ATM
-
ATM నుంచి పీఎఫ్ విత్ డ్రా.. ఎప్పటినుంచంటే?
-
EPFO: క్షణాల్లో ఈపీఎఫ్వో విత్డ్రా
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)ఖాతాదారులకు శుభవార్త. ఇప్పటికే ఉద్యోగుల సౌలభ్యం కోసం ఈపీఫ్ఓవో సంస్థ ఈపీఎఫ్వో అకౌంట్లలో పలు కీలక మార్పులు చేపట్టింది. ఈపీఎఫ్వో క్లయిమ్, వివరాలను చేర్చడం, తొలగించడం, ఎగ్జిట్ అవ్వడాన్ని సులభతరం చేసింది.తాజాగా, ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఫోన్పే,గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్ల ద్వారా ఈపీఎఫ్వో విత్ర్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. ప్రస్తుతం ఈపీఎఫ్వో సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో కలిసి ఈ సౌకర్యాన్ని ప్రారంభించేందుకు చర్చలు జరుపుతుంది. సాధ్యసాధ్యాలను బట్టి సౌకర్యాన్ని ఈ ఏడాది మే, లేదా జూన్ నాటికి ప్రారంభించే యోచనలో ఈపీఎఫ్వో ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. దీంతో పాటు ఈపీఎఫ్వో3.0లో ఏటీఎం ద్వారా ఈపీఎఫ్వో విత్డ్రా చేసుకునే వెసులు బాటు ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.ఉద్యోగులకు లభించే ప్రయోజనాలుయూపీఐ ద్వారా ఈపీఎఫ్వో విత్ డ్రా వల్ల ఉద్యోగలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో డబ్బుల్ని తక్షణమే పొందవచ్చు. పారదర్శకతతో పాటు ఈపీవోఎఫ్వో విత్ డ్రా ప్రక్రియ మరింత సజావుగా జరగనుంది.ఈపీఎఫ్వో 3.0 ప్రారంభంఈపీఎఫ్వో 3.0 అమల్లోకి వస్తే, సభ్యులు తమ పొదుపులను సాధారణ బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులను ఉపసంహరించుకోవడం మరింత సులభం అవుతుంది. -
ఏటీఎం నగదు ఉపసంహరణ మరింత భారం
ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరించేవారికి త్వరలో ఛార్జీలు పెంచనున్నాయి. ఏటీఎం లావాదేవీలకు ఇంటర్ చేంజ్ ఫీజును పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యోచిస్తోంది. ఇది ఏటీఎం ద్వారా చేసే నగదు ఉపసంహరణలను మరింత ఖరీదైనవిగా చేస్తుంది. ఐదు లావాదేవీల ఉచిత పరిమితి ముగిసిన తర్వాత చేసే నగదు లావాదేవీలకు గరిష్ట రుసుమును రూ.21 నుంచి రూ.22కు పెంచాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సిఫారసు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ఏటీఎం ద్వారా చేసే నగదు లావాదేవీలకు ఇంటర్ చేంజ్ ఫీజు(ఇతర బ్యాంకు ఏటీఎం ద్వారా చేసే లావాదేవీలు) రూ.17 నుంచి రూ.19కి, నగదు రహిత లావాదేవీలకు రూ.6 నుంచి రూ.7కు పెరగవచ్చని సమాచారం.పెరుగుదల ఎందుకు?ద్రవ్యోల్బణం, అధిక రుణ వ్యయాలు, రవాణా, నగదు భర్తీకి సంబంధించిన ఖర్చుల కారణంగా బ్యాంకులు ఛార్జీలు పెంచుతున్నాయి. ఏటీఎం ఆపరేటర్లకు, ముఖ్యంగా మెట్రోయేతర ప్రాంతాల్లో నిర్వహణ ఖర్చులను భరించడానికి, ఏటీఎం సేవల సుస్థిరతకు సాయపడడానికి ఈ పెంపు అవసరమని బ్యాంకులు భావిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఇంటర్ చేంజ్ ఫీజులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు.ఇదీ చదవండి: ప్రభుత్వ డివైజ్ల్లో ఏఐ టూల్స్ నిషేధం!వినియోగదారులపై ప్రభావంఈ సిఫార్సులను ఆర్బీఐ ఆమోదిస్తే వినియోగదారులు ఉచిత పరిమితికి మించి ఏటీఎం లావాదేవీలకు చెల్లించే ఫీజు పెరుగుతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలు అంతగా అభివృద్ధి చెందని గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఏటీఎంల నుంచి తరచూ నగదు ఉపసంహరించుకునే వారిపై ఇది ప్రభావం చూపుతుంది. ప్రతిపాదిత ఫీజుల పెంపు ప్రభావాన్ని అంచనా వేయడానికి ఆర్బీఐ కమిటీ ఏర్పాటు చేసింది. దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు ఈ పెరుగుదలకు మద్దతు ఇస్తున్నాయి. -
టాటా కంపెనీ కొనుగోలుకు ఆర్బీఐ ఆమోదం
టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఉన్న టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్ (టీసీపీఎస్ఎల్)ను భారత్లోని ఆస్ట్రేలియాకు చెందిన ఫిన్టెక్ కంపెనీకి విక్రయించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం లభించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఫైండీ ఆధ్వర్యంలోని భారతీయ అనుబంధ సంస్థ ట్రాన్సాక్షన్ సొల్యూషన్స్ ఇంటర్నేషనల్ (టీఎస్ఐ)కు టీసీపీఎస్ఎల్ను విక్రయించే ప్రణాళికలను ఆర్బీఐ ముందుంచారు. దాంతో తాజాగా వాటిపై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. రూ.330 కోట్ల విలువైన ఈ డీల్ వల్ల బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఆర్థిక సేవలు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.నవంబర్ 2024లో ప్రకటించిన ఈ కొనుగోలు టీసీపీఎస్ఎల్ వైట్ లేబుల్ ఏటీఎం(నాన్ బ్యాంకింగ్ నిర్వహకులు ద్వారా నడిచే ఏటీఎం) ప్లాట్ఫామ్, ఇండికాష్ ఏటీఎంల నెట్వర్క్ను ఉపయోగించుకోవడానికి ఫైండీకి వీలు కల్పిస్తుంది. టీఎస్ఐ ప్రస్తుతం 7,500కు పైగా బ్రౌన్ లేబుల్ ఏటీఎం(స్పాన్సర్ బ్యాంకులకు చెందిన ఏటీఎంలు)లను నిర్వహిస్తుంది. 10,000 కంటే ఎక్కువ వైట్ లేబుల్ ఏటీఎంలకు బ్యాక్ ఎండ్ కార్యకలాపాలు అందిస్తోంది. ఈ కొనుగోలుతో ఫైండీ 4,600 ఆపరేషనల్ ఇండికాష్ ఏటీఎంలను తీసుకుంటుంది. మరో 3,000 ఏటీఎం పొందేందుకు ఫైండీకి అవకాశం లభిస్తుంది.ఇదీ చదవండి: జోరందుకున్న తయారీ రంగంఫైండీ సీఈఓ దీపక్ వర్మ మాట్లాడుతూ భారత్లో ఆర్థిక సేవలను విస్తరించేందుకు ఈ కొనుగోలు ఉపయోగపడుతుందన్నారు. ఈ ఏటీఎంలను కంపెనీ ప్రస్తుత నెట్వర్క్తో అనుసంధానించడంతో బ్యాంకింగ్ సేవలులేని మారుమూల ప్రాంతాల్లో ఆర్థిక సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. -
ఆప్ ఢిల్లీ అభివృద్ధిని అడ్డుకుంది
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అభివృద్ధిని ఆప్ అడ్డుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ పురోగతి కోసం ఢిల్లీని రాజకీయ ఏటీఎంలా వాడుకుంటోందన్నారు. మోదీ శుక్రవారం నాడిక్కడ ద్వారకలో ప్రచారసభలో మాట్లాడారు. ఢిల్లీ పురోభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ సర్కారును ఎన్నుకోవాల్సిందిగా ప్రజలను కోరారు. అధునాతన ఢిల్లీకి బీజేపీ కట్టుబడి ఉందనడానికి ఇటీవల ప్రారంభించిన యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ఉదాహరణ అన్నారు. వేరే రాష్ట్రాల్లో విస్తరించేందుకు ఆప్ ఢిల్లీ వనరులను ఖాళీ చేసిందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీని ఏటీఎం కార్డు లాగా వాడుకుంటోందన్నారు. కాంగ్రెస్ రాజకుటుంబం గిరిజన రాష్ట్రపతిని అవమానించిందన్నారు. ఆప్ ప్రభుత్వం తమ సమయమంతా ఇతర రాష్ట్రాలతో పేచీలకే వెచి్చస్తోందని మండిపడ్డారు. కేంద్రంతోనూ, ఉత్తరప్రదేశ్, హరియాణాలతో నిత్యం కలహిస్తోందన్నారు. దాంతో ఢిల్లీ అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. ఇలాంటి వాళ్లు అధికారంలో ఉంటే అభివృద్ధిలో ఢిల్లీ వెనుకబడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కలహాలలో మునిగితేలే ప్రభుత్వం కంటే సమన్వయంతో ముందుకు సాగే ప్రభుత్వం ఢిల్లీకి అవసరమన్నారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూసే ప్రభుత్వం కావాలన్నారు. బీజేపీని గెలిపిస్తే అవినీతిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అన్నా హజారే ఉద్యమాన్ని అపహస్యం చేస్తూ ఆప్ సర్కార్ అవినీతిలో మునిగిపోయిందని, ప్రజలకు ద్రోహం చేసిందని మోదీ అన్నారు. ఢిల్లీ బడ్జెట్లో ఆప్ 20 శాతమే అభివృద్ధిపై ఖర్చు పెడుతోందని, మౌలికసదుపాయాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రజల కోసం డబ్బు ఖర్చు పెట్టకుండా సొంత ప్రచారానికి నిధులు వెచి్చస్తోందని పేర్కొన్నారు. అద్దాల మేడలో నివసించే వాళ్లు పేదల ఇళ్ల గురించి పట్టించుకోరని, ఆప్ మధ్యతరగతికి వ్యతిరేకమని మోదీ అన్నారు. ఆప్ అక్రమాలను తవ్వితీస్తాం ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ఆప్ ప్రభుత్వం అక్రమాలను తవ్వితీస్తామని మోదీ హామీ ఇచ్చారు. కాగ్ నివేదికను ఢిల్లీ సర్కారు తొక్కిపెట్టాలని చూసిందని ఆరోపించారు. మద్యం పాలసీతో సహా ఆప్ విధానాలను కాగ్ తప్పుపట్టిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే కాగ్ నివేదికను ప్రవేశపెడతామని మోదీ అన్నారు.ఢిల్లీ అభివృద్ధికి శాయశక్తులా బీజేపీ సర్కారు కృషి చేస్తుందన్నారు. దోపిడి, అబద్ధాల నుంచి ఢిల్లీ ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు. ఢిల్లీ ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే తన కల అని, ఆప్ దీనిని అడ్డుకుంటోందని మోదీ ఆరోపించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను పేదలకు కేటాయించకుండా ఆప్ అడ్డుకుంటోందని, తాము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందేలా చూస్తామని, ఇది తన గ్యారంటీ అని మోదీ పేర్కొన్నారు. -
ఏటీఎం నుంచి పీఎఫ్ విత్డ్రా.. ఎప్పటినుంచంటే?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన కోట్లాది మంది సభ్యులకు గొప్ప వార్తను అందించింది. ప్రభుత్వం ప్రకారం.. పీఎఫ్ కొత్త విధానం వచ్చే జూన్ నాటికి అమలులోకి వస్తుంది. కొత్త విధానం ప్రకారం.. ఏటీఎం (ATM) నుండి పీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకునేందుకు కొత్త యాప్, ఇతర ఏర్పాట్లు ఉంటాయి.ఈపీఎఫ్వో కొత్త సాఫ్ట్వేర్ సిస్టమ్ EPFO 3.0 ఈ సంవత్సరం ప్రారంభమవుతుందని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. ఈ కొత్త వ్యవస్థ ఉద్యోగులకు అనుకూలమైన, యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్రక్రియలో మానవ జోక్యం ఉండదు. అంటే ఏ అధికారి క్లియరెన్స్ లేకుండానే పీఎఫ్ నుంచి డబ్బు విత్డ్రా అవుతుంది. ఈ సిస్టమ్ సభ్యులు తమ క్లెయిమ్లను ఒకే క్లిక్తో సెటిల్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డ్ సర్వీస్ఈపీఎఫ్ఓ 3.0 కింద సభ్యులందరికీ ఏటీఎం కార్డులు ఇస్తారు.ఈ కార్డ్ ద్వారా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతా మొత్తాన్ని సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక అత్యవసర సమయాల్లో ఈ సర్వీస్ సహాయపడుతుంది. వెబ్సైట్, సిస్టమ్లో ప్రాథమిక మెరుగుదలలు ఈ నెలలోపు పూర్తవుతాయని కేంద్ర మంత్రి మాండవ్య తెలిపారు. దీని తరువాత, ఈపీఎఫ్ఓ 3.0 దశలవారీగా అమలవుతుంది.కొత్త మొబైల్ యాప్ఈపీఎఫ్ఓ కొత్త మొబైల్ యాప్, ఇతర డిజిటల్ సేవలు కూడా ఈపీఎఫ్ఓ 3.0 కింద ప్రారంభమవుతాయి. 2025 జూన్ నాటికి కొత్త యాప్, ఏటీఎం కార్డ్, అధునాతన సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెస్తామని.. దీంతోపాటు 12 శాతం కంట్రిబ్యూషన్ పరిమితిని తొలగించాలని కార్మిక మంత్రిత్వ శాఖ యోచిస్తోందని కేంద్ర మంత్రి మాండవ్య తెలిపారు. ఉద్యోగులు తమ పొదుపు ప్రణాళికలకు అనుగుణంగా పీఎఫ్కి డబ్బు జమ చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగి సమ్మతితో ఈ మొత్తాన్ని పెన్షన్గా మార్చే ప్రతిపాదన కూడా ఉంది.ఈపీఎఫ్ఓ 3.0 ఉద్దేశండిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి సేవలను సరళంగా, వేగంగా, పారదర్శకంగా చేయడమే ఈపీఎఫ్ఓ 3.0 ఉద్దేశం. ఈ చొరవ సభ్యుల అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా ఉద్యోగుల ఆర్థిక నిర్వహణను కూడా మెరుగుపరుస్తుంది. ఈపీఎఫ్ఓ కొత్త చొరవ కోట్లాది మంది ఉద్యోగులకు సురక్షితమైన పీఎఫ్ నిర్వహణ అవకాశాన్ని కల్పిస్తుంది. -
కర్ణాటకలో దొంగల బీభత్సం
-
ఏటీఎం కార్డు వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?
బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ.. దాదాపు 'ఏటీఎం' (ATM) కార్డు (డెబిట్ కార్డు) ఉంటుంది. ఏటీఎం అనేది కేవలం డబ్బు విత్డ్రా చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. ఇతర కార్యకలాపాల కోసం కూడా ఉపయోగించవచ్చు. ఈ కథనంలో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.బ్యాలెన్స్ ఎంక్వైరీ: ఏటీఎం కార్డు ఉపయోగించే మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేకుండానే.. ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందనే విషయం తెలుసుకోవచ్చు. అంతే కాకుండా లావాదేవీలకు సంబంధించిన మినీ స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు.ఫండ్ ట్రాన్స్ఫర్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ప్రకారం.. మీరు డెబిట్ కార్డును ఉపయోగించి, ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు రోజుకు రూ. 40,000 ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికి ఎస్బీఐ ఎలాంటి ఛార్జెస్ విధించదు.క్రెడిట్ కార్డ్ చెల్లింపు: క్రెడిట్ కార్డ్ చెల్లింపులను కూడా ఏటీఏం ద్వారా చెల్లించవచ్చు. దీనికి మీ డెబిట్ కార్డు, పిన్ నెంబర్ వంటివి అవసరమవుతాయి.బీమా ప్రీమియం చెల్లింపు: ఏటీఎం ఉపయోగించి బీమా ప్రీమియంలను చెల్లించవచ్చు. ఎల్ఐసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్ వంటివి బ్యాంకులతో టై-అప్లను కలిగి ఉన్నాయి. కాబట్టి ఏటీఎంలోనే ప్రీమియం చెల్లించవచ్చు.చెక్బుక్ రిక్వెస్ట్: చెక్ లీఫ్లు అయిపోయినా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఏటీఎం వీడరనే కొత్త చెక్బుక్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. చిరునామా అక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆ చిరునామాకే చెక్బుక్ (Checkbook) వస్తుంది.బిల్ పేమెంట్స్: ఏటీఎం ద్వారా యుటిలిటీ బిల్లులను చెల్లించవచ్చు. అయితే ముందుగా బిల్లింగ్ కంపెనీ ఏటీఎం నెట్వర్క్కి లింక్ చేయబడిందో లేదో చెక్ చేసుకోవాలి. డబ్బు పంపే ముందు, బ్యాంకు వెబ్సైట్లో చెల్లింపుదారు వివరాలను నమోదు చేసుకోవాలి.మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేషన్: బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటివి యాక్టివేట్ చేస్తారు. అయితే మీరు ఏటీఎం ఉపయోగించి కూడా మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకోవచ్చు లేదా డీయాక్టివేట్ చేసుకోవచ్చు.ఏటీఎం పిన్ చేంజ్: ఏటీఎం ఉపయోగించే.. పిన్ నెంబర్ మార్చుకోవచ్చు. అనుమానం వచ్చినప్పుడు ఏటీఎం పిన్ నెంబర్ మార్చుకోవడం మంచిది. కాబట్టి బ్యాంకుకు వెళ్లకుండానే.. ఏటీఎంలోనే పిన్ నెంబర్ మార్చుకోవచ్చు. -
ఏటీఎం నుంచే పీఎఫ్ నిధుల డ్రా
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) సభ్యులు అతి త్వరలోనే తమ భవిష్యనిధి (పీఎఫ్) క్లెయిమ్ల మొత్తాన్ని ఏటీఎం నుంచి ఉపసంహరించుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈపీఎఫ్వో సభ్యుల ఆన్లైన్ క్లెయిమ్ ఆమోదానికి 7–10 రోజుల సమయం తీసుకుంటోంది. క్లెయిమ్ పరిష్కారం తర్వాత ఆ మొత్తాన్ని సభ్యుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తున్నారు. ప్రతిపాదిత కొత్త విధానంలో సభ్యులకు ప్రత్యేకమైన కార్డులు అందించనున్నారు. వీటి ద్వారా ఏటీఎం నుంచి క్లెయిమ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఏడు కోట్లకు పైగా సభ్యులకు బ్యాంక్ల మాదిరి సేవలు అందించాలన్నది ఈపీఎఫ్వో ఆలోచనగా పేర్కొన్నారు. ఈపీఎఫ్వో తన ఐటీ సదుపాయాలను మెరుగుపరుచుకుంటోందని కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా తెలిపారు. కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే పీఎఫ్ ప్రయోజనాలు, బీమా ప్రయోజనాలను ఏటీఎంల నుంచే పొందొచ్చని చెప్పారు. -
ఏటీఎంలో చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి..? ఆర్బీఐ రూల్స్ తెలుసా..?
-
ఏటీఎంను ధ్వంసం చేసి.. చివరికి..
కరీంనగర్: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లిలోని ఓ ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి దొంగతనానికి యత్నించాడు. ఏటీఎంను ధ్వంసం చేసి చోరీకి విఫలయత్నం చేశాడు. ఏటీఎంలోని సీసీ పుటేజీల ఆధారంగా గుర్తుతెలియని దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు.దొంగతనానికి యత్నించిన వ్యక్తి సీసీ పుటేజీ ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. సదరు వ్యక్తిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఏటీఎం పై కప్పును తొలగించి అందులోంచి డబ్బులు తీయడానికి విఫలయత్నం చేశాడు. గంట సేపు ప్రయత్నించి వెళ్లిపోయాడు. క్లూస్ టీం పోలీసులు రంగంలోకి దిగి నిందితుని వేలిముద్రలు సేకరించారు. సీసీ పుటేజీ ఆధారంగా సదరు వ్యక్తిని గుర్తించి సమాచారం ఇవ్వాలని ఎస్సై రమాకాంత్ కోరారు. -
ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ
కూడేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం సెంటర్లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన అనంతపురం జిల్లా, కూడేరు మండలంలో చోటుచేసుకుంది. ఏటీఎంను పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, అందులోని రూ.18,41,300 నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కూడేరులో దళితవాడకు ఎదురుగా అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కన అనంతపురం సాయినగర్లోని స్టేట్ బ్యాంకు ప్రధాన శాఖ ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కట్టర్తో ఏటీఎంను కట్ చేశారు. మిషన్లో ఉంచిన నగదు చోరీ చేశారు. అదే సమయంలో మిషన్లో షార్ట్ సర్క్యూట్ సంభవించి పైభాగం కాలిపోయింది. శబ్దం కూడా రావడంతో స్థానికుడొకరు బయటకు వచ్చి చూడగా.. ఏటీఎం సెంటర్ నుంచి కొందరు కార్లో వెళ్లిపోవడం, సెంటర్లో నుంచి పొగ రావడం గమనించాడు. కొంత సమయం తర్వాత విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. సీఐ శివరాముడు ఏటీఎం సెంటరును పరిశీలించారు. చోరీ జరిగిందని నిర్ధారించుకుని సమాచారాన్ని బ్యాంకు అధికారులకు అందించారు. సంబంధిత అధికారులు వచ్చి పరిశీలించారు. నగదు నిల్వ, విత్డ్రాలకు సంబంధించి ప్రధాన కార్యాలయం నుంచి డేటా తీసుకున్నారు. రూ.18,41,300 చోరీకి గురైనట్టు పోలీసులకు తెలిపారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
హిటాచీ పేమెంట్ సర్వీసెస్ భారత్ అప్గ్రేడబుల్ ఏటీఎం మెషీన్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఏటీఎంలను ఎప్పుడైనా నగదు రీసైక్లింగ్ మెషిన్ (CRM)కి అప్గ్రేడ్ చేయవచ్చు. ఇది దేశంలోనే మొదటి అప్గ్రేడబుల్ ఏటీఎం అని హిటాచీ సంస్థ పేర్కొంది.' మేక్ ఇన్ ఇండియా ' చొరవ కింద తయారు చేసిన ఈ ఏటీఎంలు బ్యాంకులకు మెరుగైన సౌలభ్యాన్ని, సామర్థ్యాన్ని అందిస్తాయి. ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్న 2,64,000 ఏటీఎంలు/సీఆర్ఎంలలో, హిటాచీ 76,000కు పైగా నిర్వహిస్తోంది. రాబోయే ఎనిమిదేళ్లలో దాదాపు 1,00,000 అప్గ్రేడబుల్ ఏటీఎంల మార్కెట్ను కంపెనీ అంచనా వేసింది.ఏంటీ సీఆర్ఎం మెషీన్లు?సీఆర్ఎం మెషీన్లు అంటే క్యాష్ రీసైక్లింగ్ మెషీన్. దీని ద్వారా నగదు డిపాజిట్, విత్డ్రా రెండు సేవలనూ పొందవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు ఈ నగదు రీసైక్లింగ్ మెషీన్ల ద్వారా తమ శాఖల వద్ద రౌండ్-ది-క్లాక్ నగదు ఉపసంహరణ, డిపాజిట్ సేవలను అందిస్తున్నాయి. అయితే ఆఫ్సైట్ ప్రదేశాల్లో బ్యాంకులు సాధారణంగా ఏటీఎంల ద్వారా 24 గంటలూ నగదు ఉపసంహరణ సేవలను మాత్రమే అందిస్తాయి. ఇలాంటి చోట్ల అప్గ్రేడబుల్ ఏటీఎంలను ఏర్పాటు చేసుకుంటే బ్యాంకులు తమ వారి వ్యాపార అవసరాలు, స్థానిక మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డిపాజిట్, విత్ డ్రా సేవలు విస్తరించడానికి బ్యాంకులకు వీలు కలుగుతుంది. -
ATM మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆసక్తి రేకెత్తిస్తున్న హరీశ్ శంకర్ ‘ఏటీఎం’ టీజర్
బిగ్బాస్ ఫేం వీజే సన్నీ నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘ఏటీఎం’. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ సిరీస్కి కథ అందించారు. దోపిడీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్కు సి చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 20న ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ‘ఏటీఎం’టీజర్ని హరీశ్ శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `దోపిడీ జోనర్లో రాసే కథల్లో చాలా పొటెన్షియల్ ఉంటుంది. సెట్టింగ్ రియలిస్టిక్గా ఉంటుంది. ఈ సీరీస్లో దొంగలు రొటీన్గా ఉండరు. వాళ్లల్లో ఓ ప్రత్యేకత ఉంటుంది. వీజే సన్నీ కీ రోల్ చేశారు. స్లమ్ లైఫ్ మీద అతనికున్న ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. నవాబ్ తరహా జీవితాన్ని కోరుకున్న అతను ఏం చేశాడనేది ఆసక్తికరం. సీరీస్ గురించి ఇంతకు మించి ఎక్కువ చెప్పదలచుకోలేదు. ఓ వైపు నవ్విస్తూనే ఉంటుంది. చాలా కొత్త ప్రయత్నం చేశాం`అని అన్నారు. ‘పవర్ ఫుల్ ఫోర్సుల వల్ల కార్నర్ అయిన నలుగురు చిన్న దొంగల రోలర్ కోస్టరే ఈ సీరీస్. ప్రాణాలతో బతికి ఉండాలంటే కొన్ని కోట్ల రూపాయలను దోపిడీ చేయాల్సిన పరిస్థితుల్లోకి నెట్టబడిన వాళ్ల కథే ఇది. సుబ్బరాజు చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేశారు` అని నిర్మాత హర్షిత్ రెడ్డి అన్నారు. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న వీజే సన్నీ ATM, ఎప్పుడంటే?
బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ దొంగతనం చేస్తూ సీసీ కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే కదా! అయితే ఇదంతా తన అప్కమింగ్ ప్రాజెక్ట్ ప్రమోషన్స్లో భాగమేనని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. చివరకు వారు అనుకుందే నిజమైంది. వీజే సన్నీ ఏటీఎమ్ అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నాడు. ఇందులో సుబ్బరాజు, దివి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హరీష్ శంకర్ అందించిన కథను చంద్రమోహన్ డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్పై హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఏటీఎమ్: పైసల్తో ఆట అనే వెబ్ సిరీస్ జనవరి 20 నుంచి తెలుగు, తమిళ భాషల్లో జీ5లో ప్రసారం కానుందని ప్రకటించింది చిత్రయూనిట్. A heist that will make you relook at your way of life & startle you to your very core.#ATMOnZee5 - The game of money, #PaisalThoAata, STARTS SOON@VJSunnyOfficial @actorsubbaraju @RoielShree @ravirajdance @KrishnaBurugula @DiviActor@harish2you @chandramohan_c @DilRajuProdctns pic.twitter.com/rKkoheUOQ2 — ZEE5 Telugu (@ZEE5Telugu) January 6, 2023 చదవండి: పంత్ ఉన్న ఆస్పత్రి ఫోటో షేర్ చేసిన నటి -
దొంగతనం చేస్తూ దొరికిపోయిన సన్నీ
-
గుడ్ న్యూస్: ఏటీఎం కార్డ్ లేకుండా క్యాష్ విత్డ్రా.. ఇలా చేస్తే సరిపోతుంది!
న్యూఢిల్లీ: గతంలో బ్యాంకులోని మన నగదుని తీసుకోవాలంటే.. అయితే బ్యాంకుకు వెళ్లాలి లేదా ఏటీం( ATM) మెషిన్కు వెళ్లి డెబిట్ కార్డ్తో కావాల్సినంత డబ్బులను డ్రా చేసుకోవాలి. కానీ నేటి డిజిటల్ యుగంలో, మీరు డెబిట్ కార్డ్ లేకుండా కూడా ఏటీఎం మెషీన్ నుంచి డబ్బును తీసుకోవచ్చు. దీని కోసం మీకు మీ మొబైల్ మాత్రమే అవసరం. చాలా రోజుల నుంచి ఈ బ్యాంకింగ్ సర్వీస్ నడుస్తోంది. అసలు ఇలాంటి సర్వీస్ ఒకటి ఉందని చాలా మందికి కూడా తెలియదు. డబ్బులు డ్రా చేసేందుకు.. ఏటీఎం అక్కర్లేదు ఇప్పటికే చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు కార్డు లేకుండానే డబ్బు తీసుకునే వెసులుబాటును కల్పిస్తున్నప్పటికీ.. తాజాగా రిజర్వ్ బ్యాంక్ తన పరిధిని మరింత పెంచింది. ఈ సౌకర్యం కోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) ఉపయోగించనుంది. డెబిట్ కార్డ్ లేకుండా ఏటీఎం నుంచి డబ్బు విత్డ్రా చేసుకోవాలంటే, మీరు తప్పనిసరిగా స్మార్ట్ఫోన్ని కలిగి ఉండాలి. మీ స్మార్ట్ఫోన్లో భీం(BHIM), పేటీఎం (Paytm), గూగుల్పే (GPay), ఫోన్పే (PhonePe) మొదలైన యాప్లను ఉపయోగించి ద్వారా డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. ఇలా ఫాలో అయితే సరిపోతుంది.. ఏటీఎం సెంటర్లోకి వెళ్లి కార్డ్ లేకుండా డబ్బు విత్డ్రా చేసుకునే ఆప్షన్ను ఎంచుకోండి. మీరు యూపీఐ ద్వారా గుర్తింపును అందించే ఎంపికను చూస్తారు. ఆ తర్వాత మీ మొబైల్లో యూపీఐ యాప్ని ఓపెన్ చేసి, మీ ముందు కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేయండి. ఇక్కడి నుంచి ప్రక్రియ మునుపటి మాదిరిగానే ఉంటుంది. మీకు కావలసిన డబ్బును ఎంటర్ చేయండి ఆ తర్వాత విత్డ్రా చేసుకోండి. కార్డ్ లెస్ క్యాష్.. ప్రయోజనాలు ఇవే కార్డు లేకుండా నగదు విత్డ్రా చేసుకునే సదుపాయం కార్డు స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ వంటి మోసాలను నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, మీరు కార్డును మీ వద్ద ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీ స్మార్ట్ఫోన్ ఈ పనులన్నింటినీ చేస్తుంది. చదవండి: కొత్త ఏడాదిలో యూజర్లకు షాక్.. నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ షేర్ చేస్తే పైసలు కట్టాలి! -
ఓరి దేవుడా! ఏకంగా ఏటీఎం యంత్రాన్నే...
సాక్షి, బనశంకరి: ఏటీఎం కేంద్రంలోకి చొరబడిన దుండగులు ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకుని కంటైనర్లో ఉడాయించారు. ఈ ఘటన బెళ్లందూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హరళూరు రోడ్డు బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం కేంద్రంలోకి ఈనెల 10న అర్ధరాత్రి 2.30 సమయంలో చొరబడిన దుండగులు ఏటీఎం యంత్రాన్ని పెకలించి వాహనంలో తీసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం గమనించిన బ్యాంక్ అధికారులు ఏటీఎం కేంద్రాన్ని పరిశీలించి బెళ్లందూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టామని డీసీపీ గిరీష్ తెలిపారు. ట్రక్తో వచ్చిన దుండగులు ఏటీఎం కేంద్రంలోకి చొరబడి అక్కడ ఉన్న సీసీ కెమెరాకు రంగు స్ప్రే చేశారు. అనంతరం ఏటీఎం యంత్రాన్ని పెకిలించి కంటైనర్లో పెట్టుకుని ఉడాయించిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో నమోదైనట్లు తెలిపారు. (చదవండి: చికెన్ రోల్ లేదని.. హోటల్కు నిప్పు) -
ఇండియాలోనే ఫస్ట్ గోల్డ్ ATM .. ఎలా పని చేస్తుందో చూస్తే షాక్ అవుతారు..
-
మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..? మారిన ఏటీఎం విత్డ్రా నిబంధనలు
కెనరా బ్యాంక్ ఖాతా దారులకు ముఖ్య గమనిక. ఖాతాదారులు నిర్వహించే రోజూ వారీ ఏటీఎం లావాదేవీలపై మార్పులు చేసింది. ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రాల్, పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్), ఈకామర్స్ ట్రాన్సాక్షన్లలో ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది ► క్లాసిక్ డెబిట్ కార్డుల కోసం రోజువారీ ఏటీఎం విత్డ్రాల్ పరిమితిని ప్రస్తుతం రూ.40వేలు ఉండగా.. రూ.75వేలకు పెంచింది. ► ప్రస్తుతం ఉన్న పీఓఎస్,ఈ కామర్స్ పరిమితిని రూ.1 లక్ష నుండి రోజుకు రూ. 2లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ► రూ.25వరకు లిమిట్ ఉన్న ఎన్ఎఫ్సీ (కాంటాక్ట్లెస్)ని తటస్థంగా ఉంచింది. కాంటాక్ట్లెస్ లావాదేవీలు ఒక్కో సందర్భంలో రూ. 5000 వరకు, రోజుకు 5 లావాదేవీలకు అనుమతి ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం డెబిట్ కార్డ్ లావాదేవీల పరిమితిలో మార్పులు చేసింది. పీఎన్బీ వెబ్సైట్ ప్రకారం.. ప్లాటినం మాస్టర్ కార్డ్, రూపే, వీసా గోల్డ్ డెబిట్ కార్డ్లతో పాటు రూపే సెలెక్ట్, వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్ల పరిమితిని పెంచనున్నట్లు తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల వినియోగదారులకు షాక్ ఇచ్చింది. థర్డ్ పార్టీ పద్దతుల ద్వారా రెంట్ పేమెంట్ చేస్తే..సదరు వినియోగదారులు చేసిన లావాదేవీ మొత్తంలో 1శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. చదవండి👉 మారనున్న నిబంధనలు!, పాన్ కార్డు అమలులో కేంద్రం మరో కీలక నిర్ణయం? -
హైదరాబాద్లో గోల్డ్ ఏటీఎం వచ్చేసింది.. దేశంలోనే తొలిసారి
సనత్నగర్: నగదు ఉపసంహరణ, జమకు ఉపయోగించే ఏటీఎంల తరహాలోనే డెబిట్, క్రెడిట్ కార్డులతో బంగారం విత్డ్రా చేసుకునేందుకు వీలుగా దేశంలోనే తొలిసారిగా గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. గోల్డ్ సిక్కా ఆధ్వర్యంలో బేగంపేటలోని అశోకా రఘుపతి చాంబర్స్లో గల ఆ సంస్థ కార్యాలయంలో ఏర్పాటైన ఈ ఏటీఎంను శనివారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి గోల్డ్ ఏటీఎం నిదర్శనమన్నారు. బంగారాన్ని తీసుకునేందుకు దేశంలోనే తొలిసారి గోల్డ్ ఏటీఎంను నగరంలో ప్రారంభించడాన్ని ఆమె అభినందించారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఈ గోల్డ్ ఏటీఎంలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ తరహా ఏటీఎంలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకివస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గోల్డ్ సిక్కా సంస్థ సీఈఓ సయ్యద్ తరుజ్ మాట్లాడుతూ...ఈ గోల్డ్ ఏటీఎం ద్వారా 99.99% నాణ్యత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలను విత్ డ్రా చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు తాము జారీ చేసే ప్రీపెయిడ్ కార్డులనూ ఉపయోగించవచ్చన్నా రు. ఒక్కో మిషన్లో ఒకేసారి రెండున్నర కోట్ల విలువైన ఐదు కేజీల పసిడిని లోడ్ చేయవచ్చన్నారు. భారత్లో గోల్డ్ మార్కెట్ వేళలకు అనుగుణంగా ఉదయం 9.50 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఏటీఎంల ద్వారా గోల్డ్ తీసుకోవచ్చని తెలిపారు. త్వరలోనే మరిన్ని గోల్డ్ ఏటీఎంల ఏర్పాటు... త్వరలోనే ఎయిర్పోర్ట్, పాతబస్తీలో మూడు ఏటీఎంలు, సికింద్రాబాద్, అబిడ్స్లతో పాటు పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్లలో కూడా గోల్డ్ ఏటీఎంలను ప్రారంభించనున్నామని చెప్పారు. రానున్న రెండేళ్లల్లో దేశవ్యాప్తంగా 3,000 యంత్రాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వివరించారు. కార్యక్రమంలో వ్యాపార వ్యవస్థాపకుడు బండారి లక్ష్మారెడ్డి, దర్శకుడు నరసింహారావు, టీ–హబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం.శ్రీనివాసరావు, తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ అధ్యక్షుడు కొండూరు రవీందర్రావు, అక్రితి గ్రూప్ చైర్మన్ డాక్టర్ కుల్దీప్ రైజాదా, తెలంగాణ జియో సీఈఓ కేసీ రెడ్డి, గోల్డ్ సిక్కా సంస్థ చైర్పర్సన్ అంబిక బుర్మన్ తదితరులు పాల్గొన్నారు. -
అలర్ట్: అమలులోకి వచ్చే కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాలండోయ్!
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలు ఇవన్నీ తరచూ జరుగుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని రూల్స్ మారుతూ ఉంటాయి, కొన్ని కొత్తవి వస్తుంటాయి. అయితే వీటిలో కొన్నింటిపై మాత్రం సామన్యులు అప్రమత్తంగా ఉండాలండోయ్. ఎందుకంటే అవి వారి నగదుపై ప్రభావాన్ని చూపుతాయి. ఈ డిసెంబరు 1 నుంచి అమలులోకి వచ్చే రూల్స్పై ఓ లుక్కేద్దాం.. LPG Gas Cylinder Price: ప్రతీ నెల ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరల్ని అంతర్జాతీయ పరిణమాలను అనుసరించి సవరిస్తుంటాయి. ఈ క్రమంలో ఒక్కొసారి సిలిండర్ ధరలనేవి పెరగడం, తగ్గడం సహజమే. కొన్ని ధరలు స్థిరంగా కూడా ఉండే అవకాశం ఉంది. ఈ సారి డిసెంబర్ 1కి సంబంధించిన ధరల్ని ఆయిల్ కంపెనీలు తాజా సమాచారాన్ని తెలపాల్సి ఉంది. Railway time table: చలికాలం వాతావరణ పరిస్థితులు, పొగమంచు కారణంగా, రైళ్ల టైమ్ టేబుల్లో రైల్వే శాఖ మార్పులు చేసింది. అవి డిసెంబర్ 1నుంచి అమలులోకి రానుంది. 13,000 ప్యాసింజర్ రైళ్లు, 7,000 గూడ్స్ రైళ్లు, 30 రాజధాని రైళ్లకు సంబంధించిన టైమ్ టేబుల్లో మార్పులు ఉన్నాయి. ATM withdraw: డిసెంబర్ 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కస్టమర్లు కోసం పీఎన్బీ ఏటీఎంల నుంచి నగదు విత్డ్రా చేసే ప్రక్రియ మారనుంది. ఇది మనుపటిలా కాకుండా ఇందులో కాస్త మార్పులను జత చేశారు. కస్టమర్లు తమ డెబిట్ కార్డ్ నుంచి డబ్బులను విత్డ్రా చేయాలంటే ఇకపై వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) అవసరం. ఏటీఎం మెషీన్లో మీ డెబిట్ కార్డ్ను చొప్పించిన తర్వాత, ఖాతాదారులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీని అందుకుంటారు. అలా వచ్చిన OTPని నమోదు చేసిన తర్వాత, మీ ఏటీఎం పిన్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. PNB KYC: పంజాబ్ నేషనల్ బ్యాంకులో అకౌంట్ ఉన్న కస్టమర్లు డిసెంబర్ 12 లోగా కేవైసీ అప్డేట్ చేసుకోవాలి సూచించింది. ఇది చేయకపోతే కస్టమర్ల అకౌంట్పై ఆంక్షలు తప్పవని పీఎన్బీ హెచ్చరించింది. Hero Moto Corp: హీరో బైక్ లేదా స్కూటర్ కొనాలనుకునేవారు ఇది షాకిచ్చే వార్త అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో పోలిస్తే ఈ డిసెంబర్ నుంచి హీరో బైక్ను కొనాలంటే కాస్త ఎక్కువ ఖర్చు చేయక తప్పదు. కంపెనీ తమ మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరల్ని రూ.1,500 వరకు పెంచింది. పెరిగిన ధరలు డిసెంబర్ 7 నుంచే అమలులోకి రానున్నాయి. Digital Rupee: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రీటైల్ పైలట్ ప్రాజెక్ట్ను డిసెంబర్ 1న ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. క్లోజ్డ్ యూజర్ గ్రూప్ అనగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో, కేవలం ఎంపిక చేసిన వ్యాపారులు, కస్టమర్లు మాత్రమే ఈ పైలట్ ప్రాజెక్ట్లో ఉంటారు. చదవండి: ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్బై, కేటీఆర్ రియాక్షన్ -
ఫోన్పే వాడుతున్నారా? అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు గురించి తెలుసా!
ఫోన్పే(Phone Pay) .. డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటి నుంచి ఈ పేరు బాగా పాపలర్ అయిపోయింది. పర్సలో మనీ లేకపోయినా పర్లేదు ఫోన్లో ఫోన్పే ఉంటే చాలు అనుకునేంతగా ప్రజాదారణ పొందింది ఈ యాప్. ప్రస్తుతం 350 మిలియన్ల మంది రిజిస్టర్డ్ కస్టమర్లతో పలు సేవలు అందిస్తూ భారత్లో దూసుకుపోతుంది ఫోన్పే. ఎప్పటికప్పడు కొత్త సేవలో కస్టమర్లను ఆకట్టుకుంటూ వారి సంఖ్యను పెంచుకుంటున్న ఈ యాప్ తాజాగా మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్త సేవల మీ కోసం.. ఇది వరకు ఫోన్పే ఉపయోగించాలంటే తప్పనిసరిగా మన డెబిట్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే డెబిట్ కార్డు అవసరం లేకుండా సరికొత్త సేవలను ఫోన్పే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వినియోగదారుడు కేవలం ఆధార్ కార్డు ఉపయోగించి యూపీఐ సేవలు పొందవచ్చని ఫోన్ పే తెలిపింది. ఇకపై ఫోన్ పేలో మీ డెబిట్ కార్డ్ అవసరం లేకుండా కేవలం మీ ఆధార్ కార్డ్ ద్వారా ఫోన్పేలో మీ యూపీఐ (UPI)ని సెటప్ చేయాలనుకుంటే, సింపుల్గా ఇలా ఫాలో అవ్వండి. ►ముందుగా ప్లేస్టోర్ (PlayStore) లేదా యాప్ స్టోర్( App Store) నుంచి ఫోన్పేని డౌన్లోడ్ చేసుకోండి. ►ఆపై ఓపెన్ చేసి మీ మొబైల్ నంబర్ని యాడ్ చేయండి, తర్వాత OTP వస్తుంది దాని ఎంటర్ చేయండి. ►ఇప్పుడు మై మనీ పేజీకి వెళ్లి, ఆపై పేమెంట్స్ మెతడ్స్ (payments method)పై క్లిక్ చేయండి. ►తర్వాత మీ బ్యాంక్ని ఎంచుకోని, 'Add New Bank Account'పై క్లిక్ చేయండి. ► మీ బ్యాంక్ని సెలక్ట్ చేసుకుని, మీ ఫోన్ నంబర్ని ధృవీకరించాల్సి ఉంటుంది. ►దీంతో ఫోన్పే మీ ఖాతా వివరాలను యాక్సెస్ పొందుతుంది, వీటితో పాటు మీ అకౌంట్ యూపీఐకి లింక్ అవుతుంది. ►తర్వాత మీ డెబిట్/ఏటీఎం కార్డ్ వివరాలను నమోదు చేయవచ్చు లేదా ఆధార్ కార్డ్ ఎంపికను ఎంచుకోవచ్చు. ►మీ ఆధార్లోని చివరి ఆరు అంకెలను నమోదు చేయండి. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు OTP వస్తుంది. ► OTPని ఎంటర్ చేసి ఆపై మీ యూపీఐ పిన్ నెంబర్ సెట్ చేసుకోవడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. చదవండి: వణుకుతున్న ఉద్యోగులు.. డిసెంబర్ నాటికి మాంద్యంలోకి ఆ దేశాలు! -
ఏటీఎం ఉపయోగిస్తే చార్జీల మోత
-
బెంగళూరులో ఇడ్లీ ఏటీఎం మిషన్ ...
-
వాట్ యాన్ ఐడియా! ఇడ్లీ ఏటీఎం మిషన్...హాయిగా లాగించేయి గురు!
ఏటీఎం మెషిన్లో డబ్బులు తీసుకోవడం, డిపాజిట్ చేయడం వరకు మనకు తెలుసు ఔనా!. ఇక నుంచి టిఫిన్స్కి సంబంధించిన ఏటీఎంలు కూడా రానున్నాయండి. ఔను! ప్రస్తుతం ఇడ్లీ ఏటీఎం అందుబాటులోకి తీసుకొచ్చారు బెంగళూరుకి చెందిన యువ స్టార్ట్ అప్పర్లు. వివరాల్లోకెళ్తే...ఇక నుంచి మహా నగరాల్లోకి ఇడ్లీ ఆటోమేటిడ్ మేకింగ్ మిషన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ సరికొత్త రోబోటిక్ మిషన్ని బెంగళూరుకి చెందిన ఎంట్రప్రెన్యూర్స్ శరణ్ హిరేమత్, సురేష్ చంద్రశేఖరన్ రూపొందించారు. మన ఏటీఎం మిషన్లానే 24x7 సేవలందిస్తుంది. చాలా ఫ్రెష్గా వేడివేడి ఇడ్లీలను అందిస్తుంది. ఒక్కషాట్లో 72 ఇడ్లీలను కేవలం 12 నిమిషాల్లో అందిస్తుంది. అంతేకాదండోయ్ బయట హోటల్స్ రెస్టారెంట్స్ మాదిరిగా టిఫిన్ తోపాటు చట్నీ, కారప్పొడి, సాంబర్తో సహా అందిస్తోంది. ఐతే మనం ఈ మిషన్ వద్దకు వచ్చి మెనులో మనకు నచ్చిన టిఫిన్ని సెలక్ట్ చేసుకుని దానిపై ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి బిల్ పే చేస్తే...55 సెకండ్లలో మన ఆర్డర్ ప్యాక్ చేసి మన ముందు ఉంటుంది. ఈ ఆలోచన హిరేమత్కి 2016లో ఒక రోజు తన కూతురు అనారోగ్యం బారిన పడినప్పుడూ వచ్చినట్లు చెబుతున్నాడు. ఆ రోజు రాత్రి తన కూతురుకి వేడి వేడి ఇడ్లీ దొరక్కపోవడంతో చాలా ఇబ్బంది పడినట్లు పేర్కొన్నాడు. అప్పుడే తనకు ఏ సమయంలోనైనా వేడివేడిగా ఫ్రెష్గా లభించాలే ఆహారం అందించాలని నిర్ణయించుకుని ఈ ఆటోమెటిష్ మిషన్ని తయారు చేసినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మిషన్లో ఇడ్లీ, వడ అందిస్తున్నట్లు చెప్పారు. ఇదే సౌత్ ఇండియన్స్ వంటకాలకి సంబంధించిన తొలి అల్పాహర ఆటోమెటిక్ మిషన్ అని గర్వంగా చెబుతున్నాడు. ఈ ఏటీఎం ప్రస్తుతం బెంగళూరులోని రెండు ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్లను విస్తరింప చేయడమే కాకుండా ఈ ఏటీఎంలో జ్యూస్, రైస్, దోశ వంటి వాటిని కూడా అందించే ఏర్పాటు చేయాలనకుంటున్నట్లు తెలిపాడు. (చదవండి: వృద్ధురాలి కంటి నుంచి ఏకంగా 23 కాంటాక్ట్ లెన్స్ తీసిన వైద్యులు) -
క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎంలలో డబ్బులు డ్రా చేయొచ్చా?
ఇటీవల కాలంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో ఈ డిజిటల్ చెల్లింపుల కంటే లిక్విడ్ క్యాష్తో మన అవసరాల్ని తీర్చుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో డెబిట్ కార్డుతో డబ్బుల్ని డ్రా చేస్తుంటాం. మరి క్రెడిట్ కార్డుతో ఏటీఎం నుంచి డబ్బుల్ని డ్రా చేసుకునే సదుపాయం ఉంది కదా. డబ్బుల్ని డ్రా చేయొచ్చా? డ్రా చేస్తే ఏమవుతుంది? ఆర్ధిక నిపుణులు ఏం చెబుతున్నారు. ఏటీఎంలో డెబిట్ కార్డును ఎలా ఉపయోగిస్తామో.. క్రెడిట్ కార్డును కూడా అలాగే వినియోగించుకోవచ్చు. అయితే, క్రెడిట్ కార్డుల విషయంలో ఏటీఎం నుంచి డబ్బుల్ని డ్రా చేసుకుంటే కొన్ని అదనపు ఛార్జీలు బ్యాంకులకు కట్టాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఆర్ధికంగా అంత మంచి పద్దతి కాదని ఆర్ధిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. సర్వీస్ ఛార్జ్ మీరు మీ క్రెడిట్ కార్డ్తో ఏటీఎం నుండి నగదును విత్డ్రా చేస్తే.. సదరు విత్ డ్రాల్ పై సర్వీస్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము సాధారణంగా మీరు ఏటీఎం నుంచి డ్రా చేసిన నగదు పై చెల్లించాలి. మొత్తంగా ఆ అదనపు ఛార్జీలు 2.5% నుండి 3% వరకు ఉంటాయి. ఈ ఛార్జీలు మీ నెక్ట్స్ క్రెడిట్ కార్డు బిల్ జనరేట్ స్టేట్మెంట్లో యాడ్ అవుతాయి. వడ్డీ సాధారణంగా డెబిట్ కార్డుతో నెలకు 5 సార్లు ఉచితంగా డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. కానీ క్రెడిట్తో అలా కాదు. బ్యాంకులు అందించే క్రెడిట్ కార్డుతో ఏటీఎం సెంటర్లలో డబ్బులు డ్రా చేస్తే భారీగా వడ్డీ చెల్లించాలి. ఆ వడ్డీ రేట్లు క్రెడిట్ కార్డుతో డబ్బులు డ్రా చేసిన నెంబర్ను బట్టి ఉంటుంది. ఉదాహరణకు ప్రారంభ వడ్డీ నెలకు 3.5% వరకు ఉండవచ్చు. సిబిల్ స్కోర్ తగ్గుతుందా? క్రెడిట్ కార్డ్ని ఉపయోగించి డబ్బుల్ని డ్రా చేసుకుంటే ఆ ప్రభావం నేరుగా క్రెడిట్ కార్డు స్కోర్పై ప్రభావితం చూపదు. అయినప్పటికీ, అధిక ఛార్జీల కారణంగా మీరు కనీస బకాయిని చెల్లించడంలో విఫలం కావచ్చు. మీ క్రెడిట్ కార్డ్ వినియోగం పెరుగుతుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ప్రయోజనాలు, డీల్స్ రెస్టారెంట్లు, దుకాణాలలో చెల్లించడానికి మీ క్రెడిట్ కార్డ్ని స్వైప్ చేసినప్పుడు, బ్యాంకులు మీకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంటాయి. కానీ, మీరు నగదు ఉపసంహరించుకోవడానికి మీ క్రెడిట్ కార్డ్ని ఉపయోగించినప్పుడు ఈ అదనపు ప్రయోజనాల్ని పొందలేం. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో తప్పా క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎం సెంటర్లలో డబ్బులు డ్రా చేయొద్దని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఏటీఎం వద్దే బండరాయిలా నుంచొన్న వ్యక్తి... తీరా దగ్గరికెళ్తే...
ఏటీఎం వద్ద డబ్బులు డ్రా చేసుకోవడం లేదా డిపాజిట్ చేయడం వంటివి సర్వ సాధారణం. ఐతే ఎవరైన మనకంటే ముందు డబ్బులు తీసుకుంటుంటే కాసేపు ఆగుతాం జౌనా! పాపం అలానే ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఏటీఎం వద్ద డబ్బులు తీసుకుంటున్నాడు కదా అని ఆగుతారు. గంటలు గంటలు గడిచిపోతాయే కానీ ఎంతసేపటికి కదలడు. ఇక విసిగిపోయి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి తట్టగా ఆవ్యక్తిని చూసి ఒక్కసారిగా అక్కడ ఉన్న జనాలంతా షాక్ అయిపోతారు. అసలేం జరిగిందంటే...యూకేలోని టెస్కో క్యాష్ పాయింట్ సమీపంలో ఉన్న ఏటీఎం వద్ద ఒక వ్యక్తి నుంచుని ఉంటాడు. ఎంతకీ ఒక పట్టాన కదలడు. ఒకపక్క జనాలంతా క్యూలో నుంచుని అలానే ఉంటారు. ఇంతలో ఒక వ్యక్తి ఎంతసేపు ఇలా అని కోపంతో దగ్గరకు వచ్చి చేత్తో తడతాడు. అయినా కదలడు. దీంతో అనుమానంతో దగ్గరకు వచ్చి చూస్తే అది బొమ్మ. దీంతో వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుతారు. అబ్బా టైం వేస్ట్ చేశామే గానీ అసలు ఎందుకు కదలకుండా అలా ఉన్నాడని గమనించ లేకపోయామే అనుకున్నారు వారంతా. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తె వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్లు వచ్చాయి. మీరు ఓ లుక్కేయండి. Man leaves a mannequin outside a Tesco cashpoint 😭 pic.twitter.com/CgYtG372RK — UB1UB2 Southall (@UB1UB2) September 30, 2022 (చదవండి: Viral Video: జలపాతానికే రంగులు వేసే స్టంట్...పర్యావరణ అధికారులు ఫైర్) -
రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.. సీన్ కట్ చేస్తే జైల్లో ఉన్నాడు
ఒక వ్యక్తికి ప్రమాదవశాత్తు ఏటీఎం నుంచి ఊహించని విధంగా కుప్పులు కుప్పలుగా డబ్బు వచ్చింది. అంతే అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ నడిమంత్రపు సిరి ఉద్యోగాన్ని, ప్రియురాలిని కోల్పోయేలా చేసింది. చివరికి అతన్ని కటకటాలపాలయ్యేలా చేసింది. వివరాల్లోకెళ్తే... ఆస్రేలియాలోని ఒక బార్లో పనిచేసే సర్వర్ డాన్ సాండర్స్కి ఊహించని విధంగా ఏటీఎం నుంచి కట్టకట్టలు డబ్బు లభించింది. దీంతో అతను రాత్రికి రాత్రే మిలినియర్గా మారిపోయాడు. అతను ఒక రోజు రాత్రి బాగా మద్యం సేవించి ఆస్ట్రేలియాలోని వాంగారట్టాలో ఏటీఎం వద్దకు వెళ్లాడు. అప్పుడే అతను ఊహించని విధంగా ఏటీఎం నుంచి సుమారు రూ 13 కోట్ల నగదును పొందాడు. అసలేం జరిగిందటే.. అతను ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తున్న ప్రతిసారి సారీ ట్రై ఎగైన్ అని రావడం పెద్ద మొత్తంలో డబ్బులు మాత్రం ఏటీఎం నుంచి వచ్చేస్తుండేవి. ఇలా అతను మూడుసార్లు చేయగా...మూడుసార్లు పెద్దమొత్తంలో డబ్బు వచ్చింది. కానీ ఏటీఎం మెషిన్ మాత్రం లావాదేవీలు జరుపుతున్నంత సేపు ట్రాన్స్యాక్షన్ క్యాన్సిల్డ్ అని రావడం డబ్బులు మాత్రం వచ్చేయడం జరుగింది. ఐతే తన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు కూడా రావడం లేదు. దీంతో సర్వర్ సాండర్స్కి దెబ్బకి తాగిన మత్తంతా దిగిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక ఆ రాత్రికి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు బ్యాంకుకు ఫోన్చేసి సంప్రదిస్తే ఎలాంటి అవాంఛనీయమైన నగదు బదిలీలు జరగలేదని చెబుతారు. అసలు ఏమైంది ఎందుకు ఇలా జరిగిందని సర్వర్ సాండర్స్ వాకాబు చేస్తే ఆ రోజు రాత్రి తెల్లవారుజామున 1 గంట నుంచి 3 గంటలకు బ్యాంక్ నెట్వర్క్ డిస్కనెక్ట్ అయ్యిందని గ్రహించాడు. అదీగాక తాను ఆరోజు ఏటీఎంలో సేవింగ్ అకౌంట్లోని కొంత సొమ్మును క్రెడిట్ కార్డుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నసమయంలోనే ఇంత పెద్ద మొత్తంలో దాదాపు రూ 13 కోట్ల నగదు బయటకు వచ్చిందని కనుగొన్నాడు. దీంతో ఊహించని విధంగా వచ్చిపడ్డ డబ్బుతో విచ్చల విడిగా జల్సాలు చేస్తూ ఎంజాయ్ చేశాడు. స్నేహితులు యూనివర్సిటీలు ఫీజులు కట్టడం, ఉన్నత చదువులకు స్నేహితులను ఫారెన్ పంపించే పనులు వంటి సాయాలు కూడా చేశాడు. అతని మితిమీరిన జల్సాల కారణంగా బార్లో ఉద్యోగాన్ని, గర్లఫ్రెండ్ని పోగొట్టుకున్నాడు. అంతేకాదు ఆ డబ్బును మొత్తం ఐదునెలలో ఖర్చు పెట్టేశాడు. ఇదిలా ఉండగా బ్యాంకు అధికారులకు ఏటీఎంలో ఫ్రాడ్ జరిగిందని ఎవరో వ్యక్తి అధిక మొత్తంలో డబ్బును పొందినట్లు గుర్తిస్తారు. తర్వాత పోలీసులు ఇలా అక్రమంగా అధిక మొత్తంలో డబ్బుని పొందింది సర్వర్ సాండర్స్గా గర్తించి అరెస్టు చేశారు. పోలీసులు నిందితుడు సాండర్స్ పై 111 అభియోగాలతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన 2011లో జరిగింది. అతను సుమారు ఐదేళ్లు జైలు శిక్షను కూడా అనుభవించాడు. అతను 2016లో జైలు నుంచి విడుదలయ్యాడని ప్రస్తుతం ఒక బార్లో పనిచేస్తున్నాడని ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. ఐతే పోలీసులు ఫ్రాడ్ కేసుల విషయమే చెబుతూ... ఆన్లైన్లో ఈ ఘటన గురించి చెప్పడంతో ఈ విషయం కాస్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్గా మారింది. ఏదీఏమైన ఉచితంగా వచ్చే డబ్బు ఎప్పటికైనా ప్రమాదమే కదా!. (చదవండి: ఫ్రీ బస్సులోనూ టికెట్ కోసం పట్టు.. బామ్మ వీడియో వైరల్) -
ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్త సేవలు రాబోతున్నాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మైక్రో ఏటీఎంల ఏర్పాటు కు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా కస్టమర్ ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.10,000 నగదు స్వీకరించవచ్చు. ఇందుకోసం ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్నకు చెందిన బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ సాయం తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని బ్యాంక్లకు చెందిన డెబిట్ కార్డుల ద్వారా కస్టమర్లు ఈ సేవలను పొందవచ్చు. ఖాతా నిల్వ తెలుసుకోవచ్చు. ద్వితీయ శ్రేణి నగరాలు, ఉప పట్టణ ప్రాంతాల్లో దశలవారీగా దేశవ్యాప్తంగా 2023 మార్చి నాటికి 1.5 లక్షల మైక్రో ఏటీఎంలను అందుబాటులోకి తేనున్నట్టు బుధవారం బ్యాంక్ ప్రకటించింది. ఏటీఎంలు తక్కువగా ఉండి, నగదు అవసరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని పరిచయం చేస్తామని వెల్లడించింది. మైక్రో ఏటీఎం లావాదేవీలు జరిపేందుకు వీలుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్తో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అనుసంధానమైంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న వినియోగదార్లను శక్తివంతం చేసేందుకే ఈ కార్యక్రమానికి శ్రీ కారం చుట్టామని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీవోవో అనంతనారాయణన్ తెలిపారు. చదవండి: స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో కొత్త రూల్స్ వచ్చాయ్.. ఇది తప్పనిసరి! -
కలకలం.. ఏటీఎం నుంచి నకిలీ నోటు!
గుత్తి(అనంతపురం జిల్లా): స్థానిక ప్రధాన ఎస్బీఐ బ్రాంచ్ ఏటీఎం కేంద్రం నుంచి నకిలీ రూ.500 బయటపడింది. వివరాలు.. గుత్తిలోని లచ్చానపల్లి రోడ్డులో నివాసముంటున్న సీఆర్పీఎఫ్ విశ్రాంత జవాన్ కిష్టప్ప బుధవారం ఎస్బీఐ బ్రాంచ్ ఏటీఎం కేంద్రం నుంచి రూ.9,500 డ్రా చేశాడు. అందులో ఓ నకిలీ రూ.500 నోటు వచ్చింది. విషయాన్ని వెంటనే ఎస్బీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై ఎస్బీఐ అధికారులు స్పందించలేదని, ఏటీఎం కేంద్రంలో డబ్బు డిపాజిట్టు విషయం తమ పరిధిలో కాదని వారు పేర్కొన్నట్లు వివరించాడు. చదవండి: విషాదాన్ని మిగిల్చిన ‘గాడ్ ఫాదర్’ -
ఈ బ్యాంకింగ్ సేవలు ఫ్రీ కాదండోయ్.. లిమిట్ దాటితే బాదుడే!
ప్రస్తుత రోజుల్లో బ్యాంక్ అకౌంట్ ప్రతీ ఒకరికి ఉంది. టెక్నాలజీ పుణ్యమా అని ఇటీవల కాలంలో బ్యాంక్ సంస్థలు ఆన్లైన్, ఆఫ్లైన్లో తమ సేవలను అందిస్తున్నాయి. అయితే నగదు లావాదేవీల ఎస్ఎంఎస్(SMS), ఐఎంపీఎస్(IMPS) ఫండ్ బదిలీ, చెక్ క్లియరెన్స్ , ఏటీఎం విత్డ్రాల్ ఇలా ఏ సౌకర్యం పూర్తిగా ఉచితం కాదు. అన్ని సేవలకు, బ్యాంక్ నిబంధనల అనుసరించి తమ కస్టమర్ల నుంచి కొంత ఛార్జీని వసూలు చేస్తుంది. ఇది తెలియక మన జేబులో పైసలు చార్జీల రూపంలో బ్యాంక్లకు కడుతున్నాం. ఓసారి ఆ సేవల గురించి తెలసుకుందాం. నగదు లావాదేవీ బ్యాంకు అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరు నగదు లావాదేవీలు చేయడం సహజం. అయితే ఈ లావాదేవీని నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే చేయవచ్చు. మీరు నిర్ణీత పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తే, దానికి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీ ప్రతి బ్యాంకుకు దాని నిబంధనల ప్రకారం మారుతూ ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వ బ్యాంకులో 20 నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉండాలి బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ను నిర్దిష్ట పరిమితి వరకు నిర్వహించాలి. మీ ఖాతాలో అంత కంటే తక్కువ మొత్తం ఉన్నట్లయితే, కనీస బ్యాలెన్స్ లేని కారణంగా ఛార్జ్ చెల్లించాలి. అన్ని బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ లిమిట్, దానిని నిర్వహించనందుకు ఛార్జీల పరిమితి భిన్నంగా ఉంటాయి. ఐఎంపీఎస్ ఛార్జీలు అన్ని బ్యాంకులు నెఫ్ట్( NEFT), ఆర్టీజీఎస్( RTGS) లావాదేవీలను కస్టమర్లకు ఉచితంగా అందిస్తాయి. అయితే చాలా బ్యాంకులు ఇప్పటికీ ఐఎంపీఎస్( IMPS ) లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ ఛార్జీ రూ.1 నుంచి రూ.25 వరకు ఉంటుంది. లక్ష వరకు ఓకే మీ చెక్కు రూ. 1 లక్ష వరకు ఉంటే, మీరు బ్యాంకుకు ఎటువంటి ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ అంతకంటే ఎక్కువ మొత్తం ఉంటే క్లియరెన్స్ ఛార్జీని చెల్లించాలి. మరోవైపు, చెక్కుల విషయంలోనూ పరిమితి సంఖ్య వరకు ఉచితంగా ఇస్తారు. అంతకు మించి చెక్కుల కావాలంటే వాటికోసం మీరు ధర చెల్లించాలి. ఏటీఎం లావాదేవీ ఏటీఎం (ATM) నుంచి నగదు విత్డ్రా చేసుకునే సదుపాయం కూడా నిర్ణీత సమయం వరకు మాత్రమే ఉచితంగా లభిస్తుంది. పేర్కొన్న సంఖ్య కంటే ఎక్కువ లావాదేవీల జరిపితే అప్పటి నుంచి చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో బ్యాంకు వసూలు చేసే మొత్తం వేర్వేరుగా ఉంటుంది. ఇందుకు చాలా బ్యాంకులు రూ.20-50 వరకు వసూలు చేస్తున్నాయి. ఎస్ఎంఎస్ కూడా ఫ్రీ కాదండోయ్ మీ ఖాతాలో డబ్బు క్రెడిట్ అయినప్పుడు లేదా డెబిట్ అయినప్పుడు బ్యాంక్ మీకు ఎస్ఎంఎస్ పంపుతుంది. దీనికి బ్యాంకులు కూడా ఛార్జీలు వసూలు చేస్తాయి. కానీ చాలా మందికి దీని గురించి తెలియదు ఎందుకంటే ఈ ఛార్జీ చాలా తక్కువగా ఉంటుంది. వివిధ బ్యాంకులకు ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. డెబిట్ కార్డు పోతే.. పైసలే మీరు మీ డెబిట్ కార్డును పోగొట్టుకున్నట్లయితే, మీరు మరొక కార్డును పొందడానికి ఛార్జీ చెల్లించాలి. ఈ ఛార్జీ రూ. 50 నుంచి రూ. 500 వరకు ఉంటుంది. ఒక్కో బ్యాంకు ఒక్కో ఛార్జీలను నిర్దేశించింది. చదవండి: టైం వచ్చింది వెళ్దాం.. ప్రభుత్వ ఆఫీసులు ఖాళీ చేస్తున్న ఎయిరిండియా -
అలర్ట్: ఏటీఎం కార్డు వినియోగదారులకు బ్యాడ్ న్యూస్!
ఏటీఎం కార్డ్ వినియోగదారులకు బ్యాంకులు భారీ షాకిచ్చాయి. ఏటీఎం విత్ డ్రా పై అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నాయి. ఆగస్ట్ 1 నుంచి ఏటీఎం సెంటర్లలో బ్యాంకులు విధించిన 5 ఫ్రీ ట్రాన్సాక్షన్ల కంటే ఎక్కువ సార్లు డబ్బులు డ్రా చేసుకుంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. ఈ తరుణంలో ఏటీఎంలలో పరిమితికి మించిన ప్రతీ విత్ డ్రాల్పై 17 రూపాయలు, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లపై 6 రూపాయలు అదనంగా బ్యాంకులు వసూలు చేయనున్నాయి. ఏటీఎం ఇన్స్టాలేషన్, మెయింటెన్స్ ఛార్జీలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రతినెల ఏటీఎం సెంటర్ల నుంచి 5 సార్ల లోపు డబ్బుల్ని డ్రా చేస్తే..అందుకు అదనపు చెల్లింపులు చెల్లించే అవకాశం లేదు. అయితే తాజాగా ఆ ఐదు సార్లు దాటితే అదనపు రుసుము వసూలు చేసుకోవచ్చని ఆర్బీఐ.. బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. దీంతో కస్టమర్ల నుంచి ఏటీఎం లావాదేవీలపై రుసుమును వసూలు చేసేందుకు సిద్ధ మయ్యాయి. గతేడాది జూన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతేడాది జూన్లో నెలవారీ అదనపు ట్రాన్సాక్షన్లపై రూ.21 వసూలు చేసుకోవచ్చని బ్యాంకులకు చెప్పింది. దీంతో ఈ ఏడాది జనవరి 1నుంచి ఏటీఎంలో అదనపు విత్ డ్రాపై రూ.21వసూలు చేస్తున్నాయి. తాజాగా మరోసారి ఆర్బీఐ ఏటీఎంలో మనీ విత్ డ్రాపై కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారుల నుంచి బ్యాంకులు సర్వీస్ ఛార్జీలను వసూలు చేయాలని ఆదేశించింది. బ్యాంకులు సైతం ఆర్బీఐ ఆదేశాల ప్రకారం.. ఆగస్ట్ 1 నుంచి ఏటీఎం మనీ విత్ డ్రాపై అదనపు రుసుములు వసూలు చేయడం ప్రారంభించాయి. ఎన్ని ట్రాన్సాక్షన్లకు ఉచితం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు పరిమిత సంఖ్యలో ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వినియోగదారులు ప్రతి నెలా వారి (ఉదాహరణకు ఏ బ్యాంక్ ఏంటీఎం ఉంటే ఆ బ్యాంక్) ఏటీఎంలో 5 ఫ్రీ ట్రాన్సాక్షన్లు, ఏటీఎం ఎస్బీఐ బ్యాంక్ది అయి ఉండి మీరు బ్యాంక్ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేందుకు 3 ఫ్రీ ట్రాన్సాక్షన్లకు అనుమతి ఇస్తున్నాయి. ఇక నాన్ మెట్రో కేంద్రాల్లోని కస్టమర్లు ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఐదు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. చదవండి👉 ఏటీఎం యూజర్లకు గమనిక, ఆ నిబంధన అందరికీ రానుందా? -
ఏటీఎంను బద్దలు కొట్టిన వ్యక్తి.. డబ్బులు రాలేదని కోపంతో..
శ్రీకాకుళం (పొందూరు): డబ్బులు రాలేదనే కోపంతో ఏకంగా ఏటీఎం మిషన్నే బద్దలు కొట్టాడో వ్యక్తి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరులో సోమవారం జరిగింది. ఎస్ఐ లక్ష్మణరావు చెప్పిన వివరాలు మేరకు.. బూర్జ మండలానికి చెందిన పైడి సత్యనారాయణ నగదు కోసం సోమవారం పొందూరు బస్టాండ్లోని టాటా ఏటీఎంకు వెళ్లారు. తన ఏటీఎం కార్డును ఉపయోగించి డబ్బు డ్రా చేసే ప్రయత్నం చేయగా నగదు రాలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన సత్యనారాయణ ఏటీఎం మిషన్ను బద్దలు కొట్టాడు. పోలీసులకు దీనిపై సమాచారం అందింది. వెంటనే వారు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఏటీఎం అనుకుని ఎంత పని చేశారు.. చూసుకోవాలి కదా !
మైసూరు: లక్షల్లో డబ్బులు ఉన్న ఏటీఎం యంత్రం అనుకుని దొంగలు పాస్బుక్ను ప్రింట్ చేసే యంత్రాన్ని ఎత్తుకెళ్లారు. ఈ తికమక సంఘటన మైసూరు నగరంలోని లష్కర్ మహల్లాలో ఉన్న కెనరా బ్యాంక్ ఏటీఎం సెంటర్లో చోటు చేసుకుంది. దొంగలు చోరీ చేసే హడావుడిలో ఏటీఎం యంత్రం అనుకుని పాస్బుక్ ప్రింటింగ్ యంత్రాన్ని పెకలించుకుని తీసుకెళ్లారు. సిబ్బంది ఏటీఎంను రెండురోజుల పాటు మూసి ఉంచారు. గురువారం ఉదయం తెరిచి చూసిన సెక్యూరిటీ గార్డు ఆ యంత్రం లేకపోవడం చూసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. కాగా, మండ్య, మైసూరు ప్రాంతాల్లో తరచూ ఏటీఎంలను దొంగలు ఎత్తుకెళ్లడం గమనార్హం. చదవండి: Hyderabad: ఎవరికైనా చెబితే చంపేస్తా.! -
ఆ ఏటీఎం మిషీన్ వద్దకే క్యూ కడుతున్న జనాలు! ఎందుకో తెలుసా!
ATM was dispensing extra cash: మహారాష్ట్రాలోని ఒక ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఏటీఎం మెషీన్ ఉంది. ఇందులో ఎక్కువ శాతం వంద రూపాయల(రూ.100) నోట్లను మిత్రమే ఉంచుతారు.. ఐతే ఒక అతను రూ.500లు డ్రా చేద్దామని వెళ్తే ఏకంగా రూ.500ల నోట్లు ఐదు వచ్చాయి. అంటే అతను రూ.500లు డ్రా చేస్తే ఏటీఏం మెషీన్ ప్రకారం వంద రూపాయల(రూ.100) నోట్లు ఐదు రావడానికి బదులు ఐదు ఐదువందల రూపాయల(రూ.500) నోటులే వచ్చాయి. దీంతో అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇక అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంతేకాదు అతను మళ్లీ ఇంకోసారి ఇలానే డబ్బలు డ్రా చేసుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటన నాగ్పూర్కి సుమారు 30 కి.మీ దూరంలో ఉన్న ఖపర్ఖేడా పట్టణంలో ఒక ప్రైవేట్ ఏటీఎం మెషీన్లో చోటు చేసుకుంది. ఈ వార్త దావానలంలా పట్టణమంతా వ్యాపించింది. దీంతో జనాలు ఆ ఏటీఎం మిషీన్ వద్దకు క్యూ కట్టారు. ఐతే సదరు బ్యాక్ ఖాతాదారుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ ఏటీఎం మిషీన్ని మూసేంతవరకు ఈ తంతు జరిగింది. ఏటీఎంలో తలెత్తిన సాంకేతికలోపం కారణంగా ఇలా జరిగిందని పోలీసు అధికారి చెబుతున్నారు. ఈ ఏటీఎంని రూ.100/-ల డినామానేషన్ నోట్లను పంపిణీ చేయడానికి ఉద్దేశిస్తే...బదులుగా అనుకోకుండా పొరపాటున రూ.500/- డినామినేషన్ కరెన్సీ నోట్లను తప్పుగా ఉంచినట్లు అధికారి వెల్లడించారు. ఈ విషయమై ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. (చదవండి: టిఫిన్ ప్లేట్లో బల్లి...కస్టమర్కి ఎదురైన చేదు అనుభవం) -
ఏటీఏం కార్డ్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త!
ఏటీఏం కార్డ్ వినియోగదారులకు శుభవార్త. త్వరలో ఏటీఎం కార్డ్తో పనిలేకుండా యూపీఐ పేమెంట్ ద్వారా ఏటీఏం సెంటర్లో ఈజీగా డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం ప్రస్తుతం ట్రయల్ వెర్షన్లో ఉండగా త్వరలో అందరికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని సమాచారం. దేశంలో యూపీఐ పేమెంట్స్ వినియోగం రోజురోజుకీ పెరిగిపోతుంది. ముఖ్యంగా కరోనా కారణంగా మునుపెన్నడూ లేని విధంగా యూజర్లు క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్పై మొగ్గు చూపుతున్నారు. వైరస్ వ్యాప్తితో పాటు బ్యాంక్కు వెళ్లే అవసరం లేకుండా ఉన్న చోటు నుంచి ఆన్లైన్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేయడంతో యూజర్లు యూపీఏ పేమెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏటీఎం సెంటర్లలో జరిగే నేరాల్ని అరికడుతూ...యూపీఏ పేమెంట్స్ను మరింత పెంచేలా ఎన్సీఆర్ కార్పొరేషన్ అనే సాఫ్ట్వేర్ సంస్థ తొలిసారి యూపీఐ నెట్వర్క్ ఫ్లాట్ ఫామ్స్తో కలిసి ఇంటర్ ఆపరబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్ డ్రాల్(ఐసీసీడబ్ల్యూ) సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొని రానుంది. ఈ ఫ్లాట్ ఫామ్తో యూజర్లు కార్డ్ లేకుండా ఏటీఎం సెంటర్లలో గూగుల్పే, పేటీఎం, ఫోన్తో పే పాటు ఇతర యూపీఐ పేమెంట్స్తో మనీ విత్ డ్రాల్ చేసుకునే సౌకర్యం ఉంటుందని ఎన్సీఆర్ కార్పొరేషన్ ప్రతినిధులు తెలిపారు. కార్డ్ లెస్ మనీ విత్ డ్రాల్ జరగాలంటే..సంబంధిత బ్యాంక్లకు చెందిన ఏటీఎంలలో ఈ కొత్త యూపీఏ పేమెంట్ సదుపాయం ఉండాలని చెప్పారు. కార్డ్ లేకుండా ఏటీఎం నుంచి మనీ విత్ డ్రా ఎలా చేయాలంటే? ►ముందుగా ఏటీఎం మెషిన్లో విత్ డ్రా క్యాష్ ఆప్షన్ను సెలక్ట్ చేసుకోవాలి ►వెంటనే మీకు యూపీఐ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్పై ట్యాప్ చేయాలి ►అలా ట్యాప్ చేస్తే ఏటీఎం స్క్రీన్పై క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది ►ఆ కోడ్ను మీ యూపీఐ పేమెంట్(ఉదాహరణకు గూగుల్ పే) ను స్కాన్ చేసుకోవాలి ►స్కాన్ చేస్తే మీరు మనీ ఎంత డ్రా చేయాలనుకుంటున్నాని అడుగుతుంది. మీ అవసరాన్ని బట్టి మనీ డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం లిమిట్ రూ.5వేల వరకు ఉండనుందని తెలుస్తోంది. ►మీకు ఎంత క్యాష్ కావాలో..నెంబర్ (ఉదాహరణకు రూ.2వేలు) ఎంట్రీ చేసిన తర్వాత హింట్ ప్రాసెస్ బటన్ క్లిష్ చేస్తే మనీ విత్ డ్రా అవుతుంది. డీఫాల్డ్గా మీ యూపీఐ అకౌంట్ క్లోజ్ అవుతుంది. చదవండి👉వాటిని దాటేయనున్న డిజిటల్ వాలెట్లు -
వాటర్ ఏటీఎం.. ఎనీ టైం మూసుడే
సాక్షి, హైదరాబాద్: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకని మూడేళ్ల క్రితం నగరవ్యాప్తంగా 150 ప్రాంతాల్లో వాటర్ ఏటీఎంల పేరిట కియోస్క్లను ఏర్పాటు చేసేందుకు ప్రైవేటు ఏజెన్సీలకు స్థలాలు కేటాయించిన జీహెచ్ఎంసీ.. అవి పనిచేయకున్నా.. పత్తాలేకుండా పోయినా పట్టించుకోలేదు. తిరిగి ఇప్పుడు మళ్లీ వేసవి రావడంతో 60 ప్రాంతాల్లో ఏర్పాట్లకు చర్యలు చేపట్టింది. ప్రైవేటు ఏజెన్సీలు శుద్ధమైన నీటిని 24 గంటల పాటు తక్కువ ధరకు అందజేయాలనే తలంపుతో గతంలో వీటిని ఏర్పాటు చేశారు. కొద్దిరోజులు మాత్రం పనిచేసిన ఇవి క్రమేపీ పనిచేయడం మానేశాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా తెరవలేదని చెబుతున్నారు. ఇప్పుడు తిరిగి మళ్లీ ఏర్పాటుకు టెండర్లు పిలుస్తున్నారు. రోజుకు 5వేల నుంచి 10వేల లీటర్ల తాగునీటిని పంపిణీ చేసే, ఈ అంశంలో తగిన అనుభవమున్న సంస్థలను ఈసారి పిలుస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కియోస్క్ ఇన్స్టలేషన్, విద్యుత్ చార్జీలు, ట్రేడ్లైసెన్స్ తదితరాలన్నీ ఏజెన్సీ బాధ్యతే అని చెప్పారు. అంతేకాదు.. కేటాయించిన స్థలానికి లీజు ధర కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు. టెండరు దక్కించుకునే సంస్థలకు మూడేళ్ల వరకు సదరు స్థలాల్ని లీజుకిస్తామని, పనితీరును బట్టి అనంతరం పొడిగింపు ఉంటుందని తెలిపారు. ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ, నిర్వహణ చేయని వాటిపై ఎలాంటి చర్యలు ఉండకపోవడంతో ఏర్పాట్లకు ఉత్సాహం చూపుతున్న సంస్థలు.. అనంతరం చేతులెత్తేస్తున్నాయి. దాని బదులు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే వాటర్బోర్డుతో ఒప్పందం కుదుర్చుకొని, కియోస్క్లలో పనిచేసే వారికి మాత్రం వేతనాలు చెల్లించడమో లేక మరో ప్రత్యామ్నాయమో చూపితే మేలనే అభిప్రాయాలున్నాయి. లేదా సీఎస్సార్ కింద నిర్వహణను కార్పొరేట్ సంస్థలకిచ్చినా ఉపయోగముంటుందని చెబుతున్నవారు కూడా ఉన్నారు. వాటర్ కియోస్క్లు, లూకేఫ్ల ఏర్పాటు పేరిట విలువైన స్థలాల్ని ప్రైవేటు సంస్థలకు లీజు కివ్వడం అవి లీజుఅద్దెలు చెల్లించకున్నా, ఒప్పందానికనుగుణంగా పనులు చేయకున్నా చర్యలు లేకపోవడంతో ఇలాంటి విధానాల వల్ల ప్రభుత్వ స్థలాలు.. ముఖ్యంగా ఫుట్పాత్లు వంటివి సైతం అన్యాక్రాంతమై ఇతర వ్యాపారాలకు ఉపయోగపడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జోన్కు 10 చొప్పున.. జీహెచ్ఎంసీలోని ఆరు జోన్లలో జోన్కు పది చొప్పున మొత్తం 60 వాటర్ కియోస్క్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. వాటి టెండరు పూర్తయి.. ఇన్స్టలేషన్.. తదితర కార్యక్రమాలు ముగిసి అందుబాటులోకి వచ్చేప్పటికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం. ఈలోగా వేసవి ముగిసినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. టెండరు పొందే సంస్థలకు 300 చదరపు అడుగుల స్థలాన్ని జీహెచ్ఎంసీ కేటాయిస్తుంది. టెండరు ద్వారా కాంట్రాక్టు దక్కించుకునే సంస్థలు ప్రజలు శుద్ధమైన, చల్లని నీటిని దిగువ ధరలకు అందజేయాలి. (చదవండి: హైదరాబాద్ డాక్టర్కు బ్రిటిష్ అత్యున్నత అవార్డు) -
అనూహ్య నిర్ణయం! ఏటీఎంలు అన్నీ బంద్..!
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ క్రిప్టోకరెన్సీలు బిట్కాయిన్, ఈథిరియం, డోజీకాయిన్ విలువ గణనీయంగా పెరిగాయి. దీంతో ఆయా క్రిప్టోకరెన్సీలు మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ కూడా అమాంతం పెరిగాయి. ఇదిలా ఉండగా బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీ ఏటీఎంలపై యుకే ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. చట్ట విరుద్దమైనవే..! యూకేలోని క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లకు ఆ దేశ ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ (ఎఫ్సీఏ) గట్టి షాక్ను ఇచ్చింది. క్రిప్టో ఎక్సేఛేంజ్స్పై కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. క్రిప్టో ఏటీఎం ఆపరేటర్లు వారి మెషీన్లు క్లోజ్ చేయాలని ఆదేశించింది. లేదంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కొత్త రూల్స్ ప్రకారం క్రిప్టో ఎక్స్చేంజ్ సర్వీసులు అందించే క్రిప్టో కరెన్సీ ఏటీఎంలు అన్నీ ఎఫ్సీఏ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్రిప్టో ఏటీఎంలు అన్నీ యూకే మనీ ల్యాండరింగ్ నిబంధనలకు అనుగుణంగానే పని చేయాల్సి ఉంటుంది. చట్టవిరుద్దంగా క్రిప్టో కరెన్సీ ఏటీఎం సర్వీసులు అందిస్తే మాత్రం కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలను జారీ చేసింది. క్రిప్టో లావాదేవీలు సులువు..! యుకేతో పాటుగా పలు దేశాల్లో ఇన్వెస్టర్లకు సులవుగా క్రిప్టోలను కొనుగోలు లేదా సేల్ చేసేందుకుగాను క్రిప్టో ఎటీఎంలను ఎక్సేఛేంజ్స్ ఏర్పాటుచేశాయి. ఇవి సాధారణ ఎటీఎం వలె కన్పిస్తాయి. ప్రజలు తమ బ్యాంక్ కార్డ్లను ఉపయోగించి బిట్కాయిన్ వంటి క్రిప్టో-కరెన్సీ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తాయి.కాగా యుకేలోని క్రిప్టో-కరెన్సీ సేవలను అందించే ఏ కంపెనీకి క్రిప్టో-ATMని ఆపరేట్ చేయడానికి లైసెన్స్ లేదు. క్రిప్టో ఏటీఎం డైరెక్టరీ కాయిన్ ఎటీఎం రాడార్ ప్రకారం..యుకేలో సుమారుగా 81 ఫంక్షనల్ క్రిప్టో ఎటీఎంలు ఉన్నాయి.ఎఫ్సీఏ నిర్ణయంతో ఆ దేశ క్రిప్టో ఇన్వెస్టర్లకు కొత్త చిక్కులను తెచ్చిపెట్టనుంది. చదవండి: 40 ఏళ్ల తరువాత కేంద్రం షాకింగ్ నిర్ణయం..! కారణం అదేనట..? -
బ్యాంక్ దిగ్బంధనం... ఏటీఎంకి క్యూ కట్టిన రష్యన్ వాసులు
రష్యా దురాక్రమణకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా, పశ్చిమ దేశాలు కీలక చర్యలు చేపట్టాయి. అమెరికా, ఐరోపా సమాఖ్య కెనడా, బ్రిటన్లు..స్విఫ్ట్(సోసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలీకమ్యూనికేషన్స్) నుంచి రష్యాకు చెందిన కీలక బ్యాంకులను తీసేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో రష్యాన్ వాసుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఉక్రెయిన్ పై దాడికి కఠినమైన పాశ్చాత్య ప్రతిస్పందనగా గ్లోబల్ పేమెంట్స్ సిస్టమ్ స్విప్ట్ నుంచి రష్యాను మినహాయించే ఒప్పందం గురించి వార్తలు గుప్పుమన్నాయి. దీంతో వందల కొలది రష్యన్ వాసులు ఏటీఎం మిషన్ల వద్ధ బారులు తీరి ఉన్నారు. దేశానికి వ్యతిరేకంగా ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో రష్యా అంతటా అంతర్గత భయాందోళనలు మొదలైయ్యాయి. శనివారం, రష్యా మిలిటరీ ఉక్రెయిన్ నగరాలపై దాడిని వేగవంతం చేయడంతో, పాశ్చాత్య మిత్రదేశాలు దేశ బ్యాంకింగ్ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించాయి. ఈ మేరకు డబ్బును బదిలీ చేయడానికి ఉపయోగించే అంతర్జాతీయ వ్యవస్థ అయిన స్విప్ట్ నుంచి ఎంపిక చేయబడిన బ్యాంకులను తగ్గించడం ద్వారా రష్యా అంతర్జాతీయ వాణిజ్య సామర్థ్యాన్ని తీవ్రంగా అడ్డుకుంటుంది. అంతేకాదు సుమారు 200 దేశాలలో దాదాపు 11వేల కంటే ఎక్కువ ఆర్థిక సంస్థలు స్విఫ్ట్ని ఉపయోగిస్తున్నాయి. నేషనల్ అసోసియేషన్ రాస్విఫ్ట్ ప్రకారం, రష్యా వినియోగదారుల సంఖ్య పరంగా యునైటెడ్ స్టేట్స్ తర్వాత రెండవ అతిపెద్ద దేశం రష్యా, దాదాపు 300 రష్యన్ ఆర్థిక సంస్థలు ఈ వ్యవస్థకు చెందినవి. దీంతో రష్యా అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించడం కష్టమైపోతుంది. ఈ భయాందోళనలతో రష్యా వాసులు ఏటీఎంకు క్యూలు కడుతున్నారు. (చదవండి: అమెరికా వీసా దరఖాస్తుదారులకు తీపి కబురు..) -
ఏటీఎం మిషన్లో వేయాల్సిన నగదుతో జంప్!... దంపతులను బురిడీ కొట్టించినదొంగ!
మాండ్య : మండ్య జిల్లా మద్దూరు పట్టణంలోని కెనరా బ్యాంకు ఏటీఎం కేంద్రానికి వచ్చిన దంపతులను ఓ ఘరానా మోసగాడు వంచించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... చెన్నపట్టణ తాలూకా కోలూరు గ్రామానికి చెందిన మహదేవయ్య, మమత దంపతులు ఈనెల 2న తన కుమారుడు ఉన్నత చదువుల కోసం బ్యాంకులో నగలు తాకట్టు పెట్టి రూ. 50 వేలు తీసుకుని మద్దూరులోని కెనరా బ్యాంక్ వద్దకు వచ్చాడు. అదే సమయంలో బ్యాంకులో వినియోగదారులు ఎక్కువగా ఉండటంతో ఏటీఎం మిషన్లో వేయాలని సూచించారు. వారి వెనుకాలే ఓ వ్యక్తి ఏటీఎం సెక్యూరిటీ ఉద్యోగి తరహాలో వారి వద్దకు వచ్చాడు. నగదు ఏటీఎం మిషన్లో తమ ఖాతాలో డిపాజిట్ చేయాలని కోరారు. మోసగాడు వారిని చూపు మళ్లించి నగదు తన జేబులో పెట్టుకుని, ఖాతాలో వేసినట్లు నటించి అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో దంపతులు కుమారుడికి ఫోన్ చేసి నగదు వేశామని చెప్పారు. తనకు ఇంకా నగదు పడలేదని చెప్పడంతో బ్యాంకు సిబ్బందితో విచారించారు. సర్వర్ సమస్య ఉంటుందని, వారం రోజుల్లో నగదు పడుతుందని చెప్పారు. వారం రోజులు గడచినా నగదు జమ కాకపోవడంతో అనుమానించిన సిబ్బంది సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఆర్బీకేల్లో ఏటీఎంలు
సాక్షి, అమరావతి: గ్రామస్థాయిలో రైతులకు బ్యాంకింగ్ సేవలందించాలన్న లక్ష్యంతో ఇప్పటికే బ్యాంకింగ్ కరస్పాండెంట్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా.. ప్రతీ రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే)లో ఏటీఎంను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకొక ఆర్బీకేలో వీటిని ఏర్పాటుచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలుండగా, ప్రస్తుతం 9,160 ఆర్బీకేల పరిధిలో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అందుబాటులో ఉన్నట్లుగా గుర్తించారు. వీరిలో ప్రస్తుతం 6,708 మంది మాత్రమే ఆర్బీకేల ద్వారా సేవలందిస్తున్నారు. మిగిలిన వారి సేవలకూ చర్యలు చేపట్టారు. ఇక ప్రస్తుతం బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా రూ.25వేల వరకు పరిమిత నగదు ఉపసంహరణ.. కొత్త బ్యాంకు ఖాతాలు తెరవడం.. పంట రుణాల మంజూరు.. పాడి, మత్స్యకారులకు కేసీసీ కార్డుల జారీ, డిపాజిట్ల సేకరణ, రుణాల రికవరీ వంటి సేవలందిస్తున్నారు. తాజాగా.. గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు ఆర్బీకేల్లో ఏటీఎంలు ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన చేయగా బ్యాంకర్లు అందుకు ముందుకొచ్చారు. జిల్లాకొకటి చొప్పున ఆర్బీకేలతో పాటు గ్రామ–వార్డు సచివాలయాల్లో ఏటీఎంలను ఏర్పాటుచేస్తున్నారు. ఆ తర్వాత బ్యాంకుల్లేని గ్రామాల్లో ఏర్పాటుచేయనున్నారు. చివరిగా.. మిగిలిన ఆర్బీకేలు, గ్రామ–వార్డు సచివాలయాలోŠల్ స్థానికంగా ఉండే డిమాండ్ను బట్టి దశల వారీగా ఏర్పాటుచేస్తారు. రైతుల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం.. మొబైల్, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించడం, పేపర్లు లేని ఆర్థిక లావాదేవీల (పేపర్ లెస్)ను ప్రోత్సహించడం లక్ష్యంగా గ్రామస్థాయిలో బ్యాంకింగ్ సేవలను విస్తరిస్తున్నారు. మరోవైపు.. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి ఆర్బీకేల ద్వారా రైతు సంబంధిత బ్యాంకింగ్ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బ్యాంకర్లు కసరత్తు చేస్తున్నారు. జిల్లాకొకటి ఏర్పాటుచేస్తున్నాం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆర్బీకేలు, గ్రామ–వార్డు సచివాలయాల్లో ఏటీఎంలు ఏర్పాటుచేసేందుకు కృషిచేస్తున్నాం. అందుకు బ్యాంకర్లందరూ ముందుకొస్తున్నారు. తొలుత ఆర్బీకేలు, సచివాలయాల్లో జిల్లాకొకటి చొప్పున ఏర్పాటుచేస్తున్నాం. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన చోట్ల ఏర్పాటుచేస్తాం. – వి. బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్ఎల్బీసీ -
ATM History: మొట్టమొదటి ఏటీఎం ఎక్కడ ఏర్పాటు చేశారంటే..
కొత్త ఏడాదిలో మొదటి రోజునే ఆర్బీఐ ఏటీఎం విత్డ్రా కొత్త రూల్స్ను అమలులోకి తీసుకొచ్చింది. ఉచిత ట్రాన్జాక్షన్స్ పరిధి గనుక అయిపోతే.. 21రూ. చొప్పున ఛార్జీలు ఖాతాదారుల అకౌంట్ల నుంచి బాదేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఈ విషయం పక్కనపెడితే.. మొట్టమొదటి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అలియాస్ ఏటీఎం Automated teller machine ఎక్కడ నెలకొల్పారో తెలుసా? ►1987లో హెచ్ఎస్బీసీ ముంబైలో తొలి ఏటీఎంను నెలకొల్పింది. ►ఆ తర్వాత పన్నెండేళ్లకు దేశవ్యాప్తంగా 1,500 ఏటీఎంలు ఏర్పాటయ్యాయి. ►మార్చ్ 31, 2021 నాటికి మన దేశంలో 1,15,605 ఆన్సైట్ ఏటీఎంలు, 97, 970 ఆఫ్సైట్ ఏటీఎంలు ఉన్నాయి. ►2021, మార్చ్ నెల చివరినాటికి.. మొత్తం బ్యాంకులన్నీ కలిపి 90 కోట్ల డెబిట్ కార్డులు కస్టమర్లకు జారీ చేశాయి. ► ఏటీఎంను ఎవరు రూపొందించారనే విషయంపై రకరకాల వాదనలు, థియరీలు, వివిధ దేశాల వెర్షన్లు వినిపిస్తుంటాయి. ► పేటెంట్ విషయంలో అమెరికా సహా పలు దేశాలు వాదులాడుకుంటాయి. ►అయితే బ్రిటన్ ఆవిష్కరణకర్త జాన్ షెపెర్డ్ బారోన్ ప్రపంచంలో మొట్టమొదటి ఏటీఎంను రూపొందించిన వ్యక్తిగా కీర్తి గడించారు. ►1965లో నగదును అందించే స్వీయ సేవ పరికరాన్ని ఈయన ప్రపంచానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. ►1967లో నార్త్ లండన్లోని ‘బార్క్లేస్ బ్యాంక్’ ఎన్ఫీల్డ్ టౌన్ బ్రాంచ్ బయట జూన్ 27న మొట్టమొదటిసారి ఏటీఎంను ఏర్పాటు చేశారు. ►విశేషం ఏంటంటే.. ఆయన పుట్టింది భారత్లోనే!. 1925లో మేఘాలయాలో ఓ ఆస్పత్రిలో జన్మించారాయన. ►ప్రతిగా 53 ఏళ్ల తర్వాత ఎస్బీఐ బ్యాంక్ 2021 ఆగష్టులో ఆయన జన్మించిన ఆస్పత్రిలో ఏటీఎంను ఏర్పాటు చేసింది. \ ►అమెరికాలో ఏటీఎం(ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్), కెనడాలో ఆటోమేటెడ్ బ్యాంకింగ్ మెషిన్(ABM), బ్రిటిష్ నేలపై క్యాష్ పాయింట్, క్యాష్ మెషిన్, హోల్ ఇన్ ది వాల్ అని కూడా పిలుస్తుంటారు. ►క్యాష్లైన్, ఏనీ టైం మనీ, టైమీ మెషిన్, క్యాష్ డిస్పెన్సర్, క్యాష్ కార్నర్, బ్యాంకోమాట్ అని పిలుస్తారు. ►ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ ఆధీనంలో ఉండని వాటిని వైట్ లేబుల్ ఏటీఎంలు అని పిలుస్తారు. ►2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3.5 మిలియన్ల ఏటీఎంలు ఉన్నట్లు ఏటీఎం ఇండస్ట్రీ అసోషియేషన్ వెల్లడించింది. ►అయితే క్యాష్లెస్ పేమెంట్లు పెరుగుతుండడంతో ఏటీఎంల నిర్వహణ క్రమంగా తగ్గిపోతోంది. ► ఏటీఎంల కంటే ముందు 1960ల్లో కంప్యూటర్ లోన్ మెషిన్ అనే డివైజ్ జపాన్లో ప్రాచుర్యంలో ఉండేది. ►ఏటీఎంలను ఎక్కడపడితే అక్కడ నెలకొల్పడానికి అనుమతులు ఉన్నాయి. ►క్రూయిజ్ షిప్స్, యూఎస్ నేవీ షిప్స్లో కూడా ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ►ఈమధ్యకాలంలో సోలార్ పవర్డ్ ఏటీఎంలను నెలకొల్పుతున్నారు. ► ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఏటీఎం పాకిస్థాన్ ఖున్జెరబ్ పాస్లో ఉంది. సుమారు 15వేల అడుగుల ఎత్తులోలున్న ఈ ఏటీఎం.. మైనస్ 40 డిగ్రీల సెల్సియస్లోనూ పని చేస్తుంది. ►సాధారణంగా ఏటీఎంలకు సెక్యూరిటీ గార్డులు, టెక్నికల్ సిబ్బందితో పాటు ఇతర సిబ్బందిని సైతం నియమిస్తుంటారు. శుభ్రం చేయడం, ఇతర మెయింటెనెన్స్ ఇందులో భాగంగా ఉండేవి. ఏటీఎంలు నెలకొల్పిన తొలినాళ్లలో ఈ తరహా ఉద్యోగాలు పెరుగుతాయని భావించారంతా. 2010 నాటికి ఆరు లక్షల మందిని ఈ తరహా ఉద్యోగాల్లో నియమించుకున్నారు. కానీ, సెక్యూరిటీ గార్డులకే ఆ పని అప్పగించడం, పైగా ఆన్లైన్ బ్యాంకింగ్ వల్ల ఈ తరహా నియామకాలు గణనీయంగా తగ్గిపోయాయి. -సాక్షి, వెబ్స్పెషల్ -
ఏకంగా 200కు పైగా ఏటీఎం మెషీన్లు హ్యాక్!!
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసులు గడచిన రెండేళ్లలో మూడు ‘ఏటీఎం గ్యాంగు’ల్ని పట్టుకున్నారు. హరియాణా– రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన వీరంతా డబ్బు డ్రా చేసిన సమయంలో మెషీన్ను ఆపేసి కథ నడిపారు. ఢిల్లీకి చెందిన ఓ గ్యాంగ్ మాత్రం వీటిని తలదన్నేలా వ్యవహరించింది. ఏకంగా 200కు పైగా ఏటీఎం మెషీన్లను హ్యాక్ చేసి పని కానిచ్చింది. అయిదుగురిని పట్టుకున్న ఘజియాబాద్ పోలీసులు ఈ ముఠాకు సాంకేతిక సహకారం హైదరాబాద్కు చెందిన కమల్ అందించినట్లు గుర్తించారు. దీంతో ఇతడి కోసం గాలిస్తూ ఓ ప్రత్యేక బృందాన్ని సిటీకి పంపారు. నలుగురు సభ్యులతో ముఠా.. ఉత్తరప్రదేశ్లోని బాండ జిల్లాకు చెందిన షానవాజ్ అలీ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) పూర్తి చేసి ఢిల్లీలో స్థిరపడ్డాడు. ఇతడికి 2015లో పశ్చిమ బెంగాల్లోని సిలిగురికి చెందిన జమీర్ షేక్తో పరిచయమైంది. అప్పట్లో నలుగురు సభ్యులతో ఓ ముఠాను కలిగి ఉన్న జమీర్ ఉత్తరాఖండ్తో పాటు యూపీ, గుజరాత్, మహారాష్ట్రల్లో ఏటీఎంలను హ్యాక్ చేయడం ద్వారా తెరిచి అందులోని డబ్బు కాజేశారు. షానవాజ్ అయిదో మెంబర్ అయ్యాడు. అప్పట్లో హ్యాకింగ్కు అవసరమైన కోడ్ను వీరికి జార్ఖండ్లోని జామ్తారకు చెందిన వారు అందించారు. ఉత్తరాఖండ్లో వరుసపెట్టి నేరాలు చేసిన ఈ ముఠాను ఆ ఏడాది సెప్టెంబర్లో స్పెషల్ టాస్క్ఫోర్స్ పట్టుకుంది. ఈ కేసులో బెయిల్ పొంది బయటకు వచ్చిన షానవాజ్ తానే గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. ఇందులో ముంబైకి చెందిన జమీర్ షేక్ (కోడింగ్ డిప్లొమా చదివాడు), సాగిర్, మహ్మద్ ఉమర్, మెహ్రాజ్ (బీసీఏ గ్రాడ్యుయేట్) సభ్యులుగా ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ఏర్పాటు ఈ ముఠా కొత్త ఏటీఎంనూ హ్యాక్ చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి హైదరాబాద్ వాసి కమల్ను ఏర్పాటు చేసుకుంది. ఇతగాడు ఢిల్లీ వెళ్లిన సందర్భంలో అక్కడి ఓ పబ్లో వీరికి పరిచయమయ్యాడు. కమల్ డార్క్ నెట్ నుంచి ఏటీఎం మెషీన్ల హ్యాకింగ్ మాల్వేర్ సమకూర్చుకున్నాడు. దీన్ని యూఎస్బీ డ్రైవ్లో వేసి షానవాజ్కు అందించాడు. ఈ డ్రైవ్ను మిషన్కు అనుసంధానించే ముఠా అందులోకి మాల్వేర్ పంపేది. దీని ప్రభావంతో ఆ మెషీన్ ప్రధాన సర్వర్తో సంబంధాలు కోల్పోయేది. అదే సమయంలో ఈ మాల్ వేర్ ఓ కోడ్ను సృష్టించి కమల్ పొందుపరిచిన మెయిల్ ఐడీకి చేరవేసేది. హైదరాబాద్లోనే ఉండి దాన్ని అధ్యయనం చేసే ఇతగాడు పాస్వర్డ్గా మార్చి షానవాజ్ గ్యాంగ్కు ఫోన్లో చెప్పేవాడు. దీన్ని ఎంటర్ చేయడం ద్వారా ముఠా మెషీనన్ రీబూట్ అయ్యేలా చేస్తారు. ఆ సమయంలో డబ్బు డ్రా చేయడంతో అది ఖాతాదారుడి లెక్కల్లోకి రాదు. ఈ పంథాలో షానవాజ్ గ్యాంగ్ ఢిల్లీ, యూపీ, ఘజియాబాద్ల్లో కొన్నాళ్లుగా 200 ఏటీఎంలను కొల్లగొట్టింది. ఇలా కాజేసినదాంట్లో కమల్కు 5% ముట్టేది. వీరి కోసం ఘజియాబాద్ పోలీసులు 5 నెలల క్రితం స్వాట్ టీమ్ను రంగంలోకి దింపారు. హైదరాబాద్లో ఉన్నాడని.. మూడు నెలల క్రితం నోయిడాలో వీరికి చిక్కిన షానవాజ్ లంచం ఎర చూపి తిప్పించుకున్నాడు. రూ.20 లక్షల నగదుతో పాటు ఎస్యూవీ వాహనాన్ని స్వాట్ టీమ్కు ఇచ్చాడు. ఆ తర్వాత తన ముఠాతో కలిసి కొన్ని నేరాలు చేశాడు. గత నెల ఆఖరి వారంలో ఘజియాబాద్ సైబర్ సెల్ పోలీసులు షానవాజ్ సహా అయిదుగురిని పట్టుకున్నారు. వీరి విచారణలోనే నోయిడా ఉదంతం బయటపడింది. దీంతో స్వాట్ టీమ్కు చెందిన ఇద్దరిని ఘజియాబాద్ పోలీసులు విధుల నుంచి తొలగించారు. షానవాజ్ను లోతుగా విచారించిన సైబర్ సెల్ కమల్ వ్యవహారం గుర్తించింది. అతడు హైదరాబాద్లో ఉన్నాడని తేలడంతో ప్రత్యేక బృందాన్ని పంపింది. ఈ ముఠా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఈ పంథాలో ఏటీఎంల నుంచి డబ్బు డ్రా చేసినట్లు వెల్లడైంది. (చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!) -
రూ.500 డ్రా చేస్తే రూ.1100 ఇస్తున్న ఎటిఎం
-
ఏటీఎం సెంటర్లలో రూల్స్ మారాయ్..వాటి గురించి మీకు తెలుసా?
కరోనా కారణంగా ఆన్లైన్ మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. ఈజీ మనీ కోసం సైబర్ నేరస్తులు బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బుల్ని కాజేసేందుకు కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ వినియోగదారుల కోసం జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఏటీఎం సెంటర్లలో జరిగే మోసాల్ని అరికట్టేందుకు వన్ టైమ్ పాస్ వర్డ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానం వల్ల ఏటీఎం సెంటర్లలో జరిగే సైబర్ నేరాల్ని నివారించేలా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. Our OTP based cash withdrawal system for transactions at SBI ATMs is vaccination against fraudsters. Protecting you from frauds will always be our topmost priority.#SBI #StateBankOfIndia #ATM #OTP #SafeWithSBI #TransactSafely #SBIATM #Withdrawal pic.twitter.com/uCbkltrP8T — State Bank of India (@TheOfficialSBI) October 24, 2021 ఎస్బీఐ ఏటీఎం సెంటర్లలో కొత్త రూల్ ►ఏటీఎం సెంటర్లలో రూ.10వేల కంటే ఎక్కువ మొత్తాన్ని డబ్బుల్ని డ్రా చేసే వారికోసం ఎస్బీఐ ఈ కొత్త ఓటీపీ రూల్ ను అమలు చేస్తోంది. మరి ఆ రూల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ►ఎస్బీఐ ఏటీఎం సెంటర్లలో 10వేల కంటే ఎక్కువ మొత్తాన్ని డబ్బుల్ని డ్రా చేయాలంటే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ►ఏటీఏం సెంటర్లో బ్యాంక్ అకౌంట్ హోల్డర్లు ఏటీఎం మెషీన్లో డెబిట్ కార్డ్ ఇన్ సర్ట్ చేసిన తరువాత కార్డ్ పిన్, విత్ డ్రాల్ అమౌంట్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేయాలని అడుగుతుంది. ►ఆ సమయంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ►ఇక ఈ ఓటీపీని అనేది ఒక్క విత్ డ్రాల్కి మాత్రమే పనిచేస్తుంది. రెండో సారి విత్ డ్రాల్ చేయాలంటే మరో కొత్త ఓటీపీని ఎంటర్ చేయాలని ఎస్బీఐ తెలిపింది. చదవండి: బంపర్ ఆఫర్: పోస్టాఫీస్ ఫ్రాంఛైజ్,పెట్టుబడి తక్కువ..సంపాదన ఎక్కువ -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం చోరీకి విఫలయత్నం
-
ఏటీఎం సెంటర్లో యువతి.. సడన్గా ఏమైందో అలా ప్రవర్తించింది!
ఇటీవల సోషల్మీడియోలో వీడియోల హవా పెరిగిపోయింది. ముఖ్యంగా పెళ్లికి సంబంధించినవి నెట్టింట ఓ రేంజ్లో దూసుకుపోతున్నాయి. ఇక కొన్ని వీడియోలైతే అందులోని ఫన్నీ కంటెంట్తో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ యువతి ఎటీఎం సెంటర్లో చిందేసిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూ వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఏటీఎం సెంటర్లోకి డబ్బులు విత్డ్రా కోసం మాస్క్ ధరించి ఓ యువతి వచ్చింది. అయితే అందరిలా డబ్బు తీసుకుని వెళ్లలేదు. హఠాత్తుగా ఏమైందో తెలియదు గానీ అక్కడ ఆ యువతి డ్యాన్స్ వేయడం ప్రారంభించి, మాస్ స్టెప్పులతో ఇరగదీసింది. కాసేపు గ్యాప్ ఇచ్చి డబ్బులు విత్డ్రా పెట్టింది. ఏటీఎం మెషీన్ నుంచి డబ్బులు రాగానే లెక్కపెట్టుకుని మరోసారి డ్యాన్స్ దులిపేసింది. చివరగా, ఏటీఎం కేంద్రం నుంచి వెళ్తూ తలవంచి నమస్కారం చేసి వెళ్లిపోయింది. అయితే ఆ యువతి అలా ఎందుకు ప్రవర్తించిందో వివరాలు తెలియదు. ఈ వీడియోను ‘ఘంటా’ అనే యూజర్ ‘ఖుషి దేఖ్ రహే హో సాలరీ కి’ అని టైటిల్ పెట్టి నెట్టింట షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారి 12 లక్షల వ్యూస్ని సొంతం చేసుకుంది. దీన్ని చూసి.. తన జీవితంలో తొలి సాలరీ అందుకుందేమో, అందుకే అలా చేసిందని కొందరు కామెంట్ చేయగా, డ్యాన్స్ ఇరగదీసిందని మరికొందరు కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by memes | news | comedy (@ghantaa) చదవండి: Viral: ‘వధువును అవమానించిన వరుడు.. విడిపోవటం మంచిది’ -
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఏటీఎంలలో నగదు లేకుంటే జరిమానా
ముంబై: మనం బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంకులు ఏం చేస్తాయి. అడిషనల్ ఛార్జీలను వసూలు చేస్తాయి.ఇప్పుడు బ్యాంకులు నిర్వహిస్తున్న ఏటీఎంలలో నగదు అందుబాటులోకి లేదంటే ఆర్బీఐ భారీ ఎత్తున జరిమానా విధించేందుకు సిద్ధపడింది. నగదు ఉండని ఖాళీ ఏటీఎంలతో ప్రజలకు ఎదురవుతున్న అవస్థలను పరిష్కరించడంపై రిజర్వ్ బ్యాంక్ దృష్టి సారించింది. ఇకపై ఒక నెలలో మొత్తం 10 గంటలకు మించి ఏటీఎంలలో నగదు అందుబాటులో లేకుంటే బ్యాంకులకు జరిమానా విధించనుంది. ఈ నిబంధన ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు (డబ్ల్యూఎల్ఏవో) ఎప్పటికప్పుడు ఏటీఎంలలో నగదు లభ్యతను పర్యవేక్షించి, సమయానికి భర్తీ చేసేలా తమ యంత్రాంగాలను పటిష్టం చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఈ నిబంధనల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తామని, జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించింది. ఒక నెలలో పది గంటలకు మించి ఏ ఏటీఎంలోనైనా నగదు లేకపోతే, ఒక్కో ఏటీఎంకు రూ. 10,000 చొప్పున పెనాల్టీ ఉంటుంది. వైట్ లేబుల్ ఏటీఎంల విషయంలో సదరు ఏటీఎంలకు సంబంధించిన నగదు అవసరాలు తీర్చే బ్యాంకులే జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని డబ్ల్యూఎల్ఏవో నుంచి వసూలు చేసుకోవచ్చు. 2021 జూన్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు చెందిన 2,13,766 ఏటీఎంలు ఉన్నాయి. చదవండి: ఆ పని చేయండంటున్న స్వర్ణ పతక వీరుడు నీరజ్ చౌప్రా -
మంది సొమ్మే కదా మనకేంటి!
సాక్షి,హైదరాబాద్: ఏటీఎంలో నింపే డబ్బు బ్యాంకులది.. అంటే ప్రజల సొమ్ము. నిర్వహణలో మాత్రం అటు బ్యాంకులు, ఇటు కాంట్రాక్టు తీసుకున్న ఏజెన్సీలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. ఫలితంగా లోపభూయిష్టంగా మారిన ఏటీఎంలు అక్రమార్కులకు, నేరగాళ్లకు కల్పతరువులుగా మారుతున్నాయి. నగరంలో వెలుగులోకి వచ్చిన కుంభకోణాలే దీనికి నిదర్శనం. కస్టోడియన్లు రూ.14.69 కోట్లు కాజేసిన కేసులు గడిచిన కొన్నేళ్లల్లో సిటీలో నమోదయ్యాయి. రైటర్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉద్యోగులు రూ.23.32 లక్షలు కాజేశారంటూ ఇటీవల సీసీఎస్ పోలీసులు రిజిస్టర్ చేసిన కేసు వీటిలో తాజాది. ఔట్ సోర్సింగ్ చేతుల్లో నగదు భర్తీ.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ ఏటీఎంల్లో నగదును నింపే బాధ్యతల్ని స్వయంగా పర్యవేక్షించట్లేదు. ఈ కాంట్రాక్టుల్ని హైదరాబాద్, ఢిల్లీ, ముంబై కేంద్రాలుగా నడిచే ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నాయి. ఈ పని చేయడానికి ఆయా సంస్థలు అనేక మందిని కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి. వీరిలో కస్టోడియన్లుగా పిలిచే ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకం. బ్యాంకులకు చెందిన నగదు భద్రపరిచే కేంద్రాల నుంచి రూ.కోట్లను తమ సంస్థల వాహనాల్లో తరలించే టీమ్ సభ్యులకు ఈ కస్టోడియన్లు నేతృత్వం వహిస్తారు. ఆ మొత్తాన్ని తీసుకువెళ్లి ఆయా బ్యాంకుల ఏటీఎం సెంటర్లలోని మిషన్లలో పెడుతుంటారు. ఇంతటి వ్యవహారాలతో నడిపే కీలక బాధ్యతల్ని బ్యాంకులు కాంట్రాక్టు ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నాయి. సాంకేతికతకు ఆమడదూరం... ఏ ఏటీఎం కేంద్రంలో ఎప్పుడు, ఎంత నిపారన్నది కాంట్రాక్టులు నిర్వహిస్తున్న సంస్థల్లో కస్టోడియన్లు పని చేసే ఉద్యోగులు రికార్డుల్లో రాసిందే బ్యాంకులకు ఆధారం. ఈ తరహా ఉద్యోగుల కార్యకలాపాలపై ఏమాత్రం నిఘా సైతం ఉంచట్లేదు. కస్టోడియన్తో కూడిన ఓ బృందం బ్యాంక్ నుంచి సదరు వాహనంలో ఎంత మొత్తం తీసుకుని బయలుదేరుతోంది, తిరిగి ఎంత మొత్తం తీసుకువస్తోంది అనే అంశాలు కేవలం మాన్యువల్గానే పుస్తకాల్లోనో, వీరు ఫీడ్ చేస్తే కంప్యూటర్లోనో నమోదవుతున్నాయి. ఏటీఎం సెంటర్లో ఎంత డబ్బు పెట్టారనే దానికి సైతం ఈ లెక్కలే ఆధారం. అంతే తప్ప ఓ మిషన్లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని డిపాజిట్ చేశారనేది లెక్కించడానికి సాంకేతికంగా ఎలాంటి మెకానిజం ఇప్పటి వరకు ఆయా సంస్థలు, బ్యాంకులు అందిపుచ్చుకోలేదు. ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపిన కస్టోడియన్లు మళ్లీ వెళ్లి ఏటీఎంలను ఓపెన్ చేసినా గుర్తించే పరిజ్ఞానం బ్యాంకుల వద్ద ఉండట్లేదు. ఈ కారణంగానే ఏటీఎంల్లో అవసరమైనంతా డిపాజిట్ చేశామంటూ చెబుతున్న కస్టోడియన్లు గోల్మాల్కు పాల్పడుతూ రూ.లక్షలు, రూ.కోట్లు కాజేసే వరకు సంస్థలు గుర్తించలేకపోతున్నాయి. ఓల్డేజ్ సెక్యూరిటీ గార్డ్లు.. ఏటీఎంల భద్రత విషయంలోనూ లోపాలున్నాయి. ఇక్కడ విధుల్లో వృద్ధులే ఎక్కువగా ఉంటున్నారు. కూకట్పల్లిలోని పటేల్కుంట పార్క్ వద్ద ఈ ఏడాది ఏప్రిల్ 29న చోటు చేసుకున్న ఏటీఎం సొమ్ము దోపిడీ కేసు దీనికి ఉదాహరణ. దాదాపు ప్రతి సెక్యూరిటీ గార్డు, గన్మె న్ ‘ఓల్డేజ్’లోనే ఉంటున్నారు. పది ఏటీఎం కేంద్రాలను పరిశీలిస్తే వాటిలో ఆరు ఏడింటిలో వృద్ధులే సెక్యూరిటీ గార్డులుగా ఉంటున్నారు. ఏటీఎం కేంద్రాల్లో నింపాల్సిన నగదును కాజేసిన కస్టోడియన్ల ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. నగరంలో రూ.14.69 కోట్ల మేర కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా ప్రజాధనం దుండగుల పాలవుతున్నా ఆయా బ్యాంకులు మాత్రం పట్టించుకోవట్లేదు. -
డెబిట్కార్డు లేకుండా డబ్బులను ఇలా విత్ డ్రా చేయండి..!
సాధారణంగా ఏటీఎం నుంచి నగదు విత్డ్రా చేయాలంటే కచ్చితంగా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డును ఉపయోగించాల్సిందే. కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేకుండానే నగదు విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా తన ఖాతాదారులకు ఈ సదుపాయాన్ని తీసుకువచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాదారులు సురక్షితంగా డెబిట్ కార్డు లేకుండానే ఎటీఎం నుంచి నగదును విత్ డ్రా చేసుకోవచ్చును. తన ఖాతాదారులకు కార్డ్లెస్ క్యాష్ను అన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎం నుంచి నగదు ఉపసంహరించుకోవడానికి 24/7 సేవలను అందిస్తుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ట్వీటర్లో పేర్కొంది. ఏటీఎమ్లో కార్డ్లెస్ క్యాష్ను ఇలా విత్ డ్రా చేయండి..! మీకు దగ్గరలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎమ్ దగ్గరకు వెళ్లండి. మీకు ఏటీఎమ్ మిషన్పై చూపిస్తోన్న కార్డ్లెస్ క్యాష్ ఆప్షన్ను సెలక్ట్ చేయండి. తరువాత మీకు నచ్చిన భాషను ఎంచుకోండి. మీ ఖాతాతో రిజిస్టర్ ఐనా మొబైల్ నంబర్ను ఎంటర్ చేయండి. మీ నంబర్ ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ పంపినట్లు మెసేజ్ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. మీకు తొమ్మిది అంకెల ఆర్డర్ ఐడీ వస్తుంది. తరువాత ట్రాన్సక్షన్ అమౌంట్ను ఎంటర్చేయాలి. వివరాలను ధృవీకరించిన తర్వాత ఏటీఎమ్ నుంచి నగదు చెల్లించబడుతుంది. Forgot your ATM Card? Don’t worry, HDFC Bank Cardless Cash is #DigitallyYours with 24X7 service to withdraw cash at all HDFC Bank ATMs. Enjoy instant and secure mode of cash withdrawals without ATM / Debit Card. To know more, visit: https://t.co/foq6Uq144f pic.twitter.com/xIJK6YI7do — HDFC Bank (@HDFC_Bank) July 29, 2021 -
ఏటీఎం పేల్చి రూ.28 లక్షలు చోరీ
సాక్షి ముంబై: పుణే జిల్లాలో ఓ ఏటీఎంను కొందరు దుండగులు పేల్చేశారు. అందులోని సుమారు రూ.28 లక్షలు చోరీ చేశారు. స్థానికంగా తీవ్ర కలకలంతోపాటు భయాందోళనలకు గురిచేసిన ఈ ఘటన వివరాలిలాఉన్నాయి.. పుణే జిల్లా చాకణ్ మహాలుంగే భాంబోలి ప్రధాన కుడలిలో హిటాచి కంపెనీ ఏటీఎం ఉంది. ప్రధాన పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని ఈ ఏటీఎంను బుధవారం తెల్లవారుజాము 2.30 గంటలకు కొందరు దుండగులు పేలుడు పదార్థాలను వినియోగించి ధ్వసం చేశారు. అందులోని సుమారు 28 లక్షల రూపాయలు దొంగిలించి పరారయ్యారు. ఈ తరహాలో ఏటీఎం చోరీ చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారిగా పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ఈ పేలుడు కోసం వినియోగించిన పదార్థాలను నక్సలైటులు ఎక్కువగా వినియోగిస్తుంటారని ప్రాథమికం గా భావిస్తున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఘటనలో నలుగురైదుగురు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. -
ఆగస్టు 1 నుంచి పెరగనున్న ఏటీఎం ఛార్జీలు
ఆగస్టు 1 నుంచి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్(ఏటీఎం) చార్జీలు పెరగనున్నాయి. ఏటీఎం కేంద్రాల నిర్వహణ భారంగా మారిందన్న బ్యాంక్ ఆందోళన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఇంటర్ చేంజ్ ఫీజ్ ను ₹2 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా వచ్చే ఆగస్టు 1 నుంచి ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్ధికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు పెరగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు 90 కోట్ల వరకు వాడుకలో ఉన్నాయి. ఆర్బీఐ సవరించిన నిబంధనల ప్రకారం, ఖాతాదారులు తమ హోమ్ బ్యాంక్ ఏటీఎం నుంచి ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీల చేసుకోవచ్చు. ఆ తర్వాత చేసే నగదు లావాదేవిపై ఇంటర్ ఛేంజ్ ఫీజ్ వర్తించనుంది. మెట్రో నగరాలలో ఉచిత లావాదేవీల సంఖ్య 3గా ఉంటే మెట్రో యేతర నగరాల్లో 5గా ఉంది. 2019 జూన్ లో ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ సూచనల ఆధారంగా ఈ మార్పులను చేశారు. ఏటీఎం లావాదేవీల ఇంటర్ చేంజ్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి ఏటీఎం ఛార్జీలు, ఫీజుల మొత్తం పరిధిని సమీక్షించడానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. మార్చి 31 నాటికి, దేశంలో 115,605 ఆన్ సైట్ ఏటీఎంలు, 97,970 ఆఫ్ సైట్ టెల్లర్ యంత్రాలు ఉన్నాయని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. -
ఆ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా..ఏటీఎం రేషన్!
చండీగఢ్: దేశంలో తొలిసారిగా రేషన్ ఏటీఎంను ప్రయోగాత్మకంగా హర్యానా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పైలట్ ప్రాజక్ట్ను గరుగ్రామ్లోని ఫరూక్నగర్లో హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రేషన్ ఏటీఎం ఐదు నుంచి ఏడు నిమిషాల లోపు 70 కిలోల వరకు బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు విడుదల చేస్తుందన్నారు. కాగా ఈ మెషిన్ టచ్స్క్రీన్ ద్వారా పని చేస్తుందని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి రేషన్ ఏటీఎం ఈ ఏటీఎం మెషీన్లో బయోమెట్రిక్ వ్యవస్థ ఉంటుందని, దీని ద్వారా బయోమెట్రిక్ ధ్రువీకరణ జరగగానే, లబ్ధిదారునికి ఎంత ధాన్యం లభిస్తుందో లెక్కించి ఆటోమెటిక్గా సంచుల్లో నింపేస్తుందని ఆయన అన్నారు. దీని వలన ప్రజలకు పారదర్శకంగా రేషన్ సరుకులు అందుతాయని, ఈ ప్రాజెక్ట్ ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఇదేనంటూ వెల్లడించారు. దీనిని ఆటోమేటెడ్ మల్టీ కమోడిటీ ధాన్యం పంపిణీ యంత్రంగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి రేషన్ ఏటీఎం కాగా.. ఈ పైలట్ ప్రాజెక్ట్ ఫరూకనగర్లో విజయవంతంగా నిర్వహించిన అనంతరం యూఎన్ ప్రపంచ ఆహార కార్యక్రమం క్రింద వీటిని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ మెషిన్ కారణంగా పంపిణీలో ఎటువంటి అవకతవకలకు అవకాశం ఉండదు కనుక రేషన్ సరుకుల కొరతను కూడా ఇది తగ్గించనుందని తెలిపారు. ఈ ఏటీఎంలో రేషన్ సరుకులు.. గోధుమలు, ధాన్యం, చిరుధాన్యాలు సరఫరా చేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు. కాగా ప్రస్తుతం ఫరూక్నగర్లో ప్రారంభించిన ఏటీఎంలో గోధుమలు మాత్రమే అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. -
అమాయకులు, వృద్ధులే వారి టార్గెట్
రాంగోపాల్పేట్: ఏటీఎంకు వెళ్లిన అమాయకులను, వృద్ధులను టార్గెట్ చేసి వారి ఏటీఎం కార్డును స్కిమ్మింగ్, క్లోనింగ్ చేసి నగదును తస్కరిస్తున్న ఐదుగురు అంతర్రాష్ట ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్, డీఐ వీరయ్య, ఎస్సైలు శ్రీను, యుగందర్రెడ్డిలు వివరాలు వెల్లడించారు. బీహార్లోని నవాడా జిల్లాకు చెందిన పురుషోత్తం కుమార్ (20), అదే ప్రాంతానికి చెందిన రవికాంత్కుమార్ (19)లు పాట్నాలో సేప్టీ మేనేజ్మెంట్ విద్యను అభ్యసిస్తున్నారు. నవాడా జిల్లాకు చెందిన నితీష్కుమార్ (19) ఢిల్లీ లోని ఓ రేషన్ షాపులో పనిచేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన పికు కుమార్ (23) భూపాల్లో బీఈ చదువుతున్నాడు. అదే జిల్లాకు చెందిన నిరంజన్కుమార్ (32) చిరు వ్యాపారం చేస్తున్నాడు. ఈ ఐదుగురు స్నేహితులు కాగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో పురుషోత్తం కుమార్ ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి వాటి ద్వారా నగదును తస్కరించాలని పథకం పన్ని కార్డుల్లోని డేటాను రైడ్, రీడ్ చేసే డెఫ్టన్ ఎంఎస్ఆర్ ఎక్స్6 మిషన్ను ఒక యాప్ను తయారు చేశారు. తమ పథకాన్ని అమలు పరిచేందుకు ఐదుగురు గ్యాంగ్ సభ్యులు కొద్ది రోజుల క్రితం నగరానికి వచ్చారు. ఏటీఎంలోకి డబ్బు డ్రా చేసేందుకు వెళ్లిన వ్యక్తి ఏదైనా కంగారు పడితే వెంటనే సహాయం చేసినట్లు నటిస్తారు. కార్డు తీసుకుని రివర్స్లో మిషన్లో పెట్టి అతని దృష్టిని ఏటీఎం స్క్రీన్ నుంచి మరల్చి తమ దగ్గర ఉన్న డెఫ్టన్ ఎంఎస్ఆర్ ఎక్స్ 6 మిషన్లో కార్డును ఉంచి క్షణాల్లో అందులో ఉన్న డేటాను తస్కరిస్తారు. ఆ డేటా మొత్తం వీళ్ల వద్ద ఉన్న యాప్లో నిక్షిప్తం అవుతుంది. అటు తర్వాత వీళ్ల దగ్గర ఉన్న మరో డూప్లికేట్ కార్డులోకి ఈ డేటాను మొత్తం తరలిస్తారు. ఏటీఎంలో ఉన్న వ్యక్తి లావాదేవీలు నిర్వహించుకునే సమయంలో పిన్ నంబర్ను గుర్తు పెట్టుకుంటారు. అటు తర్వాత తమ వద్ద ఉన్న డూప్లికేట్ కార్డు ద్వారా నగదును డ్రా చేస్తారు. ఇలాగే ఉత్తర్ఖండ్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి శుభం కుమార్ గౌర్, అతని స్నేహితుడు ఆకాష్కుమార్లు రైల్వే ట్రాక్ టెస్టింగ్ విధులకు వచ్చి రెజిమెంటల్బజార్లోని పంచవటి రెసిడెన్సీలో ఉంటున్నారు. జూన్ 26వ తేదీన ఆకాష్ రెజిమెంటల్బజార్ చాంద్ దర్గా ప్రాంతంలోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎంకు వెళ్లి రూ.25 వేల నగదును డ్రా చేశారు. అటు తర్వాత ఆకాష్ ఖాతా నుంచి 28వ తేదీన రూ.10వేలు, రూ.5,500 నగదు రెండుమార్లు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు తన ఖాతా నుంచి నగదును తస్కరించినట్లు గుర్తించిన ఆయన గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు ఇలాగే పలు ప్రాంతాల్లో ఏటీఎంల నుంచి రూ.5లక్షల వరకు తస్కరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వారి నుంచి 2.85 లక్షల నగదు, 6 మొబైల్ ఫోన్లు, కార్డు డేటా చోరి చేసే మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. -
జూలై ఒకటి నుంచి ఎస్బీఐ కొత్త రూల్స్!
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై ఒకటి నుంచి కొత్త నిబందనలను అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబందనలను ప్రతి ఖాతాదారుడు తెలుసుకోవాలి అని స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ ను కోరింది. ఎటిఎమ్ నుంచి నగదు విత్ డ్రా, బ్రాంచీ నుంచి నగదు విత్ డ్రా, చెక్ బుక్ వంటి అంశాలకు సంబంధించిన చార్జీల విషయంలో మార్పులు చేసినట్లు పేర్కొంది. ఈ కొత్త రూల్స్ కేవలం బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్ బీడి) ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది. జూలై ఒకటి నుంచి బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులు ఎటిఎమ్ ద్వారా నెలలో నాలుగు సార్లకు మించి ఎక్కువ సార్లు నగదు విత్ డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి లావాదేవిపై రూ.15 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి నెలలో నాలగు సార్లకు మించి డబ్బులు తీసుకుంటే కూడా అదే చార్జీలు పడతాయి. ఇక బీఎస్ బీడి ఖాతాదారులకు ఎస్బీఐ ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ లీవ్స్ను ఉచితంగా అందిస్తుంది. వీటి తర్వాత మరో 10 చెక్ లీవ్స్ కావాలంటే రూ.40 ఛార్జీ పడుతుంది. అలాగే జీఎస్టీ అదనం. ఇక 25 చెక్ లీవ్స్కు అయితే రూ.75 చార్జీ ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ చెక్ బుక్ (10 చెక్ లీవ్స్) కోసం అయితే రూ.50 కట్టాలి అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. కానీ ఈ రూల్స్ సీనియర్ సిటిజన్స్ కి వర్తించవు. చదవండి: కొత్త ఇళ్లు కొనేవారికి కేంద్రం గుడ్ న్యూస్! -
రూ.2 వేల నోట్లు జిరాక్స్ తీసి భార్య ఖాతాలో డిపాజిట్
సాక్షి, చెన్నై : ఎస్బీఐ ఏటీఎం డిపాజిట్ మెషిన్లలోని సాంకేతిక లోపాన్ని ఆసరాగా చేసుకుని హర్యానా ముఠా రాష్ట్రంలో హైటెక్ చేతివాటాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. దీని గురించి ప్రజలు మరిచిపోక ముందే ఓ వ్యక్తి ఏకంగా రూ.2 వేల నోట్లను జిరాక్స్ తీసి తన భార్య ఖాతాలోకి బ్యాంక్ ఆఫ్ బొరడా ఏటీఎం డిపాజిట్ మెషన్ ద్వారా డిపాజిట్ చేశాడు. పుదుకోటై జిల్లా అరంతాంగిలోని బ్యాంక్ ఆఫ్ బొరడా డిపాజిట్ మెషిన్ను తనిఖీ చేయగా రూ.2 వేలు జిరాక్స్ నోట్లు డిపాజిట్ చేసి ఉండడం వెలుగు చూసింది. సీసీ పుటేజీ ఆధారంగా అరంతాంగికి చెందిన శరవణన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను తన భార్య రేవతి ఖాతాలో రూ.2 వేలు జిరాక్స్ నోట్లతో రూ.60 వేలు డిపాజిట్ చేసినట్టు అంగీకరించాడు. అనంతరం మరో ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకున్నట్టు పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి శరవణన్, రవిచంద్రన్ను అరెస్టు చేశారు. చదవండి: బిట్ కాయిన్స్ పేరుతో రూ.60 లక్షలు స్వాహా -
ఈ బ్యాంకుల్లో అపరిమిత ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్..!
ముంబై: ఎటీఎం లావాదేవీలపై బ్యాంకులు ఇంటర్ఛేంజ్ ఫీజు వసూలు చేసుకోవచ్చునని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గత కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో బ్యాంకు ఖాతాదారులపై మరింత భారం పడనుంది. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ ట్రాన్సాక్షన్ పరిమితి దాటితే ట్రాన్సాక్షన్ ఫీజును వసూలు చేయనున్నాయి. పరిమితికి మించి లావాదేవీలు జరిపితే ఒక్కో లావాదేవీకి రూ. 20 నుంచి రూ.21 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు 2022 జనవరి 1, నుంచి అమలులోకి రానున్నాయి. బ్యాంకు ఖాతాదారులు తమ సొంత బ్యాంకు ఏటీఎం నుంచి 5 ఉచిత ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చును. ఇతర బ్యాంకు ఏటీఎంలో మెట్రో నగరాల్లో 3 సార్లు, గ్రామీణ ప్రాంతాల్లో 5 ఉచిత లావాదేవీలను నిర్వహించవచ్చును. కాగా కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారుల కోసం అపరిమిత ఎటీఎం లావాదేవీలు జరుపుకోవచ్చునని ప్రకటించాయి. ఇండస్ఇండ్, ఐడీబీఐ వంటి ప్రైవేటు బ్యాంకులు ఈ ఆఫర్ను తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. ఐడీబీఐ బ్యాంకు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన వాటికి పూర్తిగా అపరిమిత ఉచిత ఎటీఎం లావాదేవీలను జరుపుకోవచ్చును. కాగా ఐడీబీఐ బ్యాంక్ ఆర్బీఐ నిర్దేశించిన కనీస ఉచిత పరిమితులకు అనుగుణంగా ఉచిత ఎటీఎం లావాదేవీలను అందిస్తుంది. బ్యాంక్ తన స్వంత ఎటిఎంలలో 5 ఉచిత లావాదేవీలను, ఇతర బ్యాంక్ ఎటిఎంలలో, ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో మూడు ఉచిత లావాదేవీలను కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని ఐడిబిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోర్టీ చాకో పేర్కొన్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్ తన బ్యాంకు ఖాతాదారులకు దేశవ్యాప్తంగా ఏ బ్యాంక్ ఏటీఎం నుంచైనా అపరిమిత ఉచిత ఏటీఎం లావాదేవీలను అందిస్తోందని ఇండస్ఇండ్ బ్యాంక్ తన వెబ్సైట్ పేర్కొంది. సేవింగ్స్ ఖాతాలో రూ.25వేల కంటే ఎక్కువ సగటు బ్యాలెన్స్ నిర్వహిస్తోన్న అకౌంట్ హోల్డర్లకు సిటీ బ్యాంకు కూడా అపరిమిత ఉచిత లావాదేవీలను అందిస్తోంది. ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు రూ.1 లక్ష కంటే ఎక్కువ బ్యాలెన్స్ కలిగి ఉన్న వారికి ఏ ఏటీఎంలోనైనా అపరిమిత ఉచిత ట్రాన్సాక్షన్ ఇవ్వనుంది. చదవండి: గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్! -
వచ్చే నెలనుంచి ఎస్బీఐ కొత్త నిబంధనలు అమలు
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎం, మనీ విత్ డ్రా నియమ నిబంధనల్ని మార్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త నిబంధనలు జులై నెల నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఎస్బీఐ వినియోగదారులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్ బీడీ) అకౌంట్లకు కొత్త ఛార్జీల అమలుతో పాటు ఏటీఎం విత్ డ్రాల్ ఛార్జీలు, చెక్బుక్లు ఆర్థికేతర టాన్సాక్షన్లపై ఈ కొత్త నిబంధనల్ని విధించనున్నారు. ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే ఏమిటి? ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే అదనపు ఛార్జీలు, మినిమం బ్యాలెన్స్ లేకుండా జీరో బ్యాలెన్స్ పై అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. పేదలకు అండగా నిలిచేలా ఎస్బీఐ ఈ అకౌంట్ ను అందుబాటులోకి తెచ్చింది. సంబంధిత వ్యక్తి కేవైసీ వివరాల సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అకౌంట్ తో పాటు ఏటీఎం కార్డ్ ను ఉచితంగా పొందవచ్చు. వీటిపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. బీఎస్ బీడీ అకౌంట్ హోల్డర్లు ప్రతి నెలా ఏటీఎంలు, బ్యాంక్ శాఖలతో సహా నాలుగుసార్లు ఉచితంగా నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. ఉచిత విత్ డ్రా పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి బ్యాంక్ రూ.15 ప్లస్ జీఎస్టీని విధిస్తుంది. అయితే ఈ బీఎస్ బీడీ అకౌంట్ హోల్డర్లకు ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ బుక్స్ ను బ్యాంక్ అందిస్తుంది. ఆ తరువాత నుంచి అందించే చెక్కులపై ఎస్బీఐ నిర్ధిష్ట మొత్తాన్ని వసూలు చేస్తుంది. 10 చెక్ బుక్ లకు బ్యాంక్ రూ .40 తో పాటు జీఎస్టీ వసూలు చేయనుంది. 25 చెక్ బుక్ లకు బ్యాంక్ రూ .75 తో పాటు జీఎస్టీ వసూలు చేయనుంది. 10 ఎమర్జెన్సీ చెక్ బుక్ లకు రూ.50తో పాటు జీఎస్టీ వసూలు చేయనుంది. సీనియర్ సిటిజన్లకు చెక్ బుక్ లకు సంబంధించి కొత్త స్వరీస్ ఛార్జీల నుండి మినహాయింపు ఉంటుంది. అకౌంట్ హోల్డర్ హోం బ్రాంచ్ లేదంటే ఇతర బ్రాంచ్ లలో ఆర్థికేతర లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు విధించరు. అంతేకాదు మనీ విత్ డ్రాల్ పరిమితిని పెంచుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ అధికారికంగా ప్రకటించింది. "ఈ మహమ్మారి కారణంగా వినియోగదారులకు అండగా నిలిచేందుకు మనీ విత్ డ్రాల్ ను పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ బీ ఐ ట్వీట్ లో పేర్కొంది. కాగా, ఇటీవల ఎస్ బీ ఐ చెక్ ద్వారా రోజుకు 1లక్ష నగదును డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సేవింగ్స్ బ్యాంక్ పాస్బుక్తో పాటు విత్ డ్రాల్ ఫాం ద్వారా ప్రతిరోజు రూ.25,000 వేలు డ్రా చేసుకోవచ్చు. చెక్ ద్వారా మనీ విత్ డ్రాల్ ను నెలకు రూ.50,000గా నిర్ణయించింది. చదవండి : ఎస్బీఐ ఖాతాదారులకు ఊరట -
ఎస్బీఐ : జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కస్టమర్లకు హెచ్చరిక. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు విధించే సేవా ఛార్జీలను సవరించింది. ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేయడం, చెక్బుక్, ఇతర ఆర్థిక లావాదేవీలకు జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని ఎస్బీఐ తన వెబ్సైట్లో పేర్కొంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఇందులో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇతర అకౌంట్లలో అయితే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం తప్పనిసరి. ఒకవేల మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ హోల్డర్లకు బేసిక్ రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు వస్తుంది. నెలలో నాలుగు సార్లు ఉచితంగా బ్యాంక్ బ్రాంచ్లో, ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. అంతకన్నా ఎక్కువసార్లు డ్రా చేస్తే సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీ రూ.15+జీఎస్టీ వర్తిస్తుంది. అంటే ఎస్బీఐ, నాన్ ఎస్బీఐ ఏటీఎంలల్లో, బ్రాంచ్లో కలిపి ఒక నెలలో నాలుగు సార్లు మాత్రమే డబ్బులు డ్రా చేసే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్స్ ఉచితంగా అందిస్తుంది. ఆ తర్వాత మరో 10 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.40+జీఎస్టీ, 25 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.75+జీఎస్టీ చెల్లించాలి. 10 చెక్స్తో ఎమర్జెన్సీ చెక్ బుక్ కావాలంటే రూ.50+జీఎస్టీ చెల్లించాలి. సీనియర్ సిటజన్లకు చెక్ బుక్పై కొత్త సర్వీస్ ఛార్జీ వర్తించదు. ఇక ఎస్బీఐ, నాన్ ఎస్బీఐ బ్రాంచ్లల్లో ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులు జరిపే నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించరు. చదవండి: ఐఎఫ్ఎస్సీ కోడ్లను అప్డేట్ చేసుకోండి -
కొడితే కుంభస్థలాన్నే కొట్టాలని.. చివరికి జైలు పాలయ్యారు
హైదరాబాద్: ఇటీవల నగరంలో కూకట్ పల్లి ఏటీఏం సెంటర్ వద్ద కాల్పులు జరిపిన ఏ1, ఏ2 నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సైబరాబాద్ సీపీ వారిని మీడియా ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ‘‘ పొట్టకూటి కోసం బీహార్కు చెందిన ఏ1 నిందితుడు అజిత్ కుమార్, ఏ2 నిందితుడు ముఖేష్ కుమార్లు 2011లో నగరానికి వచ్చారు. నగరంలోని దుండిగల్ ప్రాంతంలో ప్యాకేజీ అండ్ ఇండస్ట్రీలో కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలు పని చేసిన వీళ్లిద్దరు జల్సాలకు అలవాటు పడ్డారు. తొలిసారి ఏ1 నిందితుడు అజిత్ కుమార్ దుండిగల్లోని ఓ ఏటీఎంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తూ జైలు పాలయ్యాడు. విడుదల అనంతరం నేరాల్ని తన వృత్తిగా ఎంచుకున్నాడు. అడ్డదార్లలో డబ్బులు సంపాదించి జల్సాలు చేసేవాడు. దొంగతనాలు చేస్తూ పోలీసుల కన్నుగప్పి తప్పించుకునేవాడు. చిన్నాచితకా దొంగతనాలు చేయగా వచ్చే డబ్బులు సరిపోవడం లేదని ఈ సారి ఏకంగా ఏటీఎంలలో డబ్బులు నింపే వాహనాల్ని టార్గెట్ చేశాడు. అందుకు ముఖేష్ కుమార్ సపోర్ట్ తీసుకున్నాడు. బీహార్ నుంచి ముఖేష్తో నాటు తుపాకి తెప్పించుకుని ఏప్రిల్ 29న కూకట్ పల్లి ఏటీఎం చోరీకి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఏప్రిల్ 29న కూకట్ పల్లి ఏటీఎం సెంటర్ చోరీకి పాల్పడ్డారు నిందితులు. ఏటీఎం నుంచి డబ్బుల్ని దొంగిలించేందుకు ఏటీఎం సెంటర్లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ అలీ బేగ్పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో ఏటీఎం డోర్లపై థంబ్ ప్రింట్స్ ఆధారంగా పాతనేరస్తులపై కన్నేశారు. అయితే కూకట్ పల్లి ఏటీఎం దొంగతనంలో పాల్గొన్న నిందితుల చేతిగుర్తులు.. గతంలో దొంగతనాలకు పాల్పడ్డ నిందితుల చేతి గుర్తులు ఒకేలా ఉండడంతో అజిత్ కుమార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో నిందితులు గుండపోచంపల్లి ప్రాంతానికి చెందిన ఓ గదిలో తలదాచుకున్నారన్న సమాచారంతో దాడులు చేసిన పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులు కలిసి సైబరాబాద్ లిమిట్స్లో ఐదు నేరాలు చేశారు. వారి వద్ద నుండి రూ. 6,31,000/- నగదు, ఒక పిస్తోల్, ఒక మ్యాగజైన్, పల్సర్ బైక్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. ఏటీఎం సెక్యూరిటీగా పెద్ద వయస్సు ఉన్నవారు విధులు నిర్వహించడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై ఆర్బీఐతో మాట్లాడుతున్నాం. సెక్యూరిటీల వద్ద యువకులు విధులు నిర్వహిస్తే ఇలాంటి దారుణాలు జరగవు’’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
వైరల్ వీడియో: శానిటైజర్ దొంగిలించిన వ్యక్తి
-
‘‘నీపై కోప్పడాలో.. జాలి పడాలో తెలీడం లేదు’’
దొంగతనం అనగానే బంగారం, డబ్బు, విలువైన వస్తువులను చోరీ చేయడం గుర్తుకు వస్తాయి. కానీ కొందరు కక్కుర్తి వ్యక్తులు చేసే చోరీలు చూస్తే వారిపై జాలి పడాలో లేక కోప్పడాలో అర్థం కాదు. ఓ వ్యక్తి చేసిన దొంగతనం చూస్తే మీకు కూడా ఇలానే అనిపిస్తుంది. ఇంతకు ఆ వ్యక్తి చేసిన దొంగతనం ఏంటయ్యా అంటే.. ఏటీఎం సెంటర్లో ఉన్న శానిటైజర్ డబ్బాను తస్కరించాడు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది వాస్తవం. ఏటీఎంలో డబ్బులు తీయడానికి వెళ్లిన ఓ కస్టమర్.. అక్కడే ఉన్న శానిటైజర్ బాటిల్ను దొంగిలించాడు. కరోనా కట్టడిలో భాగంగా ప్రస్తుతం శానిటైజర్, మాస్క్ వినియోగం తప్పనిసరి అయ్యింది. ఈ క్రమంలో పలు దుకాణాలు, ఏటీఎం సెంటర్లు, ఆఫీసుల ముందర శానిటైజర్లను ఉంచుతున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి డబ్బులు తీసుకోవడం కోసం ఏటీఎం సెంటర్కి వెళ్లాడు. కాసేపు అక్కడే ఉన్న ఆ వ్యక్తి.. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం గమనించి వెంటనే శానిటైజర్ బాటిల్ను తన బ్యాగులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడే ఏటీఎం సెంటర్లోని సీసీ కెమెరాల్లో ఈ తతంగమంతా రికార్డవ్వడంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. సదరు వ్యక్తిని నెటిజనులు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. నీ కక్కుర్తి తగలడా.. ఓ ఇరవై రూపాయలు పెట్టి శానిటైజర్ కొనుక్కోలేవా అంటూ విమర్శిస్తున్నారు. చదవండి: పొగ వదలడం.. ఫుటేజీ ఎత్తుకెళ్లడం వీరి స్టైల్ -
కూకట్పల్లి ఏటీఎం: కాల్పులకు తెగబడ్డది ఆ ముఠానే!
సాక్షి, హైదరాబాద్: బిహార్ నుంచి వలస కూలీలుగా వచ్చారు.. ఇక్కడ దోపిడీ దొంగల అవతారం ఎత్తారు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని నేరబాట పట్టారు. ఏటీఎం వద్ద కాల్పులకు తెగబడి దోపిడీకి పాల్పడింది బిహార్ ముఠానేనని పోలీసులు గుర్తించారు. కూకట్పల్లి విజయ్నగర్ కాలనీలోని ఏటీ ఎం కేంద్రం వద్ద దుండగులు గురువారం ఓ సెక్యూరిటీ గార్డ్ను చంపి రూ.5 లక్షలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఇద్దరు నిందితుల్లో ఒకరిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు గురువారం అర్ధరాత్రి పట్టుకున్నారు. మరో నిందితుడు ఆయుధం, డబ్బు తో రైలులో పారిపోయినట్లు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. బిహార్కు చెందిన ఇద్దరు యువకులు జీడిమెట్ల–చందానగర్ మధ్య ప్రాంతంలో నివసిస్తూ కొద్దిరోజులు దినసరి కూలీలుగా పనిచేశారు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పూనుకున్నారు. గతంలోనూ నాటు తుపాకీతో బెదిరించి.. నిందితులు కొన్నాళ్ల క్రితం తమ స్వస్థలంలో ఓ నాటు పిస్టల్ ఖరీదు చేసుకుని వచ్చారు. జీడిమెట్ల అయోధ్యనగర్ చౌరస్తాలో ఉన్న లక్ష్మీ మనీ ట్రాన్స్ఫర్ సంస్థను టార్గెట్ చేశారు. గత నెల 16న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తన దుకాణం మూసేందుకు సిద్ధమైన యజమాని రవికుమార్ రూ.1.95 లక్షలను తన బ్యాగ్లో పెట్టుకున్నారు. అదే సమయంలో హెల్మెట్, మాస్క్ ధరించిన ఇద్దరు దుండ గులు ఆ దుకాణంలోకి ప్రవేశించి రవికుమార్కు తుపాకీ గురిపెట్టి, అరిస్తే చంపేస్తామంటూ బెదిరించారు. ఆయన వద్ద నగదు ఉన్న బ్యాగ్తోపాటు సెల్ఫోన్ తీసుకుని ఉడాయించారు. ఈ నేరం చేసిన తర్వాత నిందితులు కొన్ని రోజులు మిన్నకుండిపోయారు. ఏటీఎం కేంద్రాలు ధ్వంసం చేయలేమనే.. ఆపై కూకట్పల్లి ప్రాంతంలోని ఏటీఎం కేంద్రాలపై గురిపెట్టారు. వాటిని ధ్వంసం చేసి డబ్బు దోచుకోవడం సాధ్యం కాదని భావించి, డబ్బు నింపడానికి వచ్చే వాహనాన్ని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ వాహనాలు వచ్చే సమయాలు, రూట్లతోపాటు నేరం చేసిన తర్వాత పారిపోయేందుకు వీలున్న ప్రాంతాలను రెక్కీ ద్వారా విజయ్నగర్ కాలనీ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. జీడిమెట్లలో నేరం చేయడానికి తమకు పరిచయస్తుడైన వ్యక్తి నుంచి యాక్టివా వాహనం తీసుకున్నారు. కానీ, విజయ్నగర్కాలనీలో నేరం కోసం మాత్రం బైక్ ఉండాలని భావించారు. బాలానగర్ జోన్ పరిధి నుంచి ఓ పల్సర్ వాహనాన్ని చోరీ చేసి దాని నంబర్ ప్లేట్ తీసేసి వినియోగించారు. విజయ్నగర్ కాలనీలో చోరీ చేసి కేపీహెచ్బీ వైపు పారిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. గ్లాస్డోర్పై వేలిముద్రల సహాయంతో... ఇద్దరిలో ఓ నిందితుడు వాహనాన్ని తీసుకుని లిం గంపల్లి వరకు వెళ్లాడు. అక్కడే ద్విచక్ర వాహనాన్ని వదిలేసి డబ్బు, తుపాకీతో రైలులో మహారాష్ట్రకు పారిపోయాడు. ఏటీఎం కేంద్రంలోని గ్లాస్ డోర్పై నిందితుల వేలిముద్రలు దొరికాయి. ఇవి దుండిగల్లో సేకరించిన వేలిముద్రలతో సరిపోలాయి. అలా అనుమానితులను గుర్తించి సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లిన పోలీసులు బాలానగర్లోని ఒక నిందితుడిని గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఇతడిని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ముఠాలో మరికొందరు ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన నేరంలో వీరి పాత్రపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు పాల్గొన్నారని, ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన కస్టోడియన్ శ్రీనివాస్ను చికిత్స అనంతరం వైద్యులు శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. ఈ కేసు దర్యాప్తును నేరుగా కమిషనర్ వీసీ సజ్జనార్ పర్యవేక్షిస్తున్నారు. చదవండి: ఈటల కథ క్లైమాక్స్కు.. ఏం జరగబోతోంది..? హైదరాబాద్: ఆడపిల్ల పుట్టిందని ఆటోలో వదిలేశారా? -
హైదరాబాద్: కూకట్పల్లిలో కాల్పుల కలకలం
-
కూకట్పల్లిలో కాల్పుల కలకలం..చంపేసి.. దోచేశారు
సాక్షి, హైదరాబాద్/భాగ్యనగర్కాలనీ: అది కూకట్ పల్లిలోని విజయ్నగర్ కాలనీ... గురువారం మిట్ట మధ్యాహ్నం... అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఏటీ ఎం మిషన్లలో నగదు నింపే రైటర్ సేఫ్ గార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉద్యోగులు టార్గె ట్గా ఈ ఫైరింగ్ జరిగింది. ఈ కాల్పుల్లో ఓ సెక్యూరిటీగార్డు అక్కడికక్కడే చనిపోగా.. మరో కస్టోడియన్కు తీవ్ర గాయాల య్యాయి. రూ.11 లక్షలు దోచుకోవడానికి ప్రయత్నించిన దుండగుల చేతికి రూ.5 లక్షలు చిక్కాయి. నిందితులు రెక్కీ చేసిన తర్వాతే ద్విచక్ర వాహనంపై వచ్చి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అను మానిస్తున్నారు. రైటర్ సేఫ్గార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది. హైదరా బాద్లో ఆయా ఏటీఎం కేంద్రాలు ఉన్న మార్గాలను రూట్లుగా విభజించి రోజూ కస్టోడియన్లతో డబ్బు పంపిస్తుంది. ప్రతి వ్యాన్కు ఇద్దరు కస్టోడియన్లు, ఓ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. వీటిలో ఓ బృందం రోజూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన ఏటీఎం మిషన్లలో నగదు నింపుతూ ఉంటుంది. ఆ సంస్థకు చెందిన వ్యాన్(ఏపీ36వై9150)లో డ్రైవర్ కృష్ణ, పటాన్చెరుకు చెందిన కస్టోడి యన్లు చింతల శ్రీనివాస్(33), ఎ.నవీన్ లతోపాటు సెక్యూరిటీగా విధులు నిర్వర్తి స్తున్న బోరబండ వాసి అయిన సీఆర్ పీఎఫ్ మాజీ కానిస్టేబుల్ మీర్జా సుభాన్ అలీ బేగ్ (74) నగదుతో బయలుదేరారు. ఆ సమయంలో సదరు వ్యాన్లో మొత్తం రూ.2.7 కోట్లు ఉన్నాయి. బేగంపేట నుంచి బయలుదేరిన ఈ టీమ్ కూకట్పల్లిలోని ఏటీఎం మిషన్లలో రూ.12 లక్షలు నింపింది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో కూకట్పల్లిలోని విజయ్నగర్కాలనీకి చేరుకుంది. అక్కడ ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎంలో రూ.11 లక్షలు నింపేందుకు వచ్చారు. డ్రైవర్ కృష్ణ వాహనంలోనే ఉండగా, ఇద్దరు కస్టోడియన్లు, సెక్యూరిటీ గార్డు నగదు తీసుకుని ఏటీఎం కేంద్రం వద్దకు వెళ్లారు. మిగిలిన మొత్తం వ్యాన్లోనే ఉంది. సెక్యూరిటీ గార్డు అలీబేగ్ తన తుపాకీతో బయటే వేచి ఉండగా, మిగిలిన ఇద్దరూ లోపలకు వెళ్లి నగదు నింపడానికి ఉపక్రమించారు. ఆ సమయంలో ఇద్దరు యువకులు నల్ల రంగు పల్సర్ వాహనంపై జగద్గిరిగుట్ట వైపు నుంచి దూసుకువచ్చారు. వీరి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని, వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించాడని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఏటీఎం కేంద్రం వద్ద ద్విచక్ర వాహనం ఆగడంతోనే వెనుక కూర్చున్న వ్యక్తి కిందికి దిగి మీర్జాపై నాటు పిస్టల్తో ఓ రౌండ్ కాల్పులు జరిపాడు. తూటా ఎడమ వైపు గుండె కింది భాగంలో కడుపులోకి దూసుకుపోవడంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలి చనిపోయారు. లోపలకు వెళ్లిన దుండగులు మరో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. వీటిలో ఒక తూటా శ్రీనివాస్ మోకాలులోంచి దూసుకుపోగా, మరోటి అక్కడే ఉన్న అద్దానికి తగిలింది. అదే సమయంలో అక్కడ ఉన్న రూ.5 లక్షలను చేజిక్కించుకున్న ఇరువురూ క్షణాల్లో ఉడాయించారు. వీరిని పట్టుకునేందుకు నవీన్, కృష్ణ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. స్థానికులు అప్రమత్తమై దుండగులపై రాళ్లు విసిరినా తప్పించుకుని కేపీహెచ్బీ కాలనీ వైపు పారిపోయారు. వారి తుపాకీకి సంబంధించిన మ్యాగజీన్ అక్కడే పడిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రెండు తూటాలకు సంబంధించిన ఖాళీ క్యాట్రిడ్జ్లు, నిందితులు వదిలి వెళ్లిన హెల్మెట్ను స్వాధీనం చేసుకున్నారు. మూడో తూటాకు సంబంధించినది అక్కడ లభించలేదు. పక్క ప్లాన్ ప్రకారమే... క్లూస్ టీమ్, డాగ్స్క్వాడ్లు ఘటనాస్థలానికి చేరుకొని, నిందితులకు చెందినవిగా అనుమానిస్తున్న వేలిముద్రలను సేకరించాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీని పరిశీలించి అనుమానితుల ఫొటోలు సేకరించారు. ఘటనాస్థలాన్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. ఈ నిందితులు గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నామన్నారు. ఈ వాహనం కదలికలపై రెక్కీ చేసిన తర్వాతే, గురువారం దాన్ని వెంబడిస్తూ వచ్చి దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బేగంపేట నుంచి ఘటనాస్థలి వరకు ఉన్న సీసీ కెమెరాల్లో గత 15 రోజులుగా రికార్డు అయిన ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని ఫోన్ లొకేషన్స్ను సాంకేతికంగా ఆరా తీస్తున్నారు. బీహార్ లేదా రాజస్థాన్ ముఠాలపై అనుమానం... ఇది బీహార్ లేదా రాజస్థాన్కు చెందిన ముఠా పని అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. వీరిద్దరితోపాటు ఈ ముఠాకు చెందినవారు మరికొందరు ఉండి ఉంటారని, నేరం చేసిన తర్వాత వాళ్లు పరారై ఉంటారని భావిస్తున్నారు. కేపీహెచ్బీ కాలనీ వైపు వెళ్లిన దుండగులు మళ్లీ కూకట్పల్లి ప్రధాన రహదారి ఎక్కలేదని అధికారులు అనుమానిస్తున్నారు. వివిధ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను పరిశీలించినా వారి కదలికలు కనిపించపోవడం గమనార్హం. అయితే దుండగులు తమ వాహనం వదిలేసిగానీ, దుస్తులు మార్చుకుని గానీ ఉంటారనే అంశాన్నీ కొట్టి పారేయలేమని చెప్తూ ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల నుంచి సేకరించిన అనుమానితుల ఫొటోలను బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ పోలీసులకు పంపారు. రంగంలోకి దిగిన పది ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. చికిత్స పొందుతున్న శ్రీనివాస్ పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారు. చదవండి: ఆల్కహాల్ తీసుకుంటే కరోనా రాదా.. నిజమెంత? వాడిని చంపేయండి.. వదలొద్దు! -
ఏటీఎం: కార్డు లేకుండానే నగదు విత్ డ్రా
గతంలో బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేయాలంటే సదురు బ్యాంకు శాఖకు వెళ్లి నగదును తీసుకునేవాళ్లం. ఇక ఏటీఎం మిషన్ వచ్చాక బ్యాంకుకు వెళ్లకుండానే కార్డులు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నాం. ప్రస్తుతం అభివృద్ధి చెందిన టెక్నాలజీ వల్ల త్వరలో ఏటీఎం కార్డు అవసరం లేకుండానే గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్ ద్వారా ఏటీఎం కేంద్రాలలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు కావాల్సిన మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీని మీరు ఉపయోగించడానికి ఇంకెంతో సమయం ఆగాల్సిన అవసరం లేదు. ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్స్(ఎటిఎం) తయారుచేసే ఎన్సీఆర్ కార్పొరేషన్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యుపీఐ) ప్లాట్ఫాంతో కలిసి మొట్టమొదటి సారిగా ఇంటర్పెరబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్ డ్రా(ఐసిసిడబ్ల్యు) సౌకర్యాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొనిరావడానికి సిటీ యూనియన్ బ్యాంక్, ఎన్సీఆర్తో చేతులు కలిపింది. క్యూఆర్ కోడ్ ఆధారిత ఇంటర్పెరబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్ డ్రా సదుపాయాన్ని బ్యాంక్ ఇప్పటికే 1,500 ఏటీఎంలను అప్గ్రేడ్ చేసింది. ఈ ఏటీఎంలలో ఎటువంటి కార్డు అవసరం లేకుండానే స్కాన్ చేసి క్షణాల్లో డబ్బులు డ్రా చేయొచ్చు. "మొబైల్ ఫోన్లో ఉన్న యుపీఐ యాప్ ద్వారా ఎటిఎమ్ లో ఉన్న క్యూఆర్ కోడ్ క్యాష్ విత్ డ్రా చేయవచ్చు, దీని కోసం ఎటువంటి కార్డులు అవసరం లేదు" అని ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & ఎన్సీఆర్ కార్పొరేషన్లో సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతీయ ఉపాధ్యక్షుడు నవ్రోజ్ దస్తూర్ పీటీఐకి చెప్పారు. ఎలా పని చేస్తుంది ఈ కొత్త సదుపాయంతో వినియోగదారులు తమ మొబైల్ లోని యుపీఐ ఎనేబుల్ చేసిన బీమ్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్ ద్వారా నగదు డ్రా చేసుకోవచ్చు. దీనికోసం ఎటువంటి కార్డ్స్ కూడా అవసరం లేదు. మొదట ఏటీఎం స్క్రీన్ పై కనిపించే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఎంతమొత్తం డ్రా చేయాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పిన్ ఎంటర్ చేయాలి. అంతే యూపీఐ యాప్లో ప్రాసెస్ పూర్తి కాగానే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా అవుతాయి. ప్రస్తుతం, పరీక్ష దశలో ఉంది కాబట్టి రూ.5వేలకు డ్రా మించి విత్ డ్రా చేయలేరు. ఇది సురక్షితమేనా? భద్రతా విషయంలో ఇది ఇంకా అత్యంత సురక్షితమైనది. ఎందుకంటే కార్డు అవసరం లేదు కాబట్టి కార్డుతో జరిగే మోసాలు అరికట్టవచ్చు. ఇక ఈ లావాదేవీ డైనమిక్ క్యూఆర్ కోడ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రతి లావాదేవీ సమయంలో క్యూఆర్ కోడ్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఈ డైనమిక్ క్యూఆర్ కోడ్ ఆధారిత ఇంటర్పెరబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్ డ్రా సేవలను అన్ని బ్యాంకుల యూజర్లకు అందుబాటులోకి తీసుకోని రావడానికి ఎన్సీఆర్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు నవ్రోజ్ దస్తూర్ తెలిపారు. చదవండి: రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ డీల్ గడువు పొడగింపు రైల్వే ప్రయాణికులకు తీపికబురు -
జాతీయ రహదారుల వెంట ప్రపంచ స్థాయి సౌకర్యాలు!
న్యూఢిల్లీ: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) ప్రయాణీకుల సౌకర్యం కోసం దేశంలోని జాతీయ రహదారుల వెంట ఆధునిక వసతులను కల్పించనుంది. వచ్చే ఐదేళ్లలో 22 రాష్ట్రాల్లో హైవే మార్గాలలో 600కు పైగా ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను అభివృద్ధి చేయనుంది. వీటిలో 130 ప్రాంతాల్లో 2021-22లో అభివృద్ధి చేయాలని లక్ష్యించినట్లు. ఇప్పటికే 120 ప్రాంతాల్లో సౌకర్యాల అభివృద్ధికి బిడ్లను ఆహ్వానించినట్లు ఎన్హెచ్ఏఐ తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఎన్హెచ్లు, భవిష్యత్తులో రాబోయే రహదారులు, ఎక్స్ప్రెస్వే మార్గాలలో ప్రతి 30-50 కి.మీ.లకు ఈ సౌకర్యాలుంటాయని పేర్కొంది. పెట్రోల్ బంక్లు, ఎలక్ట్రిక్ చార్జీంగ్ సదుపాయాలు, ఫుడ్ కోర్ట్లు, రిటైల్ షాపులు, బ్యాంక్ ఏటీఎంలు, మరుగుదొడ్లు, పిల్లల ఆట స్థలాలు, క్లినిక్లు, స్థానిక హస్తకళల కోసం విలేజ్ హట్లు, ట్రక్ మరియు ట్రెయిలర్ పార్కింగ్, ఆటో వర్క్షాప్స్, దాబా, ట్రక్కర్ వసతి గృహాలు వంటి సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా ఎన్హెచ్ఏకు ఉన్న 3 వేల హెక్టార్ల స్థలంలో ఆయా వసతులను అభివృద్ధి చేస్తుంది. దీంతో ఆయా మార్గాలలో పెట్టుబడిదారులు, డెవలపర్లు, ఆపరేటర్లు, రిటైలర్లకు భారీ అవకాశాలు వస్తాయని, అలాగే స్థానిక ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొంది. ప్రస్తుతం ఎన్హెచ్ఏఐ రహదారుల అభివృద్ధి, కార్యకలాపాల కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో రాబోయే కొత్తగా నిర్మించే/విస్తరించే జాతీయ రహదారి ప్రాజెక్ట్ల వెంట ఆధునిక వసతులు, లాజిస్టిక్ పార్క్లు తప్పనిసరిగా ఉంటాయని తెలిపింది. స్థలాల గుర్తింపు, ఆదాయ ప్రణాళికలు, స్థానిక అనుకూలతలు, సౌకర్యాల డిజైన్ రూపకల్పన వంటి అంశాలపై ఎన్హెచ్ఏఐ నిమగ్నమైంది. చదవండి: సూయజ్కు అడ్డంగా నౌక.. గంటకు రూ.3వేల కోట్ల నష్టం -
రైతు దగ్గర రూ.82 వేలు కొట్టేసిన ఏటీఎం దొంగ!
ఖమ్మం: అవసర నిమిత్తం నగదు డ్రా చేసుకునేందుకు ఏటీఎం సెంటర్ కు వచ్చిన రైతు దగ్గర నుంచి మోసం 82 వేల రూపాయిలు డ్రా చేసుకున్నా కేటుగాడుని ఖమ్మం త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. రైతుకు డబ్బులు డ్రా చేయడం తెలవక పోవడంతో వెనుక ఉన్న వ్యక్తి నేను తిసిస్తాను అని చెప్పడంతో నమ్మి తన ఏటీఎం కార్డు ఇచ్చినట్లు రైతు పేర్కొన్నారు. ఎంతో తెలివిగా ఏటీఎం కార్డు మార్చి 82వేల రూపాయలను కేటుగాడు డ్రా చేసుకున్నాడు. అయితే, బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఏటీఎం సెంటర్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకొని దొంగను పట్టుకున్నారు. పూర్తీ వివరాల్లోకి వెళ్లితే.. మహబూబాబాద్ జిల్లా పెరుమాళ్ళ సంకీస గ్రామానికి చెందిన బోబ్బ వెంకటరెడ్డి అనే రైతు పురుగు మందులు కొనుగోలు చేసేందుకు ఇటీవల ఖమ్మంకు వచ్చాడు. తన అవసరాల కోసం నగదు డ్రా చేసుకునేందుకు నగరంలోని గాంధీచౌక్ ఎస్బీఐ ఏటీఎం సెంటర్ వచ్చాడు. అక్కడ ఉన్న ఏటీఎంలో డబ్బు డ్రా చేస్తున్న క్రమంలో డబ్బులు రాక పోవడంతో వెనుకనే ఉన్న గుర్తు తెలియని వ్యక్తి నేను ట్రై చేస్తానని చెప్పి డబ్బులు రావడం లేదని చెప్పి తన కార్డ్ కు బదులు వేరే ఏటీఎం కార్డ్ ఇచ్చి మోసం చేసి తన ఖాతా నుండి 82 వేల రూపాయిలు డ్రా చేసుకున్నట్లు బాధితుడు ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఏటీఎం సెంటర్ సిసి ఫుటేజ్, మోసం చేసి రైతుకు ఇచ్చిన ఏటీఎం కార్డ్ చిరునామా ప్రకారం పోలీసలు విచారణ చేపట్టారు. సిసి ఫుటేజ్ విజువల్స్ అనుమానం గల వ్యక్తి(కొండబోయిన నరసింహారావు) ఆదివారం అనుమానాస్పదంగా గాంధీచౌక్ పరిసరాలలో తిరుగుతుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు చేసిన నేరం ఒప్ప్పుకున్నాడు. ఈ నేరంతో పాటు ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మూడు నేరాలు, ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, ఇల్లందులో రెండు నేరాలు చేసినట్లు నిందితుడు అంగీకరించారు. అతనిని అరెస్టు చేసే సమయంలో అతని వద్ద ఉన్న 36,000/- రూపాయల నగదు, పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీన పర్చుకోని రిమాండ్ కు పంపారు. ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేసుకునే సమయంలో ఖాతాదారులు జాగ్రత్త లు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. డబ్బులు డ్రా చేయడం తెలియకపోతే ఇంట్లొ సంబంధించిన వ్యక్తులను వెంట తీసుకొని ఏటీఎం సెంటర్ కి వెళ్లాలే తప్పితే గుర్తుతెలియని వ్యక్తుల సహకారం తీసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చదవండి: మార్చి నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవు -
దిల్సుఖ్నగర్ ఏటీఎం లూటీ, మేనేజర్కు జైలు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: కెనరా బ్యాంక్ డబ్బులను స్వాహ చేసిన మేనేజర్కు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ ఆరో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బుధవారం తీర్పునిచ్చింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహాలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం... కెనరా బ్యాంక్ దిల్సుఖ్నగర్ బ్రాంచ్లో మేనేజర్గా వి.భాస్కర్రావు 2007 మార్చి–1 నుంచి మే–31 వరకు పని చేశారు. అదే బ్యాంక్లో ఏటీఎం నిర్వహిస్తున్నారు. సదరు ఏటీఎం సైతం మేనేజర్ భాస్కర్రావు ఆధీనంలో ఉండేది. అప్పుడు ఏటీఎంలో మూడు నెలలుగా రూ.10,34,500 నగదు తక్కువగా చూపించింది. విషయాన్ని గమనించిన బ్యాంక్ ఉన్నతాధికారులు డిపార్టుమెంటల్ ఎంక్వైరీతో పాటు సరూర్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్రాంచ్ మేనేజర్ భాస్కర్రావు నిధులు నిర్వర్తించే సమయంలో మోసపూరితంగా డబ్బులు స్వాహా చేశారని తేలడంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కోర్టులో అభియోగ పత్రాలను నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన మెజిస్ట్రేట్ పై విధంగా తీర్పునిచ్చారు. -
ఏటీఎంలు ఎక్కడెక్కువో మీకు తెలుసా?
ఈ మధ్య మన దగ్గర ఏటీఎంల దొంగతనాలు ఎక్కువయ్యాయి కదా.. అసలు ఏటీఎం అంటే గుర్తుకొచ్చింది.. ఈ ప్రపంచానికే ఏటీఎం రాజధాని ఏమిటో మీకు తెలుసా? దక్షిణ కొరియా.. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం.. అక్కడ ప్రతి లక్ష మందికి 267 ఏటీఎంలు ఉన్నాయి. తర్వాతి స్థానంలో కెనడా ఉంది.. అమెరికాది నాలుగో స్థానం.. ఇంతకీ మన పరిస్థితి ఏంటనేగా మీ డౌటు.. ఇక్కడ ప్రతి లక్ష మందికి 21 ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి. చెప్పుకోవాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. క్యాష్లెస్ పేమెంట్స్ విషయంలోనూ దక్షిణ కొరియావాళ్లే ముందున్నారు.. వాళ్లు నగదు లావాదేవీలకు పెద్దగా మొగ్గు చూపడం లేదని ఇటీవల జరిపిన ఓ సర్వే తేల్చింది.. అదే సమయంలో అక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఏటీఎంలు ఉండటం విశేషం.. -
పొగ వదలడం.. ఫుటేజీ ఎత్తుకెళ్లడం వీరి స్టైల్
సాక్షి, హైదరాబాద్: మొన్న ఆదిలాబాద్ నగరంలో జరిగిన ఎస్బీఐ ఏటీఎం చోరీ కలకలం రేపింది. దొంగలు దర్జాగా ఏటీఎం సెంటర్లో జొరబడి ఏటీఎం యంత్రానికి తాడు కట్టి లాక్కెళ్లారు. రూ.7.5 లక్షలు ఎత్తుకెళ్లడంతో 3 బృందాలు ఈ దొంగల కోసం గాలిస్తున్నాయి. ఈ విషయం మరువక ముందే నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిపర్తిలో ఓ ఏటీఎంను చోరీ చేసేందుకు విఫలయత్నం చేశారు. ఇదే సమయంలో దగ్గర్లోని వెలిమినేడు గ్రామంలో ని ఏటీఎంను కొల్లగొట్టి రూ.7.12 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ రెండు చోరీలు చేసిన విధానం ఒకేలా ఉంది. ఇది హరియాణా రాష్ట్రానికి చెందిన మేవాట్ జిల్లాలోని ముఠాల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. జాతీయ రహదారులే అడ్డా.. మేవాట్లో కొన్ని మారుమూల ప్రాంతాల ప్రజలు నేటికీ చోరీలే వృత్తిగా జీవిస్తున్నారు. దేశంలోని అనేక ఏటీఎం చోరీల్లో వీరు నిందితులు. హరియాణా నుంచి తెలంగాణకు వచ్చే లారీల్లో వీరూ వస్తారు. రహస్యంగా గ్యాస్ కట్టర్లు, ఏటీఎంలు తెరిచేందుకు కావాల్సిన టూల్కిట్లను తెచ్చుకుంటారు. హైవేల పక్కన ఉన్న దాబాలే వీరికి ఆశ్రయం. అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. చూసేందుకు లారీ డ్రైవర్, క్లీనర్లలా కనిపించడంతో ఎవరికీ అనుమానం రాదు. అక్కడికి సమీపంలోని కాపలాలేని పాతతరం ఏటీఎంలు, జువెల్లరీ షాపుల వద్ద రెక్కీ నిర్వహిస్తారు. రాత్రి ఒంటి గంట సమయంలో చోరీకి పాల్పడతారు. దీని కోసం చోరీ చేసిన వాహనాలనే వినియోగిస్తారు. ఏటీఎంలను ఎత్తుకెళ్లి, శివారు ప్రాంతా ల్లో గ్యాస్ కట్టర్లు, టూల్ కిట్ల సాయంతో వాటిని తొలచి డబ్బు తీసుకుంటారు. ఏటీఎం లోపలి భాగాల అమరికపై వీరికి అవగాహన ఉండటంతో క్షణాల్లో ఈ పనిపూర్తి చేస్తారు. చోరీ చేసిన వాహనాలతోనే రాష్ట్రం దాటుతారు. తరువాత జాతీయ రహదారి వెంట దొరికిన లారీల్లో చెక్కేస్తారు. దాబాల్లో బస నుంచి చోరీ చేసి తిరిగి వెళ్లేవరకూ రాష్ట్రానికి అధికారికంగా వచ్చినట్లు ఎక్కడా చిన్న క్లూ కూడా దొరక్కుండా జాగ్రత్తపడతారు. పాత ఏటీఎంలు, రసాయనాలు... ఆదిలాబాద్లోని ఎస్బీఐ, చిట్యాలలోని ఇండి క్యాష్ ఏటీఎంలు రెండూ పాత తరహావే. వీటిలో అలారం వ్యవస్థ ఉండదు. కొత్త ఏటీఎంలలో దాన్ని కొట్టినా, తట్టినా వెంటనే సమీపంలోని పోలీసులకు, కాల్సెంటర్లకు సందేశాలు వెళతాయి. ఈ భయంతో వారు ఆధునిక ఏటీఎంల జోలికి వెళ్లరు. ఊరికి దూరంగా, కాపలాలేని పాత తరం ఏటీఎంల ను చోరీకి ఎంచుకుంటారు. ఉదయం పూట రెక్కీకి వచ్చినపుడు సీసీ కెమెరాలకు నల్ల రంగు పూస్తారు. డబ్బు తీసుకుంటున్నట్లు నటించి ఏటీఎంలు సులువుగా ఊడివచ్చేలా అడుగుభాగాన కొన్ని రసాయనాలు పూస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అది లిక్విడ్ నైట్రోజన్ అయి ఉండొచ్చని సందేహిస్తున్నారు. లిక్విడ్ నైట్రోజన్తో భారీ ఇనుపకడ్డీలనైనా సులువుగా విరగ్గొట్టేయవచ్చు. ఇదే సమయంలో కొన్ని రకాల స్ప్రేలూ వాడుతున్నారు. వాటిని చల్లగానే ఏటీఎం కేంద్రమంతా క్షణాల్లో పొగలు వ్యాపిస్తున్నాయి. ఈ విషయంపై క్లూస్టీం, ఫోరెన్సిక్ బృందాలు అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. లారీల్లో వచ్చి విమానాల్లో ఉడాయిస్తారు.. ఈ తరహా నేరాలు గతంలో హైదరాబాద్లోనూ జరిగాయి. వనస్థలిపురం, హయత్నగర్లోనూ ఏటీఎంలు కొల్లగొట్టిన ఘటనలో రాచకొండ పోలీసులు ఆ పని చే సింది హరియాణాకు చెందిన మేవాట్ ము ఠాలుగా గుర్తించారు. వీరు చాలా తెలివైన దొంగలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. ‘సీసీ కెమెరాలకు చిక్కరు. ముసుగులు ధరించడం, కెమెరాలకు రంగు పూయడం, పొగ వదలడం, ఫుటేజీ ఎత్తుకెళ్లడం వీరి స్టైల్. చోరీ చేసిన వాహనాలతో రాష్ట్రం దాటుతారు. తర్వాత భోపాల్, నాగ్పూర్ చేరుకుంటారు. అక్కడ నుంచి లారీలు లేదా విమానాల్లో సొంతూళ్లకు చేరతారు. వీరిని అరెస్టు చేసి తీసుకురావడంలో రాష్ట్ర పోలీసులకు గతంలో చాలా సవాళ్లు ఎదురయ్యా యి. ఊళ్లకు ఊళ్లే దొంగతనాలు జీవనాధారంగా బతుకుతుంటారు కాబట్టి, దొంగల అరెస్టు సమయంలో స్థానికులతో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాలి’అని వివరించారు. -
మాస్టర్ కార్డు వినియోగదారులకు శుభవార్త!
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఏదైనా వస్తువును తాకాలంటే ఎక్కువ శాతం ప్రజలు భయపడుతున్నారు. దింతో నగదు చెల్లింపుల విషయంలో కూడా ప్రజలు డిజిటల్ చెల్లింపులు చెల్లిస్తున్నారు. ఇప్పుడు బ్యాంకులు కూడా ఎటిఎంలను తాకకుండానే నగదు ఉపసంహరణ చేసుకునేలా కొత్త విధానాన్ని తీసుకోని రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ విధానం ఇంకా అందరికి అందుబాటులోకి రాకున్నప్పటికీ పరీక్ష దశలో ఉంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ కార్డ్, ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్తో సహాయంతో పూర్తి కాంటాక్ట్లెస్ నగదు ఉపసంహరణను విధానాన్ని తీసుకోని రాబోతుంది. మాస్టర్ కార్డు దారులు బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ను ఉపయోగించి ఎటిఎం స్క్రీన్పై కనిపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బ్యాంక్ యాప్లో పిన్ను నమోదు చేయాలి. తర్వాత మీరు మొబైల్ లో ఎంటర్ చేసిన మొత్తాన్ని ఎటిఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఈ విధానం ఏటీఎంలలో మోసాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ మొదట బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ప్రారంభించింది. ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ తన నెట్వర్క్లోని అన్ని ఎటిఎంలకు దశలవారీగా ఈ 'కాంటాక్ట్లెస్' క్యూఆర్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. చదవండి: సంచలనాలు సృష్టిస్తున్న షియోమీ భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు -
ఏటీఎంలో చోరీకీ యత్నించిన విద్యార్థులు
సాక్షి, శంషాబాద్: పట్టణంలోని యాక్సిస్ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో దొంగతనం చేసేందుకు యత్నించిన ఇద్దరు మైనర్లను ఆర్జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఇంద్రానగర్ దొడ్డికి చెందిన 9వ తరగతి చదువుతున్న ఓ బాలుడు(14) చదువు మానేసీ ఖాళీగా ఉన్న మరో బాలుడు(16)తో కలిసి ఏటీఎం ధ్వంసం చేసి డబ్బులు కాజేయాలని పథకం వేశారు. ఇద్దరు కలిసి శనివారం అర్ధరాత్రి బస్టాండ్ సమీపంలో ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీంలోకి వెళ్లారు. ఏటీఎంకు సంబంధించిన కొన్ని వస్తువులను బయటికి తీసిన వెంటనే యాక్సిస్ బ్యాంకుకు సమాచారం అందింది. దీంతో వారు వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. గస్తీలో ఉన్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ఇద్దరి అదుపులోకి తీసుకున్నారు. చోరికి యత్నించిన కారణంగా వారిని జువైనల్ హోంకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. 200 కోట్లు- 2,000 ఉద్యోగాలు!
ముంబై, సాక్షి: ఏటీఎం నిర్వాహక కంపెనీ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ తాజాగా రూ. 1,300 కోట్ల పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. తొలి దశలో భాగంగా రూ. 180-200 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు వైస్చైర్మన్ రాజీవ్ కౌల్ వెల్లడించారు. తద్వారా రూ. 2,000 మందికి ఉపాధి లభించనున్నట్లు అంచనా వేశారు. నిధులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు తెలియజేశారు. పీఈ దిగ్గజం బేరింగ్కు ప్రధాన వాటా కలిగిన కంపెనీ ఏడేళ్ల కాలంలో రూ. 1,300 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. తద్వారా దేశీయంగా ఏటీఎంల నిర్వహణ, క్యాష్ మేనేజ్మెంట్ బిజినెస్లను భారీగా పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలియజేసింది. సీఎంఎస్ ఇన్ఫోలో.. బేరింగ్ పీఈ ఏషియాకు చెందిన సియాన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ 100 శాతం వాటాను కలిగి ఉంది. (మెడ్ప్లస్పై వార్బర్గ్ పింకస్ కన్ను!) కంపెనీ కొనుగోలు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ నుంచి 3,000 ఏటీఎంల నిర్వహణకు సీఎంఎస్ ఇన్ఫో కాంట్రాక్టును పొందింది. దీనిలో భాగంగా స్థల ఎంపిక, ఏటీఎంల ఏర్పాటు, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసులు, రోజువారీ నిర్వహణ చేపట్టవలసి ఉంటుంది. ఏడేళ్లపాటు అమల్లో ఉండే కాంట్రాక్టును మరో మూడేళ్లు పొడిగించుకునేందుకు వీలుంటుంది. ఈ ఏడాది మొదట్లో సెక్యూరిటీ మేనేజ్మెంట్ కంపెనీ లాజిక్యాష్ సొల్యూషన్స్ను సీఎంఎస్ ఇన్ఫో కొనుగోలు చేసింది. నిశా(ఎన్ఐఎస్ఏ) గ్రూప్ నుంచి సొంతం చేసుకున్న ఈ సంస్థ కారణంగా నిర్వహణలోని ఏటీఎంల సంఖ్య 62,000 నుంచి 72,000కు పెరిగినట్లు తెలుస్తోంది. (బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?) రోజుకి రూ. 5,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్కల్లా దేశీయంగా బ్యాంకింగ్ వ్యవస్థలో 1,13,981 ఆన్సైట్, 96,068 ఆఫ్సైట్ ఏటీఎంలున్నాయి. వీటికి అదనంగా బ్యాంకులు 3,27,620 మైక్రో ఏటీఎంలను సైతం కలిగి ఉన్నాయి. సీఎంఎస్ ఇన్ఫో సగటున రోజుకి రూ. 5,000 కోట్ల నగదును నిర్వహిస్తున్నట్లు చెబుతోంది. కాగా.. ఏటీఎంల నిర్వహణలో దేశీయంగా ఏజీఎస్ ట్రాన్సాక్ట్, ఎస్ఐఎస్, రైటర్స్ కార్ప్ తదితర సంస్థలు సర్వీసులు అందిస్తున్నాయి. -
జైల్లో ఏటీఎం.. ఎక్కడంటే..!
పట్నా: ఏటీఎంలు వచ్చాక బ్యాంకులకు వెళ్లే పని సగం తగ్గిపోయింది. లేదంటే బ్యాంకు టైమ్ లోపల వెళ్లి ఓచర్ రాసి డబ్బులు డ్రా చేయాలంటే ఓ రోజంతా పట్టేది. డబ్బులు అత్యవసరం ఉండి.. అదే రోజు బ్యాంకుకు సెలవు ఉంటే ఇక చెప్పలేం. ఈ కష్టాలన్నింటికి ఏటీఎంతో ఫుల్స్టాప్ పడింది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏటీఎం సేవలు అందుబాటులోకి వచ్చాయి. చేతిలో కార్డు ఉంటే చాలు.. నిమిషాల వ్యవధిలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే తాజాగా ఖైదీల కోసం జైల్లో కూడా ఏంటీఎం ఏర్పాటు చేయబోతున్నారు. బిహార్లోని పూర్నియా సెంట్రల్ జైలు అధికారులు ఖైదీల కోసం ఏటీఎం ఏర్పాటు చేయాలని భావించారు. ఖైదీలకు తమ అవసరాల నిమిత్తం డబ్బు కావాలంటే కుటుంబ సభ్యులు వచ్చి ఇవ్వాల్సిందే. దీని వల్ల గేటు దగ్గర ఎక్కువ మంది గుమిగుడుతున్నారు. దీన్ని నివారించడం కోసం ఏటీఎం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి: ఇలాంటివి కూడా చోరీ చేస్తారా..!) ఈ సందర్భంగా పూర్నియా సెంట్రల్ జైలు సూపరిండెంట్ మాట్లాడుతూ.. ‘జైలు ప్రాగణంలో ఏటీఎం ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ ఎస్బీఐకి లేఖ రాశాము. మరో రెండు వారాల్లో ఏటీఎం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నాం’ అన్నారు. ప్రస్తుతం జైలులో 750 మంది ఖైదీలు ఉన్నారని.. అందులో 600 వందల మందికి వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 400 మందికి సంబంధింత బ్యాంకుల నుంచి ఏటీఎం కార్డులు ఇప్పించాం. త్వరలోనే మిగతా వారికి కూడా అందిస్తాం అని తెలిపారు. ఇక జైలులో ఖైదీలు ప్రతి రోజు 4-8 గంటలు పని చేస్తుంటారు. ఇందుకు గాను వీరికి 52-103 రూపాయల వేతనం చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని ఖైదీల చేతికి ఇవ్వకుండా అకౌంట్లో జమ చేస్తారు. ఇక జైలులో లోపల కొన్ని చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఒకవేళ అవి అమల్లోకి వస్తే ఖైదీల వేతనం 112-156 రూపాయలకు పెరగనుంది. ఇక జైలులో ఖైదీలు తమ చేతిలో 500 రూపాయలు వరకు ఉంచుకోవచ్చు. (చదవండి: వామ్మో.. ఏటిఎం?) జనవరి 2019 వరకు, ఖైదీల వేతనాలను చెక్కుల ద్వారా చెల్లించేవారు. ప్రస్తుతం డబ్బును వారి ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. జైలు గేటు వద్ద ఏటీఎం ఏర్పాటు చేస్తే.. ఖైదీలకు డబ్బులు ఇవ్వడానికి వచ్చే వారిని సంఖ్యను చాలా వరకు తగ్గించవచ్చు. ఏటీఎం ఏర్పాటు చేయడం ద్వారా ఖైదీలు జైలులో పని చేసినందుకు లభించే వేతనం నుంచి తమకు అవసరమైన నూనె, సబ్బులు, పండ్లు, స్నాక్స్ వంటి రోజువారీ వినియోగ వస్తువులను కొనుగోలు చేయడానికి కార్డు ఉపయోగించి డబ్బు డ్రా చేసుకుంటారు అని అధికారులు తెలిపారు. -
వైరల్: జ్యూస్ షాప్గా మారిన ఏటీఎం
ముంబై: మహారాష్ట్రలోని అమరావతిలో ఒక జ్యూస్ షాప్ యజమాని చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆ యజమాని ఏటీఎంనే ఏకంగా జ్యూస్ షాప్గా మార్చేశాడు. సాధారణంగా ఏటీఎం లోపల ఒక వ్యక్తి ఉంటేనే మరో వ్యక్తిని లోనికి అనుమతించరు. అలాంటిది ఏటీఎం మిషన్ను ఒక మూలకు నెట్టి మరీ అతను లోపల కుర్చీలు వేసేశాడు. అంతేకాకుండా ఏటీఎంలో డబ్బలు విత్డ్రా చేసుకోవడానికి వచ్చిన వారిని కుర్చీలో కూర్చోండి అంటూ మర్యాదలు కూడా చేస్తున్నాడు. చాలా మంది అక్కడ కూర్చొని ఉండగానే కస్టమర్లు వారి ఏటీఎం లావాదేవీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని బట్టి ఏటీఎంలు ఎంత రిస్క్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మీ ఏటీఎం పిన్లను, ఓటీపీలను ఎవరికి తెలియనివ్వద్దు అంటూ బ్యాంకులు ప్రతిసారి మెసెజ్లు పంపుతూ హెచ్చరిస్తూనే ఉంటారు. అలాంటిది ఈ వ్యక్తి ఏటీఎంను జ్యూస్ షాప్గా మార్చడంతో కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే మరికొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు అంటూ మండిపడుతున్నారు. ఇది పూర్తిగా బ్యాంక్ ఏటీఎం నిబంధనలకు విరుద్ధం. ఏటీఎం రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి లోపల ఉంటే మరో వ్యక్తి అక్కడ ఉండటానికి వీలు లేదు. సాధారణంగా ప్రతి ఏటీఎం దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. అయితే ఈ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ ఎందుకు లేదో తెలియడం లేదు. అంతేకాకుండా బ్యాంకు అధికారులు ఎవరు కూడా దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఏటీఎంలో డబ్బులు పెట్టడానికి వచ్చినప్పుడు, అదేవిధంగా ఏదైనా సాంకేతిక లోపలు తలెత్తినప్పుడు అధికారులు అక్కడికి వచ్చే ఉంటారు. అప్పుడు కూడా వారు జ్యూస్ యజమానిని ఎందుకు హెచ్చరించలేదు? అసలు ఆ వ్యక్తిపై బ్యాంక్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈ వీడియో చూసిన వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండటంతో సదరు వ్యక్తిపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. వైరల్: జ్యూ స్ షాప్గా మారిపోయిన ఏటీఎం Autoplay ONOFF చదవండి: ఇటలీని షేక్ చేస్తున్న ప్రభాస్ మేనియా -
మూతపడుతున్న ఎటిఎమ్లు
-
ఏటీఎం షట్డౌన్..
సాక్షి, హైదరాబాద్: బ్యాంక్ ఏటీఎంలు ఒక్కొక్కటిగా షట్డౌన్ అవుతున్నాయి. ప్రజలు బ్యాంకింగ్ లావాదేవీల కోసం డిజిటల్ వైపు మళ్లుతుండటంతో వీటి అవసరం క్రమంగా తగ్గుతోంది. మరోవైపు కరోనా భయం వెంటాడుతుండటంతో ఆదరణ కూడా తగ్గింది. ఒకవైపు ఆన్లైన్ పేమెంట్లు, మరోవైపు కరోనా ప్రభావంతో ఏటీఎంల్లో నగదు ఉపసంహరణ తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఏటీఎంలను తగ్గించుకోవడంపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. క్రమంగా కస్టమర్లు డిజిటల్ మాధ్యమాల ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలకు అలవాటు పడటంతో వీటి అవసరం చాలా వరకు తగ్గుతోంది. దీంతో దినసరి 200 స్వైపింగ్ లేని ప్రాంతాలను గుర్తించి ఏటీఎంలను ఎత్తివేసేందుకు రంగం సిద్ధమవుతోంది. నగరంలో వివిధ బ్యాంకులకు సంబంధించి సుమారు 4 వేల ఏటీఎంలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులు సుమారు 20 శాతానికి పైగా ఏటీఎంలను మూసివేసినట్టు సమాచారం. నగదు రహిత లావాదేవీలు... ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ భయంతో నగదు రహిత లావాదేవీలు ఊపందుకున్నాయి. పాలు బిల్లు నుంచి ఇంటి అద్దె వరకు డిజిటల్ రూపంలో చెల్లిస్తుండటంతో పెద్దగా నగదు అవసరం లేకుండా పోయింది. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఏటీఎంలు బోసిపోతున్నాయి. కరోనా భయంతో ఏటీఎంలకు వెళ్లి నగదు డ్రా చేసేందుకు నగర వాసులు వెనుకాడుతున్నారు. ఇంటి గుమ్మం ముందే బ్యాంకు ఖతాలోని నగదును ఉపసంహరించుకునే వెసులుబాటు ఖాతాదారులకు ఉంది. ఇప్పటికే తపాలా శాఖ వివిధ బ్యాంకుల ఖాతాదారులకు ఇంటి ముంగిటకే నగదు సేవలు అందిస్తోంది. ఎస్బీఐ కూడా డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. (చదవండి: ఓటుందో.. లేదో.. చెక్ చేసుకోండి) -
ఏటీఎంలో 15 లక్షల నగదు చోరీ
సాక్షి, జడ్చర్ల: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ ఎస్బీఐ ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఏకంగా రూ. 15 లక్షల నగదును దుండగులు అపహరించారు. తెల్ల కారులో వచ్చిన ఇద్దరు దుండగులు ముఖాలకు మాస్కులు ధరించడంతోపాటు రుమాలును చుట్టుకుని ఏటీఎంలోకి ప్రవేశించారు. ఆ వెంటనే సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి, గ్యాస్ కట్టర్తో ఏటీఎం మిషన్ను కట్ చేశారు. ఏటీఎంలోని డబ్బును అపహరించి షట్టర్ను కిందికి దించి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం బ్యాంకు సిబ్బంది ఏటీఎం షట్టర్ మూసి ఉండటాన్ని గమనించి షట్టర్ను తెరవగా చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే బ్యాంకు మేనేజర్ దీపిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. -
ఎస్బీఐ కస్టమర్లకు మరో శుభవార్త
భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎంల నుంచి ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణకు సమయం పొడిగించినట్లు ప్రకటించింది. దీనిని వినియోగదారులు శుక్రవారం (సెప్టెంబర్ 18) నుంచి వినియోగించుకోవచ్చు. జనవరిలో నెల నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ సదుపాయం కేవలం ఉదయం8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు రోజంతా ఆ సదుపాయం అందుబాటులోకి తెస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. దీని ద్వారా 10,000 నగదు వరకు ఉపసంహరించుకోవచ్చు. ఏటీఎం వద్ద జరిగే మోసలను నివారించడం కోసం ఎస్బీఐ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా కస్టమర్కు ఓటీపీ వస్తేనే నగదును తీసుకోవచ్చు. వినియోగదారులు నగదు భద్రత కోసం ఎస్బీఐ తీసుకువచ్చిన గొప్ప సంస్కరణగా దీనిని పేర్కొనవచ్చు. నగదు ఉపసంహరణ ఓటీపీని వినియోగదారుడు బ్యాంకులో నమోదు చేసుకున్న కస్టమర్ మొబైల్ నంబర్కు పంపిస్తారు. దీంతో వినియోగదారుడి అనుమతి లేకుండా ఎవరు నగదు తీసుకునే అవకాశం లేకండా ఉంటుంది. అయితే ఈ సౌకర్యం కేవలం ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణకు మాత్రమే ఉపయోగపడుతుంది. లావాదేవీలకు ఇది వర్తించదు. ఇది కేవలం ఎస్బీఐ ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకునేందుకు మాత్రమే వీలవుతుంది. వేరే బ్యాంక్ ఏటీఎం నుంచి నగదు తీసుకోవడానికి ఉపయోగపడదు. కార్డ్ హోల్డర్ నగదు ఉపసంహరించుకోవాలనుకున్నప్పుడు ఎంత డబ్బు డ్రా చేయాలో ఎంటర్ చేసిన తరువాత, ఏటీఎం స్క్రీన్ ఓటీపీ విండోను చూపిస్తుంది. లావాదేవీని పూర్తి చేయడానికి కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. చదవండి: ఎస్బీఐ ఏటీఎంకు మొబైల్ తీసుకెళ్లండి! -
కస్టమర్ల భద్రత కోసం ఎస్బీఐ కొత్త ఫీచర్
న్యూఢిల్లీ : తమ ఖాతాదారుల భద్రత కోసం భారతీయ స్టేట్ బ్యాంక్ మరో ముందడుగు వేసింది. ఏటీఎమ్ మోసాలను అరికట్టేందుకు ఓ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఏటీఎమ్తో బ్యాలెన్స్ , మినీ స్టేట్మెంట్ ఎంక్వైరీ చేసిన ప్రతిసారి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓ మెసెజ్ పంపటం ద్వారా ఖాతాధారులను అలర్ట్ చేయనుంది. ఈ మెసేజ్ అలర్ట్ కారణంగా.. ఒకవేళ అనధికార లావాదేవీ జరుగుతున్నట్లయితే సదరు ఖాతాదారుడు వెంటనే స్పందించి తన ఏటీఎమ్ కార్డును బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ( ఐఆర్సీటీసీ ఎస్బీఐ రుపే కార్డ్ : ఆఫర్లు) ఈ కొత్త ఫీచర్కు సంబంధించిన వివరాలను ఎస్బీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో మంగళవారం వెల్లడించింది. బ్యాలన్స్, మినీ స్టేట్మెంట్ ఎంక్వైరీలకు సంబంధించిన ఎస్ఎమ్ఎస్ అలర్ట్లను నిర్లక్ష్యం చేయవద్దని ఎస్బీఐ పేర్కొంది. అనధికారిక లావాదేవీ జరుగుతున్నట్లయితే వెంటనే ఏటీఎమ్ను బ్లాక్ చేయాలని తెలిపింది. -
ఏటీఎం కార్డుతో దోచేశారు
ఏలూరు టౌన్ (పశ్చిమగోదావరి) : ఒక వ్యక్తి బ్యాంకు ఖాతాలో నగదు ఏటీఎం కార్డుతో స్మార్ట్గా దోచేశాడో అగంతకుడు. బ్యాంకు ఖాతాలోని డబ్బు ఏకంగా రూ.11.91 లక్షలు కాజేయటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమ సొమ్ము భారీగా మాయం అయ్యిందంటూ బాధితులు ఏలూరు త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి కుమారుడు గుమ్మళ్ళ రాజేష్ ఫిర్యాదు మేరకు త్రీటౌన్ సీఐ మూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు త్రీటౌన్ పరిధిలోని విద్యానగర్కు చెందిన గుమ్మళ్ళ రాజేష్ తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆయన ఇటీవల మృతిచెందటంతో ఆయనకు ప్రభుత్వ పరంగా రావాల్సిన సొమ్ములు వచ్చాయి. తండ్రి రాయితీ డబ్బులు తల్లి బ్యాంకు అక్కౌంట్లో జమ అయ్యాయి. ఈ సొమ్మును బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకునేందుకు ఈనెల 7న రాజేష్ తన తల్లిని తీసుకుని బ్యాంకుకు వెళ్లాడు. డబ్బులు తీసుకునేందుకు ప్రయతి్నంచగా అప్పటికే ఆమె ఖాతాలోని నగదు డ్రా చేసినట్లు ఉందని బ్యాంకు సిబ్బంది తెలిపారు. జూన్ నెల నుంచీ ఏటీఎం ద్వారా 28సార్లు నగదును ఎవరో డ్రా చేసినట్లు తెలిపారు. బాధితులు చేసేది లేక ఏలూరు త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏటీఎంల ఛార్జీల మోత
-
ఏటీఎంలో 5వేలు మాత్రమే విత్డ్రా..!
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల ఎదుర్కొనేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఏటీఎం ఛార్జీలను మరింత పెంచే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఏటీఎం ట్రాన్సక్షన్లో 5వేలు మాత్రమే విత్డ్రాకు అవకాశం ఇచ్చేలా నిర్ణయం తీసుకోనున్నట్లు సమచారం. ఒకవేళ ఇదే అమల్లోకి వస్తే అంతకు మించి విత్ డ్రా చేసుకుంటే అదనపు ఛార్జీలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఇటీవల ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ పలు కీలక సంస్కరణలను ప్రతిపాదించింది. పలు రకాల ఛార్జీలు పెంచుతూ కమిటీ నివేదికను రూపొందించింది. (వడ్డీమీద వడ్డీనా..?) ఏటీఎంలల్లో జరిపే అన్ని లావాదేవీలపై ఇంటర్ ఛేంజ్ ఛార్జీలను పెంచాలని సూచించినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలకు ఇది వర్తించేలా చేయాలని ఆర్బీఐని కోరింది. అలాగే 10 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో ఏటీఎం చార్జీలను 24శాతం పెంచాలని నివేదికలో పేర్కొంది. కమిటీ సమర్పించిన రిపోర్టును బ్యాంకు అత్యున్నత స్థాయి అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల్లో కమిటీ నివేదిక అమలుకే రిజర్వ్ బ్యాంక్ మొగ్గుచూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఏటీఎం యూజర్లపై మరింత భారం పడే అవకాశం ఉంది. -
కస్టోడియనే సూత్రధారి
సాక్షి, గుంటూరు: ఈ నెల 9న గుంటూరు అమరావతి రోడ్డులోని నగరాలు సమీపంలో సెంట్రల్ బ్యాంకు ఏటీఎంలో నగదు నింపే వాహనంలో రూ.39 లక్షలు చోరీ కేసు మిస్టరీ వీడింది. ఏటీఎంలో నగదు నింపే కస్టోడియన్ నాగేంద్రబాబే చోరీకి ప్రధాన సూత్రధారిగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, రెండు బైక్లు, నాలుగు సెల్ఫోన్లు, రూ.39 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని అర్బన్ సమావేశ మందిరంలో ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రైటర్స్ సేఫ్ గార్డు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రవీణ్, సొల్లా వెంకట నాగేంద్రబాబు కస్టోడియన్లుగా, భోజారావు గన్మెన్గా, ఉల్లం తిరుపతిరావు ఏటీఎంకు డబ్బు నింపే వాహనం డ్రైవర్గా పని చేస్తున్నారు. తిరుపతిరావు తాను ప్రయాణించిన దూరం కంటే ఎక్కువ దూరం ప్రయాణించినట్టు ట్రావెలింగ్ అలవెన్స్ పొందుతూ ఉండేవాడు. ఈ ట్రావెలింగ్ అలవెన్స్ అనుమతికి కస్టోడియన్ సంతకం పెట్టాల్సి ఉంటుంది. తప్పుడు ట్రావెలింగ్ అలవెన్స్పై నాగేంద్రబాబు సంతకం పెట్టడాన్ని ప్రవీణ్ వ్యతిరేకించాడు. దీంతో నాగేంద్రబాబు, తిరుపతిరావు, భోజారావు ప్రవీణ్తో గొడవపడ్డారు. ప్రవీణ్ను ఇబ్బంది పెట్టాలని... భేదాభిప్రాయాల నేపథ్యంలో ప్రవీణ్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అతను డ్యూటీలో ఉన్న సమయంలో వ్యాన్లో ఉన్న డబ్బు కాజేయాలని పథకం రచించారు. ఇందులో భాగంగా నాగేంద్ర తన స్వగ్రామమైన మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన రాజబోయిన వెంకట నాగశివ, కంపసాటి గంగాధర్లను భోజారావు, తిరుపతిరావులకు పరిచయం చేశాడు. పథకం ప్రకారం ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు నగదుతో ఉన్న వాహనం నగరాలులోని సెంట్రల్ బ్యాంకు వద్ద రోడ్డుపై నిలిపి డ్రైవర్ తిరుపతిరావు తనకు సొంత పని ఉందని ప్రవీణ్ను బ్యాంకులోకి తీసుకువెళ్లాడు. ఈ సమయంలో నాగ వెంకటసాయి, గంగాధర్ వ్యాన్లోని రూ.39 లక్షల నగదుతో ఉన్న బాక్స్ను చోరీ చేసి బైక్పై నవులూరుకు వెళ్లారు. 250 సీసీ కెమెరాలు పరిశీలించగా... చోరీ ఘటనపై రెండు ప్రత్యేక బృందాలను ఎస్పీ అప్పట్లో ఏర్పాటు చేశారు. ఈ బృందాలు అర్బన్ జిల్లాలోని 250 సీసీ కెమెరాలను పరిశీలించగా ప్రాథమికంగా నిందితులను గుర్తించిన అనంతరం, టెక్నికల్ ఆధారాలు సేకరించి నిర్ధారించారు. చోరీ జరిగిన అనంతరం నిందితులు వెళ్లిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా వారు వేసుకున్న దుస్తులు, వాడిన బైక్ను గుర్తించారు. ఈ ఆధారాల వల్ల నిందితులు ఎవరో గుర్తించడం కుదరకపోవడంతో, నిందితులు ఎక్కడి నుంచి వచ్చారనే దానిపై విచారణ సాగించారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలు వెరిఫై చేయగా నవులూరు ప్రాంతంలో నిందితులు ప్రారంభమైనట్టు గుర్తించి, చోరీ అనంతరం కూడా వాళ్లు ఆ ప్రాంతానికి వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో నిర్ధారణ అవడంతో ఆ కోణంలో కేసు దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా గుర్తించిన నిందితుల కాల్డేటా పరిశీలించగా వీళ్లు తిరుపతిరావు స్నేహితులని గుర్తించిన పోలీసులు తిరుపతిరావును అదుపులోకి తీసుకుని విచారించగా విషయాన్ని చోరీ వివరాలు వెల్లడించినట్టు సమాచారం. కేసును ఛేదించిన సిబ్బందికిఅభినందనలు కేసును త్వరగా ఛేదించి, 100 శాతం రికవరీ చేసిన నల్లపాడు పోలీసులను, సీసీఎస్, ఐటీ కోర్ సిబ్బందిని ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించారు. సీఐ కె.వీరాస్వామి, ఎస్ఐలు విశ్వనాథ్, రవీంద్ర, అమరవర్థన్, ఇతర సిబ్బందికి క్యాష్ రివార్డు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ అడ్మిన్ గంగాధరం, సీసీఎస్ ఏఎస్పీ మనోహర్, డీఎస్పీలు కమలాకర్, ప్రకాశ్, బాలసుందరరావు పాల్గొన్నారు. -
ఏటీఎంలల్లో సగానికి తగ్గిన క్యాష్ విత్డ్రా
కరోనా వైరస్ ప్రేరిత లాక్డౌన్ ప్రభావం కరెన్సీ నోట్లపై పడింది. లాక్డౌన్ విధింపు నేపథ్యంలో ఈ ఏప్రిల్లో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ సగానికి పైగా తగ్గింది. దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంల నుంచి ఈ ఏప్రిల్లో రూ.1.27లక్షల కోట్ల నగదును మాత్రమే ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. అంతకు ముందు నెల మార్చిలో ఏటీఎంల ద్వారా రూ.2.51లక్షల కోట్ల ఉపసంహరణ జరిగినట్లు తెలుస్తోంది. మార్చిలో కంటే ఏప్రిల్లో పాయింట్ ఆఫ్ సేల్ వద్ద నగదు విత్డ్రా వాల్యూమ్స్ స్వల్పంగా పెరిగాయి. ఈ ఏప్రిల్లో పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) నుంచి రూ.110 కోట్ల నగదు ఉపసంరణ జరిగినట్లు ఆర్బీఐ గణాంకాలు తెలిపాయి. ప్రజలు నిత్యావసర కొనుగోళ్లకు అత్యధికంగా డిజిటల్ చెల్లింపులకే మొగ్గుచూపారు. ఏటీఎంల్లో డెబిల్ కార్డుల వినియోగం సైతం సగానికి పైగా పడిపోయింది. ఈ ఏప్రిల్లో డెబిట్ కార్డులను ఉపయోగించి రూ.28.52 కోట్లను ఉపసంహరించుకున్నారు. మార్చిలో ఇవే కార్డుల ద్వారా రూ.54.41 కోట్లను విత్డ్రా చేసుకున్నారు. ఈ ఏప్రిల్ నాటికి దేశంలో మొత్తం 88.68 కోట్ల కార్డులున్నాయి. ఇందులో 82.94 కోట్ల డెబిట్ కార్డులు, 5.73 కోట్ల క్రిడెట్ కార్డులున్నాయి. అంతకుముందు నెల మార్చిలో 88.63 కోట్ల కార్డులున్నాయి. ఇదే ఏప్రిల్ నాటికి దేశ వ్యాప్తంగా మీద 2.34లక్షల ఏటీఎంలు, 50.85లక్షల పీఓఎస్ ఉన్నాయి. -
ఏటీఎంలే టార్గెట్
-
హైటెక్ చోరీ: రూ. 42.39 లక్షలు లూటీ
గుర్గ్రాం : హాలీవుడ్ తరహాలో ఏటీఎంలో ఇద్దరు ముసుగు దొంగలు రూ. 42.39 లక్షలు దోచుకుని పరారైన ఘటన గుర్గ్రాంలో వెలుగుచూసింది. మే 23న సుశాంత్లోక్ ప్రాంతంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో జరిగిన ఈ దోపిడీకి సంబంధించి నిందితులను పోలీసులు ఇంతవరకూ గుర్తించలేదు. ఈ ఏటీఎంలో మే 20న రూ. 28 లక్షల నగదు నింపారని, మూడు రోజుల తర్వాత సాంకేతిక సమస్యలతో మెషిన్ పనిచేయడం లేదని ఫిర్యాదు రావడంతో నగదు నిర్వహణ సంస్థ సిబ్బంది తనిఖీ చేయడంతో దోపిడీ గుట్టు రట్టయింది. ఏటీఎం నుంచి రూ. 42.39 లక్షలు చోరీ అయ్యాయని గుర్తించామని కంపెనీ ప్రతినిధి గిరీష్ పాల్ సింగ్ చెప్పారు. ఏటీఎంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించగా మే 23 రాత్రి 2.30 గంటల సమయంలో ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఏటీఎం కియోస్క్కు చేరుకుని కెమెరా లెన్స్ను తొలగించినట్టు కనిపించిందని అన్నారు. ఏటీఎంను గ్యాస్ కట్టర్ ఉపయోగించి నిందితులు తెరవలేదని, హ్యాకింగ్ పరికరం ద్వారా నగదును దొంగిలించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇంటిదొంగల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: వైరల్ వీడియో: ఏటీఎంలో అనుకోని అతిథి -
వైరల్ వీడియో: ఏటీఎంలో అనుకోని అతిథి
లక్నో : లాక్డౌన్ కారణంగా రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారడంతో అడవి జంతువున్నీ జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇటీవల ఓ కోతి ఏటీఎం మెషిన్ను ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే అలాంటి మరో ఘటన చోటుకేసుకుంది. అయితే ఈసారి కోతికి బదులు ఓ భారీ పాము ఏకంగా ఏటీఎం మెషిన్లోకి చొరబడింది. పామును చూసి డబ్బు డ్రా చేసుకోవడానికి వచ్చిన వారంతా భయాందోళనకు గురయ్యారు. చేసేదేమీ లేక దూరం నుంచి తమ మొబైల్ కెమేరాల్లో బందించారు. అనంతం అటవీశాక అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్ ఐసీఐసీఐ ఏటీఎంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా... అదికాస్తా వైరల్గా మారింది. వేసవి నేపథ్యంలో ఈ పాము చల్లదనం కోసం ఏటీఎంలోకి దూరి ఉంటుందని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. -
నగదు ఏదీ?
సాక్షి, సిటీబ్యూరో: రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదల పాలిట లాక్డౌన్ శాపంగా పరిణమించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న వారికి ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నా.. నిత్యావసర వస్తువుల కోసం చేతిలో చిల్లిగవ్వ లేక తల్లడిల్లుతున్నారు. ఆహార భద్రత కార్డుదారులకు ఉచిత బియ్యంతో పాటు నిత్యావసర సరుకుల కోసం రూ.1500 అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఇప్పటికే ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా ఉచితం బియ్యం అందిస్తోంది. మహా నగరంలో ఇప్పటికే ఆహార భద్రత కార్డుదారులు 70 శాతానికిపైగా నిరుపేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేశారు. నగరంలోని కార్డుదారులతో పాటు ఉపాధి కోసం వచ్చి స్థానికంగా ఉన్న ఇతర ప్రాంతాలకు చెందిన కార్డుదారులకు సైతం పోర్టబిలిటీ ద్వారా రేషన్ పంపిణీ అందింది. ఇక నిత్యావసర సరుకులు, నగదు కోసం లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలుచేపట్టినట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. దీంతో తమ బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ ఎప్పుడు జరుగుతుందోనని పేదలు ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ మహా నగరంలో సుమారు 18 లక్షల పేద కుటుంబాలకు నగదు ద్వారా లబ్ధి చేకూరనుంది. వాస్తవంగా నగరంలోని అర్బన్ ప్రాంతానికి చెందిన ఆహార భద్రత కార్డుదారులు సుమారు 9.80 లక్షలపైగా ఉండగా, వివిధ జిల్లాలకు చెంది ఇక్కడ ఉపాధి, ఇతరత్రా కారణాలతో తాత్కాలికంగా నివాసం ఉంటున్నవారు మరో 8.20 లక్షల వరకు ఉంటారని అధికారుల అంచనా. బ్యాంక్ ఖాతాలో నగదు జమ అవుతున్న కారణంగా ఎక్కడైనా ఏటీఎంలో డ్రా చేసుకునే విలుంటుంది. గతంలోనే ఆహార భద్రతకార్డుదారుల బ్యాంక్ ఖాతాలు, ఆధార్ నంబర్లను డీలర్లు సేకరించారు. మరోవైపు బ్యాంక్ ఖాతాలు సైతం ఆధార్తో అనుసంధానమయ్యాయి. ఆహార భద్రతకార్డుదారుల ఆధార్ ఆధారంగా నగదు బ్యాంక్ ఖాతాలో జమ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆహార భద్రత కార్డుల లేని వలస కార్మికులను ఇప్పటికే గుర్తించి ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యంతోపాటు రూ.500 నగదు సైతం అందించారు. ఇక ఆహార భద్రత కార్డుదారులకు నగదు అందించాల్సి ఉంది. -
పాపం ఆయన కష్టాల్లో ఉన్నాడేమో..
-
ఇలాంటివి కూడా చోరీ చేస్తారా..!
కరోనావైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మాస్కులు, శానిటైజర్లకు డిమాండ్ పెరిగింది. కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే ప్రతి గంటకు ఒక్కసారి శానిటైజర్ లేదా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలని, మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో జనాలంతా మాస్కులు, శానిటైజర్ల కొనుగోలుపై పడ్డారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా శానిటైజర్ల కొరత ఏర్పడింది. దీన్నే ఆసరాగా చేసుకున్న కొంతమంది దళారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శానిటైజర్ బాటిళ్లను సంపాదించుకోవడం కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అధిక ధరలు ఉన్నప్పటికీ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్తున్నారు. మరికొంత మంది ఇంట్లోనే శానిటైజర్లను తయారు చేసుకుంటున్నారు. ఇక ఈ రెండు తన వల్ల కాదనుకున్న ఓ వ్యక్తి సింపుల్గా ఏటీఎం సెంటర్లో ఉంచిన బాటిల్నే ఎత్తుకెళ్లాడు. ఈ శానిటైజర్ దొంగతనం వీడియోని పాకిస్తాన్ జర్నలిస్ట్ నైలా ఇనాయత్ ట్వీటర్లో షేర్ చేశారు. వీడియోలో ప్రకారం.. ఓ వ్యక్తి డబ్బులు విత్డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్కు వచ్చాడు. డబ్బులు తీసుకున్నాడు. తర్వాత అక్కడ ఉన్న శానిటైజర్ బాటిల్ను జేబులో పెట్టుకొని వెళ్లిపోయాడు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ‘ఏటిఎంలోకి వచ్చి డబ్బులు చోరీ చేసిన వాళ్లను చూశాం కానీ.. శానిటైజర్ బాటిల్ను దొంగతనం చేయడం ఇప్పుడే చూస్తున్నా’, ‘ఏటీఎం డోర్ టచ్ చేసే ముందు శాటిటైజర్తో చేతులను శుభ్రం చేసుకుంటే బాగుండేది’, ‘ఇలాంటి వారి వల్ల ఆ దేశం పురోగమిస్తుంది’, ‘పాపం ఆయన కష్టాల్లో ఉన్నాడేమో..అందుకే శానిటైజర్ చోరీ చేశాడు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
భార్య పోరు పడలేక.. ఏటీఎం క్యాష్ చోరీ
సాక్షి, సిటీబ్యూరో: డిప్లమో పూర్తి చేసిన అతగాడు సివిల్ ఇంజినీర్గా సిటీకి వచ్చాడు.. వివిధ సంస్థల్లో పని చేసినా భార్య అంగీకరించకపోవడంతో మానేశాడు.. భారీ చోరీ చేసి స్వస్థలంలో ఇల్లు కట్టుకుని సెటిల్ అవుదామని పథకం వేశాడు.. దీనికోసం కారు డ్రైవర్ అవతారం ఎత్తి సీఎంఎస్ వాహనం ‘చేజిక్కించుకున్నాడు’.. ఏటీఎం కేంద్రాల్లో నింపాల్సిన రూ.92 లక్షలు ఎత్తుకుపోయాడు.. ఈ పంథాలో చోరీకి పాల్పడిన దొండపాటి ప్రకాశ్ను ఉత్తర మండల టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. అతడి నుంచి రూ.90 లక్షలు రికవరీ చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్రావుతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. భార్య పోరు పడలేక.. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ప్రాంతానికి చెందిన ప్రకాశ్ కాకినాడలో సివిల్ ఇంజినీరింగ్ డిప్లమో చేశాడు. ఆపై అనేక ప్రైవేట్ సంస్థల్లో పని చేసిన ఇతగాడు తన విధుల్లో భాగంగా ఏపీతో పాటు మధ్యప్రదేశ్, తమిళనాడుల్లోనూ ఉండి వచ్చాడు. 2015లో ప్రేమ వివాహం చేసుకున్న ఇతగాడు రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతూ ఉద్యోగాలు చేయడానికి భార్య అంగీకరించలేదు. దీంతో బతుకుదెరువు కోసం 2017లో నగరానికి వచ్చి నాగోల్ సమీపంలోని సాయినగర్లో స్థిరపడ్డాడు. ఇప్పటికీ తన స్నేహితులు, బంధువులకు తాను సివిల్ ఇంజినీర్గా పని చేస్తున్నట్లు చెప్పుకొంటూ స్వస్థలంలోని ఇంటి ద్వారా వచ్చే అద్దెతో బతికేస్తున్నాడు. ఓ భారీ చోరీ చేయడం ద్వారా స్వస్థలంలోని ప్లాట్లో ఇల్లు కట్టుకుని సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం డూప్లెక్స్ ఇంటి ప్లాన్ సైతం సిద్ధం చేసుకుని తన స్మార్ట్ఫోన్లో భద్రపర్చుకున్నాడు. క్యాష్ నింపే వాహనాలే ఎంచుకుని.. ఎక్కడ చోరీ చేయాలనే విషయంలో అనేక ఆలోచనలు చేసిన అతగాడు ఏటీఎం కేంద్రాల్లో క్యాష్ నింపే బాధ్యతలు నిర్వర్తించే వాహనాలైతే ఉత్తమమని నిర్ణయించుకున్నాడు. అలా చేయడానికి ఆ వాహనం చేజిక్కించుకునే అవకాశం సంపాదించడం, వారి కార్యకలాపాలు తెలుసుకోవడం అవసరమని భావించాడు. దీంతో పథకం ప్రకారం గత ఏడాది ఆగస్టులో కవాడిగూడకు చెందిన ఫైవ్స్టార్ ఫ్యాకల్టీ సొల్యూషన్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ అనే మ్యాన్పవర్ కన్సల్టెన్సీలో డ్రైవర్గా చేరాడు. దీని ద్వారా ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే దోమలగూడలోని ఎస్ఐపీఎల్ సంస్థలోకి డ్రైవర్గా వెళ్లాడు. ఇటీవల ఈ సంస్థ మరో క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ సీఎంఎస్లోకి విలీనమైంది. దీంతో మూడుసార్లు సీఎంఎస్ క్యాష్ వాహనాలకు డ్రైవర్గా వెళ్లిన అతగాడు వాటి పూర్తి కార్యకలాపాలను తెలుసుకున్నాడు. నేరం చేయడానికి సిద్ధమైన ప్రకాశ్ తన భార్యను ఆమె సొంతూరు చాగల్లుకు పంపించాడు. సోమవారమే సో బెటర్గా.. క్యాష్ నింపే వాహనాలకు వారంలో మొదటి పని దినమైన సోమవారం భారీ డిమాండ్ ఉంటుంది. ఆ రోజు దాదాపు ప్రతి ఏటీఎంలోనూ డబ్బు నింపాల్సి వస్తుంది. ఆ రోజు ఉండే హడావుడి నేపథ్యంలో నిర్వాహకులు ఏ విషయాన్నీ పూర్తిగా సరిచూసుకోరు. ఈ విషయం తెలిసిన ప్రకాశ్ సోమవారం రంగంలోకి దిగాడు. పథకం ప్రకారం ఇంటి నుంచి బయలుదేరేప్పుడే తన సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. డబ్బు నింపుకోవడానికి ఓ బ్యాగ్ కూడా ఇంటి నుంచే తెచ్చుకున్నాడు. రోజూ మాదిరిగా ద్విచక్ర వాహనంపై కాకుండా ఆ రోజు బస్సులో బయలుదేరాడు. నేరుగా ముషీరాబాద్లోని సీఎంఎస్ క్యాష్ వాహనాల పార్కింగ్ స్థలంలోకి వెళ్లాడు. అక్కడ ఉన్న వాహనాల్లో గతంలో తాను డ్రైవ్ చేసిన (ఏపీ16 టీడీ 4451) బొలేరోను గుర్తించాడు. సెక్యూరిటీ గార్డు వద్దకు వెళ్లి తన పేరు రాకేశ్గా ఫైవ్స్టార్ సంస్థ తరఫున సీఎంఎస్లో ‘4451’ వాహనానికి డ్రైవర్గా వచ్చానని చెప్పాడు. ఆ రోజు మొత్తం 90 వాహనాలను పంపాల్సి ఉండటంతో ఆ హడావుడిలో ఉన్న సెక్యూరిటీ గార్డు వివరాలు సరిచూసుకోకుండా దాని తాళం ఇచ్చేశాడు. యూ టర్న్ పేరుతో ఉడాయింపు.. ఈ వాహనంతో లోయర్ ట్యాంక్బండ్లోని సీఎంఎస్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడి ఉద్యోగులు ఇద్దరు కస్టోడియన్లు, ఒక గన్మన్ను ఈ వాహనానికి కేటాయిస్తూ రూ.1.6 కోట్ల నగదు ఇచ్చారు. వీరికి కోఠిలోని ఎస్బీఐ ప్రధాన బ్రాంచ్ నుంచి ఈసీఐఎల్ మధ్య ఉన్న ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే పని అప్పగించారు. వాహనంతో బయలుదేరే ముందు తలకు టోపీ పెట్టుకున్న ప్రకాష్, ముఖం సైతం కనిపించకుండా వస్త్రం చుట్టుకున్నాడు. అంతా కరోనా ఎఫెక్ట్ కారణంగా జాగ్రత్తలు తీసుకున్నాడని భావించి ప్రశ్నించలేదు. వాహనం చిలకలగూడకు చేరుకున్న తర్వాత అక్కడి ఏటీఎంలో రూ.68 లక్షలు నింపడానికి కస్టోడియన్లు వెళ్లారు. కారు దగ్గరే ఉన్న గన్మన్తో యూ టర్న్ చేసుకుని వస్తానని చెప్పిన ప్రకాశ్ మిగిలిన రూ.92 లక్షలతో ఉడాయించాడు. అక్కడ నుంచి మెట్టుగూడ, తార్నాక మీదుగా లాలాగూడ ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నాడు. నగదు మొత్తం బ్యాగ్లో నింపుకొన్న అతగాడు అక్కడ వాహనాన్ని వదిలి ఆటోలో సాయినగర్కు వెళ్లాడు. తన ఇంటికి కిలోమీటరు దూరంలో దిగి ఆటోడ్రైవర్కు రూ.200 ఇచ్చి వెళ్లిపోయాడు. చాకచక్యంగా పట్టుకున్న టాస్క్ఫోర్స్... సీఎంఎస్ ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని పట్టుకోవడానికి నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో ఎస్సైలు జి.రాజశేఖర్రెడ్డి, బి.పరమేశ్వర్, కె.శ్రీకాంత్ రంగంలోకి దిగారు. దాదాపు 28 మందితో కూడిన బృందం 500 సీసీ కెమెరాల ఫీడ్ను అధ్యయనం చేసింది. లాలాగూడ ఫ్లైఓవర్ వద్ద సీఎంఎస్ వాహనం వదిలిన ప్రకాశ్ ఆటోలో వెళ్లడాన్ని గుర్తించింది. ఆ ఆటోడ్రైవర్ షేక్ హమీద్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సాయినగర్లో నిందితుడు ప్రకాశ్ ఆటో దిగినట్లు తేలింది. ఆ ప్రాంతంలో ఉన్న 600 ఇళ్లను స్థానికులైన ఏడుగురి సాయంతో టాస్క్ఫోర్స్ గాలించి ప్రకాశ్ ఇంటిని గుర్తించింది. ఆ ఇంట్లో సగం సామాను సర్దేసి ఉండటంతో మళ్లీ వస్తాడనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో కాపుగాశారు. సోమవారం తెల్లవారుజామున నగదు బ్యాగ్తో వచ్చి చిక్కాడు. చోరీ చేసిన మొత్తం నుంచి నిందితుడు రూ.2 లక్షలు అప్పులు తీర్చేయగా.. మిగిలిన రూ.90 లక్షలు రికవరీ చేశారు. కేసును కొలిక్కి తేవడంలో సహకరించిన ఆటోడ్రైవర్, సాయినగర్ వాసుల్ని కొత్వాల్ అంజనీకుమార్ సన్మానించారు. -
ఏటీఎం కార్డు స్కిమ్మింగ్
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: ఏటీఎం కార్డు స్కిమ్మింగ్ చేస్తున్న ఇద్దరు విదేశీయులతో కలిపి ముగ్గురు నిందితులను రామనగర జిల్లా హారోహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియాకు చెందిన అలూక సాండ్రా ఒరెవ్హా (25), హెన్రి అఖ్యుటైమెన్ (25), మహారాష్ట్రకు చెందిన విజయ్ థోమన్ (30) పట్టుబడ్డ నిందితులు. నిందితుల నుండి నైజీరియా పాస్పోర్టులు, నకిలీ ఏటీఎం కార్డులు, ల్యాప్టాప్ ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 2న కనకపుర తాలూకా బూదగుప్పె గ్రామంలోని ఇండియా వన్ ఏటీఎం సెంటర్లో గీత అనే మహిళ ఏటీఎం కార్డు ఉపయోగించి డబ్బులు డ్రా చేసుకున్నారు. తరువాత ఇదే ఏటీఎంలో ఫిబ్రవరి 9న రూ.49 వేలు డ్రా చేసినట్టు గీత మొబైల్కు మెసేజ్ వచ్చింది. దీంతో బాధిత మహిళ సీఈఎన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సీఈఎన్ పోలీసులు డీసీఐబీ, హారోహళ్లి పోలీసులతో కలిసి కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. గత నెల ఏటీఎం స్కిమ్మింగ్ కేసులో అరెస్టయ్యి జైలులో ఉన్న ముగ్గురు నైజీరియా వ్యక్తులను విడిపించడానికి డబ్బులు అవసరమై తాము మళ్లీ ఏటీఎం స్కిమ్మింగ్కు పాల్పడ్డట్టు నిందితులు తెలిపారని పోలీసులు చెప్పారు. నిందితులపై రామనగరలో 44, బెంగళూరులో 6, చిత్రదుర్గ జిల్లాలో 4 కేసులు ఇవే కేసులు నమోదయ్యాయి. -
ఆ ఏటీఎమ్లలో రూ.2 వేల నోటు కనిపించదు
చెన్నై: రూ.2 వేల నోటు విషయంలో ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి తన ఏటీఎమ్లలో పెద్ద నోటు లభ్యం కాదని స్పష్టీకరించింది. రెండువేల నోటును రద్దు చేస్తారంటూ గత కొంతకాలంగా ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో బ్యాంకు నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏటీఎమ్లలో రెండు వేల నోటు నింపడం ఆపివేయాలంటూ ఇండియన్ బ్యాంకు సంబంధింత బ్రాంచ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇకమీదట తన ఏటీఎమ్లలో రెండు వేల నోటు కనిపించదని, దానికి బదులుగా రూ.200 నోటును అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది.(రూ. 2 వేల నోటు కనబడుటలేదు!!) వినియోగదారుల సౌకర్యార్థమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో మార్చి 1 నుంచి ఇండియన్ బ్యాంకు ఏటీఎమ్లలో రూ.2 వేల నోటు అదృశ్యం కానుంది. కాగా ఇప్పటికే వినియోగదారులు సైతం ఏటీఎమ్లలో తీసుకుంటున్న పెద్ద నోట్లను బ్యాంకుకు వెళ్లి మార్చుకుంటున్నారు. మరోవైపు మిగతా బ్యాంకులు కూడా అదే బాటలో వెళతాయేమోనని కొందరు వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.(రెండు వేల నోటు, మరో షాకింగ్ న్యూస్) -
రూ. వెయ్యి డ్రా చేస్తే రూ. 2,200
కమలాపూర్: ఏటీఎంలో రూ.వెయ్యి డ్రా చేసేందుకు యత్నిస్తే రూ.2,200 నగదు వచ్చింది. ఇది దావానలంలా వ్యాపించడంతో జనం ఏటీఎం కేంద్రానికి ఎగబడ్డారు. ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్లో సోమవారం సాయంత్రం జరిగింది. కమలాపూర్లోని బస్టాండ్ వద్ద ఉన్న ఇండియా వన్ ఏటీఎం సెంటర్లో రూ.వెయ్యి డ్రా చేయాలని యత్నిస్తే రూ.2,200 వచ్చాయి. మళ్లీ యత్నించినా అలా రూ.1,200 ఎక్కువగా రావడం.. రూ.2 వేలకు రూ.4,400, రూ.3 వేలకు రూ.6,600, రూ.4 వేలకు రూ.8,800 చొప్పున వచ్చాయి. ఆ నోటా ఈనోట బయటకు పొక్కడంతో కార్డుదారులు బారులు తీరారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఏటీఎంను మూసేశారు. -
మల్కన్గిరిలో ఎనీటైం ఖాళీ..!
ఒడిశా, మల్కన్గిరి: జిల్లా కేంద్రంలోని ఏ ఏటీఎంలో చూసినా డబ్బులు లేని పరిస్థితి. దీంతో డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు ఏటీఎం సెంటర్కు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో అవసరమై డబ్బులు తీసుకునేందుకు ఏటీఎంకు వస్తే అందులో డబ్బులు లేకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని, ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద బ్యాంక్గా పేరొందిన స్టేట్బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు లేకపోవడం విశేషం. ఇదే విషయంపై ఆ బ్యాంక్ మేనేజర్ను కలిసినా ఫలితం కనిపించలేదని ఆ బ్యాంక్ ఖాతాదారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో మొత్తం 23 సెంటర్లలో వివిధ బ్యాంకులకు చెందిన 23 ఏటీఎంలు ఉండగా, ఏ ఒక్క ఏటీఎం తెరిచి ఉండకపోవడం గమనార్హం. ఈ క్రమంలో ప్రజలు తమ అవసరాలు తీర్చుకునేందుకు ఇక్కట్లు పడుతుండగా తమ ఖాతాలో డబ్బులున్నా అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పుడిప్పుడే జిల్లాలోని గిరిజనులు కూడా ఏటీఎంల వాడకం ప్రారంభించగా, ప్రస్తుతం ఏటీఎంలో డబ్బులు లేకపోవడంతో వారు తమ అవసరాల నిమిత్తం డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుస్తోంది. ఇదే విషయంపై ఆయా బ్యాంకుల యజమానులను కలిసినా ఫలితం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి, డబ్బులు ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
నల్గొండ ఏటీఎంలో చోరీ
-
ఓటీపీతో ఎస్బీఐ ఏటీఎంల నుంచి నగదు
న్యూఢిల్లీ: ఎస్బీఐ ఏటీఎంకు చీకటి పడిన తర్వాత వెళుతున్నారా..? కార్డుతోపాటు, చేతిలో మొబైల్ ఫోన్ కూడా ఉండాలి. ఎందుకంటే ఓటీపీ సాయంతోనే నగదు ఉపసంహరణ జరిగే విధానాన్ని ఎస్బీఐ దేశవ్యాప్తంగా తన ఏటీఎంలలో ప్రవేశపెడుతోంది. రూ.10,000, అంతకుమించి నగదు ఉపసంహరణలకు మాత్రమే ఇది అమలవుతుంది. అది కూడా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే. మిగతా వేళల్లో ఇప్పటి మాదిరే ఓటీపీ లేకుండా నగదును తీసుకోవచ్చు. అలాగే, రూ.10వేల లోపు నగదును ఇక ముందూ ఓటీపీ లేకుండా రోజులో ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు. జనవరి 1 నుంచే ఈ విధానం అమల్లోకి వస్తోంది. ఓటీపీ విధానం ఇలా.. ► కార్డును ఏటీఎం మెషీన్లో ఉంచి చివర్లో నగదు మొత్తాన్ని టైప్ చేసి ఓకే చేసిన తర్వాత ఖాతాదారుల రిజిస్టర్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఏటీఎం స్క్రీన్పై ఓటీపీ అడుగుతుంది. నంబర్ను ప్రవేశపెట్టడం ద్వారానే నగదు ఉపసంహరణకు వీలవుతుంది. ► ఎస్బీఐ ఏటీఎంలలోనే ఈ విధానం. ఎస్బీఐ ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నగదు ఉపసంహరణకు ఓటీపీ విధానం ఉండదు. భవిష్యత్తులో అన్ని బ్యాంకులు ఈ విధానంలోకి మళ్లితే అప్పుడు అన్ని చోట్లా ఓటీపీ అవసరపడుతుంది. ► ఖాతాదారులు తమ కార్డును పోగొట్టుకున్నా లేదా కార్డు వివరాలను మరొకరు తెలుసుకుని అనధికారికంగా, మోసపూరిత లావాదేవీలు చేద్దామనుకుంటే కుదరదు. ఎందుకంటే కచ్చితంగా ఓటీపీ ఉంటేనే పని జరుగుతుంది. దీంతో ఎస్బీఐ ఏటీఎం లావాదేవీలు మరింత సురక్షితంగా మారనున్నాయి. -
వామ్మో.. ఏటిఎం?
ఒకపక్క ఏటీఎంలలో భద్రత లోపాలు అనేకసార్లు బైటపడుతున్నప్పటికీ బ్యాంకులు తగు చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయంలో బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను కూడా అంతగా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఏటీఎంలలో విండోస్ 7 సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేసుకోవడం మొదలుకుని యాంటీ స్కిమ్మింగ్ కార్డ్ రీడర్లు ఇన్స్టాల్ చేయడం, నగదు సరఫరాలో తీసుకోవాల్సిన జాగ్రత్తల దాకా వివిధ అంశాలపై ఏప్రిల్ 2018 నుంచి ఆగస్టు 2019 మధ్యలో ఆర్బీఐ, హోంశాఖ పలు సర్క్యులర్లు జారీ చేశాయి. నగదు భర్తీ చేసే సంస్థలు పాటించాల్సిన నిబంధనలు కూడా వీటిల్లో ఉన్నాయి. విండోస్ 7 సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేసుకునేందుకు ఆర్బీఐ విధించిన జనవరి 2020 డెడ్లైన్ దగ్గరపడుతోంది. అయినప్పటికీ.. మిగతా నిబంధనల్లాగే దీన్ని కూడా పూర్తి స్థాయిలో అందుకునే పరిస్థితి కనిపించడం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తీవ్రంగా పరిగణిస్తున్న ఆర్బీఐ... భారత్లో బ్యాంకింగ్ తీరుతెన్నులు, పురోగతిపై రిజర్వ్ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం.. ఏటీఎం, డెబిట్ కార్డు లావాదేవీలపై బ్యాంకింగ్ అంబుడ్స్మన్కి 2017–18లో 24,672 ఫిర్యాదులు రాగా, 2018–19లో 36,539కి పెరిగాయి. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యల గురించి అనేకసార్లు హెచ్చరించినప్పటికీ బ్యాంకులు పట్టించుకోకపోతుండాన్ని రిజర్వ్ బ్యాంక్ తీవ్రంగా పరిగణిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏటీఎంలలో భద్రతా ప్రమాణాలకు సంబంధించి 2017 మార్చి, నవంబర్లలో చేసిన సిఫార్సులను అమలు చేయాలంటూ 2018 జూన్ 21న ఆర్బీఐ ఒక సర్క్యులర్ పంపించింది. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం.. ఏటీఎంలను కచ్చితంగా గోడలు లేదా పిల్లర్లలోకి అమర్చడం, నగదు భర్తీ కోసం వన్ టైమ్ కాంబినేషన్ (ఓటీసీ) తాళాలను ఉపయోగించడం తదితర నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుంది. కానీ ఆర్బీఐ ఆదేశాల అమలు పురోగతి నత్తనడకన సాగుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం దేశంలో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మొత్తం 2,06,589 ఏటీఎంలు నిర్వహణలో ఉన్నాయి. అయితే, ఇప్పటికీ సగం ఏటీఎంలలో ఓటీసీ వినియోగంలోకి రాలేదు. ఆపరేటింగ్ సిస్టమ్ను అప్గ్రేడ్ చేసుకోకపోవడం, తగిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల.. బ్యాంకు ఖాతాదారులు నష్టపోవడంతో పాటు బ్యాంకు ప్రతిష్ట కూడా దెబ్బతింటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వ్యయాల భయంతో వెనుకంజ.. ఏటీఎంలలో నగదు భర్తీకి ప్రస్తుతం ఉపయోగిస్తున్న విధానానికి బదులుగా మరింత సురక్షితమైన లాకబుల్ క్యాసెట్స్ (పెట్టె) విధానాన్ని అమల్లోకి తేవాలని సూచిస్తూ 2018 ఏప్రిల్ 12న.. ఆర్బీఐ మరో సర్క్యులర్ కూడా ఇచ్చింది. 2020–21 నాటికి మొత్తం ఏటీఎంలలో కనీసం 60% ఏటీఎంలలో దీన్ని అమల్లోకి తేవాలని నిర్దేశించింది. అయితే, దీనిపై బ్యాంకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల ఖర్చులు తడిసిమోపెడవుతాయని, పరిశ్రమపై సుమారు రూ. 6,000 కోట్ల భారం పడుతుందంటున్నాయి. భారీ ఆర్థిక భారం పడే అవకాశాలు ఉన్నందున ఈ ఆదేశాల విషయంలో జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర ఆర్థిక శాఖను కోరాయి. మరోవైపు, నగదు రవాణా చేసే సంస్థలకు (సీఎల్సీ) సంబంధించి కూడా ఆర్బీఐ 2018 ఏప్రిల్ 6న మరో కీలక సర్క్యులర్ జారీ చేసింది. సీఎల్సీల వద్ద పటిష్టమైన, తేలికపాటి వాణిజ్య వాహనాలు కనీసం 300 అయినా ఉండాలని నిర్దేశించింది. దీన్నే పునరుద్ఘాటిస్తూ 2018 ఆగస్టు 8న కేంద్ర హోంశాఖ కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందుకు నిర్దేశించిన గడువు దాటిపోయి ఏడాది గడిచిపోయినా.. ఇంతవరకూ పూర్తిగా అమలు కావడం లేదని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. దేశంలో మొత్తం ఏటీఎంల సంఖ్య: 2,06,589 వీటిలో ఎస్బీఐ వాటా : 58,567 ఏటీఎం/డెబిట్ కార్డులు: 83,55,93,848 క్రెడిట్ కార్డులు: 5,25,89,719 ♦ గణాంకాలు 2019 సెప్టెంబర్ నాటికి -
స్కిమ్మింగ్.. క్లోనింగ్
సాక్షి, సిటీబ్యూరో: ఏటీఎం కేంద్రాలే టార్గెట్గా డెబిట్ కార్డులను క్లోనింగ్ చేస్తున్న ముఠాను అబిడ్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన విషయంవిదితమే. రొమేనియాకు చెందిన ఇద్దరు లండన్ వాసి క్రిస్ట్ ఆదేశాలతో ఏటీఎం మెషిన్లకు స్కిమ్మర్లు, మైక్రో కెమెరాలు అమర్చి డేటా చోరీ చేశారు. అయితే నగరంలోనూ ఇలాంటి హైటెక్ ముఠాలు ఉన్నాయని... అవి స్కిమ్మింగ్, క్లోనింగ్ వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా పబ్లిక్ ప్లేసులే అడ్డాగా చేసుకొని దందా కొనసాగించే ఈ ముఠాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.ఈ ముఠాలు క్లోనింగ్,స్కిమ్మింగ్ చేసే విధానాలను వివరిస్తున్నారు. అంతా అరచేతిలోనే... ఈ సైబర్ నేరగాళ్లు మినీ స్కిమ్మర్లుగా పిలిచే అత్యాధునిక యంత్రాలను ఇంటర్నెట్, డార్క్ వెబ్ ద్వారా చైనా నుంచి ఖరీదు చేసి దిగుమతి చేసుకుంటున్నారు. నగరంలోని పెట్రోల్ బంక్లు, హోటల్స్, రెస్టారెంట్స్, బార్స్ తదితర చోట్ల హెల్పర్స్గా పనిచేసే వారిని మచ్చిక చేసుకొని వారికి ఈ పరికరాలను అందిస్తున్నారు. అరచేతిలో ఇమిడిపోయే సైజులో ఉండే వీటిని వాళ్లు నిత్యం తమ జేబుల్లో ఉంచుకుంటున్నారు. వినియోగదారుల్లో ఎవరైనా డబ్బు చెల్లింపు కోసం డెబిట్ కార్డు ఇచ్చినప్పుడు అదను చూసి ఆ కార్డును తమ అరచేతిలోని స్కిమ్మర్లోనూ ఒకసారి స్వైప్ చేస్తున్నారు. దీంతో అందులో ఉండే డేటా మొత్తం స్కిమ్మర్కు చేరుతోంది. ఆపై దాన్ని పీఓఎస్ మెషిన్లో స్వైప్ చేసి, పిన్ నంబర్ ఎంటర్ చేయడం కోసం వినియోగదారుడికి అందిస్తుంటారు. కస్టమర్ ఎంటర్ చేసే పిన్ను జాగ్రత్తగా గమనిస్తారు. ఈ తంతు పూర్తయిన తర్వాత కార్డును వినియోగదారుడికి తిరిగి ఇచ్చేస్తుంటారు. రైటర్తో ల్యాప్టాప్లోకి... డెబిట్ కార్డుకు సంబంధించిన డేటా మొత్తం దాని వెనుక ఉండే నల్లని టేపు లాంటి మ్యాగ్నటిక్ స్ట్రిప్ లేదా చిప్లో నిక్షిప్తమై ఉంటుంది. స్కిమ్మర్లో కార్డును ఉంచి స్వైప్ చేయడంతో డేటా అందులోకి చేరుతుంది. ఇలా తస్కరించిన డేటాతో కూడిన స్కిమ్మర్లను ఈ పాత్రధారులు అసలు సూత్రధారులకు అందిస్తారు. ఇలా చేసినందుకు వీరికి కమీషన్ లేదా కొంత మొత్తం సూత్రధారుల నుంచి అందుతుంది. కేవలం డేటా మాత్రమే ఇచ్చిన కార్డుల కంటే పిన్ నంబర్తో సహా అందించిన వారికే కమీషన్ ఎక్కువ ఇస్తారు. ఈ డేటాను అందుకునే సూత్రధారులు ల్యాప్టాప్కు స్కిమ్మర్లు కనెక్ట్ చేయడం ద్వారా వాటిలోకి అప్లోడ్ చేస్తారు. అనేక సందర్భాల్లో ఈ సమాచారాన్ని సూత్రధారులు విదేశాల్లోని తమ అనుచరులకు అందిస్తారు. డార్క్ వెబ్ ద్వారానూ విక్రయించే దందా జోరుగా సాగుతుంటుంది. ఖాళీ కార్డు టు క్లోన్డ్ కార్డు సూత్రధారులు ఇంటర్నెట్ లేదా డార్క్ వెబ్ ద్వారానే మ్యాగ్నటిక్ స్ట్రిప్ లేదా చిప్తో కూడిన ఖాళీ కార్డులను కొనుగోలు చేస్తుంటారు. వీటిని ల్యాప్టాప్కు అనుసంధానించిన రైటర్లో ఉంచి.. అందులోకి క్లోన్ చేసిన వాటిలో ఓ కార్డు డేటా ట్రాన్స్ఫర్ చేసి క్లోన్డ్ కార్డు రూపొందిస్తారు. అంటే వినియోగదారుడి కార్డుకు నకలు దుండగుడి వద్ద తయారైపోతుందన్న మాట. దీన్ని తీసుకొని వాళ్లు షాపింగ్, ఆన్లైన్లో లావాదేవీలు చేయడం, డబ్బు డ్రా చేసుకోవడం చేస్తుంటారు. పీఓఎస్ మెషిన్లు ఉన్న కొందరు చిన్న చిన్న వ్యాపారులకు ఈ నేరగాళ్లు కమీషన్ల వల వేస్తున్నారు. దీంతో వాళ్లు నిబంధనలకు విరుద్ధంగా స్వైపింగ్ మెషిన్లో స్వైప్ చేసి నగదు ఇస్తూ కమీషన్ తీసుకుంటున్నారు. ఓ కన్నేయండి... కేవలం డెబిట్ కార్డులనే కాదు క్రెడిట్ కార్డులనూ క్లోన్ చేసే ఆస్కారం ఉంది. కార్డుల ద్వారా లావాదేవీలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ కార్డు ఎదుటి వ్యక్తి చేతికి వెళ్లి మళ్లీ తిరిగి వచ్చే వరకూ గమనిస్తూ ఉండాలి. పీఓఎస్ మెషిన్లో పిన్ నంబర్ మీరే ఎంటర్ చేయాలి. అలా చేస్తున్నప్పుడు అది ఎవరూ గమనించకుండా రహస్యంగా చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్ను ఎంటర్ చేసుకొమ్మని ఎదుటి వ్యక్తికి చెప్పకూడదు. ఈ తరహా సైబర్ నేరాల్లో రికవరీలు కష్టసాధ్యం. ఈ నేపథ్యంలో నేరాల బారినపడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం. – సైబర్ క్రైమ్ పోలీసులు రొమేనియా ఎంబసీకి లేఖ రాస్తాం నగరంలోని ఏటీఎం కేంద్రాలను టార్గెట్గా చేసుకొని ప్రత్యేక ఉపకరణాల ద్వారా డెబిట్ కార్డుల క్లోనింగ్కు పాల్పడుతున్న డినీట వర్జిల్ సొరైనెల్, జార్జ్ క్రిస్టియన్లను అరెస్టు చేశాం. వీరి విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లండన్కు చెందిన క్రిస్ట్ వీరి తో పాటు మరికొందరు రొమేనియన్లనూ క్లోనింగ్ దందా కోసం భారత్కు పంపాడని వెల్లడైంది. వీళ్లు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దిగారని తెలిసింది. దీనిపై సమగ్ర నివేదిక రూపొందించి ఆ వివరాలతో రొమేనియన్ ఎంబసీకి లేఖ రాసి సమాచారం ఇవ్వాలని నిర్ణయించాం. డినీట, జార్జ్లన కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత మరింత సమాచారం తెలుస్తుంది. – మధ్య మండల పోలీసులు -
టార్గెట్ ఏటీఎం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఏటీఎం కేంద్రాలను టార్గెట్గా చేసుకొని ప్రత్యేక ఉపకరణాల ద్వారా డెబిట్ కార్డ్స్ క్లోనింగ్ చేస్తున్న హైటెక్ ముఠా గుట్టును అబిడ్స్ పోలీసులు రట్టు చేశారు. లండన్లో ఉన్న సూత్రధారి సూచనల మేరకు నగరానికి వచ్చి స్కిమ్మింగ్కు పాల్పడుతున్న ఇద్దరు రొమేనియా దేశస్తులను పట్టుకున్నారు. వీళ్లు నగరంలోని 8 ఏటీఎం కేంద్రాల్లోని మెషిన్లకు అత్యాధునిక స్కిమ్మర్లు, మైక్రో కెమెరాలు ఏర్పాటు చేసి డెబిట్ కార్డుల డేటా సంగ్రహించినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. మధ్య మండల సంయుక్త పోలీసు కమిషనర్ విశ్వప్రసాద్తో కలిసి గురువారం తనకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. గత నెల 20న సిటీకి యూరోపియన్ యూనియన్ దేశమైన రొమేనియాకు చెందిన డినీట వర్జిల్ సొరైనెల్, జార్జ్ క్రిస్టియన్లు అక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికేవాళ్లు. ఓ సందర్భంలో ఈ ద్వయం లండన్ వెళ్లినప్పుడు అక్కడ క్రిస్ట్ అనే వ్యక్తిని కలిశారు. ఇరువురికీ 5వేల యూరోల చొప్పున ఇచ్చిన అతగాడు డెబిట్ కార్డ్స్ స్కిమ్మింగ్, క్లోనింగ్కు ఉపకరించే అత్యాధునిక పరికరాలు అందజేశాడు. వీటితో ఇండియాకు వెళ్లి అక్కడి ఏటీఎం కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని సూచించాడు. అలా తస్కరించిన డేటాను తనకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పాడు. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 9న రొమేనియాలో పాస్పోర్ట్ పొందిన ఇరువురూ వేర్వేరుగా విజిట్ వీసా తీసుకొని 14న ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి నుంచి 20న హైదరాబాద్కు వేర్వేరుగా వచ్చిన వీరు.. వేర్వేరు ప్రాంతాల్లోని సర్వీసు అపార్ట్మెంట్స్లో దిగారు. కేవలం ఫోన్కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారానే సమాచార మార్పిడి చేసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కో పని... డినీట్ తన వద్దనున్న పరికరాలు తీసుకొని ఉదయమే బయటకు వచ్చేవాడు. నగరం మొత్తం సంచరిస్తూ అనువైన ఏటీఎం కేంద్రాన్ని గుర్తించేవాడు. అందులోకి మాస్క్, టోపీతో వెళ్లేవాడు. డెబిట్కార్డ్ పెట్టే స్లాట్లో స్కిమ్మర్, పిన్ నంబర్ నొక్కే కీ–ప్యాడ్పైన భాగంలో మైక్రో కెమెరా, బ్యాటరీలతో కూడిన డివైజ్ ఏర్పాటు చేసేవాడు. ఇవి ఆ మెషిన్కు ఉండే పరికరాల్లో ఇమిడిపోతాయి. దీంతో సాధారణంగా చూసే ఎవరూ గుర్తించరు. ఉదయం 7:30–8 గంటల మధ్య ఈ పని పూర్తి చేసేవాడు. ఆ ఏటీఎం మెషిన్ను వినియోగించడానికి వచ్చిన వినియోగదారుడు తన డెబిట్కార్డును స్లాట్లో పెడితే... అప్పటికే దానిపై అమర్చిన స్కిమ్మర్ దాని డేటాను రీడ్ చేసేస్తుంది. పిన్ నొక్కేప్పుడు అవన్నీ కీప్యాడ్ పైన ఉన్న కెమెరాలో రికార్డు అయిపోతాయి. వీటిని ఏర్పాటు చేసిన తర్వాత ఆ లోకేషన్ను డినీట్ వాట్సాప్లో జార్జ్కు పంపించేవాడు. దీని ఆధారంగా 16–17 గంటల తర్వాత ఆ ప్రాంతానికి చేరుకునే జార్జ్ వాటిని తీసుకెళ్లేవాడు. వాటిలో నిక్షిప్తమైన డేటాను తమ ల్యాప్టాప్లోకి డౌన్లోడ్ చేసేవాడు. సెక్యూరిటీ గార్డు అనుమానంతో... మధ్య మండల పరిధిలోని జగదీష్ మార్కెట్ వద్దనున్న ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలోని మెషిన్కు ఓ విదేశీయుడు ఏవో ఉపకరణాలు బిగిస్తున్నట్లు సెక్యూరిటీ గార్డు అనుమానించాడు. ఈ విషయం బ్యాంకు అధికారులకు తెలపడంతో వాళ్లు ఈ నెల 14న వచ్చి పరిశీలించి ఉన్నట్లు గుర్తించారు. ఆ మరుసటి రోజు పరిశీలిస్తే అవి లేకపోవడం, 16న మళ్ళీ ఉండడంతో బ్యాంకు అధికారులు అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ రవికుమార్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. ఏటీఎం కేంద్రంలో రికార్డు అయిన ఫీడ్ ఆధారంగా దుండగులు విదేశీయులని గుర్తించింది. అక్కడి నుంచి చుట్టూ ఉన్న అనేక సీసీ కెమెరాల్లో ఫీడ్ పరిశీలిస్తూ ముందుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే సదరు విదేశీయుడు ఆటో ఎక్కుతున్నట్లు దానికి 200 మీటర్ల దూరంలో ఉన్న ఓ కెమెరాలో గుర్తించారు. ఆ ఆటోడ్రైవర్ను ప్రశ్నించగా, అతగాడు మెహిదీపట్నంలో దిగాడని తేలింది. ఆటోలు మారుతూ... ఒకే ఆటోలో ప్రయాణిస్తే సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు పట్టుకుంటారని నిందితుడు అనుమానించాడు. దీంతో ఆటోలు మారుతూ తాను బస చేసిన సర్వీస్ అపార్ట్మెంట్కు వెళ్లే పథకం వేశాడు. మెహిదీపట్నం ప్రాంతంలో సీసీ కెమెరాలు పరిశీలించగా అక్కడ మరో ఆటో ఎక్కినట్లు తేలింది.దాని నంబర్ ఆధారంగా డ్రైవర్ను గుర్తించి ఆరా తీశారు. నానల్నగర్ వద్ద ఆటో దిగాడని తేలడంతో అక్కడి కెమెరాల ఆధారంగా మూడో ఆటో ఎక్కినట్లు తేల్చి ఆ డ్రైవర్ను ఆరా తీశారు. సదరు డ్రైవర్ ఆ విదేశీయుడు గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్లో దిగాడని చెప్పాడు. అప్పటికే సీసీ కెమెరాల ఫీడ్ నుంచి సంగ్రహించిన విదేశీయుడి ఫొటో ఆధారంగా అక్కడి సర్వీస్ అపార్ట్మెంట్స్లో ఆరా తీయగా ఫలితం దక్కింది. ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న డినీట్ పోలీసులకు చిక్కాడు. అక్కడ దిగడానికి అతగాడు బోగస్ గుర్తింపు కార్డు వాడినట్లు వెల్లడైంది. అతడిచ్చిన సమాచారంతో బేగంపేటలోని మరో సర్వీస్ అపార్ట్మెంట్లో ఉంటున్న జార్జ్ను అదుపులోకి తీసుకున్నారు. వీరి గదుల్లో తనిఖీ చేసిన పోలీసులు ల్యాప్టాప్ తదితర స్వాధీనం చేసుకున్నారు. క్లోనింగ్ సైతం చేస్తున్నట్లుఅనుమానాలు... ఈ ద్వయం చెప్పిన దాని ప్రకారం వీళ్లు డెబిట్కార్డుల డేటా తస్కరించి (స్కిమ్మింగ్) లండన్లో ఉన్న క్రిస్ట్కు పంపిస్తుంటారు. అయితే వీరి వద్ద పోలీసులు స్కిమ్మర్లతో పాటు ఎలాంటి డేటా లేని ఖాళీ ప్లాస్టిక్ కార్డులు, ల్యాప్టాప్ సాయంతో స్కిమ్మింగ్ డేటాను వీటిలోకి ఎక్కించే రీడర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్లు ఇక్కడే క్లోన్డ్ డెబిట్కార్డులు తయారీకి ప్రయత్నించారని అనుమానిస్తున్నారు. తదుపరి విచారణలోనే ఈ వివరాలన్నీ వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. 20 రోజులకు పైగా నగరంలో స్వైరవిహారం చేసిన ఈ ద్వయం 8 ఏటీఎం కేంద్రాల్లో డివైజ్లు ఏర్పాటు చేసి డేటా తస్కరించినట్లు పోలీసులు గుర్తించారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్ను ఫోరెన్సిక్ ల్యాబ్లో విశ్లేషించిన తర్వాతే ఎవరెవరి డేటా తస్కరణకు గురైంది? అందులో ఎంత లండన్లోని క్రిస్ట్కు చేరింది? అనేది తేలుతుందని, బ్యాంక్ అధికారులు సైతం దీనిపై విచారణ చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. ఎలా కొట్టేస్తున్నారు? ఏటీఎంలలో డెబిట్ కార్డును ఉంచే స్లాట్లో స్కిమ్మర్, పిన్ నంబర్ ఎంటర్ చేసే కీప్యాడ్ పైభాగం లో మైక్రో కెమెరా అమర్చుతారు. వినియోగదారులు డెబిట్ కార్డును స్లాట్లో ఉంచినప్పుడు అప్పటికే దానిపై అమర్చిన స్కిమ్మర్ డేటాను రీడ్ చేస్తుంది. పిన్ ఎంటర్ చేసేటప్పుడు మైక్రో కెమెరాలో రికార్డు అవుతుంది. ఏం చేస్తున్నారు? ఏటీఎం కేంద్రాల్లో ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేసి డెబిట్ కార్డుల డేటా సంగ్రహిస్తున్నారు. దీని ద్వారా డెబిట్ కార్డుల క్లోనింగ్కు పాల్పడుతున్నారు. ఎంత మంది? ఇద్దరు రొమేనియా దేశస్తులు ఈ నేరానికి పాల్పడ్డారు. వీరు విజిట్ వీసాపై భారత్కు వచ్చి నగరంలో పాగా వేశారు. వీరిద్దరు పాత్రధారులు కాగా.. లండన్లోని క్రిస్ట్ సూత్రధారి. ..ఇలా చిక్కారు అబిడ్స్ జగదీష్ మార్కెట్లోని ఎస్బీఐ ఏటీఎంలో వీటిని అమర్చుతుండ గా సెక్యూరిటీ గార్డుకు అనుమానం వచ్చింది. బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వగా స్కిమ్మర్లు ఉన్నట్లు గుర్తించారు. అధికారులు పోలీసులకు తెలియజేయడంతో సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. -
ఏటీఎంలకు వెళ్తున్నారా? బీ కేర్ఫుల్..
సాక్షి, విజయవాడ: ఏటీఎం కేంద్రాల వద్ద అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర మోసగాడిని సోమవారం గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 5 లక్షల 46వేలు నగదుతో పాటు హోండా యాక్టివాను స్వాధీనం చేసుకొన్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్లో డీసీపీ హర్షవర్ధన్ రాజు, నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. ఏటీఎం కేంద్రాల వద్ద నేరాలకు పాల్పడుతున్న నిందితుణ్ని తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన చింతల సురేష్ బాబుగా గుర్తించామని తెలిపారు. నిందితుడు చెడు వ్యసనాలకు బానిసై..ఏటీఎం కేంద్రాల వద్ద సహాయం చేస్తానని చెప్పి మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. జిల్లాలో 16 నేరాలతో పాటు గన్నవరంలో ఆరు ఏటీఎం కేంద్రాల వద్ద మోసాలకు పాల్పడినట్లుగా గుర్తించామని అన్నారు. గన్నవరంలోనే ఏటీఎం సెంటర్లో మరో మోసానికి సురేష్ బాబు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశామని చెప్పారు. ఏటీఎం కేంద్రాల వద్ద డబ్బులు డ్రా చేసుకునే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. అపరిచిత వ్యక్తులకు ఏటీఎం వివరాలు వెల్లడించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. -
ఏటీఎం దగ్గర కి‘లేడీ’ల చేతివాటం..
న్యూఢిల్లీ: ఏటీఎమ్ వద్ద మాజీ సైనికుడి నుంచి డబ్బులు దొంగిలించినందుకు ముగ్గురు మహిళలను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాలు.. దక్షిణ ఢిల్లీలోని హౌజ్ ఖాస్ గ్రామంలో నివసిస్తున్న 73 ఏళ్ల వ్యక్తి ఏటీఎమ్ నుంచి రూ.40,000 విత్డ్రా చేసి బయటకు వస్తున్న సమయంలో ముగ్గురు మహిళలు ఆయనను అడ్డుకొని బెదిరించి జేబులో నుంచి డబ్బులు లాక్కొని వెళ్లిపోయారు. ఆ సమయంలో ఏటీఎమ్లో, చుట్టుపక్కలా ఎవరూ లేకపోవడంతో నిరాశ్రయుడైన ఆ వృద్ధుడు చూస్తూ ఉండిపోయాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించాడు. ఏటీఎమ్లో డబ్బులు తీస్తున్న సమయంలో ఇద్దరు మహిళలు ఏటీఎమ్లోకి వచ్చారని.. వారిని బయట నిల్చొమని చెప్పినా వినలేదని.. అక్కడ సమయానికి ఎవరు లేకపోవడంతో ఏమీ చేయలేకపోయానని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించగా ఆ ముగ్గురి నిందితుల బాగోతం బయటపడింది. అనంతరం ముగ్గురు మహిళలు దొంగింలించిన డబ్బులను పంచుకోడానికి ఓ పార్కులోకి వచ్చారని సమాచారం అందడంతో అప్రమత్తమైన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన మొత్తాన్ని పోలీసులు బాధితుడికి అందించారు. నిందితులు మధ్యప్రదేశ్లోని రాజ్ఘర్ జిల్లకు చెందిన వారని, వీరికి మరో కేసుతో కూడా సంబంధం ఉందని పోలీసులు వెల్లడించారు. పండగలు, వేడుకలు వంటి సీజన్లలో నగరానికి వచ్చి రద్దీ ఎక్కువగా ఉండే బ్యాంకులు, మార్కెట్లు, ఏటీఎమ్ ప్రదేశాలలో సంచరించి అనుకూలంగా ఉన్న సమయంలో ఇలా వ్యక్తుల నుంచి డబ్బులు, ఆభరణాలు దొంగిలిస్తారని పోలీసులు తెలిపారు. -
డూప్లి కేట్గాళ్లు!
నెల్లూరు (క్రైమ్): ఏటీఎం కేంద్రాల వద్ద రెక్కీ వేస్తారు. వృద్ధులు, నిరక్షరాస్యులే వారి లక్ష్యం. ఏటీఎంల్లో నగదు విత్డ్రా చేయడంలో వారికి సాయం చేస్తున్నట్లు నటిస్తూ స్కిమ్మింగ్ మెషిన్ ద్వారా వారి ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేస్తున్నారు. వీటి ద్వారా నకిలీ ఏటీఎం కార్డులను తయారు చేసి ఖాతాల్లోని నగదు దోచేస్తున్నారు. జిల్లాలో గతేడాది కలిగిరిలో ఈ తరహా నేరానికి పాల్పడ్డారు. ఇటీవలి కాలంలో ఈ తరహా నేరాలు అధికం కావడంతో పోలీసులు నిఘా పెంచారు. ఎట్టకేలకు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తీగ లాగితే డొంక కదిలిందన్న చందాన 14 రాష్ట్రాల్లో వారి నేరాలు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం నెల్లూరు నగరంలోని ఉమేష్చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వివరాలను వెల్లడించారు. హరియాణా రాష్ట్రం భివానీ జిల్లా భవానీకేడ తాలూకా బార్సీ గ్రామానికి చెందిన సందీప్కుమార్, మంజీత్ సోదరులు. సందీప్కుమార్ ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నప్పటికీ సాంకేతిక పరిజ్ఞానంపై మంచి పట్టు ఉంది. తమ సమీప బంధువు జగ్జీత్తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. నేరాలు ఇలా చేస్తారు.. ఏటీఎం కేంద్రాల వద్ద ఉంటారు. స్కిమ్మింగ్ మెషిన్ను బ్లూటూత్ సహాయంతో ఫోన్కు అనుసంధానం చేస్తారు. ఎవరైనా నగదు డ్రా చేయమని సాయం కోరితే నగదు డ్రా చేస్తున్నట్లు నటించి వారి ఏటీఎం కార్డునుస్కిమ్మర్ సాయంతో స్వైప్ చేసి కార్డు డేటాను తస్కరిస్తారు. వారి పిన్ వివరాలను గమనించి వాటిని బుక్లో నోట్ చేసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి జారుకుని ఫోన్లోని వివరాలను రైటర్ డివైజ్ ద్వారా నకిలీ ఏటీఎం కార్డులోకి మార్చుకుంటారు. వాటిని వినియోగించి ఖాతాలోని నగదును కాజేస్తారు. అందిన కాడికి దోచుకెళ్తున్నారు.. ఎవరూ ఊహించని రీతిలో నేరాలకు పాల్పడుతున్న ఈ ముఠా లక్ష్యం వృద్ధులు, నిరక్షరాస్యులు, దినసరి కూలీలు. వారైతే కేసులు వరకు వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నది వారి అభిప్రాయం. వారి ఖాతాల్లో నుంచి రూ.5 వేలు, రూ.10 వేలు ఇలా దొరికిన కాడికి దోచుకెళతారు. 14 రాష్ట్రాల్లో వెయ్యికిపైగా నేరాలు నిందితులు 14 రాష్ట్రాల్లో వెయ్యికి పైగా నేరాలకు పాల్పడ్డారు. హరియాణా నుంచి వారు రోడ్డు మార్గాన ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో నిర్దేశిత ప్రాంతాలకు చేరుకుంటారు. ఎయిర్పోర్టు సమీపంలో డ్రైవర్ రహిత కార్లను అద్దెకు తీసుకుని నేరాలు చేసేందుకు బయలుదేరుతారు. వారు అనుకున్న లక్ష్యాలకు చేరుకోగానే కారును ఎయిర్పోర్టులో అప్పగించి తిరిగి తమ గమ్యస్థానాలకు వెళ్లిపోతారు. ఒక్కో ట్రిప్పులో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు దోచేసి అందులో రూ.లక్షకు పైగా తమ రవాణా, వ్యక్తిగత అవసరాలకు వెచ్చిస్తారు. మిగిలిన సొమ్మును సమానంగా పంచుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తిలో, హైదరాబాద్లో రెండు నేరాలకు పాల్పడ్డారు. రూ.25 వేల సొత్తున దోచుకెళ్లారు. నెల్లూరు జిల్లాల్లో 16 కేసుల్లో రూ.3.17 లక్షలు, శ్రీకాకుళంలో ఎనిమిది కేసుల్లో రూ.95 వేలు, విశాఖపట్నంలో 8 కేసుల్లో రూ.లక్ష, అనంతపురం జిల్లాలో ఏడు కేసుల్లో రూ.80 వేలు, గుంటూరు జిల్లాలో మూడు కేసుల్లో రూ.17 వేలు, కర్నూలు జిల్లాలో నాలుగు కేసుల్లో రూ.60 వేలు, ప్రకాశం జిల్లాలో రెండు కేసులో రూ.10 వేలు దోచుకెళ్లారు. విచారణ వేగవంతం ఈ తరహా నేరాలపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి లోతుగా దర్యాప్తు చేపట్టారు. సూళ్లూరుపేట, చెన్నై, విజయవాడ, హైదరాబాద్, కర్ణాటక, హరియాణా రాష్ట్రాల్లో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఇటీవల వైజాగ్లో ఉన్నారని సమాచారం రావడంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కానీ అప్పటికే వారు అక్కడి నుంచి జారుకున్నారు. అయినప్పటికీ వారి కోసం గాలిస్తుండగా శుక్రవారం నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ పడమర వైపునున్న ఏటీఎం కేంద్రం వద్ద నిందితులు ఉండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదు, కారు, స్కిమ్మింగ్ మెషిన్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందికి రివార్డులు నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రతిభ కనపరిచిన ఇన్స్పెక్టర్లు ఐ.శ్రీనివాసన్, పి.అక్కేశ్వరరావు, ఎం.నాగేశ్వరమ్మ, పి.బాజీజాన్సైదా, ఎస్సైలు జేపీ శ్రీనివాసులురెడ్డి, బాబీ, శేఖర్బాబు, విజయకుమార్, బలరామయ్య, ఏఎస్సైలు వెంకటేశ్వర్లు, బుజ్జయ్య, హెడ్కానిస్టేబుల్స్ వారీస్, టి.సుబ్రహ్మణ్యం, సీహెచ్ సుబ్రహ్మణ్యం, కానిస్టేబుల్స్ మహేంద్రనాథ్రెడ్డి, వినోద్, రమేష్కృష్ణ, దుర్గారావు, గౌస్బాషా, నరేష్, శివనారాయణ తదితరులను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. బయటపడిందిలా.. ఏడాది క్రితం జిల్లాలో తొలి సారిగా ఈ ముఠా కలిగిరిలో ఈ తరహా నేరానికి పాల్పడింది. ఇటీవల ఢిల్లీ నుంచి చెన్నైకు చేరుకున్న నిందితులు అద్దె కారు తీసుకున్నారు. నెల్లూరు బొల్లినేని హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఏటీఎంలో భారతమ్మ అనే మహిళకు సాయం చేస్తున్నట్లు నటించి కార్డు వివరాలను సేకరించారు. వాటిని వినియోగించి వింజమూరులోని ఓ ఏటీఎంలో నగదు డ్రా చేశారు. ఆమె దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అక్కడి ఏటీఎం కార్డులోని సీసీ టీవీ ఫుటేజ్ వివరాలను సేకరించారు. వింజమూరులోని పోలీసులు ఏటీఎం కేంద్రంలోని సీసీ టీవీ ఫుటేజ్ వివరాలను సేకరించారు. రెండింటిని పరిశీలించగా నేరం చేసిన వారు ఒక్కరేనని నిర్ధారణ కావడంతో వారి కోసం నిఘా ఉంచి పట్టుకున్నారు. దీంతో 14 రాష్ట్రాల్లో జరిగిన నేరాల పుట్ట కదిలింది. -
ఏటీఎం పగులకొట్టి..
సాక్షి, నిడదవోలు(పశ్చిమగోదావరి) : సమిశ్రగూడెం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) వద్ద ఉన్న ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగినట్లు ఎస్సై టీవీ సురేష్ శుక్రవారం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం ఈనెల 5వ తేదీ సాయంత్రం ఐఓబీ ఏటీఎంలో రూ.5 లక్షల నగదును పెట్టగా అర్థరాత్రి రెండుగంటల సమయంలో ఒక వ్యక్తి చొరబడి ఏటీఎంను పగులకొట్టాడు. సీసీ కెమెరాలను గోడలవైపు తిప్పాడు. ఏటీఎంలోని నగదును దోచేయడానికి ప్రయత్నించగా లాకర్ తెరవకపోవడంతో దొంగ వెళ్లి పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఏటీఎంలో ఇంకా రూ.4.47 లక్షల నగదు ఉన్నట్లు బ్యాంక్ మేనేజర్ యాలంగి రాజేష్ ఫోన్కు శుక్రవారం ఉదయం మెసేజ్ వచ్చింది. బ్యాంక్ వద్ద ఘట నాస్థలాన్ని, బ్యాంకులోని సీసీ కెమెరా పుటేజ్ను కొవ్వూరు డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి, నిడదవోలు సీఐ కేఏ స్వామి పరిశీలించారు. ఏటీఎంలో నగదును చోరీ చేసేందుకు వచ్చిన దొంగ ముఖానికి నలుపు గుడ్డ కట్టుకుని, చేతులకు తొడుగులు వేసుకుని లోపలికి వచ్చి ఏటీఎం పగుల కొట్టినట్లు తెలుస్తోంది. కొవ్వూరు నుంచి క్లూస్టీం వచ్చి ఏటీఎంలోని వేలిముద్రలను సేకరించారు. బ్యాంక్ మేనేజర్ రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ చెప్పారు. -
యువకుడి పై కేసు..మనస్ధాపంతో ఆత్మహత్య
-
ప్రాణం తీసిన భయం..
సాక్షి, శ్వారావుపేట: తనపై పోలీసులు కేసు నమోదు చేశారేమోననే భయానికి గురయిన ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన అశ్వారావుపేట గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసు సిబ్బంది ధనదాహానికి తమ బిడ్డ బలయ్యాడని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు. కానిస్టేబుళ్లు అడిగిన లంచం ఇచ్చామని, అయినా కొట్టారని, ఆ దెబ్బలకు, కేసుకు భయపడి బాలుడి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబీకులు ఆరోపించారు. కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శింగారెడ్డి కల్యాణ్కుమార్(17) తన సమీప బంధువులు, మిత్రులతో కలిసి ఆదివారం అర్ధరాత్రి జంగారెడ్డిగూడెం రోడ్లోని స్టేట్బ్యాంక్ ఏటీఎంకు వెళ్లారు. నగదు విత్డ్రా చేసేందుకు ప్రయత్నించగా నగదు రాకపోవడంతో మిషన్ను వీరిలో ఒకరు కాలితో తన్నగా మిషన్ పాక్షికంగా ధ్వంసమయింది. తెల్లారి సోమవారం ఈ విషయం ఏటీఎంకు వెళ్లిన వినియోగదారుల ద్వారా బయటకు పొక్కింది. అంతకుముందు రోజు గుర్రాల చెరువు రోడ్లోని ఆంధ్రాబ్యాంకు ఏటీఎంపై కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఈ వరుస సంఘటనలు అశ్వారావుపేటలో సంచలనం సృష్టించాయి. స్టేట్బ్యాంకు ఏటీఎంలో చోరీకి యత్నం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో మిషన్ను కాలితో తన్నిన అశోక్ అనే యువకుడు పోలీస్స్టేషన్కు వెళ్లి సీఐ ఎం అబ్బయ్య వద్ద అంగీకరించాడు. కానీ ఫిర్యాదు, సీసీ ఫుటేజీ లేనందున కేసు నమోదు కాలేదు. అంతటితో సమస్య ముగిసిపోయిందనకున్నారు. బెయిల్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పడంతో.. యువకుల తల్లిదండ్రులు మంగళవారం రాత్రి వరకు బ్యాంకు సిబ్బంది కాళ్లా వేళ్లా పడి బతిమిలాడి కేసు పెట్టొద్దని కోరారు. ఏటీఎంకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు. కాగా ఏటీఎంకు వెళ్లిన నలుగురిలో అశోక్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి మిగిలిన ముగ్గురు యువకులను సాక్షులుగా పేర్కొన్నారు. కానీ బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్కు వెళ్లిన అశోక్తోపాటు మిగిలిన ముగ్గురికీ బెయిల్కు ఏర్పాటు చేసుకోవాలని కానిస్టేబుళ్లు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో బెయిల్ ఏర్పాట్ల కోసం ఓ న్యాయవాది ఇంటికి కల్యాణ్, అతని బంధువులు వెళ్లారు. సదరు న్యాయవాది పోలీస్ స్టేషన్కు ఫోన్చేసి మాట్లాడుతుండగా ఏడేళ్లు శిక్ష అనే పదం ఫోన్ సంభాషణలో వచ్చింది. ఆ మాట వినగానే కల్యాణ్ ఒంటరిగా ఇంటికి వచ్చాడు. న్యాయవాదితో మాట్లాడి కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేసరికి కల్యాణ్ ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు ఉరి విప్పి అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. కాగా మృతుడు తమ కుటుంబానికి చెందిన టిఫిన్ సెంటర్లోనే పనిచేస్తుంటాడు. మృతదేహంతో ఠాణాకు.. ప్రభుత్వాసుపత్రి వద్ద విచారణకు వచ్చిన సీఐ ఎం అబ్బయ్యను మృతుడి బంధువులు నిలదీశారు. కల్యాణ్ను సాక్షిగా పేర్కొంటే ముద్దాయిలాగా రెండ్రోజులపాటు ఠాణా చుట్టూ ఎందుకు తిప్పారని, నలుగురు కానిస్టేబుళ్లు డబ్బులు ఎందుకు వసూలు చేశారని ప్రశ్నించారు. ధనార్జనకు పసివాడిని బెదిరించడంతోపాటు శారీరకంగా, మానసికంగా గాయపరిచారని.. తీవ్ర ఒత్తిడికి లోనయి.. జైలు శిక్ష పడుతుందనే భయంతో కల్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. బంధువులు, మిత్రులు తీవ్ర ఆగ్రహానికి గురై మృతదేహాన్ని చేతులమీద మోసుకుంటూ జాతీయ రహదారిపై కిలోమీటర్ మేర శవయాత్ర నిర్వహించి ఠాణాకు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా రహదారిపై మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. సీఐ అబ్బయ్య నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆందోళనకారులు శాంతించలేదు. జనం గుమిగూడటం, పోలీసులు చెదరగొట్టడం ఇలా నాలుగు గంటలపాటు సాగిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కల్యాణ్ మృతికి కారణమైన నలుగురు కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆందోళనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. భద్రాచలం, రాజమండ్రి, ఏలూరు, ఖమ్మం మార్గాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. డీఎస్పీ ప్రవేశంతో.. ఆందోళన వద్దకు చేరుకున్న పాల్వంచ డీఎస్పీ మధుసూదనరావు లాఠీ చేబూని ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు. ఆందోళనను బలవంతంగా విరమింపజేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతదేహాన్ని తరలించేందుకు తెచ్చిన ప్రైవేటు అంబులెన్స్ స్టార్ట్ కాకపోవడంతో ఫర్లాంగు దూరం పోలీసులు నెట్టుకెళ్లారు. ఆ తర్వాత అంబులెన్స్ తాళం ఎవరో దొంగిలించారని డ్రైవర్ చెప్పడంతో ఆటోలో పోస్టుమార్టానికి తరలించారు. తొలుత డీఎస్పీ రెండు గంటల పాటు పోలీస్స్టేషన్లో కూర్చుని పెద్దమనుషులతో చర్చలు జరిపినా సఫలం కాలేదు. చివరకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి ఆందోళనకారులను పంపేయడం గమనార్హం. -
ఏటీఎంలకు తాళం..!
ముంబై: పట్టణ ప్రాంతాల్లో ఖాతాదారులు బ్యాంకింగ్ లావాదేవీల కోసం డిజిటల్ విధానాలవైపు మళ్లుతుండటంతో ఏటీఎంలు, బ్యాంకు శాఖల అవసరం క్రమంగా తగ్గుతోంది. దీంతో పభ్రుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కూడా వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా వీటిని తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఏటీఎంలు, శాఖల ఏర్పాటు, నిర్వహణ భారం తడిసి మోపెడవుతుండటం ఇందుకు కారణం. గడిచిన ఏడాది కాలంలో టాప్ 10 ప్రభుత్వ రంగ బ్యాంకులు సుమారు 5,500 ఏటీఎంలు, 600 పైచిలుకు శాఖలను మూసివేసినట్లు ఆయా బ్యాంకుల త్రైమాసిక ఆర్థిక ఫలితాల నివేదికల ద్వారా తెలుస్తోంది. ఓవైపు పెరిగిపోతున్న మొండిబాకీలు, మరోవైపు రుణ వృద్ధి లేకపోవడం వంటి అంశాలతో లాభాలు సాధించడానికి పీఎస్బీలు నానా తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా ఎస్బీఐ.. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాŠంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ మధ్య కాలంలో 420 శాఖలు, 768 ఏటీఎంలను మూసివేసింది. ఇక విలీనమైన బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా, దేనా బ్యాంక్లు ఇదే వ్యవధిలో మొత్తం 40 శాఖలు, 274 ఏటీఎంలను మూసివేశాయి. ఇలా బ్రాంచీలను, ఏటీఎంలను తగ్గించుకున్న పీఎస్బీల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ మొదలైనవి కూడా ఉన్నాయి. పది బ్యాంకుల్లో తొమ్మిది బ్యాంకులు ఏటీఎంలను తగ్గించుకోగా, ఆరు బ్యాంకులు శాఖలను కూడా తగ్గించుకున్నాయి. ఈ వ్యవధిలో ఒక్క ఇండియన్ బ్యాంక్ మాత్రమే ఏటీఎంలు, శాఖల నెట్వర్క్ను పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా..నగరాల్లోనే...: మూసివేతల ధోరణి ఎక్కువగా నగరాల్లోనే కనిపిస్తోంది. పెద్ద పట్టణాలు, నగరాల్లో బ్యాంకింగ్ నెట్వర్క్ విస్తృతంగా ఉండటం, ఖాతాదారులు కూడా డిజిటల్ లావాదేవీల నిర్వహణకు అలవాటు పడుతుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ‘ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎంలు, శాఖల మూసివేత ఎక్కువగా మెట్రో నగరాల్లోనే ఉంటోందే తప్ప గ్రామీణ ప్రాంతాలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇలాంటి ధోరణులు లేవు‘ అని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ పల్లవ్ మహాపాత్ర తెలిపారు. ‘ఇది డిమాండ్పరమైన అంశం. తీవ్రమైన పోటీ ఉన్న మెట్రోల్లోనే అసంఖ్యాకంగా శాఖలు, ఏటీఎంలు ఎందుకు ఏర్పాటు చేయాలి. మెట్రో నగరాల్లో ఏదైనా ఏటీఎం వినియోగం చాలా తక్కువగా ఉంటే దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏం ఉంది‘ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇది లాభదాయకతతో ముడిపడి ఉన్న విషయంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీ ఎన్ దామోదరన్ పేర్కొన్నారు. ‘ఏటీఎంలు, శాఖల మూసివేత అన్నది ఎక్కువగా వ్యాపారపరమైన లాభదాయకత అంశానికి సంబంధించినది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా శాఖలు, ఏటీఎంల క్రమబద్ధీకరణ ప్రక్రియ కొనసాగుతుంది‘ అని ఇటీవల బ్యాంకు ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన తెలిపారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా గతేడాది 36 శాఖలు, 1,269 ఏటీఎంలను మూసివేసింది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. క్రమంగా కస్టమర్లు డిజిటల్ మాధ్యమాల ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలకు అలవాటుపడే కొద్దీ ఏటీఎంలు, శాఖల అవసరం చాలా మటుకు తగ్గిపోతుందని ప్రభుత్వ రంగ బ్యాంకుకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కొన్నాళ్లు పోతే గ్రామీణ ప్రాంతాల్లో ఖాతాదారులు కూడా డిజిటల్ బాట పడితే.. ఆయా ప్రాంతాల్లో కూడా శాఖలు, ఏటీఎంలపరమైన వ్యయాలను బ్యాంకులు తగ్గించుకుంటాయని పేర్కొన్నారు. డిజిటల్ మాధ్యమంతో పోలిస్తే వీటిపై పెట్టుబడుల భారం భారీగా ఉంటోంది కాబట్టి ఖాతాదారుల బ్యాంకింగ్ అలవాట్లు మారే కొద్దీ .. ఇలాంటి మూసివేతలు సాధారణ ట్రెండ్గా మారే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రైవేట్ విస్తరణ.. ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఏటీఎంలు, శాఖలను మూసివేస్తుండగా .. మరోవైపు ప్రైవేట్ బ్యాంకులు మాత్రం క్రమంగా తమ నెట్వర్క్ను విస్తరిస్తున్నాయి. గత ఏడాది వ్యవధిలో యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజాలన్నీ తమ బ్యాంకింగ్ నెట్వర్క్ను విస్తరించాయి. అయితే, రిజర్వ్ బ్యాంక్ గణాంకాల చూస్తే ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రధాన నగరాల్లోనే ఏటీఎంలు ఏర్పాటు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే విషయంలో ఈ బ్యాంకుల ఏటీఎంలు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ అయిదు ఏటీఎంలలో ప్రభుత్వ రంగ బ్యాంకు ఏటీఎం ఒకటి ఉంటుండగా, ప్రైవేట్ రంగ బ్యాంకుల విషయం తీసుకుంటే ప్రతి పదింటిలో ఒకటి మాత్రమే ఉంటోంది. -
బైక్ మోజులో పడి.. మేనత్తకే కన్నం
ప్రకాశం ,కందుకూరు: అధునాతన బైక్ మోజులో పడి ఓ యువకుడు సొంత మేనత్త ఇంటికే కన్నం వేశాడు. మేనత్త డబ్బులతో బైక్ అయితే కొన్నాడుగానీ చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన కందుకూరు పట్టణంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ విజయ్కుమార్ వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. పాలేటి హైమావతి అనే మహిళ పట్టణంలోని కోటకట్ట వీధిలో నివాసం ఉంటోంది. ఆమె మేనల్లుడు శబరీష్. అతడికి సాయి, అన్వీకుమార్ అనే పేర్లు కూడా ఉన్నాయి. శబరీష్కు ఆధునిక బైక్ అంటే మోజు. తాను నచ్చిన బైక్ కొనేందుకు మేనత్త ఏటీఎం కార్డును కాజేశాడు. సొంత మేనల్లుడే కావడంతో ఆమె కార్డు పిన్ నంబర్ శబరీష్ తెలుసుకున్నారు. కార్డు తీసుకుని మిత్రులు గుర్రం సిద్ధార్థ, ఇండ్లా ప్రవీణ్, దేవర్ల సాయికుమార్తో కలిసి సింగరాయకొండ వెళ్లారు. అక్కడ ఏటీఎం సాయంతో రూ.48 వేలు డ్రా చేశారు. కేసు వివరాలు వెల్లడిస్తున్న సీఐ విజయ్కుమార్ అనంతరం నెల్లూరు వెళ్లారు. అక్కడ ద్విచక్ర వాహన షోరూమ్కు వెళ్లి కెటిఎం డుకే–2000 బైకు కొన్నాడు. దీనికి రూ.70 వేలు కార్డు ద్వారా స్వైప్ చేశారు. బైక్కు అన్ని హంగులు అమర్చేందుకు రూ.1,31,000 నగదు పద్మ పూజిత ఫైనాన్స్ నుంచి తీసుకున్నారు. ఈ క్రమంలో తన ఏటీఎం పోయిన విషయాన్ని హైమావతి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు విచారణ చేయడంతో అసలు విషయం బయట పడింది. మేనత్త ఇంట్లో కార్డు దొంగలించిన శబరీష్తో పాటు మిగిలిన ముగ్గురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.25 వేల నగదుతో పాటు బైకును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వీరిలో గుర్రం సిద్ధార్థ, ఇండ్లా ప్రవీన్ అనే వారు మైనర్లు కావడంతో ఒంగోలు జువైనల్ కోర్టుకు, మిగిలిన ఇద్దరిని స్థానిక కోర్టులో హాజరు పర్చనున్నట్లు సీఐ వివరించారు. ఆయనతో పాటు పట్టణ ఎస్ఐ కేకే తిరుపతిరావు, ఇతర సిబ్బంది ఉన్నారు. -
ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలంటే ఓటీపీ
ఏటీఎంల నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులతో డబ్బులను డ్రా చేసుకోవచ్చు.. కానీ, కెనరా బ్యాంకు ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలంటే మాత్రం ఓటీపీని ఎంటర్ చేయాల్సిందే. కాకపోతే ఒక రోజులో రూ.10,000 ఆ పై మొత్తాలకే ఈ ఓటీపీ నిబంధన. ‘‘కెనరా బ్యాంకు ఏటీఎంలలో నగదు ఉపసంహరణలు ఇప్పుడిక మరింత సురక్షితం. రోజులో రూ.10,000కు మించి చేసే నగదు విత్ డ్రాయల్స్ ఓటీపీతో మరింత సురక్షితం కానున్నాయి. ఈ అదనపు ఆథెంటికేషన్ కార్డుదారుల ప్రమేయం లేకుండా అనధికారిక లావాదేవీలు జరగకుండా నిరోధిస్తుంది’’ అని కెనరా బ్యాంకు తన ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వరంగంలోని ఎస్బీఐ కార్డు లేకపోయినా, కస్టమర్లు తమ యోనో యాప్ సాయంతో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణల సేవను ఆరంభించిన విషయం తెలిసిందే. -
నగరంలో ఏటీఎం క్లోనింగ్ ముఠా
విశాఖపట్నం, అల్లిపురం(విశాఖ దక్షిణం): ఏటీఎం క్లోనింగ్ ముఠాకు చెందిన ఒక వ్యక్తిని సైబర్ క్రైం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సైబర్ క్రైం సీఐ వి.గోపీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం... హర్యాణాకు చెందిన డ్రైవర్ వీరేంద్ర సింగ్, కులదీప్సింగ్ స్నేహితులు. వీరివురు సులువుగా డబ్బు సంపాదించాలని సందీప్ సింగ్ అనే వ్యక్తితో కలిసి ఏటీఎం క్లోనింగ్ ద్వారా ఏటీఎం కార్డు రూపొందించారు. దాని సాయంతో సులువుగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది జనవరిలో కులదీప్ సింగ్, సందీప్ సింగ్లు ఢిల్లీ నుంచి విమానంలో నగరానికి వచ్చి విశాలాక్షినగర్లో గల సీ పిరల్ హోటల్లో గదులు బుక్ చేసుకుని విడిదిచేశారు. తరువాత నగరంలో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం సెంటర్లలో వినియోగదారుల కార్యకలాపాలను రహస్యంగా వీడియో రికార్డింగ్ చేసేవారు. ఏటీఎం కార్డు నంబరు, పిన్ నంబర్లను సేకరించి కార్డు క్లోనింగ్ చేసేవారు. ఒక్కోసారి వృద్ధులు, ఏటీఎం కార్డు వినియోగించలేని వారి నుంచి కార్డులు మార్చేసేవారు. తరువాత అక్కడి నుంచి హోటల్ గదికి వచ్చి కార్డులు క్లోనింగ్ చేసి తిరిగి సాయంత్రానికి హర్యాణా వెళ్లిపోయేవారు. అక్కడ ఏటీఎం కార్డుల ద్వారా రాంచీ, అంధేరీ, ముంబయి, అసన్సోల్, డియోఘర్, షిరిడీ ప్రాంతాల్లో డబ్బులు డ్రా చేసేవారు. తిరిగి ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలలో పలుమార్లు వచ్చి ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేసి వాటి ద్వారా సుమారు రూ.60 లక్షలు డ్రా చేసుకుని వెళ్లారు. ఈ మేరకు రూ.50వేలలోపు డబ్బు గుర్తు తెలియని వ్యక్తులు డ్రా చేసినట్లు బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో 40 కేసులు నమోదైనట్లు సీఐ తెలిపారు. అదే విధంగా తాజాగా ఈ నెల 21వ తేదీన కులదీప్ సింగ్, వీరేంద్రసింగ్ స్పైస్ జెట్ విమానంలో 12.30గంటల ప్రాంతంలో నగరానికి చేరుకుని మధురవాడలో విడిది చేశారు. గణేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్కు ఫోన్ చేసి దిలీప్ అనే వ్యక్తి నుంచి ద్విచక్రవాహనం తీసుకున్నారు. ఆ బైకు ఉపయోగించి 22వ తేదీన నగరంలో విశాలాక్షినగర్, గోపాలపట్నం, మధురవాడ ప్రాంతాల్లో ఎస్బీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా, యాక్షిస్ బ్యాంకు ఏటీఎం సెంటర్లలో వీరంద్రసింగ్ ఏటీఎం కార్డుల వివరాలు సేకరిస్తుంటే కులదీప్ సింగ్ బయట ఉండి పర్యవేక్షిస్తూ కార్డులు క్లోనింగ్ చేశాడు. కులదీప్సింగ్, వీరేంద్ర సింగ్ నగరానికి వచ్చినట్లు తెలుసుకున్న సైబర్ క్రైం పోలీసులు వారు విడిది చేసిన హోటల్ రూంలో తనిఖీలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న కులదీప్ సింగ్ అక్కడి నుంచి పారిపోయాడు. గదిలో ఉన్న వీరేంద్రసింగ్ను అదుపులోకి తీసుకున్నామని సీఐ గోపీనాథ్ తెలిపారు. అతని వద్ద నుంచి క్లోనింగ్ చేసిన నాలుగు ఏటీఎం కార్డులు, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం కార్డు ఒకటి, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఏటీఎం సెంటర్లలో అపరిచితులను నమ్మొద్దు ఏటీఎం సెంటర్లలో అపరిచితులతో కార్డుల ద్వారా డబ్బు డ్రా చేయటం, పిన్ నంబర్లు చెప్పటం చేయవద్దని సైబర్ క్రైం సీఐ వి.గోపీనాథ్ సూచించారు. అలా చేయడం వల్ల ఏటీఎం కార్డులు మార్చేసే అవకాశంతో పాటు పిన్ నంబరు అపహరించే అవకాశం ఉందని, తద్వారా డబ్బులు డ్రా చేసే ప్రమాదం ఉందని తెలిపారు. నగరంలో క్లోనింగ్ ముఠా సంచరిస్తున్నట్లు సమాచారం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సీఐ సూచించారు. -
ఎక్కడండీ.. ఏటీఎం?
సాక్షి, బిజినెస్ విభాగం: పెద్ద నోట్ల రద్దు తర్వాత మూగబోయిన ఏటీఎంలు ఆ తర్వాత కాలంలో వినియోగంలోకి వచ్చినా కానీ, ఎందుకో గతంలో మాదిరిగా విరివిగా అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు తరవాత గత రెండు సంవత్సరాల కాలంలో నగదు లావాదేవీలు పెరిగిపోగా, ఏటీఎంల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టింది. ఆర్బీఐ తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. బ్రిక్స్ దేశాల్లో ఒక్క భారత్లోనే లక్ష మంది ప్రజలకు అతి తక్కువ ఏటీఎంలు ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పేర్కొంది. ఇటీవలి కాలంలో ఏటీఎంల సంఖ్య తగ్గిపోవటానికి అసలు కారణం వాటిపై బ్యాంకులు చేస్తున్న ఖర్చులు పెరిగిపోవటమేనని తెలుస్తోంది. ఆర్బీఐ నిర్దేశించిన కఠిన నియమ, నిబంధనలకు తోడు... లావాదేవీలకు అవుతున్న చార్జీలను కస్టమర్ల నుంచి పూర్తి స్థాయిలో రాబట్టుకోలేకపోవడం, ఏటీఎం కేంద్రం నిర్వహణ, సెక్యూరిటీ ఖర్చు వెరసి బ్యాంకులకు ఆర్థికంగా భారం కావడంతో, దాన్ని తగ్గించుకునే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. గతేడాది సాఫ్ట్వేర్, ఎక్విప్మెంట్ల ఆధునికీకరణ కోసం ఆర్బీఐ ఆదేశించడం వల్ల ఏటీఎంల నిర్వహణ వ్యయం పెరిగిపోయింది. దీంతో రానున్న కాలంలోనూ ఏటీఎంల క్షీణత ఉంటుందని అంచనా. పెరిగిన వినియోగం... ‘‘ఏటీఎంల సంఖ్య తగ్గడం ప్రజలపై ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా పిరమిడ్లో సామాజిక, ఆర్థికంగా దిగువవైపున ఉండే వారిపై ఈ ప్రభావం ఉంటుంది’’ అని ఏటీఎం మెషీన్ల సరఫరా కంపెనీ హిటాచి పేమెంట్ సర్వీసెస్ ఎండీ రస్టోమ్ ఇరానీ అభిప్రాయపడ్డారు. భారత్లో ఏటీఎంల విస్తరణ చాలా తక్కువగా ఉందని ఇరానీ పేర్కొన్నారు. వ్యయాలు పెరిగిపోవటమనేది ఏటీఎంల నిర్వహణపై బ్యాంకులను ఆలోచనల్లో పడేస్తోంది. ఎందుకంటే లావాదేవీలపై విధించే ఫీజు ద్వారా వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటోంది. పరిశ్రమ కమిటీ ఆమోదం లేనిదే ఈ ఫీజులను పెంచే పరిస్థితి లేదు. బ్యాంకులు, థర్డ్ పార్టీ సంస్థలు మన దేశంలో ఏటీఎంలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంటర్చేంజ్ ఫీజుగా డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో నగదు ఉపసంహరణ లావాదేవీపై ఇవి రూ.15ను వసూలు చేస్తున్నాయి. ఇంటర్చేంజ్ ఫీజు ఏటీఎంల వృద్ధి ఆగిపోవడానికి ప్రధాన కారణమని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్.గాంధీ తెలిపారు. బ్యాంకులు తాము సొంతంగా ఏటీఎంలను నిర్వహించడం కంటే వేరే బ్యాంకులకు ఇంటర్చేంజ్ ఫీజు చెల్లించడం చౌకగా భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఫీజులను పెంచడం పరిష్కారమని అందరూ భావించడం లేదని, ఒకవేళ ఫీజులు పెంచితే ఆ భారాన్ని బ్యాంకులు కస్టమర్లకే బదిలీ చేస్తాయని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సీఈవో ఆర్.సుబ్రమణ్యకుమార్ పేర్కొన్నారు. పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు మోదీ సర్కారు చేపట్టిన డీమోనిటైజేషన్ లక్ష్యాల్లో డిజిటల్ లావాదేవీల పెంపు కూడా ఒకటి. మోదీ సర్కారు చేపట్టిన జన్ధన్ యోజన తదితర కార్యక్రమాల ఫలితంగా 2014 తర్వాత 35 కోట్ల మందికి పైగా కొత్తగా బ్యాంకు సేవలకు అనుసంధానమయ్యారు. దీంతో ఏటీఎం వంటి కనీస ఆర్థిక సేవల అందుబాటు కీలకంగా మారింది. ఏటీఎంల సంఖ్య తగ్గుముఖానికి ఇతర అంశాలూ కనిపిస్తాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య స్థిరీకరణ మరో ప్రధాన అంశం. చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయడం కూడా ఏటీఎంలు తగ్గడానికి కారణం. ఇక దేశంలోని ప్రతి రెండు ఏటీఎంలలో ఒకటి బ్యాంకు శాఖల వద్ద ఉన్నదే. దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ 2018 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఏకంగా 1,000 ఏటీఎంలను తగ్గించుకోవడం గమనార్హం. డిజిటలైజేషన్ పెరిగిపోవడం, మొబైల్, ఇంటర్నెట్ వ్యాప్తి సామాన్యులకూ చేరువ కావడంతో భవిష్యత్తులో బ్యాంకులు శాఖలపై ఆధారపడడం తగ్గిపోనుందని ఎస్బీఐ ఎండీ దినేష్కుమార్ ఖరా తెలిపారు. మొబైల్ యాప్స్ను ఆశ్రయిస్తున్న ఖాతాదారులు పెరుగుతున్నట్టు ఫెడరల్బ్యాంకు సీఎఫ్వో అశుతోష్ఖజూరియా తెలిపారు. గత ఐదేళ్లలో మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు 65% పెరిగాయి. మొబైల్ బ్యాం కింగ్ జోరుతో ఏటీఎంల సంఖ్య ఇక ముందూ తగ్గనుందనేది పరిశ్రమ వర్గాల అంచనా. -
3 ఏటీఎంలు.. 7 రోజులు.. రూ. 19 లక్షలు
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో మూడు ఏటీఏంలలో కలిపి సుమారు 89 మంది అకౌంట్ల నుంచి దాదాపు రూ. 19 లక్షల వరకు విత్ డ్రా చేశారు. ఈ సంఘటనలన్ని తిలక్ నగర్ ఏరియా పరిధిలోనే జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం గురించి పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘ఈ నెల ఒకటవ తేదీన తిలక్ నగర్ ఏరియాలో మొదటి ఫిర్యాదు నమోదయ్యింది. తన ఏటీఎం నుంచి తనకు తెలియకుండానే డబ్బు విత్డ్రా అయినట్లు ఓ వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేశాడు. రెండు మూడు రోజుల్లోనే బాధితుల సంఖ్య పెరగడంతో ఈ కేస్ను సీరియస్గా తీసుకున్నాం’ అన్నారు. ఆ అధికారి మాట్లాడుతూ.. ‘ఒకే ఏటిఎం నుంచి సొమ్ము విత్డ్రా అవుతున్నట్లు గుర్తించిడంతో.. దీని వెనక ఓ గ్యాంగ్ ఉన్నట్లు భావించాం. ఓ వైపు ఈ కేసుల గురించి దర్యాప్తు కొనసాగుతుండగా.. మరోవైపు ఫిర్యాదుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అయితే ఈ సారి మరో రెండు ఏటీఎంల నుంచి కూడా సొమ్ము డ్రా చేసినట్లు మా దృష్టికి వచ్చింది. మొత్తం వారం రోజుల వ్యవధిలో 89 మంది అకౌంట్ల నుంచి దాదాపు రూ. 19 లక్షల సొమ్ము డ్రా చేసినట్లు గుర్తించా’మని సదరు అధికారి తెలపారు. అంతేకాక నిందితులు ఏటీఎంలలో స్కిమ్మింగ్ మెషన్లను అమర్చడం ద్వారా ఈ నేరాలకు పాల్పడుతుండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. రోమానియాకు చెందిన కార్డ్ క్లోనింగ్ గ్యాంగ్ ఈ నేరాలకు పాల్పడుతుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తమ సైబర్ బృందం ఈ కేసును చేధించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఓ బాధితుడు మాట్లాడుతూ.. ‘నేను ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సక్షన్లు చేయ్యను. నాకు నా అకౌంట్ నుంచి దాదాపు 50 వేల రూపాయలు విత్డ్రా చేశారు. ఇందుకు సంబంధించి నాకు ఎలాంటి ఫోన్ కానీ.. మెసేజ్ కానీ రాలేద’ని తెలిపారు. -
ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
దుండిగల్: ఏటీఎంలో చోరీకి యత్నించిన ఇద్దరు వ్యక్తులను దుండిగల్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఏసీపీ నర్సింహరావు, సీఐ వెంకటేశం కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సూరారం కాలనీ2 భవానీ నగర్కు చెందిన ఎం.డి.షకీర్ ఎలక్ట్రిషీయన్గా పని చేసేవాడు. సంగారెడ్డి రాంనగర్కు చెందిన సాయి విక్రమ్ సెంట్రింగ్ పనులు చేస్తూ షకీర్ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. చెడు వ్యసనాలకు బానిసైన వీరు సులువుగా డబ్బులు సంపాదించడానికి ఏటీఎం ను కొల్లగొట్టాలని నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 12న రాత్రి సూరారం ఓం జెండా సమీపంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం లో చోరీ చేసేందుకు వెళ్లగా జన సంచారం ఉండడంతో విరమించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా సూరారం కాలనీ లాస్ట్బస్టాప్ సమీపంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వద్దకు వెళ్లారు. ఏటీఎం మెషిన్ను తొలగిస్తుండగా ఓ వ్యక్తి అక్కడికి రావడంతో భయంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఏటీఎం నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులు షకీర్, సాయి విక్రమ్లను గుర్తించి అదుపులోకి తీసుకుని సోమవారం రిమాండ్కు తరలించారు. -
58.97 లక్షలు కొట్టేసిన కేసులో కీలక పురోగతి
-
డబ్బులు డ్రా చేసినా అకౌంట్లో కట్ అవ్వవు..
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో కొత్త తరహా ‘ఏటీఎం సైబర్ క్రైమ్’ వెలుగులోకి వచ్చింది. డబ్బు డ్రా చేసుకోవడానికి వస్తున్న కొన్ని ముఠాలు మిషన్కు సాంకేతిక ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఫలితంగా డబ్బు డ్రా అయినా.. కానట్లే రికార్డు అవుతోంది. ఈ పంథాలో సౌత్ ఇండియన్ బ్యాంక్నకు రూ.1.3 లక్షలు టోకరా వేశారు. ఈ బ్యాంకు అధికారులు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక ఆధారాలను బట్టి ఇది హరియాణా సరిహద్దుల్లోని మేవాట్ రీజియన్కు చెందిన ముఠాగా అనుమానిస్తున్నారు. ఏటీఎం యంత్రంలో డిపాజిట్ చేసిన నగదుకు, విత్డ్రా అయిన దానికి మధ్య తేడాను సౌత్ ఇండియన్ బ్యాంకు అధికారులు ఇటీవల గుర్తించారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఓ ఏటీఎం కేంద్రంలోని సీసీ టీవీల్లో రికార్డు అయిన ఫీడ్ను పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే మార్చి, ఏప్రిల్ నెలల్లో ఐదుసార్లు గుర్తుతెలియని వ్యక్తులు ఈ మొత్తం డ్రా చేసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాలో రికార్డు అయిన వివరాల ప్రకారం.. ముందుగా ఆ ఏటీఎం కేంద్రంలోకి ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. ఏటీఎం కేంద్రానికి విద్యుత్ సరఫరా అయ్యే ప్రాంతంలో ఒకరు సిద్ధంగా ఉంటుండగా... మరో వ్యక్తి ఏటీఎంలో కార్డుతో డబ్బు డ్రా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మొదట ఓ వ్యక్తి తమ వద్ద ఉన్న ఏటీఎం కార్డు వినియోగించి లావాదేవీ మొత్తం పూర్తి చేస్తున్నాడు. మిషన్ నుంచి డబ్బు బయటకు వచ్చిన తర్వాత.. ట్రాన్సాక్షన్ పూర్తి కావడానికి మధ్య నాలుగైదు సెకన్ల తేడా ఉంటోంది. ఆ సమయం తర్వాతే లావాదేవీ పూర్తయినట్లు స్క్రీన్పై డిస్ప్లే కావడంతో పాటు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఎస్సెమ్మెస్ వస్తుంది. ఈ అతితక్కువ సమయాన్నే ఈ గ్యాంగ్ తమకు అనుకూలంగా మార్చుకుంది. ఆ సమయంలోనే ఏటీఎంకు విద్యుత్ సరఫరా అయ్యే చోట ఉన్న వ్యక్తి పవర్ సప్లయ్ ఆపేయడం ద్వారా సదరు మిషన్కు సాంకేతిక సమస్య సృష్టిస్తున్నారు. దీంతో ఏటీఎం నుంచి డబ్బు బయటకువచ్చినా అందులో మాత్రం సదరు లావాదేవీ ఫెయిల్ అయినట్లు నమోదు అవుతోంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ స్లిప్ కూడా ప్రింట్ అయి వస్తోంది. ఇలా డబ్బు తీసుకున్నా దాన్ని ఏటీఎం లెక్కల్లోకి ఎక్కకుండా చేస్తున్నారు. ప్రధానంగా సెక్యూరిటీ గార్డులు లేని, కాస్త పాత ఏటీఎం మిషన్లనే ఈ ముఠా టార్గెట్ చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ గ్యాంగ్ సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి ఒకే రోజు డబ్బు తీయకుండా మార్చి 3, 21 తేదీలతో పాటు ఏప్రిల్ 27, 28, 29 తేదీల్లో డ్రా చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్తో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏటీఎంలో డబ్బులు పెట్టే వ్యాన్లో చోరీ
-
వనస్థలిపురంలో భారీ దోపిడీ..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో భారీ దోపిడి జరిగింది. ఏటీఎంలో డబ్బులు పెట్టే వ్యాన్ల నుంచి భారీ మొత్తంలో నగదును దోచుకెళ్లారు. ఏటీఎంలో డబ్బులు పెడుతుండగా.. సిబ్బంది దృష్టి మరల్చి దాదాపు 58లక్షలను దుండగులు దోచుకెళ్లారు. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు పెడుతుండగా ఈ చోరి జరిగింది. దీనిపై పోలీసులు మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ.. అటెన్షన్ డైవెర్షన్తో వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిదిలో భారో చోరీ జరిగిందన్నారు. పనామా వద్ద యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు జమ చేయడానికి నలుగురు సిబ్బంది వచ్చారని తెలిపారు. వాహనంలో నుంచి డబ్బులు తీసుకెళ్లి జమ చేస్తుండగా.. దుండగులు దృష్టి మళ్లించి డబ్బులు ఉన్న పెట్టెను ఎత్తుకెళ్లారన్నారు. పెట్టెలో దాదాపు 58లక్షలు వరకు ఉండొచ్చన్నారు. చోరీ ఎలా జరిగిందనే విషయంపై విచారిస్తున్నట్లు, ఆ గ్యాంగ్లో 5 మంది ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
కరెన్సీ కటకట!
కర్నూలు(అగ్రికల్చర్): నగదు కొరత అన్ని వర్గాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆర్బీఐ నగదు సరఫరాను పూర్తిగా తగ్గించింది. ప్రభుత్వ పథకాల అత్యవసరాలకు మినహా డబ్బు రావడం లేదు. ఎవరైనా డిపాజిట్ చేస్తే తప్ప ఇతరులకు చెల్లింపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. డిపాజిట్ చేసే వాళ్లు లేకపోవడం, చెల్లింపులు ఎక్కువగాఉండటంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో బ్యాంకర్లతో ఖాతాదారులు గొడవలకు దిగుతున్నారు. నగదు సమస్యతో ఆంధ్రా, ఎస్బీఐ తదితర బ్యాంకులకు చెందిన ఏటీఎంలు మూత పడ్డాయి. జిల్లాలో ఎస్బీఐకి దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఒక ఆర్బీఐ కరెన్సీ చెస్ట్ ఉండేది. ఆలూరు, పత్తికొండ, డోన్, బనగానపల్లె, కోవెలకుంట్ల, బేతంచెర్ల, ఆళ్లగడ్డ ఆత్మకూరు, నందికొట్కూరు, శ్రీశైలం కరెన్సీ చెస్ట్లు మూతపడ్డాయి. ప్రభుత్వం నాలుగో విడత రుణమాఫీ నిధులను రైతుల ఖాతాలకు జమ చేస్తోంది. కష్టాల్లో కూరుకపోయిన రైతులు నగదును విత్డ్రా చేసుకునేందుకు పోతే డబ్బు లేదని వెనక్కిపంపుతున్నారు. నగదు సమస్యతో 70 శాతం నుంచి 80 శాతం వరకు చెల్లింపులు ఆగిపోయాయి. ఉద్యోగులకు మార్చి నెల వేతనాలు ఏప్రిల్ మొదటి వారంలోనే బ్యాంకు ఖాతాలకు జమ అయినప్పటికీ నగదు కొరత కారణంగా తీసుకోలేని పరిస్ధితి ఏర్పడింది. ఏటీఎంల్లో డబ్బులు పెట్టడం బాగా తగ్గిపోయింది. పెట్టినా రెండు గంటల్లోనే ఖాళీ అవుతున్నాయి. బ్యాంకులకు పోతే నగదు లేదు... తర్వాత రండనే సమాధానం వస్తోంది. జిల్లాలో నగదు సమస్యలను ఎప్పటికప్పుడు ఎల్డీఎం.. రిజర్వు బ్యాంకు దృష్టికి తీసుకెళ్తున్నా ఫలితం ఉండడం లేదు. పెద్ద నోట్లు రద్దు తర్వాత ఆర్బీఐ నుంచి నగదు రావడం 70 శాతం తగ్గిపోయింది. ‘పసుపు–కుంకుమ’కు డబ్బుల్లేవ్.. సాధారణ ఎన్నికల నేపథ్యంలో నగదు నిల్వలన్నీ రాజకీయ పార్టీలు, నాయకులకు వెళ్లిపోయాయి. దీంతో పోలింగ్కు ముందు నగదు సమస్య ఏర్పడింది. పోలింగ్ తర్వాత పసుపు–కుంకుమ రూపంలో నగదు కొరత ఉత్పన్నమైంది. పోలింగ్కు ముందు రాజకీయ పార్టీల నేతలు నగదును బ్లాక్ చేయడంతో కరెన్సీ కొరత ఏర్పడింది. మొదటి, రెండో విడత పసుపు–కుంకుమ చెక్లకు నగదు చెల్లించేందుకు ఆర్బీఐ నుంచి ప్రత్యేకంగా నగదు వచ్చింది. అందువల్ల ఇబ్బంది కలుగలేదు. మూడో విడత చెక్కులకు నగదు సమస్య మరింత ఎక్కువైంది. ఏటీఎంల మూత... పెద్దనోట్లు రద్దు నాటి పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి. జిల్లాలో ప్రధాన బ్యాంకులైన ఎస్బీఐ, ఆంధ్రబ్యాంకుతో సహా ఏ బ్యాంకులోనూ డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఎస్బీఐ మెయిన్ బ్రాంచికి అనుసంధానంగా దాదాపు 57 ఏటీఎంలు ఉన్నాయి. ఒక్కో ఏటీఎంలో రోజుకు రూ.20 లక్షలు పెడుతారు. ఇందుకు రూ.11.40 కోట్లు అవసరం అవుతాయి. బ్యాంకుకు డిపాజిట్ల రూపంలో రోజుకు రూ.2 కోట్లు కూడా రావడంలేదు. దీంతో ఏటీఎంల నిర్వహణ ప్రశ్నార్థకం అవుతోంది. కెనరా బ్యాంకు, ఏపీజీబీ, ఇండియన్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులు నగదు సమస్యతో సతమతం అవుతున్నాయి. మామూలుగా అయితే బ్యాంకుల్లో 100 కోట్లకు పైగా నగదు ఉండాలి. జిల్లాలోని 445 బ్రాంచీల్లోను రూ.10 కోట్లు నగదు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 485 ఏటీఎంలు ఉండగా 50 శాతం మూత పడ్డాయి. డిజిటల్ లావాదేవీలు నామమాత్రమే... పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలకు ప్రధాన్యం ఏర్పడింది. డిజిటల్ లావాదేవీలను ప్రొత్సహించాలనే లక్ష్యంతో ఆర్బీఐ నగదు సరఫరాను తగ్గించేసి.. ఏకంగా కరెన్సీ చెస్ట్లనే జిల్లాకు ఒకటి, రెండు మినహా అన్నిటిని మూసేసింది. డిజిటల్ లావాదేవీలు నామమాత్రం కావడం... నగదు లావాదేవీలు ఎక్కువగా ఉండటం, నగదు ప్లో తగ్గిపోవడంతో సమస్యలు పెరుగుతున్నాయి. జిల్లాలో జన్ధన్ ఖాతాలు 6.93 లక్షలు, ఎస్బీ ఖాతాలు 40 లక్షలకు పైగా ఉన్నాయి. డిజిటల్ లావాదేవీలు 5 శాతం కూడా లేకపోడం గమానార్హం. బ్యాంకు ఖాతాలకు ఆన్లైన్ సదుపాయం లేకపోవడంతో ఇది సాధ్యం కాని పనిగా మారిపోయింది. -
‘స్కిమ్మింగ్’తో దోపిడీ!
సాక్షి, సిటీబ్యూరో: డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎంలకు వెళ్తున్నారా? అయితే మీరు జాగ్రత్తగా వ్యవహరించకపోతే మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బులు మాయం కావచ్చని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడూ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఏ మార్గమైనా డబ్బులే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణీ ప్రియదర్శిని పేర్కొన్నారు. బ్యాంక్ ప్రతినిధులమంటూ ఫోన్కాల్స్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు తెలుసుకొని నగదు మాయం చేసే నేరగాళ్లు... ఇప్పుడు రూటు మార్చి ‘స్కిమ్మింగ్’ చేసి డబ్బులు డ్రా చేస్తున్నారని వెల్లడించారు. గత కొంతకాలంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని బ్యాంక్ ఏటీఎంలలో స్కిమ్మింగ్ తరహా జరిగిన మోసాలను గుర్తు చేస్తూ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలా చేస్తే మంచిది... ♦ ఏటీఎంలో కార్డు రీడర్పై స్కిమ్మర్లను అమరుస్తారు. దీంతో పాటు ఏటీఎం పిన్ తెలుసుకోడానికి కీప్యాడ్కు వ్యతిరేకంగా పైభాగంలో చిన్న కెమెరాతో కూడిన స్కానర్ను కూడా ఉంచుతారు. ఏటీఎంలోకి వెళ్లినప్పుడు ఈ పరికరాలు ఉన్నాయా? అనేది పరిశీలించాలి. ♦ శివార్లలో ఉండే, జన సంచారం ఎక్కువగా లేని, సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎంలకు వెళ్లకపోవడమే మంచిది. ♦ పిన్ టైప్ చేసేటప్పుడు చెయ్యి అడ్డుపెట్టుకోవడం సురక్షితం. ♦ నగదు విత్డ్రా చేయగానే మొబైల్కు మెసేజ్లు వచ్చేలా ఎస్ఎంఎస్ అలర్ట్లు పెట్టుకోవాలి. ♦ చాలామంది కస్టమర్లు ఫోన్ నంబర్లను మార్చినా బ్యాంకు అధికారులకు తెలపడంలో నిర్లక్ష్యం వహిస్తారు. ఫోన్ నంబర్ మార్చితే తక్షణమే బ్యాంకు ఖాతాకు కొత్త ఫోన్ నంబరును అనుసంధానం చేసుకోవాలి. ♦ బ్యాంక్ ఖాతా నుంచి మన ప్రమేయం లేకుండానే నగదు ఉపసంహరణ జరిగితే వెంటనే కస్టమర్ కేర్ నంబర్కు ఫోన్ చేసి మన ఏటీఎం సేవలను స్తంభింపజేసుకోవాలి. వెంటనే సంబంధిత సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. స్కిమ్మింగ్ ఇలా... ప్రత్యేక పరికరాలను అమర్చి క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారాన్ని తస్కరించడాన్ని ‘స్కిమ్మింగ్’ అంటారు. ఇలా కార్డుల సమాచారాన్ని చౌర్యం చేయడానికి ఉపయోగించే పరికరాలను స్కిమ్మర్ పరికరాలు అంటారు. ఎంపిక చేసుకున్న ఏటీఎంలలో మోసగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా వీటిని అమరుస్తారు. కస్టమర్లు ఏటీఎం ద్వారా నగదు తీసుకునేందుకు కార్డును స్వైప్ చేసినప్పుడు, కార్డు మ్యాగ్నటిక్ స్ట్రిప్లోని సమాచారం, పిన్ నంబర్ను స్కిమ్మర్ సంగ్రహిస్తుంది. సేకరించిన సమాచారంతో మోసగాళ్లు ఆ తర్వాత నగదు తీసుకుంటున్నారు. దీని కోసం కూడా పలుదారులు ఎంచుకుంటున్నారు. ప్రధానంగా నకిలీ కార్డులను తయారు చేసి సుదూర ప్రాంతాల్లోని ఏటీఎంల ద్వారా నగదు తస్కరిస్తున్నారు. -
ఏటీఎంలో నకిలీ రూ. 2వేల నోటు
సాక్షి, భూదాన్పోచంపల్లి : ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే అందులో రూ.2వేల నకిలీ నోటు రావడంతో బాధితుడు ఖంగుతిన్న సంఘటన భూదాన్పోచంపల్లి మండలంలోని దేశ్ముఖిలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుడు దుర్గం లింగస్వామి తెలిపిన వివరాల ప్రకారం..దేశ్ముఖిలోని నిజాం ఇంజనీరింగ్ కళాశాలలో ఇండిక్యాష్ ప్రైవేట్ ఏటీఎం ఏర్పాటు చేశారు. లింగస్వామి ఏటీఎం నుంచి రూ. 10వేల చొప్పున రెండు సార్లు మొత్తం రూ. 20వేలు డ్రా చేశాడు. అనంతరం నోట్లను లెక్కిస్తుండగా అందులో రూ. 2వేల నకిలీ నోటు కనిపించింది. నిశితంగా పరిశీలించగా ‘భారతీయ బచ్చోంక బ్యాంకు, దో హాజార్ అంక్ ’ అని ఆ నోట్పై రాసి ఉంది. వెంటనే బాధితుడు ఏటీఎంలోని స్క్రీన్పై ఉన్న టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేయగా రిజర్వు బ్యాంకును సంప్రదించాలని వారు సలహా ఇచ్చారు. నకిలీ నోటు వల్ల తాను రూ.2వేలు నష్టపోయానని బాధితుడు వాపోయాడు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. -
సర్వీస్ పేరిట బాదుడు!
శ్రీకాకుళం, వీరఘట్టం: ఏటీఎం కార్డు వినియోగదారులు చేసే లావాదేవీలపై అన్ని బ్యాంకులు సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఏటీఎం కార్డు వినియోగించినా.. వినియోగించకపోయినా బాదుడు మాత్రం తప్పడంలేదు. జిల్లాలో సుమారు 7.50 లక్షల మంది బ్యాంకు సేవలను పొందుతున్నారు. ఎస్బీఐ 2017–2018లో రూ.140లు వసూలు చేస్తే 2018–2019లో రూ.206లు, ఆంధ్రా బ్యాంకు 2017–18లో రూ.120లు వసూలు చేస్తే 2018–19లో రూ.160లు సర్వీస్ చార్జీల పేరిట ఖాతాదారులపై భారం మోపుతున్నాయి. ఒక్కో ఖాతాదారుడు నుంచి సరాసరిన లెక్క వేస్తే జిల్లా వ్యాప్తంగా ఏడాదికి రూ.14 కోట్లు సర్వీస్ చార్జీల పేరిట వసూలు అవుతున్నట్లు అంచనా. వసతులు అంతంతమాత్రమే.. జిల్లాలో పలు ఏటీఎం సెంటర్లలో పూర్తి స్థాయి వసతులు లేవు. ఏసీలు పనిచేయవు. ప్రతి లావాదేవికి సంబంధించిన కచ్చితమైన డేటా తెలిసేలా స్లిప్లు రావటంలేదు. ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను కూడా నియమించడం లేదు. పూర్తిస్థాయి వసతులు కల్పించి సర్వీస్ చార్జీలు వసూలు చేస్తే బాగుంటుందని ఖాతాదారులు అభిప్రాయ పడుతున్నారు. అన్ని సేవలకు చార్జీలు కట్అవుతున్నాయి ఏటీఎం కార్డుతో ఆన్లైన్ ద్వారా చేసే ప్రతీ లావాదేవీకి సర్వీసు చార్జీల పేరిట డబ్బులు కట్ అవుతున్నాయి. మళ్లీ ఏడాదికి ఒకసారి సర్వీసు చార్జీలు వసూలు చేయడం సరికాదు.– భోగి మణి,మెడికల్ షాపు యజమాని, వీరఘట్టం -
రూ.1.40 వేలు మాయం!
శ్రీకాకుళం, ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం మండలంలోని లొద్దపుట్టి ఆదర్శ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న మిత్తన నిమ్మయ్య ఈ నెల 6న ఇచ్ఛాపురం ప్రభుత్వ పాఠశాలకు ఎదురుగా ఉన్న ఏటీఎం కేంద్రానికి వెళ్లి రూ.20 వేలు విత్ డ్రా చేశారు. సొమ్ము వచ్చినట్లు శబ్ధం వచ్చినప్పటికీ డబ్బులు రాలేదు. ఆయన టోల్ ఫ్రీ నంబర్ 1800112211కు ఫోన్ చేయడంతో పాటు స్థానిక ఎస్బీఐ మేనేజర్కు సమాచారం అందించారు. అదే రోజు రాత్రి మరలా బ్యాంకు ఖాతాలో రూ.20వేలు చేరినట్లు మేసేజ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అక్కడకు మూడు రోజుల అనంతరం 10వ తేదీ రాత్రి 12 గంటల సమయంలో వరుసగా రూ.20వేలు, రూ.40వేలు, రూ.20వేలు, రాత్రి 12 తర్వాత రూ.40వేలు మొత్తం రూ.1లక్షా 40వేలు విత్ డ్రా అయినట్లు వచ్చిన మెసేజ్ను ఉదయం చూసి అవాక్కయ్యారు. ఈ సొమ్మును రాజస్తాన్ రాష్ట్రంలో ఏటీఎం నుంచి విత్డ్రా చేసినట్లు మేసేజ్ రావడంతో మరలా బ్యాంకు సిబ్బందిని ఆశ్రయించడంతోపాటు ఈ నెల 17న ఇచ్ఛాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేటికి వారం రోజులు కావస్తున్నప్పటికీ ఎటువంటి పురోగతి కనిపించకపోవడంతో సోమవారం ఆయన విలేకరులను ఆశ్రయించి తన గోడును వెళ్లబుచ్చారు. తన సొమ్మును తనకు ఇప్పించాలంటూ ఆయన బ్యాంకు, పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. -
ఏటీఎంల దొంగ అరెస్టు
చిత్తూరు, పీలేరు రూరల్ : ఏటీఎంల వద్ద అమాయకులను మోసం చేస్తూ వారి ఖాతా ల నుంచి నగదు డ్రా చేసే ఘరానా మోసగాడిని పీలేరు అర్బన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పీలేరు అర్బన్ సీఐ చిన్నపెద్దయ్య కథనం.. మేరకు అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొక్కంటిక్రాస్కు చెందిన షేక్ షఫీ(39) ఏటీఎంల వద్ద చోరీలు చేయడంలో సిద్ధహస్తుడు. ఏటీఎంల వద్ద నిరక్షరాస్యులు, వృద్ధులకు సాయం చేస్తున్నట్లు నటిస్తూ వారి పిన్ నంబర్లను తెలుసుకుని వారికి తెలియకుండా నగదు డ్రా చేయడం, కుదరకపోతే తన వద్ద ఇతర ఏటీఎం కార్డులను వారికిచ్చి తరువాత డబ్బులు డ్రా చేసేవాడు. ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబర్ 4న పీలేరుకు చెందిన టెంకాయల వ్యాపారి జి.చంద్రశేఖర్ అతని భార్య స్థానిక క్రాస్ రోడ్డులోని ఏటీఎం వద్ద నగదు డ్రా చేసుకునేందుకు ఇబ్బంది పడుతుండగా వారిని గమనించిన షఫీ సాయం చేస్తానంటూ వారి కార్డు తీసుకుని రూ.4వేలు తీసిచ్చాడు. వారి ఖాతాల్లో మరింత డబ్బు ఉండడం గమనించి అప్పటికే తన వద్దనున్న అదే రకం కార్డు వారికిచ్చి పంపేశాడు. ఆ తర్వాత వారి కార్డుతో షఫీ అదేరోజు రాత్రి తిరుపతిలో రూ.20వేలు విత్డ్రా చేశాడు. మరుసటి రోజు తిరుపతిలోని వేర్వేరు బంగారు దుకాణాల్లో కార్డు ఉపయోగించి రూ.29వేలు విలువచేసే ఉంగరం రూ.63వేలు విలువచేసే బ్రాస్లెట్ కొన్నాడు. తాము మోసపోయామని గ్రహించిన చంద్రశేఖర్ దంపతులు పీలేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏటీఎం, బంగారు షాపుల్లో సీసీ టీవీల పుటేజీ ఆధారంగా ఈ కేటుగాడిని పోలీసులు గుర్తించారు. పీలేరులోని యాక్సిస్ ఏటీఎం వద్ద అమాయకులను బురిడీ కొట్టించే ప్రయత్నంలో ఉన్న అతగాడిని అరెస్ట్ చేశారు. అతని నుంచి ఒక ఏటీఎం కార్డు, 20వేల రూపాయలు, బంగారు ఉంగ రం, బ్రాస్లెట్ స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు. ఇతడు కర్ణాటక, మహారాష్ట్రతో పాటు చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలోని దాదాపు 35 ఏటీఎంలలో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసు ల విచారణలో తేలింది. కార్యక్రమంలో ఎస్ఐలు సుధాకరరెడ్డి, వినాయకం, పోలీసు సిబ్బంది అల్తాఫ్, నరసింహులు, ఆది తదితరులు పాల్గొన్నారు. -
ముఖం చూపిస్తే.. డబ్బులిస్తుంది
డబ్బులు కావాలంటే.. ఏటీఎంకి వెళ్లి తీసుకుంటాం. ఆ మెషీన్లో కార్డు ఉంచి పిన్ నంబర్ ఎంటర్ చేసి.. కావాల్సిన డబ్బులు తీసుకుంటాం. అయితే ఆ పిన్ నంబర్ మర్చిపోయినా.. వేరే అపరిచితులకు ఆ నంబర్ తెలిసినా ఇబ్బందులు తప్పవు. అందుకోసం బ్యాంకులు చాలా ఏర్పాట్లు చేశాయి. కానీ స్పెయిన్లోని బార్సిలోనా సిటీలో ఉన్న ఓ బ్యాంకు డబ్బులు తీసుకునేందుకు ఏటీఎం కేంద్రాల్లో వినూత్నమైన ఏర్పాటు చేసింది. ఏంటంటే మన ముఖాన్ని గుర్తుపట్టి డబ్బులు ఇచ్చే నూతన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా డబ్బులు ఇచ్చే ఏటీఎం ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి కావడం విశేషం. అక్కడి కెయిక్సా బ్యాంకు ఈ టెక్నాలజీని వాడుకుంటోంది. దీనిద్వారా మన డబ్బు ఎంతో సేఫ్గా డ్రా చేసుకోవచ్చని బ్యాంకు చైర్మన్ జోర్డీ గాల్ తెలిపారు. ఏటీఎంలోని కెమెరా మన ముఖంలోని దాదాపు 16 వేల అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మనకు డబ్బు ఇస్తుందట. అంతేకాదు నిరక్షరాస్యులు కూడా చాలా సులభంగా ఈ ఏటీఎంల ద్వారా ఎంతో సురక్షితంగా డబ్బును తీసుకోవచ్చు. ఈ ఏడాది చివరికి బార్సిలోనా పట్టణంలో అన్ని ఏటీఎం కేంద్రాల్లో ఈ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు కెయిక్సా బ్యాంకు సీఈవో గొంజాలో చెబుతున్నారు. -
చెత్త వేస్తే..వేడి వేడి టీ..స్పెషల్ ఏటీఎం
కుంభమేళాలో ఒక స్పెషల్ ఏటీఎం ఆకర్షణీయంగా నిలిచింది. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ప్రయోగాత్మకంగా ఒక టీ ఏటీఎంను అధికారులు ఏర్పాటు చేశారు. దీని విశేషమేమింటే.. చెత్త లేదా పనికిరాని బాటిళ్లను ఈ మెషీన్లో వేస్తే.. వేడి వేడి టీ మీకు అందిస్తుంది ఈ టీ ఏటీఎం మెషీన్. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో నగర పరిశుభ్రతను, పర్యావరణాన్ని కాపాడేందుకు అక్కడి అధికారులు ఇన్నోవేటివ్ ఐడియా తో ముందుకు వచ్చారు. అటు పుణ్యం.. ఇటు పురుషార్ధం అన్నమాట.. కుంభమేళాలో చలితో వణకుతున్న భక్తులకు వేడి వేడి టీ ఉపశమనాన్ని ఇవ్వడంతోపాటు.. నగర శుభ్రతకు కూడా ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. కుంభమేళాలో ఇలాంటి తొలిసారిగా ఇలాంటి ఏటీఎం ను వాడుతున్నామని.. ఇన్ఫ్రారెడ్ సెన్సర్ ద్వారా ఈ మెషీన్ పనిచేస్తుందని చెప్పారు. కాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా చెప్పుకుంటున్న ప్రయాగ్రాజ్(అలహాబాద్)లోని త్రివేణి సంగమం వద్ద అర్ధకుంభమేళా సందడి మొదలైంది. జనవరి 15 నుంచి మార్చి 4 వరకు జరిగే ఈ మహా ఉత్సవంలో సుమారు 12 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారని అంచనా. -
కార్డు ఉంటేనే డిపాజిట్!
కుత్బుల్లాపూర్: ఐచ్చికంగా ఉండాల్సిన విధి విధానాలను బలవంతంగా వినియోగదారులపై రుద్దుతున్నారు బ్యాంక్ అధికారులు. తమ టార్గెట్లు చేరుకునేందుకు ఖాతాదారులను పావులుగా వాడుకుంటున్నారు. తమ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయాలన్నా సరే గ్రీన్ కార్డు లేదా ఏటీఎం కార్డు ఉండాల్సిందేనంటూ ఖాతాదారులకు చుక్కలు చూపిస్తున్నారు. కుత్బుల్లాపూర్ పరిధి సుచిత్ర రోడ్డులో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ (కుత్బుల్లాపూర్ శాఖ)లో ఖాతాదారులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. కార్డు ఉటేనే డిపాజిట్ల స్వీకరణ సాధారణంగా బ్యాంకుల్లో ‘గ్రీన్ చానల్’ పేరిట పేపర్ వినియోగం తగ్గించేందుకు డిపాజిట్ కౌంటర్ల వద్ద స్వైపింగ్ మెషిన్లు ఏర్పాటు చేసి తద్వారా డిపాజిట్లు స్వీకరిస్తున్నారు. ఒక వేళ కార్డు లేకపోతే సంబంధిత ఫామ్ మీద వివరాలు రాసి డిపాజిట్కు అనుమతిస్తారు. అయితే ఈ ఎస్బీఐ బ్రాంచ్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా సాగుతోంది. ఫారం నింపి డబ్బులు ఇస్తే తీసుకోమంటూ బ్యాంక్ అధికారులు తిరస్కరిస్తున్నారు. ఏటీఎం కార్డు లేకపోతే బ్యాంక్ వారు జారీ చేస్తున్న గ్రీన్ కార్డుతో మాత్రమే డిపాజిట్లు స్వీకరిస్తామని తేల్చిచెబుతున్నారు. దీంతో నిరక్షరాశులు, నిరుపేదలైన ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.20కు గ్రీన్ కార్డు.. ఖాతాదారు తన ఏటీఎం కార్డును మరిచిపోయి బ్యాంక్కు వస్తే బయట ఉన్న సీడీఎం(క్యాష్ డిపాజిట్ మెషిన్)లో వేసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే రూ.20 చెల్లించి ఎస్బీఐ ‘గ్రీన్ రెమిట్ కార్డు’ తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ఇక వినియోగదారులు తిరిగి వెళ్లి ఏటీఎం కార్డు తీసుకురాలేక రూ.20 చెల్లించి గ్రీన్ కార్డును తీసుకుని డిపాజిట్లు చేసుకుంటున్నారు. ఈ రెండు పద్ధతుల్లో తప్ప ఇతర పద్ధతుల్లో ఇక్కడి అధికారులు ఏ మాత్రం క్యాష్ డిపాజిట్లను స్వీకరించడం లేదు. గ్రీన్ కార్డు ఆవశ్యకతను, దాని ఉపయోగాలను సానుకూలంగా ఖాతాదారులకు వివరించాల్సిన సిబ్బంది ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని బలవంతంగా గ్రీన్కార్డులను అంటగడుతున్నారని పలువురు ఖాతాదారులు వాపోతున్నారు. పైగా బ్యాంక్ ఆవరణలో గ్రీన్ కార్డు లేదా ఏటీఎం కార్డు ద్వారానే డిపాజిట్ స్వీకరిస్తామని ఎక్కడా నోటీసు కూడా పెట్టకపోవడంతో చాలా మంది ఖాతాదారులు కార్డు లేకుండానే బ్యాంక్కు రావడం, సంబంధిత అధికారులతో వాదులాడడం, లేదా బతిమిలాడడం సర్వసాధారణమైంది. ఇక్కడ అందరూ చదువుకున్న వారే.. కార్డు తెచ్చుకోవాల్సిందే.. ఈ విషయమై సంబంధిత బ్యాంక్ ఉన్నతాధికారిని ఖాతాదారులు సంప్రదించగా జనవరి 1వ తేదీ నుంచి పేపర్ లెస్ డిపాజిట్లను తీసుకుంటున్నామని, ఇది తమ బ్యాంక్లో తప్పనిసరని చెప్పుకొచ్చారు. మరి కార్డులు తీసుకురాని వారి పరిస్థితి ఏమిటని అడగ్గా ‘ఇది పట్టణ ప్రాంతం.. అందరూ చదుకున్న వాళ్లే ఉంటారు. కార్డు తెచ్చుకోకపోతే మేమేమీ చేయలేమంటూ’ స్పష్టం చేశారు. మరో అధికారి స్పందిస్తూ అత్యవసర సమయంలో మాత్రమే డిపాజిట్ స్లిప్లను అనుమతిస్తామని కొంచెం వెసలుబాటు మాటలు చెప్పారు. -
ఏటీఎంలకు వెళ్తున్నారా? ఇలాంటోళ్లుంటారు జాగ్రత్త!
చిత్తూరు , బి.కొత్తకోట: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఏటీఎం కేంద్రాల వద్ద కాపుకాసి నగదు ఉపసంహరణతో అమాయకులను మోసం చేస్తున్న కర్ణాటక వాసిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం బి.కొత్తకోట ఎస్ఐ రాంభూపాల్ కథనం..స్థానిక రంగసముద్రం రోడ్డుకు చెందిన ఎస్.షాహీదా బుధవారం సాయంత్రం తన భర్త ఏటీఎం కార్డు తీసుకుని నగదు కోసం జ్యోతిచౌక్ సమీపంలోని ఏటీఎం కేంద్రానికి వచ్చింది. అక్కడే తచ్ఛాడుతున్న ఓ యువకుడిని నగదు తీసి ఇవ్వమని ఆమె కోరింది. ఆ యువకుడు ఏటీఎంలో కార్డుపెట్టి, పిన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత నగదు రాలేదని, ఇంకో ఏటీఎంకు వెళ్లమని చెప్పాడు. నిజమే కాబోలని నమ్మిన వాహీదా దిగువ బస్టాండ్లోని ఏటీఎం వద్దకు వెళ్తుండగా రూ.4,500 నగదు డ్రా చేసినట్లు సెల్ఫోన్కు మెస్సేజి రావడంతో ఆమె బిత్తరపోయింది. తనను గుర్తు తెలియని యువకుడు మోసం చేసి డబ్బులు డ్రా చేసినట్టు గ్రహించింది. నేరుగావెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తక్షణమే స్పందించిన పోలీసులు ఏటీఎం కేంద్రాల వద్ద నిఘా వేశారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేసేసరికి అతడి బండారం బట్టబయలైంది. అతగాడి పేరు ఎల్.గురుమూర్తి (24). కర్ణాటక రాష్ట్రం చింతామణి తాలూకా యనమలపుడి పంచాయతీ ముస్తురి వాసి అని తేలింది.షాహీదాను మోసం చేయడమే కాకుండా కర్ణాటకలోని హోటకోటలో ఏటీఎంలలో మోసాలకు పాల్బడటంపై అతడిపై రెండు కేసులు నమోదైనట్టు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి గురుమూర్తిని అరెస్ట్ చేశారు. -
కరెన్సీ కష్టాలు!.
పండుగ వేళ జిల్లా వాసులకు నగదు కష్టాలు వెంటాడుతున్నాయి. ఏటీఎంల్లో బ్యాంకు అధికారులు పెడుతున్న క్యాష్ను జనం క్షణాల్లో ఊడేస్తున్నారు. దీనికి తోడు బ్యాంకుల్లో నగదును కూడా ఖాతాదారులు భారీగా విత్డ్రా చేయడంతో కరెన్సీ కష్టాలు నెలకొన్నాయి. రాజాం/ శ్రీకాకుళం: సుమారు రెండేళ్ల క్రితం ఏర్పడిన నగదు కష్టాలు మళ్లీ చోటుచేసుకుంటున్నాయి. అప్పట్లో పెద్ద నోట్ల రద్దు కారణంగా నగదు కష్టాలు ఏర్పడగా, ప్రస్తుతం సంక్రాంతి నేపథ్యంలో జనం తమ ఖాతాల నుంచి నగదు ఒకేసారి తీస్తుండడంతో బ్యాంకుల్లో నగదు నిం డుకుంది. దీంతో అటు పట్టణ ప్రాంతంతో పాటు ఇటు పల్లె గ్రామాల్లో కూడా కరెన్సీ కష్టాలు అధికమయ్యాయి. గడచిన మూడు రోజులుగా ఏటీఎంలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అప్పుడప్పుడూ ఏటీఎంలలో నగదు పెడుతున్నా కొద్ది నిమిషాల్లోనే అవన్నీ ఖాళీ అవుతున్నాయి. ఈ నెల 8, 9 తేదీల్లో కొన్ని జాతీయ, ప్రైవేటు బ్యాంకులు సమ్మెలోపాల్గొన్నాయి. అప్పటి నుంచి ఖాతాదారులు నగదు కోసం ఏటీఎంలపైనే ఎక్కువుగా ఆధారపడుతూ వచ్చారు. సాధారణంగా నగదును తీసుకోవడానికి ఇటీవల ఎక్కువమంది ఖాతాదారులు ఏటీఎంలపైనే ఆధారపడుతున్నారు. ఈ విషయం బ్యాంకు అధికారులకు తెలియనది కాదు. బ్యాంకు యాజమాన్యాలు కూడా ఎటీఎంల వాడకాలను పెంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ వచ్చారు. ప్రచారం చేసినంతగా ఏటీఎంలను నిర్వహించడం లేదన్నది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. పండుగ పూట నగదు లావాదేవీలు ఎక్కువుగా జరుగుతాయి. అందుకు తగ్గట్టుగా అధికారులు ఏటీఎంలలో నగదును ఉంచే ఏర్పాట్లు చేయకపోవడంతో ఖాతాదారులకు ఇబ్బందులు తప్పలేదు. విత్డ్రాతో పాటు, ఈ కార్నర్లలో డిపాజిట్ చేసుకొనేందుకు కూడా ప్రజలు తంటాలు పడ్డారు. కొన్నిచోట్ల యంత్రాలు పనిచేయకపోగా, మరికొన్ని చోట్ల నగదు నిండుుకోవడంతో డిపాజిట్లు జరగలేదు. ఇలా అన్ని విధాలుగా ఖాతాదారులు నగదు కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మంగళవారం కూడా బ్యాంకులకు సెలవు కావడంతో ఆ రోజు కూడా అవస్థలు తప్పే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. పరిమిత విత్డ్రాలు.. రాజాంలో 27 బ్యాంకులకు చెందిన బ్రాంచిలు ఉన్నాయి. వీటిలో కూడా నగదు నిండుకుంది. ఒక్క రాజాం ఎస్బీఐ మెయిన్ బ్రాంచిలో మాత్రమే నగదు ఉంది. అక్కడ కూడా కొరతగా ఉండడంతో ఒక్కో ఖాతాదారునికి రూ. 10 వేలు మాత్రమే విత్డ్రా ఇస్తున్నారు. సంతకవిటి, రేగిడి, వంగరలో ఈ పరిస్థితి మరీదారుణంగా ఉంది. ప్రస్తుతం దాన్యం విక్రయిస్తున్న రైతులకు కూడా సకాలంలో నగదు అందని పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల్లో నగదులేక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం మా గ్రామంలోని బ్యాంకులో నగదు కొరత ఉంది. ఏటీఎం ద్వారా నగదు తీసుకోవడానికి రాజాం వస్తే ఏ ఏటీఎంలో డబ్బులు లేవు. పండగ సమయంలో నగదు కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నాం. – గుడ్ల అప్పారావు,రైతు, అప్పలఅగ్రహారం, సంతకవిటి మండలం. -
ఆమె 17 రోజులుగా ఏటీఎంకు వస్తూనే ఉంది..
ముంబై : తనను మోసం చేసి రూ.10వేలు ఎత్తుకెళ్లిన దొంగను 17 రోజలుగా మాటువేసి పట్టుకుని పోలీసులకు అప్పగించారు ముంబైకి చెందిన ఓ మహిళ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గత ఏడాది డిసెంబర్ 18న ముంబైకి చెందిన రెహనా షేక్ తన ఆఫీస్ దగ్గర్లో ఉన్న ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లారు. తన ఏటీఎం కార్డుతో రూ.10వేలు డ్రా చేశారు. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఆ డబ్బులు ఏటీఎం యంత్రం నుంచి బయటకు రాలేదు. ఇదంతా గమనించిన భూపేంద్ర మిశ్రా అనే వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. తాను ఒక్కసారి చూస్తానని చెప్పి ఆమె ఏటీఎం వివరాలు అడిగి తెలుసుకున్నాడు. నిందితుడు భూపేంద్ర మిశ్రా తాను ట్రై చేసిన డబ్బులు రావడంలేదని చెప్పి ఆమెకు కార్డు ఇచ్చి వెళ్లాడు. ఆమె కూడా టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల డబ్బులు రాలేదనుకొని ఆఫీస్కు వెళ్లింది. కాసేపటి తర్వాత ఆమె ఫోన్కు రూ.10 వేలు డ్రా తీసినట్లు మెసేజ్ వచ్చింది. అంతే అక్కడి వెళ్లి చూస్తే ఆ వ్యక్తి కనబడలేదు. ఏటీఎం వచ్చిన డబ్బులు భూపేంద్ర మిశ్రా తీసుకొని అక్కడి నుంచి హుటాయించాడు. విషయం తెలుసుకున్న రెహనా స్థానికి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రతి రోజు ఆ ఏటీఎం దగ్గరుకు వెళ్లి చుట్టు పక్కల వెతికారు. అలా 17 రోజులుగా ఆ ఏటీఎం దగ్గర మాటు వేసి చివరకు ఆ మోసగాన్ని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. భూపేంద్ర మిశ్రాపై ఇప్పటికే నాలుగు చీటింగ్ కేసులున్నాయని, ఆ పదివేల రూపాయలను కూడా మిశ్రానే దొంగిలించారని పోలీసులు తెలిపారు. నిందితునిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పేర్కొన్నారు. -
ఏటీఎంలో నో క్యాష్ : ఎస్బీఐకి ఫైన్
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకుల సేవింగ్ ఖాతాల్లో మినిమం బాలెన్స్ లేకపోతే కస్టమర్లను ఛార్జీలతో బాదేయడం మనకు తెలిసిందే. అయితే ఏటీఎంలో సరిపడినంత నగదు ఉంచడంలో ఫెయిలైన అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐకి భలే షాక్ తగిలింది. కస్టమర్ ఫిర్యాదును విచారించి వినియోగదారుల ఫోరం ఎస్బీఐకు జరిమానా విధించింది. అంతేకాదు ఇంటర్నెట్ ఫెయిల్యూర్, ఎస్బీఐ కస్టమర్ కాదు లాంటి కుంటిసాకులతో తప్పించుకోజూసిన బ్యాంకునకు మొట్టికాయలు కూడా వేసింది. వివరాల్లోకి వెడితే రాయపూర్కు చెందిన వినియోగదారుడు ఏటీఎంలో నగదు విత్ డ్రా కోసం వెళ్లినపుడు నో క్యాష్ అవైలబుల్ మెసేజ్ వెక్కింరిచింది. మూడుస్లారు ఇలాంటి చేదు అనుభవం ఎదురు కావడంతో చిర్రెత్తుకొచ్చిన సదరు కస్టమరు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. 2017 ఏడాదిలో మే, జూన్ నెలలో ఒకసారి, మరోసారి ఇలా మూడుసార్లు ఏటీఏంలో నగదు తీసుకోలేకపోయాననీ, ఈ వ్యవహారంలో తనకు న్యాయం చేయాల్సిందిగా కన్జ్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేశారు. దీన్ని విచారించిన కోర్టు అన్నిబ్యాంకులు ఏటీఏం సేవలపై ఏడాదికి ముందే ఫీజు నుకస్టమర్ల వద్దనుంచి వసూలు చేస్తున్నపుడు..ఏటీఏంలో నగదు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ఆయా బ్యాంకులకు ఉందని వినియోగదారుల ఫోరం తన తీర్పులో పేర్కొంది. మూడు సందర్భాల్లో ఏటీఎంలో క్యాష్ లభించపోవడంపై ప్రశ్నించింది. అయితే కేవలం ఇంటర్నెట్ వైఫల్యమని, దీనికి సర్వీసు ప్రొవైడర్ బాధ్యత వహించాలన్న ఎస్బీఐ వాదనను కూడా తోసి పుచ్చింది. అలాగే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని యూజర్ల నుంచి ఏడాదిలో ముందే ఛార్జి వసూలు చేస్తున్నపుడు ఏటీఎంలలో నగదు లేకుండా ఏలా చేస్తారని ప్రశ్నించింది. రూ.2500 ఫైన్ చెల్లించాలని ఆదేశించింది. కాగా ఎస్బీఐ నెలకు రూ. వెయ్యి-మూడువేల వరకు కనీస నిల్వను ఉంచని పొదుపు ఖాతాల ఖాతాదారుల నుంచి జీఎస్టీ తోపాటు 5-15శాతం జరిమానా వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2017-18 సంవత్సరంలోని ఎనిమిది నెలల కాలంలో 41కోట్ల మంది సేవింగ్స్ ఖాతాదారులను కలిగి ఉన్న ఎస్బీఐ దాదాపు రూ.1772 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేసింది. -
ఏటీఎంనే ఏమార్చారు!
సాక్షి, హైదరాబాద్: చిన్న టెక్నిక్తో ఏటీఎంలనే ఏమార్చారు. సాంకేతిక సమస్య సృష్టిస్తూ డబ్బులు దోచుకున్నారు. విత్డ్రా చేసుకున్నా.. డబ్బులురానట్లు చూపేలా ఏటీఎంలో మార్పులు చేశారు. ఈ వ్యవహారం మొత్తం 4 సెకన్లతో పూర్తి చేశారు. పైగా బ్యాంకులకు ఫిర్యాదు చేసి మళ్లీ ఆ మొత్తాన్ని తిరిగి పొందారు. ఇదీ హరియాణా–రాజస్తాన్ సరిహద్దుల్లోని మేవాట్ రీజియన్కు చెందిన ముఠా నిర్వాకం.. ఈ టెక్నిక్తో భారీ మొత్తంలో డబ్బు దోచేయాలని స్కెచ్ వేసి హైదరాబాద్ వచ్చిన ఈ గ్యాంగ్.. సౌత్జోన్ టాస్క్ఫోర్స్కు చిక్కింది. వీరి నుంచి పలు బ్యాంకులకు చెందిన 31 డెబిట్ కార్డులు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్తో కలసి సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. మేవాట్ రీజియన్కు చెందిన అఖ్లక్ అహ్మద్ (ఐటీఐ ఫిట్టర్ విద్యార్థి), ముంథీజ్ (ఐటీఐ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ విద్యార్థి), తౌఫీఖ్ (పళ్ల వ్యాపారి), తస్లీమ్ (ఐటీఐ ఎలక్ట్రీషియన్ విద్యార్థి), షాకీర్ మహ్మద్ (రైతు) ఓ ముఠాగా ఏర్పాడ్డారు. వీరు ఏటీఎం మెషీన్ను ఏమార్చే విధానం గుర్తించారు. పరిచయస్తులు, స్నేహితుల ఏటీఎం కార్డులు తీసుకున్నారు. నాలుగు రోజుల కింద హైదరాబాద్ చేరుకున్న ఈ ఐదుగురు రెండు బృందాలుగా ఏర్పడ్డారు. అత్యంత తెలివిగా.. సెక్యూరిటీ గార్డుల్లేని, పాత ఏటీఎం మెషీన్లను గుర్తించేవారు. తమ వద్ద ఉన్న ఏటీఎం కార్డుతో లావాదేవీ మొత్తం పూర్తి చేసేవారు. డబ్బులు వచ్చాక లావాదేవీ పూర్తయ్యేందుకు నాలుగైదు సెకన్ల సమయం ఉంటుంది. ఆ తర్వాతే లావాదేవీ పూర్తయినట్లు స్క్రీన్పై కనిపించడంతో పాటు మొబైల్ నంబర్కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ సమయాన్నే ఈ ముఠా తమకు అనుకూలంగా మార్చుకుంది. ఓ వ్యక్తి ఏటీఎం మెషీన్కు ఉన్న కెమెరాకు చేయి అడ్డుపెట్టేవాడు. మరో వ్యక్తి ఆ మెషీన్లో సాంకేతిక సమస్య సృష్టించేవాడు. దీంతో ఏటీఎం నుంచి డబ్బు బయటకొచ్చినా అందులో మాత్రం లావాదేవీ ఫెయిల్ అయినట్లు నమోదయ్యేది. ఇదే విషయాన్ని పేర్కొంటూ స్లిప్ ప్రింట్ వచ్చేది. దీన్ని వాట్సాప్ ద్వారా అసలు కార్డు వినియోగదారుడికి పంపేవాళ్లు. ఈ విషయం బ్యాంకుకు ఫిర్యాదు చేసి తిరిగి ఖాతాలో పడేలా చర్యలు తీసుకోవాలని కోరేవారు. దీంతో బ్యాంకు నుంచి ఆ మొత్తం వారి ఖాతాల్లోకి వెళ్లిపోవడంతో తిరిగి ఇవ్వాల్సినపనీ ఉండేది కాదు. పక్కా ప్రణాళికతో.. ఈ గ్యాంగ్ బ్యాంకు హోం బ్రాంచ్కు చెందిన ఏటీఎం కేంద్రాలకు వీరు వెళ్లేవారు కాదు. మరో బ్యాంకు ఏటీఎం నుంచి నగదు తీసుకుంటూ ఈ టెక్నిక్ వాడేవారు. హైదరాబాద్ను టార్గెట్గా చేసుకున్న ఈ గ్యాంగ్ 31 కార్డులతో రంగంలోకి దిగింది. ఈ కార్డులు ఇచ్చిన హరియాణా, రాజస్తాన్కు చెందిన వారంతా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వారే. దీంతో వారికి జీతాలు వచ్చినప్పుడే ఖాతాల్లో డబ్బు ఉంటుంది. ఆ సమయంలోనే ఈ టెక్నిక్తో డ్రా చేసుకునే వారు. రాజధానిలోని 7 ప్రాంతాల్లో రూ.లక్ష వరకు విత్డ్రా చేశారు. ఈ అనుభవంతో వచ్చే నెలలో భారీ మొత్తం కాజే యాలని స్కెచ్ వేశారు. ఈలోపు వీరి కదలికలపై సౌత్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.మధుమోహన్రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, కేఎన్ ప్రసాద్వర్మ, మహ్మద్ తఖీయుద్దీన్, వి.నరేంద్ర తమ బృందాలతో దాడి చేసి ఐదుగురినీ పట్టుకున్నారు. కాగా, ఏటీఎం మెషీన్కు సృష్టించిన సాంకేతిక సమస్యను పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. కొన్ని ఏటీఎం మెషీన్లకు ఉన్న ఈ లోపంపై బ్యాంకులకు లేఖ రాసి, లోపాన్ని సరిచేయనున్నారు. -
రోడ్డుపై నోట్ల వరద : జనం పరుగులు
అమెరికాలో అనూహ్యంగా చేతికి చిక్కిన క్యాష్తో కొంతమంది క్రిస్మస్కు ముందే సంబరాలు చేసుకున్నారు. అవును, ఒకపక్క మంచు వర్షం..మరోపక్క నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల వరద కురుస్తోంటే.. ఆహా ఏమి నా భాగ్యమూ అంటూ జనం ఎగబడ్డారు. చేతికి దొరికినంతా దక్కించుకుని చెక్కేసారు. అమెరికాలోని న్యూజెర్సీ హైవేపై ఈ ఘటన జరిగింది. అటు ఈ ఘటనపై ట్విట్టర్లో వీడియోల వర్షం కురిసింది. దీంతో అయ్యో, సమయానికి తాము అక్కడ లేకపోయామే అంటూ మరికొంతమంది నెటిజన్లు వాపోయారు. సాయుధ పహరాతో వెళుతున్న ఏటీఎంలకు నగదు సరఫరా చేసే బ్రింక్స్ వ్యాను తలుపులు ఆకస్మాత్తుగా తెరుచుకోవడంతో ఒక్కసారిగా రోడ్డు మీద కరెన్సీ వరద పారింది. దీంతో జనం ఉరుకులు పరుగులు తీశారు. విపరీతమైన రద్దీలో కూడా కార్లు ఎక్కడపడితే అక్కడ ఆపి మరీ నోట్లవేటలో పడ్డారు. దీంతో భారీ ట్రాఫిక్ జాం ..అంతేకాదు కొన్నివాహనాలు అదుపు తప్పి ఒకదానికి మరొకటి ఢీకొన్నాయి. బ్రింక్స్ వ్యానులో నుంచి రెండు బ్యాగులు కిందపడిపోయి నోట్లు బయటకు వచ్చాయి. ఒక దాంట్లో 3.7 లక్షలు, మరోదాంట్లో 1.4 లక్షలు.. మొత్తం 5.1 లక్షల డాలర్లు ఉన్నట్టు బ్యాంకు అధికారులు చెప్పారు. బ్రింక్స్ సిబ్బంది, దారినపోయేవారు కలిసి ఎట్టకేలకు సుమారు 2 లక్షల డాలర్లు అక్కడికక్కడే సేకరించారు. అలాగే కొంతమంది నిజాయితీపరులు తమకు దొరికిన నగదును పోలీసు స్టేషన్లో అప్పగించారు. అయితే ఇలా అందిన డబ్బు కేవలం 11 వేల డాలర్లేనట. దీంతో మిగిలిన సొమ్ము ఎలా తేవాలిరా బాబూ అని తలలు పట్టుకోవడం అధికారులు వంతు అయిందిట. -
ఖాళీ డబ్బాల్లా ఏటీఎంలు!
‘రాజన్న పది రోజుల కిందనే తుకం పోసిన. నాటుకు వస్తది. కూలీలకు ఇచ్చేందుకు పైసలు లేవు.. బ్యాంకుకు పోతే పైసల్లేవంటున్నరు. ఏటీఎంలల్ల కూడా ఏం లేవు. ఏంజేయాలే’.. అంటూ మరో రైతు భూమన్న అన్న మాటలివి. ఇలాంటి పరిస్థితి ఈ ఇద్దరిదే కాదు. ఉమ్మడి జిల్లాలలోని అన్ని ప్రాంతాల్లో నెలకొంది. బ్యాంకులు మాత్రం నగదు లేదు, రూ.రెండే వేలు ఇస్తమంటున్నరని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితిని అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. సాక్షి, రామారెడ్డి(ఎల్లారెడ్డి): నోట్ల రద్దు ప్రభావం నేటికి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. నగదు కొరతతో ఖాతాదారులు, సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే బ్యాంకుల ముందు రైతులు, ఖాతాదారులు బారులు తీరుతున్నారు. బ్యాంకర్లు మాత్రం ప్రతి ఖాతాదారుడికి రూ.2 వేలకు మించి ఇవ్వడం లేదు. రామారెడ్డి మండలంలో మొత్తం 19 గ్రామ పంచాయతీలుండగా 35,909 జనాభా ఉంది. మండల కేంద్రం రామారెడ్డిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు, సొసైటీ బ్యాంకులతో పాటు రెడ్డిపేటలో ఎస్బీఐ బ్యాంకులున్నాయి. రామారెడ్డిలో ఇండిక్యాష్ ఏటీఎం, రెడ్డిపేటలో ఎస్బీఐ ఏటిఎంలు ఖాతాదారులకు సేవలందిస్తున్నాయి. అయితే నగదు కారణంగా 24 గంటలపాటు పని చేయాల్సిన ఏటీఎంలు మూతపడే ఉంటున్నాయి. ఈ పరిస్థితి ఒక్క మండలంలోనే కాదు, ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో నెలకొంది. రైతులు, ఖాతాదారులు, సాధారణ పౌరులు ఇబ్బందులు పడుతున్నారు. రైతుబంధు, ధాన్యంలవీ అదే కథ.. రామారెడ్డి మండలంలో 19 గ్రామ పంచాయతీలున్నాయి. కాగా 14 రెవెన్యూ గ్రామాలున్నాయి. యాసంగి పంట పెట్టుబడి కోసం అర్హులైన 7791 మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం కింద డబ్బులను జమ కానున్నాయి. దీనికి తోడు ధాన్యం కొనుగోలు డబ్బులు సైతం బ్యాంకు ఖాతాల్లో వస్తుండడంతో డబ్బుల రైతులు, బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. నగదు కొరత కారణంగా రూ.2 వేల నుంచి రూ.5 వేలకు మించి ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడికి రూ.2వేలు ఏం సరి పోతాయని వారు ప్రశ్నిస్తున్నారు. సాధారణ ఖాతాదారులకు సైతం నగదు కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నగదు కొరతను నివారణకు గతంలో నగదు రహితంను సైతం పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురాకపోవడంతో ప్రజలకు ఇప్పటికీ నగదు తిప్పలు తప్పడం లేదు. ఏటీఎంను తెరిపించండి మోర్తాడ్: మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎం కేంద్రాన్ని తెరిపించాలని స్థానికులు కోరుతున్నారు. ఎస్బీఐ ఏటీఎం ఎన్నో రోజుల నుంచి మూసి ఉంటున్నా బ్యాంకు అధికారులు ఏమి పట్టించుకోక పోవడంతో స్థానిక ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. ఏటీఎంను తెరచి ఉంచితే వినియోగదారులు తమకు అవసరం ఉన్న నగదును విత్ డ్రా చేసుకోవడంతో పాటు, మినీ స్టేట్మెంట్, బ్యాంకు బ్యాలెన్స్ ఇతర సదుపాయాలను పొందుతారని పలువురు వినియోగదారులు వెల్లడించారు. ఏటీఎంను నిరంతరం మూసి ఉంచడం కారణంగా ఎంతో మంది వినియోగదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించి ఏటీఎం కేంద్రాన్ని తెరచి ఉంచాలని పలువురు కోరుతున్నారు. -
యూ ట్యూబ్లో చూసి చోరీయత్నం
వారంతా బీటెక్ చదివిన యువకులు.. చెడు వ్యసనాలకు బానిసలై ఈజీ మనీకి ప్రయత్నించారు. యూ ట్యూబ్లో చోరీ చేసే వీడియోలు చూసి బ్యాంక్ ఏటీఎంలను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆ చోరీ ప్రయత్నం ఫలించకపోగా, పోలీసులకు చిక్కారు. నిడదవోలు పట్టణ పోలీస్స్టేషన్లో కొవ్వూరు డీఎస్పీ ఎస్ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి, నిడదవోలు: పట్టణానికి చెందిన చెరుకూరి మునీంద్ర, ఎస్కే అరుణ్ రహిద్, యంగాల ఆదిత్య కొవ్వూరు డివిజన్ పరిధిలో దేవరపల్లి, గౌరీపట్నం, చాగల్లు ప్రాంతాల్లో రాత్రి సమయంలో ఏటీఎం చోరీలకు ప్రయత్నించారు. వీరంతా బీటెక్ డిప్లమో పూర్తి చేశారు. చాగల్లు ఏటీఎం కేంద్రం వద్ద మంగళవారం మరోసారి ఏటీఎం చోరీకి ఉపక్రమిస్తున్న సమయంలో సిబ్బంది దాడి చేసి ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు. స్నేహితులైన ఈ ముగ్గురు ఏటీఎం కేంద్రాల్లో చోరీ ఎలా చెయ్యాలో యూ ట్యూబ్ ద్వారా తెలుసుకున్నారు. ఏటీఎం కేంద్రాల్లో ఉన్న సీసీ కెమెరాలను రాడ్తో పగలగొట్టిన అనంతరం ఏటీఎం యంత్రాలను రాడ్లతో ధ్వంసం చేస్తారు. ఏటీఎం యంత్రాల్లో ఉన్న బాక్స్లు తెరుచుకోకపోవడంతో తిరిగి వెనక్కి వచ్చేసేవారు. బాక్స్లు తెరచుకోకపోవడంతో డబ్బులు వీరికి దొరకలేదని డీఎస్పీ చెప్పారు. యువకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. నిడదవోలు సీఐ కేవీఎస్వీ ప్రసాద్, చాగల్లు, నిడదవోలు ఎస్సైలు ఐ.రవికుమార్, జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
వృద్ధుణ్ని ఏమార్చిన కేటుగాడు
కర్నూలు, ఆదోని: ఏటీఎం సెంటర్ వద్ద మాటువేసిన ఓ కేటుగాడు డబ్బు తీసిస్తానని వృద్ధుడిని నమ్మించాడు. ఇక్కడ డబ్బు రావడం లేదంటూ మరో ఏటీఎం సెంటర్కు తీసుకెళ్లాడు. అక్కడా డబ్బు తీస్తున్నట్లు నటించి, ఏటీఎం కార్డులో ఏదో సమస్య ఉందంటూ డూప్లికేట్ కార్డు చేతిలో పెట్టి అక్కడి నుంచి జారుకున్నాడు. మరుసటి రోజు ఒరిజినల్ ఏటీఎం కార్డుతో నగదు డ్రా చేసుకున్నాడు. సెల్కు వచ్చిన మెసేజ్ ఆధారంగా బ్యాంక్కు వెళ్లి ఆరా తీసిన బాధితుడు మోసాపోయానని తెలుసుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. టూ టౌన్ సీఐ భాస్కర్ తెలిపిన వివరాలు.. పట్టణంలోని మహతార్ మసీదు వీధికి చెందిన ఏక్బోటే రామచంద్రకు ఆం్ర«ధాబ్యాంకులో అకౌంట్ ఉంది. కూతురు వివాహానికని ఖాతాలో కొంత నగదు దాచుకున్నాడు. అవసరం పడి ఈ నెల 3న ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంకు వెళ్లాడు. నగదు డ్రా చేసేందుకు యత్నిస్తుండగా పక్కనే ఉన్న ఓ 25 ఏళ్ల యువకుడు సాయం చేస్తానంటూ ముందుకొచ్చాడు. డబ్బు డ్రా చేస్తున్నట్లు నటిస్తూ మిషన్లో ఏదో సమస్య ఉందంటూ భీమాస్ ఎదుట ఉన్న ఎస్బీఐ ఏటీఎంకు తీసుకువెళ్లాడు. అక్కడా డబ్బు డ్రా చేస్తున్నట్లు నటించి కార్డులో ఏదోలోపం ఉందంటూ రామచంద్ర చేతిలో పెట్టి జారుకున్నాడు. ఇక రామచంద్రడు చేసేదేమీ లేక ఇంటికి వెనుదిరిగాడు. మరుసటి రోజు మధ్యాహ్నం 12గంటల నుంచి 3.10గంటలలోపు పలు దఫాలుగా రూ.72 వేలు డ్రా అయినట్లు కుమారుడు శ్యాం సెల్కు మెసేజ్లు వచ్చాయి. వెంటనే అతడు తన తండ్రికి ఫోన్ చేసి ఆరా తీయగా తాను ఇంట్లోనే ఉన్నానని, ఏటీఎం కార్డు కూడా తన వద్దే ఉందని చెప్పడంతో శ్యాం ఇంటికి వచ్చి తండ్రి వద్ద ఉన్నది డూప్లికేటుగా గుర్తించాడు. కేటుగాడు ఏటీఎం కార్డును నొక్కేసి డబ్బు డ్రా చేసినట్లు నిర్ధారించుకొని వెంటనే కార్డును బ్లాక్ చేయించాడు. అనంతరం శ్యాం తన తండ్రితో కలిసి టూటౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈనె 19, 20వ తేదీలలో కూతురి పెళ్లి ఉందని, ఇలాంటి సందర్భంలో తాను దారుణంగా మోసపోయానని బాధితుడు రామచంద్ర కన్నీరు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న సీఐ భాస్కర్ ఆంధ్రాబ్యాంకుకు చేరుకుని బ్రాంచ్ మేనేజరు నుంచి వివరాలు సేకరించారు. కర్నూలులోని కోట్ల కూడలిలో ఏటీఎం ద్వారా కొంత, స్వైప్ మిషన్ ద్వారా కొంత నగదు డ్రా చేసినట్లు తెలుసుకున్నారు. ఆం్ర«ధాబ్యాంకు, స్టేట్ బ్యాకు ఏటీఎంలలో సీసీ ఫుటేజీలు సేకరించారు. వీలైనంత త్వరగా కేటుగాడిని గుర్తించి కటకటాల వెనక్కు పంపుతామని సీఐ తెలిపారు. -
వెంటాడుతున్న నగదు కొరత
మోర్తాడ్(బాల్కొండ): పెద్ద నోట్ల రద్దు తరువాత ఏర్పడిన నగదు కొరత ఇంకా ప్రజలను వెంటాడుతూనే ఉంది. రూ.1000, రూ.500ల నోట్లు రద్దు అయ్యి రెండేళ్లు గడచినా బ్యాంకుల్లో ఖాతాదారులకు సరిపడేంత నగదు దొరకక ఇబ్బందులు కలుగుతున్నాయి. మధ్యమధ్యలో నగదు కొరత తీరినట్లు అనిపించినా నగదు కొరత ప్రభావం సామాన్యులను వెంటాడుతుండటంతో ప్రజలు సతమతం అవుతున్నారు. పక్షం రోజుల నుంచి బ్యాంకుల్లో నగదు నిలువలు తగ్గిపోవడంతో ఖాతాదారులకు పరిమితంగానే నగదు విత్డ్రాకు బ్యాంకర్లు అనుమతి ఇస్తున్నారు. ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించుకోవాలని బ్యాంకర్లు సూచిస్తున్నా అవగాహన లేమితో ఆన్లైన్ లావాదేవీలు నామమాత్రంగానే సాగుతున్నాయి. గతంలో బ్యాంకుల్లో ఒక్కో ఖాతాదారుకు రోజుకు రూ.40వేల వరకు నగదు అందించిన బ్యాంకర్లు ఇప్పుడు రూ.10వేలకు మించి ఇవ్వడం లేదు. జిల్లాలో సహకార, వాణిజ్య, ప్రైవేటు బ్యాంకుల శాఖలు 268 వరకు ఉన్నాయి. గతంలో వివిధ బ్యాంకుల శాఖలకు ప్రధాన బ్రాంచీల నుంచి నుంచి నగదు సరఫరా అయ్యేది. అలా సరఫరా అయిన నగదును ఖాతాదారులకు బ్యాంకర్లు అందించేవారు. అయితే కొన్నిరోజుల నుంచి బ్యాంకు శాఖలకు నగదు సరఫరా కావడం లేదు. వివిధ బ్యాంకుల పరిధిలోని విద్యుత్, టెలికం, గ్రామ పంచాయతీలు, పెట్రోల్ బంక్లు, మద్యం దుకాణాలు, ఇతర వ్యాపారులు బ్యాంకుల్లో నగదును జమచేస్తేనే ఆ నగదును ఖాతాదారులకు బ్యాంకర్లు అందించే పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ బంక్లలో ఎక్కువ మంది స్వైపింగ్ మిషన్ ద్వారానే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తుండటంతో నగదు తగ్గిపోయింది. కొంతమంది ఖాతాదారులు బ్యాంకుల నుంచి నగదును విత్డ్రా చేసుకోవడమే తప్ప బ్యాంకుల్లో నగదును జమచేయకపోవడంతో నగదుకు కొరత ఏర్పడటానికి కారణం అయ్యింది. ఇది ఇలా ఉండగా కొన్ని నెలల నుంచి బ్యాంకుల్లో రూ.2వేల నోటు కనిపించడం లేదు. ఎన్నికల కారణంగా పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ఖర్చు కోసం పెద్ద మొత్తంలో నగదును బ్లాక్ చేయడం వల్లనే నగదు కొరత ఏర్పడటానికి కారణం అయ్యిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బ్యాంకుల్లో నగదును జమ చేస్తే మళ్లీ నగదు తమ చేతికి లభించదనే ఉద్దేశంతో అనేక మంది నగదును ఇండ్లలోనే దాచుకుంటుండటంతో నగదు కొరత తీవ్రం అయ్యిందని కూడా తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, బ్యాంకర్లు స్పందించి నగదు కొరత తీర్చడంతో పాటు ఆన్లైన్ లావాదేవీలపై ఖాతాదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నగదు కొరత తీర్చాలి బ్యాంకుల్లో ఖాతాదారులకు సరిపడేంత నగదు ఇవ్వకపోవడంతో వ్యవసాయ పనులు సాగడం లేదు. నగదు కొరతను తీర్చాల్సిన అవసరం ఉంది. పెద్ద నోట్లు ఇవ్వకపోయినా చిన్న నోట్లనైనా ఖాతాదారులకు అందించాలి. నగదు కొరతను తీర్చాలి. సల్ల రాజేశ్వర్, రైతు, తొర్తి కూలి ఇవ్వాలంటే దొరకడం లేదు వ్యవసాయ పనులకు వచ్చే కూలీలకు నగదు రూపంలోనే కూలి ఇవ్వాల్సి ఉంది. అయితే నగదు కొరత వల్ల కూలీలకు కూలి ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉంది. నగదు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగతూ పని నష్టపోతున్నాం. ప్రభుత్వం స్పందించి నగదు కొరతను తీర్చాలి. కౌడ పెద్ద భూమేశ్వర్, రైతు, తొర్తి -
ఇప్పటికీ నగదు కష్టాలే!
కేంద్ర ప్రభుత్వం ఏ ముహూర్తాన పెద్ద నోట్లను రద్దుచేసిందో తెలియదు కాని, అప్పటి నుంచి జిల్లా వాసులను నగదు కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నెల 8వ తేదీకి పెద్ద నోట్లు రద్దు చేసి రెండేళ్లు ముగిసినా ఇప్పటికీ నగదు కష్టాలు తీరడం లేదు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 80 శాతం ఏటీఎం కేంద్రాలు మూసి ఉండడంతో పాటు, సీడీఎంలలో కూడా నగదు వేయలేని పరిస్థితి నెలకొంది. నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో ప్రధానంగా మధ్య, పేద తరగతి వారిపై నగదు కష్టాలు తీవ్ర ప్రభాన్ని చూపుతున్నాయి. నగదు రహిత లావాదేవీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పినా అందుకు తగ్గట్లుగా స్వైపింగ్ యంత్రాలను కూడా అందుబాటులోకి తీసుకుని రాలేని దుస్థితి. పెద్ద నోట్లను 2016 నవంబరు 8వ తేదీన రద్దుచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి రెండు రోజుల తరువాత ఆ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే విధానాన్ని ప్రవేశ పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నోట్ల కష్టాలు మాత్రం తీరడం లేదు. జిల్లాలో 623 బ్యాంక్ శాఖలు జిల్లాలో 41 బ్యాంక్లు ఉండగా, వాటికి అనుబంధంగా 623 శాఖలు ఉన్నాయి. వీటిలో రోజూ లావాదేవీలు జరగాలంటే కనీసం రూ.100 కోట్ల అవసరం ఉంటుందని అధికారులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తు తం ఆర్బీఐ నుంచి అరకొర నగదు వస్తుండడంతో ఉన్న దాంట్లోనే సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో బ్యాంక్ అధికారులు కూడా ఏమి చేయలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. 80 శాతం ఏటీఎంల మూత జిల్లాలో నెల్లూరు, నెల్లూరు రూరల్, కావలి, కోవూరు, ఉదయగిరి, ఆత్మకూరు, గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాలలో మొత్తం 482 ఏటీఎం కుఏంద్రాలు ఉన్నాయి. వీటిలో దాదాపుగా 80 శాతం పనిచేయడం లేదు. పేరుకు తీసి ఉన్నా వాటిలో నగదు లేదని మెసేజ్ వస్తుండడం గమనార్హం. ఆర్బీఐ నుంచి నగదు రాక పోవడంతోనే ఏటీఎంలలో నగదు పెట్టలేకపోతున్నట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా పండగ రోజులు, సెలవుల దినాల్లో అయినే నగదు ఉండే ఏటీఎంల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి వస్తోంది. దీనికి తోడు క్యాష్ డిపాజిట్ మిషన్, (సీడీఎం)లను అందుబాటులో ఉంచినా వాటిలో చాలా వరకు నగదు తీసుకోవడం లేదు. కొంత నగదు తీసుకున్నా వెనక్కు వస్తుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్వైపింగ్ మిషన్ల కొరత పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన తరువాత మొత్తం నగదు రహిత లావాదేవీలు నడపాలని చెప్పింది. అందుకు తగ్గట్లుగా స్వైపింగ్ మిషన్లను మాత్రం అందుబాటులోకి తీసుకుని రాలేదు. దాదాపుగా జిల్లాలో 50 వేల మంది వ్యాపారులు ఉన్నారు. వీరిలో కేవలం ఐదు వేల లోపు వ్యాపార కేంద్రాల్లో స్వైపింగ్ పద్ధతి ఉంది. మరో రెండు వేల మంది స్వైపింగ్ మిషిన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా మిషన్లను వారికి అందించలేదు. ఈ విధంగా స్వైపింగ్మిషన్లను సరఫరా చేయకుండా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. -
షాకింగ్: సగం ఏటీఎంలు మూత
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నాటికి సగానికి సగం ఏటీఎంలు మూత పడనున్నాయనే షాకింగ్ న్యూస్ సంచలనంగా మారింది. స్వయంగా ట్రీ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMi) బుధవారం (21 నవంబరు) నివేదించింది. దేశవ్యాప్తంగా దాదాపు 1.13 లక్షలఏటీఎంలు మూతపడే అవకాశం ఉందని హెచ్చరించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (సీఏటీఎంఐ) అంచనా ప్రకారం దేశంలో ప్రస్తుతం 2.38 లక్షల ఏటీఎంలు అందుబాటులో ఉండగా, అందులో సగానికి పైగా అంటే దాదాపు 1.13 లక్షల ఏటీఎంలు 2019 మార్చి కల్లా మూతపడే అవకాశాలున్నాయి. ఈ మేరకు సర్వీస్ ప్రొవైడర్లు ఒత్తిడి చేయనున్నారని పేర్కొంది. వీటిల్లో సుమారు లక్ష ఆఫ్ సైట్ ఎటిఎంలు, 15వేల వైట్ లేబుల్ ఏటీఎంలు ఉన్నాయని తెలిపింది. తాజా నియంత్రణలు, మార్పులు కారణంగా ఈ మూత తప్పకపోవచ్చని వెల్లడించింది. వీటిలో మెజారిటీ ఏటీఎంలు పట్టణేతర ప్రాంతాల్లో ఉండొచ్చని, ప్రభుత్వ సబ్సిడీ లబ్ధిదారులు మెషీన్ల ద్వారా తీసుకునేందుకు వీలు కల్పించే చర్యలకు ఏటీఎంల మూత విఘాతం కావచ్చని తెలిపింది. ముఖ్యంగా ప్రధానమంత్రి జన్ధన్ యోజన (పిఎంజెడివై) పథకం కింద మిలియన్లమంది లబ్దిదారులు తీవ్రంగా ప్రభావితం కానున్నారని పేర్కొంది. ఇటీవల చేపట్టిన హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్, ఇతర నియంత్రణ చర్యల్లో మార్పులు, క్యాష్ లోడింగ్కు అనుసరిస్తున్న క్యాసెట్ స్వాపింగ్ పద్ధతి వల్ల ఎటీఎం ఆపరేషన్లు ఆచరణ సాధ్యం కాకపోవచ్చని, ఫలితంగా ఏటీఎంలు మూతపడొచ్చని పేర్కొంది. సాంకేతిక పద్ధతుల్లో మార్పు, క్యాసెట్ క్యాష్ స్వాప్ విధానానికే కేవలం రూ.3,000 కోట్లు ఖర్చవుతుందని సీఏటీఎంఐ అంచనా వేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏటీఎం ఇండస్ట్రీ ఎదుర్కొన్న పరిస్థితికి అదనపు సాంకేతిక పరిజ్ఞానం తోడై పరిస్థితి మరింత దిగజారవచ్చని, సర్వీస్ ప్రొవైడర్ల నెత్తిన మోయలేని భారం పడుతుందని తెలిపింది. ఇది ఏటీఏంల మూతకు దారితీస్తుందని సీఏటీఎంఐ ప్రకటించింది. ఏటీఎంల మూత కారణంగా వేలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయని సీఏటీఎంఐ పేర్కొంది. అంతేకాదు నగదు కొరత వస్తే ఏటీఎంల దగ్గర భారీ క్యూలు, గందరగోళం తప్పదని కూడా వ్యాఖ్యానించింది. -
జమ్తారలో సూత్రధారులు.. ఢిల్లీలో పాత్రధారులు!
సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి... కార్డులకు సంబంధించిన వివరాల తో పాటు వన్టైమ్ పాస్వర్డ్స్ (ఓటీపీ) సైతం సం గ్రహించి... అందినకాడికి దండుకునే జమ్తార ముఠాలు నానాటికీ తెలివి మీరుతున్నాయి. ఏ దశలోనూ తమ ఉనికి బయటపడకుండా పక్కాగా వ్యవహారాలు నడుపుతున్నాయి. ఇందులో భాగంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి ఢిల్లీ చెందిన వ్యక్తుల ఖాతాలు వాడుకుంటున్నాయి. ఇందుకుగాను సదరు ఏజెంట్లకు కమీషన్లు ఇస్తున్నాయి. ఈ తరహాలో ప్రధాన సూత్రధారులకు సహకరిస్తున్న ఓ పాత్రధారిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ నుంచి సిటీకి తరలించిన ఇతడిని సోమవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. నగరంలో నమోదవుతున్న ఈ ‘కార్డ్ క్రైమ్’లో 98 శాతం జమ్తార ప్రాంతానికి చెందిన వారే నిందితులు. జార్ఖండ్ రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ వెళ్లే మార్గంలో ఉన్న ప్రాంతం ఇది. ఆయా బ్యాంకుల్లో కింది స్థాయి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు అనేక మార్గాల ద్వారా డెబిట్/క్రెడిట్ కార్డుల డేటా సేకరిస్తున్న జమ్తార మోసగాళ్లు వాటి ఆధారంగా అసలు అంకానికి తెరలేపుతున్నారు. బోగస్ పేర్లు, చిరునామాలతో సిమ్కార్డ్స్ తీసుకుని వాటిని ద్వారా కార్డుల డేటాలోని ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో అందరి ఫోన్లలోనూ ‘ట్రూకాలర్’ తరహా యాప్స్ ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బోగస్ సిమ్కార్డులను వినియోగిస్తున్న జమ్తార యువత ముందుగానే ఆ నెంబర్లను సదరు యాప్లో ‘బ్యాంక్ హెడ్–ఆఫీస్’ పేరుతో రిజిస్టర్ చేయించేస్తున్నారు. ఫలితంగా ఈ నెంబర్ నుంచి వచ్చిన కాల్ను రిసీవ్ చేసుకున్న వ్యక్తులకు అవి బ్యాంకుల నుంచి వస్తున్న భావన కలిగి తేలిగ్గా బుట్టలో పడతారు. క్రెడిట్, డెబిట్ కార్డులు కలిగిన వారికి ఫోన్లు చేసే ‘జమ్త్రాగాళ్లు’ ముందుగా ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి పేరు, ఓ బ్యాంకు కార్డు వినియోగిస్తున్నారో చెప్పి,... బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకుంటారు. డెబిట్ కార్డును ఆధార్తో లింకు చేయాలనో, క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చెయ్యాలనో చెబుతూ ఆపై కార్డు వివరాలను సీవీవీ కోడ్ సహా తెలుసుకుని... కొద్దిసేపట్లో మీకో వన్ టైమ్ పాస్వర్డ్ వస్తుందని, అది కూడా చెబితేనే లింకేజ్, అప్గ్రేడేషన్ పూర్తవుతుందని నమ్మిస్తారు. ఇలా అన్ని వివరాలు తెలుసుకున్న తరవాత వారి ఖాతాలోని నగదును తమ ఖాతాల్లోకి మార్చుకోవడం ద్వారా టోకరా వేస్తున్నారు. వీరు వినియోగించే సిమ్కార్డులు ఎలానూ బోగస్ వివరాలతో ఉంటాయి. బాధితుడి ఖాతా నుంచి నగదు మళ్లించుకునే ఖాతాలు తమ పేరుతో, తమ ప్రాంతంలో ఉంటే తేలిగ్గా దొరికేస్తామనే ఉద్దేశంతో వీరు కొత్త పంథా అనుసరిస్తున్నారు. ఢిల్లీకి చెందిన కొందరిని ఆకర్షించి ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకుని వారి బ్యాంకు ఖాతాల్లోకి ఆ డబ్బును మళ్లిస్తున్నారు. ఈ ఏజెంట్లకు 5 నుంచి 10 శాతం వరకు కమీషన్ ఇస్తూ ఆ నగదు తమ వద్దకు చేరేలా చేసుకుంటున్నారు. ఇటీవల నగరానికి చెందిన ఓ బాధితుడికి ఎర వేసిన జమ్తార నేరగాళ్లు రూ.79 వేలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ డి.ప్రశాంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలను బట్టి ఏజెంట్లు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లిన ప్రత్యేక బృందం సైబర్ నేరగాళ్లకు తన బ్యాంకు ఖాతా ఇచ్చి సహకరించిన ప్రేమ్చంద్ అనే నిందితుడిని అరెస్టు చేసింది. అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై సిటీకి తరలించింది. సోమవారం జ్యుడీషియల్ రిమాండ్కు తరలించింది. ఈ స్కామ్ సూత్రధారుల కోసం జమ్తారకు ఓ బృందం వెళ్తోంది. వీరు మరెందరినో మోసం చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఏటీఎంలో నకిలీ నోట్లు.!
ఎదులాపురం(ఆదిలాబాద్): జిల్లా కేంద్రంలోని ఓ బ్యాంకు ఏటీఎం కేంద్రం నుంచి వచ్చిన రూ.500ల నోట్లు నకిలీవిగా కలకలం రేగింది. దక్కన్ గ్రామీణ బ్యాంకు సమీపంలో ఉన్న ఓ బ్యాంకు ఏటీఎంలో ఆదివారం పట్టణానికి చెందిన శంకర్గౌడ్, గంగాధర్ అనే వ్యక్తులు డబ్బులు డ్రా చేశారు. ఆ సమయంలో ఎర్రా సిరాతో రాసిన.. ప్రింట్ కనిపించకుండా.. ఇతర రంగుతో కూడిన నోట్లు వచ్చాయి. దీంతో వారు ఆందోళనకు గురయ్యారు. బ్యాంకుల్లో సిరాతో రాయబడిన, ఇతర రంగుల్లో ఉన్న నోట్లను తీసుకోవడం లేదని, ఏటీఎం ద్వారా ఇలాంటి నోట్లు రావడం ఏంటని వాపోయారు. సంబంధిత బ్యాంకు అధికారులు స్పందించి ఇకనైనా ఇలాంటి నోట్లు రాకుండా చూడాలని వినియోగదారులు కోరారు. -
ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
కృష్ణాజిల్లా, ఎర్రబాలెం(మంగళగిరి): మండలంలోని ఎర్రబాలెంలో మంగళవారం తెల్లవారుజామున ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని బండివారి వీధి సెంటర్లో ప్రధాన రహదారి వెంట ఉన్న ఇండి క్యాష్ ఏటీఎం నగదు చోరీ చేయడానికి దుండగులు విఫలయత్నం చేశారు. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఏటీఎంలోకి చొరబడి సీసీ కెమెరాలను పగులకొట్టారు. అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఏటీఎంలో నగదు తీసుకునేందుకు వచ్చిన ఖాతాదారులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ఏటీఎం నుంచి చెల్లని నోట్లు
సాక్షి, విశాఖపట్నం, నాతవరం: ఇండియా వన్ ఏటీఎం ద్వారా రూ.500 నోట్లుపై రంగులు పడిన చెల్లని నోట్లు రావడంతో వినియోగదారులు అందో ళన చెందుతున్నారు. మర్రిపాలెం గ్రామానికి చెందిన సత్తిబాబు అనే వ్యక్తి సోమవారం నర్సీపట్నం ఆస్పత్రికి వెళ్తూ మార్గమధ్యంలో డి.యర్రవరం జంక్షన్లో గల ఇండియా వన్ ఏటీఎంకు వెళ్లి తన కార్డు ద్వారా రూ. మూడు వేలు నగదు తీశాడు. అయితే వచ్చిన ఆరు రూ.500 నోట్లుపై ఎర్రటి పసుపు రంగుతో కూడిన రంగులు ఉన్నాయి. నోట్లన్నిటిపైనా రంగులు పడి ఉండడంతో అవి ఎక్కడా చెల్లలేదు. దీంతో ఏం చేయాలో తెలియక లబో దిబో మన్నాడు. ఇదే విధంగా తూర్పుగోదా వరి జిల్లా కోటనందూరుకు చెందిన మరో వ్యక్తి కూడా ఇదే ఏటీఎంలో డబ్బులు తీశా రు. అయనకు కూడా రంగులు పడిన రూ. 500 నోట్లు రావడంతో అందోళన చెందారు. -
బిట్కాయిన్లకో ఏటీఎం
బనశంకరి (బెంగళూరు): బెంగళూరులో దేశంలోనే తొలి క్రిప్టో కరెన్సీ ఏటీఎం కియోస్క్ ఏర్పాటైంది. రాజాజీ నగర్లోని యునోకాయిన్ టెక్నాలజీస్ సంస్థ కెంప్ఫోర్ట్ మాల్లో దీన్ని ఏర్పాటుచేసింది. ఈ ఏటీఎం ద్వారా బ్యాంకులతో సంబంధం లేకుండా బిట్కాయిన్లను భారతీయ కరెన్సీగా మార్చుకోవచ్చు. బిట్కాయిన్లపై భారత్లో నిషేధం ఉంది. బిట్కాయిన్లతో వస్తువులను కొనాలంటే సమస్యలు వస్తుండటంతో పరిష్కారంగా క్రిప్టోకరెన్సీ ఏటీఎంను అందుబాటులోకి తెచ్చినట్లు యునోకాయిన్ టెక్నాలజీస్ అధికారులు చెప్పారు. నగదు డిపాజిట్, విత్డ్రాకు సంబంధించి దేశంలో అమల్లో ఉన్న నిబంధనలకు లోబడే ఈ ఏటీఎం పనిచేస్తుంది. -
ఏటీఎంలో చిరిగిన నోట్లు
ఆరిలోవ(విశాఖ తూర్పు): ఏటీఎంలలో చిరిగిన నోట్లు వస్తే ఎవర్ని అడగాలో తెలియక ఖాతా దారులు లబోదిబోమంటున్నారు. ఆరిలోవ బాలాజీనగర్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ఏటీఎం ఏర్పాటు చేశారు. అందులో రెండు రోజుల నుంచి చిరిగిపోయిన రూ.2000 లు నోట్లు వస్తున్నాయి. దీంతో ఇక్కడ విత్డ్రా చేసిన ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. బాలాజీనగర్కు చెందిన ఒమ్మి గోవర్థనరావు అనే యువకుడు బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ఏటీఎంలో రూ.20,000లు విత్డ్రా చేశాడు. అన్నీ రూ.2000లు నోట్లు వచ్చాయి. వాటిలో ఒక నోటు రెండు ముక్కలు అతికించి ఉన్నది వచ్చింది. ఆ నోటును మరో వ్యక్తి ఖాతాలో వేయడానికి వేరే బ్యాంకు డిపాజిట్ మెషిన్లో పెట్టగా ఈ నోటును తిరస్కరించింది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇదే ప్రాంతానికి చెందిన ఎల్.రమణ అనే మరో యువకుడు ఇదే ఏటీఎంలో రూ.రెండు వేలు విత్డ్రా చేవాడు. అతనికి కూడా చిరిగిపోయిన రూ.2000 నోటుకు ప్లాస్టరు అంటించి వచ్చింది. మధ్యాహ్నం సమయంలో రవీంద్రనగర్కు చెందిన శ్రీనివాస్ ఇక్కడ రూ.14,000లు విత్డ్రా చేశారు. అతనికి వచ్చిన 7 రూ.2000లు నోట్లులో 3 నోట్లు చిరిగిపోయి ఉన్నాయి. దీంతో వీరంతా వెంకోజీపాలెంలో ఉన్న బీవోఐ బ్యాంకుకు వెళ్లి మేనేజరును సంప్రదించగా.. నగదు డిపాజిట్ తాము చేయడం లేదని, ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించేశామని, తమకు సంబంధలేదని తేల్చి చెప్పేశారు. సాయంత్రం నగదు పెట్టడానికి ఈ ఏటీఎం వద్దకు వచ్చిన ఏజెంట్లను బాధితులు నిలదీశారు. బ్యాంకు ఇచ్చిన నగదు నోట్ల కట్టలనే తాము ఇందులో నింపుతామంటూ వారు తప్పించుకొని వెళ్లిపోయారు. బ్యాంకు అధికారులు, ప్రైవేట్ ఏజెన్సీ సిబ్బంది కలిసి ఖాతాదారులతో ఆటలాడుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏటీఎమ్లో వినాయకుని ప్రసాదం
-
ఏటీఎమ్ వినాయకుడు; ఎనీ టైమ్ మోదక్
పుణె: గణపతి నవరాత్రుల సందర్భంగా తాము ప్రతిష్టించే వినాయక విగ్రహాలు అందరి దృష్టిని ఆకర్షించాలని భక్తులు కోరుకుంటారు. అయితే మహారాష్ట్ర, పూణెలోని శంకర్నగర్కు చెందిన గణేష్ భక్తులు మాత్రం విగ్రహా ఏర్పాటులో సాంకేతికతను వినియోగించారు. నూతనంగా ఆలోచించిన వారు.. ఏటీఎమ్(ఎనీ టైమ్ మోదక్) వినాయకున్ని ఏర్పాటు చేశారు. మోదక్ అంటే వినాయకునికి ఇష్టమైన ప్రసాదం. ఏటీఎమ్ స్క్రీన్ మీద వినాయకని చిత్రాన్ని ఉంచారు. ప్రత్యేకంగా రూపొందించిన కార్డు ద్వారా ఈ ఏటీఎమ్ సేవలను పొందవచ్చు. మాములు ఏటీఎమ్లలో డబ్బులు వచ్చినట్టే ఇక్కడ వినాయకుని ప్రసాదం లభిస్తుంది. భక్తులు కార్డు వినియోగించినప్పుడు ఏటీఎమ్లో నుంచి ప్రసాదం వస్తుంది. ఈ ఏటీఎమ్పై నంబర్లకు బదులు ప్రత్యేకమైన బటన్లు ఉంటాయి. వాటిపై క్షమాపణ, శాంతి, భక్తి, జ్ఞానం, అభిమానం.. అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ ఏటీఎమ్ వినాయకునికి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.