Bigg boss reality show
-
ఆటోఇమ్యూన్ వ్యాధి.. స్టెరాయిడ్స్ తీసుకుంటున్నా: టాలీవుడ్ నటి
కొన్నేళ్లుగా ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదంటోంది బిగ్బాస్ బ్యూటీ, నటి సనా మక్బుల్ (Sana Makbul). సమంతలాగే తనకు ఆటోఇమ్యూన్ వ్యాధి వచ్చిందని వాపోయింది. శరీరంలోని కణాలు.. అవయవాలపై దాడి చేస్తున్నాయంది. తాజాగా ఓ పాడ్కాస్ట్లో సనా మక్బుల్ మాట్లాడుతూ.. కొన్ని అనారోగ్య కారణాల వల్ల నేను ఈ మధ్యే శాఖాహారిగా మారిపోయాను. నేను ఆటోఇమ్యూన్ హెపటైటిస్ రోగినని చాలామందికి తెలియదు. 2020లో బయటపడిందినాకు కాలేయ వ్యాధి ఉంది. ఇది 2020లో బయటపడింది. ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో ఈ వ్యాధి ఉందన్న విషయం ఆలస్యంగా తెలిసింది. ఈ వ్యాధి కారణంగా నా శరీరంలోని కణాలు నా అవయవాలపై దాడి చేస్తున్నాయి. అది శరీరమంతటా పాకొచ్చు, కిడ్నీలపైనా దాడి చేయొచ్చు, మోకాళ్ల నొప్పులకు కారణం కావచ్చు, ఇలా ఏదైనా జరగొచ్చు. సమంతకు ఉన్న ఆటోఇమ్యూన్ వ్యాధి మయోసైటిస్. దీని వల్ల ఆమె కండరాల బలహీనతను ఎదుర్కొంటోంది. అలాగే నాకున్న ఆటోఇమ్యూన్ వ్యాధి వల్ల కాలేయం డ్యామేజ్ అవుతోంది.నయమవుతుందో.. లేదో!స్టెరాయిడ్స్, కొన్నిరకాల ఔషధాలు తీసుకున్నాను. జీవనశైలిలో వస్తున్న మార్పుల వల్ల ఇది వచ్చిందనుకుంటున్నాను. నా ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఈ వ్యాధి పూర్తిగా నయం అవుతుందో, లేదో కూడా తెలియదు అని చెప్పుకొచ్చింది. సనా మక్బుల్.. దిక్కులు చూడకు రామయ్య, మామ ఓ చందమామ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించింది. హిందీ బిగ్బాస్ ఓటీటీ మూడో సీజన్ విజేతగానూ నిలిచింది. ప్రస్తుతం మ్యూజిక్ ఆల్బమ్స్లో నటిస్తోంది.చదవండి: అవతార్ సినిమాలో ఛాన్స్.. కోట్లు ఇస్తానన్నా 'నో' చెప్పా: గోవిందా -
ఈ ఫీలింగ్ ఎంత బాగుందో.. నమ్రత నోట కూడా అదే: శిల్ప శిరోద్కర్
బిగ్బాస్ షోకు వెళ్లడం వల్ల తనకు మంచే జరిగిందంటోంది నటి శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar). పెద్దగా కష్టపడకుండానే బరువు తగ్గిపోయానని చెప్తోంది. ఆమె లేటెస్ట్ లుక్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. నాజూకుగా మారిపోయారని కామెంట్లు చేస్తున్నారు. శిల్పా మట్లాడుతూ.. బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)లో ఎక్కువ ఆహారం అందుబాటులో ఉండదు. దీనివల్ల మితంగానే తినేదాన్ని. ఫలితంగా 11 కిలోలు తగ్గిపోయాను. బయటకు వచ్చాక మరో రెండు కిలోలు తగ్గాను.జీవితంలోనే మొదటిసారి..మొత్తంగా 13 కిలోల పైన బరువు తగ్గాను. ఇది నాకెంతో సంతోషంగా ఉంది. నువ్వు చాలా సన్నబడిపోయావ్, నీ వయసు తగ్గిపోతుందేంటి అన్న ప్రశంసలు నా జీవితంలోనే మొదటిసారి వింటున్నాను. అవి వింటుంటే నాకు మరింత ఎనర్జీ వస్తోంది. బిగ్బాస్లో మూడు, నాలుగు నెలలపాటు ఉన్నాను. బయటకు రాగానే తొలిసారి నమ్రత (Namrata Shirodkar)ను కలిసినప్పుడు నన్ను చూసి షాకైంది. చాలా సన్నబడిపోయావ్ అంది. నన్ను చూసి నా కుటుంబం ఎంతగానో గర్విస్తోంది.మంచి డైట్..ఇప్పుడు మంచి డైట్ ఫాలో అవుతున్నాను. ఇంకాస్త బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఎందుకంటే స్క్రీన్పై మనం ఉన్నదానికంటే కాస్త బొద్దుగానే కనిపిస్తాం. కాబట్టి నాకు నేను కఠిన నియమాలు పెట్టుకుంటున్నాను. రోజుకు ఒకటీ లేదా రెండు సార్లు మాత్రమే భోజనం చేయాలని నిర్ణయించుకున్నాను. గతంలో నేను లావుగా ఉన్నానని చయ్యా చయ్యా పాటకు నన్ను రిజెక్ట్ చేశారు. నాకోసం కష్టపడుతున్నా..అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నిర్ణయించుకున్నాను. నాకోసం నేను కష్టపడుతున్నాను అని చెప్పుకొచ్చింది. శిల్ప.. ఖుదా గవా, ఏక్ ముత్తి ఆస్మాన్, త్రినేత్ర, ప్రతీక్ష, పెచాన్, ఆంఖెన్.. ఇలా ఎన్నో సినిమాలు చేసింది. తెలుగులో బ్రహ్మ అనే సినిమాలో నటించింది. హీరో మహేశ్బాబుకు శిల్ప శిరోద్కర్ మరదలు అవుతుంది. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73)చదవండి: 'శ్రీలీల రాకతో ఈ ఐటం బ్యూటీ కెరీర్ ఖతం'.. ఇవే నచ్చదంటున్న నోరా -
సిరాజ్తో 'బిగ్బాస్' బ్యూటీ డేటింగ్.. లైక్ కొట్టడం వల్లే ఇదంతా
భారత క్రికెటర్, హైదరాబాదీ ప్లేయర్ మహ్మద్ సిరాజ్ డేటింగ్లో ఉన్నారంటూ కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీతో టచ్లో ఉన్న వారితో ఆయన ప్రేమలో పడినట్లు నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే లెజెండరీ గాయని ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లేతో ప్రేమలో ఉన్నాడని రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే.. అయితే, వాటిని సిరాజ్ ఖండించారు. ఆమె తనకు సోదరిలాంటిదని చెప్పేశాడు. అయితే, ఇప్పుడు హిందీ బిగ్బాస్ ఫేమ్ మహిరా శర్మ (Mahira Sharma)తో సిరాజ్ డేటింగ్లో ఉన్నాడంటూ బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చేసింది.కొద్దిరోజుల క్రితం మహిరా శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్కు సిరాజ్ లైక్ కొట్టడమే కాకుండా ఫాలో అయ్యాడు. దీంతో వారిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ విషయంపై మహిరా శర్మ తాజాగా ఇలా చెప్పుకొచ్చింది. ' సిరాజ్తో నేను డేటింగ్లో ఉన్నానంటూ వచ్చిన వార్తలను చూసి చాలా ఆశ్చర్యపోయాను. నేను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. సోషల్మీడియాతో పాటు సినిమా ఇండస్ట్రీలో పాపులర్ కావడంతో నాపై ఇలాంటి వార్తలు వస్తున్నాయి. అభిమానుల పేరుతో చాలామంది మమ్మల్ని ఎవరితోనైనా కనెక్ట్ చేయవచ్చు. మేము వారిని ఆపలేము. చిత్ర పరిశ్రమలో చాలామందితో కలిసి పనిచేస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో మేము కొన్ని ఎదుర్కొవాల్సిందే. ఒక్కోసారి మా ఫోటోలను వారు ఎడిట్లు కూడా చేస్తారు. కానీ వీటన్నింటికీ నేను పెద్దగా ప్రాధాన్యత ఇవ్వను. కానీ, ఇలాంటి రూమర్స్ ఎవరు చేసినా తప్పేనని చెబుతాను.' అని ఆమె చెప్పింది.సిరాజ్తో డేటింగ్ వార్తలపై మహిరా శర్మ తల్లి సానియా శర్మ కూడా గతంలో రియాక్ట్ అయ్యారు. ఇలాంటి రూమర్స్ ఎవరూ నమ్మద్దొని ఆమె కోరారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వాటిని ఖండించారు. నా కూతురు గురించి మీడియా వారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. బయట వాళ్లు ఎన్నో అంటారు.. అవన్నీ నిజాలు అయిపోతాయా..? నా కూతురు ఒక సెలబ్రిటీ కాబట్టే ఇలాంటి రూమర్స్ తెరపైకి వస్తున్నాయి. కొందరు అభిమానులే ఇలాంటి పనిచేస్తున్నారు. వాటిని ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదు.' అని సానియా శర్మ చెప్పారు.హిందీ టీవీ సీరియల్స్తో బాలీవుడ్ ప్రేక్షకులకు మహిరా శర్మ దగ్గరైంది. అలా బిగ్బాస్ 13లో అవకాశం రావడంతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత వెబ్సిరీసుల్లోనూ ఛాన్సులు దక్కించుకుని మరింత పాపులర్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే, బిగ్బాస్ సమయంలో పరాస్ ఛాబ్రాతో మహిరా శర్మ ప్రేమలో పడింది. ఇదే విషయాన్ని పరాస్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. కానీ, కొద్దిరోజుల్లోనే తాము బ్రేకప్ చెప్పుకున్నామని కూడా ఆయన పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Mahira Sharma (@mahirasharma) -
Bigg Boss 9: నాగార్జున ఔట్.. హోస్ట్గా మరో స్టార్ హీరో!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్(Bigg Boss)కు దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. అన్ని భాషల్లోనూ ఈ షోని ఆదరిస్తున్నారు. ఇక తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్గా ప్రారంభమైన ఈ షో.. ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లను దిగ్విజయంగా ముగించుకుంది. రెండో సీజన్కి నాని హోస్ట్గా వ్యవహరించాడు. ఇక మూడో సీజన్ నుంచి ఎనిమిదో సీజన్ వరకు కింగ్ నాగార్జుననే బిగ్బాస్ సోకి వ్యాఖ్యాతగా ఉన్నారు. తనదైన మాటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఆటలో తప్పొప్పులను ఎత్తి చూపుతూ నాగార్జున చేసే విశ్లేషణ బిగ్బాస్ షోకి మరింత ప్లస్ అయింది. వారం మొత్తం చూడకపోయినా సరే.. శని,ఆదివారాలు షో చూసేవారు చాలా మందే ఉన్నారు. అందుకే ఎనిమిది సీజన్లు దిగ్విజయంగా ముగిశాయి. ఇక త్వరలోనే తొమ్మిదో సీజన్(Bigg Boss 9 Telugu) ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్కి నాగార్జున హోస్ట్గా వ్యవహరించడం లేదట. ఆయన ప్లేస్లో ఓ యంగ్ హీరో రాబోతున్నట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.కొత్తదనం కోసం కొత్త హోస్ట్!బిగ్బాస్ షోకి మొదట్లో ఉన్న ఆదరణ ఇప్పుడు లేడు. షో రొటీన్గా సాగడం, పెద్ద సెలెబ్రిటీలు కంటెస్టెంట్స్గా పాల్గొనకపోవడంతో ఎనిమిదో సీజన్ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో తొమ్మిదో సీజన్ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దబోతున్నారట. కొత్తదనం కోసం హోస్ట్ని కూడా మార్చబోతున్నారట మేకర్స్. ఈ షోకి మరింత క్రేజ్ పెంచడానికి ఓ యంగ్ హీరోని రంగంలోకి దించబోతున్నారట. గేమ్లోనూ భారీ మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. ఇక హోస్ట్గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ వ్యవహరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మేకర్స్ విజయ్ని సంప్రదించారట. భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఎక్స్పీరియన్స్ కోసం విజయ్ కూడా హోస్ట్గా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది మేకర్స్ చెబితే తప్ప తెలియదు.కంటెస్టెంట్స్ ఎంపికలో కొత్తట్రెండ్బిగ్బాస్ తొమ్మిదో సీజన్ కొత్తగా ఉండబోతుందట. ఇప్పటికే కంటెస్టెంట్స్ వేటలో పడ్డారు మేకర్స్. ఈ సారి బాగా తెలిసిన ముఖాలనే హౌస్లోకి పంపిస్తారట. గత సీజన్లలో ఒక కామన్ మ్యాన్ కచ్చితంగా హోస్లోకి వెళ్లేవాడు. కానీ ఆ సారి ఆ రూల్కి బ్రేక్ వేశారట. ఈ సారి సెలెబ్రీలను మాత్రమే తీసుకోబోతున్నారట. అంతేకాదు గేమ్లోనూ మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ఓ యంగ్ హీరో సైతం ఈసారి కంటెస్టెంట్గా పాల్గొనబోతున్నాడట. అలాగే ఓ కమెడిన్, ప్రముఖ సింగర్, కొరియోగ్రాఫర్ కూడా ఈ సారి హౌస్లో సందడి చేయబోతున్నట్లు సమాచారం. గత సీజన్లలో చేసిన తప్పులను మళ్లీ రిపీట్ చేయకుండా.. చాలా పకడ్భందీగా తొమ్మిదో సీజన్ని ప్లాన్ చేస్తున్నారు. -
రూ.50 లక్షల ప్రైజ్మనీ.. ఇంతవరకు ముట్టనేలేదు: బిగ్బాస్ విజేత
బిగ్బాస్ (Bigg Boss Reality Show) విన్నర్ గెల్చుకునే ప్రైజ్మనీ రూ.50 లక్షలు. తెలుగులోనే కాదు హిందీలోనూ ఈ ప్రైజ్మనీ దాదాపు అంతే ఉంటుంది. అయితే వినడానికి, చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ అది వెంటనే చేతికి ఇస్తే ఇంకా బాగుండేదంటున్నాడు హిందీ బిగ్బాస్ 18వ సీజన్ విజేత కరణ్ వీర్ మెహ్రా (Karan Veer Mehra). సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన హిందీ బిగ్బాస్ 18వ సీజన్ గత నెలలోనే పూర్తయింది. ఈ షోలో కరణ్ టైటిల్ గెలవగా వివియన్ డిసేన రన్నరప్గా నిలిచారు. కరణ్.. రూ.50 లక్షలు గెలిచాడన్నమాటేకానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ముట్టలేదట!చేతికందని ప్రైజ్మనీతాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కలర్స్ ఛానల్లో నేను పాల్గొన్న మొదటి షో ఖత్రోన్ కె ఖిలాడీ-సీజన్ 14. గతేడాది జరిగిన ఈ షోలో విజయం సాధించాను. తద్వారా రావాల్సిన డబ్బు ఇటీవలే ముట్టింది. ఇదే ఛానల్లో ప్రసారమైన బిగ్బాస్ షోలోనూ పాల్గొని మరోసారి విజయం సాధించాను. కానీ ఇప్పటివరకు రూ.50 లక్షల ప్రైజ్మనీని నాకివ్వనేలేదు. అలాగే కారు కూడా బహుమతిగా ఇస్తామన్నారు. దానికోసం ఎంతో ఎదురుచూడగా ఇప్పుడు నాచేతికి వచ్చేసింది.అభిమానులతో జాలీగా..అయితే ఈ షో నేను గెలుస్తాననుకోలేదు. అభిమానుల అండదండల వల్లే నా విజయం సాధ్యమైంది. ఒకవేళ నేను గెలవకపోయినా ఇంతే సాధారణంగా ఉండేవాడిని. బిగ్బాస్ తర్వాత నాకు విపరీతమైన ప్రేమాభిమానాలు దక్కుతున్నాయి. చాలా సమయం ఫ్యాన్స్తోనే గడుపుతున్నాను. నన్ను ఆశీర్వదించిన మహిళలకూ సమయం కేటాయిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. కరణ్ బిగ్బాస్ ద్వారా గెలిచిన డబ్బుతో తన సిబ్బంది పిల్లలకు చదువు చెప్పిస్తానన్నాడు. View this post on Instagram A post shared by KaranVeerMehra (@karanveermehra) చదవండి: తండ్రిని కోల్పోయిన బాధలోనూ సాయం చేసిన ప్రభాస్.. -
మా మధ్య గొడవలు లేవు : శిల్పా శిరోద్కర్
బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar) కొద్దిరోజుల క్రితం హిందీ బిగ్బాస్ 18వ సీజన్కు వెళ్లొచ్చింది. టాప్ 5లో ఉంటుందనుకున్న ఆమె 100 రోజుల జర్నీ తర్వాత గ్రాండ్ ఫినాలే వీక్ మధ్యలోనే ఎలిమినేట్ అయింది. కానీ, చాలామంది అభిమానాన్ని ఆమె దక్కించుకుంది. అయితే ఈ షోకు వెళ్లడానికి ముందు నమ్రతతో గొడవపడినట్లు బిగ్బాస్లో ఉన్నప్పుడే శిల్ప చెప్పింది. ఆ సమయంలో వారిద్దరూ రెండు వారాలు మాట్లాడుకోలేదంది. ఫ్యామిలీ వీక్లో నమ్రత రావాలని కూడా ఆమె కోరుకుంది. కానీ, నమ్రతకు బదులుగా శిల్ప కూతురు బిగ్బాస్కు వెళ్లింది. శిల్పకు సపోర్ట్గా ఆమె అక్కాబావ నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar)- మహేశ్బాబు(Mahesh Babu) తనకు సపోర్ట్ చేయలేదని ప్రచారం జరిగింది. రెండు కుటుంబాల మధ్య తీవ్రమైన గొడవ జరిగిందని రూమర్స్ రావడంతో శిల్ప శిరోద్కర్ మరోసారి రియాక్ట్ అయింది.'సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్ల వల్ల బంధాలను జడ్జ్ చేయడం తప్పు. సోషల్ మీడియా పోస్ట్ల ద్వారా సంబంధాలను అంచనా వేయకూడదు.. మనుషుల మధ్య అనుబంధాన్ని తెలిపేందుకు సోషల్ మీడియా పోస్ట్ అవసరం లేదు. మేమిద్దరమూ మా భావాలను బహిరంగంగా వ్యక్తీకరించుకోలేం.. ఆన్లైన్ వేదికగా అలాంటివి మాకు ఇష్టం ఉండదు. నాకు సపోర్ట్గా నమ్రత పోస్ట్ చేస్తేనే మా మధ్య సంబంధాలు ఉన్నాయని, లేదంటే గొడవలు ఉన్నాయని ఊహించుకోవడం చాలా తప్పు. నా గుర్తింపు కోసం నేను బిగ్ బాస్ 18కి వెళ్లాను. నమ్రత సోదరి గానో లేదా మహేష్ మరదలిని కావడం వల్లో వెళ్లలేదు. వాస్తవానికి మహేశ్ ఒక సూపర్ స్టార్. ఆయన చాలా పాపులర్. కానీ, వారు నా కెరీర్లో భాగం కావాలని అర్థం కాదు కదా..? మహేశ్, నమ్రత ఇద్దరూ చాలా ప్రైవేట్గా ఉండాలనుకుంటారు. దీంతో వారికి పొగరు అని అందరూ అనుకుంటారు. ఇదీ ముమ్మాటికి నిజం కాదు. వారిద్దరూ చాలా మంచివారు. మహేశ్ చాలా సింపుల్, కూల్గా మాట్లాడుతారు. అతను చాలా మంచి వ్యక్తి. మీకు ఏదైనా అవసరమైతే.., ఎల్లప్పుడూ మీ కోసం అండగా నిలబడుతాడు.' అని శిల్పా పేర్కొంది. బిగ్ బాస్లో శిల్పా శిరోద్కర్కు ఓటు వేయాలని మహేశ్, నమ్రత శిరోద్కర్ విజ్ఞప్తి చేసి ఉంటే.. ఆమె తప్పకుండా గెలిచి ఉండేది అని చాలామంది భావించారు. ఈ క్రమంలో శిల్ప ఇలా రియాక్ట్ అయింది.నమ్రతను కలిసిన శిల్పతాజాగా శిల్ప.. నమ్రతను కలిసింది. వీరిద్దరూ కలిసి జాలీగా ఉన్న ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్.. ఇద్దరూ ట్విన్స్లా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. జనవరి 22న నమ్రత బర్త్డే సందర్భంగా శిల్ప ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. హ్యాపీ బర్త్డే.. ఐ లవ్యూ సో మచ్. నేను నిన్ను ఎంతగా మిస్ అయ్యానో అస్సలు ఊహించలేవు. నువ్వు ఎప్పటికీ నా సొంతమే అంటూ నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. -
గొర్రెల కాపరిగా కొనసాగుతా.. నాకదే ఇష్టం!: బిగ్బాస్ విన్నర్
రైతుబిడ్డ బిగ్బాస్ ట్రోఫీ గెలవడం విశేషమనే చెప్పాలి. ఈ అరుదైన ఘనతను తెలుగు బిగ్బాస్ షోలో పల్లవిప్రశాంత్ సాధించగా ఇటీవల కన్నడ బిగ్బాస్ షోలోనూ ఇలాంటి అరుదైన ఘటన చోటు చేసుకుంది. కన్నడ బిగ్బాస్ పదకొండో సీజన్ విజేతగా రైతుబిడ్డ, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ హనుమంత (Hanumantha Lamani) నిలిచాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వైల్డ్కార్డ్ కంటెస్టెంట్గా షోలో అడుగుపెట్టిన అతడు అందరి మనసులు గెలుచుకుని బిగ్బాస్ ట్రోఫీ అందుకున్నాడు. రూ.50 లక్షల ప్రైజ్మనీతో పాటు లగ్జరీ కారును సైతం సొంతం చేసుకున్నాడు.గొర్రెలు మేపడమే ఇష్టంఅరకోటి అందుకున్న హనుమంత.. తనకు గొర్రెలు మేపడమే ఇష్టమని అంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. గొర్రెల్ని మేపడానికి వెళ్లడం నాకెంతో ఇష్టం. అప్పుడు నా వెంట ఎవరూ లేరు. ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటూ పోయాను. ఇప్పుడది గుర్తు చేసుకుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఈ పనిని వదిలేయలేను. బిగ్బాస్ విషయానికి వస్తే.. బిగ్బాస్ హౌస్ను చాలా మిస్ అవుతున్నాను. భగవంతుడి ఆశీస్సులున్నాయిఅక్కడ ట్రోఫీ గెలిచానంటే అది నా గెలుపు మాత్రమే కాదు. కర్ణాటక ప్రజల విజయం. వారు ఓటేయడం వల్లే నేను గెలిచాను. అలాగే నేను ఎంతగానో ఆరాధించే హనుమంతుడి ఆశీర్వాదాలు నాపై బలంగా ఉన్నాయి. ప్రతి శనివారం ఆంజనేయుడి గుడికి వెళ్లి పాటలు పాడేవాడిని. అందుకే ఈ రోజు నేనిక్కడున్నాను.ఎవర్ని తీసుకొస్తే వారినే..పెళ్లి విషయానికి వస్తే.. అమ్మానాన్న ఎవర్ని ఎంపిక చేస్తే వారినే వివాహం చేసుకుంటాను. నా పెళ్లికి అందర్నీ ఆహ్వానిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే హనుమంతు.. ఈ షో కంటే ముందు సంగీతంతో పరిచయం లేకపోయినా కన్నడ సరిగమప షో 15వ సీజన్లో పాల్గొన్నాడు. తన గాత్రంతో అందర్నీ మైమరిపించి షో రన్నరప్గా నిలిచాడు. View this post on Instagram A post shared by 🧿ಹನುಮಂತ ಲಮಾಣಿ🧿 (@hanumantha_lamani_official_) చదవండి: ఆ మాటలతో డిప్రెషన్లోకి వెళ్లాను -
కన్నడ బిగ్బాస్ విన్నర్గా 'రైతుబిడ్డ'.. ప్రైజ్మనీ ఎంతో తెలుసా..?
కన్నడలో బిగ్బాస్ సీజన్ 11 (Kannada Bigg Boss 11) ముగిసింది. మొదటిసారి ఒక వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ విజేతగా నిలిచాడు. సుమారు 120 రోజులుగా కొనసాగిన ఈ సీజన్లో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్గా కొనసాగారు. జనవరి 26న బిగ్బాస్ ఫైనల్ ముగిసింది. దీంతో ట్రోఫీతో పాటు నగదును విజేతకు సుదీప్ అందించారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంది.బిగ్బాస్లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్ హనుమంత(Hanumantha) విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఆట మొదలపెట్టిన అతను ఏకంగా టైటిల్ విన్నర్ కావడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కర్ణాటకలోని హవేరికి చెందిన హనుమంత.. మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చాడు. తన సొంతూరులోనే డిగ్రీ వరకు చదివిన ఆయన సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మంచి గుర్తింపు పొందాడు. సంగీతంతో పరిచయం లేకుండానే 2018 సారిగమప కన్నడ 15వ సీజన్లో హనుమంత రన్నరప్గా నిలిచాడు. దీంతో చాలామంది ఆయనకు ఫ్యాన్స్ అయ్యారు. ఆపై మరుసటి ఏడాదిలో డ్యాన్స్ కర్ణాటక డ్యాన్స్ సీజన్ 2లో పాల్గొన్న హనుమంత ఇక్కడ కూడా తన టాలెంట్తోనూ మెప్పించాడు. ఈ గుర్తింపుతో బిగ్బాస్లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా 21వ రోజున హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన ఆట, మాట తీరుతో ప్రేక్షకులను మెప్పించాడు. చివరకు కన్నడ బిగ్బాస్ సీజన్ 11 విజేతగా నిలిచాడు.ప్రైజ్మనీ ఎంత..?ట్రోఫీ రేసులో హనుమంత, త్రివిక్రమ్, రజత్, మోక్షిత, మంజు టాప్-5లో ఉన్నారు. అయితే, గట్టిపోటీ తట్టుకుని హనుమంత విజేత కాగా.. రన్నరప్గా త్రివిక్రమ్ నిలిచారు. తర్వాతి స్థానాల్లో రజత్, మోక్షిత, మంజు వరుసగా ఉన్నారు. విజేత హనుమంతకు రూ. 50 లక్షల ప్రైజ్మనీ తో పాటు ట్రోఫీ, లగ్జరీ కారు దక్కాయి. రన్నరప్గా నిలిచిన త్రివిక్రమ్కు రూ. 10 లక్షలు గెలుచుకున్నారు. తెలుగు బిగ్బాస్ 8 విన్నర్గా నిలిచిన నిఖిల్ రూ. 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు ఒక కారు కూడా గెలుచుకున్న విషయం తెలిసింది.ಅತೀ ಹೆಚ್ಚು ವೋಟ್ಸ್ ಪಡೆದು ವಿಕ್ಟರಿ ಬಾರಿಸಿದ ಹನುಮಂತು!ಬಿಗ್ ಬಾಸ್ ಕನ್ನಡ 11 ಗ್ರಾಂಡ್ ಫಿನಾಲೆ#BiggBossKannada11 #BBK11 #GrandFinale #HosaAdhyaya #ColorsKannada #BannaHosadaagideBandhaBigiyaagide #ಕಲರ್ಫುಲ್ಕತೆ #colorfulstory #Kicchasudeepa pic.twitter.com/a6YfYVNVWm— Colors Kannada (@ColorsKannada) January 26, 2025 -
అక్కాచెల్లెళ్ల మధ్య దూరం..? శిల్ప శిరోద్కర్ పోస్ట్తో క్లారిటీ..
బాలీవుడ్ నటి శిల్ప శిరోద్కర్ (Shilpa Shirodkar).. ఇటీవలే హిందీ బిగ్బాస్ 18వ సీజన్కు వెళ్లొచ్చింది. టాప్ 5లో ఉంటుందనుకున్న ఆమె 100 రోజుల జర్నీ తర్వాత గ్రాండ్ ఫినాలే వీక్ మధ్యలోనే ఎలిమినేట్ అయింది. అయితే ఈ షోకు వెళ్లడానికి ముందు నమ్రతతో గొడవపడింది. ఈ విషయాన్ని శిల్ప శిరోద్కర్ స్వయంగా వెల్లడించింది. బిగ్బాస్కు వెళ్లేముందు నమ్రతతో గొడవైందని.. రెండు వారాలు మాట్లాడుకోలేదంది. ఫ్యామిలీ వీక్లో నమ్రత రావాలని కోరుకుంది.పట్టించుకోలేదా?కానీ నమ్రతకు బదులుగా శిల్ప కూతురు బిగ్బాస్కు వెళ్లింది. ఇకపోతే శిల్పకు సపోర్ట్గా ఆమె అక్కాబావ నమ్రత- మహేశ్బాబు తనకు సపోర్ట్ చేయలేదని ప్రచారం జరిగింది. షో నుంచి వచ్చిన వెంటనే శిల్ప ఆ ప్రచారాన్ని తిప్పికొట్టింది. నమ్రత ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు. తను కచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలని చెప్పను. ఇలాంటివి మా మధ్య బంధాన్ని ప్రభావితం చేయలేవు. తను నాకు మద్దతిచ్చినా, ఇవ్వకపోయినా తనేంటో నాకు తెలుసు.. నేనేంటో తనకు తెలుసు అని చెప్పింది.బర్త్డే విషెస్తాజాగా శిల్ప.. నమ్రతను కలిసింది. వీరిద్దరూ కలిసి జాలీగా ఉన్న ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్.. ఇద్దరూ ట్విన్స్లా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. జనవరి 22న నమ్రత బర్త్డే సందర్భంగా శిల్ప ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. హ్యాపీ బర్త్డే.. ఐ లవ్యూ సో మచ్. నేను నిన్ను ఎంతగా మిస్ అయ్యానో అస్సలు ఊహించలేవు. నువ్వు ఎప్పటికీ నా సొంతమే అంటూ నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. మహేశ్- నమ్రత దంపతులు.. శిల్పకు సపోర్ట్గా లేరు, పట్టించుకోవట్లేదన్న రూమర్లకు ఈ పోస్ట్తో చెక్ పడినట్లైంది. View this post on Instagram A post shared by Shilpa Shirodkar Ranjit (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి: ఓటీటీలో 'శ్వేతా బసు' బోల్డ్ సినిమా.. టీజరే ఇలా ఉంటే..! -
‘సల్మాన్ అవమానించాడు’.. స్పందించిన అక్షయ్ కుమార్
'బిగ్ బాస్ 18' గ్రాండ్ ఫినాలే వివాదంపై అక్షయ్ కుమార్(Akshay Kumar) స్పందించాడు. సల్మాన్ ఖాన్ తనను అవమానించారనే వార్తలను కొట్టిపాడేశాడు. తనకున్న కమిట్మెంట్ల కారణంగానే గ్రాండ్ ఫినాలే షూటింగ్ ప్రారంభం కాకముందే షో నుంచి బయటకు వచ్చానని.. అంతకు మించి అక్కడ ఏమి జరగలేదని చెప్పి రెండు రోజులుగా జరుగుతున్న సోషల్ మీడియా వార్కి పుల్స్టాఫ్ పెట్టేశాడు.అసలేం జరిగింది?గత ఆదివారం(జనవరి 19) హిందీ బిగ్బాస్ 18వ సీజన్ గ్రాండ్ ఫినాలే జరిగిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్(Salman Khan) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో గ్రాండ్ ఫినాలేకి అతిథులుగా అక్షయ్ కుమార్, వీర్ సహారియాలను పిలిచారు.షెడ్యూల్ టైం ప్రకారం అక్షయ్ కుమార్ బిగ్ బాస్ సెట్ కు వెళ్లారు. కానీ సల్మాన్ ఖాన్ మాత్రం ఆలస్యంగా సెట్కి వచ్చాడు. దాదాపు గంట పాటు సెట్లోనే వేచి చూసిన అక్షయ్.. షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్షయ్ వెళ్లిపోయిన కాసేపటికి సల్మాన్ సెట్కి వచ్చాడు. దీంతో అక్షయ్ కుమార్ను సల్మాన్ ఖాన్ అవమానించాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. అంతేకాదు అక్షయ్ అసహనంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడని.. బిగ్బాస్ నిర్వాహకులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదంటూ పుకార్లు వచ్చాయి.వాస్తవం ఎంటంటే..?సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై తాజాగా అక్షయ్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తనకున్న కమిట్మెంట్ కారణంగా షూటింగ్ ప్రారంభం కాకముందే షో నుంచి వచ్చేసినట్లు చెప్పారు.సల్మాన్ సెట్కు ఆలస్యంగా వచ్చిన విషయం వాస్తవమే. కానీ ఆయన ఆలస్యంగా రావడం వల్లే నేను వెళ్లిపోలేదు. నా సినిమా షూటింగ్కు టైమ్ కావడంతో ఫినాలే షూట్ నుంచి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత సల్మాన్తో మాట్లాడాను. నేను వచ్చేసినా మా చిత్రం ‘స్కై ఫోర్స్’ను ప్రచారం చేయడం కోసం వీర్ పహారియా బిగ్బాస్ సెట్లోనే ఉన్నారు. అతడు మా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు’ అని అక్షయ్ అన్నారు.బిగ్ బాస్ 18' విన్నర్ ఎవరు? బిగ్ బాస్ షో తెలుగులోనే కాదు మిగతా భాషల్లో కూడా పాపులర్. హిందీలో 18 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇక 18వ సీజన్ విన్నర్((Bigg Boss 18 winner) గా నటుడు కరణ్ వీర్ మోహ్రా నిలిచాడు. ఇతడు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్మనీ గెలుచుకున్నాడు. నటుడు వివియన్ డిసేన ఫస్ట్ రన్నరప్గా, యూట్యూబర్ రజత్ దలాల్ సెకండ్ రన్నరప్గా నిలిచారు. అవినాష్ మిశ్రా, చుమ్ దరాంగ్, ఇషా సింగ్ టాప్ 6లో చోటు సంపాదించుకున్నారు. -
Bigg Boss: ఒకరికి రూ.40 లక్షలు, మరొకరికి రూ.50 లక్షలు..
బిగ్బాస్ షో (Bigg Boss Reality Show) ముగిసింది. తమిళంలో ఎనిమిదో సీజన్, హిందీలో పద్దెనిమిదో సీజన్ విజయవంతంగా పూర్తయింది. జనవరి 19న ఈ రెండు భాషల్లో గ్రాండ్ ఫినాలే జరిగింది. తమిళ బిగ్బాస్ విషయానికి వస్తే యూట్యూబర్ ముత్తుకుమారన్ (Muthukumaran) విజేతగా నిలిచాడు. ఇతడు రూ.41 లక్షల ప్రైజ్మనీ అందుకున్నాడు. సౌందర్య ఫస్ట్ రన్నరప్గా, వీజే విశాల్ సెకండ్ రన్నరప్గా నిలిచారు. తమిళ బిగ్బాస్ ఎనిమిదో సీజన్కు విజయ్ సేతుపతి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.హిందీ రియాలిటీ షో విషయానికి వస్తే.. నటుడు కరణ్ వీర్ మెహ్రా (Karan Veer Mehra) బిగ్బాస్ ట్రోఫీ గెలిచాడు. గ్రాండ్ ఫినాలే స్టేజీపై హోస్ట్ సల్మాన్ ఖాన్ కరణ్ను విజేతగా ప్రకటించాడు. ఇతడు ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్మనీ గెలుచుకున్నాడు. నటుడు వివియన్ డిసేన ఫస్ట్ రన్నరప్గా, యూట్యూబర్ రజత్ దలాల్ సెకండ్ రన్నరప్గా నిలిచారు. కరణ్ ఇంతకుముందు ఖత్రోన్ కె ఖిలాడీ 14వ సీజన్ విజేతగా అవతరించాడు. ఇతడు పవిత్ర రిష్తా, యే రిష్తా క్యా కెహ్లాతా హై, పరి హూన్ మే, బడే అచ్చే లగ్తే హా, సాసురల్ సిమర్ కా, విరుద్ధ్ వంటి పలు సీరియల్స్లో నటించాడు. View this post on Instagram A post shared by Vijay Television (@vijaytelevision) View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) చదవండి: అదివారం నాడు నాకో సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ -
పెళ్లికి ముందే ప్రియుడితో పూజ.. 'అబ్బాయి పేరెంట్స్ అయినా చెప్పాలిగా'
కష్టాలు నాకు చుట్టాలని కొందరు అంటూ ఉంటారు. కానీ కీర్తి భట్కు కష్టాలు చుట్టాలుగా కాదు ఏకంగా కుటుంబ సభ్యులమే అంటూ తన ఇంట్లో, జీవితంలో తిష్ట వేశాయి. ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఉంటున్న సమయంలో విధి కీర్తి జీవితంతో ఆడుకుంది. యాక్సిడెంట్లో కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది. అమ్మానాన్న, అన్నయ్య.. ముగ్గురూ దూరమవడంతో ఎవరూ లేని అనాథగా మారింది.సినిమాల నుంచి సీరియల్స్దురదృష్టవంతురాలినని కుంగిపోయింది. కానీ ఇలా బాధపడుతూ కూర్చుంటే కరెక్ట్ కాదని తనకు తాను సర్ది చెప్పుకుంది. బాధను దిగమింగుకుంటూ జీవితాన్ని ఒంటరిగా ఎదుర్కోవాలనుకుంది. నచ్చిన ఫీల్డ్లో తన సత్తా చూపించాలనుకుంది. అలా కీర్తి భట్ (Keerthi Bhat) నటనవైపు అడుగులు వేసింది. కన్నడలో టీవీ సీరియల్స్ చేసింది. రెండు కన్నడ చిత్రాల్లోనూ నటించింది. తర్వాత మనసిచ్చి చూడు సీరియల్తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కార్తీకదీపం ధారావాహికలోనూ మెరిసింది.ఎప్పటికీ తల్లి కాలేవన్న వైద్యులుఈ సీరియల్స్ ద్వారా వచ్చిన క్రేజ్తో తెలుగు బిగ్బాస్ ఆరో సీజన్లో అడుగుపెట్టింది. ఈ సీజన్లో ఫస్ట్ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన ఆమె సెకండ్ రన్నరప్గా నిలిచి ఎందరికో ఆదర్శంగా నిలిచింది. అయితే బిగ్బాస్ షో (Bigg Boss Reality Show)కు వెళ్లేముందు కూడా మరోసారి కష్టాలు తనను పట్టికుదిపేశాయి. యాక్సిడెంట్ వల్ల కీర్తి ఎప్పటికీ తల్లి కాలేదని వైద్యులు తేల్చి చెప్పడంతో ఆమె ఓ పాపను దత్తత తీసుకుని పెంచుకుంది. కానీ ఆ సంతోషం కూడా ఎంతోకాలం ఉండలేదు. బిగ్బాస్ ఆఫర్ వచ్చిన సమయంలోనే పాప మరణించింది.(చదవండి: 'మీరు అనుకున్నది సాధిస్తే'.. ప్రమాదం తర్వాత అజిత్ వీడియో రిలీజ్!)2023లో ఎంగేజ్మెంట్ఇలా ఎన్నో కష్టాలు దాటి ఇక్కడిదాకా వచ్చింది కీర్తి. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానంటూ 2023లో కీర్తి గుడ్న్యూస్ చెప్పింది. హీరో, దర్శకుడు విజయ్ కార్తీక్ను వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించింది. అదే ఏడాది విజయ్తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ మరుసటి ఏడాది నుంచి కాబోయే భర్తతో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. నిశ్చితార్థం అయిపోయి రెండేళ్లవుతున్నా ఇంకా పెళ్లి డేట్ చెప్పట్లేదు. తాజాగా కీర్తి.. కాబోయే భర్తతో కలిసి తొలిసారి పూజలో పాల్గొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. భార్యాభర్తల్లా పూజ చేస్తున్నారేంటి?ఇది చూసిన ఓ నెటిజన్.. మిస్ కన్నడ కీర్తి గారు.. పెళ్లికి ముందు ఇలా కలిసి పూజ చేయడం తెలుగు సాంప్రదాయం కాదు. కార్తీక్.. కనీసం మీకు మీ తల్లిదండ్రులైనా చెప్పలేదా? అయినా ఈ జనరేషన్లో పేరెంట్స్ మాట ఎవరూ వినరు. ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలోనివాళ్లు అసలే వినరు అని పెదవి విరిచాడు. దీనికి కీర్తి స్పందిస్తూ.. పెళ్లికి ముందే మేము ఇలా పూజ చేస్తే ఏమవుతుందో కాస్త చెప్పగలరా? ఒకరిని నిందించేముందు సరైన కారణాలు చెప్పండి అని ఘాటుగా రిప్లై ఇచ్చింది.ఎవరీ కార్తీక్?కీర్తికి కాబోయే భర్త కార్తీక్ విషయానికి వస్తే.. చిత్తూరులోని మదనపల్లిలో పుట్టి పెరిగిన విజయ కార్తీక్ మొదట సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేశాడు. తర్వాత సినిమా మీదున్న ప్రేమతో ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీలో చేరాడు. కన్నడ భాషలో నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగులో ఏబీ పాజిటివ్, చెడ్డీ గ్యాంగ్ సినిమాలు చేశాడు.చదవండి: 'మీరు అనుకున్నది సాధిస్తే'.. ప్రమాదం తర్వాత అజిత్ వీడియో రిలీజ్! -
మరోసారి మోకాళ్లపై 'తిరుమల కొండ' ఎక్కిన తెలుగు హీరోయిన్
సినిమాల కోసం మాత్రమే గ్లామర్ లుక్లో కనిపించే నందిని రాయ్(Nandini Rai) సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఉంటుంది. కానీ, ఆమెలో ఆధ్యాత్మికత చింతన చాలా ఎక్కువని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఆమె చాలాసార్లు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. గతంలో ఒకసారి మోకాళ్లపై వెళ్లి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నందిని.. తాజాగా మరోసారి మోకాళ్లపై అలిపిరి నుంచి తిరుమల కొండ (Tirumala Temple) చేరుకున్నారు. ఇన్స్టాలో ఎప్పుడూ ఆమె గ్లామర్కు ఫిదా అయిన నెటిజన్లు ఆమెలో దాగివున్న భక్తికి ఫిదా అవుతున్నారు.( ఇదీ చదవండి: గాయం నుంచి ఎప్పుడు కోలుకుంటానో ఆ దేవుడికే తెలియాలి: రష్మిక)టాలీవుడ్లో చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించిన నందినీ రాయి.. బిగ్ బాస్ 2 తెలుగు సీజన్తో చాలామందికి దగ్గరైంది. అయితే, 2011లోనే 'ఫ్యామిలీ ప్యాక్' బాలీవుడ్ సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో మాత్రం '040' మూవీతో అడుగుపెట్టింది. కోలీవుడ్లో విజయ్ కథానాయకుడిగా దిల్ రాజు నిర్మించిన వారసుడు చిత్రంలో శ్రీకాంత్కు జోడిగా నందిని రాయ్ నటించింది. తెలుగులో మాయ,మోసగాళ్లకు మోసగాడు,సిల్లీ ఫెలోస్,భాగ్ సాలే,శివరంజని వంటి చిత్రాల్లో ఆమె మెరిసింది.వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని నందిని రాయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా వెళ్లారు. మోకాళ్ల పర్వతం వద్ద ఆమె కెమెరాలకు కనిపించారు. అక్కడ మోకాళ్లపై ఎక్కుతూ కనిపించడంతో చాలామంది అభినందించారు. అయితే, సుమారు రెండేళ్ల క్రితం కూడా నందిని రాయ్ మోకాళ్లపై నుంచే కొండ మీదకు వెళ్లి శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఆమె ఫోటోల కింద గోవిందా గోవిందా అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.నటి సౌందర్య ఇన్సిపిరేషన్తో ..దివంగత నటి సౌందర్య ఇన్సిపిరేషన్తో సినిమాల్లోకి వచ్చానని చెప్పిన నందిని రాయ్ పుట్టింది.. పెరిగింది... హైదరాబాద్లోనే. ఉన్నత చదువులు విదేశాల్లో అభ్యసించారు. మోడల్గా కెరీర్ ప్రారంభించి తక్కువ టైంలోనే అంతర్జాతీయ మోడలింగ్గా పేరు సంపాదించుకున్నారు. 2009లో మిస్ హైదరాబాద్ కిరీటం దక్కించుకున్నారు. 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ విన్నర్ కూడా. తెలుగుతోపాటు ఓ తమిళ్, కన్నడ, మళయాళం చిత్రంలో ఆమె నటించారు.అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్న నందినిగతంలో తను ఓ ఇంటర్వ్యూలో సూసైడ్ చేసుకోవాలనుకున్నానని ఇలా చెప్పింది. 'కెరియర్ మొదట్లో నా సినిమాలు అంతగా ఆడలేదు. దాంతో చాలా కుంగిపోయా. ఇంటి టెర్రస్పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా. తర్వాత ఆ ఆలోచన తప్పని గ్రహించా. మిత్రులతో రోజూ మాట్లాడుతూ ధైర్యం తెచ్చుకున్నా. సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకున్నా. ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డా. జయాపజయాలకు పొంగిపోవడం.. కుంగిపోవడం కరెక్ట్ కాదని తెలుసుకున్నా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగడమే జీవితమని అర్థం చేసుకున్నా' అని చెప్పింది. View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) -
'మా అమ్మాయి నిప్పు'.. నటి బండారం బయటపెట్టిన సల్మాన్
'మా అమ్మాయి నిప్పు.. తనకు బాయ్ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరు. అబ్బాయిలతో అంత సన్నిహితంగా ఉన్నదే లేదు. భవిష్యత్తులో కూడా తను ఎవరినీ ప్రేమించదు. నేను చూపించిన అబ్బాయిని తప్ప ఇంకెవర్నీ పెళ్లి చేసుకోదు. అనవసరంగా తన గురించి లేనిపోనివి మాట్లాడితే బాగోదు' అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది నటి (Chahat Pandey) చాహత్ పాండే తల్లి భావన పాండే. బుల్లితెర నటి చాహత్ ప్రస్తుతం హిందీ బిగ్బాస్ 18 (Bigg Boss 18)వ సీజన్లో పాల్గొంది. ఉతికారేసిన చాహత్ తల్లిఇటీవల ఫ్యామిలీ వీక్లో భాగంగా చాహత్ తల్లి బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలోనే తన కూతురితో కయ్యం పెట్టుకుంటున్న అవినాష్ మిశ్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పై కామెంట్స్ చేసింది. ఈ వ్యవహారం అంతటితో ముగిసిపోలేదు. నిజంగానే చాహత్ సింగిలా? అని బిగ్బాస్ టీమ్కు డౌట్ వచ్చింది. తనకు ప్రియుడు ఉండొచ్చన్న అనుమానంతో సోషల్ మీడియా అంతా జల్లెడపట్టారు. ఈ క్రమంలో ఓ ఫోటో దొరికింది. అందులో ప్రియుడు లేడు కానీ ప్రేమలో ఉన్నట్లు యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది.(చదవండి: గేమ్ ఛేంజర్ ఈవెంట్కు హీరోయిన్ డుమ్మా.. ఎందుకంటే?)మీ అమ్మ సర్టిఫికెట్ ఇచ్చింది!ఇంకేముంది, దాన్ని పట్టేసుకున్నారు. తాజా ప్రోమోలో సల్మాన్ ఖాన్ (Salman Khan).. అమ్మాయిల వెంటపడే అబ్బాయిలంటే నీకస్సలు ఇష్టముండదని మీ అమ్మ చెప్పింది. అంటే నువ్వు ఎలాంటిదానివో చెప్తూ మంచి సర్టిఫికెట్ ఇచ్చి వెళ్లిపోయింది. మా టీమ్ ఇది నిజమేనా? అని నిర్ధారించుకునే క్రమంలో ఒకటి కనుగొన్నారు. అదేంటో మీరూ చూసేయండి అంటూ ఫోటో చూపించాడు. యానివర్సరీ ఫోటో.. మరి ఇదేంటి?ఆ ఫోటోలో 'ఐదేళ్లు పూర్తయ్యాయి. హ్యాపీ యానివర్సరీ మై లవ్' అని కేక్పై రాసి ఉంది. ఆ కేక్ పక్కనే చాహత్ కూర్చుని ఉంది. అది చూసి చాహత్ కంగారుపడగా.. తనతో పాటు సీరియల్స్ చేసిన అవినాష్.. ఇప్పటికైనా నిజం ఒప్పుకో, సెట్లో అందరికీ ఆ విషయం తెలుసు అని చెప్పాడు. కానీ చాహత్ ఒప్పుకోలేదు.ఇంత దిగజారుతారా?అయితే ఈ వ్యవహారంలో పలువురు నెటిజన్లు బిగ్బాస్ టీమ్నే తప్పుపడుతున్నారు. తన పర్సనల్ లైఫ్లో ఏం జరిగిందో తెలుసుకుని మరీ అందరి ముందు దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అది తన వ్యక్తిగతమని, దానివల్ల మిగతావారికేంటి సమస్య? అని నిలదీస్తున్నారు. బిగ్బాస్ టీమ్ ఇంత దిగజారుతుందనుకోలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.చదవండి: 'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..? -
బిగ్బాస్ ఫ్యామిలీ వీక్లో భార్య ఎంట్రీ.. రొమాన్స్ వీడియో వైరల్
బాలీవుడ్లో బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-18 నడుస్తోంది. ఈ షోకు హోస్ట్గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. జనవరి 19న ఫైనల్ కూడా జరగనుంది. ఈ క్రమంలో అన్ని సీజన్స్ మాదిరే అక్కడ కూడా ఫ్యామిలీ వీక్ ఇప్పుడు జరుగుతుంది. టైటిల్ రేసులో ఉన్న వివియన్ డిసేనా అనే కంటెస్టెంట్ చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఫ్యామిలీ వీక్లో భాగంగా తన సతీమణి వహ్బిజ్ దొరాబ్జీ బిగ్బాస్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, తన సతీమణితో ఆయన వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.వివియన్ డిసేనా బాలీవుడ్ సీరియల్స్లలో ఆయనకు చాలా పాపులారిటీ ఉంది. పలు రియాలిటీ షోలలో కూడా సత్తా చాటాడు. ఇప్పుడు కూడా బిగ్బాస్ 18 టైటిల్ రేసులో ఉన్నాడు. అయితే, ఫ్యామిలీ వీక్లో భాగంగా చాలా రోజుల తర్వాత తనను కలవడానికి వచ్చిన భార్యతో ఆయన రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. దానిని చూసిన నెటిజన్లు వివియన్ను ట్రోల్ చేస్తున్నారు. బిగ్బాస్లో అన్ని కెమెరాల ముందు వివియన్, నూరాన్ ఇద్దరూ బెడ్పై చాలా సన్నిహితంగా ఉన్న దృశ్యాలను టెలికాస్ట్ చేశారు. వివియన్ సతీమణి నూరాన్ కూడా పలు సీరియల్స్లలో నటించింది. ఆమె మోడల్గా కూడా రానించింది.పబ్లిక్ ఫ్లాట్ఫామ్లో ప్రసారం అవుతున్న ఇలాంటి షోలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో బిగ్బాస్ నిర్వాహుకుల మీద కూడా వారు ఫైర్ అవుతున్నారు. హిందీ బిగ్ బాస్ హౌస్లో ఇలాంటివి కొత్త కాదు. గత సీజన్స్లలో కూడా ఇలాంటి సీనే వైరల్ అయింది. హౌస్లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్లు ఇంటిమేట్ సీన్ అంటూ ట్రెండ్ అయింది. దీంతో షో నిర్వాహకులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చి.. అదంతా ఫేక్ అంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కానీ, తాజాగా బిగ్ బాస్ 18 నుంచి బయటకు వచ్చిన ఈ వీడియో మాత్రం నిజమైనదేనని చెప్పవచ్చు. -
బిగ్బాస్ షోకి వెళ్లనున్న రామ్చరణ్!
హీరో రామ్చరణ్ (Ram Charan) మరోసారి బిగ్బాస్ షోకి వెళ్లనున్నాడు. మొన్న తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా వచ్చి సందడి చేశాడు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ (Game Changer Movie) చిత్ర ప్రమోషన్స్ కోసం హిందీ బిగ్బాస్ 18వ సీజన్కు వెళ్లనున్నాడట! వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో చరణ్ స్టేజీపై కనిపించనున్నాడంటూ ప్రచారం ఊపందుకుంది.గేమ్ ఛేంజర్ చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి వారికి హైప్ ఎక్కించడం కోసం చరణ్ బిగ్బాస్కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. హోస్ట్, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)తో ముచ్చటించి తన సినిమా ట్రైలర్ను చూపించనున్నారట! కాగా సల్మాన్- చరణ్ మధ్య ఇదివరకే స్నేహం ఉంది. (చదవండి: Game Changer: తగ్గిన రామ్ చరణ్ రెమ్యునరేషన్!)సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలోని ఏంటమ్మా పాటలో చరణ్, వెంకటేశ్ స్టెప్పులతో అదరగొట్టారు. సల్లూభాయ్ హైదరాబాద్కు వచ్చినప్పుడు చరణ్ ఇంటికి పిలిచి ఆతిథ్యమిస్తుంటాడు. అటు చరణ్ ముంబై వెళ్లినప్పుడు కూడా సల్మాన్ తనను ఇంటికి ఆహ్వానిస్తుంటాడు. వీరిద్దరి కలయిక కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.గేమ్ ఛేంజర్ విషయానికి వస్తే శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్చరణ్, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటించారు. అంజలి కీలక పాత్ర పోషించింది. ఎస్జే సూర్య విలన్గా నటించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జనవరి 10న విడుదల కానుంది.చదవండి: 'కలెక్టర్కి ఆకలేస్తోంది అంటా'... 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ చూసేయండి -
రెండుసార్లు నటికి గర్భస్రావం.. ఆ భయంతోనే చెప్పట్లేదా?
మెరీనా అబ్రహం (Marina Abraham Sahni).. అమెరికా అమ్మాయి సీరియల్తో అందర్నీ ఇట్టే కట్టిపడేసింది. బిగ్బాస్ తెలుగు ఆరో సీజన్ (Bigg Boss Reality Show)లో భర్త రోహిత్ సాహ్నితో కలిసి పాల్గొంది. వీరిద్దరూ కలిసి సొంతంగా ఓ ఫోటోస్టూడియో కూడా నెలకొల్పారు. ఇకపోతే కొంతకాలంగా యాక్టింగ్కు దూరంగా ఉంటోంది మెరీనా. ఈ మధ్య కాస్త బొద్దుగా అవడంతో తను ప్రెగ్నెంట్ అన్న రూమర్స్ మొదలయ్యాయి. దీనికి మెరీనా.. యూట్యూబ్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. 2021లో ప్రెగ్నెంట్లావయ్యానంటే దానికి చాలా కారణాలుంటాయి. మీకు ముందుగా నా గతం గురించి చెప్తాను. 2021లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ మొదటి స్కానింగ్లోనే బేబీ గుండె కొట్టుకోవడం లేదని తెలిసింది. అయినా మళ్లీ హార్ట్బీట్ వస్తుందేమోనని ఎదురుచూశాం. మూడునెలలవరకు తీయించుకోలేదు. ఇంకా ఆలస్యం చేస్తే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పడంతో దాన్ని తీసేయించుకోవాల్సి వచ్చింది. 2022లో మళ్లీ ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు హార్ట్బీట్ వచ్చింది. అందుకే..ఒత్తిడి వల్లో.. నా శరీరం వీక్గా ఉందనో కానీ గర్భస్రావమైంది. అప్పుడు నా బాడీలో చాలా మార్పులు వచ్చాయి. ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్లు స్టెరాయిడ్లు ఇవ్వాల్సి వచ్చింది. తినకపోయినా లావైపోయాను. ఇక ప్రస్తుత విషయానికి వస్తే నేను ప్రెగ్నెంటా? కాదా? అన్నది ఇప్పుడే చెప్పలేను అంటూ సమాధానం దాటవేసింది. కానీ తన ఫోటోలు, వీడియోలు చూస్తుంటే మెరీనా ప్రెగ్నెంట్ అని సులువుగా తెలిసిపోయిందంటున్నారు ఫ్యాన్స్. View this post on Instagram A post shared by Marina Abraham Sahni (@marina.a1203) చదవండి: కీర్తికి వింత అనుభవం.. దోస అని పిలవడంతో.. -
సోనియా పెళ్లిలో పెద్దోడు మిస్సింగ్.. కానీ పుష్ప లెవల్లో రైతుబిడ్డ ఎంట్రీ
సోనియా ఆకుల.. బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో సెన్సేషన్ అయిన పేరు. నిర్భయంగా, నిర్మొహమాటంగా తనకు ఏదనిపిస్తే అది మాట్లాడుతుంది. ఎవరేమనుకున్నా లెక్క చేయకుండా నచ్చింది చేసుకుంటూ పోతుంది. బిగ్బాస్ 8లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన పృథ్వీ, నిఖిల్తో కలిసి ఒక గ్యాంగ్గా ఏర్పడింది. ఆ ఇద్దరినీ తన గుప్పిట్లో పెట్టుకుందన్న విమర్శలు కూడా మూటగట్టుకుంది. కట్ చేస్తే షో నుంచి ఎలిమినేట్ అయ్యాక తనపై నెగెటివిటీ వచ్చిందని తెలుసుకుని దాన్ని ఎలాగోలా కవర్ చేసేయాలనుకుంది.నిఖిల్కు ఆహ్వానం.. కానీ!అందుకుగానూ తన గుప్పిట్లో పెట్టుకున్న పెద్దోడు అలియాస్ నిఖిల్నే నామినేట్ చేసింది. సోషల్ మీడియాలోనూ అతడికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టింది. ఇప్పుడు షో పూర్తయింది కాబట్టి అంతా కలిసిపోయారు. తన పెళ్లికి రమ్మని శుభలేఖ ఇచ్చిందట. ఆమెపై అలిగాడో, కోపమో, పనివల్లో కానీ సోనియా వివాహానికి నిఖిల్ డుమ్మా కొట్టాడు. అయితే గత సీజన్ విజేత రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మాత్రం సోనియా రిసెప్షన్కు హాజరై ఆమెను ఆశీర్వదించాడు. పుష్ప లెవల్లో ఎంట్రీఈమేరకు తన గ్రాండ్ ఎంట్రీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ప్రశాంత్ చుట్టూ ఇద్దరు, ముగ్గురు బౌన్సర్లు కూడా ఉన్నారు. కొత్త జంటను కలిసిన అనంతరం బిగ్బాస్ సెలబ్రిటీలందర్నీ పలకరించాడు. ఇక ఈ వీడియోకు పుష్ప 2 మూవీలోని గంగో రేణుక తల్లి పాటను యాడ్ చేయడం గమనార్హం. ఇది చూసిన జనాలు ఇతడేంటి? హీరోలా ఫీలైపోతున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) చదవండి: ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్ -
మొన్నటిదాకా సినిమాలతో బిజీ.. ఇప్పుడు కొత్తగా వ్యాపారంలోకి!
బిగ్బాస్ షోలో పాల్గొనేవారికి క్రేజ్, పాపులారిటీ వస్తుంది. ఆ క్రేజ్ను కాపాడుకోవడం వారి చేతుల్లోనే ఉంటుంది. ఇకపోతే బిగ్బాస్ తెలుగు నాలుగో సీజన్లో పాల్గొన్న సోహైల్ సెకండ్ రన్నరప్గా నిలిచాడు. తనకు వచ్చిన క్రేజ్ చూసి ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. వరుస ఆఫర్లు వస్తుండటంతో సంతోషంగా ఓకే చేసేశాడు. ఒకేసారి మూడు నాలుగు సినిమాల వరకు సంతం చేశాడు. కొత్త బంగారు లోకం సినిమాలో కేవలం ఒకటీరెండు సెకన్ల పాటు కనిపించిన సోహైల్ బిగ్బాస్ తర్వాత హీరోగా మారాడు. లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్కట్ బాలరాజు వంటి చిత్రాలు చేశాడు.ఇందులో మిస్టర్ ప్రెగ్నెంట్ తప్ప మిగతావన్నింటినీ ప్రేక్షకులు తిరస్కరించారు. దాన్ని సోహైల్ తట్టుకోలేకపోయాడు. తన సినిమాను చూడమని, ఎంకరేజ్ చేయమని కన్నీళ్లు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతున్న అతడు కొత్త బిజినెస్లోకి దిగాడు. మణికొండలో కొత్త రెస్టారెంట్ ప్రారంభిస్తున్నాడు. డిసెంబర్ 23న ఈ రెస్టారెంట్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించాడు.చదవండి: దుల్కర్ సల్మాన్కు జోడీగా ఛాన్స్ కొట్టేసిన టాలెంటెడ్ బ్యూటీ -
Pallavi Prashanth: మాట మారింది.. స్టైల్ మారింది!
'అన్నా.. నేను రైతుబిడ్డనన్నా..', 'జై జవాన్- జై కిసాన్' అంటూ బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో ఇవే డైలాగ్స్ రిపీట్ చేశాడు పల్లవి ప్రశాంత్. బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఓ పక్క అమాయకంగా ఉంటూనే మరోక్క పుష్ప లెవల్లో డైలాగ్స్ పలికేవాడు. టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్మనీతో నిరుపేదలకు సాయం చేస్తానని మాటిచ్చాడు. నేలతల్లి సాక్షిగా, పంట చేను సాక్షిగా చెప్తున్నా.. నేను గెలిచిన రూ.35 లక్షల్లో ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను. అందరికీ దానం చేస్తానని బీరాలు పలికాడు.చేతులు దులిపేసుకున్న ప్రశాంత్?ఇచ్చిన మాట ప్రకారం అప్పట్లో రూ.1 లక్ష సాయం చేశాడు. తర్వాత మరో కుటుంబానికి లక్ష కంటే తక్కువే ఇచ్చినట్లు తెలుస్తోంది. షో పూర్తయి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ప్రైజ్మనీ మొత్తాన్ని అతడు చెప్పినట్లుగా నిరుపేదలకు ఖర్చు చేయనేలేదు. ఈ విషయంలో ప్రశాంత్ మాట తప్పాడని జనాలు విమర్శిస్తూనే ఉన్నారు. హౌస్లో సింపతీ డ్రామా ఆడి, బయటకు వచ్చాక మాత్రం తలపొగరు చూపిస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. లుక్ మార్చిన రైతు బిడ్డతాజాగా ప్రశాంత్ సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేశాడు. అందులో ప్రశాంత్ గెటప్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. లుక్ మార్చేశావేంటన్నా.., రైతు బిడ్డ రాయల్ బిడ్డ అయ్యాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం.. ఈ సోకులకేం తక్కువ లేదు, ముందు ఇచ్చిన మాట ప్రకారం డబ్బు పంచు అని సెటైర్లు వేస్తున్నారు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) చదవండి: ఇన్స్టాతో పాపులర్.. ఫోక్ సింగర్ 'శృతి' ఆత్మహత్య -
గతంలో కంటే రెట్టింపు పారితోషికం, అవేవీ ఎపిసోడ్లో వేయలేదు: గౌతమ్
అశ్వత్థామకు చావు లేదన్నది అందరికీ తెలుసు. కానీ ఈ అశ్వత్థామకు తిరుగులేదని నిరూపించాడు గౌతమ్ కృష్ణ. బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో తనకు తాను అశ్వత్థామ అన్న బిరుదు ఇచ్చుకున్నాడు. అప్పుడు తనపై సెటైర్లు వేసినవాళ్లే.. ఎనిమిదో సీజన్కు వచ్చేసరికి చప్పట్లు కొట్టారు. గౌతమ్ మాట తీరు, ఆటతీరుకు ఫిదా అయ్యారు. ఈ సీజన్ రన్నరప్గా నిలిచిన్నప్పటికీ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న గౌతమ్ తాజాగా సాక్షి.కామ్తో ముచ్చటించాడు. ఆ విశేషాలు చూసేయండి..ట్రోలింగ్పై మీ అభిప్రాయం?గౌతమ్: గత సీజన్లో నేను కొన్ని పొరపాట్లు చేశాను. అందుకు నాపై ట్రోలింగ్ జరిగింది. తర్వాత నన్ను నేను కొత్తగా తీర్చిదిద్దుకుని ఎనిమిదో సీజన్లో అడుగుపెట్టాను. మొదటివారం ఎలిమినేషన్ అంచున నిలబడినప్పుడు బాధపడ్డాను. కానీ నాకు ఒక అవకాశం వచ్చిందన్నప్పుడు ధృడంగా నిలబడ్డాను, గట్టిగా ఆడాను. అశ్వత్థామ అంటే ట్రోల్ చేసినవారే మళ్లీ అదే పేరుతో పొగిడారు. నాకెంతో పాజటివిటీ దొరికింది. ఈ జర్నీని నేనెప్పటికీ మర్చిపోలేను.ఫినాలే వరకు రావడానికి మణికంఠ కారణమని భావిస్తున్నారా?గౌతమ్: లేదు. ఒక్క వారం మణికంఠ వల్ల సేవ్ అయ్యాను. కానీ ఫినాలే వరకు నా స్వయంకృషితో వచ్చాను.చిరంజీవి సతీమణి సురేఖగారిని ఎప్పుడు కలుస్తారు?గౌతమ్: మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని త్వరలోనే కలుస్తాను.గత సీజన్లో నాగార్జున గ్రూప్ గేమ్స్ తప్పన్నారు. ఈ సీజన్లో మాత్రం గ్రూప్ గేమ్స్ తప్పేం కాదని వెనకేసుకొచ్చారు. దీనిపై మీ అభిప్రాయం?గౌతమ్: నేనూ చాలా మీమ్స్లో చూశాను. ఫ్రెండ్స్గా ఉంటూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఆడటం తప్పు కాదు. కానీ గ్రూప్గా ఉంటూ వేరేవాళ్లను టార్గెట్ చేయడం తప్పు. అది నాకు నచ్చలేదు.విన్నర్ అయినందుకు నిఖిల్ను అభినందించారా?గౌతమ్: ఫినాలే స్టేజీపై వెంటనే కంగ్రాట్స్ చెప్పాను. కానీ ఎపిసోడ్లో వేయలేదు. అలాగే నాగార్జునగారు కూడా నేను చరిత్ర సృష్టిస్తానని మెచ్చుకున్నారు. అది కూడా ఎపిసోడ్లో వేయలేదు.రెమ్యునరేషన్ సంతృప్తికరంగా ఉందా?గౌతమ్: గత సీజన్ కంటే రెట్టింపు పారితోషికం ఇచ్చారు.చదవండి: ప్రెగ్నెంట్ అని తెలియగానే షాకయ్యా..: రాధికా ఆప్టే -
బిగ్బాస్: మూడు రోజులకే రూ.2.5 కోట్లు! ఎవరికో తెలుసా?
రియాలిటీ షోలకు బాస్.. బిగ్బాస్. ఈ షోను ఆదరించేవాళ్లు ఎంతోమంది. అందుకే తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, మరాఠీ భాషల్లో విజయవంతంగా రన్ అవుతోంది. షో గెలిచినవారికి కళ్లు చెదిరే ప్రైజ్మనీ ఇస్తుంటారు. తెలుగులో విజేతకు రూ.50 లక్షలు ఇస్తుండగా హిందీలో మొదట్లో రూ.1 కోటి ఇచ్చేవారు. ఆరో సీజన్ నుంచి మాత్రం అది తగ్గుతూ వచ్చింది. కోట్లల్లో రెమ్యునరేషన్మధ్యలో రూ.30 లక్షలదాకా వెళ్లిన ప్రైజ్మనీ ప్రస్తుత సీజన్లో మాత్రం రూ.50 లక్షలుగా ఉంది. అయితే వీటితో సంబంధం లేకుండా కంటెస్టెంట్లకు రెమ్యునరేషన్ కూడా ఇస్తుంటారు. కొందరు ఈ పారితోషికం రూపంలోనే లక్షలు, కోట్లు సంపాదించారు. అలా బిగ్బాస్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకున్నది ఎవరో తెలుసా? కెనడియన్ నటి పమేలా ఆండర్సన్. ఈమె హిందీ బిగ్బాస్ నాలుగో సీజన్లో పాల్గొంది. సెకండ్ ప్లేస్లో ఎవరంటే?ముచ్చటగా మూడు రోజులు హౌస్లో ఉండి వెళ్లిపోయింది. అందుకుగానూ రూ.2.5 కోట్ల పారితోషికం తీసుకుందట! కాగా పమేలా.. స్కూబీ డూ,స్నేరీ మూవీ 3, స్నాప్డ్రాగన్ చిత్రాలతో పాటు బేవాచ్ యాక్షన్ సిరీస్లోనూ నటించింది. చివరగా ద లాస్ట్ షోగర్ల్ అనే సినిమాతో మెప్పించింది. ఈ బ్యూటీ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్న కంటెస్టెంట్ గ్రేట్ ఖాలి అని తెలుస్తోంది. ఇతడు వారానికి రూ.50 లక్షలవరకు తీసుకున్నాడట! తర్వాతిస్థానంలో కరణ్వీర్ బొహ్ర రూ.20 లక్షలు అందుకున్నట్లు భోగట్టా!చదవండి: ఆస్కార్లో నిరాశ.. లాపతా లేడీస్ను సెలక్ట్ చేయడమే తప్పంటున్న డైరెక్టర్ -
క్షమించాలని కన్నీళ్లు పెట్టుకున్న షణ్ముఖ్ జస్వంత్
షణ్ముఖ్ జస్వంత్.. ఈ పేరు సోషల్ మీడియాలో ఒకప్పుడు సెన్సేషన్. పలు వెబ్ సిరీస్లతో మిలియన్ల కొద్ది వ్యూస్, అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రేజ్తో బిగ్ బాస్లో ఎంట్రీ ఇచ్చిన జస్వంత్ విన్నర్ రేసు నుంచి తీవ్రమైన నెగటివిటీ తెచ్చుకున్నాడు. హోస్ నుంచి బయటకు వచ్చాక కూడా వివాదాలు.. కేసులు.. గొడవలతో పాటు అరెస్ట్లు వంటి ఘటనలు తన జీవితంలో జరిగాయి. అయితే, షణ్ముఖ్ జస్వంత్ కుంగిపోకుండా తన ప్రయాణం మళ్లీ మొదలుపెట్టాడు. జీవిత పోరాటంలో తాను ఎన్నో నేర్చుకున్నానని తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో పలు విషయాలు పంచుకున్నాడు.సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్లతో యూట్యూబ్లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ దక్కించుకున్నాడు జస్వంత్. ఇప్పుడు ఓటీటీ కోసం ' లీల వినోదం' చిత్రంలో ఆయన నటించారు. డిసెంబర్ 19 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఘటనలను మీడియాతో పంచుకున్నాడు.స్టేజీపైనే షణ్ముఖ్ జస్వంత్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా మాట్లాడారు. నా జర్నీ అంతా మొదట వైజాగ్లోనే ప్రారంభమైంది. ఆ సమయంలో నా కెరీర్ ఎటు పోతుందో తెలియని అర్థం కాని పరిస్థితిలో నేను ఉన్నాను. అప్పుడు హైదరబాద్కు వచ్చి కొన్ని కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు చేసుకున్నాను. మంచిగానే సక్సెస్ అయ్యాను. కానీ, ఎవరో చేసిన తప్పుకు నన్ను బ్లేమ్ చేస్తూ అనేక ఆరోపణలు చేశారు. ఆ చెడ్డ పేరు నాకు మాత్రమే ఆపాదించకుండా.. ఇందులోకి నా కుటుంబాన్ని కూడా లాగారు. ఫ్యామిలీకి అండగా ఉండాలని ప్రతి కుమారుడు అనుకుంటాడు. అయితే, నా వల్లే కుటుంబానికి వారికి చెడ్డపేరు వచ్చింది. అమ్మా,నాన్నా నన్ను క్షమించండి. నా వల్లే మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అమవాస్య చూసినోడు తప్పకుండా పౌర్ణమి చూస్తాడు. నా జీవితంలో ఇప్పుడు అదే జరుగుతుంది. చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా దగ్గరకు ' లీల వినోదం' ప్రాజెక్ట్ వచ్చింది. మనం సక్సెస్లో ఉన్నప్పుడు చాలా మంది మన చుట్టూ ఉంటారు. కానీ, ఒక్కసారి కింద పడినప్పుడు మనతో ఎవరుంటారో వాళ్లే నిజమైన మిత్రులు. నా అనుభవంతో ఈ విషయాన్ని తెలుసుకున్నాను.' అని జస్వత్ పేర్కొన్నాడు.షణ్ముఖ్ జస్వంత్ జీవితంలో వివాదాలుబిగ్ బాస్లో టైటిల్ విన్నర్ అవుతాడని షణ్ముఖ్ జస్వంత్ అభిమానులు అనుకున్నారు. అయితే, హౌజ్లో సిరి-షణ్ముఖ్ల తీరుపై ఎక్కువ విమర్శలు వచ్చాయి. ఆపై కొద్దిరోజులకే గంజాయి కేసులో అరెస్ట్ కావడం. వెనువెంటనే ఓ అమ్మాయిని మోసం చేసిన కేసులో షణ్ముఖ్ అన్నయ్య సంపత్ పట్టుకోవడానికి అతని ఫ్లాట్కి పోలీసులు వెళ్లడం. అక్కడ షణ్ముఖ్ గదిలో గంజాయి దొరికందని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో షణ్ముఖ్ కెరీర్ క్లోజ్ అయిందని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పుడు పడిలేచిన కెరటంలా లీల వినోదం అనే సినిమాతో ఆయన మరోసారి తెరపైకి వస్తున్నాడు. -
షో అయిపోగానే కావ్య దగ్గర వాలిపోతానన్న నిఖిల్.. ఇప్పుడేమో!
బిగ్బాస్ 8 ట్రోఫీ గెలిచిన నిఖిల్ చాలా సెన్సిటివ్. చిన్నచిన్న విషయాలకే ఎమోషనలైపోయి కంటతడి పెట్టుకుంటుంటాడు. హౌస్లో అందరితోనూ కలిసిమెలిసి ఉండేవాడు. ముఖ్యంగా మొదట్లో సోనియాతో, తర్వాత యష్మితో ఎక్కువ క్లోజ్ అయ్యాడు. కానీ ఒకానొక సందర్భంలో తను సింగిల్ కాదంటూ లవ్స్టోరీ బయటపెట్టాడు.హౌస్లో కన్నీళ్లుసీరియల్ నటి కావ్యతో ప్రేమలో ఉన్న విషయాన్ని ఆమె పేరు చెప్పకుండానే వెల్లడించాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు తనే నా భార్య అని తెలిసిపోయింది. నా అన్ని బ్రేకప్లను ఆమె మర్చిపోయేలా చేసింది. మా ప్రేమకు ఆరేళ్లు. మేము విడిపోయామా? అంటే నేనైతే ఆ ఎమోషనల్ బంధం నుంచి బయటకు రాలేదు. భవిష్యత్తులోనూ తనతోనే కలిసుంటా.. తనే నా భార్య అని ఫిక్సయిపోయా! షో అయిపోగానే తన దగ్గరికే వెళ్తాను. యూటర్న్?ఆమె కోప్పడుతుందని తెలుసు. అయినా వెళ్తా.. తిడితే పడతాను, కొడితే కొట్టించుకుంటాను.. పిచ్చి లేస్తే లేపుకెళ్లిపోతా.. షో అయిపోగానే నీ ముందు నిలబడతా.. అంటూ కావ్యపై ఉన్న ప్రేమను చెప్తూ ఏడ్చేశాడు. తాజాగా బిగ్బాస్ బజ్లో అడుగుపెట్టిన నిఖిల్ను యాంకర్ అర్జున్ అంబటి ఇదే ప్రశ్న అడిగాడు. ట్రోఫీ గెలవగానే డైరెక్ట్గా తన దగ్గరకే వెళ్తానన్నావు.. మరి వెళ్తున్నావా? అని ప్రశ్నించాడు. ఆలస్యంగానైనా..అందుకు నిఖిల్ బయటకు వెళ్లేదాక తెలియదు పరిస్థితి! అని చెప్పాడు. అప్పుడేమో వెంటనే వెళ్తానని ఇప్పుడేమో పరిస్థితులు చూసి చెప్తానంటున్నాడేంటని నెటిజన్లు షాక్ అవుతున్నారు. అయితే ఆలస్యంగానైనా నిఖిల్.. కావ్య దగ్గరకు వెళ్లి తన ప్రేమను నిలబెట్టుకుంటాడేమో చూడాలి! మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్ షోకు గౌరవం దక్కట్లేదు.. అందుకే హోస్టింగ్కు గుడ్బై
కన్నడలో బిగ్బాస్ రియాలిటీ షో ప్రారంభమైనప్పటి నుంచి హీరో కిచ్చా సుదీప్ హోస్ట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పదేళ్లు విజయవంతంగా హోస్టింగ్ చేస్తున్న ఆయన పదకొండో సీజన్ను కూడా తనే నడిపిస్తున్నాడు. అయితే ఇకమీదట రాబోయే సీజన్స్కు తాను హోస్ట్గా చేయనని, ఇదే తన చివరి బిగ్బాస్ సీజన్ అని అక్టోబర్లో ప్రకటించాడు.మనసుకు అనిపించింది చెప్పాఅందుకు గల కారణాన్ని తాజాగా బయటపెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో సుదీప్ మాట్లాడుతూ.. బిగ్బాస్కు గుడ్బై చెప్తున్నానంటూ ట్వీట్ చేసిన రోజు చాలా అలిసిపోయి ఉన్నాను. అప్పుడు నా మనసుకు అనిపించింది చెప్పాను. అంతర్గత లోటుపాట్లు కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం. ఆరోజు గనక ఆ ట్వీట్ చేయకపోయుంటే తర్వాత నా ఆలోచనలు, అభిప్రాయాలు మారేవేమో!ఆలోచన వచ్చిన వెంటనే..అందుకే నాకు బిగ్బాస్ను వదిలేయాలన్న ఆలోచన వచ్చిన వెంటనే ట్వీట్ చేశాను. ఆ మాటపై ఉండాలని నాకు నేను చెప్పుకున్నాను. కొన్నిసార్లు నా చుట్టూ ఉన్న ప్రతిఒక్కరి కోసం నేను కష్టపడాల్సిన పనిలేదనిపించింది. అక్కడ ఎంత కష్టపడ్డా పెద్దగా ఫలితం ఉండట్లేదు, అలాంటప్పుడు అంతే శ్రమ నా సినిమాలపై పెట్టుంటే బాగుండనిపించింది. కన్నడ బిగ్బాస్కు..మిగతా భాషల్లో బిగ్బాస్కు వచ్చిన గుర్తింపు, ఆదరణ కన్నడ బిగ్బాస్కు రావట్లేదు. మిగతా షోలతో మా షోను పోల్చి చూస్తే దీనికి మరింత గౌరవం రావాలి అని చెప్పుకొచ్చాడు. కాగా ఈగ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సుదీప్ ప్రస్తుతం మ్యాక్స్ సినిమాలో నటించాడు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది. Thank you all for the great response shown towards #BBK11.The TVR (number) speaks in volumes about the love you all have shown towards the show and me.It's been a great 10+1 years of travel together, and it's time for me to move on with what I need to do. This will be my last… pic.twitter.com/uCV6qch6eS— Kichcha Sudeepa (@KicchaSudeep) October 13, 2024 చదవండి: Bigg Boss Telugu 8: ఆ రెండూ జరగకపోయుంటే ఫినాలే వేరేలా ఉండేది! -
బిగ్బాస్ 8 హైలైట్స్: ఈ విషయాలు గమనించారా?
ఎన్నో ట్విస్టులు, టర్నులతో బిగ్బాస్ 8 మొదలైంది. అన్లిమిటెడ్ ఫన్ గ్యారెంటీ అంటూ షో మొదలుపెట్టాడు హోస్ట్ నాగార్జున. రానురానూ ఫన్ తగ్గిపోవడంతో వైల్డ్కార్డ్స్ను రంగంలోకి దింపాడు. అప్పటినుంచి షోపై హైప్ క్రియేట్ అయింది. అందుకు తగ్గట్లుగానే కంటెస్టెంట్లు కూడా హోరాహోరీగా పోరాడారు. చివరకు నిఖిల్ విజేతగా నిలిచాడు. మరి 105 రోజుల జర్నీలో ఏమేం జరిగాయో హైటైల్స్లో చూసేద్దాం..⇒ సెప్టెంబర్ 1న బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ప్రారంభం⇒ లాంచింగ్ రోజు హౌస్లోకి 14 మంది కంటెస్టెంట్లు.. వీరిని జంటలుగా పంపించిన బిగ్బాస్⇒ ప్రైజ్మనీని జీరోగా ప్రకటించిన నాగార్జున.. హౌస్మేట్సే దాన్ని సంపాదించాలని వెల్లడి⇒ రెండో వారం శేఖర్ బాషాను పంపించేసిన హౌస్మేట్స్⇒ అక్టోబర్6న రీలోడ్ ఈవెంట్ ద్వారా 8 మంది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ⇒ ఈ ఎనిమిది మంది వైల్డ్ కార్డ్స్ గత సీజన్స్లో వచ్చినవాళ్లే కావడం గమనార్హం⇒ పాతవారిని ఓజీగా, వైల్డ్కార్డ్స్ను రాయల్స్ క్లాన్గా విభజించిన బిగ్బాస్⇒ తొమ్మిదోవారంలో క్లాన్స్ తీసేసి అందర్నీ కలిపేసిన బిగ్బాస్⇒ ఈ సీజన్లో కెప్టెన్ పదవికి బదులుగా మెగా చీఫ్ పదవిని పెట్టారు⇒ రేషన్ కూడా కంటెస్టెంట్లే సంపాదించుకోవాలన్నారు, కిచెన్లో టైమర్ ఏర్పాటు చేశారు⇒ ఈ సీజన్లో జైలుకు వెళ్లిన ఏకైక కంటెస్టెంట్ మణికంఠ⇒ ఏడోవారంలో నాగమణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ వల్ల బతికిపోయిన గౌతమ్⇒ పదోవారంలో గంగవ్వ సెల్ఫ్ ఎలిమినేట్⇒ 12 వారం.. ఎలిమినేట్ అయినవారితో నామినేషన్స్⇒ ఎవిక్షన్ షీల్డ్ గెలిచిన నబీల్⇒ పదమూడోవారంలో ఎవిక్షన్ షీల్డ్ను అవినాష్కు వాడిన నబీల్.. ఫలితంగా తేజ ఎలిమినేట్⇒ ఈ సీజన్లో ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్⇒ బీబీ పరివారం వర్సెస్ మా పరివారం ఛాలెంజ్లో అన్ని గేముల్లోనూ బిగ్బాస్ కంటెస్టెంట్లదే గెలుపు⇒ ఈ సీజన్ చిట్టచివరి టాస్క్ గెలిచి ప్రైజ్మనీకి రూ.1 యాడ్ చేసిన గౌతమ్⇒ దీంతో టోటల్ ప్రైజ్మనీ రూ.55 లక్షలకు చేరింది.⇒ తెలుగు బిగ్బాస్ చరిత్రలోనే ఇదే అత్యధిక ప్రైజ్మనీ⇒ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా రామ్చరణ్⇒ బిగ్బాస్ 8 విన్నర్గా నిఖిల్, రన్నరప్గా గౌతమ్⇒ తర్వాతి మూడు స్థానాల్లో నబీల్, ప్రేరణ, అవినాష్ ఉన్నారు.నాగమణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అవకపోయినా, నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడకపోయినా గౌతమ్, అవినాష్ ఫైనల్స్లో ఉండేవారే కాదు. అప్పుడు వీళ్లకు బదులుగా వేరే ఇద్దరికి ఫైనల్స్లో చోటు లభించేది!చదవండి: ఫినాలేలో గౌతమ్పై నాగ్ సెటైర్లు.. కానీ చివర్లో మాత్రం..! -
బిగ్ బాస్ ఆఖరి వారం విశ్లేషణ... తెలుగు బిగ్ బాస్లో విజేత కన్నడ నటుడు
భాషేదైనా భావం ముఖ్యమన్న విషయాన్ని నిరూపించింది ఈ సీజన్ బిగ్ బాస్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో విన్నర్ గా కన్నడ నటుడు నిఖిల్ విజేతగా నిలిచాడు. 22 మంది కంటెస్టెంట్స్ తో 105 రోజుల హోరాహోరీగా జరిగిన పోరాటంలో అజేయంగా నిలిచాడు. మొదటి ఎపిసోడ్ నుండీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తూనే వస్తున్నాడు నిఖిల్. ఓ దశలో ఫస్ట్ రన్నరప్ గౌతమ్ గట్టి పోటీ ఇచ్చినా చివరికి విజయం మాత్రం నిఖిల్నే వరించింది. ఫైనల్ ఎపిసోడ్ లో టాప్ 5 గా నిలిచిన అవినాష్, ప్రేరణ, ముందుగా ఎలిమినేట్ అయ్యి టాప్ 3లో నబీల్, గౌతమ్, నిఖిల్ నిలిచారు. ఈ ముగ్గురిలో విన్నర్గాల్ని ప్రకటించారు హోస్ట్ నాగార్జున. ఈ సీజన్లలో ప్రత్యేకత ఏంటంటే విన్నర్ పరభాషా నటుడవడం. ఆదివారం ప్రసారమైన గ్రాండ్ ఫినాలే యధావిధిగా ఆర్భాటంగా జరిగింది. ఈ సీజన్ లో పలు సెలబ్రిటీస్ తో పాటు ఫినాలేలో గ్లోబల్స్టార్ రామ్ చరణ్ గెస్ట్గా రావడం ఎపిసోడ్ కే హైలైట్. ఇక ఈ సిజన్ విశ్లేషణకొస్తే.. 14మందితో ప్రారంభమైన బిగ్బాస్ హౌజ్లోకి తర్వాత మరో 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో ఎంట్రీ ఇచ్చారు. దీంతో మొత్తంగా 22 మంది పార్టిసిపెంట్స్ తో 15 వారాలు ప్రేక్షకులను అలరించింది. బిగ్ బాస్ అనేది ప్రపంచ ప్రేక్షకాదరణ పొందిన కాన్సెప్ట్. అటువంటిది తెలుగులోనూ విశేష ఆదరణ లభించింది. ఇదే ఈ కార్యక్రమాన్ని భారత్లో నెం.1గా నిలబెట్టింది. అన్ని సీజన్లకు మాదిరిగానే ఈ సీజన్ లోనూ పార్టిసిపెంట్స్ మధ్య వాడి, వేడి టాస్కులతో సెగలు పుట్టించగా.. హోస్ట్ నాగార్జున వారాంతంలో వీరి ఆట తీరుపై విశ్లేషణతో ప్రేక్షకులను కట్టిపడేసే ప్రయత్నం చేశారు. నత్తి మెదడు, మగళై, కుట్టి వంటి పదాలు ఈ సీజన్లో పార్టిసిపెంట్స్ మధ్య బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి సీజన్ని ఫాలో అయ్యే ప్రేక్షకులకు రొటీన్ టాస్కుల పరంగా కాస్తంత అసహనం కలిగించినా సెలబ్రిటీలతో సీజన్ కవర్ చేయడానికి బాగానే ప్రయత్నించారు. బిగ్ బాస్ టీవి షోనే అయినా దీని తాకిడి మాత్రం సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది. సోషల్ మీడియాలోనే పార్టిసిపెంట్స్ పరంగా గ్రూపులతో పాటు కార్యక్రమంలోని అంశాలపై రోజువారీ చర్చలు జరిగాయి. బిగ్ బాస్ కార్యక్రమానికి కావలసిందీ ఇదే. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇప్పటిదాకా ఎక్కువగా యాంకరింగ్ చేసింది నాగార్జునే. తన ఛరిష్మాతో ఇటు పార్టిసిపెంట్స్ను అటు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. పార్టిసిపెంట్స్ గొడవ ఓ ఎత్తయితే ఆ గొడవకు సంబంధించిన నాగార్జున విశ్లేషణ మరో ఎత్తు. దీని కోసమే చాలా మంది వెయిట్ చేసేవారు. మామూలుగా అపరిచితులతో ప్రయాణం చేసేటప్పుడు జరిగే చిన్నపాటి ఘర్షణ తలెత్తినా చుట్టూ పదిమంది గుమిగూడి గొడవ సద్దుమణిగేదాకా సినిమా చూసినట్టు చూస్తారు. అలాంటిది 22 మంది అపరిచితులను వంద రోజులకు పై ఓ ఇంట్లో పెట్టి వారి మధ్య టాస్కులు పెడితే ఆ బొమ్మ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతిరోజూ ఒకే స్క్రీన్ మీద 22కు పైగా సినిమాలను చూసినట్టుండేది.. అదే బిగ్ బాస్. ఈ సీజన్ తో బిగ్ బాస్ కార్యక్రమానికి కామా పడింది. మరో సీజన్ సినిమా కోసం ప్రేక్షకులు మరో 9 నెలలు వెయిట్ చేయాల్సిందే. వచ్చే సీజన్ వరకు ఈ సీజన్ వేడి మాత్రం చల్లారేదేలే. ఎందుకంటే బిగ్ బాస్ ఎప్పటికీ అస్సలు తగ్గేదేలే. - హరికృష్ణ ఇంటూరు -
ఫినాలేలో గౌతమ్పై నాగ్ సెటైర్లు.. కానీ చివర్లో మాత్రం..!
కష్టపడు.. ఫలితం ఆశించకు అంటుంటారు. కానీ బిగ్బాస్ షోలో ఫలితం ఆశించి కష్టపడ్డా కొన్నిసార్లు ప్రతిఫలం దక్కదు. ఈ సీజన్లో వైల్డ్ ఫైర్లా మారిన గౌతమ్ కృష్ణ గత సీజన్లోనూ పాల్గొన్నాడు. అప్పుడు కూడా గ్రూప్ గేమ్స్ జోలికి వెళ్లకుండా సోలో బాయ్లా ఆడాడు. అయితే కొన్నిసార్లు నువ్వెంత ప్రయత్నించావన్నదానికి బదులు ఎన్ని గెలిచావన్నదే చూస్తారు. ఈ విషయంలో గౌతమ్ వెనకబడిపోయాడు.బెడిసికొట్టిన అశ్వత్థామ బిరుదుకానీ శివాజీ కపట నాటకాన్ని వేలెత్తి చూపించి హైలైట్ అయ్యాడు. అయితే బిగ్బాస్కు కూడా కొందరు ఫేవరెట్స్ ఉంటారు. వాళ్లనేమైనా అంటే ఆ కంటెస్టెంట్ గేటు బయట ఉండాల్సిందే! హోస్ట్ నాగార్జున కూడా అతడి నోరు నొక్కేసి నానామాటలన్నారు. చివరకు 13వ వారంలో గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. అశ్వత్థామ 2.0 అంటూ తనకు తాను ఇచ్చుకున్న బిరుదు కూడా జనాలకు రుచించలేదు, ట్రోల్ చేశారు.దారి తప్పిన గౌతమ్అయితే ఎక్కడ తగ్గాడో అక్కడే నెగ్గాలనుకున్నాడు. మళ్లీ బిగ్బాస్ 8లో అడుగుపెట్టాడు. ఈసారి ఏదేమైనా వెనక్కు తగ్గకూడదని బలంగా ఫిక్సయ్యాడు. కానీ వచ్చినవారంలోనే క్రష్ అంటూ యష్మిపై ఫీలింగ్స్ బయటపెట్టడంతో జనం అతడిని తిరస్కరించాడు. వెంటనే ఎక్కడ తప్పు చేశానన్నది గ్రహించి తనను మార్చుకున్నాడు. కేవలం ఆటపైనే దృష్టిసారించాడు. తప్పు జరుగుతుంటే వేలెత్తి చూపించాడు. (చదవండి: ఆడు మగాడ్రా బుజ్జి.. గౌతమ్ కృష్ణ సంపాదన ఎంతంటే?)ఆ ఒక్క మాటతో విపరీతమైన నెగెటివిటీగ్రూప్ గేమ్స్ తప్పు కాదని హోస్ట్ చెప్తున్నా సరే అది తప్పని వాదించాడు. అతడి గుండెధైర్యానికి జనాలు ఫిదా అయ్యారు. అతడి ప్రవర్తన, మాటతీరుకు సెల్యూట్ చేశారు. గెలుపు ఖాయం అనుకుంటున్న సమయంలో నిఖిల్పై అనవసరంగా నోరు జారాడు. అమ్మాయిలను వాడుకుంటున్నావ్ అనడంతో గౌతమ్పై ఉన్న పాజిటివిటీ కాస్త తగ్గిపోయింది. అది ఎంత పెద్ద మాట అని నాగార్జున చెప్తున్నా కూడా అతడికి చెవికెక్కలేదు. వివరణ ఇస్తూనే పోయాడు. ఈ వ్యవహారం అతడికి మైనస్ అయింది.సెటైర్.. అంతలోనే ప్రశంసగౌతమ్ ఎదుటివారు చెప్పేది వినిపించుకోకుండా తన పాయింట్స్ తను చెప్పుకుంటూ పోతూనే ఉంటాడు. ఫినాలేలో గౌతమ్ తండ్రి కూడా అలా ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. అది చూసిన నాగ్.. ఎవరైనా మాట్లాడుతుంటే వినకుండా నీ వర్షన్ నువ్వు చెప్పే క్వాలిటీ మీ తండ్రి నుంచే వచ్చిందా? అని సెటైర్ వేశాడు. అయితే ఎక్కువగా తన చేతిలో తిట్లు తినే గౌతమ్ను చిట్టచివరిసారి మెచ్చుకున్నాడు నాగార్జున. గౌతమ్ను రన్నరప్గా ప్రకటించినప్పుడు.. గర్వించే కొడుకును కన్నారంటూ అతడి పేరెంట్స్ను ప్రశంసించాడు. అది చూసిన ఫ్యాన్స్.. ఇది కదా సక్సెస్ అంటే, నువ్వు జనాల మనసులు గెలిచేశావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.తెర వెనక 'బిగ్బాస్ 8' ఫినాలే హంగామా.. ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్ విన్నర్గా నిఖిల్.. ప్రైజ్మనీతోపాటు ఏం సాధించాడంటే?
సరైనోడు, దమ్మున్నోడు, జెంటిల్మెన్.. ఇలాంటి ట్యాగులన్నీ నిఖిల్కు సరిగ్గా సరిపోతాయి. ఎంత కోపం వచ్చినా అది క్షణకాలం మాత్రమే! వంద రోజుల జర్నీలో అతడు కంట్రోల్ తప్పిన సందర్భాలను వేళ్లపై లెక్కపెట్టుకోవచ్చు. ఎవరెన్ని నిందలు వేసినా తనలో తను బాధపడ్డాడే తప్ప తిరిగి ఒక్కమాట కూడా అనలేదు. ఫిజికల్ టాస్కుల విషయానికి వస్తే అతడిని ఢీ కొట్టేవాడే లేడన్నంతగా రెచ్చిపోయాడు. నిందలు పడ్డ చోటే నిలబడ్డాడునిఖిల్ ఆటలో అడుగుపెడితే వార్ వన్సైడ్ అయిపోద్ది అన్న లెవల్లో ఆడాడు. ఈ క్రమంలో తనకు దెబ్బలు తగిలినా లెక్కచేయలేదు. కంటెస్టెంట్ల సూటిపోటి మాటల వల్ల హౌస్ను వీడాలనుకున్నాడు. కానీ తనను ప్రేమించిన ప్రేక్షకుల కోసం మాటలు పడ్డ చోటే నిలబడాలనుకున్నాడు. ఆటతోనే సమాధానం చెప్పాడు. వేలెత్తి చూపించినవారితోనే చప్పట్లు కొట్టేలా చేశాడు. (Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?)సంపాదన ఎంత?సీరియల్ యాక్టర్గా పేరు గడించిన నిఖిల్ బిగ్బాస్ ప్రియుల మనసు గెలుచుకుని ఏకంగా టైటిల్ విజేతగా నిలిచాడు. రూ.55 లక్షల ప్రైజ్మనీ అందుకున్నాడు. దీనితోపాటు మారుతి డిజైర్ కారు అదనపు బహుమతిగా లభించనుంది. ఇకపోతే నిఖిల్ వారానికి రూ.2.25 లక్షల పారితోషికం తీసుకున్నాడట! ఈ లెక్కన పదిహేనువారాలకుగానూ రూ.33,75,000 సంపాదించినట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా రూ. 88 లక్షలు వెనకేశాడు. చదవండి: కోరిక మిగిలిపోయిందన్న తేజ.. నాగార్జున బంపరాఫర్ -
ఆడు మగాడ్రా బుజ్జి.. గౌతమ్ కృష్ణ సంపాదన ఎంతంటే?
ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలి, వేలెత్తిచూపించినవారే తలదించుకునేలా చేయాలి.. తిట్టినవారితోనే పొగిడించుకోవాలి.. ఇవన్నీ చేసి చూపించాడు గౌతమ్ కృష్ణ. బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో అతడు ఏం కోల్పోయాడో దాన్ని ఈ సీజన్లో తిరిగి సంపాదించాడు. అప్పుడు మూటగట్టుకున్న నెగెటివిటినీ తన మాటతీరుతో, ఆటతీరుతో కడిగిపారేశాడు.(Bigg Boss 8: నబీల్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అన్నప్పుడు నవ్వినవాళ్లే ఈడు మగాడ్రా బుజ్జి అంటున్నారు! బిగ్బాస్ 8లో వైల్డ్కార్డ్గా వచ్చి వైల్డ్ ఫైర్లా మారాడు. టైటిల్ రేసులో ఉన్న నిఖిల్కు గట్టి పోటీనిచ్చాడు. గతంలో ఫైనల్స్కు రాకుండానే వెనుదిరిగిన గౌతమ్ ఇప్పుడేకంగా టాప్ 2లో చోటు దక్కించుకున్నాడు. వారానికి రూ.1.75 లక్షల చొప్పున సంపాదించాడు. అంటే బిగ్బాస్ హౌస్లో పారితోషికం రూపేణా పది వారాలకుగానూ దాదాపు రూ.17,50,000 వెనకేసినట్లు తెలుస్తోంది.(చదవండి: బిగ్బాస్: అందాల రాక్షసి ఎంత సంపాదించిందో తెలుసా?) -
బిగ్బాస్: అందాల రాక్షసి ఎంత సంపాదించిందో తెలుసా?
అందాల రాక్షసి.. బిగ్బాస్ ప్రేరణకు అంకితమిచ్చిన ట్యాగ్లైన్ ఇది. ఈ అందాల భామకు ముక్కు మీద కోపం. ఎవరైనా ఒక్క మాటంటే దానికి పది మాటలు తిప్పి కొడుతుంది. తనను చులకన చేస్తే బుసకొట్టిన పాములా లేస్తుంది. టాస్కుల్లో ప్రాణం పెట్టి ఆడుతుంది. మగవాళ్లకు బలమైన పోటీ ఇస్తుంది. బుద్ధిబలం కూడా మెండు.విపరీతమైన నెగెటివిటీకానీ నోటిదురుసే ఎక్కువ! సిగ్గు లేదా? క్యారెక్టర్లెస్? ఆ ముఖం చూడు.. ఇలాంటి మాటలన్నీ తన నోటి నుంచి వచ్చిన ఆణిముత్యాలే! మెగా చీఫ్ అయ్యాక నా మాటే శాసనం అన్నట్లుగా ప్రవర్తించింది. తిండి దగ్గర కూడా ఆంక్షలు పెట్టి అభాసుపాలైంది. విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకుంది. పారితోషికం ఎంతంటే?కానీ తప్పు ఎక్కడ జరుగుతుందో వెంటనే తనను తాను సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. అందుకే టాప్ 5లో నిలబడిన ఏకైక మహిళగా నిలిచింది. తనకు సూట్కేస్ ఆఫర్ చేసినా నిర్మొహమాటంగా నో చెప్పింది. ప్రేక్షకులు తనను ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు వెళ్తానని నిలబడింది. నాలుగో స్థానంలో వీడ్కోలు తీసుకుంది. ప్రేరణ వారానికి రూ.2 లక్షల చొప్పున పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన పదిహేనువారాలకుగానూ రూ.30 లక్షలు వెనకేసిందట!చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ మాత్రం.. -
బిగ్బాస్: తేజకు నాగార్జున బంపరాఫర్.. అతడి పెళ్లికి..!
బిగ్బాస్ కంటెస్టెంట్లకు నాగార్జున ఒక టీచర్లాగా! పొరపాట్లు చేస్తే సరిదిద్దుకోమని హెచ్చరిస్తాడు. మంచి చేస్తే చప్పట్లు కొడతాడు. బాధలో ఉంటే మోటివేట్ చేస్తాడు. సంతోషాన్ని నలుగురితో పంచుకోమంటాడు. బిగ్బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు కంటెస్టెంట్లకు గురువుగా, అండగా ఉండేది నాగార్జున ఒక్కరే!గత సీజన్లో..అయితే వీకెండ్లో నాగార్జున వేసుకొచ్చే షర్ట్స్కు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. పోయిన సీజన్లో షర్ట్ కావాలని శోభా శెట్టి ఇలా అడగ్గానే నాగ్ అలా ఇచ్చేశాడు. అమర్దీప్ అడిగితే మాత్రం అసలు లెక్కచేయలేదు. ఈ సీజన్లో టేస్టీ తేజ కూడా తనకు చొక్కా కావాలని సిగ్గు విడిచి అడిగాడు. సన్నబడితే షర్ట్ ఇస్తానని నాగ్ మాటిచ్చాడు. అందుకోసం తేజ కష్టపడ్డాడు కానీ ఫలితం లేకపోయింది. బరువు తగ్గకుండానే హౌస్ నుంచి వెళ్లిపోయాడు.నేను ఫిక్స్ చేస్తాతాజాగా ఫినాలేకు వచ్చిన తేజ మీ షర్ట్ దక్కలేదన్న కోరిక అలాగే మిగిలిపోయిందన్నాడు. అందుకు నాగ్ ముందు పెళ్లి ఫిక్స్ చేసుకో.. అప్పుడు నీకు పెళ్లి డ్రెస్ నేను ఫిక్స్ చేస్తా అని హామీ ఇచ్చాడు. ఊహించని బంపరాఫర్ తగలడంతో తేజ తెగ సంతోషపడిపోయాడు.చదవండి: కప్పు గెలిచేసిన నిఖిల్.. అడుగుదూరంలో ఆగిపోయిన గౌతమ్! -
Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్.. రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే
టాప్-5లో ఉన్న అవినాష్.. ఫినాలే ఎపిసోడ్లో తొలుత ఎలిమినేట్ అయ్యాడు. ఈసారి బిగ్బాస్ హౌసులో కాస్తోకూస్తో ఎంటర్టైన్మెంట్ వచ్చింది అంటే అది ఇద్దరివల్లే. ఒకరు అవినాష్ కాగా మరొకరు రోహిణి. గతంలో వీళ్లిద్దరూ బిగ్బాస్లో పాల్గొన్నారు కానీ ఈసారి మాత్రం రెచ్చిపోయి మరీ తమదైన హాస్యంతో ఆకట్టుకున్నారు. ఫినాలేకి ముందు రోహిణి ఎలిమినేట్ కాగా.. ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్గా అవినాష్ నిలిచి టాప్-5లో అడుగుపెట్టాడు. కానీ ఫినాలేకి వచ్చిన గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్తో పోలిస్తే అవినాష్కి ఓటింగ్ శాతం తక్కువే! గతంలో నాలుగో సీజన్లోనూ అవినాష్.. వైల్డ్ కార్డ్గానే హౌసులోకి ఎంట్రీ ఇచ్చాడు. టాప్-7 వరకు వచ్చాడు కానీ ఫైనల్కు రాలేకపోయాడు. ఈసారి మాత్రం కొద్దిలో ఎలిమినేట్ అయ్యేవాడు. కానీ చాకచక్యంగా ఫినాలేలో అడుగుపెట్టేశాడు.అయితే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఐదో వారం.. బిగ్బాస్ హౌసులోకి అడుగుపెట్టిన అవినాష్ చివరివరకు ఉన్నాడు. దాదాపు 10 వారాల పాటు హౌసులో తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఒక్కో వారానికి రూ.2 లక్షల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే రూ.20 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లే! -
టాప్ 2కి మనీ ఆఫర్.. ఫైనల్గా నిఖిల్ విన్నర్!
బిగ్బాస్ ఫైనల్లో సూట్కేస్ ఆఫర్ చేయడమనేది గత కొన్నేళ్లుగా వస్తున్న ఆనవాయితీ! అయితే మధ్యలోనే టెంప్ట్ అయి సూట్కేస్ తీసుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. దీనివల్ల విన్నర్ ఫుల్ ప్రైజ్మనీ అందుకోలేకపోతున్నాడు. పైగా ఈసారి కంటెస్టెంట్లకు చాలా హింట్స్ వెళ్లాయి.సూట్కేస్ ఆఫర్అసలు సిసలైన పోటీ నిఖిల్, గౌతమ్ మధ్యే అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. అందుకే టాప్ 5 మెంబర్స్కు సూట్కేస్ ఆఫర్ చేయలేదు. కానీ ఎవరూ మొగ్గు చూపలేదట.. తర్వాత ముగ్గురు మిగిలినప్పుడు టెంప్ట్ చేసే ప్రయత్నం చేయగా ఎవరూ తలొంచలేదట!అడుగు దూరంలో ఆగిపోయిన గౌతమ్చివరి ప్రయత్నంగా టాప్ 2 అంటే నిఖిల్, గౌతమ్లకు సూట్కేస్ ఆఫర్ చేసినప్పటికీ తీసుకోవడానికి ఇద్దరూ వెనకడుగు వేశాడు. దీంతో విన్నర్కు రూ.55 లక్షల ప్రైజ్మనీ అందింది. మరి ఈ మొత్తం అందుకున్న కంటెస్టెంట్ ఎవరనేది ఆల్రెడీ లీకైపోయింది. గెస్టుగా వచ్చిన రామ్చరణ్.. నిఖిల్ మళయక్కల్ను విన్నర్గా ప్రకటించినట్లు సమాచారం. దీంతో గౌతమ్ కృష్ణ రన్నరప్ స్థానంతో సరిపెట్టుకున్నాడు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
BB Telugu 8 Telugu: బిగ్బాస్ 8 విజేతగా నిఖిల్ మళియక్కల్
బిగ్బాస్ 8వ సీజన్ ఫినాలే షురూ. 100 రోజులకు పైగా ప్రేక్షకుల్ని అలరించిన ఈ రియాలిటీ షో.. తుది అంకానికి చేరుకుంది. టాప్-5లో నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్, అవినాష్ ఉన్నారు. వీళ్లలో విజేత ఎవరనేది మరో మూడు గంటల్లో తేలుతుంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి విజేతకు రూ.55 లక్షల ప్రైజ్మనీ ఇవ్వబోతున్నట్లు హోస్ట్ నాగార్జున స్వయంగా ప్రకటించాడు. ఈసారి విజేతగా నిలిచిన వాళ్లకు హీరో రామ్ చరణ్ ట్రోఫీ బహుకరించనున్నారు. -
బిగ్బాస్ ఫినాలేకు ముగ్గురు డుమ్మా.. ఆ కారణం వల్లేనా?
బిగ్బాస్ షో తమకు జీవితంలో వచ్చిన పెద్ద అవకాశం అని చాలామంది కంటెస్టెంట్లు చెప్తూ ఉంటారు. ప్రేక్షకులకు తమను దగ్గర చేసిన బిగ్బాస్ షోకు ఎప్పటికీ రుణపడి ఉంటామంటుంటారు. అయితే కొందరు మాత్రం ఈ రియాలిటీ షో వల్ల నెగెటివిటీ మూటగట్టుకున్నామని తిట్టిపోస్తుంటారు. ఇదంతా పక్కన పెడితే నేడు బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ గ్రాండ్ ఫినాలే.నెగెటివిటీ మూటగట్టుకున్న హరితేజఅంటే ఈ సీజన్ విజేతను తేల్చే ఆఖరి రోజు. ఇలాంటి పెద్ద ఈవెంట్కు ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ వస్తారు. అదేంటో కానీ ఈసారి ఏకంగా ముగ్గురు డుమ్మా కొట్టేశారు. వారే విష్ణుప్రియ, నయని పావని, హరితేజ. విచిత్రంగా సీజన్ 1లో సెకండ్ రన్నరప్గా నిలిచిన హరితేజ ఈ సీజన్లో మాత్రం వైల్డ్కార్డ్గా అడుగుపెట్టి నెలరోజులకే బయటకు వచ్చేసింది. విపరీతమైన నెగెటివిటీ మూటగట్టుకుంది. బహుశా అందుకే గ్రాండ్ ఫినాలేను లైట్ తీసుకుని ఉండవచ్చు!నిరూపించుకోలేకపోయిన నయనిఅటు నయని పావని.. ఏడో సీజన్లో వైల్డ్కార్డ్గా వచ్చి వారం రోజులకే ఎలిమినేట్ అయిపోయింది. ఈ సీజన్లో తన సత్తా చూపించాలనుకున్నప్పటికీ అన్నింటికీ ఏడ్చేస్తూ మూడువారాలకే హౌస్ నుంచి వచ్చేసింది. బహుశా ఈ బాధతోనే తను రాకపోయి ఉండొచ్చు. ఇక విష్ణుప్రియ.. విన్నర్ అయ్యేంత దమ్మున్నా ఆటపై ఫోకస్ పెట్టకుండా పృథ్వీపై మనసు పారేసుకుంది. గౌతమ్పై విష్ణు చిన్నచూపుఅతడు ఛీ కొట్టినా, చులకనగా చూసినా అతడు మాత్రమే కావాలంటూ పిచ్చిగా ప్రవర్తించింది. మనసులోని భావాలను నిర్మొహమాటంగా వ్యక్తపరిచిన ఆమె నిజాయితీ మెచ్చిన జనాలు ఆమెను దాదాపు 100 రోజులు హౌస్లో ఉండనిచ్చారు. అయితే గౌతమ్పై మొదటి నుంచీ ద్వేషం పెంచుకున్న ఆమె షో నుంచి వెళ్లేటప్పుడు కూడా అతడిని అవమానించింది.ఆ కారణం వల్లే?అసలు నువ్వేం ఆడావో చూస్తానంటూ గడ్డిపోచలా తీసిపారేసింది. కానీ ఇప్పుడేకంగా అతడు టైటిల్ రేసులో ఉన్నాడు. ఆ దృశ్యం చూడలేకే విష్ణు రాలేదని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. మరికొందరేమో తనపై వచ్చిన నెగెటివిటీ తట్టుకోలేకే ఈ ఈవెంట్కు డుమ్మా కొట్టి ఉండొచ్చని భావిస్తున్నారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్ 8 ఫినాలే.. పోలీసులు ముందస్తు వార్నింగ్
బిగ్బాస్ 8వ సీజన్ ఫినాలే సాయంత్రం జరగనుంది. అయితే గతేడాది జరిగిన అనుభవాల దృష్ట్యా.. హైదరాబాద్ వెస్ట్ పోలీసులు పలు సూచనలు, వార్నింగ్స్ ఇచ్చారు. జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లో ఆంక్షలు విధించారు. స్టూడియో బయట భారీ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అభిమానులు ఎవరూ స్టూడియో దగ్గరకు రావొద్దని పోలీసులు తెలిపారు.(ఇదీ చదవండి: 'బిగ్ బాస్' విన్నర్ ప్రైజ్ మనీ రివీల్ చేసిన నాగ్.. హిస్టరీలో ఇదే టాప్)కార్యక్రమం పూర్తయిన అనంతరం ఊరేగింపులు, ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సరే బిగ్ బాస్ నిర్వహకులదే బాధ్యత అని పోలీసులు పేర్కొన్నారు. ఇవన్నీ ఎందుకంటే గతేడాది డిసెంబరు 17న బిగ్బాస్ 7వ సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్ని ప్రకటించారు.పల్లవి ప్రశాంత్ బయటకొచ్చిన తర్వాత ఇతడి అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తోటి కంటెస్టెంట్స్ కార్లపై దాడి చేయడంతో పాటు ఆ దారిలో వెళ్తున్న ఏడు ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఈసారి ర్యాలీలపై నిషేధం విధించారు.(ఇదీ చదవండి: చిరంజీవి ఇంటికి కుటుంబంతో పాటు వెళ్లిన 'అల్లు అర్జున్') -
'బిగ్ బాస్' విన్నర్ ప్రైజ్ మనీ రివీల్ చేసిన నాగ్.. హిస్టరీలో ఇదే టాప్
బిగ్ బాస్ 8 తెలుగు ఫైనల్కు చేరుకుంది. నేడు విజేత ఎవరో తేలనుంది. టైటిల్ రేసులో గౌతమ్, నిఖిల్,నబీల్,ప్రేరణ,అవినాష్ ఉన్నారు. వీరిలో గెలుపొందిన విజేతకు ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీని కూడా అందిస్తారు. సుమారు 100 రోజులకు పైగా బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా వారందరూ ప్రేక్షకులను మెప్పించారు. హోస్ట్గా ఉన్న అక్కినేని నాగార్జున మాత్రమే వారితో టచ్లో ఉండేవారు. అయితే, తాజాగా బిగ్ బాస్ ఫైనల్కు సంబంధించిన ఫస్ట్ ప్రోమోను విడుదల అయింది. అందులో ప్రైజ్ మనీ, ట్రోఫీని నాగ్ రివీల్ చేశారు.బిగ్ బాస్ విడుదల చేసిన ప్రోమోలో ఈ సీజన్కు సంబంధించిన కంటెస్టెంట్స్ అందరూ కనిపించారు. ఆ సమయంలో అక్కినేని నాగార్జున ప్రైజ్ మనీ రివీల్ చేశారు. విజేతకు రూ. 55 లక్షలు అందేజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. బిగ్ బాస్లో ఇదే అత్యంత ఎక్కువ మొత్తం అని నాగ్ తెలిపారు. గతంలో రూ. 50 లక్షలు వరకు మాత్రమే విజేతకు ఇస్తుండగా.. ఈసారి ప్రైజ్ మనీ కాస్త పెరిగిందని చెప్పవచ్చు. ఈ సీజన్ విన్నర్ మారుతి కార్ కూడా దక్కించుకోనున్నారు. ఇప్పటికే ఆ సంస్ధ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.బిగ్ బాస్ 8 ఫైనల్స్ ప్రోమోలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సందడి చేశారు. ఆయన నటించిన కొత్త సినిమా 'యూఐ' ప్రమోషన్స్లో భాగంగా షోలో పాల్గొన్నారు. మొదటి ఫైనలిస్ట్గా సెలెక్ట్ అయన అవినాష్ను ఎలిమినేట్ చేసి హౌజ్ నుంచి స్టేజీపైకి ఉపేంద్రనే తీసుకొచ్చారని తెలుస్తోంది. బిగ్ బాస్ హౌజ్లోకి డాకు మహారాజ్ టీమ్ కూడా వెల్లింది. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ హౌజ్లోకి వెళ్లి కొంత సమయం పాటు సరదాగా వారితో గడిపింది. -
ఆ బాధతో 18వ అంతస్తు నుంచి దూకేద్దామనుకున్న గౌతమ్..
గత కొన్నిరోజులుగా నవ్వుతూ తుళ్లుతూ ఎంజాయ్ చేస్తున్న ఫైనలిస్టులను చివరిసారి ఏడిపించే ప్రయత్నం చేశాడు బిగ్బాస్. మీ జీవితంలోని అత్యంత బాధాకరమైన సంఘటనను పంచుకోమని చెప్పడంతో అందరూ ఫ్లాష్బ్యాక్లోకి వెళ్లిపోయారు. మరి ఎవరెవరు ఏమేం చెప్పారు? హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (డిసెంబర్ 14) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..సోనియాను బ్లాక్ చేస్తానన్న ప్రేరణషో అయిపోయాక ఎవరితో కలిసుండాలనుకుంటున్నారు? ఎవరిని కలవకూడదనుకుంటున్నారో చెప్పమంటూ ఫాలో- బ్లాక్ గేమ్ ఆడించాడు బిగ్బాస్. దాదపు అందరితోనూ కలవాలనుకుంటున్న చెప్పారు టాప్ 5 కంటెస్టెంట్లు. ఎవరిని కలవకూడదన్న విషయానికి వస్తే.. సోనియా పర్సనాలిటీ నచ్చలేదంటూ తనను బ్లాక్ చేస్తానంది ప్రేరణ. తక్కువ పరిచయం వల్ల పృథ్వీని టెంపరరీగా బ్లాక్ చేశాడు గౌతమ్. నబీల్.. హరితేజ, సోనియాను బ్లాక్ చేస్తానన్నాడు. నిఖిల్.. బేబక్క, సీతను బ్లాక్ చేశాడు. అవినాష్.. పృథ్వీని టెంపరరీగా బ్లాక్ చేస్తానన్నాడు.మూడేళ్లు ఇంట్లో ఖాళీగా..తర్వాత చలిమంట వేసిన బిగ్బాస్.. జీవితంలోని బెస్ట్, వరస్ట్ సంఘటనలను పంచుకోమన్నాడు. నబీల్ మాట్లాడుతూ.. బైక్ యాక్సిడెంట్ వల్ల హాస్పిటల్పాలయ్యాను. అదే నా చేదు జ్ఞాపకం అన్నాడు. నిఖిల్ మాట్లాడుతూ.. నేను ఆర్కిటెక్ట్ కోర్స్ చేస్తున్నప్పుడు సినిమా ఆఫర్ వచ్చింది. చదువు మధ్యలోనే వదిలేశాను. మూడేళ్లపాటు ఇంట్లోనే ఖాళీగా ఉన్నాను. రోజూ అమ్మ దగ్గర రూ.30 అడుక్కునేవాడిని. నువ్వు ఇంటికి భారమయ్యావు, నీకు తిండి పెట్టడమే కాకుండా ఖర్చులకు కూడా డబ్బివ్వాలా? అని తిట్టింది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చాకే..తర్వాత కన్నడ సీరియల్లో ఆఫర్ వచ్చింది. రోజుకు రూ.2500 ఇస్తామన్నారు. అంటే నెలకు రూ.75వేలు వస్తాయనుకున్నాను. కానీ పదిరోజులే షూటింగ్ జరిగింది. ఆ తర్వాత తెలుగు సీరియల్ చేశాను. అప్పటినుంచి నేను వెనుదిరిగి చూసుకోలేదు అని చెప్పాడు. ప్రేరణ నానమ్మ చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుని ఏడ్చేసింది.ఏ పాపం చేశానో..గౌతమ్ మాట్లాడుతూ.. మెడిసిన్ చదువుతున్నప్పుడు ఒకమ్మాయితో బ్రేకప్ అయింది. ఆ బాధ తట్టుకోలేక నేను ఉంటున్న 18వ అంతస్థులోని బాల్కనీలో నుంచి దూకి చనిపోదామనుకున్నాను. కానీ నాతోపాటు నన్ను ప్రేమించేవాళ్లు గర్వపడేలా చేస్తే ఈ ప్రపంచమే దాసోహం అవుతుందని ఆలోచించి ఆగిపోయాను అన్నాడు. అవినాష్ మాట్లాడుతూ.. నేను, నా భార్య అను ఎన్నో కలలు కన్నాం. ఏ జన్మలో ఏ తప్పు చేశానో మాకు బాబు పురిటిలోనే చనిపోయాడు. నా చేతిలో కొడుకున్నాడు, కానీ వాడికి ప్రాణం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.యష్మిపై ఫీలింగ్స్?తర్వాత యాంకర్ సుమ వచ్చి సరదా టాస్కులు ఆడించింది. అలాగే ప్రేక్షకుల మనసులోని ప్రశ్నలను ఫైనలిస్టులను అడిగేసింది. కావాలని స్ట్రాటజీతో రెచ్చగొట్టి గొడవలు పెట్టుకుంటారా? అని గౌతమ్ను అడగ్గా అలా ఏం లేదని, దేనికైనా హర్ట్ అయితేనే గొడవపడతానన్నాడు. యష్మిపై నీకు నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయా? లేదా లవ్ యాంగిల్ కోసం వేసిన స్ట్రాటజీయా? అని అడగ్గా మొదట్లో కొంచెం ఫీల్ ఉండేది కానీ ఒకసారి అక్క అన్నాక అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవని గౌతమ్ క్లారిటీ ఇచ్చాడు.ఫైర్ తగ్గలేదన్న నబీల్రాయల్స్(వైల్డ్ కార్డ్స్) వచ్చాక నీలో ఎందుకు ఫైర్ తగ్గింది? అని నబీల్ను అడగ్గా.. తనలో ఫైర్ ఎక్కడా తగ్గలేదని, కాకపోతే కొన్నిసార్లు కనిపించకపోయుండొచ్చన్నాడు. పృథ్వీ కాకుండా ఈ ఇంట్లో ఎవరిని ఎక్కువ నమ్ముతారు? అని నిఖిల్ను అడగ్గా ఆ రేంజ్లో ఎవరినీ నమ్మలేనన్నాడు. సీజన్ 4 లేదా సీజన్ 8లో ఏది బెస్ట్ అని ప్రశ్నించగా అవినాష్ క్షణం ఆలోచించుకోకుండా నాలుగో సీజన్ అని చెప్పాడు.అక్కడే అసలు గొడవనిఖిల్, గౌతమ్.. మీరిద్దరూ ఎందుకు ఎప్పుడూ గొడవపడతారు? అన్న ప్రశ్నకు అభిప్రాయబేధాలు అని ఇద్దరూ బదులిచ్చారు. తర్వాత ఓ టాస్క్లో నిఖిల్ గెలవడంతో అతడి తమ్ముడి వీడియో సందేశాన్ని చూపించాడు. అనంతరం ప్రేరణ గెలవడంతో తనకు ఓ ఫోటోఫ్రేమ్ ఇచ్చారు. అలా ఎమోషన్స్, ఆటపాటలతో ఎపిసోడ్ పూర్తయింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్ 8: ప్రేరణ, అవినాష్ ఎలిమినేట్!
బిగ్బాస్ రియాలిటీ షో మొదలై ఎనిమిదేళ్లు కావస్తోంది. కానీ ఇంతవరకు ఒక్క అమ్మాయి కూడా టైటిల్ గెలవలేదు. ఎలాగైనా సరే ఈసారి ట్రోఫీ అందుకుని చరిత్ర తిరగరాయాలని ప్రేరణ బలంగా కోరుకుంది. అందుకు తగ్గట్లుగానే ఎంతో కష్టపడింది. అబ్బాయిలతోనూ ధీటుగా పోరాడింది. తను పాల్గొన్న ప్రతి టాస్కులోనూ విజృంభించి ఆడింది. లేడీ ఫైటర్ అని పేరు తెచ్చుకుంది. టాప్ 3లో కూడా చోటు దక్కించుకోని ప్రేరణకానీ మైక్రో మేనేజ్మెంట్ వల్ల విమర్శలపాలైంది. అందరికీ ఓపికగా వంటచేసినప్పటికీ కిచెన్లో గొడవలు పడి నెగెటివిటీ మూటగట్టుకుంది. ప్రేరణ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే స్థాయి నుంచి ఈమె ఫైనల్కు అయినా వస్తుందా? అనే స్థాయికి పడిపోయింది. అందుకే టాప్3లో కూడా స్థానం దక్కించుకోలేదు.విజేత ఎవరు?ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో బిగ్బాస్ 8 గ్రాండ్ ఫినాలే షూటింగ్ సగం పూర్తయింది. మొదటగా ముక్కు అవినాష్ను ఎలిమినేట్ చేయగా నాలుగో స్థానంలో ప్రేరణను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. టాప్ 3లో నిఖిల్, నబీల్, గౌతమ్ కృష్ణ మిగిలారు. మూడో స్థానం నబీల్దే అన్న విషయం అందరికీ తెలుసు.. ఇక విన్నర్, రన్నర్ ఎవరనేది తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే!మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్ గ్రాండ్ ఫినాలేకు అల్లు అర్జున్ రావట్లేదా?
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ వైల్డ్ కార్డ్స్ వచ్చాకే వైల్డ్ ఫైర్లా మారింది. మొత్తంగా 22 మంది కంటెస్టెంట్లు పాల్గొన్న ఈ సీజన్లో ఐదుగురు ఫైనల్స్కు వచ్చారు. నిఖిల్, నబీల్, ప్రేరణ, గౌతమ్, అవినాష్ టాప్ 5లో ఉన్నారు. అసలు సిసలు పోటీ మాత్రం ఇద్దరి మధ్యే నెలకొంది. గౌతమ్, నిఖిల్.. నువ్వా?నేనా? అన్న రీతిలో ఓటింగ్లో దూసుకుపోయారట! గెస్టుగా అల్లు అర్జున్వీరిలో ఒకర్ని విజేతగా ప్రకటించేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నాడని ప్రచారం జరిగింది. నిజానికి గత సీజన్ ఫైనల్స్లోనూ మహేశ్బాబు అతిథిగా వస్తున్నాడని టాక్ నడిచింది. కానీ చివరికి ఆయన రానేలేదు. ఇక ఈ సీజన్లోనూ పుష్పరాజ్ వస్తున్నాడని వార్తలు వచ్చాయి. పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ కోసమైనా వస్తాడేమోనని ఫ్యాన్స్ ఎదురుచూశారు. నాగార్జున చేతులమీదుగానే..కానీ అంతలోనే సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టయ్యాడు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ పోలీసులు బన్నీని రాత్రంతా జైల్లోనే ఉంచి శనివారం ఉదయం రిలీజ్ చేశారు. జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ను పరామర్శించేందుకు సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. ఇలాంటి సమయంలో బన్నీ బిగ్బాస్ షోకు వచ్చే అవకాశం కనిపించట్లేదు. దీంతో ఈసారి కూడా నాగార్జున చేతులమీదుగానే విన్నర్కు ట్రోఫీ ఇచ్చేయనున్నారన్నమాట!మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss: ఆగిపోయిన లైవ్ స్ట్రీమింగ్, చివరి గెస్టుగా సుమ
యాంకర్ సుమ ఎక్కడుంటే అక్కడ నవ్వుల పండగే! బిగ్బాస్ హౌస్లోకి చివరి గెస్టుగా యాంకర్ సుమ ఎంట్రీ ఇచ్చింది. ఫైనలిస్టులతో టాస్కులాడిస్తూ వారిని ఓ ఆటాడుకుంది. ఈ క్రమంలోనే కొన్ని సరదా ప్రశ్నలడిగింది. మూడు రోజులు స్నానం చేయకుండా ఉన్నారా? అంటే మూడు కాదు నాలుగు రోజులు స్నానం చేయలేదని తెలిపింది ప్రేరణ.వేరేవాళ్ల టూత్ బ్రష్ను వాడారా? అంటే నబీల్, నిఖిల్, అవినాష్, గౌతమ్.. నలుగురూ అవునని తలూపారు. ఛీ బాయ్స్.. ఇలా ఉన్నారేంట్రా బాబూ అని సుమ, ప్రేరణ తల పట్టుకున్నారు. తర్వాత వీళ్లతో మరిన్ని గేమ్స్ ఆడించింది. ఇకపోతే రేపే బిగ్బాస్ ఫైనల్. ఇప్పటికే హాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ కూడా ఆగిపోయింది. ప్రేక్షకులు ఓట్లు వేయడం కూడా ముగిసిపోయింది. విజేతను ప్రకటించడమే మిగిలి ఉంది. నిఖిల్, గౌతమ్ మధ్య భారీ పోటీ నెలకొనడంతో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎవర్నీ వాడుకోలేదన్న నిఖిల్.. ప్రేరణ బెస్ట్ మెగా చీఫ్!
టాప్ 5 ఫైనలిస్టుల్లో గౌతమ్, అవినాష్ జర్నీ వీడియోలు అయిపోయాయి. ఈరోజు మిగతా ముగ్గురి వీడియోలు ప్లే చేశారు. మరి బిగ్బాస్ వారిని ఏ రేంజ్లో పొగిడారో నేటి (డిసెంబర్ 13) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..మీ మనసు ఒప్పుకోలేదుఒక్క బొట్టుతో మొదలై మహానదిగా మారే నదిలా మీ ప్రయాణం సాగింది. ఎన్నో నిందలు వేసినా ఏకాగ్రత కోల్పోలేదు. ఎన్నో బంధాలు మీతో చివరివరకు కలిసి నడవలేకపోయాయి. ఈ ఇంట్లో పృథ్వీ మీకు దొరికిన అసలైన సోదరుడు. మీరిద్దరూ ఒకరితో ఒకరు, ఒకరికోసం ఒకరు నిలబడ్డారు, ప్రత్యర్థులతో తలపడ్డారు. గ్రూప్ గేమ్ అని మీ ఆటను వేలెత్తి చూపించినప్పుడు మీ మనసు అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే మీరు మీ స్నేహం కోసం ఆడారు. రక్తాన్ని చిందించావ్మీరు నమ్మిన స్నేహితులందరూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. అప్పుడు మీ మనసుకైన గాయాన్ని మనసులోనే దాచుకున్నారు. మీరొక స్మార్ట్ గేమర్. మీ సహనాన్ని పరీక్షించినప్పుడు కామ్గా ఉన్నారు. మీ సత్తాను పరీక్షించే టాస్కుల్లో రక్తాన్ని సైతం చిందించి దూకుడు చూపించారు. మీరు నిజమైన జెంటిల్మెన్. రాయల్స్(వైల్డ్ కార్డ్స్) ఇంట్లోకి వచ్చినప్పుడు ఓజీ (పాత కంటెస్టెంట్ల)కోసం లీడర్లా నిలబడ్డారు. మీకన్నా ఇంటికోసమే ఎక్కువ ఆలోచించారు. ఆ లోటు నాకు తెలుసుసరదాకు మీరేం చేసినా హద్దులు దాటలేదు. మీ ప్రయాణం మీకు సంతృప్తినిచ్చినా మీ మనసులోని ఆ ఒక్క లోటు నాకు తెలుసు. మనసుకు దగ్గరైన ప్రతీది మీకు దక్కాలని కోరుకుంటున్నా అంటూ అతడి ప్రియురాలు కావ్య తిరిగి అతడితో కలిసిపోవాలని పరోక్షంగా కోరుకున్నాడు. తర్వాత జర్నీ వీడియోలో నిఖిల్కు రాఖీ భాయ్ లెవల్ ఎలివేషన్స్ ఇచ్చాడు. ప్రేక్షకుల రుణం తీర్చుకోలేనన్న నిఖిల్. ఎవరినీ ఆడుకుని, వాడుకుని ఇక్కడిదాకా రాలేదని కుండబద్ధలు కొట్టి చెప్పాడు.ఆ పట్టుదల వల్లే..తర్వాత ప్రేరణ వంతు రాగా.. సందర్భోచితంగా మిమ్మల్ని మీరు మార్చుకున్న తీరే ఈ స్థాయిలో నిలబెట్టింది. పసిపాపలాంటి అమాయకత్వం అందరికీ దగ్గర చేసింది. ఓటమిని ఒప్పుకోని తత్వమే మిమ్మల్ని ఎన్నోసార్లు గెలుపు అంచులవరకూ తీసుకెళ్లింది. ఆ పట్టుదల వల్లే మెగా చీఫ్ అయ్యారు. కానీ అప్పటినుంచే కష్టాలు మొదలయ్యాయి. తనమన బేధం లేకుండా మెగా చీఫ్గా వ్యవహరించారు. కానీ ఇంటిసభ్యుల దృష్టిలో వరస్ట్ మెగా చీఫ్ అయ్యారు. మనసారా ఏడ్చేసిన ప్రేరణఅయితే బిగ్బాస్ దృష్టిలో మాత్రం మీరు బెస్ట్ మెగా చీఫ్. తప్పు జరిగితే స్నేహితుల్నైనా నామినేట్ చేసేందుకు వెనుకాడలేదు. మీలోని మొండిఘటం మిమ్మల్ని ప్రశ్నించినవారికి చెమటలు పట్టించింది. ఆ లక్షణమే టాప్ 5కు తీసుకొచ్చింది. వివాహితలు కూడా ఎంతో సాధించివచ్చని, మీ ప్రయాణంతో ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తారని భావిస్తున్నా.. అంటూ బిగ్బాస్ తన జర్నీ వీడియో చూపించాడు. దీన్నంతటినీ ఆస్వాదిస్తూనే మనసారా ఏడ్చేసింది ప్రేరణ.వరంగల్ కా షేర్ నబీల్అనంతరం నబీల్ అఫ్రిది గురించి బిగ్బాస్ మాట్లాడుతూ.. వరంగల్ కా షేర్ నబీల్ అన్న పేరు ఇప్పుడు ప్రతి ఇంట్లో సుపరిచితం. మీ టాలెంట్, వ్యక్తిత్వాన్ని కోట్లమందికి తెలియజేసే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఎవిక్షన్ షీల్డ్ త్యాగం చేసి ఉన్నతంగా ఆలోచించే గుణానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు. మీరు సెల్ఫ్ మేడ్. అందుకే ఆత్మగౌరవం కూడా ఎక్కువే. దాన్ని ప్రశ్నించినవారికి ఆటతోనే ధీటుగా జవాబిచ్చారు. బలహీనత కాదు బలంఈ ఇంటి మొదటి మెగా చీఫ్గా నిలిచారు. మీలో ఫైర్ తగ్గిందన్నప్పుడు మీ సామర్థ్యాన్ని ప్రశ్నించుకున్నారు. మీ చుట్టూ ఉన్న తారల తళుకుబెళుకుల మధ్య ఒక సామాన్యుడిలా ఒంటరై నిల్చున్నట్లు మీకనిపించింది. కానీ అది మీ బలహీనత కాదు మీ బలం అంటూ జర్నీ వీడియో ప్లే చేశాడు. అది చూసి నబీల్ ఓపక్క సంతోషిస్తూనే మరోపక్క కంటతడి పెట్టుకున్నాడు. మొత్తానికి అందరి జర్నీ వీడియోలు పూర్తయ్యాయి. ఇక విన్నర్ను తేల్చడం మాత్రమే మిగిలింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆ ముగ్గురికి బిగ్బాస్ అన్యాయం.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన ప్రేరణ
బిగ్బాస్ ఫైనల్ వీక్లో టాప్ 5 కంటెస్టెంట్లు ఆడుతూపాడుతూ గడిపేస్తారు. అలాగే తమ జర్నీ వీడియోలు చూసుకుని మురిసిపోతుంటారు. అయితే సగం వారం అయిపోయాకగానీ ఈ జర్నీ వీడియోలు ప్లాన్ చేయలేదు బిగ్బాస్. వైల్డ్కార్డ్ కంటెస్టెంట్లయిన అవినాష్, గౌతమ్ల స్పెషల్ జర్నీని నిన్నటి ఎపిసోడ్లో చూపించాడు. పక్షపాతం?సీజన్ ప్రారంభం నుంచి ఉన్న కంటెస్టెంట్లు ప్రేరణ, నిఖిల్, నబీల్ జర్నీ వీడియోలు ఈరోజు ప్లే చేయనున్నాడు. 70 రోజులు హౌస్లో ఉన్న ఇద్దరి కోసం ఒక ఎపిసోడ్ అంతా కేటాయిస్తే వంద రోజులకు పైగా ఉన్న ముగ్గురినీ ఒకే ఎపిసోడ్లో సర్దేయడమేంటని నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ప్రేరణగా నిలిచావ్ఇక తాజా ప్రోమోలో ప్రేరణ భావోద్వేగానికి లోనైంది. పసిపాపలా హౌస్లో అడుగుపెట్టావ్.. పెళ్లి దేనికీ అడ్డుకాదని, పెళ్లయిన మహిళలు కూడా ఎంతో సాధించవచ్చని ఎంతోమందికి ప్రేరణగా నిలిచావంటూ బిగ్బాస్ పొగడ్తల వర్షం కురిపించాడు. ఇంటి సభ్యుల దృష్టిలో వరస్ట్ మెగా చీఫ్ కానీ నా దృష్టిలో మాత్రం బెస్ట్ మెగా చీఫ్ అని చెప్పడంతో ప్రేరణ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అవినాష్ జస్ట్ కమెడియన్ కాదు! బిగ్బాస్ ఎలివేషన్స్ వేరే లెవల్
కామెడీ తప్ప ఏం చేయగలవ్? ఫినాలేలో అడుగుపెట్టే అర్హత నీకు లేదు.. ఇలాంటి కామెంట్లను తట్టుకుని ఈ సీజన్లోనే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు ముక్కు అవినాష్. నామినేషన్స్లోకి ఒకే ఒకవారం రాగా.. నబీల్ ఇచ్చిన ఎవిక్షన్ షీల్డ్ సాయంతో ఆ వారం గండం గట్టెక్కాడు. తర్వాత మెగా చీఫ్ అయ్యాడు, టికెట్ టు ఫినాలే గెలిచి ఫైనలిస్ట్ అయ్యాడు. కొందరే స్నేహితులు..ఈ సీజన్కు ఎంటర్టైన్మెంట్ను జోడించిన అవినాష్ తన ప్రయాణాన్ని తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. తెలియని సముద్రం భయాన్ని పెంచితే.. తెలిసిన సముద్రం అంచనాలను పెంచుతుంది. ఈరోజు మీరీ స్థానంలో నిలిచి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఈ ఇంట్లో కొందరే మీకు స్నేహితులైనా అందరూ మీకు ఆప్తులే..జస్ట్ కమెడియన్ కాదుమీ భార్యకెంతో ఇష్టమైన రింగుల జుట్టును ఆటపై ప్రేమతో త్యాగం చేశారు. ఈసారి అవినాష్ కామెడీ మాత్రమే చేయగలిగే జస్ట్ కమెడియన్ కాదు.. అన్నీ చేయగలిగే ఎంటర్టైనర్లా మిమ్మల్ని మీరు ఆవిష్కరించారు. అన్ని అనారోగ్యాల నుంచి ఉపశమనం ఇచ్చే దివ్యౌషధం నవ్వు ఒక్కటే! ఆ నవ్వును పంచే మీరు అందరికన్నా ఐశ్వర్యవంతులు అంటూ బిగ్బాస్ అవినాష్పై ప్రశంసలు కురిపించాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'బిగ్బాస్' ఫైనల్ చీఫ్ గెస్ట్గా స్టార్ హీరో.. భద్రత పెంచిన పోలీసులు
ఈ నెల 15వ తేదీన బిగ్బాస్ సీజన్–8 ఫైనల్ జరగనుంది. ఈ సీజన్ విన్నర్ రేసులో గౌతమ్,నిఖిల్,నబీల్,ప్రేరణ,అవినాష్ ఉన్నారు. బిగ్ బాస్లోకి మొత్తం 22మంది ఎంట్రీ ఇస్తే వారిలో ఈ ఐదుమంది మాత్రమే సుమారు 100 రోజులకు పైగా గెలుపు రేసులో ఉన్నారు. అయితే, డిసెంబర్ 15వ తేదీన జరగనున్న గ్రాండ్ ఫినాలే కోసం చీఫ్ గెస్ట్గా నేషనల్ అవార్డ్ విన్నర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్లలో ముఖ్య అతిథిగా ఒక సెలబ్రెటీ రావడం సహజమే.. బిగ్ బాస్ రేసులో గెలిచిన వారికి చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా ట్రోపీతో పాటు ప్రైజ్ మనీ చెక్ను కూడా అందిస్తారు. అయితే, గత సీజన్లో ముఖ్య అతిథిగా ఎవరూ రాలేదు. దీంతో హోస్ట్గా షోను నడిపించిన నాగార్జున చేతుల మీదుగానే పల్లవి ప్రశాంత్ ట్రోఫీ అందుకున్నాడు. దీంతో ఈ సీజన్లో తప్పకుండా సినీ సెలబ్రిటీని ముఖ్య అతథిగా తీసుకురావాలని మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ను బిగ్ బాస్కు రానున్నారని ప్రచారం జరుగుతుంది. పుష్ప2 విజయంతో బన్నీ విజయోత్సవంలో ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం రూ. 1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ ఫైనల్లో అతిథిగా పాల్గొంటే షో మరింత బజ్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బన్నీనే ముఖ్య అతిథిగా బిగ్బాస్కు వెళ్తే.. అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీగా జనం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది.బిగ్ బాస్ ఫైనల్ కోసం భారీ సెక్యూరిటీబిగ్బాస్ సీజన్–8 ఫైనల్ జరగనున్న నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అల్లర్లు, గొడవలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోలోని ఏడెకరాల్లో బిగ్బాస్ సెట్టింగ్ వేయగా..ఫైనల్ కూడా ఇక్కడే జరగనుంది. గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన బిగ్బాస్ సీజన్–7 ఫైనల్ సందర్భంగా తలెత్తిన పరిణామాలు, గొడవలు, బస్సులపై రాళ్లు రువ్వడం తదితర అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ 53 సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని ఇప్పటికే పోలీసులు ఆయా పాయింట్లతో కూడిన జాబితాను అన్నపూర్ణ స్టూడియో, బిగ్బాస్ యాజమాన్యానికి అందజేశారు. ఫైనల్ రోజుకు ముందే 14వ తేదీన ఉదయమే వీటిని అమర్చుకోవాలని సూచించారు. -
లక్ష్యం వైపు ప్రయాణం.. గౌతమ్పై బిగ్బాస్ ప్రశంసలు
హమ్మయ్య.. సీరియల్స్ గోల ముగిసిపోయింది. బిగ్బాస్ షోలోనూ బుల్లితెర సెలబ్రిటీలను పంపి సీరియల్స్ ప్రమోషన్ చేయించారు. ఇక దానికి ఫుల్స్టాప్ పెట్టి టాప్ 5 కంటెస్టెంట్ల జర్నీ వీడియోలు ప్లాన్ చేశారు. ఈమేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది.కోరుకున్న ప్రేమ దక్కకపోయినా..అందులో గౌతమ్ తన ప్రయాణానికి సంబంధించిన గుర్తులను, జ్ఞాపకాలను చూసి ఎమోషనలయ్యాడు. ఇక బిగ్బాస్ మాట్లాడుతూ.. మీకున్న ఏకాగ్రతను చూసి ఇంట్లోని బలమైన కంటెస్టెంట్స్ కూడా ఆలోచనలో పడ్డారు. కాస్త (యష్మి దగ్గర) ప్రేమను కోరుకున్నప్పుడు ఆ ప్రేమ మీకు లభించకపోయినా ఆ అల్లరి మీ ఆటను ప్రభావితం చేయకుండా చూసుకున్నారు. అప్పటినుంచి పాదరసంలా కదులుతూ మీ ఆట ఏ ఆటంకం లేకుండా ముందుకు సాగింది.చివరి మజిలీమీ పంథా మార్చకుండా మీ లక్ష్యం వైపు కదిలారు. ఫైనలిస్టుగా చివరి మజిలీకి చేరుకున్నారు అంటూ జీరో నుంచి హీరో అయిన ప్రస్థానాన్ని తెలియజేస్తూ పొగడ్తల వర్షం కురిపించాడు. ఈ ప్రశంసలతో పొంగిపోయిన గౌతమ్.. చివరగా ఓ మంచిమాట చెప్పాడు. అమ్మానాన్నల కోసం బతకండి.. వారిని మించిన దైవం లేదు అని చెప్పుకొచ్చాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణకు కలిసొచ్చిన లక్.. టాప్ 5పై గెలవని సీరియల్ బ్యాచ్
మరో ఐదు రోజుల్లో కంటెస్టెంట్లు ఉండరు, బిగ్బాస్ హౌసూ ఉండదు. ఉన్న నాలుగురోజులైనా టాప్ 5 కంటెస్టెంట్లను, వారి జర్నీని, బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ను ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో ఓసారి గుర్తు చేసుకుందామంటే బిగ్బాస్ ఆ ఛాన్సే ఇవ్వట్లేదు. వరుసపెట్టి సీరియల్ ఆర్టిస్టులను పంపిస్తూనే ఉన్నాడు. సీరియల్స్ ప్రమోషన్ జరిపిస్తూనే ఉన్నాడు. మరి ఈ రోజెవరొచ్చారో నేటి (డిసెంబర్ 11) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..సీరియల్ బ్యాచ్పై గెలుపువంటలక్క సీరియల్ టీమ్ హౌస్లోకి వచ్చింది. వీరితో ప్రేరణ, అవినాష్ గేమ్ ఆడి గెలిచారు. దీంతో బిగ్బాస్ రూ.10,928 ప్రైజ్మనీలో యాడ్ చేశాడు. తర్వాత మగువ.. ఓ మగువ సీరియల్ టీమ్ హౌస్మేట్స్తో చిట్చాట్ చేసింది. అప్పుడు కూడా అవినాష్ తన కామెడీ యాంగిల్తో అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. అనంతరం అందరూ కలిసి ఓ ఫన్ గేమ్ ఆడారు. ప్రేరణ నోటికి తాళంమ్యూజిక్ ప్లే అవుతున్నంతసేపు ఒకరి చేతిలోని బాక్స్ను మరొకిరి ఇస్తూ పోవాలి. మ్యూజిక్ ఆగిపోయినప్పుడు ఎవరి చేతిలో అయితే ఆ బాక్స్ ఉంటుందో దాన్ని తెరిచి అందులో ఏది రాసుంటే అది ఫాలో అయిపోవాలి. అలా మొదటగా ప్రేరణ చేతిలో బాక్స్ ఉన్నప్పుడు మ్యూజిక్ ఆగిపోయింది. అందులో గేమ్ అయిపోయేవరకు ప్రేరణ నోరు తెరవకూడదని ఉంది. ఆమె తరపున అవినాష్ మాట్లాడాలని ఉంది. దెబ్బలు తిన్నాడ్రోయ్రెండో రౌండ్లో అవినాష్ వంతురాగా.. తనకు ఇచ్చిన టాస్క్ ప్రకారం అందరిపై ఫేక్ పొగడ్తలు కురిపించాడు. తర్వాత నిఖిల్ మార్నింగ్ పనులను డ్యాన్స్ రూపంలో చేయగా.. నబీల్ రెండు పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తిన్నాడు. చివర్లో అవినాష్ అందరితో దెబ్బలు తిన్నాడు. అనంతరం మగువ ఓ మగువ టీమ్తో ప్రేరణ, గౌతమ్ టాస్క్ ఆడి రూ.10,0010 గెలిచారు.ప్రేరణకు కలిసొచ్చిన అదృష్టంబీబీ పరివారంపై మా పరివారం ఇప్పటివరకు ఒక్క టాస్క్ గెలిచిందే లేదు! మరి రేపటి ఎపిసోడ్లో అయినా ఈ రికార్డును ఎవరైనా బ్రేక్ చేస్తారేమో చూడాలి! అలాగే వచ్చిన అందరూ.. హౌస్లో ఒక్క అమ్మాయే ఉందంటూ ప్రతి గేమ్లోనూ తననే సెలక్ట్ చేసుకుంటున్నారు. అలా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వందశాతం ఉపయోగించుకుంటోంది ప్రేరణ. ఈ టాస్కుల్లో తన కష్టాన్ని చూసి ప్రేరణకు మరిన్ని ఓట్లు పడే అవకాశం లేకపోలేదు. -
పెళ్లి డేట్ ప్రకటించిన సోనియా.. నాగార్జునకు ఆహ్వానం
బిగ్బాస్ షో వల్ల కంటెస్టెంట్ల కెరీర్ ముందుకెళ్తుందో, లేదో కానీ జనాల్లో పబ్లిసిటీ మాత్రం పుష్కలంగా దొరుకుతుంది. అయితే పాజిటివ్ కంటే నెగెటివ్ పబ్లిసిటీ మూటగట్టుకున్నవారే ఎక్కువ. ఆ జాబితాలోకి సోనియా ఆకుల వస్తుంది.దూకుడుకు చెక్మంథనికి చెందిన ఈ బ్యూటీ బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో పాల్గొంది. హౌస్లో అందరికంటే స్ట్రాంగ్ అనుకున్న నిఖిల్తో మొదట తలపడింది. కానీ కొద్దిరోజుల్లోనే అతడిని గుప్పిట్లో పెట్టుకుంది. అయితే అతడితో ప్రవర్తించిన తీరు కూడా జనాలకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో ఆమెను త్వరగానే ఎలిమినేట్ చేశారు.పెళ్లికి రెడీఇకపోతే సోనియా ఆకుల పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. ప్రియుడు యష్తో ఏడడుగులు వేసేందుకు ఆత్రంగా ఎదురుచూస్తోంది. గత నెలలో వీరిద్దరి నిశ్చితార్థం జరగ్గా ఇటీవలే పెళ్లిపత్రికలు కూడా అచ్చు వేయించారు. డిసెంబర్ 21న మధ్యాహ్నం 3.40 గంటలకు తమ వివాహం జరగనుందని తెలియజేస్తూ సోనియా సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. అయితే రిసెప్షన్ మాత్రం పెళ్లికి ఒకరోజు ముందే ప్లాన్ చేసినట్లు పేర్కొంది. View this post on Instagram A post shared by Yash Veeragoni (@yashveeragoni) View this post on Instagram A post shared by Yash Veeragoni (@yashveeragoni) మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8 : గౌతమ్ హిస్టరీ క్రియేట్ చేసేనా?
ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా.. అంటూ పోకిరిలో పూరీ రాసిన డైలాగ్ బిగ్బాస్ 8 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణకి బాగా సరిపోతుంది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్లోకి అడుగుపెట్టినా.. తనదైన ఆటతీరుతో ముందు నుంచి ఉన్నవాళ్లను పక్కకి నెట్టి తన గ్రాఫ్ని పెంచుకున్నాడు. తనకు ఉన్న షార్ట్ టెంపర్కి మహా అయితే రెండు మూడు వారాల కంటే ఎక్కువ ఉండలేడులే అనుకున్న వాళ్ల అంచనాలను తారుమారు చేస్తూ..టాప్ 5లోకి వచ్చేశాడు. అంతేకాదు సీజన్ 8 విన్నర్ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో గౌతమ్ ఉండడం గమనార్హం.ఈ సీజన్లో టాప్ 5లోకి అవినాష్, నిఖిల్, నబీల్, ప్రేరణ, గౌతమ్ చేరుకున్నారు. అయితే పోటీ మాత్రం నిఖిల్-గౌతమ్ మధ్యే ఉన్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ పరంగా ఇద్దరి మధ్య స్వల్ప తేడానే ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు నిఖిల్ పై స్థాయిలో ఉంటే..ఇప్పుడు మాత్రం గౌతమ్ టాప్ 1లోకి వచ్చినట్లు తెలుస్తోంది. పలు వెబ్సైట్లు పెట్టిన పోలింగ్లోనూ విన్నర్ గౌతమే అని తేలుతోంది. ఈ సారి తెలుగు వాడే విన్నర్ అవుతారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం జరుగుతుంది. తెలుగు వాడిని విన్నర్ చేయండి అంటూ నెటిజన్లు తెగ పోస్టులు పెడుతున్నారు.Gautham nuvvu eliminated ane situation nunchi Gautham is the winner ane situation ki tisukoni vachadu💪🔥🔥This Is The Most Inspirational Journey In The Entire BB History💥🥵🥵🤙 #GauthamVote For Gautham Win🏆🏆😍#BiggBosTelugu8 #GauthamKrishna 🏆#VoteforGauthamKrishna pic.twitter.com/fmnRQBu22O— S.Harsha Vardhan (@Harsha3633) December 9, 2024కన్నడ వెర్సస్ తెలుగుబిగ్బాస్ షోలో ఈ సారి కంటెస్టెంట్స్ రెండు రకాలుగా విడిపోయారు. నిఖిల్, పృథ్వి, యష్మి కలిసి ఆడడంతో వాళ్లను కన్నడ బ్యాచ్గా, మిగతవారిని తెలుగు బ్యాచ్గా కంటెస్టెంట్స్తో పాటు వీక్షకులు కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇదంతా వైల్డ్ కార్టు ఎంట్రీ తర్వాతే జరిగింది. నిఖిల్, పృథ్వి, యష్మి కలిసి గేమ్ అడుతున్నారనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంతో గౌతమ్ సక్సెస్ అయ్యాడు. ఈ విషయంలో హోస్ట్ నాగార్జునతో కూడా వాగ్వాదానికి దిగడం గౌతమ్కి కలిసొచ్చింది.హిస్టరీ క్రియేట్ చేసేనా?వాస్తవానికి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వాళ్లు ఎంత బాగా ఆడినా..ఓటింగ్కి వచ్చేసరికి వెనుకబడిపోతారు. కానీ గౌతమ్ కృష్ణ మాత్రం ప్రతి వారం నామినేషన్స్లో ఉన్నా.. తనదైన ఆట తీరుతో ప్రేక్షకులు మనసులు గెలుచుకున్నాడు. గతంలో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వాళ్లు టాప్ 5లోకి చేరారు కానీ విన్నర్గా నిలవలేదు. ఆడియన్స్తో కూడా వాళ్లు విన్నర్ అవుతారని భావించలేదు. కానీ ఈ సారి మాత్రం విన్నర్ రేసులో గౌతమ్ పేరు బలంగా వినిపిస్తుంది. మరోవైపు నిఖిల్ కూడా విన్నర్ రేసులో ఉన్నారు. సోషల్ మీడియాలో ఆయనకు కూడా భారీగా మద్దతు లభిస్తోంది. కానీ గత రెండు రోజులుగా గౌతమ్కి మద్దతు పెరుగుతోంది. తెలుగు వాడిని విన్నర్ చేయాలని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బిగ్బాస్ మాజీలు అఖిల్ సార్థక్, ఆర్జే కాజల్, సోహైల్తో పాటు మరికొంతమంది సీరియల్ నటీనటులు గౌతమ్కు ససోర్ట్గా పోస్టులు పెడుతున్నారు. మరి సీజన్ 8 విన్నర్ ఎవరనేది తెలియాలంటే ఈ ఆదివారం వరకు ఆగాల్సిందే. #GauthamKrishna inspired everyone by highlighting that life's ups and downs are natural, urging us to rise above challenges with courage and determination. Let’s make him the Bigg Boss winner🏆vote for Gautham!Missed call to 7997983717#BiggBossTelugu8 #Biggboss #gautham pic.twitter.com/aoeXOxj1fM— Gautham Krishna (@igauthamkrishna) December 11, 2024 -
ప్రేమ పెళ్లి ముద్దు అన్న నిఖిల్.. అవినాష్ను ఆడుకున్న బిగ్బాస్
నామినేషన్స్ అయిపోయాయి. బిగ్బాస్ హౌస్లో టాప్ 5 ఫైనలిస్టులు మాత్రమే మిగిలారు. ఈ చివరివారంలో కూడా ప్రైజ్మనీ పెంచుకునే ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ గేమ్స్లో గెలవకపోతే ప్రైజ్మనీ కట్ అవుతుందన్నాడు. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (డిసెంబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..సీరియల్ పరివారం వర్సెస్ బీబీ పరివారంసీరియల్ సెలబ్రిటీలు బిగ్బాస్ హౌస్కు వస్తారని చెప్పాడు బిగ్బాస్. మా సీరియల్ పరివారంతో బీబీ పరివారం పోటీపడి ఆటలు ఆడి గెలిచి ప్రైజ్మనీని పెంచుకోవచ్చన్నాడు. ఓడిపోతే ప్రైజ్మనీ కూడా తగ్గుందన్నాడు. మొదటగా నువ్వుంటే నా జతగా సీరియల్ టీమ్ అర్జున్ కళ్యాణ్, అను హౌస్లోకి వచ్చారు. వీరితో ఆడాల్సిన గేమ్కు రూ.12,489 ప్రైజ్మనీ నిర్ణయించారు. ఒగ్గుకథ చెప్పిన అవినాష్ఈ ఆటలో సీరియల్ పరివారంతో నబీల్-ప్రేరణ ఆడి గెలిచారు. అలా పన్నెండువేల రూపాయల్ని ప్రైజ్మనీలో యాడ్ చేశారు. తర్వాత అవినాష్ టాప్ 5 ఫైనలిస్టులపై ఒగ్గుకథ చెప్పి అలరించాడు. ఇప్పుడెలాగూ చేసేదేం లేదని కాసేపు దాగుడుమూతలు ఆడారు. ఈ క్రమంలో అవినాష్ యాక్షన్ రూమ్లో దాక్కున్నాడు. ఇంతలో బిగ్బాస్ ఆ గదికి తాళం వేసి లైట్లు ఆఫ్ చేశాడు. కాసేపటికి ఘల్లు ఘల్లుమంటూ గజ్జెల శబ్దం ప్లే చేశాడు.అవినాష్ను ఆటాడుకున్న బిగ్బాస్దీంతో అవినాష్ దడుసుకుని చచ్చాడు. తలుపు తీయండి బిగ్బాస్ అని వేడుకున్నా కనికరించలేదు. దెయ్యం కేకలు, కాంచన అరుపుల సౌండ్స్ వినిపించడంతో అవినాష్ ఏడ్చినంత పని చేశాడు. చివరకు గది తాళం తీయడంతో బయటకు పరిగెత్తాడు. అతడిని చూసి హౌస్మేట్స్ అందరూ ఘొల్లుమని నవ్వారు.ప్రేమ వివాహం చేసుకుంటా: నిఖిల్అనంతరం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టీమ్ నుంచి ప్రభాకర్, ఆమని వచ్చారు. తమ సీరియల్ స్టోరీలైన్ గురించి చెప్తూ హౌస్మేట్స్ను మీలో ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారని అడిగారు. అందుకు నిఖిల్.. ప్రేమవివాహం చేసుకుంటానన్నాడు. పెద్దలను ఒప్పించాకే తన పెళ్లి జరుగుతుందన్నాడు. ఇక ప్రభాకర్- ఆమనితో ప్రేరణ - అవినాష్ బాల్స్ గేమ్ ఆడారు. ఇందులో సీరియల్ పరివారంపై బీబీ పరివారం గెలిచి రూ.15,113 పొందారు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
లావుగా ఉన్నానని ఆ పాట నుంచి తప్పించారు: శిల్ప
హీరోయిన్ల లైఫ్ అంత ఈజీగా ఉండదు. కాస్త లావెక్కినా, వయసు మీద పడుతున్నట్లు ఏమాత్రం కనిపించినా వారి కెరీర్ డేంజర్లో పడ్డట్లే! పైగా కొత్తవారు ఎంట్రీ ఇచ్చేకొద్దీ తమను తాము ప్రూవ్ చేసుకుంటూ నిలదొక్కుకునేందుకు మరింత కష్టపడాల్సి వస్తుంది. అయినా కొన్నిసార్లు ఏవో వంకలు చెప్పి రిజెక్ట్ చేస్తూనే ఉంటారు.బిగ్బాస్ షోలో నమ్రత సోదరిటాలీవుడ్ హీరో మహేశ్బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఒకప్పుడు హీరోయిన్. ఆమె చెల్లి శిల్ప శిరోద్కర్ కూడా కథానాయికగా నటించింది. ఒకప్పుడు బాలీవుడ్లో ఈమె టాప్ హీరోయిన్గా చెలామణి అయింది. కానీ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇన్నాళ్లు ఆన్స్క్రీన్పై చూశారు.. ఇప్పుడు ఆఫ్స్క్రీన్లో నేనెలా ఉంటానో చూపిస్తానంటూ హిందీ బిగ్బాస్ 18వ సీజన్లో పాల్గొంది. సల్మాన్ ఖాన్కు బదులుగా..ఈ షోకు వెళ్లేముందు నమ్రతతో గొడవపడి మరీ వచ్చేశానంటూ తన సోదరిని తల్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది. తాజాగా శిల్ప మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. వీకెండ్ ఎపిసోడ్లో సల్మాన్ ఖాన్కు బదులు కొరియోగ్రాఫర్, దర్శకనటి ఫరాఖాన్ హోస్ట్గా వ్యవహరించింది. ఆమెను చూడగానే శిల్పకు ఓ విషయం గుర్తుకు రావడంతో దాన్ని మరో కంటెస్టెంట్తో పంచుకుంది. సడన్గా నన్ను తీసేశారుబ్లాక్బస్టర్ సాంగ్ చయ్య చయ్య (దిల్సే మూవీలోనిది) పాటకోసం మొదట నన్నే అనుకున్నారు. నా దగ్గరకు వచ్చిన ఫరా ఖాన్ నన్ను చూసి కాస్త బరువు తగ్గమని చెప్పింది. వారం పదిరోజుల తర్వాత నన్ను పక్కనపెట్టి మరో నటి(మలైకా అరోరా)ని వెతుక్కున్నారని తెలిసింది. నేను మరీ లావుగా ఉన్నానని, ఆ పాటకు సూటవనని ఫరా నాతో చెప్పింది. నిజంగా నన్ను తీసేయడానికి అదే కారణమా? ఇంకేదైనా ఉందా? అన్నది కొరియోగ్రాఫర్ ఫరా, డైరెక్టర్ మణిరత్నమే చెప్పాలి అని శిల్ప శిరోద్కర్ గుర్తు చేసుకుంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టాప్ 5 కంటెస్టెంట్లతో ప్రభాకర్, ఆమని పోటీ! వీళ్లే కాదు ఇంకా..
బిగ్బాస్ 8వ సీజన్లో వచ్చినంత మంది గెస్టులు మరే సీజన్లోనూ వచ్చి ఉండరు. ఫ్యామిలీ వీక్ దగ్గరి నుంచి ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. రెండువారాల క్రితం పాత సీజన్ కంటెస్టెంట్లు, గత వారం సెలబ్రిటీలు రాగా ఇప్పుడు బుల్లితెర తారలు హౌస్లోకి వస్తున్నారు.బిగ్బాస్ హౌస్లో అర్జున్ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు. త్వరలో ప్రారంభమవుతున్న కొత్త సీరియల్ జంటను లోనికి తీసుకొచ్చారు. నటి పెద్దగా పరిచయం లేదేమో కానీ అర్జున్ కళ్యాణ్ మాత్రం ఇదివరకే తెలిసిన వ్యక్తి! అతడు గతంలో బిగ్బాస్ షోలో కంటెస్టెంట్గా పాల్గొన్నాడు.ఫైనలిస్టులతో గేమ్ఈ సీరియల్ జంటతో పోటీపడి గెలిస్తే ప్రైజ్మనీలో కొంత డబ్బు యాడ్ చేస్తానన్నాడు బిగ్బాస్. అలాగే మరో సీరియల్ జంట ప్రభాకర్, ఆమని కూడా వచ్చారు. వీళ్లు కూడా కంటెస్టెంట్లతో కలిసి గేమ్స్ ఆడారు. ఫినాలే వీక్ కాబట్టి ఈ వారం గొడవలు గట్రా ఏమీ ఉండవు. కేవలం ఇలాంటి ఫన్ గేమ్స్, ఎమోషనల్ ఏవీ జర్నీ వీడియోలు మాత్రమే ఉండనున్నాయి. చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ యాక్టర్స్ -
నువ్వేం ఆడావో తెలీట్లేదు.. గౌతమ్పై విషం కక్కిన విష్ణు
ప్రైజ్మనీ గెలిస్తే ఏం చేస్తావ్? ప్రతి సీజన్లో అడిగినట్లే ఈ సీజన్లోనూ టాప్ 6 కంటెస్టెంట్లను ఇదే ప్రశ్న అడిగాడు నాగార్జున. ముందుగా అవినాష్.. మా అన్నయ్యకు ముగ్గురు ఆడపిల్లలు. వారిలో పెద్దమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని తన గొప్ప ఆలోచనను బయటపెట్టాడు. మరి మిగతావారు ఏమేం అన్నారు? విష్ణు వెళ్లేముందు ఏం చెప్పిందో తెలియాలంటే నేటి (డిసెంబర్ 8) ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే!అందరికీ పంచిపెడతానన్న విష్ణునబీల్ ప్రైజ్మనీ గెలిస్తే తన కెరీర్పై ఇన్వెస్ట్ చేస్తానని, మంచి సినిమా తీస్తానని చెప్పాడు. ప్రేరణ.. నా పేరెంట్స్కు ఉన్న అప్పులు తీర్చేస్తా.. మిగిలిన డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెడతా అని తెలిపింది. విష్ణుప్రియ.. అభయ్ నవీన్ ఫారిన్ ట్రిప్కు రూ.2 లక్షలు, మణికంఠ కారుకు రూ.1.5 లక్ష, గంగవ్వ ఇంటికోసం రూ.5 లక్షలు, పృథ్వీకి గోల్డ్ ఇయర్ రింగ్స్.. ఇలా అందరికీ పంచాలనుకుంటున్నాను అని చెప్పింది.ప్రైజ్మనీతో ఏం చేస్తానంటే?నిఖిల్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి అద్దె ఇంట్లో ఉంటున్నా.. అమ్మానాన్నలకు ఓ ఇల్లు కట్టాలి. ఇప్పటిదాకా నాకోసం ఎంతో ఖర్చుపెట్టిన మా అన్న, తమ్ముడి కోసం ఈ డబ్బు ఉపయోగిస్తాను అన్నాడు. గౌతమ్.. మా అమ్మానాన్న రిటైర్మెంట్ కోసం ప్రైజ్మనీ వాడతాను. అలాగే గంగవ్వ తన కూతురికి కట్టివ్వాలనుకున్న ఇంటి కోసం రూ.10 లక్షలు ఇద్దామనుకుంటున్నాను అని తెలిపాడు.మీ వాడిగా స్వీకరించారు: నిఖిల్అనంతరం నాగార్జున నిఖిల్ను సెకండ్ ఫైనలిస్ట్గా ప్రకటించాడు. ఈ సందర్భంగా నిఖిల్.. నేను ఆర్టిస్టుగా ఇక్కడికి వచ్చినప్పుడు బయటివాడిని అని కామెంట్స్ చేశారు. కానీ మీరు అది తప్పని రుజువు చేశారు. నన్ను మీ వాడిగా స్వీకరించారు అని ఎమోషనలయ్యాడు. మూడో ఫైనలిస్ట్గా గౌతమ్ను ప్రకటించాడు. నాలుగో ఫైనలిస్ట్గా ప్రేరణను ప్రకటించగానే ఆమె షాకై, ఆ వెంటనే సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది.నిఖిల్కు ముద్దుపెట్టిన గౌతమ్ఈ సీజన్లో ఎవరికైనా థాంక్యూ, సారీ చెప్పాలనుకుంటే చెప్పేయమన్నాడు నాగ్. విష్ణుప్రియ.. తనతో స్నేహం చేసిన సీతకు థాంక్యూ.. తెలిసీతెలియకుండా కొన్నిసార్లు బాధపెట్టినందుకు రోహిణికి సారీ చెప్పింది. నబీల్.. ఏదున్నా మణికంఠకు షేర్తో చేసుకునేవాడినంటూ అతడికి థాంక్యూ.. ప్రేరణను నామినేట్ చేసినందుకు సారీ చెప్పాడు. నిఖిల్.. నేనెలా ఉన్నానో అలాగే యాక్సెప్ట్ చేసినందుకు పృథ్వీకి థ్యాంక్స్.. గౌతమ్పై నోరు జారినందుకు క్షమించమన్నాడు. ఈ సందర్భంగా గౌతమ్.. నిఖిల్కు బుగ్గపై ముద్దు పెట్టాడు.థాంక్స్, సారీ.. రెండూ నిఖిల్కు చెప్పిన గౌతమ్అవినాష్.. ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చిన నబీల్కు థాంక్స్.. నా ఫ్రెండ్ అయిన విష్ణును నామినేట్ చేసినందుకు సారీ అన్నాడు. గౌతమ్ వంతు రాగా.. ఇప్పటివరకు జరిగిన అన్నింటికీ సారీ అంటూ నిఖిల్ను హత్తుకున్నాడు. అలాగే అందరికీ వండిపెట్టినందుకు అతడికి థాంక్యూ చెప్పాడు. ప్రేరణ.. ప్రతీది నబీల్కు చెప్పుకుంటానని అతడికి థాంక్యూ చెప్పింది. విష్ణుపై నోరు జారినందుకు క్షమాపణలు తెలిపింది. చివరగా నాగ్.. నబీల్ను ఐదో ఫైనలిస్ట్గా పేర్కొంటూ విష్ణు ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు.గౌతమ్పై విష్ణు సెటైర్లుఎప్పుడూ గ్రహాలు అంటూ వేదాంతం మాట్లాడే విష్ణుతో అందుకు సంబంధించిన గేమ్ ఆడించాడు నాగ్. ట్రోఫీ అనే సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం/ కంటెస్టెంట్ ఎవరో చెప్పాలన్నాడు. దీంతో విష్ణు.. గౌతమ్ ఆట ఇప్పటికీ తెలియట్లేదు.. అర్జంట్గా నువ్వేం ఆడావో చూసేయాలంటూ అతడిని ఐదో స్థానంలో పెట్టింది. అవినాష్ను నాలుగు, నబీల్ను మూడో స్థానంలో ఉంచింది. ప్రేరణ గెలవాలంటూనే ఆమెను రెండో స్థానంలో పెట్టింది.డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలేట్రోఫీకి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం నిఖిల్ అంటూ అతడికి విన్నర్ స్థానంలో కూర్చోబెట్టింది. ఈ పిచ్చిపిల్లను, నత్తిబుర్రను ఇన్నాళ్లు భరించినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ వీడ్కోలు తీసుకుంది. వచ్చేవారమే గ్రాండ్ ఫినాలే అని ప్రకటించిన నాగార్జున.. ఎపిసోడ్ అయిపోయిన క్షణం నుంచి శుక్రవారం వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయన్నాడు. మరి నబీల్, ప్రేరణ, నిఖిల్, గౌతమ్, అవినాష్లలో ఎవరు గెలవాలనుకుంటున్నారో వారికి ఓట్లు వేసేయండి.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విన్నర్ ప్రైజ్మనీ కంటే ఎక్కువే సంపాదించిన విష్ణు!
బిగ్బాస్ షో ప్రారంభమైన ప్రతిసారి జనాల్లో మెదిలే ప్రశ్న.. ఈసారైనా లేడీ కంటెస్టెంట్ గెలుస్తారా? అని! ఈ సీజన్లోనూ ఆ చర్చ జరిగింది. భారీ ఫ్యాన్ బేస్తో హౌస్లో అడుగుపెట్టిన విష్ణుప్రియకు ట్రోఫీ గెలిచే అవకాశం పుష్కలంగా ఉండేది. కానీ తన ఆటను చెడగొట్టుకోవడానికి ఎవరూ అక్కర్లేదు, తాను చాలు అన్నట్లే ప్రవర్తించింది.స్వచ్ఛతకు మారుపేరు విష్ణుగేమ్పై కాకుండా పృథ్వీపై ఫోకస్ చేసింది. తనకంట కూడా అతడే ఎక్కువ అని బాహాటంగానే ప్రకటించింది. భూతద్దం వేసి వెతికినా ఎక్కడా తనలో గెలవాలన్న కసి కనిపించలేదు. పృథ్వీ ఎలిమినేట్ అయ్యాక ఆటలో యాక్టివ్ అయింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఆమె నిర్మొహమాటంగా, నిజాయితీగా వ్యవహరించే తీరు మాత్రం జనాలకు బాగా నచ్చేసింది.విన్నర్ కంటే ఎక్కువ సంపాదనకానీ టైటిల్ గెలవాలంటే ఆ ఒక్కటే ఉంటే సరిపోదు కదా! లేడీ విన్నర్ అవాలనుందన్న విష్ణు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ఫలితంగా పద్నాలుగోవారం ఎలిమినేట్ అయింది. అయితే విన్నర్ కంటే ఎక్కువ సంపాదించేసింది. వారానికి సుమారు రూ.4 లక్షల చొప్పున పారితోషికం తీసుకుంటున్న ఈమె పద్నాలుగువారాలకు గానూ రూ.56 లక్షలు వెనకేసిందట! అంటే విన్నర్ ప్రైజ్మనీ కంటే కూడా విష్ణు ఎక్కువే సంపాదించింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
25 ఏళ్ల తర్వాత ఇండియాకు.. అందుకోసమే వచ్చానన్న హీరోయిన్
సెన్సేషనల్ హీరోయిన్ మమత కులకర్ణి రెండున్నర దశాబ్దాల తర్వాత సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వనుందన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఆమె ముంబైకి తిరిగి రావడంతో ఈ పుకారుకు బీజం పడింది. ఇన్నేళ్ల తర్వాత తన మాతృభూమిపై అడుగుపెట్టినందుకు మమత భావోద్వేగానికి లోనైంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది.అందుకోసమైతే రాలేదు25 ఏళ్ల తర్వాత నా దేశంలోకి తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉంది. నా భావోద్వేగాలను వర్ణించలేకున్నాను అని చెప్పుకొచ్చింది. అలాగే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా చేతిలో 40 సినిమాలు, మూడు ఫ్లాట్స్, నాలుగు కార్లు, 50 ఈవెంట్స్ ఉన్న సమయంలో అన్నింటినీ వదిలేశాను. ఇప్పుడు నేను బాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వడానికో, బిగ్బాస్లో పాల్గొనేందుకో రాలేదు. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించేందుకే వచ్చాను అని పేర్కొంది.డ్రగ్స్ కేసులో క్లీన్చిట్కాగా మమత కులకర్ణి గతంలో రూ.200 కోట్ల డ్రగ్స్ రాకెట్ కేసులో ఇరుక్కుంది. మమత ఏ తప్పూ చేయలేదంటూ బాంబే హైకోర్టు గత ఆగస్టులో క్లీన్ చిట్ ఇచ్చింది. 2016లో తనపై నమోదైన డ్రగ్స్ స్మగ్లింగ్ కేసును కొట్టివేసింది. వక్త్ హమారా హై, క్రాంతివీర్, సబ్సే బడా ఖిలాడి, బాజీ, కరణ్ అర్జున్, దిల్బర్, కిస్మత్, నజీబ్ వంటి చిత్రాలతో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ప్రేమశిఖరం, దొంగ పోలీస్ చిత్రాల్లో కథానాయికగా నటించింది. View this post on Instagram A post shared by Mamta Kulkarni 🔵 (@mamtakulkarniofficial____) చదవండి: సుష్మిత కుటుంబానికి నేనున్నా.. ఏ అవసరం వచ్చినా.: నటుడు -
నిఖిల్ను గెలిపించేందుకు బిగ్బాస్ టీమ్ రెడీ?
బిగ్బాస్ విన్నర్ను ప్రేక్షకుల ఓట్ల ఆధారంగానే నిర్ణయిస్తారా? అంటే సమాధానం చెప్పడానికి కొంత తడబడాల్సిందే! ఎందుకంటే బిగ్బాస్ అంటేనే స్క్రిప్టెడ్ షో అన్న పేరుంది. గొడవలు, కలిసిపోవడాలు, లవ్ ట్రాక్స్.. ఇలా అన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతాయన్న అపవాదు ఎప్పుడూ ఉండనే ఉంది. ఎవరికి ట్రోఫీ?ఇది నిజమేనని కొందరు, వంద రోజులు అందర్నీ ఒకే ఇంట్లో పడేస్తే కొట్టుకోకుండా ఇంకేం చేస్తారని మరికొందరు.. ఇలా ఎవరి అభిప్రాయాలు వారివి! మరి విన్నర్ను ప్రేక్షకులు డిసైడ్ చేస్తారా? లేదా మేనేజ్మెంట్ ఆల్రెడీ ఫిక్సయిన వ్యక్తికే ట్రోఫీ ఇచ్చేస్తారా?.. నటుడు, బిగ్బాస్ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ దీనికి సమాధానం చెప్పాడు.గౌతమ్ గెలిచే అవకాశం లేదటతాజాగా ఓ ఇంటర్వ్యూలో అఖిల్ మాట్లాడుతూ.. ఇది పెద్ద వివాదం అవుతుందేమో! జెన్యున్గా చెప్పాలంటే నాకైతే గౌతమ్ ఈ షో గెలిస్తే బాగుంటుందనిపిస్తోంది. అయితే బిగ్బాస్ టీమ్లో కొందరు నాకు తెలుసు.. వాళ్లు చెప్పినదాని ప్రకారం గౌతమ్ గెలిచే అవకాశం లేదని టాక్. నిఖిల్ గెలుస్తాడని చెప్తున్నారు. కష్టపడిన వాడే గెలుస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే గత సీజన్కు, ఇప్పటికి గౌతమ్ చాలా మెచ్యూరిటీ వచ్చింది అని అఖిల్ పేర్కొన్నాడు.ఈ మాత్రం దానికి ఓట్లు ఎందుకు?ఇప్పుడీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. విజేత ఎవరనేది బిగ్బాస్ యాజమాన్యం ముందుగానే డిసైడ్ చేస్తే ఇంక మమ్మల్ని ఎందుకు ఓట్లు వేయమని అడగడం? అని బిగ్బాస్ ప్రియుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్ చరిత్రలో నిలిచిపోనున్న విష్ణుప్రియ
అవినాష్, రోహిణికి మంచి టాలెంట్ ఉంది.. నవ్వించడమే కాకుండా టాస్కుల్లోనూ సత్తా చాటారు. ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు తమ సాయశక్తులా ప్రయత్నించారు. అందులో సఫలమయ్యారు కూడా! కానీ ఓట్లు రాబట్టుకోవడంలోనే విఫలమయ్యారు. అయినా నబీల్ సాధించిన ఎవిక్షన్ షీల్డ్ సాయంతో అవినాష్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. తర్వాత గట్టిగా ఆడి టికెట్ టు ఫినాలే కొట్టాడు.టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్కానీ రోహిణికి అలాంటి అవకాశం లేకుండా పోయింది. ఎంత గట్టిగా ఆడినా తొలిసారి నామినేషన్స్లోకి రావడంతో ఆమెకు పెద్దగా ఓట్లు రాలేదు, ఫలితంగా ఎలిమినేట్ అయిపోయింది. నేడు మరో టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతోంది. ఆమె ఎవరో కాదు విష్ణుప్రియ. ఈమెకు విపరీతమైన ఫ్యాన్బేస్ ఉంది. తన నిజాయితీకి ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. మోస్ట్ జెన్యున్ పర్సన్కానీ గెలవాలన్న కసి తనలో లేకపోవడం, పృథ్వీ మైకంలో మునగడంతో విన్నర్ అయ్యేంత దమ్మున్న ఈ లేడీ కంటెస్టెంట్ ఈ రోజు బిగ్బాస్ హౌస్ను వీడనుంది. చుట్టూ కెమెరాలున్నాయని ఆలోచించకుండా తన మనసుకు ఏదనిపిస్తే అది మాట్లాడేది. హోస్ట్ నాగార్జునతో మోస్ట్ జెన్యున్ పర్సన్ అని కితాబు అందుకుంది. నిజమే.. బిగ్బాస్ చరిత్రలోనే అత్యంత నిజాయితీగా, ఎలాంటి ముసుగు వేసుకోని కంటెస్టెంట్గా విష్ణు నిలిచిపోనుంది. వారమంతా ఎలా ఉన్నా వీకెండ్లో మాత్రం దుమ్ముదులిపే విష్ణు.. హౌస్లో చివరి ఫన్ టాస్క్నూ హుషారుగా పాల్గొంది. ఈమేరకు ప్రోమో రిలీజైంది. ఏదేమైనా ఈ సీజన్లో లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ను విష్ణు చేజేతులా పోగొట్టుకుంది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గౌతమ్కు హ్యాట్సాఫ్ చెప్తూ.. నిఖిల్ను విలన్ చేసిన రోహిణి
ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉందంటూ నాగార్జున బాంబు పేల్చాడు. వచ్చేవారం ఫినాలే జరగబోతుందని తెలిపాడు. ఇక ఇన్నివారాల ప్రయాణంలో ఏ విషయంలో రిగ్రెట్ ఫీలయ్యారు? అది ఏ వారమో చెప్పాలన్నాడు నాగ్. మరి ఎవరెవరు ఏమేం చెప్పారో నేటి (డిసెంబర్ 7) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..మెగా చీఫ్ నా కొంప ముంచిందిమొదటగా అవినాష్.. 12వ వారంలో నేను మెగా చీఫ్గా ఉన్నప్పుడు విష్ణు, రోహిణి మధ్య గొడవను పరిష్కరించలేకపోయానన్నాడు. ప్రేరణ.. పదకొండోవారంలో నేను మెగా చీఫ్గా ఉన్నప్పుడు సాఫ్ట్గా ఉండాల్సింది. కానీ బ్యాలెన్స్ కోల్పోయాను. దానివల్ల నాకు, హౌస్మేట్స్కు ఎఫెక్ట్ అయిందని చెప్పుకొచ్చింది. నబీల్.. తొమ్మిదో వారంలో మెగా చీఫ్ అయ్యే ఛాన్స్ వచ్చింది. కానీ, ఏదో బాధలో ఉండటంతో ఆ అవకాశాన్ని ఈజీగా వదిలేసుకుని తప్పు చేశానన్నాడు. ఎందుకంత తుత్తర? ఈ సందర్భంగా నాగ్.. టాస్కులు సరిగా పూర్తిచేయకముందే ఎందుకు గంట కొడతావ్? ఎందుకంత తుత్తర? అని ప్రశ్నించాడు. అలాగే ఫైనలిస్ట్ అవడానికి చెక్పై రూ.15 లక్షలు రాసి, దాన్నెందుకు చించేశావని సూటిగా అడిగాడు. మొదట నా స్వార్థం కొద్దీ రాశాను కానీ తర్వాత మనసొప్పకపోవడంతో దాన్ని చింపేశానని తెలిపాడు. రోహిణి వంతురాగా పదోవారం ఎవిక్షన్ షీల్డ్ గేమ్లో అవినాష్ గుడ్డు పాము నోట్లో వేసినందుకు ఎన్నోసార్లు బాధపడ్డానంది. పృథ్వీతో ఫ్లర్ట్ చేశావిష్ణుప్రియ వంతురాగా.. పృథ్వీతో ఫ్లర్ట్ చేయడం వల్ల అతడి గేమ్ ఏమైనా ఎఫెక్ట్ అయిందేమోనని బాధపడుతున్నాను. అలాగే తొమ్మిదో వారంలో నేను చీఫ్ అయినప్పుడు ఐదుగుర్ని నామినేట్ చేయమన్నారు. అప్పుడు నబీల్ను నామినేట్ చేసినందుకు రిగ్రెట్ అయ్యానంది. గౌతమ్.. ఆరో వారంలో కామెడీ టాస్క్లో నన్ను అశ్వత్థామ అన్నందుకు ఫీలయ్యాను. అది నామినేషన్స్ దాకా వెళ్లింది. అక్కడ ఫీలయ్యాను అని చెప్పాడు. సారీ చెప్పాలి కదా!ఈ సందర్భంగా నిఖిల్తో గొడవ గురించి అడిగాడు నాగ్. నా క్యారెక్టర్ గురించి తప్పుగా అనడంతో నేనూ నోరు జారానన్నాడు. వాడుకున్నావ్ అనేది ఎంత పెద్ద మాటో తెలుసా? అని నాగ్ చెప్తుంటే గౌతమ్.. తాను చేసింది తప్పని, కానీ వేరే ఉద్దేశంలో అనలేదన్నాడు. తప్పు ఎలా చేసినా తప్పే.. మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి కదా అని క్లాస్ పీకడంతో గౌతమ్ మరోసారి నిఖిల్ను అందరి ముందు క్షమాపణలు కోరాడు.వీడియోతో క్లారిటీనిఖిల్ వంతు రాగా.. ఎన్నడూ నోరు జారని నేను పద్నాలుగోవారంలో గౌతమ్పై నోరు పారేసుకున్నందుకు రిగ్రెట్ అవుతున్నానన్నాడు. రంగుపడుద్ది టాస్క్లో గౌతమ్ నిఖిల్ను కావాలని కొట్టాడా? లేదా? అనేది వీడియో ప్లే చేసి చూపించాడు. అది అనుకోకుండా తగిలిందని క్లారిటీ రావడంతో నిఖిల్ సైతం అతడికి సారీ చెప్పాడు. తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారో అవిష్ను గెస్ చేయమన్నాడు నాగ్. అవినాష్ ఊహించిందే నిజమైందిఫస్ట్ టైమ్ నామినేషన్స్కు రావడం పెద్ద మైనస్.. కాబట్టి రోహిణి ఎలిమినేట్ అవుతుందని అంచనా వేశాడు. అతడు చెప్పిందే నిజమైంది. రోహిణి ఎలిమినేట్ అయింది. అయితే హౌస్లో ఆమె మాటతీరు, ఆటతీరును ప్రశంసిసిస్తూ చప్పట్లు కొట్టి, సెల్యూట్ చేసి మరీ సెండాఫ్ ఇచ్చారు. స్టేజీపైకి వచ్చిన రోహిణి.. అవినాష్, గౌతమ్, ప్రేరణను హీరోలుగా పేర్కొంది. ఆ ముగ్గురు హీరోలు: రోహిణిగౌతమ్తో.. వైల్డ్ కార్డ్గా వచ్చిన మొదటివారమే ఎలిమినేషన్ అంచుల దాకా వెళ్లొచ్చావ్.. అలా ఎందుకు జరిగిందన్న ఆలోచనతో ఆ తర్వాతి వారం నుంచి నువ్వు ఆడిన విధానానికి హ్యాట్సాఫ్. సోలో.. సోలో అంటూ ఫైనల్కు వచ్చేశావ్.. ఫ్రెండ్స్తో ఉండటం తప్పేం కాదు, అందరికీ కాసేపు సమయం కేటాయించు సలహా ఇచ్చింది. విష్ణు, నబీల్, నిఖిల్ను విలన్లుగా పేర్కొంది. ట్రోఫీ గెలవకపోయినా రోహిణి సగర్వంగా విన్నర్లా బయటకు వెళ్లిపోయింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రోహిణితో పాటు విష్ణుప్రియ అవుట్.. ఆ తప్పిదం వల్లే ఎలిమినేట్!
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ కథ సుఖాంతం కాబోతోంది. వచ్చేవారం గ్రాండ్ ఫినాలే జరగనుంది. గౌతమ్, నిఖిల్ మధ్యే బలమైన పోటీ నెలకొంది. వైల్డ్ కార్డ్గా వచ్చిన గౌతమ్ విన్నర్ రేసులో ఉంటే అవినాష్ టికెట్ టు ఫినాలే సాయంతో ఏకంగా అందరికంటే ముందు ఫైనలిస్ట్ అయ్యాడు.రోహిణి ఎలిమినేట్అటు నవ్వులు పూయిస్తూ, ఇటు టాస్కులు ఆడుతూ సత్తా చాటిన రోహిణి బలమైన ఫ్యాన్ బేస్ లేక ఈ వారం ఎలిమినేట్ అవక తప్పలేదు. అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగ్ ఆల్రెడీ ప్రోమోలో హింటిచ్చేడు. అంటే రోహిణితో పాటు మరొకరు కూడా హౌస్ను వీడారు. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు విష్ణుప్రియ. తప్పయినా, ఒప్పయినా తనకు నచ్చింది చేసుకుంటూ పోయిన ఆమె స్వభావాన్ని జనాలు ఇష్టపడ్డారు. జరగాల్సిన నష్టం జరిగిపోయిందికానీ పృథ్వీ పట్టించుకోకున్నా అతడి వెంటపడటమే ప్రేక్షకులకు మింగుడుపడలేదు. లవ్ ట్రాక్పై పెట్టిన శ్రద్ధ గేమ్స్పై పెట్టలేదు. పృథ్వీ వెళ్లిపోయాకే బలంగా ఆడటం మొదలుపెట్టింది. కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. ఆ ఫైరేదో ముందు నుంచి ఆటలో చూపించి ఉంటే ఈ సీజన్ విన్నర్ అయ్యేది. స్వయంకృతపరాధం వల్ల ఫైనల్స్కు వెళ్లకుండానే ఎలిమినేట్ అయింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రోహిణి ఎలిమినేట్.. తప్పు ఒప్పుకొన్న ప్రేరణ
బిగ్బాస్ 8 ముగింపుకు ముహూర్తం పెట్టేసినట్లు నాగార్జునే స్వయంగా చెప్పాడు. ప్రస్తుతం హౌస్లో ఏడుగురు ఉండగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్తో ఇద్దర్ని పంపించేస్తున్నట్లు తెలిపాడు. ఈ పద్నాలుగు వారాల జర్నీలో మీరు రిగ్రెట్ ఫీలైన వారమేంటో చెప్పాలన్నాడు. అందుకు ప్రేరణ పదకొండో వారం అని చెప్పింది. మెగా చీఫ్ అయినప్పుడు సాఫ్ట్గా ఉండాల్సింది. కానీ బ్యాలెన్స్ కోల్పోయానని తప్పు ఒప్పేసుకుంది. సంచాలక్గా బాగా చేశావా?నిజమే, అప్పటిదాకా ప్రేరణ గ్రాఫ్ రయ్యిమని పైకెళ్లింది. కానీ మెగా చీఫ్ అయిన వెంటనే తన డౌన్ఫాల్ మొదలైంది. ఇక నిన్నటి రంగుపడుద్ది టాస్క్లో సంచాలక్గా బాగా చేశావని అనుకుంటున్నావా? అని నాగ్ ప్రశ్నించగా లేదంటూ నిజం ఒప్పేసుకుంది. మరోవైపు పోల్కు సరిగా తాడు చుట్టాల్సిన గేమ్లో నబీల్ ఇష్టమొచ్చినట్లు తాడును కట్టి తానే గెలిచానని వాదించాడు. అప్పుడు స్వయంగా బిగ్బాసే కలగజేసుకుని అది చుట్టడమా? అని కౌంటర్ ఇచ్చాడు. స్వార్థంగా ఆలోచించా..ఇప్పుడు నాగ్ కూడా సరిగ్గా చుట్టడమేంటో ఏంటో తెలుసా? అంటూ అతడికి క్లాస్ పీకాడు. నీ తిత్తర ఎప్పుడు తగ్గుతుంది? అని ప్రశ్నించాడు.ఫైనలిస్ట్ అవడం కోసం చెక్పై రూ.15 లక్షలు రాశావు, అలాంటప్పుడు దాన్ని ఎందుకు చించేశావని అడిగాడు. కొంచెం సెల్ఫిష్గా ఉందామనే రాశా.. కానీ తర్వాత మరీ ఎక్కువ డబ్బు రాసేశాననిపించింది అని తెలిపాడు. డబుల్ ఎలిమినేషన్సెల్ఫిష్గా ఉండి గేమ్ సరిగా ఆడకపోతే ఎవరూ గెలవలేరన్నాడు నాగ్. అలాగే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందన్నాడు. ఇప్పటికే శనివారం షూటింగ్ పూర్తవగా అందులో రోహిణిని ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇంకో ఎలిమినేషన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నా కుమారుడి కోసం సిగ్గు విడిచి డబ్బులడిగా..: కమెడియన్
సామాన్యులకైనా, సెలబ్రిటీలకైనా కష్టాలు తప్పవు. బిగ్బాస్ కంటెస్టెంట్, కమెడియన్ మునావర్ ఫరూఖి తన జీవితంలో ఎదుర్కొన్న ఓ పెద్ద సమస్యను తాజా ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. మునావర్ మాట్లాడుతూ.. నా కొడుడు మైఖేల్కు ఏడాదిన్నర వయసున్నప్పుడు కవసాకి అనే అరుదైన వ్యాధి సోకింది. దీనివల్ల రక్తనాళాల్లో వాపు ఏర్పడుతుంది. అరగంటపాటు షాక్లోఅలాగే గుండెకు సైతం హాని జరిగే ప్రమాదం ఉంది. వాడి పరిస్థితి గురించి చెప్పగానే అరగంటపాటు షాక్లో ఉండిపోయాను. ఒక్కో ఇంజక్షన్ ధర రూ.25,000 ఉంటుందన్నారు. నా దగ్గర చూస్తే రూ.700 మాత్రమే ఉన్నాయి. నా గర్వాన్ని పక్కనపెట్టి ముంబై వెళ్లా.. అందరి దగ్గరా చేతులు చాచి సాయమడిగాను. ట్రీట్మెంట్కు అవసరమైన డబ్బును మూడుగంటల్లో సమకూర్చి హాస్పిటల్లో కట్టేశాను. కానీ ఆ డబ్బు సేకరించడం కోసం పడ్డ కష్టం, వేదన మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను.నా ముఖంలో సంతోషం లేదుఅలాగే హాస్పిటల్లో డబ్బు కట్టేశాక కూడా నా ముఖంలో సంతోషం లేదు. ఎందుకంటే అది నా డబ్బు కాదు కదా! ఆరోజే ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆరోజే నిర్ణయించుకున్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా మునావర్ గతంలో జాస్మిన్ను పెళ్లాడాడు. వీరికి పుట్టిన సంతానమే మైఖేల్. ఇటీవలే మునావర్.. మెజబీన్ కోట్వాలా అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు.చదవండి: పెళ్లిలో డ్యాన్స్.. షారూఖ్ ఎంత తీసుకున్నాడేంటి? -
బిగ్బాస్ 8లో చివరి ఎలిమినేషన్.. ఆమెపై వేటు!
బిగ్బాస్ 8 తెలుగు సీజన్ చివరికొచ్చేసింది. తర్వాత వారంలో ఫినాలే జరగబోతుంది. దీంతో ఈ వీకెండ్ జరగబోయే ఎలిమినేషన్ చివరిది. దీంతో ఎవరు బయటకెళ్లిపోతారా అని ప్రస్తుతం సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ప్రస్తుతం హౌసులోని పరిస్థితుల ప్రకారం ఇద్దరమ్మాయిలు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్లలో ఒకరైనా స్టార్ కంటెస్టెంట్ ఈసారి ఎగ్జిట్ పక్కా అని అంటున్నారు.ఈ వారమంతా హౌసులో విభిన్న రంగాలకు చెందిన పలువురు వ్యక్తులు వచ్చి, హౌసులోని సభ్యులతో కాసేపు ముచ్చట్లు పెట్టి వెళ్లిపోయారు. ఈ వారం అవినాష్ తప్పితే మిగిలిన ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. వీరిలో నిఖిల్, గౌతమ్ ఏకంగా టైటిల్ రేసులో ఉన్నారు కాబట్టి వీళ్లిద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదు. ప్రేరణ కూడా టాప్-5 రేసులో ఉంది. దీంతో ఈమె కూడా బయటకెళ్లకపోవచ్చు.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ పెళ్లి టాపిక్.. తండ్రి ఏమన్నారంటే?)వీళ్లు కాకుండా అంటే నబీల్, విష్ణుప్రియ, రోహిణి ఉంటారు. కొన్నాళ్ల ముందు వరకు చాలా బ్యాలెన్స్గా గేమ్ ఆడుతూ వచ్చిన నబీల్.. ఈ మధ్య కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అయితేనేం టాప్-5కి నబీల్ అర్హుడే అనిపిస్తుంది. ఓటింగ్ పరంగానూ ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే చివరి రెండు స్థానాల్లో రోహిణి, విష్ణుప్రియ ఉన్నారు.పృథ్వీతో లవ్వాట తప్పితే విష్ణుప్రియ.. ఈ సీజన్ అంతా అంతంత మాత్రంగానే ఫెర్ఫార్మెన్స్ చేస్తూ వస్తోంది. ఈమెతో పోలిస్తే ఎంటర్టైన్, గేమ్స్ పరంగా రోహిణి చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఓటింగ్ పరంగా చూసుకుంటే రోహిణి వెళ్లిపోయే అవకాశాలే ఎక్కువ. అదే గేమ్ లెక్కల బయటకు తీస్తే మాత్రం విష్ణుప్రియ.. ఈ వారం ఎగ్జిట్ అయిపోవడం గ్యారంటీ. లేదంటే బిగ్బాస్.. గతవారం తేజ, పృథ్వీని పంపినట్లు డబుల్ ఎలిమినేషన్ ఏమైనా ప్లాన్ చేసాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పుష్ప2' టికెట్ల ధరలు తగ్గనున్నాయా.. కారణం ఇదేనా..?) -
మీ ఇంటిబిడ్డగా అడుగుతున్నా, గెలిపించండి: నిఖిల్
చివరి ఓటు అప్పీల్ ఛాన్స్ పొందేందుకు గౌతమ్, నిఖిల్ హోరాహోరీగా ఆడారు. అటు ఓంకార్ హౌస్లోకి వచ్చి తన ఇస్మార్ట్ జోడీకోసం ఓ జంటను బుక్ చేసుకుని వెళ్లాడు. మరి మౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (డిసెంబర్ 6) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..రంగు పడుద్దిగత వీకెండ్లో గోల్డెన్ టికెట్ పొందిన నిఖిల్, రోహిణి, గౌతమ్కు ఓట్ అప్పీల్ గేమ్లో పాల్గొనేందుకు చివరి ఛాన్స్ ఇచ్చాడు. ముందుగా కేక్ గేమ్ పెట్టాడు. కేక్పై ఉన్న ఎనిమిది నెంబర్ కిందపడకుండా కేక్ కట్ చేయాలన్నాడు. ఈ ఆటలో రోహిణి ఓడిపోయింది. నిఖిల్, గౌతమ్కు రంగుపడుద్ది అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ప్రత్యర్థి టీ షర్ట్పై ఎవరు ఎక్కువ రంగు పూస్తే వారే విజేతగా నిలుస్తారు. ఈ గేమ్లో కొట్టుకుంటూ తోసుకుంటూ, లాగుతూ, ఈడడ్చుకెళ్తూ భీకరంగా ఆడారు.కొట్టుకున్న గౌతమ్, నిఖిల్మొదటి రౌండ్లో గౌతమ్ గెలిచాడు. రెండో రౌండ్ అయిపోయేసరికి గౌతమ్ కొడుతున్నాడని నిఖిల్ ఆరోపించాడు. నేను కావాలని కొట్టలేదు, నీకు తగిలిందనగానే సారీ చెప్పాను. మరి నువ్వు నన్ను లాక్కెళ్లలేదా? అని ప్రశ్నించాడు. పక్కకెళ్లి కూసోబే అని నిఖిల్ అనడంతో గౌతమ్.. బే అని ఎవడ్ని అంటున్నావ్? ఎక్కువ తక్కువ మాట్లాడకు అని మండిపడ్డాడు. ఆడే విధానం తెలియదు, ముఖం మీద కొట్టావ్.. అని నిఖిల్ రెచ్చిపోయి మాట్లాడుతూనే ఉన్నాడు. నలిగిపోయిన ప్రేరణవీళ్లిద్దరికీ సర్ది చెప్పలేక సంచాలకురాలు ప్రేరణ మధ్యలో నలిగిపోయింది. మొన్న నేను నోరు జారినప్పుడు హౌస్ అందరూ నన్ను తప్పని వేలెత్తి చూపారు.. మరి ఇప్పుడు నిఖిల్ నోరు జారితే ఎవరూ ఎందుకు స్పందించట్లేదని గౌతమ్ హౌస్మేట్స్ను ప్రశ్నించాడు. అందుకు వాళ్లు.. అమ్మాయిని వాడుకుంటున్నావ్? అనడం చాలా పెద్ద తప్పు కాబట్టే ఆరోజు మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఇకపోతే రెండు, మూడవ రౌండ్స్లో నిఖిల్ గెలిచాడు. ఎక్కువ రౌండ్లు నిఖిల్ గెలవడంతో ప్రేక్షకులను ఓట్లు అడిగే చాన్స్ పొందాడు.ఎప్పటికీ రుణపడి ఉంటానిఖిల్ మాట్లాడుతూ.. ఇన్నివారాలు నన్ను సేవ్ చేసినందుకు థాంక్యూ.. నేనెంతో కష్టపడ్డా.. మీరూ అంతే ఇష్టపడి నన్ను సేవ్ చేశారు. నేను విజేత అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకోసం ఇంకా ఎంతైనా కష్టపడతాను. ఈ ఒక్కసారి మీ నిఖిల్ను గెలిపించండి. ఇప్పటికీ, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. తెలిసో తెలియక తప్పులు చేశాను. అందుకు నన్ను క్షమించండి. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ నిఖిల్ ఒకేలా ఉంటాడు. ఓటు వేయండిమీ ప్రేమాభిమానాలు కూడా ఎప్పటికీ ఇలాగే ఉంటాయని నా గట్టి నమ్మకం. ఈ షో గెలవాలంటే మీ ఓట్లు కావాలి. తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను మీ ఇంటిబిడ్డగా భావించి ఓటు వేయమని కోరుతున్నాను అని అభ్యర్థించాడు. తర్వాత యాంకర్ ఓంకార్ హౌస్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇస్మార్ట్ జోడీ మూడో సీజన్ రాబోతుందంటూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. తర్వాత అతడు కంటెస్టెంట్లతో చిన్న గేమ్ ఆడించాడు. నీ పార్ట్నర్ కోసం నీలో ఏ లక్షణాన్ని దూరం చేస్తావని అడగ్గా నిఖిల్ తన చిరాకును వదిలేస్తానన్నాడు. బిగ్బాస్ ఇస్మార్ట్ జోడీతర్వాత అందర్నీ జంటలుగా విడగొట్టి డ్యాన్సులు చేయించాడు. అయితే వీళ్లందరూ పేపర్ పైన స్టెప్పులేయాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్కు ఆ పేపర్ సైజ్ను తగ్గిస్తూ ఉంటారు. పేపర్ దాటి అడుగు బయట పెట్టిన జంట అవుట్.. అలా మొదటి రౌండ్లో గౌతమ్-రోహిణి అవుట్ కాగా తర్వాత నిఖిల్- విష్ణు ఎలిమినేట్ అయ్యారు. ప్రేరణ నబీల్ను ఎత్తుకుని మరీ డ్యాన్స్ చేసి గెలిచేసింది. పెళ్లి వీడియో చూసుకుని మురిసిపోయిన ప్రేరణనబీల్ తనకు తందూరి చికెన్ బర్గర్+ సాఫ్ట్ డ్రింక్ కావాలని కోరగా.. ప్రేరణ.. తన పెళ్లి వీడియో అందరికీ చూపించాలని ఉందంది. నబీల్ను ఒప్పించి ప్రేరణ తన పెళ్లి వీడియో వచ్చేలా చేసింది. తన పెళ్లి క్షణాలను చూసుకుని ఆమె భావోద్వేగానికి లోనైంది. ఇంతలో ఓంకార్ ట్విస్ట్ ఇచ్చాడు. నీ కోరిక తీర్చినందుకుగాను నువ్వు, నీ భర్తతో ఇస్మార్ట్ జోడీలో తప్పకుండా పాల్గొనాలంటూ మాట తీసుకున్నాడు. అందుకామె సంతోషంగా ఒప్పుకుంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గౌతమ్ను ఈడ్చుకెళ్లిన నిఖిల్.. కావాలని కొడతావంటూ కామెంట్స్
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ముగింపుకు చేరుకుంటున్న సమయంలో నిఖిల్, గౌతమ్ బ్యాలెన్స్ తప్పుతున్నారు. మొన్న గౌతమ్ నోరు జారి.. తన స్థాయిని తనే తగ్గించుకోగా నేడు నిఖిల్ వంతు వచ్చినట్లుంది. ఎదుటివారికి గౌరవం ఇవ్వవు అని గౌతమ్ను తప్పుపట్టే నిఖిల్.. నేడు అతడిని చులకన చేసి మాట్లాడాడు. ఈ మేరకు తాజా ప్రోమో రిలీజైంది.గోల్డెన్ టికెట్ అందుకున్నవారికి ఆఫర్పోయినవారం గోల్డెన్ టికెట్ అందుకున్న నిఖిల్, గౌతమ్, రోహిణిలలో ఒకరికి ఓట్ అప్పీల్ చేసే ఛాన్స్ ఉంటుందన్నాడు బిగ్బాస్. మొదటగా ఈ ముగ్గురికి కేక్ గేమ్ ఇచ్చాడు. ఇందులో రోహిణి ఓడిపోయినట్లు తెలుస్తోంది. మిగిలిన ఇద్దరికి బిగ్బాస్ రంగు పడుద్ది అనే గేమ్ పెట్టాడు. ప్రత్యర్థి టీషర్ట్పై వీలైనంతవరకు రంగు పూయాల్సి ఉంటుంది. ఈ గేమ్లో నిఖిల్, గౌతమ్ పోటాపోటీగా ఆడారు.నిఖిల్ వెకిలి మాటలుగేమ్ అయ్యాక.. గౌతమ్ నన్ను కొట్టాడని నిఖిల్ అన్నాడు. రంగు పూయబోతుంటే తగిలింది.. అలా అంటే నువ్వు నన్ను కిందపడేసి ఈడ్చుకుంటూ పోయావా? లేదా? అని గౌతమ్ ప్రశ్నించాడు. దానికి నిఖిల్ సమాధానమివ్వకుండా పక్కకెళ్లి కూసో బే అని కామెంట్ చేశాడు. బే అని ఎవడ్ని అంటున్నవ్? అంటూ గౌతమ్ సీరియస్ అయ్యాడు.కావాలని కొట్టినా కొడతావునీకు ఆడే విధానం లేదు, నన్ను కొట్టావని మరోసారి ఆరోపించాడు నిఖిల్. గేమ్లో ఎవడైనా కావాలని కొడతాడా? అని గౌతమ్ అంటుంటే కూడా ఎవరికి తెలుసు? నువ్వు కావాలని కొట్టినా కొడతావు అంటూ నిఖిల్ మరింత రెచ్చగొట్టాడు. ఇకపోతే ఈ గేమ్లో నిఖిల్ గెలిచిన ఓట్ అప్పీల్ ఛాన్స్ పొందినట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అవినాష్ త్యాగం వృథా.. విన్నర్ను చేయమంటూ విష్ణు రిక్వెస్ట్
బిగ్బాస్ సీజన్ ఎండింగ్కు వచ్చేసింది. విన్నర్గా గెలిపించమని ప్రేక్షకులను ఓట్లు అడిగే ఛాన్స్ పొందాలంటే తాను పెట్టే టాస్కులు గెలవాలన్నాడు బిగ్బాస్. అలా మొన్న ప్రేరణ, నిన్న నబీల్, నేడు విష్ణుప్రియ ఓట్ అప్పీల్ ఛాన్స్ పొందరు. ఆమె ఎలా గెలిచింది? ఏం మాట్లాడిందన్నది నేటి (డిసెంబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..అదరగొట్టిన గౌతమ్బిగ్బాస్ ఈ రోజు మొదటగా పవర్ ఫ్లాగ్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు. బజర్ మోగినప్పుడు ఫ్లాగ్ పట్టుకున్నవారు ఆ రౌండ్లో ఒకరిని ఛాలెంజ్ నుంచి తప్పించాల్సి ఉంటుంది. మొదటి రౌండ్లో గౌతమ్ గెలిచి నబీల్ను రేసు నుంచి తప్పించాడు. తర్వాతి రౌండ్లలో కూడా గౌతమ్ ఒక్కడు ఒకవైపు, మిగతా వారంతా మరోవైపు అన్నట్లుగా ఆట కొనసాగింది. గౌతమ్ దగ్గరి నుంచి జెండా లాక్కునేందుకు అందరూ కలిసి ప్రయత్నించినా లాభం లేకపోయింది. అలా మిగతా రెండు రౌండ్లలో గౌతమ్.. ప్రేరణ, నిఖిల్ను తీసేశాడు.గౌతమ్ దూకుడుకు బ్రేక్ వేసిన రోహిణితర్వాతి రౌండ్లో మిగిలినవాళ్లు గౌతమ్ను లాక్ చేశారు. అలా అతడి దగ్గరి నుంచి రోహిణి జెండా తీసుకుంది. స్ట్రాంగ్ ప్లేయర్ అంటూ గౌతమ్ను రేసులో నుంచి తొలగించింది. అనంతరం అవినాష్.. విష్ణును రౌండ్ నుంచి ఎలిమినేట్ చేశాడు. చివర్లో అవినాష్, రోహిణి మాత్రమే మిగిలారు. స్నేహితురాలిని గెలిపించడం కోసం అవినాష్ జెండా త్యాగం చేయడంతో రోహిణి కంటెండర్గా నిలిచింది. తనకోసం అవినాష్ త్యాగం చేయడంతో ఆమె చిన్నపిల్లలా ఏడ్చేసింది.ఆగమైన సంచాలక్బిగ్బాస్ నిలబెట్టు-పడగొట్టు అనే రెండో ఛాలెంజ్ ఇచ్చాడు. అర్హత లేదనుకున్న వ్యక్తి ఫోటోను వేస్ట్ బాక్స్లో పడేయాలి. ఇందులో అందరూ వారు తెచ్చుకున్న ఫోటోలు పడేయగా గౌతమ్ తాను తీసుకున్న నబీల్ ఫోటో పడేయలేకపోయాడు. దీంతో సంచాలక్ రోహిణి.. నబీల్ను విజేతగా ప్రకటించింది. ఇక్కడే బిగ్బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అందరూ గేమ్ సరిగానే ఆడారా? అని ప్రశ్నించాడు. విష్ణు గెలుపుదీంతో ఆలోచనలో పడ్డ రోహిణి.. టాస్క్ను ప్రేరణ, విష్ణు మినహా ఎవరూ సరిగా ఆడనట్లు గుర్తించింది. చర్చోపచర్చల అనంతరం విష్ణు గెలిచినట్లు తెలిపింది. రోహిణి, విష్ణుప్రియలో ఎవరు ఓట్ అప్పీల్ చేయాలో హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. అవినాష్ మినహా మిగతా అందరూ విష్ణుకు సపోర్ట్ చేయడంతో ఆమె ప్రేక్షకులను ఓట్లు అడిగే అవకాశం పొందింది.మహిళా విజేతగా నిలవాలనుందివిష్ణుప్రియ మాట్లాడుతూ.. ఇప్పటిదాకా వివిధ షోలలో నన్ను చూసి, ఆదరించి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. నన్ను నన్నుగా ప్రేమించి పద్నాలుగువారాల వరకు తీసుకొచ్చినవారికి థ్యాంక్స్. నా ప్రవర్తన నచ్చనివారికి సారీ.. ఇంకా ఒక్కవారమే ఉంది. మీ ప్రేమాభినాలు ఇలాగే కొనసాగించి నన్ను విజేతను చేస్తారని కోరుకుంటున్నాను. వీలైనంతవరకు నిజాయితీగా ఉన్నాను. బిగ్బాస్ చరిత్రలో మహిళా విజేత అవ్వాలన్నది నా కోరిక.. అందుకు మీ సాయం కావాలి. మీ ఓటే నా గెలుపు అని ప్రేక్షకులను ఓట్లు అభ్యర్థించింది.సంగీత కచేరీఇక టాస్కులు ఆడి అలిసిపోయిన కంటెస్టెంట్ల కోసం బిగ్బాస్ ప్రత్యేకంగా సంగీత కచేరీ ఏర్పాటు చేశాడు. జామర్స్ బ్యాండ్ను పిలిచి లైవ్ కన్సర్ట్ ద్వారా వినోదాన్ని పంచాడు. సంగీతంతో హౌస్మేట్స్ తమ బాధలన్నీ మర్చిపోయి రిలాక్స్ అయ్యారు. పాదమెటు పోతున్నా.. అనే ఫ్రెండ్షిప్ పాటకైతే అందరూ కలిసిపోయి డ్యాన్స్ చేయడం కన్నులపండగ్గా ఉంది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నమ్రతతో గొడవపడి బిగ్బాస్కు వచ్చేశా: శిల్ప శిరోద్కర్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు మరదలు శిల్పా శిరోద్కర్ హిందీ బిగ్బాస్ 18వ సీజన్లో పాల్గొంది. రెండు నెలలుగా హౌస్లో కొనసాగుతున్న ఈమె తన సోదరి నమ్రత శిరోద్కర్ను గుర్తు చేసుకుని ఏడ్చేసింది. ఈ మేరకు ఓ ప్రోమో కూడా రిలీజైంది. బిగ్బాస్ హౌస్లోకి బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అతిథిగా విచ్చేశాడు. నీ సోదరి గురించి చెప్పు అని అనురాగ్ అడగ్గానే శిల్ప కన్నీటిపర్యంతమైంది. నమ్రతతో గొడవపడ్డా..శిల్ప మాట్లాడుతూ.. ఈ షోకి వచ్చేముందే నమ్రతకు, నాకు గొడవ జరిగింది. రెండు వారాలు మేమసలు మాట్లాడుకోనేలేదు. తనను నేను చాలా మిస్సవుతున్నాను. నాకోసం తను ఇక్కడికి వస్తుందని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఎపిసోడ్లో సైతం నమ్రతను గుర్తు చేసుకుంది. బిగ్బాస్కు వచ్చేముందు తనను కలిసి గుడ్బై కూడా చెప్పలేదని బాధపడింది. ఫ్యామిలీ వీక్లో అయినా తనను కలవాలని కోరుకుంటున్నట్లు మనసులో మాట బయటపెట్టింది.బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గౌతమ్ ఈజ్ బ్యాక్ అనేలా విజృంభించిన అశ్వత్థామ
గౌతమ్ కృష్ణ.. తిట్టిన నోళ్లతోనే శెభాష్ అనిపించుకున్నాడు. ఇది అందరికీ సాధ్యమవదు. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన గౌతమ్ తొలినాళ్లలో గేమ్తో హడలెత్తించాడు. కానీ రానురానూ డల్ అయ్యాడు. గెలుపును అందుకోవడంలో తడబడ్డాడు. ఇంకేముంది, సరిగ్గా టాస్కులు ఆడట్లేదు, గెలవట్లేదంటూ విమర్శలు మొదలయ్యాయి.ఫ్లాగ్ టాస్క్లో విజృంభించిన గౌతమ్అయితే ఈ రోజు గౌతమ్.. తనను విమర్శిస్తున్నవారి నోళ్లు మూయించనున్నాడు. పవర్ ఫ్లాగ్ అనే గేమ్లో విజృంభించి ఆడాడు. వరుసగా మూడుసార్లు తనే జెండా అందుకుని ప్రేరణ, నబీల్, నిఖిల్ను గేమ్ నుంచి తొలగించాడు. కానీ తర్వాత రోహిణి చేతికి జెండా రావడంతో ఆమె గౌతమ్ను సైడ్ చేసింది. చివర్లో అవినాష్, రోహిణి ఇద్దరు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది.బంపర్ ఆఫర్లు ఇకపోతే బిగ్బాస్ ఈ సీజన్లో హౌస్మేట్స్కు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాడు. నిన్న చెఫ్ సంజయ్తో కడుపునిండా భోజనం పెట్టించగా నేడు సంగీత కచేరి ఏర్పాటు చేశాడు. టాస్కులు ఆడి అలిసిపోయిన కంటెస్టెంట్ల కోసం బ్యాండ్ జామర్స్ను ఇంట్లోకి పంపాడు. వీరు తమ పాటలతో అందరినీ మరో లోకానికి తీసుకెళ్లారు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నబీల్ను తప్పుపట్టిన బిగ్బాస్.. అయినా అతడిదే గెలుపు!
ప్రేరణ ఆటలో గెలిచింది. కానీ సంచాలకురాలిగా మాత్రం తడబడింది. నిన్న ప్రేరణ ఓట్లు అడిగే ఛాన్స్ పొందగా నేడు ఆ అదృష్టం నబీల్ను వరించింది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (డిసెంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..అడ్డదిడ్డంగా చుట్టేసిన నబీల్ఓట్ అప్పీల్ గెలిచేందుకు బిగ్బాస్ క్రాసింగ్ పాత్ అనే మొదటి ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్లో నబీల్ అడ్డదిడ్డంగా తన తాడును పోల్కు చుట్టేసి అందరికంటే ముందు గంట కొట్టాడు. తర్వాత రోహిణి గంట కొట్టింది. అనంతరం ప్రేరణ, గౌతమ్, నిఖిల్ వరుసగా గంట కొట్టారు. అయితే నిఖిల్ తన పోల్కు బదులు వేరేవారి పోల్కు తాడు చుట్టాడు. దీంతో నాలుక్కరుచుకుని మళ్లీ తన పోల్కు తిరిగి చుట్టాడు. విష్ణుప్రియ, అవినాష్ చివరి స్థానాల్లో ఉన్నారు.నేనే గెలిచా: ప్రేరణహౌస్మేట్స్ అందరూ కలిసి ఎవరు గెలిచారో చెప్పాలన్నాడు. నబీల్ తాడు సరిగా చుట్టలేదని, తానే గెలిచానని ప్రేరణ వాదించింది. లేదు, నేనే ఫస్ట్ అని నబీల్ అరుస్తూ ఉండటంతో ఆమె అతడిని ఇమిటేట్ చేసింది. ఇన్నాళ్లూ అవతలివారిని వెక్కిరించిన నబీల్.. తనను ఒకరు ఇమిటేట్ చేయడంతో తట్టుకోలేకపోయాడు. నన్ను వెక్కిరిస్తే బాగోదంటూ వార్నింగ్ ఇచ్చాడు.నబీల్కు బిగ్బాస్ కౌంటర్చివరకు అందరూ కలిసి నబీల్ గెలిచినట్లు ప్రకటించారు. అప్పుడు బిగ్బాస్.. మీరు తాడును సరిగా చుట్టారని అనుకుంటున్నారా? అని అడగడంతో అందరూ మనసు మార్చుకుని ప్రేరణ పేరు చెప్పారు. అయినా నబీల్ తనది కరెక్టే అనడంతో మీకు చుట్టడమంటే అర్థం తెలుసా? అని ప్రశ్నించాడు. దీంతో అతడు కిక్కురుమనకుండా ఉండిపోయాడు.అయోమయం.. గందరగోళంఈ ఆటలో ఎవరు ఓడిపోయారని ప్రేరణను అడగ్గా ఆమె మొదట అవినాష్ పేరు చెప్పింది. గంట కొట్టేశాక మళ్లీ ఆడటం తప్పు కాదా? అని అవినాష్ అడగడంతో ఆమె మనసు మార్చుకుని నిఖిల్ పేరు చెప్పింది. అందుకతడు అభ్యంతరం చెప్పడంతో ఆమె మళ్లీ యూటర్న్ తీసుకుని అవినాష్ పేరు చెప్పి ఇదే ఫైనల్ నిర్ణయమంది. దాంతో అవినాష్ రేసు నుంచి తప్పుకున్నాడు.నబీల్కు ఓట్లు అడిగే ఛాన్స్టర్ఫ్ వార్ అని బిగ్బాస్ మరో ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్లో చివరివరకు సర్కిల్లో ఉన్నవారు విజేతగా నిలుస్తారు. మొదటగా ప్రేరణను తోసేశారు. తర్వాత వరుసగా గౌతమ్, నిఖిల్, రోహిణిని తోసేశారు. చివర్లో నబీల్, విష్ణుప్రియ మిగిలారు. వీరిద్దరిలో ఎవరు ఓట్ అప్పీల్ చేసే ఛాన్స్ పొందాలో ఇంటిసభ్యులు నిర్ణయించాలన్నాడు. అందరూ కలిసి నబీల్ను సెలక్ట్ చేశారు.ప్రాణం పోయినా సరేనని..నబీల్ మాట్లాడుతూ.. నేనొక సామాన్యుడిని. సినిమాల్లో నటుడవ్వాలని కలలు కన్నాను. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చినా ఎక్కడా అవకాశం రాలేదు. ఎవరో అవకాశాలివ్వడమేంటని సోషల్ మీడియాలో వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. తొమ్మిది సంవత్సరాల్లో నాకు వచ్చిన పెద్ద అవకాశం బిగ్బాస్. ప్రాణం పోయినా సరే అని టాస్కులు గెలవాలని ఆడాను. నన్ను విజేతగా చూడాలన్నది మా అమ్మ కల. దాన్ని మీరే నిజం చేయాలి అంటూ ప్రేక్షకులను ఓట్లు వేయమని అభ్యర్థించాడు.ఎన్నాళ్లకెన్నాళ్లకు..అనంతరం ప్రముఖ చెఫ్ సంజయ్ హౌస్లో ఎంట్రీ ఇచ్చాడు. హౌస్మేట్స్తో ఫన్నీ గేమ్స్ ఆడించాడు. అలాగే వారికోసం రుచికరమైన భోజనం వండి మరీ తీసుకొచ్చాడు. నిఖిల్, గౌతమ్ మధ్య దూరాన్ని చెరిపేస్తూ ఒకరికొకరు ఫుడ్ తినిపించుకోమన్నాడు. స్టార్టర్, బిర్యానీ, ఐస్క్రీమ్స్ అన్నీ కడుపారా తిన్న కంటెస్టెంట్లు ఇది జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకమంటూ ఫుల్ ఖుషీ అయ్యారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్: గౌతమ్, నిఖిల్ను కలిపేశారుగా!
కంటెస్టెంట్ల మధ్య పోటీ ఉంటేనే కిక్కుంటుంది. ఈ సీజన్ ప్రారంభంలోనే నిఖిల్ విన్నర్ అని అంతా తేల్చేశారు. కానీ వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఈ అభిప్రాయం మారింది. నిఖిల్కు పోటీఇచ్చే వ్యక్తి దొరికాడని అనుకున్నారు. అతడే గౌతమ్. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా వచ్చిన వారమే వెళ్లిపోవాల్సిన వ్యక్తి ఇప్పుడేకంగా విన్నర్ రేసులో నిలవడమంటే మామూలు విషయం కాదు.నోరు జారడం.. సారీ చెప్పడంఅయితే మొన్నటి ఎపిసోడ్లో నిఖిల్ను.. యష్మిని వాడుకున్నావ్ అంటూ పెద్ద అభాండం వేయడం అతడికి భారీ మైనస్గా మారింది. ఓ రేంజ్లో పైకెళ్లిన గ్రాఫ్ ఢామ్మని కిందపడిపోయింది. నిన్నటి ఎపిసోడ్లో నిఖిల్కు సారీ చెప్పి తన డ్యామేజ్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు గౌతమ్.ఈ ఇద్దరినీ కలిపేందుకు హౌస్లోకి చెఫ్ సంజయ్ అడుగుపెట్టాడు. అందరికోసం ఆయన దగ్గరుండి వంట చేశాడు. అలాగే గౌతమ్, నిఖిల్ మధ్య మంటను తగ్గించేందుకు ఒకరికొకరు తినిపించుకోండంటూ ఇద్దర్నీ కలిపేశాడు.. హౌస్మేట్స్తో సరదా గేమ్స్ కూడా ఆడించాడు. చదవండి: Pushpa 2: పుష్ప 2 కథేంటి? సుకుమార్ ఏం చెప్పబోతున్నాడు? -
బిగ్బాస్: తనదే కరెక్ట్ అన్న ప్రేరణ.. ఒప్పుకోని నబీల్
హౌస్లో నామినేషన్స్కు స్వస్తి పలికారు. బిగ్బాసే స్వయంగా అందర్నీ(ఫైనలిస్ట్ అవినాష్ మినహా) నామినేట్ చేశారు. అంటే ఇకనుంచి ఇంట్లో కొట్లాటలుండవా.. ఈ రెండువారాలు పిక్నిక్లా ఎంజాయ్ చేస్తారా? అనుకునేరు. ఫినాలేకు ఇంకో రెండురోజులుందనగా కూడా మేము గొడవపడేందుకు రెడీ అన్నట్లుగానే ఉన్నారు కంటెస్టెంట్లు.ఓట్ అప్పీల్ఓట్ అప్పీల్ కోసం బిగ్బాస్ టాస్కులు ఇస్తున్నాడు. ఇప్పటికే ఓసారి ప్రేరణ గెలిచి ప్రేక్షకుల్ని తనకు ఓటేయమని అభ్యర్థించే ఛాన్స్ గెలిచింది. నేడు మరొకరికి ఛాన్స్ ఇచ్చేందుకు రెండు గేమ్స్ పెట్టనున్నాడు. అందులో మొదటిదే క్రాసింగ్ పాత్స్. ఇందులో నిఖిల్ తన తాళ్లను తనకు సంబంధించిన పోల్కు కాకుండా మరో పోల్కు పెట్టి బెల్ కొట్టాడు. నిఖిల్ను విజేతగా ప్రకటించిన ప్రేరణఈ తప్పు గురించి అవినాష్ అడుగుతుంటే అదసలు తప్పే కాదని వాదించింది ప్రేరణ. అటు నబీల్ తన తాడును అడ్డదిడ్డంగా కట్టడంతో అతడినసలు లెక్కలోకే తీసుకోలేదు. దీంతో నబీల్ గొడవకు దిగాడు. నా పోల్ సరిగ్గానే ఉంది.. నువ్వే కావాలని నేను చుట్టిన తాడును చెడగొడుతున్నావ్.. అని మండిపడ్డాడు. దీంతో ప్రేరణ ఇమిటేట్ చేయగా.. నన్ను వెక్కిరించకు, ఇది జోక్ కాదంటూ గద్దించాడు. మొత్తానికి ఈ గేమ్లో ప్రేరణ గెలిచింది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్ని ఓడించిన ప్రేరణ.. సారీ చెప్పిన గౌతమ్
మరో వారం పదిరోజుల్లో బిగ్ బాస్ ఫినాలే ఉండొచ్చు. దీంతో ఈసారి నామినేషన్స్ హడావుడి పెద్దగా లేదు. ఫైనలిస్ట్ అయిన అవినాష్ తప్పితే అందరూ లిస్టులో ఉన్నారు. అంటే గౌతమ్, రోహిణి, నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, నబీల్ నామినేషన్స్లో ఉన్నట్లే. అయితే బిగ్బాస్ ఈ వారమంతా కొన్ని గేమ్స్ పెడుతుంటాడు. వాటిలో ఎవరైతే గెలుస్తారో.. వాళ్లకు ఓట్లు అడుక్కునే అవకాశం దక్కుతుంది. మంగళవారం ఎపిసోడ్తో ఈ తంతు మొదలైంది. ఇంతకీ 93వ రోజు ఏమేం జరిగిందనేది హైలైట్స్లో చూద్దాం.(ఇదీ చదవండి: బండ్ల గణేశ్ సినిమాకు ఓకే చెప్పా.. కానీ మోసం చేశాడు: టాలీవుడ్ కమెడియన్)అయితే ఓటింగ్ రిక్వెస్ట్ కోసం జంటలుగా కొన్ని ఛాలెంజెస్లో పాల్గొనాలి. ఎవరికైతే జంట ఉండదో వారు ఈ ఓట్ అప్పీల్ రేసు నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ జంటలని ఎంచుకొని చెప్పండని బిగ్బాస్ చెప్పాడు. అలా అవినాష్-నబీల్, ప్రేరణ-నిఖిల్, విష్ణు-రోహిణి జంటలుగా సెట్ అవగా.. గౌతమ్ ఏకాకిగా మిగిలిపోయాడు. ఇంతలో ట్విస్ట్ ఇచ్చిన నబీల్.. అవినాష్ని వదిలేసి గౌతమ్తో జోడీ కట్టాడు.మూడు జంటలకు తొలి పోటీగా 'నా టవర్ ఎత్తయినది' అనే గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా జంటలు ఎవరికి వాళ్లు ఓ టవర్ నిర్మించాల్సి ఉంటుంది. నిలబెట్టిన దాన్ని వేరే జోడీలు పడగొట్టొచ్చు. బజర్ మోగేసరికి ఎవరిదైతే ఎత్తుగా ఉంటుందో వాళ్లు గెలిచినట్లు. ఇందులో అందరూ బాగానే ఆడతారు గానీ ప్రేరణ-నిఖిల్ తొలి స్థానంలో నిలుస్తారు. రోహిణి-విష్ణుప్రియ రెండో స్థానం సొంతం చేసుకుంటారు. చివర్లో నిలిచిన గౌతమ్-నబీల్.. ఓటు అప్పీల్ రేసు నుంచి తప్పుకొన్నారు.(ఇదీ చదవండి: 'బ్లాక్' సినిమా రివ్యూ (ఓటీటీ))మొదటి పోటీ తర్వాత రెండో పోటీ పెట్టారు. 'టక్ టకాటక్' అనే గేమ్లో భాగంగా తమ తమ ప్లేసులో ఉండే డిస్కులు.. పక్క వాళ్ల ప్లేసులోకి తోసేయాలి. ఈ పోటీని ఒక్కొక్కరుగా ఆడాలి. దీంతో ప్రేరణ-నిఖిల్ ఉంటారు. విష్ణు-రోహిణిలలో ఒక్కరే ఆడాలని బిగ్ బాస్ చెప్పగా.. రోహిణి ముందుకొస్తుంది. ఈ పోటీలో గెలిచిన ప్రేరణ.. ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం దక్కించుకున్న తొలి విజేతగా నిలిచింది. దీంతో ఈమెని ఇన్ఫినిటీ రూంకి పిలిచిన బిగ్ బాస్.. ప్రేక్షకుల్ని ఓట్లు అప్పీలు చేసుకోమన్నాడు.'బిగ్బాస్ జర్నీలో ఇక్కడ ఉంటానని అనుకోలేదు. తెలుగు ప్రేక్షకుల నుంచి చాలా ప్రేమ, సపోర్ట్ దొరికింది. ఇక్కడికి వచ్చి నాలాగా ఉండాలనుకున్నాను, ఉంటున్నాను. కచ్చితంగా కొన్నిసార్లు తప్పు చేశా. ఎవరూ ఫెర్ఫెక్ట్గా ఉండరు. నేను తప్పులు చేశాను. ఎవరు చెప్పినా వాటి నుంచి నేర్చుకున్నాను. నా గురించి నాకే కొన్ని మంచి, కొన్ని చెడు అంశాలు తెలిశాయి. ఇప్పటివరకు 13 వారాలు సేవ్ అయ్యాను. ఇది దాటేస్తే ఇక ఫైనల్స్. మీ ఓట్స్ నాకు ఇవ్వండి. బిగ్బాస్ హిస్టరీలోనే తొలి మహిళా విన్నర్ అవ్వాలని ఆశ ఉంది. అది మీ వల్లే అవుతుంది. ఓటు మీది గెలుపు నాది' అని ప్రేరణ రిక్వెస్ట్ చేసింది.(ఇదీ చదవండి: 'పుష్ప 2'.. తమన్ని సైడ్ చేసేశారా?)సోమవారం నామినేషన్స్ లేకపోయినా సరే గౌతమ్-నిఖిల్ మధ్య పెద్ద వాగ్వాదమే నడిచింది. 'యష్మిని వాడుకున్నావ్' అని నిఖిల్పై నోరు జారిన గౌతమ్.. మంగళవారం ఎపిసోడ్లో మాత్రం అందరిముందు క్షమాపణలు చెప్పాడు. ఎవరిది తప్పు ఎవరిది కాదు అని నేను చెప్పను. వాడుకున్నావ్ అన్నది వేరే రకంగా అనలే, గేమ్లో నువ్వు ఆటాడుతున్నావ్ అని ఎట్ల అన్నావో నేను వాడుతున్నా అని అట్ల అన్నా.. దానికి నువ్వు హర్ట్ అయ్యావనిపించింది కాబట్టి నేను అన్న ఆ మాటని వెనక్కి తీసుకుంటూ ఆ బాధ్యత వహిస్తూ ఐయామ్ రియల్లీ సారీ నిఖిల్.. మరోసారి నీ దగ్గర నోరు జారకుండా జాగ్రత్త పడతానని గౌతమ్ అన్నాడు.దీనికి స్పందించిన నిఖిల్.. నాకు తెలినంతవరకూ నిన్న మాట్లాడింది నీది కానీ ఇంకెవరిదైనా పర్సనల్ విషయం నేను తీయలేదు. ఒకవేళ నీకు అలా అనిపించి ఉంటే ఐ యామ్ సారీ. వేరే ఎక్కడా నేను ఇప్పటివరకూ నోరు జారలేదు.. మూస్కొని నొక్కు అన్న మాట వాడినందుకు సారీ.. దానికి నేను నిజంగా సారీ చెబుతున్నా అని చెప్పాడు. వెంటనే ఇద్దరూ ఒకరికొకరు హగ్ ఇచ్చుకున్నారు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది.(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్) -
నీచంగా మాట్లాడిన గౌతమ్.. కొంపముంచేంత పని చేసిన నబీల్!
నిన్నమొన్నటివరకు కిచెన్లో ఎంత సేపు వంట చేసుకోవాలన్నది బిగ్బాసే డిసైడ్ చేసేవాడు. గంట, రెండు గంటలు మాత్రమే టైమ్ ఇచ్చేవాడు. సీజన్ ముగింపుకు వచ్చేసిన సందర్భంగా కిచెన్ టైమర్ను అన్లిమిటెడ్ చేసేశాడు. నామినేషన్స్ లేకపోయినా అలాంటి ఓ ప్రక్రియ పెట్టడంతో గౌతమ్, నిఖిల్ రెచ్చిపోయి మాట్లాడుకున్నారు. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (డిసెంబర్ 2) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..రోహిణిని ఆటపట్టించిన గౌతమ్చాలాకాలంగా మనసులో దాచుకున్న మాటను చెప్పేస్తున్నానంటూ రోహిణి దగ్గర తెగ సిగ్గుపడిపోయాడు గౌతమ్. కానీ నోరు తెరుస్తూనే.. ఈ హౌస్లో ఉన్న అమ్మాయిలందరూ నా అక్కలు. ఓ సహోదరుడిగా నీకు ఎల్లప్పటికీ తోడుగా, నీడగా ఉంటాను అని చెప్పాడు. ఆ మాటతో అవాక్కయిన రోహిణి.. ఎవడ్రా నీకు అక్క అంటూ గౌతమ్ను సరదాగా తిట్టిపోసింది.సెకండ్ ఫైనలిస్ట్ ఎంపికతర్వాత బిగ్బాస్.. ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ మినహా మిగతా అందరూ నేరుగా నామినేట్ అయినట్లు ప్రకటించాడు. రెండో ఫైనలిస్ట్ ఎంపిక కోసం ఓ టాస్క్ పెట్టాడు. ఎవరైతే ఫినాలేలో ఉండకూడదనుకుంటున్నారో వారి ఫోటోను కాల్చేయాలన్నాడు. చివరకు ఎవరి ఫోటో అయితే కాలకుండా ఉంటుందో వాళ్లు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారని చెప్పాడు. మొదటగా అవినాష్.. విష్ణుప్రియ ఫోటో కాల్చేశాడు. విష్ణుప్రియ వంతురాగా.. ఎవరితోనూ ఎక్కువగా కలవట్లేదు, నీ గేమ్ అర్థం కావట్లేదంటూ గౌతమ్ ఫోటో కాల్చేసింది. అమ్మాయిలను వాడుకున్నావ్గౌతమ్.. పదేపదే పోట్రే చేస్తున్నానని నాపై లేనిపోని నింద వేశావంటూ నిఖిల్ను రేసులో నుంచి తీసేయాలనుకున్నాడు. నిఖిల్ స్పందిస్తూ.. వచ్చినప్పటినుంచి నువ్వు అదే చేస్తున్నావని వాదనకు దిగాడు. ఈ క్రమంలో గౌతమ్.. యష్మిని వాడుకుంది నువ్వు, అమ్మాయిలను వాడుకున్నావ్ అంటూ నీచంగా మాట్లాడాడు. ఇలానే మరోసారి కాస్త వల్గర్గా మాట్లాడటంతో నిఖిల్ కోపాన్ని అణుచుకోలేకపోయాడు. ఇంకోసారి నోరు జారి మాట్లాడితే బాగోదని హెచ్చరించాడు.రోహిణిని తప్పించిన నిఖిల్ఈ గొడవను ఆపేయమని చెప్తున్నా కూడా.. గౌతమ్ వినకుండా విషయాన్ని సాగదీస్తూనే ఉన్నాడు. యష్మికి గాజులు సెట్ చేస్తూ ఆమెకు హోప్స్ పెట్టడం తప్పంటూ తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించి మరింత ఇరిటేషన్ తెప్పించాడు. అనంతరం నిఖిల్.. నామినేషన్స్లోకి రాలేదంటూ రోహిణిని రేసు నుంచి తప్పించాడు. నామినేషన్స్లోకి రాకపోయినా నేను అన్ని గేమ్స్ గట్టిగానే ఆడాను అని రోహిణి సమాధానమిచ్చింది. చివర్లో ప్రేరణ, నబీల్.. ఇద్దరు మాత్రమే మిగిలారు. వీరికి బిగ్బాస్ బంపరాఫర్ ఇచ్చాడు. ఇమ్యూనిటీ కొనుక్కోవాలన్న బిగ్బాస్మీ ముందున్న చెక్పై రూ.15 లక్షల వరకు ఎంతైనా రాసి ఇమ్యూనిటీ కొనుక్కోవచ్చన్నాడు. ఆ డబ్బు విన్నర్ ప్రైజ్మనీలో నుంచి కట్ అవుతాయన్నాడు. కాసేపు ఆలోచించుకున్నాక ఇద్దరూ తమకు తోచినంత అమౌంట్ రాశారు. ఇంతలో మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్బాస్. ఇమ్యూనిటీ కొనుక్కోకుండా వారిని నామినేషన్స్లో ఉంచేందుకు హౌస్మేట్స్ ఒప్పించవచ్చన్నాడు.చెక్కులు చింపేయమన్న హౌస్మేట్స్ప్రైజ్మనీని ఒక్కో రూపాయి సంపాదిస్తూ ఇక్కడివరకు తేవడానికి అందరం ఎంతో కష్టపడ్డాం. మీకు జనాలు ఓటు వేశారు కాబట్టే పద్నాలుగోవారం దాకా వచ్చారు అని నిఖిల్ చెక్ చించేయమన్నాడు. మిగతావాళ్లు కూడా అదే సలహా ఇచ్చి ఎలాగోలా ఒప్పించడంతో ప్రేరణ, నబీల్.. ఫైనలిస్ట్ స్థానాన్ని కొనుక్కోవాలనుకోవడం లేదని చెప్పారు. రాసిన చెక్కులు చింపేయడానికంటే ముందు ఇద్దరు ఎంత రాశారో చెప్పాలన్నాడు. నబీల్ స్వార్థంప్రేరణ.. రూ.4,30,000 రాయగా నబీల్ ఏకంగా రూ.15 లక్షలు రాసేశాడు. అది విని హౌస్మేట్స్ నోరెళ్లబెట్టారు. కంటెస్టెంట్లే కాదు చూసే జనాలు కూడా వీళ్లు ఇంత స్వార్థంగా ఉన్నారేంటని ఈసడించుకోవడం ఖాయం. ఏదేమైనా వీరిద్దరూ మనసులు మార్చుకుని చెక్కులు చించేయడంతో నేరుగా ఫైనల్కు వెళ్లే అవకాశం కోల్పోయారు. ఈ వారం గౌతమ్, రోహిణి, నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, నబీల్ నామినేషన్స్లో ఉన్నారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నటితో ప్రేమాయణం? క్లారిటీ ఇచ్చిన పృథ్వీ
బిగ్బాస్ షోలో లవ్ ట్రాక్స్ కామన్. కానీ ఈ సీజన్ విచిత్రంగా అమ్మాయి వెంటపడుతుంటే అబ్బాయి పట్టింపు లేనట్లు కూర్చున్నాడు. ఆ జంటే విష్ణుప్రియ- పృథ్వీ. నాకంటే కూడా నాకు నువ్వే ఎక్కువ అంటూ వీలు కుదిరినప్పుడల్లా అతడిపై ప్రేమను గుమ్మరించింది. ముదొస్తున్నాడంటూ ముద్దులు కూడా పెట్టేది. దర్శిని గౌడతో లవ్అతడు క్యాజువల్గా ఏదైనా మాట్లాడినా సో క్యూట్ అంటూ గింగిరాలు తిరిగేది. తనది లవ్ కాదంటూనే అతడిని ఫ్రెండ్ కన్నా ఎక్కువ అని చెప్పింది. ఆమె ఇంత చేస్తున్నా తనకు మాత్రం ఇంట్రస్ట్ లేదన్నట్లుగానే ఉండేవాడు పృథ్వీ. ఇతడి కోసం ఫ్యామిలీ వీకెండ్లో నాగపంచమి సీరియల్ నటి దర్శిని గౌడ స్టేజీపైకి వచ్చింది. ఆమె మాటల్ని చూసిన ప్రేక్షకులు వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారా? అని డౌట్ పడ్డారు. క్లారిటీ ఇచ్చిన పృథ్వీసోషల్ మీడియాలో అయితే వీళ్లు కచ్చితంగా ప్రేమికులే అని ముద్ర వేసేశారు. తాజాగా ఈ రూమర్స్పై పృథ్వీ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'దర్శిని నాతో కలిసి నటించింది. ఆమె గొప్ప నటి. తను నాకు మంచి ఫ్రెండ్ కూడా! సీరియల్స్లో మంచి కెమిస్ట్రీ ఉంది కాబట్టి ఆ సమయంలో మేమిద్దరం లవ్లో ఉన్నామన్నారు. కానీ తను నాకు మంచి స్నేహితురాలు మాత్రమే!' అని క్లారిటీ ఇచ్చాడు.ప్రేమ పెళ్లి చేసుకుంటా..పెళ్లి గురించి స్పందిస్తూ.. 'పెళ్లి కంటే ముందే నాకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి. కెరీర్పై ఫోకస్ పెట్టాను. నేను అనుకున్నదాంట్లో ఇంకా పదిశాతం కూడా చేయలేదు. అబ్బాయిలకు ఫస్ట్ లైఫ్లో సెటిలవ్వాలి కదా! సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను. అది కూడా లవ్ మ్యారేజే' అని పృథ్వీ చెప్పుకొచ్చాడు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మిని వాడుకున్నావ్.. నోరు జారొద్దంటూ నిఖిల్ వార్నింగ్
బిగ్బాస్ హౌస్లో ఏడుగురు మిగిలారు. టికెట్ టు ఫినాలే గెలిచి అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. దీంతో అతడు మినహా మిగతా ఆరుగురు నామినేషన్స్లో ఉన్నట్లు ప్రకటించాడు బిగ్బాస్. తర్వాత హౌస్మేట్స్తో ఓ గేమ్ ఆడించాడు. ఈ రేసు నుంచి తొలగించాలనుకుంటున్న కంటెస్టెంట్ల ఫోటోలను కాల్చాల్సి ఉంటుంది. విష్ణు ఫోటో కాల్చిన అవినాష్ముందుగా అవినాష్.. విష్ణుప్రియ ఉండకూడదనుకుంటున్నట్లు చెప్పాడు. గేమ్ అంటే టాస్కులు మాత్రమే కాదు పర్సనాలిటీ కూడా అని చెప్పావు. గేమ్స్ ఆడుతున్నాం.. కానీ అది ఎలా ఆడుతున్నామనది ముఖ్యం అని నొక్కి చెప్పాడు. తర్వాత నిఖిల్, గౌతమ్ మధ్య వార్ మొదలైంది. పృథ్వీ, నేను.. ఇలా ఎవరో ఒకరు అవతల వ్యక్తిని అగౌరవపరిస్తే తప్పు.. కానీ నువ్వు చేస్తే మాత్రం ఒప్పా? అని నిఖిల్ ప్రశ్నించాడు. ఒప్పని నేనెప్పుడు చెప్పానని నిలదీశాడు. నీ ప్రవర్తనతోనే తెలిసిపోతుందని నిఖిల్ కోపంతో ఊగిపోయాడు.కోపంతో ఊగిపోయిన నిఖిల్ఇన్ని రోజులు ఈ స్వరంతో ఎందుకు మాట్లాడలేదు? అని గౌతమ్ అడగ్గా.. ఎందుకంటే ఇదే చివరి ఛాన్స్.. నువ్వు చేసిందంతా బయటకు రావాలి కదా అని బదులిచ్చాడు. ఇలా మాటామాటా అనుకునే క్రమంలో గౌతమ్.. యష్మిని వాడుకుంది నువ్వు అని పెద్ద నింద వేశాడు. నువ్వు ఏదిపడితే అది అంటుంటే వినడానికి రాలేదు, ఇంకోసారి నోరుజారితే వేరేలా ఉంటుంది అని నిఖిల్ వార్నింగ్ ఇచ్చాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'బిగ్ బాస్ అంటే ప్రేక్షకులకు ఫ్లవరు.. పార్టిసిపెంట్స్కు ఫైరు'
నిను వీడను నేను....అనే పాటలోని వాక్యం బిగ్ బాస్ పార్టిసిపెంట్స్కు సరిగ్గా సరిపోతుంది. ఏ సిరీస్ అయినా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే...ఒక్కసారి బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళును జీవితకాలం బిగ్ బాస్ నీడలా వారి వెంట ఉంటాడు. అదెలాగంటారా..ప్రతి సీరిస్లో పాత వాళ్ళు వచ్చి పార్టిసిపెంట్స్ ను పలకరిస్తారు, వారి టాస్కులతో పులకరిస్తారు. ఇదే జరిగింది ఈ వారం బిగ్ బాస్లో. టికెట్ టు ఫినాలె కాంటెస్ట్ కోసం హౌస్లో ఉన్న కంటెస్టెంట్లకు పాత సీజన్ల నుండి పార్టసిపెంట్సును తీసుకువచ్చి వారిచే టాస్కులు ఆడే ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. అలానే ఆ కంటెస్టెంట్లు టాస్కులతో పాటు కంటెస్టెంట్స్ మధ్య కాసింత గిల్లికజ్జాలు పెట్టి వెళ్ళారు. ఇదే ఈ వారం బిగ్ బాస్ ప్రేక్షకులకు పండుగ. అందరికీ తెలిసినట్టు హౌస్లో గ్రూపిజం బాగా కనపడుతుంది. ఒకటి మొదటి నుండి వున్న గ్రూప్ అయితే రెండోది వైల్డ్ కార్డ్ గ్రూప్. ఆ గ్రూపులు మధ్య ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీ ఫైట్లు. టికెట్ టు ఫినాలె కాంటెస్ట్ ఫైనల్ టాస్కు ముందు ఈ గ్రూపుల మధ్య ఓ పెద్ద తగాదానే నడిచింది. ఆ తగాదా తినే దోశ కోసం ఎగ పడ్డారు. ఎపిసోడ్లో ఈ దోశ పంచాయితీ కనీసం పది నిమిషాల చూపించి ప్రేక్షకుల ఆరాటాన్ని బాగానే క్యాష్ చేసుకున్నాడు బిగ్ బాస్. టికెట్ టు ఫినాలె కాంటెస్ట్ కోసం పెట్టిన టాస్కులలో విజేతగా నిలిచాడు అవినాష్. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా టేస్టీ తేజ , పృథ్వి ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లోపల, బయట చూసే ప్రేక్షకులు బిగ్ బాస్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారో కాని సోషల్ మీడియాలో బోలెడన్ని మీమ్స్, గ్రూప్స్ ఆ పై సోషల్ యూజర్స్ మధ్య బిగ్ బాస్ గురించి కొట్లాట... ఇన్ని జరుగుతున్నాయి. అందుకే బిగ్ బాస్ అంటే ఫ్లవర్ కాదు బిగ్ బాస్ చేస్తున్నవాళ్ళకి, చూస్తున్నవాళ్ళకి వాళ్ళ మధ్య మంట పెట్టే ఫైరు. కాబట్టే బిగ్ బాస్ తగ్గేదేలే....-ఇంటూరు హరికృష్ణ -
పృథ్వీ ఎలిమినేట్.. నిజాయితీగా ఎలా ఉండాలో నేర్చుకోమన్న విష్ణు
ఈరోజు మొదటగా గౌతమ్ను సేవ్ చేశాడు నాగార్జున. తర్వాత ఓ ఫన్ గేమ్ కోసం హౌస్మేట్స్ను రెండు టీమ్స్గా విడగొట్టాడు. అవినాష్, రోహిణి, నబీల్, గౌతమ్ ఒక టీమ్ కాగా మిగతావారంతా విష్ణుప్రియ టీమ్గా విభజించాడు. హుక్ స్టెప్ వేస్తే ఆ సాంగ్ ఏంటో గెస్ చేయాలన్నదే గేమ్. ఇందులో విష్ణుప్రియ టీమ్ గెలిచింది. మరి తర్వాత ఏం జరిగిందో నేటి (డిసెంబర్ 1) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..షాక్లో ప్రేరణఈ వారం ప్రేరణ సేవ్ అవుతుందని కలలో కూడా అనుకోలేదేమో! ఆమె సేవ్ అయినట్లు చెప్పగానే నమ్మలేనట్లు నోరెళ్లబెట్టింది. వెంటనే తేరుకుని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. ఆ వెంటనే నిఖిల్ను సైతం సేవ్ చేశాడు. తర్వాత కళ్లకు గంతలు కట్టి మ్యూజికల్ చెయిర్ గేమ్ ఆడించాడు. ఇందులో నిఖిల్, అవినాష్ను సంచాలకులుగా పెట్టారు. ఇందులో పృథ్వీ గెలిచాడు.టాప్ 8 కోసం స్పెషల్ పోస్టర్స్హౌస్లో ఉన్న ఎనిమిది కోసం బిగ్బాస్ స్పెషల్ పోస్టర్స్ క్రియేట్ చేశాడు. అలా నబీల్ కోసం డబుల్ ఇస్మార్ట్, విష్ణుప్రియ కోసం నిన్ను కోరి, పృథ్వీ కోసం యానిమల్, గౌతమ్ కోసం ఏక్ నిరంజన్, రోహిణి కోసం అరుంధతి, ప్రేరణకు అందాల రాక్షసి, నిఖిల్కు ద ఫ్యామిలీ స్టార్, అవినాష్ కోసం సుడిగాడు పోస్టర్స్ వేశాడు.ఎక్స్ట్రాలు చేయకుండా ఉండటం ఎలా?అనంతరం నబీల్ను సేవ్ చేసినట్లు ప్రకటించాడు. నెక్స్ట్ ఓ చిన్న టాస్క్ పెట్టాడు. కొన్ని టైటిల్స్ రాసున్న బుక్స్ను హౌస్మేట్స్కు అంకితమివ్వాలన్నాడు. ఎక్స్ట్రాలు చేయకుండా ఉండటం ఎలా? అన్న పుస్తకాన్ని ప్రేరణ.. అవినాష్కు డెడికేట్ చేసింది. సరైన కారణాలు లేకుండా నామినేట్ చేయడం ఎలా? పుస్తకాన్ని గౌతమ్ నిఖిల్కు ఇచ్చాడు.బ్రెయిన్ వాడమన్న అవినాష్బ్రెయిన్ వాడి ఆడటం ఎలా? పుస్తకాన్ని అవినాష్.. విష్ణుప్రియకు ఇచ్చాడు. సపోర్ట్ కోరుకోకుండా ఉండటం నేర్చుకో అన్న పుస్తకాన్ని నబీల్.. రోహిణికి డెడికేట్ చేశాడు. సేఫ్ గేమ్ ఆడకుండా ఉండటం ఎలా? అనేది అవినాష్కు ఇచ్చాడు పృథ్వీ. నిజాయితీగా ఉండటం ఎలా? అన్న పుస్తకాన్ని విష్ణు.. అవినాష్కు ఇచ్చింది.పృథ్వీ ఎలిమినేట్ఒక్కరిని టార్గెట్ చేయకుండా ఉండటం ఎలా? అన్న బుక్ను నిఖిల్.. అవినాష్కు ఇచ్చాడు. తర్వాత నాగార్జున విష్ణును సేవ్ చేసి పృథ్వీ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దాంతో విష్ణు కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు గొప్ప మనిషివి పృథ్వీ, ఐ మిస్ యూ అంటూ ఏడ్చేసింది.కన్నీళ్లు పెట్టుకున్న పృథ్వీఅటు స్టేజీపైకి వచ్చిన పృథ్వీ తన జర్నీ చూసుకుని ఎమోషనలయ్యాడు. కాసేపటికి తేరుకున్నాక హౌస్మేట్స్తో మాట్లాడాడు. నిఖిల్, నబీల్, విష్ణు సూపర్ హిట్ అని.. రోహిణి, అవినాష్ సూపర్ ఫ్లాప్ అని చెప్పాడు. నిఖిల్, నబీల్, విష్ణు, ప్రేరణకు తప్పకుండా ఓటేస్తానన్నాడు. చివర్లో నాగార్జున ఓ సర్ప్రైజ్ రివీల్ చేశాడు. ఈ సీజన్ విజేతకు ట్రోఫీ, ప్రైజ్మనీతో పాటు బ్రాండెడ్ కారు కూడా లభిస్తుందని చెప్పాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీ, విష్ణు.. ఇద్దరూ ఎలిమినేటెడ్..: నాగార్జున
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ముగింపుకు వచ్చేస్తోంది. ఈ వారం అవినాష్, నిఖిల్, నబీల్, విష్ణుప్రియ, గౌతమ్, పృథ్వీ, ప్రేరణ, తేజ నామినేషన్స్లో ఉన్నారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందన్న నాగ్.. ఈ మేరకు తేజను ఆల్రెడీ ఎలిమినేట్ చేసేశాడు. టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్కు నామినేషన్స్ నుంచి మినహాయింపు ఉంటుందన్నాడు.ఎలిమినేషన్నేడు మరో ఎలిమినేషన్ జరగనుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో విష్ణు, పృథ్వీ డేంజర్ జోన్లో ఉన్నట్లు చూపించారు. ఎవరి అక్వేరియంలో నీళ్లు ఎరుపురంగులో ఉంటాయో వారు ఎలిమినేట్ అని తెలిపాడు. చివర్లో మాత్రం ఇద్దరూ ఎలిమినేట్ అని ప్రకటించాడు. అయితే ఇది నిజమయ్యే ఛాన్సే లేదు.ప్రాంక్?ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ అని నాగార్జునే శనివారం ఎపిసోడ్లో ఓపెన్గా చెప్పాడు. ఈపాటికే తేజను పంపించేయగా మరొకరిని మాత్రమే పంపించే ఛాన్స్ ఉంది. కానీ ఈరోజు ఇద్దరూ ఎలిమినేట్ అన్నాడంటే ఇది ప్రాంక్ అని ఇట్టే తెలిసిపోతుంది. పైగా పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన విష్ణు హౌస్లోనే ఉండనుంది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణ అందాల రాక్షసి, రోహిణి అరుంధతి, మరి విష్ణు?
టేస్టీ తేజ ఎలిమినేషన్తో బిగ్బాస్ హౌస్లో ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఈ రోజు పృథ్వీ హౌస్ నుంచి వెళ్లిపోనున్నాడు. దానికంటే ముందు హౌస్మేట్స్తో ఫన్నీ గేమ్ ఆడించాడు. అలాగే కంటెస్టెంట్లకు ఒక్కో సినిమా టైటిల్ అంకితమచ్చాడు.నబీల్కు డబుల్ ఇస్మార్ట్, పృథ్వీ-విష్ణుప్రియకు నిన్నుకోరి, గౌతమ్కు ఏక్ నిరంజన్, రోహిణికి అరుంధతి టైటి్ ఇచ్చారు. ప్రేరణకు అందాల రాక్షసి, నిఖిల్కు ద ఫ్యామిలీ మ్యాన్, అవినాష్కు సుడిగాడు అనే టైటిల్స్ అంకితమిచ్చారు. ఆ పోస్టర్స్ చూసి హౌస్మేట్స్ ఆశ్చర్యపోతూనే నవ్వుకున్నారు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?
బిగ్బాస్ 8 తెలుగు చివరకొచ్చేసింది. ఫినాలే కోసం నువ్వానేనా అన్నట్లు పోటీ జరుగుతోంది. మరోవైపు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుంది. ఇందులో భాగంగా శనివారం ఎపిసోడ్లో టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు. తన కోరికని ఈ సీజన్లో నెరవేర్చుకున్న తేజ.. రెమ్యునరేషన్ కూడా బాగానే సంపాదించాడట. ఇంతకీ ఎన్ని లక్షలు అందుకున్నాడంటే?(ఇదీ చదవండి: నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రేరణ.. టాప్ 2లో గౌతమ్ పక్కా!: తేజ)అక్టోబరు 6న వైల్డ్ కార్డ్ ఎంట్రీల్లో ఒకడిగా టేస్టీ తేజ వచ్చాడు. ప్రారంభంలో ఉన్నంతలో బాగానే ఎంటర్టైన్ చేశాడు. తర్వాత తర్వాత అరుపులు గొడవలు ఎక్కువైపోయాయి. బాగా నస పెట్టేశాడు. దీంతో ఎలిమినేట్ కావడం అయితే పక్కా అనుకున్నారు. కాకపోతే అలా సేవ్ అయిపోతూ వచ్చాడు. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్లలో ఒకడిగా బయటకొచ్చేశాడు. ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే తన తల్లి వస్తుందని ఆశపడ్డాడు. అనుకున్నట్లే అది నెరవేర్చుకున్నాడు.హౌసులో 8 వారాలు పాటు ఉన్న తేజ.. ఒక్కో వారానికిగానూ లక్షన్నర అందుకున్నాడట. అంటే 8 వారాలకు గానూ రూ.12 లక్షలు తేజకి రాబోతున్నాయట. ఓ రకంగా చూసుకుంటే తేజకి ఇది మంచి మొత్తమే అని చెప్పొచ్చు. ఇదలా ఉంచితే ఆదివారం ఎపిసోడ్లో కన్నడ బ్యాచ్లో ఒకడైన పృథ్వీ ఎలిమినేట్ అయి బయటకు రాబోతున్నాడు. బహుశా వచ్చే వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు గట్టిగానే ఉన్నాయండోయ్!(ఇదీ చదవండి: Prithvi: అహంకారంతో విర్రవీగాడు.. ఎలిమినేట్ అయ్యాడు!) -
నెక్స్ట్ ఎలిమినేషన్ ప్రేరణ.. టాప్ 2లో గౌతమ్ పక్కా!: తేజ
నాగార్జున వచ్చీరావడంతోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించాడు. అయితే టికెట్ టు ఫినాలే గెలిచి అవినాష్ ఈ నామినేషన్స్ నుంచి తప్పించుకుని నేరుగా ఫైనల్కు వెళ్లిపోయాడని గుడ్న్యూస్ చెప్పాడు. అంతేకాదు ఫస్ట్ ఫైనలిస్ట్ అంటూ అతడికి ఓ ట్రోఫీ కూడా ఇచ్చారు. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..నోరు తీపి చేసిన బిగ్బాస్ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ను మనసులో కోరిక చెప్పమనగా.. మందు బాటిల్స్, స్వీట్స్ కావాలంటూ చిట్టా బయటపెట్టాడు. మందు కుదరదు కానీ స్వీట్స్తో సరిపెట్టుకోమంటూ బిగ్బాస్ గులాబ్జామూన్ పంపించి హౌస్మేట్స్ నోరు తీపి చేశాడు. అలాగే టికెట్ టు ఫినాలే టాస్క్లో అతడికి హౌస్మేట్స్ పెట్టిన బ్యాడ్జ్ ప్రకారం రూ.4 లక్షలు ప్రైజ్మనీలో యాడ్ చేశారు. అలా ప్రైజ్మనీ రూ.54,30,000కి చేరింది.బ్లాక్ టికెట్.. గోల్డెన్ టికెట్తర్వాత నాగ్.. హౌస్లో కొందరికి బ్లాక్ టికెట్, మరికొందరికి గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. ఎవరికి బ్లాక్ టికెట్ ఇవ్వాలని నిఖిల్ను అడగ్గా తేజ పేరు చెప్పాడు. గౌతమ్ వంతు రాగా.. అతిథులు బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తే వారితో సరిగా ప్రవర్తించలేదని ప్రేరణ పేరు సూచించాడు. దీంతో ఆమె ఫౌల్ గేమ్ ఆడిన వీడియో నాగ్ ప్లే చేశాడు. ఇలా ఆడితే బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వకపోతే ఏం చేస్తారన్నట్లు క్లాస్ పీకాడు. రోహిణి.. ఫౌల్ గేమ్ ఆడాడంటూ పృథ్వీకి బ్లాక్ టికెట్ ఇవ్వాలంది. గేమ్స్ గెలిస్తే టైటిల్ రాదు!అవినాష్.. నబీల్కు, తేజ.. విష్ణుకు బ్లాక్ టికెట్ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఎవరు ఈ సీజన్ విన్నర్ అనుకుంటున్నావని విష్ణును అడగ్గా తనే గెలుస్తానంది. గెలవాలంటే ఈ ఆట సరిపోదుకదా అని నాగ్ అంటుంటే.. ఆటలన్నీ గెలిచినవారు టైటిల్ సాధించినట్లు బిగ్బాస్ చరిత్రలోనే చూడలేదని వేదాంతం చెప్పింది. అది తప్పని, జనాలు.. ఆట, మాట.. ఇలా ప్రతి ఒక్కటి చూస్తారని స్పష్టం చేశాడు.గౌతమ్కు గోల్డెన్ టికెట్ప్రేరణ.. గౌతమ్కు బ్లాక్ టికెట్ ఇవ్వాలంది. గౌతమ్ అందుకు అర్హుడంటూ నబీల్, విష్ణు, పృథ్వీ, నిఖిల్ కూడా చేయెత్తారు. అప్పటివరకు హౌస్మేట్స్ చెప్పిన అందరికీ బ్లాక్ టికెట్ ఇచ్చుకుంటూ పోయిన నాగార్జున.. గౌతమ్కు మాత్రం బ్లాక్ టికెట్ ఇవ్వనంటూ గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. అలాగే రోహిణి, నిఖిల్, అవినాష్కు సైతం గోల్డెన్ టికెట్ ఇచ్చాడు. అనంతరం దమ్ము-దుమ్ము అని ఓ గేమ్ ఆడించాడు. ట్రోఫీని పైకి ఎత్తగల దమ్మున్న ప్లేయర్ ఎవరు? ఫినాలే వరకు రాకుండా దుమ్ముదుమ్మయిపోయే వ్యక్తి ఎవరు? అనేది చెప్పాలన్నాడు. నిఖిల్ దమ్మున్న ప్లేయర్నబీల్, పృథ్వీ, విష్ణుప్రియ.. నిఖిల్ దమ్మున్న ప్లేయర్ అని, తేజ దుమ్ము అని తెలిపారు. రోహిణి.. గౌతమ్ దమ్మున్న ప్లేయర్ అని, ప్రేరణ ఫినాలే వరకు రాకపోవచ్చంది. తేజ.. ఎంటర్టైనర్లు కూడా గెలవగలరని నిరూపిస్తారంటూ అవినాష్ దమ్మున్న ప్లేయర్ అన్నాడు. విష్ణు ఉట్టి దుమ్మున్న ప్లేయర్ అన్నాడు. గౌతమ్.. రోహిణి దమ్మున్న ప్లేయర్ అని, ప్రేరణ దుమ్ము అని తెలిపాడు. అవినాష్.. నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, ఫౌల్ గేమ్స్ ఆడతాడంటూ పృథ్వీని దుమ్ము కంటెస్టెంట్గా పేర్కొన్నాడు.గౌతమ్పై కోపాన్నంతా కక్కేసిన తేజతర్వాత తేజ.. గౌతమ్పై తన కోపాన్నంతా కక్కేశాడు. టికెట్ టు ఫినాలే ఆడే క్రమంలో ఓ గేమ్లో గౌతమ్ నా పేరు సెలక్ట్ చేయకపోవడంతో బాధేసిందని, అదే విషయం అతడిని నిలదీశానన్నాడు. నామినేషన్స్లో ప్రేరణతో అంత గొడవైనా కూడా ఆమెనే ఎందుకు సెలక్ట్ చేశాడు? అక్కడ నేను ఫ్రెండ్ కాబట్టి నన్ను సెలక్ట్ చేస్తే అతడికి సోలో బాయ్ అనే ట్యాగ్ పోతుందని వెనకడుగు వేశాడు. ప్రేరణను సెలక్ట్ చేస్తే తనకు మంచి పేరొస్తుందని లెక్కలు వేసుకున్నాడని తెలిపాడు.తేజ ఎలిమినేట్నా మనసుకు ఏదనిపిస్తే అది చేసుకుంటూ పోయా.. నువ్వు నమ్మినా, నమ్మకపోయినా అది నీ ఇష్టం అని గౌతమ్ ఒక్కముక్కలో తేల్చేశాడు. ఇక ప్రేరణ, నిఖిల్.. నబీల్ దమ్మున్న ప్లేయర్ అని, తేజ దుమ్ము కంటెస్టెంట్ అని అభిప్రాయపడ్డారు. తేజ ఆడలేకపోతున్నాడని పేర్కొన్నాడు. అనంతరం నాగార్జున తేజ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. తల్లిని హౌస్లోకి తీసుకురావాలన్న కల నెరవేర్చుకున్నాకే వెళ్లిపోతున్నానంటూ తేజ సంతోషపడితే అవినాష్ మాత్రం కంటనీరు పెట్టుకున్నాడు. స్టేజీపైకి వచ్చిన తేజతో నాగ్ ఓ గేమ్ ఆడించాడు. హౌస్మేట్స్ను కూరగాయలతో పోల్చాలన్నాడు. టాప్ 2లో గౌతమ్..అలా అవినాష్ ఉల్లిపాయ అని, ఈ సీజన్లో పెద్ద గెలుపు రోహిణిదేనంటూ బంగాళాదుంపతో పోల్చాడు. విష్ణుప్రియ కాకరకాయ అన్నాడు. ప్రేరణ.. మాట సరిగా లేకపోతే నెక్స్ట్ నువ్వే బయటకు వచ్చేస్తావని హెచ్చరిస్తూ బెండకాయ ఇచ్చాడు. పృథ్వీ.. విష్ణుప్రియను వదిలినట్లు కొన్ని గేమ్స్ కూడా వదిలేస్తున్నావంటూ పచ్చిమిర్చి ట్యాగ్ ఇచ్చాడు. గౌతమ్లో ఎన్ని పొరలుంటాయో వాడికే తెలీదంటూ క్యాబేజీతో పోల్చాడు. అతడు టాప్ 2లో పక్కాగా ఉంటాడనన్నాడు. నబీల్.. గేమ్లో కన్ఫ్యూజ్ అవుతున్నాడని, టాప్ 2లో ఉంటాడనుకుంటే ఇప్పుడు టాప్ 5కి వచ్చేశాడంటూ టమాటతో పోల్చాడు. నిఖిల్.. ఎమోషనల్గా వీక్ అంటూ అతడికి సోరకాయ ఇచ్చాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేక్షకులు అది పసిగడితే తేజ ఎలిమినేషన్ ఖాయం: ప్రేరణ
టికెట్ టు ఫినాలే గేమ్ తర్వాత హౌస్మేట్స్లో టెన్షన్ రెట్టింపైంది. ఎలాగైనా ఫైనల్లో చోటు దక్కించుకోవాలని అందరూ తాపత్రయపడుతున్నారు. కప్పు కొట్టాల్సిందేనని గట్టిగా ఫీలవుతున్నారు. అయితే బిగ్బాస్ 8 ట్రోఫీ ఎత్తగల దమ్మున్న ప్లేయర్ ఎవరు? ఫినాలే వరకు రాకుండా దుమ్ముదుమ్ముగా అయిపోయే కంటెస్టెంట్ ఎవరో చెప్పాలన్నాడు నాగ్.ట్రోఫీ అందుకు దమ్ము ఎవరికి?అలా నబీల్.. తన తర్వాత నిఖిల్ గెలిచే ఛాన్స్ ఉందన్నాడు. రోహిణి.. గౌతమ్ గెలుస్తాడని, ఫినాలే వరకు ప్రేరణ రాలేదని అభిప్రాయపడింది. తేజ.. విష్ణు దుమ్ముగా అయిపోతుందన్నాడు. పృథ్వీయేమో తేజ ఫినాలే వరకు రాలేడన్నాడు. అవినాష్.. పృథ్వీ దుమ్ము అని తెలిపాడు. ప్రేరణ మాట్లాడుతూ.. అవసరం లేని చోట కూడా తేజ కంటెంట్ క్రియేట్ చేస్తాడు. అది ప్రేక్షకులు పసిగడితే అతడు ఫినాలేకు రాడు అని చెప్పింది. అన్నట్లుగానే ఈ రోజు తేజ ఎలిమినేట్ కానున్నాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Prithvi: అహంకారంతో విర్రవీగాడు.. ఎలిమినేట్ అయ్యాడు!
నేనే తోపు అని ఎవరికి వారు డప్పు కొట్టుకుంటే పర్వాలేదు కానీ ఎదుటివారు తమకంటే తక్కువ అని చిన్నచూపు చూడటం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. బిగ్బాస్ హౌస్లో పృథ్వీ ఇదే చేశాడు. తను టాస్కులు బాగా ఆడతాడు. కానీ తనకు ఎదురొచ్చిన వ్యక్తులను మాత్రం కించపరుస్తాడు, అగౌరవపరుస్తాడు, నోటికొచ్చిన మాటలనేస్తాడు. అంతేకాదు, నువ్వేం చేయగలవన్నట్లు బాడీ షేమింగ్ కూడా చేస్తాడు. ఇదే అతడికి పెద్ద మైనస్.కనీసం కంటెండర్ కాలేకపోయాడురోహిణి, తేజ, అవినాష్.. ఈ ముగ్గురిలో ఎవరికీ టికెట్ టు ఫినాలే అందుకునే అర్హతే లేదన్నాడు. కానీ ఏం జరిగింది? టాస్కుల వీరుడు నిఖిల్తో పోటీపడి మరి అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచేశాడు. కనీసం పృథ్వీ టికెట్ టు ఫినాలే కోసం పోటీపడే కంటెండర్ కూడా కాలేకపోయాడు. ఆ మధ్య నువ్వేం పరిగెత్తగలవంటూ రోహిణిపై దిగజారుడు కామెంట్లు చేశాడు. తీరా ఏమైంది? మెగా చీఫ్ టాస్క్లో బలహీనురాలు అనుకున్న రోహిణి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు.డబుల్ ఎలిమినేషన్ఇప్పుడేకంగా రోహిణి కంటే ముందే ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని నాగ్ తాజా ప్రోమోలో ప్రకటించాడు. ఈ రోజు తేజను ఎలిమినేట్ చేయగా.. రేపు పృథ్వీని పంపించేసినట్లు తెలుస్తోంది. వైల్డ్కార్డ్స్ను తక్కువ అంచనా వేసిన పృథ్వీ.. రోహిణి, అవినాష్, గౌతమ్ కంటే ముందే వెళ్లిపోయాడు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నామినేషన్స్ నుంచి డైరెక్ట్గా టాప్ 5లోకి అవినాష్: నాగ్
అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచినప్పటి నుంచి అందరి మనసులో ఒకటే డౌట్.. అతడు డైరెక్ట్గా ఫినాలేలో అడుగుపెట్టినట్లేనా? లేదంటే ఈ వారం ఎలిమినేషన్ గండం గట్టెక్కితేనే ఫైనల్లో ఉంటాడా? అని! ఈ అనుమానాలకు నాగార్జున క్లారిటీ ఇచ్చేశాడు. అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్తాజా ప్రోమోలో నాగ్ మాట్లాడుతూ.. 'టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్.. ఈ వారం నామినేషన్స్ నుంచి బయటకు వచ్చి నేరుగా ఫైనల్స్కు వెళ్లాడు. ఈ సీజన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్' అని ప్రకటించాడు. అలాగే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని కూడా హింటిచ్చాడు. హౌస్లో కొందరికి గోల్డ్ టికెట్, మరికొందరికి బ్లాక్ టికెట్ ఇచ్చాడు. ఫస్ట్ బ్లాక్ టికెట్ ఎవరికి వస్తుందో గెస్ చేయమని నిఖిల్ను అడిగితే.. తనకు తెలియదని అమాయకంగా ముఖం పెట్టాడు. అందుకే సేఫ్ గేమ్ ఆడొద్దనేదంటూ నాగ్.. నిఖిల్కు చురకలంటించాడు.వీడియోతో దొరికిపోయిన ప్రేరణఇదే ప్రశ్న రోహిణిని అడగ్గా.. పృథ్వీకి బ్లాక్ టికెట్ ఇవ్వాలంది. నేను గేమ్స్ ఆడలేను, అతడు మాత్రమే ఆడగలను అని ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించేవాడని కారణం చెప్పింది. గౌతమ్ వంతురాగా.. బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారన్న కోపంతో ప్రేరణ.. గెస్టులతో కూడా సరిగా ప్రవర్తించలేదన్నాడు. ఈ క్రమంలో నువ్వు ఫెయిర్గా ఆడావా? అని నాగ్.. ప్రేరణను ప్రశ్నించాడు. ఆమె అవునని తలూపడంతో ఫౌల్ గేమ్ ఆడిన వీడియో ప్లే చేశాడు.విష్ణుప్రియను తప్పుపట్టిన ఆడియన్స్అది నా గేమ్ అని ప్రేరణ అనగా.. నువ్వు ఫెయిర్గా ఆడలేదన్నాడు నాగ్. హౌస్లో విన్నర్ ఎవరని విష్ణుప్రియను అడగ్గా ఆమె తన పేరే చెప్పింది. మరి విన్నర్లా ఆడుతున్నావా? అని నాగ్ అంటే.. నేను చూసిన సీజన్స్లో అన్ని ఆటలు గెలిచినవారు టైటిల్ కొట్టలేకపోయారు అంది. ఆమె అభిప్రాయాన్ని సెట్లో ఉన్న ఆడియన్స్ తప్పుపట్టారు. చదవండి: డబుల్ ఎలిమినేషన్.. తేజ అవుట్.. మరి అవినాష్? -
డబుల్ ఎలిమినేషన్.. తేజ అవుట్.. మరి అవినాష్?
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ కథ కంచికి చేరే సమయం ఆసన్నమైంది. ఈ వారమంతా టికెట్ టు ఫినాలే కోసం హౌస్మేట్స్ పోటీపడ్డారు. అనూహ్యంగా అవినాష్ ఈ టికెట్ టు ఫినాలే గెలిచి టాప్ 5కి చేరుకున్నాడు. అయితే ఈ వారం నామినేషన్స్ నుంచి బయటపడితేనే అది నెరవేరుతుంది.ఓటింగ్లో నిఖిల్ టాప్ఈ వారం రోహిణి తప్ప మిగతా ఎనిమిది మంది నామినేషన్స్లో ఉన్నారు. ఎప్పటిలాగే నిఖిల్ భారీ ఓటింగ్తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. రెండో స్థానంలో గౌతమ్, మూడో స్థానంలో నబీల్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. చిట్టచివరి స్థానాల్లో తేజ, అవినాష్ ఉన్నారు.తేజ ఎలిమినేట్!ఈ ఇద్దరిలో తేజను శనివారం ఎపిసోడ్లో ఎలిమినేట్ చేసినట్లు ఓ వార్త బయటకు వచ్చింది. మొదట్లో బాగానే ఆడిన తేజకు ఈ వారం పెద్దగా కలిసిరాలేదు. పైగా మనవాడు అని చెప్పుకుతిరిగే గౌతమ్పైనే నిందలు వేయడం అతడికి మరింత మైనస్ అయింది. ఫలితంగా ఎలిమినేట్ అవక తప్పలేదు.డబుల్ ఎలిమినేషన్రెండో ఎలిమినేషన్ ఎవరన్నదే ఆసక్తికరంగా మారింది. అవినాష్ ఆల్రెడీ ఫైనలిస్ట్ అని పక్కన పెడితే పృథ్వీని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మరి డబుల్ ఎలిమినేషన్లో బలయ్యే మరో కంటెస్టెంట్ ఎవరన్నది క్లారిటీ రావాలంటే సండే ఎపిసోడ్ షూటింగ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే!మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇన్నాళ్లకు విష్ణు కళ్లు తెరిపించిన శ్రీముఖి.. పృథ్వీతో కటీఫ్!
వైల్డ్కార్డ్స్కు టికెట్ టు ఫినాలే గెలిచే అర్హతే లేదన్నాడు పృథ్వీ.. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అవినాష్ టికెట్ టు ఫినాలే ఎగరేసుకుపోయాడు. పృథ్వీ జపం చేస్తున్న విష్ణు కళ్లు తెరిపించింది శ్రీముఖి. మరి శ్రీముఖి ఏం చెప్పిందో నేటి (నవంబర్ 29) ఎపిసోడ్ హైలైట్స్ చూసేయండి..నాలుగో కంటెండర్గా తేజరోహిణి, అవినాష్, నిఖిల్ 'టికెట్ టు ఫినాలే' కంటెండర్లుగా నిలిచారు. వీరికి ఓ వ్యక్తిని కంటెండర్గా ఎన్నుకునే సూపర్ పవర్ ఇచ్చాడు. ముగ్గురూ కలిసి తేజ పేరు సూచించారు. ఇది పృథ్వీకి ఏమాత్రం నచ్చలేదు. తేజ, అవినాష్, రోహిణి.. ఈ ముగ్గురికీ టికెట్ టు ఫినాలే అందుకునే అర్హత లేదన్నాడు. మరోవైపు తేజ, గౌతమ్తో గొడవపడ్డాడు. నువ్వు సోలోగా ఆడుతున్నావని చెప్పడానికి నన్ను ఆటలో సైడ్ చేశావంటూ నిందలు వేశాడు. నా నిర్ణయం నా ఇష్టం.. దానికి నువ్వు గౌరవమివ్వకపోతే నేనేం చేయలేను అని గౌతమ్ హర్టయ్యాడు.కరెక్ట్ గెస్ చేస్తే రూ.5 లక్షలుఅనంతరం యాంకర్ శ్రీముఖి హౌస్లో ఎంట్రీ ఇచ్చింది. రావడంతోనే ఎవరు టికెట్ టు ఫినాలే కొడతారో గెస్ చేయమని హౌస్మేట్స్తో చిన్న గేమ్ ఆడించింది. కరెక్ట్గా గెస్ చేస్తే రూ.5 లక్షలు ప్రైజ్మనీలో యాడ్ అవుతాయంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది పందెమనే అనుకోవచ్చు. దీంతో ఇంటిసభ్యులు చర్చించుకుని నిఖిల్కు రూ.5 లక్షల బ్యాడ్జ్, అవినాష్కు రూ.4 లక్షలు, రోహిణికి రూ.3 లక్షలు, తేజకు రూ.2 లక్షలు అని రాసి ఉన్న బ్యాడ్జ్ ఇచ్చారు.నాకోసం అతడిని వదిలెయ్శ్రీముఖి.. విష్ణుప్రియ కళ్లు తెరిపించే ప్రయత్నం చేసింది. మొదటి మూడు వారాలు నువ్వు గెలుస్తావేమో అనిపించింది. ఆటలో కనెక్షన్స్ ఏర్పడతాయి. ఒకర్ని ఇష్టపడటం తప్పు కాదు. కానీ ఈ రెండు వారాలు నాకోసం ఆ అబ్బాయి(పృథ్వీ)తో స్నేహం వదిలెయ్. అతడు నాకిష్టం లేదు, ఆసక్తి లేదు అని అన్నిసార్లు చెప్తున్నా కూడా నువ్వు ఎందుకు దిగజారి అతడి వెనకపడుతున్నావ్? నువ్వు ఎంకరేజ్ చేయకపోతే అతడు ఆడడా? నీ ప్రేమకు విలువిచ్చి చెప్తున్నా.. ఒక్కరికే కాకుండా అందరినీ సపోర్ట్ చేయు అని మంచి మాటలు చెప్పింది. ఆశలు పెట్టుకోవద్దని చెప్పా: పృథ్వీఅటు పృథ్వీ దగ్గరకు వెళ్లి కూడా.. అందరూ మీ గురించి అడుగుతున్నప్పుడు స్టాండ్ తీసుకోవాలి కదా అని అడిగింది. అందుకతడు.. నీపై ఆశలు పెట్టుకోవచ్చా? అని విష్ణు అడిగినప్పుడు కూడా నాపై ఎటువంటి ఆశ పెట్టుకోవద్దు అని స్పష్టంగా చెప్పానన్నాడు. ఏదైనా ఉంటే షో అయిపోయాక చూసుకుందామని మీ ఇద్దరూ మాట్లాడుకోండని ఉచిత సలహా ఇచ్చింది. దీంతో విష్ణు.. పృథ్వీతో తన స్నేహాన్ని పక్కనపెట్టి గేమ్పై ఫోకస్ చేస్తానని చెప్పింది.టికెట్ టు ఫినాలే గెలిచిన అవినాష్అనంతరం గుర్తుపట్టు, గంట కొట్టు అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో తేజకు 1, రోహిణికి 2, అవినాష్కు 3, నిఖిల్కు 4 పాయింట్లు వచ్చాయి. తక్కువ పాయింట్లు వచ్చిన తేజ గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత శ్రీముఖి అందరికోసం వంట చేయడం విశేషం. అనంతరం రోహిణి, అవినాష్, నిఖిల్కు.. కేవలం ఒక్క అడుగుదూరం అనే గేమ్ ఇచ్చాడు. ఇందులో అవినాష్ విజయం సాధించి టికెట్ టు ఫినాలే గెలిచాడు. తన కల నెరవేరడంతో అవినాష్ సంతోషంలో మునిగి తేలాడు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్ 8: ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరంటే?
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ ముగింపుకు వచ్చేసింది. డైరెక్ట్గా ఫినాలేలో అడుగుపెట్టేందుకు ఎప్పటిలాగే బిగ్బాస్ టికెట్ టు ఫినాలే టాస్క్ ప్రవేశపెట్టాడు. ఇప్పటికే ఈ టాస్క్లో అవినాష్, రోహిణి, నిఖిల్ కంటెండర్లుగా నిలిచారు. నేడు హౌస్లోకి వచ్చిన యాంకర్ శ్రీముఖి వారిలో ఒకర్ని ఫైనలిస్టుగా ప్రకటించనుంది.కిచెన్లో మళ్లీ కయ్యంఈ మేరకు ఓ ప్రోమో కూడా రిలీజైంది. అయితే ఎప్పటిలాగే మరోసారి కిచెన్లో కయ్యం మొదలైంది. ఒక్కొక్కరికి రెండు దోశలు వేస్తోంది ప్రేరణ. తనకు ఒక చీజ్ దోశ కావాలని రోహిణి అడిగితే అందుకు ప్రేరణ ఒప్పుకోలేదు. చీజ్ దోశ తిన్నవాళ్లు ప్లేన్ దోశ తినలేరంటూ అడ్డు చెప్పింది. దానికి తేజ అభ్యంతరం చెప్పాడు. ఇలా మధ్యలో దూరడం తప్పని ప్రేరణ అనగా.. అందరికీ సమానంగా పెట్టమని చెప్పానంతేనని తేజ బదులిచ్చాడు.టికెట్ టు ఫినాలే ఎవరి సొంతం?తర్వాత శ్రీముఖి హౌస్లో అడుగుపెట్టింది. ఇకపోతే అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచినట్లు ఓ వార్త వైరలవుతోంది. అదే నిజమైతే ఈ సీజన్లో ఫినాలేలో అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్ అవినాష్ అవుతాడు. అయితే ఈ వారం గండం గట్టెక్కితేనే అది సాధ్యమవుతుంది. అసలే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉంది. పైగా అవినాష్ నామినేషన్స్లో ఉన్నాడు. ఈ ఒక్కవారం సేవ్ అయ్యాడంటే టాప్ 5లో బెర్త్ కన్ఫామ్ అయినట్లే! మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణతో వచ్చిన తంటా ఇదే! పృథ్వీ పొరపాటు నిఖిల్కు కలిసొచ్చింది!
గెస్టులుగా వస్తున్న మాజీ కంటెస్టెంట్లు అందరూ విష్ణు-పృథ్వీ లవ్ట్రాక్పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందరికీ మామీద ఎందుకంత ఇంట్రస్ట్ అని విష్ణుప్రియ కాస్త అసహనానికి లోనైంది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 28) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..హౌస్లో వితికా, పునర్నవిఅవినాష్ టికెట్ టు ఫినాలే కంటెండర్ అవడాన్ని ప్రేరణ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. అవినాష్ ఓవర్ స్మార్ట్ అనుకున్నానే తప్ప అతడికంత దమ్ముందని అనుకోలేదంది. ఇంతలో మాజీ కంటెస్టెంట్లు వితికా షెరు, పునర్నవి భూపాలం హౌస్లో ఎంట్రీ ఇచ్చారు. హౌస్మేట్స్తో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడించారు. క్రష్ కోసం ఫ్రెండ్ను వదులుకున్నావా? అని పృథ్వీని అడగ్గా లేదని బదులిచ్చాడు.అబద్ధం చెప్పానన్న నిఖిల్మీరు ఆడిన అతిపెద్ద అబద్ధమేంటన్న ప్రశ్నకు నిఖిల్.. మెంటల్గా నేను స్ట్రాంగ్ అని అబద్ధమాడానన్నాడు. ట్రూలవ్ - నో ఫ్రెండ్స్, ట్రూ ఫ్రెండ్- నో లవ్.. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటావని నబీల్ను ప్రశ్నించగా అతడు క్షణం ఆలోచించకుండా ఫ్రెండ్స్ కన్నా ప్రేమే ముఖ్యమని బదులిచ్చాడు. ప్రస్తుతానికైతే సింగిల్ కింగునని తెలిపాడు.సింపతీ కార్డు?తర్వాత పునర్నవి విష్ణు-పృథ్వీలను ఇంటరాగేట్ చేసింది. విష్ణు ఫ్రెండ్ అని పృథ్వీ.. పృథ్వీ ఫ్రెండ్ కంటే ఎక్కువ అని విష్ణు చెప్పారు. ఈ స్నేహం వల్ల మీ గేమ్ పాడవుతుందనుకుంటున్నారా? అని ప్రశ్నించగా.. అలా ఏం లేదన్నాడు పృథ్వీ. విష్ణును సింపతీ కార్డులా వాడుతున్నావని పునర్నవి అనగా అలాంటి కార్డు తనకక్కర్లేదన్నాడు. అనంతరం వితికా, పునర్నవి.. గేమ్ కోసం నిఖిల్, గౌతమ్ను సెలక్ట్ చేశారు. వీళ్లిద్దరూ పృథ్వీ, ప్రేరణను ఎంపిక చేశారు. పృథ్వీకి అన్యాయంతన పేరును పరిగణనలోకి తీసుకోకపోవడంతో తేజ హర్టయ్యాడు. జారుతూ గెలువు అని బిగ్బాస్ గేమ్ పెట్టాడు. ఈ గేమ్లో నిఖిల్ 9, పృథ్వీ 10, ప్రేరణ, గౌతమ్ చెరో 5 డిస్కులు బాస్కెట్లో వేశారు. పృథ్వీ గేమ్లో చిన్న పొరపాటు చేశాడని అతడికి బదులుగా నిఖిల్ను విజేతగా ప్రకటించడం గమనార్హం. అలా పృథ్వీకి 2, ప్రేరణకు 3, గౌతమ్కు 4వ ర్యాంక్ ఇచ్చారు.ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ఈ గ్యాప్లో అవినాష్, రోహిణి, తేజ కామెడీ స్కిట్తో తెగ నవ్వించారు. తర్వాత రెండో గేమ్ ఆడించారు. కానీ ఇక్కడ ముగ్గురికే ఛాన్స్ ఉంటుందనడంతో ప్రేరణను తప్పించి మిగతా ముగ్గురితో ఆడించారు. సంచాలక్గా ఉన్నప్పుడు తమ మాట వినలేదంటూ ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు. ఆ బ్యాడ్జ్ తనకెలా ఇస్తారని గెస్టులతో వాగ్వాదానికి దిగింది. ఇంతలో బిగ్బాస్.. టికెట్ టు ఫినాలే రేస్ నుంచి ప్రేరణను తొలగించినట్లు ప్రకటించడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.కోపం, బాధర్యాంకుల ఆధారంగా బిగ్బాస్ ఇచ్చిన అడ్వాంటేజ్తో నిఖిల్, పృథ్వీ, గౌతమ్ గేమ్ ఆడారు. ఈ గేమ్లో నిఖిల్ గెలవగా గౌతమ్ రెండో స్థానంలో, పృథ్వీ మూడో స్థానంలో నిలిచారు. రెండు గేమ్స్లో నిఖిల్నే విజేతగా ప్రకటించడంతో అతడికే కంటెండర్ బ్యాడ్జ్ ఇచ్చారు. గెస్టులు వెళ్లిపోతుంటే కూడా ప్రేరణ వారితో మాట్లాడేందుకు నిరాసక్తత చూపించింది. హత్తుకునేందుకు వస్తే కూడా ముఖం తిప్పేసుకుంది. రేసు నుంచి తీసేశారన్న బాధ ఉండటం సహజమే.. కానీ దాన్నిలా రూడ్గా వ్యక్తం చేయడం వల్లే తనకు మైనస్ అవుతోంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టికెట్ టు ఫినాలే: మూడో కంటెండర్గా నిఖిల్, షాక్లో తేజ
బిగ్బాస్ హౌస్లోకి మాజీ కంటెస్టెంట్ల రాక కొనసాగుతోంది. ఇప్పటివరకు అఖిల్, దేత్తడి హారిక, మానస్, ప్రియాంక జైన్ వచ్చి వెళ్లగా నేడు పునర్నవి, వితికా షెరు ఇంట్లో అడుగుపెట్టారు. వీరు గేమ్స్ ఆడేందుకు నిఖిల్, గౌతమ్ను సెలక్ట్ చేశారు. వీళ్లిద్దరూ మరో ఇద్దర్ని సెలక్ట్ చేయాల్సి రాగా నిఖిల్.. పృథ్వీ పేరు సూచించాడు. గౌతమ్ క్షణం ఆలోచించకుండా ప్రేరణ పేరు ఎంపిక చేశాడు.షాక్లో తేజతన పేరు చెప్తాడని ఊహించిన తేజకు ఇది పెద్ద షాకే! నన్నెందుకు సెలక్ట్ చేయలేదని తేజ హర్టయ్యాడు. గెలిచినా, గెలవకపోయినా అవకాశం వస్తుందేమో ఆడదామనుకున్నాను, ఇలా సెలక్ట్ చేయనప్పుడు బాధనిపిస్తుంది.. దీన్ని సింపతీ అనుకుంటే నేనేం చేయలేను అని తేజ ఫ్రస్టేట్ అయ్యాడు. ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ఫైనల్గా నిఖిల్ గెలిచి కంటెండర్ అవగా ప్రేరణకు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చినట్లు భోగట్టా! తనను టికెట్ టు ఫినాలే రేసులో నుంచి తీసేయడంతో ప్రేరణ అస్సలు తట్టుకోలేకపోతుందట! మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అమ్మలా ప్రేమను పంచాడు, నెత్తిన పెట్టుకున్నాడు: విష్ణుప్రియ లవ్స్టోరీ
అవినాష్ను తక్కువ అంచనా వేసిన నబీల్, ప్రేరణకు దిమ్మతిరిగి బొమ్మ కనబడింది. ఇచ్చిన రెండు గేమ్స్లోనూ అతడే గెలిచి విన్నరయ్యాడు. కంటెండరవ్వాలనుకున్న నబీల్ రేసులోనే లేకుండా పోయాడు. అటు విష్ణుప్రియ... తన మాజీ ప్రియుడిని గుర్తు చేసుకుంది. తన ప్రేమ కహానీని పృథ్వీతో పంచుకుంది. అదేంటో నేటి (నవంబర్ 27) ఎపిసోడ హైలైట్స్లో చదివేయండి..తక్కువ అంచనా వేశారుటికెట్ టు ఫినాలే కోసం హౌస్మేట్స్తో గేమ్స్ ఆడించేందుకు మానస్, ప్రియాంక జైన్ బిగ్బాస్ ఇంట్లోకి వచ్చారు. వీళ్లు ప్రేరణ, నబీల్ను గేమ్ ఆడేందుకు సెలక్ట్ చేశారు. అయితే ఈ రోజు బ్రెయిన్ గేమ్లో నలుగురు ఆడే ఛాన్స్ ఉందంటూ మరో ఇద్దర్ని ఎంపిక చేయమన్నాడు బిగ్బాస్. దీంతో ప్రేరణ, నబీల్.. ఐక్యూ అంతగా లేదు, బ్రెయిన్ గేమ్ ఆడలేరంటూ అవినాష్, పృథ్వీని సెలక్ట్ చేశారు.సుడోకు గేమ్అలా ఈ నలుగురికి సుడోకు గేమ్ ఇచ్చాడు. ఈ గేమ్లో ముందుగా నబీల్ గంట కొట్టి గెలిచేసినంత బిల్డప్ ఇచ్చాడు. తీరా చూస్తే అన్నీ తప్పులతడకగానే ఉంది. ఏ ఒక్కరూ సుడోకు పూర్తి చేయకపోవడంతో బిగ్బాస్ క్లూ ఇచ్చాడు. ఆ క్లూ అందుకుని అవినాష్ చకచకా సుడోకు పూర్తి చేసి గంట కొట్టాడు. తర్వాత ప్రేరణ, పృథ్వీ, నబీల్ గేమ్ కంప్లీట్ చేశారు. వీళ్లందరికీ బిగ్బాస్ కొన్ని మూటలు ఇచ్చాడు. అందులో అవినాష్కు 8 బాల్స్, ప్రేరణకు 6, పృథ్వీకి 5, నబీల్కు 4 బంతులు ఉన్నాయి.అవినాష్ గెలుపుపై నబీల్ డౌట్అవినాష్ గెలుపుపై నబీల్ అనుమానపడ్డాడు. తేజ, నువ్వేమైనా సాయం చేశావా? అని అడిగాడు. ఎవరూ సాయం చేయలేదని హౌస్మేట్స్ అందరూ క్లారిటీ ఇచ్చారు. అంతా అయిపోయాక నబీల్.. నువ్వు ఆడలేవని అనలేదు, ఎవరైనా సాయం చేశారనిపించి అడిగానంతే.. నీకు కోపం వస్తే అప్పుడే తిట్టాల్సిందంటూ అవినాష్కు సారీ చెప్పాడు. తర్వాత హౌస్మేట్స్ అందరూ కలిసి కామెడీ స్కిట్తో కడుపుబ్బా నవ్వించారు.మళ్లీ గెలిచేసిన అవినాష్అనంతరం పృథ్వీ, ప్రేరణ, అవినాష్, నబీల్.. వారు పొందిన బంతులతో నేర్పుగా సాగు- స్కోర్ పొందు అని మరో గేమ్ ఆడారు. ఈ టాస్క్లో అవినాష్ అందరికంటే ఎక్కువగా 43 పరుగులు చేసి గెలిచాడు. పృథ్వీ, ప్రేరణ.. 30 పరుగులు చేయగా, నబీల్ 24 పరుగులు చేశాడు. చివర్లో రెండు బంతుల్ని ఎవరికైనా ఇవ్వొచ్చు అని మానస్, ప్రియాంకకు బిగ్బాస్ ఛాన్స్ ఇచ్చాడు. కానీ వాళ్లు అందుకు అంగీకరించలేదు.విష్ణుప్రియ బ్రేకప్ స్టోరీరెండు టాస్కులు గెలిచిన అవినాష్కు కంటెండర్ బ్యాడ్జ్ ఇచ్చారు. నబీల్కు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి టికెట్ టు ఫినాలే రేసులో నుంచి తొలగించారు. చివర్లో విష్ణు, మానస్ కలిసి జరీజరీ పంచె కట్టి.. పాటకు ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేశారు. మాజీ బాయ్ఫ్రెండ్ గుర్తురావడంతో అర్ధరాత్రి పృథ్వీపక్కన చేరి ముచ్చట్లు పెట్టింది విష్ణు. కలలో తనకు మాజీ బాయ్ఫ్రెండ్ వచ్చాడంది. బ్రేకప్ నువ్వు చెప్పావా? అని పృథ్వీ అడగ్గా.. అవును, నేనే బ్రేకప్ చెప్పానంది. తల్లి స్థానమిచ్చా..తెలీకుండా రెండు తప్పులు చేశాడు. నా మంచి కోసమే చేశాడు. నాకు తెలిస్తే భరించలేనని చెప్పలేదు. తీరా తెలిశాక నేను నిజంగా భరించలేకపోయాను. నాకోసమే కొన్ని పనులు చేసినా అవి నాకస్సలు నచ్చలేదు. అవి నా ముఖంపై చెప్పేంత ధైర్యం లేని వ్యక్తితో ఉండకూడదనుకున్నాను, బ్రేకప్ చెప్పాను. కానీ అతడికి నా తల్లి స్థానమిచ్చాను.నెత్తిన పెట్టుకుని చూసుకున్నాడుకాబట్టి తనను చూడకుండా ఉండలేకపోతున్నాను. అతడు నా బలం. తనను హత్తుకుంటే మా అమ్మను హత్తుకున్నట్లే ఉంటుంది. నన్ను నెత్తిమీద పెట్టుకుని చూసుకున్నాడు. అమ్మలాగా స్వచ్ఛంగా ప్రేమించాడు అంటూ అతడి జ్ఞాపకాలను పృథ్వీతో పంచుకుంది. అయితే అతడెవరనేది మాత్రం బయటపెట్టలేదు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బొక్కబోర్లా పడ్డ నబీల్.. తన సత్తా చూపించిన అవినాష్
టికెట్ టు ఫినాలే కోసం మాజీ కంటెస్టెంట్లు హౌస్లోకి వస్తున్నారు. ఇప్పటికే అఖిల్, హారిక వచ్చి గేమ్స్ ఆడించగా అందులో కమెడియన్ రోహిణి గెలిచి ఫస్ట్ కంటెండర్గా నిలిచింది. తాజాగా హౌస్లో మానస్, ప్రియాంక జైన్ అడుగుపెట్టారు. వీళ్లు పృథ్వీ, నబీల్, ప్రేరణ, అవినాష్తో సుడోకు గేమ్ ఆడించారు. నబీల్ అత్యుత్సాహంఇందులో నబీల్ తాను అందరికంటే ముందు విజయవంతంగా పూర్తి చేసేశాననుకుని సంతోషంతో గెంతులేశాడు. తీరా మానస్ వెళ్లి చూస్తే అక్కడ అన్నీ తప్పులే ఉన్నాయి. ఏ ఒక్కరూ ఈ గేమ్ పూర్తి చేయకపోవడంతో బిగ్బాస్ చిన్న క్లూ వదిలాడు. ఆ క్లూ సాయంతో అవినాష్ అందరికంటే ముందు సుడోకు పూర్తి చేశాడు. అతడి విజయాన్ని జీర్ణించుకోలేకపోయిన నబీల్.. అవినాష్కు ఏమైనా సాయం చేశావా? అంటూ తేజను ప్రశ్నించాడు. కంటెండర్గా మరో కమెడియన్అది విని అవినాష్ షాకవగా.. ఏమో, అక్కడ జనాలు దగ్గరున్నారని అడిగానంటూ తన కుళ్లు, అనుమానాన్ని బయటపెట్టాడు. మొత్తానికి కమెడియన్ అవినాష్ తనకు ఇచ్చిన టాస్కులు గెలిచి కంటెండర్గా నిలిచాడు. ఎంటర్టైనర్లకు టాస్కులు ఆడి గెలిచే సత్తా కూడా ఉందని రోహిణి, అవినాష్ నిరూపించారు. ఇకపోతే ఈరోజు నబీల్కు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి అతడిని రేసులో నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేమపై విష్ణుప్రియ క్లారిటీ.. ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి!
బిగ్బాస్ 8 చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఫినాలే ఉండనుంది. దీంతో సోమవారం నామినేషన్స్ హోరాహోరీగా సాగాయి. మెగాచీఫ్ రోహిణి తప్పితే విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, తేజ, అవినాష్, నిఖిల్, నబీల్ నామినేట్ అయ్యారు. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పుడు టికెట్ టూ ఫినాలే కూడా షురూ చేశారు. ఇంతకీ మంగళవారం (నవంబర్ 26) ఎపిసోడ్లో ఏం జరిగిందనేది చూద్దాం.(ఇదీ చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజ్)నామినేషన్స్ పూర్తవడంతో సోమవారం ఎపిసోడ్ అయ్యింది. గతవారం ఈ సీజన్లోని పాల్గొని ఎలిమినేట్ అయిన పాత కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేశారు. ఇప్పుడు గత సీజన్లలో పాల్గొన్న పలువురు హౌస్మేట్స్ వచ్చారు. టికెట్ టూ ఫినాలే పోటీలు పెట్టారు. నాలుగో సీజన్ ఫేమ్ అఖిల్ సార్ధక్, అలేఖ్య హారిక తొలుత వచ్చారు. వీరిని చూసి హౌస్మేట్స్ షాకయ్యారు. ఏందిరా బాబు మరో సెట్.. వైల్డ్ కార్డులను దింపుతున్నారా ఏంటా అని భయపడ్డారు. కానీ విషయం తెలిసి రిలాక్స్ అయ్యారు.వచ్చాక సరదాగా ముచ్చట్లు పెట్టిన అఖిల్.. విష్ణుప్రియను ఇన్ డైరెక్ట్గా కౌంటర్స్ వేశాడు. లైఫ్ అంటే అంతే కదా, కొందరిని అక్కడే వదిలేసి ముందుకెళ్తే ప్రయాణం ఇంకా చాలా బాగా వెళ్తుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఓటమినైనా లేకపోతే ప్రేమలో ఓడిపోయినా దాన్ని తీసుకుని ముందుకెళ్తే లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఎవరికి చెబుతున్నానో వాళ్లకి అర్థమవుతుందని అఖిల్ అన్నాడు. ఎక్కడో ఈ రిలేషన్షిప్లో నాకు ఇది రైట్ అనిపించలేదు. అది మార్చుకుంటే బావుంటుందేమోనని అనిపించింది.. విష్ణు నీ గురించే నేను చెబుతున్నానని అఖిల్ అన్నాడు.(ఇదీ చదవండి: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)దీంతో విష్ణుప్రియ రియాక్ట్ అయింది. 'ఓ వ్యక్తిపై ఇష్టం మాత్రమే.. అది ప్రేమనా లేదంటే ఇంకేమైనా అని నేను ఎక్కడా చెప్పలేదు. ఇక్కడ మనం ఎలా ఉండాలో అలా ఉండటానికే వచ్చాం. నేను 100 శాతం నాకు నేనులానే ఉంటున్నాను' అని చెప్పుకొచ్చింది. ఓవైపు ఇది జరుగుతుండగా హారిక.. పృథ్వీ దీనిపై నీ అభిప్రాయం ఏంటని అడిగింది. దీంతో క్లారిటీ ఇచ్చేశాడు. ఫస్ట్ విష్ణు వచ్చినప్పుడు మేము గుడ్ ఫ్రెండ్స్, ఆమె తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత నేను క్లారిటీ కూడా ఇచ్చేశా. ఈ రిలేషన్షిప్ ఇవన్నీ నాకు సెట్ కాదు. నాకు అలాంటి ఫీలింగ్స్ రాదు.. కానీ తను నాకు ఒక మంచి ఫ్రెండ్ అని పృథ్వీ ఖరాఖండీగా చెప్పేశాడు.ఇలా పృథ్వీతో రిలేషన్ గురించి విష్ణు-అఖిల్ మధ్య చాలానే డిస్కషన్ సాగింది. కానీ చివరకు అసలు ఈమెని ఎందుకు ఇదంతా అడిగానా అని అఖిల్ అనుకుని నోరు మూసుకోవడంతో ఎండ్ అయింది. ఇన్నాళ్లు లవ్ బర్డ్స్ అన్నట్లు తెగ పోజులు కొట్టారు కానీ వీళ్లిద్దరూ షో కోసమే ఈ డ్రామా అంతా నడిపించారని అఖిల్-హారిక అడగడం.. విష్ణుప్రియ క్లారిటీ ఇవ్వడంతో అర్థమైంది. టికెట్ టూ ఫినాలే కోసం పోటీదారుల్ని సెలెక్ట్ చేయాలని అఖిల్-హారికకు బిగ్బాస్ చెప్పగా.. వీళ్లిద్దరూ గౌతమ్, రోహిణిని తొలుత ఎంపిక చేశారు. మరో ఇద్దరిని కూడా సెలెక్ట్ చేయాలని చెప్పగా.. తేజ, విష్ణుప్రియని పోటీలోకి దించారు.(ఇదీ చదవండి: హీరో అఖిల్తో ప్రేమ-నిశ్చితార్థం.. ఎవరీ జైనాబ్?)ఈ నలుగురికి కలిపి 'ది లిమిట్లెస్ బ్రిడ్జి' టాస్క్ పెట్టారు హౌసులోకి వచ్చిన అఖిల్-హారిక. ఇందులో చకచకా బ్రిడ్జి కంప్లీట్ చేసిన రోహిణి విజేతగా నిలిచింది. ఆ తర్వాత గౌతమ్, విష్ణుప్రియ పూర్తి చేశారు. టేస్టీ తేజ మాత్రం బజర్ మోగే వరకూ చేయలేకపోయాడు. ఈ పోటీలో గెలిచిన రోహిణికి తదుపరి ఛాలెంజ్లో పెద్ద ప్రయోజనం లభిస్తుందని బిగ్బాస్ ప్రకటించాడు. తులాభారం' అని మరో టాస్క్ కూడా పెట్టారు. ఇందులోనూ రోహిణి విజేతగా నిలిచింది. ఈ రెండు టాస్క్ల బట్టి మిగిలిన ముగ్గురిలో ఒకరికి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాలని బిగ్బాస్ ఆదేశించాడు. ఈ బ్యాడ్జి దక్కిన వారికి ఇక టికెట్ టూ ఫినాలే టాస్కులు ఆడేందుకు వీల్లేదు. రేసు నుంచి తప్పుకున్నట్లే అని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చాడు.అఖిల్-హారిక డిసైడ్ చేసుకుని విష్ణుప్రియకు బ్లాక్ బ్యాడ్జిని ఇచ్చారు. దీంతో విష్ణు ఏడుపు మొదలుపెట్టింది. తేజ కంటే బాగానే ఆడాను కదా అని పృథ్వీ దగ్గరకొచ్చి తెగ బాధపడిపోయింది. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. విష్ణు.. టికెట్ టూ ఫినాలే పోటీల్లో పాల్గొనే అవకాశం కోల్పోయింది కాబట్టి ఈవారం ఆమె ఏమైనా ఎలిమినేట్ అవుతుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పుష్ప 2' నిడివి లాక్.. ఏకంగా అన్ని గంటలా?!) -
శివంగి మళ్లీ గెలుపు.. బిగ్బాస్ 8 తొలి ఫైనలిస్ట్ ఎవరంటే?
బిగ్బాస్ చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఫినాలే జరగబోతుంది. దీంతో ఎవరెవరు ఫైనల్లో ఉండాలనేది ఇప్పటి నుంచే పోటీలు పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటిలా గేమ్స్ పెడితే కిక్ ఏముంటుందా అని గతంలోని కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి మరీ కొత్త వాళ్లతో పోటీలు పెడుతున్నారు. అలా ఈ రోజు అఖిల్, హారిక వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.'టికెట్ టూ ఫినాలే'లో మొదటి ఫైనలిస్ట్ అయ్యేందుకు పోటీదారుల్ని ఎంపిక చేయాలని హౌస్లోకి వచ్చిన అఖిల్, హారికకు బిగ్బాస్ చెప్పగా.. తేజ, గౌతమ్, రోహిణి, విష్ణుప్రియని ఎంపిక చేశారు. దీంతో వీళ్లకు టాస్క్ ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్లోని కలర్ బాక్సులని తీసుకొచ్చి, రెయిన్ బో ఆకారం వచ్చేలా చేయాలి. తొలుత రోహిణి సరిగా పేర్చింది కానీ అవి పడిపోయాయి. ఆ తర్వాత తేజ కూడా పెట్టాడు కానీ అవి నిలబడలేదు.(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడు శ్రీ తేజ్పై పోలీసు కేసు)రోహిణి అన్ని సరిగా పేర్చి త్వరగా వెళ్లి గంట కొట్టింది. దీంతో తెగ సంబరాలు చేసుకుంది. ఈ క్రమంలోనే రోహిణి.. టికెట్ టు ఫినాలే తొలి ఫైనలిస్ట్ అని అంటున్నారు. కానీ బిగ్ బాస్.. మళ్లీ పోటీలు పెడతాడా? లేదంటే రోహిణిని ఫైనలిస్ట్గా ఫిక్స్ చేస్తాడా అనేది చూడాలి?కొన్నిరోజుల ముందు వరకు ఎంటర్టైనర్గా అదరగొట్టిన రోహిణి.. గతవారం కుండని బ్యాలెన్స్ చేసే టాస్కులో మాత్రం చివరివరకు నిలబడి గెలిచింది. కాలునొప్పి బాధిస్తున్నా సరే విజేతగా నిలిచి మెగాచీఫ్ అయింది. ఒక్కసారి తన గ్రాఫ్ పెంచుకుంది. ఒకవేళ ఈమె గనక తొలి ఫైనలిస్టు అయితే మాత్రం మంచిదే!(ఇదీ చదవండి: విషాదం.. టాలీవుడ్ గీత రచయిత కన్నుమూత) -
ఓపక్క తిట్టుకుంటూ మరోపక్క బుగ్గ గిల్లుతూ నామినేషన్స్
నామినేషన్స్లో ఫైర్ చూపించాలని నబీల్ బాగా తాపత్రయపడ్డాడు. నాగార్జున మాటలతో గౌతమ్ డిస్టర్బ్ అయ్యాడో, ఏమోకానీ ఓపక్క కోప్పడుతూనే మరోపక్క బాధపడుతున్నట్లు కనిపించింది. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి (నవంబర్ 25) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..ఫైర్ లేదుబిగ్బాస్ హౌస్లో పదమూడోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఫైనలిస్టుగా చూడకూడదనుకుంటున్న ఇద్దర్ని నామినేట్ చేయాలన్నాడు బిగ్బాస్. మొదటగా నబీల్.. నామినేషన్స్లో తప్ప గేమ్లో ఫైర్ లేదంటూ గౌతమ్ను నామినేట్ చేశాడు. నబీల్తో పెట్టుకుంటే బొరాన్ ఉంటదంటూ దమ్కీ ఇచ్చాడు.ఆ ఫోకస్ గేమ్పై చూపించునీ గేమ్ కనిపించడం లేదు, నీకు సీరియస్నెస్ లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు. ఒక మనిషిపై పెట్టిన ఫోకస్ గేమ్పై పెడ్తే గెలుస్తావని సలహా ఇచ్చాడు. కానీ ఈ సలహాలు పట్టించుకునే పరిస్థితిలో విష్ణు లేదు. పృథ్వీ వంతురాగా.. అమ్మాయిలు గొడవపడ్తున్నప్పుడు మెగా చీఫ్గా నువ్వు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించలేదంటూ అవినాష్ను నామినేట్ చేశాడు.తొడగొట్టిన అవినాష్ఎంటర్టైన్మెంట్ తప్ప ఏమీ చేయట్లేదు, ఆడియన్స్ నిన్ను నామినేషన్స్లోకి వచ్చినవారమే ఎలిమినేట్ చేశారు, కానీ నబీల్ ఎవిక్షన్ షీల్డ్తో సేవ్ చేశాడని ఎగతాళి చేశాడు. దీంతో అవినాష్.. నేను వచ్చిన ఏడువారాల్లో రెండుసార్లు మెగా చీఫ్ అయ్యానంటూ తొడగొట్టి చెప్పాడు. తర్వాత పృథ్వీ.. కెమెరాలతో మాట్లాడటం, ఏం పీకుతావనడం నచ్చలేదంటూ గౌతమ్ను నామినేట్ చేశాడు. ఇక్కడ వీళ్లిద్దరూ బుగ్గలు గిల్లుకోవడం గమనార్హం.విష్ణు ఎవర్ని నామినేట్ చేసిందంటే?ప్రేరణ.. గెలవాలన్న స్పిరిట్ నీలో లేదంటూ విష్ణుప్రియను, నువ్వు గెలవకూడదంటూ గౌతమ్ను నామినేట్ చేసింది. ఈ క్రమంలో ప్రేరణ, గౌతమ్ చాలాసేపు గొడవపడ్డారు. తేజ.. నీ గేమ్ నచ్చలేదంటూ విష్ణును, ఎదుటివారిని రెచ్చగొడుతున్నావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. విష్ణుప్రియ.. తేజను, ప్రేరణను నామినేట్ చేసింది.మాట తప్పావ్: గౌతమ్గౌతమ్.. ఫిజికల్ అవకూడదని చెప్పిన నువ్వే చాలా గేమ్స్లో ఫిజికల్ అయ్యావని నిఖిల్ను నామినేట్ చేశాడు. పృథ్వీ ఎందరినో అవమానించాడు, అలాంటప్పుడు అతడినెందుకు నామినేట్ చేయలేదని ప్రశ్నించాడు. వీళ్లిద్దరూ గొడవపడుతుంటే మరోసారి పృథ్వీ మధ్యలో దూరడంతో ఇది చిలికిచిలికి గాలివానలా మారింది.నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణతర్వాత ప్రేరణను నామినేట్ చేశాడు. నువ్వు కావాలని ట్రిగ్గర్ చేస్తావని ఆమె అనడంతో.. నీ కాళ్లు పట్టుకుంటా ప్రేరణ.. నేను ట్రిగ్గర్ చేయలేదు, ఏదో సరదాగా చేశానంటూ గౌతమ్ ఫ్రస్టేట్ అయ్యాడు. అవినాష్ వంతు రాగా.. మూటల టాస్క్లో ఫౌల్ గేమ్ ఆడావు, ఎదుటివారికి గౌరవమర్యాదలు ఇవ్వడం లేదంటూ పృథ్వీని, కసిగా ఆడట్లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు.మెగా చీఫ్ తప్ప అందరూ నామినేషన్లోనిఖిల్ వంతు రాగా గౌతమ్, ప్రేరణను నామినేట్ చేశాడు. చివరగా మెగా చీఫ్ రోహిణి.. నేను పక్కవాళ్లను తొక్కుకుంటూ వెళ్తానని చెప్పడం నచ్చలేదని విష్ణును నామినేట్ చేసింది. గేమ్లో నిన్నెవరైనా సైడ్ చేస్తుంటే భరించలేవు, అలాగే నన్ను వీక్ అన్నావంటూ నబీల్ను నామినేట్ చేసింది. అలా ఈ వారం విష్ణుప్రియ, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, తేజ, అవినాష్, నిఖిల్, నబీల్ నామినేట్ అయ్యారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అర్హత లేదన్న ప్రేరణ.. కాళ్లు మొక్కుతానన్న గౌతమ్
నామినేషన్స్.. ఈ రోజు కోసమే కదా ప్రేక్షకులు ఎదురుచూసేది! వారికి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరికేది నామినేషన్స్లోనే! తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో విష్ణుప్రియ.. నిన్ను విజేతగా చూడలేనంటూ ప్రేరణను నామినేట్ చేసింది. ఇక గౌతమ్.. నిఖిల్, ప్రేరణ, పృథ్వీతో గొడవపడ్డాడు.నీకోసం కట్టుకోలేదునువ్వు కట్టుకున్న చీర నచ్చలేదని గౌతమ్ అనగా నీకోసం నేను ఈ చీర కట్టుకోలేదని ప్రేరణ అంది. కదా.. మరి నేను కూడా నీకోసం ఇక్కడ ఉండటానికి రాలేదు అని సోలో బాయ్ సెటైర్లు వేశాడు. ఇమ్యూనిటీ షీల్డ్ రావడానికి నీకు అర్హత లేదని ప్రేరణ అనగా.. దేనికీ నాకు అర్హత లేదు కదా గౌతమ్ అసహనం వ్యక్తం చేశాడు.నీ కాళ్లపై పడి దండం పెట్టాలానువ్వు మనుషుల్ని ట్రిగ్గర్ చేస్తావని ప్రేరణ అనడంతో.. ట్రిగ్గర్ చేయాలని చేయలేదు.. నీ కాళ్లపై పడి దండం పెట్టాలా చెప్పు? ఇలా అంటారనే నేను సైలెంట్ అయిపోయా.. అంటూ ఫ్రస్టేట్ అయ్యాడు. ఇక అవినాష్.. పృథ్వీని నామినేట్ చేస్తుంటే అతడి కనీసం లేచి నిలబడలేదు. నిల్చుని మాట్లాడితేనే నామినేట్ చేస్తానన్నాడు అవినాష్. మెగా చీఫ్ రోహిణి, నబీల్ మినహా మిగతా అందరూ ఈ వారం నామినేట్ అయ్యారు. -
తన తప్పే లేదంటున్న యష్మి.. నిఖిల్పై ఫీలింగ్స్ గురించి..
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో యష్మి గౌడ పన్నెండోవారం ఎలిమినేట్ అయింది. హౌస్ నుంచి బయటకు వచ్చేసిన ఆమె నేరుగా బిగ్బాస్ బజ్లో అడుగుపెట్టింది. ఇక్కడ అంబటి అర్జున్.. యష్మి అనే నేను, అన్నీ నిజాలే చెప్తానంటూ తనతో ప్రమాణం చేయించాడు. ఎందుకు బయటున్నావని ఆలోచించావా? అని అడగ్గా.. హౌస్లో నా అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. చూసే జనాలకు అది ఫ్లిప్పులా అనిపిస్తుందేమో అని యష్మి సమాధానమిచ్చింది. గ్రూప్ గేమ్ ఆడావా? లేదా? ఈ ప్రవర్తనను ఉడుకుబోతుతనం అంటారని అర్జున్ సెటైర్ వేశాడు. గ్రూప్ గేమ్ ఆడావా? లేదా? నామినేషన్స్లో గ్రూప్గా చర్చించుకుని నామినేట్ చేశారా? లేదా? అని వరుస ప్రశ్నలు సంధించాడు. నిఖిల్పై నీ ఫీలింగ్ ఏంటనగా.. అతడు తనకు మంచి స్నేహితుడు అని చెప్పింది యష్మి.నేను ఏం చేసినా ఫీలింగ్స్ ఉన్నాయంటారుమీకు ఫీలింగ్స్ లేనప్పుడు గౌతమ్ టీషర్ట్ వేసుకుని నిఖిల్కు జెలసీ తెప్పించాలని ఎందుకనుకున్నావ్? అని క్వశ్చన్ చేశాడు. అందుకు యష్మి సమాధానం దాటవేస్తూ.. ఇప్పుడిదంతా జరిగింది కాబట్టి.. నేను కొంచెం నవ్వినా సిగ్గుపడుతుంది, ఫీలింగ్స్ ఉన్నాయంటారు. దానికి నేనేం చేయలేను అంది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తండ్రయిన 'బిగ్బాస్' మానస్.. ఫొటోలు వైరల్
బిగ్బాస్ ఫేమా మానస్ తండ్రయ్యాడు. కొన్నిరోజుల క్రితమే ఇతడి భార్య శ్రీజ.. మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా పిల్లాడికి నామకరణోత్సవం జరిగింది. ధ్రువ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా మానస్ ఇన్ స్టాలో పోస్ట్ చేసి బయటపెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.మానస్ విషయానికొస్తే చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలైంది. 2011లో 'ఝలక్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. గ్రీన్ సిగ్నల్, కాయ్ రాజా కాయ్, ప్రేమికుడు, గోలీ సోడా తదితర సినిమాలు చేశాడు. కానీ పెద్దగా పేరు రాలేదు. అలా కొన్నాళ్లకు తెలుగులో బిగ్బాస్ 5వ సీజన్లో పాల్గొన్నాడు. ఫైనల్ వరకు వచ్చాడు గానీ విన్నర్ కాలేకపోయాడు. కానీ మంచి ఫేమ్ సంపాదించాడు.(ఇదీ చదవండి: Bigg Boss 8: 13వ వారం నామినేషన్స్.. ఆ ఇద్దరు తప్పితే!)బిగ్బాస్ షో నుంచి బయటకొచ్చిన తర్వాత 'కార్తీకదీపం' సీరియల్లో ఆఫర్ వచ్చింది. కాకపోతే అది పెద్దగా సక్సెస్ కాలేదు. తర్వాత 'బ్రహ్మముడి' సీరియల్ చేశాడు. ఇది బుల్లితెరపై సూపర్ హిట్ అయింది. అలా సీరియల్ నటుడిగా మానస్ మంచి పేరు తెచ్చుకున్నాడు.వ్యక్తిగత విషయానికొస్తే గతేడాది నవంబర్లో మానస్.. శ్రీజని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళయి ఏడాది గడవక ముందే అంటే ఈ ఏడాది జూలైలో గుడ్ న్యూస్ చెప్పాడు. తన భార్య ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ పిల్లాడికి పేరు పెట్టారు. ఆ ఫొటోలు పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్) View this post on Instagram A post shared by Maanas Nagulapalli (@maanasnagulapalli) -
Bigg Boss 8: 13వ వారం నామినేషన్స్.. ఆ ఇద్దరు తప్పితే!
బిగ్బాస్ 8వ సీజన్ 13వ వారంలోకి ప్రవేశించింది. యష్మి ఎలిమినేట్ కావడంతో ఆదివారం ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడింది. ఎప్పటిలానే సోమవారం మళ్లీ నామినేషన్స్ రచ్చ మొదలైంది. ప్రస్తుతం హౌసులో తొమ్మిది మంది ఉండగా.. ఇద్దరిని తప్పితే మిగిలిన అందరూ నామినేట్ అయ్యారట. ఇప్పటికే షూట్ జరగ్గా.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ సీక్రెట్గా పెళ్లి చేసుకుందా?)ప్రోమో బట్టి చూస్తే నబీల్.. గౌతమ్-విష్ణుప్రియని, పృథ్వీ.. అవినాష్ని నామినేట్ చేసినట్లు చూపించారు. వీళ్లతో పాటు రోహిణి-విష్ణుప్రియ మధ్య కూడా గతవారం పోటీల్లో చేసుకున్న 'క్యారెక్టర్' గొడవ గురించి ఈసారి నామినేషన్లలో రచ్చ జరిగిందట.మెగా చీఫ్ అవడంతో రోహిణి, ఈమెతో పాటు నబీల్.. ఈ వారం నామినేషన్లలో లేరట. మిగిలిన పృథ్వీ, నిఖిల్, అవినాష్, విష్ణుప్రియ, ప్రేరణ, తేజ, గౌతమ్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 13వ వారం కాబట్టి ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ వీక్ అంతా ఏమేం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్) -
ఆ నలుగురు ఫ్రెండ్స్.. గౌతమ్ శత్రువన్న యష్మి.. అతడిపైనే బిగ్బాంబ్
ఒకరి గురించి ఒకరు రాసిన కంప్లైంట్లు చదవడంతోనే సగం ఎపిసోడ్ అయిపోయింది. యష్మి వెళ్లిపోతూ.. ఎవరేమనుకున్నా నిఖిల్ తన ఫ్రెండ్ అని బల్లగుద్ది చెప్పింది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 24) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..నేను చెప్పేదే నిజంనాగార్జున.. ప్రేరణను సేవ్ అయినట్లు ప్రకటించడంతో ఆమె ఎమోషనల్ అయింది. తర్వాత హౌస్మేట్స్ అందరూ తమపై వచ్చిన ఫిర్యాదుల చిట్టా చదివి వినిపించారు. తేజ.. తను మాట్లాడాలనుకుంది మాట్లాడి వెళ్లిపోతాడు, నేను చెప్పేదే నిజం అన్న మైండ్సెట్ నుంచి బయటకు రావాలని నబీల్, నిజాయితీగా ఉండు, అబద్ధం ఆడటం చాలాసార్లు చూశా.. అని పృథ్వీ కంప్లైంట్స్ చేశారు. గౌతమ్పై వచ్చిన కంప్లైంట్స్..అన్ప్రిడక్టబుల్గా ఉండటం వల్ల తనను నేను నమ్మలేను, త్వరగా ట్రిగ్గర్ అవడం నాకు నచ్చదు అని యష్మి గురించి ప్రేరణ ఫిర్యాదు చేసింది. నీ ఇండివిడ్యువాలిటీ కనిపించడం లేదు, ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే మారిపోతావు. అసలైన నువ్వు ఎవరనేది అర్థం కావట్లేదు.. అని రోహిణి పేర్కొంది. కెమెరాలతో కన్నా మనుషులతో ఎక్కువ మాట్లాడు, ఫుడ్ అందరితో షేర్ చేసుకో అని పృథ్వీ.. కొన్నిసార్లు కావాలనే గొడవలు సృష్టిస్తున్నాడేమో అనిపిస్తుందని అవినాష్ .. గౌతమ్ గురించి అభిప్రాయపడ్డారు. ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలీదునీకు అవినాష్ రక్షణ కవచంలా అనిపిస్తోంది.. అవినాష్, తేజతోనే ఎక్కువగా ఉంటున్నావ్ అని పృథ్వీ. ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం ఇబ్బందిగా అనిపిస్తోందని తేజ రోహిణి గురించి రాసుకొచ్చారు. తను ఎవరికోసం గేమ్ ఆడుతుందో తెలియదు, నామినేషన్స్లో క్లారిటీ లేదు, ఆట పట్ల ఆసక్తి అంతకన్నా లేదు అని అవినాష్, మేమందరం కష్టపడి తనను మెగా చీఫ్ చేశాం. తనను గెలిపించినవారికంటే యూనివర్స్కే ఎక్కువ కృతజ్ఞత చూపిస్తుంది అని నబీల్.. విష్ణు గురించి కంప్లైంట్ చేశారు.ఎక్కువ విని తక్కువ మాట్లాడాలినువ్వొక్కడివే బలవంతుడివని ఆలోచించడం మానేయ్.. ప్రతి ఒక్కరికీ టాలెంట్ ఉంది. కాబట్టి ఎవర్నీ తక్కువ అంచనా వేయకు అని రోహిణి.. గొడవ నీ గురించి కాకపోయినా నువ్వే గొడవ సృష్టిస్తున్నావ్.. అభ్యంతరకర పదాలతో అటాక్ చేస్తావ్.. అని గౌతమ్.. పృథ్వీ గురించి ఫిర్యాదు చేశారు. ఆటలో అయినా, చర్చలో అయినా ఎక్కువ విని తక్కువ మాట్లాడాలని నబీల్, మెగా చీఫ్గా ఉన్నప్పుడు తన డిక్టేటర్ ప్రవర్తన నచ్చలేదని అవినాష్.. ప్రేరణకు చెప్పారు.నబీల్పై ఫిర్యాదులుకామెడీ వెనకున్న ఎమోషన్స్ దాచుకోవడం ఆపేసి తన నిజస్వరూపం చూపించాలని ప్రేరణ, నీ అరుపు ఎక్కువైందని యష్మి.. అవినాష్పై ఫిర్యాదు చేశారు. వైల్డ్ కార్డ్స్ వచ్చాక నువ్వు మారిపోయి అందరితో బాగుండాలని ప్రయత్నిస్తున్నావని పృథ్వీ, ఒక్కోవారం ఒక్కోలా ప్రవర్తిస్తున్నావు, పెద్ద విషయాల్ని వదిలేసి నిన్ను ప్రశ్నించినవారిని మాత్రం టార్గెట్ చేస్తున్నావని గౌతమ్.. నబీల్ గురించి తెలిపారు.యష్మి ఎలిమినేట్మనసులో మాట డైరెక్ట్గా చెప్పుంటే నా గేమ్ ఎఫెక్టయ్యేదే కాదు. ఈ జర్నీలో నువ్వు ఫైటర్ కన్నా సేఫ్ గేమర్గానే ఎక్కువ కనిపించావని యష్మి, అందరినీ సంతోషంగా ఉంచాలనుకుంటావ్.. అతడి గేమ్ ప్లానేంటో తెలియదు, అందుకే తనను నమ్మలేనని ప్రేరణ.. నిఖిల్ గురించి రాసుకొచ్చారు. అనంతరం నాగార్జున.. నబీల్, పృథ్వీని సేవ్ చేసి యష్మి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. నా మాటల వల్ల, ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపడుంటే సారీ అంటూ యష్మి కన్నీటితో వీడ్కోలు తీసుకుంది. నిఖిల్ నా ఫేవరెట్ ఫ్రెండ్స్టేజీపైకి వచ్చాక ఆమెతో ఫ్రెండ్స్ ఎవరు? శత్రువులు ఎవరు? అన్న గేమ్ ఆడించాడు నాగ్. ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, విష్ణుప్రియ తన ఫ్రెండ్స్ అంది. నిఖిల్ తన ఫేవరెట్ ఫ్రెండ్ అని, ఎవరేమన్నా తమ స్నేహం అలాగే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. శత్రువుల లిస్ట్లో గౌతమ్, అవినాష్, రోహిణిని చేర్చింది. స్నేక్ అండ్ లాడర్ గేమ్లో గౌతమ్, నిఖిల్ పాములని మెజారిటీ హౌస్మేట్స్ అభిప్రాయపడ్డారు. వీరిలో ఒకర్ని నామినేట్ చేయాలని యష్మిపై భారం వేశాడు నాగ్. దీంతో ఆమె గౌతమ్పై బిగ్బాంబ్ వేసింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
స్ట్రాంగ్ ఉమెన్.. ఆ తప్పుల వల్లే యష్మి ఎలిమినేట్!
యష్మి గౌడ.. స్ట్రాంగ్ ఉమెన్, టాప్ 5 కంటెస్టెంట్ అని అంతా అనుకున్నారు. ఆ రేంజ్లో ఉండేది యష్మి ఆట. తను టాస్క్లో దిగితే ఎలాగైనా గెలవాల్సిందే అన్నంత కసిగా ఆడేది. ఆడపులి అన్న సెల్ఫ్ ట్యాగ్ ఇచ్చుకున్న సోనియాకే చుక్కలు చూపించింది. తనలో ఫైర్ చూసి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. కానీ తర్వాతి వారాల్లో యష్మి ఆట గాడితప్పింది.సంచాలక్గా వరస్ట్ప్లేయర్గా బెస్ట్ అనిపించుకున్నా సంచాలక్గా వరస్ట్ గేమ్స్ ఆడింది. ఎప్పుడైతే నిఖిల్పై ఆసక్తి చూపించడం మొదలుపెట్టిందో అప్పటినుంచి తన డౌన్ఫాల్ మొదలైంది. అతడిని ఎవరైనా నామినేట్ చేసినా ఈవిడే తెగ ఫీలైపోయేది. అతడితో డ్యాన్స్ చేయడం కోసం విష్ణుప్రియతో విపరీతంగా గొడవపడింది.నిఖిల్ చుట్టూ గేమ్తన కోసం గేమ్ ఆడటం మానేసి ఎవరికోసమో పాకరిల్లడమేంటని ఫ్యాన్స్ సైతం హర్టయ్యారు. ఫ్రెండ్లా అయినా ఉండరా అంటూ అతడి వెంట పడ్డ యష్మి ఈ వారం నామినేషన్లో మాత్రం అతడిపై ఏ ఫీలింగ్స్ లేవని ప్లేటు తిప్పేయడం మరింత షాక్కు గురిచేసింది. ఇలా మాట మార్చడాల వల్ల ఆమె తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. పారితోషికం ఎంత?చివరకు తన ఏడుపు కూడా ఫేక్ అని జనాలు ముద్ర వేసే స్థాయికి దిగజారిపోయింది. ఫైనల్గా ఈ వారం ఎలిమినేట్ అయింది. ఇకపోతే యష్మి.. ఒక్కవారానికిగానూ రూ.2.50 లక్షలు సంపాదించినట్లు తెలుస్తోంది. 12 వారాలకుగానూ ఆమె రూ.30 లక్షలు వెనకేసిందన్నమాట!మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వైల్డ్కార్డ్ విన్నరేంటి? ఇది అధర్మం కాదా?: అభయ్ నవీన్
తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్ ఎలా ఉంది? మొదట్లో చప్పగా.. వైల్డ్ కార్డ్స్ వచ్చాక కాస్త జోష్గా సాగుతోంది. ఎప్పుడో అస్సాం ట్రైన్ ఎక్కాల్సిన సీజన్ను తిరిగి గాడిలో పడేలా చేసింది వైల్డ్ కార్డ్సే! అయితే వీరితో పోలిస్తే పాత కంటెస్టెంట్లు నెలరోజులపాటు తమ మనుగడను కాపాడుకునేందుకు ఎక్కువ కష్టపడ్డారు. ఆ సమయంలో తమకంటూ ఫ్యాన్బేస్ ఏర్పరుచుకున్నారు. దీంతో మధ్యలో వచ్చినవారికంటే పాతవారికే ఓట్లు పడే ఛాన్సులు ఎక్కువుంటాయి.వైల్డ్ కార్డ్ విన్నర్ కాకూడదట!వైల్డ్ కార్డ్స్ రెట్టింపు కష్టపడితేనే ఓట్లు తమవైపు మళ్లుతాయి. ఇక విషయమేంటంటే.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ విన్నర్ అవకూడదంటున్నాడు అభయ్ నవీన్. నిఖిల్కు ఫ్రెండ్ అయిన ఇతడు.. పరోక్షంగా గౌతమ్ గెలవకూడదని చెప్తున్నాడు. పెద్దగా గేమ్స్ ఆడకపోయినా ఈజీగా చీఫ్ అయిపోయి నోటి దురుసుతో షో నుంచి ఎలిమినేట్ అయిన అభయ్ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. ఇది అధర్మం కాదా?నిఖిల్, నేను బెలూన్ టాస్క్ ఆడినప్పుడు వాడి చేతిలో స్టిక్ ఇరిగిపోయినా నేను ఫైట్ చేశాను. అది ధర్మం కాదు, ఒకరి చేతిలో స్టిక్ లేనప్పుడు గేమ్ ఆడకూడదు అన్నారు కదా! అదే ధర్మం కానప్పుడు మధ్యలో వచ్చిన వ్యక్తి ఎలా గెలుస్తాడన్నా? బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, తనపై జనాల్లో పాజిటివ్ ఉందా? నెగెటివ్ ఉందా? తెలుసుకోకుండా మొదటి నుంచి నచ్చిన గేమ్ ఆడుతున్నవాడు గెలిస్తే కరెక్టా? అప్పుడు ఈ కాన్సెప్ట్ దేనికి?లేదా వారి బలం, బలహీనతలు తెలుసుకుని గేమ్ మధ్యలో జాయిన్ అయి ఆడేవారు గెలిస్తే కరెక్టా? ఏదైనా సరే.. ఫస్ట్ నుంచి ఆడుతున్నవాడు గెలిస్తేనే కిక్ ఉంటదన్నా.. అది నా ఫీలింగ్ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియో చూసిన ఓ వ్యక్తి అలాంటప్పుడు వైల్డ్ కార్డ్స్ కాన్సెప్ట్ తీసేయమని చెప్పండి.. ఫస్ట్, లాస్ట్ ఇదంతా కాదు.. ఎవరు బాగా ఆడితే వాళ్లు గెలవాలి అని కామెంట్ చేశాడు. దీనికి అభయ్.. వైల్డ్కార్డ్ అనేది కేవలం జనాల్ని ఎంగేజ్ చేయడానికి మాత్రమేనని రిప్లై ఇచ్చాడు. View this post on Instagram A post shared by B Naveen Kumar (@abhainaveen) మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పోలీసులను గౌరవించేవాడిని కాదు..: సల్మాన్ ఖాన్
మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండడు. కాలం మారేకొద్దీ తను ఎంతోకొంత మారుతూ ఉంటాడు. అలా తాను కూడా చాలా మారానంటున్నాడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్. హిందీ బిగ్బాస్ 18వ సీజన్కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆయన వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో పాల్గొన్నాడు. రజత్ అనే కంటెస్టెంట్ ప్రవర్తన తప్పని వారించాడు. ఒకప్పుడు నాదీ అదే యాటిట్యూడ్ఎవరైనా ఉన్నప్పుడు టేబుల్పై దర్జాగా కాలుపెట్టి మాట్లాడటం తప్పని, ఆ యాటిట్యూడ్ మార్చుకోవాలని హితవు పలికాడు. తాను కూడా ఒకప్పుడు రూడ్గా ఉండేవాడినంటూ అందుకు సంబంధించిన ఓ ఉదాహరణను చెప్పుకొచ్చాడు. టేబుల్కు కాళ్లు అనించే అలవాటు నాక్కూడా ఉంది. గతంలో ఓ పోలీస్ స్టేషన్లో కాళ్లు టేబుల్కు ఆనించి ఠీవీగా కూర్చున్నాను. నేను ఏ తప్పూ చేయనప్పుడు ఎందుకు భయపడాలి? అన్నట్లుండేది నా వాలకం. పొగరుగా..కానీ ఎవరైనా సీనియర్ అధికారులు బ్యాడ్జ్ ధరించి వచ్చినప్పుడు లేచి గౌరవించాలి. ఆ పాత క్లిప్పింగ్స్ చూసినప్పుడు నేనేమీ గర్వంగా ఫీలవను. అంత పొగరుగా కూర్చోవాల్సిన అవసరమేముంది? అనుకునేవాడిని. పోలీసులను అగౌరవపర్చేలా అంత అహంకారంగా ఎందుకు ప్రవర్తించాననుకున్నాను. ఎంత అనుకున్నా.. దాన్నిప్పుడు మార్చలేను కదా! నీ కంటే పెద్ద గొంతుఇప్పుడు నీపై కూడా అంతే రూడ్గా మాట్లాడొచ్చు. నీ కంటే నా గొంతు పెద్దది. కానీ నేనలా గొంతు పెంచి అరవాలనుకోవడం లేదు అని చెప్పాడు. తన తప్పు అందరి ముందు ఒప్పుకోవాలంటే గుండె ధైర్యం కావాలి.. నువ్వు రియల్ హీరో అంటూ సల్మాన్ను పొగుడుతూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by 𝐀𝐧𝐮𝐬𝐡𝐚 𝐆𝐡𝐨𝐬𝐡 ♡ (@anusha_salmankhan)మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అతడి నిజస్వరూపం బయటపడాలన్న యష్మి
ఒకరి పొరపాట్లను మరొకరు పేపర్పై రాయాలన్నాడు బిగ్బాస్. తన మీద వచ్చిన ఫిర్యాదు చదివిన కంటెస్టెంట్.. అది ఎవరు రాయాలో గెస్ చేయాల్సి ఉంటుంది. అలా తేజ. తనపై వచ్చిన కంప్లైంట్ చదివాడు. తను మాట్లాడదల్చుకుంది మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తను చెప్పేది మాత్రమే నిజమని భావిస్తాడు అని రాసుంది. ఇది కచ్చితంగా విష్ణుప్రియ, యష్మి రాసుంటారని తేజ అభిప్రాయపడ్డాడు.ఫిర్యాదుల గోలఅన్ప్రిడక్టబుల్గా ఉండటం వల్ల తనను నేను నమ్మలేను. చాలా త్వరగా ట్రిగ్గర్ అవుతుంది. అది నాకు నచ్చదు.. ఈ ఫిర్యాదు తనపై గౌతమ్ చేసి ఉంటాడని యష్మి గెస్ చేసింది. కెమెరాలతో కన్నా మనుషులతో ఎక్కువ మాట్లాడు.. ఫుడ్ విషయంలో అందరికోసం ఆలోచించు అని గౌతమ్కు ఫిర్యాదు వచ్చింది. ఇది విష్ణు, అవినాష్ కంప్లైంట్ చేసుంటారన్నాడు.నిజస్వరూపం చూపించాలిఆటపట్ల ఆసక్తి ఉన్నట్లు అనిపించలేదు, అందర్నీ నిరుత్సాహపరుస్తుంది అని అవినాష్.. విష్ణుప్రియపై కంప్లైంట్ చేశాడు. కామెడీ వెనకున్న ఎమోషన్స్ దాచుకోవడం ఆపేసి తన నిజస్వరూపం అందరికీ చూపించాలి అని యష్మి.. అవినాష్ గురించి రాసింది. ప్రోమోలో చివర్లో పృథ్వీ, యష్మి డేంజర్ జోన్లో ఉన్నట్లు చూపించారు. అయితే యష్మి ఎలిమినేట్ అన్న విషయం ఇదివరకే తెలిసిందే! మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విన్నర్లు కాదు, పాములు.. గ్రూప్ గేమ్ తప్పు కాదన్న నాగ్..
విష్ణుప్రియ- రోహిణి, గౌతమ్-పృథ్వీల గొడవలు పరిష్కరించడానికి నాగార్జున తలప్రాణం తోకకొచ్చింది. గేమ్లో మిమ్మల్ని వెనక్కు లాగుతుందెవరు? అన్నప్పుడు గౌతమ్, నిఖిల్ పేర్లే ఎక్కువమంది చెప్పడం గమనార్హం. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..క్యారెక్టర్లెస్ అనలేదుగా: విష్ణునువ్వు జీరో, నీకు అర్హత లేదు.. అని నానామాటలన్నవారికి నీ విజయంతోనే సమాదానం చెప్పావంటూ నాగార్జున.. మెగా చీఫ్ రోహిణిని మెచ్చుకున్నాడు. ఆ వెంటనే రోహిణి, విష్ణును కన్ఫెషన్ రూమ్కు పిలిచి వీళ్లిద్దరి గొడవకు సంబంధించిన వీడియో క్లిప్ చూపించాడు. క్యారెక్టర్ అని తన వ్యక్తిత్వం గురించి అన్నానే తప్ప క్యారెక్టర్లెస్ అనలేదంది విష్ణు. దీనికి నాగ్.. ఆ పదం వాడినప్పుడే నీ క్యారెక్టర్ కనిపించిందన్నాడు.నిఖిల్కు ట్రై చేశా అనలేదునిఖిల్కు ట్రై చేశా వర్కవుట్ కాలేదు.. తర్వాత పృథ్వీకి ట్రై చేశా.. అని విష్ణు నిజంగానే అందా? అని రోహిణిని అడిగాడు. అందుకామె అవునని తలూపింది. అదే తన ప్లానా? అంటే కాదని చెప్పింది. దీనిపై విష్ణు స్పందిస్తూ.. నిఖిల్, నేను కలిసి బయట ఓ షో చేశాం. తన పర్సనాలిటీ అంటే ఇష్టమని చెప్పానే తప్ప ట్రై చేశాననలేదు అని క్లారిటీ ఇచ్చింది. ఏ ప్లాన్ వర్కవుట్ అయిందని విష్ణు హౌస్లో ఉంటోందన్నావని రోహిణిని అడగ్గా.. పృథ్వీతో లవ్ ట్రాక్ వల్లే ఆమె హౌస్లో ఉంటుందనిపిస్తోందని రోహిణి అభిప్రాయపడింది. తర్వాత ఇద్దరూ క్షమాపణలు చెప్పుకున్నారు.గ్రూప్ గేమ్ ఆడితే తప్పేంటన్న నాగ్పృథ్వీ, గౌతమ్ గొడవ గురించి నాగ్ చర్చించాడు. వైల్డ్కార్డ్స్ను పంపించేయాలని గ్రూప్ గేమ్ ఆడారని గౌతమ్ చెప్పగా.. అందులో తప్పేముందన్నాడు నాగ్. నా ఉద్దేశంలో తప్పేనంటూ హోస్ట్పైకే తిరగబడ్డాడు గౌతమ్. పెద్ద తప్పు చేసినవారినే నామినేట్ చేయాలే తప్ప వైల్డ్ కార్డ్ అన్న కారణంతో నామినేట్ చేయడం ముమ్మాటికీ తప్పేనని వాదించాడు. ఇంతలో పృథ్వీ.. అతడు ఇండివిడ్యువల్ ప్లేయర్ అని నిరూపించుకోవడానికి మమ్మల్ని బ్యాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించాడు.నోర్మూయ్.. నాగ్ సీరియస్ఆట అయిపోయాక కెమెరాలతో మాట్లాడతావు, నీ ఆట ఎవరూ నొక్కలేరు అని నాగార్జున గౌతమ్పై సెటైర్లు వేశాడు. అప్పటికీ గౌతమ్ మాట్లాడుతూనే ఉండటంతో బీపీ తెచ్చుకున్న నాగ్.. నోర్మూయ్, నేను మాట్లాడేటప్పుడు మధ్యలోకి రాకు అని తిట్టిపోశాడు. మనిషి పైపైకి వెళ్లడం తప్పని పృథ్వీని సైతం హెచ్చరించాడు. అనంతరం హౌస్మేట్స్తో ఓ గేమ్ ఆడించాడు.నిచ్చెన- పాముఆటలో మిమ్మల్ని ముందుకు తోస్తున్నదెవరు?(నిచ్చెన), వెనక్కు లాగుతుందెవరు?(పాము) చెప్పాలన్నాడు. రోహిణి.. అవినాష్ నిచ్చెన అని, పృథ్వీ పాము అని పేర్కొంది. అవినాష్.. తేజ నిచ్చెన, పృథ్వీ పాము అని తెలిపాడు. నబీల్.. పృథ్వీ నిచ్చెన, నిఖిల్ పాము అని పేర్కొన్నాడు. పృథ్వీ.. నబీల్ నిచ్చెన, గౌతమ్ పాము అన్నాడు. గౌతమ్.. రోహిణి నిచ్చెన, నిఖిల్ పాము అని చెప్పాడు.రెండు పాములునిఖిల్.. పృథ్వీ నిచ్చెన, గౌతమ్ పాము అంది. యష్మి.. ప్రేరణ నిచ్చెన, నిఖిల్ పాము అని తెలిపింది. తేజ.. అవినాష్ నిచ్చెన, విష్ణుప్రియ పాము అన్నాడు. విష్ణుప్రియ వంతురాగా పృథ్వీ వల్లే తనకు ఆక్సిజన్, కార్బండయాక్సైడ్ అందుతున్నాయంటూ.. చివరకు నబీల్కు నిచ్చెన ఇచ్చింది. రోహిణికి పాము ఇచ్చేసింది. ప్రేరణ.. రోహిణి నిచ్చెన, గౌతమ్ పాము అని పేర్కొంది. నిఖిల్, గౌతమ్కు పాముగా సమాన ఓట్లు పడ్డాయని, వీరిలో ఒకరిపై బిగ్బాంబ్ పడబోతుందన్నాడు నాగ్. నిఖిల్ను సేవ్ చేయడంతో నేటి ఎపిసోడ్ పూర్తయింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
షటప్ గౌతమ్.. నేనేం కంటెస్టెంట్ కాదు: నాగ్ ఫైర్
ఇద్దరు మగవాళ్ల ఇష్యూ గురించి మాట్లాడాలని నాగార్జున అనగానే నేను చెప్తా, సర్ అంటూ అవినాష్ లేచాడు. వాడు, వీడు అని మొదలుపెట్టింది పృథ్వీ.. తర్వాత గౌతమ్ ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. అప్పుడు పృథ్వీ.. ఛాతీపై వెంట్రుక పీకి పారేశాడు అని జరిగింది చెప్పాడు. ఇక గౌతమ్ గొడవ ఎక్కడ మొదలైందో చెప్పడం ప్రారంభించాడు. అందులో తప్పేముంది?వైల్డ్ కార్డ్స్ను నామినేట్ చేయాలని గ్రూప్ గేమ్ ఆడారని చెప్తుండగా.. అందులో తప్పేముందని నాగ్ ప్రశ్నించాడు. అందుకు గౌతమ్.. నా ఉద్దేశంలో తప్పేనని కరాఖండిగా తేల్చి చెప్పాడు. నువ్వు రోహిణికి సపోర్ట్ చేయడం గ్రూపిజమా? కాదా? అని నాగ్ ప్రశ్నించాడు. ప్రతిసారి ఒకరికే సపోర్ట్ చేయడం గ్రూపిజమా? ఎప్పుడో ఒకసారి సపోర్ట్ చేయడం గ్రూపిజమా? అని హోస్ట్నే తిరిగి ప్రశ్నించాడు గౌతమ్. షటప్ గౌతమ్గ్రూపిజం తప్పని నీ ఉద్దేశ్యమా? అంటూ నాగార్జున మాట్లాడుతూ ఉండగా గౌతమ్ మధ్యలో కలగజేసుకుంటూ ఉన్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన నాగ్.. నేను మాట్లాడుతున్నప్పుడు షటప్.. నువ్వు మధ్యలో కలుగజేసుకోవడానికి నేనేమీ హౌస్మేట్ కాదు అని హెచ్చరించాడు. చదవండి: బిగ్బాస్ నుంచి యష్మి ఎలిమినేట్ -
బిగ్బాస్: యష్మి ఎలిమినేట్!
బిగ్బాస్ షో నుంచి మరొకరు వెళ్లిపోయే సమయం వచ్చేసింది. ఈ వారం ప్రేరణ, పృథ్వీ, యష్మి, నిఖిల్, నబీల్ నామినేషన్స్లో ఉన్నారు. వీరిలో నిఖిల్ ఎప్పటిలాగే ఓటింగ్లో టాప్ ప్లేస్లో ఉన్నాడు. తర్వాతి స్థానంలో నబీల్ ఉన్నాడు. ప్రేరణ, పృథ్వీ, యష్మి చివరి స్థానాల్లో ఉన్నారు. అయితే ఈ వారం పృథ్వీ, యష్మిలలో ఒకరు వెళ్లిపోతారనే టాక్ నడిచింది. అనుకున్నట్లుగానే యష్మి ఎలిమినేట్ అయిందట! సండే ఎపిసోడ్ షూటింగ్ పూర్తవగా యష్మిని ఎలిమినేట్ చేసినట్లు సోషల్ మీడియాలో లీకులు మొదలయ్యాయి. టాస్కులు ఆడేందుకు యష్మి బాగానే కష్టపడింది. కానీ సంచాలక్గా ఉన్నప్పుడే లేనిపోని తప్పులన్నీ చేస్తుంటుంది. సంచాలక్ అంటే అంపైర్ తప్ప ఆటగాడు కాదని ఎన్నటికీ తెలుసుకోలేని యష్మి నిన్నటి గేమ్లో కూడా రోహిణి కుండలో ఇసుక నింపుతూ పృథ్వీకి సపోర్ట్ చేసింది. ఈ టాస్క్ వల్ల యష్మిపై మరింత నెగెటివిటీ ఏర్పడింది. ఫలితంగా దమ్మున్న కంటెస్టెంట్ బయటకు రాక తప్పలేదన్నమాట!చదవండి: గతేడాదే రోహిణి కాలికి ఆపరేషన్.. ఇప్పుడదే కాలితో ఆ ఇద్దరి అహాన్ని తొక్కిపడేసింది! -
నీ క్యారెక్టర్ కనిపిస్తోంది.. విష్ణుపై నాగార్జున సీరియస్
నాగార్జున వచ్చీరావడంతోనే విష్ణుప్రియ- రోహిణిల గొడవపై స్పందించాడు. ఇద్దర్నీ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి గొడవకు సంబంధించిన వీడియో ప్లే చేశాడు. నీ ప్లాన్ వర్కవుట్ అయింది.. అందుకు ఉన్నావ్ అని రోహిణి అనగా నీ క్యారెక్టర్ తెలుస్తోందని విష్ణు రిప్లై ఇచ్చింది. క్యారెక్టర్ అనే మాట చాలా పెద్దది అని నాగార్జున చెప్తుంటే.. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లు.. అది తప్పే కాదని వాదించింది విష్ణు.నీ క్యారెక్టర్ కనిపిస్తోందిదీంతో నాగ్.. ఆ పదం వాడకుండా ఉండాల్సింది.. అక్కడ నీ క్యారెక్టర్ కనిపిస్తోంది అని విమర్శించాడు. నిఖిల్కు ట్రై చేసి, కుదరకపోవడంతో విష్ణు.. పృథ్వీకి ట్రై చేసిందని.. అదంతా ప్లాన్ అని రోహిణి అనడాన్ని కూడా నాగ్ తప్పుపట్టాడు. ఈ విషయంలో ఎవరిది తప్పు? అని హౌస్మేట్స్ అభిప్రాయాన్ని తీసుకున్నాడు.తప్పు ఒప్పుకోని విష్ణుప్లాన్ అనడం రోహిణిదే తప్పని అవినాష్ అనగా.. ప్లాన్ కంటే క్యారెక్టర్ అనేది పెద్ద పదం కాబట్టి విష్ణుదే తప్పని ప్రేరణ అభిప్రాయపడింది. అక్కడ కూడా విష్ణు మళ్లీ సంజాయిషీ ఇచ్చుకోవడంతో నాగ్ తనను సైలెంట్ అయిపోమన్నాడు. ఇక్కడ తప్పు ఇద్దరిదీ ఉంది.. కానీ విష్ణు వాడిన పదాల వల్ల తన గోయి తనే తవ్వుకున్నట్లయింది. -
మనసులు గెలిచిన సివంగి.. టాప్ 5లో బెర్త్ కన్ఫామ్!
'అందరికంటే వీక్, ఒక్క టాస్క్ అయినా గెలిచావా? జీరో.. అసలు పరిగెత్తగలవా?' కొన్ని వారాల క్రితం రోహిణిని నామినేట్ చేసేటప్పుడు పృథ్వీ అన్న మాటలివి! నిన్న విష్ణు కూడా రోహిణిపై నోరేసుకుని పడిపోయింది.. నీలో ఫైర్ లేదు, నువ్వు జీరో, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది.. ఓటమిని తీసుకోలేవ్.. ఇలా తన నోటికి అడ్డూఅదుపే లేకుండా పోయింది. నిజానికి రోహిణి వచ్చినప్పటినుంచి తనవంతు ఆడటానికే ప్రయత్నించింది. ఎంటర్టైన్ చేయడం మరింత అదనం!అందరి కడుపు నింపిందితన ఎంటర్టైన్మెంట్ వల్ల బిగ్బాస్ పలుమార్లు కిచెన్లో రెండు గంటలపాటు వంట చేసుకునే అవకాశం కల్పించాడు. అలా ఎక్కువగా అవినాష్, రోహిణి వల్లే హౌస్మేట్స్ అందరూ కడుపునిండా తినగలిగారు. ఇక్కడ అర్థం కాని విషయమేంటంటే.. విష్ణు, రోహిణి ఇదివరకే మంచి ఫ్రెండ్స్. కానీ బిగ్బాస్ షోలో మాత్రం బద్ధ శత్రువులయ్యారు. పాత స్నేహితుల కంటే కొత్తగా పరిచయమైన పృథ్వీయే ఎక్కువయ్యాడు. రోడ్డు యాక్సిడెంట్లో గాయాలుఅతడు ఒక్కడుంటే చాలు.. మరెవరూ అవసరమే లేదన్నంతగా దిగజారింది. అందుకే ముందూవెనకా ఆలోచించకుండా ఏది పడితే అది అనేయడం తర్వాత తీరికగా సారీ చెప్పడం అలవాటైపోయింది. కానీ తన ఫ్రెండ్నే కించపరచడంతో విష్ణు స్వభావం ఎలాంటిదో బయటపడింది. రోహిణి విషయానికి వస్తే 2016లో ఆమెకు యాక్సిడెంట్ అయింది. అప్పట్లో తన కుడి కాలికి రాడ్ వేశారు. ఆ తర్వాత నటిగా బిజీ ఉండటంతో రాడ్ను తీయించుకోవాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ పోయింది. రెండుసార్లు ఆపరేషన్గతేడాది కాలినొప్పి మొదలవడంతో వైద్యుల్ని సంప్రదించింది. వారు ఆపరేషన్ చేశారు కానీ రాడ్ బయటకు తీయలేకపోయారు. బలవంతంగా తీస్తే ఎముక విరిగిపోతుందని ఆపేశారట! దీంతో తనకు సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరకు వెళ్లగా 10 గంటలపాటు ఆపరేషన్ చేసి రాడ్డును బయటకు తీశారు. ఇదంతా జరిగింది తన కుడికాలికే! నిన్న అదే కుడికాలితో గంటలకొద్దీ కుండను బ్యాలెన్స్ చేసింది. 'హీరో'హిణిఆ కుండ గేమ్లో తనను చులకనగా చూసిన పృథ్వీని ఓడించింది. అంతకంటే ముందు విష్ణును చిత్తు చేసింది. హౌస్కు మెగా చీఫ్ అయింది. కప్పు కన్నా ముఖ్యమైన ప్రేక్షకుల మనసుల్ని గెలిచింది. ఆమె విజయం చూసిన ఎంతోమందికి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కమెడియన్లను హీరోలుగా చూడరు అన్న భ్రమల్ని పటాపంచలు చేస్తూ HEROHINI అనిపించుకుంది. టాప్ 5లో బెర్త్ కన్ఫామ్ చేసుకుంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?
బిగ్బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న వాళ్లకంటే నెగిటివ్ అయిన వాళ్లే ఎక్కువ. అలా ప్రస్తుత సీజన్లో పాల్గొని ఎలిమినేట్ అయిన బ్యూటీ సోనియా ఆకుల. ఇప్పుడు ఈమె తన ప్రియుడు యష్ పాల్తో నిశ్చితార్థం చేసుకుంది. పెద్దగా హడావుడి లేకుండా గురువారం ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)మంథనికి చెందిన సోనియా.. యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అలా బిగ్బాస్ 8వ సీజన్ అంటే ఈసారి ఓ కంటెస్టెంట్గా హౌసులోకి వచ్చింది. ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. కానీ నిఖిల్-పృథ్వీతో నడిపిన లవ్ ట్రాక్ ఈమెపై విపరీతమైన నెగిటివిటీ తీసుకొచ్చింది. దీంతో ఎలిమినేట్ అయిపోయింది.బయటకొచ్చిన తర్వాత నిఖిల్ నిజ స్వరూపం తెలుసుకుని పలు ఇంటర్వ్యూలో అతడిని కడిగిపారేసింది. బిగ్బాస్ లోనే తన ప్రియుడు యష్ గురించి బయటపెట్టింది. అతడికి ఆల్రెడీ పెళ్లి అయిందని, కాకపోతే తన భార్యకు విడాకులు ఇచ్చేశాడని.. త్వరలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. ఇప్పుడు నవంబర్ 21న నిశ్చితార్థం చేసుకుంది. డిసెంబరు రెండో వారంలో పెళ్లి జరిగే అవకాశముంది.(ఇదీ చదవండి: 'జీబ్రా' సినిమా రివ్యూ) -
ఫ్రాక్చర్ అయిన కాలుతో గేమ్ ఆడి గెల్చిన రోహిణి.. ప్లేటు మార్చిన విష్ణు!
తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్లోనే ఇదొక బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. రోహిణిని గడ్డిపరకలా తీసిపారేసింది విష్ణు.. అసలు పరిగెత్తడం వచ్చా.. అని వంకరగా చూస్తూ బాడీ షేమింగ్ చేశాడు పృథ్వీ. ఫ్రాక్చర్ అయిన కాలుతోనే గేమ్ ఆడి ఈ ఇద్దరినీ ఓడించి లేడీ టైగర్ అనిపించుకుంది రోహిణి. మరిన్ని విశేషాలు నేటి (నవంబర్ 22) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..యష్మి బకరామెగా చీఫ్ కంటెండర్లకు బిగ్బాస్ ఆటోలో ప్రయాణం అనే టాస్క్ ఇచ్చాడు. చివరి వరకు ఆటోలో ఉన్నవారు ఎక్కువ పాయింట్లు గెలుస్తారన్నాడు. యష్మి, పృథ్వీ, విష్ణు కలిసి. తేజ, రోహిణిని తోసేశారు. పృథ్వీ, విష్ణు కలిసి యష్మిని తోయడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నీకు సపోర్ట్ చేస్తే నువ్వేమో తోశావ్.. అలాంటప్పుడు నాకు సాయం చేస్తానని ఎందుకన్నావ్? మీరిద్దరూ ఎలా ఆడతారో చూస్తా.. అని నిలదీసింది.నీ ఒంట్లో ఫైర్ లేదు: విష్ణుఅందుకు రోహిణి.. వాళ్లు ఆడరు, ఒకరికోసం ఒకరు కాంప్రమైజ్ అవుతారంది. ఇంకేం చూస్తావులే, దిగు అని విష్ణుప్రియకు చెప్పింది. దీంతో విష్ణుకు బీపీ వచ్చింది. నీది నువ్వు చూసుకో, నీ ఒంట్లో ఫైర్ లేదు, పక్కనోళ్ల గేమ్ గురించి మాట్లాడకు. నువ్వు జీరో అని చీప్గా మాట్లాడింది. రోహిణి కూడా నువ్వే జీరో అనడంతో.. నీకన్నా ఎక్కువ వారాలున్నానంది. ఎందుకున్నావో నీకూ తెలుసు, నీ ప్లాన్ వర్కవుట్ అయింది, అందుకే ఉన్నావని రోహిణి ఉన్నమాట అనేసింది. విష్ణు బండారం బట్టబయలుదీంతో విష్ణు.. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుందని నోరు జారింది. ఆ మాటతో రోహిణి.. ఫస్ట్ నిఖిల్కు ట్రై చేశా, వర్కవుట్ కాలేదు.. తర్వాత పృథ్వీకి ట్రై చేశా అని నువ్వే కదా చెప్పావు అని తన బండారం బయటపెట్టేసింది. ఈ గొడవ చల్లారాక విష్ణుప్రియను తోసేసి పృథ్వీ గెలిచాడు. టాస్క్ అయ్యాక విష్ణు.. రోహిణితో మళ్లీ వాదనకు దిగింది. తనే ఒప్పని నిరూపించుకోవాలని చూసింది. కానీ తన దగ్గర పప్పులు ఉడకనివ్వలేదు రోహిణి. నోరు అదుపులో పెట్టుకోఫైర్ లేదు, జీరో, క్యారెక్టర్ అంటూ నోరు జారుతున్నావ్.. నోరు అదుపులో పెట్టుకో అని హెచ్చరించింది. అనంతరం తెడ్డు మీద గ్లాస్ అనే టాస్క్ ఇచ్చాడు. ఈ గేమ్లో రోహిణి గెలవగా పృథ్వీ, తేజ, విష్ణుప్రియ, యష్మి తర్వాతి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్గా చివరి స్థానాల్లో ఉన్న యష్మి, విష్ణుప్రియను గేమ్ నుంచి ఎలిమినేట్ చేసిన బిగ్బాస్... పృథ్వీ, తేజ, రోహిణికి ఫైనల్ గేమ్ పెట్టాడు. సంచాలక్ కూడా గేమ్ ఆడింది!ఈ ఛాలెంజ్లో కంటెండర్లు.. కుండను కిందపడకుండా చూసుకోవాలి. బజర్ మోగినప్పుడల్లా హౌస్మేట్స్లో ఒకరు.. మెగా చీఫ్ అవకూడదనుకుంటున్న కంటెస్టెంట్ కుండలో రెండుసార్లు ఇసుక పోయాల్సి ఉంటుంది. ఈ గేమ్లో యష్మి సంచాలక్గా వ్యవహరించింది. సంచాలక్ అయినప్పటికీ మధ్యమధ్యలో తను వెళ్లి అందరి కుండలు బ్యాలెన్స్ చేస్తానంటూ కేవలం రోహిణి కుండలోనే పదేపదే ఇసుక పోయడం గమనార్హం.రోహిణి ఎమోషనల్ఈ గేమ్లో అద్భుతంగా ఆడిన రోహిణి.. తేజ, పృథ్వీలను మట్టికరిపించింది. ఫ్రాక్చర్ అయిన కాలుతో రెండున్నర గంటలపాటు కుండను బ్యాలెన్స్ చేసింది. నేను మెగా చీఫ్ అయ్యాను.. ఆడి గెలుచుకున్నా అంటూ రోహిణి ఏడ్చేసింది. ఇక టాస్క్ మధ్యలో రోహిణిని నిఖిల్ పొగుడుతుంటే అవసరమా? అంటూ కన్నెర్రజేసిన విష్ణు.. చివర్లో మాత్రం నువ్వు హీరో అని అరవడం డ్రామాలాగే కనిపించింది.బాధలో పృథ్వీఒక్కసారి కూడా మెగా చీఫ్ కాలేకపోయినందుకు పృథ్వీ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఇక చివరి మెగా చీఫ్ అయిన రోహిణి కోసం బిగ్బాస్ శివంగివే.. పాట ప్లే చేశాడు. బాడీ షేమింగ్ చేసిన పృథ్వీపై, జీరో అని హేళన చేసిన విష్ణుప్రియపై రోహిణి పైచేయి సాధించి తన సత్తా చూపించింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గుడ్న్యూస్ చెప్పిన టాలీవుడ్ హీరోయిన్
కత్తి, గగనం, మిస్టర్ నూకయ్య వంటి చిత్రాలతో తెలుగువారికి సుపరిచితమైన హీరోయిన్ సనా ఖాన్ గుడ్న్యూస్ చెప్పింది. తాను మరోసారి తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. ముగ్గురం నలుగురం కాబోతున్నామని పేర్కొంది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారగా అభిమానులు తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినీ కెరీర్కాగా హీరోయిన్ సనా ఖాన్.. 2005లో యేహై హై సొసైటీ అనే సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. కళ్యాణ్రామ్ కత్తి మూవీతో తెలుగులో అరంగేట్రం చేసింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. 2019లో తమిళ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. మధ్యలో హిందీ బిగ్బాస్ ఆరో సీజన్లో పాల్గొని సెకండ్ రన్నరప్గా నిలిచింది. సినిమాలు మానేసిన తర్వాత నవంబర్ 2020 నవంబరులో ముస్లిం మతగురువు, వ్యాపారవేత్త అనాస్ సయ్యద్ని పెళ్లి చేసుకుంది. వీరికి 2023లో పాపాయి జన్మించింది. View this post on Instagram A post shared by Saiyad Sana Khan (@sanakhaan21) చదవండి: క్యారెక్టర్ తెలుస్తోందన్న విష్ణు.. తన బండారం బయటపెట్టిన రోహిణి -
పృథ్వీని ఓడించిన రోహిణి.. దెబ్బ అదుర్స్ కదూ!
మెగా చీఫ్ అవడానికి కంటెండర్లకు బిగ్బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. అదే తెడ్డు మీద గ్లాస్. ఓ తెడ్డుపై నీళ్ల గ్లాసుల్ని తీసుకెళ్లి అవతల ఒడ్డుకు తీసుకెళ్లి కంటైనర్లు నింపుకోవాలి. మొదట అందరూ ఎవరి ఆటపై వారు దృష్టి సారించారు. అయితే విష్ణుప్రియ.. అవతలివారు ఆటలో ముందుకు పోకుండా తన తెడ్డుతో ఆ గ్లాసుల్ని పడగొట్టింది. గలీజ్ గేమ్దీంతో యష్మి.. ఇలా గలీజ్ ఆట ఆడాలంటే మొదటి నుంచే ఆడొచ్చు అని అసహనానికి లోనైంది. ఇక ఇప్పటివరకు పెట్టిన గేమ్స్లో ఎక్కువ పాయింట్లు తెచ్చుకున్న ముగ్గురికీ చివరి టాస్క్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఆ టాస్క్లో తేజ, పృథ్వీ, రోహిణి పాల్గొన్నారు. ఇసుక కూజాల్ని కింద పడకుండా హోల్డ్ చేయాలి. ఈ గేమ్లో తేజ ఓడిపోగా చివర్లో పృథ్వీ, రోహిణి మిగిలారు.పృథ్వీని ఓడించిన రోహిణినువ్వు పరిగెత్తగలవా? అంటూ హేళన చేసిన పృథ్వీపై రోహిణి విజయం సాధించి మెగా చీఫ్ అయినట్లు సమాచారం. ఇది తెలిసిన అభిమానులు దెబ్బ అదుర్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ పరాభవాన్ని పృథ్వీ తట్టుకుంటాడా? తన ఇగో హర్ట్ అయిందా? అనేది ఎపిసోడ్లో చూడాలి! మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
క్యారెక్టర్ తెలుస్తోందన్న విష్ణు.. తన బండారం బయటపెట్టిన రోహిణి
హౌస్లో చివరిసారి చీఫ్ అయ్యేందుకు యష్మి, తేజ, విష్ణుప్రియ, పృథ్వీ, రోహిణి బాగానే కష్టపడుతున్నారు. వీరికి బిగ్బాస్ నేడు ఆటోలో ప్రయాణం అనే టాస్క్ ఇచ్చాడు. ఈ ఆటోలో చివరి వరకు ఉన్నవారికి ఎక్కువ పాయింట్లు లభిస్తాయి. టాస్క్ మొదలైందో, లేదో.. రోహిణిని తోసేయ్ అని విష్ణు పృథ్వీకి ఆర్డర్ వేసింది. అయితే అందరికంటే ముందు తేజ అవుట్ అయ్యాడు. తర్వాత రోహిణిని తోసేశారు. అందర్నీ తోసేసిన ప్రేమపక్షులుమీ ముగ్గురిలో ఎవరు ఎవర్ని తోసుకుంటారో చూస్తానని రోహిణి సవాల్ చేసింది. ఏముంది? ప్రేమపక్షులిద్దరూ కలిసి యష్మి అడ్డు తొలగించారు. నిన్ను తోయకుండా సపోర్ట్ చేశానంటూ ఏడ్చేసింది. ఇది గేమ్, ఎమోషనల్ అవకు అని పృథ్వీ అనడంతో యష్మి.. గ్రాటిట్యూడ్ ఉంది, సపోర్ట్ చేస్తానని ఎందుకన్నావ్? అంటూ నిలదీసింది. నన్నెలా పుష్ చేశావో ఇప్పుడు తనను (విష్ణును) తోసేసి పాయింట్లు తీసుకో అని ఛాలెంజ్ చేసింది. అందుకు రోహిణి.. వాళ్లెందుకు ఆడతార్రా గేమ్ అంది.నోరు జారిన విష్ణుదాంతో విష్ణు.. ఇందాక నుంచి మాట్లాడుతున్నావు.. ఫస్ట్ నీది నువ్వు చూసుకో, నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అని నోరు జారింది. ఆ మాటతో రోహిణిలో కోపం కట్టలు తెంచుకుంది. ఫస్ట్ నిఖిల్కు ట్రై చేశా.. అవలేదు, తర్వాత పృథ్వీకి ట్రై చేశా అన్నావు.. ఎవరు ప్లాన్ చేస్తున్నారు? అంటూ విష్ణు బండారం బయటపెట్టింది.నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడుతన గుట్టు రట్టవడంతో బిత్తరపోయిన విష్ణు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడకంటూ కవర్ చేయడానికి ప్రయత్నించింది. అంతా అయ్యాక కూడా మళ్లీ రోహిణితో మాట్లాడటానికి వెళ్లింది. అక్కడ కూడా లేని పాయింట్లు చెప్పడంతో రోహిణి.. క్యారెక్టర్ గురించి ప్రస్తావించావు.. ఏం మాట్లాడుతున్నావో నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని వార్నింగ్ ఇచ్చింది. నేనేదీ క్రియేట్ చేయలేదు, నువ్వు చెప్పిందే అక్కడ మళ్లీ చెప్పాను అంటూ ఇచ్చిపడేసింది. చదవండి: Bigg Boss 8.. ఇన్నాళ్లు ఎలాగోలా మిస్... ఈసారి మాత్రం తప్పదేమో! -
రౌడీలా రెచ్చిపోయిన పృథ్వీ.. విశ్వక్సేన్ దగ్గర అవినాష్ కక్కుర్తి!
ఈసారి మెగా చీఫ్ పోస్టు అందుకోవడం అంత ఈజీ పనిలా లేదు. బిగ్బాస్ పెట్టిన పలు టాస్కులు ఆడి గెలిస్తేనే హౌస్లో చివరిసారి చీఫ్ అవుతారు. ఇకపోతే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హౌస్లో అడుగుపెట్టి అందరితో ఇట్టే కలిసిపోయాడు. మరి షోలో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..చివరి కంటెండర్పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, తేజ మెగా చీఫ్ కంటెండర్లవగా చివరగా నిఖిల్, రోహిణి మాత్రమే మిగిలారు. వీరిలో ఎవర్ని కంటెండర్ చేస్తారో హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. ఈ క్రమంలో గౌతమ్.. చాలామంది వైల్డ్కార్డ్స్ను పంపించేద్దామని ప్లాన్ చేశారు. అవన్నీ తట్టుకుని రోహిణి ఇక్కడిదాకా వచ్చిందంటూ ఆమెకు సపోర్ట్ చేశాడు. యష్మి, ప్రేరణ, తేజ కూడా రోహిణికే సపోర్ట్ ఇచ్చారు.గ్రూప్ గేమ్ను ప్రశ్నించిన గౌతమ్విష్ణుప్రియ నిఖిల్కు మద్దతిచ్చింది. ఇక పృథ్వీ.. వైల్డ్ కార్డ్స్ను పంపించేయాలని ప్లాన్ చేశామన్నారు. ఓజీ, రాయల్ టీమ్స్గా ఉన్నప్పుడు అది జరిగింది. కానీ ఇప్పుడు క్లాన్స్ లేవు కాబట్టి అలాంటి ప్లానింగ్స్ ఏవీ చేయడం లేదని క్లారిటీ ఇస్తూనే నిఖిల్కు సపోర్ట్ ఇచ్చాడు. ఇక గ్రూపిజం ఉందని గౌతమ్.. పృథ్వీతో గొడవపడుతుంటే యష్మి, విష్ణుప్రియ, నిఖిల్ వెంటనే దూసుకువచ్చి ఆ మాట నిజమేనని నిరూపించారు. నా వెంట్రుక కూడా పీకలేవుపృథ్వీ.. గౌతమ్ పైపైకి వెళ్తూ వాడు, వీడు అని మాట్లాడాడు. వాడు అని పిలవొద్దని చెప్తున్నా పృథ్వీ వెనక్కు తగ్గలేదు. దీంతో గౌతమ్ నువ్వు నన్నేం పీకలేవన్నాడు. దానికి పృథ్వీ.. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు అని మరింత రెచ్చిపోయాడు. ఇలా వీరిద్దరూ చాలాసేపు గొడవపడ్డారు. మెజారిటీ ఓట్లు రోహిణికి రావడంతో ఆమె కంటెండర్ అయింది. విశ్వక్సేన్ ఎంట్రీమెగా చీఫ్ అవడానికి ఒకటి కంటే ఎక్కువ టాస్కులుంటాయన్నాడు బిగ్బాస్. అలా మొదటగా పట్టువదలని విక్రమార్కుడు టాస్క్ ఇచ్చాడు. ఇందులో విష్ణుప్రియ 10, యష్మి 20, పృథ్వీ 30, రోహిణి 40, తేజ 50 పాయింట్లు సాధించారు. అనంతరం విశ్వక్సేన్ హౌస్లో ఎంట్రీ ఇచ్చాడు. అవినాష్ కక్కుర్తివస్తూనే రుచికరమైన ఇంటి భోజనం తీసుకువచ్చి అందరితో కలిసి తిన్నాడు. విశ్వక్ కోరిక మేరకు తేజ, అవినాష్ పోల్ డ్యాన్స్ చేశారు. అనంతరం రోహిణి, అవినాష్తో కలిసి విశ్వక్ స్కిట్ కూడా చేశాడు. తర్వాత అవినాష్.. విశ్వక్ దగ్గర టీషర్ట్ దోచేశాడు. చివరగా అందరితో కలిసి స్టెప్పులేసి వీడ్కోలు తీసుకున్నాడు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్ షోలో మెకానిక్ రాకీ.. గౌతమ్పై రౌడీలా దూసుకొచ్చిన పృథ్వీ
బిగ్బాస్ హౌస్లోకి మెకానిక్ రాకీ వచ్చేశాడు. ఏకంగా ఆటో వేసుకుని మరీ మెయిన్ గేట్ నుంచి లోనికి దూసుకొచ్చాడు. విశ్వక్ సేన్ ఇలా ఆటోలో హౌస్లోకి రావడం చూసి కంటెస్టెంట్లు సర్ప్రైజ్ అయ్యారు. తాను కూడా కంటెస్టెంట్గా వచ్చానంటూ హీరో అందర్నీ సరదాగా ఆటపట్టించాడు.మెకానిక్ రాకీ సినిమా ప్రమోషన్స్ కోసం బిగ్బాస్ హౌస్కు వచ్చిన ఆయన అందరితో కలిసి ఫన్నీ స్కిట్ చేశాడు. చివరగా హౌస్మేట్స్తో డ్యాన్సులు కూడా వేశాడు. మరో ప్రోమోలో.. నిఖిల్, రోహిణిలలో ఒకర్ని కంటెండర్గా ఎన్నుకోమని బిగ్బాస్ హౌస్మేట్స్పై భారం వేశాడు. ఈ సందర్భంగా గౌతమ్.. చాలామంది హౌస్మేట్స్ కలిసి వైల్డ్కార్డ్స్ను పంపించేద్దామని ప్లాన్ చేశారు అంటూ వైల్డ్ కార్డ్ రోహిణికి సపోర్ట్ చేశాడు. ఈ క్రమంలో పృథ్వీ, గౌతమ్ గొడవపడ్డారు. పృథ్వీ వాడు వీడంటూ నోరు జారడంతో గౌతమ్... మంచిగా మాట్లాడమని హెచ్చరించాడు. అయినా కూడా పృథ్వీ.. నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ సైగ చేస్తూ అతడి పైపైకి వెళ్లాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నా ప్రయాణం ముగిసింది.. ఓట్లు వేయొద్దు: నిఖిల్
చేయని తప్పుకు నిందలు పడటం ఎవరికైనా కష్టమే! అవతలివారిపై నోరుజారకుండా ఆచితూచి మాట్లాడే నిఖిల్.. అమ్మాయిలను గేమ్ కోసం వాడుకుంటాడని సీత పెద్ద నిందేసి వెళ్లిపోయింది. ఆ మాటను నిఖిల్ జీర్ణించుకోలేకపోతున్నాడు. తాను అలాంటి వ్యక్తిని కాదని కెమెరాలకు గోడు వెల్లబోసుకున్నాడు. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 20) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..నిఖిల్కు సారీ చెప్పిన యష్మిఆడవాళ్లను ట్రాప్ చేస్తున్నావ్.. ఎమోషన్స్తో ఆడుకుంటున్నావ్ అని సీత ఇచ్చిన స్టేట్మెంట్ విని ప్రేక్షకులే కాదు హౌస్మేట్స్ కూడా షాకయ్యారు. తనవల్లే అలాంటి నిందలు వచ్చాయంటూ నిఖిల్కు యష్మి సారీ చెప్పింది. నా వల్లే ఇదంతా మొదలైంది.. మన ఇద్దరి గేమ్ పాడవుతుందంటే మనం మాట్లాడకుండా ఉండటమే నయమని చెప్పుకొచ్చింది. తర్వాత ఒంటరిగా కూర్చున్న నిఖిల్ బిగ్బాస్కు తన గోడు చెప్పుకున్నాడు. నాకు ఓటు వేయకండి: నిఖిల్ఒకర్ని తొక్కి ఆడాలని ఎన్నడూ అనుకోలేదు. నామినేషన్స్లో సీత చెప్పినట్లు స్ట్రాంగ్ మహిళల్ని అడ్డుపెట్టుకుని గేమ్లో గెలవాలనుకోలేదు. మనసుకు ఏమనిపిస్తే అదే చేశాను. ఎవర్నీ తొక్కాలనుకోలేదు. ఈ వారం నామినేషన్లో ఉన్నాను, హౌస్ నుంచి వెళ్లిపోవాలనిపిస్తోంది. ఇక్కడ నా ప్రయాణం అయిపోయింది. దయచేసి ప్రేక్షకులు ఎవరూ నాకు ఓటు వేయకండి.. నన్ను ఎలిమినేట్ చేయండి అని కోరుకున్నాడు. వెళ్లిపోతా అన్నందుకు క్షమించండిమరికాసేపట్లోనే మనసు మార్చుకుని.. నేనేంటో నిరూపించుకున్నాకే బయటకు వస్తాను. వెళ్లిపోతా అన్నందుకు క్షమించండి. కప్పు తీసుకునే బయటకు వస్తా అని తనకు తాను ధైర్యం చెప్పుకుని కెమెరాలతో మాట్లాడాడు. తర్వాత హౌస్మేట్స్ అందరూ సమావేశమై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ప్రేరణ.. ఎవరినైనా బాధపెట్టుంటే క్షమించమని కోరుతూ ఏడ్చేసింది. అది నా వ్యక్తిత్వం కాదుయష్మి మాట్లాడుతూ.. నిఖిల్ గేమ్కోసం అమ్మాయిలను వాడుకోలేదు అని క్లారిటీ ఇచ్చింది. నిఖిల్ మాట్లాడుతూ.. నన్ను తప్పు అని నిందవేసినచోటే నేనేంటో నిరూపించుకోవాలనుకుంటున్నాను. ఒకర్ని వాడుకుని గేమ్ ఆడే వ్యక్తిత్వం నాది కాదు అని తెలిపాడు. అనంతరం తేజ నిద్రపోయినందుకు చీఫ్ అవినాష్ పనిష్మెంట్ ఇచ్చాడు. షర్ట్ తీసేసి స్విమ్మింగ్ పూల్లో 10 సార్లు దూకాలన్నాడు. ఈ టాస్క్ పూర్తి చేస్తే యష్మి.. తేజకు ముద్దుపెడతానంది. ముద్దు కోసం తేజ ఆశఆశతో పూల్లో పదిసార్లు మునకేసిన తేజను కళ్లుమూసుకోమని పక్కనే నిలబడింది యష్మి. తీరా నిఖిల్ వచ్చి తేజ చెంపపై ముద్దుపెట్టాడు. ఆ విషయం తెలియని తేజ కుప్పిగంతులు వేశాడు. నీకంత సినిమాలేదు, నీకు కిస్ పెట్టింది నిఖిల్ అని నబీల్ అసలు విషయం బయటపెట్టాడు. అనంతరం ఈ సీజన్కే ఆఖరి మెగా చీఫ్ పోస్టును ప్రకటించాడు బిగ్బాస్. సమయానుసారం ఒక్కొక్కరి పేరుతో టీషర్ట్స్ గార్డెన్ ఏరియాలో వేస్తుంటాడు. మెగా చీఫ్ ఎవరంటే?ఆ టీషర్ట్ను చించకుండా భద్రంగా కాపాడుకున్నవారు కంటెండర్లవుతారు. అలా ఈ గేమ్లో ప్రేరణ, గౌతమ్, అవినాష్, నబీల్ ఓడిపోగా.. పృథ్వీ, తేజ, యష్మి, విష్ణుప్రియ కంటెండర్లయ్యారు. చివర్లో నిఖిల్, రోహిణి మాత్రమే మిగలగా.. వీరిలో ఎవరు కంటెండర్ అవ్వాలనేది హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. అంతటితో ఎపిసోడ్ ముగిసింది. అయితే రోహిణిని కంటెండర్ చేయగా చివరకు ఆవిడే మెగా చీఫ్ అయినట్లు తెలుస్తోంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ల టార్గెట్.. ట్రోఫీకి మరింత దగ్గరైన నిఖిల్
ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో నామినేషన్ చేయిద్దాం అని బిగ్బాస్కు ఏ ముహూర్తాన అనిపించిందో కానీ ఇది ఒకరకంగా నిఖిల్కు ప్లస్సే అయింది. వచ్చినవాళ్లంతా.. నిఖిల్ ఆట గురించి కాకుండా పర్సనల్ టార్గెట్ చేశారు. సింహంలా ఉండే నిఖిల్ను పిల్లిలా మార్చి తనవైపు తిప్పుకున్న సోనియా కూడా అతడిని తప్పుపట్టింది.క్లారిటీ ఇవ్వకపోవడం తప్పే!యష్మి విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం తప్పని కుండ బద్ధలు కొట్టింది. సీత అయితే మరో అడుగు ముందుకేసి స్ట్రాంగ్గా ఉండే ఆడవారిని టార్గెట్ చేస్తున్నావని, వారిని గేమ్ కోసం వాడుకుంటున్నావంటూ నిందలేసింది. ఇది మరీ విడ్డూరం.. నిఖిల్తో డ్యాన్స్ చేయాలనుంది, నిఖిల్తో ఓ కలగన్నాను అంటూ యష్మినే అతడి వెంట పడింది. కనీసం ఫ్రెండ్లా అయినా ఉండమని అర్థించింది. అటు సీత కూడా నిఖిల్పై ఇష్టం చూపించింది. జీవితంలో క్షమించనన్న నిఖిల్వీరిని పెద్దగా పట్టించుకోని నిఖిల్.. మీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని ముక్కుసూటిగా చెప్పలేకపోయాడు. అదే అతడికి పెద్ద మైనస్ అయింది. అయితే యష్మితో కొన్ని సందర్భాల్లో ఫీలింగ్స్ పెట్టుకోవద్దన్నట్లు ఛూఛాయగా చెప్పినప్పటికీ అదంత హైలైట్ అవలేదు. ఫలితంగా 12వ వారం నామినేషన్స్లో సీత.. ఆడవారి ఎమోషన్స్తో ఆడుకుంటావ్ అని నిందేయడంతో నిఖిల్ చాలా హర్టయ్యాడు. ఆమెను జీవితంలో క్షమించనన్నాడు. ఆ బాధతో భోజనం కూడా తినకుండా నిద్రపోయాడు.నిఖిల్కు సింపతీబిగ్బాస్ హౌస్లో ఎవరినైనా టార్గెట్ చేస్తే ప్రేక్షకులు అస్సలు ఊరుకోరు. అతడిపై చాలా సింపథీ చూపిస్తారు.. అదీ ఓట్ల రూపంలో! ఈ నామినేషన్ ప్రక్రియతో నిఖిల్పై జనాల్లో సింపథీ వచ్చింది. పైగా నటి కావ్యతో ప్రేమస్టోరీ చెప్తూ.. తమ మధ్య దూరం వచ్చింది, కానీ ఈ జీవితానికి తనే భార్య అని ఏడ్చేయడంతో జనాలు తెగ కనెక్ట్ అయిపోయారు. నిఖిల్ ప్రేమ సఫలం కావాలని కోరుకున్నారు. అలా ఈ వారం నిఖిల్కు నెగెటివిటీ కంటే సింపథీయే ఎక్కువ వచ్చింది. దీంతో విన్నింగ్ రేస్లో గౌతమ్ను వెనక్కు నెట్టి మరీ ముందుకు దూసుకొచ్చేశాడు. మరి తర్వాతి వారాల్లో వీరిద్దరి గేమ్ ఎలా ఉంటుందో చూడాలి!మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణుతో యష్మి గొడవ.. చివరిసారి చీఫ్ అయిందెవరంటే?
బిగ్బాస్ ప్రతి సీజన్లో కెప్టెన్ అనే పదవి ఉండేది. ఈ పదవి పొందినవారు ఆ వారం నామినేషన్స్లోకి అడుగుపెట్టరు. అయితే ఈ సీజన్లో కెప్టెన్ పోస్టు ఉండదన్నాడు బిగ్బాస్.. కానీ అంతలో చీఫ్ అనే కొత్త పదవిని తీసుకొచ్చాడు. అయితే దీని ఉద్దేశం కూడా అదే! చీఫ్ అయినవారు ఆ వారం నామినేషన్స్లో ఉండరు. చివరి ఇమ్యూనిటీ ప్రస్తుతం హౌస్లో ఉన్నవారిలో నిఖిల్, యష్మి, ప్రేరణ, అవినాష్, విష్ణుప్రియ, గౌతమ్, నబీల్ అంతా కూడా ఒకసారి చీఫ్ అయినవాళ్లే! తేజ, రోహిణి, పృథ్వీలకే ఇంతవరకు ఆ అవకాశం దక్కలేదు. ఇకపోతే బిగ్బాస్ తాజాగా హౌస్లో చీఫ్ పదవి కోసం పోటీపెట్టాడు. అయితే ఇది ఈ సీజన్లోనే చివరి చీఫ్ పోస్ట్ అని ప్రకటించాడు. దాంతో ఎలాగైనా దాన్ని గెలిచి ఒక్క వారమైనా ఇమ్యూనిటీ అందుకోవాలని కంటెస్టెంట్లు తెగ తహతహలాడారు.చీఫ్గా రోహిణి!బిగ్బాస్ సమయానుసారం టీషర్టు విసిరేస్తుంటాడు. తమ టీషర్ట్ను ఎవరైతే కాపాడుకుని బొమ్మకు తగిలిస్తారో వారే విజేతలుగా నిలుస్తారన్నాడు. ఈ గేమ్లో యష్మి, విష్ణుకు గొడవైనట్లు తెలుస్తోంది. యష్మి, రోహిణి, పృథ్వీ, విష్ణు, తేజ గెలిచి కంటెండర్లుగా నిలిచారు. హౌస్మేట్స్ మద్దతుతో రోహిణి చీఫ్ అయినట్లు తెలుస్తోంది. ఈ వారం ఎలాగో నామినేషన్స్లో లేదు, వచ్చేవారం చీఫ్ పోస్టుతో మరోసారి సేవ్ అయిపోయింది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అందరి టార్గెట్ కన్నడ బ్యాచ్.. నామినేషన్స్లో ఎవరెవరు?
బిగ్బాస్ 12వ వారం విచిత్రమైన పద్ధతిలో నామినేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ఎలిమినేట్ అయినవాళ్లు హౌసులోకి వచ్చి ఈ వారం ఎవరెవరు నామినేట్ అవ్వాలనేది డిసైడ్ చేశారు. సోమవారం కొంతవరకు జరగ్గా.. మంగళవారం కూడా ఇదే కొనసాగింది. మణికంఠ, నైనిక, ఆదిత్య ఓం, కిర్రాక్ సీత వచ్చారు. తన పాయింట్లు చెప్పి రఫ్ఫాడించేశారు. ఇంతకీ బిగ్బాస్లో మంగళవారం(79వ రోజు) ఎపిసోడ్లో ఏమేం జరిగిందనేది చూద్దాం.(ఇదీ చదవండి: బిగ్బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్గా అడుగుపెట్టిన శోభా శెట్టి)తొలుత హౌసులోకి వచ్చిన నైనిక.. నిఖిల్ని పలకరించి హగ్గు ఇచ్చింది. ఎక్కువగా ఆలోచించి బాధపడకు అని చెప్పింది. ఇక తన మొదటి నామినేషన్ నబీల్ పేరు చెప్పింది. 'నువ్వు వచ్చినప్పుడు ఏం చెప్పావ్ నబీల్.. షేర్ (సింహం) అన్నావ్ కదా! మరి అది ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయింది. గత కొన్నివారాలుగా నువ్వు కనిపించట్లేదు' అని అడిగింది. దీనికి సమాధానంగా.. నేను వచ్చిందే ఆ కప్పు కోసం.. ఖచ్చితంగా దాని కోసమే ఆడతా.. నేను ఎవరి గురించి వెనకాల మాట్లాడలే అని నబీల్ తనని తాను డిఫెండ్ చేసుకున్నాడు.నైనిక తన రెండో నామినేషన్ యష్మీకి వేసింది. ఒకప్పుడు యష్మీ ఇప్పుడు కనిపించట్లేదని, ఎప్పుడైతే నిఖిల్ వెంటపడటం మొదలుపెట్టావో అప్పటినుంచి యష్మీ మిస్ అయిపోయిందని చెప్పింది. దీనికి ఆన్సర్ ఇచ్చిన యష్మీ.. నేనెందుకు ఇలా అయిపోయానో నాకు అర్థం కావడం లేదు.. నేను బాగానే ఆడుతున్నా అంటూ యష్మీ ఏడ్చింది. ముందు యష్మీని తీసుకొస్తా.. కప్పు కొట్టడానికి ట్రై చేస్తానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: క్షమించమంటూ నిఖిల్ ఏడుపు.. అది చూసి మోసపోవద్దన్న కావ్య!)తర్వాత వచ్చిన మణికంఠ.. నిఖిల్ని నామినేట్ చేశాడు. నేను వెళ్లేటప్పుడే నీ గ్రాఫ్ పడిపోతుందని నీకు చెప్పా. కానీ నీకెలా తెలుసు అని నువ్వు అడిగావ్.. ఇప్పుడు నేనే చూసి వచ్చా అందుకే చెబుతున్నా.. నీ గ్రాఫ్ పడిపోయింది, నువ్వు ఇక్కడికి కనెక్షన్స్ పెట్టుకోవడానికి వచ్చావా? కప్పు కోసం వచ్చావా అనే క్లారిటీ నీకు లేకపోతే టైటిల్ గెలవడం చాలా కష్టం నిఖిల్ అని అన్నాడు. దీనికి నిఖిల్ వైపు నుంచి పెద్దగా సమాధానం ఏం రాలేదు. సైలెంట్గా ఉండిపోయాడు.రెండో నామినేషన్ నబీల్కి వేసిన మణికంఠ పెద్ద మోటివేషన్ ఇచ్చాడు. నాలుగు వారాలుగా నువ్వు నామినేషన్స్ నుంచి తప్పించుకుంటున్నావ్. త్యాగాలు చేస్తున్నావ్. సైలెంట్ అయిపోయావ్. ఇవన్నీ ఎందుకు. నిన్ను ఇష్టపడే వాళ్లు నీ గేమ్ చూడాలనుంకుంటారు.. నీ త్యాగాలు కాదు అని అన్నాడు. దీంతో ఇకపై నా ఆట చూపిస్తా అని నబీల్ సవాల్ చేశాడు.(ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్కి విడాకులు ఇచ్చేసిన భార్య)అనంతరం హౌసులోకి వచ్చిన సీత.. విష్ణుప్రియని సూపర్ ఆడుతున్నావ్ అని మెచ్చుకుంది. ప్రేరణని నామినేట్ చేసింది. నువ్వు చీఫ్గా అట్టర్ ఫ్లాప్. డిక్టేటర్లా బిహేవ్ చేశావ్. ఇదే విషయం నీ భర్త కూడా చెప్పారు. ఆయన చెప్పి వెళ్లిన కాసేపటికే కిచెన్ దగ్గర తేజతో దోస గురించి గొడవపడ్డావ్. నువ్వు చిరాకుగా మాట్లాడే మాటలు గుచ్చుకుంటున్నాయ్ అని చెప్పుకొచ్చింది. నేను వాటిని మార్చుకుంటానని ప్రేరణ చెప్పింది. సీత తన నెక్స్ట్ నామినేషన్ యష్మీకి వేసింది. నువ్వు నిఖిల్ వెంట పడటం మొదలుపెట్టిన తర్వాతి నుంచి నీ గేమ్ పోయింది. నిఖిల్ ఉంటేనే నువ్వు కనపడుతున్నావ్ అని గట్టిగానే క్లాస్ పీకింది.తర్వాత వచ్చిన ఆదిత్య ఓం.. కర్మ ఈజ్ బ్యాక్ అనే డైలాగ్తో హౌసులోకి వెళ్లాడు. యష్మిని మొదటగా నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా కన్నడ బ్యాచ్ గ్రూప్ గేమ్ గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. మీరు ముందే ఫిక్సయి లోపలికి వచ్చినట్లున్నారు. ఎందుకంటే ప్రేరణ, నిఖిల్, పృథ్వీలను మీరు ఇప్పటివరకూ నామినేట్ చేయలేదు. వేరే వాళ్లని టార్గెట్ చేస్తున్నారు. వాళ్లు పెద్ద తప్పులు చేసినాసరే మీరు వదిలేస్తున్నారు. పక్షపాతంగా ఉంటున్నారు. ఫేవరిటిజం చూపిస్తున్నారు. న్యూట్రల్గా ఉన్నట్లు నటిస్తున్నారు. ఇది 12వ వారం అండి.. ఇంకెన్ని వారాలు చేస్తారని తన అసహనాన్ని వ్యక్తపరిచాడు.(ఇదీ చదవండి: జీవితంలో పెళ్లి చేసుకోను: హీరోయిన్ ఐశ్వర్య)ఆదిత్య మాటలపై స్పందించిన యష్మీ.. గ్రూప్ గేమ్ ఆడితే నా గేమ్ స్పాయిల్ అవుతుందని నాకు క్లారిటీ ఉందని చెప్పింది. గ్రూపిజం గురించి ఆదిత్యతో యష్మి కాస్త వాదన పెట్టుకుంది. కానీ చివరకు తను కొన్ని గేమ్స్లో ఫేవరెటిజం చూపించానని ఒప్పుకొంది. తర్వాత ప్రేరణని ఆదిత్య నామినేట్ చేశాడు. ఈమె కూడా గ్రూప్ గేమ్ ఆడుతోందనే కారణమే చెప్పాడు. దీంతో యష్మీని మీరు 12 వారాల్లో ఒక్కసారి కూడా ఎందుకు నామినేట్ చేయలేదు? అని ఆదిత్య అడిగాడు. అంతకంటే ఎక్కువ తప్పులు వేరే చోట కనిపించాయ్ అని ప్రేరణ అనేసరికి.. అవును మీకు నబీల్లో, నాలో, విష్ణుప్రియలో కనిపించాయ్, ప్రతిసారి మీకు మేమే కనిపిస్తామా? బయట జనాలు ఎలా నమ్ముతారు అని అడిగేసరికి ప్రేరణ సైలెంట్ అయిపోయింది.అలా ఈసారి నామినేషన్స్ కాస్త వెరైటీగా జరిగింది. కాకపోతే కన్నడ బ్యాచ్ ఫుల్ టార్గెట్ అయింది. ఇన్నాళ్లు గ్రూప్ గేమ్ ఆడుతూ నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు కానీ ఈసారి మాత్రం వీళ్లు నలుగురిపై కత్తి వేలాడుతోంది. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్ పూర్తయ్యేసరికి లిస్ట్లో యష్మీ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, నబీల్ చేరారు.(ఇదీ చదవండి: నటి కస్తూరిపై మరిన్ని కేసులు) -
గ్రూప్ గేమ్ ఆడినోళ్లను మడతెట్టేశారు.. గౌతమ్పై ప్రేరణ కుళ్లు
బిగ్బాస్ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను తిరిగి హౌస్లోకి తీసుకొచ్చి వారితో నామినేషన్స్ వేయించాడు. వచ్చిన ప్రతిఒక్కరూ నిఖిల్ గ్యాంగ్పైనే విరుచుకుపడ్డారు. మరి ఎవరు ఎవరెవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే నేటి (నవంబర్ 18) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..గౌతమ్పై ప్రేరణ కుళ్లుగత వారం అవినాష్, తేజ డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే వీరికి బదులు గౌతమ్ ఉండాల్సిందని ప్రేరణ అభిప్రాయపడింది. వచ్చినవారమే గౌతమ్ ఎలిమినేట్ అవ్వాల్సింది.. ఇప్పుడు ఏకంగా స్ట్రాంగ్ ప్లేయర్ అయి కూర్చున్నాడు. అదెలాగో నాకర్థం కావట్లేదు. ఈ వారం గౌతమ్, విష్ణుప్రియ, యష్మిలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారనుకున్నాను. అంతా రివర్స్లో జరుగుతోంది అని నబీల్తో ముచ్చట్లు పెట్టింది.వచ్చావా అక్క..తర్వాత బిగ్బాస్ ఆసక్తికర ఘట్టానికి తెరదీశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌస్లోకి వచ్చి ఇద్దర్ని నామినేట్ చేస్తారన్నాడు. మొదటగా సోనియా.. ప్రేరణను నామినేట్ చేసింది. వచ్చావా అక్క అని ప్రేరణ అనడంతో గొడవ పీక్స్కు వెళ్లింది. నాకు అక్క కాదు, నిఖిల్కు అక్కవి అని ప్రేరణ సంజాయిషీ ఇవ్వడంతో సోనియాకు మరింత తిక్క రేగింది. అతడికి అక్కను అని నువ్వెలా డిసైడ్ చేస్తావు? అంటూ గట్టిగా నిలదీసింది. అందుకు బదులుగా దాదాపు మూడునాలుగుసార్లు ప్రేరణతో సారీ చెప్పించుకుంది.తేజది తప్పయినప్పుడు యష్మిది కూడా తప్పేగా?అనంతరం నా పెద్ద కొడుకు నిఖిల్ను నామినేట్ చేస్తున్నా అంటూ నైస్గా మొదలుపెట్టి వైల్డ్గా మారిపోయింది. అప్పట్లో పృథ్వీని చిన్న కారణంతో నామినేట్ చేశావు. ఎప్పుడైనా కరెక్ట్ కారణంతో ఎవర్నైనా నామినేట్ చేశావా? యష్మి, ప్రేరణను ఎందుకు నామినేట్ చేయలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎవిక్షన్ షీల్డ్గేమ్లో తేజ ముందుగా ఎగ్ వేశాడని అతడిని వరస్ట్ కంటెస్టెంట్ అన్నావు.. మరి తేజ ఎగ్ వేసేవరకు ఆగి కావాలని యష్మి మరో గుడ్డు వేసింది. ఆమె చేసింది తప్పని ఎందుకు ఒప్పుకోవట్లేదు అని నిలదీసింది.ఆమె ముందు మాట్లాడు.. నిఖిల్కు సలహాఅతడి లవ్ట్రాక్ గురించి మాట్లాడుతూ.. యష్మి నీపై ఫీలింగ్స్ చూపించింది.. ఒక మహిళకు గౌరవమిచ్చేవాడివే అయితే.. ఆమె రిలేషన్షిప్ కోసం హౌస్కు రాలేదు, ఆమె ఏం చేస్తే అది పడటానికి రాలేదు అని తన వెనకాల మాట్లాడాల్సిన అవసరం లేదు. అవన్నీ తన ముందే చెప్పాలని గద్దించింది. తన మీద ఇష్టం లేనప్పుడు ఆమె జోలికి వెళ్లకూడదు అని తేల్చేసింది.ఏడ్చేసిన యష్మిసోనియా మాటలతో యష్మి కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు క్లారిటీగా చెప్పుంటే నీ జోలికే వచ్చేదాన్ని కాదని నిఖిల్పై మండిపడింది. నిఖిల్తో ఒక కలగన్నానే తప్ప తనపై నాకు పెద్ద ఫీలింగ్సే లేవని ప్లేటు తిప్పేసింది యష్మి. చివరగా సోనియా.. నువ్వు నీలా ఉండు నిఖిల్, నువ్వు గెలిస్తే సంతోషపడే మొదటి వ్యక్తిని నేనే అంటూ అతడి తలపై గాజు బాటిల్ పగలగొట్టింది.బేబక్కపై సెటైర్లుతర్వాత బేబక్క హౌస్లోకి వచ్చి అవతలివాళ్లను తక్కువ చేయడం నచ్చలేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది. దీంతో అతడు.. ప్రేక్షకులు మాకు ఓట్లు వేసి ఇక్కడిదాకా ఉంచారు. మీకు ఓట్లు వేయకుండా ఎలిమినేట్ చేశారంటూ సెటైర్లు వేశాడు. చీఫ్గా ఉన్నప్పుడు తనకు సపోర్ట్ చేయలేదంటూ బేబక్క.. నిఖిల్ను నామినేట్ చేసింది.గ్రూప్ గేమ్ మానేస్తే బెటర్అనంతరం శేఖర్ బాషా హౌస్లో అడుగుపెట్టాడు. ప్రేరణలో చిన్నపిల్లల మనస్తత్వం ఎంతో నచ్చేవి. కానీ రానురానూ రూడ్గా మారిపోయింది.. కొందర్ని పురుగుల్ని చూసినట్లు చూస్తోందంటూ ఆమెను నామినేట్ చేశాడు. గ్రూప్ గేమ్ మానేస్తే బెటర్ అని సలహా ఇచ్చాడు. యష్మిని సైతం గ్రూపిజం కనిపిస్తోందంటూ నామినేట్ చేశాడు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గ్రూప్ గేమ్ బండారం బయటపెట్టిన బాషా.. నిఖిల్కు పెద్ద మైనస్
నిఖిల్ అంటే ఇష్టమని అతడి వెంట తిరిగింది యష్మి. తనకు అలాంటి ఫీలింగ్స్ లేవని నిఖిల్ క్లియర్గా చెప్పకుండా చెప్పీచెప్పినట్లు చెప్పి తప్పించుకున్నాడు. పైగా యష్మి.. గౌతమ్ షర్ట్ వేసుకున్నప్పుడు అలగడం, వేరే ఎవరితోనైనా డ్యాన్స్ వేస్తే కుళ్లుకోవడం, తనను హత్తుకుని ముద్దుపెట్టడం వంటివి చూసినప్పుడు నిఖిల్కు కూడా ఆమె అంటే ఇష్టముందేమో అన్న సంకేతాలు కనిపించాయి.ముసుగులో గుద్దులాటఈ ముసుగులో గుద్దులాట దేనికి? అసలు నీ అభిప్రాయమేంటి? అని నిఖిల్ను ముఖం పట్టుకుని అడిగేసింది సోనియా. అందుకతడు ఆ మ్యాటర్ను ఎప్పుడో కట్ చేశానని, యష్మిపై తనకలాంటి ఉద్దేశమే లేదన్నాడు. అయితే యష్మి మాత్రం అది అబద్ధమని, తనకు ఏదీ క్లారిటీగా చెప్పలేదని వాదించింది. దీంతో నిఖిల్కు ఈ ఎపిసోడ్ కొంత మైనస్గా మారేట్లు కనిపిస్తోంది.పురుగుల్ని చూసినట్లు చూస్తావుఇక బేబక్క.. మనుషుల్ని చాలా తక్కువ చేసి చూస్తుంటావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు. ఆర్జే శేఖర్ బాషా.. ప్రేరణను నామినేట్ చేస్తూ అదిరిపోయే పాయింట్లు చెప్పాడు. అవతలివారిని కించపరిచేట్లుగా మాట్లాడతావ్.. కొన్నిసార్లు కొందర్ని పురుగుల్ని చూసినట్లు చూస్తావు.. పానీపట్టు టాస్క్లో నిఖిల్ నిన్ను, యష్మిని రఫ్గా హ్యాండిల్ చేశాడు. ఆ పాయింట్తో నువ్వు నిఖిల్ను నామినేట్ చేయొచ్చు. కానీ అది వదిలేసి నీ టీమ్ మెంబర్ అయిన గౌతమ్ను ఎందుకు నామినేట్ చేశావు? అని ప్రశ్నించాడు.నిఖిల్కు లేని బాధ నీకెందుకు?అటు యష్మిని సైతం నామినేట్ చేస్తూ.. అవినాష్.. రోహిణిని సేవ్ చేసి నిఖిల్ను నామినేట్ చేశాడు. అక్కడ నిఖిలే లైట్ తీసుకున్నాడు, కానీ నువ్వెందుకు బాధపడ్డావు? మీ ముగ్గురూ కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని జనాలకు తెలిసిపోయింది అంటూ యష్మిని నామినేట్ చేశాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అగ్గి రాజేసిన సోనియా.. నిఖిల్ వల్ల బ్యాడ్ అయ్యానన్న యష్మి
ఈసారి నామినేషన్స్ ప్రక్రియను బిగ్బాస్ వెరైటీగా ప్లాన్ చేశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను హౌస్లోకి రప్పించి.. ఇద్దర్ని నామినేట్ చేయాలన్నాడు. అలా మొదటగా సోనియా ఆకుల హౌస్లో ఎంట్రీ ఇచ్చింది. వచ్చీరావడంతోనే నిఖిల్ బ్యాచులో పుల్లలు పెట్టింది. పృథ్వీని ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నావ్ అంటూ ప్రేరణను నామినేట్ చేసింది.సిల్లీ రీజన్స్తో నామినేషన్ఇక నిఖిల్ను అయితే ఓ ఆటాడేసుకుంది. మొదట్లో పృథ్వీని ఎందుకు నామినేట్ చేశావ్? అని అడిగింది. అందుకతడు నిర్లక్ష్యంగా ఉన్నందుకు చేశానన్నాడు. అది విని అవాక్కైన పృథ్వీ.. ఆ కారణంతో నామినేట్ చేశావా? అని నోరెళ్లబెట్టాడు. మంచి పాయింట్లతో ఎప్పుడైనా నామినేట్ చేశావా? అని నిఖిల్ను నిలదీసింది. ఇక యష్మితో లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ.. యష్మి తన మనసులో ఫీలింగ్ చెప్పింది.. కానీ నువ్వు అంటూ సోనియా మాట్లాడుతుండగా.. మధ్యలో నిఖిల్ అందుకున్నాడు. నిఖిల్ జోలికే వెళ్లేదాన్ని కాదుతన ఫీలింగ్ చెప్పగానే అక్కడే కట్ చేసేశాను అని క్లారిటీ ఇచ్చాడు. అది అబద్ధమని యష్మి గట్టిగా అరిచింది. క్లారిటీగా తనకు చెప్పుంటే నిఖిల్ జోలికే వెళ్లేదాన్ని కాదంది. అతడి వల్ల తాను బ్యాడ్ అయ్యానంది. అలా సోనియా నిఖిల్ నెత్తిపై బాటిల్ పగలగొట్టి నామినేట్ చేసింది. మరి హౌస్లోకి ఇంకా ఎవరెవరు వచ్చారు? ఎవర్ని నామినేట్ చేశారు? అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: ఫ్యామిలీని కూడా వదలని బిగ్బాస్.. వారమంతా ఏడిపించి, చివర్లో అలా..
అప్పట్లో ఓ సినిమాలో ఓ విలన్ అంటాడు, నాకు నా శత్రువే కాదు, శత్రువు కుటుంబ సభ్యులు కూడా అవసరం. అలానే బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ మాత్రమే కాదు, వారికి సంబంధించిన కుటుంబసభ్యులను కూడా తన షోలో వినియోగించుకున్నాడు బిగ్ బాస్. హౌస్ లోని పార్టిసిపెంట్స్ కుటుంబసభ్యులను మాంచి డ్రామా రూపంలో దశలవారిగా పార్టిసిపెంట్స్ కు కలిపించి వారి మధ్య జరిగిన భావావేశాలను ప్రేక్షకులకు యధావిధిగా వండి వార్చాడు సదరు బిగ్ బాస్. కుటుంబ సభ్యులను పార్టిసిపెంట్స్ కలవడం లో పెద్ద వింతేమీ లేదు కాని, ఆ పార్టిసిపెంట్స్ తో హౌస్ లో జరుగుతున్న విషయాలను బాహటంగానే కుటుంబ సభ్యులు చర్చించడం అటు పార్టిసిపెంట్స్ కు ఇటు ప్రేక్షకులకు చిన్న పాటి ఇబ్బంది కలిగింది. ముఖ్యంగా యశ్మి, ప్రేరణ, నిఖిల్, విష్ణు తదితరల పార్టిసిపెంట్స్ తమ కుటుంబ సభ్యులను కలవడంలో పడ్డ ఆనందం కన్నా ఆ తరువాత వాళ్ళతో మాట్లాడినపుడు ఎక్కువగా ఇబ్బంది పడ్డారని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా హౌస్ లో జరిగే ప్రేమాయణాల నుండి గిల్లికజ్జాల వరకు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడటం చాలా ఎబ్బెట్టుగా ఉంది.అంతేనా బిగ్ బాస్ ప్రేక్షకులకు ఇంత చిన్న మసాలా అయితే ఎలా సరిపోతుంది అనుకున్న బిగ్ బాస్ ఒక పార్టిసిపెంట్ ను వారమంతా ఏడిపించి వారం చివర్లో వాళ్ళ ఫ్యామిలీని కలిపించి ప్రేక్షకులకు ఓ మాంచి మసాలానే చూపించాడు బిగ్ బాస్. ఆ పార్టిసిపెంటే టేస్టీ తేజ. ఓ రకంగా చెప్పాలంటే ఈ వారమంతా బిగ్ బాస్ ఎపిసోడ్లలో ఈ తేజ ఏడుపునే అమ్ముకున్నాడు బిగ్ బాస్. అంతేనా అదే తేజను ఎలిమినేషన్లో పెట్టి నాటకీయంగా నో ఎలిమినేషన్ అని చెప్పింది ఈ వారానికి తేజకు కథ సుఖాంతం చేశాడు. ఒక్క విషయం మాత్రం అటు ప్రేక్షకులు ఇటు పార్టిసిపెంట్స్ గుర్తు పెట్టుకోవాలి, అదేంటంటే బిగ్ బాస్ కార్యక్రమాన్ని చూడడం లేదా పార్టిసిపెంట్ చేయడమంటే కాస్త గుండె దిటవుతో ఉండాలి. ఎందుకంటే బిగ్ బాస్ తన కార్యక్రమాన్ని నార్మల్ ప్యాక్ లో చేయడు ఫ్యామిలీ ప్యాక్ తప్ప.-ఇంటూరు హరికృష్ణ -
నిఖిల్ గొప్పతనాన్ని చెప్పిన అమర్, బిగ్బాస్ మాస్టర్ ప్లాన్
కొందరి ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ శనివారం ఎపిసోడ్లో స్టేజీపైకి వచ్చేసి మాట్లాడారు. మిగిలినవారి ఫ్యామిలీస్ నేడు స్టేజీపై సందడి చేశారు. మరి ఎవరెవరు వచ్చారు? ఎవర్ని టాప్ 5లో పెట్టారు? అనేది నేటి (నవంబర్ 17) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..మందు తాగుతానన్న యష్మియష్మి కోసం ఆమె ఫ్రెండ్స్ శ్రీసత్య, సంయుక్త స్టేజీపైకి వచ్చారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత యష్మిని మీరు చూడలేరని నాగార్జునతో అన్నారు. అందుకు కారణమేంటో ఎలాగైనా తెలుసుకోవాలనుకున్న నాగ్.. ఆ సీక్రెట్ చెప్తే ప్రైజ్మనీకి రూ.3 లక్షలు యాడ్ అవుతాయన్నారు. ఈ బంపరాఫర్కు టెంప్ట్ అయిపోయిన యష్మి.. తాను మందు తాగుతానని ఒప్పేసుకుంది. నిన్నటిలాగే వీరితోనూ టాప్ 5 ఎవరనేది గేమ్ ఆడించాడు. టాప్ 5లో ఎవరంటే?తమ కంటెస్టెంట్ను పక్కనపెట్టి మిగతావారిలో ఐదుగురిని ఫైనలిస్టులుగా సెలక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా గౌతమ్ 1, నిఖిల్ 2, నబీల్, అవినాష్, ప్రేరణ మిగతా మూడు స్థానాల్లో ఉన్నారు. తర్వాత యష్మిని సేవ్ చేశారు. తేజ తండ్రి శ్రీనివాసరెడ్డి, ఫ్రెండ్ వీజే సన్నీ వచ్చారు. తల్లిని హౌస్లోకి తీసుకురావాలన్న కలను నెరవేర్చుకున్నావు.. నిన్ను ఫినాలేలో చూడాలనుకున్న అమ్మ కలను కూడా నెరవేర్చు అని తేజపై భారం వేశాడు అతడి తండ్రి.అవినాష్తో సినిమాసన్నీ.. గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్ను వరుసగా టాప్ 5లో పెట్టాడు. అందరి అంచనాలను మనం అందుకోలేము.. నువ్వు నీలా ఉండు అంటూ నిఖిల్కు గోల్డెన్ సలహా ఇచ్చాడు. అనంతరం ముక్కు అవినాష్ కోసం అతడి తమ్ముడు అశోక్తో పాటు దర్శకుడు కోన వెంకట్ వచ్చారు. బిగ్బాస్ నుంచే చాలామంది నటుల్ని తీసుకుంటున్నాను.. అవినాష్తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు కోన వెంకట్. కంటెస్టెంట్లందరికీ తన సినిమా టైటిల్స్ను డెడికేట్ చేశాడు. అవినాష్ అదుర్స్, నబీల్ దూకుడుఅలా నిఖిల్కు బాద్షా, పృథ్వీకి బలుపు, విష్ణుప్రియకు నిన్ను కోరి, యష్మికి దేనికైనా రెడీ, ప్రేరణకు గీతాంజలి, రోహిణికి హ్యాపీ, గౌతమ్కు శివమణి, అవినాష్కు అదుర్స్, తేజకు ఢీ, నబీల్కు దూకుడు సినిమా టైటిల్స్ అంకితమిచ్చాడు. వీరు.. నబీల్ను 1, నిఖిల్ను 2, రోహిణిని 3, విష్ణుప్రియను 4, గౌతమ్ను 5వ ర్యాంకులో ఉంచారు. తర్వాత నిఖిల్ కోసం అతడి తండ్రి శశికుమార్, నటుడు అమర్దీప్ వచ్చేశారు. రెండు రోజులు నాతోనేఅమర్దీప్ మాట్లాడుతూ.. ఓ షో తర్వాత నా రెండు కాళ్లు నొప్పితో కదల్లేని స్థితికి వచ్చేశాయి. పూర్తిగా బిగుసుకుపోయాయి. షో నుంచి ఇంటికి వెళ్లకుండా సరాసరి నాతో పాటే నా రూమ్కు వచ్చాడు. రెండు రోజులు నాతోనే ఉన్నాడు. నన్ను వాష్రూమ్కు కూడా ఎత్తుకుని తీసుకుపోయాడు అంటూ నిఖిల్ స్నేహానికిచ్చే విలువను చాటిచెప్పాడు. అలాగే విష్ణుప్రియ, నబీల్, రోహిణి, గౌతమ్, తేజకు వరుస ఐదు ర్యాంకులిచ్చాడు.మగాళ్లపై ఆడాళ్ల విజయంర్యాంకుల గోల అయిపోవడంతో నాగ్.. హౌస్మేట్స్తో చిన్న గేమ్ ఆడించాడు. అమ్మాయిలను, అబ్బాయిలను రెండు టీములుగా విడగొట్టాడు. సినిమా పేరు చెప్పగానే హీరో, దర్శకుడు, హీరోయిన్ ఫోటోలను బోర్డుపై పెట్టాలన్నాడు. అలా ఈ ఆటలో మహిళల టీమ్ గెలిచింది. తర్వాత విష్ణుప్రియ సేవ్ అయినట్లు ప్రకటించాడు.అవినాష్ను సేవ్ చేసిన నబీల్చివరగా అవినాష్, తేజ నామినేషన్లో మిగిలారు. ఈ క్రమంలో నబీల్ను ఎవిక్షన్ షీల్డ్ వాడతావా? అని నాగ్ అడిగాడు. నాకు షీల్డ్ రావడానికి అవినాష్ కూడా ఓ కారణమే.. అందుకే అతడి కోసం వాడాలనుకుంటున్నాను. నేను గేమ్ ద్వారా మాత్రమే ముందుకు వెళ్తాను అని నబీల్ తన నిర్ణయం చెప్పాడు. దీంతో అవినాష్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన నాగ్.. నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడటం వల్ల అతడు సేవ్ అయినట్లు తెలిపాడు. టెన్షన్తో చచ్చిపోయిన తేజబిగ్బాస్ నాలుగో సీజన్లో ఎవిక్షన్ షీల్డ్తో సేవ్ అయ్యానని.. ఇప్పుడు మరోసారి అదే షీల్డ్ తనను కాపాడిందన్నాడు అవినాష్ మరి నా పరిస్థితి ఏంటని తేజ అయోమయానికి లోనయ్యాడు. అతడిని కాసేపు టెన్షన్ పెట్టిన నాగ్.. చివరకు సేవ్ అయినట్లు ప్రకటించాడు. ఈ వారం ఎలిమినేషనే లేదని తెలిపాడు. అయితే రేపు మాత్రం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో నామినేషన్స్ చేయించాడు బిగ్బాస్. ఈ క్రమంలో సోనియా.. నిఖిల్ను నామినేట్ చేయడం గమనార్హం. ఆ తతంగమంతా రేపు చూసేయండిమరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్గా అడుగుపెట్టిన శోభా శెట్టి
బిగ్బాస్ షో చప్పగా సాగుతున్నప్పుడు, తిరిగి పట్టాలెక్కించేందుకు వైల్డ్కార్డులనే నమ్ముకుంటున్నారు. అందుకే గత సీజన్తో పాటు ఈ సీజన్లో కూడా ఈ ఫార్ములానే నమ్ముకున్నారు. అది ఈసారి కాస్త ఫలించినట్లు కనిపిస్తోంది. ఎంటర్టైన్మెంట్ లేక బోసిపోయిన బిగ్బాస్ హౌస్కు కాస్త కొత్త కళ వచ్చినట్లయింది.వైల్డ్ కార్డులనే నమ్ముకుంటున్నారుఅటు కన్నడ బిగ్బాస్ పదకొండో సీజన్లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఏడు వారాలుగాయవంతంగా కొనసాగుతున్న ఈ షోలో నేడు ఇద్దరు సెలబ్రిటీలు భాగం కానున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా బయటకు వచ్చేసింది.గతేడాది తెలుగులో.. ఇప్పుడు కన్నడలోప్రోమోలో ఫేస్ రివీల్ చేయలేదు కానీ వచ్చిన ఇద్దరిలో ఒకరు మన తెలుగువారికి బాగా సుపరిచితురాలు. తనే కార్తీక దీపం సీరియల్ విలన్ శోభా శెట్టి. పోయిన ఏడాదే తెలుగు బిగ్బాస్ ఏడో సీజన్లో పాల్గొంది. సీరియల్లో చూపించిన ఉగ్రరూపాన్నే ఇక్కడ కూడా చూపించి కొంత నెగెటివిటీ మూటగట్టుకుంది.మరి ఈసారైనా..?కాకపోతే ఎవరినైనా ఎదురించే స్వభావం జనాలకు తెగ నచ్చేసింది. టాప్ 5 వరకు రాకుండానే వెనుదిరిగిన ఈ బ్యూటీ ప్రస్తుతం కన్నడ బిగ్బాస్లో ఎంట్రీ ఇవ్వనుంది. హౌస్లో ఎవరు నీకు పోటీ? అని హోస్ట్ కిచ్చా సుదీప్ అడిగితే.. తనకు ఎవరూ పోటీ కారంటోంది శోభా. మరి అక్కడ ఎన్నివారాలు హౌస్లో కొనసాగుతుందో చూడాలి! View this post on Instagram A post shared by Colors Kannada Official (@colorskannadaofficial) మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మి సీక్రెట్ ఖరీదు రూ.3 లక్షలు.. ఆరు దాటిందంటే పెగ్గు..
కంటెస్టెంట్ల కోసం ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు కూడా వచ్చేస్తున్నారు. అలా యష్మి కోసం ఆమె సోదరితో పాటు శ్రీసత్య వచ్చారు. వచ్చీరావడంతోనే యష్మి నోటితోనే సీక్రెట్ బయటపెట్టించారు. సాయంత్రం ఆరుగంటల తర్వాత యష్మి ఏం చేస్తుందో మీకు తెలియదు సర్ అని హోస్ట్ నాగార్జునతో అన్నారు.సాయంత్రం ఆరు దాటితే..ఆ సీక్రెట్ ఏంటో బయటపెడితే ప్రైజ్మనీకి మరో రూ.3 లక్షలు యాడ్ చేస్తానని నాగ్ బంపరాఫర్ ఇచ్చాడు. దీంతో యష్మి క్షణం ఆలోచించకుండా మావా.. ఏక్ పెగ్లా.. అంటూ తను మద్యం తాగుతానన్న రహస్యాన్ని బయటపెట్టింది.. ఒక్క పెగ్ కాస్ట్ మూడు లక్షలా? అని అవినాష్ ఆశ్చర్యపోయాడు. శ్రీసత్య వెళ్లిపోయేముందు తనకు పాత యష్మి కావాలని అడిగింది.అవినాష్ కోసం కోన వెంకట్బిగ్బాస్కు వీరాభిమాని అయిన కోన వెంకట్ అవినాష్ కోసం వచ్చేశాడు. తన సినిమా టైటిల్స్ను హౌస్మేట్స్కు అంకితమిచ్చాడు. అలా పృథ్వీకి 'బలుపు', యష్మికి 'దేనికైనా రెడీ' అన్న టైటిల్స్ ఇచ్చాడు. అమర్దీప్.. వస్తే కప్పుతోనే రావాలని నిఖిల్కు బూస్ట్ ఇచ్చాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
క్షమించమంటూ నిఖిల్ ఏడుపు.. అది చూసి మోసపోవద్దన్న కావ్య!
నిఖిల్ మళయక్కల్.. గోరింటాకు సీరియల్తో బాగా ఫేమస్ అయ్యాడు. ఇదే ధారావాహికలో అతడికి జోడీగా నటించింది కావ్య శ్రీ. సీరియల్ ఎంత పాపులర్ అయిందో కానీ, వీరి జోడీ అంతకంటే ఎక్కువ క్లిక్ అయింది. ఇంకేముంది.. ప్రతి ఫంక్షన్లోనూ, షోలోనూ, ఈవెంట్లోనూ జంటగా మెరిసేవారు. కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు. ఇద్దరి మధ్య దూరంవీళ్ల యవ్వారం చూసిన జనాలు ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని భావించారు. ఇదే ప్రశ్న ఓసారి నిఖిల్కు ఎదురైతే.. కావ్య మంచి అమ్మాయి.. పెళ్లి అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. కానీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని తమ ప్రేమ నిజమేనని హింటిచ్చాడు. తర్వాత ఏమైందే ఏమో తెలియదుగానీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. యూట్యూబ్ వీడియోలు చేయడం ఆపేశారు. కొట్టినా, తిట్టినా పడతా..ఇక నిన్నటి బిగ్బాస్ ఎపిసోడ్లో నిఖిల్ తన లవ్స్టోరీ చెప్తూ ఎమోషనలయ్యాడు. ఆరేళ్ల ప్రేమ.. విడిపోయామని నేను అనుకోవడం లేదు. బిగ్బాస్ అయిపోగానే నీ ముందు ప్రత్యక్షమవుతాను. నువ్వు కొట్టినా, తిట్టినా పడతాను కానీ నన్ను క్షమించు. నువ్వే నా భార్యవి.. పిచ్చిలేస్తే నిన్ను లేపుకెళ్లిపోతా.. అని ఏడుస్తూ చెప్పాడు. అయితే అతడి కన్నీళ్లకు కావ్య కరిగినట్లు లేదు. ఇలాంటివి చూసి మోసపోవద్దంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేసింది. మోసపోవద్దుమాస్కు వేసుకుని నటించేవాళ్లను చూసి మోసపోవద్దు. ఫేక్ మనుషులు పరిస్థితులకు తగ్గట్లుగా తమ అసలు రంగును బయటపెడుతుంటారు. ఆ మాస్కులు పూర్తిగా ఊడిపోయేవరకు ఎదురుచూడండి అని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ కొటేషన్ను పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు నిఖిల్- కావ్య మళ్లీ కలుస్తారా? లేదా? అని చర్చించుకుంటున్నారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నెం.1 స్థానంలో నిఖిల్.. గౌతమ్ సాయాన్ని మర్చిపోని సోహైల్
వారమంతా కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ వచ్చారు. ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కంటెస్టెంట్ల ఫ్రెండ్స్ కూడా స్టేజీపైకి వచ్చారు. వారికి నాగ్ ఓ టాస్క్ ఇచ్చాడు. తమ కుటుంబ సభ్యుడిని మినహాయించి మిగతావారిలో ఎవరు టాప్ 5లో ఉంటారో చెప్పాలన్నాడు. మరి ఎవరెవరు ఏయే కంటెస్టెంట్లను టాప్ 5లో పెట్టారో నేటి (నవంబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..టాప్ 5 ర్యాంకులుమొదట ప్రేరణ తల్లి రూప, చెల్లి ప్రకృతితో పాటు నటి ప్రియ వచ్చారు. ప్రకృతి మిస్ ఇండియా తెలంగాణతో పాటు బెనెటి యూనివర్సిటీ మిస్ సుడోకుగా నిలిచిందంటూ నాగ్ అభినందించాడు. తర్వాత ప్రేరణ తల్లి.. నిఖిల్ను మొదటి స్థానంలో, నబీల్ను రెండో స్థానంలో, గౌతమ్, యష్మి, రోహిణిలను మిగతా మూడు స్థానాల్లో పెట్టారు.రవి సలహాను లెక్కచేయని విష్ణుతర్వాత విష్ణుప్రియ కోసం ఆమె చెల్లి పావని, యాంకర్ రవి వచ్చారు. నీకు నువ్వు ప్రాధాన్యత ఇచ్చుకోకపోతే జనాలు నీకెందుకు ఓట్లు వేస్తారు? ముందు నీకు నువ్వు ముఖ్యం అనుకుని గేమ్ ఆడమని రవి సలహా ఇచ్చాడు. కానీ విష్ణుప్రియ వింటేగా..? నాకోసం నేను ఆలోచిస్తే అహంకారమంటూ పిచ్చిగా మాట్లాడింది. దీంతో పావని నీపై నువ్వు ఫోకస్ చేయు అని హెచ్చరించడంతో కాస్త వెనక్కు తగ్గింది.కోవై సరళ కంటే పెద్ద ఆర్టిస్టు..వీరు గౌతమ్ను 1, నిఖిల్ను 2, నబీల్ను 3, పృథ్వీని 4, రోహిణిని 5వ స్థానంలో పెట్టారు. రోహిణి కోసం నాన్నతో పాటు నటుడు శివాజీ స్టేజీపైకి వచ్చారు. కోవై సరళ కంటే కూడా పెద్ద ఆర్టిస్టు అవుతావు అని శివాజీ.. రోహిణిని మెచ్చుకున్నాడు. టాప్ 5 గురించి మాట్లాడుతూ.. విష్ణు 1, నబీల్ 2, నిఖిల్ 3, గౌతమ్ 4, తేజ 5వ స్థానంలో ఉంటారన్నాడు.గౌతమ్ సాయం మర్చిపోని సోహైల్పృథ్వీ కోసం తమ్ముడు విక్రమ్, నటి దర్శిని వచ్చారు. నిఖిల్, నబీల్, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియను టాప్ 5లో వరుస స్థానాల్లో ఉంచారు. పృథ్వీ సేవ్ అయినట్లు ప్రకటించారు. గౌతమ్ తల్లి మంగమ్మతో పాటు నటుడు సోహైల్ వచ్చారు. ఈ సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ.. నా సినిమా రిలీజ్ సమయంలో 120 టికెట్లు స్పాన్సర్ చేసి జనాలకు చూపించాడు అని తెలిపాడు.నబీల్ కోసం భోలెఇక నబీల్ను 1, నిఖిల్ను 2, ప్రేరణను 3, తేజను 4, అవినాష్ను 5వ స్థానాల్లో పెట్టారు. తర్వాత గౌతమ్ను సేవ్ చేశారు. నబీల్ కోసం అతడి సోదరుడు సజీల్తో పాటు సింగర్ భోలె షావళి వచ్చారు. వీళ్లు నిఖిల్, గౌతమ్, అవినాష్, తేజ, విష్ణుప్రియకు టాప్ 5 ర్యాంకుల్ని వరుసగా ఇచ్చారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నాకు నువ్వు కావాలి, అవసరమైతే లేపుకెళ్లిపోతా: నిఖిల్
హౌస్మేట్స్ తమ మొదటి ప్రేమకథ చెప్పాలన్నాడు బిగ్బాస్. ఈ క్రమంలో ఫస్ట్ లవ్స్టోరీ చెప్తూ కొందరు సిగ్గుపడితే మరికొందరు ఎమోషనలయ్యారు. ముందుగా యష్మి మాట్లాడుతూ.. నేను టీవీ యాంకర్గా ట్రై చేసినప్పుడు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మొదట ఫ్రెండయ్యాడు.. తర్వాత ప్రేమించుకున్నాం. కానీ ఒకానొక సమయంలో నాకు ఫ్యామిలీనే ముఖ్యమనిపించింది. అప్పుడు మా మధ్య కూడా విభేదాలు వచ్చాయి. ఒప్పుకోలేకపోతున్నా..ప్రేమ మీద నమ్మకం పోయింది. మా నాన్న తప్ప ఇంకెవరూ వద్దనుకున్నాను. కానీ ఈరోజుకూ ఆయన నాకోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎందుకో ఆయన్ను ఒప్పుకోలేకపోతున్నాను. కానీ ఈరోజుకూ నన్ను గైడ్ చేస్తూ ఫ్రెండ్గా ఉన్నాడు. మరో జన్మంటూ ఉంటే అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను.. అని యష్మి భావోద్వేగానికి లోనైంది.బాగోలేనని బ్రేకప్: తేజతేజ మాట్లాడుతూ.. నాలుగేళ్లపాటు రిలేషన్లో ఉన్నాం. ఓసారి ఇంటికెళ్లి రాగానే బ్రేకప్ చెప్పింది. తన పక్కన నేను బాగోలేనని వాళ్ల పేరెంట్స్ వద్దన్నారట! ఆమె పెళ్లికి కూడా వెళ్లాను. ఓసారి ఆమె సడన్గా కాల్ చేసి సారీ అంటూ ఏడ్చేసింది. నా లైఫ్లోకి వచ్చే అమ్మాయికి ఒకటే చెప్తున్నా.. మా అమ్మను ఎంత ప్రేమగా చూసుకుంటానో, తనను కూడా అంతే ప్రేమగా చూసుకుంటా అని బిగ్బాస్ షో సాక్షిగా మాటిచ్చాడు.పృథ్వీ లవ్ స్టోరీపృథ్వీ.. నేను, నా బెస్ట్ ఫ్రెండ్ ఒకే అమ్మాయిని ప్రేమించాం. ఇద్దరం ట్రై చేసుకుందాం, ఎవరికి పడితే వాళ్లకే ఆ అమ్మాయి సొంతం అని డీల్ మాట్లాడుకున్నాం. ఓసారి ఆమె దగ్గరకు వెళ్లి ఐ లవ్యూ చెప్తే నీ పేరేంటి? అని అడిగింది. కాలేజీలో నా పేరు అందరికీ తెలుసు.. అలాంటిది ఆమె నా పేరు అడిగేసరికి ఇన్సల్ట్ అనిపించింది. తర్వాత ఆమె నా ఫ్రెండ్స్ దగ్గర నెంబర్ తీసుకుని నాకు మెసేజ్లు చేసింది.మోసం చేశాడు: రోహిణిఓరోజు ప్రపోజ్ కూడా చేసింది. అంతా బాగానే సాగింది. త్వరగా పెళ్లి చేసుకుందామంది. నా కెరీర్ నాకు ముఖ్యం, పెళ్లికి సమయం పడుతుందని చెప్పేసరికి ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం అని తెలిపాడు. రోహిణి.. డైమండ్ రింగ్తో నాకు బాగా దగ్గరైన స్నేహితుడికి ప్రపోజ్ చేశాను. ఆర్థిక ఇబ్బందులున్నాయి. అవి క్లియర్ అయ్యాకే పెళ్లి చేసుకుందామన్నాడు. సరేనన్నాను. కట్ చేస్తే వేరే అమ్మాయితో రెండేళ్లుగా రిలేషన్లో ఉన్నాడు. అది నా దగ్గర దాచాడు. తర్వాత సిల్లీగా బ్రేకప్ చెప్పాడు అంటూ ఎమోషనలైంది.నా భార్య అని ఫిక్సయ్యా: నిఖిల్నిఖిల్ వంతు రాగా.. తెలుగు ఇండస్ట్రీలో కాలు పెట్టినప్పుడే ఈ అమ్మాయి నా సొంతం అనిపించింది. అన్ని ప్రేమకథల్ని మరిపించేలా చేసింది. మాది ఆరేళ్ల రిలేషన్.. తను నా భార్య అని ఫిక్సయిపోయాను. కానీ ఫ్యామిలీ వల్ల మా మధ్య దూరం వచ్చింది. ఈ జన్మకు సరిపోయేటన్ని జ్ఞాపకాలనిచ్చింది. తిట్టు, కొట్టు..కోపంలో విడిపోయాం.. కానీ నా వల్ల కావట్లేదు. కచ్చితంగా తన దగ్గరకు వెళ్తా.. తిట్టు, కొట్టు, నువ్వు మళ్లీ ఒప్పుకునేవరకు నీ వెంటపడ్తాను. నాకు పిచ్చి లేసిందంటే మాత్రం లేపుకెళ్తాను. బిగ్బాస్ షో అయిపోగానే నీ కళ్ల ముందుంటాను. బిడ్డ తప్పు చేస్తే అమ్మ ఎలా క్షమించి దగ్గరకు తీసుకుంటుందో నువ్వూ అలాగే దగ్గరకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు నువ్వు కావాలి అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పృథ్వీ సేఫ్.. ఎంటర్టైనర్ అవుట్? అంతలోనే ట్విస్ట్
బిగ్బాస్ ఫ్యామిలీ వీక్ సంపూర్ణమైందన్నాడు కానీ ఇంకా కొనసాగుతూనే ఉంది. హౌస్లో వచ్చేవాళ్లు అయిపోయారు కానీ స్టేజీపైకి వచ్చి మాట్లాడేవాళ్లు ఇంకా మిగిలే ఉన్నారు. ఈ రోజు కంటెస్టెంట్ల ఇంటిసభ్యులతో పాటు స్నేహితులు కూడా వచ్చి విజయం నీదేనంటూ ధైర్యం చెప్పనున్నారు.పృథ్వీ సేఫ్కానీ ఈపాటికే ఆ పదిమందిలో ఒకరి ఎలిమినేషన్ కన్ఫామ్ అయిపోయింది. ఈ వారం అవినాష్, తేజ, గౌతమ్, పృథ్వీ, విష్ణుప్రియ, యష్మి నామినేషన్లో ఉన్నారు. పృథ్వీ వెళ్లిపోయే సూచనలున్నాయి, జంట పక్షులు విడిపోవడానికి సమయం ఆసన్నమైందని ఊరించారు కానీ అలాంటిదేమీ జరగలేదు. అంతెందుకు సండేవరకు ఆగకుండా నేటి ఎపిసోడ్లోనే పృథ్వీ సేవ్ అయ్యాడట!ఎంటర్టైనర్ గుడ్బైఅంటే తన ఓటు బ్యాంక్ బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలినవారిలో అవినాష్ డేంజర్ జోన్లో ఉన్నాడు. వైల్డ్కార్డ్ ఎంట్రీగా ఇచ్చిన ఇతడు నామినేషన్స్ అంటేనే జంకాడు. చివరకు అతడి భయమే నిజమైంది. గేమ్ ఆడి మెగా చీఫ్ అయినప్పటికీ ప్రేక్షకులు అతడిని బయటకు పంపించేందుకే మొగ్గుచూపారు. ఈ వారం ఎంటర్టైనర్ను ఎలిమినేట్ చేశారు.నబీల్ వల్ల బతికిపోయిన అవినాష్కానీ ఇక్కడే ట్విస్ట్ ఇచ్చారు. చివర్లో తేజ, అవినాష్ ఇద్దరూ మిగిలారు. నబీల్తో ఎవిక్షన్ షీల్డ్ బలవంతంగా వాడేలా చేశారు. దీంతో అతడు అవినాష్ కోసం ఎవిక్షన్ షీల్డ్ వాడటంతో అతడు సేవ్ అయిపోయాడట. అలా ఈ వారం నో ఎలిమినేషన్ అని తెలుస్తోంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణు గెలవాలన్న శివాజీ.. గౌతమ్పై పంచులు
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో పట్టుమని పదిమందే మిగిలారు. వీళ్లందరి కుటుంబసభ్యులను హౌస్లోకి పంపించి నూతనోత్తేజాన్ని నింపారు. అయితే ఎప్పటిలాగే వీకెండ్లో మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ను తీసుకువచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు.మరోసారి ఫ్యామిలీస్..ప్రేరణ కోసం ఆమె తల్లి, చెల్లితో పాటు సినీ నటి ప్రియ వచ్చింది. విష్ణుప్రియ కోసం ఆమె చెల్లి, యాంకర్ రవి వచ్చారు. రోహిణి కోసం ఆమె తండ్రి, శివాజీ వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చినవాళ్లతో టాప్ 5లో ఎవరుంటారన్న గేమ్ ఆడించారు. నువ్వు గెలవాలంటూ విష్ణును టాప్ 1 ప్లేస్లో పెట్టాడు శివాజీ. అది చూసి విష్ణుప్రియ సైతం షాకైంది. గౌతమ్పై శివాజీ పంచులుగౌతమ్ను కూడా శివాజీ ఓ ఆట ఆడుకున్నాడు. యష్మి బిజీగా ఉంది, నిన్ను పట్టించుకోలేదు.. నీకు వర్కవుట్ కాలేదని అక్కా అన్నావ్.. అయినా నీకు రోహిణి కంటే మంచి అమ్మాయి దొరుకుతుందా? అని సెటైర్లు వేశాడు. ఎవరికి టైటిల్ దక్కనుంది? ఎవరు ఫినాలేలో అడుగుపెడతారన్నది కంటెస్టెంట్ల ఇంటిసభ్యులు డిసైడ్ చేయనున్నారు. దీంతో హౌస్లో ఉన్నవారికి కూడా గేమ్పై ఓ క్లారిటీ రానుంది. చదవండి: నా అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్లను పట్టించుకోవద్దు: విశ్వంభర దర్శకుడు -
గాల్లో తేలుతున్న తేజ.. హింట్లు వదిలేసి ప్రేమ పంచిన శ్రీపాద
అమ్మను మించిన సెంటిమెంట్ మరొకటి ఏముంటుంది? మీ అమ్మ రాదు, రానివ్వను అని తేజను భయపెట్టి ఏడిపించిన బిగ్బాస్ చివరకు పట్టువదిలాడు. తల్లిని లోనికి పంపించాడు. దానికంటే ముందు, తర్వాత ఏం జరిగిందో నేటి (నవంబర్ 15) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..కటౌట్ తీసేయమన్న బిగ్బాస్ఫ్యామిలీ వీక్ అయిపోంది.. కాబట్టి ప్రేరణ.. తన భర్త శ్రీపాద కటౌట్ను స్టోర్ రూమ్లో పెట్టేయాలన్నాడు బిగ్బాస్. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కాసేపటికే ఆమె పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్బాస్.. శ్రీపాదను హౌస్లోకి పంపించాడు. అతడు రావడంతోనే భార్య నుదుటన తిలకం దిద్దాడు. వీరికి బ్యూటిఫుల్ డిన్నర్ డేట్ కూడా ఏర్పాటు చేయడం విశేషం.ప్రేమ కావాలి..అది చూసిన విష్ణు, రోహిణి తెగ ఫీలైపోయారు. విష్ణు అయితే.. పృథ్వీ తనను ప్రేమించట్లేదంటూ బాధపడింది. అతడికి నువ్వంటే ఇష్టం ఉంది కానీ ప్రేమ కాదు అని యష్మి క్లారిటీ ఇచ్చింది. అయినా సరే నాకు ప్రేమ కావాలని విష్ణు పిచ్చిపట్టినట్లే ప్రవర్తించింది. మరోవైపు శ్రీపాద.. గొడవలన్నింటికీ మూలకారణమైన కిచెన్ నుంచి బయటకు వచ్చేయమని ప్రేరణకు సూచించాడు. తెగేదాక గొడవలు లాక్కురావద్దన్నాడు. లవ్ సాంగ్తర్వాత భార్యతో కలిసి గేమ్ ఆడాడు. ఈ గేమ్ వల్ల కిచెన్ టైమర్కు రెండు గంటలు యాడ్ అయింది. అందరి ఫ్యామిలీస్ వచ్చాయి కానీ తన తల్లి మాత్రం రాలేదని తేజ బెంగపెట్టుకున్నాడు. అనంతరం బిగ్బాస్ సరదాగా లవ్ సాంగ్ ప్లే చేస్తే నిఖిల్-యష్మి, పృథ్వీ-విష్ణు అందులో లీనమై స్టెప్పులేశారు. తర్వాత మెగా చీఫ్ కోసం గేమ్ పెట్టారు. ఇందులో తేజ తప్ప మిగతా అందరూ పాల్గొనాల్సి ఉంటుందన్నాడు. ఏడుస్తుంటే చూడలేకపోతున్నా..ఈ గేమ్లో అవినాష్ గెలిచి మెగా చీఫ్గా నిలిచాడు. తల్లి కోసం తేజ ఏడుస్తూనే ఉన్నాడు. అతడి బాధను అర్థం చేసుకున్న బిగ్బాస్ ఆమెతో ఫోన్ కాల్ మాట్లాడిపించాడు. నేను రావట్లేదని బాధపడకు, నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నా అని ఫోన్లో ఓదార్చింది. కాసేపటికే నేరుగా ప్రత్యక్షమైంది. అమ్మను చూడగానే తేజ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. గోరుముద్దలుతల్లి ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. నువ్వు బాగా ఆడుతున్నావు. ఫినాలేలో చూడాలనుందని తన కోరిక బయటపెట్టింది. అలాగే తను ప్రేమగా వండుకొచ్చిన చికెన్, ఆలుగడ్డ కూరను అన్నంలో కలిపి అందరికీ గోరుముద్దలు తినిపించింది. అమ్మను బిగ్బాస్ షోలో చూపించాలన్న కల నెరవేరిందంటూ తేజ తెగ సంబరపడిపోయాడు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణ నుంచి హౌస్మేట్స్కు విముక్తి.. కొత్త చీఫ్ ఎవరంటే?
ఏంటో.. బిగ్బాస్ హౌస్లో ఎవరి గ్రాఫ్ ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరూ ఊహించలేరు. వైల్డ్కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ అదే వారం బ్యాగు సర్దుకుని వెళ్లాల్సింది. కానీ ఇప్పుడేకంగా విన్నర్ రేసులో నిలబడ్డాడు. వార్ వన్ సైడ్ అయింది, నిఖిల్ ట్రోఫీ ఎత్తడం ఖాయమనుకుంటే అతడికే పోటీ ఇస్తున్నాడు.అంతా తలకిందులువిష్ణుప్రియ.. పృథ్వీపైనే కోపం తెచ్చుకుని రెబల్గా మారిందనుకునేలోపే అతడిని కన్నందుకు థాంక్యూ అంటూ ఏకంగా పృథ్వీ తల్లి కాళ్లపై పడింది. ఎంతో కూల్గా ఉండే తేజ ఈమధ్య ఆవేశం స్టార్గా మారిపోయాడు. చాలామందికంటే ప్రేరణ నయం అనుకునేలోపే ఆమె తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. చీఫ్ అయ్యాక చీప్గా..అందరి మీదా నోరు పారేసుకుని విపరీతమైన నెగెటివిటీ సంపాదించుకుంది. మెగా చీఫ్ అవ్వాలని ఫస్ట్ వీక్ నుంచి ఆశపడింది. ఎట్టకేలకు పదోవారంలో చీఫ్ అయింది.. కానీ చీప్ బిహేవియర్తో తన గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది. ఆమె.. విష్ణుప్రియ, గౌతమ్లను టార్గెట్ చేయడం జనాలకు అస్సలు మింగుడుపడలేదు. చీఫ్ అయ్యాక తన ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కొత్త చీఫ్గా అవినాష్మొత్తానికి హౌస్లో ఆమె చీఫ్ పదవి ముగిసినట్లు తెలుస్తోంది. ఈసారి అందరూ చీఫ్ పదవి కోసం పోటీపడగా ముక్కు అవినాష్కే ఆ పోస్టు దక్కినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే.. హౌస్మేట్స్కు ప్రేరణ నుంచి విముక్తి లభించినట్లేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎట్టకేలకు బిగ్బాస్ హౌస్లో తేజ తల్లి.. కల నిజమైందోచ్!
అందరి అమ్మలు వస్తున్నారు.. ఒక్క మా అమ్మ తప్ప! అని కంటికి మిన్నుగా ఏడుస్తూనే ఉన్నాడు తేజ. అతడి కోసం రోహిణి, గౌతమ్ తమ పేరెంట్స్ రాకపోయినా పర్లేదు తేజ తల్లిని మాత్రం పంపించండని త్యాగానికి సిద్ధమయ్యారు. అందుకు బిగ్బాస్ ఒప్పుకోలేదు. ప్రేరణకు సర్ప్రైజ్హౌస్లో అందరి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. రావట్లేదన్న ప్రేరణ భర్త కూడా నేడు హౌస్లో అడుగుపెట్టి సర్ప్రైజ్ చేశాడు. చిట్టచివరగా తేజకూ ఆ సర్ప్రైజ్ వచ్చేసింది. అయితే మొదట ఏడిపించాకే తర్వాత సంతోషాన్ని పంచాడు బిగ్బాస్. అతడి తల్లి హౌస్లోకి రాలేకపోతున్నానంటూ ఫోన్లో మాట్లాడటంతో మరింత కుమిలిపోయాడు. హౌస్లో తేజ తల్లికానీ కాసేపటికే ఆమె హౌస్లో ఎంట్రీ ఇచ్చింది. తనను చూడగానే తేజ చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. తల్లిని బిగ్బాస్ హౌస్కు తీసుకురావాలన్న కల ఎట్టకేలకు నెరవేరిందోచ్ అంటూ తెగ సంబరపడిపోయాడు. ఈ ఆత్మీయ కలయిక చూసిన నబీల్.. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ సంపూర్ణమైందని పేర్కొన్నాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రేరణకు భంగపాటు.. మోసం చేయడం మానుకోమన్న పృథ్వీ తల్లి
ఫ్యామిలీ వీక్తో కంటెస్టెంట్ల ముఖాలు వెలిగిపోతున్నాయి. తేజ మాత్రం తిరునాళ్లలో తప్పిపోయిన చిన్నపిల్లాడిలా తల్లికోసం ఏడుస్తూనే ఉన్నాడు. ఈ రోజు (నవంబర్ 14) ఎవరెవరు హౌస్లోకి వచ్చారో చూసేద్దాం..స్ట్రాటజీ ప్రకారం లవ్ ట్రాక్?మొదటగా విష్ణుప్రియ తండ్రి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆమెతో.. గ్రూప్ గేమ్ వద్దు, నీ ఆట నువ్వు ఆడు. నువ్వు కష్టపడితే కప్పు గెలుస్తావు. నువ్వు కొద్దిగా అటువైపు (పృథ్వీతో) ఉంటున్నావని నీ అభిమానులే బాధపడుతున్నారు. నువ్వు స్ట్రాటజీ ప్రకారం అతడితో లవ్ ట్రాక్ నడుపుతూ గేమ్ ఆడుతున్నావు. అదంతా జనాలు నిజమనుకుంటారు అని చెప్పుకుంటూ పోయాడు.అతడి వల్లే ఉండగలుగుతున్నాఇంతలో విష్ణు మధ్యలో కలగజేసుకుంటూ అది స్ట్రాటజీ కాదని, తన ఫీలింగ్స్ నిజమేనని తెలిపింది. ఇది ప్రేమ కాదు, ఒకలాంటి ఇష్టం తనపై ఉంది.. అతడి వల్లే ఎన్నిరోజులైనా హౌస్లో ఉండగలుగుతానన్న ధైర్యం వచ్చింది. నాకు తనపై ఫీలింగ్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు కప్పేయాలి? అని ప్రశ్నించింది. అందుకాయన నవ్వుతూ నీ గేమ్ నువ్వు ఆడు అని సలహా ఇచ్చాడు.అన్యాయం చేశావిష్ణుకు తండ్రి ప్రేమ అందించలేకపోయానని ఎమోషనల్ అయ్యాడు. విష్ణు పుట్టాక చాలారోజులు తన దగ్గరకు వెళ్లలేదు. తన చిన్నతనంలో సంతోషాన్ని పంచలేకపోయాను. కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నాను. వాళ్లకు అన్యాయం చేశాను. పైసా కూడా వాళ్లకు పెట్టలేకపోయాను. అందుకు ఇప్పటికీ నేను సారీ చెప్తున్నాను అన్నాడు.పృథ్వీతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ పెళ్లి ప్రస్తావన రాగా విష్ణుకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేస్తానన్నాడు. పృథ్వీతో లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ.. అదంతా కేవలం ఈ హౌస్లోనే.. గేమ్ అయిపోయాక ఏముండదు అన్నాడు. దాంతో విష్ణు.. ఏమో, అదిప్పుడే చెప్పలేమని సిగ్గుపడగా తనకు ఎవరైనా ఓకే అంటూ తండ్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తర్వాత ఆయన ఓ గేమ్ ఆడి కూతురి కోసం బర్గర్ సంపాదించాడు.విష్ణు నచ్చేసిందన్న పృథ్వీ తల్లిఅనంతరం అమ్మ పాట రాగానే తేజ కన్నీటితో ఆశగా గేటువైపు చూశాడు. కానీ అక్కడ పృథ్వీ తల్లి సత్యభామ లోనికి వచ్చింది. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ణును మాత్రం ప్రేమగా హత్తుకుంది. పృథ్వీని కన్నందుకు థాంక్యూ అంటూ విష్ణు ఆమె పాదాలపై పడింది. కోడలిగా విష్ణుప్రియ ఓకేనా అని నిఖిల్ అడగ్గా.. అన్నీ వాడిష్టం.. వాడికి నచ్చితే ఓకే అని సిగ్నల్ ఇచ్చేసింది.ఇన్ని రోజులు ఉంటావనుకోలేదుఅందరితో కలిసుండు, ఎవరితోనూ గొడవపడకు. నామినేషన్ చేసేటప్పుడు వాళ్లతో వీళ్లతో చెప్పకు. ఎవరి గురించో నామినేట్ చేయకు. నీ గురించి చేయు. నీ టాలెంట్ చూపించుకోవడానికి బిగ్బాస్ మంచి ఛాన్స్. ఇన్ని రోజులు ఉంటావనుకోలేదు. గేమ్లో మోసం చేయకుండా నిజాయితీగా ఆడు అని సలహాలు, సూచనలు ఇచ్చింది.ప్రేరణకు భంగపాటుఎవరు ఎక్కువ ఇష్టమని పృథ్వీ అడగ్గా విష్ణు పేరు చెప్పింది. డ్యాన్స్ బాగా చేస్తుంది, దేవుడి భక్తురాలు, జెన్యూన్ అంది. సత్యభామ తన కొడుకుతో పాటు విష్ణుకు సైతం గోరుముద్దలు తినిపించింది. భర్త రాక కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన ప్రేరణకు భంగపాటు ఎదురైంది. హౌస్లోకి రాలేకపోతున్నానంటూ తన కటౌట్ను పంపించాడు. నువ్వు ట్రోఫీ ఎత్తినప్పుడు వస్తానంటూ వీడియో సందేశం పంపాడు.నిన్ను టార్గెట్ చేయరుఅనంతరం గౌతమ్ అన్నయ్య డాక్టర్ జగదీష్ వచ్చాడు. అందరికీ ఇన్పుట్స్ వచ్చాయి కాబట్టి నిన్ను టార్గెట్ చేయరు. సోలోగానే ఆడు. ట్రయాంగిల్ లవ్స్టోరీలు వద్దు.. మరీ ఎక్కువ కోప్పడకు. అనుకున్న లక్ష్యానికి దగ్గరలో ఉన్నావు అని చెప్పాడు. చివరగా తమ్ముడితో కలిసి ఓ గేమ్ ఆడి రూ.51 వేలు గెలిచారు. అది ప్రైజ్మనీలో యాడ్ చేయగా మొత్తం రూ.50,30,000కు చేరింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణు చెంప చెళ్లుమనిపిస్తానన్న నిఖిల్ తల్లి.. ఎందుకంటే?
తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్ విజయవంతంగా పది వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు పదకొండో వారం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. నిన్నటి ఎపిసోడ్లో నిఖిల్ తల్లి, అవినాష్ భార్య, యష్మి తండ్రి హౌస్లో అడుగుపెట్టారు. అయితే ఏ ఫ్యామిలీ మెంబర్ ఇవ్వనన్ని హింట్లు నిఖిల్ తల్లి.. తన కొడుక్కి ఇచ్చింది.నిఖిల్ను ఆదేశించిన తల్లిఏమాత్రం సంకోచించకుండా చెప్పాలనుకున్నవన్నీ చెప్పేసింది. గౌతమ్తో గొడవపెట్టుకోవద్దని, అతడిని నామినేట్ చేయొద్దని సూచించింది. యష్మిని కంట్రోల్లో పెట్టమంది. ప్రేరణకు బయట నెగెటివిటీ పెరిగిపోతోందని పరోక్షంగా చెప్తూ తనతో దూరంగా ఉండమంది. యష్మి, ప్రేరణ, నిఖిల్ అంతా ఒకే గ్రూప్.. కానీ ఇక మీదట గ్రూప్ గేమ్స్ వద్దు, ఒంటరిగా నీ ఆట నువ్వు ఆడు అని నొక్కి చెప్పింది. విష్ణుపై ఎందుకంత కోపం?ఈ క్రమంలో నిఖిల్ తల్లి సోషల్ మీడియాలో చేసిన పాత పోస్టులు కొన్ని వైరల్గా మారాయి. అందులో ఆమె విష్ణుప్రియపై దారుణ కామెంట్లు చేసింది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ ముఖంపై లాగిపెట్టి కొట్టాలనుందని ఓ పోస్ట్ పెట్టింది. అందులో విష్ణును డ్రామా క్వీన్ అని విమర్శించింది. దీనిపై ఓ వ్యక్తి స్పందిస్తూ.. విష్ణు కనీసం డ్రామా అయినా చేస్తుంది.. మరి నిఖిల్ ఏం చేస్తున్నాడు? అని కామెంట్ పెట్టాడు. అందుకామె.. నిఖిల్ తన గేమ్ ఆడుతున్నాడు.. టాస్కులు గెలుస్తున్నాడు. విష్ణు మాత్రం కేవలం డ్రామానే చేస్తుందని విమర్శించింది. ఇతర కంటెస్టెంట్లను తిట్టడమేంటి?ప్రేరణను వీడియోను షేర్ చేస్తూ.. వావ్. ఆ కల్చర్ ఏంటి? నీ ప్రవర్తన ఏంటి? ఆ లాంగ్వేజ్ ఏంటి? అని విమర్శించింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లు నెట్టింట ప్రత్యక్షం కావడంతో బిగ్బాస్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఫ్యామిలీ తన కంటెస్టెంట్ గురించి పోస్టులు పెట్టాలి కానీ ఇలా ఇతర కంటెస్టెంట్లను తిడుతూ పోస్టులు పెట్టడం తప్పని పలువురూ అభిప్రాయపడుతున్నారు. నిఖిల్ను తిడుతుంటే ఎలా ఊరుకుంటుంది?ఓ టాస్కులో ప్రేరణ, విష్ణుప్రియ.. నిఖిల్పై నోరుపారేసుకోవడం వల్లే ఆ తల్లి తట్టుకోలేక అలాంటి కామెంట్స్ చేసిందని నిఖిల్ అభిమానులు ఆమెను వెనకేసుకొస్తున్నారు. నిఖిల్ చేతికి గాజులు వేసుకుని బొట్టు పెట్టుకోవాలి అని విష్ణు తిట్టినందుకే అతడి తల్లి ఆమె చెంప పగలగొడతానందని.. అందులో తప్పేముందని కామెంట్లు చేస్తున్నారు. WTH 🤯🤯🤯This is absolutely rude & disgusting!!Being a contestant’s mom posting so harshly with such a unnecessary rude description on #VishnuPriya & #Prerana is absolutely worst 👎🏻👎🏻Didn’t expect this from #NikhilMaliyakkal mom 🤢🤢#BiggBossTelugu8 pic.twitter.com/fYCl3SN7QU— Vamc Krishna (@lyf_a_zindagii) November 14, 2024 మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
40 రోజులుగా బ్లీడింగ్.. నేను చేసిన తప్పు ఎవరూ చేయకండి: స్రవంతి
బిగ్ బాస్ ఫేమ్, యాంకర్ స్రవంతి చొక్కారపు తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. సోషల్ మీడియా నుంచి స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో యాంకరింగ్ చేసే స్థాయికి ఆమె చేరుకుంది. అయితే, తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో స్రవంతి ఒక పోస్ట్ చేసింది. తనకు ఆరోగ్యం బాగలేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డానని పేర్కొంది. దీంతో తన అభిమానులు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.ఇన్స్టాగ్రామ్లో స్రవంతి తన అనారోగ్యం గురించి ఇలా చెప్పింది. 'నేను అస్సలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు .ఇప్పుడు పెట్టక తప్పలేదు,కేవలం అవగాహన కోసం మాత్రమే ఇలా చెబుతున్నాను. ముఖ్యంగా 'ఆడవారి కోసం' చెబుతున్నాను. 35 నుంచి 40 రోజులుగా నాకు విపరీతమైన బ్లీడింగ్ అవుతూనే ఉంది.రకరకాల మెడిసిన్ వాడాను,డాక్టర్ని డైరెక్ట్గా వెళ్లి కలిసే సమయం లేకపోవడంతో స్కానింగ్ చేపించుకోలేదు. ఒక రోజు షూటింగ్ ఉదయం 6:45 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 2:45 వరకు జరిగింది. దీంతో విపరీతమైన కడుపు నొప్పి రావడంతో వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాను. అప్పుడు తెలిసింది ఇది చిన్న సమస్య కాదు అని ,వెంటనే అడ్మిట్ అయ్యి సర్జరీకి వెళ్లాల్సి వచ్చింది. అయితే, గతంలో మాదిరి నేను పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు రావాలంటే కనీసం 4 నుంచి 5 వారాలు పడుతుంది. ఇదే విషయాన్ని వైద్యులు సూచించారు. షూటింగ్ లేదా మీ ఇతర పనుల కోసం అని ఎక్కువ సమయం కేటాయించకండి. అనారోగ్యంతో పనిలోకి వెళ్లడం వల్ల మరింత ఎక్కువ నష్టం జరగొచ్చు. మీరు వర్క్ చేసే ఏ ప్రొఫెషన్ అయినా సరే.. మీ అరోగ్యానికి మొదటి ప్రాముఖ్యత ఇవ్వండి. నిర్లక్ష్యం చేయకండి. ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి.ఇవన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి.' అని ఆమె పేర్కొంది. స్రవంతి గర్భాశయ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది.రాయలసీమలోని మారుమూల గ్రామమైన కదిరి నుంచి వచ్చింది యాంకర్ స్రవంతి చొక్కారపు. సోషల్ మీడియా నుంచి టీవీ దాకా సాగిందామె ప్రయాణం. బిగ్బాస్ స్టేజీపై కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె తన స్మైల్తో ప్రేక్షకులను కట్టిపడేసింది. View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) -
అందరికంటే విష్ణుప్రియ ఎక్కువ ఇష్టం: పృథ్వీ తల్లి
కంటెస్టెంట్ల ఒక్కో పేరెంట్ హౌస్లో అడుగుపెట్టేకొద్దీ మిగతావారంతా తమవారి కోసం కళ్లు పెద్దవి చేసుకుని మరీ గేటు వైపు ఆశగా చూస్తున్నారు. ఈ రోజు విష్ణుప్రియ తండ్రి హౌస్లోకి అడుగుపెట్టగా పృథ్వీ తల్లి, గౌతమ్ సోదరుడు ఎంట్రీ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమో విడుదల చేశారు.పృథ్వీ తల్లి సత్యభామ అలా ఇంట్లో అడుగుపెట్టగానే తన తల్లి గుర్తొచ్చి తేజ విలవిలా ఏడ్చాడు. అందరి పేరెంట్స్ వస్తున్నారు, మా అమ్మను కూడా పంపించండంటూ బిగ్బాస్ను కన్నీటితో వేడుకున్నాడు. ఇకపోతే పృథ్వీ తల్లి అందరిలోకెల్లా తనకు విష్ణు అంటే ఇష్టమంది. ఆమెకు ప్రేమగా గోరుముద్దలు సైతం తినిపించింది. విష్ణుప్రియ ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుంది. అటు గౌతమ్ సోదరుడు.. ట్రయాంగిల్ లవ్ స్టోరీలాంటివి వద్దు, అందరికీ ఇంటిసభ్యుల నుంచి ఇన్పుట్స్ వెళ్లాయి కాబట్టి నీ గేమ్ నువ్వు ఆడమని తెలిపాడు. -
నా కూతురికి అన్యాయం చేశా.. క్షమించమన్న విష్ణు తండ్రి
ఫ్యామిలీ వీక్ అంటే చాలు హౌస్మేట్స్ ముఖం కళకళలాడుతుంది. ఇప్పటికే హౌస్లోకి నబీల్, యష్మి, నిఖిల్, అవినాష్, రోహిణి కుటుంబసభ్యులు అడుగుపెట్టారు. తాజాగా విష్ణుప్రియ తండ్రి ఇంట్లోకి వచ్చాడు. అతడిని చూడగానే విష్ణు సంతోషంతో ఎగిరిగంతేసింది.అందరిముందు చెప్పొద్దు నాన్ననువ్వు ఇంకా బాగా ఆడాలిరా అని పెద్దాయన చెప్పడంతో విష్ణు.. ఇవన్నీ అందరిముందు చెప్పొద్దు నాన్న, మనం పర్సనల్గా మాట్లాడుకుందాం అంది. అలా వీరిద్దరూ ఒంటరిగా కూర్చుని మాట్లాడుకున్నారు. పృథ్వీని పట్టుకుని వేలాడటం వల్ల కూడా బ్యాడ్ అవుతున్నావని చెప్పాడు. నువ్వు కొద్దిగా అటు వైపు ఎక్కువగా ఉండటం వల్ల నీ అభిమానులే నిన్ను విమర్శిస్తున్నారన్నాడు. ఆ ఫీలింగ్ ఎందుకు దాచేయాలి?అందుకు విష్ణు.. నాకు అలాంటి భావన వచ్చినప్పుడు దాన్ని ఎందుకు కప్పేయాలని నిష్కల్మషంగా అడిగింది. అందుకాయన జనాలకు మనం నచ్చాలని సర్దిచెప్పాడు. ఇక చిన్నప్పటినుంచి కూతురికి దూరంగా ఉన్న సంగతులను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. కొన్ని సమస్యల వల్ల చాలారోజులు విష్ణు దగ్గరకు వెళ్లలేకపోయాను. అన్యాయం చేశా..తనకు దూరంగా ఉంటున్నానని చాలా బాధపడ్డాను. నేను వాళ్లకు అన్యాయం చేశాను.. అందుకు ఇక్కడ కూడా సారీ చెప్తున్నాను అన్నాడు. ఇంతలో తేజ పెళ్లి ప్రస్తావన తేగా.. తప్పకుండా దగ్గరుండి వివాహం జరిపిస్తానన్నాడు. తనకు నచ్చినవాళ్లు దొరకాలిగా అన్నాడు. దీంతో రోహిణి.. అబ్బాయిని కూడా మీ అమ్మాయే చూసుకుంటుందిలెండి అనేసింది. అందుకాయన.. హౌస్లో జరిగేవన్నీ సరదా కోసం మాత్రమే! అని తెలిపాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నిఖిల్కు హింట్లిస్తూనే హెచ్చరించిన తల్లి.. గౌతమ్ జోలికి మాత్రం..!
ఫ్యామిలీ వీక్ అంటేనే సంతోషం, దుఃఖం రెండూ కలగలసి ఉంటాయి. అయితే అవినాష్ మాత్రం దుఃఖాన్ని దాచేస్తూ సంతోషాన్ని పంచేందుకే ప్రయత్నించాడు. అటు నిఖిల్ తల్లి.. ఏమాత్రం సంకోచించకుండా చెప్పాల్సిన హింట్లన్నీ చెప్పేసింది. అవేంటో నేటి (నవంబర్ 13) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి..యష్మికి హింట్ ఇచ్చిన తండ్రితండ్రిని చూడగానే యష్మి.. పప్పా అంటూ సంతోషంతో ఏడ్చింది. కూతుర్ని ఓదార్చిన ఆయన అందరితోనూ కలివిడిగా మాట్లాడారు. తర్వాత కూతురికి అవసరమైనన్ని హింట్లు ఇచ్చాడు. 'నువ్వు నీకోసమే ఆడాలి.. ఇండివిడ్యువల్ గేమ్ ఆడు.. టాస్కులు ఆడకుండా ఊరికే కూర్చుంటే నీపై బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. నువ్వు మనసులో అనుకుంది అందరికీ చెప్పేయకు.. నువ్వు చేయాలనుకుంది నేరుగా చేసేయు. కూతురి తరపున సారీఇన్నివారాలున్నావ్.. నిన్ను స్టేజీపై చూడాలనుంది. నీకోసమే ఆడితే కప్పు గెలుస్తావు.. నీ గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోకు అని చెప్పాడు. గారాలపట్టికి గోరుముద్దలు కూడా తినిపించాడు. నాన్నతో యష్మి డ్యాన్స్ చేస్తుంటే.. నబీల్కు తండ్రి గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. యష్మి తండ్రి ఆడిన గేమ్లో వచ్చిన రూ.21 వేలు ప్రైజ్మనీలో యాడ్ చేశారు. వెళ్లిపోయేముందు.. నా కూతురు ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే.. దయచేసి ఎవరూ ఏమనుకోవద్దు అంటూ కూతురి తరపున క్షమాపణలు చెప్పి ఓ మెట్టు పైకి ఎక్కేశాడు. .కుమిలిపోతున్న తేజఆయన వెళ్లిపోతుంటే యష్మితో పాటు తేజ కూడా ఏడ్చేశాడు. అందరి పేరెంట్స్ వచ్చినప్పుడల్లా కుమిలి కుమిలి ఏడుస్తున్న తేజను ఎలా ఓదార్చాలో హౌస్మేట్స్కు అర్థం కాలేదు. అతడి బాధను చూడలేకపోయిన గౌతమ్.. తన ఫ్యామిలీకి బదులుగా తేజ పేరెంట్స్ను పంపించమని బిగ్బాస్ను అభ్యర్థించాడు. అనంతరం నిఖిల్ తల్లి హౌస్లో అడుగుపెట్టింది. ఏయే కారణాల వల్ల నిఖిల్ గ్రాఫ్ పడిపోతుందో.. అవన్నీ పూసగుచ్చినట్లు చెప్పి మార్చుకోమని సూచించింది. నిఖిల్ను జాగ్రత్తపడమన్న తల్లిగ్రూప్ గేమ్ ఆడకు, ఇకపై ఇండివిడ్యువల్గానే ఆడు. నెల రోజులు మాత్రమే ఉంది. G (గౌతమ్)తో ఎక్కువగా ఫైట్, డిఫెన్స్కు వెళ్లొద్దు, నామినేషన్ దాకా అసలే వెళ్లొద్దు అని హింట్లు ఇచ్చింది. తప్పు చేస్తేనే నామినేట్ చేస్తున్నా అని నిఖిల్ సంజాయిషీ ఇవ్వగా.. నీతో జరిగిన దానికే మాత్రమే నామినేట్ చేయు, వేరే వాళ్ల గురించి చేయకు. Y(యష్మి)ని కొంచెం కంట్రోల్ చేయు. ఆమెకు దూరంగా ఉండుP (ప్రేరణ) అనే అమ్మాయి నుంచి కొంచెం దూరంగా ఉండు.. గ్రూపిజం ఆడకు.. నీకోసమే ఆడు అంటూ ఎవరూ ఇవ్వనన్ని హింట్లు ఇచ్చేసింది. తర్వాత ఆమె గేమ్ ఆడి మటన్ సంపాదించింది. తమకు నాన్వెజ్ రావడంతో హౌస్మేట్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఆమె వెళ్లిపోయాక బిగ్బాస్ హౌస్మేట్స్ అందరికీ ఓ గంటసేపు నిద్రపోయే అవకాశం ఇచ్చాడు. ఈ సమయంలో అనూజ వచ్చి నిద్రలో ఉన్న అవినాష్ను హత్తుకుంది.భార్య కోసం డ్రెస్ మార్చుకున్న అవినాష్భార్యను చూడగానే దెబ్బకు నిద్రమత్తు వదిలింది. అనూజ బ్లాక్ డ్రెస్లో వచ్చిందని వెంటనే అతడు కూడా వెళ్లి డ్రెస్ మార్చుకున్నాడు. బిగ్బాస్ వీళ్లిద్దరికీ కంపారిబులిటీ టెస్ట్ పెట్టాడు. ఈ గేమ్ ద్వారా రూ.51,000 ప్రైజ్మనీ కావాలా? లేదా మూడుగంటలు కిచెన్ టైమింగ్ కావాలా? అని అడిగాడు. అందుకు వీళ్లు ప్రైజ్మనీని ఎంచుకున్నారు. ఇక ఈ దంపతుల కోసం బిగ్బాస్ పెద్ద జే ప్లాన్ చేశాడు. బిగ్బాస్ సర్ప్రైజ్యాక్షన్ రూమ్ను హార్ట్ షేప్ బెలూన్లతో నింపేసి డిన్నర్ డేట్ ఏర్పాటు చేశాడు. అది చూసి మురిసిపడ్డ అవినాష్.. ఇది తన జీవితంలోనే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అన్నాడు. ఇంతలో బిగ్బాస్ అవినాష్ ముచ్చటపడినట్లుగా లైట్లు ఆఫ్ చేశాడు. దాంతో అతడు తన భార్యపై ముద్దుల వర్షం కురిపించాడు. చివరగా అనూజ నవ్వుతూ అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అవినాష్ దంపతులకు బిగ్బాస్ సర్ప్రైజ్
ఫ్యామిలీ వీక్లో ఏ కంటెస్టెంట్ అయినా కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే! కానీ అవినాష్ మాత్రం అక్కడ కూడా నవ్వించాడు. తన భార్య అనూజ సడన్ ఎంట్రీతో షాకైన అవినాష్కు బిగ్బాస్ మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇద్దరికీ సెపరేట్గా డిన్నర్ డేట్ ఏర్పాటు చేశాడు. కేవలం ఇద్దరు మాత్రమే ఉన్న గదిని బెలూన్లతో నింపేశాడు.బిగ్బాస్ సర్ప్రైజ్ఆ సెటప్ చూసి అవినాష్కు దిమ్మతిరిగిపోయింది. ఇది జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందంటూ బిగ్బాస్కు థ్యాంక్స్ చెప్పాడు. అయితే అనూజ వచ్చినప్పుడు లైట్లు ఆఫ్ చేయమని అవినాష్ ఇటీవలే సరదాగా బిగ్బాస్తో అన్నాడు. కానీ ఆ పెద్దాయన ఇది సీరియస్గా తీసుకుని నిజంగానే వీళ్లున్న గదిలో లైట్లు ఆఫ్ చేశాడు. దీంతో అవినాష్ తెగ సిగ్గుపడిపోయాడు. మరిన్ని బిగ్బాస్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తల్లిని చూసి చిన్నపిల్లాడిలా ఏడ్చిన నిఖిల్.. మరి తేజ సంగతి?
బిగ్బాస్ షోకివ వచ్చినవాళ్లు కప్పు గెలవకపోయినా పర్లేదు కానీ తమ ఫ్యామిలీ మెంబర్ను ఒక్కసారైనా హౌస్కు తీసుకురావాలని తహతహలాడతారు. గంగవ్వ కూడా అదే ఆశపడింది. కానీ, ఆరోగ్యం సహకరించకపోవడంతో సడన్గా హౌస్ నుంచి నిష్క్రమించింది. అటు గతేడాది బిగ్బాస్కు వచ్చిన తేజ మరోసారి ఈ సీజన్లో అడుగుపెట్టడానికి ప్రధాన కారణం... తన తల్లిని హౌస్లోకి తీసుకురావాలని!వరస్ట్ కంటెస్టెంట్కానీ మెజారిటీ హౌస్మేట్స్ తేజను వరస్ట్ కంటెస్టెంట్ అని తేల్చడంతో ఫ్యామిలీ వీక్లో అతడి కోసం ఎవరూ రారని నాగ్ తేల్చిచెప్పాడు.. ఎంతోమంది ఎన్నో తప్పులు చేసినా, చేస్తూనే ఉన్నా చూసీచూడనట్లు ఉన్న బిగ్బాస్ తేజకు మాత్రం ఇలాంటి దారుణమైన శిక్ష విధించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.నిఖిల్ పశ్చాత్తాపంఇది విన్నాక నిఖిల్ సైతం పశ్చాత్తాపపడ్డాడు. ఎందుకంటే తేజను వరస్ట్ కంటెస్టెంట్ అని డిసైడ్ చేసినవారిలో నిఖిల్ కూడా ఉన్నాడు. (విష్ణుప్రియ, పృథ్వీ కూడా తేజను చెత్తప్లేయర్గా పేర్కొన్నారు) తల్లిని హౌస్లోకి తీసుకురావడమే తేజ ఏకైక లక్ష్యం అని అందరికీ తెలుసు! అలాంటిది.. అతడి కోరిక నెరవేరకపోవడానికి తాను కూడా కారణమవుతున్నానని నిఖిల్ బాధపడ్డాడు.తేజ తల్లి వస్తుందా? రాదా?అయితే నిజంగా తేజ తల్లి హౌస్లోకి అడుగుపెట్టే అవకాశమే లేదా? అంటే కచ్చితంగా ఉంది. టీఆర్పీ కోసం తేజ ఎమోషన్స్ను వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందరి ఇంటివాళ్లు వచ్చి వెళ్లాక చివర్లో తేజ ఫ్యామిలీ మెంబర్ హౌస్లో సర్ప్రైజ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయం. ఇక ఈరోజైతే నిఖిల్ తల్లి హౌస్లోకి వచ్చింది. అందుకు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది. అమ్మను చూడగానే నిఖిల్ చంటిపిల్లాడిలా ఏడ్చేశాడు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
యష్మికి హింట్ ఇచ్చిన తండ్రి.. ఆ తప్పు చేయొద్దంటూ..
మగళై.. ఈ పదం వింటే చాలు యష్మి ఒళ్లు పలకరించిపోతుంది. తండ్రి తనను ముద్దుగా మగళై అని పిలుస్తాడని యష్మి చెప్పినప్పుడు ఆమె ముఖం వెయ్యి వోల్టుల బల్బులా వెలిగింది. తండ్రి పంపిన లెటర్ కొన్ని క్షణాలపాటు కళ్లముందు కనిపించి మాయమైనప్పుడు కన్నీళ్ల వరద పారింది. అలాంటిది తండ్రి తన కళ్లముందుకు నడుచుకుంటూ వస్తే.. ?ఆనందభాష్పాలుఫ్యామిలీ వీక్లో భాగంగా యష్మి తండ్రి హౌస్లో అడుగుపెట్టాడు. అతడిని చూడగానే యష్మిలో ఎమోషన్స్ కట్టలు తెంచుకున్నాయి. పప్పా అని గట్టిగా అరిచి నాన్నను ఆప్యాయంగా హత్తుకుంది. ఆయన కూడా కూతుర్ని దగ్గరకు తీసుకుని తన తప్పులు సరిదిద్దుతూ కొన్ని హింట్లు ఇచ్చాడు ఇండివిడ్యువల్ గేమ్ ఆడు.. బయట బ్యాడ్ అవుతున్నావు. నువ్వు ఇన్నిరోజులు ఉండి ఇంతవరకు వచ్చావు.. నిన్ను ఫినాలే స్టేజీపై చూడాలనుంది అని చెప్పాడు. కూతురి తరపున సారీహౌస్మేట్స్తో కూడా.. నా కూతురు ఆవేశంలో ఏమైనా అంటే తప్పుగా తీసుకోకండి.. అని కోరాడు. కూతురి కోసం తండ్రి క్షమాపణ చెప్పడం చూసి నెటిజన్లు సైతం ఎమోషనల్ అవుతున్నారు. ఎంతైనా తండ్రీకూతుర్ల అనుబంధం అన్నింటికంటే గొప్పదని కామెంట్లు చేస్తున్నారు. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Bigg Boss 8: అమ్మ రాకతో నబీల్ ఫుల్ హ్యాపీ.. బాధతో తేజ కన్నీళ్లు
ఈ వారం నామినేషన్ ఒక్కరోజులోనే పూర్తయ్యాయి. గౌతమ్, తేజ, పృథ్వీ, అవినాష్, విష్ణుప్రియ, యష్మీ నామినేట్ అయ్యారు. ప్రతి సీజన్లో మిగతా ఎపిసోడ్స్ గురించి జనాలు ఎంత తిట్టుకున్నా సర 'ఫ్యామిలీ వీక్' వస్తే మాత్రం తప్పకుండా చూస్తారు. ఈ వారం అదే జరగనుంది. తల్లి రాకతో నబీల్ ఫుల్ హ్యాపీగా ఫీలవగా.. తేజ మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నాడు. గడ్డం గురించి నిఖిల్-యష్మీ సోదిలో ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇంతకీ మంగళవారం (నవంబర్ 12) ఎపిసోడ్లో అసలేం జరిగిందనేది చూద్దాం.(ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారంలో ప్రముఖ నటుడికి చేదు అనుభవం)స్వీట్ రూల్ బ్రేక్గతంలో హౌస్మేట్స్ కోసం వారంరోజుల పాటు అన్లిమిటెడ్ ఫుడ్ అందించేందుకు నబీల్.. సీజన్ అంతా స్వీట్స్ తిననని త్యాగం చేశాడు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసిన బిగ్బాస్.. యాక్షన్ రూంకి రమ్మని పిలిచి హల్వా ఇచ్చాడు. ఇది జరిగిన కాసేపటికి మరోసారి యాక్షన్ రూంకి పిలిచి ప్లేటులో స్వీట్స్ పెట్టాడు. ఇవి తింటుండగానే ఇతడి తల్లి నజ్మా నూష్రత్ హౌసులోకి వచ్చారు.నీ ఆట నువ్వు ఆడాలిహౌసులోకి వచ్చిన తర్వాత అందరూ నబీల్ తల్లిని పలకరించారు. ఆ తర్వాత నబీల్-అతడి తల్లి కూర్చుని మాట్లాడుకున్నారు. ఎలా ఆడుతున్నా, టీవీలో కనిపిస్తున్నానా లేదా అని నబీల్.. తన గేమ్ గురించి తల్లిని అడిగాడు. నబీల్ అడిగితే బాగా ఆడుతున్నావ్, ఇండివిడ్యువల్గా అట్లనే ఆడు, ఎమోషనల్ కావద్దు, నీ ఆట నువ్వు ఆడు.. ఎవరి గురించీ పట్టించుకోవద్దు.. ఎవరో ఏదో అన్నారని ఏం ఫీల్ కాకు.. అందరితో మంచిగానే ఉండు అని విలువైన సూచనలు ఇచ్చారు.(ఇదీ చదవండి: రోహిణికి సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న టేస్టీ తేజ!)నబీల్ కోసం గేమ్ఇంతలో నబీల్ తల్లి బయటకు వెళ్లాల్సిన టైమ్ వచ్చిందని బిగ్బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. కాకపోతే మీరు బయటకెళ్లేముందు మీ అబ్బాయి కోసం ఓ గేమ్ ఆడాలని చెప్పి.. టేబుల్ ముందున్న ఓ డిస్క్ విసరమని చెప్పాడు. అది ఓ చోట ఆగడంతో ఎన్వలప్ కవర్లో ఏముందా అని చూడగా.. అమ్మ చేతి గులాబ్ జామున్ 20 పీస్ అని రాసుంది. దీంతో ఆ స్వీట్లని తీసుకున్న నబీల్.. హౌస్మేట్స్ అందరికీ ఇచ్చాడు. వెళ్లేముందు 'మనం' మూవీలోని 'కనిపించిన మా అమ్మకి..' పాట ప్లే చేయగా.. అందరూ కలిసి డ్యాన్స్ చేసి నబీల్ తల్లికి టాటా చెప్పేశారు. తల్లి వెళ్లిపోవడంతో నబీల్ కాస్త ఎమోషనల్ అయ్యాడు.గడ్డం గురించి డిస్కషన్నబీల్ తల్లి వెళ్లిపోయిన తర్వాత నిఖిల్ ఒంటరిగా కూర్చుని ఉంటే.. యష్మీ టీజ్ చేసింది. గడ్డం గురించి మాట్లాడుతూ.. మంచి గడ్డం వద్దురా వద్దురా అంటే అస్సలు విన్నాడా అని నిఖిల్ గురించి పృథ్వీకి చెప్పింది. దీంతో నువ్వు (నిఖిల్) గడ్డం పెంచుకోరా అని నిఖిల్ అన్నాడు. అవును నువ్వు తీసేసి రెడ్ ఫ్లాగ్ అయ్యావ్ అని నిఖిల్ని పరోక్షంగా కౌంటర్ వేసింది. హౌస్లో గడ్డం ఉన్నవాడివి నువ్వు (పృథ్వీ) ఒక్కడివే.. ఆ గడ్డానికి పడిపోయా నేను.. అని పృథ్వీతో యష్మి ఫ్లర్ట్ చేసింది. ఇది విని నవ్వేసిన నిఖిల్.. ఈ డైలాగ్ వింటే 'విష్ణు ఏం చేస్తది తెలుసా.. నైట్కి నైట్ నిన్ను చంపేస్తాది' అని యష్మిని ఆటపట్టించాడు.(ఇదీ చదవండి: అక్కినేని ఇంట పెళ్లిసందడి.. ఆ విషయంలో సెంటిమెంట్!)తేజ ఏడ్చేశాడునబీల్ తల్లి వచ్చి వెళ్లిన తర్వాత తన తల్లిని గుర్తుచేసుకుని తేజ తెగ బాధపడ్డాడు. అందరి పేరెంట్స్ వస్తారు, కానీ నా కోసం మాత్రం రారు.. ప్లీజ్ బిగ్బాస్.. నేను ఏడిస్తే మా అమ్మకి నచ్చదు.. కానీ అమ్మ కోసం ఏడుస్తా అనుకోలేదు బిగ్బాస్.. ఇంకా కష్టపడి ఆడతా బిగ్బాస్ ప్లీజ్.. ఇంత పెద్ద పనిష్మెంట్ నాకు ఇవ్వొద్దు.. మీరు ఏదంటే అదే.. నాకు ఇంతకంటే పెద్ద పనిష్మెంట్ ఏం ఉండదు.. కావాలంటే ఎవ్రీ వీక్ డైరెక్ట్ నామినేషన్ అవుతా అని తనలో తానే అనుకుంటూ తేజ ఏడ్చాడు.ఇక కాసేపటి తర్వాత అవినాష్ దగ్గర నిఖిల్ ఓపెన్ అయ్యాడు. నాకు తేజదే గిల్ట్ అవుతుంది.. నాకేం తెలుసురా అలా అవుతుందని.. ఇప్పుడు మా అమ్మ వచ్చినా నేను అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేను అని నిఖిల్ అన్నాడు. దీని తర్వాత ఫ్రీజ్-రిలీజ్ అనే గేమ్ని బిగ్బాస్ పెట్టాడు. మిగతా వాళ్ల సంగతేమో గానీ విష్ణుప్రియ, పృథ్వీ దగ్గరికి రాగానే పలుమార్లు ఫ్రీజ్ చేశాడు. దీంతో విష్ణు.. పృథ్వీ మీద వాలిపోయి తెగ ఫీలైపోయింది. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్'.. నేను తీసుకున్న చెత్త నిర్ణయం!) -
బిగ్బాస్లోకి వచ్చిన నబీల్ తల్లి.. ఏడ్చేసిన టేస్టీ తేజ
బిగ్బాస్ ఏ సీజన్ తీసుకున్నా సరే మిగతా రోజులు హౌస్మేట్స్ ఎవరెలా ప్రవర్తించినా, ఎన్ని తిట్టుకున్నా సరే ఓ వారం మాత్రం అందరూ ఒక్కటైపోతారు. అదే 'ఫ్యామిలీ వీక్'. ప్రతి సీజన్లో ఉన్నట్లే ఈసారి కూడా వచ్చేసింది. ఈ వారమే కుటుంబ సభ్యులు.. హౌస్లోకి రాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు రిలీజ్ చేశారు.షో ప్రారంభంలో కాస్త హడావుడి చేసిన ఓరుగల్లు కుర్రాడు నబీల్.. ప్రస్తుతం పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. ఫ్యామిలీ వీక్లో మొదటిగా ఇతడి తల్లి హౌస్లో అడుగుపెట్టింది. అంతకు ముందు నబీల్ని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన బిగ్బాస్.. తినమని స్వీట్స్ ఇచ్చాడు.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)మరోసారి లోపలికి పిలిచి కాసేపు అలానే ఉండమన్నాడు. ఆ తర్వాత టీవీ స్క్రీన్పై అమ్మ హౌసులోకి వచ్చిన విషయాన్ని చూపించాడు. దీంతో 70 రోజుల తర్వాత తల్లిని కలిసిన నబీల్.. ఎమోషనల్ అయ్యాడు. చాలాసేపు మాట్లాడుకున్నాడు. ఇదంతా చూసి టేస్టీ తేజ కన్నీళ్లు పెట్టుకున్నాడు.గత వీకెండ్లో తేజకి చిన్న తప్పుకి పెద్ద క్లాస్ పీకిన నాగార్జున.. ఫ్యామిలీ వీక్కి అనర్హుడిని చేశాడు. అంటే తేజ కోసం కుటుంబ సభ్యులు ఎవరూ హౌస్లోకి రారు. దీంతో నబీల్ కోసం అతడి తల్లి రావడం చూసి.. ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశాడు. దీంతో మిగతా హౌస్మేట్స్ అతడిని ఓదార్చుతూ కనిపించారు.(ఇదీ చదవండి: 'అమరన్' ఓటీటీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?) -
యష్మి, నిఖిల్ను బుక్ చేసిన తేజ.. దమ్ము లేదంటూ రెచ్చగొట్టిన పృథ్వీ
కంటెస్టెంట్ల ఫోటోపై పెయింట్ వేసి నామినేట్ చేయాలి. బజర్ మోగినప్పుడు ముందుగా బ్రష్ పట్టుకున్న వారికే నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. నామినేషన్స్ అంటేనే గొడవలు కాబట్టి దానికి ఏమాత్రం కొదవ లేదు. యష్మి తప్పును తన నోటితోనే చెప్పించాడు తేజ.. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో నేటి (నవంబర్ 11) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..ఫేవరిటిజం స్పష్టంగా కనిపిస్తోందిముందుగా మెగా చీఫ్ ప్రేరణ.. గౌతమ్ ఫోటోకు పెయింట్ పూస్తూ ప్రతీది ఆడియన్స్ ఏమనుకుంటారు? అనేది ఆలోచిస్తూ అడుగు వేస్తున్నాడు. అందరితో కలవట్లేదు, టీమ్ స్పిరిట్ లేదు అని కారణాలు చెప్పింది. ఆ కారణాలు గౌతమ్కు ఏమాత్రం మింగుడుపడలేదు. టీమ్ వర్క్ అంటే.. ఓడినా, గెలిచినా కలిసి పోరాడటం.. అంతే తప్ప నీవల్ల ఓడిపోయాం అంటూ గుచ్చిగుచ్చిచెప్పడం టీమ్ మెంబర్ లక్షణం కాదు. ఇక్కడ ఫేవరిటిజం, గ్రూపిజం స్పష్టంగా కనిపిస్తోంది అని ప్రేరణపై మండిపడ్డాడు.నాది తప్పయితే యష్మిది కూడా తప్పే!తర్వాత బజర్ మోగగానే బ్రష్ పట్టుకున్న నిఖిల్.. తేజను నామినేట్ చేశాడు. ఎవిక్షన్ షీల్డ్ గేమ్లో అతడు కావాలని తప్పు చేశాడన్నాడు. దీనికి తేజ స్పందిస్తూ.. నేను తెలిసి తప్పు చేయలేదు. నేను గుడ్డు వేయడం తప్పయితే నా తర్వాత యష్మి చేసింది తప్పు కాదా? అని సూటిగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు నిఖిల్ సమాధానం దాటవేస్తుంటే.. నీకు మాట్లాడటానికి భయం.. అంటూ రెచ్చగొట్టాడు. దాంతో నిఖిల్.. ఆమెది తప్పు కాదు, నీదే తప్పు అన్నాడు. దమ్ము లేదుఇంతలో నిఖిల్ గ్యాంగ్ వీళ్లను ఆపేందుకు రాగా.. ముగ్గురూ నాపై అటాక్ చేస్తున్నారా? అని తేజ అన్నాడు. దాంతో పృథ్వీ.. ఆ ముగ్గురు ఎవరని అడిగారు. నువ్వు అడిగితే నేను చెప్పను అని తేజ అంటే.. నీకు పేర్లు చెప్పే దమ్ము లేదు అంటూ తేజపై రెచ్చిపోయాడు. తర్వాత గౌతమ్.. అవతలి వ్యక్తులను అగౌరవపర్చడం అలవాటైపోయిందంటూ పృథ్వీని నామినేట్ చేశాడు.తల్లికి తేజ క్షమాపణలుదీని గురించి చర్చించే క్రమంలో.. నీ బెదిరింపులకు అందరూ భయపడతారేమో కానీ నేను కాదు అని గౌతమ్ అన్నాడు. నువ్వు విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నావని పృథ్వీ ఆరోపించాడు. అనంతరం తేజ ముందుగా తన తల్లికి సారీ చెప్పాడు. నిన్ను హౌస్కు తీసుకొస్తానని చెప్పాను, కానీ ఆ మాటపై నిలబడలేకపోతున్నందుకు క్షమించమన్నాడు. ఇందుకు కారణమైన హౌస్మేట్స్కు థాంక్యూ చెప్పాడు. వరస్ట్ ప్లేయర్ అంటూతర్వాత యష్మిని నామినేట్ చేస్తూ.. ఆమె అభిప్రాయాన్ని గౌరవించకుండా నేను ఒక గుడ్డును పాము నోట్లో పెట్టాను. తర్వాత యష్మి కూడా ఆలోచించకుండా వెళ్లి మరో గుడ్డు పాము నోట్లో వేసింది. నేను చేసింది తప్పే.. అలాగే యష్మి చేసింది కూడా తప్పే! అన్నాడు. దీనిపై యష్మి.. తాను తప్పు చేయలేదని వాదించింది. ఈ క్రమంలో హే.. పో, కూర్చో అంటూ చిరాకుపడింది. వరస్ట్ ప్లేయర్ అంటూ తేజపై ముద్ర వేసింది. పృథ్వీ.. చీఫ్గా, సంచాలకుడిగా ఫెయిలయ్యావంటూ అవినాష్ను నామినేట్ చేశాడు.మాట తప్పావ్రోహిణి.. చీఫ్ కంటెండర్ అయినప్పుడు నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి మాట తప్పావంటూ విష్ణుప్రియను నామినేట్ చేసింది. ఆ రోజు అందుకే ఏడ్చానని రోహిణి పేర్కొంది. దీనికి విష్ణు తలతిక్క సమాధానమిచ్చింది. తొక్కలో మాట ఇచ్చుండకపోతే నాకు ఈ సమస్య వచ్చేదే కాదు. ఇప్పుడు చెప్తున్నా.. నాకు అందరికంటే పృథ్వీయే ఎక్కువ అని ప్రకటించేసింది. ఇక ఈ వారం గౌతమ్, తేజ, పృథ్వీ, అవినాష్, విష్ణుప్రియ, యష్మీ నామినేట్ అయ్యారు.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మూడేళ్ల క్రితం నటి ఎంగేజ్మెంట్.. గతేడాది పెళ్లి.. ఇప్పుడు మరోసారి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
బిగ్బాస్ చరిత్రలోనే పరమ చెత్త కంటెస్టెంట్.. హరితేజ ఏమందంటే?
బిగ్బాస్ తెలుగు మొదటి సీజన్లో హరితేజ అదరగొట్టింది. కానీ ఈసారి తన సత్తా చూపించలేకపోయింది. అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడి మాటలు అక్కడ చెప్తూ నారదుడిలా మారిపోయింది. టాస్కులు పెద్దగా ఆడలేదు కానీ టైమ్పాస్ మాత్రం బాగానే చేసింది. ఫలితంగా పదోవారంలో ఎలిమినేట్ అయింది. తాజాగా బిగ్బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. కామెడీ వల్ల బతికిపోతున్నాడుఈ సందర్భంగా కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ.. అవినాష్ అంత జెన్యూన్ కాదు. కాకపోతే కామెడీ వల్ల బతికిపోతున్నాడు. విష్ణు.. నత్తిబుర్ర, పృథ్వీ.. ఫ్రెండ్ కోసం ఏమైనా చేస్తాడు, టాస్క్లో విజృంభిస్తాడు. ఇతడు గెలిస్తే చూడాలనుకుంది. తేజ.. ఈయన అతితెలివి అతడికే చేటు తెస్తుంది. ప్రేరణ.. నోటికొచ్చిన మాటలు అనేస్తుంది, నబీల్.. తన పర్సనాలిటీ వేరేలా ఉంది. పాములాంటోడు, నిజంగానే పగబడతాడు. ఆమె సెల్ఫిష్రోహిణి.. ప్రతిదానికి ఏడవడం నచ్చదు. నిఖిల్.. అందరితో బాగుండటానికి ట్రై చేస్తున్నాడు.. అతడు రేలంగి మామయ్య. యష్మి.. సెల్ఫిష్, ఎమోషనల్గా వీక్ అవుతోంది అంటూ హౌస్మేట్స్పై తన అభిప్రాయాలు వెల్లడించింది. తర్వాత యాంకర్ అర్జున్.. హరితేజపై వచ్చిన ట్వీట్లు స్క్రీన్పై చూపించాడు. ఆడితే ఇలా.. ఆడకపోతే అలాబిగ్బాస్ తెలుగు చరిత్రలోనే వరస్ట్ కంటెస్టెంట్ హరితేజ. మరీ అంత చండాలంగా ప్రేరణ మీద పగతో గేమ్ ఆడాలా? టూ వరస్ట్. విష్ణుప్రియ, నయని పావని దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మోస్ట్ వరస్ట్ కంటెస్టెంట్స్.. మీకు మానవత్వమే లేదు అని ఓ యూజర్ ట్వీట్ చేశాడు. దీనిపై హరితేజ స్పందిస్తూ.. ఆడకపోతే ఆడలేదంటారు.. ఆడితేనేమో ఇలాంటి మాటలంటారు అని పెదవి విరించింది. మధ్యలో ఎందుకు దూరానా?మరో ట్వీట్లో విష్ణుప్రియ.. ప్రేరణను నామినేట్ చేస్తుంటే హరితేజ, నయని ఎందుకు మధ్యలో దూరుతున్నారు? అక్కడ వాళ్లకేం పని? అని మరో వ్యక్తి విమర్శించాడు. ఆ నామినేషన్స్లో అందరూ అందరి మధ్యలో దూరి మాట్లాడారాని తెలిపింది. హరితేజ తనకున్న మంచి పేరు పోగొట్టుకుని నెగెటివ్ ఇమేజ్ తెచ్చుకుంది అని మరో ట్వీట్ చూపించాడు. ఎవరు గెలవాలంటే?ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉండి ప్రేక్షకులకు దగ్గరగా బతికిన హరితేజ నెల రోజుల్లో చెడ్డదెలా అవుతుంది? ఓపికతో ఉంటే అన్నీ సెట్ అయిపోతాయ్ అని సానుకూల దృక్పథంతో మాట్లాడింది. ఈ సీజన్ ఎవరు గెలవాలనుకుంటున్నారన్న ప్రశ్నకు విష్ణుప్రియ అని బదులిచ్చింది.మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్బాస్ అంటేనే ఇమేజ్ డ్యామేజ్.. ఎప్పుడు తెలుసుకుంటారో?
కళ అనేది ప్రేక్షకుడికి ఆనందం, కళాకారుడికి జీవితం ఇస్తుంది. ఏ కళాకారుడైనా తన కళను నమ్ముకునే జీవిస్తాడు. ముఖ్యంగా నేటి కళాకారులు తమకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. తమ కష్టాన్ని, నష్టాన్ని బేరీజు వేసుకోకుండా ఆఖరికి తమ జీవితాన్ని కూడా పణంగా పెట్టి కళకు అంకితమవుతున్నారు. కానీ దురదృష్ణమేమిటంటే ఎంతటి కళాకారులనైనా కనుమరుగు చేస్తూ క్యాష్ చేసుకుంటుంది బిగ్ బాస్ లాంటి కార్యక్రమం. అదెలాగంటారా చూడండి...ఇమేజ్ పెంచుకోవడానికే..బిగ్ బాస్ కార్యక్రమం దాదాపు 8 సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకులకు పరిచయం. 8 సీరిస్ లలో వచ్చిన పార్టిసిపెంట్స్ మళ్ళీ ఎక్కడా కనబడట్లేదు. కనీసం విన్నర్స్ ఎవరైనా ఎక్కడైనా కనబడతారనుకున్నా పొరపాటే. బిగ్బాస్ కార్యక్రమ రూపేణా ప్రేక్షకాదరణ విపరీతంగా ఉంటుంది. దాన్ని చూసే ప్రతి కళాకారుడు బిగ్బాస్కు వెళ్ళి తన ఇమేజ్ పెంచుకోవాలనుకుంటాడు. కట్ చేస్తే తాను బిగ్ బాస్ బ్యాలెన్స్ పెంచుతాడే కానీ తన ఇమేజ్ డామేజ్ కాకుండా చూసుకోలేడు.అదెలాగో ఇంకాస్త వివరంగా చెబుకుందాం.హౌస్లో గిల్లికజ్జాలుబిగ్ బాస్ హౌస్ అంటే ఏమిటి ? ఏ సంబంధం లేని నలుగురు పబ్లిక్ ఇమేజ్ ఉన్నవాళ్ళని ఓ ఇంట్లో పెట్టి, వారి మధ్య టాస్కుల పేరుతో గిల్లికజ్జాలు పెట్టి, వారు కొట్టుకుంటే చూసే ప్రేక్షకుడితో తన గల్లా పెట్టి నింపుకునేదే ఈ బిగ్ బాస్ వ్యాపార సూత్రం. సాధారణంగా రోడ్డు మీద ఎవరైనా అనామకుడితో మనకు చిన్న పాటి ప్రమాదం జరిగినా చెలరేగిపోతాం. అటువంటి సమయంలో చుట్టూ వచ్చి పోయే వాళ్ళు ఆగి మరీ మన కొట్లాట వేడుకలా చూసి ఆనందిస్తారు. ఇప్పుడు బిగ్బాస్లో జరిగేది కూడా అదే! గొడవపడితే ఏమవుతుంది?తెలియని అనామకుడితో జరిగే గొడవ మనకు కాస్తంత అసహనం ఇచ్చినా గొడవపడతాం, అలాంటిది కోట్లాది మంది చూస్తున్నారన్న విషయం తెలిసి కూడా అదుపు తప్పి తోటి పార్టిసిపెంట్స్తో గొడవ పడినపుడు ఏమవుతుంది? మహా అయితే బిగ్బాస్ చిల్లర రెమ్యునరేషన్ రూపంలో విదిలిస్తాడు, కానీ తన ఇమేజ్ను ఈ కాస్త చిల్లర కోసం పాడు చేసుకుంటున్నామన్న విషయం గ్రహించలేకపోతున్నారు ఇప్పటి పార్టిసిపెంట్స్.గంగవ్వ ఎలిమినేషన్ఈ వారం విశ్లేషణ అంతా పైన విషయంలోనే వుంది. ఇక చెప్పుకోవాల్సిన అంశాలేమైనా ఉన్నాయి అంటే వైల్డ్ ఎంట్రీగా వచ్చిన గంగవ్వ సైలెంట్గా అనారోగ్య కారణాలతో ఎగ్జిట్ అయింది. బిగ్బాస్ కార్యక్రమాన్ని మొత్తంగా హరికథ రూపేణా పొగిడించుకుని వారాంతంలో హరితేజకు హ్యాండిచ్చి ఎలిమినేట్ చేశాడు బిగ్బాస్. బిగ్ డ్యామేజ్వారాంతంలో జంబలకిడిపంబ పేరుతో పార్టిసిపెంట్స్ను లింగ వేషధారణతో జుగుప్సాకరమైన డ్యాన్సులు హావభావాలతో రసాభాస చేసి ఈ వారానికి మమ అనిపించారు. ఏదేమైనప్పటికీ బిగ్బాస్ అన్నది బిగ్ డ్యామేజ్ అన్న విషయం చూసే ప్రేక్షకులు ఎప్పటికీ తెలుసుకోలేరు. కానీ పార్టిసిపెంట్స్ అయినా ఎప్పటికి గ్రహిస్తారో ఏమో!-ఇంటూరు హరికృష్ణమరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ర్యాంప్ ఆడించిన గౌతమ్, తేజ.. భయపడే రకం కాదు!
బిగ్బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ పది మంది మాత్రమే మిగిలారు. మీలో మీరు కొట్టుకు చావండి అంటూ బిగ్బాస్ నామినేషన్స్ ప్రక్రియ ఇచ్చాడు. నామినేట్ చేయాలనుకునే వ్యక్తి ఫోటోకు పెయింట్ వేసి పాడు చేయాలన్నాడు. అలా గౌతమ్.. పృథ్వీని, తేజ.. యష్మిని నామినేట్ చేశాడు. ఈ క్రమంలో పెద్ద గొడవలే జరిగాయి.భయపడేదేలె..తనను నామినేట్ చేసిన పాయింట్ల గురించి పృథ్వీ చర్చ మొదలుపెట్టగా నీ మాటలకు వేరేవాళ్లు భయపడతారేమో.. నేను భయపడను అన్నాడు గౌతమ్. ఇక ఎవిక్షన్ షీల్డ్ టాస్క్లో జంటగా వెళ్లిన తేజ, యష్మి.. ఏకాభిప్రాయానికి రాకుండా ఎవరికి నచ్చిన వ్యక్తుల్ని వారు సైడ్ చేసేశారు. నాది తప్పే.. నీది కూడా తప్పేఅయితే మొదట తేజ ఆ పని చేయడంతో అందుకు తగ్గ పరిణామాల్ని ఎదుర్కొన్నాడు. కంటెండర్ రేసులో లేకుండా పోవడమే కాకుండా ఫ్యామిలీ వీక్ కూడా తనకు ఉండబోదని చెప్పాడు. ఏకాభిప్రాయానికి రాకముందే పాము నోట్లో తాను గుడ్డు వేయడం ఎంత తప్పో.. తను వేశాక కూడా యష్మి వచ్చి మరో గుడ్డు వేయడం అంతే తప్పు అని తేజ కుండబద్ధలు కొట్టి చెప్పాడు.ర్యాంప్ ఆడించారుఅది తప్పనుకుంటావో, ఒప్పనుకుంటావో నీ ఇష్టం అని యష్మి చెప్తుంటే అనుకోవడమేముంది.. అది తప్పే.. అని తేజ కౌంటరిచ్చాడు. నా తప్పును నేను ఒప్పుకుంటున్నాను.. నా తర్వాత నీది కూడా తప్పే అని సమాధానమిచ్చాడు. దీంతో యష్మి నువ్వు చేసింది తప్పే.. అని అరిచింది. ప్రోమోలో అయితే గౌతమ్, తేజ ర్యాంప్ ఆడించినట్లు కనిపిస్తోంది. మరిన్ని బిగ్బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి