Narayanpet
-
వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలివ్వండి
నారాయణపేట: ప్రాధాన్యత రంగాలైన అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈలకు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో డీసీసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బ్యాంకర్లు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి సకాలంలో రుణాలు మంజూరు చేయాలన్నారు. సమావేశంలో కన్వీనర్, లీడ్ బ్యాంకు మేనేజర్ వార్షిక ప్రణాళిక 2024–25 డిసెంబర్తో ముగిసిన త్రైమాసానికి రూ.1984.54 కోట్లతో త్రైమాసిక వృద్ధి అని, వార్షిక ప్రణాళికలో 60.62 శాతం అలాగే ఎస్ఎంఈ సెగ్మెంట్కు సంబంధించి రూ.123.06 కోట్లతో 48.80 శాతం ప్రగతి అని తెలిపారు. ప్రాధాన్యత రంగానికి 1678.14 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. ఆయా బ్యాంకుల ఏజీఎంలు శ్రీహరి, ప్రకాష్, శ్రావ్య, షణ్ముఖచారి, అనిల్కుమార్, జిల్లా అధికారులు పలు సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం నాబార్డు వారిచే పొటెన్షియల్ లింక్డ్ ప్లాన్ 2025–26 గాను రూ.3,833.47 కోట్ల రుణ లక్ష్యంతో రూపొందించిన పుస్తకాన్ని కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ మొత్తం 2024–25 సంవత్సరం కంటే 25.23 శాతం అధికం కాగా, వ్యవసాయ రంగానికి రూ.3470.93 కోట్లు, ఎంఎస్ ఎంఈ రంగానికి రూ.310.30 కోట్ల లకా్ష్య్న్ని నిర్ధారించారు. సమావేశంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గ్యంగ్వార్, ట్రైని కలెక్టర్ గరిమా నరుల పాల్గొన్నారు. వరి పంట పరిశీలన ధన్వాడ: మండలంలోని మందిపల్లిలో రైతు నర్సింహులు సాగు చేసిన వరి పంటను మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. నాలుగు ఎకరాల్లో వరి పంట సాగుచేయగా.. నీరు అందక ఎండిపోయే దశకు చేరుకుంది. గతేడాది పంట సాగుకు ఎలాంటి సమస్య రాలేదని, ఈ ఏడాది భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్డు ఎండిపోయాయని, నీటి సమస్య తీవ్రమైందరి రైతు పేర్కొన్నాడు. స్పందించిన కలెక్టర్ జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఎక్కడెక్కడ ఉందో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని డీఏఓ జాన్ సుధాకర్కు సూచించారు. -
మద్దూరులో ఇరుకు రోడ్లపై అవస్థలు
మద్దూరులో కూరగాయల విక్రయాలు రోడ్లపైనే నిర్వహిస్తున్నారు. ఇక్కడ రైతుబజార్, షెడ్లు కానీ నిర్మించలేదు. రోడ్లపై విక్రయాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులను రోడ్లపై నుంచి తొలగించడానికి పోలీసులు ప్రయత్నించినా లాభం లేకుండా పోతుంది. ఇరుకుగా ఉండే పాత బస్టాండ్ చౌరస్తాలో రోడ్లపైనే కూరగాయలు ఇతర ఇతర వస్తువుల విక్రయాలు చేస్తున్నారు. ప్రతి గురువారం జరిగే సంత నాడు వాహనదారులు, ప్రజలు చుక్కలు చూడాల్సిందే. మద్దూరు మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత వెంటనే వీధి వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు రైతు బజారును ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
‘ఇంటర్’ వాల్యూయేషన్ ప్రారంభం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల వాల్యూయేషన్ను అధికారులు మంగళవారం ప్రారంభించారు. జిల్లాకేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో వాల్యూయేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి 20 వేలకు పైగా సంస్కృతం సబ్జెక్టుకు సంబంధించిన జవాబుపత్రాలు క్యాంప్నకు చేరాయి. తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టులకు సంబంధించిన జవాబుపత్రాలు ఒకట్రెండు రోజుల్లో రానున్నాయి. వీటికి అధికారులు కోడింగ్ ప్రక్రియ చేపట్టారు. మొత్తంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి రెండు లక్షలకు పైగా జవాబు పత్రాలు వచ్చే అవకాశం ఉంది. రెండు వారాల్లో వాల్యూయేషన్ పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలకు 165 మంది గైర్హాజరు నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షకు 165 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మొత్తం 4975 మంది విద్యార్థులకుగాను 4810 మంది హాజరయ్యారు. అందులో జనరల్ విద్యార్థులు 4,383 మందికిగాను 4239 మంది హాజరయ్యారు. 144 మంది గైర్వాజరయ్యారు. ఒకేషనల్లో 592 మందికిగాను 571 మంది హాజరయ్యారు. 21మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సుదర్శన్రావు తెలిపారు. -
రోడ్లపైనే మార్కెట్లు..!
మక్తల్, మద్దూరులో రైతుబజార్లు లేక రోడ్లపైనే కూరగాయల విక్రయాలు ● పేట, కోస్గిలో మార్కెట్లు ఉన్నా..ప్రయోజనం సున్నా ● వ్యాపారులు పోటీపడి రోడ్లపైకి వచ్చికూరగాయలు, పండ్ల విక్రయాలు ● వినియోగదారులు, వాహనదారుల ఇక్కట్లు నారాయణపేట: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో రోడ్లపైనే కూరగాయల విక్రయాలు సాగుతున్నాయి. నారాయణపేట, కోస్గిలో రైతుబజార్లు, షెడ్లు నిర్మించినా కూడా కూరగాయల వ్యాపారం మళ్లీ వీధికెక్కింది. నాలుగు మున్సిపాలిటీల్లో రోడ్లనే మార్కెట్లు చేసి వ్యాపారాలు నిర్వహిస్తూ అటు వినియోగదారులకు, ఇటు వాహనదారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎంత తాజాగా ఉన్నా.. రోడ్లపైనే దుమ్మూ దూళి మధ్య విక్రయించడంతో ఎక్కడ అనారోగ్యం బారిన పడతామోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించినా.. జిల్లా కేంద్రమైన నారాయణపేట నడిబొడ్డున కూరగాయల మార్కెట్ ఉంది. కూరగాయల మార్కెట్ దుకాణాల సముదాయం ఉండగా 2018లో గత ప్రభుత్వ హయాంలో రైతు బజార్ను రూ.68 లక్షలతో 16 దుకాణాలు, షెడ్లను నిర్మించారు. రైతులు పండించిన కూరగాయలను స్వయంగా విక్రయించుకుని లబ్ధి పొందేందుకు రైతు బజార్ను ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతంలో రైతులు తెల్లవారు జామున 4గంటల నుంచి 7 వరకు విక్రయించుకొని వెళ్తుంటారు. ఆ తర్వాత రైతు బజార్ వెలవెలబోతుంది. కూరగాయల చిరు వ్యాపారులు ఆయా షెడ్లలో కూరగాయలను విక్రయించుకునేందుకు ఆసక్తి చూపకపోవడంతో పోటీపడి ఒకరి తర్వాత ఒకరు రోడ్లపైకి వస్తున్నారు. దీంతో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే జనం బేజారు అవుతున్నారు. అలాగే, కూరగాయల మార్కెట్కు వచ్చే వ్యాపారులతో పాటు ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.లక్షలు వెచ్చించి వాటర్ప్లాంట్ ఏర్పాటుచేశారు. కానీ, నిర్వహణ సరిగా లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. అసలే వేసవికాలం, ఎక్కడెక్కడి నుంచే రైతులు కూరగాయలు విక్రయించేందుకు, ప్రజలు కొనుగోలు చేస్తుందుకు వస్తుంటారు. మార్కెట్ అధికారులు స్పందించి మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని వ్యాపారులు కోరుతున్నారు. -
ఏకపక్ష నిర్ణయాలు సరికాదు
నారాయణపేట: నారాయణపేట జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ వైఖరిని నిరసిస్తూ మంగళవారం బార్ అసోసియేషన్ అధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. జిల్లా జడ్జి రఫీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని క్రమశిక్షణ రహితంగా కై ్లంట్ లను, న్యాయవాదులను కించపరుస్తున్నారని అందుకు నిరసనగా బార్ అసోసియేషన్ అధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్నామని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్,అసోసియేషన్ సభ్యులు తెలిపారు. జిల్లా జడ్జి వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని జిల్లా పోర్టు పోలియో జడ్జి మధుసూదన్కు,రాష్ట్ర బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింహరెడ్డి కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది నాగు రావునామాజీ,బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, ఉపాధ్యక్షుడు నందు నామాజీ, కార్యదర్శి బింరెడ్డి, న్యాయవాదులు రఘువీర్యాదవ్, సీతారామారావు పాల్గొన్నారు. -
రేపు టెన్నికాయిట్ క్రీడాకారుల ఎంపిక
మక్తల్: జిల్లా టెన్నికాయిట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో మక్తల్లో 13వ తేదీన జిల్లా స్థాయి టెన్నికాయిట్ క్రీడాకారుల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.దీప తెలిపారు. పట్టణంలో సాయిజ్యోతి ఉన్నత పాఠశాల ఆవరణలో మహిళలు, పురుషులకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఆధార్కార్డు, బోనోపైడ్, మూడు పాస్పోర్టు సైజ్ ఫొటోలతో హాజరుకావాలని, ప్రతిభ కనబర్చిన వారిని ఈ నెల 15, 16 తేదీల్లో హన్మకొండలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. జొన్నలు క్వింటాల్ రూ.4,565 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం జొన్నలు క్వింటాల్కు గరిష్టంగా రూ.4,565, కనిష్టంగా రూ.4,320 ధర పలికాయి. అలాగే, శనగలు గరిష్టం రూ.5,720, కనిష్టం రూ.5,659, పెసర గరిష్టం రూ.6,818, కనిష్టం రూ.6,606, అలసందలు గరిష్టం, కనిష్టం రూ.6,933, ఎర్ర కందులు గరిష్టం రూ.7,411, కనిష్టం రూ.4,350, తెల్ల కందులు గరిష్టంగా రూ.7,663, కనిష్టంగా రూ.6,759 ధరలు పలికాయి. పీయూలో 27, 28 తేదీల్లో వర్క్షాప్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 27, 28 తేదీల్లో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రీసెర్చ్ మెథడాలజీ, ప్రాజెక్టుపై రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎంబీఏ చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ వర్క్షాప్ ఎంతో ఉపయోగకరం అని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ చెన్నప్ప, ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, కన్వీనర్ అర్జున్కుమార్, కో కన్వీనర్ నాగసుధ, జావిద్ఖాన్, అరుంధతి, గాలెన్న తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల ఖరారు తర్వాతే ఫలితాలివ్వాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి, వాటిని ఖరారు చేసే వరకు గ్రూప్–1, 2, 3 ఫలితాలను ప్రకటించవద్దని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పీయూ మెయిన్ గేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్న కొంత మంది స్వార్థపరుల ఒత్తిడి మేరకు మాదిగ విద్యార్థుల భవిష్యత్ను దెబ్బతీయాలన్న కుట్రతో ముందస్తుగా గ్రూప్స్ ఫలితాలను విడుదల చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణలో ఏబీసీడీ వర్గీకరణ అనంతరం మాత్రమే ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతామని ప్రభుత్వం చెబుతూనే ఫలితాల విడుదలకు కసరత్తు చేయడం బాధాకరమని, రిజర్వేషన్ల బిల్లు పెట్టి వర్గీకరణ చేసే వరకు నిరసన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్పీ అధ్యక్షుడు టైగర్ అంజయ్య, వీరస్వామి, జేఏసీ చైర్మన్ రాము, దాసు, శ్రీను, రవితేజ, రాము, నాగేందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. యువతతోనే దేశ ప్రగతి నాగర్కర్నూల్ క్రైం: యువతతోనే దేశప్రగతి ముడిపడి ఉందని, దేశ అభివృద్ధిలో యువత కీలకం అని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్నాయక్ అన్నారు. కేంద్ర యువజన క్రీడా సర్వీసులు, మై భారత్, నెహ్రూ యువకేంద్ర సహకారంతో స్వామివివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మంగళవారం యువ ఉత్సవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్లో యువత పాత్ర ముఖ్యమైనదని, చదువుతోపాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులపై సోషల్మీడియా ప్రభావం ఎక్కువగా ఉందని, సెల్ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. ఈ నెలలో జరగనున్న జాతీయ యూత్ పార్లమెంట్ వాల్పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం యువ ఉత్సవంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో ప్రతిభచాటిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, స్వామివివేకానంద సేవా బృందం అధ్యక్షుడు శివకుమార్, జిల్లా యువజన అధికారి కోటానాయక్, కల్యాణ్నాయక్, సుధాకర్, లక్ష్మీనర్సింహ, అజయ్ పాల్గొన్నారు. -
మౌంటెన్ సైక్లింగ్లో విద్యార్థుల ప్రతిభ
మక్తల్: తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7 నుంచి 9 వరకు రంగారెడ్డి జిల్లా కోహెడ అడవుల్లో జరిగిన 9వ రాష్ట్ర స్థాయి మౌంటెన్ సైక్లింగ్ పోటీలలో నారాయణపేట జిల్లా విద్యార్థులు జిల్లా ప్రధాన కార్యదర్శి బి. గోపాలం ఆధ్వర్యంలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. మొత్తం 242 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనగా, జిల్లా నుంచి అత్యధికంగా 37 మంది బాలబాలికలు 10 కి.మీ. మౌంటెన్ సైక్లింగ్ పోటీలో అసమాన ప్రతిభ కనబర్చారు. నర్వ మండలం రాయికోడ్ గ్రామానికి చెందిన కూలీ పని చేసే వెంకటయ్య, అంజమ్మల పెద్ద కూతురు టి.అనూష గోల్డ్ మెడల్ సాధించింది. అనూష ఈ నెల 28 నుంచి 31 వరకు హర్యానా రాష్ట్రం పంచకుల అడవులలో జరుగే మౌంటెన్ జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటుందని గోపాలం తెలిపారు. 16 ఏళ్లలోపు సైక్లింగ్ పోటీలలో త్రివేణి 4వ స్థానం, పల్లవి ఏడో స్థానం, రాఘవేందర్ 10వ స్థానం సాధించారు. వారితో పాటు 14 సంవత్సరాలలోపు సైక్లింగ్ పోటీలలో పలువురు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు మల్లారెడ్డి, విజయ్కాంతారావు, మ్యాక్సీన్వెల్, వెంకటనర్సయ్య, తదితరులు పాల్గొన్నారు. -
సెర్ప్లో.. మెప్మా విలీనం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల్లో రుణాలు ఇప్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న మెప్మా.. ఇక నుంచి డీఆర్డీఏలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో విలీనం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో పాటు ఇటీవల నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడగానే మహబూబ్నగర్, నారాయ ణపేట జిల్లాలోని మహబూబ్నగర్, భూత్పూ ర్, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, కోస్గి, మద్దూరు, మక్తల్ మున్సిపాలిటీల్లోని మెప్మా ఉద్యోగులు, సిబ్బందితో పాటు మెప్మా జిల్లా కార్యాలయ ఉద్యోగులు సెర్ప్ పరిధిలోకి వెళ్లనున్నారు. పట్టణాల్లో సర్వేలకు ఇబ్బందే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు, ఇతరత్రా పనులను క్షేత్రస్థాయిలో మెప్మా ఆర్పీలు సీఓలు సర్వే చేస్తుంటారు. మెప్మా ఆర్పీలకు కాలనీల్లో ఉండే వివరాలు తేలికగా తెలిసే అవకాశం ఉంటుందని.. ప్రతి సర్వేకు వారి సేవలను వినియోగించుకున్నారు. ఇక నుంచి వారు ఇతర శాఖ పరిధిలోకి వెళ్తే.. మున్సిపాలిటీ సేవలకు వారు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఈ నిర్ణయంతో ప్రభు త్వం చేపట్టే సర్వే చేయాలంటే మున్సిపల్ యంత్రాంగానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మర్గదర్శకాలు రాలేదు.. డీఆర్డీఏలో మెప్మాను విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఇప్పటి దాక మాకు ఎలాంటి మర్గదర్శకాలు రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే మార్గ దర్శకాల మేరకు నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి డీఆర్డీఏ, మెప్మాలు వేరువేరుగా విదులు నిర్వహిస్తున్నాయి. – నర్సిములు, డీఆర్డీఏ ఒకే గొడుగు కిందికి రానున్న మహిళా సంఘాలు డీఆర్డీఏ పరిధిలోకి రిసోర్స్పర్సన్లు ప్రతిపాదనలు రూపొందించిన ప్రభుత్వం -
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
నారాయణపేట: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 15 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో లోకల్ బాడీ అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్,అదనపు కలెక్టర్ రెవెన్యూ బెంషాలం ట్రైనీ కలెక్టర్ గరిమానరుల పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 9 అర్జీలు.. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు 9 అర్జీలు వచ్చాయి. ఎస్పీ యోగేష్ గౌతమ్ నేరుగా ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలు విన్నారు. భూ తగాదాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని, అలాగే పోలీస్ స్టేషన్లకు, ప్రధాన కార్యాలయాలకు వెళ్లేవారు మధ్యవర్తులను తీసుకువెళ్లరాదని, బాధితులు మాత్రమే ధైర్యంగా వెళ్లి ఫిర్యాదు చేయాలని ఫిర్యాదుదారులకు తెలిపారు. శనగలు క్వింటాల్ రూ.5,719 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో సోమవారం శనగలు క్వింటాల్కు గరిష్టం, కనిష్టంగా రూ.5,719 ధర పలికాయి. అలాగే, పెసర గరిష్టం, కనిష్టంగా రూ.7 వేలు, వేరుశనగ గరిష్టంగా రూ.5,960, కనిష్టంగా రూ.4,330, జొన్నలు గరిష్టంగా రూ.4,559, కనిష్టంగా రూ.3,406, అలసందలు గరిష్టంగా రూ.7,012, కనిష్టంగా రూ.6,756, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,370, కనిష్టంగా రూ.5,809, తెల్ల కందులు గరిష్టంగా రూ.7,711, కనిష్టంగా రూ.6,829 ధర పలికాయి. నేటినుంచి కాచిగూడ డెమో రైలు పునరుద్ధరణ స్టేషన్ మహబూబ్నగర్: మహబూబ్నగర్–కాచిగూడ డెమో రైలును మంగళశారం నుంచి పునరుద్ధరించనున్నారు. కుంభమేళా నేపథ్యంలో దాదాపు 45 రోజుల పాటు ఈ రైలును భక్తుల సౌకర్యార్థం అక్కడికి నడిపారు. తిరిగి నేటి నుంచి ప్రతి రోజు ఉదయం 6.45 గంటలకు మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ నుంచి కాచిగూడ వరకు నడవనుంది. డెమో రైలు తిరిగి పున:ప్రారంభం కానుండడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
మరికల్/దామరగిద్ద: అర్హులైన లబ్ధిదారులందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. సోమవారం మరికల్, దామరగిద్ద మండలాల్లో పైలెట్ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసి, ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పల్లెగడ్డలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం జరగాలని అధికారులకు సూచించారు. త్వరలోనే రేషన్కార్డులను కూడా పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇప్పటికే 90 శాతం మందికి ఉచిత కరెంట్, సిలిండర్లు అందుతున్నాయని, పథకాలు అమలు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించి అర్హులకు ఆరు గ్యారంటీలను అందజేస్తామని హామీచ్చారు. మీ అభిమానం కూడా కాంగ్రెస్ పార్టీపై ఎప్పటికి ఉండాలని సూచించారు. మరికల్ కార్యక్రమంలో తహసీల్దార్ అనిల్కుమార్, ఎంపీడీఓ కొండన్న, ఎంపీఓ పావని, రేవతమ్మ, వీరన్న, సూర్యమోహన్రెడ్డి, తిమ్మరెడ్డి, పాల్గొన్నారు. దామరగిద్దలో 72 మదికి ఇళ్లు మంజూరు దామరగిద్ద మండలంలోని గత్ప గ్రామంలో అర్హులైన 72 మంది లభ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశామని ఎమ్మెల్యే అన్నారు. విడతల వారీగా అందరికీ లబ్ధి చేకూర్చుతుందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం గడ్డు పరిస్థితుల్లో ఉన్నా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని గుర్తు చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, ఎంపీడీఓ సాయిలక్ష్మి, విండో అద్యక్షుడు ఈదప్ప, మాజీ సర్పంచ్ రాములు హౌసింగ్ డీఈ, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
లింగ నిర్ధారణ కట్టడికి పటిష్ట చర్యలు
నారాయణపేట: జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి బహుళ సభ్య అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో గర్భస్థ పూర్వము, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేదం చట్టం 1994 అమలుపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ .. జిల్లాలోని స్కానింగ్ సెంటర్లపై నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. జిల్లాలో లింగ నిష్పత్తి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న ఎస్పీ యోగేశ్ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెడుతూ లింగ నిర్ధారణ తెలిపే కేంద్రాలపై పీసీపీఎన్డీటీ యాక్ట్ 1994 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి సూచించారు. అలాగే మొదటి, రెండు మాసాలలో జరిగే గర్భస్రావాలపై దృష్టి సారించాలన్నారు. జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సౌభాగ్యలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 5 స్కానింగ్ కేంద్రాల అనుమతికి దరఖాస్తు చేసుకోగా వాటిని పరిశీలించి పర్యవేక్షించి అనుమతి ఇవ్వడం జరిగిందని, వాటిలో ఒకటి ప్రభుత్వ, నాలుగు ప్రైవేట్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఈ చట్టం, దాని విధి విధానాలు, వ్యతిరేకించే వారిపై విధించే శిక్షలు, జరిమానాలను డాక్టర్ శైలజ వివరించారు. సమావేశంలో సఖి కేంద్రం ఏవో క్రాంతి రేఖ,ఎంపీ హెచ్ ఈ ఓ గోవిందరాజు, శ్రీనివాసులు, వసంత పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలి నారాయణపేట: జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జిల్లా జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) సమన్వయకర్తగా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కిషన్ ఇటీవలే బాధ్యతలు చేపట్టడంతో సోమవారం కలెక్టర్ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ కిషన్, వైద్య నిపుణులు డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ మోహన్తో ఆస్పత్రిలో వైద్య సేవలు, సిబ్బంది, బడ్జెట్ తదితర అంశాలపై కలెక్టర్ చర్చించారు. ఈ వేసవికాలం ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, వైద్యశాఖ పరంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలన్నారు. ఇక నుంచి మెడికల్ కళాశాలతో పాటు జిల్లా ఆస్పత్రి పర్యవేక్షణను చూసుకోవాలని ప్రిన్సిపల్కు ఆమె సూచించారు. ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్ అవసరమని, ఎవరినైనా డిప్యూట్ చేయించాలని రాంకిషన్ కలెక్టర్ను కోరారు. జిల్లా ఆసుపత్రి, చిన్న పిల్లల ఆసుపత్రిలో 20 మంది శానిటేషన్ వర్కర్లు పని చేస్తున్నారని, అదనంగా అవసరం అయితే తీసుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఆస్పత్రి భవన ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టాలి కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
మిగిలింది 20 రోజులే..
నారాయణపేట: మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతోపాటు ఆస్తి పన్నుల రాబడితో పట్టణాల్లో ప్రగతి పరుగులు పెడుతుంది. మున్సిపాలిటీల్లోని నివాసగృహాలు, వాణిజ్య సముదాయ భవనాలకు 2024– 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్ను వసూలుపై మున్సిపల్ అధికార యంత్రాంగం డిజిటల్ చెల్లింపు (టెక్నాలజీ)లపై దృష్టిసారించింది. క్యూఆర్ కోడ్ స్కాన్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాట్సప్ నంబర్, ఏటీఎం ద్వారా నేరుగా ఆయా మున్సిపాలిటీ ఖాతాలో జమ చేయవచ్చని చెబుతోంది. అయితే ప్రభుత్వం చేపట్టిన సర్వేలతోనే మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లకు అధికారులు ఒక అడుగు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి పడినట్లు చెబుతున్నారు. అయితే మున్సిపాలిటీల్లో ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వసూలు అంతంత మాత్రమే ఉండటం.. టార్గెట్ చేరుకునేందుకు కేవలం 20 రోజులే ఉండటంతో అధికారులు సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. 80 శాతంతో నాలుగో స్థానం.. రాష్ట్రస్థాయిలో పన్నులు వసూలు చేయడంలో ఉమ్మడి జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ నాలుగో స్థానంలో నిలిచింది. సుమారు 4 వేల ఆస్తులకు రూ.98 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటికే రూ.78 లక్షలు (80 శాతం) వసూలు చేశారు. అదనపు కలెక్టర్లకు బాధ్యతలు.. ఈ ఏడాది జనవరి 26తో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో అదనపు కలెక్టర్లు (లోకల్ బాడీస్) ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు అప్పగించింది. వీరు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూళ్లపై ఎప్పటికప్పుడు మున్సిపల్ రెవెన్యూ, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, కమిషనర్లకు ఆదేశాలు ఇస్తున్నారు. వారం రోజులుగా ప్రత్యేక దృష్టిసారిస్తూ రోజూవారిగా పన్నుల వసూళ్లపై నివేదిక తెప్పించుకుంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూళ్లకు మిగిలింది కేవలం 20 రోజులేనని.. అంతలోపే లక్ష్యం చేరుకోవాలని ప్రత్యేకాధికారులు మున్సిపల్ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్తి, నీటి పన్ను చెల్లింపులు, రివిజన్ పిటిషన్ సహా ఇతర సమస్యల పరిష్కా రం కోసం సోమ, గురువారాల్లో ఉద యం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మున్సి పాలిటీల్లో రెవెన్యూమేళా నిర్వహించేందుకు చర్యలు చేప ట్టారు. ఈ మేళా ద్వారా ప్రజలకు అ నేక రకాల సేవలు అందుబాటులో ఉంటాయని అధికారు లు చెబుతున్నారు. మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి, నీటి పన్ను చెల్లింపులు, ఇతర సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. ప్రాపర్టీ పేరు మార్పు, మ్యూటేషన్, ఇంటి నంబర్ కేటాయింపు లేదా మార్పు వంటి సేవలు పొందవచ్చు. రాష్ట్రస్థాయిలో 63వ స్థానం.. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీలో 5,332 ఆస్తులకు రూ. 1.94 కోట్లు వసూలు చేయా ల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.1.10 కోట్లు (57 శాతం) వసూలు చేశా రు. దీంతో ఈ మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో 63వ స్థానంలో నిలిచింది. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లపూర్లో సైతం 6,406 ఆస్తుల కు రూ.1.28 కోట్లకు రూ.72 లక్షలు వసూలు (56 శాతం) చేశారు. ఈ మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో 68వ స్థానంలో నిలిచింది. మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లు అంతంతే సీఎం ఇలాఖాలో 57 శాతమే వసూలుతో రాష్ట్రస్థాయిలో 63వ స్థానం ఉమ్మడి జిల్లాలో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లే దిక్కు ప్రత్యేకంగా సోమ, గురువారాల్లో రెవెన్యూ మేళాలు గడువు నేపథ్యంలో పరుగులు పెట్టిస్తున్న ప్రత్యేకాధికారులు -
సెర్ప్లో.. మెప్మా విలీనం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల్లో రుణాలు ఇప్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న మెప్మా.. ఇక నుంచి డీఆర్డీఏలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో విలీనం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో పాటు ఇటీవల నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడగానే మహబూబ్నగర్, నారాయ ణపేట జిల్లాలోని మహబూబ్నగర్, భూత్పూ ర్, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, కోస్గి, మద్దూరు, మక్తల్ మున్సిపాలిటీల్లోని మెప్మా ఉద్యోగులు, సిబ్బందితో పాటు మెప్మా జిల్లా కార్యాలయ ఉద్యోగులు సెర్ప్ పరిధిలోకి వెళ్లనున్నారు. పట్టణాల్లో సర్వేలకు ఇబ్బందే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు, ఇతరత్రా పనులను క్షేత్రస్థాయిలో మెప్మా ఆర్పీలు సీఓలు సర్వే చేస్తుంటారు. మెప్మా ఆర్పీలకు కాలనీల్లో ఉండే వివరాలు తేలికగా తెలిసే అవకాశం ఉంటుందని.. ప్రతి సర్వేకు వారి సేవలను వినియోగించుకున్నారు. ఇక నుంచి వారు ఇతర శాఖ పరిధిలోకి వెళ్తే.. మున్సిపాలిటీ సేవలకు వారు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఈ నిర్ణయంతో ప్రభు త్వం చేపట్టే సర్వే చేయాలంటే మున్సిపల్ యంత్రాంగానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మర్గదర్శకాలు రాలేదు.. డీఆర్డీఏలో మెప్మాను విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఇప్పటి దాక మాకు ఎలాంటి మర్గదర్శకాలు రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే మార్గ దర్శకాల మేరకు నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి డీఆర్డీఏ, మెప్మాలు వేరువేరుగా విదులు నిర్వహిస్తున్నాయి. – నర్సిములు, డీఆర్డీఏ ఒకే గొడుగు కిందికి రానున్న మహిళా సంఘాలు డీఆర్డీఏ పరిధిలోకి రిసోర్స్పర్సన్లు ప్రతిపాదనలు రూపొందించిన ప్రభుత్వం -
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
నారాయణపేట: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 15 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో లోకల్ బాడీ అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్,అదనపు కలెక్టర్ రెవెన్యూ బెంషాలం ట్రైనీ కలెక్టర్ గరిమానరుల పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 9 అర్జీలు.. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు 9 అర్జీలు వచ్చాయి. ఎస్పీ యోగేష్ గౌతమ్ నేరుగా ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలు విన్నారు. భూ తగాదాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని, అలాగే పోలీస్ స్టేషన్లకు, ప్రధాన కార్యాలయాలకు వెళ్లేవారు మధ్యవర్తులను తీసుకువెళ్లరాదని, బాధితులు మాత్రమే ధైర్యంగా వెళ్లి ఫిర్యాదు చేయాలని ఫిర్యాదుదారులకు తెలిపారు. శనగలు క్వింటాల్ రూ.5,719 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో సోమవారం శనగలు క్వింటాల్కు గరిష్టం, కనిష్టంగా రూ.5,719 ధర పలికాయి. అలాగే, పెసర గరిష్టం, కనిష్టంగా రూ.7 వేలు, వేరుశనగ గరిష్టంగా రూ.5,960, కనిష్టంగా రూ.4,330, జొన్నలు గరిష్టంగా రూ.4,559, కనిష్టంగా రూ.3,406, అలసందలు గరిష్టంగా రూ.7,012, కనిష్టంగా రూ.6,756, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,370, కనిష్టంగా రూ.5,809, తెల్ల కందులు గరిష్టంగా రూ.7,711, కనిష్టంగా రూ.6,829 ధర పలికాయి. నేటినుంచి కాచిగూడ డెమో రైలు పునరుద్ధరణ స్టేషన్ మహబూబ్నగర్: మహబూబ్నగర్–కాచిగూడ డెమో రైలును మంగళశారం నుంచి పునరుద్ధరించనున్నారు. కుంభమేళా నేపథ్యంలో దాదాపు 45 రోజుల పాటు ఈ రైలును భక్తుల సౌకర్యార్థం అక్కడికి నడిపారు. తిరిగి నేటి నుంచి ప్రతి రోజు ఉదయం 6.45 గంటలకు మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ నుంచి కాచిగూడ వరకు నడవనుంది. డెమో రైలు తిరిగి పున:ప్రారంభం కానుండడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి
నారాయణపేట రూరల్: స్వామి వివేకానందుడిని యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు కదలాలని ఎస్పీ యోగేష్ గౌతం అన్నారు. మండలంలోని కోటకొండలో స్వామి వివేకానందుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఐదేళ్లు కావస్తున్న సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ.. యువత చెడు మార్గాల్లో పయనించకుండా సన్మార్గంలో వెళ్లాలన్నారు. చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. క్రమశిక్షణ కలిగి లక్ష్యం, పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధ్యమేనని తెలిపారు. కార్యక్రమంలో బాలస్వామి, శివరాములు, రవి, సిద్దు, కృష్ణయ్య, సురేందర్, జగదీష్, నరేష్, కిషోర్ పాల్గొన్నారు. మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టాలి నారాయణపేట టౌన్: మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులను అరికట్టాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్రామ్, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు బాలమణి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ వద్ద అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభలో వారు మాట్లాడారు. మహిళలపై హింస, వేధింపులను ప్రతిఘటించాలని, వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు నడుం బిగించాలన్నారు. అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు, మెప్మా, ఐకేపీ తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల పరిదిలో పనిచేస్తున్న మహిళలను ప్రభుత్వాలే శ్రమ దోపిడీకి గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా సాధికారత, సమానత్వం గురించి గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు ముందు సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాధిక, మమత, పార్వతి, నాంచారమ్మ, చంద్రకళ, భాగ్యమ్మ,అశ్విని,సుశీలమ్మ,పలువురు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి నారాయణపేట రూరల్: జిల్లా విద్యా శాఖలో నెలకొన్న సమస్యలపై నూతనంగా ఎన్నికై న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డికి స్థానిక పీఆర్టీయూ నాయకులు వినతిపత్రం అందించారు. ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు శాలువాతో సన్మానించి బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన నారాయణపేట జిల్లాకు టీజిఎల్ఐ కార్యాలయ ఏర్పాటుకు కృషి చేయాలని, సరిహద్దు ప్రాంత పాఠశాలలో పనిచేస్తున్న కర్ణాటక ఉపాధ్యాయులకు మెడికల్ రియంబర్స్మెంట్ కల్పించాలని, డీఈఓ, ఎమ్మార్సీ కార్యాలయాల్లో సిబ్బందిని పెంచాలన్నారు. యాదగిరి జనార్దన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు. -
సొరంగంలో ర్యాట్ మైనర్స్
సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలోపల 13.85 కి.మీ. వద్ద జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు మొత్తం 18 బృందాలు పని చేస్తున్నాయి. 16 రోజులుగా నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నా వారి ఆచూకీ లభ్యం కావడం లేదు. సొరంగంలో 13 కి.మీ. అవతల సొరంగ పైకప్పు కుప్పకూలడంతో సుమారు 18 ఫీట్ల ఎత్తులో 200 మీటర్ల విస్తీర్ణం వరకూ మట్టి, బురద, శిథిలాలు మేట వేశాయి. మట్టిని తొలగిస్తే పైనుంచి మరింత కుంగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఇన్లెట్ టన్నెల్లో ఎలాంటి ఆడిట్, ఎస్కేప్ టన్నెల్స్ లేకపోవడం, నిత్యం నీటి ఊట, బురద ఉంటుండటంతో ఇంతటి క్లిష్ట పరిస్థితి ఎక్కడా చూడలేదని రెస్క్యూ నిపుణులు అంటున్నారు. ఆయా రెస్క్యూ బృందాలతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన ర్యాట్ హోల్ మైనర్స్ బృందం వినూత్న పద్ధతిలో సేవలు అందిస్తోంది. రైల్వేలైన్లు, రహదారుల పనుల్లో సేవలు.. మేఘాలయా, ఈశాన్య రాష్ట్రాల్లోని బొగ్గు గనుల్లో ఎలుక బొరియలుగా సొరంగాలు తవ్వుతూ ర్యాట్ హోల్ మైనర్స్ బొగ్గును బయటకు వెలికితీస్తారు. ప్రమాదకరమైన ఈ మైనింగ్ను సుప్రీంకోర్టు నిషేధించింది. అయితే రైల్వే లైన్ల నిర్మాణం, జాతీయ రహదారులు, రోడ్ల నిర్మాణంలో వీరు సేవలందిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. సాధారణంగా రోడ్డు, రైల్వేలైన్ కిందుగా పైప్లైన్ వేయాలంటే జేసీబీల సాయంతో తవ్వుతూ రోడ్డును కట్ చేయాల్సి ఉంటుంది. ర్యాట్ హోల్ మైనర్స్ రవాణాకు ఆటంకం కలిగించకుండా, రోడ్డును తవ్వాల్సిన పని లేకుండానే కింద నుంచి సొరంగం తవ్వి పైప్లైన్ వేస్తారు. నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీ రోడ్లపై వాహనాల రాకపోకలు కొనసాగుతుండగానే, రోడ్డు కింద నుంచి సొరంగం తవ్వి పైప్లైన్ వేయడంలో వీరి సేవలు విశేషంగా ఉపయోగపడుతున్నాయి. దారి ఏర్పాటు చేస్తూ తవ్వకాలు.. ప్రమాద స్థలంలో సుమారు 8 మీటర్ల మేర మట్టి, బురద, మిషిన్ శిథిలాలు మేట వేసి ఉన్నాయి. బురద, కాంక్రీట్ కలసి గట్టిగా ఉంది. ఒక్క పక్కగా దారి ఏర్పాటు చేస్తూ తవ్వకాలు కొనసాగిస్తున్నాం. రోజంతా అక్కడే ఉండి పనులు నిర్వహిస్తున్నాం. – మహమ్మద్ రషి, ర్యాట్హోల్ మైనర్ సభ్యుడు●వినూత్న సేవలందిస్తున్న 24 మంది సభ్యులు కార్మికుల జాడ కోసం నిరంతరం అన్వేషిస్తున్న బృందం రాత్రింబవళ్లు ప్రమాదస్థలంలోనే తవ్వకాలు జరుపుతున్న వైనం తవ్విన కొద్దీ ఊటనీరు వస్తోంది.. మేం మొత్తం 24 మంది ర్యాట్ హోల్ మైనర్స్ బృందం రెస్క్యూ పనుల్లో పాల్గొంటున్నాం. ఒక్కో షిప్టులో ఆరుగురు చొప్పున 24 గంటల పాటు ప్రమాద స్థలం వద్ద తవ్వకాలు జరుపుతున్నాం. ఇనుప కడ్డీలు, పారలతో మట్టిని తొలగించిన కొద్దీ ఊటనీరు పెరుగుతోంది. – ఖలీల్ ఖరేషి, ర్యాట్హోల్ మైనర్ సభ్యుడు 24 గంటల పాటు సొరంగంలోని ప్రమాద స్థలం వద్దే.. సొరంగంలో మట్టి కింద చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు ర్యాట్ హోల్ మైనర్స్ బృందం గతనెల 25న రంగంలో దిగింది. మొత్తం 24 మంది సభ్యులు ఉండగా, వీరిలో ఎల్లప్పుడూ ఐదు, ఆరుగురు సొరంగంలోని ప్రమాదస్థలం వద్ద మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. కేవలం ఇనుప కడ్డీలు, తట్టా, పారల సాయంతో తవ్వకాలు చేపడుతూ, మట్టిని పక్కకు వేస్తున్నారు. టన్నెల్ నిండా మట్టి పేరుకుపోయిన నేపథ్యంలో రాడార్ గుర్తించిన చోటుతో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో తవ్వకాల చేపట్టి కార్మికుల జాడను అన్వేషిస్తున్నారు. వంతుల వారీగా సొరంగంలోకి వెళుతూ రాత్రింబవళ్లు ప్రమాద స్థలంలోనే తవ్వకాలు చేపడుతున్నారు. భోజనం సైతం అక్కడే చేస్తూ మళ్లీ తవ్వకాలకు ఉపక్రమిస్తున్నారు. -
హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి
నారాయణపేట రూరల్: హిందూ ధర్మ పరిరక్షణకు కంకణబద్ధులు కావాలని ప్రాంత విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు నరసింహమూర్తి అన్నారు. స్థానిక సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో శనివారం నారాయణపేట జిల్లా, పట్టణ విశ్వహిందూ పరిషత్ పూర్తిస్థాయి కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నరసింహమూర్తి మాట్లాడుతూ.. నిద్రావస్థలో ఉన్న హిందూ సమాజం మేల్కొనాలని, రాజకీయ లబ్ధి కోసం కులాల పేరుతో విభజిస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. పల్లె నుంచి పట్టణం వరకు జరుగుతున్న మతమార్పిడులను అరికట్టాలన్నారు. దేవాలయాల పరిరక్షణకు కృషి చేద్దామని, గోసంరక్షణ దేయంగా ముందుకు పోదామన్నారు. ఇతర మతస్తుల యాత్రకు డబ్బులు ఇస్తున్న ప్రభుత్వాలు హిందువుల పండుగల సమయంలో ఆర్టీసీ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేయడం సరికాదని ముక్తకంఠంతో ఖండించాలన్నారు. హిందువుల పూర్తిస్థాయి చైతన్యంతోనే మార్పు జరుగుతుందన్నారు. హిందువులపై దాడులకు పాల్పడే సంఘవిద్రోహులను పారద్రోలేలా, హిందూ జాగృతికి, హిందూ ధార్మిక కార్యక్రమాల అభ్యున్నతి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. నూతన కమిటీల ఎన్నిక విశ్వహిందూ పరిషత్ నారాయణపేట నూతన జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కన్న శివకుమార్, విభాగ కార్యదర్శిగా నరేందర్, విభాగ్ సహ కార్యదర్శిగా లక్ష్మీనారాయణను ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షుడిగా మురళీబట్టడ్, ప్రధాన కార్యదర్శి కడుదాస్ ప్రవీణ్, బజరంగ్దళ్ జిల్లా అధ్యక్షుడిగా వడ్ల శ్రావణ్, సహా ప్రయోజక్ గా భీమేష్ తోపాటు మరి కొంతమంది సభ్యులతో జిల్లా పట్టణ కమిటీలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ప్రాంత ఉపాధ్యక్షులు జగదీశ్వర్లు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పగుడాకుల బాలస్వామి, దుర్గవాణి మాతృమండలి సభ్యులు పవిత్ర, లలిత, భాస్కర్, వందన, వైష్ణవి లతోపాటు నారాయణపేట జిల్లా పరిధిలోని ఆయా మండలాల, గ్రామాల విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
బ్యాటరీ, సెల్ టెక్నాలజీపై పరిశోధన
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రస్తుతం బ్యాటరీ, సెల్ టెక్నాలజీపై పరిశోధనలు, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినివైష్ణవ్ అన్నారు. శనివారం మధ్యాహ్నం మహబూబ్నగర్ నగర శివారులోని దివిటిపల్లి ఐటీ పార్కు ఆవరణలో మొత్తం రూ.3,225 కోట్లతో ఏర్పాటు చేయనున్న అమరరాజా గిగా ఫ్యాక్టరీ–1, అల్టమిన్, లోహం మెటీరియల్స్, ఎస్సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్లకు ఆయనతో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి తన ప్రసంగాన్ని తెలుగులో ‘నమస్తే.. బాగున్నారా..!’ అని ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్ప సినిమాలోని ‘పుష్ప తగ్గేలే..’ డైలాగ్ను ప్రస్తావిస్తూ ‘దివిటిపల్లి అభివృద్ధి ఆగదు.. ఇక నిరంతర అభివృద్ధే..’ అని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడి అమరరాజా కంపెనీలో 80 శాతం మహిళలే పనిచేస్తుండటం అభినందనీయమన్నారు. కాగా మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకితో పాటు మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రకాలుగా అండగా ఉంటాం: మంత్రి శ్రీధర్బాబు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్త లు ముందుకు వస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ డి.శ్రీధర్బాబు అన్నారు. ఇటీవల దావోస్ సమ్మిట్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వివిధ పెద్ద సంస్థలు సుమారు రూ.78 వేల కోట్లకు ఎంఓయూ కుదుర్చుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఇతర రాష్ట్రాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అమరరాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ, చైర్మన్ గల్లా జయదేవ్ మాట్లాడుతూ దివిటిపల్లిలో ఏర్పాటు చేస్తున్న గిగా ఫ్యాక్టరీ ద్వారా సుమారు 4,500 మందికి ప్రత్యక్షంగా, మరో పది వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, టీజీఐఐసీ వీసీ అండ్ ఎండీ విష్ణువర్ధన్రెడ్డి, జీఎం ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినివైష్ణవ్ -
అన్ని రంగాల్లో మహిళల ముందంజ
నారాయణపేట: ఏ ఇంట్లో అయితే మహిళ బాగా చదివితే ఆ కుటుంబమంతా బాగుపడుతుందని, ప్రస్తుతం మహిళలు అటు ఇంట్లో పని చేస్తూ తమ విధి నిర్వహణలో రాణిస్తున్నారన్నారని, ఇక మహిళా పోలీసులు తమ విధి నిర్వహణలో గొప్పగా రాణిస్తూ ఆదర్శంగా నిలవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉన్న మహిళా పోలీసులు, డీపీఓ స్టాప్, ఆఫీస్ స్టాఫ్తో శనివారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మహిళ పోలీసులచే కేక్ కట్ చేయించి ఎస్పీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళలకు ఓర్పు, సహనం, పట్టుదల ఎక్కువ అని ప్రపంచానికి వెలుగు చూపేది మహిళ అని అన్నారు. పురుషులతో పోటీపడి ఉద్యోగ అవకాశాల్లో విధుల్లో వారితో సమానంగా మహిళలు పనిచేయడం గొప్ప విషయమన్నారు. శాంతి భద్రతల విషయంలో జిల్లా పోలీస్ శాఖలో పలు విభాగాల్లో మహిళా పోలీస్ అధికారులు సిబ్బంది సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు. మహిళా పోలీసులకు విధి నిర్వహణలో ఉన్నప్పుడు గాని పోలీస్ స్టేషన్లో గాని పని చేసే చోట ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎవరికై నా ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా పరిధిలో మహిళా ఉద్యోగులకు ప్రత్యేకంగా ఇంటర్నల్ కంప్లైంట్ సెల్ ఉందని, అందులో కంప్లైంట్ చేయవచ్చని మహిళా పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎన్ లింగయ్య,ఆర్ఐ నరసింహ, మహిళ ఎస్సైలు స్వాతి, సునిత, రేవతి, గాయత్రి, మహిళ పోలీసులు పాల్గొన్నారు. -
మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం
నారాయణపేట టౌన్: మహిళలపై జరుగుతున్న అణచివేత, హింస, దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని, ఈమేరకు మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలంటూ ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర సహాయ కార్యదర్శి విజయలక్ష్మీ అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేద్రంలో మహిళలు స్థానిక అంబేడ్కర్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ మీదుగా మున్సిపల్ పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. దేశంలో ఇంటా బయట మహిళలపై అత్యాచారాలు, దాడులు, వేధింపులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల హక్కుల కోసం రాజ్యాంగం రూపొందించిన చట్టాలను పాలకులు నీరుగారుస్తున్నారన్నారు. పోరాడి సాధించుకున్న గృహహింస, వరకట్న వేధింపుల చట్టాలను తిరిగి కాపాడుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. సీ్త్రలు సమాజంలో ఎదురుకుంటున్న పలు సమస్యలను ప్రస్తావించారు. లింగభేదం లేకుండా సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగ్యలక్ష్మి,సరళ,లక్ష్మి,సునిత,లక్ష్మి,అరుణ,అనిత.రాధిక.చంద్రకళ పలువురు పాల్గొన్నారు. చింతపండు క్వింటాల్ రూ.10,189 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం చింతపండు 52 క్వింటాళ్లు విక్రయానికి రాగా.. క్వింటా గరిష్టంగా రూ.10,186, కనిష్టంగా రూ.6 వేలు పలికింది. అలాగే, శనగలు 19 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.6,950, కనిష్టం రూ.5,811, ఎర్రకందులు 136 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.7,461, కనిష్టం 6,469, జొన్నలు 84 క్వింటాళ్లు రాగా గరిష్టం రూ.4,400, కనిష్టం రూ.3,629 ధర పలికింది. అదేవిధంగా, వేరుశనగ 41 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.5,420, కనిష్టం రూ.3,910, తెల్లకందులు 58 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.7,700, కనిష్టం రూ.6.870 ధర పలికింది. సీఎంను కలిసిన పీయూ వీసీ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: పీయూకు మంజూరైన ఇంజినీరింగ్, లా కళాశాలలను త్వరలో ప్రారంభించాల్సి ఉందని, బోధన, బోధనేతర ఖాళీలు భర్తీ చేయాలని వీసీ ఆచార్య జి.ఎన్.శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సంలో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తెచ్చారు. పీయూ అభివృద్ధికి నిధుల కేటాయింపు, అదనపు పోస్టుల మంజూరు, వనపర్తి పీజీ సెంటర్లో వసతి గృహాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆరు గ్యారంటీలను అమలు చేయాలి వనపర్తి రూరల్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని దళితవాడ, చిట్యాల రోడ్డులోని డబుల్బెడ్రూం ఇళ్లు, చందాపూర్ రోడ్డులోని పీర్లగుట్ట గంగిరెద్దుల కాలనీల్లో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. అనంతరం సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జాన్వేస్లీ మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని దళితవాడలో లోఓల్టేజీ, శ్మశానవాటిక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దళితవాడ కందకంలో నిర్మించిన కూరగాయల మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు రూ. 2,500 చొప్పున ఇవ్వడంతో పాటు వృద్ధాప్య పింఛన్ రూ. 4వేలకు పెంచుతామని చెప్పి నేటికీ అమలు చేయడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. -
రాజీమార్గమే రాజమార్గం
నారాయణపేట: రాజీమార్గమే రాజ మార్గమని, రాజీమార్గంతో ఎలాంటి కేసులైనా పరిష్కరించుకోవచ్చని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్న్స్ జడ్జి కం చైర్మన్ డీఎల్ఎస్ఎ మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో డీఎల్ఎస్ఎ కార్యదర్శి కం సీనియర్ సివిల్ జడ్జి వింద్యనాయక్, జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఉమర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జకియా సుల్తానా, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేష్ కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలప్ప, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె లక్ష్మీపతి గౌడ్ , నాగేశ్వరి, ఇతర న్యాయవాదులు కలిసి లోక్ అదాలత్కు వచ్చిన వివిధ రకాల కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ... ప్రజలకు సేవ చేయడం మన కర్తవ్యం అన్నారు. ప్రజలు తమకు అండగా నిలిచి సహకరించాలని కోరారు. 9,825 కేసులు.. రూ.24 లక్షల ఆదాయం ఇదిలాఉండగా, శనివారం నాటి లోక్ అదాలత్ లో జిల్లా కోర్టు పరిధిలో 9825 కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించారు. జిల్లాలో 14 పోలీస్ స్టేషన్లతో పాటు రెండు ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ల (కోస్గి, నారాయణపేట) పరిధిలో ఉన్న కేసులకు న్యాయవాదులు సహకరించి పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా రాజీ అయిన వ్యక్తులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మొక్కను అందజేసి అభినందించారు. కాగా మొత్తం కేసుల పరిష్కారానికి గాను రూ 24,08,020 ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందన్నారు.ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి , డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి వీంధ్య నాయక్ మాట్లాడుతూ.. ఇరువురు అవగాహనతో కేసులను రాజీ చేసుకుని సంతోషంగా ఉండాలని సూచించారు. జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఉమర్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్ మంచి అవకాశమని, చిన్నచిన్న కేసులను క్షమించి రాజీ కావడం వల్ల వారికి ఎంతో సుఖంగా సంతోషంగా ఉంటుందన్నారు. సివిల్ తదితర కేసులలో ఒకరికొకరు రాజీ కావడం వల్ల కేసులు పరిష్కారం అవుతాయని ఇద్దరూ గెలుస్తారని తెలిపారు తెలిపారు. అనంతరం రాజీ అయినవారికి మొక్క, అవార్డును న్యాయమూర్తులు అందజేశారు. పిపి బాలప్ప మాట్లాడుతూ ప్రతి రెండు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. ఆర్థిక స్తోమత లేని వారి కేసులను ఉచితంగా వాదించడానికి న్యాయవాదులను నియమిస్తుందని డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మిపతిగౌడ్ తెలిపారు. జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ జాతీయ లోక్అదాలత్లో 9,825 కేసుల పరిష్కారం -
అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం
చిరుతల సంచారం కొనసాగుతుందని అటవీశాఖ అధికారులు ధ్రువీకరిస్తున్నా వాటిని పట్టుకోవడం కోసం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటూ చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గతేడాది చిరుత సంచరిస్తుందని గుర్తించిన అధికారులు మోమినాపూర్, నందిగామ, నందిపాడ్ గ్రామ శివారులో బోన్లు ఏర్పాటు చేశారు. చిరుతల కదలికల కోసం సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. 10 రోజులు ఉంచి చిరుతలు చిక్కకపోవడంతో వాటిని తొలగించారు. ఆ తర్వాత తరచూ లేగదూడుల, మేకలు మృతి చెందుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మళ్లీ మోమినాపూర్లో 15 రోజుల్లో చిరుత, లేగదూడలు మృతి చెందడంతో ఒక బోనును ఏర్పాటు చేశారు. పశువుల స్థానంలో మనుషుల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ఈ గ్రామాల ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. -
బాధితులకు ఆర్థిక సహాయం
మహబూబ్నగర్ క్రైం: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భరోసా కేంద్రం నుంచి ఆరుగురు బాధితులకు శుక్రవారం ఎస్పీ డి.జానకి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. భరోసా కేంద్రం ఎస్ఐ సుజాత పాల్గొన్నారు. ● హోంగార్డ్స్ సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సహాయంలో భాగంగా ఐదుగురు హోంగార్డ్స్కు ఎస్పీ జానకి చెక్కులు అందజేశారు. కవితకు రూ.15,000, శేఖరయ్య, వెంకట్రాములు, నాగమణి, శోభకు రూ.10 వేల చొప్పున చెక్కులు అందించారు. -
రోడ్డు ప్రమాదంలో సీడీసీ చైర్మన్ దుర్మరణం
కొత్తకోట: పట్టణానికి చెందిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చెరుకు అభివృద్ధి మండలి అధ్యక్షుడు, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు పాపయ్యగారి చంద్రశేఖర్రెడ్డి అలియాస్ గొల్లబాబు (55) హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గురువారం హైదరాబాద్లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై ఎల్బీనగర్లోని తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన గతే డాది అక్టోబర్ 27న ఉమ్మడి జిల్లా సీడీసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రశేఖర్రెడ్డి మరణంతో పట్టణంలో విషాదచాయలు అలు ముకున్నాయి. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి ప్రగాడ సానుభూతి తెలిపి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పాలమూరు నుంచి 14 బస్సులు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: హైదరాబాద్లో శనివారం జరిగే మహిళా దినోత్సవ ప్రధాన కార్యక్రమంలో ఎస్హెచ్జీలు 800 మంది పాల్గొనాలని మెప్మా ఇన్చార్జ్ డీఎంసీ లక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్నగర్కి చెందిన 700 మంది మహి ళల కోసం 14 ఆర్టీసీ బస్సులను ప్రభుత్వ బా లుర జూనియర్ కళాశాల మైదానంలో అందు బాటులో ఉంచినట్లు ఆమె పేర్కాన్నారు. శనివా రం మధ్యాహ్నం 12 గంటల కల్లా ఆయా ప్రాంతాలకు తరలి రావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బ్యాంకులో ఖాళీలను భర్తీ చేయాలి ● ఎస్బీఐ ఉద్యోగుల నిరసన స్టేషన్ మహబూబ్నగర్: బ్యాంకులో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఎస్బీఐ అవార్డు స్టాప్ యూనియన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, రీజినల్ కార్యదర్శి నరేష్కుమార్, ఆఫీసర్ అసోసియేషన్ రీజినల్ కార్యదర్శి జగన్నాథ్రెడ్డి అన్నారు. తమ విధులు ముగించుకొని పట్టణంలో వివిధ ఎస్బీఐ బ్రాంచీల ఉద్యోగులు జిల్లా కేంద్రం మెట్టుగడ్డలోని ఎస్బీఐ ఎదుట శుక్రవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేశారు. ధర్నాలో బ్రాంచీల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అతివకు అందలం
●మహిళలు అన్నిరంగాల్లో రాణించాలంటే చదువు ఎంతో ముఖ్యం ● కుటుంబ పోషణతో పాటు ఉద్యోగాల్లోనూ రాణించడం ఆమెకే సాధ్యం ● ప్రభుత్వం మరిన్ని చట్టాలు, స్కీంలు తీసుకువస్తే మహిళా సాధికారత ● ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో మహిళళా సాధికారతపై ‘సాక్షి’ డిబేట్ అవగాహన అవసరం.. సమాజం ఎంత అభివృద్ధి చెందినా చాలామంది మహిళలకు బయటి ప్రపంచం గురించి తెలియని పరిస్థితి. అందుకే వంటిళ్లు కుటుంబమే జీవితంగా జీవిస్తున్నారు. అందుకోసం ప్రతి మహిళ తమ హక్కులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అగ్రశ్రేణి సంస్థల్లో మహిళలు ఉన్నత పదవుల్లో ఉన్నారు. కానీ, చాలా మంది అవగాహన లేనందుకు ప్రతి విషయానికి పురుషులపై ఆధారపడాల్సి వస్తోంది. – తనీష, ఎంపీసీ, ఫస్ట్ ఇయర్ కట్టుబాట్లు ప్రతిబంధకాలు.. మన సమాజంలో మహిళలు సాధికారత సాధించకపోవడానికి కట్టుబాట్లు, పద్ధతులు ఒక ప్రతిబంధకంగా మారాయి. ఉన్న ఒక్క జీవితానికి ప్రతి మహిళ తన లక్ష్యాన్ని, తన కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. చరిత్రలో ఎంతో మంది మహిళలు దేశ అస్తిత్వం కోసం పోరాటం చేశారు.. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని.. కొత్త చరిత్ర సృష్టించాలి. – వాహిని, ఎంపీసీఎస్, సెకండ్ ఇయర్ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంఎంత కష్టాన్ని అయిన భరించేతత్వం ఒక్క మహిళకే ఉంటుంది. నేనూ ఒక మహిళ అయినందుకు గర్విస్తున్నా. నాకు అన్ని విష యాల్లో సహకరించే కుటుంబ సభ్యులు, మా తల్లిదండ్రుల సహకారం మరువలేనిది. మహిళ సాధికారత, సమానత్వం సాధించాలంటే తప్పకుండా కుటుంబ సభ్యుల సహకారం ఉంటే ఏదైనా సాధ్యమే. ప్రభుత్వాలు, మరిన్ని చట్టాలు, స్కీంలు తీసుకురావాలి. – ఆలియా, ఎంజెడ్సీ, సెకండ్ ఇయర్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఆధునిక ప్రపంచంలో సమాజం ఎంతో అభివృద్ధి చెందినా మహిళలు తక్కువ, మగవారు ఎక్కువ అనే భావన తొలగిపోవడం లేదు. మహిళా సాధికారత, సమానత్వం సాధించాలంటే ప్రతి మహిళ కూడా ఉన్నత విద్యను అభ్యసించి.. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తమదైన ముద్ర వేసినప్పుడే అన్నీ సాధ్యమవుతాయని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థినులు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన డిబేట్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో డిగ్రీ, పీజీ విద్యార్థినులు, అధ్యాపకులు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మహిళగా గర్విస్తున్నా.. సమాజంలో మహిళలు ఉద్యోగం చేసేవారు ఇటు కుటుంబాన్ని.. అటు ఉద్యోగం రెండింటినీ సమన్వయం చేసే శక్తి ఒక్క మహిళకు మాత్రమే ఉంది. అంత ఓర్పు మహిళలకు ఉన్నందుకు ఒక మహిళగా గర్విస్తున్నా. మహిళ కేవలం వంటింటికే పరిమితం కాకుండా ప్రస్తుతం అనేక రంగాల్లో రాణిస్తున్న వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సమానత్వం సాధిస్తే సాధికారత సాధ్యపడుతుంది. – వసంత, ఎంజెడ్బీటీ, సెకండ్ ఇయర్ ఉన్నత విద్యతోనే.. మహిళా సాధికారత సాధించి, సమానత్వం రావాలంటే తప్పకుండా ఉన్నత విద్యను అభ్యసించి, మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. అందుకే పాఠశాల, కళాశాలలో చదువుతున్న క్రమంలో ప్రతి విద్యార్థిని కూడా అనవసర విషయాల జోలికి పోకుండా చదువులపై దృష్టి సారించినప్పుడు అవకాశాలు వాటంతట అవే వస్తాయి. – భవాని, బీకాం, ఫస్ట్ ఇయర్ ఉద్యోగావకాశాలు కల్పించాలి.. మహిళా సాధికారత రావాలంటే ప్రతి ఒక్కరు తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం చేసే విధంగా అవకాశాలు రావాలి. చదువులు ఉన్నప్పటికీ కొంత మంది ఉద్యోగాలు చేయలేని పరిస్థితి ఉంది. అందుకు ప్రభుత్వం మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ అందిస్తే సులువుగా ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉంది. – నిహారిక, బీకాం, ఫస్ట్ ఇయర్ పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయి వరకు బాలికలు చదువుతున్నప్పటికీ ఉన్నత విద్యకు వచ్చే సరికి వారి సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉంది. వీటితోపాటు స్కిల్ డెవలప్మెంట్, మరిన్ని యూనివర్సిటీలను అందుబాటులోకి తీసుకువస్తే మహిళలు చదువుకునేందుకు ఆస్కారం ఉంది. నాకు అన్ని స్థాయిల్లో కుటుంబ సభ్యులు సహకరించడం వల్ల ప్రిన్సిపాల్ స్థాయి వచ్చా. మహిళలకు కుటుంబమే బలం. అలాంటి అవగాహన అందరిలో రావాలి. – పద్మావతి, ప్రిన్సిపాల్, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల చైతన్యం అవసరం.. చాలామంది మహిళలు అవగాహన లేకకపోవడం, హక్కులు తెలియపోవడం వంటి విషయాల కారణం సాధికారత సాధ్యపడడం లేదు. అందుకోసం సామాజిక అంశాల పట్ల పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి మహిళలో కూడా చైతన్యం వచ్చి రాజకీయ, సామాజిక, ఉద్యోగాల్లో వారి సంఖ్య పెరిగితే అప్పుడు మహిళలు పురుషులతో సమానంగా రాణించగలుగుతారు. – నీలిమ, బీబీఏ, సెకండ్ ఇయర్ తోటివారికి సహకరించాలి.. సమాజంలో మహిళలకు తోటివారే సహకరించాలి. పనిచేసే ప్రదేశం, ఇతర చోట్ల ఎక్కడైనా మహిళలు ఒకరికి ఒకరు సహరించుకుంటే ముందుకు సాగేందుకు ఆస్కారం ఉంటుంది. రెండు కొప్పులు ఒక దగ్గర కలవవు అనే నానుడి నుంచి బయటికి రావాలి. ప్రతి మహిళా సాధికారత సాధించాలంటే తప్పకుండా విద్యను ఒక ఆయుధంగా మలచుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. – సుభాషిణి, ఎంవీఎస్ కళాశాల అధ్యాపకురాలు కుటుంబమే బలం.. -
సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
మహబూబ్నగర్ రూరల్: ఎస్సీ వర్గీకరణ ఏబీసీ ముసాయిదాను సీఎం రేవంత్రెడ్డి , మంత్రివర్గం ఆమోదించి చట్టం చేయడానికి నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మార్పీఎస్ ఉద్యమ నేత ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృపాకర్ అన్నారు. శుక్రవారం టీఎన్జీఓ భవనం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వినోద్కుమార్, సింగిరెడ్డి పరమేశ్వర్, రాయికంటి రాందాస్, మీసాల రాము పాల్గొన్నారు. రవాణాశాఖ మంత్రికి కృతజ్ఞతలు స్టేషన్ మహబూబ్నగర్: ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ఒక గంట ముందు ఇంటికెళ్లే వెసులుబాటును అమలు చేయాల్సిందిగా ఆల్మేవా ఆధ్వర్యంలో ఇటీవలే రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, ఎండీలకు వినతిపత్రాలు పంపించినట్లు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు షేక్ ఫారుఖ్ హుస్సేన్, సయ్యద్ వహీద్షా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్కు, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. మత్స్య సహకార సంఘం ఎన్నికలు నిర్వహించాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మత్స్య సహకార సంఘం ఎన్నికలు నిర్వహించాలని మహబూబ్నగర్ జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు గోనెల శ్రీనివాస్ ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ కోరారు. ఈమేరకు శుక్రవారం కలెక్టర్ విజయేందర బోయికి వినతి పత్రం సమర్పించారు. -
మహిళా శక్తిని సమాజానికి చాటి చెప్పాలి
పాలమూరు: మహిళలు ఎందులో తక్కువ కాదని, మహిళా శక్తిని సమాజానికి చాటి చెప్పాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళను గౌరవించే సంస్కృతి మన ఇంటి నుంచే మొదలుపెట్టాలన్నారు. సీ్త్ర శక్తిని దేనితో పోల్చలేమని, వారి పట్ల గౌరవంగా ఉండాలని సూచించారు. న్యాయమూర్తులు కళ్యాణ్ చక్రవర్తి, శారదా దేవి, శ్రీదేవి, రాజేశ్వరి, డి.ఇందిర, రాధిక, మమతారెడ్డి, రవిశంకర్, భావన, నిర్మల, మాధవి, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఆమె కోసం.. ఒకరోజు
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం 2023, మార్చి 8న మహిళా క్లినిక్లను ప్రారంభించింది. జిల్లాలోని జనరల్ ఆస్పత్రులు, 24 గంటలు సేవలందించే పీహెచ్సీల్లో మహిళా క్లినిక్లు కొనసాగుతున్నాయి. ఈ క్లినిక్లలో ప్రతి మంగళవారం మహిళలకు వైద్యసేవలు అందిస్తారు. ప్రతి వారం ఒక రకమైన వైద్య సేవలు అందిస్తున్నారు. సోమవారం గర్భిణులకు వైద్య పరీక్షలు చేస్తుండగా.. బుధవారం, శనివారం టీకాలు, శుక్రవారం డ్రై డే, గురువారం హెల్త్కేర్ క్లినిక్ వృద్ధుల కోసం చేస్తుండగా.. ఖాళీగా ఉన్న మంగళవారాన్ని మహిళలకు కేటాయించారు. ఇందులో 57 రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ క్లినిక్స్లో పరీక్షలు చేసి 24 గంటల్లో రిపోర్టు అందజేస్తారు. ఈ మేరకు తెలంగాణ డయాగ్నోస్టిక్ పోర్టల్ ప్రత్యేక లింక్ రూపొందించింది. నమూనాల సేకరణ, కేంద్రాలకు తరలింపునకు వాహనాలు, స్టాప్ను నియమించారు. -
గడ్డు పరిస్థితులు
సొరంగంలో అచ్చంపేట/అచ్చంపేట రూరల్/బల్మూర్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ కనుగొనేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సహాయక చర్యలకు నీటి ఊట అడ్డంకిగా మారింది. సొరంగంలో 14 రోజులుగా 12 విపత్తు బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నా కార్మికుల ఆచూకీ మాత్రం లభించడం లేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ నిరంతరం పర్యవేక్షిస్తూ కావాల్సిన సహాయక చర్యలు, వనరులు సమకూరుస్తున్నారు. గురువారం కేరళలోని త్రిసూల్ నుంచి వచ్చిన కడావర్ డాగ్స్ శుక్రవారం సొరంగంలోని ప్రమాద స్థలంలో సహాయక బృందాల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. రోబోటిక్ నిపుణులు, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు టన్నెల్ లోపల పరిసరాలు పరిశీలించారు. అన్వి రోబోటిక్, హైదరాబాద్ బృందం ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా సమాచారం తెలుసుకొని అవసరమైన సహకారం అందిస్తున్నారు. సొరంగంలో సహాయక బృందాలకు రోజురోజుకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. సఫారీ వాహనంలో సిస్మాలజీ బృందం.. భూ ప్రకంపనలు, భూమిలో ప్రయాణించే ప్రత్యాస్తి తరంగాలను అధ్యయనం చేసే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం నల్లమలలో సర్వే చేస్తున్నారు. రెండు ప్రత్యేక సఫారీ వాహనాలను అటవీశాఖ అధికారులు కేటాయించారు. సొరంగంలో ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి అధికారులు సిస్మాలజీ ప్రతినిధులకు లాంగిట్యూడ్, ల్యాటిట్యూడ్ లొకేషన్ను పంపిస్తుండగా సర్వే చేపడుతున్నారు. సమగ్ర నివేదికలను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిసింది. సక్రమంగా పనిచేయని కన్వేయర్ బెల్ట్.. సొరంగంలో సింగరేణి కార్మికుల పనికి ప్రాధాన్యం ఉండటంతో అధికంగా తరలివస్తున్నారు. కాగా టీబీఎం వద్ద 7 కంటైనర్లు ఉండగా.. ఒక కంటైనర్ మాత్రం బయట పడిందని, మిగిలినవన్నీ మట్టితో కూరుకుపోయినట్లు సమాచారం. బయటపడ్డ కంటైనర్లో ఆక్సిజన్ సౌకర్యం ఉందని.. అందులో చిక్కుకున్న కార్మికులు ఉండి ఉంటే క్షేమంగా బయటపడేవారని సహాయక బృందాలు చెబుతున్నాయి. టీబీఎం విడిభాగాలను తొలగించడానికే అధిక సమయం పడుతుందని.. సరైన విద్యుత్ సౌకర్యం లేక కన్వేయర్ బెల్ట్ సక్రమంగా పని చేయకపోవడంతో మట్టి తరలింపునకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. సొరంగంలో కార్మికులు సుమారు ఆరు నుంచి 10 గంటలు పని చేస్తుండగా.. మొబైల్ టాయిలెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. కార్మికుల జాడ కనుగొనేందుకు రంగంలోకి కడావర్ డాగ్స్, రోబోటిక్ బృందం 14 రోజులైనా లభించని ఆచూకీ కొనసాగుతున్న సహాయక చర్యలు సహాయక చర్యలు ఇలా.. చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు కడావర్ డాగ్స్ బృందం శుక్రవారం ఉదయం 7.15 గంటలకు ఎస్ఎల్బీసీ సొరంగంలోకి వెళ్లింది. 15 ఫీట్ల లోపలున్న వారిని గుర్తించగలగటం ఈ శునకాల ప్రత్యేకత. సొరంగంలోని బురద, మట్టి, ఇతర శిథిలాలను తొలగించేందుకు 110 మంది ఎన్డీఆర్ఎఫ్, ఇతర బృందాలు లోకో ట్రైన్లో వెళ్లారు. నలుగురు సభ్యుల అన్వి రోబోటిక్ నిపుణుల బృందం, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు ఉదయం 11.25కు మరోమారు సొరంగంలోకి వెళ్లారు. నాగర్కర్నూల్ కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. -
బ్యాంకుల్లో సరైన భద్రత ఏర్పాటు చేసుకోవాలి: ఎస్పీ
నారాయణపేట: బ్యాంకుల వద్ద సరైన భద్రత ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ బ్యాంకర్లకు సూచించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో అన్ని బ్యాంకుల అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. బ్యాంకుల వద్ద సీసీ కెమెరాలు తరచూ పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలని,సెక్యూరిటీ అలారం వ్యవస్థ, సెక్యూరిటీ గార్డ్స్ నియమించుకోవాలని, అధిక మొత్తంలో బ్యాంకులకు నగదు తీసుకువస్తున్నా, తరలిస్తున్నా పోలీసుల భద్రత తీసుకోవాలన్నారు. నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి జిల్లా పరిధిలో నిత్యం శాంతి భద్రతలు పరిరక్షిస్తూ, ప్రాపర్టీ నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. -
పెళ్లికి అడ్డంకులు..
‘మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. కూలీపని చేసి, జీవనం గడిపేవాళ్లం. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు (1985లో) జోగినిగా మార్చారు. అప్పుడు మా అమ్మానాన్నకు జోగిని వ్యవస్థ గురించి అసలే తెలియదు. తెలిస్తే అలా చేసేవారు కాదు. 1995లో ఊట్కూర్కు చెందిన లక్ష్మయ్యతో పెళ్లి నిశ్చయం కాగా.. చాలామంది గ్రామస్తులు, జోగినిలు వ్యతిరేకించారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను అడ్డుకున్నారు. ఊరోళ్లయితే పంచాయితీ పెట్టి.. జోగినికి పెళ్లి ఎలా చేస్తారని నిలదీశారు’ అని హాజమ్మ తన గాథను చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాను మూఢనమ్మకాలను పట్టించుకోనని స్పష్టం చేసినట్లు వివరించారు. తాను ఊరందరికీ భార్య అంటున్నారు కదా.. మరి మీ ఆస్తి రాసివ్వాలని అడిగితే ఎవరూ సమాధానం చెప్పలేకపోయారన్నారు. అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నానని.. తాను జోగినిని కాదని సమాజానికి తెలియజేసేందుకు చాలా సమయం పట్టిందని పేర్కొన్నారు. -
వివక్ష లేదు.. వేధింపులు తగ్గలేదు
ఇంట్లో వివక్ష లేకున్నా... బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు కొంతమేర కొనసాగుతున్నాయి. బస్టాప్, కళాశాల, ఆఫీస్తో పాటు అసభ్యపద జాలంతో పంపిస్తున్న మెసేజ్లతో ఇబ్బంది పడుతున్నారు. తెలియనివారితోనే ఎక్కువ సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు మహిళలు చెబుతున్నారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆడ–మగ వివక్ష, పని ప్రదేశంలో వివక్ష తదితర అంశాలపై ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సాక్షి సర్వే నిర్వహించగా పలు విషయాలు వెలుగుచూశాయి. – సాక్షి నెట్వర్క్ సాక్షి సర్వేలో మహిళల మనోగతం -
No Headline
మహబూబ్నగర్ క్రీడలు: కోయిలకొండ మండలం కేశ్వాపూర్ పెద్దతండాకు చెందిన అక్కా, చెల్లెలు కె.జ్యోతి, కె.ప్రియాంక బాస్కెట్బాల్లో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు. అక్క జ్యోతి 12 సార్లు జాతీయస్థాయి బాస్కెట్బాల్ టోర్నీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. 2015లో పంజాబ్లో జరిగిన జూనియర్ నేషనల్, వరంగల్లో జరిగిన జాతీయ ఆర్జీకేఏ బాస్కెట్బాల్ టోర్నీలో పాల్గొంది. 2016లో కర్ణాటకలో జరిగిన యూత్, ఉత్తరప్రదేశ్లో జరిగిన జూనియర్ నేషనల్ టోర్నీలో తెలంగాణ తరఫున ఆడిన జ్యోతి ఆ తర్వాత హైదరాబాద్, లుథియానా, ఢిల్లీ, చైన్నెలో జరిగి పలు జాతీయస్థాయి టోర్నీలో ప్రతిభ చూపారు. అలాగే 25కు పైగా రాష్ట్రస్థాయి టోర్నీల్లో పాలమూరు జట్టు తరఫున బరిలోకి దిగి సత్తా చాటారు. గుజరాత్ రాష్ట్రం భావ్నగర్లో జరిగిన 36వ జాతీయ క్రీడల్లో పాల్గొని, తెలంగాణ జట్టు స్వర్ణం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. చెల్లి ప్రియాంక 2014లో ఖమ్మంలో తన తొలి రాష్ట్రస్థాయి టోర్నీలో జిల్లాకు ప్రాతినిధ్యం వహించింది. ఇప్పటి వరకు 25కుపైగా రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొంది. అక్క జ్యోతితో కలిసి పలు సార్లు రాష్ట్రస్థాయి టోర్నీలో ఆడింది. మూడు సార్లు జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొంది. 2017 ఢిల్లీలో జరిగిన ఎస్జీఎఫ్ జాతీయస్థాయి టోర్నీలో తొలిసారిగా తెలంగాణ తరఫున బరిలోకి దిగారు. అలాగే 2019 ఢిల్లీలో జరిగిన అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయస్థాయి బాస్కెట్బాల్ టోర్నీలో ఆడింది. అండర్–23 విభాగంలో నేషనల్ బాస్కెట్బాల్ కోచింగ్ క్యాంపునకు ఎంపికై ంది. ప్రస్తుతం స్పోర్ట్స్ కోటాలో వీరు హైదరాబాద్లోని కేఎల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నారు. గిరిజన బిడ్డలు... బాస్కెట్బాల్లో దిట్టలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్న అక్కాచెల్లెలుఅతివకు అందలం అన్నిరంగాల్లో రాణించాలంటే చదువు ఎంతో ముఖ్యం ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారతపై ‘సాక్షి’ డిబేట్ -
ఏడాది పాటు ప్రైవేట్ ఉద్యోగం చేశా..
మా సొంత రాష్ట్రం ఒడిశా అయినప్పటికీ తండ్రి ఉద్యోగరిత్యా ఎ.కె పట్నాయక్ ఇండియన్ అడిట్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తుండడంతో ఢిల్లీలో ఉంటున్నారు. తల్లి మంజుశ్రీ ఉపాధ్యాయురాలు. నా విద్యాభ్యాసం ఢిల్లీలోనే కొనసాగింది. ఎం.ఏ.ఎకనామిక్స్ చేసిన తర్వాత ప్రైవేట్ సెక్టార్లో ఏడాదిపాటు జాబ్ చేశాను. కలెక్టర్ కావాలనే లక్ష్యంతో ఒకవైపు జాబ్ చేస్తూనే సివిల్స్కు సిద్ధమవుతూ వచ్చా. అనంతరం కలెక్టర్ అయ్యాను. మా సోదరి అర్పిత పీహెచ్డీ ఎకనామిక్స్ చదివి యూఎస్లో ఉంటుంది. వివక్షను రూపుమాపుతాం స్థానిక ఎమ్మెల్యే, ఎంపీతో పాటు మహిళలు ఉద్యోగులుగా ఉండడంతో లింగ వివక్షతకు ఆస్కారం లేకుండా చేస్తున్నాం. ఉద్యోగులు విధులు నిర్వహించే కార్యాలయాల్లో గౌరవం కల్పిస్తున్నాం. లింగ వివక్షతపై ఎస్పీ యోగేష్ గౌతమ్తో సమీక్షలు జరుపుతున్నాం. ఐసీడీఎస్, సఖి, భరోసా సెంటర్ల ద్వారా మహిళలకు కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాం. న్యాయపరంగా పూర్తి సహకారాన్ని అందిస్తున్నాం. మహిళలు ఏదైనా సహాయం అడిగితే వెంటనే స్పందిస్తున్నాం. అలాగే, మహిళల్లో రక్తహీనత ఉన్నవారిని గుర్తించి వారికి కావాల్సిన మందులను అందజేస్తున్నాం. జిల్లా ఆసుపత్రిలో స్పెషలిస్ట్ మహిళా డాక్టర్లచే ప్రత్యేక క్యాంపులు నిర్వహించి మహిళల ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ తీసుకుంటున్నాం. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: కలెక్టర్
నారాయణపేట: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మహిళకు వ్యక్తిగత, కుటుంబ జీవితం ఉంటుందని, ఉద్యోగ పరంగా చాలామంది మహిళలు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారన్నారు. ఒక మహిళకు మరో మహిళే సపోర్ట్ చేయాలని ఆకాంక్షించారు.ఎమ్మెల్యే మాట్లాడు తూ.. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను మహిళల పేరిటే అమలు చేస్తోందని చెప్పారు.మహిళలందరికీ సోద రుడిలా అండగా ఉంటానని భరోసా ఇస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
నారాయణపేట: ‘మహిళా హక్కుల కోసం పోరాడిన సావిత్రిబాయి ఫూలే, దుర్గాబాయి దేశ్ముఖ్ వంటి మహిళామణుల స్ఫూర్తితో మహిళా సాధికారత కోసం ఐదు లక్ష్యాల వైపు అడుగులు వేయాలి. మొదటిది.. లింగ వివక్ష లేని సమాజం వైపు అడుగు వేయడం. రెండు.. మహిళలకు సమాన విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడం. మూడు.. మహిళలకు భద్రత, ఆరోగ్య సంరక్షణ పెంపొందించడం. నాలుగు.. మహిళా సాధికారత, స్వతంత్ర నిర్ణయాలను ప్రోత్సహించడం. ఐదు.. రాజకీయాలు, వ్యాపారాల్లో మహిళలకు సరైన వాటా అందించడం. ఈ లక్ష్యాలతో ముందుకు సాగాలని’.. కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆమె ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు. ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ సిక్తాపట్నాయక్ మా సొంత రాష్ట్రమైన ఒడిశాలో మహిళలు ఎక్కువశాతం నిరక్షరాస్యులే. వారిలో ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తోంది. ఇక తెలంగాణలో మహిళలు ఎంతో ముందున్నారు. చదువుకొని అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ అంతర్జాతీయ స్థాయిలో మహిళలు రాణించాలి. చైతన్యం ఎక్కువే నారాయణపేటశనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025 -
వనిత.. ప్రగతి బావుటా
మక్తల్: జోగిని వ్యవస్థ నిర్మూలనకు ఆమె చేసిన పోరాటం ఆదర్శనీయం.. ఒక దృఢ సంకల్పతో ముందుకు సాగుతూ.. ఏ ఒక్కరినీ జోగినిగా మార్చకుండా అడ్డుకోవడంతో పాటు ఆదర్శ వివాహాలు జరిపిస్తూ.. జోగినుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఊట్కూరుకు చెందిన దళిత మహిళ హాజమ్మ. చిన్నతనం నుంచే జోగిని వ్యవస్థను వ్యతిరేకించిన ఆమె.. ఓఎంఐఎఫ్, ఏహెచ్టీయూ సంస్థల సహకారంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జోగినులకు అండగా నిలుస్తున్నారు. ఇందుకోసం ఆశ్రయ్ సంస్థ నిర్వాహకురాలు గ్రీస్ నిర్మలతో కలిసి ‘ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘటన సంస్థ’ను ఏర్పాటుచేశారు. ఈ సంస్థకు హాజమ్మ ఉమ్మడి జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నారు. 20 ఏళ్లుగా జోగిని వ్యవస్థను అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకు 30 మంది జోగినులకు వివాహాలు జరిపించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 5 వేల మంది జోగినులు ఉన్నారని.. అందులో 2 వేల మందికి ప్రభుత్వం నేటికీ పునరావాసం కల్పించలేదని హాజమ్మ తెలిపారు. ● వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతున్న ‘ఆమె’ ● ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి ● ఉమ్మడి జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్న మహిళలు -
డిజిటల్ లెర్నింగ్పై అవగాహన అవసరం
నారాయణపేట రూరల్: విద్యార్థులు డిజిటల్ లెర్నింగ్పై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మండలంలోని జాజాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులతో గురువారం ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్ లెర్నింగ్పై శిక్షణ పొందిన విద్యార్థుల ప్రెసెంటేషన్ చూసి ప్రశంసించారు. అనంతరం మాట్లాడుతూ.. గూగుల్ టూల్స్, ఈమెయిల్, వివిధ యాప్స్ వినియోగంతో స్కూల్ ప్రాజెక్టులు చేయడం చాలా బాగుందని, గ్రామీణ విద్యార్థులకు డిజిటల్ వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండడం ఎంతో ఉపయోగకరమన్నారు. అన్ని టాపికల్స్పై పిల్లలు మంచిగా నేర్చుకున్నారని పాజిటివ్ విషయాలకే వాడుకోవాలన్నారు. వ్యక్తిగతంగా, దేశానికి ఉపయోగపడే విధంగా కొత్త వాటిని రూపొందించాలని సూచించారు. అనంతరం శిక్షణ ఇచ్చిన డిజిటల్ ఈక్వటీ సంస్థ ఓంకార్, స్ఫూర్తి డిగ్రీ కళాశాల విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజు, ఏఎంఓ విద్యాసాగర్, డీఎస్ఓ భాను ప్రకాష్, కళాశాల ప్రిన్సిపల్ పద్మ, జిహెచ్ఎం భారతి పాల్గొన్నారు. -
ఏమైపోయారో..
అచ్చంపేట రూరల్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 13 రోజులుగా ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ గుర్తింపు కోసం అన్వేషణ కొనసాగుతోంది. తిండీ తిప్పలు దేవుడెరుగు.. కనీసం గాలి, వెలుతురు కూడా లేకుండా ఊపిరి సలపని చీకటి గుహలో తమ వారు ఎలా ఉన్నారో.. ఏమైపోయారో అంటూ టన్నెల్ వెలుపల కార్మికుల కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురుచూస్తూనే ఉన్నాయి. దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి కోసం 13 రోజులుగా సహాయక చర్యలు చేపడుతున్నారు. గురువారం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ సూచనలు చేశారు. ఈ క్రమంలోనే సొరంగం లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా క్యాడావర్ డాగ్స్ రప్పించినట్లు అరవింద్కుమార్ తెలిపారు. గురువారం ఉదయం షిఫ్టులో సింగరేణి, ఐఐటీ నిపుణులతోపాటు సైనిక అధికారులు సొరంగం లోపలికి వెళ్లారు. మట్టి తరలింపులో ఇబ్బందులు.. సొరంగంలో పేరుకుపోయిన, మట్టి, రాళ్లు, బురద బయటకు పంపడానికి సింగరేణి కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జీపీఆర్ మిషన్ చూయించిన చోట 6, 7 మీటర్ల లోపల ఉన్న అవశేషాల కోసం ప్రతిరోజు అన్వేషణ కొనసాగుతోంది. జీపీఆర్ చూయించిన ప్రదేశంలోనే ఎక్కువ శాతం పనులు కొనసాగిస్తుండటం, చివరికి ఆ ప్రాంతంలో ఎలాంటి అవశేషాలు కనిపించకపోవడంతో శ్రమిస్తున్న సింగరేణి కార్మికులకు నిరాశే మిలుగుతోంది. దీనికి తోడు 7 మీటర్ల లోతులో మట్టిని తవ్వి పక్కనే పడేస్తున్నారు. మట్టిని తవ్వడానికి కార్మికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పనులు కొనసాగితే ఆ మట్టి, రాళ్లు, ఇతర శిథిలాలను బయటకు పంపిస్తే పని సులువవుతుందని కార్మికులు అంటున్నారు. గోతులు తవ్వితే అధికంగా నీరు, బురద వస్తుంది. దీంతో ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. అందుబాటులో ఉండాలి.. సొరంగం వద్ద సహాయక చర్యల్లో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి సహకరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. అందరూ సమన్వయంతో, సహకారం అందిస్తూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వివిధ విపత్తుల ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది సొరంగ ప్రాంతానికి వస్తున్నారని, వారికి అన్ని వసతులు కల్పిస్తూ.. సర్వే, ఇతర పనులు చేయించుకోవాలన్నారు. ఐఐటీ నిపుణులు, సింగరేణి సాంకేతిక నిపుణులు, సైనిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఉదయం ఒక చివర నుంచి మట్టిని తీసి ఎక్సలేటర్పై వేస్తూ నీటిని మరోవైపు దారి మళ్లిస్తూ ముందుకు సాగాలని సూచించారు. సింగరేణి సిబ్బందితో పాటు యాంత్రిక సహకారం తీసుకుంటూ మనుషులు బురదను బయటికి తరలించేందుకు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. టన్నెల్ లోపల పనిచేసే వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి అధికారులు, ఐఐటీ నిపుణులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు పడిగాపులు టన్నెల్లో చిక్కుకున్న కార్మికులకు సంబంధించి కుటుంబసభ్యులు దోమలపెంట జేపీ కంపెనీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కంపెనీ యజమానితో మాట్లాడటానికి కుటుంబ సభ్యులు చూస్తుండగా.. కంపెనీ అధికారులు, సిబ్బంది పొంతన లేని సమాధానం చెబుతూ వారిని అక్కడి నుంచే పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం ఓ కార్మికుడి కుటుంబసభ్యులు కార్యాలయం వద్దకు వచ్చి ఆరా తీశారు. అదే సమయంలో జేపీ కంపెనీ యజమాని హెలీకాప్టర్లో వస్తుండటంతో అక్కడి నుంచి వారిని పంపించేశారు. నేటికీ అంతుచిక్కని 8 మంది కార్మికుల ఆచూకీ ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్నసహాయక చర్యలు తాజాగా రంగంలోకి కేరళ క్యాడావర్ డాగ్స్ ఐఐటీ నిపుణులతో టన్నెల్లోకి సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు -
నిర్ణీత గడువులోగా అనుమతులు ఇవ్వాలి
నారాయణపేట: జిల్లా పరిశ్రమల శాఖకు దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దేశించిన గడువులోపు అనుమతులు ఇవ్వాలని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్హల్ లో ఏర్పాటు చేసిన టీజీ ఐపాస్ సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నెల నెలా క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశపు ఎజెండాలోని వివిధ అంశాలపై పరిశ్రమల శాఖ జీఎం భరత్రెడ్డి అదనపు కలెక్టర్కు వివరించారు. టీజీ ఐపాస్ కింద గత జనవరి నుంచి ఈ నెల 6 వరకు 19 పరిశ్రమలకు అనుమతుల కోసం సంబంధిత శాఖలలో దరఖాస్తు చేసుకోగా వాటిలో 8 అనుమతులు మంజూరయ్యాయని, మిగతా 11 ప్రాసెస్లోఉన్నాయన్నారు. అలాగే టీ ఫ్రైడ్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సి లకు చెందిన 17 దరఖాస్తుదారులకు సబ్సిడీ మంజూరు చేసినట్లు తెలిపారు. అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించారు. సమావేశంలో ఆర్టీఓ మేఘా గాంధీ, లీడ్ బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్, సబ్ రిజిస్టార్ రామ్ జీ, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ రెహమాన్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి అక్బర్ హబీబ్, కార్మిక శాఖ అధికారి మహేష్ కుమార్, ప్రిన్సిపల్ మెర్సీ వసంత, చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అన్ని హంగులతో గురుకుల పాఠశాల నిర్మించాలి
మద్దూరు: అన్ని హంగులతో కూడిన ఎస్సీ గురుకుల పాఠశాల భవనాన్ని నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఏ. తిరుపతిరెడ్డి, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి అన్నారు. గురువారం మద్దూరు పట్టణంలోని కోట్ల ఆంజనేయస్వామి ఆలయం వద్ద రూ.30 కోట్లతో చేపట్టే గురుకుల పాఠశాల నిర్మాణ పనులకు, అలాగే నర్సింహస్వామి ఆలయం నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ భవన నిర్మాణం నమూనాను ఈఈ రాంచందర్ వారికి వివరించగా.. వచ్చే విద్యాసంవత్సరం వరకు భవన నిర్మాణం పూర్తయ్యే విధంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇదిలాఉండగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు నెలకు రూ.50వేలు గౌరవ వేతనం వచ్చేలా చూడాలని పలువురు వారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ విజయ్కుమార్, పీఏసీఎస్ చైర్మన్ నర్సింహా, మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు రమేష్రెడ్డి, హన్మిరెడ్డి, మల్లీకార్జున్, రహీం, వెంకట్రెడ్డి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మీయ భరోసాపై ఆశలు
మరికల్: వలసలను నిరోధించి ఉన్న ఊరిలోనే ఉపాధి కల్పించేలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. పారదర్శకంగా పథకం అమలుకు సంస్కరణలు చేపట్టారు. ఉపాధి పనుల్లో శ్రమించిన భూమి లేని వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆతీయ భరోసా కింద ఆర్థిక సాయం రూ.12వేల చొప్పున అందించేలా సంకల్పించింది. అయితే ఉపాధి హామీలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన కుటుంబాలను గుర్తిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కూలీలు ఆసక్తి చూపారు. క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభు త్వం అధికారులకు సూచించింది. ఇందుకు గాను జనవరి 21 నుంచి నాలుగు రోజుల పాటు గ్రామా ల్లో గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల వివరాలను ప్రజల ముందు ఉంచారు. పలు గ్రామాల్లో కూలీలు అభ్యంతరాలు తెలపడంతో పాటు కొత్తగా పథకానికి అర్హులమంటూ దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో మండల ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో మరోమారు పరిశీలించి పథకానికి అర్హుల జాబితాను పంపించారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లోని మొదటి విడతగా భరోసా నిధులు సైతం జమయ్యాయి. కానీ మిగిత ఆర్హులకు ఆత్మీయ భరోసా కింద డబ్బులు జమ కాకపోవడంతో వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. 20 రోజులు పనిచేసిన కుటుంబాల గుర్తింపు జిల్లాలోని 13 మండలాల్లో 280 గ్రామ పంచాయతీలకుగాను మొత్తం 1,10,835 జాబ్కార్డులు ఉన్నాయి. 2,01,268 మంది కూలీలు ఉండగా 73 వేల మందికి ఉపాధి పనులు కల్పించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీలో కనీసం 20 రోజులకు పైగా పనిచేసి ఉండటంతో పాటు భూమిలేని కూలీలను ఆత్మీయ భరోసా పథకం కింద ప్రభుత్వం సహాయం పొందేందుకు అర్హులని ప్రకటించింది. 20 రోజులు పని చేసిన 8,189 కుటుంబాలను గుర్తించారు. ఇందులో కూడా కేవలం 3,445 కూలీల కుటుంబాలే పథకానికి అర్హులుగా గుర్తించారు. మిగతా కూలీల కుటుంబాలను మరోసారి పరిశీలించగా మరో 402 మంది కూలీలను అర్హులుగా ఎంపిక చేశారు. దీనికి తోడు గ్రామసభల్లోనూ పథకానికి తాము అర్హులమంటూ 2,239 మంది కుటుంబాలు దరఖాస్తులు అందజేశారు. ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించి మొత్తం 3,942 మంది అర్హులుగా గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. తప్పని ఎదురుచూపులు జిల్లాలో 13 మండల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద 13 గ్రామలను ఎంపిక చేశారు. మొదటి విడతగా ఆయా గ్రామాల్లోని మొత్తం 197 మంది లబ్ధిదారులకు రూ.6 వేల చొప్పున ఆత్మీయ భరోసా నిధులు కూలీల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. మిగితా 3,745 మంది భూమిలేని అర్హులైన కూలీలకు వారి ఖాతాలో ఆత్మీయ భరోసా నిధులు జమ కావాల్సి ఉంది. అయితే మరోపక్క ఈ పథకానికి సంబంధించి అర్జీలు చేసుకున్న కూలీల్లో అనర్హులే అధికంగా ఉన్నారు. గ్రామసభల్లో 2,239 మంది దరఖాస్తు చేసుకోగా.. కేవలం 95 మందిని మాత్రమే అనర్హులుగా అధికారులు గుర్తించారు. మిగితా వారు ఉపాధి హామీలో పనిచేయని, జాబ్కార్డు లేని కూలీలే పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. జిల్లాలో 3,942 మంది పథకానికి ఎంపిక పైలెట్ గ్రామాల్లో 197 మంది ఖాతాల్లో డబ్బులు జమ మిగితా వారికి తప్పని ఎదురుచూపులుత్వరలో జమ చేస్తాం.. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే మిగితా అర్హులైన కూలీల ఖాతాలో ఆత్మీయ భరోసా సాయం మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ నెలాఖరు వరకు ఆత్మీయ భరోసా నిధులు వచ్చే అవకాశం ఉంది. రాగానే వారి ఖాతాలో జమ చేస్తాం. – మొగులప్ప, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి -
ఆయుధ పరిజ్ఞానం పెంపొందించుకోవాలి
వనపర్తి: విధుల్లో వినియోగించే ఆయుధాలపై జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎరవ్రల్లిలోని 10వ బెటాలియన్లో గురువారం ఉదయం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందికి మూడురోజుల ఫైరింగ్ శిక్షణ నిర్వహించారు. పోలీసులు విధుల్లో వినియోగించే ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఒక్కొక్కరు పది రౌండ్లు కాల్చే అవకాశం కల్పించారు. ఎస్పీ స్వయంగా పాల్గొని జిల్లా సాయుద దళాల అదనపు ఎస్పీ, జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ఫైరింగ్ చేసి ఆయుధ నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు. ఫైరింగ్ శిక్షణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయుధాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలని సూచించారు. వ్యాయామం చేయడం చాలా ముఖ్యమని, శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విధులు నిర్వర్తించవచ్చన్నా రు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి జీవ న విధానాన్ని అలవర్చుకోవాలని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి జిల్లాకు, పోలీసుశాఖకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు, డ్యూటీలో ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా సాయుద దళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సైబర్క్రైం డీఎస్పీ రత్నం, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు పాల్గొన్నారు. వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ -
ఆరుగురికి పదోన్నతి
మహబూబ్నగర్ క్రైం: జోగుళాంబ జోన్–7 పరిధిలో ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి ఇస్తూ గురువారం డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి వచ్చిన వారిలో చిన్ను నాయక్, బాలయ్య, బి.రాజు, వి.నాగరాజు, ఎం.వెంకటయ్య, రాములు, రాజేషం ఉన్నారు. వీరికి ఉమ్మడి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్లు కేటాయించారు. ప్రాజెక్టు రూపకల్పనపై అవగాహన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో వాణిజ్యశాస్త్ర విభాగం వి ద్యార్థులకు ప్రాజెక్టు రూపకల్పనపై అవగాహ న నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ చెన్నప్ప మాట్లాడుతూ బ్యాంకింగ్, బీమా, వ్యాపార, వాణిజ్య వంటి అంశాలను ఎన్ను కుని క్షణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. ఇలాంటి ప్రాజెక్టుల పరిశోధనల ద్వారా విద్యార్థుల వికాసం, సృజనాత్మకత, విశ్లేషణ నైపుణ్యాలు మెరుగుపడతాయని తెలిపారు. కార్యక్రమంలో కంట్రోలర్ రాజ్కుమార్, అనురాధారెడ్డి, రంగప్ప, సురేష్ పాల్గొన్నారు. -
ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం
మక్తల్: భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్ల నుంచి రబీసీజన్లో ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం సంగంబండ రిజర్వాయర్ నుంచి లెప్ట్హైలెవల్ కెనాల్ నుంచి నీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేస్తామని, కాల్వ నుంచి పారే చెరువులన్నింటికి నీటిని వదులుతామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్, మాజీ ఎంపీపీ చంద్రకాంత్గౌడ్, వెంకటేష్, రాయికోడ్ ఆనంద్, జయప్రకాస్రెడ్డి పాల్గొన్నారు. -
తొక్కు,చింత పులుసే తింటాం
మేం ఎక్కువగా కారం, తొక్కులు, చింతపులుసు తింటాం. మా పిల్లలు కూడా అవే తింటారు. కూరగాయలు కావాలంటే మన్ననూరుకు పోయి తెచ్చుకుంటాం. 15 రోజులు, నెలకు ఒకసారి వెళ్లి తెచ్చుకుంటాం. వారం తర్వాత కూరగాయలు పాడవుతాయి. ఎక్కువ రోజులు కారం పొడి, తొక్కు వేసుకుని అన్నం తింటాం. – దంసాని ఈదమ్మ, కొమ్మనపెంట, అమ్రాబాద్, నాగర్కర్నూల్ జిల్లా సరైన ఆహారం లభించట్లేదు.. చెంచులు ఎక్కువగా రైస్, కారం, తొక్కులపైనే ఆధారపడుతున్నారు. కూరగాయలు, కూరలు, పౌష్టికాహారం లేక రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. పుట్టిన శిశువులు రక్తహీనతతో 2 నుంచి 2.5 కిలోల లోపే జన్మిస్తున్నారు. చలికాలంలో న్యూమోనియా, ముక్కు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. – డాక్టర్ సైఫుల్లా ఖాన్, ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ -
ఆస్తి పన్ను లక్ష్యం చేరుకోవాలి
నర్వ: గ్రామపంచాయతీల్లో వందశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని జెడ్పీ సీఈఓ భాగ్యలక్ష్మి, డీపీఓ కృష్ణ కోరారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. వేసవి ప్రారంభమవుతున్నందున గ్రామాల్లోని ప్రతి కూలీకి ఉపాధి కల్పించాలని, జాబ్కార్డు లేనివారికి తక్షణమే అందజేయాలని కోరారు. శాశ్వత ప్రాతిపదికన పనులు గుర్తించి పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. పన్ను వసూళ్లను కార్యదర్శులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు. తాగునీటి ఎద్దడి నివారణకు ముందుస్తు చర్యలు చేపట్టాలని, కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేయించాలన్నారు. ఉపాధి పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, ఏపీఓ రాఘవేందర్, యాదవరాజు పాల్గొన్నారు. మట్టి నమూనా సేకరణను అడ్డుకున్న రైతులు మక్తల్: కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా మండలంలోని భూత్పూర్ రిజర్వాయర్ నుంచి నీటి తరలింపు పనులకుగాను ఇరిగేషన్ అధికారులు బుధవారం కాట్రేవుపల్లిలోని ఓ వ్యసాయ పొలంలో మట్టి నమూనా సేకరణకు డ్రిల్ యంత్రంలో వచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామ రైతులు అక్కడకు చేరుకొని పనులను అడ్డుకున్నారు. ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి, తహసీల్దార్ సతీష్కుమార్ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పేందుకు యత్నించినా ఒప్పుకోలేదు. ప్రభుత్వం నష్టపరిహారం ఎంత చెల్లిస్తుందో చెప్పకుంట నమూనాలు ఎలా సేకరిస్తారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లేనిపోని పనులు చేస్తే మా మరణాలు చూస్తారని హెచ్చరించారు. పోలీసులతో భయభ్రాంతులకు గురిచేసి మట్టి నమూనాలు సేకరిస్తే సహించమన్నారు. దీంతో చేసేది లేక అధికారులు వెనుదిరిగారు. కార్యక్రమంలో రైతులు రాజు, జిలానీ, కేశవులు, శ్రీనివాసులు, నర్సింహులు, శివరాజు, రాము, కృష్ణయ్య, శివకుమార్, రఘు, సోమాజీ పాల్గొన్నారు. పంట మార్పిడితోఅధిక దిగుబడులు మరికల్: మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో పంటల మార్పిడి చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని హైదరాబాద్ కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం ఇన్చార్జ్ సునీత తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదిక ఆవరణలో పంటల సమగ్ర సస్యరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. సంస్థ ఆధ్వర్యంలో పంటల సాగుపై ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. యాసంగిలో సాగుచేసే వరి, మొక్కజొన్న, ఆముదం తదితర పంటలకు వచ్చే కత్తెర పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే పంటలకు మేలుచేసే మిత్ర పురుగుల గురించి తెలిపారు. అనంతరం రైతులు సాగుచేసిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి డ్రోన్ సాయంతో మందులను ఎలా పిచిరాకీ చేయాలో వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వెంకట్రెడ్డి, ఉదయ్శంకర్, జిల్లా వ్యవసాయ అధికారి జాన్సుధాకర్, ఏఓ రహమాన్, ఏఈఓ పరశురాం తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ @ రూ.6,780 జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్యార్డులో బుధవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,780, కనిష్టంగా రూ.5,469 ధరలు లభించాయి. పెబ్బర్లు రూ.6,910, పత్తి గరిష్టంగా రూ.6,289, కనిష్టంగా రూ.5,469, కందులు గరిష్టంగా రూ.6,970, కనిష్టంగా రూ.6,210, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,371, కనిష్టంగా రూ.2,026, ఆముదాలు గరిష్టంగా రూ.6,077, కనిష్టంగా రూ.6,020 ధరలు లభించాయి. -
కారం, తొక్కులే నిత్య భోజనం..
నల్లమలలో మొత్తం 88 చెంచు ఆవాసాలు ఉండగా, చెంచుల మొత్తం జనాభా 9 వేల లోపే. ప్రభుత్వం వీరి సంక్షేమం, జీవన ప్రమాణాలు పెంచేందుకు రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా, వాస్తవంలో చెంచులు కనీసం సరైన తిండికీ నోచుకోవడం లేదు. చెంచుల్లో చిన్నారులు, మహిళల నుంచి పెద్దల వరకు నిత్యం కారం, తొక్కులతోనే కాలం గడుపుతున్నారు. అప్పాపూర్, భౌరాపూర్, మేడిమల్కల తదితర చెంచుపెంటల నుంచి కూరగాయలు కావాలంటే సుమారు 40 కి.మీ.దూరంలో ఉన్న మన్ననూరుకు వెళ్లాల్సి ఉంటుంది. పదిహేను, నెలరోజులకు ఒకసారి తెచ్చుకున్న కూరగాయలు, సరుకులతోనే సరిపెట్టుకుంటున్నారు. అటవీ అధికారుల ఆంక్షల నేపథ్యంలో తేనే, చెంచుగడ్డలు తదితర ఆహారం వారికి అరకొరగా దొరికినా, వాటిని ఆహారంగా తీసుకోకుండా ఇతరులకు విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు. నల్లమలలోని కొమ్మెనపెంటలో చెంచు మహిళలు -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులు కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున్నారు. సిబ్బంది ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రంలోకి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కేంద్రాల ఆవరణలో బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా మొదటిరోజు బుధవారం 4,476 మంది విద్యార్థులకుగాను 4,336 మంది హాజరుకాగా 140 మంది గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సుదర్శన్రావు తెలిపారు. జనరల్ విభాగంలో 3,888 మందికిగాను 3,767 హాజరుకాగా.. 121 మంది గైర్హాజరయ్యారని, ఒకేషనల్ విభాగంలో 588 మందికిగాను 569 మంది హాజరుకాగా 19 మంది రాలేదని వివరించారు. ఎలాంటి మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరిగాయని చెప్పారు. డీఈసీ కన్వీనర్ జిల్లాకేంద్రంలోని, డీఈసీ సభ్యులు ఉట్కూరు, మక్తల్, మాగనూర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. అడిషనల్ కలెక్టర్, డీఎస్పీ లింగయ్య జిల్లాకేంద్రంలోని శీ సాయి జూనియర్ కశాశాల పరీక్ష కేంద్రం తనిఖీ చేశారు. కేంద్రానికి 200 మీటర్ల వరకు ఇతరులు గుంపులుగా తిరగకుండా చూడాలని పోలీసులకు సూచించారు. -
కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
నారాయణపేట రూరల్: విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక విద్యలో ప్రావీణ్యం సంపాదించాలని జిల్లా సంక్షేమ అధికారి జయ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సహకారంతో మహిళా సాధికారిక కేంద్రంలో ఏర్పాటుచేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఆడపిల్లల చదువు దేశానికి ఎంతో ఉపయోగమని.. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠ్య పుస్తకాలతో పాటు కంప్యూటర్ శిక్షణ సైతం ఎంతో అవసరం అన్నారు. అమ్మాయిలను అన్నిరకాలుగా ప్రోత్సహించేందుకు ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బేటీ బచావో బేటీ పడావో పథకం ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో సీడీపీఓ వెంకటమ్మ, సూపర్వైజర్ శ్రీలత, కో–ఆర్డినేటర్ నర్సింహులు, అనిత, నర్సింహ, నరేశ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
తిండికీ తిప్పలే..
కొమ్మెనపెంటలో చెంచుల ఆవాసాలు(బొడ్డు గుడిసెలు) నల్లమలలోని చెంచు మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నల్లమలలోని చెంచు మహిళలు, చిన్నారుల్లో అధికశాతం మందిని రక్తహీనత సమస్య వేధిస్తోంది. సరైన పౌష్టికాహారం లేక చెంచులు తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్నారు. దీంతో గర్భిణులకు ప్రసవ సమయంలో వేధన తప్పడం లేదు. కొన్ని సార్లు పుట్టిన శిశువులు సైతం మృత్యువాత పడుతుండటం కలచివేస్తోంది. మహిళల్లో హిమోగ్లోబిన్ శాతం కనీసం 12 వరకు ఉండాలి, అయితే చెంచు మహిళలు, గర్భిణులు, బాలింతల్లో 60 శాతానికి పైగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. 25 శాతం మంది మహిళలు 9 శాతం కన్నా తక్కువ రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కేసుల్లో 3–6 శాతం మాత్రమే హిమోగ్లోబిన్ ఉంటున్న తీవ్రమైన ఎనిమియా కేసులు చోటుచేసుకుంటున్నాయి. నల్లమలలోని చెంచు మహిళల్లో రక్తహీనత సమస్యపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్(ఎన్ఐఎన్) హైదరాబాద్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించింది. శిశువులు నెలలు నిండక ముందే జన్మించడం, తక్కువ బరువుతో జన్మించడం, శిశు మరణాలు, పురుషులతో పాటు మహిళల్లోనూ ఆల్కహాలిక్ లివర్ సిర్రోసిస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు గుర్తించింది. అడవినే నమ్ముకుని జీవనం గడుపుతున్న చెంచుల జీవితాలు సరైన తిండి, ఆదాయం లేక మరింత దుర్భరంగా మారుతున్నాయి. నిత్యం కారం, తొక్కులే ఆహారం చెంచు మహిళల్లో 60 శాతం మందికి ఎనిమియా సమస్య గర్భిణులు, బాలింతల్లో రక్తం లేక పెరుగుతున్న శిశుమరణాలు -
టెండర్ ప్రక్రియ నిర్వహించాలి
సరైన అడ్డా లేక వాణిజ్య సముదాయం ఎదుట చిన్న హోటల్ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నా. ప్రభుత్వం సముదాయాన్ని ప్రారంభిస్తే ఓ దుకాణాన్ని అద్దెకు తీసుకొని వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నా. ప్రభుత్వం స్పందించి త్వరగా ప్రారంభించాలని కోరుతున్నా. – కె.రాణా, చిరు వ్యాపారి, నారాయణపేట దుకాణాలు కేటాయించాలి.. వాణిజ్య సముదాయం నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకొనే పరిస్థితులు ఉన్నాయి. అధికారులు త్వరగా ప్రారంభిస్తే మాలాంటి వారు వ్యాపారం చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ సరైన వ్యవస్థ లేక వేసవి, వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – కెంచె వెంకటేష్, దుస్తుల వ్యాపారి ● -
ఏడేళ్లుగా ఎదురుచూపులు
గత ప్రభుత్వ హయంలో రిజర్వేషన్ల ప్రాతిపదికన మార్కెట్ పాలకవర్గాలు కొలువుదీరాయి. బీసీ రిజర్వేషన్లో చైర్మన్ బండి వేణుగోపాల్ హయంలో దుకాణ సముదాయ నిర్మాణం పూర్తికాగా అప్పటి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. తర్వాత వచ్చిన చైర్మన్ సరాఫ్ నాగరాజు రెండేళ్ల పాటు కొనసాగారు. ఆయన పాలన అంతా ఎన్నికలు, కరోనా కాలంతో ముగిసింది. ఆ తర్వాత జనరల్ మహిళ రిజర్వేషన్లో చైర్పర్సన్గా వెంకట్రెడ్డి భాస్కరకుమారి రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. అనంతరం ఎస్సీ జనరల్ కేటగిరిలో ఎం.జ్యోతి చైర్పర్సన్ అయ్యారు. ఆమె పాలన ఏడాది పూర్తిగాకముందే ప్రభుత్వం మారడంతో పాలక వర్గాలు రద్దయ్యాయి. ప్రస్తుత మార్కెట్ చైర్మన్ ఆర్.శివారెడ్డి అయినా దృష్టిసారించాలని కోరుతున్నారు. జిల్లాకేంద్రంలో నిరుపయోగంగా వాణిజ్య దుకాణ సముదాయం ● టెండర్లు నిర్వహించరూ.. దుకాణాలు కేటాయించరు ● మార్కెట్యార్డుకు సుమారు రూ.కోటి నష్టం ● రిజర్వేషన్లు ప్రతిపాదించినా..రిజర్వులోనే టెండర్లు నారాయణపేట: జిల్లాకేంద్రం నడిబొడ్డున వాణిజ్య దుకాణ సముదాయం ప్రారంభించి ఏడేళ్లు గడుస్తున్నా నేటికీ నిరుపయోగంగానే ఉంది. పాతబస్టాండ్ సమీపంలో రూ.1.56 కోట్లతో 28, రైతుబజార్ కాంప్లెక్స్లో రూ.38 లక్షలతో నిర్మించిన 16 దుకాణాలను 2018, ఫిబ్రవరి17న అప్పటి రాష్ట్ర మార్కెటింగ్శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించారు. గత ప్రభుత్వ హయంలో ఆర్టీసీ డిపోకు చెందిన స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్యార్డు నిర్మించారు. అక్కడ అద్దెకు షెడ్లు వేసుకున్న వాటిని తొలగించడంతో వారు ఉపాధి కోల్పోతారని 2023లో రైతుబజార్లోని 16 దుకాణాలను అప్పటి ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి ప్రత్యేక చొరవతో పలువురికి దుకాణాలను ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో కేటాయించారు. వాణిజ్య సముదాయంలోని దుకాణాలు టెండర్లకు నోచుకోక ఏడేళ్లు కావస్తుంది. కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టి సారించి దుకాణాలకు టెండర్లు పిలిచి కేటాయించాలని వ్యాపారులు కోరుతున్నారు. రిజర్వేషన్లు ప్రతిపాదించినా.. వాణిజ్య సముదాయంలోని 28 దుకాణాల్లో 26 వాటికి రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. షెడ్యూల్ కులాల వారికి 4, షెడ్యుల్ తెగల వారికి 2, బలహీనవర్గాల వారికి (బీసీలకు) 6, దివ్యాంగులకు 1, జనరల్ కేటగిరికి 13 కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల వారీగా టెండర్ నిర్వహించేందుకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినా జాప్యంలో అంతర్యమేమిటో అర్థం కావడం లేదు. ● పట్టణంలోని సత్యనారాయణ చౌరస్తా నుంచి మార్కండేయ దేవాలయం వరకు రహదారి విస్తరణ పూర్తయింది. ఇందులో దుకాణాలు కోల్పోయిన వ్యాపారులు వాణిజ్య సముదాయం ఎప్పుడు వినియోగంలోకి తీసుకువస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఏడేళ్ల కిందటే దుకాణాలకు టెండర్లు నిర్వహించి ఉంటే మార్కెట్యార్డుకు రూ.1.18 కోట్ల ఆదాయం వచ్చేదని చెబుతున్నారు. ఐదుగురు చైర్మన్లు మారినా.. -
పనితీరులో మార్పు రావాలి
నారాయణపేట: నియోజకవర్గంలోని ఐకేపీ అధికారులు, సిబ్బంది పనితీరులో ఇక మార్పు రావాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి సూచించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోయిల్కొండలోని ఐకేపీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నందన్నారు. మహిళలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. మహిళా సంఘాల సభ్యులు పొందిన రుణ బకాయిలను సమయానికి కట్టించాలని.. వారికి మరింత రుణ సదుపాయం కలిగే అవకాశం ఉంటుందన్నారు. ఇటీవలే సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభించుకున్నామని గుర్తుచేశారు. ఇలాంటి పథకాలను మరెన్నో రూపొందించి జిల్లాలోని అన్ని సంఘాల సభ్యులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రొత్సహించాలన్నారు. బ్యాంకుల ద్వారా పొందిన రుణాలను సకాలంలో చెల్లించాలన్నారు. ప్రభుత్వ ఫలాలను అర్హులైన వారందరికి అందుతాయన్నారు. ఇది వరకు జరిగిన వాటిని తాను అడగదలచుకోలేనని..గతం గతహాః ..రాజకీయాలను పక్కనపెట్టి పార్టీల కతీతంగా మహిళా సంఘాల సభ్యులకు అన్ని విధాలుగా ప్రొత్సహించాలన్నారు. ఐకేపీలోని వీఏఓలు, ఏపీఎంలు, సీసీలు తమ పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తుంటామన్నారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. సమావేశంలో ఇంచార్జీ డీపీఎం ఆనందం, సీసీలు, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు. -
రాయితీని సద్వినియోగం చేసుకోండి
నారాయణపేట టౌన్: అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులైజేషన్ (ఎల్ఆర్ఎస్) పథకాన్ని ప్రకటించిందని, తాజాగా దీనిపై ఫీజులో 25 శాతం రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియపై పేట పుర పాలక సంఘం కార్యాలయంలో మంగళవారం డాక్యుమెంట్ రైటర్లకు, లైసెన్స్ ఇంజినీర్లు, సర్వేయర్లు, రియల్ ఎస్టేట్ వాపారులతో పుర కమిషనర్ భోగేశ్వర్లు అధ్యక్షతన అవగాహన సమావేశం నిర్వహించగా.. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని అన్నారు. మున్సిపల్ పరిదిలో ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి సమస్యలు లేని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. 2020 ఆగస్టు 26 నాటికి లేఅవుట్లలోని పది శాతం ప్లాట్లు రిజిస్ట్రేసన్ జరిగితే మిగితా ప్లాట్లను రిజిస్ట్రేషన్ సమయంలో విక్రయ దస్తావేజుతో క్రమబద్ధీకరణకు అవకాశం ఉంటుందన్నారు. సందేహాలకు ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కాగా సమావేశంలో పలువురు రియల్ వ్యాపారులు సందేహాలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కిరణ్కుమార్ నివృత్తి చేశారు. -
సీసీ నిఘాలో..
ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు ఈసారి సీసీ కెమెరా నిఘాలో పరీక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎప్పటికప్పుడు ప్రత్యేక స్క్వాడ్స్తో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయనున్నారు. ఎలాంటి మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ పాల్పడి పట్టుబడితే విద్యార్థులు తమ విలువైన గమ్యాన్ని కోల్పోతారని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
ఆచూకీ లభించేనా..?
● ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరం ● ఎట్టకేలకు కన్వేయర్ బెల్టు పునరుద్ధరణ ● ఎలాంటి సమాచారం బయటికి పొక్కనివ్వని అధికారులు అచ్చంపేట రూరల్/ఉప్పునుంతల: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ ప్రశ్నార్థకంగా మారింది. రోజూ విడతల వారీగా ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నా.. సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ మాత్రం లభించడం లేదు. ఈ నేపథ్యంలో అధికారులు సైతం ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. సొరంగంలో చేపడుతున్న సహాయక చర్యలకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారు. షిఫ్ట్ల వారీగా సొరంగంలోకి వెళ్లి వచ్చిన వారు కూడా సమాచారం అందించడం లేదు. కాగా, సొరంగంలో ప్రమాదం జరిగిన ప్రాంతంలో నీటి ఊట రోజురోజుకూ పెరుగుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. లోకో ట్రైన్లో సహాయ బృందాలు 13.5 కిలోమీటర్లు వెళ్లడానికి సుమారు 2 గంటల సమయం పడుతోందని.. అక్కడికి వెళ్లి గంట పాటు పనులు చేసి బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. టీబీఎం మెషీన్ విడి భాగాలను రైల్వే సిబ్బంది గ్యాస్ కట్టర్తో తొలగిస్తున్నారు. ● భూ ప్రకంపనలు, భూమిలో ప్రయాణించే ప్రత్యాస్తి తరంగాలను అధ్యయనం చేసే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం ఢిల్లీ నుంచి ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు చేరుకుంది. ఈ బృందం పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. సొరంగం కుప్పకూలిన ప్రదేశంలో అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఉన్నతాధికారులతో వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫోరెన్సిక్ బృందం రాక.. సొరంగంలో సహాయక బృందాలకు దుర్వాసన వస్తుందని.. మట్టి తవ్వకాల్లో ఎముకలు బయటపడ్డాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి నుంచి ప్రత్యేకంగా ఫోరెన్సిక్ బృందం సొరంగ ప్రాంతానికి చేరుకోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. ఉన్నతాధికారుల సమీక్ష.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. టన్నెల్ ఇన్ లెట్ ఆఫీస్ వద్ద రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న బృందాల అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, మైనింగ్, ఫైర్ సర్వీసెస్, ర్యాట్ మైనింగ్ ప్రత్యేకతలు, ప్లాస్మా కట్టర్స్ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. కన్వేయర్ బెల్టును పునరుద్ధరించిన కారణంగా గంటకు 800 టన్నుల మట్టిని బయటకు తీసుకురాగలమని అధికారులు వెల్లడించారు. గ్రౌండ్ పేనిట్రేటింగ్ రాడార్ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయని.. కన్వేయర్ బెల్టు ద్వారా వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అదేవిధంగా రెండు ఎస్కలేటర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగాలను గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించి లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకురానున్నట్లు చెప్పారు. సహాయక బృందాలకు అవసరమైన ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. కాగా, సహాయక చర్యలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ డీజీపీ నాగిరెడ్డి ప్రత్యేకంగా పర్యవేక్షించారు. సమావేశంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, కల్నల్ పరిక్షిత్ మెహ్ర, ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న తదితరులు ఉన్నారు. అందుబాటులోకి కన్వేయర్ బెల్టు.. సొరంగంలో టీబీఎం మెషీన్తో పాటు పనిచేసే కన్వేయర్ బెల్టు ధ్వంసమైంది. దీంతో సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లను బయటికి తరలించేందుకు ఇబ్బందులు తలెత్తాయి. సింగరేణి కార్మికులు పదుల సంఖ్యలో సొరంగంలోకి వెళ్లి పనులు చేసినప్పటికీ పురోగతి కనిపించలేదు. మట్టి, నీరు, బురదను బయటకు పంపడానికి శ్రమతో కూడుకున్న పనిగా మిగిలింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 3:30 గంటలకు కన్వేయర్ బెల్టును పునరుద్ధరించారు. అయితే ప్రమాదం జరగకముందు సొరంగంలో జరిగిన పనులకు సంబంధించిన మట్టి, రాళ్లు కన్వేయర్ బెల్టుపై ఉండటంతో, వాటిని మాత్రమే బయటికి తరలించారు. -
సర్వం సిద్ధం
నేటి నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు వివరాలు 8లో uనారాయణపేట రూరల్/నారాయణపేట ఎడ్యుకేషన్: నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి లోపాలు, పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, గురుకులాల్లో మొత్తం 8,791 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 3635, ఒకేషనల్లో 521మంది, ద్వితీయ సంవత్సరంలో 4049, ఒకేషనల్లో 586మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో నారాయణపేటలో 4, మక్తల్లో 3, కోస్గి, ధన్వాడలలో రెండు, మిగితావి మద్దూర్, దామరగిద్ద, ఊట్కూర్, మాగనూర్, మరికల్లలో ఒక్కో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మార్చి 5 నుంచి మార్చి 25 వరకు రెగ్యులర్ ఎగ్జామ్స్ ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. వసతుల కల్పన.. విద్యార్థులు పరీక్షలు రాయడానికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని వసతులు కల్పించారు. విద్యార్థులందరూ 8.30 నిమిషాల వరకు పరీక్ష కేంద్రానికి చేరుకొని, సెంటర్లో వారికి కేటాయించిన స్థానంలో 8.45 నిమిషాలకు కూర్చోవాలి. విద్యార్థుల సౌకర్యార్థం ఎండ తాకిడి తట్టుకోవడానికి వీలుగా పరీక్ష కేంద్రాల ఆవరణంలో టెంట్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ప్రతి పరీక్ష కేంద్రంలో ముగ్గురు చొప్పున ఆరోగ్య కార్యకర్తలను నియమించారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో సమయానికి చేరుకునే విధంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. ఇక పరీక్ష కేంద్రంలో డబుల్ డెస్క్ బెంచీలు.. వెలుతురు, గాలి వచ్చే గదుల్లోనే నెంబర్లు వేసేలా గైడ్ చేశారు. ప్యాన్లు ఏర్పాటు చేయాలని, మూత్రశాలలు, మరుగుదొడ్లు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టారు. కేంద్రాల ఆవరణ పోలీసులు 144 సెక్షన్ అమలు చేయడంతోపాటు బందోబస్తు నిర్వహించనున్నారు. పరీక్ష జరిగే సమయాలలో అన్ని జిరాక్స్ సెంటర్లను మూసి వేయనున్నారు. విద్యార్థులు ఎవరూ కూడా పరీక్ష కేంద్రాల లోపలికి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని ఆదేశించారు. సిబ్బంది కేటాయింపు ఇలా.. పరీక్షల నిర్వహణకు 16 మంది సీఎస్లు, నలుగురు అడిషనల్ సీఎస్లు, 16 మంది డీఓలు, నలుగురు కస్టోడియన్లు, ఒక ఫ్లయింగ్, మరొక సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను, 450 మంది ఇన్విజిలేటర్లు నియమించారు. 12 చోట్ల ప్రభుత్వ కళాశాలలు, మరో 4 ప్రైవేటు కళాశాలలు ఉండటంతో అక్కడ మాత్రం అడిషనల్ సీఎస్ల నియామకం చేశారు. ఇక ఇన్విజిలేటర్లుగా పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసిన కళాశాల సిబ్బందిని తీసుకోగా, తక్కువ ఉన్నచోట్ల ప్రభుత్వ ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ప్రశ్నపత్రాలను 8 స్టాక్ పాయింట్లలో భద్రపరిచారు. పరీక్షల నిర్వహణకు రెండు రకాల కమిటీలు పని చేస్తున్నాయి. హై పవర్ కమిటీలో చైర్పర్సన్గా కలెక్టర్ సిక్తా పట్నాయక్, కన్వీనర్గా డీఐఈఓ సుదర్శన్రావు కమిటీలో ఒక సీనియర్ ప్రిన్సిపల్ ప్రతాప్రెడ్డి, ఒక లెక్షరర్ అంబాజీ ఉన్నారు. స్ట్రాంగ్ రూం ఇన్చార్జ్గా విజయలక్ష్మి వ్యవహరిస్తున్నారు. ఇన్విజిలేటర్లు5 నిమిషాల గ్రేస్ టైమ్ గతంలో అమలు చేసిన ఒక్క నిమిషం నిబంధనను ఎత్తివేస్త్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా 15 నిమిషాల ముందు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభం అయిన తర్వాత 5 నిమిషాల వరకు గ్రేస్ టైమ్ ఉంటుంది. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్ పరీక్షలకు సంబందించి విద్యార్థి హాల్టికేట్ పై సంబందిత కళాశాల ప్రిన్సిపల్ సంతకం అవసరంలేదు. ఇంటర్ నెట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. నేరుగా డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు వెళ్లే అవకాశం ఉంది. కళాశాల వెబ్సైట్లో సైతం హాల్టికెట్లు ఉండటంతో చాలా వరకు విద్యార్థులు కాలేజీకి వెళ్లి సైతం తీసుకున్నారు. ఫీజు బకాయిల విషయంలో కళాశాల యాజమాన్యం ఇబ్బంది పెట్టకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం... జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా మొత్తం 16 పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇప్పటికే విద్యార్థులకు హాల్టికెట్లు అందాయి. పరీక్షకు గంట ముందు కేంద్రానికి రావడంతో పాటు అన్ని రకాల పరీక్ష సామాగ్రి వెంట తెచ్చుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి ఉండదు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. – సుదర్శన్, డీఐఈఓ జిల్లాలో మొత్తం 16 పరీక్ష కేంద్రాలు హాజరుకానున్న 8,791మంది విద్యార్థులు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ..పకడ్బందీ ఏర్పాట్లు నిమిషం నిబంధన ఎత్తివేత రెగ్యులర్ విద్యార్థులు 7,684ఒకేషనల్ విద్యార్థులు 1,107450 -
మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక పథకాలు
కొత్తకోట రూరల్: మహిళలు ఆర్థికంగా ఎదగడం చాలా ముఖ్యమని.. నాబార్డ్ అందిస్తున్న అనేక పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నాబార్డ్ మహబూబ్నగర్ క్లస్టర్ డీడీఎం మనోహర్రెడ్డి సూచించారు. మంగళవారం పెద్దమందడి మండలం మోజర్ల ఉద్యాన కళాశాలలో నాబార్డ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ వ్యవసాయ ఆర్థిక బలోపేతంతో గ్రామాలు గొప్పగా ఎదుగుతాయన్నారు. అనంతరం మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. పిడిగం సైదయ్య మాట్లాడుతూ.. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని.. అన్నిరంగాల్లో రాణించే శక్తి వారి సొంతమని కొనియాడారు. వ్యవసాయ రంగంలో విత్తనం పొలంలో నాటిన దగ్గర్నుంచి పంట ఉత్పత్తులు మార్కెట్లో విక్రయించే వరకు మహిళల పాత్ర కీలకమన్నారు. వ్యవసాయంలో రోజురోజుకు మహిళల ప్రాధాన్యం పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమని చెప్పారు. అనంతరం ఉత్తమ మహిళా రైతులు, ఉత్తమ స్వయం సహాయక బృందాల మహిళలను విద్యార్థులు, ప్రొఫెసర్లు సన్మానించారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా అడిషనల్ డీఆర్డీఓ భాస్కర్, వనపర్తి లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిషోర్ పాండే, కళాశాల ఉమెన్ సెల్ ప్రొటెక్షన్ ఇన్చార్జ్ డా. ఆర్.పూర్ణిమా మిశ్రా, డా. విద్య, డా. గౌతమి, నవ్య, శ్వేత, ఏఈఓ రమేష్కుమార్, విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు. -
కార్పొరేట్ వైద్యం
ఆస్పత్రి ప్రధాన భవనం సీ–బ్లాక్ పాలమూరు: ఇకపై ప్రతి చిన్న రోగానికి హైదరా బాద్కు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఉండదు. కార్పొరేట్ ఆస్పత్రులకే పరిమితమైన అత్యాధునిక వైద్యసేవలు త్వరలో పాలమూరులోనే అందుబాటులోకి రానున్నాయి. అన్ని హంగులతో నిర్మించనున్న నూతన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉమ్మడి జిల్లా పేదలకు ఆరోగ్య ప్రదాయినిగా మారనుంది. ప్రతి విభాగానికి చెందిన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రధానంగా కార్డియాలజీ, న్యూరా లజీ వంటి ప్రధాన సమస్య తీరనుంది. పాత కలెక్టరేట్ ఆవరణలో ఉన్న స్థలంలో 2022 జూన్లో రూ.200 కోట్ల వ్యయంతో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం ఐదు బ్లాక్లుగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ఏ, బీ, సీ, డీ బ్లాక్లు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం వీటిలో పెయిటింగ్, కరెంట్ వైరింగ్ పనులు కొనసాగుతున్నాయి. అక్కడక్క డ వాటర్ సంపు, పోస్టుమార్టం విభాగం, ఆక్సిజన్ పైప్లైన్, విద్యుత్ పనులు, ఎస్టీపీ, డ్రెయినేజీ, గ్లాస్ వర్క్, గ్రిల్స్ ఏర్పాటు చేసే పనులు చేస్తున్నా రు. ప్రధాన వైద్యసేవలు సీ–బ్లాక్లో నిర్మించనున్నా రు. జూన్ చివరి నాటికి సివిల్ పనులతో పాటు మైనర్ పనులను సైతం పూర్తి చేసి అధికారులకు అప్పగించే అవకాశం ఉంది. ఆస్పత్రి ప్రధాన ముఖ ద్వారం ఎల్లమ్మ గుడి వెనుక భాగంలో రావడంతో అక్కడి నుంచి రెండు లైన్ల రహదారి నిర్మిస్తున్నారు. ఆస్పత్రి చుట్టూ డివైడర్తో రెండు లైన్ల రహదారి నిర్మిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం జెడ్పీ గ్రౌండ్ స్థలంలో నిర్మిస్తున్నారు. ● ప్రస్తుతం నిర్మిస్తున్న ఆస్పత్రి ప్రధాన ముఖద్వారం నిర్మించే స్థలంలో ఫోరం భవనం ఉంది. ఫోరం కార్యకలాపాలు ప్రస్తుతం అక్కడే కొనసాగుతున్నాయి. ఫోరం కోసం పాత డీఈఓ కార్యాలయం లేదా పశు సంవర్ధకశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. పాలమూరులో 1,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి త్వరలో అందుబాటులోకి రానున్న అత్యాధునిక వైద్యసేవలు రూ.200 కోట్లతో ఐదు బ్లాక్ల నిర్మాణం నాలుగు విభాగాల పనులు దాదాపు పూర్తి, పెండింగ్లో ఈ–బ్లాక్ పనులు -
కొనసాగుతున్న అన్వేషణ
అచ్చంపేట/మన్ననూర్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలు సోమవారం పదో రోజు కూడా కొనసాగాయి. కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే భారీస్థాయిలో పేరుకుపోయిన బురద, ఉబికి వస్తున్న నీటి ఊటతో వీరి అన్వేషణకు అవరోధాలు కలిగిస్తున్నాయి. దాదాపు 10– 20 వేల లీటర్ల మేర నీటి ఊట ఉబికి వస్తుంది. మరోవైపు తమవారి రాక కోసం కుటుంబసభ్యులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఎస్ఎల్బీసీ సందర్శించిన సీఎం రేవంత్రెడ్డి కన్వేయర్ బెల్టు మరమ్మతు సోమవారం సాయంత్రానికి పూర్తవుతాయని చెప్పారు. కానీ, ఇక్కడి పరిస్థితి చూస్తే మరో రెండు రోజులైనా కన్వేయర్ బెల్టు మరమ్మతు జరిగే అవకాశం కనిపించడం లేదు. దీనికోసం సింగరేణి, రాబిట్ బృందాలు కష్టపడుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన శిథిలాలను సింగరేణి బృందాలు మాన్యువల్ పద్ధతిలో తవ్వకాలు చేపడుతున్నారు. ఆ మట్టిని లోకో ట్రైన్ ద్వారా బయటికి పంపిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ కూడా ఒకింత ఆటంకం సృష్టిస్తుంది. దీనిని బట్టి 15 అడుగుల ఎత్తులో పేరుకుపోయిన బురద, మట్టి బయటికి తేవడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. రాడార్ (జీపీఆర్) స్కానింగ్ గుర్తించిన మూడు, నాలుగు ప్రదేశాల్లో శిథిలాలు తొలగించినా ఆనవాళ్లు దొరకలేదు. ఎంత తవ్వితే అంత ఊట బయటికి వస్తుండటంతో ఎప్పటిప్పుడు డీవాటరింగ్ చేస్తున్న పనులకు అడ్డంకులు కలిగిస్తుంది. సహాయక చర్యలు వేగవంతం సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో మట్టిని తొలగించేందుకు కన్వేయర్ బెల్టు పనులు వేగవంతం చేసినట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ తెలిపారు. సోమవారం ఎస్ఎల్బీసీ సొరంగం ఇన్లెట్ వద్ద రెస్క్యూ బృందాల ఆపరేషన్లో పాల్గొన్న సహాయక బృందాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టిని తొలగించేందుకు డీవాటరింగ్ ప్రక్రియ వేగవంతం చేశామని చెప్పారు. 12 సంస్థలకు సంబంధించిన బృందాలు సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారని, సమస్యలు ఎదురువుతున్నా వాటిని అధిగమిస్తూ ముందుకుపోతున్నామని చెప్పారు. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేకాధికారులతో సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో సొరంగంలో మట్టి, బురద, కాంక్రీట్ శిథిలాలను తొలగించే పనులు వేగవంతం చేశామన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి జాడ గుర్తిస్తామని పేర్కొన్నారు. ఇరువైపుల నుంచి నీరు రాకుండా సొరంగంలో ఇప్పటికే నిల్వ ఉన్న నీటిని తొలగించే ప్రక్రియను చేపట్టామని, దీని కోసం ప్రత్యేక యంత్రాలు నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్అలీ, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, కల్నల్ పరీక్షిత్ మోహ్రా, ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న, హైడ్రా, సింగరేణి, మైన్స్ తదితర సంస్థలు పాల్గొన్నాయి. బురద, ఊట నీరే ప్రధాన సమస్య నిమిషానికి 10– 20 వేల లీటర్ల నీటి ఊట సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తేవడంలో అవరోధాలు పదోరోజు కొనసాగిన సహాయక చర్యలు రెస్క్యూ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం -
హైరిస్క్ ప్రసవాలపై ప్రత్యేక శ్రద్ధ
నారాయణపేట: జిల్లాలో హైరిస్క్ గర్భిణులకు సుఖ ప్రసవం అయ్యేలా వైద్యులు, ఏఎన్ఎంలు చూడాలని, ఈమేరకు ప్రతి గర్భిణికి ముందస్తు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ సౌభాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం స్కిల్ డెవలప్మెంట్ హాల్లో జిల్లాలోని ఏఎన్ఎంలకు హైరిస్క్ ప్రసవాలపై డీఎంహెచ్ఓ, డాక్టర్లు శైలజ,రోహిణి చెవని అర్మాన్ ఆర్గనైజేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలు ఎల్ఎంపీ రిజిస్టర్ ఆధారంగా అర్హులైన గర్భిణులను నిశ్చయ్ కిట్ల ద్వారా పరిక్షిస్తూ నమోదు చేయాలన్నారు. ప్రతి ఏఎన్ఎం ఒక గర్భిణిని నమోదు చేసే ముందు కుటుంబానికి సంబందించిన అన్ని వివరాలను తెలుసుకోవాలని, ఏవైనా ప్రమాద సంకేతాలు (కారణాలు) ఉన్నాయో లేదో తెలుసుకోవాలని, బ్లడ్ గ్రూప్ పరీక్షలు చేయాలన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ ట్రైమిస్టర్లలో వారాల ప్రతిపాదికన కాకుండా పర్ అబ్దమెన్ ద్వారా పరీక్షించాలన్నారు. అనీమియా (రక్తహీనత), అధిక రక్తపోటు, మధుమేహం, మూర్చ, గత సిజేరియన్ సెక్షన్ వివరాలు, గర్భదారణ సమయంలో హెచ్ఐవి మొదలగు వాటిపై తెలియజేస్తూ, విపులంగా వివరించాలన్నారు. కార్యక్రమంలో గోవిందరాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి నారాయణపేట: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు కదం తొక్కాలని తెలంగాణ రాష్ట్ర రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షుడు రాచమల్ల సిద్దేశ్వర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో సోమవారం రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ రివ్యూ సమావేశం డీసీసీ అధ్యక్షుడే కె.ప్రశాంత్ కుమార్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉండి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి , జిల్లా గ్రంథాలయ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రసన్న, జిల్లాలోని పార్టీ మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
తుది దశలో నిర్మాణ పనులు
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ–బ్లాక్ మాత్రం ఈవీఎం భవనం ఉండటం వల్ల పూర్తి కాలేదు. ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. కోర్టు ఆ సమస్యను త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం. ఈవీఎం భవనంపై స్పష్టత వస్తే ఈ–బ్లాక్ కూడా పనులు ప్రారంభం అవుతాయి. ప్రభుత్వ నూతన ఆస్పత్రిని ఎప్పుడూ ప్రారంభం చేస్తుందనే అంశంపై స్పష్టత రాలేదు. – డాక్టర్ సంపత్కుమార్ సింగ్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
బాధ్యతాయుతంగా పని చేయాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఎవరూ నిబంధనలు అతిక్రమించవద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలో డీపార్ట్మెంట్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండ్లకు 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ విధి విధానాలపై ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించగా.. కలెక్టర్ హాజరై మాట్లాడారు. పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని, సీఎస్, డీఓలు, ఇన్విజిలేటర్లు మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్లు తీసుకురావద్దని, విద్యార్థుల నుంచి కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించకూడదన్నారు. డీఈఓ మాట్లాడుతూ.. మార్చి 21 నుంచి జరిగే 10వ తరగతి పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో మెత్తం 39 పరీక్ష కేంద్రాలు ఎంపిక చేయబడ్డాయని మొత్తం 7637 విద్యార్థులు రెగ్యులర్గా, 65 మంది వన్స్ ఫెయిల్డ్ విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారని, 39 చీఫ్ సూపరింటెండ్లు, డిపార్టుమెంట్ ఆఫీసర్లు, ఆరుగురు కస్టోడియన్లు, ముగ్గురు ప్లైయింగ్ స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్ఈఓలు కృష్ణారెడ్డి, బాలాజీ, ఏసీజీ ఆంజనేయులు, సీఎమ్ఓ రాజేంద్ర కుమార్, యాదయ్య శెట్టి, ఉపాద్యాయులు పాల్గొన్నారు. విద్యా ప్రమాణాలు పెంచాలి విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెంచే విధంగా ఉపాద్యాయులు కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఈ మేరకు జిల్లా స్థాయిలో నూతన ఉపాద్యాయులకు స్థానిక కెజీబీవీ పాఠశాలలో నిర్వహించిన మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి సోమవారం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వెనుకబడిన విద్యార్థుల విషయంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద వహిస్తూ జిల్లాను ఎస్ఎల్ఎన్ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్లాలన్నారు. డీఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ.. ఏ రకమైనా బోధన పద్దతి తరగతికి సరిపోతుందో అందుకు అనుగుణంగా బోధన చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ అధికారి విద్యాసాగర్, కోర్సు కో ఆర్డినేటర్ కృష్ణా రెడ్డి, మద్దూర్ ఎమ్ఈఓ బాల కిష్టప్ప, ఎస్ఎస్ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సొంతింటి కల నిజం చేస్తాం
ధన్వాడ: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తుందని.. ఇల్లు లేని వారందరికీ సొంతింటి కల నిజం చేస్తామని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కంసాన్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. మండలంలో మొదటి విడతలో ఎంపికై న కంసాన్పల్లి గ్రామంలో నిర్మాణ పనులు లబ్ధిదారులు మొదలు పెట్టారు. అనంతరం ధన్వాడ మండల కేంద్రంలో దళితల కేటాయించిన భూమిలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బోరు పాయింట్లకు భూమి పూజలు నిర్వహించారు. మొత్తం ఏడుగురు రైతులకు ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బోర్లు మంజూరయ్యాయి. అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. -
ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం
నారాయణపేట రూరల్: పరీక్షల ఒత్తిడిని అధిగమించడానికి విశ్వాసం, పట్టుదల, సంకల్పం, ఏకాగ్రత పునాదులపై విజయ సాధనాన్ని నిర్మించుకోవాలని, విద్యార్థులు పరీక్షలపై భయాన్ని వీడి ఉన్న కొద్ది సమయాన్ని పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రం సమీపంలో గల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన పూసల్ పహాడ్ టాలెంట్ టెస్ట్ విజేతల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి కలెక్టర్తోపాటు ఎమ్మెల్యే పర్ణికారెడ్డి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో ముందుకు వెళ్లడానికి ఇలాంటి టాలెంట్ టెస్టులు ఎంతో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరూ శ్రద్ధ, ఏకాగ్రతను కలిగి పరీక్షల్లో విజయం సాధించాలని సూచించారు. పాఠశాలల్లో ఇప్పటికే సిలబస్ పూర్తి కావడంతో రివిజన్పై దృష్టి సారించాలని, గ్రాండ్ టెస్ట్ లపై ఫోకస్ పెట్టాలని కోరారు. విద్యార్థులు పరీక్షల సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలని, మిత ఆహారాన్ని తీసుకోవాలని, యోగ, వ్యాయామం, ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం జిల్లా టాపర్లుగా నిలిచిన ముగ్గురు ప్రభుత్వ, మరో ముగ్గురు ప్రైవేటు విభాగాల్లోని విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు. రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించాలి పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ క్రమంలో జిల్లాలోనూ విద్యారంగంలో బాలికలదే పై చేయిగా ఉందని అన్నారు. తల్లిదండ్రులు సైతం బాలిక విద్యను ప్రోత్సహించాలని, అన్ని విషయాల్లోనూ అమ్మాయిలకు తోడ్పాటున అందించాలని కోరారు. ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. అనంతరం పూసల్ పహాడ్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లూరి శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే పిల్లలకు సాంస్కృతి, సాంప్రదాయాలను నేర్పించాలని, తల్లిదండ్రులు, గురువుల పట్ల భక్తి, గౌరవం కలిగి ఉండాలని, సెల్ ఫోన్, టీవీలకు బానిసలు కాకుండా పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం విషయాల వారీగా సీనియర్ సబ్జెక్ట్ టీచర్లు మెలకువలను తెలియజేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, నిర్వాహకులు షేర్ పారిజాత, కృష్ణారెడ్డి, ఏఎంఓ విద్యాసాగర్, సెక్టోరియల్ అధికారి నాగార్జున్ రెడ్డి, ఏపీవో సురేష్, ఎంఈఓ బాలకిష్టప్ప, డీఎస్ఓ భాను ప్రకాష్, నరసింహ, రఘురామేశ్వర్, రాజేష్ కుమార్ పాల్గొన్నారు. పరీక్షల వేళ స్పష్టమైన లక్ష్యంతోవిద్యార్థులు ముందుకు సాగాలి కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
పడకేసిన పల్లె పాలన
మరికల్: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా తయారైంది. ఏడాది క్రితం పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం మండలాలతోపాటు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకాధికారిని నియమించింది. జిల్లాలో 280 గ్రామ పంచాయతీలు ఉండగా.. ఏ గ్రామంలో చూసినా పారిశుద్ధ్య సమస్య కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రోడ్లపైనే మురుగు, చెత్తా చెదారం పారుతున్నాయి. వేసవి ఇంకా రాకముందే తాగునీటి సమస్య కొన్ని గ్రామాల్లో ఉత్పన్నమవుతోంది. ఏదైనా ప్రత్యేక కార్యక్రమం ఉంటే తప్పా గ్రామాల వైపు ప్రత్యేకాదికారులు కన్నెత్తయినా చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శులతో చిన్న చిన్న పనులు కొనసాగిస్తున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో 16వ ఆర్థిక సంఘం నిధులు మినహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేవి ఆలస్యం అవుతున్నాయి. ఆర్థిక సంఘం నిధులు వేతనాలు, ఇతర బిల్లులకు కూడా సరిపోవడం లేదు. పల్లెల్లో పన్నుల వసూలు అంతంత మాత్రమే కావడంతో మోటార్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, ట్రాక్టర్ డీజిల్, ఇతర ఖర్చులకు నిధులు లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక వేసవి కాలంలో నీటి సమస్య ఏర్పడే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకాధికారులపై పని ఒత్తిడి అత్యధిక గ్రామాల్లో ప్రత్యేక అధికారులు గ్రామ సభలు, తీర్మానాలు, వేతనాల చెల్లింపులతో పాటు అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గ్రామ పంచాయతీలకు వచ్చేందుకు ప్రత్యేక అధికారులు ముఖం చాటేశారని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామ సభలు వేతనాలతో చెల్లింపులతో పాటు అభివృద్ధి పనుల బిల్లుల విషయంలో ప్రత్యేక అధికారులు సంతకాలు చేయడం లేదని వాపోతున్నారు. కొన్ని పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించే సమయం తీరిక లేకపోవడంతో బిల్లు చెల్లింపులకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. నిధుల జాడేది..? గ్రామాల్లో పాలకవర్గాలు ఉంటేనే రాష్ట్ర ఆర్థిక కమిషన్ (ఎస్ఎఫ్సీ) కేంద్ర ఆర్థిక కమిషన్(సీఎఫ్సీ) నిధులు వస్తాయి. పాలకవర్గాలకు గడువు ముగియడంతో ఏడాది కాలంగా నిధులు విడుదల కావడం లేదు. చిన్న పంచాయతీల్లో నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు, పెద్ద పంచాయతీలకు రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చవుతుంది. పంచాయతీలకు పన్నుల రూపంలో వచ్చే అరకొర ఆదాయం ఖర్చులో 20–30 శాతానికి కూడా సరిపోవటం లేదు. విద్యుత్ దీపాల నిర్వహణ, పైపులైన్ల మరమ్మతులు, పారిశుద్ధ్య పనులు, సామగ్రి కొనుగోలు, మల్టీపర్సన్ కార్మికుల వేతనాలు, ట్రాక్టర్ల డీజిల్ ఖర్చులు భారంగా మారాయి. గ్రామాల వైపు కన్నెత్తి చూడని ప్రత్యేకాధికారులు ముంచుకొస్తున్న తాగునీటి ముప్పు మురుగు కూపాలను తలపిస్తున్న వీధులు ఏడాదిగా విడుదల కాని నిధులు అంతంతమాత్రంగానే పన్ను వసూళ్లు -
తాగునీటి సమస్య తీవ్రమవుతోంది
గ్రామంలో తాగునీటి సమస్య రోజు రోజుకు జఠిలంగా మారుతుంది. మిషన్ భగీరథ నీళ్లు సంక్రమంగా రాకపోవడంతో బోరు బావుల వద్ద నుంచి నీటిని తీసుకొస్తున్నాం. మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీల కారణంగా నెలలో వారం రోజులు నీరు రావడం లేదు. గ్రామ శివారులోని పొలాల వద్దకు వెళ్లి బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నాం. – లక్ష్మమ్మ, ఇబ్రహీంపట్నం అస్తవ్యస్తంగా డ్రెయినేజీ వ్యవస్థ ఆర్నెళ్ల నుంచి కాలనీల్లో విద్యుత్ దీపాలు వెలగక చీకట్లో గడుపుతున్నాం. లైట్లు వేయాలని కార్యదర్శి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన లైట్లు రాలేదని సమాధానం చెప్పుతున్నారు. గ్రామంలో మురుగు రహదా రులపై పారుతుడంటంతో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వెంటనే అధికారులు స్పందించి గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి. – తిరుపతయ్య, అప్పంపల్లి నిధులు మంజూరు కావాల్సి ఉంది గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగింది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే పెండింగ్ బిల్లులతో పాటు విధి దీపాలు, డ్రైనేజీలు, నీటి ఎద్దడి వంటి సమస్యలను పరిష్కరిస్తాం. – కృష్ణ, డీపీఓ, నారాయణపేట ● -
పాలమూరు రుణం తీర్చుకుంటా
నారాయణపేటసోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025వనపర్తి: ‘నల్లమల ప్రాంతంలో పుట్టి.. చైతన్యవంతమైన వనపర్తిలో పెరిగి విద్యాభ్యాసం చేశాను. స్వస్థలమైన పాలమూరు ప్రాంత రుణం తీర్చుకుంటాను.’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. ఆదివారం వనపర్తి జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. పదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు అభివృద్ధిని విస్మరించారని, కృష్ణా జలాల నీటి కేటాయింపుల్లో తెలంగాణకు, పాలమూరుకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల పేరుతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. 50 లక్షల పైచిలుకు కుటుంబాలకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ఆడ బిడ్డలను విస్మరించిన బీఆర్ఎస్, బీజేపీ నేతలకు సరైన గుణపాఠం చెప్పాలంటే సలాకి కాల్చి వాత పెట్టాలన్నారు. రాష్ట్రంలోని 65 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రజాపాలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాల సభ్యులకే అప్పగించి కొనసాగిస్తున్నామని గుర్తు చేశారు. పదేళ్ల పాలనలో పాలమూరులోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే ఇప్పటికింకా వలసలు ఎందుకు కొనసాగుతున్నాయో చెప్పాలన్నారు. ● నాలుగు దశాబ్దాలుగా వనపర్తి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులుగా కొనసాగిన వారు కక్షపూరిత డబ్బుతో కూడిన రాజకీయాలను ఏనాడు చేయలేదని.. ఐదేళ్ల క్రితం వనపర్తిలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగిన వ్యక్తి వల్ల నియోజకవర్గ రాజకీయాలు కలుషితమయ్యాయని సీఎం అన్నారు. గతంలో వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా ఆదర్శవంతమైన పరిపాలన అందించిన వారి పేర్లను ప్రభుత్వ ఆస్పత్రులు, తాగునీటి ఎత్తిపోతల పథకాలకు పెడతామని... వేదికపైనే ఈ విషయం గురించి సీఎస్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ కె.దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు జి.మధుసూదన్రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్వర్రెడ్డి, శంకర్, వాకిటి శ్రీహరి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ● ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారత పట్ల సానుకూలంగా ఆలోచిస్తున్నారని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. వంటింటికి పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ రాణించే విధంగా ప్రజాపాలన ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ పంపులు, ఆర్టీసీకి బస్సులు అద్దెకిచ్చే స్థాయికి మహిళలు ఎదిగారని పేర్కొన్నారు. ● మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులకు ప్రాణం పోసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పదేళ్లలో తాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగానే నిలిచాయన్నారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ సామాజికంగా వెనకబడిన కులాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా 50 రోజుల్లో కులగణన చేపట్టి పూర్తి చేసిందన్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని జాబ్మేళాలు నిర్వహించి 295 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తి ప్రాంతంలో విద్యను అభ్యసించిన సీఎం ఈ ప్రాంతంపై అభిమానంతో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, ఇప్పటికే రూ.375 కోట్ల అభివద్ధి పనులను చేపట్టామని, మరో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులను చేసేందుకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 133 గ్రామపంచాయతీల అభివృద్ధికి ఎస్డీఎఫ్ నిధులు విడుదల చేయాలని కోరారు. పాలమూరు వాసులుఅమాయకులేం కాదు.. దేశానికి పేరెన్నిక గల నేతలను అందించిన ఉద్యమాల గడ్డ పాలమూరు అని రేవంత్రెడ్డి పేర్కొన్నా రు. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో పాటు పటేల్ సుధాకర్, పండగ సాయన్న, మహేంద్రనాథ్ లాంటి గొప్ప నాయకులను పాలమూరు అందించిందని.. వారి స్ఫూర్తితోనే విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ సీఎం దాకా ఎదిగానని చెప్పారు. ఉమ్మడి పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అడ్డుపడితే సహించేది లేదని స్పష్టం చేశారు. పాలమూరు వాసులు.. అమాయకులేం కాదని.. డొక్క చీల్చి డోలు కట్టడానికి వెనుకాడబోరని హెచ్చరించారు. తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరిపోసింది వనపర్తి గడ్డ అని.. నాడు ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చిన్నారెడ్డి 41 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారని గుర్తు చేశారు. కేసీఆర్ వల్లే కృష్ణా జలాలకేటాయింపుల్లో అన్యాయం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు మహిళల పేరుతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం పాలమూరు అభివృద్ధికి అడ్డుపడితే సహించను వనపర్తి బహిరంగసభలో సీఎం రేవంత్రెడ్డి -
బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జోగుళాంబ డీఐజీ..
సభాస్థలిని పరిశీలిస్తున్న డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ రావుల గిరిధర్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా శనివారం జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఎస్పీ రావుల గిరిధర్తో కలిసి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ముందుగా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్ నుంచి జెడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల వరకు రూట్ బందోబస్తును పరిశీలించారు. సభాస్థలి, సీఎం పర్యటించనున్న ప్రదేశాలు, పైలెట్ వాహనాల ట్రయల్రన్ నిర్వహించారు. వీఐపీ కాన్వాయ్ వెళ్లే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ ఓపెనింగ్ పార్టీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో రోడ్లపై చిరు వ్యాపారులు, వాహనాలు నిలుపరాదని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. బహిరంగ సభకు వచ్చే వాహనాలకు ఆర్టీసీ బస్డిపోలో పార్కింగ్ సౌకర్యం కల్పించామని.. కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే నిలపాలని సూచించారు. బందోబస్తును మొత్తం ఏడు సెక్టార్లుగా విభజించామని.. నలుగురు ఎస్పీలు, నలుగురు అడిషనల్ ఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 21 మంది సీఐలు, 28 మంది ఎస్ఐలు, 140 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 420 మంది కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుల్, 250 మంది హోంగార్డులు విధులు విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100కు ఫోన్చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి వెంట సీఐ కృష్ణ, ఇతర పోలీస్ అధికారులు తదితరులు ఉన్నారు. -
ఆశలు వదులుకున్నా..
సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలపై ఆశలు దాదాపు వదులుకున్నట్లేనని ప్రజాప్రతినిధులు చెబుతున్న విషయాలను బట్టి తెలుస్తోంది. చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వ అధికార యంత్రాంగం నిష్ణాతులైన రెస్క్యూ టీంలతో సహాయక చర్యలను ముమ్మరం చేసినా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. టన్నెల్లో పేరుకుపోయిన బురద, నీటి ఊటలు సహాయక చర్యలకు ఆటంకంగా మారాయని అధికారులు చెబుతున్నా.. ప్రమాదం జరిగిన సందర్భంలోనే చిక్కుకున్న వారి ప్రాణాలు పోయాయని పలువురు చర్చించుకుంటున్నారు. -
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
నారాయణపేట: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్ కోసం బాటలు వేసుకోవాలని డీఎస్పీలు నల్లపు లింగయ్య, ఎన్ బుచ్చయ్య పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో డీఎస్పీ, జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేకంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల నిరోధానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తుందన్నారు. డ్రగ్స్ మహమ్మారిని ప్రారంభ దశలోనే గుర్తించి వాటిని నివారించాలని, డ్రగ్స్ విక్రయదారులు యువతనే లక్ష్యంగా చేసుకొని తమ కార్యకలాపాలను కొనసాగిస్తారని, దీనిపై యువత చైతన్యం కలిగి ఉండాలన్నారు. మన పరిసరాలలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నారని తెలిస్తే సామాజిక బాధ్యతగా పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ వినియోగిస్తే ఎలాంటి ప్రభావాలు చూపుతాయని, వాటి వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయని పీపీటీ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు విద్యార్థులు, ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు ముందుకు సాగాలన్నారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడడం వలన క్రమేపి ఆరోగ్యం క్షీణించడంతో పాటు అది ఒక వ్యసనంగా మారుతుందని, నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందన్న విషయం గమనించాలని పేర్కొన్నారు. ఎవరైనా నిషేధిత మాదక ద్రవ్యాల సమాచారాన్ని తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచి అట్టి వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే సెల్ఫోన్ నంబర్ 8712671111 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1908 కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనంతరం యాంటీ డ్రగ్స్ కి సంబంధించిన అవగాహన వాల్పోస్టర్ ఆవిష్కరించి, విద్యార్థులు, లెక్చరర్స్తో ప్రతిజ్ఞ చేయించారు.ఎకై ్సజ్ సీఐ అశోక్ కుమార్, ఎస్ఐ లు వెంకటేశ్వర్లు, సునిత, ఎకై ్సజ్ ఎస్సైలు పాల్గొన్నారు. చింతపండు క్వింటాల్ రూ. 8,040 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 19 క్వింటాళ్ల చింతపండు రాగా.. క్వింటాల్కు గరిష్టం రూ.8,040, కనిష్టం రూ.5,011 ధరలు పలికాయి. అలాగే, శనగలు 5 క్వింటాళ్లు రాగా.. గరిష్టం, కనిష్టం రూ.5,755, వేరుశనగ 104 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.6,160, కనిష్టం రూ.3,920, జొన్నలు 42 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.4,021, కనిష్టం రూ.3012, అలసందలు 10 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.6,671, కనిష్టం రూ.6,609, ఎర్ర కందులు 241 క్వింటాళ్లు రాగా.. గరిష్టం రూ.7,585, కనిష్టం రూ.5,329 ధర పలికాయి. -
మద్దూరు డిగ్రీ కళాశాల నిర్మాణానికి రూ.6.10 కోట్లు
మద్దూరు: మద్దూరు పట్టణంలో డిగ్రీ కళశాల భవన నిర్మాణానికి రూ.6.10 కోట్ల నిధులు మంజూరయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ ఈ.నారాయణగౌడ్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే తరగతులు ప్రారంభించామని, ఈ కళాశాల నిర్మాణం కోసం పట్టణ శివారులోని డంపింగ్ యార్డు దగ్గర 5 ఎకరాల స్థలం కేటాయించారని తెలిపారు. ప్రస్తుతం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ జీఓ విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. డిగ్రీ కళశాల భవన నిర్మానానికి నిధులు మంజూరు చేసినా సీఎం రేవంత్రెడ్డి, జిల్లా ఇంచార్జీ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. -
నేడు వనపర్తికి సీఎం రాక
వనపర్తి: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకుగాను అధికార, పాలకవర్గం భారీఎత్తున ఏర్పాట్లు చేసింది. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4:35 వరకు వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. హెలీకాప్టర్లో హైదరాబాద్ నుంచి 11.30కి జిల్లాకేంద్రంలోని కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకొని స్వామి వారి దర్శనానంతరం ఆలయ అభివృద్ధికి రూ.కోటి ప్రొసీడింగ్ పత్రాలను ఆలయ కమిటీ చైర్మన్ అయ్యలూరి రఘునాథశర్మకు అందజేస్తారు. అటు నుంచి తను విద్యనభ్యసించిన జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకొని అక్కడే పాఠశాల, కళాశాల భవన నిర్మాణాలు, జీజీహెచ్ భవనం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, ఐటీ టవర్, శ్రీరంగాపురం ఆలయ అభివృద్ధి పనులు, పెబ్బేరులో 30 పడకల ఆస్పత్రి భవనం, జిల్లాకేంద్రంలోని రాజనగరం శివారు నుంచి పెద్దమందడి వరకు బీటీరోడ్డు నిర్మాణం, ఎస్టీ హాబిటేషన్ వర్కింగ్ బిల్డింగ్, నియోజకవర్గంలోని సీఆర్ఆర్ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని తన పాఠశాల, కళాశాల మిత్రులు, గురువులతో కాసేపు గడిపి వారితో కలిసి భోజనం చేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.20కి బయలుదేరి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించే ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. అక్కడే రేవంతన్న కా భరోసా అనే కొత్త పథకాన్ని ప్రారంభిస్తారు. అలాగే వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులు, కుట్టుమిషన్లు, నియామక పత్రాలు అందజేసిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 4.35 గంటలకు హెలీకాప్టర్లో తిరిగి హైదరాబాద్కు బయలుదేరుతారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ఎకై ్సజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు హాజరుకానున్నారు. రూ.721 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ‘రేవంతన్న కా భరోసా’ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం -
చివరి అంకానికి..
ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న 8 మంది కార్మికుల అవశేషాల గుర్తింపు సాక్షి, నాగర్కర్నూల్/అచ్చంపేట రూరల్: ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను వెలికితీసేందుకు చేపడుతున్న సహాయక చర్యలు చివరి అంకానికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. నేడో, రేపో సొరంగం నుంచి కార్మికులను బయటకు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. మొదట గుర్తించిన ఒక స్పాట్ నుంచి నలుగురు, ఆ తర్వాత మరో స్పాట్ నుంచి నలుగురు కార్మికులను వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నీటి ఊట పెరుగుతుండటం, మట్టి తొలగింపునకు కన్వేయర్ బెల్టు అందుబాటులోకి రాకపోవడంతో ఆలస్యం అవుతోంది. శనివారం మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి సంఘటన స్థలానికి చేరుకుని, పనులను పర్యవేక్షించారు. నీటి ఊట, మట్టి తొలగింపుతో పనులు ఆలస్యం.. మొత్తం 13.85 కి.మీ. సొరంగమార్గంలో 13.61 పా యింట్ వరకు సహాయక బృందాలు చేరుకున్నాయి. మిగతా చోటును గాలించేందుకు అక్కడ సుమారు 18 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, శిథిలాలు ఆటంకంగా మారాయి. జీపీఆర్ గుర్తించిన చోట తవ్వకాలు జరిపేందుకు సింగరేణి, ర్యాట్ మైనింగ్ టీం రంగంలోకి దిగింది. ఎలాంటి మిషనరీ లేకుండా వారు మ్యానువల్గా తవ్వకాలు చేపడుతున్నారు. టీబీఎం సంబంధిన విడిభాగాలు, శిథిలాలను కట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. సహాయక బృందాల రాకపోకలకు, మట్టి, శిథిలాల తరలింపునకు దారిని ఏర్పాటు చేస్తున్నారు. కట్టర్ చివరి భాగంలో కార్మికులు ఉన్నట్టుగా భావిస్తున్న చోట తవ్వకాలు చేపడుతుండగా, పెద్ద ఎత్తున వస్తున్న నీటి ఊటతో అవరోధాలు ఏర్పడుతున్నాయి. నీటిని తోడేందుకు డీవాటరింగ్, మట్టిని తొలగించేందుకు చేపడుతున్న చర్యలతో ఆలస్యం అవుతోంది. కుటుంబీకుల ఎదురుచూపులు.. పొట్టకూటి కోసం వేలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఇతర రాష్ట్రాల కూలీలు, సిబ్బంది ఎస్ఎల్బీసీ సొరంగంలో పనులు చేస్తూ చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎస్ఎల్బీసీలో జేపీ కంపెనీలో పనులు చేస్తున్నారు. కాగా ఏడు రోజుల నుంచి సొరంగంలో తమ వారు క్షేమంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాలను చూసి సొరంగంలో చిక్కుకున్న వారి బంధువులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. క్షేమంగా బయటపడతారని ఇన్ని రోజులు ఎదురు చూశామని, అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు భిన్నంగా ఉన్నాయని వాపోతున్నారు. జేపీ కంపెనీ సమీపంలోకి పెద్దఎత్తున పార్థివ అంబులెన్సులు రావడంతో తమవారి ప్రాణాలపై ఆశలు లేవని అర్థమైందని అక్కడికి వచ్చిన బంధువులు కన్నీరు పెట్టుకుంటున్నారు. టీబీఎంకు ఇరువైపులా ఉన్నట్లు గుర్తించిన జీపీఆర్ స్కానింగ్ నేడు నలుగురు, 2 రోజుల తర్వాత మరో నలుగురు కార్మికులను వెలికి తీస్తారని అంచనా సహాయక చర్యలను పరిశీలించిన మంత్రులు ఉత్తమ్, జూపల్లి, సీఎస్ శాంతికుమారి మంత్రులు, సీఎస్ సమీక్ష.. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్, ఎమ్మెల్యే వంశీకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో దోమలపెంటకు వచ్చిన మంత్రులు 11.50 గంటలకు టన్నెల్ వద్దకు చేరుకున్నారు. టన్నెల్ లోపల పరిస్థితులను వివిధ శాఖల విపత్తుల అధికారులు వివరించారు. టీబీఎం విడి భాగాలను గ్యాస్ కట్టర్తో కట్ చేస్తూనే.. ఊట నీరు, మట్టిని తొలగించే ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.బీజేపీ ఎమ్మెల్యేల పరిశీలన.. ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద జరుగుతున్న సహాయక చర్యలను బీజేపీ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. సహాయ చర్యలను పరిశీలిస్తూ అక్కడి వివిధ విపత్తుల అధికారులతో మాట్లాడారు. సంఘటన జరిగిన తీరు, చేపడుతున్న సహాయ చర్యలు, చిక్కుకున్న వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జేపీ కార్యాలయ సమీపంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
పరీక్ష కేంద్రాలకు సెల్ఫోన్లు తీసుకురావొద్దు
నారాయణపేట: పరీక్ష కేంద్రాలకు ఎవరు సెల్ఫోన్ తీసుకురావద్దని, ఈ అంశాన్ని మరోసారి స్పష్టం చేస్తూ ప్రతి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెండ్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్పై కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడారు. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయని జిల్లాలో సమర్థవంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగవద్దని తెలిపారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకం, శిక్షణ పూర్తయిందని, ప్రశ్న పత్రాలు జిల్లాకు చేరుకున్నాయని, రేపటి నుంచి ప్రశ్నాపత్రాలు స్ట్రాంగ్రూంలో నుంచి పోలీస్ స్టేషన్లకు చేరుతాయన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ ఉండాలని, జిరాక్స్ షాపులను మూసివేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసి విద్యార్థులను పూర్తిగా చెక్ చేసి లోపలికి అనుమతించాలని ఎటువంటి కాపీయింగ్కు పరీక్ష కేంద్రాల్లో అవకాశం ఉండవద్దన్నారు. పరీక్షా కేంద్రాలకు ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది, విద్యార్థులు ఎవరు సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకుని రావడానికి వీలు లేదన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన తాగునీరు, విద్యుత్ సరఫరా ఉండాలని, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టిసి బస్సులు నడపాలన్నారు. ఎల్ఆర్ఎస్పై నివేదికలు పంపాలి ఎల్ఆర్ఎస్పై ప్రతిరోజు నివేదికలు పంపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్పై తగు సూచనలు ఇచ్చారు. రూరల్ అర్బన్ పరిధిలో దరఖాస్తు చేసుకున్న వాటిని పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలన్నారు. ఎల్ఆర్ఎస్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో రుసుం చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవచ్చని, దరఖాస్తుల ఆమోదించే వాటికి మార్చి 31 వరకు క్రమబద్ధీకరణ చేసుకుంటే చెల్లించాల్సిన రుసుములో 25శాతం మినహాయింపు ఉంటుందన్నారు. ఆగస్టు 26, 2020 వరకు 10 శాతం ప్లాట్లు విక్రయించిన లే ఔట్ లను క్రమబద్ధికరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, సబ్ రిజిస్టర్ ద్వారా నిర్ణయిత నమూనాలో నూతన దరఖాస్తులు సేకరించి ఎల్ఆర్ఎస్ కోసం మున్సిపల్ శాఖకు వివరాలు పంపించి క్రమబద్ధీకరణ చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ బెన్ షాలం, ఎస్పీ యోగేష్ గౌతమ్, ఆర్డీఓ రామచందర్, డీపీఓ కృష్ణ, డీఎంహెచ్ఓ సౌభాగ్యలక్ష్మి, డీఈఓ గోవిందరాజులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్యనందించాలి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు నాణ్యమైన విద్యాను అందించాలని కలెక్టర్ ఆదేశించారు. నారాయణపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సింగార్బేష్, భవిత కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధన ఏవిధంగా జరగుతుందో పరిశీలించారు. ఫిజియోథెరపీ, హోం బేసిక్ ఏడ్యుకేషన్ సంబంధిత ఐఈఅర్పి, ఎంఈఓ లను అడిగి తెలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు వేగవంతం యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్సియల్ స్కూల్ కాంప్లెక్స్ పనులు త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం నారాయణపేట మండలం లింగంపల్లి శివారు సర్వే నెంబర్ 30లో గల 20 ఎకరాలలో నిర్మించ తలపెట్టిన పాఠశాల స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. సుమారు రూ.200 కోట్లతో నిర్మిస్తున్న భవన నిర్మాణానికి సంబందించిన ఏర్పాట్లు త్వరితగిన మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ఇంటర్ విద్యార్థులతోపాటు అధికారులు నిబంధనలు పాటించాలి కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
మరికల్: పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం విద్యార్థుల తలుపు తట్టండి కార్యక్రమం చేపట్టిందని ఆర్జేడీ ఎస్ఈ విజయలక్ష్మి అన్నారు. మరికల్ మండలం మాధవరంలో శుక్రవారం ఉదయం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తలుపు తట్టండి కార్యక్రమంను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పది పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంట్లో పనులేవి చెప్పకుండా వారిని టీవీలకు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచి ప్రశాంతమైన వాతావారణంలో ఒత్తిడి లేకుండా చదివించాలని సూచించారు. పరీక్షలకు 20 రోజుల సమయం ఉందని ఈ సమయంలో చదవడంతో పాటు రాయడం పైన దృష్టి సారించాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు ఉదయమే వెళ్లడం పట్ల వారిలో పరీక్షల భయం పోగొట్టడం జరుగుతుందన్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా మరింత బాధ్యతగా ఉండి పిల్లలను చదివిస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మరికల్ బాలుర ఉన్నత పాఠశాలో పదవ తరగతి విద్యార్థులకు జరుగుతున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజు, ఏఏంఓ విద్యాసాగర్, ఎంఈఓ మనోరంజని, జీహెచ్ఎం నాగరత్నం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆదేశాలు ఇచ్చాం..
ఉమ్మడి జిల్లాలో ఉన్న అందరూ ఎంవీఐలు, ఆర్టీఓలకు 15 ఏళ్లు పైబడిన వాహనాలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేసి అలాంటి వాహనాలు గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో 15, 20 ఏళ్లు పైబడిన వాహనదారులు ప్రతిఒక్కరూ వారి వాహనాల రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువన్ లేని వాహనాలు ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలో పట్టుబడితే సీజ్ చేస్తాం. ప్రధానంగా రోడ్లపై వాహనాలు నడిపే ప్రతిఒక్కరూ సీటు బెల్ట్, హెల్మెట్ తప్పక ధరించాలి. – కిషన్, డీటీసీ ఉమ్మడి జిల్లా -
ఓపీఎస్ సాధనకు అలుపెరగని పోరాటం
నారాయణపేట రూరల్: జిల్లా కేంద్రంలోని మండల పరిషత్, తహసిల్దార్ కార్యాలయాల దగ్గర శుక్రవారం సాయంత్రం యుద్ధభేరి వాల్పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. టీఎస్ సీబీఎస్ఈ ఆధ్వర్యంలో మార్చి 2న హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఓపీఎస్ సాధననే ఏకై క మార్గంగా ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి బలాన్ని చూయిస్తు, సీపీఎస్ వల్ల జరుగుతున్న నష్టాలను వివరిద్దామన్నారు. పాత పెన్షన్ విధానం వల్ల ఎంతో ఉపయోగకరము ఉంటుందని తెలియచెద్దామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర కార్యదర్శి శంకర్, జిల్లా గౌరవ అధ్యక్షులు చైతన్య, డిప్యూటీ తాసిల్దార్ రామకృష్ణ, సూపరింటెండెంట్ ప్రసాద్, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
అడ్డంకులు దాటుతూ..
అచ్చంపేట: దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపట్టిన సహాయకచర్యలు ముమ్మరం చేశారు. అత్యాధునిక పరికరాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. గ్యాస్ కటింగ్ పరికరంతో టీబీఎం మిషన్ విడి భాగాలను కట్ చేసే పనులు వేగవంతమయ్యాయి. కటింగ్ చేసిన విడి భాగాలను ఎప్పటికప్పుడు బయటకు తీసుకొచ్చారు. శుక్రవారం ఏడోరోజు లోకో ట్రైన్ ద్వారా సింగిరేణి బొగ్గు గనుల నుంచి తెప్పించిన పెద్ద సైజు ట్రేలలో సొరంగం బయటికి బురద, గ్యాస్, ఫాస్మ కటర్ల ద్వారా టీబీఎం విడి భాగాలు, ఇతర ఇనుప రాడ్లు, పైపులను రెస్క్యూ టీం సభ్యులు మోయగలిగిన సైజులో కట్ చేసి బయటికి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కన్వేయర్ బెల్ట్ను పునరుద్ధరించలేదు. సొరంగం లోపల 14.85 కిలోమీటర్ల వద్ద టీబీఎం మిషన్ ఉండగా పైకప్పు కూలింది. ఇక్కడ పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు లోకో ట్రైన్ను 13.500 కిలోమీటరు వరకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్ని స్తున్నారు. గట్టి పడిన మట్టిని తీయడానికి మినీ జేసీబీలను వినియోగిస్తున్నారు. జేసీబీలు, బృందాలు లోపల బురదను పక్కకు తొలగిస్తూ బయటికి పంపిస్తున్నారు. మూడు బోగీలు (ట్రేలు) ద్వారా బురద బయటికి తరలించారు. సొరంగంలోకి చేరిన నీటిని బయటకు పంపింగ్ చేయడానికి అదనపు మోటార్లను తీసుకొచ్చారు. పూర్తిస్థాయిలో మట్టిని తరలించకపోయినా లోపల ఓ పక్కకు వేస్తూ కార్మికుల ఆచూకీ కనుకొనేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బాధితుల కోసం సొరంగంలో టెషర్స్ అందుబాటులో ఉంచారు. రక్షణ కోసం.. టన్నెల్లోకి వెళ్లే సహాయక బృందాల రక్షణ కోసం కృత్రిమ ఏర్పాట్లు చేస్తున్నారు. లోపల ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐరన్ షీట్లు, పైపులను రౌండ్గా బెండ్ చేసి వెల్డింగ్ చేసిన తర్వాత లోపలికి తీసుకెళ్తున్నారు. దీని ద్వారా లోపలికి ప్రవేశించేలా చర్యలు చేపట్టారు. సొరంగం కూలిన, రాళ్లు, రప్పలు ఊడిపడినా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేలా వీటిని తయారు చేసున్నారు. దీంతో ఏమైనా ప్రమాదం జరిగినా తప్పించుకునే అవకాశం ఉంటుందని సహాయక బృందాలు పేర్కొంటున్నాయి. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ టన్నెల్ వద్దకు ఇతరులు వెళ్లకుండా నివారిస్తున్నారు.సొంతూళ్లకు కార్మికులు.. టన్నెల్లో జరిగిన ప్రమాదంతో భయాందోళనకు గురైన కార్మికులు ఒక్కొక్కరుగా సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. కుటుంబసభ్యులు ఫోన్ చేసి తిరిగి రావాలని వేడుకుంటున్నారని, గత్యంతరం లేక మూడు నెలల జీతాలు రావాల్సి ఉన్నా వదిలి వెళ్తున్నామని కార్మికులు వాపోయారు. సొరంగం వద్ద పనులు సాగుతాయో లేదో అని.. తమ సొంత రాష్ట్రంలోనే ఏదో ఒక పని చేసుకుంటామని పేర్కొంటున్నారు. జీతాలు లేకున్నా సరే మా ప్రాణాలే ముఖ్యం అంటున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఏడోరోజు కొనసాగిన సహాయక చర్యలు ముమ్మరంగా బురద, మట్టి, శిథిలాల తరలింపు అత్యాధునిక పరికరాలతో గాలింపు -
కాలం చెల్లిన వాహనం.. కాలుష్య కారకం
● 15 ఏళ్లుపై బడిన వెహికిల్స్తో తీవ్రమైన కాలుష్యం ● రోగాల విజృంభణ నేపథ్యంలో కట్టడికి చర్యలు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 32,181 వాహనాలు ● గ్రీన్ ట్యాక్స్ భారీగా పెంచిన ప్రభుత్వాలు పాలమూరు: భారీగా పెరిగిపోతున్న వాహన కాలుష్యంతో వాతావరణంలో సమతుల్యత లోపించి కొత్త రకం జబ్బులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కాలం చెల్లిన వాహనాలను తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 15, 20 ఏళ్లు దాటిన వాహనాలకు గ్రీన్ టాక్స్ భారీగా విధిస్తోంది. 15 ఏళ్లు దాటిన ద్విచక్రవాహనం రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవడానికి రూ.2 వేలు, 20 ఏళ్లు దాటిన బైక్లకు రూ.5 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. ఇక 15 ఏళ్లు దాటిన కార్లకు రూ.5 వేలు, 20 ఏళ్లు దాటిన వాటికి రూ.10 వేల పన్నులు వసూలు చేయాలని ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లాలో చాలా వరకు కార్లు, ద్విచక్రవాహనాలు 20 ఏళ్లు పైబడినా అలాగే రోడ్లపై నడుపుతున్నారు. అలా కాలం చెల్లిన వాహనాల నుంచి భారీస్థాయిలో పొగ విడుదల కావడంతో మిగిలిన వాహనదారులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
కొనసాగుతున్న భూ సర్వే
ఊట్కూరు: ఊట్కూరు మండలంలో నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా గత రెండు రోజులుగా భూ సర్వే కొనసాగుతుంది. శుక్రవారం తహసీల్దార్ సి రవి ఆధ్వర్యంలో దంతన్పల్లి శివారులో భూ సర్వే చేపట్టారు. విషయం తెలుసుకున్న పలువురు రైతులు వివిధ పార్టీల నాయకులు సర్వే జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రైతులకు ముందుగా సమాచారం అందించి సర్వే పట్ల రైతులకు అవగాహన కలిపించాలని వాగ్వాదానికి దిగారు. ఇప్పటికే రైతులకు సమాచారం అందించామని తహసీల్దార్ తెలిపారు. ఆర్డీఓకు సమాచారం అందించి రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తామని సముదాయించారు. దంతన్పల్లి శివారులో సుమారు 58 ఎకరాల భూమి కోసం సర్వే చేపడుతున్నామని తెలిపారు. ఎస్ఐలు కృష్ణంరాజు ఆధ్వర్యంలో బందోబస్త్ నిర్వహించారు. ఇరిగేషన్ డీఈ సతీష్, ఏఈ వెంకటేష్, సర్వేబృందం అరుణ, వివిధ పార్టీల నాయకులు అరవింద్కుమార్, భరత్, భాస్కర్, ఆనంద్కుమార్, లక్ష్మారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ముమ్మరంగా సహాయక చర్యలు
అచ్చంపేట/ అచ్చంపేట రూరల్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. దోమలపెంట జేపీ బేస్ క్యాంప్ కార్యాలయంలో సహాయక బృందాల అధికారులతో కలెక్టర్, ఎస్పీ వైభవ్, ఇరిగేషన్ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎన్డీఆర్ఎఫ్ అధికారి సుఖేండు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఆర్మీ అధికారులు కల్నల్ పరీక్షిత్ మెహ్రా, కల్నల్ అమిత్ కుమార్ గుప్తా, సింగరేణి మైన్స్ రెస్క్యూ అధికారి బలరాం, హైడ్రా అధికారులు, జేపీ కంపెనీ ప్రతినిధులతో టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది ఆక్సిజన్ అందుబాటులో ఉంచారని, సహాయ చర్యలను మరింత వేగవంతం చేయాలని కోరారు. -
ఆదేశాలు వచ్చాయి..
జనరల్ ఆస్పత్రి పడకల స్థాయి 650 నుంచి 900కు పెంచడానికి అన్ని రకాలుగా సిద్ధం కావడం జరిగింది. ఇప్పటికే ఎన్ఎంసీ నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం, డీఎంఈతో నుంచి అధికారికంగా రావాల్సి ఉంది. రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది. పడకలు పెరగడం వల్ల రోగులకు మరింత వైద్య సేవలు పెరుగుతాయి. – సంపత్కుమార్సింగ్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్, మహబూబ్నగర్ పీజీలో కూడా సీట్లు మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో 250 పడకలు అదనంగా పెంచుకోవడానికి అనుమతి రావడంతో పకడలు 900 చేరాయి. ప్రస్తుతం మెడికల్ కళాశాలలో 175 ఎంబీబీఎస్ సీట్లకు సరిపడా పడకలు ఆస్పత్రిలో అవసరం ఉన్నాయి. పీజీలో కూడా సీట్లు మరిన్ని పెరుగుతాయి. మార్చిలో ఈ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. – రమేష్, మెడికల్ కళాశాల డైరెక్టర్, పాలమూరు ● -
వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు
నారాయణపేట: రానున్న వేసవిలో తాగునీటి సమస్య లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో మిషన్ భగీరథ బడ్జెట్ పన్నుల వసూలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ గ్రామాన మిషన్ భగీరథ తాగునీరు సరఫరా అవుతున్నాయని, రానున్న వేసవిలో ఏ ఇబ్బంది లేకుండా సరఫరా చేయాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ముందుగానే తెలపాలని అధికారులను ఆదేశించారు. వేసవి యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాలని తెలిపారు. నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూరు మున్సిపాలిటీ కమిషనర్లను ఆయా మున్సిపాలిటీలలో తాగునీటి సరఫరాపై పూర్తి వివరాలు ఆరా తీశారు.అలాగే పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలని ఆదేశించారు, సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ పి.వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. రంజాన్కు ఏర్పాట్లు పూర్తి చేయాలి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం అధికారులతో సమావై రంజాన్ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష జరిపారు. ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లకు తావులేకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రధానంగా ఎక్కడ తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి బాధ్యతలు పురమాయిస్తూ, నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రార్థనా సమయాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని, మసీదులు, ఈద్గాల వద్ద పారిశుద్ధ్య సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కడ కూడా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ బేన్షాలం, ఆర్డీఓ రాంచందర్ మాట్లాడుతూ.. మున్సిపల్ కమిషనర్లు రంజాన్ పండుగ రోజు షామియానాలు, తాగునీరు తదితర ఏర్పాట్లు చూడాలన్నారు. డీఎస్పీ లింగయ్య మాట్లాడుతూ రంజాన్, హోలీ, ఉగాది పండుగలకు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని, రంజాన్ నేపథ్యంలో ఈద్గాలో దాదాపు 10 వేల మంది ప్రార్థనలకు హాజరవుతారని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మైనారిటీ అధికారి ఎంఏ.రషీద్, డీఆర్డీఓ మొఘులప్ప, ట్రాన్స్కో డీఈ జితేందర్నాథ్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
మరికొన్ని వివరాలు..
● మధ్యాహ్నం 12.16 గంటలకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఎస్ఎల్బీసీ జేపీ కార్యాలయం వద్ద ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ● 12.30 గంటలకు కార్యాలయానికి వచ్చారు. అంతకు ముందే కార్యాలయం ముందున్న మీడియా ప్రతినిధులను అక్కడి నుంచి గేటు బయటకు పోలీసులు పంపించారు. ● 2.16 గంటలకు బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీశ్రావుతో పాటు పలువురు ఎస్ఎల్బీసీ సొరంగ ప్రాంతానికి వెళ్లారు. కొందరికే అనుమతి ఇవ్వడంతో రెండు కార్లలో ఉన్నవారు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. 5 నిమిషాల తర్వాత సొరంగానికి పంపించారు. అక్కడి నుంచి వచ్చి ప్రెస్మీట్లో మాట్లాడారు. -
జనరల్ ఆస్పత్రి @ 900
నారాయణపేటశుక్రవారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025వివరాలు 8లో uఅదనంగా 250 బెడ్స్ ఏర్పాటు చేసుకోవాలని ఎన్ఎంసీ ఆదేశాలు ● ఇప్పటికే డీఎంఈకి అందిన ఉత్తర్వులు ● రెండు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయడానికి కసరత్తు ● వసతులు సమకూరినా.. ఖాళీల భర్తీపై దృష్టిపెట్టని ప్రభుత్వం ● అరకొర వైద్యులతో రోగులకు మెరుగుపడని వైద్యసేవలు పాలమూరు: ఉమ్మడి మహబూబ్నగర్ పేద ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న జనరల్ ఆస్పత్రి 650 పడకల నుంచి 900 పడకలకు అప్గ్రేడ్ అయ్యింది. కొత్తగా మరో 250 పడకలు అదనంగా పెంచుకోవ డానికి ఎన్ఎంసీ అంగీకరించినట్లు రెండ్రోజుల కిందట డీఎంఈకి ఉత్తర్వులు అందాయి. మరో రెండు నెలల్లో 900 పడకలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం కసరత్తు చేపడుతోంది. పెరిగిన పడకల నేపథ్యంలో సరిప డా వైద్యుల దగ్గరి నుంచి నాలుగో తరగతి, పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. పడకల పెంపుపై ప్రభుత్వ వర్గాల నుంచి అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది. అదేవిధంగా ప్రస్తుతం 13 విభాగాల్లో 28 పీజీ సీట్లు ఉండగా ఇటీవల అర్థోకు 4, ఈఎన్టీ విభాగానికి 3 పీజీ సీట్లు దర ఖాస్తు చేయగా వాటికి సైతం మార్చి మొదటి వా రంలో అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. పడకల పెంపుతో జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలు మె రుగుపడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. పని ఒత్తిడి తట్టుకోలేక.. జనరల్ ఆస్పత్రిగా మార్పు చెందిన తర్వాత 350 నుంచి 550 పడకలకు, ఆ తర్వాత 650 పడకల సామర్థ్యం పెరిగింది. దీంతో రోజువారి ఓపీతోపాటు ప్రసవాలు, అడ్మిట్ అవుతున్న రోగుల సంఖ్య క్రమంగా పెరిగింది. అయితే జిల్లా వైద్య కళాశాల అనుమతి వచ్చిన తర్వాత ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన పారామెడికల్ సిబ్బంది ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. ఆస్పత్రిలో ఉండే ప్రధాన విభాగాలకు మూడు షిఫ్టుల వైద్యులు ఉండాలి. ప్రస్తుతం పనిచేస్తున్న వైద్య సిబ్బంది సరిపోవడం లేదు. దీనికితోడు జిల్లా జనరల్ ఆస్పత్రికి వైద్య సిబ్బంది 459 మంది అవసరం ఉంటే.. ఇప్పటికీ 200లోపు మాత్రమే ఉన్నారు. ఇలా పని ఒత్తిడి తట్టుకోలేక వైద్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని విభాగాల్లో ఎస్ఆర్లు లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. అనేక కొత్త సమస్యలు జనరల్ ఆస్పత్రి తాజా పరిస్థితిని పరిశీలిస్తే మళ్లీ కథ మొదటికి వచ్చే ప్రమాదం లేకపోలేదు. పడకల పెంపుతో అనేక కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. అరకొర సిబ్బందితో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఉన్నవారు పని చేయలేమంటూ వాపోతున్నారు. ఇక కాంట్రాక్టు వైద్యులు తమ వల్ల కూడా కాదంటూ ఇప్పటికే కొందరు తప్పుకున్నారు. ఇక ఆస్పత్రిని ఒంటిచేతిపై నడిపిన ఎస్ఆర్లు సైతం లేకపోవడంతో ఇబ్బందులు పెరిగి.. జనరల్ ఆస్పత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఖాళీగా ఉన్న పోస్టులు అన్నింటిని భర్తీ చేస్తే తప్ప రోగులకు మెరుగైన సేవలు అందే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి దవాఖానాల్లో వసతులు, ఆధునిక పరికరాలు సమకూర్చుతున్నా.. ఖాళీలపై దృష్టి పెట్టకపోవడంతో రోగులకు అంతంత మాత్రంగానే సేవలు అందుతున్నాయి. -
సమష్టి ప్రణాళికతోనే జిల్లా సస్యశ్యామలం
నారాయణపేట: సమష్టి ప్రణాళికతోనే పాలమూరు సస్యశ్యామలం అవుతుందని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం జిల్లా కేంద్రం సమీపంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మర్రి చెన్నారెడ్డి చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాగునీటి ప్రాధాన్యత లభ్యత, మూడు పంటలకు సాగు నీరు ఎలా ఇవ్వవచ్చు, ఇరిగేషన్ నిపుణులు హనుమంతరావు రూపొందించిన జల చతుర్భుజ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజస్థాన్తో పాటు ఇటు తెలంగాణలోని జహీరాబాద్ నియోజకవర్గంలో బ్రహ్మండంగా హనుమంతరావు కాన్సెప్ట్ అమలు అవుతోందన్నారు. ఈ విధానంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాంతానికి సాగునీరు ఇవ్వవచ్చని, రూ.5 వేలతో ఎకరాకు సాగునీరు అందించవచ్చని, ఇది పెద్ద ఎత్తున అమలు చేస్తే మరిన్ని ఫలితాలు సాధించవచ్చన్నారు. పండించిన పంటకు ఖర్చు తగ్గించడంతో పాటు, చివరి అయకట్టుకు, సాగు నీరు ఇవ్వవచ్చు, రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం నిర్మించినా కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యం మధ్యలోనే ఆగిపోయిందన్నారు. పాలమూరు రంగారెడ్డి పథకంతోనూ జిల్లాకు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యం నేటికీ నెరవేరలేదన్నారు. నీటి అప్రోచ్ జూరాల నుంచి తీసుకోవాలన్నది ప్రతిపాదన, ఈ పార్లమెంట్లోని ఏడు అసెంబ్లీల్లో ఒక్కో నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరివ్వాలి అని, ఏళ్లు గడుస్తున్నా ఆ లక్ష్యం నెరవేరడం లేదన్నారు. ఇప్పటికై నా ఒక మంచి లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ కాన్సెప్ట్ను రాష్ట్రంలో అమలు చేయాలని, వేలాది రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఈ ప్రాంత రైతుల అభ్యున్నతి, వారికి సాగునీటి ఇబ్బందులు తీర్చడమే నా లక్ష్యంగా, పార్లమెంట్ పరిదిలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేందుకు కృషిచేస్తామన్నారు. త్వరలో పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనేత్తుతానన్నారు. రైతులకు మేలు చేయడమే లక్ష్యం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి మాట్లాడుతూ ఈ విధానంపై సీఎంతో పాటు ఇరిగేషన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులకు మేలు చేసేవిధంగా చర్యలు చేపడతమన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ఎస్.ఆర్రెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డిలోని కోయర్ నిర్వహించే ఈ విధానంపై ఈ ప్రాంత రైతులను ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఆ విధానంతో మూడు పంటలు పండించేందుకు రైతులకు పూర్తి అవగాహన వస్తే ఎంతో మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆ ట్రస్ట్ కార్యదర్శి మర్రి శశిధర్రెడ్డి, ప్రముఖ పర్యవేరణ వేత్త పురుషోత్తం రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఆర్. శివారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షులు కుంభం శివకుమార్రెడ్డి, జలసాధన సమితి జిల్లా అధ్యక్షులు అనంత్రెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపల్ సుదర్శన్రెడ్డి, నిర్వాహకులు పాల్గొన్నారు. -
అంబులెన్స్ సిబ్బందిఅందుబాటులో ఉండాలి
నారాయణపేట: జిల్లాలోని మక్తల్, నారాయణపేట మండలం జీవీకే ఈఎంఆర్ఐ 1962 మొబైల్ వెటర్నరీ అంబులెన్న్స్లను గురువారం స్టేట్ ప్రాజెక్టు హెడ్ డాక్టర్ బగిష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్లోని వివిధ పరికరాలు, వాటి పని తీరు, అదే విధంగా మందులు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాల్ వచ్చి న వెంటనే 1962 సిబ్బంది తక్షణమే స్పందించి సేవలు అందించాలని, జిల్లాలో ప్రతి అంబులెన్స్ 10 ట్రిప్పులు, అదే విధంగా 20 పైన జంతువులకి వైద్య సేవలు చేస్తున్నట్టు పేర్కొన్నా రు. పశువులకు వైద్య సహాయం కోసం 1962 సమాచారం అందించాలని, మా మొబైల్ వెట ర్నరీ 1962 అంబులెన్స్ సిబ్బంది మీ దగ్గరికి వచ్చి పశువులకు తగిన శస్త్ర చికిత్స, మందులు అందిస్తారన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ మేనేజర్ రవి, ఎగ్జిక్యూటివ్ రాఘవేందర్, డాక్ట ర్ వైష్ణవి,మురళి, చంద్రశేఖర్ పాల్గొన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి నారాయణపేట ఎడ్యుకేషన్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్ఎఫ్ఐ ఎనలేని కృషి చేస్తుందని రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్ అన్నారు. గురువారం జిల్లాలో ఎస్ఎఫ్ఐ మూడో మహాసభలు నిర్వహించగా.. జిల్లా అధ్యక్షుడు మోహన్ జెండా ఆవిష్కరించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన కిరణ్ మాట్లాడుతూ.. నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడం సరికాదని, ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడేందుకు ఎస్ఎఫ్ఐ నిరంతరం కృషి చేస్తుందని, విద్యార్థులను బోర్డు, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు పదో తరగతి టాలెంట్ టెస్ట్, ఇంటర్ విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో మోడల్ ఎంసెట్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులలో జాతీయ భావాలు పెంపొందించేలా జాతీయ నాయకుల జయంతులు, వర్ధంతులు, సమాజంపై అవగాహన కలిగించేందుకు పలు అంశాలపై సెమినార్లు, చర్చాగోస్టి, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించినట్లు వెల్లడించారు. త్యాగాలగడ్డపై 3వ జిల్లా మహాసభలు నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ విషయమని కొనియాడారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి నరహరి, జిల్లా నాయకులు మహేందర్, కాశీ, నరసింహా, నయీమ్, శ్రావణి, కవిత తదితరులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మక్తల్: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్ల నుంచి రబీ సీజన్లో సాగునీరు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం పలు గ్రామాల ప్రజలు మక్తల్కు చేరుకొని రిజర్వాయర్ల నీటి విడుదలకు కృషి చేశారంటూ ఎమ్మెల్యేను సన్మానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ రైతులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిసి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడామని, 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరగా 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారన్నారు. కాల్వ నుంచి పారే చెరువులన్నింటికి నీటిని వదులుతామని, పంటలు సాగు చేసిన రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, రెండు రిజర్వాయర్లు నింపేలా తనవంతు కృషి చేస్తానన్నారు. బాలబ్రహ్మేశ్వరుడి క్షేత్రంలో శివజ్యోతి దర్శనం.. అలంపూర్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరుడి క్షేత్రంలో బుధవారం అర్ధరాత్రి భక్తులకు శివజ్యోతి దర్శనం కలిగింది. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు అర్ధరాత్రి శివజ్యోతి కార్యక్రమం నిర్వహించారు. మాలధారులు పంచాక్షరి నామస్మరణతో శివజ్యోతిని నింగిలోకి వదలగా హరహర మహాదేవ.. శంభో శంకర..నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు, మాలధారులు లింగోద్భవ సమయంలో నింగికెగిరిన శివజ్యోతిని వీక్షించారు. అంతకుముందు భక్తులు శివజ్యోతిని తలపై ఉంచుకొని నగర సంకీర్తనలు చేస్తూ.. బాణసంచా పేలుస్తూ భారీ ఊరేగింపుగా పట్టణంలో నుంచి ప్రధాన ఆలయమైన బాలబ్రహ్మేశ్వర ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. జూరాలకు స్వల్ప ఇన్ఫ్లో ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్ఫ్లో వస్తుంది. బుధవారం రాత్రి 9 గంటల వరకు 2,418 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. జూరాలలో నీటి మట్టం తగ్గడంతో ఇటీవల మంత్రి జూపల్లితో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు కర్ణాటక ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి 3 టీఎంసీల నీరు విడుదల చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆరు వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేయగా..జూరాలకు 2,418 క్యూసెక్కులు వస్తున్నట్లు అధికారులు చెప్పారు. నదిలోని గుంతల్లోకి ఎక్కువ నీరు చేరడంతో ఇక్కడికి వచ్చే సరికి స్వల్ప ఇన్ఫ్లో ఉన్నట్లు తెలిపారు. ఎడమ కాలువకు 550, కుడి కాలువకు 400 ు, భీమా లిఫ్టు–1కు 338 క్యూసెక్కులు, ప్రాజెక్టు నుంచి మొత్తం 1364 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. -
హెలీప్యాడ్లు లేక..
సొరంగం ఘటన జరిగిన రోజు నుంచి రెండు, మూడు హెలిక్యాప్టర్లు వచ్చి పోతున్నాయి. జేపీ కంపెనీ కార్యాలయం వద్ద ఒకటి నిలిచేందుకు హెలీప్యాడ్ ఉంది. ఒకటి వస్తే మరొకటి గాలిలో చక్కర్లు కొడుతుంది. కొన్ని సందర్భాల్లో సున్నిపెంట, శ్రీశైలం వెళ్లి ల్యాండ్ అవుతున్నాయి. బుధవారం మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి హెలిక్యాప్టర్లో రాగా.. జేపీ కంపెనీ అధినేత జయప్రకాశ్గౌర్ మరో హెలిక్యాప్టర్లో వచ్చారు. ఒక హెలీపా్య్డ్ మాత్రమే ఉండటంతో దిగడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మరొకటి గాలిలోకి ఎగరాల్సి వచ్చింది. దీంతో హుటాహుటిన మరో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. -
మళ్లీ కంప్యూటర్ విద్య
నర్వ: మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక విద్య ప్రతి విద్యార్థికి అవసరమే. ఇందులో భాగంగా సర్కారు పాఠశాలలను ఆధునిక పరిశోధన కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎం శ్రీ) పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పాఠశాలల్లో మళ్లీ కంప్యూటర్ విద్య అమలు చేయా లని నిర్ణయించింది. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞా నం అందించాలనే ఉద్దేశంతో మొదటి విడతలో ఎంపికై న పీఎంశ్రీ పాఠశాలలకు పది డెస్క్ టాప్ కంప్యూటర్లు, ఒక ప్రింటర్, 2 కేవీ ఇన్వర్టర్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 487 పాఠశాలలకు 4870 కంప్యూటర్లు, 487 ప్రింటర్లు, 974 2కేవీ ఇన్వర్టర్లు మంజూరు చేస్తూ ఈ నెల 14న పాఠశాల స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ సమగ్రశిక్ష నుంచి ఆదేశాలు జారీ అయ్యా యి. పాఠశాలలో కంప్యూటర్ విద్య విద్యార్థుల కెరీర్ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇంటర్నెట్తో కూడిన కంప్యూటర్ అనేది విద్యార్థుల కొత్త నైపుణ్యాలు, ప్రస్తుత పాఠాల అధునాతన వెర్షన్ను నేర్చుకోవడానికి దోహద పడనుంది. పీఎంశ్రీ కింద పాఠశాలల్లో.. పీఎంశ్రీ పథకం కింద మొదటి దఫాలో ఎంపికై న ఉన్నత పాఠశాలల్లో సాంకేతిక విద్య అమలులోకి రానుంది. జిల్లా వ్యాప్తంగా 11 పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలలకు కంప్యూటర్లు, ప్రింటర్లు, 2కేవీ ఇన్వర్టర్లు మంజూరు చేశారు. సెల్కాన్ ఇంపెక్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ సామగ్రిని పాఠశాలలకు సరఫరా చేయనుంది. ప్రతి ఎమ్మార్సీకి సరఫరా చేయబడిన ఎలక్ట్రికల్ నెట్వర్కింగ్ సిస్టమ్తో పాటు డెస్క్టాప్, ప్రింటర్లు, యూపీఎస్ సిస్టమ్లు, ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ధ్రువీకరించాలి. ఇప్పటికే ఫీల్డ్ట్రిప్, ఎక్స్ఫోజర్ విజిట్, సైన్స్ మ్యాథ్స్ యాక్టివిటీ, స్కూల్ యాన్వల్డే, ట్వినింగ్ మోటివేషనల్ లెక్చర్స్ నిర్వహణకు సంబందించిన నిధులు విడుదలయ్యాయి. ఇదివరకు పీఎంశ్రీ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ఫీల్డ్టూర్కు తీసుకెళ్లారు. ఎన్టీపీసీ, అగ్రికల్చరల్( వ్యవసాయక్షేత్రాలు), పరిశ్రమలు, ఇలా క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. పాఠశాలల్లో సౌర విద్యుత్ దీపాల ఏర్పాటు తోటల పెంపకం, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, స్వచ్చత చర్యలు, బోమ్మలతో బోధన, విద్యార్థుల సామర్థ్యాల ముదింపు వంటివి చేపడుతారు. ఉపాధి అవకాశాలపైనా అవగాహన, సాంస్కృతిక కార్యక్రమాలు, విస్తృతంగా నిర్వహణతో పాటు సాంకేతిక విద్య వైపు అడుగులు పడుతున్నాయి. నర్వ కేజీబీవీలో కంప్యూటర్ విద్య బోధిస్తున్న బోధకురాలు (ఫైల్) పీఎంశ్రీ పథకం కింద జిల్లాలో 11 పాఠశాలలు ఎంపిక కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇన్వర్టర్లు మంజూరు గతంలో బోధకులు లేక కుంటుపడిన వైనం -
శంభో.. శివ శంభో...
● జిల్లాలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు మక్తల్: శంభో.. శివ శంభో.. ఓం నమఃశ్శివాయ నామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. నారాయణపేట, మక్తల్, కోస్గితోపాటు గ్రామాల్లో ఉదయాన్నే పుణ్య స్నానాలు ఆచరించి శివాలయాలకు తరలివెళ్లారు. శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. మారేడు దళాలు, పువ్వులతో శివయ్యను ఆరాధించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శివుడి దర్శనాలు సాగాయి. రాత్రి శివ కల్యాణాలు కనులపండువగా జరిగాయి. మహా శివరాత్రి సందర్భంగా ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయ నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. -
గతంలో బోధకులు లేక..
గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఆధారిత విద్యా విధానం అమల్లోకి వచ్చిన కొంత కాలానికి అటకెక్కింది. 2005లో పాఠశాలలకు కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేసినా ఒప్పంద గడువు తీరడం.. బోధకులు లేకనో కంప్యూటర్ విద్య మరుగునపడింది. గతేడాది మరోసారి ఐసీటీ స్కూల్ ప్రాజెక్టు కింద 47 పాఠశాలలకు సమగ్రశిక్ష నిధులతో ఒక్కో పాఠశాలకు 5 నుంచి 10 వరకు కంప్యూటర్లు వచ్చాయి. ప్రత్యేక బోధకులు లేకపోవడం, శిక్షణ ఇవ్వకపోవడంతో కంప్యూటర్లు నిరుపయోగంగా మారాయి. రూ.లక్షలు వెచ్చించిన ప్రభుత్వం బోధకులను నియమించకపోవడంతో సాంకేతిక విద్య అంతా మిథ్యగానే మారింది. ఇన్నాళ్లకు పాఠశాలల్లో కంప్యూటర్ విద్య పునఃప్రారంభం కానుండడంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మల్లెల తీర్థం జలపాతమే కారణమా?
సొరంగం ఘటన జరిగిన ప్రదేశం మల్లెలతీర్థం జలపాతం లోయ ప్రాంతం అయి ఉండవచ్చని వటువర్లపల్లి, సార్లపల్లి, కుడిచితలబైలు గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ నుంచి 13.93 కి.మీ. వద్ద జరిగిన ప్రమాదాన్ని నేరుగా పరిశీలిస్తే.. ఆ ప్రాంత వరకు వెళ్తోంది. ఇక్కడ 500 అడుగుల ఎత్తు నుంచి నిరంతరం హోరెత్తుతూ దూకే జలధార మూడు సరస్సులను నింపుతూ.. నల్లమల అడవి గుండా కృష్ణానదిలో కలుస్తుంది. మల్లెల తీర్థంలో ఏడు గుండాలు ఉన్నాయి. ఈ గుండాల వద్దనే నీటి నిల్వ ఉంటుంది. ఇందులో ఏదో ఒకటి సొరంగం వద్ద లికేజీ అయి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొరంగంలో కిలోమీటరు వరకు సీపేజీ ఉండే అవకాశం ఉందని.. ముందే తెలిసినా జేపీ కంపెనీ తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐదు రోజులైనా సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటి వరకు నెమ్మదిగా సాగిన సహాయక చర్యలను వేగవంతం చేసి.. రెండు రోజుల్లో ఎనిమిది మంది కార్మికులను బయటికి తెస్తామని మంత్రులు ప్రకటించారు. -
కనిపించని పురోగతి
వాతావరణం మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. ఉదయం, రాత్రివేళ చల్లని గాలులు వీస్తాయి. ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఐదు రోజులైనా దొరకని కార్మికుల జాడ ● ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కోసం భగీరథ యత్నం ● నీటిని, బురద తొలగించడం పెద్ద సవాలే.. ● రెండు రోజుల్లో తీసుకు వస్తామన్న మంత్రులు అచ్చంపేట/అచ్చంపేట రూరల్/ఉప్పునుంతల: దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది కార్మికులను బయటికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రమాదం జరిగి ఐదు రోజులైనా ఇంత వరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం న్యూఢిల్లీలోని బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్, టన్నెల్ వర్క్స్లో నిష్టాతులైన వారిని ప్రత్యేకంగా పిలిపించారు. సొరంగంలోకి వెళ్లి వచ్చిన రెస్క్యూ బృందాలు మాత్రం శిథిలాలను తొలగించడం.. అందులో చిక్కుకున్న కార్మికులను కాపాడటం కష్టంగా ఉందని చెబుతున్నారు. సొరంగంలో భారీగా మట్టి, రాళ్లు కూలి పడటంతో.. వాటిని కదిలిస్తే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శిథిలాలు, మట్టిని తొలగించేందుకు రోజులు పట్టవచ్చని చెబుతున్నారు. కాగా, ఉత్తరఖండ్లోని డెహ్రాడూన్లో 41 మందిని రక్షించినప్పటికీ అక్కడికి ఇక్కడికి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండటంతో ప్రయత్నాలు చేయడం కూడా కష్టంగా మారిందని రెస్క్యూ బృందాలు పేర్కొంటున్నాయి. దేశంలో ఇప్పటివరకు జరిగిన టన్నెల్ ప్రమాదాల్లో ఇదే అత్యంత కఠినమైనదని చెబుతున్నారు. అయితే 12 కి.మీ. వద్ద మరో మార్గం ద్వారా లోపలికి వెళ్లాలని సహాయక బృందాలు అన్వేషిస్తున్నాయి. సొరంగంపై నుంచి లేదా పక్క నుంచి రంధ్రం చేసేందుకు ఉన్న అవకాశాలపై ప్రయత్నాలు చేస్తున్నారు. అంతుచిక్కడం లేదు సొరంగంలో చేరిన నీటిని, బురదను తొలగించి ఎనిమిది మంది ప్రాణాలను కాపాడటం పెద్ద సవాల్గా మారింది. ఈ ప్రమాదాన్ని అంచనా వేయడం నిపుణులు, ఇంజినీర్లు, రెస్క్యూ బృందాలను సైతం కలవరపెడుతోంది. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన అనుభవజ్ఞులైన వారికి ఈ ప్రమాదం అంతుచిక్కుడం లేదు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలనే దానిపై ఇప్పటి వరకు ఓ నిర్ణయానికి రాలేదు. లోపల ఉన్న బురద, రాళ్లు, నీటిని బయటికి తీసుకురావడం కష్టమన్న భావన వ్యక్తమవుతోంది. తెగిపోయిన కన్వేయర్ బెల్టును కూడా ఇప్పటి వరకు పునరుద్ధరించ లేదు. వాస్తవానికి టన్నెల్ బోరింగ్ మెషీన్ నడిస్తేనే ఈ బెల్టు పని చేస్తుంది. కార్మికుల కుటుంబసభ్యుల్లో ఆందోళన.. సొరంగంలో చిక్కుకున్న వారు ఎక్కుడున్నారో.. ఎలా ఉన్నారో అనే ఉత్కంఠ తారస్థాయికి చేరింది. ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని కార్మికుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. టన్నెల్ వద్దకు తమను పంపడం లేదని.. షెడ్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని వాపోతున్నారు. ఎలాంటి సమాచారం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని.. రోజుకు రెండు, మూడు హెలిక్యాప్టర్లు రావడం చూసి ఏమైందోనన్న ఆందోళన చెందుతున్నామని గోడు వెలిబుచ్చారు. మంత్రుల పర్యవేక్షణ.. దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద చేపట్టిన సహాయక చర్యలను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్మార్రెడ్డి, రోడ్డు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పర్యవేక్షించారు. అనంతరం ఉన్నతాధికారులు, జేపీ కంపెనీ, వివిధ రెస్క్యూ బృందాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను రెస్క్యూ బృందాలు మంత్రుల దృష్టికి తీసుకువచ్చాయి. గాలి, వెలుతురు లేని సొరంగంలో ఆక్సిజన్ అందకపోవడంతో సహాయక బృందాలు ఎక్కువ సేపు ఉండలేకపోతున్నాయని.. ఆక్సిజన్ సిలిండర్లు సమకూర్చితే లోపల ఎక్కువ సమయం ఉండేందుకు అవకాశం ఉంటుందని.. ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు వ్యూహాలు రచించవచ్చని తెలిపారు. -
ధనార్జనే ధ్యేయంగా దందా
గద్వాల క్రైం: సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వారు నకిలీ సర్టిఫికెట్ల దందాకు తెరలేపా రు. అందులోను ప్రధాన సూత్రధారి గతంలో పదే ళ్లు కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసిన అనుభవం ఉండడంతో.. లేని కళాశాలను ఉన్నట్లుగా సృష్టించారు. నిరుద్యోగుల అవసరాన్ని అవకాశంగా మార్చుకొని ఒక్కో నకిలీ సర్టిఫికెట్ను రూ.లక్షకుపైనే విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మరికొన్ని రాష్ట్రాల వారికి సర్టిఫికెట్లు విక్రయించినట్లు సమాచారం. నకిలీ డిప్లొమా సర్టిఫికెట్తో ఏఈఓగా ప్రభుత్వ ఉద్యోగం పొంది.. దాదాపు ఐదేళ్లు వ్యవసాయ శాఖలో పనిచేసిన వ్యక్తి వ్యవహారం ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తాజాగా ఈ నకిలీ సర్టి ఫికెట్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన చెరువుపల్లి బాలకృష్ణను మంగళవారం రాత్రి గద్వాల పోలీసులు అరె స్టు చేసినట్లు డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకర్ల స మావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. పట్టుబడ్డారిలా.. ఇదిలాఉండగా, జిల్లాలో నకిలీ సర్టిఫికెట్తో ఏఈఓ ఉద్యోగం పొందిన కాట్రావత్ నరేష్తోపాటు మరో వ్యక్తిని ఈ నెల 22న అరెస్టు చేశామన్నారు. అనంతరం ప్రధాన సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. పట్టుబడిన ఇద్దరు ఇచ్చిన సమాచారం మేరకు గద్వాల పోలీసు బృందం రెండు రోజుల క్రితం మిర్యాలగూడకు చేరుకున్నారని తెలిపారు. ఈక్రమంలోనే 25వ తేదీన మిర్యాలగూడ పట్టణ శివారులో గుర్తు తెలియని వ్యక్తులకు నకిలీ సర్టిఫికెట్లు అందిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు రెక్కీ నిర్వహించి బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడి నుంచి మూడు నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నుటు్ల్ వెల్లడించారు. ఈ కేసులో బాలకృష్ణ ఏ3గా ఉన్నాడని తెలిపారు. ఇతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి వివరాలు వెల్లడించారని, త్వరలో అతడిని అదుపులోకి తీసుకుంటామన్నారు. 12 మందికి నకిలీ సర్టిఫికెట్లు అందించాడని అతను నేరం అంగీకరించాడన్నారు. ఇప్పటివరకు ఆరుగురి నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నామని, త్వరలో మిగతా వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విషయంలో సీరియస్గా ఉందని, పట్టుబడిన నిందితుడిని గద్వాల కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసు విచారణలో సీఐ శ్రీను, ఎస్ఐ కళ్యాణ్కుమార్, సిబ్బంది చంద్రయ్య, ఇస్మాయేల్ కీలకంగా వ్యవహరించారన్నారు. పదేళ్లుగా గుట్టుగా దందా ప్రఽదాన సూత్రధారి చెరువుపల్లి బాలకృష్ణ మిర్యాలగూడ పట్టణంలో ఓ జూనియర్ కళాశాలకు ప్రిన్సిపల్గా వ్యవహరించారని, కొన్నాళ్లకు కళాశాలను నడిపించే ఆర్థిక స్థోమత లేక మూసి వేశాడన్నారు. అప్పటి నుంచి ఎలాగైన డబ్బులు సంపదించాలనే లక్ష్యంతో పలు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో ముఠాగా ఏర్పడి నకిలీ సర్టిఫికెట్ల దందాకు తెరలేపాడన్నారు. దాదాపు పదేళ్లుగా నకిలీ సర్టిఫికెట్ల మాఫియా దందాను గుట్టుగా సాగిస్తున్నాడని వివరించారు. నకిలీ సర్టిఫికెట్ల కేసులో విస్తుపోయే నిజాలు ఒక్కో సర్టిఫికెట్ రూ.లక్షకుపైనే విక్రయం తాజాగా ప్రధాన సూత్రధారి బాలకృష్ణ అరెస్టు మిర్యాలగూడలో చిక్కిన నిందితుడు కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ మొగిలయ్య -
ఆటోలకు త్వరలో నంబర్ కోడ్
నారాయణపేట: జిల్లా కేంద్రంలో ప్రతి ఒక్క ఆటో డ్రైవరు తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఆటో డ్రైవర్లకు మంగళవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్యాసింజర్ల వద్ద ఎక్కువ చార్జ్ తీసుకోవడం జరుగుతుందని నా దృష్టికి వచ్చినందున ప్రతి ఒక్కరూ జిల్లా కేంద్రంలో ఒకే రేటు పై డబ్బులు తీసుకోవాలని సూచించారు. త్వరలో ప్రతి ఒక్క ఆటోకు ఆటో కోడ్ నెంబర్ ఇవ్వనున్నట్లు, అలాగే ఆటోలలో స్కూల్ పిల్లలను, ప్యాసింజర్లను, కూలీలను పరిమితికి మించి ఎక్కించుకోరాదన్నారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ తప్పకుండా యూనిఫామ్ ధరించాలని, సరాఫ్ బజార్తో పాటు పట్టణంలోని రద్దీ గల ప్రాంతాలలో ఎక్కుడ రోడ్డుపై ఆటోలు ఆపి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించరాదన్నారు. టౌన్లో రాష్ డ్రైవింగ్ చేయరాదని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని వారికి తగిన గౌరవం ఇవ్వాలని సూచించారు. సరాఫ్ బజార్ రూట్ను వన్ వే చేయడం జరుగుతుందని, ఎవరైనా వెళ్లాలనుకుంటే ఓల్డ్ బస్టాండ్ నుంచి సరాఫ్ బజార్ రోడ్లోకి వెళ్లవచ్చు అని సూచించారు. ఆర్టీఏ మేఘ గాంధీ, సిఐ శివ శంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. -
2న వనపర్తికి సీఎం రాక
వనపర్తి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మార్చి 2న వనపర్తి జిల్లాకు రానున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. మంగళవారం ఎంపీ మల్లు రవి, నేతలతో కలిసి హైదరాబాద్లో అభివృద్ధి పనుల నివేదికను సీఎంకు ఆయన అందజేశారు. సుమారు రూ.వెయ్యి కోట్ల పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మంగళవారం కలెక్టర్ ఆదర్శ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య సమావేశమై సీఎం పర్యటన ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. సాయంత్రం కలెక్టరేట్ సమీపంలోని హెలీప్యాడ్ను ఎస్పీ పరిశీలించి బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు, వాహనాల పార్కింగ్ తదితర వాటిపై డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కృష్ణకు సూచనలు చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి నారాయణపేట ఎడ్యుకేషన్: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేష్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నాగేశ్వరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని స్థానిక స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు వాడటం వల్ల యువత భవిష్యత్ను నాశనమవుతుందని, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది వీటికి బానిసలుగా మారి జీవితం నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఇందులో ఎక్కవ శాతం యువతనే ఉండటం ఆందోళన చెందాల్సిన విషయమని అన్నారు. గంజాయి ఇతర నిషేదిత మత్తు పదార్థాలు ఆరోగ్యానికి చాలా హానికరమని, వీటిని తీసుకున్నా, రవాణా చేసినా చట్టరిత్యా చర్యలు తప్పవన్నారు. ఇప్పటికై నా యువత నిషేదిత మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడి సమాజంలో చైతన్యం తీసుకురావాలని అన్నారు. విజేతకు కలెక్టర్ అభినందన ధన్వాడ: హైదరాబాద్లో జరిగిన తొలి చత్రపతి శివాజీ మహిళా కేసరి(రెజ్లింగ్) పోటీల్లో విజేతగా నిలిచిన విద్యార్థి నాగలక్ష్మిని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అభినందించారు. మండలంలోని మందిపల్లితండాకు చెందిన నాగలక్ష్మి ఈ నెల 16 నుంచి 19 వరకు హైదరాబాద్లో జరిగిన రెజ్లింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చి విన్నర్గా నిలిచింది. ఈమేరకు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో డివైఎస్ఓ వెంకటేష్, కోచ్ శ్రీనివాస్, విద్యార్థి తల్లిదండ్రులు కలెక్టర్ను కలిశారు. మరిన్ని అవార్డులు సాధించాలని కలెక్టర్.. నాగలక్ష్మికి సూచించారు. పాఠశాల పనులు వెంటనే ప్రారంభించాలి మద్దూరు: మద్దూరు పట్టణంలోని కోట్ల ఆంజనేయస్వామి ఆలయం వెనుక ఉన్న స్థలంలో గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కడా అధికారి వెంకట్రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఈఈ రాంచందర్తో కలిసి స్థలాన్ని పరిశీలించారు. రూ.20 కోట్ల నిధులతో నిర్మించి భవన నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. ఈ స్థలంలో ఉన్న లక్ష్మి నర్సింమస్వామి ఆలయాన్ని రోడ్డు వైపు వచ్చేలా నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ రెండు పనులు ఏకకాలంలో జరగాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలతో, అలయ కమిటీ సభ్యులతో ఆయన మాట్లాడారు. ఆలయ నమునాను అందజేస్తే వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. అలసందలు క్వింటాల్ రూ.5,800 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం అలసందలు క్వింటాల్ గరిష్టం, కనిష్టంగా రూ.5,800 ధర పలికింది. అలాగే, శనగలు గరిష్టం, కనిష్టంగా రూ.5,409, ఎర్ర కందులు గరిష్టం రూ.7,619, కనిష్టంగా రూ.6,800, తెల్ల కందులు గరిష్టం రూ.7,656, కనిష్టంగా రూ.6,006, వేరుశనగ గరిష్టం రూ.6,320, కనిష్టంగా రూ.4,320 ధరలు పలికాయి. -
ప్రభుత్వ పథకాలు రైతులకు చేరాలి
నారాయణపేట: ప్రభుత్వం అమలు చేసే పథకాలను రైతులకు చేరే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా లోకల్ బాడీ అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరెట్ వీడియో కన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ శాఖపై వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎం కిసాన్ కొరకు పోర్టల్లో నమోదు చేసుకున్న రైతుల వివరాలను పరిశీలించాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ కేవైసీ చేసుకోని రైతులను ఈ కేవైసీ చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఆధార్ సీడింగ్ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో పంటల నమోదు 28 శాతంగా నమోదు జరిగిందని, పంటల నమోదును ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రైతుబీమా డెత్ రికార్డు 4 రోజుల్లోగా చేయాలని, అదే విధంగా డాక్యుమెంట్స్ 5 రోజుల్లోగా పోర్టల్ నందు అప్లోడ్ చేయాలని సూచించారు. రైతుబీమా క్లెయిమ్ లు త్వరగా చేయాలని, నామినీ అకౌంట్లలో డబ్బులు జమ చేయబడుటకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు భరోసా, అకౌంట్ నంబర్లను రైతు భరోసా పోర్టల్ నందు నమోదు చేయాలని సూచించారు. -
ఒంటరిగా వెళ్లాలంటే భయం
రెవెన్యూ సహాయకులు లేకపోవడంతో మహిళా ఏఈఓలు ఒంటరిగా వెళ్లి పంట వివరాలు నమోదు చేయడం కష్టంగా ఉంది. గ్రామంలో భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి.. ఏయే సర్వేనంబర్లలో ఏ పంటలు సాగు చేశారనే వివరాలు తెలుసుకోవడానికే సమయం సరిపోవట్లే. రోజువారీగా 20 ఎకరాల వివరాలు సైతం నమోదు చేయలేకపోతున్నాం. – ప్రశాంతి, ఏఈఓ, నిడుగుర్తి కొత్త ట్యాబ్లు ఇవ్వాలి పంట వివరాల నమోదుకు ఐదేళ్ల కిందట వ్యవసాయశాఖ ఇచ్చిన ట్యాబ్లు ప్రస్తుతం పనిచేయడం లేదు. దీంతో వ్యక్తిగత స్మార్ట్ ఫోన్లలో యాప్ డౌన్లోడ్ చేసుకొని వివరాలు నమోదు చేస్తున్నాం. ఫొటో క్యాప్చర్, డాటా ఎంట్రీ సమయంలో ఫోన్లు వేడెక్కుతున్నాయి. స్మార్ట్ఫోన్లలో వ్యక్తిగత సమాచారం సైతం బయటి వ్యక్తులు చేతుల్లోకి వెళ్తుందనే భయం వెంటాడుతోంది. జిల్లా అధికారులు స్పందించి కొత్త ట్యాబ్లు, సర్వేకు సహాయకులను ఇవ్వాలి. – తిరుపతి, ఏఈఓ, గుండుమాల్ సర్వర్.. సిగ్నల్ సమస్య రెవెన్యూ అధికారులు జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాల ప్రకారం గ్రామాలకు వెళ్లి పంట వివరాల నమోదు చేయడంలో ఇబ్బందులు తప్పట్లేదు. యాప్లో పంటలను సాగు చేసే సమయంలో సర్వర్, సిగ్నల్ సమస్యలు వస్తున్నాయి. సర్వే కోసం ప్రత్యేక ట్యాబ్లు అందజేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఏఈఓలు వారి సొంత మొబైల్ఫోన్లో సర్వే చేస్తున్నారు. – శ్రావణ్కుమార్గౌడ్, ఏఈఓ, మద్దూర్ వేగవంతం చేస్తాం సర్వే నంబర్ల వారీగా సాగుచేసిన పంటల వివరాలు, ఫొటోలు, ఇతర వివరాలను యాప్లో ఏఈఓలు పొందుపర్చాలి. డిజిటల్ సాగు సర్వే వేగవంతానికి చర్యలు తీసుకుంటాం. అలాగే, పంట నమోదు చేయించుకోకపోతే పంట విక్రయించే సమయంలో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రైతులు ఏఈఓలకు సహకరించి పంట సాగు వివరాలను నమోదు చేయించుకోవాలి. – జాన్ సుధాకర్, డీఏఓ ● -
ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం
నారాయణపేట: ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ ఇళ్లు, తాగునీరు ఎన్ఆర్ఈజీఎస్ పనులపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. శివరాత్రి పండుగ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పనుల గ్రౌండ్ పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హత ఉన్న వారిని జాబితాలో చేర్చాలన్నారు. పరిశీలన పూర్తి అయ్యాక ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారని తప్పులు లేకుండా జాబితా సిద్ధం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల బేస్మెంట్ లెవెల్ మార్చి 10 లోపు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎక్కడ తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మోటార్లు అందుబాటులో ఉంచుకోవాలని మరమ్మత్తులు ఉంటే చేయించాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీలలో ట్యాంకర్లను మరమ్మతు చేయించుకోవాలన్నారు. ప్రైవేట్ బోర్వెల్స్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కొత్త మోటార్లు అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. తాగునీరు ఉదయం 6 గంటలకల్లా గ్రామాలకు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో కూలీలకు ఉపాధి కల్పించేలా అవగాహన కల్పించాలన్నారు. పనులు జరిగే చోట తాగునీటి వసతి కల్పించాలని, పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేసవి దృష్ట్యా ఉదయమే ఉపాధి పనులు ప్రారంభించాలని తెలిపారు. సరైన యాక్షన్ ప్లాన్ తో ఉపాధి హామీ పనులు చేయాలన్నారు. నర్సరీ అవెన్యూ ప్లాంటేషన్ చేసేందుకు ఇప్పటినుండి చర్యలు తీసుకోవాలన్నారు. రోల్డ్ వైపు చెట్లు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వర్, ట్రైనీ కలెక్టర్ గరిమనరుల, జడ్పీ సీఈవో తదితరులు పాల్గొన్నారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు కలెక్టర్ సిక్తాపట్నాయక్ -
సన్నగిల్లుతున్న ఆశలు
వాతావరణం ఆకాశం నిర్మలంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. ఉదయం, రాత్రివేళ చల్లని గాలులు వీస్తాయి. నాలుగు రోజులైనా దొరకని ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ నెల 22న ఘటన జరగగా ఇప్పటి వరకు వారి ఆచూకీ లభ్యం కాలేదు. దాదాపు 11 రెస్క్యూ బృందాలు నాలుగు రోజులుగా రేయింబవళ్లు శ్రమిస్తున్నా కనీసం ఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నారు. మంగళవారం నాలుగో రోజు కూడా సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో బాధిత కుటుంబాల్లో నిరాశ, నిస్పృహ అలుముకోగా.. ఆశలు సన్నగిల్లుతున్నాయి. సహాయక చర్యలకు ఆటంకం.. సొరంగంలో సెగ్మెంట్ బిగిస్తుండగా ఏర్పడిన రంద్రం వల్ల నీటి ప్రవాహం రోజురోజుకూ పెరుగుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకపోయింది. బురద, నీటి ప్రవాహంతో సహాయక బృందాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ తదితర 11 బృందాలకు చెందిన 750 మంది నిపుణులు కార్మికుల ఆచూకీ కోసం గాలిస్తుండగా.. బుధవారం మరిన్ని బృందాలు రంగంలోకి రానున్నాయి. చెల్లాచెదురైన మిషన్ వద్దకు చేరుకునేందుకు ర్యాట్ హోల్ మైనర్స్ కూడా ప్రయత్నిస్తున్నారు. నిమిషానికి 3,600 నుంచి 5 వేల లీటర్ల నీటి ఊట వస్తుండటంతో రెండు 100 హెచ్పీ మోటార్లతో నీటిని బయటికి తోడేస్తున్నా ఊట అదుపులోకి రాలేకపోతోంది. రేపటి వరకు నీటి ప్రవాహం తగ్గుతుందనే ఆశాభావం మంత్రుల బృందం వ్యక్తం చేస్తోంది. సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు ఎల్అండ్టీ సంస్థ రెండు క్రేన్లను కూడా తెప్పించింది. వాటిని లోపలికి తీసుకెళ్లి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉంచారు. మరోవైపు పైకప్పు కూలిన ఘటనతో కార్మికుల్లో నెలకొన్న భయం ఇంకా తొలగిపోలేదు. మంగళవారం పనులు చేయడానికి ముందుకు రాకపోవడంతో పలు దఫాలుగా వారితో చర్చలు జరిపి లోపలికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఉదయం 8 గంటల షిఫ్టులో వెళ్లాల్సిన బృందం మధ్యాహ్నం ఒంటిగంటకు లోపలికి వెళ్లింది. పొట్ట కూటి కోసం వచ్చి.. పొట్ట కూటి కోసం వేలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్లో చిక్కుకున్నారు. వారి ప్రాణాలు ఇప్పుడు దేవుడిపైనే భారంగా మారింది. జార్జండ్, ఉత్తరప్రదేశ్, జమ్ముకాశ్మీర్, మద్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు జేపీ కంపెనీలో పనిచేస్తున్నారు. చాలీచాలనీ వేతనాలు, కూలీలకు ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. తమకు సొంత ప్రాంతంలో పని లేకనే ఇంత దూరం వచ్చి పనిచేస్తున్నామని, తమ వారి ప్రాణాలకు భద్రత లేదని వాపోతున్నారు. కూలీ డబ్బులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని, ఇక్కడ పనిచేస్తున్నారనే పేరు తప్పా తామే తిండికి డబ్బులు పంపిస్తున్నామని ఆరోపించారు. ఈ క్రమంలోనే మంగళవారం జార్జండ్ రాష్ట్రం గుమ్లా జిల్లాకు చెందిన నాలుగు కుటుంబాల సభ్యులు ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు చేరుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేసి తమ కుటుంబ సభ్యులను క్షేమంగా తీసుకువచ్చి అప్పగించాలని అధికారులను కోరుతున్నారు. ఘటనా స్థలానికి కొద్దిదూరంలోనే ఆగిపోతున్న రెస్క్యూ బృందాలు భారీగా వస్తున్న నీటి ఊటతో తీవ్ర ఆటంకం టన్నెల్ లోపలికి వెళ్లిన ర్యాట్ హోల్ మైనర్స్ దేవుడిపైనే భారమంటున్న కుటుంబ సభ్యులు నీరు, మట్టి తొలగిస్తేనే.. టన్నెల్లో కాంక్రీట్ సెగ్మెంట్లతోపాటు నిర్మాణ సామగ్రి, సెగ్మెంట్ మిషన్, ఇతర సామగ్రి, కన్వేయర్ బెల్ట్, లోకో ట్రైన్ ట్రాక్ వంటివి నీటిలో మునిగి, మట్టిలో కూరుకుపోయాయి. ఈ క్రమంలోనే సెగ్మెంట్ల కింద కానీ, బురదలో కాని బాధితులు చిక్కుకుని ఉంటారని, తొలగింపు ఎంతో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందని రెస్క్యూ బృందాలు పేర్కొంటున్నాయి. శిథిలాలను తొలగించేందుకు వచ్చిన బృందాలు తాళ్లు, పలుగు, పారలతో లోపలికి వెళ్లారు. నీరు, మట్టిని తొలిగిస్తే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. శిథిలాలు తొలగిస్తుంటే ఎక్కడి నుంచి ఏ సమస్య వస్తుందోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. నిత్యం సమీక్షలు సొరంగ ప్రమాదం నేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే వంశీకృష్ణ నాలుగు రోజులుగా సమీక్షలు నిర్వహిస్తూ.. వివిధ దేశాలకు చెందిన నిపుణులను రప్పించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధుల రాకతో వారి భద్రతా ఏర్పాట్లు, అధికారుల హడావుడితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందన్న వాదన వినిపిస్తోంది. -
సాగు సర్వేకు ఆటంకాలు
నారాయణపేట: పంటల సాగు వివరాలు పక్కాగా తెలుసుకునేందుకు చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే జిల్లాలో మందకొడిగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పంటల సాగును డిజిటలీకరణ చేయాలనే లక్ష్యంతో రైతులు ఏ పంట, ఎంత వేశారో క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు పరిశీలించి పక్కాగా నమోదుకు శ్రీకారం చుట్టారు. అయితే అడుగడుగునా సెల్ఫోన్లలో సిగ్నల్లు లేక, సర్వర్ సమస్యలు తలెత్తుతుండడంతో పంటల లెక్క సా..గుతోందని చెప్పవచ్చు. పంటల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడంతో పంటల నష్టాన్ని అంచనా వేయవచ్చు. సాగు రంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(డీపీఐ) రూపొందించాలనే లక్ష్యంతో డిజిటల్ అగ్రి మిషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతులకు ప్రయోజనం, వ్యవసాయ సామర్థ్యాన్ని పెంచడానికి ఆధునిక సాంకేతికతను పెంచేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఏఈఓల ఇబ్బందులు జిల్లాలో 77 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. ఆయా క్లస్టర్లలో 63 మంది వ్యవసాయశాఖ విస్తీర్ణ అధికారులు పంటల నమోదును క్షేత్రస్థాయికి వెళ్లి చేపడుతున్నారు. ప్రతి ఏఈఓ 2వేల ఎకరాలు డీసీఎస్ నమోదు చేయాల్సి ఉండగా.. మహిళా ఏఈఓలకు 1800 ఎకరాలు లక్ష్యంగా కుదించారు. ఒక్కో ఏఈఓ పరిధిలో ఐదు వేల ఎకరాలుంటే.. 2వేల ఎకరాలు సర్వే, మిగతా ఎకరాలు సాధారణ పంట నమోదు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. ఏఈఓలు పంట దగ్గరకు వెళ్లి నమోదు సర్వే చేయక తప్పడం లేదు. ఏఓలు, ఏడీఏలు పర్యవేక్షణలో కొనసాగనుంది. అయితే మహిళా ఏఈఓలకు క్షేత్రస్థాయిలో వెళ్లి పంటల సర్వే చేపట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ భూములు గ్రామాలకు దూరంగా ఉండడంతో కొంత భయాందోళన వ్యక్తపరుస్తున్నారు. మహళా ఏఈఓలకు భద్రతాపరమైన చర్యలను శాఖాపరంగా తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అలాగే, తరచూ యాప్ సర్వర్ డౌన్ కావడం, సిగ్నల్ సమస్యలు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. సర్వర్డౌన్.. వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు సర్వేకు వెనకాడుతున్న ఏఈఓలు ఇప్పటివరకు 28 శాతం డిజిటల్ క్రాప్ సర్వే పూర్తి జిల్లాలో 77 క్లస్టర్లు.. 4.59 లక్షల ఎకరాలు -
రాయితీతో ఊరట..
నారాయణపేట: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఎల్ఆర్ఎస్ ఫీజులో 25శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జీఓ 28ని విడుదల చేయడంతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ప్రక్రియ వేగవంతానికి జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. కొన్ని రోజుల క్రితం వరకు జిల్లాలో మూడు మున్సిపాలిటీలు ఉండగా.. ఇటీవల కొత్తగా మద్దూర్ మున్సిపాలిటీగా ఏర్పాటైంది. జిల్లావ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కోసం 34,396 దరఖాస్తులు అందగా.. 9,381 ఆమోదం పొందాయి. మూడు మున్సిపాలిటీల్లో 21,384, మండలాల్లోని 140 జీపీల్లో 13,012 దరఖాస్తులు రాగా.. రూ.10వేల ఫీజు కట్టిన వెంచర్లు 403 ఉన్నాయి. మున్సిపాలిటీల్లో 3, గ్రామాల్లో 3 వెంచర్లను నిషేధిత జాబితాలో అధికారులు గుర్తించారు. అదే విధంగా నిషేధిత ప్లాట్లు మున్సిపాలిటీల్లో 637, గ్రామాల్లో 443 ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేనెల 31వ తేదీలోగా ఎల్ఎస్ఆర్ ఫీజు చెల్లించే వారికి 25 శాతం రాయితీ ప్రకటించింది. గ్రామాల్లో ఫీజు కట్టింది ఇద్దరే.. మక్తల్, నారాయణపేట సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని మున్సిపాలిటీలు, మండలాల్లో అనధికారికంగా ప్లాట్లు అమ్ముతున్నారు. వీటిని క్రమబద్ధీకరణ చేసుకుంటేనే నిర్మాణ అనుమతులు వస్తాయి. ఈ క్రమంలో ప్లాట్లను క్రమబద్ధీకరణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో శ్రీకారం చుట్టింది. ఎల్ఆర్ఎస్ కోసం భారీగా దరఖాస్తులు వచ్చినప్పటికీ పరిష్కారానికి మాత్రం నోచుకోలేదు. గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎల్ఆర్ఎస్లో కదలిక వచ్చింది. ఆ తర్వాత మళ్లీ పరిశీలనలు జరిగినా.. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 56 మంది, గ్రామాల్లో ఇద్దరే ఫీజు కట్టి రెగ్యులరైజ్ చేసుకున్నారు. చాలా మంది ప్లాట్ల క్రమబద్ధీకరణకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభు త్వం ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ ప్రకటించడం దరఖాస్తుదారులకు ఊరటనిస్తోందని చెప్పవచ్చు. రియల్టర్లలో ఆనందం.. జీఓ 28 ప్రకారం 2020 ఆగస్టు 26 నాటికి ఏదేని వెంచరులో కనీసం 10శాతం ప్లాట్ల అమ్మకాలు జరిగినా.. మిగిలిన ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ వర్తింపజేస్తామని ప్రకటించింది. దీంతో జిల్లాలోని రియల్టర్లలో హర్షం వ్యక్తమవుతోంది. ప్లాట్లు అమ్మకుండా మిగిలి ఉన్నా.. గతంలో దరఖాస్తు చేయకున్నా.. మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ప్లాటు మార్కెట్ విలువ ప్రకారం లెక్కగట్టి భూ యజమాని నుంచి వసూలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఈ ఫీజు భారీగానే ఉండే అవకాశం ఉంది. అనధికార లేవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు సువర్ణావకాశం జిల్లాలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు 34,396 అధికారులు ఆమోదించినవి 9,381 జీఓ 28 జారీతో రియల్టర్లు, ప్లాట్ల యజమానుల్లో ఆనందం 14శాతం ఫీజు.. 25శాతం రాయితీ జిల్లాలోని మున్సిపాలిటీలు, జీపీల్లో అనధికార ప్లాటును క్రమబద్ధీకరణకు రూ. వెయ్యి రుసుము చెల్లించిన రశీదు, ప్లాటు డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్, ఈసీ, సెల్డీడ్ను జతచేయాల్సి ఉంటుంది. అదే విధంగా అక్రమ లేఅవుట్ను క్రమబద్ధీకరించుకోవాలంటే రూ. 10వేల రుసుముతో సేల్డీడ్ ప్రతులు, విక్రయించిన ప్లాట్ల ఈసీలు వెంచర్ప్లాన్ జతచేయాలి. ఇది వరకు రిజిస్ట్రార్ డాక్యుమెంట్ ప్రకారం మార్కెట్ విలువలో 14 శాతం ఆన్లైన్ ద్వారా పేమెంట్ను కస్టమర్తో ఫోన్పే లేదా గూగూల్ పే, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయించారు. ఇక పై ఫీజులో 25 శాతం రాయితీతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చెల్లించాల్సి ఉంటుంది. -
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు
నారాయణపేట: వేసవిలో డిమాండ్కు అనుగుణంగా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా విద్యుత్శాఖ ఎస్ఈ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవిలో లోఓల్టేజీ సమస్య లేకుండా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే 1912 టోల్ఫ్రీ నంబర్కు వినియోగదారులు సమాచారం అందించేలా అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఎస్ఈ సంజీవరెడ్డి, ఆపరేషన్ డీఈ డీఎల్ నర్సింహారావు, డీఈ శ్రీనివాస్, డీఈటీ జితేందర్, ఏడీ శ్రీనివాస్ ఉన్నారు. పొదుపు పద్ధతులు పాటించాలి.. మహిళా సంఘాల సభ్యులు పొదుపు పద్ధతులు పాటించి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో సీఆర్పీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీఆర్పీలు కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఒక్కరికీ ఐదు సంఘాల బాధ్యత ఉంటుందని.. క్యాలెండర్ ప్రకారం నడుచుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ మొగుల ప్ప, అడిషనల్ డిఆర్డీఓ అంజయ్య ఉన్నారు. ● అన్ని శాఖల అధికారులు ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్లో ఉన్న అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 10 అర్జీలు రాగా.. పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బెంషాలం, ఆర్డీఓ రాంచందర్, ఏఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు. పెదిరిపాడ్ కేజీబీవీలోకలెక్టర్ రాత్రి బస మద్దూరు: మండలంలోని పెదిరిపాడ్ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం రాత్రి కలెక్టర్ బస చేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని పూర్ణ లక్ష్యసాధనకు సంబంధించి రూపొందించిన చిత్రాన్ని విద్యార్థినులతో కలిసి కలెక్టర్ తిలకించారు. ఈ చిత్రం ద్వారా విద్యార్థినులు నేర్చుకున్న విషయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలో విద్యార్థినులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు సందేశాత్మక చిత్రాలను ప్రదర్శించాలని డీఈఓ గోవిందరాజులకు సూచించారు. అనంతరం కలెక్టర్, ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల విద్యార్థినులతో కలిసి అక్కడే బస చేశారు. కార్యక్రమంలో ఏఎంఓ విద్యాసాగర్, శ్రీనివాస్, ఎంఈఓ బాలకిష్టప్ప, తహసీల్దార్ మహేష్గౌడ్, ఎంపీడీఓ నర్సింహారెడ్డి, ప్రిన్సిపాల్ గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు. వేసవిలో డిమాండ్కు అనుగుణంగాసరఫరా చేయాలి కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
ఫిర్యాదులు సత్వరమేపరిష్కరించాలి
నారాయణపేట: వివిధ సమస్యలపై పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం ఎనిమిది ఫిర్యాదులు అందగా.. చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత పోలీస్స్టేషన్లకు పంపించారు. ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని సూచించారు. రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేంద్రం నారాయణపేట: కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించడం తగదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్లో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ప్రాజెక్టులకు జాతీయ హోదా, హై స్పీడ్ రైల్వేలైన్ తదితర హామీలు ఇచ్చిన కేంద్రం.. ఏ ఒక్క హామీని నెరవేర్చేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని విమర్శించారు. వ్యవసాయ రంగంలో సబ్సిడీల తగ్గింపు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సరిపడా నిధులు కేటాయించపోవడం దారుణమన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక దేశవ్యాప్తంగా లక్షమంది రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకానికి కనీసంగా రూ. 3వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా 18 శాతం ముడిచమురు రేట్లు తగ్గినా.. పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదన్నారు. మిర్చి ధర క్వింటాల్ రూ. 50వేల నుంచి రూ. 15వేలకు పడిపోయిందన్నారు. ధరల స్థిరీకరణకు నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. పప్పులు, నూనెలతో పాటు 14 రకాల సరకులను చౌకధర దుకాణాల ద్వారా పేదలకు అందించాలన్నారు. సదస్సులో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, కార్యదర్శి బాల్రాం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్యగౌడ్, ప్రజా సంఘాల నాయకులు గోపాల్, గోవిందురాజ్, దస్తప్ప, శివకుమార్, అశోక్, బొమ్మన్పాడ్ బలరాం, మహమ్మద్ అలీ, నరహరి, పవన్, మల్లేష్ ఉన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి నారాయణపేట ఎడ్యుకేషన్: ముందస్తు అడ్మిషన్ల పేరుతో అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి సాయికుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం డీఈఓ కార్యాలయ అధికారి ఉదయ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్య పూర్తిగా వ్యాపారంగా మారిందాన్నరు. ప్రతి గల్లీలో మోడల్, ఈ టెక్నో, ఫౌండేషన్, ఐఐటీ, మెడిసిన్ లాంటి తోక పేర్లు తగిలించుకొని యథేచ్ఛగా రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. ఒకే పాఠశాల పేరుతో సబ్ క్యాంపస్లను ఏర్పాటు చేయడం.. రేకులషెడ్ల నుంచి మొదలుకొని బహుళ అంతస్తుల భవనాల్లో తరగతి గదులను నిర్వహించడం విద్యా నియమాలకు విరుద్ధమన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తాగునీరు, వాష్ రూమ్స్, ఫ్యాన్లు వంటి కనీస సౌకర్యాలు లేకపోయినా రూ.లక్షల్లో ఫీజులు దండుకుంటున్నారని ఆరోపించారు. నిబంధనలు పాటించని ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి అజయ్, ఉపాధ్యక్షుడు గౌస్, సహాయ కార్యదర్శి వెంకటేష్, కోశాధికారి మహేష్, సురేష్, మహిపాల్ పాల్గొన్నారు. -
మూడో రోజూ నిరాశే..
అచ్చంపేట: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ సోమవారం మూడోరోజూ చిక్కలేదు. సహాయక బృందాలు షిఫ్ట్ల వారీగా టీబీఎం మిషన్ సమీపంలో వంద మీటర్ల దూరం వరకు వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. నీటి ఉధృతికి కాంక్రీట్ సెగ్మెంట్లు ఊడిపోయి అందులో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. సోమవారం నాటికి రాష్ట్ర విపత్తుతోపాటు ఆర్మీ, నేవీ, సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, జేపీ, నవయుగలకు చెందిన బృందాలు ఇప్పటి వరకు ఏడు సార్లు టన్నెల్లోకి వెళ్లి గాలింపు చేపట్టారు. ఇందులో దాదాపు 584 మంది నిపుణులైన సిబ్బంది ఉన్నారు. ఉత్తరాఖండ్లో జరిగిన విపత్తులో ఈ బృందాలతో పాటు 14 మంది ర్యాట్ (ర్యాట్ హూల్ టీం) మైనర్స్, స్నిపర్ డాగ్స్ సైతం చేరుకున్నాయి. పెద్దఎత్తున బురద నీరు ఉండటంతో లోపలికి వెళ్లలేకపోయాయి. టన్నెల్ లోపలికి పైనుంచి రంద్రం చేసి వెళ్లాలన్న (వర్టికల్ డ్రిల్లింగ్) ప్రతిపాదనలు తోసిపుచ్చారు. ఐదు గ్యాస్ కట్టింగ్ మిషన్లతో పనిచేస్తున్నారు. పై సెగ్మెంట్ బిగిస్తుండగా.. బోరింగ్ మిషన్(టీబీఎం) మీటరు దూరం సొరంగం తొలచిన తర్వాత మరో మిషన్ ద్వారా కాంక్రీట్ సెగ్మెంట్ బిగిస్తారు. 9 మీటర్ల వ్యాసంతో ఉండే ఈ సొరంగంలో మొత్తం 7 సెగ్మెంట్లు బోల్టుల ద్వారా బిగిస్తారు. చుట్టూ అటు ఇటు మూడు చొప్పున ఆరు సెగ్మెంట్లు బిగించి పై సెగ్మెంట్ బోల్టును బిగిస్తుండగా ఒక్కసారి వచ్చిన నీటి ఊటకు సెగ్మెంట్లు ఊడిపోయి ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ శిథిలాల కింద కార్మికులు చిక్కుకొని ఉంటారని తోటి కార్మికులు భావిస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో నీటి ఊట, రాళ్లు, బురద కూరుకుపోవడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి తలెత్తినట్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పేర్కొంటున్నాయి. సిగ్నల్స్ ఏర్పాటు ద్వారా.. సొరంగంలో విద్యుత్, సమాచార వ్యవస్థ వైర్లు, పరికరాలు దెబ్బతినడంతో సిగ్నల్స్ వ్యవస్థ రావడం లేదు. దట్టమైన అడవితో పాటు సొరంగం ప్రాంతంలో మొబైల్ సిగ్నల్స్ అందుబాటులో లేవు. ఈ దశలో ప్రభుత్వం సోమవారం హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రమాదం జరిగిన చోటకు పంపించారు. దీని ద్వారా అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. టన్నెల్లో లభించని ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు చర్యలు ఎస్ఎల్బీసీకి చేరుకున్నస్నిపర్ డాగ్స్, ర్యాట్ మైనర్స్ బృందాలు వంద మీటర్ల దూరంలోనే ఆగిపోతున్న వైనం పైనుంచి రంధ్రం చేసి వెళ్లాలన్న ప్రతిపాదన విరమణ మంత్రులు, అధికారుల పర్యవేక్షణ సొరంగం పనుల్లో చోటు చేసుకున్న సంఘటన జరిగిన నాటి నుంచి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రెండురోజుల పాటు ఇక్కడే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. సోమవారం రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, జయవీర్రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, బాలునాయక్ ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకున్నారు. అలాగే ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, హైడ్రా చీఫ్ సెక్రటరీ అర్వింద్, హైడ్రా కమిషనర్ రంగరాథ్, నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పర్యవేక్షణ, భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. -
వంద మీటర్ల దూరంలోనే..
లోకో ట్రైన్ ద్వారా 13.3 కి.మీ., వరకు చేరుకున్న టీం సభ్యులు బురదలోకి దిగే ప్రయత్నాలు చేస్తున్నా.. వంద మీటర్ల దూరంలో అంత చీకటిగా ఉండటంతో ఏమీ చేయలేక వెనుదిరిగి వస్తున్నారు. ఆదివారం వెళ్లిన బృందాలకు కన్వేయర్ బెల్టు కిందనే నీటి ఊట ఉండటంతో దానిపై నడుచుకుంటూ వెళ్లగా.. సోమవారం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తాజాగా కన్వెయర్ బెల్టు సైతం మునిగిపోయినట్లు సమాచారం. తెగిపోయిన కన్వేయర్ బెల్టును సరిచేసి ఇప్పుడు దాని ద్వారా సహాయక చర్యలు చేపట్టేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. అలాగే సోమవారం నుంచి నీటిని తోడేందుకు 100 హెచ్పీ మోటార్లు ఏర్పాటు చేసినా నీటి ప్రవాహం ఏమాత్రం తగ్గడం లేదని, ఒకవేళ బురద, రాళ్లను తొలగిస్తూ.. ముందుకెళ్తే మరింత ముందుకు వచ్చే అవకాశం ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ● ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని ఆర్మీ చీఫ్తో మాట్లాడి స్పెషల్ ఎక్విప్మెంట్ తెప్పించే ప్రయత్నాలు చేస్తోంది. మూడు రోజులుగా విడతల వారీగా వెళ్తున్న బృందాలు నీళ్లు, బురద ఉండటంతో లోపలికి వెళ్లలేకపోతున్నామనే విషయం తప్ప చిక్కుకుపోయిన వారు కనిపించారనే సమాచారం చెప్పడం లేదు. దీంతో వారు ఇంకా బతికే ఉన్నారా అన్న చర్చ మొదలైంది. మరోవైపు మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారుల హడావుడి తప్ప.. లోపల చిక్కుకున్న వారిని బయటికి తెచ్చే ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం లేదు. దీంతో సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే.. మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
రియల్ వ్యాపారం పడిపోయింది
జిల్లాలో ఏడాది నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది. ప్లాట్లు అమ్మేవారు ఉన్నారు కానీ.. కొనే వారు కరువయ్యారు. గతంలో గజం రూ. 15వేలు పలికిన ప్లాట్లు.. ఇప్పుడు రూ. 12వేలకు అడుగుతున్నారు. గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరిట వెంచర్లకు రూ.10వేల చొప్పున కట్టించుకుంది. ప్రస్తుత ప్రభుత్వం 25 శాతం రాయితీ అంటుంది. వెంటనే మార్గదర్శకాలు జారీ చేసి రియల్టర్లను ఆదుకోవాలి. – రవికుమార్ గౌడ్, రియల్ వ్యాపారి, నారాయణపేట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.. డీటీసీపీ లేఅవుట్లు సక్రమంగా లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. పాత పద్ధతి విధానంలో గ్రామపంచాయతీ ద్వారానే ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతున్నాం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. – నీలప్ప ముదిరాజ్, రియల్ వ్యాపారి, మక్తల్ సద్వినియోగం చేసుకోండి.. అనధికార లేఅవుట్లు, ప్లాట్లు క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎల్ఆర్ఎస్ ఫీజు 25శాతం రాయితీతో చెల్లించాలి. జిల్లాలోని రియల్టర్లు, ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – కిరణ్కుమార్, డీటీపీఓ, నారాయణపేట ఫీజుల వివరాలు రాలేదు.. ప్రభుత్వం జీఓ 28ని విడుదల చేసింది. 10శాతం రిజిస్ట్రేషన్ చేసిన వాటికి ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు వీలు కల్పించింది. అయితే ఎంత ఫీజు వసూలు చేయాలనేది తమకు అధికారికంగా ఆదేశాలు రాలేదు. త్వరలోనే వస్తాయని ఉన్నతాధికారుల ద్వారా మౌఖికంగా తెలిసింది. – రాంజీ, సబ్ రిజిస్ట్రార్, నారాయణపేట ● -
ఎస్ఎల్బీసీ ఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి
సాక్షి, నాగర్కర్నూల్/ అచ్చంపేట: గత పాలకులు ఎస్ఎల్బీసీకి సరిపడా నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేయడంతోనే టన్నెల్ పనులు నిర్దేశిత సమయంలో పూర్తి చేయలేకపోయారని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే (సీపీఐఎం) జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో ఇద్దరు ఇంజినీర్లతోపాటు ఇద్దరు మిషన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఇరుక్కపోవడం దురదృష్టకరమన్నారు. ఆదివారం ఎస్ఎల్బీసీ టన్నెల్ను పరిశీలించిన ఆయన అక్కడే ఉన్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో మాట్లాడి.. సొరంగంలో ఇరుక్కుపోయిన వారిని రక్షించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు గ్రావిటీ ద్వారా నీరందించడానికి తలపెట్టిన టన్నెల్ పనులను సకాలంలో పూర్తిచేయకపోవడంతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. సుమారు రూ.2 వేల కోట్లతో చేపట్టిన పనులను నాలుగేళ్లలో పూర్తిచేయాల్సి ఉండగా.. 20 ఏళ్లు అయినా పూర్తి చేయలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీకి ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో పదేళ్లపాటు పనులు నిలిచిపోయాయని విమర్శించారు. ఫలితంగా వ్యయం పెరిగి.. అంచనా బడ్జెట్ రూ.4,600 కోట్లకు చేరిందని దుయ్యబట్టారు. టన్నెల్లో ఇరుక్కపోయిన వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి అన్నివిధాలా ఆదుకోవాలని, ఈ ఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. -
ఎన్నో సార్లు విన్నవించాం
రైతులు మార్కెట్కు తెచ్చిన ధాన్యం అకాల వర్షాలతో తడిసిపోతుందని ఎన్నో సార్లు మార్కెట్ పాలకవర్గాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పటికై న స్పందించి కవర్షెడ్లతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయడంతో రైతులకు శుభపరిణామంగా భావిస్తున్నాం. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరుతున్నాం. – వెంకోభ, బీకెఎస్ రాష్ట్ర నాయకుడు, నారాయణపేట రైతుల ఇబ్బందులు తప్పాయి రైతులు ప్రతి ఏటా ఆరుగాలం కష్టించి పంటను పండించడం ఒక ఎత్తు అయితే.. మార్కెట్కు తీసుకువచ్చి విక్రయించడం, తూకాలు వేయడం వరకు ఇబ్బందులు తప్పేవికాదు. గిట్టుబాటు ధరలు రాకపోతే అక్కడే ఉంచాలంటే భద్రత లేకపాయె. వచ్చిన ధరలకు అమ్మే పరిస్థితి. ఇప్పుడు సీసీ కెమెరాల ఏర్పాటుతో రైతులు నిశ్చింతగా ఉండొచ్చు. – అంజిలయ్యగౌడ్, రైతు సంఘం నాయకులు నారాయణపేట. సంతోషంగా ఉంది మార్కెట్కు రైతులు తెచ్చే ధాన్యాన్ని వ్యాపారస్తులు కొనుగోలు చేసిన తర్వాత వాటిని ఎత్తేంత వరకు ఆందోళన పడేవాళ్లం. ఎప్పుడైనా వర్షం వస్తే ఆ నష్టమంతా వ్యాపారస్తులపై పడేది. షెడ్ల నిర్మాణంతో ఇటు రైతులు, అటు కమీషన్ ఏజెంట్ల ఇబ్బందులు తప్పుతాయి. ధాన్యం తడవకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. సీసీ కెమెరాల ఏర్పాటుతో మా సరుకుపై నిఘా ఉంచినట్లు అవుతుంది. – పవన్కుమార్ లహోటి, గంజ్అసోసియేషన్ అధ్యక్షుడు ● -
శ్రీశైలం ప్రత్యేక బస్సులు ప్రారంభం
నారాయణపేట రూరల్: మహాశివరాత్రి పండగను పురస్కరించుకొని శ్రీశైలంలో జరిగే ఉత్సవాలకు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు స్థానిక డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. ఆదివారం మొదటి ప్రత్యేక బస్సును ఆమె ప్రారంభించి మాట్లాడారు. శైవ క్షేత్రమైన శ్రీశైలానికి మహాశివరాత్రి పురస్కరించుకొని నాలుగు రోజుల పాటు ఈ సర్వీసులను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 24, 25తేదీల్లో ఉదయం 6, 8, 10గంటలకు మూడు బస్సులు, 26న ఉదయం 6నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు 15బస్సులు రాకపోకలు సాగించనున్నట్లు చెప్పారు. ఈప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. శివరాత్రి పర్వదినాన శ్రీశైలంలో పాదదర్శనం అనంతరం తిరుగు ప్రయాణానికి భక్తుల సౌకర్యార్థం తగినన్ని బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, కాలినడకన వెళ్లిన భక్తులు సైతం ఈ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ బస్సుల్లో మహిళలకు ఆధార్ కార్డుపై ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు. అహింసా మార్గాన్ని అనుసరించాలి దామరగిద్ద: మాతా మాణికేశ్వరి మాత బోధించిన అహింసా మార్గాన్ని అందరం అనుసరించాలని యానగుంది మాతా మాణికేశ్వరి ట్రస్ట్ కార్యదర్శి శివయ్యస్వామి అన్నారు. ఆదివారం మండలంలో ఉడ్మల్గిద్దలో వెలసిన మాతా మాణికేశ్వరి ఆలయంలో మాత పాదుక ప్రతిష్ఠాపన 11వ వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అథితిగా హాజరైన ఆయన మాట్లాడారు. అహింసా మార్గంలో నడవాలని, అహింసో పరమోధర్మ అన్న పరమ సత్యాన్ని మాత మనందరికి బోధించిందన్నారు. ఆలయంలో అమ్మవారి పాదుక పూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో జనార్ధన్రెడ్డి, సాయన్న బాల్చంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి లక్ష్మణ్ వీరప్ప, భగవంతు, నర్సిములు, జల్లప్ప, ఎల్లప్ప, బాల్చందర్, గజలప్పపాల్గొన్నారు. కెమికల్ పరిశ్రమకు అనుమతులు ఇవ్వొద్దు మరికల్: మండలంలోని చిత్తనూర్ ఇథనాల్ కంపెనీలో కొత్తగా సింథటిక్ కెమికల్ పరిశ్రమ ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇవ్వద్దన్ని కంపెనీ వ్యతీరేక పోరాట సమితి సభ్యులు ఆదివారం మరికల్లో ధర్నా పోస్టర్లను విడుదల చేశారు. ఇప్పటికే ఇథనాల్ కంపెనీ నుంచి వచ్చే కాలుష్యం నుంచి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. సింథటిక్ కెమికల్ వ్యతిరేకంగా ఈ నెల 24న చిన్నచింతకుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. అలాగే గతంలో కంపెనీకి వ్యతీరేకంగా ఉద్యమించిన వారిపై పెట్టిన రౌడీ షీటర్ కేసులను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. కోయిల్సాగర్కు వెళ్తున్న నీటిలో ఒక టీఎంసీ నీరు కంపెనీకి వెళ్లడం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. ధర్నా విజయవంతం చేయడం కోసం అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్రాములు, సుదర్షన్, రాంచంద్రయ్య, మల్లేష్, మధు, లక్ష్మయ్యలు పాల్గొన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు స్టేషన్ మహబూబ్నగర్: ది పాలమూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు బ్యాంకు పాలక మండలి చైర్మన్ కుమారస్వామి తెలిపారు. జిల్లాకేంద్రంలో ఆదివారం పాలమూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన చైర్మన్ కుమారస్వామి మాట్లాడుతూ 1998లో ది పాలమూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఏర్పాటైనట్లు తెలిపారు. గతేడాది డిసెంబర్ 13న జడ్చర్ల పట్టణంలో నూతన బ్రాంచీని ప్రారంభించామని, త్వరలోనే నాగర్కర్నూల్ పట్టణంలో మరో నూతన నాలుగో బ్రాంచీ ప్రారంభిస్తామన్నారు. బ్యాంకుకు 20 వేలకుపైగా ఖాతాదారులు, 3,369 మంది వాటాదారులు ఉన్నారని, రుణాలు రూ.39.61 కోట్లు, డిపాజిట్లు రూ.42.17 కోట్లు, రిజర్వు రూ.12.04 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. రాజేంద్రకుమార్, కృష్ణయ్య, సూర్యనారాయణ, డైరెక్టరు పాల్గొన్నారు. -
గురుకుల ప్రవేశ పరీక్షకు 95శాతం హాజరు
నారాయణపేట ఎడ్యుకేషన్: గురుకులాల్లో 2025–26 విద్యాసంవత్సరంలో 5,6,9వ తరగతి ప్రవేశాల కోసం ఆదివారం జిల్లాలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని మొత్తం 8 పరీక్ష కేంద్రాలలో మొత్తం 4,100 మంది విద్యార్థులకుగాను 3,896 మంది హాజరయ్యారు. 95 శాతం హాజరుశాతం నమోదు కాగా.. 114 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు కోఆర్డినేటర్ యాదమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రాల వద్ద ట్రాఫిక్జాం.. నారాయణపేట రూరల్: జిల్లా కేంద్రం నుంచి కర్ణాటక వైపు వెళ్లే రహదారిపై సరైన నియంత్రణ లేక ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎర్రగుట్ట సమీపంలో సోషల్ వెల్ఫేర్, కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలు ఒకే కాంపౌండ్ లో ఉన్నాయి. రెండు భవనాల్లో కలిపి ఆదివారం జరిగిన గురుకుల ప్రవేశ పరీక్షకు ఏకంగా 1140 మంది విద్యార్థులను కేటాయించారు. అయితే ఉదయం గంట ముందుగానే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించగా, మధ్యాహ్నం ఒంటిగంటకు ఒకేసారి పరీక్ష నుంచి విద్యార్థులు బయటికి వచ్చారు. దీంతో అంతమంది విద్యార్థులతోపాటు వారి పెంట వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు రోడ్లపై పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అదేవిధంగా వారి వెంట తెచ్చుకున్న ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలతో రోడ్డు పూర్తిగా బ్లాక్ అయ్యింది. దీంతో కర్ణాటక నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బంది నెలకొంది. గంటకు పైగా ఆ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. ముందస్తు ఆలోచన లేకుండా గురుకుల పాఠశాల నిర్వాహకులు పెద్ద సంఖ్యలో విద్యార్థులను ఒకే చోట పరీక్షా కేంద్రాన్ని కేటాయించడం, మరోవైపు సరైన ట్రాఫిక్ నియంత్రణ పద్ధతులను తీసుకోవడంలో పోలీసుల వైఫల్యంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం ఎండకు తీవ్ర ఉక్కపోతతో ఆపసోపాలు పడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, వాహనదారులు కోరుతున్నారు. -
క్షణక్షణం ఉత్కంఠ
బ్రహ్మోత్సవ శోభ.. పరుషవేదీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. రెండు రోజులుగా టన్నెల్లోనే ఎనిమిది మంది కార్మికులు మార్కెట్కు కొత్త హంగులు పాలకుల నిర్లక్ష్యంతోనే నత్తనడకన పనులు వివరాలు 8లో uక్షణ క్షణం ఉత్కంఠ రేపుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 14వ కిలోమీటర్ వద్ద చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 13 కిలోమీటర్ల తర్వాత సొరంగంలో బురద మట్టి, నీటితో పేరుకుపోవడంతో ముందుకు వెళ్లేందుకు సాధ్యపడటంలేదు. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణిలోని నిపుణులతో కూడిన రెస్క్యూ బృందాలను రంగంలోకి దింపారు. సహాయక చర్యలు రాత్రంతా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు మూడు విడతలుగా సహాయక బృందాలు టన్నెల్లోకి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాయి. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో నాలుగో బృందం లోపలికి వెళ్లగా.. అర్ధరాత్రి తర్వాత ఐదో బృందం టన్నెల్ లోపలికి వెళ్లింది. టన్నెల్లో ప్రమాద స్థలానికి చేరుకుని రెస్క్యూ టీంలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా, వారితో పాటు లోపలికి వెళ్లి మట్టి, శిథిలాలను తొలగించేందుకు కార్మికులు జంకుతున్నారు. కళ్ల ముందే ప్రమాదం చోటుచేసుకోవడంతో వారు భయబ్రాంతులకు లోనయ్యారు. ఈ క్రమంలో లోపల శిథిలాల తొలగింపు, మట్టి తొలగింపునకు కార్మికులు వెనకాడుతుండటంతో సహాయక చర్యల్లో మందగమనం నెలకొంది. దీంతో లోపలికి వెళ్లి విధులు నిర్వర్తించే కార్మికులకు దినసరి వేతనం రూ.2 వేల చొప్పున ఇవ్వాలని ఓ ఉన్నతాధికారి సంబంధిత కంపెనీ ప్రతినిధికి సూచించారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) ఇన్లెట్ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల రెస్క్యూ ఆపరేషన్పై రెండు రోజులుగా ఉత్కంఠ నెలకొంది. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను చేరుకోలేకపోవడంతో ఇంకా ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. వారిని సమీపించేందుకే సహాయక బృందాలకు సాధ్యపడటంలేదు. 9.8 మీటర్ల వ్యాసార్థం ఉన్న సొరంగం నిండా మట్టి, బురద నిండిపోవడంతో కార్మికుల వద్దకు చేరడం కష్టంగా మారింది. టన్నుల కొద్దీ పేరుకున్న మట్టిని తొలగించడం సైతం కుదరడం లేదు. ఈ నేపథ్యంలో కార్మికుల జాడ గుర్తింపుపై సందిగ్ధం నెలకొంది. సహాయక చర్యలకు ఆటంకాలే.. సొరంగంలో కార్మికులను కాపాడేందుకు రంగంలోకి ఆర్మీ (24), ఎఫ్డీఆర్ఎఫ్(120), ఎస్డీఆర్ఎఫ్(24), సింగరేణి(24), హైడ్రా(24) రెస్క్యూ సిబ్బందితో కూడిన బృందాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ఆయా శాఖల సమన్వయంతో విడతల వారీగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సుమారు 6–8 గంటలకు ఒక బృందం చొప్పున షిఫ్ట్ల వారీగా సహాయక చర్యలను నిరంతరం కొనసాగిస్తున్నాయి. ప్రమాదం జరిగిన 13వ కి.మీ. వద్దకు లోకో ట్రైన్ వెళ్లడానికి గంట, రావడానికి గంట సమయం పడుతోంది. అక్కడ పెద్ద ఎత్తున మట్టి, రాళ్లతో కూడిన శిథిలాలు పేరుకుని ఉండటంతో రెస్క్యూ టీంలు అక్కడికి చేరుకోలేకపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే వారిని రక్షించడం కష్టంగా మారుతోంది. సంఘటన స్థలంలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కడు వంశీకృష్ణ, కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ రఘునాథ్ పర్యవేక్షిస్తున్నారు. పంథా మార్చితేనే సాధ్యం.. కార్మికులను కాపాడేందుకు ఇప్పటివరకు చేపట్టిన చర్యలు ఫలించలేదు. కొత్త పంథా(టెక్నిక్)లో వెళ్లితే తప్ప వారిని బయటికి తీసుకురావడం సాధ్యపడే పరిస్థితి కనిపించడం లేదు. సొరంగంలో ఒకే మార్గం గుండా రాకపోకలు చేయాల్సి రావడం, ఎలాంటి ఆడిట్, ఎస్కేప్ టన్నెళ్లు లేకపోవడంతో రెస్క్యూ వీలు కావడం లేదు. రాకపోకలకు, మట్టిని తరలించేందుకు ఒకే ఒక కన్వేయర్ బెల్టు ఉండగా, ఆ మట్టి తరలించేందుకు దాదాపు మూడు రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. సొరంగంలో నుంచి మట్టిని, రాళ్లను తొలగించడం అంతా సాధ్యమైన పని కాదని అంటున్నారు. దీంతో కొత్త పంథాలో సహాయక చర్యలు చేపడితేనే ప్రయోజనం ఉండనుంది. ఉత్తరాఖండ్ తరహాలో రెస్క్యూకు సన్నద్ధం.. టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. గతంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించిన తరహాలోనే ఇక్కడ కూడా ఆపరేషన్ నిర్వహించేందుకు ప్రభు త్వం సిద్ధమైంది. ర్యాట్ హోల్ మైనింగ్ ద్వారా పై నుంచి రంధ్రం చేసి కార్మికులను బయటకు తీసు కొచ్చేలా ప్రయత్నించే అవకాశం ఉంది. ఇందుకు గల సాధ్యాసాధ్యాలను సైతం పరిశీలించనున్నారు. సోమవారం ఉదయానికి ఈ తరహా రెస్క్యూ బృందాలు ప్రమాదస్థలికి చేరుకునే అవకాశం ఉంది. – సాక్షి, నాగర్కర్నూల్ /అచ్చంపేట వాతావరణం ఉదయం చల్లగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆకాశం నిర్మలంగా ఉంటుంది. భద్రతా ప్రమాణాలపై అనుమానాలు.. ఎస్ఎల్బీసీ సొరంగం తొలుస్తున్న టీబీఎం కొన్ని రోజులుగా మరమ్మతుకు గురై పెద్ద శబ్ధంతో పనిచేస్తోందని కొందరు కార్మికులు చెబుతున్నారు. అలాగే అసంపూర్తిగా కాంక్రీట్ సెగ్మెంట్ ఉండటం, భద్రతా ప్రమాణాలు పాటించకనే ప్రమాదం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటిపై అధికారులు స్పందించడం లేదు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ నెల 18న పునఃప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ముందస్తుగా పనుల వద్ద సేఫ్టీ ప్రమాణాలు పాటించలేదని తెలుస్తోంది. పని మొదలుపెట్టిన నాలుగు రోజులకే ప్రమాదం చోటుచేసుకోవడంతో భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాత్రంతా కొనసాగుతున్న సహాయక చర్యలు అర్ధరాత్రి తర్వాత టన్నెల్లోకి ప్రవేశించిన ఐదో బృందం రెస్క్యూ ఆపరేషన్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఫైర్, సింగరేణి, హైడ్రా బృందాలు టన్నెల్ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రులు ఉత్తమ్, జూపల్లి -
రూ.3 కోట్లతో ధాన్యం తడవకుండా కవర్ షెడ్ల నిర్మాణం
నారాయణపేట: పేట మార్కెట్యార్డు రూపురేఖలు మారనున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచుస్తున్న కవర్షెడ్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుంచి రూ.3.09 కోట్లు నిధులు మంజూరు చేస్తూ వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ ఉదయకుమార్ ఈ నెల 17న ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తానికి ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికరెడ్డి చొరవతో మార్కెట్ పాలకవర్గానికి, రైతులు, వ్యాపారస్థులకు, కమీషన్ ఏజెంట్లకు శుభవార్త అందింది.నిఘా నీడలో మార్కెట్జిల్లా కేంద్రమైన నారాయణపేట వ్యవసాయ మార్కెట్యార్డుకు దామరగిద్ద, మద్దూర్, నారాయణపేట, ధన్వాడ,మరికల్, ఊట్కూర్, మక్తల్, నర్వ మండలాలతో పాటు తెలంగాణ సరిహద్దులోని కర్ణాటకలోని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తమ పంటలను సీజన్లలో విక్రయించేందుకు తీసుకువస్తారు. మార్కెట్ యార్డుకు కంపౌండ్ వాల్ ఉన్నప్పటికి అప్పుడప్పుడు ధాన్యం సంచులు మాయమైన సంఘటనలు ఉన్నాయి. దీంతో ఆటు రైతులు, ఇటు కమీషన్ ఏజెంట్లకు నష్టం జరిగేది. మార్కెట్కు తెచ్చే ధాన్యంతో పాటు క్రయ, విక్రయాలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టేందుకు మార్కెట్ చైర్మన్ ఆర్. శివారెడ్డి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందుకు పాలకవర్గం సభ్యులు అమోదం తెలిపారు.ధాన్యం తడవకుండా కవర్షెడ్లువర్షాకాలంతోపాటు అకాల వర్షాలతో రైతులు మార్కెట్కు తెచ్చే ధాన్యం సైతం తడిసి రైతులు నష్టపోయేవారు. దీంతో రైతులు, రైతు సంఘాల నాయకులు, కమిషన్ ఏజేంట్లు, వ్యాపారస్థులు పలుమార్లు మార్కెట్ అధికారులు, పాలకవర్గాలకు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం ఫర్నీకరెడ్డి మార్కెట్ పాలకవర్గంతో చర్చించి రూ.3 కోట్ల వరకు మార్కెట్యార్డులో కవర్షెడ్ నిర్మాణం చేపట్టేందుకు సూచించారు. ఇందుకు పాలకవర్గం ప్రతిపాదనలు తయారు చేసి మార్కెటింగ్ డైరక్టర్కు నివేదికలను పంపించారు. ఇందుకు మార్కెటింగ్ డైరెక్టర్ నుంచి పరిపాలన అనుమతులు జారీ చేస్తూ రూ.3.09 కోట్లు మంజూరు చేశారు.జీరో వ్యాపారానికి కళ్లెంమార్కెట్ యార్డులో జరిగే ధాన్యం క్రయవిక్రయాల్లో ఇప్పటికే ఈ నామ్ ద్వారా కొనసాగుతున్నాయి. మార్కెట్లో ఎలాంటి చోరీలు, జీరో వ్యాపారానికి చోటు లేకుండా పోతుందని చెప్పవచ్చు. సీసీ కెమెరాల ఏర్పాటుతో ఓ వైపు రైతులకు కంటి మీద కునుకుపడినట్లయింది. మరో వైపు కాస్తా కూస్తో జరిగే జీరో వ్యాపారానికి కళ్లేంపడినట్లేనంటూ వ్యాపార వర్గాల్లో చర్చకొనసాగుతుంది. మార్కెట్కు వచ్చే వాహనాలు, లోడింగ్, అన్లోడింగ్ తదితర వాటివన్నీ సీసీ కెమెరాలో రికార్డు అవుతాయి. వాహనాల నంబర్లతో సహా వచ్చి పోయే గేట్లలో కనిపిస్తాయంటూ చర్చ జరుగుతోంది. -
జిల్లాలో సాగుకు యోగ్యంకాని భూముల వివరాలు..
మండలం (1)కాలనీలుగా (2)రియల్ (3)ప్రభుత్వం (4) రాళ్లు, మొత్తం మారినవి ఎస్టెట్ తదితర.. సేకరించినది గుట్టలు మక్తల్ 445 381 17 23 868 నారాయణపేట 140 363 15 30 549 మద్దూర్ 135 157 –– 61 353 దామరగిద్ద 146 6 –– 155 307 మరికల్ 100 144 5 48 298 ఊట్కూర్ 202 90 –– 4 297 కృష్ణా 96 147 –– 31 275 మాగనూర్ 135 107 1 5 248 నర్వ 133 92 13 5 245 కోస్గి 20 126 6 22 174 ధన్వాడ 98 56 –– 0.25 155 గుండుమాల్ 53 19 –– 4 76 కొత్తపల్లి 31 1 –– 7 40 మొత్తం 1,738 1,694 59 399 3,892 -
శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు
స్టేషన్ మహబూబ్నగర్: మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రత్యేక బస్సు లు నడుపనున్నారు. రీజియన్లోని 9 డిపోల నుంచి శ్రీశైలం వరకు 357 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ప్రతి ఏడాది రీజియన్లోని డిపోల నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతారు. శివరాత్రి అనంతరం తిరుగు ప్రయాణం రోజుల్లో కూడా ప్రత్యేక బస్సులు నడపడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో అచ్చంపేట డిపో నుంచి 58, గద్వాల నుంచి 15, కల్వకుర్తి 34, కొల్లాపూర్ 37, మహబూబ్నగర్ 85, నాగర్కర్నూల్ 56, నారాయణపేట 23, షాద్నగర్ 6, వనపర్తి డిపో నుంచి 43 ప్రత్యేక బస్సులు నడువనున్నాయి. ముఖ్యంగా మహాశివరాత్రి రోజు రీజియన్ నుంచి 151 బస్సులు నడపనున్నారు. సద్వినియోగం చేసుకోవాలి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రీజియన్లోని డిపోల నుంచి ప్రత్యేక బస్సు లు నడుపుతున్నామని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ తెలిపారు. శ్రీశైలంతోపాటు ఆయా బస్టాండ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం చలువ పందిర్లు, తాగునీరు, వలంటీర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బస్సుల వివరాలు, తేదీల వారీగా.. శివరాత్రి నేపథ్యంలో రీజియన్ నుంచి 357 సర్వీసులు -
టాలెంట్ టెస్టులు ప్రతిభకు దోహదం
నారాయణపేట రూరల్: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసేందుకు టాలెంట్ టెస్టులు ఎంతో దోహదపడతాయని డీఈవో గోవిందరాజు అన్నారు. ఈనెల 2న జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పూసల్ పహాడ్ టాలెంట్ టెస్ట్ ఫలితాలను శనివారం సాయంత్రం డీఈవో చేతులమీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్షలపై భయాన్ని విడాలని, ఇష్టంతో చదవాలని, ఉన్నత లక్ష్యాలను చేరెందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టాలన్నారు. టాలెంట్ టెస్టులు రాయడం వల్ల విద్యార్థుల్లోనూ ప్రతిభ బయటకు వస్తుందని, ఇలాంటి పోటీ పరీక్షల నిర్వహణ చేపట్టడం అభినందనీయమన్నారు. టాలెంట్ టెస్ట్ విజేతలకు మార్చి 2న బహుమతులు అందిస్తున్నట్లు నిర్వాహకులు షేర్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 120 పాఠశాలల నుంచి 3750 మంది విద్యార్థులు పరీక్ష రాశారని, వీరిలో ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలు వేరువేరుగా మొదటి మూడు స్థానాలకు క్యాష్ అవార్డు, మిగితా టాప్ టెన్ విద్యార్థులకు బహుమతులు, ప్రతి స్కూల్ టాపర్కు ప్రశంసా పత్రం, ప్రోత్సాహక బహుమతి అందిస్తామన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు విద్యాసాగర్, నాగార్జున రెడ్డి, నర్మదా, శ్రీనివాస్, సూపరింటెండెంట్ నరసింహారెడ్డి, డీఎస్ఓ భాను ప్రకాష్ పాల్గొన్నారు. -
సొరంగంలోనే ఎనిమిది మంది
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులు ● ఘటనా స్థలానికి మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి, కలెక్టర్, ఎస్పీ ● కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు ● రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, సింగరేణి రెస్క్యూ బృందాలు ● భారీ ఎత్తున నీటి ఊట, బురద, శిథిలాలతో సహాయక చర్యలకు ఆటంకం ఒకే మార్గం గుండా.. టన్నెల్ శిథిలాల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలకు పెద్దఎత్తున నీటి ప్రవాహం, బురద ఆటంకంగా మారాయి. ఇలాంటి సొరంగ పనుల నిర్వహణకు ఆడిట్ టన్నెళ్లు, ఎస్కేప్ టన్నెళ్లు కీలకంగా పనిచేస్తాయి. వీటి ద్వారా సొరంగంలో తొలగించిన మట్టి, రాళ్లు, శిథిలాల తొలగింపుతోపాటు సొరంగంలో ఎయిర్ ప్రెజర్ను సమన్వయం చేసేందుకు, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు ఉపయోగపడతాయి. ఇలాంటివి ఏవీ ఆడిట్, ఎస్కేప్ టన్నెళ్లు ఈ ప్రాజెక్ట్లో లేవు. ప్రధాన సొరంగంతోపాటు అదనంగా ఆడిట్ టన్నెళ్ల నిర్మాణం చేపట్టేందుకు అటవీశాఖ అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారు. ఆడిట్ టన్నెళ్లు లేకపోవడం, ఒకే మార్గం గుండా సహాయక చర్యలు చేపట్టడం రెస్య్యూ బృందాలకు సవాలుగా మారింది. సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో చేపడుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణ పనుల్లో ఇన్లెట్ టన్నెల్లో 14 కి.మీ., వద్ద సొరంగం పైకప్పు కూలి ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో ప్రమాదం సంభవించగా, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సొరంగంలో నీటి ఊట ఉధృతి పెరిగి, మట్టి వదులు కావడం, అకస్మాత్తుగా కాంక్రీట్ సెగ్మెంట్ ఊడిపడటంతో ప్రమాదం సంభవించింది. టన్నెల్ బోరింగ్ మిషన్కు ఇవతల వైపు ఉన్న సుమారు 50 మంది బయటకు పరుగులు తీసి ప్రాణాలను దక్కించుకోగా.. అవతల వైపు ఉన్న 8 మంది సొరంగంలోనే చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సుమారు 150 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక, సింగరేణి కాలరీస్కు చెందిన రెస్క్యూ టీంలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఆదివారం ఉదయానికి ఆర్మీ బృందాలు సైతం ఘటనా స్థలానికి చేరుకునే అవకాశం ఉంది. సీపేజీనే ప్రమాదానికి కారణం.. శ్రీశైలం జలాశయం నుంచి నీటిని నల్లగొండ జిల్లాకు తరలించేందుకు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. నల్లమల కొండలను తవ్వుకుంటూ సుమారు 40 కి.మీ., మేర టన్నెల్ను తవ్వాల్సి ఉండగా.. కృష్ణాతీరం నుంచి 13 కి.మీ., మరోవైపు అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి నుంచి 23 కి.మీ., టన్నెల్ తవ్వకం పూర్తయ్యింది. దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ ఇన్లెట్ నుంచి 14 కి.మీ., వద్ద సొరంగం తవ్వకాలను గత నాలుగు రోజుల కిందటే మొదలుపెట్టారు. ఈ సొరంగంలో గత నాలుగేళ్లుగా నీటి సీపేజీ కొనసాగుతోంది. శనివారం ఈ నీటి ఉధృతి ఎక్కువై అప్పటికే బలహీనంగా మారిన పైకప్పు, రాక్ బోల్టింగ్, కాంక్రీట్ సెగ్మెంట్తోపాటు ఒక్కసారిగా కుప్పకూలింది. సీపేజీ నిర్వహణ, డీవాటరింగ్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించడంతోపాటు భద్రతా ప్రమాణాలు పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
‘పేట – కొడంగల్’ పథకం భూసర్వే అడ్డగింత
మక్తల్: పేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసర్వే పనులను మండలంలోని కాట్రెవ్పల్లి రైతులు శనివారం అడ్డుకున్నారు. మక్తల్ మండలం భూత్పూర్ రిజర్వాయర్ నుంచి నీటిని అక్కడికి తీసుకెళ్లేందుకు సర్వే, రెవెన్యూ అధికారులు భూసర్వే చేస్తుండడంతో తమ భూములు పోతాయన్న భయంతో రైతులు అడ్డుకున్నారు. ప్రస్తుతం కాట్రెవ్పల్లి గ్రామం వద్ద సర్వే పనులు కొనసాగుతున్నాయి. తమకు ఈ భూములే జీవనాధారమని, ఇవి పోతే తాము ఎలా బతకాలని రైతులు అధికారు లను ప్రశ్నించారు. భూసర్వే నిర్వహించే ప్రసక్తే లేదంటూ భీష్మించారు. ఇలాగే 18వ తేదీన భూసర్వేను రైతులు అడ్డుకోవడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పారు. తాజాగా మరోసారి పనుల ను అడ్డుకోవడంతో అధికారులు ఏం చేయాలో పాలుపోలేదు. ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డితోపాటు స్పెషల్పార్టీ పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పినా ఫలితం లెకుండా పోయింది. సోమ వారం సర్వే పనులు నిర్వహిస్తామని, సహకరించాలని అధికారులు పేర్కొంటూ వెనుదిరిగారు. -
సీఎంను కలిసిన ఎమ్మెల్యే
మక్తల్: సీఎం రేవంత్రెడ్డి శనివారం ప్రజాభవనంలో హైదరాబాద్లో బీసీ కులగణనపై ప్రత్యేకంగా బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. దేశంలో కులగణన చేపట్టి అధికారికంగా ఆమోదముద్ర వేసిన తొలి రాష్ట్రం మనదేనని, బీసీల సంఖ్యకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుతామని సీఎం ఆదేశించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. కులగణన చేయడం సీఎం రేవంత్రెడ్డికే సాధ్యమైందని అన్నారు. అనంతరం సీఎంను సన్మానించారు. గురుకుల ప్రవేశ పరీక్షకు సర్వం సిద్ధం ● జిల్లాలో మెత్తం 8 పరీక్ష కేంద్రాలు ● హాజరుకానున్న 4130 విద్యార్థులు నారాయణపేట ఎడ్యుకేషన్: గురుకుల విద్యాలయాల్లో 5, 6, 9వ తరగతుల ప్రవేశాల నిమిత్తం ఆదివారం నిర్వహించే ప్రవేశ పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కో ఆర్డినేటర్ యాదమ్మ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 4130 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుందని, కేంద్రాలకు 30 నిమిషాల ముందే చేరుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు తమ వెంట హాల్ టికెట్తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్నును వెంట తీసుకురావాలన్నారు. ఈ పరీక్షకు గాను 8 మంది చీఫ్ సూపరింటెండెంట్లు , ఒక రూట్ ఆఫీసర్ను, ఒక నోడల్ ఆఫీసర్ను నియమించినట్లు తెలిపారు. శనగలు క్వింటాల్ రూ.5,677 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో శనివారం శనగలు క్వింటాల్ గరిష్టం, కనిష్టంగా రూ.5,677 ధర పలికాయి. వేరుశనగ గరిష్టంగా రూ.6,420, కనిష్టంగా రూ.4,110 ధర పలకగా 112 క్వింటాళ్లు వ్యాపారులు కొనుగోలు చేశారు. నల్ల కందులు గరిష్టంగా రూ.7,659, కనిష్టంగా రూ.6,850, తెల్ల కందులు గరిష్టంగా రూ.7,759, కనిష్టంగా రూ.6,706 ధర పలకగా.. 180 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. చింతపండు గరిష్టంగా రూ.7,069, కనిష్టంగా రూ.5,319 ధర పలికింది. జడ్చర్లలో వేరుశనగ రూ.7,044 జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం వేరుశనగ క్వింటాల్ గరిష్టంగా రూ.7,044, కనిష్టంగా రూ.5,369 ధరలు లభించాయి. అలాగే ఆముదాలు క్వింటాల్ సరాసరిగా రూ.5,822, పత్తి గరిష్టంగా రూ.6,262, కనిష్టంగా రూ.5,501, కందులు గరిష్టంగా రూ.7,149, కనిష్టంగా రూ.5,097, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,870, కనిష్టంగా రూ.5,001, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,397, కనిష్టంగా రూ.2,167, ఉలువలు రూ.6,100 ధర వచ్చాయి. -
లెక్క తేలింది..
జిల్లాలో సాగుకు యోగంగా లేని భూములు 3,892 ఎకరాలు 3,892 ఎకరాలకు రైతుభరోసా కట్ జిల్లాలో 1,92,020 మంది రైతులు ఉండగా.. 4,58,626 ఎకరాలకు రూ.266 కోట్లు రైతు భరోసా అందాల్సి ఉంది. అయితే కొంతమంది రైతుల భూముల్లో ప్రభుత్వ అనుమతులు లేని వెంచర్లు వేసినప్పటికీ ధరణిలో మాత్రం వ్యవసాయ భూమిగానే ఉండి పోయింది. ప్రాజెక్టులో ముంపునకు గురై అవార్డు అయిన భూములు సైతం రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూములు, రోడ్లు, ఇతర అవసరాల కోసం సేకరించిన భూములు వ్యవసాయ భూములుగానే రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అలాంటి భూములకు సైతం రైతుబంధు అందించింది. అయితే రాష్ట్రంలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు రైతుభరోసా తరహా రైతుల నుంచి రైతుభరోసాకు దరఖాస్తులు సైతం స్వీకరిస్తోంది. క్లస్టర్ల వారీగా వ్యవసాయశాఖ అధికారులు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండడంతో జిల్లాలో రైతుభరోసా అర్హుల సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉంది. నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు.. పంటల సాగులో రైతులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు ‘రైతుభరోసా’ పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తోంది. అయితే గత ప్రభుత్వం ధరణిలో ఉన్న భూములన్నింటికీ రైతుబంధు అమలు చేయగా సాగుకు యోగ్యంగా లేని భూముల యాజమానులు సైతం రైతుబంధును పొందారు. దీంతో ప్రస్తుత ప్రభుత్వం సాగుకు యోగ్యంగా ఉన్న భూములకు మాత్రమే రైతుభరోసా అందిస్తామని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే నిర్వహించి సాగుకు యోగ్యంగా లేని భూముల లెక్క తేల్చడంతో జిల్లా వ్యాప్తంగా 3,892 ఎకరాలను గుర్తించారు. దీంతో ప్రభుత్వానికి రూ. 4.67 కోట్లు నిధులు మిగిలినట్లయింది. గత ఆరేళ్లుగా బీఆర్ఎస్ హయంలో సాగుకు యోగ్యం కాని భూములకు చెల్లించిన రైతు బంధుతో అప్పటి ప్రభుత్వానికి రూ.56 కోట్లు నష్టం వాటిల్లినట్లయింది. జిల్లాలో 1,92,020 మంది రైతులు ఉన్నట్లు గుర్తించారు. గత ప్రభుత్వం ఎకరానికి సీజన్కు రూ.5వేలు మాత్రమే చెల్లించగా ప్రస్తుత ప్రభుత్వం ఎకరానికి రూ.6వేలు చెల్లిస్తుంది. దీంతో ఈ సారి రైతుభరోసా కింద ఈ సీజనకు జిల్లా రైతులకు రూ.266 కోట్లు పెట్టు బడి సాయంగా అందనుంది. రాళ్లు, గుట్టలు, రియల్ ఎస్టేభూములకు రైతు భరోసా కట్ ప్రభుత్వానికి రూ.4.67 కోట్లు మిగులు -
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
వనపర్తి/కొత్తకోట రూరల్: దేశంలో ఉన్న మంచినూనె కొరతను అధిగమించి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగేందుకు రైతులు అత్యధికంగా ఆయిల్పాం సాగు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. దేవరకద్ర నియోజకవర్గంలోని సంకిరెడ్డిపల్లిలో ప్రీ యూనిక్ సంస్థ నిర్మించనున్న ఆయిల్పాం ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయిల్పాం రైతులతో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో వంటనూనెల లోటు భర్తీ చేయాలంటే 70 లక్షల ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేపట్టాల్సిన అవసరం ఉందని.. తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందే పంట ఆయిల్పాం మాత్రమే అన్నారు. ప్రస్తుతం ఆయిల్పాం గెలలు టన్నుకు రూ.20,487 ధర పలుకుతుందని త్వరలో రూ.25 వేలకు చేరుతుందని వివరించారు. ఆగష్టు 15 నాటికి కంపెనీ నిర్మాణం పూర్తిచేసి ప్రారంభిస్తామని.. అదేవిధంగా బీచుపల్లి వద్ద ఉన్న కంపెనీ మరమ్మతులు పూర్తిచేసి ఇదే సంవత్సరంలో వినియోగంలోకి తీసుకొస్తామని భరోసానిచ్చారు. జిల్లాలో 11 వేల ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేసేలా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆయిల్పాం కంపెనీ నిర్మాణం ఎట్టకేలకు కార్యరూపం దాల్చిందని.. త్వరగా నిర్మాణం పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ ప్రతినిధులను కోరారు. ఆయిల్పాం సాగుతో ఏడాదికి ఎకరాకు రూ.1.50 లక్షల ఆదాయం వస్తుందని వివరించారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బడుగు, బలహీనవర్గాలు, రైతుల సమస్యలు తనవిగా భావించి పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో ఆయిల్పాం కంపెనీ ఏర్పాటుతో పర్యావరణానికి హాని కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. భూత్పూర్, అడ్డాకుల మధ్య మరో మార్కెట్యార్డు మంజూరు చేయాలని, దేవరకద్ర నియోజకవర్గంలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గోదాం మంజూరు చేయాలన్నారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని 1,680 మంది రైతులు 5,500 ఎకరాల్లో ఆయిల్పాం సాగు చేస్తున్నారని, త్వరలో 10 వేల ఎకరాలకు పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యానశాఖలో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. జిల్లాలో వేరుశనగ సాగు అధికంగా ఉన్నందున పెద్దమందడి మండలంలో వేరుశనగ పరిశోధన కేంద్రం మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఉద్యానశాఖ ఎండీ షేక్ యాస్మిన్బాషా, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, ఆయిల్ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడారు. అంతకుముందు పెద్దమందడి మండలం వెల్టూరులో ఆరోగ్య ఉప కేంద్ర భవనం, మోజర్లలో గోదాముల సముదాయానికి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి శంఖుస్థాపన చేశారు. అదేవిధంగా పెబ్బేరులో మరో వ్యవసాయ గోదాం, వ్యవసాయ కార్యాలయ అదనపు భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అదేవిధంగా కాలిన మార్కెట్యార్డు గోదాం పునర్నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ రెవెన్యూ జి.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, వనపర్తి మార్కెట్యార్డు చైర్మన్ శ్రీనివాస్గౌడ్, దేవరకద్ర మార్కెట్యార్డు చైర్మన్ ప్రశాంత్, పీఏసీఎస్ చైర్మన్లు, కాంగ్రెస్పార్టీ కార్యకర్తలు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆయిల్పాం సాగుపై రైతులు దృష్టి సారించాలి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
నాడు వైఎస్సార్, జగన్ నీళ్లు తీసుకెళ్తుంటే ఊడిగం చేశారు
సాక్షి, నాగర్ కర్నూల్ / నారాయణపేట: ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు పొక్క 4 వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచితే ఆయనకు ఊడిగం చేసి.. చెప్పులు మోసి.. కృష్ణా నది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించిన సన్నాసి చంద్రశేఖరరావు అని తెలంగాణ సీఎంరేవంత్రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే హారతి ఇచ్చింది నువ్వు కాదా.. ఆనాడు మంత్రి వర్గంలో నీ మంత్రులు లేరా.. హరీశ్ రావు ఆ మంత్రి వర్గంలో మంత్రి కాదా.. సమాధానం చెప్పాలని నిలదీశారు. ఆయన కుమారుడు జగన్సీఎం అయ్యాక, ప్రజల స్వేదంతో నిర్మించిన ఇదే ప్రగతి భవన్ అధికారిక నివాసానికి పిలిపించి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి.. ఆరు గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకం రచించింది నువ్వు కాదా.. ఇది ద్రోహం కాదా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ నీళ్ల కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో.. ఏ నీళ్ల కోసం శ్రీకాంతచారి లాంటి యువకులు ఆత్మ బలిదానం చేసుకున్నారో ఆ నీళ్లను రాయలసీమకు తరలించుకుపోతుంటే ఏం చేశావని ప్రశ్నించారు. రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలకు రావాల్సిన నీళ్లను తీసుకెళ్తుంటే ఒక్కరోజైనా నువ్వు అడ్డుకున్నావా అని ధ్వజమెత్తారు. ‘అవ్వాల నువ్వు చేసిన పాపం ఇయ్యాల మాకు శాపమైంది. ఇవాళ మాకు ఉరైంది. తొందర్లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే రోజుకు 10 టీఎంసీలు అంటే నెల రోజులు కళ్లు మూసుకుంటే 300 టీఎంసీల శ్రీశైలం నీళ్లు మొత్తం తరలించుకుపోతారు’ అని చెప్పారు. శుక్రవారం నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో మెడికల్ కళాశాల, నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలకు సీఎం రేవంత్రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. -
పాలమూరుపై పగ ఎందుకు?
నారాయణపేట: ‘పాలమూరు జిల్లాలో కృష్ణానది 811 టీఎంసీల నీరు పారుతుంది.. ఈ నీరు దశాబ్దాలుగా పారుతున్న ఈ ప్రాంత ప్రజల కష్టాలు ఎందుకు తీరలేదు.. సాగునీరు, తాగునీరు ఎందుకు అందలేదు.. పాలమూరులో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు.. జిల్లాను ఎందుకు నిర్లక్ష్యం చేశారంటూ’ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా దాదాపు రూ.వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం అప్పక్పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పాలమూరు– రంగారెడ్డి, భీమా, నెట్టెంపాడు, తుమ్మిళ్ల, ఆర్డీఎస్, కల్వకుర్తి, కోయిల్సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా పదేళ్లు నిర్లక్ష్యం చేశారు.. పైగా పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు నీళ్లు తరలించుకుపోయేందుకు అవకాశం కల్పించారని పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి విమర్శించారు. పాలమూరులో చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడంలో కేసీఆర్కు పగ ఎందుకు అని ప్రశ్నించారు. కేవలం 12 నెలల్లో రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, ఈ విషయంలో ప్రతిపక్షాలతో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ‘పేట–కొడంగల్’ను పూర్తి చేసుకుందాం పదేళ్లలో సంగం‘బండ’ పగలకొట్టలేదు. దీంతో ఆ ప్రాంతంలోని 10 వేల వ్యవసాయ భూములకు సాగునీరు అందక ఏడారిగా మారాయని సీఎం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.15 కోట్లు మంజూరు చేసి బండను పగలకొట్టించామన్నారు. ఇప్పుడు 10 వేల ఎకరాలు పారుతున్నాయన్నారు. మక్తల్, కొడంగల్, నారాయణపేట ప్రాజెక్టు 2014లో కొట్లాడి మంజూరు చేయిస్తే తనపైన ఉన్న కోపంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకుండా కేసీఆర్ ఆపేశారన్నారు. ఇప్పుడు తన హయాంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉదండాపూర్, పాలమూరు రంగారెడ్డి, ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పేట– కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రైతులు సహకరించాలని, రైతులకు ఎకరాకు రూ.10 లక్షలు సరిపోకపోతే రూ.20 లక్షలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. లగచర్లలో పరిశ్రమల ఏర్పాటుకు కృషిచేస్తే అడ్డుకున్నారని, పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకుంటే ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారని ప్రశ్నించారు. జిల్లాను అన్నివిధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని, నన్ను కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కార్యక్రమంలో సీ్త్రశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, జి.మధుసూదన్రెడ్డి, అనిరుధ్రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్కుమార్రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిబీఆర్ఎస్ పదేళ్ల పాలనలోప్రాజెక్టులు ఎందుకు పూర్తిచేయలేకపోయారు కృష్ణానదిలో 811 టీఎంసీలు పారుతున్నా సాగు, తాగునీరు లేదు ఏడాదికి 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం పేట ‘ప్రజా పాలన– ప్రగతి బాట’ సభలో సీఎం రేవంత్రెడ్డి ధ్వజం రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు -
70 ఏళ్లకు సీఎం పదవి
హైదరాబాద్ రాష్ట్రానికి పాలమూరు జిల్లావాసి బూర్గుల రామకృష్ణారావు తొలి ముఖ్యమంత్రిగా పనిచేస్తే దాదాపు 7 దశాబ్దాల తర్వా త తిరిగి పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని రేవంత్రెడ్డి అన్నా రు. పాలమూరు బిడ్డ మీ ముందు నిటారుగా నిలబడ్డాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో ముఖ్యమంత్రులు అయ్యారు. పాలమూరు ప్రజల పేదరికాన్ని ప్రపంచ దేశాలకు చూపించి విదేశాల్లో మార్కెటింగ్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెనకబడిన ఈ పాలమూరు జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని, ఇందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
నారాయణపేట రూపురేఖలు మారుస్తా
నారాయణపేట: సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో నారాయణపేట నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజాపాలన– ప్రగతిబాట బహిరంగ సభలో ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రానున్న నాలుగేళ్లలో అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకోవడం అభివృద్ధిలో తొలిమెట్టు అని అన్నారు. ఏడాది క్రితం ప్రజలంతా ఆశీర్వదించడంతో ఎమ్మెల్యేగా గెలిచానని, పదేళ్ల కిందటి వరకు ఒక లెక్క.. ఈరోజు నుంచి ఒక లెక్క అని చెప్పా.. ఇచ్చిన మాట ప్రకారం రూ.వెయ్యి కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులే నిదర్శనమని అన్నారు. సభకు పురుషులకంటే మహిళలే అధికంగా వచ్చి విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి -
ఛాలెంజ్లు కాదు.. సమస్యలు పరిష్కరించండి
నారాయణపేట రూరల్: చాలెంజ్లు చేయడం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలను, నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు శ్రద్ధ చూపాలని.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటిలేటర్పై నడుస్తోందని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ విమర్శించారు. శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్పై చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. శుక్రవారం రాత్రి పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. సీఎం హుందాగా వ్యవహరించాలని, చౌకబారు రాజకీయం తగదన్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్రెడ్డి పట్ల వ్యతిరేకత కలిగి ఉన్నారని, సోనియా, రాహుల్ గాంధీ మెప్పు పొందేందుకు బీజేపీని విమర్శిస్తున్నారని ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎంతో దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుందని, దీనిపై దృష్టి సారించాలని హితవు పలికారు. బిజెపి గురించి మాట్లాడిన కేసీఆర్కు పార్లమెంటు ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాలేదని, భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి సైతం అదే పునరావృతం అవుతుందన్నారు. 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీని విమర్శించడం రేవంత్కు తగదన్నారు. ఢిల్లీలో ఖాతా కూడా తెరవని కాంగ్రెస్ ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల్లో కేంద్రం వాటా ఉందనే విషయం గుర్తు చేశారు. ఐదు రోజుల పనివిధానం అమలుపరచాలి స్టేషన్ మహబూబ్నగర్: బ్యాంకులో ఐదు రోజుల పనివిధానాన్ని అమలు చేయాలని ఎస్బీఐ అవార్డు స్టాప్ యూనియన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, రీజినల్ కార్యదర్శి నరేష్కుమార్, ఆఫీసర్ అసోసియేషన్ రీజినల్ కార్యదర్శి జగన్నాథ్రెడ్డి అన్నారు. తమ విధులు ముగించుకొని పట్టణంలో వివిధ ఎస్బీఐ బ్రాంచీల ఉద్యోగులు జిల్లాకేంద్రం మెట్టుగడ్డలోని ఎస్బీఐ రీజినల్ కార్యాలయం ఎదుట శుక్రవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ల పిలుపుమేరకు వచ్చే నెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల సమ్మే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దశల వారీగా నిరసనలు కార్యక్రమాలు చేపడుతామన్నారు. బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న అన్నిస్థాయిల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగ పద్ధతిని తీసివేయాలని, తాత్కాలికంగా పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. హోరాహోరీగా పొట్టేళ్ల బల ప్రదర్శన పోటీలు అయిజ: మండల కేంద్రంలోని తిక్కవీరేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ వారు శుక్రవారం అంతర్రాష్ట్ర స్థాయి పొట్టేళ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 20 పొటేళ్లు హోరా హోరీగా తలపడ్డాయి. అయిజ మండలానికి చెందిన సుల్తాన్ పొట్టేలు ప్రథమ స్థానంలో నిలిచి రూ.50వేలు, హైదరాబాద్కు చెందిన రాజావలి, ఎంజీ గ్రూప్, క్రైమ్ మేకర్ పొట్టేళ్లు ద్వితీయ, తృతీయ, నాల్గో స్థానాల్లో నిలిచి రూ.35వేలు, 20వేలు, రూ.10వేలు గెలుచుకున్నాయి. అనంతరం విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతులను అందజేశారు. -
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
నారాయణపేట రూరల్: జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతుగా కృషి చేస్తామని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ అన్నారు. జిల్లా కేంద్రంలోని సిటిజన్ క్లబ్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ను శుక్రవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, సంవత్సరాలుగా నెలకొన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పరిష్కార మార్గం చూయిస్తుందని అన్నారు. ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల విషయం ప్రెస్ అకాడమీ సూచనల మేరకు త్వరలో నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అంతకుముందు నామాజీ మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమన్నారు. త్వరలోనే జిల్లా కేంద్రంలో శాశ్వత ప్రెస్ క్లబ్ భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రాంపురం సదాశివరెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు కొండా సత్యయాదవ్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు విజయ సాగర్, సిపిఎం నాయకులు వెంకట్రామిరెడ్డి, సిపిఐ ఎంఎల్ నాయకులు కాశీనాథ్, సిఐటియు నాయకులు బలరాం, సిటిజన్ క్లబ్ సభ్యులు, వివిధ జర్నలిస్టు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. -
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
పేట జిల్లాలో దాదాపు రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను సీఎం చేశారు. రూ.56 కోట్లతో నిర్మించిన వైద్య కళాశాల భవనాన్ని ప్రారంభించారు. అలాగే రూ.130 కోట్ల అంచనా వ్యయంతో వైద్య కళాశాల నూతన హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్కు శంకుస్థాపన, రూ.26 కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల భవనం, రూ.40 కోట్లతో నిర్మించనున్న 100 పడకల యూనిట్కు శంకుస్థాపన, రూ.5.58 కోట్లతో నిర్మించిన ధన్వాడ పోలీస్స్టేషన్, నారాయణపేటలో నిర్మించిన రూరల్ పోలీస్స్టేషన్ భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. రూ.1.23 కోట్లతో నిర్మించిన జిల్లా మహిళా సమాఖ్య నిర్వహించే పెట్రోల్ బంక్ను ప్రారంభించారు. రూ.295 కోట్లతో తుంకిమెట్ల– నారాయణపేట రోడ్, కోటకొండ– మద్దూరు రోడ్డు అభివృద్ధి పనులు, అప్పక్పల్లి– గుండుమాల్ రోడ్డు, మద్దూరు– లింగాల్చేడ్ రోడ్డులలో హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణ పనులకు శంకుస్థాపన, రూ.193 కోట్లతో గుల్బర్గా– కొడంగల్ , రావులపల్లి– మద్దూరు, కోస్గి– దౌల్తాబాద్ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రూ.12.70 కోట్లతో నారాయణపేట నియోజకవర్గ పరిధిలో సీఆర్ఆర్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. రూ.7 కోట్లతో మరికల్లో నిర్మించిన మండల పరిషత్ కార్యాలయ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. -
సంస్కృతి, సంప్రదాయాలు పాటించాలి
ధన్వాడ: ప్రపంచదేశాలు హిందూ సంస్కృతి, సంప్రదాయలను పాటిస్తుంటే.. మనం మాత్రం ఇతర సంస్కృతులను అలవరుచుకుంటున్నామని హంపీ విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థాన పీఠాధీశ్వరులు విద్యారణ్య భారతి స్వామిజీ అన్నారు. శుక్రవారం ధన్వాడ మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయ రాజగోపుర శిఖర కలశ స్థాపన, మహామంగళహారతి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఉదయం పీఠదేవతాపూజ, ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేవుడు మనకు ఇచ్చిన గొప్పవరం మానవజన్మ అని.. పుట్టిన రోజు నాడు దీపాలు వెలిగించి జీవితం వెలుగలమయం అయ్యేలా చూడాలని కోరుకోవాల్సిన రోజు దీపాలు ఆర్పి ఫొటోలతో ఏర్పాటు చేసుకున్న కేకులను కట్ చేస్తూ ధర్మాలను పాటించడం మానేస్తున్నామని అన్నారు. గంగనీటిని పోస్తే సూక్ష్మక్రిములు మరణిస్తున్నాయని అమెరికా సైంటిస్టులు కనుకొంటుంటే.. మనం మాత్రం గంగనీరు పరిశుభ్రం కాదు, గంగాస్నానాలు చేయరాదు అంటూ ప్రచారాలు చేసుకుంటున్నామని అన్నారు. ప్రపంచదేశాల్లో గొప్ప విజ్ఞానం మన ఆచార సంప్రదాయలలో ఉందని ప్రతి ఒక్కరు పాటించాలని అన్నారు. పెద్ద గుడికి వెళ్తేనే దేవుడు వరాలు ఇవ్వడని, మనకు దగ్గరలో దీపం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉండే ఆలయంలో ప్రతి వారం శుభ్రం చేసి దీపారాధన చేస్తే దేవుడి కృప ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, నేరడుగం సిద్ధి లింగేశ్వర పశ్చిమాద్రి సంస్థాన సిద్ధిలింగేశ్వరస్వామి, అంబత్రయ క్షేత్ర పీఠాధిపతి అదిత్యపరాశ్రీస్వామి, బీజేపీ రాష్ట్ర నాయకుడు రతంగ్పాండురెడ్డి పాల్గొన్నారు. -
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
పాలమూరు: జిల్లాలో విద్యుత్ డిమాండ్ గతేడాది కంటే ఈసారి 18 శాతం పెరిగిందని, ఎలాంటి ఓవర్ లోడ్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. జిల్లాలో విద్యుత్ శాఖ వేసవి యాక్షన్ ప్లాన్ పనులను శుక్రవారం పరిశీలించడంతోపాటు టీడీగుట్ట సబ్స్టేషన్లో దాదాపు రూ.కోటి వ్యయంతో అదనంగా ఏర్పాటు చేసిన ఐదు ఎంవీఏ ఫవర్ ట్రాన్స్ఫార్మర్లను కలెక్టర్ విజయేందిరతో కలిసి సీఎండీ ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో విద్యుత్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది పీక్ డిమాండ్ 352 మెగావాట్లు కాగా ఈసారి 415 మెగావాట్లకు చేరిందని, ఇంతగా డిమాండ్ పెరిగినా ఎలాంటి ఓవర్లోడ్ సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. డిమాండ్ 500 మెగావాట్లకు చేరిన సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుందని, గతేడాదితో పోల్చితే ఈసారి జనవరి వరకు దాదాపు 15 వేల మంది చేరికతో మొత్తం వినియోగదారులు 3.99 లక్షలకు చేరారని, గృహాజ్యోతి పథకం కింద దాదాపు 1.29 లక్షల మంది గృహ వినియోగదారులు లబ్ధిపొందుతున్నారని చెప్పారు. గతేడాది దాదాపు 9 సబ్స్టేషన్ల్ పరిధిలో ఫవర్ ట్రాన్స్ఫార్మర్లు ఓవర్ లోడ్ అయ్యాయని, డివిజన్ల వారీగా పెరుగుతున్న లోడ్లకు తగ్గట్టుగా నూతన ట్రాన్స్ఫార్మర్, ఫీడర్ల విభజన చేయడం జరిగిందన్నారు. కేవలం హైదరాబాద్కు పరిమితమైన విద్యుత్ కాల్ సెంటర్ 1912 సదుపాయాన్ని జిల్లాలకు విస్తరించామన్నారు. విద్యుత్ అంతరాయాలు జరిగిన వెంటనే సమస్య పరిష్కరించేందుకు అంబులెన్స్ తరహా వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సమస్య ఉంటే వినియోగదారులు 1912 ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డైరెక్టర్ ఆపరేషన్ నర్సింహులు, రూరల్ జోన్ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి, ఎస్ఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు. గతేడాది కంటే ఈసారి జిల్లాలో 18 శాతం పెరిగిన డిమాండ్ విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ -
వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు
నారాయణపేట: సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా 1000 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ యోగేష్ గౌతమ్ వెల్లడించారు. గురువారం సింగారం సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి జిల్లా నుంచి బందోబస్తుకు వచ్చిన పోలీస్ సిబ్బందితో ఎస్పీ సమావేశమై పలు సూచనలు చేశారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, సంగారెడ్డి ఎస్పీలు, ఇద్దరు అదనపు ఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 28 మంది సీఐలు, 81మంది ఎస్ఐలు, 133 మంది ఏఎస్ఐలు, 750 కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటుచేయడం జరిగిందని అన్నారు. సింగారం శివారులోని హెలిప్యాడ్ నుంచి పెట్రోల్బంక్, ఇందిరమ్మ ఇండ్లు, మెడికల్ కాలేజ్, పబ్లిక్ మీటింగ్ వరకు బందోబస్తులో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రియాజ్, భారత్, డీఎస్పీ లింగయ్య పాల్గొన్నారు. బందోబస్తును పరిశీలించిన ఐజీపీ సీఎం పర్యటన ముందస్తు బందోబస్తు ఏర్పాట్లను మల్టీజోన్–2 ఐజీపీ సత్యనారాయణ, జోగుళాంబజోన్ –7 డీఐజీ ఎల్ఎస్ చౌహన్, ఎస్పీ యోగేష్ గౌతమ్తో కలిసి గురువారం పరిశీలించారు. వీఐసీ కాన్వాయ్ వెళ్లే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్ ఓపెనింగ్ పార్టీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీకి ససూచించారు. సభకు వచ్చే ప్రజలకు పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
శనగలు క్వింటాల్ రూ.6,080
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం శనగలు క్వింటాల్కు గరిష్టం, కనిష్టంగా రూ.6,080 ధర పలికింది. మొత్తం 17 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. వేరుశనగకు గరిష్టంగా రూ.6,676, కనిష్టంగా రూ.4,300 ధర పలికింది. 192 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. తెల్ల కందులు గరిష్టంగా రూ.7,756, కనిష్టంగా రూ.6,321, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,569, కనిష్టంగా రూ.6,652 పలకగా రెండు కలిపి 433 క్వింటాళ్లను వ్యాపారస్థులు కొనుగోలు చేశారు. రూ.7 వేలు దాటిన వేరుశనగ ధర జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం వేరుశనగ క్వింటాల్ ధర రూ.7వేలు దాటింది. ఈ ఏడాది ఇంత ధర రావడం ఇదే మొదటి సారి అని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి యార్డుకు 2,662 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి రాగా.. క్వింటాల్కు గరిష్టంగా రూ.7,019, కనిష్టంగా రూ.4,322 లభించింది. అదేవిధంగా కందులు గరిష్టంగా రూ.7,179, కనిష్టంగా రూ.5,300, ఆముదా లు రూ.5,560, జొన్నలు రూ.3,751, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,195, కనిష్టంగా రూ.5,820, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,369, కనిష్టంగా రూ.1,929 ధర లభించింది. -
గంజాయి సాగు, సారా తయారీపై ఉక్కుపాదం
నాగర్కర్నూల్: గంజాయి సాగు, సారా తయారీ, సరఫరాపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్కర్నూల్ను సారా రహిత జిల్లాగా మార్చేందుకు ఎకై ్సజ్, పోలీస్ శాఖల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎమ్మెల్యేలు రాజేశ్రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డిలతో కలిసి ఎకై ్సజ్, పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ దేశానికి యువత అత్యుత్తమమైన సంపద అని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పేదలు సారా తాగి ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారన్నారు. యువకులు డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసమే సారాను రూపుమాపేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగు, సారా తయారీ జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించొద్దని చెప్పారు. జిల్లాలో రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు సారా, గంజాయి వంటి మత్తు పదార్థాలపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నాయన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, తనిఖీల్లో నమోదు చేసిన కేసుల వివరాలను కలెక్టర్, ఎస్పీలు మంత్రికి వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, ఎకై ్సజ్, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
బూటకపు రాష్ట్ర సమితి.. బీఆర్ఎస్
నారాయణపేట: పదేళ్లలో ఈ ప్రాంతంలో ఒక్క ఎకరానికై నా సాగునీరు అందించారా.. పాలమూరు కష్టాలను ఎత్తిచూపి గతంలో కేసీఆర్ కాలయాపన చేశారని.. బూటకపు రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అని షాద్నగర్ ఎమ్మెలే వీర్లపల్లి శంకర్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయనతోపాటు ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి, వంశీకృష్ణ కలిసి గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట సాధించుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు పదేళ్ల పాలనలో కేవలం ఉత్తర తెలంగాణను అభివృద్ధి చేసుకున్నారన్నారు. వాస్తవాలను ప్రజలు గ్రహిస్తారని, బీఆర్ఎస్ చెప్పే మాయమాటలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని, పదేళ్లలో మహిళలను పట్టించుకోలేదన్నారు. మన పాలమూరు బిడ్డ రేవంత్రెడ్డి సీఎం కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని.. ఏడాది పాలనలో రాష్ట్రమంతా ప్రగతి బాట పట్టిందన్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలకు సాగునీరు అందించాలని కంకణం కట్టుకున్నారన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఎనలేని అభివృద్ధి చేసుకొనేందుకు అందరూ సహకరించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి మాట్లాడుతూ రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను సీఏం చేతుల మీదుగా చేపట్టబోతున్నామన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా సమాఖ్యతో నడిచే పెట్రోల్ పంప్ ప్రారంభించుకుంటున్నమన్నారు. ‘పేట’ ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం కాబోతోందని, 42 శాతం ఉన్న బీసీలకు 42 శాతం టికెట్లు సాధిస్తామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని సాహసోపేత నిర్ణయాలను సీఎం తీసుకుంటున్నారని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. 14 నెలల్లో మీరు చేయని పనులు మేం చేశామని, గతంలో కేసీఆర్ పాలమూరును దత్తత తీసుకున్నా ఏం అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ -
వరాల జల్లు కురిసేనా?
నారాయణపేట: జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం పర్యటించనున్నారు. సీఎం హోదాలో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇదిలాఉండగా, సీఎం పర్యటనపై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తారని, పెద్ద మొత్తంలో వరాలు కురిపిస్తారని జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.రూ. 450 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రెయినేజీకి ప్రతిపాదనలునారాయణపేట మున్సిపాలిటీలో రూ.450 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సీఎంకు సమర్పించనున్నారు. రూ.7 కోట్లతో నూతన మున్సిపల్ కార్యాలయ భవనం, రూ.70 లక్షలు స్వీప్పింగ్ మిషన్, రూ.10 కోట్లతో కొండారెడ్డిపల్లి చెరువు అభివృద్ధి పనులు, 3.50 కోట్లు చెత్తసేకరణకు మినీ టిప్పర్లు, జేసీబీ, రూ.16 కోట్లతో సీసీ, డ్రెయినేజీల నిర్మాణాలకు ప్రతిపాదనలతో సీఎంకు అందజేయనున్నారు. జిల్లా కేంద్రం విస్తరిస్తుండడంతో మాస్టర్ ప్లాన్తో నూతన రింగ్ రోడ్ను ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని.. ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.సర్వం సిద్ధంకాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్రెడ్డి తొలిసారిగా శుక్రవారం నారాయణపేట జిల్లాకేంద్రానికి రానున్నారు. ఈ సందర్భంగా రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ దిశానిర్దేశంతో జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లను సిద్ధం చేసింది.పర్యవేక్షించిన అధికారుల బృందంసీఎం పర్యటన నేపథ్యంలో గురువారం రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ క్రిస్టియానా, ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి, ఐఅండ్పీఆర్ కమిషనర్ హరీశ్, ఎస్పీ యోగేష్ గౌతమ్తో కలిసి కలెక్టర్ సిక్తా పట్నాయక్ సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. సింగారం చౌరస్తాలోని హెలీప్యాడ్ స్థలాన్ని, సమీపంలోని నూతన పెట్రోల్ బంక్, వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని, అప్పక్పల్లి వద్ద సీఎం భూమి పూజ చేసే ఇందిరమ్మ ఇంటి స్థలాన్ని అధికారుల బృందం పరిశీలించింది. అనంతరం మెడికల్ కళాశాలలో ఏర్పాట్ల గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. బహిరంగసభ వేదిక పక్కన గ్రీన్ రూమ్, వేదికపై సీటింగ్ కెపాసిటీ, వీఐపీ గ్యాలరీ తదితర వాటిపై చర్చించారు. అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వారివెంట టీజీఎమ్ఐడీసీసీ దేవేందర్, ఎస్ఈ సురేందర్ రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రాంకిషన్, ఆర్అండ్బీ ఎస్ఈ వనజా రెడ్డి తదితరులు ఉన్నారు. -
ఊరంతా బంధువులే
నేటి ఆధునికయుగంలో బంధాలు.. అనుబంధాలు తగ్గిపోతున్నాయి. అయితే ఆ గ్రామమంతా కలిసికట్టుగా ఉంటోంది. అన్నింట్లో పాలుపంచుకుంటున్న ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. దాదాపు 500 ఏళ్ల క్రితం వలస వచ్చిన ఓ కుటుంబం... ఇప్పుడు 228 ఇళ్లుగా మారి ఓ పంచాయతీగానే రూపాంతరం చెందింది. అదే నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ‘పల్లెగడ్డ’గ్రామం.మరికల్: ఒకే కులం.. ఒకే మాటతో గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా అన్న.. తమ్మి, మామ, అల్లుడు అని పలకరిస్తూ కలిసికట్టుగా పరిష్కరించుకుంటారు పల్లెగడ్డ వాసులు. ఒక ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే అందరూ అక్కడే ఉండి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎవరైనా చనిపోతే ఊరంతా ఉపవాసం ఉండి అంత్యక్రియలు నిర్వహిస్తారు. 500 ఏళ్ల క్రితం మరికల్ గ్రామంలో ముదిరాజ్ కులంలోని కట్టెకొండ గోత్రానికి చెందినవారు ఉండేవారు. వీరి వ్యవసాయ భూములు మరికల్కు రెండు కిలోమీటర్ల దూరంలో ఎత్తయిన ప్రాంతంలో ఉండేవి.దీంతో కట్టెకొండ గోత్రానికి చెందిన ఓ వ్యక్తి మరికల్ నుంచి అక్కడకు వెళ్లి ఓ గుడిసె వేసి నివాసం ఏర్పరుచు కున్నాడు. కాలక్రమంలో ఈ కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు పుట్టి మూడు తరాలుగా విడిపోయి ఇళ్లు నిర్మించుకోవడంతో ఒక చిన్న పల్లెగా అవతరించింది. ఆనాడు మరికల్ పరిధిలోనే ఈ గ్రామం ఉండటంతో పల్లెగడ్డగా పేరుగాంచింది. ఒక ఇంటిలో మూడు తరాలుగా విడిపోయిన అన్నదమ్ములే వారసత్వంగా కుటుంబాలు పెరిగి.. నేడు ఇక్కడ 228 ఇళ్లు నిర్మించుకున్నారు. గ్రామంలో ప్రస్తుతం 1,260 జనాభా ఉండటంతో మరికల్ నుంచి విడిపోయి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడింది. గ్రామంలో 349 మంది స్త్రీలు, 357 మొత్తం కలిపి 706 మంది ఓటర్లు ఉన్నారు.75 శాతం పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువు కుంటున్నారు. గ్రామ శివారులో 1,245 ఎకరాల వరకు భూమి ఉంది. ఇక్కడ 90 శాతం మంది వ్యవసా యంపై ఆధారపడి జీవనం సాగిస్తుండగా, 10 శాతం మంది మాత్రమే ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. ఆపద వస్తే సాయంగ్రామమంతా ఒకే కులంవారు ఉండటంతో అందరూ ఐక మత్యంతో ఉంటున్నారు. గ్రామంలో పెళ్లిళ్లు చేయడానికి దేవాలయం లేకపోవడంతో గ్రామస్తులు కలిసి చందాలు వేసుకొని శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాలను నిర్మించుకున్నారు. ఎవరికైనా ఆపద వస్తే సాయం చేస్తారు. ఆనందంగా ఉంది.. మా పూర్వీకులు చెప్పిన ప్రకారం ఇప్పటికే ఏడు తరాలు దాటినట్టు తెలిసింది. ఒకే కులం పేరుతో ఇక్కడ నివసించడం ఆనందంగా ఉంది. గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా, అందరూ కలిసి వారి బాధను పంచుకుంటాం. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. – హన్మంతు శ్రీవారి సేవకులం15 ఏళ్ల నుంచి టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి దేవ స్థానంలో నిర్వహించే కార్య క్రమాలకు గ్రామం నుంచి మూడు టీంలుగా వెళతాం. అక్కడే వారం రోజులు ఉండి శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు సేవలు చేస్తాం. అన్నదానం, లడ్డూ్డ తయారీ, అఖండ భజన కార్యక్రమాలు నిర్వహించడంతో మా గ్రామానికి ప్రత్యేక గౌరవం దక్కింది. –శ్రీరామ్ -
పెరిగిన పట్టాదారులు
జిల్లా వ్యాప్తంగా 259 రెవెన్యూ గ్రామాల్లో 1,86,236 మంది రైతులకుగాను 4,63,476 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో రైతు బీమా తీసుకురావడంతో ఉన్న భూమిని భాగాలు చేసుకుంటూ కుటుంబ సభ్యులు పట్టా చేసుకోవడం షురూ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 1,92,020 మంది రైతులకు పట్టా పాసుపుస్తకాలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ వినియోగంలో లేని భూములను గుర్తించి వాటికి రైతు భరోసా ఇవ్వకుండా ప్రత్యేకంగా సర్వే చేపట్టడంతో జిల్లా వ్యాప్తంగా 3,744 ఎకరాలు తేలింది. దీంతో జిల్లాలో 4,58,626 ఎకరాలకు రైతు భరోసా వేసేందుకు అధికారులు లెక్క తేల్చారు. 1,92,020 మంది రైతులకుగాను రూ.266 కోట్లు జమ చేయాల్సి ఉంది. కాగా అందులో 1.80 లక్షల మంది రైతులు తమ పట్టాపాసు పుస్తకాలతో పాటుబ్యాంకు పుస్తకాలు, ఆధార్కార్డులు సమర్పించినట్లు అధికారులు చెబుతున్నారు. మిగతా 12 వేల మంది రైతులకు సంబంధించి ఇంకా పోర్టల్ పూర్తిగా వివరాలు నమోదు కాకపోవడంతో వారికి రైతుభరోసా కాస్త ఆలస్యంగా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ముగిసిన టెన్త్ ఇంటర్నల్ మార్కుల పరిశీలన
నారాయణపేట రూరల్: సీసీఈ విదానంలో భాగంగా టెన్త్ విద్యార్థులకు పాఠశాలలో నిర్వహించే కృత్యాలకు సంబంధించి సబ్జెక్ట్ టీచర్లు వేసిన ఇంటర్నల్ మార్కుల పరిశీలన కార్యక్రమం బుధవారం ముగిసింది. 2024–25 విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 146 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 7,631 మంది టెన్త్ విద్యార్థులకు ఆ పాఠశాలలో నిర్వహించిన ఫార్మెటివ్ పరీక్షలు, ప్రాజెక్టు ఇతర అంశాలకు సంబందించి సబ్జెక్టు వారికిగా 20 మార్కుల చొప్పున ఒక్కో విద్యార్థికి మొత్తం కేటాయించిన 120మార్కులను సరిచూశారు. జిల్లా వ్యాప్తంగా జీహెచ్ఎంల నేతృత్వంలో ఒక లాంగ్వేజ్, మరో నాన్ లాంగ్వేజ్ టీచర్ల 31 ప్రత్యేక బృందాలు గత మూడు రోజులుగా వారికి కేటాయించిన షెడ్యూల్ ప్రకారం ఆరు చొప్పున స్కూళ్లను తనిఖీ చేశారు. మార్కుల పరిశీలన చేసి ఆయా మార్కులను ఆన్లైన్ అప్లోడ్ చేయించి డీఈఓ కార్యాలయంలో నివేదిక అందించారు. అదేవిధంగా గురువారం నుంచి జరిగే మొదటి ఫ్రీఫైనల్ పరీక్షల కోసం విద్యార్థులకు సూచనలు చేశారు. జిల్లా కేంద్రంలోని వివిధ పాఠశాలలను ఎంఈఓ బాలాజి, డీఎస్ఓ భానుప్రకాష్, జీహెచ్ఎంలు అనురాధ, సత్యనారాయణసింగ్, సునీత, భారతి, బృంద సభ్యులు యాద్గీర్ నారాయణరెడ్డి, మధుసూదన్, రవికుమార్ తనిఖీలో పాల్గొన్నారు. -
ఎదురుచూపులు..
వివరాలు 8లో uనారాయణపేట: రైతు భరోసా పంపిణీలో వాయిదా ల పర్వం కొనసాగుతోంది. దీంతో జిల్లాలోని చాలా మంది రైతులు తమకు ఇంకెప్పడు సాయం అందుతుందని ఎదురుచూస్తున్నారు. సీఎం ఎనుముల రేవంత్రెడ్డి జిల్లాలోని కోస్గి మండలం చంద్రవాంఛలో నాలుగు పథకాల్లో భాగంగా రైతు భరోసా పథకాన్ని జనవరి 26న శ్రీకారం చుట్టారు. జిల్లా లోని 1,92,020 మంది రైతులకుగాను ( 4,58,626 ఎకరాలకు) రూ.266 కోట్లు రైతు భరోసా వారి ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. తొలి రోజు నారాయణపేట జిల్లాలో 13 మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 9,348 రైతులకు రూ.13.87 కోట్లు జమచేసింది. కాగా రెండు, మూడో విడతలో రైతుల ఖాతాలో జమ చేసింది కేవలం రూ.97 కోట్లు మాత్రమే అని చెప్పవచ్చు. మిగతా రైతులు తమకు ఎప్పుడు రైతు భరోసా పడుతుందోనని ఎదురుచూస్తున్నారు. ఈ నెల 21న సీఎం వస్తుండడంతో ఆ లోపు దాదాపు బడ్జెట్ రిలీజ్ చేయిస్తారేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కొందరికే అందిన ‘రైతుభరోసా’ మొత్తంగా రూ.266 కోట్లకు.. రూ.97 కోట్లు ఖాతాల్లో జమ పట్టా పాసు బుక్కులున్న రైతులు 1,92,020 మంది మూడు విడతల్లో 3 ఎకరాల్లోపు వారికి మాత్రమే అందిన వైనం పూర్తయ్యేదెప్పుడని రైతులు ఆవేదన -
ఇబ్బందిగా ఉంది
మూడు ఎకరాల పొలం ఉంది. ఇంతవరకు రైతు భరోసా పడలేదు. నిత్యం మరికల్ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా. రైతు భరోసా డబ్బులు పడకపోవడంతో పెట్టుబడి సాయంకు ఇబ్బందిగా మారింది. –పద్మనాభం, రైతు, అప్పంపల్లి, మరికల్ మం ఎకరా భూమికి పడలేదు మూడు ఎకరాలలోపు రైతులకు ఇప్పటివరకు రైతు భరోసా పడింది అని అధికారులు చెబుతున్నారు. నాకు ఉన్నది ఎకరా పొలమే. ఇప్పటివరకు రైతు భరోసా తన అకౌంట్లో జమ కాలేదు. – చెన్నయ్య, కొత్తపల్లి మాకెప్పుడొస్తుందో.. మాకు 3.10 ఎకరాల పొలం ఉంది. గత వారం రోజుల క్రితం 3 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా పడిందని చెప్పారు. మాకు ఎప్పుడు రైతు భరోసా పడుతుందో తెలియని పరిస్థితి. త్వరగా అందజేస్తే పంటల పెట్టుబడికి ఆర్థికంగా ఇబ్బందులు తప్పుతాయి. – బాల్యనాయక్, కొత్తపల్లి తండా ఆందోళన అవసరం లేదు.. రైతు భరోసా డబ్బులు రైతులకు రోజు పడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు మూడు ఎకరాల లోపు లక్ష మందికి పైగా రైతులకు వారి ఖాతాలో నగదు జమ అయ్యాయి. అర్హులైన రైతులందరికి మార్చి 31 వరకు అందరికి రైతు భరోసా వస్తుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – జాన్సుధాకర్, డీఏఓ ● -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
నారాయణపేట: సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 21న నారాయణపేటలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనుండడంతో సంబంధిత అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం సీఎం రేవంత్రెడ్డి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎస్పీయోగేష్ గౌతమ్తో కలిసి ఎమ్మెల్యే పర్యవేక్షించారు. నారాయణపేట మండలం అప్పక్పల్లి వద్ద గల మెడికల్ కళాశాల, సింగారం చౌరస్తాలో నూతన పెట్రోల్ బంక్ను, హెలిప్యాడ్ స్థలాన్ని, అప్పక్పల్లి వద్ద సభా స్థలాన్ని పరిశీలించారు. ఆయా స్థలాల్లో పనులు చేయిస్తున్న అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. సభా స్థలి వద్ద 12 స్టాళ్లను ఏర్పాటు చేసే విషయమై వారు చర్చించారు. వేదికకు ఎటువైపు స్టాళ్లను ఏర్పాటు చేయాలనేది వేదిక స్తలాన్ని బట్టి నిర్ణయం తీసుకుందామన్నారు. అనంతరం కలెక్టర్ మెడికల్ కళాశాలకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసే శిలాఫలకాలపై ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్తో అక్కడి ఏర్పాట్లపై చర్చించారు. ● ఎస్పీ యోగేష్గౌతమ్ సింగారం శివారులో ఉన్న హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి చుట్టూ బారికేట్స్ ఏర్పాటు చేయాలని, అప్పక్ పల్లి గ్రామ శివారులో పబ్లిక్ మీటింగ్ సంబంధించిన స్థలాలను పరిశీలించి పబ్లిక్ మీటింగ్ వద్ద భద్రతా ఏర్పాట్లను, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. పబ్లిక్ మీటింగ్ వచ్చే ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, సింగారం శివారులో నూతన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవం సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పోలీసు అధికారులకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. వారితోపాటు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బేన్ షాలోమ్, ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల, ఆర్డీఓ రామచందర్ నాయక్, గ్రంథాలయ సంస్థల వార్ల విజయకుమార్, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ కుమార్రెడ్డి,ఆర్ అండ్ బీ శాఖ అధికారులు ఉన్నారు. మెడికల్ కళాశాలను పరిశీలించిన ఆర్వీ కర్ణన్ నారాయణపేట మండలంలోని అప్పక్పల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలను బుధవారం కమిషనర్ అఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, జాతీయ ఆరోగ్య మిషన్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. ఈ నెల 21న సీఎం నారాయణపేట పర్యటన సందర్భంగా బుధవారం నారాయణపేటకు వచ్చి అప్పక్పల్లి వద్ద మెడికల్ కళాశాలను పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో కళాశాలలో జరిగే ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలపై కలెక్టర్ సిక్తా పట్నాయక్తో చర్చించారు. అనంతరం కలెక్టర్తో కలిసి నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని, పాత బస్టాండ్లోని ప్రభుత్వ చిన్నపిల్లల ఆస్పత్రిని సందర్శించి ఆయా ఆస్పత్రుల్లో రోగులకు అందిస్తున్న సేవలపై వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
పునరావాసానికి సన్నద్ధం
సాక్షి, నాగర్కర్నూల్: నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్న చెంచుపెంటల తరలింపునకు అవసరమైన చర్యలను అటవీశాఖ వేగవంతం చేసింది. ఇప్పటికే కోర్ ఏరియాలో ఉన్న సార్లపల్లి, కుడిచింతల్బైల్, వటవర్లపల్లి గ్రామాలను ఖాళీ చేయించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ(ఎన్టీసీఏ) ద్వారా బాధితులకు పునరావాస ప్రత్యేక ప్యాకేజీని అందజేయనున్నారు. కేంద్రం నుంచి ఆమోదం లభించిన వెంటనే అధికారులు పునరావాస ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. మరో రెండు నెలల్లోనే పునరావాసానికి పూర్తిస్థాయి అనుమతులు లభిస్తాయని భావిస్తున్నారు. విడతల వారీగా చెంచుపెంటల తరలింపు.. నల్లమల అటవీప్రాంతంలో ఉన్న పులులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో ఉన్న చెంచుపెంటలను ఖాళీ చేయించి, అడవి బయట వారికి పునరావాసం కల్పించేందుకు అటవీశాఖ సిద్ధమవుతోంది. ప్రధానంగా పెద్దపులుల సంరక్షణ, వాటికి స్వేచ్ఛగా సంచరించేందుకు వీలు కల్పించడం, వన్యప్రాణులకు, మనుషులకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని నిరోధించడంలో భాగంగా పునరావాస ప్రక్రియను చేపడుతున్నట్టు అటవీశాఖ చెబుతోంది. ఇప్పటికే ఇందుకోసం ప్రక్రియను ప్రారంభించగా, తొలి విడతగా తరలించనున్న సార్లపల్లి, కుడిచింతల్ బైల్, వటవర్లపల్లి గ్రామాల్లో సర్వే నిర్వహించి, స్థానికుల నుంచి అంగీకార పత్రాలను తీసుకుంటున్నారు. స్వచ్ఛందంగా తరలింపునకు ఒప్పుకున్న వారికే పునరావాస ప్యాకేజీని అమలు చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని బలవంతం చేయబోమని అటవీ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ స్థానిక చెంచుల్లో మాత్రం భయాందోళనలు నెలకొన్నాయి. తొలి విడతలో మూడు గ్రామాలు.. నల్లమల అటవీ ప్రాంతంలోని కోర్ ఏరియాలో ఉన్న సుమారు 20 వరకు చెంచుపెంటలను విడతల వారీగా ఖాళీ చేయించి మరో చోట పునరావాసం కల్పించాలని అటవీశాఖ భావిస్తోంది. వీటిలో మొదటి విడతగా సార్లపల్లి, కుడిచింతల్బైల్, వటవర్లపల్లి గ్రామాలను ఖాళీ చేయించాలని నిర్ణయించింది. ఇందుకోసం క్షేత్రస్థాయి సర్వేతో పాటు కుటుంబాల నుంచి అంగీకార పత్రాలను సేకరిస్తోంది. సార్లపల్లిలో మొత్తం 269 కుటుంబాలు ఉండగా, వీరిలో 83 కుటుంబాలు మాత్రమే చెంచులు కాగా, మిగతా ఇతర వర్గాలకు చెందినవారు ఉన్నారు. వీరిలో ఇతర వర్గాలు మాత్రమే తరలింపునకు అంగీకారం చెబుతుండగా, మెజార్టీ చెంచులు ఒప్పుకోవడం లేదు. ప్యాకేజీ కింద 5 ఎకరాలు, లేదంటే రూ.15 లక్షలు అడవిని ఖాళీ చేసి మరో చోటుకు తరలుతున్న స్థానికులకు పునరావాసం కింద ఎన్టీసీఏ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీ, లేదా 5 ఎకరాల భూమి కేటాయిస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ప్యాకేజీని బాధితులు ఎంచుకోవచ్చు. ఖాళీ చేయనున్న గ్రామస్తులకు పునరావాసం కల్పించేందుకు పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఇప్పటికే భూమిని గుర్తించారు. అక్కడే పునరావాస కాలనీలను ఏర్పాటు చేసి నిర్వాసితులకు ఇళ్లు, పాఠశాల, రోడ్లు, ఇతర మౌలిక వసతులను కల్పించనున్నారు. నల్లమల అడవి నుంచి చెంచుపెంటలతరలింపునకు కొనసాగుతున్న కసరత్తు మొదటి విడతలో కుడిచింతలబైల్,సార్లపల్లి, వటవర్లపల్లి గ్రామాలు ఎన్టీసీఏ ద్వారా ప్రత్యేక పునరావాస ప్యాకేజీ పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఏర్పాట్లు -
స్వచ్ఛందంగా తరలింపు..
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్న ఆవాసాల్లో ఉంటున్న వారిని అడవి బయట పునరావాసం క ల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తరలింపు ప్రక్రియ స్వచ్ఛందంగా అంగీకారం తెలిపిన వారికే చేపడతాం. పునరావాసం కింద రూ.15 లక్షల ఆర్థిక సహాయం, లేదా 2 హెక్టార్ల భూమి కేటాయింపు ఉంటుంది. – రోహిత్ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్కర్నూల్ సక్రమంగా ఇస్తేనే వెళతాం.. ఎన్నాళ్ల నుంచో అడవినే నమ్ముకుని ఉంటున్నాం. పులులు, వన్యప్రాణుల సంరక్షణకు మా ఊరిని ఖాళీ చేసి మరో చోటికి పంపిస్తాం అంటున్నారు. పునరావాసం కింద నష్టపరిహారాన్ని అందించి, అక్కడ సౌకర్యాలు కల్పించిన తర్వాతే వెళతాం. అందరికీ న్యాయమైన పరిహారాన్ని అందించి పునరావాస ప్రక్రియ చేపట్టాలి. – మండ్లి భౌరమ్మ, కుడిచింతల్బైల్, అమ్రాబాద్ మండలం మాకు జీవనోపాధి కల్పించాలి.. ఏళ్లుగా ఉన్న మా ఊరిని ఖాళీ చేయించి, మమ్మల్ని మరో చోటుకి తరలిస్తామని చెబుతున్నారు. ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది, పరిహారం ఎప్పుడు అందుతుందన్న దానిపై ఎవరికీ స్పష్టత లేదు. పునరావాసం కల్పిస్తే అక్కడ జీవనోపాధి కల్పించి మా కుటుంబాలను ఆదుకోవాలి. – పోషప్ప, కుడిచింతల్బైల్, అమ్రాబాద్ మండలం ● -
ఛత్రపతి శివాజీ ఆదర్శనీయుడు
దామరగిద్ద: ఛత్రపతి శివాజీ మహరాజ్ అందరికి ఆదర్శనీయుడని, గొప్ప వ్యక్తులను స్మరించుకునేలా విగ్రహాన్ని నెలకొల్పడం ఎంతో సంతోషయనీమని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, స్వామి ఆదిత్య పరాశ్రీ, బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ, బీష్మ పౌండేషన్ చైర్మర్ రాజ్కుమార్ అన్నారు. మండలంలోని కాన్కుర్తిలో భజరంగ్దళ్ ఆధ్వర్యంలో చేపట్టిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వారు ముఖ్యఅథితులుగా హాజరై మాట్లాడారు. మొగల్ సామ్రాజ్య నిరంకుశ పాలనను ఎదిరించి దేశంలో హిందు సామ్రాజ్య స్థాపనకు కృషిచేసిన గొప్ప పరిపాలన దక్షుడు ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. ఆదర్శనీయుడిని భావి తరాలు గుర్తించేలా విగ్రహావిష్కరణ చేసిన భజరంగ్దళ్ యువతను అభినందించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, స్థానిక మాజీ ఎంపీటీసీ బస్వరాజ్, భీంరెడ్డి, స్థానిక యువకులు పాల్గొన్నారు. మెగా జాబ్మేళాకు విశేష స్పందన నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని స్థానిక చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్మేళాకు విశేష స్పందన లభించింది. ఈ మేరకు పదికి పైగా బహుళజాతి కంపెనీలు మేళాలో పాల్గొనగా దాదాపు 200 మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. మేళాకు విచ్చేసిన అభ్యర్థుల ధ్రుపత్రాలను పరీశీలించా రు. అనంతరం పలు కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సత్యయాదవ్ నారాయణపేట రూరల్: బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుడిగా కే.సత్యయాదవ్ ఎంపికయ్యారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం రాత్రి అధ్యక్ష పదవి ఎంపికకు నామినేషన్ల ప్రక్రియ నిర్వహించగా, ఎన్నికల అధికారిగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కట్ట సుధాకర్ హాజరయ్యారు. ఈ మేరకు జిల్లాలో 9మంది నాయకులు జిల్లా అధ్యక్ష పదవికి పోటీ పడ్డా రు. అయితే అధిష్టానం పట్టణానికి చెందిన కొండ సత్యయాదవ్ వైపు సానుకూలంగా వ్యవహరించడంతో ఆ పార్టీ రాష్ట్ర సహ ఎన్నికల అధికారి కే.గీతామూర్తి ఆయన పేరును ధ్రువీకరిస్తూ నియామక పత్రాన్ని విడుదల చే సింది. ఈ మేరకు సత్యయాదవ్ నియామకంపై ఆ పార్టీ మండల అధ్యక్షులు జ్యోతి, సాయిబన్న ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. జొన్నలు క్వింటాల్ రూ.2,421 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం జొన్నలు క్వింటాల్ గరిష్టం, కనిష్టంగా రూ.2,421 ధర పలకగా 15 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,630, కనిష్టంగా రూ.5,225 ధరలు కోడ్ చేయగా 331 క్వింటాళ్లు చేశారు. తెల్లకందులు గరిష్టంగా రూ.7,740, కనిష్టంగా రూ.6,869 (104 క్వింటాళ్లు), వేరుశనగ గరిష్టంగా రూ.6,550, కనిష్టంగా రూ.4,140 ధర పలకగా 187 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. నేడు పీయూలో హ్యాండ్బాల్ ఎంపికలు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో పరిధిలోని వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు హ్యాండ్బాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నామని పీడీ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థులు తమిళనాడు పెరియార్ యూనివర్సిటీలో ఈ నెల 28నుంచి నిర్వహించనున్న అంతర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
ఏసీబీకి చిక్కిన మక్తల్ సీఐ
మక్తల్: ఓ కేసు విషయంలో వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటున్న సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లాకేంద్రానికి చెందిన సందె వెంకట్రాములు మక్తల్లో శ్రీనిధి అనే సొసైటీని ఏర్పాటు చేసి.. ప్రజల నుంచి ప్రతినెలా కిస్తుల ప్రకారం డబ్బులు కట్టిస్తున్నారు. అయితే సొసైటీలో కొందరు వ్యక్తులతో బేధాభిప్రాయాలు రావడంతో మక్తల్ పోలీస్స్టేషన్లో ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సందె వెంకట్రాములుపై కేసు నమోదు చేశారు. అయితే సందె వెంకట్రాములు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా.. ప్రతి సోమవారం మక్తల్ పోలీస్స్టేషన్కు రావాలని షరతులతో కూడిన ముందస్తు బెయిల్ వచ్చింది. ఆఫీసు, ఇళ్లలో సోదాలు.. కేసుకు సంబంధించిన చార్జీషీటు కోర్టులో దాఖలు చేయాల్సిన విషయంలో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు గాను మక్తల్ సీఐ జి.చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు నర్సింహ, శివారెడ్డి రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో సందె వెంకట్రాములు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ముందస్తుగా ప్రణాళిక ప్రకారం మంగళవారం మక్తల్ పోలీస్ కార్యాలయంలో నిందితుడి నుంచి కానిస్టేబుల్ నర్సింహ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇందులో ప్రమేయం ఉన్న మక్తల్ సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుల్ శివారెడ్డిని సైతం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఐ కార్యాలయం, కానిస్టేబుళ్ల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు సీఐ చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు నర్సింహ, శివారెడ్డిలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. దాడుల్లో ఏసీబీ అధికారులు లింగస్వామి, జిలాని సయ్యద్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సైతం ఓ కేసు విషయంలో రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు -
కూలీలు, సాగుదారులు
87.6%కూలీలు సాగుదారులు92.2%86.9%88.2%33.9 %27.3 %81.1%25.9 %22.3 %20.8 %జో.గద్వాలవనపర్తినారాయణపేటనాగర్కర్నూల్మహబూబ్నగర్ -
అన్నింటా.. అట్టడుగు
సాక్షి, నాగర్కర్నూల్: ప్రజల జీవన ప్రమాణాల స్థాయిని సూచించే అక్షరాస్యత, తలసరి ఆదాయం, జీఎస్డీపీ, మౌలిక సదుపాయాల కల్పన ఇలా అన్నింట్లోనూ ఉమ్మడి పాలమూరు జిల్లాలు రాష్ట్రంలోనే అట్టడుగున కొనసాగుతున్నాయి. అక్షరాస్యత విషయంలో జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు రాష్ట్రంలోనే వెనకబడే ఉన్నాయి. ఈ జిల్లాల్లో అక్షరాస్యత శాతం కనీసం 50 శాతం కూడా మించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టిక్ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ● పాఠశాల విద్యార్థుల డ్రాపౌట్స్లోనూ గద్వాల జిల్లా రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 28.8 శాతం మంది విద్యార్థులు పాఠశాల దశలోనే చదువుకు దూరమవుతున్నారు. ఇక వనపర్తి జిల్లా 8.81 శాతం మంది డ్రాపౌట్స్తో కాస్త మెరుగ్గా ఉంది. విద్యార్థులకు, ఉపాధ్యాయుల నిష్పత్తిలోనూ గద్వాల, నారాయణపేట జిల్లాలు వెనకబడి ఉన్నాయి. ఉపాధ్యాయుల కొరతలో జోగుళాంబ గద్వాల జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంది. ● తలసరి ఆదాయం విషయంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలు చివరి వరుసలో ఉన్నాయి. నారాయణపేట జిల్లా రూ.1,94,962 తో అట్టడుగున ఉండగా.. తర్వాతి వరుసలో జోగుళాంబ గద్వాల జిల్లా కొనసాగుతోంది. అభివృద్ధి పురోగతికి సూచీగా నిలిచే జీఎస్డీపీలోనూ నారాయణపేట జిల్లా చివరి నుంచి నాలుగో స్థానంలో ఉంది. ఈ విషయంలో మహబూబ్నగర్ జిల్లా కాస్త మెరుగ్గా మొదటి నుంచి పదో స్థానంలో కొనసాగుతోంది. ఉపాధి, పరిశ్రమలు కరువు.. ఉమ్మడి జిల్లాలో ఉపాధి కల్పన, పరిశ్రమల ఏర్పాటు లేకపోవడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన తదితర విషయాల్లోనూ వెనుకబాటు కనిపిస్తోంది. పరిశ్రమల ఏర్పాటు విషయంలో నారాయణపేట జిల్లా రాష్ట్రంలోనే చిట్టచివరి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో కేవలం 18 పరిశ్రమలు మాత్రమే ఉండగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మహబూబ్నగర్లో అత్యధికంగా 297 పరిశ్రమలు ఉన్నాయి. పశుసంపదలో మేటి.. పశుసంపద విషయంలో రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోల్చితే ఉమ్మడి పాలమూరు మేటిగా నిలిచింది. ముఖ్యంగా నారాయణపేట జిల్లా 12.95 లక్షల గొర్రెలతో రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉంది. కూలీల సంఖ్య విషయానికి వస్తే గద్వాల జిల్లా 92.2 శాతంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా.. వనపర్తి జిల్లాలో 88.2 శాతం మంది కూలీలు ఉన్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 33.9 శాతం మంది సాగుదారులు ఉన్నట్టు నివేదికలో వెల్లడయింది. రాష్ట్రంలోని మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల తర్వాత నాగర్కర్నూల్లోనే అత్యధికంగా 21.4 శాతం ఎస్సీ జనాభా ఉంది. హైదరాబాద్, కరీంనగర్ తర్వాత జోగుళాంబ గద్వాల జిల్లాలో తక్కువగా 1.5 శాతం మంది మాత్రమే ఎస్టీలు ఉన్నారు. జాతీయ రహదారుల విస్తరణ విషయంలో నల్లగొండ మొదటిస్థానంలో ఉండగా.. నాగర్కర్నూల్ జిల్లా 252.83 కి.మీ., విస్తీర్ణంతో రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. సీ్త్ర, పురుష నిష్పత్తి (ప్రతి వెయ్యి మంది పురుషులకు ఉన్న మహిళల సంఖ్య) అక్షరాస్యతలో రాష్ట్రంలోనే చివరన ఉమ్మడి పాలమూరు గద్వాల, పేటలో 50 శాతంలోపే.. తలసరి ఆదాయంలోనూ అంతంత మాత్రమే మౌలిక సదుపాయాల కల్పనలో చివరి వరుసలోనే తెలంగాణ స్టాటిస్టిక్ రిపోర్టులో వెల్లడి జనాభా సాంద్రతలో.. (ప్రతి చదరపు కిలోమీటర్కు)