Dhanush
-
సోషల్మీడియాను షేక్ చేసిన సాంగ్ వీడియో వర్షన్ వచ్చేసింది
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'గోల్డెన్ స్పారో' సాంగ్ వీడియో వర్షన్ వచ్చేసింది. నటుడు, దర్శక–నిర్మాత ధనుష్ స్వీయ దర్శకత్వంలో విడుదలైన తాజా తమిళ చిత్రం ‘నిలువుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’. ఈ రొమాంటిక్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో అనిఖా సురేంద్రన్ , ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్ , రమ్య రంగనాథన్ లీడ్ రోల్స్లో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదలైంది. అయితే, ఒక ప్రేక్షకులకు ఈ మూవీ బాగా కనెక్ట్ అయిందని చెప్పవచ్చు.ఈ మూవీలో ‘మామా మామా కమ్ అండ్ సింగు... క్వీనే వచ్చెను... నువ్వే కింగు...’ అంటూ మొదలయ్యే ఒక హిట్ సాంగ్ తాజాగా వీడియో వర్షన్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ హిట్ సాంగ్ను జీవీ ప్రకాష్ కుమార్తో సుబ్లాషిణి, ధనుష్, అరివు ఆలపించారు. ఈ మూవీని ‘జాబిలమ్మ నీకు అంత కోపమా..’ అనే టైటిల్తో తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ‘గోల్డెన్ స్పారో’ పాట లిరికల్ వీడియో తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. -
ధనుష్ దర్శకత్వంలో అజిత్
-
మరో ఓటీటీకి ధనుశ్ హాలీవుడ్ మూవీ.. దాదాపు ఆరేళ్ల తర్వాత!
కోలీవుడ్ స్టార్ ధనుశ్ హీరోగా నటించిన హాలీవుడ్ చిత్రం 'ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్'. 2019లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ మూవీలో ధనుశ్ హాలీవుడ్లో అడుగుపెట్టారు. ఈ చిత్రం కోలీవుడ్ హీరో మెజీషియన్ పాత్రలో కనిపించారు. అయితే ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి వరకు కేవలం యాపిల్ టీవీ ప్లస్లో మాత్రమే అందుబాటులో ఉంది.తాజాగా ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ మూవీని మరో ఓటీటీలో సందడి చేయనుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వెల్లడించింది. ఈ మేరకు మూవీ పోస్టర్ను విడుదల చేసింది. అయితే ఎప్పటి నుంచి అనేది మాత్రం వెల్లడించలేదు. కాగా.. ఈ సినిమాకు కెన్ స్కాట్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరో ధనుష్ నటనకు హాలీవుడ్ సినీ జనాలు కూడా ఫిదా అయ్యారు. ఈ సినిమాలో ధనుష్ అజాత శత్రు అనే మెజీషియన్ పాత్రలో నటించారు. రొమైన్ ప్యుర్తోలస్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కించారు. -
అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. ధనుశ్ పోటీ నుంచి తప్పుకున్నట్టేనా?
విదాముయార్చి మూవీ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మరో యాక్షన్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ వేసవిలో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోన్న గుడ్ బ్యాడ్ అగ్లీలో అజిత్ నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టీజర్ను విడుదల చేశారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది.అయితే అదే రోజు ధనుశ్ హీరోగా నటిస్తోన్న ఇడ్లీ కడై విడుదల కానుంది. ఈ మూవీలో నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తోంది. అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా అదే రోజు కావడంతో ఇడ్లీ కడై మేకర్స్ పునరాలోచనలో పడ్డారు. ఇడ్లీ కడై మూవీ రిలీజ్ వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. తిరుచిత్రంబలం మూవీ తర్వాత ధనుశ్, నిత్యా మీనన్ మరోసారి జంటగా కనిపించనున్నారు. ఇదిలా ఉండగా.. ధనుశ్ డైరెక్షన్లో అజిత్ కుమార్ నటించనున్నట్లు మరో టాక్ వినిపిస్తోంది. ధనుశ్ సొంత నిర్మాణ సంస్థ అయిన వండర్బార్ పిక్చర్స్ బ్యానర్లో అజిత్ కుమార్ నటించే అవకాశం ఉందని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు కోలీవుడ్ టాక్. -
ధనుష్ను కాపీ కొడుతున్నారా? ఇబ్బందిపడ్డ ప్రదీప్ రంగనాథన్
లవ్ టుడే సినిమాతో సెన్సేషన్ అయిన ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ (Return of the Dragon Movie)తో మరో బ్లాక్బస్టర్ అందుకున్నాడు. ప్రదీప్ హీరోగా నటించిన డ్రాగన్ మూవీ రూ.100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రదీప్ రంగనాథన్ సమాధానాలిచ్చారు. మీ పర్ఫామెన్స్ బాగుంటుంది. కానీ స్క్రీన్పై చూసినప్పుడు ధనుష్ను కాపీ చేసినట్లు అనిపిస్తుంది. ఎవర్నీ కాపీ కొట్టట్లేదుఆ విషయాన్ని మీరు గ్రహించారా? లేదా ఎవరైనా చెప్పారా? అని ఓ పాత్రికేయుడు అడిగారు. అందుకు ప్రదీప్ ఇబ్బందిగా నవ్వుతూనే.. చాలాకాలంగా ఇలాంటి కామెంట్స్ వింటూనే ఉన్నానన్నాడు. కాకపోతే తానెవరినీ ఇమిటేట్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు. తన ఫిజిక్, ఫేస్కట్ వల్ల మీ అందరూ అలా పొరబడుతున్నారని వివరణ ఇచ్చాడు. సేమ్ ధనుష్లాగే ఉండటం మీకు ప్లస్సా? మైనస్సా అన్న ప్రశ్నకు.. అదంతా నాకు తెలియదు.. అద్దంలో చూసుకున్నప్పుడు నాకు నేను మాత్రమే కనపడతాను. నేను తీసిన సినిమా బాగా ఆడుతోందంటే నేను బాగానే చేస్తున్నాను అనుకుంటున్నాను అని హీరో తెలిపాడు. నా కళ్లకు ప్రదీప్లాగే ఉన్నాడు: దర్శకుడి అసహనంఇంతలో డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు (Ashwath Marimuthu) మైక్ అందుకుని.. మీ కళ్లకు మాత్రమే ఫలానా హీరోలా కనిపిస్తున్నాడేమో కానీ నా కళ్లకు మాత్రం ప్రదీప్ రంగనాథన్లాగే ఉన్నాడు. కేవలం ఆయన్ను మిగతా హీరోతో పోల్చాలని మాత్రమే ఈ ప్రశ్న అడిగినట్లున్నారు. ప్రదీప్ రంగనాథన్లో నేను ఏ ఇతర హీరోను చూడలేదు అని గరమయ్యాడు. డ్రాగన్ సినిమా విషయానికి వస్తే.. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ఫిబ్రవరి 21న ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజైంది.చదవండి: నాపై నీ ప్రేమకు, నమ్మకానికి థాంక్యూ.. పెళ్లిరోజు మౌనిక స్పెషల్ పోస్ట్ -
నాగార్జున కుబేర మూవీ.. రిలీజ్ డేట్ వచ్చేసింది!
నాగార్జున, ధనుశ్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం కుబేర. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజవుతుందని భావించినా అలా జరగలేదు. ఈ సినిమా రిలీజ్ కోసం నాగార్జున ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కుబేర టీమ్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేసింది.ఈ పాన్ ఇండియా చిత్రాన్ని జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా విడుదలైన పోస్టర్లో నాగార్జున్, ధనుశ్తో పాటు బాలీవుడ్ నటుడు జిమ్ షర్బ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నాగ్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. రష్మిక హీరోయిన్గా నటిస్తుండడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. A story of power..👑A battle for wealth..💰A game of fate..♟️#SekharKammulasKuberaa is ready to deliver an enchanting theatrical experience from 𝟐𝟎𝐭𝐡 𝐉𝐮𝐧𝐞, 𝟐𝟎𝟐𝟓. @dhanushkraja KING @iamnagarjuna @iamRashmika @sekharkammula @ThisIsDSP @SVCLLP @amigoscreation pic.twitter.com/OUATNh4iES— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) February 27, 2025 -
'కుబేర'కు టైటిల్ కష్టాలు..
ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధమౌతున్న ‘కుబేర’ సినిమాకు టైటిల్ సమస్యలు ఎదురౌతున్నాయి. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న పాన్–ఇండియన్ మూవీ ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్రావు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా టైటిల్ వివాధంలో చిక్కుకుంది.కుబేర సినిమా టైటిల్ తనదే అని తాను 2023 నవంబర్ 29వ తేదీనే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించానని త్రిశక్తి ఎంటర్ప్రైజెస్ నిర్వాహ కుడు, సినీ నిర్మాత నరేందర్ తెలిపారు. 2024 మార్చి 5 నుంచి దర్శకుడు శేఖర్ కమ్ముల కుబేర అనే సినిమా టైటిల్కు కాపీ చేసుకుని టైటిల్కు ముందు శేఖర్ కమ్ముల అని పెట్టి తమ సినిమాకు ఇబ్బంది కలిగిస్తున్నాడని ఆయన ఆవేదనవ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శేఖర్ కుమ్ముల కుబేర టైటిల్ కాపీ చెయ్యగానే తాను ప్రొడ్యూసర్ కౌన్సిల్లో సంప్రదిస్తే వారు పెద్దవారితో ఎందుకు పెట్టుకుంటున్నారు అంటూ తమనే బెదిరిస్తున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. న్యాయం జరుగకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు. -
నటిస్తూనే దర్శకత్వం వహిస్తున్న ధనుష్
-
వేసవిలో ధనుష్ ‘ఇడ్లీ కొట్టు ’
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’ (ఇడ్లీ కొట్టు). ఈ మూవీలో నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా, రాజ్ కిరణ్, అరుణ్ విజయ్, షాలినీ పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. వండర్బార్ ఫిలిమ్స్, డాన్ పిక్చర్స్ బ్యానర్స్పై ధనుష్, ఆకాశ్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘ఇడ్లీ కడై’ తెలుగు విడుదల హక్కులను శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత, నిర్మాత చింతపల్లి రామారావు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా చింతపల్లి రామారావు మాట్లాడుతూ– ‘‘రాయన్’ మూవీ తర్వాత ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘ఇడ్లీ కడై’పై మంచి అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్కు అద్భుతమైన స్పందన వచ్చింది. ధనుష్కి ఇది నటుడిగా యాభై రెండో చిత్రం, అలాగే ఆయన దర్శకత్వం వహిస్తున్న నాలుగో సినిమా. ఈ మూవీకి జీవీ ప్రకాశ్కుమార్ సంగీతం, కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణ. ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. విజయ్ సేతుపతి లీడ్ రోల్లో నటించిన ‘విడుదల 2’ చిత్రాన్ని ఇటీవల మా బ్యానర్లో తెలుగులో రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది’’ అని తెలిపారు. -
`జాబిలమ్మ నీకు అంత కోపమా' మూవీ ప్రెస్ మీట్ (ఫోటోలు)
-
ధనుశ్ డైరెక్షన్లో లవ్ ఎంటర్టైనర్.. ట్రైలర్ చూశారా?
పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'జాబిలమ్మ నీకు అంత కోపమా'(Jaabilamma Neeku Antha Kopama Movie). ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ (Dhanush) దర్శకత్వం వహించారు. ఈ మూవీ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను వండర్బార్ ఫిల్మ్స్ బ్యానర్లో స్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి రాజా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే ఇద్దరు ప్రేమజంటల స్టోరీనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అర్థమవుతోంది. కథ మొత్తం రెండు ప్రేమజంటల చుట్టూ తిరిగే కథాంశంగా రూపొందించారు. ఈ చిత్రంలో వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనర్హన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న థియేటర్లలో సందడి చేయనుంది.It's the season to fall in love ❤️✨ #JaabilammaNeekuAnthaKopama Trailer out now:https://t.co/ZTw9vcjKUkIn cinemas on Feb 21, 2025 💞🎬 Written and directed by @dhanushkraja#JNAK @gvprakash @wunderbarfilms @theSreyas @editor_prasanna @leonbrittodp @asiansureshent pic.twitter.com/SCu6o2G0Fi— Asian Suresh Entertainment (@asiansureshent) February 10, 2025 -
ఇళయరాజా బయోపిక్ కు బ్రేక్ పడిందా ?
-
గెట్... సెట్... గో
స్పోర్ట్స్ మూవీస్కి ఆడియన్స్లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఈ తరహా సినిమాలు ఏమాత్రం ఆడియన్స్కి కనెక్ట్ అయినా బాక్సాఫీస్ స్కోర్స్ (కలెక్షన్స్) కొత్త రికార్డులు సృష్టిస్తాయి. దీంతో వీలైనప్పుడల్లా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీస్ చేస్తుంటారు యాక్టర్స్. ఇలా ప్రస్తుతం సెట్స్లో ‘గెట్..సెట్..గో’ అంటూ సిల్వర్ స్క్రీన్ కోసం స్పోర్ట్స్ ఆడుతున్న కొందరు హీరోల గురించి తెలుసుకుందాం.పెద్ది... ప్లే స్టార్ట్‘రచ్చ, ఆరెంజ్’... ఇలా కొన్ని సినిమాల్లో రామ్చరణ్ క్రికెట్ ఆడిన సన్నివేశాలు చాలా తక్కువ నిడివిలో కనిపిస్తాయి. కానీ ‘పెద్ది’ సినిమాలో మాత్రం ఫుల్ మ్యాచ్ ఆడనున్నారట రామ్చరణ్. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్చరణ్ క్రికెటర్గా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్లో ముగిసింది. చివరి రోజు తన కుమార్తె క్లీంకారని సెట్స్కి తీసుకొచ్చారు రామ్చరణ్.అలాగే ఈ సినిమాలో క్రికెట్తోపాటు కబడ్డీ వంటి ఇతర స్పోర్ట్స్ల ప్రస్తావన కూడా ఉంటుందట. జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీలో దివ్యేందు, జగపతిబాబు, శివరాజ్కుమార్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్స్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీని ఈ దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.ఒక మ్యాచ్.... మూడు జీవితాలు!మాధవన్ , నయనతార, సిద్ధార్థ్ లీడ్ రోల్స్లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘టెస్ట్’. ఈ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్కి శశికాంత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో క్రికెటర్గా నటించారు సిద్ధార్థ్. చక్రవర్తి రామచంద్రన్, శశి కాంత్ నిర్మించిన ఈ మూవీ త్వరలోనే డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఒక టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుందని కోలీవుడ్ సమాచారం. ఇక 2006లో వచ్చిన హిందీ చిత్రం ‘రంగ్ దే బసంతి’ తర్వాత మళ్లీ 18 సంవత్సరాల అనంతరం మాధవన్ , సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం ఇదే.జల్లికట్టు నేపథ్యంలో...తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు. ఈ క్రీడ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. కాగా సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడి వాసల్’ అనే పీరియాడికల్ యాక్షన్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నాలుగు సంవత్సరాల క్రితమే ప్రకటించారు. కానీ వివిధ కారణాల వల్ల సెట్స్పైకి వెళ్లలేదు. దీంతో ఈ ఏడాది ఈ మూవీని సెట్స్పైకి తీసుకుని వెళ్లాలని సూర్య, వెట్రిమారన్ ప్లాన్ చేశారు. జనవరిలో సూర్య, వెట్రిమారన్, ఈ చిత్రనిర్మాత కలైపులి .ఎస్ థానుల మధ్య ‘వాడి వాసల్’ గురించిన చర్చలు కూడా జరిగాయి. ఇక ఎప్పట్నుంచో ఈ మూవీ ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ‘వాడి వాసల్’ రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిసింది.మరోసారి బాక్సింగ్ధనుష్ మెయిన్ లీడ్ రోల్లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’. ఈ మూవీలో అరుణ్ విజయ్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ ఓ బాక్సర్ రోల్ చేస్తున్నారు. కాగా అరుణ్ విజయ్ బాక్సర్గా కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘బాక్సర్’ అనే మూవీలో అరుణ్ విజయ్ బాక్సర్గా నటించారు. అయితే ‘బాక్సర్’ కంప్లీట్ స్పోర్ట్స్ ఫిల్మ్ కాగా, ‘ఇడ్లీ కడై’ మాత్రం స్పోర్ట్స్తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్న మూవీ. ధనుష్, ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కా నుంది. నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో షాలినీపాండే, సత్యరాజ్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు.కె–ర్యాంప్‘క’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘కె–ర్యాంప్’. ఈ చిత్రం టైటిల్ లోగోలో ఓ వ్యక్తి ఫుట్బాల్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది స్పోర్ట్స్ డ్రామా మూవీ అని ఊహించవచ్చు. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. యుక్తీ తరేజా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వీకే నరేశ్, ‘వెన్నెల’ కిశోర్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.రేస్ రాజాహీరో శర్వానంద్ బైక్ రేసింగ్తో బిజీగా ఉన్నారు. శర్వా నంద్ హీరోగా అభిలాష్ కంకర్ డైరెక్షన్లో ‘రేజ్ రాజా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో మోటారు బైకు రేసర్గా శర్వానంద్ నటిస్తున్నారు. 1990 నుంచి 2000ల మధ్య కాలంలో జరిగే ఈ స్పోర్ట్స్ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే... స్పోర్ట్స్ డ్రామా జానర్లో సినిమాలు చేసిన అనుభవం శర్వానంద్కు ఉంది. ‘మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు (2015)’ మూవీలో రన్నింగ్ రేసర్గా, ‘పడి పడి లేచే మనసు (2018)’ మూవీలో ఫుట్బాల్ ప్లేయర్గా శర్వానంద్ నటించి, మెప్పించిన సంగతి తెలిసిందే.బాక్సింగ్ రౌండ్ 2హీరో ఆర్య, దర్శకుడుపా. రంజిత్ కాంబినేషన్లో వచ్చిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘సార్పట్టై పరంబర’. ఈ మూవీ 2021లో డైరెక్ట్గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్గా 2023 మార్చిలో ‘సార్పట్టై పరంబర రౌండ్ 2’ అంటూ సీక్వెల్ను ప్రకటించారు. అయితే తొలి భాగం మాదిరి, రెండో భాగాన్ని ఓటీటీలో రిలీజ్ చేయకుండా థియేటర్స్లో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు మేకర్స్. కబడ్డీ... కబడ్డీ..ధృవ్ విక్రమ్ హీరోగా చేస్తున్న మూవీ ‘బైసన్: కాలమాడన్’. మారి సెల్వరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ధృవ్ విక్రమ్ కబడ్డీ ప్లేయర్గా నటిస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అలాగే కబడ్డీ ప్లేయర్గా కెరీర్ను మొదలుపెట్టి, రాజకీయ నాయకుడిగా మారిన మనత్తి పి. గణేశన్ జీవితం ఆధారంగా ‘బైసన్’ మూవీ రూపొందుతోంని కోలీవుడ్ సమాచారం. అ΄్లాజ్ ఎంటర్టైన్మెంట్, నీలంప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది.- ముసిమి శివాంజనేయులు -
నో కాంప్రమైజ్ అంటున్న శేఖర్ కమ్ముల: Kubera Movie
-
తేదీ మారలేదు
ధనుష్(Dhanush) నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘ఇడ్లీ కడై’ (Idly Kadai)(తెలుగులో ఇడ్లీ కొట్టు అని అర్థం). నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో అరుణ్ విజయ్, షాలినీ పాండే, సముద్ర ఖని, రాజ్ కిరణ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆకాశ్ భాస్కరణ్తో కలిసి ధనుష్ నిర్మిస్తున్న మూవీ ఇది. కాగా ‘ఇడ్లీ కడై’ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ వెల్లడించారు. కానీ తాజాగా ఈ సినిమా రిలీజ్ ఏప్రిల్ 10న విడుదల కావడం లేదనే ప్రచారం జరిగింది. అయితే ‘ఇడ్లీ కడై’ సినిమాను ఏప్రిల్ 10నే రిలీజ్ చేస్తామన్నట్లుగా వెల్లడించి, ఈ సినిమా కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో అనుకున్నట్లే ‘ఇడ్లీ కడై’ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్నట్లుగా స్పష్టమైపోయింది. ఇక ధనుష్ దర్శకత్వంలోని మరో మూవీ ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. పవీష్, అనిఖా సురేంద్రన్ , ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్ లీడ్ రోల్స్లో నటించిన ఈ మూవీ తెలుగులో ‘జాబిలమ్మా నీకు అంత కోపమా...’ అనే టైటిల్తో రిలీజ్ కానుంది. -
స్టార్ హీరోను లాక్ చేయనున్న 'లోకేశ్ కనకరాజ్'
కోలీవుడ్ నటుడు ధనుష్ పాన్ ఇండియా రేంజ్ సినిమాలో నటించనున్నారని కోలివుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్కు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. రేర్ కాంబినేషన్లో ఈ చిత్రం రానున్నడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. కోలీవుడ్లో మానగరం చిత్రంతో దర్శకుడిగా పరిచయమై ఆ తరువాత ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి భారీ చిత్రాలను తెరకెక్కించి స్టార్ దర్శకుడిగా లోకేశ్ కనకరాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా కూలీ చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తున్నారు. తరువాత కార్తీ హీరోగా ఖైదీ–2తోపాటు మరో రెండు చిత్రాలు కమిట్ అయ్యారు. కాగా నటుడు ధనుష్ విషయానికి వస్తే ఇటీవల కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అదేవిధంగా తమిళంలో పాటు, తెలుగు, హిందీ, ఆంగ్లం భాషల్లోనూ కథానాయకుడిగా నటిస్తూ వరల్డ్ స్టార్గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈయన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఇడ్లీ కడై. అదేవిధంగా ఈయన దర్శకత్వం వహించిన మరో చిత్రం నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇక తెలుగులో హీరోగా నటిస్తున్న కుబేర చిత్రం కూడా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇలా మరిన్ని చిత్రాల్లో ధనుష్ నటించనున్నారు. తాజాగా ఈయన దర్శకుడు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల లోకేశ్ కనకరాజ్ నటుడు ధనుష్ను కలిసి కథను వినిపించినట్లు, అది ఆయనకు నచ్చడంతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కాగా ఈ క్రేజీ కాంబినేషనల్ తెరకెక్కనున్న చిత్రాన్ని 7స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. అయితే ధనుష్, దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ప్రస్తుతం కమిటైన చిత్రాలను పూర్తి చేసిన తరువాత వీరి కాంబోలో చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం. -
తెలుగులో క్వీనే వచ్చేను...
‘మామా మామా కమ్ అండ్ సింగు... క్వీనే వచ్చెను... నువ్వే కింగు...’ అంటూ మొదలవుతుంది ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama) సినిమాలోని ‘గోల్డెన్ స్పారో...’ పాట. పవీష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేశ్ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం’. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీకి హీరో ధనుష్ దర్శకత్వం వహించారు.ఆర్కేప్రోడక్షన్స్తో కలిసి ధనుష్(Dhanush) సొంత నిర్మాణ సంస్థ వండర్బార్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. ఈ మూవీని ‘జాబిలమ్మ నీకు అంత కోపమా..’ అనే టైటిల్తో తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ మూవీలోని ‘గోల్డెన్ స్పారో’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.‘గోల్డెన్ స్పారో... నా గుండెలో యారో... నువ్వు లేని లైఫు ఫుల్ శారో..,’ అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్లో పవీశ్, అనిఖాలతో పాటు హీరోయిన్ ప్రియాంకా మోహనన్(Priyanka Mohan) డ్యాన్స్ చేశారు. ఈ పాటకు రాంబాబు గోసాల లిరిక్స్ అందించగా, అశ్విన్ సత్య–సుదీష్ శశికుమార్–సుభాషిణి ఆలపించారు. ఈ సిని మాకు సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్. -
అమ్మాయిలూ ప్రాణాలర్పించగలరు
ప్రేమ కోసంప్రాణాలర్పించే ధైర్యం అమ్మాయిలకూ ఉంటుందని చెబుతున్నారు హీరోయిన్ కృతీ సనన్(kriti sanon). ‘రాంఝాణా (2013), అత్రంగి రే (2021)’ చిత్రాల తర్వాత హీరో ధనుష్(dhanush), దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేషన్లో రూపొందుతున్న రొమాంటిక్ లవ్స్టోరీ ‘తేరే ఇష్క్ మే’(tere ishq mein). 2023లోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పటికీ కొన్ని కారాణాల వల్ల ఇంకా చిత్రీకరణ ఆరంభించలేదు. ఈ ఏడాది ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నారు.కాగా ఈ మూవీలో ధనుష్ సరసన హీరోయిన్గా ముక్తి అనే పాత్రలో కృతీ సనన్ నటించనున్నట్లు మంగళవారం వెల్లడించి, ఈ పాత్ర తాలుకూ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘శంకర్... (ధనుష్ పాత్రను ఉద్దేశించి కావొచ్చు) ప్రేమ కోసం అబ్బాయిలే ప్రాణాలర్పిస్తారా? కొంతమంది అమ్మాయిలకు కూడా ఆ ధైర్యం ఉంది’ అని అర్థం వచ్చేలా కృతీ సనన్ హిందీలో డైలాగ్స్ చెబుతూ, ఒంటిపై పెట్రోల్ పోసుకుని, ఆత్మహత్యాయత్నానికి రెడీ అవుతున్న విజువల్స్ కనిపిస్తాయి. నవంబరు 28న హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
ధనుష్ Vs నయనతార.. హీరోకు మద్దతిచ్చిన కోర్టు!
నయనతార (Nayanthara)పై ధనుష్ వేసిన పరువునష్టం దావాను సవాలు చేస్తూ నెట్ఫ్లిక్స్ (Netflix) వేసిన పిటిషన్ను మద్రాస్ న్యాయస్థానం కొట్టివేసింది. నటుడి అనుమతి లేకుండా అతడి సినిమా క్లిప్స్ వాడుకోవడాన్ని తప్పుపట్టింది. నయనతార బయోపిక్లో నానుమ్ రౌడీదాన్ సినిమా క్లిప్స్ వాడుకోవడంపై నిర్మాత ధనుష్ (Dhanush) అభ్యంతరం వ్యక్తం చేశాడు. రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టుకెక్కాడు. దీన్ని సవాలు చేస్తూ నెట్ఫ్లిక్స్ ఓ పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా కోర్టు దీన్ని కొట్టిపారేసింది. మరోవైపు బయోపిక్పై మధ్యంతర నిషేధం విధేంచాలన్న ధనుష్ నిర్మాణ సంస్థ పిటిషన్పై ఫిబ్రవరి 5న విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది.అసలేం జరిగింది?నయనతార జీవితకథ ఆధారంగా నెట్ఫ్లిక్స్ నయతార: బియాండ్ ది ఫెయిరీటేల్(Nayanthara: Beyond the Fairytale) అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కించింది. ఇందులో నానుమ్ రౌడీదాన్ సినిమాలోని మూడు సెకన్ల సన్నివేశాన్ని వాడుకున్నారు. ఈ చిత్రానికి విఘ్నేశ్ శివన్ దర్శకుడు కాగా ధనుష్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా సమయంలోనే విఘ్నేశ్, నయన్ ప్రేమలో పడ్డారు. అందుకని సదరు సినిమా క్లిప్స్ వాడుకున్నారు. అయితే దానికి ధనుష్ అభ్యంతరం చెప్పాడు. 24 గంటల్లో ఆ సన్నివేశాలను తొలగించాలని, లేదంటే రూ.10 కోట్లు జరిమానా విధిస్తానన్నాడు. ఆయన హెచ్చరికలను అటు నయనతార, ఇటు నెట్ఫ్లిక్స్ ఏమాత్రం లెక్కచేయలేదు. దీంతో ధనుష్ హైకోర్టును ఆశ్రయించాడు.చదవండి: ప్లాస్టిక్ సర్జరీ.. అవమానంగా ఫీలవడానికేముంది?: ఖుషీ కపూర్ -
ధనుష్ హానెస్ట్ రాజ్?
హిట్ ఫిల్మ్ ‘సార్’ (2023) (తమిళంలో ‘వాతి’) తర్వాత హీరో ధనుష్( Dhanush )–దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో మరో మూవీ రానుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. దుల్కర్ సల్మాన్తో ‘లక్కీ భాస్కర్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తీసిన వెంకీ అట్లూరి నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుందనే చర్చ కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతోంది.ఇటీవల సూర్యకు వెంకీ అట్లూరి ఓ కథ వినిపించారనే టాక్ తెరపైకి వచ్చింది. తాజాగా హీరో ధనుష్( Dhanush )కు వెంకీ ఓ కథ వినిపించారట. ఈ కథకు ధనుష్( Dhanush ) అంగీకారం తెలిపారని, ప్రస్తుతం ఈ స్క్రిప్ట్కు తుది మెరుగులు దిద్దే పనిలో వెంకీ అట్లూరి ఉన్నారని భోగట్టా. అంతేకాదు... ఈ సినిమాకు ‘హానెస్ట్ రాజ్’ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. మరి... ధనుష్( Dhanush )–వెంకీ అట్లూరిల కాంబినేషన్ రిపీట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
ధనుశ్తో మూవీపై ప్రశ్న.. తనకేం తెలియదన్న స్టార్ డైరెక్టర్!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2019లో తాను తెరకెక్కించిన చిత్రం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న గౌతమ్ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.గతంలో 2019లో ధనుశ్తో(Dhanush) కలిసి ఎనై నోకి పాయుమ్ తోట అనే మూవీని గౌతమ్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఇందులో మేఘా ఆకాశ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో విడుదల చేశారు. ఎనై నోకి పాయుమ్ తోట పేరు వినగానే గౌతమ్ రియాక్ట్ అయ్యారు. మీరు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు? ఆ చిత్రాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. దాని గురించి నాకేమీ గుర్తు లేదు. అది నా సినిమా కాదు. వేరే వాళ్లది అయి ఉంటుందని అన్నారు. అయితే గౌతమ్ మీనన్ అలా రియాక్ట్ కావడంపై నెటిజన్స్ భిన్నంగా చర్చించుకుంటున్నారు. అయితే గతంలో ఈ సినిమా తొలి భాగాన్ని గౌతమ్ ఎంతో ఫోకస్ పెట్టి తెరకెక్కించారు. షూటింగ్ దశలో ఉండగానే రిలీజ్ డేట్ ప్రకటించడంతో త్వరగా పూర్తి చేయాలన్న ఒత్తిడితో రెండో భాగాన్ని స్పీడ్గా తెరకెక్కించినట్లు వార్తలొచ్చాయి. దీంతో తాజాగా గౌతమ్ మీనన్ చేసిన కామెంట్స్ కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా.. గౌతమ్ మీనన్ ప్రస్తుతం డొమినిక్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఇందులో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పీరియడ్స్ అన్నా పట్టించుకోరు... అతనొక్కడే...: నిత్యామీనన్
దక్షిణాదిలో చాలా మందికి ఇష్టమైన నటి నిత్యా మీనన్(Nitya Menen ) తెలుగు సినిమాల్లో కూడా హిట్స్ ద్వారా చాలా మందికి సుపరిచితమే. ఆమెకు దక్షిణాది వ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం తన రాబోయే తమిళ చిత్రం కాదలిక్క నేరమిల్లై ప్రమోషన్ కార్యక్రమంలో నిత్యామీనన్ బిజీ బిజీగా ఉంది. అయితే ఈ సందర్భంగా ఆమె చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇటీవల తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చిత్రపరిశ్రమ తీరుతెన్నుల గురించి తూర్పార బట్టడం ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా నటీమణుల ఆరోగ్యం విషయంలో చిత్ర పరిశ్రమ కనీసపు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుంది అని ఆమె వ్యాఖ్యానించడం విశేషం. అయితే తన స్నేహితుడు, దర్శకుడు–నటుడు మిస్కిన్ ఒక్కడు మాత్రం ఇందుకు మినహాయింపు అంటూ నిత్య చెప్పుకొచ్చారు.నిక్కచ్చిగా మాట్లాడడానికి ప్రసిద్ది చెందిన నిత్య... సినిమా షూటింగ్లో తాను ఎదుర్కున్న అనుభవాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. చిత్రనిర్మాతలు తమ బృందం అనారోగ్యం విషయంలో. అలాగే నటీమణులు పీరియడ్స్ నొప్పితో ఉన్నామని చెప్పినా పట్టించుకోరని పని మాత్రమే పట్టించుకుంటారని ఆమె వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ ‘‘సినిమా పరిశ్రమలో చాలా చోట్ల అమానవీయత ఉంటుంది. ఎంత జబ్బుపడినా, ఎంత కష్టమైనా ఏదో ఒకటి చేసి షూటింగ్కి రావాలని సినిమా నిర్మాత దర్శకులు ఆశిస్తారు. అంతే. మనం దానికి అలవాటు పడ్డాం. ఏది ఎలా జరిగినా మనం కష్టపడాలి తప్పదు ’’ అంటూ చెప్పారు.అయితే ఆమె 2020లో చేసిన చిత్రం సైకో కోసం చిత్రీకరణలో ఉన్నప్పుడు ఆమెకు ఓ వైవిధ్యభరిత అనుభవం ఎదురైంది. మొదటి రోజు షూట్లోనే తనకు పీరియడ్స్ వచ్చిందని, చాలా నొప్పిగా అనిపించిందని ఆమె గుర్తు చేసుకుంది. ఆ సమయంలో దర్శకుడు మిస్కిన్ ఎంతగా తనని అర్థం చేసుకున్నాడో అని ఆశ్చర్యపోయానని కూడా నిత్య తెలిపింది. నాకు పీరియడ్స్ ఉందని మొదటిసారిగా ఒక మగ దర్శకుడికి నోరు విప్పి చెప్పాను. అప్పుడు అది నా మొదటి రోజు కాదా? అని అతను అడిగాడు. అప్పుడే నాకు అతనిలోని సానుభూతి అనిపించింది. నేను ఆశించినట్టే, అనుకున్నట్టే.. ‘‘అయితే మీరు విశ్రాంతి తీసుకోవచ్చు’’ అని అతను అన్నాడు. అంతేకాదు ఏమీ చేయవద్దు. ఆ రోజు నిత్య అసౌకర్యానికి గురవుతున్నట్లు తాను అర్ధం చేసుకున్నానని ఆమె చేయకూడని పనిని చేయడం తనకు ఇష్టం లేదని మిస్కిన్ చెప్పాడట, ఆమె ఇబ్బంది లేకుండా వచ్చినప్పుడు మాత్రమే షాట్ చేయడానికి ఇష్టపడతానని అన్నాడట.ఈ సినిమాతో పాటు ధనుష్ దర్శకత్వం వహించిన ఇడ్లీ కడైలో నిత్యనే ప్రధాన పాత్రలో కూడా కనిపించనున్నారు. ఆమె డియర్ ఎక్సెస్ అనే చిత్రం కోసం అలాగే తదుపరి చిత్రంలో విజయ్ సేతుపతితో కలిసి నటిస్తోంది. -
కేజీఎఫ్ నేపథ్యంలో...
హీరో ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఈ కాంబినేషన్లో తొలి చిత్రం ‘΄పొల్లాదవన్’ 2007లో వచ్చింది. ఆ తర్వాత ‘ఆడుకాలం (2011), ‘వడ చెన్నై’ (2018), అసురన్’ (2019) వంటి సక్సెస్ఫుల్ మూవీలు వచ్చాయి. తాజాగా వీరి కాంబినేషన్లో ఐదో సినిమా రానుంది. ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. విజయ్ సేతుపతి హీరోగా ఈ సంస్థ నిర్మించిన ‘విడుదల 2’ చిత్రం థియేటర్స్లో 25 రోజులు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ఆడియన్స్కు ధన్యవాదాలు తెలిపి, తమ నిర్మాణ సంస్థలో ధనుష్–వెట్రిమారన్ల కాంబోలో మూవీ ఉంటుందని ‘ఎక్స్’ వేదికగా తెలిపింది ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ సంస్థ. కాగా ధనుష్తో వెట్రిమారన్ చేయనున్న మూవీ కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) బ్యాక్డ్రాప్లో ఉంటుందని, ఈ సినిమాలో మరో అగ్ర హీరో కూడా నటిస్తారని కోలీవుడ్ సమాచారం. -
నయనతార, ధనుష్ కేసు విచారణలో ఏం జరిగిందంటే..?
కోలీవుడ్ నటి నయనతారపై నటుడు ధనుష్ చెన్నై హైకోర్టులో వేసిన పిటిషన్పై న్యాయస్థానం నుంచి వచ్చే తీర్పుపై ఆసక్తి నెలకొంది. నయనతార తన బయోపిక్ను 'నయనతార బిహైండ్ ది ఫెయిరీ టెల్' పేరుతో డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. దీని విడుదల హక్కులను నెట్ప్లిక్స్ ఓటిటి సంస్థ పొంది ఇటీవలే విడుదల చేసింది. కాగా ఈ చిత్రంలో నటుడు ధనుష్ తన వండర్ ఫిలిమ్స్ పతాకంపై విజయ్ సేతుపతి, నయనతార జంటగా నిర్మించిన నాను రౌడీదాన్ చిత్రంలోని రెండు మూడు నిమిషాల నిడివి కలిగిన సన్నివేశాలను ఆ డాక్యుమెంటరీ చిత్రంలో వాడుకున్నారు. దీంతో తన అనుమతి లేకుండా తన చిత్రంలోని సన్నివేశాలను వాడుకున్నందుకుగాను నటుడు ధనుష్ నయనతారపై రూ.10 కోట్లు నష్టపరిహారం కోరుతూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో న్యాయస్థానం అ పిటిషన్ పై వివరణ కోరుతూ గత నెల 8వ తేదీన నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్తోపాటూ నెట్ప్లిక్స్ ఓటీటీ సంస్థకు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసు తాజాగా మరోసారి కోర్టులో న్యాయమూర్తి అబ్దుల్ ఖుదూస్ సమక్షంలో విచారణకు వచ్చింది. కాగా నెట్ ఫిక్స్ ఓటీటీ సంస్థ వివరణ ఇవ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని కోరడంతో, అందుకు అవకాశం ఇచ్చిన న్యాయమూర్తి తదుపరి విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు.చంద్రముఖితో కూడా అదే వివాదంనయనతార చంద్రముఖి సినిమాతో కూడా వివాదంలో చిక్కుకుంది. తమ అనుమతి లేకుండా చంద్రముఖి సినిమాలోని సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో వాడుకున్నందుకు నిర్మాతలు నయనతారకు నోటీసులు పంపించారు. హీరోయిన్, ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ తమకు రూ.5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధనుష్పై పదునైన మాటలతో విరుచుకుపడిని నయన్.. చంద్రముఖి చిత్ర యూనిట్పై ఎలాంటి కామెంట్ చేయలేదు.ధనుష్పై భగ్గుమన్న నయన్ధనుష్ తమపై చాలాకాలంగా ద్వేషాన్ని పెంచుకున్నాడని నయన్ తెలిపింది. తనలోని దాగి ఉన్న పగన ఇలా చూపించడం వల్లే తాము బాధపడాల్సి వస్తోందని ఆమె అన్నారు. 'నేనూ రౌడీనే షూటింగ్ టైంలో మేం మా ఫోన్లో తీసుకున్న వీడియోని ట్రైలర్లో 3 సెకన్లు ఉపయోగించినందుకు నువ్వు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇంతలా దిగజారుతావ్ అనుకోలేదు. దీన్నిబట్టి నీ క్యారెక్టర్ ఏంటో అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు, బయట ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది. మాతో మాత్రం అలా ప్రవర్తించకు. సినిమా సెట్లో ఉన్న వాళ్లందరి జీవితాల్ని శాసించే హక్కు నిర్మాతకు ఉందా..?' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. -
జూన్లో కుబేర?
జూన్లో థియేటర్స్లోకి రానున్నారట ‘కుబేర’. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న పాన్–ఇండియన్ మూవీ ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్రావు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కానుందనే ప్రచారం సాగింది. కానీ జూన్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
ఇడ్లీ కొట్టులో ఏం జరిగింది?
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తాజా తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ అని అర్థం). ఈ చిత్రంలో నిత్యా మీనన్, షాలినీపాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. బుధవారం (జనవరి 1) న్యూ ఇయర్ సందర్భంగా ‘ఇడ్లీ కడై’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ను విడుదల చేశారు. ‘మా సినిమా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశాం. మీ మూలాలకు కట్టుబడి ఉండండి’ అంటూ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ను ‘ఎక్స్’లో షేర్ చేశారు ధనుష్. ఇక ఈ సినిమాలో ధనుష్ యంగ్ లుక్లో కనిపిస్తుండటం ఆయన ఫ్యాన్స్ను ఖుషీ చేస్తోంది. మరి... ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’లో ఏం జరిగింది? అనేది చూడాలంటే ఈ వేసవి వరకు వెయిట్ చేయాల్సిందే. ధనుష్, ఆకాశ్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆల్రెడీ ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్. -
రెండోసారి జోడీ?
హీరో ధనుష్, హీరోయిన్ శ్రుతీహాసన్ రెండోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహించిన ‘3’ (2012) సినిమాలో తొలిసారి జంటగా నటించారు ధనుష్, శ్రుతి. ఆ చిత్రం విడుదలైన 12 ఏళ్లకి మరోసారి ఈ జోడీ రిపీట్ కానుందని టాక్. శివ కార్తికేయన్ నటించిన ‘అమరన్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ రాజ్కుమార్ పెరియసామి తాజాగా ధనుష్తో ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. వాస్తవ ఘటనల నేపథ్యంలో ఈ మూవీ రూపొందనుందని టాక్. ఈ మూవీలో ధనుష్కి జంటగా శ్రుతీహాసన్ నటించనున్నట్లు తెలుస్తోంది. పైగా డైరెక్టర్పై ఉన్న నమ్మకంతో తన పాత్ర ఏంటి? అని అడగకుండానే ఓకే చెప్పారట ఆమె. తన కెరీర్లో ఇప్పటి వరకూ చేయని ఓ వైవిధ్యమైన పాత్ర శ్రుతీహాసన్ది అని టాక్. ‘3’ మూవీతో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న ధనుష్–శ్రుతీహాసన్ రెండోసారి జంటగా నటించనుండటంతో ఈ ప్రాజెక్ట్పై ఇండస్ట్రీలో క్రేజ్ నెలకొంది. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమా షూటింVŠ తో బిజీగా ఉన్నారు శ్రుతి. ఆ మూవీ పూర్తయ్యాక ధనుష్ చిత్రంలో పాల్గొంటారని కోలీవుడ్ టాక్. -
నటుడు చంద్రబాబు బయోపిక్లో ధనుష్
ప్రఖ్యాత దివంగత హాస్యనటుడు, గాయకుడు చంద్రబాబు జీవిత చరిత్ర వెండి తెరకెక్కనుంది. తమిళ సినిమా మరిచిపోలేని హాస్య నటుడు చంద్రబాబు. ఈయన నటుడుగా పీక్లో ఉన్నప్పుడు కథానాయకుల కంటే అధిక పారితోషకం తీసుకున్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి నటుడి బయోపిక్ను తెరకేక్కించేందుకు గోపాల్ వన్ స్టూడియోస్ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇంతకుముందు రామన్ తేడియ సీతై, చారులత, అలోన్, నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన హే సినామికా వంటి పలు విజయవంతమైన చిత్రాలను ఈ సంస్థ నిర్మించింది. కాగా తాజాగా రచయిత దర్శకుడు కె. రాజేశ్వర్ రాసిన జేపీ. ది లెజెండ్ ఆఫ్ చంద్రబాబు నవలను సినిమాగా రూపొందించడానికి హక్కులను, నటుడు చంద్రబాబు సోదరుడు జవహర్ నుంచి అనుమతి తీసుకున్నట్లు ఈ సంస్థ నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ నవలను చిత్రంగా మలచడానికి కథకుడు, మాటల రచయిత జయమోహన్ సిద్ధమయ్యారని ఆయనతోపాటు యువ గీత రచయిత మదన్ కార్గీ కూడా స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నారని చెప్పారు. ఈ చిత్రం చంద్రబాబుకు తాము సమర్పించే మర్చిపోలేని అంజలిగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. అదేవిధంగా ఈ చిత్రం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందన్నారు. అయితే ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ ప్రాజెక్ట్లో కోలీవుడ్ టాప్ హీరో ధనుష్ భాగం కానున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు పాత్రకు ఆయన మాత్రమే న్యాయం చేస్తారని అక్కడి ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ధనుష్ ఇప్పటికే ఇళయరాజా బయోపిక్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబు బయోపిక్లో తాను నటిస్తున్నట్లు ఎటువంటి ప్రకటన రాలేదు. వీటికి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడుతుందని భావిస్తున్నారు. -
ధనుశ్ - నయనతార వివాదం.. కోర్టు కీలక ఆదేశాలు!
నయనతార- కోలీవుడ్ హీరో ధనుశ్ మధ్య వివాదం కీలక మలుపు తిరిగింది. ధనుశ్ ఇప్పటికే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన సినిమాలోని ఓ క్లిప్ను అనుమతి లేకుండా వినియోగించారంటూ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం హీరోయిన్ నయనతారకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీలోగా వివరణ ఇవ్వాలంటూ నయన్కు నోటీసులిచ్చింది. ఈ వ్యవహరంలో మీ వైఖరి చెప్పాలంటూ నయన్ దంపతులతోపాటు నెట్ఫ్లిక్స్ బృందాన్ని కోర్టు ఆదేశించింది. అసలేంటి వివాదం?ఇటీవల నయనతార తన ప్రేమ పెళ్లిపై రూపొందించిన డాక్యుమెంటరీని విడుదల చేసింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే పేరుతో రిలీజైన డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని మూడు సెకన్ల క్లిప్ను ఉపయోగించారు. దీంతో తన పర్మిషన్ లేకుండా తన సినిమాలోని క్లిప్ను వినియోగించారంటూ ధనుశ్ టీమ్ రూ.10 కోట్లకు దావా వేసింది. ఆ తర్వాత నయనతార ఈ వివాదంపై బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు. -
ఏ తప్పు చేయలేదు.. ఎందుకు భయపడాలి: నయనతార
తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటోంది నయనతార. ధనుష్ విషయంలో తాను చేసిన పనిని సమర్థించుకుంటుంది. ఆయనతో మాట్లాడానికి చాలా ప్రయత్నించానని..కుదరకపోవడంతో లేఖ రాయాల్సి వచ్చిందని చెప్పింది. ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ డాక్యూమెంటరీ విషయంలో ధనుష్, నయనతార మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్లో తన పర్మిషన్ తీసుకోకుండా ‘నానుమ్ రౌడీ దాన్’లోని సీన్ను వాడుకున్నారంటూ చిత్ర నిర్మాత ధనుష్ లీగల్ నోటీసులు పంపించాడు. మూడు సెకన్ల క్లిప్నకు రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నయనతార ధనుష్ క్యారెక్టర్ని తప్పుబడుతూ బహిరంగ లేఖను రాసింది. తాజాగా ఈ వివాదంపై నయనతార క్లారిటీ ఇచ్చింది. తాను లేఖను రాయడానికి గల కారణం ఏంటో తెలిపింది. (చదవండి: ఇక్కడితో ఆపేయండి..లేదంటే లీగల్ నోటీసులు పంపిస్తా.. సాయి పల్లవి మాస్ వార్నింగ్)ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వివాదం గురించి మాట్లాడుతూ.. ‘ధనుష్ క్యారెక్టర్ని బయట ప్రపంచానికి తెలియజేయడానికే ఆ లేఖను రాశాను. ‘న్యాయమని నమ్మిన దాన్ని బయటపెట్టడానికి నేను ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి. పబ్లిసిటీ కోసం ఎదుటి వ్యక్తుల పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసే మనిషిని కాదు నేను. నా డ్యాక్యుమెంటరీ ఫిల్మ్ పబ్లిసిటీ కోసమే ఇదంతా చేశారని చాలా మంది మాట్లాడుతుంటున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. (చదవండి: పుష్పరాజ్ వసూళ్ల సునామీ.. ఆరు రోజుల్లోనే రప్ఫాడించాడు!)వీడియో క్లిప్స్కు సంబంధించిన ఎన్వోసీ కోసం ధనుష్ని కలిసేందుకు ప్రయత్నించాం. నేను, విఘ్నేష్ ఫోన్ చేశాం. కామన్ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాం. కానీ ధనుష్ స్పందించలేదు. ఆయన మమ్మల్ని ఎందుకు ద్వేషిస్తున్నారో తెలియదు. ముందు నుంచి మేమిద్దరం ఏమీ శత్రువులం కాదు. ఆయన నాకు మంచి స్నేహితుడే. ఈ పదేళ్లలో ఏం జరిగిందో తెలియదు. ఆయనకు మాపై ఎందుకు కోపం వచ్చిందనే విషయం కూడా మాకు అర్థం కావడం లేదు. పక్కవాళ్ల మాటలు విని మమ్మల్ని అపార్థం చేసుకున్నారా? ఇలాంటివి క్లియర్ చేసుకునేందుకు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించాను. అది కుదరలేదు’ అని నయనతార అన్నారు. -
అలాంటి వారికే నేనేంటో తెలుస్తుంది: ధనుష్
కోలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనుశ్. అంతేకాదు సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. అయితే ధనుశ్కు ఈ స్థాయి అంత సులభంగా వచ్చింది కాదు. తుళ్లువదో ఇళమై చిత్రంతో కథానాయకుడిగా తన తండ్రి కస్తూరి రాజా దర్శకత్వంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత విడుదలకు ముందు ఎన్నో అవమానాలను, అవహేళనలను ఎదుర్కొన్నారు. అయితే ధనుష్కు తొలి చిత్రం మంచి విజయాన్ని అందించడంతో పలువురు దర్శక నిర్మాతలు ఆయన వెంట పరుగులు తీశారు.కెరీర్ ప్రారంభంలో ధనుశ్ విజయాలలో ఆయన సోదరుడు, దర్శకుడు సెల్వరాఘవన్ భాగమయ్యాడు. అయితే ధనుశ్పై విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాతలకు సరిగా కాల్ షీట్స్ కేటాయించడం లేదనే ఆరోపణలున్నాయి. ఇకపోతే ఇటీవల మరో అగ్రనటి నయనతార కూడా ఆయన వ్యక్తిత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఐశ్వర్య రజనీకాంత్తో ఈయన వివాహ బంధానికి కూడా ఎండ్ కార్డ్ వేశాడు. ఇటీవలే వీరిద్దరికి విడాకులు కూడా మంజూరయ్యాయి. యితే ఇవన్నీ ధనుశ్ కెరియర్కు ఎలాంటి ఇబ్బంది తీసుకురాలేదనే చెప్పాలి.తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ధనుశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను అర్థం చేసుకోవడం నిజంగానే కొంచెం కష్టమని.. తనతో సన్నిహితంగా ఉండే వారికే తానేంటో తెలుస్తుందన్నారు. అయితే తాను ఎవరికీ అంత సులభంగా దగ్గర అవ్వనని.. అందుకు కొన్ని రోజుల సమయం పడుతుందని అన్నారు. తనతో సుదీర్ఘ పరిచయం ఉన్న వారే తనను అర్థం చేసుకోగలుగుతారని నటుడు ధనుశ్ పేర్కొన్నారు. దీంతో ఈయన ఎవరి గురించి ఇలా మాట్లాడారా అన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. కాగా ధనుష్ ప్రస్తుతం ఇడ్లీ కడై అనే చిత్రంలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ధనుష్ దర్శకత్వం వహించిన మరో చిత్రం నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. -
ధనుష్తో వివాదం.. సోషల్ మీడియాలో విఘ్నేశ్ మిస్సింగ్!
తమిళ ఇండస్ట్రీలో ధనుష్-నయనతార మధ్య గత కొన్నిరోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. ఈమె లైఫ్, పెళ్లి తదితర అంశాలతో డాక్యుమెంటరీ తీశారు. దాన్ని రీసెంట్గా రిలీజ్ చేశారు. అయితే ఇందులో తను నిర్మించిన 'నానుమ్ రౌడీదానే' మూవీ సీన్స్ ఉపయోగించడంపై ధనుష్ అభ్యంతరం చెప్పాడు. 3 సెకన్ల క్లిప్ వాడినందుకు రూ.10 కోట్ల దావా వేశాడు. దీంతో నయనతార పెద్ద పోస్ట్ పెట్టింది.ధనుష్ని చెడ్డవాడు అనేలా చిత్రీకరించడానికి నయనతార గట్టిగానే ట్రై చేసింది. లాజికల్గా చూసుకుంటే ఈమె చేసింది తప్పయినా సరే ధనుష్నే తప్పుబట్టాలని చూసింది. కొన్నిరోజులు ఊరుకున్న ధనుష్.. ఈ మధ్యే నయనతార-ఆమె భర్త విఘ్నేశ్ శివన్కి కోర్టు ద్వారా నోటీసులు జారీ చేయించాడు. పిటిషన్పై విచారించిన న్యాయమూర్తి.. దీనిపై వివరణ ఇవ్వాలని నయనతారని ఆదేశించారు.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: తేజ ఎలిమినేట్.. 8 వారాలకు ఎంత సంపాదించాడు?)గొడవ నయన-ధనుష్ మధ్య జరుగుతున్నప్పటికీ కొన్నిరోజుల క్రితం నయనతార భర్త విఘ్నేశ్.. ధనుష్ వీడియో ఒకటి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ధనుష్ ఫ్యాన్స్ ట్రోల్ చేసేసరికి దాన్ని డిలీట్ చేశాడు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను హీరో అజిత్ సినిమా 'ఎన్నై అరిందాల్' మూవీ కోసం పాట రాశానని, అదే టైంలో తన తొలి మూవీ 'నానుమ్ రౌడీదానే' చూసి ఆయన మెచ్చుకున్నారని చెప్పాడు.అయితే 'నానుమ్ రౌడీదానే' రిలీజ్ కావడానికి 7 నెలల ముందు అజిత్ మూవీ రిలీజైందని.. అసలు థియేటర్లలోకి రావడానికి ముందు అజిత్ ఎలా సినిమా చూశారని, ఇలా అబద్ధాలు చెప్పడం సరికాదని ధనుష్ అభిమానులు విఘ్నేశ్ని విపరీతంగా ట్రోల్ చేశారు. అలానే ధనుష్ తొలి మూవీ చేసే ఛాన్స్ ఇచ్చారనే కనీస కృతజ్ఞత కూడా విఘ్నేశ్కి లేదని అంటున్నారు. దీంతో ఈ గోల భరించలేక విఘ్నేశ్ తన ట్విటర్ ఖాతాని డిలీట్ చేశాడు. (ఇదీ చదవండి: Prithvi: అహంకారంతో విర్రవీగాడు.. ఎలిమినేట్ అయ్యాడు!) -
ఏదో ఒకరోజు వడ్డీతో సహా తిరిగొస్తుంది: నయనతార
కోలీవుడ్లో నటి నయనతార, ధనుష్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఆమెపై తెరకెక్కిన డాక్యుమెంటరీ విషయంలో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో నయనతారతో పాటు ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివనన్పై ధనుష్ దావా వేసిన సంగతి తెలిసిందే. కోర్టు కూడా సమాధానం చెప్పాలని నయన్ను కోరింది. అయితే, తాజాగా సోషల్మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ధనుష్ను టార్గెట్ చేసే నయన్ పోస్ట్ చేసింది అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.కోలీవుడ్లో నయనతార, ధనుష్ వివాదం ఇప్పట్లో తగ్గేలా లేదు. సుమారు మూడు పేజీలతో ధనుష్పై నయన్ సంచలన ఆరోపణలు చేస్తూ ఒక లేఖ విడుదల చేసి కొద్దిరోజులు కాకముందే ఆమె మరోసారి పరోక్షంగా పదునైన వ్యాఖ్యలు చేసింది. ధనుష్ను హెచ్చరిస్తూ నయన్ ఇలా పోస్ట్ చేసింది. 'అబద్ధాలతో పక్క వారి జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించకండి. అది కూడా అప్పుతో సమానమే. ఏదో ఒకరోజు మీకు కూడా అంతకు మించి వడ్డీతో సహా తిరిగి వస్తుంది. ఈ విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోండి.' అంటూ ఒక నోట్ను నయన్ పంచుకుంది.సోషల్మీడియాలో ఆమె ఎవరి గురించి ఈ పోస్ట్ చేసిందో తెలియదు. కానీ, కోలీవుడ్లో మాత్రం ధనుష్ను టార్గెట్ చేస్తూనే ఈ పోస్ట్ ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీ విషయంలో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. ధనుష్ నిర్మాతగా తెరకెక్కించిన ‘నానుమ్ రౌడీ దాన్’కు సంబంధించిన ఫుటేజ్ను నయన్ ఉపయోగించారు. అందుకు పరిహారంగా రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ ధనుష్ లీగల్ నోటీసులు పంపించారు. ఈ కారణంతో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. -
ధనుష్ – ఐశ్వర్య జంటకు విడాకులు మంజూరు
-
జైలర్ 2 సీక్వెల్ లో ధనుష్..?
-
మళ్లీ మొదటికి వచ్చిన ధనుష్.. నయనతారకు షాక్
-
ధనుష్- ఐశ్వర్యకు విడాకుల మంజూరు
తమిళ స్టార్ జంట ధనుష్- ఐశ్వర్య రెండేళ్ల క్రితమే విడిపోతున్నట్లు ప్రకటించారు. మనస్పర్థలు తొలగిపోయి ఎప్పటికైనా కలవకపోతారా? అని అభిమానులు ఆశగా ఎదురుచూశారు, కానీ ఆ దిశగా ప్రయత్నాలు సాగలేదు. ఇద్దరూ విడిపోవడానికే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.తాము కలిసుండాలనుకోవడం లేదని, విడిపోవాలనే నిర్ణయించుకున్నామని కరాఖండిగా చెప్పారు. ఈ క్రమంలో న్యాయస్థానం ధనుష్-ఐశ్వర్య దంపతులకు విడాకులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం తుదితీర్పు వెలువరించింది.కాగా ధనుష్.. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను 2004లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి యాత్ర, లింగ అనే కుమారులు జన్మించారు. 2022లో ధనుష్- ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించారు. నేడు అధికారికంగా విడాకులు తీసుకున్నారు.చదవండి: సవతికూతురిపై నటి రూ.50 కోట్ల పరువునష్టం దావా! -
నయనతార డాక్యుమెంటరీ.. మరింత ముదిరిన వివాదం..!
కోలీవుడ్లో వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల లేడీ సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరీ రిలీజ్ తర్వాత మొదలైన వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే రూ.10 కోట్ల పరిహారం కోరుతూ నోటీసులు పంపించిన హీరో ధనుశ్.. తాజాగా కోర్టులో దావా వేశారు. నయనతారతో పాటు ఆమె భర్త విఘ్నేశ్ శివన్పై తాజాగా దావా వేశారు. గతంలో నయన్, ధనుశ్ జంటగా నటించిన నానుమ్ రౌడీ దాన్ మూవీలోని మూడు సెకన్ల క్లిప్ను అనుమతి లేకుండా వినియోగించారంటూ ధనుశ్ టీమ్ ఆరోపించింది. ఈ విషయంపై ఇప్పటికే నయనతారకు నోటీసులు కూడా పంపారు. అయితే తాజాగా ఆ మూవీ నిర్మాణసంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం విచారణకు అనుమతించింది. అయితే ఇటీవల ఓ పెళ్లి వేడుకలో కలిసిన వీరిద్దరు ఒకరిని ఒకరు అస్సలు పట్టించుకోలేదు. అసలేం జరిగిందంటే..ఇటీవల విడుదలైన నయనతార నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ ఈ వివాదానికి కారణమైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపించారు. ఈ వివాదం కాస్తా కోలీవుడ్లో మరింత చర్చకు దారితీసింది. కాగా.. నయనతార డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. -
భారీ అంచనాలతో కుబేర.. విడుదల ఎప్పుడు..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది.ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న కుబేర విడుదల తేదీ ప్రకటించే పనిలో ఉన్నాడు. వాస్తవంగా ఈ మూవీ దీపావళీ కానుకగా రావాల్సి ఉంది. పలు కారణాల వల్ల జాప్యం జరగడంతో ఇప్పుడు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. హీరో ధనుష్ కుబేరలో సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు భారీగానే ఎదురుచూస్తున్నారు. -
మొన్నటి వరకు గొడవలు..! ఇప్పుడు పెళ్లి వేడుకకు హాజరు
-
టాప్ ప్రొడ్యూసర్ పెళ్లిలో హైలైట్గా ధనుష్, నయన్, కానీ.. (ఫొటోలు)
-
ధనుశ్- నయనతార వివాదం.. అప్పుడే పెళ్లిలో కలిశారు.. కానీ!
ప్రస్తుతం కోలీవుడ్ను కుదిపేస్తోన్న వివాదం ఏదైనా ఉందంటే అది ధనుశ్- నయనతారదే. ఇటీవల నయనతార లైఫ్ స్టోరీగా వచ్చిన డాక్యుమెంటరీ రిలీజైన తర్వాత ఈ వివాదం మొదలైంది. 2015లో ధనుశ్-నయన నటించిన నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్లో మరింత చర్చకు దారితీసింది.ఈ వివాదం మొదలైన తర్వాత కోలీవుడ్లో వీరిద్దరు ఒకరంటే ఒకరికీ అస్సలు పడటం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఈ కాంట్రవర్సీ కొనసాగుతున్న టైమ్లో ఊహించని విధంగా ఇద్దరూ ఓకే వేదికపై మెరిశారు. తమిళ నిర్మాతల్లో ఒకరైన ఆకాశ్ భాస్కరన్ పెళ్లికి హాజరయ్యారు. ఈ వేడుకలో పక్కపక్కనే ఉన్నప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు సరికదా.. కనీసం చూసుకోలేదు కూడా. ఈ పెళ్లికి నయన్ భర్త విఘ్నేశ్ శివన్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.కాగా.. నయనతార నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. కేవలం మూడు సెకన్ల ఫుటేజీని ఉపయోగించినందుకు ధనుశ్ లీగల్ నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింత ముదిరింది.#Dhanush & #Nayanthara together at the recent wedding of Producer AakashBaskaran pic.twitter.com/ulZDckjak8— AmuthaBharathi (@CinemaWithAB) November 21, 2024 #Dhanush & #Nayanthara today at a Marriage Function pic.twitter.com/xHURf15YJ6— Arun Vijay (@AVinthehousee) November 21, 2024 -
ధనుశ్ - ఐశ్వర్య విడాకులు.. ఇక అదొక్కటే మిగిలి ఉంది!
కోలీవుడ్ స్టార్ కపుల్గా గుర్తింపు తెచ్చుకున్న జంటల్లో ధనుశ్- ఐశ్వర్య ఒకరు. రెండేళ్ల క్రితమే వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్కు షాకిచ్చారు. ప్రస్తుతం ఈ జంట విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఇవాళ కేసు విచారణలో భాగంగా కోర్టుకు ధనుశ్, ఐశ్వర్య కోర్టుకు హాజరయ్యారు. చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు తమ నిర్ణయాన్ని న్యాయమూర్తి వివరించారు. ఇటీవల వీరిద్దరు త్వరలో కలుసుకోబోతున్నారంటూ కోలీవుడ్లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.తాజాాగా కోర్టులో విచారణకు హాజరైన వీరిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు న్యాయమూర్తికి వివరించారు. విడిపోవడానికి గల కారణాలను కోర్టుకు వివరించినట్లు తెలుస్తోంది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం త్వరలోనే తీర్పు ఇవ్వనుంది. ఈ కేసు తుది తీర్పును నవంబర్ 27కు వాయిదా వేశారు. దీన్ని బట్టి చూస్తే మరో స్టార్ జంట విడాకులు తీసుకోవడం దాదాపు ఖరారైనట్లే.(ఇది చదవండి: కోర్టు విచారణకు దూరంగా ధనుష్, ఐశ్వర్య... మరోసారి వాయిదా!)అయితే వీరి నిర్ణయంతో కోర్టు విడాకులు మంజూరు చేసే అవకాశముంది. ఇద్దరు కూడా కలిసి ఉండాలనుకోవట్లేదని ఇవాళ కోర్టుకు వివరించారు. దీంతో ఈ జంట తమ వివాహబంధానికి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్యను ధనుశ్ పెళ్లాడారు. పెద్దల అంగీకారంతో 2004 నవంబర్ 18న వీరి వివాహం జరిగింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి బంధానికి ఎండ్ కార్డ్ పడనుంది. -
నయన్- ధనుశ్ వివాదం.. ఆ విషయం తెలిసి షాకయ్యా: రాధిక శరత్ కుమార్
ధనుశ్- నయనతార వ్యవహారం కోలీవుడ్ను కుదిపేస్తోంది. ఇటీవల విడుదలైన నయనతార నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ ఈ వివాదానికి కారణమైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్లో మరింత చర్చకు దారితీసింది.అయితే తాజాగా ఈ వ్యవహారంపై సీనియర్ నటి రాధిక శరత్కుమార్ స్పందించారు. నానుమ్ రౌడీ ధాన్లో కీలక పాత్ర పోషించిన రాధిక ధనుశ్ ప్రవర్తనపై మాట్లాడారు. ఈ మూవీ సెట్స్లో నయనతార, విఘ్నేష్ శివన్ల ప్రేమ వ్యవహారం గురించి తనతో చెప్పాడని తెలిపింది. ఆ మూవీ షూటింగ్ టైమ్లో ధనుశ్ నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడని వివరించింది. ధనుశ్ ఫోన్లో మాట్లాడుతూ అక్కా.. నీకు సిగ్గు లేదా? అని అడిగాడు. అతను ఏమి చెబుతున్నాడో నాకు అర్థం కాలేదు. 'ఏం జరుగుతుందో నీకు తెలియదా?, 'విక్కీ, నయన్లు డేటింగ్ చేస్తున్నారని ధనుశ్ నాతో అన్నాడని తాజాగా విడుదలైన డాక్యుమెంటరీలో రాధిక వివరించింది. ఆ తర్వాత వెంటనే 'ఏం మాట్లాడుతున్నావ్.. నాకేమీ తెలీదు' అని షాకింగ్కు గురైనట్లు డాక్యుమెంటరీలో చెప్పుకొచ్చింది.కాగా.. నయనతార డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. కేవలం మూడు సెకన్ల ఫుటేజీని ఉపయోగించినందుకు ధనుశ్ లీగల్ నోటీసులు పంపడంతో ఈ వివాదం మరింత ముదిరింది. -
ధనుశ్- నయనతార వివాదం.. మంచి ఎంటర్టైనింగ్గా ఉందన్న నటుడు!
ప్రస్తుతం కోలీవుడ్లో ధనుశ్-నయనతార వివాదం హాట్ టాపిక్గా మారింది. ఇటీవల నయన్ తన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ రిలీజ్ తర్వాత వీరిద్దర మధ్య వార్ మొదలైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం తగదంటూ, ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించారు. దీంతో ఈ వివాదం కాస్తా కోలీవుడ్లో మరింత చర్చకు దారితీసింది.అయితే తాజాగా ఈ వివాదంపై నానుమ్ రౌడీ ధాన్ నటుడు ఆర్జే బాలాజీ స్పందించారు. ఈ విషయం తనకు సోషల్ మీడియా ద్వారా తెలిసిందన్నారు. అయితే వీరి మధ్య జరుగుతున్న ఫైట్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైనర్గా మారిందని ఆయన అన్నారు. ఈ విషయంలో నేనేం చెప్పలేను.. దీనిపై మాట్లాడానికి నేను ఎవరినీ? అని వెల్లడించారు. ఆదివారం చెన్నైలో ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన మీడియా అడిగిన ప్రశ్నకు పైవిధంగా స్పందించారు.(ఇది చదవండి: నయనతార- ధనుష్ వీడియో క్లిప్ వివాదం.. హీరో తండ్రి షాకింగ్ కామెంట్స్!)వాళ్లిద్దరూ కూడా సినీరంగంలో అనుభవమున్న వ్యక్తులనీ ఆర్జే బాలాజీ అన్నారు. ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించుకోవాలో వారికి తెలుసన్నారు. ప్రస్తుతానికి నా దృష్టంతా సూర్య సర్తో చేయాల్సిన సినిమాపైనే ఉందని ఆయన తెలిపారు. -
నయనతారను హెచ్చరిస్తూ ధనుష్ అడ్వకేట్ మరో నోటీసు
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారను హెచ్చరిస్తూ ధనుష్ లాయర్ మరో నోటీసు పంపారు. నయనతారపై తెరకెక్కించిన డాక్యుమెంటరీలో తమ సినిమాకు సంబంధించిన ఫుటేజీని తొలగించాలని ఆయన కోరారు. ఈమేరకు ఇప్పటికే నోటీసులు కూడా పంపడం జరిగిందని ఆయన గుర్తుచేశారు. 24 గంటల్లో ఆ ఫుటేజీని తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని ధనుష్ లాయర్ మరోసారి హెచ్చరిస్తూ నయన్కు నోటీసులు పంపారు.నయనతార డాక్యుమెంటరీ కోసం ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన 'నేనూ రౌడీనే' సినిమా నుంచి మూడు సెకండ్ల వీడియోను ఆమె ఉపయోగించుకుంది. దీంతో ధనుష్ కాపీరైట్ చట్టం కింద నయన్పై రూ. 10 కోట్లు నష్టపరిహారం కేసు వేశారు. అయితే, తాజాగా నెట్ఫ్లిక్స్లో ఆ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతుండంతో అందులో ఈ సినిమా నుంచి తీసుకున్న ఫుటేజీ కూడా ఉంది. దీంతో ధనుష్ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఆమెతో పాటు నెట్ఫ్లిక్స్కు హెచ్చరికతో ధనుష్ అడ్వకేట్ నోటీసు జారీ చేశారు.ధనుష్ లాయర్ తాజాగా నయన్ అడ్వకేట్కు ఒక లేఖ ఇలా రాశారు 'నా క్లయింట్కు హక్కులు కలిగి ఉన్న సినిమాలోని వీడియోను నయనతార డాక్యుమెంటరీలో ఉపయోగించారు. ధనుష్ అనుమతి లేకుండా అలా చేయడం చట్టరిత్యా నేరం. 24 గంటల్లో దానిని తొలగించాలి. ఈ విషయంలో మీ క్లయింట్కు (నయనతార) సలహా ఇవ్వండి. లేని పక్షంలో మీ క్లయింట్కు వ్యతిరేకంగా నా క్లయింట్ చట్టపరమైన తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. రూ. 10 కోట్ల నష్టపరిహారం విషయంలో నయనతారతో పాటు నెట్ఫ్లిక్స్ ఇండియా కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది.' అని ప్రకటన ముగించారు. దీంతో నయనతారకు పుట్టినరోజు కానుకను ధనుష్ ఇలా ప్లాన్ చేశాడా అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.Dhanush has given them 24 hours to remove the contents of NRD movie from the documentary. If not, then #Nayanthara, @VigneshShivN and @NetflixIndia will have to face legal actions, and will also be subjected to a 10cr damage pay. But Couples can’t tolerate this appeal . So they… pic.twitter.com/JpMfotdT7E— Dhanush Trends ™ (@Dhanush_Trends) November 17, 2024 -
నయనతార- ధనుష్ వీడియో క్లిప్ వివాదం.. హీరో తండ్రి షాకింగ్ కామెంట్స్!
నయనతార సినీ, వ్యక్తిగత జీవితంపై రూపొందించిన నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, నయనతార జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ధనుష్ నిర్మించిన తమిళ చిత్రం ‘నానుమ్ రౌడీదాన్’ (నేనూ రౌడీనే)లోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం తగదంటూ, ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నయనతార సోషల్ మీడియా ద్వారా ఘాటుగా స్పందించారు. తాజాగా ధనుష్ తండ్రి, దర్శక–నిర్మాత కస్తూరి రాజాను ‘ఈ విషయమై మీ అభిప్రాయం ఏంటి?’ అని ఒక విలేకరి ప్రశ్నించగా – ‘‘నయనతార వ్యవహారం గురించి నాకు కాస్త ఆలస్యంగా తెలిసింది. మేం ఎప్పుడూ ముందుకు పరిగెడుతుంటాం. తరుముకు వచ్చే వారి గురించి కానీ, వెనక మాట్లాడే వారి గురించి కానీ పట్టించుకునేంత టైమ్ మాకు లేదు. అయితే ధనుష్ అనుమతి కోసం రెండేళ్లు ఎదురు చూశానని నయనతార చేసిన ఆరోపణలో వాస్తవం లేదు. మా దృష్టంతా మేం చేసే పని మీద ఉంటుంది. ధనుష్ ‘ఇడ్లీ కడై’ చిత్రంతో బిజీగా ఉన్నారు’’ అన్నారు.– చెన్నై, ‘సాక్షి’ సినిమా ప్రతినిధి -
ధనుష్ ఆ హీరోయిన్లందరినీ వేధించాడు: సింగర్
నయనతారకు సంబంధించిన డాక్యుమెంటరీ విషయంలో కోలీవుడ్లో పెద్ద చర్చ జరుగుతుంది. నయన్కు ధనుష్ నోటీసులు పంపిన తర్వాత ఈ అంశం నెట్టింట దుమారం రేగుతుంది. దీంతో తాజాగా ధనుష్పై సింగర్ సుచిత్ర సంచలన ఆరోపణలు చేసింది. సుచీ లీక్స్తో ఆమె సౌత్ ఇండియాలో అందరికీ పరిచయమే. నయన్కు మద్ధతుగా ధనుష్పై ఆమె చేసిన కామెంట్స్ కోలీవుడ్లో వైరల్ అవుతున్నాయి.యూట్యూబ్ వేదకగా సుచిత్ర మాట్లాడుతూ.. 'ధనుష్ వల్ల కష్టాలు ఎదుర్కొన్నది నయనతార మాత్రమే కాదు.. ఇప్పుడు నయనతారకు సపోర్ట్గా ఉన్న చాలా మంది నటీమణులు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అతని వల్ల సుమారు 150 మంది నటీమణులు పలు ఇబ్బందులు పడ్డారు. నిజానికి ధనుష్తో కలిసి నటించిన మొదటి సినిమా నటీమణులకు కూడా ఇలాంటి వేధింపులే ఎదురయ్యాయి. చివరకు తన తల్లి పాత్రలో నటించిన నటీమణులను కూడా ధనుష్ వేధించాడు. ధనుష్ ఇప్పటి వరకు సుమారు 50 సినిమాల్లో నటించాడు. అలా ఒక్కో సినిమాకు ముగ్గురు నటీమణుల చొప్పున 150 మంది నటీమణులను ఆయన ఇబ్బంది పెట్టాడు. ధనుష్ వల్ల ఇందులో కొందరికి లైంగిక వేధింపులను ఎదుర్కొంటే.. మరికొందరికి వృత్తిపరమైన వేధింపులకు గురికావడం జరిగింది. అయితే, కొంతమంది నటీమణులకు తమ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కూడా ధనుష్ ప్రవర్తించాడు. నచ్చకపోతే నయన్ మాదిరి వ్యక్తిగతంగా ఇబ్బంది పెడతాడు. ధనుష్ సైకో కాబట్టి అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేస్తాడు.' అని ఆమె మాట్లాడింది.సుచిత్ర వ్యాఖ్యలపై ధనుష్ ఫ్యాన్స మండి పడుతున్నారు. ధనుష్పై ఉన్న ద్వేషం కారణంగానే ఆమె ఇలా మాట్లాడుతుందని వారు పేర్కొంటున్నారు. తమ హీరో నిశ్శబ్ధంగా ఉంటే తప్పు చేసినట్లు కాదని తెలుపుతున్నారు. నిజనిజాలేంటో త్వరలో అందరికీ తెలుస్తాయిని చెప్పుకొస్తున్నారు.ధనుష్ నిర్మాతగా ఉన్న 'నానుమ్ రౌడీ దానే' చిత్రానికి సంబంధించిన మూడు సెకండ్ల వీడియోను నయన్ తన డాక్యుమెంటరీ కోసం ఉపయోగించడంతో ఈ గొడవ మొదలైంది. తన అనుమతి లేకుండా సినిమాకు సంబంధించిన వీడియోను ఎలా ఉపయోగిస్తారని నయన్పై కాపీరైట్ చట్టం కింద రూ. 10 కోట్ల నష్టపరిహారం నోటీసులు పంపారు. -
ధనుష్ క్యారెక్టర్ పై తీవ్ర విమర్శలు చేసిన నయనతార
-
మంచివాళ్ళంటే ధనుష్కు ఇష్టం ఉండదు: విఘ్నేష్ శివన్
నయనతారకు లీగల్ నోటీసులు పంపిన ధనుష్పై ఆమె భర్త విఘ్నేష్ శివన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సాటి మనిషిగా ధనుష్ చేసింది ముమ్మాటికి తప్పు అంటూ ఆయన పేర్కొన్నారు. ధనుష్ అభిమానులు అతని అసలు ముఖం ఎంటో తెలుసుకోవాలని ఒక ఆడియో క్లిప్ను విఘ్నేష్ శివన్ షేర్ చేశారు. దీంతో అది నెట్టింట వైరల్ అవుతుంది.ధనుష్ పంపిన లీగల్ నోటీసును విఘ్నేష్ శివన్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ధనుష్ మాట్లాడిన ఒక పాత వీడియోను కూడా పంచుకున్నారు. ఆ వీడియోలో ధనుష్ ఇలా అన్నారు 'ఒకరిపై ప్రేమ మరొకరిపై ద్వేషంగా మారుతుంది. అది అలా ఎందుకు మారుతుందో అర్థం కాదు. ప్రపంచం నేడు అత్యంత అధ్వాన్నంగా ఉంది. మంచివాడే ఎవరినీ ఇష్టపడడు. మీరు జీవించండి, జీవించనివ్వండి. ఎవరూ ఎవరినీ ద్వేషించాల్సిన అవసరం లేదు.' అని అన్నారు. మంచివాళ్ళంటే ధనుష్కు ఇష్టం ఉండదని వ్యాఖ్యానించిన ఆయన పాత వీడియోను విఘ్నేష్ శివన్ పోస్ట్ చేశారు. ధనుష్ అభిమానులను ప్రస్తావిస్తూ కూడా విఘ్నేష్ పలు వ్యాఖ్యలు చేశారు. 'మీరందరూ అనుకున్నట్లు ధనుష్ అంత మంచివాడు కాదు. ఈ విషయాన్ని తెలుసుకుంటారని నేను హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.' అని తెలిపారు. ఆపై ధనుష్ కోరిన రూ. 10 కోట్ల విలువగల వీడియో ఇదేనంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విఘ్నేష్ షేర్ చేశారు.(ఇదీ చదవండి: ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్తో నయనతార గొడవ)ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన నయనతార.. సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేంత స్థాయికి చేరుకున్నారు. ఆపై ఆమే ప్రేమించి విఘ్నేష్ శివన్ను పెళ్లి చేసుకోవడం ఆపై ఇద్దరు పిల్లలతో ఆమె సక్సెస్ఫుల్ లైఫ్ను లీడ్ చేస్తున్నారు. దీంతో నెట్ఫ్లిక్స్ ఆమె డాక్యుమెంటరీని తెరకెక్కించింది. నవవంబర్ 18న విడుదల కానుంది. అయితే, ధనుష్ నిర్మాతగా తెరకెక్కిన 'నేనూ రౌడీనే' అనే చిత్రం నుంచి 3 సెకండ్ల వీడియోను వారు ఉపయోగించుకున్నారు. కాపీ రైట్స్ హక్కుల పరంగా ధనుష్ ఏకంగా రూ. 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ వారికి నోటీసులు పంపారు. ఈ చిత్రంలో నయన్ నటించిగా.. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచే వారిద్దరూ ప్రేమలో పడటం ఆపై పెళ్లి చేసుకోవడంతో ఆ 3 సెకండ్ల వీడియోను ఉపయోగించుకున్నట్లు నయన్ పేర్కొంది. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
నయనతారను 10 కోట్లు డిమాండ్ చేసిన ధనుష్
-
ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్తో నయనతార గొడవ
తమిళ స్టార్ హీరో ధనుష్పై హీరోయిన్ నయనతార సంచలన ఆరోపణలు చేసింది. ఇంత దిగజారుతావ్ అనుకోలేదు అనే స్టేట్మెంట్ పాస్ చేసింది. తమపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకోవడం సరికాదని హితవు పలికింది. దాదాపు మూడు పేజీలున్న నోట్ని నయన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసి అటు నయన్ ఇటు ధనుష్ అభిమానులు షాక్లో ఉన్నారు.ఏం జరిగింది?నయనతార గతంలో 'నేనూ రౌడీనే' సినిమా చేసింది. దీనికి దర్శకుడు విఘ్నేశ్ శివన్. హీరో ధనుష్ నిర్మాత. ఈ మూవీ చేస్తున్న టైంలోనే విఘ్నేశ్-నయన్ ప్రేమలో పడ్డారు. చాన్నాళ్లపాటు రహస్యంగా రిలేషన్లో ఉన్నారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. ఈమె పెళ్లి, జీవిత విశేషాలతో 'నయనతార: బియాండ్ ద ఫెయిరీ టేల్' పేరుతో నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. నవంబర్ 18న దీన్ని రిలీజ్ చేయనున్నారు. కొన్నిరోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది.డాక్యుమెంటరీ ట్రైలర్లో 'నేనూ రౌడీనే' షూటింగ్ టైంలో తీసిన 3 సెకన్ల వీడియో క్లిప్ ఉపయోగించారు. తన అనుమతి లేకుండా మూవీ బిట్స్ ఉపయోగించడంపై నిర్మాత ధనుష్ సీరియస్ అయ్యాడు. కాపీరైట్ యాక్ట్లో భాగంగా లీగల్ నోటీసులు పంపించాడు. ఏకంగా రూ.10 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేశాడు. గత కొన్నిరోజులుగా ఈ గొడవ నడుస్తోంది. ఇరువురు మధ్య రాజీ కుదరకపోవడంతో ఇప్పుడు నయన్ ఓపెన్ అయిపోయింది. ధనుష్పై సంచలన ఆరోపణలు చేస్తూ మూడు పేజీల పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: మోసపోయిన 'కంగువ' హీరోయిన్ తండ్రి)నయన్ ఏమంది?తండ్రి, ప్రముఖ డైరెక్టర్ అయిన అన్నయ్య అండతో నటుడిగా ఎదిగిన నువ్వు ఇది చదివి అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. సినిమా అనేది ఓ యుద్ధం లాంటిది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ రంగంలో పోరాడి నేను ఇప్పుడీ స్థానంలో ఉన్నాను. నా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం పలువురు సినీ ప్రముఖులు సాయం చేశారు. దీని రిలీజ్ కోసం నేను, నా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నాం. అయితే మాపై నీకు పగ ఉంది. కానీ అది ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడిన వారి జీవితాలపై అది ప్రభావం చూపిస్తుంది. నా శ్రేయోభిలాషులు చెప్పిన మాటలు, నా సినిమా క్లిప్స్ ఇందులో జోడించాం. కానీ నాకు ఎంతో ప్రత్యేకమైన 'నానుమ్ రౌడీ దాన్' (తెలుగులో 'నేనూ రౌడీనే') మూవీ క్లిప్స్ మాత్రం ఉపయోగించలేకపోయాం. అందులోని పాటలు మా డాక్యుమెంటరీకి బాగా సెట్ అవుతాయి. కానీ ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా నువ్వు నో చెప్పడం నా మనసుని ముక్కులు చేసింది.బిజినెస్ లెక్కల పరంగా కాపీ రైట్ సమస్యలు వస్తాయని నువ్వు ఇలా చేసుంటావ్ అనుకోవచ్చు. కానీ చాలాకాలంగా మాపై పెంచుకున్న ద్వేషాన్ని ఇలా చూపించడం వల్ల మేం చాలా బాధపడాల్సి వస్తోంది. 'నానుమ్ రౌడీ దానే' షూటింగ్ టైంలో మేం మా మొబైల్స్తో తీసుకున్న వీడియోని ట్రైలర్లో 3 సెకన్లు ఉపయోగించినందుకు నువ్వు రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడం చాలా దారుణం. నువ్వు ఇంతలా దిగజారుతావ్ అనుకోలేదు. దీన్నిబట్టి నీ క్యారెక్టర్ ఏంటనేది అర్థమవుతోంది. నీ అభిమానుల ముందు, బయట నువ్వు ఎంతలా నటిస్తున్నావో తెలుస్తోంది. మాతో మాత్రం అలా ప్రవర్తించకు. సినిమా సెట్లో ఉన్న వాళ్లందరి జీవితాన్ని శాసించే హక్కు నిర్మాతకు ఉందా? డాక్యుమెంటరీ విషయంలో క్లిప్స్ వాడుకునేందుకు కోర్టు ద్వారా నోటీసులు పంపించి ఉండొచ్చు. కానీ నీకు ఓ మనస్సాక్షి అనేది ఉంటుందిగా!(ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ సింగర్స్)సినిమా రిలీజై 10 ఏళ్లు దాటిపోయింది. అయినా సరే ఇప్పటికే బయటకు ఒకలా, లోపల మరోలా నటిస్తూ ప్రపంచాన్ని ఎలా మోసం చేస్తున్నావ్? ఈ మూవీ గురించి అప్పట్లో నువ్వు చెప్పిన షాకింగ్ విషయాలు నేను ఇప్పటికీ ఏవి మర్చిపోలేదు. 'నానుమ్ రౌడీ దానే' బ్లాక్ బస్టర్ హిట్ అవడం నీ ఇగోని హర్ట్ చేసిందని నాకు తెలుసు. 2016 ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వేడుకలోనూ నీ అసంతృప్తిని బయటపెట్టావ్. బిజినెస్ లెక్కలన్నీ పక్కనబెడితే పబ్లిక్లో ఉన్న తోటి వ్యక్తుల జీవితాల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు. ఇలాంటి విషయాల్లో కాస్త మర్యాదగా ప్రవర్తిస్తే బెటర్. తమిళనాడు ప్రజలు ఇలాంటి వాటిని సహిస్తారని అనుకోను.ఈ లెటర్ ద్వారా ఒక్కటే విషయం చెప్పాలనుకుంటున్నాను. నీకు తెలిసినవాళ్లు సక్సెస్ అవ్వడం చూసి ఇగో పెంచేసుకున్నావ్, దాన్ని నీ మనసులో నుంచి తీసేస్తావని అనుకుంటున్నాను. ప్రపంచం అందరిది. నీకు తెలిసిన వాళ్లు ఎదిగితే తప్పేం కాదు. బ్యాక్ గ్రౌండ్ లేనివాళ్లు స్టార్స్ అయితే తప్పేం కాదు. వ్యక్తులు ఒక్కటై, హ్యాపీగా ఉంటే తప్పేం కాదు. ఇవన్నీ జరగడం వల్ల నువ్వు కోల్పోయేదేం లేదు. ఇప్పటివరకు నేను చెప్పిన దాన్ని మొత్తం మార్చేసి, కొత్త కథ అల్లేసి, రాబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరోలా చెబుతావని నాకు తెలుసు అని నయనతార షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' చూసి భయపడ్డాను: తమన్) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
'కుబేర' మ్యూజికల్ గ్లింప్స్ విడుదల
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదలైంది. రష్మిక మందన్న కీలక పాత్రలో కనిపించనుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు.తాజాగా విడుదలైన గ్లింప్స్ ఎలాంటి డైలాగ్స్ అయితే లేవు. కానీ, ధనుష్ పాత్రను మాత్రం బిచ్చగాడిగానే కాకుండా డబ్బున్న వ్యక్తిలా చూపించారు. 52 సెకండ్ల పాటు ఉన్న ఈ గ్లింప్స్ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే నడుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ప్రధాన హైలెట్గా ఉంది. పాన్ ఇండియా రేంజ్లో వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా విడుదల కానుంది. -
ప్రభాస్ 'రాజాసాబ్'కి పోటీగా 'ఇడ్లీ' సినిమా
సాధారణంగా ప్రభాస్ సినిమా వస్తుందంటే మిగతా ఏ ఇండస్ట్రీల్లోనూ ఆ టైమ్కి వేరే పెద్ద హీరోల చిత్రాలు రిలీజ్కి పెట్టుకోరు. ఒకవేళ అలా కాదనుకుంటే షారుక్ 'డంకీ' మూవీకి అయినట్లు కలెక్షన్స్ డ్యామేజ్ అవ్వొచ్చు. కానీ తమిళ హీరో ధనుష్ మాత్రం తన కొత్త మూవీని 'రాజాసాబ్'కి పోటీగా బరిలో నిలబెట్టాడు.సలార్, కల్కి 2898ఏడీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా 'రాజాసాబ్'. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీకి మారుతి దర్శకుడు. చాలావరకు షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇందులో ఏ మార్పు ఉండకపోవచ్చు.(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)ఇకపోతే ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమా 'ఇడ్లీ కడై' (ఇడ్లీ మాత్రమే). ఇప్పుడు ఈ సినిమాని కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ 10నే థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ధనుష్ మూవీ అంటే తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ప్రభాస్ మూవీ ఉంది కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. తమిళంలో మాత్రం థియేటర్ల, కలెక్షన్ దగ్గర 'రాజాసాబ్'కి ఇడ్లీ మూవీ వల్ల ఇబ్బంది ఉండొచ్చు.ధనుష్ అదే తేదీన తన మూవీ రిలీజ్ చేయడానికి కారణముందనే అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఉగాది ఉన్నట్లే తమిళ న్యూ ఇయర్.. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఉంది. దీంతో ఆ లాంగ్ వీకెండే ధనుష్ టార్గెట్. ఇదంతా చూస్తుంటే 'రాజాసాబ్' రిలీజ్తోపాటు ధనుష్ మూవీ రిలీజ్ విషయంలోనూ మార్పు ఉండకపోయే అవకాశాలే ఎక్కువ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన నాలుగు హిట్ సినిమాలు.. ఏది ఎందులో?) -
పండగ వేళ పసందుగా...
కొత్త లుక్స్, విడుదల తేదీల ప్రకటనలతో దీపావళి సందడి తెలుగు పరిశ్రమలో బాగానే కనిపించింది. మాస్ లుక్, క్లాస్ లుక్, భయంకరమైన లుక్, కామెడీ లుక్... ఇలా పండగ వేళ పసందైన వెరైటీ లుక్స్లో కనిపించారు స్టార్స్. ఆ వివరాల్లోకి వెళదాం.⇒ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్లో నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టిస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నల పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. టీజర్ని ఈ నెల 15న విడుదల చేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ⇒ హీరో వెంకటేశ్ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ని ఖరారు చేసి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. యూనిక్ ట్రయాంగిలర్ క్రైమ్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రం రూపొందుతోంది. ⇒ సంక్రాంతికి ఆట ప్రారంభించనున్నారు రామ్చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ బ్యానర్స్పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్ని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, రామ్చరణ్ లుక్ని రిలీజ్ చేశారు. ⇒ అర్జున్ సర్కార్గా చార్జ్ తీసుకున్నారు హీరో నాని. ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ప్రొడక్షన్స్పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి నాని యాక్షన్ ఫ్యాక్డ్ పోస్టర్ రిలీజ్ చేశారు. 2025 మే 1న ఈ సినిమా విడుదల కానుంది. ⇒ నితిన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘రాబిన్హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ విడుదలైంది. త్వరలో టీజర్ రిలీజ్ కానుంది. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ⇒ నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్లస్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘లెవెన్’. రేయా హరి కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రంలోని ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్..’ అంటూ శ్రుతీహాసన్ పాడిన పాట చాలా పాపులర్ అయింది. ‘లెవెన్’ని నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ⇒ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాత–మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంగా రాజా గౌతమ్ పోషిస్తున్న పాత్ర ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ఇందులో ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్ హీరోయిన్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది.⇒ నాగ సాధువుగా తమన్నా లీడ్ రోల్లో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓదెల 2’. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్పై బహు భాషా చిత్రంగా రూపొందుతోంది. ఈ డివోషన్ యాక్షన్ థ్రిల్లర్లో విలన్ తిరుపతి పాత్రలో వశిష్ఠ ఎన్. సింహ నటిస్తున్నట్లు పేర్కొని, లుక్ని విడుదల చేశారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ మరో కీలక -
నాగార్జున 'కుబేర'.. ఫ్యాన్స్కు దీపావళీ అప్డేట్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ ధనుశ్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం కుబేర. ఈ సినిమాను శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. దీపావళి సందర్భంగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈనెల 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ విడుదల చేస్తూ అనౌన్స్మెంట్ చేశారు. కాగా.. ఈ చిత్రంలో ఇదివరకెన్నడూ చేయని ఓ సరికొత్తపాత్రలో ధనుష్ కనిపించనున్నరు. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని ఇప్పటికే చిత్రయూనిట్ పేర్కొంది. బాలీవుడ్ నటుడు జిమ్సర్భ్ కీలకపాత్రలో నటిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. Wishing you a sparkling Diwali from #SekharKammulasKubera! 💥The wait is almost over!!Catch the explosive #KuberaTeaser on Kartik Purnima, November 15th! 💥🔥@dhanushkraja KING @iamnagarjuna @iamRashmika @sekharkammula @jimSarbh @Daliptahil @ThisIsDSP @AsianSuniel @SVCLLP… pic.twitter.com/9vAsnAv4tu— Annapurna Studios (@AnnapurnaStdios) November 1, 2024 -
ఇళయరాజా బయోపిక్పై నీలినీడలు?
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు జరిగిన విషయం తెలిసిందే. వెయ్యికి పైగా చిత్రాలకు సంగీతాన్ని, 7 వేలకు పైగా పాటలకు బాణీలు కట్టిన మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఎనలేని గుర్తింపు పొందారు. ఆయన బయోపిక్ తెరకెక్కనున్న వార్త, సంగీత ప్రియుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. సంగీత ప్రపంచంలో ఇళయరాజా ఒక లెజెండ్.. ఆయన బయోపిక్లో నటుడు ధనుష్ నటించడానికి సమ్మతించడం కూడా మంచి క్రేజ్ను తీసుకొచ్చింది. దీన్ని ఇంతకు ముందు ధనుష్ కథానాయకుడిగా నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం ఫేమ్ అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహించడానికి సిద్ధం అయ్యారు. ఓ బాలీవుడ్ సంస్థ దీన్ని నిర్మించడానికి ముందుకు వచ్చింది. అదేవిధంగా ఈ చిత్ర పరిచయ కార్యక్రమాన్ని చాలా రోజుల క్రితమే చైన్నెలో నిర్వహించారు. అందులో సంగీత దర్శకుడు ఇళయరాజా, నటుడు కమలహాసన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. త్వరలోనే చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అలాంటిది ఇప్పటివరకు ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాలేదు. అదేవిధంగా నటుడు ధనుష్ కథానాయకుడిగా ,దర్శకుడుగా తన చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇళయరాజా బయోపిక్పై నీలినీడలు పడుతున్నాయి. ఈ చిత్ర నిర్మాణానికి బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ సెట్ కాదని అభిప్రాయాన్ని యూనిట్ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్ర షూటింగ్ ఆదిలోనే ఆగిపోతుందా? లేక వేరే సంస్థ దీని నిర్మాణ బాధ్యతలను చేపడుతుందా? అనేది వేచి చూడాల్సి ఉంది. -
జైలర్తో ధనుష్?
మామా అల్లుడు రజనీకాంత్, ధనుష్ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. హీరో రజనీకాంత్ టైటిల్ రోల్లో నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 2023లో విడుదలైన ఈ చిత్రం సూపర్హిట్గా నిలిచింది. దీంతో రజనీకాంత్తోనే ‘జైలర్ 2’ తీయాలని ప్రస్తుతం స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్.ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. కాగా ‘జైలర్ 2’లోని ఓ కీలకపాత్ర కోసం ధనుష్ను సంప్రదించారట నెల్సన్. ఈ ప్రత్యేకపాత్రలో నటించేందుకు ధనుష్ కూడా దాదాపు ఓకే చెప్పారట. ఇదిలా ఉంటే... ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ‘కూలీ’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు రజనీ. ఓ యాక్షన్ సీక్వెన్ చిత్రీకరిస్తున్నారని తెలిసింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. -
విడాకులు క్యాన్సిల్! ధనుష్-ఐశ్వర్య మళ్లీ ఒక్కటి కానున్నారా? (ఫొటోలు)
-
విలన్ గా మారుతున్న కింగ్ నాగార్జున
-
కోర్టు విచారణకు దూరంగా ధనుష్, ఐశ్వర్య... మరోసారి వాయిదా!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ల విడాకుల విషయంలో కోర్టుకు హాజరవ్వాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, వారిద్దరూ విచారణ కోసం కోర్టులో హాజరుకాలేదు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట సుమారు 18 ఏళ్ల పాటు కలిసి జీవించారు. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా 2022లో పలు విభేదాల వల్ల తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ సమయం నుంచి ఇద్దరూ వేర్వేరుగానే ఉంటున్నారు.ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ తమ వైవాహిక జీవితం ముగిసిందంటూ పరస్పర విడాకుల కోసం చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో రెండేళ్ల క్రితమే పిటిషన్ వేశారు. కానీ, ఇప్పటి వరకు కోర్టులో మాత్రం హజరవలేదు. ఈ ఏడాది ఏప్రిల్లోనే న్యాయస్థానం ముందుకు రావాలని వారికి నోటీసులు కూడా కోర్టు పంపింది. ఈ క్రమంలో అక్టోబర్ 7న విచారణకు రావాల్సి ఉంది. అయితే, వారిద్దరూ ఇప్పుడు కూడా కోర్టులో హాజరు కాలేదు. దీంతో అక్టోబర్ 19కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి శుభాదేవి తెలిపారు.2004లో ప్రేమ వివాహం చేసుకున్న ధనుష్, ఐశ్వర్య పలు విభేదాల వల్ల 2022 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో వారిద్దరిని కలిపేందుకు రజనీకాంత్ కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయినా కూడా వారిద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, కోర్టు విచారణకు వారిద్దరూ హజరు కాకపోవడంతో మళ్లీ కలుస్తారంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. -
రజినీకాంత్తో నటించావా? అని అడిగారు.. రాయన్ ఫేమ్ ఆసక్తికర కామెంట్స్!
ధనుశ్ ఇటీవలే రాయన్ మూవీతో అభిమానులను అలరించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. ధనుశ్ తమ్ముడి పాత్రలో మెప్పించాడు. అయితే ఈ చిత్రం ధనుశ్కు సోదరిగా నటించిన దుషారా విజయన్ అభిమానుల ఆదరణ దక్కించుకుంది. రాయన్ మూవీతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె రజినీకాంత్ వెట్టైయాన్ చిత్రంలో కనిపించనుంది.దసరాకు ఈ మూవీ రిలీజ్ కానుండగా.. ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధనుశ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆ హీరో అంటే తనకెంతో ఇష్టమని చెప్పింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే ఆయన్ని అభిమానిస్తున్నట్లు తెలిపింది. నేను రజనీకాంత్ మూవీలో యాక్ట్ చేస్తున్నానని తెలిసి ధనుశ్ ఆనందించారని వెల్లడించింది.దుషారా విజయన్ మాట్లాడుతూ..'ధనుశ్ ఓసారి నా వద్దకు వచ్చారు. రజినీకాంత్ సర్తో యాక్ట్ చేశావా? అని అడిగారు. అవునని చెప్పా. ఆయన వెంటనే ఈ విషయంలో నిన్ను చూసి అసూయపడుతున్నా.. ఎందుకంటే నేను ఇంకా ఆయనతో కలిసి నటించలేదన్నారు. రజనీకాంత్ను ఆయన ఎంతలా ఇష్టపడతారో ఆ రోజే నాకర్థమైంది' అని ఆమె అన్నారు. -
ధనుష్ లో ఎక్కడలేని జోష్..
-
ధనుష్ ఇడ్లీ కొట్టు!
ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించనున్న తాజా సినిమాకు ‘ఇడ్లీ కడై’ (ఇడ్లీ కొట్టు) అనే టైటిల్ ఖరారైంది. గురువారం ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ధనుష్ కెరీర్లోని ఈ 52వ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్బార్ ఫిల్మ్స్ పతాకాలపై ఆకాశ్ భాస్కరన్ నిర్మించనున్నారు. ‘‘మా డాన్ పిక్చర్స్ సంస్థలోని తొలి సినిమాకే ధనుష్గారితో అసోసియేట్ కావడం సంతోషంగా ఉంది. మా సంస్థలో ఈ సినిమా ఓ మైల్స్టోన్గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. త్వరలోనే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు ఆకాశ్ భాస్కరన్. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్కుమార్, కెమెరా: కిరణ్ కౌశిక్. -
వారికి కృతజ్ఞతలు.. రెడ్కార్డ్ ఎత్తివేతపై ధనుష్
కోలీవుడ్ హీరో ధనుష్పై తమిళ చిత్రపరిశ్రమ ప్రయోగించిన రెడ్కార్డ్ను ఎత్తివేసిన విషయం తెలిసిందే. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్తో నడిగర్ సంఘం చర్చలు జరిపి ధనష్తో ఉన్న వివాదాన్ని పరిష్కరించింది. అందుకు ధన్యవాదాలు తెలుపుతూ ధనుష్ ఒక నోట్ విడుదల చేశారు. రెమ్యునరేషన్ తీసుకుని షూటింగ్కు సహరించని నటీనటులకు తమిళ ఇండస్ట్రీ రెడ్కార్డులు జారీ చేస్తుంది. ఈ క్రమంలోనే ధనుష్పై రెడ్కార్డ్ జారీ అయింది.ధనుష్పై తమిళ నిర్మాత మండలి రెడ్ కార్డ్ ప్రయోగించిన వెంటనే నడిఘర్ సంఘం అధ్యక్షుడు నాజర్ తప్పుబట్టారు. నిర్మాతలు అలాంటి నిర్ణయం తీసుకుంటే ఇండస్ట్రీకి చాలా నష్టమని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే చర్చలతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ధనుష్ వల్ల ఇబ్బుందులు పడుతున్నామని ఆరోపించిన త్రేండల్ ఫిల్మ్స్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్స్ అధినేతలతో చర్చలు జరిపారు. దీంతో గతంలో వారి నుంచి తీసుకున్న డబ్బు ధనుష్ తిరిగి చెల్లించేందుకు ఓకే చెప్పడంతో లైన్ క్లియర్ అయింది.ఇదే విషయం గురించి ధనుష్ ఒక నోట్ విడుదల చేశారు. 'నా నిర్మాతలు,త్రేండల్ ఫిల్మ్స్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ చేసిన ఫిర్యాదులను పరిష్కరించడంలో నాకు అండగా నిలిచిన నడిఘర్ సంఘానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విషయంలో జోక్యం చేసుకుని నిజాయితీగా సమస్యను పరిష్కరించారు. దీంతో మేము కొత్త సినిమా ప్రాజెక్ట్ను వెంటనే తిరిగి ప్రారంభించకలిగాము. నాజర్, కార్తీ,విశాల్, కరుణాస్లకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సమస్యలను పరిష్కరించి మాకు సహాయపడటమే కాకుండా పరిశ్రమకు మంచి ఉదాహరణగా నిలిచారు.' అని తెలిపారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్నారు. -
ధనుష్ప నిషేధం ఎత్తివేత
-
ధనుష్పై రెడ్కార్డ్ ఎత్తివేత.. కొత్త ప్రాజెక్ట్లకు లైన్ క్లియర్
కోలీవుడ్ హీరో ధనుష్పై తమిళ చిత్రపరిశ్రమ రెడ్కార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) జూలైలో ఒక తీర్మానం కూడా చేసింది. నవంబర్ 1 నుంచి ధనుష్తో సినిమాలు చేసేది ఉండదని కఠినమైన నిర్ణయం కూడా తీసుకుంది. దీంతో కోలీవుడ్లో పెద్ద దుమారమే రేగింది. రెమ్యునరేషన్ తీసుకుని షూటింగ్కు సహరించని నటీనటులకు తమిళ ఇండస్ట్రీ రెడ్కార్డులు జారీ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జులైలో ధనుష్పై రెడ్కార్డ్ జారీ అయింది.ఇదీ చదవండి: 'దేవర' రన్ టైమ్.. ఎన్టీఆర్కు గిఫ్ట్ ఇచ్చిన రవి బస్రూర్త్రేండల్ ఫిల్మ్స్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్స్ నుంచి సినిమాలు చేసేందుకు ధనుష్ అడ్వాన్స్ తీసుకున్నారట. అయితే, ఎన్ని సంవత్సరాలైనా షూటింగ్కు డేట్స్ ఇవ్వకపోవడంతో ఈ నిర్మాణ సంస్థలు తమిళ నిర్మాత మండలిని ఆశ్రయించింది. దీంతో ధనుష్పై రెడ్ కార్డ్ జారీ చేస్తున్నట్లు గతంలో TFPC పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశంపై ధనుష్తో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ధనుష్ తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా ఫైవ్ స్టార్ క్రియేషన్స్కి తిరిగి చెల్లిస్తాడని ఆపై త్రేండల్ ఫిల్మ్స్తో సినిమా చేయడానికి ధనుష్ అంగీకరించాడని నివేదికలు అందుతున్నాయి. దీంతో ఇదే విషయాన్ని రెండు ప్రొడక్షన్ హౌస్లు TFPC తెలిపాయని సమాచారం. అయితే, కొన్ని షరతులపై ధనుష్ మీద ఉన్న రెడ్ కార్డ్ రద్దు చేయబడిందని సమాచారం. -
అర్థాలే వేరులే!
ధనుష్, అక్కినేని నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ధనుష్, నాగార్జునల పోస్టర్ని విడుదల చేశారు. ఈ పోస్టర్లో ధనుష్ చూపులు దీనంగా ఉన్నట్లు, నాగార్జున తీక్షణంగా చూస్తున్నట్లు అనిపిస్తోంది. ఇద్దరు చూపులకు అర్థాలేంటో సినిమా చూస్తేనే తెలుస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సమర్పణ: సోనాలీ నారంగ్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి. -
ధనుశ్–మహిత్ జోడీ ప్రపంచ రికార్డు
న్యూఢిల్లీ: ప్రపంచ బధిరుల షూటింగ్ చాంపియన్షిప్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ధనుశ్ శ్రీకాంత్ తన ఖాతాలో రెండో స్వర్ణ పతకాన్ని జమ చేసుకున్నాడు. జర్మనీలోని హనోవర్లో జరుగుతున్న ఈ టోర్నీనలో ధనుశ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో విజేతగా నిలిచాడు. ఫైనల్లో ధనుశ్ శ్రీకాంత్–మహిత్ సంధూ (భారత్) ద్వయం 17–5తో భారత్కే చెందిన నటాషా జోషి–మొహమ్మద్ ముర్తజా జంటపై గెలిచింది.ధనుశ్–మహిత్ జోడీ క్వాలిఫయింగ్లో 628.8 పాయింట్లు స్కోరు చేసి బధిరుల షూటింగ్లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇదే టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో అభినవ్ దేశ్వాల్–ప్రాంజలి ధూమల్ జంట రజత పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో అభినవ్–ప్రాంజలి ద్వయం 7–17తో ఒలెక్సిల్ లేజ్బింక్–ఇనా అఫోన్చెంకో (ఉక్రెయిన్) జంట చేతిలో ఓడిపోయింది. మూడో రోజు ముగిశాక భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు, ఆరు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలున్నాయి. -
మరో ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్ 'రాయన్' మూవీ
తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ 'రాయన్'. యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీతో తీయగా.. ధనుష్ హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. తెలుగు హీరో సందీప్ కిషన్తో పాటు కాళీదాస్ జయరం, అపర్ణ బాలమురళి, సెల్వ రాఘవన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సూపర్ హిట్ అవగా.. తెలుగులో ఓకే ఓకే అనేలా ఆడింది.(ఇదీ చదవండి: సీరియల్ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం.. సీసీటీవీ వీడియో)మొన్నీమధ్య అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసిన ఈ చిత్రానికి రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'రాయన్'ని మరో ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఈ మూవీని నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థకు సన్ నెక్స్ట్ అనే ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఉంది. ఇందులోకే ఇప్పుడు రాయన్ అందుబాటులోకి వచ్చింది. కాకపోతే విదేశీ ఓటీటీ ప్రియులకు మాత్రమే ఈ యాప్లో 'రాయన్' స్ట్రీమింగ్ అవుతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనని స్వయంగా సన్ నెక్స్ట్ పోస్ట్ చేసింది.'రాయన్' విషయానికొస్తే.. రాయన్ (ధనుష్) ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతుంటాడు. ఇతడికి ఇద్దరు తమ్ముళ్లు, చెల్లి ఉంటుంది. గుట్టుగా బతుకున్న వీళ్ల జీవితం.. రాయన్ తమ్ముడు వల్ల ఊహించని చిక్కులు ఎదుర్కొంటుంది. కుటుంబంలో ఒకరిని ఒకరు చంపుకొనేంత వరకు వెళ్తారు. అసలు దీనికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: హీరో భార్యకు తప్పని బాడీ షేమింగ్.. పోస్ట్ వైరల్) View this post on Instagram A post shared by SUN NXT (@sunnxt) -
గోల్డెన్ స్పారో
నటుడు, దర్శక–నిర్మాత ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న తాజా తమిళ చిత్రం ‘నిలువుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’. ఈ రొమాంటిక్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో అనిఖా సురేంద్రన్ , ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్ , రమ్య రంగనాథన్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్, ఈ చిత్ర సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అతిథి పాత్రల్లో నటించారు. ఈ సినిమా నుంచి ‘గోల్డెన్ స్పారో’ అనే పాట లిరికల్ వీడియోను ఈ నెల 30న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ పాటలోనే ప్రియాంక, జీవీ ప్రకాష్ అతిథులుగా కనిపించనున్నారని కోలీవుడ్ టాక్. ‘నిలువుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. -
'రాయన్'తో లాభాలు.. ధనుష్కు గిఫ్ట్గా రెండు చెక్కులు
కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు తెచ్చిపెట్టింది. దీంతో నిర్మాత కళానిధి మారన్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. తాజాగా ధనుష్ను కలిసి రెండు చెక్కులు అందించాడు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ధనుష్ కెరియర్లో 50వ చిత్రంగా జూలై 27న విడుదలైంది.ధనుష్ హీరోగా, డైరెక్టర్గా తన ప్రతిభను రాయన్లో చూపించాడు. బాక్సాఫీస్ వద్ద రూ. 158 కోట్ల కలెక్షన్లు రాబట్టి నిర్మాతతో పాటు పంపిణీదారులకు కూడా రాయన్ మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇది ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా, అలాగే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా గుర్తింపు పొందింది. ధనుష్ని స్వయంగా కలుసుకున్న నిర్మాత ఆపై రెండు చెక్కులను చిత్ర విజయానికి బహుమతిగా అందజేశారు. ఒకటి హీరోకి,మరొకటి దర్శకుడికి అంటూ చెప్పుకొచ్చారు. అయితే, ధనుష్కు ఎంత మొత్తం ఇచ్చారని చెప్పలేదు. కానీ, సుమారు రూ. 10 కోట్ల వరకు ఇచ్చి ఉంటారని నెట్టింట ప్రచారం జరుగుతుంది.ఓటీటీలో రాయన్రాయన్ సినిమా నేడు (ఆగష్టు 23) ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో ధనుష్తో పాటు సందీప్ కిషన్, దుషరా విజయన్,ఎస్.జే సూర్య వంటి స్టార్స్ నటించారు. ఈ మూవీకి ఏఆర్ రహమాన్ సంగీతం ప్రధాన బలంగా నిలబడింది. భారీ విజయాన్ని అందుకున్న ధనుష్ తన తర్వాతి ప్రాజెక్ట్పై నిమగ్నమయ్యాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున,రష్మిక మందన్నా వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన డబ్బింగ్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మరో వీకెండ్ వచ్చేసింది. గురువారం 'కల్కి' సినిమా ఓటీటీలోకి రావడంతో థియేటర్లలో చూసిన చాలామంది మరోసారి షో వేశారు. అలానే కొత్తగా ఇంకేమైనా మూవీస్ వచ్చాయా అని సెర్చ్ చేస్తున్నారు. ఇందుకు తగ్గట్లే రెండు తమిళ డబ్బింగ్ చిత్రాల తెలుగు వెర్షన్స్ తాజాగా అందుబాటులోకి వచ్చేశాయి. ఇంతకీ ఈ సినిమాలేంటి? ఏ ఓటీటీలో ఉన్నాయి?(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. వీడియోలు వైరల్)ధనుష్.. హీరోగా నటించిన దర్శకత్వం వహించిన సినిమా 'రాయన్'. ఇతడి కెరీర్లో ఇది 50వ సినిమా. కమర్షియల్ హంగులతో తీసిన ఈ సినిమాలో యాక్షన్, డ్రామా బాగానే వర్కౌట్ అయింది. తమిళంలో బాగానే డబ్బులొచ్చాయి కానీ తెలుగులో ఎందుకో సరిగా ఎక్కలేదు. తాజాగా ఇది అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది.'బిచ్చగాడు' ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'తుఫాన్'. ఆగస్టు 09న తెలుగులో రిలీజైన ఈ సినిమాని రెండు వారాలైన కాకుండానే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ అనుకున్నారు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఓటీటీలోనే కాబట్టి టైమ్ పాస్ చేసేయొచ్చు. 'కల్కి' కాకుండా ఓటీటీలో మరేదైనా మూవీస్ చూద్దామనుకుంటే వీటిని ట్రై చేయండి.(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ) -
ఓటీటీలో 'రాయన్'.. అధికారిక ప్రకటన వచ్చేసింది
కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈమేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ధనుష్ కెరియర్లో 50వ చిత్రంగా జూలై 27న విడుదలైంది. ఇందులో తన అద్భుతమైన నటనతో పాటు డైరెక్టర్గా కూడా ధనుష్ మెప్పించాడు. సుమారు రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రాయన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే, సినిమా విడుదలైన నెలరోజుల లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. రాయన్ సినిమా ఆగష్టు 23న ఓటీటీలో విడుదల కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగు,హిందీ,తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో స్ట్రీమింగ్ అవుతుందని ఆ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రంలో ధనుష్తో పాటు సందీప్ కిషన్, దుషరా విజయన్,ఎస్.జే సూర్య వంటి స్టార్స్ నటించారు. భారీ అంచనాలతో ఈ చిత్రాన్ని సన్పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఆ సంస్థ లాభాలను అందుకుంది. ఈ మూవీకి ఏఆర్ రహమాన్ సంగీతం ప్రధాన బలంగా నిలబడింది. భారీ విజయాన్ని అందుకున్న ధనుష్ తన తర్వాతి ప్రాజెక్ట్పై నిమగ్నమయ్యాడు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున,రష్మిక మందన్నా వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. View this post on Instagram A post shared by prime video IN (@primevideoin) -
మ్యూజికల్ హిట్ ఇచ్చిన అనిరుధ్ ఫస్ట్ సినిమా రీ-రిలీజ్
ధనుష్, శ్రుతీహాసన్ జంటగా ఐశ్వర్య దర్శకత్వం వహించిన చిత్రం ‘త్రీ’. 2012 మార్చి 30న ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల అయింది. కోలీవుడ్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ధనుష్ సరసన శ్రుతి హాసన్ నటించింది. 2012లో వచ్చిన ఈ సినిమా రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కింది. ఇప్పటికే ఒకసారి రీ-రిలీజ అయిన 'త్రీ' సినిమా ఇప్పుడు మరోసారి భారతదేశం అంతటా థియేటర్లలో రీ-రిలీజ్ చేయడానికి సిద్ధంగా మేకర్స్ ఉన్నారు. ధనుష్ దర్శకత్వం వహించి, అనిరుధ్ రవిచందర్ సంగీత అరంగేట్రం చేసిన ఈ చిత్రాన్ని మరోసారి చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.సెప్టెంబర్ 14న థియేటర్లలో తిరిగి విడుదల కానుంది. ఈ చిత్రం రామ్ (ధనుష్), జనని (శృతి హాసన్) తమ పాఠశాల రోజుల్లో ప్రేమలో పడటం నుంచి కథ ప్రారంభమవుతుంది. చివరికి పెళ్లి చేసుకుంటారు. అయినప్పటికీ, రామ్ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడంతో వారి జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది, అతని అకాల మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి జనని ఏం చేసిందనేది కథ. ఎంతో థ్రిల్లింగ్ ఇచ్చే ఈ సినిమాను మరోసారి వెండితెరపై చూడొచ్చు.ఈ సినిమాతో అరంగేట్రం చేసిన అనిరుధ్ రవిచందర్ సంగీతం 3 సినిమాకి హైలైట్గా నిలిచింది. సౌండ్ట్రాక్, ముఖ్యంగా ధనుష్ రచించి పాడిన వై దిస్ కొలవెరి డి పాట సంచలనంగా మారింది. -
అందానికి అందం హన్సిక
అందం అంటే గుర్తొచ్చేది నటి హన్సికనే అన్నంతగా తన సొగసులను మెయిన్టెయిన్ చేస్తున్నారీ ముంబాయి బ్యూటీ. ఈమె వయసు జస్ట్ 33 ఏళ్లు అంతే. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అయిన నటీమణుల్లో ఈమె ఒకరు. 2003లో నటిగా హిందీలో ఎంట్రీ ఇచ్చిన హన్సికను దర్శకుడు పూరి జగన్నాథ్ దేశముదురు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశారు. అలా తెలుగులో తొలి చిత్రంతోనే చిత్రపరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. ఇక తమిళంలోకి ధనుష్ కు జంటగా మాప్పిళ్లై చిత్రంలో వచ్చారు. ఈ చిత్రం సక్సెస్ కావడంతో తెలుగు, తమిళం భాషల్లో కథానాయకిగా దూసుకుపోయారు. అలా 50 చిత్రాల మైలురాయిని అవలీలగా దాటేశారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే గత 2022లో డిసెంబర్ నెలలో తన బాయ్ఫ్రెండ్ సోహైల్ ఖతూరియను పెళ్లి చేసుకున్నారు. దీంతో హన్సిక సినిమాలకు గుడ్బై చెపుతారనే అందరూ భావించారు. అయితే ఆమె పెళ్లి అయిన కొద్దిరోజుల్లోనే నటించడానికి సిద్ధం అయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. కానీ ఇటీవల హన్సికకు సరైన హిట్ పడలేదన్నది నిజం. అయితే అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. అలా ప్రస్తుతం రౌడీబేబీ, మ్యాన్, గాంధారి చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ఈ బ్యూటీ ద్విపాత్రాభినయం చేసిన గాంధారి చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అయితే గ్లామర్ విషయంలో తగ్గేదేలే అనే హన్సిక కొత్త అవకాశాల వేటలో పడ్డారు. అందుకోసం ఈమె తాజాగా ప్రత్యేకంగా ఫొటో సెషన్ నిర్వహించి తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. వాటిని చూసిన నెటిజన్లు వారేవ్వా హన్సిక అంటూ కామెంట్ చేస్తున్నారు. -
వయనాడ్ బాధితులకు అండగా మరో స్టార్ హీరో!
కేరళలోని వయనాడ్ బాధితులకు కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ అండగా నిలిచారు. బాధితుల సహయార్థం సీఎం సహాయనిధికి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి దాదాపు 400లకు పైగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పటికే పలువురు సినీతారలు సాయం అందించారు. మలయాళ నటులతో పాటు కోలీవుడ్, టాలీవుడ్ నటులు సైతం విరాళాలు ఇచ్చారు.ధనుశ్ ఇటీవలే రాయన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. గతనెల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన రాయన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. -
రాయణ్ బ్లాక్ బస్టర్.. దూకుడు పెంచిన ధనుష్..
-
ధనుష్కు జంటగా బాలీవుడ్ బ్యూటీ
ఎన్ని సమస్యలొచ్చినా.. తానుమాత్రం తగ్గేదేలే అంటున్నారు నటుడు ధనుష్. ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకున్నా, వసూళ్లను మాత్రం కొల్లగొడుతోంది. ఇది ఆయన 50వ చిత్రం కావడం మరో విశేషం. ఇలా నటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా, దర్శకుడిగా సత్తా చాటుకుంటున్న ధనుష్కు కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ అవకాశాలు వరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నటించిన ఈయన మరోసారి బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో నటించడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా హిందీలో ఆయన నటించిన షమితాబ్, రాంజానా వంటి చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా మరో హిందీ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్తో ధనుష్కు మంచి బౌండింగ్ ఉంది.ఇంతకు ముందు వీరి కాంబోలో రూపొందిన రాంజానా చిత్రం మంచి విజయం సాధించింది. తాజాగా మరోసారి వీరు కలిసి పని చేయడానికి సిద్ధం అవుతున్నారనే టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనికి తేరే ఇష్క్ మెయిన్ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు తెలిసింది. కాగా ఇందులో ధనుష్కు జంటగా బాలీవుడ్ క్రేజీ నటి కృతీసనన్ నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈమె ఇప్పటికే తెలుగులో మహేశ్బాబు సరసన నేనొక్కడినే, ప్రభాస్కు జంటగా ఆదిపురుష్ చిత్రాల్లో నటించారు. తాజాగా ధనుష్తో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నారన్నమాట. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
ధనుష్కి జోడీగా..?
‘రాంఝాణా, అత్రంగి రే’ చిత్రాల తర్వాత హీరో ధనుష్, దర్శకుడు ఆనంద్. ఎల్. రాయ్ కాంబినేషన్లో రూపొందనున్న తాజా చిత్రం ‘తేరే ఇష్క్ మే’. ఈ సినిమా చిత్రీకరణను అక్టోబరులో ప్రారంభించడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో నటీనటుల ఎంపికపై ఆనంద్ దృష్టి పెట్టారట.హీరోయిన్ పాత్ర కోసం కృతీ సనన్ను సంప్రదించారని టాక్. త్వరలోనే ఆమె పేరుని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని బాలీవుడ్ భోగట్టా. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం ఇప్పటికే కియారా అద్వానీ, త్రిప్తి దిమ్రీ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా కృతీ సనన్ పేరు వినిపిస్తోంది. మరి... కృతీ సనన్ ఖరారు అవుతారా? లేక సీన్లోకి వేరే హీరోయిన్ వస్తారా? అనేది చూడాలి. -
మరో హాలీవుడ్ అవకాశం?
హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్’ సిరీస్లో తమిళ నటుడు ధనుష్ భాగమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్వెల్ ఫ్రాంచైజీలోని ‘అవెంజర్స్’ సిరీస్లో తర్వాతి చిత్రాలుగా ‘అవెంజర్స్: డూమ్స్ డే, అవెంజర్స్: సీక్రెట్ వార్’ రానున్నాయని, ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ చిత్రానికి దర్శకత్వం వహించిన రూసో బ్రదర్స్ (ఆంథోనీ రూసో, జోసెఫ్ రూసో) ఈ చిత్రాలను తెరకెక్కించనున్నారని మార్వెల్ సంస్థ ప్రకటించింది.‘అవెంజర్స్: డూమ్స్ డే’లో రాబర్ట్ డౌనీ జూనియర్ ఓ లీడ్ రోల్లో నటించనున్నారు. మరో లీడ్ రోల్లో ధనుష్ నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. రూసో బ్రదర్స్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ మూవీ ‘ది గ్రే మ్యాన్’లో ధనుష్ ఓ లీడ్ రోల్ చేశారు. మరి... ‘అవెంజర్స్: డూమ్స్ డే’లోనూ ఈ ఇండియన్ హీరో నటిస్తారా? వేచి చూడాలి. -
ధనుష్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా..: హీరో సోదరి
ధనుష్.. ఇటీవల రాయన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు. ధనుష్ బావ డాక్టర్ కార్తీక్ ఆంజనేయన్(సోదరి కార్తీక భర్త) తొలిసారి ఈ మూవీలో నటించాడు. అది కూడా పోలీస్గా..! తాజాగా కార్తీక.. తన భర్త పోలీస్ గెటప్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.డాక్టర్తో యాక్టింగ్రాయన్.. నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని, ఈ ఫోటోలు షేర్ చేయాలని ఏడాదికిపైగా ఎదురుచూస్తున్నాను. డాక్టర్ కార్తీక్ ఆంజనేయన్.. ఒక పేరున్న డాక్టర్, కార్డియాలజిస్ట్. నా సోదరుడు ధనుష్ 50వ సినిమాలో ఈయన ఒక చిన్న పాత్ర చేస్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోయాను. ధనుష్కు ఈయనలో ఏం కనిపించింది? తనను తీసుకోవడమేంటి? అని షాకయ్యాను. ఏం జరుగుతుందో చూద్దామని ఆతృతగా ఎదురుచూశాను. మురిసిపోయాధనుష్.. తన సహనటులను డైరెక్ట్ చేయడం కళ్లారా చూసి మురిసిపోయా.. ఒక డాక్టర్తో కూడా యాక్టింగ్ చేయించగలిగాడంటే తనను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నా భర్తను వెండితెరపై చూస్తానని కలలో కూడా అనుకోలేదు. అలాంటిది అంత మంచి పాత్రలో కనిపించాడంటే ఆ క్రెడిట్ అంతా ధనుష్కే దక్కుతుంది. సంతోషంగా ఉందిఅంజీ చాలా బాగా నటించాడు. ధనుష్ హీరోగా నటించి, డైరెక్ట్ చేసిన మూవీలో ఈయన భాగమవడం గౌరవప్రదంగా ఉంది. ఇందుకు నా తమ్ముడికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. ఒక సోదరిగా, భార్యగా సంతోషంగా ఉంది. రాయన్ టీమ్కు థ్యాంక్స్.. అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Karthika Krishnamoorthy (@dr.karthikakarthik) చదవండి: అంతకుమించి వేదా ఉంటుంది -
Nadigar Vs Tamil Producers: కోలీవుడ్లో ముదురుతున్న వివాదం!
సాక్షి, చెన్నై: తమిళ నిర్మాతల మండలి, నడిగర్ సంఘం (దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం) మధ్య వివాదం ముదురుతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఇటీవల తమిళ నిర్మాతల మండలి, డిస్ట్రిబ్యూటర్ల సంఘం, థియేటర్ల సంఘం నిర్వాహకులు సమావేశమై నటీనటుల పారితోషికాలు, పెరిగిపోతున్న నిర్మాణ వ్యయం, నటీనటులు ముందుగా ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేశాకే కొత్త చిత్రాలను అంగీకరించాలని, నటుడు ధనుష్ చాలా చిత్రాలకు అడ్వాన్స్లు తీసుకున్నారని, ఆయనతో కొత్తగా చిత్రాలు చేసే నిర్మాతలు ముందుగా నిర్మాతల మండలితో చర్చించాలని, ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యే వరకూ నవంబర్ నెల ఒకటో తేదీ నుంచి షూటింగ్లను రద్దు చేస్తున్నట్లు తీర్మానాలు చేశారు. నిర్మాతల మండలి చేసిన ఈ తీర్మానాలు తమకు సమ్మతం కాదని, వెనక్కి తీసుకోవాలని దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కార్యవర్గం డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ పై స్పందిస్తూ తమిళ నిర్మాతల మండలి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నటుడు ధనుష్పై ఎలాంటి ఫిర్యాదు లేదని దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం పేర్కొనడం అవాస్తవమని నిర్మాతల మండలి పేర్కొంది. ఏడాదిన్నర క్రితమే నిర్మాతల మండలి సర్వసభ్య సమావేశంలో నిర్మాతలకు నష్టం కలిగించిన ఐదుగురు నటుల గురించి తీర్మానం చేసి, దాన్ని నడిగర్ సంఘానికి పంపామని తెలిపింది. అయితే దానిపై ఆ సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. ఈ కారణంగానే నిర్మాతల మండలి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని, తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేయడంతో పాటు తమకు నడిగర్ సంఘం సహకరిస్తుందని భావిస్తున్నామని పేర్కొంది. దీనిపై నడిగర్ సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
నిర్మాతల మండలి ఏకపక్ష నిర్ణయం సరికాదు: నడిగర్ సంఘం
తమిళ నిర్మాతల మండలి, నడిగర్ సంఘం మధ్య వార్ మొదలైందా? అంటే అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. ఇందుకు కారణం నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలే. ఈ మండలి ఈ నెల 29న ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళ నిర్మాతల మండలి, యాక్టీవ్ నిర్మాతల మండలి, డిస్ట్రిబ్యూటర్స్ సంఘం కలిసి నిర్వహించిన సమావేశంలో చేసిన తీర్మానాలను ఆ ప్రకటనలో వెల్లడించారు.ముఖ్యంగా నటీనటులు ముందుగా నటించడానికి అంగీకరించి, అడ్వాన్స్ లు తీసుకున్న చిత్రాల్లోనే నటించాలని, అదే విధంగా నటీనటులపారితోషికం, నిర్మాణ వ్యయం వంటి విషయాల గురించి నూతన విధి విధానాలను నిర్ణయించే వరకూ నవంబర్ 1వ తేదీ నుంచి షూటింగ్లను నిలిపి వేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. ఆగస్ట్ 16 తర్వాత కొత్త చిత్రాల ఆరంభానికి అనుమతి లేదని కూడా నిర్మాతల సంఘం పేర్కొంది. అయితే ఇప్పటికే నిర్మాణంలో ఉన్న చిత్రాల షూటింగ్లను అక్టోబర్ 30 లోగా పూర్తి చేయాలని తీర్మానం చేసింది.అలాగే నటుడు ధనుష్ పలువురు నిర్మాతల నుంచి అడ్వాన్స్ లు తీసుకున్నారనీ, అందువల్ల ఆయనతో కొత్త చిత్రాలను నిర్మించే నిర్మా తలు తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులతో చర్చించాకే ఆ సినిమా కార్యక్రమాలు మొదలుపెట్టాలనే తీర్మానం చేశారు. కాగా నిర్మాతల మండలి తీర్మానాలపై నడిగర్ సంఘం (దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం) అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ మేరకు నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) విడుదల చేసిన పత్రికా ప్రకటనలోని సారాంశం ఈ విధంగా...తమిళ నిర్మాతల మండలి విడుదల చేసిన ప్రకటనలో నటీనటులకు సంబంధించిన తీర్మానాలు, నటుడు ధనుష్కు సంబంధించిన తీర్మానం తమను దిగ్భ్రాంతికి గురి చేశాయని నటీనటుల సంఘం పేర్కొంది. ధనుష్ గురించి ఇప్పటివరకూ ఎలాంటి ఫిర్యాదు రాలేదని, అకస్మాత్తుగా అతనిపై నిషేధం విధించడం ఏమాత్రం ఆమోదనీయం కాదని కూడా ఆ ప్రకటనలో ఉంది.సమస్యను తమతో చర్చించకుండా తీర్మానించడాన్ని ఖండిస్తున్నామని పేర్కొంది. రెండు సంఘాలూ కలిసి మాట్లాడుకుని, నిర్ణయం తీసుకోవాల్సిన విషయాన్ని ఏక పక్షంగా నిర్ణయించి, పత్రికా ప్రకటనలా ఇవ్వడం సరి కాదని కూడా నటీనటుల సంఘం అభిప్రాయపడింది. తమిళ సినీ సంఘాల్లో ముఖ్యమైన నటీ నటీనటుల సంఘం నిర్వాహకులను సంప్రదించకుండా వేలాది మంది నటీనటులు, కార్మికుల జీవితాలను బాధించే విధంగా షూటింగ్లు నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా తాము విడుదల చేసిన నోట్లో నటీనటుల సంఘం పేర్కొంది.ఈ ఏక పక్ష తీర్మానాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని, ఈ విషయమై దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కార్యవర్గంతో చర్చించి తగిన చర్యలు గురించి వెల్లడించడం జరుగుతుందని పేర్కొంది. – సాక్షి, చెన్నైనిర్మాతల మండలి తీర్మానాన్ని ఖండిస్తున్నాం: కార్తీనటీనటుల సంఘం కోశాధికారి, నటుడు కార్తీ మీడియాతో మాట్లాడుతూ– ‘‘తమిళ నిర్మాతల మండలి ఏక పక్షంగా చేసిన తీర్మాలను ఖండిస్తున్నాం. ముఖ్యంగా నటుడు ధనుష్ పై ఎలాంటి ఫిర్యాదు లేకున్నా ఆయనపై చర్యలు తీసుకోవాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం’’ అన్నారు.నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్లను సంపద్రించాకే పత్రికా ప్రకటన విడుదల చేశామని కూడా కార్తీ పేర్కొన్నారు. అదే విధంగా నడిగర్ సంఘాన్ని సంప్రదించకుండా నిర్మాతల మండలి చేసిన తీర్మానాలను వ్యతిరేకిస్తున్నట్లు నటీనటుల సంఘం ఉపాధ్యక్షుల్లో ఒకరైన కరుణాస్ కూడా పేర్కొన్నారు. -
రాయన్ను అభినందించిన మహేశ్ బాబు
కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాయన్. విడుదల సమయంలో మిక్సిడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. రాయన్ తెరకెక్కించిన తీరును చూసిన ప్రేక్షకులు ధనుష్ టాలెంట్కు ఫిదా అవుతున్నారు. ఇందులోని నటీనటులు అందరూ కూడా తమ అద్భుతమైన నటనతో ఇచ్చిపడేశారు. అందుకే రాయన్ టీమ్పై అభినందనల వెల్లువ వస్తుంది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు రాయన్ సినిమా చూసి ఫిదా అయ్యారు. సినిమాపై అయన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నారు.సోషల్ మీడియా వేదికగా రాయన్ సినిమాపై మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. 'ధనుష్ అద్భుతంగా నటించడమే కాకుండా బ్రిలియంట్గా డైరెక్ట్ చేశారు. కచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. రెహమాన్ మ్యూజిక్ సినిమాకు బాగా కలిసొచ్చింది. SJ సూర్య, ప్రకాశ్ రాజ్,సెల్వ రాఘవన్, సందీప్ కిషన్, దుషరా విజయన్, అపర్ణ బాలమురళీ ఇతర నటీనటుల యాక్టింగ్ సూపర్. రాయన్ భారీ విజయాన్ని అందుకున్నాడు. మూవీ టీమ్కు కంగ్రాట్స్' అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ధనుష్ కూడా రియాక్ట్ అయ్యారు. 'మీ ప్రశంసలతో మా టీమ్ ఆశ్చర్యానికి లోనైంది. మీ ఆత్మీయతకు చాలా ధన్యవాదాలు' అంటూ తెలిపారు. ఎస్.జే సూర్య, సందీప్ కిషన్, అపర్ణ బాలమురళీ కూడా మహేశ్ బాబుకు తిరిగి సమాధానంగా కృతజ్ఞతలు తెలిపారు.కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై ధనుష్ 50వ సినిమాగా రాయన్ సినిమా తెరకెక్కింది. మరోసారి తన రస్టిక్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో మెప్పించారు. దీంతో తొలి మూడురోజుల్లోనే రూ. 75 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కోలీవుడ్తో పాటు తెలుగులో కూడా రాయన్ చిత్రానికి మంచి ఆదరణ లభించడం విశేషం.#Raayan…. Stellar act by @dhanushkraja… brilliantly directed and performed. 🔥🔥🔥 Outstanding performances by @iam_SJSuryah, @prakashraaj, @sundeepkishan, and the entire cast. An electrifying score by the maestro @arrahman. 🔥🔥🔥 A must-watch… Congratulations to the entire…— Mahesh Babu (@urstrulyMahesh) July 29, 2024 -
ధనుష్కు మద్ధతుగా నిలిచిన నడిగర్ సంఘం
తమిళ టాప్ హీరో ధనుష్పై తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్పీసీ) తీసుకున్న నిర్ణయాన్ని నడిగర్ సంఘం తప్పుపట్టింది. దీంతో కోలీవుడ్లో నిర్మాతలు వర్సెస్ నడిగర్ సంఘం అనేలా పెద్ద యుద్ధమే జరుగుతుంది. తాజాగా ధనుష్పై తమిళ నిర్మాతల మండలి పలు ఆంక్షలు విధించింది. కొత్త సినిమాలకు ధనుష్ని తీసుకునే ముందు, అతనికి అడ్వాన్సులు ఇచ్చిన్న పాత నిర్మాతలను సంప్రదించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ధనుష్ను టార్గెట్ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున దుమారం రేగింది.ధనుష్ అధికమొత్తంలో అడ్వాన్స్లు తీసుకొని ఆపై షూటింగ్స్కి సహకరించడంలేదని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. దీంతో టీఎఫ్పీసీ అభ్యంతరం తెలిపింది. ఇక నుంచి ధనుష్తో కొత్త సినిమాను ప్రారంభించే వారు ఎవరైనా సరే ఆ నిర్మాతలు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ను సంప్రదించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా నిర్మాతలు ధనుషను టార్గెట్ చేయడంపై నడిగర్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ధనుష్కు మద్ధతుగా నిలిచింది.ధనుష్తో సంప్రదింపులు లేకుండానే ఇలాంటి ఆంక్షలు ఎందుకు విధిస్తారని నడిగర్ సంఘం ప్రశ్నించింది. అందకు పలువురు నటీనటులు కూడా ధనుష్కు మద్ధతు ఇస్తున్నారు. తమిళ సినిమా అభ్యున్నతి కోసం అంటూ ఆగస్ట్ 16 నుంచి కొత్త సినిమాల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని నడిగర్ సంఘం తప్పుపట్టింది. సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని అనడం సరికాదని హెచ్చరించింది. నిర్మాతల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని నడిగర్ సంఘం డిమాండ్ చేసింది. -
సరికొత్త కుబేర
ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ ‘కుబేర’. రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కుదిరితే ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు మేకర్స్.ఆదివారం (జూలై 28) ధనుష్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘కుబేర’ సినిమా నుంచి ధనుష్ కొత్తపోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఇదివరకెన్నడూ చేయని ఓ సరికొత్తపాత్రలో ధనుష్ కనిపిస్తారు. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. బాలీవుడ్ నటుడు జిమ్సర్భ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
ధనుశ్ బర్త్ డే స్పెషల్.. ఈ వీడియో చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ ఇటీవల రాయన్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చారు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 26న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజు నుంచే రాయన్ మూవీ పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది.తాజాగా ఇవాళ ధనుశ్ బర్త్ డే కావడంతో చిత్రబృందం, అభిమానులు ఆయనకు విషెస్ చెబుతున్నారు. అంతే కాకుండా సన్ పిక్చర్స్ సంస్థ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ధనుశ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ రాయన్ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోను ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో కనిపించారు. -
ట్రెండ్ ఫాలో అయిన ధనుష్.. 50వ చిత్రం సూపర్ హిట్..
-
ధనుష్ పుట్టినరోజు స్పెషల్.. సోదరీమణులతో ఫోటోలు వైరల్
-
'రాయన్' ఫస్ట్ డే కలెక్షన్స్.. అక్కడ కేవలం రూ. 20 లక్షలే
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం 'రాయన్'. సన్ పిక్చర్స్పై కళానిధి మారన్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. జులై 26న విడుదలైన ఈ చిత్రం మిక్సిడ్ టాక్ తెచ్చుకుంది. ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే మెప్పించేలా రాయన్ ఉందంటూ నెట్టింట ప్రచారం జరిగింది. ఇందులో దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషించారు. ఇలా స్టార్ యాక్టర్స్ ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. కానీ ఆ అంచనాలను రాయన్ చేరుకోలేకపోయింది.రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి ధనుష్ స్వీయ దర్శకత్వం వహించాడు. సినిమాపై మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికీ రాయన్కు ఫస్ట్ డే కలెక్షన్స్ బాగానే వచ్చాయని తెలుస్తోంది. ధనుష్కి తమిళంలోనే కాదు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. సార్, తిరు లాంటి సినిమాలతో టాలీవుడ్లోనూ మంచి గుర్తింపు సంపాదించాడు. ఇండస్ట్రీ లెక్కల ప్రకారం రాయన్ మూవీ విడుదలైన తొలి రోజు భారత్లో రూ. 13.65 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ వసూళ్లలో తెలుగు వెర్షన్ నుంచి రూ. 1.6 కోట్లు రాగా తమిళ వెర్షన్కు రూ. 11.85 కోట్లు వచ్చాయి. అయితే హిందీ నుంచి కేవలం రూ. 20 లక్షలు మాత్రమే వచ్చాయని ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.20.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. -
'రాయన్' సినిమా రివ్యూ
ధనుష్కి తమిళంలో ఉన్నంత క్రేజ్ తెలుగులోనూ ఉంది. 'సార్', 'తిరు' లాంటి సినిమాలతో టాలీవుడ్లోనూ మంచి గుర్తింపు సంపాదించాడు. అలాంటిది ఇతడు హీరోగా నటించి దర్శకత్వం వహించిన మూవీ 'రాయన్' వస్తుందంటే ఆ మాత్రం అంచనాలు ఉంటాయి కదా! అందున ఇది ధనుష్కి 50వ మూవీ. ఇంతకీ ఇది ఎలా ఉంది? హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?కాతవరాయన్ (ధనుష్) చిన్నతనంలోనే తల్లిదండ్రులు కనిపించకుండా పోతారు. దీంతో ఉన్న ఊరిని వదిలిపెట్టి ఇద్దరు తమ్ముళ్లు, చెల్లితో వేరేచోటకు వలస పోతాడు. పెద్దయిన తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని బతికేస్తుంటాడు. సాఫీగా సాగిపోతున్న ఇతడి జీవితం.. అదే ఊరిలో పేరు మోసిన గూండాలు దురై, సేతు వల్ల తల్లకిందులవుతుంది. ఓ టైంలో సొంత తమ్ముడే.. రాయన్ని చంపాలనుకుంటాడు. ఇలా జరగడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?హీరో కమ్ దర్శకుడిగా ధనుష్.. ఈ పాయింట్ చాలు సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవడానికి. కానీ యాక్టర్గా న్యాయం చేసిన ధనుష్.. రైటర్ కమ్ డైరెక్టర్గా విఫలమయ్యాడు. కథగా చూసుకుంటే 'రాయన్' పాతదే. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ఈ తరహా స్టోరీలతో మూవీస్ చాలానే వచ్చాయి. అంతెందుకు ఇలాంటి ఫ్లేవర్ ఉన్న స్టోరీల్లో గతంలో ధనుషే హీరోగా నటించాడు.ఫస్టాప్ విషయానికొస్తే.. రాయన్ బాల్యంతో కథ మొదలవుతుంది. ఊరెళ్లి వస్తానని చెప్పిన తల్లిదండ్రులు రాకపోవడం, కొన్ని అనుకోని పరిస్థితుల్లోని ఊరి నుంచి తప్పించుకుని రావడం.. ఇలా ఎక్కడో చూశామే అనిపించిన సీన్లతో టైటిల్స్ పడతాయి. ప్రస్తుతంలోకి వచ్చిన తర్వాత అయినా స్టోరీ కదులుతుందా అంటే అస్సలు కదలదు. రాయన్, అతడి షాప్, తమ్ముళ్లు, వాళ్ల చుట్టూ ఉండే వాతావరణం.. ఇలా బోరింగ్గా సాగుతూ ఉంటుంది. కాస్త హై ఇచ్చే ఫైట్ సీన్తో ఇంటర్వెల్ పడుతుంది.సెకండాఫ్లో అయినా ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుందా అంటే అసలు కన్విన్స్ కాని, లాజిక్ లేని విధంగా స్టోరీ ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే ఫైట్ సన్నివేశాలు మినహా 'రాయన్' పూర్తిగా నిరాశపరుస్తుంది. పాత్రల మధ్య డ్రామా సరిగా వర్కౌట్ కాలేదు. రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తీద్దామనుకున్న ధనుష్.. అసలేం తీశాడో అర్థం కాని విధంగా సినిమా ఉంటుంది. సెకండాఫ్లో అన్నదమ్ముల మధ్య చిన్నపాటి ట్విస్ట్ పెట్టి ఏదో మేనేజ్ చేద్దామనుకున్నారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది.ఎవరెలా చేశారు?నటుడిగా ధనుష్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఇతడి చెల్లిగా నటించిన దుశరా విజయన్, తమ్ముడిగా చేసిన సందీప్ కిషన్కి ఉన్నంతలో మంచి రోల్స్ పడ్డాయి. సెకండాఫ్లో హాస్పిటల్లో జరిగే ఫైట్ సీన్లో దుశరా యాక్టింగ్కి విజిల్ వేయాలనిపిస్తుంది. విలన్గా చేసిన ఎస్జే సూర్య యాక్టింగ్ బాగుంది కానీ కథలో దమ్ము లేకపోవడంతో ఆ పాత్ర తేలిపోయింది. వీళ్లతో పాటు ప్రకాశ్ రాజ్, అపర్ణ బాలమురళి, కాళీదాస్ జయరాం, సెల్వరాఘవన్.. ఇలా మంచి మంచి యాక్టర్స్ని పెట్టుకున్నారు. కానీ వీళ్లకు సరైన సీన్స్ పడలేదు. అసలు ఇంతమంది స్టార్స్ని సినిమాలో ఎందుకు పెట్టుకున్నారా అనే డౌట్ వస్తుంది.టెక్నికల్ విషయాలకొస్తే పాటలు అస్సలు బాలేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల మాత్రమే బాగుంది. సినిమాటోగ్రఫీ పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. యాక్టర్గా ధనుష్ని వంకపెట్టడానికి లేదు కానీ దర్శకుడిగా మాత్రం ఫ్లాఫ్ అయ్యాడు. దానికి తోడు 'రాయన్' చూస్తున్నంత సేపు తమిళ ఫ్లేవర్ కనిపిస్తూనే ఉంటుంది. ఇది 'రాయన్' సంగతి!రేటింగ్: 1.75-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
Raayan X Review: ధనుష్ 'రాయన్' ట్విటర్ రివ్యూ
తమిళ హీరో ధనుష్ మైల్ స్టోన్ మూవీ 'రాయన్'.ఇతడే దర్శకత్వం వహించిన, హీరోగా నటించాడు. సందీప్ కిషన్, కాళీదాస్ జయరాం, దుసరా విజయన్, అపర్ణ బాలమురళి, ప్రకాశ్ రాజ్, సెల్వ రాఘవన్ తదితరులు కీలక పాత్రలు చేశారు. తాజాగా ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? చూసిన వాళ్లు ట్విటర్లో టాక్ ఏంటి?ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, సెకండాఫ్ మరింత బాగుందని అంటున్నారు. అలానే ధనుష్ ఎంట్రీ అదిరిపోయిందని ఓ నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఇంటర్వెల్, క్లైమాక్స్ బ్యాంగ్ సూపర్ గా ఉందని అంటున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉందని, ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందని చెప్పుకొచ్చారు. పూర్తి రివ్యూ ఏంటనేది మరికాసేపట్లో వచ్చేస్తుంది.#Raayan - ARR Bhai is the second hero of the movie🥶🫶Sema BGM, especially the flashback portions🤌🔥🔥 pic.twitter.com/y8Nl2Q7wiU— AmuthaBharathi (@CinemaWithAB) July 26, 2024#Raayan First Half REPORT -Raayan - Raw & Rustic One 🔥💥 . @dhanushkraja 's Transformation 🥵🔥 screen presence ... Fireyyyy One ! #Dhanush 's Direction 🏆🙏🙏 Top Notch ... Literally Witnessed an another Vetrimaran Here 🔥 Casting & their Performance - Perfect 💥… pic.twitter.com/shheQ4m4ir— Let's X OTT GLOBAL (@LetsXOtt) July 26, 2024#Raayan interval 💥💥💥💥💥💥#dhanush naaaaaaaaaaaa 💥💥💥💥💥💥💥💥💥💥💥 Watha edra Dragon Template ah omalae #RaayanFDFS pic.twitter.com/TAUiUjcsPG— Tonystark👊🏽 (@Tonystark2409) July 26, 2024#Raayan First half - ABOVE AVERAGE to GOOD🤝- Takes some to set the phase & establish the characters & the story gears up in the midway of the movie 🔥- A Usual Revenge drama but shies out well with the treatment of Director #Dhanush👌- Goosebumps Interval Portion🔪🥵- ARR… pic.twitter.com/XE9v9Lc0Fv— AmuthaBharathi (@CinemaWithAB) July 26, 2024Simple and neat title card with terrific BGM..#Raayan pic.twitter.com/5zt02u4Hhg— R Vasanth (@rvasanth92) July 26, 2024 -
మీకు సూపర్ స్టార్తో పోలికా?.. ధనుశ్ కామెంట్స్పై నెటిజన్స్ ఫైర్!
కోలీవుడ్ స్టార్ ధనుశ్ ప్రస్తుతం రాయన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 26న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించి ఆడియో లాంఛ్ ఈవెంట్ను చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి ధనుశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.తాను కిందిస్థాయి నుంచి పైకి వచ్చానని ఈవెంట్లో ధనుశ్ మాట్లాడారు. తన కెరీర్లో ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. వీధుల్లో పెరిగిన నేను.. పోయెస్ గార్డెన్లో కోట్ల విలువ చేసే ఇంటిని కొనుగోలు చేశామని వెల్లడించారు. అంతేకాదు సూపర్ స్టార్ రజినీకాంత్, జయలలిత లాంటి దిగ్గజాలు ఉండే ప్రాంతంలో ఇంటిని కొన్నట్లు పేర్కొన్నారు. నాకు 16 ఏళ్ల వయసులో ఫ్రెండ్తో కలిసి రజినీకాంత్ ఇంటిని చూసేందుకు వెళ్లానని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు రజినీకాంత్ ఇల్లు అని.. ఆ పక్కన జయలలిత ఇల్లు అని చెప్పారని అన్నారు. అప్పుడే నేను చిన్న ఇంటినైనా కొనలేనా? అని మనసులో అనుకున్నానని చెప్పారు.అయితే ధనుశ్ చేసిన కామెంట్స్పై నెటిజన్స్ మండిపడుతున్నారు. మీరు కష్టపడి పైకొచ్చారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీ నాన్న డైరెక్టర్.. మీ బ్రదర్ కూడా దర్శకుడే.. అలాంటి మీరు ఎలాంటి టాలెంట్ లేకపోయినా కెరీర్ తొలి రోజుల్లో నెట్టుకొచ్చావని అన్నారు. మీరు పోయెస్ గార్డెన్లో ఇల్లు మీలాంటి వారికి పెద్ద విషయమే కాదన్నారు. అసలు మిమ్మల్ని రజినీకాంత్తో ఎలా పోల్చుకుంటారు? కొందరు ప్రశ్నించారు. ఆయన కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ స్థాయికి సొంతంగా ఎదిగారని ధనుశ్కు గుర్తు చేశారు. ఆయన కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకోవడం వల్లే మీకు గుర్తింపు వచ్చిందని చురకలంటించారు. అయితే మరికొందరేమో ధనుశ్ చెప్పిన మాటలు ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.కాగా.. ధనుష్ దర్శకత్వం వహించిన రాయన్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఎస్జే సూర్య, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, దుషార విజయన్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం కుబేరలో ధనుశ్ కనిపించనున్నాడు. నాగార్జున, రష్మిక మందన్న, జిమ్ సర్భ్ కూడా ఇందులో నటిస్తున్నారు. Its funny when a Nepo Kid like #Dhanush is talking about starting from a scratch.. Like, damm your family has a cinema background and you access it easily with no talents at all during your first few movies.. And you talk about being in streets? Do you know what is streets?— BlastingTamilCinema (@BLSTG) July 24, 2024🤔 What is this new level of idiocy from Dhanush?The guy says that the incident happened when he was 16 y.o. Was he an outsider back then? No. His father was a well-known director who had lost his magic. At 18 y.o, his father pooled finances to produce a film with him as the… pic.twitter.com/3i6JGBdY8P— Saikiran Kannan | 赛基兰坎南 (@saikirankannan) July 23, 2024 -
ధనుష్ దర్శకత్వంలో నిత్యామీనన్
కోలీవుడ్లో తుళ్లువదో ఇళమై చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయిన నటుడు ధనుష్. తొలి చిత్రంతోనే విజయాన్ని ఎంజాయ్ చేసిన ఈయన ఆ తరువాత పలు సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించి స్టార్ నటుడిగా ఎదిగారు. అంతేకాదు తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో నటిస్తూ అరుదైన కథానాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక నటుడు, నిర్మాత, దర్శకుడు, గాయకుడు అంటే బహుముఖ ప్రతిభావంతుడిగా రాణిస్తున్న ధనుష్ 50 చిత్రాల మైలు రాయిని అధిగమించారు. ఈయన కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం రాయన్కు తనే దర్శకత్వం వహించారు. ఇది ఈ నెల 26న తెరపైకి రానుంది. అదే విధంగా ధనుష్ దర్శకత్వం వహించిన రెండవ చిత్రం ఇది. కాగా ప్రస్తుతం నిలవుక్కు ఎన్న ఎనమేల్ కోవం అనే మరో చిత్రాన్నీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం తరువాత 4వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తాజా సమాచారం. ఈ విషయాన్ని నటుడు ఎస్జే సూర్య ఇక భేటీలో పేర్కొన్నారు. ధనుష్ తనకు ఒక కథను చెప్పారని, అది అద్భుతంగా ఉందన్నారు. ఆ కథను ధనుష్నే తెరకెక్కించనున్నారని చెప్పారు. ఇదే విషయాన్ని రాయన్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో నటుడు ప్రకాశ్రాజ్ వెల్లడించారు. ఈ చిత్రంలో తనతో పాటు నటి నిత్యామీనన్ నటించనున్నట్లు ఆయన చెప్పారు. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇకపోతే ఇంతకు ముందు నటుడు ధనుష్కు జంటగా నిత్యామీనన్ నటించిన తిరుచిట్రఫలం చిత్రం మంచి విజయాన్ని సాధించింది. -
స్టార్ హీరో కాళ్లు మొక్కిన సందీప్ కిషన్!
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం రాయన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ధనుశ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సందీప్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్.. ధనుశ్పై ప్రశంసలు కురిపించారు. తనకు అన్న, గురువు అన్నీ ధనుశ్ అని అన్నారు. ఈ సినిమాలో ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. గురువుకు గురుపౌర్ణమి రోజున ధన్యవాదాలు అంటూ ధనుశ్ కాళ్ల మొక్కారు. అయితే ఇద్దరం సినిమాలో నటిస్తున్నప్పటికీ ఆయన ఫోన్ నంబర్ కూడా తన వద్ద లేదని సందీప్ అన్నారు. కాగా.. రాయన్లో ధనుశ్ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్పై కళానిధి మారన్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, కాళిదాస్ జయరాం, ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. With a special gesture, actor #SundeepKishan expressed his love for #Dhanush at #Raayan Pre-Release Event.Event by @shreyasgroup ✌️#RaayanPreReleaseEvent #RaayanFromJuly26 #ShreyasMedia #ShreyasGroup pic.twitter.com/qbUBEm8yg3— Shreyas Media (@shreyasgroup) July 22, 2024 -
ధనుష్ కామెంట్స్.. జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్కు తెలుగులో కూడా భారీగానే అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో ఆయన కూడా టాలీవుడ్ హీరోలతో పాటు ఇక్కడి ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు. తెలుగులో ఒక స్టార్ హీరోతో కలిసి పనిచేయాలనే కోరిక తనలో ఉందని తాజాగా ధనుష్ చెప్పాడు. సార్ సినిమాతో తెలుగులో మరింత ఇమేజ్ పెంచుకున్న ధనుష్ తాజాగా రాయన్తో థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఇందులో ఆయన హీరోగా నటిస్తూనే స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మించారు. సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, అపర్ణ బాలమురళి, ప్రకాశ్రాజ్,నిత్యా మీనన్,ఎస్ జే సూర్య,సెల్వరాఘవన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జులై 26న రాయన్ విడుదల కానుంది.‘రాయన్’ విడుదల సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను మేకర్స్ నిర్వహించారు. ఈ వేడుకలో టాలీవుడ్ హీరోల గురించి ఎదురైన ప్రశ్నలపై ధనుష్ స్పందించారు. ఒకవేళ మల్టీస్టారర్ మూవీ ఛాన్స్ వస్తే రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, ఎన్టీఆర్.. వీరిలో ఎవరితో కలిసి నటిస్తారు..? అనే ప్రశ్న ఎదురైంది. దీంతో ఆయన వెంటనే జూ.ఎన్టీఆర్ అని బదులిచ్చారు. దీంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎవరైనా తమ హీరోతో కలిసి నటించాలని కోరుకుంటారని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.‘రాయన్’ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో జులై 26న విడుదల కానుంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా రిలీజ్ అవుతోంది. ధనుశ్ కెరీర్లో 50వ చిత్రంగా ఇది తెరకెక్కడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. -
రాయన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
నేను చేసిన తప్పులకు కృతజ్ఞతలు: ధనుష్
‘‘నా మొదటి సినిమా నుంచి ఇప్పటివరకూ మంచి దర్శకులతో పనిచేశాను. వాళ్లందరి దగ్గరి నుంచి ఒక్కో విషయం నేర్చుకుంటూ వచ్చి డైరెక్టర్ అయ్యాను. నాకు నటనకంటే కూడా డైరెక్షన్ అంటే ఎక్కువ ఇష్టం’’ అని ధనుష్ అన్నారు. ఆయన హీరోగా నటì ంచి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. ప్రకాశ్ రాజ్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించారు. కళానిధి మారన్ నిర్మించిన ‘రాయన్’ ధనుష్ కెరీర్లో 50వ సినిమా.ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో ఈ నెల 26న విడుదల కానుంది. తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో రిలీజ్ అవుతోంది. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ధనుష్ మాట్లాడుతూ–‘‘నేను ముఖ్యంగా రెండు విషయాలకు కృతజ్ఞతలు చె΄్పాలనుకుంటున్నాను. ఒకటి.. నా మొదటి సినిమా నుంచి 49వ సినిమా వరకూ నేను పని చేసిన దర్శకులందరికీ కృతజ్ఞతలు. రెండోది.. నేను చేసిన తప్పులకు కృతజ్ఞతలు. ఈ వేడుకలో నా గత చిత్రాలకు సంబంధించిన ఏవీ వేసినప్పుడు నాకు చాలా తప్పులు కనిపించాయి. ఆ తప్పుల నుంచి చాలా నేర్చుకున్నాను. ఇక గొప్పగా చెప్పుకునే సినిమా ఇవ్వాలనే ‘రాయన్’ చేశాను. తెలుగులో ఎన్టీఆర్తో మల్టీస్టారర్ చేయాలనుంది. నాకు తెలుగు వంటకాల్లో ఆవకాయ పప్పన్నం అంటే ఇష్టం’’ అన్నారు. ‘‘ధనుష్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని కాకుండా ఇండియన్ ఇండస్ట్రీలోనే ఫైనెస్ట్ హీరో అండ్ ఫైనెస్ట్ ఆర్టిస్ట్ అనిపించుకున్నారు. క్రిస్మస్కి ‘గేమ్ చేంజర్’ సినిమాతో కలుద్దాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘రాయన్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు డి. సురేష్బాబు. నిర్మాతలు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు. -
బ్రహ్మరాక్షసుడిలా వస్తాడు!
ధనుష్ టైటిల్ రోల్లో నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘రాయన్’. సందీప్ కిషన్, కాళిదాసు జయరామ్ ఇతర లీడ్ రోల్స్లో నటించిన ఈ సినిమాలో సెల్వరాఘవన్, ప్రకాశ్రాజ్, ఎస్జే సూర్య, అపర్ణా బాలమురళి, దుషారా విజయన్, వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి తెలుగు వెర్షన్ను రిలీజ్ చేయనుంది.ఈ సందర్భంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో మంగళవారం ‘రాయన్’ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ‘రాయన్... అడవిలో ప్రమాదమైన జంతువు ఏదో తెలుసా’, ‘సింహం,’ ‘అడవిలో బలమైన జంతువులు పులి, సింహమే. కానీ ప్రమాదమైన జంతువు తోడేలు. రెండూ ఎదురుగా నిలబడితే సింహమే గెలుస్తుంది. కానీ తోడేలు చాలా జిత్తులమారిది. గుంపుగా చుట్టిముట్టి, ఓ పథకం వేసి సింహాన్ని ఓడిస్తాయి’, ‘వస్తాడు... బ్రహ్మరాక్షసుడిలా వస్తాడు... దహనం చేస్తాడు’, ‘రావయ్యా... రాయన్... వెళ్లి ఏం చెప్పావ్... టక్కున కేసు వెనక్కు తీసుకున్నాడు’ అనే డైలాగ్స్ తెలుగు ట్రైలర్లో ఉన్నాయి. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరకర్త. -
రాక్షసుడిలా 'రాయన్'.. అంచనాలు పెంచేసిన ట్రైలర్
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న 'రాయన్' నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. సన్ పిక్చర్స్పై కళానిధి మారన్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.'రాయన్' ట్రైలర్తోనే ధనుష్ ఆకట్టుకుంటున్నాడు. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పుడు రాయన్తో ఆయనలో దాగివున్న దర్శకత్వం టాలెంట్ అందరినీ మెప్పించేలా ఉంది. ట్రైలర్ను కూడా అందరినీ మెప్పించేలా కట్ చేశారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జులై 26న రిలీజ్ కానుంది. -
ధనుష్కు జంటగా యానిమల్ చిత్ర బ్యూటీ
ఈతరం పాన్ ఇండియా హీరో అంటే ధనుష్ అనే చెప్పాలి. ఈయనతో చిత్రాలు చేయడానికి తమిళం, తెలుగు, హిందీ ఇలా ఏ భాషా దర్శక నిర్మాతలైనా ఇష్టపడతారు. భాష ఏదైనా విజయం పక్కా ఇదీ ధనుష్ లెక్క. ఈయనే సక్సెస్ ఫుల్ దర్శకుడు, కథకుడు, గాయకుడు. ఇక నటుడిగా చెప్పనే అక్కర్లేదు. అర్ధ సెంచరీ హీరో. చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న నట, దర్శక నిర్మాత ధనుష్. ఈయన దర్శకత్వం వహించి, కథానాయకుడిగా నటించిన రాయన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈయన నిర్మిస్తూ, స్వీయ దర్శకత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న నెలవుక్కు ఎన్ మేల్ ఎన్న కోపం చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఇక తెలుగు, తమిళం భాషల్లో కథానాయకుడిగా నటిస్తున్న కుబేర చిత్రం కూడా చివరి దశకు చేరుకుంది. కాగా తాజాగా మరోసారి బాలీవుడ్ చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈయన ఇంతకు ముందు, షమితాబ్, రాంజానా, అట్రాంగి వంటి హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. వీటిలో రాంజానా, అట్రాంగి చిత్రాలకు ఆనంద్ ఎల్.రాయ్ దర్శకుడు. కాగా ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ ఇప్పుడు హ్యాట్రిక్కు రెడీ అవుతున్నారన్నదే తాజా సమాచారం. దీనికి తేరే ఇష్క్ మెయిన్ అనే టైటిల్ను నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన వార్త కొద్ది నెలల క్రితమే వెలువడింది. ఆ తరువాత దీని గురించి ఎలాంటి సమాచారం లేదు. కాగా తాజాగా ఈ చిత్రం గురించి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ఇందులో నటుడు ధనుష్ సరసన యానిమల్ చిత్రం ఫేమ్ త్రిప్తి దిమ్రి నాయకిగా నటించనున్నారని తెలిసింది. అక్టోబరు నెలలో షూటింగ్ను ప్రారంభించి వారణాసి, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు సమాచారం. -
నీ ప్రేమలో..!
రణ్బీర్ కపూర్ ‘యానిమల్’లో జోయా పాత్రలో గ్లామరస్గా నటించి బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ త్రిప్తీ దిమ్రి. ‘యూనిమల్’ సినిమా కూడా బాక్సాఫీస్ బ్లాక్బస్టర్గా నిలవడంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఈ క్రమంలో రాజ్కుమార్ రావుతో ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’, కార్తీక్ ఆర్యన్తో ‘భూల్ భూలయ్యా 3’, సిద్ధాంత్ చతుర్వేదితో ‘ధడక్ 2’ సినిమాల్లో హీరోయిన్గా చాన్స్లు దక్కించుకున్నారు త్రిప్తి. ఈ బ్యూటీకి మరో హిందీ సినిమా ఆఫర్ దక్కిందని టాక్. ‘రాంఝణా’, ‘అత్రంగి రే’ చిత్రాల తర్వాత హీరో ధనుష్, దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కనుంది. ప్రేమకథ నేపథ్యంలో ‘తేరే ఇష్క్ మే’ (నీ ప్రేమలో) టైటిల్తో ఈ సినిమా చేయనున్నారు. ఈ చిత్రం షూటింగ్ను అక్టోబరులో ్రపారంభించాలనుకుంటున్నారు. హీరోయిన్ పాత్రకు త్రిప్తీ దిమ్రిని సంప్రదించారనే ప్రచారం బాలీవుడ్లో జరుగుతోంది. మరి... ‘తేరే ఇష్క్ మే’ అంటూ ధనుష్తో త్రిప్తిæజోడీ కడతారా? అనేది త్వరలో తెలిసి΄ోతుంది. -
వీరి వీరి గుమ్మడిపండు ఈ స్టార్ ఎవరు?
వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి? అని కళ్లకు గంతలు కట్టి అడుగుతారు. కానీ గంతలు కట్టకుండానే ఫొటోలు చూపించి, వీరి వీరి గుమ్మడిపండు ఈ స్టార్ ఎవరు? అని అడిగితే... పేరు చెప్పడానికి తడబడాల్సిందే. అలా పోల్చుకోలేనంతగా మారిపోయారు కొందరు స్టార్స్. గుర్తుపట్టలేని వెరైటీ గెటప్స్లో ఆ స్టార్స్ కనిపించనున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.⇒ మేకోవర్, కొత్త గెటప్ అనగానే వెంటనే గుర్తొచ్చే హీరోల్లో విక్రమ్ ఒకరు. ‘పితామగన్’ (‘శివపుత్రుడు’), సేతు, అపరిచితుడు, ఐ, కోబ్రా’... ఇలా చెప్పుకుంటూ పోతే విక్రమ్ చేసిన ప్రయోగాత్మక చిత్రాల్లోని పాత్రల జాబితా ఎక్కువగానే ఉంటుంది. తాజాగా ‘తంగలాన్’లోనూ విక్రమ్ వినూత్నంగా కనిపించనున్నారు. పద్దెనిమిదో శతాబ్దంలో కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) నేపథ్యంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ‘తంగలాన్’ తీశామని ఈ చిత్రదర్శకుడు పా. రంజిత్ పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్లు మాళవికా మోహనన్, పార్వతీ తిరువోత్తుల గెటప్స్ కూడా పూర్తి డీ–గ్లామరస్గా, ఆడియన్స్ గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి.⇒ తమిళ హిట్ ఫిల్మ్ ‘సారపట్ట పరంపరై’లో డీ–గ్లామరస్ రోల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు హీరోయిన్ దుషారా విజయన్. ఇప్పుడైతే మరీ గుర్తుపట్టలేని గెటప్లో కనిపించనున్నారు. ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘రాయన్’ సినిమాలోనే ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఈ సినిమాలో దుషారతో పాటు వరలక్ష్మీ శరత్కుమార్, అపర్ణా బాలమురళి కూడా డీగ్లామరస్ రోల్స్లోనే కనిపిస్తారు. సందీప్ కిషన్, కాళిదాసు ఇతర లీడ్ రోల్స్లో నటించారు. నార్త్ చెన్నై బ్యాక్డ్రాప్లో ముగ్గురు అన్నదమ్ముల కథగా సాగే ఈ మూవీ ఈ నెల 26న రిలీజ్ కానుంది.⇒ కథ డిమాండ్ చేస్తే అందులోని గెటప్లోకి అవలీలగా మారిపోతారు కమల్హాసన్. ‘భామనే సత్యభామనే’లో బామ్మగా, పది అవతారాల్లో ‘దశావతారం’ వంటి చిత్రాలు అందుకు మంచి ఉదాహరణలు. ‘దశావతారం’ (2008) తర్వాత కమల్ ఒకే సినిమాలో ఎక్కువ గెటప్స్లో కనిపించలేదు. ఇప్పుడు ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2’)లో ఐదారు గెటప్స్లో కనిపించనున్నారు. వీటిలో ఒకట్రెండు గెటప్స్ ఇప్పటికే బయటకు రాగా మిగిలినవి థియేటర్స్లో సర్ప్రైజ్గా ఉండబోతున్నాయని తెలిసింది. ‘భారతీయుడు 2’ కథ రీత్యా కమల్ వందేళ్ల వయసుపైబడిన సేనాపతి పాత్రలో నటించారు. మొత్తంగా ఆయన ఎన్ని పాత్రల్లో కనిపిస్తారో థియేటర్స్లోనే చూడాలి. ఇక శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇండియన్ 2’ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 12న విడుదల కానుంది. ⇒ డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్ను మెప్పించడంలో ధనుష్ ముందు ఉంటారు. ఈ విలక్షణ హీరో ప్రస్తుతం దర్శకుడు శేఖర్ కమ్ములతో ‘కుబేర’ సినిమా చేస్తున్నారు. ఇందులో నాగార్జున మరో హీరో. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా, సామాజిక అసమానతల మేళవింపుతో రానున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ధనుష్ బిచ్చగాడి గెటప్లో కనిపిస్తారట.⇒ మాస్ హీరో అనిపించుకున్న విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేశారు. అది ‘లైలా’ సినిమా కోసం అన్నమాట. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఫస్టాఫ్ అబ్బాయిగా, సెకండాఫ్ లైలా అనే అమ్మాయిగా కనిపిస్తారు. ఆకాంక్షా శర్మను హీరోయిన్గా పరిచయం చేస్తూ రామ్నారాయణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.⇒ అటు కన్నడకు వెళితే ఇప్పుడు శివ రాజ్కుమార్ గెటప్ హాట్ టాపిక్గా నిలిచింది. ‘భైరవనకోనెపాఠ’ అనే చిత్రంలో శివ రాజ్కుమార్ గుర్తుపట్టలేని గెటప్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి హేమంత్రావు దర్శకుడు. ఈ సినిమా తెలుగు లోనూ రిలీజ్ కానుంది.ఇలా గుర్తు పట్టలేని గెటప్కి సై అని, సవాల్గా తీసుకుని నటిస్తున్న స్టార్స్ మరికొందరు ఉన్నారు. -
Captain Miller: 'కెప్టెన్ మిల్లర్' చిత్రానికి అంతర్జాతీయ అవార్డ్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్- అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. ఈ ఏడాదిలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిడమే కాకుండా తాజాగా అరుదైన రికార్డ్ను సొంతం చేసుకుంది. లండన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ' కెప్టెన్ మిల్లర్' సత్తా చాటింది.యుకె నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అవార్డ్ను సొంతం చేసుకున్నట్లు అరుణ్ మాథేశ్వరన్ తెలిపారు. గ్రే మ్యాన్ సినిమా ద్వారా ధనుష్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఇప్పుడు ఈ అవార్డు రావడంతో ఆయన పేరు ఇప్పుడు హాలీవుడ్లో ట్రెండ్ అవుతుంది. పలు హాలీవుడ్ చిత్రాలతో పోటీపడినప్పటికీ విజేత కెప్టెన్ మిల్లర్ కావడంతో ధనుష్ అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఇక ఇదే క్యాటగిరీలో భూమి పెడ్నేకర్ కీలక పాత్రలో నటించిన ‘భక్షక్’ కూడా నామినేషన్లో చోటు దక్కించుకుంది. కానీ, అవార్డ్ అందుకోలేపోయింది.ఈ చిత్రంలో ధనుష్ నటనకు విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. ధనుష్తో పాటు, ఈ చిత్రంలో సందీప్ కిషన్, ప్రియాంక మోహన్, నివేదిత సతీష్, ఎడ్వర్డ్ సోనెన్బ్లిక్ కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు వసూలు చేసి ధనుష్ బెస్ట్ సినిమాల జాబితాలో చేరిపోయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ధనుష్ 'రాయన్'లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించడం విశేషం. జులై 26న ఈ చిత్రం విడుదల కానుంది. సందీప్ కిషన్, ఎస్.జె.సూర్య, కాళిదాస్ జయరామ్ వంటి స్టార్స్ ఇందులో కీలక పాత్రలలో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Arun Matheswaran (@thatswatitis) -
ఇళయరాజా ముందు ధనుష్ భారీ డిమాండ్
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా జీవితం వెండితెరపైకి రానుంది. ధనుష్ లీడ్ రోల్లో నటిస్తున్న ‘ఇళయరాజా’ షూటింగ్ కార్యక్రమాన్ని కొద్దిరోజుల క్రితమే ప్రారంభించారు. ఈ మూవీకి అరుణ్మాథేశ్వరన్ దర్శకుడు. కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యూరీ మూవీస్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే, ఈ సినిమాకు హీరో ధనుష్ భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.ధనుష్ నటించిన 'కెప్టెన్ మిల్లర్' చిత్రం పట్ల భిన్న అభిప్రాయాలు వచ్చినప్పటికీ సినిమాపై మంచి టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.అయితే, ధనుష్ మాత్రం తన పారితోషికాన్ని తగ్గించకుండా మరింత పెంచాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత తెలుగులో డైరెక్ట్ సినిమా ఒకటి ఆయన తీస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో 'కుబేర' కోసం నాగార్జున, ధనుష్ కలిసి ఇందులో నటిస్తున్నారు. ఇదే వరుసలో రాయన్, ఇళయరాజా బయోపిక్ ఉంది. అయితే, ధనుష్ రెమ్యునరేషన్ భారీగా పెంచాడని తెలుస్తోంది. ఇళయరాజా సినిమా కోసం రూ. 50 కోట్ల రెమ్యునరేషన్ అడిగారని కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. అయితే, సినిమా కోసం కేవలం 50 రోజులకు మించి కాల్షిట్స్ ఇవ్వలేనని కూడా ఆయన ముందే చెప్పారట. ధనుష్ పారితోషికం రోజుకు కోటి రూపాయలకు పెరిగిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా రజనీకాంత్, విజయ్, అజిత్ వంటి ప్రముఖ నటులు 100 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. అయితే వారు ఒక్కో సినిమాకు కనీసం 70 రోజులకు పైగా కేటాయిస్తారని టాక్ ఉంది. -
ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ధనుష్ సినిమా నామినేట్
తమిళ చిత్రసీమలో అగ్రనటుడిగా సత్తా చాటుతున్నాడు ధనుష్. ఆయన నటుడిగానే కాకుండా గాయకుడు, దర్శకుడు, నిర్మాత, గీత రచయిత ఇలా మల్టీటాలెంటెడ్ కావడంతో ఆయనకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘కెప్టెన్ మిల్లర్’ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో కెప్టెన్ మిల్లర్ ఎంట్రీ ఇచ్చింది.అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, శివరాజ్ కుమార్, నివేద సతీష్ సహా పలువురు నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సినిమా విడుదలై సమయంలో మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, ధనుష్కు ఉన్న క్రేజ్ వల్ల రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది.అయితే, తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేసింది. లండన్లో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 కార్యక్రమంలో కెప్టెన్ మిల్లర్ చిత్రం బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయిందని తెలిపింది. ఉత్తమ విదేశీ సినిమా విభాగంలో కెప్టెన్ మిల్లర్ చిత్రం నామినేట్ అయినట్లు మేకర్స్ తెలిపారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు.ధనుష్ ప్రస్తుతం తన 50వ చిత్రం రాయన్కి దర్శకత్వం వహించి, నటించారు. ఈ చిత్రాన్ని జూలై 26న విడుదల చేయనున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కథానాయకులుగా కుబేర చిత్రంలో కనిపించనున్నారు. పాన్ ఇండియా రేంజ్లో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. -
దీపావళికి కుబేర?
ఈ దీపావళికి థియేటర్స్లోకి రానున్నాడట ‘కుబేర’. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. సోనాలీ నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. నాగార్జున–ధనుష్ పాల్గొనగా ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉందని తెలిసింది. -
డేట్ చేంజ్
ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్ ’. ఈ మూవీ కాస్త ఆలస్యంగా థియేటర్స్లోకి రానుంది. సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్జే సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, దుషార విజయన్ ఇతర లీడ్ రోల్స్లో నటించిన ఈ సినిమాను సన్పిక్చర్స్ సంస్థ నిర్మించింది.నార్త్ చెన్నై బ్యాక్డ్రాప్లో సాగే ఈ గ్యాంగ్స్టర్ డ్రామాను తొలుత జూన్ 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ జూలై 26న రిలీజ్ చేయనున్నట్లుగా ధనుష్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ధనుష్ కెరీర్లో 50వ సినిమాగా రూపొందిన ‘రాయన్’ కి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. -
ధనుష్తో కియారా రొమాన్స్
బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా నటుడు ధనుష్. ఈయన నటుడు మాత్రమే కాకుండా గాయకుడు, గీత రచయిత, కథకుడు, దర్శకుడు, నిర్మాతగా కూడా ఉన్నారు. ఇక తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లోనూ నటిస్తూ పాన్ ఇండియా కథానాయకుడుగా రాణిస్తున్నారు. తాజాగా ఈయన తమిళంలో రాయల్ అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించారు సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇది కథానాయకుడుగా ధనుష్ 50వ చిత్రం కావడం గమనార్హం. అదేవిధంగా తెలుగులో కుబేర అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ నటుడు నాగార్జున ముఖ్యపాత్రను పోషిస్తుండగా, రష్మికమందన్న నాయకిగా నటిస్తున్నారు. కాగా ధనుష్ ఇంతకుముందు రంజనా, షమితాబ్, అత్రాంగి రే వంటి హిందీ చిత్రాల్లో నటించి అక్కడ ప్రేక్షకుల ఆదరణను చూరగొన్న విషయం తెలిసింది. తాజాగా మరోసారి బాలీవుడ్ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. దీనికి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. ఈ చిత్రం అక్టోబర్ లేదా నవంబర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ఇందులో కథానాయకిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఈమె ప్రస్తుతం తెలుగులో రామ్చరణ్ సరసన నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. -
యాక్షన్ కుబేర
‘కుబేర అండ్ కో యాక్షన్ మోడ్లోకి వెళ్లారు. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సినిమా కోసం తయారు చేయించిన ఓ స్పెషల్ సెట్లో ధనుష్–నాగార్జున పాల్గొంటుండగా, యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు.ఈ షెడ్యూల్తో ‘కుబేర’ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందట. ‘‘చాలా వరకు టాకీ పార్టును పూర్తి చేశాం. ఒకవైపు షూటింగ్ చేస్తూనే, మరోవైపు పోస్ట్ప్రోడక్షన్ వర్క్స్ కూడా చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
పీచు మిఠాయ్...
సైకిలు మీద ప్రేమ షికారుకు వెళ్లారు సందీప్ కిషన్, అపర్ణా బాలమురళి. ఈ జాలీ రైడ్లో ‘పీచు మిఠాయ్...’ అంటూ పాట పాడుకున్నారు. ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘రాయన్’లో సందీప్ కిషన్, అపర్ణా బాలమురళి ఓ జంటగా నటించారు. సినిమాలో ఈ ఇద్దరి మధ్య ‘పీచు మిఠాయ్..’ అంటూ సాగే రొమాంటిక్, మెలోడీ సాంగ్ను విడుదల చేశారు.ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా విజయ్ ప్రకాశ్, హరిప్రియ పాడారు. తెలుగు, తమిళ భాషల్లో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 13న రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్ని ఏషియన్–సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి విడుదల చేయనుంది. -
మళ్లీ కలకలం రేపుతున్న సుచిత్ర లీక్స్..
-
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
కోలీవుడ్ హీరో ధనుశ్ తన మంచి మనసును చాటుకున్నారు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన భవనానికి రూ. కోటి విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్ను నటుడు నాజర్కు అందజేశారు. ఈ విషయాన్ని అసోసియేషన్ వెల్లడించింది.కాగా.. ప్రస్తుతం నటుడు నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ ప్రధాన కార్యదర్శిగా, కార్తి కోశాధికారిగా నడిగర్ సంఘంలో పని చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు భవనం కోసం విరాళాలు అందచేశారు. కమల్ హాసన్, విజయ్లు గతంలోనే రూ.కోటి సాయమందించారు. ప్రస్తుతం నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరికి నిర్మాణం పూర్తి చేయనున్నారు. కాగా.. ధనుశ్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటిస్తున్నారు. అంతేకాకుండా స్వీయ దర్శకత్వంలో రాయన్లో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్గా ముస్తాబవుతున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. -
సుచిత్ర సంచలన వ్యాఖ్యలు
సుచీలీక్స్తో సింగర్ సుచిత్ర అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సెలబ్రిటీల పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి యావత్ సినీ ఇండస్ట్రీనే షేక్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి సెలబ్రిటీలపై విరుచుకుపడింది. ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ గురించి మాట్లాడుతూ.. వాళ్లు పెళ్లయినప్పటినుంచి ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూనే ఉన్నారు. పెళ్లయిన విషయాన్నే మర్చిపోయి మిగతావాళ్లతో డేటింగ్ చేశారు. ఐశ్వర్య కంటే ధనుషే నయంభర్త మోసం చేశాడని ఆరోపించిన ఐశ్వర్య ఏమైనా పద్ధతిగా ఉందా? తను కూడా వేరేవాళ్లతో డేటింగ్ చేసి మోసం చేయలేదా? ఆమె కంటే ధనుషే నయం.. అయినా ఐశ్వర్య తన పిల్లలను ఏనాడూ పెద్దగా పట్టించుకోలేదు. అందుకే వారి కుమారులు యాత్ర, లింగ.. అమ్మమ్మ- తాతయ్యల వద్ద పెరిగితే బాగుంటుంది' అని సుచిత్ర చెప్పుకొచ్చింది.కార్తీక్ గేభర్త కార్తీక్తో విడాకుల గురించి మాట్లాడుతూ.. 'కార్తీక్తో పెళ్లయిన 11 ఏళ్లకు అతడు గే అని తెలిసింది. అది బయటకు చెప్పే ధైర్యం అతడికి లేదు. ఆ మరుసటి ఏడాదే విడాకులు తీసుకున్నాను. పూటుగా తాగిన తర్వాత ధనుష్, నా భర్త ఒకే గదిలో ఉండేవారు. రాత్రిపూట గదిలో నా భర్తతో ధనుష్కు ఏం పని?' అని ప్రశ్నించింది.అందుకే టార్గెట్కాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్ మాజీ భర్త కార్తీక్.. సుచిత్ర మానసిక ఆరోగ్యం బాగోలేదని తెలిపాడు. అయితే తన మానసిక స్థితి బాగోలేదని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని సుచిత్ర ఆరోపించింది. ఎప్పుడైతే డ్రగ్స్ వాడేందుకు ఒప్పుకోలేదో అప్పుడే తనను ధనుష్, కార్తీక్ టార్గెట్ చేశారని వెల్లడించింది.చదవండి: బాలీవుడ్లో రాణిస్తున్న బ్యూటీ.. ఫస్ట్ సినిమా తెలుగులోనే! -
రూ.1 కోటి విరాళమిచ్చిన హీరో ధనుష్
దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణం వేగం పుంజుకుంది. నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ ప్రధాన కార్యదర్శిగా, కార్తీ కోశాధికారిగా బాధ్యతలను నిర్వహిస్తున్న నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణాన్ని ఆధునిక వసతులతో బ్రహ్మాండంగా నిర్మించడానికి చాలా కాలం ముందే ప్రణాళికలను సిద్ధం చేశారు. భవన నిర్మాణ పనులు కొంతమేరకు జరిగాయి కూడా. అయితే నిధుల కొరత కారణంగా పనులు నిలిచిపోయాయి. రూ.1 కోటి విరాళంతాజాగా సంఘం నిర్వాహకులు నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసే పనికి పూనుకున్నారు. అందుకు కావలసిన నిధులను సమకూర్చే కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ముందుగా హీరో కమలహాసన్ రూ. కోటి విరాళంగా అందించారు. ఆ తరువాత నటుడు, నిర్మాత, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్, హీరో విజయ్ తలా కోటి రూపా యలను విరాళంగా అందించారు. ధనుష్ సైతంఅలాగే హీరో శివకార్తికేయన్ రూ. 50 లక్షలను విరాళం ఇచ్చారు. తాజాగా హీరో ధనుష్ కోటి రూపాయలు ఇచ్చారు. దీంతో నడిగర్ సంఘం నిర్వాహకులు ధనుష్కు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి కల్లా నూతన భవనాన్ని పూర్తి చేయనున్నట్లు విశాల్ ఇటీవల ఓ భేటీలో పేర్కొన్న విషయం తెలిసిందే.చదవండి: అందుకే విడిపోతున్నాం.. వివాహ బంధానికి ముగింపు ప్రకటన చేసిన జీవీ ప్రకాష్-సైంధవి -
లొంగని రాక్షసుడు
ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. సందీప్ కిషన్, కాళిదాసు జయరామ్ లీడ్ రోల్స్లో నటించారు. కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూన్ 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, ‘అడంగాద అసురన్ (లొంగని రాక్షసుడు) పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.ఈ పాటకు లిరిక్స్ రాయడంతో పాటు ఈ చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్తో కలిసి పాడారు ధనుష్. ‘‘అడంగాద అసురన్’ పాటను ఏఆర్ రెహమాన్గారు రెడీ చేసినప్పట్నుంచి, మీతో (ప్రేక్షకులు) ఈ పాటను షేర్ చేసుకునేందుకు ఎదురు చూస్తున్నాను. ఈ పాటను ఇప్పుడు రిలీజ్ చేశాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు ధనుష్. -
రాయన్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘రాయన్’ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. సన్ పిక్చర్స్పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న రాయన్ నుంచి తాజాగా మొదటి సాంగ్ విడుదలైంది.ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఎంతో క్రేజీగా సాగిని ఈ సాంగ్కు ధనుష్తో పాటు ఏఆర్ రెహమాన్ గాత్రం కలిపారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జూన్ 13న రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుంది. -
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ధనుష్ కుమారుడు.. మార్కులెన్నో తెలుసా..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్లు కొద్దిరోజుల క్రితమే విడాకుల విషయంలో వార్తల్లో నిలిచారు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ సుమారు 18 ఏళ్ల పాటు కలిసి జీవించారు. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, గత రెండేళ్లుగా ధనుశ్, ఐశ్వర్య వేర్వేరుగానే ఉంటున్నారు.ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర 12వ తరగతి బోర్డు పరీక్షలలో బాగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంటర్ ఫలితాల్లో అతని అత్యుత్తమ ప్రదర్శనకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఇటీవల ముగిసిన 12వ తరగతి బోర్డు పరీక్షలో యాత్ర 600 మార్కులకు గాను మొత్తం 569 మార్కులు సాధించినట్లు సమాచారం. తమిళ్ 100కి 98, ఇంగ్లిష్లో 92, గణితంలో 99, ఫిజిక్స్లో 91, బయాలజీలో 97, కెమిస్ట్రీలో 92 మార్కులు సాధించినట్లు ఇంటర్నెట్లో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇందులో అధికారికంగా ప్రకటన వెలువడలేదు.ధనుష్, ఐశ్వర్య విడిపోయినప్పటికీ, వారు తమ ఇద్దరు పిల్లలను బాధ్యతగానే చూసుకుంటున్నారు. లాల్ సలామ్ మ్యూజిక్ లాంచ్ పార్టీలో ఐశ్వర్యతో పాటుగా యాత్ర,లింగ కనిపించారు. కెప్టెన్ మిల్లర్ ఫిల్మ్ ఫెస్టివల్ సమయంలో పిల్లలు ఇద్దరూ కూడా ధనుష్తో కలిసి సందడి చేశారు. యాత్రకు 18 ఏళ్లు కాగా, చిన్న కుమారుడు లింగాకు 14 ఏళ్లు. వీరిద్దరూ చెన్నైలోని ఓ ప్రముఖ పాఠశాలలో చదువుకున్నట్లు సమాచారం. -
జూన్లో రాయన్
ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘రాయన్’ చిత్రం జూన్లో విడుదలకు సిద్ధం అవుతోంది. సన్ పిక్చర్స్పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని జూన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో పాటు ఈ సినిమా నుంచి తొలి పాటని ఈ నెల 9న రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు ధనుష్. ఆ మధ్య ఈ మూవీ నుంచి విడుదలైన మటన్ కొట్టు రాయన్గా ధనుష్ ఫస్ట్ లుక్కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. -
డంప్యార్డ్లో ధనుష్.. ఫ్యాన్స్ అభినందనలు
ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రష్మికా మందన్న కథానాయిక. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ముంబై మహానగరంలో అత్యంత భారీ డంప్యార్డ్లో ధనుష్తో ఒక సీన్ తీయాలని మేకర్స్ ప్లాన్ చేశారట. కానీ ఆ డంప్ యార్డ్ను సెట్టింగ్స్తో క్రియేట్ చేయాలని అనుకున్నారట. అయితే సినిమాకు అత్యంత కీలకంగా ఉన్న ఈ సీన్ను సహజంగా రావడం కోసం డంప్ యార్డ్లోనే షూటింగ్ చేద్దామని ధనుష్ చెప్పడమే కాకుండా.. అందుకు తగ్గట్లుగా సుమారు 10 గంటల పాటు మాస్క్ లేకుండానే డంప్యార్డ్లో ధనుష్ నటించారట. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ ధనుష్ను అభినందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్లో కూడా ధనుష్ డీగ్లామరైజ్గా కనిపించి అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో కీలకపాత్రలో నటించనున్న నాగార్జున ఫస్ట్ లుక్ను కూడా మీకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నాగ్ను చూసిన ఆయన ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న కుబేర ఇదే ఏడాదిలో విడుదల కానుంది. -
నోటు కథేంటి?
ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రష్మికా మందన్న కథానాయిక. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ని విడుదల చేశారు. వర్షం కురుస్తుండగా గొడుగు పట్టుకుని నిల్చున్నారు నాగార్జున. ఆయన వెనకవైపు డబ్బు నోట్ల కట్టలు ఉన్న కంటైనర్ కనిపిస్తోంది. కాగా.. ఓ ఐదువందల రూపాయల నోటు కింద పడి ఉండటాన్ని చూసిన నాగార్జున తన పర్సులోంచి ఓ నోటుని తీసి, ఆ కంటైనర్లో పెడతారు. మరి.. ఆ నోటు వెనక కథేంటి అనేది సినిమాలో చూడాల్సిందే. ‘‘వైవిధ్యమైన కథాంశంతో ‘కుబేర’ రూపొందుతోంది. ఈ చిత్రం కోసం బ్యాంకాక్లో నాగార్జున, ఇతర నటీనటులపై కొంత టాకీ, యాక్షన్ పార్ట్ చిత్రీకరించాం. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది’’ అని యూనిట్ పేర్కొంది. -
'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'కుబేర'. ఈ సినిమా నుంచి ఇప్పటికే ధనుష్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. తాజాగా కింగ్ నాగార్జున లుక్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున కీలకపాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.కుబేర సినిమాలో ధనుష్ కొంత సమయం పాటు రిచ్గా కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. కానీ, ధనుష్ ఫస్ట్ లుక్లో మాత్రం బిచ్చగాడి పాత్రలో కనిపించారు. నాగార్జున మాత్రం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా కోసం నాగార్జున అభిమానులతో పాటు ధనుష్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేస్తామని డైరెక్టర్ శేఖర్ కమ్ముల చెప్పారు. -
ముంబైలో కుబేర
ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్లో నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవల బ్యాంకాక్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది.కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ముంబైలోప్రారంభం అయింది. దాదాపు రెండు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్లో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట శేఖర్ కమ్ముల. సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ‘కుబేర’ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
వివాదంలో శేఖర్ కమ్ముల కుబేర..
-
ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్లకు కోర్టు ఉత్తర్వులు
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ల విడాకుల విషయంలో కోర్టుకు హాజరవ్వాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ సుమారు 18 ఏళ్ల పాటు కలిసి జీవించారు. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా 2022లో పలు విభేదాల వల్ల తాము విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. గత రెండేళ్లుగా ధనుశ్, ఐశ్వర్య వేర్వేరుగానే ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే ఈ జంట అధికారికంగా చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసింది. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో వారిద్దరిని కలిపేందుకు రజనీకాంత్ కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయినా కూడా వారిద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాజాగా వారి పిటిషన్ను న్యాయమూర్తి సుభాదేవి విచారించారు. అక్టోబరు 7న చెన్నై ఫ్యామిలీ కోర్టులో ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ విచారణకు హాజరవ్వాలని ఉత్తర్వులు ఇచ్చారు. 2022 నుంచి వేర్వేరుగా ఉంటున్న ఈ జంట పలు సినిమా నిర్మాణంలో బిజీగానే ఉంటున్నారు. వారి కుమారులు యాత్ర, లింగ మాత్రం ఐశ్వర్య వద్దే ఉంటున్నారు. కానీ వారిద్దరూ కూడా అప్పడప్పుడు ధనుష్ వద్దకు వెళ్లి వచ్చేవారు. ఏదేమైనా సుమారు 18 ఏళ్ల పాటు కలిసి జీవించిన ఈ స్టార్ కపుల్స్ ఈ సంవత్సరంలో విడాకులు తీసుకుని తమ బంధానికి ఫుల్స్టాప్ పెట్టబోతున్నారనే విషయాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. -
హీరో ధనుష్ తండ్రినని చెప్పుకున్న కదిరేశన్ మృతి
తమిళ సినీ నటుడు ధనుష్ తమ కుమారుడని కదిరేశన్, మీనాక్షి అనే వృద్ధ దంపతులు చెప్పుకుని పెద్ద వార్తల్లో నిలిచారు. మదురైకి చెందిన ఈ దంపతులు ధనుష్ తమ కుమారుడని కొన్నేళ్లపాటు చట్టపరంగా పోరాటం చేశారు. అయితే ధనుష్ తండ్రిగా చెప్పుకునే కదిరేశన్ కన్నుమూశారు. మదురైలోని రాజాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కదిరేశన్ మరణించాడు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ వచ్చారు. ఈ వృద్ధ దంపతులిద్దరూ మదురైలోని మేలూర్ తాలూకాలో మలంపట్టి గ్రామానికి చెందినవారు. ధనుష్ తమకు పుట్టిన మూడో కుమారుడని వారు చెప్పడం ఆపై సుదీర్ఘ న్యాయపోరాటం చేయడంతో వార్తల్లో నిలిచారు. ధనుష్ తమ కుమారుడే అని నిరూపించడానికి సాక్ష్యాధారాలుగా బర్త్ సర్టిఫికేట్, టెన్త్ క్లాస్ టీసీ, 2002లో ఉద్యోగం కోసం ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ధనుష్ తన పేరును నమోదు చేసుకున్న సర్టిఫికేట్లను గతంలో వారు కోర్టుకు సమర్పించి ఆపై కేసు వేశారు. ఈ ఆరోపణలపై ధనుష్ తరపు న్యాయవాది స్పందిస్తూ నోటీసులు పంపారు. అనంతరం మధురై మేలూర్ కోర్టులో దంపతులు వేసిన కేసును చెన్నై హైకోర్టు కొట్టివేసింది. నకిలీ పత్రాలను ఉపయోగించి ధనుష్ తమ కుమారుడే అని వారు చెప్పుకుంటున్నారని మార్చి 14న కోర్టు తీర్పు వెలువరించింది. ధనుష్ తమ కుమారుడే అంటూ ఆ వృద్ధ దంపతులిద్దరూ సుమారు పదేళ్ల పాటు పోరాడారు. చివరకు కోర్టు తీర్పు ఇచ్చిన కొద్దిరోజుల్లోనే కదిరేశన్ మరణించడం బాధాకరం అని చెప్పవచ్చు. -
రెండేళ్లుగా సస్పెన్స్.. విడాకులే కావాలంటున్న ధనుష్-ఐశ్వర్య
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్, ఐశ్వర్య రజినీకాంత్ ప్రస్తుతం తమ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. సుమారు 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న ధనుష్ దంపతులు 2022లోనే విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఆ తర్వాత నుంచి ఇద్దరు దూరంగానే ఉంటున్నారు. ఇటీవల ఐశ్వర్య రజినీకాంత్ లాల్ సలామ్ సినిమాను తెరకెక్కించారు. మరోవైపు ధనుశ్ రాయన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ జంట అధికారికంగా చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 2022 జనవరిలో విడిపోతున్నట్లు ప్రకటించిన స్టార్ కపుల్ దాదాపు రెండేళ్ల తర్వాత అధికారికంగా విడాకుల కోసం పిటిషన్లు వేశారు. త్వరలో వారి కేసు విచారణకు రానున్నట్లు సమాచారం. కాగా.. 2004లో ధనుశ్, ఐశ్వర్య ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరికీ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. దీంతో మరోసారి ధనుశ్- ఐశ్వర్య టాపిక్ కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. కలుస్తారని భావించినా.. గతంలో ఈ జంట మళ్లీ కలవబోతున్నారని చాలాసార్లు వార్తలొచ్చాయి. అంతే కాదు అభిమానులు సైతం వీరిద్దరు కలుస్తారని ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్లకు పైగా దూరంగా ఉన్న ఈ జంట చివరికీ విడిపోయేందుకే మొగ్గు చూపారు. 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/hAPu2aPp4n — Dhanush (@dhanushkraja) January 17, 2022 -
ధనుష్తో గొడవలు నిజమే.. ఆరేళ్లు మాటల్లేవ్: హీరో
జీవీ ప్రకాశ్ కుమార్.. మల్టీ టాలెంటెడ్. సంగీత దర్శకుడిగా, నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా తమిళ చిత్రపరిశ్రమలో రాణిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్గా సెంచరీ సినిమాలు దాటేసిన అతడు హీరోగా దాదాపు 25 చిత్రాలు చేశాడు. ఇతడికి కోలీవుడ్లో ధనుష్ క్లోజ్ ఫ్రెండ్. కానీ గతంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని.. అప్పటినుంచి వీరికి మాటల్లేవని ప్రచారం జరిగింది. ఫ్రెండ్స్ మధ్య గొడవలు కామన్ ఎట్టకేలకు ఈ ప్రచారంపై స్పందించాడు జీవీ ప్రకాశ్. ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ఫ్రెండ్స్ అన్నాక గొడవలు సర్వసాధారణమే! అలా మా మధ్య కూడా భేదాభిప్రాయాలు వచ్చాయి. చిన్నపాటి గొడవలు జరిగాయి. అలా ఆరేళ్లు మాట్లాడుకోలేదు. కానీ తర్వాత అంతా సెట్టయిపోయింది. ఫ్రెండ్షిప్ అంటేనే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కదా.. ఆ డిస్టబెన్స్ తర్వాత మేమిద్దరం ఇంకా క్లోజయ్యాం. తనతో క్రికెట్ ఆడటం ఇష్టం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తను నా కోసం అండగా నిలబడతాడు. నేను కూడా ఎప్పుడూ తనకు తోడుగా ఉంటాను. ధనుష్కు ఎవరైనా నచ్చారంటే వారికోసం ఎంతవరకు వెళ్లడానికైనా సిద్ధపడతాడు. తనలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. నాకు ధనుష్తో క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. కాగా జీవీ ప్రకాశ్ వెయిల్ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్గా చిత్ర రంగప్రవేశం చేశాడు. డార్లింగ్ మూవీతో హీరోగా మారాడు. మదయానై కూట్టం(2013) చిత్రం ద్వారా నిర్మాతగా అవతారం ఎత్తాడు. చదవండి: కీరవాణి అబ్బాయితో నా కూతురు పెళ్లి నిజమే: మాగంటి రూప -
వివాదంలో రఘువరన్ బీటెక్ నటి.. !
కోలీవుడ్ ధనుశ్ నటించిన చిత్రం రఘువరన్ బీటెక్. ఈ చిత్రంలో అతనికి జోడీగా అమలా పాల్ నటించింది. ఇంజినీరింగ్ చదివిన నిరుద్యోగుల బాధలను చూపే నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాలో రఘువరన్కు తల్లిగా నటి శరణ్య పొన్వన్నన్ నటించారు. అమాయకపు తల్లి పాత్రలో మెప్పించారు. తాజాగా ఆమె ఓ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని వారు నివాసముండే విరుంగబాక్కంలో పార్కింగ్ గొడవ ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లింది. పార్కింగ్ విషయంలో పొరుగింటి వారితో వివాదం తలెత్తింది. దీంతో పక్కింటి వారు శరణ్య పొన్వన్నన్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను నటి బెదిరించిందని పేర్కొంటూ శ్రీదేవి అనే మహిళ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభినట్లు తెలుస్తోంది. అయితే శరణ్య రఘువరన్ బీటెక్తో పాటు 24, వేదం, గ్యాంగ్ లీడర్, మహాసముద్రం, ఖుషి లాంటి సినిమాల్లోనూ కనిపించారు. -
ఈ ముగ్గురు సినిమా స్టార్స్ ధరించిన 'కరుంగలి దండ' గురించి తెలుసా..?
చాలామంది ప్రముఖులు తమ మెడలో స్పటిక,రుద్రాక్ష, కరుంగలి మాల ఇలా వారి నమ్మకం కొద్ది వివిధ దండలు ధరిస్తూ ఉంటారు. ప్రస్తుతం కోలీవుడ్కు చెందిన స్టార్స్ లోకేష్ కనగరాజ్, ధనుష్, శివకార్తికేయన్ వంటి వారు కరుంగలి దండను తమ మెడలో ఎప్పటికి ధరించే ఉంటారు. వారు పలు వేదికల మీదికి వెళ్లినా సరే ఈ దండను మాత్రం తొలగించరు. అంతలా ఈ కరుంగలి దండకు వారు ప్రాముఖ్యత ఇస్తారు. అది ఎందుకు ధరిస్తున్నారో అనే విషయాన్ని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కారణం ఏమిటంటే..: లోకేష్ కనగరాజ్ 'విక్రమ్ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఒక సందర్భంలో షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాధానికి గురయ్యాను. అప్పుడు నా మిత్రుడు ఆర్ట్ డైరెక్టర్ సతీష్ నాకు ఈ కరుంగలి దండను ఇచ్చాడు. అప్పుడు ఈ మాల గురించి నాకు పెద్దగా ఎలాంటి సమాచారం తెలియదు. కానీ ఈ దండను ధరించమని అతను చెప్పడంతో నేను తీసుకున్నాను. ఇక నుంచి నీకు అన్నీ మంచే జరుగుతాయి.. ఎలాంటి ప్రమాధాలు జరగవు అని చెప్పాడు. నాకు అలాంటి వాటి పట్ల పెద్దగా నమ్మకం లేదు. కానీ ఆయన కోరిక మేరకు ఆ మాలను ధరించాను. కానీ ఆ సమయం నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. విక్రమ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఎంతో పేరుప్రతిష్ఠలు వచ్చాయి. దీంతో ఆ దండను నేను ఎప్పడూ తొలగించలేదు.' అని ఆయన చెప్పారు. కరుంగాలి మాల అంటే.. కరుంగలి అంటే జమ్మి చెట్టు అని అర్థం. ఆ చెట్టు కాండం నుంచి ఈ దండను తయారు చేస్తారు. జ్యోతిషశాస్త్ర రీత్యా, కరుంగాలి మాల అంగారక గ్రహానికి చెందినది. అంగారక గ్రహ ప్రభావాలను నియంత్రించే శక్తి ఈ మాలకు ఉందని, అలాగే ఈ హారం ధరించిన వ్యక్తి వారి జాతకంలో అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని తగ్గిస్తుందని జ్యోతిష్య నిపుణుల నమ్మకం. అలాగే విద్యార్థులు తమ జ్ఞాపకశక్తి , మేధో శక్తులను మెరుగుపరచడానికి , విద్యలో రాణించడానికి ఈ మాలన ధరిస్తారని చెబుతారు.వ్యాపారస్తులతో పాటు నిరుద్యోగులు, జాబ్ హోల్డర్లు కూడా ఈ దండను ధరిస్తారు. అందుకే ఈ దండలకు భారీ డిమాండ్ పెరిగింది. ఆన్లైన్లో దొరికే మాలలన్నీ డూప్లికేట్ ఉండొచ్చని.. వాటి వల్ల మంచి కన్నా చెడు జరిగే అవకాశాలు ఎక్కువని జ్యోతిష్య నిపుణులు పలు సందర్భాల్లో హెచ్చరిస్తున్నారు. ఒరిజినల్ మాలను తమిళనాడులోని పాతాళ శంభు మురుగన్ ఆలయం దగ్గర మాత్రమే తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. రాత్రి నిద్రపోయే ముందు ఈ హారాన్ని తీసి ఇంట్లో దేవుడు దగ్గర పెట్టుకుని.. ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్లీ ఈ మాలను ధరించవచ్చని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తారు. తమిళనాడులోని సోలైమలై కొండల దిగువన ఈ ఆలయం ఉంది. మదురై నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయంలో సుబ్రమణ్య స్వామి ఉన్నారు. శివకార్తికేయన్, ధనుష్ కూడా కరుంగాలి అభిమానులే కరుంగలి మాలను కోలీవుడ నుంచి శివకార్తికేయన్, ధనుష్ కూడా ధరిస్తారు. ఒక ఇంటర్వ్యూలో ఈ దండ గురించి మాట్లాడుతూ.. 'ఈ కరుంగలి మాల ధరించిన సమయం నుంచి నా జీవితం మారిపోయింది. సినిమాల పరంగా మంచి అవకాశాలు దక్కాయి.' అని చెప్పాడు. పలుమార్లు ఈ ఆలయానికి ధనుష్ కాలినడక ద్వారా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. చుట్టూ కొండల మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. -
మెగా ఫోన్ పట్టనున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్.. ఆ స్టార్ హీరోతోనే!
సినిమా చాలా పాఠాలు నేర్పుతుంది. అందులో మంచి, చెడు రెండు ఉంటాయి. ఇక సినిమా ద్వారా చాలా నేర్చుకున్నవారూ ఉన్నారు. అలాంటి వారిలో సినిమాటోగ్రాఫర్ ఓం ప్రకాశ్ ఒకరు. ఆయన తమిళంలో కళవాణి, నాణయం, అనేగన్, మారి, నీదానే ఎన్ పొన్వసంతం, తిరుచిట్రఫలం తదితర చిత్రాలకు ఛాయాగ్రహకుడిగా పని చేశారు. తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ ఛాయాగ్రహకుడిగా రాణిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం భాషా చిత్రాలకు ఛాయాగ్రహకుడిగా పని చేశారు. దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతున్న ఓం ప్రకాశ్ సుమారు 500 చిత్రాలకు పైగా పని చేశారు. తాజాగా ఓం ప్రకాశ్ మెగాఫోన్ పట్డడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ హీరోగా ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం. మరో విశేషం ఏంటంటే ఈ సినిమాకు హీరో ధనుశ్ కథను సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయనే తన వండర్బార్ ఫిలింస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం తన 50వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ధనుష్ తన సోదరి కొడుకును హీరోగా పరిచయం చేస్తూ నిలావుక్కు ఏన్ ఎన్మేల్ కోపం అనే చిత్రాన్ని స్వీయ దర్శక్వంలో నిర్మిస్తూ కీలక పాత్రలో నటిస్తున్నారు. అదే విధంగా సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్లో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఆ తరువాత ఓం ప్రకాశ్ దర్శకత్వంలో చిత్రాన్ని చేసే అవకాశం ఉంది. -
అది జరగాలని కోరుకుంటున్నా.. రజనీకాంత్పై ధనుష్ కామెంట్
కోలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన నటుడు ధనుష్. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా రాణిస్తున్న ఈయన తాజాగా సంగీతజ్ఞాని ఇళయరాజా బయోపిక్లో నటిస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ చిత్రం ఫేమ్ అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్కురీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక, ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చైన్నెలోని ఓ హోటల్లో తాజాగా జరిగింది. ఇందులో నటుడు కమల్హాసన్, దర్శకుడు భారతీరాజా, వెట్రిమారన్, ఆర్వీ ఉదయకుమార్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు ధనుష్ మాట్లాడుతూ భావనను బట్టే జీవి తం అంటారన్నారు. దాన్ని తాను నమ్ముతానన్నారు. పలువురు రాత్రుల్లో నిద్ర పట్టకపోతే ఇళయరాజా పాటలను వింటూ నిద్రపోతారన్నారు. అయితే తాను పలు రాత్రుళ్లు ఇళయరాజాగా నటిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ నిద్ర లేకుండా గడిపానన్నారు. తాను ఇద్దరి బయోపిక్లలో నటించాలని ఆశ పడ్డానని, అందులో ఒకరు రజనీకాంత్ కాగా, మరొకరు ఇళయరాజా అనీ అన్నారు. అందులో ఇళయరాజా బయోపిక్లో నటించే కల నెరవేరుతోందని అన్నారు. ఈ అవకాశం తనకు రావడం గర్వంగా ఉందన్నారు. ఇళయరాజా సంగీతమే తనకు అండ అని, ఇది అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించడం ఛాలెంజ్, ప్రెజర్ అని అంటున్నారని, నిజానికి అలాంటిదేమీ లేదని, జాలీగా నటించడమేనని ధనుష్ పేర్కొన్నారు. అదేవిధంగా విడుదలై చిత్ర పాటల రికార్డింగ్ సమయంలో తనను పాడమని ఇళయరాజా చెప్పినప్పుడు మీరు ఇక్కడే ఉంటారా? అని అడిగానన్నారు. అందుకాయన తాను ఎప్పుడు మీతో లేకుండా ఉండాను అని పేర్కొన్నట్లు తెలిపారు. కాగా ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని, నీరవ్షా ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
Ilaiyaraaja Biopic:వెండితెరకి ఇళయరాజా జీవితం
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా జీవితం వెండితెరపైకి వస్తోంది. ధనుష్ లీడ్ రోల్లో నటిస్తున్న ‘ఇళయరాజా’ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ మూవీకి అరుణ్మాథేశ్వరన్ దర్శకుడు. కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యూరీ మూవీస్ సమర్పణలో రూ΄÷ందుతున్న ‘ఇళయరాజా’ షూటింగ్ బుధవారం చెన్నైలో ప్రారంభమైంది. ఈ వేడుకకి ఇళయరాజా, హీరోలు కమల్హాసన్, ధనుష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇళయరాజాతో తమకున్న అనుబంధాన్ని కమల్హాసన్, ధనుష్ పంచుకున్నారు. కాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఈ మూవీకి ఇళయరాజా సంగీతం అందిస్తారని కోలీవుడ్ టాక్. -
'కెప్టెన్ మిల్లర్' డైరెక్టర్ చేతికి మరో క్రేజీ ప్రాజెక్ట్.. ఆఫర్ చేస్తున్న ధనుష్
సంగీత జ్ఞాని ఇళయరాజా జీవితం వెండితెరపైకి రానుంది. ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ విషయంలో మార్పులు జరిగినట్లు రూమర్స్ వస్తున్నాయి. ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మెర్క్యూరీ గ్రూప్, కనెక్ట్ మీడియా సంస్థలు నిర్మించనున్నాయి. మార్చి 20న ఈ సినిమాను లాంచ్ చేసి 2025 మార్చిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను బాలీవుడ్ దర్శకుడు ఆర్.బాల్కి తెరకెక్కించనున్నారని ప్రచారం జరిగింది. ఇదే విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు ఆర్.బాల్కి ఇలా అన్నాడు. 'నాకు ఇళయరాజా గారి జీవితంపై సినిమా తీయాలని ఉంది. అది కూడా ధనుష్ హీరోగా. వారిద్దరి పోలికలు కొంచెం దగ్గరగా అనిపిస్తాయి. ధనుష్ కూడా ఆయనకి పెద్ద అభిమాని కాబట్టి ఈ ప్రాజెక్టు కోసం ధనుష్ ఒప్పుకుంటారు' అని తెలిపారు. బాలీవుడ్లో ధునుష్, అమితాబ్ బచ్చన్ నటించిన 'షమితాబ్' చిత్రానికి డైరెక్టర్ ఆర్. బాల్కి అనే విషయం తెలిసిందే. (ధనుష్, ఆరుణ్ మాథేశ్వరన్- ఆర్ బాల్కి, ధునుష్) అయితే తాజా సమాచారం ప్రకారం ఇళయరాజా బయోపిక్ కోసం బాల్కిని కాదని డైరక్టర్ అరుణ్ మాథేశ్వరన్ను ఎంపిక చేసినట్లు కోలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమాకు ఆరుణ్ మాథేశ్వరన్ డైరెక్టర్ అనే విషయం తెలిసిందే. కానీ ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. సుమారు7 వేలకు పైగా పాటలకు సంగీతం అందించిన ఇళయరాజా బయోపిక్ చిత్రానికి 'ఇసైజ్ఞాని' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. -
ప్రేమలో పడ్డ ఐశ్వర్య రజనీకాంత్.. ఆమె మాటలే చెప్తున్నాయ్!
కోలీవుడ్ డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్ విడిపోయి రెండేళ్లు అవుతోంది. 2004లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2022 జనవరిలో విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం విడిపోయినప్పటికీ వారిద్దరి మధ్య స్నేహం, గౌరవం అలాగే ఉందని, అందుకు నిదర్శనం ఐశ్వర్య ఇప్పుడు తన మాజీ భర్త ధనుష్ గురించి మాట్లడమేనని నెటిజన్లు అంటున్నారు. పెళ్లయి 18 ఏళ్లు, ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట ఇప్పుడు మళ్లీ ఒక్కటవుతుందని కోలీవుడ్లో పుకార్లు వస్తున్నాయి. విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ధనుష్, ఐశ్వర్య విడివిడిగా జీవిస్తున్నారనే విషయం తెలిసిందే. భార్యాభర్తలుగా కలిసి లేకున్నా.. ఇద్దరూ మంచి స్నేహితులని ఐశ్వర్య మాటలే నిదర్శనం. ఐశ్వర్య తన దర్శకత్వం వహించిన లాల్ సలామ్ కోసం ఒక ఇంటర్వ్యూలో ధనుష్ గురించి మాట్లాడింది. దీంతో ఇద్దరూ తిరిగి మళ్లీ కలుసుకోనున్నారని ఊహాగానాలకు దారితీసింది. దక్షిణాది సినిమాకి చెందిన ప్రముఖ సంగీత స్వరకర్త అనిరుధ్ రవిచందర్ సినీ జర్నీ వెనుక ధనుష్ ఉన్నాడని ఆమె ఇలా చెప్పుకొచ్చింది. అనిరుధ్ రవిచందర్ పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ప్రస్తుతం కోట్లలో పారితోషికం తీసుకుంటున్నాడు. అయితే ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన '3' చిత్రానికి అనిరుధ్ మొదట సంగీతాన్ని అందించాడు. అప్పుడు అతని వయస్సు దాదాపు 20 సంవత్సరాలు. అలాంటి కుర్రాడు సంగీత దర్శకత్వం వహించాలనేది ధనుష్ కోరికని.. అనిరుధ్ నేడు ఇంత స్థాయికి చేరుకున్నాడంటే అందుకు కారణం ధనుష్ అని ఆమె చెప్పింది. గత కొన్ని సంవత్సరాలుగా, అనిరుధ్ రవిచందర్ భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న సంగీత స్వరకర్తలలో ఒకరిగా మారారు. నేడు దక్షిణాదిలోని ప్రతి దర్శకుడి మొదటి ఎంపిక అతనే. 2012లో '3' సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ సినిమాలోని 'కొలవెరి డి..' పాట ఆప్పట్లో పెద్ద సెన్సేషన్ అని అందరికి తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ ఐశ్వర్యకు కజిన్ అవుతాడు. కానీ ధనుష్ మాత్రం అనిరుధ్లోని ప్రతిభను గుర్తించాడని ఐశ్వర్య తెలిపింది. అనిరుద్ సక్సెస్ జర్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అతను మా బంధువు అయినందుకు సంతోషంగా ఉంది. ధనుష్ వల్లే అనిరుధ్ సినిమాల్లోకి వచ్చాడు. అనిరుధ్ను మొదట సింగపూర్కు పంపించి చదివించాలని ఆయన తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ ధనుష్ మాత్రం సంగీతంపై మక్కువ కొనసాగించాలని అన్నారు. ప్రతిభను ఎలా గుర్తించాలో ధనుష్కి తెలుసు. ఇక్కడే ఉండి విజయాన్ని అందుకోవాలని అనిరుధ్ని ధనుష్ ఒప్పించాడని ఐశ్వర్య తెలిపింది. కీబోర్డ్ కొనడం నుంచి పాటలు రాయమని ఒత్తిడి చేయడం వరకు ప్రతిదానికీ ధనుష్కే క్రెడిట్ ఉంది. అనేలా ఐశ్వర్య తెలిపింది. దీంతో తన మాజీ భర్త ధనుష్తో ఐశ్వర్య మళ్లీ ప్రేమలో పడినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయంపై ఆమె నుంచి ఎలాంటి ప్రకటన జరగలేదు. -
ధనుష్ సినిమాలో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్..
హీరోగా బిజీగా ఉన్న ధనుష్ దర్శకుడిగా, నిర్మాతగానూ కొనసాగుతున్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం రాయన్. ఇది ధనుష్ 50వ చిత్రం అన్నది తెలిసిందే. దుషారా విజయన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న రాయన్ మూవీ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోది. దీంతో ధనుష్ ప్రస్తుతం తన 51వ చిత్రం కుబేరపై దృష్టి పెట్టారు. కుబేర.. టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఇకపోతే ధనుష్ మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన సోదరి కొడుకు పవిష్ను హీరోగా పరిచయం చేస్తున్నారు. నటి అనికా సురేంద్రన్, మాథ్యూ థామస్, ప్రియ ప్రకాశ్ వారియర్, రమ్య రంగనాథన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇందులో ధనుష్ కీలక పాత్రలో మెరవనున్నారు. దీనికి జీవి ప్రకాశ్కుమార్ సంగీతం అందిస్తున్నారు. స్పెషల్ సాంగ్ ఈ చిత్రాన్ని వండర్బార్ ఫిలింస్ పతాకంపై ధనుష్ పేరెంట్స్.. దర్శకుడు కస్తూరి రాజా, విజయలక్ష్మి నిర్మిస్తున్నారు. మ్యూజికల్ లవ్స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిలావుకు ఎన్మేల్ ఎన్నడీ కోబం అనే టైటిల్ను నిర్ణయించారు. ఇందులో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో ప్రియాంక మోహన్ నటించినట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు ధనుష్తో కలిసి ఈ బ్యూటీ కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న నిలావుకు ఎన్ మేల్ ఎన్నడీ కోబం చిత్రంలో ప్రత్యేక గీతంలో నటించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ పాట చిత్రంలో చాలా కీలకమని తెలిసింది. చదవండి: మూడు నెలల తర్వాత చెప్పింది చేసిన 'బిగ్బాస్ 7' విన్నర్ -
హీరో ధనుష్ మా కుమారుడే అంటూ పిటిషన్.. ఫైనల్ తీర్పు ఇచ్చిన కోర్టు
పాన్ ఇండియా స్టార్ హీరో ధనుష్ తమ కుమారుడు అని పేర్కొంటూ మేలూర్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ని మద్రాసు హైకోర్టు, మదురై ధర్మాసనం కొట్టివేసింది. మేలూర్కి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు.. నటుడు ధనుష్ తమ కుమారుడని 2015లో మేలూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ధనుష్ తమ కుమారుడే అని నిరూపించడానికి సాక్ష్యాధారాలుగా బర్త్ సర్టిఫికేట్, టెన్త్ క్లాస్ టీసీ, 2002లో ఉద్యోగం కోసం ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ధనుష్ తన పేరును నమోదు చేసుకున్న సర్టిఫికేట్లను గతంలో వారు కోర్టుకు సమర్పించారు. స్కూల్లో చదువుతున్నప్పుడు ధనుష్ ఇంట్లో నుంచి పారిపోయాడని వారు కోర్టుకు తెలిపారు. ధనుష్ తమ అబ్బాయి అని వారు సమర్పించిన అధారాలను పరిశీలించిన కోర్టు తాజాగా ఈ కేసును కొట్టివేసింది. పిటిషన్ దారుడు ఆరోపణలు రుజువు చేయడానికి సరైన ఆధారాలు లేనందున ఈ కేసులో నిజంలేదని తెలిపి పిటిషన్ని కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. ధనుష్ తమ కుమారుడే అని పేర్కొనడంతో పాటు ప్రతి నెల తమ ఖర్చులకు 65 వేలు ఇప్పించాల్సిందిగా కోర్టును కోరిన కదిరేశన్కు ఎదురుదెబ్బ తగిలింది. పుట్టుమచ్చలతో కేసు క్లియర్ కదిరేశన్, మీనాక్షి చేస్తున్న వాదనల్లో నిజం లేదంటూ ధనుష్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించడంతో పాటు కొన్ని ఆధారాలు సమర్పించారు. అయితే... కదిరేశన్ సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు ఉన్నాయి. ధనుష్ న్యాయవాదులు సమర్పించిన టీసీలో పుట్టుమచ్చలు లేవు. దీనిపై న్యాయమూర్తి ప్రశ్నించగా... అసలు కదిరేశన్ దంపతులు పేర్కొన్న పుట్టుమచ్చులు ధనుష్కు లేవని అతడి తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. దీంతో కొన్ని రోజుల క్రితం ధనుష్ వ్యక్తిగతంగా కోర్టుకు హజరయ్యారు. కోర్టు రిజిస్టార్ సమక్షంలో మేలూర్ రాజాజీ ప్రభుత్వాసుపత్రి డీన్ ధనుష్ పుట్టుమచ్చలను పరిశీలించారు. ధనుష్కు పుట్టుమచ్చలు లేవని తేలడంతో కదిరేశన్ పిటిషన్ను కొట్టివేశారు. సుమారు ఎనిమిదేళ్ల పాటు అనేక అధారాలపై విచారణ జరిపిన కోర్టు కస్తూరి రాజా, విజయలక్ష్మిలకే ధనుష్ జన్మించినట్లు తీర్పును వెళ్లడించింది. -
బ్యాంకాక్లో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని లీడ్ రోల్స్లో నటిస్తున్న మల్టీస్టారర్ ఫిల్మ్ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ని బ్యాంకాక్లో ్ర΄ారంభించారు. ‘‘సరికొత్త కథాంశంతో రూ΄÷ందుతున్న చిత్రం ‘కుబేర’. బ్యాంకాక్లో ్ర΄ారంభించిన షెడ్యూల్లో నాగార్జునతో ΄ాటు మరికొందరు నటీనటులపై కొన్ని టాకీ, యాక్షన్ ΄ార్ట్లు చిత్రీకరించనున్నాం. భారీ స్థాయిలో రూ΄÷ందుతున్న ఈ సినిమా ఇంతకుముందు ఎవరూ చూడని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకుంటోంది. శివరాత్రి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్కి అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: సోనాలీ నారంగ్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి. -
పాన్ ఇండియా సినిమా.. ఆసక్తిగా 'కుబేర' ఫస్ట్ లుక్ పోస్టర్
ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేశారు. దీన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కుబేర అనే టైటిల్ను మేకర్స్ ఖరారు చేశారు. ఈమేరకు తాజాగా టైటిల్ గ్లింప్స్ను విడుదల చేశారు. ధనుష్ టైటిల్కు భిన్నమైన లుక్లో చిరిగిన బట్టలు, మాసిన జుట్టు, గుబురు గడ్డంతో ఆసక్తికరంగా కనిపించారు. అదే పోస్టర్లో ధనుష్ వెనక అన్నపూర్ణ దేవి నుంచి శివుడు భిక్ష తీసుకుంటున్నట్లుగా ఉన్న పెయింటింగ్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. కాగా ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే తిరుపతి పరిసరప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణను, గోవాలో మరో షెడ్యూల్ను పూర్తి చేశారు మేకర్స్. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలో హైదరాబాద్లోప్రారంభం కానుందని తెలిసింది. తాజాగా విడుదలైన పోస్టర్ను బట్టి ఈ సినిమాలో ధనుష్, నాగార్జునల పాత్రలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
మలయాళంలో రికార్డు సృష్టించిన సినిమా.. ఆ డైరెక్టర్తో ధనుష్!
మంజుమేల్ బాయ్స్.. ఇప్పుడు దక్షిణాది సినిమా పరిశ్రమలో మార్మోగిపోతున్న సినిమా పేరు. ఇది చిన్న బడ్జెట్లో రూపొందిన మలయాళ చిత్రం. విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇంకా కూడా అనేకచోట్ల సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఒక యధార్థ సంఘటనతో రూపొందించిన ఈ చిత్రానికి చిదంబరం దర్శకుడు. ఈయన్ని పలువురు దక్షిణాది సినీ ప్రముఖులు కలిసి మరీ అభినందిస్తున్నారు. వారిలో హీరో ధనుష్ కూడా ఉన్నారు. ఈయన మలయాళ దర్శకుడు చిదంబరంను ఎంతగానో ప్రశంసించారు. కాగా చిదంబరం తన నెక్స్ట్ మూవీ తమిళంలో ఉండబోతుందని ప్రచారం సాగుతోంది. దీంతో చిదంబరం దర్శకత్వంలో ధనుష్ నటించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది. ప్రముఖ నిర్మాత అన్బు సెళియన్ తన గోపురం ఫిలింస్ పతాకంపై నటుడు ధనుష్ హీరోగా ఓ చిత్రం చేయనున్నారు. ఈ చిత్రానికి మంజుమేల్ బాయ్స్ చిత్రం ఫేమ్ చిదంబరం దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ దర్శకుడికి ముందుగా రోమియో ఫిలింస్ అధినేత రాహుల్ అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేసినట్లు తెలిసింది. మరి ఈ ఇద్దరు నిర్మాతల్లో చిదంబరం ఎవరికి ముందుగా చిత్రం చేస్తారో చూడాలి. అయినా ఒక్క చిత్రంతోనే ఒక దర్శకుడికి ఇంత డిమాండ్ రావడం అరుదైన విషయమే! చదవండి: ఓటీటీలో హనుమాన్?.. ఇప్పట్లో లేనట్లేనా? -
ఓటీటీలో ధనుష్ మూవీ.. ఇన్నాళ్లకు మోక్షం!
ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలన్నీ పోటీపడ్డాయి. మహేశ్బాబు గుంటూరు కారం, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నా సామిరంగతో పాటు తేజ సజ్జ హనుమాన్ కూడా సంక్రాంతి బరిలో దిగింది. అయితే పెద్ద సినిమాలను వెనక్కినెట్టి హనుమాన్ విజేతగా నిలిచింది. సైంధవ్ మినహా మిగతా రెండు చిత్రాలు భారీగానే కలెక్షన్స్ రాబట్టాయి. నిజానికి ఈ చిత్రాలతో పాటు ధనుష్ యాక్షన్ మూవీ కెప్టెన్ మిల్లర్ కూడా తెలుగులో రిలీజ్ కావాల్సి ఉంది. మొత్తం ఎన్నికోట్లు వచ్చాయంటే? కానీ థియేటర్లు దొరక్కపోవడంతో ఇక్కడ ఆలస్యంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ సాధారణ వసూళ్లు రాబట్టడంలో ఘోరంగా విఫలమైంది. తమిళనాట మాత్రం హిట్ కొట్టింది. ఓవరాల్గా రూ.104 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఫిబ్రవరి 9 నుంచి ఈ మూవీని అమెజాన్ ప్రైమ్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. హిందీ వర్షన్ మాత్రం విడుదల చేయలేదు. ఇక హిందీలో చూడొచ్చు తాజాగా హిందీ రిలీజ్పై క్లారిటీ ఇచ్చారు. ఓటీటీకి వచ్చిన నెల రోజులకు హిందీలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. మార్చి 8 నుంచి హిందీ వర్షన్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపారు. దీంతో ధనుష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హమ్మయ్య.. ఇక హిందీలో చూడొచ్చంటూ కామెంట్లు చేస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మించారు. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించాడు. భారీ పీరియాడికల్ కథగా తెరకెక్కించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందించారు. witness the rise of this revolution, coming soon in Hindi! #CaptainMillerOnPrime in Hindi, Mar 8 pic.twitter.com/QrRXr0gLcz — prime video IN (@PrimeVideoIN) March 1, 2024 చదవండి: మందు తాగే అలవాటు లేదు.. బూతులు తిట్టాడు.. అందుకే అలా చేశానంటూ ఏడ్చేసిన నటి -
మాజీ అల్లుడితో రజినీకాంత్.. ఆ దిగ్గజం బయోపిక్ కోసమే?
సాధారణంగా స్టార్ హీరోలు ఇద్దరు కలిసి నటిస్తే పెద్ద విషయమేం కాదు. కానీ ముగ్గురు ప్రముఖ హీరోలు ఒకే మూవీలో కలిసి నటిస్తే మాత్రం విశేషమని చెప్పొచ్చు. ఇలాంటిదే త్వరలో తమిళ చిత్రసీమలో జరగబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్ 'రాయన్' సినిమాతో బిజీగా ఉన్నాడు. హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్నాడు. దీని తర్వాత దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్లో టైటిల్ రోల్ చేయబోతున్నాడు. (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) ఇప్పటి జనరేషన్కి తెలియకపోవచ్చు గానీ 90ల్లో సినిమాలు చూసిన వాళ్లకు ఇళయరాజా పాటల్లోనే మ్యాజిక్ ఏంటనేది తెలుస్తుంది. దక్షిణాదిలో స్టార్ హీరోల సినిమాలకు సంగీతమందించిన ఈయన.. దశాబ్దాల పాటు గుర్తుండిపోయే పాటలు ఇచ్చారు. ఇప్పుడు ఈయన జీవితాన్నే సినిమాగా తీయబోతున్నారు. ఇందులోనే కమల్ హాసన్-రజినీకాంత్ అతిథి పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్ కూతురు ఐశ్వర్యని గతంలో పెళ్లి చేసుకున్న ధనుష్.. కొన్నేళ్ల క్రితం విడాకులు ఇచ్చేశాడు. దీంతో రజినీకాంత్కి ఇతడు మాజీ అల్లుడు అయిపోయాడు. అయినా సరే ఇప్పుడు రజినీకాంత్.. ధనుష్ సినిమాలో కనిపించబోతున్నాడనే వార్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. బహుశా ఇళయరాజా బయోపిక్ కావడం వల్లే ఒప్పుకొని ఉంటాడని నెటిజన్స్ అనుకుంటున్నారు. ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన కొత్త వాచ్.. రేటు తెలిస్తే మైండ్ బ్లాకే) -
తమ్ముడి డైరెక్షన్లో అన్న.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!
స్టార్ హీరో ధనుష్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పేరుకే తమిళ నటుడు కానీ తెలుగు, హిందీలోనూ బోలెడంత క్రేజ్ సంపాదించాడు. ధనుష్లో గాయకుడు, లిరిక్ రైటర్, దర్శకుడు కూడా ఉన్నాడు. నటుడిగా కోలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి చేరిన ధనుష్ ఎదుగుదలలో ఆయన సోదరుడు, దర్శకుడు సెల్వరాఘవన్ పాత్ర ఎంతో ఉంది. తాజాగా అన్న సెల్వ రాఘవన్ గురించి ధనుష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. (ఇదీ చదవండి: ప్రముఖ నిర్మాతకి బ్రేకప్ చెప్పిన భార్య.. విడాకుల తీసుకోబోతున్నారా?) ధనుష్ తొలి చిత్రం 'తళ్లువదో ఇళమై' సినిమాని తీసిన సెల్వరాఘవన్నే. ఈ చిత్రం విజయం వీరిద్దరి ఫేట్ మార్చేసింది. ఆ తర్వాత కాదల్ కొండేన్, పుదుపేట్టై వంటి హిట్ చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. కాగా ధనుష్ తన 50వ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తీస్తున్నాడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం.. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. దీనికి 'రాయన్' టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో నటీనటులను పరిచయం చేస్తూ ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ధనుష్ అన్న సెల్వరాఘవన్ కూడా క్రేజీ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించిన ధనుష్.. 'మిమ్మల్ని(సెల్వరాఘవన్ ) డైరెక్ట్ చేస్తానని ఊహించలేదు సర్' అని ఎమోషనల్ అయిపోయాడు. దీనికి బదులిచ్చిన సెల్వరాఘవన్.. తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు దర్శకుడు సార్, మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సంభాషణ వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: నన్ను చూసి అబ్బాయిలు కన్నుకొడుతూనే ఉంటారు: నరేశ్) Never thought I’ll direct you someday sir 🙏🙏 @selvaraghavan pic.twitter.com/X1TnkaGqAR — Dhanush (@dhanushkraja) February 22, 2024 -
'ఇటు చెన్నై... అటు ముంబై' వార్కు దిగిన మన గ్యాంగ్స్టార్స్
బాక్సాఫీస్ను లూటీ చేయడానికి గ్యాంగ్స్టర్గా మారారు కొందరు స్టార్స్. వెండితెరపై ఈ హీరోలు గ్యాంగ్వార్ చేస్తున్నారు. గ్యాంగ్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రాల్లో గ్యాంగ్స్టర్స్గా మారిన ఆ కోలీవుడ్ గ్యాంగ్స్టార్స్ గురించి తెలుసుకుందాం. గ్యాంగ్స్టర్ రంగరాయ గ్యాంగ్స్టర్ రంగరాయ శక్తివేల్ నాయకర్గా మారారు కమల్హాసన్. ‘థగ్ లైఫ్’ సినిమాలో కమల్హాసన్ చేస్తున్న పాత్ర పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. 1987లో చేసిన ‘నాయకన్’ (తెలుగులో ‘నాయకుడు’) చిత్రం తర్వాత హీరో కమల్హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. 37 ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో వస్తున్న ఈ సినిమాలో త్రిష, దుల్కర్ సల్మాన్, ‘జయం’ రవి, నాజర్, గౌతమ్ కార్తీక్, జోజూ జార్జ్, ఐశ్వర్యా లక్ష్మి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం పీరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ‘నా పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. కాయల్ పట్టినమ్. నన్ను క్రిమినల్, గుండా, యాకుజా అని పిలుస్తారు. యాకుజా అంటే జపాన్ భాషలో గ్యాంగ్స్టర్ అని అర్థం’ అంటూ ‘థగ్ లైఫ్’లోని తన పాత్ర గురించి ఈ సినిమా టైటిల్ టీజర్ అనౌన్స్మెంట్ వీడియోలో చెప్పుకొచ్చారు కమల్. ఆర్. మహేంద్రన్, కమల్హాసన్, మణిరత్నం, ఎ. శివ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరకర్త. 2025లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. స్టూడెంట్ టు గ్యాంగ్స్టర్ ‘సూరరై పోట్రు’ (‘ఆకాశం నీ హద్దురా!’) వంటి సందేశాత్మక బయోపిక్ తీసిన తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర ఓ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ చేయనున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ మూవీలో సూర్యతో పాటు దుల్కర్ సల్మాన్, నజ్రియా ఫాహద్, విజయ్ వర్మ లీడ్ రోల్స్ చేస్తారు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం అవుతుంది. చెన్నై, తిరుచ్చి లొకేషన్స్తో పాటు హర్యానాలో కూడా కొంత షూటింగ్ ప్లాన్ చేశారట. ఇక కథ రీత్యా స్టూడెంట్ స్థాయి నుంచి గ్యాంగ్స్టర్ వరకు ఎదిగే వ్యక్తి పాత్రలో సూర్య కనిపిస్తారని కోలీవుడ్ సమాచారం. 2డీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ను ఆరంభించారు సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్కుమార్. ఇది జీవీ ప్రకాశ్కు నూరవ చిత్రం కావడం విశేషం. ఇటు చెన్నై... అటు ముంబై తమిళనాడులో ఒకటి, ముంబైలో మరొకటి... ఇలా రెండు గ్యాంగ్లు మెయిన్టైన్ చేస్తున్నట్లున్నారు హీరో ధనుష్. ముందు తమిళనాడుకు వెళితే... ధనుష్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాయన్’. పీరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సందీప్ కిషన్, కాళిదాసు, సెల్వ రాఘవన్, ప్రకాశ్రాజ్, దుషారా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముగ్గురు అన్నదమ్ములు (ధనుష్, సందీప్ కిషన్, కాళిదాసు)ల మధ్య నార్త్ చెన్నై నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్ డ్రామా అట ‘రాయన్’. ధనుష్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రం, ఆయనకు కెరీర్లో యాభైవ చిత్రం కావడం విశేషం. ఓ గ్యాంగ్స్టర్ చెఫ్గా ఎందుకు కొత్త జీవితం ప్రారంభించాల్సి వచ్చింది? గ్యాంగ్స్టర్ గొడవలు అతని కుటుంబాన్ని, జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయనే అంశాలు ‘రాయన్’ చిత్రంలో ఉంటాయని టాక్. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు ముంబై గ్యాంగ్స్టర్స్ మాఫియా నేపథ్యంలో సాగే ‘డీఎన్ఎస్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నారని తెలిసింది. నాగార్జున ఓ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్. కథ రీత్యా ధనుష్, నాగార్జున ఈ సినిమాలో గ్యాంగ్స్టర్స్ రోల్స్ చేస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పుస్కూరు రామ్మోహన్, సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ధారావి’ అనే టైటిల్ను పరిశీ లిస్తున్నారట మేకర్స్. ఈ సినిమా 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలతో పాటు గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తమిళంలో మరికొన్ని చిత్రాలు రానున్నాయి. -
గోవాను టార్గెట్ చేసిన ధనుష్, నాగార్జున
ధనుష్, నాగార్జున హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘డీఎన్ఎస్’(వర్కింగ్ టైటిల్) అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ముంబై మాఫియా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే తిరుపతి పరిసరప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణను, గోవాలో మరో షెడ్యూల్ను పూర్తి చేశారు మేకర్స్. ధనుష్, నాగార్జున పాల్గొనగా కీలక సన్నివేశాలను తీశారు. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ ఈ వారంలో హైదరాబాద్లోప్రారంభం కానుందని తెలిసింది. ధనుష్, నాగార్జున పాల్గొనే ఈ షెడ్యూల్లోనే హీరోయిన్ రష్మికా మందన్నా కూడా జాయిన్ అవుతారట. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
స్వీయ దర్శకత్వంలో మరో స్టార్ హీరో.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్!
ఇటీవలే కెప్టెన్ మిల్లర్తో సూపర్ కొట్టిన కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా ధనుశ్ మరో చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ధనుశ్-50 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ధనుశ్ కెరీర్లో 50వ సినిమాగా నిలవనుంది. తాజాగా రిలీజైన ఫస్ట్లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు రాయన్ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ఈ సినిమా కథను తానే రాయడంతోపాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు ధనుశ్. ఈ చిత్రంలో కెప్టెన్ మిల్లర్లో కీలక పాత్ర పోషించిన సందీప్ కిషన్ కూడా నటిస్తున్నారు. ఇదే కాకుండా టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు సినిమాలో ధనుష్ నటిస్తున్నారు. ఇది ఆయన కెరీర్లో 51వ చిత్రం. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. రష్మిక హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. #D50 is #Raayan 🔥 🎬 Written & Directed by @dhanushkraja 🎵 Music by @arrahman Releasing in Tamil | Telugu | Hindi@omdop @editor_prasanna @kalidas700 @sundeepkishan @PeterHeinOffl @jacki_art @kavya_sriram @kabilanchelliah @theSreyas @RIAZtheboss #D50FirstLook pic.twitter.com/vfemOIRKIX — Sun Pictures (@sunpictures) February 19, 2024 -
ఆ ఒక్క పాట సినిమాను చంపేసింది: ఐశ్వర్య రజనీకాంత్
హీరో ధనుష్ను ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ చేసిన పాట 'వై దిస్ కొలైవెరి..'. ధనుష్ రాసిన ఈ పాటకు అనిరుధ్ బాణీలు కట్టారు. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలిగా పరిచయం అయిన '3' చిత్రంలోనే పాటే ఇది! 2012లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న సామెత మాదిరి ఈ మూవీలో వై దిస్ కొలైవెరిడీ పాట విపరీతంగా పాపులర్ అయ్యింది. ఎంతగా అంటే స్వయంగా దేశ ప్రధాని అప్పట్లో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ను విందుకు ఆహ్వానించి అభినందించారు. సినిమాను చంపేసింది ఆ సమయంలో ఏ వీధిలో చూసినా వై దిస్ కొలైవెరి పాటే వినిపించేది. అయితే ఈ పాట 3 చిత్రాన్ని చంపేసిందని ఆ సినిమా దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆమె డైరెక్ట్ చేసిన కొత్త మూవీ లాల్ సలామ్. రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించింది. ఏఆర్.రెహ్మన్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ తన తొలి చిత్రం 3 గురించి ప్రస్తావించారు. పాట వల్లే సినిమా మరుగునడపింది జీవితంలో కొన్ని అనూహ్య సంఘటనలు జరగాలని ఉంటే వాటికి మనం సిద్ధపడాలన్నారు. తన జీవితంలో 3 చిత్రం విషయంలోనూ అలాగే జరిగిందన్నారు. అందులోని వై దిస్ కొలైవెరి సాంగ్ అనూహ్య విజయాన్ని సాధించిందన్నారు. అయితే అది చిత్రానికి బలం కావాల్సింది బలహీనంగా మారిందన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ పాట చిత్రాన్ని చంపేసిందన్నారు. ఇటీవల రీ రిలీజ్ అయినప్పుడు పలువురు తనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారన్నారు. చిత్ర నిర్మాణ సమయంలో గానీ, మొదటగా విడుదల అయినప్పుడు రాని అభినందనలు ఇప్పుడు రావడానికి కారణం వై దిస్ కొలైవెరి పాట చిత్రాన్ని మరుగున పడేయడమేనని ఐశ్వర్య పేర్కొన్నారు. చదవండి: శింబు సినిమాలో కమల్ హాసన్ గెస్ట్ రోల్? -
సెల్వతో పనిచేయడం ఇష్టమే.. మాజీ భర్త సినిమాపై సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు
ఉత్తరాది భామ సోనియా అగర్వాల్ గురించి సినీ వర్గాల్లో తెలియని వారుండరు. ఎందుకంటే అంత సంచలన నటి ఈ భామ. ధనుష్ సరసన కాదల్ కొండేన్, పుదుపేటఐఅట, రవికృష్ణకు జంటగా 7/జీ బృందావన్ కాలనీ వంటి విజయవంతమైన చిత్రాల్లో కథానాయికిగా నటించారు. ఈ మూడు చిత్రాలకు దర్శకుడు సెల్వరాఘవనే. ఆ సమయంలో సెల్వరాఘవన్, నటి సోనియా అగర్వాల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి దాంపత్య బంధం ఎక్కువ కాలం సాగలేదు. విభేదాలు కారణంగా విడిపోయారు. ఆ తరువాత ఎవరి వృత్తిని వారు కొనసాగిస్తున్నారు. అయితే ఆ తరువాత ఈ ఇద్దరిలో ఎవరికీ సరైన హిట్స్ లేకపోవడం గమనార్హం. కాగా ఇటీవల నటుడిగానూ అవతారం ఎత్తిన సెల్వరాఘవన్ తాజాగా ఆ వృత్తికి ఫుల్స్టాప్ పెట్టి మళ్లీ దర్శకత్వంపై దృష్టి పెట్టారు. తను ఆదిలో తెరకెక్కించి సంచలన విజయాన్ని కొట్టిన 7/జీ బృందావన్ కాలనీ చిత్రానికి సీక్వెల్ తీయనున్నారు. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. కాగా ఆయన ఇంతకు ముందు దర్శకత్వం వహించిన మరో సూపర్ హిట్ పుదుపేట్టై చిత్రానికి సీక్వెల్ చేస్తానని ప్రకటించారు. అదీ ఈ ఏడాదిలోనే మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా పుదుపేట్టై చిత్రంలో ధనుష్ సరసన నటి సోనియా అగర్వాల్, స్నేహా నటించారు. దీంతో పుదుపేట్టై– 2 చిత్రంలో మీరు నటిస్తారా? అన్న ప్రశ్నకు నటి సోనియా అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. సెల్వరాఘవన్ తో కలిసి పని చేయడానికి తనకెలాంటి సమస్య లేదన్నారు. నటన తన వృత్తి అని, పుదుపేట్టై– 2 చిత్రంలో నటించడం తనకు ఇష్టమేనన్నారు. అయితే ఆ చిత్రంలో నటించే విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. అసలు ఆ చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారో కూడా తెలియదని నటి సోనియా అగర్వాల్ పేర్కొన్నారు. -
ఓటీటీలో సంక్రాంతి సినిమా హవా.. ఒక్క రోజులోనే టాప్లో ట్రెండింగ్!
కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది. సంక్రాంతికి థియేటర్ల వద్ద పోటీ నెలకొనడంతో జనవరి 26న తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. టాలీవుడ్లోనూ ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 9 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ముందు నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న కెప్టెన్ మిల్లర్కు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. స్ట్రీమింగ్కు వచ్చిన రెండో రోజే టాప్లో ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్ హీరో వెంకటేశ్ నటించిన సైంధవ్ మూవీని వెనక్కి నెట్టిన కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ ప్లేస్కు దూసుకెళ్లింది. మొదటిస్థానంలో కెప్టెన్ మిల్లర్ ట్రెండ్ అవుతుండగా.. రెండోస్థానంలో సైంధవ్, మూడో ప్లేస్లో సల్మాన్ ఖాన్ టైగర్-3 కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించారు. భారీ పీరియాడికల్ కథగా తెరకెక్కించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందించారు.