EPF
-
ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు: ఈసారీ అంతే..
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై.. వడ్డీ రేటును ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్దారించింది. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.25 శాతం వడ్డీరేటు యధావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత.. ఈ వడ్డీ రేటు ఏడు కోట్లకు పైగా చందాదారులకు జమ అవుతుంది.2022-23లో ఈ వడ్డీ 8.15 శాతంగా ఉండేది. అయితే దీనిని 2023-24లో 8.25 శాతానికి పెంచారు. 2018-19లో ఈ రేటు 8.65గా ఉండేది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో వడ్డీ రేటు ఏకంగా 8.1 శాతానికి పడిపోయింది. ఇప్పుడు గత ఏడాది మాదిరిగానే 8.25 శాతం వద్దనే కొనసాగుతుందని ప్రకటించారు.ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం ఎలా?ఉమాంగ్ యాప్: ఉమాంగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని.. మీ ఫోన్ నంబర్తో నమోదు చేసుకోండి. ఆ తరువాత EPF పాస్బుక్, క్లెయిమ్లు, బ్యాలెన్స్ చెక్ వంటి సేవలను యాక్సెస్ చేసుకోవచ్చు.ఈపీఎఫ్ఓ పోర్టల్: EPFO అధికారిక వెబ్సైట్ను సందర్శించండి, "మెంబర్ పాస్బుక్" విభాగానికి వెళ్లి, మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.మిస్డ్ కాల్: మీ UAN-రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406 కు మిస్డ్ కాల్ ఇవ్వండం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: పతనమవుతున్న పసిడి ధరలు: కొనడానికి ఇదే మంచి ఛాన్స్! -
ఈపీఎఫ్వోలో కొత్తగా 16 లక్షల మందికి చోటు
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) కిందకు 2024 డిసెంబర్లో కొత్తగా 16.05 లక్షల మంది సభ్యులుగా నమోదయ్యారు. 2024 నవంబర్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 10 శాతం, 2023 డిసెంబర్ గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 2.74 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. నికరంగా చూస్తే 8.47 లక్షల కొత్త చందాదారులు చేరారు. ఇది ఉపాధి అవకాశాల కల్పన పెరుగుదలను సూచిస్తున్నట్టు కార్మిక శాఖ తెలిపింది.కొత్త సభ్యుల్లో 4.85 లక్షల మంది 18–25 ఏళ్ల వయసులోని వారే కావడం గమనార్హం. నికర కొత్త సభ్యుల్లో 57 శాతం మేర ఈ వయసు నుంచే ఉన్నారు. వీరంతా మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. 15.12 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరారు. 2024 నవంబర్ నెలతో పోల్చి చూసినప్పుడు వీరి సంఖ్య 5 శాతం పెరిగింది. కొత్త సభ్యుల్లో 2.22 లక్షల మంది మహిళలు ఉన్నారు. 2023 డిసెంబర్ నెలతో పోల్చి చూస్తే మహిళా సభ్యుల చేరికలో 6.34 శాతం వృద్ధి నమోదైంది.ఇదీ చదవండి: హైదరాబాద్లో పెరిగిన ఇళ్ల ధరలు.. ఎంతంటే..టాప్–5 రాష్ట్రాల నుంచే 60 శాతం కొత్త సభ్యుల్లో 60 శాతం మంది టాప్ 5 రాష్ట్రాల నుంచే ఉన్నారు. ఒక్క మహారాష్ట్ర నుంచే 21.71 శాతం మంది ఈపీఎఫ్లో చేరారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, హర్యానా, ఢిల్లీ, తమిళనాడు, యూపీ, తెలంగాణ ఇలా ఒక్కో రాష్ట్రం నుంచి విడిగా 5 శాతానికి పైనే కొత్త సభ్యులు చేరారు. మానవ వనరుల సరఫరా, కాంట్రాక్టర్లు, సెక్యూరిటీ సేవలు తదితర ఎక్స్పర్ట్సరీ్వసెస్ తరఫున 41 శాతం మంది కొత్తగా ఈపీఎఫ్వో కిందకు వచ్చారు. -
ఈపీఎఫ్ కనీస పెన్షన్.. నెలకు రూ. 7500?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కింద ఉన్న, ప్రైవేట్ రంగ ఉద్యోగులు చాలా కాలంగా తమ కనీస పెన్షన్ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన 2025-26 బడ్జెట్ సమావేశంలో నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారేమో అని చూసారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రకటలను వెలువడే అవకాశం ఉంది.2024-25 ఆర్థిక సంవత్సరానికి.. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఖరారు చేయడానికి EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఫిబ్రవరి 28, 2025న సమావేశం కానుంది. ఇందులో పెన్షన్ సవరణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. వడ్డీ రేటుకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా.. పెన్షన్ పెంపుదల అంశం చర్చనీయాంశంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.2014 నుంచి మినిమమ్ పెన్షన్ నెలకు రూ. 1,000గా ఉంది. దీనిని 7500 రూపాయలకు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. EPF సభ్యులు తమ జీతంలో 12 శాతం ప్రావిడెంట్ ఫండ్కు జమ చేస్తారు. అంతే మొత్తంలో సంస్థ కూడా జమచేస్తుంది. కంపెనీ జమచేసి 12 శాతంలో.. 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)కి కేటాయిస్తారు. మిగిలిన 3.67 శాతం EPF స్కీమ్కి వెళుతుంది.గత కొన్ని సంవత్సరాలుగా.. పెన్షనర్లు, న్యాయవాద సంఘాలు ప్రస్తుత పెన్షన్ స్కీమును విమర్శిస్తున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నెలకు రూ.1,000 పెన్షన్ సరిపోదని చెబుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులతో, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కాబట్టి ఇక సీబీటీ నిర్ణయం కోసం వారందరూ ఎదురు చూస్తున్నారు.EPFO కనీస పెన్షన్ పెంపు2025 బడ్జెట్కు ముందు.. EPS-95 పదవీ విరమణ చేసిన వారి ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి, నెలకు రూ. 7,500 కనీస పెన్షన్ పెంపు, డియర్నెస్ అలవెన్స్ (DA) గురించి వివరించారు. ఆ విషయాలను తప్పకుండా పరిశీలిస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారని EPS-95 జాతీయ కమిటీ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే.. మినిమమ్ పెన్షన్ పెంపు తప్పకుండా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. -
ఈపీఎఫ్ఓ వడ్డీరేటుపై త్వరలో నిర్ణయం
ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8 శాతానికి పైగా కొనసాగించే ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఇది గత సంవత్సరానికి ప్రకటించిన 8.25% రేటుకు దగ్గరగా ఉండనుంది. ఫిబ్రవరి 28న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ ఆదాయ, వ్యయాలను పరిగణనలోకి తీసుకుని రిటైర్మెంట్ ఫండ్ బాడీ గణాంకాలను లెక్కలోకి తీసుకోనున్నారు. వీటన్నింటినీ లెక్కించి వడ్డీ రేటును నిర్ణయించడానికి ఇన్వెస్ట్మెంట్ కమిటీ, ఈపీఎఫ్ఓ అకౌంట్స్ కమిటీ త్వరలో సమావేశం కానున్నాయని ఓ అధికారి తెలిపారు. సంబంధిత కమిటీలు వివరాలను రూపొందిస్తున్నాయని, గత సంవత్సరాలతో సమానంగా ఉండే వడ్డీ రేటును ప్రతిపాదించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ పెట్టుబడులపై అధిక రాబడులు, సబ్స్క్రైబర్ల సంఖ్య పెరిగినట్లు చెప్పారు. అదే సమయంలో క్లెయిమ్ సెటిల్మెంట్లు అధికమయ్యాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: నేడు పార్లమెంట్లో కొత్త ఆదాయపన్ను బిల్లు2023-24లో రూ.1.82 లక్షల కోట్ల విలువైన 4.45 కోట్ల క్లెయిమ్లను పరిష్కరించగా, 2024-25లో రూ.2.05 లక్షల కోట్ల విలువైన 5.8 కోట్ల క్లెయిమ్లను ఈపీఎఫ్ఓ ప్రాసెస్ చేసిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈపీఎఫ్ఓకు 6.5 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. 2023-24 సంవత్సరానికి రూ.1,07,000 కోట్ల ఆదాయంపై 8.25 శాతం వడ్డీని ఇచ్చింది. 2022-23లో రూ.11.02 లక్షల కోట్ల అసలు ఆదాయంపై 8.15 శాతం వడ్డీ రేటుపై రూ.91,151.66 కోట్ల ఆదాయం అందించింది. వడ్డీ రేటుకు సంబంధించిన తుది ప్రతిపాదనను ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఆమోదం కోసం సమర్పిస్తారు. ఒకసారి ఆమోదం పొందితే అధికారికంగా నోటిఫై చేసి చందాదారుల ఖాతాల్లో జమ చేయడానికి ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి అవసరం అవుతుంది. -
రిటైర్మెంట్కు ఏ పథకాలు మేలు..?
రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఆర్థిక ప్రణాళికలో కీలకమైన భాగం. సరైన ప్రణాళిలు ఎంచుకుని వాటిని అనుసరిస్తే రిటైర్మెంట్ తర్వాత సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ప్రైవేట్ సంస్థలు విభిన్న రిటైర్మెంట్ స్కీమ్లతో వినియోగదారులకు ఆకర్షిస్తున్నాయి. కానీ ఆయా కంపెనీలు ఇస్తున్న హామీలపై చాలానే ప్రశ్నలొస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫండ్స్ను ఎంచుకుని పదవీ విరమణ తర్వాత ఆర్థిక, సామాజిక భద్రత కలిగిన జీవితాన్ని సాగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఉద్యోగుల భవిష్య నిధి (EPF), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లను పదవీ విరమణ పథకాల్లో భాగంగా చాలామంది ఎంచుకుంటున్నారు. వీటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: రూపాయి పడినా ఇంకా విలువైనదే.. -
నెలలో కొత్తగా 14.63 లక్షల మంది చందాదారులు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నవంబర్ 2024 తాత్కాలిక పేరోల్ డేటాను విడుదల చేసింది. నవంబర్లో 14.63 లక్షల మంది సభ్యులు చేరినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. 2024 అక్టోబర్తో పోలిస్తే ఇది 9.07 శాతం అధికం. 2023 నవంబర్తో పోలిస్తే ఈ సంఖ్యలో 4.88 శాతం పెరుగుదల నమోదైంది.ఈపీఎప్వో తెలిపిన వివరాల ప్రకారం..2024 నవంబర్లో సుమారు 8.74 లక్షల మంది ఈపీఎఫ్లో కొత్త సభ్యులు నమోదు చేసుకున్నారు. ఇది అక్టోబర్ 2024తో పోలిస్తే 16.58 శాతం అధికం.18-25 సంవత్సరాల మధ్య వయసువారు అత్యధికంగా 4.81 లక్షల మంది కొత్తగా సభ్యులుగా చేరారు. ఇది మొత్తం కొత్త సభ్యుల్లో 54.97%గా ఉంది.సుమారు 2.40 లక్షల మంది మహిళా సభ్యులు కొత్తగా చేరారు. ఇది అక్టోబర్ 2024తో పోలిస్తే 14.94% పెరుగుదలను సూచించింది.ఇటీవల కొత్తగా చేరిన మొత్తం సభ్యుల్లో 20.86% వాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది.ఇదీ చదవండి: అమెరికా చమురు ఎగుమతులు పెంపుఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) 7.6 కోట్లకుపైగా చందాదార్లకు ఇటీవల కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. యాజమాన్యం (కంపెనీ) నుంచి తనిఖీ లేదా ఈపీఎఫ్ఓ ఆమోదం లేకుండా ఉద్యోగులే వారి పేరు, పుట్టిన తేదీ, జాతీయత, లింగం, తల్లి/తండ్రి పేరు, జీవిత భాగస్వామి పేరు, కంపెనీలో చేరిన/రాజీనామా చేసిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో మార్చుకునే వెసులుబాటును తెచ్చింది. అంతేగాక ఆధార్ ఓటీపీ సాయంతో ఈపీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టయితే యజమాని వద్ద పెండింగ్లో ఉన్న బదిలీ క్లెయిమ్ అభ్యర్థనను తొలగించి.. చందాదార్లు నేరుగా ఈపీఎఫ్ఓకు క్లెయిమ్ను సమర్పించవచ్చు. -
ఈపీఎఫ్వో కొత్త రూల్.. కంపెనీ హెచ్ఆర్తో పనిలేదు!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తమ 8 కోట్ల మంది క్రియాశీలక చందాదారుల కోసం కీలక సంస్కరణలు తీసుకువస్తోంది. వచ్చే జూన్ నుండి కేవైసీ (KYC) ధ్రువీకరణ కోసం స్వీయ-ధ్రువీకరణ సదుపాయాన్ని అమలు చేయబోతోంది. దీంతో కంపెనీ హెచ్ఆర్ ఆమోదంతో పనిలేకుండానే ఉద్యోగులు తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. తద్వారా ఈపీఎఫ్ ఖాతాల నిర్వహణలో సభ్యులకు వేగంతోపాటు ఎక్కువ సౌలభ్యం లభిస్తుంది.కేవైసీ ప్రక్రియ సులభతరంఇప్పటి వరకు సభ్యుల కేవైసీ వివరాలను వారి యూఏఎన్ (UAN) నంబర్ల ఆధారంగా ప్రామాణీకరించే బాధ్యత కంపెనీకు ఉండేది. ఇప్పుడు కంపెనీల ఆమోదంతో పని లేకుండా స్వీయ-ధ్రువీకరణ సదుపాయం ద్వారా సభ్యులు తామే ధ్రువీకరిస్తే సరిపోతుంది. దీంతో కంపెనీ షట్-డౌన్ మోడ్లోకి వెళ్లినప్పుడు లేదా సకాలంలో స్పందించడంలో విఫలమైనప్పుడు ప్రతిసారీ తలెత్తే ఇటువంటి ఆలస్యం తగ్గే అవకాశం ఉంది. అలాగే కేవైసీ ఫార్మాలిటీల అసంపూర్తి కారణంగా జరిగే ఈపీఎఫ్ క్లెయిమ్ల తిరస్కరణలు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు.సభ్యులకు సేవలను మెరుగుపరచడానికి చేపడుతున్న ఈపీఎఫ్వో 3.0 (EPFO 3.0) ప్రాజెక్ట్లో స్వీయ-ధ్రువీకరణ సదుపాయం కూడా భాగం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్లతో ఈపీఎఫ్వో మెంబర్షిప్ బేస్ 10 కోట్లకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో ఈ డిజిటల్ అప్గ్రేడ్ సహాయం అందించనుంది. ఇప్పటికే సంస్థ ఐటీ వ్యవస్థలు బలంగా ఉన్న క్రమంలో ఇక సభ్యులకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలను అందించడంపై ఈపీఎఫ్వో దృష్టి సారిస్తోంది.క్లెయిమ్ పెట్టకుండానే ఉపసంహరణబ్యాంక్ ప్లస్ ఈపీఎఫ్వో 3.0 సిస్టమ్లో అందుబాటులోకి రానున్న మరో ముఖ్యమైన వెసులుబాటు క్లెయిమ్కు దరఖాస్తు చేయకుండానే నిధులను ఉపసంహరించుకోవడం. దీనికి సంబంధించిన వ్యవస్థను వచ్చే మార్చి లోపు ప్రవేశపెట్టాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. దీని కింద చందాదారు తన ఈపీఎఫ్ కార్పస్ నుండి క్లెయిమ్ దాఖలు చేయకుండానే నేరుగా మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది.ఈపీఎఫ్వో చందాదారులు కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బును ఆలస్యం, అవాంతరాలు లేకుండా సులభంగా డ్రా చేసుకునేలా అవకాశం కల్పిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల హామీ ఇచ్చారు. ఈపీఎఫ్వో అందించే సేవల ఆధునీకరణ దిశగా, లక్షలాది మంది కార్మికులకు ఆర్థిక సాధికారత కల్పించే దిశగా ఈ సంస్కరణలు ఒక ముఖ్యమైన దశను సూచిస్తాయి. -
మీకు వచ్చే పెన్షన్ తెలుసుకోండిలా..
పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా ఇచ్చే వాటిలో పెన్షన్ ప్రధానపాత్ర పోషిస్తుంది. పెన్షన్(Pension) లెక్కలకు సంబంధించి చాలామందికి చాలా ప్రశ్నలుంటాయి. ప్రైవేట్ సంస్థలో 10 సంవత్సరాలుగా పనిచేస్తుంటే పెన్షన్ ఎంత వస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం. అయితే అంతకంటే ఎక్కువ అనుభవం ఉంటే వచ్చే పెన్షన్ అధికంగా ఉంటుంది. అందుకు భిన్నంగా తక్కువ సర్వీసు ఉంటే తక్కువ పెన్షన్ అందుతుందని గుర్తుంచుకోవాలి.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)ను నిర్వహిస్తుంది. ఉద్యోగుల పెన్షన్ పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ముందుగా తెలిసుండాలి.పెన్షన్కు అర్హత పొందాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీసు ఉండాలి.ఉద్యోగికి 58 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి పెన్షన్ విత్డ్రా చేసుకోవచ్చు.పెన్షన్ విధానంలో కనీసం నెలవారీ మొత్తం రూ.1,000 అందుతుంది.గరిష్ఠంగా అందే పెన్షన్ రూ 7,500.ఎలా లెక్కిస్తారంటే..ఈపీఎస్ కింద పెన్షన్ పొందాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 58 ఏళ్లకు చేరుకుని ఉండాలి.పెన్షన్ తీసుకోవాలనుకునే సమయం నుంచి గత 60 నెలల సగటు జీతం (నెలకు గరిష్టంగా రూ.15,000)ను పరిగణనలోకి తీసుకుంటారు.ఈపీఎస్కు మీరు కంట్రిబ్యూషన్ చేసిన మొత్తం సంవత్సరాల సంఖ్యను పెన్షనబుల్ సర్వీసు అంటారు. కింది ఫార్ములా ఉపయోగించి పెన్షన్ లెక్కిస్తారు.నెలవారీ పెన్షన్ = పెన్షనబుల్ జీతం(రూ.15,000కు మించకుండా 60 నెలల సరాసరి)×పెన్షనబుల్ సర్వీస్/70ఉదాహరణకు, మీ పెన్షనబుల్ జీతం రూ.15,000, పెన్షనబుల్ సర్వీస్ 10 సంవత్సరాలు అయితే నెలవారీ పెన్షన్ కింది విధంగా ఉంటుంది.నెలవారీ పెన్షన్=15,000×10/70=2,143ఇదీ చదవండి: కాలర్ ఐడీ ఫీచర్ను వెంటనే అమలు చేయాలని ఆదేశాలుపదేళ్లలో విభిన్న కంపెనీలు మారితే..పెన్షన్ పొందాలంటే పదేళ్లు ఒకే కంపెనీలో పని చేయాలనే నిబంధనేం లేదు. పదేళ్లలోపు ఈపీఎస్ సర్వీసు అందుబాటులో ఉన్న విభిన్న కంపెనీల్లో పని చేసినా పెన్షన్ పొందడానికి అర్హులు అవుతారు. అయితే, మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) మాత్రం యాక్టివ్గా ఉండాలి. కేవైసీ వివరాలను అప్డేట్ చేయాలి. ఉద్యోగం మారినప్పుడు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ కొత్త యజమాన్యం పీఎఫ్ ఖాతాకు బదిలీ అవుతుంది. అయితే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) బ్యాలెన్స్ మీ మునుపటి యజమాని వద్ద ఉంటుంది. అయినప్పటికీ సర్వీస్ వివరాలు బదిలీ చేస్తారు. దాంతో మొత్తం సర్వీసును పరిగణలోకి తీసుకుని ట్రాక్ చేస్తారు. -
మాజీ క్రికెటర్ ఊతప్పపై వారెంటు
సాక్షి బెంగళూరు: ఉద్యోగుల ఈపీఎఫ్ డబ్బులను జమ చేయలేదనే కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై ఈ నెల 4న అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఉత్తప్ప బెంగళూరు పులకేశి నగర పోలీసు స్టేషన్ పరిధిలోని నివాసి కావడంతో ఆయనను అరెస్టు చేయాలని అక్కడి పోలీసులకు ఈపీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ షడాక్షరి గోపాలరెడ్డి లేఖ రాశారు. వివరాలు.. సెంచురీస్ లైఫ్స్టైల్ ప్రై.లి. అనే కంపెనీకి రాబిన్ ఉత్తప్ప సహ యజమానిగా ఉన్నారు. కంపెనీలో సిబ్బంది జీతం ఉంచి ఈపీఎఫ్ డబ్బులు కట్ చేశారని, కానీ ఖాతాలోకి వేయలేదని, మొత్తం రూ. 23 లక్షల మోసం చేశారని ఫిర్యాదులు వచ్చాయి. -
రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ
టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప చిక్కుల్లో పడ్డాడు. ఎంప్లాయి ప్రొవిడెంట్ ఫంఢ్(EPF) నిధుల మళ్లింపు కేసులో ఇరుక్కున్నాడు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బెంగళూరులో ఉన్న సెంటారస్ లైఫ్స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఊతప్ప డైరెక్టర్గా ఉన్నాడు.రూ. 23 లక్షల మేర మోసం?అయితే, ఈ కంపెనీ ఉద్యోగుల జీతం నుంచి పీఎఫ్ రూపంలో కట్ చేసిన రూ. 23 లక్షలను తిరిగి డిపాజిట్ చేయలేదు. ఈ విషయం తమ దృష్టికి రావడంతో ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్, రికవరీ ఆఫీసర్ అయిన శదక్షర గోపాలరెడ్డి చర్యలు చేపట్టారు. ఊతప్పపై అరెంస్ట్ వారెంట్ జారీ చేయాల్సిందిగా డిసెంబరు 4న తూర్పు బెంగళూరులోని పులకేశ్నగర్ పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు.అయితే, ప్రస్తుతం రాబిన్ ఊతప్ప తన కుటుంబంతో కలిసి దుబాయ్లో నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కేఎర్ పురం చిరునామాలో అతడు లేకపోవడంతో తాము ఊతప్పను అరెస్ట్ చేయలేకపోయినట్లు సంబంధిత పోలీస్ ఆఫీసర్ తెలిపారు. ప్రస్తుతం అతడు తమ స్టేషన్ పరిధిలో లేడన్న విషయాన్ని పీఎఫ్ ఆఫీస్ వర్గాలకు తెలియజేశామన్నారు.దుబాయ్కు మకాం మార్చిన ఊతప్పకాగా రాబిన్ ఊతప్ప పులకేశినగర్లోని వీలర్ రోడ్లో గల అపార్టుమెంట్లో నివాసం ఉండేవాడు. అయితే, ఏడాది క్రితమే ఆ ఫ్లాట్ను ఖాళీ చేసినట్లు సమాచారం. ఇక పీఎఫ్ ఫ్రాడ్ కేసులో రాబిన్ ఊతప్పపై ఇంతవరకు అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సీనియర్ పోలీస్ ఆఫీసర్ చెప్పినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది.కర్ణాటకకు చెందిన రాబిన్ ఊతప్ప 2006- 2015 మధ్య టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తన అంతర్జాతీయ కెరీర్లో 46 వన్డేలు, 13 టీ20 ఆడి.. ఆయా ఫార్మాట్లలో 934, 249 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 205 మ్యాచ్లు ఆడి 4952 రన్స్ సాధించాడు. కాగా రాబిన్ ఊతప్ప ఇటీవల జరిగిన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు. చదవండి: శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర శతకం.. శివం దూబే మెరుపు ఇన్నింగ్స్ -
చెట్ల ట్రాన్స్లోకేషన్పై విధాన నిర్ణయం తీసుకోండి
సాక్షి, అమరావతి: చెట్లను కొట్టేయకుండా, వాటిని వేళ్లతో సహా పెకిలించి మరో చోట నాటే ప్రక్రియ (ట్రాన్స్లొకేషన్)కు ప్రాధాన్యతనివ్వాలని, దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్లొకేషన్కు అవసరమైన యంత్రాలు ఖరీదైనవే అయినప్పటికీ, అవి లేవని చెప్పొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్ల విస్తరణ, విద్యుత్ లైన్ల ఏర్పాటు, నిర్వహణ తదితరాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా చెట్లను విచక్షణారహితంగా కొట్టేస్తుండటంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. చెట్ల నరికివేత పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించిందని తెలిపింది. చెట్ల నరికివేతను గణనీయంగా తగ్గించడంతో పాటు ట్రాన్స్లొకేషన్ అమలు చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందో సలహాలు ఇచ్చేందుకు ఓ కమిటీని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని హైకోర్టు ఆదేశించింది.ఈ కమిటీలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు, పర్యావరణ నిపుణులను సభ్యులుగా నియమించాలని ఆదేశించింది. ఆ కమిటీ సలహాలను తాము పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. మూడు నెలల్లో పూర్తి వివరాలతో స్పందనను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 12కి వాయిదా వేసింది. ఇదే వ్యవహారంలో జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) దాఖలు చేసిన కౌంటర్ను పరిగణనలోకి తీసుకుంది. ట్రాన్స్లొకేషన్ కోసం పిల్... రోడ్ల విస్తరణ, విద్యుత్ లైన్ల ఏర్పాటు తదితరాల పేరుతో భారీ చెట్లను విచక్షణారహితంగా కొట్టేస్తున్నారని, చెట్లను కొట్టేయకుండా వాటిని మరో చోట నాటేలా ఆదేశాలు ఇవ్వాలంటూ గుంటూరుకు చెందిన వైద్య విద్యార్థి అస్మద్ మహ్మద్ షేక్ షా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు వచ్చిoది. పిటిషనర్ తరఫు న్యాయవాది బషీర్ అహ్మద్ వాదనలు వినిపిస్తూ.. చాలా రాష్ట్రాల్లో చెట్లను నరికేయకుండా వాటిని మరో చోట నాటుతున్నారని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణాలకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించి, మరో చోట విజయవంతంగా నాటారని తెలిపారు. ఇందుకోసం హైకోర్టులో ఓ సంస్థ పనిచేస్తోందని వివరించారు. జీపీఎఫ్, ఈపీఎఫ్ దేనిని ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయం » ఫలానా స్కీంను వర్తింపజేయాలని కోర్టులు ఆదేశించలేవు »ఉద్యోగులు జీపీఎఫ్ కోరుతున్నందున దానిపై నిర్ణయం తీసుకోండి » ఆర్థిక, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులకు హైకోర్టు ఆదేశం సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్ స్కీం లేదా జీపీఎఫ్ స్కీంలలో దేనిని వర్తింపజేయాలన్నది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని హైకోర్టు తేల్చి చెప్పింది. నిర్దిష్టంగా ఫలానా స్కీంను వర్తింపజేయాలని న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని ఆదేశించలేవని స్పష్టం చేసింది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) స్కీం వర్తింపజేయాలంటూ పలువురు విద్యుత్ ఉద్యోగులు అభ్యర్థనలు పెట్టుకున్న నేపథ్యంలో దీనిపై మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. తమకు పాత పెన్షన్ స్కీం అయిన జీపీఎఫ్ను వర్తింపజేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ విద్యుత్ పంపిణీ సంస్థల్లో (డిస్కం) పనిచేసి పదవీ విరమణ చేసిన పలువురు ఉద్యోగులు, ప్రస్తుతం సర్వీసులో ఉన్న కొందరు ఉద్యోగులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ సుబ్బారెడ్డి శుక్రవారం విచారణ జరిపారు. ఉద్యోగుల తరఫున న్యాయవాది పీటా రామన్ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ప్రభుత్వం 2023లో జారీ చేసిన మెమోరాండం ప్రకారం పిటిషనర్లందరూ జీపీఎఫ్కు అర్హులని చెప్పారు. జీపీఎఫ్ కోసం పిటిషనర్లు పై అధికారులకు వినతులు ఇచ్చినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇది ఆర్థికపరమైన అంశమని, దీనికి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అని డిస్కంలు, ఆరి్థక, ఇంధన శాఖల న్యాయవాదులు వాదనలు చెప్పారు. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని చెప్పారు. -
ఈ–వ్యాలెట్లలోకి పీఎఫ్ సొమ్ము?
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) సభ్యులు తమ పీఎఫ్ క్లెయిమ్లను త్వరలో ఏటీఎంల నుంచి ఉపసంహరించుకోవచ్చని కార్మిక శాఖ ఇటీవలే ప్రకటించగా.. ఈ–వ్యాలెట్ల నుంచి సైతం ఈ సదుపాయం కల్పించే దిశగా పనిచేస్తున్నట్టు తెలిపింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి సుమితా దావ్రా దీనిపై స్పందించారు.‘తమ సొమ్మును ఎంత సులభంగా ఉపసంహరించుకోవచ్చన్న దానిపై సభ్యుల్లో ఆసక్తి నెలకొంది. ఆటో సెటిల్మెంట్లో క్లెయిమ్ మొత్తం సభ్యుల బ్యాంక్ ఖాతాల్లోకి వెళుతుంది. దాంతో బ్యాంక్ ఏటీఎం నుంచి ఉపసహరించుకోవచ్చు. క్లెయిమ్ మొత్తం వ్యాలెట్లోకి నేరుగా ఎలా పంపాలన్న విషయమై కొన్ని మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది. దీనిపై బ్యాంకర్లతో చర్చలు మొదలు పెట్టాం. దీని అమలు విషయమై ప్రణాళిక అవసరం’ అని పర్యాటక సదస్సుకు హాజరైన సందర్భంగా మీడియాకు సుమితా దావ్రా వివరించారు. ఆర్బీఐని సంప్రదించి త్వరలోనే తగిన ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు.ఇదీ చదవండి: బీమా పాలసీతో ఆరోగ్యం కొనుక్కోవచ్చు!ఈపీఎఫ్వో సభ్యులు అతి త్వరలోనే తమ భవిష్యనిధి (పీఎఫ్) క్లెయిమ్ల మొత్తాన్ని ఏటీఎం నుంచి ఉపసంహరించుకునే అవకాశం అందుబాటులోకి రానున్నట్లు ఇప్పటికే ఆ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఈపీఎఫ్వో సభ్యుల ఆన్లైన్ క్లెయిమ్ ఆమోదానికి 7–10 రోజుల సమయం తీసుకుంటోంది. క్లెయిమ్ పరిష్కారం తర్వాత ఆ మొత్తాన్ని సభ్యుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తున్నారు. ప్రతిపాదిత కొత్త విధానంలో సభ్యులకు ప్రత్యేకమైన కార్డులు అందించనున్నారు. వీటి ద్వారా ఏటీఎం నుంచి క్లెయిమ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని ఇటీవల ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
రూ.25,820 కోట్లకు చేరిన పీఎఫ్ బకాయిలు!
ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) వాటాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)కు చెల్లించడంలో యాజమాన్యాలు విఫలమవుతున్నాయి. ఈపీఎఫ్ఓ డిఫాల్ట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2023-24లో ఈపీఎఫ్ఓ డిఫాల్ట్లు రూ.25,820.88 కోట్లకు చేరుకున్నాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 69.3 శాతం అధికంగా ఉంది. ఇది గతంలో రూ.15,254.06 కోట్లు ఉండేదని అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి.పీఎఫ్ కాంట్రిబ్యూషన్ల బకాయిలు తెలంగాణలోనే అధికంగా ఉన్నట్లు తెలిసింది. కొన్ని కంపెనీల్లో తలెత్తుతున్న ఆర్థిక ఇబ్బందులు, పరిపాలనాపరమైన లోపాలు లేదా ఉద్దేశపూర్వకంగానే ఈ ఎగవేతలు జరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈపీఎఫ్ఓ రాష్ట్ర ప్రభుత్వ సహాయం కోరడం, ఎగవేతదారుల వివరాలను పబ్లిక్ డొమైన్లో ప్రచారం చేయడం, ఎగవేతదారుల చరాస్తులు, స్థిరాస్తులను జప్తు చేయడం వంటి అనేక చర్యలు తీసుకుంటోంది.ఇదీ చదవండి: స్పామ్ కాల్స్, ఆన్లైన్ మోసాల కట్టడికి సూచనలుఈపీఎఫ్ఓ రికవరీ ఇలా..రాష్ట్ర ప్రభుత్వ సహాయం: బకాయిల రికవరీకి వీలుగా ఈపీఎఫ్ఓ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది. స్థానిక ప్రభుత్వాల మద్దతుతోపాటు అక్కడి పరిపాలనా యంత్రాంగాన్ని ఉపయోగించడం వల్ల రికవరీకి అవకాశం ఉంటుందని నమ్ముతుంది.డిఫాల్టర్ల వివరాలు ప్రచారం చేయడం: కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకునే వారికి అవగాహన కల్పించడంతోపాటు నిబంధనలు పాటించకపోవడంపై సంస్థలకు సమాచారం అందించేందుకు డిఫాల్ట్ కంపెనీల పేర్లను ప్రచారం చేస్తున్నారు.ఆస్తుల అటాచ్మెంట్: ఈపీఎఫ్వో యాజమాన్యాల చరాస్తులు, స్థిరాస్తులను జప్తు చేస్తోంది. ఈ చట్టపరమైన చర్యల వల్ల నగదుగా మార్చగల ఆస్తులను స్వాధీనం చేసుకుని బకాయి వసూలు చేస్తోంది.చట్టపరమైన చర్యలు: దీర్ఘకాలిక ఎగవేతదారులపై ఈపీఎఫ్ఓ చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేయడం, కఠిన శిక్షలు విధించేలా చూస్తోంది. -
ఏటీఎం నుంచి ఈపీఎఫ్వో సొమ్ము!
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎఫ్వో 3.0 అనే కొత్త వెర్షన్కి అప్గ్రేడ్ అయ్యే ప్రణాళికలో ఉంది. ఏటీఎం నుండి పీఎఫ్ సొమ్ము ఉపసంహరణ, ఉద్యోగి ప్రస్తుత 12 శాతం చందా పరిమితి పెంపు, పీఎఫ్ సొమ్మును పెన్షన్గా మార్చుకునే అవకాశం వంటి కొత్త సంస్కరణలు ఇందులో ఉండవచ్చని భావిస్తున్నారు.ఏటీఎం తరహా కార్డుఈటీ నౌ రిపోర్ట్ ప్రకారం.. ఈపీఎఫ్వో 3.0 అనే కొత్త వెర్షన్లో అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే, పీఎఫ్ సొమ్ము ఉపసంహరణల కోసం ఒక కార్డును జారీ చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ కార్డును ఉపయోగించి ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బును విత్డ్రా చేయవచ్చు. అయితే, పీఎఫ్ మొత్తంలో గరిష్టంగా 50 శాతం మాత్రమే ఇలా విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ వచ్చే ఏడాది మే నుంచి జూన్ నెలల మధ్య ఎప్పుడైనా అమలు చేయవచ్చు.ఇక మరొక పరిణామం ఏమిటంటే, ఉద్యోగులు తమ జీతంలో ఈపీఎఫ్కు జమ చేసే కాంట్రిబ్యూషన్లపై ప్రస్తుతం ఉన్న 12% పరిమితిని తొలగించవచ్చు. ఉద్యోగులు తమకు నచ్చినంత మొత్తాన్ని పీఎఫ్కు జమ చేసుకునే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. అయితే, యజమాన్యం కాంట్రిబ్యూషన్ మాత్రం ఉద్యోగి జీతం ఆధారంగా ఉంటుంది. అలాగే ఉద్యోగి సమ్మతితో పీఎఫ్ మొత్తాన్ని పెన్షన్గా మార్చాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. -
EPFO Update: ఆధార్ లేకుండానే ఈపీఎఫ్ క్లెయిమ్!
కొంత మంది ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తూ ఫిజికల్ క్లెయిమ్లను సెటిల్ చేయడానికి ఇకపై తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)తో ఆధార్ను లింక్ చేయాల్సిన అవసరం లేదని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ప్రకటించింది. ఇటీవలి సర్క్యులర్లో పేర్కొన్న కొత్తగా సవరించిన విధానంలో భాగంగా ఈ మార్పు చేసింది.అయితే మినహాయింపు అందరికీ కాదు. భారతదేశంలో తమ అసైన్మెంట్ పూర్తి చేసి, ఆధార్ పొందకుండా స్వదేశానికి తిరిగి వెళ్లిన అంతర్జాతీయ వర్కర్లు, విదేశాలకు వలస వెళ్లి, అక్కడి పౌరసత్వం పొందిన ఆధార్ లేని భారతీయులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. అలాగే ఈపీఎఫ్&ఎంపీ చట్టం ప్రకారం "ఉద్యోగులు"గా అర్హత పొంది ఆధార్ లేకుండా భారత్ వెలుపల నివసిస్తున్న నేపాలీ, భూటాన్ పౌరులు కూడా మినహాయింపును వినియోగించుకోవచ్చు. ఇదీ చదవండి: EPFO 3.0: భారీ సంస్కరణలు.. అధికంగా పీఎఫ్ సొమ్ము!వీరంతా ఆధార్ స్థానంలో పాస్పోర్ట్లు లేదా పౌరసత్వ గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు వంటి పత్రాలను ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలుగా ఉపయోగించవచ్చు. "డ్యూ డిలిజెన్స్" ప్రక్రియలో భాగంగా, మినహాయింపులు క్లెయిమ్ చేస్తున్న ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేయాలని, పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ రూ. 5 లక్షలకు మించి ఉంటే సంబంధిత యాజమాన్యాలతో వివరాలను ధ్రువీకరించాలని ఈపీఎఫ్వో అధికారులకు సూచించింది. సెటిల్మెంట్ సొమ్మును నెఫ్ట్ ద్వారానే బదిలీ చేయనున్నట్లు పేర్కొంది. -
ఈపీఎఫ్ఓ క్లెయిమ్ తిరస్కరించారా? ఇవి తెలుసుకోండి!
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) క్లెయిమ్లు గత కొంతకాలంగా ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈపీఎఫ్ఓ వార్షిక నివేదిక ప్రకారం 2023లో దాదాపు ఆరు కోట్ల ఉపసంహరణ దరఖాస్తులు నమోదైతే అందులో సుమారు 27 శాతం తిరస్కరణకు గురయ్యాయి. అయితే క్లెయిమ్ రెజక్ట్ అయ్యేందుకు చాలా కారణాలున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.వ్యక్తిగత వివరాలు సరిగా లేకపోవడం: క్లెయిమ్ ఫారం, ఈపీఎఫ్ఓ రికార్డుల్లో ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత సమాచారంలో తేడా ఉండడం వల్ల క్లెయిమ్ తిరస్కరించబడుతుంది.కేవైసీ పూర్తి చేయకపోవడం: ఆధార్, పాన్ లేదా బ్యాంక్ వెరిఫికేషన్ వంటి వాటిలో కేవైసీని అప్డేట్ చేయాలి. లేదంటే క్లెయిమ్ నిలిపేసే అవకాశం ఉంటుంది.తప్పుడు బ్యాంకు వివరాలు: బ్యాంకు ఖాతా నంబర్ లేదా ఐఎప్ఎస్సీ కోడ్లో తప్పుల వల్ల క్లెయిమ్ను తిరస్కరించవచ్చు.యూఏఎన్: ఇన్ యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)తో క్లెయిమ్ నమోదు చేస్తే రెజెక్ట్ అవుతుంది.తగినంత బ్యాలెన్స్ లేకపోవడం: క్లెయిమ్ చేసిన మొత్తాన్ని కవర్ చేయడానికి ఈపీఎఫ్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే క్లెయిమ్ ఇవ్వరు.పెండింగ్ బకాయిలు: ఈపీఎఫ్ఓకు చెల్లించాల్సిన బకాయిలు క్లియర్ అయ్యే వరకు క్లెయిమ్ అందించరు. కొన్నిసార్లు యాజమాన్యం చెల్లించాల్సిన ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ను జమ చేయడం ఆలస్య అవుతుంది. అలాంటి సందర్భాల్లో క్లెయిమ్ రాదు.కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు, నిబంధనల ప్రకారం సర్వీసు లేకుండానే దరఖాస్తు చేస్తుండడం వంటి కారణాల వల్ల క్లెయిమ్ తిరస్కరించే అవకాశం ఉంది. -
EPFO 3.0: భారీ సంస్కరణలు.. అధికంగా పీఎఫ్ సొమ్ము!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 3.0 వెర్షన్లో మెగా పునరుద్ధరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలు లక్ష్యంగా కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 12 శాతం ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ పరిమితిని తొలగించడంతో సహా ఈపీఎఫ్వో సేవల్లో భారీ సంస్కరణలను కార్మిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.ఉద్యోగుల 12 శాతం కాంట్రిబ్యూషన్ పరిమితిని ఈపీఎఫ్ఓ సమీక్షించే అవకాశం ఉందని ఈటీ నౌ మూలాధారాలను ఉటంకిస్తూ రిపోర్ట్ చేసింది. ఉద్యోగులు తమ కాంట్రిబ్యూషన్ను పెంచుకోవడం ద్వారా మరింత సొమ్మును పీఎఫ్కు జమ చేసుకునేందుకు వీలు కలగనుందని నివేదిక పేర్కొంది. అయితే, యాజమాన్యం వంతుగా జమ చేసే మొత్తం ఉద్యోగి జీతంపై ఆధారపడి ఉంటుంది.మొత్తంమీద, ఈపీఎఫ్వో తీసుకుంటున్న చర్యలను ఉద్యోగుల పొదుపును పెంచే ప్రయత్నంగా చూడవచ్చు. అదనంగా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ను వారి సమ్మతితో పెన్షన్గా మార్చడానికి అనుమతించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. అంటే ఏ సమయంలోనైనా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని పెన్షన్గా మార్చుకునే అవకాశం ఉంటుంది. -
EPFO: కొత్తగా 18.81 లక్షల మందికి పీఎఫ్
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) సభ్యులు సెప్టెంబర్లో 18.81 లక్షల మంది పెరిగారు. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 9.33 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఉపాధి అవకాశాల పెరుగుదలను ఇది సూచిస్తోంది. వీరిలో 9.47 లక్షల మంది కొత్త సభ్యులు.క్రితం ఏడాది ఇదే నెల కంటే 6.22 శాతం పెరిగారు. సభ్యుల్లో 8.36 లక్షల మంది 18–25 ఏళ్లలోపు వారే (60 శాతం) కావడం గమనార్హం. అంటే వీరు మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు అర్థం చేసుకోవచ్చు. 14.10 లక్షల మంది సభ్యులు సెప్టెంబర్ నెలలో ఈపీఎఫ్వో పరిధిలోనే ఒక సంస్థ నుంచి మానేసి, మరో సంస్థలో చేరారు.వార్షికంగా క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే ఇది 18 శాతం అధికం. కొత్త సభ్యుల్లో 2.47 లక్షల మంది మహిళలు ఉన్నారు. 9 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్ నెల మొత్తం మీద నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 3.70 లక్షలుగా ఉంది. ఇది కూడా 12 శాతం అధికం. 21 శాతం మహారాష్ట్ర నుంచే.. సెప్టెంబర్ నెలలో నికర సభ్యుల చేరికలో మహారాష్ట్ర నుంచే 21.20 శాతం మంది ఉన్నారు. ఇక కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యాన, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ నుంచి విడిగా 5 శాతం కంటే ఎక్కువ సభ్యులు చేరారు. నైపుణ్య సేవలు, ట్రేడింగ్–వాణిజ్య సంస్థలు, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, వస్త్రాల తయారీ, క్లీనింగ్, స్వీపింగ్ సేవలు, హాస్పిటళ్లలో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. -
EPFO: 7.66 లక్షల కంపెనీలు.. 7.37 కోట్ల మందికి పీఎఫ్
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో)లో సభ్యత్వం గడిచిన ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. ఉద్యోగులకు చందా కట్టే కంపెనీల సంఖ్య 6.6 శాతం మేర పెరిగింది. దీంతో వీటి మొత్తం సంఖ్య 7.66 లక్షలకు చేరింది. అలాగే ఉద్యోగుల చేరికలు సైతం 7.6 శాతం పెరిగి ఈపీఎఫ్వో మొత్తం సభ్యుల సంఖ్య 7.37 కోట్లకు చేరినట్టు కేంద్ర కార్మిక శాఖ గణాంకాలు విడుదల చేసింది.2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను ఈ నెల 8న జరిగిన ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 109వ సమావేశం పరిగణనలోకి తీసుకున్నట్టు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. ఈపీఎఫ్వో కింద చందాలు జమ చేసే సంస్థలు 6.6 శాతం పెరిగి 7.66 లక్షలకు చేరాయి. చందాలు జమ చేసే సభ్యులు 7.6 శాతం పెరిగి 7.37 కోట్లుగా ఉన్నారు. మొత్తం 4.45 కోట్ల క్లెయిమ్లకు పరిష్కారం లభించింది.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!2022–23లో ఇవి 4.13 కోట్లుగా ఉన్నాయి. కొత్త కారుణ్య నియామక ముసాయిదా విధానం, 2024ను సైతం ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిగణనలోకి తీసుకున్నట్టు కార్మిక శాఖ ప్రకటించింది. ఐటీ, మెరుగైన పరిపాలనా, ఆర్థిక సంస్కరణలపై చర్చించినట్టు.. వచ్చే కొన్ని నెలల పాటు ప్రతి నెలా సమావేశమైన సంస్కరణల పురోగతిని సమీక్షించాలని నిర్ణయించనట్టు తెలిపింది. -
ఈపీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితి పెంపు?
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించనుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్) ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి(ఈపీఎఫ్ఓ వేజ్ సీలింగ్)ని పెంచాలని యోచిస్తోంది. ఈమేరకు త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రూ.15 వేలుగా ఉన్న ఈ పరిమితిని రూ.21 వేలకు పెంచనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఒకవేళ అనుకున్న విధంగానే ఈ మేరకు నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులకు మరింత సామాజిక భద్రత చేకూరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుత విధానం ప్రకారం.. (ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితి: రూ.15,000)ఉద్యోగి ప్రాథమిక జీతం: నెలకు రూ.25,000ఎంప్లాయి కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000యజమాని కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.15,000(గరిష్ఠ పరిమితి)లో 8.33 శాతం = రూ.1,250ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.3,000 - రూ.1,250 = రూ.1,750ఇదీ చదవండి: ‘తను నా కోసమే పుట్టిందనిపించింది’ప్రతిపాదిత విధానం ప్రకారం.. (వేతన సీలింగ్: రూ.21,000)ఉద్యోగి ప్రాథమిక జీతం: నెలకు రూ.25,000ఎంప్లాయి కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000యజమాని కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.21,000(గరిష్ఠ పరిమితి)లో 8.33 శాతం = రూ.1,749ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.3,000 - రూ.1,749 = రూ.1,251కేంద్రం వేతన గరిష్ఠ పరిమితిలో మార్పులు తీసుకొస్తే గతంలో కంటే ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. ఈపీఎఫ్ తగ్గుతుంది. -
వీపీఎఫ్..పన్ను రహిత వడ్డీ పరిమితి పెంపు?
స్వచ్ఛంద భవిష్య నిధి(వీపీఎఫ్)పై సమకూరే పన్ను రహిత వడ్డీ పరిమితిని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు వీపీఎఫ్పై సమకూరే వడ్డీపై పన్ను మినహాయింపు ఉంది. ఈ పరిమితిని పెంచితే మరింత మందికి మేలు జరుగుతుందని, కాబట్టి ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఈ విషయం తెలిసిన వ్యక్తులు తెలిపారు.ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఆధ్వర్యంలోని స్వచ్ఛంద భవిష్య నిధి(వీపీఎఫ్) ద్వారా ఉద్యోగులు తమ డబ్బుపై అదనంగా వడ్డీ సమకూర్చుకోవచ్చు. ఈపీఎఫ్, వీపీఎఫ్కు ఒకే వడ్డీరేటు ఉంటుంది. దాంతో దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చు. వీపీఎఫ్లో జమ చేసే నగదుకు సంబంధించి ఎలాంటి పరిమితులు లేవు.వీపీఎఫ్ గురించి కొన్ని విషయాలుఈ పథకం కోసం ఉద్యోగి ప్రత్యేకంగా కంపెనీ యాజమాన్యానికి లేఖ అందించాల్సి ఉంటుంది. కచ్చితంగా అందరు ఉద్యోగులు ఈ పథకంలో చేరాల్సిన నిబంధనేమీ లేదు. బ్యాంకు సేవింగ్స్ ఖాతా, కొన్ని బ్యాంకులు అందించే ఎఫ్డీ వడ్డీ కంటే మెరుగైన వడ్డీ ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలంలో మంచి రాబడులు అందుకోవచ్చు. భవిషత్తు అవసరాల కోసం మెరుగైన వడ్డీ కావాలని భావించే ఉద్యోగులు ఇందులో చేరవచ్చు.ఈ పథకంలో చేరిన వారు తమ ప్రాథమిక జీతంలో కట్ అవుతున్న 12 శాతం ఈపీఎప్ కంటే అధికంగా జమ చేసుకునే వీలుంది.ఇదీ చదవండి: ఆహార శుభ్రతకు ‘స్విగ్గీ సీల్’ఏటా జమ చేసే మొత్తం రూ.1.5 లక్షల వరకు ఉంటే సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది.ప్రస్తుతం ఈపీఎఫ్ వడ్డీ 8.15 శాతంగా ఉంది. ఇదే వడ్డీ వీపీఎఫ్కు వర్తిస్తుంది.ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత, లేదా పదవీ విరమణ చేసిన తర్వాత ఈ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. వైద్య అత్యవసరాలు, విద్య, వివాహాలు..వంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కూడా నిబంధనల ప్రకారం విత్డ్రా చేసుకోవచ్చు. -
EPFO: 18.53 లక్షల మందికి కొత్తగా పీఎఫ్
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో (ఈపీఎఫ్వో) ఆగస్టులో నికరంగా 18.53 లక్షల మంది కొత్త సభ్యులు జతయ్యారు. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఇది 9.07 శాతం అధికం. ఉద్యోగావకాశాలు, ఉద్యోగులకు లభించే ప్రయోజనాలపై అవగాహన పెరుగుతుండటం, ఈపీఎఫ్వో ప్రచార కార్యక్రమాలు మొదలైనవి ఇందుకు దోహదపడినట్లు కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.కొత్తగా చేరిన వారిలో 18–25 ఏళ్ల వయస్సు వారి వాటా గణనీయంగా ఉన్నట్లు పేర్కొంది. ఉద్యోగాల్లో తొలిసారి చేరేవారు, యువత సంఖ్య పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోందని వివరించింది. దాదాపు 13.54 లక్షల మంది ఉద్యోగాలు మారి, తిరిగి ఈపీఎఫ్లో చేరినట్లు పేర్కొంది.రాష్ట్రాలవారీగా చూస్తే నికరంగా కొత్తగా చేరిన సభ్యుల సంఖ్యను బట్టి మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. కర్ణాటక, తమిళనాడు, హర్యానా, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి చేరిన వారి సంఖ్య తలో అయిదు శాతం పైగా ఉంది. -
ఈపీఎఫ్వో క్లెయిమ్ ప్రాసెసింగ్.. ఇప్పుడు మేలు!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) క్లెయిమ్ల ప్రాసెసింగ్లో ఇటీవల గణనీయమైన పెరుగుదలను సాధించింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో ఇది సుమారు 30 శాతం పెరిగింది. దీనంతటికీ కారణం ఈపీఎఫ్వో ఇటీవల అమలు చేసిన భారీ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్. ఇది దాని డిజిటల్ ప్లాట్ఫామ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచింది.గతంలో క్లెయిమ్ల పరిష్కారం నెమ్మదిగా ఉండేది. దీంతో చందాదారులు, ప్రత్యేకించి అత్యవసర ఆర్థిక అవసరాల కోసం నిధులను ఉపసంహరించుకోవాల్సిన వారు ఇబ్బందులు పడేవారు. కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్తో ఇప్పుడది బాగా మెరుగుపడింది. ఈ వేగాన్ని కొనసాగించడానికి మరిన్ని హార్డ్వేర్ అప్గ్రేడ్లు, అదనపు సాఫ్ట్వేర్ మెరుగుదలలను కూడా ఈపీఎఫ్వో ప్లాన్ చేస్తోంది.ఇదీ చదవండి EPFO: కొత్త ప్రతిపాదన.. రిటైరయ్యాక భారీగా సొమ్ముసెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC) అభివృద్ధి చేసిన కొత్త వ్యవస్థ క్లెయిమ్ తిరస్కరణలను తగ్గించడంలో కీలకపాత్ర పోషించింది. ఇటీవలి సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ తర్వాత, క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగం, ఖచ్చితత్వం రెండింటిలోనూ మెరుగుదలను గుర్తించారు. దీంతోపాటు చందాదారులు ఉద్యోగాలు లేదా స్థానాలను మార్చినప్పటికీ, చెల్లింపు వ్యవస్థల క్రమబద్ధీకరణ, చందాదారుల రికార్డులను ఒకే చోట నిర్వహించే కేంద్రీకృత డేటాబేస్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇది రెండు నెలల్లో కార్యరూపం దాల్చనుంది. -
ఏ బ్యాంకు నుంచైనా ఈపీఎస్ పింఛను
న్యూఢిల్లీ: ఈపీఎఫ్వో నిర్వహణలోని ‘ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్’ (ఈపీఎస్) 1995 కింద దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు శాఖ నుంచి అయినా పింఛను పొందొచ్చని కేంద్ర కారి్మక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. వచ్చే జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. ఈపీఎఫ్వో అత్యున్నత నిర్ణయాల మండలి అయిన ‘సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్’కు కారి్మక శాఖ మంత్రి చైర్పర్సన్గా వ్యవహరిస్తుంటారు. ఈపీఎస్ 1995 పరిధిలోని ఉద్యోగులకు కేంద్రీకృత పింఛను చెల్లింపుల వ్యవస్థ(సీపీపీఎస్)కు ఆమోదం తెలిపినట్టు మాండవీయ ప్రకటించారు. దీని ద్వారా ఏ బ్యాంక్ శాఖ నుంచి అయినా పింఛను చెల్లింపులకు వీలుంటుంద న్నారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) ఆధునికీకరణలో సీపీపీఎస్ ఓ మైలురాయిగా అభివరి్ణంచారు. -
ఈటీఎఫ్ లేదా ఇండెక్స్ ఫండ్స్.. ఏది బెస్ట్?
ద్రవ్యోల్బణానికి దీటైన రాబడులు ఇవ్వడంలో షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్, ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్లు ప్రభావవంతమైనవేనా? – జితేంద్రషార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్, ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్లు మంచి రాబడులను ఇవ్వగలవు. ఇవి ద్రవ్యోల్బణాన్ని మించి స్వల్ప రాబడులను ఇస్తాయి. అధిక రాబడుల కోసం ఈ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే మరోసారి పునరాలోచించాల్సిందే.సాధారణంగా స్థిరాదాయ (ఫిక్స్డ్ ఇన్కమ్/డెట్) పథకాల్లో పెట్టుబడులు పెట్టడంలో ప్రధాన లక్ష్యాలు.. 1. పెట్టుబడిని కాపాడుకోవడం. 2. పెట్టుబడులకు స్థిరత్వాన్ని అందించడం. ఇవి ఊహించతగిన రాబడులు ఇవ్వగలవు. అలా కాకుండా ఫిక్స్డ్ ఇన్కమ్ ద్వారా గొప్ప రాబడులు ఆశిస్తున్నట్టు అయితే, అది రిస్కీ ఆప్షన్లలో పెట్టుబడి పెట్టడం అవుతుంది. కానీ, దీన్ని మేము సూచించం. పోర్ట్ఫోలియోలో డెట్ సాధనాలకు కేటాయింపుల లక్ష్యాన్ని ఇది నీరుగారుస్తుంది. ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులు ఆశిస్తున్నట్టు అయితే అప్పుడు పోర్ట్ఫోలియోలో కొంత భాగాన్ని ఈక్విటీలకు కేటాయించడాన్ని పరిశీలించొచ్చు.నేను నా రిటైర్మెంట్ అవసరాల కోసం 2040 వరకు ప్రతి నెలా రూ.25,000 చొప్పున ఇన్వెస్ట్ చేయగలను. ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్స్లో ఏది మెరుగైన ఆప్షన్ అవుతుంది? – వినాయక్ రావు భోలేఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు) ఏదో ఒక ఇండెక్స్కు అనుగుణంగా ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఉదాహరణకు సెన్సెక్స్, నిఫ్టీ 50. స్టాక్స్ మాదిరే ఇవి స్టాక్ ఎక్సే్ఛంజ్లలో ట్రేడ్ అవుతుంటాయి. ఈటీఎఫ్ల ద్వారా పెట్టుబడులు పెట్టడం ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అవుతుంది. ఈటీఎఫ్లు అన్నవి చాలా తక్కువ వ్యయాలతో కూడిన పెట్టుబడి సాధనాలు.మ్యూచువల్ ఫండ్స్లో వీటికి ప్రత్యామ్నాయం ఇండెక్స్ ఫండ్స్. ఈటీఎఫ్లలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) సాధ్యం కాదు. ఎందుకంటే ఇవి స్టాక్ ఎక్సే్ఛంజ్లలో ట్రేడ్ అవుతుంటాయి. అదే ఇండెక్స్ ఫండ్స్లో అయితే సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిప్ ద్వారా అయితే పెట్టుడులు ప్రతి నెలా క్రమం తప్పకుండా వెళ్లేందుకు సాధ్యపడుతుంది. పెట్టుబడులు సులభంగా ఉండేందుకు ఇండెక్స్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్స్లో సిప్ పెట్టుబడి వేతనానికి అనుగుణంగా ఏటా పెరిగేలా చూసుకోవడం మర్చిపోవద్దు. లార్జ్క్యాప్ విభాగంలో యాక్టివ్ ఫండ్స్తో పోల్చితే ఇండెక్స్ ఫండ్స్ స్థానం బలమైనది.ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఈపీఎఫ్ ఖాతాలో వ్యక్తిగత వివరాలు మార్చుకోండిలా..!
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చందాదారులకు శుభవార్త! మీ పీఎఫ్ ఖాతాలో పేరు, జెండర్, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు..వంటి కీలక వివరాలు తప్పుగా ఉన్నాయా? అయితే ఇకపై వాటిని సవరించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దీనికోసం జాయింట్ డిక్లరేషన్ను మాత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆన్లైన్లోనే పూర్తి చేసుకోవచ్చు.ఏమిటీ జాయింట్ డిక్లరేషన్..ఈపీఎఫ్ చందాదారులు తమ వ్యక్తిగత వివరాలు మార్చాలనుకుంటే జాయింట్ డిక్లరేషన్ ఫారమ్ను సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగి పేరు, జెండర్, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, రిలేషన్, వైవాహిక స్థితి, జాయినింగ్ డేట్, లీవింగ్ డేట్, రీజన్ ఫర్ లీవింగ్, నేషనాలిటీ, ఆధార్ నంబర్.. వంటి 11 రకాల వివరాలు ఇందులో మార్చుకోవచ్చు. అయితే ఈ వివరాలను మార్చాలంటే చందాదారుడు, సంస్థ యజమాని ఇద్దరూ ఈ మార్పును ధ్రువీకరించాలి. ఈ ప్రక్రియ ఆన్లైన్నే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ డిక్లరేషన్ ఫారాన్ని పీఎఫ్ కమిషనర్కి పంపించాలి. దాని అనుసరించి చందాదారుల వివరాలు అప్డేట్ అవుతాయి.సవరణ ఇలా..చందాదారులు ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్ epfindia.gov.inకు వెళ్లాలి.హోం పేజీ టాప్లో ఎడమవైపు servicesపై క్లిక్ చేయాలి.For Employees అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి.కిందకు స్క్రోల్ చేసి సర్వీసెస్ సెక్షన్లో Member UAN/ online Service(OCS/OTCP)పై క్లిక్ చేయాలి.కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో UAN, పాస్వర్డ్ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.స్క్రీన్పై కనిపించే Manage ఆప్షన్ను ఎంచుకోగానే అందులో joint declaration ఆప్షన్ కనిపిస్తుంది.ఇదీ చదవండి: బ్యాంకులను హెచ్చరించిన ఆర్బీఐ గవర్నర్!మీ మెంబర్ ఐడీని ఎంటర్ చేసి అప్డేట్ చేయాలనుకుంటున్న వివరాలను తెలపాలి. సంబంధిత డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.వివరాలు సబ్మిట్ చేశాక యజమానికి (ఎంప్లాయర్) లాగిన్లో ఆ వివరాలు కనిపిస్తాయి. ఎంప్లాయర్ రిజిస్టర్డ్ ఇ-మెయిల్కు కూడా వెళ్తాయి.ఎంప్లాయర్ కూడా ఆయా వివరాలను ధ్రువీకరించిన తర్వాత సదరు జాయింట్ డిక్లరేషన్ను పీఎఫ్ కమిషనర్కు పంపించాలి. -
ఈపీఎఫ్ వడ్డీ చెల్లింపులు ప్రారంభం
సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం.. ఈపీఎఫ్ వడ్డీ సొమ్మును అవుట్గోయింగ్ సభ్యులకు ఇప్పటికే చెల్లిస్తున్నట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తెలిపింది. దీంతో పదవీవిరమణ పొందిన సభ్యులు వారి ఫైనల్ పీఎఫ్ సెటిల్మెంట్లతో పాటు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ సొమ్మును పొందుతున్నారు.ఈపీఎఫ్ వార్షిక వడ్డీ రేటు సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత తదుపరి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రకటిస్తారు. దీని ప్రకారం, ఈపీఎఫ్ సభ్యులకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీ రేటును ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇదే విషయాన్ని గత మే నెలలో ఈపీఎఫ్ఓ తెలియజేసింది. సవరించిన రేట్ల ప్రకారం వడ్డీ సొమ్మును ఇప్పటికే అవుట్గోయింగ్ సభ్యులకు చెల్లించడం ప్రారంభించినట్లు ఈపీఎఫ్ఓ పేర్కొంది.ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా..ఉమంగ్ యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు..» యాప్ను డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నంబర్తో నమోదు చేసుకోండి» ఆప్షన్స్ నుంచి "EPFO"ని ఎంచుకుని, "View Passbook"పై క్లిక్ చేయండి» స్క్రీన్పై మీ పాస్బుక్, ఈపీఎఫ్ బ్యాలెన్స్ చూడటానికి UAN ఎంటర్ చేసి, ‘Get OTP’పై క్లిక్ చేయండిఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా.. » ఈపీఎఫ్ఓ వెబ్సైట్లోని ఎంప్లాయీ సెక్షన్కి వెళ్లి, "మెంబర్ పాస్బుక్"పై క్లిక్ చేయండి. » పీఎఫ్ పాస్బుక్ని చూడటానికి, మీ UAN, పాస్వర్డ్ను నమోదు చేయండి.» మీ UAN ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అయి ఉంటే 7738299899కి SMS పంపడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. -
రూ.61 కోట్లు రికవరీ చేసిన ఈపీఎఫ్ఓ
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్ చెల్లించాల్సిన రూ.73 కోట్ల బకాయిలకుగాను రూ.61 కోట్లను రికవరీ చేసినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తెలిపింది. మార్చి 2020 నుంచి మే 2021 వరకు ఈపీఎఫ్ఓకు చెల్లించాల్సిన ఎంప్లాయర్(కంపెనీ) వాటాలో కొంత మొత్తం వసూలైనట్లు పేర్కొంది.స్పైస్జెట్ సంస్థ ఉద్యోగుల వేతనాల్లో కట్ అవుతున్న ఈపీఎఫ్ఓ వాటాలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. మేనేజ్మెంట్ వాటాను ఈపీఎఫ్ఓకు జమ చేయడం లేదని, బకాయిపడిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని సంస్థకు నోటీసులు అందించారు. దాంతో తాజాగా మార్చి 2020 నుంచి మే 2021 వరకు బకాయిపడిన మొత్తం రూ.73 కోట్లలో రూ.61 కోట్లు రికవరీ అయినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. ఆలస్య చెల్లింపునకు సంబంధించిన వడ్డీ, జనవరి 2022 తర్వాత చెల్లించాల్సిన బకాయిలను కూడా అంచనా వేసినట్లు పేర్కొంది.ఈ సందర్భంగా స్పైస్జెట్ అధికారి ఒకరు మాట్లాడుతూ..‘ఈపీఎఫ్ సెక్షన్ 14బీ, ఇతర నిబంధనల చట్టం 1952 ప్రకారం విచారణ జరుగుతుంది. చట్టంలోని సెక్షన్ 7A కింద మిగిలిన కాలానికి (ఇప్పటి వరకు) ఎంత చెల్లించాలో లెక్కించి దాన్ని రికవరీ చేసే ప్రక్రియ మొదలైంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అంబానీ చెల్లి.. భర్త చనిపోయినా కోట్ల కంపెనీకి ఛైర్పర్సన్గా..ఈపీఎఫ్ఓ పరిధిలోని ప్రతి సంస్థ ఎంప్లాయర్ వాటాను ఉద్యోగభవిష్య నిధిలో జమ చేయాలి. ప్రతి నెలా 15వ తేదీలోపు ఈపీఎఫ్ఓలో తమ రిటర్న్లను ఫైల్ చేయాలి. లేదంటే బకాయిపడిన తేదీ నుంచి ఏటా 12% చొప్పున వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. -
ఈపీఎఫ్లో ఉన్న ఈ అదనపు బెనిఫిట్ గురించి తెలుసా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగులు భవిష్యత్తు కోసం తమ కొంత మొత్తాన్ని ఇందులో జమ చేస్తుంటారు. దీనికి ఈపీఎఫ్ఓ వడ్డీ చెల్లిస్తుంది. అయితే దీంతోపాటు ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ అందించే అద్భుతమైన అదనపు ప్రయోజనం ఒకటుంది. అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..ఈపీఎఫ్ ఖాతాదారుల కోసం ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) పథకాన్ని ఈపీఎఫ్ఓ 1976లో ప్రారంభించింది. ఈపీఎఫ్ఓ సభ్యుడు ఏ కారణం చేతనైనా మరణిస్తే, అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. ఈ ఇన్సూరెన్స్ కవరేజీ పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. ఈడీఎల్ఐ స్కీమ్కు కంపెనీ కంట్రిబ్యూషన్ ఇస్తుంది.బీమా మొత్తాన్ని ఎలా నిర్ణయిస్తారంటే..బీమా మొత్తం గత 12 నెలల బేసిక్ జీతం, డీఏపై ఆధారపడి ఉంటుంది. బీమా కవరేజీ క్లెయిమ్ చివరి మూల వేతనం + డీఏకు 35 రెట్లు ఉంటుంది. ఇది కాకుండా, రూ .1,75,000 వరకు బోనస్ మొత్తాన్ని కూడా చెల్లిస్తారు.ఈపీఎఫ్ఓ సభ్యుడు ఉద్యోగంలో ఉన్నంత కాలం మాత్రమే ఈడీఎల్ఐ స్కీమ్ పరిధిలోకి వస్తారు. ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తరువాత, అతని కుటుంబం, వారసులు, నామినీలు దానిని క్లెయిమ్ చేయలేరు. ఈపీఎఫ్ఓ సభ్యుడు 12 నెలలు నిరంతరాయంగా పనిచేస్తుంటే, ఉద్యోగి మరణించిన తర్వాత, నామినీకి కనీసం రూ .2.5 లక్షల ప్రయోజనం లభిస్తుంది.ఉద్యోగి పనిచేసేటప్పుడు అనారోగ్యం, ప్రమాదం లేదా సహజ మరణం సంభవిస్తే ఈడీఎల్ఐ క్లెయిమ్ చేయవచ్చు. ఈడీఎల్ఐ పథకం కింద నామినీలుగా ఎవరినీ పేర్కొనకపోతే మరణించిన ఉద్యోగి జీవిత భాగస్వామి, అవివాహిత కుమార్తెలు, మైనర్ కొడుకులు, కుమారులను కవరేజీని లబ్ధిదారులుగా పరిగణిస్తారు.ఎలా క్లెయిమ్ చేయాలంటే..ఈపీఎఫ్ చందాదారు అకాల మరణం చెందితే, వారి నామినీ లేదా చట్టబద్ధమైన వారసులు బీమా కవరేజీ కోసం క్లెయిమ్ చేయవచ్చు. ఇందుకోసం నామినీ వయస్సు కనీసం 18 ఏళ్లు ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే తల్లిదండ్రులు వారి తరఫున క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ చేసేటప్పుడు డెత్ సర్టిఫికేట్, వారసత్వ ధ్రువీకరణ పత్రం వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. మైనర్ సంరక్షకుడి తరఫున క్లెయిమ్ చేస్తుంటే గార్డియన్ షిప్ సర్టిఫికెట్, బ్యాంకు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. -
ఈపీఎస్లో మార్పులు.. పదేళ్ల సర్వీసు లేని వారికి నష్టం
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)లో చేరి పదేళ్లు పూర్తి కాలేదా..? ఉద్యోగుల పింఛను స్కీం (ఈపీఎస్)లో జమైన డబ్బు తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకు వచ్చే నగదు కొంతమేర తగ్గనుంది. ఈపీఎస్ ముందస్తు ఉపసంహరణ చెల్లింపుల్లో ఈపీఎఫ్వో మార్పులు తీసుకొచ్చింది. ఈపీఎఫ్ పరిధిలోని సంస్థలో పని చేసిన సర్వీసును ఇప్పటివరకు ఏడాది పరంగా లెక్కగట్టేవారు. తాజాగా మార్చిన నిబంధనల ప్రకారం సంస్థలో ఎన్ని నెలలు పనిచేస్తే అన్ని నెలలకే లెక్కించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఈపీఎస్ చట్టం, 1995 టేబుల్-డీలో కార్మికశాఖ సవరణలు చేసింది.ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం..ఉద్యోగి ఏదేని సంస్థలో పనిచేస్తూ కనీసం పదేళ్ల ఈపీఎస్ సర్వీసు పూర్తి చేస్తేనే వారికి 58 ఏళ్లు వచ్చాక నెలవారీ పింఛను వస్తుంది. తొమ్మిదేళ్ల ఆరు నెలల సర్వీసు పూర్తి చేసినా పదేళ్లుగానే పరిగణిస్తారు. అంతకు తక్కువుంటే పింఛను రాదు. పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఈపీఎస్ నిల్వలను చెల్లించదు. కనీస సర్వీసు లేనివారు మాత్రమే ఈ నగదు తీసుకునేందుకు అర్హులు.ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు పదేళ్ల సర్వీసుకంటే ముందే ఈపీఎస్ మొత్తాన్ని ఉపసంహరిస్తున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన కొంతమంది రెండు, మూడేళ్లకో సంస్థ మారుతూ అప్పటికే ఈపీఎస్లో జమైన మొత్తాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. అయితే బదిలీ, ఉద్యోగం మానేసిన కారణాలతో డబ్బులను వెనక్కి తీసుకోవద్దని, మరో సంస్థకు ఆ సర్వీసును పూర్తిగా బదిలీ చేసుకుంటే పింఛను అర్హత పొందడంతోపాటు ఎక్కువ పింఛను వస్తుందని ఈపీఎఫ్వో అధికారులు చెబుతున్నారు.ఇదీ చదవండి: నెలలో రెట్టింపైన ఉల్లి ధర.. ఎగుమతి సుంకంపై మంత్రి ఏమన్నారంటే..ఎలా లెక్కిస్తారంటే..ఉద్యోగి మూలవేతనం నుంచి 12 శాతం ఈపీఎఫ్ ఖాతాకు డబ్బు జమవుతుంది. పనిచేస్తున్న సంస్థ అంతేమొత్తంలో 12 శాతం వాటాను ఈపీఎఫ్కు చెల్లిస్తుంది. అయితే సంస్థ చెల్లించే 12 శాతంలో 8.33 శాతం ఈపీఎస్లోకి, 3.67 శాతం ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. 2014 నుంచి ఈపీఎఫ్వో గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేలకు పెంచారు. దాని ప్రకారం సంస్థ చెల్లించే 12 శాతం వాటా (రూ.1,800)లో 8.33 శాతం అంటే రూ.1,250 ఈపీఎస్కు వెళ్తుంది. ఉద్యోగి పదేళ్ల సర్వీసుకు ముందే రాజీనామా చేసినా, రిటైర్డ్ అయినా ఈపీఎస్ను వెనక్కి తీసుకోవాలని అనుకుంటే అతని సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఎంత చెల్లించాలో లెక్కించేవారు. ఒకవేళ మూలవేతనం, డీఏ కలిపి రూ.15000 ఉందనుకుందాం. ఉద్యోగి ఏడేళ్ల ఏడు నెలలు పని చేశాడనుకుంటే గతంలోని నిబంధన ప్రకారం ఏడేళ్ల ఏడు నెలలను ఎనిమిదేళ్లుగా పరిణించేవారు. రాజీనామా లేదా ఉద్యోగ విరమణ చేసినప్పుడు మూలవేతనం రూ.15000 ఉన్నందున ఈపీఎస్ టేబుల్-డీ ప్రకారం ఎనిమిదేళ్ల కాలానికి 8.22 నిష్పత్తి చొప్పున చెల్లించేవారు. అంటే రూ.15,000 X 8.22 చొప్పున రూ.1,23,300 వచ్చేవి. తాజా నిబంధనల ప్రకారం ఏడేళ్ల ఏడు నెలలు అంటే 91 నెలలు అవుతుంది. 91 నెలల కాలానికి నిష్పత్తి 7.61 అవుతుంది. అంటే రూ.15000 X 7.61 లెక్కన రూ.1,14,150 చెల్లిస్తారు. -
త్వరలో ఈపీఎఫ్ వడ్డీ.. మీ ఖాతాలో ఎంతుంది.. ఎంతొస్తుంది?
EPFO Interest Rate: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అనేది ఉద్యోగుల రిటైర్మెంట్ స్కీమ్. చాలా మంది ఉద్యోగులు తమ జీతంలో కొంత మొత్తాన్ని ఇందులో దాచుకుంటారు. కంపెనీల యాజమాన్యాలు కూడా ఉద్యోగుల తరఫున కొంత మొత్తాన్ని జమ చేస్తాయి.ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల వరకు డిపాజిట్లకు పన్ను మినహాయింపు ఉంటుంది. దీనిపై ఈపీఎఫ్వో ఏటా వడ్డీని చెల్లిస్తుంది.వడ్డీ ఎంతొస్తుందో తెలుసుకోండి..ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) ప్రకారం.. ఈ ఏడాది జూలై-ఆగస్టు నాటికి అన్ని ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలకు వడ్డీ జమ అవుతుంది. ఈ నేపథ్యంలో మీ ఈపీఎఫ్ ఖాతాలో వడ్డీ రేటును ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి.. మీ ఈపీఎఫ్ ఖాతాలో రూ.1 లక్ష, రూ.3 లక్షలు, రూ.5 లక్షల డిపాజిట్లు ఉంటే ఎంత రాబడి వస్తుందో ఇక్కడ తెలియజేస్తున్నాం..వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) నిర్ణయిస్తుంది. ఈ సంవత్సరానికి ఇది 8.25 శాతంగా ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది. అంటే ప్రస్తుత సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు వారి ఖాతాలపై ఎక్కువ వడ్డీ లభిస్తుంది.మీ ఈపీఎఫ్ ఖాతాలో రూ.1 లక్ష ఉంటే దానిపై 8.25 శాతం వడ్డీ పొందితే ఏడాదికి మీ వడ్డీ రూ.8,250 అవుతుంది.అదే రూ.3 లక్షలు ఉన్నట్లయితే రూ.24,500 వడ్డీ వస్తుంది. ఒక వేళ రూ.5 లక్షలు ఉంటే మీకు వచ్చే వడ్డీ రూ.41,250 అవుతుంది.పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా..⇒ ఉమాంగ్ యాప్ లేదా ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.⇒ ఈపీఎఫ్ఓ పోర్టల్లో లాగిన్ అవ్వండి⇒ ఈ-పాస్బుక్ ఆప్షన్పై క్లిక్ చేయాలి.⇒ ఇది మిమ్మల్ని మరొక స్క్రీన్కు తీసుకువెళుతుంది. ఇక్కడ మీ యూఏఎన్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ నమోదు చేయాలి.⇒ విజయవంతంగా లాగిన్ అయిన తర్వాత, పాస్బుక్ కోసం మెంబర్ ఐడీ ఆప్షన్ను ఎంచుకోండి.⇒ పాస్బుక్ పీడీఎఫ్ ఫార్మాట్లో లభిస్తుంది. నిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఈపీఎఫ్ కొత్త రూల్స్.. వాటి అప్లోడ్ తప్పనిసరి కాదు!
EPF New rules: ఆన్లైన్లో క్లెయిమ్ దరఖాస్తు చేసేవారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఊరట కల్పించింది. దరఖాస్తులో భాగంగా చెక్ లీఫ్, అటెస్టెడ్ బ్యాంక్ పాస్బుక్ చిత్రాలను అప్లోడ్ చేయవలసిన అవసరాన్ని సడలించినట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది.ఆన్లైన్లో దాఖలు చేసిన క్లెయిమ్ల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి, క్లెయిమ్ను ఆన్లైన్లో ఫైల్ చేసినప్పుడు చెక్ లీఫ్/అటెస్టెడ్ బ్యాంక్ పాస్బుక్ చిత్రం అప్లోడ్ చేయని కారణంగా తిరస్కరణకు గురయ్యే క్లెయిమ్ల సంఖ్యను తగ్గించడానికి ఈ చర్య దోహదపడుతుంది.మరి క్లెయిమ్ వెరిఫై ఎలా?చెక్ లీఫ్/అటెస్టెడ్ బ్యాంక్ పాస్బుక్ చిత్రాలు అప్లోడ్ చేయని పక్షంలో క్లెయిమ్ ఖచ్చితత్వాన్ని ధ్రువీకరించడానికి ఈపీఎఫ్వో అదనపు ధ్రువీకరణ పద్ధతులను ఉపయోగిస్తుంది. వీటిలో ఇవి ఉండవచ్చు..ఆన్లైన్ బ్యాంక్ కేవైసీ వెరిఫికేషన్: మీ బ్యాంక్ లేదా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కేవైసీ వివరాలను నేరుగా తనిఖీ చేస్తుంది.డీఎస్సీ ద్వారా కంపెనీ వెరిఫికేషన్: డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (డీఎస్సీ) ఉపయోగించి మీ బ్యాంకు ఖాతా వివరాలను మీ కంపెనీ ధ్రువీకరించవచ్చు.సీడెడ్ ఆధార్ నంబర్ వెరిఫికేషన్: మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ నంబర్ను యూఐడీఏఐ ధ్రువీకరిస్తుంది. -
ఇకపై రూ.1 లక్ష విత్డ్రా చేసుకోవచ్చు.. పీఎఫ్లో కీలక మార్పు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ( EPFO ) చందాదారుల నగదు ఉపసంహరణ విషయంలో కీలక మార్పులు చేసింది. వైద్య ఖర్చుల కోసం చేసే 68జే క్లెయిమ్ల అర్హత పరిమితిని రూ. 50,000 నుంచి రూ.1 లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈపీఎఫ్వో కొత్త మార్పు ప్రకారం.. చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్స ఖర్చుల కోసం ఇకపై రూ.1 లక్ష వరకూ ఉపసంహరించుకోవచ్చు. నెల అంతకంటే ఎక్కువ రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా, ఆపరేషన్లు చేయించుకున్నా క్లెయిమ్ చేయొచ్చు. పక్షవాతం, టీబీ, క్షయ, క్యాన్సర్, గుండె సంబంధిత చికిత్స కోసం కూడా నగదు విత్డ్రాకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. లక్ష పరిమితికి లోబడి ఉద్యోగుల ఆరు నెలల బేసిక్ వేతనంతోపాటు డీఏ లేదా ఈపీఎఫ్లో ఉద్యోగి వాటా వడ్డీతో సహా ఏది తక్కువైతే అంత వరకూ మాత్రమే ఉపసంహరించుకోవడానికి క్లెయిమ్ చేయడానికి వీలుంటుంది. ఇందు కోసం ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లు లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు. -
EPFO Update: భారీగా పెరిగిన ఉద్యోగులు
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో సభ్యులు భారీగా పెరిగారు. 2023 నవంబర్లో నికరంగా 13.95 లక్షల మంది సభ్యులను చేర్చుకున్నట్లు ఈపీఎఫ్వో తాజాగా విడుదల చేసిన తాత్కాలిక పేరోల్ డేటా ద్వారా వెల్లడించింది. ఇది మునుపటి ఏడాదిఇదే కాలంలో చేరికల కంటే ఎక్కువని తెలుస్తోంది. 7.36 లక్షల మంది కొత్తవారు 2023 నవంబర్లో దాదాపు 7.36 లక్షల మంది కొత్త సభ్యులు నమోదు చేసుకున్నారని ఈపీఎఫ్వో డేటా సూచిస్తోంది. కొత్తగా చేరిన సభ్యులలో 18-25 సంవత్సరాల వయస్సు గలవారు 57.30 శాతం మంది ఉన్నారు. అంటే పెద్ద సంఖ్యలో శ్రామిక శక్తి సంఘటిత రంగంలో ప్రవేశించింది. సుమారు 10.67 లక్షల మంది సభ్యులు నిష్క్రమించినా మళ్లీ ఈపీఎఫ్వోలో చేరినట్లు పేరోల్ డేటా ప్రతిబింబిస్తోంది. 1.94 లక్షల మంది మహిళలు జెండర్వారీగా పేరోల్ డేటాను పరిశీలిస్తే 2023 నవంబర్లో చేరిన మొత్తం 7.36 లక్షల మంది కొత్త సభ్యులలో దాదాపు 1.94 లక్షల మంది మహిళలు ఉన్నారు. అలాగే ఆ నెలలో నికరంగా మహిళా సభ్యుల చేరిక దాదాపు 2.80 లక్షలకు చేరుకుంది. నికర చందాదారుల చేరికలో నికర మహిళా సభ్యుల శాతం 20.05 శాతంగా ఉంది. ఇది 2023 సెప్టెంబరు కంటే అధికం. సంఘటిత రంగ శ్రామిక శక్తిలో మహిళా ఉద్యోగుల భాగస్వామ్యాన్ని ఇది తెలియజేస్తోంది. -
అక్టోబర్లో భారీగా ఉపాధి
న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్లో భారీగా ఉపాధి కల్పన నమోదైంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) నిర్వహిస్తున్న ఈపీఎఫ్ పథకంలో 15.29 లక్షల మంది సభ్యులుగా చేరారు. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 18.2 శాతం మందికి అదనంగా ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. అక్టోబర్ నెలకు సంబంధించి పేరోల్ గణాంకాలను కేంద్ర కారి్మక శాఖ బుధవారం విడుదల చేసింది. 7.72 లక్షల మంది కొత్త సభ్యులు నికరంగా చేరినట్టు తెలుస్తోంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు ఇందులో 6 శాతం వృద్ధి నమోదైంది. నికర సభ్యుల చేరిక 15.29 లక్షలుగా ఉంది. కొత్తగా చేరిన వారిలో 58.60 శాతం మంది 18–25 ఏళ్ల వయసులోని వారు. అంటే సంఘటిత రంగంలో వీరంతా మొదటిసారి ఉపాధి పొందిన వారని తెలుస్తోంది. ఇక 11.10 లక్షల మంది ఒక సంస్థలో మానేసి మరో సంస్థలో చేరారు. వీరు ఆన్లైన్లో తమ ఈపీఎఫ్లను బదిలీ చేసుకున్నారు. ఈపీఎఫ్వో నుంచి వైదొలగిన సభ్యుల సంఖ్య గడిచిన 12 నెలల్లోనే తక్కువగా ఉంది. మహిళా సభ్యులు 3 లక్షలు: 7.72 లక్షల కొత్త సభ్యుల్లో 2.04 లక్షల మంది మహిళలు ఉన్నారు. అక్టోబర్ నెలకు నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 3.03 లక్షలుగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలో పోల్చి చూస్తే 15 శాతం వృద్ధి కనిపించింది. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 22 శాతం మంది సభ్యులు చేరారు. హోటళ్లు, టీ విక్రయ కేంద్రాలు, ట్రేడింగ్, షాపులు, కెమికల్స్ కంపెనీలు, జీవత బీమా సంస్థల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. -
ఎన్పీఎస్, ఈపీఎఫ్ - రెండింటిలో ఏది బెస్ట్ అంటే?
నాకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాల పెట్టుబడులు ఉండగా, వీటిని విక్రయించాను. ఈ లాభం లక్షలోపు ఉంది. దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్షలోపు ఉంటే పన్ను చెల్లించక్కర్లేదని విన్నాను. అయితే, ఈ లాభాలను ఆదాయపన్ను రిటర్నుల్లో వెల్లడించాలా? అవసరం లేదా? – గురుమూర్తి మీ వార్షికాదాయం ఆదాయపన్ను వర్తించే శ్లాబులో ఉంటే తప్పకుండా రిటర్నులు వేయాల్సి ఉంటుంది. రిటర్నులు దాఖలు చేయాల్సిన ప్రతి ఒక్కరూ పన్ను పరిధిలోకి రాని మూలధన లాభం ఉన్నప్పటికీ దాన్ని రిటర్నుల్లో వెల్లడించాల్సిందే. లిస్టెడ్ కంపెనీల్లో నేరుగా పెట్టుబడులు కలిగినా లేదా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను ఏడాదికి మించి కలిగి ఉంటే, వాటిపై వచ్చే లాభాన్ని దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ)గా పేర్కొంటారు. ఒక ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష వరకు ఉంటే పన్ను లేదు. అంతకుమించిన లాభం వస్తే, ఆ మొత్తంపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్) ఆధారంగా మీరు దాఖలు చేయాల్సిన వార్షిక రిటర్నుల పత్రాల్లో ఈ వివరాలు ముందుగానే నింపి ఉంటాయి. కనీస ఆదాయపన్ను మినహాయింపు పరిధిలోనే ఆదాయం ఉంటే, పన్ను వర్తించని మూలధన లాభాలను వెల్లడించక్కర్లేదు. ఆదాయపన్ను పాత విధానం కింద సీనియర్ సిటిజన్లు అయితే (60 ఏళ్లు నిండిన) వార్షికాదాయం రూ.3 లక్షలు ప్రాథమిక పన్ను మిహాయింపు పరిమితిగా ఉంది. 80 ఏళ్లు నిండిన వారికి ఇది రూ.5లక్షలుగా ఉంది. మిగిలిన వారికి రూ.2.5 లక్షలుగా ఉంది. నూతన పన్ను విధానంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఆదాయపన్ను మినహాయింపు కనీస పరిమితి రూ.2.5 లక్షలుగానే ఉంది. వార్షిక ఆదాయ మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా ఉన్నప్పటికీ, వాస్తవ ఆదాయం ఇంతకంటే తక్కువగా ఉన్న వారు మూలధన లాభాలు (స్వల్పకాల, దీర్ఘకాల) కలిగి ఉంటే, ఆ మొత్తాన్ని కనీస పరిమితి కింద భర్తీ చేసుకోవచ్చు ఉదాహరణకు వార్షికాదాయం రూ.1.8 లక్షలుగానే ఉండి, మూలధన లాభం రూ.లక్ష వచ్చి ఉంటే, అప్పుడు బేసిక్ పరిమితిలో మిగిలిన రూ.70వేలను భర్తీ చేసుకోవచ్చు. ఇది పోను మిగిలిన రూ.30వేలపైనే మూలధన లాభాల పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇలా కాకుండా మీ ఆదాయం రూ.2.5 లక్షలకు పైన ఉంటే, అప్పుడు మూలధన లాభాలను రిటర్నుల్లో వెల్లడించి నిబంధనల కింద పన్ను చెల్లించాల్సిందే. ప్రస్తుతం నేను పనిచేస్తున్న సంస్థలో నా నెలవారీ వేతనం నుంచి ఈపీఎఫ్ పథకానికి చందాలు వెళుతున్నాయి. నేను వచ్చే ఏడాది నేను పదవీ విమరణ తీసుకోబోతున్నాను. పీఎఫ్ నిధి సుమారు రూ.50 లక్షలుగా ఉంటుంది. ఈ సమయంలో ఎన్పీఎస్కు మారేందుకు కార్యాలయం నాకు ఆప్షన్ ఇచ్చింది. మరి నేను ఎన్పీఎస్కు మారాలా? అది నాకు ప్రయోజనమేనా? – రాజేష్ కుమార్ భాసిన్ రిటైర్మెంట్ ప్రణాళిక కోసం ఎన్పీఎస్, ఈపీఎఫ్ రెండూ ముఖ్యమైన పథకాలుగా ఉన్నాయి. ఈపీఎఫ్ అనేది మీ వేతనం నుంచి తప్పకుండా మినహాయించే ప్రావిడెంట్ ఫండ్ ఆప్షన్. రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకోవడమే ఇందులోని ఉద్దేశం. పదవీ విమరణ సమయంలో చేతికి అందే మొత్తంపై పన్ను ఉండదు. ఎన్పీఎస్ అనేది స్వచ్ఛంద పథకం. పదవీ విరమణ నిధి ఏర్పాటుకు ఇది కూడా ఒక సాధనం. మీరు మరో ఏడాదిలో రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఈపీఎఫ్ ద్వారా ఇప్పటికే నిధిని సమకూర్చుకున్నారు. కనుక ఈ సమయంలో ఎన్పీఎస్కు మారడం వల్ల వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు. వేచి చూసి రిటైర్మెంట్ తర్వాత వచ్చే ఈపీఎఫ్ నిధిని మీ అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేసుకోవడం సరైనది. పదవీ విరమణ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునేట్టు అయితే, మీ ఉద్దేశ్యాలకు అనుగుణంగా సాధనాలను ఎంపిక చేసుకోవాలి. క్రమం తప్పకుండా ఆదాయం కోరుకోకపోతే అప్పుడు ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. స్వచ్ఛందంగా అయినా ఎన్పీఎస్ ఖాతాను 70 ఏళ్ల వరకు తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
వేతన జీవులకు షాక్.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)లో డబ్బులు దాచుకునే ఉద్యోగులకు చేదువార్త. రానున్న రోజుల్లో పీఎఫ్పై వడ్డీ తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగుల భవిష్యనిధిపై ఇస్తున్న వడ్డీ రేట్లను పునఃపరిశీలించాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించిందని ఆర్టీఐ సమాచారం ఆధారంగా ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ మిగులును అంచనా వేసిన తర్వాత కూడా నష్టాన్ని చవిచూసింది. రూ. 449.34 కోట్ల మిగులు ఉంటుందని అనుకున్నప్పటికీ రూ. 197.72 కోట్ల లోటును ఎదుర్కొంది. దీంతో పీఎఫ్పై ఇస్తున్న వడ్డీ రేట్లను పునఃపరిశీలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.15 శాతంగా నిర్ణయించింది. అయితే నష్టాలను దృష్టిలో ఉంచుకుని, వడ్డీ రేటును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. పీఎఫ్పై అధిక వడ్డీ రేట్లను తగ్గించి మార్కెట్ రేట్లతో సమానంగా తీసుకురావాల్సిన అవసరం ఉందంది. ప్రస్తుతం పీఎఫ్పై వచ్చే వడ్డీని మార్కెట్తో పోల్చితే కాస్త ఎక్కువే. చాలా పొదుపు పథకాల్లో వడ్డీ పీఎఫ్పై చెల్లించే వడ్డీ కంటే తక్కువగానే ఉంది.ఈ కారణంగానే పీఎఫ్ వడ్డీని 8 శాతం దిగువకు తగ్గించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ చాలా కాలంగా వాదిస్తోంది. దీంతో పీఎఫ్పై వడ్డీని ఎప్పకప్పుడు తగ్గిస్తూ వస్తున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్పై వడ్డీ రేటును 8.80 శాతం నుంచి 8.70 శాతానికి తగ్గించారు. కార్మిక సంఘాల నిరసనతో మళ్లీ 8.80 శాతానికి పెంచారు. ఆ తర్వాత పీఎఫ్పై వడ్డీ రేట్లు తగ్గుతూ 2021-22లో 8.10 శాతానికి తగ్గాయి. 2022-23లో ఇది 8.15 శాతానికి స్వల్పంగా పెరిగింది. కోట్లాది మంది ఉద్యోగుల సామాజిక భద్రతకు పీఎఫ్ అతిపెద్ద ఆధారం. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ చందాదారుల సంఖ్య 6 కోట్లకు పైగా ఉంది. -
ఈపీఎఫ్వో అలర్ట్: వివరాల అప్డేషన్కు కొత్త మార్గదర్శకాలు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యుల ప్రొఫైల్ అప్డేషన్ ప్రక్రియకు సంబంధించి కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను తీసుకొచ్చింది. ఈ మేరకు తాజాగా ఓ సర్క్యులర్ను జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం, ఈపీఎఫ్ సభ్యులు వారి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను అప్డేట్ చేసుకోవడానికి జాయింట్ డిక్లరేషన్ల ప్రాసెసింగ్లో ఎస్ఓపీ సహాయం చేస్తుంది. అప్డేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు వివరాల నమోదులో అవకతవకలను నివారించేందుకు ఈ కొత్త ప్రక్రియను ఈపీఎఫ్ఓ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఈపీఎఫ్వో డేటాబేస్లో అసంపూర్ణంగా లేదా సరిపోలని విధంగా ఉన్న వివరాల అప్డేషన్ కోసం కాగితాల ద్వారా సమర్పించే జాయింట్ డిక్లరేషన్ విధానం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇందుకు చాలా సమయం పడుతోంది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కొత్త విధానానం (ఎస్ఓపీ) సహాయపడుతుందని సర్క్యులర్లో పేర్కొన్నారు. అప్డేషన్ వివరాలు, పరిమితులు ప్రొఫైల్స్ సక్రమంగా లేకపోవడంతో తరచూ తిరస్కరణలు, కొన్నిసార్లు అవకతవకలకు సైతం దారితీసే అవకాశం ఉంటోంది. పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు/తల్లి పేరు, సంబంధ స్థితి, ఆరోగ్య స్థితి, ఉద్యోగంలో చేరిన తేదీ, నిష్క్రమించడానికి కారణం, నిష్క్రమించిన తేదీ, జాతీయత, ఆధార్ నంబర్ తదితర వివరాల్లో డేటా సరిపోలకపోవడం వంటి కారణాల వల్ల క్లెయిమ్ సెటిల్మెంట్లలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైన పేర్కొన్న 11 రకాల వివరాల్లో సవరణలను ఈపీఎఫ్వో సభ్యులు చేసుకోవచ్చు. కొత్త ఎస్ఓపీ ప్రకారం.. వీటిని చిన్న, పెద్ద మార్పులుగా వర్గీకరించారు. అలాగే ఈ వివరాలను ఎన్నిసార్లు అప్డేషన్ చేసుకోవచ్చన్న దానిపై కూడా పరిమితిని విధించింది ఈపీఎఫ్వో. చిన్న అభ్యర్థనలు ఏడు రోజుల్లో పెద్ద అప్డేషన్లు 15 రోజుల్లో పూర్తయ్యే చర్యలు చేపట్టింది. అప్డేషన్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి దశలోనూ సభ్యులకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. అప్డేషన్ ప్రక్రియతో పాటు, ఇందుకు అవసరమైన పత్రాలను సర్క్యులర్లో పేర్కొన్నారు. పేరు, జెండర్ అప్డేట్ చేయడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి. అగానే సభ్యులు మరణించిన సందర్భంలో మరణ ధ్రువీకరణ పత్రం కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. -
పీఎఫ్ వడ్డీ డబ్బులు ఎప్పుడు పడతాయి? ఈపీఎఫ్ఓ ఏం చెప్పింది?
వేతన జీవులు డబ్బులు పొదుపు చేసుకునే ప్రావిడెంట్ ఫండ్ (PF)లో డిపాజిట్ల వడ్డీ రేటును 8.15 శాతానికి పెంచాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సిఫార్సును ప్రభుత్వం జులై 24న ఆమోదించింది. ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి చాలా మంది సభ్యులు తమ పీఎఫ్ ఖాతాలో వడ్డీ మొత్తం ఎప్పుడు జమవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్లో ఓ చందాదారు 2022-23 ఆర్థిక సంవత్సారానికి సంబంధించిన వడ్డీ ఎప్పుడు జమవుతుందని అడిగారు. దీనికి ఈపీఎఫ్ఓ స్పందిస్తూ, ప్రాసెస్ జరుగుతోందని, అతి త్వరలో వడ్డీ సొమ్ము జమవుతుందని బదులిచ్చింది. వడ్డీ సొమ్ము ఎప్పుడు జమయినా మొత్తం జమవుతుందని, కాస్త ఓపిక పట్టాలని కోరింది. EPFO: వేతన జీవులకు గుడ్న్యూస్: ఈపీఎఫ్ వడ్డీని పెంచిన కేంద్రం సాధారణంగా పీఎఫ్ వడ్డీని నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తారు. ఆర్థిక సంవత్సరం చివరిలో జమ చేస్తారు. ఇలా జమయిన వడ్డీ.. తర్వాత నెల బ్యాలెన్స్కి యాడ్ అవుతుంది. ఆ మొత్తం అంతటికీ మళ్లీ వడ్డీ లెక్కిస్తారు. వడ్డీ మొత్తం జమయిన తర్వాత పీఎఫ్ చందాదారులు ఈపీఎఫ్ఓ వెబ్సైట్, ఎస్సెమ్మెస్, మిస్డ్ కాల్లు లేదా ఉమంగ్ యాప్తో సహా వివిధ మోడ్ల ద్వారా వారి ఈపీఎఫ్ బ్యాలెన్స్ని చెక్ చేసుకోవచ్చు. EPFO Provides dedicated portal for the members of EPF For more details please click on the below link 👇https://t.co/Y6MCy1V8rx#epf #ईपीएफ #पीएफ #epfowithyou #AmritMahotsav #HumHaiNa #epfo@PMO @byadavbjp @Rameswar_Teli @MIB_India @LabourMinistry @PIB_India @AmritMahotsav — EPFO (@socialepfo) August 4, 2023 -
విద్యుత్సౌధ అష్టదిగ్బంధనం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్సౌధను ఉద్యోగులు అష్టదిగ్బంధనం చేశారు. వేతన సవరణ, ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఆర్టిజన్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చలో విద్యుత్సౌధ కార్యక్రమానికి 24 సంఘాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్(టీఎస్పీఈ జేఏసీ) కమిటీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జేఏసీ పిలుపు మేరకు గ్రేటర్ హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు, ఆర్టీజన్ కార్మి కులు ఉదయం పదిగంటలకే పెద్దసంఖ్యలో సోమాజిగూడలోని విద్యుత్సౌధకు చేరుకున్నారు. అనుకున్న దానికంటే అధిక సంఖ్యలో తరలిరావడంతో విద్యుత్సౌధ ప్రాంగణమంతా నిండిపోయింది. మిగిలినవాళ్లంతా ప్రధాన కార్యాలయం ముందున్న రహదారిపైనే నిలబడాల్సి వచ్చింది. దీంతో ఇటు ఖైరతాబాద్ చౌరస్తా నుంచి అటు పంజగుట్ట వరకు రోడ్డంతా విద్యుత్ కార్మి కులతో నిండిపోయింది. ట్రాఫిక్ మళ్లింపు.. ఎక్కడి వాహనాలు అక్కడే.. విద్యుత్ ఉద్యోగుల ధర్నాతో లక్డీకాపూల్, పంజగుట్ట, ఎన్టీఆర్ మార్గ్, సోమాజిగూడ, ఎర్రమంజిల్ పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు అప్రమత్తమై ఖైరతాబాద్ చౌరస్తా నుంచి పంజగుట్ట వైపు వెళ్లే రోడ్డుమార్గాన్ని బారికేడ్లతో మూసివేశారు. అసెంబ్లీ మీదుగా వచ్చి న వాహనాలను రాజ్భవన్ మీదుగా బేగంపేట వైపు మళ్లించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. ఆందోళనకారులు ఒక్కసారిగా పెద్దసంఖ్యలో రోడ్డుపైకి రావడం, సీఎం కేసీఆర్, సీఎండీ ప్రభాకర్రావుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని ముందే పసిగట్టిన జేఏసీ నేతలు ధర్నా విజయవంతమైందని చెప్పి ఆందోళన కార్యక్రమాన్ని ముగించారు. ధర్నా కారణంగా రోడ్లపై భారీగా ట్రాఫిక్ జాం కావడంతో వాహనచోదకులు, ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. మొండివైఖరిపై మండిపడిన జేఏసీ ఉద్యోగుల వేతనాలను వెంటనే సవరించాలని, 1999 నుంచి 2004 మధ్యకాలంలో నియమితులైన విద్యుత్ ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ నుంచి జీïపీఎస్ సదుపాయాన్ని కల్పించాలని, ఆర్టీజన్ కార్మి కుల సమస్యలను పరిష్కరించాలని జేఏసీ కన్వీనర్ రత్నాకర్రావు, చైర్మన్ సాయిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నావేదికపై నుంచి వీరు కార్మి కులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ఇప్పటికే పలుమార్లు యాజమాన్యం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అయినా వారి నుంచి కనీసస్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగులకు నగదురహిత అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని అమలు చేయాలని, రూ.కోటి లైఫ్టైమ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలని, రిటైర్మెంట్ గ్యారంటీని జీపీఎఫ్ ఉద్యోగులకు రూ.16 లక్షలు, ఈపీఎఫ్ ఉద్యోగులకు రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా విద్యుత్ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలా? ఈపీఎఫ్ నుంచి ఇలా తీసుకోండి..
ఉద్యోగం చేసే ప్రతిఒక్కరికీ పీఎఫ్ అకౌంట్ అంటే ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. ఉద్యోగులు ప్రతినెలా తమ జీతం నుంచి కొంత మొత్తాన్ని ఇందులో పొదుపు చేస్తుంటారు. పీఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్ముకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం కొంత వడ్డీని చెల్లిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 8.1 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది. ఇలా పొదుపు చేసిన డబ్బు కష్ట సమయాల్లో ఉపయోపడుతుంది. అవసరమైనప్పుడు పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకోవచ్చు. పెళ్లి ఖర్చుల కోసం డబ్బు డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ సంస్థ అవకాశం కల్పిస్తోంది. ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం.. ఇక ఇదే మూడో అతిపెద్ద బ్యాంక్! కొత్తగా వచ్చిన పీఎఫ్ ఉపసంహరణ నిబంధనల ప్రకారం.. ఈపీఎఫ్ సభ్యులు వివాహ సంబంధిత ఖర్చుల కోసం వారి ఖాతాలో ఉన్న సొమ్ము నుంచి కొంత మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు. స్వయంగా వధూవరులు కానీ లేదా ఖాతాదారు కుమారుడు, కుమార్తె, సోదరుడు, సోదరి వివాహాల నిమిత్తం డబ్బు ఉపసంహరించుకోవచ్చు. అయితే పీఎఫ్ ఖాతాలో ఏడేళ్ల పాటు డబ్బు జమ చేసి ఉండాలి. విత్డ్రా ఎంత చేసుకోవచ్చు? ఈపీఎఫ్వో నిబంధనల ప్రకారం.. సభ్యులు తమ ఖాతాలో ఉన్న మొత్తంలో 50 శాతం వడ్డీతో సహా ఉపసంహరించుకోవచ్చు. అయితే ప్రావిడెంట్ ఫండ్లో ఏడేళ్ల సభ్యత్వం కచ్చితంగా ఉండాలి. ముందస్తు ఉపసంహరణపై ఈపీఎఫ్ పరిమితులు విధించింది. పిల్లల స్కూల్ ఖర్చులు, పెళ్లి ఖర్చుల కోసం ఒక్కో సందర్భానికి మూడు సార్లు మాత్రమే విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇంట్లో నుంచి ఆన్లైన్ ద్వారా సులువుగా నగదు విత్డ్రా చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన 72 గంటల తర్వాత డబ్బు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. తగ్గిన టీడీఎస్ ఈపీఎఫ్ ఉపసంహరణలపై విధించే టీడీఎస్ను ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి 20 శాతానికి తగ్గించింది. గతంలో ఇది 30 శాతం ఉండేది. ఐదేళ్ల లోపు ఈపీఎఫ్ ఖాతా నుంచి ఉపసంహరించుకునే ప్రతిఒక్కరికీ టీడీఎస్ వర్తిస్తుంది. ఇదీ చదవండి: సుందర్ పిచాయ్.. మాకు న్యాయం చేయండి.. తొలగించిన ఉద్యోగుల బహిరంగ లేఖ -
EPFO: పెన్షనర్లు ఆగ్రహం.. నాలుగు నెలలని వారంలోనే ముగింపా?
సిరిపురం మాధవరావు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసి.. 2013 మేలో పదవీ విరమణ పొందారు. ఆయన సర్వీసులో ఉన్నప్పుడే అధిక పెన్షన్ కోసం ఉమ్మడి ఆప్షన్ ఇచ్చారు. అయితే ఈపీఎఫ్ఓ అధికారులు దానిని తిరస్కరించడంతో సాధారణ పెన్షన్ పొందుతున్నారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తిరిగి అధిక పెన్షన్ కోసం ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం, కొన్నిసార్లు ఓపెన్ అయినా వివరాలు నమోదు చేసేటప్పుడు స్తంభించిపోవడం ఆ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఇంతలో గడువు ముగిసింది. దీంతో ఈపీఎఫ్ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతూ అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: అధిక పెన్షన్ల విషయంలో ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)’తీరుపై పెన్షనర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తులు, ఆప్షన్ నమోదులో గందరగోళం, త్వరగా గడువును ముగించడంపై మండిపడుతున్నారు. ముఖ్యంగా 2014 సెప్టెంబర్ 1 కంటే ముందు పదవీ విరమణ పొందినవారు దరఖాస్తు చేసుకోలేక నష్టపోయామని వాపోతున్నారు. ఈపీఎఫ్ఓ తాత్సారం, సర్వర్ సమస్యతోపాటు నమోదు విషయంలో అవగాహన లోపంతో జాయింట్ ఆప్షన్ ఇవ్వలేకపోయామని అంటున్నారు. తమకు అవకాశం ఇవ్వాలంటూ ఈపీఎఫ్ఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తాము చేసేదేమీ లేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఈపీఎఫ్ఓ చందాదారులు, పెన్షనర్లకు సంబంధించి అధిక పెన్షన్ అమలుపై సుప్రీంకోర్టు గతేడాది నవంబర్ 4న తీర్పు ఇచ్చింది. ఆ రోజు నుంచి నాలుగు నెలల పాటు దరఖాస్తులకు గడువు ఇవ్వాలని ఆదేశించింది. 2023 మార్చి 3వ తేదీ వరకు గడువును నిర్దేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు చర్యలు చేపట్టిన ఈపీఎఫ్ఓ.. చాలా తాత్సారం చేసి ఈ ఏడాది ఫిబ్రవరి 20న దీనిపై ఒక సర్క్యులర్ను జారీ చేసింది. అంతేకాదు దరఖాస్తులు, జాయింట్ ఆప్షన్కు సంబంధించిన లింకును మరో ఐదురోజులు ఆలస్యంగా 25వ తేదీన అందుబాటులోకి తెచ్చింది. మార్చి 3వ తేదీతో గడువు ముగియనుండగా.. కేవలం వారం రోజుల ముందు మాత్రమే లింకును అందుబాటులోకి తేవడం గమనార్హం. అయితే 2014 సెప్టంబర్ 1 తర్వాత పదవీవిరమణ పొందినవారు, ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ మరో రెండునెలల పాటు అవకాశం కల్పించింది. వారు మే 3 నాటికల్లా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కానీ 2014 సెపె్టంబర్ 1వ తేదీకి ముందు రిటైరైన వారికి మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీనితో వారిలో చాలా మంది అధిక పెన్షన్కు దూరమయ్యారు. దేశవ్యాప్తంగా 91,258 దరఖాస్తులే.. 2014 సెపె్టంబర్ 1వ తేదీకి ముందు రిటైరైనవారిలో దేశవ్యాప్తంగా కేవలం 91,258 మంది మాత్రమే అధిక పెన్షన్ కోసం జాయింట్ ఆప్షన్ ఇవ్వగలిగారు. పేరుకు నాలుగు నెలలు అవకాశం ఇచ్చినా.. సర్క్యులర్ జారీ, ఆన్లైన్ లింకు అందుబాటులోకి తేవడంలో ఈపీఎఫ్ఓ జాప్యం చేసిందని సీనియర్ పెన్షనర్లు మండిపడుతున్నారు. తమకు మరో అవకాశం కల్పించాలంటూ ఈపీఎఫ్ఓకు విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: ఈపీఎఫ్వో అధిక పెన్షన్.. అంత ఈజీ కాదు!? -
ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్కు మీరు అర్హులేనా? ఇలా అప్లయ్ చేసుకోండి!
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సంస్థ ఉద్యోగులు ఎక్కువ పెన్షన్ పొందేలా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో అధిక పెన్షన్ కోసం ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పోర్టల్లో అప్లయ్ చేసుకునే వీలు కల్పించింది. ఉద్యోగులు పెన్షన్ పొందడానికి గరిష్ట వేతనం (బేసిక్ పే ప్లస్ డియర్నెస్ అలవెన్స్) నెలకు రూ.15,000 ఉండాలి. ఆ వేతనంపై 8.33 శాతం పూర్తిగా ఈపీఎస్(ఉద్యోగుల భవిష్యనిధి పింఛను పథకం)లో జమ చేయాల్సి ఉంటుంది. నవంబర్ 4న సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం.. అధిక పెన్షన్ పొందేందుకు అర్హులైన ఉద్యోగులు ఈపీఎఫ్ఓలో అప్లయి చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా ఈపీఎఫ్ఓ రిటైర్డ్ ఫండ్ బాడీ పోర్టల్ను సిద్ధం చేసింది. ఈపీఎఫ్ఓలో ఎలా అప్లయ్ చేయాలి ♦ అర్హులైన ఈపీఎఫ్ఓ ఖతాదారులు ఈ-సేవ పోర్టల్(e-Sewa portal)ను సందర్శించాలి ♦అందులో అధిక పెన్షన్ అప్లయ్ చేసేలా Pension on Higher Salary: Exercise of Joint Option under para 11(3) and para 11(4) of EPS-1995 on or before 3rd May 2023 అనే ఆప్షన్ పాపప్ అవుతుంది. ♦ ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో అధిక పెన్షన్ కోసం (pensionOnHigherWages) అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ♦ అనంతరం అప్లికేషన్ ఫారమ్ ఫర్ జాయింట్ ఆప్షన్తో యూఏఎన్ నెంబర్, పేరు, మీ పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ వివరాల్ని ఎంటర్ చేసి ఓటీపీ ఆప్షన్పై ట్యాప్ చేయాలి. ♦ ట్యాప్ చేసిన తర్వాత మీరు అర్హులైతే అధిక పెన్షన్ పొందే సౌలభ్యం కలుగుతుంది. లేదంటే రిజెక్ట్ అవుతుంది. -
ఈపీఎఫ్ఓ సర్క్యులర్ జారీ.. ‘అధిక పెన్షన్’కు ఏం చేయాలి?
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పరిధిలోని చందాదారులు, పెన్షన్దారుల్లో ఇప్పుడు అధిక పెన్షన్ చర్చనీయాంశమైంది. గత నవంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడి ఈపీఎఫ్ఓ తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఈపీఎఫ్ఓ జోనల్ కార్యాలయాల్లోని అదనపు చీఫ్ ప్రావిడెంట్ కమిషనర్లు, ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాల్లోని రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్లకు ప్రత్యేక సూచనలు చేసింది. అయితే సర్క్యులర్లో వివరాలు వెల్లడించినప్పటికీ, అవి శాఖాపరమైన పరిభాషలో ఉండటంతో ఉద్యోగులు, పెన్షనర్లకు అర్థంకావడంలేదు. దీంతో అర్హులెవరు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే అంశాలపై ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈపీఎస్ (ఎంప్లాయిస్ పెన్షన్ స్కీం) కింద అధిక పెన్షన్ పొందే అంశంపై కొందరు ఈపీఎఫ్ఓ కార్యాలయాల్లో సంప్రదిస్తుండగా, మరికొంతమంది సామాజిక మాధ్యమాల్లో నిపుణులను సంప్రదిస్తున్నారు. అధిక పెన్షన్ పొందడానికి చందాదారులు తమ వివరాలను unifiedportal emp. epfindia. gov. in/ epfo/ memberinterface లింక్ ద్వారా అప్డేట్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అధిక పెన్షన్కు అర్హతలు ఇలా... ►2014, సెప్టెంబర్ 1 కన్నా ముందు పదవీ విరమణ పొందిన ఉద్యోగి పీఎఫ్ కంట్రిబ్యూషన్ చెల్లించడంతోపాటు ఈపీఎస్ ఆప్షన్ను (ఈ ఆప్షన్ను ఈపీఎఫ్ఓ అధికారులు తిరస్కరించినా, స్పందించకున్నా) ఎంచుకొని ఉండాలి. ఈ రెండింట్లో ఏ ఒక్కటి లేకున్నా అధిక పెన్షన్కు అర్హత లేనట్లే. ►1 సెప్టెంబర్ 2014 నుంచి 4 నవంబర్ 2022 మధ్య పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, ప్రస్తుతం సర్వీసులో ఉన్న వారిలో ఉద్యోగి, యజమాని ఇద్దరు పీఎఫ్ కంట్రిబ్యూషన్ చెల్లించడంతోపాటు ఆ కాలంలో అధిక పెన్షన్ ఆప్షన్ ఇచ్చుకున్నా అర్హత సాధించినట్లే. ఇక్కడ పెన్షన్ ఆప్షన్ను ఈపీఎఫ్ఓ తిరస్కరించినా... స్పందించకున్నా అర్హత ఉన్నట్లే. ►1 సెప్టెంబర్ 2014 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి కేవలం ఈపీఎఫ్ (ఉద్యోగి భవిష్యనిధి) పథకం మాత్రమే వర్తిస్తుంది. ఈపీఎస్ వర్తించదు. అదేవిధంగా 1 సెప్టెంబర్ 2014 కంటే ముందు ఈపీఎస్కు ఎలాంటి ఆప్షన్ ఇవ్వకుండా ఉద్యోగం మానేసిన వారు కూడా అనర్హులే. ►నిర్దేశిత తేదీ నాటికి అధిక పెన్షన్కు అర్హత ఉన్నా.. పదవీ విరమణ పొందిన ఉద్యోగి మరణిస్తే అధిక పెన్షన్ ప్రయోజనం సదరు ఉద్యోగి కుటుంబానికి వర్తిస్తుందా? లేదా? అనే అంశంపై అధికారులు వివరించడం లేదు. -
ఈక్విటీల్లోకి మరింతగా ఈపీఎఫ్వో పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీల్లో మరింతగా ఇన్వెస్ట్ చేసే అంశాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్వో పరిశీలిస్తోంది. ప్రస్తుతం 15 శాతంగా ఉన్న పరిమితిని 20 శాతం వరకూ పెంచాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదనపై జులైలోనే ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జులై 29, 30 తారీఖుల్లో జరిగే ఈపీఎఫ్వో ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాయి. (Electric Scooters: కేవలం వేలం వెర్రేనా? సర్వేలో షాకింగ్ విషయాలు) ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈపీఎఫ్వో తన దగ్గరున్న ఇన్వెస్ట్ చేయతగిన డిపాజిట్లలో 5-15 శాతం భాగాన్ని ఈక్విటీలు లేదా ఈక్విటీ సంబంధ స్కీముల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. తాజాగా దీన్ని 20 శాతం వరకూ పెంచే ప్రతిపాదనకు ఈపీఎఫ్వో సలహాదారు ఫైనాన్స్ ఆడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిటీ (ఎఫ్ఏఐసీ) ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. ఎఫ్ఏఐసీ సిఫార్సులను తుది ఆమోదం కోసం కీలక నిర్ణయాలు తీసుకునే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ముందు ఉంచనున్నారు. 2015 ఆగస్టు నుంచి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లలో పెట్టుబడుల ద్వారా ఈక్విటీల్లో 5 శాతం ఇన్వెస్ట్ చేయడాన్ని ఈపీఎఫ్వో ప్రారంభించింది. ఇటీవలే ఈ పరిమితిని 15 శాతానికి పెంచింది. అయితే, రాబడులకు ప్రభుత్వ హామీలాంటివి ఉండని స్టాక్మార్కెట్లలో పింఛను నిధులను ఇన్వెస్ట్ చేయడాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. (వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్) చదవండి: Tata Steel: వ్యయాల సెగ.. అందుకే టాటా స్టీల్ ఫలితాలు ఇలా! -
ఈపీఎఫ్ చందాదారులకు షాక్.. మారిన రూల్స్ ఇవే!
Provident Fund Tax Rules: బడ్జెట్ ప్రతిపాదనలో భాగంగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) నిబంధనలల్లో కేంద్ర ఆర్థిక శాఖ కీలక మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పులు ప్రకారం.. ఏప్రిల్ 1, 2022 నుంచి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు రెండు రకాలుగా విభజించారు. ఒకటి పన్ను విధించేవి, మరొకటి పన్ను మినహాయింపు ఖాతాలు అంతేకాకుండా ప్రావిడెంట్ ఫండ్ వడ్డీరేటును 8.1 శాతానికి పరిమితం చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు ఏడాది ఈ వడ్డీరేటు 8.5 శాతంగా ఉంది. గడిచిన నలభై ఏళ్లలో కూడా ఇదే అత్యల్ప వడ్డీరేటు. అయితే ఈ నిర్ణయం మాత్రం ఈపీఎఫ్ఓ చందాదారులకు షాక్ అనే చెప్పాలి. ఈపీఎఫ్ఓ చందాదారులు ఇవి తప్పక తెలుసుకోవాలి..! ►పీఎఫ్ FY 2021-22కి గాను వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించింది. చివరి సారిగా 1977-78లో పీఎఫ్ వడ్డీరేటు 8 శాతంగా ఉండేది. నలభై నాలుగేళ్ల తర్వాత ఇంచుమించు అదే స్థాయికి వడ్డీరేటు చేరింది. ►ఈపీఎఫ్ఓ చందాదారుల వాటా.. వార్షికంగా రూ.2.5 లక్షలు దాటితే వారంతా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ►ఉద్యోగులు వాటా వార్షికంగా రూ.2.5 లక్షల కన్నా తక్కువగా ఉంటే.. వారిపై పన్ను భారం ఉండదు. ►ఒక యజమాని ఉద్యోగి ఈపీఎఫ్కి నగదు జమ చేయకపోతే (contribution threshold) కాంట్రిబ్యూషన్ థ్రెషోల్డ్ ₹ 5 లక్షలకు పెంచనున్నారు. ►కాంట్రిబ్యూషన్ థ్రెషోల్డ్ పెంచిన అనంతరం.. అదనంగా పెంచిన నగదుపై మాత్రమే పన్ను విధిస్తారు, మొత్తానికి కాదు. ►ఉద్యోగి ఖాతాలో జమ అయ్యే నగదు, దానిపై వచ్చే వడ్డీ ఈపీఎఫ్లో ప్రత్యేక అకౌంట్లో నిర్వహించనున్నారు. ►యజమానులు(Accruals) అక్రూవల్స్ ఆధారంగా పన్నులను నిలిపివేస్తారు కాబట్టి, ఈ వివరాలను తప్పనిసరిగా ఫారమ్ 16, ఫారమ్ 12BAలో నింపాలి. ►నెలవారీ ఆదాయం ₹ 15,000 వరకు ఉన్న ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాలో యజమానులు తప్పనిసరిగా ఈపీఎఫ్ నగదు జమ చేయాల్సి ఉంటుంది. చదవండి: విమానయాన సంస్థలకు భారీ ఊరట -
ఈపీఎఫ్ చందాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
మీరు ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా? అయితే మీకు ఒక ముఖ్య గమనిక. వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. కొత్తగా అమలులోకి రానున్న పీఎఫ్ నిబంధనల ప్రకారం.. రూ. 2.5 లక్షలకు పైన ఈపీఎఫ్ ఖాతాలో జమ అయ్యే పీఎఫ్ మొత్తంపై ట్యాక్స్ పడనుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) కూడా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్ధిక మంత్రి ఈ విషయాన్ని తెలియజేశారు. 2021 ఆగస్ట్ 31న సీబీడీటీ జారీ చేసిన నిబంధనల ప్రకారం.. ప్రావిడెంట్ ఫండ్లో రూ. 2.5 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్పై వచ్చే వడ్డీ ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. అయితే ఈ లిమిట్ దాటితే మాత్రం పన్ను పడుతుంది. అంటే రూ.2.5 లక్షలకు మించి ఇన్వెస్ట్ చేస్తే వచ్చే వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ చెల్లించుకోవాల్సి ఉంటుంది. యజమానులు పీఎఫ్ కంట్రిబ్యూట్ చేయనప్పుడు ఈ పరిమితి సంవత్సరానికి రూ.5 లక్షలుగా ఉంటుంది. రూ.2.5 లక్షలకు పైగా ఇన్వెస్ట్మెంట్ కలిగిన వారు పీఎఫ్ ఖాతాను రెండు విభాగాలుగా మార్చుకోవాల్సి వస్తుంది. అంటే రూ.2.5 లక్షల వరకు ఒక అకౌంట్లో, మిగతా డబ్బులు మరో అకౌంట్లో డిపాజిట్ చేసుకోవాల్సి రావొచ్చు. అప్పుడు ఈ అదనపు అకౌంట్పై ట్యాక్స్ పడుతుంది. కొత్త పీఎఫ్ నిబంధనలు: ప్రస్తుతం ఉన్న పీఎఫ్ ఖాతాలను పన్ను పరిధిలోకి వచ్చే కంట్రిబ్యూషన్ అకౌంట్లు, నాన్ ట్యాక్సబుల్ కంట్రిబ్యూషన్ అకౌంట్లుగా విభజించనున్నారు. ప్రావిడెంట్ ఫండ్ వార్షిక కంట్రిబ్యూషన్ రూ.2.5 లక్షలు దాటితే అప్పుడు రెండు ప్రత్యేకమైన అకౌంట్లను క్రియేట్ చేసుకోవాలి. ఒక అకౌంట్లో రూ.2.5 లక్షలు డిపాజిట్ చేస్తారు. ఈ లిమిట్కు మించిన డబ్బులు మరో అకౌంట్లో డిపాజిట్ చేయాలి. దీని వల్ల పన్ను లెక్కింపు సులభతరం అవుతుంది. కొత్త పీఎఫ్ నిబంధనలు వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2022 నుంచి అమల్లోకి వస్తాయి. ఏడాదికి రూ.2.5 లక్షలకు మించిన ఉద్యోగుల కంట్రిబ్యూషన్ పీఎఫ్ ఆదాయంపై కొత్త పన్ను విధించేందుకు ఐటీ నిబంధనలకు కొత్త సెక్షన్ 9డీని తీసుకొచ్చింది. (చదవండి: ఓలా, ఒకినావా ఈవీ స్కూటర్ అగ్నిప్రమాదంపై కేంద్రం కీలక నిర్ణయం..!) -
EPF వడ్డీ రేట్లు తగ్గించడం సరికాదు :విజయసాయిరెడ్డి
-
ఈపీఎఫ్ అలెర్ట్: ఈ-నామినేషన్ దాఖలు చేశారా? చేస్తే మీకే లక్షల్లో ప్రయోజనం!
ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) బంపరాఫర్ ఇచ్చింది. ఈ నామినీ ప్రక్రియ నమోదు చేసిన వారికి లక్షల్లో ప్రయోజనాల్ని అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ఖాతాదారులు ఈ- నామినీని పూర్తి చేయాలని సూచించింది. నామినీ పూర్తి చేసిన ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్ ) సభ్యులకు అనేక ప్రయోజనాల్ని అందిస్తుంది. పీఎఫ్ ఖాతాదారులు ఇ-నామినేషన్ను దాఖలు చేయడం ద్వారా అవాంతరాలు లేని, వేగవంతమైన ఆన్లైన్ సేవలు, ఉచితంగా రూ.7లక్షల వరకు బీమాను పొందవచ్చు. Benefits of filing e-Nomination. ई-नामांकन दर्ज करने के लाभ।#EPF #SocialSecurity #eNomination #AmritMahotsav @AmritMahotsav pic.twitter.com/xJ8AZbkZjD — EPFO (@socialepfo) March 22, 2022 "ఈ-నామినేషన్ దాఖలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా ?" సభ్యుడు మరణించిన తర్వాత ఆన్లైన్ లో క్లయిమ్ చేసుకోవచ్చు. పేపర్లెస్, వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్. పీఎఫ్, పెన్షన్ ఆన్లైన్ చెల్లింపు. అర్హులైన నామినీలకు రూ.7 లక్షల వరకు బీమా. -
ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిర్మలా సీతారామన్..!
ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిపై ప్రతిపాదిత 8.1 శాతం వడ్డీ రేటు ఇతర చిన్న పొదుపు పథకాలు అందించే వడ్డీ రేట్ల కంటే మెరుగ్గా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుత కాలపు వాస్తవికతలను బట్టి, త్వరలో వడ్డీ రేటును సవరించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల వడ్డీ రేటుపై ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని, 2021-22 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ రేటును 8.1 శాతానికి తగ్గించాలని బోర్డు ప్రతిపాదించిందని ఆమె రాజ్యసభలో అప్రాప్రియేషన్ బిల్లులపై చర్చకు సమాధానంగా చెప్పారు. "ఈపీఎఫ్ఓకు ఒక సెంట్రల్ బోర్డు ఉంది, చందాదారులకు ఎంత రేటు ఇవ్వాలనే దానిపై బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. వారు కొంతకాలంగా వడ్డీ రేటును మార్చలేదు.. ఇప్పుడు దానిని 8.1 శాతానికి మార్చారు" అని ఆమె పేర్కొన్నారు. ఇది ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు తీసుకున్న నిర్ణయం.. బోర్డులో విస్తృత శ్రేణి ప్రతినిధులు ఉన్నారు. సుకన్య సమృద్ధి యోజన(7.6 శాతం), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (7.4 శాతం), పీపీఎఫ్ (7.1 శాతం) వంటి ఇతర పథకాలు అందించే రేట్లు చాలా తక్కువగా ఉండగా, ఈ వడ్డీ రేటును 8.1 శాతంగా ఉంచాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది. "వాస్తవంగా ఈ రోజు అమలులో ఉన్న ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు మిగిలిన వాటి కంటే ఇంకా ఎక్కువగా ఉంది" అని ఆర్థిక మంత్రి అన్నారు. ఈ సవరణ ఇప్పుడు "నేటి వాస్తవాలను" ప్రతిబింబిస్తోందని అన్నారు. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2020-21లో ఉన్న 8.5 శాతం నుంచి 2021-22 నాటికి 8.1 శాతానికి తగ్గించాలని ఈపీఎఫ్ఓ ప్రతిపాదించింది. (చదవండి: టాటా చేతికి ఎయిరిండియా..! భారీ డీల్కు సిద్ధమైన యూరప్ కంపెనీ..!) -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త.. నామినీ పేరు మార్చుకోండి ఇలా..!
ఈపీఎఫ్ఓ తన ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఇక నుంచి నామినీ పేరును కూడా ఆన్లైన్ ద్వారా మార్చుకోవచ్చు అని తెలిపింది. పీఎఫ్ ఖాతాదారులందరూ నామినీ పేరును నమోదు చేసుకోవడం తప్పనిసరి. ఇందు కోసం ఈపీఎఫ్ఓ ఈ-నామినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఇది పూర్తిగా డిజిటల్. దీని కోసం పీఎఫ్ కార్యాలయానికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చొని మీ పీఎఫ్ ఖాతాకు నామినీ పేరును జత చేసుకోవచ్చు. సామాజిక భద్రత పీఎఫ్, ఈపీస్, ఈడీఎల్ఐ బీమా ప్రయోజనాలను పొందడానికి ఆన్లైన్ ఈ-నామినేషన్ తప్పనిసరి విషయం మనకు తెలిసిందే. ఒకవేళ నామినీ పేరు తప్పుగా నమోదు చేసిన, ఏదైనా ఇతరత్రా కారణాల వల్ల ఇంతకముందు మీరు నమోదు చేసిన నామినీ పేరును మార్చుకునే అవకాశాన్ని ఈపీఎఫ్ఓ తాజాగా కల్పిస్తుంది. గత కొద్ది రోజుల క్రితం వరకు ఈ ఆప్షన్ అందుబాటులో లేదు, ఒకవేళ వచ్చిన ఆ ఆప్షన్ సరిగా పనిచేయలేదు. కానీ, ఇప్పుడు బగ్స్ తొలిగించడంతో పీఎఫ్ ఖాతాదారులు ఎటువంటి ఆటంకం లేకుండా నామినీ పేరు మార్చుకోవచ్చు. నామినీ పేరును మార్చడానికి ఈపీఎఫ్ఓ అనుమతి అవసరం లేదు. పీఎఫ్ నామినేషన్లో నమోదు చేసిన తాజా పేరు మాత్రమే చట్టపరమైన హోదా కల్పిస్తారు. పీఎఫ్ నామినీ పేరును ఎలా మార్చాలో కొత్త పేరును ఎలా చేర్చాలో తెలుసుకుందాం. #EPF Members can file new nomination to change existing EPF/#EPS nomination. ईपीएफ सदस्य मौजूदा ईपीएफ/ईपीएस नामांकन को बदलने के लिए नया नामांकन दाखिल कर सकते हैं।#EPFO #Services #Pension #ईपीएप #पीएफ #AmritMahotsav @AmritMahotsav pic.twitter.com/sBfHhMjLbp — EPFO (@socialepfo) March 1, 2022 పీఎఫ్ నామినీ పేరును ఎలా మార్చాలి? ఈపీఎఫ్ఓ https://unifiedportal-mem.epfindia.gov.in/ అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయండి. ఇప్పుడు మీ యుఏఎన్, పాస్వర్డ్తో వెబ్సైట్లో లాగిన్ అవ్వండి. ‘మేనేజ్మెంట్’ ట్యాబ్ కింద ‘ఈ-నామినేషన్’పై క్లిక్ చేయండి. మీ కుటుంబం ఉంటే ‘అవును’ అని క్లిక్ చేయండి ఇప్పుడు నమోదు చేయలని అనుకున్న కొత్త నామినీ పేరు ఎంటర్ చేయండి. ‘నామినేషన్ వివరాలు’పై క్లిక్ చేయండి డిక్లరేషన్ తర్వాత, ‘సేవ్ ఈపీఎఫ్ నామినేషన్’పై క్లిక్ చేయండి ఓటీపీని పొందడానికి ‘e-Sign’ని ఎంచుకోండి ఆధార్ కార్డ్తో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దానిని ఫిల్ చేయండి. ఇప్పుడు కొత్త నామినీ ఈపీఎఫ్ఓలో నమోదు అయింది. (చదవండి: ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్కు లక్కీ ఛాన్స్.. రూ.1కే సినిమా టికెట్!) -
40 ఏళ్ల తరువాత కేంద్రం షాకింగ్ నిర్ణయం..! కారణం అదేనట..?
న్యూఢిల్లీ: మధ్య తరగతి వేతన జీవికి భారీ నిరాశ. ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటు 8.5 నుంచి ఏకంగా 8.1 శాతానికి తగ్గుతోంది. ఇది దాదాపు 6 కోట్ల మంది సభ్యులపై ప్రభావం చూపనుంది. మార్చి 31తో ముగిసే 2021–22 ఆర్థిక సంవత్సరానికి 8.1 శాతం వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ శనివారం నిర్ణయించింది. 4 దశాబ్దాల్లో ఇదే అతి తక్కువ వడ్డీ రేటు! 1977–78లో 8 శాతముండగా తర్వాత ఏటా కనీసం 8.25, ఆపైనే ఉంటూ వచ్చింది. రూ.76,768 కోట్ల అంచనా ఆదాయం ఆధారంగా తాజాగా వడ్డీని నిర్ణయించారు. దీపావళి నాటికి సభ్యుల ఖాతాల్లో కొత్త వడ్డీ జమవుతుంది. ప్రావిడెంట్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఇతర చిన్న పొదుపు పథకాలతో సమానంగా 8 శాతం కంటే తగ్గించాలని కేంద్ర కార్మిక శాఖపై ఆర్థిక శాఖ కొన్నాళ్లుగా ఒత్తిడి తెస్తోంది. చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేటు 4 నుంచి 7.6 శాతం మధ్య ఉంది. రుణం, ఈక్విటీ నుండి వచ్చే ఆదాయాలను బట్టి వడ్డీ చెల్లింపును లెక్కిస్తారు. కరోనా దెబ్బ ఈపీఎఫ్వోఆదాయాన్ని కరోనా దెబ్బతీసింది. కోవిడ్ నేపథ్యంలో అధిక ఉపసంహరణలు, తక్కువ విరాళాలను ఈపీఎఫ్వో ఎదుర్కొంది. 2021 డిసెంబర్ 31 నాటికి అడ్వాన్స్ సౌకర్యం కింద రూ.14,310.21 కోట్లు అందించి 56.79 లక్షల క్లెయిమ్లను పరిష్కరించింది. దీంతో 2019–20 చెల్లింపులు ఆలస్యమయ్యాయి. వడ్డీనీ రెండు వాయిదాలలో చెల్లించారు. 2021–22లో ఈపీఎఫ్వోరూ.3,500 కోట్ల లోటు నమోదు చేసింది. ఈపీఎఫ్వో కార్పస్ 13 శాతం పెరిగినా వడ్డీ ఆదాయం 8 శాతమే పెరిగినట్టు సమాచారం. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందనేందుకు వడ్డీ రేటు తగ్గడం నిదర్శనమని సీబీటీ సభ్యుడు ఏకే పద్మనాభన్ అన్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, ఈక్విటీ మార్కెట్ దృష్ట్యా సామాజిక భద్రతతో కూడిన పెట్టుబడి సమతుల్యతను కొనసాగించడం తమ ప్రాధాన్యత అని కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. जिस प्रकार की अंतरराष्ट्रीय परिस्थिति और equity बाज़ार की स्थिति बनी है, उसमें निवेश के साथ सामाजिक सुरक्षा को भी रखना है। हम बहुत हाई रिस्क वाले इंस्ट्रुमेंट को नहीं ले सकते है। वो मार्केट करने के लिए हम लोग नहीं है, हम मार्केट की एक स्थायित्व, सामाजिक सुरक्षा के लिए है। pic.twitter.com/b9P6FAEZKn — Bhupender Yadav (@byadavbjp) March 12, 2022 చదవండి: ఉద్యోగులకు బిగ్షాక్.. 40ఏళ్ల తరువాత కీలక నిర్ణయం! -
e-nomination: చందాదారులకు చుక్కలు చూపిస్తున్న ఈపీఎఫ్ఓ వెబ్సైట్..!
రిటైర్ మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఎఫ్ఓ గత ఏడాది డిసెంబర్ 31 తేదీన ఒక కీలక ప్రకటన చేసిన సంగతి మనకు తెలిసిందే. డిసెంబరు 31 తర్వాత కూడా ఈ-నామినేషన్ దాఖలు చేసుకోవచ్చు అని ఈపీఎఫ్ఓ తన ట్విటర్ వేదికగా గతంలో తెలిపింది. అయితే అప్పటి నుంచి చందాదారుల తమ సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివరాలను జత చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికి ఈపీఎఫ్ఓ పోర్టల్ సర్వర్ డౌన్ సమస్య కారణంగా అసౌకర్యానికి గురి అవుతున్నారు. ఈ సమస్య గురించి ట్విటర్ వేదికగా చందాదారులు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన సంస్థ పట్టించుకోవడం లేదు అని వారు వాపోతున్నారు. సబ్స్క్రైబర్లు తమ కుటుంబ సభ్యుల ఈ-నామినేషన్లో బోలెడు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈపీఎఫ్వో వెబ్సైట్ గంటల కొద్దీ పని చేయడం లేదు. ఒకవేళ వెబ్సైట్ ఓపెన్ అయినా.. కనెక్షన్ ప్రాబ్లం అని మెసేజ్ రావడంతో ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు తెలుపుతున్నారు. ప్రతి దశను పూర్తి చేయడానికి కనీసం ఒక రోజు పడుతున్నట్లు వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను అందరికీ అందుబాటులోకి తేవడానికి ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లు తమ కుటుంబ సభ్యుల ఈ-నామినేషన్ తప్పనిసరి చేసింది. ఈ-నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఖాతా బ్యాలన్స్ వివరాలు కనిపించకపోవడంతో పాటు ఈపీఎఫ్ ఖాతాలో నగదును కూడా విత్ డ్రా చేయలేరు. ఒకవేళ ఈపీఎఫ్ఓలో సభ్యులుగా ఉన్నవారికి దురదృష్టవశాత్తు ఏమైనా జరిగితే.. వారి మీద ఆధారపడిన వారికి పీఎఫ్ డబ్బులు తీసుకోవడానికి ఈ-నామినేషన్ తప్పనిసరి. (చదవండి: సామాన్యులను కలవర పెడుతున్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర!) -
పీఎఫ్ ఖాతాదారులకు తీపికబురు.. వడ్డీ రేటు పెరిగే అవకాశం..!
పీఎఫ్ ఖాతాదారులకు త్వరలో ఈపీఎఫ్ఓ తీపికబురు అందించనున్నట్లు తెలుస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల వడ్డీ రేటును నిర్ణయించడానికి గౌహతిలో మార్చి 4-5న సమావేశమవుతుంది. ఈ సమావేశంలో పీఎఫ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈపీఎఫ్ఓ బోర్డు ఆదాయాలపై చర్చించడానికి ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆడిట్ కమిటీ(ఎఫ్ఐఏసీ) బుధవారం సమావేశం కానుంది. గత ఆర్థిక సంవత్సరం 2020-21కు 8.5 శాతం వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ బోర్డు గత ఏడాది మార్చిలో ఖరారు చేసింది. గత 8 ఏళ్లలో ఈపీఎఫ్ఓ అందించిన అతి తక్కువ వడ్డీ రేటు ఇదే. ఈపీఎఫ్ బోర్డు తన చందాదారులకు ఎఫ్ వై21 వడ్డీ రేటును క్రెడిట్ చేయడం ప్రారంభించింది. "2020-21 ఆర్థిక సంవత్సరానికి 8.50% వడ్డీతో 23.59 కోట్ల ఖాతాలు క్రెడిట్ చేయబడ్డాయి" అని డిసెంబర్ 20న ఒక ట్వీట్లో బోర్డు పేర్కొంది. ప్రస్తుతం పీఎఫ్లో డిపాజిట్ చేసిన సొమ్ముపై 8.5 శాతం వడ్డీ ఇస్తోంది. అయితే ఇది మునుపటి వడ్డీ రేట్ల కంటే తక్కువ. 2019-20కి వడ్డీ రేటు 8.5 శాతంగా నిర్ణయించారు. ఇది గత 7 సంవత్సరాలలో అతి తక్కువ. 2018-19లో పీఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతం. 2016-17 సంవత్సరంలో EPFO సభ్యులకు 8.65 శాతం వడ్డీని ఇచ్చింది. ఈపీఎఫ్ సభ్యులు ఎస్ఎమ్ఎస్ ద్వారా బ్యాలెన్స్ ఎంతో మనం చెక్ చేసుకోవచ్చు. కేవలం ‘EPFOHO UAN’ అని టైప్ చేసి తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కి ఎస్ఎమ్ఎస్ పంపాలి. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అలా చెక్ చేయడానికి ఈపీఎఫ్ సభ్యుడు 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. (చదవండి: హైదరాబాద్లో పెట్టుబడులకు జర్మన్ కంపెనీ రెడీ.. మూడు వేల మందికి ఉపాధి!) -
ఇక ఈపీఎఫ్ DOE అప్డేట్ కోసం కంపెనీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు..!
గతంలో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ డబ్బుల కోసం చాలా మంది ఇబ్బందిపడేవారు. అయితే ఇప్పుడు అలాంటి సమస్య నుంచి ఉద్యోగులను సేవ్ చేసేవిధంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఏదేని సంస్థలో ఉద్యోగంలో చేరినప్పుడు, మానేసినప్పుడు పీఎఫ్ డబ్బులు తీసుకోవడానికి ఆ సంస్థ హెచ్ ఆర్'పై ఆధారపడవలసి వచ్చేది. ఎందుకంటే, ఉద్యోగంలో చేరినతేదీ, మానేసిన తేదీని నవీకరిస్తేనే పీఎఫ్ డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ, ఇప్పుడు అలా మార్చుకునే హక్కును ఈపీఎఫ్ సంస్థ ఉద్యోగికే కల్పించింది. మీరు ఇటీవల ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లయితే, మీరు నిష్క్రమణ తేదీని దాఖలు చేయడానికి 2 నెలలు వేచి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది పీఎఫ్లో యజమాని చివరి సహకారం అందించిన 2 నెలల తర్వాత మాత్రమే నవీకరించబడుతుంది. ఈపీఎఫ్ఓ తెలిపిన వివరాల ప్రకారం, మీ నిష్క్రమణ తేదీ నవీకరించకపోతే, మీరు మీ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకోలేరు లేదా ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేయలేరు. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు మాత్రమే నిష్క్రమణ తేదీని నవీకరించే హక్కును ఇచ్చింది. ఇది ఉద్యోగులకు చాలా ఉపశమనం కలిగిస్తుంది. Employees can now update their Date of Exit on their own. To know more about this process, click on this link & watch this video- https://t.co/skGJdcqFW9#EPFO@byadavbjp @Rameswar_Teli @PMOIndia @LabourMinistry @PIB_India @PIBHindi @MIB_India @mygovindia @PTI_News @wootaum — EPFO (@socialepfo) January 24, 2022 మొదట https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ పోర్టల్ ఓపెన్ చేయండి వెళ్లండి. ఇప్పుడు మెనూ బార్'లో ఉన్న'మేనేజ్' ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు డ్రాప్ డౌన్ మెనూలో Mark Exit అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎంపిక చేసిన ఎంప్లాయిమెంట్ డ్రాప్ డౌన్ నుంచి పిఎఫ్ అకౌంట్ నెంబరు ఎంచుకోండి. నిష్క్రమణ తేదీ, నిష్క్రమణకు గల కారణాన్ని కారణం నమోదు చేయండి. మీ ఆధార నెంబర్ కు లింకు అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ నమోదు చేయండి. ఆ తర్వాత చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి అప్ డేట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నిష్క్రమణ తేదీ విజయవంతంగా అప్ డేట్ అవుతుంది. (చదవండి: మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ బైక్.. అదిరిపోయిన రేంజ్!) -
ఈపీఎఫ్ఓ చందాదారులకు శుభవార్త.. ఇక సులభంగానే!
ఈపీఎఫ్ఓ తన చందాదారులకు శుభవార్త అందించింది. మీరు ఒక కంపెనీ ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరొక కంపెనీలో చేరినట్లయితే ఉద్యోగం మానేసిన తేదీని సులభంగానే ఈపీఎఫ్ ఖాతాలో అప్డేట్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ట్విటర్ ఖాతా వేదికగా విడుదల చేసింది. మీరు ఈ వీడియోను చూడటం ద్వారా ఆన్లైన్ నిష్క్రమణ తేదీని మీరే స్వయంగా అప్డేట్ చేసుకోవచ్చు. తేదీని అప్డేట్ చేసుకోండి ఇలా.. యుఏఎన్, పాస్వర్డ్తో వెబ్ సైట్ లాగిన్ అవ్వండి. మేనేజ్ బటన్పై క్లిక్ చేసి మార్క్ ఎగ్జిట్పై క్లిక్ చేయండి. ఎంప్లాయ్మెంట్ డ్రాప్డౌన్ని ఎంచుకోవడం ద్వారా పీఎఫ్ ఖాతా నంబర్ను ఎంచుకోండి నిష్క్రమణ తేదీ, ఉద్యోగం నుంచి నిష్క్రమించడానికి గల కారణాన్ని తెలియజేయండి. రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేసి ఆధార్తో లింక్ చేయబడిన మొబైల్లో అందుకున్న ఓటీపీని నమోదు చేయండి. చెక్ బాక్స్ని ఎంచుకుని అప్డేట్పై క్లిక్ చేసి ఆపై ఓకేపై క్లిక్ చేయండి. తర్వాత మీరు మునుపటి కంపెనీ నుంచి ఉద్యోగం మానేసిన తేదీని విజయవంతంగా అప్డేట్ చేసినట్లు మీ మొబైల్కు మెస్సేజ్ వస్తుంది. Employees can now update their Date of Exit on their own. To know more about this process, click on this link & watch this video- https://t.co/skGJdcqFW9#EPFO@byadavbjp @Rameswar_Teli @PMOIndia @LabourMinistry @PIB_India @PIBHindi @MIB_India @mygovindia @PTI_News @wootaum — EPFO (@socialepfo) January 24, 2022 (చదవండి: గుడ్న్యూస్: భారీగా తగ్గనున్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ ధరలు!) -
ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ-నామినేషన్ చేయకపోతే..?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) చందాదారులకు అలర్ట్. ఈపీఎఫ్ సంస్థ ఈ-నామినేషన్ ప్రక్రియను ఇప్పుడు తప్పనిసరి చేసింది. గతంలో పలుమార్లు గడువు పొడిగించిన పీఎఫ్ సంస్థ.. తాజాగా ఆ వివరాలు నమోదు చేసేవరకు కొన్ని సేవలు పొందకుండా ఆంక్షలు విధించింది. అయితే, ఈ ఈ-నామినేషన్ ప్రక్రియను పూర్తిచేయడానికి ఎలాంటి గడువు విధించక పోవడం గమనర్హం. ఈపీఎఫ్ నుంచి నిధుల ఉపసంహరణతో పాటు ఖాతాలో ఎన్ని నిధులు నిల్వ ఉన్నాయో చూసుకునే అవకాశాన్ని ఈ నెల జనవరి 1 నుంచి తొలగించింది. ఈ-నామినేషన్ పూర్తి చేసిన చందాదారులే ఆన్లైన్ సేవలు పొందవచ్చని స్పష్టం చేస్తోంది. ఈపీఎఫ్ఓ డిజిటలైజేషన్ ఈపీఎఫ్ఓ గత కొంత కాలంగా డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అనేక ఆన్లైన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చిన సంస్థ.. భవిష్యత్తులో మరిన్ని సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొనిరావాలని యోచిస్తున్నట్లు పేర్కొంది. గతంలో ఈపీఎఫ్ చందాదారుడిగా నమోదైనప్పుడే సభ్యుల నామినీ వివరాలను కాగితం రూపంలో సేకరించింది. ఆ వివరాలు పూర్తిస్థాయిలో డిజిటైలేషన్ కాలేదు. దీంతో చందాదారుడు చనిపోయినపుడు వారసులకు ఈపీఎఫ్ మొత్తం, పింఛను, ఉద్యోగి డిపాజిట్ ఆధారిత బీమా(ఈడీఎల్ఐ) అందించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్లెయిమ్లను వేగంగా పరిష్కరించేందుకు ఈ-నామినేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. చందాదారులు ఈ వివరాలను నమోదు చేసుకోవాలని గత కొంతకాలంగా సూచిస్తూ వస్తోంది. ఇందుకు 2021 డిసెంబరు 31ను గడువని పేర్కొంది. అయినప్పటికీ కోట్ల మంది చందాదారులు వివరాలు నమోదు చేయలేదు. చివరి నిమిషంలో సర్వర్పై ఒత్తిడి పెరగడంతో సాధ్యం కాలేదు. దీంతో డిసెంబరు 31 తర్వాతా ఈ-నామినేషన్ నమోదుకు సంస్థ అనుమతి ఇచ్చింది. (చదవండి: కేంద్ర బడ్జెట్పై దేశీయ నిర్మాణ రంగం గంపెడాశలు.. కోరుతుందేంటి?) -
Deadline Relief: కొత్త ఏడాదిలో ప్రజలకు ఊరట..!
న్యూఢిల్లీ: కోవిడ్-19 కొత్త వేరియంట్ ఓమిక్రాన్ దేశంలో వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ, ఆర్బీఐ, ఈపీఎఫ్ఓలు ముఖ్యమైన తేదీల గడువును పొడగిస్తూ ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కెవైసీ అప్డేట్ విషయంలో బ్యాంకులకు విధించిన గడువును మార్చి 31, 2022 వరకు పొడగిస్తున్నట్లు పేర్కొంది. ఆర్బీఐతో పాటు ఆదాయపు పన్ను శాఖ, ఈపీఎఫ్ఓ కూడా కొన్ని కీలక నిర్ణయం తీసుకున్నాయి. అవేంటి ఇప్పుడు తెలుసుకుందాం.. ఈపీఎఎఫ్ఓ ఈ-నామినేషన్ ఈపీఎఎఫ్ఓ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. డిసెంబరు 31 తరువాత కూడా ఈ-నామినేషన్ చేయవచ్చు అని ఈపీఎఫ్ఓ తన ట్విటర్ వేదికగా తెలిపింది. గత కొద్ది రోజుల నుంచి చందాదారుల తమ సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివరాలను జత చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికి, ఈపీఎఫ్ఓ పోర్టల్ సర్వర్ డౌన్ సమస్య కారణంగా చందాదారులు అసౌకర్యానికి గురి అయ్యారు. ఈ సమస్య గురించి ట్విటర్ వేదికగా ఖాతాదారులు ఇచ్చిన ఫిర్యాదును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ఓ తెలిపిన వివరాల ప్రకారం చందాదారులు డిసెంబరు 31 తర్వాత కూడా ఈ-నామినేషన్ దాఖలు చేయవచ్చు. (చదవండి: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం షాక్..!) ఐటీఆర్ ఈ-వెరిఫై 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్లో తమ ఆదాయపు పన్ను రిటర్ను(ఐటీఆర్)లను ఈ-వెరిఫై చేయని పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ మరో అవకాశం కల్పించింది. ఐటీఆర్లను వెరిఫై చేయడానికి ఐటీ శాఖ ఈ ఏడాది డిసెంబర్ 21 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు గడువును పొడిగించింది. చట్టం ప్రకారం.. డిజిటల్ సంతకం లేకుండా దాఖలు చేసిన ఐటీఆర్లను ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, డీమ్యాట్ ఖాతా ద్వారా పంపిన కోడ్, ప్రీ వాలిడేటెడ్ బ్యాంక్ ఖాతా, ఏటిఎమ్ ద్వారా రిటర్న్ దాఖలు చేసిన 120 రోజుల్లోగా ఈ-వెరిఫై చేయాల్సి ఉంటుంది. జీఎస్టీ వార్షిక రిటర్న్ 2020-21 సంవత్సరానికి సంబంధించి వ్యాపార జీఎస్టీ వార్షిక రిటర్న్లను దాఖలు చేసే తేదీని ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. జీఎస్టీఆర్-9ను వార్షిక రిటర్న్గా జీఎస్టీ కింద నమోదైన పన్ను చెల్లింపుదార్లు సమర్పిస్తారు. జీఎస్టీఆర్-9, ఆడిటెడ్ వార్షిక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మధ్య రీకాన్సిలేషన్ స్టేట్మెంట్ను జీఎస్టీఆర్-9సీగా సమర్పిస్తారు. రూ.2 కోట్లకు మించి టర్నోవరు ఉన్న వ్యాపారులు జీఎస్టీఆర్-9ను సమర్పించడం తప్పనిసరి. రూ.5 కోట్లకు మించి టర్నోవరు ఉంటే.. జీఎస్టీఆర్-9సీని సమర్పించాల్సి ఉంటుంది. కెవైసీ గడువు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) బ్యాంక్ ఖాతాదారులకు గుడ్న్యూస్ తెలిపింది. కెవైసీ అప్డేట్ గడువును మార్చి 31, 2022 వరకు పొడగిస్తున్నట్లు పేర్కొంది. కోవిడ్-19 కొత్త రకం ఓమిక్రాన్ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గతంలో ఈ గడువు డిసెంబర్ 31, 2021 వరకు ఉండేది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం-2002, మనీ లాండరింగ్ నిరోధక(రికార్డుల నిర్వహణ) నియమాలు-2005 నిబంధనల పరంగా ఖాతాదారుల కెవైసీ అప్డేట్ ఆర్బీఐ 2016లో నియంత్రిత సంస్థలను ఆదేశించింది. కేవైసీ కేవలం బ్యాంకింగ్ లావాదేవీలకు మాత్రమే కాదు, నగదుతో ముడిపడి ఉన్న అన్ని లావాదేవీలకు కేవైసీ చేయాల్సి ఉంటుంది. (చదవండి: యూజర్లకు యూట్యూబ్ భారీ షాక్!) -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త..!
ఈపీఎఎఫ్ఓ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. డిసెంబరు 31 తరువాత కూడా ఈ-నామినేషన్ చేయవచ్చు అని ఈపీఎఫ్ఓ తన ట్విటర్ వేదికగా తెలిపింది. గత కొద్ది రోజుల నుంచి చందాదారుల తమ సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివరాలను జత చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికి, ఈపీఎఫ్ఓ పోర్టల్ సర్వర్ డౌన్ సమస్య కారణంగా చందాదారులు అసౌకర్యానికి గురి అయ్యారు. ఈ సమస్య గురించి ట్విటర్ వేదికగా ఖాతాదారులు ఇచ్చిన ఫిర్యాదును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఇంకొక ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ-నామినేషన్ చేయడానికి ఎలాంటి గడువు తేదీ లేదు అని పేర్కొనడం కొసమెరుపు. ఈపీఎఫ్ఓ తెలిపిన వివరాల ప్రకారం చందాదారులు డిసెంబరు 31 తర్వాత కూడా ఈ-నామినేషన్ దాఖలు చేయవచ్చు. అయితే ఈ రోజే నామినేషన్ దాఖలు చేయమని ఈపీఎఫ్ఓ ట్వీట్లో తెలిపింది. ఒకవేళ ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాకు నామినీ జత చేయకపోతే బీమా డబ్బు, పెన్షన్ డబ్బుతో పాటుగా ఇతర ఈపీఎఫ్ ప్రయోజనాలను కోల్పోతారు. కొత్త నిబంధనల ప్రకారం, చందాదారుల ఆకస్మిక మరణం సంభవించినప్పుడు నామినేటెడ్ సభ్యులు మాత్రమే ఈపీఎఫ్ పొదుపును విత్ డ్రా చేయగలరు. Empower your family, file enomination. #EPFO pic.twitter.com/sY8EjuDjSs — EPFO (@socialepfo) December 29, 2021 ఈపీఎఫ్ ఖాతాకు నామినీ జత చేయండి ఇలా.. ఈపీఎఫ్ఓ పోర్టల్ అధికారిక లింక్పై క్లిక్ చేయండి. యుఏఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి. మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ-నామినేషన్ ఎంచుకోండి. తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు. వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి. ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది. (చదవండి: ఒళ్లంతా కనిపించేలా ఏంటా పచ్చబొట్లు ! ఇది కరెక్టేనా?) -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలర్ట్.. ఈ-నామినేషన్కు ఇంకా 4 రోజులే గడువు..!
ఈపీఎఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్య గమనిక. కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాకు డిసెంబర్ 31, 2021 లోపు నామినీని జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాకు నామినీ జత చేయకపోతే బీమా డబ్బు, పెన్షన్ డబ్బుతో పాటుగా ఇతర ఈపీఎఫ్ ప్రయోజనాలను కోల్పోతారు. కొత్త నిబంధనల ప్రకారం, చందాదారుల ఆకస్మిక మరణం సంభవించినప్పుడు నామినేటెడ్ సభ్యులు మాత్రమే ఈపీఎఫ్ పొదుపును విత్ డ్రా చేయగలరు. అలాగే, ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీం(ఈడిఎల్ఐ) ప్రయోజనాలను ఈపిఎఫ్ నామినేషన్లో పేర్కొన్న నామినీ మాత్రమే క్లెయిం చేసుకోవచ్చు. చందాదారులు ఒకరికంటే ఎక్కువ మంది నామినీలను కూడా జత చేసే అవకాశాన్ని కల్పించింది. ఆ నామినీలందరి మధ్య వాటా శాతాన్ని కూడా నిర్ణయించవచ్చు. ఆన్లైన్లో ఖాతాదారులు నామినీని జతచేయవచ్చు. ఈపీఎఫ్ ఖాతాకు నామినీ ఏ విధంగా జత చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈపీఎఫ్ ఖాతాకు నామినీ జత చేయండి ఇలా.. ఈపీఎఫ్ఓ పోర్టల్ అధికారిక లింక్పై క్లిక్ చేయండి. యుఏఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి. మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ-నామినేషన్ ఎంచుకోండి. తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు. వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి. ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది. (చదవండి: అదిరిపోయిన బ్రిటన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. హెడ్ ఆఫీస్ మన హైదరాబాద్లోనే!) -
జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే..!
New Rules From 1st January 2022: అమ్మో ఒకటో తారీఖు..! ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంతో పాటు దేశంలో కూడా అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ నిబంధనలు వల్ల కొన్ని సార్లు సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. ప్రతి నెల మాదిరిగానే రాబోయే కొత్త ఏడాది జనవరి 1 నుంచి కూడా పలు కీలక నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర, ఈపీఎఫ్ ఈ-నామినేషన్, కొత్త జీఎస్టీ రూల్స్, ఏటీఎమ్ ఛార్జీలు వంటివి జనవరి నెలలో మార్పులు చోటు చేసుకొనున్నాయి. వచ్చే నెల 1 నుంచి అమలులోకి రాబోయే కొత్త రూల్స్ గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్: 2022 జనవరి 1 నుంచి క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్డ్రాయల్ లావాదేవీలపై ఐపీపీబీ ఛార్జీలు వసూలు చేయనుంది. బేసిక్ సేవింగ్స్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్లకు ఈ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. బ్యాంకు ఖాతాను బట్టి ఉచిత లిమిట్ ఉంటుంది. ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత క్యాష్ విత్డ్రాయల్, క్యాష్ డిపాజిట్లపై 0.50 శాతం లేదా కనీసం రూ.25 ప్రతీ లావాదేవీకి చెల్లించాలి. ఏటీఎం ఛార్జీలు: క్యాష్, నాన్-క్యాష్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ల(ఏటీఎం) ఉపయోగానికిగానూ కస్టమర్ల నుంచి అధిక వసూళ్లకు ఆర్బీఐ గతంలోనే బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఇదివరకు ఇది 20రూ.గా ఉండగా, 21రూ.కి పెంచుకునేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. సొంత బ్యాంకుల్లో ఐదు ట్రాన్జాక్షన్స్, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో అయితే ఐదు(నాన్-మెట్రో నగరాల్లో మాత్రమే), మెట్రో నగరాల్లో మూడు విత్డ్రాలకు అనుమతి ఉంది. ఇవి దాటితే ఒక్కో ట్రాన్జాక్షన్కు రూ.21 చొప్పున వసూలు చేస్తాయి బ్యాంకులు. ఈ కొత్త ఛార్జీలు జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. (చదవండి: కేంద్రం కీలక ఆదేశాలు! కాల్ రికార్డ్స్, ఇంటర్నెట్ యూజర్ల వివరాలన్నీ..) ఈపీఎఫ్ ఈ-నామినేషన్: ఈపీఎఫ్ ఖాతాదారులు డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా మీ పీఎఫ్ ఖాతాకు నామిని తప్పనిసరిగా లింక్ చేయాలి. లేకపోతే మీరు ఈపీఎఫ్, ఈపీస్, ఈడీఎల్ఐకు సంబంధించిన ప్రయోజనాలను జనవరి 1 నుంచి పొందలేరు. ఎల్పీజీ గ్యాస్ ధర: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల 1, 15వ తేదీ నాడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరిస్తాయి. అలాగే, జనవరి 1న కూడా గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్: పన్ను చెల్లింపుదారులు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది 2021 డిసెంబర్ 31 ఫైల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే, 2022 జనవరి 1 నుంచి 2020-21 ఐటీఆర్ ఫైల్ చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ రూల్స్: పన్ను చెల్లింపు విషయంలో మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టానికి పదికి పైగా సవరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సవరణలన్నీ కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. హీరో మోటోకార్ప్: వచ్చే ఏడాది జనవరి 4 నుంచి హీరో మోటోకార్ప్కు చెందిన మోటార్సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలను పెంచే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. ధరల పెంపుపై కంపెనీ గురువారం రోజున స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. క్రమంగా పెరుగుతున్న ముడిసరుకుల ధరల ప్రభావాన్ని పాక్షికంగా ఆఫ్సెట్ చేయడానికి ధరల పెంపు అనివార్యమని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కార్ల ధరలు: వచ్చే ఏడాది 2022 జనవరి నుంచి కార్ల ధరలను పెంచుతూ చాలా వరకు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ కొత్త ధరలు అనేవి కంపెనీ బట్టి మారుతున్నాయి. (చదవండి: అమెజాన్: ప్లీజ్ ఆత్మహత్య చేసుకోవద్దు..మీ హెచ్ఆర్ను కలవండి!) -
PF New Rule: ఈ-నామినేషన్ ఫైల్ చేయకపోతే.. ఈపీఎఫ్ ప్రయోజనాలు బంద్?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సరికొత్త రూల్ తీసుకొని వచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి అంటే డిసెంబర్ 31 లోపు ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాలకు నామినీ పేరును జత చేసుకోవాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఒకవేళ నామినీ పేరును యాడ్ చేయకపోతే, ఈ రిటైర్మెంట్ బాడీ అందించే పలు ప్రయోజనాలను ఉద్యోగులు కోల్పోవాల్సి వస్తుందని తెలిపింది. ఈపీఎఫ్ అందించే ప్రయోజనాలను పొందాలంటే డిసెంబర్ 31 లోపల నామినీ పేరును తమ ఖాతాలకు జత చేసుకోవాలని, ఈ-నామినేషన్ ప్రక్రియను కూడా ఆన్లైన్ చేసినట్లు పేర్కొంది. భారత్లో పనిచేసే ఉద్యోగులందరికీ దాదాపు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతా తప్పనిసరిగా ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత వారికి ఈపీఎఫ్ఓ ఫండ్ ఒక ముఖ్యమైన ఆదాయపు వనరుగా ఉపయోగపడుతుంది. ఈపీఎఫ్ఓ అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి ఖాతా నుంచి ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తంలో కట్ చేస్తారు. ఉద్యోగి ఖాతా నుంచి ఎంత మొత్తమైతే కట్ అవుతుందో, అంతే మొత్తంలో ఎంప్లాయర్స్ కూడా ఉద్యోగి ఈపీఎఫ్ఓ ఖాతాలో జమ చేస్తారు. డిసెంబర్ 31 లోపల నామినీ వివరాలను అప్డేట్ చేయకపోతే, జనవరి 2022 నుంచి పెన్షన్, ఇన్సూరెన్స్ మనీ ఎలాంటి ప్రయోజనాలను ఉద్యోగులు పొందలేరు. ఏదైనా ఊహించని ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్, పెన్షన్ పథకాల ప్రయోజనాలు నామినీ పొందేలా కొత్త నిబంధనను ఈపీఎఫ్ రూపొందించింది. ఈపీఎఫ్ఓలో ఈ-నామినేషన్ చేయండి ఇలా.. ఈపీఎఫ్ఓ పోర్టల్ అధికారిక లింక్పై క్లిక్ చేయండి. యుఏఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి. మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ-నామినేషన్ ఎంచుకోండి. తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు. వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి. ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్ తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది. (చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను భారీగా పెంచిన ఎస్బీఐ బ్యాంక్..!) -
రూ.15 వేల కంటే తక్కువ వేతనం వచ్చే వారికి ఈపీఎఫ్ఓ శుభవార్త!
రూ.15 వేల కంటే తక్కువ వేతనం గల ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన(ఏబీఆర్వై) పథకం కింద ఉద్యోగులు రిజిస్టర్ చేసుకునే సౌకర్యాన్ని మార్చి 31, 2022 వరకు పొడగించినట్లు తెలిపింది. ఈ మేరకు ఏబీఆర్వై కింద రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యాన్ని వచ్చే ఏడాది 2022 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు ఈపీఎఫ్ఓ ఒక ట్వీట్ చేసింది. అధికారిక రంగంలో ఉపాధిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020లో ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజనను తీసుకొచ్చింది. రూ.15 వేల కంటే తక్కువ వేతనం ఉన్న వారు ఈ క్రింది ప్రయోజనాలు పొందవచ్చు. ఏబీఆర్వై పథకం: కీలక ముఖ్యాంశాలు.. 1) ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేసుకున్న అర్హత కలిగిన సంస్థల యజమానులు, కొత్త ఉద్యోగులకు ప్రోత్సాహం లభిస్తుంది. 2) కొత్త ఉద్యోగులు రిజిస్ట్రేషన్ తేదీ నుంచి రెండు సంవత్సరాల వరకు ప్రోత్సాహకాలను అందుకుంటారు. 3) చెల్లింపు రూపంలో ఇన్సెంటివ్ ఎ) 1,000 మంది వరకూ ఉద్యోగులు ఉండే సంస్థలు కొత్తగా చేపట్టే నియామకాలకు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) చెల్లింపులను ప్రభుత్వమే భరిస్తుంది. బి) 1,000 మంది కంటే అధికంగా ఉద్యోగులు కలిన సంస్థల విషయంలో మాత్రం రెండేళ్ల పాటు కేవలం ఉద్యోగుల తరఫున 12 శాతం ఈపీఎఫ్ చెల్లింపు మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది. 4) నిర్దిష్ట సంఖ్యలో కొత్త ఉద్యోగులను చేర్చుకున్న సంస్థలకు మాత్రమే పైన ప్రోత్సహాకాలు అందుతాయి. 5) సెప్టెంబర్ 2020 కొరకు ఈసిఆర్లో కంట్రిబ్యూటరీ ఈపిఎఫ్ సభ్యుల సంఖ్యగా ఉద్యోగుల రిఫరెన్స్ బేస్ తీసుకోబడుతుంది. 6) రూ.15000 కంటే తక్కువ నెలవారీ వేతనం గల కొత్త ఉద్యోగులు రిజిస్ట్రేషన్ తేదీ నుంచి 24 నెలల వరకు ఈ ప్రయోజనాలను పొందుతారు. 7) అక్టోబర్ 1, 2020 తర్వాత ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేసుకున్న సంస్థ కొత్త ఉద్యోగుల కూడా పలు ప్రయోజనాలను పొందుతారు. ఏబీఆర్వై పథకం ఏబీఆర్వై కింద1,000 మంది వరకూ ఉద్యోగులు ఉండే సంస్థలు కొత్తగా చేపట్టే నియామకాలకు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) చెల్లింపులను ప్రభుత్వమే భరిస్తుంది. అంటే ఆయా కొత్త ఉద్యోగుల మూల వేతనంపై 12% ఉద్యోగుల తరఫు చెల్లింపు, 12% వ్యాపార సంస్థ తరఫు చెల్లింపు, అంటే మొత్తం 24 శాతాన్ని ఈ స్కీమ్ కింద కేంద్రం సబ్సిడీ కింద అందజేస్తుంది. 4 డిసెంబర్ 2021 నాటికి, 39.73 లక్షల మంది కొత్తగా ఉద్యోగాలు పొందారు. వారి అకౌంట్లలో కూడా రూ.2612.10 కోట్ల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. Registration facility under #ABRY has been extended till 31.03.2022. ABRY के तहत पंजीकरण सुविधा 31.03.2022 तक बढ़ा दी गई है।#EPFO #Employees pic.twitter.com/l9SuskDNQ9 — EPFO (@socialepfo) December 15, 2021 (చదవండి: వచ్చేసింది ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్..! శాంసంగ్ కంటే తక్కువ ధరకే..!) -
22 కోట్ల ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్న్యూస్..!
22.55 కోట్ల మంది ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.50 శాతం వడ్డీని పీఎఫ్ ఖాతాలో జమ చేసినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) తెలిపింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొంది. ఈపీఎఫ్ఓ ప్రస్తుతం పీఎఫ్ పెట్టుబడులపై 8.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. ఈపీఎఫ్ఓ 2020-21 సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సభ్యుల ఖాతాలకు వడ్డీ రేటును అక్టోబర్ 30వ తేదీన ఇచ్చిన సర్క్యులర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల కంటే ఎక్కువ విత్ డ్రా ఉన్నందున 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును రిటైర్ మెంట్ ఫండ్ రెగ్యులేటరీ బాడీ మార్చకుండా ఉంచింది. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తర్వాత ఈపీఎఫ్ఓ మార్చిలో 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును ఏడు సంవత్సరాల కనిష్టస్థాయికి(8.5 శాతం) తగ్గించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీరేటు 8.65 శాతంగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.55 శాతం కాగా, 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇచ్చిన ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. 22.55 crore accounts have been credited with an interest of 8.50% for the FY 2020-21. @LabourMinistry @esichq @PIB_India @byadavbjp @Rameswar_Teli — EPFO (@socialepfo) December 6, 2021 ఆన్లైన్లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఇలా.. ఈపీఎఫ్ పోర్టల్ https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login లింకు మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఖాతా ఓపెన్ చేయడానికి మీ యుఎఎన్ నెంబర్, పాస్ వర్డ్ నమోదు చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు ఒక్క మెస్సేజ్ ద్వారా ఖాతాదారులకు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ ద్వారా EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మెస్సేజ్ చేయాలి. పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, చివరి ఇన్స్టాల్ మెంట్ వివరాలు అందుతాయి. ఈపీఎఫ్ ఖాతాలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. -
ఈపీఎఫ్ ఖాతాకు నామినీ జత చేయకపోతే రూ.7 లక్షలు రానట్లే?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పీఎఫ్ చందాదారుల కోసం అనేక ఆన్లైన్ సేవలు అందిస్తుంది. దీంతో చిన్న చిన్న పనుల కోసం ప్రతిసారీ ఈపీఎఫ్ఓ సంస్థ కార్యాలయానికి సందర్శించాల్సిన అవసరం లేదు. ఈపిఎఫ్ ఈ-నామినేషన్ సర్వీస్ అనేది అలాంటి ఒక కొత్త ఫెసిలిటీ, దీనిని ఆన్లైన్లో ఉపయోగించుకోవచ్చు. ఈపీఎఫ్ నామినీని మార్చడానికి పీఎఫ్ సభ్యులు కొత్త నామినేషన్ దాఖలు చేయవచ్చని ఈపీఎఫ్ఓ తన తాజాగా ట్వీట్ లో తెలిపింది. తాజా పీఎఫ్ నామినేషన్ లో పేర్కొన్న నామినీ పేరును ఫైనల్ గా పరిగణిస్తారు. అయితే ఖాతాదారుని తాజా నామినేషన్ తర్వాత ఇంతకు ముందు నామినేషన్ క్యాన్సిల్ చేసినట్లు పరిగణిస్తారు. ఉద్యోగులకు నామినేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సేవలను ప్రారంభించింది. ఈ-నామినేషన్ చేయడం ద్వారా ఖాతాదారుడు మరణిస్తే ఈడీఎల్ఐ కింద రూ.7 లక్షల వరకు నామినీకి అందుతాయి. ఈ-నామినేషన్ కోసం ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ద్వారానే నామినీ జత చేసుకునే అవకాశం ఈపీఎఫ్ఓ కల్పించింది. ఒకవేళ మీరు ఇంకా ఈ-నామినేషన్ దాఖలు చేయనట్లయితే దిగువ పేర్కొన్న విధంగా చేయవచ్చు. #EPF सदस्य मौजूदा EPF/#EPS नामांकन को बदलने के लिए नया नामांकन दाखिल कर सकते हैं।#EPF Members can file new nomination to change existing EPF/#EPS nomination.#EPFO #Services #Pension #ईपीएप #पीएफ pic.twitter.com/rm3G2FaqKy — EPFO (@socialepfo) November 18, 2021 ఈపీఎఫ్ఓలో ఈ-నామినేషన్ చేయండి ఇలా.. ఈపీఎఫ్ఓ పోర్టల్ అధికారిక లింక్పై క్లిక్ చేయండి. యుఎఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి. మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ-నామినేషన్ ఎంచుకోండి. తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు. వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి. ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్ తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది. (చదవండి: 2023లో మార్కెట్లోకి సోలార్ కారు.. ధర తక్కువ, రేంజ్ ఎక్కువ?) -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త!
6.47 కోట్ల మంది ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.50 శాతం వడ్డీని మీ పీఎఫ్ ఖాతాలో జమ చేసినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) తెలిపింది. దీపావళి పండుగా సందర్భంగా అందరి ఖాతాలో జమ అవుతుందని భావించారు కానీ, కొంచెం ఆలస్యం అయ్యింది. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తర్వాత ఈపీఎఫ్ఓ మార్చిలో 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును ఏడు సంవత్సరాల కనిష్టస్థాయి 8.5 శాతానికి తగ్గించింది. 2018-19లో వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ తన చందాదారులకు 8.55 శాతం వడ్డీ రేటును అందించింది. 2016-17లో వడ్డీ రేటు 8.65%గా ఉంది. ఆన్లైన్లో మీ పీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో చూసుకోవచ్చు. దీంతో వడ్డీ ఎంత వచ్చిందో తెలుసుకోవచ్చు. వెంటనే ఇలా చేయండి.. 6.47 crore accounts have been credited with an interest of 8.50% for the FY 2020-21. Next update on 15-11-2021. @LabourMinistry @esichq @PIB_India @byadavbjp @Rameswar_Teli @wootaum — EPFO (@socialepfo) November 12, 2021 ఆన్లైన్లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఇలా.. ఈపీఎఫ్ పోర్టల్ https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login లింకు మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఖాతా ఓపెన్ చేయడానికి మీ యుఎఎన్ నెంబర్, పాస్ వర్డ్ నమోదు చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు ఒక్క మెస్సేజ్ ద్వారా ఖాతాదారులకు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ ద్వారా EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మెస్సేజ్ చేయాలి. పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, చివరి ఇన్స్టాల్ మెంట్ వివరాలు అందుతాయి. ఈపీఎఫ్ ఖాతాలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. (చదవండి: మదుపరులపై కాసుల వర్షం కురిపించిన స్టాక్స్!) -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: 6 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ త్వరలో శుభవార్త చెప్పనుంది. తన ఖాతాదారులకు వడ్డీ జమ విషయంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ప్రకటించడం తెలిసిందే. తాజాగా ఈపీఎఫ్ఓ 6 కోట్ల మంది ఖాతాదారులకు దీపావళికి ముందే వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి, రిటైర్డ్ బోర్డు ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయించింది. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తర్వాత ఈపీఎఫ్ఓ మార్చిలో 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును ఏడు సంవత్సరాల కనిష్టస్థాయి 8.5 శాతానికి తగ్గించింది. 2018-19లో వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ తన చందాదారులకు 8.55 శాతం వడ్డీ రేటును అందించింది. 2016-17లో వడ్డీ రేటు 8.65%గా ఉంది. కేంద్ర ప్రభుత్వం మార్చి 2020లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన(పీఎంజీకెవై) కింద కొత్త నిబంధనను రూపొందించింది. ఈపీఎఫ్ సభ్యులు మూడు నెలల ప్రాథమిక వేతనం, కరువు భత్యం(డీఏ) లేదా వారి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులో 75 శాతం వరకు అడ్వాన్స్ గా తీసుకునే అవకాశాన్ని కల్పించింది. (చదవండి: డ్రీమ్-11కు షాకిచ్చిన క్యాబ్ డ్రైవర్...!) ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఇలా.. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ద్వారా ఈపీఎఫ్ ఖాతాదారులు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఒక్క మెస్సేజ్ ద్వారా ఖాతాదారులకు పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు రిజిస్టర్డ్ మొబైల్కు వస్తాయి. EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మెస్సేజ్ చేయాలి. పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, చివరి ఇన్స్టాల్ మెంట్ వివరాలు అందుతాయి. ఈపీఎఫ్ ఖాతాలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.(చదవండి: ఇక నల్లకుబేరుల పని అయిపోయినట్లే!) -
ఈపీఎఫ్వో ఖాతాదారులకు కేంద్రం శుభవార్త
ఈపీఎఫ్వో ఖాతాదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్ఓ అకౌంట్ను ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా ఉద్యోగి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ను మార్చుకోవాలి. ఈ పద్దతి ఉద్యోగులకు తలకు మించిన భారంగా ఉండేది. అకౌంట్ను ట్రాన్స్ఫర్ చేయించుకోవడంతో పాటు డబ్బుల్ని విత్ డ్రాల్ చేసుకోవడం మరింత కష్టతరంగా మారింది. ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరిస్తూ కేంద్రం ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కొత్త మార్గదర్శకాల్నిఅందుబాటులోకి తెచ్చింది. ఆ ప్రొసీజర్ ఫాలో అయితే చాలు సులభంగా ఉద్యోగులు ఈపీఎఫ్ అకౌంట్ను మార్చుకోవచ్చు. Know how to transfer EPF online जानिए कैसे करें ईपीएफ ऑनलाइन ट्रांसफर#EPFO #SocialSecurity #HumHainNa pic.twitter.com/x22NiLgMgc — EPFO (@socialepfo) September 5, 2021 అంతకంటే ముందు మీ ఈపీఎఫ్ఓ అకౌంట్ను ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మార్చుకునేందుకు ముందు ఈ రూల్స్ను పాటించాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉండాలి. అకౌంట్ హోల్డర్ మునుపటి లేదా ప్రస్తుత సంస్థ EPFOలో డిజిటల్ రిజిస్టర్డ్ సంతకాలు కలిగి ఉండాలి. ఇది కాకుండా బ్యాంక్ కేవైసీ సరిగ్గా ఉందో? లేదో? చెక్ చేసుకోవాలి. ఆ తర్వాతనే అకౌంట్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అకౌంట్ను ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి • ఉద్యోగులు ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్ సైట్ను ఓపెన్ చేయాలి. • ఓపెన్ చేసి యూఏఎన్(Universal Account Number),పాస్వర్డ్ను టైప్ చేసి ఎంటర్ బటన్ ను క్లిక్ చేయాలి. • క్లిక్ చేసిన వెంటనే మనకు ఆన్ లైన్ సర్వీస్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ను క్లిక్ చేసి'వన్ మెంబర్ - వన్ ఈపీఎఫ్ అకౌంట్పై క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి • రిక్వెస్ట్ తర్వాత గెట్ డీటెయిల్స్ ఆప్షన్ పై ట్యాప్ చేయాలి. • గెట్ డీటెయిల్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు పాత సంస్థ ఈపీఎఫ్ఓ వివరాలు డిస్ ప్లే అవుతాయి. • ఆ తర్వాత ట్రాన్స్ ఫర్ చేసుకునేందుకు ధృవీకరణ ఫారం కోసం మునుపటి సంస్థ లేదా ప్రస్తుత సంస్థ ఆప్షన్ను ఎంచుకోవాలి. • అనంతరం యూఏఎన్ రిజిస్ట్రర్డ్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. • మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.అలా క్లిక్ చేస్తే చాలు మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ వెరిఫికేషన్ వెళుతుంది. అనంతరం ట్రాన్స్ఫర్ అవుతుంది. చదవండి: హ్యాకర్స్ రూట్ మార్చారు, స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు -
ఇక రెండుగా ఈపీఎఫ్ ఖాతాల విభజన
ప్రస్తుతం ఉన్న ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఖాతాలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ ఖాతాల్లో భారీగా నగదు జమ చేసే మొత్తాల ద్వారా సమకూరే వడ్డీపై పన్ను విధించే దిశగా కేంద్రం పీఎఫ్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. ఇకపై ఏడాదికి ₹2.5 లక్షలకు మించి పీఎఫ్ ఖాతాల్లో జమ చేసే ఆదాయంపై ప్రభుత్వం పన్ను విధించనుంది. దీనికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) నిబంధనలను జారీ చేసింది. అలాగే, రెండు వేర్వేరు ఖాతాలగా ఏర్పాటు చేయాల్సిందిగా పేర్కొంటూ నిబంధనలలో పేర్కొంది. ఇప్పటికే ఉన్న ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) ఖాతాలు అన్నీ పన్ను పరిధిలోకి వచ్చే, పన్ను పరిధిలోకి రాని కంట్రిబ్యూషన్ ఖాతాలుగా విభజించనున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆగస్టు 31న కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. తర్వాత ఆదాయపు పన్ను విభాగానికి కూడా ఈ సమాచారం అంధించింది. అధికారిక వర్గాల ప్రకారం, ఈ నిబంధనలు వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2022 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఏటా ₹2.5 లక్షలకు మించి పీఎఫ్ ఖాతాల్లో జమ చేసే ఆదాయంపై కొత్త పన్నును వసూలు చేయడానికి ఆదాయపు పన్ను నిబంధనల్లో కొత్త సెక్షన్ 9డీని చేర్చారు. పన్ను పరిధిలోకి వచ్చే వడ్డీని లెక్కించడం కొరకు, ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అదేవిధంగా ఇంతక ముందు సంవత్సరాల్లో ఇప్పటికే ఉన్న ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో రెండు ప్రత్యేక ఖాతాలను నిర్వహించాల్సి ఉంటుంది. (చదవండి: రిలయన్స్ చేతికి జస్ట్ డయల్!) -
ఈ-నామినేషన్ ఫైల్ చేశారా.. లేకపోతే రూ.7 లక్షలు రానట్లే?
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) చందాదారులు కుటుంబాలకు సామాజిక ఆర్ధిక భద్రత కల్పించేందుకు కేంద్రం ఎంప్లాయిస్ డిపాజిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఈడీఎల్ఐ స్కీమ్ కింద చేరిన చందాదారులు మరణిస్తే ఆ తర్వాత నామినీకి గరిష్ఠంగా రూ.7 లక్షలు వస్తాయి. అయితే, ఈ ప్రయోజనాన్ని పొందాలంటే ఈపీఎఫ్ చందాదారులు తప్పనిసరిగా ఈ-నామినేషన్ ఫైల్ చేయాలని ఇటీవల ట్విటర్ ద్వారా తెలిపింది. ఈ-నామినేషన్ కోసం ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ద్వారానే నామినేషన్ చేసుకునే అవకాశం ఈపీఎఫ్ఓ కల్పించింది. ఒకవేళ మీరు ఇంకా ఈ-నామినేషన్ దాఖలు చేయనట్లయితే దిగువన పేర్కొన్న విధంగా చేయవచ్చు. (చదవండి: ఈ-శ్రమ్ పోర్టల్లో పేరు రిజిస్టర్ చేసుకోవడం ఎలా?) File e-Nomination today online through UAN, to ensure #SocialSecurity for your family/nominee.#EPFO #PF #Services #Pension #ईपीएप #पीएफ pic.twitter.com/bWfFCyxGXF — EPFO (@socialepfo) September 1, 2021 ఈ-నామినేషన్ ఫైలింగ్.. ఈపీఎఫ్ఓ అధికారిక లింక్ పై క్లిక్ చేయండి. (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/) యుఏఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి. మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ-నామినేషన్ ఎంచుకోండి. ఆ తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు. వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి. ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్ తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది. -
యుఏఎన్ నెంబర్-ఆధార్ లింక్ చేయకపోతే కలిగే నష్టాలు?
ఈపీఎఫ్ ఖాతా యుఏఎన్ నెంబర్తో ఆధార్ ను లింక్ చేయడానికి చివరి తేదీ ఆగస్టు 31 అని పీఎఫ్ చందాదారులు గమనించాలి. మీరు మీ యుఏఎన్ నెంబర్తో ఆధార్ లింక్ చేయకపోతే అప్పుడు మీకు ఈపీఎఫ్ అందించే బహుళ ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది. ఇంతకు ముందు ఈ గడువు జూన్ 1 వరకు ఉండేది. కానీ, కరోనా మహమ్మారి నేపథ్యంలో గడువును ఆగస్టు 31, 2021 వరకు పొడిగించినట్లు ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఈపీఎఫ్ ఖాతా యుఏఎన్ నెంబర్తో ఆధార్ ను లింక్ చేయడం తప్పనిసరి చేసింది. దీని కోసం, ఈపీఎఫ్ఓ సామాజిక భద్రత కోడ్ 2020 సెక్షన్ 142లో కొన్ని కీలక మార్పులు చేసింది.(చదవండి: పీఎఫ్ యూఎన్ నెంబర్తో ఆధార్ లింకు చేసుకోండి ఇలా..) ఇక నుంచి పీఎఫ్ మెంబర్లు సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద ఏదైనా ప్రయోజనాన్ని పొందాలంటే ఆధార్ నంబర్-యుఏఎన్ లింకింగ్ తప్పనిసరి అని పేర్కొంది. రెండింటిని లింక్ చేయనివారికి పీఎఫ్ కంట్రిబ్యూషన్ అందకపోవడమే కాదు.. ఇతర ఈపీఎఫ్ఓ సేవలు ఆగిపోతాయని సంస్థ పేర్కొంది. పెన్షన్ ఫండ్ నుంచి డబ్బు తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఉద్యోగుల లింకింగ్ పూర్తయ్యే వరకు వాళ్ల ఖాతాలో కంపెనీలు తమ కంట్రిబ్యూషన్ను డిపాజిట్ చేయడం వీలుపడదు.(చదవండి: సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!) ఈ ఏడాది జూన్ నుంచి ఆర్గనైజేషన్ ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్(ఈసీఆర్) దాఖలు చేసే రూల్స్ కూడా మారాయి. ఇక నుంచి ఆధార్తో లింక్ అయిన పీఎఫ్ ఖాతాకు మాత్రమే ఎలక్ట్రానిక్ చలాన్-కమ్ -రిటర్న్లను దాఖలు చేయడానికి యజమానులను అనుమతిస్తామని ఈపీఎఫ్ఓ ఇది వరకే ప్రకటించింది. పెన్షన్ ఫండ్కి అందించే డబ్బు కూడా అందులో పడదు. ఉద్యోగులు తమ వడ్డీని సైతం పొందలేరు. -
మీ పీఎఫ్ ఖాతాను ఆధార్తో లింక్ చేశారా..?
పీఎఫ్ చందాదారులకు ఒక ముఖ్యమైన గమనిక. సెప్టెంబర్ 1 వరకు పీఎఫ్ ఖాతాతో ఆధార్ కార్డును లింక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేల మీరు లింకు చేయకపోతే మీకు అందించే ఈపీఎఫ్ ప్రయోజనాలు తగ్గించవచ్చు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఆధార్ కార్డును పీఎఫ్ ఖాతాతో లింక్ చేయాలని గతంలో జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది. (చదవండి: మైక్రోసాఫ్ట్ యూజర్లకు అలర్ట్!) ఇంతకు ముందు, ఈపీఎఫ్ఓ ఈ గడువును జూన్ 1, 2021గా నిర్ణయించింది. ఆధార్ వెరిఫైడ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్లు(యుఏఎన్)తో పీఎఫ్ రిటర్న్ దాఖలు చేయాలని రిటైర్ మెంట్ ఫండ్ బాడీ పేర్కొంది. తాజా ఆర్డర్ అమలులో ఉండటంతో, ఇప్పుడు యజమానులు తమ ఉద్యోగుల ఆధార్ నంబర్ ను పిఎఫ్ ఖాతాలు లేదా యుఎఎన్ తో లింక్ చేయడానికి ఎక్కువ సమయం ఉంటుంది. ఓకవేళ మీరు ఆధార్తో లింక్ చేయకపోతే సదరు కంపెనీ జమ చేసే నగదు మీ ఖాతాలో పడదు. అందుకే వెంటనే మీ ఆధార్ను లింకు చేయండి చేసుకోండి. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని ఈపీఎఫ్ విడుదల చేసింది. సామాజిక భద్రత కోడ్ 2020 సెక్షన్ 142 ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. -
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగం కోల్పోయి తిరిగి విధుల్లో చేరిన ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఈపీఎఫ్ఓ చందాదారులకు 2022 వరకు ఉద్యోగుల చెల్లించే మొత్తంతో పాటు యాజమాన్యాలు చెల్లించే మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈపీఎఫ్ఓ కింద నమోదు చేసుకున్న సంస్థల్లో ఉద్యోగం చేసే వారికి మాత్రమే ఈ నిబందన వర్తిస్తుందని పేర్కొన్నారు.(చదవండి: దాల్ సరస్సులో ఎస్బీఐ ఫ్లోటింగ్ ఎటిఎమ్) అయితే, ఈ అవకాశం 2022 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. రూ.15 వేలలోపు వేతనం కలిగిన వారికి ఈ బెనిఫిట్ వర్తిస్తుంది అని గుర్తుంచుకోవాలి. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి జూన్లో 12.83 లక్షల మంది కొత్తగా చేరారు. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. జూన్లో కరోనా వైరస్ నెమ్మదించడం ఉద్యోగ కల్పనకు దారితీసినట్టు పేర్కొంది. ఈపీఎఫ్ఓ సభ్యులకు వారి పదవీ విరమణపై ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ప్రయోజనాలు, కుటుంబ పెన్షన్ & సభ్యుడు అకాల మరణం చెందితే వారి కుటుంబాలకు బీమా ప్రయోజనాలను అందిస్తుంది. Central govt will pay the PF share of the employer as well as the employee till 2022 for people who lost their job but again called back to work in small scale jobs in the formal sector whose units are registered in EPFO: Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/9fDXzLdBSC — ANI (@ANI) August 21, 2021 -
EPFO Aadhaar Link: ఇంకా పది రోజులే గడువు!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) చందాదారులు తమ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను సెప్టెంబర్ 1 లోపు ఆధార్ తో లింక్ చేసుకోవాలని పేర్కొంది. గతంలో జూన్ 1 వరకు ఉన్న ఆధార్ - పీఎఫ్ యూఎన్ నెంబర్ లింకు గడువును సెప్టెంబర్ 1 వరకు పొడగిస్తూ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మీ పీఎఫ్ ఖాతా యూఎన్ నెంబర్ను ఆధార్తో లింకు చేయకపోతే వెంటనే లింకు చేసేయండి. ఈపీఎఫ్ కొత్త నిబంధనల ప్రకారం కచ్చితంగా పీఎఫ్ ఖాతాను ఆధార్తో లింక్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే పీఎఫ్ లో సంస్థ జమ చేసే నగదు మొత్తంపై ప్రభావం పడనుంది. ఒకవేళ ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతా ఆధార్తో లింకు చేసుకోకపోతే యజమాని జమ చేసే నగదు మీ ఖాతాలో ఇక నుంచి జమకాదు. కాబట్టి, మీ పీఎఫ్ ఖాతాను వెంటనే ఆధార్తో లింకు చేయాలని తెలుసుకోండి. దీనికి సంబంధించి ఉత్తర్వులను ఈపీఎఫ్ఓ విడుదల చేసింది. సామాజిక భద్రత కోడ్ 2020లోని సెక్షన్ 142 కింద ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ఆధార్తో ఈపీఎఫ్ ఎలా లింకు చేయాలో ఈ క్రింది విదంగా తెలుసుకోండి.(చదువుకోండి: హోండా యు-గో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంతో తెలుసా?) ఈపీఎఫ్ - ఆధార్ లింకు విధానం అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. ఇప్పుడు మేనేజ్ ట్యాబ్ కింద ఉన్న ఈ-కెవైసీ ఆప్షన్ ఎంచుకోండి. 'ఆధార్' అని పేర్కొన్న ట్యాబ్ ఆప్షన్ ఎంచుకోండి మీ పేరు, ఆధార్ కార్డు నెంబరును సరిగ్గా నమోదు చేసి 'సేవ్' మీద క్లిక్ చేయండి. దీని తర్వాత, మీ ఆధార్ నెంబరు యుఐడీఎఐ డేటాబేస్ తో వెరిఫై అవుతుంది. -
తరచుగా పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తే రూ. 35 లక్షలు నష్టపోయినట్లే!
సాక్షి, న్యూఢిల్లీ: పీఎఫ్ అకౌంట్ నుంచి తరచుగా డబ్బులు డ్రా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త. తరచుగా పీఎఫ్ డబ్బులను విత్డ్రా చేస్తే.. పదవీవిరమణ సమయంలో భారీగా నష్టపోతారట. సుమారు 35 లక్షల రూపాయల వరకు కోల్పోతారట. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ప్రకారం కరోనా కాలంలో చాలామంది అభ్యర్థులు తన పీఎఫ్ డబ్బులను భారీగా విత్ డ్రా చేసుకున్నారు. సుమారు 7.1 మిలియన్ల కన్నా ఎక్కువ పీఎఫ్ అకౌంట్లు క్లోస్ అయ్యాయి. దీనిపట్ల ఈపీఎఫ్ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అత్యవసరం అయితే తప్ప పీఎఫ్ డబ్బులను డ్రా చేయవద్దని సూచిస్తోంది ఈఫీఎఫ్ఓ. కారణం ఏంటంటే ప్రస్తుతం ఈపీఎఫ్ఓ అకౌంట్ మీద 8.5 శాతం వడ్డీ వస్తుంది. చిన్నమొత్తాల మీద ఇచ్చే ఇంట్రెస్ట్తో పోల్చితే.. ఇదే అత్యధికం. 8.5 ఇంట్రెస్ట్ లభిస్తుండటంతో చాలా మంది జనాలు తమ వాలంటరీ రిటైర్మెంట్ డబ్బులను ఈపీఎఫ్ అకౌంట్లోనే పొదుపు చేస్తున్నారు. ఈ ఖాతాలో ఎంత ఎక్కువ పొదుపు చేస్తే.. అంత ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఈ సందర్భంగా ఈపీఎఫ్ఓ మాజీ అసిస్టెంట్ కమిషనర్ ఏకే శుక్లా మాట్లాడుతూ.. ‘‘మీకు ఇప్పుడు 30 ఏళ్లు ఉన్నాయనుకొండి.. మరో 30 ఏళ్లు ఉద్యోగంలో ఉంటారు. ఈ క్రమంలో మీరు పీఎఫ్ అకౌంట్ నుంచి లక్ష రూపాయలు విత్ డ్రా చేశారనుకుందాం. అది మీ పదవీవిమరణ సమయంలో లభించే మొత్తం మీద భారీ ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మీరు డ్రా చేసే 1 లక్ష రూపాయలు.. ఈపీఎఫ్ కాలుక్యులేటర్ ప్రకారం ఈ మొత్తం పదవీ విమరణ కాలానికి 11.55 లక్షలతో సమానం అన్నమాట. ఈ లెక్కన మీరు పీఎఫ్ ఖాతా నుంచి మధ్యమధ్యలో సుమారు 3 లక్షల రూపాయలు డ్రా చేశారనుకొండి.. ఇది మీ పదవీవిరమణ సమయంలో లభించే మొత్తంలో భారీ కోతకు దారి తీస్తుంది. ఈ లెక్కన పదవీవిరమణ సమయంలో మీరు 35 లక్షల రూపాయల వరకు కోల్పోయే ప్రమాదం ఉంది. కనుక వీలైనంత తక్కువ సార్లు డ్రా చేస్తే మంచిది’’ అని సూచిస్తున్నారు. -
ఈపీఎఫ్ చందాదారుల ఖాతాల్లో త్వరలో వడ్డీ జమ
ఈపీఎఫ్ చందాదారులకు శుభవార్త. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) అతి త్వరలో సుమారు ఆరు కోట్ల మంది చందాదారుల ఖాతాలలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) వడ్డీని క్రెడిట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఒక ఖాతాదారుడు ట్విటర్ లో అడిగిన ప్రశ్నకు ఈపీఎఫ్ఓ ఇలా ట్వీట్ చేసింది.. "ఈ ప్రక్రియ పైప్ లైన్ లో ఉంది. అతి త్వరలో మీ ఖాతాలో చూపించవచ్చు. ఇప్పటి వరకు పొగుచేసిన వడ్డీ పూర్తిగా క్రెడిట్ చేయబడుతుంది. వడ్డీలో ఎటువంటి నష్టం ఉండదు. దయచేసి సహనాన్ని పాటించండి" అని పేర్కొంది. ఇప్పటివరకు తెలిసిన నివేదికల ప్రకారం.. రిటైర్ మెంట్ ఫండ్ రెగ్యులేటర్ ఈ నెలాఖరునాటికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం ఈపీఎఫ్ వడ్డీని క్రెడిట్ చేసే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రక్రియ ఇంకా పైప్ లైన్ లో ఉంది. ఈపిఎఫ్ చందాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే వారి ఖాతాలో ఏదో ఒక రోజు ఈ నెలలో క్రెడిట్ చేసే అవకాశం ఉంది. చందాదారులు తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్, వడ్డీ స్టేటస్ ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. The process is in pipeline and may be shown there very shortly. Whenever the interest will be credited, it will be accumulated and paid in full. There would be no loss of interest. Please maintain patience. — EPFO (@socialepfo) July 28, 2021 ఆన్లైన్ లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఇలా.. ఈపీఎఫ్ పోర్టల్ https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login లింకు మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఖాతా ఓపెన్ చేయడానికి మీ యుఎఎన్ నెంబర్, పాస్ వర్డ్ నమోదు చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. -
EPFO: ఈ-నామినేషన్ దాఖలు చేయకపోతే ఏడు లక్షలు రానట్లే?
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఉద్యోగుల భవిష్యత్ కోసం నియమించిన సంస్థ. ప్రతి నెల జీతం పొందిన వ్యక్తుల నుంచి కొంత మొత్తాన్ని పీఎఫ్ రూపంలో ఈ సంస్థకు యాజమాన్యం కేటాయిస్తుంది. ఈపీఎఫ్ఓ తన సభ్యుల కోసం ఈ-నామినేషన్ దాఖలు చేసే సదుపాయాన్ని కల్పిస్తుంది. ఈ-నామినేషన్ దాఖలు చేయడం చాలా ముఖ్యం. ఒక సభ్యుడి మరణంపై ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), పెన్షన్ (ఈపీఎస్), ఇన్స్యూరెన్స్ (ఈడీఎల్ఐ) ప్రయోజనాలను సులభంగా పొందడానికి ఈ-నామినేషన్ దాఖలు చేయాలని ఈపీఎఫ్ఓ తన ఇటీవలి ట్వీట్ లో తెలిపింది. ఉద్యోగులకు నామినేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సేవలను ప్రారంభించింది. ఈ-నామినేషన్ చేయడం ద్వారా ఖాతాదారుడు మరణిస్తే ఈడీఎల్ఐ కింద రూ.7 లక్షల వరకు నామినీకి అందుతాయి. ఈ-నామినేషన్ కోసం ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ద్వారానే నామినేషన్ చేసుకునే అవకాశం ఈపీఎఫ్ఓ కల్పించింది. ఒకవేళ మీరు ఇంకా ఈ-నామినేషన్ దాఖలు చేయనట్లయితే దిగువ పేర్కొన్న విధంగా చేయవచ్చు. File your e-nomination today to get Provident Fund (PF), Pension (EPS) and Insurance (EDLI) benefit online.#SocialSecurity #EPF #EDLI #Pension #ईपीएफओ #ईपीएफ@byadavbjp @Rameswar_Teli @PMOIndia @PIB_India @PIBHindi @MIB_India @DDNewslive @airnewsalerts @mygovindia @PTI_News pic.twitter.com/d2veK15fye — EPFO (@socialepfo) August 6, 2021 ఈపీఎఫ్ఓలో ఈ-నామినేషన్ చేయండి ఇలా.. ఈపీఎఫ్ఓ అధికారిక లింక్ పై క్లిక్ చేయండి. (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/) యుఎఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి. మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి. అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ-నామినేషన్ ఎంచుకోండి. తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు. వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి. ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్ తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది. -
ఈఎస్ఐ కార్డుదారులకు 90 శాతం పింఛన్
సాక్షి, హైదరాబాద్: కరోనా ఉపశమన పథకం (సీఆర్ఎస్) కింద కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ) కార్డుదారులు మరణిస్తే వారి వేతనంలో 90 శాతం డబ్బును పింఛన్గా మృతుడి కుటుంబ సభ్యులకు అందజేస్తామని ఈఎస్ఐ కూకట్పల్లి బ్రాంచ్ మేనేజర్ షేక్ జిలానీ అహ్మద్ వెల్లడించారు. ఈఎస్ఐ కార్డు సభ్యుడు జడల గణేశ్ ఇటీవల కరోనా కారణంగా మృతి చెందాడు. ఆయన కుటుంబ సభ్యులు సీఆర్ఎస్ పథకం కింద లబ్ధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి కూకట్పల్లి ప్రశాంత్నగర్లోని ఈఎస్ఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఆర్ఎస్ పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ... సీఆర్ఎస్ పథకం కింద రాష్ట్రంలో మంజూరైన మొదటి పింఛన్ ఇదేనని స్పష్టం చేశారు. ఈఎస్ఐ కార్డుదారులు కరోనాతో చనిపోతే వారి కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారం జీవితాంతం 90 శాతం పింఛన్ అందుతుందన్నారు. -
ఈపీఎఫ్ఓ మెడికల్ అడ్వాన్స్గా రూ.1 లక్ష సాయం
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) కింద రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులు ఇప్పుడు మెడికల్ అడ్వాన్స్ కింద లక్ష రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఉద్యోగులు ఈ మొత్తాన్ని విత్ డ్రా చేయడానికి ముందు ఎటువంటి ఆసుపత్రి బిల్లుల సమర్పించాల్సిన అవసరం లేదు. సెంట్రల్ సర్వీసెస్ మెడికల్ అటెండెంట్(సీఎస్(ఎంఎ) నియమాలు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్) కింద కవర్ అయ్యే ఉద్యోగులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) విడుదల చేసిన సర్క్యులర్ లో పేర్కొంది. ఈ సేవలను ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఈ క్రింద తెలుసుకుందాం. నిబంధనల ప్రకారం రోగిని ప్రభుత్వ/పీఎస్ యు/సీజీహెచ్ఎస్ ఆసుపత్రిలో చేర్చాలి. ఒకవేళ రోగిని ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్చినట్లయితే, అప్పుడు ఒక అధికారి వివరాలను పరిశీలించిన అనంతరం దీన్ని మంజూరు చేస్తారు. ఉద్యోగి లేదా వారి కుటుంబం అడ్వాన్స్ క్లెయిం చేయడం కొరకు ఆసుపత్రి, రోగి వివరాలను తెలియజేస్తూ ఒక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. వారు దరఖాస్తులో బిల్లు అంచనాను రాయాల్సిన అవసరం లేదు. రోగి కుటుంబానికి ఈ డబ్బు అడ్వాన్స్గా ఇవ్వవచ్చు లేదా రోగిని చేర్చిన నిర్ధిష్ట ఆసుపత్రికి నేరుగా చెల్లించే అవకాశం ఉంది. ఒకవేళ చికిత్స బిల్లు లక్ష పరిమితిని మించితే మరోసారి అడ్వాన్స్ కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ సందర్భంలో ఆసుపత్రిలో వేసిన అంచనా బిల్లును సమర్పించాల్సి ఉంటుంది. రోగి డిశ్చార్జ్ అయిన 45 రోజుల్లోగా మెడికల్ బిల్లులు ఈపీఎఫ్ కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. -
ఆన్లైన్లో ఈపీఎఫ్ఓ సమస్యలపై ఎలా ఫిర్యాదు చేయాలి?
మీకు ఈపీఎఫ్ఓలో ఖాతా ఉందా? పీఎఫ్ కు సంబంధించిన ఏదైనా సమస్య గురించి ఎవరికి తెలియజేయాలో అర్ధం కావడం లేదా? అయితే ఇక నుంచి మీరు తేలికగా ఫిర్యాదు చేయవచ్చు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) చందాదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను సేకరించడానికి ఆన్లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఒకవేళ మీరు గనుక ఈపీఎఫ్ విత్ డ్రా, ఖాతా బదిలీ, కెవైసీ మొదలైన వాటికి సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలని అనుకుంటే ఇప్పుడు మీరు గ్రీవియెన్స్ మేనేజ్ మెంట్ సీస్టమ్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అలాగే, ఈపీఎఫ్ ఖాతాదారుడు ఈపీఎఫ్ఓ ట్విట్టర్ హ్యాండిల్ @socialepfoకు ఫిర్యాదు చేయవచ్చు. ఆన్లైన్లో ఫిర్యాదు ఎలా ఫైల్ చేయాలి? మొదట https://epfigms.gov.in/ పోర్టల్ సందర్శించండి ఫిర్యాదు చేయడం కొరకు 'Register Grievance' మీద క్లిక్ చేయండి. ఇప్పుడు పీఎఫ్ సభ్యుడు, ఈపీఎస్ పెన్షనర్, యజమాని, ఇతర అనే ఆప్షన్ లలో ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకోండి. పీఎఫ్ ఖాతా సంబంధిత ఫిర్యాదు కోసం పీఎఫ్ మెంబర్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత యుఏఎన్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి 'Get Details' మీద క్లిక్ చేయండి. యుఏఎన్ తో లింక్ చేయబడ్డ మీ వ్యక్తిగత వివరాలు కంప్యూటర్ స్క్రీన్ పై కనిపిస్తాయి. ఇప్పుడు 'గెట్ ఓటిపి' మీద క్లిక్ చేయండి. (ఈపిఎఫ్ఓ డేటాబేస్ లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు/ ఈమెయిల్ ఐడీకి ఒక్కసారి ఓటీపీ వస్తుంది) ఓటీపీ, వ్యక్తిగత వివరాలు నమోదు చేసిన తర్వాత ఫిర్యాదు చేయాల్సిన పీపీ నెంబరుపై క్లిక్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ పై పాప్-అప్ కనిపిస్తుంది. దీనిలో, మీ ఫిర్యాదుకు సంబంధించిన బటన్ ఎంచుకోండి. గ్రీవియెన్స్ కేటగిరీని ఎంచుకొని మీ ఫిర్యాదు వివరాలను ఇవ్వండి. ఒకవేళ మీ వద్ద ఏవైనా రుజువులు ఉన్నట్లయితే, వాటిని అప్ లోడ్ చేయవచ్చు. ఫిర్యాదు రిజిస్టర్ చేసిన తరువాత, 'Add' మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. దీని తర్వాత మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్/మొబైల్ నెంబరుకు ఫిర్యాదు రిజిస్టర్ నెంబర్ వస్తుంది. ఆన్లైన్లో ఫిర్యాదు స్టేటస్ ఎలా తనిఖీ చేయాలి? ఈపీఎఫ్ఓలో ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత ఆ పోర్టల్ లోనే ఉన్న 'View Status" ఆప్షన్ ఎంచుకోండి. ఇప్పుడు ఫిర్యాదు రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబరు/ఈమెయిల్ ఐడీ, సెక్యూరిటీ కోడ్ నమోదు చేసి సబ్మిట్ మీద నొక్కండి. ఇప్పుడు మీ ఫిర్యాదు స్టేటస్ కంప్యూటర్ స్క్రీన్ పై చూపిస్తుంది. మీ ఫిర్యాదుపై ఈపీఎఫ్ఓ ఏ ప్రాంతీయ కార్యాలయం, అధికారి పనిచేస్తున్నారు చూపిస్తుంది. -
ఈ నెలాఖరులోగా ఈపీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఈ నెలాఖరులోగా చందాదారుల ఖాతాలో 8.5 శాతం ఈపీఎఫ్ వడ్డీని జమ చేసే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల కంటే ఎక్కువగా చందాదారులు విత్ డ్రాలు చేయడంతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును మార్చకుండా ఉంచింది. 2020లో వచ్చిన కోవిడ్-19 కారణంగా మార్చి 2020లో పీఎఫ్ వడ్డీ రేటును 2019-20 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతానికి తగ్గించింది. గత 7 సంవత్సరాల కాలంలో ఈపీఎఫ్ వడ్డీ రేటు ఇప్పుడే చాలా తక్కువగా ఉంది. రిటైర్ మెంట్ ఫండ్ రెగ్యులేటర్ వచ్చే వారం పనిదినాల్లో 6 కోట్ల మంది చందాదారుల ఖాతాలో ఈపీఎఫ్ వడ్డీని 8.5 శాతం క్రెడిట్ చేయవచ్చు. కాబట్టి, ఈపీఎఫ్ ఖాతాదారులు తమ ఈపిఎఫ్ బ్యాలెన్స్ ని ఎస్ఎమ్ఎస్, మిస్డ్ కాల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎస్ఎమ్ఎస్, మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్ ఎస్ఎమ్ఎస్ పంపడం ద్వారా తన ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి “EPFOHO UAN ENG" అని టైపు చేసి 7738299899కు ఎస్ఎమ్ఎస్ పంపాలి. మీ పీఎఫ్ ఖాతాకు గనుక మీ మొబైల్ నెంబర్ లింకు చేసినట్లయితే, ఎస్ఎమ్ఎస్ పంపిన తర్వాత పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ వివరాలతో కూడిన ఒక ఎస్ఎమ్ఎస్ మీకు వస్తుంది. అలాగే, ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్ మిస్డ్ కాల్ ద్వారా తన ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీరు మీ మొబైల్ నెంబర్ ద్వారా 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇలా మిస్డ్ కాల్ ఇచ్చిన కొద్ది సమయం తర్వాత మీకు మెసేజ్ వస్తుంది. అందులో మీ ఖాతా బ్యాలెన్స్ వివరాలు కనిపిస్తాయి. ఈ సౌకర్యం కెవైసీ పూర్తి చేసుకున్న చందాదారులకు మాత్రమే వర్తిస్తుంది. -
5 నిమిషాల్లో ఈపీఎఫ్ నెంబర్ జనరేట్ చేయడం ఎలా..?
ఈపీఎఫ్ లేదా పీఎఫ్ సభ్యులు ఇప్పుడు ఆన్ లైన్ లో యూఏఎన్ ను జనరేట్ లేదా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను జారీ చేస్తుంది. యూఏఎన్ నెంబర్ను శాలరీ స్లిప్ మీద చూసుకోవచ్చు. ఒకవేళ మీ శాలరీ స్లిప్ మీద యూఏఎన్ నెంబర్ లేకపోతే ఉద్యోగులు ఈపీఎఫ్ పోర్టల్లో యూఏఎన్ నెంబర్ పొందవచ్చు. యూఏఎన్ నెంబర్ అనేది తొలిసారి ఉద్యోగంలో చేరిన వెంటనే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. యుఎఎన్ జనరేట్ చేయడానికి ముందు మీ ఆధార్ మొబైల్ నెంబరుతో మొదట లింకు అవ్వాలి. ఎందుకంటే మీ ఆధార్ తో లింకు చేసిన మొబైల్ నెంబర్ కు ఒక సందేశం వస్తుంది. యుఏఎన్ జనరేట్ లేదా యాక్టివేట్ చేసేటప్పుడు మీరు ఆధార్ కార్డు నెంబరును దగ్గర ఉంచుకోవాలి. మీరు ఎన్ని ఉద్యోగాలు మారినా కూడా యూఏఎన్ నెంబర్ మాత్రం ఎప్పుడు ఒక్కటే ఉంటుంది. #ईपीएफ सदस्य इन आसान स्टेप्स का पालन करके डायरेक्ट यूएएन जेनरेट कर सकते हैं। अधिक जानकारी के लिए लिंक पर क्लिक करें: https://t.co/vMcykaXRgS#EPFO #ईपीएफओ@byadavbjp @Rameswar_Teli @PMOIndia @PIB_India @MIB_India @DDNewslive @airnewsalerts @mygovindia @PTI_News @_DigitalIndia — EPFO (@socialepfo) July 20, 2021 యూఏఎన్ నెంబర్ జనరేట్ చేయు విధానం: మొదట మీరు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ పోర్టల్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత Important Links విభాగంలో ఉన్న Direct UAN Allotment by Employees ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీరు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబరు, క్యాప్చాను నమోదు చేసి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఏదైనా ప్రయివేట్ కంపెనీ, ఎస్టాబ్లిష్ మెంట్ లేదా ఆర్గనైజేషన్ లో మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే 'అవును' మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు "ఎంప్లాయిమెంట్ కేటగిరీ" ఎస్టాబ్లిష్ మెంట్ పీఎఫ్ కోడ్ నెంబరు, చేరిన తేదీ, ఐడీని ఎంచుకోవాలి. మళ్లీ ఆధార్ నెంబరు చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత వచ్చిన ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. చివరగా వ్యక్తిగత వివరాలు, కెవైసీ వివరాలతో కూడిన ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అన్ని వివరాలు సరిగ్గానే ఉన్నాయా? లేదా అని చెక్ చేసుకొని రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ మీ మొబైల్ నెంబర్కు మెసేజ్ వస్తుంది. -
పీఎఫ్ విత్ డ్రాపై ట్యాక్స్ మినహాయింపు పొందడం ఎలా?
Tax On EPF Withdrawl: కరోనా వైరస్ మహమ్మారి వల్ల సామాన్య ప్రజానీకం సేవింగ్స్ కోసం దాచుకున్న నగదును మొత్తం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రైవేట్ ఉద్యోగుల పరిస్థితి మరి దారుణంగా మారింది. ఈ మహమ్మారి వల్ల చాలా మంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతా నుంచి భారీ మొత్తంలో నగదును ఉపసంహరించుకున్నారు. సాదారణంగా అయితే, పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేస్తే కొన్ని సందర్భాల్లో పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయం తెలియక ఈపీఎఫ్ ఖాతాదారులు చిక్కుల్లో పడుతున్నారు. ఇతర కారణాల చేత ఐదేళ్ల సర్వీస్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు డబ్బులు డ్రా చేస్తే పన్నులు చెల్లించాలి. విత్డ్రా చేసే మొత్తం రూ.50,000 కన్నా ఎక్కువ ఉంటే సెక్షన్ 192ఏ ప్రకారం 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. అంతకన్నా తక్కువ డ్రా చేస్తే టీడీఎస్ వర్తించదు. ఒకవేళ పాన్ కార్డు లేకపోతే 30 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. రూ.30,000 కన్నా తక్కువ డ్రా చేస్తే టీడీఎస్ ఉండదు. ఐదేళ్ల సర్వీస్ దాటితే ఎలాంటి పన్నులు ఉండవు. ఇక ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత ఈపీఎఫ్ బ్యాలెన్స్ మొత్తం డ్రా చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం, 1961 నాల్గవ షెడ్యూల్ రూల్ 8 సెక్షన్ 10(12) ప్రకారం.. ఒక వ్యక్తి తన ఉద్యోగం మానేసిన తేదీ నాటికి ముందు అతను ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పని చేసినట్లయితే విత్ డ్రా చేసే నగదుపై పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. 5 ఏళ్లు పైగా పని చేసి ఉండాలి అలాగే ఒక వ్యక్తి ఒక కంపెనీలో 2 ఏళ్లు పనిచేసి తర్వాత మరో కంపెనీలో 3 ఏళ్లు పైగా పనిచేస్తే ఇటువంటి సందర్భంలో కూడా తను ఉపసంహరించే నగదుపై పన్ను వర్తిస్తుంది. కానీ, అతను మొదటి సంస్థలో పనిచేసినప్పుడు అక్కడ ఉన్న పీఎఫ్ ఖాతాను, మరో సంస్థలో జాయిన్ అయినప్పుడు పూర్వ పీఎఫ్ ఖాతాను కొత్త పీఎఫ్ కొత్త లింకు చేయడం వల్ల అతను 5 ఏళ్లకు పైగా పనిచేసినట్లు పరిగణించబడుతుంది. ఇలాంటి సందర్భంలో మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ సందర్భంలో కూడా అతను పూర్తి సర్విస్ పీరియడ్ కనుక 5 ఏళ్లు కంటే తక్కువగా ఉంటే కచ్చితంగా తను ఉపసంహరించే నగదుపై పన్ను పడుతుంది. కరోనా మహమ్మరి కాలంలో కాకుండా సాధారణంగా నగదు డ్రా చేసినప్పుడు పన్ను నుంచి మినహాయింపు పొందాలంటే కచ్చితంగా 5 ఏళ్లు పని చేసి అయిన ఉండాలి లేదా గత కంపెనీలో పనిచేసిన సర్వీస్ పీరియడ్ అయిన 5 ఏళ్లు పైగా అయిన ఉండాలి. -
పీఎఫ్ ఖాతాదారులు వెంటనే కేవైసి అప్డేట్ చేసుకోండి
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) కస్టమర్లకు సంబంధించి క్లెయిమ్ చేయని డబ్బు రూ.58,000 కోట్లు ఉన్నాయని స్పష్టం చేసింది. ఖాతాదారుల పరంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థగా గుర్తింపు పొందింది. ఇప్పటి వరకు క్లెయిమ్ చేయని వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో వారి బ్యాంక్ ఖాతా వివరాలను, కేవైసి ప్రక్రియను అప్డేట్ చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సూచిస్తుంది. అప్పుడే ఎటువంటి సమస్య లేకుండా పీఎఫ్ డబ్బులు వారి ఖాతాలో జమ అవుతాయని పేర్కొంది. ఇటీవల, అనేక బ్యాంకులు విలీనం అయ్యాయి కాబట్టి మరోసారి వాటి ఐఎఫ్ఎస్సీ కోడ్ లు మారే అవకాశం ఉంటుంది కాబట్టి క్లెయిమ్ చేసుకునేతప్పుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉండటానికి వారి వివరాలను అప్డేట్, కొత్త ఖాతాలను లింక్ చేయాలని ఇటీవల విలీనం అయిన ప్రభుత్వ బ్యాంకుల వినియోగదారులను ఈపీఎఫ్ఓ కోరింది. ఒకవేళ పీఎఫ్ ఖాతాలను బ్యాంకులతో లింక్ చేయనట్లయితే, ఈపీఎఫ్ సబ్ స్క్రైబర్లు వారి మొత్తాన్ని ఆన్ లైన్ ద్వారా క్లెయిమ్ చేసుకోలేరని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం దేశంలో 6 కోట్లకు పైగా పీఎఫ్ చందాదారులు ఉన్నారు. ఇంకా పీఎఫ్ ఖాతాదారుల తమ ఖాతాలను ఆధార్ తో లింక్ చేయకపోతే వెంటనే చేసేయండి లేకపోతే వారు ఈపీఎఫ్ఓ ఇతర సేవలను ఉపయోగించుకోలేరు. చదవండి: ఎస్బీఐ vs పోస్టాఫీస్: ఎందులో డబ్బులు పొదుపు చేస్తే మంచిది? -
పీఎఫ్ ఖాతాలో బ్యాంక్ ఖాతా వివరాలు అప్ డేట్ చేయండి ఇలా?
ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు 3 నిమిషాల్లో మీ బ్యాంక్ ఖాతా వివరాలను యూనివర్సల్ అకౌంట్ నెంబరు(యుఎఎన్)లో సులభంగా అప్ డేట్ చేయవచ్చు. మీరు బ్యాంక్ ఖాతా వివరాలను పీఎఫ్ ఖాతాలో అప్ డేట్ చేయడం ద్వారా భవిష్యత్ లో ఎప్పుడైన నగదు ఉపసంహరించుకోవాలని అనుకున్నప్పుడు మీ ప్రాసెస్ అప్పుడు తేలిక అవుతుంది. "ఉద్యోగులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను యుఎఎన్లో సులభంగా ఎలా అప్ డేట్ చేయాలో తెలుసుకోండి" అని ఈపీఎఫ్ఓ ట్వీట్ చేసింది. Know the simple steps through which employees can easily update their Bank Account Details in UAN. #EPFO #SocialSecurity #HumHainNa #Employees #Services #पीएफ #ईपीएफओ pic.twitter.com/3xyM0deMAY — EPFO (@socialepfo) June 24, 2021 పీఎఫ్ ఖాతాలో బ్యాంకు ఖాతా వివరాలను ఎలా అప్ డేట్ చేయాలి? మీరు "యూనిఫైడ్ మెంబర్ పోర్టల్"లో "యుఎఎన్ నెంబర్, పాస్ వర్డ్"తో లాగిన్ అవ్వాలి. ఇప్పుడు 'మ్యానేజ్ ట్యాబ్'పై క్లిక్ చేస్తే "డ్రాప్ డౌన్ మెనూ"లో ఉన్న 'కెవైసీ'ను ఎంచుకోవాలి. తర్వాత అందులో మీకు కనిపించే బ్యాంక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పేరు, ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ నమోదు చేసి ఆ తర్వాత 'సేవ్' మీద క్లిక్ చేయండి. కొత్త బ్యాంకు వివరాలను సేవ్ చేసిన తర్వాత ఇది 'ఆమోదం కొరకు కెవైసి పెండింగ్ లో ఉంది' అని చూపిస్తుంది. బ్యాంకు వివరాలు ఆమోదం పొందిన తర్వాత ఈపీఎఫ్ఓ నుంచి మీకు ఒక సందేశం వస్తుంది సంస్థ తెలిపింది. చదవండి: పీఎఫ్ విత్ డ్రా: ఐదేళ్లుగా ఒకే చోట పని చేస్తున్నారా? -
పీఎఫ్ విత్ డ్రా: ఐదేళ్లుగా ఒకే చోట పని చేస్తున్నారా?
చాలా మంది ప్రైవేట్ ఉద్యోగులు వారి అవసరాల కోసం పీఎఫ్ ఖాతా నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకుంటారు. అలా తీసుకున్న నగదుపై ఈపీఎఫ్ఓ పన్ను విధిస్తుంది. అయితే, కొందరికి మాత్రం ఈ పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. అది ఎలానో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. రమేష అనే వ్యక్తి ఒక కంపెనీలో 8 సంవత్సరాలు పనిచేశాడు. ఆ కంపెనీ అతనికి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) సౌకర్యాన్ని అందించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అతను మరో కంపెనీలో 14 నెలలు పనిచేశాడు. ఈ కంపెనీ అతనికి ఈపీఎఫ్ సౌకర్యం కల్పించలేదు. ఆ తర్వాత కొన్ని నెలలు కాలిగానే ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఒత్తిడి పెరగడంతో మరో కంపెనీలో చేరాడు. ఈపీఎఫ్ సౌకర్యం ఉన్న పెద్ద కంపెనీలో 5 సంవత్సరాలు పైగా పని చేశాడు. అయితే, అతను తన అవసర నిమిత్తం మొత్తం ఒకేసారి విత్డ్రా చేస్తే పన్ను మినహాయింపు ఉంటుందా? అని సందేహం కలిగింది. ప్రస్తుత పీఎఫ్ నిబందనల ప్రకారం.. ఇలా అతను విత్ డ్రా చేసిన మొత్తంపై ఎటువంటి పన్ను ఉండదు. ఒక ఉద్యోగి ఒక సంస్థలో 5 ఏళ్లు అంతకన్నా ఎక్కువ సమయం పాటు పనిచేస్తే వారు పీఎఫ్ సౌకర్యం కల్పిస్తే పీఎఫ్ను విత్డ్రా చేసిన నగదుపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదు. 5 ఏళ్ల కన్నా తక్కువ సమయం పనిచేస్తేనే పన్ను వర్తిస్తుంది. పైన తెలిపిన ఉదాహరణలో రమేష్ 8 ఏళ్ల పాటు ఒక కంపెనీలో పనిచేశాడు. 5 ఏళ్ల కన్నా ఎక్కువగా ఒకే కంపెనీలో చేసిన అనుభవం, అన్ని ఏళ్ల పాటు నిరంతరాయంగా పీఎఫ్ కట్టాడు. కాబట్టి అతను మొదటి కంపెనీతోపాటు చివరి కంపెనీలోనూ పీఎఫ్ విత్డ్రా చేస్తే పన్ను మినహాయింపు పొందవచ్చు. మధ్యలో రమేష్ 14 నెలలు పనిచేసిన కంపెనీలో ఎలాగో పీఎఫ్ సౌకర్యం లేదు కాబట్టి అతను మొదటి, చివరి సంస్థలో 5 ఏళ్లకు పైగా పనిచేశాడు. అందుకని అతను విత్డ్రా చేసిన నగదుపై టాక్స్ ఫ్రీ లభిస్తుంది. ఎవరైనా ఏదైనా కంపెనీలో 5 ఏళ్ల కంటే తక్కువగా పనిచేస్తే పీఎఫ్ విధించే టాక్స్ చెల్లించాలి. చదవండి: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త! -
పీఎఫ్ యూఎన్ నెంబర్ ను ఆధార్తో లింకు చేసుకోండి ఇలా..?
ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) శుభవార్త అందించింది. గతంలో జూన్ 1 వరకు ఉన్న ఆధార్ - పీఎఫ్ యూఎన్ నెంబర్ లింకు గడువును తాజాగా సెప్టెంబర్ 1 వరకు పొడగిస్తూ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు మీ పీఎఫ్ ఖాతా యూఎన్ నెంబర్ ను ఆధార్తో లింకు చేయకపోతే వెంటనే లింకు చేసేయండి. కొత్త నిబంధనల ప్రకారం కచ్చితంగా పీఎఫ్ ఖాతాను ఆధార్తో లింక్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే పీఎఫ్ లో సంస్థ జమ చేసే నగదు మొత్తంపై ప్రభావం పడనుంది. ఒకవేళ ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతా ఆధార్ తో లింకు కాకపోతే యజమాని జమ చేసే నగదు మీ ఖాతాలో ఇక నుంచి జమకాదు. కాబట్టి, మీ పీఎఫ్ ఖాతాను వెంటనే ఆధార్తో లింకు చేయాలని తెలుసుకోండి. అలాగే, మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్(యూఎన్) ఆధార్తో లింకు చేసుకోవాలి. దీనికి సంబంధించి ఉత్తర్వులను ఈపీఎఫ్ఓ విడుదల చేసింది. సామాజిక భద్రత కోడ్ 2020లోని సెక్షన్ 142 కింద ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ను ఆధార్తో లింకు చేయండి ఇలా? దశ 1: అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. దశ 2: ఇప్పుడు మేనేజ్ ట్యాబ్ కింద ఉన్న ఈ-కెవైసీ ఆప్షన్ ఎంచుకోండి. దశ 3: 'ఆధార్' అని పేర్కొన్న ట్యాబ్ ఆప్షన్ ఎంచుకోండి దశ 4: మీ పేరు, ఆధార్ కార్డు నెంబరును సరిగ్గా నమోదు చేసి 'సేవ్' మీద క్లిక్ చేయండి. దశ 5: దీని తర్వాత, మీ ఆధార్ నెంబరు యుఐడీఎఐ డేటాబేస్ తో వెరిఫై చేస్తుంది. మీ సంస్థ, యుఐడీఎఐ ద్వారా మీ కెవైసీ డాక్యుమెంట్ విజయవంతంగా ఆమోదించిన తర్వాత, ఈపీఎఫ్ ఖాతా ఆధార్ కార్డుకు లింక్ చేయబడుతుంది. చదవండి: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త! -
త్వరలో పెరగనున్న కంపెనీల పీఎఫ్ కేటాయింపులు
నాలుగు కొత్త లేబర్ కోడ్స్ త్వరలో అమలులోకి రానున్నాయి. గతంలో వాయిదా వేసిన నాలుగు లేబర్ కోడ్స్ అమలును తిరిగి తీసుకొనిరావడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నాలుగు లేబర్ కోడ్స్ వాయిదా పడటానికి ప్రధాన కారణం వీటి అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడమే అని కేంద్రం ప్రకటించింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టాలను ఆయా రాష్ట్రాలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ చట్టాలను ఆమోదించాయి. ప్రస్తుత సమాచార ప్రకారం.. ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఒడిశా, పంజాబ్, గుజరాత్, కర్ణాటక, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు మాత్రమే వీటిని ఆమోదించాయి. దేశంలో ఇప్పటి వరకు అమలులో ఉన్న 29 కార్మిక చట్టాలను కలిపి నాలుగు లేబర్ కోడ్లగా తీసుకొచ్చినట్లు కేంద్రం పేర్కొంది. సామాజిక భద్రతకు సంబంధించిన సోషల్ సెక్యురిటీ కోడ్, ఉద్యోగుల భద్రత, ఆరోగ్యానికి సంబంధించిన ఆక్యుపెషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లను పార్లమెంట్ 2020లో ఆమోదించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నూతన నిబంధనలు అమల్లోకి వస్తాయని కేంద్రం గతంలో పేర్కొంది. అయితే.. వేజ్ కోడ్ మాత్రం ఉద్యోగుల్లో పెద్ద చర్చకు దారితీసింది. కొత్త నిబంధన ప్రకారం.. మొత్తం శాలరీలో మూలవేతనం కనీసం 50 శాతంగా ఉండాలి. దీంతో.. ఉద్యోగుల భవిష్యనిధికి కేటాయించే మొత్తం పెరగడంతో పాటూ కొన్ని వర్గాల వారికి ట్యాక్స్ భారం పెరిగి చేతికి అందే మొత్తంలో కోత పడుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. చదవండి: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ -
గుడ్ న్యూస్ : మూడు రోజుల్లోనే పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్ డ్రా చేసుకునే వారికి కేవలం మూడు రోజుల్లోనే వారి ఖాతాలో జమ అయ్యే విధంగా ఈపీఎఫ్ క్లెయిమ్ లో మార్పులు చేసింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులలో నేపథ్యంలో పీఎఫ్ విత్ డ్రా చేసుకునేందుకు అనుమతించేలా గతేడాది మాదిరిగా కేంద్రం కొన్ని మార్పులు చేసింది. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు ఎదుర్కోంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈపీఎఫ్ఓ ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఇంతకముందు పీఎఫ్ క్లెయిమ్ చేసుకున్న 15 నుంచి 30 రోజుల్లో ఖాతాలో జమ అయ్యేవి. ఆన్ లైన్ లో పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆన్లైన్ పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా చేయాలంటే కచ్చితంగా ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతాతో లింక్ చేసిన యాక్టివ్ గా ఉన్న క్రియాశీల యూఏఎన్ అవసరం. అలాగే, పీఎఫ్ మీ ఆధార్, యుఏఎన్ ఖాతాకు జత చేసిన మొబైల్ నంబర్ పనిచేయాలి. ఆన్లైన్లో పీఎఫ్ అమౌంట్ ఎలా విత్ డ్రా చేయాలి? ముందుగా యూఏఎన్ UAN, పాస్ వర్డ్ నంబర్ ఉపయోగించి ఈపీఎఫ్ఓ ఖాతాకు లాగిన్ అవ్వాలి. 'ఆన్లైన్ సర్వీసెస్' టాబ్కు వెళ్లి 'క్లెయిమ్ (ఫారం -31, 19, 10సీ) ఆప్షన్ క్లిక్ చేయాలి. మీ పీఎఫ్/ ఈపీఎఫ్ ఖాతా వివరాలు కంప్యూటర్ మానిటర్లో కనిపిస్తాయి. మీ బ్యాంక్ ఖాతా నంబర్ చివరి నాలుగు అంకెలను నమోదు చేసి, 'వేరిఫై' బటన్ మీద క్లిక్ చేయాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత 'ప్రొసీడ్ క్లెయిమ్ ఆన్లైన్' బటన్ ని ప్రెస్ చేయాలి. "పీఎఫ్ అడ్వాన్స్ (ఫారం 31)" ఎంచుకోండి, పీఎఫ్ అమౌంట్ విత్ డ్రా ఎందుకు చేస్తున్నారో తెలియజేయాలి. తర్వాత మీకు కావాల్సిన అమౌంట్ ఎంటర్ చేసి.. అడ్రస్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ బ్యాంక్ ఖాతా వివరాలను నింపి, బ్యాంక్ ఖాతా చెక్కును అప్లోడ్ చేయండి. 'సెండ్ ఓటీపీ' ఆప్షన్ పై క్లిక్ చేయండి. స్వీకరించిన ఓటీపీని సమర్పించిన తర్వాత ఆన్లైన్లో మీ పీఎఫ్ దావా నమోదు అవుతుంది. మీ పీఎఫ్ అమౌంట్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయడానికంటే ముందు మీ యజమాని విత్ డ్రా పర్మిషన్ అవసరమని ఈపీఎఫ్ఓ సభ్యుడు గమనించాలి. మీ యజమాని ఒకే చేసిన తర్వాత మీరు ఇచ్చిన బ్యాంక్ ఖాతాలోకి నగదు బదిలీ చేస్తారు. అత్యవసర పరిస్థితులలో ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ ను సెలక్ట్ చేసుకోవాలి. దీంతో మూడు రోజుల్లో డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇందుకోసం దరఖాస్తు చేయడానికి అన్ని కేవైసీ పత్రాలను కలిగి ఉండాలి. చదవండి: ఈపీఎఫ్: కరోనాతో చనిపోతే క్లెయిమ్ ఎలా చేసుకోవాలి? -
ఈపీఎఫ్: కరోనాతో చనిపోతే క్లెయిమ్ ఎలా చేసుకోవాలి?
కోవిడ్ -19 సెకండ్ వేవ్ చాలా కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. గత ఏడాది కరోనా మరణాల సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాది మరణాల సంఖ్య విపరీతంగా పెరిగింది. రోజువారీ మరణాల సంఖ్య 4,500 మార్కును కూడా దాటింది. ఈపీఎఫ్ ఉద్యోగులు ఎవరైనా కరోనాతో మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఈపీఎఫ్ అకౌంట్లోని డబ్బులు క్లెయిమ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు జమ చేసిన నగదు ఉద్యోగి వాటా, యజమాని వాటా, వడ్డీ మాత్రమే కాకుండా ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ కింద ఉద్యోగి కుటుంబ సభ్యులకు గరిష్ఠంగా రూ.7,00,000 వరకు బీమా డబ్బులు లభిస్తాయి. చనిపోయినవారి ఈపీఎఫ్ అకౌంట్ నుంచి వారి కుటుంబ సభ్యులు డబ్బులు తీసుకోవడానికి ఈపీఎఫ్ ఫామ్ 20 సమర్పించాల్సి ఉంటుంది. దీనితో పాటు ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ పేరు, తండ్రి లేదా భర్త పేరు, సంస్థ పేరు, చిరునామా, ఈపీఎఫ్ ఖాతా నెంబర్, ఉద్యోగంలో పనిచేసిన చివరి రోజు, ఉద్యోగం మానెయ్యడానికి కారణం అంటే మరణించారు అని వెల్లడించాలి. అలాగే, ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ పుట్టిన తేదీ, మ్యారిటల్ స్టేటస్ లాంటి వివరాలు రాయాలి. ఇక ఉద్యోగి అకౌంట్ నుంచి డబ్బులు క్లెయిమ్ చేసుకోవాలనుకునే వ్యక్తుల వివరాలు కూడా సమర్పించాలి. క్లెయిమ్ చేసే వ్యక్తి పేరు, తండ్రి పేరు లేదా భర్త పేరు, జెండర్, వయస్సు, మారిటల్ స్టేటస్, చనిపోయిన వ్యక్తితో ఉన్న సంబంధం, పూర్తి పోస్టల్ అడ్రస్ లాంటి వివరాలు వెల్లడించాలి. బ్యాంకు ఖాతా ద్వారా నగదు పొందాలనుకుంటే అకౌంట్ వివరాలు, రద్దు చేసిన చెక్ ఈపీఎఫ్ కార్యాలయం లేదా పోర్టల్ లో సమర్పించాలి. ఇంకా ఆధార్ నెంబర్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. క్లెయిమ్ ప్రాసెస్లో పలు దశల్లో ఎస్ఎంఎస్లు వస్తాయి. ఉద్యోగి ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బులను డ్రా చేయడానికి ఫామ్ 20 నింపాల్సి ఉంటుంది. దీంతో పాటు ఈపీఎఫ్, ఈపీఎస్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ ద్వారా రావాల్సిన డబ్బుల కోసం ఫామ్ 10C/D కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని ఫామ్ సబ్మిట్ చేయాలి. ఫామ్ సబ్మిట్ చేసిన 30 రోజుల్లో మీ ఖాతాలోకి డబ్బులు వస్తాయి. చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే లింక్ చేయండి -
పీఎఫ్ డబ్బు ఇప్పించలేదని కిరోసిన్ పోసుకుని
సాక్షి, బంజారాహిల్స్: పీఎఫ్ డబ్బు ఇప్పించడం లేదనే ఆవేదనతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఫిలింనగర్లోని సైదప్ప బస్తీలో నివసించే జె.సంగీత(45) సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఐదేళ్లుగా హౌస్కీపింగ్ విభాగంలో పని చేస్తుంది. ఇటీవల ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించారు. రోజూ ఆఫీస్కు వెళ్లి తన పీఎఫ్ డబ్బులు అడుగుతుండగా హౌస్కీపింగ్ సూపర్వైజర్ ప్రవీణ్ కుమార్ పట్టించుకోకపోగా సమాధానం సైతం ఇవ్వకపోవడంతో తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. చుట్టుపక్కల వారు గమనించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కరోనా దెబ్బతో 71 లక్షల ఈపీఎఫ్ ఖాతాల తొలగింపు -
పీఎఫ్ ఖాతా వల్ల కలిగే ఈ ప్రయోజనాలు గురుంచి తెలుసా?
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారులకు అనేక పీఎఫ్ ప్రయోజనాలను కల్పిస్తోంది. ప్రతీ ఉద్యోగి ఖాతా నుంచి కొద్ది మొత్తం ప్రతీ నెల పీఎఫ్ ఎకౌంట్లో భద్రపరుస్తారు. ఇది కాకుండా ఉద్యోగ విరమణ తర్వాత కూడా నిర్ణీత మొత్తాన్ని పెన్షన్గా పొందవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మనకు అండగా నిలుస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఉద్యోగులకు పిఎఫ్ ఖాతాలో బీమాతో సహా అనేక ఇతర సౌకర్యాలను అందిస్తుంది. అయితే వీటి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పీఎఫ్పై రుణం తీసుకోవచ్చు పీఎఫ్ ఖాతాదారులు అందులో నగదు జమ చేయడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ ఖాతా నుంచి రుణం తీసుకోవచ్చు. ఆర్ధిక అత్యవసర పరిస్థితిలో తీసుకున్న పీఎఫ్ రుణంపై విధించే వడ్డీ రేటు కూడా 1 శాతం మాత్రమే. అయితే, తీసుకున్న రుణ మొత్తాన్ని 36 నెలల్లోపు తిరిగి చెల్లించాలి. ఉచిత భీమా ఈడీఎల్ఈ పథకం కింద ఒక ఉద్యోగి మరణిస్తే పీఎఫ్ ఖాతాదారులకు అప్రమేయంగా 7 లక్షల వరకు ఉచిత బీమా లభిస్తుంది. గతంలో డెత్ కవర్ రూ.6 లక్షలు. ఈడీఎల్ఈ పథకం కింద పీఎఫ్ ఖాతాదారుడు డెత్ కవర్ కోసం ఎటువంటి బీమా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. గృహ రుణం ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం కొత్త ఇల్లు కొనడానికి లేదా ఇంటిని నిర్మించుకోవడానికి పీఎఫ్ బ్యాలెన్స్లో 90 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. కాబట్టి, గృహ రుణాల కోసం పీఎఫ్ ఖాతాను ఉపయోగించుకోవచ్చు, భూమిని కూడా కొనుగోలు చేయవచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ ఒక ఉద్యోగి అనారోగ్యంతో ఉంటే లేదా అతని కుటుంబంలో వైద్య అత్యవసర పరిస్థితి ఉంటే తన పీఎఫ్ నిధి నుంచి 50 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. పెన్షన్ సౌకర్యం పీఎఫ్ ఖాతాదారుడు 58 సంవత్సరాల తర్వాత పెన్షన్ పొందటానికి అర్హులు. పెన్షన్ అర్హత పొందడానికి పీఎఫ్ ఖాతాలో కనీసం 15 సంవత్సరాల రెగ్యులర్ నెలవారీ పీఎఫ్ సహకారం ఉండాలి. మిగిలిన మొత్తం ప్రయోజనం యజమాని సహకారం నుంచి వర్తిస్తుంది. ఎందుకంటే అతని సహకారం 8.33 శాతం(12 శాతంలో) పీఎఫ్ ఖాతాదారుడి ఈపీఎస్ ఖాతాకు వెళుతుంది. చదవండి: పన్నెండు రూపాయలతో రూ.2 లక్షల ప్రమాద బీమా -
కరోనాతో మరణిస్తే డబ్బులు డ్రా చేయడం ఎలా?
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది దేశంలో కరోనా మరణాల రేటు ఎక్కువగా ఉంది. భారతదేశంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 2.83 లక్షలు. కరోనాతో మరణించిన వారిలో ధనవంతుల నుంచి దినసరి కూలీల వరకు ఉన్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఉన్నారు. అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులు/ఖాతాదారులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు ఎలా క్లెయిమ్ చేసుకోవాలన్న సందేహాలు వస్తున్నాయి. సాధారణంగా పదవి విరమణ తర్వాత లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈపీఎఫ్ ఖాతా నుంచి నగదు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈపీఎఫ్ ఖాతాదారుడు దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఈపీఎఫ్ ఖాతాలోని డబ్బుల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు జమ చేసిన ఉద్యోగి వాటా, యజమాని వాటా, వడ్డీ మాత్రమే కాకుండా ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ పథకం కింద రూ.7 లక్షల వరకు బీమా డబ్బులు ఉద్యోగి కుటుంబ సభ్యులకు లభిస్తాయి. చనిపోయినవారి ఈపీఎఫ్ ఖాతా నుంచి వారి కుటుంబ సభ్యులు డబ్బులు తీసుకోవడానికి నామినీ ఈపీఎఫ్ ఫారం 20 ద్వారా ప్రావిడెంట్ ఫండ్ ఉపసంహరణను పొందవచ్చు. సెకండ్ వేవ్ సమయంలో కోవిడ్ -19 వల్ల చాలా మంది చనిపోతున్నందున, ఈ బీమా ప్రయోజనం మరణించిన వ్యక్తి కుటుంబానికి ఎంతో సహాయపడుతుంది. మరణించిన వ్యక్తికి నామినీ లేకపోతే, చట్టబద్ధమైన వారసుడు ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు. ఫారం 20 నింపేటప్పుడు ఈపీఎఫ్ సభ్యుడి పేరు, తండ్రి / భర్త పేరు, సభ్యుడు చివరిగా పనిచేసిన సంస్థ పేరు & చిరునామా, ఈపీఎఫ్ ఖాతా సంఖ్య, చివరి పనిదినం, ఉద్యోగం మానెయ్యడానికి కారణం(మరణించిన సభ్యుడి విషయంలో “మరణం” పేర్కొనండి), మరణించిన తేదీ (dd / mm / yyyy), అతని / ఆమె మరణించిన రోజున సభ్యుడి వైవాహిక స్థితి వంటి వివరాలు నింపాలి. అలాగే, నామినీ/చట్టబద్ధమైన వారసుడు వివరాలు కూడా నింపాల్సి ఉంటుంది. నామినీ/చట్టబద్ధమైన వారసుడు పేరు, తండ్రి / భర్త పేరు, లింగం, వయస్సు (సభ్యుడు మరణించిన తేదీ నాటికి), వైవాహిక స్థితి (సభ్యుడు మరణించిన తేదీ నాటికి), మరణించిన సభ్యుడితో సంబంధం, పూర్తి పోస్టల్ అడ్రస్ లాంటి వివరాలు వెల్లడించాలి. అలాగే, పోస్టల్ మనీ ఆర్డర్ ద్వారా డబ్బులు పొందాలనుకుంటే ఆ కాలమ్ టిక్ చేయాలి. లేదా అకౌంట్ ద్వారా పొందాలనుకుంటే అకౌంట్ వివరాలు, క్యాన్సల్డ్ చెక్ సబ్మిట్ చేయాలి. నామినీ/ హక్కుదారుడు ఆధార్ లింకైన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. క్లెయిమ్ ప్రాసెస్లో పలు దశల్లో ఎస్ఎంఎస్లు వస్తాయి. బ్యాంక్ ఖాతాలో డబ్బులు పొందాలంటే క్యాన్సల్డ్ చెక్ ఇవ్వడం తప్పనిసరి. పూర్తి అడ్రస్ పిన్కోడ్తో సహా వెల్లడించాలి. ఉద్యోగి ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బులను డ్రా చేయడానికి ఫామ్ 20 ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఈపీఎఫ్, ఈపీఎస్, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ ద్వారా రావాల్సిన డబ్బుల కోసం ఫామ్ 10C/D కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని ఫామ్ సబ్మిట్ చేయాలి. ఫామ్ సబ్మిట్ చేసిన 30 రోజుల్లో క్లెయిమ్ సెటిల్ అవుతుంది. చదవండి: టౌటే తుపాను: నౌక ప్రమాదంలో 22 మంది మృతి -
సీబీఐకి కడప ఈపీఎఫ్ స్కామ్ కేసు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కడపలో 2016లో జరిగిన కార్మిక భవిష్యనిధి (ఈపీఎఫ్) నిధుల స్కామ్ కేసును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈపీఎఫ్ కడప ప్రాంతీయ కార్యాలయంలో రూ.1.64 కోట్ల మేర అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై 2016లో కడప వన్టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబరు 137/2016లో ఐపీసీ 403, 406, 409, 420 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇదే విషయమై సీబీఐ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం 2017లో కేసు నమోదు చేసింది. ఒక నేరంపై రెండు దర్యాప్తు సంస్థలు విచారణ చేయకూడదు కాబట్టి ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1946 సెక్షన్ 6 ప్రకారం ఈ కేసు దర్యాప్తును సీబీఐకే అప్పగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. చదవండి: ఏపీ: షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు వాటర్ ప్లాంట్లపై కొరడా -
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి పీఎఫ్ కొత్త రూల్స్
ఏప్రిల్ 1 నుంచి సంవత్సరానికి రూ.2.5 లక్షలకుపైగా జమ అయ్యే ప్రావిడెంట్ ఫండ్ నగదుపై పన్ను విధించబడుతుంది. దీనికి సంబందించిన ప్రకటనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2021లో ప్రకటించారు. 2.5 లక్షల వరకు డిపాజిట్ అయ్యే నగదుపై ఎలాంటి పన్ను విధించరని ఆర్థిక మంత్రి అన్నారు. ఫైనాన్స్ బిల్లు 2021లో ప్రభుత్వం ఈ నిబంధనకు సవరణను ప్రవేశపెట్టింది. సాధారణంగా, ప్రతి ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి మూల వేతనం నుంచి 12 శాతం జమ అవుతుంది. అంతే మొత్తంలో కంపెనీ కూడా ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమచేస్తుంది. అయితే, తాజా నిబంధనల ప్రకారం.. ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ సిస్టం, సూపర్ న్యూ నేషన్ ఫండ్కు సంవత్సరానికి రూ.7,50,000 కంటే ఎక్కువ మొత్తంలో యజమాని సహకారం కింద పీఎఫ్ ఖాతాలో జమ అయ్యే నగదుపై మాత్రమే ప్రభావం పడనుంది. సంవత్సరానికి రూ.20.83 లక్షలకు పైగా సంపాదించే వారిపై పన్ను విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈపిఎఫ్ సహకారంపై అతని లేదా ఆమె ఆసక్తిని ఆకర్షిస్తారు. సుమారు 93 శాతం మంది రూ.2.5 లక్షల పరిమితికి లోబడి ఉన్నారు. ఇందులో జమ అయ్యే నగదుపై వడ్డీ లభిస్తుంది. దీని వల్ల పదవి విరమణ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు మీ చేతికి అందుతుంది. తద్వారా, పదవి విరమణ తర్వాత ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చు. చదవండి: కొత్త ఇళ్లు కొనే వారికి ఎస్బీఐ షాక్! మళ్లీ పెరిగిన బంగారం ధరలు! -
ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు
కొత్త 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 1 నుంచి అనేక విషయాలలో కీలక మార్పులు చోటు చేసుకుంటుంటాయి. కాబట్టి మార్చి నెలలో ఎక్కువ శాతం ప్రజలు కొత్త నిబంధనల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, నిబంధనలకు గడువును పొడిగించిన విషయం తెలిసిందే. ఇందులో పాన్-ఆధార్ కార్డు లింకు, ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు గడువు వంటివి ఉన్నాయి. ఈసారి కార్లు, బైక్లు, టీవీలు, ఏసీల ధరల రూపంలో సామాన్యులపై ఒకటో తారీఖు నుంచి భారం పడే అవకాశం ఉంది. ఇలాంటివి చాలానే ఉన్నాయి.. అవేంటంటే.. ఈ బ్యాంకుల పాస్బుక్, చెక్బుక్లు చెల్లవు ఆంధ్రా బ్యాంకు, దేనా బ్యాంకు, విజయా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్ ఈ ఏడు బ్యాంకుల్లో ఖాతాలున్నాయా? అయితే ఇప్పుడు ఆ బ్యాంకుల పాస్బుక్, చెక్బుక్లు వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి చెల్లవు. ఎందుకంటే ఈ ఏడు బ్యాంకులు వేర్వేరు బ్యాంకుల్లో విలీనమయ్యాయి. ఇతర బ్యాంకుల్లో విలీనమైన కస్టమర్లు సంబంధిత బ్యాంకు శాఖలను సంప్రదించి మారిన ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, పాస్బుక్, చెక్బుక్ మొదలైనవి పొందాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ ఖాతాలో ఎక్కువ జమ చేస్తున్నారా? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021లో ప్రావిడెంట్ ఫండ్పై కీలక ప్రకటన చేశారు. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ఏడాదికి రూ.2.5 లక్షలకు పైన జమ అయ్యే నగదుపై లభించే వడ్డీ మొత్తంపై ఇక నుంచి పన్ను పడనున్నట్లు వెల్లడించారు. రూ.2.5 లక్షల లోపు వరకు గల డిపాజిట్ మొత్తంపై వచ్చే వడ్డీ మొత్తానికి ఎలాంటి పన్ను కట్టక్కర్లేదు. ప్రతి ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి మూల వేతనం నుంచి 12 శాతం జమ అవుతుంది. అలాగే ఇదే మొత్తానికి సమానమైన మొత్తాన్ని కంపెనీ కూడా ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పీఎఫ్ ఖాతాలో ఎక్కువ నగదును జమ చేసే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. బ్యాంకు డిపాజిట్లపై రెట్టింపు టీడీఎస్ ఎక్కువ మంది ఆదాయపు పన్ను రిటర్నులు(ఐటిఆర్) దాఖలు చేయడం కోసం ఆర్థిక మంత్రి 2021 బడ్జెట్లో అధిక టిడిఎస్(మూలం వద్ద పన్ను) లేదా టిసిఎస్ (మూలం వద్ద వసూలు చేసిన పన్ను) రేట్లు ప్రతిపాదించారు. ఆదాయపు పన్ను రిటర్న్ను దాఖలు చేయనివారిపై టీడీఎస్, టీసీఎస్ల అధిక రేట్లు విధించేందుకు ప్రత్యేక నిబంధనగా ఆదాయపు పన్ను చట్టంలో 206ఎబి, 206 సిసిఎ తీసుకొచ్చారు. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుంది. అంటే ఆదాయ పన్ను శ్లాబులో లేనివారు కూడా ఐటీఆర్ దాఖలు చేయకపోతే రెట్టింపు టీడీఎస్ను కట్టాల్సి వస్తుంది. ఐటీ రిటర్నుల దాఖలును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కార్లు, బైక్లు, ఏసీలు ధరలు పెంపు కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కార్ల, బైక్లు, ఏసీలు ధరలు పెరగనున్నాయి. అంతర్జాతీయంగా సరఫరా కొరత కారణంగా కమొడిటీ, లోహ ధరలు పెరగడంతో కార్లు, బైక్ల సంస్థలు రేట్లు పెంచక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. తయారీ వ్యయాలు పెరగడంతో ఏసీ, రిఫ్రిజిరేటర్ల ధరలు ఆ మేరకు పెరగనున్నాయి. ఏసీ ధరలు రూ.1500-2000 వరకు పెరగవచ్చు. విమానం చార్జీల మోత ఏప్రిల్ నుంచి విమాన ప్రయాణికులు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. భారత విమానాశ్రయాల్లో ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు(ఏఎస్ఎఫ్) పెరగనుంది. ఏప్రిల్ 1 నుంచి జారీ అయ్యే టికెట్లపై ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి. దేశీయ ప్రయాణికులపై రూ.200 చొప్పున, అంతర్జాతీయ ప్రయాణికులపై 12 డాలర్ల చొప్పున ధర పెరగనుంది. అయితే రెండేళ్లలోపు చిన్నారులకు, డిప్లొమాటిక్ పాస్పోర్టులున్నవారు తదితర ప్రత్యేక వర్గాలకు ఈ ఫీజు నుంచి మినయింపు ఇచ్చారు. కంపెనీలు క్రిప్టోకరెన్సీ లెక్క చెప్పాల్సిందే కంపెనీలు ఏప్రిల్ 1 నుంచి తమ వద్ద ఉండే క్రిప్టోకరెన్సీ వివరాలను తప్పనిసరిగా ఆర్థిక ఖాతాల్లో వెల్లడించాల్సి ఉంటుంది. కంపెనీకి చెందిన ఆర్థిక అంశాలు వాటాదార్లకు తెలియాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిబంధనను తీసుకొచ్చింది. ఆర్థిక ఫలితాలను ప్రకటించే తేదీ నాటికి ఎంత మేర క్రిప్టోకరెన్సీ ఉందన్నదో చెప్పాలి. అంతే కాదు.. వాటిపై వచ్చిన లాభం, నష్టాలనూ వెల్లడించాలి. ఈ కరెన్సీల్లో ట్రేడింగ్/పెట్టుబడులకు ఇతరుల నుంచి తీసుకునే డిపాజిట్లు, అడ్వాన్సులనూ ఆయా కంపెనీలు చెప్పాల్సి ఉంటుంది. చదవండి: మరిన్ని పట్టణాలకు అమెజాన్ ప్యాంట్రీ లోన్ తీసుకునేవారికి ఎస్బీఐ తీపికబురు -
కరోనా దెబ్బతో 71 లక్షల ఈపీఎఫ్ ఖాతాల తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్ఓ) నుంచి చందాదారులు భారీ ఎత్తున నిధులను విత్డ్రా చేశారు. ఏప్రిల్ ప్రారంభం నుంచి 80 లక్షల మంది చందాదారులు ఏకంగా రూ.30వేల కోట్ల వరకు నగదును ఉప సంహరించుకున్నారు. దాంతోపాటు ఉద్యోగాలను కోల్పోవడం, వేరే ఉద్యోగాల్లో చేరడం, ఇతర కారణాల వల్ల భారీ స్థాయిలో ఈపీఎఫ్ ఖాతాలు తొలగించాల్సి వచ్చింది. 2020 ఏప్రిల్ నుంచి డిసెంబరు మధ్యకాలంలో సుమారు 71 లక్షల ఈపీఎఫ్ ఖాతాలు మూసివేసినట్టు కేంద్ర వెల్లడించింది. రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ 2020 ఏప్రిల్లో డిసెంబర్లో 71.01 లక్షల మంది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) ఖాతాలను తొలగించింది. పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ముగిసిన ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాల సంఖ్య 71,01,929. అదే 2019 ఏప్రిల్-డిసెంబర్లో ఈపీఎఫ్ ఖాతాలను పూర్తిగా మూసివేసిన వారి సంఖ్య 66,66,563 ఉందని మంత్రి తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ పథకంలో భాగంగా.. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన (ఎబీఆర్వై) పథకం కింద ఫిబ్రవరి 21, 2021 వరకు రూ .186.34 కోట్లు విడుదల చేశారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో సామాజిక భద్రతతో పాటు, కొత్తగా ఉపాధి కల్పన, ఉద్యోగాలను సృష్టించడంలో భాగంగా కంపెనీలను ప్రోత్సహించడానికి ఎబీఆర్వై పథకాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. ఎబీఆర్వై పథకం కింద 2021 ఫిబ్రవరి 28 వరకు 15.30 లక్షల మందికి ఉద్యోగాలను కవర్ చేస్తూ, 1.83 లక్షల సంస్థలు లేదా కంపెనీలు నమోదైనట్లు కేంద్ర మంత్రి పార్లమెంట్లో సమాధామిచ్చారు. ఇదిలాఉండగా... ఎబీఆర్వై పథకంలో భాగంగా భారత ప్రభుత్వం రెండేళ్ల కాలానికిగాను ఉద్యోగుల వాటా (12% వేతనాలు), యజమానుల వాటా (12% వేతనాలు) ఈపీఎఫ్ను చెల్లించనుంది. ప్రభుత్వం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో (ఈటిఎఫ్) 2021 ఫిబ్రవరి 28 వరకు ఈపీఎఫ్ఓ రూ .27,532.39 కోట్లు పెట్టుబడి పెట్టిందని సంతోష్ గంగ్వార్ సభలో పేర్కొన్నారు. ఈపీఎఫ్ఓ 2019-20లో రూ .32,377.26 కోట్లు, 2018-19లో రూ .27,743.19 కోట్లు పెట్టుబడి పెట్టిందని తెలిపారు. (చదవండి:ఈపీఎఫ్ ఖాతాదారులు హోమ్ లోన్ తీసుకోండిలా!) -
ఏప్రిల్ 1 నుంచి ఐటీలో ఐదు కొత్త నిబంధనలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2021లో సమర్పించిన కేంద్ర బడ్జెట్ లో ఆదాయపు పన్ను నిబంధనలలో కొన్ని మార్పులు రానున్నట్లు ప్రకటించారు. ఈ మార్పులు 1 ఏప్రిల్ 2021 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం.. 75 అంతకంటే ఎక్కువ వయస్సు గల సీనియర్ సిటిజన్లకు పెన్షన్ నుండి వచ్చే ఆదాయం, అదే బ్యాంకులో స్థిర డిపాజిట్ నుంచి వచ్చే వడ్డీపై ఏప్రిల్ 1 నుంచి ఐటిఆర్ దాఖలు నుంచి మినహాయింపు ఉంటుంది. అంతేకాకుండా, ఆర్థిక మంత్రి ఐటిఆర్ దాఖలు చేయని వారి కోసం అధిక టిడిఎస్ ను ప్రతిపాదించారు. ఇక ఈపిఎఫ్ ఖాతాలో ఏటా రూ.2.5 లక్షలకు పైగా డిపాజిట్ చేసే వ్యక్తులపై పన్ను విధించాలని ప్రకటించారు. 1) పిఎఫ్ పన్ను నియమాలు: 2021 ఏప్రిల్ 1 నుంచి ప్రావిడెంట్ ఫండ్లో ఏడాదికి రూ.2.5 లక్షలకు పైగా డిపాజిట్ చేసే వ్యక్తులకు అంత మొత్తం మీద పన్ను వర్తిస్తుంది. అది ఎంత అనేది ఇంకా తెలీదు. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపిఎఫ్)లో అధిక మొత్తం కలిగిన డిపాజిటర్లపై పన్ను విధించేందుకే ఈ చర్య అని ప్రభుత్వం తెలిపింది. దీని వల్ల సాధారణ ఈపీఎఫ్ కార్మికులకు ఎటువంటి ఇబ్బంది కలగదు అని చెప్పింది. కార్మికుల సంక్షేమం కోసం ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. 2) టిడిఎస్: ఎక్కువ మంది ఆదాయపు పన్ను రిటర్నులు(ఐటిఆర్) దాఖలు చేయడం కోసం ఆర్థిక మంత్రి 2021 బడ్జెట్లో అధిక టిడిఎస్(మూలం వద్ద పన్ను) లేదా టిసిఎస్ (మూలం వద్ద వసూలు చేసిన పన్ను) రేట్లు ప్రతిపాదించారు. ఆదాయపు పన్ను రిటర్న్ను దాఖలు చేయనివారిపై టీడీఎస్, టీసీఎస్ల అధిక రేట్లు విధించేందుకు ప్రత్యేక నిబంధనగా ఆదాయపు పన్ను చట్టంలో 206ఎబి, 206 సిసిఎ తీసుకొచ్చారు. 3) సీనియర్ సిటిజన్లకు మినహాయింపు: సీనియర్ సిటిజన్లపై పన్ను భారం తగ్గించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 బడ్జెట్లో 75 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటిఆర్) దాఖలు చేయకుండా మినహాయింపు కల్పించారు. ఈ మినహాయింపు ఇతర ఆదాయం లేని సీనియర్ సిటిజన్లకు మాత్రమే లభిస్తుంది. కానీ పెన్షన్ ఖాతా ఉన్న బ్యాంక్ నుంచి లభించే పెన్షన్, వడ్డీ ఆదాయంపై ఐటిఆర్ దాఖలు ఆధారపడి ఉంటుంది. 4) ముందే నింపిన ఐటిఆర్ ఫారాలు: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ముందుగా నింపిన ఆదాయపు పన్ను రిటర్నులు(ఐటిఆర్) జారీ చేయనున్నారు. పన్ను చెల్లింపుదారునికి ఈ కొత్త విధానంలో ప్రాసెస్ సులభతరం చేయడానికి జీతం ఆదాయం, పన్ను చెల్లింపులు, టిడిఎస్ మొదలైన వివరాలు ముందే ఆదాయపు పన్ను ఫారంలలో ముందే నింపబడి ఉంటాయి. అలాగే రిటర్న్స్ దాఖలు మరింత సులభతరం చేయడం కోసం లిస్టెడ్ సెక్యూరిటీల మూలధన లాభాల వివరాలు, డివిడెండ్ ఆదాయం, బ్యాంకుల వడ్డీ, పోస్ట్ ఆఫీస్ మొదలైనవి కూడా ముందే నింపబడతాయి. 5) ఎల్టిసి: సెలవు ప్రయాణ రాయితీ(ఎల్టిసి) బదులుగా నగదు భత్యానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని బడ్జెట్ 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది . ప్రయాణానికి కోవిడ్ సంబంధిత పరిమితుల కారణంగా తమ ఎల్టిసి పన్ను ప్రయోజనాన్ని పొందలేకపోయిన వ్యక్తుల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం గత సంవత్సరం ప్రకటించింది. చదవండి: 2నిమిషాల్లో పాన్-ఆధార్ అనుసంధానం పాన్-ఆధార్ లింకుకు ఇంకా పదిహేను రోజులే -
ఈపీఎఫ్ ఖాతాదారులు హోమ్ లోన్ తీసుకోండిలా!
ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) సంస్థ ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు నగదు నిల్వ, వడ్డీలు, పన్ను మినహాయింపు, పింఛన్ లాంటి పలు రకాల సౌకర్యాలను అందిస్తోంది. ఈపీఎఫ్ ఖాతాదారులకు 2019-20 ఏడాదికిగానూ ఈపీఎఫ్వో 8.5 శాతం వడ్డీని అందించింది. ఈపీఎఫ్ ఖాతాదారులు పన్ను ఆదా ప్రయోజనాలతో పాటు ఈపీఎఫ్ ఖాతా ద్వారా ఇంటితో సహా వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. మీ వివాహం, మీ కొడుకు & కుమార్తె వివాహం కోసం రుణం పొందవచ్చు. ఇలా పలు రకాల రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు గృహ రుణాలు, వ్యక్తిగత రుణాల ఈ కింది పద్ధతి ద్వారా దరఖాస్తు చేసుకోండి. ఈపీఎఫ్వో అధికారిక ఈపీఎఫ్ వెబ్సైట్ లో యూఏఎన్ యూజర్ నేమ్, పాస్వర్డ్తో లాగిన్ కావాలి. మేనేజ్ సెక్షన్ వెళ్లి అందులో ఆధార్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, బ్యాంక్ ఖాతా లాంటి కేవైసి వివరాలు వెరిఫై చేసుకోవాలి. ఆన్లైన్ సర్వీసెస్ కు వెళ్లి అందులో క్లెయిమ్(ఫార్మ్- 31, 19, 10సీ) ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత ఈపీఎఫ్ ఖాతాదారుడి వివరాలు కనిపిస్తాయి. మీ బ్యాంక్ ఖాతాలోని చివరి 4 అంకెలు నమోదు చేయాలి. ఇప్పుడు వెరిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అనంతరం మీ వివరాలు మొత్తం నమోదు పూర్తయ్యాక ఎస్ ఆప్షన్ ఓకే చేయాలి. అనంతరం ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆపై I want to Apply For అప్షన్ మీద క్లిక్ చేయాలి. లోన్ తీసుకోవడానికి గల కారణాలు, ఎంత నగదు విత్డ్రా చేసుకోవాలని భావిస్తున్నారో తెలియజేయాల్సి ఉంటుంది. మొత్తం ప్రక్రియ పూర్తైన తర్వాత Employer ఆమోదం తెలిపితే అనంతరం 15 నుంచి 20 రోజుల్లోగా ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్కు నగదు జమ అవుతుంది. చదవండి: 2022లో చంద్రయాన్-3 ప్రయోగం: ఇస్రో చైర్మన్ మారుతి సుజుకి బంపర్ అఫర్ -
ఈపీఎఫ్ వడ్డీరేటు యథాతథం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21)గానూ ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై వడ్డీరేటును 8.5 శాతంగా ఖరారు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా యథాతథంగా ఉంచారు. గురువారం శ్రీనగర్లో జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన మరికొద్ది క్షణాల్లో వెలువడనుంది. కాగా కరోనామహమ్మారి నేపథ్యంలో పీఎఫ్ వడ్డీరేటును తగ్గనుందనే అంచనాలు వెలువడ్డాయి. 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును 8.5 శాతంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018-19లో ఇది 8.65 శాతంగా ఉండగా, గత ఏడాది 8.5 శాతం వద్ద 7 సంవత్సరాల కనిష్టానికి చేరింది. తాజాగా దాదాపు దశాబ్దం కనిష్టానికి చేరింది. -
ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఎఫ్ రూల్స్!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021లో ప్రావిడెంట్ ఫండ్పై కీలక ప్రకటన చేశారు. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ఏడాదికి రూ.2.5 లక్షలకు పైన జమ అయ్యే నగదుపై లభించే వడ్డీ మొత్తంపై ఇక నుంచి పన్ను పడనున్నట్లు వెల్లడించారు. రూ.2.5 లక్షల లోపు వరకు గల డిపాజిట్ మొత్తంపై వచ్చే వడ్డీ మొత్తానికి ఎలాంటి పన్ను కట్టక్కర్లేదు. ప్రతి ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి మూల వేతనం నుంచి 12 శాతం జమ అవుతుంది. అలాగే ఇదే మొత్తానికి సమానమైన మొత్తాన్ని కంపెనీ కూడా ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పీఎఫ్ ఖాతాలో ఎక్కువ నగదును జమ చేసే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఏడాదికి రూ.20.83 లక్షలకు పైన సంపాదించే వారు పీఎఫ్ కంట్రిబ్యూషన్పై ట్యాక్స్ చెల్లించుకోవాల్సి రావొచ్చు. కొత్త రూల్ కేవలం ఉద్యోగి కంట్రిబ్యూషన్కు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ప్రస్తుతం పీఎఫ్ అకౌంట్ ద్వారా అర్జించే వడ్డీ మొత్తంపై ఎలాంటి పన్ను విధింపు లేదు. ఇంకా దీనికి సంబందించిన పూర్తీ నియమ, నిబంధనలు ఖరారు చేయలేదు. వీటిపై పన్ను ఎంత విధిస్తారు అనేది త్వరలో తెలియనుంది. చదవండి: వాట్సాప్ సేవలను ప్రారంభించిన ఈపీఎఫ్ఓ ఫేస్‘బుక్'కు అమెరికా కోర్టు షాక్ -
వాట్సాప్ సేవలను ప్రారంభించిన ఈపీఎఫ్ఓ
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) తన చందాదారుల సమస్యల పరిష్కారం కోసం వాట్సాప్ హెల్ప్లైన్ నంబర్ను ప్రారంభించింది. దీని ద్వారా ఈపీఎఫ్ఓ వినియోగదారులు సులభంగా తమ సమస్యలను పరిష్కరిచుకునే అవకాశం ఉంటుంది. ప్రతి చిన్న పని కోసం ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లకుండానే ఈ ఏర్పాట్లు చేసినట్లు సదరు సంస్థ ప్రకటించింది. ఇంతకు ముందే ఈపీఎఫ్ఓ ఫిర్యాదుల పరిష్కారం కోసం గ్రీవియన్స్ రిడ్రెస్సల్ ఫోరంను ప్రారంభించింది. ఇందులో భాగంగానే వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ను ప్రకటించింది. సమస్యల పరిష్కారం కోసం EPFIGMS, CPGRAMS పోర్టళ్లతో పాటు ప్రత్యేకంగా 24×7 కాల్ సెంటర్ కూడా అందుబాటులో ఉంది. వీటికి అదనంగా మరో సేవలను అందుబాటులోకి తీసుకువస్తూ వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్ను ప్రారంభించింది. ఈ సదుపాయం ద్వారా పీఎఫ్ చందాదారులు డిజిటల్ విధానంలో ఈపీఎఫ్వో ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించవచ్చు. అవసరమైన సమాచారాన్ని నేరుగా పొందవచ్చు. ఈపీఎఫ్ఓకు చెందిన మొత్తం 138 ప్రాంతీయ కార్యాలయాలలో వాట్సాప్ హెల్ప్ లైన్ సర్వీసులను ప్రారంభించింది. పీఎఫ్ చందాదారులు తమ సమస్యల పరిష్కారం కోసం ఈపీఎఫ్ఓ వాట్సాప్ నంబర్కు మెసేజ్ చేస్తే సరిపోతుంది. ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయల వాట్సాప్ నెంబర్ కోసం అధికారిక వెబ్ సైట్ సందర్శించండి. ఈపీఎఫ్ఓ వాట్సాప్ హెల్ప్ లైన్ నంబర్: Hyderabad (Barkatpura) 9100026170 Hyderabad (Madhapur) 9100026146 Karimnagar 9492429685 Kukatpally 9392369549 Nizamabad 8919090653 Patancheru 9494182174 Siddipet 9603262989 Warangal 8702447772 Guntur 0863-2344123 Kadapa 9491138297 Rajamundry 9494633563 Vishakhapatnam 7382396602 చదవండి: ఫేస్‘బుక్'పై భారీ జరిమానా రూ.299కే బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ -
ఏప్రిల్ 1 నుంచి పీఎఫ్ కొత్త నిబంధనలు
కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి పీఎఫ్ లో కొత్త నిబంధనలు తీసుకురాబోతుంది. ప్రస్తుతం ఉన్న పన్ను నిబంధనల ప్రకారం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ నుంచి పొందిన వడ్డీకి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, రాబోయే ఏప్రిల్ 1 నుంచి అధిక ఆదాయాన్ని సంపాదించేవారికి లభించే వడ్డీకి సైతం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈపీఎఫ్లో ఏడాదికి రూ.2.5 లక్షల కంటే ఎక్కువ జమ చేసేవారు వారికి అందించే వడ్డీపై పన్నులు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పేర్కొన్నారు. అయితే కేవలం ఉద్యోగులు జమ చేసే మొత్తంపైనే ఈ పన్నును లెక్కించనున్నారు. 2021 ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. పీఎఫ్లో ఉద్యోగి వాట ఏడాదికి రూ.2.5 లక్షల వరకు ఉంటే 80సీ కింద ఎప్పటిలాగే మినహాయింపు లభిస్తుంది. పీఎఫ్ ఉద్యోగి వాటా రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ ఉంటే ఆ వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పీఎఫ్లో ఉద్యోగితో పాటు అతను పని చేస్తున్న కంపెనీ కూడా ఉద్యోగి తరపున కొంత జమ చేసే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మొత్తానికి కొత్త నిబంధనలు వర్తించవు. కేవలం ఉద్యోగి వాటాపై మాత్రమే పన్ను ఉంటుంది. అయితే వీటిపై మార్గదర్శకాలను త్వరలో కేంద్రం విడుదల చేయనుంది. చదవండి: ఆస్ట్రేలియాకు మైక్రోసాఫ్ట్ మద్దతు..గూగుల్ వైదొలిగేనా? పెట్రోల్ ధరలను తగ్గించిన నాలుగు రాష్ట్రాలు! -
ఈపీఎఫ్ వడ్డీపై కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధిపై (ఈపీఎఫ్) 2020–21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ ఎంత ఇవ్వాలన్నది మార్చి 4న జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. శ్రీనగర్లో మార్చి 4న సమావేశం విషయమై తనకు ఆహ్వానం అందినట్టు ట్రస్టీ కేఈ రఘునాథన్ మీడియాకు తెలిపారు. తనకు వచ్చిన మెయిల్లో వడ్డీపై నిర్ణయ అంశం లేదని స్పష్టం చేశారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2019–20) సభ్యుల భవిష్యనిధి నిల్వలపై 8.5 శాతం వడ్డీ రేటును ఈపీఎఫ్వో అందించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు ఇంత ఇవ్వడం సాధ్యపడక పోవచ్చని, రేటును తగ్గించే అవకాశాలున్నాయనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో సభ్యులు ఎక్కువగా తమ నిధులను ఉపసంహరించుకోవడంతో పాటు, తాజా జమలు తగ్గడం ఇందుకు కారణం కావచ్చని తెలుస్తోంది. 2018–19లో ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతంగా ఉన్న విషయం గమనార్హం. 2019–20కు ఆఫర్ చేసిన 8.5% రేటు అనేది 2012–13 తర్వాత అత్యంత కనిష్ట రేటు.(చదవండి: ఐదు సెకన్లలో 20 లక్షల ఎస్బీఐ పర్సనల్ లోన్) -
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్!
న్యూఢిల్లీ: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది కేంద్రం. ఉద్యోగులకు పెద్ద ఉపశమనం కలిగించే విధంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో చాలా మంది ఉద్యోగులు కంపెనీ మారే సందర్భంలో ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను కొత్త సంస్థకు బదిలీచేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కొత్త సంస్థకు పీఎఫ్ డబ్బులు బదిలీ చేయాలంటే తప్పని సరిగా పాత కంపెనీలో చివరి తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ కంపెనీలు కావాలనే ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులు కంపెనీ మారినప్పుడు వారే స్వయంగా పాత కంపెనీలో పని చేసిన చివరి తేదీని ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో అప్డేట్ చేసుకునే అవకాశం అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత కంపెనీలో జాబ్ మానేసి వెళ్లిపోయిన రెండు నెలల తర్వాతే ఎగ్జిట్ డేట్ వివరాలు ఆప్డేట్ చేసుకోవడం సాధ్యం అవుతుంది. ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో అప్డేట్ చేసుకునే విధానం: దశ 1: ఉద్యోగులు ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో తమ యూఏఎన్ నంబర్, పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. దశ 2: ‘మేనేజ్’ ఆప్షన్లో కనిపించే ‘మార్క్ ఎగ్జిట్’ మీద క్లిక్ చేయాలి. దశ 3: మీ పాత పిఎఫ్ ఖాతాను ఎంచుకోవాలి. దశ 4: గతంలో పనిచేసిన కంపెనీలో ఉద్యోగం మానేయడానిక గల కారణాన్ని, చివరిగా పని చేసిన తేదీని నమోదు చేయాలి. దశ 5: ‘రిక్వెస్ట్ ఓటీపీ’ మీద క్లిక్ చేస్తే ఆధార్తో లింక్ చేసిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని చెక్ బాక్స్లో అప్డేట్ చేయాలి. దశ 6: ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే క్లోజింగ్ డేట్ ప్రక్రియ పూర్తవుతుంది. చదవండి: ఆధార్ యూజర్లకు ముఖ్య గమనిక! త్వరలో ఇండియాలోకి క్రిప్టోకరెన్సీ -
ఒకే వ్యక్తి ఖాతాలో రూ.103 కోట్ల పిఎఫ్ జమ
న్యూఢిల్లీ: సాధారణంగా ఒక వ్యక్తి పీఎఫ్ ఖాతాలో ఎంత నగదు జమ అవుతుంది? 25ఏళ్ల వయస్సులో ఉద్యోగంలో చేరి.. 60 ఏళ్ల వయస్సులో రిటైర్ మెంట్ అయ్యేసరికి అతని పీఎఫ్ ఖాతాలో రూ.50 లక్షల నుంచి రూ.కోటి జమ అవుతుంది. అది కూడా మధ్యలో ఎప్పుడు తీయకపోతే. రిటైర్మెంట్ అయ్యాక వచ్చే డబ్బుతో చక్కగా జీవిత చరమాంకం వరకు చాలా హాయిగా గడపవచ్చని భావిస్తారు. తాజాగా ఇటీవల ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఇపిఎఫ్) ఖాతాల గురించి ఒక ఆశ్చర్యకరమైన సమాచారం బయటకి వచ్చింది. (చదవండి: గగన్యాన్ కోసం చికెన్ బిర్యానీ) మన దేశంలోనే ఓ వ్యక్తి పీఎఫ్ ఖాతాలో ఏకంగా రూ.103 కోట్లు జమ అయ్యాయి. 2018-19లో అత్యంత పీఎఫ్ అందుకునే 1.23 లక్షల పీఎఫ్ అకౌంట్లలో రూ.62,500 కోట్లు జమ అయ్యాయి. దేశంలో 4.5 కోట్ల పీఎఫ్ ఖాతాల్లో ఈ 0.3 శాతం మంది అత్యధిక ఈపీఎఫ్ కార్పస్ ఫండ్ పొందుతున్నారు. ఇపిఎఫ్ అత్యధికంగా సంపాదించే 20 మంది ఖాతాల్లో మొత్తం రూ.825 కోట్లు జమ అయ్యాయి. అదే సమయంలో ఎక్కువగా సంపాదించే టాప్ 100 మంది ఖాతాల్లోనే రూ.2,000 కోట్లకు పైగా నగదు జమ చేయబడింది. 20 మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తూ రూ.15వేలకు పైగా జీతం అందుకునే వారికీ కచ్చితంగా కంపెనీ గ్రాస్ శాలరీపై 12శాతం వారి వేతనంలో పీఎఫ్ కింద జమ చేస్తుంది. అలాగే అంతే మొత్తంలో కంపెనీ కూడా నగదును వారి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏడాదికి 7.5లక్షల కంటే ఎక్కువ మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ చేయరాదు అనే నిబంధన గత ఏడాది ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ప్రైవేట్ కంపెనీ విషయంలో ఎటువంటి నిబంధనలు లేవు. దీంతో ఉద్యోగి ఖాతాలో ఎంతైనా కంపెనీ జమ చేయవచ్చు. అందుకే చాలా మంది నిపుణులు అత్యవసర విషయంలో తప్ప ఎప్పుడు కూడా పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు డ్రా చేయవద్దు అని కోరుతారు. -
కష్టమైనా.. ఇన్వెస్ట్ చేయాల్సిందే..!
రిటైర్మెంట్.. ఏదో ఒకరోజు ఆహ్వానించాల్సిందే. ఉద్యోగాల్లో ఉన్న వారికి కాస్త ముందు, స్వయం ఉపాధుల్లోని వారికి కొంత ఆలస్యంగా అయినా.. వృద్ధాప్యంలో పని జీవితం నుంచి విశ్రాంతి అవసరమే. అప్పటి వరకు సంపాదనతో నడిచిన జీవితం.. ఆ తర్వాత కూర్చుని కొనసాగించాలంటే అందుకు ముందు నుంచే ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాల్సిందే. రిటైర్మెంట్ కోసం పొదుపును పెద్దగా పట్టించుకోని ధోరణి యుక్త వయసులోని వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. రిటైర్మెంట్ కోసం చాలా సమయం ఉందన్నది వారి ఆలోచనా తీరు. ఈ ధోరణితో రిటైర్మెంట్ ప్రణాళికను వాయిదా వేస్తే.. వివాహంతో గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన తర్వాత పిల్లలు, వారి ఉన్నత విద్య, వారి వివాహాలు, సొంతిల్లు, కారు తదితర లక్ష్యాలు ముఖ్యమైనవిగా మారతాయి. దీంతో తమ విశ్రాంత (వృద్ధాప్య) జీవనానికి సంబంధించిన ప్రణాళిక పక్కకు వెళ్లిపోతుంది. కారణం ఏదైనా కానీయండి.. వయసుతో సంబంధం లేకుండా సంపాదించే గ్రూపులో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ పదవీ విరమణ జీవితానికి పొదుపును తక్షణం ప్రారంభించడమే మంచి పరిష్కారం. ఇది ఎంత ముందుగా ప్రారంభిస్తే అంత సులభంగా కావాల్సినంత సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది. ఇందుకు ఏం చేయాలో చూద్దాం.. ఉద్యోగులు అయితే ‘ఉద్యోగుల భవిష్య నిధి’ (ఈపీఎఫ్) సదుపాయం ఉంటుంది. వేతనంలో ప్రతీ నెలా నిర్ణీత శాతం మేర ఈపీఎఫ్ ఖాతాకు వెళుతుంటుంది. ఉద్యోగి వాటాకు సమానంగా పనిచేయించుకునే సంస్థ కూడా తన వంతు వాటాను సమకూర్చడం ఇందులోని విశేషం. ఉద్యోగి ప్రమేయం లేకుండా క్రమం తప్పకుండా ప్రతీ నెలా భవిష్యనిధి ఖాతాకు జమ కావడం వల్ల దీన్ని మంచి సాధనంగా నిపుణులు చెబుతారు. దీనికి విరుద్ధంగా చాలా మంది ఈపీఎఫ్ విషయంలో తప్పుగా వ్యవహరిస్తుండడాన్ని చూడొచ్చు. తమ అవసరాలకు ఈపీఎఫ్ నిధిపై ఆధారపడుతుంటారు. ఇల్లు కొనుగోలు, ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ నిధిని వెనక్కి తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవడాన్ని చూడొచ్చు. ఇలా చేయడం అన్ని సందర్భాల్లోనూ సరైనది కాదు. ఈపీఎఫ్ నిధిని కదపకుండా.. రిటైర్మెంట్ తర్వాత ఉపసంహరించుకోవడం వల్ల మంచి నిధిని చేతికందుకోవచ్చు. ప్రతీ ఉద్యోగికీ సాధ్యమయ్యే రిటైర్మెంట్ పొదుపు సాధనంగా దీన్ని చూడాలి. మరి రిటైర్మెంట్ జీవితానికి ఈపీఎఫ్ ఒక్కటి సరిపోతుందా..? లేదు. మరింత అదనంగా పొదుపు, మదుపు చేసుకుంటూ వెళ్లాలి. ఎంత మొత్తం అన్నది మీరు తీసుకునే రిస్క్, ఇన్వెస్ట్ చేయగలిగే మొత్తంపై ఆధారపడి ఉంటుంది. రిస్క్ తీసుకోని రక్షణాత్మక ధోరణి ఇన్వెస్టర్ అయితే డెట్ సాధనాలను పెట్టుబడులకు ఎంచుకోవాలి. ఓ మోస్తరు రిస్క్ అయినా ఫర్వాలేదనుకునే వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనుకూలం. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్.. ప్రయోజనాలు ఈపీఎఫ్ ఉద్యోగుల భవిష్యనిధిలో జమ అయ్యే మొత్తాలకు సెక్షన్ 80సీ కింద పన్ను పడదు. ఉద్యోగి వాటాతోపాటు, సంస్థ జమ చేసే వాటా కూడా పన్ను మినహాయింపు పరిధిలోకి వస్తుంది. అంతే కాదు రిటైర్మెంట్ సమయంలో ఈపీఎఫ్ నుంచి తీసుకునే మొత్తంపైనా పన్ను మినహాయింపు ఉంటుంది. ఇందులో పెట్టుబడులు, రాబడులు, ఉపసంహరణల మొత్తం కూడా పన్ను లేనిదే. అందుకే ఉద్యోగాలలో ఉన్న వారు అనవసరాలకు ఈపీఎఫ్ నిధిని ఖాళీ చేయకుండా, రిటైర్మెంట్ కోసం కొనసాగించుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఒక సంస్థ నుంచి వేరే సంస్థకు మారినా, ఈపీఎఫ్ నిధిని బదిలీ చేసుకుని, కొనసాగించుకోవాలి. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్కు అనుసంధానంగా పనిచేసే వీపీఎఫ్ను వినియోగించుకునే వారు చాలా తక్కు వ మందే. ఈపీఎఫ్ వాటా మూల వేతనంలో 12 శాతానికే పరి మితం. కానీ, వీపీఎఫ్ విషయానికొస్తే మూలవేతనం, డీఏ రెండింటికి సమాన స్థాయిలో ప్రతీ నెలా పొదుపు చేసుకునేందుకు అనుమతి ఉంది. ఈపీఎఫ్ వడ్డీ రేటే వీపీఎఫ్కూ అమలవుతుంది కనుక.. మెరుగైన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇందు లో జమ చేసే మొత్తానికీ పన్ను మినహాయింపు పొందొచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వేతన జీవులు కాని వారికి పీపీఎఫ్ ఒకానొక సాధనం అవుతుంది. రాబడులు ఈపీఎఫ్తో పోలిస్తే ప్రస్తుతానికి ఒక శాతానికి పైగా తక్కువగా ఉన్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఇందులో రాబడులు, ఉపసంహరణలకూ పన్ను మినహాయింపు ఉంది కనుక ఇది కూడా డెట్లో ఒక మెరుగైన ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్జన ఆరంభమైన నాటి నుంచి రిటైర్మెంట్కు చాలా సమయం ఉంటుంది. కనుక ముందే రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ ఆరంభించినట్టయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఘనంగా సమకూర్చుకోవచ్చు. మధ్యస్థ రిస్క్ ఉన్నా ఫర్వాలేదనుకుంటే.. ఈక్విటీ ఫండ్స్ను ఎంచుకుని ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. ద్రవ్యోల్బణాన్ని అధిగమించి సంపదను సృష్టించుకునే మార్గం ఈక్విటీలు. కాకపోతే ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్ పనితీరును ఏడాదికోసారి తప్పకుండా సమీక్షించుకోవాలి. ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీల్లోనే ఇవి ఒక విభాగం. ఇందులో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద పన్ను రాయితీ పొందొచ్చు. రాబడులను వెనక్కి తీసుకున్న సమయంలో మాత్రం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 10 శాతం (రూ.లక్ష మించిన మొత్తాలపై) చెల్లించాల్సి ఉంటుంది. అయినా, రిటైర్మెంట్ కోసం ఈ పథకాలను ఎంచుకుని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం మంచి మార్గమే అవుతుంది. అంతేకాదు, రిటైర్మెంట్ తర్వాత ఈక్విటీ పథకాల నుంచి ఏకమొత్తంలో ఉపసంహరించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రతీ నెలా తమ అవసరాలకు కావల్సిన మొత్తాన్ని రిడెండప్షన్ చేసుకుంటూ వెళ్లొచ్చు. అప్పుడు మిగిలి ఉన్న పెట్టుబడులకు రాబడులు జమవుతూ ఉంటాయి. ఎన్పీఎస్ ఇది పూర్తిగా రిటైర్మెంట్ సేవింగ్స్ కోసం ఉద్దేశించిన సాధనం. ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఇప్పుడు తప్పనిసరి అమల్లో ఉన్న పెన్షన్ సాధనం ఇదే. ప్రైవేటు రంగ సంస్థలు తమ అభీష్టం మేరకు ఈపీఎఫ్కు బదులు ఎన్పీఎస్ను కూడా ఎంచుకోవచ్చు. స్వచ్ఛందంగా ఎవరైనా ఎన్పీఎస్లో భాగం కావచ్చు. ఇందులో డెట్, ఈక్విటీల కలయికగా పెట్టుబడుల ఆప్షన్ ఎంచుకునేందుకు వీలుంది. ఎంత మేర ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నది నిర్ణయించుకోలేకపోతే.. వయసు ఆధారంగా ఈక్విటీ, డెట్ శాతాలను నిర్ణయించే ఆటో చాయిస్ ఆప్షన్ను ఎంపిక చేసుకోవచ్చు. అయితే, ఈపీఎఫ్, పీపీఎఫ్ సాధనాల్లో మెచ్యూరిటీ తర్వాత మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు వీలుంటుంది. కానీ, ఎన్పీఎస్లో అలా కాదు.. 60 ఏళ్లనాటికి సమకూర్చుకున్న నిధిలో 60 శాతాన్నే వెనక్కి తీసుకునేందుకు వీలుంటుంది. ఈ మొత్తంపై పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. మిగిలిన 40 శాతంతో పెన్షన్ ఇచ్చే యాన్యుటీ ప్లాన్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా యాన్యుటీ ప్లాన్ నుంచి ప్రతీ నెలా అందుకునే మొత్తం ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. ఇలా మెచ్యూరిటీ తర్వాత కచ్చితంగా యాన్యుటీలో 40 శాతాన్ని ఇన్వెస్ట్ చేయాలన్న నిబంధన కొందరికి నచ్చకపోవచ్చు. అటువంటి వారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈక్విటీ, డెట్ కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్ను ఎంచుకోవచ్చు. రక్షణాత్మక ధోరణి కలిగిన విభాగంలోకి మీరు వస్తే.. ఈపీఎఫ్ ఖాతాకు ప్రతీ నెలా మీ వంతు అదనంగా జమ చేయడం ఒక మంచి మార్గం. దీన్నే వాలంటరీ ప్రావిడెంట్ ఫంఢ్ (వీపీఎఫ్) అంటారు. ఈపీఎఫ్ నిల్వలపై అమలయ్యే వడ్డీ రేటే వీపీఎఫ్కూ వర్తిస్తుంది. డెట్ సాధనాల్లో ఈపీఎఫ్ అత్యధిక రిటర్నులు అందిస్తున్న ఒక సాధనమని గుర్తుంచుకోవాలి. ఒకవేళ ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేయని వారు ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్)ని ఎంచుకోవచ్చు. కాకపోతే ఇందులో రాబడులు కాస్త తక్కువగా ఉంటాయి. ఈపీఎఫ్తోపాటు వీపీఎఫ్ లేదా పీపీఎఫ్ రూపంలో రిటైర్మెంట్కు కావాల్సిన మేర నిధికి ప్రణాళిక వేసుకోవడం మంచి ఆలోచనే అవుతుంది. అయితే, డెట్ సాధనాల్లో వచ్చే రాబడిలో అధిక శాతం ద్రవ్యోల్బణ ప్రభావానికే కరిగిపోతుంది. కనుక అధిక రాబడుల కోసం కొంత మొత్తాన్ని అయినా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మోస్తరు నుంచి అధిక రిస్క్ తీసుకునే వారికి ఈక్విటీలు అనుకూలమైన పొదుపు సాధనమని చెప్పుకోవాలి. ఈపీఎఫ్, వీపీఎఫ్, పీపీఎఫ్, ఈక్విటీ ఫండ్స్ కలయికతో పెట్టుబడుల ప్రణాళిక రూపొందించుకున్నామెరుగ్గానే ఉంటుంది. 20–30ల్లోనే ఉండి ఆదాయం మొదలు పెట్టిన వారు ఈక్విటీలకు అధిక కేటాయింపులు చేసుకోవడం ద్వారా భారీ నిధిని సమకూర్చుకునే అవకాశం సొంతం చేసుకోవచ్చు. రిటైర్మెంట్కు కనీసం 20–30 ఏళ్లు అయినా ఉంటే, ఈక్విటీల కలయికగా పెట్టుబడులను ప్లాన్ చేసుకోవాలి. పెంచుతూ పోవడం పరిష్కారం ఆదాయం పెరుగుతూ వెళుతున్నట్టే.. రిటైర్మెంట్ కోసం చేసే పొదుపు మొత్తాన్ని కూడా అంతే మేర పెంచుకుంటూ వెళ్లాలి. వీలైనంత ముందుగా పెట్టుబడులను ప్రారంభించాలి. చెప్పడం సులభం.. ఆచరణే కష్టం. కానీ, ఆరంభించేంత వరకే కష్టం. ఒక్కసారి మొదలు పెడితే, దానికి తగినట్టు ఖర్చులను సర్దుబాటు చేసుకోవచ్చు. రిటైర్మెంట్ కోసం కొంత మొత్తం కావాలన్న అవసరాన్ని ఒక్కొక్కరు ఒక్కో సమయంలో గుర్తిస్తుంటారు. కొందరు అయితే అప్పటి సంగతి అప్పుడే చూసుకోవచ్చనుకుంటారు. కానీ, ముందుగా ప్రారంభించినట్టయితే.. దానికి కాంపౌండింగ్ (వృద్ధి) శక్తి తోడవుతుంది. దాంతో దీర్ఘకాలానికి గణనీయమైన మొత్తాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఒకవేళ మీరు మధ్య వయసు కూడా దాటి, రిటైర్మెంట్ పొదుపును ఇంకా ప్రారంభించలేదని ఆలోచిస్తున్నారా..? ఆందోళన చెందకుండా వెంటనే ఆచరణలో పెట్టడం ఉత్తమం. ఏ మాత్రం ఆలస్యం చేయవద్దు. ఎందుకంటే 45–50లకు చేరిన తర్వాత రిటైర్మెంట్ కోసం పొదుపు మొదలు పెట్టడం వల్ల అవసరమైనంత నిధి సమకూరదు. చిన్న వయసులో అయితే సంపాదనలో కొంత భాగాన్ని పక్కన పెట్టినా సరిపోతుంది. కానీ, ఆలస్యం చేసిన కొద్దీ సంపాదనలో భారీ మొత్తాన్ని రిటైర్మెంట్కు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రిటైర్మెంట్ అవసరాలకు ఎంత మేర కావాలి, అందుకు ఏం చేయాలన్న విషయమై సందేహాలు ఉంటే ఆర్థిక సలహాదారులను సంప్రదించి వారిచ్చే సూచనలను అనుసరించాలి. -
రెండు దఫాలుగా ఈపీఎఫ్ వడ్డీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీని రెండు దఫాలుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనుంది ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ పై ప్రస్తుతానికి కొంత భాగాన్ని..8.5 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాలని నిర్ణయించింది. మిగిలిన దాన్ని డిసెంబరులో చెల్లించనుంది. దీనిపై ఈపీఎఫ్ఓ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ), డిసెంబరులో మరోసారి సమావేశం కానుంది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈపీఎఫ్ ఖాతాల్లోని ఫండ్పై 8.15 శాతం వడ్డీని ప్రస్తుతం జమ చేస్తారు. మిగిలిన 0.35 శాతం వడ్డీని ఈ ఏడాది డిసెంబరులో జమ చేయనుంది. ఈక్విటీ పెట్టుబడుల డైల్యూషన్ ద్వారా 0.35 శాతం బకాయి వడ్డీని డిసెంబర్లో చెల్లించేలా బుధవారం జరిగిన ఈపీఎఫ్ఓ ట్రస్టీల సమావేశం నిర్ణయించింది. కోవిడ్-19 అసాధారణమైన పరిస్థితుల దృష్ట్యా, వడ్డీ రేటుకు సంబంధించిన ఎజెండాను కేంద్ర బోర్డు సమీక్షించింది. అలాగే కరోనావైరస్ మహమ్మారి కాలంలో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఇడిఎల్ఐ) పథకం కింద ఉన్న గరిష్ట హామీ ప్రయోజనాన్ని ప్రస్తుతమున్న రూ .6 లక్షల నుండి రూ .7 లక్షలకు పెంచింది. దీంతో ఆరు కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. కాగా లక్ష కోట్ల రూపాయల విలువైన ఈటీఎఫ్ పెట్టుబడులపై నష్టాలు రావడం చందాదారుల చెల్లింపును దెబ్బతీసినట్టు సమాచారం. వార్షిక డిపాజిట్లలో, ఇపిఎఫ్ఓ 85 శాతం రుణ సాధనాలలో, 15 శాతం ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెడుతుంది. మరోవైపు కరోనా సంక్షోభ కాలంలో క్లెయిమ్ల సంఖ్యం మొత్తం 13 శాతం పెరిగింది. ఏప్రిల్-ఆగస్టు కాలంలో మొత్తం 35,445 కోట్ల విలువైన 94.41 లక్షల క్లెయిమ్లను చెల్లించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 32 శాతం ఎక్కువ. -
33 కోట్ల మందికిపైగా ప్రత్యక్ష నగదు బదిలీ
న్యూ ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్యాకేజీ నిధులను విడుదల చేసింది. 33 కోట్ల మందికి పైగా ప్రత్యక్ష నగదు బదిలీ చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజి కింద రూ. 31,235 కోట్లు, 20 కోట్ల మహిళా జన్ధన్ ఖాతాల్లోకి రూ. 10,025 కోట్లను బదిలీ చేసినట్టు తెలిపింది. 2.82 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పెన్షన్ కోసం రూ. 1,405 కోట్లు, పీఎం-కిసాన్ యోజన కింద 8 కోట్ల మంది రైతులకు రూ. 16,146 కోట్లను బదిలీచేశామని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 68,775 కంపెనీల్లో పనిచేసే 10.6 లక్షల ఉద్యోగులకు ఈపీఎఫ్ వాటాగా రూ. 162 కోట్లు బదిలీ చేసినట్టు తెలిపింది. -
రిటైర్మెంట్కు వీపీఎఫ్ ఆయుధం!
రిటైర్మెంట్ తర్వాత జీవితానికి సంబంధించి చాలా మందిలో ప్రణాళిక కనిపించదు. ఎన్నో ఏళ్ల తర్వాత అవసరాల కంటే ప్రస్తుత జీవన అవసరాలే వారికి ప్రాధాన్యంగా ఉంటుంటాయి. ఎక్కువగా మధ్యతరగతి, దిగువ ఆదాయ వర్గాల్లో ఇది చూడొచ్చు. కానీ, 60 ఏళ్ల తర్వాత ఆర్జనా శక్తి తగ్గిపోయిన పరిస్థితుల్లో తమ జీవన అవసరాలు, ఆరోగ్య సంరక్షణ, వైద్య ఖర్చులు భరించాలంటే.. కచ్చితంగా అందుకు చిన్న నాటి నుంచే తగిన ప్రణాళిక కావాలి. అన్ని అవసరాలను తీర్చేంత నిధి సమకూర్చుకోవాలి. దీన్ని విస్మరిస్తే విశ్రాంత జీవనంలో ఇబ్బందులు (స్థిర, చరాస్తులు కలిగిన వారు మినహా) ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఎన్పీఎస్ నిధి ఎలానూ ఉంటుంది. ప్రైవేటు రంగంలోని వారికి ఈపీఎఫ్ సదుపాయం ఉంది. కానీ, దీని వాటా స్వల్ప మొత్తమే. ఇంకాస్త అదనంగా ఈపీఎఫ్కు జమ చేసుకుంటానంటే అందుకు వీలు పడదు. కానీ, ఇటువంటి వారు ఈపీఎఫ్కు అదనంగా మరికొంత మొత్తాన్ని ప్రతి నెలా స్వచ్ఛ్చంద భవిష్యనిధి (వీపీఎఫ్) రూపంలో సమకూర్చుకోవచ్చు. సులభ ప్రక్రియ ఈపీఎఫ్కు కొనసాగింపు వీపీఎఫ్. వేతన జీవులకే ఈ అవకాశం. వీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అది సులభమే. తాము పనిచేస్తున్న సంస్థకు ఆ విషయాన్ని తెలియజేసి రిజి స్ట్రేషన్ ఫామ్ను పూర్తి చేసి ఇస్తే సరిపోతుంది. ప్రతి నెలా ఎంత మొత్తాన్ని వీపీఎఫ్కు జమ చేయాలన్నది కూడా తెలియజేయాలి. అప్పటి వరకు కొనసాగుతున్న ఈపీఎఫ్ ఖాతాయే వీపీఎఫ్కూ వర్తిస్తుంది. వీపీఎఫ్ రూపంలో అదనంగా జమ చేసే మొత్తం కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్కే కలుస్తుంది. వీపీఎఫ్లో పెట్టుబడుల పరంగా సౌలభ్యం కూడా ఉంది. వీలున్నంత కాలం ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాత కొంత కాలం పాటు నిలిపివేయవచ్చు. అయితే, కొన్ని సంస్థలు ఏడాదికి ఒక్కసారే మార్పులకు అనుమతిస్తున్నాయి. రిస్క్లేని అధిక రాబడులు రిటైర్మెంట్ తర్వాత అవసరాల కోసం స్థిరాదాయ సాధనాల్లో పొదుపు చేసుకోవాలనుకునే వారికి వీపీఎఫ్ ఒక మంచి సాధనమన్నది నిపుణుల అభిప్రాయం. ఈపీఎఫ్ చందాకు అదనంగా స్వచ్ఛందంగా ఉద్యోగులు ఇందులో జమ చేసుకోవచ్చు. ప్రైవేటు రంగ ఉద్యోగులకు వారి మూల వేతనం, డీఏలో 12 శాతాన్ని ప్రతి నెలా వేతనం నుంచి మినహాయించి వారి ఈపీఎఫ్ ఖాతాకు సంస్థలు జమ చేస్తుంటాయి. ఇంతే మొత్తాన్ని ఉద్యోగి తరఫున సంస్థ కూడా తన వాటాగా అందజేస్తుంది. కానీ, ఈ పరిమితికి మించి ఈపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అవకాశం లేదు. దీనికి అదనంగా రిటైర్మెంట్ ఫండ్ కోసం మరికొంత పొదుపు చేసుకోవాలని భావించే వారికి వీపీఎఫ్ అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగి తన మూలవేతనం, డీఏకు నూరు శాతం సమాన మొత్తాన్ని ప్రతి నెలా వీపీఎఫ్లో జమ చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి మూల వేతనం 12,000, డీఏ రూ.3,000 అనుకుంటే అప్పుడు ప్రతి నెలా గరిష్టంగా రూ.15,000ను వీపీఎఫ్లో జమ చేసుకోవచ్చు. వీపీఎఫ్ ఎందుకు ఆకర్షణీయం అంటే.. ఈపీఎఫ్ చందాలపై లభించే వడ్డీ రేటే వీపీఎఫ్ నిధికి కూడా వర్తిస్తుంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) ప్రతీ ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడులపై వచ్చిన ఆదాయం, నిధుల లభ్యతకు అనుగుణంగా వడ్డీ రేటును నిర్ణయిస్తుంటుంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ రేటు 8.65 శాతం కాగా, 2019–20 సంవత్సరానికి 8.5 శాతంగా నిర్ణయించింది. స్థిరాదాయ పథకాల్లో ఇది అత్యధిక రేటు. కొంత మంది విడిగా పీపీఎఫ్ ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ పీపీఎఫ్తో పోలిస్తే కనీసం అర శాతానికి పైనే వీపీఎఫ్లో వడ్డీ రేటు ఉంటుందని ఆశించొచ్చు. ఈపీఎఫ్, వీపీఎఫ్ రెండూ కూడా క్యుములేటివ్ ఇన్వెస్ట్మెంట్ సాధనాలే. అంటే ఇందులో చేసే పెట్టుబడులపై వడ్డీ ఆదాయం ఏటా అసలుకు కలుస్తుంటుంది. దీంతో దీర్ఘకాలంలో మంచి కాంపౌండింగ్ వృద్ధి ఉంటుంది. అయితే, ఈపీఎఫ్ జమలకు వర్తించే లాకిన్, పాక్షిక ఉపసంహరణల నిబంధనలే వీపీఎఫ్కూ వర్తిస్తాయి. రాబడుల వ్యత్యాసం బ్యాంకు డిపాజిట్లపై ఇప్పుడు వడ్డీ రేటు 6.5% స్థాయిలకు పడిపోయింది. దీంతో వడ్డీ రేటు పరంగా వీపీఎఫ్ ఎంతో ఆకర్షణీయమనే చెప్పొచ్చు. పెద్దల కోసం ఉద్దేశించిన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (8.6%)ను మినహాయిస్తే చిన్న మొత్తాల పొదుపు పథకాల రేట్లతో పోల్చి చూసినా వీపీఎఫ్ రేటే అధికం. ఈక్విటీల్లో ఈపీఎఫ్ పెట్టుబడులు పెరుగుతూ ఉండడం, కార్మిక సంఘాల డిమాండ్ల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్, వీపీఎఫ్పై అధిక వడ్డీ రేటును నిర్ణయించక తప్పడం లేదు. రిటైర్మెంట్ పథకం ఎన్పీఎస్లో ఈక్విటీలకు గరిష్టంగా 75% కేటాయింపులకు అవకాశం ఉండడంతో దీర్ఘకాలంలో వీపీఎఫ్తో పోలిస్తే కొంత అదనపు రాబడులకు వీలుంది. కానీ, గడువు ముగిసిన తర్వాత ఉపసంహరించుకునే విషయంలో పరిమితులు న్నాయి. ఆ విధంగా చూసుకుంటే వీపీఎఫ్ ఎం తో సౌలభ్యం. ఈపీఎఫ్/వీపీఎఫ్కు చేసే జమ లకు కేంద్రం హామీ ఉండడం అదనపు ఆకర్షణ. పన్ను వర్తించని సాధనం వీపీఎఫ్కు చేసే జమలు, రాబడులు, ఉపసంహరణలు అన్నీ కూడా పన్ను ఆదా ప్రయోజనం కలిగినవి. ఎన్పీఎస్లో గడువు తీరే నాటికి సమకూరిన నిధిలో 40 శాతంపై పన్ను చెల్లించి ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తే, వీపీఎఫ్లో జమ అయిన మొత్తాన్ని ఎటువంటి పన్ను లేకుండా వెనక్కి తీసేసుకోవచ్చు. ఇందులో చేసే జమలకు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఏ దశలోనూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు కనుక.. వాస్తవికంగా పొందే రాబడి రేటు మెరుగైనదిగా భావించాలి. అయితే, వడ్డీ రేటు 9.5 శాతం మించితే అప్పుడు ఆ మొత్తంపై పన్ను చెల్లించాలి. కానీ, ఇటీవలి సంవత్సరాల్లో ఈపీఎఫ్, వీపీఎఫ్పై వడ్డీ రేటు 8.5–9 శాతం మధ్యే స్థిరపడడాన్ని చూస్తూనే ఉన్నాం. రిటైర్మెంట్ అనంతరం ఈపీఎఫ్, వీపీఎఫ్ నిధిని పన్ను లేకుండా వెనక్కి తీసేసుకోవచ్చు. ఒకవేళ రిటైర్మెంట్కు ముందుగా ప్రత్యేక అవసరాల్లో కొంత వెనక్కి తీసుకున్నా కానీ పన్ను చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. అయితే, కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన తర్వాత తీసుకుంటేనే పన్ను మినహాయింపు ప్రయోజనం వర్తిస్తుంది. ఐదేళ్ల సర్వీసు పూర్తి కాకముందే ఉపసంహరించుకునే మొత్తం రూ.50,000 మించితే 10 శాతాన్ని టీడీఎస్ కింద మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తారు. అలాగే, అప్పటి వరకు ఆర్జించిన వడ్డీ రాబడిపైనా పన్ను పడుతుంది. అవసరాల్లో అక్కరకు.. ఆర్థిక అత్యవసరాల్లో ఈపీఎఫ్లో మాదిరే వీపీఎఫ్ బ్యాలెన్స్ను కూడా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పిల్లల వివాహాలు, వారి ఉన్నత విద్య, వైద్య అవసరాల కోసం, గృహ కొనుగోలుకు ఇందులోని బ్యాలెన్స్ను వెనక్కి తీసుకునేందుకు ఈపీఎఫ్వో అనుమతిస్తుంది. నిర్ణీత కాలం పాటు ఉద్యోగం లేకుండా ఉన్నా బ్యాలెన్స్ను ఉపసంహరించుకోవచ్చు. ఒక నెలకు మించి ఉద్యోగం లేకుండా కొనసాగితే, వీపీఎఫ్/ఈపీఎఫ్ బ్యాలెన్స్లో 75 శాతాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. వరుసగా రెండు నెలల పాటు ఉద్యోగం లేని యెడల మిగతా మొత్తాన్ని కూడా వెనక్కి తీసేసుకోవచ్చు. పీపీఎఫ్తో పోలిస్తే ఎన్నో విధాలుగా ఈపీఎఫ్, వీపీఎఫ్లు ప్రయోజనకరం. పీపీఎఫ్లో పాక్షిక ఉపసంహరణలు, అది కూడా ఏడో ఏట నుంచే అవకాశం కల్పిస్తారు. 15 ఏళ్లు పూర్తయిన తర్వాతే పూర్తిగా వెనక్కి తీసుకోగలరు. కానీ, ఈపీఎఫ్/వీపీఎఫ్లో ఉపసంహరణల పరంగా సౌలభ్యత ఎక్కువ. పైగా రాబడి రేటు కూడా పీపీఎఫ్లో ప్రస్తుతమున్న 7.9 శాతంతో పోలిస్తే ఎక్కువే. -
ఈపీఎఫ్ వడ్డీపై కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)పై 8.65 శాతం వడ్డీ అందించాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2018–19 కాలానికి 6 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ వడ్డీరేటు 2017–18 కాలానికి 8.55గా ఉండేది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్వో సంస్థ ఇకపై చందాదారుల క్లెయిమ్లను 8.65 శాతం వడ్డీతో సెటిల్ చేయనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈపీఎఫ్ రేటును 8.65 శాతానికి పెంచుతూ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ నిర్ణయానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. (చదవండి: పండగ సీజన్కు ముందే చెల్లింపు) -
జెట్కు ఈపీఎఫ్వో నోటీసులు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ని మరిన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ నిధులు, ఇతరత్రా బకాయీలను జమ చేయనందుకుగానూ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) జెట్ ఎయిర్వేస్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మొత్తం బకాయిలపై విచారణ జరపనున్నట్లు, ప్రావిడెంట్ ఫండ్లో ఉద్యోగుల వాటాను జమ చేయనందుకు పోలీస్ కేసు పెట్టనున్నట్లు సంస్థ ఎండీకి పంపిన లేఖలో ఈపీఎఫ్వో ముంబై ప్రాంతీయ కార్యాలయం అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ దిలీప్ కే రాథోడ్ స్పష్టం చేశారు. లేఖ ప్రకారం 2019 మార్చి నుంచి బకాయిలు పేరుకుపోయాయి. మరోవైపు, బకాయిలు చెల్లించకపోవడంతో జెట్ ఎయిర్వేస్కి అద్దెకిచ్చిన పలు కార్యాలయాలను ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తమ స్వాధీనంలోకి తీసుకుంది. ఎయిర్లైన్ సమర్పించిన బ్యాంక్ గ్యారంటీలను నగదుగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ఏఏఐ వర్గాలు తెలిపాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ ఏప్రిల్ 17 నుంచి కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. జెట్కు బిడ్స్ దాఖలు.. జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు సంబంధించి ఎతిహాద్ ఎయిర్వేస్తో పాటు మరికొన్ని సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు ఎస్బీఐ క్యాప్స్ వెల్లడించింది. సీల్డ్ కవర్లో వచ్చిన బిడ్లను పరిశీలించేందుకు రుణదాతలకు సమర్పించనున్నట్లు సంస్థ వెల్లడించింది. జెట్లో 31.2–75 శాతం దాకా వాటాల విక్రయానికి బ్యాంకుల కన్సార్షియం బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అర్హత పొందిన సంస్థలు ఆర్థిక బిడ్లు దాఖలు చేయడానికి మే 10 (శుక్రవారం) ఆఖరు తేదీ. దీనికి అనుగుణంగా ఎతిహాద్ తదితర సంస్థల నుంచి బిడ్స్ వచ్చినట్లు బిడ్డింగ్ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్బీఐ క్యాప్స్ పేర్కొంది. బ్యాంకులకు జెట్ ఎయిర్వేస్ దాదాపు రూ. 8,000 కోట్లు బాకీపడింది. ప్రస్తుతం సంస్థలో బ్యాంకులకు 51 శాతం పైగా వాటాలు ఉన్నాయి. షేరు 3 శాతం అప్..: జెట్ కొనుగోలు కోసం బిడ్స్ వచ్చాయన్న వార్తలతో షేరు శుక్రవారం 3 శాతం పెరిగింది. రూ. 151.80 వద్ద క్లోజయ్యింది. -
ఈపీఎఫ్పై 8.65 శాతం వడ్డీ రేటు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్)పై 2018–19 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటు అమలు కానుంది. కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గాంగ్వర్ అధ్యక్షతన ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వడ్డీ రేటు పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకోగా, దీనికి కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. ఈపీఎఫ్వో వడ్డీ రేటు ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం అమోదం తెలిపినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 2017–18లో ఈపీఎఫ్ నిధులపై 8.55 శాతం వడ్డీ రేటు అమలు కాగా, దీన్ని స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2015–16 ఆర్థిక సంవత్సరానికి 8.8 శాతం వడ్డీ రేటు ఉండగా, ఆ తర్వాత రెండు సంవత్సరాల్లో స్వల్పంగా తగ్గించారు. ఆదాయపన్ను శాఖ, కార్మికశాఖ వడ్డీ రేటును నోటిఫై చేసిన తర్వాత చందాదారుల ఖాతాల్లో వడ్డీని జమ చేయాలంటూ దేశవ్యాప్తంగా ఉన్న 120 క్షేత్రస్థాయి అధికారులకు ఈపీఎఫ్వో ఆదేశాలు జారీ చేస్తుంది. సభ్యుల భవిష్యనిధిపై 8.65 శాతం వడ్డీ చెల్లించిన అనంతరం కూడా సంస్థ వద్ద రూ.151.67 కోట్ల మిగులు నిల్వలు ఉంటాయని అంచనా. -
ఆర్థికంగా వెలిగిపోదాం!
నూతన ఆర్థిక సంవత్సరం 2019–20లోకి ప్రవేశించి మూడు వారాలు గడిచిపోయింది. ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ, వ్యయాలకు తోడు పన్ను బాధ్యతలు ఎదురవుతుంటాయి. ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఓ ప్రణాళిక రూపొందించుకుని దానిని ఆచరణలో పెడితే ఒడిదుడుకులు లేకుండా సాఫీగా జీవనం కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. తమ పెట్టుబడుల పోర్ట్ఫోలియోను ఏడాదికి ఒకసారి అయినా తప్పకుండా సమీక్షించాలని, అందుకు ఏప్రిల్ మాసం సరైనదిగా నిపుణుల అభిప్రాయం. ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి తమ పెట్టుబడులకు సంబంధించి అనుసరించ తగిన మార్గాలపై నిపుణుల సూచనలు ఇలా ఉన్నాయి. ఈఎల్ఎస్ఎస్లో సిప్ ఏప్రిల్ నుంచే పన్ను ఆదాకు ఉపయోగపడే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాల్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ప్రతీ నెలా పెట్టుబడుల ప్రణాళికను ఆరంభించాలి. దీంతో ఆర్థిక సంవత్సరం చివర్లో పన్ను ఆదా పెట్టుబడుల గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి రాదని తమన్నావర్మ అనే ఫైనాన్షియల్ అడ్వైజర్ సూచించారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఉండే రిస్క్లే ఈఎల్ఎస్ఎస్కు వర్తిస్తాయి. కనుక ప్రతీ నెలా క్రమం తప్పకుండా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆటుపోట్లను అధిగమించి మెరుగైన రాబడులను అందుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ స్వల్పకాలిక పనితీరు చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఒక్కసారి ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేస్తే మూడేళ్లు లాకిన్ అయినట్టే. అయితే, ఇది మెరుగైన రాబడులకు వీలు కల్పిస్తుంది. వాలంటరీ పీఎఫ్ (వీపీఎఫ్) ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) పథకం పరిధిలో ఉన్న వారికి అందు బాటులో ఉన్న చక్కని సాధనం వీపీఎఫ్. ఈపీఎఫ్కు అనుబంధంగా సభ్యులు చేసే స్వచ్ఛంద కంట్రిబ్యూషన్. ఈపీఎఫ్కు వర్తించే పన్ను మినహాయింపులు వీపీఎఫ్కూ వర్తిస్తాయి. సెక్షన్ 80సీ కింద 1.5 లక్షల వరకు పెట్టబడులకు వీపీఎఫ్ చందాలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. అలాగే, రాబడులు, ఉపసంహరణలపైనా పన్ను ఉండదు. కనుక మూడు రకాల పన్ను ఆదా ప్రయోజనాలు వీపీఎఫ్తో పొందొచ్చు. ఈపీఎఫ్ చందాలకు అమలయ్యే వడ్డీ రేటే వీపీఎఫ్కూ చెల్లుబాటు అవుతుంది. పీపీఎఫ్లోనూ ఇదే మాదిరి పన్ను ఆదా ప్రయోజనాలున్నప్పటికీ ఈపీఎఫ్తో పోలిస్తే వడ్డీ రేటు తక్కువ. డెట్లో పెట్టుబడులకు వీపీఎఫ్ మెరుగైన మార్గం. వేతనం బ్యాంకు ఖాతాలో జమ కావడానికి ముందే వీపీఎఫ్ చందాను ఉద్యోగ సంస్థ మినహాయించడం చెల్లింపుల కోణంలో సానుకూలం. ఇంక్రిమెంట్ కూడా... ఏటా ఏప్రిల్లో ఇంక్రిమెంట్లు పడుతుంటాయి. అంటే ఆదాయం పెరిగినట్టే. పెరిగిన వేతనానికి తగ్గట్టే పెట్టుబడుల మొత్తాన్ని పెంచుకోవాలని నిపుణుల సూచన. చాలా మంది ఎప్పటి మాదిరే మ్యూచువల్ ఫండ్స్ సిప్ కొనసాగిస్తుంటారని, పెరిగిన వేతనం మేరకు పెట్టుబడులను పెంచుకునే వారు తక్కువేనంటున్నారు. కనుక ఈ విధమైన పొరపాట్లకు తావివ్వకుండా ఏప్రిల్ నుంచే సిప్ మొత్తాలను పెంచుకోవాలని సూచిస్తున్నారు. పెరిగిన ఇంక్రిమెంట్లో కనీసం 20 శాతాన్ని అయినా పెట్టుబడుల వైపు మళ్లించాలన్నది సూచన. రిటైర్మెంట్ కోసం ఎన్పీఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. దేశంలో ఎవరైనా సరే ఈ పథకంలో చేరి 60 ఏళ్ల వరకు చందాలు చెల్లిస్తూ వెళ్లొచ్చు. విశ్రాంత జీవన అవసరాల కోసం ఉద్దేశించినది ఈ పథకం. గడువు తీరిన తర్వాత 60% మొత్తాన్ని పన్ను లేకుండా వెనక్కి తీసేసుకోవచ్చు. మిగిలిన 40%తో పెన్షన్ యాన్యుటీ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మొత్తంపై అప్పటి రేటు ప్రకారం పెన్షన్ అందుతుంది. ఈ పథకంలో గరిష్టంగా ఈక్విటీలకు 75% కేటాయింపులు చేసు కోవచ్చు. ఇప్పటికీ ఎన్పీఎస్ ఖాతా తెరవని వారు, ప్రారం భించేందుకు ఏప్రిల్ అనువైనది. నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉండి, కేవైసీ నిబంధనలను ఇప్పటికే పూర్తి చేసిన వారు ఆన్లైన్లోనే ఎన్పీఎస్ ఖాతాను తెరవొచ్చు. ఎన్పీఎస్ పోర్టల్కు వెళ్లి అక్కడి సూచనలను అనుసరించండి. పెట్టుబడులకూ ఓ లెక్క... ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక మొత్తాన్ని ఏప్రిల్ నెలలోనే అమలు చేసేయాలని, లేదా మార్చిలో చేయాలనుకోవడం కూడా సరికాదు. ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది కనుక, ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ రానుంది. అందులో ఏవైనా మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆ మార్పులకు అనుగుణంగా ప్రణాళికను కూడా మార్చుకోవాల్సి రావచ్చు. కనుక ఒకేసారి పెట్టుబడులకు దూరంగా ఉండాలి. క్రమానుగత పెట్టుబడులే ఉత్తమం. ఏడాది పొడవునా పెట్టుబడులను కొనసాగించడం వల్ల మార్పు, చేర్పులకు అవకాశం ఉంటుందని పీక్ ఆల్ఫా ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ డైరెక్టర్ ప్రియా సుందర్ పేర్కొన్నారు. దీనివల్ల మరింత ప్రయోజనం ఉండే పన్ను ఆదా పథకాలను ఎంచుకునేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. టీడీఎస్... బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఒక ఏడాదిలో రూ.10,000 మించితే టీడీఎస్ను గతంలో అమలు చేసే వారు. దీన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి రూ.40,000కు పెంచారు. అదే 60 ఏళ్లు దాటిన వారికి 50,000 వడ్డీ ఆదాయంపై టీడీఎస్ ఉండదు. ఒకవేళ వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో 40,000–50,000 మించినట్టయితే, అదే సమయంలో పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ.2.5 లక్షలు మించని వారు టీడీఎస్ లేకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం ఫామ్ 15హెచ్/15జీ ఇవ్వాలి. పన్నుల్లో మార్పులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) సంబంధించిన మధ్యంతర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పన్ను పరంగా కొన్ని మార్పులు చేసింది. నూతన ఆర్థిక సంవత్సరం మొదలైంది కనుక మరోసారి వీటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అవసరం. రూ.5 లక్షలకు పన్ను లేదు రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారు ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కనీస మినహాయింపు రూ.2.5 లక్షల ఆదాయానికి ఆదాయపన్ను లేదన్న విషయం తెలిసినదే. దీనికి అదనంగా మరో రూ.2.5 లక్షల ఆదాయం ఉన్న వారు 5 శాతం పన్ను రేటు ప్రకారం రూ.12,500ను చెల్లించాల్సి ఉండేది. అయితే, సెక్షన్ 87 కింద 12,500 వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. కనుక రూ.2.5 లక్షలపైన ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించేంత ఆదాయం లేకపోయినప్పటికీ రిటర్నులు సమర్పించడం తప్పనిసరి. ప్రామాణిక మినహాయింపు ప్రామాణిక మినహాయింపు (స్టాండర్డ్ డిడక్షన్) రూ.40,000 నుంచి రూ.50,000కు పెరిగింది. 2018లో ఈ స్టాండర్డ్ డిడక్షన్ను కేంద్రం తిరిగి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అదే సమయంలో ట్రాన్స్పోర్ట్, మెడికల్ రీయింబర్స్మెంట్పై మినహాయింపులను ఎత్తివేసింది. నోషనల్ రెంట్పై అద్దెలేదు పన్ను చెల్లింపుదారుల పేరిట రెండో ఇల్లు ఉండి, దానిపై అద్దె ఆదాయం ఏదీ లేకపోయినా నోషనల్ రెంట్ (ఊహాజనిత) పేరుతో పన్ను వేసే వారు. అయితే, 2019–20 నుంచి ఈ తరహా నోషనల్ ఆదాయంపై పన్ను లేదు. టీడీఎస్ పరిమితి పెంపు వడ్డీ ఆదాయం ఏటా రూ.10,000 దాటితే మూలం వద్దే పన్ను కోత (టీడీఎస్)ను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, పోస్టాఫీసు అమలు చేసేవి. కాకపోతే ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రూ.40,000 వరకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ అమలు చేయరు. అంతకుమించితేనే అమలు చేస్తారు. 60 ఏళ్లు దాటిన వారికి ఇది రూ.50,000గా అమలవుతుంది. ఇంటిపై క్యాపిటల్ గెయిన్స్ ఇల్లు అమ్మగా వచ్చిన మూలధన లాభంపై పన్ను చెల్లించడానికి బదులు ఆ మొత్తంతో మరో ఇల్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఇకపై ఒక ఇంటి విక్రయంపై వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభంతో (ఎల్టీసీజీ) రెండు ఇళ్లు కొనుగోలు చేసినా గానీ పన్ను చెల్లించక్కర్లేదు. గతంలో ఇది ఒక్క ఇంటికే పరిమితమైంది. కాకపోతే ఎల్టీసీజీ రూ.2 కోట్లకు మించకుండా ఉంటేనే ఈ ప్రయోజనం వర్తిస్తుంది. అత్యవసర నిధి ప్రతీ కుటుంబానికీ అత్యవసర నిధి ఎంతో అవసరం. కనీసం 4–6 నెలల కుటుంబ అవసరాలకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధి కింద సమకూర్చి పెట్టుకోవాలని నిపుణుల సూచన. ఒకవేళ అత్యవసర నిధి ఇప్పటికీ సమకూర్చుకోని వారు ఆలస్యం చేయకుండా వెంటనే లిక్విడ్ ఫండ్స్లో పెట్టుబడులను ఆరంభించుకోవాలి. -
ఇక వాస్తవిక వేతనం ఆధారంగా పింఛన్
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఎలాంటి గరిష్ట పరిమితి లేకుండా ఉద్యోగులు పదవీవిరమణ సమయానికి పొందుతున్న వాస్తవిక మూలవేతనం, డీఏ ఆధారంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) ఖాతాదారులందరికీ పింఛన్ దక్కనుంది. ఈమేరకు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా ఈపీఎఫ్వో తాజాగా నూతన విధానం రూపొందించనుంది. పింఛను లెక్కించేందుకు గరిష్ట పరిమితి విధానం కాకుండా పూర్తి వేతనాన్ని (చివరి మూల వేతనం, డీఏ) పరిగణనలోకి తీసుకోవాలంటూ.. గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఈపీఎఫ్ఓ దాఖలు చేసిన పిటిషన్ను.. సుప్రీంకోర్టు ఈనెల ఒకటో తేదీన తోసిపుచ్చింది. ఈపీఎఫ్వో దాఖలు చేసిన పిటిషన్లో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలేవీ లేవని చెబుతూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో ప్రైవేటురంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు పదవీ విరమణ పొందే సమయంలో తీసుకునే మూలవేతనం, డీఏ ఆధారంగా íపింఛన్ పొందే అవకాశం లభించింది. పింఛన్ లెక్కింపు ఇలా! ఇకపై ఉద్యోగి వాస్తవిక మూలవేతనం, డీఏను ఆధారంగా íపింఛన్ లెక్కిస్తారు. ఉద్యోగి సర్వీసును పరిగణనలోకి తీసుకుని నిర్ణీత ఫార్ములా ప్రకారం దీన్ని ఖరారు చేస్తారు. ఇప్పటివరకు ఈపీఎఫ్వో ఉద్యోగికి వేతనం ఎంత ఉన్నా పింఛన్ లెక్కించేందుకు గరిష్ట పరిమితి విధించింది. 2014 సెప్టెంబరు వరకు ఈ పరిమితి రూ.6,500గా ఉండేది. ఆ తదుపరి గరిష్ట పరిమితిని రూ.15 వేలకు పెంచింది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. 2014 సెప్టెంబరు కంటే ముందుగా పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు చివరి వాస్తవిక వేతనం ఆధారంగానే పింఛన్ పొందేందుకు అర్హత ఉంది. అయితే తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కారణంగా 2014 తరువాత పదవీ విరమణ చేసే ఉద్యోగులకూ ఈ సూత్రం వర్తించనుంది. ఈ కారణంగా పదవీ విరమణ అనంతరం íపింఛన్ గణనీయంగా పెరగనుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈపీఎఫ్వో కొత్త పింఛన్ విధానాన్ని రూపొందించాల్సి ఉంది. ఈమేరకు ఈపీఎఫ్ఓ మార్గదర్శకాలను విడుదల చేయాలి. వాటి ప్రకారం కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ఇలా పెరుగుతుంది! ఇప్పటి వరకు గరిష్ట పరిమితి, సర్వీసు గుణించి దానిని 70తో భాగించడం ద్వారా పింఛన్ లెక్కించేవారు. అంటే గరిష్ట పరిమితి అయిన రూ.15 వేలను సర్వీసుతో గుణించి 70తో భాగించే వారు. 20ఏళ్ల సర్వీసు ఉంటే రూ.4,285గా లెక్కించేవారు. కానీ ఇకపై రూ.15 వేలు కాకుండా వాస్తవ వేతనం ఆధారంగా.. అంటే పదవీవిరమణ పొందే సమయంలో వాస్తవిక మూలవేతనం, డీఏ కలిపి రూ.40 వేలు, సర్వీసు 20ఏళ్లు ఉంటే రూ.11,428 చొప్పున íపింఛన్ లభిస్తుంది. మూలవేతనం, డీఏ, సర్వీసు పెరిగే కొద్దీ పదవీవిరమణ అనంతరం వచ్చే పింఛన్ పెరుగుతుంది. ఈపీఎస్ సర్దుబాటు ఎలా? ఉద్యోగులు మూలవేతనం, డీఏలో 12% తమవంతు వాటాగా ఈపీఎఫ్కు చెల్లిస్తారు. అంతేమొత్తాన్ని ఈ ఖాతాకు యాజమాన్యం జతచేస్తుంది. యాజమాన్యం జమ చేసే 12% లో 8.33% íపింఛన్ పథకానికి (ఈపీఎస్) వెళ్తుంది. మిగిలిన సొమ్ము పీఎఫ్ ఖాతాకు వెళుతుంది. అంటే ఉద్యోగి రూ.1,800 చెల్లిస్తాడనుకుంటే.. యాజమాన్యం చెల్లించే రూ.1,800లో రూ.1,250 ఈపీఎస్కు, రూ.550 పీఎఫ్ ఖాతాకు వెళుతుంది. తాజా గా సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈపీఎస్కు వెళ్లే మొత్తం పెరుగుతుంది. ఇందుకు సంబంధించి ఈపీఎఫ్వో సవివరంగా మార్గదర్శకాలు జారీచేయాల్సి ఉంది. -
ఠీవీగా రిటైర్మెంట్..!
వేతన జీవులు అందరూ తాము రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నిశ్చింతగా జీవించేందుకు ముందుగానే ప్రణాళికా బద్ధంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఈ విషయమై ఇటీవలి సంవత్సరాల్లో అవగాహన విస్తృతం అవుతోంది. విశ్రాంత జీవితానికి క్రమం తప్పని పెట్టుబడులు ఎంతో కీలకం. ఇందుకోసం బాగా ప్రాచుర్యంలో ఉన్న సాధనాల్లో మ్యూచువల్ ఫండ్స్, యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్లు, నేషనల్ పెన్షన్ సిస్టమ్, ఈపీఎఫ్, పీపీఎఫ్, వీపీఎఫ్ ఉన్నాయి. వీటిలోని లాభ, నష్టాలు తెలుసుకున్న తర్వాత తమ రిస్క్ ప్రొఫైల్కు అనుగుణంగా భిన్న సాధనాల మధ్య ఎంత పెట్టుబడుల కేటాయించాల్సిన మొత్తాలపై ప్రణాళిక వేసుకోవాలి. ఆ తర్వాత క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడంతోపాటు, నిర్ణీత కాలానికి ఆ పెట్టుబడుల మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. ఇందుకు సంబంధించిన పెట్టుబడి సాధనాల వివరాలను తెలియజేసే కథనమే ఇది. మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ పథకాలు రిటైర్మెంట్ జీవనానికి నిధి సమకూర్చుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి డైవర్సిఫైడ్ ఈక్విటీ పథకాలు సరైన ఎంపిక అవుతుంది. లార్జ్క్యాప్, మిడ్క్యాప్, మల్టీక్యాప్, స్మాల్క్యాప్, ఈఎల్ఎస్ఎస్ ఇలా ఎన్నో రకాల పథకాలు ఉన్నాయి. గడిచిన పదేళ్ల కాలంలో మార్కెట్లలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నప్పటికీ ఈ విభాగాల్లోని పథకాలు వార్షికంగా 16–21 శాతం మధ్య రాబడులను ఇచ్చాయి. ఇదే కాలంలో సెన్సెక్స్ టీఆర్ఐ (టోటల్ రిటర్న్ ఇండెక్స్) రాబడులు 17.8 శాతంగా ఉన్నాయి. 25 ఏళ్ల కాలంలో చూసుకుంటే సెన్సెక్స్ వార్షిక రాబడులు 11 శాతంగా ఉన్నాయి. ఇదే కాలంలో టాప్ లార్జ్క్యాప్ ఫండ్స్ వార్షికంగా 19 శాతం ప్రతిఫలాన్ని ఇచ్చాయి. కాకపోతే సెబీ ఇటీవలి కాలంలో పథకాల పునర్వ్యస్థీకరణకు చేసిన మార్పులు, గత ఏడాది కాలంలో మార్కెట్ల పనితీరు నత్తనడకనే ఉండడం వంటి అంశాలతో లార్జ్క్యాప్ పథకాల పనితీరు బెంచ్మార్క్కు అనుగుణంగా లేదు. కనుక మిడ్, స్మాల్క్యాప్ విభాగంలో యాక్టివ్ పథకాలు దీర్ఘకాలంలో మంచి పనితీరు చూపించగలవు. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం, నిర్ణీత కాలానికోసారి పోర్ట్ఫోలియో రీబ్యాలన్స్ చేసుకోవడం, పనితీరు ఆశించిన మేర లేని పథకాల నుంచి వైదొలగి, వాటి స్థానంలో వేరే వాటిని ఎంచుకోవడం చేస్తుండాలి. నిర్ణీత లక్ష్యానికి సమయం దగ్గర పడుతుంటే ఈక్విటీల నుంచి వైదొలిగి సురక్షిత సాధనాల్లోకి పెట్టుబడులు మళ్లించుకోవాలి. ఇందుకోసం అధిక నాణ్యత కలిగిన డెట్ ఫండ్స్, బ్యాంకు ఎఫ్డీలు పనికొస్తాయి. సాధారణ ఈక్విటీ పథకాలకు అదనంగా ప్రత్యేకించి రిటైర్మెంట్ అవసరాల కోసం రిటైర్మెంట్ ప్లాన్లు ఉన్నాయి. ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ఈ విభాగంలోనివే. వీటిల్లో పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద ఆదాయపన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. ఇక టాటా, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ఆది త్య బిర్లా సన్లైఫ్ కూడా పథకాలను ప్రవేశపెట్టాయి. ఇందులో టాటా రిటైర్మెంట్ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. ప్రొగ్రెసివ్, మోడరేట్ పేరుతో నడిచే రెండు ఈక్విటీ పథకాల్లోనూ ఐదేళ్ల కాలంలో రాబడులు 18 శాతం స్థాయిలో ఉన్నాయి. బెంచ్మార్క్ కంటే ఈ పథకం ఎక్కవే రాబడులు తెచ్చిపెట్టింది. యూటీఐ రిటైర్మెంట్, ఫ్రాంక్లిన్ పెన్షన్ అన్నవి డెట్తో కూడిన బ్యాలన్స్డ్ ఫండ్స్. డెట్కు, ఈక్విటీలకు 40:60 నిష్పత్తిలో పెట్టుబడులను కేటాయిస్తాయి. ఈ రెండు పథకాలు గత ఐదేళ్ల కాలంలో వార్షికంగా 10–11 శాతం రాబడులను ఇచ్చాయి. ఈ పథకాలన్నీ కూడా నెలవారీగా తమ పెట్టుబడుల పోర్ట్ఫోలియో వివరాలను ఇన్వెస్టర్లకు వెల్లడిస్తుంటాయి. ఇండెక్స్ ఫండ్స్ 1–1.5 శాతం స్థాయిలో చార్జ్ చేస్తుంటే, ఈటీఎఫ్ల్లో ఎక్స్పెన్స్ రేషియో 0.5 శాతంగా ఉంటోంది. యాక్టివ్గా నడిచే ఈక్విటీ ఫండ్స్ మాత్రం 1.6–2.7 శాతం మధ్య చార్జీలను రాబడుతున్నాయి. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో 2.3–2.8 శాతం మధ్య ఉంది. ఇక డైరెక్ట్ ప్లాన్ల ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటే అర శాతం వరకు ఎక్స్పెన్స్ రేషియో భారం తగ్గుతుంది. పన్ను వివరాలు ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ప్లాన్లు రెండింటిలోనూ పెట్టుబడులకు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఈ ఫండ్స్లో తొలుత పెట్టుబడి చేసేటప్పుడు మినహాయింపు లభిస్తుంది కానీ...వాటిపై వచ్చే రాబడులపై పన్ను వుంటుంది. ఈ రెండూ డెట్తో కూడిన హైబ్రిడ్ ఫండ్స్. మూడేళ్లకు మించి పెట్టుబడులు కొనసాగిస్తే రాబడులపై 20 శాతం పన్ను రేటు చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే ఈ రాబడులకు ఇండెక్సేషన్ (ద్రవ్యోల్బణం మినహాయింపు) ప్రయోజనం ఉంటుంది. మూడేళ్లలోపు వైదొలిగితే ఆ మొత్తాన్ని వార్షిక ఆదాయానికి కలిపి చూపించుకోవాలి. అదే ఈక్విటీ పథకాలు అయితే ఏడాది దాటిన తర్వాత రాబడులపై 10 శాతం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది. ఏడాదిలోపు అయితే 15 శాతం పన్ను పడుతుంది. రిటైర్మెంట్ తర్వాత సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ఎంచుకోవడం ద్వారా ప్రతీ నెలా తమ అవసరాలకు సరిపడా వెనక్కి తీసుకోవచ్చు. దీంతో పన్ను భారం అంతగా ఉండదు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) విశ్రాంత జీవనానికి అందుబాటులో ఉన్న పెట్టుబడి సాధనాల్లో అత్యంత ముఖ్యమైనది ఎన్పీఎస్. ఈక్విటీ, ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్ల సమతూకంతో పలు రకాల పెట్టుబడి ఆప్షన్లు ఎన్పీఎస్లో ఉన్నాయి. ఎనిమిది ఫండ్ మేనేజర్లలో ఇన్వెస్టర్లు తమకు నచ్చిన సంస్థను ఎంచుకోవచ్చు. వీటిల్లో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, యూటీఐ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, కోటక్ మెరుగ్గా ఉన్నాయి. బిర్లా సన్లైఫ్ మినహా మిగిలిన ఫండ్ సంస్థలు ఎన్పీఎస్లు ఏ మేరకు రాబడులను ఇచ్చాయన్నదానిపై ఐదేళ్ల ట్రాక్ రికార్డు అందుబాటులో ఉంది. ఆ వివరాలను పరిశీలించి అనువైన దానిని ఎంచుకోవచ్చు. వార్షికంగా కనీసం రూ.1,000ను ఇన్వెస్ట్ చేయాలి. గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. ఈక్విటీలకు గరిష్టంగా 75 శాతాన్నే యాక్టివ్ చాయిస్ కింద ఎంచుకోవచ్చు. మిగిలిన 25 శాతాన్ని తప్పనిసరిగా కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ సాధనాలకు కేటాయించుకోవాల్సి ఉంటుంది. 50 ఏళ్ల వయసు దాటితే యాక్టివ్ చాయిస్ చందాదారులు ఈక్విటీలకు కేటాయింపులను క్రమంగా 50 శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుంది. అదే ఆటో చాయిస్లో అయితే ఎన్పీఎస్ చందాదారుని వయసు ఆధారంగా ఈక్విటీలకు పెట్టుబడుల రేషియో మారుతూ ఉంటుంది. ఉదాహరణకు 40 ఏళ్ల వ్యక్తి అయితే, 100 సంవత్సరాల కాలంలో 40 ఏళ్లను తీసివేయగా, మిగులు 60 శాతం ఉంటుంది కనుక ఈ విధానం ప్రాతిపదికన ఆటో చాయిస్లో ఈక్విటీలకు 60 శాతం డెట్సాధనాలకు 40 శాతం ఫండ్ మేనేజర్లే కేటాయింపులు చేస్తారు. ఈక్విటీల్లోనూ ఇండెక్స్ ఫండ్స్, సెన్సెక్స్, నిఫ్టీ 50, నిఫ్టీ 100 స్టాక్స్లోనే ఫండ్స్ సంస్థలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరి. గడిచిన ఐదేళ్ల కాలంలో ఈక్విటీతో కూడిన పెట్టుబడి ఆప్షన్ కింద ఫండ్స్ మేనేజింగ్ సంస్థలు వార్షికంగా 11–13 శాతం మధ్య రాబడులను ఇచ్చాయి. ఇందులో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, కోటక్, యూటీఐ 12 శాతానికి పైబడి రాబడులను ఇచ్చాయి. గిల్ట్ విభాగంలో పెట్టుబడులపై ఇవి గత ఐదేళ్ల కాలంలో వార్షికంగా 10–11 శాతం మేర రాబడులు తెచ్చి పెట్టాయి. కార్పొరేట్ బాండ్స్ విభాగంలో రాబడులు 9–10 శాతం మధ్య ఉన్నాయి. పాక్షిక ఉపసంహరణలకు అనుమతి కొన్ని రకాల అనారోగ్యాలతో ఆస్పత్రి పాలైతే, పిల్లల విద్యావసరాలు, ఇంటి కొనుగోలు సమయాల్లో పాక్షిక ఉపసంహరణలకు ఎన్పీఎస్ పథకంలో అనుమతి ఉంది. ఎన్పీఎస్ ఫండ్ మేనేజర్లు నెలవారీగా, కొన్ని సందర్భాల్లో అర్ధ సంవత్సరానికోసారి పోర్ట్ఫోలియో వివరాలను వెల్లడిస్తుంటాయి. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ ఎన్పీఎస్ను ప్రారంభించుకోవచ్చు. ఖాతా ప్రారంభ చార్జీ కింద రూ. 40 చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక నిర్వహణ ఫీజు కింద ఎన్ఎస్డీఎల్కు రూ. 95 చెల్లించాలి. వీటికి అదనంగా ప్రతీ లావాదేవీపై రూ.3.75 చార్జీ ఉంటుంది. కార్వీ సంస్థ తక్కువ చార్జీలను వసూలు చేస్తోంది. ఇంకా పాయింట్ ఆప్ ప్రెజెన్స్ (డిస్ట్రిబ్యూటర్కు చెల్లించేది) చార్జీ పేరుతో ప్రారంభంలో రూ.200 చార్జీ చెల్లించుకోవాలి. అంతేకాదు, ఇక ఆ తర్వాత చేసే అన్ని పెట్టుబడులపై 0.25 శాతం కమీషన్ కూడా డిస్ట్రిబ్యూటర్కు వెళుతుంది. ఈఎన్పీఎస్ ద్వారా పెట్టుబడి పెడితే అప్పుడు పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్కు కేవలం 0.1 శాతమే కమీషన్ వెళుతుంది. కనుక ఆన్లైన్లో నేరుగా ఎన్పీఎస్ సైట్ ద్వారా చందాలు చేసుకోవడం ద్వారా ఆదా చేసుకోవచ్చు. అలాగే, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఫీజు కూడా వార్షికంగా 0.01 శాతమే పడుతుంది. ఆదాయపన్ను ప్రయోజనాలు ఎన్పీఎస్కు అదనంగా ఉన్నాయి. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పెట్టుబడుల తర్వాత కూడా మరో రూ.50,000 మొత్తంపై పన్ను మినహాయింపును సెక్షన్ 80సీసీడీ కింద ఎన్పీఎస్లో పెట్టుబడుల ద్వారా పొందే అవకాశం ఉంది. ఎన్పీఎస్లో రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేసినా మొత్తం సెక్షన్ 80సీ, సీసీడీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. 60 ఏళ్ల తర్వాత మొత్తం నిధిలో 60 శాతాన్ని పన్ను లేకుండా వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన 40 శాతాన్ని పెన్షన్ యాన్యుటీ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాలి. యూనిట్లింక్డ్ ప్లాన్లు ఈక్విటీ ఆధారిత పెన్షన్ ప్లాన్లు కూడా ఉన్నాయి. వీటిని బీమా సంస్థలు ఆఫర్ చేస్తుంటాయి. బజాజ్ అలియాంజ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, ఎస్బీఐ లైఫ్ పెన్షన్లను ప్లాన్లను అందిస్తున్నాయి. బీమా సంస్థలు తాము నిర్వహించే ఈక్విటీ, డెట్ లేదా హైబ్రిడ్ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. రాబడులకు హామీ ఉండదు. మార్కెట్ పనితీరు ఆధారంగానే ఉంటాయి. గడిచిన మూడేళ్ల కాలంలో వార్షిక రాబడులు ఎంచుకున్న పథకాలను బట్టి 6.5–14.1 శాతం మధ్య ఉన్నాయి. ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడులు 7.3–12.6 శాతంగా ఉన్నాయి. ఎటువంటి చార్జీలను మినహాయించకముందు రాబడుల వివరాలు ఇవి. రాబడులు ఆశించిన విధంగా లేకపోతే భిన్న ఆప్షన్ల మధ్య పెట్టుబడులను మార్చుకునే అవకాశాన్ని బీమా సంస్థలు ఈ పథకాల్లో అనుమతిస్తున్నాయి. రిటైర్మెంట్ ప్లాన్ గడువు ముగిసిన తర్వాత సమకూరిన నిధిలో మూడింట రెండొతులను పెన్షన్ యాన్యుటీ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. ఒక వంతును వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్లు ప్రతీ నెలా పోర్ట్ఫోలియో వివరాలను వెల్లడిస్తుంటాయి. కాకపోతే ఈ పాలసీల్లో బీమా కూడా ఉంటుంది కనుక అదనపు చార్జీల భారాన్ని మోయాల్సి వస్తుంది. యూనిట్ లింక్డ్ప్లాన్ ఎందులో అయినా పెట్టుబడులు, బీమా కలగలసి ఉంటాయి. దీంతో మోర్టాలిటీ చార్జీలు, పాలసీ అడ్మినిస్ట్రేషన్ చార్జీలు, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు, ప్రీమియం అలోకేషన్ చార్జీలు ఇలా రకరకాల రూపంలో చార్జీల భారం ఉంటుంది. ఫండ్ మేనేజ్మెంట్ చార్జీ 1–1.35 శాతం వరకు ఉంటుంది. పాలసీ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ 0.3–0.4గా ఉంటుంది. వార్షిక ప్రీమియానికి బీమా మొత్తం కనీసం 10 రెట్లు ఉంటే, పన్ను మినహాయింపు లభిస్తుంది. సెక్షన్ 80సీ కింద ప్రీమియానికి పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే, ఉపసంహరణ సమయంలో ఒక వంతుకు పన్ను ఉండదు. మిగిలిన రెండొంతులను యాన్యుటీ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ దీర్ఘకాలిక లక్ష్యాల కోసం అందుబాటులో ఉన్న సురక్షిత పెట్టుబడి సాధనాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఒకటి. ఇందులో పెట్టుబడులకు హామీ ఉంటుంది. ప్రస్తుత వడ్డీ రేటు 8 శాతం. ప్రతీ త్రైమాసికానికి వడ్డీ రేట్లను కేంద్రం సవరిస్తుంటుంది. దీనికి అదనంగా పన్ను మినహాయింపులు (పెట్టుబడులపై, రాబడులు, ఉపసంహరణలపైనా) ఉన్నందున ఇది ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన సాధనం. ఇది డెట్ సాధనం. వ్యవధి 15 ఏళ్లు. ఆ తర్వాత కావాలంటే వ్యవధిని ఐదేళ్లు పెంచుకోవచ్చు. కనుక దీర్ఘకాలిక అవసరాల కోసం తగిన ఎంపిక అవుతుంది. ఏడాదిలో కనీసం 500 ఇన్వెస్ట్ చేసినా సరిపోతుంది. గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల పెట్టుబడులకే పన్ను మినహాయింపు లభిస్తుంది. మొదటి ఇన్స్టాల్మెంట్ చెల్లించిన ఆర్థిక సంవత్సరం చివరి నుంచి 15 ఏళ్ల కాల వ్యవధి అమల్లోకి వస్తుంది. ఉదాహరణకు 2018 అక్టోబర్లో మొదటి వాయిదా కట్టారనుకోండి. అప్పుడు 2019 ఏప్రిల్ 1 నుంచి 2034 ఏప్రిల్1 వరకు కాల వ్యవధి అమలవుతుంది. మూడు నుంచి ఆరో ఏట వరకు రుణం తీసుకోవచ్చు. రుణం తీసుకోవడానికి రెండేళ్ల ముందు నాటికి ఉన్న బ్యాలన్స్లో 25 శాతాన్ని రుణంగా ఇస్తారు. తిరిగి మూడేళ్ల కాలంలో రుణాన్ని తీర్చివేయాలి. ఏడో ఏట నుంచి పాక్షిక ఉపసంహరణలకు అనుమతి ఉంటుంది. పీపీఎఫ్లో పెట్టుబడులు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ1.5 లక్షలపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. అలాగే, పెట్టుబడులపై వడ్డీ, చివర్లో ఉపసంహరణల మొత్తం మీదా పన్ను ఉండదు. దీంతో 30% పన్ను పరిధిలో ఉన్న వారికి వాస్తవంగా గిట్టుబాటయ్యే వడ్డీ 11.9 శాతంగా అంచనా వేసుకోవచ్చు. అధిక పన్ను శ్లాబుల్లోని వారికి పీపీఎఫ్ ఎంతో ఆకర్షణీయమైన సాధనం అవుతుంది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అన్ని రకాల డెట్ సాధనాల్లో అధిక రాబడులను ఇస్తున్న సాధనం ఇది. పదేళ్ల ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్స్ కంటే ఎక్కువగానే ఈపీఎఫ్ చందాలపై వడ్డీ రేటును నిర్ణయించడం జరుగుతోంది. ఇందులో పెట్టుబడులు, రాబడులకు ప్రభుత్వ హామీ ఉంటుంది. ఇటీవలే 2018–19 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ రేటును నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉద్యోగి వేతనం (బేసిక్, డీఏ కలిపిన మొత్తం)లో 12 శాతాన్ని మినహాయించి ఈపీఎఫ్, ఈపీఎస్కు జమ చేయడం జరుగుతుంది. అలాగే, ఇంతే మొత్తాన్ని ఉద్యోగి తరఫున సంస్థ కూడా చెల్లిస్తుంది. పనిచేసే సంస్థను మారిపోయి, మరో ఉద్యోగంలో చేరినా ఈపీఎఫ్ను కొనసాగించుకోవచ్చు. దీనికి అదనంగా ఉద్యోగి తన బేసిక్, డీఏ మొత్తంలో 100 శాతాన్ని వీపీఎఫ్ (వాలెంటరీ ప్రావిడెంట్ ఫండ్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఈపీఎఫ్ వడ్డీ రేటే అమలవుతుంది. పన్ను ప్రయోజనాలు ఈపీఎఫ్, వీపీఎఫ్కు సమానంగా వర్తిస్తాయి. పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద మినహాయింపులు పొందొచ్చు. రాబడులు, ఉపసంహరణలకూ పన్ను లేదు. -
ఎన్పీఎస్కు పూర్తిగా పన్ను మినహాయింపు
న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో ఉద్యోగుల తరఫున కేంద్ర ప్రభుత్వ చందాను 10 శాతం నుంచి 14 శాతానికి పెంచాలని నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. అలాగే, ఎన్పీఎస్ నుంచి రిటైర్మెంట్ సమయంలో ఉపసంహరించుకునే మొత్తంపైనా పన్ను ఉండదని తెలిపారు. దీంతో పీపీఎఫ్, ఈపీఎఫ్ పథకాల మాదిరే ఎన్పీఎస్కు కూడా ఈఈఈ హోదా (మూడు దశల్లోనూ పన్ను మినహాయింపు) లభించనుంది. కార్యదర్శుల కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వ చందాను 14 శాతానికి పెంచాలని గత వారమే కేబినెట్ నిర్ణయం తీసుకుందని జైట్లీ వెల్లడించారు. ఆర్థిక బిల్లులో మార్పులు చేసిన తర్వాత ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చేది త్వరలోనే తెలియజేస్తామన్నారు. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ప్రయోజనాలు అమల్లోకి రానున్నాయని అధికార వర్గాల సమాచారం. ప్రభుత్వ నిర్ణయం 18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలిగించనుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు సంబంధించి కేంద్రం నమూనాను అనుసరించడంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని జైట్లీ అభిప్రాయపడ్డారు. మీడియాకు మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం... ఇకపై ఈ ప్రయోజనాలు ప్రస్తుత నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ నాటికి సమకూరిన నిధి నుంచి 40 శాతం మొత్తంతో తక్షణం పెన్షన్ వచ్చే యాన్యుటీ ప్లాన్ను తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై పన్ను లేదు. మిగిలిన 60 శాతాన్ని ఎన్పీఎస్ చందాదారులు తీసేసుకోవచ్చు. ఇందులో 40 శాతాన్ని పన్ను మినహాయింపు ఇస్తూ మిగిలిన 20 శాతంపై పన్ను అమలు చేస్తున్నారు. ఇకపై ఉపసంహరించుకునే మొత్తం 60 శాతంపైనా పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ వెసులుబాటు ఎన్పీఎస్ చందాదారులు అందరికీ వర్తిస్తుంది. ఇప్పటి వరకు టైర్–1 కింద జమ చేసే వాటికే పన్ను మినహాయింపు ఉండగా, కొత్తగా టైర్–2కింద జమచేసే మొత్తంలో రూ.1.5 లక్షలకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును కేంద్రం కల్పించింది. ఇందుకు గాను టైర్–2 ఖాతా కింద జమలపై మూడేళ్ల లాకిన్ పీరియడ్ అమలవుతుంది. ఎన్పీఎస్లో టైర్–1 అకౌంట్లో జమలను 60 ఏళ్లు వచ్చే వరకు ఉపసంహరించుకోవడానికి లేదు. కొన్ని ప్రత్యేక కారణాల్లోనే ఇందుకు అనుమతిస్తారు. టైర్–2 అకౌంట్ అన్నది స్వచ్చందంగా పొదుపునకు ఉద్దేశించిన అకౌంట్. టైర్–1 అకౌంట్కు అనుబంధంగా ప్రారంభించుకోవచ్చు. ఎప్పుడు అవసరమైనా ఇందులో మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇకపై మూడేళ్ల పాటు టైర్–2 అకౌంట్ డిపాజిట్లను వెనక్కి తీసుకునేందుకు వీలుండదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి బేసిక్ వేతనంపై 14 శాతం ప్రభుత్వ చందాగా లభిస్తుంది. ఇది ప్రస్తుతం 10 శాతంగా ఉంది. ఇక ఉద్యోగుల వాటా 10 శాతంలో ఎటువంటి మార్పు లేదు. ఈ నిర్ణయం 18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనుంది. ఈ పెంపు కారణంగా కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.2,840 కోట్లను అదనంగా భరించాల్సి వస్తుంది. 2004 జనవరి 1 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన వారికి పెన్షన్ పథకంగా ఎన్పీఎస్ అమలవుతున్న విషయం గమనార్హం. ఎన్పీఎస్లో డెట్, ఈక్విటీల్లోనూ పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతించనుంది. అలాగే, తమకు నచ్చిన ఫండ్ మేనేజర్ సంస్థలను కూడా ఎంచుకునే అవకాశం కల్పించనుంది. ప్రస్తుత మూడు ఫండ్ మేనేజ్మెంట్ సంస్థలకే అవకాశం ఉండగా, ఇకపై 8 ఫండ్ మేనేజ్మెంట్ సంస్థల నుంచి ఎంపిక చేసుకోవచ్చు. -
తగ్గనున్న ఈపీఎఫ్.. పెరగనున్న వేతనాలు
న్యూఢిల్లీ : టేక్-హోమ్ శాలరీ చాలా తక్కువగా వస్తోందని బాధపడుతున్నారా? అయితే ఇక ఆ దిగులును ప్రభుత్వం కాస్త తగ్గించబోతుంది. ఉద్యోగుల టేక్-హోమ్ శాలరీని పెంచాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. దీని కోసం ఉద్యోగుల వేతనాల్లోంచి తీసుకునే సామాజిక భద్రత సహకారం(సోషల్ సెక్యురిటీ కాంట్రిబ్యూషన్)ను తగ్గించేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తోంది. దేశంలో ఉన్న ఉద్యోగులందరికీ ఒకే విధమైన సామాజిక భద్రత సహకారం ఉండేలా కార్మిక మంత్రిత్వ శాఖ కమిటీ పనిచేస్తుందని.. ప్రస్తుతమున్న సీలింగ్ 24 శాతాన్ని, 2 శాతం తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదనలను తయారు చేస్తుందని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగుల సహకారం కింద వారి బేసిక్ వేతనం నుంచి 12 శాతాన్ని ఈపీఎఫ్కి అందిస్తున్నారు. అంతేకాక ఆర్గనైజేషన్స్ కూడా ఉద్యోగుల బేసిక్ వేతనం నుంచి 3.67 శాతాన్ని తమ సహకారం కింద ఈపీఎఫ్లో క్రెడిట్ చేస్తున్నాయి. ఈపీఎస్ లేదా ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ కింద 8.33 శాతం మైనస్ అవుతుంది. ఇవన్నీ కలిపి మొత్తంగా 24 శాతం ఉద్యోగుల బేసిక్ వేతనం నుంచి కట్ అవుతుంది. తాజాగా ఉద్యోగుల ఈపీఎఫ్ సహకారాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం చూస్తోంది. దీంతో ఉద్యోగుల టేక్-హోమ్ శాలరీ పెరగబోతుంది. ప్రస్తుతం 20 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థలకు కేవలం 10 శాతం మాత్రమే ఈపీఎఫ్ సహకారం ఉంది. ఇదే విధానాన్ని అన్ని ఆర్గనైజేషన్లకు అమలు చేయాలని ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. దీంతో 10 కోట్ల మంది ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు లబ్ది చేకూరనుంది. ఒక్కసారి కార్మిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఈ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆ మంత్రిత్వ శాఖ వాటాదారులతో సంప్రదింపులు జరుపుతుంది. ప్రస్తుతం సామాజిక భద్రత స్కీమ్ కింద 10 కోట్ల మంది ఉద్యోగులున్నారు. వీరిని 5 రెట్లు అంటే 50 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక భద్రత సహకారం తగ్గితే, ఇటు ఉద్యోగులు, అటు ఆర్గనైజేషన్లకు రెండింటికీ ప్రయోజనం చేకూరనుందని ప్రభుత్వ అధికారులు చెప్పారు. -
ఉద్యోగుల పీఎఫ్పై 8.55 శాతం వడ్డీ
న్యూఢిల్లీ: ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో 2017–18 ఆర్థిక సంవత్సరానికి 8.55 శాతం వడ్డీరేటును జమ చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్వో) ఆదేశించింది. కార్మికశాఖ మంత్రి నేతృత్వంలో ఈపీఎఫ్వో కేంద్ర ట్రస్టీ బోర్డు ఈ రేటుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. ఈ రేటును గతంలోనే ఖరారు చేసినప్పటికీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నియమావళి కారణంగా అమలు చేయలేదని తెలిపింది. దాదాపు 5 కోట్ల మంది ఖాతాదారులున్న ఈపీఎఫ్వో అత్యల్ప వడ్డీరేటును ప్రకటించడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి. 2016–17లో ఈ వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. -
మహిళల జీవితాల్లో ఉజ్వల
అష్ట సతుల్లోనూ కృష్ణునికి అత్యంత ఇష్టురాలు సత్య. నారీ శక్తికి, స్త్రీ ఆత్మగౌరవానికి తిరుగులేని ప్రతీక. నరకునితో పోరుతూ వాసుదేవుడు సొమ్మసిల్లిన వేళ విల్లు చేపట్టి అంతటి రాక్షసుణ్నీ అలవోకగా నిలువరిస్తుంది. ఆధునిక భారత మహిళను సత్యభామలా సాధికార పరచడమే లక్ష్యంగా ఈ బడ్జెట్లో పలు కీలక కేటాయింపులు చేశారు అరుణ్ జైట్లీ... న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లో మహిళలపై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఉచిత గ్యాస్ కనెక్షన్లు సహా.. ఉద్యోగాలు చేసే మహిళలు, స్వయం సహాయక బృందాలకు భారీగా నిధులను కేటాయించింది. పేద మహిళలకు ఇవ్వాల్సిన ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల లబ్ధిదారుల సంఖ్యను 8 కోట్లకు పెంచినట్లు జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో భాగంగా వెల్లడించారు. పేద మహిళలకు వంటచెరకు పొగనుంచి విముక్తి కల్పించేందుకు ఉజ్వల పథకాన్ని ప్రవేశపెట్టాం. ప్రారంభంలో 5 కోట్ల మంది పేద మహిళలకు ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించి పనిచేస్తున్నాం. ఈ పథకానికి పేద మహిళల్లో ఆదరణ పెరగటంతో ఈ లక్ష్యాన్ని 8 కోట్లకు పెంచాలని నిర్ణయించాం’అని జైట్లీ పేర్కొన్నారు. తొలి మూడేళ్ల వరకు ఈపీఎఫ్ 8 శాతమే! మహిళా ఉద్యోగులను ప్రోత్సహించడంలో భాగంగా ఈసారి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. నూతనంగా ఉద్యోగంలో చేరిన మహిళలు అధిక మొత్తంలో టేక్ హోమ్ శాలరీ (నికర జీతం) తీసుకునే విధంగా వెసులుబాటును ఇచ్చింది. ఉద్యోగ భవిష్యనిధిలో వీరి వాటా చెల్లింపును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వారి ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ను ప్రస్తుతం ఉన్న 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ మేరకు ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్–1952’లో మార్పులు చేస్తున్నట్లు జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు. ఇందులో భాగంగా మహిళా ఉద్యోగులు తొలి మూడేళ్ల వరకు 8 శాతం ఈపీఎఫ్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీంతోపాటుగా సామాజిక భద్రత పథకాల్లో భాగంగా మూడేళ్లపాటు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే అందరు ఉద్యోగులకు ఎంప్లాయర్ (యాజమాన్యం) వాటా ఈపీఎఫ్ 12 శాతాన్నీ ప్రభుత్వమే భరించే ప్రతిపాదన చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రధాన్ మంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన కింద వస్త్ర, తోలు, ఫుట్వేర్ పరిశ్రమలకు చెందిన ఉద్యోగులు పొందుతున్న ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ప్రయోజనాన్ని మిగిలిన రంగాలకు కూడా వర్తింపచేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో ఈ పథకం కింద ఇచ్చిన ప్రయోజనాలు ఇప్పుడిప్పుడే సత్ఫలితాలను ఇస్తున్నాయని జైట్లీ పేర్కొన్నారు. స్వయం సహాయక బృందాలకు.. జాతీయ గ్రామీణ జీవన కార్యక్రమంలోని క్లస్టర్లలో స్వయం సహాయక బృందాలు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. 2019 మార్చి వరకు ఈ కార్యక్రమం కోసం ఇచ్చే రుణాలను రూ.75 వేల కోట్లకు పెంచుతున్నట్లు జైట్లీ వెల్లడించారు. స్వయం సహాయక బృందాలకు ఇచ్చే రుణాలను గతేడాదితో పోలిస్తే 37 శాతం పెంచి.. రూ.42,500 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన ‘బేటీ బచావో, బేటీ పఢావో’, సుకన్య సమృద్ధి అకౌంట్ పథకాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయని జైట్లీ పేర్కొన్నారు. ‘నవంబర్ 2017 వరకు బాలికల పేర్లతో 1.26 కోట్ల అకౌంట్లు దేశవ్యాప్తంగా తెరిచారని.. ఇందులో రూ.19,183 కోట్లు దాచుకున్నారు’అని ఆయన తెలిపారు. బడ్జెట్ హైలైట్స్ ► రూ.5 లక్షల కోట్ల అదనపు రుణాలు అందించేలా బ్యాంకు లకు మూలధన సాయం. ► ఎంపీల వేతనం, నియోజకవర్గ అలవెన్సు, ఆఫీసు ఖర్చులు, అలవెన్సుల్లో మార్పులకు ప్రతిపాదన. ద్రవ్యోల్బణం ఆధారంగా ఐదేళ్లకోసారి వేతనాల సమీక్షకు చర్యలు. ► 018–19 ఆర్థిక సంవత్సరంలో రక్షణ శాఖకు రూ.2.82 లక్షల కోట్ల కేటాయింపు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 2.67 లక్షల కోట్లు. ► జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల కోసం రూ.150 కోట్లు కేటాయింపు. ► 2018 జనవరి 15 వరకూ ప్రత్యక్ష పన్నుల వసూలు 18.7 శాతం వృద్ధి. ► 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలపై కార్పొరేట్ పన్ను 25 శాతానికి తగ్గింపు. -
దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్స్ ఆందోళన
-
ఈపీఎఫ్–ఆధార్ అనుసంధానం ఆన్లైన్లోనే
న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) చందాదారులు తమ ఖాతాను ఆధార్తో ఆన్లైన్లోనే అనుసంధానించుకునే అవశాన్ని కల్పించింది. యూనివర్సల్ అకౌంట్ నంబర్(యూఏఎన్) కలిగిన వారు ఈపీఎఫ్ ఇండియా పోర్టల్కు వెళ్లి అనుసంధానించుకోవచ్చు. ఇందుకోసం https:// iwu.epfindia.gov.in/eKYC/LinkUanAadhaar లింక్కు వెళ్లి యూఏఎన్, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ‘జనరేట్ ఓటీపీ’ని క్లిక్ చేయాలి. అప్పుడు సభ్యుల మొబైల్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి, కింది కాలమ్లో ఆధార్ నంబర్ను కూడా ఇచ్చి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మరోసారి వారి మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. యూఏఎన్ వివరాలు, ఆధార్తో సరిపోలితే వెంటనే ఆధార్తో లింక్ అయిపోతుంది. దీంతోపాటు www.epfindia.gov.in సైట్కు వెళ్లి అక్కడ ఈకేవైసీ పోర్టల్ను ఎంచుకుని ఆధార్తో అనుసంధానం చేసుకోవచ్చు. -
ఈపీఎఫ్.. ఎన్పీఎస్...విరమణ తరవాత నేస్తాలివే!
♦ రిటైర్మెంట్ కోసం ఇవే నయమంటున్న నిపుణులు ♦ ఈపీఎఫ్ సురక్షిత పథకం, రాబడులు తక్కువ ♦ ఎన్పీఎస్ రాబడులు ఎక్కువ, రిస్క్ కూడా ఎక్కువే ♦ అయినప్పటికీ దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ♦ విశ్రాంత జీవనం హాయిగా సాగేందుకు రెండూ అవసరమే! జీతంపై ఆధారపడినవారు ఈ రోజు ఎలా గడుస్తోందో చూసుకోవటంతో పాటు... మున్ముందు ఎలా గడుస్తుందో కూడా ఆలోచించాలి. రిటైర్మెంట్ కోసం పన్ను ఆదాతో పాటు మంచి నిధిని సమకూర్చుకోవాలనుకుంటే ఈపీఎఫ్, ఎన్పీఎస్ మెరుగైన చాయిస్ అంటున్నారు ఫైనాన్షియల్ ప్లానర్లు. ఈపీఎఫ్, ఎన్పీఎస్!! ఈ రెండింటిలోనూ రాబడులు ఎలా ఉంటాయ్? రిస్క్ ఏంటి? పన్ను ప్రయోజనాలు ఎలా ఉంటాయ్? రెండింటి మధ్య తేడా ఏంటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. ఎందుకంటే ఈ రెండూ భిన్నమైన ప్రయోజనాలను అందిస్తాయి. ‘‘ఈపీఎఫ్ డెట్ విభాగానికి చెందినది. ఎన్పీఎస్ డెట్తోపాటు ఈక్విటీ మార్కెట్లోనూ పెట్టుబడికి వీలు కల్పించే సాధనం. ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని రాబడులను అందించే సాధనం’’ అనేది బ్యాంక్ బజార్ తాలూకు సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ విభాగం హెడ్ అజిత్ నరసింహన్ మాట. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఈపీఎఫ్ అన్నది ప్రతి నెలా వేతనం నుంచి కొంత ఇన్వెస్ట్మెంట్కు వెళ్లే సాధనం. రిటైర్మెంట్ లేదా ఆకస్మిక మరణం సందర్భాల్లో ఫండ్ అంతా చెల్లిస్తారు. దీర్ఘకాలానికి పెట్టుబడిపై వడ్డీని, ఆ వడ్డీపై మరింత వడ్డీని సమకూర్చే సాధనమిది. సంప్రదాయ ఇన్వెస్ట్మెంట్ సాధనాలన్నిట్లోకీ ఎక్కువ రాబడి ఇస్తున్నది ఇదే. ప్రస్తుతం వడ్డీ రేటు 8.65 శాతం ఉంది. జీవితంలో కీలక అవసరాలైన పిల్లల విద్య, వివాహం, సొంతిల్లు వంటి వాటి కోసం పాక్షిక ఉపసంహరణలకు ఇందులో వీలుంది. ఏదైనా అనారోగ్యం పాలైన సందర్భాల్లో కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు అనుమతిస్తారు. ఒక కంపెనీలో ఉద్యోగం మానేసిన తర్వాత తిరిగి మరో ఉద్యోగం సంపాదించలేకుంటే అప్పుడు కూడా ఈపీఎఫ్ నిధి మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు. వేతన జీవులకు ఈపీఎఫ్తోపాటు, ఈపీఎస్ (ఉద్యోగ పెన్షన్ స్కీమ్) కూడా ఉంది. బేసిక్ వేతనం, డీఏ ఈ రెండింటి మొత్తంలో 12 శాతం ఉద్యోగి వాటాగా, మరో 12 శాతం సంస్థ వాటాగా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థకు జమ చేస్తారు. అంటే 24 శాతం ఉద్యోగి భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడిగా వెళుతుంది. అయితే, ఉద్యోగి వాటా 12 శాతం భవిష్యనిధి కింద జమ అవుతుంది. సంస్థ వాటా 12 శాతంలో 8.33 శాతం ఈపీఎఫ్ కోసం, మిగిలిన 3.67 శాతం ఈపీఎస్ కోసం కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా ఈపీఎఫ్ వాటాల కింద జమైన మొత్తం, దానిపై వడ్డీ కలిపి రిటైర్మెంట్ తర్వాత చెల్లించడం జరుగుతుంది. ఈపీఎస్ కింద జమైన మొత్తంపై నిర్ణీత శాతం సంబంధిత వ్యక్తికి ప్రతీ నెలా పింఛనుగా అందుతుంది. అయితే, ఇది చాలా స్వల్పంగానే ఉంటుంది. ఎందుకంటే కేవలం 3.67 శాతమే జమవుతుంది గనుక. ఈపీఎఫ్లో రాబడులకు హామీ ఉంటుంది. నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) వేతన జీవులు, ఈపీఎఫ్ పరిధిలో ఉన్నవారు, స్వయం ఉపాధిలో ఉన్నవారు, 18 ఏళ్లు దాటిన వారు ఎవరైనా ఎన్పీఎస్లో చేరొచ్చు. ఎన్ఎస్డీఎల్కు చెందిన సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ) దగ్గర ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఇలా చేరిన వారికి శాశ్వత రిటైర్ ఖాతా నంబర్ (ప్రాన్) కేటాయిస్తారు. ఏడాదిలో కనీసం రూ.6,000 ఇన్వెస్ట్ చేయాలి. ఇందులో టైర్–1, టైర్–2 అని రెండున్నాయి. టైర్1లో ఉపసంహరణకు అవకాశం లేదు. టైర్–2లో నగదు వెనక్కి తీసేసుకోవచ్చు. అయితే, టైర్–2 ఖాతా కావాలంటే అప్పటికే టైర్–1 ప్రారంభించి, యాక్టివ్గా ఉండాలి. ఎన్పీఎస్లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం పరమైన ప్రయోజనాలు ఉంటాయి. అయితే గడువు తర్వాత మొత్తం నిధిలో 40 శాతాన్ని యాన్యుటీ పథకంలో నెలనెలా పెన్షన్ కోసం గాను ఇన్వెస్ట్ చేయడం తప్పనిసరి. ఎన్పీఎస్లో రిస్క్ ఆధారిత పెట్టుబడులకు గాను మూడు వర్గీకరణలు చేశారు. అస్సెట్ క్లాస్ ఈ అంటే ఈక్విటీ, అస్సెట్ క్లాస్ సీ అంటే కార్పొరేట్ డెట్ సెక్యూరిటీలు. అస్సెట్ క్లాస్ జీ అంటే ప్రభుత్వ సెక్యూరిటీలకు ఉద్దేశించినవి. ఈక్విటీల్లో రిస్క్ అధికం, రాబడులూ అధికమే. కార్పొరేట్ డెట్ సెక్యూరిటీల్లో రిస్క్ మధ్యస్థంగా ఉంటుంది. రాబడులు మోస్తరుగా ఉంటాయి. ప్రభుత్వ సెక్యూరిటీల్లో రిస్క్ తక్కువ, రాబడులు తక్కువ. ఇన్వెస్టర్లు తమ రిస్క్ ఆధారంగా వీటిని ఎంచుకోవచ్చు. ఈక్విటీలో గరిష్ట పెట్టుబడులు 50 శాతానికే పరిమితం. కనుక రిస్క్ భరించే వారు ఈక్విటీకి 50 శాతం పోను మిగిలిన పెట్టుబడికి కార్పొరేట్ డెట్ సెక్యూరిటీలు, ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఏదో ఒక దానిని లేదా రెండింటినీ ఎంచుకోవచ్చు. మూడూ కోరుకుంటే వేటికి ఎంత వాటా కేటాయించాలన్నది ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికి ఏది బెటర్? ఎన్పీఎస్ అన్నది పూర్తిగా రిటైర్మెంట్ కోసం ఉద్దేశించినది. ఈపీఎఫ్ను మాత్రం రిటైర్మెంట్కు, సొంతిల్లు, ఇతర లక్ష్యాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎన్పీఎస్లో 60 ఏళ్లు వచ్చిన తర్వాత కాల వ్యవధి తీరుతుంది. అప్పుడు సమకూరిన నిధిలో 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. 40 శాతాన్ని యాన్యుటీ పథకంలో పింఛను కోసం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 60 ఏళ్లు రాకముందే పథకం నుంచి తప్పుకుంటానంటే సమకూరిన నిధిలో 80 శాతాన్ని యాన్యుటీ పథకంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతాన్నే వెనక్కి ఇస్తారు. ఎన్పీఎస్లోనూ పెట్టుబడుల ఉపసంహణకు అవకాశం ఉంది. పదేళ్ల తర్వాత మొత్తం నిధిలో 25 శాతాన్ని డ్రా చేసుకోవచ్చు. ప్రత్యేక అవసరాల కోసమే దీన్ని పరిమితం చేశారు. మొత్తం కాల వ్యవధి తీరేలోపు ఇలా మూడు సార్లు డ్రా చేసుకునేందుకు అనుమతిస్తారు. పన్ను ప్రయోజనాలు ఈపీఎఫ్లో చేసే పెట్టుబడులు సెక్షన్ 80సీ కింద ఏడాదికి రూ.1.50 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఉంది. ఎన్పీఎస్లో పెట్టుబడులకూ ఇది వర్తిస్తుంది. సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షలు పెట్టుబడులు పెట్టారనుకోండి. అప్పుడు అదనంగా మరో రూ.50,000ల వరకు ఎన్పీఎస్లో పెట్టుబడులపై సెక్షన్ 80సీసీడీ (1బి) కింద పన్ను మినహాయంపు పొందే సౌలభ్యం ఉంది. అంటే రూ.2.50 లక్షలు బేసిక్ మినహాయింపు, అదనంగా సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల మినహాయింపు పోను మరో రూ.50,000లపై ఎన్పీఎస్ రూపేణా పన్ను ఆదా చేసుకోవచ్చు. ఏడాదికి రూ.4.5 లక్షలు ఆపైన ఆదాయం ఉన్న వారికి ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ విధమైన ప్రయోజనం కూడా ఉంది. ఇక ఉపసంహరణ సమయంలో పన్ను మినహాయింపు లేని పథకం ఇది. చివర్లో సమకూరిన నిధిలో 40 శాతం యాన్యుటీకి వెళుతుంది. 20 శాతంపై ఆదాయపన్ను చెల్లించాలి. మిగిలిన 40 శాతం పన్ను రహితం. రాబడి ఏ స్థాయిలో ఉంటుంది? ఈపీఎఫ్లో 2016–17 సంవత్సరానికి గాను కేంద్రం 8.65 శాతం వడ్డీ రేటును ఇచ్చింది. ఎన్పీఎస్లో మార్కెట్ అనుసంధానిత ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లలో రాబడులు ఎక్కువగా ఉన్నాయి. ఏడాదిలో 20 శాతానికిపైగా రాబడులను ఇచ్చిన పథకాలు ఉన్నాయి. నిజానికి ఈ రెండూ భిన్న అవసరాలను తీర్చేవి గనుక రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేయడం మంచిదని ఫైనాన్షియల్ ప్లానర్లు సూచిస్తున్నారు. రిటైర్మెంట్కు ముందు ఎదురయ్యే కీలక లక్ష్యాలకు ఈపీఎఫ్ నిధి ఉపయోగపడుతుంది. ఈపీఎఫ్ను కదిలించకుండా తమ అవసరాలను తీర్చుకోగలిగితే రిటైర్మెంట్ తర్వాత ఈపీఎఫ్, ఎన్పీఎస్ రెండూ కలిపి పెద్ద నిధి సమకూరుతుంది. దాన్ని సరైన రాబడినిచ్చే పథకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మలి జీవితాన్ని హాయిగా గడిపేయవచ్చు. -
హోమ్ లోన్ సబ్సిడీ కోసం హడ్కో
హైదరాబాద్: రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్వో, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో)ల మధ్య తాజాగా పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఇందులో భాగంగా ఈపీఎఫ్వో సభ్యులు గృహ కొనుగోలుకు సంబంధించి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద రూ.2.67 లక్షల వరకు వడ్డీ సబ్సిడీ పొందొచ్చు. ఇంటి కొనుగోలు కోసం తన సబ్స్క్రైబర్లకు ఈపీఎఫ్ మొత్తం నుంచి 90 శాతం వరకు విత్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో). ఈపీఎఫ్ ఖాతా నుంచే హౌసింగ్ లోన్ ఈఎంఐలు చెల్లించే అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వపు ‘2022 నాటికి అందరికీ ఇళ్లు’ అనే లక్ష్యానికి అనువుగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు తెలియజేశాయి. కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సమక్షంలో హడ్కో చైర్మన్, ఎండీ ఎం.రవి కాంత్, ఈపీఎఫ్వో సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వి.పి.జాయ్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. -
పీఎఫ్ చందాదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఎంప్లాయర్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) ఖాతాదారులకు శుభవార్త అందించింది. పీఎఫ్ ఖాతాదారులకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడి పథకాన్ని అందుబాటులోకి తెచ్చేలా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో)తో ఒక ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ మేరకు గురువారం ఒక అంగీకారానికి వచ్చింది. తద్వారా ఇ.పి.ఎఫ్.ఒ. తన చందాదారుల కోసం, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పిఎంఏఐ) ద్వారా ప్రవేశపెట్టిన హౌసింగ్ పథకం ప్రయోజనాలను మౌలీకృతం చేస్తుంది. పిఎంఏ పరిధిలో సరసమైన గృహాలను కొనుగోలు చేసేందుకు రూ. 2.67 లక్షల వరకు సబ్సిడీని సభ్యులకు అందించనుంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద సబ్సిడీ, వడ్డీ సబ్సిడీని పొందేందుకు గృహనిర్మాణ, పట్టణ అభివృద్ధి సంస్థతో ఇపిఎఫ్ఓ ఒప్పందం కుదుర్చుకుంటుంది. 2022 నాటికి అందరికీ ఇల్లు అనే కేంద్ర ప్రభుత్వ నిబద్ధతలో భాగంగా ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటుందని ఒక అధికారిక ప్రకటనలో ఈపీఎఫ్వో తెలిపింది. హడ్కోతో కుదుర్చుకున్న ఈ ఒప్పదం ప్రకారం రూ. 2.67 లక్షల వరకు గృహ సబ్సిడీ ఇపిఎఫ్ సభ్యులు పొందుతారు. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వి పి జాయ్, హడ్కో సీఎండీ ఎం.రవి కంత్లు ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచారశాఖ మంత్రి వెంకయ్య నాయుడు సమక్షంలో ఈ ఒప్పందం జరగనుంది. ఇపిఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వి పి జాయ్ ఈ ఒప్పందంపై మాట్లాడుతూ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఇపిఎఫ్ఓ చందాదారులకు ఇళ్లు కొనుగోలు చేయడానికి చౌకైన రుణాలు వంటి వివిధ ప్రయోజనాలను అందించనున్నట్టు చెప్పారు. -
రిటైర్మెంట్ రోజే పీఎఫ్ సెటిల్మెంట్
-
రిటైర్మెంట్ రోజే పీఎఫ్ సెటిల్మెంట్
ఈపీఎఫ్ సేవలన్నీ ఇక ఆన్లైన్లోనే: కమిషనర్ శ్రీకృష్ణ సాక్షి, హైదరాబాద్: ఈపీఎఫ్ ఖాతాదారుల పదవీ విరమణ రోజే భవిష్యనిధి ఖాతాకు సంబంధించిన చెల్లింపులను పూర్తి చేస్తా మని ఈపీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ శ్రీకృష్ణ తెలిపారు. దీనికిగాను సదరు కంపెనీ పక్షం రోజుల ముందు రిపోర్టు చేయాలని, ఆ నెల పీఎఫ్ బకాయిని కూడా ముందస్తుగా చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. తెలంగాణ జోనల్ కమిషనర్ చంద్రశేఖర్, రీజినల్ ఆఫీసర్ రవీంద్ర కుమార్లతో కలసి శుక్రవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యో గుల కాంపోజిట్ క్లెయిమ్స్కు సంబంధించి గతంలో నాలుగైదు ఫారాలతో కూడిన దరఖాస్తు సమర్పించాల్సి ఉండేదని, ప్రస్తుతం ఈ ప్రక్రియ సులభతరమైందని చెప్పారు. ఒకే పేజీతో కూడిన దరఖాస్తును పూరించి సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే పదిరోజుల్లో సెటిల్మెంట్ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి పీఎఫ్ ఖాతాదారుడు ఆధార్ వివరాల్ని నమోదు చేయాలని, దీనికిగాను మీసేవా కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. పీఎఫ్ కార్యాలయంలోనూ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈపీఎఫ్వోలో ప్రతి సేవను కంప్యూటరీ కరించామని, ఇకపై ఆన్లైన్ ద్వారానే అన్ని కార్యక్రమాలు చేపడతామని వెల్లడిం చారు. గ్రూప్ హౌసింగ్ పథకం దరఖాస్తులు తీసుకుంటున్నామని, అర్హతను బట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వడ్డీ రాయితీ వస్తుందని పేర్కొన్నారు. ఎంప్లాయి ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ను జూన్ 30 వరకు పొడిగించామని తెలిపారు. పీఎఫ్ ఖాతాదారులకు మెరుగైన సేవలందిం చేందుకు మొబైల్ ఆధారిత యాప్ను అందు బాటులోకి తెచ్చామన్నారు. తెలంగాణను ప్రత్యేక జోన్గా కేంద్రం నోటిఫై చేసిందని జోనల్ కమిషనర్ చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలో ఎనిమిది ప్రాంతీయ, మూడు జిల్లా కార్యాల యాలున్నాయని, వీటి పరిధిలో 37,919 సంస్థలు, 84.97 లక్షల మంది ఉద్యోగు లున్నారని పేర్కొన్నారు. జూన్ 1న రవీంద్రభారతిలో పీఎఫ్పై అవగాహన కార్యక్రమంతోపాటు ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని ప్రాంతీయ అధికారి రవీంద్రకుమార్ తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, మైనార్టీ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ఏపీ, తెలంగాణ కార్మికశాఖ మంత్రులు పాల్గొననున్నట్లు చెప్పారు. -
ఈపీఎఫ్ సభ్యులకు గ్రూప్ ఇన్సూరెన్స్ హౌసింగ్
సాక్షి, హైదరాబాద్: ఈపీఎఫ్(ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ) సభ్యుల కోసం ప్రత్యేకంగా గ్రూప్ ఇన్సూరెన్స్ హౌసింగ్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈ పథకం కింద వచ్చే రెండేళ్లలో 10 లక్షల మంది ఈపీఎఫ్ సభ్యులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఆదివారం ఇక్కడ ఈపీఎఫ్ఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022 నాటికి దేశంలోని ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, హడ్కోలతో ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపి సరైన స్థలాలు గుర్తించి వీలైనంత త్వరితంగా అప్పగించాలని కోరారు. పథకం కింద ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందుకు రావాలని, ప్రత్యేక శ్రద్ధ చూపితే ఎక్కువ సంఖ్యలో గృహాలు మంజూరు చేస్తామని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ.2.2 లక్షల రాయితీ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. గృహాలు నిర్మించుకునే ఈపీఎఫ్ఓ సభ్యులకు 90 శాతం మొత్తాన్ని రుణ రూపంలో ఇస్తామని వెల్లడించారు. ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో రూ.21,559 కోట్లు పెట్టుబడిగా పెట్టగా, 31 మార్చి 2017 నాటికి వాటి మార్కెట్ విలువ రూ. 23,845 కోట్లకు చేరిందన్నారు. -
ఈపీఎఫ్పై 8.65 వడ్డీకి ఆర్థిక శాఖ ఆమోదం
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)పై 8.65 శాతం వడ్డీ ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ విషయంలో తదుపరి చర్యలు చేపట్టేందుకు కార్మిక శాఖకు అనుమతినిచ్చింది. 2016-17కు గాను ఈ మేరకు వడ్డీని ఖరారు చేసిందని కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గురువారం ప్రకటించారు. దీనికి సంబంధించి అధికారిక చర్చలు ముగిసినట్టు త్వరలోనే ఒక ప్రకటన వెలువడుతుందని చెప్పారు. దాదాపు నాలుగుకోట్లమందికి ప్రయోజనం చేకూరనున్నట్టు మంత్రి తెలిపారు. కాగా 8.65 శాతం చొప్పున వడ్డీ ఇచ్చేందుకు ఈపీఎఫ్ సంస్థ ట్రస్టీలు డిసెంబరులోనే ప్రతిపాదించారు. కేంద్ర ఆర్థిక శాఖ ఆ రేటు ఎక్కువగా ఉందన్న అభిప్రాయంతో ఇప్పటిదాకా నిర్ణయంఅమలును పెండింగ్ లోపెట్టిన సంగతి తెలిసిందే. -
చందాదారులకు 50 వేల లాయల్టీ
ఈపీఎఫ్ఓ కొత్త కానుక ► కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశంలో సిఫార్సు న్యూఢిల్లీ: ఈపీఎఫ్ చందాదారులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) కొత్త కానుకను అందివ్వనుంది. ఉద్యోగ విరమణ సమయానికి 20 ఏళ్లకంటే ఎక్కువ కాలం చందా చెల్లించిన వారికి లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ కింద రూ.50,000 చెల్లించాలని ఈపీఎఫ్ఓ బోర్డు నిర్ణయించింది. శాశ్వత అంగవైకల్యం ఉన్న వ్యక్తులు 20 ఏళ్లు చెల్లించకపోయినా వారు ఈ ప్రయోజనం పొందొచ్చు. ప్రతిపాదిత ప్రథకం ప్రకారం.. మూలవేతనం రూ.5 వేల వరకూ ఉన్న వారు లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ కింద రూ.30,000, మూలవేతనం రూ.5,001–10,000 మధ్య ఉన్న వారు రూ.40,000 పొందవచ్చు. రూ.10 వేలకంటే ఎక్కువ మూలవేతనం పొందే వారు రూ.50 వేల ప్రయోజనం పొందుతారు. కేంద్ర ట్రస్టీల బోర్డు(సీబీటీ) బుధవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చందాదారుడు మరణిస్తే కుటుంబానికి రూ.2.5 లక్షల కనీస బీమా అందజేయాలని సిఫార్సు చేసింది. కేంద్రం ఆమోదిస్తేఈ ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి. పైలట్ ప్రాజెక్టుగా రెండేళ్ల పాటు దీనిని కొనసాగిస్తామని, ఆ తర్వాత సమీక్షించి కొనసాగించే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. 8.65% వడ్డీ అందిస్తాం: దత్తాత్రేయ సాక్షి, న్యూఢిల్లీ: 2016–17కు గాను గత డిసెంబర్లో నిర్ణయించిన విధంగానే పీఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీని అందిస్తామని కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ చెప్పారు. అవసరమైతే ఆర్ధిక మంత్రిత్వ శాఖతో చర్చిస్తామని, ఇప్పటికే 8.65 శాతం వడ్డీ రేటును ఆమోదించాలని ఆర్ధిక శాఖను కోరానని, కార్మికులకు డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీని అందించాల్సిందేనని దత్తాత్రేయ అన్నారు. ఈపీఎఫ్ ప్రయోజనాలను మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు ఆధార్ సీడింగ్ అప్లికేషన్ను ఆయన ప్రారంభించారు. పీఎఫ్ సభ్యుడు లేదా పెన్షనర్ స్వయంగా ఏదైనా ఈపీఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీసుకు లేదా కమాండ్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ)కు వెళ్లి ఈ అప్లికేషన్ ద్వారా ఆధార్ను తన పీఎఫ్ ఖాతాకు అనుసంధానించుకోవచ్చు. -
ఈపీఎఫ్ నుంచి పాలసీ కట్టొచ్చు!
► కావాలంటే పీఎఫ్ సంస్థే కడుతుంది ► కానీ మీ ఖాతాలో డబ్బులుంటేనే సుమా! ► లేకపోతే పాలసీ రద్దయ్యే ప్రమాదమూ ఉంది ఎల్ఐసీ పాలసీలు మనలో చాలా మంది తీసుకుంటారు. ఉద్యోగులైతే ప్రత్యేకంగా వారి వేతనం నుంచి ప్రీమియం కట్టాల్సిన ఇబ్బంది లేకుండా భవిష్య నిధి (ఈపీ ఎఫ్)ని అందుకు ఉపయోగించుకోవచ్చు. చాలా మందికి ఈ విష యమై అవగాహన లేదు. ఈ సదుపాయం ఎలాగో ఓసారి చూద్దాం... కొత్తగా ఎల్ఐసీ పాలసీ తీసుకుంటున్నా, ఇప్పటికే పాలసీ తీసుకుని ఉన్నా... సంబంధిత పాలసీ వివరాలను ఈపీఎఫ్వోకు తెలియజేసి ప్రీమియాన్ని తమ భవిష్య నిధి నుంచి చెల్లించాలని కోరవచ్చు. అయితే, ఈపీఎఫ్వోకు చెప్పాం కదా అని దాని గురించి పట్టించుకోవటం మానొద్దు. ఎందుకంటే బీమా పాలసీ ప్రీమియాన్ని పీఎఫ్ నుంచి చెల్లించాలని కోరిన తర్వాత మీ భవిష్యనిధి ఖాతాలో నగదు నిల్వలు తప్పనిసరిగా ఉండాలి. లేకుంటే ఈపీఎఫ్వో ఎలా చెల్లిస్తుంది చెప్పండి? పైపెచ్చు ఈ విషయంలో మిమ్మల్ని ఈపీఎఫ్వో అప్రమత్తం చేయదు కూడా. ఆ బాధ్యత పాలసీదారుడిపైనే ఉంటుంది. ఈపీఎఫ్వో గనక ప్రీమియం చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్ అయిపోతుందని గుర్తుంచుకోవాలి. భవిష్య నిధిలో డబ్బులున్నంత కాలం ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపు సదుపాయం యాక్టివ్గానే ఉంటుంది. నిధిని ఖాళీ చేసేస్తే పాలసీదారు స్వయంగా బీమా పాలసీ ప్రీమియాన్ని గుర్తుంచుకుని మరీ చెల్లించుకోవాలి. ఈపీఎఫ్కు హక్కులివ్వాలి... భవిష్య నిధి నుంచి ఎల్ఐసీ పాలసీ ప్రీమియాన్ని చెల్లించే సదుపాయాన్ని వినియోగించుకోవాలని అనుకుంటే... ఆ పాలసీపై హక్కుల్ని ఈపీఎఫ్వో సంస్థకు దఖలు పరచాలనే నిబంధన ఉంది. భవిష్య నిధి నుంచి పాలసీ ప్రీమియాన్ని చెల్లించడం ద్వారా దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం లేకుండా ఈ నిబంధన విధించినట్టు తెలుస్తోంది. ఉదాహరణకు ఎల్ఐసీ ఎండోమెంట్ పాలసీని సరెండ్ చేయడం ద్వారా కట్టిన మొత్తంలో కొంత వెనక్కి అందుకునే అవకాశం ఉందన్న విషయం తెలుసు. అలాగే, పాలసీపై రుణం పొందే సదుపాయం కూడా ఉంది. భవిష్య నిధిని బీమా పాలసీకి మళ్లించి అక్కడి నుంచి నిధిని తరలించుకుపోకుండా ఈ నిబంధన విధించి ఉండవచ్చు. రెండేళ్లు నిండాలి... ఈ సదుపాయం కోసం ఈపీఎఫ్ చందాదారుడిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న వారే అర్హులు. ఉద్యోగం చేస్తున్న సంస్థలోనే ఇందుకు సంబంధించి ఫామ్ 14ను ఇస్తే సరిపోతుంది. ఈ ఫామ్ను ఈపీఎఫ్వో వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. భవిష్య నిధి నుంచి చెల్లించడం సరైనదేనా? ఎల్ఐసీ పాలసీ ప్రీమియాన్ని భవిష్య నిధి నుంచి చెల్లించడం కరెక్టేనా? అన్న సందేహం సహజం. జీవితానికి బీమా పాలసీ ఎంతో కీలకమైనది. ప్రీమియం సకాలంలో చెల్లిస్తేనే పాలసీ మనుగడలో ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈపీఎఫ్వో ప్రీమియాన్ని చెల్లించిందా? లేదా? అన్నది గడువు తేదీ తర్వాత బీమా కార్యాలయంలో తెలుసుకోవాలి. లేదంటే వెంటనే చెల్లించాలి. ఈ మాత్రం సమయం కేటాయించే తీరిక ఉంటే భవిష్య నిధి నుంచి ప్రీమియాన్ని నిశ్చింతగా చెల్లించుకోవచ్చు. ఎందుకంటే భవిష్యనిధిలో నగదు నిల్వలు లేక ఈపీఎఫ్వో చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది. దాంతో పాలసీదారుడు రిస్క్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక, భవిష్యనిధి అనేది ఉద్యోగ విరమణ తర్వాత అక్కరకు వచ్చే చక్కని సాధనం. దాని నిల్వల నుంచి పాలసీ ప్రీమియం చెల్లించడం కంటే వీలుంటే సొంత బడ్జెట్ నుంచి చెల్లించటమే మంచిది. బడ్జెట్ కష్టంగా ఉంటే, వేతనం నుంచి కట్టే అవకాశం లేకపోతేనే ఈపీఎఫ్ నుంచి చెల్లించడం ఎంచుకోవాలి. –సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా..
నిడమర్రు : ప్రభుత్వ గుర్తింపు పొందిన/ ప్రైవేట్/ కార్పొరేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు భవిష్య నిధి సౌకర్యంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతా ఉంటుంది. ఈ ఖాతాలో ఆ ఉద్యోగి వేతనం నుంచి కొంత మొత్తంలో మినహాయింపుతోపాటు పనిచేస్తున్న కంపెనీ కూడా కొంత మొత్తంలో నగదు జమ చేస్తుంది. ఈపీఎఫ్ ఖాతాలోని బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ద్వారా ఎంత మొత్తంలో పొదుపు చేస్తామన్నది సులభంగా తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ బ్యాలెన్స్ను వివిధ రకాలుగా ఎప్పటికప్పుడు ఉచితంగా తెలుసుకునే అవకాశాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కల్పించింది. ఎస్ఎంఎస్ ద్వారా యూఏఎన్ యాక్టివేషన్ ఈపీఎఫ్ ఉన్న ఉద్యోగులందరికీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)ను సంస్థ కేటాయించింది. ఉద్యోగం మారినప్పుడు ఈ నెంబర్ను ఉపయోగించి మీ పీఎఫ్ ఖాతాలోని సొమ్మును బదిలీ చేసుకోవచ్చు. ఈ యూఏఎన్ను ప్రతి సంస్థ తమ ఉద్యోగులకు కేటాయించాలి. ఉద్యోగి ఉద్యోగం మారినా ఈ సంఖ్య మారదు. యూఏఎన్ ఆధారంగా ఈపీఎఫ్ ఖాతా పాస్బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూఏఎన్కు నమోదు చేసుకుని ఉంటే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కు పీఎఫ్ బ్యాలెన్స్ సమాచారం సంక్షిప్త సందేశాల్లో వస్తుంది. దీని కోసం ఈ విధంగా చేయాలి. -
పీపీఎఫ్ వడ్డీరేట్లకూ ప్రభుత్వం షాక్?
న్యూఢిల్లీ : గత ఎనిమిదేళ్లలో మొదటిసారి ఈపీఎఫ్ వడ్డీరేటు తగ్గిస్తున్నట్టు ప్రకటించిన కేంద్రప్రభుత్వం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) వడ్డీరేట్లను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. పీపీఎఫ్, చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టే వారు మరో రేటు కోతకు సిద్ధంగా ఉండాలని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వం ఒకవేళ గోపినాథ్ ప్యానెల్ ఫార్ములా అమలుచేస్తే ప్రభుత్వ బాండ్ల ఆదాయాలతో సంబంధమున్న చిన్న పొదుపు మొత్తాల వడ్డీరేట్లకు భారీగా కోత పడనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీపీఎఫ్ రేట్ దాదాపు 100 బేసిస్ పాయింట్లు తగ్గి 7 శాతానికి దిగొస్తుందని సమాచారం. గోపినాథ్ ప్యానెల్ ఫార్ములా ప్రకారం కనీస ప్రభుత్వ బాండ్ల ఆదాయాలు కంటే చిన్న పొదుపు మొత్తాల వడ్డీరేట్లే ఎక్కువగా ఉన్నాయి. పీపీఎఫ్నే తీసుకుంటే సగటు 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ ఆదాయం కంటే పీపీఎఫ్ వడ్డీరేటు 25 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉంది. 10 ఏళ్ల పరిమితులోని ప్రభుత్వ బాండ్లపై వచ్చే వడ్డీరేట్లు 6.5 శాతానికి దిగిరావడంతో, జనవరి-మార్చి త్రైమాసికంలో పీపీఎఫ్ రేటు కూడా 7 శాతానికి పడిపోతుందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అయితే గోపినాథ్ ప్యానెల్ ఫార్ములాను రద్దు చేసి కేవలం పీపీఎఫ్ రేట్లను 20-25 బేసిస్ పాయింట్లు మాత్రమే ప్రభుత్వం తగ్గించే అవకాశాలున్నాయని ఇన్వెస్ట్మెంట్, ట్యాక్స్ ఎక్స్పర్ట్ బల్వంత్ జైన్ చెబుతున్నారు. ఏ మేరకు తీసుకున్నా పీపీఎఫ్ రేటు కిందకి రావడం ఖాయమని తెలుస్తోంది. ఆ రేటు తగ్గించినా.. బ్యాంకు డిపాజిట్లు, కార్పొరేట్ ఎఫ్డీలపై ఆర్జించే ఆదాయాల కంటే పీపీఎఫ్పైనే పొందే వడ్డీ రేటే ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ట్యాక్స్-ఫ్రీ పీపీఎఫ్ పెట్టుబడిదారులకు ఉత్తమమైన పొదుపు మార్గమమని విశ్లేషకులు చెప్పారు. -
స్టాక్స్లో ఈపీఎఫ్వో పెట్టుబడులు రూ.9,723 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్ వరకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్)లలో రూ.9,723 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. వీటిపై రాబడి 9.17 శాతంగా ఉన్నట్టు కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ సోమవారం లోక్సభకు లిఖిత పూర్వకంగా తెలిపారు. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకుల నేపథ్యంలో ఆ ప్రభావం నుంచి తట్టుకునేందుకు నిఫ్టీ, సెన్సెక్స్ ఈటీఎఫ్లలో ఈ మేరకు పెట్టుబడి పెట్టినట్టు పేర్కొన్నారు. ఈపీఎఫ్వో వద్ద ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం రూ.7.49 లక్షల కోట్ల నిధులు ఉన్నట్టు వెల్లడించారు. ఈటీఎఫ్లలో రాబడులు ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాల కంటే ఎక్కువగా ఉన్నాయని, ఇది చందాదారులకు లాభదాయకమన్నారు. ఈపీఎఫ్వో గతేడాది ఆగస్ట్ నుంచి ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. -
భవన నిర్మాణ కార్మికులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్!
భువనేశ్వర్: కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు కూడా ఈఎస్ఐ, ఈపీఎఫ్ సదుపాయాలు కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేయనుందని కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. భువనేశ్వర్లో కార్మికుల జాతీయ భేటీలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లు, రిక్షా కార్మికులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లకూ వీటిని కల్పించే ందుకు కసరత్తు జరుగుతోందన్నారు. రాష్ట్రాలకు నిర్మాణ పన్ను రూపేణా వచ్చిన రూ. 27,886 కోట్లలో రూ.5,800 కోట్లే ఖర్చు పెట్టాయని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల చట్టం-1996 ప్రకారం ఆ సొమ్మును కార్మికుల అభివృద్ధి కోసం ఉపయోగించాలన్నారు.ఈ పన్ను రూపంలో ఒడిశా ప్రభుత్వం వసూలు చేసిన రూ. 940 కోట్లలో రూ. 120 కోట్లే ఖర్చు చేసిందన్నారు. ఈ సదస్సులో ఒడిశా, బిహార్, తెలంగాణ, మేఘాలయ, జార్ఖండ్, హరియాణాల కార్మిక మంత్రులు పాల్గొన్నారు. -
సులభంగా పీఎఫ్ సొమ్ము తీసుకోవచ్చు
న్యూఢిల్లీ: ఉద్యోగులు తమ పెన్షన్ సొమ్మును తీసుకునే ప్రక్రియను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) సులభతరం చేసింది. ఇక ఉద్యోగి పనిచేసిన కంపెనీ ధ్రువీకరణ లేకుండానే పీఎఫ్ సొమ్మును తీసుకునేలా ఈపీఎఫ్ఓ కొత్తగా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) దరఖాస్తు (ఫారం 10 డి)ను ప్రవేశపెట్టింది. ఈ దరఖాస్తును పూర్తిచేసి నేరుగా ఈపీఎఫ్ కార్యాలయంలో సమర్పించి పీఎఫ్ ఖాతాదారులు డబ్బు తీసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు యూఏఎన్లో అనుసంధానమై ఉంటాయి. కంపెనీ డిజిటల్ సంతకం, ఉద్యోగి పూర్తి వివరాలు ఫారం 11లో పొందుపరచబడి ఉంటాయి. వీటిని సంస్థ సరిపోల్చుకుంటుంది. -
యూఏఎన్ లేకున్నా పీఎఫ్ తీసుకోవచ్చు
న్యూఢిల్లీ: భవిష్య నిధి(పీఎఫ్) నుంచి ఉపసంహరణ సమయంలో సార్వత్రిక ఖాతా సంఖ్య (యూఏఎన్) వివరాలు అందించాలన్న నిబంధనను ఉద్యోగ భవిష్య నిధి సంస్థ సరళతరం చేసింది. ఈ మినహాయింపు 2014, జనవరి 1కి ముందు విరమణ పొందిన ఉద్యోగులకే వర్తిస్తుంది. యూఏఎన్ లేనివారు పీఎఫ్ నగదు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారి ఒకరు వెల్లడించారు. నగదు సెటిల్మెంట్ సమయంలో యూఏఎన్ను సమర్పించడాన్ని ఈపీఎఫ్ఓ గత డిసెంబర్లో తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. -
కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు: దత్తాత్రేయ
న్యూఢిల్లీ: భవన కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను కల్పించనున్నట్లు కేంద్ర మంత్ర బండారు దత్తాత్రేయ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భారత్లో వెట్టిచాకిరి ప్రధాన సమస్య అని పలు దేశాలు అంటున్నాయి.. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు సర్వే చేపట్టనున్నట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు. -
ఎన్పీఎస్-ఈపీఎఫ్ ఏది మంచిది?
విభిన్నమైన ప్రయోజనాలు అందించే నేషనల్ పెన్షన్ స్కీమ్ను (ఎన్పీఎస్) ప్రభుత్వం సాధారణ ప్రజానీకానికి అందుబాటులోకి తెచ్చి ఐదేళ్లు దాటిపోయింది. కానీ ఇప్పటికీ ఆదరణ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. దీంతో ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) విత్డ్రాయల్స్లో కొంత మొత్తంపై పన్నులు విధించే ప్రతిపాదన ద్వారా ఎన్పీఎస్తో దీన్ని సమం చేసేందుకు, తద్వారా ఇన్వెస్టర్లను అటువైపు కూడా మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఆ ప్రతిపాదన విరమించుకోక తప్పలేదు. ఈ నేపథ్యంలో అసలు ఈపీఎఫ్కు, ఎన్పీఎస్ లక్షణాలేంటి? వీటి మధ్య ఉన్న తేడాలేంటి? చూద్దాం... * ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా చూడొద్దు * రెండింటితోనూ వేర్వేరు ప్రయోజనాలు పెట్టుబడుల విధానం.. * ఈపీఎఫ్కు క్రమం తప్పకుండా బేసిక్ వేతనం నుంచి కొంత మొత్తాన్ని జమచేయాలి. కంపెనీయే ఉద్యోగి జీతం నుంచి ఈ మొత్తాన్ని కట్ చేసి తన ఈపీఎఫ్ ఖాతాకు జమచేస్తుంది. అంతే మొత్తాన్ని కంపెనీ కూడా జోడిస్తుంది. * ఎన్పీఎస్ మాత్రం పూర్తిగా స్వచ్ఛందం. ఇన్వెస్టర్లు ఏకమొత్తంగానైనా లేదా ఇతరత్రా వాయిదాల పద్ధతిలోనైనా తమ ఇష్టప్రకారం కట్టుకోవచ్చు. కనిష్ట, గరిష్ట పెట్టుబడి.. * ఈపీఎఫ్కు ఉద్యోగి నెలవారీ బేసిక్ జీతంలో కొంత మొత్తం చెల్లించాలి. కంపెనీ కూడా అంతే చెల్లిస్తుంది. ఉద్యోగి స్వచ్ఛందంగా ఎక్కువ కూడా కట్టుకోవచ్చు. * ఎన్పీఎస్కి సంబంధించి ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.6,000 కట్టాలి. గరిష్ట పరిమితులేమీ లేవు. అసెట్ కేటాయింపులు.. * ఇప్పటి దాకా ఈపీఎఫ్ 100 శాతం పెట్టుబడుల్ని రుణ సాధనాల్లోనే పెట్టేది. ఈ మధ్యే పీఎఫ్ నిధిలో 5 శాతం మొత్తాన్ని ఈక్విటీ మార్కెట్లలో ఈపీఎఫ్వో ఇన్వెస్ట్ చేస్తోంది. గరిష్టంగా 15 శాతం దాకా పరిమితి ఉంది. * ఎన్పీఎస్లో ఇన్వెస్టరే తన పెట్టుబడి మొత్తాన్ని ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఏ రకంగా పెట్టుబడి పెట్టాలన్నది నిర్ణయించుకోవచ్చు. లేదా డిఫాల్ట్ ఆప్షన్ కింద సదరు ఇన్వెస్టరు రిటైర్మెంట్ వయస్సుకు దగ్గరవుతున్న కొద్దీ.. ఏటా కొంత కొంతగా ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతుంటాయి. మరో ఆప్షన్లో ఈక్విటీలకు గరిష్టంగా యాభై శాతమే కేటాయింపులు జరిపే వీలుంది. దీన్ని ఆరు పెన్షన్ ఫండ్ సంస్థలు నిర్వహిస్తుం టాయి కనుక మనకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. ఆశించతగ్గ రాబడులు.. * ఈపీఎఫ్లో చందాదారులందరికీ వడ్డీ ఒకే రకంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరం ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.7 శాతం. దేశంలో వడ్డీ రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో ఇది కాస్త తగ్గొచ్చు లేదా అదే స్థాయిలోనూ కొనసాగవచ్చు. * ఈక్విటీల్లోనూ పెట్టుబడులు ఉంటా యి కనుక.. ఎన్పీఎస్ చందాదారులకు కొంత అధిక రాబడులొచ్చే అవకాశాలున్నాయి. పదేళ్లు ఆపైన దీర్ఘకాలిక పెట్టుబడులు పెడి తే ఈపీఎఫ్ కన్నా ఎన్పీఎస్ స్కీము ద్వారా 2-3 శాతం మేర ఎక్కువ రాబడులు రావొచ్చు. అర్హత * ఈపీఎఫ్ అనేది ప్రైవేట్ సంస్థల్లోని వేతన జీవులకు మాత్రమే పరిమితం. 20 మంది పైగా ఉద్యోగులున్న సంస్థలకు ఇది తప్పనిసరి. * ఎన్పీఎఫ్ విషయానికొస్తే.. ఏప్రిల్ 2004 తర్వాత విధుల్లో చేరిన ప్రభుత్వోద్యోగులందరికీ ఇది తప్పనిసరి. వ్యాపారవేత్తలు, స్వయం ఉపాధి పొందే వారు, గృహిణులు, సంఘటిత.. అసంఘటిత రంగాల్లో పనిచేసే సాధారణ ప్రజలు కూడా ఎన్పీఎస్లో పెట్టుబడి పెట్టొచ్చు. దీంతో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి తన రిటైర్మెంట్ ప్రణాళిక కోసం ఇటు ఈపీఎఫ్ అటు ఎన్పీఎస్ను కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ, వ్యాపారవేత్తలు లేదా స్వయం ఉపాధి పొందే వారికి ఈపీఎఫ్ ఉండదు. వారు ఎన్పీఎస్ లేదా పరిమిత స్థాయిలో పీపీఎఫ్ మాత్రమే వినియోగించుకోగలరు. పన్ను ప్రయోజనాలు.. * ప్రస్తుత నిబంధనల ప్రకారం సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ. 1.5 లక్షల దాకా పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఈపీఎఫ్ దీని పరిధిలోకే వస్తుంది. అయితే, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, బీమా పథకాలు, ట్యూషన్ ఫీజులు, 5 ఏళ్ల కాలపరిమితి బ్యాంకు డిపాజిట్లు అన్నీ సెక్షన్ 80సీ కిందికే వస్తాయి. * ఎన్పీఎస్ మాత్రం సెక్షన్ 80సీ పరిధిలోకి రాదు. సెక్షన్ 80సీసీడీ (1బీ) కిందికి వస్తుంది. ఏడాదికి గరిష్టంగా రూ.50,000 దాకా మినహాయింపు పొందవచ్చు. ఇది సెక్షన్ 80సీకి అదనమని గుర్తుంచుకోవాలి. * రిటైరైనప్పుడు మెచ్యూరిటీ సమయంలో మొత్తం ఈపీఎఫ్ను పన్ను ప్రసక్తి లేకుండా విత్డ్రా చేసుకోవచ్చు. * ఎన్పీఎస్ నుంచి మొత్తం నిధిని విత్డ్రా చేసుకోవటం కుదరదు. నిధిలో 40 శాతాన్ని పన్నుల్లేకుండా విత్డ్రా చేసుకోవచ్చు. మిగతా 60 శాతాన్ని కచ్చితంగా పెన్షన్ ప్లాన్ వంటి యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి. కావాలనుకుంటే పూర్తి మొత్తాన్ని కూడా యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. * స్థూలంగా చూస్తే ఎన్పీఎస్, ఈపీఎఫ్లనేవి ఒకదానికి మరొకటి ప్రత్యామ్నాయం కాదు. ఒకదానికి మరొకటి తోడుగా పరిగణించాలి. రెండూ ఉంటే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒకటి యాపిల్ అయితే మరొకటి నారింజలాంటిది. రెండిటినీ పోల్చలేం. కానీ ఈ రెండూ ఆరోగ్యానికి మేలే చేస్తాయి. -
ఈపీఎఫ్ వడ్డీరేటు పెంపు
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) వడ్డీ రేటుపై తన నిర్ణయాన్నిమార్చుకున్న ప్రభుత్వం ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చింది. ఇటీవల తగ్గించిన వడ్డీరేటును సవరించుతూ నిర్ణయం తీసుకుంది. కార్మిక శాఖ మంత్రి నేతృత్వంలో ఉన్న సీబీటీ సిఫారసులకు అనుగుణంగా ఈపీఎఫ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును 8.8 శాతంగా నిర్ణయించింది. ఇటీవల ఇపిఎఫ్ఓ ధర్మకర్తల త్రైపాక్షిక సెంట్రల్ బోర్డు (సిబిటి) ఏకగ్రీవ నిర్ణయానికి విరుద్ధంగా ప్రకటించిన 8.7 శాతం వడ్డీ రేటు నిర్ణయానికి వెనక్కి తీసుకుంది. కాగా ఆర్థిక శాఖ ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ సహా పది కేంద్ర కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోకపోతే ఏప్రిల్ 29న పెద్ద ఎత్తున నిరసనకు దిగనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పింఛను కావాలా..?
ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగమంటే... పింఛనుతో కూడిన భరోసా! ఈ పెన్షన్ ఉంటుందనే ప్రభుత్వోద్యోగం కోసం ఏళ్లపాటు ఎడతెగని ప్రయత్నాలు చేసేవారు. మరిప్పుడు..? ఉద్యోగస్తులు మాత్రమే కాదు. ఎవరైనా పెన్షన్ తీసుకోవచ్చు. అది కూడా 58 ఏళ్లో, 60 ఏళ్లో దాటాక... అదికూడా రిటైరయ్యాక మాత్రమే కాదు. 45 ఏళ్లు దాటాక కూడా కావాలంటే పెన్షన్ తీసుకోవటానికి కొన్ని పథకాలున్నాయి. కాస్త ప్లానింగ్ ఉండి.. మొదటి నుంచీ పొదుపు పాటిస్తే... రిటైర్మెంట్ వయసు దాటాక జీతం కన్నా ఎక్కువ పెన్షన్ కూడా తీసుకోవచ్చు. అందుకు ఏఏ పథకాలు అందుబాటులో ఉన్నాయి? వాటి నిబంధనలేంటి? రాబడులెలా ఉంటాయి? అనే వివరాలే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రధాన కథనం... ఈపీఎఫ్, పీపీఎఫ్లతో పాటు పలు మార్గాలు ♦ పన్ను మినహాయింపులతో ఆకర్షణీయంగా ఎన్పీఎస్ ♦ బీమా పథకాలు, మ్యూచ్వల్ ఫండ్స్తోనూ పెన్షన్ ♦ మునుపటిలానే ఈపీఎఫ్కు పన్ను మినహాయింపులు పెన్షన్ కోసం దేశంలో అందుబాటులో చాలా పథకాలున్నప్పటికీ...90 శాతం మందికి పైగా ఎంచుకుంటున్నవి మాత్రం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లే. ఇవికాక బీమా పథకాలు, మ్యూచువల్ పెన్షన్ ఫండ్స్ కూడా పెన్షన్ అందిస్తుంటాయి. కానీ వీటిలో పెట్టుబడి పెట్టడానికి, వీటిపై వచ్చే రాబడులకు ఒకదానితో ఒకటి సంబంధం ఉండదు. కొన్ని పథకాల్లో వెనక్కి తీసుకునే మొత్తంపై పన్ను చెల్లించాల్సి వస్తే, కొన్ని పథకాలు పన్ను లేని ఆదాయాన్నిస్తాయి. ⇒ ఈపీఎఫ్, పీపీఎఫ్ నుంచి వెనక్కి తీసుకునే మొత్తంపై ఎలాంటి పన్నూ లేదు. ⇒ బీమా పింఛను పథకాల నుంచి వెనక్కి తీసుకునే మొత్తంలో 40 శాతానికే పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ⇒ ఎన్పీఎస్ నుంచి తీసుకునే మొత్తంపై మొన్నటిదాకా పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఈపీఎఫ్పై అసలు పన్ను లేకపోవడం, ఎన్పీఎస్కు పూర్తిగా పన్ను చెల్లించాల్సి రావటంతో... ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మొన్నటి బడ్జెట్లో ఎన్పీఎస్ నుంచి తీసుకునే మొత్తంలో 40 శాతానికి పన్ను మినహాయింపు ఇచ్చారు. మరోవంక ఈపీఎఫ్కు కూడా మొత్తానికి మినహాయింపును తీసేసి 40%కే మినహాయింపు వర్తిస్తుందని చెప్పారు. దీనిపై ఉద్యోగ కార్మిక సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి... ఈ ప్రతిపాదనను విరమించుకున్నారు. ఈపీఎఫ్లో పాత నిబంధనలే.. ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ అంటే తెలుసు. 20 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రతి సంస్థ విధిగా పీఎఫ్ పథకాన్ని అమలు చేయాలి. దీని ప్రకారం జీతంలో ( బేసిక్ శాలరీ + డీఏ) 12 శాతాన్ని ఉద్యోగి చెల్లిస్తే... మరో 12 శాతాన్ని సంస్థ జమచేయాలి. సంస్థ జమచేసే మొత్తంలో 8.3 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీంలోకి వెళుతుంది. మిగిలిన మొత్తం ఉద్యోగి పీఎఫ్ ఖాతాలోకి వెళుతుంది. అయితే 2014 వరకూ పీఎఫ్ ఖాతాలో చేరడానికి గరిష్ఠ జీతం పరిమితి రూ.6,500గా ఉండేది. దీనికన్నా జీతం ఎక్కువ ఉన్నా సరే... చట్టప్రకారం ఈ మొత్తంలో 12 శాతాన్ని (అంటే రూ.780) పీఎఫ్ ఖాతాకు జమ చేస్తే చాలు. కాకపోతే 2014 సెప్టెంబర్లో ఈ పరిమితిని రూ.15,000కు పెంచారు. దీన్లో 12 శాతం... అంటే రూ.1,800 కనీసం జమ చేయాలి. ఇంకా ఎక్కువ జీతం ఉన్న పక్షంలో... ఉద్యోగి, సంస్థ ఇష్టపూర్వకంగా మరింత మొత్తాన్ని కూడా ఈపీఎఫ్ ఖాతాకు జమ చేయొచ్చు. ఇలా కేటాయించిన అదనపు మొత్తంపై కూడా ఇదే వడ్డీ రేటు, పన్ను రాయితీలు లభిస్తాయి. దీన్లో వలంటరీ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. అయితే వరసగా ఐదేళ్ల పాటు పనిచేసిన వారికి మాత్రమే పెన్షన్ లభిస్తుంది. ⇒ పీఎఫ్లో ప్రస్తుతం నెలకు జమ చేయాల్సిన కనీస మొత్తం రూ.1800 + 1800 ⇒ 2015-16 సంవత్సరానికి ఈపీఎఫ్పై 8.8 శాతం వడ్డీని ఇస్తున్నారు. ⇒ ఈపీఎఫ్కు జమచేసే మొత్తానికి కూడా ఏటా పన్ను మినహాయింపు ఉంటుంది. ⇒ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈపీఎఫ్ నుంచి... అత్యవసర సందర్భాల్లో డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. ఇంటి నిర్మాణం, రుణం చెల్లింపులు, ఇంటి రిపేర్లకు, పిల్లల చదువు, పెళ్ళి, వైద్య ఖర్చులు, ప్రకృతివైపరీత్యాల వలన నష్టాలు సంభవించినప్పుడు... నిబంధనలు అనుసరించి ఈపీఎఫ్ సొమ్మును వినియోగించుకోవచ్చు. ఇలా వెనక్కి తీసుకునే మొత్తంపై ఇకపై కూడా మునుపటిలానే పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. ఈపీఎఫ్ ద్వారా వచ్చే నెలవారీ పింఛను చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈపీఎఫ్లో జమ చేసిన నిధితో యాన్యుటీ పథకాలను కొనుగోలు చేసి... మరింత పెన్షన్ పొందవచ్చు. అందరికీ అందుబాటులో... పీపీఎఫ్ ⇒ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్... ఉద్యోగస్తులే కాక ఎవరైనా పీపీఎఫ్లో ఖాతా తెరవవచ్చు. ⇒ పోస్టాఫీసులు, బ్యాంకుల్లో అందుబాటులో ఉండే పీపీఎఫ్ కాలపరిమితి 15 ఏళ్లు. ⇒ పెట్టుబడిపై ఏటా పన్ను మినహాయింపులుంటాయి; మెచ్యూరిటీ మొత్తం ట్యాక్స్ఫ్రీనే. ⇒ పీపీఎఫ్లో ఏడాదికి రూ.500 నుంచి రూ.1,50,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ⇒ పిల్లల పేరిట కూడా ఖాతా తెరవొచ్చు. 15 ఏళ్లు దాటాక మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు కూడా. ⇒ ఏడేళ్ల వరకు ఇన్వెస్ట్ చేసిన మొత్తం నుంచి వెనక్కి తీసుకోలేము. ⇒ ఏడేళ్ళ తర్వాత ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 50 శాతం వరకు తీసుకోవచ్చు. ప్రసుత్త వడ్డీ 8.7 శాతం. ఇది దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ పథకమే కాని పెన్షన్ అందించేది కాదు. పీపీఎఫ్ అకౌంట్ కాలపరిమితి తర్వాత వచ్చే మెచ్యూర్టీ మొత్తంతో యాన్యుటీ ప్లాన్ను కొనుగోలు చేయడం ద్వారా పెన్షన్ పొందవచ్చు. మరింత ఆకర్షణీయంగా ఎన్పీఎస్ సామాజిక భద్రతలో భాగంగా అందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో 2004లో న్యూ పెన్షన్ సిస్టమ్ను (ఎన్పీఎస్) ప్రవేశపెట్టారు. ప్రతి బడ్జెట్లో దీన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నారు. గతేడాది బడ్జెట్లో ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై సెక్షన్ 80సీసీడీ కింద అదనంగా రూ.50,000 పన్ను రాయితీనిచ్చారు. ఇది సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.50 లక్షల పన్ను మినహాయింపులకు అదనం. ఇప్పటిదాకా ఈ పథకం నుంచి వెనక్కి తీసుకునే మొత్తంపై వారి వ్యక్తిగత ఆదాయ శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి వచ్చేది. వచ్చే ఏడాది నుంచి ఎన్పీఎస్ నుంచి వెనక్కి తీసుకునే మొత్తంలో 40 శాతం వరకు ఎలాంటి పన్ను ఉండదని తాజా బడ్జెట్లో పేర్కొన్నారు. ⇒ 18-55 సంవత్సరాల మధ్య ఈ పథకంలో చేరవచ్చు. ⇒ ఇది కూడా ఫండ్ పథకాల మాదిరే పనిచేస్తుంది. ⇒ దీనికి జమయ్యే మొత్తాన్ని ఈక్విటీ, డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ⇒ ఎన్పీఎస్ ఫండ్స్ను ఎస్బీఐ, ఐసీఐసీఐ, యూటీఐ, రిలయన్స్, ఐడీఎఫ్సీ, కోటక్ మహీంద్రాలు నిర్వహిస్తున్నాయి. ⇒ ఈ ఫండ్స్ మూడు రకాలు. అధిక రిస్క్ ఉండే ఈక్విటీ ఫండ్లో గరిష్టంగా 50 శాతం మాత్రమే ఇన్వెస్ట్ చేయొచ్చు. ⇒ రిస్క్ సామర్థ్యం ఆధారంగా నచ్చిన ఫండ్ మేనేజర్ను, ఫండ్ను మీరే ఎంచుకోవచ్చు. ఏడాదికి కనీస పెట్టుబడి రూ.6,000. దీన్ని నాలుగు దఫాల్లో చెల్లించవచ్చు. కనీస వాయిదా రూ.500. ⇒ ఇందులో టైర్-1, టైర్-2 ఖాతాలుంటాయి. టైర్-1లో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని 60 ఏళ్లు దాటాకే తీసుకోవాలి. ⇒ 60 ఏళ్ల తరవాత వచ్చే మొత్తంలో కనీసం 80% యాన్యుటీలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ⇒ టైర్-2లో అవసరమైనప్పుడు కనీసం 2వేలు ఉంచి మిగిలిన మొత్తం వెనక్కి తీసుకోవచ్చు. ⇒ ఎవరైనా ఎన్పీఎస్లో ఖాతా తెరవచ్చు. పన్ను ప్రయోజనాలతో పాటు, 60 ఏళ్లు దాటాక పెన్షన్ పొందవచ్చు. బీమాతోనూ పింఛన్ పొందొచ్చు.. బీమా కంపెనీలు అందిస్తున్న పెన్షన్ పథకాల్ని రెండు రకాలుగా చెప్పొచ్చు. మొదటివి సాంప్రదాయ పెన్షన్ పథకాలు; రెండో రకం యూనిట్ ఆథారిత బీమా పథకాలు. సాంప్రదాయ పెన్షన్ పథకాలు స్థిరమైన రాబడినిస్తాయి. అదే యులిప్స్ పథకాల రాబడులైతే స్టాక్ మార్కెట్ కదలికలపై ఆధారపడి ఉంటాయి. ⇒ ఈ 2 పథకాల్లోనూ పాలసీ వ్యవధి మొత్తం ఇన్వెస్ట్ చేయాలి. ⇒ రిటైరయ్యాక ఎంచుకున్న కాలానికి పెన్షన్ను అందిస్తాయి. ⇒ మెచ్యూరిటీ మొత్తంలో గరిష్టంగా 25-33% ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. ⇒ 33% వరకూ పన్నుండదు. ⇒ మిగిలినదాంతో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాలి. ⇒ మిగిలిన బీమా పథకాలతో పోలిస్తే వీటిలో మోర్టాలిటీ ఛార్జీలు, ఇతర ఛార్జీలు తక్కువ. ⇒ చాలా బీమా కంపెనీలు 45 ఏళ్లు దాటితే యాన్యుటీ ప్లాన్కు అనుమతిస్తున్నాయి. అంటే 45 ఏళ్ల నుంచే పెన్షన్ తీసుకోవచ్చన్న మాట. ⇒ పెన్షన్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై గరిష్టంగా లక్ష రూపాయల వరకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. ⇒ పెన్షన్గా వచ్చే మొత్తాన్ని ఆదాయంగా పరిగణిస్తారు. మిగిలిన పథకాలతో పోలిస్తే బీమా పెన్షన్ పథకాల రాబడి చాలా తక్కువ. కేవలం 6-7 శాతం రాబడులు మాత్రమే అందిస్తాయి. బీమా రక్షణతో పాటు పెన్షన్ కావాలనుకునే వారు వీటికేసి చూడొచ్చు. యాన్యుటీ అంటే... పైన పేర్కొన్నవన్నీ పెన్షన్ పథకాలే. కానీ ఇవి నిజంగా పెన్షన్ ఇవ్వవు. పింఛన్ కోసం నిధిని సమకూర్చుకోవడానికి పనికొస్తాయి. ఇలా సమకూర్చుకున్న నిధిని యాన్యుటీ ప్లాన్లో పెట్టుబడిగా పెట్టడం ద్వారా పింఛను పొందొచ్చు. పెన్షన్ పథకం తీసుకున్న దగ్గరే యాన్యుటీ ప్లాన్ను తీసుకోవాలన్న నిబంధనేమీ లేదు. పెన్షన్ పాలసీ గడువు ముగిశాక మీకు నచ్చిన కంపెనీకి చెందిన యాన్యుటీ ప్లాన్ను తీసుకోవచ్చు. చేతికి ఎంత పెన్షన్ వస్తుందనే విషయం మీరు ఎంత కాలానికి పెన్షన్ కావాలనుకుంటున్నారు? మీ తదనంతరం మీపై ఆధారపడిన వారికి కూడా పెన్షన్ కావాలనుకుంటున్నారా? అన్న విషయాలపై ఆధారపడి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయ్... ⇒ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే కేవలం నాలుగు పెన్షన్ ఫండ్లే అందుబాటులో ఉన్నాయి. ⇒ పదేళ్లుగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా పెన్షన్ ఫండ్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ఫండ్స్ను అందిస్తున్నాయి. ⇒ ఈ మధ్య రిలయన్స్ సంస్థ రిటైర్మెంట్ ఫండ్ను, హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ను ప్రవేశపెట్టాయి. ⇒ ఇవన్నీ బ్యాలెన్స్డ్ ఫండ్ విభాగంలోకి వస్తాయి. ఈక్విటీల్లో 40 శాతం, డెట్ పథకాల్లో 60 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తాయి. ⇒ ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేయాలి. ⇒ వీటిలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై సెక్షన్80సీ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి. ⇒ వీటి లాకిన్ పిరియడ్ మూడు నుంచి ఐదేళ్లుగా ఉంది. గడిచిన పదేళ్లలో ఈ ఫండ్స్ 9 నుంచి 10 శాతం వార్షిక సగటు రాబడుల్ని అందించాయి. ఎన్పీఎస్తో పోలిస్తే వీటి నిర్వహణ ఖర్చులు ఎక్కువ. ఆ మేరకు రాబడులు తగ్గుతాయి. కానీ వీటి నుంచి వెనక్కి తీసుకున్న మొత్తంతో తప్పనిసరిగా యాన్యుటీ ప్లాన్ కొనాలన్న నిబంధన ఏమీ లేదు. అలాగే ఇవి అందించే రాబడులపై ఎటువంటి పన్ను భారం ఉండదు. -
‘ఈపీఎఫ్’ ఉపసంహరణపై పన్నులేదు
► వెనక్కి తగ్గిన కేంద్రం ► ఉద్యోగులు, కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో నిర్ణయం ►పాత నిబంధనలే కొనసాగుతాయని లోక్సభలో ప్రకటించిన జైట్లీ ► బడ్జెట్ ప్రతిపాదనల్లోని 138, 139 పేరాలను తొలగిస్తున్నట్లు ప్రకటన ►ఎన్పీఎస్పై ప్రతిపాదనలు మాత్రం కొనసాగిస్తామని వెల్లడి న్యూఢిల్లీ: ఉద్యోగ, కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్- ఉద్యోగుల భవిష్యనిధి)’పై బడ్జెట్లో చేసిన పన్ను ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈపీఎఫ్ ఉపసంహరణపై పన్ను ఉండదని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈపీఎఫ్ చందాదారులు ఉపసంహరించుకునే సొమ్ములో మొత్తంలో 40 శాతం సొమ్ముపై పన్ను మినహాయింపు ఉంటుందని, మిగతా 60 శాతం సొమ్ముపై పన్ను చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తాజా బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే నిపుణులతో చర్చించిన తర్వాత ఈపీఎఫ్ ఉపసంహరణ పన్ను ప్రతిపాదనను స్వచ్ఛందంగా వెనక్కి తీసుకుంటున్నట్లు అరుణ్ జైట్లీ మంగళవారం లోక్సభలో ప్రకటించారు. అయితే ఎన్పీఎస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్) నుంచి ఉపసంహరించుకునే సొమ్ములో 40 శాతంపై ఇచ్చిన పన్ను మినహాయింపు రాయితీ మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. యాజమాన్యాల తరఫున భవిష్యనిధికి జమయ్యే మొత్తంపై పన్ను మినహాయింపుపై విధించిన రూ.1.5 లక్షల పరిమితి ప్రతిపాదనను కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘పన్ను’పై తీవ్రస్థాయిలో విమర్శలు ఇతర యాన్యుటీ పథకాల్లాగానే ఈపీఎఫ్పై కూడా పన్ను విధిస్తున్నట్లు జైట్లీ బడ్జెట్లో చేసిన ప్రతిపాదనపై అన్నివైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం... ఉపసంహరించుకునే 60 శాతం మొత్తంపై కాకుండా దానికి సంబంధించిన వడ్డీపై మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుందని వివరణ ఇచ్చింది. దాంతోపాటు వేతనం రూ.15,000 దాటిన వారికి మాత్రమే ఈ ప్రతిపాదనలు వర్తిస్తాయని... 3.7 కోట్ల మంది చందాదారుల్లో పన్ను పరిధిలోకి వచ్చేది కేవలం 70 లక్షల మంది మాత్రమేనని పేర్కొంది. అయితే ఈ వివరణలు ఉద్యోగుల్లో గందరగోళాన్ని, భయాన్ని మరింత పెంచాయి. మరోవైపు ఈ పన్ను వల్ల భవిష్యత్తు అవసరాల కోసం ఈపీఎఫ్లో జమ చేసే మొత్తం తగ్గడమే కాకుండా ఈపీఎఫ్ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని నిపుణులు హెచ్చరించారు. దీంతో అన్ని పక్షాలతో సమావేశమైన ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలోని 138, 139 పేరాలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఈ పేరాల్లో ఎన్పీఎస్ 40 శాతం విత్డ్రాయిల్స్పై ప్రవేశపెట్టిన పన్ను మినహాయింపులు మాత్రం కొనసాగుతాయని పేర్కొన్నారు. పదవీ విరమణ తర్వాత మరింత ఆర్థిక స్వేచ్ఛ కల్పించే విధంగా యాన్యుటీ పథకాల్లో పెట్టుబడిని ప్రోత్సహించడానికే ఈపీఎఫ్ ఉపసంహరణపై ప్రతిపాదనలు చేశామని, దీనివల్ల ప్రభుత్వానికి పెద్ద ఆదాయం సమకూరదని జైట్లీ పేర్కొన్నారు. ఈ పన్ను వల్ల ప్రైవేటు ఉద్యోగులు ఈపీఎఫ్లో దాచుకున్న మొత్తాన్ని మధ్యలో తీసేసుకోకుండా ఉంటారని... రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందేందుకు దోహదపడుతుందని చెప్పారు. కానీ ఈ నిర్ణయం వల్ల ఉద్యోగస్తులు ఎందులో పెట్టుబడి పెట్టాలన్న దానిపై స్వేచ్ఛ కోల్పోతారన్న అభిప్రాయంతో ఏకీభవించారు. ఉద్యోగులు, కార్మికుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని పన్ను ప్రతిపాదనను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అంటే ఈపీఎఫ్ నుంచి ఉపసంహరించుకునే మొత్తంపైగానీ, వడ్డీపై గానీ ఇక ఎటువంటి పన్ను ఉండదు. ఈపీఎఫ్ ఉపసంహరణకు సంబంధించి పాత నిబంధనలే కొనసాగుతాయి. -
ఈపీఎఫ్ పన్ను ఉపసంహరణ
మధ్య తరగతికి ఊరటనిచ్చే చర్య న్యూఢిల్లీ: ఈపీఎఫ్ పన్ను విధింపుపై చెలరేగిన ఆందోళనలు సమంజసమైనవని భావించడంతో పన్ను విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. ఉద్యోగులకు మరింతగా ప్రయోజనం కల్పించడానికే ఈ పన్ను ప్రతిపాదన తెచ్చామని, అంతేకాని పన్ను ఆదాయం పెంచుకోవడానికి కాదని స్పష్టం చేశారు. పెన్షన్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికే ఈ ప్రతిపాదన ఉద్దేశమని పేర్కొన్నారు. ఫిక్కి ఇక్కడ నిర్వహించిన ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ విషయాలు వెల్లడించారు. వివాదస్పదమైన ఈపీఎఫ్ పన్ను ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం సరైన చర్య అని పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. సంప్రదింపుల ప్రక్రియకు ప్రభుత్వం కట్టుబడి ఉందని దీనివల్ల అందరికీ అర్థమైందని కేపీఎంజీ ఇండియా హెడ్(ట్యాక్స్) గిరీష్ వన్వరి చెప్పారు. ఈపీఎఫ్ పన్ను ప్రతిపాదనను వెనక్కి తీసుకోవడం మధ్యతరగతికి ఊరటనిచ్చే చర్య అని నంగియా అండ్ కో ఈడీ నేహ మల్హోత్ర చెప్పారు. తమ రిటైర్మెంట్ పొదుపులను తమకు ఇష్టం వచ్చిన రీతిలో వినియోగించుకునే స్వేచ్ఛ వారికి లభించిందని వివరించారు. ఈపీఎఫ్ పన్ను ప్రతిపాదనను వెనక్కి తీసుకోవడం పట్ల ఆన్లైన్ పిటీషన్ ప్లాట్ఫారమ్ ఛేంజ్డాట్ఓఆర్జీ హర్షం వ్యక్తం చేసింది. ఈపీఎఫ్ పన్ను ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఆన్లైన్ పిటీషన్పై సంతకాలు చేసిన రెండున్నర లక్షలమందికి ఇది అతిపెద్ద విజయమని పేర్కొంది. గుర్గావ్కు చెందిన ఆర్థిక రంగ నిపుణులు, వైభవ్ అగర్వాల్ ఈ ఆన్లైన్ పిటీషన్ను ప్రారంభించారు. -
ఈపీఎఫ్లపై పన్ను లేదు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) విషయంలో అనుకున్నదే జరిగింది. ఈపీఎఫ్లపై పన్ను విధించే విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. కేంద్ర బడ్జెట్లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఈపీఎఫ్లపై పన్ను విధించాలని చేసిన ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. ఈపీఎఫ్ చందాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతోపాలు పలు ప్రతిపాదనలు, స్పందన గమనించి దానిని ప్రస్తుతానికి విరమించుకుంటున్నట్లు అరుణ్ జైట్లీ తెలిపారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి ఆయన నిర్ణయం మేరకే జైట్లీ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్ లో ఏప్రిల్ 1 తర్వాత నుంచి దాచుకొనే మొత్తాలను వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు 60 శాతం మొత్తం మీద ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో పేర్కొన్నారు. పదవీ విరమణ నాటికి ఈపీఎఫ్లో సమకూరిన నిధిలో 40శాతం మొత్తానికి ఎలాంటి పన్ను ఉండదని అరుణ్ జైట్లీ ప్రకటించారు. తాజా ప్రతిపాదనపై ఆరున్నర కోట్ల ఈపీఎఫ్ చందాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. -
ఈపీఎఫ్లో.. ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించమా?
నా వయస్సు 40 సంవత్సరాలు. నేను ఉద్యోగంలో చేరిన కొత్తలోనే ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్(ఈపీఎఫ్)లో ఎక్కువ మొత్తంలోనే ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. ఈ ఇన్వెస్ట్మెంట్స్, వీటిపై వడ్డీ కూడా కలుపుకొని ఈ మొత్తం ఇప్పుడు రూ.40 లక్షలకు చేరింది. ఇది కాకుండా లార్జ్ క్యాప్ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో నెలకు రూ.15,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రిటైరైనప్పుడు ఈపీఎఫ్ నుంచి 40 శాతానికి మించిన విత్డ్రాయల్స్పై పన్ను విధిస్తామని అరుణ్ జైట్లీ తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు కదా ! ఈ పరిస్థితుల్లో ఈపీఎఫ్లో నా ఇన్వెస్ట్మెంట్స్ను కొనసాగించమంటారా? లేకుంటే ఈపీఎఫ్లో పెట్టే అధిక పెట్టుబడులను వేరే సాధనాల్లోకి మళ్లించమంటారా? తగిన సూచనలివ్వండి. - జగన్నాథ్, విశాఖపట్టణం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, ఈపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసే ఏ వ్యక్తి అయినా తన కార్పస్లో 40 శాతం వరకూ విత్డ్రా చేసుకుంటే ఎలాంటి పన్ను ఉండదు. ఈ కార్పస్లో 60 శాతానికి యాన్యుటీని కొనుగోలు చేస్తే పన్ను బాధ్యత ఉండదు. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్స్పై ఆర్జించిన వడ్డీపై మాత్రమే పన్ను ఉంటుందని, అసలుపై పన్ను ఉండదని తాజాగా ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అయితే ఈ విషయమై పూర్తిగా స్పష్టత వచ్చేదాకా వేచి చూడడమే మంచిది. ఆ తర్వాత దానికి తగ్గట్లుగా నిర్ణయం తీసుకోవచ్చు. అయితే పన్ను విషయాలను పక్కన బెడితే, ఈపీఎఫ్లో స్వచ్ఛందంగా ఇన్వెస్ట్ చేయడాన్ని మీరు నిలిపేయవచ్చు. కేవలం మీ ఇన్వెస్ట్మెంట్స్ భద్రత కోసం మీరు రాబడుల విషయంలో రాజీ పడ్డారని భావిస్తున్నాం. ఇలా కాకుంటే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తే ఈ మొత్తంపై మరింతగా రాబడులు పొందే అవకాశముంది. అందుకని ఈపీఎఫ్ స్వచ్ఛంద ఇన్వెస్ట్మెంట్స్ను ఆపేసి ఆ మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. దీనివల్ల మంచి రాబడులు రావడమే కాకుండా దీర్ఘకాలంలో మీ ఆర్థిక లక్ష్యాల సాధన కోసం తగిన స్థాయిలో సంపదను సమకూర్చుకున్నవారవుతారు. కొత్త బడ్జెట్ ప్రకారం, నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)కు సంబంధించి పన్ను సంబంధిత విషయాల్లో మార్పులు జరిగాయని తెలిసింది. ఈ కొత్త ప్రతిపాదనలు ఎన్పీఎస్లో ఇన్వెస్ట్ చేసేవారికి అనుకూలంగానే ఉన్నాయా ? వివరించగలరు -సుచరిత, రాజమండ్రి నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)కు సంబంధించి పన్ను అంశాల్లో ఒక ముఖ్యమైన మార్పును ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ తాజా బడ్జెట్ ప్రతిపాదన ప్రకారం, ఒక వ్యక్తి రిటైరైనప్పుడు తన కార్పస్లో 40 శాతం విత్డ్రా చేసుకునే మొత్తంపై ఎలాంటి పన్ను విధించరు. గతంలో ఈ 40 శాతం మొత్తాన్ని ఆ వ్యక్తి ఆదాయానికి కలిపి, ఆ వ్యక్తికి వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలన్న నిబంధన ఉండేది. గతంలో.. ఒక వ్యక్తికి 60 సంవత్సరాలు వచ్చినప్పుడు తన ఎన్పీఎస్ కార్పస్లో కనీసం 40 శాతం మొత్తంలో యాన్యుటీని కొనుగోలు చేయాలి. 60 శాతం మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఈ విత్డ్రా చేసుకున్న మొత్తంపై పన్ను ఉండేది. ఇక తాజా బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, ఒక వ్యక్తి తన ఎన్పీఎస్ కార్పస్లో 40 శాతం వరకూ మొత్తాన్ని ఎలాంటి పన్ను పోటు లేకుండా విత్డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 60 శాతం మొత్తంతో యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు. పన్ను బాధ్యత నుంచి తప్పించుకోవచ్చు. లేదంటే 40 శాతం మొత్తంతో యాన్యుటీని కొనుగోలు చేయవచ్చు. 40 శాతం మొత్తాన్ని ఎలాంటి పన్ను పోటు లేకుండా విత్డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 20 శాతంపై పన్ను చెల్లించి ఆ మొత్తాన్ని కూడా విత్డ్రా చేసుకోవచ్చు. నేను గత కొన్నేళ్లుగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నేను ఏమైనా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లంచాల్సి ఉంటుందా? తాజా బడ్జెట్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రాబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుకు సంబంధించి ఏమైనా మార్పులు, చేర్పులు జరిగాయా? - వికాస్, తిరుపతి ఈక్విటీలకు సంబంధించి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విషయమై బడ్జెట్లో ఎలాంటి మార్పులు, చేర్పులు జరగలేదు. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ను ఏడాది తర్వాత విక్రయిస్తే ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ఏమీ ఉండదు. మీరు నిరభ్యంతరంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే పన్ను ప్రయోజనాలతో పాటు రాబడులు కూడా బాగా వస్తాయి. -
పీఎఫ్ వివాదాల పరిష్కారానికి మొబైల్ యాప్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) విషయంలో తలెత్తే సమస్యలు, వివాదాలను పరిష్కరించడం కోసం మొబైల్ యాప్ను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ రీజనల్ కమిషనర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంస్కరణల్లో భాగంగా రూపొందించిన మొబైల్ యాప్ వ్యవస్థను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. అన్ని ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. దీని ద్వారా పీఎఫ్ అకౌంట్లో జమవుతున్న మొత్తాలు, ఏ మేరకు నిధులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చన్నారు. ఏవైనా సమస్యలున్నా విన్నవిస్తే పరిష్కరిస్తామన్నారు. -
ఈపీఎఫ్ పై పన్ను.. కొందరికే భారం!
♦ పన్ను ప్రతిపాదనలపై కేంద్రం వివరణ ♦ తీవ్ర విమర్శలు రావటంతో దిద్దుబాటు చర్యలు ♦ నిర్ణయంపై పునరాలోచిస్తామన్న రెవెన్యూ కార్యదర్శి ♦ పీపీఎఫ్ విత్డ్రాయల్స్పై పన్నుండదని స్పష్టీకరణ ♦ 2016 ఏప్రిల్ 1 నుంచీ... అదికూడా ఈపీఎఫ్ వడ్డీపైనే పన్ను! న్యూఢిల్లీ: అన్ని వైపుల నుంచీ విమర్శలు వెల్లువెత్తడంతో ఈపీఎఫ్ విత్డ్రాయల్స్పై పన్ను విధించాలన్న నిర్ణయంపై పునరాలోచన చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) నిధి నుంచి వెనక్కి తీసుకునే మొత్తంలో 40 శాతానికి పన్ను మినహాయించి మిగిలిన 60 శాతంపై పన్ను విధించాలని బడ్జెట్లో చేసిన ప్రతిపాదనపై ఉద్యోగ, కార్మిక సంఘాల నుంచి తీవ్ర విమర్శలు చెలరేగడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. ‘‘ఈపీఎఫ్ విత్డ్రాయల్స్పై విధించనున్న పన్నుపై ఉద్యోగులు ఆందోళన చెందనవసరం లేదు’’ అని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా పేర్కొన్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి ఈపీఎఫ్ నుంచి వెనక్కి తీసుకునే 40 శాతంపై పన్ను భారం ఉండదని, మిగిలిన 60 శాతం మొత్తాన్ని పెన్షన్ అందించే యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి పన్ను భారం ఉండదని చెప్పారు. ‘‘ఒకవేళ ఈ 60% కూడా వెనక్కి తీసుకుంటే... దీన్లో చందాదారులు తమ వాటాగా చెల్లించిన మొత్తంపై పన్ను ఉండదు. వడ్డీగా వచ్చిన రాబడిపై మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మరో విషయమేంటంటే 2016, ఏప్రిల్ 1 తరవాత ఈ ఖాతాకు జమ అయిన వడ్డీపైనే పన్ను భారం లెక్కిస్తారు’’ అని వివరించారు. అలాగే 15 ఏళ్ల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) విత్డ్రాయల్స్పై ఎలాంటి పన్ను భారం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈపీఎఫ్ విత్డ్రాయల్స్పై విధించిన ఈ నిబంధనలు రూ.15,000 లోపు జీతం ఉన్న వారికి వర్తించవని, ఇందువల్ల చిన్న ఉద్యోగులు ఆందోళన చెందనవసరం లేదని వివరించారు. ఈపీఎఫ్లో మొత్తం 3.7 కోట్ల మంది సభ్యులుంటే అందులో 3 కోట్ల మందికి ఈ నిబంధన పరిధిలోకి రారని ఆయన స్పష్టం చేశారు. కేవలం అధిక జీతం ఉన్న 70 లక్షల మంది నగదు వెనక్కి తీసుకుంటే మాత్రమే ఈ పన్ను భారం ఏర్పడుతుందన్నారు. పదవీ విరమణ తర్వాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించడమనేది ఈఎఫ్ఎఫ్ స్కీం ప్రధానోద్దేశమని, అందులో భాగంగా పెన్షన్ ఫండ్లో ఇన్వెస్ట్మెం ట్ను ప్రోత్సహించేలా ఈ నిబంధనను ప్రవేశపెట్టారని ఆయన వివరించారు. చిన్న ఫండ్ ఏజెంట్లకు సేవా పన్ను ఊరట న్యూఢిల్లీ: చిన్న మ్యూచువల్ ఫండ్ల పంపిణీదారులకు ఊరటనిచ్చేలా ఏటా రూ.10 లక్షల కన్నా తక్కువ కమీషన్లు అందుకునే ఏజెంట్లకు సేవా పన్ను నుంచి కేంద్రం మినహాయింపునిచ్చింది. అయితే, నిర్దిష్ట పరిమితికి మించి ఆర్జన ఉండే వారు మాత్రం 14 శాతం మేర సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ను ఆకర్షణీయంగా మార్చి, వాటి వైపు మరింత మందిని మళ్లించే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
ఈపీఎఫ్ పన్నుపై పునరాలోచన?
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్)లో దాచుకొనే మొత్తాలకు ఆదాయపన్ను విధించాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే అవకాశం కన్పిస్తోంది. దీనిపై ఈపీఎఫ్ చందాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు కనబడుతోంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈపీఎఫ్ లో ఏప్రిల్ 1 తర్వాత నుంచి దాచుకొనే మొత్తాలను వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు 60 శాతం మొత్తం మీద ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో పేర్కొన్నారు. పదవీ విరమణ నాటికి ఈపీఎఫ్లో సమకూరిన నిధిలో 40 శాతం మొత్తానికి ఎలాంటి పన్ను ఉండదని అరుణ్ జైట్లీ ప్రకటించారు. తాజా ప్రతిపాదనపై ఆరున్నర కోట్ల ఈపీఎఫ్ చందాదారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పందించారు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఎన్ పీఎస్ పన్నుల విధానంలో ప్రతిపాదిత మార్పుల పట్ల ఆందోళనను గుర్తించామని, దీనిపై సందేహాలను త్వరలోనే నివృత్తి చేస్తామని ట్విటర్ ద్వారా తెలిపారు. 60 శాతం మొత్తం మీద వచ్చే వడ్డీకి మాత్రమే పన్ను చెల్లించాల్సివుంటుందని పీటీఐతో రెవెన్యూ కార్యదర్శి హసముఖ్ అదియా చెప్పారు. ప్రిన్సిపల్ అమౌంట్ కు పన్ను మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. -
కొత్త ఉద్యోగులకు ఈపీఎఫ్ ఊరట
దేశంలో ఉపాధి కల్పన పెంపు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కొన్ని ప్రతిపాదనలు చేసింది. కొత్త ఉద్యోగులకు కంపెనీల బదులు ప్రభుత్వమే ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్ (ఈపీఎస్)కు 8.33 శాతం మొత్తాన్ని జమచేయనున్నది. ఉపాధి కల్పనకు ఊతమిచ్చేదిశగా ఆర్థిక మంత్రి జైట్లీ ఈ ప్రతిపాదన చేసారు. ఉద్యోగి నియామకం తర్వాత మూడేళ్ల వరకూ ప్రభుత్వం ఈ చెల్లింపు చేస్తుంది. దీని కోసం ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. రూ. 15,000లోపు వేతనంతో నియమించుకునే కొత్త ఉద్యోగులకు 8.33 శాతం ఈపీఎఫ్ను కంపెనీల తరపున ఇక మీదట ప్రభుత్వమే చెల్లించడం కంపెనీలకు ఊరటనిచ్చే అంశం. కాగా ఉపాధి పెరుగుదల కోసం 2016-17 చివరి నాటికి 100 మోడల్ కెరీర్ సెంటర్స్ను ఏర్పాటు చేస్తామని జైట్లీ ప్రకటించారు. స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజెస్, నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ను అనుసంధానం చేస్తామని తెలిపారు. -
ఈపీఎఫ్పై వడ్డీ ఇక 9 శాతం ?
న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు శుభవార్త. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి పీఎఫ్ డిపాజిట్లపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)... తొమ్మిది శాతం వడ్డీ చెల్లించనుంది. ప్రస్తుతం ఈ ఖాతాలపై 8.75 శాతం వడ్డీ చెల్లిస్తోన్న సంగతి విదితమే. ఇందువల్ల ఐదుకోట్ల మందికి పైగా పీఎఫ్ ఖాతాదారులకు లబ్ధి కలగనుంది. ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ ట్రస్టీ, భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యదర్శి పీజే బనాసురే వెల్లడించారు. ఇటీవల సమావేశమైన ఈపీఎఫ్ఓ అనుబంధ ఫైనాన్స్ ఆడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిటీ (ఎఫ్ఏఐసీ)... పీఎఫ్ డిపాజిట్లపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 8.95 శాతం వడ్డీ చెల్లించాలంటూ సిఫారసు చేసింది. కాగా ఈ నెలాఖరులోగా మరోసారి సమావేశమవనున్న ఎఫ్ఏఐసీ.. పీఎఫ్ డిపాజిట్లపై తొమ్మిది శాతం వడ్డీ చెల్లించాలంటూ తన సిఫారసును మార్చే అవకాశం ఉంది.