Egg
-
గుంటూరులో ఉచితంగా చికెన్,గుడ్లు వంటకాల పంపిణీ... పోటెత్తిన జనాలు (ఫొటోలు)
-
World Best Egg Dishes: మసాలా ఆమ్లెట్ ఎన్నో స్థానంలో ఉందంటే..
గుడ్లను ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. వాటితో డెజెర్ట్ల దగ్గర నుంచి వివిధ రకాల వంటకాల వరకు పలు రకాలు చేసుకుని ఆస్వాదిస్తుంటా. అలాంటి గుడ్డు వంటకాలలో ది బెస్ట్గా భారతీయ వంటకం నిలిచింది. ప్రతి ఏడాది ది బెస్ట్ డెజర్ట్, బెస్ట్ కర్రీ వంటి వాటికి ర్యాంకులిచ్చి మరీ జాబితాను విడుదల చేసే ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఈ గుడ్డు వంటకాల జాబితానను కూడా విడుదల చేసింది. ఇది ప్రపంచంలోనే టాప్ వంద గుడ్డు వంటకాల జాబితాను వెల్లడించింది. వాటిలో మన భారతీయ వంటకం మసాలా అమ్మేట్ 22వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. మొదటి 50 బెస్ట్ గుడ్డు వంటకాల్లో మసాలా ఆమ్లేట్ స్థానాన్ని సంపాదించుకుంది. ఈ జాబితాలో జపాన్కి చెందిన అజిత్సుకే టమాగో అనే గుడ్డు వంటకం అగ్రస్థానంలో నిలిచింది. ఈ అజితసుకే టమాగో అనేది మిరిన్, సోయా సాస్తో నానబెట్టి ఉకించిన గుడలతో చేసే సంప్రదాయ జపనీస్ వంటకం ఇది. ఇక నోరూరించే మన భారతీయ మసాలా అమ్మెట్ తయారీ ఎలాగో చూద్దామా..!దీనిని గుడ్లు, ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, కొత్తిమీర, కారం, పసుపు పొడితో తయారు చేస్తారు. అన్ని పదార్థాలను గుడ్లతో కలిపి, ఆ మిశ్రమాన్ని పాన్లో (సాధారణంగా వెన్న లేదా నూనెతో) వండుతారు. ఈ స్పైసీ ఆమ్లెట్ను సాంప్రదాయకంగా పావ్ లేదా బ్రెడ్తో అల్పాహారంగా వడ్డిస్తారు. తాజాగా వండిన రోటీతో కూడా తినవచ్చు. చాలా మంది దీనిని టమోటా కెచప్ లేదా కొత్తిమీర-పుదీనా చట్నీతో ఆస్వాదిస్తారు. వీధి దుకాణాలలో ఈ వంటకాన్ని ఎక్కువగా విక్రయిస్తుంటారు. కొందరూ టమోటాలను కూడా ఉపయోగిస్తారు. చివరగా ప్రపంచంలోని టాప్ 10 గుడ్డు వంటకాల జాబితా ఏంటంటే..అజిత్సుకే టమాగో (జపాన్) టోర్టాంగ్ టాలాంగ్ (ఫిలిప్పీన్స్) స్టాకా మే అయ్గా (గ్రీస్) స్ట్రాపట్సదా (గ్రీస్) ఇస్పానక్లి యుమూర్త (టర్కీ) టోర్టిల్లా డి బెటాన్జోస్ (స్పెయిన్) యుఎస్ఎ బెనెడిక్ట్ (జపాన్) షక్షౌకా (ట్యునీషియా ప్రాంతాలు) మెనెమెన్ (టర్కీ)(చదవండి: -
బర్డ్ఫ్లూ భయం : సగానికి దిగజారిన గుడ్డు వినియోగం!
గుడ్లవల్లేరు: కోడిగుడ్డు వాడకాలు సగానికి పడిపోయాయి. జిల్లాలో నిత్యం కోడిగుడ్ల వినియోగం 20 లక్షల పైమాటే ఉండేది. కానీ బర్డ్ఫ్లూతో 10 లక్షలకు వాడకాలు పడిపోయాయి. గతంలో రిటైల్లో గుడ్డు ధర రూ.7 ఉండేది. అదే కోడిగుడ్డు ధర రూ.4.30కు పడిపోయింది. బర్డ్ఫ్లూ భయంతో చికెన్తో పాటు కోడిగుడ్లను తినకూడదన్న ప్రచారం బాగా కొనసాగుతుంది. దీంతో గుడ్డుకు ఉండే మాత్రం డిమాండ్ తగ్గిపోయింది. జిల్లాలో నిత్యం ఈ కోడిగుడ్ల వినియోగం 20లక్షల పైమాటే ఎప్పుడూ ఉంటుంది. గతంలో ఒక్కో కోడి గుడ్డు ధర రూ.5 నుంచి రూ.6 ఉండేది. అది కాస్తా....రూ.7కు పెరిగిపోయింది. ఇప్పుడైతే బర్డ్ఫ్లూతో రూ.4.50కు దిగజారింది. 30 గుడ్లు ఉండే ఒక్కో ట్రే గుడ్లను ప్రాంతాలను బట్టి రూ.135 నుంచి రూ.15 0వరకు మార్కెట్లో వ్యాపారులు అమ్ముతున్నారు.బర్డ్ఫ్లూ భయంతో.... బర్డ్ఫ్లూతో జిల్లాలో కోడిగుడ్ల వాడకం 10 లక్షలకు పడిపోయింది. తిరువూరు, గంపలగూడెంలో బర్డ్ఫ్లూ కలకలంతో మరింత ఆందోళన అధికమైంది. గతంలో జిల్లాలో గుడ్ల వాడకం 20 లక్షల పైమాటే ఉండేది. జిల్లాలోని ప్రజలతో పాటు హాస్టల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో గుడ్ల వినియోగం కూడా బర్డ్ఫ్లూతో తగ్గిపోయింది. అలాగే ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లలో వాడకం కూడా నానాటికీ దిగజారిపోతుంది. వీటిలో గుడ్ల వాడకం గతంలో ప్రతి స్నాక్స్ కోటింగ్కు వినియోగించటంతో పాటు ఫ్రైడ్రైస్ తయారు చేసే ఆ చెఫ్కు ఎగ్స్ లేకుండా వంట అనేది ముందుకు వెళ్లేదే కాదు. కానీ ఇపుడు చికెన్తో పాటు గుడ్డు లేకుండా ఉన్న స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్నే కస్టమర్స్ ఎక్కువగా అడుగుతున్నారని ఆ రెస్టారెంట్ల యజమానులు చెబుతున్నారు. గుడ్డుకు ఇలాగే డిమాండ్ తగ్గితే ఇపుడు ఒక్కో గుడ్డు రూ.4.50 ఉండటంతో ఆగిపోకుండా మరింతగా దిగజారిపోయే అవకాశం ఉందని వ్యాపారులు సతమతమవుతున్నారు.గుడ్డు హ్యాపీగా తినవచ్చు బర్డ్ఫ్లూ ఉన్న ప్రాంతాల్లో తప్ప గుడ్డును నిత్యం ఎలా ఆరోగ్యానికి వినియోగిస్తారో...అలాగే తినవచ్చు. కానీ ఆరగ్యోం కోసం పచ్చి గుడ్లను తాగేవాళ్లు కొన్నాళ్లు ఆ అలవాటుకు అడ్డుకట్ట వేయాలి. బర్డ్ఫ్యూ ప్రభావం తగ్గేంత వరకు కొన్ని జాగ్రత్తలతో గుడ్లను తింటే ఆరోగ్యానికి మంచిది. సగం ఉడికించిన (హాఫ్ బాయిల్డ్) గానీ, సరిగా ఉడకని ఆమ్లెట్ గానీ తినకూడదు. చలికాలంలో గుడ్లను తినటంతో శరీరానికి ఎక్కువగా వెచ్చదనం వస్తోంది. – డాక్టర్ ఎ.లక్ష్మీనారాయణ,వెటర్నరీ ఏడీ గుడ్లవల్లేరు -
'ఎగ్స్ కేజ్రీవాల్' రెసిపీ..: ఢిల్లీ మాజీ సీఎంకి ఏంటి సంబంధం..!
కొన్ని రెసిపీల పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటి పేర్లు భలే తమాషాగా ఉంటాయి. అసలు వాటికా పేరు ఎలా వచ్చిందో వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే ఈ రెసిపీకి కూడా అలానే పేరు వచ్చింది. కాకపోతే మన దేశ రాజధాని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పేరు మీద ఉండటం చూస్తే..ఆయనే పేరు మీద రెసీపీ పేరేంటీ అని అనుకోకండి. నిజానికి ఆయనకి ఈ రెసిపీతో సంబంధం లేకపోయినా..ఆ రెసీపీ స్టోరీ మాత్రం వెరీ ఇంట్రస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే..?.ఆ వంటకం పేరు ఎగ్స్ కేజ్రీవాల్(Eggs Kejriwal) అనే ప్రసిద్ధ బ్రేక్ఫాస్ట్. భారతీయ వంటకాల్లో ఎగ్స్తో చాలా వెరైటీ వంటకాలు ఉన్నాయి. అయితే ఈ వంటకం మాత్రం చాలా గమ్మతైనది. ఈ వంటకం ఆవిష్కరణ కూడా అత్యంత విచిత్రమైనది. ఈ వంటకం మూలం ముంబై(Mumbai). ఈ వంటకానికి కేజ్రీవాల్ పేరు ఎలా వచ్చిందంటే..1960లలో ముంబైలోని నాగరిక విల్లింగ్డన్ స్పోర్ట్స్ క్లబ్ దేవీ ప్రసాద్ కేజ్రీవాల్ అనే వ్యాపారవేత్త కారణంగా వచ్చిందట. ఆయనది పూర్తిగా శాకాహారులైన మార్వాడీ కుటుంబం. కాబట్టి ఇంట్లో గుడ్డు తినే ఛాన్స్ లేకపోయింది. అయితే ఆయనకు గుడ్లంటే మహా ప్రీతి. వాటిని ఆరగించేందుకు విల్లింగ్డన్ స్పోర్ట్స్ క్లబ్(Willingdon Sports Club) వెళ్లిపోయేవాడట. అక్కడ ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా గుడ్లు ఎలా తినాలన్నా ఆలోచన నుంచే..ఈ రెసీపీని కనిపెట్టారట పాకనిపుణులు. ఆయన బ్రెడ్ని చీజ్లో వేయించి దానిపై రెండు గుడ్లు వేయించుకుని ఆపై ఉల్లిపాయలు, కొత్తిమీర, మిరియాల పొడితో గార్నిష్ చేయించుకుని మరీ తెప్పిచుకునేవాడట. చూసే వాళ్లకు ఏదో చీజ్ బ్రెడ్ తిన్నట్లు కనిపిస్తుంది అంతే..!. ఆయన ఆవిధంగా అక్కడకు వెళ్లిన ప్రతిసారి అలా ఆర్డర్ చేయించుకుని తినడంతో మిగతా కస్టమర్లలో ఆయన ఏం ఆర్డర్ చేస్తున్నాడనే కుతుహాలం పెరిగింది. ఆ తర్వాత అందరికీ అలా తినడమే నచ్చి ఆర్డర్ చేయడం మొదలు పెట్టారు. దాంతో ఆ రెసిపీకి ఎగ్స్ కేజ్రీవాల్ అనే పేరు స్థిరపడిపోయింది. అంతేగాదు ఈ రెసిపీకున్న క్రేజ్ చూస్తే నోరెళ్లబెడతారు. ఎందుకంటే న్యూయార్క్, లండన్ రెస్టారెంట్లలో ప్రసిద్ద బ్రేక్ఫాస్ట్ ఇది. అలాగే న్యూయార్క్ టాప్ 10 వంటకాల జాబితాలో చోటు కూడా దక్కించుకుంది ఈ రెసిపీ. తమషాగా ఉన్న ఈ రెసిపీ స్టోరీ..ఓ మనిషి అభిరుచి నుంచే కొత్త రుచులతో కూడిన వంటకాలు తయారవ్వుతాయన్న సత్యాన్ని తెలియజేసింది కదూ..!. మరీ ఈ రెసిపీ తయారీ విధానం సవివరంగా చూద్దామా..!.కావాల్సిన పదార్థాలు తురిమిన చీజ్: 80 గ్రాములుబ్రెడ్: రెండు స్లైసులుస్ప్రింగ్ ఆనియన్స్ : 2పచ్చి మిరపకాయ: 1నూనె: 1 టీస్పూన్పెద్ద గుడ్లు: 2నల్ల మిరియాలు: రుచికి సరిపడతురిమిన చీజ్లో చక్కగా గోల్డెన్ కలర్లో బ్రెడ్లు కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మందపాటి గిన్నెలో రెండు గుడ్లను పగలకొట్టి వేసుకోవాలి. వాటిని చిదపకుండా అలానే బ్రెడ్పై వేసి కొద్దిసేపు కాల్చాలి. ఆ తర్వాత దానిపై ఆనియన్స్ తురిమిన చీజ్, పచ్చిమిర్చి, మిరియాల పౌడర్ చల్లి సర్వ్ చేయడమే. హెల్తీగానూ కడుపు నిండిన అనుభూతి కలిగించే మంచి బ్రేక్ఫాస్ట్ ఇది.(చదవండి: పుష్ప మూవీలో హీరో అన్నట్లు వర్క్లో బ్రాండ్ కావాలి..!) -
అంతుచిక్కని లక్షణాలతో.. గుడ్లు తేలేస్తున్న కోళ్లు
సాక్షి, భీమవరం/పెరవలి: ఏపీ పౌల్ట్రీల్లో కోళ్ల మృత్యువాత కలకలం రేపుతోంది. అంతుచిక్కని వైరస్తో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతుండటం కలవరపెడుతోంది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ప్రతి పౌల్ట్రీలో నిత్యం రోజుకు వేలాది కోళ్లు మరణిస్తున్నాయి. గత 15 రోజుల్లో సుమారు 40 లక్షలకు పైగా కోళ్లు చనిపోయినట్టు అంచనా. డిసెంబర్లోనే మొదలైన అంతుచిక్కని వైరస్ సంక్రాంతి తర్వాత మరింత విజృంభించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలోని ఓ పౌల్ట్రీలో ఇప్పటికే 1.60 లక్షల కోళ్లు మరణించాయి. ఆరోగ్యంగానే ఉన్నా క్షణాల్లో మరణం అప్పటివరకు ఆరోగ్యంగా కనిపించిన కోడి అంతలోనే మృత్యువాత పడుతుండటం పౌల్ట్రీ నిర్వాహకులను కలవరపెడుతోంది. సాధారణ మరణాలకు భిన్నంగా వేలాది కోళ్లు చనిపోతుండటం వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అంతుచిక్కని వైరస్ చాపకింద నీరులా పౌల్ట్రీలకు విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, అత్తిలి, ఇరగవరం, దేవరపల్లి, ఉండ్రాజవరం తదితర మండలాల్లో దాదాపు 200 పౌల్ట్రీలు ఉన్నాయి. వీటిలో గుడ్లు పెట్టే కోళ్లు 1.30 కోట్ల వరకు ఉండగా.. రోజుకు 1.05 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 245 షెడ్లలో 1.35 కోట్ల కోళ్లు ఉండగా.. వీటిని 245 షెడ్లలో పెంచుతున్నారు. ఈ జిల్లాలో నిత్యం 1.08 కోట్ల వరకు గుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. మొత్తంగా రెండు జిల్లాల్లో గుడ్లు పెట్టే కోళ్లు 2.65 కోట్ల వరకు ఉండగా.. నిత్యం 2.13 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి, నిడదవోలు, నల్లజర్ల, గోపాలపురం, కొవ్వూరు, కడియం ప్రాంతాల్లో పౌల్ట్రీలు ఉన్నాయి. ఇవేకాకుండా మాంసానికి వినియోగించే బ్రాయిలర్ కోళ్లను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నెలకు 12 లక్షలకు పైగా పెంచుతున్నారు. వీటి సంఖ్య ప్రతి 40 రోజులకు మారిపోతుంటుంది. ఊహించని రీతిలో మరణాలు సాధారణంగా డిసెంబర్, జనవరి మాసాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువై కొరైజా, సీఆర్డీ (క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్), రానికెట్ వంటి ఊపిరితిత్తుల సంబంధిత వైరస్లు వ్యాపిస్తుంటాయి. సాధారణంగా ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలతో పౌల్ట్రీలోని కోళ్ల సంఖ్యలో రోజుకు 0.05 శాతం లోపు కోళ్లు మృత్యువాత పడుతుంటాయి. లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో రోజుకు 20 నుంచి 50 వరకు కోళ్లు చనిపోతుంటే పరిగణనలోకి తీసుకోరు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. కొద్దిరోజుల క్రితం నాటు కోళ్లలో కనిపించిన వింత లక్షణాలు ఇప్పుడు లేయర్, బ్రాయిలర్ కోళ్లకు వ్యాపించాయి. నాటు కోళ్లతో పోలిస్తే లేయర్ కోళ్లకు వ్యాక్సినేషన్ విషయంలో పౌల్ట్రీ వర్గాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. కోడికి 20 వారాల వయసు వచ్చేనాటికి ఐ డ్రాప్స్, నీటిద్వారా, ఇంజెక్షన్ రూపంలో దాదాపు 23 వరకు వ్యాక్సిన్లు వేస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోళ్లు అంతుచిక్కని లక్షణాలతో మృత్యువాత పడుతుండటం పౌల్ట్రీ వర్గాలను కలవరపరుస్తోంది. కొన్ని పౌల్ట్రీల్లో అసాధారణ రీతిలో కోళ్ల మరణాలు సంభవిస్తున్నాయి. లక్ష కోళ్లు ఉంటే రోజుకు 3వేల నుంచి 4వేల వరకు చనిపోతున్నాయి. మూడు లక్షల కోళ్లు ఉన్న ఒక పౌల్ట్రీలో వారం రోజులుగా రోజుకు 13 వేల నుంచి 14 వేల వరకు కోళ్లు మృత్యువాత పడుతున్నట్టు ఉంగుటూరు మండలానికి చెందిన రైతు ఒకరు చెప్పారు. బర్డ్ఫ్లూ తరహాలోనే.. బర్డ్ఫ్లూ తరహాలోనే కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. శీతాకాలంలో వచ్చే వ్యాధులకు భిన్నంగా ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. తెల్లారేసరికి ఎన్ని కోళ్లు ఉంటాయో తెలియని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది వారాల క్రితం కృష్ణా జిల్లాలో అక్కడకక్కడా కనిపించిన ఈ వైరస్ లక్షణాలు తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు విస్తరించినట్టు తెలుస్తోంది. గతంలో బర్డ్ప్లూ వచ్చినప్పుడు కోళ్లను పూడ్చిపెట్టిన తరహాలోనే ఇప్పుడు చనిపోయిన కోళ్లను భారీ గోతులు తీసి సున్నం, బ్లీచింగ్, ఉప్పు వేసి పూడ్చిపెడుతున్నారు. పౌల్ట్రీల వద్ద ఫార్మాలిన్ ద్రావణంతో సిబ్బంది కాళ్లు, వాహనాల టైర్లు శుభ్రపరచిన తరువాత మాత్రమే లోపలికి అనుమతిస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పతనమవుతున్న గుడ్డు ధర శీతల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు పుంజుకుని డిసెంబర్లో ఫామ్ గేట్ వద్ద రూ.6.30కి అమ్ముడైన గుడ్డు ధర ఎండలు ముదురుతుండటంతో తిరోగమనం బాట పట్టాయి. ప్రస్తుతం ఫామ్ గేట్ వద్ద గుడ్డు ధర రూ.4.62కు చేరింది. ఓ వైపు గుడ్డు ధర పతనమవుతుంటే మరోపక్క అధిక సంఖ్యలో కోళ్ల మరణాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒక కోడి చనిపోతే రైతుకు రూ.300 నష్టం వస్తుంది. ఈ మేరకు ఎన్ని కోళ్లు చనిపోతే అంత నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. బ్యాంకు రుణాలు, అమ్మకాలు తగ్గిపోతాయన్న ఆందోళనతో పౌల్ట్రీ వర్గాలు వీటిపై నోరుమెదపని పరిస్థితి నెలకొంది. స్పష్టత ఇవ్వలేకపోతున్న పశు సంవర్థక శాఖ కోళ్ల ఆకస్మిక మరణాలపై పశు సంవర్థక శాఖ పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ను ల్యాబ్కు పంపామని, నివేదికలు రావాల్సి ఉందని పశుసంవర్ధక శాఖ ఏలూరు జిల్లా ఇన్చార్జి జేడీ టి.గోవిందరాజు తెలిపారు. ప్రస్తుతం హైలీ వైరల్డ్ ఆర్డీగా భావించి పౌల్ట్రీల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. చనిపోయిన కోళ్లను గొయ్యి తీసి పూడ్చిపెడుతూ.. మిగిలిన కోళ్లకు వైరస్ సోకకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ముందుజాగ్రత్తలే నివారణ కోళ్లకు సోకుతున్న వైరస్లకు మందులు లేవు. ముందుజాగ్రత్తలతోనే నివారణ సాధ్యం. వైరస్ సోకిన కోళ్లు గంటల వ్యవధిలోనే మృత్యువాత పడతాయి. ఒక కోడికి వైరస్ సోకిన నిమిషాల్లోనే మిగిలిన కోళ్లకు వ్యాపిస్తుంది. దీని నివారణకు వైరస్ సోకిన కోళ్లను వేరు చేయటం ఒక్కటే మార్గం. ముందస్తు టీకాలు వేయటం ద్వారానే అరికట్టాలి. కోళ్లలో వ్యాధి నిరోదక శక్తి పెంచేలా చర్యలు తీసుకోవాలి. – చరణ్, పశువైద్యాధికారి, పెరవలి -
32 ఏళ్ల వయసులో సీఈవో కరిష్మా కీలక నిర్ణయం
హ్యూమన్స్ ఆఫ్ బాంబే సీఈఓ కరిష్మా మెహతా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇటీవల తన అండాలను (ఎగ్స్)ను భద్రపర్చుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కావాల్సినప్పుడు పిల్లలను కనే వెసులుబాటు కల్పిస్తోన్న ఈ సంతాన పద్దతిని ఇప్పటికే చాలా మంది, సెలబ్రిటీలు హీరోయిన్స్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పునరుత్పత్తి సాధికారత కోసం ఎగ్స్ను చాలా మంది మహిళలు ఫ్రీజ్ చేసుకుంటున్న అంశాన్ని ఆమె హైలైట్ చేశారు. ఇంతకీ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలో..ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఎగ్ ఫ్రీజింగ్ అంటే వయసులో ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరచుకోవడం. ఇది కరియర్లో లేదా చదువులో బిజీగా ఉన్నపుడు, కావాల్సినప్పుడు పిల్లలను కనే వెసులు బాటు కల్పిస్తుంది. 30 వయసు దాటిన తరువాత నుంచి మహిళల్లో అండాల ఉత్పత్తి సామర్థ్యం, నాణ్యత క్షీణిస్తుంది అందుకే ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా మహిళల అండాలను సేకరిచి భద్రపరుస్తారు. కావాలనుకున్నపుడు ఈ అండాల ద్వారా పిల్లల్ని కనవచ్చు.ఈ ప్రక్రియను “ఓసైట్ క్రయోప్రెజర్వేషన్ అంటారు. తద్వారా జీవితంలో తరువాతి కాలంలో పునరుత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు తమ అండాలను గుడ్డు దానం విషయంలో ఇదే టెక్నిక్ సహాయపడుతుంది. మహిళల అండాల పరిస్థితి, ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఈ ప్రక్రియకోసం దాదాపు 10 నుండి 14 రోజుల వరకు పట్టవచ్చు. తాజాగా కరిష్మా మెహతా ఇన్స్టా స్టోరీలో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. తద్వారా ఎగ్ ఫ్రీజింగ్ మహిళల సంతానోత్పత్తి, పిల్లల్ని ఎపుడు కనాలి అంశాలనే చర్చను మరింత విస్తృతం చేశారు. కాగా ముంబైకి చెందిన కరిష్మా 1992 మార్చి 5న జన్మించింది. తన ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ ఫేస్బుక్ ద్వారా ఎందరో విజేతలను పరిచయం చేసింది. వారు అసామాన్య జీవన పోరాటాలు, త్యాగాలు, గొప్ప పనులు ఈ పేజీ ద్వారా లోకానికి తెలిశాయి.ఇలా సంతానోత్పత్తిలో కీలకమైన అండాలను మహళలు భద్రపర్చుకోవడం ద్వారా పిల్లల్ని ఎపుడు కనాలనుకుంటే అపుడు కనేందుకు ఇది చాలా అవసరమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం పిల్లల్ని కనేందుకు సంసిద్దంగా లేనపుడు, భవిష్యత్తులో పిల్లలు పుడతారా లేదా? అనే ఒత్తిడిని అరికట్టేందుకు ఎగ్ ఫ్రీజింగ్ అనేది అనుమతిస్తుంది.ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు, హీరోయిన్లు ఈ పద్ధతిని పాటిస్తున్నారు. స్టార్ హీరోయిన్, ప్రియాంక చోప్రా, హీరోయిన్ మెహ్రీన్ కూడా ఆ జాబితాలో చేరారు. అంతేకాదు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇదే ఆలోచనలో ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుత రోజుల్లో సరైన రిలేషన్ షిప్ దొరకడం చాలా కష్టమని. అందుకే తాను ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పు కొచ్చింది. -
తిరుమలలో ఎగ్ పలావ్!
తిరుమల: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో శనివారం కొందరు కొడిగుడ్ల పలావ్ (ఎగ్ బిర్యానీ) తింటూ కనిపించడం కలకలం సృష్టించింది. తమిళనాడు రాష్ట్రం గుమ్ముడిపూండికి చెందిన 23 మంది తిరుమలకు వస్తూ పెద్ద క్యారియర్ నిండా కోడిగుడ్ల పలావ్ తమ వెంట తెచ్చుకున్నారు. వారు బస్సులో అలిపిరి వద్ద చెకింగ్, లగేజ్ స్కానింగ్ దాటుకుని తిరుమలకు చేరుకున్నారు. రాంబగీచా అతిథిగృహం సమీపంలోని బస్టాండ్ వద్ద బస్సు దిగి అక్కడే కోడిగుడ్ల పలావ్ తినసాగారు.ఈ విషయాన్ని కొందరు భక్తులు గుర్తించి సమీపంలోని పోలీస్ కాంప్లెక్స్కి వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే వచ్చి గుమ్ముడిపూండికి చెందిన వారి వద్ద ఉన్న ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలకు ఇలాంటి ఆహారం తీసుకురాకూడదని పోలీసులు మందలించారు. ఈ అంశంపై టూ టౌన్ సీఐని సంప్రదించగా.. అది చాలా చిన్న విషయమని, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పడం గమనార్హం. కాగా, టీటీడీ విజిలెన్స్, భద్రతా విభాగం నిఘా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.తిరుమలలో బయటపడ్డ ఎగ్ పలావ్ -
ఎగ్సలెంట్ ఎక్సలెంట్ ఐడియా - నెలపాటు గుడ్లు ఫ్రెష్
కోడిగుడ్డు ఓ మంచి పౌష్టికాహారం, ప్రతి రోజు ఓ గుడ్డు తినమని వైద్యులు సైతం సలహాలిస్తుంటారు. కాబట్టి చాలామంది రోజుకో గుడ్డు తినేస్తుంటారు. అయితే ప్రతి రోజూ గుడ్లు తెచ్చుకోవడం, వాటిని నిల్వ చేసుకోవడం కొంత కష్టమైన పనే. అయినా తగ్గేదేలే అన్నట్టు కొందరు గుడ్లు నిల్వచేయడానికి వివిధ పద్ధతులను అనుసరిస్తుంటారు. కానీ చాలా రోజులు నిల్వ చేసుకోవడం మాత్రం దాదాపు అసాధ్యమే. దీనిని సుసాధ్యం చేయడానికి 'ఎగ్సలెంట్' (EGGcellent) ముందుకు వచ్చింది. దీని గురించి తెలుసుకోవడానికి సంస్థ ఫౌండర్ 'విశాల్ నారాయణస్వామి'తో సంభాషించాము.మీ గురించి చెప్పండినా పేరు 'విశాల్ నారాయణస్వామి'. నేను ఎగ్సలెంట్ ప్రారభించడానికి ముందు హైడ్రోపోనిక్ వ్యవసాయంతో పంటలు పండించాను. తరువాత ఆహార వ్యర్థాలను తగ్గించడానికి.. వాటిని ఫ్రీజింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇందులో భాగంగానే గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ చేసి అందించాలని ఈ సంస్థ ప్రారంభించాను.గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?ఇతర దేశాల్లో అయితే చిప్స్, నూడుల్స్ వంటి ఆహార పదార్థాల మాదిరిగా.. ఉడికించిన గుడ్లను కూడా షాపింగ్ మాల్స్ లేదా ఇతర స్టోర్లలో కొనుగోలు చేసి తింటున్నారు. ఈ విధానం మనదేశంలో లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని భారతీయులకు కూడా ఉడికించిన గుడ్లనే నేరుగా అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఆలోచన వచ్చింది.ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి? ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయా?ఎగ్సలెంట్ గుడ్లు నెల రోజులు (30 రోజులు) తాజాగా ఉంటాయి. ఇప్పటికే దీనిపై రీసెర్చ్ చేసి సక్సెస్ కూడా సాధించాము. ప్రస్తుతం 60 రోజుల నుంచి 90 రోజులు నిల్వ చేయడానికి కావాల్సిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా త్వరలోనే రానున్నాయి.గుడ్లను నిల్వ చేయడానికి ఏమైనా ద్రావణాలు ఉపయోగిస్తున్నారా?అవును, మేము గుడ్లను నిల్వ చేయడానికి ప్రత్యేకంగా తయారు చేసిన 'ఎగ్సలెంట్ ఎగ్స్టెండర్' (EGGcellent EGGstender) ద్రావణం ఉపయోగిస్తున్నాము.ఎగ్సలెంట్స్ ప్రారంభించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?ఒకేసారి ఎక్కువ గుడ్లను కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడం కష్టం. అంతే కాకుండా గుడ్ల ధరలు ప్రతి రోజూ మారుతూ ఉంటాయి. ఉదాహరణకు.. ఈ రోజు గుడ్డు ధర రూ.5 అనుకుంటే, మరుసటి రోజు అది రూ.5.50 పైసలు కావొచ్చు, 6 రూపాయలు కూడా కావొచ్చు. అలాంటప్పుడు వారానికి 10 గుడ్లు, నెలకు 30 గుడ్లు చొప్పున కొంటే.. ఎంత ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రజలు కూడా కొంత డబ్బుకు ఆదా చేసుకోవాలని.. మళ్ళీ మళ్ళీ గుడ్ల కోసం స్టోర్స్కు వెళ్లే పని తగ్గించాలని అనుకున్నాను.ఇప్పటికి కూడా చాలా మంది కొనుగోలు చేసిన గుడ్లలో.. చెడిపోయినవి లేదా పాడైపోయినవి కనిపిస్తూనే ఉంటాయి. అంతే కాకుండా ఎక్కువగా గుడ్లను కొనుగోలు చేస్తే.. కొన్ని రోజులకు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ దూరాలకు గుడ్లను ఎగుమతి చేయాలనంటే అవి తప్పకుండా పాడైపోకుండా ఉండాలి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఎగ్సలెంట్స్ ప్రారభించాలనుకున్నాను.ఎగ్సలెంట్స్ గుడ్ల వల్ల ఉపయోగాలు ఏమిటి?భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా సంకోచం లేకుండా ఎగ్సలెంట్స్ గుడ్లను ఎగుమతి చేసుకోవచ్చు. రిమోట్ ఏరియాలలో గుడ్లను విక్రయించాలనుకునే వారు కూడా కొన్ని రోజులు నిల్వ చేసుకుని వీటిని అమ్ముకోవచ్చు.ఎగ్సలెంట్స్ గుడ్ల ధరలు ఎక్కువగా ఉంటాయా?ఎగ్సలెంట్స్ గుడ్ల ధరలు సాధారణ మార్కెట్ ధరల కంటే 6 పైసల నుంచి 15 పైసలు మాత్రమే ఎక్కువ. కానీ ధర తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ గుడ్లను కొనుగోలు చేస్తే.. ధరలు పెరిగినప్పుడు ఆ ప్రభావం ప్రజల మీద పడకుండా ఉంటుంది. విక్రయదారులు కూడా వాటిని అప్పటి పెరిగిన ధరలకే విక్రయించుకోవచ్చు. -
ఎమ్మెల్యే అని కూడా చూడకుండా గుడ్డు పగలగొట్టారు బ్రో..
-
కోడిగుడ్లతో బీజేపీ సీనియర్ ఎమ్మెలేపై దాడి
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ఆర్ ఆర్ నగర్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడి(Muniratna Naidu)పై కొందరు ఆగంతకులు కోడిగుడ్డు విసిరారు. అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి మునిరత్న బెయిల్ మీద బయటకు వచ్చి రెండు నెలలు అయ్యింది. అయితే అప్పటి నుంచి ఆయనకు ప్రజల్లోకి వచ్చింది ఇదే తొలిసారికాగా.. ఆ టైంలోనే దాడి జరగడం గమనార్హం.బుధవారం లక్ష్మీ నగర్లో నిర్వహించిన వాజ్పేయి(Vajpayee) శతజయంతి ఉత్సవాల్లో మునిరత్న పాల్గొన్నారు. తిరిగి తన అనుచరులతో వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఆయనపైకి గుడ్డు విసిరారు. ఆపై మంటతో కాసేపు ఆయన విలవిలలాడిపోయారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఆయనకు రకరకాల వైద్య పరీక్షలు జరిపారు. చివరకు ఆయన బాగానే ఉన్నారని ప్రకటించి అర్ధరాత్రి పూట వైద్యులు డిశ్చార్జి చేశారు.ఇదిలా ఉంటే.. మునిరత్న నాయుడు రాజకీయాలతోనే కాదు.. సినిమాలతోనూ పేరు సంపాదించుకున్నారు. ఉపేంద్ర, దర్శన్ లాంటి అగ్ర తారాలతో ఆయన చిత్రాలను నిర్మించారు. 2013, 2018, 2020, 2024 ఎన్నికల్లో రాజరాజేశ్వరి నగర్(RR Nagar) నుంచి ఆయన ఎమ్మెల్యేగా నెగ్గారు. గతంలో కర్ణాటక కేబినెట్ మినిస్టర్గానూ పని చేశారు. అయితే.. In a dramatic incident on Wednesday, #BJP MLA #Munirathna was targeted with an egg during an event marking the birth anniversary of former Prime Minister #AtalBihariVajpayee in #Bengaluru's #NandiniLayout.Police have arrested three individuals in connection with the attack and… pic.twitter.com/TWavEBJADq— Hate Detector 🔍 (@HateDetectors) December 25, 2024ఈ ఏడాది సెప్టెంబర్లో ఆయనపై అనూహ్యమైన ఆరోపణలు వచ్చాయి. సోషల్ వర్కర్గా పని చేసే ఓ మహిళ(40) ఫిర్యాదుతో ఈ బీజేపీ ఎమ్మెల్యేపై పలు నేరాల కింద కేసు నమోదయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద మూడు రోజులుల్లో ఉండి బయటకు వచ్చారాయన. అయితే బయటకు వచ్చి కొన్నినిమిషాలకే.. అత్యాచారం కేసు(Rape Case)లో ఆయన్ని మరోసారి అరెస్ట్ చేశారు.వాపై నెలరోజులపాటు సెంట్రల్ జైల్లో గడిపిన ఆయనకు.. అక్టోబర్ మూడో వారంలో ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఊరట ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది. గుడ్డు దాడిపై రాజకీయం తమ పార్టీ సీనియర్ నేత మునిరత్నపై కోడిగుడ్డు దాడి కాంగ్రెస్ కార్యకర్తల పనేనని బీజేపీ(BJP) ఆరోపిస్తోంది. మునిరత్న మరో అడుగు ముందుకు వేసి.. ఇది తనను చంపేందుకు జరిగిన కుట్ర అని ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మరికొందరు కాంగ్రెస్ నేతలు ఈ కుట్రలో భాగమయ్యారని అన్నారాయన. అయితే ఘటనపై నందిని లేఅవుట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల వివరాలను వెల్లడించాల్సి ఉంది. -
తగ్గిన చికెన్ ధర.. పెరిగిన గుడ్డు ధర
జ్యోతినగర్(రామగుండం): బహిరంగ మార్కెట్లో కోడిగుడ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఒకకోడిగుడ్డు రిటెయిల్ ధర రూ.7గా పలుకుతోంది. హోల్సేల్గా రూ.6.50గా ధర ఉంది. చలికాలంలో కోడిగుడ్ల ధరలు పెరగడం సాధారణమేనని, కానీ, ఈస్థాయిలో ధర పెరగడం అరుదని కొందరు వ్యాపారులు వివరిస్తున్నారు.క్రిస్మస్, న్యూ ఇయర్ కేక్ల కోసం..ఈనెలలో క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకల్లో ప్రధానంగా కేక్లు కట్చేసి మిఠాయిలు పంచుకుంటారు. ఇప్పటికే జిల్లాలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇదేసమయంలో కేక్ల వినియోగం, విక్రయాలూ పెరిగాయి. కేక్ల తయారీలో కోడిగుడ్ల వినియోగం అధికంగా ఉంటుంది. దీంతో సహజంగానే వాటికి డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు.. న్యూ ఇయర్ వేడుకల కోసం కొందరు ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. వివిధ డిజైన్లలో కేక్లు తయారు చేసుకునేందుకు ఆర్డర్లు ఇస్తున్నారు. దీంతో బేకరీలు, మిఠాయి దుకాణదారులు కోడిగుడ్లు కొనుగోలు చేయడం అధికమైంది. ఫలితంగా మార్కెట్లో కోడిగుడ్లకు ధర పెరుగుతోందని వ్యాపారులు అంటున్నారు.కార్తీకం నేపథ్యంలో దిగివచ్చిన చికెన్కార్తీక మాసం నేపథ్యంలో చికెన్ ధరలు తగ్గాయి. కార్తీక మాసానికి ముందు కేజీ చికెన్ ధర రూ.230వరకు పలికింది. ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉండడంతో డిమాండ్ పడిపోయిందని, ఫలితంగా చికెన్ ధరలు దిగొచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం కేజీ చికెన్ ధర రూ.180గా పలుకుతోది. మరోవైపు.. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వరకు చికెన్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.చలికాలమే కారణం..30 గుడ్లు గల ట్రే ధర రూ.195గా ఉంది. హోల్సేల్గా గుడ్డు ధర రూ.6.50గా ఉంది. చలికాలంలో గుడ్ల ధరలు పెరుగుతుంటాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా వీటి వినియోగం అధికమైంది.– గుండ చంద్రమౌళి, హోల్సేల్ వ్యాపారి, ఎన్టీపీసీ -
జుట్టుకి గుడ్లు, పెరుగు అప్లై చేయడం మంచిదేనా..?
కురుల ఆరోగ్యం కోసం పెరుగు, మెంతులు, గుడ్లు వంటివి అప్లై చేస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివని నిపుణులు కూడా సిఫార్సు చేస్తుంటారు. అంతెందుకు నీతా అంబానీ, జాన్వీ కపూర్, అలియా భట్ వంటి ప్రముఖులు కూడా తమ అందమైన శిరోజాల సీక్రెట్ ఇదేనని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు కూడా. అయితే సెలబ్రిటీ హెయిర్స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్ ఇలా గుడ్లు, పెరుగు కురులకు అప్లై చేయడం వల్ల నిజంగా ప్రయోజనం ఉంటుందా..? అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలా జుట్టుకి కండిషనర్గా అవి రాయడం వల్ల ఏమవుతుందో కూడా వెల్లడించారు. ఇంతకీ ఠాగూర్ ఏమన్నారంటే..జుట్టుకి పెరుగు, గుడ్లు అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందనేది అవాస్తవమని చెప్పారు. ఇది రాయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండదని తెలిపారు. ఇక్కడ పెరుగులో పుష్కలంగా ఉండే లాక్టిక్ యాసిడ్ జుట్టులోని పీహెచ్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మంచి కండిషనర్గా ఉంటుంది. అయితే జుట్టు నష్టాన్ని రిపేర్ చేయదని అన్నారు. అలాగే గుడ్డులో విటమిన్లు, ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని అప్లై చేయడం వల్ల శిరోజాలు మృదువుగా ఉండి మెరుస్తూ ఉంటుంది. అయితే శాశ్వతమైన మార్పును కలిగించదు. ఈ సహజసిద్ధమైన వాటితో తయారైన ఉత్పత్తులు కురులను ఆరోగ్యంగా పెరిగేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయని అన్నారు. మన బడ్జెట్కి అనుగుణంగా కురులు చూడటానికి అందంగా ఆకర్షణీయంగా కనిపించాలంటే ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పెరుగు, గుడ్లు వంటి వాటిని కండిషనర్లుగా ఉపయోగించొచ్చని చెప్పారు.కానీ జుట్టు ఒత్తుగా, ధృడంగా పెరిగేందుకు, డ్యామేజ్ అయిన జుట్టుని రిపేర్ చేసేందుకు మాత్రం ఇవి అస్సలు సరిపోవని తేల్చి చెప్పారు హెయిర్స్టైలిస్ట్ ఠాగూర్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్టాపిక్గా మారింది కూడా. View this post on Instagram A post shared by Amit Thakur (@amitthakur_hair) (చదవండి: నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్ని కరిగించే బెడ్టైమ్ 'టీ'..!) -
కోడి ముందా? గుడ్డు ముందా?
కోడి ముందా, గుడ్డు ముందా? చిరకాలంగా మనిషి మెదడును తొలుస్తున్న అంతుచిక్కని ప్రశ్న. దీనికి సమాధానం కనిపెట్టేందుకు సైంటిస్టులు ఎంతోకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కోడి కంటే బహుశా గుడ్డే ముందు వచ్చి ఉండొచ్చని అలాంటి తాజా పరిశోధన ఒకటి పేర్కొంది. జంతువుల ఆవిర్భావానికి చాలాకాలం ముందునుంచే జీవుల్లో గుడ్డు వంటి నిర్మాణాలు ఏర్పడేవని తేలి్చంది. క్రోమోస్పెరియా పెర్కిన్సి అనే ఏకకణ జీవిపై చేసిన పరిశోధనల ఆధారంగా ఈ నిర్ధారణకు వచి్చనట్టు జెనీవా యూనివర్సిటీ బయోకెమిస్ట్ మరైన్ ఒలివెట్టా తెలిపారు. పరిశోధన బృందానికి ఆమే సారథ్యం వహించారు. పునరుత్పత్తి ప్రక్రియ సందర్భంగా సి.పెర్కిన్సిలో జరిగే పాలింటమీ ప్రక్రియ అచ్చం జంతువుల్లో పిండం ఎదుగుదలను పోలి ఉంటుందని ఒలివెట్టా వివరించారు. ‘‘ఆ ప్రక్రియ ఫలితంగా గుడ్డును పోలే బోలు కణ పదార్థం రూపొందినట్టు కనిపెట్టాం. సంక్లిష్టమైన బహుళకణ జీవుల ఆవిర్భావానికి చాలాముందే తొలినాటి జీవుల్లో పిండం వంటి నిర్మాణాల జెనెటిక్ ప్రోగ్రామింగ్ వ్యవస్థ ఉండొచ్చని దీన్నిబట్టి అంచనా వేయవచ్చు. తొలి నాళ్లలోనే జీవుల్లో బహుళకణ సమన్వయం వంటి ప్రక్రియలు సాగేవనేందుకు మా పరిశోధన ఫలితాలు ఊతమిస్తున్నాయి’’అని చెప్పారు. అయితే దీనిపై స్పష్టత రావాలంటే మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సి ఉందని అంగీకరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గొంతులో గుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి
లింగాల: గొంతులో కోడి గుడ్డు ఇరుక్కొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా లింగాలలో చోటుచేసు కుంది. బిజినేపల్లి మండలం నందివడ్డెమాన్ గ్రామానికి చెందిన ఉప్పరి తిరుపతయ్య (55) ఆదివారం లింగాల మండలంలోని అప్పాయ పల్లిలో బంధువుల ఇంటికి వచ్చాడు. లింగాలలో ఉన్న బజ్జీల బండి దగ్గర ఉడకబెట్టిన గుడ్డు తీసుకున్నాడు. అప్పాయపల్లి వెళ్లే మార్గంలో ఉన్న కమాన్ దగ్గర కూర్చొని గుడ్డు తింటుండగా అది గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతిచెందాడు. సమా చారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. అనంతరం బంధువులకు సమాచారం అందించి వారికి మృతదేహాన్ని అప్పగించారు. తిరుపతయ్య భార్య లక్ష్మమ్మ మూడేళ్ల క్రితం మృతిచెందగా ముగ్గురు కుమారులు ఉన్నారు. -
రోజూ రోటీయేనా ?
కోల్కతా: దేశమంతటా కలకలం సృష్టించిన కోల్కతాలో జూనియర్ వైద్యురాలి హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్ జైళ్లోనూ తన మొండితనం చూపిస్తున్నాడు. ప్రతి రోజూ చపాతి ఏం తింటామని జైలు అధికారులపైనే ఆగ్రహం వ్యక్తంచేశాడు. అయితే జైలు నిబంధనల ప్రకారం ఖైదీలతోపాటే విచారణ ఖైదీలకు ఒకేరకమైన భోజనం వడ్డిస్తారు. వైద్యురాలి హత్యకేసులో అరెస్ట్చేశాక పోలీసులు సంజయ్ను కోల్కతాలోని ప్రెసిడెన్సీ కారాగారంలో పడేశారు. అయితే కస్టడీలో ఉన్నప్పటి నుంచి ఒకే తరహా చపాతి, కూరనే రోజూ వడ్డిస్తున్నారని సంజయ్ ఆగ్రహంగా మాట్లాడారు. ‘‘ రోజూ రోటీయేనా?. నాకు కోడిగుడ్డు ఫ్రైడ్రైస్లాంటి ఎగ్ చావ్మీన్ పెట్టండి’ అని జైలు సిబ్బందిని బెదిరించినట్లు విశ్వస నీయ వర్గాల సమా చారం. అయితే విచారణ ఖైదీ తనకిష్టమొచ్చింది తింటానని తెగేసి చెప్పడంపై జైలు యాజమాన్యం సీరియస్ అయింది. అతి చేయొద్దని హెచ్చరించి అధికారులు సంజయ్ నోరు మూయించారు. దీంతో పెట్టింది తింటానని సంజయ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే జైలుకు వచ్చిన కొత్తలో తనకు నిద్ర పట్టట్లేదని, నిద్ర సరిపోవడం లేదని, నన్ను కాస్తంత పడుకోనివ్వండి అని సంజయ్ తెగ ఫిర్యాదులు చేసేవాడని ఇప్పుడు సాధారణ స్థాయికి వచ్చాడని తెలుస్తోంది. -
ఈ విషయం తెలుసా! ఏ గుడ్డయినా... వెరీగుడ్డే!
ఫారం కోడిగుడ్ల కంటే నాటు కోడిగుడ్లలో బలం ఎక్కువగా ఉంటుందని కొందరిలో ఓ అపోహ ఉంటుంది. కానీ పోషక విలువల విషయంలో నాటు గుడ్లయినా, ఫారం గుడ్లయినా ఒకటే. రెండింటిలోనూ పోషకాలు ఒకేలా ఉంటాయి. కాకపోతే నాటు గుడ్లు ఫారం గుడ్ల కంటే కాస్తంత చిన్నగా ఉంటాయి, మరికాస్త ఎక్కువ ముదురురంగుతో కాస్త గోధుమరంగు అనిపించేలా ఉంటాయి. అంతేతప్ప పోషకాలతో పాటు మరింకే విషయంలోనూ తేడా ఉండదు. కాబట్టి అధిక ధర పెట్టి నాటు కోడిగుడ్లు కొనడమన్నది జేబుకు నష్టం తప్ప... ఒంటికి చేకూరేలా మరే లాభమూ ఉండదు.ఇవి చదవండి: కాటేసిన కార్ఖానా -
World IVF Day ఎగ్ ఫ్రీజింగ్పై మహిళల్లో ఆసక్తి : అటు పురుషుల్లో కూడా!
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ సంతానోత్పత్తి కేంద్రాల్లో ఒకటైన హైదరాబాద్ బంజారాహిల్స్లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ పదేళ్లు పూర్తిచేసుకుంది. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, మారుతున్న జీవనశైలి లాంటివి సంతానలేమి పెరగడానికి కారణమని ఫెర్టిలిటీ నిపుణులు చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి చికిత్స కోసం 35 ఏళ్లు పైబడిన మహిళలు వస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సగటు వయస్సు 22-23 సంవత్సరాలే ఉండటం ఆందోళనకరంగా ఉంది. అయితే, గత దశాబ్దంలో పురుషులలో సంతానరాహిత్య సమస్యను అంగీకరించడంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది.తెలంగాణలోనూ పురుషులు, మహిళల్లో సంతానరాహిత్యం పెరుగుతోంది. సంతానసాఫల్య రేటు రాష్ట్రంలో తగ్గుతోంది. ఒక్కో మహిళకు సగటున 2.1 మంది పిల్లలు ఉండాలి గానీ, 1.8 మంది ఉంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలో ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ లక్ష్మీ చిరుమామిళ్ల మాట్లాడుతూ. “పదేళ్ల క్రితం కొంతమంది పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గడం చూసేవాళ్లం. కానీ ఇప్పుడు ఇది తీవ్రంగా మారింది. పురుషుల్లో వీర్యకణాల నాణ్యత, పరిమాణం చాలా తక్కువగా ఉంటోంది. మహిళల్లో, అండం నాణ్యతలో తగ్గుదల గమనించినా, అడెనోమైయోసిస్ కేసులు కూడా ఉంటున్నాయి. ఇది పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం కలిగించే సమస్య. ఒక దశాబ్దం క్రితం, సమాజానికి భయపడి సంతానసాఫల్య చికిత్్లకు అంతగా ముందుకు వచ్చేవారు కారు, ప్రజలను ఒప్పించలేకపోయేవాళ్లం. ఇప్పుడు మా వద్దకు వచ్చేవారిలో 30% మంది ఈ చికిత్సకు ఆమోదం తెలుపుతున్నారు. పదేళ్లతో పోలిస్తే ఇది మంచి మార్పు. గత పదేళ్లలో సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా అభివృద్ధి చెందింది. ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ (పీజీటీఏ) లాంటి పరీక్షలను ఉపయోగించి ఇప్పుడు జన్యుపరమైన సమస్యలను పరీక్షించవచ్చు. పిండం ఎంపికలో డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆవిష్కరణలు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ పెరగడానికి దోహదపడతాయి.సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి వల్ల సంతానసాఫల్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పిల్లలు పుట్టని జంటలకు కొత్తఆశ, మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. దాంతోపాటు.. క్రియోప్రిజర్వేషన్ వల్ల ఇప్పుడు అండాలు, వీర్యం, పిండాలను కూడా సమర్థంగా నిల్వచేయగలుగుతున్నాం. దీనివల్ల ఎవరైనా కొంత వయసు తర్వాత పిల్లలు కావాలనుకున్నా అది సులభమే అవుతుంది” అని వివరించారు.నోవా ఐవీఎఫ్లో మరో ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ హిమదీప్తి మాట్లాడుతూ, “సంతానసాఫల్య చికిత్సలో సాంకేతికపరమైన అభివృద్ది చాలా వచ్చింది. తమ జీవ గడియారం గురించి, సంతానసాఫల్యంలో దాని పాత్ర గురించి మహిళలకు అవగాహన పెరుగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో ఎగ్ ఫ్రీజింగ్ గురించి అడిగేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ప్రస్తుతం సంవత్సరానికి 50 నంచి 100 మంది దీనికోసం అడిగేందుకు వస్తున్నారు. కొన్నేళ్ల క్రితం అస్సలు అడిగేవారే కారు. పిల్లలు తర్వాత కావాలనుకుంటే, తమ అండాలు, వీర్యం, లేదా పిండాలను కూడా ఫ్రీజ్ చేసుకునేందుకు అవకాశం ఉంది” అని తెలిపారు.పురుషుల సంతానరాహిత్య అంగీకారంలో మార్పుసంతానరాహిత్య సమస్యలకు పరీక్షలు చేయించుకోవడంలో పురుషుల ఆలోచనా విధానం గణనీయంగా మారిందని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీలోని సంతానసాఫల్య నిపుణులు చెబుతున్నారు. ఒక దశాబ్దం క్రితం పురుషులు వీర్యం విశ్లేషణ చేయించుకోవడానికి వెనకాడేవారు. పురుషుల వల్ల కూడా సంతానరాహిత్య సమస్యలు వస్తాయని గుర్తించడానికే ఇష్టపడేవారు కారు. కానీ ఇప్పుడు వీర్యం విశ్లేషణ విషయంలో పురుషులు ధైర్యంగా ముందుకొస్తున్నారు. తద్వారా పురుషుల సంతానసాఫల్య ఆరోగ్య ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రయోగశాలలతో, సంతాన సాఫల్య చికిత్సలను అందించడంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్న సమగ్ర సంతాన సాఫల్య చికిత్సా కేంద్రం. -
అంగన్ వాడీల్లో పురుగులు గుడ్లు..
-
ఎగ్గొట్టారు!
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చదువులు అర్ధాకలితో సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న గోరుముద్ద పేరుతో ఆకర్షణీయమైన మెనూతో రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించగా.. నేడు ఆ పథకం అస్తవ్యస్తంగా మారింది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు ఇవ్వడం లేదు. గుంటూరులో ఉన్న 14 ఉన్నత పాఠశాలలతో పాటు 80 ప్రాథమిక పాఠశాలల్లో 15 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా రూపకల్పన చేసిన మెనూ యథావిధిగా అమలయ్యేది. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ పథకం అమలులో నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేశారు. దీంతో విద్యార్థులంతా మధ్యాహ్న భోజనం తృప్తిగా ఆరగించేవారు. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరంలో స్కూళ్లు తెరిచినప్పటి నుంచి మధ్యాహ్న భోజనం అధ్వానంగా మారింది. విద్యార్థులకు వారంలో ఐదు రోజులు కోడి గుడ్డు ఇవ్వాల్సి ఉండగా.. దీనిని పూర్తిగా విస్మరించారు. ఎక్కడా మెనూ పాటిస్తున్న దాఖలాలు లేవు. పౌష్టికాహారం సంగతి దేవుడెరుగు.. చాలీచాలని, రుచి లేని భోజనం చేయలేక చాలా మంది విద్యార్థులు ఇళ్ల నుంచే క్యారేజీలు తెచ్చుకుంటున్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ మాట్లాడుతూ.. బిల్లులు పెండింగ్లో ఉండటంతో కోడిగుడ్ల సరఫరా నిలిచిపోయిందని చెప్పారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళతానని చెప్పారు. -
ఈ వెరైటీ వంటకాలను.. ఎప్పుడైనా ట్రై చేశారా..!?
హనీ– మిల్క్ పౌడర్ కప్ కేక్..కావలసినవి..తేనె– 1 కప్పు;మిల్క్ పౌడర్– 1 కప్పు;మైదా పిండి– అర కప్పు;పంచదార– పావు కప్పు (పొడి చేసుకోవాలి, అభిరుచి బట్టి కాస్త పెంచుకోవచ్చు);నెయ్యి, కొబ్బరి కోరు– అర కప్పు చొప్పున;గుడ్లు– 4, చిక్కటి పాలు– 2 టేబుల్ స్పూన్లు;తినే సోడా, వెనీలా ఎసెన్స్– అర టీ స్పూన్ చొప్పున;తయారీ..ముందుగా ఒక బౌల్లో గుడ్లు కొట్టి, పాలు పోసి క్రీమీగా అయ్యేలా బాగా గిలకొట్టుకోవాలి.ఆ మిశ్రమంలో తేనె, మైదా, మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకుని పేస్ట్లా కలుపుకోవాలి. తర్వాత తినే సోడా, సగం నెయ్యి, వెనీలా ఎసెన్ ్స వేసుకుని బాగా కలుపుకోవాలి.ఈలోపు మిగిలిన నేతిలో కొబ్బరి కోరు, పంచదార పొడి వేసుకుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు మినీ కేక్ బౌల్స్ తీసుకుని, వాటికి నెయ్యి రాసి పెట్టుకోవాలి.తర్వాత వాటిలో కొద్దిగా గుడ్ల మిశ్రమం వేసుకుని మధ్యలో కొద్దిగా కొబ్బరికోరు మిశ్రమం నింపుకుని, మళ్లీ పైన గుడ్ల మిశ్రమాన్ని వేసుకుని నింపుకుని ఓవెన్లో బేక్ చేసుకోవాలి.చల్లారాక క్రీమ్తో గార్నిష్ చేసుకుని, పైన గార్నిష్ కోసం.. కొద్దిగా తేనె పోసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ఎగ్ – బాదం హల్వా..కావలసినవి..గుడ్లు– 8, బాదం పాలు– 1 కప్పు;కస్టర్డ్ మిల్క్– పావు కప్పు;పంచదార– 1 టేబుల్ స్పూన్ (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు);ఏలకుల పొడి– 1 టీ స్పూన్;నెయ్యి– 4 టేబుల్ స్పూన్లు;కుంకుమ పువ్వు– చిటికెడు;వెనీలా ఎసెన్ ్స– 1 టీ స్పూన్;బాదంపప్పు– 2 టేబుల్ స్పూన్లు (దోరగా నేతిలో వేయించాలి, అభిరుచిని బట్టి జీడిపప్పు, కిస్మిస్ వంటివి జోడించుకోవచ్చు);తయారీ..ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో గుడ్లలోని పసుపు సొనను మాత్రమే తీసుకుని, బాగా గిలకొట్టాలి.అందులో కస్టర్డ్ మిల్క్, బాదం పాలు, పంచదార, ఏలకుల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మరోసారి కలుపుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని, పాన్ బౌల్లో నెయ్యి వేడి చేసుకుని, అందులో ఈ మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద ఉడికించుకోవాలి.మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూనే ఉండాలి. మిశ్రమం సగానికి తగ్గుతున్నప్పుడు కుంకుమ పువ్వు వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి.మళ్లీ మధ్యమధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కాస్త దగ్గర పడుతున్నప్పుడు వెనీలా ఎసెన్ ్స వేసుకుని మరోసారి కలపాలి.ఆ మిశ్రమం మరింత దగ్గర పడుతున్న సమయంలో నేతిలో వేయించిన బాదం పప్పు వంటి వేసుకుని, కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.స్వీట్కార్న్ ఇడియాప్పం..కావలసినవి..స్వీట్ కార్న్ జ్యూస్ (వడకట్టుకోవాలి);బియ్యప్పిండి– 3 కప్పులు చొప్పున;జొన్న పిండి, ఓట్స్ పౌడర్– పావు కప్పు చొప్పున:జీలకర్ర పొడి– పావు టీ స్పూన్;చిక్కటి కొబ్బరి పాలు– పావు కప్పు;నీళ్లు– కొద్దిగా, నెయ్యి– 1 టీ స్పూన్;ఎల్లో ఫుడ్ కలర్– కొద్దిగా (అభిరుచి బట్టి);తయారీ..ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యప్పిండి, జీలకర్ర పొడి, స్వీట్కార్న్ జ్యూస్, కొబ్బరి పాలు వేసుకుని కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుని, మరోసారి బాగా కలుపుకోవాలి.తర్వాత ఇడ్లీ పాన్ లేదా పెద్ద బౌల్కి బ్రష్తో నెయ్యి పూసుకోవాలి.అనంతరం మురుకుల మేకర్కి సన్నని హోల్స్ ఉండే ప్లేట్ని అమర్చి, అందులో ఈ మిశ్రమాన్ని సగానికి నింపుకుని, ఇడ్లీ పాన్ లో లేదా పెద్ద బౌల్లో నూడుల్స్లా ఒత్తుకుని ఆవిరిపై ఉడికించాలి.అభిరుచిని బట్టి ఆవాలు, కరివేపాకు, కొత్తిమీరలతో తాళింపు వేసి, కలుపుకుని.. సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ఇవి చదవండి: ఈ 'తియా శిలాఫలకాలు'.. ఏ కాలంనాటివో తెలుసా!? -
భారీగా పెరిగిన కోడి గుడ్డు ధర
-
యూఎస్లో బర్డ్ ఫ్లూ కలకలం.. గుడ్లు, పాలు తీసుకోవచ్చా..!
ఆవు పాలల్లో బర్డ్ ఫ్లూ (H5N1) వైరస్ అధిక సాంద్రతలో గుర్తించడం తీవ్ర ఆందోళన రేపింది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా స్పందించింది. అమెరికాలోని ఆవు పాలలో హెచ్5ఎన్1 వైరస్ అధిక సాంద్రతల్లో ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అయితే పచ్చి పాలలో మాత్రమే ఈ వైరస్ ఉందనీ, పాలను వేడి చేసినప్పుడు ఈ వైరస్ నాశనమవుతోందని నిపుణులు అంటున్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఇటీవల ఈ నెల ప్రారంభంలోనే అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం ఆరు రాష్ట్రాల్లో కనీసం 13 మందలను ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో పచ్చి పాలు, గుడ్లు, చికెన్ తినడం ఎంతవరకు సురిక్షతం అని ప్రజల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఇంతకీ తినొచ్చా? తినకూడదా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు అంటే..! ఈ బర్డ్ ఫ్లూ వైరస్ని ఏవియన్ఇన్ఫ్లెఎంజా అని కూడా పిలుస్తారు. ఇది ఒకరకమైన జూనోటిక్ ఇన్ఫ్లు ఎంజా. అడవి పఓలు, పౌల్ట్రీ, ఇతర జంతువులను ప్రభావితం చేస్తుంది. ఇది వైరస్ ఉక రకాల ఏ(హెచ్5ఎన్1), ఏ(హెచ్9ఎన్2) వల్ల వస్తుంది. ఈ హెచ్5ఎన్1 వైరస్ సోకిన ప్రతి వందమంది రోగులలో దాదాపు 52 మంది మరణించారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇలా బర్డ్ఫ్లూ వ్యాప్తి చెందుతున్నప్పుడూ.. పాలు తాగడం, గుడ్లు, మాసం తినడం ఎంతవరకు సురక్షితం అని ప్రజల్లో తీవ్ర ఆందోళనలు పెరుగుతున్నాయి.అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ప్రకారం..బర్డ్ఫ్లూ వ్యాప్తి చెందుతున్నప్పుడు ఆయా ఆహార పదార్థాలను మంచి ఉడకించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని పేర్కొంది. గుడ్లు.. గుడ్లు మంచిగా ఉడికించి తిన్నంత వరకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతోంది. గుడ్డులోపలి పచ్చసొన, తెలుపు రెండు గట్టిగా ఉండే వరకు పూర్తిగా ఉడికించి తినమని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రత వద్ద ఆ బ్యాక్టీరియా చనిపోతుంది. ఇలా చేస్తే వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని నివారించొచ్చు. అలాగే గుడ్లను మంచి విశ్వనీయమైన చోటే కొనుగోలు చేస్తున్నారా లేదా అని నిర్థారించుకోవడం కూడా ముఖ్యమే అని చెబుతున్నారు నిపుణులు. పాలు.. ఇక పాల వద్దకు వస్తే పాశ్చరైజ్డ్ మిల్క్ తాగడం క్షేమమని నిపుణులు అంటున్నారు. పాశ్చరైజేషన్ ప్రక్రియలో, పాలు చాలా అధిక ఉష్ణోగ్రతకు వేడి చేయడం జరుగుతుంది. ఈ ఉష్ణోగ్రత వ్యాధికారక క్రిములను చంపడానికి సరిపోతుంది. బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్లను నిర్మూలించడంలో ఈ ప్రక్రియ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. చికెన్ ఈ వైరస్ కోళ్లతో సహా పక్షులను ప్రభావితం చేస్తుంది. అందువల్ల చికెన్ను సరిగా వండుకుని తినడం అనేది అత్యంత ముఖ్యం. పౌల్ట్రీని 165°F (74°C) ఉష్ణోగ్రత వద్ద ఉడికించడం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్తో సహా ఇతర వైరస్లు నశించడం జరుగుతుంది. అలా చికెన్ కొనుగోలు చేసే చోటు పరిశుభ్రత ఉందా లేదా అన్నది కూడా ముఖ్యమే చివరిగా బర్డ్ ఫ్లూ సోకినట్లయితే ఈ కింది లక్షణాల ద్వారా గుర్తించి వెంటనే అప్రమత్తమవ్వండి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. జ్వరం: అధిక ఉష్ణోగ్రత తరచుగా మొదటి సంకేతం, సాధారణంగా 38°C (100.4°F) కంటే ఎక్కువగా ఉంటుంది. దగ్గు: ప్రారంభంలో, పొడి దగ్గు కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది. గొంతు నొప్పి: గొంతు ప్రాంతంలో అసౌకర్యం లేదా నొప్పి, మింగడం కష్టతరం చేస్తుంది. కండరాల నొప్పులు: శరీర నొప్పులు తలనొప్పి: ఇది తేలికపాటి నుండి తీవ్రమైన వరకు ఉంటుంది. శ్వాసకోశ లక్షణాలు: ప్రారంభ దశల్లో తేలికపాటి శ్వాసకోశ సమస్యలు ఉండవచ్చు, ఇవి వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఈ వ్యాధి తీవ్రమైతే కనిపించే లక్షణాలు.. న్యుమోనియా: ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వేగవంతమైన శ్వాస లేదా శ్వాసలోపం ద్వారా సూచించబడుతుంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS): శ్వాసకోశ వైఫల్యం అతిసారం: సాధారణ ఇన్ఫ్లుఎంజాలా కాకుండా, H5N1 జీర్ణశయాంతర లక్షణాలను కలిగిస్తుంది. వాంతులు: ఇది ఇతర జీర్ణశయాంతర లక్షణాలతో కలిపి సంభవించవచ్చు. ముక్కు,చిగుళ్ళ నుంచి రక్తస్రావం: ఇది సాధారణంగా తీవ్రమైన సందర్భాల్లో జరుగుతుంది. నాడీ సంబంధిత మార్పులు: అరుదుగా, ఎన్సెఫాలిటిస్ (మెదడు వాపు) సంభవించవచ్చు. ఒక్కోసారిమూర్ఛలు లేదా మానసిక స్థితిlr ప్రభావితం చెయ్యొచ్చు. (చదవండి: మానసిక ఆరోగ్యంపై అలియా ఆసక్తికర వ్యాఖ్యలు! అందుకే థెరపీ..!) -
గుడ్లు ఎక్కువగా తింటున్నారా? పరిశోధనలో షాకింగ్ విషయాలు!
గుడ్లు ఎక్కువుగా తింటే అస్సలు భయపడాల్సిన పనిలేదు. పైగా మీ ఆరోగ్యం పదిలం అని ధీమాగా చెబుతున్నారు వైద్యులు. అస్సలు ఆ సమస్యలు బారినపడరని అన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే కొన్ని రకాల సమస్యలు సైతం రావని శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఆ అధ్యయనంలో బయటపడ్డ ఆసక్తికర విషయాలేంటంటే.. గుడ్డు ఎముకలు బలంగా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుందట. రోజుకి ఒక గుడ్డు తినడం అనేది ఎంతో మంచిదని, దీని వల్ల ఫోలేట్, బీ విటమిన్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయని అన్నారు. అలాగే ఎముకల వ్యాధి రాకుండా నివారిస్తుందని చెప్పారు. ముఖ్యంగా గుండెతో ఎముకల ఆరోగ్యం ముడిపడి ఉందనే ఆసక్తికర విషయం తమ పరిశోధనలో బయట పడిందని హువాజోంగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్త తెలిపారు. అందుకోసం నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ దాదాపు 1900 మందిపై అధ్యయనం నిర్వహించింది. పరిశోధకులు గుడ్డు వినియోగం తోపాటు, వారి ఎముకల బలాన్ని కూడా అంచనా వేశారు. ఈ పరిశోధనలో పాల్గొనేవారికి గుడ్డులోని 3.53 ఔన్సుల పోషకాలు వారి తొడలు, వెన్నుముకలోని ఎముకలను దృఢంగా ఉంచాయిని తెలిపారు. వారిలో అధిక బీఎండీ స్థాయిలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా వృద్ధుల్లో అయితే బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గిందని చెప్పారు. వయసు పెరిగే కొద్ది ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి. ఆ సమస్య రాకూడదంటే గుడ్డుకి మించిన తగిన పోషకాహారం లేదని ఈ పరిశోధనలో తేలిందని చెప్పారు. అలాగే ఇదే సమయంలో తగినంత పోషకాహారం లేకపోవడం, తక్కువ శారీరక శ్రమ, ధూమపానం, అధిక మొత్తంలో మద్యం సేవించడం, కొన్ని రకాల మందులు దీర్థకాలికంగా వాడడం వంటి ఇతక కారణాల వల్ల కూడా ఈ బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఎముకలను ఎలా ఆరోగ్యంగా ఉంచుతాయంటే.. గుడ్లు ప్రోటీన్తో నిండి ఉంటాయి. ఇవి ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ అని పిలువబడే శారీరక ఎంజైమ్ల సమూహాన్ని సక్రియం చేసి, ఎముకలను బలోపేతం చేస్తుంది. ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ అనేది ప్రధానంగా కాలేయం, ఎముకలు, మూత్రపిండాలు మొదలైన వాటిలో ఉండే ఎంజైమ్ల సమూహం. ఇది ఎముక జీవక్రియ బయోమార్కర్ గుడ్లు తీసుకోవడం వల్ల ఏఎల్పీ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీంతో తొడ, కటి వెన్నెముక వంటి భాగాల్లోని ఎముకలను బలంగా ఉంచుతుంది. అంటే ఇక్కడ గుడ్లలో డి విటమిన్ పుష్కలంగా ఉంటుందని తేలింది. అందువల్ల దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం అంది ఎముకలు దృఢంగా ఉండేందుకు ఉపకరిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: చెఫ్గా పదిమందికి కడుపు నిండా భోజనం పెట్టేది..కానీ ఆమె అన్నమే..!) -
సలాడ్స్ తయారీలో ఇబ్బందా..? ఇక స్లైస్ డివైస్తో క్లియర్..!
ఆరోగ్యాన్నిచ్చే ఆహారంలో సలాడ్స్ ముందువరుసలో ఉంటాయి. కానీ సలాడ్స్ను తయారు చేసుకోవడమంటేనే బద్ధకమా? అయితే వెంటనే ఈ స్లైస్ డివైస్ని తెచ్చుకోండి. ఏ పండునైనా ఒకే ఒక్క నిమిషంలో స్లైసెస్గా చేసిపెడుతుంది. ఉడికించిన గుడ్లు, యాపిల్, బనానా వంటి పండ్లనైతే ఒకేసారి ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అందుకు వీలుగా మధ్యలో ఒక వైపు మందంగా ఉండే స్టెయిన్లెస్ స్టీల్ డివైడర్ స్టాండ్ అమర్చి ఉంటుంది. దాని సాయంతో పండ్లను ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. మరోవైపు కూడా అదేమాదిరి మరో షేప్లో డివైడర్ ఉంటుంది. దీన్ని వినియోగించుకోవడం.. క్లీన్ చేసుకోవడం రెండూ సులభమే. కిచెన్లో చిన్న ప్లేస్లో కూడా దీన్ని సర్దొచ్చు. స్థలం పెద్దగా ఆక్రమించదు. దీని ధర 7 డాలర్లు (రూ.580). ఇవి చదవండి: ఆటోమేటిక్ ప్రెజర్ సర్ఫేస్ మెషిన్ -
1700 ఏళ్ల నాటి పురాతన గుడ్డు..ఇప్పటికీ లోపల పచ్చసొన..!
పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలతో నాటి కాలంలో వాడే పనిముట్లు, వారు ఉపయోగించిన టెక్నాలజీ తదితరాలను వెలికితీస్తుంటారు. నాటి పూర్వీకుల వైభవం కళ్లముందుకు తీసుకురావడమే గాక తెలియని ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తుంటారు. అలాంటి ఒక అద్భుతమైన ఆవిష్కరణను తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించి వెలుగులోకి తీసుకొచ్చారు. మాములుగా ఏ గుడ్డు అయినా సాధారణంగా కొన్ని రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఆ తర్వాత కుళ్లిపోడవం లేదా పాడైపోవడం జరుగుతుంది. కానీ పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించిన అద్భుత ఆవిష్కరణ అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఇంతకీ అదేంటంటే..? వివరాల్లోకెళ్తే..శాస్తవేత్తలు.2007-2016 నుంచి జరుపుతున్న ఐలెస్బరీ త్రవ్వకాల్లో ఏకంగా 17 వందల ఏళ్ల నాటి పురాతన రోమన్ గుడ్డుని గుర్తించి వెలికితీశారు. తవ్వకాలు జరిపిన ప్రదేశాల్లో మరో మూడు గుడ్లు ఉన్నప్పటికీ అవి బయటకీ తీసే క్రమంలో పగిలి దుర్గంధం వెదజల్లింది. అయితే ఈ గుడ్డుని శాస్త్రవేత్తలు జాగ్రత్తగా వెలికితీశారు. నీటితో నిండి ఉన్న గొయ్యి నుంచి వీటిని బయటకు తీయడం జరిగింది. ఇది నాటి రోమన్ల వైభవాన్ని గుర్తు చేస్తోంది. ఇక మైక్రో స్కాన్లతో ఆ గుడ్డుని పరీక్షించగా దానిలో పచ్చసొన, తెల్లసొనతో చెక్కు చెదరకుండా ఉన్నట్లు చూపించాయి. అన్ని వేల ఏళ్ల నుంచి చెక్కు చెదరకుండా ఉండటం అందర్నీ చాలా ఆశ్చపర్చింది. నాటి రోమన్లు వాడే సాంకేతికత శాస్త్రవేత్తల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఈ మేరకు ఆక్స్ఫర్డ్ ఆర్కియాలజీ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎడ్వర్డ్ బిడ్డుల్ఫ్ మాట్లాడుతూ..అక్కడ తవ్వకాల్లో బయటపడిన వాటిని చూసి తాము ఒక్కసారిగా షాకయ్యామని, ఊహించని వాటిని కనుగొనడమే కాకుండా చెక్కుచెదరకుండా ఉండటం మమల్ని మరింత ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ప్రంపచంలోనే వేల ఏళ్ల నాటి నుంచి చెక్కుచెదరకుండా ఉన్న తొలి కోడిగుడ్డు ఇదే అన్నారు. నిజానికి ఆ గుడ్డు లోపల ద్రవాలు ఉండవని అనుకున్నాం. అయితే స్కాన్లో పచ్చసొన, అల్బుమెన్ వంటివి కనిపించడం నిజంగా అద్భుతం అనిపించింది. దీన్ని తాము లండన్లో ఉన్న నేచురల్ హిస్టరీ మ్యూజియమ్కు తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. అలాగే ఆ గుడ్డుని సంరక్షించే పద్ధతుల గురించి ఆ మ్యూజియంలో ఉండే పక్షుల సంరక్షకులను సంప్రదించినట్లు పేర్కొన్నారు. (చదవండి: అతిపెద్ద ఉప్పు సరస్సు గుండా వెళ్తున్న రైలు..వీడియో వైరల్) -
ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకుని ఐదారేళ్ల తర్వాత పిల్లల్ని కనొచ్చా?
నాకిప్పుడు 32 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లవుతోంది. నా కెరీర్ వల్ల పిల్లలను ప్లాన్ చేసుకోవడం లేట్ అవుతోంది. ఒకవేళ ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్కి వెళితే.. ఇప్పటికిప్పుడు నా ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకుని ఒక అయిదారేళ్ల తర్వాత పిల్లల్ని కనాలనుకుంటే సాధ్యమేనా? అప్పటికీ ఎగ్స్ ఇంతే క్వాలిటీతో ఉంటాయా? ప్రెగ్నెన్సీ క్యారీ చేయడంలో అయిదారేళ్ల తర్వాత నా ఏజ్ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే చాన్సెస్ ఉన్నాయా? నా డౌట్స్ క్లియర్ చేయగలరు. మీ ఆన్సర్స్ మీదే నేను పిల్లలను ప్లాన్ చేసుకోవడం డిపెండ్ అయి ఉంది. ఎందుకంటే నా హజ్సెండ్ సహా మా ఇంట్లో వాళ్లంతా ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ని ఒప్పుకోవట్లేదు. పేరు, ఊరు రాయలేదు. ఎగ్ ఫ్రీజింగ్ని oocyte cryopreservation అంటారు. ఈ ప్రొసీజర్లో అండాశయాల నుంచి అండాలను తీసి ఫ్రీజ్ చేసి అన్ఫర్టిలైజ్డ్ స్టేట్లో ఉంచుతారు. భవిష్యత్లో గర్భందాల్చాలి అనుకున్నప్పుడు ఆ ఎగ్స్ని ఫర్టిలైజేషన్కి ఉపయోగించి.. ఐవీఎఫ్ ద్వారా గర్భందాల్చేలా చేస్తారు. ఇంతకుముందు 38–40 ఏళ్ల స్త్రీలు ఈ ప్రక్రియను ఎక్కువగా ఉపయోగించుకునేవాళ్లు. కానీ ఇప్పుడు జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల చాలామంది అమ్మాయిల్లో oocyte క్వాలిటీ చాలా త్వరగా తగ్గిపోతోంది. ఇప్పుడు 30–35 ఏళ్లక్కూడా ప్రెగ్నెన్సీ వద్దు అనుకునేవాళ్లు ఈ ప్రక్రియ ద్వారా ఆరోగ్యకరమైన అండాలను ఫ్రీజ్ చేసుకునే సౌకర్యాన్ని చాలా ఆసుపత్రులు కల్పిస్తున్నాయి. ఇలా ఫ్రీజ్ చేసిన అండాలను పదేళ్ల వరకు ఉపయోగించుకోవచ్చు. అయితే 35 ఏళ్లు దాటితే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ పెరుగుతాయి. కాబట్టి దీన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. అంతేకాదు ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియలోనూ కొన్ని రిస్క్స్ ఉన్నాయి. ఫ్రోజెన్ ఎగ్స్ cryo freezing ప్రాసెస్లో కొన్నిసార్లు డామేజ్ కావచ్చు. కంటామినేషన్ రిస్క్ కూడా ఉంటుంది. అండాశయాల నుంచి అండాలను తీసే సమయంలో ఆ ప్రక్రియకు సంబంధించి అంటే బవెల్ గాయపడడం, రక్తనాళాలు గాయపడడం వంటి రిస్క్స్ కూడా ఉండొచ్చు. ఎక్కువ అండాలను తీయడానికి ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్స్కి కొంతమందికి పొట్టలో నొప్పి, ఛాతీ నొప్పి రావచ్చు. వీటిని మందులతో తగ్గించవచ్చు. ఇలాంటి కాంప్లికేషన్స్ 5 శాతం కేసెస్లో కనపడతాయి. 0.1 శాతం కేసెస్లో బ్లడ్ క్లాట్స్, చెస్ట్ ఇన్ఫెక్షన్ వంటివాటితో కాంప్లికేషన్స్ తీవ్రంగా ఉంటాయి. బిడ్డకు బర్త్ డిఫెక్ట్స్ విషయానికి వస్తే.. నేచురల్ ప్రెగ్నెన్సీలో ఎంత శాతం రిస్క్ ఉంటుందో ఫ్రోజెన్ ఎగ్స్తో వచ్చే ప్రెగ్నెన్సీలోనూ అంతే రిస్క్ ఉంటుంది. అదనంగా ఏమీ ఉండవని అధ్యయనాల్లో ప్రూవ్ అయింది. ఫ్రోజెన్ ఎగ్స్తో ప్రెగ్నెన్సీ 30 – 60 శాతం వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా ఎగ్ ఫ్రీజింగ్ సమయంలోని మీ వయసు మీద ఆధారపడి ఉంటుంది. --డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: 'ర్యాట్ బ్రేక్ ఫాస్ట్'! ఈ పద్ధతిలో తింటే.. ఈజీగా బరువు తగ్గొచ్చు!) -
మామిడిపిందె అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే..
'మనం సాధారణంగా కోడిగుడ్లల్లో పెద్దవిగానో, చిన్నవిగానో చూసి ఉంటాం. అలాగే కొన్నింటినీ గండ్రంగా గానీ, పొడవుగా గానీ, తోలుగుడ్లలాంటివి కూడా చూసుంటాం. కానీ ఇలాంటి అసలు సిసలైన, గమ్మత్తైన కోడిగుడ్డును చూశారా! మరెందుకు ఆలస్యం.. అదేంటో చూద్దాం!' ఈ ఫొటోలో చూస్తుంది.. మామిడిపిందె అనుకుంటున్నారా.? అయితే మీరు పప్పులో కాదు కాదు.. తప్పులో కాలేసినట్లే.. అవును ఇది నిజం.. ఇది మామిడిపిందె కాదు.. మామిడి పిందె ఆకారంలో ఉన్న అసలు సిసలైన ‘కోడిగుడ్డు’.. ఇది నమ్మాల్సిన నిజమే.. మామిడి పిందెలాంటి గుడ్డు కథలోకి వెళ్తే.. హాజీపూర్ మండలం గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ ఎదురుగా ఉన్న దుమ్మల శ్రీనివాస్యాదవ్ కిరాణంలో గురువారం ఈ మామిడిపిందె ఆకారంలో ఉన్న కోడిగుడ్డు కనిపించింది. అప్పుడే వచ్చిన కోడిగుడ్ల నిల్వను దుకాణంలో ఓ చోట పెడుతూ ఉండగా ఒక్కసారిగా గుడ్ల ట్రేలో తేడా కనిపించడంతో పరీక్షించి చూడగా కోడిగుడ్డు రూపం గమ్మత్తుగా అగుపించింది. కోడిగుడ్డు అచ్చంగా ‘మామిడిపిందె’ ఆకారంలో విచిత్రంగా కనబడటంతో ఆ గుడ్డును అంతా విచిత్రంగా చూస్తూ ఔరా.! ఇదేంటీ ఈ విచిత్రం సుమా.. అనుకోవడం కొసమెరుపే. ఇవి చదవండి: ఆ చిన్నారికి తన కన్నీళ్లు, చెమటే అలర్జీ! కానీ ఆమెకు.. -
చికెన్ చౌక.. గుడ్డు కేక!
సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి వేళ మాంసాహార ప్రియులకు చికెన్ ధర ఊరటనిస్తోంది. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా దీని రేటు దిగివచ్చింది. దాదాపు నెల రోజుల కిందట కిలో బ్రాయిలర్ చికెన్ రూ.300కు పైగా పలికింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం రూ.190కి క్షీణించింది. సంక్రాంతి మర్నాడు కనుమ పండగకు మాంసాహారులు బంధుమిత్రులతో కలిసి విధిగా చికెన్, మటన్ వంటి వాటిని తినడం రివాజుగా వస్తోంది. సాధారణ రోజులకంటే ఆరోజు మూడు నాలుగు రెట్ల అధికంగా వీటి వినియోగం ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని విక్రయదారులు వీటి ధరను గణనీయంగా పెంచుతుంటారు. అయితే ఈ ఏడాది కనుమకు బ్రాయిలర్ కోడి మాంసం సరసమైన ధరకే లభించనుంది. కొద్దిరోజుల నుంచి మార్కెట్లో బ్రాయిలర్ చికెన్ కిలో రూ.170–180 మధ్య ఉంది. రెండ్రోజుల కిందట స్వల్పంగా పెరిగి రూ.190కు చేరుకుంది. అయినప్పటికీ ఈ ధర మధ్య తరగతి వారికి సైతం అందుబాటులోనే ఉంది. కిలో రూ.300 రేటుతో పోల్చుకుంటే దాదాపు 40 శాతం తగ్గింది. మంగళవారం కనుమ నాటికి మరికాస్త పెరిగినా అది రూ.10–20కి మించి ఉండకపోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా గడచిన కొన్నేళ్ల కనుమ పండగలతో పోల్చుకుంటే ఈసారి చికెన్ ధర చాలా తక్కువగా ఉందని నాన్వెజ్ ప్రియులు అంటున్నారు. ‘ఎగ్’బాకి.. దిగివచ్చి.. మరోవైపు కోడిగుడ్ల కొద్ది రోజుల నుంచి ధర స్వల్పంగా పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. నెల రోజుల కిందట విశాఖపట్నంలో వంద గుడ్ల ధర రూ.590 ఉండగా డిసెంబర్ 27 నాటికి అది రికార్డు స్థాయిలో రూ.625కి ఎగబాకి పౌల్ట్రీ చరిత్రలో అత్యధిక ధరను నమోదు చేసింది. ఇలా ఈ నెల 10 వరకు ఇదే రేటు కొనసాగింది. 11వ తేదీ నుంచి తగ్గుముఖం పట్టి ప్రస్తుతం రూ.599 రేటు కొనసాగుతోంది. రిటైల్ మార్కెట్లో ఒక్కొక్కటి రూ.7 చొప్పున విక్రయిస్తున్నారు. గుడ్డుపై కోల్కతా మార్కెట్ ప్రభావం కోడిగుడ్ల ధరపై కోల్కతా మార్కెట్ ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు నిత్యం కోడిగుడ్లు ఎగుమతి అవుతుంటాయి. శీతాకాలంలో ఆయా ప్రాంతాల ప్రజలు గుడ్లను విరివిగా తింటారు. దీంతో ఇతర సీజన్లకంటే ఈ శీతలంలో గుడ్ల వినియోగం గణనీయంగా ఊపందుకుంటుంది. దీనికనుగుణంగా వీటి రేటు కూడా పెరుగుతుంది. ఇటీవలే కోల్కతా మార్కెట్లో గుడ్ల కొనుగోళ్లను తగ్గించడంతో ధర క్షీణించింది. ఫలితంగా విశాఖలో వంద గుడ్ల ధర రూ.625 నుంచి 599కి తగ్గింది. ధర తగ్గితే గుడ్లను నిల్వ చేసుకునే సదుపాయం ఉత్తరాంధ్రలో అంతగా లేదు. దీంతో పౌల్ట్రీ రైతులు రేటు ఎంతున్నా తెగనమ్ముకోవల్సిన పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్రలో 40 లక్షల కోళ్లు రోజుకు సగటున 32 లక్షల గుడ్లను ఉత్పత్తి చేస్తుంటాయి. దాదాపుగా ఇవన్నీ స్థానికంగానే వినియోగమవుతాయని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ జాతీయ సభ్యుడు భరణికాన రామారావు ‘సాక్షి’కి చెప్పారు. పొరుగున ఉన్న ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే గుడ్లను కొన్ని స్థానిక వినియోగానికి, మరికొన్ని ఎగుమతి చేస్తుంటారు. -
ధర ఎగ్సే
సాక్షి, భీమవరం/అమరావతి: పౌల్ట్రీ రంగంలో సరికొత్త రికార్డు నమోదైంది. కోడి గుడ్డు రైతు ధర రూ.5.79కు చేరి పాత రికార్డులను తిరగరాసింది. ఈ ఏడాది ఇదే అత్యధిక రైతు ధర కావడం గమనార్హం. కాగా.. పెరిగిన మేత ధరలతో గుడ్డు ధర పెరిగినా ప్రయోజనం అంతంత మాత్రమేనని పౌల్ట్రీ రైతులు అంటున్నారు. మరోపక్క రిటైల్ మార్కెట్లో గుడ్డు రూ.7కు చేరింది. ఇదే ధర మరికొంత కాలం కొనసాగితే.. నష్టాల నుంచి గట్టెక్కుతామని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. 60 శాతం ఉత్తరాదికి ఎగుమతి రాష్ట్రంలో 2 వేలకు పైగా కోళ్లఫారాలు ఉండగా.. వాటిలో ప్రస్తుతం 5.60 కోట్లకు పైగా కోళ్లు ఉన్నాయి. రోజుకు 6 కోట్ల గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం సగటున 4.20 కోట్ల నుంచి 4.75 కోట్ల మధ్య గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో 40 శాతం స్థానికంగానే వినియోగిస్తుండగా.. మిగిలిన 60 శాతం బీహార్, పశ్చిమ బెంగాల్, అసోం, నాగాలాండ్, మణిపూర్, ఒడిశా రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. శీతల ప్రభావం ఉండే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పౌల్ట్రీకి ముఖ్య సీజన్గా భావిస్తారు. ఏటా ఈ సీజన్లో అత్యధిక ధర నమోదవుతుంటుంది. 2017–18 సీజన్లో రూ.5.45 అత్యధిక ధర నమోదైంది. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో పౌల్ట్రీలు విస్తరించడం, ఎగుమతుల్లో ఇతర రాష్ట్రాల పోటీతో సీజన్ కలిసి రాక రైతు ధర రూ.5 దాటడం గగనంగా ఉండేంది. చరిత్రలో ఇదే గరిష్ట ధర ఉత్తరాదిన కోళ్లు ఫ్లూ బారిన పడటంతో ఎగుమతులకు డిమాండ్ ఏర్పడి నాలుగేళ్ల తర్వాత 2022–23 పౌల్ట్రీ సీజన్లో రూ.5.57 గరిష్ట ధర పలికింది. కాగా.. ప్రస్తుత సీజన్ ఆరంభంలో ధరలో ఒడిదొడుకులు ఎదురైనా.. వారం, 10 రోజుల నుంచి ఫామ్ గేట్ వద్ద గుడ్డు ధర అనూహ్యంగా పెరుగుతూ బుధవారం రూ.5.79కి చేరి అల్టైమ్ రికార్డు నమోదైంది. కార్తీక మాసం ముగియడం, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండగల నేపథ్యంలో స్థానిక వినియోగం మరింత పెరగనుండటంతో ఫామ్ గేట్ వద్ద ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. నూకలు దొరకట్లేదు పౌల్ట్రీ పరిశ్రమలో విరివిగా ఉపయోగించే నూకలు టన్ను రూ.13 వేల నుంచి ఏకంగా రూ.25 వేలకు చేరింది. నూకలను ఎక్కువగా ఇథనాల్ ఉత్పత్తికి మళ్లిస్తుండటంతో మార్కెట్లో దొరకని పరిస్థితి నెలకొంది. ఫలితంగా నూకలకు బదులు మొక్కజొన్నపైనే రైతులు ఆధారపడాల్సి వస్తోంది. మొక్కజొన్న కూడా టన్ను రూ.17 వేల నుంచి రూ.25 వేలకు పెరిగింది. సోయాబీన్ టన్ను రూ.48 వేల నుంచి రూ.50 వేల మధ్య పలుకుతోంది. ఆయిల్ తీసిన తవుడు (డీవోపీ) టన్ను రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెరిగింది. పెరిగిన మేత ధరలతో పాటు మందులు, వ్యాక్సిన్ల ధరలు, కార్మికుల జీతాలు పెరగడం పౌల్ట్రీల నిర్వహణ వ్యయాన్ని గణనీయంగా పెంచేసింది. ఫలితంగా పిల్ల దశ నుంచి గుడ్డు పెట్టే దశ వరకు ఒక్కో కోడికి గతేడాది రూ.300–310 ఖర్చు కాగా.. ప్రస్తుతం రూ.360–370 ఖర్చవుతోంది. పట్టణ ప్రాంతాల్లో రిటైల్ మార్కెట్లో గుడ్డు ధర రూ.7, మారుమూల పల్లెల్లో రూ.7.50 వరకు పలుకుతోంది. సాధారణంగా రైతు ధరకు 40–50 పైసలు అదనంగా చేర్చి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తుంటారు. -
గుడ్డుతో పొంగనాలు.. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా?
మసాలా ఎగ్ పనియరం తయారీకి కావల్సినవి: గడ్డ పెరుగు – 2 కప్పులు గుడ్డు – 3, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు – 1 టేబుల్ స్పూన్ చొప్పున కొత్తిమీర తురుము – కొద్దిగా అల్లం తురుము – అర టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ మిరియాల పొడి – పావు టీ స్పూన్ ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ విధానమిలా: ముందుగా పెరుగును రెండుమూడు సార్లు అటూ ఇటూ తిరగబోసుకుని సాఫ్ట్గా అయ్యేలా చేసుకోవాలి. అందులో గుడ్లు పగలగొట్టుకుని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని.. దానిపై పొంగనాల పెనం పెట్టుకుని.. ప్రతి గుంతలో కొద్దికొద్దిగా నూనె వేసుకుని.. కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని వాటిలో వేసుకుని ఇరువైపులా వేయించుకోవాలి. వీటిని.. నచ్చిన చట్నీలో వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. -
గుడ్డులోని పచ్చసొన మంచిదేనా? ఇన్నాళ్లకు సమాధానం దొరికింది
గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలామందికి గుడ్డు రోజువారీ ఆహారంలో భాగం. అయితే చాలామంది గుడ్డులోని తెల్లసొన మాత్రం తిని పచ్చసొన వదిలేస్తుంటారు. ఎందుకంటే పచ్చసొన మంచిది కాదేమోనని కొందరి అనుమానం.గుడ్డులోని పచ్చసొన తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని భ్రమ పడతారు. అందుకే కేవలం ఎగ్వైట్ మాత్రమే తినడానికి ఇష్టపడుతుంటారు. ఇంతకీ కోడిగుడ్డు పచ్చసొన తినొచ్చా? తినకూడదా? ఎప్పటినుంచో ఉన్న ఈ సందేహానికి రీసెంట్గా యూనివర్శిటీ ఆఫ్ కనెక్టికట్ సైంటిస్టులు జరిపిన రీసెర్చ్తో ఫుల్స్టాప్ పడింది. ఇంతకీ ఆ అధ్యయనంలో ఏం తేలింది? అన్నది ఈ స్టోరీలో చదివేయండి. కామన్ పీపుల్ నుంచి సెలబ్రిటీల వరకు బ్రేక్ఫాస్ట్లో చాలామంది గుడ్డు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఉడకబెట్టిన గుడ్లు. అమ్లెట్, ఫ్రై ఇలా అనేక రూపాల్లో తీసుకుంటారు. అయితే, మనలో చాలామంది పచ్చసొనను తీసుకోవటం అంతగా ఇష్టపడరు. ఎందుకంటే ఇది ఫ్యాట్ ఫుడ్ అని, దీనివల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందని భావిస్తారు. తాజాగా ఇదే అంశంపై యూనివర్శిటీ ఆఫ్ కనెక్టికట్ (యుకాన్) సైంటిస్టులు జరిపిన అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఇందుకోసం 18-35ఏళ్ల వయసున్న 28 మంది ఆరోగ్యవంతులను ఈ రీసెర్చ్ కోసంఎంచుకున్నారు. వీళ్లలో కొందరిని కేవలం ఎగ్ వైట్ తినేలా, మరికొందరిని పచ్చసొనతో కలిపి గుడ్డు మొత్తం తినేలా, మిగిలిన వాళ్లకు గుడ్డు లేని ఆహారం అందించారు. నాలుగు వారాల తర్వాత వారి డైట్ను బట్టి జీవక్రియ, హెమటోలాజికల్ ప్రొఫైల్లపై గుడ్డు ప్రభావాన్ని పరిశీలించారు. వీరిలో మొత్తం గుడ్డు తిన్న వారి శరీరంలో కోలిన్ అనే పోషకం గణనీయమైన పెరుగుదలను చూపించిందని సైంటిస్టులు తెలిపారు. కోలీన్.. మెదడు, నాడీ వ్యవస్థ, జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, కండరాల నియంత్రించడానిక కోలిన్ సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది ట్రైమిథైలామైన్ N-ఆక్సైడ్ (TMAO) ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణంగా గుడ్డు పచ్చసొన తింటే కొవ్వు పెరిగి గుండెపై ప్రభావం చూపిస్తుందని అనుకుంటారు. కానీ సైంటిస్టులు జరిపిన ప్రయోగం ప్రకారం.. పచ్చసొన కలిపిన గుడ్డు తిన్నవారిలో TMAO మారలేదని పరిశోధకులు గమనించారు. గుడ్డు మొత్తాన్నితినడం వల్ల మైక్రోన్యూట్రియెంట్ డైట్ క్వాలిటీ, కోలిన్, మంచి కొలెస్ట్రాల్లో పెరుగుదల కనిపించిందని సైంటిస్టుల పరిశోధనలో తేలింది. వాస్తవానికి గుడ్డు తెల్లసొనలో ప్రోటీన్ మరియు విటమిన్ B2 చాలా ఎక్కువ. కానీ గుడ్డు పచ్చసొనలో వివిధ విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి, ఇవి మన శరీరానికి కూడా చాలా ముఖ్యమైనవి.ఒక కంప్లీట్ ఎగ్ తినడం వల్ల ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ సమతులంగా అందుతాయి గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె, ఒమేగా 3 వంటి కొవ్వు కరిగే విటమిన్లు ఉన్నాయి. గుడ్డు పచ్చసొనలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. థైరాయిడ్ ఆరోగ్యంలో సెలీనియం కీలకపాత్ర పోషిస్తుంది. పచ్చసొనలో కేలరీలు కూడా తక్కువగా ఉన్నందున బరువు పెరిగే అవకాశాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. రక్తపోటును నియంత్రించి, గుండె పనితీరును మెరుగుపరచడంలో గుడ్లు ఎంతో ఉపయోగపడతాయని అధ్యయనంలో తేలింది.అసలు చెడు కొవ్వు శరీరంలోకి చేరడానికి ఆహారపు అలవాట్లే కారణమట. జంక్ ఫుడ్స్, మధ్యపానం, ధూమపానం లాంటి వాటితో దీని పరిమాణం పెరుగుతుంది తప్ప గుడ్డులోని పచ్చసొన తీసుకుంటే కాదని తేలింది. ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్న పేషెంట్స్ మినహాయించి ఎవరైనా పచ్చసొనతో కలిపి గుడ్డును తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పట్నుంచి నిక్షేపంగా గుడ్డులోని పచ్చసొనను కూడా తినొచ్చన్నమాట. -
గుడ్డుతో భలే వెరైటీలు.. ఎగ్ ఫింగర్స్ ఎప్పుడైనా ట్రై చేశారా?
ఎగ్ ఫింగర్స్ తయారికి కావల్సినవి: గుడ్లు – 4, మిరియాల పొడి – 1 టీ స్పూన్ ఉప్పు – తగినంత, మైదా పిండి – పావు కప్పు చాట్ మసాలా, కారం – పావు టీ స్పూన్ చొప్పున బ్రెడ్ పౌడర్ – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్లో మూడు గుడ్లు పగలగొట్టి.. అందులో అర టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని చతురస్రాకారపు పాత్రకు నూనె రాసి.. దానిలో వేసుకుని.. స్టీమ్ చేసుకోవాలి. అనంతరం దాన్ని నచ్చిన షేప్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంతలో ఒక చిన్న పాత్రలో మిగిలిన గుడ్డు పగలగొట్టి, స్పూన్తో గిలకొట్టి పెట్టుకోవాలి. మరో పాత్రలో మైదా పిండి, చాట్ మసాలా, కారం వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ఇంకో చిన్న పాత్రలో బ్రెడ్ పౌడర్ వేసుకుని.. ఒక్కో ముక్కను మొదట మైదా మిశ్రమంలో.. తర్వాత గుడ్డు మిశ్రమంలో ముంచి అటూ ఇటూ తిప్పి.. బ్రెడ్ పౌడర్ పట్టించి.. నూనెలో దోరగా వేయించుకోవాలి. వీటిని టొమాటో సాస్తో తింటే భలే రుచిగా ఉంటాయి. -
ఏలియన్ అవశేషాల పరిశోధనలో సంచలన విషయాలు
మెక్సికో సిటీ: మెక్సికో పార్లమెంట్లో మానవేతర అవశేషాల(ఏలియన్)ను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా వైద్యుల పరిశోధనలో వీటిపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏలియన్లు భూమిపై జీవించి ఉన్నవేనని పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా ఓ ఆడ ఏలియన్ కడుపులో గుడ్లు కూడా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. దాదాపు వెయ్యి ఏళ్ల క్రితంనాటి అవశేషాలుగా కార్బన్ డేటింగ్ విధానంలో కనుగొన్నారు. మెక్సికో శాస్త్రవేత్తలు గ్రహాంతర శవాలపై ప్రయోగశాలలో విస్తృతమైన అధ్యయనాలు నిర్వహించారు. సోమవారం నూర్ క్లినిక్లో నౌకాదళానికి చెందిన ఫోరెన్సిక్ వైద్యుడు జోస్ డి జీసస్ జల్సే బెనితేజ్ పరీక్షలు పూర్తి చేశారు. ఈ ఏలియన్ల పుర్రెలు అతికించినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని చెప్పారు. భూమిపై ఏ ఇతర జంతువుతో పోలి లేవని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఒకదాని కడుపులో గుడ్లు ఉన్నట్లు కనుగొన్నారు. ఆ రెండు అవశేషాలు ఒకే అస్థిపంజరానికి చెందినవని మెక్సికన్ జర్నలిస్ట్ ధీర్ఘకాల UFO ఔత్సాహికుడు జైమ్ మౌసన్ పేర్కొన్నారు. ఒక్కోదాని చేతికి మూడు వేళ్లు ఉన్నట్లు వెల్లడించారు. Mexico's Congress just unveiled two dead aliens estimated to be around 1,000 years old. What do you think? pic.twitter.com/Zr7z4FKenS — Kage Spatz (@KageSpatz) September 13, 2023 నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికోలోని శాస్త్రవేత్తలు ఆ అవశేషాలపై కార్బన్ డేటింగ్ విధానంలో పరిశోధనలు చేశారు. అవి 1000 ఏళ్లనాటివని తేలినట్లు తమ పరిశోధనలో తేలినట్లు వెల్లడించారు. భూమిపై ఒకప్పుడు జీవం ఉన్న, జీవ సంబంధమైన, గర్భధారణ కలిగి ఉన్నాయని తమ పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు. ఇదీ చదవండి: ఏలియన్ అవశేషాలు.. నాసా స్పందన ఇది -
వీకెండ్ స్పెషల్: పాలకూర చికెన్ ఎగ్ బైట్స్, సింపుల్గా ఇలా
పాలకూర చికెన్ ఎగ్ బైట్స్ తయారీకి కావల్సినవి: పాలకూర – రెండు కప్పులు; గుడ్లు – పది; పాలు – ముప్పావు కప్పు; చీజ్ తరుగు – అరకప్పు; ఉడికించిన చికెన్ ముక్కలు – పది; ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా. తయారీ విధానమిలా: ►పాలకూర, చికెన్ ముక్కలను సన్నగా తరిగి పెట్టుకోవాలి.పెద్దగిన్నెలో గుడ్ల సొన వేయాలి. దీనిలో పాలు, చికెన్, పాలకూర ముక్కలు వేసి కలపాలి. ► చివరిగా రుచికి సరిపడా, ఉప్పు, మిరియాల పొడి వేసి నురగ వచ్చేంత వరకు బాగా కలపాలి. ► ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కూప్లతో మఫిన్ ట్రేలో వేసి అరటగంట పాటు బేక్ చేస్తే పాలకూర చికెన్ ఎగ్ బైట్స్ రెడీ. -
Egg Side Effects: గుడ్డు ఆరోగ్యానికి మంచిది కాదా..?
గుడ్డు ఆరోగ్యానికి మంచిదని డైట్లో కంప్లసరీ ఉండేలా చూసుకుంటారు. దీనిలో ప్రోటీన్ల తోపాటు శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు మినరల్స్ కూడా ఉంటాయన్నది నిజమే. కానీ అలా అని వాటిని ఎక్కువగా తింటే చాలా తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయి. గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో అతిగా తింటే అంతే ప్రమాదం అంటున్నారు వైద్యులు. గుడ్డు ఎక్కువగా తీసుకుంటే కలిగే దుష్పరిణామాలు కొలస్ట్రాల్ సమస్య ఉన్నవారు గుడ్డు అస్సలు తినకూడదు. తింటే ఒక్కసారిగి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. గుండె జబ్బుల అవకాశాలను పెంచుతుంది. అధిక రక్తపోటు ఉన్న పేషెంట్లు తింటే మరింత ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. తినాలనుకుంటే గుడ్డులోని పసుపు భాగాన్ని బయటకు తీసి తినవచ్చు. ఇవి ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడమే గాక శరీరంలో అదనపు ప్రోటీన్లు, కొవ్వు కూడా పెరుగుతుంది. మధుమేహం పెరిగే ప్రమాదం ఎక్కువే. ఇది ఇన్సులిన్ నిరోధకతను కూడా పెంచుతుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజు రెండు నుంచి మూడు గుడ్లు తీసుకోవాలి. అతిగే తింటే మాత్రం తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కొనక తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్యులు (చదవండి: జీ20లో అదిరిపోయే వంటకాలు ఇవే..ఏకంగా 500కిపైగా..) -
వెరైటీగా బనానా ఆమ్లెట్ ట్రై చేయండిలా!
ఎప్పుడు గుడ్డుతో వేసుకునే ఆమ్లెట్ కాకుండా కాస్త వెరైటీగా ఆలోచించండి. మసాలా వేసి చేసే ఎగ్ ఆమ్లెట్ గురించి తెలిసిందే. అలా కాకుండా అరటిపండుతో అదిరిపోయే రుచితో ఇలా ఆమ్లెట్ వేసుకుని చూడండి. పిల్లలు, పెద్దులు వదిలిపెట్టకుండా తినేస్తారు చూడండి. అయితే దీని తయారీ విధానం ఏంటో చూసేద్దామా!. బనానా ఆమ్లెట్కి కావలసినవి: అరటి పండు – ఒకటి గుడ్లు – రెండు ఉప్పు – రుచికి సరిపడా మిరియాల పొడి – టీస్పూను కారం – అరటీస్పూను నూనె – ఆమ్లెట్ వేయించడానికి సరిపడా. తయారీ విధానం: ∙అరటిపండును ముక్కలుగా తరగాలి. మిక్సీజార్లో అరటిపండు ముక్కలు, గుడ్ల సొన, మిరియాలపొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి నురగ వచ్చేంత వరకు గ్రైండ్ చే యాలి. ఇప్పుడు పెనం మీద నూనె వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఆమ్లెట్లా పోసుకోవాలి. సన్నని మంట మీద రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే బనానా ఆమ్లెట్ రెడీ. (చదవండి: వెన్న దొంగకు ఇష్టమైన.. గోపాల్కాలా ఎలా చేయాలంటే..) -
వీకెండ్ స్పెషల్: ఎగ్మటన్ నర్గీసి కోఫ్తా, టేస్ట్ మామూలుగా ఉండదు
ఎగ్మటన్ నర్గీసి కోఫ్తా తయారీకి కావల్సినవి: ఉడికించిన గుడ్లు – ఆరు; మటన్ ఖీమా – అరకేజీ; కారం – టీస్పూను; పసుపు – పావు టీస్పూను; అల్లం వెల్లుల్లి పేస్టు – టీస్పూను; గరం మసాలా – టీస్పూను; మిరియాల పొడి – టీస్పూను; కొత్తిమీర తరుగు – మూడు టేబుల్ స్పూన్లు; పచ్చిమర్చి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు; పుదీనా తరుగు – టేబుల్ స్పూను; బ్రెడ్ ముక్కల ΄÷డి – రెండు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె –డీప్ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ►శుభ్రంగా కడిగిన మటన్ ఖీమాను మిక్సీజార్లో వేయాలి. ► దీనిలో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, మిరియాల పొడి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, బ్రెడ్ ముక్కల పొడి, టేబుల్ స్పూను నూనె వేసి మెత్త్తగా గ్రైండ్ చేయాలి. ► గ్రైండ్ అయిన మిశ్రమాన్ని ఒక మాదిరి పరిమాణంలో ఉండలుగా చుట్టుకోవాలి. ► ఇప్పుడు ఉడికించిన గుడ్ల పెంకు తీసేయాలి ∙ఖీమా ఉండను తెరిచి గుడ్డును లోపలపెట్టి ఖీమా మిశ్రమంతో కోఫ్తాలా వత్తుకోవాలి. ► ఇలా ఆరు గుడ్లను కోఫ్తాలా తయారు చేసుకున్నాక, సన్నని మంటమీద డీప్ఫ్రైచేయాలి. ► కోఫ్తా బంగారు వర్ణంలోకి మారేంత వరకు వేయించితే ఎగ్మటన్ నర్గీసి కోఫ్తా రెడీ . ► కోఫ్తాను మధ్యలో రెండు సగాలుగా కట్ చేసి నచ్చిన సాస్తో సర్వ్చేసుకోవాలి. -
పచ్చసొన తినకపోతే ఏం జరుగతుందో తెలుసా?
పచ్చసొన పారేస్తున్నారా? చాలామంది గుడ్డులోని తెల్లసొన మాత్రం తిని పచ్చసొన వదిలేస్తుంటారు. ఎందుకంటే పచ్చసొన మంచిది కాదేమోనని కొందరి అనుమానం. నిజానికి పచ్చసొన మీకు ఎటువంటి హానీ కలిగించదు. పైగా గుడ్డులోని తెల్లటి భాగాన్ని మాత్రమే తినడం వల్ల పచ్చసొనలో ఉండే ఎ, బి. ఇ. కె. విటమిన్లని పొందలేరు. పచ్చసొన తినకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం పోషకాల లోపం గుడ్డులోని పచ్చసొనలో కోలిన్ అనే పోషకం ఉంటుంది. ఇది చికెన్, చేపలు, బంగాళదుంపలు, బియ్యం వంటి వాటిలో కనిపిస్తుంది. పూర్తిగా ఉడికించిన గుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే పచ్చసొనలో ఐరన్, జింక్ ఉంటాయి. మీరు దీనిని తినకపోతే ఈ పోషకాలు కోల్పోతారు. రోగనిరోధక శక్తి కోల్పోవడం: గుడ్లలో ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ మినరల్స్, అమినో యాసిడ్స్, విటమిన్ డి, బి12 ఉంటాయి. అనేక అధ్యయనాల ప్రకారం గుడ్లు తినడం వల్ల శక్తి పెరుగుతుంది. ఇవి రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. కళ్లను సురక్షితంగా ఉంచడమే కాకుండా చర్మం, జుట్టుకి కూడా మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉన్న చాలామంది వ్యక్తులు గుడ్డులోని పసుపు భాగాన్ని తినకుండా వదిలేస్తారు. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో డైటరీ కొలెస్ట్రాల్ ఉంటుంది. దాదాపు ఒక గుడ్డులో 187 మి.గ్రా. కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే ఇది ఎప్పుడూ తీసుకునే మటన్ , ఐస్ క్రీం వంటి ఆహార పదార్థాలతో పోలిస్తే తక్కువే. ఇలాంటి పరిస్థితులలో గుడ్డులోని పసుపుభాగం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి.. ప్రకృతి మనకు గుడ్డులో తెల్లసొన, పచ్చసొన కలిపే ఇచ్చింది. అంటే కలిపే తినమని అర్థం. కాబట్టి అది మంచిది కాదేమోననే అనుమానంతో దానిని వేరు చేయాల్సిన అవసరం లేదు. (చదవండి: బరువు తగ్గడం..అంత బరువేం కాదు!) -
అంగన్వాడీలో కుళ్లిన గుడ్లు!
వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలని చేపట్టిన సంకల్పాన్ని పలువురు మధ్య దళారులు చిన్నాభిన్నం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న అధికారుల నిర్లక్ష్యంతో పలువురు నీరు గార్చుతున్నారు. కొన్నె గ్రామంలో సోమవారం కోడిగుడ్లను పంపిణీ చేయగా అవి వండుకున్న వారు గుడ్లు కుళ్లిపోయి వాసన వస్తుందని, అవి తింటే అనారోగ్యం పాలుకావడం ఖాయమని వాపోతున్నారు. అధికారులు సంబంధిత కాంట్రాక్టర్పై చర్య తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
'గుడ్డు' లేకుండానే ఆమ్లెట్..ఆ సరికొత్త రెసిపీ వ్యాపారవేత్తగా..
ప్రస్తుతం ఈ ఉరుకులు పరుగులు జీవితంలో ఏదో పొట్టకింత తిన్నమా అన్నట్లు కానిస్తారు. ఏదో తూతూ మంత్రంగా తినడమే గానీ గంటలు గంటలు కూర్చొని చేసే వంటకాల జోలికే వెళ్లరు. ఇక బ్రేక్ ఫాస్ట్లు దగ్గరకు వస్తే..త్వరగా అయిపోయే వాటికే ప్రయారిటీ ఇస్తారు. అందులోనూ ముఖ్యంగా బ్రెడ్, ఆమ్లేట్ వంటివే ప్రివర్ చేస్తారు. చాలామంది ఉడకబెట్టి లేదా బ్రెడ్ ఆమ్లెట్ వంటి రెసీపీలు చేసుకుంటారు. మనం వెళ్లే కంగారు ఆ గుడ్డుని పగలుగొట్టడానికి నానాతంటాలు..ఇక గిలకొట్టడం మరో పని. దీంతో హడావిడిగా కిందమీద పడేసి చేసేస్తుంటాం. అలాంటి హైరానా ఏమి లేకుండా..అసలు 'గుడ్డే' లేకుండా క్షణాల్లో రెడీ చేసే ఆమ్లేట్ మన ముందుకు వస్తోంది. ఓ కేరళ వ్యక్తి దీన్ని సృష్టించాడు. ఇంతకీ ఎలా చేస్తారు? ఏవిధంగా వంటి కథాకమామీషులు ఒక్కసారి చూద్దామా!. వివరాల్లోకెళ్తే..కేరళలోని రామనట్టుకర నివాసి అర్జున్ 'గుడ్లు' లేకుండా ఫాస్ట్గా ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించాడు. అందుకు సంబంధించిన ఇన్స్టెంట్ పౌడర్ను కూడా మార్కెట్లోకి తీసుకువచ్చాడు కూడా. ఆ పౌడర్కి సంబంధించిన చిన్న ప్యాకెట్ ధర రూ. 5 నుంచి రూ. 100 వరకు వివిధ రేంజ్లో ధరలో పెద్ద ప్యాకెట్ల వరకు కూడా మార్కెట్లోకి తీసుకువచ్చాడు. ఈ పౌడర్ నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుందట. ఈ రెసీపీ తయారీ వెనుక ఉన్న రీజన్.. అర్జున్ తన కూతురు ధన్శివ కోసం "ముత్తయప్పం" (ఆమ్లెట్) త్వరగా ఎలా తయారు చేయడం ఎలా అని ఆలోచించాడు. అదే ఈ గుడ్డ లేకుండా త్వరగా చేసే ఆమ్లెట్ రెసీపీకి నాంది పలికింది. ఆ తరువాత అర్జున్ ఇలా మూడు సంవత్సరాలుగా రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. చివరికి అనుకున్నది సాధించడమే గాక తాను రూపొందించిన ఆ పౌడర్ను మార్కెట్లకి తీసుకువచ్చే ముందు మరిన్ని ప్రయోగాలు చేసి సత్ఫలితాలు ఇచ్చేంత వరకు కొంత డబ్బును ఖర్చు పెట్టాడు. అంతా ఓకే అనుకున్నాకే మార్కెట్లోకి తాను తయారు చేసిన ప్రొడక్ట్లను తీసుకొచ్చాడు. ఈ మేరకు అర్జున్ దాదాపు రూ. 2 కోట్లతో కొండోట్టి వజ్హయూర్లో 'ధన్స్ డ్యూరబుల్' అనే పేరుతో ఓ కంపెనీని కూడా పెట్టి..సేల్స్ ప్రారంభించాడు. అంతేకాదు కిడ్స్ ఆమ్మెట్, ఎగ్ బుర్జి, వైట్ ఆమ్లెట్, మసాలా ఆమ్లెట్, స్వీట్ ఆమ్మెట్ బార్ స్నాక్ వంటి కొత్త ఫ్లేవర్స్లో మరిన్ని వెరైటీలను కస్టమర్లకు పరిచయం చేయనున్నాడు. ఈ మేరకు బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నై, యూకే, కువైట్ వంటి దేశాలకు కూడా తన ప్రొడక్ట్లను మార్కెట్ చేసుకుంటున్నాడు. అర్జున్ 2021లో తన వ్యాపారాన్ని ప్రారంభించారడు. ఈ పౌడర్ను మరింతగా ఉత్పత్తి చేసేందుకు యంత్రాలను ఏర్పాటు చేసుకోవడమే గాక సుమారు ఏడుగురు మహిళలతో సహ 12 మందికి ఎంప్లాయిమెంట్ని కల్పించాడు అంతేకాదు ఆఖరికి ఆన్లైన్లో కూడా కొనుగొళ్లు చేసేలా మార్కెట్ని విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నాడు కూడా. అతని గురించి ఔట్లుక్ అనే న్యూస్ ఛానెల్ 'ది ఆమ్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా' శీర్షికతో అర్జున్ గురించి కథనం ఇచ్చింది. ఆ తర్వాత నుంచి అతను ఓ సెలబ్రెటీ మాదిరిగా అన్ని పత్రికలు అతని గురించి కథనాలు రావడం జరిగింది. పైగా తాను త్వరగా ఆమ్లెట్ని రెడీ చేసే విధానంలో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని బద్దలు కొట్టే సన్నహాలు కూడా చేస్తున్నట్లు పేర్కొన్నాడు అర్జున్. (చదవండి: మగ గొరిల్లా కడుపున ఓ ఆడ గొరిల్లా పిల్ల..కంగుతిన్న జూ సిబ్బంది) -
ఫాస్ట్ఫుడ్ సెంటర్లో అంగన్వాడీ కోడిగుడ్లు
మహబూబాబాద్ అర్బన్: మానుకోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో అంగన్వాడీ కోడిగుడ్లతో ఎగ్ ఫ్రైడ్రైస్, ఎగ్ నూడిల్స్ తయారు చేసిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేసే కోడిగుడ్లు పక్కదారి పట్టకుండా స్టాంప్లు వేస్తున్నారు. అయితే ఫాస్ట్ఫుడ్ సెంటర్లో స్టాంప్ వేసి ఉన్న కోడిగుడ్లతో ఫాస్ట్ఫుడ్ తయారు చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా అవకతవకలు జరుగుతున్నాయడానికి ఈ ఘటనే నిదర్శనమని, ఇప్పటికై నా ఐసీడీఎస్ అధికారులు పర్యవేక్షణ పెంచి, తనిఖీలు విస్తృతం చేయాలని నెటిజన్లు, జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
అది అత్యంత విచిత్ర జీవి.. పాలివ్వడమే కాదు.. గుడ్లు కూడా పెడుతుంది!
ప్రపంచంలో అనేక వింత జీవులు ఉన్నాయి. వీటిని చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.అటువంటి వాటిలో ఒకటే ప్లాటిపస్. చూసేందుకు ఈ జీవి ఎంతో విచిత్రంగా ఉంటుంది. దీని ముఖం బాతు ముఖాన్ని పోలివుంటుంది. దీని శరీరం సీలు చేప మాదిరిగా ఉంటుంది. ఇది క్షీరద జాతికి చెందిన జీవి. ఇది పాలిచ్చి పెంచే జంతువు అయినప్పటికీ.. గుడ్లను కూడా పెడుతుంది. ఇది మిశ్రమ జీవిలా కనిపిస్తుంది. ఇలాంటి మిశ్రమ జాతి జీవులు ప్రపంచంలో ఐదు రకాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం ప్లాటిపస్కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. శాస్త్రవేత్తలు దీనిని నమ్మలేదు 1799లో తొలిసారి ఈ ప్లాటిపస్ శాస్త్రవేత్తల కంటికి చిక్కింది. దీనిని చూడగానే వారు తెగ ఆశ్చర్యపోయారు. దీని శరీరం, ముఖం ఎంతో వింతగా.. పొంతన లేని విధంగా కనిపించింది. ఇలాంటి జీవి భూమిపై ఉందనే విషయాన్ని నమ్మలేకపోతున్నామన్నారు. తొలుత దీనిని రెండు జీవులుగా భావించిన శాస్త్రవేత్తలు తమపరిశోధనల ద్వారా అది ఒక జీవేనని తేల్చారు. తరువాత అటువంటి జీవి సజీవంగానే లభ్యం అయ్యింది. రక్షణ కోసం విషం జిమ్ముతూ.. ప్లాటిపస్ ఇతర జీవుల నుంచి రక్షణ కోసం విషం జిమ్ముతుంటుంది. దాని వెనుక కాళ్లలో ఒక ముల్లులాంటిది ఉంటుంది. దానిలో విషం ఉంటుంది.తన రక్షణకు అది ఆ ముల్లును ఇతర జీవులకు గుచ్చుతుంది. అయితే మనిషికి ప్లాటిపస్ ముల్లు గుచ్చుకోవడం వల ఎటువంటి హాని జరగను. అయితే తట్టుకోలేకంత నొప్పి కలుగుతుంది. ఇది కూడా చదవండి: మన వర్సిటీలు ప్రపంచంలో మేటి -
గుడ్లను యూరిన్లో ఉడికించి, ఉప్పుకారం జల్లి..
ప్రపంచంలో చాలామంది ఆరోగ్యం కోసం రకరకాల గృహవైద్యాలను అనుసరిస్తుంటారు. వాటిపై అపరిమితమైన నమ్మకం కలిగివుంటారు. ఒక్కోసారి అటుంటి ఆహారాలపై ఏవగింపు కలిగినా, ఆరోగ్యం పేరుతో వాటిని తింటారు. ఈ కోవలో కొందరు పాములను, మరికొందరు కీటకాలు, పురుగులను కూడా తింటుంటారు. అది వర్జిన్ గుడ్డు.. ఇదేకోవలోకి వచ్చే ఒక ‘పోషకాహారం’ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. చైనాకు చెందిన చాలామంది తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మూత్రంలో గుడ్లను ఉడికించి, వాటిపై మసాలాలు చల్లి ఎంతో ఆనందంగా తింటుంటారు. యూరిన్లో గుడ్లను ఉడికించి, తినడం వలన మంచి ఆరోగ్యం సమకూరుతుందని చెబుతుంటారు. ఇలా మూత్రంలో ఉడికించిన గుడ్డును వారు వర్జిన్ గుడ్డు అని అంటారు. ఈ విధంగా గుడ్లను ఉడికించేందుకు కొందరు చైనావాసులు.. స్కూలుకు వెళ్లే పిల్లల నుంచి మూత్రం సేకరిస్తారు. స్కూలు టాయిలెట్లలో బకెట్లను ఉంచి.. మూత్రంలో ఉడికించిన గుడ్లను తినడం వలన ఎప్పుడూ జ్వరం రాదని కొందరు చైనావాసులు నమ్ముతారు. అదేవిధంగా రక్తపోటు అదుపులో ఉంటుందని కూడా చెబుతారు. మూత్రం సేకరించేందుకు ఇక్కడివారు ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తారు. స్కూళ్ల టాయిలెట్లలో బకెట్లను ఉంచి, చిన్నారుల నుంచి మూత్రాన్ని సేకరిస్తారు. దానిని గుడ్లను ఉడికించేందుకు వినియోగిస్తారు. ఇది కూడా చదవండి: చిరుతల మధ్య పోరాటం..‘అగ్నికి’ తీవ్రగాయాలు..! -
'గుడ్లను తాకితే తాటతీస్తా..!' జూ కీపర్పై కొండ చిలువ వీరంగం..
ఏ జంతువులోనైనా అమ్మతనం అసామాన్యమైనది. పిల్లలను రక్షించుకోవడానికి ఎంతకైన తెగిస్తుంది తల్లి. సాధారణంగా మన ఇళ్లలో ఉండే కోడిని చూడండి.. దాని పిల్లల వైపు వచ్చిన ఏ జంతువునైనా ప్రాణాలకు తెగించి కొట్లాడుతుంది. అదీ అమ్మలోని గొప్పతనం. తాజాగా ఓ కొండ చిలువ తన గుడ్లను తీసుకోవడానికి వచ్చిన జూకీపర్పై విరుచుకుపడింది. అతను ఎన్నిసార్లు ప్రయత్నించినా.. గుడ్లను మాత్రం ముట్టుకోనీయలేదు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. View this post on Instagram A post shared by Jay Brewer (@jayprehistoricpets) ఓ పైథాన్ అందమైన గుడ్లను పెట్టింది. అవి భారీ సైజులో ఉన్నాయి. ఓ కుప్పగా ఉన్న తన గుడ్ల చుట్టూ చుట్టకుని ఆ కొండ చిలువ పడుకుని ఉంది. జూ కీపర్ జాయ్ బ్రూవర్ అది పడుకున్న రూమ్లోకి ఎంట్రీ ఇస్తాడు. పైథాన్ను ఆటపట్టించాలనుకుంటాడు. అనంతరం ఆ గుడ్లలోంచి ఓ గుడ్డును తీసుకునే ప్రయత్నం చేస్తాడు. వెంటనే ఆ కొండ చిలువ బ్రూవర్ను కరవడానికి వస్తుంది. అతను ఎన్ని సార్లు ప్రయత్నించినా.. పైథాన్ మాత్రం గుడ్లను ముట్టుకోనీయదు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నెటిజన్లు భారీగా స్పందించారు. అమ్మతనంలోని గొప్పతనాన్ని కొనియాడారు. పైథాన్కు గుడ్లపై ఉన్న ప్రేమను కొనియాడుతూ కామెంట్లు పెట్టారు. అదీ.. అమ్మంటే అంటూ అని మరికొందరు స్పందించారు. ఇదీ చదవండి: ప్లీజ్ ఇలాంటి స్కూల్లో పిల్లలను చేర్పించకండి.. షాకింగ్ వీడియో -
కోడి ముందా.. గుడ్డు ముందా? ఎట్టకేలకు ఆన్సర్ దొరికింది!
కోడి ముందా..గుడ్డు ముందా అనే ప్రశ్నఅనేది ఎందరినో ఆకర్షించిన ఓ చిక్కు ప్రశ్న. యుగాలుగా పండితుల దగ్గర నుంచి శాస్త్రవేత్తలకు పట్టి పీడించిన ఆ చిక్కు ప్రశ్నకు ఆన్సర్ దొరికింది. ఎట్టకేలకు శాస్త్రవేత్తలు ఫజిల్లా మిగిలిన ఆ ప్రశ్నకు సమాధానం కనుగొన్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు ఉభయచరాలు, బల్లులపై చేసిన ఎన్నో అధ్యయనాల అనంతరం ఆ ప్రశ్నకు సమాధానం 'కోడె' ముందని తేల్చి చెప్పేందుకు రెడీగా ఉన్నారు. అందుకు సంబంధించి.. ఆధారాలతో సహా వెల్లడించేందుకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ క్రమంలో ఆయా పరిశోధనల్లో ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆధునిక సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు వంటివి ఇంతకమునుపు గుడ్లు పెట్టడానికి బదులు పిల్లలకు జన్మనిచ్చేవని తేల్చి చెప్పారు. ఇది 51 శిలాజ జాతులు, 29 జీవ జాతులపై జరిపిన పరిశోధనల ఆధారంగా వెల్లడించినట్లు పేర్కొన్నారు. వాటిల్లో గుడ్లు పెట్టేవి(అండాశయం), జన్మనిచ్చేవి(వివిపరస్) అని రెండు రకాలుగా వర్గీకరించి మరీ అధ్యయనం చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. వాస్తవానికి ఇవి మొదట్లో పునరుత్పత్తి కోసం నీటి సమీపంలో నివశించేవని చెప్పారు. అలాగే పరిస్థితులు అనువుగా మారే వరకు తమ పిల్లలను గర్భంలోనే దాచుకునేవని తెలిపారు. పరిణామక్రమంలో భూమిపై జీవించడానికి అలవాటు పడటంతో క్రమంగా గుడ్లు పెట్టడం ప్రారంభించాయని అన్నారు. ప్రస్తుతం జీవించి ఉన్న కొన్ని జాతులు పాములు, కప్పలు, బల్లులు అప్పుడప్పుడూ పిల్లలకు నేరుగా జన్మనిస్తాయని, కొన్ని సందర్భాల్లో గుడ్లు పెడతాయని బ్రిస్టల్ స్కూల్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్రొఫెసర్ మైఖేల్ బెంటన్ చెప్పారు. అవి అండాశయం(గుడ్లు పెట్టడం), వివిపరస్(జన్మనివ్వడం) అనే రెండు పునరుత్పత్తి వ్యూహాలను ప్రదర్శిస్తాయని శిలాజ జాతులపై జరిపిన అధ్యయనంలో వెల్లడైందని నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్లో శాస్త్రవేత్తలు వెల్లడించారు. (చదవండి: అదొక్కటే! ఎన్నో వ్యాయామాలకు సరిసాటి..) -
ఈ గుడ్ల ధరలు తెలిస్తే.. గుడ్లు తేలేస్తారు!
చాలామందికి గుడ్డు రోజువారీ ఆహారంలో భాగం. గుడ్లతో ప్రతీరోజూ వంటకాలు చేసుకునేవారు ఉన్నారు. మరి ప్రపంచంలో అత్యంత ఖరీదైన గుడ్లు కూడా ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? వాటికి అంత ధర ఎందుకు ఉంటుందో తెలిస్తే ఎవరూ ఒక పట్టాన నమ్మలేరు. ప్రపంచంలోని ప్రజలు అత్యధికంగా తినే ఆహారాలలో గుడ్డు ఒకటి. సాధారణంగా అందరూ తెల్లని గుడ్లు తింటారు. వీటి ధర రూ.5 నుంచి రూ.10 మధ్య ఉంటుంది. అయితే కాస్త డబ్బులు అధికంగా ఉండేవారు దేశీ గుడ్లను తింటుంటారు. ఇవి కాస్త గులాబీరంగులో ఉంటాయి. వీటి ధర రూ. 20 నుంచి రూ. 25 మధ్య ఉంటుంది. మరికొందరు వివిధ పక్షుల గుడ్లను కూడా తింటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుడ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుడ్లు.. రోత్స్చైల్డ్ ఫాబెర్జ్ ఈస్టర్ గుడ్లు. ఈ గుడ్డు ధర రూ. 9.6 మిలియన్ డాలర్లు. దీని ధర భారత కరెన్సీలో చూస్తే రూ. 78 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. వికీపీడియాలోని సమాచారం మేరకు ఈ గుడ్డుపై పూర్తిస్థాయిలో వజ్రాలను పొదిగారు. ఇది బంగారు కవర్ కలిగివుంటుంది. అయితే ఈ గుడ్డు తినేందుకు కాదు. అలంకరణ కోసం తీర్చిదిద్దారు. పైగా ఇది ఆర్టిఫిషియల్ గుడ్డు. ఖరీదైన గుడ్ల పరంగా చూస్తే రెండవ స్థానంలో మిరాజ్ ఈస్టర్ ఎగ్స్ వస్తాయి. వీటి ధర 8.4 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దీనిని చూస్తే రూ. 69 కోట్లకు సమానం. 18 కేరెట్ల బంగారంతో రూపొందించిన ఈ గుడ్డును వేయి వజ్రాలతో అలంకరించారు. ఈ గుడ్డును చూసే వారికి అది గుడ్డు సైజులో ఉన్న వజ్రం అని అనిపిస్తుంది. మూడవ స్థానంలో డైమండ్ స్టెల్లా ఈస్టర్ ఎగ్స్ వస్తాయి. వీటి ఖరీదు సుమారు రూ. 82 లక్షలు. ఈ గుడ్డు 65 సెంటీమీటర్ల పొడవు కలిగివుంటుంది. ఈ గుడ్డునుకొనాలంటే మీ కున్న ఇంటిని అమ్మేయాల్సి వస్తుంది. ఈ గుడ్డు చూసేందుకు చాక్లెట్ మాదిరిగా ఉంటుంది. ఈ గుడ్డు పైభాగంలో వజ్రాలు పొదిగి ఉండడంతో పాటు దీనిని బంగారంతో రూపొందించారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలో ఐదు అతిపెద్ద మారణహోమాలివే.. -
కోడిగుడ్ల ఆహారోత్పత్తులకు పురస్కారాలు!
హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ (ఐఈసీ) తాజాగా విజన్ 365 ఎగ్ ఇన్నోవేషన్ అవార్డులను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. కోడిగుడ్లతో చేసిన వినూత్న ఆహారోత్పత్తులకు గాను ఈ అవార్డును అందించనున్నట్లు విజన్ 365 చైర్మన్ సురేష్ చిట్టూరి తెలిపారు. ఈ కొత్త అంతర్జాతీయ పురస్కారానికి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. నూతన ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకునేందుకు, వ్యాపారాన్ని పెంపొందించుకునేందుకు సంస్థలకు ఇది మంచి అవకాశం కాగలదని ఆయన పేర్కొన్నారు. దీనికి ఆగస్టు 11లోగా కంపెనీలు తమ ఉత్పత్తుల వివరాలను షేర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 24–28 మధ్య జరిగే ఐఈసీ గ్లోబల్ లీడర్షిప్ సదస్సులో అవార్డును ప్రదానం చేస్తారు. -
ఎమ్మెల్యే కారుపై కోడిగుడ్లతో దాడి
కొరాపుట్: అధికార పార్టీ బీజూ జనతాదల్కు చెందిన కొరాపుట్ ఎమ్మెల్యే, జిల్లా ప్రణాళికా సంఘం అధ్యక్షుడు రఘురాం పొడాల్పై కోడి గుడ్లతో దాడి జరిగింది. ఈ నేపథ్యంలోకొరాపుట్ జిల్లా లమతాపుట్ సమితి కేంద్రంలో వివాదం చెలరేగాయి. లమతాపుట్లో ప్రభుత్వం నూతనంగా పంచాయతీ భవనం నిర్మించింది. దీనికి సంబంధించి ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే హాజరు కానున్నారు. ఈ మేరకు భవన శిలాఫలకంపై ఎమ్మెల్యే, కలెక్టర్ పేర్లు ఉన్నాయి. అయితే విపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు స్థానిక జిల్లా పరిషత్ సభ్యుల పేర్లు లేవు. దీనిని గమనించిన ఆ పార్టీ కార్యకర్తలు అధికారులను నిలదీశారు. దీనిపై అధికారుల నుంచి స్పందన కరువైంది. ఇంతలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, ఆరుగురు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో ఎమ్మెల్యే రఘురాం భవనం ప్రారంభించేందుకు కారులో వచ్చారు. అప్పటికే ఆగ్రహావేశాలతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు.. మార్కెట్ మీదుగా ఎమ్మెల్యే కాన్వాయ్ వెళ్తుండగా కోడి గుడ్లతో దాడి చేశారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోగా పరారయ్యారు. అయితే యథావిధిగా కార్యక్రమ వేదిక వద్దకు చేరుకున్న రఘురాం పొడాల్.. భవనాన్ని ప్రారంభించారు. ఈ ఘటన అనంతరం మరో కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పప్పు.. పాలు.. గుడ్లు.. టెండర్ల ఖరారు ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాల కింద సరుకుల పంపణీకి కాంట్రాక్టర్ల ఎంపిక అధికార యంత్రాంగానికి ప్రహసనంగా మారింది. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లను ఖరారు చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం టెండరులో పాల్గొంటున్న బిడ్డర్లు అత్యధిక ధరలు కోట్ చేయడమే. బిడ్డర్లు కుమ్మక్కై వాస్తవ ధరల కంటే అత్యధిక ధరలను కోట్ చేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న తీరును అధికారులు గుర్తించడంతో కాంట్రాక్టరు ఎంపిక వాయిదా పడుతూ వస్తోంది. దాదాపు రెండు నెలలుగా ఒక్క టెండరు సైతం ఖరారు కాలేదు. వన్.. టూ.. త్రీ.. అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన గర్భిణులు, బాలింతలు, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులకు ఆరోగ్యలక్ష్మి తదితర పోషకాహార కార్యక్రమాల్లో భాగంగా పాలు, కోడి గుడ్లు, కందిపప్పును వివిధ రూపాల్లో అందిస్తున్నారు. సంపూర్ణ పోషకాహారం కింద పాలను, గుడ్లను నేరుగా అందిస్తుండగా... ఫుల్ మీల్స్లో భాగంగా కందిపప్పుతో కూడిన కూరలతో భోజనాన్ని ఇస్తున్నారు. ఈ పథకాలకు అవసరమైన పాలు, గుడ్లు, కందిపప్పును సరఫరా చేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తుంది.మూడు లేదా ఆరు నెలల పాటు ఈ కాంట్రాక్టును అప్పగించి సరుకులను స్వీకరిస్తుంది. తక్కువ ధరల కోసం.. ఈ క్రమంలో మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలో సరుకుల కొనుగోలు లక్ష్యంగా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు చేపట్టింది. కానీ ఇందులో పాల్గొంటున్న వారంతా మార్కెట్ ధర కంటే అత్యధిక ధరలను కోట్ చేస్తూ రావడంతో సర్కారు ఖజానాకు భారీగా గండి పడుతుందన్న భావనతో ఆ శాఖ టెండర్లను రద్దు చేస్తూ వస్తోంది. ► అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరా కోసం ఈ ఏడాది మార్చిలో మొదటిసారి, ఏప్రిల్ మొదటి వారంలో రెండోసారి టెండరు పిలిచారు. కానీ అందులో పాల్గొన్న సంస్థలు నిబంధనలకు సరితూగలేదు. దీంతో రెండు టెండర్ల ద్వారా అర్హులు ఎంపిక కాకపోవడంతో మరో టెండరు పిలవాల్సి వచి్చంది. ఈ క్రమంలో పాల పంపిణీకి ఇబ్బందులు కలగకుండా ఇప్పటివరకు పంపిణీ చేసిన సంస్థకు పాత ధరలోనే పంపిణీ చేసేలా అవకాశమిస్తూ ఆర్నెళ్లకు పొడిగిస్తూ రాష్ట్ర మహిళాభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సెపె్టంబర్ వరకు పంపిణీకి అవకాశం దక్కినట్లయింది. ► కందిపప్పు పంపిణీకి మార్చి నెలాఖరులోనే టెండరు పిలిచింది. గత టెండరు సమయంలో కిలోకు రూ.114 చొప్పున పంపిణీ చేయగా... ఈ సారి టెండర్లు ఓ కనిష్ట ధర(ఎల్–1)ను రూ.145 కోట్ చేసింది. ఇక గరిష్ట ధర కింద ఏకంగా రూ.175 చొప్పున కోట్ చేశారు. గత ధర కంటే భారీగా ధరలు పెంచిన కారణంగా ఆ టెండరును రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రద్దు చేసింది. కొత్తగా మరో టెండరును పిలిచినప్పటికీ ధరలు ఆదే స్థాయిలో ఉండడంతో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ► కోడిగుడ్ల పంపిణీకి సంబంధించిన టెండరులో జిల్లాల వారీగా పంపిణీ దారుల ఎంపికకు టెండరు పిలిచింది. దీనిపై పలు పౌల్ట్రీ సంస్థల యజమానులు న్యాయపోరాటానికి ఉపక్రమించారు. కోర్టు కేసులు నమోదు చేయగా... కొన్నాళ్లుగా ఎంపిక ప్రక్రియ ముందుకు కదల్లేదు. తాజాగా వీటన్నింటినీ పరిష్కరించి కాంట్రాక్టర్లను ఎంపిక చేసేందుకు సీఎం కార్యాలయాధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ పోస్టులకు ఏజ్ భారమైంది! వైద్య విద్య విభాగంలో ‘వయో పరిమితి’సంక్షోభం -
తూర్పు తీరం ఆడపడుచులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పుట్టింటిపై మమకారం మగ పిల్లలతో పోలిస్తే ఆడ పిల్లలకు మరింత ఎక్కువే. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయినా.. పుట్టింటిపై మమకారం వారిలో చెక్కు చెదరదు. నోరులేని మూగజీవాలకు కూడా జన్మస్థలంపై అంతటి మమకారం ఉంటుందంటే ఆశ్చర్యమే. సైబీరియా పక్షుల మాదిరిగా కేవలం సంతానోత్పత్తి కోసమే ఎన్ని వేల కిలోమీటర్ల దూరమైనా ప్రయాణించి పుట్టింటికి వస్తాయి ఆలివ్ రిడ్లే తాబేళ్లు. పుట్టిన కొద్ది రోజులకే సముద్రంలో ఎంతో దూరం వెళ్లిపోయే ఈ తాబేళ్లు పదేళ్ల తరువాత సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ఈదుకుంటూ.. తాము పుట్టిన ప్రాంతానికే చేరుకుంటాయి. ఇలా రాగలగటం వాటి జ్ఞాపక శక్తికి నిదర్శనమంటారు. ఆలివ్ రిడ్లే శాస్త్రీయ నామం‘లెపిడోచెలిస్ ఒలివేసియా’.గ్రీన్ టర్టిల్, లెదర్ బ్యాగ్, గ్రీన్సీ టర్టిల్, హాక్చిల్సీ వంటి జాతుల తాబేళ్లు ఉన్నప్పటికీ ఆలివ్ రిడ్లే రకం తాబేళ్లు తూర్పు తీరానికి ఎక్కువగా వస్తున్నాయి. ఆ మూల నుంచి.. ఈ మూల వరకు ఒడిశాలోని బీతర్కానిక తీరం నుంచి.. తమిళనాడు సరిహద్దులోని తడ వరకు విస్తరించి ఉన్న సముద్ర తీరం వరకు ఆలివ్ రిడ్లే తాబేళ్లు సంతానోత్పత్తి కోసం వస్తుంటాయి. అందులోనూ కాకినాడ తీరానికే వీటి రాక అధికం. ఇసుక, నీరు తేటగా ఉండటంతోపాటు 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలపై ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఆసక్తి చూపుతాయి. వివిధ సముద్రాల్లో ఉండే ఈ తాబేళ్లు సంపర్కం కోసం ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో బంగాళాఖాతంలోకి చేరుతాయి. ఆ తరువాత ఆడ తాబేళ్లు మాత్రమే గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తాయి. జనవరి రెండోవారం నుంచి ఏప్రిల్ మొదటివారం వరకు ఇవి గుడ్లు పెట్టే సీజన్. ఈ తాబేళ్లు జీవితమంతా సముద్రంలోనే గడుపుతాయి.గుడ్లు పెట్టడానికి మాత్రం భూమి మీదకు వస్తాయి. నదులు సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. తీరంలోని ఇసుకలో బొరియలు తవ్వి ఒక్కో తాబేలు 100 నుంచి 150 వరకు గుడ్లు పెడుతున్నాయి. గుడ్లు పెట్టేశాక తల్లి సముద్రంలోకి వెళ్లిపోతుంది. ఆ గుడ్లలోంచి 45–55 రోజుల్లో పిల్లలు బయటకొస్తాయి. వీటిని ఏపీ ఆటవీ శాఖ సంరక్షిస్తోంది. కళ్లు తెరిచిన పిల్లలను సూర్యుడు ఉదయించే వేళ అధికారులు సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. వెలుతురు అంటే ఇష్టపడే తాబేలు పిల్లలు సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ కిరణాలవైపు పరుగులు తీస్తూ సముద్రంలో కలిసిపోతాయి. ఈ ప్రక్రియ నెల రోజులుగా కాకినాడ తీరంలో అటవీ రేంజర్ ఎస్.వరప్రసాద్ పర్యవేక్షణలో జరుగుతోంది. ఇప్పటికే 8వేల పిల్లలను సముద్రంలోకి విడిచి పెట్టారు. సమతుల్యతలో కీలకం కళ్లు తెరిచిన పిల్లలు సముద్రంలోకి వెళ్లిన పదేళ్లకు కౌమార దశకు వస్తాయి. సంపర్కం తరువాత తనకు జన్మనిచ్చిన తీరాన్ని గుర్తుంచుకుని గుడ్లుపెట్టేందుకు తిరిగి అక్కడికే వస్తాయి. సముద్రం జలాల్లో వాతావరణ సమతుల్యతను పరిరక్షించడంలో వీటి పాత్ర కీలకం. సముద్రంలో మత్స్య సంపదను మింగేస్తున్న జెల్లీ ఫిష్లను ఆలివ్ రిడ్లేలు ఆహారంగా తీసుకుంటాయి. మత్స్య సంపదకు రక్షణగా ఉండటం, సముద్ర జలాలలో కాలుష్యం నివారించి శుభ్రంగా ఉంచడంలో వీటి పాత్ర అమోఘం. – ఎస్.వరప్రసాద్, రేంజర్, కోరంగి అభయారణ్యం మేధస్సులో ఆడ తాబేళ్లు దిట్ట తెలివితేటల్లో ఆడ తాబేళ్లు దిట్ట. ఆడ తాబేళ్లు గుడ్లు పెట్టడానికి ముందు ఇసుక తేటగా.. చదునుగా.. అలికిడి లేని, సముద్ర అలలు తాకని ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటాయి. గుడ్లు పెట్టే ప్రాంతంలో 30 సెంటీమీటర్ల మేర గొయ్యి తవ్వి గుడ్లు పెట్టి.. ఇసుకతో కప్పేస్తాయి. తవ్విన గోతిలో అడుగు భాగం (పునాది) గట్టిగా ఉండాలని శరీర బరువు (సుమారు 50 కేజీలు)తో అరగంట పాటు పైకి, కిందకు పడుతూ లేస్తూ చదును చేసి గుడ్లు పెడతాయి. గుడ్లను శత్రుజీవులు గుర్తించకుండా చుట్టుపక్కల డమ్మీగా నాలుగైదు గోతుల్ని తవ్వి ఇసుకతో కప్పేస్తాయి. నక్కలు, కుక్కలు, కాకులకు గుడ్లు పెట్టిన ప్రాంతం తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ఆలివ్ రిడ్లే తెలివితేటలు అమోఘం. -
Health: పొద్దుతిరుగుడు గింజలు, ఇంకా వీటిని తింటే? వెల్లుల్లిలో ఉండే గ్లటాథియోన్ వల్ల
Health Tips In Telugu: మానసిక ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని రకాల పోషకాలను తప్పకుండా తీసుకోవాలి. దానికి పిల్లలు, పెద్దలు అనేం లేదు. ఈ కింద ఇచ్చిన కొన్ని పదార్థాలలో మానసికంగా చురుగ్గా ఉంచే కొన్ని కారకాలు ఉన్నట్లు పోషకాహార నిపుణులు గుర్తించారు. వాటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి చురుగ్గా ఉండగలం. అవేమిటో చూద్దాం. మానసిక ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషన్.. పేరు ఏదైనా వచ్చిన తర్వాత బాధ పడేకంటే రాకుండా చూసుకోవడం చాలా మేలు. ఈ కింద ఇచ్చిన కొన్ని పదార్థాలు తీసుకోండి. శారీరకంగానే కాదు, మానసికంగానూ ఆరోగ్యంగా ఉండండి. పొద్దుతిరుగుడు గింజలు... వీటిలో విటమిన్ ‘ఇ’ అధిక స్థాయిలో ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సమర్థంగా పనిచేస్తుంది. వెల్లుల్లి... వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి గ్లటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ను ఉత్పత్తిచేస్తాయి. ఇది ఒత్తిడిని ఎదుర్కొనే రక్షణ ఛత్రంలో మొదటి మూలకంగా పనిచేస్తుంది. గుడ్లు... గుడ్లలో పోషకాలు పుష్కలం అనే విషయం తెలిసిందే. వీటిలో విటమిన్లు, మినరల్స్, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్స్ సంతృప్త స్థాయిలో లభిస్తాయి. ప్రత్యేకంగా ఇందులో చోలిన్ అనే పోషకం పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుందని, అలాగే ఒత్తిడి నివారణకు సమర్థం గా పనిచేస్తుందని వైద్యులు గుర్తించారు. నువ్వులు... నువ్వులతో తయారుచేసే పదార్థాలలో ఎల్–ట్రిప్టోపాన్ అనే అమైనో ఆమ్లం పాళ్లు ఎక్కువ. ఇది మనసును ఉల్లాసంగా ఉంచే డోపమైన్, సెరటోనిన్ ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది. అలాగే ఒత్తిడిని తగ్గించేందుకు తోడ్పడుతుంది. 25 మంది యువకులకు నాలుగు రోజుల పాటు నువ్వుల ఉండలను తినిపించి పరిశీలించినప్పుడు వారిలో ఆందోళన, ఒత్తిడి స్థాయులు గణనీయంగా తగ్గినట్లు ఓ సర్వేలో తేలింది. నువ్వులతో రకరకాల స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఏదైనా పదార్థాన్ని రుచిగా ఉండేలా తయారు చేసుకోవడం వల్ల వాటిని తినే విధంగా మెదడు కూడా మనల్ని ప్రోత్సహిస్తుంది. చదవండి: Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే.. -
కింగ్ కోబ్రాలు గూడు కట్టి.. గుడ్లు పెట్టి..
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యంత అరుదైన జాతికి చెందిన కింగ్ కోబ్రాలు గుడ్లు పెట్టేందుకు దిబ్బల మాదిరిగా నేలపై గూళ్లు కడతాయి. ఇందుకోసం ఆడ కింగ్ కోబ్రా గర్భం దాల్చిన వెంటనే ఎండిపోయిన వెదురు ఆకులను సేకరించి గూట్లో గుడ్లు పెట్టేందుకు అనువుగా సర్దుతుంది. అందులో 30 నుంచి 40 గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఆ సమయంలో నెల నుంచి నెలన్నర పాటు ఆహారం మానేసి గూట్లోనే ఉండిపోతుంది. ఆ తరువాత 15 నుంచి 30 రోజుల్లో గుడ్ల నుంచి పిల్లలు వస్తాయనగా తల్లిపాము గూడు విడిచి వెళ్లిపోతుంది. ఆ గూళ్లను అడవి పందులు, ముంగిసలు ఇతర జంతువులు తవ్వి గుడ్లను తినేస్తాయి. ఫలితంగా కింగ్ కోబ్రాల జాతి అంతరించిపోయే స్థితికి చేరుకుంది. ఎలా రక్షిస్తున్నారంటే.. మన రాష్ట్రంలో వెదురు పొదలు ఎక్కువగా ఉండే చోట కింగ్ కోబ్రా గూళ్లు ఎక్కువగా పెడుతున్నట్టు తూర్పు కనుమల వైల్డ్ లైఫ్ సొసైటీ, అటవీ శాఖ గుర్తించాయి. పిల్లలు బయటకు వచ్చేంత వరకు వీటి గుడ్లను సంరక్షించేందుకు వైల్డ్ లైఫ్ సొసైటీ, అటవీ శాఖ ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టాయి. గిరి నాగులు గుడ్లు పెట్టే దశ మార్చిలో ప్రారంభమై జూలై, ఆగస్టులో ముగుస్తుంది. ఆగస్టు నెలలో గుడ్లలోంచి పిల్లలు బయటకు వస్తాయి. ఆ గూళ్లను రక్షించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అనకాపల్లి జిల్లా మాడుగులలో మొదటిసారి ఒక గూడును పరిరక్షించి గుడ్లలోంచి పిల్లలు వచ్చాక వాటిని అడవిలో వదిలేశారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఈ గూళ్లపై సర్వే పూర్తి చేయగా.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఆడ గిరి నాగులు గుడ్లు పెట్టిన గూళ్లను వదిలి వెళ్లిపోయిన తరువాత గూళ్ల చుట్టూ వెదురు బొంగుల్ని పాతి ఇతర జీవులేవీ గుడ్లను తాకలేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆపై గూళ్ల చుట్టూ దోమ తెరలను ఆమరుస్తున్నారు. గుడ్లలోంచి గిరి నాగు పిల్లలు బయటకు వచ్చిన తరువాత వెదురు బొంగులు, దోమ తెరలను తొలగించి.. ఆ పిల్లల్ని స్వేచ్ఛగా అడవిలో వదిలేస్తున్నారు. వీటిని ఎందుకు కాపాడుకోవాలంటే.. కింగ్ కోబ్రా ఆహార గొలుసులో అగ్ర స్థానంలో ఉంటుంది. అంటే గిరి నాగులు ఇతర అన్ని రకాల పాముల్ని ఆహారంగా తీసుకుంటాయి. వీటి వల్ల ఇతర పాముల జనాభా నియంత్రణలో ఉంటుంది. పర్యావరణంలో కింగ్ కోబ్రాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. గిరి నాగులు ఉన్నచోట జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్నట్టు లెక్కిస్తారు. సాధారణంగా ఇవి మనుషులు వస్తే.. తప్పించుకుని పోతాయి. ఈ పాముల కాటు వల్ల మనుషులు చనిపోయిన సందర్భాలు తక్కువ. కింగ్ కోబ్రాల రక్షణ కోసం పని చేస్తున్నాం ఐదారేళ్ల క్రితం వరకు గిరి నాగుల్ని స్థానికులు ఎక్కువగా చంపేసేవారు. ఆ సమయంలో అటవీ శాఖతో కలిసి కింగ్ కోబ్రా కన్జర్వేషన్ ప్రాజెక్టును మొదలుపెట్టాం. వాటి సంరక్షణ, ఇతర పాము జాతులపై అధ్యయనం, పాము కాటు నివారణే లక్ష్యంగా పని చేశాం. మేం చేపట్టిన చర్యలు ఫలించి గిరి నాగుల్ని చంపడం చాలా వరకూ తగ్గిపోయింది. ప్రస్తుతం వాటి గూళ్లు, వాటి సంతతి పరిరక్షణ కోసం చర్యలు చేపడుతున్నాం. – కంఠిమహంతి మూర్తి, అధ్యక్షుడు, తూర్పు కనుమల వైల్డ్ సొసైటీ -
బ్యూటిప్స్
ఏ కాలంలోనైనా జిడ్డు చర్మం బాగా ఇబ్బంది పెడుతుంటుంది. జిడ్డుపోగొట్టి ముఖం ఫ్రెష్గా ఉండడానికి ఎగ్, లెమన్ఫేస్మాస్క్ బాగాపనిచేస్తుంది. ఒక గుడ్డును తీసుకుని దానిలోని తెల్లసొనను ఒక గిన్నెలో వేసి దానికి స్పూను తాజా నిమ్మరసం చేర్చి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. ఫేస్మాస్క్ ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగి తుడుచుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల ముఖం మీద జిడ్డు, మొటిమలు తగ్గుతాయి. టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానికి ప్యాక్లా వేయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డును తొలగించి, ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది ఈ ప్యాక్. -
20 వేల కిలో మీటర్లు ప్రయాణించి.. ఆలివ్ రిడ్లే తాబేళ్ల ఆసక్తికర విషయాలు..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సముద్ర తీరాలకు చేరుకుంటున్నాయి. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న ఈ జాతి తాబేళ్లను రక్షించేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లలో ఏడు రకాల జాతులు ఉన్నాయి. వీటిలో 5 రకాలు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఎక్కువ. రెండు అడుగుల వెడల్పు.. 50 కిలోల వరకూ బరువు పెరిగే ఈ తాబేలు ఎక్కడైతే గుడ్డు నుంచి పిల్లగా బయటకు వస్తుందో.. తిరిగి అక్కడికే వచ్చి గుడ్లు పెట్టడం ఈ జాతి ప్రత్యేకత. ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు సుమారు 20 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి తీరానికి వస్తాయి. దేశంలోని ఒడిశా తీరంలో ఈ జాతి తాబేళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ తరువాతి స్థానం ఆంధ్రప్రదేశ్దే. మన రాష్ట్రంలో కాకినాడ తీరంలోని ఉప్పాడ, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కృష్ణా జిల్లాలోని కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకూ, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, బాపట్ల పరిధిలోని సూర్యలంక ప్రాంతం వరకు ఈ జాతి తాబేళ్లు ఎక్కువగా వస్తుంటాయి. ఆడా.. మగా నిర్ధారించేది ఉష్ణోగ్రతలే ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్లు పెట్టి పిల్లగా మారడానికి 28 డిగ్రీల నుంచి 32 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. 30 నుంచి 32 డిగ్రీల మధ్య పుట్టిన తాబేలు ఆడ తాబేలు అవుతుంది. అంతకంటే తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలో పుట్టే పిల్లలు మగ తాబేళ్లు అవుతాయి. సృష్టిలో ఒక్క తాబేలు జాతికి మాత్రమే ఇలాంటి ప్రత్యేకత ఉంది. ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఏటా అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఫలదీకరణ కోసం వస్తుంటాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో గుడ్లు పెడతాయి. ఇసుకలో 30 నుంచి 45 సెం.మీ. లోతున కుండాకారంలో గొయ్యి తీసి.. 60 నుంచి 120 వరకూ గుడ్లు పెడతాయి. గొయ్యి తీసేదగ్గర నుంచి గుడ్లు పెట్టడానికి 45 నిమిషాల నుంచి ఒక గంట సమయం తీసుకుంటుంది. ఈ గుడ్లు 45 నుంచి 50 రోజుల తరువాత పిల్లలు బయటకొస్తాయి. ఆలివ్ రిడ్లే తాబేళ్ల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. సముద్రంలో ఆక్సిజన్ శాతం పెంచేందుకు.. చేపల సంతానం వృద్ధి చెందేందుకు తాబేలు ఎంతగానో దోహదపడుతుంది. చేప పిల్లలను తిని జీవించే జెల్లీ చేపలను తాబేలు తినడం వల్ల చేపల ఉత్పత్తి పెరుగుతుంది. తాబేలు ఎంత లోతులో ఉన్నా ప్రతి 45 నిమిషాలకు ఒకసారి నీటిపైకి వచ్చి ఆక్సిజన్ తీసుకుని లోపలకు వెళుతుంటుంది. అవి నీటిలో పైకి, కిందకు రావడం వల్ల నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఈ విధంగా పర్యావరణానికి తాబేలు ఎంతో మేలు చేస్తుంది. గుడ్డు పెడుతున్న తాబేలు, నాగాయలంక మండలం ఐలాండ్ వద్ద సముద్రంలోకి తాబేళ్లను వదులుతున్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక హేచరీల ద్వారా రక్షణ అరుదైన ఆలివ్ రిడ్లే జాతి తాబేలుని రక్షించేందుకు అటవీ శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అవనిగడ్డ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో కోడూరు మండలం పాలకాయతిప్ప వద్ద ఒకటి, నాగాయలంక మండలం లైట్హౌస్ శివారు ఐలాండ్ దగ్గర మూడు, సంగమేశ్వరం వద్ద ఒకటి, నిజాంపట్నం, సూర్యలంక వద్ద రెండు హేచరీలను ఏర్పాటు చేశారు. 2009 నుంచి ఇప్పటి వరకూ 5 లక్షల తాబేళ్లను సముద్రంలోకి వదిలారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ కృష్ణా జిల్లా పరిధిలో 12,624 గుడ్లను సేకరించినట్టు అధికారులు చెప్పారు. తాబేళ్ల సంఖ్య పెరుగుతోంది ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టే కాలంలో వాటి ప్రాణాలకు ముప్పు వాటిల్లే వలలు వేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై మత్స్యశాఖ అధికారులతో కలసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గతంలో కంటే గుడ్లు పెట్టేందుకు వచ్చే తాబేళ్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. – కేవీఎస్ రాఘవరావు, ఫారెస్ట్ అధికారి, అవనిగడ్డ రేంజ్ -
బ్రాండెడ్ గుడ్డు గురూ.. ‘ఎగ్గోజ్’తో మరో సంచలనం!
సాక్షి, అమరావతి : బ్రాండింగ్ మానియా ఇప్పుడు కోడిగుడ్లకూ వచ్చి చేరింది. వివిధ రంగుల్లో, వివిధ పరిమాణాల్లో ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి వివిధ బ్రాండ్ల పేర్లతో విక్రయిస్తున్నారు. ఆహార పదార్థాల కొనుగోళ్లలో వినియోగదారులు నాణ్యతకు అధిక ప్రాధాన్యతనిస్తుండటంతో వారి అంచనాలకనుగుణంగా గుడ్లను ప్రవేశపెడుతున్నారు. ఎలాంటి రసాయనాలు, యాంటి బయోటిక్స్ వినియోగించని సహజ సిద్ధమైన కోడి గుడ్లు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న గుడ్లు, అధిక ప్రొటీన్లున్న గుడ్లు.. ఇలా రకరకాల పేర్లతో విక్రయిస్తున్నారు. సాధారణ గుడ్డు ధరతో పోలిస్తే ఈ బ్రాండెడ్ గుడ్ల ధరలు అధికంగానే ఉంటున్నాయి. ప్రస్తుతం సాధారణ గుడ్డు ధర బహిరంగ మార్కెట్లో రూ.6 ఉంటే, బ్రాండెడ్ గుడ్డు దాని లక్షణాలను బట్టి ధర రూ.10 నుంచి రూ.25 దాకా ఉంటోంది. ఉదాహరణకు హ్యాపీ హెన్స్ బ్రాండ్తో విక్రయిస్తున్న సంస్థ ఫ్రీ రేంజ్ ఎగ్స్ను ఒక్కోటి రూ.25కు విక్రయిస్తోంది. ఈ గుడ్డు బరువు 100 గ్రాములుండటమే గాక, అధిక ప్రొటీన్లు, విటమిన్లతో ఉంటుందని చెబుతోంది. ‘ఎగ్గోజ్’తో సంచలనం ఖరగ్పూర్ ఐఐటీకి చెందిన అభిషేక్ నగీ 2017లో తొలిసారిగా ఎగ్గోజ్ పేరుతో బ్రాండెడ్ ఎగ్స్ను మార్కెట్లోకి విడుదల చేసి సంచలనం సృష్టించాడు. ఐఐటీ పూర్తి చేశాక ఒక రిటైల్ సంస్థలో ఉద్యోగంలో చేరినప్పటికీ కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచనతో ఈ రంగంలోకి అడుగుపెట్టాడు. కోడిగుడ్లు అధికంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్పత్తి అవుతుండటం, వినియోగం మాత్రం ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉండటాన్ని నగీ గమనించాడు. పైగా దక్షిణాది నుంచి ఉత్తరాదికి గుడ్డు రావడానికి ఎనిమిది రోజులకు పైగా సమయం పడుతోంది. ఈలోపు తనలో ఉన్న సహజసిద్ధమైన ప్రొటీన్లు కొన్నింటిని ఆ గుడ్డు కోల్పోతున్న విషయాన్ని గుర్తించారు. గుడ్డు పెట్టిన 24 గంటల్లోగా వినియోగదారుడికి చేర్చేలా ఎగ్గోజ్ బ్రాండ్ను ప్రవేశపెట్టి విజయం సాధించాడు. ఆ తర్వాత అనేక మంది బ్రాండెడ్ ఎగ్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. ప్రస్తుతం సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ మార్కెట్లలో ఎగ్గోజ్తో పాటు కెగ్స్, గుడ్ మార్నింగ్, హలో, ఎగ్గీ, హెన్ ఫ్రూట్, ఫ్రెషో, ఫామ్ మేడ్, బీబీ కాంబో, హ్యాపీ హెన్ తదితర బ్రాండెడ్ గుడ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ కోళ్ల పెంపకం దగ్గర నుంచి గుడ్డు ఎంపిక వరకూ అంతా ప్రత్యేకం. కొన్ని కోళ్లను సహజసిద్ధమైన వాతావరణం అంటే తోటల్లో పెంచితే, మరికొన్నింటిని ఫామ్స్లో పెంచుతారు. వాటికి దాణా, మందులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొన్ని కోళ్లకు శాఖాహార దాణాను అందిస్తూ పెంచితే, మరికొన్నింటిని హెర్బల్స్, జీడిపప్పు, బాదంపప్పు వంటి ప్రత్యేక దాణాతో పెంచుతున్నారు. సాధారణంగా కోడిగుడ్డు బరువు 45 నుంచి 52 గ్రాముల మధ్యలో ఉంటుంది. గుడ్డు పరిమాణం పెరిగే కొద్దీ ధర పెరుగుతుంది. 53–60 గ్రాముల మధ్యలో ఉండే గుడ్లను ప్రీమియం గుడ్లుగా, 60 గ్రాముల దాటితే సూపర్ ప్రీమియంగానూ పరిగణించి ధర నిర్ణయిస్తుంటారు. బ్రాండెడ్ గుడ్డును ఎంపిక చేసేప్పుడు గుడ్డుపై పెంకు నాణ్యత కూడా కీలకం. మచ్చలు లేకుండా పరిశుభ్రంగా ఉండి, మరీ మందంగా కాకుండా పల్చగా ఉండే గుడ్లను ఎంపిక చేస్తున్నారు. వాటిని అందంగా ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా గుడ్ల ప్యాకేజింగ్ పరిశ్రమ విలువ రూ.25,412.32 కోట్లుగా ఉంటే, అది ఏటా 6 శాతంపైన వృద్ధి చెందడం ద్వారా 2028 నాటికి రూ.37,960.24 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. బ్రాండెడ్ ఎగ్ మార్కెట్లోకి ప్రవేశించాం.. బ్రాండెడ్ ఎగ్స్ మార్కెట్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. హలో బ్రాండ్ పేరుతో మేమూ ఈ రంగంలోకి అడుగు పెడుతున్నాం. ఇందుకోసం దాణా దగ్గర నుంచి గుడ్ల ఎంపిక వరకు అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. హై ఎండ్ ధరల సెగ్మెంట్లోకి కాకుండా సాధారణ గుడ్డు కంటే రెండు మూడు రూపాయలు అధికంగా ఉండే మార్కెట్పై తొలుత దృష్టిసారిస్తున్నాం. – సురేష్ చిట్టూరి, ఎండీ, శ్రీనివాస హేచరీస్ -
కోడిగుడ్డు.. కొత్త రికార్డు
మండపేట: గుడ్డు ధర అంతకంతకూ పెరుగుతోంది. పౌల్ట్రీ రంగంలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. గుడ్డు రైతు దగ్గర ధర రూ.5.54కు చేరింది. నాలుగేళ్లలో ఇదే అత్యధిక ధర. మరోపక్క రిటైల్ మార్కెట్లో గుడ్డు రూ. 7కు చేరడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పౌల్ట్రీల్లో గుడ్లు పెట్టే కోళ్లు 1.4 కోట్ల వరకు ఉండగా రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 60 శాతం పశ్చిమబెంగాల్, ఒడిశా, బిహార్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా మిగిలినవి స్థానికంగా వినియోగిస్తున్నారు. శీతాకాలంలో ఉత్తరాది రాష్ట్రాల్లో చేపల లభ్యత తక్కువగా ఉండటంతో గుడ్ల వినియోగం పెరుగుతోంది. ఫలితంగా ఎగుమతులు పుంజుకొని రైతులకు అత్యధిక ధర లభిస్తుంది. 2017వ సంవత్సరం సీజన్లో రైతు దగ్గర ధర అత్యధికంగా రూ.5.45 లభించింది. అయితే, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పౌల్ట్రీలు విస్తరించడం, ఎగుమతుల్లో ఇతర రాష్ట్రాల పోటీతో నాలుగేళ్లుగా పౌల్ట్రీ రంగం గడ్డు కాలం ఎదుర్కొంటోంది. సీజన్లో రైతు ధర రూ.5 దాటడం గగనమైంది. ఈ సీజన్లో శీతలం ఎక్కువగా ఉండటంతో జిల్లాలోని గుడ్లకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ పెరిగి, ధర పెరిగింది. ఈ ధర అశాజనకమే అయినప్పటికీ, మేత ధర ఇబ్బడిముబ్బడిగా పెరడంతో ప్రయోజనం అంతంత మాత్రమేనని కోళ్ల రైతులు అంటున్నారు. కోళ్లకు వేసే వ్యాక్సిన్లు, మందుల ధరలు, కార్మికుల జీతాలు పెరిగిపోవడం పౌల్ట్రీల నిర్వహణ వ్యయాన్ని పెంచేసిందంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాది సగటు ధర రైతు దగ్గర రూ.5 ఉంటేనే కానీ గిట్టుబాటు కాదని, గత ఏడాది సగటు ధర రూ. 4.39 మాత్రమే ఉండటంతో నష్టాలు వచ్చాయని చెబుతున్నారు. కోడి మేతకు వినియోగించే మొక్కజొన్న, సోయా, నూకలు తదితర వాటిని పౌల్ట్రీలకు రాయితీపై సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ధరలు తగ్గితేనే ఊరట గతంతో పోలిస్తే ఈ సీజన్లో గుడ్డు అత్యధిక రైతు ధరను నమోదు చేసుకుంది. ప్రస్తుత ధర ఆశాజనకంగా ఉన్నా కోడి మేత ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. మేత రేట్లు అందుబాటులోకి వస్తేనే పరిశ్రమకు ఊరట. కోడి మేతను సబ్సిడీపై పౌల్ట్రీలకు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ -
Hyderabad: గొంతులో కోడి గుడ్డు ఇరుక్కొని వ్యక్తి మృతి
సాక్షి, హైదరాబాద్: మరణం మనిషిని ఎటు నుంచి ఆవహిస్తుందే చెప్పడం కష్టంగా మారింది. ఈ మధ్య కాలంలో అకారణ మరణాలు పెరిగిపోతున్నాయి. అప్పటి వరకు సంతోషంగా ఉన్నవారు ఉన్నట్టుండి ప్రాణాలు విడుస్తున్నారు. చిత్ర విచిత్ర కారణాలు మనిషిని చావు వరకు తీసుకెళ్తున్నాయి. గొంతులో ఆమ్లెట్, మాంసం ముక్క, కొబ్బరి ముక్క ఇరుక్కొని ప్రాణాలు విడిచిన ఘటనలు ఇటీవల చూశాం. తాజాగా ఓ వ్యక్తి నోట్లో కోడిగుడ్డు ఇరుక్కొని మృత్యువాతపడ్డాడు. ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయంలో అనుమానాస్పద స్థితిలో ఓ రోగి మృతి చెందిన ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పొట్టు తీయని గుడ్డు గొంతులో ఇరుక్కుని ఊపిరాడకపోవడం వల్లనే రోగి మృతి చెందినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే రోగిది సహజ మరణమేనని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి సమీపంలోని ఓ హోం నుంచి అంజి అనే వ్యక్తి సెప్టెంబర్ 5న ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేరారు. ఆస్పత్రిలోని డీసీ వార్డులో చికిత్స పొందుతున్న అంజి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఊపిరాడని స్థితిలో ఉన్నట్లు ట్యూటీలో ఉన్న స్టాఫ్ నర్సు లక్ష్మీ వైద్యాధికారి రఘువీర్రాజుకు సమాచారం ఇచ్చారు. దీంతో బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతి చెందాడు. పొట్టు తీయని గుడ్డును నోట్లో పెట్టుకోగా గొంతులో ఇరుక్కుని ఊపిరాడక చనిపోయినట్లు వార్తలు వెలువడగా, మానసిక చికిత్సాలయం ఆర్ఎంఓ మనోహర్ సోమవారం ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. చదవండి: ఏటీఎంలో రూ.14 లక్షలు చోరీ.. సీసీ కెమెరాలకు రంగేసి -
Hair Care: జుట్టు ఆరోగ్యంగా, సిల్కీగా ఉండాలంటే.. ఇంట్లోనే ఇలా..
శిరోజాలు సిల్కీగా, ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. రెడీమేడ్గా దొరికే షాంపూల్లో రసాయనాల గాఢత ఎక్కువగా ఉండి వెంట్రుకలు దెబ్బతింటున్నాయని బాధపడుతుండే వారు ఇంట్లోనే షాంపూని తయారు చేసుకోవచ్చు. కావలసినవి: ►కోడిగుడ్డు ►టేబుల్స్పూన్ నిమ్మరసం ►టేబుల్ స్పూన్ క్యాస్టిల్ సోప్ లిక్విడ్ ►టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ►అరకప్పు నీళ్లు లేదా హెర్బల్ టీ ►కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ తయారి: ►వీటన్నింటినీ కలిపి తలకు రాసుకుని స్నానం చేయాలి. ►ఈ షాంపూని ఫ్రిజ్లో పెట్టుకుని రెండు వారాల వరకు వాడుకోవచ్చు. ►తాజాగా తయారు చేసుకుంటే మరింత మంచిది. చదవండి: Overcome OCD: పదే పదే అవే చెడు ఆలోచనలు.. తల్లి, చెల్లి పట్ల కూడా! ఆఖరికి గుడికి వెళ్లినా.. ఏం చేయాలి? Cucumber Juice: రోజూ తలస్నానం చేస్తున్నారా? కీర దోస జ్యూస్ను ఇలా వాడితే సెబమ్ ఉత్పత్తి పెరిగి.. -
ధర వెరీ గుడ్డు.. పౌల్ట్రీ రైతుకు ఊరట
సాక్షి, అమరావతి: కోడిగుడ్డు ధర ఊహించని రీతిలో పెరుగుతోంది. ఫారమ్ గేటు వద్ద రికార్డు స్థాయిలో ఒక్కో గుడ్డు ధర రూ.5.25 పలుకుతుండగా.. రిటైల్గా రూ.6.50 వరకు విక్రయిస్తున్నారు. ఇదే ధర మరికొంత కాలం కొనసాగితే.. నష్టాల నుంచి గట్టెక్కుతామని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలో 1,200 కోళ్ల ఫారాలు ఉండగా.. వాటిలో ప్రస్తుతం 5.60 కోట్లకు పైగా కోళ్లున్నాయి. రోజుకు 6 కోట్ల గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ మేత, ఇతర ధరలు పెరగడంతో కోళ్ల ఉత్పత్తి సంఖ్య తగ్గిపోగా.. రోజుకు 4.75 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్ర పరిధిలో నిత్యం 2.50 కోట్ల నుంచి 3 కోట్ల గుడ్లు వినియోగమవుతున్నాయి. కాగా, దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు గల్ఫ్ దేశాలకు కోడిగుడ్లు ఎగుమతి అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఫారమ్ గేటు వద్ద ధర రూ.6 దాటే అవకాశం కన్పిస్తోందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రిటైల్ మార్కెట్లో గుడ్డు ధర రూ.7 మార్క్ను చేరుకునే అవకాశాలు లేకపోలేదంటున్నాయి. ఎగుమతులకు ఊపు సాధారణంగా మన రాష్ట్రం నుంచి పశ్చిమ బెంగాల్, ఒడిశా, బిహార్, అస్సాం, మణిపూర్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. కొంతమేర గల్ఫ్తో పాటు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. విదేశాల విషయానికి వస్తే ప్రతినెలా 2 కోట్ల గుడ్లు గల్ఫ్ దేశాలకు, 50 లక్షల నుంచి 75 లక్షల వరకు ఇతర దేశాలకు మన దేశం నుంచి ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం టర్కీ, నెదర్లాండ్స్లో కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో మన దేశం నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయి. గత నెలలో ఏకంగా 20 కోట్ల గుడ్లు ఎగుమతి అయ్యాయి. 50 లక్షలకు మించి ఎగుమతి కాని కతార్కు ప్రస్తుతం 2 కోట్లకు పైగా ఎగుమతి అవుతున్నాయి. ఇతర దేశాలకు కూడా కోటిన్నరకు పైగా గుడ్లు ఎగుమతి అవుతున్నాయి. అదే సమయంలో పశ్చిమ బెంగాల్తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సైతం రాష్ట్రం నుంచి ఎగుమతులు పెరిగాయి. ఫలితంగా గుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి. రైతులకు ఊరట మొక్కజొన్న టన్ను గత ఏడాది రూ.20 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.24 వేలకు చేరింది. సోయాబీన్ టన్ను గతేడాది రూ.38 వేల వరకు పలకగా.. ప్రస్తుతం రూ.48 వేల నుంచి రూ.51వేల మధ్య వరకు ఉంది. ఆయిల్ తీసిన తవుడు (డీవోపీ) గతేడాది కిలో రూ.9 నుంచి రూ.10 ఉండగా.. ప్రస్తుతం రూ.17–18 మధ్య ఉంది. ఇలా ఊహించని రీతిలో పెరిగిన మేత ధరల వల్ల పిల్ల దశ నుంచి గుడ్డు పెట్టే దశ వరకు ఒక్కో కోడికి రూ.300 నుంచి రూ.315 వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా ఫారమ్ గేట్ వద్ద ఒక్కో కోడిగుడ్డు ఉత్పత్తికి రూ.4.65 నుంచి రూ.4.75 వరకు ఖర్చవుతోంది. ఫిబ్రవరి నుంచి ఇదే రీతిలో ఖర్చవుతున్నా నెల రోజుల క్రితం వరకు ఫారమ్ గేట్ వద్ద గుడ్డు ధర రూ.3.90కి మించి పలకలేదు. ఫలితంగా పౌల్ట్రీ రైతులు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. కాగా, ప్రస్తుతం ఊహించని రీతిలో విదేశాలకు పెరిగిన ఎగుమతులు దేశీయంగా పౌల్ట్రీ రైతుకు కాస్త ఊరటనిచ్చాయి. ఎగుమతులు పెరగటం వల్లే.. చాలా రోజుల తర్వాత పౌల్ట్రీ రైతుకు గిట్టుబాటు ధర లభిస్తోంది. ఇది పౌల్ట్రీ పరిశ్రమకు శుభపరిణామం. ఊహించని రీతిలో గల్ఫ్ దేశాలకు ఎగుమతులు పెరగడం వల్లే ఫారమ్ గేటు వద్ద రైతుకు గిట్టుబాటు ధర లభిస్తోంది. గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసే టర్కీ, నెదర్లాండ్స్ దేశాల్లో ఉత్పత్తి తగ్గడం మన గుడ్డుకు కలిసొచ్చింది. – తుమ్మల కుటుంబరావు, చైర్మన్, ఎన్ఈసీఎస్, విజయవాడ జోన్ తొలిసారి గిట్టుబాటు ధర కృష్ణా జిల్లాలో 70 కోళ్ల ఫారాలు ఉన్నాయి. సుమారు కోటి కోళ్లను పెంచుతుండగా.. 75 లక్షల నుంచి 80 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. పెరిగిన ముడిసరుకు ధరల వల్ల ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒక్కో కోడిపై నెలకు రూ.30 చొప్పున నష్టపోయాం. ఆ తర్వాత నెలకు రూ.10నుంచి రూ.15 మేర నష్టాలను చవిచూశాం. ప్రస్తుతం ఫారమ్ గేట్ వద్ద గుడ్డు తయారీకి రూ.4.75 వరకు ఖర్చవుతుండగా.. తొలిసారి రూ.5.25 ధర లభిస్తోంది. చాలా ఆనందంగా ఉంది. ఇదే రీతిలో కనీసం ఏడాది పాటు కొనసాగితే నష్టాల నుంచి గట్టెక్కగలం. – ఆర్.సత్యనారాయణరెడ్డి, అధ్యక్షుడు, కృష్ణాజిల్లా లేయర్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (చదవండి: సీఎం జగన్ దూరదృష్టికి నిదర్శనమే ఆర్బీకేలు: బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ ప్రశంస) -
Recipe: ఆపిల్, మొక్కజొన్న పిండి, కోడిగుడ్లతో.. ఆపిల్ ఎగ్ రింగ్స్ తయారీ!
ఆపిల్, మొక్కజొన్న పిండి, కోడి గుడ్లతో ఇలా ఆపిల్ ఎగ్ రింగ్స్ తయారు చేసుకోండి. ఇంట్లో వాళ్లకు సండే ఇలా స్పెషల్ వంటకం చేసి పెట్టండి! కావలసినవి: ►ఆపిల్ ►గుడ్లు – 2 చొప్పున ►పాలు – పావు కప్పు ►మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు ►పంచదార, బటర్ – 1 టేబుల్ స్పూన్ చొప్పున ►నూనె, దాల్చిన చెక్క 1 టీ స్పూన్ చొప్పున ►పుదీనా – కొద్దిగా ►పంచదార పొడి – కొద్దిగా తయారీ: ►ముందుగా రెండు వేరువేరు బౌల్స్ తీసుకుని.. గుడ్లలోని తెల్లసొన ఒకదానిలో.. పసుపు సొన ఒకదానిలో వేసుకోవాలి. ►తెల్లసొనలో పంచదార వేసుకుని.. హ్యాండ్ బ్లెండర్తో నురుగు వచ్చేలా బాగా కలపాలి. ►పసుపు సొనలో మొక్కజొన్న పిండి, పాలు, దాల్చిన చెక్క వేసుకుని బాగా కలిపిపెట్టుకోవాలి. ►ఈలోపు ఆపిల్స్ పైతొక్క తొలగించి.. గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకుని.. మధ్యలో గింజలు ఉండే భాగాన్ని తీసేసుకోవాలి. ►అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని.. పెనం పెట్టుకుని.. దానిపై బటర్ వేసుకోవాలి. ►బటర్ కరిగిన తర్వాత నూనె కూడా వేసుకుని.. ఒక్కో ఆపిల్ ముక్కని రెండు బౌల్స్లో బాగా ముంచి.. ఇరువైపులా దోరగా వేయించుకోవాలి. ►వేడివేడిగా ఉన్నప్పుడే పంచదార పొడి, పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. -
ఆహార సంక్షోభం దిశగా బ్రిటన్
గుడ్లు, మాంసానికి కటకట ఏర్పడింది. పాల ఉత్పత్తుల సరఫరా భారీగా పడిపోయింది. కూరగాయలు, పండ్ల సంగతి వేరేగా చెప్పనక్కర్లేదు. దుంపలు పండడమే లేదు. డిమాండ్కు సరిపడా పంటల ఉత్పత్తిలేక బ్రిటన్లో ఆహార సంక్షోభం ముంచుకొస్తోంది. ధరాభారంతో రైతులు, సామాన్యులు కుదేలైపోతున్నారు. కొన్ని సూపర్ మార్కెట్లలో గుడ్లకి రేషన్ పెట్టేశారు. ఇదే పరిమితి ఇతర ఆహార పదార్థాలపై విధించే పరిస్థితులొస్తాయన్న ఆందోళన ఎక్కువ అవుతోంది. బ్రిటన్ ఆహార సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. బ్రెగ్జిట్ నుంచి దేశానికి మొదలైన ఆర్థిక కష్టాల పరంపర కొనసాగుతోంది. కోవిడ్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు వంటివి పంట దిగుబడులు, నిత్యావసర వస్తువుల ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా దేశాన్ని ఊపేసిన ఏవియాన్ ఫ్లూతో గుడ్లకు తీవ్ర కొరత ఏర్పడింది. కొన్ని సూపర్ మార్కెట్లలో గుడ్లు అమ్మకంపై పరిమితులు విధించారు. బంగాళదుంపలు దొరకడం లేదు. టమాట దిగుబడులు కనీవినీ ఎరుగని రీతిలో పడిపోయాయి. బ్రాసిల్, యాపిల్స్, దోసకాయలు, ఇతర కూరగాయల దిగుబడి భారీగా తగ్గిపోయాయి. గత 45 ఏళ్లలో ఈ స్థాయిలో పంట దిగుబడులు తగ్గిపోవడం ఈ ఏడాదే జరిగింది. 27% పెరిగిపోయిన పంట ఉత్పత్తి వ్యయం ఏడాది వ్యవధిలో పంటల ఉత్పత్తికయ్యే ఖర్చు 27 శాతం పెరిగింది. చమురు, ఎరువులు, పశుపోషణ, కోళ్ల పెంపకం వంటి ఖర్చులు తడిసిమోపెడు కావడంతో రైతన్నలు పంటల్ని పండించే పరిస్థితులు లేవని చేతులెత్తేస్తున్నారు. డీజిల్ ధరలు 2019తో పోలిస్తే 75 శాతం పెరిగిపోవడం రైతన్నలపై పెనుభారం మోపింది. ప్రభుత్వం జోక్యం కల్పించుకొని రైతులను ఆదుకోకపోతే బ్రిటన్లో కనీవినీ ఎరుగని ఆహార సంక్షోభం ఏర్పడుతుందని జాతీయ రైతు యూనియన్ (ఎన్ఎఫ్యూ) హెచ్చరించింది. 2019తో పోల్చి చూస్తే రిజిస్టర్డ్ వ్యవసాయ కంపెనీల సంఖ్య 7 వేలు తగ్గిపోయిందని వెల్లడించింది. పనివాళ్ల కొరత సైతం రైతులపై ఒత్తిడి పెంచుతున్నాయి. మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తుల పరిశ్రమలు కుదేలైపోయాయి. ఎన్నో సూపర్ మార్కెట్లలో ర్యాక్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బ్రిటన్లో పాలు, వెన్న సరఫరా చేసే అతి పెద్ద సంస్థ ఆర్లా ఫుడ్స్ డిమాండ్కు సరిపడా సరఫరా ఇక చేయడం కష్టమని తేల్చి చెప్పింది. పశుపోషణకయ్యే వ్యయం భారీగా పెరగడంతో రైతులు పాలు సరఫరా చేయడం లేదని తెలిపింది. వాతావరణ మార్పుల ప్రభావం పంటలపై పడుతోంది. బంగాళదుంపలు, ఇతర దుంప కూరలు సరిగా పండడం లేదని జేమ్స్ హట్టన్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ లెస్లీ వెల్లడించారు. బంగాళదుంపల ధరలు రెట్టింపయ్యే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన అంచనా వేశారు. వాతావరణ మార్పులు, ఇంధనం ధరల ప్రభావంతో ఈ ఏడాది ఆహార ఉత్పత్తులు 11% శాతం మేరకు తగ్గిపోయాయని ఇంధన, పర్యావరణ నిఘా విభాగం నివేదిక వెల్లడించింది. బ్రిటిష్ రిటైల్ కన్సోర్టియమ్లో ఫుడ్ అండ్ సస్టయినబులిటీ డైరెక్టర్ ఆండ్రూ ఒపె రిటైల్ మార్కెట్లు నిత్యావసరల కొరతతో కళ తప్పినప్పటికీ సంక్షోభం వచ్చే పరిస్థితులు వచ్చే అవకాశం లేదని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రభుత్వం రైతులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితుల్ని అంచనా వేస్తోందని, ఆహార భద్రతకు రిషి సునాక్ సర్కార్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. నవంబర్లో ద్రవ్యోల్బణం అత్యధికంగా 14.6 శాతానికి చేరుకున్నప్పటికీ అక్టోబర్తో పోలిస్తే 0.1 శాతం తగ్గిందని, గత రెండేళ్లలో ధరలు తగ్గడం ఇదే తొలిసారని ఆయన వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ కళ తప్పిన క్రిస్మస్ క్రిస్మస్ పండుగ దగ్గరకొస్తుంటే సామాన్యుల్లో ఈ సారి ఆ హుషారు కనిపించడం లేదు. సాధారణంగా క్రిస్మస్కు నెల రోజుల ముందు నుంచే మార్కెట్లు జనంతో కళకళలాడుతుంటాయి. కానీ ఈ సారి మార్కెట్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. విద్యుత్ బిల్లుల భారం భరించలేక ఎందరో చిరు వ్యాపారులు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ధరలు ఆకాశాన్నంటడం, కావల్సిన వస్తువులకి కొరత ఏర్పడడంతో ప్రజలు ఉన్నంతలో బతుకుని నెట్టుకొస్తున్నారు. ఒక కుటుంబంపై నెలవారి నిత్యావసరాల ధరల భారం 34 పౌండ్లు. అంటే 3,400 రూపాయల వరకు పడుతోంది. దీంతో సామాన్య ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. -
Beauty Tips: నల్లబడిన చర్మం తిరిగి మామూలుగా కావాలంటే ఇలా చేయండి!
Beauty Tips In Telugu: మేని నిగారింపుకు, చర్మ లావణ్యాన్ని ఇనుమడింపచేసుకోవడానికి దోహదం చేసే కొన్ని సహజసిద్థమైన క్లెన్సర్లు, ప్యాక్లను ఇంట్లో మనం రోజూ వాడే వాటితోనే చేసుకోవచ్చు. ►గుడ్డులోని తెల్లసొనలో తేనె కలిపి ముఖానికి మర్దన చేయాలి. ఈ చిట్కా పాటించడం వల్ల ఎండకు నల్లబడిన ముఖచర్మం తిరిగి మామూలవుతుంది. ►బార్లీ పొడిలో తేనె, పెరుగు, బాదం కలిపి ముఖానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ►టొమాటో రసానికి తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసి పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ►శనగపిండిలో క్యారట్ రసం కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడగాలి. ►రెండు టీ స్పూన్ల టొమాటో రసానికి నాలుగు టీ స్పూన్ల పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేయాలి. ►రెండు టీ స్పూన్ల క్యాబేజ్ రసంలో చిటికెడు ఈస్ట్ లేదా పుల్లటి పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల మేని మెరిసిపోతుంది. మెడ నల్లగా ఉందా? ముఖం, మెడ మీద చర్మం నల్లగా, జిడ్డుగా అనిపిస్తే ఇంట్లోనే ఇలా క్లెన్సర్ తయారు చేసుకోవచ్చు. సాధారణంగా టొమాటో, పాలలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ అలర్జీల నుంచి కాపాడతాయి. మృతకణాలను తొలగించడంలోనూ ఉపకరిస్తాయి. కాబట్టి ఈ రెండింటితో తయారు చేసిన మిశ్రమం సహజసిద్ధమైన క్లెన్సర్లా పనిచేస్తుంది. టొమాటోను గుజ్జు చేయాలి. దీనిని పలుచని వస్త్రంలో వేసి గిన్నెలోకి ఒత్తాలి. ఇలా వచ్చిన టొమాటో జ్యూస్కి సమపాళ్లలో పాలు కలపాలి. దీనిని బాటిల్లో పోసి ఫ్రిజ్లో పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసి.. పదిహేను నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు రోజుకు రెండుసార్లు ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుంది. మురికి, మృతకణాలు తొలగిపోయి చర్మం మెరుస్తుంది. నోట్: పొడి, సున్నితమైన చర్మం గలవారు దీన్ని ఉపయోగించకపోవడమే మంచిది. చదవండి: Muscle Cramps: గుగ్గిల వృక్షం.. ఈ జిగురుతో కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు! శరీరంతోపాటు కాలేయం బరువు కూడా.. సిర్రోసిస్ లక్షణాలు.. నివారణ ఇలా.. -
దేశ స్థాయిలో ఎగ్ బోర్డ్ ఏర్పాటు చేయాలి : తెలంగాణ స్టేట్ పౌల్ట్రీ ఫెడరేషన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పౌల్ట్రీ రంగం నష్టాల ఊబి నుంచి గట్టెక్కాలంటే దేశ స్థాయిలో ఎగ్ బోర్డ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ స్టేట్ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ రావు డిమాండ్ చేశారు. అప్పుడే రైతుకు మద్దతు ధర లభిస్తుందని, పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని చెప్పారు. ‘ఉత్పత్తి వ్యయాలకు తగ్గట్టుగా మాత్రమే గుడ్డు ధర నిర్ణయించాలి. మార్కెట్లో ధర విషయంలో పూర్తిగా బోర్డుదే తుది నిర్ణయం కావాలి. తద్వారా రైతులకు, వినియోగదార్లకు ప్రయోజనం ఉంటుంది. బోర్డుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి. ప్రభుత్వమే గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. లేదా ప్రైవేటు గిడ్డంగులను లీజుకు తీసుకోవాలి. డిమాండ్కు తగ్గట్టుగా సరఫరాను కట్టడి చేయాలి. బోర్డు కార్యరూపంలోకి వస్తే కొత్తగా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. పౌల్ట్రీకి పూర్తిగా వ్యవసాయ రంగ హోదా ఇచ్చి ప్రయోజనాలు కల్పించాలి’ అని వివరించారు. రైతులు ఒక్కో గుడ్డు ఉత్పత్తిపై సగటున 50–60 పైసలు, బ్రాయిలర్పై రూ.10–20 నష్టపోతున్నారని తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కాసర్ల మోహన్ రెడ్డి తెలిపారు. నేటి నుంచి పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో.. పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో 22–25 తేదీల్లో ఇక్కడి హైటెక్స్లో జరుగనుంది. తొలిరోజు నాలెడ్జ్ డే టెక్నికల్ సెమినార్ నిర్వహిస్తారు. 370 కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశాయని ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చక్రధర్ రావు పొట్లూరి తెలిపారు. -
బ్రేక్ఫాస్ట్లో ఇవి తీసుకుంటున్నారా.. పండ్ల రసంతో ట్యాబెట్లు తీసుకుంటే!
మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఉదయం బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే అది శరీరానికి ఒక రోజుకు అవసరమయ్యే శక్తిని అందివ్వడమే కాకుండా ఆ రోజులో మిగతా సమయం అంతా అతిగా తినటాన్ని కూడా నియంత్రించి శరీరంలో సమతుల్యతను కాపాడుతుందన్న ఆరోగ్య నిపుణుల సలహా అందరికీ తెలిసిందే. చెప్తున్నారు. అయితే ఏది పడితే అది అనారోగ్యకరమైన తిండి తినడం కంటే కూడా బ్రేక్ఫాస్ట్ చేయకపోవడమే చాలా ఉత్తమం అంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఒకవేళ కొన్నిసార్లు మీరు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్లిన సందర్భాల్లో మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి సమస్యా ఎదురు కాదు. ఉండదు. గుడ్లు ఒక అధ్యయనం ప్రకారం ఉదయం బ్రేక్ఫాస్ట్లో గుడ్లు తీసుకుంటే ఆ వెంటనే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ఆ రోజులోని మిగతా సమయంలో తీసుకునే ఆహారం కూడా ఎక్కువ, తక్కువ కాకుండా కావాల్సిన మేరకే తీసుకుంటాం. తద్వారా శరీరంలో కేలరీలు తగ్గుతాయి. అంతేకాకుండా రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయులు నియంత్రణలో ఉంటాయని వెల్లడైంది. గుడ్ల సొనలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటికి బలాన్నిస్తాయి. ఇవి శరీరానికి కావాల్సిన ముఖ్యమైన ప్రోటీన్లు, పోషకాలు అందజేస్తాయి. ఓట్ మీల్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకునే సమయం లేనప్పుడు ఓట్ మీల్కు ఓటెయ్యడం ఉత్తమం. దీనిని చాలా సులువుగా తయారు చేసుకోగలగడమే గాక చాలా ఉత్తమమైనది కూడా. ఎందుకంటే, ఓట్ మీల్స్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును అదుపు చేయడంలో తోడ్పడతాయి. రక్తపోటు, ఊబకాయం, హృద్రోగ సమస్యలు ఉన్నవారికి ఓట్ మీల్ మంచి బ్రేక్ఫాస్ట్. ఓట్ మీల్ను పాలతో కలుపుకొని తినడం లేదా ఉప్మాలా తిరగమోత వేసుకుని తినడం వల్ల ఈ సుగుణాలు అందుతాయి. చదవండి: Recipe: పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి పండ్లు మీ రోజు ఫలవంతంగా సాగాలంటే ఉదయాన్నే పొట్టను పండ్లతో నింపేస్తే సరి. పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిలో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కావాల్సినంత ఫైబర్, శరీరానికి అవసరమయ్యే హైడ్రేషన్ కూడా పండ్ల ద్వారా లభిస్తుంది. ఒక కప్పు ఆపిల్ ముక్కలు, లేదా సిట్రస్ జాతికి చెందిన నారింజ, సంత్ర పండ్లు లేదా బెర్రీస్ ఏవైనా సరే మంచి బ్రేక్ఫాస్ట్ జాబితాలో ఉంటాయి. చదవండి: Health Tips: బెండకాయ తరచూ తింటున్నారా? పెద్ద పేగు క్యాన్సర్.. ఇంకా నట్స్, సీడ్స్ నట్స్ తినటానికి రుచిగా ఉండటమే కాదు, వాటి నుంచి శరీరానికి లభ్యమయ్యే పోషకాలు కూడా అధికంగానే ఉంటాయి. నట్స్ లో కేలరీలు చాలా ఉన్నా కొవ్వు ఏ మాత్రం రాదు. బరువు తగ్గటానికి నట్స్ చాలా ఉపయోగకరం, వీటిలో మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్ శరీరానికి అందుతాయి. రోజు ఉదయం గుప్పెడు నట్స్ తీసుకోవటం ఆరోగ్యకరం. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్ శరీరంలో షుగర్ లెవెల్స్ను నియంత్రణలో ఉంచుతూ, ఇన్సులిన్ ను అందిస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక రోగాలనుంచి రక్షణ లభిస్తుంది. ఒక విషయం సాధారణంగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా టాబ్లెట్స్ వేసుకోవడం సహజమే. ఐతే మంచినీళ్లతో మాత్రలు వేసుకుంటే ఫర్వాలేదు కానీ కొందరు టాబ్లెట్లను రకరకాల పద్ధతుల్లో వేసుకుంటుంటారు. అందులో భాగంగా పండ్ల రసంతో మాత్రలు తీసుకుంటే బాగా పని చేస్తాయనే ఉద్దేశ్యంతో నారింజ లేదా నిమ్మరసంతో కలిపి మాత్రలను మింగే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల మేలు జరగకపోగా, ప్రమాదం ఎదురుకావొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. నారింజ లేదా ఇతర సిట్రస్ పండ్లను తీసుకున్నప్పుడు, సిట్రస్ పండ్లలో ఉండే రసాయనాలు పేగులో చర్య జరిపి ఔషధం ప్రభావాన్ని తగ్గిస్తాయి. వీటి రసంతో ఔషధాన్ని తీసుకోవడం వల్ల ప్రేగు కణాలు వాటి రూపాన్ని మార్చుకుంటాయి. ఫలితంగా ఔషధంలో ఉన్న రసాయనం పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. కనుక అలా చేయరాదని వైద్యులు చెబుతున్నారు. -
పాఠశాలకు విద్యార్థులకు వెరీ ‘గుడ్డు’.. ఇక ప్రతివారం రంగు తప్పనిసరి!
రాయవరం (అంబేడ్కర్ కోనసీమ): జగనన్న గోరుముద్ద పథకం పేరుతో పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. పథకాన్ని ఎప్పటికప్పుడు పర్య_వేక్షిస్తూ అవసరమైన మార్పుల్ని చేస్తోంది. ఇపప్పటివరకు కాంట్రాక్టర్లు 10 రోజులకు ఒకసారి చొప్పున నెలకు మూడుసార్లు పాఠశాలలకు కోడి_గుడ్లు సరఫరా చేసేవారు. దీనివల్ల గుడ్ల నాణ్యత దెబ్బతింటుందన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం కోడిగుడ్ల సరఫరాలో తక్షణ మార్పులకు ఆదేశించింది. కోడిగుడ్ల నాణ్యత చెడిపోకుండా, తాజా గుడ్లు అందించేందుకు వారానికి ఒకసారి కోడిగుడ్లు సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: చనిపోయాడనుకుని దహన సంస్కారాలు.. చిన్న కర్మ జరుపుతుండగా సతీష్ ప్రత్యక్షం.. అంతా షాక్!) కోడిగుడ్లపై స్టాంపింగ్ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా మధ్యాహ్న భోజనంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి ఐదు ఉడికించిన కోడి_గుడ్లను అందజేస్తున్నారు. కోడిగుడ్లు అక్రమార్కుల పాలవ్వకుండా కోడిగుడ్లపై ప్రతి వారం ఒక్కో రంగు వేసి సరఫరా చేస్తున్నారు. నెలలో మొదటి వారం నీలం, 2వ వారం గులాబీ, 3వ వారం ఆకుపచ్చ, 4వ వారం వంగపువ్వు రంగులో కోడిగుడ్లపై స్టాంపింగ్ చేస్తారు. ఈ విధంగా వచ్చే కోడిగుడ్లను మాత్రమే ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లో దిగుమతి చేసుకోవాల్సి ఉంది. గుడ్డు పరిమాణం తగ్గినా పాఠశాలల్లో తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలకు కలర్ స్టాంపింగ్తో సరఫరా అవుతున్న కోడిగుడ్లు పకడ్బందీ పరిశీలన మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం పర్యవేక్షణను పెంచింది. పాఠశాల స్థాయిలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీలు, గ్రామ, వార్డు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు నిత్యం పర్యవేక్షణ చేస్తారు. కోడి గుడ్ల సరఫరాకు అనుమతి పొందిన కాంట్రాక్ట్ ఏజెన్సీ నుంచి వచ్చిన గుడ్ల సైజు, కలర్ స్టాంపింగ్ ఉన్న గుడ్లు, స్టాంపింగ్ లేని గుడ్లు తదితర వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐఎంఎంస్ యాప్లో నమోదు చేయాలన్న నిబంధన విధించారు. (చదవండి: వినూత్నం: ఆ గుప్పెళ్లు.. దయగల గుండెల చప్పుళ్లు) నాణ్యతకు పెద్ద పీట ‘విద్యార్థులకు అందించే పౌష్టికాహారం నాణ్యతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా కాంట్రాక్టర్లు నాణ్యత ఉన్న కోడిగుడ్లనే సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టింది. పాఠశాల హెచ్ఎంలు కోడిగుడ్ల ఏజెన్సీ నుంచి దిగుమతి చేసుకునే ముందు కచ్చితంగా గుడ్డు సైజు, కలర్ స్టాంపింగ్ చెక్ చేసుకోవాలి. పాడైన గుడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ దిగుమతి చేసుకోకూడదు. – ఎన్వీ రవిసాగర్, డీఈవో, అమలాపురం -
ఇకపై మరింత వెరీ ‘గుడ్డు’
సాక్షి, అమరావతి: ‘జగనన్న గోరుముద్ద’లో కీలక పౌష్టికాహారమైన కోడిగుడ్లను మరింత నాణ్యంగా, తాజాగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోడిగుడ్లు సరఫరాలో, వాటి నిల్వలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించడంపై దృష్టి సారించింది. పాఠశాల విద్యా శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమై దీనిపై చర్చించారు. కోడిగుడ్ల నాణ్యతపై ప్రభుత్వం థర్డ్ పార్టీ ద్వారా చేయించిన పరిశీలనల నివేదికపై కూడా సమావేశంలో చర్చించారు. కోళ్ల ఫారాల నుంచి నేరుగా స్కూళ్లకు తాజా, నాణ్యమైన గుడ్లను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం కావడంతో ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇకనుంచి నెలకు నాలుగుసార్లు సరఫరా చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. -
Recipe: అటుకులు, జొన్నపిండి.. నోరూరించే పోహా రోటీ- ఆమ్లెట్ రోల్స్ తయారీ ఇలా
రోటీ, ఆమ్లెట్ తిని బోర్ కొట్టిందా! ఇలా వెరైటీగా అటుకులు, జొన్నపిండితో రొట్టె చేసుకుని.. ఆమ్లెట్ రోల్స్ చేసుకుని తింటే టేస్ట్ అదిరిపోద్ది. పోహా రోటీ – ఆమ్లెట్ రోల్స్ కావలసినవి: ►గుడ్లు – 3 (ఒక బౌల్లో గుడ్లు పగలగొట్టుకుని, అందులో ఉప్పు,కారం, పసుపు, పాలతోపాటు ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కూరగాయల తరుగు వంటివి అభిరుచిని బట్టి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి) ►అటుకులు – 2 కప్పులు ►జొన్నపిండి – పావు కప్పు ►నెయ్యి – టేబుల్ స్పూన్ ►గోరు వెచ్చని నీళ్లు – సరిపడా ►ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ: ►ముందుగా అటుకులు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ►జొన్నపిండి, ఉప్పు, నెయ్యి వేసుకుని, గోరువెచ్చని నీళ్లను కొద్దికొద్దిగా కలుపుకుంటూ.. ముద్దలా చేసుకోవాలి. ►15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని, తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ►ఆ ఉండలను చపాతీల్లా ఒత్తుకోవాలి. ►పాన్పై సరిపడా నూనె వేసుకుని ఇరువైపులా దోరగా వేయించుకోవాలి. ►ఒకవైపు ఆమ్లెట్ వేసుకుని.. సర్వ్చేసుకునే ముందు.. నచ్చిన మసాలా కర్రీతో రోల్స్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేయండి: Korrala Idli- Millet Halwa: ‘సిరి’ ధాన్యాలు.. నోటికి రుచించేలా.. కొర్రల ఇడ్లీ, మిల్లెట్ హల్వా తయారీ ఇలా.. బాస్మతి బియ్యంతో ఘీ రైస్.. కార్న్ఫ్లోర్తో పనీర్ జిలేబీ! తయారీ ఇలా -
Recipe: ఈ పదార్థాలు ఉంటే చాలు.. చికెన్ పొటాటో నగ్గెట్స్ తయారు చేసుకోవచ్చు!
బోన్లెస్ చికెన్.. బంగాళదుంపలు.. మొక్కజొన్న పిండి.. గుడ్లు... నోరూరించే చికెన్ పొటాటో నగ్గెట్స్ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. చికెన్ పొటాటో నగ్గెట్స్ తయారీకి కావలసినవి: ►బోన్లెస్ చికెన్ – అర కప్పు (మెత్తగా ఉడికించి.. చల్లారాక చేత్తో చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి) ►బంగాళదుంపలు – 2 (మెత్తగా ఉడికించి.. తురుములా చేసుకోవాలి) ►జీలకర్ర పొడి, మిరియాల పొడి – 1 టీ స్పూన్ చొప్పున ►గరం మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్ చొప్పున ►ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్ ►కొత్తిమీర తురుము – కొద్దిగా ►మొక్కజొన్న పిండి – 3 టేబుల్ స్పూన్లు ►గుడ్లు – 2 (ఒక బౌల్ తీసుకుని అందులో గుడ్లు, అర టేబుల్ స్పూన్ పాలు పోసుకుని.. బాగా కలిపి పెట్టుకోవాలి) ►బ్రెడ్ పౌడర్ – గార్నిష్ కోసం ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ►ముందుగా ఒక బౌల్లో బంగాళదుంప తురుము, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము, ►మొక్కజొన్న పిండి, చికెన్ ముక్కలు వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ►అనంతరం చిన్న చిన్న ఉండలుగా చేసుకుని.. చిత్రంలో ఉన్న విధంగా చతురస్రాకారంగా నలువైపులా ఒత్తుకోవాలి. ►వీటిని గుడ్డు–పాల మిశ్రమంలో ముంచి.. బ్రెడ్ పౌడర్ పట్టించి నూనెలో దోరగా వేయించుకోవాలి. ►వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. ఇవి కూడా ట్రై చేయండి: Moringa Chutney Recipe: ఇడ్లీ, దోశలోకి.. మొరింగా చట్నీ, వాల్నట్ చట్నీ! తయారీ ఇలా! Banana Coffee Cake Recipe: బనానా– కాఫీ కేక్ ఇలా తయారు చేసుకోండి! -
Kitchen Tips: గుడ్లు, చాక్లెట్లు, ఉల్లి.. ఇంకా వీటిని కూడా ఫ్రిజ్లో పెడుతున్నారా? అయితే
Why Should We Not To Store These Foods In Refrigerator: కూరగాయలు, పండ్లు... ఇలా ఏవైనా బయటి నుంచి కొనుక్కుని రాగానే శుభ్రం చేసి ఎక్కువ కాలం తాజాగా ఉండాలని ఫ్రిజ్లో పెట్టేస్తాం. అది కొంతవరకూ నిజమే. అయితే కొన్ని కూరగాయలు, పండ్లను ఫ్రిజ్లో పెట్టడం వల్ల అవి వాటి సహజ గుణాలను కోల్పోతాయి. ఒక్కోసారి అవే మన అనారోగ్యానికి కారణమవుతాయి. అలాగని ఫ్రిజ్లో పెట్టవలసిన వాటిని పెట్టడం మానకూడదు. అయితే ప్రస్తుతానికి మనం ఫ్రిజ్లో ఏమేమి పెట్టకూడదో తెలుసుకుందాం. ఈ కింది వాటిని ఎప్పుడూ ఫ్రిజ్లో పెట్టకండి. వీటికి గది ఉష్ణోగ్రతే సరిపోతుంది. ఇంతకీ అవేమిటి? వాటిని ఫ్రిజ్లో పెడితే ఏమౌతుందో తెలుసుకుందాం. టమాటా: టమాటాలు ఫ్రిజ్లో పెడితే గట్టిపడిపోతాయి. వాసన కూడా పోతుంది. దీంతో మనం ఏదైనా వంటకం చేస్తే రుచీపచీ ఉండదు. కాబట్టి ఈసారి మీరు ఇంటికి టమాటాలు తీసుకువస్తే శుభ్రం చేసిన తర్వాత ఫ్రిజ్లో పెట్టకుండా బయట గది ఉష్ణోగ్రత వద్దే ఉంచడం మరచిపోకండి. అరటికాయలు: అరటికాయలను ఫ్రిజ్లో పెడితే తొందరగా నల్లబడిపోతాయి. ఇలా నల్లబడిన అరటికాయలను చూస్తూ చూస్తూ పారేయలేము. అలాగని తినలేము కూడా. ఒకవేళ తిన్నా కూడా రుచి ఉండదు. అందువల్ల ఫ్రిజ్లో పెట్టకుండా ఎక్కువ రోజులు అరటికాయలు తాజాగా ఉండాలంటే వాటిని తడి లేని ప్రదేశంలో ఉంచి ప్లాస్టిక్ కవర్ సగం వరకు తొడగండి. అరటి కాయలే కాదు, అరటి పండ్లు కూడా ఫ్రిజ్లో పెట్టకూడదు. ఆవకాడో: ఫ్రూట్స్లో కాసింత ఖరీదయినది అవకాడో. మరి అంత ఖరీదు పెట్టి అవకాడో కొన్నాం కదా అని దానిని తీసుకెళ్లి పదిలంగా ఫ్రిజ్లో పెట్టేయద్దు. దానివల్ల అవకాడో రుచి మారుతుంది. వాటిని తడి లేని చోట, గాలి మారే చోట భద్రపరిస్తే మంచిది. పుచ్చకాయ: ఇంటికి పుచ్చకాయ తెస్తే సగం కోసి మిగిలింది ఫ్రిజ్లో పెట్టేస్తాం. అందరి ఇళ్లల్లో జరిగేదే ఇది. కానీ, పుచ్చకాయని ఫ్రిజ్లో పెట్టడం వల్ల వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ని కోల్పోతాం. ఫలితంగా పుచ్చకాయ తిన్నా కడుపు నిండుతుందేమో గానీ ఆరోగ్య ప్రయోజనాలు అందవు. వంకాయ: వంకాయలను ఫ్రిజ్లో పెడితే తొందరగా పాడైపోతాయి. ఇవి ఫ్రిజ్లో కంటే బయట ఉంటేనే తాజాగా ఉంటాయి. ఉల్లి, వెల్లుల్లి: వెల్లుల్లిపాయలు ఫ్రిజ్లో కంటే గాలి, వెలుతురు ఉండే చోట పెడితే నెలరోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. వీటిని ఫ్రిజ్లో పెడితే జిగురు వస్తుంది. ఉల్లి కూడా అంతే! చాక్లెట్లు: చాలామంది పేరెంట్స్ చాక్లెట్లను ఫ్రిజ్లో పెట్టి పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇస్తుంటారు. అయితే అలా ఫ్రిజ్లో పెట్టిన చాక్లెట్లు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పైగా ఫ్రిజ్ లో పెట్టడం వల్ల చాక్లెట్లకు ఉండే సహజమైన రుచి, ఫ్లేవర్ దెబ్బతింటాయి. అయితే బయటపెట్టినా వీటిని ఎండలో కాకుండా కాంతి కిరణాలకు దూరంగా ఉంచడం మంచిది. గుడ్లు: చాలామంది ఇళ్లలో ఫ్రిజ్ తెరవగానే ఎగ్ ట్రేస్ దర్శనమిస్తాయి. అయితే ఎగ్స్ని ఎప్పుడూ ఫ్రిజ్లో పెట్టకూడదు. మార్కెట్లలో కూడా గుడ్లను ఫ్రిజ్లో ఉంచరు. వీలయినంత వరకు వీటిని బయట ఉంచితేనే బెటర్. బ్రెడ్: బ్రెడ్ని ఫ్రిజ్లో ఉంచితే తొందరగా పాడవుతుంది. అది త్వరగా ఎండిపోతుంది. బ్రెడ్ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా బయట ఉంచితే అది ఫ్రెష్గా ఉంటుంది. బత్తాయి పండ్లు: సిట్రస్ యాసిడ్ ఉన్న బత్తాయిలు ఫ్రిజ్లో ఉంచితే త్వరగా పాడైపోతాయి. అదే విధంగా... తేనె, కాఫీ గింజలు, కెచప్, పీనట్ బటర్, దోసకాయలు, స్ట్రాబెర్రీస్లను ఫ్రిజ్లో పెట్టద్దు. మరేం చేయాలి.. అని చికాకు పడకండి. మరీ సంచులు సంచులు కాకుండా వారానికి సరిపడా కూరగాయలు, పండ్లు తెచ్చుకోండి చాలు. ఆ తర్వాత మళ్లీ తాజాగా తెచ్చుకుంటే సరి. అప్పుడు అనారోగ్యాలు మీ దరి చేరవు. చదవండి: Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల.. -
ఫుడ్కోర్టులో ‘గుడ్డు’ వివాదం
శివమొగ్గ(బెంగళూరు): శివమొగ్గ నగర పార్కు లేఔట్ ప్రధాన రోడ్డులో వెజ్ ఫుడ్ కోర్టు (శాఖాహార)లో గుడ్లకు సంబంధించిన ఆహార విక్రయంపై గొడవ జరిగింది. వ్యాపారస్తులు బాహాబాహీకి కూడా దిగాల్సి వచ్చింది. శనివారం వెజ్ఫుడ్ కోర్టులో గుడ్డుతో తయారు చేసిన ఆహారాన్ని విక్రయించారు. దీనికి కొందరు మరికొందరు ఆక్షేపణ వ్యక్తం చేశారు. వెజ్ఫుడ్ కోర్టులో గుడ్డుతో తయారు చేసిన ఆహారాన్ని విక్రయించేందుకు అవకాశం లేదని గొడవకు దిగారు. ఇదే విషయంపై శివమొగ్గ మహానగర పాలికెకు కొందరు ఫిర్యాదు చేశారు. చదవండి: మొబైల్ చార్జర్ మాదిరిగా ఉండే స్పై కెమెరాను అమర్చి.. -
తెలుగు రాష్ట్రాల నుంచి 50 శాతం పడిపోయిన గుడ్ల ఎగుమతులు
-
Recipe: ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్.. మసాలా ఫ్రెంచ్ టోస్ట్ ఇలా తయారు చేసుకోండి!
రోజూ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తప్పనిసరి. స్కూలు, కాలేజీ విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే వాళ్లకైతే ఎంత త్వరగా లేచినా సమయం సరిపోకపోగా రోజూ ఇడ్లీ, దోశ, ఉప్మాలు విసుగు పుట్టించేస్తుంటాయి. ఇటువంటి వారు వెరైటీగా ఈ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయొచ్చు.. మసాలా ఫ్రెంచ్ టోస్ట్ కావలసినవి: ►బ్రౌన్ బ్రెడ్ స్లైసులు – మూడు ►గుడ్లు – నాలుగు ►బటర్ – వేయించడానికి సరిపడా ►పాలు – రెండు టేబుల్ స్పూన్లు ►బరకగా దంచిన ఎండు మిర్చి పొడి – టేబుల్ స్పూను ►ఉప్పు – రుచికి సరిపడా ►కొత్తిమీర తరుగు – మూడు టేబుల్ స్పూన్లు ►మిరియాల పొడి – పావు టేబుల్ స్పూను ►ఉల్లిపాయ –ఒకటి(సన్నగా తరగాలి) ►పచ్చిమిర్చి –మూడు (సన్నగా తరగాలి) తయారీ: ►గుడ్ల సొనను గిన్నెలో వేసి చక్కగా బీట్ చేసుకోవాలి. ►దీనిలోనే పాలు, బరక మిరప పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ►స్టవ్ మీద పాన్పెట్టి బటర్ వేయాలి. బటర్ వేడెక్కిన తరువాత బ్రెడ్ స్లైస్ను గుడ్ల సొనలో ముంచి పాన్పై పెట్టాలి. ►బ్రెడ్స్లైస్ ఒకవైపు కాలుతుండగానే.. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగును పైన వేయాలి. ►ఈ ముక్కలపైనే కొద్దిగా గుడ్లసొన మిశ్రమం వేయాలి. ►బ్రెడ్ స్లైస్ను రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు కాల్చి సర్వ్చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Chicken Strips Recipe: మైదా, బ్రెడ్ ముక్కల పొడి.. చికెన్ స్ట్రిప్స్ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి! Egg Poha Recipe: అటుకులు, కోడిగుడ్లు.. ఎగ్ పోహా తయారీ ఇలా! -
Recipe: అటుకులు, కోడిగుడ్లు.. ఎగ్ పోహా తయారీ ఇలా!
అటుకులు, కోడిగుడ్డుతో ఇలా రుచికరమైన వంటకం ఎగ్ పోహా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోండి. ఎగ్ పోహా తయారీకి కావాల్సినవి: ►గుడ్లు – 2 ►అటుకులు – 1 కప్పు (ముందుగా నీళ్లలో కడిగి, తొట్టెలో వేసుకుని వడకట్టుకోవాలి) ►నూనె – సరిపడా, కరివేపాకు రెమ్మలు – 3 ►ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు – 1 టేబుల్ స్పూన్ చొప్పున ►పసుపు, మిరియాల పొడి – కొద్దికొద్దిగా ►ఉప్పు – తగినంత ►కొత్తిమీర తరుగు – గార్నిష్ కోసం ఎగ్ పోహా తయారీ విధానం ►ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. కళాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ►అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేగిన తర్వాత టొమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ►అవన్నీ బాగా వేగిన తర్వాత.. కళాయి మధ్యలో ఖాళీ చేసి.. గుడ్లు పగలగొట్టి వేసుకుని.. పసుపు సొనను బాగా కలపాలి ►ఆమ్లెట్లా 2 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించి.. తర్వాత గరిటెతో అటూ ఇటూ కదిలిస్తూ.. ఇప్పుడు క్యాప్సికం మిశ్రమంతో కలిపి వేయించాలి. ►అనంతరం కారం, పసుపు, మిరియాల పొడి వేసుకుని తిప్పాలి. ►తర్వాత అటుకుల్ని వేసుకుని మరోసారి తిప్పి.. కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ►ఆ కళాయిపై మూతపెట్టి 5 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించాలి. ►అనంతరం వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా ట్రై చేయండి: Kakori Kebab Recipe: మటన్ కీమా.. పచ్చిబొప్పాయి తరుగు.. కకోరి కబాబ్ తయారీ ఇలా! Chicken Strips Recipe: మైదా, బ్రెడ్ ముక్కల పొడి.. చికెన్ స్ట్రిప్స్! -
సాక్షి కార్టూన్ 20-07-2022
-
పిల్లలు ఇష్టంగా తినే ఎగ్ బైట్స్.. దీనితో సులభంగా తయారు చేసుకోవచ్చు! ధర?
చిన్నాపెద్దా ఇష్టపడే రుచుల్లో ఎగ్ బైట్స్ ప్రత్యేకం. కాఫీ, టీలతో పాటు సాయంకాలపు స్నాక్స్లో అవీ భాగమే. పిల్లల స్నాక్స్ బాక్సుల్లోనూ వాటినే సర్దుతుంటారు చాలామంది తల్లులు. ఈ ఎగ్ బైట్స్ను తయారు చేయడంలో ఈ డివైజ్ చక్కగా ఉపయోగపడుతుంది. డివైజ్ అడుగు భాగంలో ట్రే కింద వాటర్ నింపుకుని, ట్రే బౌల్స్లో సిద్ధం చేసుకున్న రెసిపీనీ ఉంచేసి.. మూతపెట్టి, స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుంది. పదే పది నిమిషాల్లో టేస్టీ టేస్టీ ఎగ్ బైట్స్ సిద్ధమైపోతాయి. ఎగ్ తిననివారు ఇతర రెసిపీలతో కూడా ఈ కప్స్ను కుక్ చేసుకోవచ్చు. భలే ఉంది కదూ. -ధర : 27 డాలర్లు (రూ.2,133) చదవండి: Health Tips: రోజూ క్యారెట్ తినే అలవాటుందా? దీనిలోని బీటా కెరోటిన్ వల్ల.. Black Pepper: మిరియాల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే -
Recipe: క్యారెట్, బీట్ రూట్ తురుము.. ఎగ్ బుర్జీ బాల్స్ తయారీ ఇలా!
ఎగ్ బుర్జీ బాల్స్ ఇలా సులువైన పద్ధతిలో ఇంట్లో తయారు చేసుకోండి! ఎగ్ బుర్జీ బాల్స్ తయారీకి కావలసినవి: ►బ్రెడ్ పౌడర్ – పావు కప్పు + 3 టేబుల్ స్పూన్లు ►గుడ్లు – 6, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్ ►ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు (చిన్నగా తరిగినవి) ►కారం, మిరియాల పొడి, ఉప్పు, గరం మసాలా, పసుపు – కొద్దికొద్దిగా ►మైదా పిండి – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు (కొద్దిగా నీళ్లు పోసుకుని పేస్ట్లా చేసుకోవాలి) ► క్యారెట్ తురుము, బీట్ రూట్ తురుము – 3 టేబుల్ స్పూన్ల చొప్పున ( అభిరుచిని బట్టి) ►నూనె – సరిపడా తయారీ: ►ముందుగా గుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, మిరియాల పొడి, ఉప్పు, గరం మసాలా, పసుపు వేసుకుని బాగా కలపాలి. ►కళాయిలో నూనె వేసి ఆమ్లెట్లా వేసి.. నిమిషం పాటు కదపకుండా ఉంచాలి. ►అనంతరం గరిటెతో కలియతిప్పి.. బుర్జీలా చేసుకోవాలి. ►స్టవ్ ఆఫ్ చేసి, చల్లారిన తర్వాత అందులో పావు కప్పు బ్రెడ్ పౌడర్, క్యారెట్ తురుము, బీట్ రూట్ తురుము వేసుకుని బాగా కలపాలి. ►కొద్దిగా ఉప్పు జోడించి.. బాల్స్లా చేసుకోవాలి. ►వాటిని మైదా పిండి పేస్ట్లో ముంచి.. మిగిలిన బ్రెడ్ పౌడర్లో దొర్లించి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Panasa Ginjala Vadalu: పనస గింజలతో వడలు.. ఇలా తయారు చేసుకోండి! Senagapindi Masala Roti Recipe: హర్యానా స్టైల్.. శనగపిండి మసాలా రోటీ తయారీ ఇలా! -
భారత్లో బయటపడ్డ అరుదైన డైనోసార్ల గుడ్లు!
భోపాల్: డైనోసార్లు(రాక్షస బల్లులు).. వీటి రూపం ఎలా ఉంటుందో సినిమాల ద్వారా అందరికీ పరిచయమే. భౌతికంగా ఈ జాతులు మిలియన్ల సంవత్సరాల కిందటే అంతరించినా.. ఈ భూమ్మీద వీటి అవశేషాలు శిలాజాల రూపంలో బయల్పడుతూనే ఉన్నాయి. తాజాగా భారత్లో అరుదైన రాక్షస బల్లుల గుడ్లను వెలికితీశారు పరిశోధకులు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలోని డైనోసార్ ఫోసిల్ నేషనల్ పార్క్ లో తవ్వకాలు చేపట్టారు. ఈ సందర్భంగా పది డైనోసార్ గుడ్ల అవశేషాలను వెలికితీశారు. ఇప్పటివరకు లభ్యమైన గుడ్లతో పోల్చితే ఇవి ఎంతో భిన్నంగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అవన్నీ అసాధారణరీతిలో ఉన్నట్టు గమనించారు. సారోపోడ్ వర్గానికి చెందిన టిటానోసారస్ డైనోసార్లకు చెందినవిగా నిర్ధారించారు. ఓవమ్ ఇన్ ఓవో.. ఒక గుడ్డులోనే మరొక గుడ్డు ఏర్పడి ఉండడంతో రీసెర్చర్లు ఆశ్చర్యపోయారు. శాస్త్ర పరిభాషలో ఈ స్థితిని ‘ఓవమ్ ఇన్ ఓవో’ అంటారు. సాధారణంగా.. గుడ్డులోనే గుడ్డు ఉండడం అనే స్థితి పక్షుల్లో అధికంగా కనిపిస్తుందని. సో.. టిటానోసారస్ డైనోసార్లకు పక్షులకు మధ్య దగ్గరి సంబంధం ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.ధార్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో ఇప్పటికే 52 టిటానోసారస్ సారోపోడ్స్ డైనోసార్ గూడులను(పక్షుల మాదిరి) వెలికితీశారు. లక్షల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించి, ప్రతికూల వాతావరణం కారణంతోనే డైనోసార్లు అంతరించి పోయాయన్నది అందరికీ తెలిసిందే. -
గుడ్డులో గుడ్డు
నగరి: కోడి గుడ్డు పగులగొడితే అందులో మరో గుడ్డు కనిపించింది. నగరి మునిసిపాలిటీ పరిధిలోని బస్టాండు ప్రాంగణంలో రోడు పక్కన టిఫిన్ సెంటర్లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. హోటల్ యజమాని మధర్బాయి ఆమ్లెట్ వేయడానికి గుడ్డు పగలగొట్టగా అందులో మరో చిన్న గుడ్డు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. గుడ్డులో గుడ్డు వచ్చిందని తెలియటంతో దానిని చూసేందుకు జనం గుమిగూడారు. టిఫిన్ సెంటర్లో ఉన్న కస్టమర్లతో పాటు బస్టాండు ప్రాంగణంలో ఉన్న వారు కూడా ఈ వింతను చూసేందుకు ఎగబడ్డారు. -
Health Tips: ట్యూనా, సాల్మన్, గుడ్లు, పాలు.. విటమిన్- డి పుష్కలం!
మన శరీరానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన విటమిన్లలో.. విటమిన్- డి కూడా ఒకటి. ఈ ‘సన్షైన్ విటమిన్’ లోపిస్తే ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. పిల్లల్లో రికెట్స్ వంటి సమస్యలు వస్తాయి. మరి ఈ లోపాలను అధిగమించేందుకు ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే సరి! వీటిలో విటమిన్- డి పుష్కలం. ఈ ఆహారాల్లో లభిస్తుందం’డి’ ►పుట్టగొడుగుల్లో ‘విటమిన్–డి’ ఎక్కువగా ఉంటుంది. ►గుడ్లను ఆహారంగా తీసుకుంటే ‘విటమిన్–డి’ లభిస్తుంది. ►పాలు, సోయా పాలు లేదా నారింజ రసంలో సైతం విటమిన్లు, ఖనిజాలు సమద్ధిగా ఉంటాయి. ►ట్యూనా, సాల్మన్ చేపలు వంటి సముద్రపు ఆహారంలో కూడా విటమిన్–డి సమృద్ధిగా ఉంటుంది. ►జున్ను, పాలు, టోఫు, పెరుగు, గుడ్లు వంటి పాల ఉత్పత్తులు ‘విటమిన్–డి’కి మంచి వనరులు. ►చలికాలంలో వీలైనంత ఎక్కువసేపు ఎండలో ఉన్నట్లయితే శరీరానికి కావలసినంత విటమిన్ డి లభిస్తుంది. ►అలాగని ఎండాకాలంలో ఎప్పుడూ ఏసీగదుల్లోనే ఉండిపోకుండా అప్పుడప్పుడు శరీరానికి ఎండ తగలనివ్వడం చాలా మంచిది. ఎందుకంటే ఇది ఎండలోనే ఉందండీ మరి! చదవండి👉🏾Vitamin D Deficiency: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ లోపిస్తే జరిగేది ఇది.. ఇవి తింటే మేలు! -
Recipe: ఘుమఘుమలాడే ఎగ్ చపాతీ తయారీ ఇలా!
రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా ఎగ్ చపాతి సులువుగా ఇంట్లోనే చేసుకోండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఎగ్ చపాతి తయారీకి కావలసినవి: ►గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు (ఓ అరగంట ముందు గోరువెచ్చటి నీళ్లు, ఉప్పు వేసుకుని బాగా కలిపిపెట్టుకోవాలి) ►గుడ్లు – 4 లేదా 5 ►ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్(చిన్నగా కట్ చేసుకోవాలి) ►పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్(చిన్నగా కట్ చేసుకోవాలి) ►ఉప్పు –తగినంత ►పసుపు – చిటికెడు ►కారం – 1 టీ స్పూన్ ►చిక్కటిపాలు – 1 టేబుల్ స్పూన్ ఎగ్ చపాతి తయారీ విధానం: ►ముందుగా గుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, పాలు పోసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ►తర్వాత చపాతీలు చేసి పెట్టుకోవాలి. ►అనంతరం రెండు స్టవ్లు ఆన్ చేసుకుని, రెండింటిపైన రెండు పెనాలు పెట్టుకుని, ఒకవైపు చపాతీ కాలుస్తూ.. మరోవైపు ఆమ్లెట్ వేసుకోవాలి. ►ఇరువైపులా దోరగా కాలిన చపాతిని ఒకవైపు కాలని ఆమ్లెట్పై వేసుకుని రెండు అతుక్కున్నాక అటు, ఇటు తిప్పి.. సర్వ్ చేసుకోవాలి. చదవండి👉🏾Recipes: తోతాపురి మామిడికాయలు, అరకేజీ బెల్లం.. సింపుల్గా ఇలా ఆవకాయ పెట్టేయండి! చదవండి👉🏾Egg Bread Manchuria: గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా తయారీ ఇలా! -
గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా!
నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా ఇలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోండి. ఎగ్ బ్రెడ్ మంచూరియా తయారీకి కావలసినవి: ►గుడ్లు – 6, బ్రెడ్ పౌడర్ – అర కప్పు ►అల్లం తురుము – అర టీ స్పూన్ ►వెల్లుల్లి – 6 రెబ్బలు (తురుములా చేసుకోవాలి) ►పచ్చిమిర్చి –6 (మూడిటితో పేస్ట్లా చేసుకుని, మిగిలినవి చిన్నచిన్న ముక్కలుగా తరుక్కోవాలి) ►కొత్తిమీర – 2 టీ స్పూన్లు, కరివేపాకు – అభిరుచిని బట్టి ►ఉల్లిపాయల ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు ►గరం మసాలా – 4 టీ స్పూన్లు ►ధనియాల పొడి – కొద్దిగా ►కారం – 3 టీ స్పూన్లు, ఉప్పు – సరిపడా ►టమాటా ముక్కలు – 1 టేబుల్ స్పూన్ ►పెరుగు: 2 కప్పులు, రెడ్ చిల్లీ సాస్ – కొద్దిగా ►జీలకర్ర పొడి – 2 లేదా 3 టీ స్పూన్లు ►నూనె – 3 గరిటెలు, ఉల్లికాడల ముక్కలు – గార్నిష్కి సరిపడా ఎగ్ బ్రెడ్ మంచూరియా తయారీ విధానం: ►ముందుగా 4 గుడ్లు ఉడకబెట్టుకుని, పచ్చసొన లేకుండా తెల్లటి గుడ్డు భాగాన్ని మాత్రమే తీసుకుని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ►ఈ ముక్కల్లో సన్నగా తరిగిన పావు టీ స్పూన్ అల్లం తురుము, సగం వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల గరం మసాలాతో పాటు బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ►అందులో మిగిలిన 2 గుడ్లు పగలగొట్టి తెల్లసొనను మాత్రమే ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ►తర్వాత ఈ మిశ్రమాన్ని కుకర్లో స్టీమ్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ►అనంతరం కళాయిలో 3 గరిటెల నూనె వేసుకుని.. వేడికాగానే టమాటా ముక్కలు, మిగిలిన అల్లం తురుము, మిగిలిన వెల్లుల్లి తురుము, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని దోరగా వేయించాలి. ►రెడ్ చిల్లీ సాస్, పెరుగు, జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల గరం మసాలా వేసుకుని కాసేపు గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి. ►అనంతరం ఎగ్ ముక్కల్ని వేసుకుని.. పెరుగు– సాస్ మిశ్రమం ముక్కలకు పట్టే విధంగా గరిటెతో తిప్పుతూ కాసేపటికి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ►వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. చదవండి👉🏾Upma Bonda Recipe In Telugu: ఉప్మా మిగిలిపోయిందా.. ఇలా రుచికరమైన బోండాలు చేసుకోండి! చదవండి👉🏾Green Dosalu Recipe: గోధుమ పిండి, మినప్పప్పుతో రుచికరమైన గ్రీన్ దోసెలు! -
Health Tips: రోజూ కోడిగుడ్డు తిన్నారంటే..
కొంతమంది ఉడకబెట్టిన కోడిగుడ్డు తినేందుకు ఇష్టపడరు. అలాంటి వారు దాని ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు వదలరు. గుడ్డులోని తెల్లసొనను తినడం వల్ల అధిక రక్తపోటును నియంత్రించుకోవచ్చు. గుడ్డు తినడం అన్ని రకాల గుండె సమస్యలను దూరం చేస్తుంది. అందువల్ల మీరు రోజూ తినే ఆహారంలో గుడ్డును చేర్చుకోవడం చాలా మంచిది. మరిన్ని ఆరోగ్య చిట్కాలు మెడ నొప్పితో బాధపడుతున్నారా? నిద్ర లేచిన తర్వాత మీకు మెడ నొప్పిగా అనిపిస్తే.. నొప్పి ప్రభావిత ప్రాంతాల్లో ఐస్ ప్యాక్ లేదా చల్లని నీటిలో క్లాత్ను ముంచి నీళ్లు పిండేసి మెడమీద మెల్లగా అద్దాలి. అలా చేయడం వల్ల మెడ కండరాల వాపు తగ్గుతుంది. దీంతో పాటు హీట్ ప్యాక్ ను ఉపయోగించవచ్చు. మెడ నొప్పిగా ఉన్న వాళ్లు చేతులతో మెడను నెమ్మదిగా మసాజ్ చేయాలి. అలా చేయడం వల్ల కండరాలు సర్దుకొని నొప్పి తగ్గే అవకాశం ఉంది. మసాజ్ చేసే సమయంలో కొబ్బరి లేదా నువ్వుల నూనె ఉపయోగిస్తే మేలు. ఒకోసారి నిద్రలో కూడా మెడ పట్టేస్తుంటుంది. ఇందుకోసం మీరు రాత్రిళ్లు బోర్లా పడుకోకుండా ఉంటే చాలు. చుండ్రు పోవాలంటే.. బాదం నూనెలో నిమ్మరసం కలిపి రాసుకుంటే చుండ్రు పోతుంది. ఒక గిన్నెలో కొద్దిగా బాదం నూనెను తీసుకొని.. అందులో కాస్త నిమ్మ రసాన్ని మిక్స్ చేసి.. ఆ తర్వాత జుట్టుకు పట్టించాలి. ఇది మాడుకు పట్టేట్లుగా కొద్దిసేపు చేతులతో తలపై మృదువుగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత అవసరమైతే.. గంట తర్వాత లేదా మరుసటి రోజు షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. చదవండి: Beauty Tips: ముఖంపై మంగు మచ్చలు ఉంటే.. పాలల్లో ఎర్రకందిపప్పు నూరి నేతిలో కలిపి.. -
పుట్టిన చోటే.. ఆలివ్ రిడ్లే గుడ్లు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/అవనిగడ్డ: తొణక్కుండా తాపీగా నడిచే తాబేలు గుడ్లు పెట్టేందుకు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుందంటే ఎంత ఆశ్చర్యం? అదే ఆలివ్ రిడ్లే తాబేళ్ల ప్రత్యేకత. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వీటి లింగ నిర్థారణ జరిగేది ఉష్టోగ్రత ఆధారంగానే. మత్స్య సంపదను పెంచడంతోపాటు సముద్రంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచడంలో వీటి పాత్ర ఎంతో కీలకం. అలాంటి విశిష్ట తాబేలు జాతి ఇప్పుడు ప్రమాదంలో ఉన్న జీవుల జాబితాలో చేరింది. ఆలివ్ రిడ్లే తాబేళ్లకు మనుషుల నుంచే ప్రధానంగా ముప్పు వాటిల్లుతోంది. ఈ అరుదైన జాతిని రక్షించేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాల అటవీ శాఖాధికారులు చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అంతరించి పోతున్న జాబితాలో ఉన్న ఆలివ్ రిడ్లే తాబేళ్లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... నాగాయలంక వద్ద సముద్రంలోకి తాబేళ్లను వదులుతున్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ఒడిశా తరువాత ఇక్కడే.. అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లలో ఏడు రకాల జాతులున్నాయి. వీటిలో ఐదు రకాలు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఎక్కువగా ఉన్నాయి. రెండు అడుగుల వెడల్పు, 50 కిలోల వరకు బరువు పెరుగుతాయి. ఒడిశాలో ఈ జాతి తాబేళ్లు ఎక్కువగా ఉండగా మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. కాకినాడ తీరంలోని ఉప్పాడ, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కృష్ణా జిల్లా కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకూ, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, బాపట్ల పరిధిలోని సూర్యలంక ప్రాంతంలో ఈ తాబేళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఉష్ణోగ్రతను బట్టి లింగ నిర్ధారణ.. ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్లు పెట్టి పిల్లగా మారడానికి 28 నుంచి 32 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత అవసరం. 30 నుంచి 32 డిగ్రీల మధ్య జన్మిస్తే ఆడ తాబేలు అవుతుంది. తక్కువ ఉష్ణోగ్రతలో మగ తాబేళ్లు జన్మిస్తాయి. సృష్టిలో ఒక్క ఆలివ్ రిడ్లే తాబేలు జాతికి మాత్రమే ఈ ప్రత్యేకత ఉంది. ఆలివ్ రిడ్లే తాబేళ్ల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. సముద్రంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు, చేపలు వృద్ధి చెందేందుకు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి. చేప పిల్లలను తిని జీవించే జెల్లీ చేపలను తాబేళ్లు ఆహారంగా తీసుకోవడం వల్ల చేపల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ తాబేలు ఎంత లోతులో ఉన్నా ప్రతి 45 నిముషాలకు ఒకసారి నీటిపైకి వచ్చి ఆక్సిజన్ తీసుకుని లోపలకు వెళుతుంటాయి. నీటిలో పైకి, కిందకు వెళ్లి రావడం వల్ల ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇలా పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రత్యేక హేచరీల ద్వారా రక్షణ అరుదైన ఆలివ్ రిడ్లే జాతి తాబేళ్లను రక్షించేందుకు అటవీ శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అవనిగడ్డ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో కోడూరు మండలం పాలకాయతిప్ప వద్ద ఒకటి, నాగాయలంక మండలం లైట్హౌస్ శివారు ఐలాండ్ దగ్గర మూడు, సంగమేశ్వరం వద్ద ఒక హేచరీలను ఏర్పాటు చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లా పరిధిలో ఇప్పటి వరకూ 4.62 లక్షల తాబేళ్లను సముద్రంలోకి వదిలినట్లు అటవీ శాఖాధికారులు తెలిపారు. వలలే ఉరితాళ్లు.. చేపల ఉత్పత్తిని పెంచి మత్స్యకారులకు ఆదాయాన్ని తెచ్చి పెట్టే తాబేళ్లకు వలలే ఉరితాళ్లు అవుతున్నాయి. మరబోట్ల ద్వారా వేసే వలల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఎక్కువగా చిక్కుకుని మరణిస్తుంటాయి. ఈ వలలను లాగేందుకు మూడు గంటల సమయం పడుతుంది. వలలో చిక్కుకున్న తాబేలు పైకి రాలేక, ఆక్సిజన్ అందక మరణిస్తున్నాయి. మత్స్యకారులు ఉపయోగించే టేకు వలల్లోనూ తాబేళ్లు చిక్కుకుని చనిపోతుంటాయి. -
రండి రండి.. అరుదైన అతిథులు వస్తున్నారోచ్!
ఎల్లలు లేని సాగరంలో జీవించే ఉభయచర జీవులు వడివడిగా పుట్టింటి వైపు అడుగులు వేస్తున్నాయి. అరుదైన ఈ అతిథుల ఆగమనంతో రుషికుల్య తీరం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ సంతానవృద్ధికి అర్ధరాత్రి దాటిన తరువాత తీరానికి చేరుకుంటున్న ఆలివ్రిడ్లేలు.. గుడ్లు పెట్టి, వాటిని ఇసుకలో భద్ర పరిచిన అనంతరం సంద్రంలోకి తిరిగి చేరుకుంటున్నాయ. వీటి రాకతో తీరమంతా సందడి నెలకొంది. – భువనేశ్వర్ భువనేశ్వర్: గుడ్లు పెట్టేందుకు ఏటా రుషికుల్య తీరానికి ఆలివ్రిడ్లే తాబేళ్లు అతిథులుగా విచ్చేయడం పర్యావరణ ప్రియులకు ఆహ్లాదపరుస్తోంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 5,48,768 తాబేళ్లు ఈ తీరానికి చేరడం విశేషం. 2018లో అత్యధికంగా 4,82,128 ఆలివ్రిడ్లే ఈ ప్రాంతానికి విచ్చేశాయి. మార్చి 27 నుంచి రుషికుల్య తీరంలో తాబేళ్లు గుడ్లు పొదగడం ప్రారంభమైంది. ఈనెల 3తో ముగిసిందని డీఎఫ్ఓ అమ్లాన్ నాయక్ తెలిపారు. మరో 45 రోజుల్లో ఈ గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక జాగ్రత్తలు.. అపురూపమైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల ఆగమనం పురస్కరించుకుని రుషికుల్య తీరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సువిశాల తీరాన్ని 50 సెగ్మెంట్లుగా విభజించారు. గుడ్లు పెట్టేందుకు అనుకూలమైన పర్యావరణంతో ఈ సెగ్మెంట్లు ఏర్పాటు చేయడం విశేషం. తాబేళ్ల గుడ్లని కుక్కలు, కాకులు, ఇతర పక్షలు నష్ట పరచకుండా ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. పొదిగిన గుడ్లు నుంచి బయటపడిన ఆలివ్ రిడ్లే తాబేళ్ల కొత్త సంతతి సురక్షితంగా తిరిగి సముద్ర గర్భానికి వెళ్లేంత వరకు ఈ కార్యాచరణ నిరవధికంగా కొనసాగుతుందని డీఎఫ్ఓ వివరించారు. చదవండి: కట్నంతో లాభాలెన్నో! -
Weight Loss: గుడ్లు, పప్పుధాన్యాలూ, ఉప్పు కలపని తాజా వెన్న తీసుకుంటే..
శరీరానికి తగినంత శక్తి అందనప్పుడు ఆకలి నియంత్రణలో ఉండదు. దాంతో ఏవి పడితే అవి తినేస్తాం. దీన్ని అదుపులో ఉంచాలంటే.. పొద్దున పూట అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. అందులోనూ మాంసకృత్తులూ, పీచు పదార్థాలు, కార్బో హైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆటోమేటిగ్గా మధ్యాహ్నం భోజనం తక్కువ తీసుకుంటాం. గుడ్లు, పప్పుధాన్యాలూ, అవిసెగింజలు, చేపలు వంటివాటితో పాటు కూరగాయలూ, ఆకుకూరలూ వంటివి మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. సన్నబడాలనుకునేవారు తినే పదార్థాల్లో అసలు కొవ్వే ఉండకూడదనుకుంటారు. ఇది పొరబాటు. శరీర వ్యవస్థలూ, హార్మోన్లు సరిగా పనిచేయాలంటే డైటరీ ఫ్యాట్ కూడా కొంతవరకూ అవసరమే అంటారు నిపుణులు. లేదంటే నెలసరికి సంబంధించిన సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే మేలుచేసే కొవ్వు పదార్థాలైన బాదం, వాల్నట్స్, పిస్తా వంటి డ్రైఫ్రూట్లూ, రైస్బ్రాన్ ఆయిల్ వంటివి ఎంచుకోవాలి. అలాగే ఉప్పు కలపని తాజా వెన్న కూడా మంచిది. ఆవునెయ్యి తగు మోతాదులో పుచ్చుకోవచ్చు. బరువు పెరగడానికి ప్రధాన కారణం.. మనం తీసుకునే ఆహారం ద్వారా అందే పిండిపదార్థాలు గ్లూకోజ్గా మారడమే. ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే సంక్లిష్ట పిండి పదార్థాలున్న ఆహారాన్ని ఎంచుకోవాలి. సాధారణ బియ్యానికి బదులు ముతక బియ్యం, రాగులూ, కొర్రలూ, జొన్నల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. వాటికి జతగా కూరగాయలూ, ఆకుకూరల్ని ఎంచుకుంటే పోషకాలు అందుతాయి. శరీర జీవక్రియా రేటు మెరుగుపడుతుంది. -
Health Tips: లేత మాంసం, కోడిగుడ్లు తిన్నపుడు విడుదలయ్యే హార్మోన్ల వల్ల..
దేహం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. సమతుల ఆహారంతోనే సమగ్రమైన ఆరోగ్యం సాధ్యమవుతుంది. వీటితోపాటు మనసు మీద ప్రభావం చూపించే ఆహారాలు కూడా ఉంటాయి. నిరుత్సాహంగా మార్చే ఆహారాలతోపాటు మనసును ఉత్తేజపరిచే ఆహారాలు కూడా ఉంటాయి. ►కార్బోహైడ్రేట్లు సెరోటోనిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తాయి. ఇది ఫీల్గుడ్ హార్మోన్. అందుకే మన రోజువారీ ఆహారంలో కార్బొహైడ్రేట్లు ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే మితిమీరిన చక్కెర స్థాయులు లేని కార్బోహైడ్రేట్లను తీసుకోవడం మంచిది. తిన్న తర్వాత త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెర స్థాయులను పెంచే ఆహారానికి బదులుగా కూరగాయలు, బీన్స్, పొట్టు తీయని ధాన్యాలను తీసుకోవాలి. ►లేత మాంసం, కాయధాన్యాలు, కోడిగుడ్లు, చికెన్, పాలు, పాల ఉత్పత్తులలో ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఆహారంలో వీటిని తీసుకున్నప్పుడు డోపామైన్, నార్ఎపీనెఫ్రిన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి శక్తిని ఇనుమడింప చేయడంతోపాటు మెదడును ఒక విషయం మీద కేంద్రీకృతం చేయడానికి దోహదం చేస్తాయి. ►హైలీ ప్రాసెస్డ్ ఫుడ్, డీప్ ఫ్రైలు తిన్న తర్వాత వాటిని జీర్ణం చేయడానికి దేహం ఎక్కువ శక్తిని వినియోగించాల్సి వస్తుంది. దాంతో నీరసం ఆవహించినట్లవుతుంది. కాబట్టి జిహ్వ చాపల్యాన్ని నియంత్రించుకోలేక వాటిని తిన్నప్పుడు ఇతర ఆహారం మోతాదు తగ్గించడం మంచిది. ►ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తినాలనే జాగ్రత్త పాటించడంతోపాటు ఇష్టమైన వాటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం కూడా లేదు. దేహ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కోసం అవసరమైన వాటిని తింటూనే ఇష్టమైన వాటిని రోజులో ఒక్కసారికి పరిమితం చేసుకోవచ్చు. ►తరచు కొత్తిమీర చట్నీ తింటుండటం వల్ల లేదా ధనియాల పొడిలో కొద్దిగా తేనె వేసుకుని తీసుకుంటుండటం వల్ల జ్ఞాపకశక్తి మెరుగు పడుతుంది. ►వేరుశనగలో ఉండే విటమిన్–బి3... జ్ఞాపకశక్తి మెరుగయ్యేలా చేస్తుంది. చదవండి: Beauty Tips In Telugu: టమాటా... సీ సాల్ట్.. మృతకణాలు ఇట్టే మాయం! Anjeer Health Benefits: అంజీర తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా? -
బరువు తగ్గాలనుకుంటున్నారా? కడుపు నిండా తింటూనే ఆ పనిచేయండి
కొందరు బరువు తగ్గడం కోసం కడుపు మాడ్చుతుంటారు. కానీ కడుపు నిండా తింటూనే బరువు తగ్గడం ఆరోగ్యకరమైన మార్గం. ఇటువంటి ఆహారంలో ముఖ్యమైనది కోడి గుడ్డు. గుడ్డులో ‘ల్యూసిన్’ అనే ఒక రకమైన ‘ఎసెన్షియల్ అమైనో యాసిడ్’ ఉంటుంది. ఇది నేరుగా బరువు తగ్గించడానికి దోహదపడుతుంది. ఇక ఉడికించిన కోడి గుడ్లు ఒకటి లేదా రెండు గుడ్లు తినగానే కడుపు ఉబ్బిపోయినట్లుగా అనిపిస్తుంది. అంటే త్వరగా పొట్ట నిండేందుకు కోడిగుడ్లు ఉపయోగపడి, తద్వారా తక్కువ ఆహారంతోనే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. ఈ రెండు ప్రయోజనాలతో కోడిగుడ్డు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇక ఆకుకూరలు, కాయగూరల్లో నీటి మోతాదులు, పీచు పాళ్లు చాలా ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా తిన్న వెంటనే కడుపు నిండిపోయిన తృప్తి కలుగుతుంది. తాజా కాయ/ఆకుకూరలు కూడా బరువు తగ్గడానికి ఉపయోగం. ఒకవేళ మీరు మాంసాహారాన్ని ఇష్టపడేవారైతే వేటమాంసాని(రెడ్మీట్)కి బదులుగా కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలు వంటి వైట్మీట్ తినడం మేలు. అది కూడా పరిమితంగా, కేవలం రుచికోసం మాత్రమే. -
Viral Video: ఆమ్లెట్ వెయ్యబోతే పిల్లైంది! కోడి పిల్లలు ఇలా కూడా పుడతాయా..
While making omelet chick suddenly came out of the egg స్ట్రీట్ ఫుడ్కి ఈ రోజుల్లో యమ క్రేజీ ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫైవ్ స్టార్ హోటల్లో లేని కిక్కు రోడ్డు మీద దొరికే చిన్న ప్లేటు స్నాక్స్లో ఉంటుంది. అదేం మాయో ఎవరికి ఎరుక? ఐతే అలాంటి రోడ్ సైడ్ షాప్లో ఆమ్లేట్ వేడి వేడిగా తిందామని పొయ్యి చుట్టూ చేరి గుడ్లు పగలగొట్టి, ఎంతో నేర్పుగా ఆమ్లెట్ వేస్తున్న వ్యక్తిని, అతని పనితనాన్ని శ్రద్ధగా గమనిస్తున్న కస్టమర్లలకు ఒక్కసారిగా షాక్ కొట్టినంత పనైంది! గుడ్డులోనుంచి ఓ అతిథి బయటకొచ్చింది మరీ! ప్రస్తుతం నెట్టింట ఈ ఆమ్లెట్లో నుంచి వచ్చిన అతిథికి చెందిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తే మీరూ ఖచ్చితంగా ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు.. నిజానికి ఈ వీడియోలో ఆమ్లెట్ వేస్తున్న వ్యక్తి పక్కన అనేక ఎగ్ ట్రేలు ఉన్నాయి. అతను ఒక్కో గుడ్డు పగలగొట్టి, వేడి పెనంమీద వేయడం కనిపిస్తుంది. అలా ఒక గుడ్డు వేశాడు కూడా. ఐతే మరో గుడ్డు పగల గొట్టి పెనం మీద వేయగానే.. తెల్ల రంగు కోడి పిల్ల పెనం మీద పడి వేడికి గంతులు వేయడం కనిపిస్తుంది. వెంటనే అతను తేరుకుని కోడిపిల్లను కాపాడాడులే! సాధారణంగా కోడి 21 రోజులపాటు గుడ్ల మీద పొదగడం వల్ల లేదా గుడ్లను పొదిగించే పరికరంతోగానీ కోడి పిల్లలు పుడతాయి. అంటే గుడ్డులోని అండం పిల్లగా మారాలంటే కొన్ని డిగ్రీల వేడి అవసరం అవుతుంది. కోడి గుడ్లపై పొదగడం వల్ల ఆ వేడి గుడ్డుకు అంది కోడి పిల్లగా ఏర్పడటానికి దోహదపడుతుంది. ఐతే ట్రేలో ఉన్న గుడ్డులోనుంచి కోడి పిల్ల ఎలా వచ్చిండబ్బా? అని చూసినవారంతా బుర్రలు గోక్కుంటున్నారు. ఇక నెటిజన్లైతే ఫన్నీ కామెంట్లతో జోకులు పేలుస్తున్నారు. మీరూ చూడండి.. చదవండి: చిచ్చర పిడుగు! ఎగ్జామ్స్లో కాపీ కొట్టేందుకు కొత్త ఎత్తులు.. View this post on Instagram A post shared by ✹⃝💎 .̶͟͟͞͞͞͞🇷⃝ᴏ🅑𝒾ɲ♓𝖔𝖔ᶑ preet (@robinhood_preet) -
పిండి, కోడి గుడ్లతో తమాషా యుద్ధం!!
-
పిండి, కోడి గుడ్లు.. ఇలాంటి తమాషా యుద్ధం ఎప్పుడైనా చూశారా?
200 Year Old Els Enfarinats Festival: ఇంతవరకు చాలా రకాల పండుగల గురించి విన్నాం. ప్రపంచంలో విభిన్న సంసృతులకు సంబంధించిన పండుగలు చాలానే ఉన్నాయి. జంతువులకు సంబంధించిన పండుగలే కాక బురదలో కొట్టుకోవడం, ఆవు పేడతో జరుపుకునే రకరకాల విచిత్రమైన పండుగులు గురించి విన్నాం. అయితే స్పెయిన్లో మాత్రం వాటన్నింటకి భిన్నంగా ఆహార పదార్థాలతో యుద్ధం చేసుకుంటూ పండుగను చేసుకుంటారట!. (చదవండి: వికటించిన పెడిక్యూర్.. బాధితురాలికి ఏకంగా రూ.13 కోట్ల నష్టపరిహారం) అసలు విషయంలోకెళ్లితే....స్పెయిన్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆహార యుద్ధంలో ఒకటిగా ఎల్స్ ఎన్ఫారినాట్స్ పండుగ ప్రసిద్ధి చెందింది. ఈ పండుగను స్పెయిన్లోని ఐబి, అలికాంటే వంటి చిన్నపట్టణాల్లో ఏటా డిసెంబర్ 28న ఈ పండుగను జరుపుకుంటారు. ఎల్స్ ఎన్ఫారినాట్స్ అనేది రెండు గ్రూపుల మధ్య జరిగే తమాషా యుద్ధం. అయితే ఈ పండుగను పిండి, గుడ్డు వంటి వాటిని ఒకరి పై ఒకరు విసురుకుంటూ బాణాసంచాలు కాలుస్తు జరుపుకుంటారు. అంతేకాదు ఈ పండుగ 200 ఏళ్లనాటి సంప్రదాయ పండుగ. ఇది బైబిల్ కథలోని అమాయకుల ఊచకోతకు సంబంధించిన నాటి చీకటి సంఘటనకు గుర్తుగా జరుపుకుంటారు. ఈ పండుగను డే ఆఫ్ ఇన్నోసెన్స్ అని కూడా పిలుస్తారు. అయితే ప్రజలు నకిలీ సైనిక దుస్తులు ధరించి తిరుగుబాటు చేస్తున్నట్లుగా ఆడుతుంటారు. పైగా ఈ పండుగలో ఒక సముహం నగరాన్ని తమ హస్తగతం చేసుకునేలా తిరుగుబాటు చేస్తుంది. ఆ తర్వాత వారికి వారే విచిత్రమైన చట్టాలను కూడా ఏర్పాటు చేసుకుని దండన వంటి శిక్షలు కూడా విధించుకుంటారు. ఆ తర్వాత ఈ పండుగ నుంచి సేకరించిన డబ్బును స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తారు. ఈ మేరకు ఈ పండుగను ఐబీ నగరం 1862 కాలం నుండి ఈ సంప్రదాయ పండుగను జరుపుకుంటుంది. అయితే 1936-39లో స్పానిష్ అంతర్యుద్ధం సమయంలో స్పెయిన్ అంతటా యుద్ధం జరగడంతో ఈ పండుగను జరుపుకోలేదు. అలాగే నియంత జనరల్ ఫ్రాన్సిస్కో ఫ్రాంకో హత్య జరిగిన ఆరు సంవత్సరాల తర్వాత తొలిసారిగా ఈ పండుగను 1981 జరుపుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) (చదవండి: షార్క్ చేపతో ముఖాముఖి షూటింగ్: షాకింగ్ వైరల్ వీడియో!!) -
Health Tips: పిల్లలకు గుడ్డు, పెరుగు, బాదం, వాల్నట్స్ ఎక్కువగా తినిపిస్తున్నారా..
Immunity Booster Foods For Kids: పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగేలా సరైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ముఖ్యంగా కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలంటే... గుడ్డు కోడిగుడ్డులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పిల్లలకు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినిపించాలి. కండరాలు, చర్మం, గుండె ఆరోగ్యానికి గుడ్డు మంచిది. పిల్లల ఎదుగుదలకు అవసరమైన విటమిన్ ఎ, బి2 (రైబోఫ్లేవిన్) కోడిగుడ్డులో లభిస్తాయి. ఆకుకూరలు ఆకుకూరలు, మునగకాడలు, కొత్తిమీర, పాలకూర వంటివి ఎక్కువగా పెట్టాలి. వీటిలో ఫైబర్తోపాటు ఐరన్, జింక్, మినరల్స్ లభిస్తాయి. పెరుగు పెరుగులో ప్రోబయోటిక్స్, విటమిన్ బి12 లభిస్తాయి. ఇది పొట్టలో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేలా ఫ్రూట్ యోగర్ట్, వెజిటబుల్స్ రైతా, బూందీ రైతా రూపంలో ఇవ్వొచ్చు. పసుపు పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. పిల్లలకు రోజూ ఇచ్చే ఆహారంలో పసుపును చేర్చడం వల్ల ఆస్తమా, అలర్జీకి సంబంధించిన సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. పాలల్లో పసుపు వేసి తాగించడం అలవాటు చేయవచ్చు. డ్రైఫ్రూట్స్ బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్నట్స్, అప్రికాట్స్ వంటివి ఎక్కువగా తినిపించడం వల్ల మెదడు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు లభించడంతో పాటు పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. స్వీట్స్ వద్దు పిల్లలకు స్వీట్స్, పంచదార ఎక్కువగా ఉండే ఇతర పదార్థాలైన ఫ్రూట్జ్యూస్లు, చాక్లెట్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్ను ఎక్కువగా తినిపించకూడదు. ఇవి ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. సరిపడా నిద్ర ముఖ్యంగా పిల్లలు రోజూ తగినంత నిద్రపోయేలా చూడాలి. ఉదయం ఒక గంటసేపైనా ఎండలో ఆడుకునేలా ప్రోత్సహించాలి. చదవండి: Health Tips: షుగర్, రేచీకటి ఉన్నవాళ్లు.. దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను తింటే... -
పళ్లులేని రాకాసి బల్లి.. శిలాజ అండంలో ఎదిగిన పిండం!
బీజింగ్: దాదాపు 7 కోట్ల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ గుడ్డును చైనాలోని గాంఝూ నగరంలో పరిశోధకులు కనుగొన్నారు. ఈ శిలాజ అండంలో పూర్తిగా ఎదిగిన పిండం ఉండడం విశేషం. దీనికి ముద్దుగా బేబీ ఇంగిలియాంగ్ అని పేరుపెట్టారు. ఈ గుడ్డు పళ్లులేని రాకాసి బల్లి ఒవిరాప్టోరోసారస్కు చెందినదై ఉండొచ్చని పరిశోధన నిర్వహించిన బర్మింగ్హామ్ యూనివర్సిటీ పురాతత్వ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ రాకాసి బల్లుల శరీరంపై ఈకలుండేవని, వీటికి రకరకాల ముక్కులుండేవని తెలిపారు. గతంలో వీటి శిలాజాలు ఆసియా, ఉత్తర అమెరికాల్లో లభించాయి. ఇంతవరకు పూర్తిగా ఎదిగిన పిండం ఉన్న డైనోసార్ గుడ్లు అరుదుగా లభించాయి. ప్రస్తుతం లభించిన గుడ్డు, దానిలోని జీవి ప్రస్తుత పక్షుల గుడ్లను, అందులోని పిండాలను పోలి ఉండడం విశేషం. బేబీ ఇంగ్లియాంగ్ పొదగడం పూర్తయ్యే దశలో శిలాజంగా మారి ఉండొచ్చని అందుకే దాని తల శరీరం కిందకు ముడుచుకొనిఉందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పక్షుల గుడ్లలో పిండాలు పొదుగుదల పూర్తయ్యే దశలో ఇదే ఫోజులో ఉంటాయి. ఈ భంగిమను టకింగ్ అంటారు. పక్షి పిండానికి రెక్కలుంటాయి, ఈ డైనోసార్ పిండానికి పంజాలున్న చిన్న చేతులున్నాయి. ఇంతవరకు ఇలాంటి టకింగ్ భంగిమ ఆధునిక పక్షి జాతులకే సొంతమని భావించారు. ప్రస్తుతం లభించిన డైనోసార్ శిలాజ అండంలో కూడా ఇదే పొజిషన్లో పిండం ఉండడం గమనిస్తే ఈ తరహా భంగిమ తొలుత డైనోసార్లలో ఉండేదని, కాలక్రమేణా పక్షుల్లోకి వచ్చిందని తెలుస్తోంది. డైనోసార్ల పెరుగుదల, పునరుత్పత్తి, పక్షులతో వీటి సంబంధం తదితరఅంశాలను పరిశోధించేందుకు తాజా శిలాజం ఉపయోగపడుతుందని పరిశోధక బృందంలోని ప్రొఫెసర్ ఫియాన్వైసుమ్ మా చెప్పారు. నిజానికి దీన్ని 2000 సంవత్సరంలోనే కనుగొన్నారు. అనంతరం పదేళ్లు స్టోరేజ్లో ఉంచారు. 2010 తర్వాత దీనిపై పరిశోధనలు ఆరంభించారు. ఇందులో ఎదిగిన పిండం ఉందనే విషయం తాజాగా బయటపడింది. పరిశోధనా వివరాలను జర్నల్ ఐసైన్స్లో ప్రచురించారు. బేబీ ఇంగ్లియాంగ్ విశేషాలు ► వయసు: సుమారు 6.6– 7.2 కోట్ల ఏళ్లు. ► జాతి: ఒవిరాప్టోరోసారస్(గుడ్లను దొంగలించే బల్లులు అని అర్ధం) ► పొడవు: 27 సెంటీమీటర్లు. (ముడుచుకోకుండా ఉంటే) ► గుడ్డు సైజు: 17 సెంటీమీటర్లు. ► పెద్దయ్యాక సైజు: 2– 3 మీటర్లు(అంచనా). -
మహిళా ఎంపీకి చేదు అనుభవం.. కోడిగుడ్ల దాడి
భువనేశ్వర్: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్పై భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తలు కోడిగుడ్ల దాడి చేయడంతో ఒడిశాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం కాన్వాయ్పై దాడి జరగిన మరుసటి రోజే.. ఓ మహిళా ఎంపీకి ఇదే రీతిలో చేదు అనుభవం ఎదురయ్యింది. కాంగ్రెస్ మద్దతుదారులు బీజేడీ ఎంపీ అపరాజిత సారంగిని టార్గెట్ చేశారు. ఆమె వాహానంపై కోడిగుడ్లు విసిరారు. (చదవండి: ఒడిశా సీఎం కాన్వాయ్పై కోడిగుడ్ల దాడి) ఈ సంఘటన శుక్రవారం భువనేశ్వర్ బనమలిపూర్లో చోటు చేసుకుంది. నిరుద్యోగం, నిత్యసరాల ధరలు, ఇంధన ధరలు పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఎంపీ అపరాజిత సారంగి వాహానాన్ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ మద్దతుదారులు.. దానిపై కోడిగుడ్లు విసిరారు. నల్ల జెండాలు చూపి నిరసన వ్యక్తం చేశారు. (చదవండి: అథ్లెట్ ద్యుతి చంద్ ఫిర్యాదు.. ‘ఫోకస్ ప్లస్’ ఎడిటర్ అరెస్టు) ఈ క్రమంలో జరిగిన సంఘటన గురించి అపరాజిత సారంగి తన స్వస్థలం ధనేశ్వర్ బారిక్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరసనకారుల రాళ్లు కోడిగుడ్లతో తన వాహనంపై దాడి చేశారని.. వారి వద్ద కత్తులు, ఇతర మారణాయుధాలు ఉన్నాయని ఎంపీ తన కంప్లైంట్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులు ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. చదవండి: ఒడిశాలో పతీసహగమనం.. భార్య మరణం తట్టుకోలేక -
ఒడిశా సీఎం కాన్వాయ్పై కోడిగుడ్ల దాడి
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్పై భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. పూరీ నగరంలోని దర్జీపోఖారీ ఛక్ వద్ద బుధవారం ఈ దాడి జరిగింది. శ్రీ జగన్నాథ్ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపనకు సీఎం పట్నాయక్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకుని బీజేవైఎం కార్యకర్తలు అత్యంత సమీపం నుంచి సీఎం కాన్యాయ్పైకి కోడిగుడ్లు విసిరారు. ఇవి నేరుగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలకు తగిలాయి. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోంశాఖ సహాయ మంత్రి దిబ్య శంకర్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు మంత్రుల వాహనాలపై కోడిగుడ్ల దాడులకు పాల్పడింది. మహిళా టీచర్ మమతా మెహర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు గోబింద సాహుతో శంకర్ మిశ్రాకు సంబంధాలున్నాయని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోడిగుడ్ల దాడులు జరుగుతున్నాయి. సీఎం కాన్యాయ్పై కోడిగుడ్ల దాడి చేసింది తామేనని బీజేవైఎం ఒడిశా అధ్యక్షుడు ఇరాసిస్ ఆచార్య తెలిపారు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా నిరసన తెలుపుతుంటామన్నారు. దిబ్య శంకర్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించే వరకు ఇదే తరహాలో ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. (చదవండి: పెళ్లి బాజాలతో.. 65 కోళ్లు మృతి!.. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో!!) -
మాకొద్దు సారూ ఈ తిండి..! చారు నీళ్లలాగా.. కూరలు చారులాగా, గుడ్ల సంగతి సరేసరి..
నగరంలోని మేకలమండి ప్రభుత్వ పాఠశాలకు బుధవారం మధ్యాహ్న భోజనంలో భాగంగా, పప్పు చారు, ఉడకబెట్టిన కోడి గుడ్లు సరఫరా అయ్యాయి. విద్యార్థులు గుడ్డు పొరను తొలగించగా లోపల కుళ్లిపోయి తినడానికి పనికి రాకుండా ఉన్నాయి. దీంతో విద్యార్థులు హెచ్ఎంకు ఫిర్యాదు చేశారు. ఆయన సంబంధిత ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్లగా .. మరుసటి రోజు తాజా గుడ్లు పంపిస్తామని తాపీగా సమాధానం ఇవ్వడం విస్మయానికి గురిచేసింది. సాక్షి, హైదరాబాద్: ముద్ద అన్నం... నీళ్ల పప్పుచారు.. కుళ్లిన కోడి గుడ్లు... అకలితో తినడానికి ప్రయత్నించినా.. గొంతు నుంచి ముద్ద దిగని వైనం. ఇదీ నగరంలోని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా అవుతున్న మధ్యాహ్న భోజనం పరిస్థితి. నగరంలో మ«ధ్యాహ్న భోజనం అధ్వానంగా తయారైంది. వాటిని సరఫరా చేసే ఏజెన్సీల తీరుతో విద్యార్థుల ఆకలి తీరకపోగా అనారోగ్యం పాలవుతున్నాయి. ప్రతిస్థాయిలోనూ అవినీతి తాండవిస్తోంది. తాజాగా కుళ్లిన కోడిగుడ్లను సరఫరా వెలుగు చూడడం ఆందోళన కలిగించింది. పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడటం మానవ హక్కుల ఉల్లంఘనే కాక పిల్లల ప్రాథమిక హక్కుల ఉల్లంఘించడమేనని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించి పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా అమలు కావాల్సిన మధ్యాహ్నా భోజన పథకం వారికి మరింత హానికరంగా తయారైంది. చదవండి: టీఆర్ఎస్ మహాధర్నా: స్టేజి కింద కూర్చున్న కేటీఆర్.. నాగలితో ఎమ్మెల్యే నాసిరకంగా మెనూ మధ్యాహ్నా భోజనం నాసిరకంగా తయారైంది. దొడ్డు బియ్యంతో వండిన అన్నం ముద్ద ముద్దగా ఉండటం. అందులోనూ రాళ్లు వస్తున్నాయి. చిన్న గుడ్డు, నాసిరకం పప్పు , చారు నీళ్లను తలపిస్తుండగా, కూరలు చారును మరిపిస్తున్నాయి. ఉడకని కూరగాయలు, రుచిపచీలేని వాటితో విద్యార్థులు తినలేకపోతున్నారు. సగం విద్యార్థులు దూరం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను లంచ్ టైమ్లో ఇళ్లకు రప్పించుకోవడమో...లేదంటే క్యారేజీలు కట్టివ్వడమో చేస్తున్నారు. మరోవైపు సరఫరా అవుతున్న భోజనం కూడా విద్యార్థులకు సరిపోని పరిస్థితి. చదవండి: విద్యార్థినుల హాస్టల్.. నీడలాగ ఒక ముఖం.. వింత శబ్దాలు.. హాజరు శాతం తక్కువ పేరుతో కనీసం 25 శాతం కూడా సరఫరా జరగడం లేదని స్పష్ట మవుతోంది. దీంతో ఉదయమే పాఠశాలకు వస్తుండడం వల్ల టిఫిన్న్ తినలేని పిల్లలు మధ్యాహ్నం ఆకలితో తిందామన్నా అది సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. వారానికి మూడు గుడ్లు ఇవ్వాలని నిబంధన ఉన్నా... సరఫరా మాత్రం మొక్కుబడిగా తయారైంది. వారానికి ఒక్క గడ్డు పెట్టి చేతులు దులుపుకుంటున్నట్లు తెలుస్తోంది. లక్షకు పైగా విద్యార్థులు హైదారాబాద్ జిల్లాలో సుమారు 690 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో 1,06,676 మంది విద్య అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం హాజరుశాతం మాత్రం సగం మించనట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో మధ్యాహ్న భోజనం సరఫరా అవుతోంది. ఒక ఫౌండేషన్కు సంబంధించిన ఏజెన్సీ నగరంలోని ప్రభుత్వ పాఠశాలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తోంది. అయితే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో కమ్మక్కై సరఫరాలో చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. మధ్యాహ్న భోజనం ఖర్చు రోజుకు ఇలా.. ► ప్రాథమిక పాఠశాల విద్యార్థికి: రూ.4.97 పైసలు ► ఉన్నత పాఠశాల విద్యార్థికి రూ. 7.45 పైసలు -
అంగన్వాడీల్లో గుడ్డు వెరీబ్యాడ్
సాక్షి, హైదరాబాద్: చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషక లోపాలు అధిగమించేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పౌష్టికాహార పంపిణీ చేస్తోంది. ఒక్కో లబ్ధిదారుకు ప్రతినెలా 16 కోడిగుడ్లను అందించాలి. గుడ్లయితే ఇస్తున్నారు కానీ... అందులో నాణ్యత ఉండటం లేదు. ఫలితంగా ఉన్నతమైన లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న పౌష్టికాహార లక్ష్యానికి గండిపడుతోంది. కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్వహిస్తున్న కార్యక్రమం పర్యవేక్షణా లోపంతో గాడితప్పుతోంది. పర్యవేక్షణ లోపం... కాంట్రాక్టర్లకు వరం... రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో 21,59,988 మంది చిన్నారులు, గర్భిణులు, బాలింతలు నమోదయ్యారు. ఇందులో 4,57,643 మంది గర్భిణులు, బాలింతలు కాగా, ఏడు నెలల నుంచి 3సంవత్సరాల లోపు చిన్నారులు 10,34,562 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు ఉన్న చిన్నారులు 6,67,783 మంది ఉన్నారు. ఒక్కో లబ్ధిదారులకు నెలకు 16 గుడ్లు అందిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న గుడ్లు 3.45 కోట్లు. ఇందుకోసం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏటా సగటున రూ.150కోట్ల మేర నిధులను కోడిగుడ్లపైనే ఖర్చు చేస్తోంది. ఇంతటి భారీ బడ్జెట్తో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంపై నిఘా లోపించింది. అంగన్వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేస్తున్నప్పటికీ... దాదాపు ఏడాదిన్నరగా ఎలాంటి పర్యవేక్షణా లేదు. ఇది కాంట్రాక్టర్లకు వరంగా మారింది. సాధారణంగా ఒక గుడ్డు 50గ్రాములుండాలి. కానీ కాంట్రాక్టర్లు పంపిణీ చేస్తున్న గుడ్లు చాలావరకు నాసిరకంగా ఉంటున్నాయి. తక్కువ ధరకు దొరికే... తక్కువ పరిమాణంలో ఉన్న, మురిగిపోయిన గుడ్లు సరఫరా చేస్తున్నారు. గుడ్లు చిన్నగా ఉంటున్నాయని, ఉడికించిన గుడ్లనుంచి దుర్గంధం వస్తోందని అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఫిర్యాదులు సీడీపీఓలు, జిల్లా సంక్షేమాధికారులు, రాష్ట్ర కార్యాయానికి సైతం వెల్లువెత్తాయి. చివరకు ఈ అంశం మంత్రి సత్యవతి రాథోడ్ దృష్టికి వచ్చింది. నివేదిక అందగానే చర్యలు.. కోడిగుడ్ల పంపిణీ క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫిర్యాదులు, నాణ్యతాలోపాలపై మీడియాలో వస్తున్న వార్తలు చూసి ఇటీవల మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నివేదిక ఇవ్వాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఒకట్రెండు రోజుల్లో నివేదిక అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నివేదిక అందిన తర్వాత సమీక్షించి నాసిరకం గుడ్లు సరఫరా చేసిన కాంట్రాక్టర్లపై వేటు వేయాలని, కాంట్రాక్టర్ల ఎంపికలో కఠిన నిబంధనలు విధించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
కొండెక్కిన చికెన్ ధరలు.. రెండు నెలలైనా తగ్గని ధర.. గుడ్డుతోనే సరి!
సాక్షి, నారాయణఖేడ్: ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా చికెన్ ముక్క లేకుండా ముగియదు. రోజురోజుకు పెరుగుతున్న చికెన్ ధరలు సామాన్యుడికి ముక్క చిక్కకుండా చేస్తున్నాయి. రెండు నెలలుగా చికెన్ ధరలు కొండెక్కాయి. కిలో చికెన్ రూ.280 నుంచి రూ.300లకు కిందకు దిగనంటోంది. గత నెల శ్రావణమాసంలో చికెన్ ధరలు తగ్గుతాయని ఆశించినా, కిలో రూ.260 రికార్డు ధర పలికింది. పెళ్లిళ్ల సీజన్తో ఈ ధర మరింత పైకి ఎగబాకింది. అనంతరం ధరలు తగ్గుతాయని ఆశించినా తగ్గడంలేదు. సాధారణ సమయంలో రిటైల్ లైవ్ బర్డ్ కిలో రూ.80 నుంచి రూ.100వరకు ఉండగా, ప్రస్తుతం రూ.145 నుంచి రూ.150వరకు పలుకుతోంది. మటన్ ఒక్కో ప్రాంతంలో రూ.600 నుంచి రూ.700 వరకు ఉంది. తగ్గిన ఉత్పత్తి.. పెరిగిన డిమాండ్ వేసవి నుంచి చికెన్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కారణంగా మాంసాహారం తినాలన్న ప్రచారంతో చాలా మంది డ్రైప్రూట్స్తో పాటు మాంసాహారాన్ని తీసుకోవడం ప్రారంభించారు. దీంతో చికెన్కు డిమాండ్ పెరిగింది. ఉత్పత్తి తగ్గడం, కొనుగోళ్లు పెరగడంతో ధరలు అమాంతం పెరిగాయి. గుడ్డుతోనే సరి.. చాలామంది మాంసం ధరలు పెరగడంతో గుడ్డుతోనే సరిపెడుతున్నారు. ఓ వారం మాంసం కొనుగోలు చేస్తే మరో వారం గడ్డుతో కానిచ్చేస్తున్నారు. కోడి గుడ్డు ధర రూ.6 వరకు పలుకుతోంది. గుడ్లు ఒకటి రూ.4నుంచి రూ.4.50కు విక్రయించే వారు వీటి ధరలు కూడా పెరిగి రూ.6కు తగ్గనంటోంది. -
బాప్రే! టోపీపై ఏకంగా 735.. ‘గుడ్డు’ రికార్డు!
డజను గుడ్లు పగలకుండా షాప్ నుంచి ఇంటికి తీసుకురావడానికి తలమునకలైపోతాము. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా 735 గుడ్లను తల టోపీపై ఉంచుకుని, అవి పగలకుండా నడిచి అందరినీ అబ్బురపరిచాడు. తన టాలెంట్తో ప్రపంచ రికార్డు కొట్టాడు కూడా. గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారికంగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చదవండి: లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఏకంగా రొటేటింగ్ హౌస్ కట్టించాడు!! పశ్చిమ ఆఫ్రికాలోని కేప్ టౌన్కు చెందిన గ్రెగరీ దా సిల్వా అనే వ్యక్తి ‘ఎగ్ మ్యాన్’గా అందరికీ సుపరిచితుడు. అందుకు ఒక పెద్ద హిస్టరీనే ఉంది. ప్రపంచమంతా తిరిగి తన ట్యాలెంట్ను వివిధ దేశాల్లో ప్రదర్శించాడట. అంతేకాకుండా పలు టెలివిజన్ షోలలో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. దీనితో అతడు వరల్డ్ ఫేమస్ ఎగ్మ్యాన్గా అందరికీ గుర్తుండిపోయాడు. చదవండి: అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!! ఈ వీడియోలో ఇతను ధరించిన టోపీపై గుడ్లన్నింటినీ అతికించడానికి మూడు రోజుల టైం పట్టిందట. చైనాలో సీసీటీవీ ఛానెల్ నిర్వహించిన గిన్నీస్ వరల్డ్ రికార్డు స్పెషల్ షోలో దీనిని తలపై పెట్టుకుని కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తూ ప్రదర్శించాడు. దీనిని చూసిన గిన్నీస్ రికార్డు అధికారులు ‘వావ్’అనకుండా ఉండలేక పోయారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక గుడ్లు సింగిల్ టోపీపై ధరించిన మొదటి వ్యక్తిగా గిన్నీస్ రికార్డులో స్థానం సంపాధించుకున్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో ప్రశంశల్లో ముంచెత్తుతున్నారు. ‘ఇది చాలా ఇమ్ప్రెస్సివ్గా ఉంది’ అని ఒకరు, ‘మొత్తం ఎగ్స్ బరువు ఎంత ఉంటుందని’ మరొకరు సరదాగా కామెంట్ చేశారు. వేల సంఖ్యలో నెటిజన్లు ఈ వీడియోను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్గా మారి..! View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
ఏడాదికి ఎన్ని గుడ్లు తినాలో తెలుసా?
గుడ్డు అంత శ్రేష్టమైన ఆహారం మరొకటి లేదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పోషణలో తల్లి పాల తర్వాత స్థానం గుడ్డుదే. గుడ్డు అనేక విటమిన్లు, మినరల్స్తో నిండిన సూపర్ ఫుడ్డు. గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్–ఇ, ఫొల్లేట్లు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్లు, 78 కాలరీల శక్తి ఉంటాయి. శరీరానికి అవసరమైన అన్ని కీలకమైన విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, మాంసకృత్తులు దీనిద్వారా లభిస్తాయి. తెల్ల సొనలో అల్బుమిన్ పుష్కలంగా ఉంటుంది. కండరాలను బలోపేతం చేసుకోవడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది. తెల్ల సొన వల్ల మహిళలకు అవసరం అయ్యే కాల్షియం పుష్కలంగా అందుతుంది. ముఖ్యంగా, మహిళల్లో ఎముకల ఆరోగ్యానికి, చాలా సహాయపడుతుంది. (ఎండలో ఎంతసేపుంటే సరిపడా విటమిన్ ‘డి’ అందుతుంది?) ఒక సర్వే ప్రకారం, 80 శాతం భారతీయుల ఆహారంలో ప్రోటీన్ల లోపం ఉన్నది. మనిషి బరువును బట్టి, కిలో బరువుకు, రోజుకు ఒక గ్రాము ప్రోటీన్ను ఆహారంలో తీసుకోవాలి. మరొక సర్వే ప్రకారం, 70–90 శాతం భారతీయులలో విటమిన్ డి లోపం ఉంది. ఆహార ఉత్పత్తులు ఎంత పెరిగినా, ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు మాత్రం తగిన మోతాదులో అందరికీ లభించటం లేదు. (బార్లీ, కొర్రలు.. వేపుళ్లు, నేతి వంటకాలు.. ఏవి తినాలి? ఏవి వద్దు?) ప్రతి వ్యక్తి సంవత్సరానికి కనీసం 180 గుడ్లు తినాలని జాతీయ పోషణ సంస్థ సూచించినది. కాని, మన దేశంలో సగటు వినియోగం 70 గుడ్లు మాత్రమే ఉన్నది. మెక్సికో, జపాన్, కొలంబియా లాంటి దేశాల్లో తలసరి వినియోగం 340 గుడ్ల వరకు ఉంది. మన వద్ద అది 70 కంటే మించడం లేదు. గుడ్ల వినియోగంలో, ప్రపంచంలో మన ర్యాంకు 114. ఇది చాలా తక్కువ. దీన్ని గుర్తించిన మన ప్రభుత్వాలు కూడా, విద్యార్థులకు, గర్భిణి స్త్రీలకు, మధ్యాహ్న భోజనం లాంటి పథకాల్లో గుడ్లను అందించి, పోషకాహార లోపం తలెత్తకుండా చూస్తున్నాయి. అంతర్జాతీయ ఎగ్ కమిషన్ ధ్యేయం గుడ్డు వినియోగంతోనే పోషకాల లోపాలను భర్తీచేసి, మెరుగైన ఆరోగ్యాన్ని సాధించటం. – సురేష్ చిట్టూరి, చైర్మన్, అంతర్జాతీయ ఎగ్ కమిషన్ -
రుచి తగ్గిన బ్రాయిలర్.. నాటుకోడికి జై, కిలో రూ.600
సాక్షి,తూర్పుగోదావరి: బ్రాయిలర్ రాకతో కనుమరుగైన నాటుకోళ్ల పెంపకం జిల్లాలో మళ్లీ ఊపందుకుంటోంది. మార్కెట్లు, రోడ్ల పక్కన వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నాటుకోడి గుడ్లు, మాంసాన్ని బలవర్ధక ఆహారంగా పరిగణిస్తారు. పూర్వం మాంసాహార ప్రియుల ఇళ్ల వద్ద కోళ్ల గూళ్లలో 10 నుంచి 30 వరకూ నాటుకోళ్లను పెంచేవారు. ఇంట్లో కూరలకు వీటి గుడ్లనే వినియోగించేవారు. చుట్టాలు వచ్చినప్పుడు వారికి నాటు కోడి కూర పెట్టడంతో పాటు పండగలప్పుడు నైవేద్యాలకు నాటుకోళ్లనే కోసేవారు. 1988–92 మధ్య కాలంలో జిల్లాలో లేయర్ కోళ్ల పరిశ్రమ విస్తరణతో తక్కువ ధరకే గుడ్లు లభించడం, ఇళ్ల వద్ద ఖాళీ స్థలాలు కనుమరుగవడంతో రానురానూ నాటుకోళ్ల పెంపకం తగ్గిపోయింది. మరోపక్క దుమ్ములు కూడా మెత్తగా నమలడానికి వీలుగా ఉండే బ్రాయిలర్ కోళ్ల వినియోగం పెరిగింది. అయితే కాలక్రమేణా మాంసాహార ప్రియుల అలవాట్లలో మార్పులొస్తున్నాయి. త్వరగా బరువు పెరగడానికి బ్రాయిలర్ కోళ్లకు చేస్తున్న హార్మోన్లు ఇంజక్షన్లు ఆరోగ్యానికి చేటు తెస్తాయన్న భావన పెరిగింది. దీనికితోడు వీటి మాంసం రుచి తగ్గడంతో నాటుకోడి వైపు మాంసాహార ప్రియులు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా నాటుకోళ్ల పెంపకం రెండేళ్లుగా జోరందుకుంది. లాభదాయకంగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా 200 పైగా నాటుకోళ్ల ఫారాలు ఏర్పాటయ్యాయి. గ్రామాల్లోని ఫారాల్లో కోళ్లను పెంచి వారాంతంలో పట్టణాలకు, నగరాలకు తీసుకువచ్చి మార్కెట్లు, రోడ్లు పక్కన ఉంచి విక్రయిస్తున్నారు. మార్కెట్లో నాటుకోడి లైవ్ కిలో రూ.600, చికెన్ రూ.700 ఉంటోంది. మటన్, నాటుకోడి ధరలు మార్కెట్లో దాదాపు ఒకేలా ఉంటున్నాయి. లేయర్ కోడి గుడ్డుతో పోలిస్తే నాటుకోడి గుడ్డులో పోషక విలువలు పుష్కలంగా ఉండటంతో ఒక్కో గుడ్డు రూ.20 పలుకుతోంది. లాభసాటిగా ఉంది నాటుకోళ్లకు డిమాండ్ పెరగడంతో రెండేళ్ల క్రితం పశువుల మకాం వద్ద నాటుకోళ్ల పెంపకం ప్రారంభించాం. గుడ్ల ఉత్పత్తికి వినియోగించే కోడిపుంజుకు రూ.75 వేలు, పెట్టకు రూ.12 వేలు వెచ్చించాం. పూర్తి ఆర్గానిక్ తరహాలో ఒక్కో బ్యాచ్ సిద్ధం కావడానికి ఎనిమిది నెలలు పడుతోంది. మా వద్ద పెంచిన కోళ్లను చికెన్ వ్యాపారులు హోల్సేల్గా తీసుకువెళుతుంటారు. నాటుకోళ్ల పెంపకం లాభసాటిగా ఉంది. – పిల్లా విజయ్కుమార్, ఆర్గానిక్ నాటుకోళ్ల రైతు, పాలతోడు చదవండి: ప్రకాశం జిల్లా: 11 మంది వీఆర్వోల సస్పెన్షన్ -
కోడిపుంజు గుడ్డు పెట్టింది.. ఇది నిజం!
తొట్టంబేడు: కోడిపెట్ట గుడ్లు పెట్టడం సృష్టి ధర్మం. ఇక్కడ విచిత్రంగా కోడిపుంజు గుడ్లు పెట్టి, పిల్లలు పొదిగింది. చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలోని పెద్దకన్నలి ఎస్టీ కాలనీలోని సుబ్రమణ్యంరెడ్డి ఇంట్లో 4 కోళ్లతో పాటు ఒక పుంజు ఉంది. ఈ కోడి పుంజు ఐదు గుడ్లు పెట్టింది. ఇదేంటి గుడ్లు పెడుతోందని యజమాని ఆశ్చర్యపోయాడు. అయితే ఏం చేస్తుందో చూడాలని, ఆ గుడ్లు తీసుకెళ్లి పుంజు కిందపెట్టడంతో అది 5 పిల్లలను పొదిగింది. ప్రస్తుతం ఆ పుంజు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆ కోడిపుంజును, పిల్లలను చూసి వెళ్తున్నారు. అయితే పుంజు గుడ్లు పెట్టడంపై వెటర్నరీ అధికారి వీరభద్రరెడ్డి వివరణ ఇచ్చారు. జన్యుపరమైన కారణాలతో ఇలా అరుదుగా ఇలాంటి ఘటనలు జరుగుతాయని తెలిపారు. -
కోడిగుడ్ల కొనుగోలులో భారీ కుంభకోణం.. మంత్రికి వ్యతిరేకంగా..
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): మహిళా, శిశు సంక్షేమశాఖలో పేదలకు అందజేసే కోడిగుడ్ల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని మహిళా కాంగ్రెస్ నాయకులు మైసూరులో ధర్నా నిర్వహించారు. మంత్రి శశికళా జొల్లె చిత్రపటాలు, కోడిగుడ్ల ట్రేలను రోడ్డు మీద పెట్టి బైఠాయించారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు. ఇంతలో పోలీసులు వచ్చి వారిని బలవంతంగా అరెస్టు చేసి తరలించారు. మరోవైపు మంత్రి శశికళా స్పందిస్తూ కొందరు తనపై తప్పుడు ప్రచారం చేయటం సరికాదన్నారు. అమ్మాయిలను వేధిస్తే ఊరుకోం యశవంతపుర: అమ్మాయిలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు నగర సీపీ కమల్పంత్ హెచ్చరించారు. శనివారం ఆయన నందిని లేఔట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల సమావేశంలో పాల్గొని ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. బస్టాప్లు, కళాశాలల వద్ద యువకులు తిష్టవేసి అమ్మాయిలను వేధిస్తే ఉపేక్షించమని అన్నారు. నందిని లేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలో గంజాయి కేసుల సంఖ్య అధికం కావటంతో పోలీసులు రాత్రి గస్తీని పెంచాలని సూచించారు. -
కల్తీ కోడిగుడ్ల కలకలం
-
గుడ్డు నుంచి పిల్ల వరకు..
పాలమూరు యూనివర్సిటీలోని ఓ చెట్టుకు ఈ స్పైడర్ హంటర్ పక్షి గూడు కట్టడం నుంచి, అందులో గుడ్లు పెట్టి, పొదిగి పిల్లలు బయటికి వచ్చే వరకు వివిధ దశలను ‘సాక్షి’తన కెమెరాలో బంధించింది. ఈ పక్షికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పాలమూరు యూనివర్సిటీ జువాలజీ అధ్యాపకుడు రాజశేఖర్ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఈ పక్షి సైంటిఫిక్ పేరు ఆర్చినొతిరా లాంగిరోస్ట్రా. ఇంగ్లిష్ పేరు సన్బర్డు. సాధారణంగా స్పైడర్ హంటర్ అని పిలుస్తారని, ఈ పక్షి చిన్నపాటి చెట్లపై గూడు పెట్టి వర్షాకాలం ప్రారంభంలో కేవలం 15 నుంచి 16 రోజుల్లోనే గుడ్లు పెట్టి పొదిగి పిల్లలకు జన్మనిస్తాయని వెల్లడించారు. – మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ -
కొండెక్కిన కోడి కూర.. వారంలోనే రూ.100 పెరిగింది
సాక్షి,శ్రీకాకుళం: చికెన్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేనంతగా పెరిగిపోయాయి. కరోనా నేపథ్యంలో పౌష్టికాహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో చాలామంది చికెన్ తినేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో దీని ధర అమాంతం పెరిగిపోయింది. వారం రోజుల వ్యవధిలో కిలోపై వంద రూపాయలకు పైగా పెరిగింది. ఈ పరిస్థితి చూసి చాలామంది చికెన్ కొనేందుకు భయపడుతున్నారు. ఈ నెల నాలుగో తేదీ ఆదివారం కిలో రూ.285 ఉండగా.. తాజాగా మంగళవారం మరో రూ. 15 పెరిగి రూ. 300 చేరింది. నిత్యావసరాల సరుకుల ధరలు నియంత్రించే అధికారం మార్కెటింగ్ శాఖ అధికారులకు ఉండగా.. చికెన్, గుడ్లు ధరలు కట్టడి చేసే అధికారం మాత్రం వీరి చేతుల్లో లేదు. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది వ్యాప్యారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచుతున్నారనే ఆరోపణలు వినియోగదారుల నుంచి వినిపిస్తున్నాయి. డిమాండ్ బట్టి ధరల పెంపు మార్కెట్లో చికెన్కు డిమాండ్ అధికంగా ఉన్న సమయంలో బ్రాయిలర్ అసోసియేషన్ ధర నిర్ణయిస్తోంది. గుడ్ల ధరలను నేషనల్ ఎగ్ కో–ఆర్డినేషన్ కమిటీ సభ్యులు నిర్ణయిస్తారు. వీరంతా ప్రైవేటు వ్యక్తులు కావడంతో తమకునచ్చినప్పుడు ధరలు ఇష్టారాజ్యంగా పెంచుకుంటూ పోతున్నారు. ఇటీవల కాలంలో మాంసం ప్రియులు పెరగడంతో దాన్ని అదునుగా చేసుకొని ధరలు పెంచేస్తున్నారు. కోళ్లు అందుబాటులో ఉన్నా కావాలనే కొరత సృష్టించి డిమాండ్ పెంచి అధిక ధరలకు అమ్ముతున్నారనే విమర్శలు వస్తున్నాయి. హోల్సేల్ వ్యాపారులకు బాగానే ఉన్నా రిటైల్ అమ్మకందారులు మాత్రం కస్టమర్లకు సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. ధరలు పెంచడంతో కిలో కొనుగోలు చేసేవారు అర కేజీతో సరిపెట్టుకుంటున్నారు. జిల్లాలో రోజుకి లక్ష కేజీల చికెన్ అవసరం ఉంటుంది. సుమారు ప్రస్తుతమున్న ధర ప్రకారం రూ.3 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది. జిల్లా వాసులకు రోజుకి ఎనిమిది లక్షల గుడ్లు అవసరం. అయితే జిల్లాలో సుమారు ఆరు లక్షల వరకు ఉత్పత్తి జరుగుతోంది. మిగిలిన వాటిని ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. -
మూలకణాలతో పిండం అభివృద్ధి!
సృష్టికి ప్రతిసృష్టి చేయడంలో మనిషి ఇంకో అడుగు ముందుకేశాడు. శరీరంలోని ఏ కణంగా అయినా మారిపోగల సామర్థ్యమున్న మూలకణాలతో ఏకంగా ఓ పిండాన్ని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన థిస్సీ ల్యాబ్ అభివృద్ధి చేశారు. ఈ పద్ధతిని మరింత అర్థం చేసుకుంటే.. భవిష్యత్తులో మనిషికి కావాల్సిన అవయవాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు. క్రిస్టీన్, బెర్నార్డ్ థిస్సే అనే ఇద్దరు శాస్త్రవేత్తలు మూలకణాలతో పిండం తయారు చేయడం ఎలా అన్న దానిపై పరిశోధనలు చేపట్టి పాక్షిక విజయం సాధించారు. చేపలతో మొదలుపెట్టి ఎదురైన వైఫల్యాలను అర్థం చేసుకుని సరిదిద్దుకోవడం ద్వారా ఈ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో ముందడుగు వేశారు. ఎలుకల నుంచి సేకరించిన పలు మూలకణాలతో ప్రయోగాలు చేశామని క్రిస్టీన్ తెలిపారు. తామిచి్చన సూచనలకు అనుగుణంగా మూలకణాలు దశలవారీగా పిండం లాంటి నిర్మాణంగా ఎదిగాయని, ఈ క్రమంలో అవి పిండం అభివృద్ధి చెందే దశలు ఒక్కొక్కటీ దాటాయని వివరించారు. ఇలా అభివృద్ధి చెందిన నిర్మాణంలో ఎలుక పిండంలో మాదిరిగానే పలు రకాల కణజాలం కనిపించిందని తెలిపారు. అయితే ప్రస్తుతానికి తాము పూర్తిస్థాయిలో ఎదిగిన పిండాన్ని తయారు చేయలేకపోయామని చెప్పారు. మెదడును అభివృద్ధి చేయడం తమ ముందున్న అతిపెద్ద సవాల్ అని, ఈ సమస్యను అధిగమిస్తేనే పూర్తిస్థాయి పిండం తయారీ వీలవుతుందని వివరించారు. -
తవ్వకాల్లో వెయ్యి సంవత్సరాల కోడిగుడ్డు లభ్యం
జెరూసలేం: ఇజ్రాయెల్లో ఇటీవల జరిపిన తవ్వకాల్లో వెయ్యి సంవత్సరాల నాటి కోడిగుడ్డు దొరికింది. ఆశ్చర్యం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు గడిచినా సురక్షితంగా ఉన్నది. దానికి బయటకు తీసి శుభ్రపరుస్తుండగా పగుళ్లు వచ్చాయి. వెయ్యేండ్ల నాటి ఈ కోడిగుడ్డును అతి జాగ్రత్తగా భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోడిగుడ్లు వారం రోజులకే చెడిపోతున్న తరుణంలో వేయి సంవత్సరాల నుంచి ఈ కోడిగుడ్డు ఎలా భద్రంగా ఉందో కనుక్కొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది ప్రపంచంలోని పురాతన గుడ్లలో ఒకటి అని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అద్భుతమైన ఆవిష్కరణ గురించి ఇజ్రాయెల్ పురావస్తు విభాగం ఫేస్బుక్లో ఒక వివరణాత్మక పోస్ట్ను షేర్ చేశారు. ఇజ్రాయెల్లోని యావ్నేలో పట్టణ అభివృద్ధి ప్రాజెక్టు పనుల తవ్వకాల సమయంలో ఈ పురాతన కోడిగుడ్డు దొరికింది. ఈ గుడ్డు 10 వ శతాబ్దానికి చెందినదని భావిస్తున్నారు. యావ్నేలో పురావస్తు త్రవ్వకాల్లో దాదాపు 1000 సంవత్సరాల క్రితం నాటి కోడిగుడ్డు కనుగొన్నాం అని ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు. ఇలాంటి అతిపురాత కోడిగుడ్డు దొరకడం చాలా అరుదు అని ఇజ్రాయేల్ పురవాస్తు విభాగానికి చెందిన నిపుణురాలు డాక్టర్ లీ పెర్రీ గాల్ చెప్పారు. -
మాట తప్పావంటూ ట్రోలింగ్.. కోహ్లి కౌంటర్
ముంబై: మూడేళ్ల క్రితం తాను శాఖాహారిగా మారినట్లు వెల్లడించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. తాజాగా రెండు రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్తో ముచ్చటిస్తూ.. తన డైట్లో గుడ్లు తీసుకుంటానని తెలిపాడు. వెజిటేరియన్ అని చెప్పి గుడ్లు తింటావా.. ఇదేంది కోహ్లి అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలపై కోహ్లి ఘాటుగా స్పందించాడు. నేను శాఖాహారినని ఎప్పుడు చేప్పలేదే అన్నాడు. తాజాగా ఇన్స్టా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన కోహ్లి.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులుగా తన డైట్కు సంబంధించిన విషయాలను వెల్లడించాడు. తనడైట్లో కూరగాయాలు, గుడ్లు, కాఫీ, పప్పు, పాలకూర, దోశలు ఉంటాయన్నాడు. అయితే వీటన్నిటిని మితంగా తీసుకుంటానని తెలిపాడు. ఇక కోహ్లి గుడ్లు తింటానని చెప్పడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాంసం తినడం లేదని, పూర్తిగా వెజిటేరియన్గా మారనని గతంలో చెప్పిన కోహ్లి ఇప్పుడేలా గుడ్లు తింటున్నాడని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. గతేడాది లాక్డౌన్ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్తో ఇన్స్టా వేదికగా లైవ్ సెషన్లో పాల్గొన్న విరాట్.. తన అనారోగ్య సమస్యల కారణంగా శాఖహారిగా మారినట్లు తెలిపాడు. వెన్నుముకలో తలెత్తిన సమస్య కారణంగా మాంసాహారానికి దూరంగా ఉంటున్నానని తెలిపాడు. అది తనకు మేలు చేసిందని కూడా చెప్పాడు. ఇక ఈ వ్యాఖ్యలనే ప్రస్తావించిన అభిమానులు కోహ్లిపై విమర్శల వర్షం కురిపిస్తూ.. తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శాఖాహారి అని చెప్పి కోహ్లి గుడ్లు తింటున్నావా.. గుడ్లు నాన్వెజ్ కాదనుకుంటా.. అంటూ కామెంట్ చేశారు. కోహ్లి కూడా మనలానే మాట తప్పాడని మరికొందరు విమర్శించారు. ఈ ట్రోలింగ్పై స్పందించిన కోహ్లి.. ఘాటుగానే బదులిచ్చాడు. 'నేను శాఖాహారిని అని ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పటికే అలానే ఉంటానని కూడా అనలేదు. గట్టిగా గాలి పీల్చుకొని మీ కూరగాయాలు మీరు తినండి' అంటూ ఫన్నీ ఎమోజీలతో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. ఇంగ్లండ్ పర్యటనకు సిద్దమవుతున్న కోహ్లీ.. ముంబై వేదికగా బీసీసీఐ ఏర్పాటు చేసిన బయోబబుల్లో క్వారంటైన్ పాటిస్తున్నాడు. ఇక బుధవారమే టీమిండియా.. ఇంగ్లండ్కు పయనం కానుంది. I never claimed to be vegan. Always maintained I'm vegetarian. Take a deep breath and eat your Veggies (if you want 😉)💪😂✌️ — Virat Kohli (@imVkohli) June 1, 2021 చదవండి: ఏంటి కోహ్లి.. ఫీజు ఒకేసారి చెల్లిస్తావా లేక ఈఎంఐల్లో కడతావా.. ? -
కోళ్ల 'మేత' కూత
సాక్షి, అమరావతి బ్యూరో: కోళ్ల దాణా ధర కొండెక్కింది. దీన్లో అధికంగా వినియోగించే సోయా రేటు పెరగడంతో ఆ ప్రభావం ఈ దాణాపై పడింది. అది చికెన్, కోడిగుడ్లపై ప్రభావం చూపుతోంది. సోయా ధర 4 నెలల్లో రెట్టింపయింది. ప్రస్తుతం చికెన్, గుడ్ల ధరలు కోళ్ల పెంపకందార్లకు ఊరటనిస్తున్నా పెరిగిన కోళ్ల మేత ధర భారంగా మారింది. కోళ్ల మేతను సోయా, మొక్కజొన్న, తవుడు, సజ్జలు, రాగులు, వరి నూక, వేరుశనగ చెక్కలతో తయారుచేస్తారు. వీటిలో సోయా, మొక్కజొన్నలను ఎక్కువగా వినియోగిస్తారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో సోయా ధర టన్ను రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఉండేది. ప్రస్తుతం అది రూ.70 వేల నుంచి రూ.75 వేల మధ్య పలుకుతోంది. ఫలితంగా దాణా ధర నాలుగు నెలల్లో రూ.17 వేల నుంచి రూ.27 వేలకు చేరింది. డిసెంబర్, జనవరిల్లో సోయా ధర టన్ను రూ.30 వేల నుంచి రూ.35 వేల మధ్య ఉన్నప్పుడు మన దేశం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది రూ.2 వేల కోట్ల విలువైన సోయా ఎగుమతులు జరగ్గా, ఈ ఏడాది నాలుగు రెట్లు అధికంగా అంటే రూ.8 వేల కోట్ల ఎగుమతులు జరిగినట్టు పౌల్ట్రీ వర్తకులు చెబుతున్నారు. ఎగుమతులు ఎక్కువగా చేయడం వల్ల దేశీయంగా సోయా కొరత ఏర్పడింది. దీంతో దాణా ధర పెరిగింది. కోడి పూర్తిస్థాయిలో ఎదగడానికి 6 వారాలు పడుతుంది. ఈ 6 వారాల్లో ఒక బ్రాయిలర్ (చికెన్) కోడి 4 కిలోలకుపైగా, గుడ్ల (లేయర్) కోడి గుడ్లుపెట్టే దశకు వచ్చే సరికి 8 కిలోల వరకు మేత తింటాయి. 4 నెలల కిందటి ధరతో పోల్చుకుంటే కిలోకు రూ.10 చొప్పున మేత ధర పెరిగింది. అంటే బ్రాయిలర్ కోడిపై రూ.40, లేయర్ కోడిపై రూ.80 మేత ఖర్చు పెరిగింది. కోళ్ల మేత ధరల పెరుగుదల ఇంతలా ఊహించలేదని, ఇవే ధరలు కొనసాగితే పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతింటుందని కృష్ణా, గుంటూరు బ్రాయిలర్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుచ్చారావు ‘సాక్షి’తో చెప్పారు. కోళ్ల మేత వినియోగంలో 2వ స్థానం ఇండియా పౌల్ట్రీ ఫీడ్ మార్కెట్ అంచనా ప్రకారం.. కోళ్ల మేత వినియోగంలో దేశంలోకెల్లా తమిళనాడు మొదటి స్థానంలోను, ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలోను ఉన్నాయి. రాష్ట్రంలో ఏటా బ్రాయిలర్ కోళ్లకు సుమారు 1.50 మిలియన్ టన్నులు, లేయర్ కోళ్లకు 3.40 మిలియన్ టన్నుల మేత అవసరమవుతోంది. ఏటా చికెన్, గుడ్ల వినియోగం పెరుగుతుండడంతో ఆ మేరకు మేత అవసరం కూడా పెరుగుతూ వస్తోంది. పౌల్ట్రీ రంగంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు వృద్ధిలో ఉన్నాయి. దీంతో మన రాష్ట్రంపై కోళ్ల మేత ఉత్పత్తి సంస్థలు దృష్టి సారించాయి. పెరిగిన గుడ్లు,చికెన్ వినియోగం కోవిడ్ ఉధృతి సమయంలో కోడిగుడ్లు, చికెన్ వినియోగం పెరిగింది. కోడిగుడ్డు తింటే వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుందన్న డాక్టర్లు, న్యూట్రిషనిస్టుల సూచనలతో ఎక్కువమంది వీటిని తినడానికి మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో రోజుకు 4.50 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. సాధారణ రోజుల్లో రాష్ట్రంలో రోజుకు సగటున 3 కోట్ల గుడ్లు వినియోగం అవుతుంటాయి. ప్రస్తుతం కోవిడ్ ప్రభావంతో రోజుకు అదనంగా 50 లక్షల గుడ్ల వినియోగం పెరిగింది. అదే సమయంలో గుడ్ల ధరలు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. ఈనెల 5న విజయవాడలో 100 గుడ్ల ధర హోల్సేల్లో రూ.370 ఉండగా 27 నాటికి రూ.541కి, విశాఖపట్నంలో రూ.360 నుంచి రూ.557కి పెరిగింది. మరోవైపు చికెన్ వినియోగం కూడా ఆశాజనకంగానే ఉంది. రాష్ట్రంలో రోజుకు సగటున 8 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతున్నాయని అంచనా. రెండేళ్ల కిందటితో పోల్చుకుంటే చికెన్ కొనుగోళ్లు పెరిగాయని వర్తకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల కిలో చికెన్ ధర రూ.200కు అటుఇటుగా ఉంది. -
Stress Relief:: నువ్వులు.. గుడ్లు.. శనగలు..షెల్ఫిష్!
ఒత్తిడి ఎదుర్కోని మనిషి ప్రస్తుత సమాజంలో కనిపించడం అరుదు. ఆధునిక సాంకేతికత కొత్త పుంతలు తొక్కి మనిషి జీవితం ఉరుకులు పరుగుల మయం అయ్యాక ఎన్నో శారీరక, మానసిక సమస్యలు విజంభిస్తున్నాయి. అలాంటి వాటిలో ఒత్తిడి(స్ట్రెస్) ఒకటి. ఆఫీసులో అప్పగించిన పనిని సకాలంలో పూర్తిచేయాలని టార్గెట్లు పెట్టడం, పోటీ రంగంలో ఇతరులు ముందుకు దూసుకెళ్లుతుండడం, అనుకున్న లక్ష్యాల్ని చేరుకొనే క్రమంలో ఆలస్యం కావడం వంటివి ఒత్తిడికి కారణమవుతున్నాయి. ఫలితంగా హృద్రోగాలు, బీపీ, మధుమేహం వంటివి చుట్టుముడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి ఈ ఒత్తిడి డిప్రెషన్గా మారి బలవన్మరణాలకు సైతం ప్రేరేపిస్తోంది. అందువల్ల శారీరక మానసిక ఆరోగ్యంతో ఉండాలంటే ఒత్తిడిని దరిచేరనీయకపోవడం అత్యుత్తమం. దీనికోసం తోడ్పడే కొన్ని రకాల ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం... చిలగడ దుంపలు ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ హార్మోన్ స్థాయిని ఇవి తగ్గిస్తున్నట్లు ఓ పరిశోధనలో తేలింది. ఊబకాయం, అధిక బరువుతో ఉండే కొందరు మహిళలను ఎంచుకొని వారికి కొన్ని రోజుల పాటు చిలగడ దుంపలను ఆహారంగా ఇచ్చారు. అనంతరం వారికి పరీక్షలు చేసినప్పడు అంతకుముందుతో పోలిస్తే కార్టిసోల్ స్థాయిలు తగ్గినట్లు గుర్తించారు. చిలగడ దుంపల్లో ఉండే విటమిన్ సి, పొటాషియం ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు కనుగొన్నారు. మచా పొడి గ్రీన్ టీ ఆకులతో చేసే ఈ పొడి జపాన్లో చాలా ప్రసిద్ధి. ఇందులో ఎల్–థియానిన్ అనే ప్రొటీనేతర అమైనో ఆమ్లం ఎక్కువ పాళ్లలో ఉంటుంది. ఇది ఒత్తిడిని సమర్థంగా తగ్గిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. దీనికోసం కొంతమందిని ఎంచుకొని వారికి రోజుకు 4.5గ్రాముల మచా పొడి ఉన్న బిస్కెట్లను 15 రోజుల పాటు ఆహారంగా ఇచ్చారు. ఆ తర్వాత పరీక్షించగా వారిలో ఒత్తిడి చాలా వరకు తగ్గినట్లు గుర్తించారు. కాగా, ఈ పొడి తయారీకి గ్రీన్ టీ ఆకులను ఒక ప్రత్యేక పద్ధతిలో సేకరిస్తారు. షెల్ఫిష్ అంటే రక్షణ కవచాలు ఉన్న నత్తలు, ఆల్చిప్పలు, మస్సెల్స్ వంటివి. వీటిలో అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ప్రత్యేకంగా మనసును ఉల్లాసంగా ఉంచగలిగే టారిన్ ఎక్కువగా ఉంటుంది. దీనితోపాటు ఉండే డోపమైన్ ఒత్తిడి నిరోధకంగా పనిచేస్తున్నట్లు అనేక సర్వేలు వెల్లడించాయి. స్విస్ చార్డ్ సాధారణంగా శరీరంలో మెగ్నీషియం ఉండాల్సిన స్థాయి కంటే తక్కువ ఉన్నప్పుడు ఆందోళన, ఒత్తిడి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి విరుగుడుగా స్విస్ చార్డ్ అనే వంటకం సమర్థంగా పనిచేస్తున్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. స్విస్ చార్డ్ అంటే క్యాబేజీని తలపించే ఒక దుంప చెట్టు. దీని ఆకుల్లో ఒత్తిడితో పోరాడే పోషకాలున్నాయి. ప్రత్యేకంగా మెగ్నీషియం పాళ్లు కొంచెం అధికం. 175 గ్రాముల స్విస్ చార్డ్ ఆకులను కూరగా వండినప్పుడు అందులో 36శాతం మెగ్నీషియం ఉంటుంది. ఇది శరీరంలో ఒత్తిడి తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఆర్గాన్ మీట్ అంటే అవయవ మాంసం. కోళ్లు, పొట్టేళ్లు, మేకలు వంటి జంతువుల గుండె, కాలేయం, మూత్రపిండాలతో చేసే వంటకాల్లో బి12, బి16, రైబోఫ్లవిన్, ఫ్లోట్ వంటి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తాయి. దాదాపు 18 సర్వేలు దీనిని రుజువు చేశాయి. అసిరోలా చెర్రీ పొడి ఎర్రటి రేగు పండ్లలా అనిపించే అసిరోలా అనే ఒక రకం చెర్రీ పొడి ఒత్తిడి నివారణకు ఉపయోగపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ చెర్రీలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. సిట్రస్ జాతి రకాలైన నిమ్మ, నారింజ, బత్తాయి వంటి వాటికంటే ఇందులో 50 నుంచి 100శాతం విటమిన్ సి అధికంగా ఉంటుంది. అసిరోలా పండ్లు, లేదా పొడిని తిన్నప్పుడు అందులోని విటమిన్ సి ఉల్లాసంగా ఉంచడంతో డిప్రెషన్, కోపం తగ్గిస్తోందని గుర్తించారు. పొద్దుతిరుగుడు విత్తనాలు: వీటిలో విటమిన్ ‘ఇ’ అధిక స్థాయిలో ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యం మెరుగుపరచడంలోనూ సమర్థంగా పనిచేస్తుంది. విటమిన్ ‘ఇ’ తక్కువ పాళ్లలో ఉన్నవారిలో డిప్రెషన్ ఉన్నట్లు గుర్తించారు. ఫాటీ ఫిష్ ఒమెగా 3 ఆమ్లాలు, విటమిన్ డి అధికంగా ఉండే చేపలను ఆహారంగా తీసుకోవడం వల్ల అవి ఒత్తిడి స్థాయిలను తగ్గించడంతోపాటు మనసును ఉల్లాసంగా చేస్తున్నట్లు తేలింది. సాధారణంగా మెదడు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడే ఒమేగా–3 ఆమ్లాలు ఒత్తిడిని తగ్గించడంలోనూ సమర్థంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇంకా చెప్పాలంటే ఒమేగా–3 తగినంత స్థాయిలో లేకపోవడం వల్లే ఆందోళన, డిప్రెషన్కు గురయ్యే వారి సంఖ్య పశ్చిమ దేశాల్లో ఎక్కువగా ఉంటోన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కిమ్చి ఇది క్యాబేజీ, ముల్లంగితో తయారుచేసే ఒక రకం ఆవకాయ. దీనిని ఎక్కువగా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో తయారుచేస్తారు. ఇందులో ప్రొబయాటిక్స్, విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ అధికస్థాయిలో ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం వివిధ రకాల ఒత్తిళ్లతో బాధపడే 710 మంది యువతను ఎంచుకొని ఓ సర్వే నిర్వహించారు. వీరూ రోజూ తీసుకునే ఆహారంలో కిమ్చి తప్పనిసరిగా ఉండేట్లు చేశారు. కొన్ని రోజుల తర్వాత వీరికి పరీక్షలు జరిపినప్పుడు ఒత్తిడిని కలిగించే మూలకాలు అతి తక్కువ ఉన్నట్లు గుర్తించారు. వెల్లుల్లి వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి గ్లటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ను ఉత్పత్తిచేస్తాయి. ఇది ఒత్తిడిని ఎదుర్కొనే రక్షణఛత్రంలో మొదటి మూలకంగా పనిచేస్తుంది. అనేక ప్రయోగాల్లో ఇది రుజువైంది. చమోమిలే టీ చమోమిలే(సీమ చేమంతి) టీని తాగడం ద్వారా మంచి నిద్ర రావడంతోపాటు ఒత్తిడిని తగ్గిస్తున్నట్లు వైద్యనిపుణులు గుర్తించారు. సీమ చేమంతి పూలను ఎండబెట్టి ఆ పొడిని బాగా మరిగించిన ఓ గ్లాసు నీళ్లలో వేసి మూడు నిమిషాలు కలియబెట్టాలి. ఆ తర్వాత కొద్దిగా తేనె కానీ నిమ్మరసం కానీ అందులో పిండితే చమోమిలే టీ సిద్ధం. 45 మందికి రోజూ 1.5 గ్రాముల పొడి వేసి ఇచ్చిన చమోమిలే టీని 8 వారాల పాటు ఇచ్చి పరిశీలించగా వారిలో ఒత్తిడిని కలిగించే కారిస్టోల్ హార్మన్ గణనీయంగా తగ్గినట్లు తేలింది. నువ్వులు నువ్వులతో తయారుచేసే పిండి ముద్దల్లో ఎల్–ట్రిప్టోపాన్ అనే అమైనో ఆమ్లం పాళ్లు ఎక్కువ. ఇది మనసును ఉల్లాసంగా ఉంచే డోపమైన్, సెరటోనిన్ ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది. అలాగే డిప్రెషన్, ఒత్తిడిని తగ్గించేందుకు తోడ్పడుతుంది. 25 మంది యువకులకు నాలుగు రోజుల పాటు నువ్వుల పిండి ముద్దలను ఆహారంగా ఇచ్చి పరిశీలించినప్పుడు వారిలో ఆందోళన, ఒత్తిడి స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు ఓ సర్వేలో తేలింది. గుడ్లు గుడ్లలో పోషకాలు పుష్కలం అనే విషయం తెలిసిందే. వీటిలో విటమిన్లు, మినరల్స్, అమైనో ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్స్ సంతప్త స్థాయిలో లభిస్తాయి. ప్రత్యేకంగా ఇందులో చోలిన్ అనే పోషకం పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతోందని, అలాగే ఒత్తిడి నివారణకు సమర్థంగా పనిచేస్తోందని వైద్యులు గుర్తించారు. శనగలు ఒత్తిడిని తగ్గించడంలో కీలకపాత్ర పోషించే మెగ్నీషియం, పొటాషియం, బి విటమిన్స్, జింక్, మాంగనీస్, సెలినియం, కాపర్ మూలకాలు శనగల్లో అధిక స్థాయిలో ఉంటాయి. అలాగే ఎల్–ట్రిప్టోపాన్ సైతం ఎక్కువగానే ఉంటుంది. ఇవన్నీ మనిషిని ఉల్లాసంగా ఉంచడంతోపాటు ఒత్తిడి తగ్గేందుకు దోహదం చేస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. చదవండి: నోటి దుర్వాసనా.. ఇలా దూరం చేసుకోండి! -
కోడి గుడ్ల కోసం.. ఛీ ఇదేం పాడు పని పోలీసు
చంఢీగడ్: దొంగలని పట్టుకోవాల్సిన పోలీసే.. దొంగగా మారాడు. అది కూడా కోడి గుడ్ల కోసం. వినడానికి వింతగా ఉన్నా ఈ ఘటన పంజాబ్లోని ఫతేఘర్ సాహిబ్ టౌన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రోడ్డు పక్కన ఓ గుడ్ల వ్యాపారి సైకిల్ మీద గుడ్ల ట్రేను ఉంచి ఏదో పని నిమిత్తం పక్కకు వెళ్లాడు. అటుగా వచ్చిన హెడ్ కానిస్టేబుల్ ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో భలే చాన్స్ అనుకుని గుడ్ల ట్రేలో నుంచి కొన్ని గుడ్లని తీసుకుని తన ప్యాంట్లో వేసుకున్నాడు. గుడ్ల వ్యాపారి అక్కడకు రాగానే.. ఏమి తెలియనట్లు అటు నుంచి మెల్లగా జారుకున్నాడు. అటుగా వెళ్తున్న ఆటోను ఆపి అందులో ఎక్కి వెళ్లిపోయాడు. ఆ పోలీసు ఎవరూ చూడలేదు అనుకున్నాడు గానీ కెమెరా ముందు దొరికిపోయాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ వైరల్ అయ్యింది. గుడ్ల దొంగతనానికి పాల్పడిన హెడ్ కానిస్టేబుల్ను ప్రీత్పాల్ సింగ్గా గుర్తించారు. అతడిని విధుల నుంచి పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ( చదవండి: చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తారో చూద్దామని ‘చనిపోయింది’! ) A video went viral wherein HC Pritpal Singh from @FatehgarhsahibP is caught by a camera for stealing eggs from a cart while the rehdi-owner is away and putting them in his uniform pants. He is suspended & Departmental Enquiry is opened against him. pic.twitter.com/QUb6o1Ti3I— Punjab Police India (@PunjabPoliceInd) May 15, 2021 -
తెలుపు, బ్రౌన్ కలర్ గుడ్డు: ఈ నిజాలు మీకు తెలుసా?
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కకావికలం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు, వైరస్ సోకిన వారు దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు చాలా మంది పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడంపై దష్టిపెడుతున్నారు. ఇందులో గుడ్డు మొదటి వరుసలో ఉంది. సాధారణంగా కోడి గుడ్లను మనం ఎక్కువగా తీసుకుంటుంటాం. ఇందులో బ్రాయిలర్, నాటు కోడి గుడ్లు ముఖ్యమైనవి. ఇవి తెలుపు రంగులో ఉంటాయి. అయితే, వీటికితోడు బ్రౌన్ (గోధుమ రంగు) గుడ్లు కూడా మనకు లభిస్తున్నాయి. ఇవి తెల్లటి గుడ్లకంటే మంచివని అంతా భావిస్తుంటారు. వాస్తవానికి రంగుతో సంబంధం లేకుండా, గుడ్డు ఏదైనా సరే పోషకాలు మాత్రం ఒక్కటేనని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు రకాల గుడ్లలో విటమిన్లు, మినరల్స్తో పాటు శరీరానికి అవసరమైన ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. రుచి విషయంలో తెలుపు, గోధుమ రంగు గుడ్లలో కొద్ది తేడా ఉన్నప్పటికీ పోషకాలు మాత్రం సమానమే. నిజానికి కోడి గుడ్డు పెంకు ఏ రంగులో ఉన్నా వాటిల్లోని పోషకాలు ఒకేలా ఉంటాయి. కాకపోతే నాటు కోడి గుడ్డు పరిమాణం కాస్త చిన్నగానూ ఫారం కోడి గుడ్లు కాస్త పెద్దగానూ ఉంటాయి. ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్.. కేలరీలు, ప్రొటీన్స్, కొలెస్ట్రాల్ విషయంలో తెలుపు, గోధుమ రంగు గుడ్లు సమానంగా ఉంటాయి. బ్రౌన్ గుడ్లలో మాత్రం ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ పాళ్లు కొంత ఎక్కువగా ఉంటాయి. అది పెద్ద తేడా కాదని నిపుణులు చెబుతున్నారు. తెల్లవైనా, బ్రౌన్వి అయినా 100 గ్రాముల గుడ్డులో దాదాపు 13 గ్రాముల ప్రొటీన్స్ ఉంటాయి. కానీ బ్రౌన్ ఎగ్స్ను సేంద్రియ పద్ధతి(ఆర్గానిక్)లో ఉత్పత్తి చేయడం వల్ల అందులో పోషకాలు అధికంగా ఉంటాయన్న అపోహతోనే వినియోగదారులు వీటిని కొనుగోలుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిజానికి బ్రౌన్ ఎగ్స్ ఉత్పత్తి తక్కువ కాబట్టే డిమాండ్ ఎక్కువని, అందుకే అవి అధిక ధర పలుకుతున్నాయని నిపుణులు అంటున్నారు. కోళ్లను బట్టి సైజు... గుడ్ల సైజు విషయంలో తెల్లవి కాస్త పెద్దగా, బ్రౌన్వి కాస్త చిన్నగా ఉంటాయి. గుడ్డు పరిమాణం కోడి సైజును బట్టి ఉంటుంది. అలాగే వేసవిలో పెట్టే గుడ్లు చిన్నవిగానూ, చలికాలంలో పెట్టే గుడ్లు పెద్దవిగానూ ఉంటాయి. -
పచ్చ సొన.. సుగుణాల సోనా: డాక్టర్ ప్రత్యూషారెడ్డి
‘కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని అందరికీ తెలుసు. అయితే కొంతమంది కొవ్వు చేరుతుందని అందులోని పచ్చసొనను పక్కనపెట్టి తెల్లసొన మాత్రమే తింటుంటారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. డీ విటమిన్ కొరత రాకుండా ఉండాలంటే రోజూ కోడిగుడ్డు తినాలి. గుడ్డులో ఉండే పచ్చసొనలో లభించే డీ విటమిన్ మరెక్కడా లభించదు’ అంటున్నారు డాక్టర్ ప్రత్యూషారెడ్డి. హైదరాబాద్లో ఎంబీబీఎస్ చదివి, అమెరికాలో క్లినికల్ న్యూట్రిషన్లో ఎంఎస్ చదివిన ప్రత్యూష ప్రస్తుతం హైదరాబాద్లో పోషకాహార నిపుణులుగా రాణిస్తున్నారు. మళ్లీ కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఎలాంటి పోషకాహారం తీసుకోవాలన్న దానిపై ‘సాక్షి’కి ప్రత్యూషారెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. –సాక్షి, హైదరాబాద్ రోగనిరోధక శక్తి అంటే ఏంటి? ఎర్ర రక్తకణాలను పెంచుకోవడం లేదా వాటిని బలోపేతం చేసుకోవడమే రోగ నిరోధక శక్తి. ఏదైనా వైరస్ వస్తే, దానిపై పోరాడేతత్వం ఈ ఎర్రరక్త కణాలకు ఉంటుంది. ఏడు రకాల పద్ధతులు పాటిస్తే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని ప్రపంచ వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సమతుల్యమైన ఆహారం అవసరం... ఆరోగ్యానికి, బరువు నియంత్రణలో ఉంచుకోవడానికి సమతుల్యమైన ఆహారం అవసరం. సమతు ల్యమైన ఆహారం అంటే ఏంటనే ప్రశ్న అందరిలో వస్తుంది. కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్ సరిగ్గా తీసుకోవడమే సమతుల్యమైన ఆహారం. ఇడ్లీ, దోశ, అన్నం, చపాతీలతో కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. అదే సమయంలో పీచుపదార్థం తీసుకోవడం చాలా ముఖ్యం. వివిధ రంగుల్లో లభించే కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల మనకు యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రొటీన్లు ఉండే గుడ్లు, పప్పు, చికెన్, మటన్ వంటివి కొద్దిగా తీసుకోవాలి. ఇలా మన ఆహారంలో ఇవి మూడూ ఉండాలి. పసుపు, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర వంటివి ప్రతిరోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటే కరోనా సమయంలో ఏ కషాయాలు తాగాల్సిన అవసరంలేదు. రోజులో అప్పుడప్పుడు పళ్లు, డ్రైప్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. వ్యాయామం.. నిద్ర.. నీరు ఇక ప్రతిరోజూ 30 నుంచి 45 నిమిషాలు ఆగకుండా వాకింగ్ చేయ డం ఆరోగ్యానికి మంచిది. లేదా ప్రాణాయామంతో కూడిన యోగా చేసుకోవచ్చు. కరోనా సమయంలో ప్రాణాయామం ముఖ్యం. వ్యాయామంతోపాటు ప్రతి ఒక్కరూ ఆరు నుంచి ఏడు గంటలపాటు నిద్ర పోవాలి. నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్లు దెబ్బతిని అవయవాల పనితీరు తగ్గిపోతుంది. ఇది ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అలాగే రోజుకు 10–12 గ్లాసుల నీరు తాగితే మంచిది. దీనివల్ల డీహైడ్రేషన్ ప్రమాదం ఉండదు. మానసికంగా లేదా శారీరకంగా తీవ్రమైన ఒత్తిడి, అలసట ఏర్పడితే మనలో ఉన్న హార్మోన్లు తగ్గడం లేదా పెరగడం జరుగుతాయి. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకో వడానికి వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం. పెద్దలకు ప్రతిరోజూ మల్టీ విటమిన్... తినే ఆహారంలో అన్ని విటమిన్లు ఉంటాయి. రకరకాల కారణాల వల్ల ఒక్కోసారి అవసరమైన విటమిన్లు శరీరానికి సరిగా అందవు. కాబట్టి పెద్దవాళ్లు రోజూ ఒక మల్టీ విటమిన్ మాత్ర వేసుకోవాలి. కడుపునిండా తిన్న తర్వాతే మాత్ర వేసుకోవాలి. మల్టీ విటమిన్లో విటమిన్–సీ, యాంటి ఆక్సి డెంట్స్ ఉంటాయి. శరీరంలో ఇన్ఫెక్షన్, ఊపిరితి త్తుల్లో సమస్య రాకుండా చూసుకుంటాయి. ఒకవేళ కరోనా వచ్చినా ఇబ్బంది ఉండదు. పండ్లను జ్యూస్ చేసుకోకూడదు.. అన్ని రకాల పండ్లను జ్యూస్ చేసుకొని తాగకూడదు. పండ్లను నేరుగా తినడమే మేలు. జ్యూస్ చేయడం వల్ల వాటిలో షుగర్ చేరుతుంటుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. నేల లోపల పండే క్యారె ట్, బీట్రూట్ లాంటి వాటిని ఉడికించే తినాలి. లేకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక చాలామంది సకాలంలో ఆహారం తినకపోవడం వల్లనే బరు వు పెరుగుతూ ఉంటారు. ఉదయం అల్పా హారం సరిగా తినకపోవడం వల్ల మధ్యాహ్నం ఎక్కువగా తింటాం. ఉదయం ఏదైనా కొద్ది మోతాదులో టిఫిన్తోపాటు ఒక ఎగ్ లేదా కూరగాయలు తింటే సరిపోతుంది. అన్నం పరిమాణం తగ్గించుకోవాలి. సాయంత్రం తక్కువ తినాలి. తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారి లక్షణాలు.. తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి తరచుగా జలుబు చేస్తుంది. ఒత్తిడికి గురవుతుంటారు. ప్రతి చిన్నదానికీ భయపడుతుంటారు. గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్దకం, విరేచనాలు వస్తుంటాయి. తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తాయి. శారీరకంగా పెద్దగా శ్రమ చేయకుండానే అలసిపోతుంటారు. -
వందల ఏళ్ల తర్వాత విస్ఫోటనం.. ఆమ్లెట్ వేసిన సైంటిస్టులు
రేక్జావిక్: ఐస్ల్యాండ్ రాజధాని రేక్జావిక్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఫగ్రడాల్స్ఫాల్ పర్వతం సమీపంలో ఉన్న అగ్ని పర్వతం వారం రోజుల క్రితం విస్ఫోటనం చెందిన సంగతి తెలిసిందే. 900 వందల సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఈ ఏడాది బద్దలవ్వడంతో ఆ చుట్టు పక్కల ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ ప్రాంతంలో విస్ఫోటనం గురించి అధ్యయనం చేయడానికి ఐస్ల్యాండ్ చేరుకున్న శాస్త్రవేత్తలు పర్వత ప్రాంతంపై నుంచి లావా ప్రవహించే అరుదైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే వారు అక్కడ వంట కూడా చేశారు. మీరు చదివింది కరెక్టే.. శాస్త్రవేత్తలు అక్కడ వంట చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరలవుతున్నాయి. న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఇందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేసింది. వందల ఏళ్ల తర్వాత ఈ అగ్ని పర్వతం విస్పోటనం చెందడంతో కొందరు శాస్త్రవేత్తలు దీని గురించి అధ్యయనం చేయడానికి ఐస్ల్యాండ్ చేరుకున్నారు. అగ్నిపర్వతం వద్దకు చేరుకున్న శాస్త్రవేత్తల బృందం ఈ విస్ఫోటనం గురించి అధ్యయనం చేయడమేకాక.. ఈ ఘటనలో వెలువడిన లావాను ఉపయోగించి ఏకంగా వంట చేశారు. 'ఐస్లాండ్ అగ్నిపర్వతం విస్పోటనం చెందడం వల్ల వెలువడిన లావా హాట్ డాగ్స్ను ఆస్వాదించడానికి అవకాశం కల్పిస్తుంది' అనే క్యాప్షన్తో యూట్యూబ్లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఇది ఇప్పటికే 58కే వ్యూస్ పొందింది. విస్పోటనం వల్ల వెలువడిన వేడి వేడి లావాపై హాట్ డాగ్స్ వండటం, రేకు కాగితంపై శాండ్విచ్లను గ్రిల్ చేయడంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. మరొక బృందం ఈ లావా మీద పాన్ పెట్టి గుడ్లు పగలగొట్టి ఆమ్లెట్ వేయడమేకాక బేకన్ వండుతున్న మరొక వీడియోను యూరుకుర్ హిల్మార్సొన్మ్ యూట్యూబ్లో షేర్ చేశారు. ఫగ్రడాల్స్ఫాల్లో విస్ఫోటనం ప్రారంభమైన తరువాత గత శుక్రవారం రాత్రి ఎర్రటి మేఘం ఆకాశాన్ని కమ్మెసిందా అన్నట్లు అక్కడి పరిసరాలు మారిపోయాయి. ఇక విస్ఫోటనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విస్ఫోటనంతో అగ్ని పర్వతం నుంచి బయటకు చిమ్ముతున్న ఎర్రని లావా ప్రవహాన్ని చూపించే ఒక డ్రోన్ ఫుటేజ్ ఇప్పటికే మిలియన్ల వ్యూస్ సంపాదించింది. విస్ఫోటనం జరగడానికి ముందు నాలుగు వారాల్లో ఈ ద్వీపకల్పంలో 40,000కు పైగా భూకంపాలు సంభవించాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో నో-ఫ్లై జోన్ ఆంక్షలు విధించారు. విస్ఫోటనం ప్రజలకు తక్షణ ప్రమాదం కలిగించలేదని అధికారులు వెల్లడించారు. చదవండి: వాల్కనో బీభత్సం : ఎగిసిపడిన లావా సమ్మర్ లేని సంవత్సరం గురించి మీకు తెలుసా? -
కొలెస్ట్రాల్ ఒంటికి హాని చేస్తుందా?
కొలెస్ట్రాల్ అనగానే అది హానికరమనే విధంగా నే చెప్పుకుంటూ ఉంటాం. కానీ కొలెస్ట్రాల్లో మంచి, చెడు ఉంటాయి. అది చెడు కొలెస్ట్రాల్ అయినా, మంచి కొలెస్ట్రాల్ అయినా ఉండాల్సిన పాళ్లలో ఉండాలి. మంచి కొలెస్ట్రాల్ను హెచ్డీఎల్ అంటారు. చెడు కొలెస్ట్రాల్ను ఎల్డిఎల్ అంటారు. వున శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులను రక్త పరీక్ష ద్వారా కనుక్కోవచ్చు. 12 గంటలపాటు ఏమీ తినకుండా ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఈ పరీక్షలో మన ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్), హెచ్డీఎల్ (మంచి కొలెస్ట్రాల్) మోతాదులు తెలుస్తాయి. ఎల్డీఎల్ ఎక్కువగా ఉంటే ధమనుల్లో కొవ్వు చేరి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎల్డీఎల్ను ‘‘చెడు కొలెస్ట్రాల్’’ అని అంటారు. కానీ హెచ్డీఎల్ రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. అందుకే హెడీఎల్ ను ‘‘వుంచి కొలెస్ట్రాల్’’ అని అంటారు. మన శరీరంలో ఎప్పుడు హెచ్డీఎల్ ఎక్కువగా, ఎల్డీఎల్ తక్కువగా ఉండాలి. గుడ్డులోని తెల్లసొన లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. పచ్చ సొనలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి తెల్లసొన తీసుకుని, పచ్చసొనను తగ్గించాల్సిందిగా డాక్టర్లు, ఆహారనిపుణులు చెబుతుంటారు. ఒకవేళ చెడు కొలెస్ట్రాల్ అంతగా లేనివారు మొత్తం గుడ్డును తినేయవచ్చు. కొలెస్ట్రాల్ కూడా ఉండాల్సిన మోతాదులో శరీరానికి అందాలి. అయితే అది తన మోతాదుకు మించకుండా చూసుకోవాలి. మంచి జీవనశైలితో మంచి ఆహార అలవాట్లతో సరైన వ్యాయామంతో చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో పెట్టుకోవచ్చు. -
నాటు కోడి గుడ్లను ఎక్కువ ధర పెట్టి కొంటున్నారా?
ఫారం కోడిగుడ్ల కంటే నాటు కోడి గుడ్లలో చాలా బలం ఉంటుందని చాలామందిలో ఓ దురభిప్రాయం ఉంటుంది. అది కేవలం అపోహ మాత్రమే. అందుకే తెల్లగా ఉండే ఫారం కోడిగుడ్ల కంటే... కాస్తంత గోధుమ రంగులో లేదా ముదురు రంగులో ఉండే నాటు కోడి గుడ్లను మరింత ఎక్కువ ధర పెట్టి కొంటుంటారు. నాటు గుడ్లయినా, ఫారం గుడ్లయినా అందులోని పోషకాలు ఒకేలా ఉంటాయి. కాకపోతే కొన్నిసందర్భాల్లో నాటు కోడి గుడ్డు పరిమాణం కాస్త చిన్నగానూ, ఫారం కోడి గుడ్లు కాస్త పెద్దగానూ ఉంటాయి. అయితే వాటిల్లోని తెల్లసొన, పచ్చసొనలో పోషక విలువలు మాత్రం ఒకేలా ఉంటాయి. ఆ రెండు రకాల గుడ్లలో ఉండే ఐరన్ పాళ్లు కూడా ఒకటే. చదవండి: కేన్సర్ ప్రాథమిక లక్షణాలు ఏంటో తెలుసా? -
నోరూరించే ఎగ్ బన్స్ చేసుకోండిలా..
ఎగ్ బన్స్ కావలసినవి: గుడ్లు – 6 బన్స్ – 6, ఉల్లిపాయలు – 3 పచ్చిమిర్చి – 2 చీజ్ తురుము – 2 టీ స్పూన్లు కొత్తిమీర తురుము – 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్ కారం – 1 టీ స్పూన్ మిరియాల పొడి – 1 లేదా 2 టీ స్పూన్లు ఉప్పు – తగినంత తయారీ: ముందుగా బన్స్ పైభాగం తొలగించి గుంతల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చీజ్ తురుము, కొత్తిమీర తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అభిరుచిని బట్టి మరిన్ని జోడించుకోవచ్చు. ఆ మొత్తం మిశ్రమాన్ని కొద్దికొద్దిగా బన్స్ బౌల్స్లో వేసుకుని.. ప్రతి బన్లో ఒక కోడిగుడ్డు కొట్టి.. ఓవెన్లో ఉడికించుకుంటే భలే రుచిగా ఉంటాయి. ఆపిల్ కోవా హల్వా కావలసినవి: ఆపిల్స్ – 3 (పైతొక్క తొలగించి గుజ్జులా చేసుకోవాలి) బాదం గుజ్జు – 3 టేబుల్ స్పూన్లు కోవా – అర కప్పు దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్ పంచదార – అర కప్పు నెయ్యి – 4 లేదా 5 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడికాగానే.. ఆపిల్ గుజ్జు, బాదం గుజ్జు వేసుకుని గరిటెతో తిప్పుతూ.. ఉడికించుకోవాలి. అందులో పంచదార యాడ్ చేసుకుని, బాగా కరిగే వరకూ తిప్పుతూ ఉండాలి. కోవా, దాల్చిన చెక్క పొడి వేసుకుని బాగా కలుపుతూ దగ్గరపడే వరకూ తిప్పుతూ మిగిలిన నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అరటిపండు పునుగులు కావలసినవి: అరటి పండ్లు – 4 (మెత్తగా గుజ్జులా చేసుకోవాలి) గోధుమ పిండి – పావు కప్పు బియ్యప్పిండి – పావు కప్పు మైదా పిండి – పావు కప్పు మొక్కజొన్న పిండి – ముప్పావు కప్పు ఉప్పు – తగినంత బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్ పంచదార – 2 టేబుల్ స్పూన్లు నూనె – డీప్ ఫ్రై కి సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో అరటిపండ్ల గుజ్జు, గోధుమ పిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, బేకింగ్ పౌడర్, పంచదార, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి జోడించి, బాగా కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కాగుతున్న నూనెలో పునుల్లా వేసుకుని దోరగా వేయించి సర్వ్ చేసుకోవాలి. - సేకరణ: సంహిత నిమ్మన -
బర్డ్ ఫ్లూ: చికెన్ తిందామా.. వద్దా?!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఇంకా అదుపులోకి రాలేదు. మరో వైపు యూకే కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి ప్రారంభమయ్యింది. ఇప్పటికే భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతుండగా.. తాజాగా బర్డ్ ఫ్లూ నేనున్నానంటూ భయపెడుతుంది. ఇప్పటికే కేంద్రం 10 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక బర్డ్ ఫ్లూ అనేది జూనోటిక్ వైరస్. అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. దాంతో ప్రస్తుతం జనాలు చికెన్, గుడ్డు తినాలంటే భయపడుతున్నారు.. సందేహిస్తున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న ఈ కాలంలో చికెన్, గుడ్లు తినడం సేఫేనా అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇది చదవాల్సిందే.. ఇక బర్డ్ ఫ్లూ వ్యాప్తి ప్రారంభం కాగానే ఇలాంటి వార్తలు తెగ ప్రచారం అవుతాయని తెలిసే కేంద్ర పంశు సంవర్ధక మంత్రి గిరిరాజ్ సింగ్ ఓ ట్వీట్ చేశారు. చికెన్, గుడ్లను తినాలంటే.. ముందుగా వాటిని బాగా ఉడికించాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రత వద్ద.. ఎక్కువ సమయం ఉడకడం వల్ల వైరస్ ప్రమాదం తొలుగుతుందన్నారు. ఇక ఇది హీట్ సెన్సెటివ్ వైరస్ కావడం వల్ల గుడ్లను ఉడికించేటప్పడు.. పచ్చసొన, తెల్ల సొన గట్టి పడేవరకు.. మాంసం ఉడికించేటప్పుడు దాని మధ్యలో గులాబి రంగు కనపడనంత వరకు ఉడికించాలని.. అప్పుడే తినాలని తెలిపారు. (చదవండి: అది బర్డ్ఫ్లూ కాదు.. ) కలుషితమైన మాంసం ద్వారా బర్డ్ ఫ్లూ మానవులకు సంక్రమిస్తుందనే భయాన్ని ప్రభుత్వం తొలగించింది, "భారతదేశంలో, ఈ వ్యాధి ప్రధానంగా వలస పక్షుల ద్వారా వ్యాపిస్తుంది" అని పేర్కొంది, అయితే " బర్డ్ ఫ్లూ సోకిన పక్షుల ద్వారా వైరస్ మనుషులకు సంక్రమించే ప్రమాదాన్ని తోసిపుచ్చలేము" అన్నారు. ప్రస్తుతం అధికారులు చనిపోయిన పక్షులను సేకరించి, లాలాజలం, రక్తం, బిందువుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందా.. లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ నమూనాలను సేకరించే సమయంలో వారంతా తప్పక పీపీఈ కిట్లు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక మాంసం అమ్మకదారులకు బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం అధికంగా ఉందని.. వారు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది. (చదవండి: 120 నాటుకోళ్లు మృతి..బర్డ్ ఫ్లూ అనుమానం) గత కొన్నేళ్లుగా బర్డ్ ఫ్లూ మానవులకు సంక్రమించిన దాఖలాలు లేవు. అయితే 1997 లో హాంకాంగ్లో బర్డ్ ఫ్లూ వైరస్ హెచ్5ఎన్1.. 80 మందికి సోకగా.. ఒకరు చనిపోయారు. ఇక వైరస్ మానవుల నుంచి మానవులకి బదిలీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. పక్షుల మధ్య కూడా బర్డ్ ఫ్లూ వ్యాప్తిని తనిఖీ చేయడానికి, ప్రభావిత రాష్ట్రాలు పౌల్ట్రీ మార్కెట్లను తాత్కాలికంగా మూసివేసాయి.. వైరస్ సోకిన పక్షులను చంపడం ప్రారంభించాయి. పక్షుల దిగుమతిని నిషేధించాయి. జంతుప్రదర్శనశాలలు, అభయారణ్యాల చుట్టూ "బయో-బబుల్స్"ని ఏర్పాటు చేశాయి. వ్యవసాయంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో కలుసుకుని దేశంలో జంతువుల వ్యాక్సిన్ల లభ్యతను పరిశీలించింది. -
కోడి గుడ్డు లేని ఆమ్లెట్ తిన్నారా..?
అవును మీరు చదివింది కరెక్టే.. ఎగ్లెస్ కేక్ తిన్నాం కానీ.. ఎగ్ లేకుండా ఆమ్లెట్ ఏంటీ అనుకుంటున్నారా... మొక్కల ప్రొటీన్లతో తయారు చేసే ఆమ్లెటే ఎగ్లెస్ ఆమ్లెట్. దీనినే వీగన్ ఆమ్లెట్ అని కూడా అంటారు. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న డైట్ ‘వీగన్ డైట్’. ఈ ఆహారపు ముఖ్య లక్ష్యం.. మనిషి తిండికోసం ఏ జీవినీ బాధించకపోవడమే.. అందుకే వీగన్ డైట్ ఫాలోవర్స్ అంతా మాంసం, గుడ్డు, చేపలు, పాలు, పెరుగు, వెన్న, జున్ను, తేనె వంటివేవీ ఆహారంగా తీసుకోరు. అయితే ఈ డైట్ ఫాలో అయ్యే వాళ్ల కోసం ముంబై కేంద్రంగా పనిచేస్తోన్న ‘ఇవో ఫుడ్స్’ అనే ఓ స్టార్టప్ రెస్టారెంట్ మొక్కల ప్రొటీన్ల నుంచి వీగన్ ఎగ్స్ను తయారు చేసి వాటితో ఆమ్లెట్స్, ఎగ్రోల్స్, వివిధ రకాల ఎగ్వెరైటీ డిష్లను అందిస్తోంది. అయితే ఎగ్స్ వాడకుండా చేసే ఆమ్లెట్ టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా..? వీగన్ ఎగ్స్తో చేసినప్పటికీ దీని రుచి నిజమైన గుడ్లతో తయారు చేసిన ఆమ్లెట్లానే ఉంటుందని రుచి చూసిన వారంతా చెబుతున్నారు. లిక్విడ్ ఎగ్.. ఫ్యాబేసీ కుటుంబానికి చెందిన లెగ్యుమ్ మొక్కల నుంచి ప్రొటీన్లను సేకరించి వాటికి విటమిన్ డి3, బి12లు కలిపి లిక్విడ్ రూపంలో ఎగ్ను తయారు చేస్తారు. ఆ తరువాత సాధారణ ఎగ్తో చేసే అన్ని రకాల డిష్లను దీనితో తయారు చేస్తున్నట్లు్ల రెస్టారెంట్ యాజమాన్యం వెల్లడించింది. రుచి కూడా చాలా బాగుంటుందని, జంతు ప్రేమికులకు, వీగన్ డైట్ ఇష్టపడేవారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని యాజమాన్యం చెబుతోంది. మీరు వీగన్ డైట్ను ఫాలో అవుతున్నారా.. అయితే ఒకసారి ఎగ్లెస్ ఆమ్లెట్ రుచి చూసేయండి. -
బర్డ్ ఫ్లూ: 15 రోజుల పాటు చికెన్ సెంటర్లు బంద్
భోపాల్: కరోనా వైరస్ ఇంకా కంట్రోల్ కాలేదు. మరో వైపు బర్డ్ ఫ్లూ ముంచుకోస్తుంది. ఇప్పటికే కేరళ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. ఇక మధ్యప్రదేశ్ మాంద్సౌర్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంద్సౌర్ జిల్లా వ్యాప్తంగా 15 రోజుల పాటు చికెన్ సెంటర్లు ముసివేయడమే కాక, కోడిగుడ్ల విక్రయాలను నిషేధించారు. మంద్సౌర్ ప్రాంతంలో ఒకే రోజు 100 కాకులు చనిపోవడమే కాక.. ఇక ఇండోర్ ప్రాంతంలో చనిపోయిన కాకుల్లో బర్డ్ ఫ్లూ వైరస్ని గుర్తించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక మరికొన్ని జిల్లాల్లో కూడా బర్డ్ ఫ్లూ మరణాలు వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ మాట్లాడుతూ ‘ఇండోర్లో చనిపోయిన కాకుల్లో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (బర్డ్ ఫ్లూ) గుర్తించారు. దాంతో ఇక్కడ రాపిడ్ రెస్పాన్స్ టీం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేస్తోందని’ తెలిపారు. (చదవండి: కరోనా వల్ల మేలెంత? కీడెంత? ) 2020 డిసెంబర్ 23 నుంచి 2021 జనవరి 3 వరకు మధ్యప్రదేశ్ ఇండోర్లో 142, మాంద్సౌర్లో 100, అగర్-మాల్వాలో 112, ఖార్గోన్లో 13, సెహోర్ జిల్లాలో తొమ్మిది కాకులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇక కేరళలో కేరళలోని కొట్టాయం, అలపూజ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ గుర్తించారు. దీని కారణంగా ఇప్పటికే ఈ ప్రాంతంలో 12 వేల బాతులు చనిపోగా.. మరో 36,000 బాతులు చనిపోయే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. -
62 ఏళ్ల వయసులో గుడ్లను పెట్టింది..
మిస్సౌరీ : 60 ఏళ్లు దాటిన తర్వాత పైతాన్లు గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని కోల్పోతాయని.. సంతాన్పోత్పత్తి జరిగే అవకాశం ఉండదని పలు పరిశోధనల్లో తేలింది. కానీ 62 ఏళ్ల బాల్ పైతాన్ ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా ఏడు గుడ్లను పెట్టింది. ఇక్కడ ఆశ్యర్యమేంటంటే గత 20 ఏళ్లుగా అది సంతానోత్పత్తికి దూరంగా ఉంటుంది. దీంతో పాటు అది ఎలాంటి మగ పైతాన్తో కలయిక లేకుండానే గుడ్లను పెట్టడం విశేషం. ఈ వింత ఘటన మిస్సౌరీలోని సెయింట్ లూయిస్ జూలో చోటుచేసుకుంది.(చదవండి : అలా సరదాగా రేసుకు వెళ్దామా!) జూ మేనేజర్ మార్క్ వానర్ స్పందించాడు. 'ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం. సాధారణంగా బాల్ పైతాన్స్ 60 ఏళ్లు పైబడితే గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని కోల్పోతాయి. మా జూలో ఉన్న బాల్ పైతాన్ 20 ఏళ్లకు పైగా మగ పైతాన్తో కలయిక జరపలేదు. అయినా 62 ఏళ్ల వయసులో గుడ్లను పెట్టింది.. బహుశా బాల్ పైతాన్ మగ పైతాన్కు సంబంధించిన వీర్యం తన శరీరంలో ఒకచోట నిల్వ ఉంచుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ అండాన్ని విడుదల చేసి గుడ్లను పెట్టి ఉంటుంది.' అని తెలిపాడు. ఈ విషయంపై సెయింట్ లూయిస్ జూ యాజమాన్యం స్పందించింది. జూలై 23 న బాల్ పైతాన్ 7 గుడ్లను పెట్టగా.. అందులో మూడింటిని ఇన్క్యూబేటర్లో ఉంచారు. రెండింటిని జెనిటిక్ శాంపిల్స్ కోసం పరీక్షించారు. మిగతా రెండు గుడ్లలో ఉన్నవి మాత్రం చనిపోయాయని తెలిపింది. అయితే జెనటిక్ శాంపిల్స్ కోసం గుడ్లను పరిక్షించిన తర్వాత ఆసక్తికర విషయం బయటిపడింది. బాల్ పైతాన్లో ఎలాంటి కలయిక లేకపోయినా(సెక్య్సుయల్ లేదా అసెక్య్సుయల్) వాటిలో పునరుత్పత్తి జరుగుతుందని.. దీనినే ఫ్యాకల్టేటివ్ పార్థినోజెనిసిస్ అంటారు. ఇప్పుడు సెయింట్ లూయిస్ జూలో ఒకటే మగ బాల్ పైతాన్ ఉందని.. దాని వయసు 31 ఏళ్లని యాజమాన్యం తెలిపింది. గుడ్లు పెట్టిన ఆడ బాల్ పైతాన్ను 1961లో ఒక వ్యక్తి జూకు విరాళంగా ఇచ్చాడని.. అప్పటినుంచి అది ఇక్కడే పెరుగుతుందని తెలిపారు. -
గుడ్డుపై వాక్యూమ్ క్లీనర్ ప్రయోగించాడు!
వంట చేసేటప్పుడు ఎంతటి నిష్ణాతులకైనా కొన్ని పొరపాట్లు తలెత్తడం సహజం. ఒక్కోసారి చక్కెర బదులుగా ఉప్పు వేయడం లాంటి తప్పులు దొర్లుతుంటాయి. కొన్ని చిట్కాలు ఉపయోగించి దాన్ని సరిచేసే పద్దతులూ ఉంటాయి. అయితే ఓ ట్విట్టర్ యూజర్ చేసిన వినూత్నంగా ఆలోచించాడు. ఉడకబెట్టిన గుడ్డును తిందామనుకుంటే అందులో మిరియాల పొడి కాస్త ఎక్కువైంది. దీంతో వాక్యూమ్ క్లీనర్తో ఎక్స్ట్రా పెప్పర్ను తీసేద్దాం అనుకొని వెరైటీగా ఆలోచించాడు. ఈ ఐడియా కాస్తా ఫెయిల్ అయ్యి చివరకు గుడ్డు పోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటికే ఈ వీడియోను 7.1 మిలియన్ల మంది వీక్షించారు. ఐడియా ఫెయిలంయిదేమో కానీ బోలెడంత ఫన్ క్రియేట్ అయ్యింది అంటూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. (40 అడుగుల ఎత్తు నుంచి దూకిన చిన్నారులు ) Added too much pepper 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/3AQUSt5Jun — Sgujana 🧃 (@shange033) July 20, 2020 -
గుడ్డుకు జై నిమ్మకు సై
వేసవి కాలంలో నిమ్మకాయ ధరలుపెరగడం, కోడిగుడ్ల ధరలు తగ్గడంసాధారణమే. కానీ ప్రస్తుతం గ్రేటర్లోవీటి వినియోగం భారీగా ఉన్నప్పటికీ ధరలు అందుబాటులోనే ఉండటంగమనార్హం. కారణం నిమ్మకాయలవినియోగం వేసవిలో ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది వేసవిలో, వేసవిముగిసిన అనంతరంనిమ్మకాయల ధరలుపెరగలేదు. సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల రోజువారీ మెనూలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. కోవిడ్ ఉపద్రవం ముంచుకొచ్చిన ప్రస్తుతతరుణంలో సరికొత్త ఆరోగ్య సూత్రాలకు ప్రాధాన్యం పెరిగింది. కరోనా మహమ్మారి బారిన పడకుండా గట్టి జాగ్రత్తలు అవసరమని సిటీజనులు భావిస్తున్నారు. రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దినసరి ఆహార పదార్థాల్లో కోడిగుడ్డు, నిమ్మకాయ వచ్చి చేరాయి. నెల రోజులుగా గ్రేటర్ పరిధిలో నిమ్మకాయలు, కోడిగుడ్లవినియోగం విపరీతంగా పెరగడమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గతంలోవారానికి ఒకటి రెండు రోజులునిమ్మకాయ, కోడిగుడ్లు వినియోగించేవారు ప్రస్తుతం వీటిని ప్రతిరోజూ వాడుతున్నారు. కోడిగుడ్లను ఉడకబెట్టి తింటున్నారు. నిమ్మకాయలను జ్యూస్ చేసుకుని తాగుతున్నారు.కోవిడ్ను ఎదుర్కొనేందుకు, వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు ఇదే సరైన విధానమని భావిస్తున్నారు. దీంతో నిమ్మ, కోడిగుడ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. వేసవి కాలంలో నిమ్మకాయ ధరలు పెరగడం, కోడిగుడ్ల ధరలు తగ్గడం సాధారణమే. కానీ ప్రస్తుతం గ్రేటర్లో వీటి వినియోగం భారీగా ఉన్నప్పటికీ ధరలు అందుబాటులోనే ఉండటం గమనార్హం. కారణం నిమ్మకాయల వినియోగం వేసవిలో ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది వేసవిలో, వేసవి ముగిసిన అనంతరం నిమ్మకాయల ధరలు పెరగలేదు. వేసవి తర్వాత మామూలుగా వర్షాలు ప్రారంభమైతే జనం నిమ్మకాయల వినియోగం తగ్గిస్తారు. కానీ కరోనా విరుగుడుకు చాలా మంది నిమ్మకాయను వినియోగిస్తున్నారు. అయినా ధరలు మాత్రం అంతగా పెరగలేదు. రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు ‘సి’ విటమిన్ ఎక్కువగా తీసువాలని జనం నిత్యం నిమ్మకాయలను వినియోగిస్తున్నారు. వర్షాకాలంలోనూ నిమ్మకు డిమాండ్ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ రోగ నిరోధకశక్తి పెంచుకునేందుకు ‘సి’ విటమిన్ బాగా లభించే నిమ్మకాయ వినియోగం పెంచారు గ్రేటర్వాసులు. అయినా ధరలు మాత్రం అంతగా పెరగలేదు. గ్రేటర్ పరిధిలో మార్కెట్లు, రైతు బజార్లతో పాటు దారుషిపా, చాదర్ఘాట్లోని మార్కెట్లకు ఎక్కువ మోతాదులో నిమ్మకాయలు దిగుమతి అవుతున్నాయి. దీంతో గ్రేటర్ డిమాండ్కు సరిపడా ఇవి అందుబాటులో ఉండడంతో ధరలు పెరగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది ఇదే సీజన్లో నిమ్మకాయల బస్తా ఒకటి రూ.600 నుంచి రూ.800 ఉందని, ప్రస్తుతం బస్తా రూ.250 నుంచి రూ. 350 వరకు ఉందని వ్యాపారులు అంటున్నారు. ఒక బస్తాలో దాదాపు 300 నుంచి 400 నిమ్మకాయలు ఉంటాయి. కోడిగుడ్లు సైతం భారీగా వినియోగం వ్యాధి నిరోధకశక్తి పెంచుకోవడానికి గ్రేటర్ ప్రజలు తమ రోజువారీ మెనూలో పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కోడ్ల వినియోగం పెరిగింది. కొన్ని రోజుల నుంచి గుడ్ల వినియోగం పెరిగిందని, ప్రస్తుతం జంట నగరాల్లో కోటి కోడిగుడ్ల మేరకు వినియోగమవుతున్నట్టు ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ (నెక్) అధికారులు అంటున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కోడిగుడ్ల ఉత్పత్తులు బాగానే ఉన్నాయని నెక్ వర్గాలు చెబుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో దాదాపు 80 వరకు ఉన్న పౌల్ట్రీఫారాలు చికెన్తోపాటు కోడిగుడ్లపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ప్రస్తుతం చికెన్ వినియోగం కొంత తగ్గినా, గుడ్ల వినియోగం మాత్రం రికార్డు స్థాయిలో ఉన్నట్టు పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. ధరలు అందుబాటులోనే.. వేసవిలో తగ్గిన గుడ్ల ధరలు ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నాయి. హోల్సేల్ మార్కెట్లో కోడిగుడ్డు ధర రూ. 3.60 పైసలు ఉండగా రిటేల్ మార్కెట్లో రూ. 4.50 పైసల వరకు ఉంది. గత వారం రోజులుగా గుడ్ల వినియోగం పెరిగిన ధరలు అంతగా పెరగలేదు. ప్రస్తుతం వర్షాకాలంలో గుడ్ల వినియోగం ఎక్కువగా ఉండదని భావించినా.. కరోనా ప్రభావంతో గుడ్లకు గతంలో ఎప్పుడూ లేనంతగా డిమాండ్ ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ల ఉత్పత్తి బాగానే ఉందని నెక్ అధికారులు అంటున్నారు. ♦ గత ఏడాది బస్తా నిమ్మకాయల ధర రూ.600– రూ.800 ♦ ప్రస్తుతం రూ.250– రూ.350 ♦ ఒక బస్తాలో 300– 400 నిమ్మకాయలు ♦ హోల్సేల్లో కోడిగుడ్డు రూ.3.60 పైసలు ♦ రిటైల్ మార్కెట్లో రూ.4.50 పైసలు ♦ నగరంలో రోజుకు కోటి కోడిగుడ్ల వినియోగం -
గుడ్డు పగిలింది: రివేంజ్ అదిరింది
న్యూఢిల్లీ: గోడకు కొట్టిన బంతి ఎంత వేగంగా తిరిగొస్తుందో అంతే వేగంగా ఓ యువతి తనను ప్రాంక్ చేసిన వ్యక్తిని చెడుగుడు ఆడేసుకుంది. చర్యకు ప్రతిచర్యగా అతను చేసిన పనికి వడ్డీతో సహా తిరిగిచ్చేసింది. ఇంతకూ ఏం జరిగిందంటే.. ఓ వ్యక్తి సరదాగా గేమ్ ఆడుదామని యువతిని అడిగాడు. అందుకు ఆమె సరేనంది. ఆటంటే యువకుడు బాల్స్ తీసి యువతి వైపు విసిరేస్తాడు. ఆమె వాటిని తలతో నెట్టుతూ కింద గ్లాస్లో పడేయాలి. అలా ఆట మొదలైంది.. అతడు ఒకటి, రెండూ బంతులు వేశాడు. ఆమె ఏ ఒక్కటీ గ్లాసులో పడేయలేకపోయింది. ఇంకా తీక్షణంగా ఆడటం మొదలుపెట్టింది. (ఇలాంటి దొంగతనం ఎప్పుడూ చూడలేదు) ఇంతలో ఆ కొంటె యువకుడు బంతికి బదులు కోడి గుడ్డు విసిరాడు. అది నేరుగా వచ్చి ఆమె తలపై పలిగింది. దీంతో కోపం కట్టలు తెంచుకున్న సదరు యువతి చేతికందిన వస్తువునల్లా అతడిపైకి బాణాల్లా విసిరేస్తూ తన ప్రతాపం చూపించింది. ఈ వీడియోను క్వారంటైన్ లైఫ్ పేరిట భారత వ్యాపారవేత్త హర్ష గొయాంక శనివారం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముందీ భార్య ప్రతీకారానికి లైకులు, బలైన భర్తకు జాలి చూపిస్తూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. 'భారతీయులు మాత్రం దీన్ని ప్రయత్నించకండి, ఇలా చేస్తే కనీసం మనకు తిండి కూడా పెట్టరు' అంటూ ఓ నెటిజన్ చమత్కరించాడు. 'క్వారంటైన్ సమయంలో నేను చూసిన బెస్ట్ వీడియో' ఇది అంటూ మరొకరు కామెంట్ చేశారు. (చచ్చిన వ్యక్తి కోసం మూడు నెలలుగా..) -
ప్రాంక్ వీడియో: తిక్క కుదిరింది
-
కోడిగుడ్లు తిన్నాడని.. సుత్తితో కొట్టి
సాక్షి, బొమ్మనహళ్లి : సూర్యాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెన్నాగర గ్రామంలో ఈనెల 13న చోటు చేసుకున్న బిహార్ కార్మికుడు ఇక్బాల్షా హత్యోదంతం మిస్టరీ వీడింది. ఉడకపెట్టిన కోడిగుడ్డు విషయంలో తగాదా ఏర్పడి స్నేహితుడే ఇక్బాల్షాను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. వివరాలు...బిహార్కు చెందిన ఇక్బాల్షా(25), జితేంద్రలు ఆరు నెలల క్రితం బెంగళూరుకు వలస వచ్చారు. హెన్నాగర గ్రామంలో ఇళ్ల నిర్మాణాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. ఇద్దరూ ఒకే చోట అన్నం వండుకొని బస చేసేవారు. ఈ నెల 13న రాత్రి భోజనం చేసే సమయంలో ఉడకబెట్టిన కోడి గుడ్లను ఇక్బాల్ షా ఎక్కువగా తినడంతో స్నేహితుడు జితేంద్ర ఆగ్రహానికి లోనయ్యాడు. (పచ్చని సంసారంలో.. అక్రమ బంధం చిచ్చు) సుత్తి తీసుకొని ఇక్బాల్షా తలపై బాది హత్య చేశాడు. మృతదేహాన్ని నీటి ట్యాంకు కోసం తీసిన గుంతలో పడేసి ఉడాయించాడు. రక్తం మరకలు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకొని పరిశీలించగా మృతదేహం లభ్యమైంది. మృతుడిని ఇక్బాల్షాగా గుర్తించి దర్యాప్తు చేపట్టారు. మృతుడి జతలో ఉన్న జితేంద్ర కనిపించకపోవడంతో అతనిపై అనుమానంతో గాలింపు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించడంతో ఆదివారం అరెస్ట్ చేశారు. (మహాబలిని మట్టికరిపించిన వేళ...) -
చికెన్, గుడ్లతో రోగనిరోధక శక్తి
సాక్షి, హైదరాబాద్: వాతావరణ మార్పులతో వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్ ద్వారా వ్యాపించే వ్యాధులతో పోరాడాలంటే ప్రజల్లో రోగనిరోధక శక్తి ఎంతో అవసరమని, చికెన్, గుడ్లు తినడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని వెంకటేశ్వర హేచరీస్ సంస్థ జీఎం యస్.బాలసుబ్రమణియన్ పేర్కొన్నారు. చికెన్, గుడ్లు తినడం ద్వారా శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పోషకాలు లభిస్తాయన్నారు. కరోనా వైరస్ దుష్ప్రచారంతో ధరలు తగ్గి చికెన్, గుడ్ల వినియోగం పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు ఆర్థికంగా చితికిపోయారన్నారు. దీంతో పౌల్ట్రీ రైతులు మార్చి, ఏప్రిల్ నెలల్లో కొత్తగా కోళ్లను పెంచలేదన్నారు. లాక్డౌన్తో రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో కోళ్ల దాణా, బ్రాయిలర్కోడి పిల్లల సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అందువల్ల మార్కెట్లో డిమాండ్కు తగిన చికెన్ సరఫరా కావడం లేదని, ఫలితంగా చికెన్, గుడ్ల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా హోటల్స్, రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లు, ఫుడ్ కౌంటర్లు మూతపడి ఉండటంతో కేవలం గృహ అవసరాలకు మాత్రమే చికెన్ వినియోగిస్తున్నారని, లేదంటే డిమాండ్ పెరిగి ధరల పెరుగుదల మరింత ఎక్కువగా ఉండేదని తెలిపారు. సడలింపులతో ధరలు తగ్గే అవకాశం ప్రస్తుతం లాక్డౌన్ సడలింపులు ఇస్తుండటంతో వ్యాపార కార్యకలాపాలు మొదలవుతాయని, త్వరలోనే మార్కెట్ డిమాండ్కు సరిపడినంతగా చికెన్ ఉత్పత్తి పెరుగుతుందని సుబ్రమణియన్ తెలిపారు. ఈమేరకు పౌల్ట్రీ రైతులు, పౌల్ట్రీ ఇంటిగ్రేషన్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, జూన్ 15 తర్వాత చికెన్ ధరలు కొంతమేర తగ్గే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు, మీడియా చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, చికెన్మేళాల నిర్వహణ ద్వారా చికెన్ వినియోగంపై ప్రజల్లో ఏర్పడిన భయాందోళనలు తొలిగిపోయాయన్నారు. చికెన్, గుడ్లు తినేందుకు ప్రజలు తిరిగి ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. లాక్డౌన్ ముందు రాష్ట్రంలో ప్రతి నెల దాదాపు 4.2కోట్ల కోడిపిల్లలు ఉత్పత్తి అయ్యేవని, ప్రస్తుతం ఈ సంఖ్య 2.8 కోట్లుగా ఉందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో సాధారణ రోజుల్లో 7.5 నుంచి 8 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతాయని అందులో ఆదివారాల్లో మాత్రం 24 లక్షలు కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. -
కరోనా వస్తుందేమోనని కోడిగుడ్లు పూడ్చేశారు
సాక్షి, ఏటూరు నాగారం : కరోనా అనుమానం ప్రజల్లో భయాందోళనను కలిగిస్తుంది. ఎంతలా అంటే ఒక వ్యక్తికి కరోనా సోకితే అతను వాడిన వస్తువులు దగ్గర నుంచి ఏదైనా సరే కాల్చేయడమో లేక పాతిపెట్టేడమో చేస్తున్నారు. తాజాగా మండల కేంద్రానికి చెందిన కిరాణం షాపు యజమానికి కరోనా పాజిటివ్ రాగా.. ఆయన షాపులో నిల్వ ఉన్న కోడిగుడ్లను గురువారం ట్రాక్టర్లో తీసుకెళ్లి పాతిపెట్టారు. సదరు వ్యక్తికి 19 రోజుల చికిత్స తర్వాత నెగెటివ్ వచ్చినప్పటికీ ఆయన షాపులో నిల్వ ఉన్న గుడ్లు వాడితే ఇబ్బంది అవుతుందనే భావనతో ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు గురువారం రూ.85వేల విలువైన గుడ్లను తీసుకెళ్లి ఊరి బయట పూడ్చివేశామని చెప్పారు. సర్పంచ్ ఈసం రామ్మూర్తి, సీఐ నాగబాబు, తహసీల్దార్ సర్వర్పాషా, డాక్టర్ వైశాలి, పంచాయతీ కార్యదర్శి రవి, బిల్ కలెక్టర్ వెంకయ్య పాల్గొన్నారు. (పోలీసు నుంచి మంత్రికి సోకిన కరోనా) -
చిత్తూరులో 16లక్షల కోడిగుడ్ల పంపిణీ
-
వెరీ'గుడ్డు'
సాక్షి, అమరావతి: కోడిగుడ్డుకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. కరోనా నేపథ్యంలో అపోహలతో వినియోగం తగ్గి ధరలు పడిపోవడం, తర్వాత లాక్డౌన్తో రవాణా ఆగిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన పౌల్ట్రీ రైతులు ఇప్పుడిప్పుడే ఊరట చెందుతున్నారు. కోడిమాంసం, గుడ్లు వల్ల కరోనా వైరస్ సోకదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పడం, కరోనా వైరస్ బారిన పడిన వారికి సైతం చికెన్ సూప్, గుడ్డు ఇవ్వొచ్చని కేంద్రప్రభుత్వ పశు సంవర్థక శాఖ అడ్వయిజరీ ప్రకటించడంతో అపోహలు తొలగిపోయాయి. అలాగే లాక్డౌన్ నుంచి కోడిగుడ్లను మినహాయించి నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చడం వల్ల నాలుగైదు రోజులుగా రాష్ట్రం నుంచి వివిధ రాష్ట్రాలకు కోడిగుడ్లు ఎగుమతి అవుతున్నాయి. దీంతో ధరలు మళ్లీ పుంజుకున్నాయి. మంగళవారం మార్కెట్ ధరలతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. ఇబ్బందులు ఇలా... ► కోడి గుడ్ల ఉత్పత్తిలో దేశంలో ద్వితీయ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మూడో వంతు ఇతర రాష్ట్రానికి ఎగుమతి చేయాలి. ► కరోనా నేపథ్యంలో స్థానిక వినియోగం తగ్గడంతో గుడ్లు మిగిలిపోవడం మొదలైంది. ఆ వెనువెంటనే వెలువడిన లాక్డౌన్తో ఎగుమతులపైనా ప్రభావం పడింది. ► ఎండ పడకపోతే 15 రోజుల వరకు గుడ్లను నిల్వ చేయవచ్చు. ఎండ పడితే వారానికే మురిగిపోతాయి. ► ఒక దశలో ఒక్కో గుడ్డును రూపాయిన్నరకు కూడా కొనే పరిస్థితి లేకపోయింది. ఫలితంగా నష్టాలు తీవ్రమయ్యాయి. లాక్డౌన్ నుంచి మినహాయింపుతో.. ► జిల్లాల సరిహద్దుల వద్ద, చెక్పోస్టుల వద్ద కోడిగుడ్ల వాహనాలను ప్రస్తుతం ఆపడం లేదు. స్థానిక మార్కెట్లకు తరలించుకునే అవకాశం వచ్చింది. ► అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద సైతం తనిఖీ చేసి పంపిస్తున్నారు. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, అసోం తదితర రాష్ట్రాలకు మళ్లీ రవాణా ఊపందుకుంది. ► లాక్డౌన్ ప్రారంభంలో మాదిరిగా రెండు మూడు రోజులు చెక్పోస్టుల వద్ద ఆగిపోయే పరిస్థితి ఇప్పుడు లేదు. -
త్వరపడండి: రూపాయికే గుడ్డు
సాక్షి, ఆర్మూర్ టౌన్: కరోనా దెబ్బకు రోజురోజుకు కోడిగుడ్డు ధర అమాంతంగా పడిపోతోంది. చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందనే పుకార్లు రావడంతో గుడ్ల వ్యాపారం పడిపోయింది. దీంతో ఆర్మూర్ పట్టణంలోని బృందావనం థియేటర్ సమీపంలో ఓ గుడ్ల వ్యాపారి కేవలం వంద రూపాయలకే వందగుడ్లు విక్రయిస్తున్నాడు. అదేవిధంగా 100 రూపాయలకే 100 గుడ్లు అని ఆటోలో ప్రచారం చేస్తున్నాడు. దీంతో ప్రజలు తరలివచ్చి గుడ్లను కొనుగోలు చేస్తున్నారు. (అలా పెరిగే కోళ్లతో డేంజర్!) (కోడి కూర.. మాకొద్దు బాబోయ్) -
చికెన్, గుడ్లు నిర్భయంగా తినొచ్చు
సాక్షి, బూర్గంపాడు : ప్రజలు చికెన్, గుడ్లు నిర్భయంగా తినొచ్చని భద్రాద్రి జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి డాక్టర్ వేణుగోపాలరావు అన్నారు. శనివారం ఆయన బూర్గంపాడు మండల పరిధి మోరంపల్లిబంజరలోని పౌల్ట్రీఫామ్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వైరస్కు చికెన్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందనేది కేవలం అపోహ మాత్రమేనన్నారు. కరోనా వదంతులతో పౌల్ట్రీ రంగం కుదేలవుతుందని, పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కోడి ధరలు కిలో రూ.80 నుంచి ఒక్కసారిగా రూ.10కి పడిపోయాయన్నారు. దీంతో ప్రత్యక్షంగా పౌల్ట్రీ రైతులు నష్టపోతుంటే పరోక్షంగా కోళ్ల మేతకు వినియోగించే మొక్కజొన్న, జొన్న, సోయాబీన్ సాగు చేసే రైతులు నష్ట పోతున్నారన్నారు. అదే విధంగా వెటర్నరీ మెడికల్ షాపులు, చికెన్షాపుల వాళ్లు కూడా ఉపాధి కోల్పోతున్నారన్నారు. కరోనా వైరస్ ప్రభావం పౌల్ట్రీ రైతులతో పాటు చిరు వ్యాపారులపై కూడా పడిందన్నారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి ప్రజలు నిర్భయంగా చికెన్, గుడ్లు తినవచ్చన్నారు. అవి మంచి పౌష్టికాహారమని, చికెన్, గుడ్లు తినడం వలన కరోనా వచ్చినట్లు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ నిరూపితం కాలేదన్నారు. తక్కువ ధరలతో అధిక ప్రొటీన్లు లభించే ఆహారం చికెన్, గుడ్లు మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఊడిన ఆటో బ్యాక్డోర్ లాక్
మలక్పేట: కొత్తపేట నుంచి మలక్పేట వైపు కోడిగుడ్ల లోడ్తో వెళ్తున్న ఓ ఆటో వెనుక డోర్ లాక్ ఊడి దిల్సుఖ్నగర్ గడ్డిఅన్నారం చౌరస్తాలో రోడ్డుపై పడిపోయాయి. ఒక్కసారిగా దారి అంతా పగిలిన గుడ్లతో నిండిపోయింది. వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించలేక ఇబ్బంది పడ్డారు. కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంటనే అప్రమత్తమైన మలక్పేట ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. రోడ్డుపై పడిన గుడ్లను జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగం సిబ్బంది ఎత్తించారు. మలక్పేట ఫైర్ సిబ్బంది రోడ్డుపై నీరు కొట్టి శుభ్రం చేశారు. అనంతరం జీహెచ్ఎంసీ సిబ్బంది గుడ్లు పడిన మేరకు రోడ్డుపై పొట్టు చల్లారు. రూ.20 వేలు విలువ చేసే గుడ్లు పలిగి పోయినట్లు డ్రైవర్ వినోద్, హెల్పర్ వీరస్వామి తెలిపారు. -
పెదవులు మృదువుగా...
►పెదవులు పొడిబారుతుంటే... కీరదోస ముక్కతో ఐదు నిమిషాల సేపు పెదవుల మీద వలయాకారంగా మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేస్తే మూడు లేదా నాలుగు రోజుల్లోనే పెదవులు మృదువుగా మారతాయి. ►టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానికి ప్యాక్లా వేయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డును తొలగించి, ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది ఈ ప్యాక్. ►టీ స్పూన్ పెరుగు, అర టీ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ కలిపి ముఖానికి రాయాలి. వేళ్లతో కొద్దిగా మసాజ్ చేసి, ఐదు నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మలినాలు తొలగి, చర్మం కాంతివంతం అవుతుంది. -
సాగనివ్వకండి బ్యూటిప్
వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై చర్మం సాగుతుంటుంది. దాంతో మనసు ఎంత ఉత్సాహంగా ఉరకలేస్తున్నా, ఎదుటి వారికి మాత్రం ముడతలను చూడగానే మీ వయసు ఇట్టే తెలిసి పోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి. స్ట్రాబెర్రీ: ఈ పండ్లలో చర్మాన్ని బిగుతుగా చేసే గుణం ఉంటుంది. ఇది 100 శాతం నేచురల్ ట్రీట్మెంట్. 5–6 స్ట్రాబెర్రీలను తీసుకొని గ్రైండ్ చేసి పేస్ట్లా చేసుకోవాలి. అందులో కొద్దిగా శనగపిండి వేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే సరి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ముడతలు తగ్గుతాయి. గుడ్డు తెల్లసొన, పెరుగు: ముడతలు మటుమాయం చేయడానికి గుడ్డు బాగా ఉపయోగపడుతుంది. ఒక టేబుల్ స్ఫూన్ పెరుగులో రెండు గుడ్ల తెల్ల సొనను వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖంపై ఉన్న మడతల వద్ద, మెడకు అప్లై చేయాలి. అది పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే ముఖం కాంతివంతంగా తయారవుతూ ముడతలు తగ్గుతాయి. బియ్యం పిండి: చర్మంపై ముడతలను తొలగించేందుకు రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిలో రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ లేదా గ్రీన్ టీ పోసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. 20–30 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. -
గుడ్డు సొనతో ఇన్సులిన్
మధుమేహ నియంత్రణకు ఉపయోగించే ఇన్సులిన్ను కోడిగుడ్డు సొన నుంచి తయారు చేయడంలో విజయం సాధించారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. తరచూ ఇన్పులిన్ ఎక్కించుకునే వారు డయాబెటిక్ పంపులు వాడతారన్నది మనకు తెలిసిన విషయమే. అయితే వీటితో ఓ చిక్కు ఉంది. రెండు మూడు రోజుల్లో ఇన్సులిన్ కాస్తా గడ్డలు కట్టిపోయి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్లనే వీటిని తరచూ మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మెల్బోర్న్లోని ఫ్లోరే ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్ అండ్ మెంటల్ హెల్త్ శాస్త్రవేత్తలు కత్రిమ ఇన్సులిన్ తయారీకి పూనుకున్నారు. జపాన్లోని ఒసాకా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభివద్ధి చేసిన ఒక టెక్నిక్ను మరింత మెరుగుపరచడం ద్వారా ఇందులో విజయం సాధించారు కూడా. గుడ్డుసొనలో ఇన్సులిన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఉంటాయని ఈ పరిశోధనలకు నేతత్వం వహించిన శాస్త్రవేత్త అక్తర్ హుస్సేన్ తెలిపారు. గ్లైకోఇన్సులిన్ అని పిలుస్తున్న ఈ కొత్త రకం మందు అధిక ఉష్ణోగ్రతల్లో, గాఢతల్లోనూ గడ్డకట్టదని రక్తంలోనూ సహజ ఇన్సులిన్ కంటే ఎక్కువ స్థిరంగా పనిచేస్తుందని హుస్సేన్ వివరించారు. ఇన్సులిన్ పంపుల్లో ఉపయోగించేందుకు ఇది మంచి ప్రత్యామ్నాయం అవుతుందని అన్నారు. సాధారణ ఇన్సులిన్ రెండు రోజులు మాత్రమే పనిచేస్తే.. గ్లైకోఇన్సులిన్ ఆరురోజుల పాటు పనిచేస్తుందని తెలిపారు.ఈ మందు అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి వంద కోట్ల రూపాయల వథా ఖర్చును అరికట్టవచ్చునని వివరించారు. -
వైరల్ : గుడ్డు పెంకు తీయడం ఇంత ఈజీనా..!
ఉడికించిన గుడ్డు(బాయిల్డ్ ఎగ్) పెంకు తీయడం చాలా కష్టమైన పని. వేడి వేడిగా ఉన్న గుడ్డును తీసుకొని పెంకు తొలగిస్తుంటే చేతులు కాలుతాయి. ఒక్కోసారి పెంకుతో పాటు గుడ్డు కూడా ఊడి వస్తుంది. సరైన పద్దతిలో పెంకు తీయలేక.. అసహనానికి గురవుతాం. కానీ ఇప్పుడు ఈ వీడియో చూశాక మీరు ఈజీగా బాయిల్డ్ ఎగ్ పెంకు తీయగలరు. ఈ వీడియో ప్రకారం చేస్తే... చేతులు కాలిపోవు, గుడ్డు పగిలిపోదు. గుడ్లను ఉడికించిన తర్వాత తీసి ఓ గ్లాసులో వేయండి. దాంట్లో కొన్ని చల్లటి నీటిని పోయండి. అనంతరం చేత్తో గ్లాసును మూసి షేక్ చేయండి. కొన్ని సెకండ్ల తర్వాత షేక్ చేయడం ఆపేసి గుడ్డను బయటకు తీసి పెంకు తీయండి. ఇలా చేస్తే 10 సెంకడ్లలో పెంకును తొలగించవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ‘మంచి ఐడియా.. కానీ నీరు వృధా’, గ్రేట్ ఐడియా.. కానీ ట్యాప్ కట్టిపెడితే బాగుండు’,‘ ఈ ఐడియాతో లైఫే మారిపోయింది’ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా గుడ్డు పెంకు తీయడం ఇంత ఈజీ అని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఇలా చేసి ఈజీగా బాయిల్డ్ ఎగ్ పెంకు తీయండి.. హ్యాపీగా తినండి. -
గుడ్డు పెంకు తీయడం ఇంత ఈజీనా..!
-
సంగీత దర్శకుడికి షాక్.. మూడు కోడిగుడ్లు రూ.1672
అహ్మదాబాద్ : సాధారణంగా కోడిగుడ్డు ఐదు రూపాయిల నుంచి పది రూపాయిల వరకు ఉంటాయి. కానీ ఓ స్టార్ హోటల్లో మూడు కోడిగుడ్లకు ఏకంగా రూ.1672 బిల్లు వేశారు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో జరిగింది. అహ్మదాబాద్లోని హయత్ రీజెన్సీ హోటల్లో మూడు ఉడికించిన కోడిగుడ్లకు గాను.. బాలీవుడ్ సంగీత దర్శకుడు శేఖర్ రావ్జియానీ చేతికి ఇచ్చిన బిల్లు రూ.1672 ఇదేనంటూ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. హయత్ రీజెన్సీ హోటల్లో బసచేసిన శేఖర్ రావ్ జియానీ గురువారం రోజున మూడు ఎగ్వైట్లతో భోజనం ఆర్డర్ చేశారు. అయితే హయత్ రీజెన్సీ హోటల్ సప్లయర్ మూడు బాయిల్డ్ ఎగ్స్ను ఇచ్చి శేఖర్ చేతిలో 1672 రూపాయల బిల్లు పెట్టాడు. బిల్లును చూసి శేఖర్ ఆశ్చర్యపోయాడు. షాక్ నుంచి కోలుకునేందుకు కొన్ని నిమిషాలు పట్టింది. కొన్ని నిమిషాల తర్వాత తేరుకున్న శేఖర్ రావూజీ దానిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. దీంతో ఇప్పుడీ బిల్లు వైరల్ అయింది. 15 రూపాయల కోడిగుడ్లకు రూ.1672 ఏంటంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మూడు ఉడికించిన కోడిగుడ్లకు 1350 రూపాయలు, సర్వీస్ చార్జీగా 67.50 రూపాయలు, సీజీఎస్టీ 9శాతం కింద 127.58 పైసలు, ఎస్ జీఎస్టీ 9శాతం కింద మరో రూ.127.58 కలిపి మొత్తం 1672రూపాయలు చెల్లించాలని బిల్లులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. -
ఎగ్ చాలెంజ్.. 42వ గుడ్డు తింటూ..
లక్నో : ఓ వ్యక్తి పందెం కాసి ప్రాణాలు తీసుకున్నాడు. రూ. 2వేల కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 42 ఏళ్ల సుభాష్ యాదవ్ అనే వ్యక్తి తన స్నేహితుడిలో జౌన్పూర్లోని బీబీగంజ్ మార్కెట్ ఏరియాలో గుడ్లు తినడానికి వెళ్లాడు. అయితే అక్కడ సుభాష్కు ఆయన స్నేహితుడికి మధ్య తిండి విషయంలో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఎవరు 50 గుడ్లు తింటే వారికి రూ. 2,000 ఇవ్వాలని ఇద్దరూ పందెం వేసుకున్నారు. అయితే ఈ బెట్టింగ్ సిద్ధపడ్డ సుభాష్.. 41 గుడ్లు తినేశాడు. అయితే 42వ గుడ్డు తింటున్న సమయంలో అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అక్కడున్న వారు అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే సుభాష్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు సూచన మేరకు అతన్ని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సుభాష్ ప్రాణాలు కోల్పోయాడు. ఎక్కువగా తినడం వల్లే సుభాష్ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనపై స్పందించడానికి సుభాష్ కుటుంబ సభ్యులు నిరాకరించారు. -
ప్లాస్టిక్ తీసుకొస్తే గుడ్లు ఫ్రీ
కామారెడ్డి క్రైం: జిల్లాలో ప్లాస్టిన్ను పూర్తిగా నిర్మూలించేందుకు అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఇందుకోసం త్వరలోనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రెండు కిలో ల ప్లాస్టిక్ను సేకరించి ఇస్తే అర డజన్ గుడ్లు ఉచితంగా అందించనున్నట్లు కలెక్టర్ సత్యనారాయ ణ ప్రకటించారు. శనివారం అధికారులతో స మావేశమయ్యారు. జిల్లాలో ప్లాస్టిక్ను పూర్తిగా నిర్మూలించేందుకు ఈ కార్యక్రమాన్ని ఈ నెల 4 నుంచి అమలులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ప్రతి గ్రామపంచాయతీతో పాటు మున్సిపాలిటీల పరిధిలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. మండల రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను బ్యానర్లు సిద్ధం చేసి ప్రదర్శించాలని అధికారులకు సూ చించారు. రెండు కిలోల ప్లాస్టిక్ను ఏరివేసిన వారికి స్థానికంగా ఉండే కిరాణ షాపుల ద్వారా గుడ్లను అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తహసీల్దార్లు, ఎం పీడీవోలు, పోలీసు, రెడ్క్రాస్ సభ్యులు బృందాలుగా ఏర్పడి పర్యవేక్షించాలని సూచించారు. -
సొగసుకు సొన
గుడ్డు తింటే ఆరోగ్యం. కేశాలకు, చర్మానికి గుడ్డు వాడితే మెరుగైన అందం. ఒకసారి ఉపయోగిస్తే చాలు గుడ్డు మేనికి వెరీగుడ్ ఫేస్ అండ్ హెయిర్ ప్యాక్ అంటారు. ►బాగా మగ్గిన అరటిపండును వేళ్లతో గుజ్జు చేసి అందులో టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని పచ్చసొన, అర టీ స్పూన్ బాదం నూనె, టీ స్పూన్ ఓట్స్, నాలుగైదు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి మృదువుగా మర్దన చేయాలి. పది నిమిషాల తర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ పొడి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ►గుడ్డులోని తెల్లసొన నాలుగైదు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే చర్మంపై ముడతలు తగ్గుతాయి. ►కప్పు పెరుగులో పావు కప్పు పెసర పిండి, గుడ్డులోని తెల్లసొన కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు, మాడుకు, శిరోజాలకు పట్టించాలి. పావు గంట తర్వాత తలస్నానం చేయాలి. ప్రతి మూడు రోజులకోసారి ఇలా నెలరోజుల పాటు చేస్తే చుండ్రు, జుట్టు రాలడం సమస్యలు తగ్గుతాయి. -
కుళ్లిన కోడిగుడ్లే వడ్డించారు
నర్సీపట్నం: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో నిర్లక్ష్యం వహించిన పాఠశాల సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. నర్సీపట్నం బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 29న విద్యార్థినులకు కుళ్లిన కోడిగుడ్లు పెట్టారని అందిన ఫిర్యాదు మేరకు బుధవారం ఆయన పాఠశాలను సందర్శించారు. ముందుగా మధ్యాహ్న భోజన నిర్వాహకులు, ఉపాధ్యాయుల్ని ప్రశ్నించారు. విద్యార్థినులను సైతం విచారించారు. విద్యార్థులకు వడ్డించేందుకు తయారు చేస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు నాణ్యమైన ఆహారపదార్థాలను విద్యార్థులకు వడ్డించడం లేదనే విషయం రుజువైందని చెప్పారు. ఉడికించేందుకు నీటిలో వేసిన గుడ్లలో పాడైనవి పైకి తేలాయని.. వాటిని తాను స్వయంగా తీయించానని డీఈవో చెప్పారు. హెచ్ఎం, ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపం కారణంగా మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఇష్టానుసారంగా ఆహార పదార్థాలను వడ్డిస్తున్నారన్నారు. హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తానని చెప్పారు. వారి నుంచి సరైన సమాధానం రాకుంటే వంట నిర్వాహకులను తప్పించడంతో పాటు హెచ్ఎం, ఆ రోజు మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించాల్సిన ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిల్వల్లో తేడాలున్నాయ్... నిత్యావసర సరుకులకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లో వెత్యాసం ఉందని డీఈవో గుర్తించారు. 1346 కిలోలకు గాను 250 కిలోల బియ్యం మాత్రమే స్టోర్ రూమ్లో ఉన్నాయన్నారు. దీనిపై కూడా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందించే గుడ్డును విద్యార్థులకు వలిచి ఇవ్వాలని సూచించారు. నాణ్యమైన ఆహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తానని డీఈఓ హెచ్చరించారు. వైఎస్సార్సీపీ పట్టణ పార్టీ «అధ్యక్షుడు కోనేటి రామకృష్ణ, సిరసపల్లి నాని, యాదగిరి శేషు, లోకవరపు శ్రీను, చోటీ, రాజేశ్వరి, పాకలపాటి అరవిందుకుమార్లు పాఠశాలలో జరుగుతున్న విషయాలను డీఈవో దృష్టికి తీసుకువెళ్లారు. -
కోడిగుడ్లు కోసం గొడవ.. ప్రియుడితో వివాహిత పరార్
లక్నో : తినడానికి కోడిగుడ్లు తేవటంలేదన్న కోపంతో ఓ భార్య, భర్తను విడిచి ప్రియుడితో పారిపోయింది. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాల మేరకు.. గోరఖ్పూర్ జిల్లాలోని కంపేర్గంజ్కు చెందిన ఓ మహిళ ప్రతిరోజూ తినడానికి గుడ్లు తేవాలని భర్తతో గొడవపడేది. దినసరి కూలీ అయిన సదరు భర్త ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇందుకు నిరాకరించేవాడు. దీంతో శనివారం మహిళ భర్తతో గొడవపడి ప్రియుడితో ఇంట్లోంచి పారిపోయింది. ఈ విషయంపై మహిళ భర్త మీడియాతో మాట్లాడుతూ.. ‘నేనో దినసరి కూలీని. నా ఆదాయంతో ప్రతి రోజూ కుటుంబానికి గుడ్లు తెచ్చిపెట్టే పరిస్థితి లేదు. ఈ బలహీనతను అలుసుగా తీసుకుని నా భార్య రోజూ గుడ్లు కావాలని గొడవపెట్టుకునేది. ఆమె ప్రియుడు ప్రతి రోజూ గుడ్లు తెచ్చి ఇచ్చేవాడు. అందుకే అతడితో పరారయింద’ని తెలిపాడు. -
వారు ఎలా ఇస్తే.. అలానే....!
చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యమే లక్ష్యంగా ఏర్పాటైన అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న పౌష్టికాహారంలో అనేక లోటుపాట్లు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆహార పదార్ధాల సరఫరా చేసే సమయంలో ప్రభుత్వ నిబంధనలు సంబంధిత కాంట్రాక్టర్లు పాటించడం లేదు. ఇది ఏంటని అడిగే పరిస్థితి కేంద్రాల నిర్వాహకులకు లేదు. ఒకవేళ అడిగినా... సరఫరా చేసే వారు ఎటువంటి సమాధానం చెప్పకుండా తమ పని తాము కానిచ్చేసి ఆదరాబాదరాగా వెళ్లిపోతున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ కేంద్రాలకు ఏం సరఫరా చేస్తే అవే తీసుకోవాలి మరి. వారు ఎలా ఇస్తే...అలా తీసుకోవాల్సిందే...! సాక్షి,బలిజిపేట(విజయనగరం) : పౌష్టికాహారంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లును కేంద్రం వద్ద అట్టలతో కలిపి తూకాలు వేసి కార్యకర్తలకు అప్పగించాల్సి ఉంది. కానీ గుడ్లు వ్యానుతో తెచ్చేవారు అట్టలను కార్యకర్తల చేతికి అందించి వెళ్లిపోవడమే తప్ప వాటిని తూచి ఇచ్చిన దాఖలాలు లేవు. తూకం వేసి ఇమ్మని కేంద్రం నిర్వాహకులు అడిగినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ఇచ్చే గుడ్లులో చాలా వరకు పాడైనవి వస్తున్నాయి. అట్టలతో దొంతులుగా ఇచ్చేసి ఆదరాబాదరాగా వ్యాన్తో వెళ్లిపోవడమే తప్ప వాటి నాణ్యతను పరిశీలించే పరిస్థితులు ఎక్కడా కానరావడం లేదు. దీంతో కార్యకర్తలు స్థానికులకు సమాధానం చెప్పలేక అవస్థలు పడుతున్నారు. గుడ్లు చిన్న, పెద్ద ఉండడంతో పాటు ఒకే బరువుతో ఉండనందున తూకం వేసి కేంద్రాలకు అప్పగించాల్సి ఉంది. ఒక అట్టలో 30 గుడ్లు ఉంటాయి. దీని బరువు కేజిన్నర నుంచి 1600 గ్రాములు ఉండాలి. ఈ ప్రాప్తికి తూనిక వేసి కేంద్రాలకు అప్పగించాల్సి ఉంది. కాంట్రాక్టు ప్రకారం గుడ్లు తెచ్చే వ్యాన్లో కాటాను తీసుకువచ్చి కేంద్రాలకు అప్పగించేటప్పుడు తూకం వేసి అందించాల్సి ఉంది. కాంట్రాక్టర్ ఈ నిబంధనను పాటించకున్నా అధికారులు పట్టించుకునే దాఖలాల్లేవు. మెనూ ప్రకారం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పంపిణీ చేసే గుడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవ్వాల్సిన మెనూ... ► గర్భిణులు, బాలింతలు, ప్రీస్కూలు పిల్లలకు : సోమ, గురువారాల్లో సాంబారు, అన్నం, మంగళ, శుక్రవారాల్లో పప్పు, ఆకుకూర, అన్నం, బుధ, శనివారాల్లో కాయగూర దీనికి బదులు ఆకుకూరతో పప్పున్నం. ►గర్భిణులు, బాలింతలకు: గుడ్లు, పాలు, శనగ చెక్కీలు సోమవారం నుంచి శనివారం వరకు ఇవ్వాలి. ►మూడు నుంచి ఆరేళ్ల చిన్నారులకు వారానికి నాలుగు రోజులు గుడ్లు ఇవ్వాలి.(గురువారం, శనివారం ఉండవు) ►మూడేళ్లలోపు వారికి వారానికి రెండు రోజులు మాత్రమే గుడ్లు పంపిణీ చేస్తారు. ►మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులలో బరువు తక్కువ ఉండే వారికి బరువు పెరిగే వరకు పాలు పంపిణీ చేస్తారు. ►గుడ్లు పది రోజులకు ఒకసారి కేంద్రాలకు పంపిణీ చేస్తున్నారు. ►కొత్త మెనూలో బాలసంజీవిని అమలు చేయాలి: గర్భిణులకు, బాలింతలకు నెలకు కిలో ఖర్జూరం, అరకిలో బెల్లం, కిలో రాగి పిండిని అందిస్తున్నారు. -
అయ్యో ! గుడ్లన్ని నేలపాలయ్యాయి
పెన్సిల్వేనియా : చేతి నుంచి కోడిగుడ్డు జారితే ఏమవుతుంది? కింద పడి పగిలిపోతుంది. అదే విధంగా కొన్ని లక్షల గుడ్లు రోడ్డు మీద పగిలితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. తాజాగా ఇదే ఘటన పెన్సిల్వేనియాలోని హెగిన్స్ టౌన్షిప్లో చోటుచేసుకుంది. పెన్సిల్వేనియా ప్రాంతానికి చెందిన 66 ఏళ్ల జోసెఫ్ మైల్స్ అనే వ్యక్తి ట్రక్కు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో హెగిన్స్ లోని రూట్ నెం. 125లో జోసెఫ్ తన ట్రక్కులో 1,36,000 గుడ్లను ఇంక్యుబేటర్లో పెట్టి తరలిస్తున్నారు. కాగా కొంతదూరం వరకు అతని ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. హెగిన్స్ ప్రాంతం కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉండడంతో జంక్షన్ వద్దకు రాగానే ట్రక్కు అదుపుతప్పి ఒక్కసారిగా గుడ్లు కింద పడిపోయాయి. ఇంకేముంది రహదారి మొత్తం పచ్చసొన వరదలా మారింది. దీంతో రోడ్డుమీద పడిన పచ్చసొనను శుభ్రం చేయడానికి 20 వేల గ్యాలన్ల నీరు అవసరం అయిందంటూ హెగిన్స్ ప్రాంతం ఎమెర్జెన్సీ కో-ఆర్డినేటర్ బ్రియాన్ ముసోలినో వాపోయాడు. ' జోసెఫ్ మైల్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎత్తైన ప్రాంతంలోకి ట్రక్కును తీసుకొచ్చి లక్షల గుడ్లు నేలపాలు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నాం' అని హెగిన్స్ పోలీస్ చీఫ్ బ్యూరో యర్ముష్ వెల్లడించారు. కానీ అక్కడి స్థానికులు మాత్రం బంగారం లాంటి గుడ్లను నేలపాలు చేశాడంటూ ట్రక్కు డ్రైవర్ను తిట్టిపోశారు. -
పౌష్టికాహారంలో పురుగులు
సాక్షి, బలిజిపేట(విజయనగరం) : గర్భిణిలు, బాలింతలు, చిన్నారులకు అందించాల్సిన పౌష్టికాహారంలో పురుగులు కనిపిస్తుండడంతో లబ్ధిదారులు బెంబేలెత్తుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పాలు, గుడ్లు, శనగ చెక్కీలు, నువ్వు చెక్కీలు నాణ్యంగా ఉండడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాసిరకంగా ఉన్న ఉండలను తినడానికి ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు భయపడుతున్నారు. పొరపాటున చూడకుండా వాటిని తింటే మా పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గుడ్లు కూడా పూర్తిగా కుళ్లిపోవడంతో ఇవేం గుడ్లని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పౌష్టికాహార పదార్థాలు పాడవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.అలాగే పాల ప్యాకెట్లను కేంద్రాల కార్యకర్తలు ఇచ్చే ఇండెంట్ ప్రకారం మొత్తం సరుకును ఒకేసారి సరఫరా చేస్తున్నారు. దీంతో వచ్చిన పాలప్యాకెట్లను కేంద్రాలలో నిల్వ చేయాల్సి వస్తోంది. రోజుల తరబడి పాల ప్యాకెట్లు ఉంచాల్సి రావడంతో పాడవుతున్నాయని కేంద్రాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాలకు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్టర్లు సరైన సమయానికి సరుకులు సరఫరా చేసిన దాఖాలు లేవు. గర్భిణులు, బాలింతలకు ప్రతి రోజూ గుడ్డు, పాలు, శనగ, నువ్వు చెక్కీలు ఇవ్వాల్సి ఉంది. అయితే సరుకు ఒకేసారి రావడం... వాటిని నిల్వ చేసి ఇవ్వడంతో పాడుతున్నాయి. చిలకలపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఊర్మిల అనే లబ్ధిదారుకు బుధవారం సరఫరా చేసిన చెక్కీలలో పురుగులు కనిపించాయి. అలాగే గుడ్లు కూడా కూళ్లిపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఈ ఒక్క కేంద్రానిదే కాదని.. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గర్భిణిలు, బాలింతలు, ప్రీ స్కూల్ చిన్నారులకు ఇవ్వాల్సిన మెనూ.. ► సోమ, గురువారాలలో: సాంబారు, అన్నం ► మంగళ, శుక్రవారాలలో పప్పు, ఆకుకూర, అన్నం. ► బుధ, శనివారాలలో కాయగూర లేదా ఆకుకూరతో పప్పు, అన్నం. ► సోమవారం నుంచి శనివారం వరకు గర్భిణిలు, బాలింతలకు గుడ్లు, పాలు, శనగ, నువ్వు చెక్కీలు ► 3 నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారులకు నాలుగు రోజులు గుడ్లు. (గురువారం, శనివారం ఉండవు) ► 3 సంవత్సరాల లోపున్న వారికి వారానికి 2 రోజుల మాత్రమే గుడ్లు పంపిణీ చేస్తారు. ► 3 నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారులలో బరువు తక్కువ ఉండేవారికి బరువు పెరిగేవరకు పాలు పంపిణీ చేస్తారు. కార్యకర్తలు చూసుకోవాలి కేంద్రాలకు సరఫరా అయ్యే సరుకులను కార్యకర్తలే చూసుకోవాలి. చెక్కీలు, పాలు నెలకొకసారి సరఫరా అవుతున్నాయి. గుడ్లు 10 రోజులకు ఒకసారి వస్తున్నాయి. అటువంటప్పుడు చూసుకోవాలి. పాడైతే అధికారుల దృష్టికి తీసుకురావాలి. – ఉమాభారతి, సీడీపీఓ, బొబ్బిలి. -
గుడ్డు గుటుక్కు!
సాక్షి, సిటీబ్యూరో: అందరికీ సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ కొరవడింది. ఆశయం ఘనంగా ఉన్నా అమలు మాత్రం అస్తవ్యస్తంగా తయారైంది. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది చేతివాటంతో కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ అంతంతగా మారింది. కోడిగుడ్లు సరఫరా కాకుండానే మాయమవుతున్నాయి. చిన్నారులు, కౌమార బాలికలు, గర్భిణులు, బాలింతలకు సమగ్ర పోషకాహారం అందించాలనే లక్ష్యం గాడి తప్పుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో మూడేళ్లలోపు బాలబాలికలు బాలామృతం, ప్రతినెలా పదహారు కోడిగుడ్ల చొప్పున పంపిణీ చేయాల్సి ఉంది. కేంద్రానికి వచ్చే వారికి పోషక పదార్థాలతో కూడిన ఆరోగ్యలక్ష్మి, బాలామృతం ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు, తక్కువ బరువున్న పిల్లలకు, గర్భిణులకు సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్పీ) ఆహారాన్ని అందిస్తారు. తక్కువ బరువున్న చిన్నారులకు రూ.9, గర్భిణులకు రూ.7 చొప్పున ఖర్చు చేస్తారు. చిన్నారులకు 12– 15 గ్రాములు, గర్భిణులకు 18– 20 గ్రాముల ప్రొటీన్లు అందేందుకు రోజువారీ ఆహారంలో గుడ్డు అందించటం తప్పనిసరి. గర్భిణులకు రోజూ పోషకాహారంతోపాటు పాలు కూడా అందించాల్సి ఉంటుంది. కానీ అంగన్ వాడీ కేంద్రాల్లో అమలవుతున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో సుమారు 35– 45 శాతం అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లు, పాలు పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. అడపాదడపా సంబంధిత అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలో నిర్వాహకుల చేతివాటం బయటపడుతున్న ప్పటికీ చర్యలు మాత్రం కానరావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భిన్నంగా హాజరు శాతం.. అంగన్వాడీ కేంద్రాల్లో హాజరు శాతం వాస్తవికతను భిన్నంగా కనిపిస్తోంది. సుమారు 63,894 చిన్నారులు నమోదై ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చిన్నారుల హజరు శాతం సగానికిపైగా తక్కువగా ఉంటున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. గత ఏడాది అప్పటి కలెక్టర్ యోగితా రాణా ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు హాజరు శాతాన్ని తీవ్రంగా పరిగణించారు. ముఖ్యంగా చిన్నారుల హాజరు శాతం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినా ఫలితం లేకుండాపోయింది. అంగన్వాడీల సూపర్వైజర్లు, వర్కర్లు కమిటీగా ఏర్పడి బస్తీలు, కాలనీలో ప్రజలకు అవగాహన కల్పించేలా చేపట్టిన చర్యలు ముందుకు సాగలేదు. -
యువతి కంటి చూపు పోగొట్టిన ‘ఆన్లైన్’వంట
లండన్ : మెక్రోవేవ్లో ఉడకబెట్టిన కోడిగుడ్డు ఓ యువతి జీవితంలో విషాదాన్ని నింపింది. బ్రేక్ఫాస్ట్ తయారుచేయటానికి ఆన్లైన్ చిట్కాను ఉపయోగించి కంటి చూపును కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. బ్రిటన్లోని రెడ్డిచ్కు చెందిన బెతానీ రోసర్(22) ఓ రోజు బ్రేక్ఫాస్ట్ తయారు చేయటానికి కోడిగుడ్లు ఉడకబెట్టాలనుకుంది. అప్పుడు ఆమెకు ‘మెక్రోవేవ్లో గుడ్లు ఉడకబెట్టటం ప్రమాదం కాదు. సురక్షితంగా, వేగంగా గుడ్లను ఉడకబెట్టుకోవచ్చు’ అని ఇంటర్నెట్లో చదివిన సంగతి గుర్తుకు వచ్చింది. వెంటనే ఓ బౌల్లో నీళ్లు తీసుకుని గుడ్లు వేసి, అందులో కొద్దిగా ఉప్పు కూడా కలిపింది. ఆ గుడ్ల బౌల్ను మెక్రోవేవ్లో ఆరు నిమిషాల పాటు 900 వాట్స్ వద్ద ఉడికించింది. అనంతరం వాటిని బయటకు తీసి కొద్దిసేపు చల్లారబెట్టి.. అవి ఉడికాయో లేదో తెలుసుకోవటానికి ఓ గుడ్డును నొక్కి చూసింది. అంతే అది ఒక్కసారిగా పేలి ఆమె కుడివైపు ముఖంపై పడింది. వేడివేడి ముక్కలు బలంగా ఆమె కుడి కంటిని ఢీ కొన్నాయి. దీంతో ఆమె కన్ను దెబ్బతిని, కంటిచూపును కోల్పోయింది. ముఖం కూడా బాగా కాలటంతో నొప్పి భరించలేక ఆమె దగ్గరలోని ఆసుపత్రికి పరిగెత్తింది. చికిత్స అనంతరం బెతానీ మాట్లాడుతూ.. ‘మెక్రోవేవ్ నుంచి గుడ్లను బయటకు తీసిన తర్వాత అవి ఉడికాయో లేదో తెలుసుకోవటానికి ఒకదాన్ని గట్టిగా నొక్కి చూశాను. అంతే అది పేలి నా ముఖంపై పడింది. నా జీవితంలో నేనెప్పుడు అంత భయపడలేదు. శరీరం వణుకుతూ ఉంది. నొప్పి భరించలేక ఏడుస్తూ ఉన్నాను. ఇంటర్నెట్లో చదివే విషయాలను గుడ్డిగా నమ్మవద్దు. ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నప్పటికి నా కంటిచూపు మెరుగవలేదు. అసలు కంటిచూపు వస్తుందన్న నమ్మకం నాకు లేదని వాపోయింది. -
గుడ్లు చాలవు.. పాలు అందవు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీల్లో పౌష్టికాహార పంపిణీ గాడి తప్పుతోంది. పంపిణీలో సమస్యలను పరిష్కరించకపోవడం... పలు చోట్ల పంపిణీ దారులను ఎంపిక చేయకపోవడం... స్టాకు ఉన్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఉదాశీన వైఖరితో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషక సమస్యలు తీవ్రమవుతున్నాయి.ఐదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి, పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతీ రోజు 200 మిల్లీలీటర్ల పాలు, ఉడికించిన కోడిగుడ్డు ఇవ్వాలి. పౌష్టికాహారలోపం తీవ్రంగా ఉన్న పిల్లలు, బాలింతకు అదనంగా మరో 100 మిల్లీ లీటర్ల పాలు అందజేయాలి. వీటితో పాటు పూర్తి పోషక విలువలున్న ఆహారాన్ని సైతం వడ్డించాలి. కానీ చాలా అంగన్వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్ల పంపిణీ గందరగోళంగా మారింది. పలు జిల్లాల్లో పాలు, గుడ్ల సరఫరాదారుల ఎంపిక ప్రక్రియే పూర్తి కాలేదు. కొన్ని చోట్ల సరఫరా దారులను ఎంపిక చేసినప్పటికీ సాంకేతిక కారణాలు, సరఫరాలో సమస్యలను అధిగమించకపోవడంతో అది అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు. వీటి పరిధిలో 5.31లక్షల మంది గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 7నెలల నుంచి 3 ఏళ్ల లోపు వయసున్న వారు 10.42 లక్షల మంది, ఆరేళ్ల లోపు వయసున్న చిన్నారులు 6.54లక్షల మంది నమోదయ్యారు. వీరికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్లు, పౌష్టికాహారాన్ని అందివ్వాలి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధి పొందిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. ఈ క్రమంలో అంగన్వాడీల్లో హాజరు శాతం సంతృప్తికరంగా ఉన్నప్పటికీ పాలు, గుడ్లు పొందిన వారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. సిద్దిపేట, ఆసీఫాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో హాజరు, లబ్ధి వత్యాసం అధికంగా ఉంది. ఈ వత్యాసాన్ని లోతుగా పరిశీలిస్తే అక్కడ సరుకుల పంపిణీలోని లొసుగులు బయటపడుతున్నాయి. రెండు నెలలుగా అరకొరే... అంగన్వాడీ కేంద్రాలకు గత రెండు నెలలుగా పాలు, గుడ్ల సరఫరా లోపభూయిష్టంగా ఉంది. కేంద్రాలకు హాజరవుతున్న విద్యార్థుల ఆధార్ వివరాలు అప్డేట్ కాకపోవడంతో సరఫరా కావడం లేదని కొన్నిచోట్ల నిర్వాహకులు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల ఓటీపీలు రావడం లేదని, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో గుడ్లు ఇవ్వలేక పోయామని కాంట్రాక్టర్లు అంటున్నారు. వాస్తవానికి ఓటీపీలు రాకపోతే సీడీపీఓలకు మరోమారు అర్జీ పెడితే సరిపోయేదని, కాంట్రాక్టర్లు తప్పించుకునే ధోరణితో ఇలా సరఫరా చేయడం లేదంటున్నారు. పలురకాల సమస్యలతో అంగన్వాడీ కేంద్రాలకు సకాలంలో సరుకులు చేరడం లేదు. ఈ అంశంపై రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం గమనార్హం. అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ ఆగమాగం కావడంతో చిన్నారులు, బాలింతల్లో పోషకాహార సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.