Ashok Babu
-
ఐదుగురు సిట్టింగ్లూ కరివేపాకులు!
సాక్షి, అమరావతి: ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో సిట్టింగ్లకు అవకాశం లేనట్లేనని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్సీలు ఉంటే వారిలో ఒక్కరికి కూడా సభ్యత్వాన్ని తిరిగి రెన్యువల్ చేసే పరిస్థితి లేదని నేతలు చర్చించుకుంటున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావుల పదవీ కాలం ఈ నెలాఖరులో పూర్తి కానుండగా, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన జంగా కృష్ణమూర్తి గతంలోనే రాజీనామా చేశారు. ఈ ఐదు స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ ఐదింటిలో ఒకటి జనసేనకు కేటాయించగా, మిగిలిన నాలుగింటిలో ఒకటి బీజేపీకి ఇచ్చే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. అయితే బీజేపీ అగ్ర నాయకత్వం రాజ్యసభ స్థానాలపైనే ఆసక్తి చూపుతూ, ఎమ్మెల్సీ స్థానాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఒక స్థానం తమకివ్వాలని కోరుతున్నా, జాతీయ నాయకత్వం ఆ దిశగా టీడీపీకి ఎటువంటి సూచనలు చేయలేదని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం బీజేపీ నుంచి ఎవరికీ అవకాశం దక్కే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నాలుగు స్థానాలు టీడీపీ ఖాతాలోకే వెళతాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ ఇందులో ప్రస్తుతం ఆ స్థానాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారిలో ఒక్కరిని కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. యనమలకు అవమానం!పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడిని అవమానకరమైన రీతిలో పక్కన పెడుతున్నట్లు టీడీపీలో చర్చ నడుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ స్థానాన్ని రెన్యువల్ చేయకపోగా, పార్టీలోనూ ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉండడంతోపాటు పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతూ, చంద్రబాబుతో అత్యంత సాన్నిహిత్యం ఉన్నా ఆయన్ను పట్టించుకోక పోవడం వెనుక లోకేశ్ ఉన్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. సీనియర్లను పూర్తిగా పక్కనపెట్టి, సొంత మనుషులతో కోటరీ నిర్మించుకుంటున్నారని పార్టీలో గుప్పుమంటోంది. ఈ క్రమంలోనే చాలా కాలంగా యనమల సహా చాలా మంది సీనియర్లకు అవమానాలు ఎదురవుతున్నాయి. ఈ కోపంతోనే కొద్ది రోజుల క్రితం కాకినాడ పోర్టు, సెజ్ వ్యవహారంలో చంద్రబాబు తీరును తప్పు పడుతూ యనమల లేఖ రాయడం ద్వారా కలకలం సృష్టించారు. అప్పటి నుంచి పార్టీలో ఆయన ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీతో సహా మరే పదవులు ఆయనకు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మిగిలిన నలుగురికీ నిరాశేఉద్యోగ సంఘాల నేతగా ఉండి టీడీపీలో చేరి, పార్టీ కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అశోక్బాబు, ఉత్తరాంధ్ర నుంచి గతంలో శాసన మండలికి వెళ్లిన దువ్వారపు రామారావు, రాయలసీమ కోటాలో మండలిలో ఉన్న బీటీ నాయుడి పేర్లను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ముగ్గురు మండలిలో చురుగ్గా ఉండి లోకేశ్తో కలిసి పని చేసినా, మారిన పరిస్థితుల్లో వారి అవసరం లేదని భావిస్తున్నట్లు సమాచారం. వారివల్ల అంత ఉపయోగం లేదనే కారణంతో ఎమ్మెల్సీ సభ్యత్వం రెన్యువల్ కోసం పరిగణనలోకి తీసుకోలేదని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు జంగా కృష్ణమూర్తి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించినప్పుడు మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయనొకరు ఉన్నారనే విషయమే టీడీపీ అధిష్టానం గుర్తించడం లేదంటున్నారు. -
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
తాడేపల్లి: వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు జరిగాయి. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా కరణం ధర్మశ్రీను నియమించారు. చోడవరం నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్తగా బూడి ముత్యాల నాయుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా తిప్పల దేవన్ రెడ్డి, పి.గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్తగా గన్నవరపు శ్రీనివాస రావు, కాగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి అశోక్ బాబును నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. -
నా దీక్ష ఆగదు..
-
అశోక్బాబు తల్లి భౌతికకాయానికి సీఎం జగన్ నివాళులు
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కొండెపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు తల్లి కోటమ్మ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. సోమవారం ప్రకాశం జిల్లా కారుమంచికి వెళ్లిన సీఎం జగన్.. అశోక్బాబు తల్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా, సీఎం వైఎస్ జగన్ సోమవారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి గ్రామానికి చేరుకున్నారు. 28న విశాఖ పర్యటన 28వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సీఎం వైఎస్ జగన్ బయలుదేరి 5.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు రిషికొండ రాడిసన్ బ్లూ రిసార్ట్స్కు చేరుకుని రాత్రి 7–8 గంటల మధ్య జీ–20 ప్రతినిధులతో జరిగే ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అతిథులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘గాలా డిన్నర్’లో పాల్గొని రాత్రి 8.45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 10 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
హవ్వ... మోసగాడికి వత్తాసా?
తప్పుడు విద్యార్హతతో ప్రభుత్వాన్ని మోసగించిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు ఉదంతంలో చంద్రబాబు తన నైజాన్ని మరోసారి చాటుకున్నారు. అశోక్బాబు అరెస్ట్ అయిన తర్వాత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తే దాన్ని కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్గా చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేరం చేసిన వ్యక్తి ఇంటికి వెళ్లి అతడికి మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏపీ సబార్డినేట్ రూల్ 23(6) ప్రకారం ప్రభుత్వ శాఖాధి పతులు, డైరెక్టర్ల కార్యాలయాల్లో విధులు నిర్వర్తించాలంటే సదరు ఉద్యోగి తప్పనిసరిగా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. కాగా ఈ నిబంధనలకు విరుద్ధంగా అశోక్ బాబు వ్యవహరించారు. ఇంటర్మీడియట్ విద్యార్హతతో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరిన ఆయన 1996 నాటికి పదోన్నతి పొంది విజయవాడ వాణిజ్య పన్నుల శాఖలో సీనియర్ అసిస్టెంట్గా ఉన్నారు. అదే సంవత్సరం శాఖాధిపతుల కార్యాలయంలో బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాను బీకామ్ చదివి నట్టూ, అలాగే ఎన్ఐఐటీ అనే ప్రైవేటు సంస్థ నుంచి డిప్లమో ఇన్ కంప్యూటర్ (డీకామ్) కూడా పొందినట్టూ అఫిడవిట్ ఇస్తూ దరఖాస్తులో పేర్కొన్నారు. అంతేకాదు తన సర్వీస్ రిజిస్టర్లో విద్యార్హతగా ఉన్న డీకామ్ను బీకామ్గా ట్యాంపర్ చేసి ప్రభుత్వాన్ని మోసగించారు. అశోక్బాబు మోసంపై వాణిజ్య పన్నుల శాఖలో ఓ ఉద్యోగి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో శాఖాధిపతి కార్యాలయం కోసం దరఖాస్తు చేసిన ఆరుగురు ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లను తన వద్దకు తీసుకురావాలని వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ ఆదేశించారు. వారిలో ఐదుగురి సర్వీస్ రిజిస్టర్లు వచ్చాయి. కానీ అశోక్బాబు సర్వీస్ రిజిస్టర్ రాలేదు. తరువాత చూస్తే ఆయన సర్వీస్ రిజిస్టర్లో విద్యార్హత కాలమ్ వద్ద చిత్తు చిత్తుగా కొట్టివేసి ఉంది. అంటే ఆ కాలమ్లో ఏం రాసి ఉందన్నది ఎవరికీ తెలియకూడదనే అలా చేశారు. ప్రభుత్వ శాఖలో సంబంధిత అధికారి నియంత్రణలో ఉండాల్సిన సర్వీస్ రిజిస్ట ర్ను అనుమతి లేకుండా తీసుకుని అలా కొట్టివేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందన్నది బహిరంగ రహస్యమే. అశోక్బాబు తప్పుడు విద్యార్హతలను పేర్కొంటూ ప్రభు త్వాన్ని మోసగించారనే ఫిర్యాదుపై 2013లోనే వాణిజ్య పన్నుల శాఖ విచారణకు ఆదేశించింది. కాగా 2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత అశోక్బాబుపై దర్యాప్తును 2018వరకు సాగ దీసిన టీడీపీ ప్రభుత్వం అతడికి క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఇక టీడీపీకి రాజకీయ లబ్ధి కలిగించేలా 2014లో ప్రభుత్వ ఉద్యోగులను మోసగించిన అశోక్ బాబుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని చంద్రబాబు 2018 చివర్లో నిర్ణయించారు. దాంతో ఆయన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్ఎస్) కోసం దరఖాస్తు చేశారు. సర్వీసు నిబంధన 42 ప్రకారం 20 ఏళ్లు సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగి వీఆర్ఎస్ కోసం కనీసం మూడు నెలల నోటీసు ఇవ్వాలి. ఆ ప్రకారం అశోక్బాబుకు 2019, జనవరి 31న వీఆర్ఎస్ ఇవ్వాలి. కానీ అందుకు విరుద్ధంగా 2019, జనవరి 10నే ఆయనకు వీఆర్ఎస్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఎవరైనా ఉద్యోగిపై ఏదైనా కేసు పెండింగులో ఉంటే వీఆర్ఎస్కు అనుమతించకూడదన్నది ప్రభుత్వ నిబంధన. ఈ విషయంలోనూ అశోక్బాబుకు అనుకూలంగా టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించింది. తనపై ఎలాంటి కేసులు పెండిం గులో లేవని ఆయన తన వీఆర్ఎస్ దరఖాస్తులో పేర్కొన్నారు. దాన్ని సరిచూసుకోకుండానే ఉన్నతాధికారులు వీఆర్ఎస్కు అను మతించడం వెనుక టీడీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉంది. కానీ ఎమ్మెల్సీ నామినేషన్ çసందర్భంలో సమర్పించిన అఫిడివిట్లో అశోక్బాబు తనపై నాలుగు కేసులు పెండింగులో ఉన్నాయని వెల్లడించారు. అంటే ఆయన వీఆర్ఎస్ దరఖాస్తులో ఉద్దేశ పూర్వకంగానే తప్పుడు సమాచారమిచ్చారన్నది స్పష్టమైంది. చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా అశోక్బాబు అక్రమా లకు వత్తాసు పలకడంతో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగవర్గాల్లో తీవ్ర అసంతృప్తి రగిలింది. దాంతో ఆయన అక్రమాలపై పూర్తి ఆధారాలతోసహా లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. అన్ని అంశా లను సమగ్రంగా పరిశీలించిన లోకాయుక్త అశోక్బాబుపై ఆరో పణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని భావించింది. అందుకే ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించాలని ఆదేశిం చింది. ఎట్టకేలకు వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ అశోక్ బాబుపై సీఐడీకి ఫిర్యాదు చేశారు. దాంతో సీఐడీ రంగం లోకి దిగి జనవరి 25న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అంతవరకు అశోక్బాబు తాను బీకామ్ చదివినట్టు సర్వీస్ రిజిస్టర్లో ట్యాంపర్ చేశారనే అంతా భావించారు. కానీ సీఐడీ దర్యాప్తుతో ఆయన అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి. ఆయన ఏకంగా ఓ ఫేక్ బీకామ్ సర్టిఫికెట్ను సమర్పించినట్టు సీఐడీ దర్యాప్తులో బయటపడింది. అంతేకాదు తాను బీకామ్ చేసినట్టు ఆయన అఫిడవిట్ కూడా సమర్పించారని తెలిసింది. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే ప్రభుత్వాన్ని మోసగించారన్నది నిర్ధారణ అయ్యింది. తగిన ఆధారాలు లభించినందునే సీఐడీ ఆయన్ని ఫిబ్రవరి 10 రాత్రి అరెస్టు చేసింది. విజయవాడలోని న్యాయస్థానంలో అశోక్బాబును ప్రవేశ పెట్టినప్పుడు ఆయన తరఫు న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. న్యాయస్థానం స్పందిస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇక్కడ న్యాయస్థానం అశోక్బాబుకు బెయిల్ మాత్రమే మంజూరు చేసింది. అంతేగానీ ఆయన ఏమీ నిర్దోషి అని తీర్పునివ్వలేదు. ఆయన అక్రమాలపై దర్యాప్తు, విచారణ కొనసాగుతూనే ఉన్నాయి. అశోక్బాబు బెయిల్పై విడుదల కాగానే ఆయన నివాసానికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు చంద్రబాబు. ఇదెంతవరకు సమంజసం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే ‘ఉద్యోగుల హక్కుల కోసం డిమాండ్ చేసినందుకే అశోక్బాబుపై ప్రభుత్వం అన్యాయంగా కేసు పెట్టింది’ అని ఆరోపణలతో అసలు విష యాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించారు చంద్రబాబు. వాస్తవానికి ఉద్యోగుల సమస్యపై ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న అశోక్బాబుకు ఏ సంబంధమూ లేదు. ఆయన ప్రస్తుతం ఉద్యోగుల ప్రతినిధి కాదు. ఉద్యోగ సంఘాలు పీఆర్సీ అంశంపై ఆందోళన చేశాయి. ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో సామ రస్యంగా పలు దఫాలు చర్చించి ఉభయపక్షాలకు సమ్మతంగా సానుకూల ఫలితాన్ని సాధించింది. 14 ఏళ్లు సీఎంగా చేశాను... రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం అశోక్ బాబుకు వత్తాసు పలకడం ద్వారా ఏకంగా ప్రభుత్వ అధికార వ్యవస్థనే నిర్వీర్యం చేసేందుకు ప్రయ త్నిస్తున్నారు. హవ్వ... ఇంతకన్నా దిగజారుడుతనం ఏమైనా ఉందా? – వడ్డాది శ్రీనివాస్, సాక్షి అమరావతి విలేఖరి -
చంద్రబాబు మీరు చేసింది 420 పని అర్థం కావడం లేదా..?: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: 14 ఏళ్లలో తాను చేయనిది ఒక దమ్మున్న ముఖ్యమంత్రి చేస్తున్నాడని చంద్రబాబుకి నిద్ర పట్టడం లేదని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఈ మేరకు శనివారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు.. 420 అశోక్ బాబు ఇంటికి వెళ్లి మాపై రుబాబు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఘీంకరిస్తున్నాడు. అశోక్ బాబు అనే వ్యక్తి ఒక 420 పనిచేశాడు. అది రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసు. తప్పుడు సర్టిఫికెట్తో పదోన్నతి పొందారని పిర్యాదు అందింది. ఆ ఫిర్యాదును లోకాయుక్త విచారణ చేసి సీఐడీ విచారణకు ఆదేశించింది. సీఐడీ దానిని విచారించి అది నిజమే అని నిర్దారణ చేశాక అరెస్ట్ చేశారు. దీన్ని నిన్నటి నుంచి చంద్రబాబు అండ్ కో నానా యాగీ చేస్తోంది. దీనికి సీఎం జగన్కు ఏమి సంబంధం. అసలు ఆయన చేసిన పనిని ఎవరు సమర్థిస్తారు..?. మీరు చేసింది 420 పని అని చంద్రబాబుకి అర్థం కావడం లేదా. ఎవర్ని బెదిరిస్తావ్.. ఇక్కడ ఎవ్వరూ బెదిరిపోరు. చదవండి: (టీడీపీ నాయకుల బూతుపురాణం.. వాట్సాప్లో వైరల్) చంద్రబాబు నిద్రపోవట్లేదు.. నిద్రపోడు కూడా. 14 ఏళ్లలో తాను చేయనిది ఒక దమ్మున్న ముఖ్యమంత్రి చేస్తున్నాడని ఆయనకి నిద్ర పట్టదు. నువ్వు ఎవ్వరి గుండెల్లో నిద్రపోలేవు చంద్రబాబు.. ఇక్కడెవరూ భయపడరు. ఇక్కడ ఉన్నది ఒక ధీశాలి నాయకత్వంలో పనిచేస్తున్న కోదమ సింహాలు. నువ్వు ఎన్ని దొంగ ఏడుపులు ఏడ్చినా 25 సంవత్సరాలు జగన్ సీఎంగా ఉంటారు. అప్పులు అంటున్నాడు.. తెచ్చిన అప్పులు మీలా దోచుకోలేదు. ప్రతి పైసాకి మా దగ్గర లెక్క ఉంది.. ప్రతి ఇంటికి ఆ డబ్బు చేరింది. అభివృద్ది ఒకచోటే కావాలా..? అమరావతిలోనే అభివృద్ది చేయాలా..?. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అభివృద్ది కావాలని తపించే వ్యక్తి జగన్. సమసమాజ స్థాపన కోసం పాటుపడుతున్నది జగన్. చదవండి: (‘అశోక్బాబైనా.. చంద్రబాబైనా చట్టం ముందు సమానమే..’) ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నావ్...మళ్లీ తెరిచిన పుస్తకంగా నిలబెట్టిన వ్యక్తి జగన్. ప్రధాని మోదీ నోటి వెంట విభజన వల్ల ఏపీ నష్టపోయింది అంటూ వచ్చిన మాటలు జగన్ పోరాటం వల్లే. ఈ రోజు సబ్ కమిటీ అజెండాలో చేర్చి చర్చించేలా చేసింది జగన్. ఇది జగన్ విజయం. ప్రత్యేక హోదా అంశం ఎప్పటికీ మరుగున పడదు. తెరిచిన పుస్తకంలా ఉంచిన జగన్కి ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. ఇలాంటివి మరుగున పెట్టాలని 420 అశోక్ బాబు వివాదాలను తెస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దమ్మున్న పార్టీ.. మీలా చేవ చచ్చిన పార్టీ కాదు. మీకు దమ్ముంటే ప్రజా సమస్యలపై పోరాడండి. ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టాలనే ఇలాంటి చిల్లర వేషాలు వేస్తున్నారు. ముగిసిన అధ్యాయాన్ని మళ్లీ మాట్లాడుకుంటున్నాం అంటే అది మేము చేసిన పోరాటమే. తప్పనిసరిగా దీనిపై చర్చ జరుగుతుంది. మనకు మంచి జరిగే రోజు వస్తుంది. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యం అని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. -
అవినీతిపరుడి కోసం టీడీపీ తాపత్రయపడుతోంది: మంత్రి కొడాలి నాని
-
ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి ప్రమోషన్లు సంపాదించాడు: మంత్రి కొడాలి నాని
-
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్.. టీడీపీలో మొదలైన హైటెన్షన్
-
‘అశోక్బాబు దొరికిపోవడంతో టీడీపీలో ఉలికిపాటు’
సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు చదవని డిగ్రీతో పదోన్నతి పొందారని.. ఆయన దొరికిపోవడంతో టీడీపీలో ఉలికిపాటు మొదలైందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, కోర్టు ఇచ్చిన ఆదేశాలతో సీఐడీ అరెస్ట్ చేసిందన్నారు. ‘‘ఎల్లో మీడియాకు కూడా అశోక్బాబు బండారం తెలుసు. గతంలో ఫేక్బాబు అంటూ ఎల్లో మీడియా కథనాలు ఇచ్చిందని’’ నాగార్జున యాదవ్ పేర్కొన్నారు. చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు అరెస్ట్ -
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు అరెస్ట్
-
అడ్డంగా దొరికిన అశోక్బాబు
సాక్షి, అమరావతి: తప్పుడు విద్యార్హతతో ప్రభుత్వాన్ని మోసగించిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పదోన్నతి కోసం తన సర్వీస్ రిజిస్టర్ను ట్యాంపర్ చేయడమే కాకుండా, ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో ఫేక్ బి.కాం సర్టిఫికెట్ సమర్పించి ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించారు. దీనిపై కేసు పెండింగులో ఉన్నాసరే నిబంధనలకు విరుద్ధంగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. తనపై కేసులు పెండింగులో లేవని పేర్కొంటూ ఎమ్మెల్సీగా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారు. తప్పుడు సర్టిఫికెట్తో పదోన్నతి పొందడమే కాకుండా సహచర ఉద్యోగుల పదోన్నతి అవకాశాలకూ గండి కొట్టారు. లోకాయుక్త ఆదేశాలతో అశోక్బాబుపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసిన సీఐడీ విభాగం.. కీలక ఆధారాలు సేకరించి, ఈ కేసులో కీలక పురోగతి సాధించింది. అర్థం కాని విధంగా సర్వీస్ రిజిస్టర్లో మార్పులు ఇంటర్మీడియట్ విద్యార్హతతో వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్ అసిస్టెంట్గా చేరిన అశోక్బాబు.. డి.కాం(డిప్లమో ఇన్ కంప్యూటర్స్) చేసి, సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి పొందారు. కాగా వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఉన్నతోద్యోగం పొందాలంటే డిగ్రీ కనీస అర్హత ఉండాలి. దాంతో తన సర్వీస్ రిజిస్టర్లోని ‘డి.కాం’ ను కాస్త ‘బి.కాం’గా మార్చివేసి ట్యాంపరింగ్కు పాల్పడ్డారు. తర్వాత పదోన్నతి పొంది వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో విధుల్లో చేరారు. కాగా, ఆయన విద్యార్హతపై ఫిర్యాదులు రావడంతో సర్వీస్ రిజిస్టర్లో విద్యార్హత కాలమ్లో పేర్కొన్న సమాచారాన్ని అడ్డదిడ్డంగా కొట్టివేశారు. అందులో పేర్కొంది ఏమిటన్నది తెలియకుండా చేశారు. పొరపాటు అయితే ఫేక్ సర్టిఫికెట్ ఎందుకు? పదోన్నతి కోసం తన విద్యార్హత బి.కాంగా పేర్కొన్న అశోక్బాబు అంతటితో ఆగలేదు. ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో ఓ ఫేక్ బి.కాం సర్టిఫికెట్ను సృష్టించి సమర్పించినట్టు తెలుస్తోంది. తాను బి.కాం చేసినట్టుగా అఫిడవిట్ కూడా సమర్పించారు. సీఐడీ దర్యాప్తులో ఈ అంశం తాజాగా వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. దాంతో ఈ కేసులో సీఐడీ అధికారులు కీలక ఆధారం సేకరించినట్టే. తనపై సీఐడీ కేసు నమోదు చేయగానే తాను ఇంటర్మీడియట్ మాత్రమే చదివానని, తన సర్వీస్ రిజిస్టర్లో టైపింగ్ పొరపాటుతో బి.కాం అని పడినట్టు అశోక్బాబు వాదిస్తూ వచ్చారు. మరి టైపింగ్ పొరపాటే అయి ఉంటే.. ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో ఫేక్ సర్టిఫికెట్ ఎందుకు సమర్పించాల్సి వచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. అంటే అశోక్బాబు ఉద్దేశ పూర్వకంగానే ఫేక్ సర్టిఫికెట్తో ప్రభుత్వాన్ని మోసం చేశారన్నది స్పష్టమవుతోంది. ఎమ్మెల్సీ నామినేషన్లోనూ తప్పుడు సమాచారం టీడీపీ ప్రభుత్వ హయాంలో అశోక్బాబుపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదు. పైగా ఆయన్ను టీడీపీ తరఫున ఎమ్మెల్సీ చేశారు. అందుకోసం హడావుడిగా ఆయనకు స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతి ఇచ్చారు. పెండింగు కేసులు ఉండగా, స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం ఇవ్వకూడదన్న నిబంధనను టీడీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే విస్మరించింది. ఇక ఎమ్మెల్సీగా నామినేషన్ వేసే సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లోనూ తప్పుడు సమాచారమే ఇచ్చారు. తనపై ఎలాంటి కేసులు పెండింగులో లేవని పేర్కొన్నారు. అయితే లోకాయుక్త ఆదేశాలతో అశోక్బాబుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన సీఐడీ కీలక ఆధారాలు సేకరించింది. సర్వీస్ రిజిస్టర్లో ట్యాంపరింగ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం పేరుతో నకిలీ సర్టిఫికెట్, నిబంధనలకు విరుద్ధంగా స్వచ్ఛంద పదవీ విరమణ, ఎమ్మెల్సీగా నామినేషన్ కోసం సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం.. ఇలా వీటన్నింటికీ సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించింది. వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి అశోక్బాబు సమర్పించిన ఫేక్ సర్టిఫికెట్కు సంబంధించిన కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఆయన సర్వీస్ రిజిస్టర్లో ట్యాంపరింగ్ చేసినట్టు కూడా ఆధారాలు లభించాయి. అనంతరమే అశోక్బాబును అరెస్టు చేసి గుంటూరులోని ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి తరలించింది. ఈ కేసుపై ఆయన్ను సీఐడీ అధికారులు శుక్రవారం వివిధ కోణాల్లో విచారించినట్టు తెలుస్తోంది. తప్పుడు నివేదిక ఇచ్చిన వారినీ కేసులో చేర్చాలి టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబును అరెస్టు చేయడం హర్షనీయమని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఎన్జీవోల సంఘం–1 అధ్యక్షుడు బి.మెహర్ కుమార్ అన్నారు. ఆయన నేరాన్ని పూర్తి సాక్ష్యాధారాలతో రుజువు చేసి తగిన శిక్ష పడేలా చూడాలని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో కోరారు. ప్రభుత్వాన్ని మోసం చేసిన అశోక్బాబును సమర్థించిన ముగ్గురు ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన టీడీపీ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసేందుకు వీలుగా హడావిడిగా తప్పుడు నివేదిక ఇచ్చిన వారిని కూడా కేసులో చేర్చాలన్నారు. అశోక్బాబుతో కుమ్మక్కై ప్రభుత్వాన్ని మోసం చేసిన అప్పటి విచారణ అధికారి పుల్లయ్య, సంయుక్త కమిషనర్ కిరణ్కుమార్లపై కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిండికేట్ రింగ్ మాస్టర్ అశోక్ బాబు టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్బాబు రాష్ట్రంలో పలువురు అవినీతి ఉన్నతాధికారుల అక్రమాలకు వత్తాసు పలికే సిండికేట్ను నిర్వహించారని విజయవాడలోని సనత్ నగర్కు చెందిన షేక్ నజియా బేగం విమర్శించారు. ప్రధానంగా ఏసీబీ దాడుల్లో దొరికిన ఉన్నతాధికారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా ఆ కేసులను నీరుగార్చారని చెప్పారు. 2016లో ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్పై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా అశోక్బాబే రక్షించారన్నారు. ఏసీబీ కేసు విచారణ కూడా ముందుకు సాగకుండా చేయడంతోపాటు కనీసం శాఖా పరమైన విచారణ జరగకుండా అడ్డుకున్నారని చెప్పారు. దీనిపై తాము పూర్తి ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. అశోక్బాబు, సంయుక్త కమిషనర్ అవినీతికి వత్తాసు సహకరించిన ఓ ఐఏఎస్ అధికారికి విజయవాడలో కోట్లాది రూపాయల విలువైన ఇంటిని బహూకరించారని ఆమె చెప్పారు. అశోక్బాబు సిండికేట్లోని అవినీతి అధికారులపై కూడా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని ఆమె కోరారు. గుంటూరులో టీడీపీ హైడ్రామా పాత గుంటూరు/విజయవాడ లీగల్ : సీఐడీ అధికారులు అరెస్టు చేసిన ఎమ్మెల్సీ అశోక్బాబును కలిసేందుకు వచ్చిన టీడీపీ నాయకులను లోపలికి అనుమతించక పోవడంతో ధర్నాకు దిగి హైడ్రామాకు తెరలేపారు. సీఐడీ అధికారులు కావాలనే ఎమ్మెల్సీ అశోక్ బాబుపై అక్రమ కేసులు పెట్టారని శుక్రవారం హంగామా సృష్టించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ.. అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. ఎంపీ రఘరామ కృష్ణంరాజును కొట్టినట్లు అశోక్ బాబుని సైతం కొట్టాలని చూస్తున్నారన్నారు. తప్పు చేయలేదు కనుక ముందస్తు బెయిల్ తీసుకోలేదని చెప్పారు. ఏపీలో రాక్షస పాలన సాగుతోందని, ప్రజల కోసం పోరాడుతున్న తమపై ఎన్ని దాడులు చేసినా భయపడమని అన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ప్రభుత్వం కనుసన్నల్లో సీఐడీ అధికారులు పని చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమతో పాటు టీడీపీ నేతలు రావిపాటి సాయికృష్ణ, మన్నవ మోహనకృష్ణ, అబ్బూరు మల్లి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెనాలి శ్రావణ్కుమార్లు కొద్దిసేపు హడావుడి చేసి వెళ్లిపోయారు. కాగా, నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ధర్నా చేసిన 60 మందిపై సెక్షన్ 151 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం గుంటూరు జీజీహెచ్లో అశోక్బాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత విజయవాడ కోర్టుకు తరలించారు. బెయిల్ మంజూరు ఎమ్మెల్సీ పరుచూరి అశోక్బాబు తప్పుడు పత్రాలు సృష్టించి పదోన్నతి పొందినట్లుగా నిర్ధారణ కావడంతో సీఐడీ పోలీసులు 10వ తేదీ రాత్రి ఆయన్ను అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ మూడవ అదనపు చీప్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఇన్చార్జ్ జడ్జి ఎదుట హాజరు పరిచారు. రాత్రి వరకు ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి.. అశోక్బాబుకు బెయిల్ మంజూరు చేశారు. ఇదిలా ఉండగా అంతకు ముందు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం లంచ్ మోషన్ రూపంలో అశోక్బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ దొనడి రమేశ్ ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించారు. ఈ వ్యాజ్యంలో లోకాయుక్త వాదన కూడా వినేందుకు ప్రతివాదిగా చేర్చాలని అశోక్బాబు తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లును ఆదేశిస్తూ ఈ నెల 14వ తేదీకి విచారణ వాయిదా వేశారు. -
అశోక్బాబుపై కేసు నమోదు
అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. గతంలో ఏసీటీవోగా పని చేసిన సమయంలో అశోక్బాబు తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగాలపై కేసు నమోదు చేసింది సీఐడీ. తన సర్వీసు రికార్డు లేకుండానే తప్పుడు సమాచారం ఇచ్చారని కేసు నమోదైంది. బీకాం చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారనే అభియోగంపై కేసు నమోదు చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చి రికార్డులను ట్యాంపరింగ్ చేయడమే కాకుండా, ఎన్నికల అఫిడవిట్లో కూడా డిగ్రీ చదివినట్లు పేర్కొన్నారనే అభియోగాల కింద కేసులు నమోదు చేశారు. అశోక్ బాబు పైన సెక్షన్ 477A, 465,420 కింద కేసు నమోదు చేశారు. 2021లో అశోక్బాబుపై లోకాయుక్తాలో కేసు నమోదు కాగా, ఆ కేసును సీఐడీకి అప్పగించాలని లోకాయుక్తా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
రిజర్వ్ ఇన్స్పెక్టర్పై లోకేశ్ హత్యాయత్నం
సాక్షి, అమరావతి/మంగళగిరి: టీడీపీ ఎమ్మెల్సీలు లోకేశ్, అశోక్బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెనాలి శ్రావణ్కుమార్ విధి నిర్వహణలో ఉన్న రిజర్వ్ ఇన్స్పెక్టర్ సక్రూనాయక్పై హత్యాయత్నం చేశారు. దీనిపై కేసు నమోదైంది. ఏకంగా టీడీపీ రాష్ట్ర కార్యాలయంలోని ఓ గదిలో ఆ పోలీసు అధికారిని బంధించి కులం పేరుతో దూషిస్తూ దాడికి తెగబడటం విస్మయం కలిగిస్తోంది. చివరికి మంగళగిరి సీఐ వచ్చి ఆ అధికారిని విడిపించి ఆస్పత్రికి తీసుకెళ్లారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బాధిత రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకేశ్ ఏ1, అశోక్బాబు ఏ2, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఏ3, తెనాలి శ్రావణ్కుమార్ ఏ4గా, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, కులం పేరుతో దూషించడం, విధి నిర్వహణకు ఆటంకం కలిగించడం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ప్రకారం వివరాలివీ.. టీడీపీ ఆఫీసు వద్ద దాడిచేసి, బంధించి.. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం వద్ద ఘర్షణలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో మంగళవారం సాయంత్రం మంగళగిరి బెటాలియన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సక్రూనాయక్ వెంటనే అక్కడకు చేరుకున్నారు. విధి నిర్వహణ కోసం టీడీపీ ప్రధాన కార్యాలయం గేటు వద్దకు చేరుకున్న ఆయనపై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. తాను పోలీసు అధికారినని చెబుతున్నా వినిపించుకోకుండా ఆయన్ని బలవంతంగా టీడీపీ కార్యాలయం లోపలికి తీసుకెళ్లి ఒక గదిలో బంధించారు. తరువాత టీడీపీ ఎమ్మెల్సీలు లోకేశ్, అశోక్బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజా, శ్రావణ్ తదితరులు పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలతో ఆ గదిలోకి వచ్చారు. తాను పోలీసు అధికారినని చెబుతున్నా, తన గుర్తింపు కార్డు చూపించినా వారు పట్టించుకోలేదు. అందరూ కలసి రిజర్వ్ ఇన్స్పెక్టర్ సక్రూనాయక్పై తీవ్రంగా దాడిచేశారు. లంబాడి తెగకు చెందిన ఆయన్ని కులం పేరుతో దుర్భాషలాడారు. హత్యాయత్నం చేశారు. అశోక్బాబు ఆయన గుర్తింపు కార్డును లాక్కున్నారు. సెల్ఫోన్ను నేలకేసి కొట్టారు. మళ్లీ అందరూ కలసి మూకుమ్మడిగా ఆయనపై దాడిచేశారు. అతి కష్టం మీద అక్కడ నుంచి తప్పించుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన సక్రూనాయక్ను అశోక్బాబుతోపాటు పలువురు మళ్లీ పట్టుకుని బంధించారు. బలవంతంగా ప్రెస్మీట్లో కూర్చోబెట్టి ఆయనపై అసత్య ఆరోపణలు చేశారు. అంత జరుగుతున్నా సరే ప్రాణభయంతో సక్రూనాయక్ మౌనంగా ఉండిపోయారు. ప్రెస్మీట్ అనంతరం ఆయన్ని మళ్లీ గదిలో బంధించారు. సమాచారం తెలుసుకున్న మంగళగిరి రూరల్ సీఐ భూషణం మంగళవారం రాత్రి 10.30 గంటలకు టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని ఆయన్ని విడిపించి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం సక్రూనాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేశ్, అశోక్బాబు, ఆలపాటి రాజా, శ్రావణ్కుమార్, పోతినేని శ్రీనివాసరావులతోపాటు మరికొందరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసులు బుధవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయానికి ఇరువైపులా అర కిలోమీటరు దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ను మళ్లించారు. టీడీపీ నాయకులను మాత్రమే అనుమతించారు. టీడీపీ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్సీ లోకేశ్ పోలీసులను బెదిరించడం ఉద్రిక్తతలకు దారితీసింది. మంగళవారం దాడిలో గాయపడ్డారని చెబుతున్న కార్యకర్తలు కార్యాలయానికి వస్తుండగా వాహనాన్ని బెటాలియన్ వద్ద బందోబస్తులో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్ కార్యకర్తలతో తరలివచ్చి గాయపడినవారి అంబులెన్స్ను ఎందుకు వదలరని ప్రశ్నించడంతోపాటు అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు వేలు చూపిస్తూ బెదిరించారు. దీంతో విధుల్లో ఉన్న పోలీసులు విస్తుపోయారు. వాహనాల రాకపోకలు అడ్డుకోవడంపై కేసు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవిపై మంగళగిరి రూరల్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన వివాదంలో గంజి చిరంజీవితో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి వాహనదారులను అడ్డుకుని ఇబ్బందులు కలిగించారు. జాతీయ రహదారులశాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంజి చిరంజీవితో పాటు మరికొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 70 మందిపై కేసు నమోదు మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద మంగళవారం జరిగిన ఘర్షణలకు సంబంధించి గుర్తుతెలియని 70 మందిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. తమ పార్టీ కార్యాలయంపై దాడిచేశారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగా.. టీడీపీ కార్యకర్తలు తమపై దాడికి పాల్పడ్డారని మరికొందరు కూడా ఫిర్యాదు చేశారు. ఈ వివాదంలో తమకు పలు ఫిర్యాదులు అందాయని, అన్నింటిపై సమగ్రంగా దర్యాప్తు జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంగళగిరి రూరల్ సీఐ భూషణం చెప్పారు. -
అశోక్బాబుపై ఏపీఎన్జీవో ఫైర్..
సాక్షి, అమరావతి: తాము ఎప్పుడు టీడీపీకి మద్దతుగా ప్రచారం చేయలేదని.. అశోక్బాబు చెప్పేవన్నీ అవాస్తవాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అశోక్బాబు తనను ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా కాకుండా అడ్డుకోవాలని చూశారని, చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నవారిని ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా చేయాలని చూశారని ధ్వజమెత్తారు. ‘‘అశోక్బాబు మమ్మల్ని రాజకీయంగా వేధించారు. ఇంకోసారి ఆయన ఏపీఎన్జీవో పేరు ఎత్తితే సహించేదిలేదని’’ చంద్రశేఖర్రెడ్డి హెచ్చరించారు. ఏపీఎన్జీవో సంఘానికి అశోక్బాబు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. (చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం నోటీసులు) ఉద్యోగుల హక్కులను తాకట్టు పెట్టిన ఘనుడు టీడీపీకి మద్దతు తెలిపామని అశోక్బాబు మాట్లాడటం సిగ్గుచేటని ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. అశోక్బాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టిన ఘనుడు అశోక్బాబు అని, వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే ఒక మాటైనా మాట్లాడావా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పదవి కోసం ఉద్యోగుల హక్కులను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని అశోక్బాబుపై బొప్పరాజు నిప్పులు చెరిగారు. (‘టీడీపీకి మిగిలింది ఆ ఒక్కటే’) ఉద్యోగాన్ని అడ్డంపెట్టుకుని ఎమ్మెల్సీ పదవి.. గత ఎన్నికల్లో టీడీపీకి సహకరించానని స్వయంగా అశోక్బాబే ఒప్పుకున్నారని, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ పదవిని అశోక్ బాబు సంపాదించారని, వెంటనే ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అశోక్ బాబు పై రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషన్, గవర్నర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరమైనతే హైకోర్టు ను కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా అశోక్ బాబు కు వచ్చిన నిధులుపైన కూడా విచారణ జరపాలని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. -
అక్కడి కూలీలకు ఆకలి భయం లేదు
కరోనా లాక్ డౌన్ కూలి లేకుండా చేసింది. కూలీల కడుపు ఎండగట్టేసింది. ఆఫీసులు మూసేశారు సరే!!. ఉద్యోగులకైతే జీతాలొస్తాయి. ఇంట్లో నుంచే పని చేస్తారు. మరి కూలీల సంగతో..? వేల కిలోమీటర్లు నడిచి సొంతిళ్లకు వెళ్లిపోవాలా? నడిచేటపుడు వారి ఆకలి దప్పుల సంగతేంటి? ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా ఒకటే కదా? వారూ ఈ దేశీయులే కదా..? వాళ్లను ఆదుకునేదెవరు? అందరివీ ప్రశ్నలే. అశోక్బాబు మాత్రం తానే జవాబు కావాలనుకున్నాడు. కొంతైనా జవాబుదారీ అవుదామనుకున్నాడు. ఆ ఆలోచనతోనే పుట్టుకొచ్చాయి కమ్యూనిటీ కిచెన్లు. పుణె, పింప్రీ– చించ్వాడ్లో రోజుకు 25 వేల మంది ఆకలి తీర్చటంతో మొదలై... ఇపుడు రోజూ లక్షన్నర మందికి భోజనంతో పాటు ఆశ్రయం కూడా కల్పిస్తున్నాయి. ఐఆర్ఎస్ అధికారిగా తన విధిని నిర్వర్తించటంతో ఆగిపోలేదు అశోక్బాబు. తన స్నేహితుల్ని కూడా ఇందులోకి లాగాడు. సివిల్ సర్వెంట్ల నెట్వర్క్ చాలా పెద్దది. శక్తిమంతమైందిlకూడా. అందుకే ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని ఎన్జీవోల సహకారంతో వీళ్లు తమ సేవల్ని అందించగలుగుతున్నారు. పుణే, పింప్రి–చించ్వాడ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆసియా ఖండంలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడగా చెప్పాలి. ఎందుకంటే ఈ పరిసరాల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలతో పాటు పలు ఆటోమొబైల్ కంపెనీలన్నాయి. చక్కెర మిల్లుతో పాటు ఇతర మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లు, సాఫ్ట్వేర్ హబ్లు, ఇతర వాణిజ్య, వ్యాపార సంస్థలు ఎక్కువే ఉన్నాయి. వీటిలో పనిచేసే లక్షల మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారే. లాక్డౌన్ కారణంగా వీళం్లతా ఇబ్బందుల్లో పడ్డారు. కంపెనీలు మూసేయటం, నిర్మాణ కార్యకలాపాలు ఆగిపోవటంతో నిరాశ్రయులయ్యారు. తిండిలేక అలమటిస్తున్న వీరిని ఆదుకోవటానికి పుణె, షోలాపూర్, కొల్హాపూర్, సతారా, సాంగ్లీ జిల్లాలకు పుణె డీఆర్ఓ హోదాలో (రెవిన్యూ డివిజనల్ కమిషనర్) పనిచేస్తున్న దీపక్ మహిష్కర్ ఓ ఆలోచన చేశారు. కమ్యూనిటీ కిచెన్ భావనకు పురుడు పోశారు. ఆచరణ, పర్యవేక్షణ బాధ్యతలు ఐఆర్ఎస్ అధికారి నేలపట్ల అశోక్బాబుకు అప్పగించారు. ప్రతి రోజూ స్వయంగా కిచెన్లకు... కో–ఆర్డినేటర్గా నియమితులైన నాటినుంచి అశోక్ బాబు తనదైన శైలిలో సేవలు అందించటం మొదలెట్టారు. ముఖ్యంగా ప్రతిరోజూ పుణే డిప్యూటి కలెక్టరు, పుణే, పింప్రి–చించ్వడ్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర ్లతో సమన్వయం చేసుకునే వారు. రోజుకు కనీసం రెండు నుంచి మూడు కమ్యూనిటీ కిచెన్ సెంటర్లతోపాటు షెల్టర్ల వద్దకు నేరుగా వెళుతున్నారు. కూలీల్లో భయాన్ని పారదోలేందుకు ప్రయత్నిస్తూ... ఆహారం సరిగా అందిందో లేదో చూస్తున్నారు. పలువురికి బస కూడా ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లో... ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగువారికి అశోక్బాబు తన వంతు సాయం అందిస్తున్నారు. తన మిత్రులతో పాటు ఎన్జీఓ సంస్థల సహకారంతో పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ప్రజలకు భోజనం, వీలైనంత వరకూ వసతి కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్, గుంటూరు, రాజమండ్రి, చిత్తూరు, తెలంగాణలోని హైదరాబాదు, మెదక్, సూర్యాపేట, గద్వాల్ ప్రాంతాలతో పాటు కర్ణాటక, పంజాబ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిషా, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తమ సేవలు అందుతున్నట్లు చెప్పారాయన. గుంటూరు జిల్లా వినుకొండ నుంచి.. అశోక్బాబుది గుంటూరు జిల్లా. వినుకొండ తాలూకా మొగచిందలపాలెంలో పుట్టారు. వినుకొండలోని సెయింట్ మేరిస్, లయోల స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించాక గుంటూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్లో డిప్లొమా చేసి, వరంగల్లో బీటెక్ చేశారు. 2010లో హైదరాబాద్లో కొన్నాళ్లు పనిచేశాక ముంబై రీజియన్లో ఐటీ జాయింట్ కమిషనర్గా పనిచేశారు. ప్రస్తుతం పుణే సీనియర్ ఐఆర్ఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తూనే ఈ కమ్యూనిటీ కి చెన్ బాధ్యతలను చూస్తున్నారు. – గుండారపు శ్రీనివాస్ / చక్రవర్తి సాక్షి ముంబై/ పింప్రీ 25 వేల భోజనాలతో ప్రారంభం.. పుణే, పింప్రీ–చించ్వాడ్ పరిధిలో ఏప్రిల్ 16న కమ్యూనిటీ కిచెన్ సేవలను ప్రారంభించాం. మొదట సుమారు 25 వేల మందికి భోజనాలు అందించాం. ఈ సంఖ్య పెంచుతూ ఇపుడు 105 కమ్యూనిటీ కిచెన్ల ద్వారా రోజూ 1.50 లక్షల మందికిపైగా భోజనాలు అందిస్తున్నాం. అదేవిధంగా 57 షెల్టర్లలో సుమారు 70 వేల మందికి బస ఏర్పాటు చేశాం. – నేలపట్ల అశోక్బాబు ఐఆర్ఎస్, కో ఆర్డినేటర్, కమ్యూనిటీ కిచెన్ సెంటర్స్ -
మా ఉద్యోగుల జోలికి రావొద్దు..
సాక్షి, అమరావతి: విశ్రాంత ఉద్యోగస్తులకు 100 శాతం పెన్షన్ చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. కరోనా వైరస్పై పోరాటంలో కింది స్థాయి ఉద్యోగుల కష్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు. ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దని.. కరోనాపై పోరులో ఇంటికి వెళ్లకుండా కష్టపడుతున్న ఉద్యోగుల సేవలను ముఖ్యమంత్రి గుర్తించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఉద్యోగులకు 50 శాతం జీతాలు చెల్లించారని... మిగిలిన 50 శాతం గురించి ప్రభుత్వాన్ని కోరతామని తెలిపారు. ఇక ఉద్యోగులను అడ్డుగా చూపించి పదవి సంపాదించిన చరిత్ర గల టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు ఒక్కరోజు నిరాహార దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు. ఉద్యోగుల కోసం ఇప్పుడు దీక్ష చేసేంత అవసరం ఆయనకు ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఆయన నిరాహార దీక్ష రాజకీయ కుట్రలో భాగమేనని మండిపడ్డారు. గతంలో ఉద్యోగుల జీవితాన్ని తాకట్టు పెట్టిన ఆయన తమ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉద్యోగ సంఘంలో ఉన్నప్పుడు చేయని దీక్షలు అశోక్బాబు ఇప్పుడెందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తమను కదిలిస్తే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలను బయటపెడతామని.. ఉద్యోగుల జోలికి రావొద్దని హెచ్చరించారు. (కరోనాపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష) ‘‘ఉద్యోగ సంఘాల మీద రాజకీయ ముద్ర వేసిన చరిత్ర నీది. మా ఉద్యోగులకు ఏం కావాలో మాకు తెలుసు... మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నీ వలన ఉద్యోగస్తులమంతా ఇప్పుడు బాధ పడుతున్నాం . మీ రాజకీయం మీరు చేసుకోండి.. మేం మీ జోలికిరాము. వాళ్ల నాన్న చనిపోతే అశోక్బాబు ఉద్యోగం తెచ్చుకున్నారు. ఇంటర్మీడియట్ చదవిన వారికి జూనియర్ అసిస్టెంట్ ఇవ్వమని మేము పోరాడుతుంటే.. డిగ్రీ వాళ్ల కు ఇవ్వమని అడిగిన వ్యక్తి అశోక్ బాబు. 50 శాతం జీతాలు రాకుండా అడ్డుకొవాలని అశోక్ బాబు కుట్ర పన్నుతున్నట్లు అనిపిస్తుంది. ఏపీఎన్జీవో ఉద్యోగ సంఘ నాయకులు పై రాజకీయ ముద్ర పడేలా చేసిన చరిత్ర అశోక్ బాబుది’’ అని అశోక్బాబు తీరును బొప్పరాజు వెంకటేశ్వర్లు దుయ్యబట్టారు.(కార్మికుల కాళ్లు కడిగిన ఎమ్మెల్యే ) ఆ ఘనత సీఎం జగన్ సొంతం ‘‘ఉద్యోగులు అడగకుండానే 27% ఐఆర్ ఇచ్చిన ఘనత సీఎం జగన్ సొంతం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసిన చరిత్ర ఈ ప్రభుత్వానిది. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్మికులకు మూడు వేల రూపాయల నుంచి 10 వేలు జీతాలు పెంచిన ఘనత సీఎం జగన్కు దక్కింది. అయితే కొంతమంది పారిశుద్య, కార్మికులు, ఏఎన్ఎంలతో ధర్నాలు చేయించి రాజకీయం చేయాలని చూస్తున్నారు. పనిచేసే వాడికి ఎస్మా గురించి అవసరమేముంది. పనిచేయని వాడే ఎస్మా గురించి భయపడతారు. ఇంకా కొన్ని రోజులు కష్టపడండి... కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు మరింత కష్టపడి ప్రజలను రక్షిద్దాం’’ అని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ‘‘అశోక్ బాబు రాజకీయాలు మీ చేసుకోండి, మా ఉద్యోగుల సంక్షేమం మేము చూసుకుంటాం’’ అని చురకలు అంటించారు. -
జేఆర్పురం ఎస్ఐపై కేసు నమోదు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారన్న అభి యోగంతో జేఆర్పురం పోలీస్స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వి.అశోక్బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఇంకా అదే స్టేషన్లో ఉంటే విచారణపై ప్ర భావం చూపుతుందన్న అభిప్రాయంతో యుద్ధ ప్రా తిపదికన ఎస్ఐను వీఆర్లోకి పంపించారు. ఇప్పుడి ది పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రణస్థలం మండలం పిశిని పంచాయతీకి చెందిన ఓ మహిళ జేఆర్పురం ఎస్ఐ అశోక్బాబుపై ఫిర్యాదు చేశారు. ఎస్ఐ తనను కారులో ఎక్కించుకుని, మత్తు మందు చల్లి, అత్యాచారానికి పాల్పడ్డారని టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఆ ఫోన్ నేరుగా తెలంగాణ పోలీసులకు వెళ్లిపోయింది. దీనిపై స్పందించిన అక్కడి పోలీసులు ఆంధ్రప్రదేశ్ టోల్ఫ్రీ నంబర్ ఇచ్చారు. దీంతో ఆమె నేరుగా మళ్లీ ఇక్కడి టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఎస్ఐ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సోమవారం శ్రీకాకుళంలో జరిగిన స్పందనలో ఎస్పీకి కూడా నేరుగా ఫిర్యాదు చేశారు. దీంతోపాటు స్థానిక మహిళా పోలీసు స్టేషన్లో కూడా కంప్లయింట్ ఇచ్చారు. ఒక భూమి విషయంలో ప్రకృతి లేఅవుట్ యజమానికి, తన కుటుంబానికి మధ్య వివాదం నడుస్తోందని, అందులో ఎస్ఐ, గ్రామ పెద్దల సమక్షంలో ఇరువర్గాల మధ్య లావాదేవీల ఒప్పందం జరిగిందని, అందులో కొంత మొత్తం లేఅవుట్ యజమాని ఇవ్వగా మిగతా మొత్తాన్ని చెల్లించే విషయంలో తాత్సారం చేస్తున్నారని, అదే విషయాన్ని ఎస్ఐకి, గ్రామ పెద్దలకు మళ్లీ ఫిర్యాదు చేశానని మహిళ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఒక రోజు ఎస్ఐ దారిలో తనను చూసి కారులో ఎక్కమని పిలిచారని, ఎక్కిన తర్వాత మత్తు మందు చల్లి అత్యాచారానికి యత్నించారని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తానికి మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు ఉన్నతాధికారులు సోమవారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విచారణపై ప్రభావం చూపొచ్చని అక్కడి నుంచి తప్పించి వీఆర్లోకి పంపించారు. ఆయన స్థానంలో లావేరు ఎస్ఐ చిరంజీవి జేఆర్పురం ఇన్చార్జ్ ఎస్ఐగా నియమించారు. నేనేంటో అందరికీ తెలుసు జేఆర్పురం పోలీస్స్టేషన్ ఎస్ఐగా కొంత కాలంగా పనిచేస్తున్నాను. నేనేంటో అందరికీ తెలుసు. రణస్థలం మండలంలో ఎవర్ని అడిగినా చెబుతారు. నేనెలాంటి తప్పు చేయలేదు. నా ఇల్లు రణస్థలం నడిబొడ్డున ఉంది. ఆరోపణల్లో వాస్తవం లేదు. ఇలాంటి ఫిర్యాదును నమ్మలేకపోతున్నాను. మా కుటుంబమంతా ఆందోళన చెందుతోంది. తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నాం. విచారణలో వాస్తవాలు బయటపడతాయి. కానీ ఈ లోగా నాకు ఎంత చెడ్డ పేరు. దుష్ప్రచారం జరిగిపోతోంది. మా కుటుంబం ఏమైపోవాలి. ఉద్దేశపూర్వకమైన ఫిర్యాదిది.– అశోక్బాబు,ఎస్ఐ, జేఆర్పురం పోలీసు స్టేషన్. ఫిర్యాదు మేరకు కేసు నమోదు మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. విచారణపై ప్రభావం చూపుతుందని ఎస్ఐను అక్కడి నుంచి తప్పించాం. ప్రస్తుతం వీఆర్లోకి పంపించాం. విచారణ తర్వాత వాస్తవాలు బయటపడతాయి. తదనంతరం శాఖా పరమైన చర్యలు ఉంటాయి. – ఎల్.కె.వి.రంగారావు,డిఐజీ, ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, జిల్లా ఎస్పీ -
అవినీతి ‘అశోక’వనం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికార పార్టీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇచ్ఛాపురం నియోజకవర్గంలో అవినీతి, మామూళ్ల వసూళ్లకు అంతు లేకుండా పోయిందని నియోజకవర్గ ప్రజలు ఆగ్రహిస్తున్నారు. నియోజకవర్గంలో అంగన్వాడీ న్యూట్రిషన్ కౌన్సిలర్ పోస్టుల నియామకంలో భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఎమ్మెల్యే అశోక్, ఆయన తండ్రి ప్రకాశ్, టీడీపీ నాయకులపై వచ్చిన ఆరోపణలు సంచలనం కలిగించాయి. 283 మంది కౌన్సిలర్ల నియామకం కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ముక్కుపిండి మరీ వసూలు చేశారని బాధితులే రోడ్డెక్కారు. 2015 నవంబరులో ఈ కౌన్సిలర్ల నియామకం జరిగింది. తీరా ఏడాది తిరగకముందే వారిని పోస్టింగుల నుంచి తొలగించేయడం గమనార్హం. బాధితులంతా నిరసనకు దిగి ఎమ్మెల్యే అశోక్ను చుట్టుముట్టి నిలదీసిన సంగతి తెలిసిందే. అలాగే ఇచ్ఛాపురం మండలంలోని తిప్పనపుట్టుగ గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఘనశ్యామ్ మజ్జి ఇంటర్మీడియెట్ తర్వాత టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశాడు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో అటెండర్ పోస్టు కోసం దివ్యాంగుల కోటాలో తన పేరు సిఫారసు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్కు విన్నవించుకుంటే..ఎమ్మెల్యే తండ్రి బెందాళం ప్రకాశ్ అక్షరాలా మూడు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. మరోవైపు ప్రభుత్వపరంగా జరిగే నిర్మాణ పనులనూ ఎమ్మెల్యే వదల్లేదు. తన బినామీలకే కట్టబెట్టారు. ఇసుక అక్రమ రవాణాకు అంతేలేదు బాహుదా, మహేంద్రతనయ నదులు ఇచ్ఛాపురం నియోజకవర్గానికి ప్రకృతి సంపద! వాటిలో ఇసుక తవ్వకాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందనే ఉద్దేశంతో ర్యాంపులకు ఎక్కడా గనులశాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు. కానీ అక్రమ సంపాదనే పనిగా పెట్టుకున్న కొంతమంది టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. ఆ నదుల్లో ఇసుకను నిలువెత్తు లోతున తవ్విచేసి రెండు చేతులా సంపాదించారు. సామాన్యుల ఇళ్లనూ వదల్లేదు హుద్హుద్ తుపాను బాధితుల కోసం సోంపేట, కవిటి మండల కేంద్రాల్లో నిర్మిస్తున్న ఇళ్లను కూడా టీడీపీ నాయకులు వదల్లేదు. తుపానుతో నష్టపోయినవారికి కాకుండా ఇతరుల నుంచి భారీగా ముడుపులు తీసుకుని ఆ ఇళ్లను కట్టబెట్టారనే విమర్శలు వస్తున్నాయి. తిత్లీ పరిహారంలోనూ పరిహాసం ఇటీవల తిత్లీ తుపానుతో నష్టపోయిన వారికి అందాల్సిన పరిహారం విషయంలోనూ ఎమ్మెల్యే అశోక్ అనుచరులు చేతివాటం ప్రదర్శించారు. బాధితుల జాబితాలో బినామీలను జొప్పించి, వారికి జరిగిన నష్టం తక్కువే అయినా అధిక మొత్తంలో చూపించి పరిహారంలో భారీగా పర్సంటేజీలు నొక్కేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు కూలిపోయిన కొబ్బరి చెట్లకు నష్టపరిహారం నమోదుకు సంబంధించిన ఆప్టికేషన్ లాగిన్ రహస్య సంకేతం(కోడ్) తెలుసుకుని ఈ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే కవిటి మండలంలో కొబ్బరి రైతులకు ప్రకటించిన రుణ ఉపశమనం పథకం (గరిష్ట లబ్ధి రూ.50వేలు) కోసం అమరావతిలోని రైతు ప్రాధికార సంస్థలో మేనేజ్ చేస్తామనే సాకుతో ఎమ్మెల్యే అనుచరుడైన ఓ టీడీపీ నాయకుడు పలువురు రైతుల నుంచి దండిగా వసూళ్లకు పాల్పడ్డాడు. ఆఖరికి రాయితీతో వచ్చే బోటు ఇంజిన్లు, వలలు ఇవ్వడానికీ భారీగానే వసూళ్లు చేయడంపై మత్స్యకారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. క్వారీల్లో కాసుల గలగల కంచిలి మండలంలోని జలంత్రకోట పంచాయతీ పరిధి క్రాంతినగర్, రాధాశాంతినగర్, నువాగడ గ్రామాల ఉనికికే ప్రమాదం పొంచి ఉన్నా అక్కడి కొండపై గ్రానైట్ క్వారీ నిర్వహణకు ఎమ్మెల్యే అశోక్ బంధువులే లీజు పొందడంపై స్థానికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపినా ఫలితం లేకపోయింది. కంచిలి మండలంలోని మండపల్లి పంచాయతీ పరిధి బంజిరి నారాయణపురం గ్రామానికి ఆనుకుని ఉన్న కొండపై కంకర తవ్వకాలకు, గ్రానైట్ క్వారీ, క్రషర్ ఏర్పాటుకు అక్రమంగా అనుమతులు ఇచ్చిన వ్యవహారం కూడా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. -
అశోక్ తంత్రం!
పచ్చచొక్కాలేసుకున్న కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ప్రచారంలో పాల్గొంటున్నారు. కొందరు అధికారులైతే కొన్ని కీలక నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలను నెత్తిన వేసుకున్నారు. అయితే వీరిమాయమాటలను నమ్మబోమంటూ ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: సమైక్యాంధ్ర ఉద్యమానికి తూట్లు పొడిచి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచరుడిగా ముద్రపడిన ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర నేత పరుచూరి అశోక్బాబు తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. గత రెండ్రోజులుగా విశాఖ లోనే మకాం వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే తన ముసుగు తీసేసి టీడీపీలో చేరి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న అశోక్బాబు రాష్ట్రమంత్రి లోకేష్ తోడల్లుడు భరత్, మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడులకు అనుకూలంగా ఆయా నియోజకవర్గాల్లో పరోక్షంగా ప్రచారం చేస్తు న్నారు. అశోక్బాబు గడిచిన రెండ్రోజులుగా విశాఖలోనే మకాం వేసి ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అవుతున్నారు. అశోక్బాబుకు అనుకూలమైన ఉద్యోగ సంఘ జిల్లా నేత వివిధ సంఘాల నేతలను రప్పించి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ çహోటల్లో దిగిన అశోక్బాబు ఉద్యోగసంఘాల నేతలతో భేటీ అయ్యేందుకు యత్నిస్తున్నప్పటికీ మెజార్టీ ఉద్యోగ సంఘల నేతలు రావడానికి ససేమిరా అంటున్నారు. ఇటీవలే ఏసీబీ కేసులో అడ్డంగా దొరికిపోయిన జిల్లా ఎన్జీవో సంఘ నాయకుడొకరు అశోక్బాబు అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఈయనపై నమోదైన ఆదాయానికి మించి ఆస్తులు కేసును ఎత్తి వేయిస్తానని ప్రభుత్వ పెద్దల తరఫున అశోక్బాబు హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. ఈ కారణంగానే సదరు ఉద్యోగసంఘ నేత తనకు అనుకూలంగా ఉన్న సంఘాల సభ్యులను అశోక్బాబు వద్దకు తీసుకొచ్చి ఉద్యోగులంతా టీడీపీకి అనుకూలంగానే ఉన్నారంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అశోక్బాబును కలిసేందుకు ఉద్యోగ సంఘ నేతలు కానీ, ఉద్యోగులు కానీ ఏమాత్రం ఇష్టపడడం లేదు. అంతేకాదు భూకుంభకోణంతో పాటు ఆదాయానికి మించి ఆస్తులు వంటి కేసులు నమోదైన అధికారులకు కూడా ఇదే తరహా హామీ అశోక్బాబు ఇచ్చి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెబుతున్నారు. మరో వైపు రిటైర్డ్ ఉద్యోగుల సంఘ జాతీయ నేతంటూ మరో నేత శుక్రవారం నగరంలో మకాం వేశారు. నాలుగేళ్లు తప్పించుకుని ఇటీవలే 75 ఏళ్ల వయస్సు కలిగిన వారికి పెన్షన్ 10 శాతం పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రిటైర్డ్ ఉద్యోగుల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి 70 ఏళ్లు దాటిన వారికి 15 శాతం, 80 ఏళ్లు దాటిన వారికి 25 శాతం పెంచాలని 90 ఏళ్లు దాటిన వారికి 50 శాతం పెరగాలని, 100 ఏళ్లు దాటితే 100 శాతం పెంచాలని గత పీఆర్సీ కమిషన్ సిఫార్సు చేసింది. వాటిని అమలు చేయని ప్రభుత్వం నాలుగేళ్లు తిప్పించుకుని 70 ఏళ్లు ఉన్న వారికి మాత్రమే పెన్షన్ 10 శాతం పెంచడాన్ని మెజార్టీ రిటైర్డ్ ఉద్యోగులు తీవ్రంగా తప్పుబడతున్నారు. ఈ పరిస్థితిలో వచ్చిన ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చూస్తున్న టీడీపీ నాయకులు అశోక్బాబును ఎరగా వేసి ఉద్యోగుల ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నా అది సఫలీకృతం కావడం లేదు. -
ఏపీలో కొత్త ఉద్యోగ సంఘాల జేఏసీ
-
ఏపీలో కొత్త ఉద్యోగ సంఘాల జేఏసీ
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో మరో కొత్త ఉద్యోగ సంఘాల జేఏసీ ఏర్పాటైంది. అశోక్బాబు, బొప్పరాజు సంఘాల వల్ల ఉద్యోగులు నష్టపోతున్న కారణంగా ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ సమాఖ్య ఏర్పాటు చేసినట్లు నూతన జేఏసీ కన్వీనర్ వెంకట్రామి రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పుడున్న ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల సమస్యల కోసం పోరాడకుండా ప్రభుత్వ భజన చేస్తున్నాయని మండిపడ్డారు. ఐఆర్, ఇళ్ల స్థలాలు ఇచ్చారంటూ సన్మానాలు, పాలాభిషేకాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ‘ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కోసం అమరావతిలో ఎకరానికి కోటికి పైగా రూపాయలు ఇస్తే.. దానికి సంబరాలు చేసుకున్నారు. ప్రైవేటు సంస్థలకు రూ. 30 లక్షలకు, రూ. 50లక్షలకు ఇచ్చిన ప్రభుత్వం....ఉద్యోగుల దగ్గర కోటి రూపాయలు వసూలు చేసి.. స్థలాలు ఇస్తుందా’ అని ప్రశ్నించారు. మీకసలు సిగ్గుందా? కొత్తగా ఏర్పడే ఉద్యోగ సంఘాల సమాఖ్య ఉద్యోగుల సమస్యలపై పోరాడుతుందన్న వెంకట్రామిరెడ్డి... ‘సీపీఎస్ కోసం అనేక పోరాటాలు చేసాము. అయినా ప్రభుత్వం స్పందించలేదు. 54 సంఘాలు ఇప్పటి వరకు మాకు మద్దతు ఇచ్చాయి. అమరావతి జేఏసీలో ఉన్న ఉద్యోగ సంఘాలు కుడా మద్దతు తెలుపుతున్నాయి. మేము ఏర్పాటు చేస్తున్న సమాఖ్యలో వారంతా కలుస్తున్నారు. కొంతమంది రాజకీయ పదవుల కోసం సిగ్గు లేకుండా ప్రభుత్వం భజన చేస్తున్నారు. అసలు మీకు సిగ్గుందా.. ఉద్యోగుల సమస్యలు మీకు పట్టవా’ అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు అశోక్ బాబు ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన... టీడీపీతోనే రాష్ట్రభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చారు. -
అశోక్ బాబుపై ఉద్యోగుల ఆగ్రహం
సాక్షి, తిరుపతి : ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంపై ఉద్యోగ సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. అశోక్ బాబు ఉద్యోగుల ప్రయోజనాలు తాకట్టు పెట్టారని, ఓ పార్టీ ముసుగులో ఉండి ఉద్యోగులకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. తమ ప్రయోజనాలు తాకట్టు పెట్టి అశోక్ బాబు ఎమ్మెల్సీ పదవి పొందారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ విమర్శించారు. ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. కాగా అశోక్ బాబు నిన్న (గురువారం) లుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు తనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన... టీడీపీతోనే రాష్ట్రభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చారు. -
ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా చంద్రశేఖర్రెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘానికి కొత్త నాయకత్వం వచ్చింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్.చంద్రశేఖర్రెడ్డి, బండి శ్రీనివాస్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా కొనసాగిన అశోక్బాబు స్వచ్ఛంద పదవీ విరమణ చేయడంతో ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. దీన్ని భర్తీ చేసేందుకు ఆదివారం ఉదయం విజయవాడలోని ఎన్జీవో హోమ్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. దీనికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు, మహిళా విభాగం అధ్యక్షురాలు, కన్వీనర్లు హాజరయ్యారు. రాష్ట్ర సంఘానికి ఇన్చార్జి అధ్యక్షునిగా ఉన్న సీహెచ్ పురుషోత్తంనాయుడు అధ్యక్షతన ఎన్నిక నిర్వహించారు. చంద్రశేఖర్రెడ్డి, బండి శ్రీనివాస్లను అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చంద్రశేఖర్రెడ్డి 1985 నుంచి ఏపీ ఎన్జీవో సంఘంలో వివిధ పదవులు నిర్వహించారు. ఐదున్నరేళ్లుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బండి శ్రీనివాస్ ప్రకాశం జిల్లా ఎన్జీవో సంఘ అధ్యక్షునిగా, ఇరిగేషన్ ఉద్యోగుల సంఘ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం.. ఈ సందర్భంగా విలేకరులతో నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఐదు లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు, నాలుగు లక్షలమంది పెన్షనర్ల సంక్షేమమే లక్ష్యంగా వారి న్యాయమైన కోర్కెల సాధనకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం నుంచి 35 శాతం మధ్యంతర భృతి మంజూరుకు ప్రయత్నిస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇళ్ల నిర్మాణాలకు స్థలాలిప్పించే విషయంలో ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం అశోక్బాబు మాట్లాడుతూ పదేళ్లపాటు ఎన్జీవో సంఘ నాయకునిగా క్రియాశీల పాత్ర పోషించానని, తనకు సహకరించిన ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పెద్దలకు భంగపాటు ఇదిలా ఉండగా, రాష్ట్ర ఎన్జీవో సంఘ ఎన్నికల్లో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని భంగపాటుకు గురయ్యారు. పశ్చిమ కృష్ణా ఎన్జీవో సంఘ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎ.విద్యాసాగర్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు అన్నివిధాలా ప్రయత్నించారు. చివరకు పోలీసు శాఖ ద్వారా కొన్ని జిల్లాల సంఘ నాయకులను బెదిరించినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. అశోక్బాబు ఆధ్యర్వంలో ఎన్జీవో సంఘం ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరించిందని, రానున్న ఎన్నికల నేపథ్యంలో అటువంటి కార్యవర్గమే ఉంటే అటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగులకు మంచిదనే అభిప్రాయాన్ని ఉద్యోగ సంఘ నాయకులకు వివరించినట్టు తెలుస్తోంది. విద్యాసాగర్ను ప్రధాన కార్యదర్శిగా చేసేందుకు సహకరించాలని అశోక్బాబు కూడా పలు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులకు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. అయితే 11 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడంతో సీఎం చంద్రబాబు వద్ద పంచాయతీ పెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆదివారం ఉదయం 9 గంటల్లోపు సీఎంతో అపాయింట్మెంట్ ఇప్పిస్తామని, ఆయనతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని కొందరు ముఖ్య నాయకుల్ని అధికారులు కోరారు. అయితే వారంతా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించి ఎన్నికను నిర్వహించారు. -
‘రాష్ట్రంలో ఉన్నవి బ్రోకర్, భజన సంఘాలే’
సాక్షి, విజయవాడ: ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షడు అశోక్బాబు వీఆర్ఎస్ను ప్రభుత్వం ఆమోదించడంపై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అశోక్ బాబు సంతకాలు పోర్జరి చేసి తప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ సమర్పించాడని ఆరోపించారు. శాఖ పరమైన చర్యల్లో భాగంగా అతనిపై చర్యలు తీసుకోవాలని సహచర ఉద్యోగులు కోరిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయంలో 2018వరకు విచారణ చేయకుండా జాప్యం చేశారని మండిపడ్డారు. డిగ్రీ ఉన్నట్టు సర్వీసు రిజిష్టర్లో అశోక్ బాబు దొంగ ఎంట్రీ చేశారని తెలిపారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం అశోక్బాబు క్లీన్ చీట్ ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. ఇదే రకమైన అభియోగాలు ఉద్యోగులందరికీ క్లీన్ చిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అశోక్బాబు ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకువచ్చి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారని విమర్శించారు. స్వచ్ఛందంగా పదవి విరమణ చేయాలంటే మూడు నెలల ముందు శాఖకు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు లేవని.. బ్రోకర్, భజన సంఘాలు మాత్రమే ఉన్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం అపాయింట్మెంట్ కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులకు మాత్రమే లభిస్తోందని తెలిపారు. విలువలు లేని అశోక్బాబును ఏ పార్టీలో చేర్చుకున్న వారికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అశోక్బాబు వీఆర్ఎస్కు ప్రభుత్వం అమోదం.. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబు వీఆర్ఎస్ గురువారం ఏపీ ప్రభుత్వం అమోదించింది. ప్రస్తుతం సహా అధ్యక్షుడిగా కొనసాగుతున్న పురుషోత్తం నాయుడు తాత్కాలిక అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, త్వరలో జరగబోయే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నూతన అధ్యక్షుడి ఎంపిక జరగనుంది. నూతన అధ్యక్షుడిగా ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని ఎన్నుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. -
వివాదస్పదంగా మారిన ఏపీ ఎన్జీవో నేత ఆశోక్ బాబు విఆర్ఎస్
-
వివాదాస్పదంగా మారిన అశోక్ బాబు వీఆర్ఎస్
సాక్షి, విజయవాడ : ఏపీ ఎన్జీవో స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) వివాదాస్సందంగా మారింది. నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ల వ్యవహారంలో అశోక్ బాబుకు విచారణాధికారి క్లీన్ ఎక్విడిక్ట్ ఇవ్వడంపై ఎన్జీవో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లీన్ ఎక్విడిక్ట్ను అడ్డుపెట్టుకొని అశోక్బాబు వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు వీఆర్ఎస్ ఇవ్వడం నిబంధనలకు విరుద్దమని కమర్షియల్ టాక్స్ ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ మేరకు కమర్షియల్ టాక్స కమిషనర్కు ఎన్జీవో నేతలు ఫిర్యాదు చేశారు. అశోక్ బాబుపై పలు కేసులు పెడింగ్లో ఉన్నాయని డీసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెన్షన్ రూల్ 44 ప్రకారం అశోక్కు వీఆర్ఎస్ ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. -
మద్యంమత్తులో ఎన్జీవో నేతల చిందులు
సాక్షి, పోలవరం (పశ్చిమ గోదావరి జిల్లా) : ఉదయం కార్యవర్గ సమావేశం.. చీకటి పడిన తర్వాత మందు, చిందు.. ఇదీ ఏపీ ఎన్జీవో నేతల నిర్వాకం.. సాక్షాత్తు ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సమక్షంలో నేతలంతా ఫుల్గా మందుకొట్టి చిందులేశారు. పోలవరంలోని గౌతమీ గెస్ట్హౌస్లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎన్జీవో నేతల సమావేశం అంటూ పిలుపు అందండంతో చాలామంది శనివారం ఉదయం ఇక్కడికి చేరుకున్నారు. ఉదయం ఏపీఎన్జీవోల కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మద్యం మత్తులో ఏపీ ఎన్జీవో నేతలు వయసును మరిచి చిందులేశారు. -
అశోక్ బాబు సమక్షంలో ఏపీ ఎన్జీవో నేతలు మందు, చిందు..
-
సీపీఎస్పై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి
గుంటూరు: సీపీఎస్ విధానంపై ఏపీ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వేసిన కమిటీపై తమకు నమ్మకం లేదని చెప్పారు. తమిళనాడులో కమిటీ వేసి రెండున్నరేళ్లు దాటినా ఫలితం లేదని పేర్కొన్నారు. ఇక్కడ వేసిన కమిటీ పరిస్థితి కూడా అదేనని అన్నారు. సీపీఎస్ కొనసాగిస్తే ఆర్ధిక భారం అనేది శుద్ధ అబద్ధమన్నారు. దీనిపై ప్రభుత్వంతో బహిరంగ చర్చకు తాము సిద్దమని సవాల్ విసిరారు. కొన్ని సంఘాలు మా పోరాటంపై విమర్శలు చేస్తున్నాయని, పద్ధతులు మార్చుకోకుంటే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఉద్యమాన్ని రాజకీయంగా వాడుకోవాల్సిన అవసరం జేఏసీకి లేదని వ్యాఖ్యానించారు. -
అశోక్బాబుపై ఉద్యోగుల ఆగ్రహం
సాక్షి, అమరావతి: ‘‘ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటి పరిష్కారంపై దృష్టి పెట్టకుండా, ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా మీరు రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు. మీరు సభలు నిర్వహిస్తే మేము రావాలా? మీ ఎదుగుదల కోసం మమ్మల్ని వాడుకుంటారా?’’ అని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబుపై ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీన గుంటూరులో సభ నిర్వహించాలని అశోక్బాబు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి కోసమే ఆయన ఈ సభ తలపెట్టారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా ముఖ్యమంత్రికి వంతపాడిన ఆయన ఇప్పుడు గుంటూరులో సభ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో దిగేందుకే తమను వాడుకుంటున్నారని మండిపడుతున్నారు. టీడీపీ ప్రభుత్వానికి, అశోక్బాబుకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల గురించి అందరికీ తెలుసని అంటున్నారు. ఏం చేశారని మీ వెంట రావాలి? ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబుకు పలువురు ఉద్యోగులు లేఖాస్త్రాలు సంధించారు. తమ సంక్షేమం కోసం ఇప్పటిదాకా మీరేం చేశారని మీ వెంట నడవాలని అశోక్బాబును నిలదీశారు. లేఖల్లోని కీలక అంశాలవీ... ⇒ మీరు(అశోక్బాబు) మీ అవసరాల కోసం ఎన్నోసార్లు ముఖ్యమంత్రిని కలిశారు. ఒక్కసారైనా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ గురించి మాట్లాడారా? ⇒ జీవో నెం.27ను విడుదల చేసి కాంట్రాక్టు ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తుంటే.. ఆ జీవోను మీరు సమర్థించినందుకు మీ వెంట రావాలా? ⇒ కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్ధీకరణ కోసం ఒక్కసారైనా మంత్రివర్గ ఉపసంఘాన్ని కలిశారా? ⇒ సీపీఎస్ రద్దు గురించి ఏరోజైనా మీరు ముఖ్యమంత్రితో మాట్లాడిన సందర్భాలున్నాయా? ⇒ సీపీఎస్ కోసం కమిటీ వేసి కాలయాపన చేయండని ముఖ్యమంత్రికి చెప్పిన మాట వాస్తవం కాదా? ⇒ జీవో నెం.27తో లబ్ధి పొందిన అతికొద్ది మందితో మీరు సన్మానాలు చేయించుకోవడం నిజం కాదా? ⇒ ప్రభుత్వ ఉద్యోగులకు 15వ పీఆర్సీ జాప్యం జరిగితే మధ్యంతర భృతి గురించి ఒక్కమాటైనా అడిగారా? అశోక్బాబును విశ్వసించడం లేదు ‘‘ప్రభుత్వ ఉద్యోగులెవరూ అశోక్బాబును విశ్వసించడం లేదు. ఆయన వెంట నడిచేవారు ఎవరూ లేరు. సీపీఎస్పై పూటకోమాట మాట్లాడుతున్నారు. నూతన పెన్షన్ విధానం రద్దు అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన 653, 654, 655 జీవోలను రద్దు చేస్తే చాలు. అసెంబ్లీ తీర్మానం కూడా అవసరం లేదు’’ – పాలేల రామాంజనేయులు యాదవ్, అధ్యక్షులు, ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోషియేషన్ కాంట్రాక్టు ఉద్యోగులు ఇప్పుడే గుర్తొచ్చారా? ‘‘నాలుగున్నరేళ్లుగా కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల గురించి ఒక్కసారి కూడా మాట్లాడని అశోక్బాబు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సభలు నిర్వహించి, ఉద్యోగులను రమ్మని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. నాలుగున్నరేళ్లుగా ఆయనకు కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు, వారి పోరాటాలు కనిపించలేదా? ఇప్పుడే గుర్తొచ్చాయా? – ఏవీ శేషయ్య, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు, నెల్లూరు -
అశోక్బాబుకు ఏపీఎండీసీ ఛైర్మన్ పదవి, ఎమ్మెల్సీ!
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబుకు ఏపీ ఎండీసీ (ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) చైర్మన్ పదవి ఖరారైంది. ఈ మేరకు అశోక్బాబుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. అశోక్బాబు స్వచ్చంద ఉద్యోగ విరమణ చేయగానే ఏపీ ఎండీసీ చైర్మన్గా నియమించనున్నారు. అలాగే మార్చిలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు కృతజ్ఞతగా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే వ్యక్తి ఏపీ ఎన్జీవో అధ్యక్షుడిగా ఎన్నికయ్యేలా కృషి చేస్తానని అశోక్బాబు తన స్వామి భక్తి చూపించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ కోసం గతంలోనే ప్రయత్నం.. వాస్తవానికి కొన్ని నెలల కిందటే ఎమ్మెల్సీ పదవి కోసం అశోక్బాబు తీవ్రంగా ప్రయత్నించారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతి చెందడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవిని తనకు ఇవ్వాలని అశోక్బాబు అడగ్గా.. ఇందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే ముద్దుకృష్ణమ కుటుంబం ఆ ఎమ్మెల్సీ పదవి తమకే కావాలని పట్టుబట్టడంతో.. ఏదైనా కార్పొరేషన్ చూసుకోవాలని సీఎం సూచించడంతో అశోక్బాబు ఏపీ ఎండీసీ చైర్మన్ పదవిని ఎంపిక చేసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఉద్యోగానికి స్వచ్చంద విరమణ తీసుకోగానే.. ఏపీఎండీసీ చైర్మన్గా నియమిస్తానని అశోక్బాబుకు సీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఏపీఎండీసీ చైర్మన్ పదవి రాగానే ఎన్జీవో అధ్యక్ష పదవికి రాజీనామా చేసి.. ప్రభుత్వ అనుకూల వ్యక్తిని ఆ స్థానంలోకి వచ్చేలా శాయశక్తులా కృషి చేస్తానని ముఖ్యమంత్రికి అశోక్బాబు చెప్పినట్లు సమాచారం. దీంతో మార్చిలో ఏపీ ఎండీసీ చైర్మన్ పదవి వదులుకుంటే.. ఎమ్మెల్సీ అయ్యేందుకు కూడా అవకాశం కల్పిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఓ ఉన్నతాధికారి ద్వారా తెలిసింది. విచారణ పూర్తయితేనే ఉద్యోగ విరమణ ఇదిలాఉండగా, అశోక్బాబు స్వచ్చంద ఉద్యోగ విరమణకు పలు అడ్డంకులు ఎదురయ్యాయి. ఆయన ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా పనిచేస్తున్నారు. ఆయనపై నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతి పొందారనే ఆరోపణలున్నాయి. దీనిపై అప్పట్లో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణ కొనసాగుతోంది. ఇది పూర్తయ్యి క్లీన్చిట్ వస్తేనే స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. దీంతో క్లీన్చిట్ తెచ్చుకునేందుకు అశోక్బాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు వాణిజ్య విభాగంలోని ఓ అధికారి ‘సాక్షి’తో చెప్పారు. విచారణాధికారిగా ఉన్న ఓ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అశోక్బాబుకు క్లీన్చిట్ ఇచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి అశోక్బాబుకు అనుకూలంగా వ్యవహరించాలని విచారణాధికారులను కొందరు ప్రభుత్వ పెద్దలు ఆదేశించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యాసాగర్ అభ్యర్థిత్వంపై తీవ్ర వ్యతిరేకత.. రాష్ట్రంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ 15 యూనిట్లుగా ఉంది. అశోక్బాబు రాజీనామా చేస్తే ఈ 15 యూనిట్ల అధ్యక్షులు, కార్యదర్శుల్లో మెజారిటీ సభ్యులు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. అయితే చాలా ఏళ్లుగా జనరల్ సెక్రటరీనే అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ వస్తున్నారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో తమకు అనుకూలమైన వ్యక్తిని ఏపీ ఎన్జీవో అధ్యక్ష పదవిలో నియమించాలని ప్రభుత్వం పట్టుబట్టడంతో.. వెస్ట్ కృష్ణా యూనిట్ అధ్యక్షుడు విద్యాసాగర్ పేరును అశోక్బాబు తెరపైకి తెచ్చినట్లు అసోసియేషన్ సభ్యులు చెప్పారు. కానీ విద్యాసాగర్ను 15 యూనిట్లలో 12 యూనిట్ల సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సాగర్ను అధ్యక్షుడిని చేయాలని చూస్తే.. అసోసియేషన్ నుంచి పూర్తిగా తప్పుకుంటామని వారు హెచ్చరించినట్లు సమాచారం. అసోసియేషన్ను రాజకీయాల్లోకి లాగొద్దు.. కొన్ని రోజుల కిందట ఏలూరులో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 12 యూనిట్లకు సంబంధించిన సభ్యులు ప్రస్తుత జనరల్ సెక్రటరీని అధ్యక్షుడిగా చేయాలని, మరో ముగ్గురు సభ్యులను కార్యవర్గంలోకి తీసుకోవాలని కోరుతూ సంతకాలు చేశారు. ఆ తర్వాత విశాఖలోనూ ఇలాగే జరిగింది. మెజారిటీ సభ్యులు విద్యాసాగర్ను వ్యతిరేకించారు. ‘కావాలంటే మీరు రాజకీయాల్లోకి వెళ్లండి. అంతేగానీ అసోసియేషన్ను మాత్రం రాజకీయాల్లోకి లాగొద్దు. ఇది రాజకీయ అనుబంధ సంస్థ కాదు. ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్నది’ అని పలువురు సభ్యులు అశోక్బాబును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు బయటకు వెళితేనే అసోసియేషన్కు మంచిది.. అలాగే విజయవాడలోని ఎన్జీవో భవన్లో శనివారం(18వ తేదీ) అర్ధరాత్రి కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి తమ అభిప్రాయం, సంతకాలు చేసిన కాపీని అశోక్బాబుకు అందించారు. దీంతో నన్నెప్పుడు వెళ్లిపొమ్మంటారంటూ అశోక్బాబు ఆ సభ్యులను ముభావంగా ప్రశ్నించినట్లు తెలిసింది. ‘మీరు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా ముద్ర వేసుకున్నారు. మీరు ఎంత త్వరగా బయటికి వెళితే అంత మంచిది. లేకపోతే ఏ పార్టీతోనూ సంబంధం లేదని మీడియాకు చెప్పండి’ అని అసోసియేషన్ సభ్యులు తేల్చిచెప్పారు. ‘ఇప్పటికే చాలామంది ఉద్యోగులు అశోక్బాబు అంటే టీడీపీ సభ్యుడనే అభిప్రాయంలో ఉన్నారు. మీరు ఎంత త్వరగా అసోసియేషన్ నుంచి బయటకు వెళితే అంత మంచిది. మన అసోసియేషన్కు రాజకీయ ముద్ర ఉందన్న అపప్రద పోతుంది’ అని అశోక్బాబుపై మరికొందరు విరుచుకుపడ్డారు. దీంతో ఉక్కిరిబిక్కరి అయిన అశోక్బాబు.. త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పి వెళ్లిపోయారని ఆ సమావేశానికి హాజరైన ఎన్జీవో సభ్యులు తెలిపారు. -
సీపీఎస్ రద్దు చేయాల్సిందే..
సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) రద్దు చేసే వరకూ పోరాటం ఆపేదిలేదని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. రాష్ట్రంలో సీపీఎస్ అమలు చేసేదిలేదని టీడీపీ ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించే వరకూ సీఎం చంద్రబాబు నాటకాలు నమ్మేది లేదని సంఘాల నేతలు ప్రకటించారు. ఉద్యమంలో చంద్రబాబు మాదిరిగా యూటర్న్లు తీసుకోవద్దని సంఘాలను పలువురు నేతలు కోరారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో విజయవాడలోని జింఖాన గ్రౌండ్స్లో శనివారం బహిరంగ సభ నిర్వహించారు. సీపీఎస్ అమలుతో రాష్ట్రంలో లక్షా 50 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్మెంట్ తరువాత పెన్షన్ భద్రత కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కనీస స్పందనలేదని ద్వజమెత్తారు. ఉద్యోగుల పొట్టకొట్టే ఈ విధానంపై టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన వైఖరి తక్షణం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేయిస్తామని ఇప్పటికే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు. ఎన్నికల వరకు చూడకుండా సీపీఎస్ రద్దు కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోను, ఎంపీలు రాజ్యసభలోను ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టాలని పలువురు కోరారు. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయని, ఉపాధ్యాయ, ఉద్యోగులకు అండగా ఉండే రాజకీయ పార్టీలకే మేము దన్నుగా ఉంటామని ప్రకటించారు. సీపీఎస్ రద్దు అనేది రాజకీయ నినాదంగా మారాలని, అందుకోసం రానున్న మూడు నెలల్లో పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగానే సెప్టెంబర్ 1న చేపట్టే కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఫ్యాప్టో రాష్ట్ర అధ్యక్షుడు పి.బాబురెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో సీపీఎస్ రద్దుకు మద్దతు ఇస్తున్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఏపీలో నోరు మెదపకుండా రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఫ్యాప్టో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.హృదయరాజు మాట్లాడుతూ.. క్రమశిక్షణతో మెలిగే ఉపాధ్యాయులు తిరగబడితే ఏం జరుగుతుందో పాలకులకు తెలియజెప్పాలన్నారు. ఎమ్మెల్సీలు రెడ్డప్ప బాలసుబ్రహ్మణ్యం, బొడ్డు నాగేశ్వరరావు, కత్తి నర్సింహారెడ్డి, వై.శ్రీనివాసరావు, రాము సూర్యారావు మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా సీపీఎస్ రద్దు కోసం మండలిలో తమ వాణి వినిపిస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమాఖ్య జాతీయ నాయకుడు జి.నాగేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఏ గఫూర్, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పెద్దన్న, ఏపీఎన్జీవో అధ్యక్షుడు పి.అశోక్బాబు తదితర నేతలు ఉపాధ్యాయుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. క్విట్ సీపీఎస్ నినాదంతో మూడు జాతాలు క్విట్ సీపీఎస్ నినాదంతో చేపట్టిన మూడు జాతాలు 13 రోజులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి విజయవాడ చేరుకున్నాయి. 12 ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కుప్పం, అనంతపురం జిల్లా లేపాక్షి , శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ప్రారంభించిన ఈ జాతాలు అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజలకు తమ ఇబ్బందులు వివరించి వారి మద్దతు కోరాయి. శనివారం విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి జింఖానా గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వర్షం పడుతున్నా లెక్కచేయక గంటల తరబడి ర్యాలీ, బహిరంగ సభల్లో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అశోక్బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు.. ఉపాధ్యాయులకు సంఘీభావంగా వచ్చిన ఏపీఎన్జీవో నేత అశోక్బాబుకు చేదు అనుభవం ఎదురైంది. అశోక్బాబు గో బ్యాక్ అంటూ, ఆయనను రానివ్వద్దని పలువురు టీచర్లు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అశోక్బాబు టీడీపీ ఏజెంటని పలువురు పేర్కొన్నారు. దీంతో సభలో అలజడి రేగింది. ఫ్యాప్టో అధ్యక్షుడు బాబురెడ్డి, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు జోక్యం చేసుకుని సభికులకు నచ్చజెప్పారు. అశోక్బాబు మాట్లాడేటప్పుడు కూడా సభలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
సీపీఎస్ ధర్నాలో ఆశోక్బాబుకు చుక్కెదురు
-
ఎవడబ్బ సొమ్మని అశోక్బాబు విరాళం ఇస్తారు ?
-
‘రైతుల ఆదాయం పెంచా’
ఏలూరు (మెట్రో)/ఏలూరు టౌన్: వ్యవసాయ రంగాన్ని కేంద్రం నాశనం చేస్తుంటే తాను ప్రశ్నించానని సీఎం చంద్రబాబు అన్నారు. రైతులను ఆదుకునేందుకు ఎంతదూరమైనా వెళ్తానన్నారు. పశ్చిమగోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) శత వార్షికోత్సవంలో భాగంగా ఏలూరు ఇండోర్ స్టేడియంలో మంగళవారం ప్రత్యేకంగా నిర్వహించిన రైతుల సభలో సీఎం మాట్లాడారు. రైతు ఆదాయం రెండింతలు అభివృద్ధి చేస్తానని మోదీ చెప్పినప్పటికీ అది సాధ్యం కాలేదనీ, తాను మాత్రం 11 శాతం అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రైతులకు లబ్ధి చేకూర్చే స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మాటేమిటని కేంద్రాన్ని ప్రశ్నించానన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సాగునీటికి, ఎరువులకు కొరత లేకుండా చూశామని చెప్పారు. రైతు రుణమాఫీ విషయంలో ధైర్యంగా తాను ముందడుగు వేస్తే మోదీ మాత్రం ఇవ్వలేనని చేతులెత్తేశారన్నారు. ప్రధాని మాటలకు చేతలకు పొంతన లేకుండా పోతోందన్నారు. అలాగే, వ్యవసాయంలో ఉపాధి హామీ పథకం (నరేగా)ను అమలుచేయాలని తాను కోరిన ఫలితంగానే కేంద్రం కమిటీ వేసిందని సీఎం చెప్పారు. ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వనంటోందని, మోసం చేస్తోందని, అయినా సాధించుకుంటామని చెప్పారు. ప్రతిపక్షాన్ని బీజేపీ ఆటలాడిస్తోందని, పవన్కళ్యాణ్ను తనపైకి ఉసిగొల్పుతోందని మండిపడ్డారు. గతంలో తన పాట పాడిన పవన్కళ్యాణ్ ప్రస్తుతం బీజేపీ పాట పాడుతున్నారన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పేందుకు కేంద్రం అడ్డుతగులుతోందన్నారు. కనీసం తాను నిర్మాణం చేస్తానన్నా సహకరించట్లేదన్నారు. కాగా, ఏలూరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రి రెడ్క్రాస్ భవనంలో తలసేమియా, హిమోఫీలియా వ్యాధిగ్రస్తుల చికిత్సా భవనాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు పూర్తిస్థాయిలో ఔషధాలను సమకూర్చడంతోపాటు నెలకు రూ.2 వేలు పెన్షన్గా అందిస్తామని చెప్పారు. గేట్లు వేసి.. రైతులను బంధించి.. ఇదిలా ఉంటే.. రైతుల సభకు హాజరైన వారిని బయటకు వెళ్లకుండా పోలీసులు గేట్లు వేసి బంధించడం విమర్శలకు తావిచ్చింది. సభకు జిల్లావ్యాప్తంగా వెయ్యిమందికి పైగా రైతులు, మహిళలు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం మ.1.30 గంటలకు ప్రారంభమవ్వాల్సిన సభ గంటన్నర ఆలస్యంగా మొదలైంది. తదుపరి టీడీపీ ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రసంగాలు కొనసా..గాయి. దీంతో రైతులు సభాప్రాంగణం నుంచి బయటకు వెళ్లిపోవటం మొదలెట్టారు. 3.45కు సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని ప్రారంభించగానే రైతులు భారీసంఖ్యలో బయటకు వెళ్లిపోసాగారు. గమనించిన పోలీసు అధికారులు గేట్లు వేసేసి.. రైతులు బయటకు పోకుండా అడ్డుకున్నారు. దీంతో మమ్మల్ని బయటకు వెళ్లనీయండి బాబోయ్ అని రైతులు గగ్గోలు పెట్టారు. ఇలా బంధించి ఇబ్బంది పెడితే ఎలాగని అసహనం వ్యక్తంచేశారు. నినాదాలకు దిగారు. పరిస్థితి విషమించటంతో పోలీసులు గేట్లు తీయగా రైతులు, మహిళలు బయటకు పరుగులు తీశారు. టీడీపీలో చేరండి : అశోక్బాబుకు సీఎం ఆదేశం ఇదిలా ఉంటే.. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబును తమ పార్టీలో చేరాల్సిందిగా సీఎం చంద్రబాబునాయుడు మరోసారి ఆహ్వానించారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం మంగళవారం ఏలూరులో జిల్లా ఎన్జీఓ హోంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగుల తరఫున పోరాటాలు చేస్తున్న అశోక్బాబు ప్రజలకు సేవచేయడం ఎంతో అవసరమన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని అశోక్బాబును ఎప్పుడో కోరానని.. ఈ మేరకు ఎప్పుడో పార్టీలోకి రమ్మన్నానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పోటీచేయాలని అశోక్బాబును సీఎం కోరారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పిస్తున్నానని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. -
అశోక్బాబుకు చంద్రబాబు ఆహ్వానం
సాక్షి, ఏలూరు : ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో నాయకుడు అశోక్బాబును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఏలూరులో ఏపీ ఎన్జీవో హో భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న అశోక్బాబు టీడీపీలో చేరి క్రీయాశీలకంగా వ్యవహరించాలని కోరారు. ఏపీ విభజన సందర్భంగా ఎన్జీవోలు తీవ్ర పోరాటాలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అశోక్ బాబు ఎప్పుడు పార్టీలో చేరినా సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. -
‘బాబుకు బుద్ధి చెప్పేందుకు ఉద్యోగులు సిద్ధం’
సాక్షి, అనంతపురం: ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో చంద్రబాబు సర్కార్ చలగాటం ఆడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వెన్నపూస గోపాల్ రెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల ప్రయోజనాలను చంద్రబాబు వద్ద అశోక్ బాబు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల 15 రోజుల వేతనాన్ని విరాళంగా ఇచ్చేందుకు అశోక్ బాబు ఎవరు? ఉద్యోగుల అంగీకారం లేకుండానే 200 కోట్లు లాగేసుకుంటారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, అశోక్ బాబులకు ఉద్యోగులు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. -
ఏపీఎన్జీవో అధ్యక్షుడు ఆశోక్బాబుకు హైకోర్టులో చుక్కెదురు
-
అశోక్బాబుకు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. అడ్హాక్ కమిటీని రద్దు చేయాలని కోరుతూ అశోక్బాబు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. పిటిషన్పై ఈ నెల 13న వాదనలు విన్న సింగిల్ బెంచ్ స్టే విధించింది. పిటిషన్పై స్టే ఇవ్వడాన్ని సవాలు చేస్తూ అడ్హక్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ డివిజన్ బెంచ్లో పిటిషన్ వేశారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ స్టేను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. జనరల్ బాడీ మీటింగ్ను ఎందుకు నిర్వహించలేదని, సంవత్సరాంతర రిటర్న్స్ను ఎందుకు ఇంకా సమర్పించలేదని అశోక్బాబును హైకోర్టు ప్రశ్నించింది. నిబంధన ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని డీసీవోను ఆదేశించింది. -
హౌసింగ్ సొసైటీలో అవకతవకలే ఘర్షణకు కారణం
-
ఏపీ ఎన్జీవోస్ భవనం వద్ద ఉద్రిక్తత
-
ఏపీ ఎన్జీవో నేత అశోక్బాబుపై దాడి
హైదరాబాద్: ఏపీ ఎన్జీవో గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఉద్యోగుల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. ఆదివారం గన్ఫౌండ్రీలోని ఏపీ ఎన్జీవోస్ భవనంలో గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, సొసైటీలో అవకతవకలపై చర్చించారు. అయితే చర్చ జరుగుతుండగానే ఉద్యోగుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుని ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడే వరకూ వెళ్లింది. ఈ క్రమంలో ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డిపై కొందరు దాడికి పాల్పడ్డారు. దాడిలో అశోక్బాబు చొక్కా చిరిగిపోగా, ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఇరు వర్గాలు అబిడ్స్ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేశాయి. దాడులకు దిగిన ఉద్యోగులు.. గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీలో 5,500 మంది సభ్యులు ఉండగా.. వీరిలో 3,000 మంది ఏపీకి వెళ్లగా, 2,500 మంది తెలంగాణలో స్థిరపడి ఉన్నారు. కాగా, సొసైటీలో స్థలం కోసం అలాట్మెంట్ సభ్యులు ఒక్కొక్కరు రూ.1,60,000 చెల్లించగా.. మిగిలిన నాన్ అలాటీ సభ్యులు రూ.30,000 చెల్లించారు. ఉద్యోగులు చెల్లించిన మొత్తం రూ.34 కోట్ల వరకు జమయ్యింది. అయితే స్థలాల కోసం డబ్బులు చెల్లించిన కొందరు విశ్రాంత ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు తమ డబ్బును తిరిగి ఇవ్వాలని అశోక్బాబుపై ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో అశోక్బాబు వర్గం, ఇతర ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆవేశానికి లోనైన పలువురు ఉద్యోగులు భౌతిక దాడులకు పాల్పడ్డారు. విచారణ చేపట్టాలి: సత్యనారాయణగౌడ్ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీని విభజించాలని కోరుతున్నప్పటికీ అశోక్బాబు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నాడని భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్ ఆరోపించారు. సొసైటీ పేరుతో ఉద్యోగుల నుంచి రూ.34 కోట్లు వసూలు చేశారని, అందులో రూ.18 కోట్లకు అభివృద్ధి పేరిట తప్పుడు లెక్కలు చూపించారని చెప్పారు. అవకతవకలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పథకం ప్రకారమే దాడి: అశోక్బాబు హౌసింగ్ సొసైటీ సమస్యను సామరస్యంగా పరిష్కరించే సమయంలో తనపై, చంద్రశేఖర్రెడ్డిపై పథకం ప్రకారం దాడి చేశారని అశోక్బాబు అన్నారు. ఈ దాడిని ఖండిస్తున్నామని, సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలే తప్ప దాడులతో కాదని హితవు పలికారు. -
అశోక్బాబు ప్రజాసేవలోకి రా.. : చంద్రబాబు
సాక్షి, విజయవాడ : ఏపీ ఎన్జీవో ఉద్యోగ సంఘం అధ్యక్షుడు అశోక్బాబు మరో ఏడాదిలో రిటైరవుతున్నారని, కాబట్టి ప్రజాసేవలోకి (రాజకీయాల్లోకి) రమ్మని ఆయనను ఆహ్వానిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్లో చేపట్టిన నవనిర్మాణ దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తిరుమల ఆలయంలో వజ్రం పోయిందంటున్నారని, ఈ విషయంలో సీబీఐ విచారణ పేరుతో అప్రతిష్టపాలు చేయాలనుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. సాక్షాత్తు వేంకటేశ్వరస్వామిని కూడా తానే కాపాడతానని అన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా బీజేపీలో ఉన్నట్టే మాట్లాడుతున్నారని అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా ఎవరు చెప్తే వాళ్లే సీఎం అవుతారని అంటున్నారని, ఇలా బీజేపీ రకరకాలుగా అందరినీ నడిపిస్తోందని విమర్శించారు. ఇవన్నీ చూస్తుంటే హీరో శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ నిజమని అనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తమపై కుట్ర చేస్తున్నారని, కుట్రలో భాగంగానే పవన్ కల్యాణ్ తనపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ‘ఇన్నాళ్లు నేను పవన్ కల్యాణ్కు మంచిగా కనిపించాను. కేంద్రంతో విభేదించగానే పవన్కు చెడ్డగా కనిపిస్తున్నాను.పవన్ కల్యాణ్ను ఉత్తరాంధ్ర పంపి అక్కడ రెచ్చగొడుతున్నారు. నాడు రాష్ట్ర విభజన సమయంలో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడా? అప్పుడేమీ మాట్లాడలేదు. మోదీకి సహకరించాలని 2014లో మాతో వచ్చారు’ అని అన్నారు. బీజేపీ రమణ దీక్షితులను వాడుకుంటోందని ఆరోపించారు. -
ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న అశోక్ బాబు
సాక్షి, అమరావతి : ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాల్సిన యూనియన్ నాయకులే పదవీకాంక్షతో వందలాది మంది ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో అదే జరుగుతోంది. ఉద్యోగులకు గెజిటెడ్ హోదా వస్తే ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్ష పదవి పోతుందన్న భయంతో పి.అశోక్బాబు దానికి అడ్డుపడుతున్నారని వాణిజ్య శాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిళ్లు జీఎస్టీ అమల్లోకి వచ్చాక కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ శాఖలోని ఉద్యోగులతో సమానంగా వాణిజ్య శాఖ ఉద్యోగుల హోదాలను మార్చాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా గ్రేడ్ టు నాన్ గెజిటెడ్ హోదాలో ఉన్న అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో) పదవిని గెజిటెడ్ హోదాతో కూడిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్ (జీఎస్టీవో)గా మార్చాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏసీటీవోలను జీఎస్టీవోలుగా మారుస్తూ సర్వీస్ నిబంధనలు జారీ అయ్యాయి. అయితే తమకు గెజిట్డ్ హోదా రాకుండా కొన్ని రాజకీయ శక్తులు అడ్డుపడుతున్నాయని ఏసీటీవోలు వాపోతున్నారు. కారుణ్య నియామకం కింద వాణిజ్య శాఖలో ఏసీటీవోగా విధులు నిర్వర్తిస్తున్న అశోక్బాబు గెజిటెడ్ హోదాతో కూడిన జీఎస్టీవోగా మారితే.. తక్షణం నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘం నేత పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి జీవో రాకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. తన పదవి కోసం మిగిలిన 768 ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న గెజిటెడ్ హోదాకు సంబంధించిన ఫైలు కదలకుండా పైనుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపిస్తున్నారు. కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్యామలరావుతో పాటు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు కూడా ఆమోదం తెలిపినా తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అశోక్బాబు అడ్డుకుంటున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం అమలు చేయాలి రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్, కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ వంటి వారికి ఇప్పటికే గెజిటెడ్ హోదా కల్పించారు. అదే గ్రేడు పరిధిలోకి వచ్చే జీఎస్టీవోలకూ గెజిటెడ్ హోదా కల్పించాలి. ఇప్పటికే ఏసీటీవోలను జీఎస్టీవోలుగా మారుస్తూ సర్వీసు నిబంధనల్లో సవరణ చేశారు. వ్యక్తులతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్న గెజిటెడ్ హోదాను తక్షణం నోటిఫై చేయాలని డిమాండ్ చేస్తున్నాం. – కె.ఆర్.సూర్యనారాయణ, వాణిజ్య శాఖ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు -
ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టిన పీఆర్సీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల మధ్య 11వ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) ఉత్తర్వులు చిచ్చుపెట్టాయి. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సిఫార్సుల సమర్పణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీను ఏర్పాటు చేసింది. అన్ని అంశాలను పరిశీలించి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఆర్థిక నిపుణులతో చర్చించి ఏడాదిలోగా వేతన సవరణపై సిఫారసులను ప్రభుత్వానికి సమర్పించాలని పీఆర్సీని ఆదేశించినట్లు పేర్కొంటూ ప్రభుత్వం శుక్రవారం (మే 18) ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త వేతన సవరణ సిఫారసుల కోసం తక్షణమే 11వ పీఆర్సీని ఏర్పాటు చేయాలంటూ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (అమరావతి జేఏసీ) సమర్పించిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకుని కమిషన్ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొనడంతో ఉద్యోగ సంఘాల మధ్య వివాదం నెలకొంది. అశోక్బాబు వర్సెస్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలో ఏపీఏన్జీవో, సచివాలయ ఉద్యోగల సంఘాలను ప్రస్తావించక పోవడంపై ఎన్జీవో నేత అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంఘాలను ఎందుకు పెట్టలేదని అశోక్ బాబు వర్గం మండిపడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కార్యాలయంలో ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్రతో సోమవారం అశోక్బాబు నేతృత్వంలోని ప్రతినిధులు భేటీ అయ్యారు. జీవోలో తమ సంఘాలను ఎందుకు చేర్చలేదని వారు ప్రశ్నించారు. అయితే పీఆర్సీని నియమించమని వినతిపత్రం ఇవ్వలేనందునే ఏపీఎన్జీవోలో పేర్లు చేర్చలేదని సీఎం వర్గాలు తెలిపాయి. తాజా వివాదంతో అశోక్బాబు వర్సెస్ బొప్పరాజు వెంకటేశ్వర్లుగా వ్యవహారం మారిపోయింది. -
‘అశోక్బాబు రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నారు’
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలు పట్టడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు సంబంధించి రెండు డీఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. అంతే కాకుండా 10వ పీఆర్సీ బకాయిలు కూడా ఇంకా ఇవ్వలేదని తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లపై ఎన్జీవో నేత అశోక్బాబు పోరాడటం లేదని విమర్శించారు. అశోక్బాబు రాజకీయ నేతగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. -
ఆపరేషన్ అశోక్..టీడీపీకి షాక్!
-
అశోక్బాబుపై చర్యలు తీసుకోండి
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్జీవో నేత అశోక్బాబు ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతూ సర్వీసు రూల్స్కు విరుద్ధంగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో పాటు ప్రధానిపై విమర్శలు గుప్పించినందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు బుధవారం గవర్నర్ నరసింహన్ను కోరారు. ఆ పార్టీ అధికార ప్రతినిధులు సుధీష్రాంబొట్ల, ఆంజనేయరెడ్డి, తెలంగాణ రాష్ట్ర పార్టీ నేతలు ప్రకాష్రెడ్డి, రామకృష్ణ ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. సుధీష్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగిగా నిబంధనలు ఉల్లఘించిన అశోక్బాబు.. ఇప్పుడు రాజీనామా చేస్తానని చెబుతున్నారని, ఉద్యోగానికి రాజీనామా చేసినా క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకు ఆయనకు పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం చెల్లించే గ్రాట్యూటీ, పెన్షన్ వంటివి నిలుపుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ను కోరామన్నారు. -
ప్రత్యేక హోదా కోసం ఎన్జీవోల ధర్నా
సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో బుధవారం ధర్నాచౌక్లో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొనడానికి కొంత సమయం తీసుకున్నామని తెలిపారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రంలో దీక్షలతో అభివృద్ధి అగిపోతుందనే ఇంతకాలం వేచి చూశామని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇకపై హోదా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు వారి ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. తాము ఏ పార్టీకి సపోర్ట్ కాదని చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏవిధంగా పాల్గొన్నామో అదేవిధంగా హోదాకోసం పోరాటం చేస్తామని వ్యాఖ్యానించారు. పూర్తి స్థాయి కార్యాచరణ మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తామన్నారు. -
అశోక్బాబు పై చర్యలు తీసుకోవాలి..
-
‘అశోక్బాబు రాజీనామా సవాల్.. అందుకే’
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ నరసింహన్తో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు బుధవారం భేటీ అయ్యారు. కర్ణాటక ఎన్నికల్లో ఇటీవల ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు చేసిన ప్రచారంపై చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్కు వినతి పత్రం అందజేశారు. గవర్నర్తో భేటీ అనంతరం ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధీశ్ రాంభొట్ల మాట్లాడుతూ.. ఓ ఎన్జీవోకు అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల్లో ప్రచారం చేయడమంటే సర్వీస్ రూల్స్ను అతిక్రమించినట్టేని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోద్భలంతోనే అశోక్బాబు బీజేపీని విమర్శిరస్తున్నారన్నారు. తనకు చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడనే నమ్మకంతోనే రాజీనామా చేస్తానని అశోక్బాబు సవాల్ చేస్తున్నారని పేర్కొన్నారు. అశోక్బాబు తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరొచ్చని సుధీశ్ సూచించారు. -
అశోక్ బాబు చంద్రబాబు తొత్తు
సాక్షి, విజయవాడ : కర్ణాటకలో ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ప్రచారం నిర్వహించడం వివాదస్పందగా మారింది. ఇప్పటికే ఆయనపై బీజేపీ నాయకులు కర్ణాటక ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అశోక్ బాబుపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిశోర్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాల్సిన అశోక్ బాబు చంద్రబాబుకు తొత్తుగా పనిచేయడం ఎంతవరకు సరైనదని ప్రశ్నించారు. అశోక్ బాబు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకమని తెలిపారు. అశోక్ బాబుతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇతర ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే అశోక్ బాబు కర్ణాటక, తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని శ్యామ్ కిశోర్ వ్యాఖ్యానించారు. రేపు కర్ణాటకలోని తెలుగు ప్రజలకు ఏదైనా జరిగితే అశోక్ బాబు బాధ్యత వహిస్తాడా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకుల డబ్బులతో అశోక్బాబు, మిగతా ఉద్యోగులు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడాన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీని చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే పార్టీకి దగ్గర చేయడానికి ప్రయత్నిస్తుడటంతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే చంద్రబాబు ప్రజల దృష్టి మరల్చేందుకు.. కేంద్రం అన్యాయం చేసిందని చెబుతున్నారని విమర్శించారు. -
అశోక్ బాబును ఉద్యోగం నుండి తొలగించాలి
-
మోదీ సర్కార్ ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తుంది
-
ఓటుకు నోటు కేసును నీరుగార్చొద్దు
సాక్షి, విజయవాడ : ఓటుకు నోటు కేసును నీరుగార్చవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి కె ఆంజనేయ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటుకు ఓటు కేసులో సీఎం చంద్రబాబు స్వర నమూనాకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును తెలుగు ప్రజలకు వెల్లడించాలన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ దేశం మొత్తం తిరుగుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ నాయకుడు అశోక్బాబు ధోరణి విపరీత స్థాయికి చేరిందని ఆంజనేయ రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగ విధులను విస్మరించి రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంతేకాక అశోక్బాబు కర్ణాటకకు వెళ్లి ప్రచారం చేయడం వెనక సీఎం చంద్రబాబు నాయుడి ప్రోత్సహం ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అతనిపై చర్యలు తీసుకుని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మీద ఏపీ ప్రభుత్వం కొత్త డ్రామాను మొదలుపెట్టిందని, చంద్రబాబు దొంగ ఏడుపులను ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. తెలుగు డ్రామా పార్టీగా టీడీపీ మారిందని ఆంజనేయ రెడ్డి ఎద్దేవా చేశారు. -
ఆరోపణలపై అశోక్బాబు వివరణ
సాక్షి, అమరావతి: తనపై వచ్చిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు స్పందించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆరోపణలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఏ పార్టీకి అనుకూలం కాదంటూనే తెలుగుదేశం పార్టీని అశోక్బాబు వెనకేసుకొచ్చారు. చంద్రబాబు పరిపాలనకు ఇబ్బందొస్తుందని ఉద్యమాలు చేయడం లేదన్నారు. ప్రధాని మోదీ పాలన బీజేపీ, నాన్ బీజేపీ అన్న విధానంలో నడుస్తోందని పేర్కొన్నారు. టీడీపీ తరపున బెంగళూరు పర్యటనకు వెళ్లలేదని తెలిపారు. ఏపీ హక్కుల సాధన సమితి నుంచి 150 మంది వెళ్లామన్నారు. ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని అశోక్బాబు ప్రకటించారు. కాగా, అశోక్బాబు, తెలుగుదేశం నాయకులు ఆదివారం బెంగళూరులో సమావేశం పెట్టి తెలుగువారు బీజేపీకి ఓటెయ్యవద్దని, కాంగ్రెస్కు వేయాలని సూచించడం తెలుగు సంఘాల మధ్య గొడవకు దారితీసింది. మార్తహళ్లి–వైట్ఫీల్డ్ రోడ్డులోని ఒక హోటల్లో ‘ఆంధ్రప్రదేశ్ హక్కుల పోరాట వేదిక’ పేరిట అశోక్బాబు బృందం సమావేశం నిర్వహించింది. సమావేశానికి వస్తున్న కొందరు తెలుగువారిని టీడీపీ సానుభూతిపరులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారి మధ్య వాదనలతో ఉద్రిక్తత నెలకొంది. -
ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబుపై కేసు
తిరుపతి : కర్ణాటకలో ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోబ్ బాబు ప్రచారం వివాదాస్పదంగా మారింది. ఒక పార్టీకి అనుకూలంగా అశోక్ బాబు ప్రచారం చేయడంతో వివాదమైంది. బీజేపీ తిరుపతి నేత సామంచి శ్రీనివాస్, అశోక్ బాబు మీద కర్ణాటక ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని అశోక్ బాబు కించపరిచే విధంగా మాట్లాడటం దారుణమని ఈ సందర్భంగా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అలాగే బాధ్యాతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఒక రాజకీయ పార్టీకి ప్రచారం చేయడం నేరం అవుతుందన్నారు. -
కర్నాటకలో టీడీపీ బిత్తిరి రాజకీయం
-
అశోక్బాబు సమావేశంలో రభస
సాక్షి, బెంగళూరు/అమరావతి: ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు, తెలుగుదేశం నాయకులు ఆదివారం బెంగళూరులో సమావేశం పెట్టి తెలుగువారు బీజేపీకి ఓటెయ్యవద్దని, కాంగ్రెస్కు వేయాలని సూచించడం తెలుగు సంఘాల మధ్య గొడవకు దారితీసింది. మార్తహళ్లి–వైట్ఫీల్డ్ రోడ్డులోని ఒక హోటల్లో ‘ఆంధ్రప్రదేశ్ హక్కుల పోరాట వేదిక’ పేరిట అశోక్బాబు బృందం సమావేశం నిర్వహించింది. సమావేశానికి వస్తున్న కొందరు తెలుగువారిని టీడీపీ సానుభూతిపరులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారి మధ్య వాదనలతో ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ అనుకూల సంఘాల సమావేశం అని చెబితే తాము ఇక్కడికి వచ్చేవాళ్లమే కాదంటూ వారు వ్యాఖ్యానించారు. ఇక్కడి తెలుగు ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టి తమను విభజించవద్దని సూచించారు. చంద్రబాబు చెప్పినట్లు అశోక్బాబు ఇక్కడికొచ్చి వ్యవహరించడం సరికాదని చెప్పారు. టీడీపీ తన స్వార్థ రాజకీయాల కోసం కర్ణాటకలోని తెలుగు ప్రజలను ప్రమాదంలోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు కర్ణాటక ఎన్నికలతో అశోక్బాబుకు సంబంధం ఏమిటని వారు ప్రశ్నించారు. అశోక్బాబును నిలదీసేందుకు కొందరు తెలుగు సంఘాల వారు హోటల్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా టీడీపీ సానుభూతిపరులు అడ్డుకున్నారు. దీంతో తెలుగు సంఘాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. పోలీసులు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. గొడవ మధ్యే అశోక్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం చేసిన బీజేపీని, మోదీనీ ఓడించడమే తమ లక్ష్యమని చెప్పారు. టీడీపీ ఏజెంటువా?.. విష్ణువర్దన్రెడ్డి ధ్వజం ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబుపై బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన బెంగళూరులో ‘సాక్షి’తో మాట్లాడారు. ‘ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు టీడీపీ నేతలకు మొహం చెల్లక అశోక్బాబు లాంటి దళారికి విమాన టిక్కెట్లు ఇచ్చి కర్ణాటకకు పంపించారని ఆరోపించారు. అశోక్బాబు ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటున్నారో? ఎన్టీఆర్ ట్రస్టు నుంచి తీసుకుంటున్నారో వివరణ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ అశోక్బాబు కర్ణాటక ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారంలో పాల్గొనడం సర్వీసు రూల్స్కు పూర్తిగా విరుద్దమని.. ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అశోక్బాబుపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీపతిరాజు మరో ప్రకటనలో పేర్కొన్నారు. -
అశోక్బాబుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి..!
-
సీఎం చేతిలో ఆయన కీలుబొమ్మ
సాక్షి, హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడి చేతిలో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు కీలుబొమ్మగా మారారని జనచైతన్య వేదిక రాష్ట్రాధ్యక్షులు లక్ష్మణ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతున్న అశోక్ బాబు.. బెంగళూరులో రాజకీయ ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. రాజకీయ ప్రచారం నిర్వహిస్తున్న అశోక్ బాబును వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్జీవోల ప్రయోజనాల కన్నా.. అశోక్ బాబు టీడీపీ ప్రయోజనాలు కోసం కృషి చేస్తున్నారని లక్ష్మణ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. అశోక్ బాబు చేస్తున్న ఎన్నికల ప్రచారంపై బీజేపీ నాయకులు కూడా నిప్పులు చెరిగారు. -
ప్రమోషన్ కోసం అశోక్బాబు దొంగ సర్టిఫికెట్లు!
విజయవాడ, అనంతపురం: కర్ణాటకలో బీజేపీని ఓడించాలంటూ ప్రచారం చేయబోయిన ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబుపై బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన అశోక్బాబుకు కర్ణాటకలో ఏం పని అని నిలదీశారు. ఉద్యోగ పదోన్నతి కోసం దొంగ సర్టిఫికెట్లు తయారుచేయించిన వ్యక్తి అశోక్బాబు అని విమర్శించారు. అశోక్బాబుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి..! ‘కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్కు మద్దతుగా ప్రచారం చేస్తున్న ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి’ అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ లక్ష్మీపతిరాజా అన్నారు. బెంగళూరులో టీడీపీ నిర్వహించిన తెలుగు సంఘాల సమావేశంలో అశోకబాబు పాల్గొని బీజేపిని ఓడించి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అశోక్ బాబు ఉద్యోగ సంఘాల నాయకుడా? లేదంటే టీడీపీ అధికార ప్రతినిధా? ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ ఇటీవల రాయలసీమ పర్యటన సందర్భంగా కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ప్రచారం చేస్తామని అశోకబాబు ప్రకటించారు. ఇది ఉద్యోగుల సర్వీస్ రూల్స్కు వ్యతిరేకం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోక్యం చేసుకుని.. విచారణ జరిపి అతన్ని సస్పెండ్ చెయ్యాలి. ఉద్యోగ సంఘాలు అశోక్ బాబుని అధ్యక్షుడిగా తొలగించాలి. ఆయన తీరుపై రాష్ట్ర గవర్నర్ కు, కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే న్యాయస్థాన్ని ఆశ్రయిస్తాం. ఎన్ని కుట్రలు , కుతంత్రాలు చేసినా కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి తీరుతుంది. కర్ణాటకలోని తెలుగు ప్రజలు టీడీపీ అసత్య ప్రచారాలు నమ్మబోరు’ అని ఆయన అన్నారు. అనంతపురం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుద్దకుంట వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ ఇచ్చిన ప్యాకేజీ తీసుకొని.. ఆ పార్టీకి అనుకూలంగా అశోక్బాబు పనిచేస్తున్నారని, ఆయనను వెంటనే ఉద్యోగంలోంచి తీసివేయాలని అన్నారు. అశోక్బాబు నోరు అదుపులో పెట్టుకోవాలి.. లేకపోతే రాష్ట్రంలో తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు. కర్ణాటకలో ప్రధాని మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా అశోక్బాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రమోషన్ కోసం దొంగ సర్టిఫికెట్లు తయారుచేయించిన వ్యక్తి అశోక్బాబు అని విమర్శించారు. -
బెంగళూరులో తెలుగు సంఘాల పంచాయితీ
-
కర్ణాటక ఎన్నికలు; టీడీపీ బిత్తిరి రాజకీయం
సాక్షి, బెంగళూరు: ఎన్నికల రాష్ట్రం కర్ణాటకలో హీనస్థాయి రాజకీయాలు చేయబోయిన తెలుగుదేశం పార్టీకి చుక్కెదురైంది. టీడీపీ ప్రోదర్బలంతో ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సోమవారం బెంగళూరులో తెలుగు సంఘాలతో జరిపిన సమావేశం రసాభసకు దారితీసింది. ‘‘ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనకుండా, స్థానిక సమస్యలపై నోరుమెదపకుండా.. ఇక్కడికి(కర్ణాటకకు) వచ్చి మీరు చెప్పదల్చుకున్నది ఏంటి?’ అని నిలదీతలు ఎదురయ్యాయి. అసలేం జరిగింది?: ‘ఆంధ్రప్రదేశ్ హక్కుల పోరాట వేదిక’ పేరుతో అశోక్ బాబు బృందం బెంగళూరులో నిర్వహించిన సమావేశానికి కర్ణాటకలోని పలు తెలుగు సంఘాలను ఆహ్వానించారు. ఏపీకి అన్యాయం చేసినందున కర్ణాటకలోని తెలుగువారు బీజేపీని ఓడించాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మాటలనే అశోక్బాబు వల్లెవేయడంతో సభలో గందరగోళం నెలకొంది. ‘అదేంటిసార్, ఆంధ్రప్రదేశ్ను అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి గెలిపించమని కోరడం ఎంతవరకు సమంజసం?’’ అని కొన్ని సంఘాలు నిలదీశాయి. ‘ప్రత్యేక హోదా ఉద్యమంలో మారు మాట్లాడని మీరు ఇక్కడికొచ్చి చెప్పేది ఇదేనా?’’ అని ప్రశ్నించారు. తెలుగు పేరుతో టీడీపీ సమావేశమేంటి?: సమావేశం జరిగిన తీరును నిరసిస్తూ పలు తెలుగు సంఘాలు గళం విప్పాయి. ‘‘తెలుగు సంఘాల పేరుతో టీడీపీ సమావేశం నిర్వహించడమేంటి? ఒకవేళ ఇది తెలుగుదేశం పార్టీ అనుకూల సంఘాల సమావేశం అని చెబితే మేము ఇక్కడికి వచ్చేవాళ్లమేకాదు. అయినా ప్రత్యేక హోదా కోసం పోరాడని ఉద్యోగ సంఘాలు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చారు? ఏం చెప్పడానికి వచ్చారు? అశోక్ బాబును చాలా ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం. కానీ మమ్మల్ని బయటికి గెంటేశారు. ఆహ్వానించి ఇలా చేయడం ఎంతవరకు సబబు?’’ అని కర్ణాటకలోని తెలుగు యువకులు వాపోయారు. టీడీపీతొ పొత్తువల్లే బీజేపీ బతికింది: సమావేశం అనంతరం ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీ ఇజంకు చెక్ చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయ నేతలకు చెక్ పెట్టడమంటే ఓడించడమే. అసలు 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే బీజేపీ బతికిపోయింది.’’ అని అన్నారు. ‘నాలుగేళ్లు టీడీపీ-బీజేపీ కలిసే ఉందికదా, మరి ఏపీలో కాలయాపన చేశారెందుకు?’ అన్న మీడియా ప్రశ్నకు అశోక్ బాబు పొంతనలేని సమాధానమిచ్చారు. ‘‘10 ఏళ్లు టైముందని, ఆరాటం వద్దని బీజేపీ వాళ్లే చెప్పారు. కాబట్టే ఏపీ హక్కుల విషయంలో మేం మౌనంగా ఉన్నాం. అయినా హక్కుల పోరాటం వేరు, రాజకీయ పోరాటం వేరు’’ అని అశోక్ బాబు వివరించారు. -
హోదా కోసం ఉద్యమం చేయటం వృధా
-
అశోక్బాబు సంచలన వ్యాఖ్యలు
-
అశోక్బాబు అనూహ్య వ్యాఖ్యలు
సాక్షి, కడప: ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉద్యమం పూర్తిగా రాజకీయం అయింది. ఎవరికి వారు ఉద్యమాలు చేస్తున్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి 10 ఏళ్లు హోదా కావాలని ఎవరు అడగలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని బీజేపీ స్పష్టం చేసినప్పటికీ ఉద్యమాలు చేయడం వృధా.. ఉద్యమాల వల్ల ప్రజలు నష్టపోతారు. హోదా కోసం ఉద్యోగులు పోరాడితే వ్యవస్థ దెబ్బతింటుంది.. విభజన చేయమని లేఖలు ఇచ్చిన పార్టీలే.. నేడు హోదా కోసం పోరాడటం హాస్యాస్పదం.. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పాలన గాడిలో పడిన సమయంలో పోరాటాలు, ఉద్యమాలు చేయడం సబబు కాద’ని అశోక్బాబు వ్యాఖ్యలు చేశారు. -
‘ఏపీ ఎన్జీవో భవన్’ వివాదం పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, గన్ఫౌండ్రీలోని ఏపీ ఎన్జీవో భవన్లో ఉన్న గదులను, మినీ హాల్ను వాటి లభ్యతను బట్టి భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సభ్యులు ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామని ఏపీ ఎన్జీవో సంఘం శుక్రవారం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు.. ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబుపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్ను పరిష్కరించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎన్జీవో భవన్లో గదులను, సమావేశ మందిరాన్ని ఉపయోగించుకునేందుకు తమకు అవకాశమివ్వాలంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏపీ ఎన్జీవో సంఘం ఉల్లంఘించిందని, అందుకుగాను సంఘం అధ్యక్షుడు అశోక్ బాబుపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలంటూ ఎం.సత్యనారాయణ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘం తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. ఏపీఎన్జీవో భవన్లో ఉన్న గదులను, మినీహాల్ను ఉపయోగించుకునేందుకు భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘ సభ్యులకు అవకాశం ఇస్తామన్నారు. గదులను, మినీ హాల్ను వాటి లభ్యతను వాడుకోవచ్చునని చెప్పారు. ఇందుకు భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘం తరఫు న్యాయవాది జెల్లి కనకయ్య అంగీకరించారు. -
ఒంగోలు రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత
-
వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసుల దౌర్జన్యం
సాక్షి, ఒంగోలు : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం చేపట్టిన రైల్ రోకో ఉద్రిక్తంగా మారింది. ఒంగోలులో రైలు రోకో చేపట్టిన వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. నాందేడ్-తిరుపతి ఎక్స్ప్రెస్ను నిలిపేసి నిరసన తెలుపుతున్న ప్రకాశం జిల్లా వైఎస్సార్ సీపీ నేతలు బాలినేని శ్రీనివాస రెడ్డి, వరికుటి అశోక్బాబులను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. ఈ ఘటనలో సీఐ గంగా వెంకటేశ్వర్లు దళిత నేత అశోక్ బాబుపై దాడి చేశారు. ఆయన్ను కొట్టి లారీలో పడేశారు. దీంతో బాలినేని సహా కార్యకర్తలు పోలీసుల దౌర్జన్యంపై నిరసనకు దిగారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగిన వైఎస్సార్ సీపీ ఎంపీలకు మద్దతుగా రాష్ట్ర నేతలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైల్ రోకోకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. -
ఏపీఎన్జీవో అశోక్బాబుపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్బాబుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గన్ఫౌండ్రీలోని ఏపీ ఎన్జీవో భవన్లోని నాలుగు గదులు, ఒక సమావేశ మందిరాన్ని భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘానికి అప్పగించాలన్న గత ఉత్తర్వుల్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. భవనంలోని గదులకు తాళాలు వేసి అమరావతికి వెళ్లిపోతే వాటిని ఎన్జీవోలు ఉపయోగించుకోవాలంటే ఎలాగని నిలదీసింది. ఫోన్ చేస్తే వసతులు కల్పిస్తామని చెప్పడం కాదని, ఎవరైనా ఎన్జీవో చేసిన ఫోన్కు స్పందించనప్పుడు ఇక్కడున్న వారి పరిస్థితి ఏం కావాలో చెప్పాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఏపీఎన్జీవో భవన్లో నాలుగు గదులు, ఒక హాలును తమ సంఘం వినియోగించుకునేందుకు అప్పగించాలన్న ఆదేశాల్ని అశోక్బాబు ఉద్దేశపూర్వకంగా అమలు చేయలేదంటూ భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని శుక్రవారం ధర్మాసనం మరోసారి విచారించింది. గదులకు తాళాలు వేసి అమరావతికి వెళ్లి కూర్చుంటే వాటి వసతుల కోసం భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘం వారు ఎవరిని కలుసుకోవాలో చెప్పాలని ధర్మాసనం అడిగింది. వాచ్మన్కు దరఖాస్తు చేసుకోవాలా.. గదులు/హాలు వినియోగానికి వీలుగా ఏపీఎన్జీవో సంఘానికి చెందినవారు ఇక్కడ ఎందుకు అందుబాటులో లేరో చెప్పాలని పేర్కొంది. భాగ్యనగర్ ఎన్జీవో అసోసియేషన్ తరఫు న్యాయవాది జల్లి కనకయ్య వాదనలు వినిపిస్తూ.. గన్ఫ్రౌండీలోని ఎన్జీవో సంఘం గదుల్ని అద్దెకు ఇచ్చారని, నెలకు రూ.రెండు లక్షలు అద్దె వస్తోందని, అద్దెకు ఇవ్వని గదులకు తాళాలు వేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. తమ సంఘ సభ్యుల్ని వాచ్మన్ లోపలికి రానీయడం లేదన్నారు. ఈ వివరాలన్నింటినీ కౌంటర్లో తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. దీనిపై అశోక్బాబు తరఫు న్యాయవాది కల్పించుకుని.. ఏపీఎన్జీవో సంఘ కార్యాలయానికి ఫోన్ చేస్తే గదుల వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. వెంటనే ధర్మాసనం కల్పించుకుని.. ఫోన్ చేసినప్పుడు స్పందించకపోతే వసతి కోసం ఎక్కడ వేచి ఉండాలని ప్రశ్నించింది. హైదరాబాద్లో ఏపీ ఎన్జీవోకు చెందిన వారెవరైనా ఉండాలి కదా అని అడిగింది. న్యాయవాది స్పందిస్తూ.. వసతి కోసమే గదులు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయని, అయితే భాగ్యనగర్ ఎన్జీవో సంఘం కార్యాలయ గది కూడా కావాలని పట్టుబడుతోందని చెప్పారు. మీ వాదనల్ని కౌంటర్ వ్యాజ్యంలో తెలియజేయాలని ధర్మాసనం ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయకపోవడంతో ధర్మాసనం ఆదేశాల మేరకు గత వారం జరిగిన విచారణకు అశోక్బాబు స్వయంగా హాజరయ్యారు. -
వేదికపై అశోక్బాబు.. వెనుదిరిగిన చలసాని
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపై ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్తో పాటు ఎపీఎన్జీవో నేత అశోక్బాబు తదితరులను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ క్రమంలో సమావేశానికి వచ్చిన చలసాని, వేదికపై ఉన్న అశోక్బాబును చూసి సమావేశంలో పాల్గొనకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో నిర్వాహకులు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. హోదా ఉద్యమాన్ని కొందరు నీరుగారుస్తున్నారని ఈ సందర్భంగా చలసాని నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చిన వ్యక్తులే.. మళ్లీ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉపయోగించుకునే యత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. -
హైకోర్టుకు హాజరైన అశోక్బాబు
సాక్షి, హైదరాబాద్: కోర్టు ఆదేశాల్ని ధిక్కరించారనే ఆరోపణల కేసులో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్బాబు గురువారం హైకోర్టుకు హాజరయ్యారు. ఈమేరకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. హైదరాబాద్లోని గన్ఫౌండ్రిలోని ఏపీ ఎన్జీవో భవన్లో మీటింగ్ హాలు, 4 గదులను భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘానికి స్వాధీనం చేయా లని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని అశోక్బాబు అమ లు చేయలేదు. ఇది కోర్టు ధిక్కారమే అవుతుందని భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించగా.. æకోర్టు ఆదేశాల మేరకు గురువారం అశోక్ బాబు విచారణకు హాజరయ్యారు. ఆయన తరఫు న్యాయవాది వాదిస్తూ, అశోక్బాబు దంపతు లిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడం వల్ల కోర్టు నోటీసు అందుకోలేకపోయారన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జల్లి కనకయ్య స్పందిస్తూ, అశోక్బాబుకు నోటీసు అందినట్లు తమ వద్ద రశీదు ఉందన్నారు. దీనిపై కౌంటర్ పిటిషన్ను వారం రోజుల్లోగా దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
అశోక్బాబుకు కోర్టు ధిక్కార నోటీసు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని ఏపీ ఎన్జీవో సంఘం భవనం లో భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘానికి భాగం ఇవ్వాలని గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని ఎందుకు అమలు చేయలేదో స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబును హైకోర్టు ఆదేశించింది. కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలని నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణకు స్వయంగా కోర్టుకు వచ్చి వివరణివ్వాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశించింది. గత ఉత్తర్వుల్ని అమలు చేయనందున అశోక్బాబుపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. -
పెన్షన్ కోసం దేశవ్యాప్త ఉద్యమం
సాక్షి, విజయవాడ : ఉద్యోగుల పెన్షన్ సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు తెలిపారు. సీపీఎస్ విధానం రద్దు కోసం శనివారం విజయవాడలో జరిగిన సమావేశానికి వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అశోక్బాబు మాట్లాడుతూ అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి పెన్షన్ సాధన కోసం పెన్షన్ సాధన సమితిని ఏర్పాటు చేశామని, పెన్షన్ సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు. ఉద్యోగుల పెన్షన్ అంశాన్ని అవసరమైతే రాజకీయ అంశంగా మారుస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి తమ డిమాండ్ను సాధించుకుంటామని చెప్పారు. ఏపీ సర్కార్ కేంద్రంలో భాగస్వామిగా ఉన్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని సీపీఎస్ కేంద్రం పరిధా, లేక రాష్ట్రం పరిధిలోనిదా తేల్చాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిని కలిసి ఈ విషయమై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫేడరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గుర్తుచేశారు. సీపీఎస్ విధానం రద్దు చేయకపోతే నిరవధిక నిరాహార దీక్షలకు దిగుతామని ఆయన హెచ్చరించారు. -
వారిది దుర్భర జీవితం
♦ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండగా ఉంటాం ♦ ఏపీ ఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు విజయనగరం గంట స్తంభం : కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు దుర్భర జీవితం గడుపుతున్నారని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఉద్యోగులు పోరాడుతారని ఏపీ ఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్బాబు తెలిపారు. ఆదివారం విజయనగరం ఏపీ ఎన్జీఓ సంఘం భవనంలో జరిగిన కాంట్రాక్ట్ ఉద్యోగుల సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవస్థలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వ్యవస్థ భాగమన్నారు. 2001లో ఈ వ్యవస్థ ప్రారంభం అయినప్పటి నుంచి వారు బానిసలుగా బతుకుతున్నారని పేర్కొన్నారు. ప్రసూతి సెలవులు కూడా దక్కడం లేదని తెలిపారు. ఏడాదిలో పదిన్నర నెలల జీతం మాత్రమే తీసుకుంటున్నారని వివరించారు. రాష్ట్రంలో 28 వేల మంది కాంట్రాక్ట్, 55 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నట్లు తెలిపారు. వారి పక్షాన ఏపీ ఎన్జీఓల సంఘం పోరాడుతుందని పేర్కొన్నారు. వారి సమస్యలను పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వానికి చాలా సార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని వివరించారు. అందుకే ఇక్కడ పోరాటానికి కార్యాచరణ కోసం సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులు కూడా సామాజిక బాధ్యతగా ఈ పోరాటంలో పాల్గొనాల్సిందిగా సూచించారు. కొంతమందికే పరిమితమైన పెంపు.. ఇటీవల ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు 50శాతం వేతనాలు పెంచినప్పటికీ అది కొంతమందికే పరిమితమైనట్లు తెలిపారు. వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే సమానపనికి సమానవేతనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మంత్రి వర్గ ఉపసంఘం దీనిపై తొందరలోనే చర్చించనుందని, వారి దృష్టికి సమస్య తీసుకెళ్తామన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖర్ మాట్లాడుతూ కాంట్రాక్ట్, అవుట్సోర్సి ంగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిందని, ఇప్పుడు హామీని అమలు చేయాలన్నారు. న్యాయ పరమైన సమస్య ఉంటే ముందుగా వారి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పోరాటంలో అంతా కలిసి ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు డివి.రమణ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జరిగే పోరాటంలో ప్రభుత్వ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా సంఘం అధ్యక్షుడు ప్రభూజీ మాట్లాడుతూ జిల్లాలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి ఏపీ ఎన్జీఓల సంఘం అండగా ఉంటుందని వివరించారు. సమావేశంలో జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్వి.రమణమూర్తి, విజయనగరం తాలూకా సంఘం అధ్యక్షుడు సురేష్కుమార్, ఇతర సంఘం నాయకులు, ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ తొత్తుగా అశోక్బాబు!
కడప: ఉద్యోగుల హక్కుల కోసం శ్రమించకుండా, ఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు ప్రభుత్వ తొత్తుగా వ్యవహరిస్తున్నారని పశ్చిమ రాయలసీమ శాసనమండలి సభ్యుడు వెన్నపూస గోపాల్రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం వైఎస్సార్ జిల్లా కడపలో నిర్వహించిన వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు గుప్పించి అన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టారన్నారు. ఉద్యోగులను సైతం ‘నేను మారిన మనిషిని...నమ్మండి, మరో అవకాశం కల్పించండని’ వేడుకుంటూ మేక వన్నె పులిలా వ్యవహరించారు. అధికారంలోకి వచ్చాక తనదారి తనదే అన్నట్లు హామీలన్నీ అబద్ధాలేనని తేటతెల్లం చేశారని ఆరోపించారు. ప్రజలకు తాగు, సాగునీరు ఇవ్వలేని దుస్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. పాలన మొత్తం అవినీతి మయం చేశారని అన్నారు. రైతు రుణమాఫీ నీరుగార్చారు. డ్వాక్రా రుణాలు రద్దు ఉత్తుత్తిదేనని తేల్చారు. నిరుద్యోగ భృతి భ్రమగా మిగిల్చారని ఎమ్మెల్సీ గోపాల్రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రిగా అన్ని వర్గాల ప్రజల అభిమానాలకు దూరమైన వ్యక్తి అని విమర్శించారు. మరోమారు చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోగల్గితే అప్పుడే పర్మినెంటు రాజధాని సాధ్యమౌతోందని ఎన్జీఓ నేత ఆశోక్బాబు పేర్కొనడంలో ఔచిత్యమేమిటని నిలదీశారు. ఉద్యోగ వర్గాలకు సైతం న్యాయం చేయకుండా ప్రభుత్వం నియంతృత్వ ధోరణి అవలంభిస్తోందని ఆరోపించారు. ఇప్పటి వరకు ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ అరియర్స్, డీఏల పట్ల శ్రద్ద చూపి ఉద్యోగుల హక్కుల కోసం పనిచేయాలని అశోక్బాబుకు ఆయన హితవు పలికారు. రాజధాని కోసమే మరోమారు సీఎంగా చంద్రబాబు ఉండాలని పేర్కొనడం ఏమేరకు సబబో విజ్ఞనులైన ఉద్యోగులు, ఎన్జీఓలు ఆలోచించాలని కోరారు. ఎన్జీఓ అధ్యక్షునిగా అశోక్బాబు... చంద్రబాబు భుజకీర్తుల కోసం తానా అంటే తందానా అంటూ తబలా కొడుతున్నారని విరుచుకుపడ్డారు. అశోక్బాబు ధోరణిని మేధావి వర్గాలు గ్రహించాలని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజులల్లో చంద్రబాబు పాలనకు ప్రజలు చరమగీతం పాడేందుకు సంసిద్ధంగా ఉన్నారని వివరించారు. -
అశోక్బాబుకు ఝలక్
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్జీవోల సంఘం చైర్మన్ అశోక్బాబు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో తాము పాల్గొనడం లేదని ఏపీ పంచాయతీరాజ్ నాలుగో తరగతి ఉద్యోగులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.గోవిందరాజులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పీఆర్సీ బకాయిలు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర సమస్యల పరిష్కారంలో అశోక్బాబు ఘోరంగా విఫలమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ నాలుగో తరగతి ఉద్యోగులెవ్వరూ జేఏసీ చేపట్టిన ధర్నాలో పాల్గొనవద్దని గోవిందరాజులు పిలుపునిచ్చారు. -
హోదా విషయంలో మేం తలదూర్చలేం
ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్బాబు గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): ప్రత్యేక హోదా రాజకీయ అంశమని, ఇందులో ఉద్యోగులుగా తాము తలదూర్చడం అనవసరమని నిర్ణయించామని ఏపీ ఎన్జీవోల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్బాబు తేల్చిచెప్పారు.స్థానిక ఎన్జీవో కార్యా లయంలో రాష్ట్ర ఉద్యోగుల సంఘం ప్రమాణస్వీకారోత్సవం సోమవారం జరిగింది. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా అశోక్బాబు, చంద్రశేఖర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అశోక్బాబు విలేకరులతో మాట్లాడారు. ప్యాకేజా? ప్రత్యేక హోదా? అనే విషయం ప్రభుత్వం నిర్ణయించుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదా వచ్చినా.. రాకపోయినా ఆ ఫలితాన్ని రాజకీయంగా ప్రభుత్వమే అనుభవించాల్సిందే తప్ప,ఉద్యోగులకు ఆపాదించాల్సిందేమీ లేదన్నారు. ఏపీఎన్జీవో విఫలమైంది ఏపీజేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు నెల్లూరు(పొగతోట): ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఏపీఎన్జీవో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని, అందువల్లే ఏపీ జేఏసీ ఆవిర్భవించిందని జేఏసీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు.సీపీఎస్ విధానం రద్దు కోసం పోరాటం చేస్తామన్నారు. ఉద్యోగ సంఘాలను కలుపుకొని ఢిల్లీలోని జంతరమంతర్ వద్ద ఆందోళన చేపడతామన్నారు. -
'ఉద్యోగ నేతలను అశోక్బాబు బెదిరిస్తున్నారు'
విజయవాడ: ఏపీ ఎన్జీవో ఎన్నికలకు, జేఏసీ ఏర్పాటుకు సంబంధం లేదని ఏపీ నూతన జేఏసీ చైర్మన్ బొప్పారాజు వెంకటేశ్వర్లు తెలిపారు. అశోక్బాబు నాయకత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగక పోవడం వల్లే కొత్త జేఏపీ ఆవిర్భవించిందన్నారు. కొత్త జేఏసీ నుంచి అశోక్బాబుకు పోటీగా ఏన్జీవో ఎన్నికలకు ఎవరినీ ప్రోత్సహిండం లేదన్నారు. అశోక్బాబు ఒంటెద్దు పోకడల వల్లే బలమైన ఉద్యోగ సంఘం నూతన జేఏసీ ఏర్పడిందని తెలిపారు. కొత్తగా ఏర్పాటైన జేఏసీలోని ఉద్యోగ నేతలను అశోక్బాబు బెదిరించి, చీలికలకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
అశోక్బాబుపై తిరుగుబాటు
ఉద్యోగ సంఘాల నూతన జేఏసీ అధ్యక్షుడుగా బొప్పరాజు తిరుపతి వేదికగా ఎన్నుకున్న 73 సంఘాల ప్రతినిధులు తిరుపతి రూరల్: ఉద్యోగ సంఘాలన్నీ ఏకమయ్యాయి. తిరుపతిలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన జేఏసీ నవ నిర్మాణ సదస్సులో అశోక్బాబుకు వ్యతిరేకంగా గర్జించాయి. వందలాది మంది ప్రతినిధుల సమక్షంలో 73 ఏపీ ఉద్యోగ సంఘాలు కొత్త జేఏసీని ప్రకటించాయి. దానికి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లును అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తమ సంఘాల నుంచి తీసుకువచ్చిన తీర్మానాల కాపీలను నూతన జేఏసీ అధ్యక్షుడికి ఉద్యోగ సంఘాల నేతలు సభాముఖంగా అందించారు. అశోక్బాబు తీరుపై నిప్పులు ఉద్యోగుల సంఘాల జేఏసీ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న ఏపీ ఎన్జీవోల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు నాయకత్వంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నిప్పులు చెరిగారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా దళారీలా వ్యవహరిస్తున్నారని ట్రెజరీ ఉద్యోగుల సంఘ రాçష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ ఆరోపించారు. రాజకీయ పార్టీలు విఫలమై ప్రజలు కోరితే ప్రత్యేక హోదాపై జేఏసీ ఆధ్వర్యంలో ముందుండి పోరాడతామని ఏపీ జేఏసీ నూతన అధ్యక్షుడుబొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగుల కొత్త జేఏసీ!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి (జేఏసీ)లో చీలిక అనివార్యంగా కనిపిస్తోంది. నూతన జేఏసీ ఆవిర్భావానికి రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం జేఏసీకి నేతృత్వం వహిస్తున్న అశోక్బాబుపై తిరుగుబాటు బావుటా ఎగరేసేందుకు 30 ఉద్యోగ సంఘాలు ఏకమవుతున్నాయి. ఏపీఏన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడిగా అశోక్బాబు రాష్ట్ర ప్రభుత్వానికి సాగిలపడి వ్యవహరిస్తున్నారని, ఉద్యోగుల సమ స్యలు పట్టించుకోవడం లేదని సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యం లోనే 5న తిరుపతిలో సమావేశం కావాలని ఆయా సంఘాలు నిర్ణయించినట్టు సమాచారం. నవనిర్మాణ సదస్సు పేరిట తిరు పతి రెవెన్యూ అసోసియేషన్ హాలులో ఈ భేటీ జరగనుంది. కొత్త జేఏసీ విధివిధా నాల రూపకల్పన తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. -
తాగుబోతుకు అత్తింట పరాభవం
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ఓ తాగుబోతు కానిస్టేబుల్కు గ్రామస్తులు తగ్గిన బుద్ధి చెప్పారు. నిత్యం వేధిస్తుండటంతో దసరా పండుగపూట ఇంటికి పిలిచి దేహశుద్ధి చేశారు. ముస్తాబాద్ మండలం గూడూరుకు చెందిన కానిస్టేబుల్ అశోక్కు ముస్తాబాద్కు చెందిన అనితతో రెండు నెలల క్రితమే వివాహం అయింది. పెళ్లయినప్పటి నుంచి అశోక్ నిత్యం తాగివచ్చి భార్యను చిత్రహింసలు పెడుతున్నాడు. సైకోలా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయమై అనిత కుటుంబసభ్యులకు తెలిపింది. మంగళవారం పండుగ అత్తవారింటికి మద్యం మత్తులో వచ్చిన అశోక్ను కుటుంబసభ్యులు నిలదీశారు. అతడు ఎదురు తిరగటంతో గ్రామస్తుల సాయంతో స్తంభానికి కట్టేసి భార్య సహా అందరూ అతడిని చితకబాదారు. ఆపైన, గ్రామంలో ఊరేగించి పోలీసులకు అప్పగించారు. -
7,810 మంది ఉద్యోగులు రావాల్సి ఉంది
-ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబు తుళ్లూరు(గుంటూరు జిల్లా) హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలిరావాల్సిన ఉద్యోగులు 7810 మంది ఉన్నారని, వారు కాకుండా ఒక్క సచివాలయం ఉద్యోగులే 2000 మంది ఉన్నారని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు పి.అశోక్బాబు చెప్పారు. సోమవారం కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ ఉన్నా ఉద్యోగాలు చేయాలని, సచివాలయంలో పనులు పూర్తిచేసి ఉద్యోగులు విధులు నిర్వహించుకునే వీలు కల్పిస్తే ఇక్కడినుంచి పాలన చేయడానికి వెనుకాడబోమని చెప్పారు. ఈ మేరకు తాత్కాలిక సచివాలయంలో ఇంకా ఏర్పాట్లు పూర్తికావాల్సి ఉందని వివరించారు. ప్రభుత్వం కూడా వేగవంతంగా పనులు పూర్తిచేసే విధంగానే ముందుకెళుతుందని తెలిపారు. ఇదే అభిప్రాయాన్ని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ కూడా వ్యక్తం చేశారు. -
సీపీఎస్పై అశోక్బాబు వ్యాఖ్యలు సరికాదు
చిలకడపూడి : ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు సీపీఎస్కు వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న పోరాటంపై చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా నాయకులు పి సత్యనారాయణ, శోభన్బాబులు ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. సీపీఎస్ విధానం కారణంగా ఉద్యోగులు నష్టపోతున్నారని దీనిపై సెప్టెంబరు 1వ తేదీన విజయవాడలో శాంతి ర్యాలీ నిర్వహించనున్నామన్నారు. దీనికి మద్దతు పలకాలని ఉద్యోగులు సమాయత్తం అవుతుంటే అశోక్బాబు చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు. శాంతి ర్యాలీ, మహాసభకు ఎన్జీవో నాయకులు సహకరించాలని వారు కోరారు. -
సీపీఎస్ సమస్యపై దేశవ్యాప్త ఆందోళన
-ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు నెల్లూరు(పొగతోట) ఉద్యోగ సంఘాలు ఒక్కటై కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) సమస్యపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్బాబు పేర్కొన్నారు. మంగళవారం నెల్లూరు ఎన్జీఓ హోమ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్ సమస్య దేశవ్యాప్తంగా ఉందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు చేపడుతున్న కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాంది అవుతుందన్నారు. ప్రభుత్వ శాఖల్లోని మధ్య స్థాయి ఉద్యోగుల్లో అవినీతి అధికంగా జరుగుతుందన్నారు. ఉద్యోగుల్లో పూర్తి స్థాయిలో మార్పు వస్తేనే ప్రభుత్వాన్ని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బాపూజీ, ఎన్జీఓ జిల్లా నాయకులు సీహెచ్వీఆర్సీ శేఖర్రావు, వై.రమణారెడ్డి, ఆంజనేయవర్మ, సీహెచ్ సుధాకర్రావు, శ్రీకాంత్, శైలజ, రాష్ట్ర మహిళా కో-కన్వీనర్ కరుణమ్మ పాల్గొన్నారు. -
ఉద్యోగుల తరలింపు గడువు పొడిగింపు: అశోక్బాబు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగుల తరలింపు గడువు మళ్లీ మారింది. ఈ విషయాన్ని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హెచ్ఓడీల తరలింపునకు ఆగస్టు 31 వరకు గడువు కావాలని తాము ముఖ్యమంత్రిని కోరామని, దానికి ఆయన సానుకూలత వ్యక్తం చేశారని చెప్పారు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక హాస్టళ్లు ఏర్పాటు చేయాలని కోరామని, వాటి ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించాలని కోరామని ఆయన అన్నారు. ప్రభుత్వ శాఖలకు ఇంకా పూర్తిస్థాయిలో వసతులు సమకూరాల్సి ఉందని, సచివాలయ ఉద్యోగుల తరలింపు ఈనెల 27వ తేదీ నుంచి మొదలవుతుందని అశోక్బాబు చెప్పారు. భవనాల నిర్మాణం పూర్తయ్యేసరికి ఇంకా సమయం పడుతుందని, మొత్తం తరలింపు దసరా నాటికి పూర్తవుతుందని భావిస్తున్నామని ఆయన అన్నారు. సాఫ్ట్వేర్ సమస్యలు ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలను మాన్యువల్గా చేయాలని కోరామని, దానికి కూడా సీఎం అంగీకరించారని తెలిపారు. -
పెన్షనర్లంటే ప్రభుత్వాలకు చిన్నచూపేల?
- ఆలిండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్పీఎఫ్) డిమాండ్ - ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో ఘనంగా ఆవిర్భావ సమావేశం - రిటైర్డ్ ఉద్యోగులు సమాజ సేవకు ఉపక్రమించాలి: జస్టిస్ నర్సింహారెడ్డి సాక్షి, హైదరాబాద్: దశాబ్దాల పాటు ప్రభుత్వాన్ని నడపడంలో కీలకంగా వ్యవహరించి పదవీ విరమణ చేసిన ఉద్యోగుల (పెన్షనర్ల) పట్ల చిన్నచూపు చూడటం తగదని ఆలిం డియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్పీఎఫ్) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఆదివారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో జరిగిన ఏఐఎస్పీఎఫ్ ఆవిర్భావ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. ఆయా ప్రభుత్వాలు పెన్షనర్లను క్రమేపీ వది లించుకోవాలని చూస్తున్నాయని, 2004 తర్వా త ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ పెన్షన్(సీపీఎస్) విధానాన్ని అమలు చేయడం ఇందులో భాగమేనన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఆరు లక్షల మంది, దేశవ్యాప్తంగా 1.58 కోట్లమంది పెన్షనర్లు ఉన్నారని.. వారు తలచుకుంటే తమ ఓటు ద్వారా ఆయా ప్రభుత్వాలను ప్రభావితం చేయగలరన్న విషయాన్ని పాలకులు గుర్తెరగాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాల పెన్షనర్స్ అసోసియేషన్ల కార్యవర్గ సభ్యులు, తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) నుంచి పెద్దసంఖ్యలో పెన్షనర్లు ఆవిర్భావ సమావేశంలో పాల్గొన్నారు. సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వంలో ఒకరిగా సేవలందించిన రిటైర్డు ఉద్యోగులు తమ పెన్షన్ సమస్యలతో పాటు సమాజం ముందున్న సవాళ్లను పరిష్కరించే బాధ్యతను తీసుకోవాలని పట్నా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నర్సింహారెడ్డి పెన్షనర్లకు విజ్ఞప్తి చేశారు. ఎవరికి అవకాశం ఉన్న రీతిలో వారు సమాజానికి సేవ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. పెన్షనర్లను గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. తెలంగాణలో పెన్షనర్ల ఇబ్బందులను సీఎం దృష్టికి తీసికెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హెల్త్కార్డులను అమలు చేయని ఆసుపత్రులపై కఠిన వైఖరి అవలం భించాలని ప్రభుత్వం భావిస్తోందని, నెలరోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. సమావేశంలో ఆలిండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ నేతలు స్వామినాథన్, పూర్ణచంద్రరావు, లక్ష్మయ్య, దూబే, రామ్మూర్తి, సుధాకర్ పాల్గొన్నారు. హెల్త్కార్డులు అమలు కాకపోవడం సిగ్గుచేటు కొత్త ప్రభుత్వాలు ఏర్పాటై రెండేళ్లు దాటినా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చిన హెల్త్కార్డులు అమలుకు నోచుకోకపోవడం సిగ్గుచేటని ఏపీఎన్జీవో మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి అన్నారు. ఏఐఆర్ఎఫ్ సెక్రటరీ జనరల్ శివగోపాల్ మిశ్రా మాట్లాడుతూ.. పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కుగా ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఏపీఎన్జీవో ప్రస్తుత అధ్యక్షుడు అశోక్బాబు మాట్లాడుతూ.. ఏపీలో ఉద్యోగులకు లభిస్తున్న ప్రయోజనాలన్నీ, పెన్షనర్లకూ వర్తించేలా చేసేందుకు ఏపీ సీఎంను ఒప్పించామన్నారు. టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాదరావు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లను ఐక్యం చేసేందుకు ఏఐఎస్పీఎఫ్ ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. -
జూలై 31కి ఉద్యోగులంతా అమరావతికి
ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు అనంతపురం న్యూసిటీ: ఏపీ ఉద్యోగులంతా జూలై 31నాటికి రాజధాని అమరావతికితరలివెళ్తారని ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు తెలిపారు. ఆదివారం అనంతపురంలోని ఎన్జీవో హోంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జూన్ 15 నాటికి సెక్రటేరియట్ ఉద్యోగులు, జూలై 31కల్లా వివిధ విభాగాల హెచ్వోడీలు రాజధానికి వెళ్తారని చెప్పారు. అయితే 30 శాతం హెచ్ఆర్ఏ, వారంలో 5 రోజులే పనిదినాలుండాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంపై జాతీయస్థాయిలో ఉద్యమం జరగాలని అభిప్రాయపడ్డారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్పై ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు. 30న జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. -
శ్రీవారి సేవలో రకుల్ప్రీత్సింగ్
తిరుమల శ్రీవారిని సినీ నటి రకుల్ప్రీత్సింగ్ ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకున్న అనంతరం అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్రావు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. -
ఆందోళనకు సిద్ధంకండి
ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు పిలుపు తిరుపతి కార్పొరేషన్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు అసరమైతే సమైక్యాంధ్ర ఉద్యమ తరహాలో ఆందోళనకు సిద్ధం కావాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తిరుపతి శాఖ వార్షిక సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహిం చారు. తిరుపతిలో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు టీటీడీలో కల్పించే సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకుం టామన్నారు. ముఖ్యంగా గుర్తింపు కార్డులు, దర్శన విషయాలు టీటీడీ ఈవోతో చర్చిస్తామన్నారు. ఉద్యోగులకు ఇంటి స్థలాలు కల్పించడం,ఎన్జీవోలకు తిరుపతిలో కల్యాణ మండపం నిర్మించేలా ముఖ్యమంత్రి తో చర్చిస్తామని తెలిపారు. అంతకు ముందు ఏపీ మెడికల్ హెల్త్ మినిస్టీరియల్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నయనార్ వరప్రసాద్ మాట్లాడు తూ సిపీఎస్ పెన్షన్ స్కీమ్లో రుణ సౌకర్యం కల్పించాలన్నారు. ఏపీ ఎన్జీవో రాష్ట్ర, జిల్లా నాయకులు ప్రభాకర్ నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, శివారెడ్డి, విజయలక్ష్మీ, దేవప్రసాద్, ప్రసన్నరాణి, కుసుమ, గురుకుమార్, సురేష్, మునస్వామి, కోటీశ్వర్రావు, జమాల్ వల్లీ, ఎన్సీసీ గుణశేఖర్, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. -
రవాణా కమిషనర్ను బదిలీ చేయాలి
విజయవాడ : రవాణా శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యంను వెంటనే బదిలీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబు వెల్లడించారు. గురువారం విజయవాడలో చంద్రబాబును అశోక్బాబుతో పాటు రవాణ సంస్థకు చెందిన ఉద్యోగులు కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ సుబ్రహ్మణ్యం.. ఉద్యోగ సంఘ నేతలను వేధింపులకు గురి చేస్తున్న తీరును చంద్రబాబుకు అశోక్ బాబు వివరించారు. అనంతరం అశోక్బాబు విలేకర్లతో మాట్లాడుతూ... 56 సర్వీసులు ప్రైవేటీకరించేందుకు కమిషనర్ యత్నిస్తున్నారని విమర్శించారు. సుబ్రహ్మణ్యం వేధింపులపై రవాణ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలవ వలసి వచ్చిందన్నారు. సుబ్రహ్మణ్యంపై తక్షణం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అధికారులపై దాడులు కొత్త కాదు: అశోక్బాబు
హైదరాబాద్: ఉద్యోగులపై దాడులు ఈ ప్రభుత్వ హయాంలోనే జరగలేదని, గత ప్రభుత్వాల్లోనూ జరిగాయని ఉద్యోగ సంఘాల జేఏసీ నేత అశోక్బాబు అన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకుని టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల చేతిలో దాడికి గురైన తహసీల్దారు వనజాక్షికి బెదిరింపు లేఖ అందిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా ఉద్యోగులపై దాడులు కొత్తగా జరుగుతున్నవి కాదని, గత ప్రభుత్వాల్లోనూ జరిగాయని, వనజాక్షికి బెదిరింపు లేఖ ఎలా వచ్చిందో? దాని వెనుక రాజకీయంగా ఎవరున్నారో విచారణలో తేలుతుందంటూ టీడీపీ సర్కారును అశోక్బాబు వెనకేసుకొచ్చారు. కాగా, రెవెన్యూ ఉద్యోగులపై దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తహసీల్దారు వనజాక్షికి బెదిరింపు లేఖ, గుంటూరు తహసీల్దారుపై దాడి నేపథ్యంలో అసోసియేషన్ ప్రతినిధులతో కలసి ఆర్థిక మంత్రి, సీఎం పేషీలోని ముఖ్య కార్యదర్శిని కలిసి చర్చించారు. -
'ఉద్యోగులపై దాడులు కొత్తేమీకాదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు జరగడం కొత్తేమీకాదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కూడా దాడులు జరిగాయని చెప్పారు. తహశీల్దార్ వనజాక్షిపై ఇటీవలి దాడి జరిగిన ఘటన నేపథ్యంలో అశోక్ బాబు పైవిధంగా స్పందించారు. వనజాక్షిపై దాడి ఘటనపై ప్రభుత్వం విచారణ కమిటీ వేసిందని తెలిపారు. ఏపీలో ఉద్యోగుల బదిలీలను ఆగస్టులో చేయడం సరికాదని అశోక్ బాబు అన్నారు. విజయవాడకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఉద్యోగులను కూడా సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలను కట్టిన తర్వాత రాజధానిని తరలించాలని గతంలోనే కోరామని చెప్పారు. ఏయే శాఖలు, ఎంత మంది ఉద్యోగులను తరలిస్తారో తెలపాలని కోరారు. ఉద్యోగులు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారో లేదో తెలియజేస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. -
అశోక్బాబు స్పందించరేం?
తిరుపతి రూరల్: మహిళా అధికారులపై దాడులు జరుగుతున్నా ఎపీఎన్జీవో నాయకుడు ఆశోక్బాబు..ఎందుకు మౌనంగా ఉంటున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ప్రశ్నించారు. అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ టీడీపీ కార్యకర్తల కన్నా ఎక్కువగా పచ్చనేతల మెప్పుకోసం ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. తిరుపతిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యాపారాలు, రాష్ర్టస్థాయి పరపతి కోసమే పదవులను అడ్డుపెట్టుకుంటున్నారన్నారు. అధికారులపై దాడులను ఖండించలేని అశోక్బాబు నాయకుడుగా ఉండడం సిగ్గుచేటని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రౌడీ, గుండా రాజకీయాలు పెరిగిపోయాయన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళితే అధికార పార్టీకి చెం దిన అక్రమార్కుల చేతిలో దెబ్బలు తినే పరిస్థితిని కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరు దోచుకుంటున్నారని ఆరోపించారు. చిన్నగొట్టిగల్లు తహశీల్దార్పై దాడి అమానుషం చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లులో చెరువు కబ్జాలను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళా తహశీల్దార్పై టీడీపీ సర్పంచ్ దాడికి పాల్పడడం అమానుషమని చెవిరెడ్డి అన్నారు. కులం పేరుతో దూషించి, దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. -
ఆరడుగుల బుల్లెట్ ఎక్కడ దాక్కున్నాడు?
కాకినాడ : ఉద్యోగులపై దాడులు జరుగుతుంటే ఆరడుగుల బుల్లెట్ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఎక్కడ దాక్కున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రశ్నించారు. ఏ ఒక్క పార్టీకి, ప్రభుత్వానికి అశోక్ బాబు వత్తాసు పలకడం సరైంది కాదని ఆయన శనివారమిక్కడ అన్నారు. తహసీల్దార్ వనజాక్షి ఇచ్చిన ఫిర్యాదుపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను తక్షణమే అరెస్ట్ చేయాలని మధు డిమాండ్ చేశారు. లేదంటే కృష్ణాజిల్లా ముసునూరులో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ఆయన హెచ్చరించారు. చింతమనేనికి ముఖ్యమంత్రి చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారని మధు ఆరోపించారు. -
‘టీడీపీ తొత్తుగా మారిన అశోక్బాబు’
కాచిగూడ: ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్బాబు తెలుగుదేశం పార్టీ తొత్తుగా మారారని... అధికారులు, ఉద్యోగులపైన దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని హైదరాబాద్ టీఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ గౌడ్ ఆరోపించారు. శుక్రవారం నారాయణగూడలోని ఐపీఎంలో అసోసియేషన్ బ్రాంచి కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, ఐఎన్టీయూసీ ఐపీఎం అధ్యక్షుడు ఆర్.కృష్ణారెడ్డి, చెన్నయ్య, ఈశ్వర్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై ప్రభుత్వ విఫ్ చింతమనేని ప్రభాకర్ తనఅనుచరులతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సీమాంధ్ర ఉద్యోగులు అశోక్బాబును అసోసియేషన్ అధ్యక్షునిగా, ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్గా వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
సెక్షన్-8పై రౌండ్ టేబుల్ సమావేశం రసాభాస
-
సెక్షన్-8పై రౌండ్ టేబుల్ సమావేశం రసాభాస
విశాఖ : సెక్షన్-8పై విశాఖపట్నంలో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశం బుధవారం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో పాల్గొన్న న్యాయవాదులు తమ నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రక్రియలో భాగంగా ఇప్పుడు సెక్షన్-8 గుర్తుకొచ్చిందా అని వారు ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదులపైనా, న్యాయమూర్తులపైనా దాడి జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించలేదన్నారు. ఇప్పుడు వేదికపై ఉన్నవారంతా అప్పుడు ఎందుకు స్పందించలేదని న్యాయవాదులు సూటిగా ప్రశ్నలు సంధించారు. హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు అంటే... విశాఖ ఎందుకు చర్చ పెట్టారని పలువురు న్యాయవాదులు నిలదీశారు. ప్రస్తుతం వేదికపై ఉన్నవారంతా సమైక్య ఉద్యమంలో తప్పుకున్నారని, తామే చివరివరకూ పోరాడమని, 200 రోజుల పాటు కోర్టుల్లో విధులకు హాజరు కాలేదని గుర్తు చేశారు. హైకోర్టులో అలజడి రేగినప్పుడు ఎందుకు స్పందించలేదని లాయర్లు ప్రశ్నించారు. కాగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం నిర్వహణలో 'ఇంప్లిమెంటేషన్ అండ్ అమెండ్మెంట్ టు సెక్షన్ 8 ఆఫ్ ఏపీ రీఆర్గనైజింగ్ యాక్ట్' అంశంపై హోటల్ దసపల్లాలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు అశోక్ బాబు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఉద్యోగుల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మంగళవారం (మే 19) నుంచి జూన్ 5వ తేదీ వరకు బదిలీలు ఉంటాయని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. కనీసం రెండేళ్లు, గరిష్ఠంగా ఐదేళ్ల సర్వీసు ఉన్నవారిని బదిలీలు చేయాల్సిందిగా కోరామని ఆయన అన్నారు. కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు నిర్వహించాలని, బదిలీల విషయంలో పారదర్శకత పాటించాలని కోరినట్లు అశోక్ బాబు చెప్పారు. -
ఏపీ, టీ ఎన్జీవోల ఘర్షణ
పోలీస్స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు హైదరాబాద్: ఏపీఎన్జీవో నాయకులు, టీఎన్జీవో నాయకుల మధ్య శనివారం ఘర్షణ జరిగింది. రెండు సంఘాల నాయకుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. దీంతో గన్ఫౌండ్రీలోని ఏపీ ఎన్జీవో కార్యాలయం నినాదాలతో మార్మోగింది. చివరకు ఇరువర్గాలు అబిడ్స్ పోలీస్స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఏపీఎన్జీవో కార్యాలయంలో ఉన్న అధ్యక్షుడు అశోక్బాబు వద్దకు తెలంగాణ ఎన్జీవోస్ అసోసియేట్ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, ఇతర నాయకులు విచ్చేసి 58/42 రేషియో ప్రకారం గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీలో తెలంగాణ ఉద్యోగులకు పునర్విభజన చేయాలని సూచించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వాగ్వాదాలు, ఒకరిపై ఒకరు దూషణలు చేసుకున్నారు. సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు హుటాహుటిన విచ్చేసి ఇరువురికి నచ్చజెప్పారు. చివరకు ఏపీఎన్జీవో నాయకులు, తెలంగాణ ఎన్జీవో నాయకులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. తాను ప్రధాన కార్యదర్శి బలరాంలు సభ్యులతో కలిసి వినతిపత్రం సమర్పించేందుకు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు వద్దకు వెళ్లగా.. గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ కుంభకోణానికి పాల్పడ్డ నిందితులను వెనకేసుకురావడమే కాకుండా సంస్థలోని తెలంగాణ ఉద్యోగులపై వినలేని వ్యాఖ్యలు, బూతు పదజాలంతో దూషిస్తూ, అహంకార ధోరణితో వ్యవహరించారని తెలంగాణ ఎన్జీవోస్ అసోసియేట్ అధ్యక్షుడు ఎం. సత్యనారాయణగౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవలం 58/42 రేషియో ప్రకారం గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీలో తెలంగాణ ఉద్యోగులకు పునర్విభజన చేయాలంటూ వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన తమపై అధ్యక్షుడి హోదాలో ఉన్నానన్న గర్వంతోనే ఇష్టానుసారంగా వ్యవహరించి దాడికి పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో అందరి సమక్షంలో ఏపీఎన్జీవో సిటీ కార్యాలయాన్ని హెచ్టీఎన్జీవోస్కు కేటాయిస్తానని చెప్పిన అశోక్బాబు.. దాన్ని కుట్రపూరితంగానే ఏపీఎన్జీవో మహిళా విభాగానికి కేటాయించడం ఆయన కక్షపూరిత ధోరణికి నిదర్శనమన్నారు. దీనిపై అశోక్బాబు మాట్లాడుతూ... తెలంగాణ ఎన్జీవోస్ నాయకులే తమ కార్యాలయానికి విచ్చేసి తమతో ఘర్షణకు దిగారని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
పదేళ్లలో రాష్ట్రానికి పూర్వవైభవం
విజయవాడ : పదేళ్లలో రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్బాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పశ్చిమ కృష్ణా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలోని వేదిక ఫంక్షన్ హాలులో రాష్ట్ర నాయకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అశోక్బాబు మాట్లాడుతూ ఉద్యోగుల పీఆర్సీపై రెండు రోజులలో జీవో వస్తుందన్నారు. కేబినెట్ సబ్ కమిటీ ఎదుట ఏడు ప్రధాన డిమాండ్లను ఉంచినట్లు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరినట్లు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది పూర్తిగా రాజకీయపరమైన అంశమని అన్నారు. బీజేపీ, టీడీపీ ప్రత్యేక హోదా సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాసేవకు సంబంధించి కొన్ని శాఖలు ముందుగా విజయవాడకు వస్తాయని వివరించారు. అశోక్బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డిలను సన్మానించారు. -
అశోకుడి ఆరాటం!
-
'అశోక్ బాబు గోబెల్ ప్రచారం మానుకోవాలి'
కరీంనగర్: బ్రిటీష్ కాలం నాటి ఉద్యోగుల సర్వీస్ రూల్స్ లో మార్పులు తీసుకువస్తామని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన దేవీ ప్రసాద్.. ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు పై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యోగులపై అశోక్ బాబు చేస్తున్న గోబెల్ ప్రచారం మానుకోవాలన్నారు. ఉద్యోగుల సర్వీస్ రూల్స్ లో సమూల మార్పులకు తెలంగాణలోని 10 జిల్లాల్లో వర్క్ షాపులు నిర్వహిస్తామన్నారు. -
ఏపీ ఎన్జీవో కార్యాలయానికి తాళం వేసిన టీ.ఉద్యోగులు
హైదరాబాద్ : హైదరాబాద్ గన్పౌండ్రీలోని ఏపీ ఎన్జీవో కార్యాలయానికి తెలంగాణ ఉద్యోగులు గురువారం తాళం వేశారు. తాము ప్రత్యేక కార్యాలయం పెట్టుకుంటామంటే... అశోక్ బాబు వినటం లేదంటూ తెలంగాణ ఉద్యోగులు ఈ ఘటనకు పాల్పడ్డారు. కాగా ఏపీఎన్జీవో ఆఫీసులో తెలంగాణ ఉద్యోగులు వాటా అడుగుతున్నారని, అది పూర్తిగా ప్రైవేటు ఆస్తి అని ఆంధ్రప్రదేశ్ నాన్గెజిటెడ్ ఆఫీసర్స్ (ఏపీ ఎన్జీఓ) సంఘం అధ్యక్షుడు పి.అశోక్బాబు గతంలో వెల్లడించారు. దీనిపై తెలంగాణ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. -
అశోక్బాబు కుట్రలు చేస్తున్నారు: దేవీ ప్రసాద్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులు తమపై దాడి చేస్తున్నారంటూ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో దేవీ ప్రసాద్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలోనే ఎక్కడా ఏపీ ఉద్యోగులపై ఎలాంటి దాడులు చేయలేదని గుర్తు చేశారు. అలాంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ ఉద్యోగులు ఎందుకు దాడి చేస్తారని ప్రశ్నించారు. అంతర్గత కలహాలతో కుస్తీ పడుతున్న ఏపీ ఎన్జీవోలు... తెలంగాణ ప్రభుత్వంతో యుద్దం చేసే ప్రయత్నాలను మానుకోవాలని దేవీ ప్రసాద్ హితవు పలికారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఏపీ ఎన్జీవో సంఘంలోని హైదరాబాద్ ఉద్యోగులు న్యాయమైన వాటా కోసం పట్టుపడుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఏపీ ఎన్జీవోను ఏపీకి తరలించే క్రమంలో నిధులు, వాటాల కోసం ఆ సంస్థ ప్రతినిధులకు సమాధానం చెప్పలేక అశోక్బాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. -
ఉన్నపళంగా తరలింపు తగదు
ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు మంత్రులు చెట్ల కింద పనిచేస్తే ఉద్యోగులూ సిద్ధం ఒత్తిడి వల్ల లాభం కంటే ఇబ్బందులే ఎక్కువ విజయవాడ బ్యూరో: తాత్కాలిక రాజధానికి ఉద్యోగుల బదిలీ ప్రక్రియ దశలవారీగా జరగాలే తప్పా ఇప్పటికిప్పుడే హైదరాబాద్ నుంచి తరలించే యత్నం సరికాదని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి.అశోక్బాబు అన్నారు. తాత్కాలిక రాజధానికి తక్షణం వెళ్లిపోవాలంటే.. మంత్రులు, ఐఏఎస్లు చె ట్ల కింద కూర్చుని పనిచేస్తే తామూ పనిచేస్తామన్నారు. విజయవాడ ఏపీఎన్జీవో కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్న అనేక అంశాలను మంగళవారం సీఎం చంద్రబాబుతో జరిగే సమావేశంలో ప్రస్తావిస్తామని చెప్పారు. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. ఈలోగా తాత్కాలిక రాజధానిని నిర్మించుకుని, ప్రజలకు తక్షణ అవసరమైన శాఖలను దశలవారీగా తరలించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.రాజధాని స్వరూప స్వభావాలు, పరిపాలనపై ప్రభుత్వం ఉద్యోగులతో చర్చించాలని డిమాండ్ చేశారు. హెల్త్కార్డులపై నేడు సీఎం సమావేశం.. ఉద్యోగులకు హెల్త్కార్డులు అందించే అంశాన్ని చర్చించేందుకు మంగళవారం సీఎం నిర్వహించే సమావేశంలో ఆ పథకం అమలులో లోపాలను చర్చించడంతో పాటు ఉద్యోగుల సమస్యలను ఆయన దృష్టికి తెస్తామని అశోక్బాబు చెప్పారు -
విజయవాడలో పని చేయటం కష్టం: అశోక్
విజయవాడ : మౌలిక సదుపాయాలు లేకుండా ఉద్యోగులను విజయవాడకు బదిలీ చేస్తామంటే కుదరదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ వసతులు లేకుండా విజయవాడలో పని చేయటం కష్టమన్నారు. కొన్ని శాఖలు హైదరాబాద్ నుంచి కూడా పని చేయవచ్చునన్నారు. అవసరమైన శాఖలను ఉద్యోగుల ఇష్టపూర్వకంగా మాత్రమే బదిలీ చేయాలన్నారు. ఉద్యోగుకులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం పీఆర్సీ చెల్లించాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. -
సమ్మె కాలాన్ని సెలవుగా ప్రకటించాలి
కర్నూలు(అగ్రికల్చర్): సమైక్యాంధ్ర పరిరక్షణకు 80 రోజుల పాటు చేపట్టిన సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవులుగా ప్రకటించాలని ఏపీఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు డిమాండ్ చేశారు. నగరంలోని కేవీఆర్ కళాశాల సమావేశ మందిరంలో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఆదివారం ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నవ్యాంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలు.. హైదరాబాద్ నగర అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. హైదరాబాద్తో పాటు 13 జిల్లాల స్థితిగతులపై సమీక్షించారు. జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పలు డిమాండ్లు, సమస్యలను రాష్ట్ర కార్యవర్గం ముందుంచారు. ఈ సందర్భంగా అశోక్బాబు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో పీఆర్సీ కోసం కమిటీ వేశారని.. రెండు నెలల క్రితమే కమిటీ నివేదిక అందజేసినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం తగదన్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసినా పని చేసేందుకు ఉద్యోగులు సిద్ధమని, అవసరమైతే అదనపు గంటలు కూడా పని చేస్తామన్నారు. విజయవాడలోనూ, అసెంబ్లీలో ప్రకటించినట్లుగా కాంట్రాక్ట్, కంటింజెంట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసేందుకు అవసరమైన విధివిధానాలను ఖరారు చేసేందుకు వెంటనే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాలన్నారు. అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కోశాధికారి వీరేంద్రబాబు, ఉపాధ్యక్షులు జి.రామకృష్ణారెడ్డి, ప్రభాకర్, రవిశంకర్, విద్యాసాగర్, శివారెడ్డి,రమణ, కార్యదర్శులు లూక్, గంగిరెడ్డి, నరసింహారావు, నరసింహులు.. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.సి.హెచ్.వెంగల్రెడ్డి, శ్రీరాములు, కోశాధికారి పి.రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చెట్టు కింద కూర్చున్నా సీఎం సీఎమ్మే!
విజయవాడ: రెండు నెలలుగా రాష్ట్ర పాలన గాడితప్పిందని ఏపి ఉద్యోగుల సంఘ నేత అశోక్ బాబు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే కుర్చీ కూడా లేదంటున్నారని విమర్శించారు. చెట్టు కింద కూర్చున్నా సీఎం సీఎమ్మే అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు హైదరాబాద్ వెళ్లకుండా విజయవాడ, గుంటూరులో ప్రతీది అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. ప్రజలకు మెరుగైన సేవలందిస్తే సీఎం ఎక్కడ కూర్చున్నా ప్రజలకు అక్కరలేదని అశోక్బాబు అన్నారు. -
15 నుంచి ఉద్యోగులకు హెల్త్కార్డులు
ఉద్యోగ సంఘాల జేఏసీకి ఏపీ సీఎం చంద్రబాబు హామీ మిగతా డిమాండ్ల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్: ఉద్యోగులకు నగదు ప్రమేయం లేని వైద్యం అందించడానికి ఉద్దేశించిన హెల్త్ కార్డుల పథకాన్ని ఈ నెల 15 నుంచి అమల్లోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తనను కలసిన ఉద్యోగ సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. మిగతా డిమాండ్ల పరిష్కారానికి ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. హెల్త్కార్డులు మినహా మిగతా వాటి పరిష్కారానికి వెంటనే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తానని, సమస్యలన్నీ ఉపసంఘానికి చెప్పుకోవాలని ఉద్యోగులకు సూచించారు. ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధి బృందం శనివారం ముఖ్యమంత్రితో భేటీ అయింది. జేఏసీ చైర్మన్ అశోక్బాబు, సెక్రటరీ జనరల్ ఐ.వెంకటేశ్వరరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ చంద్రశేఖరరెడ్డి, కో-చైర్మన్లు కత్తి నరసింహారెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, రఘురామిరెడ్డి, కమలాకరరావు, ఉపాధ్యక్షులు రాయుడు అప్పారావు, బండి శ్రీనివాసరావు, మహిళా నేతలు రత్న, తులసీరత్నం తదితరులు ప్రతినిధి బృందంలో ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి అజయ్ సహాని సమావేశానికి హాజరయ్యారు -
మాకు ప్రత్యేక గదులు కేటాయించాలి
అశోక్బాబును నిలదీసిన టీఎన్జీవోలు హైదరాబాద్ : ఏపీఎన్జీవోస్ హోంలో టీఎన్జీవోస్ అసోసియేషన్కు ప్రత్యేకంగా గదులు కేటాయించాలంటూ అసోసియేషన్ కన్వీనర్ ఎం.సత్యనారాయణ గౌడ్ డిమాండ్ చేశారు. గదుల కేటాయింపుపై ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్బాబుకు వినతి పత్రం ఇవ్వడానికి శనివారం గన్ఫౌండ్రిలోని ఏపీఎన్జీవోస్ హోంకు టీఎన్జీవోలు వెళ్లారు. వినతి పత్రాన్ని తీసుకోకపోగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం నుంచి ఏపిఎన్జీఓస్ హోం నుంచి తమ అసోసియేషన్ కార్యకలాపాలను కొనసాగిస్తామని, ఏపిఎన్జీఓస్ అసోసియేషన్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు ఎలాంటి కష్టం రాకుండా వారికి అండగా ఉంటామని తెలిపారు. -
చిన్న రాష్ట్రానికి సీఎంనయ్యా: బాబు
పరిధి తగ్గిపోయి పని లేకుండా పోయింది: ఏపీఎన్జీవోల సన్మాన సభలో సీఎం చంద్రబాబు విజయవాడ బ్యూరో: ‘‘నేను 23 జిల్లాలకు సీఎంగా వున్నప్పుడు చేతినిండా పని ఉండేది. ఇప్పుడు 13 జిల్లాల చిన్న రాష్ట్రానికి సీఎంగా ఉండటం వల్ల పరిధి తగ్గిపోయి పెద్దగా పనిలేకుండాపోయింది. సమయం ఎక్కువగా ఉండటం వల్ల అన్ని విషయాలు అందరితో మాట్లాడే అవకాశం కలిగింది’’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శనివారం విజయవాడలో ఏపీఎన్జీవోలు జరిపిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీఎం పదవిని కొందరు బంగారు పీఠమనుకుంటారని, కానీ అది ముళ్ల కిరీటమని అన్నారు. రాష్ట్రంలో అన్నీ సమస్యలేనని, హైదరాబాద్ సెక్రటేరియెట్లో పనిచేసే పరిస్థితి కూడా లేదని అన్నారు. రాష్ట్రాన్ని సీమాంధ్ర అంటున్నారని, కానీ ఆంధ్రప్రదేశ్గా నిజమైన బ్రాండ్నేమ్ ఉందని, దాన్నే కొనసాగిస్తామని చెప్పారు. ప్రపంచంలో అందరూ చూడ్డానికి వచ్చే స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధానిని నిర్మించి అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోకి ఎటు రావాలన్నా 200 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉందని, అందుకే సెంటర్ప్లేస్ నుంచి పరిపాలన చేసే విషయమై ఆలోచిస్తున్నానని తెలిపారు. ఏదేమైనా ఆగస్టు ఆఖరులోగా రాజధాని ఎక్కడో తేలుతుందని చెప్పారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా ఉద్యోగుల సమస్యల్లో ఆర్థిక వ్యవహారాలతో ముడిపడిన వాటిని దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ఉద్యోగ సంఘాలతో మూడు నెలలకోసారి ఆయా శాఖల మంత్రులు, అధికారులు సమావేశమై సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఉద్యోగులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేస్తామని ప్రకటించారు. ఉద్యమం నిర్వహించిన 80 రోజులను లీవ్గా పరిగణించి సర్వీసును రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. హెల్త్కార్డుల ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు ఆగస్టు 15 నుంచి ఇన్సూరెన్స్ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. పీఆర్సీ ఎప్పుడు చేయడానికైనా తాను సిద్ధమేనన్నారు. హైదరాబాద్లో ఉన్న ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు. పదవీ విరమణ వయసు పెంపును టీచర్లకూ వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు. ఉద్యోగులపై పెట్టిన ఏసీబీ కేసులను సమీక్షించి ఇబ్బంది పడేవారికి అండగా ఉంటామన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా చనిపోయిన 25 మంది ఉద్యోగులు, బయట వ్యక్తులు ముగ్గురికి రూ.5 లక్షల చొప్పునసాయం చేస్తామన్నారు. సంక్షేమ పథకాలకు ఒకరోజు వేతనం: అశోక్బాబు రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఇక్కడున్న 4 లక్షల మంది ఉద్యోగుల ఒకరోజు బేసిక్ జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ఏపీఎన్జీఓల అధ్యక్షుడు అశోక్బాబు తెలిపారు. దీనిద్వారా వచ్చే రూ.80 కోట్లను ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, పెన్షన్ల పథకాలకు ఉపయోగించాలని కోరారు. హైదరాబాద్లో పనిచేయడానికి తాము సిద్ధంగా లేమని, 36 వేల మంది ఉద్యోగులు ఇక్కడికొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా సీఎంను ఘనంగా సన్మానించారు. ఇక మిమ్మల్ని పరిగెత్తిస్తా.. ఇదిలా ఉండగా విజయవాడలో జరిగిన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిందంటే.. అది కార్యకర్తల కృషేనని,కార్యకర్తలకూ ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఇకమీదట విజయవాడలో ఎక్కువ రోజులు ఉంటానన్నారు ఇంతకాలం తాను పరిగెత్తితే మీరంతా కూర్చున్నారని, ఇకమీదట తాను కూర్చుని మిమ్నల్ని పరిగెత్తిస్తానని చెప్పారు. -
'సీఎం రిలీఫ్ ఫండ్ కు ఒక రోజు జీతం విరాళం ఇస్తాం'
విజయవాడ: సీఎం రిలీఫ్ ఫండ్ కు తమ ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేశారు. తాము ఇచ్చే ఈ ఫండ్ ను మాత్రం ఆరోగ్య శ్రీ, వృద్ధాప్య పించన్లు కు ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి శనివారం మీడియాతో మాట్లాడిన అశోక్ బాబు.. రాష్ట్ర అభివృద్ధి బాధ్యత మాత్రం పూర్తిగా కేంద్రానిదేనని తెలిపారు. కాంట్రాక్టు వ్యవస్థను రెగ్యులరైజ్ చేయడంతోపాటు.. అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలని సూచించారు. అవుట్ సోర్సింగ్ వారిని కూడా రెగ్యులరైజ్ చేయాలన్నారు. పీఆర్సీ అమలు చేయడంతోపాటు ఉద్యోగస్థులకు హెల్త్ కార్డులు వచ్చేలా చూడాలని అశోక్ బాబు ప్రభుత్వానికి విన్నవించారు. -
ఏపీ ఎన్జీఓల సభలో చంద్రబాబు ప్రసంగం
-
ఏపీ ఎన్జీవోల భూమిని తీసుకోవడం అన్యాయం: అశోక్ బాబు
హైదరాబాద్: ఏపీ ఎన్జీవోలకు కేటాయించిన భూమిని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం అన్యాయమని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు అన్నారు. ఆంధ్ర ప్రాంత వారిపై కక్షసాధింపు చర్యగా ఉద్యోగులు భావిస్తున్నారని అశోక్ బాబు మీడియాకు తెలిపారు. గత ప్రభుత్వం కేటాయించిన భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేయలేదనడం భావ్యం కాదన్నారు. 2010లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్లే తాము నిర్మాణాలు చేపట్టలేకపోయామని అశోక్బాబు వివరణ ఇచ్చారు. 4 కోట్ల రూపాయలు లే అవుట్ ఛార్జీల కోసం, భూమి అభివృద్ధికి 5 కోట్లు ఖర్చుచేశామని అశోక్బాబు తెలిపారు. ఎపీఎన్జీవోలతోపాటు ఇతర సంఘాలకు ఇచ్చిన భూముల్లో కూడా చాలాభాగం నిర్మాణాలు జరగలేదని మీడియాకు అశోక్బాబు వెల్లడించారు. ఏపీఎన్జీవోలకు కేటాయించిన భూములే వెనక్కి తీసుకోవడం భావ్యం కాదని, సీఎం కేసీఆర్ను కలిసి వాస్తవాలు తెలియజేస్తామని అశోక్ బాబు అన్నారు. -
ఆరడుగుల బుల్లెట్ మిస్ అయ్యిందా?
అశోక్ బాబు ఈ పేరు సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో రాష్ట్రమంతా తెగ వెలిగిపోయింది. ఇది ఆరడుగుల బుల్లెట్....ధైర్యం విసిరిన రాకెట్ అంటూ రాష్ట్ర విభజన సమయంలో తెగ హడావుడి చేసిన ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబుకు పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా మారింది. ఆయనకు దెబ్బ మీద దెబ్బ పడింది. ఓవైపు ఏపీ ఎన్జీవో గృహ నిర్మాణ సంఘానికి భూకేటాయింపులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేస్తే, మరోవైపు ఏపీ ఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా, డెరైక్టర్గా అశోక్బాబు నియామకం చెల్లదంటూ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఒకప్పుడు తానే మోనార్క్ అంటూ, తెగ నోరు పారేసుకున్న అశోక్ బాబు ... రాజకీయాలు అంటేనే అసహ్యమేస్తుందన్న నోటితోనే... అవసరం అయితే రాజకీయాల్లోకి వస్తానని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో సీల్డ్ కవర్ సీఎంతో సన్నిహితంగా మెలిగి ఉద్యమ బాటను అర్థాంతరంగా ముగించేసి, ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఆ తర్వాత అశోక్ బాబు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపినా అందుకు అవకాశం కలిసి రాలేదు. ఓ దశలో కిరణ్ జై సమైక్యాంధ్ర పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైన ఆయన ఆ తర్వాత వెనక్కి తగ్గారు. తీరా తాను నమ్ముకున్న నేత ఏకంగా పార్టీనే ముసేసుకునే పరిస్థితి ఏర్పడింది. తాజాగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రికి దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేసినా...'బాబు' మంత్రం ఫలించలేదు. అంతన్నాడు ఇంతన్నాడు.. అన్న చందంగా అశోక్ బాబు.... వేసిన బుల్లెట్ మిస్ అయ్యిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
'ఉద్యోగ నేతలు తప్పు లెక్కలు చెప్పారు'
హైదరాబాద్ : ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చాలని ఏపీ ఎన్టీవో అధ్యక్షుడు అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణంలో ఉద్యోగులు క్రియాశీలక పాత్ర పోషిస్తారని అశోక్ బాబు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో మిగులు ఉద్యోగులు ఉన్నారని తేటతెల్లమైందన్నారు. ఉద్యోగుల సంఖ్యపై తెలంగాణ నేతలు తప్పు లెక్కలు చెప్పారని ఆయన ఆరోపించారు. -
'గోంగూర, సొరకాయ మాటలు కట్టిపెట్టండి'
-
'గోంగూర, సొరకాయ మాటలు కట్టిపెట్టండి'
హైదరాబాద్: కేసీఆర్ వ్యాఖ్యలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని, తమకు అండగా నిలబడాలని చంద్రబాబును కలిసినట్టు ఏపీఎన్జీవోలు, సీమాంధ్ర సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు అశోక్బాబు, మురళీకృష్ణ తెలిపాయి. చంద్రబాబుతో భేటీ ముగిసిన తర్వాత వారు విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారని చెప్పారు. రాష్ట్రపతి జీవో ప్రకారమే ఉద్యోగుల విభజన ఉంటుందని, అవసరమైతే కేంద్రంతో మాట్లాడి సీమాంధ్ర ఉద్యోగులకు బాబు న్యాయం చేస్తామన్నారని తెలిపారు. ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉందామన్న కేసీఆర్ ఇప్పుడు ఇలా మాట్లాడటం మంచిది కాదని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. తెలంగాణ ఉద్యోగులు రాద్ధాంతం చేస్తున్న 193 మంది తెలంగాణలో పుట్టి పెరిగినవాళ్లేనని వెల్లడించారు. గోంగూర, సొరకాయ మాటలు కట్టిపెట్టి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల విభజన జరిగేలా చూడాలన్నారు. -
ఉద్యోగుల్లో ‘స్థానికత’ చిచ్చు
సచివాలయ సిబ్బందిలో పెరుగుతున్న దూరం సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజనకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగుల మధ్య చిచ్చు రేగుతోంది. శాఖల వారీగా ఉద్యోగుల పంపిణీ కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఇరు ప్రాంత ఉద్యోగుల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోంది. సచివాలయ ఉద్యోగుల స్థానికత వివరాలను ఇటీవల వెల్లడించిన తర్వాత వాతావరణం మరింత వేడెక్కింది. సీమాంధ్ర ఉద్యోగులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో స్థానికతను మార్చుకున్నారంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాలు చేసిన ఆరోపణలు మాటల యుద్ధానికి తెరలేపాయి. సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణ సచివాలయం గేటు లోపలికి కూడా రానివ్వమంటూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు తాజాగా చేసిన వ్యాఖ్యలు.. ఉద్యోగుల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కారని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందేనంటూ సీమాంధ్ర ఉద్యోగులూ ఘాటుగానే స్పందించారు. విభజనపై రెండు రోజులుగా సాగుతున్న ఈ రగడ గురువారం కూడా కొనసాగింది. ఇరు ప్రాంత ఉద్యోగులు తమ వాదనను గట్టిగా వినిపించారు. తప్పుడు పత్రాలతో ఉండాలనుకుంటే అనుమతించం ఉద్యోగుల స్థానికతకు సంబంధించి సీమాంధ్రులు సమర్పించిన సర్టిఫికెట్లలో తప్పుడు ధ్రువపత్రాలు ఉన్నాయని సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్రావు ఆరోపించారు. ప్లానింగ్ విభాగంలో 11 మంది సర్టిఫికెట్లను పరిశీలిస్తే అందులో తొమ్మిది మంది తప్పుడు పత్రాలనే సమర్పించినట్లు తేలిందన్నారు. తప్పుడు పత్రాలతో ఇక్కడే కొనసాగాలనుకుంటే అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సమ్మె చేసిన ఉద్యోగులు.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో పనిచేయాలనుకోవడం ఏ విధంగా ైనె తికత అనిపించుకుంటుందని నిలదీశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఇక్కడ కొనసాగే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జీఏడీ అధికారులు ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్నారని 2 రోజుల్లో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ఇక్కడే పుట్టి పెరిగితే స్థానికులు కారా?: మురళీకృష్ణ ఉద్యోగుల కేటాయింపులు రాజ్యాంగం ప్రకారమే జరుగుతున్నా తప్పుబట్టడం సమంజసం కాదని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ అన్నారు. మార్గదర్శకాల ప్రకారం జరుగుతున్న విభజనను అందరూ అంగీకరించాల్సిందేనన్నారు. ఆప్షన్లు ఇస్తే ఒక్క సీమాంధ్ర ఉద్యోగి కూడా తెలంగాణలో ఉండరన్నారు. వివిధ కారణాల వల్ల మహా అయితే పది శాతం మంది మాత్రమే ఉండటానికి ఇష్టపడతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడే పుట్టి పెరిగిన వారిని కూడా స్థానికులు కాదనడంలో అర్థం లేదన్నారు. నిబంధనల మేరకు ఎవరు స్థానికులన్న స్పష్టత రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం జరగకపోయినా సీమాంధ్రకు వెళ్లి చెట్లకిందైనా ప్రశాంతంగా పనిచేసుకుంటామని చెప్పారు. కొంతమంది నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. తమకూ ఆత్మాభిమానం ఉందని, తమ రాష్ట అభివృద్ధికి తాము పనిచేయాలనే ఆకాంక్ష ఉందన్నారు. చంద్రబాబు స్పందించాలి: అశోక్బాబు కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించడానికి ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు నిరాకరించారు. తెలంగాణకు కాబోయే సీఎం హోదాలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీమాంధ్ర కాబోయే సీఎం చంద్రబాబు స్పందించాలని చెప్పారు. కేసీఆర్ స్థాయికి తాను ప్రతి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. కాగా, ఉద్యోగులను రెచ్చగొట్టే విధంగా బాధ్యతాయుతమైన నేతలు మాట్లాడటం సరికాదని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కో-చైర్మన్ మురళీమోహన్ అన్నారు. విభజన ప్రక్రియ సాఫీగా పూర్తి కావడానికి తెలంగాణ నేతలు సహకరించాలని, సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. -
ఒప్పుకుంటే అన్ని స్థాయిల్లో ఆప్షన్లు: అశోక్బాబు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఏర్పడే కొత్త ప్రభుత్వాలు రెండూ ఒప్పుకుంటే అన్ని స్థాయిల్లోని ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి, అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మలు వెల్లడించినట్లు ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు చెప్పారు. ఆ ప్రభుత్వాలు అంగీకరిస్తే ఏ రాష్ట్రంలోని ఉద్యోగులను ఆ రాష్ట్రానికి పంపే ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. శనివారం అశోక్బాబుతో పాటు ఏపీఎన్జీవో సంఘం నేతలు చంద్రశేఖర్రెడ్డి తదితరులు హోంశాఖ కార్యదర్శి, అదనపు కార్యదర్శిలను కలిసి ఆప్షన్ల విషయమై వినతులు అందజేశారు. అనంతరం అశోక్బాబు ఏపీభవన్లో మీడియాతో మాట్లాడారు. పెన్షన్ల విషయంలోనూ ఇబ్బందులు తలెత్తకుండా పెన్షన్ ఖర్చును జనాభా ప్రతిపాదికన ఇరు ప్రాంతాలకు పంచుతున్నామని కేంద్ర అధికారులు చెప్పారన్నారు. -
విభజన పార్టీలపై ప్రతీకారం తీర్చుకుంటాం: అశోక్బాబు
మేమూ రాజకీయాలు చేస్తాం: అశోక్బాబు తణుకు, న్యూస్లైన్: రాష్ట్ర విభజనకు సహకరించిన పార్టీలపై ఓటు హక్కుతో ప్రతీకారం తీర్చుకుంటామని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా మంగళవారం తణుకు ఎన్జీవో హోంలో జరిగిన సీతారాముల కల్యాణోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టిన పార్టీలవైపే ఉద్యోగ సంఘాలు మొగ్గుచూపుతాయని చెప్పారు. రాజకీయ పార్టీలు ఓట్లు, సీట్లు అనే పద్ధతిలో కాకుండా, ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడాలని.. అటువంటి పార్టీల వైపు తాము ఉంటామన్నారు. ఉద్యోగుల సమస్యలను, సంక్షేమాన్ని పట్టించుకోకపోతే తామూ రాజకీయాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కమలనాథన్ కమిటీలో అవగాహనలేమి కారణంగా ఉద్యోగుల ఆప్షన్లపై ఎటువంటి స్పష్టతా లేకుండా పోయిందన్నారు. హైదరాబాద్లో ఉన్న లక్ష మంది పెన్షనర్లకు సక్రమంగా పెన్షన్ అందాలని, పీఆర్సీ, హెల్త్ కార్డులు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ తదితర అంశాలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీలకే ఉద్యోగ సంఘాలు మద్దతిస్తాయని స్పష్టం చేశారు. 2009 ఎన్నికల్లో 4 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా పలుచోట్ల ఎన్నికల ఫలితాలను మార్చారని.. ఉద్యోగులను తక్కువగా అంచనా వేయొద్దని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ అధినేతలను కలిశామని, త్వరలో మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డిని కూడా కలుస్తామని చెప్పారు. -
'నా రాజకీయ భవిష్యత్పై 12న నిర్ణయం'
తణుకు : రాష్ట్రాన్ని విడదీసిన బీజేపీ, టీడీపీకి బుద్ధి చెబుతామని ఏపీఎన్జీవో నేత అశోక్ బాబు హెచ్చరించారు. ఆయన మంగళవారం తణుకులో ప్రెస్మీట్లో మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్పై ఈ నెల 12న నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర విభజనకు సహకరించిన రాజకీయ పార్టీలపై ఓట్లతో ప్రతీకారం తీర్చుకోవాలని అశోక్ బాబు పిలుపునిచ్చారు. ఉద్యోగ వ్యవస్థపై రాజకీయ ప్రాబల్యం తగ్గించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరామని ఆయన తెలిపారు. శాఖల విలీనం ద్వారా ఉద్యోగులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని అశోక్ బాబు హెచ్చరించారు. సీమాంధ్ర రాజధాని తర్వాత ఉద్యోగస్తులకు ఆప్షన్లు ఇవ్వాలని ఆయన అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుస్తులను రెగ్యులరైజేషన్ చేయాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. -
ఉద్యోగులకు అన్యాయం జరిగితే సమ్మెకూ సిద్ధం
-
బాబు సీఎం అవుతారని నేననలేదు: అశోక్బాబు
* ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు స్పష్టీకరణ * ఈనాడు ఏదో రాసుకుంటే నేనేం చేయగలను? * నేనలా అన్నట్లు ఆధారాలుంటే చూపించండి * ఉద్యోగులకు అన్యాయం జరిగితే సమ్మెకూ సిద్ధం సాక్షి, హైదరాబాద్: మీరే ముఖ్యమంత్రి అని తాను చంద్రబాబుతో అనలేదని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్బాబు స్పష్టం చేశారు. సోమవారం ఎన్జీవో హోంలో ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో జేఏసీ నేతలు చంద్రశేఖరరెడ్డి, నరసింహారెడ్డి తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. చంద్రబాబును మీరే ముఖ్యమంత్రి అన్నట్లు ‘ఈనాడు’లో వార్త వచ్చింది కదా?అని ప్రశ్నించగా.. ‘నేను అలా అన్నట్లు ఆధారం ఉందా? ఉంటే ఆడియో రికార్డులను బయటపెట్టండి. ఈనాడులో ఏదో రాసుకుంటే నేను ఏం చేయగలను?’ అని సమాధానం ఇచ్చారు. ఏపీఎన్జీఓ నేతకు, జర్నలిస్టు నేతకు టిక్కెట్లు అడిగినట్లు వచ్చిన వార్తల విషయమై ప్రస్తావించగా.. సమైక్య ఉద్యమంలో పాల్గొన్న వారికి టికెట్లు ఇవ్వమని టీడీపీ, జై సమైక్యాంధ్ర పార్టీలను కోరామని జవాబిచ్చారు. విభజనకు సహకరించే పార్టీలకు బుద్ధి చెప్పాలని తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కోరడంతో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల సమస్యలపై స్పందించే తీరునుబట్టి ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. విభజనలో ఉద్యోగుల పంపిణీకి జరుగుతున్న కసరత్తు సీమాంధ్ర ఉద్యోగులను అసంతృప్తికి గురి చేస్తోందని చెప్పారు. రాజధాని ఎక్కడో తేల్చకుండా ఆప్షన్లు అడగడంలో అర్థం లేదన్నారు. విభనలో ఉద్యోగులకు అన్యాయం జరిగితే సమ్మె చేయడానికి వెనకాడమని హెచ్చరించారు. ఓపెన్ కేటగిరీలో ఎంపికైన ఉద్యోగుల కు సొంత రాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఇవ్వాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను దశలవారీగా క్రమబద్ధీకరించాలని ఆయన కోరారు. ఆందోళన వద్దు: సీఎస్ హామీ విభజనవల్ల ఉద్యోగులకు అన్యాయం జరగదని, సంప్రదాయాలకు అనుగుణంగానే మార్గదర్శకాలు ఉంటాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి సోమవారం తనను కలిసిన ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధి బృందానికి చెప్పారు. కమల్నాథన్ కమిటీ ఉద్యోగుల విభజనపై వారం రోజుల్లో మార్గదర్శకాలను ఖరారు చేయనుందని తెలిపారు. జేఏసీ నేతలు విలేకరులతో మాట్లాడారు. ‘విభజనవల్ల ఉద్యోగులకు అన్యాయం జరగదు. వారం రోజుల్లో మార్గదర్శకాలు ఖరారవుతాయి. గతంలో రాష్ట్రాల విభజన సమయంలో అనురించిన సంప్రదాయాలకు అనుగుణంగానే మార్గదర్శకాలు ఉంటాయి. ఓపెన్ కేటగిరీలో వచ్చిన ఉద్యోగులకు సొంత రాష్ట్రాలకు పంపించే విషయంలో కూడా అప్పుడు స్పష్టత వస్తుంది’ అని సీఎస్ చెప్పారన్నారు. -
ఏపీఎన్జీవో నేతలతో కిరణ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: కొత్త పార్టీ ఏర్పాటు అంశంపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి మంగళవారం ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు, రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్రెడ్డి, ఇతర నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ కొత్త పార్టీ అంశాన్ని నేరుగా ప్రస్తావించనప్పటికీ.. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో ఉద్యోగుల పరిరక్షణకోసం ఉద్యమించాలని సంఘం నేతలకు సూచించడంతోపాటు తాను సైతం ఇందుకోసం పోరాడతానని పేర్కొన్నట్లు తెలిసింది. విభజన జరిగినందున సీమాంధ్రలో కొత్త పార్టీ పెట్టేందుకున్న అవకాశాలు, దాని ఫలితాలపై ఎన్జీవో నేతలనుంచి ఆరా తీసినట్టు సమాచారం. సమావేశానంతరం అశోక్బాబు మీడియాతో మాట్లాడుతూ.. సీఎంతో భేటీలో కొత్త పార్టీ అంశం ప్రస్తావనకు రాలేదన్నారు. ఒకవేళ కొత్త పార్టీ పెడతానని చెబితే ఉద్యోగ సంఘం నాయకులతో సమావేశమై తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కిరణ్తో పలువురు నేతల భేటీ: మంత్రులు పితాని సత్యనారాయణ, శైలజానాథ్, ఎంపీలు ఉండవల్లి అరుణ్కుమార్, సబ్బంహరి, సాయిప్రతాప్, హర్షకుమార్లతో అంతకుముందు కిరణ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం ఒకటి, రెండ్రోజుల్లో తేలే అవకాశమున్నందున.. ఆ తరువాతే కొత్త పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని ఈ సం దర్భంగా భావించినట్లు తెలిసింది. కాగా మహాశివరాత్రి రోజున ప్రకటన చేసే దిశగా ఆలోచనలు సాగుతున్నట్టు సమాచారం. -
కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు క్షమించరు: అశోక్బాబు
సాక్షి, హైదరాబాద్: అత్యంత దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను సీమాంధ్ర ప్రజలు క్షమించరని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు అన్నారు. అసెంబ్లీ తీర్పును గౌరవిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ... రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా, లోక్సభ సాక్షిగా కాంగ్రెస్తో కుమ్మక్కైందని ఆరోపించారు. శనివారం ఏపీఎన్జీవో భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన జరిగిపోయినందున రాష్ట్ర అభివృద్ధికి ముందుకు వచ్చిన నేతలకు తాము మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. జరిగిన అన్యాయం గురించి కలత చెంద కుండా, నష్టాన్ని పూడ్చుకోవడంపై దృష్టి పెడతామన్నారు. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నేతలు మోసం చేసినందున, వచ్చే ఎన్నికల్లో స్వార్థపరులైన నాయకులను దూరం పెట్టాలన్నారు. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు.. పార్లమెంట్లో రాష్ట్ర విభజనకు ఆమోదం లభించినందున తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఏపీఎన్జీవోల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. తాము రాష్ట్ర సమైక్యత కోసం ఉద్యమించామేగానీ, తెలంగాణ ప్రజలను ఎన్నడూ ద్వేషించలేదన్నారు. -
'కాంగ్రెస్, బీజేపీలు మూల్యం చెల్లించుకోక తప్పదు'
తమ ప్రాంతానికి న్యాయం చేస్తామంటూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీమాంధ్ర గొంతు కోసిందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు ఆరోపించారు. శనివారం ఆయన హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్రకు న్యాయం చేయకపోతే విభజన బిల్లును అడ్డుకుంటామన్న బీజేపీ క్షణాల్లోనే మాటమార్చిందని విమర్శించారు. లోక్సభలో కేవలం 20 నిముషాల్లోనే బిల్లు పాస్ చేసేందుకు బీజేపీ సహకరించిందన్నారు. రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించిన బిల్లు పార్లమెంట్ ఎలా ఆమోదించిందో సీమాంధ్ర ప్రజలు చూశారని ఆయన పేర్కొన్నారు. విభజనపై కాంగ్రెస్ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న రీతిలో వ్యవహరిస్తే అందుకు బీజేపీ సహకరించిందని ఆ పార్టీలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీలను క్షమించేది లేదన్నారు. సీమాంధ్రుల జీవితాన్ని ఆ రెండు పార్టీలు ఫణంగా పెట్టాయని, త్వరలో ఆ పార్టీలు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము తుది వరకు పోరాడిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. విభజనతో సీమాంధ్ర ప్రాంతంలోని రైతులు, విద్యార్థులు, యువత కోలుకోలేని దెబ్బతిన్నారన్నారు. సీమాంధ్ర కోలుకోవడానికి 10 నుంచి 15 ఏళ్లు పడుతుందని చెప్పారు. -
‘అశోక్బాబుపై చర్యలు తీసుకోవాలి’
కల్లూరు రూరల్, : ఉద్యోగులను తప్పుదోవ పట్టించిన ఏపీ ఎన్జీవోల చైర్మన్ అశోక్బాబుపై చర్యలు తీసుకోవాలని జిల్లాకు చెందిన కొందరు ఉద్యోగులు డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సరళగంగ, డబ్ల్యు. వెంకటరమణ మాట్లాడుతూ.. అశోక్బాబు సమైక్యం కోసం పోరాడుతున్నట్లు ఎన్జీవోలతో సమ్మె చేయించి నమ్మక ద్రోహం చేశారన్నారు. మోసపూరితంగా 60 రోజుల సమ్మె చేసిన కారణంగా ఏప్రిల్లో రిటైర్మెంట్ అవుతున్న ఓ ఉద్యోగి 1.50 లక్షల బెనిఫిట్స్ను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. కార్యక్రమంలో వీరితో పాటు సత్యనారాయణరాజు, మరికొందరు ఎన్జీవోలు పాల్గొన్నారు. -
ఎంపీలు రాజీనామా చేయకే ఈ విపత్తు: అశోక్బాబు
ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు కాంగ్రెస్ను భూస్థాపితం చేయడం ఖాయం సీఎం రాజీనామాతో ప్రయోజనం ఉండదు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) నిర్ణయం చేసినరోజే సీమాంధ్ర ప్రాంత ఎంపీలు రాజీనామా చేసుంటే విభజన జరిగుండేది కాదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు అన్నారు. వారు రాజీనామా చేయనందునే ఈ విపత్తు ఏర్పడిందన్నారు. రాజకీయ వ్యూహంలో సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు, పార్టీల నేతలు విఫలమయ్యారన్నారు. ఈ నిర్ణయంతో కాంగ్రెస్ అంతకు అంత అనుభవిస్తుందని, కాంగ్రెస్ భూస్థాపితం ఖాయమని అన్నారు. సీమాంధ్ర నేతలు సమయం అయిపోయాక యుద్ధం చేశారని వ్యాఖ్యానించారు. లోక్సభలో విభజన బిల్లు ఆమోదం పొందిన అనంతరం ఆయన విజయ్చౌక్లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఈరోజు బ్లాక్డే. ఎంపీలను కొట్టించి, తలుపులు మూసి, ప్రసారాలను నిలిపివేసి నిర్ణయం చేశారు. దీనికి యూపీఏ మూల్యం చెల్లించాల్సిందే. ఇందులో బీజేపీకి భాగస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే బీజేపీ మద్దతిచ్చింది. బిల్లువద్దని వందరోజులు ఉద్యమం చేశాక కూడా దాని తీవ్రతను గుర్తించకపోవడం జాతీయ పార్టీల వైఫల్యం’’ అని అన్నారు. సీఎం కిరణ్ రాజీనామా చేస్తారంటున్నారు, దీన్నెలా చూస్తారని ప్రశ్నించగా.. ‘‘ఇంత ప్రక్రియ ముగిశాక సీఎం రాజీనామాతో ప్రయోజనం లేదు’’ అని ఆయన బదులిచ్చారు. సీఎం వద్ద ఆఖరుబంతి ఉందన్నారు కదా? అని అడగ్గా.. ఆయనవద్ద ఆఖరు బంతి ఉందో, లేదో మీకే తెలుసు అని అశోక్బాబు వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఇచ్చిన బంద్కు మద్దతిస్తారా? అని అడగ్గా.. బంద్లతో ప్రయోజనం ఉంటుందని అనుకోవట్లేదని బదులిచ్చారు. ముగిసిన ధర్నా: ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఢి ల్లీలోని రాంలీలామైదానంలో నిర్వహించిన రెండురోజుల ధర్నా మంగళవారం మధ్యాహ్నంతో ముగిసింది. టీ-బిల్లు లోక్సభలో ఆమోదం పొందిందని తెలియడంతో శిబిరంలో తీవ్ర నిరాశ అలుముకుంది. కాగా ఉదయం పదిగంటలకు ప్రారంభమైన ధర్నా కార్యక్రమాన్ని తెలంగాణ ఏర్పాటు నిర్ణయం వెలువడడానికి కొన్ని నిమిషాలముందే ముగిస్తున్నట్టు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు ప్రకటించారు. నిరాశచెందకుండా తుదివరకు పోరాటంలో ఉండాలని ఉద్యోగులకు సూచించారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, దేవినేని ఉమ తదితరులు ధర్నాకు హాజరై తమ సంఘీభావాన్ని తెలిపారు. ధర్నాలో చలసాని శ్రీని వాస్, సమైక్యవిద్యార్థి జేఏసీ అధ్యక్షుడు అడారి కిశోర్బాబు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. సమైక్యవాదుల రైళ్లు మంగళవారం రాత్రి బయలుదే రాయి. -
సీఎం రాజీనామా చేసినా ఫలితం ఉండదు:అశోక్ బాబు
ఢిల్లీ: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసినా ఇప్పుడు ఫలితం లేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. లోక్ సభలో తెలంగాణ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం చేసిన తమ పోరాటం వ్యర్థంగానే మిగిలిపోయిందన్నారు. బిల్లు ఆమోదం పొందిన తీరును ఆయన తప్పుబట్టారు. ఈ రోజు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని అశోక్ బాబు తెలిపారు. రాష్ట్ర విభజనపై సీడబ్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడే సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేస్తే బాగుండేదన్నారు. ఇక ఎవరు రాజీనామాలు చేసినా పెద్దగా లబ్ధి చేకూరదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ తరుణలో సీఎం రాజీనామా చేసినా ఫలితం ఉండదని అశోక్ బాబు తెలిపారు. -
ఢిల్లీస్థాయిలో సమైక్యత చాటుతాం
ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు శాంతియుతంగానే ధర్నా విభజనవాదులవి మూర్ఖత్వపు వ్యాఖ్యలు బిల్లు అడ్డుకోకపోతే ప్రతిపక్షాలది ప్రేక్షకపాత్రే సాక్షి, న్యూఢిల్లీ: ‘సేవ్ డెమోక్రసీ-సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరిట ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్న ధర్నాతో సమైక్య ఉద్యమాన్ని ఢిల్లీస్థాయిలో చాటి చెబుతామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు, సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక ైచె ర్మన్ అశోక్ బాబు అన్నారు. తాము ఢి ల్లీలో దాడులకు పాల్పడే అవకాశం ఉందంటూ కొందరు విభజనవాదులు మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆందోళన కార్యక్రమాలు శాంతియుతంగా, చట్టాలకు లోబడి చేస్తామని కేంద్రానికి హామీ ఇచ్చారు. లోక్సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు పెట్టిన తీరు అత్యంత దుర్మార్గ పూరితంగా ఉందన్నారు. పార్లమెంట్లో ఏం జరుగుతుందో తెలియజెప్పేందుకు అన్ని జాతీయ పార్టీలకు ఓ వేదిక కావాలని, ఆ వేదికను తమ ధర్నాతో కల్పిస్తున్నామన్నారు. ధర్నా ఏర్పాట్లను ఆదివారం మధ్యాహ్నం ఆయన పర్యవేక్షించారు. అనంతరం చలసాని శ్రీనివాస్, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకుడు కిశోర్ బాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... ఇన్నాళ్లుగా ఉద్యమిస్తున్నా జాతీయ స్థాయిలో అంతగా స్పందన రాలేదు. ఢిల్లీ స్థాయిలో తెలుగువారి ఐక్యత చాటిచెప్పేందుకు రెండురోజులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ధర్నాకు సీమాంధ్ర 13 జిల్లాల నుంచి ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ వర్గాలకు చెందిన వారు దాదాపు 8 నుంచి 10వేల మంది హాజరవుతున్నారు. సమైక్యానికి మద్దతు ఇస్తున్న అన్ని జాతీయ పార్టీలను ఆహ్వానించాం. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుతోపాటు అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించాం. జాతీయ పార్టీలు రాష్ట్ర విభజన సమస్యను కేవలం ఆంధ్రప్రదేశ్ సమస్యగా కాకుండా జాతీయ సమస్యగా భావించాలి. ఆర్టికల్ 3ని ఉపయోగించి అడ్డగోలుగా రాష్ట్రాలను విడగొడుతూ పోతే భవిష్యత్తులో విభజన సమస్య అన్ని రాష్ట్రాలకు వస్తుంది. ప్రజాస్వామ్య విలువలు పక్కనపెట్టి సీబీఐ తరహాలో ఆర్టికల్ 3ని కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. ఎవరెన్ని చెప్పినా మూజువాణి ఓటుతోనైనా రాష్ట్రాన్ని విడదీస్తామని ముందుకెళ్తున్న కేంద్రాన్ని బీజేపీ అడ్డుకోకపోతే ప్రతిపక్షాలు ఇకపై ప్రేక్షకపాత్రకే పరిమితం కావాల్సి ఉంటుంది. కొందరు మంత్రులు సోనియా చీరలు ఉతుకుతున్నారు: కిశోర్బాబు ఈ ధర్నా రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని తెలుగుజాతి కోసం అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చేస్తున్న ఆందోళన అని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకుడు కిశోర్బాబు అన్నారు. కొందరు సీమాంధ్ర కేంద్ర మంత్రులు సోనియా చీరలు ఉతకడం, మన్మోహన్సింగ్ బూట్లు పాలిష్ చేసేవిధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన ఆపకపోతే సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని హెచ్చరించారు. సభ నుంచి సస్పెండైన సీమాంధ్ర ఎంపీలను తిరిగి సభలోకి వచ్చేలా కేంద్ర మంత్రులు చర్యలు తీసుకోవాలన్నారు. సమైక్యవాదులతో ఢిల్లీకి వస్తున్న రైళ్లలో కనీస సదుపాయాలు కల్పించకుండా వారిని ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని చలసాని శ్రీనివాస్ ఆరోపించారు. రాంలీలాలో భారీ ఏర్పాట్లు ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ధర్నా కార్యక్రమానికి ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మొత్తం ఆరు రైళ్లలో వివిధ జిల్లాల నుంచి బయలుదేరిన ఏపీఎన్జీవోలు, విద్యార్థులు, అన్ని జేఏసీల సభ్యులు సోమవారం ఉదయానికి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి చేరుకుంటారు. ధర్నాకి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం, రాత్రి భోజనాలతోపాటు మంచినీటి బాటిళ్లు సరఫరా చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. దాదాపు 6 వేల మంది రాంలీలా మైదానంలోనే రాత్రి పడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరంద రికీ సరిపడా పరుపులు వేయించారు. ఢిల్లీలో చలితీవ్రత అధికంగా ఉన్నందున శిబిరం అంతా హీటర్లను అమర్చుతున్నారు. కాలకృత్యాలు, స్నానాల కోసం 30- 40 మొబైల్ టాయిలెట్లను అందుబాటులో పెడుతున్నారు. -
ఢిల్లీ ధర్నాను విజయవంతం చేయండి: ఏపీఎన్జీవోలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో 17, 18 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న బహిరంగ ర్యాలీ, మహా ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్రం కోసం ఢిల్లీకి బయలుదేరిన ఉద్యమకారులను ఇబ్బందులకు గురిచేసేందుకు రైళ్ల బోగీలను మార్చి జనరల్ బోగీలను పెట్టారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కష్టాలకైనా ఓర్చి ఢిల్లీ చేరేందుకు ఉద్యోగులు, విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని.. ఆరు రైళ్లలో ఆరువేల మంది ఢిల్లీకి వస్తే దాన్ని ఢిల్లీపై దండయాత్ర అనడం సరికాదని వ్యాఖ్యానించారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో సీమాంధ్ర టీడీపీ ఎంపీ సుజనాచౌదరి నివాసంలో ఏపీజేఎఫ్ అధ్యక్షుడు కృష్ణాంజనేయులు, చలసాని ప్రసాద్, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకుడు అడారి కిశోర్బాబుతో కలిసి విలేకరులతో అశోక్బాబు మాట్లాడారు. పార్లమెంట్లో మార్షల్స్ చేయాల్సిన పనిని కొందరు ఎంపీలు చేస్తూ సీమాంధ్ర ఎంపీలపై దాడికి దిగడం ప్రజాస్వామ్యంలో చీకటిరోజని వ్యాఖ్యానించారు. సీమాంధ్రులను హైదరాబాద్లో తిరగనివ్వబోమన్న హెచ్చరికలకు తాము బెదిరేది లేదన్నారు. బిల్లును అడ్డుకోవాలని కోరుతూ జాతీయ పార్టీల నేతలను కలవనున్నట్లు చెప్పారు. 17న రాంలీలా మైదానంలో జరిగే సమావేశానికి జాతీయ పార్టీలతో పాటు ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, సమైక్యవాదాన్ని బలపరుస్తున్న వైఎస్సార్సీపీ, ఎంఐఎం, సీపీఎం నాయకులను సైతం రెండు రోజుల ర్యాలీలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నట్టు అశోక్బాబు చెప్పారు. సోమవారం నాటి ఆందోళనలతో సమైక్య ఉద్యమాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళతామన్నారు. సమైక్యాంధ్ర విషయంలో జాతీయ మీడియా ప్రవర్తన చూస్తే ప్రభుత్వానికి అమ్ముడుపోయినట్లు కనిపిస్తోందని విమర్శించారు. సమైక్య ఉద్యమకారులతో ఢిల్లీకి వస్తున్న రైళ్లను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్టు తమకు సమాచారం అందుతోందన్నారు. ఆరు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీకి.. సాక్షి,హైదరాబాద్: ఢిల్లీలో జరగనున్న సమైక్య ర్యాలీకి ఏపీఎన్జీవోలు,సమైక్యవాదులు ఆరు ప్రత్యేక రైళ్లలో శనివారం బయలుదేరారు. అనంతపురం, రేణిగుంట, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, కాకినాడ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు బయలుదేరాయి. రేణిగుంట నుంచి వస్తున్న రైలులో హైదరాబాద్లోని ఎపీఎన్జీవోలు కాచిగూడ స్టేషన్లో ఎక్కారు. కాగా, ఉద్యోగ సంఘం నేతలు స్లీపర్కోచ్లను బక్ చేసినా, రైల్వే అధికారులు జనరల్ బోగీలు ఇవ్వడంతో ఉద్యోగులు ప్రయాణంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. ఆదివారం రాత్రి ఈ ప్రత్యేక రైళ్లు ఢిల్లీ చేరే అవకాశం ఉంది. గద్వాల రైల్వేస్టేషన్లో ఉద్రిక్తత గద్వాల, న్యూస్లైన్: రాష్ట్ర విభజనపై నిరసన తెలిపేందుకు ఢిల్లీ వెళ్తున్న ప్రత్యేక రైలు శనివారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా గద్వాల రైల్వేస్టేషన్లో ఆగిన సమయంలో అందులోని వారు సమైక్య నినాదాలు చేశారు. ప్రతిగా స్టేషన్లోని ప్రయాణికులు తెలంగాణ నినాదాలు చేశారు. వాదన పెరిగి ఇరువైపుల వారూ పట్టాల మీది రాళ్లు తీసి పరస్పరం రువ్వుకున్నారు. రాళ్ల దాడిలో ఓ హమాలీ గాయపడ్డాడు. -
...సంపూర్ణం చేయాలి: ఏపీఎన్జీవోలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో గురువారం జరిగిన సంఘటనలు దురదృష్టకరమైనవని ఏపీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం సొంతపార్టీ ఎంపీలపై ఇతర రాష్ట్ర ఎంపీలతో దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలు నిరసిస్తూ శుక్రవారం సీమాంధ్ర బంద్కి పిలుపునిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఏకపక్షధోరణిని నిరసిస్తూ చేపట్టనున్న బంద్లో సీమాంధ్ర 13 జిల్లాల్లోని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సీమాంధ్రలో కాంగ్రెస్పార్టీని భూస్థాపితం చే స్తామని హెచ్చరించారు. ఢిల్లీలోని ఎంపీ లగడపాటి నివాసంలో గురువారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. - ఎంపీల దాడిలో గాయపడిన సీమాంధ్ర టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ పరిస్థితి విషమంగా ఉందని, ఆయనకు ఏదైనా జరిగితే సోనియాగాంధీ బాధ్యత వహించాలన్నారు. - ఓ వైపు సీమాంధ్ర ఎంపీలు, కొందరు కేంద్రమంత్రులు వెల్లోకి వచ్చి నిరసన తెలియజేస్తున్నా, కేంద్ర మంత్రులు కిశోర్చంద్రదేవ్, పనబాక లక్ష్మి, పల్లంరాజు కుర్చీలకే పరిమితం కావడం సిగ్గుచేటన్నారు. - రాష్ట్ర విభజన అంశం కేవలం ఏపీ సమస్యగా కాకుండా జాతీయ సమస్యగా చూడాలని జాతీయ పార్టీలను ఆయన కోరారు. లేదంటే సీబీఐని వాడుతున్నట్టే కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్-3ని వాడుకునే ప్రమాదం ఉందన్నారు. - పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీలపై జరిగిన దాడిని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శుక్రవారం చేపట్టిన బంద్కు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పూర్తి మద్దతు ప్రకటించింది. - సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల మూకుమ్మడి సెలవు సాక్షి, హైదరాబాద్: విభజన బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టటాన్ని నిరసిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు గురువారం మూకుమ్మడి సెలవు(మాస్ క్యాజువల్ లీవ్) పెట్టటంతో సచివాలయం బోసిపోయింది. పలు సెక్షన్లలో ఖాళీ కుర్చీలు కనిపించాయి. శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించనున్నట్లు సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం నేతలు తెలిపారు. -
బంద్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి : అశోక్ బాబు
-
బాల్య వివాహాలు ప్రోత్సహిస్తే కఠిన శిక్షలు
తాండూరు, న్యూస్లైన్: చదువుకునే వయసులో మూడు ‘ముళ్ల’ బంధంతో బాలికల జీవితాలను నాశనం చేయొద్దని జిల్లా బాలల న్యాయ మండలి ప్రధాన న్యాయమూర్తి డి.దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ఇటీవల పెద్దేముల్ మండలంలో జరిగిన ‘జోగిని’ ఘటన నేపథ్యంలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి అశోక్బాబు ఆదేశాల మేరకు బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ అభివృద్ధి చెందుతున్నా దేశంలో ఇంకా జోగిని వ్యవస్త, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు ఉండడం దారుణమన్నారు. బాలిక లకు చిన్న వయసులో వివాహాలు చేసి తమ భారం తీరుతుందనే ధోరణిని తల్లిదండ్రులు వీడనాడాలని ఆయన సూచించారు. ప్రతి ఆడపిల్ల ఉన్నత విద్యనభ్యసించి మంచి ఉద్యోగం చేసేలా ప్రోత్సహించాలన్నారు. మైనారిటీ తేరాకే ఆడపిల్ల పెళ్లి గురించి ఆలోచించాలని న్యాయమూర్తి సూచించారు. బాల్య వివాహాలు నేరమని, దానికి ప్రోత్సహించినా, బాధ్యులైనా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలను వదిలిపెట్టి అభ్యుదయంగా జీవించాలని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా జోగిని వ్యవస్థ కొనసాగుతుండటం పట్ల న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బలవంతంగా పెళ్లి చేయాలని చూసినా, వివక్షత చూపినా తమ పాఠశాల ఉపాధ్యాయులతో పాటు మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఈనెల 24న వికారాబాద్లో ఉపాధ్యాయులు, పోలీసులతో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు న్యాయమూర్తి చెప్పారు. కార్యక్రమంలో తాండూరు మున్సిఫ్ కోర్టు మేజిస్ట్రేట్ హరీష మాట్లాడుతూ.. ఇటీవల ‘జోగిని’ ఘటనలో ముక్కుపచ్చలారని బాలికను 60 ఏళ్ల వృద్ధుడితో వివాహం జరిపించడం అనారికమన్నారు. నేటీ సాంకేతిక యుగంలోనూ ఈ వ్యవస్థ ఉండడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. విద్యతోనే మూఢనమ్మకాలు నశించి గ్రామాలు, జీవితాలు బాగుపడతాయని అన్నారు. మూఢనమ్మకాలు, బాల్య వివాహాలతో అభివృద్ధి కుంటుపడుతుందని మేజిస్ట్రేట్ అభిప్రాయపడ్డారు. ప్రతిఒక్కరు చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం బాలల సంక్షేమంపై బాలల న్యాయ మండలి రూపొందించిన రెండు పోస్టర్లను దుర్గాప్రసాద్, హరీషలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జువైనల్ జస్టీస్ బోర్డు మెంబర్ వెంకటేశ్వర్లు, తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, జిల్లా బాలల ఉచిత న్యాయ సహాయ న్యాయవాది సుభాష్ చంద్రబోస్, పెద్దేముల్ ఉన్నత పాఠశాల హెచ్ఎం అక్కమదేవి, రూరల్ సీఐ రవికుమార్, కరన్కోట్ ఎస్ఐ ప్రకాష్గౌడ్, న్యాయవాదులు జనార్దన్రెడ్డి, విజయ లక్ష్మీపండిట్, విద్యార్థులు ఉన్నారు. బాల నేరస్తులతో సున్నితంగా వ్యవహరించాలి వికారాబాద్: పిల్లలను నేరారోపణపై పోలీస్స్టేషన్కు తీసుకొచ్చినప్పుడు పోలీసులు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని బాలల న్యాయమండలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి.దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక పోలీస్స్టేషన్లో బాలల సలహా సహాయ కేంద్రాన్ని దుర్గాప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బాల నేరస్తులతో పోలీసులు సున్నితంగా వ్యవహరించాలని, లేకపోతే వారి భవిష్యత్ అంధకారమవుతుందన్నారు. పిల్లలు నేరాలకు పాల్పడితే అందులో తల్లిదండ్రులది, గురువులది కూడా కొద్దివరకు బాధ్యత ఉంటుందని చెప్పారు. వీరిద్దరిపై పిల్లలను సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్య త ఉందన్నారు. బాల నేరస్తులను పోలీస్స్టేషన్లలో బందీలుగా ఉంచరాదన్నారు. బాల నేరస్తులను విచారించేందుకు ప్రతీ పోలీస్స్టేషన్కు ఒక ప్రత్యేకాధికారిని ఎస్పీ నియమించినట్లు చెప్పారు. నిందితులు మైనర్లయితే వారికి న్యాయ సహాయం అందించేందుకు ప్రతి పోలీస్స్టేషన్ ఆవరణలో బాలల సహాయ కేంద్రం బోర్డును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడానికి, బాల్య వివాహాలను అరికట్టడానికి మీడియా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్హెచ్వో లచ్చీరాంనాయక్, ఎస్ఐ హన్మ్యానాయక్, బాలల న్యాయమండలి సభ్యులు వెంకటేశ్వర్లు, జి.సుభాష్చంద్రబోస్, ఏఎస్ఐ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'సీమాంధ్ర ఎంపీలు సభను స్తంభింపచేయాలి'
హైదరాబాద్ : తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీవోలు గురువారం సీమాంధ్ర బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ సీమాంధ్ర ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. పార్టమెంట్లో తెలంగాణ బిల్లు పెడితే సీమాంధ్ర ఎంపీలు పార్టీలకతీతంగా సభను స్తంభింప చేయాలన్నారు. సీమాంధ్ర బంద్ను విజయవంతం చేయాలని అశోక్ బాబు కోరారు. -
ఉద్యమం మరింత ఉధృతం: ఏపీఎన్జీవోలు
నేటి నుంచి నిరసన కార్యక్రమాలు: ఏపీఎన్జీవోలు సాక్షి, హైదరాబాద్: కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు తెలి పారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. శని, ఆదివారాల్లో కేంద్రమంత్రుల దిష్టిబొమ్మల దహనం, ఎంపీల ఇళ్లముందు ధర్నాలు, 10న బ్యాంకులతో సహా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూసివేత, 11న థియేటర్లు, వాణిజ్య సంస్థల మూసివేత, 12న జాతీయ రహదారుల దిగ్భంధం చేయాలని ఉద్యోగ సంఘాలకు పిలుపునిచ్చారు. ఈనెల 17, 18 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వేతనాలను త్యాగం చేసి ఉద్యోగులు నడిరోడ్డుపైకి వస్తుంటే, సీమాంధ్ర కేంద్ర మంత్రులు సకల సౌకర్యాలు అనుభవిస్తుండడం సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. ఫిబ్రవరి 21వరకు జరగనున్న సమైక్య సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. -
సీమాంద్ర కేంద్ర మంత్రులకు అశోక్ బాబు హెచ్చరిక
-
మీరంతా మాయగాళ్లు: న్యాయవాదులు
సాక్షి, హైదరాబాద్: ‘‘సమైక్యవాదులమని చెప్పుకుంటున్న మీరంతా మీ పదవులకు రాజీనామాలు ఎందుకు చేయలేదు.. ఇకనైనా ఊసరవెల్లి మాటలు కట్టిపెట్టండి.. మీరంతా మాయగాళ్లు... మిమ్మల్ని జనం నమ్మడం లేదు...’’ అంటూ పలువురు న్యాయవాదులు ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, నారాయణరావు, ఏపీఎన్జీవో అధ్యక్షులు అశోక్బాబులపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర సమైక్యతను కాంక్షిస్తూ బుధవారం ఇందిరా పార్కువద్ద న్యాయవాదులు నిర్వహించిన మహాధర్నా ఇందుకు వేదికైంది. సభావేదిక వద్ద ‘గ్యోబాక్’ అంటూ పలువురు న్యాయవాదులు నినాదాలు చేస్తూ.. వారి ప్రసంగానికి అడ్డుతగిలారు. కొందరు న్యాయవాదులు ఈ నేతలకు మద్దతుగా మాట్లాడడంతో ధర్నా రసాభాసగా ముగిసింది. అడ్వకేట్స్ యాక్షన్ కమిటీ ఫర్ సమైక్యాంధ్రప్రదేశ్ కన్వీనర్సీవీ మోహన్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత కొణతాల రామకృష్ణ, కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, సబ్బంహరి, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, తెలుగు ప్రజా వేదిక అధ్యక్షుడు ఆంజనేయరెడ్డి, విద్యార్థి జేఏసీ కన్వీనర్ ఆడారి కిషోర్బాబు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వివిధ ప్రజా సంఘాలు నేతలు ధర్నాలో పాల్గొన్నారు. అక్కడేం జరిగిందంటే... ఉండవల్లి, ఆశోక్బాబులపై గరంగరం - నిలబడి ఆవేశంగా మాట్లాడే సమయం అయిపోయిందని, ఇప్పుడు కూర్చొని ఆలోచించే సమయం ఆసన్నమైందని ఎంపీ ఉండవల్లి కూర్చొనే ప్రసంగించారు. అర్హతలేని టీ-బిల్లును పార్లమెంటులో పెట్టేందుకు కేంద్రం ధైర్యం చేయదన్నారు. - ఈ సందర్భంగా ఓ న్యాయవాది లేచి... మీరెందుకు రాజీనామా చేయలేదని ఉండవల్లిని ప్రశ్నించారు. మరో న్యాయవాది లేచి ఊసరవెల్లి మాటలొద్దు... మీ మీద మాకు నమ్మకం లేదని విమర్శించారు. - రాష్ట్ర విభజనను అడ్డుకుని ఉద్యమాలు, పోరాటాలు చేయడమనేది తమ బాధ్యత కాద ని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు చెప్పారు. ఇది కేవలం రాజకీయ అంశమని, ఇప్పటివరకూ గుర్రం పని గాడిద చేసిందని వ్యాఖ్యానించారు. మీరు ఉద్యమాన్ని తాకట్టు పెట్టారు, మీరు అమ్ముడుపోకపోతే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని న్యాయవాదులు అశోక్బాబుపై విరుచుకుపడ్డారు. జన విషయంలో చంద్రబాబు విధానమే కరెక్టనీ టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, నారాయణరావు చెప్పారు. దీంతో న్యాయవాదులు వారి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. పార్టీ తరఫున ఒకే విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఎవరేమన్నారు... మైసూరారెడ్డి, వైఎస్సార్సీపీ నేత: ఆనాటి పరిస్థితులను బట్టి దేశం విచ్ఛిన్నం కాకుండా కాపాడేందుకు ఆర్టికల్-3ని తీసుకొస్తే ఇప్పుడు కేంద్రం దానిని దుర్వినియోగం చేస్తోంది. అసెంబ్లీలో 77వ నిబంధన కింద ప్రతి ఎమ్మెల్యే తన అభిప్రాయాన్ని చెప్పుకునే హక్కు ఉంది. ఆ ప్రకారమే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైఎస్సార్సీపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టింది. అసెంబ్లీ అభిప్రాయం చెప్పడమంటే అది కూడా ఓటింగే అవుతుంది. డాక్టర్ మిత్రా, తెలుగు ప్రజా వేదిక ఉపాధ్యక్షుడు: సోనియా, చిదంబరం తదితర నేతలకు చట్టం, రాజ్యాంగం గురించి అవగాహన లేదు. ఎలాంటి శాస్త్రీయమైన ప్రాతిపదిక లేకుండా రాజకీయ దురుద్దేశంతోనే రాష్ట్ర విభజన చేస్తున్నారు. -
ఏడున్నరకోట్ల మంది సమైక్యం అంటున్నారు: అశోక్బాబు
‘చలోహైదరాబాద్’ విజయవంతం చేయాలి: ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు పిలుపు సాక్షి,సిటీబ్యూరో: ఏడున్నర కోట్ల మంది ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు అన్నారు. మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న యూపీఏ ప్రభుత్వంపై తాము చేస్తున్న పోరాటంలో అన్నివర్గాలు భాగస్వామ్యం కావాలని పిలుపు ఇచ్చా రు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బుధవారం ఇందిరాపార్కు వద్ద నిర్వహిస్తున్న ‘చలో హైదరాబాద్’ మహాధర్నాకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరానున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా అసెంబ్లీలో సమైక్యవాదం వినిపిస్తున్న ప్రజాప్రతినిధులకు నైతిక మద్దతు ఇచ్చినట్లవుతుందన్నారు. లక్షలాదిగా తరలి వచ్చి సమైక్య హోరు అసెంబ్లీని తాకేలా నినదించాలన్నారు. లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే రానున్న ఎన్నికల్లో ఉద్యోగులంతా ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తారని చెప్పారు. సమైక్యవాదం వినిపించే వారికే ఎన్నికల్లో ఉద్యోగుల మద్దతు ఉంటుందని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని ఉద్యోగ సం ఘాలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే అనుమతి ఇవ్వాలా?.. వద్దా అనే అంశంపై నగర పోలీసులు మంగళవారం నిర్ణయం తీసుకోనున్నారు. -
22న హైదరాబాద్ తరలిరావాలి
విజయవాడ: ఈ నెల 22న సమైక్యవాదులు అందరూ పార్టీలు జెండాలు, అజెండాలు పక్కనపెట్టి ఛలో హైదరాబాద్కు కదిలిరావాలని ఏపిఎన్జిఓ సంఘం అధ్యక్షుడు అశోక్బాబు పిలుపు ఇచ్చారు. ఈరోజు ఇక్కడ జరిగిన ఏపీజేఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలతో సంబంధంలేకుండా అందరూ సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే ప్రభుత్వ కార్యాలయాలను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. గాంధేయమార్గంలో ఉద్యమాలు చేస్తే ఇప్పుడు ఫలితాలు రావని చెప్పారు. 2014 ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని అశోక్బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. -
అప్పుడు - ఇప్పుడు
-
సీమాంధ్ర నేతల వైఖరితోనే సంజీవ్ ఆత్మహత్య
గాంధారి, న్యూస్లైన్ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర నేతలు, ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్బాబు వైఖరితోనే సర్వాపూర్ గ్రామానికి చెందిన గొడుగు సంజీవ్ ఆత్మ బలిదానం చేశారని జేఏసీ జిల్లా కన్వీనర్ గోపాల్శర్మ, అధికార ప్రతినిధి ప్రభాకర్, టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు గైని గంగారాం ఆరోపించారు. గురువారం వారు సర్వాపూర్ గ్రామాన్ని సందర్శించి సంజీవ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీమాంధ్రలో తెలంగాణ బిల్లు ప్రతులను భోగి మంటలలో దహనం చేయడంతో సంజీవ్ తీవ్ర మనస్తాపం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లైన ఎనిమిది నెలలకే భర్తను కోల్పోయి భార్య అరుణ, చేతికొచ్చిన కొడుకును పోగొట్టుకొని తల్లి దండ్రులు దిక్కులేని వారయ్యారన్నారు. ప్రభుత్వం వెంటనే బాధిత కుటుంబానికి రూ. ఐదు లక్షల ఎక్స్గ్రేషియాతోపాటు, కుటుంబానికి రెండకరాల భూమి, మృతుడి సోదరునికి వీఆర్ఏ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం గాంధారి మండల కేంద్రంలోని నెహ్రూ విగ్రహం వద్ద అశోక్బాబు దిష్టి బొమ్మను దహనం చేశారు. ఏపీఎన్జీఓల సంఘం అధ్యక్షుడిపై ఫిర్యాదు ఏపీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు రెచ్చగొట్టే మాటలకు తోడు తెలంగాణ బిల్లు ప్రతులను దహనం చేసి 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల మనోభావాలను కించపర్చినందుకే సంజీవ్ ఆత్మహత్య చేసుకున్నాడని గాంధారి ఠాణాలో జేఏసీ నాయకులు ఫిర్యాదు చేశారు. అశోక్బాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తానాజీరావు, నాయకులు సంతోష్, కమ్మరి సాయిలు తదితరులు పాల్గొన్నారు. -
అశోక్బాబుపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు
వరంగల్ క్రైం, న్యూస్లైన్ : తెలంగాణ బిల్లు ప్రతులను భోగి మంటల్లో వేసి తగులబెట్టిన ఏపీఎన్జీవో నాయకుడు అశోక్బాబుపై చర్య తీసుకోవాలని టీఆర్ఎస్ నాయకుడు జానీదర్శన్సింగ్ హన్మకొండ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. తెలంగాణ బిల్లును తెలంగాణ ప్రజలు ఒక పవి త్ర గ్రంథంగా భావిస్తుండగా దానిని మంటల్లో తగుల బెట్టడం తెలంగాణ ఆకాంక్షను అడ్డుకోవడమేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రపతి పంపిన తెలంగాణ బిల్లును అశోక్బాబు అపహాస్యం చేయడం తగదని, ఆయనపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరారు. -
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందే: ఆశోక్బాబు
-
హైదరాబాద్లోనే పాగా వేస్తాం: అశోక్బాబు
ఒంగోలు,న్యూస్లైన్: ‘‘హైదరాబాద్ మాది.. మనందరిది.. అక్కడే పాగా వేసి ఉంటాం’’ అని ఏపీఎన్జీవో అధ్యక్షుడు పరుచూరి అశోక్బాబు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో విభజనకు వ్యతిరేకంగా సోమవారం తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను ఆయన దహనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. టీ నోట్ బిల్లును తగులబెడితే హైదరాబాద్లో ఉండనీయమంటూ తెలంగాణ నేతలు బెదిరిస్తున్నారని, అయితే తాము భయపడేది లేదన్నారు. విభజనకు వ్యతిరేకంగా ఉద్యోగులం ఎలాంటి త్యాగాలు చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే ఢిల్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. తాము బయట ఎంత ఉద్యమం చేసినా, ఇప్పుడు అసెంబ్లీలో బిల్లును వ్యతిరేకించాల్సిన బాధ్యత ఈ ప్రాంత శాసన సభ్యులపై ఉందన్నారు. ‘తెలంగాణ బిల్లు అసెంబ్లీ అనే గ్రౌండ్కు వచ్చింది. తాము ఇప్పటి వరకు గ్రౌండ్ బయట ఉండి పోరాడాం. బిల్లుఅనే బాల్ను కొట్టాల్సిన బాధ్యత బ్యాట్స్మెన్లయిన సీమాంధ్ర ఎమ్మెల్యేలపై ఉంది’ అని అశోక్బాబు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో విభజనకు సంబంధించి ఓటింగ్ జరిగితే వ్యతిరేకంగా ఓటు వేయాలని, చర్చ పెడితే వ్యతిరేకంగా మాట్లాడాలని ఆయన కోరారు. బంద్ తేదీల రీషెడ్యూల్ గుంటూరు: ఇకపై ప్రజాసంఘాలు, రాజకీయ వ్యవస్థతో కలిసి సమైక్యాంధ్ర ఉద్యమం నిర్వహిస్తామని అశోక్బాబు తెలిపారు. గుంటూరులో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 17, 18 తేదీల్లో చేపట్టనున్న బంద్ తేదీలను రీ షెడ్యూల్ చేస్తామని, 20 నుంచి 23 వరకు అసెంబ్లీలో జరిగే కార్యక్రమాలపై అప్రమత్తంగా వ్యవహరించి నిరసన కార్యక్రమాల్ని రూపొందిస్తామని చెప్పారు. అసెంబ్లీలో విభజనబిల్లుపై ఏకవాక్య తీర్మానంతోపాటు, చర్చ కూడా జరగాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పలువురు అభిప్రాయపడ్డారు. ఏపీ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణాంజనేయులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. ఆంజనేయులు, టీడీపీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, పత్తిపాటి పుల్లారావు, సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. భోగి మంటల్లో టీ బిల్లు దహనం సాక్షి నెట్వర్క్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో సోమవారం సమైక్యవాదులు భోగిమంటల్లో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను దహనం చేశారు. ఎక్కడికక్కడ బిల్లు ప్రతులను తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులో భోగిమంటల్లో టీ నోట్ బిల్లు ప్రతులను ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు దహనం చేశారు. అనంతపురంలోని ఎన్జీఓ కార్యాలయం ఎదుట బిల్లు ప్రతులను మంటల్లో వేశారు. అవి పూర్తిగా దహమనయ్యే వరకు సమైక్య నినాదాలు చేశారు. విశాఖ జిల్లా అక్కయ్యపాలెం హైవే కూడలిలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధులు 68 పేజీల బిల్లు ప్రతులను చింపి భోగిమంటల్లో తగులబెట్టారు. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆడారి కిశోర్కుమార్ మాట్లాడుతూ ఈ నెల 19న హైదరాబాదు ఇందిరాపార్కులో వెరుు్య మంది విద్యార్థులతో ఒక్క రోజు నిరాహారదీక్ష చేపడతున్నట్లు తెలిపారు. -
‘అశోక్’ మాటలు నమ్మవద్దు
కడప రూరల్, న్యూస్లైన్: ఎన్జీఓ నాయకుడు అశోక్బాబు సమైక్యాంధ్ర ఉద్యమాలను నీరుగారుస్తున్నారని, ఆయన సమైక్య ద్రోహి, ఎవరూ ఆయన మాటలు నమ్మవద్దని సమైక్యాంధ్ర ప్రజా సంఘాల జేఏసీ ఛెర్మైన్ కారెం శివాజీ అన్నారు. సోమవారం స్థానిక వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో సమైక్యాంధ్ర ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్జీఓ నాయకుడు అశోక్బాబు తాను సమైక్యవాదినంటూ సీమాంధ్ర ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. మెరుపు సమ్మెలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామంటూ ఏమీ చేయకుండా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు హైదరాబాద్తో ముడిపడి ఉన్నాయని, అలాంటిది విభజన అన్ని ప్రాంతాలకు అనర్థదాయకమన్నారు. తెలంగాణా బిల్లుకు వ్యతిరేకంగా ఈనెల 20వ తేదిన చేపడుతున్న ఛలో హైదరాబాద్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, గిరిజన విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్, కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు విపి నారాయణస్వామి మాట్లాడుతూ కేంద్రం విభజన బిల్లును వెనక్కి తీసుకొని రాష్ట్రంలో అనిశ్చితికి తెరదించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు శరత్బాబు, సుధాకర్, రామచంద్రయ్య, కొండయ్య, సింగరయ్య, ప్రకాశమ్మ, రత్నమ్మ పాల్గొన్నారు.