Diwali celebrations
-
దీపావళి సంబరాల్లో ‘మాంసం, మద్యం’... స్టార్మర్ కార్యాలయం క్షమాపణలు
లండన్: దీపావళి సంబరాల్లో మాంసం, మద్యం చోటు చేసుకున్న ఉదంతంపై బ్రిటన్ ప్రధాని కార్యాలయం శుక్రవారం క్షమాపణలు తెలిపింది. దాన్ని అనుకోకుండా దొర్లిన తప్పిదంగా అభివర్ణించింది. ‘‘దీనిపై బ్రిటిష్ హిందూ సమాజం ఆందోళనలను అర్థం చేసుకోగలం. ఇకపై జరిగే సంబరాల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాం’’ అని హామీ ఇచ్చింది. ప్రధాని అధికారిక నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్లో అక్టోబర్ 29న దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాటిలో ప్రధాని ప్రధాని కియర్ స్టార్మర్ పాల్గొనడమే గాక దీపాలు వెలిగించారు. అయితే ఆ వేడుకల్లో మాంసం, మద్యం చోటుచేసుకోవడంపై హిందూ సమాజం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. డౌనింగ్ స్ట్రీట్ దీపావళి సంబరాలు హిందూ సమాజం విశ్వాసాలకు అనుగుణంగా జరగలేదంటూ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన బ్రిటిష్ ఇండియన్ ఎంపీ శివానీ రాజా గురువారం స్టార్మర్కు లేఖ కూడా రాశారు. ఇకముందు వాటినెలా జరపాలో వివరించేందుకు సంసిద్ధత వెలిబుచ్చారు. -
న్యూజెర్సీలో దీపావళి వేడుకలు 2024
-
గాటా దీపావళి వేడుకలు.. పోతిరెడ్డి నాగార్జున రెడ్డికి సన్మానం
-
మోత మోగిన కాలుష్యం
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా ఈ ఏడాది వాయు కాలుష్యంకంటే శబ్దకాలుష్యం అధికంగా నమోదైంది. ప్రధానంగా హైదరాబాద్ మహానగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, మరికొన్ని చోట్ల శబ్ద స్థాయిలు గతం కంటే అధికంగా నమోదయ్యాయి. దీపావళి రోజు నమోదైన వాయు, శబ్ద నాణ్యతలపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) నివేదిక విడుదల చేసింది. గత ఏడాది దీపావళి పండుగ రోజుతో పోల్చితే ఈ ఏడాది శబ్ద కాలుష్య స్థాయిలు ఎక్కువ రికార్డయ్యాయి.ముఖ్యంగా హైదరాబాద్లో పండుగ రోజు రాత్రి పగలు అనే తేడా లేకుండా పటాకులు కాల్చటంతో కమర్షియల్, నివాస, సెన్సిటివ్ (ఆసుపత్రులు, స్కూళ్లు, జూ పార్కు ఇతర సున్నిత ప్రాంతాలు) ప్రదేశాల్లో శబ్ద స్థాయిలు (డెసిబుల్స్) అధికంగా నమోదయ్యాయి. ఐతే పారిశ్రామిక ప్రాంతాల్లో మాత్రమే ప్రామాణిక స్థాయిల కంటే తక్కువగా శబ్ద స్థాయిలు నమోదయ్యాయి. మిగతా మూడు కేటగిరీల్లో మాత్రం శబ్ద కాలుష్యం అధికంగా రికార్డ్ కావడం గమనార్హం.వాయునాణ్యత కాస్త మెరుగు..గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది దీపావళి రోజు వాయు నాణ్యత కాస్త మెరుగ్గా నమోదైంది. ముఖ్యంగా పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 (పీఎం 2.5–అతి సూక్ష్మ ధూళి కణాలు) ఈ ఏడాది తగ్గింది. ఇది గత ఏడాది దీపావళి రోజు 119 పాయింట్లు నమోదుకాగా, ఈ ఏడాది 84 పాయింట్లు రికార్డయ్యింది. పీఎం 10 (సూక్ష్మ ధూళికణాలు) గత ఏడాది 188 పాయింట్లు ఉండగా, ఈ ఏడాది 184 పాయింట్లుగా రికార్డయింది. పీఎం 2.5 వాయు కాలుష్య స్థాయిలు గత ఏడాది మామూలు రోజుల్లో 35 పాయింట్లుగా ఉండగా, ఈ ఏడాది 44 పాయింట్లుగా ఉంది. సాథారణ రోజుల్లో గత ఏడాది 85 పాయింట్లుగా ఉన్న పీఎం 10 సాంద్రత, ఈ ఏడాది 111 పాయింట్లుగా నమోదైంది. ఇతర కాలుష్యాలూ ఎక్కువే..ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ వంటి వాయు కాలుష్య కారకం గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అధికంగా రికార్డయింది. సల్ఫర్ డై ఆక్సైడ్ కాలుష్యకారకం కూడా గత ఏడాది కంటే ఈ ఏడాది కొంత ఎక్కువగానే నమోదైంది. గత ఏడాది దీపావళి సందర్భంగా నైట్రోజన్ ఆక్సైడ్ 30.6 పాయింట్లు నమోదుకాగా.. ఈ ఏడాది 40 పాయింట్లుగా నమోదైంది. గత ఏడాది దీపావళి సమయంలో 12 పాయింట్లు ఉన్న సల్ఫర్ డై ఆక్సైడ్, ఈ ఏడాది 14 పాయింట్లుగా రికార్డయింది. 2023లో మామూలు రోజుల్లో 6.2 పాయింట్లుగా ఉన్న సల్ఫర్ డై ఆక్సైడ్, ఈ ఏడాది సాధారణ రోజుల్లో 12 పాయింట్లుగా అంటే రెండింతలుగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.అదేవిధంగా నైట్రోజన్ ఆక్సైడ్ గత ఏడాది మామూలు రోజుల్లో 23.4 పాయింట్లు ఉండగా, ఈ ఏడాది 32.6 పాయింట్లుగా నమోదైంది. దీనిని బట్టి దీపావళి నాడే కాకుండా మామూలు రోజుల్లో కూడా వాయు కాలుష్యం పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్తోపాటు వివిధ ప్రదేశాల్లో ధూళి కణాలు, కలుషిత వాయువులు, శబ్ద స్థాయిలను టీపీసీబీ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తోంది. దీపావళి సందర్భంగా పర్యావరణ పరిస్థితి పర్యవేక్షణ అక్టోబర్ 24వ తేదీ నుంచి నవంబర్ 7 దాకా కొనసాగిస్తున్నారు. -
బాంబుల బామ్మ
-
సమంత దీపావళి సెలబ్రేషన్స్.. (ఫోటోలు)
-
దీపావళి వేడుకల్లో టీమిండియా స్టార్ క్రికెటర్లు (ఫోటోలు)
-
దీపావళి వేడుకల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు... రష్మిక, విజయ్ దేవరకొండ సహా! (ఫొటోలు)
-
దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. కచ్ బోర్డర్లో జవాన్లతో కలిసి ప్రధాని మోదీ వేడుకలు
-
దీపావళి వేడుకల్లో గాయాలు.. సరోజినీదేవి ఆసుపత్రికి బాధితులు క్యూ..
సాక్షి, హైదరాబాద్: దీపావళి వేడుకల్లో పలు చోట్ల అపశృతులు చోటుచేసుకున్నాయి. బాణసంచా కాలుస్తూ పలువురు గాయపడ్డారు. దీంతో బాధితులంతా సరోజినీదేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు. ఇప్పటివరకు 40 మంది బాధితులు గాయాలతో ఆస్పత్రికి వచ్చారు. కాగా, గాయాలపాలైన వారికి చికిత్స కోసం సరోజినీదేవి కంటి ఆసుపత్రి ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. వంద బెడ్లు వైద్యాధికారులు ఏర్పాటు చేశారు. 9 మందికి తీవ్ర గాయాలయినట్లు వైద్యులు తెలిపారు. ఈసారి ప్రజల్లో అవగాహన పెరిగిందని.. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కేసులు తగ్గుతాయని ఆశిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు అన్నారు.తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. టపాసుల దుకాణాలతో మార్కెట్లు, కిటకిటలాడాయి. చిన్నాపెద్దా పెద్ద బాణసంచా పేలుస్తూ ఆనందంగా గడిపారు. కాగా, దీపావళి సందర్భంగా రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా పేల్చడానికి అనుమతినిస్తూ సైబరాబాద్ పోలీసులు ప్రకటన చేశారు.అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారం.. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరించారు. -
స్టార్మర్ దీపావళి వేడుకలు
లండన్: బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి తన అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ ముందు ఆయన స్వంగా దీపాలు వెలిగించారు. అనంతరం నుదుట కుంకుమ దిద్దుకుని హిందూ సంప్రదాయ ప్రార్థనల్లో పాల్గొన్నారు. అరుణిమా కుమార్ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాన్ని ఆస్వాదించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని చాలారకాల చీకట్లు కమ్ముకున్నాయని ఈ సందర్భంగా స్టార్మర్ ఆవేదన వెలిబుచ్చారు. వాటన్నింటినీ పారదోలేలా ఈ వెలుగుల పండుగ మనందరికీ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. దీపావళి భిన్న వర్గాల వారిని ఒక్కటి చేసే పండుగ అన్నారు. భారతీయులపై ప్రశంసల జల్లుబ్రిటిష్ ఇండియన్ సమాజం కష్టించి పని చేస్తుందని, తమ విలువలు, సేవా భావంతో సమాజంలో ఎనలేని గౌరవం సంపాదించుకుందని స్టార్మర్ కొనియాడారు. వారి భాగస్వామ్యం బ్రిటిష్ సమాజాన్ని సుసంపన్నం చేసిందన్నారు. ‘‘ప్రభుత్వ పనితీరులో వారెంతో కీలకం. నా అధికార నివాసం తలుపులు వారికోసం ఎప్పటికీ తెరిచే ఉంటాయి’’ అన్నారు. ఉప ప్రదాని ఏంజెలా రేయ్నర్, మంత్రులు సీమా మల్హోత్రా తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. -
Video: బాలీవుడ్ పాటకు యూఎస్ దౌత్యవేత్త హుషారైన స్టెప్పులు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో దీపావళి వేడుకలు బధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి మరోసారి తన నృత్య ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. వేడుకల్లో భాగంగా గార్సెట్టి స్టేజ్పై బాలీవుడ్ హిట్ పాటకు ఎంతో ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. సంప్రదాయ దుస్తులైన కుర్తా పైజామా ధరించి విక్కీ కౌశల్ నటించిన బ్యాడ్ న్యూస్ సినిమాలోని ‘తౌబా తౌబా’ పాటకు కాలు కదిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా గార్సెట్టి ఇలా తన డ్యాన్స్ స్కిల్స్తో ఆకట్టుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో కూడా ఆయన చాలా సందర్భాల్లో తన నృత్య ప్రదర్శనతో అందరిని మంత్రముగ్దులను చేశారు. #WATCH | US Ambassador to India, Eric Garcetti dances to the tune of the popular Hindi song 'Tauba, Tauba' during Diwali celebrations at the embassy in Delhi(Video source: US Embassy) pic.twitter.com/MLdLd8IDrH— ANI (@ANI) October 30, 2024 -
గతం మర్చిపోయిన రాజేష్
-
ఘనంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్లో దీపావళి వేడుకలు (ఫొటోలు)
-
సంప్రదాయ స్వీట్స్ తో ప్రీ దీపావళి వేడుకలు నిర్వహించిన ఓ విద్యాసంస్థ
-
దీపావళి షాపింగ్ చేద్దాం పదండి! (ఫొటోలు)
-
జంటనగరాల్లో మొదలైన దీపావళి సందడి (ఫోటోలు)
-
వంట నూనె ధరలకు రెక్కలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు మొదలవుతున్న వేళ వంటనూనెల ధరలు చుక్కలనంటుతున్నాయి. గడిచిన నెల రోజులుగా క్రమంగా పెరుగుతూ సామాన్యులకు అందనంతగా పెరిగిపోతున్నాయి. నెల రోజుల్లోనే వంట నూనెల ధరలు 23 నుంచి 37 శాతం వరకు పెరగడంతో పండగ వేళ సామాన్యులకు ఇక్కట్లు తప్పేలా లేవు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే గత నెలలో రూ.100 ఉన్న పామాయిల్ ధర రూ.137 (37 శాతం) పెరగ్గా, సోయాబీన్ నూనె రూ.120 నుంచి రూ.148 (23 శాతం), సన్ఫ్లవర్ రూ.120 నుంచి రూ.149 (23.5 శాతం), ఆవ నూనె రూ.140 నుంచి రూ.181 (29శాతం), వేరుశనగ నూనె రూ.180 నుంచి రూ.187 (4 శాతం) మేర పెరిగాయి. దేశీయంగా నూనెగింజల సాగు పెద్దగా లేకపోవడంతో దేశం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్, బ్రెజిల్, ఉక్రెయిన్, రష్యా, అర్జెంటీనా నుంచి సన్ఫ్లవర్ నూనెను దిగుమతి చేసుకుంటోంది. మొత్తంగా 58 శాతం ఇతర దేశాల నుంచే భారత్కు వస్తోంది. నూనెల వినియోగంలో భారత్ రెండో అతిపెద్ద వినియోగదారుగా ఉంది. దేశీయంగా నూనె పంటల సాగును ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గత నెలలో ముడి సోయాబీన్, పామాయిల్, సన్ఫ్లవర్ నూనెల దిగుమతి సుంకాలను 5.5 శాతం నుంచి 27.5 శాతానికి పెంచింది. శుధ్ది చేయబడిన ఆవ నూనెల దిగుమతి సుంకాన్ని 13.7 శాతం నుంచి 35.7 శాతానికి పెంచింది. సెపె్టంబర్ 14 నుంచి పెరిగిన సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా హోల్సేల్ వ్యాపారులు ధరలు పెంచి అమ్మకాలు చేపట్టారు. దీనితో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు నూనెగింజల సాగులో ముందున్న మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పంట ఉత్పత్తి తగ్గింది. ఈ ప్రభావం సైతం ధరల పెరుగుదలకు కారణమైంది. పెరిగిన ధరల ప్రభావం రెస్టారెంట్లు, హోటళ్లతో పాటు దీపావళి సందర్భంగా చేసుకునే తీపి పదార్థలపై గణనీయంగా పడుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో స్వీట్ల ధరలను పెంచి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. కొత్త పంట మార్కెట్లోకి వచ్చే వరకు ధరలు దిగిరావని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. -
మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
కెనడా తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి సంబరాలు
కెనడా టొరంటో డుర్హం తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. ఈ వేడుకల్లో చిన్నా,పెద్దా అందరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆడిపాడారు. విత్బ్య్ నగర ఎంపీపీ లాన్ కాయ్ ,డిప్యూటీ మేయర్ మలీహా షాహిద్ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈవెంట్ను ఘనంగా నిర్వహించిన డీటీసీ కార్య సభ్యులను, వాలంటీర్లను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంటర్ ప్రూనేర్ అఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన అవంత్ సోలుషన్స్ అధినేత శ్రీనివాస్ వర్మ అట్లూరిని సత్కరించారు. డుర్హం తెలుగు కెనడా క్లబ్ ప్రెసిడెంట్ నర్సింహా రెడ్డి మాట్లాడుతూ..ఖండాంతరాలు దాటినా మన తెలుగు సంస్కృతిని ఇనుమడింప చేసేలా దీపావలి వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగు కుటుంబాలకు ప్రత్యక అభినందనలు తెలిపారు. -
హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు
ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో దీపావళి-2023 వేడుకలను ఘనంగా జరిగాయి. స్థానిక ఇండియా క్లబ్లో నిర్వహించిన ఈ వేడుకల్లో సమాఖ్యలో సభ్యులుగా ఉన్న కుటుంబాలన్నీ పాల్గొన్నాయి. అందర్నీ ఆహ్వానిస్తూ వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి ప్రారంభోపన్యాసం చేశారు. ప్రవాసులంతా కలిసి వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రవాసులంతా ఒక్కచోట చేరడం వల్ల ఒకరికొకరు తోడు ఉన్నారన్న భావన కలుగుతుందన్నారు. పిల్లలు, పెద్దలు ఒక కళా వేదిక కల్పించామని, అందుకు అందరూ సమిష్టిగా కృష్టి చేశారని తెలిపారు. తమ కార్యవర్గసభ్యులు రాజశేఖర్ మన్నె, రమాదేవి సారంగ, మాధురి అరవపల్లి, హరీన్ తుమ్మల, రమేశ్ రేనిగుంట్ల తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం సంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు. చిన్న ఆదిత్య సార్ల శ్లోక పద్యాలతో వినాయకుడిని స్తుతిస్తూ కార్యక్రమం మొదలు పెట్టారు. ఆ తరువాత ప్రేక్షకులని పరవశింప చేసిన అద్వైత ఈయుణ్ణి తబలా ప్రదర్శన, మన కళళ ప్రాముఖ్యతను చాటి చెప్పాయి.చిన్నారులు గుణ ఘట్టి మరియు భేవిన్ ఘట్టి మదురమైన లలితా సంగీతం వినిపించారు. అందరినీ ఆహ్లాద పరిచిన చిట్టి పొట్టి అడుగుల బుజ్జాయిలు జాహ్నవి బెల్లంకొండ, ధన్య సత్తినేని, అమృత ధర్మపురి, ముద్దోచ్చేలా తమ నృత్యాలతో అందరిని ఆశ్చర్యచకితుల్ని చేసారు. ఆ తరువాత, హాంకాంగ్ తెలుగు భామల హుషారైన డాన్స్ స్టెప్పులతో దీపావళి పటాసుల వలె ప్రదర్శనలిచ్చారు. అందరూ సరదాగా ఖబుర్లు చెబుకుంటూ, ముచ్చట్లు వేసుకుంటూ నోరు ఊరించే భోజనం చేసిన తరువాత, నృత్య - గాన ప్రద్శనలతో అందరినీ ఆనంద పరిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగంది. సాంస్కృతిక కార్యక్రమాని చక్కటి చిక్కటి అచ్చ తెలుగు లో భామలు రాధిక సంబతూర్ మరియు రాధిక నూతలపాటి చక్కగా నిర్వహించి అందరి మన్ననలు పొందారు. హాంగ్ కాంగ్ లో మూడు దశాబ్దాలకు పైగా నివసించిన వైద్య నిపుణులు డాక్టర్ మోహన్ భాస్కరభట్ల గారు, సతీమణి సూర్య గారు ఆకస్మిక సందర్శన అందరిని ఆశ్చర్యపరుస్తూ ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ తరువాత అందరూ ఎంతో ఆనందంగా కలిసి గ్రూప్ ఫోటోలు,సెల్ఫీలు తీసుకొని వచ్చిన ప్రతి కుటుంబం తమ బహుమతులు ఉత్సాహంగా అందుకున్నారు. చివరిగా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించిన - పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అందరు మన దేశ జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ముగించారు. -
న్యూజెర్సీ, సాయిదత్త పీఠంలో దీపావళి వేడుకలు
-
న్యూజెర్సీలోని ఎడిసన్లో ఘనంగా దీపావళి వేడుకలు
భారతీయ సంస్కృతిని అమెరికాలో కూడా పరిఢవిల్లేలా నిరంతరం కృషి చేస్తున్న శ్రీ శివ విష్ణు సాయిదత్త పీఠం.. దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించింది. న్యూజెర్సీలోని ఎడిసన్లో నిర్వహించిన దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఆలయ అర్చకులు అత్యంత వైడుకగా, సంప్రదాయబద్ధంగా దీపావళి వేడుకలను నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.దీపావళి సందర్భంగా బాబాకు ప్రత్యేక హారతులను నివేదించారు. ధనలక్ష్మీ అమ్మవారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయంలో దీపాలు, విద్యుత్ కాంతులు, రంగోలీలతో సుందరంగా అలంకరించారు. అనంతరం చిన్నా పెద్ద తేడాలేకుండా అందరూ కలిసి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రఘుశర్మ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా సాయి దత్త పీఠంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ వేడుకలకు చక్కటి స్పందన లభించిందని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయం చేసిన భక్తులకు, వాలంటీర్లకు, కమిటీ సభ్యులకు, దాతలకు అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. ఇక ఈ వేడుకలకు గ్రాండ్గా జరగటం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. -
Anchor Suma Diwali Celebrations: యాంకర్ సుమ ఇంట్లో దీపావళి వేడుక (ఫొటోలు)
-
VarunLav Diwali Bash: పెళ్లయ్యాక వచ్చిన తొలి దీపావళి.. జంటగా సెలబ్రేట్ చేసుకున్న వరుణ్-లావణ్య (ఫోటోలు)
-
Namrata Shirodkar Photos: మహేశ్బాబు భార్య నమ్రత దీపావళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇంట దీపావళి వేడుకలు (ఫోటోలు)
-
Anasuya Bharadwaj: అనసూయ దీపావళి సంబరాలు (ఫోటోలు)
-
దీపావళి పండుగ కారణంగా ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం
-
టపాసుల కాలుస్తుండగా పలువురికి తీవ్రగాయాలు
-
దీపావళి వేడుకల్లో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
-
తానేటి వనిత ఇంట్లో దీపావళి సంబరాలు
-
మంత్రి రోజా ఇంట్లో దీపావళి సంబరాలు
-
దీపావళి కాంతుల వేడుకల్లో సినీ తారలు (ఫొటోలు)
-
దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. హిమాచల్ సైనికులతో ప్రధాని దీపావళి వేడుకలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Viral Video: టీమిండియా దీపావళి సంబురాలు అదుర్స్
వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో (8) దూసుకుపోతున్న టీమిండియా.. నెదర్లాండ్స్తో మ్యాచ్కు ముందు దీపావళి సంబురాల్లో పాల్గొంది. బెంగళూరులోని విలాసవంతమైన ఐటీసీ గార్డెనియా హోటల్లో జరిగిన ఈ వేడుకల్లో భారత క్రికెట్ జట్టు సభ్యులందరూ పాల్గొన్నారు. ఆహ్లాదభరితమైన వాతావరణంలో సాగిన ఈ వేడుకల్లో టీమిండియా ఆటగాళ్లు కుటుంబ సభ్యుల్లా మమేకమై ఎంజాయ్ చేశారు. We are #TeamIndia 🇮🇳 and we wish you and your loved ones a very Happy Diwali 🪔 pic.twitter.com/5oreVRDLAX — BCCI (@BCCI) November 12, 2023 ఈ వేడుకల్లో విరాట్-అనుష్క దంపతులు స్పెషల్ అట్రక్షన్గా నిలిచారు. రోహిత్, కేల్ రాహుల్, జడేజా, శార్దూల్, సూర్యకుమార్ సతీసమేతంగా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకల్లో శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ చిన్న పిల్లాలలా సందడి చేశారు. టీమిండియా దీపావళి సంబురాలకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియోలో టీమిండియా ఆటగాళ్లను చూసేందుకు రెండు కళ్లు చాలవని నెటిజన్లు అంటున్నారు. ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (94 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో పాటు రోహిత్ శర్మ (61), శుభ్మన్ గిల్ (51), విరాట్ కోహ్లి (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. -
Diwali 2023: వెలుగుల ఉషస్సు
‘‘సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం!’’ మన ఇంట్లో వెలిగించింది ఒక్క దీపమైనా ముల్లోకాల చీకట్లను పోగొట్టాలన్నది భారతీయుల ఆశంస. ప్రపంచంలోని అన్ని దేశాలవారు, అన్ని జాతుల వారు ఏదో ఒక సందర్భంలో దీపాల పండగ చేసుకుంటారు. చీకటి అంటే ఎవరికీ ఇష్టం ఉండదు కదా! ఎవరు ఏ కారణంగా జరుపుకున్నా మనస్సులలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరచటానికి సంకేతంగా దీపాలను వెలిగిస్తారు. లోపల ఉన్న ఆనందమనే వెలుగుని బహిర్గతం చేసి, పరిసరాలని వెలిగేలా చేయటం దీపం వెలిగించటంలోని ఉద్దేశం. చీకటి, వెలుగు అనే మాటలని కాంతి అనే సందర్భంలోనే కాక ఎన్నింటికో ఉపయోగిస్తుంటాము. లోకంలో కావలసిన వాటిని కోరుకోదగిన వాటిని వెలుగుగాను, పనికి రానివాటిని, హాని కలిగించే వాటిని చీకటిగాను చెప్పు తుంటాము. అవిద్య, అజ్ఞానం, అనారోగ్యం, దుఖం, బాధ, చికాకు, దరిద్రం, అపకీర్తి, అవమానం, పాపం మొదలైన మనిషి నాశనానికి, నిరాశా నిస్పృహలకి హేతువులైనవన్నీ చీకటిగాను, జ్ఞానం, ఆరోగ్యం, సంతోషం, ఆనందం, ఆహ్లాదం, కీర్తి, పుణ్యం మొదలైన మానవునికి కోరుకోదగిన, ఉపయోగపడే వన్ని వెలుగుగాను సంకేతించటం జరిగింది. అందువలననే అన్నివిధాలైన చీకట్లను పోగొట్టే వెలుగు అంటే ఇష్టపడే జాతి భారతజాతి. కనుకనే దీపాన్ని ఆరాధిస్తాము. పూజిస్తాము. ‘‘దీపం జ్యోతి పరమ్ బ్రహ్మ దీపం సర్వ తమోపహమ్ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే!’’ అని దీపాన్ని ్రపార్థిస్తాము. ఇది నిత్యకృత్యం. వరుసలుగా వందలాది, వేలాది దీపాలు వెలిగించటానికి ఎంతటి సంతోషం ఉ΄÷్పంగి ఉండాలో కదా! అటువంటి సందర్భం ద్వాపరయుగం చివర లో వచ్చింది. దానికి బీజం కృతయుగంలోనే పడి త్రేతాయుగంలో మొలకెత్తింది. యజ్ఞవరాహమూర్తిగా తనను ఉద్ధరించిన మహావిష్ణువుని చూసి వలచింది భూదేవి. తనకు కుమారుని ప్రసాదించమని కోరింది. ఆ సమయంలో గర్భధారణ జరిగితే అసుర లక్షణాలతో... లోకకంటకుడు అయిన కుమారుడు జన్మిస్తాడని అన్నాడు విష్ణువు. భూదేవి తమకంతో బలవంతం చేసింది. తప్పలేదు. లోకకంటకుడు భూదేవి గర్భంలో ఉన్నాడని తెలిసిన దేవతలు ఆ బాలుడు గర్భంలో నుండి బయటకు రాకుండా చూశారు. భూదేవి విష్ణువుని వేడుకుంది. త్రేతాయుగం చివరలో కుమారుడు ఉదయిస్తాడని అభయం ఇచ్చాడు. ఆ బాలుడే నరకుడు. అతడికి పదహారు సంవత్సరాలు వచ్చిన తరువాత బ్రహ్మపుత్రానది పరీవాహక ్రపాంతంలో ్రపాగ్జ్యోతిషం రాజధానిగా కామరూపదేశానికి రాజుని చేస్తూ, ధర్మం తప్పవద్దని, గోబ్రాహ్మణులకు హాని తలపెట్టవద్దని, అలా చేస్తే కీడు వాటిల్లుతుందని హెచ్చరించాడు. ఆ మాట ననుసరించి చాలా కాలం భుజబలంతో తనకెవ్వరు ఎదురు లేని విధంగా ధర్మబద్ధంగానే పరిపాలించాడు. కాని, ద్వాపరయుగం చివరలో అతడిలోని అసురలక్షణాలు బహిర్గత మయ్యాయి. వేదధర్మానికి దూరమై, తాంత్రికసాధన సత్వర ఫలవంతమని అనుసరించటం మొదలుపెట్టాడు. దానికోసం కామాఖ్యాదేవికి బలి ఇవ్వటానికి ఎంతోమంది రాజకుమారులను, పదునారు వేలమంది రాజకుమార్తెలను చెరపట్టి ఉంచాడు. అదితి కుండలాలను, వరుణుని ఛత్రాన్ని హరించాడు. దేవతలకు నిలువ నీడ లేకుండా చేశాడు. మరెన్నో దురంతాలు చేయ సాగాడు. ఇంద్రుడి అభ్యర్థన మేరకు శ్రీ కృష్ణుడు నరకునిపై యుద్ధానికి వెడుతుంటే భూదేవి అవతారమైన సత్యభామ తానూ వెంట వస్తానని ముచ్చట పడింది. అక్కడ కృష్ణుడు మూర్ఛపోతే అతడికి సేదతీర్చుతూనే యుద్ధంలో నరకుని నిలువరించింది. సత్యభామ ఉపచారాలతో తేరుకున్న కృష్ణుడు చక్రంతో నరకుని తెగటార్చాడు. అది ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి. సత్యభామ కోరిక మేరకు ఆ రోజుని నరకుడి పేరుతో నరక చతుర్దశి అని పిలవటం జరిగింది. ఆ మరునాడు, అంటే, అమావాస్య నాడు ప్రజలందరు దీపాలు వెలిగించుకొని సంబరాలు చేసుకున్నారు. ఏదైనా శుభసంఘటన జరిగినప్పుడు కాని, ఎవరైనా మహానుభావులు పుట్టినప్పుడు కాని పండుగలు, వేడుకలు, సంబరాలు చేసుకుంటారు. కాని, ఈ సందర్భంలో ఒకరు చనిపోతే అతడి పేరు మీద చేసుకోవటం జరుగుతోంది. అతడి చావు ఎందు కంతగా సంతోష ప్రదమయింది? నరకుడు భూదేవి పుత్రుడు. భూమి వసుంధర. అన్ని రకాలైన ఓషధులు, ఖనిజాలు ఇచ్చేది భూదేవియే. భూపుత్రుడైన నరకునికి వాటన్నిటి మీద వారసత్వపు అధికారం ఉంది. కాని అతడు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. సంపదలతో పాటు వెలుగుని కూడా ఎవరికీ అందకుండా తానే స్వంతం చేసుకున్నాడు. ్రపాగ్జ్యోతిషమంటే ముందుగా వెలుగు ప్రసరించే ్రపాంతం. భారతదేశంలో మొదటి సూర్యకిరణం భూమిని సోకేది అక్కడే కదా! ముందుగా తనకి అందిన వెలుగుని ఇతరులకి చేరకుండా అడ్డుపడేవాడట! నరకుని భయానికి పగటిపూట బయటకు రావటానికి భయం. వద్దామన్నా వెలుగు లేదు. రాత్రిపూట దీపం వెలిగిస్తే తమ ఉనికి తెలుస్తుందనే భయం. మొత్తానికి చీకట్లో, భయమనే చీకట్లో మగ్గారు. భయ కారణం పోగానే ఇన్నాళ్ళ దీపాలు, కరువుతీరా వెలిగించుకొని పండుగలు, వేడుకలు, సంబరాలు చేసుకున్నారు. ఆ శుభ సంఘటనని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ కృష్ణ అమావాస్యనాడు దీపాలు వెలిగించటం సంప్రదాయం అయింది. ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఆవిర్భవించి, విష్ణువుని వివాహ మాడింది. దానితో దేవతలకు పోయిన స్వర్గలక్ష్మి లభించింది. కనుక దేవతలు కూడా దీపావళిని ఆనందంగా జరుపుకుంటారు. మనలోనూ, కుటుంబంలోనూ, సమాజంలోనూ, దేశంలోనూ, భూమండలం అంతా కప్పిన అన్నివిధాలైన అంధకారాలు పటాపంచాలు అయ్యే విధంగా దీపాలని వెలిగించి దీపావళిని దివ్య దీపావళిగా ఆనందోత్సాలతో జరుపుకుందాం. వెలుగులని పంచుదాం. నరకుని సంహరించినదెవరు? స్వంత కొడుకునైనా దుష్టుడైతే సంహరించటానికి అంగీకరించే, సహకరించే ఉత్తమ మాతృ హృదయానికి సంకేతం సత్యభామ. సౌందర్యానికి, స్వాభిమానానికి, మితిమీరిన కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమకి, పరాక్రమానికి పరాకాష్ఠగా మాత్రమే సత్యభామ ప్రసిద్ధం. కాని, మూర్తీభవించిన మాతృత్వం కూడా. ఒక్క దుష్టుడైన కుమారుడు లేకపోతే కోటానుకోట్ల బిడ్డలకి మేలు కలుగుతుంది అంటే అతడిని శిక్షించటానికి అంగీకరించేది విశ్వమాతృ హృదయం. ఆ శిక్ష అతడు మరిన్ని దుష్కృత్యాలు చేసి, మరింత పాపం మూట కట్టుకోకుండా కాపాడుతుంది. ఇది బిడ్డపై ఉన్న ప్రేమ కాదా! బిడ్డ సంహారాన్ని ప్రత్యక్షంగా చూడటమే కాదు, ్రపోత్సహించి, సహాయం చేసిన కారణంగా కాబోలు, నరకాసురుణ్ణి సత్యభామయే సంహరించింది అనే అపోహ ఉన్నది. లక్ష్మీపూజ ఎందుకు? దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజించటం సంప్రదాయం. ఆనాడు లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఆవిర్భవించి, నారాయణుణ్ణి చేపట్టింది. వ్యాపారస్తులు లక్ష్మీదేవిని పూజించి ఈ రోజే కొత్త లెక్కల పుస్తకాలు మొదలుపెడతారు. లక్ష్మీదేవి ఆ నాడు సంధ్యాసమయం తరువాత తన వాహనమైన గుడ్లగూబని అధిరోహించి విహారానికి బయలుదేరి, తన స్వరూపాలైన దీపాలు ఉన్న ఇంట ప్రవేశిస్తుంది. కనుక లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ఎన్నో దీపాలు వెలిగిస్తారు. తరువాత బాణసంచా పేలుస్తారు. దీపాలు వరుసగా వెలిగిస్తారు కనుక ఈ పండగను దీపావళి అంటారు. జ్ఞాన జ్యోతులు అన్ని సంప్రదాయాల వారు దీపావళి జరుపుకోవటానికి వారి కారణాలు వారికి ఉన్నాయి. ఎవరు ఏ కారణంగా జరుపుకున్నా మనస్సులలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరచటానికి సంకేతంగా దీపాలను వెలిగిస్తారు. లోపల ఉన్న ఆనందమనే వెలుగుని బహిర్గతం చేసి, పరిసరాలని అంతా వెలిగేట్టు చేయటం దీపం వెలిగించటంలోని ప్రధాన ఉద్దేశం. ముందురోజు నరకచతుర్దశి నాడు తెల్లవారుజామున చంద్రుడు ఉండగా నువ్వులనూనెతో అభ్యంగన స్నానం చేస్తారు. పెద్దలు యముడికి తర్పణాలు ఇస్తారు. పిండివంటలు, కొత్తబట్టలతో ఆనందంగా గడుపుతారు. మరునాడు దీపావళి. అమావాస్య పితృతిథి. పైగా దక్షిణాయనం. కనుక మధ్యాహ్న సమయంలో పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. – డా. ఎన్.అనంతలక్ష్మి -
బ్రేక్ఫాస్ట్ మానేస్తున్నారా?బీపీ నుంచి హార్ట్ఎటాక్ వరకు..
ఇవాళ ధనత్రయోదశి. దీనినే ధన్ తేరస్ అని కూడా అంటారు. ఈ పర్వదినాన సాధారణంగా అందరికీ బంగారం, వెండి, గృహోపకరణాలు, వస్తు వాహనాల వంటి వాటి మీదికే దృష్టి మళ్లుతుంది. ఆరోగ్య ప్రదాత అయిన ధన్వంతరి జయంతి కూడా ఇదే రోజు అని గుర్తు రాదు. అయితే ఆరోగ్యం కూడా ధనమే కాబట్టి ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు ఏం చేయాలో తెలుసుకుని అందుకు తగినట్లు నడుచుకుంటే ఆరోగ్య ధనం, ఆరోగ్య మహాభాగ్యం సమకూరుతుంది. ధన త్రయోదశి సందర్భంగా ఆరోగ్య సంపదను ఏవిధంగా పెంపొందించుకోవాలో చూద్దాం... సంపూర్ణ ఆరోగ్యానికి ఆహార విహారాలు ఎంత అవసరమో, నిత్యం నడక, వ్యాయామం, యోగా కూడా అంతే అవసరం. ప్రధానంగా ఇవి అనేక రుగ్మతలకు దివ్య ఔషధాలు. అజీర్తి నుంచి ఆర్థరైటిస్ వరకు.. బీపీ నుంచి హార్ట్ ఎటాక్ వరకు, మధుమేహం నుంచి మానసిక సమస్య వరకు ఏదైనా నయం కావాలంటే రోజూ వ్యాయామం, యోగా చేస్తుండాలి. సమయానికి తగు... మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఎంత అవసరమో ఆ ఆహారాన్ని తగిన సమయానికి తీసుకోవడం కూడా అంతే అవసరం. వేళ తప్పి భోజనం చేస్తే అది మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సరైన సమయాలకు భోజనం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి రోజూ ఉదయాన్నే టిఫిన్ చేయడం వల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. కొందరికి అలా బ్రేక్ ఫాస్ట్ చేయడం అలవాటు ఉండదు. అలాంటి వారు అల్పాహారంగా నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్ష, వాల్నట్స్, మొలకెత్తిన గింజలు, అవిసెలు, తాజాపండ్లు, కూరగాయల ముక్కలు లాంటివి అయినా తప్పనిసరిగా తీసుకోవాలి. లంచ్గా ఇవి... మధ్యాహ్నపు భోజనంగా సగం కంచంలో తాజా కూరగాయలు, మిగతా సగంలో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. రక్తంలో చక్కెర నిల్వల్ని అదుపులో ఉంచుకోవడానికి, లో గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు లాంటి చిరు ధాన్యాన్ని ప్రయత్నించవచ్చు. ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత మేరకు తగ్గించాలి. ఎందుకంటే, మనం వాడే ప్లాస్టిక్ వస్తువుల నుండి, రోజుకి కొన్ని లక్షల సూక్ష్మరేణువులు విడుదలవుతాయి. వాటిలో ఉండే రసాయనం హార్మోన్ల సమతౌల్యాన్ని దెబ్బ తీస్తుంది. మానసిక దృఢత్వం మానసిక ఆరోగ్యం బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు. ఇందుకోసం నిత్యం నడక, వ్యాయామం, యోగా తప్పనిసరి. ప్రధానంగా ఇవి అనేక రుగ్మతలకు దివ్య ఔషధాలు. కంటినిండా నిద్ర కడుపు నిండా తిని కంటినిండా నిద్రపోతే ఏ జబ్బూ ఉండదని పెద్దవాళ్లనేవారు. వేళకు తగినంత రాత్రి నిద్ర ఉంటే పొద్దున లేవగానే ఉత్సాహంగా ఉంటుంది. లేదంటే నిస్సత్తువగా... ఏదో పోగొట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. నిద్ర లేమి వల్ల రకరకాల ఇతర జబ్బులు వస్తాయి. అందువల్ల వీలయినంత వరకు వయసును బట్టి, చేసే శారీరక శ్రమను అనుసరించి తగినంత నిద్ర పోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. ఈ ధన త్రయోదశి నాడు అందరూ ఆరోగ్య ధనాన్ని పెంపొందించుకునే దిశగా అడుగులు వేస్తారని, వేయారనీ ఆశిద్దాం. -
దీపావళికి మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి ఇలా..
దీపావళి అంటే దీపాల పండుగే కాదు, ఇళ్లువాకిళ్లను శుభ్రం చేసి, ఇంటిని చక్కగా సర్దుకోవడం కూడా. ఇంటిని సర్దే క్రమంలో అందంగా అలంకరించుకోవడం కూడా ఈ పండగ సమయంలో చేసే ముఖ్యమైన పని. ఎంత అనుకున్నా ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇంటిని డెకరేట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా ఏం పర్లేదు.. చిన్నచిన్న ఐడియాలు, చిట్కాలతో మీ ఇంటిని క్షణాల్లో అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో చూడండి. ►గాజు, రాగి, ఇత్తడి వెడల్పాటి పాత్రలో నీళ్లుపోసి తాజాపువ్వులతో నింపేయాలి. పూలమధ్యలో దీపాలను వెలిగించాలి. ఈ పాత్రను గుమ్మానికి ఎదురుగా, డోర్ పక్కన పెడితే చాలా అందంగా ఉంటుంది. ► ఇంటి గుమ్మం పెద్దగా ఉన్నట్లయితే సంప్రదాయబద్ధంగా అలంకరించాలి. గుమ్మం ముందు రంగురంగుల ముగ్గులను పూలతో అలకరించి మధ్యలో దీపాలు పెట్టాలి. ఈ రంగవల్లుల పైన వేలాడే ల్యాంప్స్ను వెలిగిస్తే ఇంటి గుమ్మం కళకళలాడిపోతుంది. ► వివిధ రంగులతో మెరిసిపోయే చీరలు చున్నీలను గ్లాస్ విండో, డోర్లకు కర్టెన్స్లా పెట్టాలి. ఈ చీరలపైన సన్నని లైటింగ్ దండలను వేలాడదీయాలి. గది మధ్యలో సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిస్తే ఇల్లు మరింత కాంతిమంతంగా మారుతుంది. ► గుమ్మం ముందు, హాల్లో వేసే ముగ్గుని రెండు మూడు రకాల పువ్వులతో వేయాలి. ఈ ముగ్గు మధ్యలో మట్టిప్రమిదలు, సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ పెట్టి వెలిగించాలి. ► ఇంటిముందు పెద్దగా స్థలం లేనప్పుడు డోర్ పక్కనే ఉన్న గోడ మూలనుంచి దీపాలు పెట్టాలి. వీటిచుట్టూ పూలతో ఆలంకరించాలి. ఇవి ఇంటిని మరింత అందంగా చూపిస్తాయి. ► మార్కెట్లో దొరికే వివిధ రకాల వేలాడే దీపాలను వెలిగిస్తే చీకట్లో సైతం ఇల్లు కాంతులీని, పండుగ వాతావరణం కనిపిస్తుంది. ► గోడలకు వేలాడదీసే రంగురంగుల డెకరేషన్ వస్తువులు మార్కెట్లో చాలా కనిపిస్తాయి. కలర్ఫుల్ పూసలు, దారాలు, రంగురంగుల మెరిసే క్లాత్తో చేసిన, గంటలతో వచ్చే అలంకరణ వస్తువులను గోడకు వేలాడదీసి, కింద మట్టి దీపాలతో అలంకరిస్తే ఇల్లు కళకళలాడిపోతుంది. ► వీటిలో ఏదీ చేసే సమయం లేకపోతే మార్కెట్లో దొరికే చెక్క, యాక్రాలిక్ ల్యాంప్స్ కొనుక్కోని... కిటికీలు, గ్యాలరీలోవేలాడదీస్తే మీ ఇంటి దీపావళికి కళ వస్తుంది. ఇంకెందుకాలస్యం మీ ఇంటికి నప్పే విధంగా సింపుల్ డెకరేషన్ ప్రయత్నాలు మొదలుపెట్టండి. -
బంతిపూలకు మాత్రమే ఆ ప్రత్యేకత.. అందుకే పూజల్లో వాడుతారు
వేడుక వచ్చిందంటే చాలు బంతిపూల తోరణాలతో ఇళ్లూ వాకిళ్లు కళకళలాడుతూ ఉంటాయి. బంతిపూలకు మాత్రమే ఈ ప్రత్యేకత ఉంది. అందానికి, ఆరోగ్యానికి మేలు చేసే బంతిని మనకు ప్రకృతి ఇచ్చిన బహుమతిగా చెప్పచ్చు. తెల్లవారుజామున సూర్యుడు ఉదయించగానే భూమిలోని చీకట్లు తొలగి వెలుగు రేకలు అంతటా వ్యాపిస్తాయి. అదేవిధంగా, బంతిపువ్వును చూడగానే, మన మనస్సు తన బాధలను మరచిపోయి సంతోషిస్తుంది. ఈ సారూప్యత వల్ల బంతిపువ్వును సూర్యభగవానుడికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. గణేష్ చతుర్థి, నవరాత్రుల నుండి దీపావళి వరకు ఈ పూలకు చాలా డిమాండ్ ఉంది. మ్యారిగోల్డ్ శాస్త్రీయ నామం టాగెట్స్. భారతదేశానికి 350 సంవత్సరాల క్రితం పోర్చుగీసు వారి రాకతో మెక్సికో నుండి చేరుకుంది బంతి. చాలా అందంగా కనిపించే పసుపు, కుంకుమ రంగులో ఉండే ఈ పువ్వులను అందరూ ఇష్టపడతారు. విస్తారంగా సాగు.. మన దేశంలో బంతిపూల సాగు పెద్ద ఎత్తున చేస్తుంటారు రైతులు. ఇది మతపరమైన ఆచారాలతో పాటు, అనేక ఉత్పత్తుల తయారీలలో కూడా ఉపయోగపడుతుంది. సీజన్ను బట్టి బంతి పువ్వులను సాగు చేస్తారు. ఇది ఏప్రిల్, మే నెలల్లో సాగును ప్రారంభిస్తే ఆగస్టు–సెప్టెంబర్లలో చలికాలం ప్రారంభమవడానికి ముందు పంట చేతికొస్తుంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా 50 రకాల బంతి పువ్వులు ఉన్నాయి, వాటిలో మూడు జాతులు వాణిజ్య, వ్యవసాయం కోసం పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల పొలాలు బంతి పువ్వులతో వెలిగిపోతుంటాయి. త్యాగానికి పేరు బంతి పువ్వు బృహస్పతికి ఇష్టమైనదిగా జ్యోతిష్యులు చెబుతుంటారు. దేవతల గురువు బృహస్పతిని బంతి పువ్వులతో పూజిస్తే జ్ఞానం పెంపొందుతుందని నమ్మకం. పసుపు–కుంకుమపువ్వును కలిపినట్టుగా ఉండే ఈ రంగు త్యాగానికి ప్రసిద్ధి చెందింది, మరోవైపు ఇది అగ్ని వంటి ఉగ్రమైన వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ప్రజల మొదటి ఎంపిక ప్రజలు తమ ఇళ్లను బంతి పువ్వులతో అలంకరిస్తారు. కోల్కతా నుంచి వచ్చే బంతిపూలలో ఒకటి ఎరుపు, మరొకటి పసుపు. ఈ రంగు పువ్వులను బసంతి మేరిగోల్డ్ అంటారు. ఇదే అన్ని చోట్ల జనం మొదటి ఎంపికగా ఎంచుకుంటున్నారు. బంతిపూలతో అందంగా మెరిసిపోవచ్చు బొబ్బలు, కాలిన గాయాలు, దురదలు, చర్మవ్యాధుల నివారణలో బంతి పువ్వులను ఉపయోగిస్తారని ఆయుర్వేదంలో ఉంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రక్తకణాలను ఉత్పత్తి చేసి చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా మార్చగలవు. బంతి పువ్వులు వాపునే కాదు అలసటను తగ్గించడానికి కషాయంలా కూడా ఉపయోగిస్తారు. బంతి పువ్వు పొడి ముడతలు పడిన చర్మాన్ని మృదువుగా చేయడంలో కూడా సహాయపడుతుంది. బంతి పువ్వులు సహజ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కాలుష్యం నుండి చర్మాన్ని కాపాడతాయి. అందమైన ప్రయోజనాలు బంతిపూలు యాంటీ బయొటిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. మేరిగోల్డ్ ఫేస్ ప్యాక్ ముఖ చర్మాన్ని బిగుతుగా చేయడంతో పాటు చర్మకాంతిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. మొటిమలు, ముఖంపై మచ్చలు ఉన్నవారు బంతి పువ్వు ఫేస్ ప్యాక్ని ఉపయోగించవచ్చు. అందుకే, సౌందర్య ఉత్పత్తులు, మసాజ్ నూనెలు, లోషన్లు, సబ్బులు.. మొదలైన ఉత్పత్తులలో బంతిపువ్వులను ఉపయోగిస్తారు. దీని ఉపయోగం శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. దీన్ని నొప్పి, వాపును తగ్గించడానికి, పేగు, కడుపు రుగ్మతల నుండి ఉపశమనానికి, అల్సర్లను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. -
అనాథ చిన్నారులతో మంత్రి గుడివాడ అమర్నాథ్ దీపావళి వేడుకలు
-
Shriya Saran : ఫ్యామిలీతో శ్రియా శరణ్ దీపావళి వేడుకలు (ఫొటోలు)
-
టాంటెక్స్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
-
రిషి సునాక్ ఇంట దీపావళి వేడుక
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, అక్షతా మూర్తి దంపతులు 10 డౌనింగ్ స్ట్రీట్లోని తమ అధికార నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. బుధవారం జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రవాస భారతీయులు, పార్లమెంటేరియన్లు, పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొ న్నారు. ప్రధానిగా సునాక్ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నివాసాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు. ప్రధాని రిషి సునాక్, అక్షతామూర్తి దంపతులు కలిసి దీపాలు వెలిగిస్తున్న దృశ్యాలను ప్రధాని కార్యాలయం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ప్రధాని రిషి సునాక్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కమలా హ్యారిస్ నివాసంలోనూ.. వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మంగళవారం వాషింగ్టన్లోని తన అధికార నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు భారతీయ అమెరికన్లు సహా 300 మంది వరకు పాల్గొన్నారు. దీపాలు వెలిగించిన అనంతరం చట్టసభల ప్రతినిధులైన రో ఖన్నా, శ్రీ థానెదార్, రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ తదితరులతో ఆమె మాట్లాడారు. ఈసందర్భంగా ఆమె ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరును ప్రస్తావించారు. పాలస్తీనియన్లకు సాయం అందించేందుకు అమెరికా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. -
Diwali 2023: ఈసారి దీపావళి పండుగ 12,13.. ఎప్పుడు జరుపుకోవాలి?
హిందువులు జరుపుకునే ప్రధాన పండగల్లో దీపావళి కూడా ఒకటి. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడవదిలిన ఆనందంలో ప్రజలు దీపావళిచేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. కుల, మత భేదం లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెబుతారు. అయితే ఈసారి దీపావళి వేడుకలు ఎప్పుడు జరుపుకోవాలన్నదానిపై ఆయోమయం నెలకొంది. మరి అసలు దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి? ధనత్రయోదశి ఎప్పుడు నిర్వహించాలి? అన్న విషయాలపై పండితులు ఏమంటున్నారంటే.. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా కార్తీక మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తేదీన దీపావళి పండగను జరుపుకుంటారు.అయితే అధికమాసం కారణంగా దాదాపుగా అన్ని పండుగలు రెండు రోజులు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే దీపావళి కూడా రెండు రోజులు రావడంతో ఏరోజు పండగను జరుపుకోవాలి అన్న సందిగ్ధత నెలకొంది. ఈ సంవత్సరం కార్తీక మాస అమావాస్య నవంబర్ 12, 2023న మధ్యాహ్నం 2:44 గంటలకు ప్రారంభమై 13 నవంబర్ 2023న మధ్యాహ్నం 2:56 గంటలకు ముగుస్తుంది. దీపావళి అంటే సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగిస్తాం. కాబట్టి అమావాస్య ఘడియలు సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. అందుకే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నవంబరు 12నే దీపావళి పండగను జరుపుకోవాలని, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదంటున్నారు పండితులు. అయితే సోమవారం(నవంబర్13)న మధ్యాహ్నం వరకు అమావాస్య ఉంటుంది కాబట్టి ఆరోజు వైధిక క్రతువులు నిర్వహించుకోవచ్చని తెలిపారు. దీపదానాలు, యమ తర్పణాలు ఇతరత్ర దీనం చేయడానికి సోమవారం వీలుంటుందని, ఆరోజు వైధిక దీపావళిగా పండగను జరుపుకోవచ్చని పేర్కొన్నారు. -
న్యూయార్క్లో ఘనంగా దీపావళి వేడుకలు
తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్( TLCA) దీపావళి వేడుకలను గ్రాండ్గా నిర్వహించింది. న్యూయార్క్లోని క్రాన్సాఫ్ థియేటర్ వేదికగా తెలుగుదనం ఉట్టిపడేలా దీపావళి వేడుకలు కన్నుల పండగ్గా జరిగాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ పరిసర ప్రాంతాల నుంచి తెలుగు వారు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంప్రదాయ- సినీ పాటలు, నృత్యాలు, ఫ్యాషన్ షో వంటి వైవిధ్య భరితమైన వినూత్న కార్యక్రమాలతో దీపావళి సంబరాలు అంబరాన్నాంటాయి. రకరకాల అంగడులు, కమ్మటి ఫలహారాలు, పిల్లల సందడులుతో ప్రాంగణం కళకళ లాడింది. వినోదం విజ్ఞానం మేళవించిన కార్యక్రమం అని పలువురు కొనియాడారు. TLCA సభ్యులు అందరికీ దీపావళి శుభాకాంక్షలు అందజేశారు. TLCA చేస్తున్న పలు కార్యక్రమాలకు అండగా ఉంటూ సహాయసహాకారాలు అందిస్తున్న పలువురిని ఘనంగా సన్మానించారు. గత 10 ఏళ్లుగా మీడియా రంగంలో అందిస్తున్న సేవలను కొనియాడుతూ.. సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహబలుడు హనుమంతుడుని ఘనంగా సన్మానించి.. మెమొంటొలతో సత్కరించారు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతం అందించిన మెలోడీ బ్రహ్మ మణి శర్మ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ప్రేక్షకులని ఉర్రుతలూగించింది. మణిశర్మ తన ట్రూప్ తో కలిసి మ్యూజిక్తో అందరినీ ఎంటర్టైన్ చేశారు. సింగర్స్ వైష్ణవి, శృతిక, స్వరాగ్, పవన్ తదితరులు సూపర్ హిట్ పాటలు పాడి ఆడియన్స్లో జోష్ నింపారు. నటి స్పందన పల్లి ఫ్యాషన్ వాక్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. షాపింగ్ స్టాల్స్, Raffles బహుమతులు, మెహందీ, విందు భోజనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో దీపావళి వేడుకలు అసాంతం ఉత్సాహంగా సాగాయి. -
దీపావళి వేడుకలు.. అమెరికాలో స్కూళ్లకు సెలవు
అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కోసం అమెరికాలోని భారతీయులు భారీ వేడుకలను ప్లాన్ చేశారు. అమెరికా ప్రభుత్వం దీపావళిని పండుగగా గుర్తించి పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో న్యూజెర్సీలోని ఎడిసన్లో దీపావళి ఫెస్టివల్ గ్రాండ్గా జరిగింది. పాపాయిని పార్క్లో ఎడిసన్ మేయర్ సామ్ జోషి ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి ఈ వేడకల్లో పాల్గొన్నారు. తెలుగు వైభవాన్ని ఘనంగా చాటుతూ ఈ వేడుకలు నిర్వహించారు. తెలుగు పాట,ఆట కనువిందు చేశాయి. తెలుగు సంస్క్రృతి, సంప్రదాయాలకు ఈ వేడుకలు అద్దం పట్టాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి తీసుకువచ్చారు. ఇక వేదికపై బతుకమ్మలను పెట్టి ఆడపడుచులు ఆడి పాడారు. పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఇక పలువురు కళాకారులు భారతీయ సంస్కృతిని చాటిచెప్పేలా ప్రదర్శనలు నిర్వహించారు. జే సీన్ స్ఫెషల్ మ్యూజికల్ ఫెర్మామెన్స్.. అహుతులను అలరించింది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భారతీయ సాంప్రదాయ నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇక దీపావళి వేడుకల్లో ఇండియన్ ఫుడ్ స్టాల్స్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. షాపింగ్ స్టాల్స్, ఫుడ్ అండ్ రిటైల్ వెండర్స్ స్టాల్స్, కిడ్స్ జోన్, ఫైర్ వర్క్, Raffles బహుమతులు, విందు భోజనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఇక ఈ వేడుకల్లో పాల్గొనటం ఒక అద్భుతమైన అనుభవం అంటూ ప్రవాసులు తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న ఎడిసన్ మేయర్ సామ్ జోషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
హూస్టన్ మహానగరంలో ఘనంగా దిపావళి వేడుకలు
-
లండన్ ట్రఫాల్గర్ స్క్వేర్లో దీపావళి వేడుకలు
లండన్: యూకేలో దీపావళి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ప్రముఖ ట్రఫాల్గర్ స్క్వేర్లో లండన్ మేయర్ సాధిక్ ఖాన్ దీపావళి వేడుకలను నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకొనే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. యూకేలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఈ వేడకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. భారతీయ సాంప్రదాయ నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇక దీపావళి వేడుకల్లో ఇండియన్ ఫుడ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఈ వేడుకలకు హాజరైన పలువురు మాట్లాడుతూ.. మొదటిసారి దీపావళి వేడుకల్లో పాల్గొన్నామని, ఇదొ ఒక అద్భుతమైన అనుభవం అంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. That Mayor has a name, Sadiq Khan. https://t.co/U7jSV9PtG6 — Sushant Singh (@SushantSin) October 29, 2023 -
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఘనంగా దీపావళి వేడుకలు
కాన్సాస్: అమెరికా లోని కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (టీఏజీకేసీ) ఆధ్వర్యంలో స్థానిక బ్లూ వ్యాలీ నార్త్ హై స్కూలులో ఇటీవల దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 700 మంది తెలుగువారు పాల్గొన్నారు. ప్రార్థనా గీతంతో కార్యక్రమానికి విశేషు రేపల్లె, శ్రావణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మన తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించే కూచిపూడి, భరత నాట్యంతో పాటు జానపద నృత్యాలు అలరించాయి. కొత్త సినిమా పాటలకు చిన్నారుల నృత్యాలు, అభిగ్న పాటలు ప్రేక్షకులను ఉత్సాహపర్చాయి. టీఏజీకేసీకి సేవలు అందించిన శ్రీధర్ కొడాలి, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, శరత్ టేకులపల్లి, శ్రీధర్ అమిరెడ్డిలను టీఏజీకేసీ ఈ వేడుకలో ఘనంగా సత్కరించింది. టీఏజీకేసీ అధ్యక్షుడు వంశీ సువ్వారి, Trust chair దుర్గా తెల్ల గార్లను మెమొంటొలతో సత్కరించారు. Rafflesలో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. 30 మందితో నిర్వహించిన ఫ్యాషన్ షో, ‘కాన్సాస్ కిష్కింద కాండ’ హాస్య నాటిక హైలైట్గా నిలిచాయి. టీఏజీకేసీకి ఉపాధ్యక్షులు నరేంద్ర దుదెళ్ళ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చివరగా చక్కని తెలుగు విందు భోజనాన్ని ఆరగించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు స్పార్సర్స్తో పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ బోర్డు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. -
జాన్వీకపూర్ బాయ్ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఫోటో వైరల్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ధడక్, గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ వంటి సినిమాలతో మెప్పించినా కమర్షియల్ సక్సెస్ మాత్రం దక్కలేదు. స్టార్ కిడ్గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ స్టార్ హీరోయిన్ లిస్టులోకి ఇంకా వెళ్లలేదు జాన్వీ. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తుంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దివాళీ సెలబ్రేట్ చేసుకున్న జాన్వీ ఆ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్చేసింది. ఇందులో తన చిన్ననాటి స్నేహితుడు, బాయ్ఫ్రెండ్ అక్షత్ రాజన్తో జాన్వీ క్లోజ్గా దిగిన ఓ ఫోటో కూడా ఉంది. కొంతకాలం క్రితమే వీళ్లిదరు బ్రేకప్ చెప్పేసుకున్నారంటూ బీటౌన్లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే వీరిద్దరూ మళ్లీ కలిసి కనిపించడంతో ఈ ఫోటో నెట్టింట తెగ షికార్లు కొడుతుంది. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే.. జాన్వీ త్వరలోనే 'మిలి' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. -
దీపాల వెలుగులు.. బాంబుల మోతలు (ఫోటోలు)
-
వాయు నాణ్యత వెరీ పూర్.. హైదరాబాద్ను కమ్మేసిన కాలుష్యం
సాక్షి, హైదరాబాద్: దీపావళి బాణసంచా మోత ఆగింది. వాయు కాలుష్యంపై ప్రజల్లో బెంబేలు మొదలయ్యింది. పలు స్థాయిల్లో కాలుష్య స్థాయిలు పెరిగిపోవడమే ఇందుకు కారణం. రెండేళ్లుగా కోవి డ్ మహమ్మారి పరిస్థితుల కారణంగా అంతంతగానే టపాకాయలు కాల్చిన నగర ప్రజలు, కరోనా తగ్గుముఖంతో ఈ ఏడాది ఫుల్ జోష్తో పండుగ చేసుకున్నారు. సోమవారం సాయంత్రం మొదలుపెట్టి మంగళవారం తెల్లవారుజాము దాకా పటాకులు పేలాయి. హైదరాబాద్తో పాటు తెలంగాణలో ని పలు జిల్లాల్లో భారీయెత్తున బాంబులు, ఇతర టపాసుల్ని ప్రజలు కాల్చారు. దీని ప్రభావం వాతావరణంపై పడింది. హైదరాబాద్లోని 14 వాయు నాణ్యత పరీక్షా కేంద్రాల్లో చాలాచోట్ల కాలుష్య స్థాయిలు పెరిగినట్టు స్పష్టమౌతోంది. ముఖ్యంగా అత్యంత సూక్ష్మ స్థాయిల్లోని (2.5 మైక్రాన్ల కంటే తక్కువగా ఉంటే ధూళి, కాలుష్య కణాలు–పీఎం 2.5) కాలుష్యాలను బట్టి వాయు నాణ్యత సూచీని (ఏక్యూఐ–ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) లెక్కిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వర్గీకరణ ప్రకారం.. ఏక్యూఐ 400 పాయింట్లపైన ఉంటే వాయునాణ్యత తీవ్రమైన స్థాయిలో తగ్గినట్టుగా భావిస్తారు. ఇది ఆరోగ్యవంతులపై సైతం ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అన్నిచోట్లా అధికంగానే.. 24 గంటల సమయంలో పీఎం 2.5 కాలుష్యాలు 60 పాయింట్ల లోపు ఉండాల్సి ఉండగా మంగళవారం మధ్యాహ్నం 12కి సోమాజిగూడలో 105, హెచ్సీయూ, న్యూమలక్పేటలలో 99, హైదరాబా ద్ యూఎస్ కాన్సులేట్ వద్ద 92, జూపార్క్ వద్ద 91, కేపీహెచ్బీ ఫేజ్–2 వద్ద 84, కోకాపేట వద్ద 81 పాయింట్లు నమోదయ్యాయి. దీపావళి టపాసులతో వాయు నాణ్యతలో క్షీణత ఏ మేరకు జరిగిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక సోమవా రం రాత్రి 10 గంటల సమయంలో అయితే సనత్నగర్ స్టేషన్లో ఏక్యూఐ అత్యధికంగా 759కు చేరుకు ని క్రమంగా మంగళవారం ఉదయం 4 గంటలకు 298కు చేరుకుంది. అమీర్పేట, సోమాజిగూడ, గచ్చిబౌలి, జూబ్లీíహిల్స్, బంజారాహిల్స్, రామచంద్రాపురం ప్రాంతాల్లో సోమవారం రాత్రి 500 పాయింట్ల దాకా టచ్కాగా, రాత్రి 11 గంటల ప్రాంతంలో నాచారం స్టేషన్లో 446 పాయింట్లు రికార్డయింది. మంగళవారం సాయంత్రానికి చాలాచోట్ల మోస్తరు నుంచి తక్కువస్థాయిలో వాయునాణ్యత రికార్డయింది. కాగా, ఈ ఏడాది దీపావళి సందర్భంగా వాయు, శబ్ద కాలుష్యంపై పీసీబీ అధికారికంగా గణాంకాలు వెల్లడించాల్సి ఉంది. దీర్ఘకాలిక రోగులపై తీవ్ర ప్రభావం పొగ, మంచు, ఇతర రూపాల్లోని కాలుష్యాలు పెరిగి వాయు నాణ్యత స్థాయి తగ్గడం గుండె, శ్వాసకోశ, మూత్రపిండాలు, కాలేయం, ఇతర దీర్ఘకాలిక జబ్బులు, సమస్యలున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పుటికీ వానాకాలం కొనసాగడం, చలి పెరగడం, దీపావళి కాలుష్యం తదితరాలతో గతంలోని అలర్జీలు తిరగబెట్టి తీవ్రమైన జబ్బులుగా మారుతున్నాయి. అప్పర్ రెస్పిరేటరీ సమస్యలు, ముక్కులు కారడం, తుమ్ములు, గొంతు పొడిబారడం, గొంతు నొప్పి, ఖఫం పడడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్లు పెరిగి అలర్జిటిక్ బ్రాంకైటిస్, స్వైన్ఫ్లూ వంటివి వస్తున్నాయి. అస్తమా ఉన్న వారు, పొగతాగే అలవాటు ఉన్న వారు, టీబీ వచ్చి తగ్గినవారిలో ఆరోగ్య సమస్యలు పెరిగి ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. – డా. వీవీ రమణప్రసాద్, కన్సల్టింగ్ పల్మనాలజిస్ట్, కిమ్స్ -
కెనడాలో ఘనంగా దివాలీ సంబరాలు
కెనడా టొరంటోలో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. పిల్లా పెద్దా అంతా ఆటపాటలు, టపాసులతో ఆనందోత్సాహాల మధ్య వేడుకను నిర్వహించుకున్నారు. ♦కెనడా టొరంటో నగరం లో 120 మంది వాలంటీర్లతో ,170 స్టేజ్ పర్ఫామెన్స్ తో 1500 మంది అతిథులతో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దీపావళి పండుగను ఘనంగా జరిపారు. ♦ 14 రకాల ఐటమ్స్ తో అతిథులందరికీ అచ్చ తెలుగు విందు భోజనాలను ఆరగించారు. సుమారు ఏడు గంటల పాటు శాస్త్రీయ నృత్యాలు, తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, ఒడియా భాష లో పాటలు డాన్సులు ఆహుతులకు కనువిందు చేశాయి. తర్వాత పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో బాణాసంచా కాల్చారు. ♦ టొరంటో సిటీ కౌన్సెలర్ గేరి క్రాఫోర్డ్ మరియు సతీమణి చీఫ్ గెస్ట్ గా పాల్గొని హాజరైన మెంబెర్స్ కి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇండియా కెనడా బంధం మరింత ముడి వేయించుకోవాలని ఆకాంక్షించారు. ♦ ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించిన బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ కార్యనిర్వాహక సభ్యులు జగపతి రాయల,సూర్య కొండేటి, ప్రతాప్ బొల్లవరం, విష్ణు వంగల, రమేష్ తుంపర, శ్రీకాంత్ బండ్లమూడి, రాజశేఖర్ రెడ్డి, మూర్తి వారణాసి, నరసింహారెడ్డి, సర్దార్ ఖాన్, రామ సుబ్బారెడ్డి. ఈకార్యక్రమానికి విజయవంతానికి మిషన్ అఫ్ మదర్ (Mission Of Mothers ( MOM) చాలా సహకరించారు. ♦ ఆర్గనైజర్ జగపతి రాయల మాట్లాడుతూ కెనడా చరిత్రలో ఇది అతిపెద్ద దీపావళి ఈవెంట్ ,ఇలాంటి మరిన్ని మనదైన పండుగలను జరుపుతూ కెనడాలోని తెలుగువారికి సంస్కృతి సంప్రదాయాలను కాపాడతామని చెప్పారు. దీనా రెడ్డి ముత్తుకూరు, రామ్ జిన్నల, శ్రీకాంత్ లింగమనేని, ఫణీన్ద్ర కుమార్ కొడాలి, భరత్ కుమార్ రెడ్డి, మినర్వా రెస్టారెంట్, హార్టుఫుల్ రిలాక్సేషన్ సౌజన్యం తో ఈ వేడుక ఘనంగా ముగిసినది. ఈ వేడుకను విజయంతంం చేసిన 120 మంది వాలంటీర్లు మరో ఆర్గనైజర్ సూర్య కొండేటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
పిల్లాడు ఏడుస్తుంటే ఫోటో పిచ్చేంటి.. బాలీవుడ్ జంటపై ఫ్యాన్స్ ఫైర్
బాలీవుడ్ జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ దీపావళి సందర్భంగా అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ ఈ బాలీవుడ్ జంట సంప్రదాయ దుస్తులు ధరించి ఫోటోకు ఫోజులిచ్చారు. అంతా బాగానే ఉన్నా ఆ ఫోటో దిగిన సందర్భాన్ని కొందరు ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. ఎందుకంటే అందులో వారిద్దరి కుమారుల్లో ఒకరు కిందపడి ఏడుస్తూ కనిపించారు. అయినప్పటికీ ఈ జంట అవేం పట్టించుకోకుండానే నవ్వుతూ ఫోటోకు ఫోజులిచ్చారు. దీంతో వీరిద్దరి వ్యవహారంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఏది ఏమైనా సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఆ విధంగా చేయకూడదన్నది కొందరి అభిమానుల వాదన. మరి కొందరేమో పండగ వేళ సంతోషంలో అలా చేసి ఉంటారని సమర్థిస్తున్నారు. మరీ చిన్న పిల్లాడు ఏడుస్తుంటే అంత ఫోటో పిచ్చి ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా చిన్నపిల్లలను అలా వదిలేసి మనం ఆనందంలో మునిగిపోవడం ఎంతవరకు సమంజసం అని సగటు అభిమాని మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by kareena kapoor 💕💖❤❤❤ (@kareena_kapoor_khan_fanpage) -
తారల దీపావళి తళుకులు.. నెట్టంట ఫొటోల సందడి
-
దీపావళి వేడుకల్లో అపశ్రుతి
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా దీపావళి వేడుకలు
-
నయన్ దంపతుల దీపావళి సర్ప్రైజ్.. కవల పిల్లలతో కలిసి..!
ఇటీవలే ఎక్కువగా వార్తల్లో నిలిచిన జంట ఎవరంటే ఠక్కున గుర్తిచ్చేది నయన్-విఘ్నేశ్ శివన్. ఎందుకంటే ఈ దంపతులకు ఇటీవలే కవలలు జన్మించడంతో హాట్ టాపిక్గా మారింది. అయితే దీనిపై తమిళనాడు ప్రభుత్వానికి వివరాలు సమర్పించడంతో వివాదం సద్దుమణిగింది. ట్విన్స్ జన్మించిన ఆనందంలో ఉన్న ఈ జంట తాజాగా దీపావళికి కవల పిల్లలతో కలిసి శుభాకాంక్షలు తెలిపింది. పిల్లలను ఎత్తుకుని ఉన్న ఓ వీడియోను విఘ్నేశ్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అయితే పిల్లల ముఖాలను ఎక్కడా చూపించలేదు. సంప్రదాయ దుస్తులు ధరించిన నయన్ దంపతులు అందరికీ దివాళి విషెస్ తెలుపుతూ చాలా సంతోషంగా కనిపించారు. మొదటిసారి తల్లిదండ్రులైన సందర్భంగా ఎంతో ఆనందంగా ఫ్యాన్స్కు దివాళీ విషెస్ తెలిపారు. విఘ్నేశ్ శివన్ తన ఇన్స్టాగ్రామ్లో వీడియోను షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చాడు. 'మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అన్ని సందర్భాల్లోనూ మీరంతా సంతోషంగా ఉండాలి. మీ జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిపై పోరాడండి. ప్రేమ మాత్రమే ఈ జీవితాన్ని ఆనందంగా మారుస్తుంది. ప్రేమలో విశ్వాసం, మంచితనం ఎల్లప్పుడూ ఉండాలి.' అంటూ పోస్ట్ చేశారు. చాలా సంవత్సరాల పాటు ప్రేమించుకున్న ఈ జంట జూన్ 9, 2022న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
టాలీవుడ్ ప్రిన్స్ దీపావళి సర్ప్రైజ్.. సితార అదిరిపోయే ఫర్మామెన్స్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు తన గారాల పట్టి సితార అంటే పిచ్చి ప్రేమ. తండ్రితో కలిసి సితార ఎప్పుడు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. ఎక్కడికెళ్లినా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్లు ఇస్తుంటారు. తాజాగా ఇవాళ దీపావళిని పురస్కరించుకుని చేసిన షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పటిలా కాకుండా కాస్త భిన్నంగా అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. దీపావళి సందర్భంగా సితార క్లాసికల్ డ్యాన్స్తో అదరగొట్టింది. దీనికి సంబంధిత ఆ వీడియోను పోస్ట్ చేస్తూ అభిమానులందరికీ విషెస్ తెలిపింది. తన గురువు మహతీ భిక్షుతో కలిసి నృత్యం చేయటం చాలా సంతోషంగా ఉందని సితార తెలిపింది. ఆ వీడియో చూసిన పలువురు నెటిజన్లు సితార డ్యాన్స్ను మెచ్చుకుంటున్నారు. తన కూతురు సితార డ్యాన్స్ చేసిన వీడియోను మహేశ్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. (చదవండి: ఆ సినిమా బాహుబలి కంటే హిట్ అయ్యేది.. ఆర్జీవీ ట్వీట్ వైరల్) మహేశ్ బాబు తన ఇన్స్టాలో రాస్తూ..'నన్ను గర్వపడేలా చేయటంలో నువ్వు ఎప్పుడూ ఫెయిల్ కావు. ఈ ప్రదర్శన ఇలాగే కొనసాగించు చిట్టి తల్లి. నీకు నేర్పిన గురువులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ' అంటూ కితాబిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సితారకు ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
Diwali 2022: అరవిరిసిన కాంతులు.. పండుగ వేళ ఇంటిని ఇలా అలంకరించండి!
దీపపు కాంతులతో కూడిన పూల పరిమళాలు దీపావళి అందాన్ని పెంచి ఆనందం మిన్నంటేలా చేస్తాయి. పండుగరోజు ఇంటి అలంకరణలు చేయడం సాధారణమే కాని దానికి కొంచెం కళాత్మకత జోడిస్తే దీపావళి రోజు ఇల్లు గ్రాండ్ లుక్తో అదిరిపోతుంది. ఈ సరికొత్త అలంకరణ ఐడియాలపై ఒక లుక్... 1. దీపావళి అంటే తీపి లేకుండా జరగదు కదా! కుటుంబ సభ్యులందరూ కలసి తీపిని పంచుకునే డైనింగ్ టేబుల్ అలంకరణ ఇలా ఉంటే... 2. ఈ అలంకరణకు సమయం ఎక్కువే పట్టొచ్చు కాని మీ ఇంటి దీపావళిని ప్రత్యేకంగా మారుస్తుందనడంలో సందేహం లేదు. 3. చూడటానికి హాయిగా ఎంత బావుందో కదా! శ్రద్ధ తీసుకుని చేసే ఈమాత్రం చిన్న అలంకరణ చాలు ఇంటికి అద్భుతమైన అందం చేకూరడానికి! 4. వివిధ ఆకారాల్లో ఉండే వేలాడే దీపాలంకరణకు పూల సొబగులు అద్దితే కనులకు భలే విందు! 5. చూడటానికి ఎటువంటి హడావిడి లేకున్నా ప్రశాంతమైన భావనను కలిగించాలంటే అరటాకులలో దీపాలు పరిచి ఆహ్లాద దీపావళిని ఆహ్వానించండి. 6. కాదేదీ అలంకరణకు అనర్హం. ఇంట్లో పడున్న వాటితోనూ అందం తేవొచ్చు. గోడ మీద బొమ్మను చిత్రించి చిన్న వెదురు తట్టల్లో దీపాలు పెట్టి ఇంట్లో ఉన్న నిచ్చెనకి పూల అలంకరణలు చేస్తే చాలు.. -
ఆ సినిమా బాహుబలి కంటే హిట్ అయ్యేది.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఏం చేసినా అందరి కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. ఏ కామెంట్ చేసినా ఎవరూ ఊహించని విధంగా కొత్తదనం కనిపిస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఆర్జీవీ చేసిన ఓ ట్వీట్ తెగ వైరలవుతోంది. నిన్న ప్రభాస్ జన్మదినం సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ చేసి రచ్చపై స్పందించారు. బిల్లా రీ రిలీజ్ సందర్భంగా థియేటర్లోనే అభిమానులు బాణాసంచా కాల్చడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆర్జీవీ ఆ విషయంపై స్పందిస్తూ ప్రభాస్ అభిమానుల పిచ్చి అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: అది దీపావళి కాదు.. ప్రభాస్ అభిమానుల పిచ్చి.. ఆర్జీవీ ట్వీట్ వైరల్) తాజాగా ఇవాళ దీపావళి సందర్భంగా చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ ఇప్పడు రీ రిలీజ్ చేసి ఉంటే బాహుబలి కంటే పెద్ద హిట్ అయ్యేదంటూ పోస్ట్ చేశారు. ఏది ఏమైనా ఆర్జీవీ పోస్ట్ చేశాడంటే అది వైరల్ కావడం ఖాయం. దీపావళిని పురస్కరించుకుని అందరూ బాగుండాలని తనదైన శైలిలో వరుస ట్వీట్లు చేశారు. Hey #Prabhas May GOD re release Radhe Shyam and this time it becomes a bigger hit than BAHUBALI #HappyDiwali — Ram Gopal Varma (@RGVzoomin) October 24, 2022 -
కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఘోస్ట్ పోస్టర్ విడుదల
కరుణడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ పాన్ ఇండియా ఫిలిం ‘ఘోస్ట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీని దర్శకత్వం వహిస్తుండగా సందేశ్ నాగరాజ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఘోస్ట్ చిత్ర బృందం కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. గాల్లోకి ఎగురుతున్న బుల్లెట్ల మధ్య గన్ పట్టుకున్న శివరాజ్ కుమార్, వెనక ఫైర్, స్మోక్ ఎఫెక్ట్ బ్యాక్ డ్రాప్ లో పోస్టర్ ఆకట్టుకుంటోంది. భారీ వేడుకతో ప్రారంభమైన ఘోస్ట్ ప్రస్తుతం రూ 6 కోట్ల వ్యయంతో భారీగా వేసిన జైల్ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. -
దీపావళి దగదగలు.. బాలీవుడ్ భామల మెరుపులు
దీపావళి వెలుగుల్లో తారలు మరింత వెలిగిపోతున్నారు. బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫడ్నేకర్ ఇచ్చిన దీపావళి పార్టీ వేడుకలో పలువురు బీ టౌన్ తారలు తళుక్కుమన్నారు. తన భార్య పత్రలేఖతో కలిసి పార్టీకి హాజరయ్యారు రాజ్కుమార్రావు. అలాగే తనకు కాబోయే భర్త జాకీ భగ్నానీతో కలిసి పార్టీలో సందడి చేశారు హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్. ఇంకా రేఖాకపూర్, దర్శకుడు అమర్ కౌశిక్, సుహానా ఖాన్, కరణ్ డియోల్, అనన్యా పాండే, శిల్పాశెట్టి, ఆర్యన్ ఖాన్ ఈ దీపావళి వేడుకలో సందడి చేశారు. అలాగే నిర్మాత ఏక్తా కపూర్ దీపావళిని సెలబ్రేట్ చేశారు. ఈ పార్టీకి కూడా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై పాపులర్ సాంగ్స్కు డ్యాన్స్లు వేస్తూ సందడి చేశారు. కథానాయికలు హన్సిక, ఆదితీరావు హైదరీల దీపావళి సెలబ్రేషన్స్ కూడా షురూ అయ్యాయి. మరికొంత మంది తారలు దీపావళిని కుటుంబంతో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేశారు. -
ఇక వాణిజ్యప్రయోగాలే
సూళ్లూరుపేట: ఎల్వీఎం3–ఎం2 ప్రయోగం విజయంతో ఇస్రోకు ఒక రోజు ముందుగానే దీపావళి పండగ వచ్చిందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. ప్రయోగానంతరం ఆదివారం తెల్లవారుజామున ఆయన మీడియాతో మాట్లాడారు. న్యూ స్పేస్ ఇండియా, వన్వెబ్ సహకారంతో ఆదివారం ఎల్వీఎం3–ఎం2 ద్వారా ప్రయోగించిన 36 యూకేకి చెందిన కమ్యూనికేషన్ ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగామని తెలిపారు. క్రయోజనిక్ దశలో 36 ఉపగ్రహాలను ఒకేసారి కాకుండా నాలుగు దిశల్లో నాలుగేసి ఉపగ్రహాలు చొప్పున కక్ష్యలోకి విడిపోయేలా ఈ ప్రయోగంలో కొన్ని కీలకమైన సైంటిఫిక్ పరికరాలతో రూపొందించామని చెప్పారు. ఈ ప్రయోగంలో ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరడం కీలకం కావడంతో 36 ఉపగ్రహాలు విడిపోవడానికి 1.30 గంటల సమయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రయోగంతో ప్రపంచ దేశాల నుంచి ఎక్కువ మంది కస్టమర్లు రావడానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. వన్వెబ్ కంపెనీతో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఒప్పందం మేరకు మరో 36 ఉపగ్రహాలను, మళ్లీ ఇంకో 36 ఉపగ్రహాలను ఇదే తరహాలోనే ప్రయోగిస్తామని తెలిపారు. ఇస్రో విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. వాణిజ్య ప్రయోగాలే లక్ష్యం ఇకపై వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడమే లక్ష్యమని న్యూ స్పేస్ ఇండియా సీఎండీ రాధాకృష్ణన్ అన్నారు. దీన్ని చరిత్రాత్మక ప్రయోగంగా వన్వెబ్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అభివర్ణించారు. ఇప్పటికే 648 ఉపగ్రహాలను వివి«ధ దేశాల నుంచి ప్రయోగించామని గుర్తు చేశారు. ఇది కొత్త అధ్యాయానికి శ్రీకారమని పవన్ గోయెంకా (వన్వెబ్ కంపెనీ) చెప్పారు. ‘‘36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా పంపడం కూడా అద్భుతం. వాణిజ్యపరంగా ఇస్రో మరో అడుగు ముందుకేయడం శుభ పరిణామం’’ అని ఆయన చెప్పారు. -
‘ఏం భయం లేదు మేమున్నాం.. దీపావళి సంతోషంగా జరుపుకోండి’
శ్రీనగర్: యావత్ భారత దేశం దీపావళి వేడుకలకు సిద్ధమైంది. ధంతేరాస్లో భాగంగా శనివారం నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ జవాన్లు దీపాలు వెలిగించి, బాణసంచా పేల్చుతూ వేడుకలు నిర్వహించారు. దేశ ప్రజలకు దివాళీ శుభాకాంక్షలు తెలిపారు. నియంత్రణ రేఖ సహా సరిహద్దు ప్రాంతాల్లో దీపావళి జరుపుకొన్నారు. అంతా మంచే జరుగుతుందని ప్రజల్లో ధైర్యం నింపారు. సరిహద్దుల వద్ద తాము అప్రమత్తంగా ఉన్నామని, ఎలాంటి చింత లేకుండా కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకోవాలని పేర్కొన్నారు. ‘దేశ ప్రజలు ఎలాంటి చితలేకుండా కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకోవాలని చెప్పాలనుకుంటున్నా. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు, సరిహద్దుల్లో మన జవాన్లు అప్రమత్తంగా, నిరంతరం నిఘా వేస్తూ ఉన్నారని భరోసా ఇస్తున్నాం.’ అని కలెనల్ ఇక్బాల్ సింగ్ తెలిపారు. ధంతేరాస్ సందర్భంగా లక్ష్మి పూజ నిర్వహించి.. లక్ష్మీగణపతి హారతి పాటలు పాడారు సైనికులు. సైనికులతో మోదీ దీపావళి వేడుకలు.. ఈ దీపావళి వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత ఆర్మీ సైనికులతో కలిసి జరుపుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే జవాన్లతో దీపావళి వేడుకల్లో పాల్గొనాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఏ ప్రాంతానికి వెళ్తారనేది గోప్యంగా ఉంచారు. గత ఏడాది జమ్ముకశ్మీర్లోని నౌషేరాలో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. Jammu and Kashmir | Indian Army soldiers posted along the Line of Control (LoC) in the Akhnoor sector burst crackers & lit earthen lamps as #Diwali festivities began with Dhanteras yesterday pic.twitter.com/ekmaKMJiJr — ANI (@ANI) October 22, 2022 ఇదీ చదవండి: Dhanteras 2022: చీపురు సహా, వీటిని కొనుగోలు చేస్తే..లక్ష్మీ కటాక్షం! -
రాజ్భవన్లో దీపావళి సంబురాలు రేపు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పర్వదినం సందర్భంగా ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్భవన్ దర్బార్ హాల్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆమె సామాన్య ప్రజానీకంతో పాటు వివిధ రంగాల ప్రముఖులను కలుసుకుని దీపావళి పండుగను జరుపుకోనున్నారు. ఇదీ చదవండి: మునుగోడులో పోస్టర్ వార్ -
అయోధ్యలో 18 లక్షల ప్రమిదలతో దీపోత్సవం
అయోధ్య: అయోధ్యలో ఆదివారం జరిగే దీపోత్సవ్లో 18 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించనున్నారు. దీపావళి ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. సరయు నది ఒడ్డున రామ్ కి పైడి వద్ద 22 వేల మంది వలంటీర్లు 15 లక్షలకు పైగా ప్రమిదలను వెలిగిస్తారని అయోధ్య డివిజనల్ కమిషనర్ నవ్దీప్ రిన్వా చెప్పారు. మిగతా ప్రమిదలను ప్రముఖ కూడళ్లు, ప్రాంతాల్లో వెలిగిస్తారన్నారు. లేజర్ షో, త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో ఉంటాయన్నారు. బాణాసంచా కాలుస్తారని చెప్పారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన కళాకారులు రామ్లీలా ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఆదివారం అయోధ్యను సందర్శించనున్న ప్రధాని మోదీ రామాలయంలో పూజలు చేస్తారని ప్రధాని కార్యాలయం (పీఎంవో) తెలిపింది. శ్రీరామునికి లాంఛనప్రాయ పట్టాభిషేకం చేస్తారని పేర్కొంది. సరయు తీరంలో హారతిలో పాల్గొంటారని, దీపోత్సవ్ను ప్రారంభిస్తారని పీఎంవో వెల్లడించింది. చదవండి: గుంతల రోడ్డు.. బురద నీటిలో స్నానం చేసి గ్రామస్థుల నిరసన -
మహారాష్ట్రలో మరో ‘మహా’కూటమి?.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు పావులు
సాక్షి ముంబై: శివాజీపార్క్ సాక్షిగా మరో మహాకూటమి అవిర్భవించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) దీపావళిని పురస్కరించుకుని శివాజీపార్క్లో శుక్రవారం రాత్రి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లు హాజరయ్యారు. దీంతో రాబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతోపాటు ఇతర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శిందే వర్గం, బీజేపీ, ఎమ్మెన్నెస్ల మహాకూటమి ఏర్పడే అవకాశాలున్నాయన్న రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గణేశ్ ఉత్సవాల సందర్భంగా రాజ్ ఠాక్రే కూడా వారి ఇంటికి వెళ్లి గణేశుడిని దర్శించుకోవడం ఆ సందర్భంగా బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను బట్టి.. రాబోయే రాష్ట్రంలో కొత్తగా మహాకూటమికి శివాజీపార్క్లో బీజం పడిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏక్నాథ్ శిందేతోపాటు 40 మంది శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు అనంతరం ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయాలు తారుమారైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేయగా మరోవైపు బీజేపీ మద్దతులో ఏక్నాథ్ శిందే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ రాజకీయ పరిణామాల అనంతరం రాష్ట్ర రాజకీయాలలో ఒకరకమైన ఉత్పాతం సంభవించదని చెప్పొచ్చు. అనంతరం ఎన్నికల కమిషన్ శివసేన పార్టీ, చిహ్నాన్ని రెండింటినీ తాత్కాలికంగా సీజ్ చేయడం ఆ తర్వాత ఉద్దవ్ఠాక్రేకు శివసేన ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే పారీ్టగా, ఏక్నాథ్ శిందే వర్గానికి బాలాసాహెబాంచి శివసేన పార్టీగా ఆమోదం తెలిపింది. దీంతోపాటు ఉద్దవ్ ఠాక్రే వర్గానికి మండుతున్న కాగడా (మశాల్), శిందే వర్గానికి కత్తులు డాలు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. దీనిపైనే పోటీ పడనున్నాయి. అయితే రాబోయే బీఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా ఉద్దవ్ ఠాక్రే వర్గాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ, శిందే వర్గం నేతలు రాజ్ ఠాక్రేతో పొత్తు కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. చదవండి: బెంగాల్ను విడదీసేందుకు బీజేపీ కుట్రలు.. టీఎంసీ ఎంపీ ఫైర్ ఈ విషయంపై పలుమార్లు బీజేపీ నాయకులు కూడా పేర్కొన్నారు. ఇలాంటి నేపథ్యంలో రాజ్ ఠాక్రే ఆహా్వనం మేరకు ఏక్నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్లు ఎమ్మెన్నెస్ దీపోత్సవానికి హాజరుకావడంతో పలు రకాల చర్చలకు ఊతం వచ్చేలా చేసింది. ముఖ్యంగా శివాజీపార్క్లో జరిగిన ఎమ్మెన్నెస్ దీపోత్సవ కార్యక్రమంలో శిందే, బీజేపీ, ఎమ్మెన్నెస్ల మహాకూటమికి బీజం పడిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మాత్రం అధికారికంగా ఎవరూ వెల్లడించడం లేదు. ఎప్పట్నుంచో కలవాలనుకున్నాను:సీఎం ఏక్నాథ్ శిందే ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను ఎప్పట్నుంచో కలవాలని ఉన్నప్పటికీ రాజకీయాల్లో తీరికలేని పరిస్థితుల దృష్ట్యా ఇప్పటివరకు కలవలేకపోయానని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే పేర్కొన్నారు. ముఖ్యంగా గత పదేళ్లుగా ఎమ్మెన్నెస్ దీపోత్సవాలను నిర్వహిస్తోంది. గత రెండేళ్లు కరోనా మహమ్మారి కారణంగా అనేక నిర్బంధాలున్నాయి. అయితే ఈసారి మాత్రం మహమ్మారి తగ్గిపోవడంతో గణేశ్ ఉత్సవాలు, దసరా నవరాత్రోత్సవాలతోపాటు దీపావళి ఉత్సవాలను కూడా ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. గతంలో మనసులో కలవాలన్న కోరిక ఉన్నప్పటికీ కలువలేకపోయాను. కానీ ఇప్పుడు దీపోత్సవం సందర్భంగా ఇలా కలిసేందుకు అవకాశం లభించిందన్నారు. -
Diwali 2022: టపాసులు కాల్చే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
సాక్షి,హైదరాబాద్: దీపావళి అంటేనే వెలుగుల పండుగ.. అమావాస్య చీకట్లను చీల్చుతూ ఎటుచూసినా దీపాల సొబగులే.. అంబరాన్నంటే సంబరాలే.. బంధువుల రాకపోకలు... అతిథి మర్యాదలు... టపాసుల మోతలు ఇలా దీపావళి పండుగ అంతా సందడిగానే ఉంటుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆనందోత్సవాల మధ్య జరుపుకునే పండుగ ఇది. అలాంటి దీపావళి పండుగలో ఆనందం ఎంత ఉంటుందో ప్రమాదం కూడా అంతే ఉంటుందని ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. లక్ష్మీదేవి ఆరాధన.. దీపావళి రోజు ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి పూజను నిర్వహిస్తారు. ఇంట్లో ఉన్న బంగారం, నగదును అమ్మవారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. చీకట్లను పారద్రోలే విధంగా దీపాలను వెలిగించి పూజ చేస్తారు. దీపారాధన అనేది ఈ పండుగలో ప్రత్యేకమైనది. ఇంట్లో దీపాలు వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని అందరి నమ్మకం. లక్ష్మీదేవి దీప జ్యోతిగా సంపద దైవంగా భావిస్తుండటంతో అందరు దీపావళి రోజు దీపాలను వెలిగిస్తారు. మార్కెట్లో రకరకాల డిజైన్లు.. మార్కెట్లో వివిధ రకాల డిజైన్లతో కూడిన ప్రమిదలు లభిస్తున్నాయి. స్టీల్, ప్లాస్టిక్, మట్టికి సంబంధించి దీపాలు, ప్రమిదలు వివిధ డిజైన్లలో మార్కెట్లో దండిగా లభిస్తున్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలకు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయి. అదేవిధంగా ఈ పండుగకు కావాల్సిన వస్తువులు ఆన్లైన్లో తక్కువ రేటు ఉండటంతో చాలామంది ఆన్లైన్ ద్వారా తెíప్పించుకుంటున్నారు. మరికొందరు దుకాణాలకు నేరుగా వెళ్లి తెచ్చుకుంటున్నారు. దీంతో మార్కెట్లు సందడిగా మారాయి. జాగ్రత్తలు తప్పనిసరి.. దీపావళి పండుగలో ఆనందం ఎంత ఉంటుందో ప్రమాదం కూడా అంటే ఉంటుంది. బాణా సంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపకశాఖ, పోలీసులు, వైధ్యాధికారులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను నివారించవచ్చు. ► టపాసులను ఆరుబయటనే కాల్చాలి. ఇంట్లో కాల్చొద్దు. ► ఆస్పత్రులు, పెట్రోల్ బంకులు ఉన్న ప్రాంతాల్లో టపాసులు పేల్చొద్దు. ► టపాసులు కాల్చే ముందు విధిగా పాదరక్షలు ధరించాలి, అందుబాటులో నీళ్లు ఉంచుకోవాలి. గాయాలు అయితే వెంటనే సమీపంలో ఉన్న వైద్యులను సంప్రదించాలి. ► టపాసులు కాల్చేటప్పుడు చిన్నారులను ఒంటరిగా వదిలిపెటొద్దు. పెద్దల సమక్షంలోనే పిల్లలు టపాసులు కాల్చాలి. సరిగ్గా కాలని బాణసంచాపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ► టీషర్టులు, జీన్స్లాంటి దుస్తులు కాకుండా వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి, కళ్లకు హాని కలగకుండా అద్దాలు వాడాలి. ► అగ్నిమాపక శాఖ వద్ద లైసెన్సులు పొందిన దుకాణాల్లోనే బాణసంచా కొనుగోలు చేయాలి. ► పర్యావరణ హితమైన పదార్థాలతో తయారు చేసిన గ్రీన్ కాకర్స్ ఉపయోగిస్తే మంచిది. అప్రమత్తంగా ఉండాలి టపాసుల కాల్చేటప్పుడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలో బాణా సంచా కాల్చాలి. టపాసులు విక్రయించే వారు విధిగా అనుమతులు తీసుకోవాలి. దుకాణాల వద్ద ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలి. – రమేష్గౌడ్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, షాద్నగర్ అగ్నిమాపక కేంద్రం -
లైగర్ బ్యూటీ ప్రేమలో పడిందా.. ఆ స్టార్ హీరోతోనేనా?
బాలీవుడ్ నటి, లైగర్ బ్యూటీ అనన్య పాండేపై గాసిప్స్ గుప్పుమంటున్నాయి. ఆమె మరో నటుడితో డేటింగ్లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ నటుడితో ఆమె ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆమె ఓ పార్టీలో అతనితో కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. 'ఆషికీ-2’తో యువతకు చేరువైన నటుడు ఆదిత్య రాయ్ కపూర్. ఈ సినిమా తర్వాత ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆయన గత కొంతకాలంగా నటి అనన్య పాండేతో ఎక్కువగా కనిపిస్తున్నారు. గతంలో కృతిసనన్ ఏర్పాటు చేసిన దీపావళి పార్టీలో వీరిద్దరు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అప్పటి నుంచి అభిమానులు దృష్టంతా వీరిద్దరిపైనే పడింది. గత రాత్రి బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా దీపావళి బాష్ను గ్రాండ్గా నిర్వహించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్స్టా వేదికగా షేర్ చేయగా.. వారిద్దరు మాట్లాడుకుంటూ కనిపించారు. దీంతో అభిమానులు అనన్య - ఆదిత్య ప్రేమలో ఉన్నారా?’ అని మరోసారి చర్చించుకుంటున్నారు. మరోవైపు ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న అనన్య.. ఆదిత్య అంటే తనకు ఇష్టమని చెప్పింది ఈ బాలీవుడ్ భామ. దీనిపై ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. -
'దీపావళికి మాస్ మహారాజా సర్ప్రైజ్.. ధమాకా టీజర్ రిలీజ్
మాస్ మహరాజా రవితేజ లేటేస్ట్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. యాక్షన్, కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న 'ధమాకా' టీజర్ను రిలీజ్ చేసింది చిత్రబృందం. దీపావళి కానుకగా రవితేజ్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 23న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ విడుదలైన టీజర్ను చూస్తే రవితేజ మాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. టీజర్ను చూస్తే..' నేను మీలో విలన్ని చూస్తే.. మీరు నాలో హీరోని చూస్తారు' అనే డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది. చివర్లో రవితేజ డైలాగ్ మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. 'అటు నుంచి ఒక బుల్లెట్ వస్తే.. ఇటు నుంచి దీపావళే' వార్నింగ్ ఇవ్వడం రవితేజ మాస్ను ఓ రేంజ్కు తీసుకెళ్లింది. జయరాం, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, రావు రమేశ్, ఆలీ ఈ చిత్రంలో లకపాత్రలు పోషించారు. -
కుటుంబ సమేతంగా చూడాల్సిన అత్యుత్తమ టాప్ బాలీవుడ్ చిత్రాలివే..!
దీపావళికి మీరు ఏ సినిమాకు వెళ్లాలనుకుంటున్నారు? మీ కుటుంబంతో ఈ దివాళీని ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు? మీకు ఏ సినిమాకెళ్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? సినిమా ఎంపిక కోసం తర్జనభర్జనకు గురవుతున్నారా? అలాంటి ఆలోచనలకు ఇక చెక్ పెట్టండి. మీకోసం ఈ దీపావళికి చూడాల్సిన 34 ఉత్తమ బాలీవుడ్ సినిమాల పేర్లను అందిస్తున్నాం. అందులో మీకు నచ్చిన మూవీకి కుటుంబసమేతంగా వెళ్లి ఈ పండుగను ఆనందంగా ఆస్వాదించండి. బాలీవుడ్లో ఎవర్గ్రీన్ సినిమాలేంటో ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ జాబితాలో కామెడీ, ఫ్యామిలీ, డ్రామా లాంటి అన్ని చిత్రాలను అందిస్తున్నాం. మరేందుకు ఆలస్యం మీరు ఓ లుక్కేయండి. అత్యుత్తమ బాలీవుడ్ సినిమాల జాబితా: 1.కభీ ఖుషీ కభీ ఘమ్ (2001) నటీనటులు: షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, జయా బచ్చన్, కాజోల్ లాంటి అగ్రతారలు నటించిన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. కుటుంబసమేతంగా చూడాల్సిన సినిమా ఇది. 2. త్రీ ఇడియట్స్ (2009) శర్మన్ జోషి, అమీర్ ఖాన్, బోమన్ ఇరానీ, ఆర్.మాధవన్, కరీనా కపూర్, ఓమి వైద్య, మోనా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఓటీటీ ఫ్లామ్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో ఓ కళాశాల విద్యార్థి పోరాటాలు, జీవితంలో సరైన వృత్తిని ఎంచుకోవడానికి ప్రయత్నాలను చక్కగా చిత్రీకరించారు. 3. భేజా ఫ్రై (2007) సారిక, వినయ్ పాఠక్, మిలింద్ సోమన్, రజత్ కపూర్, రణవీర్ షోరే నటించిన ఈ చిత్రం ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. ఈ దీపావళికి మీరు మీ కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకోవాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. ఈ చిత్రానికి సాగర్ బళ్లారి దర్శకత్వం వహించారు. 4. మొహబ్బతీన్ (2000) షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఉదయ్ చోప్రా నటించిన ఈ మూవీ బాలీవుడ్లో ఆల్ టైమ్ ఫ్యామిలీ మూవీస్లో ఒకటి. ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమాకు ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించారు. ముగ్గుర విద్యార్థుల ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెకించారు. 5. పా (2009) పా మూవీ ఉత్తమ కుటుంబ చిత్రాలలో ఒకటి. విద్యాబాలన్, అమితాబ్ బచ్చన్, అరుంధతి నాగ్, అభిషేక్ బచ్చన్, పరేష్ రావల్ లాంటి అగ్రతారలు ఈ సినిమాలో నటించారు. కుటుంబసమేతంగా చూడాల్సిన చిత్రాల్లో ఇది ఒకటి. ఈ సినిమాకు ఆర్.బాల్కీ దర్శకత్వం వహించారు. 6.హమ్ ఆప్కే హై కౌన్..! (1994) 1994 లో వచ్చిన క్లాసిక్ మూవీ నదియా కే పార్ (1982)కి రీమేక్ ఈ చిత్రం. దేశంలో 1 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన మొదటి సినిమా ఇదే. ఇది అత్యంత భారీ బ్లాక్బస్టర్ చిత్రాల్లో ఒకటి. కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా. అలోక్ నాథ్, మాధురీ దీక్షిత్, మోహ్నీష్ బహ్ల్, రేణుకా షహానే, సల్మాన్ ఖాన్, అనుపమ్ ఖేర్, రీమా లాగూ, దిలీప్ జోషి, సతీష్ షా ప్రధాన పాత్రల్లో నటించారు. సూరజ్ బర్జాత్యా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. 7. చుప్కే చుప్కే (1975) 1970ల్లో వచ్చిన బాలీవుడ్ చిత్రాల్లో కచ్చితంగా చూడాల్సిన సినిమా. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం మిమ్మల్ని బాగా నవ్విస్తుంది. షర్మిలా ఠాగూర్, ధర్మేంద్ర, అస్రానీ, అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, ఉషా కిరణ్, ఓం ప్రకాష్, డేవిడ్ అబ్రహం చెల్కర్, లిల్లీ చక్రవర్తి ఈ సినిమాలో నటించారు. హృషికేష్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. 8. రంగీలా (1995) ప్రముఖ బాలీవుడ్ నటి కావాలని కలలు కనే అమ్మాయి నేపథ్యంలో తెరకెక్కింది ఈ చిత్రం. ఈ సినిమా మ్యూజిక్ ట్రాక్ చాలా బాగుంటుంది. ఎ.ఆర్. రెహమాన్ ఒరిజినల్ స్కోర్తో పాటు సౌండ్ట్రాక్తో వచ్చిన తొలి హిందీ సినిమా. అమీర్ ఖాన్, ఊర్మిళ మటోండ్కర్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. 9. ఖయామత్ సే ఖయామత్ తక్ (1988) అమీర్ ఖాన్, జూహీ చావ్లా, దలీప్ తాహిల్, అలోక్ నాథ్ నటించిన ఆల్ టైమ్ అత్యుత్తమ బాలీవుడ్ రొమాంటిక్ చిత్రాల్లో ఇదీ ఒకటి. ఈ సినిమాకు ఆనంద్-మిలింద్ స్వరాలు సమకూర్చారు. 1980ల్లో అత్యధికంగా అమ్ముడైన బాలీవుడ్ సౌండ్ట్రాక్ ఆల్బమ్లలో ఒకటిగా నిలిచింది ఈ చిత్రం. మన్సూర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. 10. ఆనంద్ (1971) 1971లో విడుదలైన ఈ చిత్రంలో క్యాన్సర్తో బాధపడుతున్న ఓ వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇప్పటివరకు తీసిన ఉత్తమ బాలీవుడ్ కుటుంబ చిత్రాలలో ఒకటి. అమితాబ్ బచ్చన్, రమేష్ డియో, రాజేష్ ఖన్నా, సుమితా సన్యాల్ నటించిన ఈ సినిమాకు హృషికేష్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. 11. మైన్ మేరీ పత్నీ... ఔర్ వో! (2005) మైన్ మేరీ పత్నీ...ఔర్ వో! చిత్రంలో ఓ మధురమైన ప్రేమకథను చూపించారు. వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలను చక్కగా తెరకెక్కించారు. ప్రతి సీన్లో భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఈ పండుగ సీజన్లో కచ్చితంగా చూడాల్సిన సినిమాల్లో ఒకటి. వరుణ్ బడోలా, రాజ్పాల్ యాదవ్, రితుపర్ణ సేన్గుప్తా, కే కే మీనన్ నటించిన ఈ చిత్రానికి చందన్ అరోరా దర్శకత్వం వహించారు. 12. రాకెట్ సింగ్: సేల్స్మ్యాన్ ఆఫ్ ది ఇయర్ (2009) మీకు కామెడీ, డ్రామా కావాలనుకుంటే రాకెట్ సింగ్: సేల్స్మ్యాన్ ఆఫ్ ది ఇయర్ చూడాల్సిందే. రణ్బీర్ కపూర్, ప్రేమ్ చోప్రా, గౌహర్ ఖాన్, మనీష్ చౌదరి, షాజాన్ పదమ్సీ, డి.సంతోష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి షిమిత్ అమీన్ దర్శకత్వం వహించారు. 13. చలో ఢిల్లీ (2011) ప్రముఖ ఇన్వెస్టర్ ఢిల్లీ ఫ్లైట్ మిస్ కావడంతో ఆమె జీవితం ఎలా మారిపోయిందో ఈ చిత్రంలో చూపించారు. ఇది ఉత్తమ బాలీవుడ్ కుటుంబ కథాచిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అక్షయ్ కుమార్, లారా దత్తా, మహికా శర్మ, వినయ్ పాఠక్ ప్రధాన పాత్రల్లో నటించారు. 14. దిల్ తో పాగల్ హై (1997) షారుఖ్ ఖాన్, కరిష్మా కపూర్, మాధురి దీక్షిత్ నటించిన ఈ చిత్రం అలనాటి బాలీవుడ్ ఉత్తమ కుటుంబ చిత్రాల్లో ఒకటి. ట్రై యాంగిల్ లవ్స్టోరీని ఈ సినిమాలో చూడొచ్చు. షారుఖ్ ఖాన్, కరిష్మా కపూర్, మాధురీ దీక్షిత్, అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రాన్ని యష్ చోప్రా తెరకెక్కించారు. 15. తేరే బిన్ లాడెన్ (2010) ఉత్తమ వ్యంగ్య హాస్య చిత్రాల్లో ఇది ఒకటి. అమెరికాకు వెళ్లాలనుకున్న ఓ రిపోర్టర్ కథే తేరే బిన్ లాడెన్. ఈ సినిమా కుటుంబ సభ్యులతో కలిసి చూడొచ్చు. సుగంధ గార్గ్, ప్రధుమాన్ సింగ్, అలీ జాఫర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అభిషేక్ శర్మ దర్శకత్వం వహించారు. 16. బంటీ ఔర్ బబ్లీ (2005) ఇద్దరు వ్యక్తులు వారి కలను సాకారం చేసుకోవడానికి చాలా కష్టాలను ఎదుర్కొంటారు. దానికోసం వారు ఏ మార్గాన్ని ఎంచుకున్నారో చక్కగా చూపించారు. కామెడీ జోనర్లోని ఉత్తమ బాలీవుడ్ ఫ్యామిలీ సినిమాల్లో ఇది ఒకటి. అమితాబ్ బచ్చన్, రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్ నటించిన మూవీని షాద్ అలీ తెరకెక్కించారు. 17. దృశ్యం (2015) ఈ చిత్రం ఆద్యంతం చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంది. సస్పెన్స్, ట్విస్ట్లతో కథను చక్కగా తెరకెక్కించారు. ఒక నేరం నుంచి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి అతను తీసుకునే నిర్ణయాల ఆధారంగా కథాంశమే ఈ చిత్రం. శ్రియా శరణ్, మృణాల్ జాదవ్, అజయ్ దేవగన్, రజత్ కపూర్, టబు, ఇషితా దత్తా, రిషబ్ చద్దా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. 18. దంగల్ (2016) రెజ్లింగ్ క్రీడ చుట్టూ తిరిగే కదే దంగల్. రెజ్లింగ్ క్రీడాకారుడైన మహావీర్ సింగ్ ఫోగట్ తన కుమార్తెలకు శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు తీలుకొచ్చేలా కృషి చేస్తారు. ఉత్తమ భారతీయ క్రీడా చిత్రాలలో ఒకటి. అమీర్ ఖాన్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, సాక్షి తన్వర్, జైరా వాసిం నటించిన ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూసేయొచ్చు. నితేష్ తివారీ ఈ సినిమాను తెరకెక్కించారు. 19. జానే భీ దో యారో (1983) 1983లో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి గాను కుందన్ షాకు 1984లో ఉత్తమ తొలి దర్శకుడిగా ఇందిరా గాంధీ అవార్డు లభించింది. భక్తి బార్వే, నసీరుద్దీన్ షా, ఓం పురి, రవి బస్వానీ, నీనా గుప్తా, సతీష్ షా, సతీష్ కౌశిక్, పంకజ్ కపూర్, అశోక్ బంతియా ప్రధాన పాత్రల్లో నటించగా.. కుందన్ షా దర్శకత్వం వహించారు. 20. ది లంచ్బాక్స్ (2013) ఇర్ఫాన్ ఖాన్ ఉత్తమ రచనల్లో ఇది ఒకటి. ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భారతీ అచ్రేకర్, ఇర్ఫాన్ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, నిమ్రత్ కౌర్, నకుల్ వైద్ నటించిన ఈ సినిమాకు రితేష్ బత్రా తెరకెక్కించారు. 21. స్టాన్లీ కా డబ్బా (2011) కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మీ హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. ఈ సినిమాలో నటనకు పార్థో గుప్తేకు 2012లో జాతీయ అవార్డును వరించింది. దివ్య జగ్దాలే, దివ్య దత్తా, అమోల్ గుప్తే, పార్థో గుప్తే, రాజ్ జుత్షి ప్రధాన పాత్రల్లో నటించగా.. అమోల్ గుప్తా దర్శకత్వం వహించారు. హులులో ఈ చిత్రం అందుబాటులో ఉంది. 22. దో దూని చార్ (2010) ఈ ఫ్యామిలీ కామెడీ సినిమాలో కొత్త కారు కొనడానికి మధ్యతరగతి కుటుంబం పడుతున్న కష్టాలను అద్భుతంగా చూపించారు. రిషి కపూర్, నీతూ సింగ్ నటించిన ఈ చిత్రం ఆల్ టైమ్ అత్యుత్తమ బాలీవుడ్ సినిమాల్లో ఒకటి. ఈ చిత్రానికి 'హిందీలో ఉత్తమ చలనచిత్రం' విభాగంలో జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. హబీబ్ ఫైసల్ తెరకెక్కించిన ఈ మూవీ.. నెట్ప్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. 23. అంఖోన్ దేఖి (2014) 2014లో వచ్చిన ఈ చిత్రం ఫిలింఫేర్ అవార్డ్స్, స్క్రీన్ అవార్డులను అంఖోన్ దేఖి గెలుచుకుంది. రజత్ కపూర్, సంజయ్ మిశ్రా, బ్రిజేంద్ర కాలా, సీమా పహ్వా నటించిన ఈ సినిమాకు.. రజత్ కపూర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. 24. బావర్చి (1972) 1970ల్లో వచ్చిన సినిమా ఉత్తమ బాలీవుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచింది. ఒకరితో ఒకరు చాలా గొడవలు చేసుకునే మధ్యతరగతి కుటుంబ సభ్యుల కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి రాజేష్ ఖన్నా 1973లో బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అవార్డులో ఉత్తమ నటుడి (హిందీ) అవార్డు. కన్వర్జిత్ పెంటల్ 1973లో 'ఉత్తమ హాస్య నటుడు' విభాగంలో ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. రాజేష్ ఖన్నా, జయ బచ్చన్, అమితాబ్ బచ్చన్, ఉషా కిరణ్, కన్వర్జిత్ పెంటల్, అస్రానీ నటించిన ఈ సినిమాను హృషికేష్ ముఖర్ తెరకెక్కించారు. 25. జానే తు... యా జానే నా (2008) రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకులకు కూడా బాగా నచ్చింది. ప్రతీక్ బబ్బర్, ఇమ్రాన్ ఖాన్, పరేష్ రావల్, జెనీలియా డిసౌజా, రత్న పాఠక్ షా, మంజరీ ఫడ్నిస్, నీరవ్ మెహతా, అయాజ్ ఖాన్, సుగంధ గార్గ్, సోహైల్ ఖాన్, నసీరుద్దీన్ షా, అలీష్కా వార్దే, కరణ్ మఖిజా, అర్బాజ్ ఖాన్ భారీ తారాగణం ఈ సినిమాలో నటించారు. అబ్బాస్ టైరేవాలా డైరెక్ట్ చేసిన ఈ మూవీ.. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. 26. జో జీతా వోహి సికందర్ (1992) 1992లో విడుదలైన ఈ చిత్రం రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకుంది. ఇది బాలీవుడ్లో వస్తున్న అత్యుత్తమ స్పోర్ట్స్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దీపక్ తిజోరి, అమీర్ ఖాన్, కులభూషణ్ ఖర్బండా, అయేషా జుల్కా, పూజా బేడి, మామిక్ సింగ్ నటించిన ఈ సినిమాకు మన్సూర్ ఖాన్ దర్శకత్వం వహించారు. 27. కోయి... మిల్ గయా (2003) కోయి..మిల్ గయా ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ సైన్స్ ఫిక్షన్ బాలీవుడ్ సినిమాల్లో ఒకటి. ఈ సినిమాకు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, పీపుల్స్ ఛాయిస్ అవార్డ్స్, స్క్రీన్ అవార్డ్స్తో పాటు పలువురి ప్రశంసలను అందుకుంది. రేఖ, హృతిక్ రోషన్, ప్రీతి జింటా, హన్సిక మోత్వాని, రజత్ బేడీ, ప్రేమ్ చోప్రా, ముఖేష్ రిషి తారాగణంతో తరకెక్కిన ఈ చిత్రానికి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు. 28. జిందగీ నా మిలేగీ దోబారా (2011) ముగ్గురు స్నేహితుల కథ ఆధారంగా రూపొందించిన చిత్రం జిందగీ నా మిలేగీ దొబారా. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఫర్హాన్ అక్తర్, కత్రినా కైఫ్, అభయ్ డియోల్, కల్కి కోచ్లిన్ నటించారు. ఈ చిత్రం 35 అవార్డులను కైవసం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచింది. జోయా అక్తర్ తెరకెక్కించిన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. 29. గుప్త్: ది హిడెన్ ట్రూత్ (1997) ఈ అద్భుతమైన మర్డర్ మిస్టరీని ఈ చిత్రంలో చూపించారు. బాబీ డియోల్, కాజోల్, పరేష్ రావల్, మనీషా కొయిరాలా, ఓం పురి నటించిన ఈ సినిమా బాలీవుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఒకటి. రాజీవ్ రాయ్ రూపొందించిన ఈ చిత్రాన్ని జీ5లో చూసి ఎంజాయ్ చేయండి. 30. చమేలీ కి షాదీ (1986) 1980ల నాటి ఉత్తమ కుటుంబ చిత్రాలలో చమేలీ కి షాదీ ఒకటి. అనిల్ కపూర్, అమ్జద్ ఖాన్, అమృతా సింగ్, ఓం ప్రకాష్, అన్నూ కపూర్, పంకజ్ కపూర్ నటించిన ఈ చిత్రానికి బసు ఛటర్జీ తెరకెక్కించారు. 31. స్పెషల్ 26 (2013) ఆదాయపు పన్ను అధికారులుగా నటిస్తూ రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలను దోచుకునే ముఠా చుట్టూ తిరిగే కథే ఈ చిత్రం. ఈ సినిమా ఉత్తమ బాలీవుడ్ కుటుంబ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, మనోజ్ బాజ్పేయి, జిమ్మీ షీర్గిల్ నటించిన ఈ చిత్రానికి నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. 32. సత్తె పె సత్తా (1982) తప్పక చూడావలసిన బాలీవుడ్ కుటుంబ కథా చిత్రాలలో ఒకటి. ఫామ్హౌస్లో జంతువుల మధ్య నివసించే ఏడుగురు సోదరుల కథాంశమే ఈ చిత్రం. అమ్జాద్ ఖాన్, అమితాబ్ బచ్చన్, సుధీర్ లూత్రియా, హేమ మాలిని, కన్వర్జిత్ పైంటల్, రంజీతా కౌర్, కన్వల్జిత్ సింగ్, విక్రమ్ సాహు, సచిన్ పిల్గావ్కర్, శక్తి కపూర్ నటించిన ఈ చిత్రాన్ని రాజ్ ఎన్. సిప్పీ రూపొందించారు. 33. అక్టోబర్ (2018) అక్టోబర్ వరుణ్ ధావన్ ఉత్తమ చిత్రాలలో ఒకటి. ఈ చిత్రానికి గానూ జాగ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2018, లయన్స్ గోల్డ్ అవార్డ్స్ 2019లో ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నాడు. గీతాంజలి రావు, వరుణ్ ధావన్, బనితా సంధు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి షూజిత్ సిర్కార్ దర్శకత్వం వహించారు. 34. హిచ్కీ (2018) ఈ స్ఫూర్తిదాయకమైన కథ బ్రాడ్ కోహెన్ రాసిన ఫ్రంట్ ఆఫ్ ది క్లాస్ ఆధారంగా రూపొందించబడింది. బాలీవుడ్లో ఇప్పటివరకు రూపొందించిన అత్యుత్తమ హాస్య-నాటకం చిత్రాలలో ఒకటి . రాణి ముఖర్జీ, హర్ష్ మాయర్, ఆసిఫ్ బస్రా, నీరజ్ కబీ నటించారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆమెజాన్ ప్రైమ్వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ దీపావళికి అత్యుత్తమ బాలీవుడ్ చిత్రాల్లో మీకు నచ్చిన వాటిని కుటుంబంతో కలిసి ఆస్వాదించండి. -
దీపాల వెలుగులు.. బాలీవుడ్ తారల మెరుపులు
ఈ ఏడాది దీపావళి సంబరాలు మొదలయ్యాయి. అక్టోబర్ 24న దీపావళి వేడుకకు భారత దేశమంత సిద్ధమవుతుంది. ఇక పండగ అంటే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఒక్కచోట చేరి ఆనందంగా గడపడం. అన్ని పండుగల్లో ప్రత్యేకత సంతరించుకునేది దీపావళి. ఈ పండగకు మాత్రమే ఒకరి ఇంటికి మరోకరు వెళ్లడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం చేస్తుంటారు. అంతేకాదు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులంత ఒక్కచోట చేరి టపాసులు కాల్చి ఆనందంగా గడుపుతారు. అయితే ఈ సాంప్రదాయం ఎక్కువగా ఉత్తరాదిలో కనిపిస్తుంది. ఇక నార్త్ అనగానే వెంటనే గుర్తొచ్చేది బాలీవుడ్. ప్రతి దీపావళికి బాలీవుడ్ సెలబ్రెటీలంత ఒక కుటుంబంగా మారిపోతారు. ఈ సందర్భంగా తమ విలావంత భవనంలో గ్రాండ్ పార్టీని నిర్వహించి బి-టౌన్ తారలకు ఆతిథ్యం ఇస్తుంటారు. అందులో అమితాబ్, షారుక్, కుటుంబం ముందుంటుంది. అయితే కరోనా కారణంగా రెండేళ్లు ఈ వేడుకను చాలా సింపుల్ జరుపుకుంది బి-టౌన్. అందుకే గత రెండేళ్లు దీపావళి సందడి పెద్దగా కనిపించలేదు. మరి ఈ ఏడాది బాలీవుడ్ తారలు దీపావళి పూర్వపు వైభవాన్ని తీసుకువస్తారో లేదో చూడాలి. ఇదిలా ఉంటే గతంలో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, కాజోల్, కపూర్ కుటుంబం వంటి తారలు దీపావళిని ఎలా సెలబ్రెట్ చేసుకున్నారో ఓ సారి చూద్దాం. అమితాబ్ బచ్చన్ ‘జల్సా’ సందడి ప్రతి ఏడాది బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్ తన ఇంటిలో దీపావళి పార్టీని ఘనంగా నిర్వహిస్తారు. ఈ పార్టీలో బాలీవుడ్ తారలందరిక ఆహ్వానం అందుతుంది. ఆ రోజు సాయంత్రం ముంబైలోని ఆయన బంగ్లా జల్సాలో బాలీవుడ్ తారలంత మెరుస్తారు. 2019లో ఆయన ఆయన హోస్ట్ చేసిన దీపావళి పార్టీలో షారూఖ్ ఖాన్, కాజోల్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ, సారా అలీ ఖాన్, దీపికా పదుకొనే వరకు అందరూ బిగ్ బి దీపావళి పార్టీలో సందడి చేశారు. ఈ పార్టీ షారుక్ తన భార్య గౌరీ ఖాన్తో రాగా సోనమ్ కపూర్ తన భర్త ఆనంద్ అహుజాతో వచ్చింది. సెలబ్రెటీ కపుల్ అయిన అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ హాజరయ్యారు. షారుక్ ఖాన్ ‘మన్నత్’ వెలుగులు ఇక బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన భార్య గౌర్ ఖాన్, కూతురు, కొడుకలతో దీపావళికి చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులంత ఒకే రంగు దుస్తులు ధరించి దీపావళికి స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తారు. తమ విలాసవంతమైన బంగ్లా మన్నత్ను దీపాలతో కలకలలాడుతుంది. ప్రతి ఏడాది సెలబ్రెటీల అత్యత్తుమ దీపావళి సెలబ్రెషన్స్లో ఈ షారుక్ దంపతులు మొదటి స్థానంలో నిలుస్తారు. అంతేకాదు వీరి ఫొటోలు సోషల్ మీడియాలో నెటిజన్లు ఆకట్టుకుంటాయి. కపూర్ ఫ్యామిలీ దీపావళి తళుకులు బాలీవుడ్లో కపూర్ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. అన్నదమ్ములైన బోని కపూర్, అనిల్ కపూర్, సంజయ్ కపూర్ల కుటుంబాలు ప్రతి స్పెషల్ డేస్కు ఒక్కచోట చేరిపోతారు. ప్రతి దీపావళికి అనిల్ కపూర్, ఆయన భార్య సునీతా కపూర్ తమ నివాసం జూహులో గ్రాండ్ పార్టీని నిర్వహిస్తారు. ఈ పార్టీకి చాలామంది బాలీవుడ్ ప్రముఖులు హాజరవుతుంటారు. ఇక 2021లో కరోనా కారణంగా దీపావళిని కేవలం తమ కుటుంబ సభ్యులు మాత్రమే జరుపుకున్నారు. ఈ వేడుకలో బోని కపూర్ ఆయన కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్, అర్జున్ కపూర్, అతడి ప్రియురాలు మలైకా అరోరా,అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ఆమె భర్త ఆనంత్ ఆహుజా, షానయా కపూర్, అన్షులా కపూర్, రియా కపూర్, మహీప్ కపూర్ తదితరులు భారతీయ వస్త్రధారణలో మెరిశారు. కరణ్ జోహార్ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ సినీ సెలబ్రెటీల కోసం ఆయన తరచూ పార్టీలు నిర్వహిస్తుంటారు. ఇక అందులో దీపావళి అంటే ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. 2019లో, కరణ్ జోహార్ తన నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్లో పనిచేసే నటీనటులతో పాటు సిబ్బంది కోసం దీపావళిని గ్రాండ్గా హోస్ట్ చేశారు. ఈ వేడుకలో సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, విక్కీ కౌశల్, అనిల్ కపూర్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, భూమి పెడ్నేకర్, నేహా ధూపియా ఇతర నటీనటులు సందడి చేశారు. -
‘ఓరి దేవుడా’ దివాలీ దావత్, సందడి చేసిన యంగ్ హీరోలు
యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ఓరి దేవుడా. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్టరి వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్లుగా నటించారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్లో భాగంగా గురువారం రాత్రి ‘దివాలీ దావత్’ పేరుతో వేడుకను నిర్వహించారు. ఈ పార్టీకి పలువుకు టాలీవుడ్ యంగ్ హీరోలు హాజరై సందడి చేశారు. అల్లరి నరేశ్, టీజే టిల్లు ఫేం సద్ది జొన్నలగడ్డ, సందీప్ కిషన్, ఆది సాయి కుమార్, ఆకాశ్ పూరి, విశ్వక్ సేన్, హీరో కార్తికేయతో పాటు తదితరులు, చిత్ర బృందం పాల్గొంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బాలీవుడ్ తారల దీపావళి సెలబ్రేషన్స్..కొత్త దుస్తుల్లో మెరిసిన స్టార్స్
దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సంబరాలు మొదలయ్యాయి. ప్రజలు తమ ఇళ్లను అలంకరించుకోవడం ప్రారంభించారు. దీపాల పండుగ పర్వదినాన్ని తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులలో అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు బాలీవుడ్ తారలు కూడా మినహాయింపు కాదు. బీటౌన్కి చెందిన పలువురు హీరోహీరోయిన్లు అప్పుడే దీపావళి సంబరాలను ప్రారంభించారు. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, ఆయన భార్య తాహిరా కశ్యప్లు ముంబైలోని తమ నివాసంలో దీపావళి పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి బాలీవుడ్ సెలబ్రిటీలు కార్తిక్ ఆర్యన్, కరణ్ జోహార్, కృతి సనన్, అనన్య పాండే, తాప్పీ పన్ను హాజరై సందడి చేశారు. బాలీవుడ్ బ్యూటీ, ‘ఆదిపురుష్’ సీత కృతి సనన్.. తన ఇంట దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీంతో ఆమె ఇంటికి బాలీవుడ్ నటీనటులు తరలి వచ్చారు. వరుణ్ ధావన్, అతని భార్య నటాషా దలాల్ బంగారు రంగు దుస్తుల్లో దీపాలతో పోటీగా వెలిగారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే లెహంగా ధరించి అందరినీ మెప్పించింది. దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్ బ్లాక్ కుర్తాను ధరించి మెరిశారు. శిల్పాశెట్టి బ్రౌన్ మెరూన్ కలర్ చీరతో అలరించింది. నోరా ఫతేహి తన మెరిసే లెహంగాలో అద్భుతంగా ఉంది. తాప్సీ పన్ను మెరిసే గులాబీ రంగు చీరను ధరించింది. -
ఒకేరోజు 75వేల మందికి ఉద్యోగాలు.. ప్రధాని మోదీ దీపావళి గిఫ్ట్
న్యూఢిల్లీ: ఈ ఏడాది దీపావళికి దేశవ్యాప్తంగా 75వేల మంది యువతకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దివాళీకి రెండు రోజుల ముందు శనివారం వారితో వర్చువల్గా సమావేశమై వివిధ అంశాలపై మాట్లాడనున్నారు. 75వేల మంది యువతకు ప్రభుత్వ విభాగాలు, వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నారు. అదే రోజు వారికి ఉద్యోగ నియామక పత్రాలు(అపాయింట్మెంట్ లెటర్స్) అందించనున్నారు ప్రధాని మోదీ. ప్రధాని స్పెషల్ గిఫ్ట్ అందుకునే యువత.. రక్షణ, రైల్వే, హోం, కార్మిక, ఉపాధి శాఖలు, తపాలా విభాగం, సీఐఎస్ఎఫ్, సీబీఐ, కస్టమ్స్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో వారికి పోస్టింగ్ ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుంచి కేంద్ర మంత్రులు సైతం ఈ వర్చువల్ సమావేశానికి హాజరుకానున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ ఒడిశా నుంచి, ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా గుజరాత్ నుంచి, సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చండీగఢ్ నుంచి, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మహారాష్ట్ర నుంచి హాజరుకానున్నారు. అలాగే.. ఎంపీలందరూ వారి వారి పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి హాజరుకానున్నారు. ఇదీ చదవండి: ముందస్తు దీపావళి కాంతులు: ఐటీ ఉద్యోగులకు తీపి కబురు -
బాణసంచా కొన్నా, కాల్చినా 6 నెలల జైలు!
న్యూఢిల్లీ: దీపావళి పండుగ అంటేనే బాణసంచా ఉండాల్సిందే. అయితే, పండుగకు ముందు ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వాతావరణ కాలుష్యం దృష్ట్యా బాణసంచా క్రయవిక్రయాలు, ఉపయోగించటంపై నిషేధం విధించింది. ఫైర్క్రాకర్స్ కొనుగోలు చేసినా, కాల్చినా రూ.200 జరిమానా విధించటంతో పాటు.. 6 నెలల వరకు జైలు శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు మీడియా సమావేశంలో ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటన చేశారు. బాణసంచా తయారీ, నిలువ, విక్రయాలు జరపటం నేరమని తెలిపారు. అందుకు రూ.5000 వరకు జరిమానా, పేలుడు పదార్థాల సెక్షన్ 9బీ ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. అక్టోబర్ 21న ‘ దీపాలు వెలిగించండి.. పటాకలు కాదు’ అనే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు రాయ్. వచ్చే శుక్రవారం సెంట్రల్ పార్క్ వద్ద 51వేల దీపాలు వెలిగిస్తున్నామని చెప్పారు. ‘ఫైర్క్రాకర్స్ కొనుగోలు చేయటం, కాల్చటం చేస్తే రూ.200 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధిస్తాం. ’ అని స్పష్టం చేశారు. నిషేధాన్ని అమలు చేసేందుకు 408 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్లోనే ఫైర్క్రాకర్స్ తయారు చేయటం, విక్రయించటం సహా అన్నింటిపై జనవరి 1 వరకు నిషేధం విధించింది ఢిల్లీ ప్రభుత్వం. అందులో దీపావళికి సైతం ఎలాంటి మినహాయింపునివ్వలేదు. గత రెండేళ్లుగా ఇదే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. Hon’ble Environment Minister Sh. @AapKaGopalRai Addressing an Important Press Conference | LIVE https://t.co/MgY2RNnCzv — AAP (@AamAadmiParty) October 19, 2022 ఇదీ చదవండి: మోడ్రన్ కృష్ణుడు.. తన మ్యూజిక్తో గోవులను ఆకర్షించేస్తున్నాడు.. వీడియో వైరల్ -
దీపావళి వేడకలో స్టెప్పులేసిన పీవీ సింధు.. వీడియో వైరల్
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సింధు ఎంతో సంతోషంగా పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఉత్సాహంగా డ్యాన్స్ కూడా చేశారు. నిత్యం ఆటలతో బిజీగా ఉండే సింధు ఇలా డ్యాన్స్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘లవ్ న్వాంటిటి’ పాటకు నృత్యం చేసిన హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్.. గ్రీన్ లెహంగాలో తనదైన స్టెప్పులతో అదరగొట్టారు. ఈ వీడియోను సింధు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోకు ఒకే రోజులో మిలియన్కు పైగా వ్యూస్ వచ్చాయి. చదవండి: పద్మభూషణ్ అవార్డు అందుకున్న పీవి సింధు.. కాగా సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పీవీ సింధు 2020 సంవత్సరానికి గాను పద్మభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన సింధు.. అంతకు ముందు 2016లో జరిగిన రియో ఒలింపిక్స్లో సిల్వర్ పతకం గెలుచుకుంది. ఇక 2019లో ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ఈ స్టార్ అంతకుముందు వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీల్లో రెండు కాంస్యాలు, రెండు రజతాలు సాధించింది. ఈ క్రమంలో ప్రపంచ ఛాంపియన్షిప్లో ఎక్కువ పతకాలు సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 2015లో సింధుకు పద్మశ్రీ అవార్డు దక్కింది. View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) -
ఫాంహౌస్లో బన్నీ దీపావళి సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
Allu Arjun And Sneha Reddys Diwali Celebrations: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలె దీపావళి వేడుకలను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఫాంహౌస్లో జరిగిన ఈ దీపావళి వేడుకల్లో రామ్చరణ్, ఉపాసనలతో పాటు మిగతా మెగా కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. తాజాగా దీపావళి సెలబ్రేషన్స్కు సంబంధించిన వీడియోను బన్నీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేస్తూ.. 'ఫాంహౌస్లో మా దీపావళి పార్టీ. డెకరేషన్ అంతా స్వయంగా స్నేహ దగ్గరుండి చేయించింది..దీపావళి వైబ్స్' అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో అల్లుఅర్జున్, స్నేహరెడ్డి స్టన్నింగ్ అవుట్ఫిట్లో సందడి చేశారు. ముఖ్యంగా స్నేహ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. హీరోయిన్కు ఏమాత్రం తగ్గని సౌందర్యం అంటూ పొడగ్తలతో ముంచెత్తుతున్నారు. చదవండి: ఎయిర్పోర్టులో దాడి: అసలేం జరిగిందో వివరించిన సేతుపతి చదవండి: ప్రియుడితో సీక్రెట్ 'రోకా' ఫంక్షన్ చేసుకున్న కత్రినా! View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
ప్రియుడితో కలిసి దీపావళి చేసుకున్న స్టార్ హీరో కూతురు
Ira Khan Celebrates Diwali With Boyfriend Nupur Shikhare: బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ గత కొంతకాలంగా నుపూర్ షిఖరేతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది దీపావళి సందర్భంగా తొలిసారి తన ప్రియుడిని పరిచయం చేసింది ఇరా. ఇక అప్పటినుంచి వీరిద్దరి డేటింగ్ వ్యవహారం బీటౌన్లో హాట్టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఏడాది దీపావళి పండుగను సైతం ప్రియుడు నుపూర్తో సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా అతడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. నుపూర్ తల్లి ప్రీతమ్ శిఖరే కూడా ఈ వేడుకల్లో పాల్గొంది. ఇక నుపూర్ బాలీవుడ్లో పలువురు స్టార్లకు ఫిట్నెస్ ట్రైనర్గా ఉన్నారు. సుస్మితా సేన్కు గత పదేళ్లుగా ట్రైనర్గా ఉన్నారు. ఆమిర్ ఖాన్కు నుపూర్ ఫిట్నెస్ ట్రైనర్గా ఉన్నాడు. అనంతరం ఐరాకు కూడా ఆయన కోచ్గా మారాడు. ఈ సమయంలోనే వారిద్దరు ప్రేమలో పడ్డారు. View this post on Instagram A post shared by Popeye ⚓ (@nupur_shikhare) -
మెగా కోడలు ఉపాసన దీపావళి వేడుకలో సమంత సందడి, ఫొటోలు వైరల్
Samantha Diwali Celebration With Upasana Konidela: విడాకుల అనంతర ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది సమంత. ఇందులో భాగంగానే తన క్లోజ్ ఫ్రెండ్ అయిన మోడల్ శిల్పారెడ్డితో ఎక్కువ సమయంలో గడుపుతున్నారు. ఈ క్రమంలో దీపావళి పండగను కూడా శిల్పారెడ్డి కుటుంబంతో కలిసి సెలబ్రెట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మెగా కోడలు ఉపాసన నిర్వహించిన దీపావళి వేడుకల్లో సామ్ తలుక్కుమన్నారు. చదవండి: దీపావళి సందర్భంగా భావోద్వేగానికి లోనైన సమంత, ఏం చెప్పిందంటే.. తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి మెగా కోడలి ఉప్సీ దీవాళి వేడుకల్లో సామ్ సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉపాసన తన ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేశారు. అలాగే ఈ వేడుకలో రామ్ చరణ్, ఉపాసనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇందులో ఉపాసన తల్లి, చెల్లితో పాటు పలువురు ప్రముఖులతో సినీ నటీనటులు పాల్గొన్నారు. చదవండి: చదవండి: రెమ్యునరేషన్ భారీగా పెంచిన సమంత.. ఒక్కో సినిమాకు ఎంతంటే.. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
దీపావళి సందర్భంగా భావోద్వేగానికి లోనైన సమంత, ఏం చెప్పిందంటే..
దీపావళి పండగ సందర్భంగా సమంత భావోద్వేగానికి లోనయ్యారు. ఈ పండగను తన స్నేహితురాలి కుటుంబంతో కలిసి సమంత సెలబ్రెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అది చూసి సమంత సంతోషంగా ఉందని అందరూ భావించారు, కానీ కాసేపటికే సమంత ఓ పోస్ట్ షేర్ చేస్తూ తన ఒంటరితనాన్ని గుర్తు చేసుకున్నారు. ‘ఈ ఏడాది దీపావళి కాంతులు లేని ఇల్లు. అక్కడ స్వీట్లలోని కమ్మదనం రుచించనప్పుడు. సంవత్సరం ప్రారంభంలో చవిచూసిన నష్టం.. దీంతో ప్రతి సందర్భం(పండగలు, వేడుకలు) చిన్నవిగా అనిపిస్తున్నాయి. అతి త్వరలోనే సంతోషాలు వస్తాయేమోనని తెలుసు. కానీ మీరు త్వరలోనే మళ్లీ ఆనందం పొందాలని ఆశిస్తున్నా’ అంటూ బరువెక్కిన హృదయంతో ఇన్స్టా స్టోరీ షేర్ చేశారు సమంత. చదవండి: ‘జై భీమ్’లో సినతల్లిగా కనిపించిన నటి ఎవరూ, ఆమె అసలు పేరేంటో తెలుసా! కాగా నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత ఏం చెప్పాలన్నా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. బాధను, భావోద్యేగాలు, సంతోషాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమంత ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ప్రతి పోస్ట్ వార్తల్లో నిలుస్తోంది. ఇక విడాకుల ప్రకటన అనంతరం ఆ బాధ నుంచి బయటపడేందుకు సమంత ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తన క్లోజ్ ఫ్రెండ్, మోడల్ శిల్పారెడ్డి కుటుంబంతోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఇటీవల శిల్పారెడ్డితో కలిసి సామ్ ఛార్దామ్ యాత్రకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: సమంత మరో సంచలన నిర్ణయం! ఇప్పుడు కూడా దీపావళి పండగను కూడా శిల్పారెడ్డి కుటుంబంతో కలిసి సామ్ సెలబ్రెట్ చేసుకున్నారు. అలాగే వీరిద్దరూ కలిసి మెగా కోడలు ఉపాసనలతో నిర్వహించిన దీపావళి వేడుకలో పాల్గొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఉపాసన తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అలాగే సమంత కూడా శిల్పా కుటుంబంతో కలిసి ఉన్న ఫొటోలను పంచుకున్నారు. ఈ మేరకు ఎప్పటిలాగే కొన్ని మోటివేషనల్ లైన్స్తో ఉన్న ఓ పోస్ట్ కూడా షేర్ చేశారు. ‘ఆనందాన్ని మించిన ధనం లేదు. మనశ్శాంతిని మించిన విజయం లేదు, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. దయా గుణాన్ని మించిన చల్లదనం లేదు’ అని పంచుకున్నారు సమంత. చదవండి: కుటుంబ సభ్యులతో సాయిధరమ్ తేజ్ View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
రూమర్డ్ గర్ల్ఫ్రెండ్తో సల్మాన్ దీపావళి సంబరాలు
గతేడాది కరోనా కారణంగా దీపావళి పండగ సెలబ్రెషన్స్ను ఎవరు అంతగా జరుపుకోలేకపోరు. ఇక ఈ ఏడాది పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఈ దివాళిని రెట్టింపు సంతోషంతో జరుపుకున్నారు. ఇక సినీ తారల సందడి అయితే మామూలుగా లేదు. తమ కుటుంబాలతో కలిసి పూజలు, టాపాసులు పేల్చి ఘనంగా ఈ దీవాళిని జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ‘భాయిజాన్’ సల్మాన్ ఖాన్ కూడా తన కుటుంబ సభ్యులు, రూమార్డ్ గర్ల్ఫ్రెండ్ లూలియా వాంటూర్లుతో కలిసి పండగను సెలబ్రెట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలో నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. చదవండి: స్టార్ హీరోలపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ ముంబైలోని తన నివాసంలో దీపావళి వేడుకలను ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ హాజరయ్యారు. ఈ వేడుకల్లో సల్మాన్ ఖాన్ అతడి రూమర్డ్ గర్ల్ఫ్రెండ్ లూలియా వాంటూర్లు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. సల్మాన్ ఖాన్ బ్లాక్ టీ షర్ట్, డెనిమ్ జీన్స్లో సింపుల్గా కనిపించగా..లూలియా వాంటూర్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. ఎంబ్రాయిడరీ డిజైన్తో రూపొందించిన అనార్కలీ షూట్, బంగారు ఆభరణాలు ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ వేడుకకు డేవిడ్ ధావన్-కరుణ ధావన్ దంపతులు కూడా హజరయ్యారు. వారితో సల్మాన్ ఖాన్ గేటు దగ్గర నుంచి స్వాగతం పలికి వారితో కాసేపు ముచ్చటించాడు. చదవండి: ఆ స్టార్ హీరో వల్లే ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు: టబు -
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి దీపావళి సంబరాలు
-
దీపావళి వేడుకల్లో పలు చోట్ల బాణాసంచా ప్రమాదాలు
-
హైదరాబాద్ ఛత్రినాక పేలుడు కేసులో కొత్త కోణం
-
దీపావళి సర్ప్రైజ్: తనయులతో జూ. ఎన్టీఆర్, ఫొటో వైరల్
దీపావళి సందర్భంగా జూ.ఎన్టీఆర్ తన ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చాడు. పండగ రోజున తనయులు అభయ్ రామ్, భరత్ రామ్లతో కలిసి దిగిన ఫొటోను తారక్ షేర్ చేసి ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో ముగ్గురు ఒకే రకమైన సంప్రాదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. ఇక తనయులతో తమ అభిమాన హీరోని చూసి ఫ్యాన్స్ అంతా తెగ మురిసిపోతున్నారు. దీంతో ఈ ఫొటోను పలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. చదవండి: సమంత మరో సంచలన నిర్ణయం! అలాగే అబ్బాయిలు ముద్దుగా ఉన్నారంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.. ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా తారక్ తన వ్యక్తిగత విషయాలను జాప్యంగా ఉంచుతాడు. అలాగే అభయ్ రామ్, భరత్ రామ్లను మీడియాకు దూరంగా ఉంచుతాడు. వారి ఫొటోలను కూడా చాలా అరుదుగా షేర్ చేస్తుంటాడనే విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం తారక్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో బిజీగా ఉన్నాడు.ఈ మూవీ అనంతరం ఆయన కొరటాల శివ కాంబినేషన్లో వచ్చే ఓ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాకు సంతకం చేశాడు. చదవండి: దీపావళికి జిగేల్మన్న తారలు, చూసేయండి ఫొటోలు View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
చిన్నారుల కేరింతలతో దీపావళి సంబరాలు
-
పండగపూట తన ఇష్టాన్ని తెలిపిన రోజా
-
విజయవాడలో మొదలైన దీపావళి సందడి
-
టాపు లేపుతున్న టపాసుల ధరలు
-
ఏలూరు లో సందడిగా కనిపిస్తున్న బాణాసంచా దుకాణాలు
-
తుమ్మలకుంటలో నరకాసుర వధ నిర్వహించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
-
హైదరాబాద్లో దీపావళి సందడి
-
Diwali Special: స్వీట్ ఫ్రిట్టర్స్, మూంగ్ హల్వా ఇలా తయారు చేసుకోండి..
దీపావళి పర్వదినాన ఈ స్వీట్లతో మీ నోరు తీపిచేసుకోండి..! స్వీట్ ఫ్రిట్టర్స్ కావల్సిన పదార్థాలు బియ్యం – కప్పు అరటి పండ్లు – రెండు (తొక్కతీసి ముక్కలుగా తరగాలి) యాలకులు – మూడు, బెల్లం – ముప్పావు కప్పు నీళ్లు – రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి – టేబుల్ స్పూను ఎండుకొబ్బరి ముక్కలు – రెండు టేబుల్ స్పూన్లు సొంఠి పొడి – పావు టీస్పూను నువ్వులు – టీస్పూను బేకింగ్ సోడా – టీస్పూను ఉప్పు – చిటికడు ఆయిల్ లేదా నెయ్యి – డీప్ఫ్రైకి సరిపడా తయారీ విధానం ►ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. ►నానిన బియ్యాన్ని నీళ్లు తీసేసి, మిక్సీజార్లోకి తీసుకోవాలి. దీనిలో అరటిపండు ముక్కలు, యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ►ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి బెల్లం, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి మీడియం మంట మీద సిరప్ తయారయ్యాక స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ►బెల్లం సిరప్ను వడగట్టి, గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం మిశ్రమంలో వేసి దోశ పిండిలా కలుపుకోవాలి. ►చిన్న పాన్ పెట్టి టీస్పూను నెయ్యి వేసి కొబ్బరి ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంతవరకు వేయించాలి. ►ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలను నెయ్యితోపాటు పిండిలో వేయాలి. నువ్వులు, సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ►ఇప్పుడు మౌల్డ్స్లో నెయ్యి లేదా నూనె వేసి కాగాక బ్యాటర్ను వేసి సన్నని మంట మీద ఐదు నిమిషాలు వేగనివ్వాలి. ►మరోవైపు తిప్పి గోల్డెన్ బ్రౌన్కలర్లోకి మారేంత వరకు వేయించితే ఉన్ని అప్పం రెడీ. చదవండి: Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్ ఇచ్చారంటే.. దిల్ ఖుష్!! మూంగ్ హల్వా కావల్సిన పదార్థాలు నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు చాయ పెసరపప్పు – అరకప్పు (కడిగిపెట్టుకోవాలి) నీళ్లు – రెండు కప్పులు నెయ్యి – అరకప్పు గోధుమ పిండి – రెండు టేబుల్ స్పూన్లు పంచదార – ముప్పావు కప్పు ఫుడ్ కలర్ – చిటికెడు యాలకుల పొడి – పావు టీస్పూను జీడిపలుకులు – రెండు టేబుల్ స్పూన్లు కిస్మిస్లు – రెండు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►స్టవ్ మీద ప్రెజర్ కుకర్ పెట్టి వేడెక్కిన తరువాత టీస్పూను నెయ్యి వేసి పెసరపప్పును దోరగా వేయించాలి. ►తరువాత రెండు కప్పుల నీళ్లుపోయాలి, కుకర్ మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. ►పప్పు చల్లారాక మిక్సీజార్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ∙స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని పావుకప్పు నెయ్యి, గోధుమ పిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ వేయించాలి. ►పిండి వేగిన తరువాత పప్పు మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉడికించాలి. ►ఐదు నిమిషాల తరువాత ముప్పావు కప్పు పంచదార వేసి సన్నని మంట మీద పదిహేను నిమిషాల పాటు తిప్పుతూ ఉడికించాలి. ►ఇప్పుడు పప్పు మిశ్రమం బాగా ఉడికి బాణలికి అంటుకోకుండా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో ఫుడ్ కలర్ వేసి మరో ఇరవై నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. ►స్టవ్మీద మరో పాన్ పెట్టి టేబుల్ స్పూను నెయ్యి, జీడిపలుకులు, కిస్మిస్లు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంతవరకు వేయించి హల్వాలో వేయాలి. యాలకులపొడి వేసి రెండు నిమిషాలు తిప్పితే మూంగ్ హల్వా రెడీ. చదవండి: Diwali Lakshmi Puja 2021: ఈ 5 చోట్ల దీపాలు తప్పక వెలిగించాలట..! -
Diwali Lakshmi Puja 2021: ఈ 5 చోట్ల దీపాలు వెలిగిస్తే మంచిది..!
చీకటిపై వెలుతురు విజయం సాధించినందుకు, చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా జరుపుకునే పర్వదినమే దీపావళి. లోకాన్నంతటినీ పట్టి పీడిస్తున్న నరకాసురుడనే దుష్ట దానవుని అంతమొందించిన వెలుగుల పండుగ దీపావళి. సాధారణంగా అమావాస్యనాడు చిక్కటి చీకట్లు అలముకుని ఉంటాయి. అయితే దీపావళి అమావాస్యనాడు మాత్రం అంతటా వెలుగుపూలు విరగపూస్తాయి. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా అందరి ఇంట ఉల్లాసం, ఉత్సాహం వెల్లివిరుస్తాయి. ముంగిళ్లన్నీ దీపకాంతులతో కళకళలాడతాయి. ఈ పర్వదినం ప్రాముఖ్యత, ఆచార సంప్రదాయాలను తెలుసుకుని ఆచరిద్దాం... నిత్యం హారతి పాటలు, శంఖం, ఘంటానాదాలు వినిపించే ఇంట్లోనూ, పరిశుభ్రంగానూ, అందంగానూ కనిపించే ఇంటిలోనూ, గోవులు, గోశాలలు, పుష్పగుచ్ఛాలు, వజ్రవైఢూర్యాలు, సుగంధ ద్రవ్యాలు, సమస్త శుభప్రద, మంగళకర ద్రవ్యాలలోనూ, వేదఘోష వినిపించే ప్రదేశాలలోనూ, స్త్రీ సుఖశాంతులతో తులతూగే చోట, శ్రీమన్నారాయణుని, తులసి ని పూజించే ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకుంటుందని శాస్త్రోక్తత.. రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగానూ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగానూ, విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుని తన గోళ్లతో చీల్చి చంపి, హరి భక్తుల కష్టాలను తొలగించినందుకు కృతజ్ఞతగానూ – ఇలా దీపావళికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. అయితే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై... లోకకంటకుడైన నరకాసురుని వధించిన సందర్భంగా మాత్రమే దీపావళి జరుపుకుంటున్నామనే కథే బహుళ ప్రాచుర్యంలో ఉంది. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! నరకుడు చస్తే పండుగ ఎందుకు? నరకుడు అంటే హింసించేవాడు అని అర్థం. ప్రాగ్జ్యోతిషపురమనే రాజ్యాన్ని పాలించేరాజై ఉండి కూడా అసూయతో దేవతల తల్లి అదితి కర్ణకుండలాలను, వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు. దేవతలను, మానవులను, మునులను హింసించేవాడు. దేవతల మీదికి పదేపదే దండెత్తేవాడు. వాడు పెట్టే హింసలు భరించలేక అందరూ కలసి శ్రీకృష్ణుని దగ్గర మొరపెట్టుకోగా, కృష్ణుడు వాడిని సంహరిస్తానని మాట ఇచ్చి, యుద్ధానికి బయలుదేరాడు. ప్రియసఖి సత్యభామ తాను కూడా వస్తానంటే వెంటబెట్టుకెళ్లాడు. యుద్ధంలో అలసిన కృష్ణుడు ఆదమరచి, అలసట తీర్చుకుంటుండగా అదను చూసి సంహరించబోతాడు నరకుడు. అది గమనించిన సత్యభామ తానే స్వయంగా విల్లందుకుని వాడితో యుద్ధం చేస్తుంది. ఈలోగా తేరుకున్న శ్రీకృష్ణుడు సుదర్శనచక్రాన్ని ప్రయోగించి, వాడిని సంహరిస్తాడు. లోక కంటకుడైన నరకాసురుని వధ జరిగిన వెంటనే ఆ దుష్టరాక్షసుడి పీడ వదిలిందన్న సంతోషంతో దేవతలు, మానవులు అందరూ వారి వారి లోకాలలో దీపాలను వెలిగించి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అప్పటినుంచి ప్రతి ఏటా దీపావళి పండగ జరుపుకోవడం ఆచారంగా మారింది. దీపావళి నాడు ఏం చేయాలి? ఈ రోజున తెల్లవారు జామునే తలకి నువ్వుల నూనె పెట్టుకొని, తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల మండలను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వ పాపాలను హరింపజేయడమే గాక గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. దీపావళి నాడు విధివిధానంగా లక్ష్మీపూజ చేయాలి. ఎందుకంటే, దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లలో తన కళను ఉంచి వెళుతుందట. అందుకే దీపావళి నాటికి ఇంటిలోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రం చేసి, వీలైనంత అందంగా అలంకరించాలి. చదవండి: Millet Snacks: చిరుధాన్యాలతో చిరుతిళ్ల వ్యాపారం!.. కోట్లలో లాభం.. దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి? దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి. అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పెద్ద వయసున్న చెట్ల వద్ద, ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే నాలుగు వీధుల కూడలిలో (నాలుగు రోడ్లు కలిసే ప్రదేశంలో) దీపం వెలిగించాలి. నువ్వుల నూనె దీపాలనే వెలిగించడం, మట్టి ప్రమిదలనే వాడడం శ్రేష్ఠం. దీపావళి పితృదేవతలకు సంబంధించిన పండుగ కూడా. దీపావళినాటి సాయంత్రం గోగు కాడల మీద దివిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయని, తద్వారా పితృదేవతలు సంతోషిస్తారని, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుందనీ విశ్వాసం. తరువాత అలక్ష్మి (దరిద్రం) తొలగడానికి లక్ష్మీ పూజ చేయాలి. దీపావళీ అర్ధరాత్రి 12 గంటలకు చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళ తోనూ, డిండిమం అనే వాద్యాన్ని వాయిస్తూ జ్యేష్ఠాలక్ష్మిని (దరిద్ర దేవతను) సాగనంపాలని శాస్త్రవచనం. లక్ష్మీపూజ ఇలా చేయాలి... ఇంటిగుమ్మాలను మామిడి లేదా అశోకచెట్టు ఆకుల తోరణాలతోనూ, ముంగిళ్లను రంగవల్లులతోనూ తీర్చిదిద్దాలి. అనంతరం... ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద కొత్త కండువా పరిచి, బియ్యం పోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచాలి. కలశం పెట్టే అలవాటున్న వారు ఆనవాయితీ తప్పకూడదు. ఆ ఆచారం లేనివారు అమ్మవారిని ధ్యానావాహనాది షోడశోపచారాలతో పూజించాలి. వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దు పుస్తకాలను ఉంచాలి. మిగిలినవారు నాణాలను, నూతన వస్త్రాభరణాలను, గంధ పుష్పాక్షతలను, మంగళకరమైన వస్తువులను ఉంచి యథాశక్తి పూజించాలి. లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్యష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామరపువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. ఎన్నో కథలు... మరెన్నో కారణాలు.. లోకంలోని చీకట్లను పారదోలి వెలుగు పూలతో నింపే సుదినం ఇది. భగవంతుడు పరంజ్యోతి స్వరూపుడు. జ్ఞానప్రదాత. మహాలక్ష్మి దీపకాంతులలో జ్యోతి తేజస్సుతో విరాజిల్లుతుంటుంది. అందుకే దీపావళి రోజున గృహాన్నంతటినీ దీపతోరణాలతో అలంకరిస్తారు. దీపాలు వెలిగించి చీకట్లను పారద్రోలే వేడుక స్త్రీదైతే, ఉన్నంతలో దానధర్మాలు చేసే బాధ్యత పురుషులది, పరిసరాలను వెలుగులతో నింపే ఉత్సాహం పిల్లలది. దీపాలను మన ఇంటిలోనే కాదు, ఇరుగు పొరుగు ఇళ్లలోనూ, దేవాలయాలలోనూ కూడా ఉంచి, పరహితంలో పాలు పంచుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ దీపావళి అందరికీ భోగభాగ్యాలను ప్రసాదించి, సుఖసంతోషాలు కలిగించాలని కోరుకుందాం. – డి.వి.ఆర్.భాస్కర్ చదవండి: Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్ ఇచ్చారంటే.. దిల్ ఖుష్!! -
దీపావళి నోము: మనోబలానికి సంకల్పం
‘ఏ పని తలపెడుతున్నామో అది పూర్తయ్యేంతవరకు మనలో సంకల్పం బలంగా ఉండాలి’ అంటారు పెద్దలు. కుటుంబ శ్రేయస్సుకు తపించే మనసుకు తగినంత బలం అందాలంటే అందుకు దైవ శక్తి కూడా తోడవ్వాలి అనేది పండితుల వాక్కు. అందుకే, అనాది నుంచి కుటుంబ క్షేమం కోసం చేసే దైవారాధనలలో నోములు, వ్రతాలు మన జీవనంలో ఓ భాగమయ్యాయి. వాటిలో కొన్ని ప్రాంతాలలో దీపావళి రోజున చేసుకునే కేదారేశ్వర వ్రతం (నోము)కు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ నోమును సాక్షాత్తు పార్వతీదేవే నోచిందని, పరమేశ్వరుడి అనుగ్రహం పొందిందని పురాణోక్తి. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతీ దేవి కేదారేశ్వర వ్రతాన్ని ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమినాడు మొదలుపెట్టి అమావాస్య వరకు ఆచరించినట్టుగా చెబుతారు. ఈ వ్రతాన్ని స్త్రీలు చాలా వరకు దీపావళి అమావాస్య రోజున ఉపవాస దీక్షతో భక్తిశ్రద్ధలతో గౌరీ సమేత కేదారేశ్వరుడిని పూజించి, ఆ ఆది దంపతుల కృపను పొందుతుంటారు. కల్పవల్లి.. పాలవెల్లి.. పీఠం మధ్యన ధాన్యరాశిని పోసి, అందులో పూర్ణకుంభాన్ని ఉంచి, ఇరవై ఒక్క దారాలతో సూత్రాన్ని చుట్టి, గంధ పుష్పాక్షతలను ఉంచాలి. పీఠానికి పై భాగాన మామిడి ఆకుల తోరణాలు, పూలతో అలంకరించిన పాలవెల్లిని అమర్చుకోవాలి. పసుపు గౌరి, పసుపు గణపతి. జాకెట్టు ముక్క, నోము దండ, 21 తమలపాకులు, 21 నల్ల పోకలు, 21 ఖర్జూర పండ్లు. వత్తిపత్తి, పసుపు, కుంకుమ, 2 ఎండుకొబ్బరి చిప్పలు, 2 కొబ్బరికాయలు, హారతి కర్పూరం, కంకణం(చేతికి కట్టుకునే తోరం), ధూప, దీప, నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. గౌరీ తనయుడితో ఆరంభం.. ముందుగా గణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడి (పసుపు గణపతిని) ప్రార్థనతో పూజ ప్రారంభించాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకొని, సంకల్పం చెప్పుకోవాలి. కేదారేశ్వరుని ధ్యానం, ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచామృతస్నానం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షతలు, పుష్పాలతో షోడశోపచార పూజ చేయాలి. ఆ తర్వాత అథాంగపూజ, అష్టోత్తర శతనామ పూజ, అధసూత్ర గ్రంధిపూజ చేసి శ్రీ కేదారేశ్వర వ్రత కథ విని, బ్రాహ్మణులు, పెద్దల ఆశీర్వచనం తీసుకుంటారు. ఆ తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని ఉపవాస దీక్షను విరమిస్తారు. అమ్మవారి ప్రతిరూపాలుగా భావించే నోముదండలను మెడలో ధరించి, పసుపు, కుంకుమ, పండు, ఆకు, వక్కలను ముల్తైదువులకు వాయినంగా ఇవ్వడంతో నోము పూర్తవుతుంది. మరుసటి ఏడాది దీపావళి నోము వరకు తమ ఇంట కేదారేశ్వరుని అనుగ్రహంతో ఆయురారోగ్య, సౌభాగ్య, ఐశ్వర్యాభివృద్ధి మెండుగా కలుగుతుందన్న నమ్మకమే కొండంత అండగా భక్తులు తమ జీవనప్రయాణాన్ని కొనసాగిస్తారు. సర్వేజనా సుఖినోభవంతు! -
దీపావళి రోజున ఇలా చేయండి
నిత్యం హారతి పాటలు, శంఖం, ఘంటానాదాలు వినిపించే ఇంట్లోనూ, పరిశుభ్రంగానూ, అందంగానూ కనిపించే ఇంటిలోనూ, గోవులు, గోశాలలు, పుష్పగుచ్ఛాలు, వజ్రవైఢూర్యాలు, సుగంధ ద్రవ్యాలు, సమస్త శుభప్రద, మంగళకర ద్రవ్యాలలోనూ, వేదఘోష వినిపించే ప్రదేశాలలోనూ, స్త్రీ సుఖశాంతులతో తులతూగే చోట, శ్రీమన్నారాయణుని, తులసి ని పూజించే ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకుంటుందని శాస్త్రోక్తి.. చీకటిపై వెలుతురు విజయం సాధించినందుకు, చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా జరుపుకునే పర్వదినమే దీపావళి. లోకాన్నంతటినీ పట్టి పీడిస్తున్న నరకాసురుడనే దుష్ట దానవుని అంతమొందించిన వెలుగుల పండుగ దీపావళి. సాధారణంగా అమావాస్యనాడు చిక్కటి చీకట్లు అలముకుని ఉంటాయి. అయితే దీపావళి అమావాస్యనాడు మాత్రం అంతటా వెలుగుపూలు విరగపూస్తాయి. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా అందరి ఇంట ఉల్లాసం, ఉత్సాహం వెల్లివిరుస్తాయి. ముంగిళ్లన్నీ దీపకాంతులతో కళకళలాడతాయి. ఈ పర్వదినం ప్రాముఖ్యత, ఆచార సంప్రదాయాలను తెలుసుకుని ఆచరిద్దాం... రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగానూ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగానూ, విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుని తన గోళ్లతో చీల్చి చంపి, హరి భక్తుల కష్టాలను తొలగించినందుకు కృతజ్ఞతగానూ – ఇలా దీపావళికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. అయితే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై... లోకకంటకుడైన నరకాసురుని వధించిన సందర్భంగా మాత్రమే దీపావళి జరుపుకుంటున్నామనే కథే బహుళ ప్రాచుర్యంలో ఉంది. నరకుడు చస్తే పండుగ ఎందుకు? నరకుడు అంటే హింసించేవాడు అని అర్థం. ప్రాగ్జ్యోతిషపురమనే రాజ్యాన్ని పాలించేరాజై ఉండి కూడా అసూయతో దేవతల తల్లి అదితి కర్ణకుండలాలను, వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు. దేవతలను, మానవులను, మునులను హింసించేవాడు. దేవతల మీదికి పదేపదే దండెత్తేవాడు. వాడు పెట్టే హింసలు భరించలేక అందరూ కలసి శ్రీకృష్ణుని దగ్గర మొరపెట్టుకోగా, కృష్ణుడు వాడిని సంహరిస్తానని మాట ఇచ్చి, యుద్ధానికి బయలుదేరాడు. ప్రియసఖి సత్యభామ తాను కూడా వస్తానంటే వెంటబెట్టుకెళ్లాడు. యుద్ధంలో అలసిన కృష్ణుడు ఆదమరచి, అలసట తీర్చుకుంటుండగా అదను చూసి సంహరించబోతాడు నరకుడు. అది గమనించిన సత్యభామ తానే స్వయంగా విల్లందుకుని వాడితో యుద్ధం చేస్తుంది. ఈలోగా తేరుకున్న శ్రీకృష్ణుడు సుదర్శనచక్రాన్ని ప్రయోగించి, వాడిని సంహరిస్తాడు. లోక కంటకుడైన నరకాసురుని వధ జరిగిన వెంటనే ఆ దుష్టరాక్షసుడి పీడ వదిలిందన్న సంతోషంతో దేవతలు, మానవులు అందరూ వారి వారి లోకాలలో దీపాలను వెలిగించి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అప్పటినుంచి ప్రతి ఏటా దీపావళి పండగ జరుపుకోవడం ఆచారంగా మారింది. దీపావళి నాడు ఏం చేయాలి? ఈ రోజున తెల్లవారు జామునే తలకి నువ్వుల నూనె పెట్టుకొని, తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల మండలను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వ పాపాలను హరింపజేయడమే గాక గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. దీపావళి నాడు విధివిధానంగా లక్ష్మీపూజ చేయాలి. ఎందుకంటే, దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లలో తన కళను ఉంచి వెళుతుందట. అందుకే దీపావళి నాటికి ఇంటిలోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రం చేసి, వీలైనంత అందంగా అలంకరించాలి. దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి? దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి. అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పెద్ద వయసున్న చెట్ల వద్ద, ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే నాలుగు వీధుల కూడలిలో (నాలుగు రోడ్లు కలిసే ప్రదేశంలో) దీపం వెలిగించాలి. నువ్వుల నూనె దీపాలనే వెలిగించడం, మట్టి ప్రమిదలనే వాడడం శ్రేష్ఠం. దీపావళి పితృదేవతలకు సంబంధించిన పండుగ కూడా. దీపావళినాటి సాయంత్రం గోగు కాడల మీద దివిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయని, తద్వారా పితృదేవతలు సంతోషిస్తారని, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుందనీ విశ్వాసం. తరువాత అలక్ష్మి (దరిద్రం) తొలగడానికి లక్ష్మీ పూజ చేయాలి. దీపావళీ అర్ధరాత్రి 12 గంటలకు చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళ తోనూ, డిండిమం అనే వాద్యాన్ని వాయిస్తూ జ్యేష్ఠాలక్ష్మిని (దరిద్ర దేవతను) సాగనంపాలని శాస్త్రవచనం. లక్ష్మీపూజ ఇలా చేయాలి... ఇంటిగుమ్మాలను మామిడి లేదా అశోకచెట్టు ఆకుల తోరణాలతోనూ, ముంగిళ్లను రంగవల్లులతోనూ తీర్చిదిద్దాలి. అనంతరం... ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద కొత్త కండువా పరిచి, బియ్యం పోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచాలి. కలశం పెట్టే అలవాటున్న వారు ఆనవాయితీ తప్పకూడదు. ఆ ఆచారం లేనివారు అమ్మవారిని ధ్యానావాహనాది షోడశోపచారాలతో పూజించాలి. వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దు పుస్తకాలను ఉంచాలి. మిగిలినవారు నాణాలను, నూతన వస్త్రాభరణాలను, గంధ పుష్పాక్షతలను, మంగళకరమైన వస్తువులను ఉంచి యథాశక్తి పూజించాలి. లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్యష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామరపువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. ఎన్నో కథలు... మరెన్నో కారణాలు.. లోకంలోని చీకట్లను పారదోలి వెలుగు పూలతో నింపే సుదినం ఇది. భగవంతుడు పరంజ్యోతి స్వరూపుడు. జ్ఞానప్రదాత. మహాలక్ష్మి దీపకాంతులలో జ్యోతి తేజస్సుతో విరాజిల్లుతుంటుంది. అందుకే దీపావళి రోజున గృహాన్నంతటినీ దీపతోరణాలతో అలంకరిస్తారు. దీపాలు వెలిగించి చీకట్లను పారద్రోలే వేడుక స్త్రీదైతే, ఉన్నంతలో దానధర్మాలు చేసే బాధ్యత పురుషులది, పరిసరాలను వెలుగులతో నింపే ఉత్సాహం పిల్లలది. దీపాలను మన ఇంటిలోనే కాదు, ఇరుగు పొరుగు ఇళ్లలోనూ, దేవాలయాలలోనూ కూడా ఉంచి, పరహితంలో పాలు పంచుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ దీపావళి అందరికీ భోగభాగ్యాలను ప్రసాదించి, సుఖసంతోషాలు కలిగించాలని కోరుకుందాం. – డి.వి.ఆర్.భాస్కర్ -
హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ!!
-
వెలుగుల రికార్డుకు అయోధ్య సిద్ధం
-
Diwali: దీపావళి రెండు గంటలే.. హైకోర్టు కీలక ఆదేశాలు
భువనేశ్వర్: దీపావళి సంబరాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేవలం రెండు గంటలు మాత్రమే దీపావళి జరుపుకోవాలని సూచించింది. దీంతో రాత్రి 8 నుంచి 10 గంటల వరకే టపాసులు పేల్చేందుకు అనుమతి ఇవ్వనున్నారు. కరోనా విజృంభణకు తావులేకుండా వేడుకల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టాలని గతంలో సుప్రీంకోర్టు సూచించింది. బేరియమ్ సాల్ట్స్తో తయారైన బాణసంచా వినియోగాన్ని నిషేధించాలని సుప్రీంకోర్టు అక్టోబరు 29వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పండగ నిర్వహణపై సోమవారం తుది తీర్పు వెల్లడించిన హైకోర్టు కోవిడ్–19 వ్యాప్తి కట్టడి దృష్ట్యా సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) జారీచేసిన మార్గదర్శకాల పరిధిలో రాష్ట్రంలో బాణసంచా క్రయ విక్రయాలు, వినియోగానికి సంబంధించి నిర్దిష్టమైన మార్గదర్శకాలను దాఖలు చేయాలని రాష్ట్ర ప్రత్యేక సహాయ కమిషనర్ ఎస్ఆర్సీని కోరింది. దీనికోసం రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు, కటక్–భువనేశ్వర్ జంట నగరాల పోలీస్ కమిషనరేట్తో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి హైకోర్టు ఆదేశించింది. బాణసంచా క్రయ విక్రయాల అనుమతి అభ్యర్థనతో అఖిల ఒడిశా ఫైర్వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ పురస్కరించుకుని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(పెసో) ఆమోదించిన హరిత బాణసంచా క్రయవిక్రయాలు, వినియోగానికి ధర్మాసనం అనుమతించడం విశేషం. చదవండి: (నా చేతులతో ఎత్తుకుని ఆడించా.. ఈ బాధలు ఎవరికీ రాకూడదు: శివ రాజ్కుమార్) -
సింగపూర్ తెలుగు సమాజం 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ప్రపంచంలోనే భారతదేశం వెలుపల తెలుగు వారి కోసమే స్థాపించబడిన అతి కొద్ది ప్రాచీన సంస్థలలో ఒక్కటైన సింగపూర్ తెలుగు సమాజం ఎప్పటికప్పుడు తన జవసత్వాలను కూడగట్టుకొంటూ, దిన దిన ప్రవర్ధమానంగా విరాజిల్లుతూ 46వ వసంతంలోనికి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. గాన గంధర్వుడు పద్మ భూషణ్ బాల సుబ్రహ్మణ్యానికి, నాట్యమయూరి పద్మశ్రీ శోభా నాయుడికి ఘన నివాళి అర్పిస్తూ.. అంతర్జాల వేదికపై సింగపూర్ తెలుగు సమాజం 45వ ఆవిర్భావ దినోత్సవం, దీపావళి వేడుకల కార్యక్రమం నిర్వహించారు. చదవండి: సింగపూర్లో సద్దుల బతుకమ్మ సంబరాలు ఆధ్యాంతం తెలుగుదనం, తెలుగు కళలు, సాహిత్యం ఉట్టిపడుతూ సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు మూడు తరాల ఆహుతులను ఎంతగానో అలరించాయి. కార్యక్రమానికి హాజరైన సమాజ పెద్దలు అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకొని ఆ అనుభవాలను అందరితో పంచుకొన్నారు. అంతేకాకుండా 45 వసంతాల సమాజ ప్రస్థానాన్ని, మధురానుభూతులను , గత సంవత్సర కాలంలో సమాజం నిర్వహించిన కార్యక్రమాలను బుర్రకధ రూపకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో 3000 మంది ప్రేక్షకులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిధి సందేశం, పూర్వపు కార్యనిర్వాహక సభ్యుల ఉపన్యాసాలు, చెప్పుకోండి చూద్దాం, పాటలు, రాజు కామెడీ, బుర్రకథలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు గాయకులు ప్రవీణ్ కుమార్ కొప్పోలుకి, గాయని సత్యకి, మిమిక్రీ రాజుకి, యాంకర్ నవతకి, బుర్రకథ విజయకుమార్ బృందానికి , ఆర్కెస్ట్రా వెంకటేష్ బృందానికి, తమ బిజీ షెడ్యూల్లో కొంత విలువైన సమయాన్ని వెచ్చించి, అమూల్యమైన సందేశం అందించిన ఇండియన్ హై కమీషనర్ ఇన్ సింగపూర్ పి. కుమరన్, సింగపూర్ తెలుగు సమాజం వారు ఏర్పాటు చేసిన ఛార్టర్డ్ ఫ్లైట్స్ విషయంలో వారు చేసిన సహాయ సహకారాలకు సింగపూర్ తెలుగు సమాజం ప్రెసిడెంట్ కోటి రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు సమాజ కీర్తిని, ప్రజలకు మెరుగైన సేవల్ని అత్యున్నత స్థాయిలో ఇవ్వటానికి తమ కమిటీ నిరంతరం శ్రమిస్తున్నదని తెలిపారు. సింగపూర్లో ఉండే తెలుగు వారందరూ సమాజ సభ్యులుగా చేరాలని , ఎల్లప్పుడూ కలసికట్టుగా ఉండాలని కోరారు. తెలుగు భవన నిర్మాణ కలను సాకారం చేసుకొనే దిశగా అందరూ తప్పకుండా సహాయ సహకారాలందించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్టీఎస్ పూర్వ కార్యదర్శులు, కోశాధికారులు 45 ఏళ్లుగా సమాజంతో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ సందేశాలు పంపినందుకు, కార్యక్రమానికి మా వెన్నంటి ఉన్న స్పాన్సర్లు శుభోదయం గ్రూప్కు, లగ్జరీ టూర్స్ అండ్ ట్రావెల్స్కు,హమారా బజార్కు, సెక్రటరీ సత్య చిర్ల ధన్యవాదాలు తెలిపారు. రమ్య బెహెరా పాడిన అమ్మవారి పాటను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించిన శుభోదయం మీడియాకు, ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కృషి చేసిన సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గ సభ్యులకు, కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికి కార్యక్రమ నిర్వాహకురాలు కురిచేటి స్వాతి కృతఙ్ఞతలు తెలియజేశారు. -
రామ్ చరణ్తో కేక్ కట్ చేయించిన మనోజ్
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న కుమారుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన మంచు మనోజ్ విభిన్న కథాపరమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘దొంగ దొంగది’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన మనోజ్ 2017లో విడుదలైన ఒక్కడు మిగిలాడు సినిమాలో చివరగా కనిపించాడు. అప్పటి వరకు అంతా సవ్యంగా ఉన్నా కూడా ఉన్నట్లుండి భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు షాక్ అయ్యారు. దీంతో దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. అప్పటి వరకు సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్ సుదీర్ఘ విరామం తరువాత ‘అహం బ్రహ్మస్మి’తో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇది మనోజ్కు కంబ్యాక్ సినిమా అనే చెప్పాలి. చదవండి: చలికి వెరవని జక్కన్న టీం ఈ క్రమంలో దీపావళి పర్వ దినాన్ని మంచు మనోజ్ తన ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్ అయిన రామ్ చరణ్తో జరుపుకున్నారు. మనోజ్ తన సోదరి మంచు లక్ష్మీ, రామ్ చరణ్తో కలిసి కేక్ కట్ చేశారు. ఈ ఫోటోలను మనోజ్ తన ట్విటర్లో పోస్టు చేశారు. ‘స్వీట్ బ్రదర్ చరణ్, లవ్లీ అక్క లక్ష్మీలతో దీపావళి పండుగ జరపుకోవడం సంతోషఃగా ఉంది’ అని ఆనందం వ్యక్తం చేశారు. వీటితోపాటు దీపావళి అనంతరం వచ్చే భగినీ హస్త భోజనం(భాయ్ దూజ్) వేడుకలను మంచు లక్ష్మీ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు ఇద్దరు తమ్ముళ్లతో (విష్ణు, మనోజ్) కలిసి దిగిన ఫోటోలను వీడియో రూపంలో చేసి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. సోదరులకు భాయ్ దూజ్ శుభాకాంక్షలు తెలుపుతూ మంచు విష్ణు, మనోజ్లే తనక బలమని చెప్పుకొచ్చారు.. Had a great time with my sweetest brother @AlwaysRamCharan and my lovely akka @LakshmiManchu 😍 Celebrated the real Festival of Lights with my Bestiessss ❤️❤️❤️❤️#Diwali #Diwali2020 #SeethaRAMaRajuCHARAN#ManojManchu #LakshmiManchu pic.twitter.com/mlXF5ar62L Happy Bhai Dooj to the 2 Pillars of my Strength! 😇🤗🥰 @iVishnuManchu @HeroManoj1 #LakshmiManchu #LakshmiUnfiltered #BhaiDooj #VishnuManchu #ManojKumarManchu #BrotherLove #PillarsOfStrength #BondForEternity pic.twitter.com/cJES6By30I — Lakshmi Manchu (@LakshmiManchu) November 16, 2020 — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) November 17, 2020 -
సినీ తారల దీపావళి సెలెబ్రేషన్స్
-
గర్వంగా ఉంది : డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్ : దీపావళి వేడుకలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘనంగా జరుపుకున్నారు. వైట్హౌస్లో నిర్వహించిన ఈ వేడుకల్లో ట్రంప్ సతీసమేతంగా పాల్గొన్నారు. అధికారులతో కలిసి దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైట్ హౌస్ సిబ్బందితోపాటు పలువురు భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా చాలా నమ్మకమైన దేశమని, ప్రతిఒక్కరు అమెరికన్ రాజ్యాంగబద్దంగా స్వేచ్ఛగా జీవించేలా తన పాలన కొనసాగినందుకు గర్విస్తున్నానని తెలిపారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటామని గుర్తుచేశారు. దీపావళి కాంతుల్లా.. అమెరికా ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలని, ప్రజలంతా మతాలకు అతీతంగా స్వేచ్ఛగా జీవించాలని ఆకాంక్షించారు. (చదవండి : తుది ఫలితాలు వెల్లడి.. వెనక్కి తగ్గిన ట్రంప్) కాగా, దీపావళి పండుగను పురస్కరించుకుని భారతీయులకు ప్రపంచ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్, అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో అందరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు నిండి ఉండాలని ఆకాంక్షించారు. -
అందుకే అమ్మ వెనుక దాక్కున్నా : వర్మ
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరే సంచలనం. ఎపుడు ఎవరినీ ఏ రకంగా ఎలా గిల్లుతాడో ఆయనకే తెలియదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎదో ఒక విషయం పై వ్యంగ్యంగా స్పందించడం అయన అలవాటు. ఆఖరుకు తనపై తాను కూడా పంచ్లు వేసుకుంటాడు. ఏ పని చేసినా అందరికంటే కాస్త ఢిఫరెంట్గా, వెరైటీగా చేయడం వర్మకు అలవాటు. తాజాగా దీపావళి వేడుకలను కూడా వర్మ తనదైన శైలీలో జరుపుకున్నాడు. తల్లి, సోదరితో కలిసి తన ఇంటి ముందు టపాసులు పేల్చాడు. ఈ సందర్భంగా వర్మ సోదరి చిచ్చుబుడ్లు పేలుస్తుండగా.. భయంతో ఆయన తల్లి చాటుకు వెళ్లాడు. ఈ వీడియోను వర్మ ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ‘ నేను సాధారణంగా చాలా పిరికివాడిని. అందుకే తల్లి వెనుకన దాక్కున్నాను’ అని క్యాప్షన్ ఇచ్చాడు. Me hiding behind my mother because I am basically a coward pic.twitter.com/OsJMpl14EI — Ram Gopal Varma (@RGVzoomin) November 14, 2020 అలాగే వర్మ కూడా స్వయంగా చిచ్చుబుడ్లు కాల్చాడు. ఆ వీడియోని పోస్ట్ చేస్తూ.. దీపావళి సందర్భంగా వాయు,శబ్ధ కాలుష్యానికి నా వంతు సహకారం ఆందిస్తున్నానని వ్యంగ్యంగా చెప్పుకొచ్చాడు. ఇక మరో ట్వీట్లో ‘దీపావళి సందర్భంగా వోడ్కా రుచి చూడమని నా తల్లి, సోదరిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నా’ అంటూ వోడ్కా గ్లాస్ తన తల్లి ఇస్తున్నట్లుగా ఉన్న ఫోటోని అని ట్వీట్ చేశాడు. Me contributing my best to noise and poisonous smoke pollution of HAPPY DIWALI pic.twitter.com/8Ag4JB6pcw — Ram Gopal Varma (@RGVzoomin) November 14, 2020 Me trying to convince my mother and sister to have a vodka sip to spice up the boring occasion of DIWALI pic.twitter.com/9X1zuaIOhH — Ram Gopal Varma (@RGVzoomin) November 14, 2020 -
సైనికులతో ఉన్నప్పుడే నాకు నిజమైన దీపావళి
రాజస్థాన్: సైనికులతో ఉన్నప్పుడే నాకు నిజమైన దీపావళి అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దేశ సైనికులతో కలిసి ఆయన దీపావళి వేడుకలను జరుపుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రధాని మోదీ రాజస్తాన్లోని జైసల్మీర్కు చేరుకున్నారు. అక్కడి లొంగ్వాలాలో జరగనున్న ఈ వేడుకల్లో బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ అస్థానా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ ఎంఎం నరవనే మోదీతో పాటు ఉన్నారు. వీరమరణం పొందిన జవాన్లను నివాళులు అర్పించిన మోదీ..ప్రజలంతా దీపాలు వెలిగించి దేశాన్ని కాపాడుతున్న సైనిక వీరులకు వందనం చేయాలని పిలుపునిచ్చారు. (భారత్లో ప్రపంచ ఆయుర్వేద కేంద్రం) దేశ రక్షణ కోసం సైనికులు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవన్నారు. జవాన్ల కోసం స్వీట్లు, దేశ ప్రజల ప్రేమ తీసుకువచ్చానంటూ మోదీ వ్యాఖ్యానించారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రతీ ఏడాది దీపావళి వేడుకలు దైశ సైనికులతో జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. గతేడాది జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లాలో దీపావళి వేడుకల్లో పాల్గొనగా, 2018లో ఉత్తరాఖండ్ సరిహద్దు సైనికులతో కలిసి మోదీ దీపావళి పండుగను జరుపుకున్నారు. 2017లోనూ ఉత్తర కాశ్మీర్లోని గురేజ్ సెక్టార్లో సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. (కశ్మీర్లో పాక్ దుస్సాహసం) -
ఎకో ఫ్రెండ్లి దీపావళి సెలబ్రేషన్స్ సందడి
-
దీపం లక్ష్మీ స్వరూపం..
కరీంనగర్కల్చరల్/విద్యానగర్(కరీంనగర్): హిందువుల అతి ముఖ్యమైన పర్వదినాల్లో దీపావళి ఒకటి. చీకటి వెలుగుల నిండైన జీవనానికి నిజమైన ప్రతీక లాంటి దీపావళిని ప్రజలు శని, ఆదివారాల్లో ఆనందోత్సాహాల నడుమ జరుపుకోనున్నారు. ఇంటిల్లిపాది, ముఖ్యంగా పిల్లలు ఉత్సాహంగా పాల్గొనే సంబరం ఇది. వ్యాపార సముదాయాల వద్ద లక్ష్మీదేవికి పూజలు నిర్వహంచడం ఆనవాయితీ. బాణసంచాలతో చిమ్మ చీకట్లను చెల్లాచెదురు చేసే సంబరం దీపావళి. దీపం లక్ష్మీ స్వరూపం.. ‘జ్యోతి’ని పరబ్రహ్మ స్వరూపంగా అజ్ఞానాంధకారాన్ని పారదోలి జ్ఞానదీపం వెలిగించి తద్వారా జగశ్శాంతి చేకూరాలని ప్రార్థిస్తాం. దీపావళి అమావాస్య రోజున లక్ష్మీపూజకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. సహస్రనామాలతో, అష్టోత్తరాలతో, దండకాలతో, భక్తి ప్రపత్తులతో లక్ష్మిదేవిని ప్రసన్నురాలిని చేసుకోవడానికి పూజలు చేస్తారు. లక్ష్మీదేవికి పద్మాలయ, పద్మ కమలం, శ్రీః, హరిప్రియ, లోకమాతా, ఇందిరా, మారమా, మంగళదేవతా, భార్గవి, లోకజననీ, క్షీరసాగరకన్యకా అనే పర్యాయ నామాలు ఉన్నాయి. అదే విధంగా అదిలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతాన లక్ష్మి అనే రూపాలున్నాయి. బాణాసంచా కాల్చడంలో జాగ్రత్తలు.. కోవిడ్ దృష్ట్యా సామూహికంగా వేడుకలు జరుపుకోవాలి. శానిటైజర్ రాసుకుని టపాసులు పేల్చవద్దు. టపాసులు ఆరు బయటే కాల్చాలి. వీలైతే ఒక బకెట్ నీటిని ఉంచుకోవడం మరువద్దు. వీధులు, దారులు వెంబడి ప్రయాణించే వారిని దృష్టిలో ఉంచుకోవాలి. బర్నాల్, కాటన్, గొంగడి, ఇసుక వంటివి అందుబాటులో ఉంచాలి. కాకర వొత్తులు, విష్ణుచక్రాలు, భూచక్రాల వంటివి దూరంగా ఉంచి కాల్చడం మంచిది. చైన్ టపాకాయలను చేతిలో పట్టుకొని కాల్చవద్దు. ఇంటి ఆవరణలో, మైదానాల్లో మాత్రమే కాల్చాలి. టపాకాయలను పిల్లలతో పెద్దలు దగ్గర ఉండి కాల్పించాలి. టపాకాయలను వెలిగించి గాలిలో తిప్పడం, విసరడం చేయవద్దు. వ్యాపారులకు ఊరట.. టపాసుల నిషేధం విషయమై బాణాసంచా వ్యాపారులకు ఊరట లభించింది. లైసెన్స్లు తీసుకొని దుకాణాలు పెట్టిన వ్యాపారులు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఆందోళన చెందారు. బాణాసంచాను నిషేధిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం సవరించింది. నాణ్యత సాధారణంగా ఉన్న టపాసులు, గ్రీక్క్రాకర్స్ కాల్చేందుకు రాత్రి 8గంటల నుంచి 10 గంటల వరకు అనుమతి ఇచ్చింది. సద్గుణ సంపత్తులకు ప్రతీక.. ‘జ్యోతి’ని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి సజ్జనత్వానికి సుద్గుణ సంపత్తులకు ప్రతీక. జ్ఞానదీపం వెలిగించి తద్వారా జగశ్శాంతి చేకూరాలని ప్రార్థిస్తాం. దీపారాధన చేసే ఆనవాయితీ వేల సంవత్సరాల నుంచి వస్తోంది. మహాలక్ష్మీ నూనెలో, నీటిలో అశ్వయుజ బహుళ త్రయోదళి నుంచి కార్తీక శుద్ధ విదియ వరకు నివాసముంటుంది. – పవనకృష్ణశర్మ, శ్రీదుర్గాభవానీ ఆలయం, నగునూర్, కరీంనగర్ -
టపాకాయలు కాల్చొద్దు... తినండి
త్రిపురలో మహిళలు వెదురు క్యాండిళ్లకు రూపకల్పన చేశారు... రాజస్థాన్లో మహిళలు ఆవు పేడతో ప్రమిదలు తీర్చిదిద్దారు... బెంగళూరులో ఒకామె ‘టపాకాయలు కాల్చొద్దు... తినండి’ అంటూ టపాకాయల షేపులో చాక్లెట్లు తయారు చేశారు. కోవిడ్ వేళ స్వస్థత కోసం సురక్షత కోసం మహిళలు ప్రత్యామ్నాయ దీపావళిని ప్రతిపాదిస్తున్నారు. శుభ వెలుతురుల భవిష్యత్తును ఆకాక్షిస్తున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ రెండు రోజుల క్రితం స్వయంగా అక్కడి స్వయం సహాయ మహిళా బృందాలు తయారు చేసిన ‘వెదురు కొవ్వుత్తు’లను తన చేతుల మీదుగా ఆవిష్కరించి ‘పర్యావరణ దీపావళి’ని ఆకాక్షించారు. త్రిపుర పశ్చిమ ప్రాంతంలో ఉండే సెపాహిజలా జిల్లాలో స్వయం సహాయ మహిళా బృందాలు ఈసారి కోవిడ్ వల్ల కుంటు పడిన తమ వివిధ ఉపాధులకు ప్రత్యామ్నాయంగా వెదురు కొవ్వొత్తులను తయారు చేశారు. త్రిపురలో 21 రకాల వెదురు జాతి చెట్లు ఉన్నాయి. అక్కడి 15 వేల హెక్టార్లను ప్రభుత్వం వెదురు వనాల వృద్ధికి వదిలి పెట్టింది. వాటిని స్వయం సహాయ బృందాలకు అందుబాటులోకి తెస్తే వారు ఈ కొత్త తరహా కొవ్వొత్తులను తయారు చేశారు. ‘వ్యర్థాలు మిగలని దీపావళి’ జరుపుకున్నప్పుడే అది పర్యావరణ స్నేహిత దీపావళి అవుతుంది. వెదురు కొవ్వొత్తులలో వ్యర్థం అంటూ మిగలదు. కొవ్వొత్తి కాలిపోయాక వెదురును వంట చెరుకుగా వాడుకోవచ్చు. వెదురు కొవ్వొత్తుల వల్ల వెదురు ఉత్పత్తులను వినిమయంలోకి తెచ్చినట్టయ్యిందని అక్కడి సి.ఎం. ప్రశంసించారు. ఒక సెట్ వెదురు కొవ్వొత్తులను మహిళలు రూ.240కు అమ్ముతున్నారు. ఆవు పేడ ప్రమిదలు ఉత్తరాదిన ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో మహిళా బృందాలు ఈసారి ఆవు పేడతో ప్రమిదలు విస్తృతంగా ఉనికిలోకి తెచ్చారు. మట్టితో తయారు చేసే ప్రమిదలతో పోలిస్తే ఆవు పేడ ప్రమిదలు తక్కువ డబ్బుకు దొరుకుతాయని వారు చెప్పారు. రాజస్తాన్లోని జైసల్మార్ వంద మహిళల బృందం కలిసి రోజుకు వెయ్యి ప్రమిదలను ఈ దీపావళి సందర్భంగా తయారు చేస్తోంది. ఇక మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఈ ఆవు పేడ ప్రమిదలకు రంగులు కూడా వేసి ఆకర్షణీయం చేస్తున్నారు. ఆ స్త్రీలకు తాము ఏమి తయారు చేస్తున్నారో తమకు తెలుసు. ‘చైనా సరుకు వల్ల కాలుష్యం. మన ఆవు పేడ సులభంగా మన వాతావరణంలో కలిసిపోతుంది’ అని చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలలో గోశాలలకు తోడ్పాటు కలిగేలా ‘కామధేను దివాలి అభియాన్’ పేరుతో స్వయం సహాయ మహిళా బృందాలు గోమయంతో దీపావళి ఉత్పత్తులను తయారు చేసేలా ప్రోత్సాహం అందుతోంది. ఈసారి అయోధ్యలో దీపావళి సందర్భంగా గోమయ ప్రమిదలనే ఉపయోగించనున్నారు. టపాకాయలు కాల్చొద్దు... తినండి కాలుష్యం నేపథ్యంలో టపాకాయలు కాల్చడం గురించి కోర్టులు ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల వాయు కాలుష్యాన్ని అనుసరించి టపాకాయలను నిషేధించాయి. మరో వైపు కోవిడ్ శ్వాస సంబంధమైన, ఊపిరితిత్తులపై ప్రభావం చూపే వ్యాధి. టపాకాయల కాలుష్యం కూడా ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపేదే. అందుకే ఈ సరికి టపాకాయలకు దూరంగా ఉండటమే మేలని పర్యావరణవేత్తలు, హెల్త్ ఎక్స్పర్ట్లు సూచిస్తున్నారు. కాని సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ దీపావళి. ముఖ్యంగా పిల్లలైనా పెద్దలైనా ప్రమాదాలు, పెద్దపెద్ద శబ్దాలు లేని తేలిక రకం దీపావళి సామాగ్రి కాల్చాలనుకుంటారు. వారి మనసు చిన్నబుచ్చకోకుండా ఉండటానికి బెంగళూరుకి చెందిన చాక్లెట్ తయారీదారు ప్రియా జైన్ అచ్చు టపాకాయలను పోలిన చాక్లెట్లను తయారు చేశారు. ఇవి బెంగళూరులో ప్రస్తుతం ఫుల్లుగా జనాన్ని ఆకర్షిస్తున్నాయి. చిచ్చుబుడ్లు, ఆకాశచువ్వలు, విష్ణుచక్రాలు, భూచక్రాలు... అన్నీ చాక్లెట్లే. పైగా అవి ఒక ఫ్లేవర్లో కాదు. ఒక్కోటి కాలుస్తుంటే.. సారీ కొరుకుతూ ఉంటే ఒక్కో ఫ్లేవర్లో నోరు తీపి అవుతుంది. ‘పిల్లలు నిరుత్సాహ పడకుండా ఈ టపాకాయల చాక్లెట్లు మంచి ప్రత్యామ్నాయం. అలాగే కాలుష్యానికి కూడా’ అని వీటి రూపకర్త ప్రియా జైన్ అంటున్నారు. వీటి గురించి తెలుసుకున్న బెంగళూరు వాసులు డోర్ డెలివరీ ఉందా అని ఫోన్లు కూడా కొడుతున్నారు. నిజానికి ఈ దీపావళి ఎన్నో కఠినమైన సమయాలను దాటుతున్న సమయాన వచ్చింది. ఎన్నో వొత్తిళ్లను, నష్టాలను, కష్టాలను ప్రపంచం, దేశం చూస్తున్న సమయాలలో వచ్చింది. ఈ చెడు అంతా ఈ దీపావళి వెలుతురులో దగ్ధమైపోవాలని దేశ వ్యాప్తంగా ఉన్న మహిళలు కోరుకుంటున్నారు. పురుషులతో పాటు స్త్రీలకూ తిరిగి ఉపాధి మెరుగు పడాలని, కుటుంబాలు స్వస్థతతో ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. నిరాశ నిస్పృహలు ఈ దీపావళి నాడు ఇంటి ముందు వెలిగే ప్రమిదల వెలుతురులో తరిమికొట్టబడాలని కోరుకుంటున్నారు.అందరి ఆకాంక్ష అదే. హ్యాపీ దీపావళి. సేఫ్ దీపావళి. స్వస్థ దీపావళి. – సాక్షి ఫ్యామిలీ -
వెలుగుల కేళి.. దీపావళి
సాక్షి, ఖమ్మం : భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా పండుగలు వెలుగొందుతున్నాయి. జాతి, కుల, మత వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగ దీపావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు, అతని పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతోంది. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపాల వరుసతో వెలుగొందే గృహాంగణాలు, ఆనందంతో వెల్లువిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల కళకళలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా మోతలు ప్రతి ఇంటా కనిపిప్తాయి. ప్రతి ఏటా అశ్వయుజ అమావాస్య రోజున దీపావళి వస్తుంది. ముందు రోజు అశ్వయుజ బహుళ చదుర్దశి. దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. ఈ ఏడాది తిథులు, నక్షత్రాల ఆధారంగా నరక చతుర్దశిని 13వ తేదీ శుక్రవారం రోజున, దీపావళిని 14వ తేదీన జరుపుకునేందుకు పండితులు నిర్ణయించారు. దీపాలంకరణ, లక్ష్మీపూజ మహిళలంతా బహుళ చతుర్దశి నుంచి కార్తీక మాసం అంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలు. శరదృతువులో వచ్చే ఈ దీపావళి మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలం. ఈ రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవటం ఓ విశిష్టత. దుర్వాస మహర్షి దూవేంద్రుని ఆతిథ్యాన్ని మెచ్చి ఒక హారాన్ని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన ఏనుగు మెడలో వేస్తాడు. ఆ హారాన్ని ఏనుగు తొక్కేస్తుంది. దీంతో దుర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రున్ని శపిస్తాడు. ఆ ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వ సంపదలు పోగొట్టుకుని శ్రీహరిని ప్రార్థిస్తాడు. మహావిష్ణువు గమనించి ఒక జ్యోతిని వెలిగించి దానిని మహాలక్ష్మి రూపంగా తలచి పూజించమని దేవేంద్రునికి సూచిస్తాడు. దీంతో తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపతిగా సర్వ సంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజును సకల సంపన్నులు కావటం కోసం మహాలక్ష్మి పూజలు చేస్తారు. పేలని టపాసు! గోదావరిఖని(రామగుండం): టపాసులమోత.. చిచ్చుబుడ్ల వెలుగులు.. రాకెట్ల తారాజువ్వలు.. ఈసారి ఇవ్వన్నీ కన్పించకపోవచ్చు.. కరోనా ఎఫెక్ట్.. పెరిగిపోతున్న వాయుకాలుష్యం.. వెరిసి ఈసారి దీపావళి పండుగపై ప్రభావం చూపనున్నాయి. ఏటా పండగకు వారం రోజుల ముందునుంచే టపాసుల మోత విన్పించగా ఈసారి మాత్రం ఆ చప్పుళ్లు కరువయ్యాయి. మరో రెండురోజుల్లో దీపావళి పండుగ ఉండగా టపాసుల మోతపై కరోనా ప్రభావం తప్పకుండా పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు వాయుకాలుష్యాన్ని తగ్గించాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో బాణాసంచా వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపనుంది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. అసలే చలికాలం జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఊపిరితిత్తులపై పెనుప్రభావం చూపుతున్న కరోనాతో ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు టపాసుల పొగ ఎంతమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. కరోనా ఎఫెక్ట్తో చేతుల్లో డబ్బులు లేకపోగా సుప్రీంకోర్టు తీర్పు కూడా ఈసారి టపాసుల వ్యాపారంపై ప్రభావం చూపనుంది. శబ్దకాలుష్యంతో ఆరోగ్య సమస్యలు శబ్దకాలుష్యం ఆరోగ్యంపై ప్రభావం చూపనుందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాయుకాలుష్య నియంత్రణ మండలి సుంప్రీకోర్టును ఆశ్రయించగా, వాయుకాలుష్యాన్ని అదుపులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో బాణాసంచా కాల్పివేతపై పోలీసులు ఆంక్షలు విధించారు. భారీ శబ్దాలు వచ్చే టపాసులు పూర్తిగా నిషేధించారు. శబ్దరహిత కాకర్స్మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. అమ్మకాలపై ప్రభావం.. దీపావళి సమయంలో ఒక్కో కుటుంబం రూ.ఐదు నుంచి రూ.పదివేల విలువచేసే టపాసులు కాల్చేది. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు సైతం రూ.వెయ్యి నుంచి రూ.2వేల విలువచేసే టపాసులు కాల్చడం సాదారణంగా జరిగేది. గతంలో ఉమ్మడి జిల్లాలో బాణాసంచా అమ్మకాలు సుమారు రూ.2కోట్ల వరకు జరిగేవి. కరోనా కారణంగా జనం పండుగలు, ఫంక్షన్లకు భారీ మొత్తంలో ఖర్చుచేసేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పుడిప్పుడే పనులు దొరకడంతో వచ్చిన సొమ్మును పొదుపుగా వాడుకోవాలనే ఉద్దేశంతో పండుగలకు ఖర్చులు తగ్గించారు. పెరిగిన ధరలు.. తగ్గిన విక్రయాలు విద్యానగర్(కరీంనగర్): కరోనా తన ప్రతాపాన్ని దీపావళి బాణాసంచాపై కూడా చూపింది. దీపావళి టపాసుల తయారీలో వేసవికాలం కీలకం కాగా ఈసారి వేసవి మొ త్తం లాక్డౌన్తో టపాసుల తయారీ పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ఉత్పత్తి తగ్గి వాటి ధరలు పెరిగాయి. మూడింతలు పెరిగిన ధరలు కరోనా ప్రభావంతో గత ఏడాదితో పోలీస్తే ఈ సారి టపాసుల ధరలు మూడింతలు పెరిగాయి. లాక్డౌన్తో అన్ని రంగాలు ఢీలాపడగా, ప్రైవేట్ కంపెనీలు, పాఠశాలలు, సంస్ధలు, పరిశ్రమాల్లో పనిచేసేవారు ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో వారికి రోజు గడవడమే కష్టంగా ఉన్న పరిస్ధితుల్లో పిల్లలు మారంచేసినా టపాసులు కొనే పరిస్ధితి లేకపోవడంతో వాటి అమ్మకాలు 75శాతం మేర తగ్గిపోయాయి. ప్రస్తుతం కాకరవత్తులు బాక్స్ రూ. 80– రూ.250 వరకు, చిచ్చుబుడ్లు బాక్స్ రూ.150– రూ.300, రాకెట్స్ బాక్స్ రూ.125–రూ.550, లక్షి్మబాంబ్స్ 5 పీసులు రూ.50– రూ.90, భూచక్రాలు బాక్స్ రూ.90–రూ.275 వరకు ధరలు ఉన్నాయి. -
టపాసుల వినియోగంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: కరోనా సమయంలో దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేవలం రెండు గంటల పాటు మాత్రమే టపాసుల వినియోగంకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని సూచనలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టపాసుల అమ్మకాలపై కూడా కొన్ని నిషేధ ఆజ్ఞలు జారీ చేసింది. కేవలం కాలుష్యరహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించింది. ప్రతి షాపుకి మధ్య 10 అడుగుల దూరం ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. షాపుల వద్ద కొనుగోలు దారుల మధ్య ఖచ్చితంగా 6 అడుగులు దూరం పాటించాలని సూచించింది. దీపావళి సామగ్రి అమ్మే షాపుల వద్ద శానిటైజర్ వాడొద్దని ప్రభుత్వం సూచించింది. (వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో మరో జన్మ) -
బ్రిటన్ ప్రధాని నోటి వెంట రాముడు.. సీత
లండన్ : బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్ భారతీయ సంప్రదాయంలో పెద్ద వేడుకగా నిర్వహించుకునే దీపావళి పండుగపై ప్రశంసలు కురిపించారు. భారతీయ ప్రజలు చెడుపై మంచి విజయం సాధించినందుకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటున్నారని తెలిపారు.తాజాగా బ్రిటన్లో సెకెండ్వేవ్లో కరోనా వైరస్ విజృంబిస్తున్నవేళ డిసెంబర్ 2వరకు అక్కడ మరోసారి లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం లండన్లోని 10వ డౌనింగ్ స్ట్రీట్లో ఐగ్లోబల్ దివాలి ఫెస్ట్ 2020 పేరుతో మూడు రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాన్ని బొరిస్ జాన్సన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. (చదవండి : దేశ ప్రధానికి జీతం చాలట్లేదట!) 'ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ దేశంలో వేగంగా విస్తరిస్తుందని.. మనందరం మరోసారి అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఐకమత్యంతో కరోనా వైరస్పై పోరాటం చేయల్సిన సమయం వచ్చింది. కాంతిని విరజిమ్ముతూ చీకట్లను పారద్రోలేలా.. చెడుపై మంచి విజయం సాధించినట్లుగా.. అజ్ఞానంపై జ్ఞానం ఆధిపత్యం చూపించిన విధంగా మనం పోరాడాల్సి ఉంటుంది. అచ్చం భారతీయులు జరుపుకునే దీపావళి పండుగ లాగే.. భారతీయ సంప్రదాయంలో రాముడు తన భార్య సీతతో కలిసి రావణుడిని ఓడించి తిరిగి భారతదేశానికి చేరుకున్న సమయంలో దేశ ప్రజలు కొన్ని కోట్ల దీపాల వెలిగించి తమ విజయాన్ని చూపించారు. అదే విధంగా ఇప్పుడు కరోనా వైరస్పై యుద్దం చేయడానికి అదే పని మనం చేయాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో మా ప్రభుత్వం పెట్టిన ఆంక్షల మేరకు బ్రిటన్లోని భారతీయ ప్రజలు పండుగలను జరుపుకోవడం అభినందనీయం. రానున్న దీపావళి పండుగను కూడా ఇదే తరహాలో జరుపుకోవాలని ఆశిస్తున్నా. పండుగను వేడుకలా జరుపుకునే భారతీయులకు ఇది కొంచెం కష్టమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుంది. కాగా తాము ప్రారంభించిన దివాలి ఫెస్ట్కు బ్రిటన్లోని భారతీయులంతా ఇళ్లలోనే ఉండి వర్చువల్ వీడియో ద్వారా పాల్గొనాలని కోరుతున్నా. అందుకే ఐ గ్లోబల్ దివాలి ఫెస్ట్ 2020 పేరుతో జరగనున్న దివాలి వేడుకను ప్రారంభించాం'అంటూ చెప్పుకొచ్చారు. కాగా వర్చువల్ మోడ్లో జరగనున్న దివాలి ఫెస్ట్ శుక్రవారం నుంచి మూడురోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ మూడు రోజుల్లో భారతీయ సంప్రదాయాలైన యోగా, భారతీయ సంగీతం, తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. ఇదే కార్యక్రమంలో వర్చువల్ సెషన్ ద్వారా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ నేతృత్వంలో ఆధ్యాత్మిక కార్యక్రమంతో పాటు, బ్రిటీష్ ఇండియన్ మ్యుజిషియన్ నవీన్ కుంద్రా ఆధ్వర్యంలో పలు బాలీవుడ్ గీతాలు ఆలపించనున్నారు. కాగా దేశంలో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రజలు నవంబర్ 14 న దీపావళి వేడుకలు జరుపుకోనున్న సంగతి తెలిసిందే. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు
డల్లాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) నిర్వహించిన దీపావళి వేడుకలు నవంబర్ 9వ తేదీన డల్లాస్లోని ఫ్రిస్కో ఫ్లైయర్స్ ఈవెంట్ సెంటర్లో అంగరంగ వైభవంగా, కనుల పెండుగగా జరిగాయి. టాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు, ఈవెంట్ కోఆర్డినేటర్ వెంకట్ బొమ్మ, వారి కార్యవర్గ బృందంతో కలిసి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రాంగణమంతా అందమైన అలంకరణతో ముస్తాబై, అతిథులకు, ప్రేక్షకులకు ఆహ్వానం పలికింది. సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యి రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా కొనసాగింది. యాంకర్ సంధ్య మద్దూరి ఆధ్వర్యంలో స్థానిక కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, సినిమా డాన్సులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారతదేశం నుంచి వచ్చిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి, వారి బృందం యాంకర్ సాహితి, గాయకులు సుమంగళి, శ్రీకాంత్, సింహాత్రి, సౌజన్య, ప్రవీణ్, ఇమిటేషన్ రాజు తమ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అనంతరం కోటి అందించిన 1980, 1990లో బ్లాక్ బస్టర్స్గా నిలిచిన చిరంజీవి మూవీ హిట్స్ పాటలతతో అందరి హృదయాల్లో తనదైన ముద్ర వేశారు. అనంతరం టాంటెక్స్ అధ్యక్షులు చిన్న సత్యం మాట్లాడుతూ.. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి తోడ్పడిన దీపావళి పోషక దాతలకు ధన్యవాదాలు తెలిపి, సత్కరించారు. టాంటెక్స్ ఎల్లప్పుడూ వినూత్న కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. కార్యక్రమం మొదలైన దగ్గర నుంచి చివరి వరకు జరిగేలా సహాయం, సహాయం అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య అతిథి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి, వారి బృందానికి టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, ఉత్దరాధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు,ఉపాధ్యక్షులు పాలేటి లక్ష్మీ, కార్యదర్శి ఉమా మహేష్ పార్నపల్లి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్ రెడ్డి తోపుడుర్తి, సతీష్ బండారు, వెంకట్ బొమ్మ, శరత్ యర్రం, కళ్యాణి తాడిమేటి, పాలక మండలి అధ్యక్షుడు ఎన్ ఎమ్ రెడ్డి, పవన నెల్లుట్ల, ఇందురెడ్డి, మందాడి.. శాలువ కప్పి సతక్కరించారు. కాగా టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం మాట్లాడుతూ.. సంగీత దర్శకుడు కోటి ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ఈవెంట్ను విజయవంతం చేసిన అందరికీ, ప్రసార మాధ్యమాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతోకృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్ కార్యవర్గ సభ్యులకు అలాగే వివిధ కమిటీ సభ్యులకు,స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. చివరిగా జాతీయ గీతం ఆలపించడంతో, విచ్చేసిన వారందరినీ ఎంతో ఆహ్లదపరిచిన దీపావళి వేడుకలు ముగిశాయి. -
'తామా' ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు
అట్లాంటా : అట్లాంటా తెలుగు సంఘం 'తామా' ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. నార్క్రాస్ లోని స్థానిక మేడోక్రీక్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ఫోర్సైత్ కౌంటీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్ క్రిస్టీన్ మోరిస్సి, ఫోర్సైత్ కౌంటీ డిస్ట్రిక్ట్ 2 కమీషనర్ డెన్నిస్ బ్రౌన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో వెయ్యి మందికి పైగా తెలుగు వారు పాల్గొన్నారు. ముందుగా పిల్లలకి క్యూరీ లెర్నింగ్ సెంటర్ వారు వ్యాస రచన పోటీలు, యూత్ టెక్నాలజీ లెర్నింగ్ సెంటర్ వారు లెగో పోటీలు నిర్వహించగా, సుమారు 175 మంది బాలబాలికలు పాల్గొన్నారు. లెగో పోటీలలో పిల్లలు ఎంతో వినూత్నంగా తమ సృజనాత్మకతను వెలికితీయడం విశేషం. తదనంతరం ప్రముఖ తెలుగు సినీ గాయనీగాయకులు లిప్సిక, యాజిన్, యాంకర్ రవళితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. తామా కార్యవర్గ, బోర్డు సభ్యులు జ్యోతి ప్రజ్వలనతో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. చిన్నలు పెద్దలు నృత్యాలతో, పాటలతో వేదికను హోరెత్తించారు. మధ్య మధ్యలో రాఫుల్ విజేతలకు బహుమతులు అందజేశారు. యాంకర్ రవళి వ్యాఖ్యానం అందరినీ ఆకట్టుకుంది. చక్కని విందు బోజనాలను అందించిన గోదావరి రెస్టారెంట్ వారిని, స్పాన్సర్స్ అందరినీ ముఖ్యఅతిథులను పుష్పగుచ్ఛం, శాలువా, మెమెంటోలతో గౌరవంగా సత్కరించారు. ఫ్రెండ్స్ ఆఫ్ రాయపురెడ్డి సమర్పించిన శ్రీ శ్రీనివాసరావు రాయపురెడ్డి మెమోరియల్ వాలంటీర్ సర్వీస్ అవార్డును తామా తరపున బాలనారాయణ మద్దకి అందజేశారు. ఈ సందర్భంగా అందరూ రాయపురెడ్డిని, తాను తామాకి అలాగే తెలుగు కమ్యూనిటీ మొత్తానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. గ్రాండ్ ఫినాలేలో భాగంగా యాజిన్ లిప్సిక తమ సంగీత కచేరీతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. పిల్లలు మహిళలు అందరూ స్టేజ్ మీదకు వెళ్లిమరీ డ్యాన్సులు చేయడం విశేషం. చివరిగా ప్రెసిడెంట్ వెంకీ గద్దె తామా తదుపరి కార్యవర్గాన్ని సభకు పరిచయం చేయగా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ భరత్ మద్దినేని తామా దివ్య దీపావళి వేడుకలకు సహకరించిన వాలంటీర్స్, స్పాన్సర్స్, స్టేజి డెకరేటర్ సుజాత పొన్నాడ, ఆడియో, లైటింగ్ అందించిన బీట్స్ అండ్ ఈవెంట్స్ వెంకట్ చెన్నుభొట్ల, ఫోటోగ్రఫీ సేవలందించిన రఘు, ప్రేక్షకులు తదితరులకు కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకలకు శేఖర్ రియాల్టీ, జార్జ్ మెలత్ మోర్ట్ గేజ్ & ఇన్సూరెన్స్, ట్వంటీ సెవెంత్ ఇన్వెస్ట్మెంట్స్, గోదావరి రెస్టారెంట్, ఎస్.వి.కె సిస్టమ్స్, గిరీష్ మోడీ, పటేల్ బ్రదర్స్ సమర్పకులుగా వ్యవహరించారు. -
దీపావళి వేడుకలకు నాట్స్ కు ప్రత్యేక ఆహ్వానం
వాషింగ్టన్ డీసీ: వాషింగ్టన్ డీసీలో భారత రాయబార కార్యాలయం దీపావళి వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భంగా భారతీయులకోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలను రాయబార కార్యాలయం ఆహ్వానించింది. తెలుగువారి మేలు కోసం అనేక సేవాకార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ను దీపావళి వేడుకల్లో పాలుపంచుకోవాలని కోరుతూ భారత రాయబార కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. దీంతో నాట్స్ కూడా వాషింగ్టన్ డీసీ దీపావళివేడుకల్లో భాగస్వామి అయింది. ఈ సందర్భంగా భారత రాయబారి హర్షవర్థన్ ష్రింగ్లా ప్రవాస భారతీయ ప్రతినిధులకువిందు ఇచ్చారు. ఇందులో నాట్స్ ప్రతినిధిగా నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని హాజరయ్యారు. నాట్స్ చేపడుతున్న అనేక సేవా కార్యక్రమాలను తెలుసుకున్న భారత రాయబార కార్యాలయం నాట్స్ కు ఆహ్వానాన్ని పంపడంపై నాట్స్ జాతీయ నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. -
సెయింట్ లూయిస్లో ఘనంగా దీపావళి వేడుకలు
సెయింట్ లూయిస్ : అమెరికాలోని సెయింట్ లూయిస్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను లిండ్బర్గలోని షామినాడ్ కాలేజిలో సెయింట్ లూయిస్ తెలుగు అసోషియేషన్ వారు నిర్వహించగా.. కోటి మ్యూజికల్ నైట్ తెలుగువారిని ఆనంద ఢోలికల్లో ముంచెత్తింది. దాదాపు రెండు వేలమందికిపైగా తెలుగువారు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఏఎస్ తెలుగు అసోషియేషన్ ఆఫ్ సెయింట్ లూయిస్ దీపావళి పురస్కారాలను ప్రకటించింది. తెలుగువారి మేలు కోసం అమెరికాలో వివిధ రంగాలలో కృషి చేస్తున్న ప్రముఖులకు ఈ పురస్కారాలను ప్రధానం చేశారు. అమెరికాలో పలు సేవా కార్యక్రమాలను చేసినందుకుగాను నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడిని దీపావళి పురస్కారంతో సత్కరించారు. అదేవిధంగా నాట్స్ మెడికల్ క్యాంపుల ద్వారా స్థానిక తెలుగువారికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ సుధీర్ అట్లూరి, డాక్టర్ రమా అట్లూరిని కూడా టీఏఎస్ దీపావళి పురస్కారాలతో సత్కరించింది. వీరితో పాటు స్థానిక టెంపుల్ ట్రస్టీ మాజీ ఛైర్మన్ జీవీ నాయుడు, రాజ్యలక్ష్మి, ప్రస్తుత టెంపుల్ బోర్డ్ ఛైర్మన్ రజనీ కాంత్ గంగవరపు, పీజీఎన్ ఎఫ్ పౌండర్స్ శ్రీనివాస్ గుల్లపల్లి, చిన్నా ముచ్చెర్ల, కూచిపూడి ఛారిటబుల్ ట్రస్ట్ సుజాత ఇంజమూరి తదితరులకు దీపావళి పురస్కారాలు వరించాయి. టెంపుల్ డోనర్, కమ్యూనిటీ సర్వీస్ అవార్డును శ్రీథర్ కొత్తమాసుకు అందించారు. ఈ పురస్కారాలన్నీ టీఎస్ ప్రెసిడెంట్ సురేంద్ర బాచిన, వైస్ ప్రెసిడెంట్ వెంకట్ గౌని, సెక్రటరీ రమేశ్ కొండ ముట్టి, కల్చరల్ సెక్రటరీ అర్చన ఉపమాక, ట్రెజరర్ రంగ సురేశ్, బోర్డ్ ఆఫ్ ఛైర్మన్ కుమార్ రెడ్డి, డైరెక్టర్లు శ్రీనివాస భూమా, జగన్ వేజండ్ల, జితేంద్ర ఆలూరి, రాకేశ్ గజగౌని చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించిన వాలంటీర్లకు, ఈ వేడుకలకు స్పాన్సర్ గా వ్యవహారించిన వారికి సెయింట్ లూయిస్ తెలుగు అసోషియేషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. -
మంటల్లో ఆమె.. కాపాడిన షారుఖ్!
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రెండేళ్ల విరామం తర్వాత ఆదివారం తన నివాసంలో నిర్వహించిన దీపావళి వేడుకలకు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరైన సంగతి తెలిసిందే. అయితే, ఈ వేడుకల్లో ఒక అపశ్రుతి చోటుచేసుకున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. దీపాలతో ముస్తాబైన బిగ్బీ నివాసం జల్సాలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ మేనేజర్ అర్చన సదానంద లెహెంగాకు అనుకోకుండా నిప్పంటుకుంది. దీనిని గుర్తించిన షారుఖ్ ఖాన్ వెంటనే స్పందించి.. ఆమెకు పెద్దప్రమాదం కాకుండా కాపాడారు. ఐశ్వర్యకు అర్చన సదానంద్కు చాలా కాలంగా మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. పార్టీలో ఆమె లెహంగాకు దీపం అంటుకుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన షారుక్ ఖాన్ వెంటనే తన జాకెట్తో ఆమె లెహెంగాకు అంటుకున్నమంటలను ఆర్పాడు. ఈ ప్రమాదంలో అర్చనకు చేతులకు, కుడి కాలికు 15శాతం గాయాలయ్యాయి. షారుక్కు కూడా స్వల్ఫ గాయాలయ్యాయి. ఎటువంటి ఇన్ఫెక్షన్లు దారి చేరకుండా ఉండేందుకు ఆమెను ఐసీయూలో ఉంచారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. సోమవారం తెల్లవారుజామున 3గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో బిగ్ బీ ఇంట్లో అతికొద్ది గెస్ట్లు మాత్రమే ఉన్నారు. పార్టీ సుమారుగా ముగియడంతో మేనేజర్ అర్చన తన కుమార్తెతో కలిసి బయట ప్రాంగణంలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంతో పార్టీలోని వారు ఒక్కసారి షాక్కు గురయ్యారు. అయితే, అక్కడే ఉన్న షారుఖ్ రియల్ హీరోగా స్పందించి అర్చనను కాపాడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. — Farah Khan (@TheFarahKhan) October 30, 2019 చదవండి: బిగ్ బి ఇంట్లో దీపావళి వేడుకలు, స్టార్స్ హంగామా -
వారిద్దరి మధ్య ఏముంది?
ముంబై: బాలీవుడ్ నటులు కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ కలిసి ఓ స్నేహితుడు ఇచ్చిన దీపావళి పార్టీకి రావడంతో.. వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పార్టీకి వీరిద్దరూ కలిసి వచ్చినా.. చివర్లో మాత్రం ఎవరికివారు యమునా తీరే అన్నట్లు ఎవరి కార్లలో వారు వెళ్లిపోయారు. అయితే వీరిద్దరూ జంటగా దీపావళి పార్టీ నుంచి బయటకు వస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పార్టీలో విక్కీ తెలుపు రంగు కుర్తా-పైజామాతో పాటు షెర్వానీ ధరించగా.. కత్రినా రెడ్ కలర్ ఘాగ్రా - చోళిలో తళుక్కుమని మెరిశారు. కత్రినా, విక్కీ జంటగా కలిసి ఒక చిత్రంలో నటించనున్నారనే వార్తలు వస్తున్నా.. ఇప్పటివరకు ఏలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందనే పుకార్లు వస్తున్నప్పటికిని కత్రినా, విక్కీ మాత్రం నోరు మెదపలేదు. ప్రస్తుతానికి వీరు సింగిల్ అని, డేటింగ్ చేయడం లేదని వీరి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో.. దీపావళి పార్టీకి వీరిరువురూ జంటగా రావడంతో.. వీరి మధ్య ఏదో ఉందనే వార్తలు ఊపందుకున్నాయి. View this post on Instagram #happydiwali #ManavManglani A post shared by Manav Manglani (@manav.manglani) on Oct 27, 2019 at 12:54pm PDT -
త్వరలో గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తా
సోమాజిగూడ: మరో 25 రోజుల్లో గిరిజన నివాసుల ప్రాంతాల్లో పర్యటించి వారి జీవన విధానంపై అధ్యయనం చేస్తానని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. దీపావళి సందర్భంగా ఆదివారం రాజ్భవన్లో ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. రాజ్భవన్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించామని తెలిపారు. రాజ్భవన్కు వచ్చే వారు ప్లాస్టిక్ పూలు, బొకేలు తీసుకురావద్దని సూచించారు. ప్రధాని మోదీ ఇచ్చిన ‘ఫిట్ ఇండియా’పిలుపు మేరకు నెలరోజుల పాటు రాజ్భవన్లో యోగా కార్యక్రమాలు నిర్వహించామని, ఇందులో ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం తనకు సొంతిల్లు లాంటిదని.. ఇక్కడి ప్రజలు గవర్నర్ అక్కా అని పిలవడంతో తాను పులకరించానని తెలిపారు. ఆర్టీసీ సమ్మెపై స్పందించాలని కోరగా సమ్మె విషయం ప్రభుత్వం పరిశీలిస్తోందని, దీనిపై ఇరు వర్గాల నుంచి తనకు వినతిపత్రాలు అందాయని పేర్కొన్నారు. గవర్నర్కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన వారిలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ తదితరులు ఉన్నారు. -
కాకర పువ్వొత్తుల రంగుపూలు
కాకర పువ్వొత్తులు రంగుపూలు పూశాయి. చిచ్చుబుడ్లు మెరుపులు విరజిమ్మాయి. లక్ష్మీ పూజ ఘనంగా జరిగింది. లడ్డూలు ఇష్టంగా లాగించారు. దీపావళిని అందరూ ఘనంగా జరుపుకొని ఉంటారు. సినిమా తారలు కూడా ఘనంగా జరుపుకున్నారు. పూజ విశేషాలను, పండగ సంబరాలను ఎవరెవరు ఎలా జరుపుకున్నారో తెలుసుకుందాం. దీపావళి ముందు రోజు రాత్రి మోహన్బాబువాళ్ల ఇంట్లో దీపావళి సంబరాలు జరిగాయని తెలిసింది. ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులను మంచు కుటుంబం ఆహ్వానించింది. కృష్ణంరాజు, చిరంజీవి, ప్రభాస్, రచయిత సత్యానంద్, దర్శకుడు రాఘవేంద్రరావు, రచయితలు బీవీఎస్ఎన్ రవి, గోపీ మోహన్, హీరో రాజ్ తరుణ్.. ఇలా పలువురు తారలు మంచు ఇంటి విందుకి హాజరయ్యారు. ఆ వేడుక విశేషాలను పక్కన ఫొటోల్లో గమనించవచ్చు. విష్ణు చిన్న కుమార్తె ఐరా విద్యా మంచుని చిరంజీవి ఆప్యాయంగా ఎత్తుకున్న ఫొటోతో పాటు ఈ విందుకి సంబంధించిన పలు ఫొటోలు బయటికొచ్చాయి. కృష్ణంరాజు, రాఘవేంద్రరావు, సత్యానంద్, చిరంజీవి, మోహన్బాబు ఇక కొత్తగా రీమోడలింగ్ చేయించిన ఇంట్లో దీపావళిని జరుపుకున్నారు చిరంజీవి కుటుంబ సభ్యులు. చిరంజీవి, నాగబాబు, పవన్కల్యాణ్.. ఇలా మొత్తం కుటుంబసభ్యులు పండగ చేసుకున్నారు. దీపావళిని అక్కినేని ఫ్యామిలీ కూడా గ్రాండ్గానే చేసుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫ్యామిలీ ఫొటోను సమంత షేర్ చేశారు. పెదనాన్న కృష్ణంరాజుతో కలసి దీపావళిని ఎంజాయ్ చేశారు ప్రభాస్. అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫొటోను పక్కన చూడవచ్చు. ఒక్కసారి బాలీవుడ్ సైడ్ వెళ్తే బోనీకపూర్ ఫ్యామిలీ మొత్తం దీపావళి సాయంత్రాన్ని ఎంజాయ్ చేశారు. దీపావళి ఈవెంట్ను అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ నిర్వహించింది. ఆ వేడుకకు పలువురు తారలు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ ఆఫీస్లో ఫెస్టివల్ను ఎంజాయ్ చేశారు స్టార్స్. ఫ్యామిలీతో తాప్సీ దీపావళిని జరుపుకున్నారు. తమన్నా, శ్రుతీహాసన్ సెల్ఫీను షేర్ చేశారు. రంగోలీతో పూజా హెగ్డే ఫొటో పంచుకున్నారు. ఇలా దీపావళి కాంతిని ఫేస్బుక్, ట్వీటర్ల ద్వారా అభిమానులకు కూడా షేర్ చేశారు స్టార్స్. రాజారవీంద్ర, చిరంజీవి, ఐరా విద్య, విరానికా, విష్ణు నాగార్జున, అమల, సమంత, నాగచైతన్య, అఖిల్ విష్ణు,విరానికా, ప్రభాస్, అక్కాచెల్లెళ్లు, స్నేహితులతో వరుణ్తేజ్ శ్యామల, కృష్ణంరాజు, ప్రభాస్ అల్లు అర్జున్, స్నేహ, రామ్చరణ్, ఉపాసన, అర్జున్కపూర్, జాన్వీకపుర్ -
వైరల్: భర్తతో సోనమ్ సందడి..!
ముంబై: దీపావళి సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ సందడి చేశారు. తన తండ్రి అనిల్ కపూర్ ఏర్పాటు చేసిన పార్టీలో సోనమ్ భర్త ఆనంద్ అహుజాతో కలిసి పాల్గొన్నారు. వీరితో పాటు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ, సైఫ్ అలీ ఖాన్, షాహిద్ కపూర్, మీరా రాజ్పుత్లతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అయితే సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా పార్టీలో సందడి చేస్తూ.. అటు ఇటు కలియదిరుగుతూ.. మీడియా ఛానెల్ పాపారాట్సీలకు, పార్టీలోని గెస్ట్లకు లడ్డూలు పంచుతూ.. ఒకింత రెట్టింపు ఉత్సాహంతో అందరికి హ్యపీ దీపావళి అని శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ అభిమానులను అలరిస్తోంది. ఇక మిగతా బాలీవుడ్ ప్రముఖులు దీపావళి సంబరాల్లో మునిగిపోతూ.. వేర్వేరు చోట్ల ఫోటోలకు పోజిచ్చారు. View this post on Instagram @anandahuja #with #wife @sonamkapoor at #anilkapoor Diwali Bash in #Mumbai . #happydiwali #diwali #celebrations #festival #lights #colourful #gogreen #nopollution #yogenshah @yogenshah_s @anilskapoor A post shared by yogen shah (@yogenshah_s) on Oct 27, 2019 at 7:47pm PDT -
బిగ్ బి ఇంట్లో దీపావళి వేడుకలు, స్టార్స్ హంగామా
అంగరంగ వైభవంగా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఉత్సహంగా జరుపుకునే పండగ దీపావళి. ఈ దీపావళికి మన సెలబ్రిటీల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు చేసే సందడి అంతాఇంతా కాదు. సంప్రదాయ వస్త్రాధారణతో అందరు ఒకచోట చేరి పండగ హంగామ అంటే ఎంటో చూపిస్తారు. ఇక బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆదివారం ముంబైలోని తన నివాసం జల్సాలో దీపావళి వేడుకలను ఘనంగా జరిపారు. బాలీవుడ్ నటీనటులకు, దర్శకనిర్మాతలకు ఆయన అతిథ్యం ఇచ్చారు. రెండేళ్ల తర్వాత బిగ్ బి ప్రముఖులతో కలిసి అంగరంగ వైభంగా జరుపుకున్న ఈ దీపావళికి సెలబ్రిటీలంతా కుటుంబసమేతంగా హాజరయ్యారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న వారి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. View this post on Instagram @bachchan #nitaambani #mukeshambani at #bachchan Diwali Bash in #Mumbai . #happydiwali #diwali #celebrations #festival #lights #colourful #gogreen #nopollution #yogenshah @yogenshah_s @amitabhbachchan A post shared by yogen shah (@yogenshah_s) on Oct 27, 2019 at 6:13pm PDT ఈ సందర్భంగా ప్రముఖ బిజినెస్ మ్యాన్, భారత కుబేరుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీలతో పాటు షారుక్ఖాన్ అతని భార్య గౌరి ఖాన్, అక్షయ్ కుమార్- ట్వింకిల్ కన్నా, అనుష్క శర్మ- విరాట్ కొహ్లీలతో పాటు మిగతా సెలబ్రేటిలంతా సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. అలాగే టైగర్ ష్రాఫ్, కజోల్, కత్రీనా కైఫ్, జాక్వేలీన్ ఫెర్నాండేస్, వరుణ్ ధావన్, అర్జున్ రాంపాల్, బిపాషా బసు, నటశ దాలాల్, శ్రద్ధాకపూర్, శక్తి కపూర్, సార అలీ ఖాన్, కైరా అద్వానీ ఇబ్రాహ్మీం అలీ ఖాన్, ఈశా డియోల్, షనయా కపూర్లతో ప్రముఖ బాలీవుడ్ యాక్టర్స్ ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. View this post on Instagram @akshaykumar with family at #bachchan Diwali Bash in #Mumbai . #happydiwali #diwali #celebrations #festival #lights #colourful #gogreen #nopollution #yogenshah @yogenshah_s @amitabhbachchan A post shared by yogen shah (@yogenshah_s) on Oct 27, 2019 at 5:54pm PDT View this post on Instagram @virat.kohli and @anushkasharma at #bachchan Diwali Bash in #Mumbai . #happydiwali #diwali #celebrations #festival #lights #colourful #gogreen #nopollution #yogenshah @yogenshah_s @amitabhbachchan A post shared by yogen shah (@yogenshah_s) on Oct 27, 2019 at 5:55pm PDT -
దీపావళి టపాసులు మిస్ఫైర్.. కళ్లకు గాయాలు
-
టపాసులు పేల్చినందుకు వ్యక్తి దారుణ హత్య
భువనేశ్వర్ : దీపావళి పండగ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఎంతో సంబరంగా టపాసులు కాల్చుతున్న ఓ వ్యక్తికి ఆ సంతోషమే చివరి క్షణాలుగా మారాయి. టపాసులు కాల్చొద్దు అన్న మాట పట్టించుకోనందుకు కొంతమంది చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్లో చోటు చేసుకుంది. వివరాలు.. రాజధాని సమీపంలోని సుందర్పాడ ప్రాంతంలో అమరేశ్ నాయక్ తన స్నేహితులతో కలిసి ఇంటి ముందు టపాసులు పేల్చుతున్నాడు. బాణాసంచా కాల్చుతుండగా ఆ దారిలో వెళ్తున్న కొంత మంది అమరేశ్ వద్దకు వచ్చి టపాకాయలు కాల్చనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో వీరి మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. అది ఇరు వర్గాల మధ్య గొడవకు దారి తీయగా.. కోపానికి గురైన 15 మంది వ్యక్తులు మూకుమ్మడిగా అమరేశ్పై పదునైన ఆయుధాలతో దాడికి దిగారు. దీంతో సదరు వ్యక్తి అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు అమరేశ్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా అతన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆ వ్యక్తి చనిపోయినట్లు తెలిపారు. దీపావళి నాడు జరిగిన ఘటనల్లో పలు ప్రాంతాల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. కియోంజార్ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి దీపావళి పటాసులు కాల్చుతున్న క్రమంలో ఇంట్లో మంటలు చెలరేగడంతో మరణించగా, భద్రక్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఇంటిని అలంకరించే సమయంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు. -
ఢిల్లీని వీడని వాయుకాలుష్యం
-
ఆదివాసీ గ్రామాల్లో ఘనంగా దండారి ఉత్సవం
-
దీపావళి ఎఫెక్ట్; ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
సాక్షి, న్యూఢిల్లీ : దీపావళి వేళ దేశ రాజధానిలో పర్యావరణ కాలుష్యం తారాస్థాయికి చేరింది. పండగ వేడుకల అనంతరం నగరాన్ని కాలుష్యం మరింత కమ్మేసింది. ‘సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్(సఫర్)’ నివేదిక ప్రకారం.. దేశ రాజధానిలో సోమవారానికి పవన నాణ్యత సూచీ ఉదయం 9 గంటలకు 463గా ఉండటంతో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఒకటిగా ఉన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఢిల్లీ కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా.. సుప్రీంకోర్టు 2018లోనే వాతావరణానికి హాని కలిగించే టపాసులను కాల్చరాదని, కేవలం ఎకో ఫ్రెండ్లీ టపాసులను మాత్రమే కాల్చాలని ఆదేశించింది. ఈ క్రమంలో సుప్రీం ఆదేశాలతో ఢిల్లీ ప్రభుత్వం బహిరంగ టపాసుల అమ్మకాలను నిషేధించగా కాకరవొత్తులు, చిచ్చుబుడ్లను మాత్రమే కాల్చుకోవడానికి అనుమతినిచ్చింది. ఇవి కూడా కేవలం ప్రభుత్వం తయారు చేసినవి మాత్రమే కొనాలని సూచించింది. వీటి ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందని పేర్కొంది. ఇందుకు తోడు రాజధానిలో కేవలం రాత్రి 8 గంటల నుంచి 10 వరకు మాత్రమే బాణాసంచా పేల్చాలని ఆంక్షలు విధించింది. అంతేగాక శనివారం నుంచి రాత్రి సమయాల్లో భవన నిర్మాణ పనులను నిలిపి వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రస్తుతం నమోదైన కాలుష్యపు సూచీ చూస్తుంటే నగర వాసులు సుప్రీంకోర్టు ఆదేశాలను భేఖాతరు చేసినట్లు కనిపిస్తోంది. ఢిల్లీ కాలుష్యాన్ని అదుపులో ఉంచేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ సరి-బేసి విధానాన్ని నవంబర్ 4 నుంచి 15 వరకు మరో దఫా అమలు చేయనున్నారు. సాధారణంగా పవన నాణ్యత సూచీ 0-50 మధ్య ఉంటే మంచిదని, 51-100 ఫర్వాలేదని, 101-200 మధ్య రకమని, 201-300 బాలేదని, 301-400 పూర్తిగా బాలేదని, అలాగే 401-500 తీవ్రమైనది-ప్రమాదకరమని సఫర్ నివేదించింది. చదవండి : ఢిల్లీలో ఆ రెండే కాల్చాలి -
ఆర్మీ అధికారులతో మోదీ దీపావళి వేడుకలు
-
కుటుంబసభ్యులతో కలిసి దీపావళి జరుపుకున్న ఆర్కే రోజా
-
గురుకుల పాఠశాలలో దీపావలి జరుపుకున్న పుష్పశ్రీవాణి
-
రాజ్భవన్లో ఘనంగా దీపావళి వేడుకలు
-
ఆర్మీ అధికారులతో మోదీ దీపావళి వేడుకలు
-
ఆర్మీ అధికారులతో మోదీ దీపావళి వేడుకలు
రాజౌరి : భారత ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్ రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వద్ద ఆర్మీ అధికారులతో కలిసి ఆదివారం దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తాజాగా ఈ వేడుకలకు సంబంధించిన వీడియోనూ మోదీ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. దేశ భద్రత కోసం తమ ప్రాణాలనే త్యాగం చేస్తూ నిరంతరం శ్రమిస్తున్న ఆర్మీ అధికారులతో ఈ వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.కాగా, ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొదటిసారి జమ్మూ కశ్మీర్లో పర్యటించిన మోదీ ఆర్మీ అధికారులతో కలిసి సంయుక్తంగా ఈ వేడుకలను నిర్వహించారు. బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్లో ఆర్మీ అధికారులుతో సమావేశంలో ఆర్మీ సిబ్బందితో కరచాలనం చేస్తూ , స్వీట్లు పంచి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆర్మీ సిబ్బంది తమ సంతోషాన్నిమీడియాతో పంచుకున్నారు. 'స్వయంగా ప్రధాని ఇక్కడకు రావడం మాకు ఆశ్చర్యం కలిగించింది. మాతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నందుకు ప్రధాని మోదీకు కృతజ్ఞతలు' అని ఓ సైనికుడు తెలిపారు. #Diwali is sweeter when celebrated with our brave soldiers. pic.twitter.com/skO2SfcwJ3 — Narendra Modi (@narendramodi) October 27, 2019 -
'ఆర్టీసీ సమస్య ప్రభుత్వమే చూసుకుంటుంది'
సాక్షి, హైదరాబాద్ : రాజ్భవన్లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. తమిళిసై మాట్లాడుతూ.. దీపావళి పండుగను ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.తెలంగాణ ప్రజలందరూ నన్ను అక్కలాగా భావిస్తున్నారని పేర్కొన్నారు. రాజభవన్లో ప్లాస్టిక్ను నిషేదించడంతో పాటు ఎప్పుడు పచ్చదనం ఉండేలా నిర్ణయించామని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ రహిత వస్తువులను రాజ్భవన్లో నిషేదించినట్లు వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఏర్పాటు చేయడం హర్షించతగ్గ విషయం. టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ రాములు తదితరులు గవర్నర్ దంపతులను కలిసి వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమస్యలకు సంబంధించి గవర్నర్కు వినతిపత్రం సమర్పించారు. ఆర్టీసీ సమస్యను ప్రభుత్వమే చూసుకుంటుందని తమిళిసై తెలిపారు. -
దేశరాజదానిలో టపాసులు కాల్చకండి
-
జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో దీపావళి సంబరాలు
-
పండగ వేళ
-
దీపావళి: పూర్వీకుల ఆత్మలు స్వర్గం చేరేలా..
దీపావళి అంటే దీపాల పండుగ అని అర్ధం. కటిక అమావాస్య నాడు వచ్చే చీకటిని పారద్రోలుతూ ఇళ్ల ముంగిట దీపాలను వెలిగించి కాంతులను విరజిమ్ముతాం. దేశవ్యాప్తంగా ప్రజలంతా వేడుకగా జరుపుకొనే పండుగ దీపావళి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరిగే దీపావళి పూజా సాంప్రదాయం దేశమంతా వెలుగులు పూయిస్తుంది. దీపావళి నాడు ప్రత్యేకంగా.. దీపావళి రోజున వీధులు, దుకాణాలు, భవనాలు విద్యుత్ వెలుగులతో విరాజిల్లుతుంటాయన్న సంగతి తెలిసిందే. అయితే రాజస్తాన్లోని పింక్సిటీలో జోహారీ బజార్ దీపావళికి చాలా ప్రత్యేకం. అక్కడి భవనాలు, వీధులే కాకుండా నగరంలోని ప్రతీ ప్యాలెస్ విద్యుత్ వెలుగులతో అందంగా ముస్తాబవుతుంది. అక్కడి మార్కెట్లు లైట్ల వెలుగుల్లో ప్రకాశిస్తాయి. ప్రతీ సంవరత్సరం అందంగా,సృజనాత్మకంగా అలంకరించబడిన మార్కెట్కి బహుమతి కూడా ఉంటుంది. భారతదేశం నలుమూలల నుంచి ఈ అద్బుతమైన ప్రదర్శన తిలకించడానికి సందర్శకులు వస్తారు. అంతేకాకుండా ఆ లైట్లకి అయ్యే విద్యుత్ బిల్లులను కూడా ప్రభుత్వమే చెల్లించడం విశేషం. శ్రీరాముడిని కొలుస్తూ.. దీపావళి వేడుకలకు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరం చాలా ప్రత్యేకమైనది. దీపాలను వెలిగించి ఆరాధించడంతో పాటు ‘భరత్ మిలాప్’ పేరిట శ్రీరాముడిని కొలుస్తారు. రావణ సంహారం చేసి రాముడు అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడు అయిన రోజును దీపావళిగా భావించి ఈ వేడుకను చేసుకుంటారు. ప్రతీ సంవత్సరం అక్కడ దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. 2018లో సరయు నది ఒడ్డున 3 లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకుంది. పూర్వీకుల ఆత్మలు స్వర్గం చేరేలా.. దీపావళి వేడుకల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో నరక చతుర్దశికి ఒకరోజు ముందు ఇళ్లంతా శుభ్రం చేసి అందంగా అలంకరిస్తారు. వంట చేయడానికి ముందు పొయ్యిని శుభ్రపరుచుకొని దానిపై ఓంకారం చిహ్నాలు వేస్తారు. సూర్యోదయానికి ముందే తలంటు స్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరిస్తారు. కొత్తగా పెళ్లయిన వారు వధువు ఇంట్లో ఈ వేడుకని జరుపుకోవడం ఆనవాయితీ. కొన్నిచోట్ల నరక చతుర్దశి నాడు తెల్లవారుజామునే తలంటుస్నానం ఆచరించి యముడికి తర్పణం వదులుతారు. సాయంకాలం దీపాలను వెలిగించి మహాలక్ష్మీ పూజ చేస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటుకర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఈ విధానాన్నే పాటిస్తారు. బంగారానికి పూజ ఇక ఉత్తర భారత దేశంలోనూ దీపావళి వేడుకలు ఘనంగా జరగుతున్నాయన్న విషయం తెలిసిందే. గుజరాతీలు దీపావళి ముందు రోజు తమ ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తారు. లక్ష్మీదేవిని వాహీ పూజ పేరుతో ఆరాధిస్తారు. ఇంట్లోని బంగారమంతా తెచ్చి దీపాల ముందు ఉంచి పూజ చేస్తారు. లక్ష్మీదేవిని స్వాగతించడానికి పాదముద్రలు గీస్తారు. అదే విధంగా దీపావళి రోజున కొత్త వాహనాలు కొనడం, కొత్త కార్యాలయాలు, దుకాణాలు ప్రారంభించడం వంటి శుభకార్యాలయాలను నిర్వహిస్తారు. నాలుగు రోజుల పండుగ మహారాష్ట్రలో దీపావళిని 4 రోజులు జరుపుకొంటారు. మొదటి రోజు వసుబరస్ పేరుతో ఆవు, దూడలకు పూజ చేస్తారు. ఇది తల్లి బిడ్డల ప్రేమను ప్రతిబింబిస్తుంది. రెండోరోజు ధంతేరాస్ పేరుతో పూజలు నిర్వహిస్తారు. మూడవ రోజు అంటే నరకచతుర్దశి నాడు ఉదయాన్నే తల స్నానం ఆచరించి ఆలయాన్ని సందర్శిస్తారు. కరంజీ, లడ్డూ, చక్కి లాంటి స్వీట్లను తయారుచేస్తారు. ఇక నాల్గోరోజైన దీపావళి నాడు వ్యాపారులు జమాఖర్చులు చూసుకొని కొత్త పుస్తకాలను ప్రారంభిస్తారు. సాయంత్రం ఇంటిముందు దీపాలు వెలిగించి తమ ఇంట్లోకి రావాలని లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు. అమ్మవారిముందు బంగారం, డబ్బు పెట్టి సంపదతో దేవిని పూజిస్తారు. ఇంకాస్త అందంగా.. వారణాసి....ఎప్పుడూ అందమైన ప్రదేశమే. దీపావళి రోజున వారణాసి ఇంకా ఎంతో అందంగా ముస్తాబవుతుంది. బాణాసంచా, దీపాల నిర్విరామ వెలుగులతో కాశీ విరాజిల్లుతుంది. దీపావళి సందర్భంగా ఇచ్చే గంగా హారతిని దర్శనం చేసుకోవడానికి చాలా మంది హిందువులు వారణాసికి తరలివస్తారు. క్యాండిల్ లైట్లు, నదిలో తేలియాడే మట్టి దీపాలతో వారణాసి వెలుగులు చూడటానికి ఏటా భక్తులు వారణాసిని సందర్శిస్తారు. దీపావళి పండగ అనంతరం రెండు వారాల తర్వాత కార్తిక పౌర్ణమి నాడు వారణాసిలో 10 లక్షల దీపాల మధ్య దేవతామూర్తుల ఊరేగింపు అక్కడి మరో ప్రత్యేకత. కాళీ మాత ఆరాధన భారతదేశంలో చాలా మంది దీపావళి రోజున లక్ష్మీ దేవిని ఆరాధిస్తుండగా, పశ్చిమ బెంగాల్లో కాళీ మాతను పూజిస్తుంటారు. దీపావళి సందర్భంగా పశ్చిమ బెంగాల్లోని వివిధ ప్రాంతాల్లో కాళీ మాత మండపాలు దర్శనమిస్తాయి. కోల్కతాలోని కాళీదేవీ ఆలయాలైన కలిఘాట్, బేలూర్ మఠం దక్షిణేశ్వర్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. దీపావళి రోజున కాళికా దేవీని సందర్శించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. దీపావళి రాత్రి పూర్వీకుల ఆత్మలు స్వర్గానికి వెళ్లేలా వారిని దిశానిర్దేశం చేయడానికి పొడవైన స్తంభాలపై దీపాలు వెలిగిస్తారు. ఆ వెలుగుల కాంతిలో వారు స్వర్గస్తులవుతారని వారి నమ్మకం. ఇప్పటికీ అక్కడ ఈ పద్దతిని పాటిస్తున్నారు. ఒడిశాలో కూడా ఇదే పద్దతిని ఆచరిస్తారు. పర్యావరణహిత దీపావళి పంజాబ్లో సిక్కులు బాణాసంచా కాల్చరు. కేవలం దీపాలు, క్యాండిల్స్, రంగోలితో ఇంటిని అలంకరిస్తారు. వెండినాణేలతో లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇక పంజాబీలు లక్ష్మీదేవిని పూజించడంతో పాటు పితృదేవతలను కూడా ఆరాధిస్తారు. మహాలయ అమావాస్య నాడు భూలోకానికి వచ్చిన పితృదేవతలు ఒక మాసమంతా తమ వెంట ఉంటారని వారు విశ్వసిస్తారు. దీపావళి నాడు ఆరాధనలు అందుకొని తాము వెలిగించే దీపాలను చూసి పితృలోకాలకు తిరిగి వెళ్లిపోతారని వారి నమ్మకం. -
ముఖేశ్ ఇంట దివాళీ సంబరాలు..!!
-
ట్రెండ్కు తగినట్టు ఉంటేనే ఎవరైనా చూసేది
అక్కా! నువ్వు చేయించుకున్నావ్ కదా! నాక్కూడా చేయించవే!! ఏమండీ!నా తోటికోడలు చేయించుకుందిగా!! అత్తా! మీ అమ్మాయికి చేయించారుగా!! వదినా! మా అన్నయ్య నీకు చేయించాడుగా!! పండగ చేసుకునే సమయంలో ఈ చేయించడమేంటీ?! ఇవాళ ధనత్రయోదశి.. ఎల్లుండి పండగ! మరి కన్నుల పండుగ చేయించాలి కదా! ఆభరణాల కొనుగోలులోనే కాదు కాలానుగుణంగా వచ్చే మార్పులకు తగ్గట్టుగా ఎప్పుడూ అవి కొత్తదనంతో ఆకట్టుకుంటూ ఉండాలి. ఒకసారి నగ కొన్నాక అదెప్పుడూ ట్రెండ్లో ఉండాలి. అలాంటి ఆభరణాలు ఎన్నో మెడల్స్లో వచ్చాయి. అతివల మనసు దోచేస్తున్నాయి. ఎప్పటికీ ఎవర్గ్రీన్ అనిపించే డిజైన్స్ను ధరించిన మన ‘తారా’మణులు ఆభరణాలకు కొత్త సింగారాలను అద్దుతున్నారు. వీటిలో ఖరీదైనవే కాదు అచ్చూ అలాగే ఉండే ఇమిటేషన్ జువెల్రీ కొంగొత్తగా ఆకట్టుకుంటుంది. ఏ వేడుకకు ఏ ఆభరణమో ఎంపికలోనే ఉంటుంది అసలు అందం. ♦ వరుసలుగా కూర్చిన పేటల హారాలు, జంతువులు, పక్షుల డిజైన్లతో రూపొందించిన హారాలు అన్నింటి ఔరా! అనిపిస్తూనే ఉన్నాయి. ♦ పోల్కీ కుందన్స్ సెట్ సంప్రదాయ వస్త్రాలంకరణ లోనే కాదు వెస్ట్రన్ డ్రెస్సులకు ఓ ప్రత్యేక అందాన్ని, ఆకర్షణను తెచ్చిపెడతాయి. అందుకే తారల అలంకరణలో తప్పనిసరి ఆభరణం అయ్యింది. ♦ మామిడి పిందెల హారాలు ఏ సందర్భాన్నైనా కాంతివంతంగా మార్చేస్తాయి. కాలాలు మారినా మారని ఈ డిజైన్ అతివలకు ఎప్పుడూ ఆకర్షణీయమే! ♦ మిగతా ఆభరణాలేవీ అవసరం లేకుండా పెద్ద పెద్ద చెవి బుట్టాలు ఏ వేడుకనైనా ప్రత్యేకతను నిలిపేలా చేస్తున్నాయి. ♦ పెద్ద పెద్ద పోల్కీచోకర్ సెట్స్ వేడుకకు ఒక రాణివాసపు లుక్ను తీసుకువస్తున్నాయి. అందుకే మన సంప్రదాయ వేడుకలో తప్పనిసరి గ్రాండ్ ఆభరణమైంది. ♦ దేవతా మూర్తుల రూపాలతో డిజైన్ చేసిన ఆభరణాలు (టెంపుల్ జువెల్రీ) సంప్రదాయ వేడుకలో హైలైట్గా నిలుస్తున్నాయి. ♦ ముత్యాల సొగసు ఎప్పుడూ కొత్త సింగారాలను మోసుకొస్తూనే ఉంటుంది. అందుకే ప్రతి వేడుకను ముత్యాల ఆభరణాలు ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. ♦ వజ్రాభరణాలు ఏ వయసు వారికైనా తీరైనా ఖరీదైన అందాన్ని తీసుకువస్తాయి. మగువల మనసు దోచే ఆభరణాలలో ఒక్కటైనా వజ్రాభరణం ఉండాల్సిందే! -
వెలుగులు కురిపించే ఆ వరుసే కీలకం
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం గృహే దీపం నమోస్తుతే ‘‘ గదిని ఆవరించిన అంధకారం దీపం వెలిగించగానే మాయమైనట్లు అనేక జన్మలలో చేసిన పాపాలు భగవంతుని కరుణాకటాక్షాలతో దూరం అవ్వడమే దీపావళి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాస ప్రారంభంలో దేవీ నవరాత్రులు, నరక చతుర్దశి, దీపావళి పండుగలు రావడం విశేషం. త్రయోదశి రోజు రాత్రి అపమృత్యు నివారణ కోసం దీపాలు వెలిగించి ఇంటిముందు ఉంచాలి. నరక చతుర్దశి రోజున అభ్యంగన స్నానం చేయాలి. నరకం వలన భయం లేకుండా నరక చతుర్దశి నాడు స్నానం చెయ్యాలని నరక చతుర్దశి గురించి యమధర్మరాజుని ఉద్దేశించి చెప్పినట్లు భవిష్య పురాణం చెబుతోంది. దీపావళి అంటే దీపముల వరుస. చీకటి నుంచి వెలుగులోకి రావడం అనేది అంతరార్థం. శ్రీరాముడు ఆశ్వయుజ మాసంలో విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజించి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు. మహావిష్ణువు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి పంపించాడు. అయినప్పటికీ బలి శ్రీహరినే ధ్యానించాడు. దానికి సంతోషించిన శ్రీహరి ‘నీవు దీపావళి రోజున పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ ఒక్కరోజు పరిపాలన చెయ్యి’ అన్నాడు. ఆ రోజు వెలిగించే దీపాలకే బలిదీపం అని పేరు. వరాహావతారంలో విష్ణుమూర్తికి, భూదేవికి జన్మించినవాడే నరకాసురుడు. బ్రహ్మ వల్ల వరాలు పొంది దేవతల్ని బాధపెట్టాడు. దేవతలందరూ దేవేంద్రుని వద్దకు వెళ్లి తమ బాధ చెప్పుకోగా దేవేంద్రుడు దేవతలందరితో కలిసి విష్ణుమూర్తి వద్దకు వెళ్లి ప్రార్థించగా శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకుడిని వధించారు. భూదేవి కూడా నరకుడి మరణానికి బాధపడలేదు. ఆమె అతనొక్కడికే తల్లి కాదు, భూమి మీద జీవించే ప్రతివారికి తల్లే కదా. పుత్ర శోకాన్ని మరచి నరకుని పేరు మీద పండుగగా ప్రజలు జరుపుకోవాలని శ్రీమహావిష్ణువుని ప్రార్థించింది. అదే నరక చతుర్దశి. ఆ తర్వాత రోజే ఆనందోత్సాహాలతో జరుపుకునే దీపావళి పండుగ. – డా. గొర్తి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి -
జాగ్రత్త చిన్నదే.. కానీ ఫలితం పెద్దది
దీపావళిలో ఆనందం ఉంది. కాని ఆ పక్కనే ప్రమాదం కూడా పొంచి ఉంది. దీపావళి పండుగ నూనెతో, దీపాలతో, మంటతో, భాస్వరంతో ముడిపడి ఉంది. ఇవి కాంతులతో పాటు ఏమరుపాటుగా ఉండే కన్నీళ్లను కూడా మిగులుస్తాయి. ఎన్నేళ్లు గడిచినా కొన్నింటి పట్ల కొందరు నిర్లక్ష్యంగా వుంటారు. పిల్లలకు టపాకాయలు ఇచ్చి బయట వాళ్లు కాలుస్తూ ఉంటే లోపల ఉంటారు. తీరా ప్రమాదం జరిగాక వేదన అనుభవిస్తారు. దీపావళిలో వినోదంతో పాటు జాగురూకత కూడా అవసరం. నివారణ ఇంకా అవసరం. మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిపుణులు చెప్పారు. పాటించండి. సేఫ్గా దీపావళి జరుపుకోండి. చర్మం దీపావళి పిల్లలకు ఇష్టమైన పండుగ. ఆ వెలుగులు ఉత్సవం కాస్తా ఒక్కోసారి జీవితంలో చీకట్లు నిండేలా చేయవచ్చు. మనకు ఇష్టమైన బాణాసంచా చర్మాన్ని కాల్చేయవచ్చు. అలా జరగకుండా మేనిని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చదవండి. ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదంలో చర్మం కాలినా తీసుకోవాల్సిన ప్రథమ చికిత్సల గురించి తెలుసుకోండి. ప్రమాదాలకు గురికాకుండా నివారణ ఇలా: ► సాధారణంగా బాణాసంచా కాల్చడానికి మనం కొన్ని పెద్ద దీపాలను లేదా కొవ్వొత్తులు ఉపయోగిస్తాం. ఈ కొవ్వొత్తి లేదా దీపాలను వెలిగించే ముందు కాటన్ దుస్తులు ధరించండి. దీపం మీదికి ఒంగే సమయంలో వేలాడేవి కాకుండా కాస్త ఒంటికి అంటిపెట్టుకొని ఉండేలాంటి దుస్తులు మంచిది. చున్నీ లాంటివి సైతం ముందుకు వంగినప్పుడు వేలాడకుండా కాస్త బిగించి కట్టుకోవాలి. పైటను నడుములో దోపుకోవాలి. ► బాణాసంచా కాల్చే సమయంలో మహిళలు తమ జుట్టును క్లిప్ చేసుకోవాలి. వదులుగా వదిలేయకూడదు. ► ఎప్పుడూ ఆరుబయటే బాణాసంచా కాల్చండి. ► టపాసులు కాల్చే సమయంలో ఒక బకెట్ నీళ్లను పక్కనే ఉంచుకోండి. ► పెద్ద శబ్దం వచ్చే బాంబులకు, తారాజువ్వలకు పిల్లలను దూరంగా ఉంచండి. ► కాళ్లు మొత్తం కవరయ్యే లాంటి పాదరక్షలు ధరించండి. ► మీ ఫస్ట్ఎయిడ్ కిట్ దగ్గర ఉంచుకోండి. ► విపరీతమైన పొగవచ్చే పాంబిళ్లల్లాంటివి కాల్చకండి. ఈ పొగ మీ చర్మానికీ హాని చేస్తుంది. ఒకవేళ ప్రమాదానికి గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ► మీ గాయాన్ని చల్లటినీళ్లతో కడగాలి. ఈ నీళ్లు నల్లా/కొళాయి నుంచి పడుతుండేలా జాగ్రత్త తీసుకోవాలి. కాలిన గాయంపై నుంచి నీళ్లు జారుతుండేలా మగ్ను ఒంపాలి. (కాలిన చోట నీళ్లతో కడిగే సమయంలో ఆ నీరు కూడా వేడెక్కుతుంది. ఇలా వేడెక్కిన నీటిని పారేలా చేసి, మళ్లీ చల్లని నీరు గాయం మీద ఎప్పటికప్పుడు చేరుతుండాలి. అందుకే గాయాన్ని నల్లా / కొళాయి కింద గానీ లేదా మగ్ సహాయంతో గాని కడగాలన్నమాట)జ ఇలా అక్కడి బాణాసంచాలోని పౌడర్ అంతా కడుక్కుపోయేంతవరకు గాయాన్ని కడగాలి. ► కాలిన గాయాల మీద సిల్వర్ సల్ఫాడయజైన్ క్రీమ్ రాయాలి. కాలిన గాయాలు మరీ పెద్దవైతే ప్రమాదానికి లోనైన వారిని వెంటనే హాస్పిటల్కు తరలించాలి. ► కాలిన గాయాలు మరీ పెద్దవైతే ప్లాస్టిక్ సర్జన్ కూడా అవసరం కావచ్చు. కళ్లు టపాసుల కారణంగా కంటికి స్వల్పమైన ఇరిటేషన్ నుంచి కార్నియా రాపిడికి గురవ్వడం, రెటీనా ఇబ్బందులు అంధత్వం దాకా దారి తీయవచ్చు. క్రాకర్లోని రసాయనాల సాంద్రత, కళ్లకు ఎంత బలంగా తాకింది అనే దానిపై గాయం ఆధారపడి ఉంటుంది. కంటి గోడకు అయ్యే గాయం వల్ల కలిగే వాపు (ఓపెన్ గ్లోబ్ ఇంజ్యూరీ) కార్నియల్ గాయంతో పాక్షికంగా ఉబ్బడం (క్లోజ్డ్ గ్లోబల్ ఇంజ్యూరీ) కంటి చుట్టూ నలిగిపోవడం,(కంట్యూషన్ ) కనుగుడ్డు వాపు (లామెల్లర్ లాకెరేషన్) వగైరా సమస్యలతో దీపావళి వేడుక అనంతరం కంటి వైద్యులను సంప్రదించేవాళ్లు ఎక్కువే. దీర్ఘకాలం అలుముకుని ఉండే పొగలో నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్ స్థాయిలు బాగా పెరగి కంటి దురదలకు, నీరు స్రవించడానికి దోహదం చేస్తుంది. జాగ్రత్తలు... టపాసుల్ని మూసి ఉంచిన బాక్స్లో సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. కాల్చే సమయంలో సింథటిక్ దుస్తులు ధరించవద్దు. ఖాళీ ప్రదేశాల్లో గాగుల్స్ ధరించాలి. ముఖానికి, జుట్టుకి, దుస్తులకు కనీసం ఒక చేయంత దూరం లేదా అడుగు దూరంలో, చూసేటప్పుడు కనీసం 5 మీటర్లు దూరంగా ఉండి చూడాలి. కాల్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం మరచిపోవద్దు. వేడికి నేరుగా ఎక్స్పోజ్ అయితే తీవ్రమైన ఇబ్బందులు రావచ్చు కాబట్టి కాంటాక్ట్ లెన్స్లు దరించే వాళ్లు రెట్టింపు జాగ్రత్తలు తీసుకోవాలి. కాల్చేసిన టపాసులలో సగం కాలినవి కూడా ఉండొచ్చు. బకెట్ నీళ్లతో తడిపి పారేయడం మేలు. కంటికి సమస్య వస్తే... కాలుస్తున్నప్పుడు కంటి దురద అనిపిస్తే రుద్దడం గాని నలపడం కాని చేయకూడదు వెంటనే కన్రెప్పలు పైకి ఎత్తి శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. కంటిలో ఏదైనా పెద్ద పరిమాణంలో ఇరుక్కుపోతే తీసేందుకు హడావిడిగా ప్రయత్నించవద్దు. కళ్లు మూసి ఉంచి వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. కంట్లో ఏదైనా రసాయనం లాంటిది పడినట్లయితే కంటి దిగువ భాగాల్ని 30 నిమిషాల పాటు తడిపి వైద్యుల్ని సంప్రదించాలి. కంటి మీద ఏదైనా పడినా ఇరిటేషన్ అనిపిస్తే పిల్లలు గబుక్కున కంటిని నలిపేయడం గాయాన్ని పెద్దది చేస్తుంది. ఫోమ్ క్యాప్ వంటి మెత్తని వస్త్రాన్ని కంటి మీద కప్పి వైద్యులను సంప్రదించాలి. నొప్పి నివారణ మందులు సహా ఒటిసి మెడిసిన్స్ ఉపయోగించవద్దు.. ఆయింట్మెంట్ అప్లయ్ చేస్తే కంటి పరీక్ష చేసేందుకు అది అడ్డంకిగా మారుతుంది. ఈఎన్టీ పెద్ద శబ్దంతో పేలే టపాసుల వల్ల కేవలం చెవులకు మాత్రమేగాక మాత్రమే గాక అన్ని రకాలుగా నష్టం జరగవచ్చు. ఉదాహరణకు పెద్ద పెద్ద శబ్దాలు ప్రెగ్నెంట్స్లో గర్భస్రావం కలిగించవచ్చు. వయోవృద్ధుల్లో గుండెపోటుకూ దారితీయవచ్చు. ► ఒక్కోసారి దూరం నుంచి వినిపించే పెద్ద పేలుడు శబ్దం కంటే దగ్గర నుంచి వినిపించే చిన్న చప్పుడే చెవికి ఎక్కువ నష్టం చేయవచ్చు. అదే అంతకంటే తక్కువ శబ్దమే చెవికి మరింత దగ్గరగా అయితే దానివల్ల నష్టం ఎక్కువ ఉండవచ్చు. ► మానవులకు హాని చేసే శబ్దాలను రెండురకాలుగా ఉంటాయి. మొదటిది ఇంపల్స్ సౌండ్, రెండోది రెండోది... నిత్యం శబ్దాలు వింటూ ఉండటం. దీని వల్ల కలిగే నష్టాన్ని క్రానిక్ అకాస్టిక్ ట్రామా అంటారు. దీపావళి సమయంలో వినిపించే శబ్దం ఇంపల్స్ సౌండ్. దీని వల్ల కింద పేర్కొన్న ఏవైనా సమస్యలు రావచ్చు. అవి... ► అకస్మాత్తుగా చెవి దిబ్బెడ పడినట్లు (ఇయర్ బ్లాక్) కావడం. ► చెవిలో నొప్పి, గుయ్య్బరనే శబ్దం వినిపిస్తూ ఉండవచ్చు. ► చెవిలోపలి ఇయర్ డ్రమ్ (టింపానిక్ పొర) దెబ్బతిని కొన్నిసార్లు కాస్తంత రక్తస్రావం కావడం. ► నరం దెబ్బతిని పూర్తిగా వినిపించకపోవడం వంటి శాశ్వత నష్టమూ జరగవచ్చు. టెంపొరరీ థ్రెషోల్డ్ షిఫ్ట్: ఏదైనా పెద్ద శబ్దం అయి చెవికి తాత్కాలికంగా నష్టం జరిగి వినిపించకపోవడం అంటూ జరిగితే సాధారణంగా 16 గంటల నుంచి 48 గంటలలోపు దానంతట అదే సర్దుకొని రికవరీ అవుతూ ఉంటుంది. అలా తాత్కాలికంగా వినిపించకపోయే దశను ‘టెంపొరరీ థ్రెషోల్డ్ షిఫ్ట్’గా పేర్కొనవచ్చు. అప్పటికీ చెవి వినిపించకపోతే అప్పుడు దాన్ని శాశ్వత నష్టంగా భావించాల్సి ఉంటుంది. పెద్ద శబ్దం తర్వాత చెవులు వినిపించకపోతే అప్పుడు ఆ చెవిలో ఇయర్ డ్రాప్స్, నీళ్లూ, నూనె ఎట్టిపరిస్థితుల్లో వెయ్యకండి. తప్పక ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించాలి. ఆయన మైక్రోస్కోప్, ఆడియోమెట్రీ పరీక్షలతో చెవికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి చికిత్స చేస్తారు. ముక్కుకు, గొంతుకు హాని – టపాసుల పొగతోనూ ముక్కు, గొంతు, స్వరపేటికలో మంటగా రావచ్చు. అందుకే పొగకూ, రసాయనాలకు ఎక్స్పోజ్ అయితే చేతులనూ, ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. గొంతులో నీళ్లు పోసుకొని పుక్కిలించాలి. ► బాణాసంచా కాల్చాక చేతులకూ రసాయనాలు అంటుతాయి కాబట్టి వాటితో ముక్కు, చెవుల వద్ద రుద్దడం చేయకూడదు. రసాయనాలు అంటిన చేతుల్తో ముక్కు దగ్గర రుద్దితే దాని నుంచి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. ముక్కు నుంచి రక్తం కారడాన్ని వైద్య పరిభాషలో ఎపిస్టాసిస్ అంటారు. ఇలా బాణాసంచాలోని రసాయానాలు చేతులకు అంటినప్పుడు వాటిని ముఖానికి, కళ్లకూ, ముక్కుకూ, చెవులకూ దూరంగా ఉంచాలి. అదే చేతులతో ముఖాన్ని, కళ్లనూ రుద్దుకోవద్దు. జంతువుల సంరక్షణకు సూచనలు... పటాసుల నుంచి జంతువులను రక్షించడానికి పెటా లాంటి పెట్ కేర్ పీపుల్ మాత్రమే కాకుండా, మన లాంటి మామూలు మనుషులూ ముందుకు రావాలి. మన వినోదం కోసం కాల్చే బాణాసంచా వాటికీ చేటు తెచ్పిడుతుంది. అవి బెదరడం వల్ల మనకే ముప్పు ముంచుకురావచ్చు. ఉదాహరణకు ఒక ఆవు గోడపై పోస్టర్ను తింటూ ఉందనుకుందాం. లేదా రోడ్డు పక్కన కూర్చొని తిన్నదాన్ని ప్రశాంతంగా నెమరేసుకుంటుందని అనుకుందాం. పటాసు పేలిన శబ్దంతో అది బెదిరిపోయి రోడ్డు మీదకు అకస్మాత్తుగా వచ్చేస్తుంది. దాంతో వాహనదారులు యాక్సిడెంట్లకు గురికావచ్చు. ప్రమోదం ప్రమాదం కాకుండా ఉండటానికి పశువైద్య నిపుణులు చెబుతున్న జాగ్రత్తలివి... ► పెంపుడు జంతువుల్లో కుక్కలు ఎక్కువ. బాణాసంచా మోతలకు అవి బెదిరిపోయే ప్రమాదం ఎక్కువ. ఇది ఎంతగా ఉంటుందంటే... దీపావళి నాడు మాత్రమేగాక దీర్ఘకాలం పాటు వాటికి ఆ బెదురు తగ్గదు. చిన్న చిన్న శబ్దాలకే వణికిపోతుంటాయి. లేగదూడలూ, బర్రెకుర్రలూ ఇదే ప్రమాదానికి గురవుతాయి. వీధుల్లో తిరిగే పిల్లుల వంటి స్ట్రే యానిమల్స్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ► ఒక ఒక్కోసారి థౌజెండ్వాలా లాంటివి చాలా సేపు అదేపనిగా చిటపటలాడుతూ మోగుతూనే ఉంటాయి. దాంతో పెంపుడు జంతువులు మాత్రమే గాక... చెట్లపై ఉండే పక్షులూ బెదిరిపోతాయి. ఒక్కోసారి వాటి గుండె ఆగిపోయి చెట్టు మీది నుంచి నేల మీదికి రాలిపోవచ్చు. ► పెద్దగా పేలే శబ్దాలతో కక్కులకు సౌండ్ ఫోబియా వచ్చి అన్నం తినడం కూడా మానేస్తాయి. ఆ తర్వాత చాలా రోజులు దిగులుగా ఉంటాయి. ఇలాంటి ప్రమాదాల నుంచి పెంపుడు కుక్కలాంటి జంతువులను, పేలుళ్లు తినిపించే ప్రాంతం నుంచి కాస్త శబ్దాలు తక్కువగా వినిపించే గదుల్లోకి తీసుకెళ్లాలి. వాటికి ఇష్టమైన బొమ్మలతో వాటిని ఆడిస్తూ, శబ్దాల నుంచి దృష్టి మళ్లించేలా చేయాలి. ఇక వాటికి ఇష్టమైన ఆహారం ఇవ్వాలి. ► చెట్ల మీద గూటిలో ఉండే తల్లిపిట్టలు రాలిపోతే గూళ్లలో కళ్లుతెరవని పిట్టపిల్లలకు పేరెంట్స్ను దూరం చేసినట్లే. పెద్ద పక్షుల ఉసురు తీస్తే పిల్లపిట్టల ఉసురూ మనం పోసుకున్నట్లే! అందుకే గట్టిగా పేలిపోయే శబ్దాలు వచ్చే టపాసులు కాకుండా వెలుగులు చిమ్మే వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. – డాక్టర్ ఎం.వంశీధర్, రీజనల్ మెడికల్, డైరెక్టర్, డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్, హైదరాబాద్ -
చిన్న మార్పుతో.. ఇల్లంతా వెలుగుల వెన్నెలే..!
≈ ఇమిటేషన్ జువెలరీ, ఫ్యాషన్ జువెలరీ ఇక ధరించడానికి వీలు లేకుండా ఉన్నా, వాడి వాడి బోర్ కొట్టేసినా వాటిని ఏం చేస్తున్నారు? పండగ వేళకు ఇదిగో ఇలా మార్చేయండి. ఇంటికి, కంటికి కళ పెరుగుతుంది. ≈ ఎన్నో దీపాలతో అలంకరించే వెలుగుల దీపావళి ఇంకా అందంగా మెరవాలంటే.. దీపాలు పెట్టే అడుగు భాగం మీ పాత ఇమిటేషన్(గిల్టు) ఆభరణాలతో తీర్చిదిద్దండి. కొత్త కాంతితో మెరిసిపోతూ కనులకు విందు చేస్తాయి. ≈ రకరకాల రంగు పూసలు ఎన్నో ఉంటాయి. వాటిని కలిపి దండలా గుచ్చి గుమ్మానికి వేలాడదీస్తే! ఇలా అందంగా ఉంటుంది. లేదంటే ప్లెయిన్గా ఉండే గోడకు హ్యాంగ్ చేస్తే చాలు. ≈ ప్లెయిన్ చార్ట్ తీసుకొని పెద్ద చమ్కీలు, పూసలు, ముత్యాలు, కుందన్స్ను అతికించి వేలాడదీస్తే.. వాల్ హ్యాంగింగ్ ఎంత చూడముచ్చటగా ఉంటుందో కదా! ≈ పాతవైన ఎంబ్రాయిడరీ డ్రెస్సులు, చీరలు, లెహంగాలకు అందమైన డిజైన్స్ ఉంటాయి. వాటిని అలాగే పడేయకుండా జాగ్రత్తగా కట్ చేసి, పూలతో కలిపి రంగవల్లులను దిద్దితే.. పండగ కళ రెట్టింపు అవకుండా ఉండదు. ≈ ఇలాంటి ఎన్నో ఐడియాలను మీరూ చేయగలరు. ప్రయత్నించండి. పండగ ఆనందాన్ని వెయ్యింతలు చేయండి. -
దీపావళి వేడుకల్లో పాల్గొన్న ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. వైట్హౌస్లోని రూజ్వెల్ట్ రూమ్లో జరిగిన ఈ వేడుకల్లో ట్రంప్తో పాటు భారత రాయబారి నవతేజ్ సింగ్ సర్నా, ఆయన భార్య అవినా, పలువురు ఇండో అమెరికన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. యూఎస్ భారత్తో ధృడమైన సంబంధాలు కలిగి ఉందని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో తనకు ఉన్న స్నేహం చాలా గొప్పదని వ్యాఖ్యానించారు. భారత్తో వాణిజ్య సంబంధాలు మరింత బలపడేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. భారత్ మంచి సంధానకర్త అని కొనియాడారు. అమెరికాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులకు, జైనులకు దీపావళి అతిపెద్ద పండుగని ఆయన అన్నారు. కోట్లాది మంది తమ కుటుంబాలతో కలిసి వారి జీవితాల్లో కాంతులు నిండాలని కోరుకుంటూ ఈ వేడుకను జరుపుకుంటారని తెలిపారు. గతేడాది జరిగిన దీపావళి వేడుకల్లో కూడా ట్రంప్ పాల్గొన్నారు. -
ఉక్కిరిబిక్కిరి
సాక్షి,సిటీబ్యూరో: ఈ ఏడాది దీపావళి పండగ సందర్భంగా నగరంలో శబ్దకాలుష్యం స్వల్పంగా తగ్గింది. కానీ వాయు కాలుష్యం సిటీజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. పీసీబీ జారీ చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. సుప్రీంకోర్టు రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యనే టపాసులు కాల్చాలంటూ జారీచేసిన మార్గదర్శకాలు నగరవ్యాప్తంగా అమలుకు నోచుకోలేదు. నగరంలోని సెంట్రల్ జోన్ పరిధిలో ఉల్లంఘనులపై పోలీసులు 71 కేసులు నమోదుచేసినా మిగతా జోన్లలో ఈ నిబంధనలు అమలు చేయకపోవడం గమనార్హం. ఇక టపాసులుకాలుస్తూ కళ్లకు గాయాలైన 14 మందిని సరోజినిదేవీ కంటి ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో అత్యధికులు చిన్నారులేనని, నలుగురి కళ్లకు శస్త్రచికిత్సలు చేశామని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మరో ఇద్దరి కార్నియా పూర్తిగా దెబ్బతినడంతో శాశ్వతంగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. మరో 8 మందికి చికిత్స చేసి ఇంటికి పంపినట్లు చెప్పారు. కాలిన గాయాలతో మరో 11 మంది ఉస్మానియా ఆస్పత్రిలో చేరగా.. ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్వల్పంగా తగ్గిన శబ్ద కాలుష్యం దీపావళి సందర్భంగా నగరంలో కాలుష్య నియంత్రణ మండలి పారిశ్రామిక, వాణిజ్య, నివాస, సున్నిత ప్రాంతాల్లో శబ్ద కాలుష్యాన్ని వేర్వేరుగా నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే పారిశ్రామిక, వాణిజ్య, నివాస ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఢాం.. ఢాం శబ్దాలు స్వల్పంగా తగ్గాయి. ఆస్పత్రులు, విద్యాసంస్థలు ఉన్న సున్నిత ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగినట్లు పీసీబీ తాజా నివేదిక వెల్లడించింది. పెరిగిన వాయు కాలుష్యం తక్కువ శబ్దం వెలువడే క్రాకర్స్ స్థానంలో అధిక పొగ వెదజల్లే బాణసంచా కాల్చేందుకు సిటీజన్లు ప్రాధాన్యం ఇనివ్వడంతో ఈసారి వాయు కాలుష్యం గణనీయంగా పెరిగినట్లు పీసీబీ తాజా నివేదికతో స్పష్టమైంది. అయితే, గాలిలో సూక్ష్మ, స్థూల ధూళికణాల మోతాదు గతేడాది కంటే స్వల్పంగా తగ్గినట్లు తేలింది. కానీ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియా మోతాదు ఘనపు మీటరు గాలిలో గణనీయంగా పెరిగింది. సాధారణం కంటే అధికమే.. సాధారణ రోజులతో పోలిస్తే దీపావళి రోజు నగర వాతావరణంలో వివిధ రకాల కాలుష్య కారకాల మోతాదు రెట్టింపయినట్లు పీసీబీ పరిశీలనలో తేలింది. సూక్ష్మ ధూళికణాల కాలుష్యం సాధారణ రోజుల్లో 34 శాతం మేర నమోదవుతుండగా.. దీపావళి రోజున 61 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. 14వ తేదీ దాకా కాలుష్యం పరిశీలన సుప్రీంకోర్టు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు నగరంలో శబ్ద, వాయు కాలుష్యంపై అక్టోబరు 31 నుంచి ప్రత్యేకంగా నమోదు చేస్తున్నామని పీసీబీ తెలిపింది. ఈనెల 14 వరకు నగరంలో వాయు నాణ్యత, శబ్ద, వాయు కాలుష్యాన్ని శాస్త్రీయంగా లెక్కించి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి నివేదిస్తామని ప్రకటించింది. -
50 లక్షల కేజీల టపాసులు కాల్చారు
న్యూఢిల్లీ: దీపావళి పర్వదినాన ఢిల్లీ ప్రజలు సుమారు 50 లక్షల కిలోల బాణసంచా కాల్చారని సర్వేలో తేలింది. సుప్రీంకోర్టు ఆంక్షలు విధించినా కూడా గతేడాదికి సమానంగా అంత మొత్తంలో టపాసులు పేల్చడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. 50 లక్షల కిలోల బాణసంచా.. సుమారు లక్షా యాభై వేల కిలోల పీఎం 2.5 కణాల ద్రవ్యరాశికి సమానం. దీంతో ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) దారుణంగా పడిపోయి 642కు చేరింది. దీన్ని అత్యంత తీవ్రమైన కాలుష్య పరిస్థితిగా భావిస్తారని కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సఫర్ అనే సంస్థ తెలిపింది. మరో రెండు రోజుల పాటు ఢిల్లీలో వాయు నాణ్యత అదే స్థాయిలో కొనసాగొచ్చు. 11 రెట్ల కాలుష్యం: సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి నిర్ణీత సమాయానికి ముందు, తరువాత బాణసంచా కాల్చడంతో ఢిల్లీలో కాలుష్యం అనుమతించదగిన పరిమితుల కన్నా 11 రెట్లు అధికంగా నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటకు వస్తే ఎన్–99 ముసుగులు ధరించాలని వైద్యులు సూచించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిన ఘటనలపై 550కి పైగా కేసులు నమోదుచేసి, 300 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 2500 కిలోల బాణసంచాను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అగ్ని ప్రమాదాలకు సంబంధించి రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. -
చిన్నారి నోట్లో బాంబు పేల్చి..
లక్నో : దీపావళి పండుగ సంబరాల్లో భాగంగా యూపీలో దారుణం చోటుచేసుకుంది. మిలాక్కు చెందిన ఓ యువకుడు తన రాక్షసానందం కోసం మూడేళ్ల చిన్నారి నోట్లో బాంబు పెట్టి పేల్చాడు. వివరాలు... మిలాక్కు చెందిన చిన్నారి తన ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్న సమయంలో, అటుగా వెళ్తున్న హర్పాల్ అనే యువకుడు ఆమెను తనతో పాటు తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న సుతిల్ బాంబు చిన్నారి నోట్లో పెట్టి అంటించాడు. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని, బతికే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. కాగా ఘటనపై చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
దీపావళి వేడుకలో సెలబ్రెటీలు