
భారతదేశంలో రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ఎయిర్ షో (#AeroIndia2025) బెంగళూరులోని యలహంక ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు.

ది రన్వే టు ఎ బిలియన్ అపార్చునిటీస్.. అనే థీమ్తో ప్రారంభమైన ఈ ఎయిర్ షో ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభమైంది. ఈ షో 14 వరకు జరుగుతుంది

ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భారత వైమానిక దళాల ప్రదర్శనలు ఉంటాయి. యుద్ధ విమానాల విన్యాసాలు కనువిందు చేస్తున్నాయి

150 విదేశీ కంపెనీలతో సహా 900 మందికి పైగా ప్రదర్శనకారుల భాగస్వామ్యంతో, ఇది ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఎడిషన్. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రులు, 43 మంది వైమానిక అధిపతులు సహా 90 కంటే ఎక్కువ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు


























