darshan
-
దర్శన్తో గొడవ? ఇలాంటివాడికి ఆస్కార్ ఇవ్వాలంటూ నటి వరుస పోస్టులు!
కన్నడ హీరో దర్శన్ (Darshan Thoogudeepa) చేసిన పని చర్చనీయాంశంగా మారింది. అతడు సోషల్ మీడియా ఖాతాలో కొన్నేళ్లుగా ఫాలో అవుతున్న ఆరుగురిని అన్ఫాలో కొట్టాడు. అందులో నటి, మాజీ ఎంపీ సుమలత అంబరీష్, ఆమె తనయుడు అభిషేక్ ఉన్నారు. ఉన్నట్లుండి వీరిని అన్ఫాలో కొట్టడంతో దర్శన్ ఎందుకిలా చేశాడన్న చర్చ మొదలైంది. దర్శన్ కొడుకులాంటివాడని చెప్పిన సుమలత.. తాను జైల్లో ఉండగా ఒక్కసారి కూడా చూడటానికి రాలేదన్న కోపంతోనే అతడు ఇలా చేసి ఉండొచ్చన్న ప్రచారం మొదలైంది.అలాంటి వారు హీరోలా..!ఈ నేపథ్యంలో సుమలత అంబరీష్ (Sumalatha Ambareesh) ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చేసిన పోస్టులు వైరల్గా మారాయి. తిమ్మిని బమ్మి చేసి, కాస్తైనా పశ్చాత్తాపపడకపోగా ప్రజలను బాధిస్తూ, అవతలివారిపైకి నిందను తోసేవారు ఇప్పటికీ వారిని వారు హీరోలుగా పరిగణించుకుంటున్నారు. ఇలాంటివారికి కదా ఉత్తమ నటుడిగా ఆస్కార్ ఇవ్వాలి అని ఓ పోస్ట్లో రాసుకొచ్చింది. అవే అసలైన పునాదిమరో పోస్ట్లో.. ఎటువంటి విచారం, నొప్పి లేకుండా ప్రశాంతంగా నిద్రలేవడం, మనల్ని మనం అర్థం చేసుకోవడం, ఆందోళనగా పరుగులు తీయకుండా శాంతియుతంగా గడపడం.. అనేవి ఒక నిధిలాంటివి. ఇవన్నీ సోషల్ మీడియాలో పనికొస్తాయో లేవో కానీ మన జీవితానికి బలమైన పునాది వేస్తాయి. ఈ అంశాలే మనల్ని మానసికంగా ధనవంతుల్ని చేస్తాయి అని మరో పోస్ట్ షేర్ చేసింది.(చదవండి: రికార్డు సృష్టించిన డాకు బ్యూటీ.. ఆ కారు కొన్న మొట్టమొదటి నటిగా)దర్శన్ను ఉద్దేశించి అనలేదుదీంతో సుమలత ఈ రెండు పోస్టులు దర్శన్ను ఉద్దేశించే చేసిందన్న చర్చ జరుగుతోంది. దర్శన్, సుమలత మధ్య సత్సంబంధాలు పూర్తిగా చెడిపోయినట్లున్నాయని ఎవరికి వారు కథలు అల్లేసుకుంటుకున్నారు. ఈ క్రమంలో సుమలత సోషల్ మీడియా వేదికగా అది అబద్ధమని కొట్టిపారేసింది. నేను ఇంతకుముందు చేసిన పోస్టుల గురించి అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. సాధారణంగా నేను పరిశీలించిన అంశాలపై ఆ పోస్టు పెట్టానే తప్ప ఎవరినీ ఉద్దేశించి కాదు. అలాగే ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఎంతమంది అన్ఫాలో చేస్తున్నారు? అని చెక్ చేసే అలవాటు నాకు లేదు.ఎందుకిలా రాద్ధాంతం చేస్తున్నారుదర్శన్.. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్)లో ఎవరినీ ఫాలో అవకూడదని నిర్ణయించుకున్న విషయం నాకు మీడియా వల్లే తెలిసింది. దీన్నెందుకు భూతద్దంలో చూస్తున్నారో నాకు తెలియడం లేదు. దర్శన్ అన్ఫాలో అవడం, తర్వాత నేను పోస్టులు పెట్టడం అనేది అనుకోకుండా జరిగింది. అంతేతప్ప ఇందులో ఏమీ లేదు. అసలే గొడవా లేనిచోట ఏదో జరుగుతోందంటూ వివాదం సృష్టించడం ఆపేయండి. నేను పెట్టిన పోస్టులు ప్రత్యేకంగా ఏ ఒక్కరినీ ఉద్దేశించిదని కాదని మళ్లీ చెప్తున్నాను.. నా కుటుంబ సభ్యులు, నా ఆప్తులు అనుకున్నవారితో సోషల్ మీడియాకు బదులుగా నేరుగానే మాట్లాడతాను అని సుమలత పేర్కొంది. కాగా అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో హీరో దర్శన్, అతడి ప్రేయసి, నటి పవిత్రగౌడ అరెస్టయిన విషయం తెలిసిందే! వీరిద్దరూ ప్రస్తుతం బెయిల్ మీదున్నారు. View this post on Instagram A post shared by Sumalatha Ambareesh (@sumalathaamarnath) చదవండి: ఒకప్పటి మావోయిస్టుల కంచుకోటలో మహేశ్ బాబు సినిమా షూటింగ్!ఓటీటీలోకి 'ముఫాసా'.. అధికారికంగా ప్రకటన -
అయోధ్య రాముని దర్శన వేళల్లో మార్పులు
అయోధ్య: యూపీలోని రామజన్మభూమి అయోధ్య(Ram Janmabhoomi Ayodhya)లో బాలరాముణ్ణి దర్శించుకునే వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయని రామమందిర ట్రస్ట్ తెలిపింది. ఇటీవల ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరిగిన సమయంలో అక్కడి నుంచి వస్తున్న భక్తుల సౌకర్యార్థం అయోధ్య రామాలయాన్ని ప్రతీరోజూ 19 గంటల పాటు తెరిచివుంచారు. ఇప్పుడు ఈ దర్శన సమయాన్ని తగ్గించారు.మహాకుంభమేళా(Mahakumbh Mela) జరిగిన సమయంలో ప్రతీరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ భక్తులకు రామ్లల్లా దర్శనం కల్పించారు. ఇప్పుడు ప్రయాగ్రాజ్ కుంభమేళా ముగిసిన దరిమిలా అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య కొంతమేరకు తగ్గింది. ఈ నేపధ్యంలో రామజన్మ భూమి తీర్థ ట్రస్ట్ గతంలో మాదిరిగానే దర్శనాల సమయాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో ఇకపై రామభక్తులకు అయోధ్యలో ప్రతీరోజూ 19 గంటలపాటు దర్శనం లభించదని ట్రస్ట్ తెలిపింది.రామాలయ ట్రస్ట్(Ramalaya Trust) సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ ఇకపై ప్రతీరోజూ మంగళ హారతి ఉదయం 4 గంటలకు జరుగుతుందని, ఆ తర్వాత 4:15 నుండి 6 గంటల వరకు తలుపులు మూసివేస్తారన్నారు. తిరిగి ఉదయం ఆరు గంటలకు మరో హారతి ఉంటుందని, అనంతరం భక్తులు 6:30 నుండి 11:50 వరకు దర్శనాలు చేసుకోవచ్చన్నారు. తరువాత ఆలయ తలుపులను మధ్యాహ్నం 12 గంటల వరకు మూసివేస్తారన్నారు. మధ్యాహ్న రాజభోగం 12 గంటలకు ఉంటుందని, హారతి అనంతరం దర్శనం 12.30 వరకు ఉంటుందని, ఆ తరువాత ఆలయ తలుపులను ఒంటి గంట వరకు మూసివేస్తారన్నారు. అనంతరం సాయంత్రం 6:50 వరకు దర్శనాలు ఉంటాయన్నారు. తరువాత రాత్రి 7 గంటల వరకు తలుపులు మూసివేస్తారని, సాయంత్రం 7 గంటలకు హారతి అనంతరం రాత్రి 9:45 వరకు బాలరాముని దర్శనం ఉంటుందన్నారు. 9:45 నుండి 10 వరకు తలుపులు మూసివేస్తారని, ఆ సమయంలో బాలరామునికి విందు వడ్డిస్తారన్నారు. శయన హారతి అనంతరం రాత్రి 10:15కు ఆలయ తలుపులు మూసివేస్తారన్నారు. ఇది కూడా చదవండి: World Wild Life Day: వన్యప్రాణులతోనే మానవ మనుగడ -
డబ్బుల కోసం కోర్టుకు వెళ్లిన నటుడు దర్శన్
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి(Renukaswamy) హత్య కేసులో నటుడు దర్శన్కు(Darshan) బెయిలు రావడంతో ప్రస్తుతం ఆయన తన కెరీర్పైన దృష్టి పెట్టారు. పలు సినిమాల్లో నటించిందుకు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో తన డబ్బు కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. రేణుకాస్వామి హత్య తర్వాత చాలా సమస్యల్లో ఆయన చిక్కుకున్నారు. ఈ కేసు విషయంలో తనకు సంబంధించిన రూ. 37 లక్షల డబ్బును పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.( ఇదీ చదవండి: గతేడాదిలో పెళ్లి.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం)గత ఏడాది జూన్లో జరిగిన రేణుకాస్వామి హత్య కేసు నుంచి దర్శన్ బయటపడేందుకు పవన్, నిఖిల్ అనే వ్యక్తులను సంప్రదించి ఈ కేసును వారిపై వేసుకోవాలని కోరినట్లు విచారణలో తేలింది. అందుకోసం మొత్తం నలుగురికి కలిపి రూ. 37 లక్షలు దర్శన్ ఇచ్చినట్లు పోలీసులు అనుమానించారు. పవన్ తన ఇంట్లో దాచి ఉంచిన ఆ డబ్బును బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు దర్శన్ తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరుతూ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు.హత్య కేసులో నిందితుడు కావడంతో దర్శన్ తుపాకీ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. అందుకే గన్ లైసెన్స్ రద్దు చేయవద్దని దర్శన్ పోలీసు శాఖకు లేఖ రాశారు. తుపాకీ లైసెన్స్కు సంబంధించి పోలీసు శాఖ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అందుకే దర్శన్ విజ్ఞప్తి లేఖ రాశాడు. ఈ విషయం గురించి దర్శన్ మాట్లాడుతూ.. 'నేను సెలబ్రిటీని కావడంతో ఎక్కడికి వెళ్లినా చాలా మంది గుమిగూడుతుంటారు. ఈ క్రమంలో నాకు రక్షణ అవసరం. వ్యక్తిగత కారణాలతో నాకు గన్ లైసెన్స్ కావాలి. లైసెన్స్ రద్దు చేయవద్దు. నాపై నమోదైన కేసులో సాక్షులను ఇప్పటి వరకు ఎక్కడా నేను బెదిరించలేదు. అలా జరిగితే నాపై చట్టపరమైన చర్యలు తీసుకోండి.' అంటూ లేఖలో ఆయన పేర్కొన్నారు.బెయిలు రద్దు చేయాలని కోర్టును కోరిన పోలీసులురేణుకాస్వామి హత్య కేసులో దర్శన్కు ఇచ్చిన బెయిలు రద్దు చేయాలని కోరుతూ న్యాయస్థానంలో పోలీసులు అర్జీ దాఖలు చేశారు. వెన్నునొప్పికి శస్త్రచికిత్స అత్యవసరమని ఆరు వారాలు బెయిలు తీసుకుని బయటకు వచ్చిన ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారని కోర్టుకు తెలిపారు. కొద్దిరోజులుగా మైసూరు ఫాంహౌస్లో విశ్రాంతి తీసుకున్న దర్శన్.. మళ్లీ సినిమాల్లో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో ‘డెవిల్’ అనే సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. దర్శన్తో పాటు పవిత్రా గౌడ, అనుకుమార్, లక్ష్మణ్, ప్రదోశ్, జగదీశ్లకు ఇచ్చిన బెయిలు కూడా రద్దు చేయాలని న్యాయవాది అనిల్ సి.నిశానితో పోలీసులు అర్జీ వేయించారు. మరో వారంలోపు ఈ అర్జీ విచారణకు వస్తుందని పోలీసులు తెలిపారు. -
స్నేహితురాలిని పెళ్లాడిన జెర్సీ మూవీ సింగర్.. పోస్ట్ వైరల్
ప్రముఖ సింగర్ దర్శన్ రావల్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రియురాలు ధరల్ సురేలియాను ఆయన పెళ్లాడారు. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు సింగర్. ఈ వివాహా వేడుకలో బంధువులతో పాటు సన్నిహితులు కూడా పాల్గొన్నారు.తాజాగా సింగర్ దర్శన్ రావల్ తన పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. సింగర్ దర్శన్ పలు సూపర్ హిట్ సినిమాలకు తన గాత్రాన్ని అందించాడు.దర్శన్ కెరీర్..దర్శన్ రావల్ 2014లో ఇండియాస్ రా స్టార్ మొదటి సీజన్లో పాల్గొన్నాడు. ఆషోలో ఒడిశాకు చెందిన రితురాజ్ మొహంతి చేతిలో ఓడిపోయాడు. ఆ తరవాత ది టాలెంట్ హంట్ షో అతనికి మంచి వేదికను ఇచ్చింది. అప్పటి నుంచి బాలీవుడ్లో ప్లేబ్యాక్ సింగర్గా తన కెరీర్ను ప్రారంభించాడు. 2015లో షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన హిమేష్ రేష్మియాకు ధన్యవాదాలు. లవ్యాత్రి చిత్రంలోని చోగడ పాటతో అతనికి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత షేర్షా చిత్రం నుంచి కభీ తుమ్హే, రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ మూవీలోని ధిండోరా బజే రే, ఇష్క్ విష్క్ రీబౌండ్ సినిమా నుంచి సోనీ సోని లాంటి సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాకుండా గుజరాతీలో పాటలు కూడా పాడారు. తెలుగు హీరో నాని నటించిన జెర్సీ చిత్రంలోని నీదా పదధాని అనే తెలుగు సాంగ్ను అలపించారు దర్శన్ రావల్. View this post on Instagram A post shared by Darshan Raval (@darshanravaldz) -
ఆలయాల బాటలో హీరో దర్శన్.. కారణం ఇదేనా.. ?
కర్ణాటకలో రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, ప్రముఖ నటుడు దర్శన్ ఆలయాల బాట పడ్డాడు. జిల్లాలోని శ్రీరంగపట్టణ తాలూకా ఆరతి ఉక్కడలో వెలిసిన శ్రీ అహల్యదేవి మారెమ్మ దేవస్థానాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని పూజలు చేశారు. విజయలక్ష్మి, కుమారునితో కలిసి ఆలయానికి వచ్చారు. మేలుకోటె ఎమ్మెల్యే దర్శన్ పుట్టణ్ణయ్యతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఇప్పటికే బళ్లారి జిల్లా కురుగోడిలోని బసవేశ్వర ఆలయంలో కూడా ఆయన పూజలు నిర్వహించారు. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఆయన నిత్యం ఏదో గుడికి వెళ్తూ కనిపిస్తూ ఉండటంతో ఆయనలో భక్తి చింతన ఎక్కువగా కనిపిస్తుందని నెటిజన్లు పేర్కొంటున్నారు.కన్నడలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి (29) హత్యకేసులో ప్రధాన నిందితులుగా నటుడు దర్శన్, పవిత్రగౌడ సుమారు ఆరు నెలలు పాటు జైలులో ఉన్న విషయం తెలిసిందే. రేణుకాస్వామి హత్యకు సంబంధించి దర్శన్ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 అని పోలీసులు పేర్కొన్నారు. అయితే, దర్శన్ జైల్లో ఉన్నప్పుడు నిద్రలేని రాత్రులు గడిపినట్లు కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి.బళ్లారి జైలులో దర్శన్ పలు ఇబ్బందులు పడినట్లు తెలిసిందే. అక్కడ కొన్ని రోజుల పాటు ఆయన సరైన నిద్రలేకుండా గడిపారని సమాచారం. దీనంతటికి కారణం రేణుకాస్వామి.. అతని ఆత్మ వెంటాడుతోందని జైలు అధికారులతో దర్శన్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి. నిద్రపోతున్న సమయంలో రేణుకాస్వామి ఆత్మ కలలోకి వచ్చి బయపెడుతుందని ఆయన చెప్పుకొచ్చినట్లు తెలిసింది. దీంతో జైలు బారికేడ్లో తాను ఒంటరిగా ఉండలేకపోతున్నట్లు అధికారులతో చెప్పారని వార్తలు వైరల్ అయ్యాయి. అర్ధరాత్రి సమయంలో నిద్రలోనే దర్శన్ కేకలు పెడుతున్నట్లు తోటి ఖైదీలు చెప్పినట్లు తెలిసింది. అయితే, ఈ విషయం గురించి అప్పట్లో జైలు అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.దర్శన్ బెయిల్ ద్వారా బయటకు వచ్చిన తర్వాత జైలు జీవితం తనను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కూడా రేణుకాస్వామి ఆత్మ తనను ఇబ్బంది పెడుతుందని, అందుకే ఆయన పలు గుడుల చుట్టూ తిరుగుతున్నారని ప్రచారం జరుగుతుంది. -
జైలు నుంచి రిలీజ్.. వెంటనే దర్శన్పై ప్రేమతో
కొన్ని నెలల క్రితం అభిమాని రేణుకాస్వామిని కన్నడ హీరో దర్శన్ హత్య చేయడం ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందే. దీని తర్వాత పోలీసు కేసు నమోదు కావడం.. హీరో దర్శన్, అతడి ప్రియురాలు పవిత్ర గౌడ సహా పలువురి జైలుకెళ్లడం అప్పట్లో సెన్సేషన్ అయింది. కొన్నిరోజుల క్రితం అనారోగ్య సమస్యలతో దర్శన్కి బెయిల్ దక్కగా.. ఇప్పుడు పవిత్ర గౌడకు కూడా బెయిల్ లభించింది. వచ్చీ రావడంతోనే ప్రియుడిపై ప్రేమ బయటపెట్టింది.(ఇదీ చదవండి: 'కన్నప్ప' ఐదుసార్లు చూస్తా.. విష్ణుతో నెటిజన్ ట్వీట్ టాక్)దర్శన్కు ఇప్పటికే పెళ్లయినప్పటికీ.. పవిత్ర గౌడతో రిలేషన్ ఉందనే రూమర్స్ వచ్చాయి. కానీ పవిత్రని ఇబ్బంది పెట్టాడని దర్శన్.. రేణుకాస్వామిని హత్య చేయడం మాత్రం ప్రేమకు పరాకాష్టగా నిలిచింది. తొలుత ఆరోపణలు అనుకున్నారు గానీ బలమైన సాక్ష్యాధారాలు ఉండటంతో కొన్నినెలల పాటు వీళ్లిద్దరూ జైలు జీవితం గడపాల్సి వచ్చింది.తాజాగా పవిత్ర గౌడ బెయిల్పై రిలీజైంది. వచ్చీ రావడంతోనే వజ్రమునేశ్వర ఆలయానికి వెళ్లింది. అక్కడ దర్శన్ పేరుపై ప్రత్యేక పూజలు చేయించింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఈ కారణంతోనే బెయిల్పై బయటకొచ్చాడు. ఇప్పుడు దర్శన్ కోసం పబ్లిక్గానే పవిత్ర గౌడ ప్రేమ చూపించడం, ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అయిపోతోంది.(ఇదీ చదవండి: ఒక్క క్షణం కూడా వదలట్లేదు.. భర్త గురించి వరలక్ష్మి)ರೇಣುಕಾಸ್ವಾಮಿ ಕೇಸ್ನಲ್ಲಿ ಜೈಲು ಸೇರಿದ್ದ ನಟಿ ಪವಿತ್ರಗೌಡ ಬಿಡುಗಡೆಯಾಗಿದ್ದು, ವಜ್ರಮುನೇಶ್ವರ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ತೆರಳಿದ್ದಾರೆ. ಇದೇ ವೇಳೆ ನಟ ದರ್ಶನ್ ಹೆಸರಲ್ಲಿ ದೇವರಿಗೆ ವಿಶೇಷ ಪೂಜೆ ಸಲ್ಲಿಸಿದರು.@dasadarshan#PavithraGowda #DarshanThoogudeepa #MuneshwaraTemple #Bhagya #Darshan #RenukaswamyCase #Bengaluru pic.twitter.com/NUlC9XSRyP— NewsFirst Kannada (@NewsFirstKan) December 17, 2024 -
కన్నడ నటుడు దర్శన్కు బెయిల్
బొమ్మనహళ్లి: హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్కు భారీ ఊరట లభించింది. ఆయనతోపాటు ఏడుగురికి హైకోర్టు బెయిలిచ్చింది. వెన్నునొప్పితో బాధపడుతున్న దర్శన్ మధ్యంతర బెయిల్పై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగింది. అనంతరం దర్శన్, అతడి సన్నిహితురాలు పవిత్రా గౌడ, ప్రదోశ్, అనుకుమార్, నాగరాజు, లక్ష్మణ్, జగదీష్కు బెయిల్ మంజూరు చేస్తు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురికి బెయిల్ లభించింది. పవిత్రా గౌడను దుర్భాషలాడాడనే కోపంతో రేణుక స్వామి అనే వ్యక్తిని చంపారనే ఆరోపణలపై దర్శన్ను జూలైలో పోలీసులు అరెస్ట్ చేశారు. -
దర్శన్ మానసిక స్థితి బాగాలేదు : లాయర్
కన్నడ నటుడు దర్శన్ అనారోగ్యంతో ఇబ్బుందులు పడుతున్న విషయం తెలిసిందే. రేణుకా స్వామి హత్య కేసులో ఈ కారణం వల్లే ఆయనకు ఆరు వారాల పాటు బెయిల్ లభించింది. వెన్నెముక శస్త్ర చికిత్స కోసం ఆయనకు కోర్టు తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. పాస్పోర్టును ట్రయల్ కోర్టుకు అప్పగించాలని, సాక్ష్యాలను తారుమారు చేయరాదని షరతు విధించింది.ఆపరేషన్ చేయడానికి దర్శన్ మానసికంగా సిద్ధంగా లేరని దర్శన్ తరపు లాయర్ హైకోర్టుకు తెలిపారు. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పటికే నాలుగు వారులు కావస్తుంది. అయితే, ఇన్ని రోజులైనా దర్శన్ ఆపరేషన్ చేయించుకోకపోవడంతో పోలీసులు సుప్రీంకోర్టుకు అప్పీలు వెళ్లారు. దర్శన్ బెయిలు రద్దు చేయాలని, లేదంటే ఆయన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని పోలీసులు అభిప్రాయపడ్డారు. దర్శన్కు ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని, దర్శన్ కూడా మానసికంగా సిద్ధమవుతున్నారని, ముఖ్యంగా అధిక రక్తపోటు వల్ల ఆపరేషన్ వాయిదా పడుతోందని కోర్టుకు దర్శన్ తరుపు లాయర్ వివరించారు. అందుకు సంబంధించి వైద్యులు ఇచ్చిన రిపోర్టులను కూడా సమర్పించారు. ప్రస్తుతం కన్సర్వేటివ్ ఆపరేషన్ జరుగుతుందని తెలిపారు. ఫిజియోథెరపీ, మందులతో నొప్పిని అదుపులో ఉంచడం జరుగుతోందని వివరించారు. -
తిరుమలలో ‘టూరిజం’ దర్శనాలు రద్దు
తిరుమల: టూరిజం కార్పొరేషన్లకు కేటాయిస్తున్న శ్రీవారి దర్శన టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ నూతన పాలక మండలి నిర్ణయం తీసుకుంది. తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తుంటారు. వీఐపీ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం తదితర విధానాల్లో భక్తులకు టీటీడీ స్వామివారి దర్శనం కల్పిస్తుంటుంది. వీటితో పాటు వివిధ రాష్ట్రాల టూరిజం కార్పొరేషన్లకు టీటీడీ నిత్యం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కేటాయిస్తుంటుంది.ఇందులో ఏపీ టూరిజం, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, ఐఆర్టీసీల ద్వారా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తుంటుంది. దీనివల్ల సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు తక్కువ సమయంలోనే స్వామివారిని దర్శనం చేసుకొని తిరిగి వెళ్లేవారు. కానీ టీటీడీ నూతన పాలకమండలి తొలి సమావేశంలోనే ఈ దర్శన టికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇతర రాష్ట్రాల టూరిజం కార్పొరేషన్లకు టీటీడీ రోజూ 4 వేల టికెట్లు కేటాయిస్తుండేది. ఇందులో ఏపీ టూరిజానికి 1,000, తెలంగాణకు 800 టికెట్లు, మిగతా వాటికి 500, 400 చొప్పున టికెట్లు కేటాయించేది వీరికి మధ్యాహ్నం 2 గంటల స్లాట్ ద్వారా దర్శనం కల్పించేది. అయితే ఈ టికెట్ల అవకతవకలపై ఫిర్యాదులు రావడంతో ఏడు టూరిజం కార్పొరేషన్లకు దర్శన టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. తప్పు చేసిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి గానీ.. ఇలా అందరికీ దర్శన టికెట్లు నిలిపివేయడం సరికాదని ఇతర రాష్ట్రాల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘శ్రీవాణి’లో మార్పులు!
తిరుమల: శ్రీవాణి ట్రస్టు పేరు మార్పుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి తదుపరి సమావేశం నాటికి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ నూతన ధర్మకర్తల మండలి తొలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్ బ్యాంకుల్లోని డిపాజిట్లను వెనక్కు తీసుకుని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు. శ్రీవారి నిత్య అన్న ప్రసాదం మెనూలో అదనంగా మరొక పదార్థాన్ని చేరుస్తామని చెప్పారు.తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద విశాఖ శారద పీఠానికి చెందిన మఠం నిర్మాణంలో అవకతవకలు, ఆక్రమణలు జరిగినట్లు టీటీడీ అధికారుల కమిటీ ఇచి్చన నివేదిక ఆధారంగా భవనం లీజు రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. క్యూలలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి 2, 3 గంటల్లోనే దర్శనమయ్యేలా నిపుణుల కమిటీని నియమించామన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా భక్తులకు త్వరితగతిన దర్శనం చేయిస్తామన్నారు. తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను మూడు, నాలుగు నెలల్లో తొలగిస్తామని చెప్పారు.తిరుపతిలోని శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు మార్చామన్నారు. అలిపిరిలో టూరిజం కార్పొరేషన్ ద్వారా దేవలోక్కు కేటాయించిన 20 ఎకరాల భూమిని వెనక్కి తీసుకుని టీటీడీకి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడినా, ప్రచారం చేసినా కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుపతి స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు. టూరిజం కార్పొరేషన్లు, ఆర్టీసీ ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 ) టికెట్లలో అవకతవకలపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో సదరు సంస్థల ద్వారా కోటాను పూర్తిగా రద్దు చేస్తామని టీటీడీ చైర్మన్ ప్రకటించారు. బ్రహ్మోత్సవాల్లో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు అందించే బహుమానాన్ని 10 శాతం పెంచుతున్నట్లు చెప్పారు. రెగ్యులర్ ఉద్యోగులకు రూ.15,400, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7,535 చొప్పున బ్రహ్మోత్సవ బహుమానం అందిస్తామన్నారు.శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణ, అన్న ప్రసాద కేంద్రం ఆధునికీకరణకు టీవీఎస్ సంస్థతో ఎంఓయూ చేసుకున్నామని, వారు ఉచితంగానే చేస్తారని చెప్పారు. టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగస్తులను తొలగిస్తామని, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. కాగా శ్రీవాణి ట్రస్టు పేరును మార్చి ప్రధాన ఖాతాను మార్చడం వల్ల 80 సీ నిబంధన వర్తించక టీటీడీకి ట్యాక్స్ భారం పడే అవకాశం ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
హీరో దర్శన్ నుంచి ప్రాణహాని.. బిగ్బాస్ కంటెస్టెంట్ ఫిర్యాదు
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ హీరో దర్శన్ ఇటీవలే మధ్యంతర బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చాడు. కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సర్జరీ చేయించుకోనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా దర్శన్పై మరో కన్నడ నటుడు, బిగ్బాస్ ఫేమ్, లాయర్ జగదీష్ సంచలన ఆరోపణలు చేశాడు. దర్శన్, అతడి అభిమానుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.బెదిరింపు కాల్స్దర్శన్కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు అతడి అభిమానులు తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించాడు. దాదాపు వెయ్యి బెదిరింపు కాల్స్ వచ్చాయని పేర్కొన్నాడు. ఇదంతా చేస్తున్నది అభిమానులే అయినా.. దీని వెనక ఉన్నది మాత్రం కచ్చితంగా హీరో దర్శనే అని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం దర్శన్ బెయిల్పై బయట ఉన్న కారణంగా తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు.చదవండి: మమ్మల్ని చిత్రవధ చేసింది.. నటిపై సవతి కూతురి ఆరోపణలు -
అయోధ్య దీపోత్సవం.. కన్నడ స్టార్ కు బిగ్ రిలీఫ్
-
కన్నడ స్టార్ దర్శన్ కు మధ్యంతర బెయిల్
-
హత్య కేసులో స్టార్ హీరోకి మధ్యంతర బెయిల్
కన్నడ హీరో దర్శన్కి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. కాకపోతే ఇది మధ్యంతర బెయిల్. అనారోగ్య సమస్యలు ఉన్నందున ఆరు వారాలు మాత్రమే బెయిల్ గ్రాంట్ చేస్తూ కర్ణాటక హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు దిగువ కోర్టులో దర్శన్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా.. కోర్ట్ తిరస్కరించింది. తాజాగా దర్శన్ తరఫు న్యాయవాది హైకోర్టులో అభ్యర్థించడంతో బెయిల్ మంజూరైంది.దర్శన్కి తీవ్రమైన వెన్నునొప్పి ఉందని, దీనికి శస్త్ర చికిత్స అవసరమని. చికిత్స ఆలస్యమైన పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ని దర్శన్ తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు.(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో 'కంగువ' ఎడిటర్ మృతి)డాక్టర్ రిపోర్టులో దర్శన్కు చేయాల్సిన సర్జరీ, కోలుకోవడానికి పట్టే సమయం సరిగ్గా లేదని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ విశ్వేశ్వర్ భట్.. 'విచారణలో ఉన్న ఖైదీకి వైద్యం చేయించుకునే హక్కు ఉందని' అని పేర్కొంటూ షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.తన ప్రియురాలిని వేధిస్తున్నాడనే నెపంతో రేణుకాస్వామి అనే తన అభిమానిని.. దర్శన్, తన మనుషులతో కలిసి హత్య చేయించాడు. దీనికి పక్కా ఆధారాలు ఉండటంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పుడు దర్శన్కి మాత్రమే బెయిల్ లభించింది. తమ అభిమాన హీరోకి వచ్చింది మధ్యంతర బెయిల్ అయినప్పటికీ ఇతడి అభిమానులు మాత్రం తెగ ఆనందపడిపోతున్నారు. ఆ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు.(ఇదీ చదవండి: ఆ సినిమాలో నా మీద ట్రోలింగ్ చేశారు: కిరణ్ అబ్బవరం) -
కన్నడ నటుడు దర్శన్కు సర్జరీ
రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, ప్రముఖ నటుడు దర్శన్ ఆరోగ్యం గురించి నివేదిక ఇవ్వాలని జైలు అధికారులకు హైకోర్టు ఆదేశించింది. బెయిల్ కోరుతూ దర్శన్ సమర్పించిన పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ విశ్వజిత్ శెట్టి విచారించారు. పిటిషన్ గురించి అభ్యంతరాలుంటే తెలపాలని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్కు సూచించారు. బళ్లారి జైలులో దర్శన్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఆపరేషన్ అవసరముందని వైద్యులు తెలిపారు. అందుచేత బెయిల్ ఇవ్వాలని దర్శన్ వకీలు కోరారు. నేర విచారణలో అనేక లోపాలు ఉన్నాయని, అన్ని ఆధారాలను పోలీసులే సృష్టించారంటూ పలు ఆరోపణలు వినిపించారు. తదుపరి విచారణ అవసరం కూడా లేనట్లుందని పేర్కొన్నారు. దీంతో వైద్య నివేదిక ఇవ్వాలని జడ్జి ఆదేశించి కేసును వాయిదా వేశారు.100 రోజులు దాటిందిదర్శన్, పవిత్రలు జూన్ 10 నుంచి అరెస్టయి కారాగారంలో ఉన్నారు. వారిద్దరూ జైలుకు వెళ్లి 100 రోజులు దాటింది. ఇటీవల సిట్ చార్జిషీట్లు దాఖలు చేయడంతో బెయిలు వస్తుందని ఆశించారు. దర్శన్ భార్య విజయలక్ష్మి, సన్నిహితులు బెయిలు కోసం ప్రముఖ లాయర్లతో ముమ్మరంగా ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో దర్శన్ బళ్లారి, పవిత్ర బెంగళూరు సెంట్రల్జైల్లో ఇంకొన్ని రోజులు ఉండక తప్పదు. ఈ క్రమంలో మరోసారి వారు బెయిల్ పిటీషన వేశారు. -
Tirumala: శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు కంపార్టుమెంట్ల నుంచి కాకుండా నేరుగా దర్శనానికి పంపిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 73,926 మంది స్వామివారిని దర్శించుకోగా 23,726 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.87 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టిక్కెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు కలిగిన భక్తులకు 1 గంటల్లో దర్శనమవుతోంది. నిర్దేశించిన సమయానికే భక్తులు క్యూలోకి వెళ్లాలని టీటీడీ కోరింది.22న ఆర్జిత సేవా టికెట్ల విడుదలకల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను అక్టోబరు 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.22న వర్చువల్ సేవల కోటా విడుదలవర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జనవరి నెల కోటాను అక్టోబరు 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.అక్టోబరు 23న అంగప్రదక్షిణం టోకెన్లుజనవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటాంశ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జనవరి నెల ఆన్ లైన్ కోటాను అక్టోబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటాంవయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జనవరి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను అక్టోబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.అక్టోబరు 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదలజనవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబరు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదలంతిరుమల, తిరుపతిలలో జనవరి నెల గదుల కోటాను అక్టోబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది. -
జైలులో దర్శన్.. కలిసేందుకు వచ్చిన అభిమానికి షాక్!
కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం బళ్లారి జైలులో ఉన్నారు. ఓ అభిమాని హత్య కేసులో అరెస్టయ్యారు. అయితే కన్నడ ఇండస్ట్రీలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్లో ఉంది. తాజాగా అతన్ని కలిసేందుకు ఓ అభిమాని వినూత్న రీతిలో ప్రయత్నించారు. టెడ్డీ బేర్ వేషంలో వచ్చి జైలు బయట కనిపించారు."మేము మీ కోసం ఎదురు చూస్తున్నాము" అని రాసి ఉన్న ప్లకార్డును జైలు బయట ప్రదర్శించాడు. అతన్ని శివమొగ్గలోని సాగర్కు చెందిన కార్తీక్గా గుర్తించారు. అయితే అభిమాన హీరోను కలిసేందుకు జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. ఎందుకంటే కఠినమైన నిబంధనలే కారణంగా తెలుస్తోంది.కాగా.. రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ ప్రస్తుతం జైలులో ఉన్నారు. వీరి బెయిల్ పిటిషన్ను బెంగళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు (సిసిహెచ్) ఇవాళ మరోసారి తిరస్కరించిన సంగతి తెలిసిందే. అంతకుముందు పరప్పన అగ్రహార జైలులో ఉన్న దర్శన్ను భద్రతా కారణాల దృష్ట్యా బళ్లారికి తరలించారు. -
ఆ ఫోటోలన్నీ ఫేక్.. దర్శన్ కేసులో కీలక మలుపు
కర్ణాటకలో సంచలనాత్మకంగా మారిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేయగా, కోర్టులో విచారణ ప్రారంభమైంది. రేణుకాస్వామి హత్య సమయంలో వచ్చిన ఫోటోలు నిజమా, అబద్ధమా అనే ప్రశ్న తలెత్తింది. ఈ కేసులో పోలీసులు చూపుతున్న సాక్ష్యాలన్నీ అబద్ధాలని నటుడు దర్శన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కొన్నిసాక్ష్యాల ధృవీకరణ పత్రాలు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఇంకా పోలీసుల చేతికి అందలేదు. ఆర్ ఆర్ నగరలో బస్సు షెడ్డులో రేణుకాస్వామిని బంధించి దర్శన్, పవిత్రగౌడ, అనుచరులు తీవ్రంగా కొట్టి చంపారనేది ప్రధాన అభియోగం. ఆ సమయంలో కొన్ని ఫోటోలను వారి మొబైల్ ఫోన్ల నుంచి సేకరించినట్లు పోలీసులు తెలిపారు. రేణుకాస్వామి చేతులెత్తి సమస్కరిస్తూ కూర్చున్న ఫోటో, మృతదేహం ఫోటోలు ఇందులో ఉన్నాయి. కానీ ఈ ఫోటోలు ఏఐ టెక్నాలజీతో సృష్టించారని దర్శన్ న్యాయవాదులు ఆరోపించారు. ఈ ఫోటోలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి త్వరగా నివేదిక పంపాలని పోలీసులు కోరారు. దీంతో ఈ కేసులో మరో మలుపు తీసుకున్నట్లు అయింది. -
Darshan: బెంగళూరు జైలే బెటరు
సాక్షి బెంగళూరు: రేణుకాస్వామి హత్య కేసులో బళ్లారి సెంట్రల్ జైలులో ఉన్న కన్నడ స్టార్ నటుడు దర్శన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ఇంకా కోర్టు విచారణలోనే ఉంది. అయితే అంతలోనే ఎలాగైనా బెంగళూరుకు తిరిగి వచ్చేయాలని దర్శన్ పట్టుబడుతున్నాడు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న దర్శన్.. ఆ కారణం చూపి బళ్లారి జైలు నుంచి బెంగళూరుకు రావాలనుకుంటున్నాడు. అక్కడ కటకట బెంగళూరు పరప్పన జైలు నుంచి దర్శన్ను బళ్లారి కేంద్ర కారాగారానికి తరలించిన విషయం తెలిసిందే. బళ్లారి జైలులో గడ్డు పరిస్థితి ఉన్నట్లు తెలిసింది. బెంగళూరు జైలులో ఇతర ఖైదీలతో మాట్లాడేవాడు.. కానీ బళ్లారి జైలులో మాట్లాడేందుకు కూడా ఎవరూ లేరు. సౌకర్యాల లేమి పీడిస్తోంది. ఇదే సమయంలో ఆయనకు ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. బళ్లారిలోని వైద్యులు స్కానింగ్ చేయించుకోవాలని సూచించారు. అయితే తాను బెంగళూరులోనే చేయించుకుంటానని పట్టుబట్టాడు. ఇప్పటికీ బెయిలు రాకపోతే బళ్లారి జైలులో ఉండలేనని, అందుకే బెంగళూరుకు తరలి వెళ్లాలని దర్శన్ మొండికేసినట్లు తెలిసింది. దర్శన్కు అదనపు వసతులపై సోమవారం ఆయన న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేసే అవకాశముంది. -
అయోధ్యలో నవరాత్రి వేడుకలు.. మారిన దర్శన, హారతి సమయాలు
అయోధ్య: దేశవ్యాప్తంగా దసరా నవరాత్రుల ఉత్సాహం నెలకొంది. యూపీలోని అయోధ్యలోనూ దసరా వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ శరన్నవరాత్రులలో రామ్లల్లా దర్శన, మంగళ హారతుల సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ తెలిపింది. నవరాత్రుల మొదటి రోజు నుండి ఈ మార్పులు అమలులోకి వస్తాయని ట్రస్ట్ పేర్కొంది. తెల్లవారుజామున 4:30 నుంచి 4:40 గంటల వరకు మంగళ హారతి, 4:40 నుంచి 6:30 గంటల వరకు స్వామివారి అలంకారాలు జరగనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు శృంగార ఆరతి ఉంటుందని సమాచారం. ఇక రామ్లల్లా దర్శనం ఉదయం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం 9:00 గంటలకు బాలభోగం నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఆలయ తలుపులు ఐదు నిమిషాల పాటు మూసివేయనున్నారు.నవరాత్రులలో లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తారని ట్రస్ట్ భావిస్తోంది. ఈ నేపధ్యంలోనే భక్తులకు సులభ దర్శనం కల్పించేందుకు ట్రస్ట్ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దర్శన వేళల్లో చేసిన నూతన మార్పుల విషయానికొస్తే.. బాలభోగం అనంతరం ఉదయం 9:05కు ఆలయ తలుపులు తెరుస్తారు. 11:45 వరకు దర్శనాలు ఉంటాయి. 11:45 నుండి 12:00 వరకు ప్రభువు ఏకాంతం ఉంటుంది. తిరిగి 12:00 గంటలకు భోగ్ హారతి ఉంటుంది. ఆలయంలో స్వామివారు మధ్యాహ్నం 12:15 గంటలకు నిద్రిస్తారు. ఈ సమయంలో ఆలయ తలుపులను 12:30 నుండి 1:30 వరకు మూసివేస్తారు. అదే సమయంలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తారు.మధ్యాహ్నం 1:30కి ఆలయంలోని తలుపులు తెరుస్తారు. దేవతా హారతి నిర్వహిస్తారు. దర్శనాలు మధ్యాహ్నం 1:35 నుండి ప్రారంభమై, సాయంత్రం 4:00 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం ఐదు నిమిషాల పాటు ఆలయ తలుపు మూసివేస్తారు. ఆ తర్వాత 4:05 నుంచి 6:45 వరకు నిరంతర దర్శనం ఉంటుంది. దీని తరువాత సాయంత్రం 6:45 నుండి 7:00 గంటల వరకు 15 నిమిషాల పాటు స్వామివారి ఆలయ తలుపులు మూసివేస్తారు. ఈ సమయంలో భోగ్ అందిస్తారు. సాయంత్రం 7:00 గంటలకు హారతి కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 7:00 నుండి 8:30 గంటల వరకు దర్శనం కొనసాగుతుంది. రాత్రి 9:00 గంటలకు భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తారు. 9:30 గంటలకు స్వామివారికి ప్రసాదం సమర్పించి, శయన హారతి అందిస్తారు. అనంతరం 9:45 గంటలకు స్వామివారు నిద్రించేందుకు ఆలయ తలుపులు మూసి వేస్తారు.ఇది కూడా చదవండి: దుర్గా పూజల వేళ.. మెట్రో శుభవార్త -
ఐటీ దర్యాప్తునకు దర్శన్!
సాక్షి, బళ్లారి: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రముఖ సినీ నటుడు దర్శన్ బళ్లారి జైల్లో ఖైదులో ఉన్నారు. ఆయన మరో విచారణను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. హత్యను కప్పిపుచ్చేందుకు లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు ఆధారాలు బయటకు రావడంతో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు దర్శన్ను ప్రశ్నించవచ్చని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం బళ్లారి జైలులో దర్శన్ను కలిసిన ఆయన న్యాయవాది త్వరలో బెయిల్ లభిస్తుందని సూచనలిచ్చారు. ఇంతలో ఐటీ అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోర్టు నుంచి సెంట్రల్ జైలు అధికారులకు ఈ–మెయిల్ వచ్చింది. ఐటీ అధికారులు అడిగే ప్రశ్నలకు దర్శన్ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. రేణుకాచార్య హత్య తరువాత మృతదేహం తరలింపు, ఆ నేరాన్ని ఇతరులు వేసుకోవాలని రూ. 30 లక్షలకు పైగా నగదును దర్శన్ కొందరు నిందితులకు ఇచ్చినట్లు, ఆ నగదును ఓ నిందితుని ఇంట్లో స్వాధీనం చేసుకున్నట్లు చార్జిషీటులో పోలీసులు పేర్కొన్నారు. దీంతో నగదు గురించి ఐటీ అధికారులు పూర్తి వివరాలను సేకరించాలని సిద్ధమయ్యారు. -
Actor Darshan: కారాగారంలో 100 రోజులు
సాక్షి, బెంగళూరు: మెజిస్టిక్ సినిమా 100 రోజుల ప్రదర్శన తర్వాత ఆ చిత్ర హీరో దర్శన్ స్టార్ నటునిగా మారారు. అనేక హిట్ సినిమాలతో టాప్ హీరోలలో ఒకరిగా ఆయన వెలుగొందుతున్న సమయంలో సినిమాలో మాదిరిగానే కథ మలుపు తిరిగింది. రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్రగౌడ జైలు పాలై 100 రోజులు పూర్తయింది. సినీ పరిశ్రమలో 100 రోజులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఒక నటునికి 100 రోజులు అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టం.. 100 రోజులు సినిమా ఆడితే చాలు వెంటనే అదృష్టం తిరగబడి రాత్రికి రాత్రి స్టార్ అయిపోతారు. 2001లో దర్శన్ తాను నటించిన మొదటి సినిమా మెజిస్టిక్ గాంధీనగరలో రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత ఎన్నో వంద రోజుల సినిమాల్లో నటించిన దర్శన్ జైలులోనూ వంద రోజుల జీవితాన్ని పూర్తి చేసుకోవడం అభిమానులను కలచివేస్తోంది. జైలు నుంచి తమ అభిమాన నటుడు ఎప్పుడు బయటకు విడుదల అవుతారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.జూన్ 8న చెడు మలుపు...👉 జూన్ 8– దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడకు చెడుగా మెసేజ్ చేశాడనే కారణంతో చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని బెంగళూరుకు పిలిపించి దారుణంగా భౌతిక దాడి చేసి దర్శన్ గ్యాంగ్ హత్య చేసింది.అదే రోజు రేణుకస్వామి చనిపోయిన విషయాన్ని దర్శన్కు ఫోన్ ద్వారా తెలియజేశారు. రాత్రి వేళ రేణుకస్వామి మృతదేహాన్ని సుమనహళ్లి రాజకాలువలో విసిరేశారు.👉 జూన్ 9 – ఉదయం 8 గంటలకు రాజకాలువ వద్ద రేణుకాస్వామి మృతదేహం లభ్యమైంది. ఉదయం 8.30 గంటలకు కామాక్షిపాళ్య పోలీసులు వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు.👉 జూన్ 10 – దర్శన్ సూచనల మేరకు ఆయన గ్యాంగ్లోని ముగ్గురు సహచరులు పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. పోలీసుల విచారణలో అసలు నిజం బయటకు వచ్చింది. దర్శన్, పవిత్ర గౌడ పేర్లు విచారణలో బయటకు వచ్చాయి. ఆ రోజు రాత్రి మైసూరుకు బెంగళూరు పోలీసులు వెళ్లారు. దర్శన్ ఉండే ప్రాంతాన్ని గుర్తించారు. కేసులో ఇతర నిందితులను అరెస్టు చేశారు.👉 జూన్ 11 – ఉదయం 6.30 గంటలకు మైసూరు ర్యాడిసన్ హోటల్లో జిమ్ చేస్తున్న దర్శన్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెంగళూరుకు తరలించారు. దర్శన్ అరెస్టు శాండల్వుడ్ మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. -
సలార్తో పోటీ పడిన సినిమా.. ఉత్తమ చిత్రంగా అవార్డ్!
సైమా అవార్డ్స్-2024లో కన్నడ స్టార్ దర్శన్ నటించిన చిత్రం సత్తా చాటింది. శాండల్వుడ్లో ఉత్తమ చిత్రంగా అవార్డ్ను సొంతం చేసుకుంది. ఈ మూవీ కన్నడలో గతేడాది రిలీజై బ్లాక్బస్టర్ హిట్ కొట్టింది. దర్శన్ హీరోగా నటించిన యాక్షన్ సినిమా కాటేరా.. గతేడాది డిసెంబర్లో బాక్సాఫీస్ వద్ద ఏకంగా ప్రభాస్ సలార్తో పోటీ పడి రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా ఈ చిత్రానికి సంగీతమందించిన హరికృష్ణ ఉత్తమ సంగీత దర్శకుడిగా సైమా అవార్డ్ను సొంతం చేసుకున్నారు. కాగా.. యధార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని దర్శకుడు తరుణ్ సుధీర్ తెరకెక్కించారు. కాటేరా సినిమాలో దర్శన్ సరసన ఆరాధన రామ్ హీరోయిన్గా మెప్పించింది. సీనియర్ హీరోయిన్ మాలాశ్రీ కూతురు అయిన ఆరాధన రామ్ కాటేరా మూవీతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. (ఇది చదవండి: సడెన్గా ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్బస్టర్ సినిమా తెలుగు వర్షన్)జైలులో దర్శన్అయితే ఈ మూవీ సూపర్ హిట్ తర్వాత ఊహించని విధంగా దర్శన్ ఓ హత్యకేసులో అరెస్టయ్యారు. ప్రియురాలిని వేధిస్తున్నాడంటూ ఓ అభిమాని హత్య చేయడం కన్నడ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ప్రస్తుతం దర్శన్, అతని ప్రియురాలు సైతం జైలులోనే ఉన్నారు. ఇటీవలే ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. Best Film #KAATERA #SIIMA #SIIMAAwards #SIIMAinDubai #Dboss #D56 pic.twitter.com/Pvx3ixJCDp— Filmy Corner ꭗ (@filmycorner9) September 14, 2024Congratulations Harikrishna for winning Best Music Director award in SIIMA for #Kaatera 🎊Thank you for giving this gem of a song to us, We will cherish forever❤️#DBoss @dasadarshanpic.twitter.com/fULQhP4tsK— King Kariya (@KingKariyaa) September 14, 2024𝗦𝗜𝗜𝗠𝗔 𝟮𝟬𝟮𝟰: Best Film (Kannada) award goes to #Kaatera #DBoss #RocklineEntertainment #SIIMA2024 #SIIMAAwards pic.twitter.com/jqitWHmMDu— Bhargavi (@IamHCB) September 14, 2024 -
దర్శన్,పవిత్రలకు నిరాశ.. కస్టడీ పొడిగింపు
రేణుకాస్వామి హత్య కేసులో బెయిల్ కోసం ఎదురుచూస్తున్న దర్శన్కు మరోసారి నిరాశే మిగిలింది. ఆయన రిమాండును కోర్టు పొడిగించింది. కొద్దిరోజుల క్రితం హత్యకు సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించిన బెంగళూరు పోలీసులు 3,991 పేజీలతో చార్జిషీట్ రెడీ చేశారు. దానిని కోర్టులో కూడా దాఖలు చేశారు. రేణుకాస్వామి హత్య కుట్రలో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్రగౌడ ఉన్నారని పోలీసులు తెలుపుతున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకు అందించారు.ఇదీ చదవండి: డాక్టర్పై నటి రోహిణి ఫిర్యాదుఈ కేసులో హీరో దర్శన్, పవిత్రగౌడ, గ్యాంగ్కు బెయిలు భాగ్యం దక్కలేదు. కోర్టు వారి కస్టడీని పొడిగించింది. శుక్రవారంతో జ్యుడీషియల్ రిమాండు ముగియడంతో పోలీసులు 17మంది నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 24వ ఏసీఎంఎం కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు. పూర్తి చార్జిషీట్ సమర్పించాలని, ఎల్రక్టానిక్స్ సాక్ష్యాలను ఒక వారంలోపు ప్రవేశ పెట్టాలని పోలీసులను ఆదేశించిన కోర్టు నిందితులకు సెప్టెంబర్ 17 వరకూ కస్టడీని పొడిగించింది. పవిత్ర బెయిలు అర్జీ వాపస్ ఈ హత్య కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న నటి పవిత్రగౌడ కోర్టులో పెట్టుకున్న బెయిలు పిటిషన్ వెనక్కు తీసుకుంది. అయితే చార్జ్షీట్ దాఖలైందని, పలు సాంకేతిక కారణాలు చూపుతూ ఆమె న్యాయవాదులు వాపస్ తీసుకున్నారు. త్వరలో కొత్త బెయిలు అర్జీ దాఖలు చేసే అవకాశముంది. -
ఫోటోలు, వీడియోలతో నా భర్తను లొంగదీసుకుంది
-
ఫోటోలు, వీడియోలతో నా భర్తను లొంగదీసుకుంది: దర్శన్ సతీమణి
కన్నడలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గం వాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో ప్రధాన నిందితులుగా నటుడు దర్శన్, పవిత్రగౌడ ఉన్నారు. వారిద్దరూ సుమారు నాలుగు నెలలుగా జైలులో ఉన్న విషయం తెలిసిందే. రేణుకాస్వామి హత్యకు సంబంధించి 3,991 పేజీలతో చార్జిషీట్ను పోలీసులు దాఖలు చేశారు. ఈ క్రమంలో దర్శన్ సతీమణి విజయలక్ష్మి ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా చార్జిషీట్లో పొందుపరిచారు. దర్శన్, పవిత్రల గురించి ఆమె సంచలన విషయాలను బయటపెట్టింది.కన్నడలో స్టార్ హీరోగా ఉన్న దర్శన్ వైవాహిక జీవితంలో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. 2000 సంవత్సరంలో విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. అయితే, పలు విభేదాలు రావడంతో వారిద్దిరూ చాలాకాలంగా వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ పవిత్ర గౌడ్ వారి జీవితంలో అడుగుపెట్టడంతో ఆ దూరం కాస్త మరింత పెరిగింది. అయితే, ఇప్పుడు రేణుకాస్వామి హత్యకేసులో చిక్కుకునన తన భర్త దర్శన్, పవిత్రల రిలేషన్ గురించి చార్జిషీట్లో విజయలక్ష్మి ఇలా తెలిపారు.దర్శన్ను పవిత్రగౌడ ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేసిందని దర్శన్ భార్య విజయలక్ష్మి విచారణలో చెప్పినట్టు సమాచారం. ఇదే విషయాన్ని పోలీసులు చార్జ్షీట్లో పేర్కొన్నారు. 2014లో పవిత్రగౌడతో దర్శన్ ప్రేమ, సహ జీవనం గురించి తాను గొడవపడినట్టు విజయలక్ష్మి తెలిపారు. ఈ క్రమంలో పవిత్రగౌడ దర్శన్తో ఏకాంత సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు చూపించి ఆయనను బెదిరించిందని ఆరోపించారు. దర్శన్ నుంచి పవిత్రగౌడ ఇళ్లు, కార్లు, కోట్లాది రూపాయల నగదు తీసుకుందని చెప్పారు. పవిత్రగౌడ పరిచయం కానంత వరకు తమ కాపురం సజావుగా సాగిందని తెలిపారు. మరోవైపు అంతా మంచి జరగాలని విజయలక్ష్మి అసోంలో గువాహటిలోని ప్రసిద్ధ కామాఖ్య మాత దేవాలయాన్ని దర్శించుకున్నారు. పోలీసులు వేసిన చార్జిషీట్ గురించి కన్నడ టీవీ చానెళ్లలో విస్తృతంగా వార్తా కథనాలు ప్రసారమవుతున్నాయి. -
ఫాస్ట్ట్రాక్ కోర్టుకు దర్శన్ కేసు?
దొడ్డబళ్లాపురం: పరప్పన అగ్రహార జైలులో ఉన్నప్పుడు దర్శన్కు రాచ మర్యాదలు అందించిన సంఘటనపై త్వరలో నివేదిక ఇస్తామని బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసును శీఘ్రగతిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ చేయడానికి న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు వల్ల కేసు విచారణ త్వరగా పూర్తవుతుంది. ఇక దర్శన్కు రాచ మర్యాదలు చేయడంలో జైలు అధికారుల పాత్ర, వారి వైఫల్యం తదితర అంశాలపై డీసీపీ సారా ఫాతిమా, సీసీబీ అదనపు కమిషనర్ చంద్రగుప్త ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందన్నారు. రేణుకాస్వామి హత్య కేసులో హైదరాబాద్ నుంచి కొన్ని ఫోరెన్సిక్ రిపోర్టులు రావాల్సి ఉందన్నారు.హత్య తరువాత పవిత్రగౌడ ఆరారేణుకాస్వామిని హత్య చేశాక పవిత్రగౌడ తనదైన రీతిలో ఫాలో అప్ చేసిందని తెలిసింది. శవాన్ని సుమనహళ్లి రాజకాలువలో పారవేశాక స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలో పవిత్రగౌడ స్నేహితురాలి భర్త సీనియర్ వైద్యునిగా పని చేస్తున్నాడు. వెంటనే స్నేహితురాలిని, ఆమె భర్తను ఒక కాఫీ రెస్టారెంట్కి పవిత్ర పిలిపించింది. తనకు తెలిసిన వారి బంధువు చనిపోయాడని, కారణాలు ఏమిటని ఆరా తీసింది. ఈ వివరాలను పోలీసులు చార్జ్షీట్లో పేర్కొన్నారు.టీవీ చానెళ్లలో ప్రసారం చేయొద్దుచార్జ్షీట్లోని సమాచారాన్ని కన్నడ టీవీ చానల్స్లో ప్రసారం చేయరాదని హైకోర్టు ఆదేశించింది. పోలీసులు చార్జిషీట్ వేయగానే అందులోని అంశాలపై టీవీ చానెళ్లలో విస్తృతంగా వార్తా కథనాలు ప్రసారమవుతున్నాయి. దీంతో దర్శన్ ఇబ్బందిగా భావించి హైకోర్టులో అర్జీ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నిందితుల గోప్యతను కాపాడాలంటూ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.దర్శన్కు పవిత్ర బ్లాక్మెయిల్దర్శన్ను పవిత్రగౌడ ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేసిందని దర్శన్ భార్య విజయలక్ష్మి విచారణలో చెప్పినట్టు సమాచారం. ఇదే విషయాన్ని పోలీసులు చార్జ్షీట్లో పేర్కొన్నారు. 2014లో పవిత్రగౌడతో దర్శన్ ప్రేమ, సహ జీవనం గురించి తాను గొడవపడినట్టు విజయలక్ష్మి తెలిపారు. ఈ క్రమంలో పవిత్రగౌడ దర్శన్తో ఏకాంత సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు చూపించి ఆయనను బెదిరించిందని ఆరోపించారు. దర్శన్ నుంచి పవిత్రగౌడ ఇళ్లు, కార్లు, కోట్లాది రూపాయల నగదు తీసుకుందని చెప్పారు. పవిత్రగౌడ పరిచయం కానంత వరకు తమ కాపురం సజావుగా సాగిందని తెలిపారు. మరోవైపు అంతా మంచి జరగాలని విజయలక్ష్మి అసోంలో గువాహటిలోని ప్రసిద్ధ కామాఖ్య మాత దేవాలయాన్ని దర్శించుకున్నారు.హీరోయిన్లకు అశ్లీల మెసేజ్లు చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో రోజూ కొత్త విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. నటి పవిత్రగౌడకే కాకుండా ఇంకా ఇద్దరు హీరోయిన్లకు కూడా అతడు అశ్లీల మెసేజ్లు పంపించినట్టు తెలిసింది. రేణుకాస్వామి హత్య కేసులో 14వ నిందితునిగా ఉన్న ప్రదోశ్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఈ విషయాలు చెప్పినట్లు పోలీసులు చార్జ్షీట్లో పేర్కొన్నారు. రేణుకాస్వామిని బెంగళూరులో షెడ్కు తీసుకువచ్చి కొట్టేటప్పడు అతని మొబైల్ఫోన్ని లాక్కుని పరిశీలించగా ఇన్స్టా గ్రామ్లో గౌతమ్ కేఎస్ పేరుతో చాలామంది మహిళలకు అశ్లీల మెసేజ్లు పంపించినట్లు ఉంది. ముఖ్యంగా హీరోయిన్లు రాగిణి ద్వివేది, శుభ పుంజాలకు కూడా అసభ్య మెసేజ్లు పంపాడు. -
నటుడు దర్శన్ కస్టడీ ముగింపు.. బెయిల్ కోసం దరఖాస్తు
కన్నడలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గం వాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో ప్రధాన నిందితులుగా నటుడు దర్శన్, పవిత్రగౌడ ఉన్నారు. వారిద్దరూ సుమారు నాలుగు నెలలుగా జైలులో ఉన్న విషయం తెలిసిందే. రేణుకాస్వామి హత్యకు సంబంధించి దర్శన్ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 అని పోలీసులు పేర్కొన్నారు. వారిద్దరితో పాటు మరో 15 మంది పాత్ర కూడా ఉన్నట్లు 3,991 పేజీలతో చార్జిషీట్ను పోలీసులు దాఖలు చేశారు. పవిత్ర బెంగళూరు పరప్పన జైల్లో, దర్శన్బళ్లారి జైలులో రిమాండులో ఉన్నారు.రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన నిందితుల జ్యుడీషియల్ కస్టడీ గడువు సెప్టెంబర్ 9న సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో నటుడు దర్శన్ సహా నిందితులంతా రేపు జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుకానున్నారు. ఇతర నిందితులను మైసూరు, తుమకూరు, షిమోగా, ధార్వాడ్, బెల్గాం, విజయపుర, కలబురగి జైలుకు తరలించారు. నిందితుల జ్యుడీషియల్ కస్టడీ సోమవారంతో ముగియనుండడంతో నిందితులను తమ జైళ్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెంగళూరు 24వ ఏసీఎంఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు.పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ మొత్తం 17 మంది నిందితులకు అందజేయనున్నారు. చార్జిషీటు అందిన తర్వాత చాలా మంది నిందితులు రేపు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించిన చార్జిషీటును సమర్పించినందున ప్రధాన నిందితులైన దర్శన్, పవిత్రగౌడ్ సహా సోమవారం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. -
నెలకు రూ.10వేలు ఇస్తానంటూ హీరోయిన్కు మెసేజ్
కన్నడలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గం వాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో నటుడు దర్శన్, పవిత్రగౌడతో పాటు మరో 15 మంది పాత్ర ఉందని పోలీసులు 3,991 పేజీలతో చార్జిషీట్ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. దర్శన్ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 నిందితురాలిగా పేర్కొన్నారు. పవిత్ర బెంగళూరు పరప్పన జైల్లో, దర్శన్బళ్లారి జైలులో రిమాండులో ఉన్నారు.కన్నీరుపెట్టిన పవిత్రాగౌడ రేణుకాస్వామి హత్యకేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న పవిత్రాగౌడ పోలీస్ కస్టడీలో కన్నీరుపెట్టిన ఫొటో వైరల్ అయింది. అన్నపూర్ణేశ్వరినగర పోలీస్స్టేషన్లో హాజరైన సమయంలో పవిత్రాగౌడను ఫొటో తీశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు వేసిన చార్జిషీట్లో ఒక్కొక్కటిగా పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గౌతమ్ పేరుతో రేణుకాస్వామి సందేశాలు రేణుకాస్వామి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రేణుకాస్వామి గౌతమ్ పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా సృష్టించి పవిత్రాగౌడకు అశ్లీల మెసేజ్ పంపించేవాడని పోలీసులు కోర్టుకు సమరి్పంచిన చార్జిషీట్లో పేర్కొన్నారు. నెలకు రూ.10వేలు ఇస్తా, తనతో లివింగ్ రిలేషన్షిప్ కొనసాగించాలని మెసేజ్ పెట్టడంతో నటి పవిత్రాగౌడ కోపోద్రిక్తురాలైంది. తన స్నేహితుడు పవన్ పేరుతో రేణుకాస్వామితో చాటింగ్ చేసి అతను ఎక్కడ ఉన్నాడు, ఏ ఊరిలో ఉన్నాడనే విషయాలను ఆరా తీసినట్లు అందులో పేర్కొన్నారు. -
దర్శన్ని పెళ్లి చేసుకుంటా.. జైలు ముందు మహిళ హంగామా
చిత్రదుర్గం రేణుకాస్వామి హత్య కేసులో బళ్లారి సెంట్రల్ జైలులో ఉన్న నటుడు దర్శన్ని చూడాలని ఓ మహిళ అక్కడ హంగామా చేసింది. తాజాగా జైలు వద్దకు కలబుర్గికి చెందిన లక్ష్మీ అనే యువతి అక్కడకు వచ్చింది. తాను దర్శన్ను చూడాలని, జైల్లోకి వదలాలని సిబ్బందిని పట్టుబట్టింది. పోలీసులు అడ్డుచెప్పడంతో వారితో వాగ్వాదానికి దిగింది. దర్శన్ కుటుంబ సభ్యులు మాత్రమే కలవడానికి అనుమతి ఉందని ఆమెకు తెలిపారు. అయితే, తాను దర్శన్ని పెళ్లి చేసుకుంటానని, అప్పుడు కలవడానికి ఒప్పుకుంటారా..? అని ప్రశ్నించింది. దీంతో కంగుతిన్న పోలీసు అధికారులు ఆమెను జైలు నుంచి పంపించే ప్రయత్నం చేశారు. తాను బెంగళూరు పరప్పన అగ్రహార జైలు వద్దకు కూడా వెళ్లి వచ్చానని అక్కడ కూడా దర్శన్ను కలిసేందుకు అవకాశం దొరకలేదని రాద్దాంతం చేసింది. చివరికి పోలీసులు ఆమెకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు.కన్నడ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గ వాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో నటుడు దర్శన్, పవిత్రగౌడ, మరో 15 మంది పాత్ర ఉందంటూ ధృవీకరిస్తూ పోలీసులు 3,991 పేజీలతో కూడిన చార్జిషీట్ను తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులు దర్శన్ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 నిందితురాలిగా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పవిత్రగౌడను అసభ్యంగా కామెంట్లు చేస్తున్నాడని రేణుకాస్వామిని కిరాతకంగా దర్శన్ అనుచరులు హతమార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. -
హత్యకు ముందు రేణుకాస్వామి పరిస్థితి.. ఫోటోలు వైరల్
కన్నడ సినీ నటుడు దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో తాజాగా కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హత్యకు ముందు అతనిపై తీవ్రంగా దాడిచేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే ఈ ఫోటోలు తీసినట్లు సమాచారం. వైరల్ అవుతున్న ఫోటోలను చూస్తుంటే ఒక లారీ ముందు రేణుకాస్వామిని కూర్చోబెట్టినట్లు అర్థమవుతుంది. దుస్తులు లేకుండాే ఆయన ఏడుస్తున్నట్లు ఫోటోలో కనిపిస్తుంది. ఆయన చేతిపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి.రేణుకాస్వామి హత్యకేసులో నిందితుడిగా ఉన్న ప్రదోశ్ మొబైల్ఫోన్ నుంచి ఫోటోలు, వీడియోలు పోలీసులు సేకరించారు. నన్ను కొట్టొద్దు అంటూ రేణుకాస్వామివారిని వేడుకున్నట్లు పలు వీడియోల్లో కనబడింది. ఆర్ ఆర్ నగరలోని పట్టణగెరె షెడ్లో సీసీ కెమెరా చిత్రాల్లో దర్శన్ ఉండడం, పవిత్రాగౌడ పాదరక్షలకు ఉన్న రక్తపు మరకలను సాక్ష్యాలుగా పేర్కొన్నారు. రేణుకాస్వామిని షెడ్ కు తీసుకువచ్చాం అని ఇతర నిందితులు దర్శన్ మొబైల్కి మెసేజ్ చేయగా, పోలీసులు దానిని సేకరించారు. నగరంలోనే ఓ పబ్లో ఎంజాయ్ చేస్తున్న దర్శన్ నేరుగా షెడ్ కు వెళ్లి రేణుకాస్వామిని చితకబాదినట్లు తెలిపారు. ఈ కేసులో అప్రూవర్గా మారడానికి ఓ నిందితుడు ఒప్పుకున్నట్లు చార్జిషీట్లో పొందుపరిచారు. ఈ కేసు దర్యాప్తును పశ్చిమ విభాగం డీసీపీ ఎస్.గిరీశ్, ఏసీపీ చందన్కుమార్ బృందం దర్యాప్తు చేసింది.రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గంవాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో నటుడు దర్శన్, పవిత్రగౌడ, మరో 15 మంది పాత్రను ధృవీకరిస్తూ పోలీసులు 3,991 పేజీలతో కూడిన బృహత్ చార్జిషీట్ను తాజాగా బెంగళూరు నగర 24 వ ఏసీఎంఎం కోర్టులో సమర్పించారు. దర్శన్ ఏ2 నిందితుని, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 నిందితురాలిగా పేర్కొన్నారు. పవిత్ర బెంగళూరు పరప్పన జైల్లో, దర్శన్బళ్లారి జైలులో రిమాండులో ఉన్నారు. హత్యకేసులో ఇప్పటివరకు దర్యాప్తులో సేకరించిన ప్రత్యక్ష, సాంకేతిక, ఇతరత్రా సాక్ష్యాధారాలను చార్జిషీటులో పొందుపరచినట్లు నగర పోలీస్ కమిషనర్ బీ దయానంద్ విలేకరులతో తెలిపారు. -
దర్శన్ తూగదీప చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
బెంగళూరు : అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగదీప చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తుంది. తాజాగా, బెంగళూరు పోలీసులు దర్శన్పై ఛార్జ్షీట్ దాఖలు చేశారు.ప్రస్తుతం హత్య కేసులో బళ్లారీ జైల్లో ఉన్న దర్శన్ జ్యుడిషయల్ కస్టడీ సెప్టెంబర్ 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో దర్శన్కు మరిన్ని కఠిన శిక్షలు పడేలా బెంగళూరు పోలీసులు బుధవారం కేసుకు సంబంధించి మరిన్ని 200పైగా ఆధారాల్ని సేకరించారు. వాటిల్లో దర్శన్తో పాటు, ఇతర నిందితులు ధరించిన దస్తులపై రక్తపు మరకల ఫోరెన్సిక్ రిపోర్ట్లు సైతం ఉన్నాయి. నేరం జరిగిన ప్రదేశం నుండి తీసిన ఫోటోలు, తనని కొట్ట వద్దని రేణుకా స్వామి వేడుకుంటున్న సీసీటీవీ పుటేజీతో పాటు, దాడి చేసే సమయంలో నటి పవిత్ర గౌడ చెప్పులకు అంటిన రేణుకాస్వామి రక్తపు మరకల తాలూకు ఆధారాల్ని పోలీసులు సేకరించారు. వాటిని ఛార్జ్ షీట్లో జత చేశారు. పరప్పన జైలు నుంచి అగ్రహార జైలుకుఅభిమాని రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన అగ్రహార జైల్లో ఖైదీగా ఉన్న దర్శన్కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు.. పరప్పన అగ్రహార జైలు నుంచి భారీ బందోబస్తు మధ్య దర్శన్ను బళ్లారి జైలుకు పోలీసులు తరలించారు. ఈ కేసులో ఇతర నిందితులను సైతం కర్ణాటకలోని ఇతర జైళ్లకు తరలించారు.కాగా, రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
దర్శన్పై చార్జిషీట్.. రిక్వెస్ట్ మేరకు సర్జికల్ కుర్చీ
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసుకు సంబంధించి ప్రముఖ నటుడు దర్శన్, నటి పవిత్రగౌడతో పాటు 17 మంది నిందితులపై పోలీసులు 4,500 పేజీల చార్జిషీట్ దాఖలుకు సిద్ధమయ్యారు. కేసు నమోదు అయ్యి మూడు నెలలు అయినా ఇప్పటికీ పూర్తి నివేదికను పోలీసులు సమర్పించలేదు. తాజాగా అభియోగపత్రాన్ని కోర్టులో దాఖలు చేసిన పోలీసులు ఇక చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. 200కు పైగా సాక్ష్యాధారాలతో వారు కోర్టు ముందుకు వెళ్లనున్నారు.సినీ నటుడు దర్శన్ వినతి మేరకు జైలు శాఖ సర్జికల్ టాయిలెట్ కుర్చీని అందజేశారు. వెన్నుముక సమస్యతో దర్శన్ బాధపడుతున్నట్లు ఆయన సతీమణి విజయలక్ష్మీ, న్యాయవాదితో జైలు అధికారులను ఆశ్రయించారు. ఆ సమయంలో దర్శన్ మెడికల్ రిపోర్ట్లను అందించారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వ వైద్యులు దర్శన్ వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. దీంతో సర్జికల్ కుర్చీని జైలులో ఉన్న దర్శన్కు అందించారు. ఆపై వెన్నెముక సమస్యకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను దర్శన్కు వైద్యులు సూచించారు. -
హై సెక్యూరిటీ మధ్య మరో జైలుకు దర్శన్ తరలింపు
కన్నడ నటుడు దర్శన్ను బెంగుళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి బళ్లారి సెంట్రల్ జైలుకు నేడు (ఆగష్టు 29) తరలించారు. బెంగుళూరు జైలు అధికారులు దర్శన్కు ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు అందుకు సంబంధించిన పలు ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ అంశంపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది.కన్నడ చిత్రపరిశ్రమలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దర్శన్ను గురువారం ఉదయం బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు. బెంగళూరు పోలీసుల ఎస్కార్ట్తో సహా కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో ఆయనను తీసుకెళ్లారు. బల్లారిల సెంట్రల్ జైలులో కూడా ప్రత్యేకంగా నియమించబడిన హై-సెక్యూరిటీ సెల్లో దర్శన్ను ఉంచారు. బెంగళూరు పరప్పన అగ్రహార నుంచి తెల్లవారుజామున 4.30 గంటలకు పోలీసు వాహనం బయలుదేరి ఉదయం 9.45 గంటలకు బళ్లారి సెంట్రల్ జైలుకు చేరుకుంది. నల్లటి టీషర్ట్ ధరించి కనిపించిన దర్శన్.. కుడి చేతికి బ్యాండేజీతో ఉన్నాడు. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఎంట్రీ బుక్పై సంతకం చేసిన తర్వాత జైలు వైద్యులు ఆరోగ్య పరీక్షలను నిర్వహించి, ఆపై హై-సెక్యూరిటీ సెల్కు పంపారు.ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా మీదుగా వెళ్లిన దర్శన్ వాహనానికి స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఎస్పీ శోభారాణి, జైలు సూపరింటెండెంట్ లత ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఎన్నో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ, దర్శన్ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా ఆయన అభిమానులను జైలు దగ్గరకు వెళ్లకుండా అన్నీ మార్గాలను బారికేడ్లతో మూసేశారు.దర్శన్పై మరో రెండు కేసులు దర్శన్కు రాచమర్యాదులు అందిన ఘటనలో పరప్పన అగ్రహార పోలీస్స్టేషన్లో మూడు కేసులు నమోదు కాగా రెండింటిలో దర్శన్ మొదటి నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుల దర్యాప్తునకు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సారా ఫాతిమా మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బేగూరు పోలీస్స్టేషన్ సీఐ క్రిష్ణకుమార్ దర్యాప్తు ప్రారంభించనున్నారు. జైలు లాన్లో కూర్చుని దర్శన్ రౌడీషిటర్ ఇతర ఖైదీలకు ఆ ఏర్పాటు ఎవరు చేశారు?, సిగరెట్లు జైల్లోకి ఎలా వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తారు. ఈ దృశ్యాలు ఫొటో, వీడియో ఎలా తీశారనే విషయంపై హుళిమావు సీఐ దర్యాప్తు చేస్తారు. జైలు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార దురి్వనియోగం తదితర అంశాలపై మూడవ కేసును ఎల్రక్టానిక్ సిటీ పోలీస్స్టేషన్ ఏసీపీ మంజునాథ్ దర్యాప్తు చేస్తారు. -
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 31 కంపార్ట్మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 76,910 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,320 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.4.26 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలో సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది. -
త్వరలో బళ్లారి జైలుకు దర్శన్ !
బొమ్మనహళ్లి : అభిమాని రేణుకాస్వామి హత్యకేసుకు సంబంధించి పరప్పన అగ్రహార జైలులో న్యాయ నిర్బంధంలో ఉన్న నటుడు దర్శన్కు అక్కడ రాచ మర్యాదలు లభించడం పెను సంచలనమైన విషయం తెలిసిందే. రాచమర్యాదులు అందుతున్న ఫొటోలు వెలుగులోకి రావడంతో జైళ్లశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దర్శన్ను పరప్పన ఆగ్రహార జైలు నుంచి బళ్లారి జైలుకు తరలించాలని జైళ్ల శాఖ నిర్ణయించింది. ఈమేరకు బెంగళూరు 24వ ఏసీఎంఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దర్శన్ను బళ్లారి జైలుకు తరలించేందుకు కోర్టు కూడా అనుమతి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రెండు మూడు రోజుల్లో దర్శన్ను బళ్లారికి తరించనున్నట్లు సమాచారం. భవిష్యత్లో విచారణ నిమిత్తం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బళ్లారి జైలు నుంచే కోర్టు ఎదుట హాజరు పరచనున్నట్లు సమాచారం. రాచమర్యాదల కేసుపై దర్యాప్తు దొడ్డబళ్లాపురం: దర్శన్కు రాచమర్యాదులు అందిన ఘటనలో పరప్పన అగ్రహార పోలీస్స్టేషన్లో మూడు కేసులు నమోదు కాగా రెండింటిలో దర్శన్ మొదటి నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుల దర్యాప్తునకు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సారా ఫాతిమా మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బేగూరు పోలీస్స్టేషన్ సీఐ క్రిష్ణకుమార్ దర్యాప్తు ప్రారంభించనున్నారు. జైలు లాన్లో కూర్చుని దర్శన్ రౌడీషిటర్ ఇతర ఖైదీలకు ఆ ఏర్పాటు ఎవరు చేశారు?, సిగరెట్లు జైల్లోకి ఎలా వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తారు. ఈ దృశ్యాలు ఫొటో, వీడియో ఎలా తీశారనే విషయంపై హుళిమావు సీఐ దర్యాప్తు చేస్తారు. జైలు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార దురి్వనియోగం తదితర అంశాలపై మూడవ కేసును ఎల్రక్టానిక్ సిటీ పోలీస్స్టేషన్ ఏసీపీ మంజునాథ్ దర్యాప్తు చేస్తారు.దర్శన్ ఉదంతంపై సీఎం సమీక్ష దర్శన్, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణలకు జైలులో రాచ మర్యాదలు దక్కుతున్న అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రులతో సమావేశమయ్యారు. మంగళవారం ఉదయం హోంమంత్రి పరమేశ్వర్ ముఖ్యమంత్రిని కలిసి జైల్లో జరుగుతున్న అక్రమాలు, లోపాల గురించి వివరించారు. ఇప్పటికే ఉన్నతాధికారులతో కలిపి మొత్తం 9 మందిని సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఐపీఎస్ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీ జరుగుతోందని చెప్పారు. ఆలోపు కోర్టు అనుమతి తీసుకుని దర్శన్ను వేరే జైలుకి తరలించే ఏర్పాటు చేస్తామన్నారు. కోర్టు అనుమతిస్తే దర్శన్ను బళ్లారి లేదా హిండలగా జైలుకి తరలించే అవకాశాలు ఉన్నాయి.తనిఖీకి ఐపీఎస్ అధికారులతో కమిటీ దొడ్డబళ్లాపురం: పరప్పన అగ్రహార జైల్లో దర్శన్, ప్రజ్వల్ రేవణ్ణ, రౌడీ షీటర్లకు రాచ మర్యాదలు ఇస్తున్న విషయానికి సంబంధించి తనిఖీ చేయడానికి ఐపీఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని హోంమంత్రి జీ పరమేశ్వర్ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జైల్లో దర్శన్, ఇతర ఖైదీలు ఒక బ్యారక్ నుంచి మరో బ్యారక్లోకి తిరగడానికి అవకాశం కలి్పంచినట్టు సీసీటీవీలో స్పష్టంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న పలు జైళ్లలో ఇదే పరిస్థితి ఉందన్నారు. జైలును సందర్శించిన పోలీస్ కమిషనర్ బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ పరప్పన అగ్రహార జైలును సందర్శించారు. జైలులో గంజాయి, మద్యం, సిగరెట్లు, మొబైళ్లు అన్నీ ఇస్తున్నారని ఇటీవల పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలై వచ్చిన ఒక ఖైదీ మీడియా ముందు వెల్లడించాడు. దీంతో కమిషనర్ దయానంద్ జైలుని సందర్శించారు. ఫొటోలు, వీడియోలపై జైలు అధికారులను ప్రశ్నించారు. -
దర్శన్ జైలు రాచమర్యాదల్లో డీకేఎస్ హ్యాండ్: బీజేపీ
బెంగళూరు: అభిమాని హత్య కేసులో బెంగళూరు జైల్లో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్.. వీఐపీ ట్రీట్మెంట్తో మరోసారి హాట్ టాపిక్గా మారాడు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారం రేపింది. ‘‘దర్శన్ అనుచరుడు ఒకరు వచ్చి తనను సాయం కోరాడంటూ గతంలో డిప్యూటీ సీఎం(డీకే శివకుమార్) చెప్పారు. నాలుగైదు రోజుల కిందట.. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో తనిఖీలు జరిగి కొందరు ఖైదీల నుంచి ఫోన్లు సీజ్ చేసినట్లు ప్రకటించారు. మరి ఇప్పుడు దర్శన్ కాల్ మాట్లాడేందుకు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది?.. ఈ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. ఈ వ్యవహారంలో డీకే శివకుమార్ హస్తం కూడా ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బ తిన్నాయనడానికి జైళ్ల పరిస్థితులే నిదర్శనం’’ అని బీజేపీ ఎమ్మెల్యే అశోక ఆరోపించారు.ఇదీ చదవండి: డీకే శివకుమార్తో దర్శన్ భార్య భేటీఇక.. ఈ వ్యవహారంపై జేడీఎస్ అధినేత, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి సైతం స్పందించారు. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఖైదీలకు ఫైవ్ స్టార్ హోటల్ ట్రీట్మెంట్ అందుతుందనే చర్చ ఈనాటిదేం కాదు. కొన్నేళ్లుగా ఆ చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఈ అంశంపై సంబంధిత శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి అని అన్నారు. పనిలో పనిగా సిద్ధరామయ్య సర్కార్ పని తీరుపైనా ఆయన విమర్శలు గుప్పించారు.మరోవైపు.. విమర్శల నేపథ్యంలో దర్శన్ వీఐపీ ట్రీట్మెంట్ ఎపిసోడ్పై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ వ్యవహారంలో జైలు అధికారులదే తప్పని, కొందరు అధికారులు ఉదాసీనంగా వ్యవహరించిన మాట వాస్తవమేనని, ఇప్పటికే చర్యలు తీసుకున్నామని ప్రకటించారాయన.జైలు గదిలో ఉండాల్సిన కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు.. రాచమర్యాదల అంశం చివరకు తొమ్మిది మంది జైలు అధికారులపై సస్పెన్షన్ వేటుకు దారితీసింది. స్వేచ్ఛగా జైల్లో తిరుగుతూ, సిగరెట్లు కాలుస్తూ, వీడియో కాల్ మాట్లాడినట్లు ఫొటో, వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవడంతో కర్ణాటక పోలీసు శాఖ క్రమశిక్షణా చర్యలకు దిగింది. జైల్లో ఉన్న రౌడీషీటర్ వేలు ఈ ఫొటోను రహస్యంగా సెల్ఫోన్లో తీసి బయట ఉన్న తన భార్య సెల్ఫోన్కు పంపించడంతో ఇది వెలుగు చూసింది. జైలు చీఫ్ సూపరింటెండెంట్, జైలు సూపరింటెండెంట్సహా 9 మందిని సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర సోమవారం ప్రకటించారు. ‘‘చీఫ్ సూపరింటెండెంట్ స్థాయిలో తప్పిదం జరిగింది. అసలు ఫోన్లు, కురీ్చలు, సిగరెట్లు, టీ, కాఫీలు ఎవరు సమకూర్చారో దర్యాప్తుచేస్తున్నాం. సీనియర్ ఐపీఎస్తో విచారణ జరిపిస్తున్నాం. దర్శన్ను వేరే జైలుకు తరలించే అంశాన్నీ పరిశీలిస్తున్నాం’అని మంత్రి చెప్పారు. ‘‘ఆగస్ట్ 22న ఈ ఘటన జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా, జైల్లో ఫోన్లను గుర్తించే కృత్రిమ మేథ పరికరాలను బిగిస్తాం’’అని అదనపు డైరెక్టర్ జనరల్(జైళ్లు) మాలిని కృష్ణమూర్తి చెప్పారు.జూన్ 9న సుమనహళ్లి వద్ద కాల్వలో రేణుకాస్వామి మృతదేహం లభ్యమైన కేసులో దర్శన్, అతని సన్నిహిత నటి పవిత్రా గౌడ సహా 17 మందిని పోలీసులు అరెస్ట్చేసి విచారణఖైదీలుగా కారాగారానికి పంపడం తెల్సిందే. -
దర్శన్ జైల్లో ఉన్నాడా.. రిసార్ట్లోనా??
దొడ్డబళ్లాపురం: తన కుమారున్ని హత్య చేసిన కేసులో జ్యుడీషియల్ రిమాండులో ఉన్న దర్శన్ జైలులో ఉన్నాడా, లేక రిసార్టులో ఉన్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయని రేణుకాస్వామి తండ్రి కాశీనాథయ్య ఆవేదన చెందారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జైల్లో దర్శన్కు దొరుకుతున్న రాచ మర్యాదలు చూస్తుంటే తనకు న్యాయం జరగదనే అనిపిస్తోంది. జైల్లో కూడా పేద, ధనిక ఖైదీలనే తారతమ్యం ఉంటుందని ఇప్పుడే తెలిసిందన్నారు. దర్శన్ జైల్లో హ్యాపీగా ఉన్నారని, తప్పు చేసాననే భావన ఆయన కళ్లల్లో కనబడడం లేదన్నారు. నిందితుల భేటీకి బల్లలు ఏర్పాటు చేశారు. టీ కప్పు, సిగరెట్ పట్టుకుని ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు. పరప్పన నుంచి రౌడీ నాగను తరలించండి పరప్పన అగ్రహార జైలు నుండి రౌడీ విల్సన్ గార్డెన్ నాగను వేరే జైలుకు తరలించాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ జైళ్ల శాఖ డీజీపీకి లేఖ రాసారు. నాగ, దర్శన్ డ్రింక్, సిగరెట్ తాగుతున్న ఫోటో వైరల్ కావడమే ఇందుకు కారణం. దర్శన్, రౌడీ నాగకు మధ్య స్నేహం ఎలా కుదిరిందనే కోణంలో వివరాలు రాబడుతున్నారు. సీసీబీ పోలీసులు కూడా జైలును సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. రౌడీషిటర్ కుమారుడికి దర్శన్ వీడియో కాల్ రౌడీషిటర్కుమారుడికి దర్శన్ వీడియో కాల్ చేసి మాట్లాడిన వార్త ఇప్పుడు పోలీసులకు మరో తలనొప్పిని తెచ్చిపెట్టింది. వీడియోకాల్ ఏ అధికారి సస్పెన్షన్కు దారితీస్తుందో అనే చర్చ మొదలైంది. బ్యాడరహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలోని రౌడీïÙటర్ కుమారుడికి వీడియో కాల్ చేసిన దర్శన్ ఉభయ కుశలోపరి మాట్లాడిన వీడియో ఒకటి వైరల్గా మారింది. దీన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు జైలులో దర్శన్కు స్మార్ట్ ఫోన్ ఎవరిచ్చారు? రౌడీషిటర్ కుమారుడికి దర్శన్కు ఉన్న సంబంధం ఏంటనేది కనిపెట్టే పనిలో పడ్డారు. -
దర్శన్కు రాచమర్యాదలు.. ఏడుగురు జైలు అధికారుల సస్పెండ్
బెంగళూరు: కన్నడ నటుడు దర్శన్కు బెంగళూరు జైలులో అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పించారనే వార్తలు ప్రస్తుతం హాట్టాపిక్గా మారాయి. అభిమాని హత్య కేసులో దర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే విచారణ ఖైదీగా ఉన్న దర్శన్ రాజభోగాలు అనుభవిస్తున్నట్టుగా ఆరోపణలు తాజాగా వెల్లువెత్తాయి. జైలు లోపల దర్శన్ ఓ కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతూ పక్కనే ఉన్న కొందరితో ముచ్చిటిస్తున్న ఫొటో బయటకు వచ్చింది. ఈ ఫోటోలు, వీడియోలో తాజాగా వైరల్గా మారడంతో జైల్లో దర్శన్కు వీఐపీ ట్రీట్మెంట్ లభిస్తోందనే వివాదం రాజుకుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో కర్ణాటక ప్రభుత్వం స్పందించింది.దర్శన్కు రాచమర్యాదలు చేసిన ఏడుగురు జైలు అధికారులపై వేటు పడింది. అధికారులను సస్పెండ్ చేసి ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు కర్ణాటక హోం శాఖ మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. దర్శన్కు ప్రత్యేక సదుపాయాలు కల్పించిందెవరు.. అధికారులు ఏం చేస్తున్నారనే కోణంలో విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.దర్శన్ ఫోటో, వీడియో విషయంపై డీజీపీతో చర్చించినట్లు తెలిపారు. ప్రాథమిక విచారణ ద్వారా ఈ వ్యవహారంలో ఏడుగురు జైలు అధికారుల ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. జైల్లోని సీసీ కెమెరాలు, విచారణ తర్వాతే ఈ వ్యవహారంలో ఏడుగురు జైలు అధికారులను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. సెలబ్రిటీలైనా సరే ఇలాంటి చర్యలు ఎప్పటికీ సహించబోమని స్పష్టం చేశారు. అయితే జైలులో దర్శన్కు ఎలాంటి రాచమర్యాదలు జరగలేదని.. ఫోటో, వీడియో ఎలా బయటకొచ్చిందో విచారణలో తేలుతుంది. ఖైదీలకు వీఐపీ ట్రీట్మెంట్ అందించే వీలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దర్శన్ ఎపిసోడ్పై లోతుగా విచారణ చేపట్టిననట్లు పేర్కొన్నారు. -
కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో వీఐపీ ట్రీట్ మెంట్
-
జైలులో నటుడు దర్శన్కు వీఐపీ సేవలు.. వీడియో లీక్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో నటుడు దర్శన్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రేణుకాస్వామి హత్య కేసులో ఖైదీగా ఉన్న దర్శన్కు జైలులో సకల మర్యాదలు జరుగుతున్నట్టు ఫొటోలు, వీడియోలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఆయన తన స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా, తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో జైలులులో ఆయనకు వీఐపీ సేవలు అందిస్తున్నట్టు సమాచారం. ఇక, తాజాగా వీటికి బలం చేకూరుస్తూ ఓ వీడియో కూడా బయటకు రావడం గమనార్హం. అందులో ఆయన తన స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడినట్లుగా ఉంది. వీడియో కాల్లో ఓ వ్యక్తి అవతలి వైపు మరో వ్యక్తితో మాట్లాడాడు. మధ్యలో దర్శన్ చేతికి ఫోన్ ఇచ్చి పక్కకు జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇద్దరూ ఒకరికొకరు హాయ్ చెప్పుకుంటూ పలకరించుకున్నారు. దర్శన్ గదిలో కూర్చొని మాట్లాడుతున్నట్లుగా వీడియోలో ఉంది. This is highly concerning matter!! He is living like a Pablo Escobar, made jail as his own resort. Government must think after see this videi. #Darshan pic.twitter.com/bE9AOFDAuI— RiyA Rawat (@RiyaRawat07) August 25, 2024ఇదిలా ఉండగా.. అంతకుముందు కూడా జైలు బ్యారక్ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కూర్చొని కాఫీ, సిగరెట్ తాగుతున్న ఫొటో ఒకటి కూడా బయటకు వచ్చింది. దీంతో, జైల్లో నిందితుడు దర్శన్కు వీఐపీ మర్యాదలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో జైలు అధికారులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి.. విచారణకు ఆదేశించారు. ಇವನಿಗೆ 10 ಸಲ ನೀವು ಒಳಗಡೆ ಹಾಕಿದ್ರು .. ಬುದ್ದಿ ಬರಲ್ಲ.. 2 ದಿನ ಬದುಕಿದರು ಮಯಾ೯ದೆಗೆ ಹೆದರಿ ಬದುಕಿ 😊…👍Shame On #Darshan Shame On KARNATAKA GOVT@dasadarshan @kfcc_official pic.twitter.com/Y7dyqt8DOY— ManK ‘MAX’ 😈 (@ManKichcha) August 26, 2024 -
జైల్లో స్టార్ హీరో విలాసాలు.. కాఫీ కప్పు,సిగరెట్తో..
ఓ చేతిలో కాఫీ కప్పు.. మరో చేతిలో సిగరెట్ను గుప్పు గుప్పు మని పీలుస్తున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా?ఈ ఏడాది జూన్ 8,2024 తన ప్రియురాలు పవిత్ర గౌడ అశ్లీల పంపించాడని రేణుకాస్వామి (28) అనే యువకుడిని దారుణంగా హత్య చేసి జైలు శిక్షను అనుభవిస్తున్న శాండల్ వుడ్ స్టార్ హీరో దర్శన్ తూగదీపదే ఆ ఫొటో. అభిమాని హత్య కేసులోని ఏ1 దర్శన్తో పాటు ఇతర నిందితులు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. కాగా, దర్శన్ బెయిల్ కోసం ఆయన భార్య ప్రయత్నిస్తున్నారు.ఈ తరుణంలో దర్శన్ పరప్పన అగ్రహార జైలు గార్డెన్లో ఓ చేతిలో కాఫీ కప్పు, మరో చేతిలో సిగరెట్ తాగుతూ రిలాక్స్ అవుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దర్శన్తో పాటు రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగ,మరో ఖైదీ మేనేజర్ నాగరాజ్ ఉన్నారు.ఇక ఈ ఫొటోని అదే జైలులో ఉన్న వేలు అనే ఖైదీ తన భార్యకు పంపాడని, అది సోషల్ మీడియాలో షేర్ అవ్వడంతో క్షణాల్లో వైరలైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో జైల్లో నిబంధనలపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.హత్య కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న దర్శన్కు వీవీఐపీ ట్రీట్మెంట్ అందుతుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు జైలు గార్డెన్లో తోటి నేరస్తులతో కబర్లు చెప్పుకునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలు, తాగేందుకు కాఫీ, సిగరెట్లు అందించడమేనని అంటున్నారు. మరి ఈ ఫొటోపై పరప్పన జైలు అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ಏನ್ರೀ ಸ್ವಾಮಿ ಜೈಲುಇದ್ರೆ ನೆಮ್ಮದಿ ಆಗಿರ್ಬೇಕು 💀💥#DBoss #Darshan pic.twitter.com/eTNmHZqt4j— S R E E | ಶ್ರೀ ✨ (@SreeDharaNEL) August 25, 2024 -
కన్నడ హీరో దర్శన్పై చార్జ్షీట్.. బెయిల్పై అభిమానుల్లో ఆశలు
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు 3 వేల పేజీలతో సుదీర్ఘమైన చార్జ్షీట్ను తయారు చేశారు. ఈ హత్య కేసులో కన్నడ ప్రముఖ హీరో దర్శన్, నటి పవిత్రగౌడ, మరో 15 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు రప్పించడం, హత్య చేయడం, శవాన్ని డ్రైనేజీలో పారవేయడంతో సహా అన్ని అంశాలను సవివరంగా పొందుపరిచినట్లు తెలిసింది. పెద్దసంఖ్యలో సాక్షుల, నిందితుల వాంగ్మూలాలను ఆడియో, వీడియో రికార్డు చేశారు. కొందరిని జడ్జీల ముందు హారుపరిచి స్టేట్మెంట్ ఇప్పించారు. ముందు ప్రథమ ముద్దాయిగా పవిత్రగౌడను పోలీసులు పేర్కొన్నప్పటికీ, తరువాత దర్శన్ ప్రమేయం ఎక్కువని తేలడంతో ఆయననే ఏ1 నిందితుడిగా తేల్చారు. త్వరలో కోర్టులో చార్జిషీటును సమర్పించే అవకాశం ఉంది. ఆ తరువాత దర్శన్, ఇతర నిందితులకు బెయిలుకు అవకాశం ఉన్నట్లు సమాచారం. సుమారు గత మూడు నెలలుగా దర్శన్ జైలులోనే ఉన్నారు. ఇప్పటికే బెయిల్ కోసం ఆయన పలుమార్లు అప్పీలు చేసుకున్నా కోర్టు ఇవ్వలేదు. ఇప్పటి వరకు విచారణ మాత్రమే జరుగుతుందని కోర్టు తెలిపింది. పోలీసులు చార్జ్షీట్ వేసిన తర్వాత దానిని పరిశీలించి బెయిల్ ఇచ్చే అంశం గురించి నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది. అయితే, తాజాగా పోలీసులు 3 వేల పేజీలతో చార్జ్ షీట్ రెడీ చేశారు. దీంతో దర్శన్కు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. పవిత్ర బెయిలు అర్జీ వాయిదా పవిత్రగౌడ పెట్టుకున్న బెయిలు అర్జీని కోర్టు 27వ తేదీకి వాయిదా వేసింది. ఆమెకు బెయిలు ఇవ్వరాదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. జూన్ 10న అరెస్టైన పవిత్రగౌడ అప్పటి నుంచి పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. -
రూ.300 ఎస్ఈడీ నకిలీ టికెట్లతో మోసం
తిరుమల: ఏపీ టూరిజం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లతో మోసగిస్తున్న దళారుల ముఠాకు చెందిన ముగ్గురిని సోమవారం రాత్రి టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరుమల టూటౌన్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. పాత నేరసుడు ∙అమృత యాదవ్, తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రూ.300 ఎస్ఈడీ టికెట్ స్కానింగ్ కౌంటర్లో పనిచేసే రుద్రసాగర్, అదే విభాగంలో గతంలో పనిచేసిన నవీన్ తేజ, నారాయణ అనే వారితో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. చెన్నైకి చెందిన మోహన్ రాజ్ అనే భక్తుడు సోమవారం దళారి అమృత యాదవ్ను టికెట్ల కోసం సంప్రదించారు. అతను 4 పాత∙టికెట్లు కలర్ జిరాక్స్ తీసి సీరియల్ నంబరు మార్చి రూ.11వేలకు విక్రయించాడు. క్యూ కాంప్లెక్స్లో తనిఖీల్లో ఆ టికెట్లు నకిలీవని తేలింది. స్కానింగ్ కేంద్రంలో పనిచేసే రుద్రసాగర్ నకిలీ ఎస్ఈడీ రూ.300 టికెట్లను స్కానింగ్ చేసినట్లు నటిస్తూ మోసగిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు రుద్రసాగర్, నవీన్ తేజ, ట్రావెల్ డ్రైవర్ పెరియస్వామిని అదుపులోకి తీసుకున్నారు. -
‘సాయం చేయరూ’... వాట్సప్పై దర్శన్?
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య తరువాత దర్శన్ ఏం చేయాలో దిక్కుతోచక అనేక తప్పులు చేశాడు. అవన్నీ విచారణలో వెలుగు చూస్తున్నాయి. కేసు తనపైకి ఉండేందుకు ముగ్గురు రౌడీలకు రూ.30 లక్షలు ఇవ్వడం మొదలుకుని అనేక తప్పులు చేస్తూ వచ్చారు. అవన్నీ ఇప్పుడు సాక్ష్యాధారాలుగా మారి ఆయన మెడకు చుట్టుకున్నాయి. రేణుకాస్వామి హత్య అనంతరం... కేసు నుంచి బయటపడేయాలని దర్శన్ పలువురు రాజకీయ నేతలను వాట్సాప్ ద్వారా కోరినట్టు పోలీసులు గుర్తించారు. దర్శన్ను అరెస్టు చేశాక అతని మొబైల్ స్వాధీనం చేసుకుని వాట్సాప్ కాల్స్మెసేజెస్ రిట్రీవ్ చేయగా ఈ సంచలన విషయాలు వెలుగు చూశాయి. -
దర్శన్కు ఇంటి భోజనం లేనట్టే!
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన అగ్రహార జైలులో ఉన్న హీరో దర్శన్ ఇంటి భోజనం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దర్శన్కు ఇంటి భోజనాన్ని అనుమతించలేమని, ఆ అవసరం కూడా లేదని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. ఇంటి భోజనం కోసం దర్శన్ హైకోర్టును ఆశ్రయించగా, మీ వైఖరి ఏమిటో చెప్పాలని జైలు అధికారులకు హైకోర్టు ఆదేశించింది. గత నెల రోజులుగా ఇంటి భోజనం కేసు సాగుతోంది. హత్య కేసులో నిందితుడికి ఇంటి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించలేమని కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణ 20వ తేదీకి వాయిదా వేశారు. -
పోలీసుల చేతిలో దర్శన్ ఇంటి సీసీ కెమెరాల దృశ్యాలు..
రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అండ్ గ్యాంగ్కు ఉచ్చు మరింత బిగుస్తోంది. జూన్ 8, 9, 10 తేదీల్లో దర్శన్ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించిన దృశ్యాలు డీవీఆర్లో డిలీట్ చేయడం జరిగింది. సదరు డీవీఆర్లను తీసికెళ్లిన పోలీసులు వాటిని రిట్రీవ్ చేయించారు. దృశ్యాల్లో నిందితులు దర్శన్ ఇంటికి వచ్చి వెళ్లిన సంగతి వెలుగు చూసింది. అంతేకాకుండా శవాన్ని తరలించే క్రమంలో లభించిన సాక్ష్యాధారాల్లో దర్శన్ ఫింగర్ ప్రింట్లు లభించాయి. ఇక పవిత్రగౌడకు వ్యతిరేకంగా కూడా బలమైన సాక్ష్యాధారాలు లభించాయి. రేణుకాస్వామి పవిత్రగౌడకు పంపించిన అన్ని మెసేజ్లను పోలీసులు పవిత్ర మొబైల్ నుండి రిట్రీవ్ చేశారు. -
దర్శన్కు మళ్లీ నిరాశే.. రిమాండ్ పొడిగింపు
రేణుకాస్వామి హత్య కేసులో గత రెండు నెలలుగా పరప్పన జైలులో హీరో దర్శన్ ఉన్నారు. అయితే ఈ కేసులో బెయిల్ కోసం దర్శన్ లాయర్లు పలుమార్లు కోర్టును ఆశ్రయించారు. కానీ, ఫలితం లేదు. కనీసం ఇంటి భోజనానికి అనుమతి కోరినా కోర్టు అడ్డు చెప్పింది. దీంతో ఆయన తిండి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. మరోవైపు ఆయన ప్రియురాలు నటి పవిత్ర గౌడ విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. అయితే, తాజాగా వారిద్దరికి కోర్టు షాకిచ్చింది.రేణుకాస్వామిని హత్య చేశారని హీరో దర్శన్, నటి పవిత్రగౌడ, అనుచరులను పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. అయితే, వారిద్దరూ ఇప్పట్లో విడుదల అయ్యే భాగ్యం కనిపించడం లేదు. రేణుకాస్వామి హత్య కేసులో తాజాగా దర్శన్, పవిత్రగౌడ సహా నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో పోలీసులు హాజరుపరిచారు . పరప్పన జైలు నుంచి 13 మంది, తుమకూరు జైలు నుండి నలుగురు నిందితులను హాజరు పరిచారు. వారి రిమాండును పొడిగించాలని సిట్ లాయరు కోరారు. దీంతో ఆగస్టు 14 వరకూ పొడిగించారు. దీంతో బెయిల్ మీదు ఆశలు పెట్టుకున్న దర్శన్కు నిరాశే మిగిలింది. -
దర్శన్కు ఇంటి భోజనం ఇస్తారా.. లేదా?
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన జైలులో ఉన్న హీరో దర్శన్ తనకు ఇంటి భోజనం కావాలని హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్పై బుధవారం విచారణ జరిగింది. 10 రోజుల్లో ఈ అర్జీపై జైలు అధికారులు ఒక నిర్ణయం తీసుకుని చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. జైలు నిబంధనల ప్రకారం ఇంటి భోజనానికి ఆస్కారం ఉందని జడ్జి పేర్కొన్నారు. పిటిషనర్కు పౌష్టికాహారం అవసరం ఉందని చెబుతూ ఆగస్టు 20కి వాయిదా వేశారు. స్టార్ హీరో అయిన దర్శన్, నటి పవిత్ర గౌడ తదితరులు జూన్ 10 నుంచి హత్య కేసులో జైలు పాలయ్యారు. అప్పటి నుంచి జైలు తిండితో ఇబ్బంది పడుతున్నారు.చిక్కుల్లో సిద్ధారూఢపరప్పన అగ్రహార జైలులో దర్శన్కు టీవీతో పాటు వీఐపీ సౌకర్యాలు కల్పించారని చెప్పిన మాజీ ఖైదీ సిద్ధారూఢపై చర్యలు తీసుకోనున్నారు. తాను జైలులో దర్శన్కు యోగ నేర్పించానని, ఆయనకు సకల సౌకర్యాలు అందుతున్నాయని ఇటీవల సిద్ధారూఢ మీడియా ముందు చెప్పారు. సత్ప్రవర్తన కింద విడుదలైన సిద్ధారూఢ ఇలా అవాస్తవాలు ప్రచారం చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేసి మళ్లీ జైలుకు తరలించనున్నట్టు సమాచారం.జైలు తిండి బాగుంటుంది: చేతన్తనకు జైలులో వడ్డించే భోజనం నచ్చిందని, అయితే అదే భోజనం నటుడు దర్శన్కు ఎందు నచ్చలేదో అర్థం కావడం తేదని నటుడు, సామాజిక కార్యకర్త చేతన్ అన్నారు. ఒక ఇంటర్వూలో మాట్లాడిన చేతన్ తాను జైలులో ఉండగా తన కుటుంబ సభ్యులను ఎవరినీ చూడడానికి అనుమతించలేదన్నారు. తనను జైలులో ఆరుమంది ఉన్న సెల్లో ఉంచారని, రెండవసారి జైలుకు వెళ్లినప్పుడు నలభైమంది ఉన్న బ్యారెక్లో ఉంచారన్నారు. అందరిలాగే తానూ జైల్లో పని చేశానన్నారు. జైలులో పెట్టే భోజనం బాగా ఉండేదన్నారు. మరి దర్శన్కు ఎందుకు నచ్చడం లేదో, పదే పదే ఇంటి భోజనం కావాలని ఎందుకు కోరుతున్నాడో తెలియడం లేదన్నారు. -
‘రేణుకాస్వామి ఇంటికి వెళ్లింది రాజీ కోసం కాదు’
దొడ్డబళ్లాపురం: పరప్పన అగ్రహార జైలులో దర్శన్ను కలిసిన నటుడు వినోద్ రాజ్ కొన్ని రోజుల వ్యవధిలోనే రేణుకాస్వామి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడంపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ వస్తున్నాయి. దర్శన్, రేణుకాస్వామి కుటుంబం మధ్య రాజీ చేయడానికి వినోద్రాజ్ వెళ్లారని వదంతులు వినిపిస్తున్నాయి.ఇందుకు సంబంధించి వివరణ ఇచ్చిన వినోద్ రాజ్...తోటి ఆర్టిస్టు అనే అభిమానంతో, దర్శన్తో ఉన్న అనుబంధం నేపథ్యంలో దర్శన్ను జైలుకు వెళ్లి కలిశానన్నారు. మానవత్వం కోణంలో ఆలోచించి ఆ కుటుంబానికి ఏమైనా సాయం చేద్దామని రేణుకాస్వామి కుటుంబ సభ్యులను కలిశానని, రాజీ కుదిర్చే ఉద్దేశం ఆలోచన తనకు లేవన్నారు. -
దర్శన్ మా ఇంటికి వస్తే భోజనం పెట్టి పంపుతా: రేణుకాస్వామి తండ్రి
రేణకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ A2 గా ఉన్నారు. దీంతో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో గత 30 రోజులుగా శిక్ష అనుభవిస్తున్నారు. దర్శన్కు జైలు తిండి సరిపడక ఆరోగ్యం క్షీణిస్తోందని, ఇంటి భోజనం తెప్పించుకోవడానికి తనకు అనుమతి ఇప్పించాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు నిరాకరణ ఎదురుకావడంతో ఆహారం కోసం జైల్లో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో దర్శన్లో పశ్చాత్తాపం కనిపిస్తుందని సమాచారం.తాజాగా కన్నడ సీనియర్ హీరో వినోద్రాజ్ పరప్పన జైలులో ఉన్న దర్శన్ను కలుసుకున్నారు. ఆయన్ను పరామర్శించిన వారం తర్వాత రేణుకాస్వామి కుటుంబాన్ని కలుసుకున్నారు. అక్కడ వారి పరిస్థితి చూసి ఆయన చలించిపోయారు. రేణుకాస్వామి సతీమణితో పాటు ఆయన తండ్రి ఇప్పటికీ కోలుకోకుండా ఉన్నారని తెలిపాడు. ఇంటికి ఆధారంగా ఉన్న వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబం వీధినపడుతుందని, ఆ లోటును భగవంతుడు కూడా తీర్చలేడన్నారు. కుటుంబానికి ఆయన రూ. లక్ష సాయం అందించారు.నటుడు దర్శన్ గురించి రేణుకాస్వామి తండ్రి కాశీనాథయ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్లో దర్శన్ విడుదల అయ్యాక తన ఇంటికి వస్తే భోజనం పెడతానని, తాము జంగమ సామాజికవర్గం వారమని, ద్వేషం, అసూయ వంటివి ఉండవన్నారు. చట్ట ప్రకారం తమకు న్యాయం కావాలన్నారు. దర్శన్ భార్య విజయలక్ష్మి తన భర్త కోసం పోరాడటంలో తప్పులేదని ఈక్రమంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిసి ఆమె ఏం మాట్లాడారు అనే సంగతి తమకు అనవసరమని ఆయన అన్నారు. జైలులో ఉన్న దర్శన్ ఆరోగ్యం బాగుండాలని త్వరగా విడుదల కావాలని కోరుతూ భార్య విజయలక్ష్మి నవ చండికా హోమం జరిపించారు. -
దర్శన్పై ద్వేషం లేదు.. రేణుకాస్వామి తండ్రి
దొడ్డబళ్లాపురం: నటుడు దర్శన్ తన ఇంటికి వస్తే భోజనం పెడతానని చెప్పి రేణుకాస్వామి తండ్రి పెద్ద మనసు చాటుకున్నారు. రేణుకాస్వామిని హత్య చేశారని హీరో దర్శన్, నటి పవిత్రగౌడ, అనుచరులను పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. తండ్రి కాశీనాథయ్య మాట్లాడుతూ దర్శన్ విడుదల అయ్యాక తన ఇంటికి వస్తే భోజనం పెడతానని, తాము జంగమ సామాజికవర్గం వారమని, ద్వేషం, అసూయ వంటివి ఉండవన్నారు. చట్ట ప్రకారం తమకు న్యాయం కావాలన్నారు. దర్శన్ భార్య విజయలక్ష్మి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిసి ఏం మాట్లాడారు అనే సంగతి తమకు అనవసరమని అన్నారు.కొల్లూరులో దర్శన్ భార్య పూజలుజైలులో ఉన్న దర్శన్ ఆరోగ్యం బాగుండాలని, త్వరగా విడుదల కావాలని కోరుతూ భార్య విజయలక్ష్మి ఇప్పుడు ఆలయాలకు వెళ్తున్నారు. కుందాపుర సమీపంలోని కొల్లూరు మూకాంబిక దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేయించారు. నవ చండికా హోమం జరిపించారు. తండ్రికి వినోద్రాజ్ పరామర్శరేణుకాస్వామి కుటుంబానికి వచ్చిన కష్టం చూసి ఎంతో ఆవేదన కలుగుతోందని నటుడు వినోద్రాజ్ అన్నారు. రేణుకాస్వామి తండ్రి, ఆయన కుటుంబాన్ని వినోద్రాజ్ చిత్రదుర్గకు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఇంటికి ఆధారంగా ఉన్న వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబం వీధినపడుతుందని, ఆ లోటును భగవంతుడు కూడా తీర్చలేడన్నారు. కుటుంబానికి ఆయన రూ. లక్ష సాయం అందించారు. గత వారం వినోద్రాజ్ పరప్పన జైలులో ఉన్న దర్శన్ను కలిశారు. -
Darshan Case: డీకే శివకుమార్తో దర్శన్ భార్య భేటీ
దొడ్డబళ్లాపురం: సినీ హీరో దర్శన్ కేసు విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోనని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. రేణుకాస్వామి హత్య కేసు విచారణలో పోలీసులకు పూర్తి స్వాతంత్య్రం ఇచ్చామన్నారు. రామనగరలో ఒక కార్యక్రమంలో మాట్లాడిన డీకే.. దర్శన్కు అన్యాయం జరగి ఉంటే న్యాయం చేస్తానని చెప్పారు. దీనిపై బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ తాను కెంపేగౌడ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో దర్శన్ భార్య విజయలక్ష్మి వచ్చి కలిశారన్నారు. ఇక్కడకు కాదు, ఇంటికి వచ్చి కలవాలని ఆమెకు చెప్పానన్నారు. దర్శన్ కేసు గురించి మాట్లాడతారని అనుకున్నా, అయితే వారు వారి కుమారుని స్కూలు అడ్మిషన్ గురించి వచ్చారని డీకే చెప్పడం విశేషం. నివాసంలో సమావేశం దర్శన్ భార్య విజయలక్షి్మ, తమ్ముడు దినకర్, ప్రముఖ డైరెక్టర్ ప్రేమ్లు డీసీఎం డీకేశిని నివాసంలో కలివారు. తరువాత ప్రేమ్ విలేకరులతో మాట్లాడుతూ దర్శన్ గురించి చర్చించలేదని, తనయుడు స్కూలు అడ్మిషన్ గురించి ప్రస్తావించానమన్నారు. ఇక విజయలక్షి్మ, దినకర్ ఏం మాట్లాడారో తనకు తెలీదన్నారు. జూన్ 10 నుంచి దర్శన్ హత్య కేసులో అరెస్టయి జైలు పాలయ్యాడు. అసలు ఆ విషయం గురించే మాట్లాడలేదని వారు చెప్పడం గమనార్హం. -
ఆగిపోయిన దర్శన్ సినిమాలు.. సంజయ్ దత్ మాదిరి జైలు నుంచి రాగలడా..?
రేణకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ A2 గా ఉన్నారు. దీంతో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో గత 30 రోజులుగా దర్శన్ ఉండటం వల్ల తను నటిస్తున్న సినిమా షూటింగ్ ఆగిపోయింది. దాదాపు పూర్తి కావచ్చిన డెవిల్ సినిమా షూటింగ్ ఇప్పుడు అర్దాంతరంగ ఆగిపోయింది. అయితే, దర్శన్ జైల్లో ఉండగానే ‘డెవిల్’ సినిమా షూటింగ్ లో పాల్గొనవచ్చా అనే చర్చ కన్నడ చిత్రసీమలో జరుగుతోంది. అందుకు ఉదాహరణగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఉదంతాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారు.గతంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జైలులో శిక్ష అనుభవిస్తూనే సినిమా షూటింగ్లో కూడా పాల్గొన్నాడు. దాన్ని ఉదాహరణగా పెట్టుకుని దర్శన్ కూడా ‘డెవిల్’ సినిమాను పూర్తి చేయగలడా? అని ఆయన అభిమానులు చర్చిస్తున్నారు. ‘కాటేరా’ సినిమా తర్వాత దర్శన్ ‘డెవిల్’ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మిలన్ ప్రకాష్, దర్శన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో 'డెవిల్'పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు 'డెవిల్' సినిమా షూటింగ్ను ఆపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం నిందితుడి స్థానంలో ఉన్నప్పటికీ దర్శన్ జైలులోనే ఉండాల్సి రావడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది.ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్కు కూడా ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే సంజయ్ దత్ జైలులో ఉండగానే కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి పొంది సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. 2013లో పెరోల్ పొంది ‘జంజీర్’ సినిమాతో పాటు పోలీస్ గిరి చిత్రాల్లో నటించారు. జైలులో శిక్ష అనుభవిస్తూనే ఈ రెండు సినిమాల పనులను ఆయన పూర్తి చేశారు.ఇప్పుడు దీన్నే ఉదాహరణగా తీసుకుని దర్శన్ ఫ్యాన్స్ కూడా ‘డెవిల్’ సినిమా తీస్తారా..? అని ఎదురు చూస్తున్నారు. దర్శన్ కూడా పెరోల్ పొంది జైలు నుంచి బయటకు వచ్చి సినిమా షూటింగ్లో పాల్గొనవచ్చని అభిప్రాయ పడుతున్నారు. అయితే, ఇది ఇప్పట్లో సాధ్యం కాదని న్యాయవాదులు అంటున్నారు.దర్శన్ ఇప్పటికీ నిందితుడుగానే ఉన్నారని వారు తెలుపుతున్నారు. పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కోర్టులో వాదనలు జరగాలి. ఆ తర్వాత దర్శన్ నేరం చేసినట్లు దోషిగా తేలితే శిక్షను న్యాయమూర్తి ప్రకటిస్తారు. ఆ తర్వాతే పెరోల్పై బయటకు వచ్చి షూటింగ్లో పాల్గొనవచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు. అదికూడా అర్దాంతరంగా ఆగిపోయిన సినిమాల్లో మాత్రమే నటించే ఛాన్స్ ఉంటుందని వారు తెలిపారు. చార్జిషీట్ సమర్పించే వరకు అంతా వేచి చూడాల్సిందేనని లాయర్లు తెలుపుతున్నారు. -
పెళ్లికి రమ్మని ఆహ్వానించా.. దర్శన్ అమాయకుడు.. నిరపరాధిగా తిరిగొస్తాడు!
చిత్రదుర్గకు చెందిన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. పరప్పన అగ్రహార జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను దర్శక నటుడు తరుణ్ సుధీర్ శుక్రవారం కలిశాడు. కొన్ని రోజుల్లో తన వివాహానికి ముహూర్తం పెట్టినందున పెళ్లికి రమ్మని ఆహ్వానించడానికి జైలుకు వెళ్లినట్లు తెలిపాడు.అనారోగ్యం?తరుణ్ మాట్లాడుతూ.. 'దర్శన్ ఎప్పటిలాగే చిరునవ్వుతో పలకరించాడు. అయితే కొన్నిరోజులుగా ఆయన ఆరోగ్యం అంతగా బాగోలేనట్లుంది. ఇప్పుడు కాస్త కోలుకున్నాడు. ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి మనమంతా కూడా ఏదో కోల్పోయినట్లుగా బలహీనమైపోయినట్లే అనిపిస్తోంది.పెళ్లికి ఆహ్వానంనా పెళ్లి కుదిరిన సంగతి దర్శన్కు తెలుసు. వెడ్డింగ్కు ఆహ్వానించడానికి వెళ్లాను. తన కోసం పెళ్లి వాయిదా వేసుకోవడం లాంటి పిచ్చి పనులు చేయొద్దని హెచ్చరించాడు. ఆయన ఏ పాపం చేయలేదని నేనిప్పటికీ నమ్ముతున్నాను. త్వరలోనే తను నిరపరాధిగా తిరిగొస్తాడు. నా పెళ్లికి హాజరవుతాడు అని చెప్పుకొచ్చాడు.కాంబినేషన్లో రెండు సినిమాలుకాగా తరుణ్, నటి సోనాల్ మాంటెరియోను వివాహం చేసుకోబోతున్నాడు. వీరి పెళ్లి వేడుకలు ఆగస్టు 10, 11 రోజుల్లో జరగనున్నాయి. ఇకపోతే తరుణ్ సుధీర్ దర్శకుడిగా.. దర్శన్తో కాటేర, రాబర్ట్ చిత్రాలు చేశాడు. వీరి కాంబినేషన్లో సింధూర లక్ష్మణ అనే చారిత్రాత్మక ప్రాజెక్టు రానున్నట్లు ఆ మధ్య వార్తలు వెలువడ్డాయి.సంచలనంగా రేణుకాస్వామి హత్య కేసుహీరో దర్శన్ పదేళ్లుగా నటి పవిత్రగౌడతో ప్రేమాయణం నడిపిస్తున్నాడు. ప్రియురాలిపై అనుచిత కామెంట్లు చేశాడన్న కోపంతో అభిమాని రేణుకాస్వామిని దర్శన్ గ్యాంగ్ అతడిని దారుణంగా చంపేశారు. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే న్యాయస్థానం.. వీరి జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 1 వరకు పొడిగించింది.చదవండి: 2024 OTT ఫస్టాఫ్: ఎక్కువమంది చూసిన సిరీస్, సినిమాలివే! -
దర్శన్ పశ్చాత్తాపం.. రేణుకాస్వామి భార్యకు సాయం చేయనున్నాడా..?
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉన్న ప్రముఖ హీరో దర్శన్కు జైలు తిండి సరిపడక ఆరోగ్యం క్షీణిస్తోందని, ఇంటి భోజనం తెప్పించుకోవడానికి తనకు అనుమతి ఇప్పించాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు నిరాకరణ ఎదురుకావడంతో జైల్లో ఆయన ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ఈ క్రమంలో దర్శన్లో పశ్చాత్తాపం కనిపిస్తుందని సమాచారం.రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ రెండో ముద్దాయి కాగా, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ మొదటి ముద్దాయి. ఈ కేసుకు సంబంధించిన నిందితులందరూ నెల రోజుల నుంచి కటకటాల వెనుక ఉన్నారు. దర్శన్ సహా 13 మంది నిందితులు పరప్ప అగ్రహార జైలులో ఉండగా, నలుగురు నిందితులు తుమకూరు జైలులో ఉన్నారు.జైల్లో ఉన్న దర్శన్లో పశ్చాత్తాపం కనిపిస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జైలు అధికారులు కూడా ఇదే మాట అంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం దర్శన్ నుంచి వస్తున్న ప్రతి మాటలో కూడా పశ్చాత్తాపం కనిపిస్తుందని అంటున్నారు. రేణుకాస్వామి ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు కాడంతో ఇప్పుడు ఆయన మరణం వల్ల కుటుంబం ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకున్న దర్శన్ కాస్త చలించిపోయినట్లు తెలుస్తోంది.రేణుకాస్వామి కుటుంబ సభ్యులకు సహాయం అందించాలని దర్శన్ పూనుకున్నారట. ఈ విషయాన్ని రేణుకాస్వామి కుటుంబ సభ్యులతో దర్శన్ అనుచరులు చర్చించారట. అందుకు వారు కూడా అంగీకరించినట్లు సమాచారం. గర్భంతో ఉన్న రేణుకాస్వామి భార్యకు సాయం చేయడంతో పాటు ఆయన తండ్రి, తల్లికి విడివిడిగా సాయం చేయాలని దర్శన్ ఆలోచించాడట. ఈ వార్త తన అనుచరుల ద్వారా కన్నడ మీడియాలో చక్కర్లు కొడుతుంది.దర్శన్ను పెళ్లికి ఆహ్వానించిన 'కాటేరా' దర్శకుడుదర్శన్ను కలిసేందుకు 'కాటేరా' చిత్ర దర్శకుడు తరుణ్ సుధీర్ ఈరోజు పరప్ప అగ్రహార జైలుకు వెళ్లారు. దర్శన్ని కలిసిన అనంతరం తరుణ్ సుధీర్ మీడియాతో ఇలా మాట్లాడారు.. 'దర్శన్ సర్కు ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. నన్ను చూడగానే ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయనకు చెప్పాను. దర్శన్ సార్కు రెండు పుస్తకాలు ఇచ్చాను. జీవిత పాఠం గురించి తెలిపే పుస్తకంతో పాటు అర్జునుడి గురించి మరొక పుస్తకాన్ని ఆయనకు అందించాను.' అని తరుణ్ సుధీర్ అన్నారు. -
కస్టడీ పొడిగింపు.. ఆగస్టు 1 దాకా జైల్లోనే దర్శన్, పవిత్ర..
దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో ఉన్నాడు. తనకు జైలు తిండి సరిపడక ఆరోగ్యం క్షీణిస్తోందని, ఇంటి భోజనం తెప్పించుకోవడానికి అనుమతి ఇప్పించాలంటూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేశాడు. అయితే ఇందుకు ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలుపుతూ కౌంటర్ దాఖలు చేశారు. గురువారంనాడు హైకోర్టులో వీటిపై విచారణ సాగింది. ఇంటి నుంచి భోజనం, పరుపు, దిండు, చదవడానికి కొన్ని పుస్తకాలు కావాలని దర్శన్ కోరాడు. జైలు నిబంధనల ప్రకారం జైలులో పౌష్టికాహారం ఇస్తున్నామని, అవసరం మేరకు ఇంటి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు జైళ్ల శాఖ ఐజీని కోరితే ఆయన నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. అయితే దర్శన్ ఎవరినీ సంప్రదించకుండా నేరుగా కోర్టును ఆశ్రయించడం సరికాదని పేర్కొన్నారు. ఈ కేసులో కోర్టు నిర్ణయం తీసుకోనుంది.దర్శన్ అండ్ గ్యాంగ్కు కస్టడీ పొడిగింపు ఇదిలా ఉంటే దర్శన్, నటి పవిత్రగౌడ, ఇతర నిందితులకు న్యాయస్థానంలో మళ్లీ చుక్కెదురైంది. వీరి బెయిలు ఆశలు నిరాశలయ్యాయి. వారి జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకూ పొడిగించింది. గతంలో కోర్టు విధించిన కస్టడీ గురువారంతో ముగియడంతో పోలీసులు నిందితులను కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. ఇరువర్గాల వాదనల తరువాత కస్టడీని పొడిగించారు.చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ -
శాండల్వుడ్ హీరో దర్శన్.. క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు!
ఇటీవల ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సినీ ఇండస్ట్రీ మోస్ట్ పాపులర్ తారల లిస్ట్ను ప్రకటిస్తోంది. టాలీవుడ్తో పాటు కన్నడ, మలయాళం, తమిళ స్టార్స్లో జూన్ నెలకు సంబంధించి ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోలు, హీరోయిన్ల జాబితాను వెల్లడించింది. ఇటీవల ప్రకటించిన తెలుగు హీరోల జాబితాలో ప్రభాస్ మొదటిస్థానంలో నిలిచారు.తాజాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను ప్రకటించింది. శాండల్వుడ్లో మొదటిస్థానంలో కేజీఎఫ్ స్టార్ యశ్ నిలిచారు. ఆ తర్వాత వరుసగా సుదీప్ కిచ్చా, రక్షిత్ శెట్టి, దర్శన్, రిషబ్ శెట్టి ఉన్నారు. హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి పుష్ప భామ రష్మిక మందన్నా టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఆమె తర్వాత రచిత రామ్, రాధిక పండిట్, రమ్య, ఆషిక రంగనాథ్ వరుస స్థానాలు ఆక్రమించారు.అయితే మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ లిస్ట్లో కన్నడ హీరో దర్శన్ కూడా నిలవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత నెలలో జరిగిన ఓ అభిమాని హత్యకేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. అయినప్పటికీ ఆర్మాక్స్ మీడియా విడుదల చేసిన జాబితాలో నాలుగోస్థానంలో నిలిచారు. కాగా.. తన ప్రియురాలికి అసభ్య సందేశాలు పంపించాడంటూ దర్శన్ అతన్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. Ormax Stars India Loves: Most popular female Kannada film stars (Jun 2024) #OrmaxSIL pic.twitter.com/72De2ze5MK— Ormax Media (@OrmaxMedia) July 17, 2024Ormax Stars India Loves: Most popular male Kannada film stars (Jun 2024) #OrmaxSIL pic.twitter.com/NYPwHgPNUC— Ormax Media (@OrmaxMedia) July 17, 2024 -
జైల్లో ఉండలేకపోతున్న హీరో దర్శన్.. అవన్నీ కావాలని రిక్వెస్ట్
కన్నడ స్టార్ హీరో దర్శన్ జైల్లో ఉండలేకపోతున్నాడు. ఇన్నాళ్లు లగ్జరీ లైఫ్ బతుకుతూ వచ్చిన ఇతడు.. సాధారణ ఖైదీలా ఉండలనేసరికి తెగ ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇంటి ఫుడ్తో పాటు పలు సదుపాయాలు కావాలని రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఇంతకీ దర్శన్ కేసులో అప్డేట్ ఏంటి?(ఇదీ చదవండి: ప్రభాస్ కోట్లాది రూపాయల సాయం.. బయటపెట్టిన కాస్ట్యూమ్ మాస్టర్)కన్న హీరో దర్శన్ని గత నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశాడనే ఆరోపణల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. నటి పవిత్ర గౌడ సహా మొత్తంగా 17 మందిని అరెస్ట్ చేశారు. రేణుకస్వామి అనే వ్యక్తి దర్శన్కి వీరాభిమాని. అయితే తన అభిమాన హీరో భార్యతో కాకుండా ప్రియురాలు పవిత్రతో ఎక్కువగా ఉండటాన్ని తట్టుకోలేకపోయిన రేణుకాస్వామి.. ఈమెకు అసభ్య సందేశాలు పంపించాడు. ఇది ఈమె దర్శన్కి చెప్పడంతో తన మనుషులతో కలిసి రేణుకాస్వామిని చంపేశాడు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది.ప్రస్తుతం జైల్లో ఉన్న దర్శన్.. మిగతా ఖైదీల్లానే ఉన్నాడు. కాకపోతే ఇతడికి అజీర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు. తనకు ఇంట్లో చేసిన ఆహారంతో పాటు పడుకోవడానికి పరువు, బట్టలు, పుస్తకాలు కావాలని రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. బుధవారం దీనిపై విచారణ జరగనుంది. మరి న్యాయస్థానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా? ఆ స్పెషల్ డే నుంచి స్ట్రీమింగ్!) -
ఎమ్మెల్యే కారు డ్రైవర్ నిర్బంధం
యశవంతపుర: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు కార్తీక్ పురోహిత్ అనే మరో నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని సోమవారం విచారించారు. గత శనివారం కూడా నాలుగైదు గంటల పాటు ప్రశ్నించినట్లు తెలిసింది. ఓ ఎమ్మెల్యే కారు డ్రైవర్గా పని చేస్తున్న కార్తీక్ పురోహిత్, రేణుకాస్వామి మృతదేహాన్ని పారేసిన తరువాత నిందితుడు ప్రదోశ్ను అక్కడ నుంచి తీసుకెళ్లినట్లు విచారణలో బయట పడింది. తన కారులోనే ప్రదోశ్ను గిరినగరకు తీసుకెళ్లాడు. ఆ రోజు ఏమి జరిగిందనేది కార్తీక్ నుంచి పోలీసులు వివరాలను సేకరించారు. పవిత్ర స్నేహితురాలు సమత విచారణ పవిత్రగౌడ ఆప్త స్నేహితురాలు సమతను ఈ కేసులో పోలీసులు విచారించారు. నిందితుడు ధనరాజ్కు ఆమె రూ. 3 వేలు పంపిన అధారాలను సేకరించారు. ఈ డబ్బులతో ధనరాజ్ ఎలక్ట్రిక్ షాక్ పరికరాన్ని కొన్నట్లు అనుమానిస్తున్నారు. బసవేశ్వరనగర ఠాణాలో సమతను ప్రశ్నించారు. మరోవైపు దర్శన్, పవిత్రతో పాటు 17 మంది నిందితులు జైళ్లలో కస్టడీలో ఉన్నారు. దర్శన్ బెయిలు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
కన్నడ హీరో దర్శన్కు మరో షాక్!
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి డెవిల్ సినిమా డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ అయిన మిలన ప్రకాశ్కు పోలీసులు మరోసారి విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు. శుక్రవారంనాడు ప్రకాశ్ విజయనగర ఏసీపీ ముందు హాజరయ్యారు. మరోసారి విచారణకు రావాలని శనివారం పోలీసులు ప్రకాశ్కు నోటీసులు ఇచ్చారు. రేణుకాస్వామి హత్య తరువాత హీరో దర్శన్ మైసూరులో డెవిల్ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఈ అంశాలపై సమాచారం కోసం ప్రకాశ్ను విచారించారు. 66 వస్తువుల సీజ్ రేణుకాస్వామి హత్యకేసుకు సంబంధించి దర్యాప్తు చేసిన పోలీసులు మొబైల్ఫోన్లో కలిపి మొత్తం 66 వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. రేణుకాస్వామి దుస్తులు, సీసీ కెమెరాల ఫుటేజీ, మొబైల్ ఫోన్లు, దాడికి వాడిన వస్తువులు తదితరాలను సేకరించారు.కరావళి నుంచి దర్శన్ ఔట్?పరప్పన అగ్రహార జైలులో ఊచలు లెక్కిస్తున్న దర్శన్కు మరో షాక్ తగిలింది. కొత్తగా నిర్మిస్తున్న కరావళి సినిమా నుంచి దర్శన్ను తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్న కరావళిలో దర్శన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదలైన పోస్టర్లో దర్శన్ కనిపించలేదు. దర్శన్ స్థానంలో కిచ్చ సుదీప్ నటిస్తున్నట్లు సమాచారం. ఇది దర్శన్ ఫ్యాన్స్కు మింగుడుపడడం లేదు. -
దర్శన్ భార్యను నేనే.. పవిత్రగౌడ కాదు
దొడ్డబళ్లాపురం: పవిత్రగౌడ కేవలం దర్శన్ స్నేహితురాలు మాత్రమే. ఆయనకు చట్ట ప్రకారం భార్యను నేనే, పోలీసులు ఫైల్స్లో నా పేరు మాత్రమే భార్యగా నమోదు చేయాలంటూ దర్శన్ భార్య విజయలక్ష్మి బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్కు లేఖ రాశారు. దర్శన్ తాను 2003లో హిందూ సంప్రదాయం ప్రకారం ధర్మస్థలంలో వివాహం చేసుకున్నామని, చట్ట ప్రకారం తాను మాత్రమే భార్యనని, పోలీసులు మాట్లాడేటప్పుడు, ప్రకటన ఇచ్చేటప్పుడు పవిత్రను భార్యగా పేర్కొనడం వల్ల ఈ లేఖ ద్వారా స్పష్టత ఇస్తున్నానన్నారు. దర్శన్కు తనకు ఒక కుమారుడు ఉన్నాడని, అదేవిధంగా పవిత్రకు కూడా సంజయ్ సింగ్ అనే మరో వ్యక్తితో వివాహం జరిగిందని, వారికీ ఒక కుమార్తె ఉందని అందువల్ల పోలీసులు ఇకపై తనను మాత్రమే దర్శన్ భార్యగా గుర్తించాలన్నారు.18 వరకు దర్శన్కు కస్టడీ..రేణుకాస్వామి హత్య కేసులో అరైస్టె జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న హీరో దర్శన్, అనుచరులకు కోర్టు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. గురువారంతో దర్శన్, నటి పవిత్ర, మరో 15 మంది నిందితులకు కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెస్స్ ద్వారా జడ్జి ముందు హాజరుపరిచారు. ఇందులో నలుగురు నిందితులు తుమకూరు జైల్లో ఉన్నారు. బెయిలు దక్కుతుందని ఆశించిన దర్శన్ గ్యాంగ్కి నిరాశ ఎదురైంది. జూలై 18 వరకూ కస్టడీని పొడిగిస్తూ జడ్జి ఆదేశాలిచ్చారు.దర్శన్ కేసుపై సుమలత స్పందన..యశవంతపుర: నేను 44 ఏళ్ల నుంచి సినిమా రంగంలో నటిగా, కళాకారిణిగా జీవిస్తున్నాను. ఐదేళ్లపాటు ఎంపీగా పని చేశా. అనేక రంగాలలో బాధ్యతగా నిర్వర్తించా. అనవసరంగా వ్యాఖ్యలు చేయడం వేస్ట్. అని సుమలత అంబరీష్ పేర్కొన్నారు. ప్రముఖ నటుడు దర్శన్ హత్య కేసులో జైలు పాలు కావడంపై ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు.కొడుకు, భర్తను పోగొట్టుకున్న రేణుకాస్వామి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. దుఃఖం నుంచి ఆ కుటుంబం బయటకు రావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దర్శన్ కేసులో ఇంతవరకు తను మౌనంగా ఉన్నందుకు అనేక మంది కామెంట్లు చేశారు. దర్శన్ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయి, 25 ఏళ్ల నుంచి దర్శన్ను చూస్తున్నాను అని పేర్కొన్నారు. -
ఆమెను నా భర్త పెళ్లి చేసుకోలేదు.. పోలీసులకు హీరో భార్య లేఖ!
రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్తో పాటు నటి పవిత్రా గౌడను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు పోలీసు కస్టడీలో ఉన్నారు. అయితే ఈ కేసు విచారణలో వీరిద్దరిని దంపతులుగా పేర్కొనడంపై దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరం తెలిపింది. పవిత్రాగౌడ, దర్శన్ భార్య కాదంటూ బెంగళూరు పోలీస్ కమిషనర్కు లేఖ రాసింది. ‘ఇటీవల మీరు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవిత్రను దర్శన్ భార్య అని తప్పడు ప్రకటన చేశారు. ఆ తర్వాత హోంమంత్రి కూడా అలానే పేర్కొన్నారు. ఆమెను నా భర్త పెళ్లి చేసుకోలేదు. దర్శన్కు పవిత్ర కేవలం స్నేహితురాలు మాత్రమే. దర్శన్కు చట్టపరమైన జీవిత భాగస్వామిని నేనే. మా పెళ్లి 2003లో జరిగింది. దయచేసి పోలీసు రికార్డుల్లో పవిత్రాగౌడను దర్శన్ భార్య అని పేర్కొనకండి. ఇది భవిష్యత్తులో నాకు, నా కుమారుడికి సమస్యలు తెచ్చిపెడుతుంది. పవిత్రకు సంజయ్సింగ్ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఓ కుమార్తె కూడా ఉంది. దయచేసి ఈ వాస్తవాలను రికార్డుల్లో స్పష్టంగా రాయండి’ అని విజయలక్ష్మి విజ్ఞప్తి చేసింది.కాగా, దర్శన్కి విజయలక్ష్మితో వివాహమైనప్పటికీ.. కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడు. కన్నడ నటి పవిత్రాగౌడతో సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం దర్శన్ అభిమాని రేణుకాస్వామికి తెలియడంతో.. విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందని భావించి.. పవిత్రకు అశ్లీల సందేశాలు పంపించి హెచ్చరించాడు. అదే అతని హత్యకు దారి తీసిందని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. -
డిప్రెషన్లో దర్శన్ భార్య.. ఎప్పుడూ భర్త కోసమే తపించేది!
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో ఉన్నాడు. ప్రియురాలు, నటి పవిత్ర గౌడ కోసం తన గ్యాంగ్తో కలిసి రేణుకాస్వామిని చంపేశాడన్న ఆరోపణలతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో అందరూ దర్శన్ను తప్పుపడుతుండగా ఆయన అభిమానులు మాత్రం హీరోను వెనకేసుకొస్తున్నారు.డిప్రెషన్దర్శన్ చేసిన తప్పు వల్ల ఏ పాపం ఎరుగని అతడి సతీమణి విజయలక్ష్మి ఇబ్బందులు పడుతోందంటోంది సింగర్ షమిత మల్నాడ్. ఆమె మాట్లాడుతూ... జరిగిన సంఘటన వల్ల విజయలక్ష్మి డిప్రెషన్కు లోనవుతోంది. బయటకు మాత్రం ధైర్యంగా ఉంటోంది. ఏం మాట్లాడాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న మమ్మల్ని సముదాయిస్తోంది. ఏం జరగదు.. కంగారు పడకూడదని అటు మాకు, ఇటు అభిమానులకు ధైర్యం చెప్తోంది. అయినా తను ఈ ఒత్తిడి నుంచి త్వరగానే బయటపడుతుంది. తను చాలా స్ట్రాంగ్ మహిళ.. ఈ పరిస్థితిలో తన కుమారుడిని ఎలా చూసుకోవాలి? అటు దర్శన్కు ఎలా ధైర్యం చెప్పాలో ఆమెకు బాగా తెలుసు. ఆమెలా ధైర్యంగా నిలబడేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. మాది 20 ఏళ్ల స్నేహం. ఇన్నేళ్లలో తను ఎప్పుడూ కుమారుడికి, భర్తకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. తన కుటుంబాన్ని ఎన్నటికీ విచ్ఛిన్నం కానివ్వదు అని షమిత చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Vijayalakshmi darshan (@viji.darshan)చదవండి: మామూలు ఖైదీగానే దర్శన్ -
జైలు నుంచి నిర్మాతలకు దర్శన్ ఫోన్?
శివాజీనగర: హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్కు జైలులో ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించటం లేదని, మామూలు ఖైదీలతో సమానంగా ఉన్నారని హోం మంత్రి జీ.పరమేశ్వర్ చెప్పారు. మంగళవారం సదాశివనగరలో తన ఇంటి వద్ద మాట్లాడిన ఆయన, దర్శన్కు జైలులో ప్రత్యేక సదుపాయాలు ఇస్తున్నారనే ఆరోపణలను తిరస్కరించారు. జైలులో బిర్యానీ వంటివి ఏవీ ఇవ్వడం లేదు. చూడాలనుకుంటే రండి, నాతో పాటు తీసుకెళ్లి చూపిస్తానన్నారు. నూతన చట్టం కింద 66 కేసులు కొత్త నేర చట్టాల కింద రాష్ట్రంలో 66 కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 20 కేసులు ఉన్నాయి. నూతన చట్టాల్లో కొన్ని అంశాలు బాగుంటే, మరికొన్ని బాగాలేవు. వాటి గురించి చర్చించి కేంద్రం దృష్టికి తీసుకొస్తామని హోంమంత్రి తెలిపారు. ఈ కొత్త చట్టాలు దేశమంతటికి సంబంధించినవి. లక్షలాది కేసులు నూతన చట్టం కింద నమోదవుతాయి. ఈ చట్టాల గురించి చర్చలు జరగాల్సి ఉంది. కొన్ని అంశాలపై కేసు నమోదుకు ఆస్కారం లేదు అని తెలిపారు. చిన్నారికి ఖైదీ డ్రెస్.. అభిమాని అతి దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి అనే యువకుని హత్య కేసులో అరెస్టయి పరప్పన అగ్రహార జైల్లో హీరో దర్శన్ కాలం గడుపుతున్నారు. బయట ఆయన అభిమానులు మాత్రం తలోరకంగా అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఓ అభిమాని తన చిన్నారి కొడుక్కి ఖైదీ డ్రెస్ వేసి, జైలులో దర్శన్కు ఇచ్చిన ఖైదీ నంబర్ 6106ని రాయించాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై అనేకమంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శన్ అభిమానులు మాత్రం అభినందించారు. దర్శన్ ఆందోళనగా ఉన్నారు: ధనీ్వర్ దొడ్డబళ్లాపురం: నటుడు ధనీ్వర్ పరప్పన అగ్రహార జైలులో ఉన్న దర్శన్ను మంగళవారం కలిశారు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన ఆయన దర్శన్ చాలా ఆందోళనగా కనిపించారని, ఆ స్థితిలో ఆయనను చూడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసారు. అంతా మంచే జరగాలని ఆశిస్తున్నానన్నారు. జైలు నుంచి నిర్మాతలకు దర్శన్ ఫోన్?దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టై పరప్పన అగ్రహార జైలులో ఖైదీగా ఉన్న హీరో దర్శన్ జైలు నుండే నిర్మాతలకు ఫోన్ చేసి బెయిల్ ఇప్పించాలని ఒత్తిడి తెస్తున్నాడని సమాచారం. జైలులో ఉన్న ఫోన్బూత్ నుండి నిత్యం నిర్మాతలకు కాల్ చేస్తున్న దర్శన్ పలువురు నిర్మాతలతో మాట్లాడుతూ త్వరగా బెయిల్ ఇప్పించాలని కోరుతున్నాడట. తోటి ఖైదీల ఫోన్ కాల్స్ లిమిట్ కూడా తానే వినియోగించుకుంటున్నాడట. అంతేకాకుండా అర్ధాంతరంగా నిలిచిపోయిన తన సినిమాల గురించి నిర్మాతలు, డైరెక్టర్లతో చర్చిస్తున్నాడని తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో మాట్లాడని దర్శన్ రాత్రయితే ఇలా నిర్మాతలు, డైరెక్టర్లకు కాల్ చేస్తున్నాడని సమాచారం. -
తల్లి చెంత కన్నీరు.. ఏడేళ్ల తరువాత తల్లిని చూసిన దర్శన్
దొడ్డబళ్లాపురం: హత్య కేసులో హీరో దర్శన్ అరెస్టయ్యాక తొలిసారిగా తల్లి మీనా, తమ్ముడు దినకర్ దర్శన్ను కలిసారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి మీనా ఏడేళ్లుగా దర్శన్కు దూరంగా ఉంటున్నారు. వీరిమధ్య మాటల్లేవు. అయితే కుమారుడు కష్టాల్లో ఉన్నాడని తెలుసుకున్న తల్లి మనసు తట్టుకోలేకపోయింది. సోమవారం ఉదయం ఆమె, దినకర్, దర్శన్ భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీశ్ పరప్పన జైలుకు వచ్చి దర్శన్ని కలిసారు. కుటుంబ సభ్యులను చూడగానే దర్శన్ కన్నీటి పర్యంతమయ్యాడని తెలిసింది. తోడుగా ఉంటామని దర్శన్కు కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పారని సమాచారం. -
జైలులో హీరో దర్శన్.. ఇతడికి సపోర్ట్గా టాలీవుడ్ హీరో
హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయి దాదాపు 20 రోజులు అవుతోంది. తన ప్రేయసి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు, వీడియోలు పంపాడనే కారణంతో రేణుకాస్వామిని హీరో దర్శన్ హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఇతడితో పాటు ఏకంగా 17 మంది అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కానీ బయటకొస్తున్న రోజుకో ఫొటో, న్యూస్ దర్శన్ అంటే అసహ్యం కలిగేలా చేస్తోంది. ఇలాంటి టైంలో దర్శన్కి సపోర్ట్ చేస్తూ టాలీవుడ్ హీరో నాగశౌర్య పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది.'చనిపోయిన వ్యక్తి (రేణుకాస్వామి) కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అయితే ఈ కేసులో అందరూ అప్పుడే ఓ అభిప్రాయానికి వచ్చేయడం నాకు చాలా నచ్చేలేదు. ఎందుకంటే దర్శన్ అన్న ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టే వ్యక్తి కాదు. కలలో కూడా అలాంటి పనిచేయరు. ఇతరులకు సహాయం చేసే విషయంలో ఆయన ఎంత మంచివాడో పరిచయమున్న వాళ్లకు తెలుసు. చాలామందికి కష్టకాలంలో తోడున్నాడు. కానీ నేను ఈ వార్తల్ని అస్సలు నమ్మలేకపోతున్నాను. న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకముంది. త్వరలోనే నిజం బయటపడుతుంది'(ఇదీ చదవండి: పేరు మార్చుకున్న ప్రభాస్.. 'కల్కి'లో ఇది గమనించారా?)'ఈ కేసు వల్ల మరో కుటుంబం (దర్శన్ ఫ్యామిలీ) కూడా బాధపడుతోందని మనం గుర్తుంచుకోవాలి. వాళ్లకు ఇలాంటి పరిస్థితుల్లో కాస్త ప్రైవసీ కావాలి. మీపై నాకు నమ్మకముంది అన్న. మీరు అమాయకుడు అనేది తేలుతుంది. అసలు నేరస్థుడు ఎవరనేది త్వరలోనే బయటపడుతుంది' అని నాగశౌర్య ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దర్శన్ నిందితుడు అని ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ దొరికిన ఆధారాలు బట్టి అభిమానిని ఎంత దారుణంగా హత్య చేశాడో ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది. ఇలాంటి టైంలో హీరో నాగశౌర్య పోస్ట్ పెట్టడం కరెక్ట్ కాదని పలువురు నెటిజన్లు అంటున్నారు. ఎంత అభిమానం ఉన్నాసరే కొన్నిసార్లు దాన్ని దాచుకోవాల్సి ఉంటుంది. ఇలా రాంగ్ టైంలో పోస్ట్ పెడితే లేనిపోని ట్రోల్స్ తప్ప ఇంకేం ఉండవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: ఎంతోమంది దర్శన్ను మోసం చేశారు.. ఆయనెవర్నీ మోసగించలేదు) View this post on Instagram A post shared by Naga Shaurya (@actorshaurya) -
ఎంతోమంది దర్శన్ను మోసం చేశారు.. ఆయనెవర్నీ మోసగించలేదు
బెంగళూరు: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటికే కన్నడ హీరో దర్శన్, అతడి ప్రియురాలు పవిత్ర సహా మొత్తం 17 మంది పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రియురాలికి అశ్లీల సందేశాలు పంపాడన్న కోపంతో అభిమాని రేణుకాస్వామిని చంపిన దర్శన్పై జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు.తిడతారని తెలుసుఅయితే కొందరు మాత్రం దర్శన్నే వెనకేసుకొస్తున్నారు. తాజాగా నటి సోను గౌడ ఆ జాబితాలోకి చేరింది. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడు నన్ను ఎంతోమంది తిడతారని నాకు తెలుసు. కానీ ఒక్కసారి అభిమానం పెంచుకున్నాక అది ఎల్లప్పటికీ అలాగే ఉంటుంది. నేను దర్శన్కు అభిమానిని. ఆయన వల్ల లాభం పొందిన ఎంతోమంది ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నారు. చాలామంది ఆయన్ను మోసం చేశారు కానీ ఆయన ఎన్నడూ ఇతరుల్ని మోసగించలేదు.అమాయకుల జీవితం జైల్లో..ఏ పాపం చేయకపోయినా నన్ను కూడా ఓసారి జైల్లో వేశారు. నేను మాట్లాడాల్సిన సమయం వచ్చిందనే పెదవి విప్పాను. ఎవరో ఏదో అనుకుంటారని నేను భయపడను. చాలామంది అమాయకుల జీవితం కూడా జైల్లోనే గడిచిపోతుంది. నిజంగా తప్పు చేసినవారికి తప్పకుండా శిక్ష పడాల్సిందే! దర్శన్కు తమ్ముడిని, అన్నను, అంకుల్ను అంటూ చెప్పుకుతిరిగినవారంతా ఇప్పుడు మౌనంగా ఉండిపోయారు.అదే ఆయన్ను కాపాడుతుందిపరిస్థితులు ఎలా ఉన్నా సరే దర్శన్కు సపోర్ట్ చేయడం నా బాధ్యత. దర్శన్ చిత్తశుద్ధే ఆయన్ను కాపాడుతుంది అని చెప్పుకొచ్చింది. కాగా సోను శ్రీనివాస గౌడ.. కన్నడ బిగ్బాస్ ఓటీటీలో పాల్గొంది. ఆ మధ్య ఎనిమిదేళ్ల చిన్నారిని దత్తత తీసుకుని వార్తల్లో నిలిచింది. నిబంధనలు పాటించకుండా చిన్నారిని దత్తత తీసుకోవడంతో పాటు, ఆ పాపను పబ్లిసిటీ కోసం వాడుకుంటోందని పోలీసులు సోనును అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం నటి బెయిల్పై బయటకు వచ్చింది.చదవండి: కల్కి మూవీ.. ఇంతలా అరిచి ఎన్నాళ్లయిందో: రేణు దేశాయ్ -
పోలీసుల సమక్షంలో మేకప్.. మరో వివాదంలో పవిత్ర గౌడ్
-
మేకప్లో పవిత్ర గౌడ.. పోలీస్ అధికారికి నోటీసులు
రేణుకాస్వామి హత్య కేసులో నటి పవిత్ర గౌడ (A1) ఉన్నారు. అతని హత్యలో ఆమె కీలకమని పోలీసులు కూడా నిర్ధారించారు. రేణుకాస్వామిని హతమార్చే కుట్రలో ఆమె ప్రధాన కారణమని తెలినట్లు పోలీసుల వాదన ఉంది. రేణుకస్వామి సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్నట్లు దర్శన్తో పవిత్ర చెప్పింది. దీంతో కోపగించిన దర్శన్ తన అనుచరులతో రేణుకాస్వామిని హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో 17 మంది జైలులో ఉన్నారు.బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో నటి పవిత్ర ఉన్నారు. అంతకు ముందు 10 రోజుల పాటు ఆమె పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. జైలుకు వెళ్లకు ముందు విచారణ కోసం ఆమె రోజూ అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్కు వచ్చేది. విచారణ అనంతరం మడివాలలోని మహిళా కేంద్రంలో ఆమెను పోలీసులు ఉంచేవారు. అలా 10 రోజుల పాటు పవిత్రను పోలీసులు ప్రశ్నించారు. విచారణ అనంతరం పవిత్ర గౌడ మేకప్తో కనిపించేది. పోలీస్స్టేషన్లో ఆమె కాస్మోటిక్స్ వాడడంపై పెద్ద ఎత్తున చర్చలు ప్రారంభమయ్యాయి. పవిత్ర పెదాలపై లిప్ స్టిక్తో పాటు ఆమె మేకప్ వేసుకున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. కన్నడ సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎతున్న చర్చ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. హత్యకేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న పవిత్ర గౌడ పోలీసుల అదుపులో ఉండగానే ఎలా మేకప్ వేసుకుందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆమెకు కాస్మోటిక్స్ మహిళా పోలీసులే అందించారని చర్చ జరుగుతుంది. పవిత్ర గౌడ భద్రత బాధ్యతను విజయనగర పోలీస్ స్టేషన్లోని మహిళా సబ్ఇన్స్పెక్టర్కు అప్పగించారు. ఆమె ప్రమేయంతోనే ఇదంతా జరిగిందా అనే వాదనలు కూడా వస్తున్నాయి.ఈ క్రమంలో డీసీపీ గిరీష్ ఈ అంశంలో ఫైర్ అయ్యారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితురాలికి లిప్స్టిక్తో పాటు కాస్మోటిక్స్ ఎలా వచ్చాయనేది చెప్పాలని మహిళా పీఎస్ఐకి మెమో ఇచ్చారు. అయితే, వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. విచారణ సమయంలో పవిత్ర గౌడ ప్రతిరోజూ మడివాలలోని మహిళా కేంద్రం నుంచి విచారణకు వచ్చేదని, అక్కడే దుస్తులు మార్చుకుని అవకాశాన్ని ఆమెకు అధికారులు కల్పించారని తెలుస్తోంది. అక్కడికి ప్రతిరోజు ఆమె కుటుంబ సభ్యులు వచ్చేవారని సమాచారం ఉంది. ఆ సమయంలోనే ఆమె మేకప్ వేసుకునే సౌలభ్యం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఇప్పుడు పవిత్ర గౌడను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. పరప్పన అగ్రహార జైలులో తాజాగా పవిత్ర గౌడ తల్లి, సోదరుడు, కూతురు ఆమెతో మాట్లాడారు.పవిత్ర గౌడకు రూ. 2 కోట్లు!ఈ హత్య కేసులో నటి పవిత్రగౌడ అరైస్టెన సమయంలో విధుల్లో ఉన్న విజయనగర మహిళా పీఎస్సైకి పోలీసు శాఖ నోటీసులు ఇచ్చింది. మహిళా పీఎస్సై విధుల్లో నిర్లక్ష్యం వహించారని, వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు పవిత్రగౌడకు సౌందర్య జగదీష్ అనే వ్యాపారవేత్త రూ.2 కోట్ల నగదు ఇచ్చారని విచారణలో తేలడంతో కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.రేణుకాస్వామి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంహత్యకు గురైన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆయన నివాస కార్యాలయం కృష్ణాలో కలిశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రేణుకాస్వామి మృతితో తమకు దిక్కుతోచడం లేదని వాపోయారు. రేణుకాస్వామి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, ఉద్యోగ భరోసా ఇచ్చారని తెలిసింది. -
రేణుకాస్వామిని హీరోను చేయడం ఆపండి.. దర్శన్కు యాంకర్ సపోర్ట్
స్క్రీన్పై హీరోగా మెప్పించే దర్శన్ నిజ జీవితంలో మాత్రం కరడుగట్టిన విలన్గా మారాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడను వేధిస్తున్నాడన్న నెపంతో తన గ్యాంగ్తో కలిసి అభిమాని రేణుకాస్వామిని అతి దారుణంగా చంపాడు. ఈ నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ సీసీ కెమెరాల్లో అడ్డంగా దొరికిపోవడంతో ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.ఒక్కసారి ఆ బంధంలో..ఈ కేసు విషయంలో అందరూ దర్శన్ను దుమ్మెత్తిపోస్తుండగా యాంకర్ హేమలత మాత్రం హీరోకు మద్దతుగా నిలబడింది. ఇక నా వల్ల కావడం లేదు. ఎవరు ఏమైనా అనుకోని.. ఒకరిపై మనం పెంచుకున్న ప్రేమకు, స్నేహానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ఒక్కసారి స్నేహం అనే బంధంలో ఇరుక్కున్నాక దాని నుంచి బయటకు రాలేము. అప్పుడు, ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ ఆ బంధాన్ని వదిలేయాలని అనుకోము. ఆ గౌరవం అలాగే..జరిగిన ఘటన గురించి ఏమని మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ మీ(దర్శన్) మీద ఉన్న ప్రేమ, గౌరవం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. దయచేసి రేణుకాస్వామిని హీరో చేయడం ఆపండి అని రాసుకొచ్చింది. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ పోస్టుకు దర్శన్తో కలిసి ఉన్న ఫోటోను జత చేసింది.చదవండి: ప్రియుడితో బిగ్బాస్ బ్యూటీ బ్రేకప్.. అందుకే అలా చేశారా? -
దర్శన్ కేసులో త్వరలో చార్జిషీటు!
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు తుది దశకు చేరుకోగా త్వరలో కోర్టుకు చార్జ్షీట్ సమర్పింనున్నట్టు పోలీసుల సమాచారం. దర్శన్తో పాటు మొత్తం 17మంది నిందితుల మొబైల్ ఫోన్లలోని డాటాను రిట్రీవ్ చేస్తున్న పోలీసులు అది పూర్తయితే త్వరలో చార్జ్షీట్ తయారు చేయనున్నారు. సీఐడీ టెక్నికల్ సెల్లో డిజిటల్ సాక్ష్యాల సేకరణ జరుగుతోంది. అనేక ప్రాంతాల నుంచి సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు.జైలు మార్పు అధికారుల నిర్ణయం: హోంమంత్రిదర్శన్ను బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి తుమకూరు జిల్లా జైలుకు మార్చాలనేది జైలు అధికారుల నిర్ణయమని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని హోంమంత్రి జీ పరమేశ్వర్ అన్నారు. మంగళవారంనాడు మీడియాతో మాట్లాడిన ఆయన నిందితులు అందరూ ఒకే చోట ఉండడం మంచిది కాదని జైలు అధికారులు భావించారన్నారు. దర్శన్, మరో ముగ్గురిని తుమకూరు జైలుకు తరలిస్తారని తెలిసిందన్నారు. మంత్రివర్గ విస్తరణ అనేది తనకు తెలియదని, అది హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు.నటి పవిత్రగౌడకు రూ. 2 కోట్లు!ఈ హత్య కేసులో నటి పవిత్రగౌడ అరైస్టెన సమయంలో విధుల్లో ఉన్న విజయనగర మహిళా పీఎస్సైకి పోలీసు శాఖ నోటీసులు ఇచ్చింది. మహిళా పీఎస్సై విధుల్లో నిర్లక్ష్యం వహించారని, వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు పవిత్రగౌడకు సౌందర్య జగదీష్ అనే వ్యాపారవేత్త రూ.2 కోట్ల నగదు ఇచ్చారని విచారణలో తేలడంతో కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.దర్శన్ అభిమాని అరెస్టుయశవంతపుర: నిర్మాత ఉమాపతిగౌడను అంతు చూస్తానని బెదిరించిన నటుడు దర్శన్ అభిమాని చేతన్ని బెంగళూరు బసవేశ్వరనగర పోలీసులు అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. దర్శన్ గురించి ఉమాపతి చెడుగా మాట్లాడారంటూ సోషల్ మీడియాలో చేతన్ బెదిరించాడు. దీంతో ఫిర్యాదు రాగా అరెస్టు చేసి మళ్లీ విడుదల చేశారు.సీఎంను కలిసిన రేణుకాస్వామి తల్లిదండ్రులు శివాజీనగర: హత్యకు గురైన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి తల్లిదండ్రులు మంగళవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆయన నివాస కార్యాలయం కృష్ణాలో కలిశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రేణుకాస్వామి మృతితో తమకు దిక్కుతోచడం లేదని వాపోయారు. రేణుకాస్వామి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, ఉద్యోగ భరోసా ఇచ్చారని తెలిసింది. -
రేణుకాస్వామి నుంచి అశ్లీల మెసేజ్లు: చిత్రాల్
హత్యకు గురైన రేణుకాస్వామిపై బుల్లితెర నటి చిత్రాల్ రంగస్వామి ఆరోపణలు చేశారు. తన ఆరోపణలకు సాక్ష్యంగా కొన్ని స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆమె.. రేణుకాస్వామి వేరే పేర్లతో నాకు కూడా చాలాసార్లు అశ్లీల మెసేజ్లు పంపించాడని తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. రేణుకాస్వామి పలు అకౌంట్ల నుంచి అశ్లీల మెసేజ్లు పంపించేవాడని అలాంటి అక్కౌంట్లను తాను బ్లాక్ చేశానన్నారు. చిత్రాల్ గతంలో బిగ్బాస్ పోటీదారుగా ఉండింది. ఆమె బాడీ బిల్డర్గా కూడా పేరుపొందారు. మరోవైపు వందలాది మంది అభిమానులు దర్శన్ను చూడాలంటూ జైలు వద్ద హంగామా సృష్టించారు. కొందరైతే దర్శన్ ఖైదీ నంబరైన 6106 పోస్టర్లను ప్రదర్శించారు.దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో అరైస్టె పరప్పన అగ్రహార జైలులో ఉన్న ప్రముఖ నటుడు, చాలెంజింగ్ స్టార్ దర్శన్ను మరో జైలుకు మారుస్తారని తెలుస్తోంది. ఈ జైలులో అయితే దర్శన్ భద్రత కల్పించడం కష్టమని భావిస్తున్నారు. దర్శన్ను మరో జైలుకు తరలించడానికి అవకాశం కల్పించాలని ఎస్పీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అనుమతిస్తే దర్శన్ను తుమకూరు జైలుకి తరలించే అవకాశం ఉంది. దర్శన్ అనుచరులు, ఇతర రౌడీల మధ్య జైలులో ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నట్టు జైలు అధికారులు భావిస్తున్నారు.దర్శన్తో నటుడు వినోద్ భేటీచట్టానికి ఎవరూ అతీతులు కాదు, అన్యాయం జరిగినవారికి న్యాయం జరగాలని నటుడు వినోద్ ప్రభాకర్ అన్నారు. సోమవారంనాడు పరప్పన అగ్రహార జైలులో దర్శన్ను కలిసిన తరువాత మీడియాతో మాట్లాడారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. ఇలా జరగకుండా ఉండాల్సింది అని, రేణుకాస్వామి ఆత్మకు శాంతి లభించాలని చెప్పారు. తాను దర్శన్ను కలిసి 4 నెలలు అయ్యిందన్నారు. అన్నపూర్ణేశ్వరి పోలీస్స్టేషన్లో కలవాలని ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదని, అందుకే జైలులో భేటీ అయినట్లు తెలిపారు. దర్శన్తో ఏమీ మాట్లాడలేక పోయానని, నన్ను చూసి టైగర్ అన్నాడని, బాస్ ఎలా ఉన్నారు అని అడిగానని తెలిపారు. -
జైలులో 'పవిత్ర గౌడ' గొంతెమ్మ కోరికలు.. తీర్చాలంటూ గొడవ
ఆటో డ్రైవర్ రేణుకస్వామి హత్య కేసులో నిందితులుగా బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో హీరో దర్శన్ (A2), నటి పవిత్ర (A1) ఉన్నారు. రేణుకస్వామి సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్నట్లు దర్శన్తో పవిత్ర చెప్పింది. దీంతో కోపగించిన దర్శన్ తన అనుచరులతో రేణుకాస్వామిని హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో 17 మంది జైలులో ఉన్నారు.జైల్లో పవిత్ర గౌడ మహిళా సిబ్బందితో గొడవకు దిగింది. పవిత్రకు రాత్రి నిద్రించేందుకు ఒక దుప్పటిని జైలు సిబ్బంది ఇచ్చారు. ఈ దుప్పటి వద్దని, ఇంటి నుంచి తెప్పించి ఇవ్వాలంటూ ఆమె గొడవ చేసినట్లు తెలిసింది. జైలులో ఉండి కూడా అది కావాలి, ఇది కావాలంటూ అక్కడ ఉన్న మహిళా సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం. జైలు భోజనం తినేందుకు కూడా ఆమె నిరాకరించారట. దీంతో పోలీసులు కూడా ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారట. ఇది మీ ఇల్లు కాదు, మౌనంగా ఉండటం నేర్చుకోవాలని సిబ్బంది గట్టిగా హెచ్చరించారట.దర్శన్కు ఇతర ఖైదీల నుంచి ఏమైనా ప్రమాదం రావచ్చిని ఆయన్ను ప్రత్యేకమైన బ్యారక్లో ఉంచారు. రాత్రి భోజనంగా రాగి ముద్ద, చపాతి, అన్నం, సాంబార్, మజ్జిగ ఇచ్చారు. కానీ, భోజనం చేయని దర్శన్ ఆలస్యంగా నిద్రపోయి ఉదయం 6.30 గంటలకు లేచి కొంతసేపు వాకింగ్ చేశారు. జైలు సిబ్బందిని వేడినీరు అడిగి తాగారు. ఉదయం టిఫిన్ పలావ్ ఆరగించారు. భద్రత కోసం దర్శన్ను తుమకూరు జిల్లా జైలుకు బదిలీ చేయాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు. -
దర్శన్ 6106
శివాజీనగర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో నటి పవిత్రగౌడ, హీరో దర్శన్, మరో 15 మంది నిందితులు బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో చేరారు. దర్శన్ సాధారణ ఖైదీలా మారిపోయారు. అయితే ఇతర ఖైదీల నుండి ప్రమాదం రాకుండా ప్రత్యేకమైన బ్యారక్లో ఉంచారు. శనివారం రాత్రి భోజనంగా రాగి ముద్ద, చపాతి, అన్నం, సాంబార్, మజ్జిగ ఇచ్చారు. భోజనం చేయని దర్శన్ ఆలస్యంగా నిద్రపోయి ఉదయం 6.30 గంటలకు లేచి కొంతసేపు వాకింగ్ చేశారు. జైలు సిబ్బందిని వేడినీరు అడిగి తాగారు. ఉదయం టిఫిన్ పలావ్ ఆరగించారు. దర్శన్ రిమాండు ఖైదీ నంబరు 6106, ధనరాజ్ 6107, వినయ్ 6108, ప్రదోశ్ 6109 నంబర్ ఇచ్చారు. భద్రత కోసం దర్శన్ను తుమకూరు జిల్లా జైలుకు బదిలీ చేయాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు. హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయి 13 రోజులు కాగా, ఆయన బరువులో కొంతవరకు తగ్గి రక్తపోటులో తారతమ్యంగా ఉన్నట్లు తెలిసింది. ఎప్పుడూ సినిమాలలో మాత్రమే కనిపించే దర్శన్ తమ ముందే ఉండడంతో సిబ్బంది, ఖైదీలు సంభ్రమానికి గురయ్యారు.పవిత్ర రగడ రగడజైల్లో పవిత్రాగౌడ మహిళా సిబ్బందితో గొడవకు దిగింది. పవిత్రకు రాత్రి నిద్రించేందుకు జైలు దుప్పటిని జైలు సిబ్బంది ఇచ్చారు. ఈ దుప్పటి వద్దని, ఇంటి నుంచి తెప్పించి ఇవ్వాలని రగడ చేసినట్లు తెలిసింది. అది కావాలి, ఇది కావాలని చిన్న చిన్న విషయాలకు అలుగుతున్నట్లు తెలిసింది. జైలు భోజనం తినేందుకు కూడా ఆమె నిరాకరించగా, ఇది మీ ఇల్లు కాదు, మౌనంగా ఉండటం నేర్చుకోవాలని సిబ్బంది గట్టిగా హెచ్చరించారు.రిమాండు రిపోర్టులో ఏముంది ?చిత్రదుర్గ రేణుకాస్వామి ఘోర హత్య కేసులో పరప్పన అగ్రహార జైలో చేరిన నటుడు దర్శన్తో పాటుగా 17 మంది నిందితులు, హత్యను తప్పుదారి పట్టించేందుకు సాక్షులను బెదిరింపులకు గురిచేశారని పోలీసులు చెబుతున్నారు. ఓ సాక్షిని నిందితులు ప్రాణ బెదిరింపులకు పాల్పడగా, రహస్యంగా కాపాడినట్లు పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ పిటిషన్లో తెలిపారు. కేసులో తమ పేరు రాకూడదని ఓ వ్యక్తికి దర్శన్ రూ. రూ.40 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. సొమ్ము ఆచూకీ కనిపెట్టేందుకు రెండురోజుల పాటు మూడోసారి కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. దర్శన్ మొబైల్ఫోన్ను తనిఖీ చేసేటప్పుడు డేటా పోయింది, కోర్టు అనుమతితో మళ్లీ సేకరించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కేసులో 9వ నిందితుడు ధనరాజ్ ఎలెక్ట్రికల్ టార్చ్ షాక్ను ఆన్లైన్లో కొనుగోలు చేసి సొమ్ము జమ చేయగా, దీని ఆధారాలను అందుకోవాల్సి ఉంది. -
రేణుకాస్వామి.. నాక్కూడా అసభ్య సందేశాలు పంపాడు: నటి
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ ఊచలు లెక్కపెడుతున్నాడు. ప్రియురాలు, నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపాడన్న కోపంతో దర్శన్, అతడి గ్యాంగ్ రేణుకాస్వామిని దారుణంగా కొట్టి చంపారు. అశ్లీల ఫోటోలు పంపడం రేణుకాస్వామి చేసిన తప్పయితే.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అతడి ప్రాణాలు తీయడం దర్శన్ గ్యాంగ్ చేసిన ఘోర తప్పిదం.ఎవరికీ సపోర్ట్ చేయడం లేదుఅయితే రేణుకాస్వామి తనక్కూడా అసభ్య ఫోటోలు పంపాడంటోంది కన్నడ నటి చిత్రల్ రంగస్వామి. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన వీడియోలో నటి మాట్లాడుతూ.. 'ప్రస్తుతం దేని గురించి చర్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే! ఆ విషయంలో అంతా బాధగానే ఉన్నారు. రేణుకాస్వామి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ కేసు విషయంలో నేను ఎవరికీ సపోర్ట్ చేయడం లేదు. కానీ రేణుకాస్వామి చాలామందికి అశ్లీల మెసేజ్లు పంపాడన్నది మాత్రం వాస్తవం. పోలీస్ స్టేషన్లోనూ తనపై కేసు నమోదైంది.పనికిమాలిన మెసేజ్లుఅలాగే అతడు గౌతమ్ అనే ఫేక్ అకౌంట్తో చాలామందికి పనికిమాలిన మెసేజ్లు చేసేవాడు. ఆ స్క్రీన్షాట్లను నేనిప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తే బాగోదు. కాబట్టి అవి పోస్ట్ చేయడం లేదు. దుస్తుల్లేకుండా ఫోటో లేదా అశ్లీలమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుంటే నేనైతే బ్లాక్ చేసేదాన్ని. కానీ ఇక్కడ ఆశ్చర్యమేంటంటే.. నా ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేసిన లిస్టులో ఆల్రెడీ ఇతడి అకౌంట్ కూడా ఉంది. చాలారోజులుగా మౌనంగానే ఉన్నాను. జరుగుతున్న పరిణామాలను చూసి పెదవి విప్పాలనుకున్నాను' అని చిత్రల్ పేర్కొంది. కాగా చిత్రల్ రంగస్వామి బాడీ బిల్డర్. పలు సినిమాల్లో నటించింది. కన్నడ బిగ్బాస్ 10వ సీజన్లోనూ పాల్గొంది.చదవండి: థర్డ్ హ్యాండ్ కారు.. వర్షం వస్తే కారులో వాటర్ లీకేజీ.. -
పరప్పన జైలుకు దర్శన్
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో అరైస్టె గత కొన్ని రోజులుగా పోలీసుల కస్టడీలో ఉన్న నటుడు, చాలెంజింగ్ స్టార్ దర్శన్ను జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. శనివారంతో పోలీసు కస్టడీ ముగియడంతో పోలీసులు దర్శన్ను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు జుడిషియల్ రిమాండ్కు ఆదేశించింది. దీంతో దర్శన్తో పాటు వినయ్, ప్రదోశ్, ధనరాజ్లను కూడా పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకి తరలించారు. వారిని సుమారు 12 రోజుల పాటు ముమ్మరంగా విచారించి హత్య కేసులో పూర్తి సమాచారాన్ని సేకరించారు. అనేక వాహనాలు, వస్తు సామగ్రి, రూ. 30 లక్షల వరకూ నగదును సీజ్ చేశారు. ఈ కేసులో మొత్తం 17 మందిని అరెస్టు చేశారు. కాగా, దర్శన్ 13 ఏళ్ల కిందట భార్యపై దాడి కేసులో అరెస్టయి జైలుపాలయ్యాడు. ఇప్పుడు మళ్లీ అదే జైలుకి వెళ్లాడు. హత్య కేసులో ప్రథమ ముద్దాయి, దర్శన్ ప్రియురాలు పవిత్రగౌడ ఇప్పటికే పరప్పన జైలులో ఉన్నారు.దర్శన్కు కోపం వస్తే విధ్వంసమేదర్శన్కు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, తగిన వైద్యం అవసరమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 10వ తేదీన రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయ్యాక దర్శన్ మానసిక పరిస్థితి చర్చకు వచ్చింది. గతంలో దర్శన్ గొడవపడిన ఘటనలు, షూటింగ్లో ఇతరులను కొట్టిన సంగతులు, అతని పట్టలేని ఆగ్రహం చూస్తే మానసిక రోగంతో బాధపడుతున్నారా అనే అనుమానాలు కలుగుతాయి. గతంలో దర్శన్కు కౌన్సిలింగ్ ఇచ్చిన మానసిక వైద్యురాలు చంద్రిక ఈ విషయాన్ని చెప్పారు. చిన్నచిన్న విషయాలకు అతిగా స్పందించడం, కోపం రావడం తదితర లక్షణాలు ఉండేవని, అయితే అతడి స్టార్డమ్ కారణంగా అవి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదని, అందుకే దర్శన్ ఇంతవరకూ వచ్చాడంటున్నారు. కౌన్సెలింగ్ కొనసాగించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. కోపం వస్తే దర్శన్ విచక్షణ మర్చిపోతారని, ఏం చేస్తున్నాడో అతడికే తెలీదన్నారు. తక్షణం అతడికి కౌన్సెలింగ్, వైద్యం చాలా అవసరమని పలువురు పేర్కొన్నారు.ఆ నలుగురిపై రమ్య ఫైర్దర్శన్, ప్రజ్వల్ రేవణ్ణ, సూరజ్ రేవణ్ణ, యడియూరప్పలపై నటి, కాంగ్రెస్ నాయకురాలైన రమ్య ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆమె ఎక్స్లో ఘాటుగా స్పందిస్తూ పోస్టు చేసారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న, చట్టం అంటే గౌరవం లేని శక్తివంతులు, ధనవంతులు, ప్రభావిత వ్యక్తుల దుష్ట బుద్ధి, చెడు వ్యసనాలకు అమాయక మహిళలు, పిల్లలను బలి చేస్తున్నారు, వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇలాంటి ఘోర సత్యాలను వెలుగులోకి తీసుకువచ్చిన మీడియా, కేసులు నమోదు చేసి పనిచేస్తున్న పోలీసులకు అభినందనలు అన్నారు. ఇలాంటి కేసుల విచారణ త్వరగా తేల్చి నిందితులకు కఠిన శశిక్ష పడేలా చూడాలని కోరారు. పోస్టుతో పాటు దర్శన్, ప్రజ్వల్, యడియూరప్ప, ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణల ఫోటోలను పోస్ట్ చేశారు.ముగిసిన పోలీస్ రిమాండు -
దర్శన్తో పాటు ఆ ముగ్గురిని ట్యాగ్ చేస్తూ హీరోయిన్ రమ్య కామెంట్
కర్ణాటక రాష్ట్రంలో ఇటీవల కాలంలో పలు కేసులు సంచలనం సృష్టిస్తున్నాయి. హీరో దర్శన్, మాజీ సినీ నిర్మాత యడ్యూరప్ప, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, సూరజ్ రేవణ్ణ వంటి ప్రముఖులు నేడు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరందరినీ ఉద్దేశించి కన్నడ హీరోయిన్, మాజీ ఎంపీ రమ్య విమర్శలు ఎక్కుపెట్టారు.అనేక సందర్భాల్లో చట్టాన్ని ఉల్లంఘించే ధనవంతులు, సెలబ్రిటీలు, ప్రభావవంతమైన వ్యక్తులు నేటి సమాజంలో ఉన్నారు. వారు చేసిన ఘోర తప్పిదానికి రాష్ట్ర ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. ఈ నేరాలను బయటపెట్టిన పోలీసులకు, మీడియాకు హ్యాట్సాఫ్. కేసులను సక్రమంగా విచారణ జరిగేలా న్యాయస్థానం చూడాలి. ఒక్కోసారి న్యాయం జరగకపోతే సాధారణ ప్రజలకు న్యాయస్థానం ఏం సందేశం ఇచ్చినట్లు చెప్పాల్సి ఉంటుంది.' అని రమ్య సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్, లైంగిక వేధింపుల కేసులో నిందితులుగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణ, సూరజ్ రేవణ్ణతో పాటు పోక్సో కేసులో విచారణ ఎదుర్కొంటున్న మాజీ సీఎం యడ్యూరప్ప పేరును తన సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ.. రమ్య పోప్ట్ చేయడం విశేషం.రేణుకాస్వామిని హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న దర్శన్ గురించి గతంలో ఆమె ఒక పోస్ట్ చేశారు. తప్పు చేసిన వారు ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే శిక్ష అనుభవించాల్సిందేనని ఆమె కోరింది. దీంతో ఆమెపై ఆయన అభిమానులు విరుచకపడ్డారు. ట్రోల్స్ చేస్తూ రమ్యను బూతులు తిట్టడం ప్రారంభించారు. దానిని కూడా ఆమె తప్పబట్టారు. హత్య కేసులో ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేస్తున్న సమాజంలో జీవించడం సిగ్గుచేటు అని తెలిపారు. ఈ క్రమంలో చట్టం కంటే ఎవరూ గొప్పవారు కాదని ఆమె గుర్తుచేశారు. సెలబ్రిటీ అయితే సాధారణ ప్రజలను కొట్ట చంపేస్తారా..? అంటూ ఆమె స్వరాన్ని పెంచారు. ఇలాంటి కేసుల విషయంలో ఏ రాజకీయ పార్టీ ఒత్తిడికి తలొగ్గకుండా పోలీసులు పనిచేస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. చట్టంపై ప్రజలు విశ్వాసం ఉంచుతారనే నమ్మకం ఉందని రమ్య సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.తెలుగు వారికి కూడా రమ్య పరిచయమే నందమూరి కళ్యాణ్రామ్ 'అభిమన్యు' సినిమాతో పాటు సూర్య హీరోగా నటించిన 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సినిమాలో రమ్య మెప్పించారు. 20 సంవత్సరాల పాటు కన్నడ సీమలో టాప్ హీరోయిన్గా చెరగని ముద్ర రమ్య వేశారు.The ones breaking the law who have been in the news are the rich and powerful and the ones at the receiving end of their violent actions are the poor, women & children. The common people of Karnataka. Hats off to the police and media for bringing these crimes out. Justice will…— Ramya/Divya Spandana (@divyaspandana) June 22, 2024 -
దర్శన్కి ఆ సమస్య.. అందుకే అతడితో జాగ్రత్తగా మాట్లాడతారు!
కొన్నిరోజుల క్రితం కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ కావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తనని అభిమానించే ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపాడనే ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. జైల్లో పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. మరోవైపు దర్శన్తో కలిసి పనిచేసిన కొందరు లేడీ యాక్టర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మొన్నీ మధ్యే హీరోయిన్ సంజనా గల్రానీ దర్శన్ ప్రవర్తన గురించి చెప్పగా, తాజాగా నటి అనూష రాయ్.. దర్శన్ ఇతరులతో ఎలా ఉంటాడో చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?)'హత్య కేసులో దర్శన్ అరెస్ట్ కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఆయన(దర్శన్) అందరినీ కేరింగ్గా చూసుకుంటాడు. కాకపోతే ఆయనకు అప్పుడప్పుడు కోప్పడటం లాంటి సమస్య ఉంది. దీంతో అందరూ చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. నేను మాట్లాడినప్పుడు కూడా నా ఫరిది దాటకుండా మాట్లాడాను. తనకు ఈ సమస్య ఉందని దర్శన్ గతంలో ఓ ఇంటర్వ్యూలోనే చెప్పాడు. అయితే దర్శన్కి సంబంధం ఉందనే విషయం మాత్రం నాకు తెలియదు. దర్శన్పై కోపం ఉంటే ఏమైనా అనుకోండి గానీ ఆయన భార్య, కొడుకుని మాత్రం తిట్టడం కరెక్ట్ కాదు.' అని అనుష రాయ్ చెప్పుకొచ్చింది.కర్ణాటకలోని చిత్రదుర్గకి చెందిన రేణుకాస్వామి.. దర్శన్కి వీరాభిమాని. అయితే తన అభిమాన హీరో కుటుంబంలో కలహాలకు కారణం పవిత్ర గౌడనే అని భావించిన రేణుకాస్వామి.. ఆమెకు అసభ్య వీడియోలు పంపించాడు. ఈ విషయాన్ని పవిత్ర దర్శన్కి చెప్పగా.. ఇతడు దారుణంగా టార్చర్ పెట్టి మరీ చంపేశాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ప్రకారం రేణుకాస్వామి శరీరంపై 15కి గాయాలు, కరెంట్ షాక్ ఇచ్చినట్లు గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో దర్శన్, పవిత్రతో పాటు దాదాపు 11 మందికి పైగా జైల్లో ఉన్నారు.(ఇదీ చదవండి: కాబోయే భర్తకు కారు గిఫ్ట్ ఇచ్చిన బిగ్బాస్ శోభాశెట్టి.. రేటు ఎంతో తెలుసా?) -
రేణుకస్వామి కేసులో ఏ1గా పవిత్ర!
బెంగళూరు: కన్నడ నటి పవిత్ర గౌడను ఆన్లైన్లో వేధించాడన్న పట్టారాని కోపంతో రేణుకస్వామి అనే చిరుద్యోగిని నటుడు దర్శన్ తూగుదీప, అతని అనుచరులు హతమార్చారన్న కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్శన్ సన్నిహిత నటి పవిత్ర గౌడను ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా పేర్కొంటూ పోలీసులు గురువారం బెంగళూరులో 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట రిమాండ్ రిపోర్ట్ను సమర్పించారు. స్వామికి కరెంట్ షాక్ ఇచ్చి హింసించామని ఇప్పటికే అరెస్టయిన ఒక నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఈ వివరాలను రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ప్రస్తావించారు. హత్య తర్వాత అరెస్ట్, కేసు నుంచి తప్పించుకునేందుకు, మృతదేహాన్ని మాయం చేసి ఆధారాలను ధ్వంసంచేసేందుకు దర్శన్ భారీగా ఖర్చుచేశారని, అందుకోసం స్నేహితుడు మోహన్ రాజ్ నుంచి రూ.40 లక్షల అప్పు తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. షాక్ ఇచ్చేందుకు వాడిన ఎలక్ట్రిక్ షాక్ టార్చ్ను, ఆ రూ.40 లక్షల నగదును పోలీసులు ఇప్పటికే స్వా«దీనం చేసుకున్నారు. దర్శన్, మరో ముగ్గురిని పోలీస్ కస్టడీకి, పవిత్ర గౌడను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోర్టును పోలీసులు కోరారు. ఘటనాస్థలిలో చెప్పులతో కొట్టిన పవిత్ర చిత్రదుర్గ ప్రాంతంలో రేణుకస్వామిని కిడ్నాప్చేసి 200 కి.మీ.ల దూరంలోని బెంగళూరుకు తీసుకొచ్చి షెడ్లో కట్టేసి కొట్టేటపుడు నటి పవిత్ర గౌడ అక్కడే ఉన్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆమె కూడా రేణుకస్వామిని తన చెప్పులతో కొట్టారని పోలీసులు పేర్కొన్నారు. అసభ్య సందేశాలు పంపిన స్వామికి బుద్ది చెప్పాలని అక్కడే ఉన్న దర్శన్ను పవిత్ర ఉసిగొలి్పందని ఆయా వర్గాలు వెల్లడించాయి. రేణుకస్వామి పోస్ట్మార్టమ్లో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. సున్నిత అవయవాలపై దాడితో వృషణాలు చితికిపోయాయని, ఒక చెవి కనిపించలేదని నివేదిక పేర్కొంది. రేణుకస్వామి గతంలో ఇన్స్టా్రగామ్లో పోస్ట్ చేసి డిలీట్చేసిన మెసేజ్లను వెలికి తీసివ్వాలని దాని మాతృ సంస్థ ‘మెటా’ను పోలీసులు కోరారు. -
పవిత్రగౌడ పాత్రనే కీలకం
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో సంచలనం రేపిన చిత్రదుర్గకు చెందిన ఆటోడ్రైవర్ రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ అండ్ గ్యాంగ్ సంచరించిన 28 ప్రాంతాల్లో మహజర్ నిర్వహించిన పోలీసులు.. ఏకంగా 139 వస్తువులను సాక్ష్యాలుగా సేకరించారు. నిందితులు ధరించిన దుస్తులు, షూస్, చెప్పులు, దాడికి ఉపయోగించిన వస్తువులు, హోటల్ లెడ్జర్ బుక్, సీసీటీవీ కెమెరా పేటేజీలు, వాహనాలు, నగదు, మృతదేహంపై నుంచి దోచిన నగలు ఇలా ఒక్కటీ వదలకుండా పోలీసులు సాక్ష్యాలుగా తీసుకువచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా దర్శన్ అనుచరుడు వినయ్ ఫోన్లో చాటింగ్ చేసిన మెసేజ్లు కేసులో కీలకంగా మారనున్నాయి. దర్శన్ రేణుకాస్వామిపై దాడి చేసిన దృశ్యాన్ని ముగ్గురు యువకులు మొబైల్లో వీడియో తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీడియోలను సేకరించారు.పవిత్రగౌడ పాత్రనే కీలకంరేణుకాస్వామి హత్య జరగడానికి నటి పవిత్రగౌడ ముఖ్య కారణమని పోలీసుల రిమాండ్ కాపీలో పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పవిత్ర ఏ3 నుంచి మొదలుకుని ఏ7, ఏ11, ఏ12, ఏ13, ఏ16 నిందితులు హత్యలో నేరుగా పాల్గొన్నారని, వీరందరికీ చట్టంపై కనీసం గౌరవం లేదని లభించిన సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తోందని రిమాండ్ కాపీలో పేర్కొన్నారు. ఏ1 ముద్దాయి పవిత్ర,రేణుకాస్వామి హత్యకు అందరినీ ప్రేరేపించినట్లు తెలిపారు.బెయిల్కు దర్శన్ ప్రయత్నాలురేణుకాస్వామి హత్య కేసులో ఏ2గా ఉన్న దర్శన్ బెయిల్ పిటిషన్ పెట్టుకోనున్నారు. దర్శన్ కేసు వాదించడానికి అనిల్, బాబు, రంగనాథ్రెడ్డి అనే లాయర్లను నియమించుకున్నారు. అదేవిధంగా సీనియర్ లాయర్ సీవీ నాగేశ్ను కూడా దర్శన్ నియమించుకున్నారు. ఇటీవల జైలుపాలైన మాజీ మంత్రి రేవన్న కేసును నాగేశ్ వాదించి బెయిలు ఇప్పించారు. అనేక క్రిమినల్ కేసులు వాదించిన అనుభవం ఆయనకు ఉంది. దర్శన్కు కూడా బెయిల్ ఇప్పించే ప్రయత్నంలో భాగంగా లాయర్ నాగేశ్, అసిస్టెంట్ లాయర్ రాఘవేంద్ర ఇప్పటికే అన్నపూర్ణేశ్వరి పోలీస్స్టేషన్కు వెళ్లి కేసుకు సంబంధించి పూర్తి సమాచారం తీసుకున్నారు. -
దర్శన్తో జోడీ.. ఆయనే నా గురువు అంటున్న బ్యూటీ (ఫొటోలు)
-
పవిత్ర గౌడ చూస్తుండగానే.. ఒళ్లు జలదరించేలా రేణుక స్వామి హత్య
బెంగళూరు : కన్నడ నటుడు దర్శన్ తూగుదీప్ అభిమాని రేణుకాస్వామి హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.రేణుకస్వామిని దారుణంగా కొట్టి, ఎలక్ట్రిక్ షాకిచ్చి హత్య చేసినట్లు పోస్టు మార్టం నివేదికలో వెల్లడైంది. నిందితులు కొట్టిన దెబ్బలకు బాధితుడి అంతర్గత అవయవాలు పగిలిపోయాయి. రేణుక స్వామి మృతదేహాన్ని కాలువలో పడేసినప్పుడు అతని ముఖం సగం భాగంలో కుక్కలు పీక్కుతిన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు.అయితే ఈ రేణుక స్వామిని దర్శన్, ఇతర నిందితులు చిత్రహింసలకు గురి చేసే సమయంలో పవిత్ర గౌడ అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. స్వామి అసభ్యకరంగా సోషల్ మీడియా పోస్ట్లు పెట్టారనే కారణంగా పవిత్రనే దర్శన్ని దాడికి ప్రేరేపించినట్లు సమాచారం.జూన్8న రేణుక స్వామి తన స్వగ్రామమైన చిత్రదుర్గ నుంచి నిందితులు కిడ్నాప్ చేసి బెంగళూరుకు 200 కిలోమీటర్లు దూరం తరలించారు. అక్కడికి దర్శన్, పవిత్రగౌడలు వచ్చారు. అనంతరం,రేణుక స్వామిని దర్శన్, ఇతర నిందితులు ఒళ్లు జలదరించేలా హత్య చేశారు. ఆ హత్య జరిగే సమయంలో పవిత్రగౌడ అక్కడే ఉండడం గమనార్హం.కాగా, ఈ సంచలన హత్య కేసులో పోలీసులు ఇద్దరు నటులు సహా 17 మందిని అరెస్ట్ చేశారు. హత్య కోసం దర్శన్ నిందితులకు రూ.50లక్షలు ఇచ్చినట్లు సమాచారం. ఇందులో రూ.30 లక్షలు కిడ్నాప్, హత్య, మృతదేహాన్ని మాయం చేసేందుకు సహకరించిన పవన్కు చెల్లించగా.. రాఘవేంద్ర, కార్తీక్ల కుటుంబాలకు కుటుంబాలకు రూ.5 లక్షలు చెల్లించినట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
దర్శన్ కేసు.. హత్య తర్వాత అతను ఏం చేశాడంటే?
కన్నడ హీరో దర్శన్ కేసు శాండల్వుడ్లో హాట్ టాపిక్గా మారింది. పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. తాజాగా దర్శన్ భార్య విజయలక్ష్మిని సైతం పోలీసులు విచారించారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఆమె ఉంటున్న ఫ్లాట్లో దర్శన్ షూస్ గుర్తించిన పోలీసులు.. కీలక ఆధారాలు సేకరించారు. ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నప్పటికీ ఆమె నివాసంలో దర్శన్ బూట్లు కనిపించడంతో ఆమెను ప్రశ్నించారు.అయితే తాజాగా పోలీసుల దర్యాప్తులో మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. రేణుకాస్వామి హత్యం అనంతరం దర్శన్ తన భార్య విజయలక్ష్మి ఉంటున్న ఫ్లాట్కు చేరుకున్నాడు. ఆ తర్వాత అక్కడే భార్యతో కలిసి ఇంట్లో పూజలు నిర్వహించినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత దర్శన్ మైసూరుకు వెళ్లిపోయాడు. అయితే ఈ కేసులో ఆయన భార్యను దాదాపు ఐదుగంటల పాటు విచారించిన పోలీసులు ఆమె పేరును సాక్షిగా చేర్చనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈనెల 9న బెంగళూరులో రేణుకాస్వామి అనే అభిమాని దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో హీరో దర్శన్తో పాటు అతని ప్రియురాలు పవిత్ర గౌడ, మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. -
నేరం అంగీకరించిన హీరో దర్శన్ !
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేయించిన కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకొంది. హత్య తర్వాత అభిమాని మృతదేహాన్ని ఎవరి కంట పడకుండా మాయం చేసేందుకు దర్శన్ మరో నిందితుడికి రూ. 30 లక్షలు ఇచ్చినట్లు తేలింది. ఈ నేరాన్ని దర్శన్ అంగీకరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. హత్య కేసులో ఇప్పటికే దర్శన్ను అరెస్టు చేసిన పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. రేణుకాస్వామి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా మాయం చేయాలని మరో నిందితుడైన ప్రదేశ్కు రూ.30లక్షలు ఇచ్చినట్లు దర్శన్ అంగీకరించాడు. దర్శన్ పోలీసుల ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. -
దర్శన్ నా గురువు.. ఆయన ఇలా చేశారంటే..: హీరోయిన్
కొద్దిరోజులుగా హీరో దర్శన్ పేరు మారుమోగిపోతోంది. తనేదో మంచి పని చేసినందుకు కాదు.. తన గ్యాంగ్తో కలిసి అభిమాని రేణుకాస్వామిని అతి క్రూరంగా చంపినందుకు! జూన్ 11న రేణుకాస్వామి హత్య జరగ్గా.. ఈ కేసులో దర్శన్, అతడి ప్రియురాలు పవిత్ర గౌడతో పాటు పలువురినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారం గురించి కన్నడ హీరోయిన్ రచితా రామ్ తాజాగా స్పందించింది. ట్విటర్, ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. దర్శన్.. గురువుదర్శన్.. నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన నాకు గురువులాంటివారు. నేనేదైనా తప్పు చేస్తే సరిదిద్దుతూ సలహాలు ఇచ్చే వ్యక్తి ఇలాంటి కేసులో భాగమయ్యారంటే నమ్మలేకపోతున్నాను. పోలీసులు నిజాన్ని వెలికితీస్తారని ఆశిస్తున్నాను. మీడియా కూడా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తుందని భావిస్తున్నాను. న్యాయం గెలుస్తుందిరేణుకాస్వామి ఆత్మకు శాంతి చేకూరాలి. అతడి కుటుంబం ధైర్యాన్ని కూడదీసుకోవాలి. ఈ కేసులో న్యాయమే గెలుస్తుందని నమ్ముతున్నాను అని రాసుకొచ్చింది. కాగా రచితా రామ్ తొలి సినిమా బుల్బుల్. ఈ మూవీలో దర్శన్ హీరోగా, రచిత హీరోయిన్గా నటించింది. వీరిద్దరూ అంబరీష, జగ్గు దాదా, అమర్, క్రాంతి చిత్రాల్లో కలిసి యాక్ట్ చేశారు. కన్నడలో పలు సినిమాలు చేసిన ఈమె తెలుగులో 'సూపర్ మచ్చి' మూవీతో పలకరించింది. View this post on Instagram A post shared by Rachitaa Ram (@rachita_instaofficial)చదవండి: షారూఖ్ ఖాన్కు యాటిట్యూడ్? బిగ్బీని తక్కువ చేసి.. -
ఈ అందం వల్లే కటకటాలపాలైన హీరో దర్శన్ (ఫోటోలు)
-
కన్నడ హీరో దర్శన్ కేసు.. అతని భార్యకు నోటీసులు!
ప్రస్తుతం శాండల్వుడ్ అంతటా హీరో దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ పేర్లే వినిపిస్తున్నాయి. బెంగళూరులో జరిగిన ఓ అభిమాని హత్య కేసు వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. తన ప్రియురాలు పవిత్రకు అసభ్యకర సందేశాలు పంపాడని రేణుకాస్వామి అనే అభిమానిని దారుణ హత్య చేశారని వీరిపై ఆరోపణలొచ్చాయి. అయితే హీరో దర్శన్కు ఇదివరకే పెళ్లయింది. విజయలక్ష్మిని వివాహం చేసుకోగా.. ప్రస్తుతం ఆమెకు దూరంగా ఉంటున్నారు. గత పదేళ్లుగా పవిత్ర గౌడతో రిలేషన్లో ఉన్నారు. తాజాాగ హత్య కేసులో నోటీసు అందుకున్న విజయలక్ష్మి బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి పోలీస్ స్టేషన్కు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఆయన భార్య వాంగ్మూలాన్ని బెంగళూరు పోలీసులు నమోదు చేశారు. అయితే విజయలక్ష్మి నివాసంలో దర్శన్ బూట్లు కనిపించడంతో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. రేణుకస్వామి హత్య కేసులో ఇప్పటివరకు దాదాపు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.ఇండస్ట్రీకి సంబంధం లేదు: కిచ్చా సుదీప్అయికే మరోవైపు.. ఈ వ్యవహారంతో కన్నడ ఇండస్ట్రీకి సంబంధం లేదంటూ ఇప్పటికే హీరో కిచ్చా సుదీప్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీకి చెడ్డపేరు తీసుకురావొద్దని కోరారు. -
దర్శన్ రాక్షసుడు.. శాఖాహారి నటితో నాన్వెజ్ తినిపించాడు!
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ హీరో దర్శన్ను కఠినంగా శిక్షించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. కన్నడ బిగ్బాస్ 9వ సీజన్ కంటెస్టెంట్ ప్రశాంత్ సంబర్గి సైతం హీరోను ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టకూడదని కోరుతున్నాడు. దర్శన్ తన గ్యాంగ్తో కలిసి శాఖాహారి అయిన రేణుకాస్వామి నోట్లో బలవంతంగా మాంసం ముక్కలు కుక్కి, విచక్షణారహితంగా దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే! అయితే గతంలోనూ దర్శన్ శాఖాహారి అయిన ఓ నటితో మాంసం తినిపించాడని ప్రశాంత్ ఆరోపించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు.అతడు హీరో కాదుదర్శన్ హీరో కాదు కేవలం నటుడు మాత్రమే! అతడు చేసిన దారుణాలు ఎన్నో ఉన్నాయి. రేణుకాస్వామి తాను శాఖాహారి అని చెప్తున్నా వినకుండా ఈ రౌడీ బాస్ బలవంతంగా మాసం తినిపించాడు. మూడేళ్ల క్రితం ఇలాంటి సంఘటనే జరిగింది. దర్శన్తో షూటింగ్ చేస్తున్న ఓ కన్నడ నటి శాఖాహారం తెప్పించమని అడిగింది. రాక్షసుడుఆమె పూర్తిగా వెజిటేరియన్. అయినా సరే తన మాటల్ని లెక్క చేయలేదు. దర్శన్ ఆదేశించడంతో అక్కడున్న వాళ్లు భోజనంలో నాన్వెజ్ కలిపి తీసుకొచ్చారు. అది తెలియక నటి భోజనం చేస్తుండగా అతడు దుర్యోధనుడిలా పగలబడి నవ్వాడు. దర్శన్ మనిషి కాదు నరరూప రాక్షసుడు. అలాంటివారికే ఇలాంటి ఆలోచనలు వస్తాయి అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. గత కొన్ని రోజుల క్రితం దర్శన్ గురించి మరో పోస్ట్ కూడా షేర్ చేశాడు.రౌడీ బాస్..'కన్నడ సినిమా ఇండస్ట్రీలోని ఓ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ నా స్నేహితుడు. అతడు ఓ టీవీ రియాలిటీ షోకి జడ్జిగా వ్యవహరించాడు. రెండేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయాడు. ఆ గుండెపోటుకు కారణం ఈ రౌడీ బాసే (డీ బాస్ ఇప్పుడు రౌడీ బాస్ అయ్యాడు)! ఈ ఆరడుగుల మృగం తనను మానసికంగా వేధించాడు.. బెదిరింపులకు పాల్పడ్డాడు. దానివల్లే ఆయన మరణించాడు' అని పేర్కొన్నాడు.చదవండి: తెలుగు సినిమాల్లో నటించకపోవడానికి కారణం ఇదే: విజయ్ సేతుపతి -
దర్శన్ కేసు.. రోజుకొక పేరు
దొడ్డబళ్లాపురం/ యశవంతపుర/ మైసూరు: చిత్రదుర్గకు చెందిన అభిమాని రేణుకాస్వామి హత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతూ కొత్త కొత్త ముఖాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కామాక్షిపాళ్య పోలీసులు మరో నటునికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే కమెడియన్ చిక్కణ్ణకు నోటీసులు ఇచ్చి బెంగళూరులోని స్టోని బ్రూక్ పబ్లో మహజర్కు తీసికెళ్లారు. నటుడు యశస్ సూర్యకు కూడా విచారణకు హాజరవ్వాలని సూచించారు. హత్య జరిగిన రోజు స్టోని బ్రూక్ పబ్లో హీరో దర్శన్తో పాటు యశస్ విందులో పాల్గొన్నాడని తెలియడమే దీనికి కారణం. కాగా, పోలీసుల అదుపులో ఉన్న నటి పవిత్రగౌడ మంగళవారం అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిసింది.మైసూరు హోటల్లో మహజరుహీరో దర్శన్ పర్సనల్ మేనేజర్ నాగరాజు, కారు డ్రైవర్ లక్ష్మణ్ను మంగళవారం పోలీసులు మైసూరుకు తీసుకువచ్చి స్థల పరీశీలన జరిపారు. బెంగళూరు నుంచి పోలీసు వ్యాన్లో వారిని మైసూరులోని ర్యాడిసన్ బ్లూ హోటల్కు తీసుకువచ్చారు. హత్య సమయంలో నటుడు దర్శన్ మైసూరులో ఇదే హోటల్లో ఉంటూ లలిత మహల్లో జరుగుతున్న డెవిల్ సినిమా షూటింగ్లో పాల్గొనేవాడు. కువెంపు నగరలో ఉన్న గోల్డ్ జిమ్కు కూడా వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో హత్య గురించి ఇక్కడ చర్చించారా అని నిందితులతో హోటల్, దర్శన్ సంచరించిన ప్రాంతాల్లో విచారణ జరిపారు. తరువాత టి.నరిసిపుర రోడ్డులో ఉన్న దర్శన్ ఫాంహౌస్కు తీసుకెళ్లారు.పకడ్బందీగా దర్యాప్తు: కమిషనర్రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు కాస్త ఏమరుపాటుగా ఉన్నా కేసు దారి తప్పేదని బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ దయానంద్ అన్నారు. కేసులో ఇప్పటివరకూ దర్శన్తో కలిపి మొత్తం 17మందిని అరెస్టు చేసి అన్ని కోణాల్లో విచారణ జరిపామన్నారు. కేసులో సాక్ష్యాధారాలను టెక్నాలజీ సాయంతో సేకరిస్తున్నట్లు చెప్పారు. ఫోరెన్సిక్, టెక్నాలజీ, చట్టపర సలహాలు తీసుకుని ముందుకు పోతున్నామన్నారు.మళ్లీ బాతుల కేసుమైసూరు సమీపంలో టి.నరిసిపుర రోడ్డులోని దర్శన్ ఫాంహౌస్లో అరుదైన బార్ హెడెడ్ గూస్ అనే అరుదైన జాతి బాతులు కొన్ని ఉన్నాయి. వీటిని పెంచుకోవడం నిషిద్ధం కావడంతో అటవీ సిబ్బంది గతంలో దర్శన్ దంపతులు, వారి మేనేజర్ నాగరాజుపైన కేసులు పెట్టారు. దీనిపై త్వరలో విచారణ చేపట్టనున్నారు.ఎవరు చేసినా నేరమే: ఉమాపతిదర్శన్ వ్యవహారంపై నిర్మాత ఉమాపతి స్పందిస్తూ హత్య చేయడం నేరం. అది ఎవరూ చేసినా తప్పే. అలాంటి వ్యక్తికి శిక్ష పడాలి. నాకు తెలిసినంత వరకు మృతుడు రేణుకాస్వామి వదిలేయాలని ఎంత వేడుకున్నా వదలకుండా చంపేశారని తెలిసింది. రేణుకాస్వామి భార్య గురించి ఏమి మాట్లాడాలో తెలియని పరిస్థితి. దర్శన్ అభిమానినే హత్య చేయటం ఎంతవరకు న్యాయం అని ఉమాపతి ప్రశ్నించారు. దర్శన్ దేవుడంత మనిషి అయినా కుక్క బుద్ధి కలవాడు అని విమర్శించారు. నటుల పాత్ర ఉంటే కేసు పెడతాం: హోంమంత్రిహత్య కేసులో దర్శన్తో పాటు ఇతర నటుల పాత్ర ఉందని తేలితే కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని హోంమంత్రి జీ. పరమేశ్వర్ తెలిపారు. బెంగళూరు సదాశివనగరలో నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, దర్శన్ ఒక నటుడు కాబట్టి సహజంగానే అతడితో అనేకమంది నటులు కలిసి తిరుగుతుంటారని అంత మాత్రాన వారందరినీ అనుమానంతో చూడలేమన్నారు. త్వరలో రేణుకాస్వామి కుటుంబాన్ని కలిసి పరామర్శిస్తానన్నారు. ఎస్ఐ ఉద్యోగాల భర్తీ చివరిదశలో ఉందన్నారు. ఇంధన ధరల గురించి ధర్నాలు చేస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం 14 సార్లు ధరలు పెంచిన సంగతి మర్చిపోయిందా అని ప్రశ్నించారు. -
దర్శన్ మేనేజర్ సూసైడ్
బెంగళూరు: రేణుకాస్వామి అనే యువకుడి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం(జూన్ 18) హీరో దర్శన్ ఫాంహౌజ్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు.బెంగళూరులోని దర్శన్ ఫామ్హౌస్లోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. శ్రీధర్ చనిపోతూ ఒక సూసైడ్నోట్ రాయడంతో పాటు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు లేఖ, వీడియోలో శ్రీధర్ తెలిపారు. తన చావుకు తానే బాధ్యుడినని వేరే ఎవరూ కారణం కాదని స్పష్టం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, తన ప్రియురాలు నటి పవిత్ర గౌడకు అశ్లీల సందేశాలు పంపుతూ దూషిస్తూ మెసేజ్లు పెట్టినందుకే రేణుకాస్వామిని దర్శన్ హత్య చేయించాడని ఆరోపణలున్నాయి. -
కన్నడ హీరో దర్శన్ మేనేజర్ సూసైడ్.. ఘటనాస్థలిలో కీలక ఆధారాలు!
హీరో దర్శన్ అభిమాని హత్య కేసు శాండల్వుడ్ను కుదిపేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో దర్శన్ కారు కనిపించడంతో పోలీసులు అతన్ని నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం ఈ కేసులో పవిత్ర గౌడ, దర్శన్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా మరో షాకింగ్ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. దర్శన్కు చెందిన బెంగళూరు ఫామ్హౌస్ను చూసుకునే మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతదేహాన్ని ఫామ్హౌస్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడే సూసైడ్ నోట్తో పాటు వీడియో సందేశం పోలీసులకు లభించాయి.విపరీతమైన ఒంటరితనం కారణంగానే జీవితాన్ని ముగిస్తున్నట్లు సూసైడ్ నోట్లో మేనేజర్ శ్రీధర్ పేర్కొన్నాడు. ఈ కేసులో తన మిత్రులు, బంధువులకు ఎలాంటి సంబంధం లేదని.. తన మరణానికి తానే కారణమని సూసైడ్ నోట్లో రాసుకున్నాడు. అయితే మేనేజర్ ఆత్మహత్యకు, దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసుకు మధ్య ఉన్న సంబంధంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
హీరో దర్శన్ కేసులో మరో కన్నడ హీరోకి నోటీసులు
వ్యక్తిని హత్య చేసిన కేసులో కన్నడ హీరో దర్శన్ అరెస్ట్ కావడం ఈ మధ్య కలకలం రేపింది. రోజురోజుకి కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్. కన్నడ హాస్య నటుడు కమ్ హీరో చిక్కన్నకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అలానే పోలీస్ స్టేషన్కి కూడా తీసుకొచ్చారు. దీంతో ఇప్పుడీ విషయం కాస్త ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?)కన్నడ హీరో దర్శన్.. జూన్ 8న రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకర మెసేజులు, వీడియోలని మొబైల్లో పంపడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఓవైపు విచారణ, మరోవైపు దర్యాప్తు సాగుతోంది.అయితే హత్య జరగడానికి ముందు దర్శన్తో పాటు అతడి మనుషులు.. బెంగళూరు రాజేశ్వరి నగర్లోని స్టోనీ బ్రూక్ రెస్టారెంట్లో పార్టీ చేసుకున్నారు. దీనికి దర్శన్ ఫ్రెండ్, నటుడు చిక్కన్న కూడా హాజరయ్యాడు. ఈ క్రమంలోనే పార్టీ చేసుకునే టైంలో హత్య గురించి దర్శన్ ఏమైనా చర్చించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చిక్కన్నకు నోటీసులు ఇచ్చారు. ఇతడికి హత్యతో సంబంధం లేదు కాబట్టి అరెస్ట్ చేయలేదు. కేవలం కొన్ని వివరాలు అడిగి తెలుసుకుని వదిలేశారు.(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ అమలా పాల్.. వీడియో వైరల్!) -
రేణుకాస్వామి హత్య కేసు.. సీన్లోకి కమెడియన్ చిక్కణ్ణ
దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో హీరో దర్శన్, నటి పవిత్రగౌడతో పాటు రోజుకొక కొత్త ముఖం పేరు వినిస్తోంది. తాజాగా కమెడియన్ చిక్కణ్ణను వెంటాడుతోంది. రేణుకాస్వామి హత్య జరిగిన రోజు అంటే ఈ నెల 8వ తేదీన నగరంలోని స్టోని బ్రూక్ రెస్టారెంట్లో దర్శన్తో పాటు చిక్కణ్ణ కూడా ఉన్నట్టు సమాచారం. వారితో పాటు దర్శన్ అనుచరులు ఉన్నారు. మధ్యాహ్నం నుంచి పార్టీలో పాల్గొన్న దర్శన్ సాయంత్రం వేళకు అర్జెంట్ పని ఉందని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. పారీ్టలో చిక్కణ్ణ ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. కామాక్షిపాళ్య పోలీసులు దర్శన్ అనుచరునిగా పేరున్న ధనరాజ్ ఆలియాస్ రాజ అనే మరో నిందితున్ని అరెస్టు చేశారు. రేణుకాస్వామిపై దాడి చేసిన సమయంలో దర్శన్తో పాటు అతడు కూడా ఉన్నట్టు పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. ధనరాజ్.. పవిత్రగౌడ ఇంట్లో పనిచేసేవాడు. మజా చేసిన పబ్లో విచారణ బెంగళూరు ఆర్ఆర్ నగరలోని స్టోని బ్రూక్ పబ్లో సోమవారం నాడు పోలీసులు మహజర్ చేపట్టారు. దర్శన్, రెస్టారెండ్ యజమాని వినయ్, ప్రదోశ్, పవన్ ఇతర నిందితులతో పాటు కమెడియన్ చిక్కణ్ణను కూడా పోలీసులు తీసుకువచ్చారు. హత్య జరిగిన 8వ తేదీన పబ్లో జరిగిన పారీ్టలో చిక్కణ్ణ కూడా ఉన్నాడని తెలిసి ఆయనకు పోలీసులు నోటీసు ఇచ్చి మహజర్కు తీసుకువచ్చారు. ఈ సమయంలో పరిసరాల్లో బందోబస్తు పెంచారు. నన్ను వదిలేయండి ప్లీజ్ సినిమాలు, నిజ జీవితంలో దర్జా అనుభవించే దర్శన్కు పోలీస్ ఠాణా, విచారణ చాలా కష్టంగా ఉన్నాయి. కాళ్లు పట్టుకుంటాను... నన్ను వదిలేయండి అని పోలీసులను దర్శన్ వేడుకుంటున్నట్టు సమాచారం. ఈ హత్య తాను చేయమని చెప్పలేదని, ఏ తప్పూ చేయలేదని ప్లీజ్ వదిలేయండి అంటూ కన్నీటి పర్యంతమవుతున్నాడని తెలిసింది. గత వారం రోజులుగా దర్శన్ ఏ ప్రశ్నలు వేసినా ఇదే సమాధానం ఇస్తున్నాడని పోలీసులు తెలిపారు. రాజకాలువలో మొబైల్ కోసం రేణుకాస్వామి మొబైల్ఫోన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రేణుకాస్వామిని హత్య చేశాక అతని మొబైల్ను సుమనహళ్లి అనుగ్రహ లేఔట్లో బ్రిడ్జ్ వద్ద ఉన్న రాజకాలువలో శవాన్ని, మొబైల్ని పారేసినట్టు నిందితుడు వినయ్ చెప్పడంతో, సోమవారంనాడు ఫోన్ కోసం రాజకాలువలో వెతికారు. బీబీఎంపీ పౌర కారి్మకులతోనూ గాలించినా ఫోన్ ఇంకా దొరకలేదు.తప్పు చేస్తే శిక్ష పడాలి: ఉపేంద్ర రేణుకాస్వామి హత్యపై కన్నడ హీరోలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. సోమవారంనాడు ప్రముఖ హీరో ఉపేంద్ర ఎక్స్లో స్పందిస్తూ, ఈ హత్య కేసు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే సంచలనంగా మారింది. తప్పు చేసిన వారికి కఠిన శిక్ష పడాలి. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలి. రేణుకాస్వామి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. రమ్య, చేతన్, సుదీప్ తదితరులు ఇదివరకే స్పందిస్తూ రేణుకాస్వామి భార్యకి పుట్టబోయే బిడ్డకు, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఓ టీవీ నటి దర్శన్ చేసిన దానధర్మాలే ఆయనను కాపాడతాయని పోస్ట్ చేశారు. -
పవిత్రకు ఇంత పెద్ద కూతురు ఉందా?.. మొదటి భర్త ఎవరో తెలుసా?
ప్రస్తుతం శాండల్వుడ్లో హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ కేసు హాట్టాపిక్గా మారింది. ఓ అభిమాని హత్యకేసులో వీరిద్దరు ప్రస్తుతం పోలీసులు కస్టడీలో ఉన్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయి. వీరిద్దరు గత పదేళ్లుగా సహజీవనంలో ఉన్నట్లు తెలిసింది. పవిత్ర గౌడకు ఓ అభిమాని అశ్లీల సందేశాలు పంపడంతోనే హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదిలా ఉండగా.. నటి పవిత్ర గౌడ గురించి నెటిజన్స్ ఆరా తీయడం మొదలెట్టారు. అసలు ఆమె ఎవరు? ఇంతకీ పవిత్రకు పెళ్లయిందా? దర్శన్తో రిలేషన్లో ఉందా? అని తెలుసుకునేందుకు తెగ వెతికేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం నటి పవిత్రకు ఇప్పటికే పెళ్లయినట్లు తెలుస్తోంది. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ఆమె కూతురు ఖుషిగౌడ చేసిన పోస్ట్ నెట్టింట వైరలైంది. 'నాకు అన్ని నువ్వే.. హ్యాపీ ఫాదర్స్ డే' అంటూ ఆమె కూతురు ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమెకు ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. పవిత్ర 18 ఏళ్ల వయస్సులోనే సంజయ్ సింగ్ను వివాహం చేసుకుంది. వీరిద్దరి ఖుషీ అనే కూతురు ఉంది. ఆ తర్వాత సంజయ్ సింగ్తో పవిత్ర గౌడ విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పదేళ్లుగా దర్శన్తో రిలేషన్లో ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే దర్శన్తో ఉన్న రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసింది. కాగా.. పవిత్ర కన్నడ సినీ పరిశ్రమలో 2013 కామెడీ చిత్రం చత్రిగలు సార్ చత్రిగలుతో అరంగేట్రం చేసింది. 2016లో తమిళ థ్రిల్లర్ మూవీ 54321లో నటించింది. View this post on Instagram A post shared by 𝙋𝙖𝙫𝙞𝙩𝙝𝙧𝙖 𝙂𝙤𝙬𝙙𝙖 (@pavithragowda777_official) -
హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో
హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్ కావడం ఈ మధ్య కలకలం రేపింది. స్వయంగా అభిమానిని చంపాడనే ఆరోపణలతో ఇతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు ఇంకా కోర్టులోనే ఉంది. అలానే బయటకొస్తున్న ఒక్కో విషయం అందరికీ వరస షాకులు ఇస్తోంది. అయితే దర్శన్ అరెస్ట్ వల్ల కన్నడ ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వచ్చేలా ఉంది. దీంతో అప్రమత్తమైన ప్రముఖ కన్నడ హీరో సుదీప్.. దీంతో ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.'మీడియాలో ఏం చూపిస్తున్నారో మాకు కూడా అంతే తెలుసు. ఎందుకంటే మేం నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి అడగలేం కదా! నిజాన్ని బయటపెట్టేందుకు పోలీసులు, మీడియా చాలానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో సందేహం లేదు. హత్యకు గురైన రేణుకా స్వామి కుటుంబానికి, అతడికి పుట్టబోయే బిడ్డకు న్యాయం జరగాలి. ఈ కేసులో న్యాయం గెలవాలి'(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!)'అయితే దర్శన్ అరెస్ట్ అవడంతో నింద అంతా సినిమా ఇండస్ట్రీపై వేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి న్యాయం జరగాలి.. కన్నడ చిత్రపరిశ్రమలో ఎందరో నటులున్నారు. ఇది ఏ ఒక్కరికో ఇద్దరికో సంబంధించనది కాదు. నిందితుడికి శిక్ష పడితే ఫిల్మ్ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటుంది' అని సుదీప్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.ఈ నెల 8న రేణుకా స్వామి అనే వ్యక్తి అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు. ఇతడిని ఎవరు చంపారనే కోణంలో ఆరా తీయగా.. హీరో దర్శన్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తనతో రిలేషన్లో ఉన్న పవిత్ర గౌడని రేణుకాస్వామి ఇబ్బంది పెట్టడంతోనే దర్శన్ కోపం పెంచుకుని రేణుకా స్వామిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు దర్శన్ సహా 11 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది.(ఇదీ చదవండి: కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
పవిత్రగౌడ ఇంట్లో సోదాలు.. దుస్తులు, చెప్పులు సీజ్
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలిగా ఉన్న పవిత్రగౌడ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఆర్ఆర్ నగరలో ఉన్న పవిత్రగౌడ ఇంటికి ఆమెను, ఆమె అనుచరుడు పవన్ను తీసుకెళ్లారు. హత్య జరిగాక పవిత్ర నేరుగా ఇంటికి వెళ్లిపోయింది, ఆ రోజు ఆమె ధరించిన దుస్తులు, దాడికి ఉపయోగించిన చెప్పును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడు అయిన పవిత్రగౌడ మేనేజర్ దేవరాజును పోలీసులు అరెస్టు చేశారు. హత్య జరిగిన షెడ్ వద్దకు పవిత్రగౌడతో కలిసి దేవరాజు కూడా వెళ్లాడని దర్యాప్తులో తేలడంతో శనివారం అర్ధరాత్రి అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. రేణుకాస్వామిపై మొదట దాడిచేసింది పవిత్ర అని తెలిసింది. రేణుకాస్వామి ఉంగరం, చైన్ తదితరాలను నిందితులు లాక్కున్నట్టు పోలీసులు తెలిపారు.దర్శన్ను కలిసిన నిందితులురేణుకాస్వామి మృతదేహం లభించగానే లొంగిపోవాలని డీల్ కుదుర్చుకున్న నిందితులు లొంగిపోవాలా, లేక కొన్ని రోజులు వేచి చూడాలా అనే మీమాంసలో పడిపోయారు. దీనిపై మైసూరులో ఒక హోటల్లో ఉన్న దర్శన్ వద్దకు వెళ్లి చర్చించారని విచారణలో తేలింది. దీంతో పోలీసులు సదరు హోటల్లో కూడా మహజర్ చేయవచ్చని తెలుస్తోంది.కరెంటు షాకిచ్చి..రేణుకాస్వామికి కరెంట్ షాక్ ఇచ్చి హింసించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య తరువాత ఆ పరికరాన్ని బెంగళూరు–మైసూరు హైవేలో విసిరేశారు. దీంతో పోలీసులు విజయనగర ప్రాంతంలో హైవేలో పరికరం కోసం గాలింపు చేపట్టారు.సీఐ గిరీష్ నియామకంరేణుకాస్వామి కేసును దర్యాప్తు చేస్తున్న బృందంలోకి సీఐ గిరీష్ నియమితులయ్యారు. ఎన్నికల సమయంలో కామాక్షిపాళ్య పోలీస్స్టేషన్కు తాత్కాలిక సీఐ గిరీష్ బదిలీపై వచ్చారు. తరువాత అక్కడే రేణుకాస్వామి హత్య వెలుగు చూసింది. దర్శన్ అరెస్టు సమయంలో గిరీష్ను మళ్లీ సీకే అచ్చుకట్టు పోలీస్స్టేషన్కు పంపించారు. అయితే కేసు విచారణకు అవసరమని గిరీష్ను తనిఖీ అధికారిగా నియమించారు. -
Darshan: రేణుకాస్వామి నోట్లో బిరియాని కుక్కి..
బనశంకరి: రేణుకాస్వామి హత్యకేసులో నటుడు, చాలెంజింగ్ స్టార్ దర్శన్, అతని ప్రియురాలు, నటి పవిత్రగౌడతో పాటు 14 మందికి 5 రోజుల పాటు బెంగళూరు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు 19 మందిని అరెస్ట్ చేశారు. శనివారం కస్టడీ ముగిశాక కోర్టులో హాజరు పరిచారు. దర్శన్, పవిత్రగౌడ, పవన్, రాఘవేంద్ర, నందీశ్, జగదీశ్, అనుకుమార్, వినయ్, నాగరాజ్, లక్ష్మణ, దిలీప్, ప్రదోశ్ , కేశవమూర్తి అనే వారిని మరింత విచారించాలని, కాబట్టి కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోరారు. దీంతో 5 రోజుల కస్టడీకి అనుమతించడంతో వారిని విచారణకు తరలించారు. కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో ముఖం కనిపించకుండా పవిత్ర కొంగు కప్పుకుంది. జడ్జి ముందు విలపిస్తూ నిలబడింది.ప్రత్యేక న్యాయవాది నియామకంరేణుకాస్వామి హత్య కేసులో పోలీసుల తరఫున వాదించేందుకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రసన్న కుమార్ను సర్కారు నియమించింది.క్షమించమన్నాడు, డబ్బులు ఇచ్చి పంపించమన్నాదొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని హీరో దర్శన్ పదేపదే చెబుతున్నట్లు తెలిసింది. అయితే తాను, పవిత్రగౌడ కలిసి రేణుకాచార్యను ఉంచిన షెడ్కు వెళ్లినట్లు ఒప్పుకున్నాడు. దర్శన్ ఏం చెప్పారంటే... సార్.. నాకేం తేలీదు. రేణుకాస్వామిని తీసుకువస్తున్నట్లు నాకు ముందుగా చెప్పలేదు. బ్రూక్ రెస్టారెంట్లో స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా పవన్ వచ్చి రేణుకాస్వామిని పట్టుకు వచ్చామని చెప్పాడు. దీంతో పవిత్రగౌడను తీసుకుని షెడ్ వద్దకు వెళ్లాను. క్షమాపణ చెప్పించి వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామని అనుకున్నాను. పవిత్రను చూడగానే రేణుకాస్వామి తప్పు జరిగింది, క్షమించమని వేడుకున్నాడు. దీంతో అతడికి ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఊరికి వెళ్లిపోవాల్సిందిగా చెప్పి వచ్చేశాను. నేడు షెడ్ నుండి బయటకు రాగానే వీళ్లంతా కలిసి రేణుకాస్వామిని కొట్టి హత్య చేశారు. ఇంతకు మించి తనకేం తెలీదని చెబుతున్నాడు. షెడ్ వద్దకు దర్శన్, పవిత్ర కార్లు రావడం, శవం పడేసిన చోటు కూడా వారి కార్లు తిరిగినట్లు సీసీ కెమెరాల్లో ఉండడం ఇద్దరికీ క్లిష్టంగా మారింది.రేణుకాస్వామి నోట్లో బిరియాని కుక్కి..దొడ్డబళ్లాపురం: డి.బాస్ ముఠా ఆగడాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తున్నాయి. అభిమాని, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని ఎలా హత్య చేసిందీ పోలీసులు వివరాలు లాగేకొద్దీ కొత్త సంగతులు బయటపడుతున్నాయి. 8వ తేదీ సాయంత్రం రేణుకాస్వామిని షెడ్లో బంధించి హింసించిన నిందితులు బిరియాని తెప్పించి మాంసం ముక్కలు నోట్లో కుక్కారు. లింగాయత కులానికి చెందిన రేణుకాస్వామి పూర్తి శాకాహారి. ఆ సంగతి తెలిసి కావాలనే అతనితో చనిపోయే ముందు బిరియాని తినిపించారు. బాస్ వస్తారు, ముక్కలు తిని రెడీగా ఉండు, తన్నులు తినడానికి బలం కావాలి కదా.. అంటూ ముఠా సభ్యులు అతన్ని హేళన చేశారు. నిందితుల్లో ఒకడైన దీపక్ పోలీసుల విచారణలో ఇదంతా చెప్పాడు. -
చిక్కుల్లో చిత్ర పరిశ్రమ.. ఎలా ఉండేది ఎలా అయిపోయింది!
సినిమాలో హీరోహీరోయిన్కి కష్టాలు ఉండటం కామన్. కానీ ఇప్పుడు వాళ్లకు రియల్ లైఫ్లోనూ ఇబ్బందులు తప్పట్లేదు. కొందరు వీటిని కోరి తెచ్చుకుంటే మరికొందరు మాత్రం ఊహించని విధంగా ప్రమాదాల్లో ఇరుక్కుంటున్నారు. దీంతో ఎన్నడూ లేనిది ఒక్కసారిగా ఇండస్ట్రీలో మూడ్ మారిపోయింది. ఎంతలా అంటే సినిమాల గురించి మాట్లాడుకునే వాళ్లు కాస్త సెలబ్రిటీలని ఊహించని చోట చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ అసలేం జరుగుతోంది?దర్శన్ కేసుకన్నడ హీరో దర్శన్ అరెస్ట్. ఈ మధ్య కాలంలో దీనంత షాకింగ్ సంఘటన మరొకటి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు గురించి సింపుల్గా చెప్పుకొంటే.. దర్శన్కి ఇదివరకే విజయ్ లక్ష్మితో పెళ్లయింది. కానీ పవిత్ర గౌడ అనే నటితో గత కొన్నేళ్లుగా రిలేషన్లో ఉన్నాడు. అయితే తన అభిమాన హీరో కుటుంబంలో కలతలకు ఈమెనే కారణమని భావించిన ఓ అభిమాని.. పవిత్రకు అసభ్యకర ఫొటోలు, వీడియోలని పంపించాడు. దీంతో పవిత్ర, ఈ విషయాన్ని దర్శన్కి చెప్పగా ఇతడు సదరు వ్యక్తిని దారుణంగా హత్య చేయించాడు. ఇప్పుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు.(ఇదీ చదవండి: కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్)పవిత్ర-చందు మరణాలుతెలుగు సీరియల్ 'త్రినయని'లో కీలక పాత్ర పోషిస్తున్న నటి పవిత్ర జయరాం.. కొన్నిరోజుల క్రితం సొంతూరి నుంచి హైదరాబాద్కి తిరిగొస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించింది. అయితే ఈమెని ప్రేమిస్తున్న సహ నటుడు చందు.. ఈమె మరణాన్ని తట్టుకోలేక పవిత్ర చనిపోయిన రెండు మూడు రోజుల్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మరణాలు అందరికీ షాకయ్యేలా చేశాయి.డ్రగ్స్ కేసులో హేమ టాలీవుడ్లో డ్రగ్స్, రేవ్ పార్టీ లాంటివి అప్పుడప్పుడు వినిపించే మాటలు. రీసెంట్గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ ఉండటం, ఈ కేసులో ఆమెని అరెస్ట్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఆమెని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆమెకు బెయిల్ కూడా వచ్చింది. అయితే ఎన్నడూ లేనిది ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్నట్లు దక్షిణాదిలో పలు షాకింగ్ సంఘటనలు జరుగుతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో కొన్ని స్వీయ తప్పిదాలు ఉండగా, మరికొన్ని అనుకోకుండా జరిగినవి. మరి వీటికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాలి?(ఇదీ చదవండి: ఏడేళ్లుగా కనిపించని దర్శన్ మేనేజర్.. కారణం ఏంటి..?) -
ఏడేళ్లుగా కనిపించని దర్శన్ మేనేజర్.. కారణం ఏంటి..?
కన్నడ టాప్ హీరో దర్శన్, ప్రస్తుతం హత్య కేసులో చిక్కుకుని పోలీసుల విచారణలో ఉన్నాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడకు రేణుకాస్వామి అనే వ్యక్తి అసభ్య మెసేజ్లు పెడుతున్నాడని అనుచరుల సాయంతో అతన్ని హత్య చేపించాడని తెలుస్తోంది.1997లో మహాభారత అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత 2000 సంవత్సరంలో రెండు చిత్రాలు విడుదల చేసి హీరోగా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో 100కు పైగా చిత్రాల్లో మెప్పించిన దర్శన్ తూగుదీప ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. దినకర్ అనే తన తమ్ముడు ఈ ప్రొడక్షన్స్ బాధ్యతలు నిర్వహించేవాడు.అయితే, దర్శన్ వద్ద 2018 నుంచి మేనేజర్గా పనిచేస్తున్న మల్లికార్జున్ అనే వ్యక్తి గత ఏడేళ్లుగా కనిపించడం లేదు. ఏడేళ్ల క్రితం దర్శన్ పేరు చెప్పి కన్నడ సినీ ఇండస్ట్రీలో కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు మల్లికార్జున్పై ఆరోపణలు ఉన్నాయి. ప్రేమ బరహ అనే సినిమా పంపిణీ బాధ్యత తూగుదీప ప్రొడక్షన్కి అప్పగించగా ఆ పనులు మొత్తం మల్లికార్జున్ చూసుకున్నాడు. సినిమా హక్కులు విక్రయించి వచ్చిన డబ్బుతో మల్లికార్జున్ పరారయ్యాడు. ఆనాటి నుంచి దర్శన్ చేతికి కూడా దొరకలేదని అందరూ చెప్పుకుంటున్నారు. కానీ ఆయనపై దర్శన్ ఎలాంటి కేసు పెట్టలేదని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ వివాదం కూడా మళ్లీ తెరపైకి వచ్చింది. -
హత్య జరుగుతుందని ఊహించలేదు
దొడ్డబళ్లాపురం: తనకు అసభ్యంగా మెసేజ్లు పెడుతున్నాడని రేణుకాస్వామి గురించి దర్శన్కు చెప్పానే కానీ, హత్య చేస్తారని అసలు ఊహించలేదని రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలిగా ఉన్న పవిత్రగౌడ చెప్పుకొచ్చారు. పోలీసుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆమె.. రేణుకాస్వామిని హత్య చేస్తారని ఏమాత్రం అనుమానం వచ్చినా పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకునేదాన్నని అన్నారు. అశ్లీల మెసేజ్ విషయం దర్శన్కు తెలిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తనకు తెలుసని, అందుకే మొదట దర్శన్కు చెప్పకుండా ఆ మెసేజ్ను పవన్కు చూపించినట్లు చెప్పినట్లు సమాచారం. నోరు విప్పని దర్శన్ రేణుకాస్వామి హత్యకు సంబంధించి పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు దర్శన్ తనకు ఏమీ తెలీదని చెప్పడం లేదా మౌనంగా ఉండిపోతున్నాడని తెలిసింది. ఈ కేసులో అరెస్టైన దర్శన్ ప్రియురాలు పవిత్రగౌడ ఇతర నిందితులు చాలా ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తుండగా దర్శన్ మాత్రం చెప్పిందే చెబుతున్నట్లు సమాచారం. అయితే రేణుకాస్వామిని స్కెచ్ వేసి హత్య చేయలేదని, బెదిరించి కొట్టి భయపెట్టి వదిలేయాలనుకున్నామని, దెబ్బలు తట్టుకోలేని రేణుకాస్వామి మృతి చెందినట్లు నిందితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి రేణుకాస్వామి కేసుకు సంబంధించి పోలీసులు చిత్రదుర్గలో స్పాట్ మహజర్ నిర్వహించారు. పగటి సమయంలో మీడియా, జనాల వల్ల పని కాదని భావించిన పోలీసులు గురువారం అర్థరాత్రి చిత్రదుర్గలో సీఐ సంజీవ్ గౌడ... నిందితుడు రఘును తీసుకువచ్చి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసిన స్థలం, సంఘటనకు సంబంధం ఉన్న ఇతర చోట్ల మహజర్ చేశారు. రఘు దర్శన్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. రేణుకాస్వామిని గుర్తించి కిడ్నాప్ చేయడంలో రఘు కీలకంగా వ్యవహరించారు. నగదు సీజ్ రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ పేరు బయటకు రాకుండా కుదుర్చుకున్న డీల్ ప్రకారం చేతులు మారిన రూ.30 లక్షల నగదు పోలీసులు సీజ్ చేసినట్టు సమాచారం. దర్శన్ ఇచ్చిన రూ.30 లక్షలు దర్శన్కు సంబంధించిన దగ్గరి వ్యక్తి ఇంట్లో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు ఇంటిపై రైడ్ చేసి నగదు సీజ్ చేశారు. అవకాశం దొరికినా తప్పించుకోని రేణుకాస్వామి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి చిత్రదుర్గ నుంచి బెంగళూరు తీసుకువచ్చే క్రమంలో మార్గం మధ్యలో అనేకసార్లు తప్పించుకునే అవకాశం లభించినా తప్పించుకోలేదని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఏ8గా ఉన్న నిందితుడు రవి పోలీసులకు లొంగిపోయాడు. రవి ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు మీడియాకు వివరించారు. నిందితుడు రవి క్యాబ్ డ్రైవర్. టొయోటా ఈటీఎస్ కారు అద్దెకు నడుపుతుంటాడు. ఈక్రమంలో రవి స్నేహితుడు జగ్గు కాల్ చేసి బెంగళూరుకు వెళ్లాలని కోరాడు. చిత్రదుర్గలో జగ్గు, రఘు, అను, రేణుకాస్వామి కారు ఎక్కారు. కారులో బెంగళూరు వస్తుండగానే ప్రయాణంలో పవిత్రగౌడకు పంపించిన మెసేజ్లపై జగ్గు, రఘు ప్రశ్నించారు. అయితే మెసేజ్లు పంపడం తనకు హాబీ అని రేణుకాస్వామి చెప్పుకున్నాడు. వారంతా మార్గం మధ్యలో తుమకూరులో టిఫిన్ చేయగా రేణుకాస్వామే బిల్ చెల్లించాడు. బెంగళూరు వచ్చేలోపు పలుసార్లు కారు నిలిపినా రేణుకాస్వామి తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. కారు బెంగళూరు కామాక్షిపాళ్యలోని షెడ్ వద్దకు చేరుకోగానే అక్కడ 30 మంది సిద్ధంగా ఉన్నారు. వారంతా రేణుకాస్వామిని చూసి ఈ బాడీని కొట్టడానికి ఇంతమంది అవసరమా అని నవ్వుకుని కొందరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రేణుకాస్వామిని రఘు లోపలకు తీసికెళ్లగా అను, రవి, జగ్గు చాలాసేపు బయటే వేచి ఉన్నారు. కొన్ని గంటల తరువాత బయటకు వచ్చిన రఘు రేణుకాస్వామి హత్య జరిగిపోయింది, అప్రూవర్గా మారతారా? అంటూ ప్రశ్నించాడు. రవి అందుకు నిరాకరించడంతో కారు అద్దె రూ.4వేలు ఇచ్చి పంపించేశాడు. రవి, అను, జగ్గు ముగ్గురూ చిత్రదుర్గకు తిరిగి వచ్చేశారు. అనంతరం హత్య వెలుగు చూసి విషయం పెద్దది కావడంతో భయపడ్డ రవి పోలీసులకు లొంగిపోయాడు.మరో ఇద్దరి అరెస్ట్ దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో మరో ఇద్దరు పట్టుబడ్డారు. చిత్రదుర్గకు చెందిన అనుకుమార్ ఆలియాస్ అను, జగదీష్ ఆలియాస్ జగ్గును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్ట్ అయిన వారి సంఖ్య 16కి చేరింది. రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి చిత్రదుర్గ నుంచి బెంగళూరు తీసుకురావడంలో వీరు ఇద్దరూ కీలకంగా వ్యవహరించారు. -
రేణుకా స్వామి హత్యకేసు.. లొంగిపోయిన హీరో దర్శన్ డ్రైవర్
అభిమానిని దారుణంగా హత్య చేసిన కేసులో కన్నడ హీరో దర్శన్ ఇటీవల అరెస్ట్ అయ్యాడు. ఇతడి ప్రేయసి, హీరోయిన్ పవిత్ర గౌడని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఇక రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో భాగంగా తాజాగా దర్శన్ కారు డ్రైవర్ రవి.. చిత్రదుర్గ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మరోవైపు రేణుకా స్వామి పోస్ట్ మార్టం జరగ్గా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.(ఇదీ చదవండి: 'కన్నప్ప' సినిమా తీయమని శివుడు చెప్పాడు: మంచు విష్ణు)ఈ కేసు పూర్వపరాలు పరీశిలిస్తే.. దర్శన్కి వీరాభిమాని రేణుకా స్వామి. కానీ తన అభిమాన హీరో భార్య దగ్గర కంటే ప్రేయసి పవిత్ర గౌడతో ఎక్కువగా ఉంటున్నాడని ఆమెకు, రేణుకా స్వామి అసభ్యకర మెసేజులు పంపించేవాడు. దీంతో సీరియస్ అయిన దర్శన్, తన స్నేహితులతో కలిసి ఈ నెల 8న రేణుకా స్వామిని హత్య చేశాడు. మృత దేహాన్ని బెంగళూరు కామాక్షి పాల్య పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైనేజీలో పడేశారు. అయితే రేణుకా స్వామి భార్య.. తన భర్త కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మొత్తం వ్యవహారం బయటకొచ్చింది.పోలీసులు దర్యాప్తు చేసి ఈ కేసులో మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. కన్నడ హీరో దర్శన్ ఏ-1, పవిత్ర గౌడ ఏ-2గా గుర్తించారు. రీసెంట్గా రేణుకా స్వామి పోస్ట్ మార్టం చేశారు. ఇతడి మర్మాంగాలపై గట్టిగా కొట్టడంతో చనిపోయినట్లు తేలింది. ఇది ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తోంది. ఇకపోతే దర్శన్, పవిత్ర గౌడకు ఈ నెల 17 వరకు కోర్టు రిమాండ్ విధించింది.(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ) -
'ఒకరిని కొట్టి చంపే హక్కు నీకెక్కడిది' దర్శన్పై నటి ఆగ్రహం
లక్షలాది మంచి అభిమానులను సంపాదించుకున్న హీరో దర్శన్ సరిదిద్దుకోలేని తప్పు చేశాడు. సినిమాలో మంచి పాత్రలు చేసే ఆయన నిజ జీవితంలో విలన్గా మారాడు. తన ప్రేయసి పవిత్రపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని తన అభిమాని, ఫార్మా ఉద్యోగి రేణుకా స్వామిని దారుణంగా చంపాడు. చిత్రదుర్గ్ దర్శన్ ఫ్యాన్ క్లబ్ కన్వీనర్ రాఘవేంద్ర (రఘు)తో కలిసి బెల్ట్, కర్రలతో బాది, గోడకేసి కొట్టి చంపి, తర్వాత బాడీని మురికి కాలువలో పడేశారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో దర్శన్, పవిత్రతో పాటు 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు.కొట్టి చంపే హక్కు నీకెక్కడిది?తాజాగా ఈ వ్యవహారంపై నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన(రమ్య) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక మనిషిని కొట్టి చంపే అధికారం ఎవరిచ్చారు? ఎవరైనా మనల్ని ఎక్కువగా ఇబ్బందిపెడితే వారి అకౌంట్ బ్లాక్ చేయాలి. అయినా అదేపనిగా ట్రోల్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అంతేకానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా? ఒక మనిషిని కొట్టి చంపే అధికారం ఎవరికీ లేదు. ఈ కేసును డీల్ చేస్తున్న పోలీసులను తప్పకుండా ప్రశంసించాల్సిందే! తీర్పు వచ్చేవరకు ఆగండిమీరు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పారదర్శకంగా విచారణ చేపడతారని ఆశిస్తున్నాను. ప్రజల్లో చట్టంపై నమ్మకాన్ని పెంపొందిస్తారని భావిస్తున్నాను అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. మరోవైపు హీరోయిన్ సంజన గల్రానీ.. దర్శన్ను వెనకేసుకొచ్చింది. సెలబ్రిటీలపై ఏవైనా ఆరోపణలు వచ్చాయంటే చాలు వెంటనే తప్పు చేశారని నమ్మేస్తారు. ఇంకా విచారణ జరుగుతోంది. అప్పుడే తుది నిర్ణయానికి వచ్చేయకండి అని పేర్కొంది.ఆ కారణం వల్లేకాగా దర్శన్కు విజయలక్ష్మి అనే భార్య ఉంది. ఇల్లాలిని పట్టించుకోకుండా నటి పవిత్రగౌడతో రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. దాదాపు పదేళ్లుగా పవిత్రతో కలిసుంటున్నాడు. భార్యను వదిలేసి ప్రియురాలితో తిరగడం అతడి అభిమాని రేణుకాస్వామికి నచ్చలేదు. ఆ కోపంతోనే పవిత్రకు అసభ్యంగా మెసేజ్లు పెట్టడం ప్రారంభించాడు. ఇది తారా స్థాయికి చేరడంతో పవిత్ర.. దర్శన్కు ఫిర్యాదు చేసింది. అతడు మందలించాల్సింది పోయి ఏకంగా అభిమాని ప్రాణాలే తీయడం శోచనీయం.చదవండి: సుశాంత్.. నువ్వు బతికే ఉన్నావ్..! -
హత్యపై దర్శన్ కుమారుడు కామెంట్.. కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర
కన్నడ ప్రముఖ నటుడు దర్శన్ ఆయన అనుచరులు రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశారనే కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయన ప్రియురాలు పవిత్రగౌడ కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆమె కారణంగానే ఈ హత్య జరిగినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. పవిత్ర వల్లే తన అభిమాన హీరో జీవితం నాశనం అవుతుందని రేణుకాస్వామి భావించాడు. ఆమె వల్లే భార్యను దర్శన్ దూరం చేసుకున్నాడని భావించిన రేణుకాస్వామి పవిత్రకు రేణుకాస్వామి వార్నింగ్ మెసేజ్లు పెట్టినట్లు తెలుస్తోంది.కన్నీళ్లు పెట్టుకున్న దర్శన్ ప్రియురాలుపోలీసుల విచారణలో నటి పవిత్ర కన్నీరు పెట్టుకుంది. తను చేసిన పొరపాటు వల్లే ఇదంతా జరిగిందని చెప్పుకొచ్చింది. 'చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి నాకు అసభ్య మెసేజ్లతో పాటు అశ్లీల చిత్రాలను పంపేవాడు. ఈ విషయాన్ని దర్శన్కు చెప్పి తప్పు చేశాను. ఒకవేళ రేణుకాస్వామి విషయాన్ని ముందుగా పోలీసుల దృష్టికి తీసుకెళ్లింటే ఈ హత్య జరిగేది కాదు. పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు.' అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.నా తండ్రిని దూషిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు: దర్శన్ కుమారుడురేణుకాస్వామి హత్యకేసులో అరెస్ట్ అయిన తన తండ్రి దర్శన్ గురించి 'వినీశ్ తూగుదీ' (15) ఒక పోస్ట్ పెట్టాడు. నా తండ్రి దర్శన్తో పాటు తల్లి విజయలక్ష్మికి మానసిక ప్రశాంతత అవసరం ఉంది. నా తండ్రిని భూతులతో దూషిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. నా తండ్రి హత్య చేసి ఉంటాడని నేను నమ్మడం లేదు. పోలీసుల దర్యాప్తు పూర్తి అయిన తర్వాతే అసలు విషయాలు తెలుస్తాయి. అంతవరకు కాస్త ఓపిక పట్టండి.' అని ఆవేదనతో దర్శన్ కుమారుడు వినీశ్ చెప్పుకొచ్చాడు. -
దర్శన్ కేసులో మరో నటుడు అరెస్ట్
ప్రముఖ నటుడు, చాలెంజింగ్ స్టార్ దర్శన్, ఆయన అనుచరులు రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశారనే కేసులో అరెస్టులు పెరుగుతున్నాయి. క్రమంగా మరింతమంది పాత్ర బయటపడుతోంది. పోలీసులు తాజాగా ప్రదోశ్ అనే నటున్ని అరెస్టు చేశారు. దీంతో అరైస్టెన నిందితుల సంఖ్య 14కు చేరింది. ప్రదోశ్ పలు కన్నడ చిత్రాలలో సహాయక నటునిగా నటించాడు. దర్శన్తో కలిసి బృందావన, బుల్ బుల్ సినిమాలలో నటించాడు. దర్శన్ గ్యాంగ్లో ప్రదోశ్ ఒకడిగా పేరుంది. గతంలో ఓ బీజేపీ మంత్రి వద్ద పని చేశాడు, ఆ పార్టీ ఐటీ విభాగంలోనూ ముఖ్యునిగా ఉండేవాడు. రేణుకాచార్య హత్య తరువాత దర్శన్ ప్రదోశ్కు రూ.30 లక్షలు ఇచ్చి సెటిల్ చేయమని సూచించాడు. ఈ కేసులో ఇంకా ముగ్గురు నిందితులు జగదీష్, రవి, రాజు ఉన్నారని, పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా, రేణుకాచార్య మృతదేహానికి బౌరింగ్ ఆస్పత్రిలో జరిపిన పోస్టుమార్టంలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. అతనికి ప్రైవేటు భాగాల్లో తీవ్రంగా హింసించారని, శరీరంలో అనేకచోట్ల గాయాలై ఎముకలు విరిగి ఉన్నాయని తెలిపారు.ఠాణా చుట్టూ నిషేధాజ్ఞలుదర్శన్, పవిత్రగౌడ, ఇతర నిందితులను అన్నపూర్ణేశ్వరి నగర పోలీస్స్టేషన్లో కస్టడీలో ఉంచిన సంగతి తెలిసిందే. దీంతో దర్శన్ అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో వారిని అదుపుచేయడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. అందుకే పోలీస్ స్టేషన్ను షామియానాతో మూసివేసి భద్రత పెంచారు. స్టేషన్ కాంపౌండ్ను పరదాలతో కప్పేసారు. సామాన్య ప్రజలను ఎంతో అవసరమైతే కానీ లోపలకు అనుమతించడం లేదు. లోపల ఎవరూ ఫోటోలు, వీడియోలు తీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చుట్టూ 144 నిషేధాజ్ఞలు, అలాగే 200 మీటర్ల చుట్టూ కర్ఫ్యూ విధించారు. ఈ నెల 17 వరకు ఇవి అమలులో ఉంటాయి. బాడీ తరలించిన స్కార్పియో సీజ్కామాక్షిపాళ్యలోని పట్టణగెరెలో షెడ్ నుంచి రేణుకాస్వామి మృతదేహాన్ని తరలించడానికి వాడిన స్కార్పియో కారుని కామాక్షిపాళ్య పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఆర్ నగర దర్శన్ అభిమానుల సంఘం అధ్యక్షుని ఇంటి వద్ద ఈ వాహనాన్ని పోలీసులు గుర్తించారు. ఈ వాహనం పునీత్ అనే వ్యక్తి పేరుమీద రిజిస్టర్ అయ్యింది. షెడ్ నుండి శవాన్ని తరలించడానికి సహాయపడిన గ్యారేజ్ మంజు కోసం పోలీసులు వెతుకుతున్నారు.భార్య ఇన్స్టా ఖాతా డిలిట్దర్శన్ భార్య విజయలక్ష్మి తన ఇన్స్టా ఖాతాను క్లోజ్ చేసి డిలిట్ చేశారు. దర్శన్ అరెస్టు కాగానే భర్తను ఇన్స్టా లో అన్ఫాలో చేశారు. ఇప్పుడు దర్శన్కు మద్దతుగా, వ్యతిరేకంగా వస్తున్న కామెంట్లు, పోస్టులతో ఏకంగా ఇన్స్టా నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. విజయలక్ష్మికి ముందునుంచి భర్తతో గొడవలు ఉండడం తెలిసిందే. ఈ కేసులతో విడాకులు తీసుకోవచ్చని సమాచారం.దర్శన్ను సస్పెండ్ చేయలేదుహత్య కేసులో అరైస్టెన దర్శన్పై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది అందరితో చర్చించి చర్యలు తీసుకుంటామని కన్నడ సినిమా వాణిజ్య మండలి అధ్యక్షుడు ఎన్ఎం సురేశ్ తెలిపారు. కన్నడ ఆర్టిస్టుల సంఘం,వాణిజ్య మండలి, ఇతర సినీ పెద్దలతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని, దర్శన్ను కన్నడ చిత్ర రంగం నుంచి సస్పెండ్ చేశారనే వార్త అవాస్తవమన్నారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని, వాణిజ్య మండలి ఎవరి తరఫున మాట్లాడదని అన్నారు. దర్శన్పై ఆరోపణ మాత్రమే ఉందని, కోర్టులో తీర్పు తరువాతే ఆయన నేరం చేశాడా, కాదా అనేది తెలుస్తుందన్నారు. మరోవైపు దర్శన్కు వ్యతిరేకంగా మండ్య సహా పలు ప్రాంతాల్లో భారీ నిరసనలు జరిగాయి. -
సినిమాను మించిన ట్విస్ట్లు.. దర్శన్ కేసులో విస్తుపోయే నిజాలు!
ఇటీవలే కాటేరా మూవీతో హిట్ కొట్టిన శాండల్వుడ్ హీరో దర్శన్ పేరు ప్రస్తుతం ఎక్కడ చూసినా మార్మోగిపోతోంది. తన అభిమాని అయిన రేణుకాస్వామిని(28) హత్య చేసినట్లు ఆయనపై ఆరోపణలు రావడం కన్నడ ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. అయితే ఈ కేసులో మరో నటి, ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు ఇదంతా చూస్తుంటే ఓ క్రైమ్ సినిమాను తలపించేలా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరో వైపు అసలు పవిత్ర గౌడ ఎవరు? అని తెగ ఆరా తీస్తున్నారు. అసలు ఆమెకు, దర్శన్కు మధ్య రిలేషన్ ఏంటని శాండల్వుడ్లో చర్చించుకుంటున్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకున్నారా? లేదా సహజీవనం చేస్తున్నారా? అన్న విషయాలపై నెట్టింట తెగ వెతికేస్తున్నారు.నటిగా ఎంట్రీ ఇచ్చి...మొదట టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవిత్ర సినిమాల్లోనూ నటించింది. 2016లో 54321 అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడలో సినిమాల్లో నటించారు. అంతే కాకుండా రెడ్ కార్పెట్ స్టూడియో 777 పేరిట ఒక బొటిక్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇటీవలే ఆమె ఇన్స్టాలో షేర్ చేసిన వీడియో కలకలం సృష్టించింది. మా బంధానికి పదేళ్లు అంటూ దర్శన్తో ఉన్న ఫోటోలను పవిత్ర పంచుకుంది.దర్శన్కు పెళ్లి.. పవిత్ర గౌడతో సహజీవనంమరోవైపు ఈ కేసులో పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటకొచ్చినట్లు తెలుస్తోంది. హీరో దర్శన్కు 20 ఏళ్ల క్రితమే విజయలక్ష్మి అనే మహిళతో వివాహం అయింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం దర్శన్ తన భార్యకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కన్నడ నటి పవిత్ర గౌడతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి రిలేషన్ వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందన్న బాధతో రేణుకాస్వామి అనే యువకుడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పవిత్రను లక్ష్యంగా చేసుకుని అశ్లీల సందేశాలు పోస్ట్ చేేసినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అదే అతడి హత్యకు దారితీసిందని దర్యాప్తులో వెల్లడైంది. హత్య అనంతరం మృతదేహాన్ని తరలించేందుకు రూ.30 లక్షలు ఇస్తానని దర్శన్ తమకు ఆఫర్ ఇచ్చాడని ముగ్గురు నిందితులు వెల్లడించారు. -
హత్య కేసులో నటుడు దర్శన్
-
ఖాకీ కస్టడీలో హీరో
సినిమాలో కంటే నిజజీవితంలో జరిగే సంఘటనలే మరింత నాటకీయంగా ఉంటాయని మళ్లీ రుజువైంది. షూటింగ్లో ఉండగా ప్రముఖ నటున్ని పోలీసులు అరెస్టు చేయడం, తరువాత ఆయన సన్నిహితురాలిని కూడా నిర్బంధించడం సినీ ఫక్కీలో జరిగిపోయింది. గతంలో కుటుంబ కలహాలతో వార్తల్లోకెక్కిన దర్శన్ ఇప్పుడు హత్య కేసులో నిందితుడు అయ్యాడు.దొడ్డబళ్లాపురం: ఓ యువకుని హత్యకు సంబంధించి ప్రముఖ హీరో, చాలెంజింగ్ స్టార్ దర్శన్, మరో నటి, ఆయన సన్నిహితురాలు పవిత్రగౌడతో పాటు 10 మంది బౌన్సర్లను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. రేణుకాస్వామి అనే యువకుని హత్య కేసులో దర్శన్ ప్రమేయం ఉందని కామాక్షిపాళ్య పోలీసులు మంగళవారం మైసూరులో దర్శన్ను అరెస్టు చేసి రాజధానికి తరలించారు. దర్శన్ అరెస్టు విషయం తెలుసుకున్న అభిమానులు కామాక్షిపాళ్య పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. బాస్.. బాస్.. ది బాస్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ నగరలోని దర్శన్ నివాసంతో పాటు పలుచోట్ల పోలీసులు భద్రతను పెంచారు. పవిత్రపై అసభ్య మెసేజ్లు... పోలీసు కమిషనర్ బి.దయానంద చెప్పిన ప్రకారం... సోషల్ మీడియాలో పవిత్రగౌడ ఫోటోలపై రేణుకాస్వామి తరచూ అసభ్యంగా మెసేజ్లు పెట్టేవాడు. ఆమె దర్శన్కు చెప్పడంతో రేణుకాస్వామిని గుర్తించి పట్టుకుని జూన్ 8న రాత్రి కామాక్షిపాళ్య వద్ద ఉన్న దర్శన్ అనుచరుడు వినయ్కు చెందిన షెడ్లోకి తీసుకువచ్చి చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు. అప్పుడు దర్శన్ అక్కడే ఉన్నారు. తరువాత మృతదేహాన్ని దగ్గరలో కాలువలోకి విసిరేశారు. జూన్ 9న సుమ్మనహళ్లి వద్ద ఉన్న రాజకాలువలో రేణుకాస్వామి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతింటుండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని రేణుకాస్వామిదిగా గుర్తించి విచారణ చేపట్టారు. ఇంతలో ముగ్గురు వ్యక్తులు డబ్బు గొడవలతో ఈ హత్య చేసినట్టు చెప్పుకుని పోలీసుల వద్ద లొంగిపోయారు. అయితే వారి వాంగ్మూలాలలో తేడా గమనించిన పోలీసులు గట్టిగా ప్రశ్నించగా దర్శన్ పేరు చెప్పారు. చిత్రదుర్గ నుంచి ఇలా రప్పించారు చిత్రదుర్గలో కేఈబీ రిటైర్డ్ ఇంజినీర్ కాశినాథ్ శివనగౌడ, రత్నప్రభ దంపతుల కుమారుడు రేణుకాస్వామి. గత ఏడాది సహనా అనే యువతితో పెళ్లయింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణీ. అతడు కూడా దర్శన్కు అభిమాని. ఈ నేపథ్యంలో రేణుకాస్వామిని మాయమాటలతో బెంగళూరులో నిందితుల వద్దకు తీసుకువచ్చిన చిత్రదుర్గ దర్శన్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్రను కూడా పోలీసులు అరెస్టు చేసారు. గత శనివారం దర్శన్ పిలుస్తున్నాడని చెప్పి రేణుకాస్వామిని రాఘవేంద్ర బెంగళూరుకు తీసుకువెళ్లాడు. శనివారం మధ్యాహ్నం తల్లితండ్రులకు ఫోన్ చేసిన రేణుకాస్వామి తాను స్నేహితులతో కలిసి భోజనం చేయడానికి వెళ్తున్నట్టు తెలిపాడు. ఆ తరువాత రేణుకాస్వామి ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబసభ్యుల్లో భయం నెలకొంది. చిత్రదుర్గ చెళ్లకెరె గేట్ వద్ద బాలాజీ బార్ వద్ద బైక్ లభ్యమైంది. సోమవారం మధ్యాహ్నం కామాక్షిపాళ్య పోలీసులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. కుమారుని హత్య వార్త తెలిసి వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పలుచోట్ల భద్రత పెంపు పోలీసులు దర్శన్, పవిత్ర, ఇతర నిందితులను కట్టుదిట్టమైన భద్రత మధ్య బౌరింగ్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు జరిపి తరువాత తమ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 13 మంది నిర్బంధంలో ఉన్నారు. దర్శన్ను పోలీసులు అరెస్టు చేయలేదని, విచారణ కోసం మాత్రమే తీసుకెళ్లారని ఆయన లాయర్ నారాయణస్వామి మీడియాకు తెలిపారు. దర్శన్ను వెస్ట్ డీసీపీ గిరీశ్ విచారిస్తున్నారని తెలిపారు. మొత్తం ఈ వ్యవహారం రాష్ట్ర సినీ, రాజకీయ రంగాల్లో తీవ్ర సంచలనానికి కారణమైంది. పలువురు సెలబ్రిటీలు విస్మయం వ్యక్తంచేశారు.దర్శన్ ప్రమేయంపై విచారణ : హోంమంత్రిశివాజీనగర: ఓ హత్య కేసులో నటుడు దర్శన్ పాత్ర గురించి విచారణ జరుగుతోంది, ఆ తరువాతనే స్పష్టత వస్తుందని హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం నగరంలో ఆయన మాట్లాడుతూ చిత్రదుర్గకు చెందిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసుల విచారణలో దర్శన్ పేరు వినిపించింది. అందుచేత విచారణ కోసం ఆయనను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముందుగా అరెస్ట్ అయిన నిందితులు దర్శన్ పేరు చెప్పారు. ఏ కారణానికి హత్య జరిగింది? దర్శన్ పేరు ఎందుకు వచ్చింది అనేది దర్యాప్తు తరువాతనే స్పష్టమవుతుంది అని చెప్పారు. -
హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్
హత్య కేసులో శాండల్వుడ్ హీరో దర్శన్ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తెల్లవారుజామున ఆర్ఆర్నగర్లోని ఆయన నివాసంలో కామాక్షిపాళ్య పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపినందుకు రేణుకాస్వామిని హత్య చేశారు. నటుడు దర్శన్ సూచనల మేరకే ఈ హత్య జరిగినట్లు సమాచారం. ఈ ఉదంతం సంచలనం సృష్టించింది.రెండు రోజుల క్రితం కర్ణాటకలోని సుమన్నహళ్లి బ్రిడ్జి సమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన నేపథ్యంలో కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మృతుడు, చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిగా గుర్తించారు. ఈ హత్య కేసులో దర్శన్కు సంబంధం ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్ దయానంద్ ప్రకటించారు. ఈ విషయమై మరికాసేపట్లో కమిషనర్ దయానంద్ విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు.ఈ ఘటన జూన్ 9న జరిగింది. రేణుకా స్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు తీసుకొచ్చి. వినయ్కు చెందిన షెడ్డులో ఉంచారు. ఆ సమయంలో రేణుకా స్వామిపై నలుగురు కలిసి దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ టీమ్లో దర్శన్ ఉన్నట్లు సమాచారం. రేణుకా స్వామి మరణించాక మృతదేహాన్ని ఒక కల్వర్టులో పడేశారు. దర్శన్ సూచన మేరకే హత్య చేసినట్లు నలుగురు నిందితులు పోలీసులు వద్ద అంగీకరించారని సమాచారం. కారణం ఇదేనా..?కన్నడ నటి పవిత్ర గౌడతో దర్శన్కు సంబంధం ఉందని గతంలో పుకార్లు వ్యాపించాయి. ఆయనతో సంబంధం ఉన్నట్లు ఇన్స్టాగ్రామ్లో వివాదాస్పద పోస్ట్ కూడా ఆమె చేసింది. దీంతో పవిత్ర గౌడపై దర్శన్ భార్య విజయ లక్ష్మి విమర్శలు గుప్పించింది. కొద్ది నెలల క్రితం ఈ వివాదం భారీగానే జరిగింది. అయితే, నటి పవిత్ర గౌడపై రేణుకా స్వామి కూడా సోషల్ మీడియాలో కొన్ని కించపరిచే పోస్ట్లు చేశారని తెలుస్తోంది. ఆమెకు అసభ్యకరమైన మెసేజ్లు పంపినట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే హత్య జరిగినట్లు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొంత సమయంలో మీడియా సమావేశం ద్వారా పోలీసులు వివరాలు తెలపనున్నారు. -
కేదార్నాథ్కు పోటెత్తుతున్న భక్తులు
ఉత్తరాఖండ్లో కొలువైన కేదార్నాథ్ దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ తగిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. భక్తుల రద్దీని అనుసరించి గంటకు 1,800 మందికి పైగా భక్తులు కేదార్నాథ్ను దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తులు అర్ధరాత్రి 12 గంటల వరకు స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించారు.గత మే నెలలోని 31 రోజుల్లో 5,54,671 మంది భక్తులు కేదార్నాథ్ను దర్శించుకున్నారు. చార్ధామ్ యాత్రకు ప్రభుత్వం ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించిన నేపథ్యంలో జూన్ రెండవవారం నుంచి భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉంది. కేదార్నాథ్లో దర్శన వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. రోజుకు 36 వేల మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.కేదారేశ్వరుని దర్శనం ఉదయం 4.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.30 వరకు కొనసాగుతుంది. అనంతరం స్వామివారికి బాల భోగం సమర్పిస్తారు. దీని కారణంగా ఆలయాన్ని కొద్దిసేపు మూసివేస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి మొదలై 7 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. -
సడెన్గా ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్బస్టర్ సినిమా తెలుగు వర్షన్
కన్నడలో గతేడాది రిలీజ్ అయిన కాటేరా బ్లాక్బస్టర్ హిట్ కొట్టింది. దర్శన్ హీరోగా నటించిన ఈ యాక్షన్ సినిమా ప్రభాస్ సలార్తో పోటీ పడి రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా కన్నడ వర్షన్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా తెలుగు వర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. కేజీఎఫ్ సినిమాకు పోటీగా కాటేరా సినిమాను నిర్మించారని కన్నడనాట భారీగా ప్రచారం జరిగింది. దీంతో కేజీఎఫ్ రికార్డులను కాటేరా బీట్ చేస్తుందని ప్రచారం జరిగింది. 1970 బ్యాక్డ్రాప్లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా కాటేరా చిత్రాన్ని దర్శకుడు తరుణ్ సుధీర్ తెరకెక్కించాడు. తాజాగా తెలుగుతో పాటు తమిళ వెర్షన్ జీ5 అందుబాటులోకి తెచ్చింది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఆదివారం నుంచి కాటేరా చిత్రాన్ని జీ5 విడుదల చేసింది. థియేటర్లలో విడుదలైన ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి మేకర్స్ తీసుకొచ్చారు. కాటేరా సినిమాలో దర్శన్ సరసన ఆరాధన రామ్ హీరోయిన్గా మెప్పించింది. సీనియర్ హీరోయిన్ మాలాశ్రీ కూతురు అయిన ఆరాధన రామ్ కాటేరాతోనే సాండల్వుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా సాధారణ కథనే అయినప్పటికీ కన్నడ ఆడియెన్స్కి ఎక్కేసింది. మరీ తెలుగు ప్రేక్షకులకు ఏ మాత్రం రీచ్ అవుతుందో చూడాల్సి ఉంది. -
హీరోయిన్తో సీక్రెట్ పెళ్లి?
తమిళ నటుడు దర్శన్ సీక్రెట్గా పెళ్లి చేసుకున్నాడంటూ ఓ వార్త వైరల్గా మారింది. ఇగ్లూ హీరోయిన్ అంజు కురియన్తో దర్శన్ పెళ్లిపీటలపై కూర్చున్నాడు. కొందరు నిజంగానే వారికి పెళ్లయిపోయిందని భావిస్తున్నారు. ఈ మేరకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఏదైనా యాడ్లో భాగంగానే ఈ పెళ్లి జరిగి ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. వాణిజ్య ప్రకటనలో భాగంగా వీరిద్దరూ పెళ్లి గెటప్లో కనిపించినట్లు తెలుస్తోంది. ఈ వెడ్డింగ్ రూమర్స్ గురించి అటు దర్శన్, ఇటు అను ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. కాగా దర్శన్.. కనా అనే క్రికెట్ మూవీలో కీలక పాత్రలో నటించి ఫేమస్ అయ్యాడు. తునివు (తెగింపు), అయలాన్ చిత్రాల్లోనూ మెరిశాడు. అను కురియన్ విషయానికి వస్తే.. నేరం అనే సినిమాతో కెరీర్ మొదలుపెట్టింది. తమిళ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసింది. ఓజ్లర్ మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. చదవండి: ఛాతీలో నొప్పి.. ప్రముఖ నటుడికి ఆంజియోప్లాస్టీ -
ఈసారి అమర్నాథ్ యాత్ర 45 రోజులే..
అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త. ప్రబుత్వం తాజాగా అమర్నాథ్ యాత్ర టైమ్ టేబుల్ను విడుదల చేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈసారి భక్తులు సహజసిద్ధ మంచు శివలింగాన్ని 45 రోజులు మాత్రమే దర్శనం చేసుకోగలుగుతారు. అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 నుండి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రభుత్వం పలు షరతులు విధించింది. యాత్ర చేయబోయే ప్రతివారూ శారీరకంగా దృఢంగా ఉండటం తప్పనిసరి. వారు మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవడంతో పాటు పలు మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. పలు భద్రాతా ఏర్పాట్లు చేసిన తరువాతనే ప్రభుత్వం అమర్నాథ్ యాత్ర టైమ్ టేబుల్ను విడుదల చేసింది 2024 అమర్నాథ్ యాత్ర ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ప్రారంభం కానుంది. అంటే జూన్ 29వ తేదీ అష్టమి తిథి మధ్యాహ్నం 02:19 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర ఆగస్టు 19తో ముగియనుంది. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ యాత్రకు వెళుతుంటారు. -
నేడు జూన్ నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 11 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న (బుధవారం) 65,051 మంది స్వామివారిని దర్శించుకోగా 26,239 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.51 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 6 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 16 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు3 గంటల్లో దర్శనం లభిస్తోంది. శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల ► మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తారు. ► జూన్ 19 నుండి 21వ తేదీ వరకు జరుగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చి 21న ఉదయం 10 గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ► మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు. ► మార్చి 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ► మార్చి 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదల చేస్తారు. ► మార్చి 23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనటికెట్ల కోటాను విడుదల చేస్తారు. ► మార్చి 25న ఉదయం 10 గంటలకు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టకెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ► మార్చి 25న మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తారు. ► మార్చి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది. -
అయోధ్యలో మరో ఉత్సవానికి సన్నాహాలు.. 24 గంటలూ దర్శనం!
అయోధ్యలోని రామాలయంలో బాలక్ రాముని ప్రాణప్రతిష్ఠ అనంతరం ఇప్పుడు మరో ఉత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలరాముని జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. అయోధ్యలో బాలరాముని పుట్టినరోజును ఏప్రిల్ 17న నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ తలుపులు మూడు రోజుల పాటు 24 గంటలూ తెరచి ఉండనున్నాయి. భగవంతునికి నైవేద్యం సమర్పించేటప్పుడు, అలంకారం చేసేటప్పుడు మాత్రమే తలుపులు మూసివేయనున్నారు. శ్రీరాముని జన్మదినోత్సవ వేడుకలకు అయోధ్యకు వచ్చే రామభక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రామాలయ తలుపులు సాధారణ భక్తుల దర్శనం కోసం ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటున్నాయి. అయితే బాలరాముని జన్మదిత్సవాన్ని పురస్కరించుకుని దర్శన సమయాన్ని పెంచనున్నారు. ఈ ఉత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ మీడియాకు తెలిపారు. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
రేపు లైవ్లో మహాదేవుని కల్యాణం
రేపు (శుక్రవారం) మహా శివరాత్రి సందర్భంగా యూపీలోని కాశీలో మహాదేవుని కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను భక్తులు తమ మొబైల్ ఫోన్లలో ప్రత్యక్షంగా చూడవచ్చు. కాశీ విశ్వనాథ దేవాలయం ట్రస్ట్.. మార్చి 8న మంగళ హారతి నుండి మార్చి 9 న భోగ్ హారతి వరకు మొత్తం 36 గంటల పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారాలలో నాన్స్టాప్ లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు 10 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని ట్రస్ట్ అంచనా వేస్తోంది. వికలాంగులు, వృద్ధులు సులభంగా దర్శనం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది మహాశివరాత్రి సందర్భంగా సుమారు 8 లక్షల మంది భక్తులు కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్నారని, ఈసారి ఆ సంఖ్య 10 లక్షలు దాటే అవకాశం ఉందని ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు. వారణాసిలోని అస్సీ ఘాట్, దశాశ్వమేధ్ ఘాట్, వారణాసి కాంట్ రైల్వే స్టేషన్ ఇతర ప్రధాన ప్రదేశాలలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లపై శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ గర్భగుడి నుంచి ప్రత్యక్ష దర్శనాన్ని ప్రసారం చేయనున్నమని తెలిపారు. -
ఎన్నికల ప్రచారానికి దూరంగా పాన్ ఇండియా హీరోలు.. కారణం ఇదేనా..?
కర్ణాటక మాండ్య లోక్సభ ఎంపీ, ప్రముఖ సినీనటి సుమలత అంబరీశ్ మరోసారి కూడా అక్కడి నుంచే పోటీకి దిగనున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో జేడీఎస్కు కంచుకోట లాంటి మాండ్యలో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ను ఆమె ఓడించారు. సుమారు లక్షా ముపై వేల ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచారు. ఆ సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత కోసం పాన్ ఇండియా స్టార్లు అయిన యశ్,దర్శన్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె కోసం పెద్ద ఎత్తున వారు పలు ర్యాలీలు నిర్వహించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ కూటమి నుంచి తాను తప్పకుండా పోటీ చేస్తానని సుమలత చెప్పారు. మాండ్య లోసకభ నియోజకవర్గం నుంచి వంద శాతం నాకే సీటు దక్కుతుందని ఆమె తెలిపారు. గత సారి జరిగిన ఎన్నికల్లో స్టార్ నటులు యశ్, దర్శన్ తనకు మద్దతుగా ప్రచారం చేశారని.. ఈసారి ఎన్నికల ప్రచారానికి వారిద్దరూ రాకపోవచ్చని ఆమె అన్నారు. అప్పుడు తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను.. ఇప్పుడు బీజేపీ పార్టీ గుర్తుతో బరిలోకి దిగుతున్నాను. ఇప్పుడు వారిద్దరినీ ఇబ్బంది పెట్టవద్దనుకున్నాను. అయినా తాను తప్పకుండా గెలిచి తీరుతానని ఆమె చెప్పుకొచ్చారు. '2019 ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను కాబట్టి ఇద్దరు స్టార్ నటులు యశ్, దర్శన్ నాతో కలిసి ప్రచారం చేశారు. ఇప్పుడు నేను బీజీపీ- జేడీఎస్ కూటమి తరుపున బరిలో ఉన్నాను కాబట్టి వారి అవసరం ఉండకపోవచ్చు. సుమారు 25 రోజుల పాటు గత ఎన్నికల్లో వారిద్దరూ నా వెంటే ప్రచారం చేశారు. వారు నా కోసం త్యాగం చేశారు. మద్దతు మాత్రమే కాదు. ఎలాంటి స్వార్థం లేకుండా నాకు అండగా నిలిచారు. నా కోసం వారి విలువైన సమయాన్ని మళ్లీ మళ్లీ వదిలేయడం సరికాదు. నేను అంగీకరించను కూడా. యశ్, దర్శన్లు సినిమా షూటింగ్స్లలో బిజీగా ఉన్నారు. అవి వదిలేసి రావడం సరికాదు. వాళ్లు రాజకీయాల్లోకి రావడం వల్ల వారిపై పలు విమర్శలు వస్తున్నాయి. ఒక పార్టీ వైపు సినిమా నటులు ఉంటే.. వారి కెరియర్ మీద కూడా ప్రభావం పడవచ్చు. వారిద్దరూ ఎప్పటికీ నా ఇంటి బిడ్డలే.. ఒకవేళ నాకు వారి అవసరం ఉంది అంటే వారు తప్పకుండా వస్తారు. వారు వస్తే, నేను వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తాను. ఎన్నికల ప్రచారం కోసం యశ్ వస్తే నాకు గొప్ప శక్తి అవుతారని భావిస్తున్నాను.' అని సుమలత అన్నారు. -
బుద్ధుడి అవశేషాల ప్రదర్శన థాయ్లాండ్లో..
ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన బుద్ధ భగవానుని పవిత్ర అస్థికలను, చితాభస్మాన్ని బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం థాయ్లాండ్లో ప్రదర్శించనున్నారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 18 వరకూ మధ్య థాయ్లాండ్లో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన జరగనుంది. థాయ్లాండ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం బుద్ధుని అస్థికలను, చితాభస్మాన్ని థాయ్లాండ్కు పంపాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 22న కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ నేతృత్వంలో వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెర్క్యులస్ ఎయిర్క్రాఫ్ట్లో పటిష్టమైన భద్రత నడుమ వీటిని పంపనున్నారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. శిష్యుల అస్థికలు కూడా.. బుద్ధ భగవానుని అస్థికలతోపాటు అతని శిష్యులైన అర్హంత్ సరిపుత్ర, అర్హంత్ మహామొగల్యన్లో అస్థికలను కూడా థాయ్లాండ్ పంపనున్నారు. ప్రస్తుతం ఈ మహనీయుల చితాభస్మం మధ్యప్రదేశ్లోని సాంచి స్థూపంలో భద్రపరిచారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో ఈ విషయమై చర్చించిన తర్వాత వీరి అస్థికలను థాయ్లాండ్కు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పంపిస్తోంది. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో బుద్ధ భగవానునికి సంబంధించిన 22 పవిత్ర అస్థికలు ఉన్నాయి. వీటిలో 20 అస్థికలు ప్రస్తుతం నేషనల్ మ్యూజియంలో ఉండగా, రెండు కోల్కతా మ్యూజియంలో ఉన్నాయి. వీటిలో నాలుగు అస్థికలను ఇప్పుడు థాయ్లాండ్కు పంపుతున్నారు. రెండోసారి థాయ్లాండ్కు.. బౌద్ధమత అనుచరులు ఈ పవిత్ర అస్థికలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. బుద్ధునికి సంబంధించిన ఈ పవిత్ర ఎముకలను ఇప్పటికే శ్రీలంక, కంబోడియా, సింగపూర్, దక్షిణ కొరియాలకు అక్కడి ప్రజల సందర్శనార్థం పంపారు. ఇప్పుడ రెండోసారి థాయ్లాండ్కు వీటిని పంపుతున్నారు. గతంలో అంటే 1995లో తొలిసారి బుద్ధుని అస్థికలను థాయ్లాండ్కు పంపారు. -
అయోధ్యకు సీమా హైదర్ పాదయాత్ర.. సీఎంకు అభ్యర్థన!
అయోధ్యలో కొలువైన రామ్లల్లాను దర్శించేందుకు సీమా హైదర్ పాదయాత్ర చేపట్టాలని సంకల్పించింది. ఇందుకోసం ఆమె ఉత్తరప్రదేశ్ సీఎం యోగి నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. యూపీకి చెందిన సచిన్పై ప్రేమతో పాకిస్థాన్ నుంచి భారత్కు వచ్చిన సీమా హైదర్ తాను హిందూ ధర్మాన్ని అమితంగా గౌరవిస్తానని తెలిపింది. సీమా హైదర్ తాను కృష్ణ భక్తురాలిని చెప్పుకుంటుంది. ఫిబ్రవరి 14న ఆమె సుందరకాండ పఠిస్తూ వీడియోలో కనిపించింది. ఈ వీడిలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీమా హైదర్ తాను హిందువుగా మారినట్లు తెలిపింది. పాకిస్థాన్లో ఉన్నప్పడు కూడా తాను హిందువుల పండుగలను రహస్యంగా జరుపుకునేదానినని అమె వెల్లడించింది. సోషల్ మీడియాలో సీమాహైదర్కు అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సీమా హైదర్ తన నలుగురు పిల్లలతో నేపాల్ మీదుగా అక్రమంగా భారతదేశానికి తరలివచ్చింది. ఆమె ప్రస్తుతం నోయిడాలో సచిన్తో కలిసి ఉంటోంది. కాలినడకన అయోధ్యకు వెళ్లాలనుకుంటున్న సీమా హైదర్ ఇందుకోసం యోగి ప్రభుత్వం నుంచి అనుమతి కోరింది. సీమా హైదర్ భారత పౌరసత్వం కోసం ఆమె తరపు లాయర్ ప్రయత్నిస్తున్నారు. సీమ అయోధ్యకు వెళ్లేందుకు చట్టపరమైన ప్రక్రియ త్వరలో పూర్తి కానున్నదని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. కుటుంబ సభ్యులందరితో కలిసి రామ్లల్లా దర్శనానికి వెళ్లాలనుకుంటున్నట్లు సీమా మీడియాకు తెలిపింది. గ్రేటర్ నోయిడాలోని రబుపురా గ్రామం నుంచి అయోధ్య వరకు దాదాపు 645 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టాలనుకుంటున్నట్లు ఆమె తెలిపింది. -
సలార్తో పోటీ పడిన సూపర్ హిట్ మూవీ.. ఓటీటీకి వచ్చేస్తోంది!
కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ నటించిన చిత్రం కాటేరా. గతేడాది సలార్కు పోటీగా కర్ణాటకలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. తరుణ్ సుధీర్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలో కనిపించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 9న నుంచే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. కన్నడలో సలార్ మూవీకి పోటీగా డిసెంబర్ 29న కాటేరా రిలీజైంది. పెద్ద సినిమాతో పోటీ కలెక్షన్స్ రాబట్టింది. ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సలార్ను పక్కకు నెట్టి భారీ వసూళ్లు సాధించింది. దాదాపు నెలన్నర రోజుల తర్వాత ఫిబ్రవరి 9న ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. అయితే మొదట దర్శన్ బర్త్ డే సందర్భంగా ఈనెల 16న ఓటీటీకి తీసుకురావాలని నిర్ణయించారు. కానీ వారం రోజులు ముందుగానే స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. అయితే ఈనెల 9న కేవలం కన్నడలోనే అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళం వర్షన్లు మరింత ఆలస్యంగా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా.. కాటేరా 2023లో శాండల్వుడ్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా నిలిచింది. కన్నడ ఇండస్ట్రీ చరిత్రలో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాల్లో ఏడో స్థానంలో నిలిచింది.ఈ చిత్రంలో సీనియర్ కథానాయిక మాలాశ్రీ కూతురు ఆరాధన రామ్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతోనే ఆమె కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. రాక్లైన్ వెంకటేష్ ఈ మూవీని నిర్మించాడు. -
హీరో భార్యకు ఇచ్చిపడేసిన హీరోయిన్.. మాది పవిత్ర బంధమంటూ..
కన్నడ స్టార్ హీరో దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడ ప్రేమలో ఉన్నారని ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అది నిజమే అన్నట్లుగా దర్శన్తో సన్నిహితంగా ఉన్న ఫోటోలన్నింటినీ ఒక చేట చేర్చి దాన్ని వీడియోగా ఇన్స్టాగ్రామ్లో వదిలింది. పదేళ్ల రిలేషన్.. ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని రాసుకొచ్చింది. ఇంకేముంది.. దర్శన్ భార్య విజయలక్ష్మికి ఒళ్లు మండిపోయింది. తన భర్తతో కనిపించొద్దని సెట్కు వెళ్లి మరీ హీరోయిన్ పవిత్రకు వార్నింగ్ ఇచ్చిందని, అవసరమైతే కేసు కూడా పెడతానని బెదిరించినట్లు తెలుస్తోంది. ఖుషి దర్శన్ కూతురు కాదు దీనిపై పవిత్ర సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ షేర్ చేసింది. 'నా పేరు పవిత్ర గౌడ. గతంలో నేను సంజయ్ అనే వ్యక్తిని పెళ్లాడాను. మా ఇద్దరికీ కలిగిన సంతానమే ఖుషి. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సంజయ్కు విడాకులిచ్చాను. నేను ఎప్పుడూ ఎక్కడా ఖుషి.. దర్శన్ కూతురని చెప్పలేదు. అయితే దర్శన్, నేను పదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. ఈ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. కానీ మా మధ్య ప్రేమ, కేరింగ్ మాత్రం అలాగే ఉన్నాయి. మా రిలేషన్ను తను అంగీకరించింది ఇంకా చెప్పాలంటే దర్శన్ భార్య విజయలక్ష్మికి మా గురించి అంతా తెలుసు. చాలాసార్లు ఫోన్లో కూడా మాట్లాడాను. మేమిద్దరం కలిసి ఉంటున్నందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. సరైన సమయం వచ్చినప్పుడు అందుకు తగిన ఆధారాలు చూపిస్తాను. అలాగే నా మొదటి పెళ్లికి సంబంధించిన విడాకుల పత్రాలు కూడా చూపిస్తాను. అవమానిస్తున్నారు విజయలక్ష్మి నా గురించి చెడుగా పోస్టులు పెడుతుంటే బాధేస్తోంది. చాలామంది నన్ను, నా కూతురు ఖుషిని తప్పుపడుతున్నారు, అవమానిస్తున్నారు. మానసికంగా వేధిస్తున్నారు. నన్ను ప్రేమిస్తున్న వ్యక్తితో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ఎవరైనా నన్ను ఇబ్బందులకు గురి చేస్తే కోర్టుకు వెళ్లడానికి కూడా వెనుకాడను' అని వార్నింగ్ ఇచ్చింది. మరి ఈ వివాదంపై దర్శన్ ఏమని స్పందిస్తాడో చూడాలి! View this post on Instagram A post shared by 𝙋𝙖𝙫𝙞𝙩𝙝𝙧𝙖 𝙂𝙤𝙬𝙙𝙖 (@pavithra_gowda_7) చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే.. -
రామ్లల్లా దర్శన సమయాల్లో మార్పులు
అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముడు కొలువైన అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. లక్షలాది మంది భక్తులు బాలరాముని దర్శనం చేసుకునేందుకు అర్థరాత్రి నుండే గజగజ వణికిస్తున్న చలిలో సైతం క్యూలలలో వేచివుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. అధిక సంఖ్యలో భక్తులు రామ్లల్లాను చూసేందుకు, పూజలు చేసేందుకు అవకాశాన్ని కల్పించాలని ట్రస్ట్ దర్శన సమయాల్లో మార్పులు చేసింది. ఈ సమాచారాన్ని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) మీడియాకు అందించింది. ఇది కూడా చదవండి: అయోధ్య రామ భక్తులకు శుభవార్త విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి మాట్లాడుతూ రామ భక్తులకు ఇకపై దర్శనానికి మరో గంట సమయం అదనంగా లభిస్తుందన్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు రామ్లల్లా హారతి, దర్శనం కోసం విడుదల చేసిన షెడ్యూల్ వివరాలు.. మంగళ హారతి: ఉదయం 4.30 గంటలకు ఉత్థాన్ హారతి : ఉదయం 6.30 గంటలకు దర్శనం: ఉదయం 7 గంటల నుంచి భోగ్ హారతి: మధ్యాహ్నం 12 గంటలకు సాయంత్రం హారతి: 7.30 గంటలకు రాత్రి భోగ్ హారతి: 9 గంటలకు శయన హారతి: రాత్రి 10 గంటలకు -
స్టార్ హీరో కాపురంలో చిచ్చు.. హీరోయిన్కి వార్నింగ్ ఇచ్చిన భార్య?
'సలార్' రిలీజ్ టైంలో ఓ కన్నడ స్టార్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాకు భయపడేది లేదని అన్నాడు. దీంతో ఇతడు ఎవరబ్బా అని తెలుగు ప్రేక్షకులు మాట్లాడుకున్నారు. రీసెంట్గా ఇతడు హీరోగా నటించిన 'కాటేరా' సినిమా హిట్ అయింది. ఇప్పుడు ఈ స్టార్ హీరో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయట. అది కూడా ఓ హీరోయిన్ వల్ల. ఒక్క వీడియోనే దీనికి కారణమని అంటున్నారు. అసలేం జరిగింది? కన్నడలో స్టార్ హీరో దర్శన్. ఇతడిని అభిమానులు ముద్దుగా డి-బాస్ అని పిలుస్తుంటారు. ఎప్పుడూ ఏదో ఓ అనవసరమైన కామెంట్స్ చేస్తూ వివాదాల్లో ఉంటాడు. అలాంటిది ఇప్పుడు ఇతడి సంసారంలో చిచ్చు రేగినట్లు తెలుస్తోంది. ఇదంతా కూడా పవిత్ర గౌడ అనే హీరోయిన్.. ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేయడంతో వచ్చింది. '10 ఏళ్ల రిలేషన్షిప్ ఇది. ఎప్పటికీ ఇలానే ఉండిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ దర్శన్' అని వీడియో దిగువన క్యాప్షన్ పెట్టింది. (ఇదీ చదవండి: 'సలార్' నటుడికి కోర్టు నోటీసులు.. కారణం అదే?) స్టార్ హీరో భార్య వార్నింగ్ అయితే చాన్నాళ్ల నుంచి దర్శన్-పవిత్ర గౌడ మధ్య ఏదో ఉందని కన్నడ ఇండస్ట్రీలో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో హీరో దర్శన్తో పవిత్ర గౌడ.. సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా కొన్ని ఉన్నాయి. వీటిని చూసి నెటిజన్స్ అవాక్కయ్యారు. ఇక దర్శన్ భార్య విజయలక్ష్మి మరింత సీరియస్ అయిందట. ఏకంగా సెట్కి వెళ్లి మరీ పవిత్ర గౌడకు వార్నింగ్ ఇచ్చిందట. ఇకపై దర్శన్తో కనిపించొద్దని పవిత్ర గౌడకు గట్టిగానే విజయలక్ష్మి చెప్పిందట. ప్రస్తుతం ఈ విషయం కన్నడ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ విషయం మీద అవసరమైతే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటానని పవిత్రని దర్శన్ భార్య హెచ్చరించిందట. ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: మాజీ భార్యతో డేటింగ్.. నేను మారిపోయా: నటుడు) View this post on Instagram A post shared by 𝙋𝙖𝙫𝙞𝙩𝙝𝙧𝙖 𝙂𝙤𝙬𝙙𝙖 (@pavithra_gowda_7) -
భక్తులకు శుభవార్త .. నేటి నుంచి శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 9 కంపార్ట్మెంట్లు నిండాయి. నిన్న సోమవారం 67,568 మంది స్వామివారిని దర్శించుకోగా 22,084 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.58 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు 4గంటల్లో దర్శనమవుతుండగా, దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఏప్రిల్ నెల శ్రీవారి దర్శన టికెట్ల షెడ్యూల్... శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ► ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ► శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. ► వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ► ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను జనవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ► తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ జనవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది. -
Ayodhya: అయోధ్యకు తొలిరోజు పోటెత్తిన భక్తులు
అయోధ్య రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో నేటి నుంచి సామాన్య భక్తులకు రాములవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం(మంగళవారం) మూడు గంటల నుంచే రామాలయ ప్రధాన ద్వారం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. నేటి నుంచి సామాన్య భక్తులు రాములవారి నూతన విగ్రహాన్ని దర్శించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే భక్తుల్ని నిర్వాహకులు అనుమతిస్తున్నారు. మరోవైపు ఆలయం బయట భారీగా భక్తుల రద్దీ కనిపిస్తోంది. దీంతో అవసరమైతే స్వామివారి దర్శన సమయాన్ని పొడిగించాలని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ యోచిస్తోంది. #WATCH | Ayodhya, Uttar Pradesh: Devotees gather in large numbers at Shri Ram temple on the first day after the Pran Pratishtha ceremony pic.twitter.com/EGo9yr9sXS — ANI (@ANI) January 23, 2024 కాగా రామ్ లల్లా దర్శనం కోసం రెండు స్లాట్లు కేటాయిస్తున్నట్లు నిన్ననే ట్రస్ట్ ప్రకటించింది. ఉదయం 7గం. నుంచి 11.30 వరకు.. అలాగే.. మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 7 గం. వరకు రెండు దఫాలుగా భక్తులను అనుమతిస్తామని ప్రకటించారు. నిత్యపూజలు-సేవలు ఇలా.. ఇక ప్రతీరోజూ మధ్యాహ్నం బాలరామునికి బోగ్ అందించనున్నారు. అలాగే ప్రతి గంటకు పాలు, పండ్లు అందిస్తారు. రామ్లల్లాకు సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం క్రీమ్, శనివారం నీలం, ఆదివారం గులాబీ రంగు దుస్తులను ధరింపజేస్తారు. ప్రత్యేక రోజుల్లో రాములోరికి పసుపు రంగు దుస్తులు ధరింపజేస్తారు. రామ్లల్లాకు రోజుకు ఆరుసార్లు హారతి నిర్వహిస్తారు. దీనికి హాజరయ్యేందుకు భక్తులకు పాస్లు జారీ చేస్తారు. ఇప్పటి వరకు రామ్లల్లాకు రోజుకు రెండు హారతులు ఉండేవి. ఇకపై రోజుకు ఆరు హారతులు ఉంటాయని ఆచార్య మిథిలేష్ నందిని శరణ్ తెలిపారు. 👉: అయోధ్య రామ్ లల్లా దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం (ఫొటోలు) -
రామ్లల్లా దర్శనానికి ఎలా వెళ్లాలి?
జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తయ్యాక అయోధ్యను సందర్శించాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇందుకు ఎటువంటి విధివిధానాలు అనుసరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. రామాలయంలో బాలరామునికి రోజుకు ఐదుసార్లు హారతులు ఇవ్వనున్నారు. అయితే భక్తులు మూడు హారతులను మాత్రమే దర్శించుకోగలుగుతారు. ఈ హారతులు ఉదయం 6:30 గంటలకు, మధ్యాహ్నం 12:00 గంటలకు, సాయంత్రం 7:30 గంటలకు నిర్వహిస్తారు. ఇక శ్రీరాముని దర్శనం విషయానికి వస్తే ఉదయం 6 నుండి 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్టేషన్ చేసుకోవాలి. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం (https://online.srjbtkshetra.org) అధికారిక వెబ్సైట్కి వెళ్లి, మొబైల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి. ఓటీపీ నమోదు చేశాక పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో ‘దర్శన్’ ఎంపికపై క్లిక్ చేశాక, ఓపెన్ అయిన పేజీలో మీరు శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ, సమయం, మీతోపాటు వచ్చేవారి సంఖ్య, దేశం, రాష్ట్రం, మొబైల్ నంబర్తో పాటు మీ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది. శ్రీరాముని హారతులను చూడాలనుకుంటే ఇందుకోసం ప్రత్యేకంగా బుక్ చేసుకోవాలి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆఫ్లైన్లో టిక్కెట్లు పొందాలనుకుంటే ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్లి, ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి, టికెట్ పొందవచ్చు. కాగా పదేళ్లకన్నా తక్కువ వయసుగల పిల్లలకు దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. దర్శనం కోసం టిక్కెట్తో పాటు ఐడీప్రూప్ ప్రూఫ్ను ఖచ్చితంగా వెంట తీసుకువెళ్లాలి. ఎవరైనా భక్తుడు తన టిక్కెట్ను రద్దు చేసుకుంటే, ఆ స్లాట్ మరో భక్తుడికి అందుబాటులోకి వస్తుంది. దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, దర్శనానికి 24 గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది. దర్శనానికి 24 గంటల ముందు భక్తుడు తన టిక్కెట్ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాగా స్త్రీలు, పురుషులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే దర్శనానికి రావాలి. పురుషులు ధోతీ-కుర్తా లేదా కుర్తా, పైజామా.. మహిళలు చీర, దుపట్టాతో కూడిన పంజాబీ దుస్తులు లేదా దుపట్టాతో చుడీదార్ సూట్ ధరించి శ్రీరాముని దర్శనానికి రావచ్చు. ఇది కూడా చదవండి: అయోధ్యలో త్రేతాయగం... అంతా రామమయం! -
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
తిరుపతి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతోంది. 28 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని టిటిడి పేర్కొంది. .ప్రత్యేక దర్శనానికి 4 గంటలు సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,263 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,518 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.65 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల తిరుమల: శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం జనవరి 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్లో టికెట్లు పొందిన భక్తులు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ► వర్చువల్ సేవా టికెట్లను జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ► శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు జరుగునుంది. ఇందుకు సంబంధించిన సేవా టికెట్లను జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ► ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ► శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటాను జనవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. ► వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ► ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను జనవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ► తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ జనవరి 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ► ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు. ► భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది. -
కన్నడలో సూపర్ హిట్.. ఓటీటీలో తెలుగు వెర్షన్.. రిలీజ్ అప్పుడేనా?
మరో హిట్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కి సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇది తెలుగు కాదు కన్నడ సినిమా. ప్రభాస్ 'సలార్'తో పోటీ పడి కర్ణాటకలో ఈ చిత్రానికి అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. స్టోరీ పరంగా చూసుకుంటే పెద్ద మెరుపులేం లేనప్పటికీ కన్నడ ప్రేక్షకులకు నచ్చేసింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయిందట. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ప్రస్తుతం అంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. అలానే పలువురు రీజనల్ హీరోలు కూడా యాక్షన్ సినిమాలు తీస్తూ వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నారు. అలా కన్నడలోనూ హీరో దర్శన్ ఉన్నాడు. యాక్షన్ సినిమాలు తీసే ఇతడు గతేడాది డిసెంబరులో 'సలార్' చిత్రం థియేటర్లలోకి వచ్చిన వారం తర్వాత అంటే డిసెంబరు 29న 'కాటేరా' అనే మూవీతో వచ్చాడు. సూపర్హిట్ కొట్టేశాడు. (ఇదీ చదవండి: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?) విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా సాధారణ కథనే అయినప్పటికీ కన్నడ ఆడియెన్స్కి ఎక్కేసింది. కర్ణాటకలో 'సలార్' కంటే ఈ చిత్రాన్నే ఎక్కువగా చూశారు. అలా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఎప్పుడనేది డేట్ ఇంకా తెలీదు గానీ ఓటీటీ స్ట్రీమింగ్ డీటైల్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 9న జీ5లో రిలీజ్ చేయొచ్చని టాక్ అయితే నడుస్తోంది. ఒకవేళ ఓటీటీ రిలీజ్ చేస్తే తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి తీసుకురావొచ్చని అంటున్నారు. మరి ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. అలానే 'కాటేరా' తెలుగు వెర్షన్ థియేటర్ రిలీజ్ ఉందా లేదా? అనేది కూడా స్పష్టత రావాలి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు) -
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. స్టార్ హీరోకు షాకిచ్చిన పోలీసులు!
ఇటీవలే కాటేరా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు కన్నడ స్టార్ హీరో దర్శన్. గతేడాది చివర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కర్ణాటక వ్యాప్తంగా రికార్డ్ స్థాయి వసూళ్లతో దూసుకెళ్తోంది. అయితే తాజాగా ఈ శాండల్వుడ్ స్టార్ హీరో దర్శన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి హాజరైన దర్శన్.. సమయం ముగిసిన తర్వాత పార్టీని కొనసాగించారని బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీకి హాజరైన సినీ ప్రముఖులతో పాటు పబ్ యజమానిపై కూడా కేసు నమోదైంది. ఈ కేసులో హీరో దర్శన్తో పాటు ధనంజయ, అభిషేక్ అంబరీష్, రాక్లైన్ వెంకటేష్లకు పోలీసు అధికారులు నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఎఫ్ఐఆర్పై ఇప్పటివరకు నటీనటులు ఎవరూ స్పందించలేదు. అసలేం జరిగిందంటే.. న్యూ ఇయర్ సందర్భంగా బెంగళూరులోని రాజాజీ నగర్లోని ఓ పబ్లో ఏర్పాటు చేసిన పార్టీలో కన్నడ నటీనటులు పాల్గొన్నారు. అయితే సమయానికి మించి అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా పార్టీని కొనసాగించారు. సెలబ్రిటీలంతా కేక్లు కట్ చేస్తూ ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాగా.. దర్శన్ నటించిన కాటేరా చిత్రానికి తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని రాక్లైన్ వెంకటేష్ నిర్మించారు. ఈ చిత్రంలో ఆరాధన రామ్ హీరోయిన్గా నటించగా.. టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీలకపాత్రలో కనిపించారు. -
నిండు పున్నమిలోనూ బాలరాముని దర్శనం
అయోధ్యలో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకూ బాలరాముని దర్శనం చేసుకునే అవకాశం ఉన్న భక్తులు.. ఇకపై చంద్రుని చల్లని వెన్నెలలోనూ స్వామివారిని దర్శించుకునే అవకాశం కలగనుంది. అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమై, బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన అనంతరం స్వామివారి దర్శన వ్యవధిని పొడిగించనున్నట్లు రామాలయ ట్రస్ట్ తెలిపింది. అలాగే మంగళ, శయన హారతులను కూడా ప్రారంభించనున్నారు. రానున్న కాలంలో అయోధ్యలోని నూతన రామాలయ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరగనున్న దృష్ట్యా పూజల ప్రక్రియను విస్తృతం చేసేందుకు ట్రస్ట్ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఆలయంలో శ్రీరాముని దర్శనం ఉదయం 7 గంటల నుంచి 11 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 వరకు ఉంటోంది. రాత్రివేళ ఈ సమయాన్ని మరింత పొడిగించాలని ట్రస్టు యోచిస్తోంది. దీంతో భక్తులు చల్లని వెన్నెలలోనూ బాలరాముడిని దర్శించుకోగలుగుతారు. సాధారణ రోజుల్లో రోజుకు 20 వేల మంది భక్తులు శ్రీరాముని దర్శించుకుంటున్నారు. ఏకాదశితో పాటు పండుగ రోజులలో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరుగనుంది. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం రోజుకు లక్షన్నర మంది భక్తులు దర్శనానికి వస్తారనే అంచనాలున్నాయి. -
అక్కడ 'సలార్'ని మించి కలెక్షన్స్ సాధిస్తున్న చిన్న సినిమా!
డార్లింగ్ ప్రభాస్ 'సలార్' సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ప్రస్తుతం రూ.600 కోట్లకు చేరువలో ఉన్న ఈ చిత్రం.. లాంగ్ రన్లో మరో రూ.100 కోట్లు దక్కించుకునే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. అయితే ఓ చోట మాత్రం 'సలార్' కంటే ఓ ప్రాంతీయ సినిమా ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్గా మారిపోయింది. 'సలార్' సినిమాని తీసింది డైరెక్టర్ ప్రశాంత్ నీల్. 'కేజీఎఫ్' సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. ప్రభాస్తో మాస్ సినిమా తీశాడు. అయితే ఇది 2014లో తన తీసిన ఫస్ట్ మూవీ 'ఉగ్రమ్'కి రీమేక్ అని సరిగ్గా రిలీజ్కి ఓ రోజు ముందు చెప్పాడు. మిగతా భాషా ప్రేక్షకులు 'ఉగ్రమ్' చూడలేదు కానీ కన్నడ ఆడియెన్స్ చాలాసార్లు చూసేశారు. (ఇదీ చదవండి: 'మంగళవారం' హీరోయిన్ పాయల్ రాజ్పుత్ ఇంట్లో విషాదం) ఈ క్రమంలోనే కర్ణాటకలో 'సలార్' వసూళ్లు ఓ మాదిరిగానే వచ్చాయి. ఇప్పటివరకు రూ.35.7 కోట్ల కలెక్షన్స్ మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది. అదే టైంలో రీసెంట్గా డిసెంబరు 29న కన్నడ స్టార్ హీరో దర్శన్ 'కాటేరా' రిలీజైంది. విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో రెండు రోజుల్లోనే రూ.37 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మిగతా చోట్ల 'సలార్' వసూళ్ల మేనియా గట్టిగా ఉన్నప్పటికీ కన్నడలో మాత్రం పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోయింది. ఈ కారణంగానే 'కాటేరా'కు ప్లస్ అయింది. అలా కాకుంటే మాత్రం ప్రభాస్ సినిమా ముందు దర్శన్ అస్సలు నిలబడలేకపోయేవాడు. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) -
Travancore Devaswom Board: శబరిమలలో భారీ రద్దీ.. దర్శన సమయం గంట పెంపు
పత్తనంతిట్ట: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి మాలధారుల తాకిడి పెరిగింది. దీంతో దర్శన సమయాన్ని గంట పొడిగించినట్లు ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డు(టీడీబీ)ఆదివారం ప్రకటించింది. సాయంత్రం దర్శనం 4 బదులు 3 గంటల నుంచే మొదలవనుంది. రోజూ వర్చువల్ క్యూ ద్వారా 90 వేల బుకింగ్లు, 30 వేల స్పాట్లో బుకింగ్స్ ఉంటున్నాయని ఆలయ ఏర్పాట్లను చూసే ఐజీ స్పర్జన్ కుమార్ చెప్పారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో దర్శనాలను త్వరత్వరగా సాఫీగా సాగేలా చూడాలన్న ప్రయత్నాలకు విఘాతం కలుగుతోందని వివరించారు. దర్శనానికి 15 నుంచి 20 గంటల వరకు భక్తులు ఎదురుచూపులు చూడాల్సి వస్తోందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ పేర్కొన్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘లాలూ’ కుటుంబం
సాక్షి, తిరుమల: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సమేతంగా శనివారం ఉదయం తిరుమల శ్రీ వెంటటేశర్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన సతీమణి, మాజీ సీఎం రబ్రీదేవి, కుమారుడు బీహార్ రాష్ట్ర డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ దంపతులు కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వారిని వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. आज सवेरे आंध्र प्रदेश के तिरुमाला पर्वत स्थित उत्कृष्ट शिल्प कौशल के अद्भुत उदाहरण एवं भक्ति, विश्वास और श्रद्धा के प्रतीक भगवान श्री तिरुपति बालाजी मंदिर में सपरिवार पूजा-अर्चना व दिव्य दर्शन कर सकारात्मक ऊर्जा एवं आशीर्वाद प्राप्त किया तथा गर्भगृह में विराजमान भगवान वेंकटेश्वर… pic.twitter.com/dtJhGlxe4s — Tejashwi Yadav (@yadavtejashwi) December 9, 2023 ఈ సందర్భంగా.. ‘అద్భుతమైన శిల్పకళ, భక్తి, విశ్వాసాలకు ప్రతీక అయిన తిరుపతి బాలాజీ ఆలయంలో నా కుటుంబంతో కలిసి పూజలు చేసి, దైవ దర్శనం చేసుకోన్నాం. వెంకటేశ్వర స్వామి నుంచి సానుకూల శక్తిని, ఆశీర్వాదాలను పొందాను’ అని డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ‘ఎక్స్’ట్విటర్లో ఫొటోలు పోస్ట్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రజల సంతోషం, శాంతి, శ్రేయస్సు, సంక్షేమం కోసం తాను ప్రత్యేకంగా ప్రార్థించానని తెలిపారు. ఈ రోజు తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల దర్శించటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. -
అవతలి పక్షంతో సంప్రదింపులా?
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పరువు నష్టం కేసులో అవతలి పక్షంతో సంప్రదింపులకు దిగినందుకు ఆమె తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర నారాయణన్ను ఢిల్లీ హైకోర్టు మందలించింది. దాంతో ఆయన కేసు నుంచి తప్పుకున్నారు. లోక్సభలో పారిశ్రామికవేత్త అదానీ గ్రూపుపై ప్రశ్నలడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని నుంచి మహువా డబ్బులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే, సుప్రీంకోర్టు లాయర్ జై అనంత్ దేహద్రాయ్ తదితరులు ఆరోపించడం తెలిసిందే. వారిపై ఆమె పరువు నష్టం దావా వేశారు. లాయర్ నారాయణన్ గురువారం తనకు ఫోన్ చేసి, ఆమెపై దాఖలు చేసిన సీబీఐ ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని కోరినట్టు దేహద్రాయ్ హైకోర్టుకు తెలిపారు. దాంతో న్యాయమూర్తి జస్టిస్ సచిన్ దత్తా ఆగ్రహించారు. ‘‘ఇది విని నేను నిజంగా షాక య్యాను. ఇలా మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయ త్నిస్తే ఈ కేసులో వాదించేందుకు మీరెలా అర్హుల వుతారు?’’అని ప్రశ్నించారు. దేహద్రాయ్, మహువా కొంతకాలం పాటు సహజీవనం చేసినట్టు తృణమూల్ వర్గాలు చెబుతుంటాయి. ఆయన తమ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారని, అసభ్యకర మెసేజీలు పంపుతున్నారని, చోరీకి యత్నించారని గత ఆర్నెల్లలో మహువా పలు కేసులు పెట్టారు. -
కర్ణాటక ఎన్నికల ప్రచార ‘సిత్రాలు’ గ్యాలరీ
-
ఆ హీరోలు ప్రచారం చేసినా బీజేపీకి ఒరిగేదేంలేదు.. కేపీసీసీ చీఫ్ సెటైర్లు..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 12 రోజులే గడువున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కన్నడ హీరో కిచ్చ సుదీప్తో బీజేపీ జోరుగా ప్రచారం చేయించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అలాగే మరో సీనియర్ హీరో దర్శన్తో కూడా ప్రచారం చేయించేందుకు సిద్ధమైంది. ఇద్దరి హీరోల జనాకర్షణతో మరోసారి అధికారంలోకి వస్తామని భావిస్తోంది. అయితే ఈ ఇద్దరు హీరోలు ప్రచారం చేసినా బీజేపీకి పెద్దగా ఒరిగేదేమీ లేదని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సెటైర్లు వేశారు. వారు బీజేపీలో చేరలేదని, కేవలం ప్రచారం మాత్రమే చేస్తున్నారని గుర్తు చేశారు. వీరిద్దరి వల్ల కమలం పార్టీకి ఎన్నికల్లో పెద్దగా ఉపయోగం ఉంటుందని తాను భావించడం లేదన్నారు. కచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని మరోసారి స్పష్టం చేశారు. కాగా.. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న ఒకే విడతలో జరగనున్నాయి. మే 13 కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. తాము మరోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ చెబుతుండగా.. ఈసారి 150పైగా స్థానాలు కైవసం చేసుకుని అధికారం చేజిక్కించుకుంటామని కాంగ్రెస్ బలంగా చెబుతోంది. #WATCH | BJP star campaigner, Actor Kichcha Sudeepa holds a roadshow in Hubli-Dharwad Central Assembly constituency, ahead of the upcoming Karnataka elections on 10th May#KarnatakaElections pic.twitter.com/NspKhG3ilo — ANI (@ANI) April 28, 2023 చదవండి: ప్రధాని విషసర్పం.. తాకితే అంతే -
బీజేపీలోకి కిచ్చా సుదీప్, దర్శన్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సినీ గ్లామర్ను వాడుకునేందుకు రాజకీయ పార్టీలు సిద్ధం అయ్యాయి. ఈ నేపథ్యంలో.. పలువురు తారలు రాజకీయ పార్టీల కండువాలు కప్పుకుంటున్నా కూడా. తాజాగా కన్నడ స్టార్ హీరోలు సుదీప్, దర్శన్లు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్న సమయంలో కర్ణాటకలోని ఓ ప్రైవేట్ హోటల్లో వీళ్లు బీజేపీలో అధికారికంగా చేరనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సమక్షంలోనే వీళ్లు పార్టీ కండువాలు కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో స్టార్ క్యాంపెయినర్లుగా వీళ్లిద్దరూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం పని చేస్తారని సమాచారం. ‘కిచ్చా’ సుదీప్ నాయక(ఎస్టీ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ సామాజిక ఓట్లను లక్ష్యంగా చేసుకుని బీజేపీ సుదీప్ను పార్టీలోకి తీసుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ గతంలో ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నాడు కూడా. 2020లో ఆర్ఆర్ నగర్ ఉప ఎన్నిక సమయంలో బీజేపీ అభ్యర్థి మునిరత్న కోసం దర్శన్ ప్రచారం నిర్వహించారు. ఆపై అంబరీష్ మరణం తర్వాత.. జరిగిన మాండ్యా లోక్సభ స్థానం ఉప ఎన్నికలో స్వతంత్ర సుమలత అంబరీష్కు మద్దతు ప్రకటించాడు దర్శన్. తాజాగా.. సుమలత బీజేపీ వైపు అడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో బీజేపీ అభ్యర్థుల జాబితా ఒకటి చక్కర్లు కొడుతుండగా.. అది ఫేక్ అని బీజేపీ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. మే 10వ తేదీన కర్ణాటక ఎన్నికలు జరుగుతుండగా.. 13వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
ప్రముఖ ఆలయంలో సమంత ప్రత్యేక పూజలు.. మెట్టు మెట్టుకి హారతి
స్టార్ హీరోయిన్ సమంత ఈమధ్య కాలంలో నిత్యం ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తోంది. నాగచైతన్యతో విడిపోయినప్పటి నుంచి సామ్ పేరు నెట్టింట ఎక్కువగా వినిపిస్తుంది. ఇక ఇటీవలె మయోసైటిస్ బారిన పడిన సమంత ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి కోలుకుంటుంది. దీంతో తిరిగి సినిమాలు, యాడ్స్ షూటింగుల్లో పాల్గొంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె తమిళనాడులోని పళని మురుగన్ ఆలయాన్ని దర్శించుకుంది. ఈ సందర్భంగా కొండ కింది నుంచి సుమారు 600 మెట్ల వరకు హారతి వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఇటీవలె అనోరోగ్యం నుంచి కోలుకోవడంతో సామ్ ఇలా మొక్కులు చెల్లించుకుందని సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా చైతో డివోర్స్ అయిన సమయంలోనూ సామ్ ఎక్కువగా ఆధ్యాత్మికం వైపు అడుగేసి పలు ఆలయాలను సందర్శించిన సంగతి తెలిసిందే. Actress @Samanthaprabhu2 Pics from Pazhani Murugan Temple ❤️🙏#Shaakuntalam !! #Samantha#SamanthaRuthPrabhu𓃵 #SamanthaRuthPrabhu pic.twitter.com/lWQzX5iAl9 — 𝐓𝐄𝐀𝐌 𝐒𝐀𝐌𝐀𝐍𝐓𝐇𝐀 (@TN_SamanthaFans) February 13, 2023 -
కన్నడ హీరో ఫామ్హౌస్లో అధకారుల సోదా
సాక్షి, మైసూరు: కన్నడ హీరో దర్శన్ ఫామ్ హౌస్లో అటవీ అధికారులు సోదా చేసి అరుదైన జాతికి చెందిన నాలుగు పక్షులను స్వాధీనం చేసుకున్నారు. మైసూరు నగరంలోని టీ నరిసిపుర రోడ్డు కెంపయ్యనహుండీ గ్రామ సమీపంలో దర్శన్ ఫామ్ హౌస్ ఉంది. అక్కడ అరుదైన బార్ హెడెడ్ గూస్ జాతికి చెందిన జల పక్షులను పెంచుతున్నట్లు సమాచారం అందుకున్న అటవీ అధికారులు శుక్రవారం రాత్రి సోదా చేసి నాలుగు పక్షులను స్వాధీనం చేసుకున్నారు. బార్ హెడెడ్గూస్ పక్షులను పెంచడం నేరమని, అవి అడవుల్లోనే ఉండాలని అధికారులు పేర్కొన్నారు. జూ, ఇళ్లు, ఫారాలలో పెంచడానికి అనుమతి లేదని తెలిపారు. చదవండి: బాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ అమేజింగ్.. అది తెలుగు సినిమా అంటూ క్లాస్ పీకిన నెటిజన్లు ఆ విషయంలో నయనతారకంటే ముందున్న హన్సిక -
Telangana: ‘న్యూఇయర్’ దర్శనాలకు యాదాద్రి సిద్ధం..
యాదగిరిగుట్ట: నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంతోపాటు పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. వేకువజామున 3 గంటలకే ఆలయాన్ని తెరవనున్నారు. వేకువజామున 3 గంటల నుంచి 3:30 గంటల వరకు సుప్రభాతం మొదలు రాత్రి 9:45 గంటల నుంచి 10 గంటల వరకు శయనోత్సవం వరకు నిత్య పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ద్వారబంధనం ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి 8:30 గంటల వరకు శ్రీసుదర్శన నారసింహ హోమం, 10 గంటల నుంచి 11:30 గంటల వరకు స్వామివారి నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరపనున్నారు. అనుబం«ధ ఆలయమైన శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సైతం ఆదివారం ఉదయం 4:30 గంటలకు ఆలయాన్ని తెరిచి రాత్రి 8:45 గంటల వరకు భక్తులకు దర్శనాలు కలి్పంచనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఈవో గీతారెడ్డి అధికారులను ఆదేశించారు. యాదాద్రిలోని ఆలయ పరిసరాలు, క్యూలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేశాకే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ప్రసాదం.. ఆలయానికి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా లడ్డూ, పులిహోర ప్రసాదం సిద్ధం చేస్తున్నారు. ప్రసాదం కౌంటర్లను ఉదయం 5 గంటలకే తెరిచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంచనున్నారు. స్వర్ణ తాపడం కోసం రూ. 33 కోట్ల నగదు,8 కిలోల బంగారం విరాళాలు.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం ఇప్పటివరకు దాతల ద్వారా రూ. 33 కోట్ల నగదు, 8 కిలోల బంగారం వచి్చందని ఈవో గీతారెడ్డి తెలిపారు. ప్రధానాలయం ప్రారంభానికి ముందే సీఎం కేసీఆర్ విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయాలని నిర్ణయించారు. ఇందుకు దాతలు విరివిగా విరాళాలు ఇచ్చారు. మరింత బంగారం, నగదు విరాళం రూపంలో వస్తుందని చెప్పారు. ప్రస్తుతం విమాన గోపురానికి అవసరమైన పనులు జరుగుతున్నాయని, రెండు నెలల్లో ఈ పనులు పూర్తి కాగానే బంగారు తాపడం పనులు ప్రారంభిస్తామన్నారు. చదవండి: TSPSC: మరో నాలుగు నోటిఫికేషన్లు.. 806 కొలువులు -
Kanipakam: జనవరి 1న కాణిపాకంలో ప్రత్యేక ఏర్పాట్లు
యాదమరి(చిత్తూరు జిల్లా): జనవరి 1, 2 తేదీల్లో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తెలిపారు. స్వామివారి సమావేశపు మందిరంలో చైర్మన్ మోహన్రెడ్డి, ఈవో వెంకటేశు అధ్యక్షతన ఆర్డీవో రేణుక, వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. జనవరి 1న ఆంగ్ల నూతన సంవత్సరం, జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనార్థం భక్తులు లక్ష మందికి పైగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. వీఐపీలు, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆ వివరాలను ఎమ్మెల్యే బాబు మీడియాకు వెల్లడించారు. వేకువజామున 2 గంటల నుంచి స్వామివారి దర్శనం కల్పించనున్నామన్నారు. 12 గంటల తర్వాత స్వామికి అభిషేకాలు, అలంకరణ, చందన అలంకరణ, ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆ రెండు రోజుల పాటు స్వామివారి అంతరాలయ దర్శనం, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతి, చిత్తూరు పీలేరు, మదనపల్లె, పలమనేరు, కుప్పం డిపోల నుంచి ఆర్టీసీ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నిత్య అన్నదానం ఉంటుందని వివరించారు. (క్లిక్ చేయండి: టోకెన్ ఉంటేనే వైకుంఠ ద్వార దర్శనం) -
తనపై జరిగిన దాడిపై తొలిసారి స్పందించిన స్టార్ హీరో
ఇటీవల తనపై జరిగిన దాడిపై కన్నడ స్టార్ హీరో దర్శన్ తొలిసారి స్పందించాడు. దర్శన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘క్రాంతి’ సినిమాలో రెండవ పాటను ఇటీవల కర్ణాటకలోని హోస్పేట్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన దర్శన్ స్టేజీపై అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి అతడిపై చెప్పు విసిరిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘటనను ఖండిస్తూ కన్నడ హీరో సుదీప్ అసహనం వ్యక్తం చేశాడు. అలాగే ఇలాంటి దాడులు సహించలేనివి అంటూ శివరాజ్ కుమార్ మండిపడ్డారు. చదవండి: నటి జయప్రదకు షాక్, మాజీ ఎంపీపై నాన్ బెయిలబుల్ వారెంట్ అలాగే మరో నటుడు ధనుంజయ్, రమ్యలు సైతం దీనిపై స్పందిస్తూ దర్శన్కు మద్దతుగా నిలిచారు. దీంతో ఇలాంటి ఈ క్లిష్ట పరిస్థితిలో తనకు అండగా నిలిచిన తన స్నేహితులకు దర్శన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ షేర్ చేస్తూ.. ‘‘ఈ సమయంలో నాకంటే కూడా నా సహ నటీనటులు ఎక్కువగా బాధపడుతున్నారని అర్థమైంది. ఇలాంటి ఘటనలు ఒక మనిషిని బలహీనపరచవు. మరింత దృఢంగా మారుస్తాయి. మన సొంత కన్నడ నేలపైనే గతంలో ఇలాంటి ఎన్నో సంఘటనలను చూశాం. చదవండి: తొలిసారి కూతురిని చూసి ఎమోషనలైన సింగర్ రేవంత్, వీడియో వైరల్ ఈ క్లిష్ట సమయంలో నాకోసం నిలబడి, నాకు మద్దతు ఇచ్చిన స్నేహితులు, నటీనటులకు కృతజ్క్షతుల. సినిమా ఈవెంట్ను పక్కదారి పట్టించడానికి ప్రయత్నించిన వాళ్లకూ ధన్యవాదాలు. ఒక కార్యక్రమాన్ని నాశనం చేయడానికి వంద మంది వ్యక్తులు ఉంటే.. కొన్ని వేల మంది సెలబ్రిటీలు రంగంలోకి దిగుతారని నేను మొదటి నుంచే చెబుతున్నాను. అదే జరిగింది. నాపై పలువురు వ్యక్తులు కనబరుస్తోన్న ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా’ అంటూ దర్శన్ రాసుకొచ్చాడు. కాగా ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు దర్శన్, పునీత్ రాజ్కుమార్ అభిమానులు గొడవ పడ్డారని, కాబట్టి పునీత్ అభిమానే ఇలా చేశారని వార్తలు వచ్చాయి. View this post on Instagram A post shared by Darshan Thoogudeepa Shrinivas (@darshanthoogudeepashrinivas) -
స్టార్ హీరోపై చెప్పు విసిరిన వ్యక్తి.. వీడియో వైరల్
కన్నడ హీరో దర్శన్కు చేదు అనుభవం ఎదురైంది. సాంగ్ లాంఛ్ కోసం వెళ్లిన అతడిపై ఓ వ్యక్తి చెప్పు విసరడం దారుణంగా అవమానించాడు. ఆదివారం 'క్రాంతి' సినిమా ప్రమోషన్స్లో భాగంగా కర్ణాటకలోని హోస్పేట్లో సాంగ్ లాంఛ్ కార్యక్రమానికి హాజరయ్యాడు దర్శన్. స్టేజీపై నిలబడి అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో అతడిపై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై కన్నడ స్టార్ శివరాజ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. 'నిన్న జరిగిన చర్య నా మనసును బాధించింది. ఎవరూ మానవత్వాన్ని మరిచి ఇలాంటి అమానవీయ ఘటనలకు పాల్పడవద్దని కోరుతున్నాను. అభిమానంతో ప్రేమను చూపించండి. అంతేకానీ ద్వేషం, అగౌరవం కాదు'' అంటూ ఓ వీడియో షేర్ చేశాడు. కాగా దర్శన్ ఇటీవల అదృష్ట దేవతపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. 'అదృష్ట దేవత ప్రతిసారీ తలుపు తట్టదు. తలుపు తట్టినప్పుడే చేయి పట్టుకుని బెడ్రూమ్లోకి లాక్కెల్లి దుస్తులు విప్పేయాలి. అప్పుడు ఆమె ఎక్కడికీ వెళ్లదు' అని దర్శన్ చేసిన కామెంట్లు ఎంతగానో వివాదాస్పదమయ్యాయి. అదృష్ట దేవతను లక్ష్మీ దేవతగా భావిస్తారు. శ్రీ విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవిపై అంత నీచంగా ఎలా మాట్లాడతావంటూ అతడిపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. Keeping all the hate things aside 🥹 Chappali alli hodiddu wrong 😑 I feel sorry for @dasadarshan sir 💔 Never expected this for an KFI star#Kranti #DBoss #Hospete #KicchaSudeep pic.twitter.com/IP3yl22FAn — Rohan Kiccha (@imrohxn_) December 18, 2022 ನೆನ್ನೆ ಹೊಸಪೇಟೆಯಲ್ಲಿ ದರ್ಶನ್ ಅವರ ಮೇಲೆ ನಡೆದ ಕೃತ್ಯ ನನ್ನ ಮನಸ್ಸಿಗೆ ನೋವುಂಟು ಮಾಡಿದೆ. ಈ ರೀತಿಯ ಅಮಾನವೀಯ ಘಟನೆ ಒಂದೇ ಮನೆಯವರಂತಿರುವ ಎಲ್ಲರಿಗೂ ನೋವುಂಟು ಮಾಡುತ್ತದೆ. ಮನುಷ್ಯತ್ವ ಮರೆತು ಯಾರೂ ಈ ರೀತಿಯ ಕೃತ್ಯಗಳನ್ನು ನಡೆಸಬಾರದು ಎಂದು ವಿನಂತಿಸುತ್ತೇನೆ ಅಭಿಮಾನದಿಂದ ಪ್ರೀತಿಯನ್ನು ತೋರಿ; ದ್ವೇಷ ಅಗೌರವವನ್ನಲ್ಲ ನಿಮ್ಮ ಶಿವಣ್ಣ pic.twitter.com/34eJfpdmKk — DrShivaRajkumar (@NimmaShivanna) December 19, 2022 చదవండి: బేబీ బంప్తో ఉపాసన, ఫోటోలు వైరల్ అమ్మ ఆత్మహత్య చేసుకుంది: ఆదిరెడ్డి ఎమోషనల్ -
భక్తులకు దర్శనమిచ్చిన ఉగ్ర శ్రీనివాసుడు
-
హీరో దర్శన్ వల్ల ప్రాణహాని ఉంది: పోలీసులను ఆశ్రయించిన నిర్మాత
కన్నడ స్టార్ హీరో దర్శన్పై పోలీసు కేసు నమోదైంది. దర్శన్ బెదిరిస్తున్నాడని, అతడి వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ప్రముఖ నిర్మాత పోలీసులను ఆశ్రయించాడు. దీంతో దర్శన్పై కెంగేరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంద. వివరాల్లోకి వెళితే.. భరత్ విష్ణుకాంత్ అనే నిర్మాత భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో నటుడు ధృవన్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. అయితే కరోనా, లాక్డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం తన వద్ద డబ్బు లేకపోవడంతో నిర్మాత సినిమాను పూర్తి చేయలేకపోయాడు. చదవండి: లలిత్ మోదీతో డేటింగ్.. మాజీ ప్రియుడితో మీడియాకు చిక్కిన సుష్మితా, వీడియో వైరల్ ఇదే విషయాన్ని ప్రొడ్యూసర్ ధృవన్కు వివరించాడు. ఒకవేళ డబ్బు సర్ధుబాటు అయితే గనుక తాను సినిమాను తిరిగి ప్రారంభిస్తానని మాట కూడా ఇచ్చాడట. కానీ ఆ విషయాన్ని పట్టించుకొని ధృవన్ స్టార్ హీరో అయిన దర్శన్కు చెప్పుకుని వాపోయాడు. అనంతరం దర్శన్.. నిర్మాత భరత్కు ఫోన్ చేసి సినిమాను ఎలాగైన పూర్తి చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో భయపడిన భరత్ పోలీసులను ఆశ్రయించి హీరో దర్శన్, నటుడు ధృవన్ వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. వారిపై పటిషన్ దాఖలు చేసి దానితో పాటు దర్శన్ మాట్లాడిన ఆడియో క్లిప్ను కూడా పోలీసులకు అందజేశాడు. చదవండి: నటుడికి గుండెపోటు, వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్న వైద్యులు కాగా ఆడియోలో దర్శన్, నిర్మాతతో.. ‘వెంటనే సినిమాను పూర్తి చేయాలని, లేదంటే ఏదైనా జరగొచ్చు. నేను తలుచుకుంటే కనబడకుండా పోతావ్. నేను ఏదైనా చెప్పే చేస్తాను. నిన్ను ఎక్కడా కనిపించకుండా చేయగలను’ అంటూ నిర్మాతను భయపెట్టడం.. దీంతో నిర్మాత లాక్డౌన్ తర్వాత సినిమాను ప్రారంభిస్తానని చెప్పుకురాడం ఆడియోలో క్లియర్ ఉంది. ఇక ఈ ఆడియో ఆధారంగా పోలీసులు దర్శన్, నటుడు ధృవన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా శాండల్వుడ్ స్టార్ హీరో అయిన దర్శన్కు కన్నడలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్. ఇక ఆయనను ఫ్యాన్స్ డిబి బాస్ అని పిలుచుకుంటారనే విషయం తెలిసిందే. -
‘రెడీగా ఉండు, నువ్వు కనపడకుండా పోతావ్’.. నిర్మాతకు హీరో వార్నింగ్!
నటుడు దర్శన్పై ఓ నిర్మాత కెంగేరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు... భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ పేరుతో భరత్ అనే వ్యక్తి సినిమా తీస్తున్నారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైందీ సినిమా. ఇందులో విలన్ పాత్రలో ధ్రువన్ (సూరత్) నటిస్తున్నారు. సినిమాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావటంతో చిత్రీకరణ అలస్యమైనట్లు ధ్రువన్ వద్ద భరత్ వాపోయాడు. అయితే ధ్రువన్ ఈ విషయం చెప్పటానికి దర్శన్కు ఫోన్ చేశారు. అదే సమయంలో ఫోన్లో నిర్మాతను బెదిరించినట్లు భరత్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఎన్సీఆర్ను నమోదు చేసుకున్నారు. ఇందుకు సంబంధించి దర్శకుడు ఆంథోని, కెమరామ్యాన్లను స్టేషన్కు పిలిపించి విచారించారు. దర్శన్ మాట్లాడిన ఆడియో సోషల్ వీడియాలో వైరల్గా మారింది. నీవు ఉండవు... ఏమైనా చేయాలంటే చెప్పే చేస్తా రెడీగా ఉండండి, నీవు కనపడకుండా పోతావంటూ ఆడియోలో ఉంది. ఈ ఆడియోలోని ధ్వని దర్శన్గా గుర్తించారు. దీంతో చందన సీమలో ఆడియోపై చర్చ సాగుతోంది. చదవండి: Mukesh Khanna: బెడ్ షేర్ చేసుకోవాలనుందని అడిగిందంటే ఆమె ఆడదే కాదు: నటుడు -
లగ్జరీ కారు కొన్న స్టార్ హీరో, ధరెంతో తెలుసా?
కన్నడ స్టార్ దర్శన్ కొత్త కారు కొనుగోలు చేశాడు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్యూవీని తన గ్యారేజీలోకి తెచ్చుకున్నాడు. దీని ధర దాదాపు రెండున్నర కోట్ల పైమాటే ఉంటుందని తెలుస్తోంది. కాగా సన్నీడియోల్, అర్జున్ కపూర్, ప్రకాశ్ రాజ్ సహా పలువురు సెలబ్రిటీలు సైతం ఈ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్ యజమానులే! ఇకపోతే దర్శన్కు కార్ల మీద మోజు ఎక్కువేనన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతడికి లంబోర్గిని ఉరుస్, హ్యురాకాన్ సహా పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా ఆ లిస్టులో మరో ఖరీదైన కారు చేరడంతో ఫ్యాన్స్ తమ అభిమాన హీరోకు నెట్టింట శుభాకాంక్షలు చెప్తున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1611343008.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: 7/G బృందావన్ కాలనీ హీరోయిన్తో ఎస్పీ చరణ్ పెళ్లి?, ఫొటో వైరల్ పెంపుడు కుక్కకి ఫ్లైట్ టికెట్స్ డిమాండ్ చేసిన రష్మిక? నటి రియాక్షన్! -
తిరుమల వెళ్లాలంటే వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి
-
తిరుమల శ్రీవారి టికెట్లకు ఫుల్ డిమాండ్
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి దర్శన టికెట్లకి డిమాండ్ కొనసాగుతోంది. టీటీడీ ఆన్లైన్లో శుక్రవారం 4లక్షల 60 వేల టికెట్లను విడుదల చేసింది. ఒక్కసారిగా దర్శన టికెట్ల కోసం టీటీడీ వెబ్సైట్కి 14 లక్షల హిట్లు వచ్చాయి. అయినా టికెట్ల కేటాయింపు ప్రక్రియ సాఫీగా సాగింది. 55 నిముషాల వ్యవధిలోనే 4 లక్షల 60 వేల టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు. కాగా, జనవరి 1, 13 నుంచి 22వ తేదీ వరకు రోజుకు 20 వేలు, జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు, 23 నుంచి 31వ తేదీ వరకు రోజుకు 12 వేలు చొప్పున దర్శన టికెట్లను విడుదల చేసింది. కాగా, జనవరికి సంబంధించి 1, 2, 13 నుంచి 22, 26 తేదీల్లో 5,500 వర్చువల్ సేవా దర్శన టికెట్లను టీటీడీ గురువారం ఆన్లైన్లో విడుదల చేయగా, నిమిషాల వ్యవధిలోనే బుక్ చేసుకున్నారు. చదవండి: (కబడ్డీ కబడ్డీ.. అంటూ బరిలోకి స్పీకర్ తమ్మినేని సీతారాం) వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి తిరుమల : శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్గానీ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని టీటీడీ ఇదివరకే తెలియజేసింది. కొంతమంది భక్తులు నెగెటివ్ సర్టిఫికేట్లు లేకుండా దర్శనానికి వస్తుండటంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద నిఘా, భద్రతా సిబ్బంది తనిఖీ చేసి అలాంటి వారిని వెనక్కు పంపుతున్నారు. దీనివల్ల భక్తులు ఇబ్బందిపడుతున్నారు. ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో వేలాది మంది భక్తులు, ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బందికి సహకరించాలని టీటీడీ కోరింది. -
పునీత్ సంస్మరణ సభలో స్టార్ హీరోకు చేదు అనుభవం
Kannada Star Hero Darshan And Bad Experience At Puneeth Rajkumar Namana Samsmaran Sabha: శాండల్వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్కు కన్నడ సినీ పరిశ్రమ తరపున ‘పునీత్ నామన’ పేరుతో ఘనంగా సంస్మరణ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. నవంబర్ 16న బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్లో భారీగా ఈ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైతో పాటు మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, కర్ణాటక ఎమ్మెల్యేలు, ఎంపీలు, కన్నడ సినీ పరిశ్రమకు సినీ ప్రముఖలు, నటీనటులతో పాటు తమిళ నటుడు శరత్ కుమార్, హీరో విశాల్తో తదితరులు హాజరయ్యారు. చదవండి: పోలీసులను ఆశ్రయించిన నటి స్నేహా అలాగే టాలీవుడ్ నుంచి హీరో మంచు మనోజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వారంత పునీత్కు నివాళులు అర్పించి, ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతరం అయ్యారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు రావడంతో అక్కడ బందోబస్తు కూడా భారీగానే పెట్టారు. అయితే ఈ సభ ప్రాంగణం వెలుపల ఓ కన్నడ స్టార్ హీరోకి చేదు అనుభవం ఎదురైంది. శాండల్వుడ్ అంతా అభిమానంగా డి బాస్ అని పిలుకునే స్టార్ హీరో దర్శన్ను లోపలికి వెళ్లకుండా అక్కడి పోలీసులు అడ్డగించినట్లు సమాచారం. చదవండి: కృతిశెట్టి లుక్ షేర్ చేసిన చై, కొడుకును ఇలా ప్రశ్నించిన నాగ్ టాప్ స్టార్ హీరోలలో దర్శన్ కూడా ఒకరు. పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ సభకు దర్శన్ కొంచెం ఆలస్యంగా రావడంతో ఆయనను గేటు దగ్గర పోలీసులు ఆపినట్లు సమాచారం. ఆడిటోరియం ఫుల్ అయిపోవడంతో.. కూర్చోడానికి సీట్లు కూడా లేవని చెప్పి దర్శన్ను బయటే ఆపేపేశారట. తను లోపలికి వెళ్లి వెంటనే బయటికి వచ్చేస్తాని దర్శన్ చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదట. ఆ సమయంలో హీరో దర్శన్తో పాటు కొంతమంది ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారట. చాలా సేపు పోలీసులతో మాట్లాడిన అనంతరం ఉన్నతాధికారులు వచ్చి దర్శన్ను లోపలికి అనుమతించారట. చదవండి: మెగాస్టార్ రిక్వెస్ట్.. సినీ పరిశ్రమలోని వారికి 50 శాతం డిస్కౌంట్ కానీ లోపలికి వెళ్లినా కూర్చోవడానికి సీట్లు లేక సెకండ్ క్లాస్లో కాసేపు కూర్చున్నాడు. ఇక కార్యక్రమంలో దర్శన్ స్టేజ్పై మాట్లాడుతూ పునీత్ హఠ్మారణం తలచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. దీంతో కొద్దిసేపు మాత్రమే దర్శన్ మాట్లాడి స్టేజ్పై నుంచి వెనుదిరిగాడు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమంలో తమిళ నటుడు శరత్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పునీత్ బదులుగా దేవుడు తనని తీసుకేళ్లినా బాగుండంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇక విశాల్ సైతం పునీత్ చదివిస్తున్న 1800 పిల్లల బాధ్యతను తాను తీసుకుంటానని, ఇది తనకు అప్పగించాల్సిందిగా పునీత్ కుటుంబ సభ్యులను విజ్ఞప్తి చేశాడు.