Fact Check
-
చిన్నారిపై లోకేష్ సైకో టీం విషప్రచారం
విజయవాడ, సాక్షి: పచ్చ బ్యాచ్ సైకోలు ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతీసారి ఆశ్చర్యపరస్తూ వస్తున్నారు. తాజాగా.. మరోసారి విష పడగ విప్పారు. జగన్పై అభిమానంతో ఓ చిన్నారి చేసిన పనిని విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే ఈసారి నెటిజన్ల నుంచి ఛీత్కారాలు వచ్చాయి. దీంతో ఐటీడీపీ జీతగాళ్లు మరింత దిగజారి ప్రవర్తించారు. ఆ చిన్నారి విషయంలో అసత్య ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.రవీంద్రభారతిలో ఎనిమిదో తరగతి చదువుతున్న దేవికారెడ్డి(Devika Reddy) .. విజయవాడ పర్యటనలో వైఎస్ జగన్ను కలిసింది. ఆ సమయంలో ఆయన ఆ పాపను దగ్గరికి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత భావోద్వేగంతో ఆ చిన్నారి మీడియా ముందు మాట్లాడింది. జగన్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడి రావట్లేదని ఉన్నమాటే చెప్పింది. అయితే పచ్చ బ్యాచ్కు ఇది ఏమాత్రం సహించనట్లుంది.అందుకే తమ అనుకూల సోషల్ మీడియా పేజీలు, వెబ్సైట్లలో చిన్నారి గురించి ఇష్టానుసారం పోస్టులు చేయించారు. దిగజారిపోయి మరీ పోల్ క్వశ్చన్స్ పెట్టించారు. ఈ క్రమంలో #Childabuser అంటూ ఆ వెబ్సైట్లను జనం తిట్టిపోశారు కూడా. గతంలో చిన్నపిల్లలతో రాజకీయం చేసింది ఎవరంటూ.. టీడీపీకి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు.టీడీపీ సోషల్ మీడియా(TDP Social Media) ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో తెలియంది కాదు. గతంలో ప్రభుత్వ స్కూల్లో అనర్గళంగా ఆంగ్లం మాట్లాడిన మేఘన అనే ఓ విద్యార్థిని విపరీతంగా ట్రోల్ చేశారు. జగన్ సాయం చేశారని చెప్పిన గీతాంజలికి.. సొంతింటి కల నెరవేరిన సంతోషాన్ని లేకుండా చేశారు. ఏకంగా.. ఆమె బలవన్మరణానికి పాల్పడేంతగా సోషల్ మీడియాలో ఏడ్పించారు. జగన్ పాలనలో సాయం పొందిన వాళ్లను, ఆయనపై అభిమానం ప్రదర్శించిన వాళ్లనూ ఏ ఒక్కరినీ వదలకుండా విపరీతంగా ట్రోల్ చేయడం చూశాం. ఇప్పుడు ఓ చిన్నారి విషయంలోనూ అదే చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం మరీ శ్రుతిమించడంతో బూమరాంగ్ అయ్యింది. దీంతో ఈసారి అసత్య ప్రచారాలకు దిగారు. చిన్నారి దేవిక డీపీహెచ్ స్కూల్లో చదువుతుందంటూ ప్రచారం చేశారు. పైగా ఆమె తల్లి వైఎస్సార్సీపీ నాయకురాలు అని, ఆర్థికంగా ఆ కుటుంబ పరిస్థితి ఎంతో బాగుందంటూ విషం చిమ్మారు. దేవిక తండ్రి అద్దె ఇంట్లో ఉంటూనే ఓ షాప్లో పని చేస్తూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. కానీ, లోకేష్ సైకో టీం(Nara Lokesh Team) విషప్రచారం ఇంకా ఆ ప్రచారం ఆపట్లేదు.ఇంత జరుగుతున్నా.. టీడీపీ సోషల్ మీడియా విభాగాలపై పోలీసులు ఎలాంటి కేసులు పెట్టడం లేదు. వైఎస్సార్సీపీ నేతలు, హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నవాళ్లపై కూటమి పెద్దల ఆదేశాలతో తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తుండడంలో తలమునకలైపోయారు అంతే!. -
అసలు కథ చెప్పని ‘తండేల్’
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పద్నాలుగు నెలలు పాకిస్తాన్ జైలులో మగ్గిపోయిన 22 మంది మత్స్యకారులను విడుదల చేయించింది ఎవరు? వారిని వాఘా సరిహద్దుల నుంచి ఇంటి వరకు తీసుకొచ్చింది ఎవరు? వారి కష్టాలకు చలించిపోయి ఇచ్చిన మాట ప్రకారం రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేసిందెవ్వరు? ఇంకెవరూ వలస పోకుండా, ఎవరికీ అలాంటి దుస్థితి రాకుండా శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో పోర్టు, హార్బర్, జెట్టీల నిర్మాణం మొదలుపెట్టింది ఎవరు? వలస బతుకులకు ఫుల్స్టాప్ పెట్టాలని ప్రయత్నించిందెవరు?... మత్స్యకారుల వలస జీవితం ఇతివృత్తంగా తెరకెక్కించిన ‘తండేల్’ సినిమా ఈ ప్రశ్నలన్నింటినీ మరోసారి తెర ముందు ఉంచింది. సినిమాలో సగం నిజమే చెప్పినా.., చూపించని కోణాలు ఎన్నో ఉన్నాయి. బాధితులు మాత్రం మీడియా ముందుకు వచ్చి గుండె తెరిచి వాస్తవాలు వివరించారు. తమను విడిపించి తీసుకువచ్చింది, రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి అని విస్పష్టంగా చెప్పారు. తరాల తరబడి శ్రీకాకుళం జిల్లాను పాలిస్తున్న రాజకీయ కుటుంబాలు కలలో కూడా ఊహించని విధంగా జిల్లాలో పోర్టు పనులు ప్రారంభించడం, ఫిషింగ్ హార్బర్, జెట్టీ పనులు ప్రారంభించడం వైఎస్ జగన్ (YS Jagan) చలవేనని సోషల్ మీడియా మోతమోగిపోయేలా చెబుతున్నారు. ఇదీ జరిగింది.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశంకు చెందిన 10 మంది, బడివానిపేటకు చెందిన ముగ్గురు, ముద్దాడకు చెందిన ఒకరు, విజయనగరం జిల్లా తిప్పలవలసకు చెందిన ఆరుగురు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ఇలా మొత్తం 22 మంది మత్స్యకారులు చేపల వేట కోసం 2018 జూలైలో గుజరాత్ రాష్ట్రం వీరావల్కు వెళ్లారు. వీరంతా ఒక బృందంగా ఏర్పడి నాలుగు పడవల్లో అరేబియా సముద్రంలోకి వెళ్లారు. పడవలు సముద్రంలో తీవ్ర ఆటుపోట్లకు గురవడంతో పొరపాటుగా పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. 2018 నవంబర్ 28న అక్కడి కోస్టు గార్డు అధికారులకు దొరికిపోయారు. పాకిస్తాన్ అధికారులు వారందరినీ కరాచీ సబ్ జైలులో పెట్టారు. అక్కడ సరైన తిండి, దుస్తులు లేక అక్కడ వారు పడ్డ అవస్థలు వర్ణనాతీతం. జైలు అధికారులు ఉదయం ఒక్క రొట్టె ఇచ్చేవారు. మధ్యాహ్నం, రాత్రి రెండేసి రొట్టెలు ఇచ్చేవారు. వాటితోనే సరిపెట్టుకోమని చెప్పేవారు. రొట్టెలు వద్దంటే అన్నం ఇచ్చేవారు. ఆదివారం మాత్రం కొంచెం మాంసాహారం పెట్టేవారు. ఈద్ అనే స్వచ్ఛంద సంస్థ దుస్తులతో పాటు రూ.5 వేల నగదు ఇచ్చింది. అక్కడ కూలి పనులు చేస్తే కొంత డబ్బు వచ్చేది. ఆ డబ్బుతో జైల్లోనే విక్రయించే కిరాణా సరుకులు కొనుక్కొని వంట చేసుకునేవారు. అదీ అరకొర భోజనమే. ఇలా కష్టాలు అనుభవిస్తూ క్షణమొక యుగంలా గడిపారు. మరోపక్క వేటకు వెళ్లిన వీరి ఆచూకీ తెలియకపోవడంతో ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చివరకు వారితో పాటు వేటకు వెళ్లిన మరో మత్స్యకారుడి ద్వారా వారంతా పాకిస్తాన్ అదుపులో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆ మత్స్యకారుల కుటుంబాలు తమ వాళ్ల కోసం గ్రామ సర్పంచ్ నుంచి ప్రభుత్వ పెద్దల వరకు అందరినీ ఆశ్రయించాయి. ఎవరూ పరిష్కారం చూపలేదు. పాకిస్తాన్లో మత్స్యకారులు తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిసి వారి కుటుంబీకులు తల్లడిల్లిపోయేవారు. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ హామీ ఆ సమయంలో నిండు గర్భిణిగా ఉన్న రామారావు అలియాస్ రాజు సతీమణి నూకమ్మ, బందీగా ఉన్న మరో మత్స్యకారుడు ఎర్రయ్య సతీమణి శిరీష మిగిలిన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గ్రామానికి చెందిన న్యాయవాది గురుమూర్తి సాయంతో జిల్లా యంత్రాంగానికి, నాయకులకు, ప్రభుత్వానికి విన్నపాలు అందజేశారు. అయినా ఫలితం లేదు. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. 2018 డిసెంబర్ 2న రాజాం నియోజకవర్గం లచ్చయ్యపేట గ్రామం వద్దకు వచ్చిన వైఎస్ జగన్ను బాధిత మత్స్యకార కుటుంబాలు కలిశాయి. పాకిస్తాన్ జైల్లో బందీలుగా ఉన్న తమ వాళ్లను విడిపించాలని కోరాయి. అప్పటి రాష్ట్ర మంత్రి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకటరావును కలిసినా పట్టించుకోలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. పాక్ చెరలో ఉన్న మత్స్యకారుల సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తమ ఎంపీలను పంపిస్తానని, మత్స్యకార కుటుంబ సభ్యులు విదేశాంగ శాఖ మంత్రిని కలిసేలా చేస్తానని చెప్పారు. అధికారంలోకి వస్తే వెంటనే విడిపిస్తానని భరోసా ఇచ్చారు. జగన్ పునర్జన్మనిచ్చారు తండేల్ సినిమా హీరో పాత్రకు మూలమైన రామారావు సోదరి ముగతమ్మ. ఈమె భర్త అప్పారావు, కొడుకులు కళ్యాణ్, కిషోర్ కూడా అప్పట్లో పాక్ జైల్లో బందీ అయ్యారు. ‘తండేల్’ సినిమాలో జగన్ ప్రస్తావన లేకపోవడాన్ని చూసి ముగతమ్మ తట్టుకోలేకపోయారు. సినిమా చూసి వచ్చిన వెంటనే హాల్ బయట తన మనసులో మాటను మీడియా ముందు స్పష్టంగా చెప్పారు. తమ వారిని విడిపించి తీసుకువస్తానని చేతిలో చేయి వేసి జగన్ చెప్పారని, చెప్పినట్టుగానే తీసుకుని వచ్చారని తెలిపారు. అంతేకాకుండా ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. జగనన్నతో పాటు అప్పటి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్, గ్రామ సర్పంచ్, సర్పంచ్ కుమార్తె, న్యాయవాది గురుమూర్తి కృషి కూడా ఉందని తెలిపారు. సినిమాలో అవేవీ లేకపోయినా బయట చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే అన్ని విషయాలు వివరంగా చెబుతున్నానని అన్నారు.వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో విడుదల పాదయాత్రలో ఉన్నప్పటికీ, వైఎస్ జగన్ మత్స్యకారుల సమస్య పరిష్కారానికి కృషి చేశారు. దీంతో 2019 ఫిబ్రవరిలో మత్స్యకారుల నుంచి కుటుంబ సభ్యులకు ఉత్తరాలు రావడం మొదలైంది. ఇది కుటుంబ సభ్యులకు కొంత ఉపశమనం కలిగించినా, తిరిగి ఇంటికి వస్తారో, లేదో అన్న భయం వెంటాడుతూనే ఉండేది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల విడుదలకు కేంద్రంపై ఒత్తిడి మరింతగా పెంచారు.ఆ తర్వాత కేంద్రం 370వ అధికరణం ఎత్తివేయడం, 35 (ఎ)తొలగింపు వంటి పరిణామాలతో వీరి విడుదలపై ఆశలు సన్నగిల్లాయి. అయినా వైఎస్ జగన్ పట్టువిడవకుండా ఎంపీల ద్వారా విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపారు. దీంతో మత్స్యకారుల విడుదలకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించింది. 2020 జనవరి 6న మత్స్యకారులను విడుదల చేసింది. ఆరోజు సాయంత్రం 7 గంటల సమయంలో వాఘాలోని భారత్–పాక్ సరిహద్దు వద్ద 20 మంది మత్స్యకారులను అప్పగించింది. వారికి అప్పటి వైఎస్సార్సీపీ (YSRCP) మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. మిగతా ఇద్దరు డాక్యుమెంట్లు, ఇతర సాంకేతిక కారణాల వల్ల తర్వాత విడుదలయ్యారు. విడుదలైన వారందరినీ వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు ఢిల్లీ తీసుకొచ్చి అక్కడి నుంచి విమానంలో రాష్ట్రానికి తెచ్చారు. వారంతా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. జగన్ వారందరికీ స్వీట్లు తినిపించి, ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారు. ఇకపై మత్స్యకారులు ఇలా వలసలు వెళ్లే అవసరం లేకుండా రాష్ట్రంలోనే పోర్టు, జెట్టీ, ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని భరోసా ఇచ్చారు.చెప్పినట్టుగానే హామీలు అమలు 194 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో మౌలిక సదుపాయాలు లేక మత్స్యకారులు వలసపోయేవారు. దీన్ని నివారించేందుకు జిల్లాలోని మూలపేటలోనే ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో రూ.2,949.70 కోట్లతో సీ పోర్టు తొలి దశ, బుడగట్లపాలెంలో రూ.366 కోట్లతో ఫిషింగ్ హార్బర్, మంచినీళ్లపేటలో జెట్టీ పనులకూ శ్రీకారం చుట్టారు. అధికారంలో ఉండగానే చాలా వరకు పనులు పూర్తి చేశారు. చదవండి: బాబు డేంజర్ గేమ్.. కంట్రోల్ తప్పిన లోకేష్!వేట నిషేధ కాలంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట 17,136 మందికి రూ.10 వేలు చొప్పున సాయం అందజేశారు. మత్స్యకారుల సంక్షేమం క్షేత్రస్థాయిలో అందుతుందో తెలుసుకునేందుకు 66 మంది సాగర మిత్ర ఉద్యోగులను నియమించారు. గ్రామ సచివాలయాల్లో ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించారు. ఫిష్ ఆంధ్రా షాపులను ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో రూ. 3 కోట్లు ఖర్చు పెట్టి గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి 3,064 మంది మత్స్యకారులను 46 బస్సుల ద్వారా తీసుకు వచ్చారు. ఇదంతా కళ్లెదుటే జరిగింది. అయినా ఇందులో ప్రధాన ఘట్టాలను సినిమాలో చూపించలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అంబానీ జూకు ఏనుగుల తరలింపుపై విమర్శలా?!
ఎక్కడ అరుణాచల్ ప్రదేశ్.. ఎక్కడ గుజరాత్..? మూడు వేలకు పైగా కిలోమీటర్ల దూరం. అంత దూరం నుంచి.. అదీ ట్రక్కులలో ఏనుగులను తరలించడం ఏంటి?. స్పెషల్ ట్రక్కులలో అంబానీ కుటుంబానికి చెందిన జూకు ఏనుగులను తరలించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మూగజీవుల కోసం పోరాడే ఉద్యమకారులైతే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దృశ్యాలు చూసి.. ‘‘పాపం ఏనుగులు.. డబ్బుంటే ఏమైనా చేయొచ్చా?’’ అని తిట్టుకునేవారు లేకపోలేదు. అయితే..అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) నుంచి మాత్రమే కాదు.. అసోం(Assam) నుంచి కూడా జామ్ నగర్లోని అనంత్ అంబానీకి చెందిన వంతార జూనకు ఏనుగులను తరలించారట. ఈ తరలింపునకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి అనుమతులు లేవని.. పైగా వన్యప్రాణులను అలా బంధించడమూ నేరమేనని కొందరు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నిజనిర్ధారణలు చేసుకోకుండా పోస్టులు పెట్టేస్తున్నారు. అయితే ఇలాంటి తరలింపునకు అసలు అనుమతులు ఉన్నాయా?. వన్యప్రాణులను ఇలా జంతు ప్రదర్శన శాలలో ఉంచొచ్చా?. దారిలో వాటికి ఏదైనా జరగరానిది జరిగితే ఎలా?... ఎవరిది బాధ్యత? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంలో వాస్తవమెంత?. అయితే ఇవేం అడవుల నుంచి బలవంతంగా తరలిస్తున్న ఏనుగులు కాదని అధికారులు వివరణ ఇస్తున్నారు. జంతు సంరక్షణ చర్యల్లో భాగంగానే వాటిని తరలిస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఏనుగులను బంధించి.. వాటితో సొమ్ము చేసుకుంటున్న ముఠాల నుంచి వాటికి విముక్తి కలిగిస్తున్నారు. రిలయన్స్ వంతార జూ ‘చైన్ ఫ్రీ’ ఉద్యమం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమం భాగంగా ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. అయితే తాజా వీడియోలపై విమర్శల నేపథ్యంలో.. ఇటు వంతారా నిర్వాహకులు కూడా స్పందించారు.ఆరోగ్యకరమైన వాతావరణంలో అవి జీవిస్తాయని మాది గ్యారెంటీ. వాటికి గౌరవప్రదమైన జీవితం అందించడమే మా ఉద్దేశం’’ అని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఇందుకు అవసరమైన ప్రక్రియ అంతా అధికారికంగానే నిర్వహించినట్లు స్పష్టత ఇచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారమే నడుచుకున్నట్లు, అలాగే.. గుజరాత్ , అరుణాచల్ ప్రదేశ్ అటవీ శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, ఏనుగుల తరలింపు కోసం రవాణా శాఖల నుంచీ ప్రత్యేక అనుమతులు పొందినట్లు పేర్కొంది.అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే.. అవి అటవీ ఏనుగులు కాదని, ప్రైవేట్ ఓనర్ల నుంచి వాటిని వంతారా కొనుగోలు చేసినట్లు తెలిపింది. త్రిపుర హైకోర్టు వేసిన హైపవర్ కమిటీతో పాటు సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందని స్పష్టం చేసింది. వాటిని తరలించిన ఆంబులెన్స్లు కూడా ప్రత్యేకమైన సదుపాయాలతోనే తరలించినట్లు పేర్కొంది.అసోం ప్రభుత్వం మాత్రం.. తమ భూభాగం నుంచి ఏనుగుల తరలింపేదీ జరగలేదని స్పష్టం చేసింది. అసోం నుంచి గుజరాత్ ప్రైవేట్ జూకు జంతువుల తరలింపు పేరిట అసత్య ప్రచారాలు, కథనాలు ఇస్తున్నారని ఆ రాష్ట్ర సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ వివరణలలేవీ వైల్డ్లైఫ్(Wild Life) యాక్టవిస్టులను సంతృప్తి పర్చడం లేదు. పైగా వాతావరణ మార్పు వాటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని, యానిమల్ ఆంబులెన్స్ పేరిట తరలిస్తున్న వాహనాల్లో ఎలాంటి సదుపాయాలు లేవని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని అంటున్నారు. మరోవైపు.. ఈ వ్యవహారం ఇటు సోషల్ మీడియాలో, అటు రాజకీయంగా విమర్శలకు దారి తీసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ వ్యక్తుల కోసం పని చేస్తున్నాయంటూ ప్రతిపక్షాలు తిట్టిపోస్తున్నాయి.వంతార.. రిలయన్స్ సౌజన్యంతో నడిచే అతిపెద్ద జంతు సంరక్షణశాల. దేశంలోనే అతిపెద్దది. ముకేష్ అంబానీ(Mukesh Ambani) తనయుడు అనంత్ చిన్నప్పటి నుంచి యానిమల్ లవర్ అట. అలా.. మూగ జీవుల సంరక్షణ ప్రధాన ఉద్దేశంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ దేశంలో ఎక్కడా లేనన్ని సేవలతో ఈ జూను నడిపిస్తున్నాయి. వేటగాళ్ల చేతిలో బందీ అయిన, గాయపడిన ప్రాణులను రక్షించి చికిత్స చేయడం, కాపాడాటం, వాటికి పునరావాసం కల్పించడంపై దృష్టిపెట్టింది ఫౌండేషన్. ఈ ప్రాజెక్టు కింద భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోని ప్రాణులను కూడా కాపాడుతున్నారు. ఇది గుజరాత్ లోని జామ్ నగర్ రిఫైనరీ కాంప్లెక్స్లోని రిలయన్స్ గ్రీన్ బెల్ట్లో సుమారు 600 ఎకరాల్లో విస్తరించి ఉంది.ఏమేం ఉన్నాయంటే..వంతార జూ(Vantara Zoo)లోనే లక్ష చదరపు అడుగుల్లో హాస్పిటల్, పరిశోధనా కేంద్రం నిర్మించారు. జంతువుల ట్రీట్మెంట్ కోసం అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు.. లేటెస్ట్ టెక్నాలజీతో ICU, MRI, CT స్కాన్, X-రే, అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, డెంటల్ స్కాలార్, లిథోట్రిప్సీ, డయాలసిస్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ సర్జరీలకు లైవ్ వీడియో కాన్ఫరెన్సులు ఉన్నాయి. బ్లడ్ ప్లాస్మాను వేరు చేసే టెక్నాలజీ కూడా ఉంది. ఈ కేంద్రంలో 2 వేలకు పైగా ప్రాణులు, 43 జాతుల వాటిని కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అంతరించే జాతులకు సంబంధించిన 7 రకాల వన్యప్రాణులు కూడా ఇక్కడ ఉన్నాయి.. అలాగే విదేశాల్లో అంతరించే దశలో ఉన్న ప్రాణులనూ రక్షిస్తున్నారిక్కడ. రెస్క్యూలో భాగంగా ఇప్పటికే 2వందలకు పైగా ఏనుగులను సేవ్ చేసి.. వంతారలోని ఏనుగుల రక్షణ కేంద్రంలో వదిలేశారు. జూను చూసేందుకు 3వేల-4వేల మంది పనిచేస్తున్నారు. భారత్ తో సహా ప్రపంచంలోని పేరొందిన జంతుశాస్త్ర నిపుణులు.. వైద్య నిపుణులు కొందరు వంతార మిషన్ లో భాగమైయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థలు.. ప్రభుత్వ పరిశోధనా సంస్థలు కూడా వంతార జూకు సహకరిస్తున్నాయి. -
‘కోటి’ మాయల మెంబర్షిప్
సాక్షి, అమరావతి: అడుగడుగునా ప్రలోభాలు, బలవంతాలు, మాయమాటలు, బెదిరింపులు.. అధికార తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాల వెనుక తతంగమిది. ప్రజల్ని మాయ చేయడంలో ఆరితేరిన తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత, సీఎం చంద్రబాబు (Chandrababu) ఆడిన మరో మాయ నాటకమిది. ఈ కోటి సభ్యత్వాల వెనుక అధికారాన్ని అడ్డుపెట్టుకొని మూడు నెలలుగా టీడీపీ నేతలు ఒక పథకం ప్రకారం సాగించిన దందా దాగి ఉంది. ఓ పక్క బీమా ఆశ చూపించడం, మరోపక్క పథకాలు ఆగిపోతాయన్న బెదిరింపులు, ఇంకోపక్క మాయమాటలు.. ఇలా సభ్యత్వాలన్నీ ప్రజలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేయించినవేనని టీడీపీ నేతలే చెబుతున్నారు.టీడీపీ సభ్యత్వం (TDP Membership) తీసుకున్న వారికి రూ.5 లక్షల బీమా ఉంటుందని ఆ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. సభ్యత్వాల నమోదు ప్రారంభానికి ముందే చంద్రబాబు గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ఈ బీమాను రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దాని గురించి ప్రచారం చేయడంతోపాటు ప్రతి గ్రామంలోని ఓటర్లలో 80 శాతం మందిని సభ్యులుగా చేర్చాలని నేతలపై ఒత్తిడి చేశారు. సభ్యత్వాలు చేయించిన వారికే పార్టీలో అవకాశాలు ఉంటాయని చెప్పారు. దీంతో నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి టీడీపీ సభ్యత్వం తీసుకుంటే ఉచితంగా రూ.5 లక్షల బీమా వస్తుందని ప్రజల్ని నమ్మించారు. సభ్యత్వం ఉంటేనే పథకాలని బెదిరింపులు మరోపక్క టీడీపీ సభ్యత్వం ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తాయని, లేకుంటే రావని ఇంటింటికీ తిరిగి బెదిరింపులకు దిగారు. ప్రజల నుంచి ఆధార్ కార్డులు తీసుకుని పేర్లు రాసేసి, సభ్యత్వ రుసుము రూ.100 కూడా నాయకులే కట్టేశారు. ఈ కార్యక్రమాన్ని మంగళగిరి టీడీపీ కార్యాలయం నుంచి నిరంతరం పర్యవేక్షించారు. ఏ నియోజకవర్గంలో ఎంత శాతం సభ్యత్వాలు అయ్యాయో విశ్లేషిస్తూ తగ్గిన నియోజకవర్గాల నాయకులను హెచ్చరించారు. చంద్రబాబు పలుసార్లు టెలీ కాన్ఫరెన్స్లు నిర్వహించి తక్కువ సభ్యత్వాలు నమోదైన నియోజకవర్గాల నేతలకు చీవాట్లు పెట్టారు. దీంతో వారు గ్రామాలు, వార్డుల్లో తిష్టవేసి బలవంతంగా సభ్యత్వాలు చేయించారు. కొన్ని గ్రామాల్లో ఏకంగా 80, 90 శాతం ఓటర్లను తమ సభ్యులుగా చేర్పించేశారు. ముచ్చర్లలో బయటపడిన బాగోతం విశాఖ జిల్లా ఆనందపురం మండలం ముచ్చర్ల గ్రామంలో ఏకంగా గ్రామంలోని వంద శాతం ఓటర్లను సభ్యులుగా నమోదు చేశారు. వంద శాతం సభ్యత్వ నమోదు జరిగిన గ్రామంగా ముచ్చర్లను ప్రకటించి సీఎం తనయుడు లోకేశ్తో అక్కడ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడి సభ్యత్వాల లోగుట్టును వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ బయటపెట్టడంతో లోకేశ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ముచ్చర్ల ఈనాం అన్ సెటిల్డ్ గ్రామం కావడంతో అక్కడున్న 600 ఎకరాలు వివాదంలో ఉన్నాయి. ఆ భూములకు పట్టాలు ఇప్పిస్తామని నమ్మబలికి, గ్రామస్తుల ఆధార్ కార్డులు తీసుకుని టీడీపీ సభ్యత్వాలు నమోదు చేయించినట్లు బయటపడింది.నిజానికి ఆ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులంతా వైఎస్సార్సీపీకి చెందినవారు. ఆ గ్రామంలో సుమారు 1,350 ఓట్లు ఉంటే గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 600కిపైగా ఓట్లు వచ్చాయి. జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీల నేతలు కూడా ఆ గ్రామంలో ఉన్నారు. అలాంటి గ్రామంలో నూటికి నూరు శాతం టీడీపీ సభ్యత్వాల నమోదు ఎలా సాధ్యమైందనే ప్రశ్నకు సమాధానం కరువైంది. అందుకే ఆ గ్రామానికి రాకుండా లోకేశ్ జారుకున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఇదే రీతిలో టీడీపీ శ్రేణులు బోగస్ సభ్యత్వాలు చేయించారు.వైఎస్సార్ బీమాను పణంగా పెట్టి..మరోవైపు టీడీపీ సభ్యత్వాల కోసం రాజకీయాలకు అతీతంగా అందరికీ అమలైన వైఎస్సార్ బీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం నిలిపి వేసింది. ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలోని ప్రతి ఒక్కరితో వలంటీర్లు ఈ బీమాకు దరఖాస్తు చేయించారు. ఎవరైనా రోడ్డు ప్రమాదంలోనో, అనారోగ్యంతోనే చనిపోతే నేరుగా వారి ఖాతాల్లో రూ.5 లక్షల బీమా సొమ్ము జమ అయ్యేది. మృతుని కుటుంబానికి తక్షణం రూ.10 వేలు ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం రాగానే ఈ పథకాన్ని నిలిపివేసి, టీడీపీ సభ్యత్వాల నమోదు ప్రారంభించారు. టీడీపీ సభ్యత్వం తీసుకుంటే రూ.5 లక్షల బీమా వస్తుందని చెప్పారు. వైఎస్సార్ బీమా లేదు కాబట్టి ఇదైనా వస్తుందనే ఆశతో చాలామంది తప్పనిసరై సభ్యత్వం తీసుకున్నారు. కానీ, ఎవరికీ బీమా వర్తించడంలేదు. కృష్ణా జిల్లా మంటాడకు చెందిన ఆరేపల్లి సత్యనరేంద్ర వరప్రసాద్ (37) ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోతే అతని కుటుంబానికి ఒక్క రూపాయి పరిహారం రాలేదు. వైఎస్సార్ బీమా ఉంటే అతనికి రూ.5 లక్షలు వచ్చేది. ఇప్పుడు ఎలాంటి పరిహారం అందక ఆ కుటుంబం ఇబ్బందులు పడుతోంది. ప్రతి గ్రామంలోనూ ఇలాంటి కేసులు పదుల సంఖ్యలో ఉన్నాయి. బీమా పేరుతో టీడీపీ చేస్తున్న మోసపూరిత సభ్యత్వ నమోదుకు ఇదో నిదర్శనం. -
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి నిజంగా అలా అన్నారా?
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఆ మధ్య పని గంటల మీద చేసిన వ్యాఖ్యలు.. ఎంత దుమారం రేపాయో తెలియంది కాదు. దానికి ఇప్పుడు కొనసాగింపుగా.. ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది. అయితే.. తాజాగా ఇన్ఫోసిస్ మూర్తి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.ఇంతకు ముందు వారంలో 70 పనిగంటల(70 Hours) ఉండాల్సిందేనని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిన ఇన్ఫోసిస్ మూర్తి.. ఇప్పుడు యువతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దగ్గర అమ్మాయిలు, అబ్బాయిల మధ్య మాటలు ఎంత పరిమితంగా ఉంటే దేశానికి అంత మంచిదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య మాటలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. అప్పుడే జీవితంలో విజయం బాట పడతారు అంటూ ఆయన మాట్లాడారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. దీంతో ఆ వార్త ఆధారంగా నారాయణమూర్తి(Narayana Murthy)పై సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. ఆయనకేమైందంటూ.. పలువురు విమర్శించడం, ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ చర్చ ఇలా నడుస్తుండగానే.. అసలు విషయం తెలిసింది. పీటీఐ ఫ్యాక్ట్ చెక్(PTI Fact Check)లో నెట్టింట్ హల్చల్ చేస్తున్న ఆ వార్త తాలుకా స్క్రీన్ షాట్ ఫేక్గా నిర్ధారణ అయ్యింది. అది డిజిటల్గా ఎడిట్ చేసిందని తేలింది. ఈ విషయాన్ని సదరు మీడియా సంస్థ కూడా తన సోషల్ మీడియా ద్వారా ధృవీకరించింది. -
ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్ను నిలిపేసిన మెటా
మెటా గ్రూప్ తన ఆన్లైన్ సర్వీసులైన ఫేస్బుక్(Facebook), థ్రెడ్స్, ఇన్స్టాగ్రామ్(Instagram)ల్లో ఫ్యాక్ట్ చెకింగ్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిల్లోని థర్డ్పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్ను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు బదులుగా కంపెనీ ‘కమ్యూనిటీ నోట్స్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. కమ్యూనిటీ నోట్స్ అనే కమ్యూనిటీ ఆధారిత వ్యవస్థ వల్ల తప్పుదోవ పట్టించే పోస్ట్లను కట్టడి చేయవచ్చని మెటా తెలిపింది. ఇప్పటికే ఈ వ్యవస్థను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో వాడుతున్నట్లు తెలుస్తుంది.ట్రంప్ మెప్పు పొందేందుకేనా..?ట్రంప్ త్వరలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న తరుణంలో మెటా ఇలా ఫ్యాక్ట్ చెకింగ్ సదుపాయాన్ని నిలిపేస్తున్న తీసుకున్న నిర్ణయంపట్ల కంపెనీపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలని నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పటికే ప్రధాన కంపెనీలు కొత్త ప్రభుత్వం పట్ల అభిమానాన్ని చూరగొనేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మార్పుపై ట్రంప్ అధికారులకు మెటా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ అధినేత, ట్రంప్ చిరకాల మిత్రుడు డానా వైట్ను మెటా బోర్డులో చేర్చుకున్నట్లు కంపెనీ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఇప్పటికే ప్రకటించారు.కఠిన నిర్ణయాలు తప్పవురాబోయే రోజుల్లో అమెరికాలో మార్పు రావాలని ఆశిస్తున్నట్లు మార్క్(Mark) చెప్పారు. అందరూ స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయలని నొక్కి చెప్పారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తుందన్నారు. దాంతో కంపెనీలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. దీనివల్ల కొందరి పోస్టులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆర్థిక మోసాలకు చెక్ పెట్టేలా పరిష్కారాలుతప్పుడు సమాచారం తగ్గుతుందా..?మార్క్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి నెటిజన్ల మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు మెటా అనుసరించిన ఫ్యాక్ట్ చెకింగ్ విధానంతో ఇటీవల అధికారంలోకి వచ్చిన కన్జర్వేటివ్పార్టీ నేతలను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నట్లు గతంలో భావించారు. ట్రంప్ అధికారంలోకి వస్తే మెటాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందేమోనని భావించి ముందుగానే మార్క్ ఈ మార్పులు చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కన్జర్వేటివ్ మిత్రపక్షాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే అనేక డిజిటల్ హక్కుల సంఘాలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కంపెనీ తీసుకున్న నిర్ణయంతో తప్పుడు సమాచారం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. -
సీనియర్ సిటిజన్లు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదా?
‘దేశంలో 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు’ ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న ఓ వార్త. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇలాంటి చాలా వార్తలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు లేదా సందేహాస్పదమైన న్యూస్ పోర్టల్లలో ఇటీవల ఎక్కువయ్యాయి. వీటిలో చాలా మటుకు ఫేక్ న్యూస్ లేదా తప్పుడు సమాచారమే ఉంటోంది.తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇకపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆ వార్త సారాంశం. "కేంద్ర ప్రభుత్వం భారీ ప్రకటన - వీళ్లు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు" అని సోషల్ మీడియా సందేశం పేర్కొంది.“భారతదేశంలోని సీనియర్ సిటిజన్లు పెన్షన్, ఇతర పథకాల ద్వారా వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు. అయితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, సీనియర్ సిటిజన్లు ఇకపై వారి ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వారు ఎలాంటి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు’’ అని అందులో రాసుకొచ్చారు.అయితే ఇది ఫేక్ వార్త అని, అందులో పేర్కొన్న దాంట్లో నిజం లేదని ప్రభుత్వానికి చెందిన వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం (PIBFactCheck) తేల్చింది. 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు కేవలం పెన్షన్, వడ్డీ ఆదాయానికి సంబంధించి మాత్రమే ఐటీఆర్ (ITR) (సెక్షన్ 194P ప్రకారం) ఫైల్ చేయడం నుండి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఇతర పన్ను వర్తించే అన్ని ఆదాయాలపైనా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. A message circulating on social media claims that as India commemorates 75 years of its Independence, senior citizens above 75 years of age will no longer have to pay taxes.#PIBFactCheck✔️This message is #fake pic.twitter.com/kFVbGje5FB— PIB Fact Check (@PIBFactCheck) December 29, 2024 -
ఎలాన్ మస్క్కు ట్రంప్ స్వీట్ వార్నింగ్?
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎవరు?. ‘‘ఇదేం ప్రశ్న!. మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్ నినాదంతో మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ మీద నెగ్గిన డొనాల్డ్ ట్రంప్దే’’ అని మీరు అనొచ్చు. కానీ, గత వారం పదిరోజులుగా అమెరికాలో సోషల్ మీడియాలో మరో తరహా చర్చ నడుస్తోంది. ట్రంప్ పేరుకే వైట్హౌజ్లో అధ్యక్ష స్థానంలో ఉంటారని.. కానీ ఎలాన్ మస్క్ మొత్తం నడిపిస్తారనే ప్రచారం నడిచింది. అయితే..మస్క్ అధ్యక్షుడని.. ట్రంప్ ఉపాధ్యక్షుడంటూ ప్రచారం తారాస్థాయికి చేరడం డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఏమాత్రం భరించలేకపోతున్నారట!. అందుకే ఎలాన్ మస్క్పై ఆగ్రహం వ్యక్తం చేశారట!.ఈ మేరకు సోషల్ మీడియాలోనూ ఓ సందేశం వైరల్ అయ్యింది. దాని సారాంశం పరిశీలిస్తే..‘‘అమెరికాకు కాబోయే అధ్యక్షుడ్ని నేనే. ఇంకెవరో కాదు. మీడియాగానీ, ఇంకెవరైనాగానీ ఎలాన్ మస్క్ అంతా తానై నడిపిస్తారని ప్రచారం చేయొచ్చు. కానీ, ఇది నా విజన్.. నా నాయకత్వం.. నా అమెరికా. ఎలాన్ మస్క్ నా ఎన్నికల ప్రచారం కోసం సాయం చేసి ఉండొచ్చు.అతను గొప్ప మేధావే కావొచ్చు. కానీ, రాజకీయాలకొచ్చేసరికి నా ఇష్టప్రకారమే నడుస్తుంది. ఎలాన్.. నీ మద్దతుకు కృతజ్ఞతలు. కానీ, అదే సమయంలో నువ్వు గీత దాటొద్దు. అమెరికాను మరింత గొప్పగా తీర్చిదిద్దడమే ఇప్పుడు నా ముందున్న ఆశయం. ఇది అమెరికన్ల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అంతేగానీ మస్క్ ఇగోకు సంబంధించిన అంశం కాదు’’ అంటూ ఓ సందేశం గత ఐదు రోజులుగా చక్కర్లు కొడుతోంది.అయితే.. ఆ సందేశానికి డొనాల్డ్ ట్రంప్నకు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఆయన సోషల్ మీడియా అకౌంట్ నుంచి అలాంటి సందేశమూ ఒకటి వైరల్ కాలేదు. ఆ ఇమేజ్ను వెరిఫై చేయగా.. ఉత్తదేనని ఫ్యాక్ట్ చెక్(Fact Check)లో తేలింది. అయితే ప్రస్తుత పరిణామాల ఆధారంగానే ఆ సందేశాన్ని ఉద్దేశపూర్వకంగా ఎవరో వైరల్ చేసినట్లు స్పష్టం అవుతోంది.అసలు విషయం ఏంటంటే.. సాధారణంగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎవరినీ లెక్కచేయరు. గతంలో అది చూశాం. కానీ, ఈసారి అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్కు ప్రపంచదేశాధినేతలు ఫోన్ చేస్తే పక్కనే ఉన్న మస్క్తోనూ మాట్లాడించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆపై స్వయంగా మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగాన్ని స్వయంగా హాజరై వీక్షించారు ట్రంప్. ఇక.. కొత్తగా సృష్టించిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(డోజ్)కు సహ సారథిగా కొనసాగాల్సిన మస్క్ ఏకంగా అధ్యక్షుడి నిర్ణయాల్లో కలగజేసుకుంటున్నారనేది ఆ ఆరోపణల సారాంశం. సొంత వ్యాపార ప్రయోజనాలే పరమావధిగా నడుచుకునే ఓ టెక్ బిలియనీర్ ఆలోచనలే.. జనవరి 20వ తేదీ నుంచి ప్రభుత్వ నిర్ణయాలుగా అమలుకాబోతున్నాయని డెమొక్రాట్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ వాదనకు బలం చేకూరేలా.. డోజ్తో మొదలుపెట్టి ఆపై వేలుపెట్టి.. అమెరికా ప్రభుత్వ అనవసర ఖర్చులకు కత్తెర వేసే పనిని ట్రంప్ తన భుజాలకెత్తుకున్నారు. ఇది అంతటితో ఆగలేదు. అమెరికా తాత్కాలిక బడ్జెట్ అయిన ద్రవ్య వినిమయ బిల్లులోనూ వేలు పెట్టారు. బిల్లు తెచ్చిన దిగువసభ స్పీకర్ మైక్ జాన్సన్పై మస్క్ బహిరంగంగా విమర్శలు చేశారు. అమెరికా తలపై షట్డౌన్ కత్తి వేలాడుతున్నా సరే ఈ బిల్లు ఆమోదం పొందకూడదని మస్క్ తెగేసి చెప్పారు. ట్రంప్ సైతం మస్క్ అభిప్రాయంతో ఏకీభవించడంతో రిపబ్లికన్లు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు.. ద్రవ్య బిల్లులో ఏముందో ఆ పార్టీ సెనేటర్లు మస్క్కు చెందిన ఎక్స్(ట్విటర్) ద్వారానే తెలుసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.ట్రంప్ ఏన్నారంటే..ఆరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్ సిటీలో ట్రంప్ పాల్గొన్న అమెరికాఫీస్ట్ కార్యక్రమంలో ప్రేక్షకులు ‘అధ్యక్షుడు మస్క్’అంటూ నినాదాలు ఇవ్వడంతో ట్రంప్ స్పందించారు. పీఎం కాకపోతే ఏకంగా ప్రెసిడెంట్ అవుతారని డెమొక్రాట్ల చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై ట్రంప్ మాట్లాడారు. ‘‘మస్క్(Musk) ఏనాటికీ అధ్యక్షుడు కాలేడు. నా సీటు భద్రం. ఆయన అమెరికాలో పుట్టలేదుగా. అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన వ్యక్తికే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసే అర్హత ఉంటుంది’’అని ట్రంప్ అన్నారు. మస్క్ మనసులో..ఎలాన్ మస్క్(Elon Musk) ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ఏనాడూ ప్రకటించలేదు. అలాగే.. ట్రంప్నకు తన మద్దతును బహిరంగంగానే ప్రకటించారు. కానీ, దేశ ప్రయోజనాలకంటే మస్క్ సొంత వ్యాపారాలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారనే ఆరోపణలను మాత్రం ఎందుకనో ఖండించడం లేదు. పైగా ‘అధ్యక్షుడు’ అనే ట్యాగ్ మీద కూడా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.అగ్రరాజ్యానికి అధినేతగా ట్రంప్ కొనసాగినా.. ఆర్థిక వ్యవస్థ మస్క్ చేతుల్లోకి వెళ్తుందని ఇటు డెమోక్రాట్లు.. అటు రిపబ్లికన్లు కూడా గుసగుసలాడుకుంటున్నారు. త్వరలో కొలువుతీరే కొత్త ప్రభుత్వంలో మస్క్ నిర్ణయాలే ఎక్కువగా అమలుకు నోచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే జరిగితే.. రిపబ్లికన్ పార్టీలో కలకలం రేగడం, వాళ్లిద్దరి మధ్య స్నేహ బంధానికి బీటలు వారడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు!.చదవండి👉పంజాబ్ పోలీస్ వర్సెస్ బ్రిటన్ ఆర్మీ! -
ఈనాడు చెవిలో ఈడీ చెప్పిందా?
సాక్షి, అమరావతి: కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాల విక్రయంపై ‘ఈనాడు’ తన ఆక్రోశాన్ని మరోసారి వెళ్లగక్కింది. 150 దేశాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తూ ఏటా రూ.3,000 కోట్లకు పైగా లాభాలను ఆర్జిస్తున్న కంపెనీ రూ.494 కోట్లు సమకూర్చుకోవడం కూడా పెద్ద వింత అయినట్లు ఒక విషపూరిత కథనాన్ని వండివార్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేస్తున్న దర్యాప్తు అంతా ఈనాడుకు చెవిలో చెబుతున్నట్లుగా ‘‘రూ.494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?’’ అంటూ సోమవారం ఓ కథనాన్ని ప్రచురించింది.స్వయం ప్రతిపత్తి కలిగిన ఈడీ లాంటి సంస్థ దర్యాప్తు చేస్తున్న విషయాలే కాకుండా ఎవర్ని, ఎప్పుడు, ఎలా విచారిస్తారు...? వారిని ఏ ప్రశ్నలు అడుగుతారు? అనే వాటిని కథనంలో ప్రచురించడంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ నిజంగానే విషయాలను ఇలా బయటకు చెబుతుంటే ఆ దర్యాప్తు ఎంత పక్షపాతంతో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు! లేదంటే ఈనాడు తన అజెండాకు అనుగుణంగా ఈడీ పేరుతో ఈ కథనాలను వండివార్చి ఉండాలి. ఈ రెండింటిలో ఏది నిజమైనా ఈనాడు ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి అజెండాకు డప్పు కొడుతుందో ఊహించవచ్చు!!అది వ్యూహాత్మక పెట్టుబడిఅరో ఇన్ఫ్రా వ్యూహాత్మక పెట్టుబడిలో భాగంగా కాకినాడ డీప్ వాటర్పోర్టులో వాటాలు కొనుగోలు చేసింది. పోర్టులో 41 శాతం వాటాలను కేవీ రావు పూర్తి సమ్మతితోనే 2020లో విక్రయించడంతో పాటు ఆ వాటాల విలువ రూ.494 కోట్లను స్వీకరించారు. కాకినాడ డీప్వాటర్ పోర్టు దగ్గరలోనే కాకినాడ సెజ్ను రూ.1,700 కోట్లకు కొనుగోలు చేయడంతో పాటు ఆ సెజ్లో రూ.2,400 కోట్లతో మరో పోర్టును కూడా అరో ఇన్ఫ్రా నిర్మిస్తోంది. ఇదంతా వ్యూహాత్మక వ్యాపార ప్రణాళికలో భాగంగా జరిగింది.సెజ్ను ఆనుకుని ఉన్న కాకినాడ డీప్ వాటర్ పోర్టులో కూడా తమకు వాటాలు ఉంటే వ్యూహాత్మకంగా ప్రయోజనకరమని అరబిందో సంస్థ భావించింది. భవిష్యత్లో కాకినాడ డీప్ వాటర్ పోర్టులోని తన మెజార్టీ వాటాలను ప్రమోటర్ కేవీ రావు విక్రయించాలని భావిస్తే ముందుగా అరబిందో సంస్థకే అవకాశం ఇవ్వాలి. ఆ నిబంధన ( రైట్ టు ఫస్ట్ రెఫ్యూజల్) ఒప్పందంలో ప్రధానాంశం. ఒకవేళ బెదిరించి ఉంటే మొత్తం పోర్టునే స్వాధీనం చేసుకుని ఉంటారు కదా! 41 శాతం వాటా కొనుగోలు తర్వాత కూడా పోర్టు యాజమాన్య హక్కులు కేవీరావు చేతిలోనే ఉన్నాయి కదా. ఆయన్ను నిజంగానే బెదిరించి ఉంటే అప్పుడే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, స్టాక్ ఎక్సŠచ్ంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ), నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(ఎన్ఏఎల్ఎస్ఏ) తదితర సంస్థలకు ఫిర్యాదు చేసేవారు.న్యాయస్థానాన్ని ఆశ్రయించేవారు. కానీ కేవీ రావు ఈ నాలుగున్నరేళ్లలో ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. కేవీ రావుకు అభ్యంతరం ఉంటే వాటాల బదిలీ పూర్తయ్యేలోగా వివిధ దశల్లో ఎప్పుడైనా సరే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. కానీ ఆయన ఏ దశలో కూడా ఫిర్యాదు చేయలేదు. అంటే ఆయన పూర్తి సమ్మతితోనే వాటాలను విక్రయించారన్నది స్పష్టమవుతోంది. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఫిర్యాదు చేశారంటే దీని వెనుక కుట్రను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఆడిట్ సంస్థను ఎంపిక చేసేది ఆ శాఖ కార్యదర్శిప్రభుత్వాలు వివిధ విభాగాల్లో ఆడిటింగ్ నిర్వహించడం సాధారణం. ఏదైనా విభాగంలో ఆడిటింగ్ నిర్వహించాలంటే ఆ శాఖకు చెందిన కార్యదర్శి ఆడిటింగ్ సంస్థను ఎంపిక చేస్తారు. ఇక్కడ కూడా అదే విధంగా పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ అనే ఆడిటింగ్ సంస్థను ఎంపిక చేశారు. ఆ ఆడిటింగ్ సంస్థకు, విజయసాయిరెడ్డికి ఏమిటి సంబంధం? లేని సంబంధాలను అంటగట్టి మసిబూసి మారేడు కాయ చేయాలని, తద్వారా ఎల్లో గ్యాంగ్కు ప్రయోజనం కలిగించేందుకు ఈనాడు పడరానిపాట్లు పడుతోంది.తప్పుడు ఫిర్యాదు... వెంటనే కేసుఅనంతరం అసలు పాత్రధారి తెరపైకి వచ్చారు. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడైన కాకినాడ డీప్ వాటర్పోర్ట్ ప్రమోటర్ కేవీ రావుతో ఈ నెల 2న సీఐడీకి ఫిర్యాదు ఇప్పించారు. 2020లో తనను బెదిరించి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్లో 41శాతం వాటాను అరబిందో సంస్థకు చెందిన అరో రియాల్టీ సంస్థ కొనుగోలు చేసిందని ఆయన నాలుగేళ్ల తరువాత ఫిర్యాదు చేయడం చంద్రబాబు పక్కా కుట్రను స్పష్టం చేస్తోంది. విచిత్రం ఏమిటంటే... కేవీ రావు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు చేసిన ఈ నెల 2నే సీఐడీ కేసు నమోదు చేసేయడం గమనార్హం ప్రైవేట్ ఒప్పందంతో ప్రభుత్వానికి ఏం సంబంధం?అరబిందో సంస్థ 150 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ అంతర్జాతీయంగా విశేష గుర్తింపు పొందింది. ఏటా రూ.72 వేల కోట్ల టర్నోవర్, రూ.3 వేల కోట్ల నికర లాభం నమోదు చేస్తోంది. ఆ వ్యాపార లావాదేవీ పూర్తిగా అరబిందో సంస్థ, కేవీ రావు మధ్య జరిగిన ప్రైవేట్ ఒప్పందం. అందులో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికిగానీ, ఇతరులకుగానీ ఎలాంటి సంబంధం లేదు. కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాల విక్రయం అన్నది పూర్తిగా రెండు ప్రైవేటు సంస్థల మధ్య వ్యవహారం. ఐదేళ్ల తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఆ వ్యవహారంలో తల దూర్చడం వెనుక పక్కా కుట్ర ఉందని స్పష్టమవుతోంది.ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా ప్రైవేటు ఆస్తుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ దందా సాగిస్తుండటం విభ్రాంతికరం. రెండు సంస్థల మధ్య ప్రైవేటు వ్యవహారంలో టీడీపీ కూటమి ప్రభుత్వం జోక్యం వెనుక మర్మం ఏమిటి? ప్రభుత్వం మారగానే అంతకుముందు జరిగిన ప్రైవేటు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటామంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఓ దుష్ట సంప్రదాయానికి తెరతీసినట్టు అవుతుంది. పరస్పర అంగీకారంతో ప్రైవేటు ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు సాగుతుంటాయి. ఐదేళ్ల తరువాత సహజంగానే ఆ ఆస్తుల మార్కెట్ విలువ పెరుగుతుంది. మార్కెట్ విలువ పెరిగింది కాబట్టి ఐదేళ్ల క్రితం తనను బెదిరించి ఆస్తిని అమ్మేలా చేశారని ఫిర్యాదు చేస్తామంటే ఎలా..? వాటిలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే పరిస్థితి ఎంతవరకు వెళుతుంది ?ప్రభుత్వ పోర్టును కారుచౌకగా కట్టబెట్టింది బాబేకాకినాడ డీప్ వాటర్ పోర్టును ప్రైవేటుపరం చేసింది గతంలో చంద్రబాబు ప్రభుత్వమేనన్నది అసలు వాస్తవం. ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఏడీబీ రుణాలతో ఏపీ ప్రభుత్వం కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ను 1997లో నిర్మించింది. లాభాల్లో ఉన్న ఆ పోర్టును 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే కారు చౌక ధరకు ప్రైవేటుపరం చేశారు. ఓ మలేషియా కంపెనీని ముందు పెట్టి కాకినాడ డీప్వాటర్ పోర్టును కారు చౌకగా కట్టబెట్టేశారు. కానీ తరువాత అసలు విషయం వెలుగు చూసింది. మలేషియా కంపెనీ ముసుగులో చంద్రబాబు సన్నిహితుడు కేవీ రావు ఆ పోర్టును దక్కించుకున్నట్లు బయటపడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదలు పెట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను కూడా చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుండటం గమనార్హం.అంతా బాబు కుట్ర స్క్రిప్టే...కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాలను హస్తగతం చేసుకునేందుకు చంద్రబాబు పన్నాగం పన్నారు. ఈ క్రమంలో పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణాను తెరపైకి తెచ్చి జనసేనలోని తన కోవర్ట్, మంత్రి నాదెండ్ల మనోహర్ను కాకినాడ పర్యటనకు పంపారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గత నెల 29న ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం చేరుకుని కాకినాడలో వాలారు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వద్దకు చేరుకుని రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ డ్రోన్ కెమెరాలతో డ్రామా పండించారు. యాంకరేజ్ పోర్ట్ను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మరి అక్కడ నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగితే వారు ప్రశ్నించాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబునే కదా!! -
డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారా? ఇది మీకోసమే..
ఈరోజుల్లో జేబులో కరెన్సీ లేకున్నా.. ధైర్యంగా అడుగు బయటపెట్టొచ్చు!. బ్యాంక్ బ్యాలెన్స్, ఓ స్మార్ట్ఫోన్.. దానికి ఇంటర్నెట్ ఉంటే చాలూ!. మార్కెట్లో ఎక్కడికి వెళ్లినా సెకన్లలో పేమెంట్లు చకచకా చేసేయొచ్చు. రూపాయి దగ్గరి నుంచి మొదలుపెడితే.. పెద్ద పెద్ద అమౌంట్ల చెల్లింపులకు రకరకాల యాప్స్ను ఉపయోగిస్తున్నాం. అంతగా డిజిటల్ చెల్లింపులు మన జీవనంలో భాగమయ్యాయి. అయితే ఈ చెల్లింపులపై ట్యాక్స్ విధింపు సబబేనా?.. ప్రస్తుతం దేశంలో చాలావరకు జనం డిజిటల్ పేమెంట్లకు అలవాటు పడ్డారు. పల్లె నుంచి పట్నం దాకా అందరికీ ఇది అలవాటైంది. మార్కెట్లలోనే కాదు, గ్యాస్, కరెంట్.. అన్ని రకాల బిల్లుల చెల్లింపులకు వీటినే ఉపయోగిస్తున్నారు. కానీ, కేంద్రం ఇప్పుడు వీటిపై ట్యాక్స్ విధించబోతోందట. ప్రత్యేకించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) యాప్ల ద్వారా చెల్లింపులపైనే ఈ పన్ను విధింపు ఉండనుందట!. ఇక నుంచి ఫోన్ పే, గూగుల్పే, మరేయిత యూపీఐ యాప్ ద్వారాగానీ పేమెంట్ చేశారనుకోండి.. దానిపై ఎక్స్ట్రా ఛార్జీ వసూలు చేస్తారు. 2025 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమలు కాబోతోంది. మీరూ వాటితోనే చెల్లింపులు చేస్తున్నారా? అయితే ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి.. ఏ యూపీఐ యాప్ ద్వారా అయినా 2 వేల రూపాయలకు పైన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే 1.1 శాతం టాక్స్ పడుతుందట. ఎవరికైనా 10 వేల రూపాయలు పంపిస్తే, ట్యాక్స్ రూపంలో 110 రూపాయలు కట్ అవుతుందని.. కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కానీ,ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వార్త మాత్రమే. ముఖ్యంగా వాట్సాప్ యూనివర్సిటీ నుంచి ఈ వార్త ఎక్కువగా సర్క్యులేట్ అవుతోంది. వీటిని అదనంగా.. కొందరు వీడియోలను యాడ్ చేస్తున్నారు. అయితే ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ ప్రచారంపై మీకు స్పష్టత ఇవ్వబోతున్నాం.అదొక ఫేక్ వార్త. పైగా ఇలాంటి వార్తే 2023-24 బడ్జెట్ టైంలోనూ వైరల్ అయ్యింది. ఆ టైంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) కూడా ఓ క్లారిటీ ఇచ్చింది. డిజిటల్ వాలెట్లు, ఇతర ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్.. PPIని ఉపయోగించి చేసే లావాదేవీలకు మాత్రమే ఈ టాక్స్ వర్తిస్తుంది. ‘కొత్త ఇంటర్ఛేంజ్ ఛార్జీలు PPI లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయి. ఇతర సాధారణ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు’ అని స్పష్టం చేసింది. .@IndiaToday claims that UPI transactions over Rs 2000 will be charged at 1.1%#PIBFactCheck➡️There is no charge on normal UPI transactions. ➡️@NPCI_NPCI circular is about transactions using Prepaid Payment Instruments(PPI) like digital wallets. 99.9% transactions are not PPI pic.twitter.com/QeOgfwWJuj— PIB Fact Check (@PIBFactCheck) March 29, 2023సాధారణ UPI పేమెంట్లకు, PPI పేమెంట్లకు మధ్య తేడాను అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ గందరగోళం నెలకొంటోంది. పైగా కొన్ని ప్రముఖ ఛానెల్స్, వెబ్సైట్లు ఎలాంటి ధృవీకరణ లేకుండా గుడ్డిగా.. డిజిటల్ పేమెంట్లపై బాదుడే బాదుడు అంటూ కథనాలు ఇచ్చేయడం గమనార్హం. -
‘మళ్లీ భూ ప్రకంపనలు’.. వాట్సాప్లో వాయిస్ మెసేజ్ చక్కర్లు
జయశంకర్, సాక్షి: ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఏ నలుగురు కలిసినా.. ఆఖరికి ఫోన్లలో మాట్లాడిన ఈ ఉదయంపూట సంభవించిన భూ ప్రకంపనల గురించే చర్చించుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు కాటారం రెవెన్యూ డివిజన్ లోని కాటారం , మల్హార్ రావు, మహముత్తారం, మహదేవపూర్, పలిమెల మండలాల్లో నాలుగు సెకండ్ల పాటు కంపించిన భూమి.. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అయితే..ఇది చర్చ వరకే పరిమితం కాలేదు. ‘‘మళ్లీ భూకంపం వస్తోందంటూ..’’ సోషల్ మీడియాలో ఓ వాయిస్ మెసేజ్.. వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతోంది. దీంతో జనం హడలిపోతున్నారు. ఇళ్లలోకి వెళ్లకుండా రోడ్లపై కూర్చుని.. భూకంపం గురించే చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ఖండించిన పోలీసులు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. అలాగే తప్పుడు ప్రచారాలు చేసేవాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.ఇదిలా ఉంటే.. జిల్లా వ్యాప్తంగా ఉదయం భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు వణికిపోయారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు చిట్యాల మండలం కైలాపూర్ గ్రామంలో భూకంప తీవ్రత దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. అలాగే.. రంగాపురం గ్రామంలోని ఓ ఇంటి పెంకులు ఊడిపడిపోవడంతో.. ఆ ఊరి ప్రజలు ఆ ఇంటి వద్ద గుమిగూడారు. తమ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఇలాంటి ఘటనలు చూడలేదని కొందరు వృద్ధులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాంతం సేఫ్ జోన్గానే ఉందని, స్వల్ప ప్రకంపనలకు భయపడనక్కర్లేదని, భారీ భూకంపాలు అసలు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఛాన్సే లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.అయితే.. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ భూకంపాల సంభవించే అవకాశాలపై.. అలాగే వీక్ జోన్ల పరిశీలనపై తమ అధ్యయనం కొనసాగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.20 ఏళ్ల తర్వాత తెలుగు గడ్డపై భూకంపం!.. చిత్రాల కోసం క్లిక్ చేయండి -
డైవర్షన్ డ్రామా అట్టర్ ఫ్లాప్..
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో బెంబేలెత్తుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ కుట్రలకు పదును పెడుతున్నారు. ఓవైపు ఎన్నికల హామీలు గాలికి వదిలేసి మరోవైపు యథేచ్ఛగా దోపిడీకి తెర తీసిన ప్రభుత్వ పెద్దలు.. ప్రజల్ని మభ్యపెట్టేందుకు దుష్ప్రచార కుతంత్రాలు పన్నుతున్నారు. అందులో తాజా అంకమే ‘కాకినాడ పోర్ట్ వద్ద బియ్యం రాద్ధాంతం’! చంద్రబాబు పార్ట్నర్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీలో తన కోవర్టు, మంత్రి నాదెండ్లను ముందుపెట్టి పక్కా పన్నాగంతో సాగించిన డైవర్షన్ రాజకీయ కుట్ర ఇది. మోకాలికి, బోడుగుండుకూ ముడిపెడుతూ చంద్రబాబు డైరెక్షన్లో పవన్, నాదెండ్ల ద్వయం చేసిన రాజకీయ రాద్ధాంతం కూటమి పెద్దల కుట్రను బట్టబయలు చేసింది. పూర్తిగా అవాస్తవాలు, దుష్ప్రచారంతో సాగిన ఈ హైడ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని యాంకరేజ్ పోర్ట్ నుంచే ఎగుమతి కాకినాడ సీవాటర్ పోర్ట్పై నిరాధార ఆరోపణలతో డ్రామా రేషన్బియ్యం అక్రమ రవాణాపై చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని కాకినాడ హైడ్రామా ఎపిసోడ్ తేల్చి చెబుతోంది. ఎందుకంటే.. కాకినాడ డీప్వాటర్ పోర్ట్ వేరు... కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వేరు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ఆ పోర్ట్ నుంచే బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మరి ఆ పోర్ట్ నుంచి రేషన్ బియ్యాన్ని విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ భావిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్నే నిలదీయాలి. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించాలి. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన తమను తాము నిలదీసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ మాత్రం కాకినాడ సీ పోర్ట్ను నిర్వహిస్తున్న ప్రైవేట్ కన్షార్షియాన్ని నిలదీయడం విడ్డూరంగా ఉంది. అదికూడా కేవలం 41 శాతం వాటా మాత్రమే ఉన్న మైనారిటీ షేర్ హోల్డర్ అరబిందో సంస్థపై అసత్య ఆరోపణలు చేయడం మరో విచిత్రం. సమగ్ర తనిఖీల తర్వాతే షిప్పుల్లోకి లోడింగ్ దేశంలో అన్ని పోర్టుల నుంచి బియ్యం సహా వివిధ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. షిప్పుల్లోకి లోడింగ్ చేసేముందు సమగ్రంగా తనిఖీలు చేసే వ్యవస్థ ఉంది. కేంద్రానికి చెందిన కస్టమ్స్, పోర్ట్ అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తారు. అందుకోసం నిర్దిష్ట కస్టమ్స్ ప్రోటోకాల్ ఉంది. ఎగుమతులకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు ఎగుమతి చేసే సరుకును కూడా పరీక్షిస్తారు. అంతా సక్రమంగా ఉందని నిర్ధారించిన తరువాతే ఎగుమతి కోసం షిప్పుల్లోకి లోడ్ చేసేందుకు అనుమతిస్తారు. రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతి చేసేందుకు యత్నిస్తే వారు ముందుగానే పోర్టుల వద్దే నిలిపివేస్తారు కదా! అటువంటిది కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేస్తున్నారని టీడీపీ కూటమి ప్రభుత్వంలోని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిరాధార ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. అన్ని వ్యవస్థలు చంద్రబాబు చేతిలోనే..రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు, పౌర సరఫరాల శాఖ, వివిధ చెక్ పోస్టులు... అన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోనే పని చేస్తున్నాయి. ఇక స్మగ్లింగ్ను అరికట్టేందుకు పోర్టుల వద్ద కేంద్రీకృతమైన కస్టమ్స్, షిప్పింగ్ శాఖలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్నాయి. కేంద్రంలో ఉన్నది కూడా టీడీపీ, జనసేన భాగస్వామిగా ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే కదా! మరి రాష్ట్రం నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారంటే బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానిదీ... టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వాములుగా ఉన్న కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానిదీ అవుతుంది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగితే పవన్ కళ్యాణ్ నిలదీయాల్సింది ఎవరిని? ముందుగా తన పారీ్టకి చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను... తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును...! ఇంకా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కాకినాడ యాంకరేజి పోర్ట్ వద్దకు వెళ్లి హైడ్రామా చేయడం కేవలం ప్రజల్ని మభ్యపెట్టేందుకేనన్నది సుస్పష్టం. కూటమి నేతలే రేషన్ మాఫియా లీడర్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియా దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు తమ నియోజకవర్గాల నుంచి రేషన్ బియ్యాన్ని భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద కనీసం తనిఖీలు చేయకుండా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు రాచబాట పరుస్తున్నారు. అలా అక్రమంగా భారీస్థాయిలో తరలించిన రేషన్ బియ్యాన్ని పయ్యావుల కేశవ్ వియ్యంకుడు, ఇతర టీడీపీ పెద్దల సన్నిహితులకు చెందిన సంస్థల ద్వారా విదేశాలకు స్మగ్లింగ్ చేస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయిలో రేషన్ బియ్యం మాఫియాను అడ్డుకోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వద్ద రాజకీయ డ్రామాతో ప్రజల్ని మభ్య పెట్టేందుకు యత్నించారు. పౌరసరఫరాలు, రవాణా, రెవెన్యూ, హోం, విజిలెన్స్ శాఖలే రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలి. మరి అక్రమ రవాణా సాగుతోందంటే పవన్ కళ్యాణ్ ముందుగా నిలదీయాల్సింది తన పార్టీకి చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్నే! ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ కుట్రే హామీల అమల్లో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కుట్రలకు పాల్పడుతోంది. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్తో కనికట్టు చేసేందుకు యత్నిస్తోంది. ధాన్యం కొనుగోలులో వైఫల్యంపై రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఆర్బీకేల ద్వారానే ధాన్యం సకాలంలో కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్బీకేల వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో రైతుల గోడు పట్టించుకునే నాథుడే లేకుండాపోయారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు 75 కిలోల బస్తాను రూ.400 తక్కువకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ–క్రాప్ అమలు చేయడం లేదు. మరోవైపు మిల్లర్ల నుంచి చంద్రబాబు ప్రభుత్వం భారీ కమీషన్ల డీల్ కుదుర్చుకుంది. మిల్లర్లకు రూ.1,600 కోట్ల బకాయిలు చెల్లించేందుకు 8 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు బేరం పెట్టారు. అనంతరమే మొదట విడతగా ఇటీవల రూ.200 కోట్లు విడుదల చేశారని మిల్లర్లే చెబుతున్నారు. ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ‘బియ్యం’ డ్రామను మొదలెట్టారు.మద్యం.. ఇసుకలో దోపిడీ ఇతరులెవరూ మద్యం టెండర్లు దాఖలు చేయకుండా పోలీసులతో బెదిరించి అడ్డుకుని మరీ టీడీపీ పెద్దలు దోపిడీకి రాచబాట పరిచారు. వేలం పాటలు నిర్వహిస్తూ మరీ బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఉచిత ఇసుక విధానం ముసుగులో టీడీపీ పెద్దలు ఇసుక రీచ్లను ఏకపక్షంగా దక్కించుకుని భారీ దోపిడీకి తెగించారు. ఓ వైపు ప్రభుత్వం ఏటా రూ.750 కోట్ల ఆదాయం కోల్పోతోంది. మరోవైపు ఇసుక రేట్లు భారీగా పెంచేసి సాగిస్తున్న దోపిడీతో టీడీపీ కూటమి పెద్దల సొంత ఖజానా నిండుతోంది. వలంటీర్ల జీతం నెలకు రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే అసలు వలంటీర్ల వ్యవస్థే లేదని ప్రకటించి వారిని రోడ్డున పడేశారు. ఇక పోలవరం ప్రాజెక్ట్లో నీటినిల్వను కేవలం 41.15 మీటర్లకే పరిమితం చేయాలన్న నిర్ణయంతో కేంద్రంలోని ఎన్డీయే, రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వాలు రాష్ట్రానికి తీవ్ర ద్రోహానికి పాల్పడ్డాయి. ఈ వ్యవహారాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కాకినాడలో సాగించిన రాజకీయ డ్రామా అందులో భాగమేనన్నది తేటతెల్లమవుతోంది. పయ్యావుల కేశవ్ వియ్యంకుడి సంస్థ బియ్యం తరలిస్తున్న షిప్ను ఎందుకు తనిఖీ చేయలేదు? కాకినాడ యాంకరేజి పోర్ట్ వద్ద లంగరు వేసి ఉన్న స్టెల్లా షిప్ వద్ద హైడ్రామా చేసిన పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్... ఆ సమీపంలోనే లంగరు వేసి ఉన్న ఎంవీ కెన్స్టర్ అనే షిప్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం విడ్డూరంగా ఉంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడికి చెందిన సంస్థ ఆ షిప్ ద్వారానే బియ్యాన్ని నైజీరియాకు ఎగుమతి చేస్తోంది. ఆయనకు చెందిన పట్టాభి ఆగ్రో సంస్థ కాకినాడ పోర్ట్ నుంచి నైజీరియాకు 42,500 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని ఎగుమతి చేస్తోందన్నది బహిరంగ రహస్యమే. ఆ షిప్ను మాత్రం పవన్ కళ్యాణ్, నాదెండ్ల తనిఖీ చేయలేదు. కేవీ రావు సంస్థ చేతిలోనే కాకినాడ పోర్ట్ యాజమాన్యంఅరబిందో బెదిరించి ఉంటే ఏకంగా 51శాతం వాటా తీసుకునేవారు కదాబెదిరిస్తే ఫ్రీగానే వాటాలు తీసుకునేవారు కదాకాకినాడ డీప్ వాటర్ పోర్ట్లో వాటాల అమ్మకాలు, కొనుగోలు పూర్తిగా ప్రైవ్రేటు వ్యవహారం. పోర్ట్ ప్రమోటర్ కేవీ రావు నుంచి 41శాతం వాటాను మాత్రమే అరబిందో సంస్థ కొనుగోలు చేసింది. మిగిలిన 59 శాతం వాటా కేవీ రావు సంస్థ వద్దే ఉన్నాయి. అంటే కాకినాడ డీప్వాటర్ పోర్ట్పై యాజమాన్య హక్కులు ఇప్పటికీ కేవీ రావు సంస్థ చేతిలోనే ఉన్నాయి. పోర్ట్ వ్యవహరాల్లో నిర్ణయాధికారం కేవీ రావు సంస్థకే ఉంది. పోర్ట్ ఎండీగా కేవీ రావే ఉండగా... సీఈవో, ఇతర కీలక స్థానాల్లో ఆయన సన్నిహితులే ఉన్నారు. అలాంటిది అరబిందో సంస్థ బెదిరించి పోర్ట్లో వాటాలు కొనుగోలు చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అసత్య ఆరోపణలు చేయడం మరీ విడ్డూరంగా ఉంది. అంతగా బెదిరించి వాటాలు కొనుగోలు చేసి ఉంటే... డబ్బులు ఇచ్చి ఎందుకు వాటాలు కొంటారు..? ఫ్రీగానే తీసేసుకునేవారు కదా. కనీసం మెజార్టీ వాటాలు అంటే 51శాతం వాటాను దక్కించుకునేవారు కూడా. దాంతో పోర్ట్ వ్యవహారాల్లో నిర్ణయాధికారం కూడా అరబిందో సంస్థకే దక్కేది. అంతేగానీ పోర్టుపై నిర్ణయాధికారం కేవీ రావు సంస్థకు ఎందుకు విడిచిపెడతారు...! కానీ అరబిందో సంస్థ 41శాతం వాటానే కొనుగోలు చేసి పోర్టులో మైనార్టీ పార్టనర్గానే ఉంది. మిగిలిన 59శాతం వాటా కలిగిన కేవీ రావు సంస్థే పోర్ట్పై నిర్ణయాధికారాన్ని అట్టిపెట్టుకుంది. వాస్తవాలు ఇవీ...కానీ వాటిని వక్రీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రజల్ని మభ్యపెట్టేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రైవేటు లావాదేవీల్లో చంద్రబాబు ప్రభుత్వ జోక్యం ఎందుకో...! కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాల విక్రయం అన్నది పూర్తిగా రెండు ప్రైవేటు సంస్థల మధ్య వ్యవహారం. ఐదేళ్ల తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని భావిస్తుండటం వెనుక పక్కా కుట్ర ఉందని స్పష్టమవుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంతో నిర్వర్తించాల్సి బాధ్యతలు ఎన్నో ఉన్నాయి... కానీ వాటిని విస్మరించి రెండు సంస్థల మధ్య ప్రైవేటు వ్యవహారంలో టీడీపీ కూటమి ప్రభుత్వం తలదూరుస్తుండటం వెనుక మర్మం ఏమిటి? ప్రభుత్వం మారగానే అంతుకుముందు ప్రైవేటు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటామంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఓ దుష్ట సంప్రదాయానికి తెరతీసినట్టు అవుతుంది. ఎందుకంటే పరస్పర అంగీకారంతో ప్రైవేటు ఆస్తుల కొనుగోలు అమ్మకాలు సాగుతుంటాయి. ఐదేళ్ల తరువాత సహజంగానే ఆ ఆస్తుల మార్కెట్ విలువ పెరుగుతుంది. మార్కెట్ విలువ పెరిగింది కాబట్టి ఐదేళ్ల క్రితం తనను బెదిరించి ఆస్తిని అమ్మేలా చేశారని ఫిర్యాదు చేస్తామంటే ఎలా..? వాటిలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే పరిస్థితి ఎంతవరకు వెళుతుంది ? ఐదేళ్ల తరువాత మార్కెట్ విలువ పెరిగింది కాబట్టి గతంలో తనను బెదిరించి ఆస్తిని అమ్మేలా చేశారని ప్రతి ఒక్కరూ ఆరోపిస్తే పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిర్మించిన పోర్టును కారుచౌకగా కట్టబెట్టింది చంద్రబాబే అసలు కాకినాడ డీప్ వాటర్ పోర్టును ప్రైవేటుపరం చేసిందే గతంలో చంద్రబాబు ప్రభుత్వమేననే వాస్తవాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఏడీబీ రుణాలతో ఏపీ ప్రభుత్వం కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ను 1997లో నిర్మించింది. లాభాల్లో ఉన్న ఆ పోర్టును 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే కారు చౌక ధరకు ప్రైవేటుపరం చేశారు. ప్రస్తుతం కూడా చంద్రబాబు అదే కుట్రతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను తన బినామీలపరం చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇలా ప్రభుత్వ పోర్టులను కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు గతంలో ధారాదత్తం చేసిన... ప్రస్తుతం మరో మూడు పోర్టులను కట్టబెట్టేందుకు సిద్ధపడుతున్న చంద్రబాబు అసలు కుంభకోణానికి పాల్పడినట్టు అవుతుంది కదా..! నిలదీయాల్సింది చంద్రబాబునే కదా...! -
ఈవీఎంలపై కట్టలు తెంచుకున్న జనాగ్రహం.. కరెక్టేనా?
ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(EVM)ల పనితీరుపై రాజకీయ వర్గాల్లోనే కాదు.. జనాల్లోనూ చాలా అనుమానాలే ఉన్నాయి. ఊహించని రీతిలో వెలువడే ఫలితాలే.. ఆ అనుమానాల్ని బలపరుస్తుంటాయి. అలాంటప్పుడే గో బ్యాక్ టూ బ్యాలెట్ పేపర్ అనే వాయిస్ వినిపిస్తుంటుంది. అయితే లోపాల సంగతిని పక్కనపెట్టి.. అవకతవకలకు ఆస్కారం లేదంటూ ఎన్నిక సంఘం, కేంద్రం వాటి వినియోగాన్ని సమర్థిస్తుంటాయి. తాజాగా.. ఇవాళ సుప్రీం కోర్టు సైతం బ్యాలెట్ పేపర్లను వెనక్కి తేలేమంటూ తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే..మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంలపై ప్రజాగ్రహం వెల్లువెత్తిందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాఢి ఘోర పరాభవం చవిచూసింది. కాంగ్రెస్ పార్టీ 101 స్థానాల్లో పోటీ చేసి.. కేవలం 16 స్థానాల్లో గెలిచింది. ఓడినవాళ్లలో.. దూలే రూరల్ నుంచి పోటీ చేసిన కునాల్ పాటిల్ కూడా ఉన్నారు. ఆయన బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర పాటిల్ చేతిలో ఓటమి చెందారు. అయితే..కాంగ్రెస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. నియోజకవర్గంలోని అవధాన్ గ్రామంలో జనం ఈవీఎంలకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. కాంగ్రెస్కు పట్టు ఉన్న ఈ గ్రామంలో.. కునాల్కు జీరో ఓట్లు వచ్చాయని, అందుకే ఈవీఎంలకు వ్యతిరేకంగా వాళ్లు నిరసన తెలుపుతున్నారనేది ఆ వీడియో సారాంశం. అయితే..ఈ వీడియో ఆధారంగా కాంగ్రెస్ నేతలంతా ఎన్నికల సంఘాన్ని ట్యాగ్ చేస్తూ.. ఈవీఎంల పని తీరుపై ప్రశ్నలు సంధిస్తున్నారు. వీళ్లలో యూపీ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ పాన్ఖురి పాథక్ కూడా ఉన్నారు. గ్రామంలోని 70 శాతం జనాభా కునాల్కు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈవీఎంలను బీజేపీ తప్పుడుగా ఉపయోగించుకుంటోందని పేర్కొన్నారు. కానీ..In Maharashtra people are out on the streets protesting against EVM manipulation... Will any Godi Media channel dare to show this ?NO. https://t.co/yTtAyoqav0— Pankhuri Pathak पंखुड़ी पाठक پنکھڑی (@pankhuripathak) November 25, 2024ఎన్నికల సంఘం ఆ ఆరోపణలన్నింటిని తోసిపుచ్చింది. అవధాన్లో కునాల్ పాటిల్కు 1,057 ఓట్లు పోలయ్యాయని ధూలే జిల్లా ఎన్నికల కార్యాలయం ప్రకటించింది. అలాగే.. రాఘవేంద్ర పాటిల్కు ఇక్కడ 1,741 ఓట్లు వచ్చాయని పేర్కొంది. దీంతో.. ఆ వీడియో ఫేక్ అనేది స్పష్టమైంది.నవంబర్ 20వ తేదీన మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరగ్గా.. నవంబర్ 23వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. ధూలే రూరల్ నియోజకవర్గంలో రాఘవేంద్ర పాటిల్కు 1,70,398 ఓట్లు, కునాల్ పాటిల్కు 1,04,078 ఓట్లు పడ్డాయి. -
ఏది నిజం?: సౌర విద్యుత్ మేమే ఇస్తాం
‘‘చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యధిక ధరలకు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకున్నారు. అప్పటికి మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44కే లభిస్తున్నా (బ్యాక్డౌన్ చార్జీలతో కలిపి రూ.3.54) ఏకంగా యూనిట్ రూ.6.99 చొప్పున కొనుగోలు చేశారు. ఒకపక్క మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ చంద్రబాబు దాన్ని వృథా చేసి మరీ ఇంత ఎక్కువ ధరకు పీపీఏలు చేసుకోవడంలో ఆంతర్యమేమిటి? అది కదా అసలు సిసలైన కుంభకోణం..! దీన్ని ప్రశ్నించే సాహసం ఈనాడు ఏనాడైనా చేసిందా?’’‘‘అసలు అదానీతో ఒప్పందం చేసుకోవాలనిగానీ, భారీగా లంచాలు పొందాలనిగానీ అప్పటి ప్రభుత్వం అనుకుంటే సంస్థలతోనే నేరుగా చేసుకునేవారు గానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో ఎందుకు చేసుకుంటారు? ముడుపులే కావాలనుకుంటే చంద్రబాబులా ప్రైవేట్ సంస్థలతోనే ఒప్పందం కుదుర్చుకునేవారు కదా? ఇంత చిన్న లాజిక్ కూడా తెలియదా?’’రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే టెండర్లు పిలిచినా వాటిపై చట్టపరంగా సమస్యలు వచ్చాయి. ఆ తరుణంలో కేంద్రం తక్కువ ధరకే విద్యుత్ ఇస్తామని లేఖ రాసింది. వ్యవసాయ ఉచిత విద్యుత్పై ముందుచూపు, రైతులకు 25 ఏళ్ల పాటు మంచి చేయాలనే జగన్ సర్కారు సంకల్పాన్ని అభినందిస్తూ నాడు సెకీ లేఖ రాసింది. డిస్కమ్లపై ఆర్థిక భారం పడకుండా, రైతుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ఇది దోహదం చేస్తుందని పేర్కొంది. అదే సెకీ విద్యుత్ తీసుకోకపోతే అప్పటికే పిలిచిన టెండర్ల కేసు కోర్టులో ఎప్పటికి తేలుతుందో తెలియదు. అది తేలే నాటికి పరికరాల రేట్లు, విద్యుత్ ధరలు ఎంతగానో పెరిగేవి. అప్పుడు ఇదే ఈనాడు, ఇతర ఎల్లో మీడియా తక్కువకు ఇస్తామన్నా సెకీ విద్యుత్ను ఎందుకు తీసుకోలేదని బురద చల్లేవి కాదా?సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకోవడంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అవలంభిస్తున్న వినూత్న విధానాలు, చూపిస్తున్న చొరవకు స్పందిస్తూ తామే పాతికేళ్లపాటు రాష్ట్రానికి చవగ్గా సౌర విద్యుత్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) తనకు తానే ముందుగా ప్రతిపాదించింది. అందుకు 2021 సెపె్టంబర్ 15న సెకీ రాసిన లేఖే తిరుగులేని ఆధారం. వేరే ప్రయత్నాలు అవసరం లేదని, అతి తక్కువ ధరకు యూనిట్ రూ.2.49కి తామే అందిస్తామంటూ సెకీనే ఆరోజు రాష్ట్రానికి లేఖ రాసింది. రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా వ్యవసాయానికి పగటిపూట ఉచితంగా 9 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన పునరుత్పాదక విద్యుత్ను.. అదీ డిస్కంలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా అందించాలనే జగన్ వినూత్న ఆలోచనను కేంద్ర సంస్థ ఆ లేఖలో కొనియాడింది. సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ టెండర్లు పిలిచిందనే విషయం తమకు తెలిసిందని, అయితే తామే చౌక ధరకు సోలార్ విద్యుత్ను 25 ఏళ్ల పాటు సరఫరా చేస్తామని ఆ లేఖలో తెలిపింది. 2024 సెప్టెంబర్లో 3 వేల మెగావాట్లు, 2025 సెపె్టంబర్లో 3 వేల మెగావాట్లు, 2026 సెప్టెంబర్లో 3 వేల మెగావాట్లు చొప్పున మొత్తం 9 వేల మెగావాట్లు ఇస్తామని వివరించింది. 25 సంవత్సరాల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీల నుంచి రాష్ట్రానికి మినహాయింపు కూడా ఇస్తామని చెప్పింది. తామిచ్చే టారిఫ్ యూనిట్ రూ.2.49 వల్ల వ్యవసాయ విద్యుత్కు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ భారం కూడా తగ్గుతుందని పేర్కొంది. అదే విధంగా 9 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏపీలో ప్రాజెక్టు నిర్మిస్తే అయ్యే ఖర్చులు, భూమి కూడా మిగులుతాయని, వాటిని రాష్ట్రం ఇతర అభివృద్ధి, ప్రాజెక్టుల అవసరాలకు వినియోగించుకోవచ్చని వివరించింది. డిస్కంలకు కూడా విద్యుత్ కొనుగోలు ఖర్చులు తగ్గుతాయని వెల్లడించింది. తమ ప్రతిపాదనకు అంగీకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆత్మ నిర్భర్ భారత్’కు ఏపీ మద్దతు ఇచ్చినట్టవుతుందని కూడా చెప్పింది. వెంటనే సానుకూల నిర్ణయాన్ని తెలపాలని రాష్ట్రాన్ని కోరింది. ఇలా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీనే స్వయంగా విద్యుత్ ఇస్తామంటూ ముందుకు వచ్చిన ఈ వ్యవహారంలో స్కామ్కు ఆస్కారమే ఉండదన్నది స్పష్టం. ఇందులో ముడుపుల అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్న విషయం ఎవరికైనా ఇట్టే అవగతమవుతుంది. కేంద్రం ఇంతగా చెప్పాక ఎవరైనా కాదంటారా..! చంద్రబాబు కుదుర్చుకున్న దీర్ఘకాలిక పీపీఏల వల్ల డిస్కమ్లపై తీవ్ర ఆర్ధిక భారం పడింది. దీనివల్ల ప్రభుత్వంపై రాయితీ భారం కూడా పెరిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్రంలో సోలార్ పార్క్లను అభివృద్ధి చేయాలని 2020లో గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ క్రమంలో 2020 నవంబర్లో 6,400 మెవాగాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ జీఈసీఎల్) టెండర్లు పిలిచింది. చదవండి: నిజాలకు పాతరేసి.. నిస్సిగ్గుగా నిందలా!యూనిట్ రూ.2.49 నుంచి రూ.2.58 చొప్పున సరఫరా చేసేందుకు ముందుకొస్తూ 24 బిడ్లు దాఖలు అయ్యాయి. అయితే న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమవడం వల్ల ఆ టెండర్ ప్రక్రియ రద్దయింది. అదే సమయంలో అతి చౌకగా విద్యుత్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వమే ఇంత స్పష్టంగా చెప్పాక ఏ రాష్ట్రమైనా ఎందుకు వద్దంటుంది? పైగా, ఈ విద్యుత్ తీసుకొంటే ఆరి్థకంగా, ఇతరత్రా పలు ప్రయోజనాలూ ఉన్నాయి. ఇంత మంచి అవకాశాన్ని ఏ రాష్ట్రమూ వదులుకోదు. ఒక వేళ వద్దంటే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా?తక్కువకు ఇస్తామని కేంద్రమే ముందుకు వస్తే ఎందుకు తీసుకోవడంలేదని, దాని వెనుక రాష్ట్ర ప్రయోజనాలకంటే వేరే కారణాలున్నాయంటూ గోల పెట్టేవి. ఇదే ఎల్లో మీడియా ప్రభుత్వాన్ని తప్పు బడుతూ కథనాలు రాసేది. అలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే కేంద్ర ప్రతిపాదనను మంత్రి మండలి సమావేశంలో ప్రవేశపెట్టారు. మంత్రులంతా ఏకగ్రీవంగా సెకీ ఒప్పందానికి అంగీకారం తెలిపారు. చదవండి: చంద్రబాబుకు ఆ ఒప్పందాలను రద్దు చేసే దమ్ముందా?అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం సెకీతో ఒప్పందాలకు కేంద్ర, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్ల ఆమోదం కూడా లభించింది. ఈ ఒప్పందాల్లో ఎక్కడా అదానీ గ్రూపునకు చెందిన సంస్థలతోగానీ అనుబంధ కంపెనీలతోగానీ ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ఇక అవినీతి ఎక్కడుంది? అసలు లంచాలకు ఆస్కారం ఏముంది? -
నిజాలకు పాతరేసి.. నిస్సిగ్గుగా నిందలా!
‘‘రాష్ట్ర చరిత్రలోనే ఇంత కారుచౌకగా సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం.. అది కూడా అత్యధికంగా 7 వేల మెగావాట్ల కొనుగోలు కోసం ఒప్పందం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలో, ఏ సీఎం హయాంలోనూ జరగలేదు. డిస్కమ్లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. అందులోనూ కేంద్రమే స్వయంగా లేఖ రాసి మరీ యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు నిరాటంకంగా విద్యుత్తు సరఫరా చేస్తామని ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కాదంటుందా?’’సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే ఇంత కారుచౌకగా సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం.. అది కూడా అత్యధికంగా 7 వేల మెగావాట్ల కొనుగోలు కోసం ఒప్పందం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ జరిగిన దాఖలాలు లేవు. డిస్కమ్లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. అందులోనూ కేంద్రమే స్వయంగా లేఖ రాసి మరీ యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు నిరాటంకంగా విద్యుత్తు సరఫరా చేస్తామని ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కాదంటుందా? రైతులకు ఉచిత విద్యుత్తుపై గత సర్కారు దూరదృష్టి, సోలార్పై మన విధానాలను అభినందిస్తూ స్వయంగా సెకీ నాడు లేఖ రాసింది. సరఫరా చార్జీల భారం లేకుండా అత్యంత చౌకగా కరెంట్ అందిస్తామని సంసిద్ధత తెలిపింది. ఎవరు మాత్రం దీన్ని కాదంటారు? అంతేకాకుండా అప్పటికి యూనిట్ రూ.5.10 చొప్పున కొంటున్నారు. సెకీ విద్యుత్ తీసుకోకపోతే ఏటా రూ.3,750 కోట్ల భారం పడుతుంది. ఒకవేళ తీసుకోకుంటే ఎల్లో మీడియా ఎంత దుష్ప్రచారం చేసేది? అసలు ఈ ఒప్పందం ఓ రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగింది. అలాంటప్పుడు లంచాలెలా వస్తాయి? కేంద్రం ఎక్కడైనా రాష్ట్రానికి లంచం ఇస్తుందా? ఒకవేళ తీసుకోవాలనుకుంటే కేంద్రం రాసిన లేఖకు ఎందుకు స్పందిస్తారు? అలాంటి ఉద్దేశం ఉంటే నేరుగా అదానీతోనే ఒప్పందం చేసుకోవాలి కదా? కేంద్రంతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఇందులో మూడో వ్యక్తి అనే ప్రస్తావన ఎందుకు ఉంటుంది? అదానీతో దీనికి ఏం సంబంధం? ఇక సెకీ రాసిన లేఖకు కేంద్ర విద్యుత్తు నియంత్రణ మండలి, రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి సైతం ఆమోదం తెలిపాయి. ఇవి రెండూ కేంద్ర సంస్థలే. ఆ ఒప్పందంలో ఎలాంటి తప్పు లేదు కాబట్టే అనుమతిచ్చాయి. ఇంత గగ్గోలు పెడుతున్న ఎల్లో మీడియా చంద్రబాబు అత్యధిక ధరలతో విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు (పీపీఏలు) చేసుకుంటే ఏనాడైనా కనీసం ఒక్క కథనమైనా రాసిందా? అమెరికాలో అదానీ సంస్థపై అభియోగాలు నమోదైతే దాన్ని జగన్కు ముడిపెట్టి విషప్రచారం చేస్తూ.. టీడీపీ అనుబంధ పత్రిక ఈనాడు పుంఖాను పుంఖాలుగా అసత్యాలను వండి వార్చింది. వైఎస్ జగన్మోహన్రెడ్డికున్న అశేష జనాదరణను తగ్గించకపోతే చంద్రబాబుకు మళ్లీ వానప్రస్థం తప్పదని బెంబేలెత్తుతున్న ఈనాడు ఎక్కడో అమెరికాలో నమోదైన కేసులో జగన్ పేరు లేకపోయినా ఉందంటూ పచ్చి అబద్ధాన్ని అచ్చేసింది. వంద శాతం ప్రభుత్వ రంగ సంస్థ..సెకీ ‘ట్రిపుల్ ఏ’ రేటింగ్ కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆ సంస్థ నుంచి నేరుగా 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ తీసుకునేలా ఒప్పందం చేసుకుంటేనే ఇన్ని నిందలేస్తున్న ఈనాడు ఇక చంద్రబాబులా ఏ ప్రైవేట్ కంపెనీలతోనో డీల్ కుదుర్చుకుంటే ఇంకెంత శివాలెత్తిపోయేదో! గత ప్రభుత్వం ఇలాంటి వాటికి ఎక్కడా ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంది. నేరుగా సెకీతో ఒప్పందం చేసుకుంది. దీంతో బురద జల్లడానికి రంధ్రాన్వేషణ మొదలెట్టిన ఈనాడు... గత ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంటే అది అదానీతో కుదుర్చుకున్నట్లు, అందుకోసమే ఆ కంపెనీ జగన్కు లంచాలిచ్చినట్లు దిగజారుడు రాతలకు తెగబడింది. ఇంతకన్నా దివాలాకోరుతనం ఇంకేమైనా ఉంటుందా? దాదాపు 18 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్తు అందటమే మహాపరాధంగా పరిగణిస్తూ.. దానికి అహర్నిశం పాటుపడిన జగన్పై బురద జల్లుతున్న ఎల్లో మీడియా విషపూరిత కథనాలను ఏమనుకోవాలి? తప్పయితే ‘సీఈఆర్సీ, ఏపీఈఆర్సీ’ ఎందుకు అనుమతిస్తాయి?2003 విద్యుత్ చట్టం ప్రకారం సెకీతో ఒప్పందాలకు ఏపీఈఆర్సీ అనుమతినిచ్చింది. దీంతో సెకీ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్లోనే విద్యుత్ కొనుగోలు మొదలు కావాల్సి ఉంది. అన్నీ పరిశీలించాక కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా దీన్ని ఆమోదించింది. సెకీ విద్యుత్కు అంతర్ రాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలు ఉండవని ఈ ఏడాది ఆగస్టు 13న ఏపీఈఆర్సీ కూడా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అంతకు ముందే అంటే 2021 జనవరి 15నే వెల్లడించింది. మరి ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాల్లో అత్యున్నత న్యాయ సంస్థలు అనుమతించిన ఒప్పందం తప్పంటారా? ఏదైనా అవినీతి జరిగి ఉంటే అక్కడే తేలిపోయేది కదా?చదవండి: సౌర విద్యుత్ ఇస్తామని చెప్పింది సెకీనేఏటా రూ.3,750 కోట్లు ఆదా అవుతుంటే నష్టమంటారా? ప్రస్తుతం రాష్ట్రం కొనుగోలు చేస్తున్న విద్యుత్ యూనిట్కు సగటున రూ.5.10 చొప్పున అవుతోంది. సెకీ విద్యుత్ మాత్రం యూనిట్ రూ.2.49కే వస్తుంది. ఇప్పుడు రాష్ట్రానికి ఎన్టీపీసీ ఇస్తున్న సౌర విద్యుత్ ధర కూడా ట్రేడింగ్ మార్జిన్ కలిపి యూనిట్కు రూ.2.79 అవుతోంది. ఎలా చూసినా సెకీ విద్యుత్ తక్కువకే వస్తోంది. ఈ లెక్కన ఏటా దాదాపు రూ.3,750 కోట్ల మేరకు ఆదా అవుతోంది. కానీ ఈనాడు మాత్రం పాతికేళ్లలో రూ.1.10 లక్షల కోట్లు నష్టమంటూ నోటికొచ్చిన లెక్కలు రాసుకొచ్చింది. ఆ తప్పుడు లెక్కల వెనుక అసలు ఆంతర్యాన్ని ప్రజలు గ్రహించలేరనుకుంటోంది.ప్రయోజనాలు ఎక్కువ గనుకే ఒప్పందం..సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇస్తుంది. అదే రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే పాతికేళ్లు సెంట్రల్ గ్రిడ్ చార్జీలను చెల్లించాలి. రాష్ట్రంలో అంతర్గతంగా సౌర ప్రాజెక్టులను నెలకొల్పితే వాటికి కావాల్సిన విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థను బలోపేతం చేయటం తప్పనిసరి. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ప్రసార వ్యవస్థలపై దీనికోసం పెట్టాల్సిన ఖర్చును బేరీజు వేసుకుంటే బయటి రాష్ట్రాల నుంచి సౌర విద్యుత్ తీసుకున్నప్పుడే తక్కువ వ్యయం అవుతోంది. అందుకే తొలుత రాష్ట్రంలోనే సౌర విద్యుత్ ప్రాజెక్టు పెట్టాలనుకున్నప్పటికీ పలు అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత సెకీ ప్రతిపాదనకు గత మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సెకీ ధర కన్నా ఇతర రాష్ట్రాల్లో తక్కువ రేటుకి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయంటూ ఈనాడు రాసుకొచ్చింది. రాజస్థాన్లో ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ ద్వారా ఇస్తున్న విద్యుత్ యూనిట్ రూ.2.01. కానీ అక్కడ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 23.5 శాతం. ఏపీలో ఇది 17.5 శాతమే. మరి ధరలో మార్పులుండవా?యూనిట్ రూ.6.99 చొప్పున కొనుగోలు చేసిన చరిత్ర చంద్రబాబుదిటీడీపీ హయాంలో మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44కే లభిస్తున్నా (బ్యాక్డౌన్ ఛార్జీలతో కలిసి రూ.3.54) ఏకంగా యూనిట్ రూ.6.99 చొప్పున కొనుగోలు చేసిన చరిత్ర చంద్రబాబుది! అయినా సరే ఈనాడుకు అది ఏనాడూ కనపడకపోవడం విచిత్రం! ఇక పవన విద్యుత్తుకైతే యూనిట్కు రూ.4.84 వరకు అదనంగా పెట్టి నామినేషన్ పద్ధతిలో పీపీఏలు చేసుకున్నారు. పోటీ బిడ్డింగ్ లేనేలేదు. 2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగింది. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 17,731 మెగావాట్ల విద్యుదుత్పత్తి స్థాపిత సామర్ధ్యం ఉంది. అందులో 12,190 మెగావాట్లు థర్మల్, 275.78 మెగావాట్లు ఇతర విద్యుత్ కాగా మిగిలింది పునరుత్పాదక విద్యుత్. 2014 జూన్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు రెండింటి మొత్తం గరిష్ట డిమాండ్ 13,404 మెగావాట్లు మాత్రమే. అయినా సరే టీడీపీ ప్రభుత్వం నాడు హడావుడిగా 8 వేల మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ)లను అధిక ధరలకు కుదుర్చుకుంది. ‘ఈనాడు’కు ఇదంతా దోచిపెట్టినట్లుగా కనిపించకపోవటం చిత్రమే! చంద్రబాబు స్వప్రయోజనాల కోసం కుదుర్చుకున్న ఒప్పందాల ఫలితంగా విద్యుత్ పంపిణీ సంస్థలపై ఏటా రూ.3,500 కోట్ల భారం పడుతోంది. అది కూడా దశాబ్దాల పాటు భరించాలి. ప్రస్తుత విలువ ప్రకారం డిస్కంలు రూ.35 వేల కోట్లకు పైనే చెల్లించాలి. రాష్ట్ర విద్యుత్ సంస్థలపై ప్రత్యక్షంగా, ప్రజలపై పరోక్షంగా ఇంత పెద్ద భారాన్ని మోపడానికి చంద్రబాబు సిద్ధపడ్డారంటే దాన్ని మించిన కుంభకోణం ఇంకేముంటుంది? -
యెల్లో జ్యోతి... ఇదేం పైత్యం?
చంద్రబాబు భజన చేస్తూ... వార్తలను, వాస్తవాలను వక్రీకరిస్తూ పబ్బం గడుపుకొంటున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మరోసారి తనవంకర బుద్ధిని బయటపెట్టుకుంది. టీడీపీ సేవలో తరిస్తూ సాక్షి మీడియాపై పడి ఏడ్చే ఆ పత్రిక, టీవీ యాజమాన్యం డిజిటల్ మీడియాపై కనీస అవగాహన లేకుండా ‘సాక్షి’కి వ్యతిరేకంగా వార్తలను వండి వార్చుతోంది. వ్యూస్ను, ట్రాఫిక్ను పెంచుకొనేందుకు ‘సాక్షి’ కుట్ర పన్నిందనీ... సాక్షి వెబ్సైట్ వార్తల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్లైన్ వాడుతున్నారనీ ఎల్లో పత్రికలో తప్పుడు వార్తను ప్రచురించడమే కాకుండా... రెండు రోజులపాటు ఏబీఎన్ చానల్లో అర్థంపర్థం లేని చర్చలను నడిపించింది. డిజిటల్ జర్నలి జంలో ట్యాగ్ లైన్స్ ఎందుకు వాడతారు? ఏ సందర్భంలో ఎలాంటి ట్యాగ్ లైన్స్ వాడతారు? అసలు గూగుల్ ఎనలటిక్స్, వెబ్సైట్ మెట్రిక్స్ ఎలా పనిచేస్తాయన్న పరిజ్ఞానం లేకుండా ‘సాక్షి’పై విషం చిమ్మే ప్రయత్నం మొదలుపెట్టింది.ఎవరైనా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో వార్తలను సెర్చ్ చేయాలనుకుంటే వాళ్లకు సాక్షి వార్తలు కనిపించేలా సాక్షి డాట్ కామ్లో ఏర్పాటు చేసుకున్నారంటూ బుర్ర తక్కువ వాదనను తెరపైకి తెచ్చింది ఎల్లో మీడియా. ఇలా చేయడం ద్వారా ఏబీఎన్ ట్రాఫిక్ మొత్తం ‘సాక్షి’కి వచ్చేస్తుందట. ఇంతకంటే అవగాహనా రాహిత్యం ఇంకేమైనా ఉంటుందా? వినేవాళ్లు ఉంటే పచ్చ పత్రికలు, చానళ్లు ఏదైనా చెబుతాయనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. వాస్తవానికి సాక్షి డాట్ కామ్ వెబ్ ట్రాఫిక్ ఎప్పుడూ ఆంధ్రజ్యోతికి అందనంత ఎత్తులో ఉంటుంది. ప్రజల ముందు వార్తలతోపాటు వాస్తవాలను మాత్రమే అందించే సాక్షి డాట్ కామ్కు ఉన్న ఆదరణ ఆంధ్రజ్యోతికి ఎప్పుడూ లేదు. వెబ్సైట్ ఎనలటిక్స్ను బేరీజు వేసుకుంటే ఆ అంకెలే చెబుతాయి సాక్షి స్థాయి ఏమిటో. అలాంటిది పచ్చ పత్రిక నుంచి వెబ్ ట్రాఫిక్ను డైవర్ట్ చేసుకొనేందుకు కుట్రలు చేయాల్సిన ఖర్మ సాక్షి మీడియాకు లేనేలేదు. అసలు టెక్నికల్గా, లాజికల్గా చూసుకున్నా అలా జరిగే అవకాశాలు ఏమాత్రం లేవు. సాధారణంగా ఏదైనా న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ చేయాల్సి వస్తే ఆ వార్తకు సంబంధించిన వ్యక్తులు, వ్యవస్థల పేర్లను ట్యాగ్ లైన్స్గా జత చేస్తారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేసే రాజకీయ విష ప్రచారానికి కౌంటర్గా సాక్షి డాట్ కామ్లో ఏదైనా వార్తను ప్రచురిస్తే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ను కచ్చితంగా ఉపయోగిస్తారు. ఇలా చేయడం అనైతికం, కుట్ర అని ఏబీఎన్ ఆంధ్ర జ్యోతికి అనిపిస్తే... డిజిటల్ మీడియా గురించి వాళ్లకు ఓనమాలు కూడా తెలియవనే అనుకోవాలి. ఒక పత్రిక లేదా సంస్థ ఇతర పత్రికలు, సంస్థలకు చెందిన పేర్లు, ట్యాగ్లను సహజంగా ఉప యోగించదు అన్నది నిజమేగానీ... ఆ పత్రికా సంస్థకు సంబంధించిన వార్తను ప్రజలకు చేర్చాలనుకున్నప్పుడు ఆ పేర్లు లేకుండా... వాటిని ట్యాగ్ లైన్స్లో పెట్టకుండా ఎలా పబ్లిష్ చేస్తారో ఏబీఎన్ మేధావులకే తెలియాలి.ఏ మీడియా సంస్థలు ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తు న్నాయో పాఠకులకు, వీక్షకులకు తెలియనిది కాదు. ఎల్లో మీడియా చేస్తున్న రాజకీయ కుట్రలను ఎప్పటికప్పుడు సాక్షి మీడియా ప్రజల ముందుంచుతోంది. అందులో భాగంగా ఏబీఎన్ మాత్రమే కాదు... ఏ ఇతర మీడియా సంస్థ అవాస్తవాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేసినా వాటిని ఖండిస్తూ పాఠకులకు, వీక్షకులకు నిజం చెప్పడంలో ‘సాక్షి’ ముందుంటుంది. ప్రజల్లో విశ్వసనీయత ఉంది కాబట్టే ఆంధ్ర జ్యోతి కంటే సాక్షి డాట్ కామ్ డిజిటల్ రేటింగ్స్లో ముందుంది. కేవలం సాక్షి మీడియాపై బురద జల్లడమే పనిగా పెట్టుకొని ఆంధ్ర జ్యోతి చేసే తప్పుడు ప్రచారాలను ఎవరూ విశ్వసించరు.– వర్ధెల్లి మురళి ఎడిటర్, సాక్షి -
ప్రతి పేద కుటుంబానికీ రూ.46,715.. నిజమేనా?
‘దేశంలోని ప్రతి పేద కుటుంబానికీ కేంద్ర ప్రభుత్వం రూ.46,715 ఇస్తోంది. అర్జెంటుగా మీ వివరాలన్నీ ఇచ్చేయండి’ ఇదీ వాట్సాప్లో విస్తృతంగా చలామణి అవుతోన్న ఓ సందేశం. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) స్పందించింది. నిజమా.. ఫేకా అన్నది తేల్చేసింది.దేశంలో రోజుకో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా వాట్సాప్లో వచ్చిన వార్తలను కొందరు అవగాహనలేని వాళ్లు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వార్త ఒకటి వాట్సాప్లో హల్ చల్ చేస్తోంది. దేశంలోని ప్రతి పేద కుంటుంబానికీ కేంద్ర ఆర్థిక శాఖ రూ.46,715 ఆర్థికసాయం అందిస్తోందనేది దాని సారాంశం. అంతటితో ఆగకుండా వ్యక్తిగత వివరాలను కోరుతూ ఓ లింక్ సైతం అందులో ఉంది.ఇది పూర్తిగా ఫేక్ సమాచారమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చింది. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనేది చేయలేదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుదోవ పట్టించే సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనధికార లింక్లలో వ్యక్తగత వివరాలను అందిస్తే దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.A #WhatsApp message with a link claims to offer financial aid of ₹46, 715 to the poor class in the name of the Ministry of Finance and, is further seeking the recipient's personal details#PIBFactCheck✔️This message is #FAKE✔️@FinMinIndia has announced no such aid! pic.twitter.com/rFrYeBsbfd— PIB Fact Check (@PIBFactCheck) August 25, 2024 -
కాకి దేశభక్తి.. అసలు సంగతి ఇది!
తిరువనంతపురం: కేరళలో స్వాతంత్య్ర దినోత్సవం నాడు అద్భుతం జరిగిందట. ఓ స్కూల్లో పిల్లలు, టీచర్లు కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. అయితే జెండా పైకి వెళ్లిన తర్వాత కూడా తెరచుకోకుండా ముడుచుకునే ఉంది. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందోగాని ఓ కాకి సూపర్ హీరోలా వచ్చి ముడుచుకున్న జెండాను ముక్కుతో పూర్తిగా విప్పి తుర్రుమని ఎగిరిపోయింది. Kerala - National Flag got stuck at the top while hoisting. A bird came from nowhere and unfurled it!! ✨ pic.twitter.com/lRFR2TeShK— Shilpa (@shilpa_cn) August 16, 2024దీంతో జెండా రెపరెపలాడి అక్కడున్నవారిపై పూల వర్షం కురిసింది. అచ్చం సినిమాల్లో గ్రాఫిక్స్ సీన్ను తలపించిన ఈ వీడియోను ఎక్స్(ట్విటర్)లో ఓ నెటిజన్ పోస్టు చేయగా వైరల్గా మారింది అంటూ ఓ వీడియో చక్కర్లు కొట్టింది. పక్షి జెండాను రెపరెపలాడించిన ఈ వీడియో చూసిన వారు ఆసక్తికర కామెంట్లు పెట్టారు. గాడ్స్ఓన్ కంట్రీ కదా అలాగే జరుగుతుందని ఒకరు, గత జన్మలో ఆ పక్షి దేశం కోసం ప్రాణాలు విడిచిన అమరవీరుడేమో అని మరొకరు ఇది నిజంగా అద్భుతమని ఇంకొకరు కామెంట్ చేశారు. Fact Check: అయితే అసలు విషయం ఏంటంటే.. ఆ కాకి వెనకాల ఉన్న చెట్టు మీద వాలింది. జాతీయ జెండాను ఎగరేసిన వ్యక్తి ఎవరో.. దాన్ని బలంగా లాగడం వల్లే తెరుచుకుంది. ఈలోపు ఆ అలికిడికి చెట్టు మీద కాకి జడుసుకుని ఎగిరిపోయింది. జెండా కర్రను డిఫరెంట్యాంగిల్లో చూపించడంతోనే అలా పక్షి ఎగరేసిన జెండా కథనం వైరల్ అయ్యింది.Is that the bird unfurling the flag? No.It's the camera angle. pic.twitter.com/on3BlxJs6U— Mohammed Zubair (@zoo_bear) August 17, 2024 -
పాఠ్యపుస్తకాల్లో ‘ప్యాక్ట్ చెకింగ్’ మాడ్యుళ్లు!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చాలా మాధ్యమాల్లో వస్తున్న సమాచారం ఏమేరకు ప్రామాణికమైందో ప్రశ్నార్థకంగా మారింది. సరైన సమాచారం ఇవ్వకపోయినా ఫర్వాలేదు..కానీ తప్పుడు సమాచారంతో మరింత ప్రమాదం చేకూరుతుంది. విద్యార్థి దశలోనే దానిపై సరైన అవగాహన పెంపొందించుకుంటే మేలని కేరళ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. విద్యార్థుల సాధికారత కోసం కేరళ జనరల్ ఎడ్యుకేషన్ విభాగం ఐదు, ఏడో తరగతుల్లోని ఐసీటీ పాఠ్యపుస్తకాల్లో ‘ఫ్యాక్ట్ చెకింగ్’ మాడ్యూళ్లను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఇది నకిలీ వార్తలను గుర్తించడంలో ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో నిజాలను నిర్ధారించుకోవడానికి ఎంతో సహాయపడుతుందని చెప్పాయి.ఈ సందర్భంగా కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (కైట్) సీఈఓ కె.అన్వర్సాదత్ మాట్లాడుతూ..‘ఫేక్ న్యూస్ వ్యాప్తిని నిరోధించడానికి ఐదు, ఏడో తరగతి విద్యార్థుల ఐసీటీ పాఠ్యపుస్తకాల్లో ఆన్లైన్ ‘ఫ్యాక్ట్ చెకింగ్’ మాడ్యూళ్లను ప్రవేశపెట్టాం. గతంలో ఏర్పాటు చేసిన ‘సత్యమేవ జయతే’ కార్యక్రమం స్ఫూర్తితో దీన్ని ప్రారంభించాం. నకిలీ వార్తలు, హానికరమైన కంటెంట్ను గుర్తించేందుకు విద్యార్థులను సన్నద్ధం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. చదువుకునే దశలోనే నకిలీ సమాచారంపై అవగాహన కలిగి ఉంటే భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. వచ్చే ఏడాది ఆరు, ఎనిమిది, తొమ్మిది, పదో తరగతులకు సంబంధించి ఐసీటీ పాఠ్యపుస్తకాల్లో ఈ విధానాన్ని తీసుకొచ్చేలా చర్యలు సాగుతున్నాయి. ఇందుకోసం అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సహాయం తీసుకుంటున్నాం. ఏడో తరగతికి సంబంధించిన కొత్త ఐసీటీ పుస్తకంలో దేశంలోనే తొలిసారిగా నాలుగు లక్షల మంది విద్యార్థులు ఏఐ నేర్చుకునే అవకాశం ఉంది. ఈ పుస్తకాలు మలయాళం, ఇంగ్లీష్, కన్నడ, తమిళ మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయి’ అన్నారు.2022లో కేరళ జనరల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోని కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (కైట్) ‘డిజిటల్ మీడియా లిటరసీ కార్యక్రమం’ను చేపట్టింది. అందులో భాగంగా ఐదు నుంచి పదో తరగతి చదువుతున్న దాదాపు 19.72 లక్షల మంది విద్యార్థులకు నకిలీ వార్తలపై అవగాహన కల్పించేలా శిక్షణ ఇచ్చారు. ఇందులో 9.48 లక్షల మంది అప్పర్ ప్రైమరీ, 10.24 లక్షల మంది హైస్కూల్ విద్యార్థులు ఉన్నారు. ఇంత భారీ శిక్షణ ఇవ్వడం దేశంలో అదే మొదటిసారి. ఈ కార్యక్రమంలో 5920 మంది శిక్షకుల పాల్గొన్నారు. ‘సత్యమేవే జయతే’ పేరుతో 2.5 గంటలపాటు సాగిన ఈ శిక్షణలో ‘రోజువారీ జీవితంలో ఇంటర్నెట్ వినియోగం’, ‘సోషల్ మీడియా అవసరం’, ‘సోషల్ మీడియాలో హక్కులు-తప్పులు’ అనే నాలుగు విభాగాలపై దృష్టి సారించారు.ఇదీ చదవండి: ‘లగ్జరీ కార్లను ఎలా విక్రయించాలో తెలియదు’విద్యార్థి దశలో సమాచారాన్ని విపులంగా అర్థం చేసుకోవాలి. అందులో నకిలీ వివరాలు ఎలా గుర్తించాలో అవగాహన పెంపొందించుకుంటే ‘క్రిటికల్ థింకింగ్’ వృద్ధి చెందుతుంది. దానివల్ల చదువుల్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో మేలు జరుగుతుంది. ఇది కేవలం నకిలీ వివరాలు గుర్తించడానికి మాత్రమే కాకుండా పాఠ్యాంశాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడంలోనూ ఉపయోగపడుతుంది. -
ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే భారీ పెనాల్టీ! నిజమేనా?
ప్రస్తుతం దేశంలో దాదాపు అందరికీ బ్యాంకు ఖాతా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవాలంటే బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఈ క్రమంలో చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటున్నాయి. ఇలా ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే భారీ జరిమానా విధిస్తారంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.భారత ప్రభుత్వ ప్రెస్ ఏజెన్సీ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వైరల్ న్యూస్కు సంబంధించిన అసలు నిజాన్ని చెప్పింది. ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేస్తూ ట్వీట్ చేసింది. “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉంటే జరిమానా విధిస్తారంటూ కొన్ని వార్తల ద్వారా అపోహ వ్యాప్తి చెందుతోంది” అని పేర్కొన్న పీఐబీ ఇది పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేసింది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటువంటి మార్గదర్శకాలను జారీ చేయలేదని తెలిపింది. ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా తప్పుదారి పట్టించే వార్తలు మీ దృష్టికి వస్తే నిజం తెలుసుకోవడానికి పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సహాయం తీసుకోవచ్చు. అటాంటి వార్తల స్క్రీన్షాట్, ట్వీట్, ఫేస్బుక్ పోస్ట్ లేదా URLని వాట్సాప్ నంబర్ 8799711259లో పీఐబీ ఫ్యాక్ట్ చెక్కి పంపవచ్చు లేదా factcheck@pib.gov.inకి మెయిల్ చేయవచ్చు. -
కమలా హారిస్ ‘అబద్ధం’పై మస్క్ సెటైర్
అమెరికా ఉపాధ్యక్షురాలు, భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్పై ప్రపంచ టాప్ బిలీయనీర్ ఎలన్ మస్క్ ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. ట్రంప్ గనుక అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా అబార్షన్లపై నిషేధం విధిస్తారంటూ ఆమె ట్వీట్ చేశారు. అయితే అది అబద్ధం కావడం.. ఎక్స్ సైతం కమ్యూనిటీ నోట్ ఇవ్వడంతో మస్క్ సెటైర్ సంధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో గర్భవిచ్ఛిత్తి(అబార్షన్) కీలకాంశంగా మారింది. బైడెన్ నేతృత్వంలోని డెమోక్రాట్లు నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ నాయకత్వంలోని రిపబ్లికన్లు మాత్రం కొన్ని పరిమితులు ఉండాలని వాదిస్తున్నారు. అయితే అధ్యక్ష బరిలో రిపబ్లికన్ పార్టీ తరఫు అభ్యర్థి ట్రంప్ గనుక గెలిస్తే.. అమెరికా వ్యాప్తంగా అబార్షన్ రద్దు చేస్తారు అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా హారిస్ పోస్ట్ చేశారు. Donald Trump would ban abortion nationwide.President @JoeBiden and I will do everything in our power to stop him and restore women's reproductive freedom.— Kamala Harris (@KamalaHarris) June 30, 2024 అయితే ఆమె పోస్టుకి వెంటనే ఎక్స్ ‘కమ్యూనిటీ నోట్’ ఇచ్చింది(ఫ్యాక్ట్ చెక్ టైప్ ఫీచర్). అబార్షన్ చట్టంపై తాను సంతకం చేయబోనని ట్రంప్ పదే పదే చెప్పారు అని ఆ నోట్ పేర్కొంది. దీంతో వెంటనే ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ స్పందించారు. రాజకీయ నాయకులైతేనేం.. వాళ్ల సోషల్ మీడియా అకౌంట్లను నడిపేవాళ్లు అయితేనేం.. ఇలాంటి మాధ్యమాల్లో అబద్ధాలు ఇక మీదట పని చేయవని ఎప్పటికి గుర్తిస్తారో అంటూ పోస్ట్ చేశాడు. అంతేకాదు.. కమ్యూనిటీ నోట్ వచ్చిన హారిస్ పోస్టును స్క్రీన్ షాట్ ఉంచారాయన. అక్కడితో ఆగకుండా ఆమె పోస్టుకు సైతం ఆయన కామెంట్ చేశాడు.When will politicians, or at least the intern who runs their account, learn that lying on this platform doesn’t work anymore? pic.twitter.com/wP7H4AJFwG— Elon Musk (@elonmusk) July 1, 2024 ఇదిలా ఉంటే.. అబార్షన్ను నిషేధించే ఉద్దేశం తనకు లేదంటూ గత వారం అట్లాంటాలో బైడెన్తో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల బిగ్ డిబేట్లోనూ ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు ఎక్స్ కమ్యూనిటీ ఫీచర్ను గత కొంతకాలంగా మస్క్ పొడుగుతూ వస్తుండడం చూస్తున్నాం. కమ్యూనిటీ నోట్ ఫీచర్ అనేది.. పరోక్షంగా ఇది తప్పుదోవ పట్టించే పోస్ట్ కావొచ్చని.. నిజనిర్ధారణ చేసుకోవాలని యూజర్కు సూచిస్తుంది. అలాగే.. యూజర్లు ఆ పోస్టులో ఆ నోట్ ద్వారా అభిప్రాయాలు వ్యక్తంచేసి తప్పేంటో చెప్పే అవకాశమూ ఉంటుంది. -
Fact Check: భద్రతపైనా తప్పుడు రాతలా?
సాక్షి, అమరావతి: అవాస్తవాలు, అభూత కల్పనలే ఆసరాగా బతికేస్తున్న పచ్చ మీడియా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి బురద జల్లే ప్రయత్నం చేసింది. ఆయనకు కల్పిస్తున్న భద్రతపై ఈనాడు పత్రిక అభూత కల్పనలతో అసత్య కథనాన్ని అచ్చేసింది. ఆయనకు 983 మందితో భారీ భద్రత కల్పించినట్లు అబద్ధాలతో కథనాన్ని వండింది. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల భద్రత ఏర్పాట్లకు ఉన్నత స్థాయి సెక్యూరిటీ రివిజన్ కమిటీ అనే ప్రత్యేక వ్యవస్థ ఉంటుందని, ఆ కమిటీ నిర్ణయం మేరకే ఏర్పాట్లు జరుగుతాయన్న కనీస జ్ఞానం ఆ పత్రికకు లేకపోయింది. వాస్తవంగా వైఎస్ జగన్కు ఉన్న భద్రతా సిబ్బంది ఎందరు అన్న విషయాన్ని పరిశీలించాలన్న నైతిక విలువలకూ తిలోదకాలిచ్చి నోటికొచ్చిన సంఖ్యలతో ఉద్దేశపూర్వకంగా దు్రష్పచారం చేస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం వద్ద ఈనాడు చెప్పినట్లుగా 983 మంది భద్రతా సిబ్బంది లేరు. కాన్వాయ్ కాంపొనెంట్తో కలిపి కేవలం 196 మందే విధుల్లో ఉన్నారు. అదీ షిఫ్ట్లులవారీగా భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. సెక్యూరిటీ రివిజన్ కమిటీ సమావేశం కాకుండానే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల భద్రత ఏర్పాట్లను ఉన్నత స్థాయిలోని సెక్యూరిటీ రివిజన్ కమిటీ నిర్ణయిస్తుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆ కమిటీ సూచనల మేరకే భద్రతా ఏర్పాట్లు కల్పించాల్సి ఉంటుంది. ఏ ముఖ్యమంత్రీ తనకు ఇంత భద్రత కావాలని అడగరు. సెక్యూరిటీ రివిజన్ కమిటీయే అన్ని అంశాలను విశ్లేíÙంచి ఎంత మేర భద్రత కల్పించాలన్నది ఖరారు చేస్తుంది. ముఖ్యమంత్రి నివాసం, పరిసర ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు, మార్పులు, చేర్పులు తదితర అంశాలను కూడా ఈ కమిటీ ఆదేశాల మేరకే చేపడతారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లను సెక్యూరిటీ రివిజన్ కమిటీ నిర్ణయం మేరకే చేపట్టారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తరువాత సెక్యూరిటీ రివిజన్ కమిటీ ఇంకా సమావేశమవ్వనే లేదు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల భద్రత ఏర్పాట్లపై సమీక్షించనే లేదు. కానీ ఈనాడు పత్రిక మాత్రం దురుద్దేశపూరిత కథనం ప్రచురించడం ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నమే. నాడు బాబు మనవడికి కూడా భద్రత2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మనవడు దేవాన్‡్షకు కూడా ప్రత్యేకంగా భద్రత కల్పించారనే వాస్తవాన్ని ఈనాడు ఉద్దేశపూర్వకంగా విస్మరించింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్‡్షకు ప్రత్యేకంగా భద్రత కల్పించారు.ఉండవల్లిలోని చంద్రబాబు కరకట్ట నివాసంతోపాటు హైదరాబాద్లోని వారి నివాసం, చివరకు ఫామ్ హౌస్ వద్ద కూడా భారీ భద్రత కల్పించడం గమనార్హం. వైఎస్ జగన్మోహన్రెడ్డికి కల్పించిన భద్రతకంటే ఎన్నో రెట్లు అధికంగా భద్రత కల్పించారు. ఈ అధికార దురి్వనియోగంపై ఏనాడూ పట్టించుకోని ఈనాడు.. ఉన్నత స్థాయి కమిటీ సూచనల మేరకు నిబంధనల ప్రకారం వైఎస్ జగన్కు కల్పించిన భద్రతపై అభూత కల్పనలు ప్రచురించింది. వివిధ విభాగాల నుంచి విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వివరాలు సివిల్ పోలీసులు: సీఐ–1, ఎస్సైలు–4, హెడ్ కానిస్టేబుల్–1, కానిస్టేబుళ్లు –12 , మహిళా కానిస్టేబుల్ –1. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు: ఆర్ఎస్సైలు – 2, ఏఆర్ఎస్సై –1, కానిస్టేబుళ్లు – 28 ఏపీఎస్పీ: డీఎస్పీ –1, ఆర్ఎస్సై – 3, ఏఆర్ఎస్సై–2, హెడ్ కానిస్టేబుళ్లు – 14, కానిస్టేబుళ్లు – 69 ఆక్టోపస్: ఆర్ఐ –1, ఆర్ఎస్సైలు –2, కానిస్టేబుళ్లు–10 మొత్తం: 152 మంది ఐసోలేషన్లో: అదనపు ఎస్సీ – 1, ఆర్ఐ – 2, ఆర్ఎస్సై – 3, కానిస్టేబుళ్లు – 17 మొత్తం: 23 మంది కాన్వాయ్ విభాగంలో: సీఐ – 1, ఎస్సై – 3, హెడ్ కానిస్టేబుల్ – 1, కానిస్టేబుళ్లు – 16 మొత్తం: 21 మంది. -
ఫేక్ రీల్ వైరల్ : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరిక
సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి రోజు రోజుకు ముదిరిపోతోంది. యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టా రీల్స్ కోసం ప్రాణాలకు తెగించి మరీ, ఫ్యామస్ అయిపోవాలనే తాపత్రయంతో కొంతమంది ప్రాణాలు మీదికి తెచ్చు కుంటోంటే.. మరికొందరు బూటకపు వేషాలు, తప్పుడు వీడియోలతో వెర్రి చేష్టలు చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. మరోవైపు ఈ వీడియోపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఫేక్. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్ మీడియాలో పాపులర్ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు. లైక్ లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా… pic.twitter.com/Eia1GCSxyr— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) June 21, 2024బస్సు కిందకి యువకుడు, పిచ్చి రీల్హైదరాబాద్లోని ఓ రోడ్డుపై ఆర్టీసీ బస్సు కింద ఒక యువకుడు అకస్మాత్తుగా బస్సు కింద పడుకోవడం, బస్సు వెళ్లిపోయాక, ఎలాంటి గాయాలు లేకుండానే, తీరిగ్గా షర్ట్కి అంటిన దుమ్ము దులుపుకుంటూ వెళ్లిపోయినట్టుగా చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఇది ఎడిటెడ్ వీడియో అని ఇట్టే తెలిసిపోతుందని నెటిజన్లు కమెంట్స్ చేశారు. ఇది ఫేక్ అంటూ తీవ్ర చర్చ సాగింది కూడా. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో ఫేక్. ఇది పూర్తిగా ఎడిటెడ్ వీడియో. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు ఇలా వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారు. ఇలాంటి వెకిలిచేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం మంచి పద్దతి కాదు. లైక్లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉంది. సరదా కోసం చేసే ఎడిట్ వీడియోలు ఇతరులకు ప్రాణాప్రాయం కూడా కలిగిస్తాయి. ఇలాంటి ఘటనలను తెలంగాణా ఆర్టీసీ సీరియస్గా తీసుకుంటుంది అంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. కాగా ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వీడియోలను కానీ, ఇమేజెస్ను గానీ కాస్త నిశితంగా పరిశీలిస్తే ఇది నిజమో, కాదో. ఇట్టే అర్థమవుతుంది. లేదంటే గూగుల్స్ లెన్స్ ద్వారా ఇమేజ్ను ఫ్యాక్ట్ చెక్ చేయవచ్చు. వీడియో అయితే ‘ఇన్విడ్’ అనే టూల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. -
గూగుల్పై చిల్కూరు పూజారి రంగరాజన్ ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: చిల్కూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్పై మండిపడుతున్నారు. ఆలయానికి సంబంధించి గూగుల్లో చూపిస్తున్న తప్పుడు సమాచారంపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. మీడియాతో స్పందించారు.గూగుల్లో చిల్కూరు టెంపుల్ అని టైప్ చేస్తే.. కింద శనివారం, ఆదివారం రోజుల్లో గుడి క్లోజ్ అంటూ గూగుల్ సమాచారం చూపిస్తోంది. తిరిగి సోమవారం ఉదయం 8గం.కు తెరుచుకుంటుందని ఉంది. అయితే.. గూగుల్ చూపించే ఆ సమాచరం తప్పుడుదని రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని వేళలా ఆలయం యధావిధిగా తెరిచే ఉంటుంది. గూగుల్ మాత్రమే కాదు.. అలాంటి తప్పుడు ప్రచారం ఎక్కడ జరిగినా మేం ఖండిస్తాం అని అన్నారాయన.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరు బాలాజీ టెంపుల్ ఉంది. వీసా బాలాజీ టెంపుల్గా దీనికంటూ ఓ గుర్తింపు ఉంది. విదేశాలకు వెళ్లదల్చుకున్న వాళ్లు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. శనివారం, సెలవు రోజుల్లో, పండుగల ప్రత్యేక సందర్భాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. వారం రోజుల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు భక్తులు 108 ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తుంటారు. -
చిత్తూరులో పులి హల్చల్.. అసలు కథ ఇదీ!
ఒక పల్లెటూరులో తండ్రిని ఓ పిల్లవాడు నాన్న పులి వచ్చిందంటూ రెండుసార్లు ఆటపట్టిస్తాడు. పావుగంట అయ్యాక మళ్లీ పులి అంటూ పిల్లవాడు కేకలు వేయడంతో ఎవరు పట్టించుకోరు. తీరా నిజంగానే పులి వచ్చి గొర్రెలను తీసుకెళుతుంది. ఈ కథలో నీతి ఏమిటంటే అబద్దాలు ఆడితే పరిహారం తప్పదని.. సరిగ్గా ఇదే విధంగా ప్రస్తుతం జిల్లాలో పలువురు ‘పులి సంచరిస్తోందని’ తప్పుడు ప్రచారం చేస్తూ జనాన్ని భయపెడతున్నారు. ఇవన్నీ ఫేక్గా అటవీశాఖ అధికారులు గుర్తించి ఆకతాయిలను హెచ్చరిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. చిత్తూరు కార్పొరేషన్: అదిగో ఇక్కడ పులి వచ్చింది.. అంటూ వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాలలో కొందరు ఫొటోలు పెడుతున్నారు. దీంతో సంబంధిత ప్రాంత వాసులు భయాందోళనకు లోనవుతున్నారు. దీన్ని అటవీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో నిజాలు తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి అటువంటిదేమీ లేదని సృష్టత ఇస్తున్నప్పటికీ ఆగడాలు ఆగడం లేదు. గడిచిన 9 నెలల్లో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అందరిని భయాందోళనకు గురిచేయాలనే శాడిజం మనస్వత్తంతో ఉన్నవారు ఇలా ప్రవర్తిస్తున్నారని నిపుణులు అంటున్నారు. జిల్లాలో ఇలా.. 👉 చిత్తూరు రూరల్ మండలం బీఎన్ఆర్పేట సమీపంలో రోడ్డు పనుల వద్ద బెంగాల్ టైగర్ కనిపించిందని వీడియోను వైరల్ చేశారు. తీరా క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలిస్తే అది అస్సాంలో జరిగిన వీడియోగా, సామాజిక మాధ్యమాల నుంచి డౌన్లోడ్ చేసినట్లు అధికారులు తేల్చారు. 👉గుడిపాల మండలం పసుమంద పంచాయతీలో బెంగాల్ టైగర్ను చూశామని ఫోటోలు పెట్టారు. దీంతో మండల వాసులు భయాందోళనకు లోనయ్యారు. అక్కడికెళ్లి అటవీశాఖ సిబ్బంది తనిఖీలు చేస్తే ఇక్కడి వీడియో కాదని తేలింది. ఈ వీడియోను ఉత్తరప్రదేశ్లో తీసినట్లుగా గుర్తించారు. 👉గుడిపాలలోని గొల్లమడుగు అటవీ ప్రాంతంలో పులి కూనలను వదిలి వెళ్లిందని వీడియో పెట్టారు. తల్లి కోసం పిల్లలు ఎదురుచూస్తున్నట్లు ఆ వీడియో సారాంశం. డీఎఫ్ఓ చైతన్యకుమార్రెడ్డి నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ఎఫ్ఆర్వో థామస్ సిబ్బందితో కలిసి కొండలు, గుట్టలను రెండు రోజులు పాటు జల్లెడ పెట్టి కూనలు లేవని నిగ్గుతేల్చారు. మధ్యప్రదేశ్లో జరిగిన సంఘటన వీడియో పెట్టారని అధికారులు తెలుసుకున్నారు. చిత్తూరు ఈస్ట్ రేంజ్లో వైరల్ చేసిన ఫోటోలు, వీడియోలు ఎక్కువగా బయట రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కారి్మకులు పెట్టినట్లుగా గుర్తించారు. వాటిని స్థానికులు వైరల్ చేసినట్లు తెలుస్తోంది. 👉పాకాల మండలం నేండ్రగుంట వద్ద పులి రోడ్డుపై వచ్చినట్లు ప్రయాణికులు భయాందోళనకు గురైనట్లు వీడియో పెట్టారు. ఆ వీడియో ఉత్తరప్రదేశ్ వీడియో అని అధికారులు తేల్చారు. 👉వడమాలపేట మండలం బంగారెడ్డి కండ్రిగ సమీపం ప్రాంతంలో పులి వచ్చిందని వాట్సాప్ గ్రూప్లో పోస్టులు పెట్టడంతో ప్రాంతవాసులు బిత్తరపోయారు. తీరా అధికారులు రంగంలో దిగి విచారించడంతో గత సంవత్సరం నవంబరులో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ సురేష్ బెంగళూరులో తీసిన ఫోటోగా తేల్చారు. ఇన్స్టాలో పెట్టిన వీడియోలో నుంచి తీసిన ఫోటోగా నిర్దారించారు. ఇలాంటి విషయాల్లో వాస్తవాలు తెలుసుకోకుండా పలువురు వాట్సాప్ స్టేటస్ట్లు పెడుతున్నారు. చదువుకున్న వారు సైతం ఇలా చేయడం సరికాదని అధికారులు సూచిస్తున్నారు.చర్యలు తప్పవు ఇప్పటి వరకు అవాస్తవ వీడియోలపై ఆకతాయిలను హెచ్చరించి వదిలేశాం. వీటిని అటవీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇకపై ఎలాంటి అవాస్తవ వీడియోలు వచ్చినా అటవీచట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. యువత సమాజశ్రేయస్సు కోసం బాటలు వేయాలి. – థామస్, ఎఫ్ఆర్వో, చిత్తూరు ఈస్ట్ -
TGSRTC ఫేక్ ప్రచారంపై సజ్జనార్ క్లారిటీ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ పేరును టీజీఎస్సార్టీసీగా మార్చేసింది ప్రభుత్వం. అధికారికంగా బుధవారమే దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినట్లు సాక్షి సహా పలు మీడియా చానెల్స్ సైతం కథనాలిచ్చాయి. అయితే TGSRTCపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ ప్రచారాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఖండించారు. TGSRTC కొత్త లోగో ఇదే నంటూ ఇంటర్నెట్లో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఆ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని సజ్జనార్ స్పష్టత ఇచ్చారు. ‘‘అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్. .. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోంది. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదు అని సజ్జనార్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. #TGSRTC కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ… pic.twitter.com/n2L0rezuoo— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) May 23, 2024 అత్యుత్సాహంతో కొన్ని వెబ్సైట్లు అలా లోగోను డిజైన్ చేసి కథనాలిచ్చాయి. దీంతో అదే నిజమైన లోగో అంటూ వైరల్ అయ్యింది. టీజీఎస్సార్టీసీ తాజా ప్రకనటతో కొత్త లొగోను త్వరలోనే అధికారికంగా ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. -
మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా?
మామిడి పండ్లు తినడం వల్ల ముఖంపై మొటిమలు, గడ్డలు వస్తాయని చాలామంది చెబుతుంటారు. పాపం ఆ ఉద్దేశ్యంతోనే మామిపండు తినేందుకు భయపడుతుంటారు. నిజానికి మామిడి పండ్లకు మొటిమలకు సంబంధం ఉందా? వాటిని తినడం వల్ల వస్తాయా ? అంటే..వేసవిలో అందరూ మామిడి పండ్లంటే ఇష్టంగా తింటారు. పోషకాల రీత్యా మామిడిని పండ్లలో రారాజు అని పిలుస్తారు. నిజానికి ఈ మామిడి ఆగ్నేయాసియాలో ఉద్భవించింది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా సాగు చేసే సాధారణ పండుగా మారింది. ఈ మామిడి తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల విటమిన్లు, పోషకాలు అందుతాయి. దీనిలో బీటా కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తుందని డెర్మటాలజీ నిపుణులు చెబుతున్నారు.ఈ బీటా కెరోటిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ పిగ్మెంట్, శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతుంది. అంతేగాక దీనిలో ఉండే పోషకాలన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మంటను తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాంటి మామిడి పండ్లను తింటే కొందరిలో మొటిములు ఎందుక వస్తాయంటే..? అధిక చక్కెర స్థాయి, గ్లైసెమిక్ సూచిక అని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను సూచించే స్కేల్. ఇక్కడ పండ్లు, బియ్యం, ఇతర కార్బ్ రిచ్ ఉత్పత్తులు, ముఖ్యంగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాల్లో అత్యధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసీయేషన్ ప్రకారం..తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారం బరువు తగ్గడానికి మెటిమలు తగ్గించడానికి 91% సహాయపడుతుందని వైద్యులు తెలిపారు. ఇక్కడ మొటిమలు రక్తంలోని చక్కెర స్థాయిలతో ముడిపడి ఉందని తెలిపారు. అందులోనూ ఈ మామిడిపండ్లను చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు తెగ ఇష్టంగా తింటారు. ఇది వారు యుక్త వయసుకు చేరుకునే సమయం..సరిగ్గా ఈ టైంలోనే వారిలో సెబమ్ ఉత్పత్తి అవుతుంటుంది. దీంతో వారిలో జిడ్డు చర్మం, మొటిమలు మొదలయ్యే దశ స్లోగా మొదలవుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఈ మామిడి పండ్లు కూడా వాళ్లుగా ఇష్టంగా తినడంతో పెద్దవాళ్లు మొటిమలకి, మామిడి పండ్లకి లింక్ చేసి..అవి తినడం వల్లనే వస్తున్నాయని అనేస్తారు. వాస్తవానికి అది అపోహ అని తేల్చి చెబుతున్నారు నిపుణులు. సముతల్యమైన ఆహారం తీసుకున్నవాళ్లు హాయిగా మామిడి పండ్లను తినవచ్చని చెబుతున్నారు. ఇక్కడ మొటిమలు చర్మ పరిస్థితికి ఒక లక్షణం అనేది గ్రహించాలి. ఇక్కడ చర్మాన్ని శుభ్రంగా ఉంచుకుని, మంచి పరిశుభ్రతను పాటిస్తూ.. మొటిమలను నిరోధించే క్రీమ్లను ఉపయోగిస్తే..ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతారు. పైగా చర్మం కూడా ప్రకాశవంతంగా అందంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: గురుద్వారా సేవా కార్యక్రమంలో మోదీ! ఏంటీ లంగర్ ..?) -
గొర్రెదాటు రాతలు.. ఎన్నాళ్లీ రోతలు
సాక్షి, అమరావతి: బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు..బ్యాక్ బోన్ క్లాస్ అంటూ అడుగడుగునా బీసీలకు వెన్నంటి నిలిచింది వైఎస్ జగన్ ప్రభుత్వం. యాదవులకు గొర్రెలు, మేకలు పంపిణీ చేయడం దగ్గర ఆగిపోకుండా ఆ సామాజిక వర్గాలకు చెందిన వారిని చట్టసభలకు పంపించిన చరిత్ర సీఎం జగన్ది. యాదవుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా గుర్తింపును తీసుకొచ్చారు.ఆర్బీకేల ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేయడమే కాదు..ఏటా క్రమం తప్పకుండా డీ వారి్మంగ్, వ్యాక్సినేషన్ చేస్తోంది. వైఎస్సార్ పశు బీమా పథకాన్ని సన్న జీవాలకు వర్తింప చేయడమే కాదు..మూగ, సన్నజీవాల కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవారథాలను తీసుకొచ్చింది.సుమారు 400 ఏళ్లపాటు కలగా ఉన్న మాచర్ల, నాగావళి గొర్రె జాతులకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) గుర్తింపును సాధించడం ద్వారా వాటిపై ఆధారపడిన లక్షలాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ఇలా ఐదేళ్లుగా యాదవుల సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేస్తుంటే రామోజీరావుకు మాత్రం కనిపించడం లేదు. యాదవులను తప్పుదారి పట్టించేవిధంగా ‘షెడ్డు దక్కలేదు..పొట్టేలు చిక్కలేదు’ అంటూ అచ్చేసిన బురద కథనంలో వాస్తవాలేమిటో పరిశీలిద్దాం.. ఆరోపణ: యాదవుల సంక్షేమం పట్టని జగన్ వాస్తవం: రాష్ట్రంలో 55.22 లక్షల మేకలు, 1.77 లక్షల గొర్రెలు పెంచుకుంటూ లక్షన్నర కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. వీరిలో 75 శాతం యాదవులు కాగా, మిగిలిన 25 శాతం ఇతర సామాజిక వర్గాల వారున్నారు. వీరి సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గతంకంటే మెరుగైన రీతిలో ఆర్థిక చేయూతనందించారు. నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించారు. అర్హత ఉన్నవారందరికీ ఇంటి స్థలాలతోపాటు సొంత ఇళ్ల నిర్మాణానికి సహకరించారు. ఆరోపణ: గత ప్రభుత్వ పథకాలను తెగ్గోసిన జగన్ సర్కార్ వాస్తవం: కేంద్రం సహకారంతో ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రుణం అందించే స్కీమ్ నేటికీ కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు హయాంలో 2029 సొసైటీలుండగా, ప్రస్తుతం వీటి సంఖ్య 2735కు పెరిగింది. అంటే కొత్తగా 706 సొసైటీలను ఏర్పాటు చేయడమే కాదు. వారికి అన్ని విధాలుగా అండగా నిలిచారు. ఎన్సీడీసీ ద్వారా 2423 మందికి రూ.62.49 లక్షల ఆర్థిక సాయం అందించారు. గొర్రెలు, మేకల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువలపై ఆర్బీకేల ద్వారా నిరంతరాయంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆర్బీకేల ద్వారా 1159 యూనిట్లకు డీ వారి్మంగ్తోపాటు క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఆరోపణ: వైఎస్సార్సీపీ హయాంలో అందని రుణాలు వాస్తవం: జగన్ ప్రభుత్వంలో యాదవులకు రుణాలే అందలేదని రాసుకొచ్చారు. ఎన్సీడీసీ పథకం కింద ఇప్పటి వరకు 2150 యూనిట్లు మంజూరు చేశారు. వీటిలో రూ.లక్ష చొప్పున 1,416 యూనిట్ల (20 గొర్రెలు. ఒక పొట్టేలు), రూ.5 లక్షల చొప్పున 675 యూనిట్లు (50 గొర్రెలు, రెండు పొట్టేళ్లు), రూ.10 లక్షల చొప్పున 57 యూనిట్లు (100 గొర్రెలు, ఐదు పొట్టేళ్లు), రూ.50 లక్షల చొప్పున 2 యూనిట్లు (500 గొర్రెలు 25 పొట్టేళ్లు) మంజూరు చేశారు. వీటికోసం రూ.43.77 కోట్లు ఖర్చు చేశారు. ఇవే కాదు..ఎన్ఎల్ఎం స్కీమ్ కింద 12 మందికి 50 లక్షల సబ్సిడీతో రూ.కోటి చొప్పున రుణాలు అందించారు. ఇంకా 60 అప్లికేషన్లు బ్యాంకుల వద్ద పెండింగ్లో ఉన్నాయి. లక్ష మందికి జారీ చేసిన కేసీసీ కార్డుల ద్వారా రూ.60 వేల నుంచి రూ.2 లక్షల వరకు పావలా వడ్డీ రుణాలు మంజూరు చేశారు. ఆరోపణ: అటెకెక్కించిన బీమా పథకం వాస్తవం: వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన అనంతరం నాలుగేళ్లలో 77 వేల మంది పశు పోషకులకు వైఎస్సార్ పశునష్టపరిహారం పథకం కింద నేరుగా వారి ఖాతాల్లో పరిహారం జమ చేశారు. ఇలా రూ.176.68 కోట్లు జమ చేస్తే అత్యధికంగా లబ్ధి పొందింది మేకలు, గొర్రెల పెంపకందారులే. మరింత ఎక్కువ మందికి లబ్థి చేకూర్చాలని సంకల్పంతో 2022–23లో వైఎస్సార్ పశు బీమా పథకాన్ని తీసుకొచ్చారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న వారితోపాటు ఎస్సీ, ఎస్టీలకు తమ జీవాలకు మూడేళ్ల కాలపరిమితితో నిర్దేశించిన ప్రీమియంలో 80 శాతం ప్రభుత్వం రాయితీగా భరిస్తోంది. ఇప్పటికే 1.75 లక్షల మంది ఈ స్కీమ్లో నమోదు కాగా, ఇప్పటి వరకు మృత్యువాతపడిన జీవాలకు సంబంధించి రూ.2.50 కోట్ల పరిహారాన్ని అందించారు. ఆరోపణ: కార్పొరేషన్తో పైసా మేలు జరగలేదు. వాస్తవం: యాదవుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘతన వైఎస్ జగన్కే దక్కుతుంది. కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాదు..నవరత్నాల ద్వారా యాదవులకు అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ కార్పొరేషన్ ద్వారానే అందిస్తున్నారు. చేయూత, ఆసరా వంటి పథకాల ద్వారా ఆర్థిక చేయూతనివ్వడమే కాదు..జగనన్న విద్యాదీవెన, వసతి వంటి పథకాల ద్వారా వారి పిల్లల చదువులకు భరోసా కల్పిస్తున్నారు. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాల ద్వారా సన్న జీవాలకు నాణ్యమైన వైద్యం వారి ముంగిటకే తీసుకొచ్చారు. ఆరోపణ: జగన్ హయాంలో ఏదీ పెద్దపీట? వాస్తవం: యాదవుల సంక్షేమానికి చంద్రబాబు అన్ని విధాలుగా తూట్లు పొడిచారు. యాదవులకు గుర్తింపు కాదు కదా..కనీసం ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. కేంద్రం అమలు చేసిన పథకాలు తప్ప సొంతంగా ఒక్కరంటే ఒక్కరికి కూడా ఆర్థిక చేయూతనివ్వలేదు.మంజూరు చేసిన రూ.250 కోట్లలో చెల్లించిన మొత్తం కేవలం రూ.80 కోట్లే. కేంద్ర ప్రాయోజిత పథకం కింద పశువులు, సన్న జీవాల కోసం అమలు చేసిన బీమా పథకంలో నిర్దేశించిన ప్రీమియం మొత్తంలో 50 శాతం లబ్ధిదారులే భరించాల్సి వచ్చేది. మిగిలిన 50 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. 2015లో కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ నిలిపివేయడంతో బాబు హయాంలో బీమా పథకాన్నే అటకెక్కించేశారు. ఆ రెండు జాతుల గుర్తింపు కనిపించలేదా మాచర్ల, నాగావళి జాతి గొర్రెలకు అరుదైన గొర్రె జాతులుగా ఐసీఏఆర్ గుర్తింపు లభించింది. ఇప్పటి వరకూ నెల్లూరు జాతి గొర్రెలకే అధికారిక గుర్తింపు ఉంది. ఐసీఏఆర్ గుర్తింపు ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రుణాలు పొందేందుకు వెసులుబాటు కలిగింది. పునరుత్పత్తి కోసం ఉపయోగించే పొట్టేళ్ల ధరలు రెట్టింపు పలకనున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహక పథకాల కింద వీటి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరుకానున్నాయి. -
మీ ‘మద్దతు’ బాధంతా బాబు కోసమేగా!
సాక్షి,అమరావతి: ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అనే చందంగా పచ్చ పత్రికాధినేత రామోజీరావు తీరు ఉంది. వ్యవసాయం దండగ అని చంద్రబాబు తీసిపారేస్తే.. వ్యవసాయం పండుగ అని వైఎస్ జగన్ ప్రభుత్వం నిరూపించింది. అధికారంలోకి వచ్చింది మొదలు గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు, అక్కడే విత్తు నుంచి విక్రయం వరకు అన్ని ఏర్పాట్లు, కనీస మద్దతు ధర దక్కని పంటలను ప్రభుత్వమే కొనుగోలు, మార్కెట్లో ధరలు పడిపోయిన ప్రతిసారి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వ జోక్యం, ఏకంగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, ఆరు పంటలకు కనీస మద్దతు ధర, సీఎం యాప్ ద్వారా ధరల పర్యవేక్షణ, ధాన్యాన్ని కొనుగోలు చేసినప్పుడు గోనె సంచులతోపాటు కూలీల భారం, రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే పెట్టుకుంటున్నా.. ఇంకా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో చేస్తున్నా రామోజీ విషం జిమ్ముతున్నారంటే ఏం అనుకోవాలి? ఈ ఏడుపుకు, కడుపుమంటకు అసలు మందు ఉందా? బుధవారం తన పచ్చ పత్రిక ‘ఈనాడు’లో ‘కనీస మద్దతు ధర.. గరిష్ట మోసం దొర’ అంటూ ఒక తప్పుడు కథనాన్ని అచ్చేశారు. దీనికి సంబంధించి అసలు వాస్తవాలివిగో..ఆరోపణ: ధరల స్థిరీకరణ నిధి ఒక దగావాస్తవం: మార్కెట్లో మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు రూ.3 వేల కోట్లతో ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. వాస్తవానికి ఈ 57 నెలల్లో 1–2 సీజన్లలో 2–3 పంట ఉత్పత్తులకు మినహా మిగిలిన పంటల మార్కెట్ ధరలు మద్దతు ధరకు మించి పలికాయి. ఈ ఏడాది కూడా మద్దతు ధరలు ప్రకటించిన పంట ఉత్పత్తులతో సహా పలు రకాల వ్యవసాయ, ఉద్యాన పంటల ధరలు ఎమ్మెస్పీకి మించి పలుకుతున్న మాట వాస్తవం కాదా? అలాంటప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకోవల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంటుందో ‘ఈనాడు’కే తెలియాలి. ఆరోపణ: సీఎం యాప్ సిగ్గు..సిగ్గువాస్తవం: దేశంలోనే తొలిసారిగా గ్రామాల వారీగా మార్కెట్లో ధరలను సేకరించి ఎప్పటికప్పుడు వాటి హెచ్చుతగ్గులను సమీక్షించేందుకు సీఎం యాప్ను తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా ఈ 57 నెలల్లో ధరలు పతనమైన ప్రతిసారీ ప్రభుత్వమే మార్కెట్లో జోక్యం చేసుకొని వ్యాపారులతో పోటీపడి రైతులకు కనీసమద్దతు ధర దక్కేలా కృషి చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 3.74 లక్షల మంది రైతుల నుంచి రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల పంటల ఉత్పత్తులు కొనుగోలు చేస్తే.. ఈ 57 నెలల్లో 6.18 లక్షల మంది రైతుల నుంచి రూ.7,757.87 కోట్ల విలువైన 21.61 లక్షల టన్నుల ఉత్పత్తులను జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంటే... రెట్టింపు కన్నా అధికం. అలాగే చంద్రబాబు ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే.. ఈ 57 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం 37.34 లక్షల మంది రైతుల నుంచి 3.38 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.65 వేల కోట్లు చెల్లించింది. బాబు హయాంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోలుకు రూ.43,559 కోట్లు మాత్రమే వెచ్చిస్తే, వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ 57 నెలల్లో ఏకంగా రూ.72,445 కోట్లు ఖర్చుచేసింది అంటే.. సగటున చంద్రబాబు హయాంలో ఏడాదికి రూ.8,711 కోట్లు వెచ్చిస్తే, జగన్ ప్రభుత్వం ఏటా సగటున రూ.16,099 కోట్లు వెచ్చించింది. ఆరోపణ: గిట్టుబాటు ధర కల్పనలో చేతులెత్తేశారువాస్తవం: గిట్టుబాటు ధరలు పడిపోతే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని సైతం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇలా ప్రభుత్వ భరోసా వల్లే మార్కెట్లో ధరలు స్థిరపడ్డాయి. అలాగే 2021–22లో ఉల్లి ధరలు పతనమైనప్పుడు మద్దతు ధరకు, 2022–23లో ధరలు పెరిగినప్పుడు మార్కెట్ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇటు రైతులకు, అటు వినియోగదారులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఇలా రూ.64 కోట్ల విలువైన 9,025 టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి ప్రజలకు సబ్సిడీ ధరలకు అందించింది. 2022–23లో రూ.22.94 కోట్ల విలువైన 2,541 టన్నులు, 2023–24లో రూ.43.46 కోట్ల విలువైన 5,517 టన్నుల పసుపును కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. మిరప ఎమ్మెస్పీ రూ.7వేలు కాగా మూడేళ్లుగా మార్కెట్లో క్వింటా రూ.15వేల నుంచి రూ.30వేలకు పైగా ధరలు పలుకుతున్నాయి. నాలుగేళ్లుగా చిరుధాన్యాల మార్కెట్ ధరలు మద్దతు ధర కంటే ఎక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగానే ప్రస్తుత ఎమ్మెస్పీ ధరల కంటే మిరప, పత్తి, పసుపు, వేరుశనగ, మినుము, మొక్కజొన్న పంటలకు మార్కెట్లో రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయి. ఆరోపణ: వ్యవసాయ ఖర్చులు పెరిగాయివాస్తవం: సహజంగా మద్దతు ధరలు ప్రకటించేది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని పంటలు వేసే రైతులు నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని విధంగా సొంతంగా వాటికి మద్దతు ధరలను ప్రకటించింది. మద్దతు ధరకు మించి పలికితే మార్కెట్లోనే రైతులు విక్రయించుకుంటారు. మార్కెట్లో ధర లేనప్పుడు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతుకు బాసటగా నిలుస్తోంది. రైతులకు పెట్టుబడి పెరిగిందని వాదిస్తున్న రామోజీ... అదే సమయంలో రైతుకు ఏటా రూ.13,500 చొప్పున ఇస్తున్న రైతు భరోసా సాయాన్ని మాటమాత్రం ప్రస్తావించలేదు. ఈ 57 నెలల్లో ప్రతి రైతుకు రూ.65,500 చొప్పున 53.53 లక్షల మందికి రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించినా రామోజీ పచ్చ కళ్లకు కనిపించలేదు. జీఎల్టీ ఖర్చులను కూడా భరిస్తూ.. రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాకుండా జీఎల్టీ (గన్నీ బ్యాగ్లు, కూలీలు, రవాణా)ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తోంది. ధాన్యం కొనుగోలు సందర్భంలో టన్నుకు రూ.2,523 (గోనె సంచులకు రూ.1,750, కూలీలకు రూ.220, రవాణా చార్జీలకు రూ.468తో పాటు ఒకసారి వాడిన గోనె సంచులకు రూ.85), ఇతర పంట ఉత్పత్తుల సేకరణ సందర్భంలో క్వింటాకు రూ.418 చొప్పున భరిస్తోంది. -
ఒక వైపే చూడకు.. పచ్చిగా అబద్ధాలాడకు!
సాక్షి, అమరావతి: ఒకసారి తప్పు చేస్తే పొరపాటు...పదే పదే ఆ తప్పులనే పునరుక్తం చేస్తుంటే అది అలవాటు...గ్రహపాటు...దురలవాటు..అలాంటి దురలవాటును ఈనాడు ఆనవాయితీగా మార్చుకుంది..అబద్ధాలనే రాయడానికే కంకణం కట్టుకున్నానన్నట్లుగా ఉంది ఆ పత్రిక వక్రీకరణల ధోరణి...గతంలో కౌలురైతుల సాయంపై అడ్డగోలుగా వక్రీకరిస్తే అది తప్పని ...వాస్తవమేంటని గణాంకాలతో రుజువు చేసినా... మూర్ఖపు రాతలతో మళ్లీ రాసిన తప్పులనే రాస్తూ... తన అజ్ఞానాన్ని, తానేం చేసినా చెల్లిపోతుందన్న అహంకారాన్ని రామోజీ నిరూపించుకుంటున్నట్లుగా ఉంది.. ఇప్పటికే ఈనాడు దుష్టరాతల తలంపును పాఠకులు అర్థం చేసుకున్నారు..ఒక నిజాన్ని ఎన్నిసార్లు అబద్ధంగా చూపాలనుకున్నా అది అవాస్తవంగా మారదన్న వాస్తవం రామోజీకి బోధపడినట్లు లేదు... రైతులకు ఆపన్నహస్తమందిస్తున్నదే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం... ఈ రోజు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా విత్తనం నుంచి విక్రయం దాకా రైతులకు కొండంత ఊతంగా నిలుస్తూ... వ్యవసాయాన్ని పండగ చేసి చూపిస్తున్నదే జగన్ ప్రభుత్వం... రైతులే కాదు...వారితో సమానంగా కౌలు రైతుల భుజంపైనా భరోసా చెయ్యేసి... వారిని అక్కున చేర్చుకుంటున్నదే ఈ ప్రభుత్వం...ఆ నిజాన్ని అబద్ధం చేయాలని రామోజీ తహతహలాడిపోతూ.. గురువారం ఈనాడులో ..‘ధీమా లేదు...బీమా రాదు’... శీర్షికన ప్రచురించిన కథనం ఒక బోగస్. నిజాలేమిటో సవివరంగా గణాంక సహితంగా చెప్పడానికే ఈ ఫ్యాక్ట్చెక్...గతంలో ఎన్నడూ లేనివిధంగా కౌలు రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. గత ప్రభుత్వాలు ఆలోచనే చేయని పంట సాగు హక్కు దారుల చట్టం–2019ను తీసుకురావడమే కాదు..సీసీఆర్సీల ఆధారంగా భూ యజమానులతో సమానంగా కౌలు రైతులకూ సంక్షేమ ఫలాలు అందిస్తోంది. ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇస్తోంది. పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా రైతులు మద్దతు ధరకు సులువుగా అమ్ముకోగలుగుతున్నారు. వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, ఉచిత పంటల బీమా, పంట నష్టపరిహారంతో పాటు దురదృష్టవశాత్తూ చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం ఈ ప్రభుత్వం అందిస్తోంది.అబద్ధం: పెట్టుబడి సాయానికి అర్హులు కారట..వాస్తవం: బాబు హయాంలో కౌలురైతులకు కాదు కదా అటవీ, దేవదాయ భూ సాగుదారులకు పైసా విదల్చ లేదు. తద్భిన్నంగా ...నేడు దేశంలోనే తొలిసారిగా ఏపీలో మాత్రమే కౌలు రైతులకు జగన్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు అటవీ, దేవదాయ భూమి సాగుదారులకూ రూ.13,500 చొప్పున మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అందిస్తోంది.మెజార్టీ కౌలుదారులు సొంత భూమినీ కలిగి ఉన్నారు. వీరందరికీ భూ యజమానిగా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందుతోంది. సీసీఆర్సీ కార్డులు పొందిన సెంటు భూమిలేని కౌలు రైతులకు భూ యజమానులతో సమానంగా పెట్టుబడి సాయాన్ని ఈ ప్రభుత్వం ఇస్తోంది. ఇలా గత ఐదేళ్లలో 5.57 లక్షల మంది కౌలు రైతులకు రూ.751.42 కోట్లు, 4.01 లక్షల అటవీ భూములు (ఆర్వో ఎఫ్ఆర్) సాగు చేసే గిరిజనులకు రూ.541.58 కోట్లు కలిపి మొత్తం 9.58 లక్షల మందికి రూ.1293 కోట్ల మొత్తాన్ని పెట్టుబడి సహాయంగా అందించింది. అంటే ఏటా సగటున 1.92 లక్షల మందికి రూ.259 కోట్ల చొప్పున పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇచ్చింది. అయినా ఈనాడుకు మాత్రం 1.07 లక్షల మందికి మాత్రమే పెట్టుబడి సాయం అందించినట్టుగా కని్పంచింది.అబద్ధం: కౌలురైతులకు అందని సంక్షేమ ఫలాలు..వాస్తవం: కౌలుదారులకు సంక్షేమ ఫలాలు అందడం లేదనడంలో ఎంతమాత్రం వాస్తవం లేదు. వైఎస్సార్ రైతు భరోసాతో సహా భూ యజమానులకు వర్తింçపచేసే సంక్షేమ ఫలాలన్నీ భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులకూ ఈ ప్రభుత్వం వర్తింప చేస్తోంది. సీసీఆర్సీ కార్డు ఉన్నా లేకున్నా ఈ సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈనాడుకు మాత్రం సున్నా వడ్డీ రాయితీ పొందిన వారే కని్పంచలేదు. ఈ ఐదేళ్లలో 3,54,878 మందికి రూ.731.08 కోట్ల పంటల బీమా పరిహారం, 3,67,903 మందికి రూ.424 కోట్ల పంట నష్ట పరిహారం (ఇన్పుట్సబ్సిడీ) పంపిణీ చేస్తే, ఈనాడుకు మాత్రం ఐదేళ్లలో పెట్టుబడి రాయితీ పొందిన వారు 48,290 మంది, పంటల బీమా పరిహారం పొందిన వారు 88,619 మంది మాత్రమే కని్పస్తున్నారంటే ఈ ప్రభుత్వం చేసిన సాయాన్ని తక్కువ చేయాలన్న దుష్టతలంపేనని ఇట్టే అర్థమవుతోంది.అబద్ధం: కౌలు రైతులకు పంట రుణాల్లేవు..వడ్డీ రాయితీకి సున్నా..వాస్తవం: వాస్తవ సాగు దారులందరికీ పంట రుణాలివ్వాలన్న సంకల్పంతో పీఏసీఎస్లను ఆర్బీకేలతో ప్రభుత్వం అనుసంధానం చేసింది. సీసీఆర్సీ కార్డులున్న వారికి రుణాలు అందిస్తున్నారు. సీసీఆర్సీ పొందలేని కౌలు రైతులను గుర్తించి, వారితో జాయింట్ లయబలిటీ గ్రూపు (జేఎల్జీ)లను ఏర్పాటు చేస్తోంది. ఈ గ్రూపుల ద్వారా కౌలుదారులకు పెద్ద ఎత్తున రుణాలు అందేలా చేస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు 14.75 లక్షల మంది కౌలుదారులకు రూ.8,642.40 కోట్ల రుణాలను ఈ ప్రభుత్వం అందించింది. ఈనాడుకు మాత్రం ఐదేళ్లలో రుణాలు పొందిన వారు 1.68 లక్షల మందే కని్పంచారు. ఈ –క్రాప్ ఆధారంగా లక్ష లోపు పంట రుణాలు పొందిన 30 వేల మందికి రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీని జగన్ ప్రభుత్వం అందించింది. -
సౌదీ యువరాజుపై హత్యాయత్నం అంటూ కథనాలు
రియాద్: సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్పై హత్యాయత్నం జరిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని పలు అరబ్ మీడియా సంస్థలు సైతం ప్రచురించాయన్నది సదరు సోషల్ మీడియా పోస్టుల సారాంశం. అయితే ఈ విషయంపై అక్కడి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.మరోవైపు సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్పై హత్యాయత్న ప్రయత్నం జరిగినట్లు సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి. దీంతో.. ఆయన పేరు ఎక్స్ ఖాతాలోట్రెండింగ్లో కొనసాగుతోంది.కారు బాంబు ఉపయోగించి మహ్మద్ బిన్ సల్మాన్పై హత్యాయత్యానికి ప్రయత్నించగా ఆయన సురక్షితంగా బయటపడ్డారన్నది ఆ వైరల్ కథనాల సారాంశం. ఇక ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు కూడా సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్గా మారుతున్నాయి. ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఈ కథనాలకు కాసేపట్లో ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. -
Fact check: రామోజీ శాసిస్తే... టీటీడీ శిరసావహించాలట!
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం తాను చెప్పినట్లు నడుచుకోవాలని ఈనాడు రామోజీ తన బూటకపు కథనాలతో శాసిస్తున్నారు. తిరుమల కొండపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో ఆ దేవస్థానానికి పెరిగిన ఆదాయం, భక్తులకు సమకూరిన సౌకర్యాలు, సామాన్య భక్తులకు శీఘ్రంగా సర్వదర్శనం చేయించడంలోనూ వచ్చిన విశేష మార్పులు, శ్రీవాణి ట్రస్టు ద్వారా లభిస్తున్న ఆదాయంతో రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి... వంటివాటిని పక్కనబెట్టి లేనిపోని వక్రభాష్యాలతో మంగళవారం ‘వడ్డీకాసుల వాడికి వంచన సేవ’ ...శీర్షికన ఈనాడులో ఓ దౌర్భాగ్య కథనాన్ని అచ్చేశారు. ధర్మారెడ్డి డిప్యుటేషన్ కొనసాగింపు గురించి, సేవా టికెట్లలో అక్రమాలు జరిగిపోతున్నాయని, టీటీడీ సభ్యుల్లో నేరచరితులున్నారని, శ్రీ వాణి ట్రస్టులో పారదర్శకత లేదని... ఇలా మతిలేని గ్రాఫిక్స్ జోడించి మరీ పైత్యాన్ని రంగరించి కథనాన్ని రాశారు. ఈ అబద్ధాల కథనం వెనుక రామోజీ దురాలోచనను బట్టబయలు చేయడానికే ఈ ఫ్యాక్ట్చెక్.రామోజీ తాపత్రయమంతా టీడీపీ కోసమే... తిరుమల వేంకటేశ్వర స్వామిని కేంద్రంగా చేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్రంలో హిందువుల ఓట్లను టీడీపీకి అనుకూలంగా మార్చేయాలని రామోజీరావు తెగతాపత్రయపడిపోతున్నారు. గత ఆరు నెలలుగా టీటీడీ మీద రాజకీయ దాడి ప్రారంభించిన ఈ అక్షర అష్టావక్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పాత్ర పోషించడం ప్రారంభించారు. ఈనాడులో పనికిమాలిన, అవాస్తవ కథనాలను రాయడం... టీడీపీ నాయకులు దాన్నే మళ్లీ ప్రెస్మీట్లో చర్విత చరణంగా చెప్పడం, రెండు మూడు రోజుల పాటు ఈ డ్రామా నడపడం ఈ పత్రికకు నిత్యకృత్యమైంది. ఎన్నికలు దగ్గర పడటంతో గత రెండు నెలలుగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డిలపై రాజకీయ ఆరోపణలు చేస్తూ, లేనిది ఉన్నట్లు అభూత కల్పనల కథనాలను రాసిందే రాస్తున్నారు. బాబు హయాంలో ఇద్దరిని సుదీర్ఘంగా కొనసాగిస్తే రామోజీకి కనిపించలేదా?...చంద్రబాబు నాయుడి హయాంలో తిరుమల జేఈవోగా పి.బాలసుబ్రమణ్యం తొమ్మిదేళ్లు పని చేశారు. ఆయన తమకు కనీస మర్యాద ఇవ్వడం లేదని, ఆయన్ను బదిలీ చేయాలని అప్పటి తిరుపతి ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి మొదలు అనేకమంది టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు పదే పదే మొర పెట్టుకున్నా చంద్రబాబు ఆయన్ను ఎందుకు బదిలీ చేయలేదో ఈనాడు బదులివ్వగలదా? పైగా బాలసుబ్రమణ్యం తిరుమల జేఈవోగానే రిటైరయ్యేలా చంద్రబాబు ఎందుకు అవకాశం కల్పించారో రామోజీ చెప్పగలరా? టీటీడీపై అంత ప్రేమ ఉంటే ఈ విషయాన్ని ఆ రోజు ఈనాడు ఎందుకు రాయలేదు? అంతేకాదు... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తిరుమల జేఈవోగా నియమితులైన మరో అధికారి శ్రీనివాసరాజు. ఆయన లాబీయింగ్, అధికార పారీ్టకి వీరవిధేయత వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులూ కొనసాగించారు. దాదాపు పదేళ్ల పాటు తిరుమల జేఈవోగా శ్రీనివాసరాజు పనిచేశారు. అప్పుడూ చంద్రబాబును ఈనాడు ప్రశి్నంచలేదు. శ్రీనివాసరాజు అధికార పారీ్టకి అనుకూలంగా దేశ, విదేశాల్లో సైతం లాబీయింగ్ చేస్తున్నారని రామోజీరావు ఎందుకు నిలదీయలేదో చెప్పగలరా?ధర్మారెడ్డి కొనసాగింపు కేవలం భక్తుల సౌకర్యార్థమే ప్రస్తుత టీటీడీ ఈవో ధర్మారెడ్డి బాలసుబ్రమణ్యం, శ్రీనివాసరాజుల్లాగా వరుసగా తొమ్మిదేళ్లు పని చేయలేదు. వేసవిలో వరుస సెలవుల కారణంగా తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతోంది. స్వామివారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. అలాంటి సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడానికి సమర్థుడైన అధికారి అవసరం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ధర్మారెడ్డికి మరో 8 వారాల పొడిగింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇదేదో మహా అపచారమన్నట్లు ఈనాడు రాసింది. కథనం రాశాం కాబట్టి ధర్మారెడ్డికి పొడిగింపు రాదని భ్రమపడింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని, తిరుమలలో భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ధర్మారెడ్డి మరో 8 వారాలు టీటీడీలోనే కొనసాగేలా కేంద్ర ప్రభుత్వం డిప్యుటేషన్ పొడిగింపు ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని జీర్ణించుకోలేని రామోజీరావు ‘వారికి నో.. వీరికి ఎస్’ అంటూ తన కడుపుమంట కథనాన్ని ప్రచురించారు. ధర్మారెడ్డికి డిప్యుటేషన్ పొడిగింపు ఉత్తర్వులు రావడంతో ఆక్రోశం, ఆందోళన, కోపం, బాధ కలగలిపి పనికిమాలిన కథనాన్ని అచ్చేశారు.బోర్డు సభ్యుల నియామకాలపైనా వక్రపూరిత రాతలుతన రాజకీయ, ఆర్థిక, కార్పొరేట్ ప్రయోజనాల కోసం టీటీడీ ధర్మకర్తల మండలిలో సభ్యుల సంఖ్యను పెంచిందే చంద్రబాబు. ఈ నిజాన్ని ఈనాడు పొరపాటున రాయదు. తన అడుగులకు మడుగులొత్తే చంద్రబాబు నాయుడు ఈ పనిచేస్తే రామోజీరావు దృష్టిలో తప్పుకాదు. చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డిని టీటీడీ బోర్డులో మొదట నియమించింది చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఆయనను చెన్నై స్థానిక సలహామండలి చైర్మన్గా నియమిస్తే దాన్ని ఘోరంగా అభివర్ణిస్తూ ఆ కథనంలో ఈనాడు పేర్కొందిశ్రీవాణి ట్రస్టు ఆదాయమంతా ఆలయాల అభివృద్ధికే... శ్రీవాణి ట్రస్టు ఆదాయ, వ్యయాల గురించి సుమారు ఏడాది కిందటే టీటీడీ శ్వేత పత్రం ప్రకటించింది. ఈనాడు ఈ విషయాన్నీ గతంలో ప్రచురించింది. ఈ ట్రస్టుపై ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా తమను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. ఈ ట్రస్టు ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల్లో మతాంతీకరణలను నిరోధించడానికి టీటీడీ సుమారు 3 వేల ఆలయాలను నిర్మించింది. అనేక పురాతన ఆలయాల జీర్ణిద్ధరణకు నిధులు ఇచ్చింది. కేవలం వైఎస్సార్సీపీ నేతలున్న గ్రామాల్లోనే ఈ ఆలయాలు నిర్మించారని ఈనాడు ఆ కథనంలో అసత్యాలను రాసేసింది. ఈ ఆలయాల్లో దీప, ధూప నైవేద్యాల కోసం టీటీడీ ప్రతినెలా రూ. 5 వేలను అందిస్తున్న వాస్తవాన్ని ఈనాడు దాచి పెట్టింది. సేవా టికెట్లపైనా అవాస్తవాలు వైవీ సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండగా, సిఫారసు లేఖల మీద జారీచేసే సేవా టికెట్ల ధరలు పెంచి తద్వారా వీటి డిమాండ్ తగ్గించి సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో సేవా టికెట్లు జారీ చేయాలని భావించారు. ఈ విషయాన్ని సుబ్బారెడ్డి మీడియా సమావేశంలో స్పష్టంగా వివరించారు. ఈనాడు దీన్నీ వక్రీకరించి తన వక్ర బుద్ధిని ప్రదర్శించింది. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వందలు, వేల సంఖ్యలో టికెట్లు హోల్సేల్గా విక్రయించడంతో అనేక కేసులు నమోదయ్యాయి. వసతి సముదాయాల నిర్మాణాలపై అభూతకల్పనలుతిరుపతిలో ఉన్న శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల స్థానంలో కొత్త వాటిని నిర్మించాలని వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి భావించింది. ఇందుకోసం చెన్నై ఐఐటీ నిపుణులతో ఆ భవనాల పటుత్వంపై అధ్యయనం చేయించింది. యాత్రికుల వసతికి ఎక్కువ కాలం ఈ భవనాలు పనికి రావని నిపుణుల బృందం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగానే అచ్యుతం, శ్రీ పథం పేర్లతో కొత్త వసతి సముదాయాలను నిర్మించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ వసతి సముదాయంలో 1,800 మందికి మాత్రమే ఉన్న వసతి 8,200 మందికి పెంచి అధునాతన వసతులు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. రూ.600 కోట్లుగా ఉన్న ఈ నిర్మాణాల అంచనాలను రూ.460 కోట్లకు కుదించి గ్లోబల్ టెండర్లు నిర్వహించింది. టెండర్ల ప్రక్రియపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. జ్యుడీషియల్ కమిషన్ అనుమతీ తీసుకుంది. ఈనాడు తన కథనంలో ఈ వాస్తవాలను దాచి 10% కమీషన్లు తీసుకున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మీద ఆరోపణలు చేసింది. మూడేళ్లలో పూర్తయ్యే పనికి ముందే కమీషన్లు తీసుకునే విద్య రామోజీరావుకు మాత్రమే తెలిసినట్లు ఉంది. -
రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం! ఆడియో వైరల్
ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ఉపయోగించి తయారు చేస్తున్న డీప్ ఫేక్ వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులకు డీప్ ఫేక్ వీడియోలు తలనొప్పిగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాహుల్ గాంధీకి సంబంధించిన ఏఐ జనరేటెడ్ వాయిస్ క్లిప్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. అయితే రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు ఆ వాయిస్ క్లిప్ విపిస్తుంది. ఏఐ వాయిస్తో పాటు.. మ్యూజిక్, ఢిల్లీలోని ఎర్రకోట దృష్యాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆడియో క్లిప్ను కొందరు కాంగ్రెస్ మద్దతుదారులు షేర్ చేయటంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.The day is soon… on June 4… The Prime Minister will be Rahul Gandhi… pic.twitter.com/ymrLZC447q— Aaron Mathew (@AaronMathewINC) April 25, 2024 ఒకవైపు లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ.. రాహుల్ గాంధీ ప్రమాణం చేసినట్లు ఆడియో క్లిప్ వైరల్ కావటంతో నెటిజన్లు తమ నేతకు మద్దతుగా కామెంట్లు పెడుతూ వీడియో క్లిప్ షేర్ చేస్తున్నారు.‘ఆ రోజు త్వరలోనే రానుంది.. అది జూన్ 4’, ‘రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు’అని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే ఈ ఆడియో క్లిప్.. ఏఐ వాయిస్ క్లోన్ అని కొన్ని డిటెక్షన్ టూల్స్ నిర్ధారణ చేశాయి. ఆడియో, వీడియో రెండు వేరుగా చేసి.. ఫ్యాక్ట్ చేయగా ఈ క్లిప్ ఏఐ జనరేటెడ్గా తేలిందని పేర్కొంటున్నాయి. ఇది ఫేక్ ఆడియో క్లిప్ అని తేల్చాయి. ఇక.. ఇటీవల ఇదే తరహాలో కాంగ్రెస్ నేత కమల్నాథ్ ఏఐ వాయిస్ క్లోన్ క్లిప్ ఒకటి వైరల్గా మారింది. అందులో ఆయన ఆర్టికల్ 370 గురించి మాట్లాడినట్టు ఉంది. -
డిజిటల్ టెక్నాలజీకి అర్థం తెలుసా రామోజీ
పాతికేళ్ల క్రితం... » రైల్వే ప్రయాణంలో టీసీ టికెట్ చూపించమని అడిగితే... చిన్న అట్టముక్కలాంటి టికెట్ చూపించేవాళ్లం. ఇప్పుడు సెల్ ఫోన్లో టిజిటల్ కాపీ చూపిస్తున్నాం. టీసీల దగ్గర కూడా ఓ అట్ట దానికి తగిలించిన కాగితాలు ఉండేవి. దాన్లో ఉన్న పేర్లపై టిక్కులు పెట్టుకునేవారు. ఇప్పుడు వారి చేతుల్లోకి ట్యాబ్లు వచ్చాయి. » బ్యాంకుల్లో విత్డ్రాయల్కు గాని, డిపాజిట్ చేయడానికి గాని వెళ్తే పని పూర్తవడానికి ఓ పూట పట్టేది. నేడు మన చేతుల్లోకి ఏటీఎం కార్డులు వచ్చాయి. క్షణాల్లో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. డిపాజిట్ చేసుకోవచ్చు. అసలు బ్యాంకులకే వెళ్లకుండా ఈ–బ్యాంకింగ్ ద్వారా ఇంటి వద్ద నుంచే లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అసలు పాసు పుస్తకాలనే బ్యాంకులు ఇవ్వడం మానేసాయి. మన చేతిలో ఉన్న ఆ చిన్న కార్డులోనే మన వివరాలన్నీ పొందుపరిచి ఉంటాయి. ఆ కార్డు ద్వారానే మన లావాదేవీలన్నీ క్షణాల్లో తెలుసుకోవచ్చు. » ఒకప్పుడు మన వాహన రిజిస్ట్రేషన్, లైసెన్సు, ఇన్సూరెన్సు పత్రాలు కాగిత రూపంలో ఉండేవి. వాటిని ఓ పర్సులాగా బైండ్ చేయించుకునే వాళ్లం. ఇప్పుడు ఓ బెత్తెడంత డిజిటల్ ప్లాస్టిక్ కార్డు చాలు. అందులోనే మన వాహనం పుట్టుపూర్వోత్తరాలు ఉంటాయి. » వ్యవసాయ భూములు వివరాల కోసం ప్రాథమికంగా చూసేది అడంగల్–బి ఫారం. ఒకప్పుడు దీన్ని పొందాలంటే వారాలు, నెలలు పట్టేది. ఇప్పుడది మీ చేతుల్లో సెల్ ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఏ ఈ–సేవ కేంద్రానికి వెళ్లినా ప్రింట్ కూడా తీసుకోవచ్చు. గత పాతికేళ్లుగా ప్రపంచమంతా విస్తరించిన డిజిటల్ విప్లవం ద్వారా ఇవన్నీ సాధ్యమయ్యాయి. ప్రపంచగతినే మార్చేసిన ఈ సాంకేతికతను రిజిస్ట్రేషన్ల శాఖ కూడా అందిపుచ్చుకుంది. స్టాంపు పేపర్లపై జరిపే లావాదేవీలను డిజిటల్ రూపంలోకి మార్చి తన సర్వర్లో నిక్షిప్తం చేస్తుంది. దాన్నే మనకు అందిస్తుంది. అంతేగానీ అవి జిరాక్సు కాపీలు కాదు. ప్రతి డిజిటల్ కాపీపై క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే చాలు. మన ఆస్తి రిజిస్ట్రేషన్ వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఈ నూతన సాంకేతిక విధానాన్నే ఈ–స్టాంపింగ్ అంటున్నాం. ఇంత గొప్ప సాంకేతిక వ్యవస్థను వ్యతిరేకిస్తున్నది ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, అతని తాబేదారు రామోజీరావు మాత్రమే. ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి చంద్రబాబు పిచ్చి కూతలు కూస్తే... దాన్ని వ్యాప్తి చేయడానికి రామోజీ పచ్చిరాతలు రాస్తున్నాడు.సాంకేతికత అందిపుచ్చుకోవడం తప్పా గురివిందా సాంకేతికత అభివృద్ధి చెందిన కొద్దీ ప్రభుత్వ వ్యవస్థల్లో జరిగే మార్పుల్ని కూడా రామోజీ పత్రిక తప్పుదోవ పట్టిస్తూ పచ్చ పైత్యం పరాకాష్టకు చేరిందని నిరూపించుకుంటోంది. అనేక రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ–స్టాంపింగ్ విధానంలో జారీ అయ్యే స్టాంపు పత్రాలను జిరాక్స్ కాపీలని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. నాన్–జ్యుడీíÙయల్ స్టాంప్ పేపర్ల వినియోగం చాలా రాష్ట్రాల్లో తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ వివిధ రాష్ట్రాల్లో ఈ–స్టాంపింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా డిజిటల్ స్టాంపుల వినియోగం తప్పనిసరి అనే ఉద్దేశంతో ఈ–స్టాంపింగ్ వ్యవస్థను చాలా ఏళ్ల క్రితమే కేంద్రం ప్రవేశ పెట్టింది. అదే సమయంలో నాన్–జ్యుడీíÙయల్ స్టాంప్ పేపర్లను పూర్తిగా రద్దు చేయలేదు. ప్రజల్లో అవగాహన కోసం స్టాంప్ పేపర్లు, ఈ–స్టాంపింగ్ వ్యవస్థ రెండింటినీ అందుబాటులో ఉంచింది.మన రాష్ట్రంలోనూ ఏడాదిన్నరగా నేషనల్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ అనుమతించిన కామన్ సర్విస్ సెంటర్ల ద్వారా ఈ–స్టాంపులను జారీ చేస్తోంది. ఇవి జిరాక్స్ కాపీలని చెప్పడం అంటే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టడమే. ఆస్తి కొనుగోళ్ల వ్యవస్థను గతం కంటే పారదర్శకంగా చేయడాన్ని వ్యతిరేకించడమేకాకుండా సాంకేతికాభివృద్ధిని కూడా తప్పుదోవ పట్టించే స్థాయికి రామోజీ దిగజారిపోయారు.ఆన్లైన్ రిజిస్ట్రేషన్లపై తప్పుడు ప్రచారం అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్డ్ ప్రైమ్ రిజిస్ట్రేషన్ల విధానంపైనా ఈనాడు తన పైత్యపు రాతలు రాసింది. ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్లు చేసుకునే క్రమంలో కార్డ్ ప్రైమ్ సాఫ్ట్వేర్ను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అభివృద్ధి చేసింది. దీని ద్వారా వినియోగదారులు డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడకుండానే రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లోనే మోడల్ డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించింది. రిజిష్టర్ చేసుకునే ఆస్తి, వివరాలను ఎవరికివారే పూర్తి చేసుకునే డేటా ఎంట్రీ విధానం ఇందులో భాగమే. అంటే గతంలో మాదిరిగా తమ ఆస్తి డాక్యుమెంట్ను డాక్యుమెంట్ రైటర్లు కాకుండా తామే తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న డాక్యుమెంట్ను సబ్ రిజి్రస్టార్ కార్యాలయంలో రిజిష్టర్ చేసి ప్రింట్ ఇస్తారు. దీనిపైనా ఎల్లో మీడియా విష ప్రచారం చేసి రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక డాక్యుమెంట్లు ఇవ్వకుండా జిరాక్స్ పత్రాలు ఇస్తారనే దు్రష్పచారం చేస్తోంది. జిరాక్స్ పత్రాలనే ప్రచారం ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి ఎల్లో మీడియా, కొందరు డాక్యుమెంట్ రైటర్లు చేసేదే తప్ప నిజానికి అది స్టాంప్ పేపర్ల కంటే అత్యంత భద్రమైన ఆన్లైన్ విధానం. ఇటీవల కార్డ్ ప్రైమ్ అమలుకు సంబంధించి జారీ అయిన మెమోను ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలు కోసం జారీ చేసిందిగా పేర్కొంటూ దు్రష్పచారానికి తెరదీశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అధికారులు కోరుతున్నారు. -
ఆ ద్రోహం మీ బాబుదే రామోజీ
సాక్షి, అమరావతి: అన్ని వర్గాల పక్షపాతిగా వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్ సర్కారుకు వంకలు పెడుతూ అబద్ధాలు అచ్చేస్తున్న రామోజీరావు మరో అవాస్తవాన్ని మిత్ర ద్రోహం శీర్షికతో వండి వార్చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మళ్లీ వస్తే మొదటి వేటు యానిమేటర్లపైనే పడుతుందని అలవోకగా అబద్ధం ఆడేశారు. యానిమేటర్లను మోసం చేసింది చంద్రబాబేనన్న నిజాన్ని దాచిపెట్టి అప్పటి దారుణాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెట్టేశారు. పొదుపు సంఘాల డ్వాక్రా యానిమేటర్లకు ఉమ్మడి ఏపీలో 2014కు ముందు రూ. రెండువేల గౌరవ వేతనం ఉండేది. ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆ గౌరవ వేతనాన్ని నిలిపివేశారు.యానిమేటర్లును ఉద్యోగులుగా పరిగణించలేమని, జీతాలు ఇచ్చేది లేదని తెగేశారు. డ్వాక్రా సంఘాల నుంచే కొంత మొత్తం వసూలు చేసుకోవాలని కూడా సూచించారు. దీనిపై 2015లో వారు 75 రోజులు పాటు సమ్మె చేసినా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. వీరి ఆగ్రహం ఎదురు తిరుగుతుందన్న భయంతో అదే గౌరవ వేతనం అందజేస్తామంటూ 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రకటించారు. అప్పట్లో ప్రజా సంకల్పయాత్రలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని యానిమేటర్లు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.పార్టీ అధికారంలోకి వస్తే రూ.10 వేల చొప్పున వేతనం చెల్లిస్తామని జగన్ ప్రకటించారు. హామీ ఇచ్చినట్టుగానే గత ఐదు సంవత్సరాలుగా నిరాటంకంగా చెల్లిస్తున్నారు. అప్పట్లో బీమా మిత్ర, కళ్యాణ్మిత్రలు మండల కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉండేవారు. కానీ, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వైఎస్సార్ బీమా, వైఎస్సార్ కళ్యాణమస్తు పథకాలను వలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే అందిస్తున్నారు. దీన్ని కూడా తప్పుగా పేర్కొంటూ రామోజీ విషం చిమ్మారు. -
‘400 సీట్లు ఇలాగే దాటుతుంది’.. పాత వీడియో మళ్లీ వైరల్
న్యూఢిల్లీ: ఓటింగ్ సమయంలో ఓ మహిళా పోలింగ్ ఏజెంట్ ఇద్దరు మహిళలను ప్రభావితం చేస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించినదే ఈ వీడియో అంటూ వైరల్గా మారింది.ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలని సూచించే క్యాప్షన్లతో యూజర్లు వీడియోను షేర్ చేశారు. దీనిపై వార్తా ఏజెన్సీ పీటీఐ ఫాక్ట్ చెక్ చేసింది. ఇందులో ఈ వీడియా 2019 ఎన్నికల నాటిదని తేలింది. ప్రస్తుతం జరుగుతన్న ఎన్నిలకు సంబంధించిన వీడియో అంటూ తప్పుదారి పట్టిస్తూ సోషల్ మీడియాలో రీసెంట్గా షేర్ చేసినట్లు కనుగొంది.ఏప్రిల్ 23న ఓ ఫేస్బుక్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఇది ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలకు సబంధించినదని పేర్కొన్నారు. "400 సీట్లు ఇలాగే దాటుతుంది" అంటూ దానికి క్యాప్షన్ రాసుకొచ్చారు. దీనిపై ఫ్యాక్ట్ చెక్ చేపట్టిన పీటీఐ ఇది 2019 మే 18న పశ్చిమ బెంగాల్లో ఓ పోలింగ్ కేంద్రంలో తీసినదిగా తేల్చింది. -
ఆ బుర్రలో ‘సైతాన్’ తిష్ట ఫ్యాక్ట్ చెక్
రామోజీ మెదడును సైతాన్ శోధించింది. అందుకే దయ్యం పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. నిత్యం అబద్దాలు అచ్చు వేస్తూ చంద్రబాబు పాలన మొత్తం నీతివంతంగా జరిగినట్లు వక్రీకరిసు్తన్నారు. ‘పాపపు’ రాతలు రాస్తూ ప్రజల్ని ఏమార్చాలని చూస్తున్నారు. దీన్నే నిత్యం పనిగా పెట్టుకుని కల్లిబొల్లి మాటలతో అబద్ద ప్రచారం చేస్తున్నారు. ‘జీసస్’ కాలంలో ‘అబద్ద ప్రవక్తలు’ ఉండేవారు. ఇప్పుడు అచ్చు గుద్దినట్లు వారికి పదిరెట్లు ఎక్కువగా ‘ఈనాడు’ అబద్దాలను ప్రచారం చేస్తోంది. నిస్సిగ్గుగా నిజాలను తప్పులుగా రాస్తున్న రామోజీకి ప్రజాకోర్టులో ఆ ‘కరుణామయుడు’ శిక్ష వేయడం మాత్రం ఖాయం.(సాక్షి, అమరావతి) సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను ప్రకటించిన మేనిఫెస్టోను బైబిల్ అంత పవిత్రంగా భావించారు. అందుకే మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటీ చిత్తశుద్దితో అమలు చేసి చూపించారు. అంతకు ముందు మేనిఫెస్టోను చిత్తు కాగితంలా చూసిన చంద్రబాబు 600పైగా హామీలిచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదని రామోజీకి తెలియదా?. మేనిఫెస్టోను అమలు చేయని చంద్రబాబు దాన్ని టీడీపీ అధికారిక వెబ్సైట్ నుంచి కూడా తొలగించిన మాయల మరాఠీ. ఇప్పుడు జర్నలిజం విలువలకు శిలువేస్తూ రామోజీ నీతులు వల్లిస్తున్నారు.ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందిన సీఎం వైఎస్ జగన్పై రోజు ఏదో ఒకటి పచ్చి అబద్దాలతో అచ్చేస్తూ రామోజీ పైశాచికానందాన్ని పొందుతున్నారు. తాజాగా క్రైస్తవులకు టీడీపీ హయాంలో బాగా చేశారు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏమి చేయలేదంటూ.. ‘హామీలకు శిలువ’ అంటూ అడ్డగోలు అబద్దాలతో రామోజీ వార్త అచ్చేయడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.ఆరోపణ: పాస్టర్లను బెంబేలెత్తించారువాస్తవం: వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పాస్టర్లకు గౌరవ వేతనం అందించి అండగా నిలిచింది. కోవిడ్ కష్టంలోను పాస్లర్లకు నెలకు రూ.5వేలు చొప్పున అందించి సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. ఈ ప్రభుత్వం నెలకు రూ.5వేలు చొప్పున 8,427 మందికి ఇప్పటి వరకు గౌరవ వేతనంగా రూ.71.10కోట్లు అందించింది. కోవిడ్ లాక్డౌన్ సమయంలో క్రిస్టియన్లతోపాటు పాస్టర్లకు కలిపి 29,841 మందికి కోవిడ్ అసిస్టెన్సీ వన్ టైమ్ గ్రాంట్గా రూ. రూ.14.90కోట్లు అందించింది. చంద్రబాబు తన హయాంలో ఏనాడు పాస్టర్లను పట్టించుకోలేదు. అయినా చంద్రబాబు కోసం రామోజీ దాసోహం అయిపోతున్నారు.ఆరోపణ: ఆర్థిక సాయం రెట్టింపు చేస్తామనివాస్తవం: పవిత్ర జెరుసలేం యాత్రకు గత టీడీపీ ప్రభుత్వం సాయం చేసినట్టు రామోజీ మసి పూస్తున్నారు. ఆయన హయాంలో నిధులు కేటాయించినట్టు చూపించినా సాయం అందించింది నామమాత్రమే. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకం కింద వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే తక్కువ ఉన్న ప్రతి క్రైస్తవునికి రూ.60వేలు, రూ.3లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.30వేలు సాయాన్ని అందించింది. ఇప్పటివరకు 1,060 మంది లబ్ధిదారులకు రూ.591.60 లక్షలు నిధులు అందించారు.ఆరోపణ: సాయాన్ని కాదు..జాప్యాన్ని పెంచారు..వాస్తవం: గత ప్రభుత్వం సాయం చేసింది గోరంత అయినా రామోజీకి ఆనందంగా ఉంటుంది. నిరుపేద ఆడ పిల్లల పెళ్లికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ మింగుడు పడటంలేదు. వాస్తవానికి గత ప్రభుత్వం తోచినప్పుడు సాయం అందించేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా క్యాలెండర్( నిర్థిష్ట గడువు) ప్రకటించి ప్రతి మూడు నెలలకు (త్రైమాసికం) ఒకసారి పెళ్లి సాయాన్ని విడుదల చేస్తోంది. గతంలో దరఖాస్తు చేసుకోవాలంటే ఆపసోపాలు పడేవారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాయాల ద్వారా స్థానికంగా దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కలిగింది.దీంతో ఉన్న చోట నుంచే ధరఖాస్తు చేసుకోవడంతోపాటు ఆర్థిక సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలకు పొందుతున్నారు. గత ప్రభుత్వంలో బకాయిలు కాలానుగుణంగా విడుదల చేయలేదు. ఇప్పుడు వివాహం జరిగిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకుంటే మూడు నెలలకు ఒకసారి అప్పటి వరకు వచ్చిన దరఖాస్తులకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఆడ పిల్లల చదువులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో వివాహాలు చేసుకునే వారు కనీసం పదవ తరగతి విద్యార్హత ఉండాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. వారిని ఉన్నత చదువులు చదివించాలనే సీఎం వైఎస్ జగన్ ఉన్నతాశయం ఆచరణలో మంచి ఫలితాలు ఇస్తోంది.ఆరోపణ: పెళ్లి కానుక హుళక్కే..వాస్తవం: పేదల పెళ్లికి టీడీపీ ప్రభుత్వం అండగా నిలిచినట్టు రామోజీ అడ్డగోలుగా రాసేశారు. వాస్తవానికి పేద బిడ్డల పెళ్లికి సాయం అందించేలా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ‘మాస్ మ్యారేజ్’ పేరుతో ఆర్థిక సాయాన్ని అందించారు. క్రైస్తవ ఆడ బిడ్డల పెళ్లికి రూ.25వేల ఆర్థిక సాయం, కొత్త బట్టలతోపాటు పెళ్లి వస్తువులు అందించేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ పెట్టిన పథకాన్ని 2015లో ‘దుల్హాన్’ పథకంగా పేరు మార్చారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు హడావుడిగా 2018లో రూ.25వేల ఆర్థిక సాయాన్ని రూ.50వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.పెంచిన మొత్తాన్ని అందించకపోగా బకాయిలు పెట్టారు. చంద్రబాబు హయాంలో 2018 నుంచి జరిగిన 43,490 జంటల(పెళ్లిళ్లు)కు రూ.177.96 కోట్ల బకాయిలను చెల్లించలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ బకాయిలను విడుదల చేసి పేద బిడ్డలకు భరోసా ఇచ్చింది. అంతేకాకుండా ఆయా వర్గాలకు గతం కంటే రెట్టింపు చేసి మరీ సీఎం వైఎస్ జగన్ పెళ్లి సాయాన్ని అందిస్తుండటం విశేషం.ఆరోపణ: బీమా అమలులోను కుయుక్తులే..వాస్తవం: బీమా అమలు లేదంటూ రామోజీ కుయుక్తులతో కూడిన ఆరోపణలు చేశారు. వాస్తవానికి వైఎస్సార్ బీమా పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ సీఎం వైఎస్ జగన్ పేద వర్గాలకు అండగా నిలిచారు. కుటంబంలో ప్రధాన ఆధారమైన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించినా, వైకల్యానికి గురైనా ఆ కుటుంబం రోజువారీ గడవడం కష్టమని భావించి బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తోంది. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల లోపు వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు, శాశ్వత వైకల్యానికి గురైతే రూ.5లక్షలు, సహజ మరణమైతే రూ.లక్ష బీమా మొత్తాన్ని చెల్లిస్తోంది.ఆరోపణ: గ్రాంట్ ఇన్ ఎయిడ్నూ ఎగ్గొట్టారువాస్తవం: చర్చిల నిర్మాణం, ప్రహారీల ఏర్పాటుకు గత ప్రభుత్వం గొప్పగా చేసింది.. ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని రామోజీ బురదచల్లేశారు. వాస్తవానికి కొత్త చర్చిల నిర్మాణం, పాత చర్చిల మరమ్మత్తులు, పునరుద్ధరణ, అభివృద్ధి, ప్రహారీ, మరుగుదొడ్లు, మౌళిక వసతుల కోసం రూ.5 లక్షల సాయంతో పాటు శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.3 లక్షల నుంచి 5 లక్షలు చొప్పున నిధులు కేటాయించింది. ఇప్పటి వరకు 98 చర్చిలకు రూ.5.67కోట్లు నిధులు కేటాయించింది.ఐదేళ్లలో 24,304.37కోట్ల లబ్ది వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక క్రిస్టియన్ మైనార్టీలకు ఐదేళ్లలో నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందాయి. క్రిస్టియన్ మైనారిటీలకు డీబీటీ ద్వారా రూ.13,239.49కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో 11,064.88కోట్లు లబ్ధిని అందించింది. ఐదేళ్లలో మొత్తం రూ.24,304.37కోట్లు లబ్దిని చేకూర్చింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 1,82,270 మందికి రూ.416.56కోట్లు లబ్ది అందించింది. చంద్రబాబు ఓట్ల కోసం మాయ మాటలతో మభ్య పెడితే.. సీఎం జగన్ ప్రజల నమ్మకాన్ని పొందారు. -
‘క్రమం’ తప్పి బాబు ‘కక్ష’
సాక్షి, అమరావతి: అబద్దాలు అలవోకగా చెప్పడం చంద్రబాబుకే అలవాటు తప్ప ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్రెడ్డికి అవి వర్తించవు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్థీకరణ చేయకుండా మోసం చేసింది మీ చంద్రబాబే. గత చరిత్రను వదిలేసి ఇప్పుడు కళ్లు మూసుకుని రాసే రాతలు చెల్లవు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చారు.ఆ హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరించకుండా పరీశీలన చేయడానికి మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సమావేశాలతో కాలయాపన చేసి చివరికి సుప్రీం కోర్టు తీర్పు అడ్డు వస్తోందని, దానికి సాధ్యం కాదంటూ కాంట్రాక్టు ఉద్యోగులను నిలువునా వంచించింది చంద్రబాబే. ఇవేమీ రామోజీకి అప్పట్లో కనిపించలేదు.ఇప్పుడు వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ అమలు చేస్తుంటే ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల కోడ్ ముందు వరకూ జీవోలు ఇవ్వలేదంటూ మరో పచ్చి అవాస్తవాన్నీ ఈనాడు అచ్చువేసింది. అర్హత ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణకు సంబంధించి గత ఏడాది డిసెంబర్ 13నే ఆర్దికశాఖ మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేసింది. కానీ ఈనాడు మాత్రం ఎన్నికల షెడ్యూల్కు రెండు రోజులు ముందే ఉత్తర్వులు ఇచ్చినట్లు ఈనాడు మరో అబద్దాన్ని అచ్చు వేసింది.మేనిఫెస్టోనే వక్రీకరిస్తున్న రామోజీవైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫేస్టోలో అర్హత గల కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరిస్తామని పేర్కొంది తప్ప అందరినీ క్రమబద్దీకరిస్తామని చెప్పలేదు. ఎన్నికల మేనిఫేస్టోను కూడా వక్రీకరించి మరీ రామోజీ అవాస్తవాలను ప్రచురించారు. కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ఎటువంటి కసరత్తు చేయలేదు. వీలైనంత ఎక్కువ మందిని క్రమబద్దీకరించే విధంగా నిబంధనలను రూపకల్పన చేశారు.ప్రభుత్వ రంగ సంస్ధలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న వారందరినీ క్రమబద్దీకరిస్తామని ఎక్కడా ఎన్నికల మేనిఫేస్టోలోగానీ ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్.జగన్ చెప్పలేదు. వివిధ కేంద్ర పథకాల కింద పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు, ఆ పథకాల కొనసాగినంత కాలమే కొనసాగుతారు. ఈ విషయం తెలిసి కూడా ఆ ఉద్యోగులను క్రమబద్దీకరించడం లేదంటూ మరో వక్రభాష్యం చెప్పారు.1999 నుంచి 2004 మధ్య ఏకంగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు మూసేయించారు. ఇందుకోసం ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ అని ఓ విభాగాన్నే సెక్రటేరియట్లో పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను పప్పూ, బెల్లాల మాదిరిగా తన వాళ్లకు అమ్మేసుకున్నారు.ఆల్విన్, నిజాం షుగర్స్, రిపబ్లిక్ ఫోర్చ్, చిత్తూరు డెయిరీ, ప్రకాశం డెయిరీ వంటివి ఏకంగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిన చరిత్ర చంద్రబాబుది. దాని గురించి అప్పట్లో ఒక్క వార్త రాయని ఈనాడు ఇప్పుడు మేనిఫేస్టోలో చెప్పకపోయినా ప్రభుత్వ రంగ సంస్ధల ఉద్యోగులను క్రమబద్దీకరించడం లేదంటూ గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉంది.నిబంధనల ప్రకారమే క్రమబద్దీకరణచంద్రబాబు హయాంలో ఐదేళ్లు పాటు సాగదీసి గత ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ సాధ్యం కాదని చెప్పారు. వైఎస్.జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల కోడ్ కన్నా ముందే క్రమబద్ధీకరణ ప్రారంభమైంది. ఇందుకోసం అర్హులైనవారిని రెగ్యులరైజేషన్ చేసేందుకు ఆర్థికశాఖ చర్యలను చేపట్టింది. రెగ్యులరైజేషన్కు సంబంధించి మార్గదర్శకాలను ఆర్థిక శాఖ 13-12-2023న సర్క్యులర్ మెమో ద్వారా విడుదల చేసింది. దీనికి రూపొందించిన సాఫ్ట్ వేర్లో ఉద్యోగులు దరఖాస్తులను నమోదు చేసుకోవాల్సిందిగా ఆర్దిక శాఖ స్పష్టం చేసింది.సంక్రాంతి లోపు అర్హత కలిగిన ఉద్యోగులందరినీ రెగ్యులరైజేషన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అర్హులైన సుమారు పది వేల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు ప్రభుత్వం చర్యలను చేపట్టింది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో 3,000 మందికిపైగా క్రమబద్దీకరించారు. మిగతా ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. రెండు మూడు నెలల్లో ఆ ప్రకియ పూర్తి అవుతుంది. ప్రభుత్వంలో రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు పాటిస్తూనే కాంట్రాక్టు ఉద్యోగులు సర్వీసును క్రమబద్దీకరిస్తారు.ప్రభుత్వం అంటే రామోజీ సొంత జాగీరు కాదు రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు పాటించకపోవడానికి. మంజూరైన పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండాలనే నిబంధన ఇప్పుడు తెచ్చింది కాదు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయబోమని, సుప్రీం కోర్టు తీర్పు అందుకు అనుమతించదని టీడీపీ హయాంలో చంద్రబాబు అడ్డు పుల్ల వేశారు.ఎన్నికల హామీ నెరవేర్చకుండా సుప్రీం కోర్టు తీర్పు పేరుతో కాంట్రాక్టు ఉద్యోగులను మోసం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజేషన్పై ఆర్దిక మంత్రి, మానవ వనరుల మంత్రి, ఆరోగ్య, ఐటీ శాఖల మంత్రులతో 09-09-2014న జీవో 3080 ద్వారా మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసిన అప్పటి ప్రభుత్వం చివరికి చేతులెత్తేసింది.ఇప్పుడు వైఎస్ జగన్ సర్కారు న్యాయంఇప్పుడు సీఎం వైఎస్.జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు న్యాయ పరమైన చిక్కులు అధిగమించి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. ప్రభ్వుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసును పరిగణనలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని వైస్సార్సీపీ మేనిఫేస్టోలో పేర్కొంది. దీని ప్రకారం రెగ్యులరైజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది.మంత్రుల కమిటీతో పాటు సీఎస్ అధ్యక్షతన వర్కింగ్ కమిటీ ఏర్పాటైంది. మంత్రులు కమిటీ, వర్కింగ్ కమిటీ పలు సార్లు న్యాయపరమైన, చట్టపరమైన సమస్యలపై చర్చించింది. ఇందుకోసం రెగ్యులరైజేషన్పై నిషేధం విధిస్తూ 1994లో చేసిన చట్టంలో సవరణలు చేయాలని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగాలను పొందడానికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. బ్యాక్ డోర్ కాకూడదని సుప్రీంకోర్టు తీర్పు పేర్కొంది.కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఎటువంటి చిక్కులు ఎదురుకాకుండా ఉండే విధంగా న్యాయపరంగా అన్ని అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. చంద్రబాబు సుప్రీం కోర్టు తీర్పును బూచిగా చూపెట్టి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా మోసం చేస్తే జగన్ సర్కారు సుప్రీం కోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుంటూనే ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేయడానికి నిర్ణయం తీసుకుంది. -
మీ కథనమే బోగస్
సాక్షి, అమరావతి : గురివింద రామోజీ మరోసారి తన మచ్చను కప్పెట్టేసుకున్నారు. కరోనా కష్టకాలంలో సైతం రైతులకు అండగా నిలిచి, బాబు ఎగ్గొట్టిన ఉచిత విద్యుత్, ఆక్వా విద్యుత్, విత్తన, సూక్ష్మ సేద్యం, ధాన్యం సేకరణ బకాయిలను జగన్ చెల్లించిన అంశాలను విస్మరించారు. ఈ ఐదేళ్లలో రూ.1.86 లక్షల కోట్ల సాయం అందించారు. బాబు ప్రయోజనాలే లక్ష్యంగా ‘ప్రోగ్రెస్ కాదు..అంతా బోగస్’ అంటూ సీఎం వైఎస్ జగన్పై విషం కక్కిన కథనంలో వాస్తవాలివీ.ఆరోపణ: రైతు భరోసాకు కోత పెట్టేశారువాస్తవం: 2014 ఎన్నికల నాటికి ఉన్న రూ.87,612 కోట్ల రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని నమ్మబలికిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత రూ.15 వేల కోట్లతో సరిపెట్టాడు. అన్నదాత సుఖీభవ పేరిట పెట్టుబడి సాయం అందిస్తానంటూ ఏమార్చిన చంద్రబాబు ఆచరణలోకి వచ్చేసరికి రూ.1765.29 కోట్లతో మమ అనిపించాడు. ఇలా మొత్తం చెల్లించింది రూ.16,765 కోట్లే. జగన్ ప్రభుత్వం వచ్చాక హామీ కంటే మిన్నగా ఐదేళ్లలో 53.58 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.67,500 చొప్పున రూ.34,288.17 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించారు.ఆరోపణ: మూడు కోట్ల ఎకరాలకు పంటల బీమా పోయింది.వాస్తవం: బాబు పాలనలో 30.9 లక్షల మందికి రూ.3411.20 కోట్ల బీమా పరిహారం మాత్రమే దక్కింది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఈ ఐదేళ్లలో 2.04 కోట్ల మంది రైతులకు రక్షణ కల్పించారు. రైతుల వాటాతో కలిపి రూ.4406.86 కోట్లు బీమా కంపెనీలకు చెల్లించారు. ఈ ఐదేళ్లలో 54.55 లక్షల మందికి రూ.7802.08 కోట్ల పరిహారం అందించింది. గతం కంటే ఇది రూ.4390.88 కోట్లు అధికం.ఆరోపణ : వడ్డీలేని పంట రుణాలు..తూచ్వాస్తవం: ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద ఈ ఐదేళ్లలో 84.67 లక్షల మందికి రూ.2050.53 కోట్లు చెల్లించారు. ఇందులో బాబు ఎగ్గొట్టిన రూ.1180.66 కోట్ల బకాయిలున్నాయి.ఆరోపణ: కర్షకులను విపత్తులకు వదిలేశారువాస్తవం: సీఎంగా వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత రూ.2వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు చేశారు. ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్ చివర్లోనే పరిహారం అందిస్తున్నారు. తిత్లీ తుపాన్ సమయంలో చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.182.60 కోట్లతో సహా ఈ ఐదేళ్లలో రూ.3261.60 కోట్ల పరిహారం చెల్లించారు. బాబు పాలనలో రూ.2558 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టారు.ఆరోపణ: దోచుకునే వారికే మద్దతువాస్తవం: ఈ ఐదేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం 37.73 లక్షల మంది రైతుల నుంచి 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.65,313 కోట్లు చెల్లించింది. గోతాలు, కూలీలు, రవాణా ఖర్చులు(జీఎల్టీ) రూపంలో ఎమ్మెస్పీకి అదనంగా క్వింటాకు రూ.252 చెల్లిస్తోంది. రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ద్వారా ధరలు పతనమైన ప్రతీసారి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చేస్తోంది.ఆరోపణ: బాధిత రైతు కుటుంబాలకు మోసంవాస్తవం: బాబు జమానాలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల్లో తమ పార్టీ సానుభూతి పరులకు మాత్రమే పరిహారం అందేది. అందులోనూ కోతలు, ఆంక్షలుండేవి. టీడీపీ ఐదేళ్లలో 924 మంది ఆత్మహత్యలకు పాల్పడితే కేవలం 450 మందికే పరిహారం అందింది. వైఎస్ జగన్ ప్రభుత్వం పరిహారాన్ని రూ.7లక్షలకు పెంచడమే కాకుండా, నిర్ణీత గడువులోగా నేరుగా రైతు కుటుంబాలకు జమ చేస్తోంది. ఈ ఐదేళ్లలో బాబు ఎగ్గొట్టిన 474 మందితో కలిపి 1770 మందికి రూ.114.42 కోట్లు ఎక్స్గ్రేషియా చెల్లించింది.ఆరోపణ: పేరుకే వెలుగులు..రైతులకు కోతలువాస్తవం: రైతులకు పగటి పూట తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ను అందిస్తోంది. అంతరాయం లేకుండా సరఫరా చేసేందుకు రూ.1700 కోట్లు ఖర్చు చేసి ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచింది. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.8845 కోట్ల బకాయిలను చెల్లించి, ఈ ఐదేళ్లలో ఉచిత విద్యుత్ కోసం రూ.43,744 కోట్లు ఖర్చు చేసింది.ఆరోపణ: ఆక్వా కరెంట్..అంతే సంగతులువాస్తవం: పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50 చొప్పున విద్యుత్ సరఫరా చేసింది. ఆక్వాజోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు సాగు చేసే 3.34 లక్షల ఎకరాలకు ఆక్వా సబ్సిడీ అందిస్తున్నారు. ఆయా జోన్ల పరిధిలో ఉన్న కనెక్షన్లలో 95 శాతం మంది ఆక్వా సబ్సిడీ పొందుతున్నారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.340 కోట్ల బకాయిలతో పాటు ఈ 57 నెలల్లో రూ.3,497 కోట్లు ఆక్వా విద్యుత్తు సబ్సిడీ కింద ప్రభుత్వం ఖర్చు చేసింది.ఆరోపణ: పాడి రైతుకు బోనస్..తుస్వాస్తవం: ‘జగనన్న పాల వెల్లువ’ (జేపీవీ)తో పాడి రైతుల జీవితాలకు భద్రత.. భరోసా కల్పిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మిన్నగా రూ.10 నుంచి రూ.20 వరకు పాడి రైతులకు అదనంగా లబ్ధి చేకూరింది. ఈ ప్రాజెక్టు ద్వారా 4794 గ్రామాలకు చెందిన 4.19 లక్షల మందిపాడి రైతుల నుంచి 16.72 కోట్ల లీటర్ల పాలు సేకరించగా, రూ.762.89 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. మరొక వైపు మూతపడిన చిత్తూరు డెయిరీని రూ.385 కోట్ల అమూల్ పెట్టుబడులతో పునరుద్ధరిస్తున్నారు.ఆరోపణ: అటకెక్కిన ఆహార శుద్ధి పరిశ్రమలువాస్తవం: పంటలకు అదనపు విలువ జోడించేందుకు ఆర్బీకేలకు అనుబంధంగా 940 కలెక్షన్ సెంటర్స్, 340 కోల్డ్ స్టోరేజ్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 478 కలెక్షన్ సెంటర్లు, 89 కోల్డ్ రూమ్స్తో పాటు 2,905 ప్యాక్ హౌస్ల ద్వారా అదనంగా 2.44 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం పెరిగింది. రైతులకు వ్యక్తిగతంగా 1156, రైతు సంఘాలకు 164 ఫామ్ పాండ్స్ నిర్మించారు. రాయలసీమలో 217 సోలార్ డీహైడ్రేషన్ యూనిట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరొక పక్క పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. -
FACT CHECK: బడుగులను ఏవగించుకునే బాబు రామోజీకి గొప్పోడు!
ఇంట్రో... మంచి మనిషికో మాట...మంచి గొడ్డుకో దెబ్బ ...అంటారు...రామోజీ దుర్మార్గపు రాతలపై ఎన్నిసార్లు వాస్తవాల హంటర్ ఝళిపించినా బజారుస్థాయి రాతలతో పత్రికను ఆసాంతం దిగజార్చుకుంటూనే పోతున్నారు...జగన్ ప్రభుత్వ వ్యతిరేకత అనే పూనకంలో కన్నూమిన్నూగాననంతగా తప్పుడు కథనాలను అచ్చేస్తున్నారు...విచక్షణాయుత పాత్రికేయానికి మంగళం పాడేసి దుష్ట పాత్రికేయం అంటే ఎలా ఉంటుందో పాఠకలోకానికి తన రాతల్లో చూపిస్తున్నారు...అన్నీ ఏకపక్ష కథనాలు... పవిత్ర పాత్రికేయ వస్త్రాన్ని తొలగించుకుని అక్షర దిగంబర నృత్యం చేస్తున్నట్లుగా ఉంది రామోజీ తీరు...ఈ కథనాలు ఎవరు చదివినా చదవకపోయినా బాబొక్కడు చదివితే చాలు తన జన్మ ధన్యమైపోతుందన్న మూర్ఖత్వంలో బొంకుల దిబ్బపై కూర్చుని బొంకుడు కథనాలను రాస్తున్నట్లుగా ఉంది...బడుగులను ఏవగించుకున్న బాబు రామోజీ దృష్టిలో గొప్పోడు..అయిదేళ్ల పాలనలో ఎస్సీ ఎస్టీ లకు అన్ని రంగాల్లోనూ అగ్రాసనం వేసిన జగన్ అంటే మంట...మంచి చేసిన జగన్ కన్నా జనాన్ని ముంచే బాబే రామోజీకి ఆదర్శం..ఈ వికృతధోరణిని నిలువెల్లా ఒంటబట్టించుకుని మంగళవారం ’నా..నా...నా..అని బాకా...చేసిందంతా ధోకా’ శీర్షికన జగన్ ప్రభుత్వంపై రాళ్లేస్తూ...ఓ తప్పుడు కథనాన్ని జనంపైకి వదిలారు...రామోజీ బుర్ర తక్కువ రాతలకు వాస్తవాల షాక్ ఇచ్చే సమాధానాలివి...సాక్షి, అమరావతిః చంద్రబాబుకు పదవీ ప్రయోజనం కోసం రామోజీ అబద్ధాల డోలు వాయించడం మానడం లేదు. వాస్తవానికి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ధోకా ఇచ్చింది చంద్రబాబేనని తెలిసినా రామోజీ దుర్మార్గ రాతల ధోరణి మాత్రం మారడంలేదు. రాష్ట్రంలో దళిత, గిరిజనులకు విద్యా, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నవరత్నాలతో వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యమివ్వడంలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ను నిలిపింది. ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధితో పాటు అనేక విధాలుగా ఆదుకోవడంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్ద మనస్సును చాటుకుంది. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి దళిత, గిరిజనులకు సంక్షేమ పథకాలను రద్దు చేశారని, ఉపాధి అవకాశాలను దెబ్బతీశారనే తప్పుడు ప్రచారానికి ఈనాడు బరితెగించింది.పేదల అసైన్డ్ భూములను రాబందులా ఆక్రమించి ఫిలిం సిటీ కోట కట్టుకున్న రామోజీ నీతులు వల్లిస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు సర్కారు దళితులను భయపెట్టి భూములను కాజేసినా రామోజీ కళ్లప్పగించి చూశారు. వ్యవసాయ భూమి ఉన్న దళితులకు కనీసం మోటారు కనెక్షను అయినా ఇవ్వకపోయినా అది తప్పని ఏ రోజూ బాబుకు బుద్ధి చెప్పలేదు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల పేరుతో బాబు అస్మదీయులకు కాంట్రాక్టులు కట్టబెట్టినా, ఎస్సీలకు దక్కాల్సిన కార్లు బినామీల పేరుతో టీడీపీ నేతలు దక్కించుకున్నా, ఈ ఎల్లో మీడియా పెద్దకు అక్షరం రాసేందుకు మనసొప్పలేదు.రామోజీ చేసిన ఆరోపణలు ఎంత నీచమైనవో చెప్పే వాస్తవాలివి... ఆరోపణః కొత్త వైద్య కళాశాలల్లో రిజర్వేషన్ల కోత వాస్తవంః కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కొత్తగా ఎంబీబీఎస్ సీట్లను సీఎం వైఎస్ జగన్ సాధించారు. 2023–24 విద్యా సంవత్సరంలో 5 వైద్య కళాశాలలు ప్రారంభించడం ద్వారా రాష్ట్రంలో ఒక్కసారిగా 319 కన్వీనర్ కోటా సీట్లు పెరిగాయి. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే సీట్లు దక్కించుకుని లబ్ధిపొందారు. మీ బాబు అధికారంలో ఉండగా ఏనాడైనా ఈ విధంగా అట్టడుగు వర్గాల పిల్లలకు మెడికల్ సీట్లను తెచ్చిపెట్టి మేలు చేశాడా రామోజీ? ఆరోపణః అవన్నీ సంక్షోభ వసతి గృహాలు వాస్తవంః సంక్షోభంలో వసతి గృహాలు అంటూ ఈనాడు మరో వక్రీకరణకు దిగింది.వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే సోషల్ వెల్ఫేర్ స్కూళ్ల మరమ్మతుల కోసం ఇప్పటికే రూ. 64.33 కోట్లు ఖర్చు చేసింది. 39 సివిల్ వర్కుల కోసం మరో రూ.133.90 కోట్ల మొత్తాన్నీ వెచ్చించింది. ఈ భవనాలన్నీ నిర్వహణలోకి వచ్చాయి. దాదాపు రూ.318 కోట్లతో 177 స్కూళ్లలో నాడు–నేడు పనులకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది, వసతి గృహాలను ఆధునికీకరించి మౌలిక వసతులు కల్పించింది. ఆరోపణః సివిల్స్లో శిక్షణకు విముఖత, పోటీలో నిలవకుండా కుట్ర వాస్తవంః నాడు–నేడు ద్వారా స్కూళ్లన్నీ సర్వాంగ సుందరంగా మారుతున్నాయి.పోటీ పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ కోచింగ్ ప్రోగ్రామ్లను నిర్వహిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతుల్లో స్టడీ సర్కిళ్లున్నాయి. ఒక్కో స్డడీ సర్కిల్లో ఒక్కో మాదిరిగా సివిల్స్, గ్రూప్స్, బ్యాంక్ టెస్ట్లకు శిక్షణ ఇస్తున్నారు. గత ప్రభుత్వం విద్యోన్నతి పథకం కింద 9,775 మంది అభ్యర్థులను శిక్షణ కోసం ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు పంపగా , ఒక అభ్యర్థి మాత్రమే ఎంపికైనా రామోజీ ఏరోజూ రాయలేదు. ఆ పథకాన్ని సవరించి సివిల్స్ సర్వీస్ పరీక్షకు ఏపీ స్టడీ సర్కిళ్లలోనే ఇప్పుడు కోచింగ్ ఇస్తున్నారు. ఇటీవలే జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. మెయిన్స్కు అర్హత సాధిస్తే రూ.లక్ష , ఇంటర్వ్యూలకు క్వాలిఫై అయినవారికి అదనంగా రూ.50 వేల చొప్పున ప్రోత్సాహకాలను ప్రకటించి అందిస్తోంది.పేద పిల్లలు ఉన్నత స్థానాలకు పోటీ పడి ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు అమెరికా వంటి సంపన్నదేశాలకు వెళ్లేందుకు ఊతమిస్తున్న సీఎం వైఎస్ జగన్పై రామోజీ విషం కక్కుతున్నారు. ఆరోపణః విదేశీ విద్యకు కొర్రీలు వాస్తవంః గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విదేశీ విద్యా పథకంలో జరిగిన లోపాలు, అవినీతి, అక్రమాలు విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి లోపాలు, అక్రమాలకు తావులేని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని తెచ్చింది. ప్రతిభ ఉన్న విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా, ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీటు సాధించిన వారికి పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లించేలా పథకాన్ని సమున్నతంగా తీర్చిదిద్ది అమలు చేస్తోంది.అభ్యర్ధులు ఎంచుకోదగ్గ 21 కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్ఠంగా రూ.1.25 కోట్లు, ట్యూషన్ ఫీజు 100 శాతం చెల్లించేలా పథకాన్ని సమర్థంగా మార్చి ప్రభుత్వం అమలు చేస్తోంది. మిగిలిన వర్గాలకు రూ.కోటి లేదా అసలు ట్యూషన్ ఫీజు (ఏది తక్కువ అయితే అది) చెల్లిస్తోంది. ఈ స్థాయిలో విదేశీ విద్య కోసం గత ప్రభుత్వం భరోసా ఇవ్వగలిగిందా? మరి ఈనాడు ఈ పథకంపై పదేపదే ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తోందో రామోజీ పక్షపాత బుద్ధిని బట్టి ఇట్టే అర్థమవుతోంది.. ఆరోపణః స్వయం ఉపాధికి చెల్లు వాస్తవంః ఇస్త్రీ పెట్టె.. కత్తెర ఇచ్చి.. అదే స్వయం ఉపాధి పథకం అని గత టీడీపీ ప్రభుత్వం అర్భాటపు ప్రచారం చేసుకునేది. వాస్తవానికి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలను అన్ని విధాలుగా ఆదుకుని వారి జీవన ప్రమాణాలను పెంచేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశేష కృషి చేసింది.టీడీపీ హయాంలో స్వయం ఉపాధి పథకం కింద 2,02,414 మందికి రూ.2,726 కోట్లు, ఎస్టీలు 39,906 మందికి రూ.284.8 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా ద్వారా 23,27,682 మంది ఎస్సీలకు రూ.9,697.99 కోట్లు. 4,78,716 మంది ఎస్టీలకు రూ.1,895.37 కోట్ల లబ్ధి చేకూరింది. చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటుకు 6,256 మంది ఎస్సీలకు రూ.346.79 కోట్లు, 1,228 మంది ఎస్టీలకు రూ.65.90 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది.స్థిరమైన జీవనోపాధి, ఆర్థిక అభ్యున్నతి కోసం పౌర సరఫరాల సంస్థ ద్వారా 2020–21లో రాష్ట్ర ప్రభుత్వం రూ.133.67 కోట్లతో ఎస్సీ లబ్ధిదారులకు 2,300, ఎస్టీలకు 701 ఫోర్ వీలర్ మినీ ట్రక్ మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ వాహనాలను పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డోర్ డెలివరీ కోసం అందించింది.ఎన్ఎస్ఎఫ్డీసీ ద్వారా స్వయం ఉపాధి పథకంలో రూ.63.20 కోట్లతో 1,038 యూనిట్లను అమలు చేసింది. ఆరోపణః సాగుకు సెంటు భూమి ఇవ్వలేదు వాస్తవంః సాగుకు సెంటు భూమి ఇవ్వలేదని తప్పుడు రాతలు రాసిన ఈనాడు గత ప్రభుత్వం భూమి కొనుగోలు పథకానికి ఎంతమేర భూమి సేకరించిందనే విషయాన్ని రాయలేకపోయింది. దీన్నిబట్టే ఈ పథకాన్ని టీడీపీ ఎత్తేసిందనే సంగతి ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.దశాబ్దాల క్రితం భూమి కొనుగోలు కోసం ఎస్సీ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రుణాలన్నింటినీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మాఫీ చేసింది. ఆ భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించింది. ఎస్సీల జీవితాల్లో ఇది మైలు రాయిగా నిలిచిపోయింది. 22ఏ జాబితా నుంచి మినహాయింపుతో 14.223 దళిత మహిళలకు 16,213.51 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభించాయి. అసైన్ భూముల క్రమబద్ధీకరణతో 3,57,805 మందికి 5,37,719 ఎకరాలపై హక్కులు దక్కాయి. అవసరమైనప్పుడు భూములను విక్రయించడానికి ఎస్సీ మహిళా లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం పూర్తి హక్కులను కల్పించింది. ఎస్సీ మహిళా లబ్ధిదారులు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, వైఎస్ఆర్ జలకళ, పంటలబీమా సాయాన్నీ పొందే సౌలభ్యాన్నీ ఏర్పరిచింది.అసైన్డ్ భూముల డీనోటిఫికేషన్ తర్వాత, భూమి యజమానులు తమ భూములపై ఫ్రీహోల్డ్ హక్కులు పొందుతారు. పట్టా భూములతో సమానంగా తమ భూములను విక్రయించుకునే అవకాశాన్ని ప్రస్తుత ప్రభుత్వం కల్పించింది. గత ప్రభుత్వాల కంటే అత్యధికంగా ఎస్టీలకు ఏకంగా 2.47 లక్షల ఎకరాలకు పైగా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్ దేశంలోనే ఆదర్శంగా నిలిచారు. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంటి నిర్మాణాలకు గత ప్రభుత్వం ఒక్క సెంటు భూమినీ కొనుగోలు చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘పేదలందరికీ ఇళ్లు ’ కార్యక్రమంలో దళితులకు, ఎస్టీలకు బాసటగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 31.19 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు ఇస్తే , అందులో 6,36,732 మంది లబ్ధిదారులు దళిత వర్గాలకు చెందిన అక్క చెల్లెమ్మలే (మొత్తం లబ్ధిదారుల్లో 20.7 శాతం).ఆయా కుటుంబాలకు రూ.10,949 కోట్ల లబ్ధి చేకూర్చింది. వారి కోసం చేస్తున్న 4,18,646 ఇళ్ల నిర్మాణ రూపంలో మరో రూ.10,949 కోట్ల లబ్ధి చేకూరుతోంది. 1,41,496 మంది ఎస్టీ అక్కచెల్లెమ్మలు (మొత్తం లబ్ధిదారుల్లో 6 శాతం) ఉన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇంతటి లబ్ధి ఈ వర్గాలకు దక్కడం ఇదే ప్రథమం. ఇంత భారీస్థాయిలో దళితులకు ఏ ప్రభుత్వం అండగా నిలబడలేదు. ఆరోపణః బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్కు గండి వాస్తవంః ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రోత్సహించే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని నిర్వీర్యం చేసినట్టు ఈనాడు మరో వక్రీకరణకూ దిగింది. వాస్తవానికి కనీస ప్రమాణాలు పాటించని స్కూళ్లకూ బెస్ట్ అవైలబుల్ స్కీమును గత బాబు ప్రభుత్వం అమలు చేసింది.ఇప్పుడు ఆ స్కూళ్ల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువులు అందుతున్నాయి. అత్యుత్తమంగా తరగతి గదులను డిజిటలైజ్ చేస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందిస్తున్నారు. బైలింగ్యువల్ టెక్ట్స్బెక్స్, డిక్షనరీ, యూనిఫారం, షూలతో విద్యాకానుక అందిస్తున్నారు. నాడు–నేడు ద్వారా స్కూళ్లన్నీ ఆధునాతనంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే 15 వేల స్కూళ్లలో పనులు జరిగాయి. టోఫెల్ లాంటి కోర్సులనూ ప్రభుత్వం ఈ పిల్లలకు అందుబాటులోకి తెచ్చింది. పిల్లలంతా బడిలో ఉండాలనే ఏకైక ధ్యేయంతో ఎస్సీ చెందిన 8,84,131 మంది తల్లులకు రూ.15వేల చొప్పున రూ.5,335.70 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం అందించింది.2,86,379 ఎస్టీ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి ద్వారా రూ.1,714.76 కోట్లు సమకూర్చింది. జగనన్న వసతి దీవెన ద్వారా 5,06,390 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.834.96 కోట్లు జమ చేసింది. 83,04 మంది ఎస్టీలకు రూ.135.౬౬ కోట్లను జమచేసింది. జగనన్న విద్యాదీవెన ద్వారా రూ.5,93,926 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.2,409.76 కోట్లను అందించింది. 1,22,495 ఎస్టీ విద్యార్థులకు రూ.383.43 కోట్లను సమకూర్చింది. ఈ పథకాల నిధులన్నీ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవినీతికీ చోటు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ అయ్యాయి. ఆరోపణః కేంద్ర సాయానికి మోకాలడ్డు వాస్తవంః ఎస్సీ, ఎస్టీలను ఉద్ధరించడంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసింది.ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, సాయాన్ని రాబట్టడంలో గత టీడీపీ ప్రభుత్వానికంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం గణనీయమైన కృషి చేసింది. ఎస్సీ కాంపొనెంట్ అమలులో అత్యధిక మందికి లబ్ధి చేకూర్చిన జాబితాలో దేశంలోని 20 రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదికలోను స్పష్టం చేసింది. దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎస్సీ కాంపొనెంట్ ద్వారా మొత్తం 37.64 లక్షల మందికి మేలు జరిగితే అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 35.92 లక్షల మందికి లబ్ధి చేకూరడం గొప్ప రికార్డు.ఈ కోవలోనే గిరి బిడ్డలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారినీ సమాదరిస్తోంది. జిల్లాల విభజనతో గిరిజనులకు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం రెండు జిల్లాలను ఏర్పాటు చేయడం విశేషం. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు సమస్యలు ఉంటాయి కాబట్టి ఒకే కమిషన్గా ఉన్న దాన్ని వేర్వేరుగా ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారికి దన్నుగా నిలవడం గొప్ప విషయం. ----- సంక్షేమానికి ఇలా... -టీడీపీ హయాంలో ఎస్సీలు 21,43,853 మందికి రూ..8844 కోట్లు, ఎస్టీలు 9,17,488 మందికి రూ.2,611.3 కోట్లను వెచ్చించింది.-వైఎస్సార్సీపీ ప్రభుత్వం డీబీటీ ద్వారా ఎస్సీలు 1,37,72.539 మందికి రూ.45,412.12 కోట్లు, ఎస్టీలు 37,90,517 మందికి రూ.13,389.21 కోట్ల మొత్తాన్ని నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాలకే జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా 69,91,349 మంది ఎస్సీలకు రూ.23,468.91 కోట్లు, ఎస్టీలు 22,71,105 మందికి రూ.5,963.43 కోట్ల లబ్ధిని ఈ ప్రభుత్వం చేకూర్చింది. ఈ ప్రభుత్వంలోనే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మొత్తంగా ఎస్సీలు 2,07,63,888 మందికి రూ.68,881.04 కోట్లు, ఎస్టీలు 60,61,622 మందికి రూ.19,352.64 కోట్ల లబ్ధిని అందించింది. -
FactCheck: ‘అంధుడి’ సర్టిఫికెట్ అందుకోవాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై రాజ గురువు రామోజీ పదే పదే విషం కక్కుతూ చివరికి కోర్టుల్ని సైతం పక్కదారి పట్టించేలా తప్పుడు రాతలు రాస్తున్నారు. అధికారులు ఇసుకపై కోర్టులకు ఇవ్వాల్సిన నివేదికలు తనకే ఇచ్చినట్లు ఊహించుకుని ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. ‘ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే.. కృష్ణా జిల్లా గనుల శాఖాధికారి సంచలన నివేదిక’ పేరుతో రామోజీ రోత పత్రిక వాస్తవాలకు మసి పూసి పూర్తిగా వక్రీకరించి అడ్డగోలు కథనాన్ని ప్రచురించింది.నివేదికలో అంతా అక్రమాలే జరిగాయని ఒక అధికారి నివేదిక ఇచ్చారంట.. అది ఈయనగారికి చెప్పారంట? దాన్నే ఏ ఆధారం లేకుండా అబద్దాలతో అచ్చేశారు. కోర్టులకు వెళ్లాల్సిన నివేదికలు అంతకంటె ముందు రామోజీ, ఈనాడు కార్యాలయాలకు వెళుతున్నాయంటే అది నమ్మాలా? ఒకవేళ నిజంగా అలా జరిగితే రామోజీరావు కోర్టుల్ని కూడా డిక్టేట్ చేస్తున్నారా?. ఇసుక తవ్వకాలపై హైకోర్టులో దాఖలైన పిటీషన్ విచారణ జరుగుతుంటే దానిపై కోర్టును ధిక్కరించేలా అడ్డగోలు కథనాలు రాసి మరీ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.జిల్లా కలెక్టర్లు ఇసుక రీచ్లను మరోసారి పరిశీలించి సమగ్ర నివేదికను సమర్పించాలని న్యాయస్థానం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో జిల్లా గనుల శాఖ అధికారితో సహా సంబంధిత అధికారుల బృందం ఇసుక రీచ్లను సందర్శించి నివేదికలను రూపొందిస్తున్నాయి. రూపొందించాక కోర్టుకు సమర్పించనున్నారు. ఈలోపే అక్రమ తవ్వకాలు జరిగాయని ఈనాడుకు తెలిసిపోతుందా? నివేదిక తయారు కాకుండానే అందులో ఏం రాస్తారో ఊహించుకుని తన ఇష్టానుసారం వార్తలు రాస్తారా?ఈ కథనాల ద్వారా కోర్టుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడమేగా? జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో వివిధ విభాగాలకు చెందిన అధికారుల బృందం సంయుక్తంగా తనిఖీలు చేసి, సమర్పించిన నివేదికలు మార్చేందుకు వీలుంటుందా? అలా మార్చేందుకు ఎవరైనా ప్రయత్నిస్తారా? ఈనాడు మాత్రం కనీస అవగాహన లేకుండా అక్రమాలు జరిగిపోతున్నాయని ఊహించుకుని, నివేదికలో అవి జరిగాయని ఊహించుకుని కథనాలు రాసేసింది. అక్రమ తవ్వకాలపై నిరంతర పర్యవేక్షణ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరగకుండా గనులశాఖ, ఎస్ఇబి నిరంతరం పర్యవేక్షణ జరుపుతోంది.ఎక్కడ అక్రమాలు జరిగినా ఉక్కుపాదం మోపుతోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంటే ఆ విషయాన్ని కూడా పట్టించుకోకుండా అబద్ధాలు రాసింది. కేవలం రాజకీయ దురుద్ధేశంతో ప్రభుత్వంపై బుదరచల్లే పనిలో భాగంగా తరచూ ఇలాంటి కథనాలు రాస్తోంది. అందుబాటు ధరలోనే ఎక్కడా ఇసుక కొరత లేకుండా ప్రజలకు అందించడాన్ని తట్టుకోలేక అడ్డగోలుగా బురదజల్లుతున్నారు. పర్యావరణ అనుమతులతో ఇసుక ఆపరేషన్స్ రాష్ట్రంలో పారదర్శకంగా జరుగుతున్నాయి. ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఎస్ఇబిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.రాష్ట్ర సరిహద్దులు దాటి ఇసుక రవాణా జరగకుండా అన్ని చోట్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ఇంత పకడ్భందీగా ఇసుక ఆపరేషన్స్ జరుగుతుంటే దానిపై అదే పనిగా అబద్ధపు ప్రచారం చేస్తోంది. 4 వేల కోట్ల విలువ లేని ఇసుక కాంట్రాక్టులో రూ.40 వేల కోట్ల దోపిడీయా? రాష్ట్రంలో ఇసుక దోపిడీకి ఏపీఎండీసీ సహకారం అందిస్తోందంటూ టీడీపీ అధికార ప్రతినిధి ఒకరు సోమవారం కామెడీ షో నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ కోసం టెండర్లు పిలిచిన మొత్తం కాంట్రాక్ట్ విలువే రూ.4 వేల కోట్ల లోపు ఉంటే, ఏకంగా రూ.40వేల కోట్ల ఇసుక దోపిడీ ఎలా జరుగుతుందో ఆ మహా మేధావికే తెలియాలి.ఏపీఎండీసీ శరవేగంగా అమలులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రాజెక్టులు చేపట్టేందుకు అవసరమైన నిధులను బాండ్లను జారీ చేయడం ద్వారా మార్కెట్ నుంచి సేకరించేందుకు ఏపీఎండీసీ నిర్ణయించింది. బాండ్ల కోసం సేకరించే మొత్తం, దానికి చెల్లించే వడ్డీ కన్నా అధికంగా రెవెన్యూ ఆర్జించే అవకాశం ఉన్న ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టనుంది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపి వాణిజ్య ప్రయోజనం అందించే ప్రాజెక్టులనే బాండ్ల ద్వారా సేకరించిన సొమ్మును పెట్టుబడి వ్యయంగా పెట్టాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది.ఈ బాండ్ల సేకరణ ప్రక్రియ ఇంకా నడుస్తుండగానే ఏపీఎండీసీ రూ.7 వేల కోట్లకు బాండ్లు జారీ చేసిందని ఆరోపణలు చేయడం విడ్డూరమే. బాండ్ల కోసం ఆసక్తి వ్యక్తం చేసిన వారి వివరాలే తెలియకుండా, బాండ్ల జారీనే జరగకుండా, రూ.7 వేల కోట్లు ఎలా సేకరిస్తారో ఆ ప్రతినిధికే తెలియాలి? అసలు సేకరణే జరగని సొమ్మును ప్రభుత్వానికి ఎలా బదిలీ చేస్తారనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా చంద్రబాబు మెప్పు కోసం ఆరోపణలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
రామోజీ.. మీ రాతల్లోనే వ్యత్యాసం
సాక్షి, అమరావతి : రామోజీ మెదడు మోకాల్లోకి వచ్చిందేమోనన్న సందేహాలను ఈనాడు ప్రచురించే కథనాలు బలపరుస్తున్నాయి. పొదుపు సంఘాల రుణాలకు కొన్ని జిల్లాల్లో ఒక విధంగా.. మరికొన్ని జిల్లాల్లో మరో విధంగా వ్యత్యాసపు వడ్డీ రేటును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని అజ్ఞానపు రాతలతో సున్నా వడ్డీ రుణాలపై శుక్రవారం ‘అన్నా...సున్నా అంటే అంత భారమా?’ శీర్షికన ఒక తెలివితక్కువ కథనాన్ని ఈనాడు ప్రచురించింది. ఈనాడు అజ్ఞానాన్ని చూసి బ్యాంకులు, పొదుపు సంఘాల మహిళలు నవ్విపోతారన్న స్పృహ అయినా రామోజీకి లేకుండా పోయింది. బాబు 2014 ఎన్నికల ముందు తాను అధికారంలోకి వస్తే బేషరతుగా పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఘోరమైన అబద్ధమాడి, అధికారంలోకి వచ్చిన తర్వాత రూపాయి కూడా మాఫీ చేయలేదు. మాఫీ చేయకపోగా తన హయాంలో సున్నా వడ్డీ పథకాన్ని ఆపేస్తే.. సీఎం జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు పెట్టిన బకాయిలన్నిటినీ బ్యాంకులకు చెల్లించి, ఆ పథకాన్ని పునరుద్ధరించారు. బాబు చేసిన మోసానికి పొదుపు సంఘాలు నీరుకారిపోయాయి. సున్నా వడ్డీ రుణాలు అందక అల్లాడిపోయాయి. బాబు చేసిన ఈ ఘోరమైన తప్పును జగన్ సరిదిద్దడంతో బ్యాంకులు ఇప్పుడు పొదుపు సంఘాలకు రుణాలు ఇవ్వడానికి పోటీ పడుతున్నాయి. ఈ నిజాలు రామోజీ మట్టిబుర్రకు తెలియక అజ్ఞానాన్ని రంగరించి, పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాల్లో నాలుగు శాతమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని, మిగిలింది కేంద్రం ఇస్తోందని తన తెలివితక్కువ పాత్రికేయ అసమర్థతను బయటపెట్టుకుంది. తెలివి తక్కువ తనాన్ని బయటపెట్టుకున్న ఈనాడు... ‘ఆరు జిల్లాలకు ఏడు శాతం కేంద్రం రాయితీ’ అంటూ తమ కథనంలో ఓ ఉపశీర్షికను పెట్టి.. జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోందని , అందులో ఏపీ పరిధిలో ఆరు ఉమ్మడి జిల్లాలు ఉన్నట్టు ‘ఈనాడు’ రాసుకుపోయింది. ఆ ఆరు జిల్లాల్లో మాత్రమే సంఘాలు రూ. 3 లక్షల వరకు తీసుకున్న రుణానికి అక్కడ బ్యాంకులు 11 శాతం వడ్డీకి రుణాలు ఇస్తూ, కేంద్రం ఏడు శాతం రాయితీ ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం నాలుగు శాతమే భరిస్తోందంటూ ఈనాడు రాసింది. వాస్తవం ఏమిటంటే..2022 జూలై 20న ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాల మేరకు ఇప్పుడు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఏడు శాతం వడ్డీకే పొదుపు సంఘాలకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఈ రుణాలపై కేంద్రం ఏడు శాతం వడ్డీ రాయితీ ఇస్తుందన్నదే శుద్ద తప్పు. ఆ ఏడు శాతం వడ్డీ మొత్తాన్ని ఇప్పటి ప్రభుత్వమే భరిస్తోంది. ఈనాడు మరో పెద్ద శుద్ధ తప్పు రాసింది. రాష్ట్రంలో ఇప్పుడు ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఒకలా, మరో ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఇంకోలా వడ్డీ రేటుకు పొదుపు సంఘాలకు రుణాలిస్తోందని రాసింది. అలాంటి వ్యత్యాసం లేనేలేదు. ఇప్పుడు.. బ్యాంకులే మహిళలను బతిమిలాడి రుణాలిచ్చే స్థితి.. అప్పట్లో చంద్రబాబు డ్వాక్రా రుణామాఫీ హామీ ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమలు చేయని కారణంగా రాష్ట్రంలో మొత్తం పొదుపు సంఘాల్లో 18.6 శాతం సంఘాలు అంటే ప్రతి ఐదులో ఒక సంఘం బాబు మాట నమ్మి తమ రుణాలు చెల్లించకపోవడంతో వాళ్లందరూ బ్యాంకుల ఎగవేతదారులుగా ముద్ర వేయించుకున్నారు. ఇప్పుడు పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 2019 ఎన్నికల నాటికి ఉన్న అప్పు మొత్తం ప్రభుత్వమే తిరిగి చెల్లించడం వంటి కారణాలతో ఇప్పుడు మహిళలు 99.83 శాతం మంది అంటే దాదాపు అందరూ ఎప్పటికప్పుడు తమ కిస్తీలను చెల్లిస్తున్నారు. ఈ చెల్లింపులతో బ్యాంకులు పొదుపు సంఘాల మహిళలపై నమ్మకాన్ని పెంచుకున్నాయి. ఇప్పుడు ఎంత కావాలంటే అంత రుణాలు బ్యాంకులు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. 2019 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు ఐదేళ్ల కాలంలో ఏకంగా 1.73 లక్షల కోట్ల మొత్తాన్ని బ్యాంకులు పొదుపు సంఘాలకు రుణాలుగా ఇచ్చాయంటే రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల వద్ద ఎంత పరపతి పెరిగిందో అర్ధమవుతుంది. బాబు ప్రభుత్వంలో కేవలం ఒక్కో సంఘానికి గరిష్ఠంగా రూ. 10 లక్షల చొప్పున మాత్రమే బ్యాంకు రుణాలు ఇవ్వగా, ఇటీవల ఆర్బీఐ పొదుపు సంఘాలకు గరిష్ఠంగా రూ. 20 లక్షల వరకు పరిమితిని పెంచడంతో చాలా సంఘాలు ఇప్పుడు రూ. 20 లక్షల చొప్పున రుణాలు పొందుతున్నాయి. చంద్రబాబు చేసిన మోసం ఈ ప్రభుత్వానికి అంటగట్టే యత్నం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పొదుపు సంఘాల రుణాలపై మొదట పావలా వడ్డీ పథకం అమలు చేయగా, తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనే సున్నా వడ్డీ అమలులోకి వచ్చింది. విభజన అనంతరం.. 2014 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఐదేళ్ల కాలంలో ఒక రూపాయినైనా మాఫీ చేయకుండా రాష్ట్రంలో పొదుపుసంఘాల మహిళలందరినీ మోసం చేసిన చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో సున్నా వడ్డీ పథకానికీ మంగళం పాడేశారు. 2016 జూలై తర్వాత రాష్ట్రంలో పొదుపు సంఘాల రుణాలపై వడ్డీలో ఒక్క రూపాయి అయినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తిరిగి మహిళలకు చెల్లించలేదు. 2019లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు గత ఐదేళ్లుగా ఏటా ఠంచన్గా ఆర్థిక సంవత్సరం ముగియగానే ఆ ఏడాది వడ్డీ డబ్బును ప్రభుత్వం తిరిగి మహిళలకు చెల్లిస్తూ వస్తోంది. గత నాలుగేళ్లల్లో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా వారి రుణాలపై వడ్డీ రూ. 4969.05 కోట్లను ఇప్పటికే ఆయా మహిళలకు చెల్లించింది. 2023–24 సంవత్సర వడ్డీని ఇటీవల ముగిసిన మార్చి నెలాఖరు తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లోగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. వాస్తవం ఇది...దీనికి భిన్నంగా చంద్రబాబును వెనకేసుకొచ్చే రాతలు రాసింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 2016 నుంచి ఆపేసిన సున్నా వడ్డీని గొప్పగా చిత్రీకరిస్తూ.. అవన్నీ బకాయిలుగా పేర్కొంది. అప్పటి ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించలేదని , ఇదంతా ‘జగన్ మోహన్రెడ్డి నయవంచన’ అంటూ ఈనాడు వక్రీకరించింది. వరుసగా రెండన్నరేళ్ల పాటు పథకానికి నిధులు ఇవ్వకుండా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆపేస్తే వాటిని బకాయిలు ఎలా అంటారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. -
Fact check: ఓటమి భయం ప్రస్ఫుటం
సాక్షి, అమరావతి: రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం, టీడీపీ ఓటమి ఖాయమని జాతీయ చానళ్ల సర్వే ఫలితాలు విడుదలవుతున్న కొద్దీ ...ఈనాడు రామోజీరావులో పాత్రికేయ పైశాచికత్వం పెట్రేగి పోతోంది. ‘మేమంతా సిద్ధం’ యాత్రలో సీఎం వైఎస్ జగన్ పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాదరణతో రామోజీరావుకు తత్వం మెల్లగా బోధపడుతోంది. జగన్కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం తన తరం కాదన్న అక్కసుతో ఏకంగా పోలీసు వ్యవస్థనే బ్లాక్మెయిల్ చేసేందుకు బరితెగించారు. ఆ కసిలో ఈనాడు పత్రికలో ‘అదే అరాచకత్వం...అదే దౌర్జన్యం’ శీర్షికన గురువారం తాజాగా విష పూరిత కథనాన్ని ప్రచురించారు. రామోజీ రాతలకు అతీతంగా అటు ఈసీ, ఇటు పోలీసు వ్యవస్థ నిబద్ధతతో తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడం సానుకూల పరిణామం. కుట్ర బెడిసికొట్టినా ఖాకీలపై ఈనాడు కారుకూతలు... చంద్రబాబు, పురందేశ్వరిల భాగస్వామ్యంతో పోలీసు వ్యవస్థను తమకు గులాంగా చేసుకునే కుట్రలో భాగంగా ...రాష్ట్రంలో 20 మందికి పైగా ఐపీఎస్ అధికారులను మార్చేయాలని ఈనాడు లో కథనాలు రాశారు. రామోజీ పాచిక పారలేదు. డీఐజీ, ఐదుగురు ఎస్పీలను మాత్రమే ఎన్నికల కమిషన్ మార్చింది. వారి స్థానాల్లో తాము చెప్పిన వారినే నియమించాలన్నట్టుగా పచ్చ ముఠా పరోక్షంగా ఆదేశాలు జారీ చేసింది. తద్భిన్నంగా నియమావళి ప్రకారం ఎన్నికల కమిషన్ ఒక డీఐజీ, ఐదుగురు ఎస్పీలను నియమించడంతో రామోజీలో అహం దెబ్బతింది. దీంతో ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు లక్ష్యంగా దు్రష్పచార కథనాన్ని ఈనాడు ప్రచురించింది. ఈ కథనంతో చిర్రెత్తిన పోలీసు యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. ఏకంగా 19 మంది ఐపీఎస్ అధికారులు టీడీపీ, జనసేన, బీజేపీ, ఈనాడులకు వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఈనాడు తీరుపై మండిపడింది. అంతటితో బుద్ధి రాని రామోజీ కుక్కతోక వంకరన్నట్లు మరోసారి పోలీసు వ్యవస్థపై విధ్వేషం వెళ్లగక్కారు. ఈనాడులో వచి్చన ఆదేశాలనే ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పోలీసులు పాటించాలన్నట్టుగా బ్లాక్మెయిలింగ్కు దిగజారారు. టీడీపీ దౌర్జన్యాలు, దాడులను మసిపూసి మారేడు కాయ చేస్తూ వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు యతి్నంచారు. వైఎస్సార్సీపీలో ఫలానా నేతలపై ఫలానా సెక్షన్ల కింద కేసులు పెట్టండంటూ పోలీసులకు రామోజీ తన రాతల హుకుం జారీ చేశారు. పోలీసు అధికారుల బెదిరింపునకూ పన్నాగం తాజాగా ఎన్నికల విధుల్లో క్రియాశీలంగా ఉండే డీఎస్పీ, సీఐ, ఎస్సైలను బ్లాక్మెయిల్ చేయడం ద్వారా టీడీపీ అక్రమాలకు అడ్డులేకుండా చేయాలన్న పచ్చ కుట్రలో రామోజీ భాగస్వామిగా మారారు. ఇటీవల పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు దౌ ర్జన్యాలకు పాల్పడ్డ ఉదంతాలను ఈనాడు వక్రీకరిస్తూ తప్పుడు కథనం ప్రచురించింది. మాచర్ల, గన్నవరం, అద్దంకి, ఉరవకొండ, గుడివాడ తదితర నియోజకవర్గాల్లో గత వారం పదిరోజుల్లో టీడీపీ కార్యకర్తలు దౌర్జ న్యాలకు పాల్పడ్డారు. తాజాగా బుధవారం రాత్రి ఒంగోలులో ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్సార్సీపీ అ భ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఆయన కుటుంబ స భ్యులనే అడ్డుకున్నారు. అసలు ఎన్నికల ప్రచారం చే యడానికి వీల్లేదని గలాభా సృష్టించారు. ఈ ఘటనల పై స్థానిక పోలీసులకు ఫిర్యాదులు అందడంతో వారు కఠిన చర్యలు తీసుకున్నారు. టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడినా.. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రచా రా న్ని అడ్డుకున్నా పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి చూ స్తుండాలన్నట్టుగా ఈనాడు వితండవాదం చేస్తోంది. ఈసీనే శాసిస్తున్న రామోజీ రాతలు... ఏకంగా రాజ్యంగబద్ధ సంస్థ ఈసీకే పరోక్షంగా తన రాతలతో ఆదేశాలు జారీ చేస్తుండటం రామోజీరావు బరితెగింపునకు నిదర్శనం. ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఏకంగా ఎస్పీలను మారిస్తే సరిపోతుందా... మొత్తం డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను మార్చేయాలని ఈసీకే రాతల హుకుం జారీ చేశారు. అందర్నీ మారుస్తామన్నారు..ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈసీనే ఈనాడు నిలదీయడాన్ని ప్రజాస్వామ్యవాదులే ఛీత్కరించుకుంటున్నారు. ఈసీ కొత్తగా నియమించిన పల్నాడు ఎస్పీపైనా ఈనాడు విషం కక్కింది. అయినా రామోజీ రాతలకు అతీతంగా ఈసీ తన పని తాను పక్షపాత రహితంగా చేసుకుపోతోంది. -
Fact check: అబద్ధాలు రచించెన్
సాక్షి, అమరావతి: అబద్ధం.. కుళ్లు.. భయం.. వీటికి ప్యాంటూ చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం రామోజీ మాదిరే ఉంటాయేమో! జగన్ పరిపాలనలో అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు ప్రతి నెలా పింఛన్లు అందుకుంటూ ఆనందంగా ఉంటే రామోజీకి కంపరంగా ఉంది. ఈ వర్గాల్లో జగన్కు పెరుగుతున్న పరపతిని చూసి తన భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తోంది. అందుకే వాస్తవాలకు మసిపూసి ‘నవరత్నాలు – నయవంచన’ అంటూ మరో అబద్ధపు కథనాన్ని అచ్చేసేశారు. ఈ నిస్సిగ్గు పాత్రికేయాన్ని చూసి అక్షరాలు సిగ్గుతో తలదించుకోవాల్సిందేనేమో...!! పింఛనుదారుల సంఖ్య పెరిగింది జగన్ హయాంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. ఇందులో 29.51 లక్షల మంది జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొత్తగా పింఛన్లు అందుకున్నవారే. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో పింఛన్ల సంఖ్య ఏ మాత్రం పెరగలేదు. అప్పట్లో 43.11 లక్షల మంది పింఛనుదారులున్నారని లెక్కలు చెబుతున్నా 39 లక్షల మందికే చెల్లింపులు జరిపేది. నాలుగు నుంచి 5 లక్షల మందికి ఎగ్గొట్టేది. రామోజీ దగ్గర ఈ లెక్కలు లేవో.. లేక కావాలనే విస్మరించారో. ఇంటికో పింఛను విధానం బాబుదే కుటుంబానికి ఒక్కటే పింఛను విధానం జగన్ ప్రభుత్వం అమలు చేసినట్టు ఈనాడు ఓ అబద్ధాన్ని రాసింది. ఈ విధానం ప్రవేశపెట్టిందే చంద్రబాబు ప్రభుత్వం. 2014 సెప్టెంబర్ 18న ఆర్సీ నంబరు 1053 పేరిట జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఐదేళ్ల పాటు దీన్ని అమలు చేసింది. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒకే ఇంటిలో ఇద్దరు దివ్యాంగులున్నా రెండో పింఛను ఇచ్చే విధానాన్ని అమలు చేశారు. మరో వైపు.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల చొప్పున నెలనెలా పింఛన్ అందిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే కొత్తగా తీసుకొచి్చన ఈ మేలును బహుశా రామోజీ మరిచిపోయి ఉంటారు. కోతల్లేవు పింఛనుదారులలో మరణాల సంఖ్యను ఎక్కువగా చూపి పింఛన్లను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తగ్గించినట్టు ఈనాడు ఇంకో అబద్ధం ప్రచురించింది. సాధారణంగా పింఛనుదారుల్లో 0.5 శాతం మరణాలు నమోదవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇది 0.8 శాతం ఉండొచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2015 మేలో 0.8 శాతం మేర అంటే 36,406 మరణాలు నమోదు కావడంతో ఆ నెలలో పింఛన్లకు కోత పెట్టింది. అదే ఏడాది ఏప్రిల్లో 0.6 శాతం మేర అంటే 22,334 మంది పింఛనుదారులు మరణించినట్లు లెక్కలు వేసి వాటిని తొలగించింది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో వాస్తవ మరణాలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆ మేరకే తొలగింపులు ఉంటున్నాయి. గత ఆరు నెలల గణాంకాలు తీసుకుంటే ఏ నెలలోనూ ఈ సంఖ్య 20 వేలకు మించలేదు. పింఛను విధానంలో మరెన్నో మార్పులు ► గత పాలనలో పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు చాంతాడంత క్యూలో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.6 లక్షల గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీ పొ ద్దున్నే లబ్ధిదారుల గడప వద్దనే అందిస్తోంది. ► పింఛన్ల మంజూరులో లంచాలు, వివక్ష, జన్మభూమి కమిటీల పెత్తనాన్ని జగన్ కూకటివేళ్లతో పెకలించారు. కుల, మత వర్గ, పార్టీలకు అతీతంగా లంచాలు, వివక్ష, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తున్నారు. అర్హులై ఉండి ఒకవేళ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం ఇస్తూ ప్రతి ఏటా జూన్, డిసెంబర్లలో అందజేస్తున్నారు. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో లబి్ధదారుల జాబితాలు ప్రదర్శించి, సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకంగా లబి్ధదారులను ఎంపిక చేస్తున్నారు. ► గత ప్రభుత్వంలో దివ్యాంగులకు 5 ఏళ్లలో అందిన లబ్ధి కేవలం రూ.58,500. ఈ ప్రభుత్వంలో లబ్ధి రూ.1,91,000. అంటే రూ.1,32,500 అదనం. ► పెన్షన్లపై నెలవారీ సగటు వ్యయం రూ.400 కోట్ల నుంచి రూ.1968 కోట్లకు పెంపు. ► 2014–19 మధ్య గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్లపై సగటున వ్యయం రూ.400కోట్లు. -
‘కోతల’ రాతలు ఇంకెన్నాళ్లు
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో అనంతపురానికి మైక్రోసాఫ్ట్ వచ్చేసింది. హైపర్లూప్ టెక్నాలజీతో గంటలో అమరావతి నుంచి విశాఖకు వెళ్లిపోవచ్చు. దుబాయ్కు చెందిన బీఆర్షెట్టి అమరావతిలో నిర్మించిన ఆసుపత్రుల్లో ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుతోంది... ‘ఇవన్నీ గ్రాఫిక్స్ రా’ అని ప్రజలు ఎప్పుడో తేల్చేసినా ఆయన కూలీ రామోజీ మాత్రం ఆ మాయాజాలం నుంచి బయటకు రావడం లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి సర్కార్లో విదేశీ పెట్టుబడులు వాస్తవ రూపంలో కనిపిస్తున్నా కళ్లకు గంతలు కట్టేసుకుని రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రాలేదంటూ కొయ్ రాజా కొయ్ శీర్షికతో ఓ పుచ్చు కథనాన్ని ప్రచురించారు. కోవిడ్ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ సంస్థలు తమ వ్యాపార విస్తరణ కార్యక్రమాలను తగ్గించుకున్నప్పటికీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలోనే కాదు వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుంది. గడిచిన ఐదేళ్ల కాలంలో రూ.35,000 కోట్లకుపైగా విదేశీ పెట్టుబడులు వచ్చాయి. జపాన్కు చెందిన యకహోమా టైర్స్ అచ్యుపుతాపురం సెజ్లో సుమారు రూ.1929 కోట్లతో భారీ టైర్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించింది. జర్మనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద రూ.4,640 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేస్తోంది. యూరప్కు చెందిన పెట్రేగ్యాస్ కృష్ణపట్నం వద్ద రూ.600 కోట్లతో ఏర్పాటు చేసిన భారీ ఫ్లోటింగ్ ఎల్ఎన్జీ టెర్మినల్ వారం రోజుల క్రితమే వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించింది. జపాన్కు చెందిన డైకిన్ రూ.2,600 కోట్లతో ఏసీ తయారీ యూనిట్ను తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ప్రారంభించింది. టోరే ఫార్మా అక్కడే రూ.1,000 కోట్ల పెట్టుబడులను వాస్తవరూపంలో తెచ్చింది. క్యాడ్బరీస్ చాక్లెట్స్ మాండలీజ్ రూ.1,600 కోట్లతో భారీగా విస్తరిస్తోంది. అదిదాస్ బ్రాండ్తో తయారయ్యే పాదరక్షల తయారీ సంస్థ హిల్టాప్ సెజ్ పేరుతో రూ.800 కోట్లతో ఏర్పాటు చేస్తున్న యూనిట్ ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. దావోస్లో పాలకూర పప్పు.. వాస్తవాలు ఇలా కళ్లకు కనబడుతుంటే.. విదేశీ పెట్టుబడుల కోసం రాష్ట్రం చాలా సమావేశాలు, డిప్లొమాటిక్ ఔట్రీచ్లు ఏర్పాటు చేసింది కానీ ఏం సాధించలేదంటూ ఈనాడు రాసేసింది. గత ప్రభుత్వంలో దావోస్ వెళ్లిన చంద్రబాబు పాలకూర పప్పు... బెండకాయ వేపుడు ప్రసంగం ఇప్పటికీ అంతర్జాతీయంగా కామెడీ పీస్గా ఉంది. ఈ నెలలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ భారత్ పర్యటనకు వస్తున్నారు. ఆయనను ఏపీకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇక్కడ వనరులు అవకాశాలను వివరిస్తూ వార్తలు రాయాల్సింది పోయి.. నీచ రాజకీయాల బాబు కోసం స్థానిక యువత నోట్లో మట్టి కొట్టే విధంగా విషపురాతలు రాయడం తగునా? అని యువత ప్రశ్నిస్తోంది. -
Fact Check: రుచీపచీ లేని రాతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారాయి. అత్యాధునిక వైద్యం అందుతోంది. గ్రామాలు, వార్డుల చెంతకు వైద్యం చేరింది. డాక్టర్లే ప్రజల గుమ్మం వద్దకు వచ్చి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. మందులకు కొదవ లేదు. విలేజ్, వార్డు క్లినిక్లు ఏర్పడ్డాయి. ఇక ప్రధానాసుపత్రుల్లో సేవలు కార్పొరేట్ స్థాయిని తలపిస్తున్నాయి. గడచిన ఐదేళ్ల సీఎం జగన్ పాలనలో నాడు–నేడు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ బలోపేతం, డైట్ చార్జీల పెంపు ఇలా అనేక సంస్కరణలతో ప్రభుత్వాస్పత్రులు అభివృద్ధి చెందాయి. ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచి్చన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో అభిమానం వెల్లువెత్తుతోంది. ఇది రుచించని ఈనాడు రామోజికి ఆసుపత్రుల్లో అందిస్తున్న రుచికరమైన భోజనం నచ్చలేదు. తన బాబు పాలనలో రుచీపచీలేకుండా వండినా, ఆ ఐదేళ్లలో రోగుల మెనూ ఛార్జీ రూ.40 మించకపోయినా, మూడుపూటలా భోజనం అందించకపోయినా ఈ ‘పచ్చ’రోగికి వెచ్చగా ఉంది. జగన్ పాలనలో మెనూ చార్జి రూ.80కి పెంచి రుచితో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నా రామోజీకి చప్పగానే ఉంది. అందుకే ‘బటన్ల బడాయి.. రోగుల బువ్వకూ బకాయి’ అంటూ రుచీపచీలేని ఓ కథనాన్ని వండేశారు. బాబు పాలనలో ఇదీ గతీ 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఒక్కో రోగికి రూ.40తో భోజనం పెట్టేది. ఇది కూడా 2011లో నిర్దేశించిన ఖర్చు. ఇంత తక్కువ ధరతో ఎలా వీలవుతుందన్న ఆలోచన కూడా అప్పట్లో బాబుకు రాలేదు. ఆ ఐదేళ్లలో ఒక్కసారి కూడా డైట్ చార్జీల పెంపుపై బాబు దృష్టి పెట్టిన పాపాన పోలేదు. రోజులో ఒక పూట మాత్రమే కోడిగుడ్డు అందించేవారు. ఇక అప్పట్లో వైద్య సేవల గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. గుంటూరు జీజీహెచ్లో చిన్నారిని ఎలుకలు కొరికి చంపిన దుర్ఘటనే బాబు పాలనలో కునారిల్లిన వైద్య రంగానికి పెద్ద నిదర్శనం. జగన్ పాలనలో ఇదీ పురోగతి 2019లో సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో చేరిన రోగులు త్వరగా కోలుకోవాలంటే నాణ్యమైన వైద్య సేవలతో పాటు, పౌష్టికాహారం అవసరమని గుర్తించారు. ఇందులో భాగంగా రూ.80కు డైట్ చార్జీలను పెంచారు. రోగులకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అందించేందుకు ప్రత్యేకంగా ఒక మెనూ రూపొందించారు. రూ.100 తో గర్భిణులకు నిర్దేశించిన మెనూతో పాటు, అదనంగా చిక్కీలు, రాగి జావ, టీబీ, ఎయిడ్స్, మానసిక రోగులకు హై ప్రొటీన్ డైట్ను అందిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా రోగులందరికీ కోడిగుడ్డు ఇస్తున్నారు. మెనూలో మార్పులు ఇలా టీడీపీ ప్రభుత్వంలో రోగికి రోజుకు మూడు పూటలా ఆహారం కోసం రూ.40 బ్రేక్ ఫాస్ట్: బ్రెడ్, పాలు మధ్యాహ్న భోజనం: అన్నం, సాంబారు, వెజ్ కర్రీ, గుడ్డు, అరటిపండు, మజ్జిగ రాత్రి భోజనం: అన్నం, సాంబారు, వెజ్ కర్రీ, మజ్జిగ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రోగికి రోజుకు మూడు పూటలా ఆహారం కోసం రూ.80 ఖర్చు బ్రేక్ ఫాస్ట్: ఉప్మా, కిచిడీ, ఇడ్లీ, పొంగలి, కోడిగుడ్డు, పాలు మధ్యాహ్న భోజనం: అన్నం, సాంబారు, ఆకుకూర పప్పు, అరటిపండు, మజ్జిగ, వెజ్ కర్రీ, గుడ్డు రాత్రి భోజనం: అన్నం, సాంబారు, పప్పు, అరటిపండు, మజ్జిగ, వెజ్ కర్రీ, సంగటి, చపాతీ(డయాబెటీస్ రోగులకు), గుడ్డు -
పందికొక్కులు మీరు, మీ బాబే
సాక్షి, అమరావతి: పెరిగిన కార్డులను ఒప్పుకోరు. అత్యంత నాణ్యతతో ఇస్తున్న సరుకులను చూడరు. దాదాపుగా రెట్టింపైన సబ్సిడీ గానీ... ఇంటి ముంగిటకే వస్తున్న రేషన్ డెలివరీ గానీ... ఇవేవీ ‘నంగనాచి రామోజీ’కి పట్టవు! ఐదేళ్ల జగన్ ప్రభుత్వం 162.15 లక్షల టన్నుల బియ్యం, 3.28 లక్షల టన్నుల చక్కెర, 3.28 లక్షల టన్నుల కందిపప్పు పంపిణీకి రూ.28,491 కోట్లు ఖర్చు చేసినా సరే...రామోజీకి మాత్రం రేషన్ వ్యవస్థ గాడితప్పినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు హ యాంలో కేవలం 117.45 లక్షల టన్నుల బియ్యం, 3.15 లక్షల టన్నుల చక్కెర, 0.93 లక్షల టన్నుల కందిపప్పు పంపిణీకి రూ.15,356 కోట్లు ఖర్చు చేస్తే అదేదో ఘనకార్యంగా ఈనాడు కీర్తిస్తోంది. భాషా విచక్షణ కోల్పోయిన రామోజీ పరమ నీచపు రాతలు రాస్తున్నారు. ‘గాదె కింద పందికొక్కు.. కోతవేసే పప్పూ..ఉప్పు!’ అంటూ మంగళవారం ఈనాడులో రేషన్ పంపిణీపై దగాకోరుభాషను వాడారు. అప్పట్లో.. రేషన్ కోసం ఫీట్లు..అగచాట్లు... చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి 1.39 కోట్ల కార్డులు మిగిలాయి. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా నిర్దేశించి, పార్టీల కతీతంగా కార్డులు ఇవ్వడంతో రాష్ట్రంలో 1.49 కోట్లకు కార్డుల సంఖ్య పెరిగింది. చంద్రబాబు హయాంలో ముక్కిపోయిన, పురుగుల పట్టిన, రాళ్లు, నూకలు ఎక్కువగా ఉన్న బియ్యాన్ని ఇస్తే తినలేక జనం బియ్యం జోలికే పోయేవారు కాదు. జగన్ ప్రభుత్వంలో ఇప్పుడిస్తున్నది నాణ్యమైన సార్టెక్స్ బియ్యం. అప్పట్లో నాసిరకం బియ్యాన్నే లబ్ధిదారుల నుంచి బాబు బినామీలు తమ దళారులతో పదీ పరక్కు కొనుగోలు చేసి అక్రమ రవాణా ద్వారా రూ.కోట్ల ప్రజాధనాన్ని మింగేసేవారు. వాస్తవానికి జాతీయ ఆహార భద్రత చట్టం కింద 2.68 కోట్ల మందికి 1.54 లక్షల టన్నులు మాత్రమే కేంద్రం బియ్యాన్ని పంపిణీ చేస్తుంటే.. మిగిలిన 1.68 కోట్ల మంది లబి్ధదారులకు సీఎం జగన్ ప్రభుత్వం సొంత ఖర్చుతో 0.81 లక్షల టన్నుల బియ్యాన్ని అందిస్తోంది. హెరిటేజ్ కోసమే పండగ కానుకలు.. చంద్రబాబు ప్రభుత్వం పండగల పేరుతో ప్రజా పంపిణీ వ్యవస్థను హెరిటేజ్కు దోచిపెట్టడానికి.. తమ అనుయాయులు స్వాహా చేయడానికే ఉపయోగించుకుంది. నిబంధనలకు విరుద్ధంగా.. టెండర్లు లేకుండా ఇష్టమొచ్చిన ధరలకు అప్పటి ప్రభుత్వానికి సరుకులు సరఫరా చేసిన బాబు అనుయాయులు ప్రజాధనాన్ని మింగేశారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. 2013లో అప్పటి ప్రభుత్వం తెల్ల కార్డుదారులకు ఇచ్చే 9 రకాల నిత్యావసరాల్లో పామాయిల్ ఉండేది. బాబు ప్రభుత్వం దీన్ని తొలగించింది. కందిపప్పు పంపిణీ నాడు ఎన్నికల డ్రామా వాస్తవానికి టీడీపీ ప్రభుత్వం జూన్ 2014 సెపె్టంబర్ నుంచి 2015 జూలై వరకు అసలు కందిపప్పు గురించి పట్టించుకోలేదు. నవంబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2018 వరకు గిరిజన ప్రాంతాల్లో మాత్రమే కిలో రూ.40 చొప్పున పంపిణీ చేసింది. 2017–18లో ఎక్కడా పంపిణీ చేయలేదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మార్చి 2018 నుంచి రెండు కిలోల కందిపప్పు పేరిట పంచి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓపెన్ మార్కెట్లో హెచ్చురేటు ఎంత ఉన్నా, సబ్సిడీ భారాన్ని భరిస్తూ రూ.67కే అందిస్తోంది. ఇదీ.. బాబు చిరుధాన్యాల గుట్టు టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయంలో రాగులు, జొన్నలు, గోధుమ పిండి, ఉప్పు పంపిణీ ప్రారంభించింది. 1.39 కోట్ల కార్డుల్లో కేవలం 1 శాతానికే వీటినిచి్చనా... అబ్బో అంటున్నారు రామోజీ. ఎన్నికల భయంతో ప్రజలను మభ్యపెట్టేందుకు చివరి సంవత్సరంలో టీడీపీ పంపిణీ చేసిందీ చిరు ధాన్యాల్ని. జగన్ ప్రభుత్వం కరోనా తర్వాత వినియోగదారులకు పౌష్టికాహారం పంపిణీలో భాగంగా ఉత్తరాంధ్రలో రాగులు, రాయలసీమలో రాగులు, జొన్నల పంపిణీకి శ్రీకారం చుట్టింది. రేషన్లో కిలో బియ్యం బదులు కిలో రాగులు, జొన్నలు ఉచితంగా అందిస్తోంది. -
నిజాలకు పాతర.. 'అబద్ధాల జాతర'
సాక్షి, అమరావతి: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది ఈనాడు రామోజీ పరిస్థితి. కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలను దాచి, అబద్ధాల కథనాలు అచ్చోస్తే ప్రజలు నమ్మేస్తారులే అన్న భ్రమల్లోనే ఆయన ఇంకా ఉన్నారు. ఇదే భ్రమలతో ఏది రాసినా చెల్లుతుందని గుడ్డిగా నమ్ముతూ రోజుకో అంశంపై ఆయన విషం కక్కుతున్నారు. పాఠకులు ఏమనుకుంటారనే ఇంగిత జ్ఞానం, సిగ్గూఎగ్గూ లేకుండా సీఎం జగన్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. అప్పుడెప్పుడో ఈట్ క్రికెట్.. స్లీప్ క్రికెట్.. డ్రింక్ క్రికెట్ అన్న ప్రకటన మాదిరిగా రామోజీ ఏ పనిచేస్తున్నా అందులో భూతద్దం పెట్టి జగన్ వ్యతిరేకతపై రంధ్రాన్వేషణ చేస్తున్నారు. ఇందులో భాగమే ఆయన కనుసన్నల్లో సాగిన తాజా పచ్చపైత్యం ‘బందిపోటు పాలన’ కథనం. డొంకతిరుగుడు రాతలతో ఎప్పటిలాగే సీఎం జగన్ పాలనపై రామోజీ అక్షరం అక్షరంలో తన అక్కసునంతా వెళ్లగక్కారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ అక్కడక్కడ బందిపోటు పాలన కొనసాగుతోందని వ్యాఖ్యానిస్తే దాన్ని వక్రీకరించి రాష్ట్రానికి అంటగడుతూ రామోజీ బందిపోటు ‘గోల’ చేస్తూ పండగ చేసుకున్నారు. నేను సీఎం అయితే ఏ చట్టమైనా చేస్తా, కేసులు పెట్టిస్తా, జైల్లో వేస్తాం, భూములు లాక్కుంటాం అంటే కుదరదని.. అది బందిపోట్లు చేసే పనవుతుందని.. అక్కడక్కడ బందిపోటు పాలకులను చూస్తున్నామని పీవీ రమేష్ వ్యాఖ్యానిస్తే దాన్ని ఈనాడు రామోజీ సీఎం జగన్ పాలనకు ఆపాదిస్తూ పైశాచికానందం పొందారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ముసుగులో.. నిజానికి.. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ అధికారైనా రాజ్యాంగం, చట్టాల మేరకే పాలన సాగిస్తారని.. కానీ, ఏపీలో అందుకు విరుద్ధంగా పాలన సాగుతున్నట్లు పీవీ రమేష్ చెప్పారంటూ ఈనాడు తన వక్రబుద్ధిని, సీఎం జగన్పై తన అక్కసును మరోసారి బయటపెట్టుకుంది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ముసుగులో వందిమాగధులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చర్చాగోష్టి పేరుతో సీఎం జగన్ పాలనపై ఈనాడు రామోజీ విమర్శలు చేయించి వాటిని వక్రీకరించీ మరీ అనైతికంగా అచ్చువేశారు. ఏ ప్రభుత్వమైనా దోచుకుంటే అది ప్రజాస్వామ్యం కాదు బందిపోట్ల పాలన అవుతుందని సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించేందుకు ఈనాడు రామోజీ తెగ ఆరాటపడిపోయారు. మరోవైపు.. సంక్షేమం, అభివృద్ధి వేర్వేరు కాదు ఒక్కటే.. రెండూ అవసరమేనని, డబ్బులు పంచడం సులభతరమేనని, అందుకు బటన్ నొక్కితే సరిపోతుందని, అలాగే ఇంటర్నెట్ ఉంటే చాలంటూ పేదలకు నగదు బదిలీ చేయడాన్ని పీవీ రమేష్ అవహేళన చేస్తూ తన పెత్తందారీ ధోరణిని బయటపెట్టుకున్నారు. ఈనాడు రామోజీ కూడా పెత్తందారే కాబట్టి పీవీ రమేష్ మాటలు చాలా రుచికరంగా ఉండటంతో ఆయన మాటలకు అత్యధిక ప్రాముఖ్యతనిచ్చి ప్రముఖంగా అచ్చువేశారు. గురవింద గింజలా పీవీ రమేష్.. ఇక ప్రజలకు అవసరమైన సేవలందించడమే ప్రభుత్వ పాలనంటూ పీవీ రమేష్ చెప్పారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే వైఎస్ జగన్ కూడా ప్రజలకు అవసరమైన సేవలందించేందుకు గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేశారు. గత ప్రభుత్వాల తరహాలో గ్రామీణ, పట్టణ ప్రజలు తమకు అవసరమైన సేవలకు రాజకీయ నేతలు, మండల, జిల్లా కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరంలేకుండా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రజల ముంగిటికే పాలనందిస్తున్న విషయం రిటైర్ట్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్కు కనిపించడంలేదా? కనిపించినా ఈనాడు రామోజీ తనకు కావాల్సినట్లు రాసుకున్నారా? అసలు రమేష్ రిటైర్ కాగానే ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగంలో చేరిన ఆయన ఇతరులకు నీతులు చెప్పడం అంటే తన కింద నలుపు చూసుకోకపోవడమే అవుతుంది. ఈనాడు రామోజీ వంటి పెత్తందారుకు కావాల్సినట్లు మాట్లాడాలి కాబట్టి పీవీ రమేష్ కూడా ఆ ముసుగు ధరించారు. ఏ గణాంకాలు చూసినా రాష్ట్రం ప్రగతిపథంలో వెళ్తున్నట్లు కనిపించడంలేదని.. రివర్స్ ఇంజన్లో రాంగ్ రూట్లో వెళ్తున్నామనే అనుమానం కలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గణాంకాలను ఈయన చూడలేకపోతున్నట్లు ఉన్నారు. అందుకే గణాంకాలపై కూడా పెత్తందార్లకు ఏదీ కావాలో అదే ఎంపిక చేసుకుని మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మేనిఫెస్టోలోని 99 శాతం అంశాలను అమలుచేసి పేదవర్గాలకు పైసా లంచం లేకుండా నగదు బదిలీచేస్తే దాన్ని కూడా పీవీ రమేష్ తప్పుపట్టారంటే పేదలు అభివృద్ధి చెందకూడదనే ధోరణిని ఆయన కూడా చాటుకున్నారు. ఇవేవీ అభివృద్ధి కావా రమేష్..? మరోపక్క.. ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వ రంగంలో ఏకంగా 17 వైద్య కళాశాలల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడితే ఇది అభివృద్ధిగా రమేష్కు కనిపించడంలేదా? ఇదే పీవీ రమేష్ ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు నాడు–నేడు పేరుతో ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విషయాన్ని కూడా మరిచిపోయి ఇప్పుడు పెత్తందారుల పంచన చేరి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలాగే.. ► నాలుగు పోర్టులను, పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇది అభివృద్ధి కాదా పీవీ రమేష్? ► పేదలందరికీ ఇళ్లు పేరుతో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి ఇంటి నిర్మాణాలను చేపట్టారు. ఇది పేదలు అభివృద్ధి చెందడం కాదా? ► గతంలో చంద్రబాబు వ్యవసాయ రుణాలన్నీ మాఫీచేస్తానని చెప్పి రైతులను మోసం చేశారు. ఆ సమయంలో ఇదే పీవీ రమేష్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. రుణమాఫీకి తూట్లుపొడవడంలో రమేష్ పాత్ర కూడా ఉంది. ఆయన దీనిని మర్చిపోతే ఎలా? ► 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల ఆధారంగా జీఎస్డీపీలో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉందని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత చంద్రబాబు పాలన కన్నా జీఎస్డీపీ పెరుగుదల ఇప్పుడే ఎక్కువగానే ఉంది. దీనిని ఆయన ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించారా లేక రామోజీ ఇచ్చిన స్క్రిప్ట్ను బట్టీపట్టారా? ఏం పీవీ రమేష్? ► ఇక రాష్ట్ర అప్పులు కూడా ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే ఉన్నాయి. జీఎస్డీపీతో సమానంగా అప్పులున్నాయంటూ పీవీ రమేష్ పచ్చమీడియా వల్లిస్తున్న అబద్ధాలనే వల్లించారు. కార్పొరేషన్ల పేరుతో అప్పులుచేయడం తప్పుగా పీవీ రమేష్ అనడమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే. ► ఎందుకంటే.. గత ఎన్నికల ముందు ఇదే పీవీ రమేష్ కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్ధలో పనిచేస్తూ అప్పటి సీఎం చంద్రబాబు కోరిక మేరకు 2019 ఎన్నికలకు ముందు పసువు–కుంకమ పేరుతో డబ్బులు పంచేందుకు సాగునీటి ప్రాజెక్టులను తాకట్టు పెట్టి అప్పు మంజూరు చేసిన విషయం మరిచిపోతే ఎలా? ► కానీ, ఇందుకు భిన్నంగా సంక్షేమం, అభివృద్ధి సమతుల్యతతో సీఎం జగన్ ఐదేళ్ల పాలన సాగింది. -
Fact check: చదువులపై విషం కక్కిన నారా వారి కూలీ..
సాక్షి, అమరావతి: తల్లిదండ్రుల తరువాత గురువుకు ప్రత్యేక స్థానం ఇచ్చిన సంస్కృతి మనది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆ సంస్కృతిని కొనసాగిస్తూ వారికి అత్యున్నత గౌరవం ఇస్తోంది. ప్రతి అంశంలోనూ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న గురివింద రామోజీకి ఇది మింగుడు పడలేదు. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను కాపలా పెట్టింది.. వారిచేత మరుగుదొడ్లు ఊడ్పించిందని టీచర్లను అవమానించేలా కట్టుకథ అల్లేసింది. ఈ పనులు ఎక్కడ చేయించిందో మాత్రం ఆ పత్రిక రాయదు. గత ప్రభుత్వంలో పిల్లలకే కాదు.. టీచర్లకూ మరుగుదొడ్లు లేవన్న సత్యాన్ని మరుగున పరిచింది. ఈ ప్రభుత్వ హయాంలో ప్రతి స్కూల్లో స్టాఫ్కు ప్రత్యేక, ఆధునిక సదుపాయాల కల్పన ఆ పత్రికకు కనబడవు. ఒకేసారి 25 వేల మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించింది ఈ ప్రభుత్వమే. నాడు–నేడుతో 45 వేల ప్రభుత్వ బడులు అద్భుతంగా రూపురేఖలు మార్చుకున్నాయి. ఉపాధ్యాయులకు ట్యాబ్లు, బోధనకు ఐఎఫ్పీ స్క్రీన్ల ఏర్పాటు జరిగాయి. వీటిని కావాలనే విస్మరించి ఆధారాలు లేని రాతలతో ఎల్లో మీడియా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. పాఠశాల అభివృద్ధిలో టీచర్లను భాగస్వామ్యం చేయడం తప్పేనా? ఒకప్పటి బ్లాక్ బోర్డుల స్థానంలో ఇప్పుడు డిజిటల్ బోధన సాగుతోంది. విద్యార్థులు నేర్చుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు 2019–20 విద్యా సంవత్సరంలో ‘మనబడి నాడు–నేడు’ పథకానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ, జువైనల్ వెల్ఫేర్, ఫిషరీస్, రెసిడెన్షియల్ పాఠశాలల ఆధ్వర్యంలో ఉన్న మొత్తం 44,512 స్కూళ్లను ఈ పథకం కిందకు తీసుకొచ్చింది. నిరంతర నీటి సరఫరాతో టాయిలెట్లు, శుద్ధి చేసిన తాగునీరు, ఫ్యాన్లు, లైట్లు, విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదుల నిర్మాణం జరిగాయి. నాడు–నేడు మొదటి విడతలో రూ.3,669 కోట్లతో 15,715 పాఠశాలలు, రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలు బాగుపడ్డాయి. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లోను ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో 3డీ డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు. ప్రాధమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా అందిస్తున్నారు. 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఓ రికార్డు. ఇవన్నీ పూర్తి పారదర్శకత కొనసాగేందుకు తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలకు ఏం అవసరమో వారే నిర్ణయించుకునే స్వేచ్ఛను ప్రభుత్వం ఉపాధ్యాయులకు అప్పగించింది. వీటిని తప్పంటోంది ఈనాడు పత్రిక. మీ రమాదేవి స్కూల్లో.. మీ నారాయణ స్కూళ్లల్లో ఇలాగే చేయిస్తున్నారా రామోజీ. జగన్ పాలనలో ► విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కొత్త భవనాల నుంచి మరుగుదొడ్ల వరకు సమకూరాయి. ►గత నాలుగేళ్లలో అర్హత కలిగిన 25 వేల మంది టీచర్లు ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొందారు. ఇందులో నాలుగేళ్ల సర్వీసు ఉన్నవారికీ అవకాశం లభించింది. ►నాడు–నేడుతో ప్రతి బడిలోనూ 12 రకాల సదుపాయాలు. ►బోధనకు డిజిటల్ స్క్రీన్లు, స్మార్ట్ టీవీలు. ►బడుల్లోకి కొత్త ఫర్నిచర్. ►మన బడికి అంతర్జాతీయ కీర్తి. ►కోవిడ్ కష్ట కాలంలో నెలల తరబడి పాఠశాలలు మూతబడినా ప్రతి టీచర్కు ఠంచన్గా వేతనాలు. ►బడిలో పాఠాలు చెప్పడం, అభివృద్ధి పనులు పర్యవేక్షించడం తప్ప ఏ ఉపాధ్యాయుడికీ అదనపు పనులు అప్పగించలేదు. ►మరుగుదొడ్లను ప్రతిరోజు శుభ్రంగా ఉంచేందుకు సిబ్బంది ఉన్నారు. వారికి ప్రతినెలా వేతనాలు చెల్లించేందుకు ‘టాయిలెట్ మెయింటనెన్స్ ఫండ్’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ టాయిలెట్లు పరిశుభ్రంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించే బాధ్యత స్థానిక ఉపాధ్యాయులు తీసుకున్నారు. చంద్రబాబు పాలనలో ► 2000 సంవత్సరంలో అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడులో చంద్రబాబు జన్మభూమి సమావేశం ఏర్పాటు చేసి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని స్టేజీ మీదకు పిలిచారు. నూరు శాతం ఫలితాలు తేవాలని ఆదేశించారు. సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో సాధ్యం కాదని ఆ ప్రధానోపాధ్యుడు ఉన్నది ఉన్నట్టు చెప్పారు. అంతే అదే వేదికపై ఆ హెచ్ఎంను సస్పెండ్ చేశారు. ► 2003లో మంత్రిగా చేసిన నిమ్మల కిష్టప్ప గోరంట్లలో నిర్వహించిన జన్మభూమి కమిటీ సమావేశంలో టీచర్ను చెట్టుకు కట్టేసి కొట్టమని అనుచరులను రెచ్చగొట్టారు. ►మరుగుదొడ్లు లేక మహిళా టీచర్ల ఇబ్బందులు వర్ణనాతీతం. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆ అవసరం తీర్చుకునేవారు. ►జన్మభూమి సభ్యులే పేరెంట్స్ కమిటీల్లో చేరిపోయి పప్పు, బియ్యం ఎత్తుకెళితే అడిగినందుకు ఉపాధ్యాయులపై దౌర్జన్యాలు చేశారు. ►ఉపాధ్యాయులను నియమించకుండా నూరు శాతం ఫలితాలు తేవాలని ఒత్తిడి చేశారు. సాధ్యం కాదని చెబితే వెంటనే సస్పెండ్ చేసేవారు. ఈ రాతలు టీచర్లను అవమానించడమే గతంలో పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక ఉపాధ్యాయినులు పట్టణాలకే గాని మండల స్థాయి పాఠశాలలకు వచ్చేందుకు ఇష్టపడేవారు కాదు. బ్లాక్ బోర్డులౖపె రాసేందుకు సుద్దముక్క కూడా ఉండేది కాదు. ఈ ప్రభుత్వంలో పిల్లలకు, స్టాఫ్కు అన్ని సదుపాయాలు కల్పించింది కళ్లకు కనిపిస్తున్నాయి. తప్పుడు రాతలు రాసి టీచర్ల మనోభావాలను కించపరచడం దుర్మార్గం. ఉపాధ్యాయుల విధులు, సిబ్బంది విధులు ప్రత్యేకంగా ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడా ఏ టీచర్ కూడా మరుగుదొడ్లు కడిగింది లేదు. గతంలో ఎన్నికల విధులకు వెళ్లే ఉపాధ్యాయులు స్థానిక బడుల్లో ఉండలేక కష్టాలు పడేవారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ పాఠశాలకైనా నిర్భయంగా వెళ్లే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది. – గోపీకృష్ణ, ఉపాధ్యాయుడు (వైఎస్సార్టీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్) -
FACT CHECK: కల్లు తాగిన కోతి..రామోజీ
సాక్షి, అమరావతి: కల్లు తాగిన కోతిలా చిందులు వేయడం అంటే ఏమిటో ఈనాడు రామోజీరావును చూస్తుంటే తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో టీడీపీకి మరోసారి ఘోర పరాజయం తప్పదన్న బాధతో ఆయనలో పచ్చ పైత్యం ప్రకోపిస్తోంది. ఆ ఆక్రోశంతో నిద్రపట్టని రాత్రులు గడుపుతున్న రామోజీ చిత్త చాపల్యంతో మతి స్థితమితం కోల్పోతూ మత్తు రాతలు రాస్తున్నారు. ఈనాడు పత్రిక నిండా అసత్యాలతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విష ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయంటూ తాజాగా ‘తాగించారు.. తూగించారు’ శీర్షికతో కట్టుకథను అల్లారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణను సమర్థంగా అమలు చేస్తున్నా కల్లు తాగిన కోతిలా చిందులు తొక్కారు. మద్యం విక్రయాలు తగ్గించేందుకే షాక్ కొట్టేలా ధరలు.. మద్యం విక్రయాలను నిరుత్సాహపర్చడమే తమ పార్టీ విధానమని వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల సందర్భంగా స్పష్టంగా చెప్పారు. పేదలను మద్యం వ్యసనానికి దూరం చేసేందుకే ఆ నిర్ణయమన్నారు. అందుకే అధికారంలోకి వచ్చాక మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ) పన్నునూ విధించారు. దాంతో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. మరోవైపు.. మద్యం వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు విధించిన ఏఆర్ఈటీ పన్నుతో మద్యం రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వాస్తవాన్ని రామోజీ వక్రీకరిస్తూ రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగాయని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. దాచేస్తే దాగని సత్యాలు చంద్రబాబు హయాంలో ► రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్ యథేచ్ఛగా చెలరేగిపోయింది. మూడు పరి్మట్ రూమ్లు.. ఆరు బెల్ట్ దుకాణాలు అన్నట్టుగా మద్యం ఏరులై పారింది. ► ఉ. 10 నుంచి రాత్రి 11 వరకు విక్రయాలు. అనధికారికంగా 24 గంటలూ షాపులు. ► 4,380 మద్యం దుకాణాలకు అనుబంధంగా అంతే సంఖ్యలో పరి్మట్ రూమ్లకు అనుమతి. వీటికి తోడు 43 వేలకుపైగా బెల్డ్ దుకాణాలు. ► ఎమ్మార్పీ ధరల కంటే 25 శాతం వరకు అధిక ధరలకు అమ్మకాలు. ► ఏటా బార్ల సంఖ్య పెంపు. ► మొక్కుబడిగా మద్యం నాణ్యత పరీక్షలు. ఐదేళ్లలో 96,614 శాంపిల్స్ మాత్రమే సేకరణ. ► జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం 2015–16లో 34.9 శాతం పురుషులు, 0.4 శాతం మహిళలకు మద్యం అలవాటు ఉంది. జగన్ హయాంలో ► మద్యం మాఫియా అరాచకాలను ఒక్క విధాన నిర్ణయంతో తుడిచిపెట్టేశారు. ► ప్రైవేటు మద్యం దుకాణాల విధానం రద్దు. ► 2019, అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వపరం. ► మద్యం దుకాణాల వేళలు కుదింపు. ఉ.10 నుంచి రాత్రి వరకే విక్రయాలు. ► 4,380 పరి్మట్ రూమ్లు రద్దు. 43వేల బెల్ట్ దుకాణాలు పూర్తిగా తొలగింపు. మద్యం దుకాణాలు క్రమంగా తగ్గింపు. ప్రస్తుతం ఉన్నవి 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలే. ► కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. నోటిఫికేషన్ జారీ చేసి ఈ–వేలం ప్రక్రియ ద్వారా బార్ల కేటాయింపు. ► నగదు చెల్లింపులతోపాటు డిజిటల్ చెల్లింపుల విధానం. ► మద్యం నాణ్యత పరీక్షల కోసం బెవరేజస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.12.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక లేబరేటరీల ఏర్పాటు. సగటున ఏడాదికి 1,26,083 శాంపిల్స్ పరీక్ష. ► అక్రమ మద్యం అరికట్టేందుకు ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ఏర్పాటు. ► 2019–21 నాటికి ఇది పురుషులు 31.2 శాతానికి, మహిళలు 0.2 శాతానికి తగ్గింది. -
లోకేశ్ ఐటీ.. రియల్ లూటీ
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో మాటల మరాఠి చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ పాలనను ప్రజలు ఛీకొట్టారు. అరచేతిలో స్వర్గం చూపిస్తే.. జనం తమ ఓటుతో అసలు వాస్తవం చూపించారు. మన మందళగిరి చినబాబు అయితే ఏకంగా ఐటీ పేరుతో మంగళగిరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీస్తే.. గోబెల్స్కు రాజగురువు రామోజీ మాత్రం మంగళగిరిని ఏకంగా మాదాపూర్లా మార్చేయడానికి మా మాలోకం కష్టపడ్డాడని జాకీలతో పైకెత్తడానికి తెగ ఆరాటపడుతున్నారు. ‘మంగళగిరి ఐటీపై జగన్ వేటు’అంటూ ఈనాడులో విషపు రాతలు రాశారు. చంద్రబాబు హయాంలో మంగళగిరి సింగపూర్ను తలదన్నేలా బహుళ అంతస్తుల భవనాల ఐటీ కంపెనీలతో కళకళలాడేదట. కనకదుర్గ వారధి నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వరకు ఆకాశహర్మ్యాలతో హైదరాబాద్లోని మాదాపూర్ను తలపించేదట. యువత ఆనందంతో ఉద్యోగాలు చేసుకునేవారట. జగన్ వచ్చాక ఇవన్నీ మాయమయ్యాయట. ఇదీ అసలు నిజం.. ఐటీ కంపెనీలకు ప్రోత్సాహం అంటూ చంద్రబాబు పుత్రరత్నం ఇక్కడ ఐటీ మంత్రిగా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడ్డారు. ఐటీ పార్కుల పేరుతో బిల్డింగ్లు నిర్మించేసి.. ఐటీ కంపెనీలు రాకపోతే ఖాళీగా ఉన్న స్థలానికి ప్రభుత్వమే అద్దె చెల్లించేలా ప్రణాళిక వేశారు. ఇందుకోసం డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కుల పేరుతో ప్రత్యేక పాలసీ రూపొందించారు. ఈ పాలసీ ముసుగులో బాబు అనుయాయులు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ భవనాలు నిర్మించి భారీ ఎత్తున ప్రభుత్వ సొమ్మును కాజేశారు. ఈ విధంగా నిరుపయోగంగా ఉన్న భవనాలకు భారీగా అద్దెను చెల్లించాల్సి వస్తుండటంతో ఈ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. నిజంగా మంగళగిరిలో ఐటీ కంపెనీలు వచ్చి ఉంటే ఆ కంపెనీల పేర్లు రాయొచ్చు కదా రామోజీ..? ఒక్క కంపెనీ పేరు రాసే ధైర్యం లేదు. ఐటీ, ఎల్రక్టానిక్స్ రంగాల్లో మూడు లక్షల ఉద్యోగాలంటూ లోకేశ్ ప్రచారంలోని డొల్లతనం 2019 జనవరిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లోనే బయట పడింది. చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటే 2018 అక్టోబర్ నాటికి కేవలం 8,768 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో 47,908 మందికి ఐటీ రంగంలో ఉపాధి కల్పించినా అవేవీ మీకు పట్టవా రామోజీ? -
నాలుకా.. తాటిమట్టా?
సాక్షి, అమరావతి: ‘అది నేనే... ఇది నేనే... నా చేతులతోనే పోలీసులపై బురద జల్లుతా... మళ్లీ నా నోటితోనే అయ్యో పోలీసులు అంటూ మొసలి కన్నీరు కారుస్తా’ ఇదీ ఈనాడు రామోజీరావు పాత్రికేయ వికృత తాండవం. మొన్నటి వరకు రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల నుంచి కానిస్టేబుల్ వరకూ వైఎస్సార్సీపీకి ఊడిగం చేస్తున్నారంటూ యథేచ్ఛగా రాసేశారు. దీనిపై పోలీసు యంత్రాంగం తిరగబడడంతో రామోజీ వెంటనే ప్లేటు ఫిరాయించి పోలీసులను వైఎస్సార్సీపీ నేతలు వేధిస్తున్నారంటూ నిర్లజ్జగా మరో విషపు రోత రాత అచ్చేసేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన పోలీసు వ్యవస్థకు గౌరవాన్ని పెంచింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనన్న నిజాన్ని ఉద్దేశ పూర్వకంగా విస్మరించారు. చంద్రబాబు–పురందేశ్వరి కుట్రలో భాగంగా ఎన్నికల కమిషన్(ఈసీ)ను తప్పుదారి పట్టించేందుకు పోలీసులపై దు్రష్పచారం చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ ఒక డీఐజీ, అయిదుగురు ఎస్పీలను బదిలీ చేసింది. వారి స్థానంలో ఎన్నికల నియమావళి ప్రకారం కొత్త అధికారులను నియమించింది కూడా. అయినా సరే ఈనాడు రామోజీరావు శాంతించ లేదు. తనను సంప్రదించకుండా ఎస్పీలను ఈసీ నియమిస్తుందా అన్నట్టుగా పేట్రేగిపోయారు. ‘వీళ్లా ఎస్పీలు..’ అంటూ ఐపీఎస్ అధికారులను అవమానపరుస్తూ విషం కక్కారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలపై కూడా దు్రష్పచారానికి పాల్పడ్డారు. దీనిపై ఐపీఎస్ అధికారుల సంఘం, పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా స్పందించి ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీంతో రామోజీ మరో కుట్రకు తెరతీశారు. 16 ఏళ్ల డిమాండ్ 16 రోజుల్లో పరిష్కారం ♦ బ్రిటిష్ కాలంలో ప్రవేశపెట్టిన తమ యూనిఫామ్లో మార్పులు చేయాలని ఆర్మ్డ్ రిజర్వుడ్(ఏఆర్), స్పెషల్ పోలీస్(ఏపీఎస్పీ) కానిస్టేబుళ్లు 16 ఏళ్లుగా చేస్తున్న డిమాండ్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 16 రోజుల్లో పరిష్కరిస్తూ జీవో జారీ చేశారు. బ్యారెట్ టోపీ స్థానంలో పీక్ టోపీని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. కానిస్టేబుల్ నుంచి రిజ ర్వ్ ఎస్సై స్థాయివరకు నలుపు రంగు విజిల్ కార్డ్ను తీసుకువచ్చింది. ఏఆర్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు విజిల్ కార్డ్తోపాటు పోలీస్ ఎంబ్లమ్ ఉన్న నలుపు బకిల్ ఉన్న బెల్ట్ను యూనిఫామ్లో భాగం చేసింది. ♦రాష్ట్రంలో ఎస్సైలకు గెజిటెడ్ అధికారి హోదా కల్పించాలన్న దీర్ఘకాలిక డిమాండ్పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కొత్త పీఆర్సీ ద్వారా ఆ మేరకు సిఫార్సు చేయనున్నట్టుగా ప్రకటించింది. ♦పోలీసులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించేందుకు ఎస్ఎల్ఆర్, ఏఎస్ఎల్ఎస్ బిల్లులు చెల్లించేలా ఆర్థిక శాఖను ఆదేశించారు. వివిధ రిస్క్ అలవెన్స్లను మంజూరు చేయాలని ఆదేశించారు. ♦24 ఏళ్ల సర్వీసు ఇంక్రిమెంట్ను కొనసాగిస్తూనే 30 ఏళ్ల సర్విసుకు ప్రత్యేకంగా ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని నిర్ణయించింది. ♦ఏపీఎస్పీ నుంచి ఏఆర్కు మారే పోలీసులకు 6, 12, 18, 24 ఇంక్రిమెంట్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ♦అమర వీరుల కుటుంబాల పిల్లలకు ఇంజినీరింగ్, వైద్య విద్య తదితర కోర్సుల్లో 2 శాతం రిజర్వేషన్ (ఇది వరకు 0.25 శాతం) కల్పించారు. ఇతర ప్రయోజనాలు ♦ డీజీపీ, జిల్లా ఎస్పీ, పోలీస్ కమిషనరేట్లలో ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు. ♦ కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాల్లో పోలీసు ఆసుపత్రుల ఏర్పాటు. ♦ మహిళా పోలీసులకు అదనంగా ఏడాదికి 5 క్యాజువల్ లీవులు. చైల్డ్ కేర్ లీవులు 150 నుంచి 180 రోజులకు పెంపు. ♦విధి నిర్వహణలో భాగంగా రాజధానికి వచ్చే మహిళా పోలీసులకు ప్రత్యేక వసతి సౌకర్యం.. ఎల్టీసీ సౌకర్యం పునరుద్ధరణ ♦ పోలీసు అధికారుల సంఘం తొలిసారిగా రాష్ట్ర జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో భాగం. -
నిస్సిగ్గుగా నిజాలను కాలదన్ని..
చంద్రబాబు హయాంలో ఏమీ సాధించలేకున్నా... ప్రగతి పరుగులు తీసిందంటూ తప్పుడు రాతలు. పరిస్థితులు దిగజారినా... రాష్ట్రం పురోగమిస్తుందంటూ అడ్డగోలు అబద్ధాలు. ఐటీ కంపెనీ ఒక్కటైనా తీసుకురాలేకపోయినా... ఏదో సాధించారంటూనిస్సిగ్గుగా కితాబులు. ఇదీ పచ్చముసుగు వేసుకున్న రామోజీ పత్రికలో నిత్యం అచ్చవుతున్న అసత్య కథనాల తీరు. అదే జగన్ హయాంలో ఎంత ఉన్నతంగా ఎదిగినా... ఏమీలేదంటూ కబోది వ్యాఖ్యానాలు. కళ్లముందే దానికి సంబంధించిన రుజువులున్నా... దాచిపెట్టి అడ్డగోలు రోతలు. అవాస్తవాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ... జనానికి ఏమీ తెలియదులే అన్న అహంకార ధోరణి. ఇదీ రోజూ ఈనాడులో వండివారుస్తున్న అబద్ధాలు. గడచిన ఐదేళ్లలో ఐటీరంగం రాష్ట్రంలో అభివృద్ధి సాధిస్తే ‘కల్పతరువును కాలదన్నారు’ అంటూ అభాండాలు వేసేశారు. వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం... సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా ఐటీ రంగం వేగంగా విస్తరిస్తోంది. కరోనా వంటి విపత్కర పరిస్ధితుల్లో అంతర్జాతీయంగా ఐటీ రంగం కుదేలైనా రాష్ట్రంలో ఆ సమస్య ఎదురుకాలేదు. బహుళజాతి సంస్థలైన ఇన్ఫోసిస్,విప్రో,భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ వంటి సంస్థలు విశాఖలో డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయగా, రాండ్స్టాండ్ వంటి అంతర్జాతీయ సంస్థలు విశాఖ కేంద్రంగా కార్యకలాపాలను ప్రారంభించాయి. రాష్ట్రానికి 65కు పైగా కొత్త కంపెనీలు రాగా విశాఖలో డబ్ల్యూఎన్ఎస్, పల్సస్ గ్రూపులు భారీగా విస్తరించాయి. టెక్ మహీంద్రా విశాఖ నుంచి తన కార్యకలాపాలను విజయవాడకు విస్తరించింది. ‘ఐటీకి పితామహుడిని నేనే... సైబర్బాద్ను నేనే సృష్టించా...’ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు పాలనలో విశాఖకు వచ్చిన ఐటీ దిగ్గజం ఒక్కటంటే ఒక్కటైనా లేదు. ఆయన సీఎం పదవి ముగిసేనాటికి రాష్ట్రంలో ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 27,643 అయితే ఇప్పు డు ఆ సంఖ్య 75,551కు చేరింది. చంద్రబాబు దిగిపోయే నాటికి ఉన్న ఐటీ ఉద్యోగుల్లో సగంమందికి పైగా దివంగత నేత ముందుచూపుతో విశాఖ, కాకినాడ, విజయవాడల్లో అభివృద్ధి చేసిన∙ఐటీ పార్కుల్లో పనిచేస్తున్నవారే. కానీ ప్రస్తుత వైఎస్ జగన్ హయాంలో ఐటీ రంగంలో 47,908 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించినా కళ్లకు గంతలు కట్టుకున్న రామోజీకి అవేవీ కనిపించడం లేదు. పైగా ప్రజలను తప్పుదారి పట్టించేలా ఐటీ పాలసీ తుస్ అంటూ గురువారం ఒక అబద్ధాన్ని వండివార్చారు. తెలంగాణతో పోలికెందుకు రామోజీ... 2014–19 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి తీసుకువచ్చిన ఒక్క కంపెనీ పేరు కూడా ఆ కథనంలో రాసుకోలేకపోయారు. ఎంతసేపూ ప్రస్తుత ప్రభుత్వంపై విషం చిమ్మాలన్నదే వారి దుగ్ధ. అందుకే పొరుగు రాష్ట్రం తెలంగాణతో పోలుస్తూ అబద్దాలు అచ్చేశారు. బాబు పాలనలో తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంటే ఆయన ఎందుకు ఉద్ధరించడానికి కృషి చేయలేదు? ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు నాయుడు వల్లే కదా విశాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కేవలం హైదరాబాద్ను మాత్రమే ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలువునా ముంచేసిన విషయం రాష్ట్ర ప్రజలు మరచిపోయారనుకుంటున్నారా? రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కేవలం అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చూపించి ఐటీ రంగాభివృద్ధిని గాలికి వదిలేసిన విషయం ఇక్కడి యువత గమనించలేదనుకుంటున్నారా? పైగా ఇప్పుడు ఐటీ రంగంలో విశాఖ పురోగమిస్తుంటే తప్పుడు కథనాలతో జనాన్ని ఏమార్చడానికి యత్నిస్తారా? నాడు ప్రచారం... నేడు ప్రోత్సాహం... చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఇంక్యుబేషన్ సెంటర్ పేరుతో ప్రచారానికే పరిమితం చేసి స్టార్టప్లలో రాష్ట్రం చతికిలబడితే వైఎస్ జగన్ ప్రభుత్వం స్టార్టప్ల ప్రోత్సాహానికి అనేక చర్యలు చేపట్టింది. స్టార్టప్లకు మెంటార్షిప్, ఫండింగ్, ఇండస్ట్రీ కనెక్ట్లతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలి నాలుగో తరం పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 4కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ‘‘కల్పతరువు’’ పేరిట విశాఖలో ఏర్పాటు చేసింది. దీంతోపాటు నాస్కామ్ సహాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల స్టార్టప్ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను కూడా విశాఖలో ఏర్పాటు చేసింది. ఆంధ్రా యూనివర్సిటీలో ఓ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్టెక్ జోన్లోనూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేసింది. ఈ విధంగా ఐటీ రంగంలో విశాఖను కల్పతరువుగా మార్చేలా ప్రభు త్వం చర్యలు తీసుకుంటే యువతను నైరాశ్యంలో నెట్టివేసేలా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈనాడు రామోజీ రాస్తున్న తప్పుడు రాతలను ప్రజలు గమనిస్తున్నారు. మూడు రెట్లు పెరిగిన స్టార్టప్ల సంఖ్య నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకువస్తూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల ఏర్పాటుతో రాష్ట్రంలో స్టార్టప్ల సంఖ్య భారీగా పెరిగింది. వీటి ద్వారా సాంకేతిక నిపుణులైన యువత స్వయం ఉపాధి పొందడమే గాకుండా, వేలాది మందికి ఉద్యోగాలూ వస్తున్నాయి. గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో స్టార్టప్ల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వరంగ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఆ సంస్థ తాజా గణాంకాల ప్రకారం.. 2019లో రాష్ట్రంలో 161 స్టార్టప్లు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 586కు పెరిగింది. వీటిలో పనిచేసే ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగింది. 2019లో 1,552 మంది పనిచేస్తుండగా, ఆ సంఖ్య ఇప్పుడు 5,669కు చేరింది. -
Fact Check: పచ్చగంతలు తీస్తే రహదారులు కనిపిస్తాయి
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో టీడీపీ ఓటమి తథ్యమని స్పష్టం కావడంతో ఈనాడు రామోజీరావు పైత్యం పరిపరి విధాలుగా ప్రకోపిస్తోంది. అసహనంతో చిందులు తొక్కుతూ రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ విద్వేష విషం కక్కుతున్నారు. అందుకే రాష్ట్ర రోడ్ల పరిస్థితిపై మరోసారి రామోజీ తన మార్కు రోత రాతలతో ఈనాడు పత్రికను ఖరాబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తూ రహదారుల పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసినా సరే ...కళ్లకు పచ్చ గంతలు కట్టుకున్న రామోజీ కబోదిలా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఈనాడు పత్రిక గురువారం ‘రోడ్లేయని జగన్ ఓ జనహంతక చక్రవర్తి’ అంటూ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెరతీశారు. తప్పుడు కథనంతో ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నంలో ఈనాడు బోల్తా కొట్టింది. వాస్తవానికి రాష్ట్రంలో రోడ్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది చంద్రబాబు హయాంలోనే. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే రోడ్ల పునరుద్ధరణ పనులు వేగం పుంజుకున్నాయని ప్రభుత్వ రికార్డులు వెల్లడిస్తున్న వాస్తవం. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు అయిదేళ్లలో ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, జాతీయ రహదారులకు కలిపి మొత్తం రూ.23,792.19 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు ఏకంగా రూ.46,383.20 కోట్లు వెచ్చించారు. రోడ్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమిది. కళ్లుండీ కబోదిగా వ్యవహరిస్తున్న రామోజీకి కనువిప్పు కలిగించేందుకే ఈ ఫ్యాక్ట్ చెక్... చంద్రబాబు జమానా..రహదారులు అధ్వాన్నం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రోడ్ల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నది అక్షరసత్యం. ఆ ప్రభుత్వ హయాంలో మొదటి మూడేళ్లూ అసలు రోడ్ల గురించే పట్టించుకోలేదు. తరువాత రోడ్ల పునరుద్ధరణకు 2017–18లో తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని కూడా ఎన్నికల ప్రయోజనాల కోసం ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించారు. దాంతో 2019 నాటికి రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ► టీడీపీ ప్రభుత్వ ఐదేళ్లలో రోడ్ల నిర్మాణానికి రూ.2,953.81 కోట్లు వెచ్చించింది. అంటే ఏడాదికి సగటున రూ.591 కోట్లు ఖర్చు చేసింది. ► రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల పునరుద్ధరణకు రూ.4,325 కోట్లే వెచ్చించింది. ► పంచాయతీరాజ్ రహదారుల కోసం రూ. 3,160.38 మాత్రమే ఖర్చు చేసింది. ► 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం రూ.13,353 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. వైఎస్సార్సీపీ హయాంలో మారిన రూపురేఖలు 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రోడ్ల పునరుద్ధరణకు ప్రాధాన్యతనిస్తోంది. కోవిడ్ పరిస్థితులు, వరుసగా రెండేళ్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసినా రోడ్ల నిర్మాణంపై రాజీ పడలేదు. ప్రజల సంక్షేమంతోపాటు మౌలిక సదుపాయాలపైనా దృష్టి సారించారు. రోడ్ల మరమ్మతులు చేపట్టి విశాలంగా చేస్తున్నారు. కొత్త రోడ్లు వేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టడంతో రాష్ట్రంలో రోడ్లు మెరుగయ్యాయి. ఇందు కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన ఖర్చు ఇలా ఉంది... ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అయిదేళ్లలో రోడ్ల నిర్మాణానికి రూ.5,099.59 కోట్లు వెచ్చించింది. అంటే ఏడాదికి సగటున రూ.951కోట్లు. దీని ప్రకారం బాబు ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 591 కోట్లకంటే చాలా ఎక్కువే. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అయిదేళ్లలో రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి రూ.9,175 కోట్లు ఖర్చుచేసింది. ► పంచాయతీరాజ్ రోడ్ల కోసం రూ.6,804.61 కోట్లు వెచ్చించింది. ► జాతీయ రహదారుల కోసం రూ.25,304 కోట్లు వెచ్చించారు. సీఎం వైఎస్ జగన్ కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు, నిరంతరం పర్యవేక్షణతోనే ఇది సాధ్యమైంది. ► ఇక రోడ్ల అభివృద్ధి సెస్ ద్వారా వచ్చిన రూ.3 వేల కోట్లను టీడీపీ చేసిన అప్పులు తీర్చడానికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేటాయించాల్సి వచ్చింది. సెస్ ద్వారా వచ్చిన మరో రూ.2 వేల కోట్లకు అదనంగా రూ.2,500 కోట్ల రుణం తీసుకుని మొత్తం రూ.4,500 కోట్లతో 7,600 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించింది. -
Fact Check: ఈనాడు దగాకోడ్ రాతలు
సాక్షి, అమరావతి: ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతుండటంతో రాష్ట్రంలో ఎల్లో సిండికేట్ బెంబేలెత్తుతోంది. త్వరలో నిర్వహించనున్న ఎన్నికల్లో వరుసగా రెండోసారి టీడీపీ ఓటమి ఖాయమని స్పష్టం కావడంతో చంద్రబాబు, ఈనాడు రామోజీరావుల కాళ్ల కింద భూమి కంపిస్తోంది. తమ రాజకీయ జీవితానికి ముగింపు కార్డు పడిందని చంద్రబాబుకు.. తమ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలుతుందని రామోజీరావుకు భయం పట్టుకుంది. తమ భవిష్యత్తు సినిమా కళ్ల ముందు కనిపిస్తోంది. ఫలితంగా దింపుడు కళ్లెం ఆశతో విద్వేష కథనాలు అల్లుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనా, ప్రభుత్వ యంత్రాంగంపైనా విషం చిమ్ముతున్నారు. ఏకంగా రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల కమిషన్(ఈసీ) అధికార పరిధినీ ప్రశ్నిస్తూ కట్టుకథలతో ‘ఈనాడు’ పత్రిక చెలరేగిపోతోంది. ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న పోలీసు, అధికార యంత్రాంగాన్ని బ్లాక్మెయిల్ చేయాలని పన్నాగం పన్నింది. మొన్న ఐపీఎస్ అధికారుల పోస్టింగులను ప్రశ్నిస్తూ ఈసీనే బ్లాక్ మెయిల్ చేసేందుకు యత్నించిన ఈనాడు.. తాజాగా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలే లక్ష్యంగా అబద్ధాలను వల్లెవేసింది. ‘వైకాపా కోడ్ నడుస్తోంది’ అంటూ బుధవారం ఓ విష కథనాన్ని వండి వార్చింది. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించింది. పోలీసు అధికారుల బెదిరింపునకూ పన్నాగం తాజాగా ఈనాడు రామోజీరావు క్షేత్రస్థాయిలో క్రియాశీలంగా వ్యవహరించే పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకుని దు్రష్పచార కుట్రకు తెరతీశారు. ఎన్నికల విధుల్లో క్షేత్రస్థాయిలో క్రియాశీలంగా ఉండే డీఎస్పీ, సీఐ, ఎస్సైలను బ్లాక్మెయిల్ చేయడం ద్వారా టీడీపీ అక్రమాలకు అడ్డులేకుండా చేయాలన్నది పచ్చ కుట్ర. ఇటీవల రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడ్డ ఉదంతాలను ఈనాడు పత్రిక వక్రీకరిస్తూ తప్పుడు కథనం ప్రచురించింది. మాచర్ల, గన్నవరం, అద్దంకి, ఉరవకొండ, గుడివాడ తదితర నియోజకవర్గాల్లో గత వారం పదిరోజుల్లో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. తాజాగా బుధవారం రాత్రి ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులనే అడ్డుకున్నారు. అసలు ఎన్నికల ప్రచారం చేయడానికి వీల్లేదని గలాభా సృష్టించారు. ఇటువంటి ఘటనలపై స్థానిక పోలీసులకు ఫిర్యాదులు అందడంతో కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం యావత్ పోలీసు యంత్రాంగం ఈసీ మార్గదర్శకాల ప్రకారం విధులు నిర్వహిస్తోంది. ఈ వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తూ వైఎస్సార్ సీపీ నేతల ఆదేశాల ప్రకారం పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని కట్టుకథలను ఈనాడు ప్రచారంలోకి తీసుకువస్తోంది. టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడినా.. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రచారాన్ని అడ్డుకున్నా సరే పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండాలి అన్నట్టుగా ఈనాడు వితండవాదం చేస్తోంది. నిజంగా పోలీసులు ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు. ఈసీ విచారించి తగిన చర్యలు తీసుకుంటుంది. కానీ చంద్రబాబుగానీ ఈనాడు రామోజీరావుగానీ ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే పోలీసులు నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నారు. అందుకే ఈనాడు పత్రిక ద్వారా పోలీసు అధికారులపై దు్రష్పచారానికి పాల్పడుతున్నారు. తద్వారా క్షేత్రస్థాయిలో పని చేసే పోలీసు అధికారులను బెదిరించి టీడీపీ అక్రమాలకు అడ్డులేకుండా చేయాలన్నది చంద్రబాబు, రామోజీ లక్ష్యం. కానీ వారి కుట్రలను తిప్పికొడుతూ ఈసీ నిబంధనల మేరకు సక్రమ ఎన్నికల నిర్వహణకు పోలీసు యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకుంటోంది. మొన్న ఐపీఎస్లపై అక్కసు బెడిసికొట్టి.. చంద్రబాబు హయాంలో రాజ్యాంగేతర శక్తిగా చలామణి అయిన రామోజీరావు ప్రస్తుతమూ తన మాటే శాసనం అనేట్టుగా ఉండాలని భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నదీ ప్రజలు ఎన్నుకున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అని.. రాజ్యాంగబద్ధ సంస్థ ఈసీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ సాగుతుందని గానీ గుర్తించేందుకు ఆయన ససేమిరా అంటున్నారు. తాను చెప్పిన అధికారులనే ఎస్పీలుగా నియమించాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అందుకు విరుద్ధంగా ఎన్నికల నియమావళి ప్రకారం ఇటీవల ఎన్నికల కమిషన్ ఒక డీఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లను నియమించడంతో ఆయన చిందులు తొక్కారు. ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ ఈనాడు పత్రికలో విద్వేష కథనాన్ని ప్రచురించారు. దీనిపై యావత్ పోలీసు యంత్రాంగం తీవ్రంగా స్పందించడం విశేషం. ఏకంగా 13 మంది ఐపీఎస్ అధికారులు సంతకాలు చేసి మరీ టీడీపీ, జనసేన, బీజేపీ, ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు ఈనాడు పత్రికను అడ్డంపెట్టుకుని పోలీసు వ్వవస్థను, ఈసీని బ్లాక్ మెయిల్ చేసేందుకు యత్నిస్తున్నాయన్న వాస్తవం దేశవ్యాప్తంగా అందరికీ తెలిసింది. ఈసీ తీవ్ర చర్యలు తీసుకునే అవకాశాలు ఉండటంతో రామోజీరావు తోక ముడిచారు. టీడీపీ, జనసేన, బీజేపీ నోళ్లు కూడా మూతపడ్డాయి. కానీ అధికారయంత్రాంగం ఆత్మస్థైర్యం దెబ్బతీసే కుతంత్రాలు మాత్రం ఆపలేదు. -
ఎమ్మెల్వోలపై ఏడుపు
సాక్షి, అమరావతి: ‘ఈనాడు’ రోత రాతలు చూస్తుంటే ప్రభుత్వం ద్వారా ఎవరికి ప్రయోజనం చేకూరినా వారిపై ఎన్నికల సంఘం ఎడాపెడా కేసులు నమోదు చేయాల్సిందేననే ఆక్రోశం కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడంపై వలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకు కాంట్రాక్టర్ల వద్ద విధులు నిర్వహించే ఎమ్మెల్వోలపై ఏడుపుగొట్టు కథనాలను ప్రచురించింది. ఒకవైపు వలంటీర్లను ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కాజేసే దొంగలుగా చిత్రీకరిస్తూ మరోవైపు తాయిలాలను ఎర వేయడంపై విస్మయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈనాడు ఆరోపణ: ఎమ్మెల్వోలను వైఎస్సార్సీపీ స్లీపర్ సెల్స్లా ప్రజలపైకి వదిలారు. వాస్తవం: వలంటీర్లు ప్రజల నుంచి ఎలాంటి వ్యక్తిగత సమాచారం సేకరించరు. ప్రభుత్వ పథకాల అమలు ప్రక్రియలో సేకరించే వివరాలను యాప్లో నమోదు చేయగానే నేరుగా రాష్ట్ర ప్రభుత్వ అ«దీనంలో ఉండే డేటా సెంటర్లో నిక్షిప్తమవుతుంది. వలంటీర్ల వద్ద ఉండే మొబైల్ యాప్లోని సమాచారాన్ని పరిశీలించేందుకు ఎమ్మెల్వోలకు లాగిన్ అవకాశం ఉండదు. ఈనాడు ఆరోపణ: ఎమ్మెల్వోలు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవం: వలంటీర్ల నుంచి ఫోన్లు, నంబర్లను స్వాదీనం చేసుకున్నాక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయడం ఎలా సాధ్యమో ఈనాడుకే తెలియాలి. -
Fact Check: రామోజీ రాతల్లోనే ‘కోతలు’.. బాబు పాలనలోనే ‘చీకట్లు’
సాక్షి, అమరావతి : ‘‘పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పాటు పవర్ హాలిడే అమలు చేస్తున్నాం. వారంతపు సెలవుతో కలిపి వారంలో మూడు రోజులు పరిశ్రమలకు విద్యుత్ ఉండదు.’’ ‘‘గ్రామాల్లో ఎనిమిది గంటలు..పట్టణాల్లో ఆరు గంటలు..నగరాల్లో నాలుగు గంటలు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ విధిస్తున్నాం.’’‘‘వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ ఇవ్వడం కష్టం..నాలుగు గంటలు రెండు విడతల్లో ఇస్తాం..క్రాప్ హాలిడే తీసుకుంటే ఇంకా మంచిది.’’ ...ఇదీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి..బాబు హయాంలో రాష్ట్రాన్ని చీకటి మయం చేశారు. రైతులు అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక పొలాల్లోనే పడిగాపులు కాసేవారు. ఆ సమయంలో పాముల బారినపడి ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు. గ్రామాల్లో పగలూ రాత్రీ గంటల తరబడి కోతలు విధించేవారు. కొన్ని సీజన్ల పంటలకు విద్యుత్ సరఫరా లేక రైతులు క్రాప్ హాలిడే పేరుతో పంటలు వేయకుండా చేలను బీడు భూములుగా వదిలేసేలా అప్పటి పాలకులు ప్రోత్సహించారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల నుంచి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసింది. రైతులకు ఉచితంగా పగటి పూటే 9 గంటల విద్యుత్ను అందిస్తోంది. భారీ విద్యుత్ డిమాండ్, తీవ్ర విద్యుత్ కొరత ఉండే వేసవిలోనూ ఎలాంటి కోతలు లేకుండా, లోడ్ రిలీఫ్ అవసరం రాకుండా, క్రాప్ హాలిడే విధించకుండా, పవర్ హాలిడే పెట్టకుండా అన్ని వర్గాల ప్రజలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందిస్తోంది. కానీ దీనిని చూసి బాబు తోక పత్రికైన ఈనాడు కుళ్లుకుంటోంది. ఇలాంటి పాలనకు ప్రజలు ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టనున్నారని గ్రహించి, తప్పుడు రాతలతో జనాన్ని నమ్మించాలని చూస్తోంది. అందులో భాగంగానే ‘కంటి మీద కునుకు లేకుండా చేస్తారా జగన్?’ అంటూ ఈనాడు మంగళవారం ఓ అబద్దాన్ని అచ్చేసింది. రామోజీ రాస్తున్న రాతల్లో అన్నీ కోతలేనని, వాస్తవాలను పరిశీలిస్తే ఎవరికైనా అర్ధమవుతుంది. ♦ శ్రీకాకుళం జిల్లా గార మండలం జల్లువలస, జఫ్రా బాద్, రాఘవాపురం, వాదాడ, తోనంగి శాలి హుండం గ్రామాల పరిధిలో సోమవారం ఉదయం 05:34 నుండి సాయంత్రం 04:15 గంటల వరకు కరెంటు లేదు అన్నది వాస్తవం కాదు. ఎందుకంటే ఆ రోజు బలమైన ఈదురు గాలులు వచ్చిన కారణంగా కళింగపట్నం, చల్లపేట, అతులుగు సబ్ స్టేషన్ పరిధిలోని 11కేవీ ఫీడర్స్పై చెట్టు కొమ్మలు పడి ట్రిప్ అయి కొంత విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ♦ రాజమహేంద్రవరం జిల్లా గండేపల్లి మండలం, కె. సూరపాలెం గ్రామీణ ఇండస్ట్రియల్ ఫీడర్ పరిధిలో సోమవారం ఉదయం 07:15 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచింది. రాజమహేంద్రవరం తాడితోట సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 8.55 నుంచి సాయంత్రం 04:15 గంటల వరకు సరఫరా నిలిచింది అన్నది కూడా వాస్తవం కాదు. ఈదురు గాలుల వల్ల 33/11 కేవీ గండేపల్లి సబ్ స్టేషన్లో 11కేవీ సూరంపాలెం ఇండస్ట్రియల్ పరిధిలో చెట్లు కొమ్మలు, వెదురు చెట్లు లైన్ మీద పడి బ్రేక్ డౌన్ అయ్యింది. కొమ్మలు, చెట్లు తొలగించి మధ్యాహ్నం 1 గంటకు సరఫరా పునరుద్ధరించారు. అలాగే 33/11కేవీ తాడితోట సబ్ స్టేషన్ పరిధిలోగల 11కేవీ ఇన్నిస్ పేట ఫీడర్ పైన నక్కలగూడెం వద్ద గల వీటి కాలేజ్ దగ్గర చెట్టు కొమ్మలు పడటంతో సరఫరాలో అంతరాయం కలిగింది. తెగిన విద్యుత్ లైన్ పున రుద్ధరించి 09:59 గంటలకు సరఫరా ఇచ్చారు. ♦పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, అలవద్ద, కురుపాం, మండలం భర్తంగి గ్రామాల పరిధిలో ఉదయం 09:24 గంటలకు 33/11కేవీ గుమ్మలక్ష్మీపురంలోని 11కేవీ గుమ్మలక్ష్మీపురం–ఆర్కే బాయ్ ఫీడర్ పరిధిలో అల్లవరం గ్రామం వద్ద చెట్లు కొమ్మలు లైను మీద పడి విద్యుత్ అంతరాయం కలిగింది. వాటిని తొలగించి 09:48 గంటలకు సరఫరా యధావిధిగా కొనసాగించారు. ♦ కడపలోని 220 కెవి సబ్స్టేషన్లో బ్యాటరీల మరమ్మతుకు గురై సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యుత్తు సరఫరా పునరుద్ధరించారు. ♦ కర్నూలు సర్కిల్ పరిధిలోని గుండ్లకొండ సబ్స్టేషన్, అనంతపురం సర్కిల్ పరిధిలోని రాయదుర్గం, తిరుపతి సర్కిల్ పరిధిలోని పూతలపట్టు సబ్ స్టేషన్లలో బ్రేక్డౌన్ కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ ఆయా సబ్స్టేషన్ల పరిధిలో లైటింగ్ సప్లైలో మాత్రం ఎటువంటి అంతరాయం లేదు. -
కరెంటు ఆపడం కొత్తేం కాదు
సాక్షి, అమరావతి: ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు, వేగంగా తుపాను గాలులు వీస్తున్నప్పుడు, అల్పపీడనం కారణంగా జోరుగా వాన కురుస్తున్నప్పుడు మాత్రమే కాదు రోడ్డు మీద భారీ లోడ్తో ఉన్న వాహనం వెళుతున్నప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంటారు. లక్షలాది జనం ఒకే రహదారి వెంట బారులుతీరినప్పుడు, తమ నాయకుడిని చూడాలని వేలాది మంది భవనాలపై నిలబడినప్పుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు తీగలు తగిలే అవకాశాలు చాలా ఎక్కువ. ఇలాంటి సమయాల్లో అనుకోనిది ఏదైనా జరిగి తీగలు తెగి జనం మీద పడినా, ట్రాన్స్ఫార్మర్ తగిలి షాక్కు గురైనా అమాయకుల ప్రాణాలు క్షణాల్లో పోతాయి. అలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రముఖుల పర్యటనలు, బహిరంగ సభలు, రోడ్ షోలు జరుగుతున్న ప్రదేశాల్లో అధికారులు విద్యుత్ సరఫరాను కాసేపు నిలిపివేస్తుంటారు. ఇది అందరి భద్రతను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న చర్య మాత్రమే. దీనిని కూడా రాజకీయం చేయాలని చూశారు ఈనాడు రామోజీ. ‘జగన్ వస్తే కరెంట్ వైర్లకు కత్తిరింపే’ అంటూ ఈనాడులో వంకర రాతలు రాశారు. ప్రజల ప్రాణాలు పోతే మా కెందుకు మా అజెండా మాదే అన్నట్లు రాసిన ఆ తప్పుడు కథనాన్ని విద్యుత్ సంస్థలు తీవ్రంగా ఖండించాయి. ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న విశేష ఆదరణను చూసి మరోమారు అక్కసు వెళ్లగక్కారు. ఈ అసత్య రాతలపై ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీసీపీడీసీఎల్) సీఎండీ కె.సంతోషరావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రముఖుల రోడ్ షో సందర్భంగా భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం సహజంగా జరిగేదేనని ఆయన వివరించారు. అంతేకాకుండా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో జన సందోహం ఎక్కువై విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, ఆ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ ప్రముఖుల పర్యటన జరిగినా ఇదే పద్ధతిని అవలంభిస్తున్నామని స్పష్టం చేశారు. నిజానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారి పర్యటనల సమయంలోనూ ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తుంటారు. అప్పుడు మాత్రం ప్రభుత్వం కావాలనే, వారి పర్యటనకు ఆటంకం కలిగించడం కోసమే విద్యుత్ సరఫరా నిలిపివేసిందంటూ ఇదే ఈనాడు కథనాలు రాస్తోంది. ఇటీవల పవన్ పర్యటనలో ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్కు గురై ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. అలాంటి దుర్ఘటనలు జరగకూడదనే విద్యుత్ శాఖ అధికారులు కరెంటు నిలిపివేస్తుంటే దానిపైనా పడి ఏడ్వడం రామోజీకే చెల్లింది. -
పెళ్లి సాయంపైనా కుళ్లు రాతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద బిడ్డల పెళ్లికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంపైనా రామోజీ కుళ్లు రాతలు మానలేదు. క్రిస్టియన్ మైనారిటీలకు అందించే ‘వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా’ పథకంపై ‘మేనిఫెస్టోలో ఆమెన్.. ఆనక మరిచెన్’ అనే తప్పుడు కథనంతో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేశారు. వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే పేద బిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక ప్రోత్సాహం పెంచడంతో పాటు గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను సైతం లబ్ధిదారులకు అందించిందనే విషయాన్ని ఈనాడు విస్మరించింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులకు చెందిన 56,194 జంటలకు రూ.427.27 కోట్ల ఆర్థిక సాయం అందించి వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఆరోపణ: వాగ్దానాల అమలుకు ఒక్క రోజు కూడా చర్యలు తీసుకోలేదు వాస్తవం: గత ప్రభుత్వం హామీలను గుప్పించి అమలు చేయకపోగా అధికారిక వెబ్సైట్లోనూ మేనిఫెస్టో మాయం చేశారు. ఇది రామోజీ పచ్చ కళ్లకు కన్పించ లేదు. మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతలా భావించి అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ది. మేనిఫెస్టోను కళ్ల ముందే కన్పించేలా డిస్ప్లే చేస్తూ అందులో ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేసేలా షెడ్యూల్ ప్రకటించి ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరిస్తున్నారు. అయినా సీఎం వైఎస్ జగన్పై విషం కక్కే రాతలు రాసింది. క్రైస్తవులకు టీడీపీ హయాంలో అమలు చేసిన పెళ్లి కానుక పథకాన్ని పక్కన పెట్టినట్టు అబద్ధాలు రాసింది. క్రిస్టియన్ మైనారిటీలకు ఆర్థిక సాయం అందిస్తున్నప్పటికీ అదేం లేదంటూ అడ్డగోలు రాతలు అచ్చేసింది. ఆరోపణ: పెళ్లి కానుక అటకెక్కించారు వాస్తవం: క్రైస్తవ యువతుల పెళ్లికి గత టీడీపీ ప్రభుత్వం అండగా నిలిచినట్టు రామోజీ అడ్డగోలుగా అబద్ధాలు రాసేశారు. పేద బిడ్డల పెళ్లికి సాయం అందించేలా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ‘మాస్ మ్యారేజ్’ పేరుతో ఆర్థిక సాయాన్ని అందించారు. క్రైస్తవ ఆడ బిడ్డల పెళ్లికి రూ.25వేల ఆర్థిక సాయం, కొత్త బట్టలతోపాటు పెళ్లి వస్తువులు అందించేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో ‘దుల్హాన్’ పథకంగా పేరు మార్చి అమలు చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు హడావుడిగా 2018లో రూ.25వేల సాయాన్ని రూ.50వేలకు పెంచుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. పెంచిన మొత్తాన్ని అందించకపోగా బకాయిలు పెట్టారు. 2018 నుంచి జరిగిన 43,490 జంటల(పెళ్లిళ్లు)కు రూ.177.96 కోట్ల బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలను సైతం విడుదల చేసింది. ఈ వాస్తవాన్ని ఈనాడు మరుగున పరిచింది. ఆరోపణ: పరిశీలన లేదు.. ఎంపిక లేదు వాస్తవం: గత ప్రభుత్వం గొప్పలను డబ్బా కొట్టిన ఈనాడుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా షాదీ తోపా పథకాన్ని అమలు చేయడం మింగుడు పడలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు నెలలకు(త్రైమాసికం) ఒకసారి లబ్ధిదారులందరికీ సాయం విడుదల చేస్తోంది. గత ప్రభుత్వం వధువుకు సాయం అందిస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వధువు తల్లికి అందజేస్తోంది. గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ఐకేపీల పరిధిలోని మండల సమాఖ్య ద్వారా ఎంపిక చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎంపిక చేస్తోంది. గత ప్రభుత్వంలో పట్టణ, గ్రామీణ లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోవాలంటే అవస్థలు పడేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా స్థానికంగా దరఖాస్తులు చేసుకునే వెసులుబాటు కలిగింది. గత ప్రభుత్వంలో బకాయిలు కాలానుగుణంగా విడుదల చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో వివాహం జరిగిన తేదీ నుండి 30 రోజులలోపు దరఖాస్తు చేసుకుంటే మూడు నెలలకు ఒకసారి అప్పటి వరకు వచ్చిన దరఖాస్తులకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఆడ పిల్లల చదువులను ప్రోత్సహించాలనే మహోన్నత లక్ష్యంతో వివాహాలు చేసుకునే వారు కనీసం పదవ తరగతి విద్యార్హత ఉండాలని నిబంధన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టింది. దీని వల్ల పేద వర్గాలకు చెందిన ఆడపిల్లలందరూ పదవ తరగతికి తగ్గకుండా చదువుకున్నారు. ఉన్నత చదువులు చదివించాలనే సీఎం వైఎస్ జగన్ ఉన్నతాశయం ఆచరణలో మంచి ఫలితాలు ఇస్తోంది. అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన వంటి పథకాల ద్వారా ఉన్నత విద్యకు మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. ఆరోపణ: ఇచ్చిన జీవోకే మళ్లీ జీవో వాస్తవం: పేద బిడ్డల పెళ్లికి గత ప్రభుత్వం ఏం చేసింది.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతమేరకు సాయం అందిస్తోంది అనేది గమనిస్తే చాలు ఈనాడు రోత రాతల వెనుక ఉన్న మర్మం ఏమిటో తెలుస్తుంది. గత ప్రభుత్వం అరకొర సాయాన్ని కూడా సకాలంలో చెల్లించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాత బకాయిలు సైతం చెల్లించి ఆర్థిక సాయం పెంచి అందించింది. మైనారిటీలను ఆదుకున్నది జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో మైనారిటీలను అదుకున్నది సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వమే అనేది గర్వంగా చెప్పగలం. ఏపీ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 1,82,270 మందికి రూ.416.56 కోట్ల లబ్ధి చేకూర్చింది. నవరత్నాల్లోని సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ ద్వారా రూ.13,239.49 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో 11,064.88కోట్ల లబ్ధిని అందించింది. ఐదేళ్లలో మొత్తం రూ.24,304.37కోట్లు చెల్లించింది. మైనారిటీ వర్గాలను రాజకీయ, సామాజిక, ఆర్థికంగా ముందుకు నడిపిస్తూ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిలుస్తున్నారు. – బొల్లవరపు జాన్ వెస్లీ, చైర్మన్, ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ -
Fact Check: గురుకులాలపై ఈనాడు వక్రభాష్యాలు
అదేదో సినిమాలో ... ‘మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటున్నా.. మీరు ఇక్కడే ఉంటారని’..చెప్పే హాస్యనటుడి డైలాగ్ చంద్రబాబు–రామోజీలకు సరిపోతుందేమో...ఎన్నికలేమో దగ్గరపడుతున్నాయి...తన శిష్యుడు చంద్రబాబును ఎంత ఎత్తుదామన్నా...రాజకీయంగా అథఃపాతాళానికి దిగజారిపోయిన ప్రతిష్ఠను తీసుకురాలేని దౌర్భాగ్య స్థితిలో రామోజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై రాళ్లేయాలని చూస్తున్నారు... ఇది ఆకాశమ్మీద రాయివేసిన చందమేనని రామోజీకి అర్థం కావడం లేదేమో... తాజాగా గురుకులాలపై ఈ పచ్చపాత పెద్ద వక్రదృష్టి సారించి, తన విషప(పు)త్రికలో కట్టుకథలు అల్లారు...చంద్రబాబు ప్రభుత్వంలో గురుకులాల సంఖ్య పెరగలేదు..అక్కడి విద్యార్థుల సంక్షేమాన్ని బాబు పట్టించుకోలేదు...విద్యా ప్రమాణాలనూ గాలికొదిలేశారు... ఇప్పుడివన్నీ జగన్ ప్రభుత్వం పట్టించుకుంది..గురుకులాలు పెరిగాయి..డైట్ ఛార్జీలు పెరిగాయి...విద్యా ప్రమాణాలూ పెరిగాయి....ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, నీట్, ఇంజనీరింగ్ సీట్లను గురుకుల విద్యార్థులు సాధిస్తున్నారు.. గురుకులాల పేరిట కలకలం రేపాలని రామోజీ తహతహలాడుతూ చదువుల తల్లినీ అవమానిస్తున్నారు... కళ్లు విప్పార్చుకుని చూస్తే ఈ ఎల్లో పెద్దకు నిజానిజాలు తెలుస్తాయి... సాక్షి, అమరావతిః బీసీ విద్యార్థులు చదివే గురుకుల విద్యాలయాలపైనా రామోజీ గురివింద రాతలు మానలేదు. తెలంగాణాతో పోలిక పెట్టి ఆంధ్రప్రదేశ్పై బురద చల్లేందుకు ఈయన తాపత్రయ పడ్డారు. పేద పిల్లలకు పెద్ద చదువులు దక్కాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషిని వెక్కిరిస్తూ వెకిలి రాతలు రాసేశారు. బీసీ గురుకులాల మంజూరు, నిర్మాణం, విద్యార్థులకు వసతులు, మెరుగైన ఫలితాలు తదితర అనేక విషయాల్లో చంద్రబాబు వైఫల్యాలను కప్పిపుచ్చడమే కాకుండా సీఎం వైఎస్ జగన్ హయాంలో విజయాలను మరుగుపరిచే కుటిలయత్నం ఈ రాతల్లో స్పష్టంగా కన్పించింది. ఈనాడు అబద్ధాలను దునుమాడే వాస్తవాలు ఇవిగో.. ఆరోపణః వైకాపా పాలనలో గురుకులాలకు అథమ స్థానం వాస్తవంః రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన బీసీ గురుకుల విద్యాలయాలకు సీఎం వైఎస్ జగన్ మహర్దశ తీసుకొచ్చారు. చంద్రబాబు హయాంలో కేవలం 41 గురుకులాలు ఉంటే.. సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన అనంతరం వాటిని 105కు పెంచారు. విద్యార్థుల సంఖ్యా గణనీయంగా పెరగడంతో పాటు వారికి అవసరమైన నాణ్యమైన విద్య, మౌలిక వసతులు అందించడంలో జగన్ ప్రత్యేక శ్రద్ధతో అనేక చర్యలు చేపట్టారు. ♦ చంద్రబాబు హయాంలో 2018–19 నాటికి రాష్ట్రంలో బీసీ గురుకులాలు కేవలం 41 మాత్రమే ఉన్నాయి. ♦ 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు హడావుడిగా 65 కొత్త గురుకులాలు మంజూరు చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. వాటిని కనీసం గ్రౌండింగ్ అయినా చేయలేదంటే చంద్రబాబు చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న 2019 ఏప్రిల్లో హడావుడిగా 21 గురుకులాలు ప్రారంభించినట్టు బిల్డప్ ఇచ్చి జనాన్ని మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. ♦ సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన అనంతరం 2019 నుంచి 2023లోపు 41 కొత్త గురుకులాలను ప్రారంభించారు. 2023లో మరో రెండు కొత్త గురుకులాలను సీఎం జగన్ ప్రారంభించారు. దీంతో చంద్రబాబు హయాంలో 41 గురుకులాలు ఉంటే, జగన్ ప్రభుత్వ హయాంలో వాటి సంఖ్య 105కు పెరిగిన విషయాన్ని ఈనాడు దాచిపెట్టింది. ఈ గురుకుల విద్యాలయాల్లో 2018–19 విద్యా సంవత్సరం (చంద్రబాబు పాలన)లో 25,629 మంది విద్యార్థులుంటే.. 2023–24 విద్యా సంవత్సరానికి (జగన్ సర్కారు)లో 38,188 మంది విద్యార్థులు పెరగడం గమనార్హం. ♦ రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో 14 జూనియర్ గురుకుల కాలేజీలు ఉంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కొత్తగా మరో నాలుగు మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, నంద్యాల జిల్లా డోన్, బేతంచెర్ల, చిత్తూరు జిల్లా సదుంలో కొత్తగా జూనియర్ గురుకుల కాలేజీలు ప్రారంభించింది. ♦ హెయిర్ కటింగ్ కోసం 3వ తరగతి నుంచి బాలురకు నెలకు గత ప్రభుత్వం రూ.30 ఇస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.50కి పెంచింది. ఆరోపణః బిల్లులు చెల్లించలేదు... వాస్తవంః బడ్జెట్ కేటాయింపుల్లోను జగన్ సర్కారు ఉదారంగా నిలిచిందనే విషయం గత పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. చంద్రబాబు అధికారం చేపట్టిన తొలినాళ్లలో కేవలం రూ.45 కోట్లు కేటాయిస్తే.. సీఎం జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి రూ.213 కోట్లకు పైగా ప్రభుత్వం కేటాయింపులు చేసింది. ఈ నిజాలనూ రామోజీ దాచేశారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు వాస్తవాలను వక్రీకరించి బోగస్ రాతలు రాస్తున్నారు. ఆరోపణః ‘అద్దె’సరు భవనాలు.. వాస్తవంః పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఇంగ్లీష్ మీడియం చదువులు, ప్రభుత్వ బడుల సౌకర్యాలను మెరుగు పర్చడంలో సీఎం వైఎస్ జగన్ చేపట్టిన నాడు–నేడు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందనే విషయం రామోజీకి మింగుడు పడటంలేదు. ప్రభుత్వ బడులు మాదిరిగానే బీసీ గురుకులాల రూపురేఖలను నాడు–నేడు కార్యక్రమంతో మార్చిన విషయాన్ని ఈనాడు ఉద్దేశపూర్వకంగా మరుగున పరిచింది. తొమ్మిది ప్రధానమైన మౌలిక వసతులు కల్పిస్తూ బీసీ గురుకులాలను తీర్చిదిద్దింది. రాష్ట్రంలో 37 గురుకులాలను రూ.17.97 కోట్లతో అభివృద్ధి చేసింది. వాటికి నీటి సరఫరాతో కూడిన టాయిలెట్లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, పాఠశాలకు పెయింటింగ్, మరమ్మతులు, ఆకుపచ్చ సుద్ద బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్లు, ప్రహరీ గోడలు నిర్మించింది. జూనియర్ కాలేజీ భవనాల నిర్మాణం విషయానికి వస్తే.. గత ప్రభుత్వం (2014–19)లో రూ.102.60 కోట్లు కేటాయిస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం (2019–23)లో రూ.194 కోట్లు కేటాయించింది. ఫలితాలే గీటురాయి.. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమేరకు ఫలప్రదమయ్యాయో తెలియాలంటే ఆయా విద్యా సంస్థల్లో విద్యార్థులు సాధించిన ఫలితాలే గీటురాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీ గురుకుల విద్యార్థులకు ప్రత్యేకంగా ఐఐటీ, నీట్లో ప్రత్యేక కోచింగ్ ఇవ్వడంతో వారు ఉత్తమ ఫలితాలు సాధించారు. ♦ బిసీ గురుకులాల్లో 2022–23లో పదో తరగతిలో 90 శాతం, ఇంటర్మీడియట్లో 90.10 శాతం ఉత్తీర్ణత సాధించారు. ♦ ఎంపీసీ (ఐఐటీ అడ్వాన్డ్స్)లో 2019–20లో 102 మంది విద్యార్థుల్లో 37 మంది అర్హత సాధించారు. 2020–21లో 205 మందికి 65 మంది అర్హత సాధించారు. 2021–22లో 147 మందికి 45 మంది అర్హత సాధించారు. ♦ఐఐటీ, నీట్, పోటీ పరీక్షల్లో 2022–23లో మంచి ప్రతిభ కనబరిచిన 40 మంది గురుకుల విద్యార్థులు సీట్లు సాధించారు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలో ఆరుగురు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో 24, నీట్ (బైపీసీ స్ట్రీమ్)లో ఎంబీబీఎస్లో నాలుగు, డెంటల్లో ఒక సీటు, వెటర్నరీ 4, అగ్రికల్చర్ లో ఒక సీటును సాధించారు. ఆరోపణః బీసీ విద్యార్థుల వెన్ను విరిచారు. వాస్తవంః పేద పిల్లలు చదివే గురుకులాల్లో చంద్రబాబు ప్రభుత్వం కనీసం డైట్, కాస్మొటిక్, హెయిర్ కట్ వంటి ఛార్జీల పెంపుదల మాటే పట్టించుకోలేదు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక వాటిని పెంచి అందిస్తున్నారు. ఈ వివరాలు గమనిస్తే ఈనాడు రాసినవన్నీ కట్టుకథలని ఇట్టే తేటతెల్లమవుతాయి. -
Fact Check: నిర్జీవం బాబు సంస్కృతి.. జవజీవం జగన్ జాగృతి!
చంద్రబాబు హయాంలో మూతపడిన సహకార చక్కెర కర్మాగారాలు, డెయిరీల పునరుద్ధరణకు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. తన పాదయాత్రలో పాడి రైతులకు ఇ చ్చిన హామీ మేరకు చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చిత్తూరుతో సహా రాష్ట్రంలోని చక్కెర కర్మాగారాల కార్మికులకు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిలను అణాపైసలతో సహా చెల్లించడమే కాదు..స్థానిక రైతులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఆయా ఫ్యాక్టరీల ఆవరణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టింది. ఇవేమీ పచ్చ మీడియాకు కనిపించడం లేదు. మేమంతా సిద్ధం అంటూ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు పర్యటనను పురస్కరించుకుని ‘జగన్... ఇదేనా మీ విశ్వసనీయత’ అంటూ ఈనాడు అబద్ధాలను అచ్చేసింది. వాస్తవాలను ముసుగేసి జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా విషం కక్కింది. ఈ కథనంలో రామోజీ మరుగున పెట్టిన వాస్తవాలివి... – సాక్షి, అమరావతి/ చిత్తూరు అగ్రికల్చర్ బాబు హయాంలోనే నిర్వీర్యం.. సహకార రంగంలో ఉన్న డెయిరీలనే కాదు..చక్కెర కర్మాగారాలనూ నిర్జీవం చేసిన ఘనత చంద్రబాబుదే. ఈయనగారి హయాంలో మూతపడిన చిత్తూరు, రేణిగుంట, కొవ్వూరు, ఎన్వీఆర్ జంపని సహకార చక్కెర కర్మాగారాలను దివంగత మహానేత వైఎస్సార్ అధికారంలోకి వచ్చీరాగానే పునరుద్ధరిస్తే, వాటిని మళ్లీ చంద్రబాబు మూతపడేలా చేశారు. లాభాల బాటలో నడుస్తున్న ఈ నాలుగు చక్కెర కర్మాగారాలను తన అనుయాయులకు కట్టబెట్టే లక్ష్యంతో కొరగాకుండా చేసి, వాటిని 2003–04లో మూతపడేలా చేశారు. ఫలితంగా పదింటికి తొమ్మిది మూతపడగా, ఆ ప్రభావంతో 15 ప్రైవేటు కర్మాగారాలు సైతం మూతపడ్డాయి. చిత్తూరు చక్కెర కర్మాగారాన్ని ఒక పథకం ప్రకారం నీరుగార్చి 2015 జనవరిలో మూతపడేలా చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 16 వేల మంది చెరకు రైతులు, 550 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. డెయిరీల మూతకు కారకుడు బాబే.. సహకార స్ఫూర్తితో ఏర్పాటైన వివిధ జిల్లాల పాల యూనియన్లను ప్రభుత్వ అనుమతి లేకుండానే మాక్స్ పరిధిలోకి తీసుకొ చ్చి, ఆ తర్వాత వాటిని సొంత కంపెనీలుగా తమను తాము ప్రకటించుకున్నారు. ఇలా 2016 జనవరి 6న విశాఖ మిల్క్ యూనియన్, 2013 జూన్ 18న గుంటూరు, 2013 ఫిబ్రవరి 13న ప్రకాశం జిల్లా యూనియన్లు కంపెనీల యాక్టు–1956 కింద కంపెనీలుగా మారిపోయాయి. అంతేకాదు... 1.20 లక్షల పాడి రైతుల కుటుంబాలకు జీవనాధారమైన చిత్తూరు విజయ డెయిరీని తన సొంత డెయిరీ హెరిటేజ్ అభివృద్ధి కోసం పణంగా పెట్టారు. 2002 ఆగస్టు 31న చిత్తూరు డెయిరీని మూతపడేలా చేశారు. ఇంకా.. 2017 జనవరి 23న పులివెందుల , 2018 జూలై 31న రాజమండ్రి డెయిరీలు, 2018 నవంబర్ 30న కంకిపాడు మిని డెయిరీ, 2019 మార్చి 15న మదనపల్లి డెయిరీలు చంద్రబాబు పాలనలోనే మూతపడ్డాయి. వీటిలో ఏ ఒక్క డెయిరీనీ తెరిపించేందుకు బాబు కనీస ప్రయత్నమూ చేయలేదు. పైగా ఉద్యోగులకు, రైతులకు వందల కోట్లు చెల్లించకుండా ఎగనామం పెట్టారు. బాబు ఎగ్గొట్టిన బకాయిల్ని చెల్లించిన జగన్ సర్కార్... రాష్ట్ర వ్యాప్తంగా చక్కెర కర్మాగారాలకు సంబంధించి బాబు ఎగ్గొట్టిన బకాయిలతో సహా ఈ ఐదేళ్లలో రైతులకు రూ.346.47 కోట్లు ఈ ప్రభుత్వం చెల్లించింది. ఉద్యోగులకు బకాయిపెట్టిన 72.86 కోట్లు చెల్లించింది. 2015 జనవరిలో మూతపడిన చిత్తూరు చక్కెర కర్మాగారానికి సంబంధించి 450 మంది సీజనల్ కార్మికులకు పెండింగ్లో ఉండిన రూ. 31.22 కోట్ల వేతనాలను గతేడాది జూలైలో ఒకేసారి జగన్ ప్రభుత్వమే చెల్లించింది. దీంతో ప్రతి కార్మికునికి రూ. 15 లక్షల నుంచి రూ. 35 లక్షల వరకు పెండింగ్ వేతనాలు చేతికందాయి. మరో వైపు ఉపసంఘం సిఫార్సుల మేరకు బాబు హయాంలో నీరుగారిపోయిన అనకాపల్లి, తాండవ, ఏటికొప్పాక, విజయరాయ కర్మాగారాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టినప్పటికీ సామర్థ్యానికి తగినట్టుగా చెరకు దొరకని పరిస్థితి నెలకొనడంతో స్థానిక రైతులకు లబ్ధి చేకూర్చేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇ చ్చింది. చిత్తూరు ఫ్యాక్టరీ ఆవరణలో 25 ఎకరాలను ఈ మేరకు కేటాయించగా, త్వరలోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నారు. వీటిని ప్రభుత్వమే స్వయంగా నిర్మించి లీజు పద్ధతిన వాటి నిర్వహణను మాత్రమే ఆసక్తి గల సంస్థలకు అప్పగించాలని సంకల్పించింది. కర్మాగారాల ఆస్తులపై కానీ, స్థలాలపై కానీ ఆయా సంస్థలకు ఎలాంటి హక్కులు ఉండవన్నది సుస్పష్టం. చిత్తూరు డెయిరీ అభివృద్ది ఇలా.. ఎన్నికల్లో ఇ చ్చిన హామీ మేరకు చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు చిత్తశుద్ధితో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డెయిరీకి ఉన్న రూ.182 కోట్ల అప్పులను ప్రభుత్వమే చెల్లించింది. రూ. 385 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొ చ్చిన అమూల్ సంస్థకు 99 ఏళ్ల లీజుకు ఇచ్చేందుకు అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. డెయిరీ పునరుద్ధరణ ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి , పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తొలుత రూ.150 కోట్ల అంచనాతో దేశంలోనే అతిపెద్ద ఐస్క్రీమ్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నారు. దశల వారీగా పాల కర్మాగారం, వెన్న, పాలపొడి, చీజ్, పనీరు, యాగార్ట్, స్వీట్ల తయారీ విభాగాలతో పాటు అల్ట్రా హై ట్రీట్మెంట్ (యూహెచ్టీ) ప్లాంటునూ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే రూ.35 కోట్ల మేరకు వె చ్చించి 20 లక్షల లీటర్ల సామర్థ్యం గల ప్రాసెసింగ్ యూనిట్ భవన నిర్మాణ పనులు చేపట్టింది. వే బ్రిడ్జి , ప్రధాన గేటు నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. వెన్న, నెయ్యి ప్రాసెసింగ్ ¿యూనిట్ నిర్మాణ పనులూ చురుగ్గా జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా డెయిరీ నిర్మాణ పనులు పూర్తి చేసి పాడి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. కార్మికులనూ ఆదుకున్నది ఈ ప్రభుత్వమే.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే 2015 జనవరిలో చిత్తూరు సుగర్ ఫ్యాక్టరీని ఉద్దేశ్యపూర్వకంగా చంద్రబాబు ప్రభుత్వం మూసేసింది. ఈ చర్యతో కార్మిక కుటుంబాలు వీధిన పడ్డాయి. కనీసం పెండింగ్ వేతనాలైనా చెల్లించాలని అప్పటి బాబు ప్రభుత్వాన్ని పలుమార్లు వేడుకున్నా ఏమాత్రం కనికరించలేదు. ప్రస్తుత జగన్ ప్రభుత్వం కార్మికులకు పదేళ్లుగా పెండింగ్లో ఉండిన రూ. 31.22 కోట్ల వేతనాలను ఒక్కసారిగా చెల్లించి ఆదుకుంది. – కేశవరెడ్డి, కార్మికుడు, చిత్తూరు సుగర్ ఫ్యాక్టరీ -
Fact Check: బూటకాల బాబుకు రామోజీ బాకా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మైనారిటీలకు మేజర్ మేలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రామోజీ మరోసారి విషం చిమ్మారు. వైఎస్సార్సీపీకి ముస్లిం మైనారీటీలు అండగా ఉన్నారని గుర్తించిన దినకంత్రీ పత్రిక ఈనాడులో తప్పుడు కథనం వండివార్చారు. వాస్తవాలను వక్రీకరించి చంద్రబాబుకు బాకా ఊదారు. మైనారిటీలను మోసం చేసిన జగన్ అంటూ గగ్గోలు పెట్టారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మైనారిటీలకు అందించిన సాయం, సీఎం వైఎస్ జగన్ సర్కార్ అందించిన ఆర్థిక లబ్ది అధికారిక లెక్కలను గమనిస్తే నిజానికి మైనారిటీలకు ధోకా ఇచ్చింది ఎవరో ఇట్టే అర్థమవుతోంది. బాబు చేసిన అరకొర సాయాన్ని భూతద్దంలో చూపే యత్నం చేస్తున్న రామోజీ పచ్చకళ్లకు సీఎం వైఎస్ జగన్ నవరత్నాలతో మైనారిటీలకు కల్పించిన ఆర్థిక భరోసా కన్పించలేదు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో మైనారిటీలకు సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ పద్ధతిలో రూ.13,239.49 కోట్లు నేరుగా వారి ఖాతాలకే జమ చేశారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, జగనన్న తోడు వంటి కార్యక్రమాల ద్వారా (నాన్ డీబీటీ) మరో రూ.11,064.88 కోట్లు ప్రయోజనం చేకూర్చారు. ఐదేళ్లలో మొత్తం రూ.24,304.37 కోట్ల మేర మైనారిటీలకు లబ్ధి చేకూర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతోంది. మైనారిటీలకు ధోకా ఇచ్చింది బాబే.. ముస్లిం మైనారిటీ ర్గాల సంక్షేమానికి 2014 మేనిఫెస్టోలో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయలేదు. హజ్ యాత్రికుల సౌకర్యం కోసం విశాఖపట్నం, విజయవాడ, రేణిగుంటలో హజ్ హౌస్ల నిర్మాణం హామీ కార్యరూపం దాల్చలేదు. ముస్లిం జనాభా ప్రాతిపదికగా దామాషా ప్రకారం బడ్జెట్లో నిధులూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లూ కేటాయిస్తానన్న హామీనీ బాబు అటకెక్కించారు. వక్ఫ్ ఆస్తుల రికార్డులను పక్కాగా తయారు చేసి వాటిని పరిరక్షిస్తామని చెప్పి మోసం చేశారు. నిరుద్యోగ ముస్లిం యువత స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షలు, వ్యాపారం కోసం రూ.లక్ష వడ్డీలేని రుణాలు ఇస్తామని అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వడ్డీలేని ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని ఇచ్చిన ప్రధాన హామీనీ అమలు చేయలేదు. అయినా అప్పుడు బాబు ఘనకార్యాలు రామోజీ పచ్చకళ్లకు కనిపించలేదు. ఆరోపణ: ఇదీ వైకాపా ఘనకార్యం వాస్తవం: స్వయం ఉపాధి రుణాల కోసం నిధులు కేటాయించి అమలు చేయలేదని ఈనాడు అడ్డగోలుగా రాసింది. వాస్తవానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక మైనారిటీలకు శాశ్వత జీవనోపాధి చూపించేలా వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా వంటి పథకాలను ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ ఐదేళ్ల కాలంలో చేయూత ద్వారా 2,24,334 మంది మైనారిటీలకు రూ.1,613.25 కోట్లు అందించింది. ఆసరా పథకం ద్వారా 1,69,412 మందికి రూ.583.01 కోట్లు అందించి వారికి అండగా నిలిచింది. ఆరోపణ: రాయితీ రుణాలకూ పాతర వాస్తవం: 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 36.18 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వారిలో అత్యధిక శాతం మంది చిరు వ్యాపారులు, చేతివృత్తుల వారు ఉండటంతో వారికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండదండలు అందిస్తోంది. గత ప్రభుత్వం మాదిరిగా అరకొర సాయం చేసి చేతులు దులుపుకోకుండా వారికి స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేలా, ఆర్థిక, సామాజిక, రాజకీయ చేయూతను అందించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. నవరత్నాలతోపాటు అనేక కార్యక్రమాల ద్వారా వారి జీవనోపాధికి ఊతమిచ్చేలా చేయడంలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, జగనన్న చేదోడు, జగనన్న తోడు, వైఎస్సార్ వాహన మిత్ర వంటి అనేక పథకాలతో మైనారిటీలకు పెద్ద మేలు చేశారు. ఆరోపణ: ఇమామ్లు.. మౌజమ్లకు వెన్నుపోటే వాస్తవం: రాష్ట్రంలో మసీదుల్లో పనిచేసే ఇమామ్లు, మౌజమ్లకు ఆర్థిక సాయం అందించే విషయంలో ఈనాడు చంద్రబాబు గొప్పులు ఘనంగా చెప్పే యత్నం చేసింది. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం అరకొరగా ఆర్థిక సాయం అందిస్తే దాన్ని పెంచి మరీ అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్కు దక్కుతోంది. గత ప్రభుత్వం మౌజమ్లకు రూ.3 వేలు, ఇమామ్లకు రూ.5 వేలు మాత్రమే అందించింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మౌజమ్లకు రూ.5 వేలు, ఇమామ్లకు రూ.10 వేలు ఆర్థిక సాయం పెంచి జగన్ అందిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఇమామ్లు, మౌజన్లకు గౌరవ వేతనంగా రూ.300.68 కోట్లు అందించింది. దీనికితోడు వారికి భరోసా ఇచ్చేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వన్టైమ్ ఫైనాన్సియల్ అసిస్టెన్సీ ఇచ్చింది. తెల్లకార్డుదారులకు స్పెషల్ కోవిడ్ అసిస్టెన్సీగా మైనార్టీలకు సుమారు రూ.100 కోట్లు అందించింది. షాదీతోఫా ద్వారానూ ఆర్థిక సాయాన్ని పెంచి అందించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దక్కింది. ఆరోపణ: తేదేపా హయాంలో రూ.248 కోట్ల రుణాలు వాస్తవం: టీడీపీ ప్రభుత్వంలో గొప్పగా రుణాలు ఇచ్చినట్టు రామోజీరావు బాకాలు ఊదారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనారిటీల సామాజిక ఆర్థిక అభివృద్ధి, శిక్షణ, విద్యాభివృద్ధి కోసం బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చినట్టు గొప్పలు పోయారు. వాస్తవానికి 2014 నుంచి 2019 వరకు బ్యాంకుల ద్వారా ఇచ్చిన రుణాలకు టీడీపీ ప్రభుత్వం రూ.343.52 కోట్లు కేటాయించి రూ.248.51 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం శోచనీయం. ఐదేళ్లలో కేటాయించిన నిధులూ లబ్దిదారులకు ఖర్చు చేయలేని దారుణమైన పరిస్థితి గత ప్రభుత్వానిది. మరోవైపు మైనారిటీల శిక్షణ–ఉపాధి పథకంలో 2014 నుంచి 2019 వరకు కేవలం రూ.62 కేటాయించి అందులోనూ రూ.53.89 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం గమనార్హం. అదీ తొలి ఏడాది కేవలం రూ.4.30 కోట్లు కేటాయించి, ఎన్నికల ముందు మాత్రం గొప్పలు చెప్పుకొనేందుకు రూ.16.80 కోట్లు కేటాయించారు. బాబుకు రామోజీ చేస్తున్న భజనను జనం నమ్మరు చంద్రబాబు రాజకీయ ప్రయోజనం కోసం రామోజీ ఎంత బాజా వాయించినా జనం నమ్మే స్థితిలో లేరు. నవరత్నాల ద్వారా ఆర్థిక లబ్ధిని చేకూర్చే అనేక పథకాలను అందించడంతోపాటు మైనారిటీలకు శాశ్వత జీవనోపాధి కోసం సీఎం వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలు చేపట్టారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముస్లింలను సీఎం వైఎస్ జగన్ చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తున్నారు. వైఎస్సార్ నాలుగు శాతం రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టడంతో ముస్లిం యువత వేలాది మంది బాగా చదువుకుని నేడు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా పలు రంగాలలో స్థిరపడి సామాజికంగా అభివృద్ధి చెందారు. అందుకే ఆ మహానేత వైఎస్సార్ని ముస్లిం సమాజం గుండెల్లో పెట్టుకుంది. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి కంటే పది అడుగులు ముందుకు వేసి ముస్లింలకు మేలు చేస్తున్నారు. 2019 ఎన్నికలలో ముస్లింలకు ఐదు సీట్లు ఇచ్చారు. నాలుగు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి, శాసన మండలి డెప్యూటీ చైర్మన్గా అవకాశం కల్పించడమే కాకుండా నామినేటెడ్, స్థానిక సంస్థల పదవుల్లోనూ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ సీట్లు ముస్లింలకు ఇచ్చి మరింత ఆదరణ చూపిన సీఎం వైఎస్ జగన్కు ముస్లిం సమాజం అండగా ఉంటుంది. – డాక్టర్ మీర్చా షంషీర్ ఆలీబేగ్, చైర్మన్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ -
Fact Check: ‘ప్రగతి’ రథంపై ‘పచ్చ’ బురద
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం హయాంలో నెలనెలా అప్పులు చేస్తూ, డొక్కు బస్సులతో ముక్కుతూ మూలుగుతూ నడిచే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి బాటలో నడిపించారు. ఉద్యోగులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా సిబ్బందికి మేలు చేయడమే కాకుండా, సంస్థపై పెను ఆర్థిక భారాన్ని తొలగించారు. సీఎం వైఎస్ జగన్ చర్యలతో ఆర్టీసీ ఇప్పుడు కొత్త బస్సులతో కళకళలాడుతోంది. ఉద్యోగులందరూ నెలనెలా సక్రమంగా జీతాలు, అలవెన్సులు పొందుతూ సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో ఏ ఆర్టీసీ ఉద్యోగిని అడిగినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారికి చేసిన మేలును వివరిస్తారు. కానీ, రామోజీ నేతృత్వంలోని పచ్చ మీడియా, పచ్చ పార్టీలకు కావాల్సింది ఇది కాదు. ఆర్టీసీ ఉద్యోగులు, ఆ సంస్థ నిత్యం సమస్యలతో సతమతమవుతుంటే చూసి ఆనందించే బ్యాచ్ ఇది. సహజంగానే వారికి మంచి అనేది నచ్చదు కాబట్టి ఈనాడులో రామోజీ ఆర్టీసీపై ఓ కుట్రపూరిత బురద కథనాన్ని అచ్చే శారు. అవాస్తవాలు, అభూతకల్పనలతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. ఆర్టీసీ సాధించిన ప్రగతి ఏమిటో ఓ సారి చూద్దాం.. 1,406 కొత్త బస్సులు కొనుగోలు దశాబ్దాలుగా ఆర్టీసీ కొత్త బస్సులు కొనలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలు వేగవంతం చేసింది. 2019 – 20లో 406 బస్సులు కొనుగోలు చేసింది. పాత బస్సుల స్థానంలో 900 సరికొత్త డీజీల్ బస్సులను ప్రవేశపెట్టింది. అంతేకాదు రాష్ట్రంలో తొలిసారిగా ఇ–బస్సులను ప్రవేశపెట్టింది. తిరుమల – తిరుపతి ఘాట్రోడ్డుతో పాటు తిరుపతి సమీప పట్టణాల్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టిన ఘనత కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే. రెండేళ్లపాటు కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ 2019 నుంచి 2023 మధ్య ఆర్టీసీ 1,406 కొత్త బస్సులను కొనుగోలు చేసింది. తాజాగా 1,500 కొత్త డీజిల్ బస్సుల కొనుగోలు ప్రక్రియను చేపట్టింది. ఆర్డర్లు కూడా జారీ చేసింది. మరో 1,125 డీజిల్ బస్సుల కొనుగోలు చేయనుంది. మరో వేయి విద్యుత్ బస్సుల కొనుగోలుకు నిర్ణయించింది. 2024 – 25లో 950 విద్యుత్ బస్సులతోపాటు రానున్న ఐదేళ్లలో దశలవారీగా 7వేల విద్యుత్ బస్సుల కొనుగోలు ప్రణాళికను ఆర్టీసీ ఆమోదించింది. మరోవైపు కొత్త బస్సుల తయారీకి బిల్డింగ్ యూనిట్లు ప్రారంభించింది. ఉన్నత ప్రమాణాలతో బస్సుల నిర్వహణ బస్సుల సక్రమ నిర్వహణపై ఆర్టీసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 15 ఏళ్లు పూర్తి చేసుకున్న 214 పాత బస్సులను తొలగించింది. మరోవైపు బస్సుల మెరుగైన నిర్వహణకు ఉన్నత ప్రమాణాలను పాటిస్తోంది. బస్సుల విడిభాగాల కొనుగోలు, ఇతర నిర్వహణ వ్యయం కోసం గత నాలుగేళ్లలో ఆర్టీసీ పూర్తిస్థాయిలో నిధులు కేటాయించింది. గత ఐదేళ్లలో నిర్వహణ నిధులిలా.. 2020–21, 2021–22లో కోవిడ్ మొదటి, రెండో వేవ్లలో ఆర్టీసీ బస్సు సర్వీసులను బాగా కుదించింది. దాంతో స్పేర్ పార్టుల కోసం బడ్జెట్ ప్రతిపాదనలు తగ్గాయి. 2021–22, 2022–23, 2023–24లో పూర్తిస్థాయిలో బస్సులను పునరుద్ధరించింది. అందుకు తగ్గట్టుగా ప్రత్యేక నిర్వహణ వ్యయం కింద రూ.50 కోట్లు ఖర్చు చేసింది. ఉద్యోగుల జీవితాల్లో నవోదయం 2019కి ముందు ఆర్టీసీ చరిత్ర మొత్తం జీతాల కోసం నెలనెలా అప్పులు చేయడమే అన్నట్టుగా ఉండేది. ఉద్యోగుల జీతాల కోసం నెలకు అయ్యే ఖర్చు దాదాపు రూ.300 కోట్లు అప్పు చేస్తేనే చెల్లింపులు అన్నట్లుగా ఉండేది. ఆ అప్పుల మీద ఏడాదికి వడ్డీల భారమే దాదాపు రూ.350 కోట్లు. కానీ సీఎం వైఎస్ జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో సంస్ధ దశ, దిశ మారిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం నంబర్లు కేటాయించి సీఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు నెలనెలా సక్రమంగా చెల్లిస్తోంది. ఇందుకోసం ఏడాదికి రూ.3,600 కోట్ల భారాన్ని మోస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లపాటు ఆర్టీసీ రాబడి గణనీయంగా తగ్గినప్పటికీ, ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో ఎటువంటి లోటు రాలేదు. జీతాల భారం లేకపోవడంతో ఆర్టీసీ క్రమంగా నష్టాల ఊబి నుంచి బయటపడుతోంది. 2020 జనవరి నాటికి ఆర్టీసీకి దాదాపు రూ.4 వేల కోట్ల అప్పులుండగా, ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుండటంతో ఇప్పటికే ఆర్టీసీ రూ.2 వేల కోట్ల అప్పులు తీర్చేసింది. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం అందిస్తున్న మరిన్ని ప్రయోజనాలు ♦ పీఎఫ్ చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయి. ♦ ఆర్టీసీ ఉద్యోగుల పరపతి సహకార సొసైటీకి 2014 నుంచి ఉన్న బకాయిలు రూ.200 కోట్లను యాజమాన్యం చెల్లించింది. దాంతో సొసైటీ ద్వారా ఉద్యోగులు కొత్తగా రుణాలు పొందుతున్నారు. ♦ ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ (ప్రమాద బీమా) ప్యాకేజీని మొదట రూ.45 లక్షలకు, ఆ తర్వాత ఏకంగా రూ.1.10 కోట్లకు ప్రభుత్వం పెంచడం విశేషం. ♦ ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచింది. ♦ 2020 జనవరి తరువాత రిటైరైన ఉద్యోగుల గ్రాట్యుటీ కోసం రూ.23.25 కోట్లు, ఉద్యోగ విరమణ ప్రయోజనాల కోసం రూ.271.89 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ♦ ఏపీ గవర్నమెంట్ ఇన్సూ్యరెన్స్ స్కీమ్ ద్వారా 55 ఏళ్లకంటే ఎక్కువ వయసు ఉన్న 44,500 మందికి ప్రయోజనం కలుగుతోంది. ఈ పథకాన్ని ఆర్టీసీ ఉద్యోగులకూ వర్తింపజేశారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను కూడా ఉద్యోగులు పొందుతున్నారు. ♦ 2016 నుంచి పెండింగులో ఉన్న కారుణ్య నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. ♦ 2020 జనవరి 1 తరువాత అనారోగ్య సమస్యలతో ఉద్యోగ విరమణ చేసిన 100 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులకు ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ♦ 2016 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్ 31 మధ్య మరణించిన 845 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులకు, 2020 జనవరి 1 తరువాత మరణించిన 955 మంది ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు కారుణ్య ఉద్యోగాలిచ్చింది. ♦ ఉద్యోగుల డిమాండ్ మేరకు ఆర్టీసీలో రెండు కేటగిరీలుగా పదోన్నతుల విధానాన్ని ఆమోదించింది. ప్రభుత్వంలో విలీనానికి ముందు ఉన్న ఉద్యోగులకు ఆర్టీసీ సర్వీసు నిబంధనల ప్రకారం, ఆ తరువాత చేరిన ఉద్యోగులకు ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారం పదోన్నతులు కల్పిస్తారు. ♦ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ, ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం జీతంతోపాటే అలవెన్స్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
Fact Check: పర్యాటకంపై రామోజీ నాటకం
సాక్షి, అమరావతి : నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఈనాడు రామోజీరావు. నిత్యం తన క్షుద్ర పత్రికలో వండివారుస్తున్న అశుద్ధ కథనాలు చూసి పాఠకులు ఛీకొడుతున్నా ఆయన సిగ్గూఎగ్గూ లేకుండా బాబు పల్లకిని మోయడమే పనిగా పెట్టుకున్నారు. గ్రాఫిక్స్ బొమ్మలు, కనికట్టు కథనాలతో అప్పట్లో ప్రజల్ని మభ్యపెట్టిన బాబు మాదిరిగా రామోజీ కూడా ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు రంగరించి తన ఈనాడులో అభూతకల్పనలను అచ్చోస్తున్నారు. తాజాగా.. రాష్ట్రంలో టూరిజం రంగంపై ఆయన కక్కింది కూడా అక్షరాల విషమే. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచినా.. జాతీయ స్థాయిలో ఉత్తమ పర్యాటక గ్రామంగా ‘లేపాక్షి’ ఘనత సాధించినా.. అలాగే, ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో తాత్కాలిక జాబితాలోనూ ఏపీ చోటు దక్కించుకున్నా.. విశాఖలోని రుషికొండ బీచ్కు వరల్డ్ ఫేమస్ ‘బ్లూఫ్లాగ్’ సర్టిఫికేషన్ రావడంతో అక్కడ వరుసగా నాలుగేళ్లుగా బ్లూఫ్లాగ్ జెండా రెపరెపలాడుతున్నా.. అలాగే.. గతేడాది జీఐఎస్ సదస్సుల్లో ఏకంగా రూ.17వేల కోట్లకు పైగా పెట్టుబడులు పర్యాటక పెట్టుబడులు వెల్లువెత్తినా బాబు జాకీ లిఫ్టర్ రామోజీకి ఇవేమీ కనపడవు. నిజానికి.. ఇదంతా దేశంలోనే అత్యుత్తమ పర్యాటక పాలసీని సీఎం వైఎస్ జగన్ తీసుకురావడంవల్లే పెట్టుబడిదారులు క్యూ కట్టారనేది ఎవరూ కాదనలేని సత్యం. కరోనా రెండేళ్ల కాలం మినహా.. మిగిలిన మూడేళ్లలోనే ఇది సాధ్యపడింది. కానీ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి ఏపీ పర్యాటకానికి దక్కిన దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో.. ప్రపంచ పర్యాటకం మొత్తం ఏపీ వైపు చూస్తుంటే.. కళ్లకు టీడీపీ గంతలు కట్టుకున్న గురవింద రామోజీ మాత్రం కళ్లుండీ కబోదిలా నటిస్తున్నారు. సీఎం జగన్ ప్రభుత్వం చేస్తున్న ఏ ఒక్క మంచిని చెప్పకపోగా.. ప్రజల మెదళ్లలో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక అంశాన్ని భుజానకెత్తుకుని టన్నుల కొద్దీ అసత్యాలతో ‘ఈనాడు’లో నింపి పారేస్తున్నారు. ఇందులో భా గమే శుక్రవారం ‘పర్యాటకం.. పక్కా నాటకం’ అంటూ ఈనాడు వండిన ఓ ఫక్తు నాటకీయ కథనం. అప్పట్లో బీచ్లలో అశ్లీలత ప్రోత్సాహానికి కుట్ర ఇక అప్పట్లో పర్యాటకం ముసుగులో చంద్రబాబు సంప్రదాయలకు పాతరేశారు. విశాఖ బీచ్లో లవ్ ఫెస్టివల్ పేరుతో అశ్లీలతను ప్రోత్సహించే కుట్రకు తెరతీశారు. దీనిపై ప్రజలు, మేధావుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే రామోజీకి పర్యాటకాభివృద్ధిగా కనిపిస్తుందంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. చంద్రబాబు బీచ్లను బహిరంగ అశ్లీలతకు వాడుకోవాలని చూస్తే ప్రస్తుత ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా 288 బీచ్లను గుర్తించి అత్యాధునిక మౌలిక వసతులు కల్పించి కోస్టల్ జోన్ టూరిజాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. ఇందులో భాగంగా విశాఖలో క్రూయిజ్ టెర్మినల్ను సైతం అందుబాటులోకి తెచ్చింది. కానీ, చంద్రబాబు ప్రచార పిచి్చతో రూ.కోట్ల ప్రజాధనాన్ని వృథాగా ఖర్చుచేయడాన్ని రామోజీ ఒక్కసారి కూడా ప్రశ్నించిన పాపాన పోలేదు. రికార్డు స్థాయిలో ఏపీటీడీసీ ఆదాయం.. ప్రపంచ పర్యాటకం మొత్తం కరోనాతో కుదేలైన రోజుల్లోనూ ఏపీ పర్యాటకం అత్యంత వేగంగా బలోపేతమైంది. ఏపీటీడీసీ ఆదాయాన్ని టీడీపీ ఐదేళ్ల పాలనతో పోలిస్తే రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసింది. 2022–23లో ఏకంగా రూ.162.25 కోట్ల టర్నోవర్ సాధించింది. 2021–22తో పోలిస్తే 10.82 శాతం వృద్ధిని నమోదు చేసింది. విచిత్రంగా 2017–18లో టీడీపీ హయాంలో మాత్రం రూ.1.99 కోట్ల లోటుతో ఆర్థిక సంవత్సరాన్ని ముగించడం గమనార్హం. మరి రామోజీ చెబుతున్న పర్యాటకం కుంటుపడితే ఒక్క హరిత హోటళ్లు, బోటింగ్ ద్వారా ఇంత వృద్ధి ఎలా సాధ్యపడుతుందో రామోజీనే చెప్పాలి. మరోవైపు.. నాస్తికత్వపు వాసనలు పోని రామోజీ టీటీడీ టూర్ ప్యాకేజీలపైనా విషం చిమ్మారు. సెంట్రలైజ్డ్గా అత్యాధునిక సౌకర్యాలతో ఉత్తమ రవాణా మార్గాల్లో సేవలందిస్తుంటే.. పర్యాటక సంస్థ ఆదాయానికి గండి కొట్టేస్తున్నట్లు ఆయన గుండెలు బాదుకున్నారు. కేంద్రం మెచ్చిన ఏపీ.. ఇక రూ.200 కోట్లతో అరకు, గండికోట అభివృద్ధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో గండికోట ప్రాంతంలో 4,336 ఎకరాల్లో పర్యాటక సిటీని అభివృద్ధి చేయనున్నారు. అరకు లోయలోనూ సుందర హోటళ్లు, అడ్వెంచర్, ఎకో పర్యాటకానికి ప్రణాళిక సిద్ధమయ్యాయి. సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, విజయవాడ దేవాలయాలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. అహోబిళం, నాగార్జునసాగర్ను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. రూ.3వేల కోట్ల పనులకు శ్రీకారం.. జీఐఎస్లో చేసుకున్న ఒప్పందాల్లో దాదాపు రూ.3,049.90 కోట్ల విలువైన సివిల్ వర్క్స్ ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తయితే 9,022 మందికి ఉపాధి రెడీగా ఉంటుంది. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కింద రూ.600 కోట్లతో 7వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. మరో రూ.3,757 కోట్లతో 2,750 మందికి ఉపాధి కల్పించేలా 15 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద (ఓ అండ్ ఎం) 87 ప్రాజెక్టులను పట్టాలెక్కించింది. అప్పట్లో అద్దె సూట్లు తొడిగేసి.. వాస్తవానికి.. చంద్రబాబు హయాంలో ప్రచార పిచ్చి పీక్స్లో ఉండేది. గ్రాఫిక్స్ బొమ్మలు, కనికట్టు సదస్సులతో ప్రజలను నిరంతరం మభ్యపెడుతూనే ఉండేవారు. విశాఖలో పెట్టుబడుల సదస్సు పేరుతో రోడ్ల పక్కన కనిపించిన ప్రతిఒక్కరికీ అద్దె సూట్లు తొడిగేసి మరీ వారికి పెట్టుబడిదారుల కలరింగ్ ఇచ్చేశారు. రూ.వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నట్లు వారితో దొంగ ఒప్పందాలు చేసుకున్నారు. ఇదంతా జగమెరిగిన సత్యం. అప్పట్లో పర్యాటక రంగంలో తన అనుయాయులకు తప్ప మిగిలిన ఎవరికీ ఒక్క కాంట్రాక్టు, లేదా ఒక్క ఉద్యోగం కూడా రాలేదంటే చంద్రబాబు పాలనంతా పైన పటారం లోన లొటారం అనే స్పష్టమైంది. ఇక వీటినే రామోజీరావు గొప్పగా కీర్తిస్తూ పతాక శీర్షకల్లో బాబుకు నిర్లజ్జగా భజన చేసి ప్రజలను దగా చేశారు. కానీ, సీఎం జగన్ దార్శనిక పిలుపుతో గతేడాది విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ (జీఐఎస్)లో మొత్తం రూ.13.11 లక్షల కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంటే.. ఒక్క పర్యాటక రంగంలోనే 117 ఒప్పందాల ద్వారా రూ.17,127 పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 39,170 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వచ్చేలా ప్రణాళిక రచించారు. కానీ, చంద్రబాబు దొంగ ఒప్పందాలను అడ్డగోలుగా కీర్తించిన అదే రామోజీరావు.. సీఎం జగన్ పాలనలో వాస్తవాలకు పాతరేస్తూ దు్రష్పచారానికి తెగబడడం సిగ్గుచేటు. ఆతిథ్య ఆంధ్ర.. మరోవైపు.. సీఎం జగన్ సారథ్యంలో ఆతిథ్య రంగం అభివృద్ధి బాట పడుతోంది. అంతర్జాతీయ స్థాయి లగ్జరీ హోటల్ రంగ సంస్థలైన ఒబెరాయ్, హయత్, తాజ్ గ్రూప్తో పాటు దేశీయ సంస్థలైన గార్రిసన్ కన్స్ట్రక్షన్, మేఫెయిర్ హోటళ్లు వచ్చాయి. అత్యాధునిక సౌకర్యాలతో రిసార్ట్స్ (ఇండిపెండెంట్ విల్లా), స్టార్ హోటళ్ల నిర్మాణంతో ఈ రంగంలో మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని ఐదు ప్రదేశాల్లో రూ.1,350 కోట్ల అంచనాతో 7–స్టార్ సౌకర్యాలతో లగ్జరీ రిసార్ట్స్ నిర్మాణానికి ఒబెరాయ్ ముందుకొచ్చింది. ఇప్పటికే విశాఖ (అన్నవరం), తిరుపతి (పేరూరు), గండికోటలో నిర్మాణాలకు ఒప్పందాలు పూర్తయ్యా యి. ఇక్కడ శంకుస్థాపనలు జరగ్గా త్వరలో పనులు ప్రారంభంకానున్నాయి. ఒక్క ఒబెరాయ్ సంస్థల ద్వారానే సుమారు 11వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. తిరుపతిలో నోవోటెల్ సంస్థ రూ.125 కోట్లతో మూడువేల మందికి ఉపాధి, విశాఖపట్నలో మేఫెయిర్ సంస్థ రూ.525 కోట్లతో, మరో రూ.404 కోట్లతో హయత్ రీజెన్సీ ఫైవ్స్టార్ హోటళ్లు నిర్మాణానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే విజయవాడలో సుమారు రూ.100 కోట్లతో హయత్ న్యూ లగ్జరీ స్టార్ హోటల్, గుంటూరులో ఐటీసీ హోటళ్లు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. చంద్రబాబు హ యాంలో ఇలాంటి అభివృద్ధి లేకపోగా విదేశీ యులను తీసుకొచ్చి పర్యాటకంలో విపరీతమై న దుబారా ఖర్చులు చేశారు. బహుశా రామోజీకి రూపాయి రాక కంటే.. రూపాయి ఖర్చుచేయడమే అభివృద్ధిగా కనిపించినట్లుంది. -
Fact Check: ‘ఓట్లాటమీ ఓటి కుండదే’
సాక్షి, అమరావతి: ‘ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే’ అంటూ ఎద్దేవా చేసి..తాను అధికారంలో ఉన్నన్నాళ్లూ కనీసం రోజుకి మూడు,నాలుగు గంటలు కూడా వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వకుండా..రైతులను అష్టకష్టాలు పెట్టారు చంద్రబాబు. అలాంటి నయవంచకుడిని భుజానకెత్తుకుని..ఆయన ప్రాపకం కోసం భజన వార్తలు రాస్తూ రామోజీ రోజురోజుకీ దిగజారిపోతున్నారు. ప్రతి రోజూ అవాస్తవాలను అచ్చేస్తూ అడుగడుగునా అబద్దాలు చెప్పుకొస్తూ నిస్సిగ్గుగా ప్రస్తుత ప్రభుత్వంపైనా, సీఎం వైఎస్ జగన్పైనా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ‘జగన్ ఓట్లాటలో ఓడిన రైతు!’ శీర్షికతో ఓ నిరాధార వార్తా కథనాన్ని గురువారం అచ్చేశారు డ్రామోజీ. ఆ కథనం వెనుక వాస్తవాలను పరిశీలిస్తే..అసలు నిజాలు ఇలా ఉన్నాయి. ఆరోపణ: అనంతపురం జిల్లా కణేకల్ మండలం ఉద్దేహాళ్ గ్రామంలో లోకన్న అనే రైతు విద్యుత్ సమస్య కారణంగా మూడెకరాల్లో పైరు పశువుల మేత కింద వదిలేశారు. ఇదే గ్రామంలో మరో రైతు ఎర్రిస్వామికి చెందిన పదెకరాల్లో నాలుగెకరాల పైరు ఎండిపోయింది. రాయదుర్గం నియోజకవర్గం పరిధిలో 1200 ఎకరాల్లో వివిధ పంటలు ఎండిపోయాయని అంచనా. వాస్తవం: లోకన్న, అనే రైతుకు ఆరెకరాల పొలం ఉంటే దానికి నీరందించడానికి ఒకే బోరు ఉంది. కానీ ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు తక్కువగా ఉండటం వల్ల ఆ బోరు నుంచి నీరు సరిగ్గా రావడం లేదు. దీని వల్ల అన్ని ఎకరాలకు సరిపడా నీరు అందించలేకపోతున్నారు. ఇదే పరిస్ధితి ఎర్రిస్వామిది కూడా. ఈ కారణంగానే కొంత పొలాన్ని వారు వదిలేయాల్సి వచ్చింది. అంతే తప్ప కరెంటు అందక కాదు. కానీ ఈనాడు మాత్రం వాస్తవాన్ని వక్రీకరించి తమకు అనుకూలంగా అచ్చేసుకుంది. అలాగే 1,200 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని అధికారిక ధృవీకరణలేమీ లేకుండా కాకి లెక్కలు రాసేసుకుంది. ఆరోపణ: కర్నూలు జిల్లా తుగ్గలికి చెందిన కౌలు రైతు గుండాల ఆంజనేయులు సాగునీరు పూర్తిగా అందదని ముందే గ్రహించి నాలుగెకరాల్లో రెండెకరాలు బీడుపెట్టారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు, ఉదయం పది గంటలకు రెండు విడతల్లో విద్యుత్ ఇవ్వడం వల్ల నీరు చాలక దిగుబడి దెబ్బతిందని ఆయన వాపోతున్నారు. వాస్తవం: నాలుగెకరాలు కౌలుకి తీసుకున్న రైతుకి రెండెకరాలకే నీరందుతుందని ముందే తెలిసిందంటే దానికి కారణం బోరు నుంచి వచ్చే తక్కువ నీరని ఏ రైతుకైనా ఇట్టే అర్ధం అవుతుంది. ఇక రెండు విడతల్లో విద్యుత్ కూడా రైతుల విజ్ఞప్తి మేరకే అధికారులు ఇస్తున్నారు. అయినా ఈనాడు చెప్పినట్లు తెల్లవారు జామున నాలుగు గంటలకు, ఉదయం పది గంటలకు విద్యుత్ ఇవ్వడం అంటే రైతులకు అనుకూలంగా ఉండే సమయాల్లో ఇస్తున్నట్టే. గ్రామాల్లో ఏ రైతైనా నాలుగు గంటలకే నిద్రలేచి పొలానికెళ్లి పశువులను, పంట పనులను చూసుకోవడం పరిపాటి. చంద్రబాబు హయాంలో అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారు జామున 3 గంటల మధ్య ఇచ్చేవారు.అది కూడా ఎప్పుడు వస్తుందో, ఎప్పడు పోతుందో తెలిసేది కాదు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదని ఈ రాతలతో ఈనాడే ఒప్పుకుంది. కాదంటారా డ్రామోజీ. ఆరోపణ: థర్మల్ ప్లాంట్లు పరిగెత్తుతూనే ఉన్నాయి. ఒత్తిడి పెట్టి ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏముంది. వాస్తవం:రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు గతంతో పోల్చితే అత్యంత భారీగా సామరŠాధ్యన్ని పెంచుకున్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో గతేడాది మార్చిలో 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. ఎన్టీటీపీఎస్లో ఎనిమిదో యూనిట్ సీఓడీ డిసెంబర్లో జరిగింది. దీంతో జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 5,810 మెగావాట్ల నుంచి 6,610 మెగావాట్లకు పెరిగింది. అలాగే డాక్టర్ ఎన్టీటీపీఎస్ ఆపరేషన్, మెయింటెనెన్స్ యూనిట్ల లభ్యత శాతం 2022–23 ఆర్థిక సంవత్సరంలో 69.90 శాతం ఉంటే, 2023–24లో 75.83 శాతానికి పెరిగింది. డాక్టర్ ఎన్టీటీపీఎస్ స్టేజ్–4 యూనిట్ హీట్ రేట్ 2,517 కిలో వాట్ అవర్ నుంచి 2,436 తగ్గింది. అదే విధంగా డాక్టర్ ఎంవీర్ ఆర్టీపీపీ స్టేషన్ యూనిట్ల లభ్యత 67.85 శాతం నుంచి 75.68 శాతానికి మెరుగుపడింది. ఫలితంగా సామర్థ్యాన్ని మించి దాదాపు 10 మెగావాట్ల అధిక విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. దీంతో ఏపీ మొత్తం విద్యుత్ డిమాండులో ఏపీజెన్కో 45 నుంచి 50 శాతం వరకూ సమకూర్చుతోంది. ఆరోపణ: ఎన్నికల ఏడాది కావడంతో గృహ విద్యుత్ వినియోగదారులకు కోతలు పెడితే ఓట్లకు నష్టం కలుగుతుందని సీఎం ఆలోచన. పీక్ డిమాండ్ సమయంలో అధిక ధరకు విద్యుత్ కొనాలన్నా దొరికే పరిస్థితి లేదు.ప్రత్యామ్నాయంగా సేద్యానికిచ్చే విద్యుత్లో రోజుకు రెండు గంటలు కోతలు పెట్టారు. వ్యవసాయ విద్యుత్ కోసం రూ.10058 కోట్లు వెచ్చించినా ఫలితం లేదు. వాస్తవం: మధ్యాహ్నం పీక్ డిమాండ్ 12476 మెగావాట్లుగా ఉంది. ఇది గతేడాది ఇదే సమయానికి 10643 మెగావాట్లు మాత్రమే ఉండేది. అంటే 17.22 శాతం పెరిగింది. సాయంత్రం పీక్ డిమాండ్ కూడా 8965 మెగావాట్లుగా ఉంది. దీనికి తగ్గట్లు రోజుకి 39.687 మిలియన్ యూనిట్లను యూనిట్ సుమారు రూ.9 చొప్పున వెచ్చించి రూ.34.116 కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. విద్యుత్ దొరకడం లేదు.. కొనడం లేదనడం అవాస్తవమని ఇక్కడే తేలిపోయింది కదా రామోజీ. అలాగే రాష్ట్రంలో ఎక్కడా సేద్యానికి విద్యుత్ కోత లేదు. నిజానికి ఇది గత ప్రభుత్వ హయాంలో ఉండేది. ప్రస్తుతం వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు విద్యుత్ అందుతోంది. భవిష్యత్తులోనూ వ్యవసాయ ఉచిత విద్యుత్ అందించడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో 7 వేల మెగావాట్ల విద్యుత్ యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు కొనుగోలు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంది. ఈ విద్యుత్ కొనుగోలుకు అయ్యే ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. అలాగే నాణ్యమైన వ్యవసాయ విద్యుత్ సరఫరా కోసం రూ.10058 కోట్లు వెచ్చించడం వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, లో, హై ఓల్టేజీతో మోటార్లు దెబ్బతినడం వంటి సమస్యలు తగ్గాయి. రైతుల బాగుకోసం, వ్యవసాయాన్ని పండుగ చేయడం కోసం అలోచించే నాయకుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది. ఆరోపణ: కృత్రిమ మేధనూ ఏమార్చిన ప్రభుత్వం.. డిమాండ్ తగ్గిందని తప్పుడు లెక్కలు. వాస్తవం: విద్యుత్ డిమాండ్, సరఫరాకు సంబంధించి ఖచ్చితమైన లెక్కలను విద్యుత్ సంస్థలు ఏ రోజుకారోజు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. ప్రస్తుతం (గురువారం నాటి బులిటెన్ ప్రకారం) రాష్ట్రంలో రోజువారీ డిమాండ్ 234.406 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. ఇది గతేడాది ఇదే సమయానికి జరిగిన వినియోగం 218.322 కంటే 7.37 శాతం ఎక్కువ. దాచాలనుకుంటే గతేడాది కంటే డిమాండ్ ఇప్పుడు ఇంత ఎక్కువగా ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు రోజువారీ పవర్ బులిటెన్లో స్పష్టంగా ఇస్తున్నారంటే అంతకన్నా పారదర్శకత ఇంకేముంది. మరోవైపు ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, డిమాండ్కు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు వినియోగదారులకు కరెంట్ సరఫరా చేస్తున్నాయి. కృత్రిమ మేధను ఉపయోగించి పవర్ ఫోర్కాస్ట్ ద్వారా డిమాండ్ను అంచనా వేసి షార్ట్టెర్మ్ టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు విద్యుత్ లోటు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. దీనివల్లనే ప్రతిరోజూ బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయగలుగుతోంది. -
Fact Check: సిగ్గొదిలేసి పచ్చి అబద్ధాలు
కళ్లకు గంతలు కట్టుకుని లోకమంతా చీకటిగా ఉందన్నాడట ఒకడు. సరిగ్గా ఈనాడు రామోజీలాగ. ఆయనాగంతలు విప్పడు. విప్పితే వెలుగును చూడాల్సి వస్తుందన్న భయం. చూస్తే నిజాలు రాయాల్సి వస్తుందన్న జడుపు. నిజాలు రాస్తే తాను, తన ‘బాబు’ గల్లంతైపోతారన్న వణుకు. అందుకే ఆ చీకటిలోనే ‘సిగ్గొ’దిలేసి పచ్చి అబద్ధాలు రాసేస్తున్నాడు. వైఎస్సార్సీపీ గత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన పథకాల్లో 99 శాతం నెరవేర్చింది. జగమెరిగిన ఈ సత్యాన్నే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మిగనూరులో జరిగిన మేమంతా సిద్ధం సభలో చెప్పారు. హామీలు అమలు చేశారనేందుకు తిరుగులేని సాక్ష్యాలున్నాయి. కాని వాటిని చూసే దమ్ము..ధైర్యం రామోజీకి లేవు. సీఎం వైఎస్ జగన్ చెప్పిన విషయాలు అబద్ధాలంటూ పచ్చి అబద్ధాలను వండేశారు. సాక్షి, అమరావతి: మహిళలు, పిల్లల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 58 నెలల కాలంలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.2.83 లక్షల కోట్లు వ్యయం చేశారు. ఇందులో నేరుగా డీబీటీ ద్వారా మహిళల ఖాతాల్లో రూ.1.89 లక్షల కోట్లు జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా మరో రూ.94,347 కోట్లు మహిళలు, పిల్లల కోసం వెచ్చించారు. ఇందుకు సాక్ష్యం రూ.5.85 కోట్ల ప్రయోజనాలు పొందిన మహిళలు, పిల్లలే. పేదల ఇళ్ల కోసం కొత్తగా 17,005 జగనన్న కాలనీలనే ఏర్పాటు చేశారు. ఏ ఊరు వెళ్లినా ఇవి కనిపిస్తాయి. 31 లక్షల మంది మహిళల పేరిట ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణాల విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని కేంద్ర పట్టణ గృహ నిర్మాణ శాఖ ప్రశంసించింది. ప్రత్యేక హాదాను ముగిసిన అధ్యాయంగా చంద్రబాబు పాతరేస్తే.. ప్రత్యేక హోదా నినాదాన్ని సజీవంగా ఉంచింది సీఎం జగన్. దశల వారీగా మద్య నియంత్రణలో భాగంగా మద్యం ధరలను షాక్ కొట్టేలాగ పెంచి వినియోగాన్ని తగ్గించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై 14 నిముషాల పాటు సీఎం జగన్ మాట్లాడటం పెద్ద నేరంగా, తప్పుగా ఈనాడు రామోజీ చిత్రీకరించడం చూస్తుంటే వ్యక్తిగత కక్ష ఎంత ఉందో అర్థం అవుతుందని పరిశీలకులు అంటున్నారు. విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా అక్షరాస్యతను పెంచే చర్యలను చేపట్టారు. బాల్య వివాహాలు తగ్గించేందుకు తీసుకున్న చర్యలు ఫలితాలను ఇచ్చి ంది. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాకు వధువులు కనీసం పదవ తరగతి ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన విధించడం ద్వారా అక్షరాస్యతను పెంచడం, మరో పక్క బాల్య వివాహాలను నిరోధించడం, ఉన్నత విద్య అభ్యసించేలాగ చర్యలను తీసుకున్నారు. దీని వల్ల బాల్య వివాహాలు తగ్గిన విషయాన్ని సీఎం జగన్ ఈ సభలో చెప్పారు. దీన్ని వక్రబుద్ధితో చూసి సిగ్గులేని తనాన్ని ఈనాడు రామోజీ బయటపెట్టుకున్నారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారిన విషయం ప్రతీ ఊరిలో కనిపిస్తోంది. ఒక గుడ్డి ఈనాడు రామోజీకి తప్ప. నాడు–నేడు ద్వారా స్కూళ్లను తీర్చిదిద్దడాన్ని చూసిన తరువాతనే కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం అమలు చేస్తోంది. 58 నెలల సీఎం జగన్ పాలనలో మొత్తం డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.4.54 లక్షల కోట్లు పేదలకు ఆర్థిక సాయం అందింది. ఇందులో డీబీటీ ద్వారా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. 2014 ఎన్నికల ముందు రైతులకు, పొదుపు సంఘాల మహిళలు, యువతకు, చేనేత కారి్మకులకు, పేదలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయకుండా మోసం చేస్తే.. వైఎస్జగన్ ఇచ్చి న హామీల్లో 99 శాతం అమలు చేసి మళ్లీ ప్రజల దగ్గరకు వెళ్లి ధైర్యంగా ఓటు వేయమని అడుగుతున్నారు. రైతులకు ఇచ్చి న హామీల అమల్లో చంద్రబాబుకు, సీఎం వైఎస్ జగన్కు తేడా ఇలా.. ♦ 2014 ఎన్నికల ముందు చంద్రబాబు వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తాను అని అధికారంలోకి వచ్చాక రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను షరతులతో తగ్గించేసి కేవలం రూ.13,500 కోట్లతో సరిపెట్టారు. ♦ 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్ వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి 12,500 చొప్పున ఒక్కో రైతుకు నాలుగేళ్లలో 50,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ రైతు భరోసా సాయాన్ని ఏడాదికి 13,500కు పెంచి ఒక్కో రైతుకు ఐదేళ్లలో 67,500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ♦ 58 నెలల కాలంలో వైఎస్సార్ రైతు భరోసా కింద 53.58 లక్షల మంది రైతులకు రూ.34,378.16 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. -
సిగ్గు ఎగ్గూ అన్నీ ఒగ్గేసీ...
హ.. హవ్వ! చదివిన వాళ్లు నవ్వుకుంటారే అని సిగ్గు ఎగ్గూ అన్నింటినీ ‘ఈనాడు’ వదిలేసింది. అధికారంలోకి వస్తే డ్వాక్రా (పొదుపు సంఘాల) రుణాలన్నీ (రూ.14,203.58 కోట్లు) భేషరత్తుగా మాఫీ చేస్తానని 2014 ఎన్నికల ముందు మాటిచ్చి ఆ తరువాత ఒక్క రూపాయీ మాఫీ చేయని చంద్రబాబు పాలనలో పొదుపు సంఘాల మహిళలందరూ ఓ వెలుగు వెలిగారట. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పటికి (2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి) పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న మొత్తం రూ.25,570.80 కోట్ల అప్పును వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగు విడతలో అందజేస్తే.. పొదుపు సంఘాలను, మహిళలు నిలువునా మోసం చేయడమట. ఇలాంటి పచ్చి అబద్ధాలను రామోజీరావు తన ‘ఈనాడు’ పత్రికలో ‘నాడు దర్జా– నేడు గజగజ, డ్వాక్రా సంఘాలకు తీరని ద్రోహం’ అంటూ రోత రాతలు అచ్చేశారు. తమ ప్రభుత్వం డ్వాక్రా రుణ మాఫీ అమలు చేయని అంశాన్ని అప్పటి మంత్రి పరిటాల సునీత అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా వెల్లడించినా.. ఆ అంశాన్ని రామోజీ తన రాతల్లో ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. – సాక్షి, అమరావతి ఈనాడు అబద్ధం: 2014 –19 మధ్య టీడీపీ ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలకు ఉన్నతి పథకంలో రూ. 800 కోట్లు వడ్డీ లేకుండా రుణాలుగా ఇచ్చింది. అప్పును నెలవారీగా వాయిదాల్లో తిరిగి కట్టించుకునేది. మహిళా సాధికారితకు పెద్దపీట వేయడంలో తనను మించిన వారే లేరన్నట్టు గొప్పులు చెప్పుకునే జగన్.. ఈ ఐదేళ్లలో ఉన్నతికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. వాస్తవం: ఉన్నతి పథకం ద్వారా ఎస్టీ, ఎస్సీ సామాజికవర్గాలకు చెందిన పొదుపు సంఘాల మహిళలకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో 2.40 లక్షల మందికి రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల మంది వడ్డీ లేని రుణాలను అందజేసింది. అదే చంద్రబాబు ప్రభుత్వంలో ఈ పథకం ద్వారా ఒక్కొక్కరి గరిష్టంగా కేవలం రూ. 30 వేల వరకు మాత్రమే రుణాలు ఇచ్చింది. గత తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లు, అంతకు ముందు కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వంలో నాలుగేళ్లు కలిపి మొత్తం తొమ్మిదేళ్లలో 1.67 లక్షల మందికి రూ. 800 కోట్లు ఈ పథకం ద్వారా రుణాలు ఇస్తే, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలోనే 2.40 లక్షల మందికి రూ. 900 కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు అందజేసింది. ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరం(ఒక్క ఏడాది)లోనే దాదాపు రూ.200 కోట్లు ఇచ్చింది. ఈనాడు అబద్ధం: జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సున్నా వడ్డీ రాయితీలోనూ కోత పెట్టింది. వాస్తవం: బ్యాంకులో రుణం తీసుకొని సకాలంలో కిస్తీల వారీగా చెల్లించే పొదుపు సంఘాల మహిళలకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల్లో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా వారి రుణాలపై వడ్డీ రూ.4969.05 కోట్లు చెల్లించింది. ఆర్థిక ఏడాది ముగిసిన వెంటనే ఠంచన్గా సున్నా వడ్డీ పథకాన్ని జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది. దీని ద్వారా ఏటా 1.05 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందారు. ఇంకోవైపు.. చంద్రబాబు ప్రభుత్వం తన ఐదేళ్ల కాలంలో చివరి మూడు సంవత్సరాలు 2016 ఆగస్టు తర్వాత కాలానికి సున్నా వడ్డీ పథకానికి నిధులే ఇవ్వలేదు. ‘ఈనాడు’ తన కథనంలోనే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీ పథకానికి నిధులు ఇవ్వలేదని అంగీకరించింది కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అమలులో ఉన్న ఈ పథకానికి నిధులే విడుదల చేయలేదు. అదే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి అమలు చేస్తూనే.. నవరత్నాల కార్యక్రమాలు ద్వారా కూడా అదనపు లబ్ధి చేకూర్చింది. ఈనాడు అబద్ధం: జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ‘మిత్ర’లకు తీరని ద్రోహం చేసింది. వాస్తవం: రాష్ట్రంలో కోటి మందికి పైగా మహిళలు పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. ఆ కోటి మందిలో ఓ రెండు మూడు వేల మందిని అప్పటి టీడీపీ ప్రభుత్వం భీమా మిత్రలుగా నియమించింది. ఆ నియామకాలు కూడా అప్పటి జన్మభూమి కమిటీ సభ్యుల తరహాలోనే జరిగాయి. తమ పరిధిలో దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే వారికి ప్రభుత్వం ఇచ్చే బీమా సొమ్ములో కనీసం పది శాతం లంచంగా తీసుకున్నారన్న ఆరోపణలూ ఉండేవి. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన అనంతరం ఇప్పుడు ఈ కార్యక్రమాలను వారి ఆధ్వర్యంలో పారదర్శకంగా జరిపిస్తోంది. బీమా లబ్ధిదారుల నుంచి ఒక పైసా కూడా వసూలు చేయకుండా అందిస్తున్నారు. బీమా ప్రీమియాన్ని కూడా పూర్తిగా రద్దు చేసింది. -
విశాల హితం.. రామోజీ రాతల్లో ఖతం
దేశంలో తీర ప్రాంతాల్లో వెలసిన రాజధానులు ఆ రాష్ట్ర ప్రగతికి పునాదులు వేశాయన్నది కళ్లెదుట కనిపించే నిజం. అందుకే రాష్ట్ర విశాల హితమే ధ్యేయంగా సీఎం జగన్ మూడు రాజధానులను ప్రకటించారు. రామోజీకి మాత్రం ఇది గిట్టలేదు. ఎందుకంటే చంద్రబాబు అండ్ బ్యాచ్ సాగించే రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బ తింటుందనే. ఆ సంకుచిత ధోరణితో ఒక్క అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని రామోజీ, చంద్రబాబు బృందం తెగ ఆరాట పడిపోయింది. రాజధాని గురించి ముందుగా లీకులిచ్చింది కూడా ఈ భూ దందాల కోసమేనని ఎవరినడిగినా చెబుతారు. అమరావతి పాలనా రాజధాని కాదంటే ఆ పరిసరాల్లో ముందస్తుగా అడ్డగోలుగా ఎల్లో బ్యాచ్ కొన్న భూముల విలువ పడిపోతుందని రామోజీ భయం. అందుకే శాసన మండలిలో మూడు రాజధానుల బిల్లును అడ్డుకున్నా, జగన్ గట్టి సం కల్పం వల్ల శాసనసభలో బిల్లుకు ఆమోదం లభించింది. ఇది నచ్చని బాబు బ్యాచ్ అడ్డుపడి కోర్టు కెక్కింది. ఇదే విషయాన్ని నంద్యాల సభలో సీఎం జగన్ ప్రస్తావిస్తూ మూడు రాజధానుల ఏర్పాటు గురించి మాట్లాడితే దానికి రామోజీ వక్రభాష్యం చెబుతూ ఏడుపుగొట్టు.. వెకిలి.. వెటకారపు రాతలతో కథనాన్ని అచ్చేశారు. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మూడు రాజధానులను ఏర్పాటు చేసిన మాట చట్టసభల సాక్షిగా నిజం. మూడు రాజధానులకు బల ప్రదర్శన ద్వారా తొలుత శాసన మండలిలో చంద్రబాబు అండ్ కో బృందం అడ్డుపడింది. మళ్లీ శాసన సభ ఆమోదించిన తర్వాత మండలి ఆమోదించక తప్పలేదు. ఆ తరువాత న్యాయస్థానానికి వెళ్లి మూడు రాజధానులు ఏర్పాటు కాకుండా ఈ బృందమే అడ్డుకుంది. ఈ పరిణామంతో మూడు రాజధానుల కార్యకలాపాలు వాయిదా పడ్డాయే తప్ప.. వాటి ఏర్పాటు అక్షరాలా నిజం. ఇదే విషయాన్ని నంద్యాలలో ‘మేమంతా సిద్ధం’ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. దీనికి ఈనాడు రామోజీ వెటకారంతో పైత్యం జోడించి సిగ్గులేని కథనం అచ్చువేశారు. అమరావతిని చంపేశారంటూ పచ్చి అబద్ధాలను వండి వార్చారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించారు. అమరావతిలో బాబు చేపట్టి పూర్తి చేయకుండా వదిలేసిన పనుల్లో అవసరమైన పనులనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టింది. రామోజీ ఈ అవాస్తవాలను ప్రచారం చేయడానికి ప్రధాన కారణం తనకు ఇష్టుడైన చంద్రబాబు అండ్ కో బ్యాచ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం నిలిపోయిందనే అక్కసే తప్ప మరొకటి కాదు. తొలి నుంచి పరిపాలనను, అభివృద్ధిని వికేంద్రీకరించడం ద్వారా అన్ని ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లోని ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది వైఎస్సార్సీపీ విధానం. అందులో భాగంగానే విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చట్టం చేయడం.. చంద్రబాబు అండ్ కో బృందం న్యాయస్థానానికి వెళ్లి ఈ చర్యను అడ్డుకోవడం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. అడ్డుకోబోయింది మీ బాబే అమరావతి రైతుల పేరుతో ఒక వైపు కృత్రిమ పోరాటం చేయిస్తూ, మరో పక్క న్యాయస్థానంలో అడ్డుకుంది మీ బాబే రామోజీ. జనం అమాయకులు కాదు. మీరు ఏది రాస్తే దాన్నే జనం నమ్ముతారనుకోవడం మీ అజ్ఞానం, అవివేకం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో వ్యవస్థల్లో గొప్ప విప్లవాత్మక మార్పులను తెచ్చారనేది వాస్తవం. మీరు అంగీకరించకపోయినా నీతి ఆయోగ్తో పాటు ప్రపంచ బ్యాంకు తదితర గొప్ప సంస్థలు జగన్ ప్రభుత్వానికి కితాబిచ్చాయి. మీ చంద్రబాబు కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేయలేకపోతే, సీఎం జగన్ చేసి చూపించి, కుప్పంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రెండేళ్ల పాటు కోవిడ్ సంక్షోభం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇబ్బంది పెట్టినా సరే ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఎన్నికల హామీల్లో 99 శాతం అమలు చేశారు. ఈ విషయాన్నే ఆయన తన ప్రసంగంలో చెప్పారు. ఇందులో ఆత్మస్తుతి, పరనింద ఏముందీ రామోజీ? గ్రామ, వార్డు సచివాయాల వ్యవస్థను ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో చదువుకున్న 10–11 మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. ఇది జగమెరిగిన సత్యం. ఎవరూ కాదనలేని నిజం. రైతుల కోసం ఆర్బీకేలను ఏర్పాటు చేశారు. విలేజ్, వార్డు క్లినిక్స్ను ఏర్పాటు చేసి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. బాబు ఐదేళ్ల పాలనలో జిల్లాలను పునర్ వ్యవస్థీకరించాలనే ఆలోచనే చేయలేదు. జగన్ 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచారు. ఇది పరిపాలన వ్యవస్థలను మరింతగా ప్రజల దగ్గరకు తీసుకువెళ్లింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ప్రభుత్వ రంగంలో 17 వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు. రాష్ట్రంలో చంద్రబాబు చేయలేకపోయిన, సాధించలేకపోయిన నాలుగు పోర్టుల నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో పాటు వలంటీర్లను ఏర్పాటు చేసి లంచాల్లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను చేరవేస్తున్న విషయం కళ్లెదుట కనిపించే వాస్తవం. లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీతో పాటు మధ్యలో రూపాయి దుర్వినియోగం కాకుండా నేరుగా వారి ఖాతాలకు చేరుతోంది. ఇవన్నీ క్షేత్ర స్థాయిలో కనిపిస్తున్న నిజాలు రామోజీ. మీరు కాదన్నా.. వెటకారం చేసినా రాష్ట్ర ప్రజలందరికీ కనిపిస్తున్న వాస్తవాలివి. రాష్ట్ర ప్రగతిపై ప్రశంసలిలా.. ♦ మహిళా సాధికారత, మహిళా సంక్షేమానికి జగన్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని నోబల్ గ్రహీత దుఫ్లో కొనియాడారు. ♦ ఐక్య రాజ్య సమితి ఛాంపియన్ అవార్డుకు రైతు భరోసా కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. గ్రామ స్థాయిలో ఆర్బీకెల ఏర్పాటు చేయాలనే వినూత్న ఆలోచనను ఎఫ్ఏఒ కంట్రీ డైరెక్టర్ టోమియో పిచిరి అభినందించారు. ♦ ఏపీ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఇతర రాష్ట్రాలు అనుసరించాలని ప్రధాని నరేంద్ర మోదీ శ్లాఘించారు. ♦ ప్రతి 2000 జనాభాకు ఆరోగ్య సంరక్షణ అందిస్తున్న ఏపీ ప్రభుత్వ చర్యలను డబ్యుఈఎఫ్ హెల్త్ కేర్ చీఫ్ డా.శ్యామ్ బిషెన్ ప్రశంసించారు. ♦ 31.88 లక్షల మంది మహిళలు, పిల్లలకు లబ్ధి చేకూరేలా ఏపీ ప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్ సంపూర్ణ పోషణను నీతి ఆయోగ్ ప్రశంసించింది. ♦ విద్యా రంగంలో ఏపీ ప్రభుత్వం తెచ్చిన అమ్మ ఒడి పథకం వల్ల అక్షరాస్యత రేటు పెరుగుతోందని నోబెల్ గ్రహీత జాన్ బి.గూడెనఫ్ ప్రశంసించారు. ♦ విద్య, ఆరోగ్య, సామాజిక రంగ పెట్టుబడుల్లో ఏపీ పురోగతిని ప్రపంచ బ్యాంకుప్రశంసించింది. ♦ కోవిడ్కు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రపంచం మొత్తం నేర్చుకోవాలని యూకే మాజీ డిప్యుటీ హైకమిషనర్ అండ్రూ ఫ్టెమింగ్ కొనియాడారు. -
Fact Check: వినాశకాలే.. విపరీత రాతలే!
తప్పుడు రాతల పూనకంలో రామోజీ ఊగిపోతున్నారు. కరోనా సమయంలో దేశమంతా విపత్కర స్థితిలో ఉంటే, ఆ సమయంలోనూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వచ్చాయి. ఈ సంగతి రామోజీకి తెలుసో లేదో మరి. తెలిసినా నిజాలు రాస్తే ఆయన రామోజీ ఎందుకవుతారు? నిజాలు చెబితే చంద్రబాబు తల వేయి ముక్కలవుతుందనే శాపముందని దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో చమత్కరించేవారు. రామోజీకీ బహుశా అలాంటి శాపమే ఉన్నట్లుంది. సీఎంగా జగన్ చొరవ, పట్టుదల, కృషి వల్లనే రాష్ట్రంలో పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయని జాతీయ ఆంగ్ల పత్రికలు కోడై కూస్తున్నాయి. అవన్నీ కార్యరూపం దాలుస్తున్నాయి. టాటాలు, అంబానీ, అదానీలు ఉత్సాహభరితంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొస్తున్నారు. మూడేళ్లుగా సులభతర వాణిజ్యంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తున్నా, దానికి రామోజీ అబద్ధాల పరదాలు కడుతున్నారు. సాక్షి, అమరావతి: గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిలో వేగంగా దూసుకువెళుతోంది. టాటాలు, బిర్లాలు, అదానీ, అంబానీ, అర్సెలర్ మిట్టల్, సంఘ్వీ, భజాంకా, భంగర్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనలోనే రాష్ట్రంలో పెట్టుబడులు మూడు రెట్లు పెరిగాయని జాతీయ ఆంగ్ల దిన పత్రికలు ప్రముఖంగా కథనాలు ప్రచురిస్తున్నాయి. అయినా రామోజీ అనే రాష్ట్ర వినాశకారి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ‘జగన్ అనే నేను ఒక వినాశకారి’ శీర్షికతో ఒక సిగ్గుమాలిన కథనాన్ని వండి వార్చారు. విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో 386 పెట్టుబడుల ఒప్పందాల ద్వారా రూ.13.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను జగన్ ఆకర్షించారు. ఈ ఐదేళ్లలో 130 భారీ ప్రాజెక్టుల ద్వారా రూ.69 వేల కోట్ల పెట్టుబడులు వాస్తవరూపంలోకి వచ్చినా రామోజీ రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెళ్లిపోయాయంటూ దిగజారుడు రాతలు రాసిపారేశారు. ఒక పక్క పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంపై నమ్మకం పెరగడంతో గత మూడేళ్ల నుంచి పూర్తిగా 100 శాతం పారిశ్రా>మికవేత్తల అభిప్రాయాలు ఆధారంగా నిర్వహిస్తున్న సులభతర వాణిజ్యం సర్వేలో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుస్తున్నా , పారిశ్రామికవేత్తలు వెళ్లిపోతున్నారంటూ రాయడం ఒక్క రామోజీకే చెల్లుతుంది. జీఎస్డీపీలో పరిశ్రమల వాటా పెరగడం, ప్రజల తలసరి ఆదాయం పెరగడమే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి నిలువెత్తు సాక్ష్యం. 2019–20లో రాష్ట్ర జీఎస్డీపీలో 22.04 శాతంగా ఉన్న పరిశ్రమల వాటా 2022–23 నాటికి అది 23.36 శాతానికి చేరింది. గతేడాదితో పోలిస్తే దేశంలో తలసరి ఆదాయం సగటున రూ.23,476 పెరిగితే మన రాష్ట్రంలో రూ.26,931కు పెరిగింది. 2021–22లో రూ.1,92,587గా ఉన్న రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2022–23 నాటికి రూ.2,19,518కు చేరింది. ఇదే సమయంలో రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు 10.59 శాతం వృద్ధితో రూ.1.59 లక్షల కోట్లకు చేరడం ద్వారా ఆరో స్థానానికి ఎగబాకింది. ఇలా అన్ని రంగాల్లో వేగంగా విస్తరిస్తుంటే పరిశ్రమలపై పగ అంటూ ఈనాడు వంకరరాతలు రాసింది. అమర్రాజా తరలిపోయిందని తప్పుడు ప్రచారం వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా అమరరాజా గ్రూపు తెలంగాణలో కొత్తగా పెట్టుబడులను పెట్టింది. రాష్ట్రంలో ప్రస్తుత పెట్టుబడులను కొనసాగిస్తూ ఇక్కడా విస్తరణ కార్యక్రమాలను చేపడుతోంది. ఇదే విషయాన్ని అమరరాజా గ్రూపే స్వయంగా ప్రకటించింది. కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం వివిధ రాష్ట్రాలు దేశాల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. రామోజీకి చెందిన మార్గదర్శి గ్రూపు కర్ణాటకలో కొత్తగా బ్రాంచీలను ఏర్పాటు చేసింది. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మా గ్రూపు వెళ్లిపోయిందని రాయగలవా రామోజీ...?తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ ఈ మధ్య పార్లమెంటు సమావేశాల్లోనే రాజకీయాల్లోకి రావడం వల్ల కేంద్ర ఈడీ సంస్థల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్నారే కాని ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం తనను ఇబ్బంది పెట్టిందని చెప్పలేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వ వేధింపుల వల్ల అమరరాజా వెళ్లిపోయిందంటూ కుందేళ్లు, కొరివి దెయ్యాలు..రాక్షసులు అంటూ రామోజీ చందమామ కథలు రాస్తున్నారు. అక్క చెల్లెమ్మలకు ఉపాధి గత ప్రభుత్వం పెట్టుబడుల ఒప్పందాలు అంటూ కేవలం మాటలకే పరిమితమయింది...దీనికి భిన్నంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికోసం అహరహం జగన్ శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం వాస్తవ పెట్టుబడులను తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పిస్తోంది. దీనికి తార్కాణమే ఆదిత్య బిర్లా గార్మెంట్స్ యూనిట్. రూ. సుమారు రూ.110.38 కోట్ల వ్యయంతో 2112 మందికి ఉపాధి కల్పించే విధంగా పులివెందులలో యూనిట్ ఏర్పాటు చేయడమే కాకుండా పలు అంతర్జాతీయ బ్రాండ్ల దుస్తులు అక్కడ తయారవుతున్నాయి. రామోజీ వీటి గురించి ఒక్క మాటా రాయరు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల ఒప్పందం కుదుర్చుకుని పెట్టుబడులు పెట్టకుండా వెళ్లిపోయిన జాకీ పరిశ్రమ గురించి పదేపదే జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ విషపూరిత కథనాలను అల్లుతారు. గత ప్రభుత్వంలో అనంతపురం జిల్లాలో మంత్రిగా ఒక వెలుగు వెలిగిన వారు భూకేటాయింపుల్లో భారీగా లంచాలను అడగటంతో జాకీ పరిశ్రమ వెళ్లిపోయిందన్న సంగతి అందరికీ తెలుసు. జాకీ ఒప్పందాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు వాస్తవ రూపంలోకి తీసుకురాలేకపోయిందన్న విషయాన్ని చెప్పకుండా ఆ బురదను ఈ ప్రభుత్వానికి అంటగట్టే విధంగా దిక్కుమాలిన రాతలతో పత్రికను నింపేస్తున్నారు. విశాఖ సమీపంలోని అచ్యుతాపురం వద్ద జపాన్కు చెందిన యకహోమా టైర్స్ కంపెనీలో స్థానిక మహిళలు రూ.22,000 పైగా జీతంతో పనిచేస్తున్నారు అంటూ రెండు రోజుల క్రితం ఈనాడు వసుంధర పేజీలో ‘‘ ఆ చక్రాలను నడిపించేది వాళ్లే’’ అంటూ రాసిన కథనమే అక్క చెల్లెమ్మలకు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉపాధి లభిస్తోందో చెప్పడానికి ప్రబల సాక్ష్యం. -
Fact Check: ఈసీలపైనా గుడ్డి రాతలేనా?
సాక్షి, అమరావతి: ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూపి... అదే పనిగా రాష్ట్ర ప్రభుత్వంపైకి తప్పు నెట్టేయడం ఈనాడుకు... దానిని నడుపుతున్న రామోజీకి నిత్యకృత్యంగా మారింది. తాజాగా ఈసీల జారీలో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా... అవి అందించలేకపోవడంతో రిజిస్ట్రేషన్లు అగిపోయాయంటూ ఓ అబద్ధాన్ని అందంగా అచ్చేశారు. కానీ వాస్తవానికి ఒకటి కాదు.. రెండు కాదు.. ఒక్క మార్చిలోనే రాష్ట్రంలో 2,62,807 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆన్లైన్లో 1.26,123 ఉచితంగా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా 26,912 ఈసీలు జారీ అయ్యాయి. ఇక్కడ లక్షల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్లు, ఈసీల జారీ కనిపిస్తుంటే.. రాజగురువు రామోజీ మాత్రం కళ్లుండి ధృతరా్రషు్టడిలా మారిపోయారు. రాజకీయంగా చతికిలపడిన తన పార్ట్నర్ చంద్రబాబు గ్రాఫ్ను పైకి లేపేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈనాడులో నిత్యం అసత్య కథనాలు వండివారుస్తూ దిగజారిపోతున్నారు. దేశంలోనే రిజిస్ట్రేషన్ల విధానంలో ఏపీ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కార్డ్ ప్రైమ్ సాఫ్ట్వేర్ అమలులోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ల సేవలు మరింత సులభంగా, సురక్షితంగా సాగుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వ సక్సెస్ను జీర్ణించుకోలేని రామోజీ ప్రైమ్ సాఫ్ట్వేర్ సమస్య కారణంగా పది రోజులుగా ఈసీలు నిలిచిపోయాయంటూ కుట్రపూరిత కథనాన్ని అల్లేశారు.అవాస్తవాలే అందులో వార్తలు రాష్ట్రంలో ఈసీల జారీ నిలిచిపోలేదు. క్రయవిక్రయాలు ఆగలేదు. రిజిస్ట్రేషన్లు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. www.registration.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఉచితంగా ఈసీలు అందుతున్నాయి. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల కౌంటర్ల ద్వారా ప్రజలు నిర్దేశిత దరఖాస్తు నింపి, నిర్ణీత రుసుము చెల్లింపులతో సబ్రిజిస్ట్రార్ ఈ–సైన్తో కూడిన ఈసీలను పొందుతున్నారు. మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు అందించేవారికి జారీ చేస్తున్న విధానం ప్రస్తుతం సాంకేతిక భద్రతా ప్రమాణాల ఆడిటింగ్ కారణంగా తాత్కాలికంగా నిలిచింది. మిగిలిన విధానాల్లో యథావిధిగా ఈసీల జారీ కొనసాగుతోంది. కానీ, వాస్తవాలను పక్కన పెట్టి ఈనాడు యథావిధిగా అసత్యాలను అచ్చేసింది. సెక్యూరిటీ ఆడిట్ పూర్తయిన వెంటనే మీసేవ ద్వారా కూడా ఈసీల జారీ పునఃప్రారంభమవుతుంది. దీనితో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ ద్వారా 30వ తేదీ నుంచి డిజిటల్ సర్టిఫైడ్ ఈసీలు, డాక్యుమెంట్ సర్టిఫైడ్ కాపీలు ఆన్లైన్లో నిర్ణీత రుసుము చెల్లింపులతో పొందవచ్చు. కానీ కేవలం అబద్ధాలే అచ్చేసే ఈనాడు ఈ విషయంలోనూ జనాన్ని తప్పుదారి పట్టించేందుకు యరిజిస్ట్రార్స్తోంది. -
Fact Check: బాబు హయాంలో తుస్...జగన్ పాలనలో భేష్!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రామోజీ పైత్యం పరాకాష్టకు చేరుతోంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గంటూ ఈనాడులో ‘పచ్చ’ రోతలు పెచ్చుమీరుతున్నాయి. బాబు హయాంలో వ్యవస్థ మొత్తం భ్రష్టుపట్టినా వేలెత్తి చూపేందుకు మనసురాని పచ్చ పత్రికలకు జగన్ హయాంలో జరిగే మంచి కూడా పాపంలా కనిపిస్తోంది. ఏపీలో వైద్యరంగాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న ఆయన సంస్కరణలు వారికి ఘోరంలా గోచరిస్తున్నాయి. కొత్తగా 17 వైద్య కళాశాలలు రాష్ట్రంలో ఏర్పాటు చేసి అందులో ఐదింటిని ప్రారంభించినా ప్రశంసించలేక... పగబడుతున్నాయి. ఐదేళ్లలో వైద్య రంగం స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తే... అది తమ వారు చేయలేకపోయారన్న దుగ్ధతో క్షుద్ర రాతలకు తెగబడుతున్నాయి. ‘తెలంగాణ లో భేష్.. ఏపీలో తుస్’ అంటూ ఇక్కడి బోధన ఆస్పత్రులపై నికృష్ట కథనాన్ని అచ్చేశాయి. సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. వీలైనంత పెద్ద సంఖ్యలో అబద్ధాలను అచ్చేయాలి. ఎలాగైనా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలి. తద్వారా తమకు అనుకూలురైన పచ్చనేతలకు పట్టంగట్టాలి. ఇదే లక్ష్యంతో ఎలాంటి దారుణానికైనా వెనుకాడకూడదని రామోజీ సారధ్యంలో నడుస్తున్న ఈనాడు నిర్ణయించుకున్నట్టుంది. ఇందుకోసం రోజురోజుకూ అత్యధిక సంఖ్యలో తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయి. 2014–19 మధ్య రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగం పడకేసిన సందర్భంలోనూ సీఎంగా తన మనిషి ఉండటంతో ఆహా ఓహో ఏపీ వైద్య రంగం అంటూ రామోజీరావు బాకాలు ఊదారు. గడచిన ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైద్య, ఆరోగ్యశాఖలో 53 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయడంతో పాటు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించారు. 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టి ఐదు కళాశాలలను ఇప్పటికే ప్రారంభించడంతో పాటు, మరో ఐదు త్వరలో ప్రారంభించనున్నారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ విధానం, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి ప్రజల గుమ్మం వద్దకే వైద్య సేవలను చేరువ చేశారు. కేవలం ఐదేళ్లలో వైద్య రంగం ఇంతగా పురోగమిస్తే బాబుకు రాజకీయ భవిష్యత్ ఉండదనే ఉద్దేశంతో నిస్సిగ్గుగా ఈనాడులో దిగజారుడు రాతలు రాస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ కంటే మనమే మెరుగు ప్రజలకు వైద్యపరంగా అండగా నిలవడంలో పక్కనున్న తెలంగాణాతో పాటు, దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ ఉంటోంది. మధ్యతరగతి వర్గాలకు సైతం ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందిస్తున్న రాష్ట్రంగా ఏపీని నీతి ఆయోగ్ సైతం కీర్తించింది. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం గల కుటుంబాలన్నీ నేడు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయి. రూ.25 లక్షల వరకూ వైద్య సేవలను ఉచితంగా పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం కన్నా మిన్నగా ఆరోగ్యశ్రీ పథకాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. రక్తహీనత నివారణ, డిజిటల్ వైద్య సేవల కల్పన, జాతీయ ప్రమాణాలు కలిగిన ఆస్పత్రుల సంఖ్య పరంగా, ఇలా వివిధ అంశాల్లో తెలంగాణా ఏపీ కంటే వెనుకే ఉంది. వైద్య విద్యకు పట్టం అధికారంలోకి వచ్చాక ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా ప్రణాళికబద్ధంగా అడుగులు వేశారు. తొలుత ఐదు జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేయడం ద్వారా రాజమహేంద్రవరం, ఏలూరు, విజయనగరం, నంద్యాల, మచిలీపట్నం వైద్య కళాశాలలకు అనుమతులను రాబట్టారు. తద్వారా ఈ ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు. మిగిలిన 7 వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చేలా సన్నద్ధమయ్యారు. మూడేళ్లలో 17 కొత్త మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలోనూ ఏర్పాటు కానున్నాయి. కరోనా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూనే వైద్య రంగంలో సంస్కరణలన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్రంలో చిన్న పిల్లలకు మెరుగైన వైద్య సదుపాయాల అవసరాలను గుర్తించి టీటీడీ ఆధ్వర్యంలో శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలన్ని ప్రారంభించారు. చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తెస్తూ రూ. 450 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దాని నిర్మాణం దాదాపు పూర్తయింది. కానీ చిన్న పిల్లల ఆస్పత్రులకు ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపలేదని ఈనాడు తప్పుడు రాతలతో జనాన్ని నమ్మించేందుకు యత్నిస్తోంది. బాబు పాలనలోనే నీరుగార్చారు గత తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో వైద్యరంగం పూర్తిగా కుదేలైంది. ఆరోగ్యశ్రీ మూలకు చేరింది. వైద్యకళాశాలల ఊసే లేదు. అదే సమయంలో పక్కనున్న తెలంగాణ ప్రభుత్వం నాలుగు కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడంతోపాటు, భవిష్యత్తులో మరిన్ని కళాశాలల ఏర్పాటుకు వీలుగా 25 సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా అప్గ్రేడ్ చేస్తూ పడకల సంఖ్యను పెంచింది. 2018లోగా ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసింది. అప్పట్లో తీసుకున్న చర్యలు 17 కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు వచ్చేందుకు దోహదపడ్డాయి. పక్క రాష్ట్రంలో కళాశాలల ఏర్పాటుకు ముందు చూపుతో అడుగులు వేస్తున్నా.. బాబు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగి కూడా రాష్ట్ర ప్రయోజనాలను నీరుగార్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ వైద్య రంగాన్ని పట్టించుకోకుండా ప్రైవేట్ వైద్య కళాశాలలను ప్రోత్సహిస్తూ వైద్య విద్యను వ్యాపారంగా మార్చేశారు. అయినా అవేవీ ఈనాడుకు... దానిని నడిపిస్తున్న రామోజీరావుకు ‘కమ్మ’గానే కనిపించాయి. వైఎస్సార్సీపీ హయాంలో పురోగతి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర వైద్య శాఖ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఏకంగా 53 వేలకుపైగా పోస్టులను ఐదేళ్లలో భర్తీ చేశారు. అంతేకాకుండా వైద్య శాఖలో నియామకాల కోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుతో పాటు, ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేపట్టేలా అత్యవసర ఉత్తర్వులు ఇచ్చారు. స్పెషలిస్ట్ వైద్యులు 4500 మేర, మెడికల్ ఆఫీసర్లు 2500కు పైగా, 6700కు పైగా నర్సుల పోస్టులను భర్తీ చేశారు. ఇంతలా చర్యలు తీసుకుంటే బోధనాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత ఉంటోందని రామోజీరావు రోత రాతలు రాసుకొచ్చారు. -
తెరచాటు వ్యవహారాలు మీ బాబుకే చెల్లు
ప్రతీ నెలా ఒకటో తేదీ సుప్రభాత వేళ.. పేదింటి అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులకు అందే పింఛన్ సంతోషంలో జగన్ కనిపిస్తారు.. రైతుభరోసా సాయంలో రైతులకు ఆయన నవ్వు మోమే కనిపిస్తుంది.. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షలాది రూపాయల ఖరీదైన చికిత్స ఉచితంగా పొందే పేదల ఆరోగ్యంలోజగన్ రూపమే కనిపిస్తుంది.. ఇలా ప్రతీ పథకం లబ్ధిలోనూ రాష్ట్రమంతటికీ సీఎం జగన్ సంక్షేమాశయమే వేర్వేరు రూపాల్లో ప్రత్యక్షమవుతోంది ఒక్క రామోజీకి తప్ప. కనిపించకూడదని కళ్లు మూసుకుంటాడాయన. నిత్యం జనంతో మమేకమై వారి సమస్యలే తనవిగా తపించే నేత సీఎం జగన్.. జనానికి చిన్నపాటి అసౌకర్యమూ కలగరాదని ఆరాటపడే నాయకుడాయన. ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా అక్కడ తక్షణ సాయం అందాల్సిన పేదలను దగ్గరకు తీసుకుని, ఆత్మీయ పరిష్వంగంతో తక్షణ భరోసా ఇస్తారాయన. ఆ భరోసాకు తగ్గట్టుగా 24 గంటలు తిరగక ముందే ఆర్థిక సాయాన్ని కలెక్టర్లే అందించేలా చూస్తున్న మానవతావాది. ఇవన్నీ అందరికీ తెలుసు. అయినా ఎన్నికల వేళ జగన్కు రాష్ట్ర ప్రజల నుంచి లభిస్తున్న అఖండ స్వాగతాన్ని జీర్ణించుకోలేక తత్తరపాటు, బిత్తరపాటుతో రామోజీ తొట్రుపాటు రాతలు రాస్తున్నారు. సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ ఇన్ని రోజులూ పరదాల చాటున ఉన్నట్లు.. ఎన్నికలున్నందున ఇప్పుడే ప్రజల దగ్గరకు వెళ్తున్నట్లు అజ్ఞానంతో ఈనాడు రామోజీ సీఎం జగన్పై విషం కక్కారు. జగన్ అంటే జనం..జనం అంటే జగన్ అనే విషయం రాష్ట్రంలో ఎవరినడిగినా చెబుతారు. ఈనాడు రామోజీకీ ఆ విషయం తెలుసు...ఆయినా నిలువునా జగన్ వ్యతిరేకతతో అక్షర కుట్రలు, కూహకాలతో ఆయనకు ప్రతీ రోజూ తెల్లారుతోంది. పథకాల అమలు సందర్భంగా సాయం అందించే క్రమంలో ఏ జిల్లాకు జగన్ వెళ్లినా నిస్సహాయులైన పేదలను స్వయంగా కలిసి, వారికి ఒక అన్నలా..తమ్ముడిలా...కొడుకులా..వారి వేదనను నివేదనను ఎంతో శ్రద్ధాసక్తులతో ఆలకిస్తారు. వారి కష్టాలను 24 గంటల్లోనే పరిష్కరిస్తారు. ఇదంతా రామోజీ ఈనాడులో రాస్తూనే ఉంటారు. జనానికి జగన్ చేస్తున్న మేలేమిటో తెలిసినా, తెలియనట్లే నటిస్తూ... ఎన్నికలు కనుక జగన్ జనంలోకి వెళ్తున్నారంటూ తప్పుడు ప్రచారానికి తెరతీశారు. జగన్ తొలి నుంచీ జనంతో ఉండటానికే ఇష్టపడతారు తప్ప చంద్రబాబు మాదిరిగా బడా వ్యాపార వేత్తలు, పలుకుబడి గల వారితో అంటకాగడానికి ఇష్టపడరనే విషయం జగమెరిగిన సత్యం. ముఖ్యమంత్రి జగన్ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడల్లా రహదారులకు ఇరు వైపులా జనం పూలతో స్వాగతించడం, ఆయన నవ్వులు చిందిస్తూ, ఆత్మీయంగా జనానికి అభివాదం చేస్తూ ముందుకు సాగడం రాష్ట్ర ప్రజలందరికీ కనిపిస్తోంది. ఒక్క ఈనాడు రామోజీకి మాత్రం ఈ ముచ్చటైన దృశ్యాన్ని చూడడానికి అబద్ధాల పరదాలు అడ్డొస్తున్నాయి. వాస్తవానికి పరదాలు, తెరచాటు వ్యవహారాలు మీ చంద్రబాబు నాయుడికే చెల్లుతుంది రామోజీ. ముఖ్యమంత్రి జగన్ పథకాల అమలుకు జిల్లాలకు వెళ్లిన సందర్భంగా లబ్ధిదారులతో కలిసి ఫొటోలు దిగుతున్నారు. ఆయా ప్రాంతాల్లో నిస్సహాయులై అనారోగ్యంతో బాధపడే పేదలను, లేదా ఇతర ఆర్దిక సమస్యల్లో సతమతమవుతున్న పేదలను కలిసి వారి సమస్యలను శ్రద్ధగా వినడమే కాకుండా కొంత మందికి 24 గంటలు తిరగకుండానే జిల్లా కలెక్టర్ల చేత ఆర్థిక సాయాన్ని పంపిణీ చేయిస్తున్నారు. కాలేయ మార్పిడితో పాటు గుండె, కేన్సర్ వంటి పెద్ద ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ నుంచి భారీ ఆర్దిక సాయాన్నీ ముఖ్యమంత్రి మంజూరు చేస్తున్నారు. జిల్లాల పర్యటనలో జగన్ను కలిసిన ఆర్తుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సీఎంఓ కార్యాలయంలో ఒక బృందమే పనిచేస్తోంది. జిల్లాల పర్యటనల సందర్భంగా ఇప్పటివరకు 699 మంది పేదలను స్వయంగా కలిసి వారి సమస్యలను పరిష్కరించడంతోపాటు వైద్యానికి, ఇతర అవసరాలకు ఆర్థిక సాయం అందేలా జగన్ చర్యలు తీసుకున్నారు. జనం అంటే ఈ 699 మంది పేదలు కాదా ఈనాడు రామోజీ..జనంలోకి వెళ్లడం అంటే నీ అర్థం ఏంటో మరి! ఊరికో సచివాలయం.. సమస్యల పరిష్కారాలయం.. గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా, వారికి ప్రభుత్వ సేవలు అక్కడే అందేలా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఈ సీఎం ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి వరకు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా నిత్యం ప్రజల మధ్యే సీఎం జగన్ పాలన కొనసాగింది. మీ చంద్రబాబులా ప్రచార యావ కోసం జిమ్మిక్కులు చేయడం జగన్కు ఇష్టం ఉండదనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, విదేశాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్లిన ఘనత మీ బాబుకే దక్కుతుంది. చంద్రబాబు 13 దేశాలకు 23 సార్లు ప్రత్యేక విమానాల్లో వెళ్లారు. నిత్యం హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాలతో చంద్రబాబు విహరించినప్పుడు మీకు తప్పనిపించలేదా రామోజీ?. రాష్ట్ర ఖజానా నుంచి చంద్రబాబు ప్రత్యేక విమానాలకు రూ.100 కోట్లకు పైగా వ్యయం చేశారు. ఎన్నికల ముందు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ప్రజల్లోకి వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటారా?. ఎన్నికల వేళ జనంలోకి అంటూ ఈనాడు తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకుండానే ప్రాంతాల వారీగా నాలుగు సిద్ధం సభలను నిర్వహించారు. ప్రజలకిచ్చిన హామీల అమలు గురించిన ఆలోచనతో జగన్ పాలన సాగించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో ఎన్నుకున్న ప్రజల దగ్గరకే ప్రజాప్రతినిధులను ధైర్యంగా పంపించింది దేశంలో ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్.జగన్. చేసిన మేలును ప్రజలకు వివరిస్తూ మళ్లీ వైఎస్సార్సీపీని గెలిపించాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పడానికి ధైర్యంగా ఆయన జనంలోకి వెళ్తుంటే దాన్నీ తప్పుపట్టే స్థాయికి రామోజీ దిగజారారు. ప్రజలకు ఏ కష్టం, ఆపద వచ్చినా నేనున్నానంటూ ఆదుకోవడమే లక్ష్యంగా జగన్ ఐదేళ్ల పాలన కొనసాగింది. బాబు తరహాలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి. ఏదైనా ఆపద వస్తే దాన్ని ప్రచారానికి వినియోగించుకోవడం ఆయన నైజం కాదు. -
ఈనాడు అత్యుత్సాహం.. లోకేష్ సహా బకరాలైన యెల్లో బ్యాచ్
సాక్షి, గుంటూరు: తాము అధికారంలో ఉండగా ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పరు. మంచి చేస్తుంటే చూసి ఓర్చుకోలేరు. గత 58 నెలల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ను ఏరకంగా బద్నాం చేయాలి? అనే ఆలోచనతోనే కుట్రలు పన్నుతూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల వేళ తమ అసత్య ప్రచారాల మోతాదును ఒక్కసారిగా పెంచేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఈ కంటెయినర్ ఎందుకొచ్చింది? ఏం తెచ్చింది ? అంటూ ఈనాడు తాజాగా ఓ కథనం ప్రచురించింది. వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వ్యతిరేక మార్గంలో లోపలికి, అలాగే బయటకు వచ్చిందని, భద్రతా సిబ్బంది వద్ద నమోదు కాని వాహన వివరాలంటూ.. రకరకాల డైరెక్షన్లలో కంటెయినర్ను హైలెట్ చేస్తూ ఓ గాలి వార్త రాసేసింది. ఇంకేం ఐ-టీడీపీ సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. తమకు చెందిన అకౌంట్లతో ఏవేవో ట్వీట్లు వేయించింది. దీనికి తోడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు.. ‘‘నిబంధనలు అతిక్రమించి సీఎం జగన్ ఇంట్లోకి వెళ్లిన కంటెయినర్ సంగతేంటి?’’ అంటూ ఓ ట్వీట్ కూడా వేశారు. దానికి ఆ ఈనాడు పేపర్ కట్టింగ్ క్లిప్పులను జత చేశారు. అయితే.. బస్సుయాత్రకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారిలో ఆహారాన్ని తయారుచేసుకునే పాంట్రీ వాహనం అది. నేటి నుంచి జరగబోయే మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేపథ్యంలో.. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వంటసామానులు తీసుకు వచ్చింది ఆ పాంట్రీవాహనం. ఏపీ16జడ్ 0363 నంబరుతో వచ్చిన ఈ వాహనంపై పోలీసు స్టిక్కరు ఉంది. పైగా ఈ ఉదయం ఆ వాహనం ఆళ్లగడ్డకు సైతం చేరుకుంది. అసలు అదేంటో కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా.. అత్యుత్సాహంతో ఆ కంటెయినర్ వాహనం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎందుకు వచ్చింది, ఏదో తెచ్చిందంటూ నిస్సిగ్గుగా రాతలు రాయించారు రామోజీ రావు. ఈ క్రమంలో.. క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ నుంచి ఈటీవీ ప్రతినిధి మకాం వేసిన దృశ్యాలు కనిపించాయి. ఆ పాంట్రీ వాహనం విజువల్స్, ఫోటోలు తీసినట్టు సీసీటీవీ పుటేజీ ద్వారా క్యాంపు కార్యాలయ భద్రతా సిబ్బంది గుర్తించారు. అనుమతి లేకుండా చిత్రీకరించడమే కాకుండా... సదరు పోటోలను, వీడియోను వాడుకుని.. దురుద్ధేశపూర్వకంగా తప్పుడు రాతలు రాసిన ఈటీవీపై చర్యలకు అధికారులు ఇప్పుడు సిద్ధం అయ్యారు. -
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై రామోజీ విషం
-
FACT CHECK: హే జీసస్.. రోత రాతల పాపాలను క్షమించుడి!
సాక్షి, అమరావతి: రామోజీ పచ్చ పైత్యం రోజు రోజుకీ పరాకాష్టకు చేరుతోంది. క్రైస్తవుల సంక్షేమంపై జగన్ వివక్ష అంటూ విషం చిమ్మే నీచానికి రామోజీ దిగజారిపోయారు. రాయితీలపై అడ్డగోలుగా కోత అంటూ మడత వ్యాఖ్యలు చేస్తూ ఈనాడులో అబద్ధాలు అచ్చేయడాన్ని ‘హే జీసస్.. రామోజీ రోత రాతలు చూడు ప్రభు’ అని క్రైస్తవ సమాజం వ్యాఖ్యానిస్తోంది. పాపపు రాతల తీరును క్షమించమని ప్రార్థిస్తున్నాయి. చంద్రబాబు ఐదేళ్లపాలనలో క్రైస్తవులకు అరకొర రాయితీలు, పథకాలతో సరిపెట్టినా పచ్చ కళ్లకు అంతా సవ్యంగా కన్పించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రైస్తవులకు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా తోడ్పాటు అందిస్తుంటే రామోజీకి మింగుడు పడటంలేదు. ఆరోపణ: టీడీపీ హయాంలో స్వయం ఉపాధి, నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం, చర్చిలకు వెన్నుదన్ను. వాస్తవం: స్వయం ఉపాధి, నైపుణ్య శిక్షణ అంటూ కేవలం రెండు కార్యక్రమాలు అమలు చేసిన టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో క్రిస్టియన్ మైనార్టీల కోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. ఆ రెండు కార్యక్రమాలే ఏదో గొప్పగా చేసేసినట్టు ఈనాడు పచ్చ కలర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆరోపణ: వైఎస్సార్సీపీ పాలనలో క్రైస్తవులకు కుచ్చుటోపీ, యువతకు శిక్షణ లేదు, వెన్ను విరిచారు. వాస్తవం: వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్(మైనారిటీ) ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేసి వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచింది. సుమారు 6.82 లక్షల క్రైస్తవ మైనారిటీల సంక్షేమ పథకాల అమలుతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందంజలో ఉంది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న అమ్మఒడి, వైఎస్ఆర్ వాహన మిత్ర, లా నేస్తం, వైఎస్ఆర్ చేయూత, వంటి ఎన్నో కొత్త కార్యక్రమాలు వారి ఉన్నతికి దోహదం చేశాయి. కరోనా లాక్డౌన్ సమయంలో పాస్టర్లకు వన్–టైమ్ ప్రత్యేక ఆర్థిక సహాయం, జెరూసలేంకు తీర్థయాత్ర, చర్చిల ద్వారా, చర్చి నడిపే సంస్థలకు సహాయం అందించడం వంటి ప్రత్యేక తోడ్పాటుతో క్రిస్టియన్ మైనార్టీల్లో ఆత్మస్థైర్యం నింపింది. ఆరోపణ: ఆర్థిక సాయమూ అంతంతే వాస్తవం: చంద్రబాబు ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం ఐదేళ్లలో రూ.29 కోట్లు, శిక్షణ కోసం రూ.3.55 కోట్లు ఖర్చు చేస్తే అదే గొప్ప అంటూ ఈనాడు డబ్బాలు కొట్టింది. వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 మార్చి వరకు క్రిస్టియన్ మైనార్టీ ఆర్థిక సంస్థ ద్వారా ఏకంగా రూ.416.58కోట్లు అందించింది. దీనిలో ఒక్క చేయూత పథకం(స్వయం ఉపాధి) ద్వారా 27,150 మందికి రూ.50.90కోట్లు అందించింది. దీంతోపాటు 90శాతం సబ్సీడీపై 90 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు(నిత్యావసర సరుకుల సరఫరా వాహనాలు) రూ.55 లక్షలు ఆర్థిక సాయం అందించింది. ఆరోపణ: అప్పుడలా ఇప్పుడిలా అంటూ తప్పుడు లెక్కలు వాస్తవం: టీడీపీ ప్రభుత్వం(2014–19)లో చర్చిలకు సాయం, రాయితీలపై రుణాలు, నైపుణ్య శిక్షణ వంటివి అరకొరగా జరిగితే గొప్పగా జరిగినట్టు ఈనాడు మసిపూసి మారేడు కాయ చేసింది. వైఎస్సార్సీపీ 2019–24 మధ్య క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందించిన ఆర్థిక తోడ్పాటును ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించింది. ► పాస్టర్లకు గౌరవ వేతనం కింద కోవిడ్ లాక్డౌన్ సమయంలో రూ.5వేలు చొప్పున వన్–టైమ్ గ్రాంట్గా 29,841 మందికి రూ.1490లక్షలు అందించింది. దీంతోపాటు నెలకు రూ.5వేలు చొప్పున 8427 మంది పాస్టర్లకు గౌరవ వేతనంగా రూ.7109.9లక్షలు అందించింది. ► ఇవి కాక లా నేస్తం కింద జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5వేలు చొప్పున 2020–21లో రూ.30 లక్షలు, 2021–22లో రూ.50 లక్షలు కేటాయించింది. ► కొత్త చర్చిల నిర్మాణం, పాత చర్చిల మరమ్మత్తులు, పునరుద్ధరణ, ఇతర మౌలిక వసతుల కోసం రూ.5 లక్షలు చొప్పున, శ్మశాన వాటికల అభివృద్ధికి రూ.3 నుంచి 5 లక్షలు చొప్పున నిధులు ఇచ్చింది. ఇప్పటివరకు 98 చర్చిలకు రూ.5.67కోట్లు నిధులు అందించింది. ► జెరూసలేం, ఇతర బైబిల్ ప్రదేశాలకు తీర్థ యాత్ర పథకం కింద, వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే తక్కువ ఉన్న ప్రతి లబ్ధిదారునికి రూ.60వేలు, వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.30 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఇప్పటివరకు 1,060 మంది లబ్ధిదారులకు రూ.591.60 లక్షలు నిధులు కేటాయించింది. -
fact check: తిక్కరాతలతో రామోజీ తెలివి బొక్కబోర్లా!
రాష్ట్ర ప్రగతికి నిధులు గాల్లోంచి సృష్టించాలన్నదే రామోజీ మతిచలించిన రాతల పరమార్థంలా కనిపిస్తోంది. ఏటా పెరిగే ఆస్తుల విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచాలని కేంద్రం చట్టమే తెచ్చి, అమలు చేసి తీరాలన్న నిబంధనను విధించింది. అయినా సరే...పన్ను పెంపు అనేది పేద వర్గాలకు పెనుభారం కారాదని సీఎం జగన్ ప్రభుత్వం పన్ను పెంపు 15 శాతానికి మించకుండా చర్యలు తీసుకుంటే అదేదీ ఈనాడుకు కనిపించదు. నోటికొచ్చిన లెక్కలు గట్టి రాష్ట్రంలోని మూడు నగరాల్లో ఇళ్లకు పన్ను పెంపు భారం ...అంటూ తప్పుడు రాతలు రాసింది. నిజానికి 2020 నుంచే అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త పన్ను విధానం అమలు చేయాలని కేంద్రం నిర్దేశించింది. తెలంగాణతో సహా పది రాష్ట్రాలు పన్ను పెంపు విధానంలో కేంద్రం చెప్పిందే అమలు చేస్తున్నాయి. తద్భిన్నంగా .. రాష్ట్రంలో సీఎం జగన్ పేదల పట్ల కారుణ్యంతో వ్యవహరిస్తున్నారు. పేదలపై పెనుభారం మోపడానికి ఆయన ససేమిరా అంటారు...అందుకే 2021 ఏప్రిల్ నుంచి 375 చదరపు అడుగుల లోపు ఇళ్లకు కేవలం రూ.50 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయడంలోని జగన్ మానవత్వ భావన రామోజీ బుర్ర కెక్కినట్లు లేదు. లెక్కలేనన్ని తిక్కరాతలతో రాష్ట్రంలో అభివృద్ధికి మోకాలడ్డడానికి ఈ అతి తెలివి వక్రమార్కుడు నానా తంటాలు పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఖాళీ స్థలాలపై పన్నే పెంచని ఉదారత జగన్ ప్రభుత్వానిది... అంతేకాదు ఒకేసారి పన్ను మొత్తాన్ని చెల్లిస్తున్న వారికి రెండేళ్లుగా వడ్డీ రాయితీని ప్రభుత్వం కల్పించడం ఆస్తి పన్ను చెల్లింపుదారులకు మరో వరం...ఇదంతా రామోజీకి తెలియదా అంటే తెలుసు..తెలిసినా ఈ ప్రభుత్వాన్ని నిందించడానికి ఏదో ఒక తప్పుడు కారణాన్ని వెదుక్కుని వాస్తవాల పునాదులపై అడ్డగోలుగా అబద్ధాల మేడలు కట్టడమే ఈ కుహనా మేధావి లక్ష్యం... ఈయన తెలివి తెల్లారినట్లే ఉందని చెప్పడమే ఈ ఫ్యాక్ట్ చెక్ ఉద్దేశం... సాక్షి, అమరావతి: అబద్ధాలను అచ్చు వేయడంలో రామోజీ అందెవేసిన చేయిగా మారిపోయారు. తెల్లారి లేచిందే తడవుగా ప్రభుత్వంపై ఎలా రాళ్లేయాలా? అనే దురాలోచన నుంచి ఈనాడు బయటపడడం లేదు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ఒక్కరోజూ చెప్పకపోగా, అబద్ధాన్ని నిజమని ప్రజలను నమ్మించేందుకు వాస్తవాలను కప్పిపుచ్చి అదే అబద్ధాన్ని పదేపదే అచ్చు వేస్తోంది. పన్ను మదింపును పరిగణనలోకి తీసుకున్న విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లోని ఇళ్లకు గాలిలో తప్పుడు లెక్కలు వేసి అన్యాయం జరిగిపోతున్నట్టు గగ్గోలు పెట్టింది. వాస్తవానికి పట్టణ స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఆస్తిపన్ను పెంపు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. ప్రతి ఐదేళ్లకోసారి ఆస్తిపన్ను పునరీకరణ (రివిజన్) చేయాలని సూచించింది. ద్రవ్య లోటును తగ్గించేందుకు ఈ విధానం తప్పనిసరని చెప్పడంతో పాటు 2019లో ‘‘ఫిస్కల్ రెస్పాన్స్బిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్’’ (ఎఫ్ఆర్బీఎం) చట్టాన్ని తీసుకొచ్చింది. 15వ ఆర్థిక సంఘం సంస్కరణల్లో భాగంగా పట్టణ ఆస్తి పన్ను వార్షిక అద్దె విధానం కాకుండా, ఆస్తుల వార్షిక విలువ ఆధారంగా లెక్కించాలని సూచించింది. 2020 నుంచి అన్ని రాష్ట్రాలు కొత్త పన్ను విధానం అమలు చేయాలని ఆదేశించింది. అందుకు మున్సిపాలిటీల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల లెక్కల ప్రకారం ప్రాంతాన్ని బట్టి ఆస్తి మార్కెట్ విలువ ఎంతుందో లెక్కించి పన్ను విధించాలని మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. తెలంగాణతో సహా 10 రాష్ట్రాలు ఈ పన్ను విధానాన్ని అదే ఏడాది నుంచి అమలు చేస్తుండగా, ఏపీలో జగన్ ప్రభుత్వం మాత్రం 2021 ఏప్రిల్లో అమల్లోకి తేవడంతో పాటు 375 చ.అ. లోపు ఇంటికి ఆస్తిపన్ను గరిష్ఠంగా రూ.50 మాత్రమే వసూలు చేస్తోంది. ఇది నిరుపేదలకు ఎంతో మేలు చేసింది. ఖాళీ స్థలాలపై అసలు పన్ను పెంపే లేదు. రెండేళ్లుగా మొత్తం పన్ను ఒకేసారి చెల్లిస్తున్న వారికి వడ్డీ రాయితీనీn ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధించాలన్న కేంద్రం... కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం మున్సిపాలిటీల్లో ఆస్తి పన్నును ఐదేళ్లకోసారి మదింపు చేసి, తదనుగుణంగా పన్ను పెంచాలి. స్థానిక సంస్థల్లో వివిధ కారణాలతో పెంపు చర్యలు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో చివరిసారిగా 2002లో నివాస ఆస్తులపైన, 2007లో కమర్షియల్ ఆస్తుల పన్నును మదింపు చేశారు. తర్వాత పన్ను మదింపుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో పన్ను విధింపు ఆస్తి వార్షిక అద్దె ప్రకారం వసూలు చేసేవారు. దీనివల్ల ఒకే ప్రాంతంలో పన్ను విధింపులో అసమానతలు ఉండేవి. దీన్ని సరిచేసేందుకు ఆస్తి మార్కెట్ విలువ ప్రకారం పన్ను విధింపు ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. ఈ విధానంలో ఆస్తి పన్ను భారీగా పెరిగి ప్రజలకు అధిక భారం పడే ప్రమాదముందని భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్ను పెంపు గరిష్టంగా 15 శాతం మించరాదని షరతు పెట్టింది. ప్రజలపై భారం లేకుండా చూసిన రాష్ట్రం... కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం పన్ను నిర్ణయించినట్టయితే అది మున్సిపాలిటీల్లోని ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడే ఇబ్బంది ఉందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ స్లాబులను అందుబాటులోకి తెచ్చింది. నివాస ఆస్తులపై స్థానిక మార్కెట్ ధర ప్రకారం 0.10 నుంచి 0.50 శాతం, కమర్షియల్ ఆస్తులపై 0.02 నుంచి 2 శాతం మధ్య పన్ను ఎంత ఉండాలనే నిర్ణయాధికారం పట్టణ స్థానిక సంస్థల కౌన్సిళ్లకే అప్పగించింది. ఆస్తి విలువ ఎంత పెరిగినా పన్ను పెంపు 15 శాతం మించరాదని, పేదలు నివసించే 375 చ.అ విస్తీర్ణం గల ఇళ్లకు పన్ను వార్షిక రూ.50 మాత్రమే ఉండాలని అదేశాలు జారీ చేసింది. గత ఏడాది కంటే ఈ ఏడాది పన్ను పెరగని ఆస్తులకు గరిష్టంగా 2 శాతం పెంపు అమలు చేయాలంది. పట్టణ స్థానిక సంస్థల్లో కొత్త పన్ను విధానంపై అధ్యయనం, ప్రజల అభ్యంతరాలను తీసుకున్న తర్వాతనే అధికారులు పన్ను వసూలు చేపడుతున్నారు. పట్టణాభివృద్ధికి ఎల్లో మీడియా వ్యతిరేకం... పట్టణ స్థానిక సంస్థల్లో ఉద్యోగులు, సిబ్బంది వేతనాలు, అభివృద్ధి పనులకు నిధులు అవసరం. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు అధికంగా ఉండేవి. కేంద్రం 2019లో తెచ్చిన ఎఫ్ఆర్బీఎం చట్టంతో యూఎల్బీలు పన్ను ఆదాయాన్ని పెంచుకుంటేనే సాయం అందుతుంది. ఈ విషయంలో ప్రపంచానికి ఆర్థిక పాఠాలు నేర్పిన నారా చంద్రబాబుకు, ఆయనకు శిక్షణ ఇచ్చిన రాజగురువు రామోజీకి తెలియంది కాదు. రాష్ట్రంలోని 123 యూఎల్బీల నుంచి ఆస్తి పన్ను డిమాండ్ రూ.3950.15 కోట్లు ఉంటే, గతేడాది వసూళ్లు 50 శాతం (రూ.1686.46 కోట్లు) దాటలేదు. మరి స్థానిక సంస్థల్లో అభివృద్ధి పనులు ఎలా చేయాలో వారికే తెలియాలి. కేపిటల్ వ్యాల్యూ పన్ను విధానం అమలు చేస్తున్న రాష్ట్రాలు.. ఛత్తీస్గఢ్, గోవా, కేరళ, మధ్యప్రదేశ్, మణిపూర్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్ -
Ramoji Rao: శవాలపై పేలాలు
రాజంపేట: అసలే అంతులేని అప్పుల భారం.. ఆపై పచ్చ మూకల ఆన్లైన్ భూ మాయాజాలం! ఇదీ అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో చేనేతకారుడు పాల సుబ్బారావు కుటుంబం విషాదకర చావులకు అసలు కారణం! దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అంటగడుతూ, రాష్ట్రమంతా ఇలాగే జరిగిపోతోందంటూ శోకాలు పెడుతూ ఈనాడు రామోజీ మరోసారి శవాలపై పేలాలను ఏరుకున్నారు! దాదాపు రూ.అరకోటి దాకా తలకు మించిన అప్పులు, భూముల రికార్డులు తారుమారు కావడమే తమ చావులకు దారి తీసినట్లు మరణ వాంగ్మూలంలో సుబ్బారావే వెల్లడించాడు. అప్పులు చేసింది తానేనని బాధితుడే స్వయంగా ఒప్పుకున్నాడు. మరి ఇక భూములు రికార్డులు తారుమారు ఎప్పుడయ్యాయి? ఎవరు చేశారు? అనేది కదా తేలాల్సిన కీలక అంశం. టీడీపీ హయాంలో 2015లో ఆన్లైన్లో భూముల మాయాజాలం కారణంగా బాధితుడు వంచనకు గురయ్యాడు. ఎక్కడో కొండల్లో ఉన్న ప్రభుత్వ భూమిని నాడు పచ్చమూకలు రికార్డులు తారుమారు చేసి బాధితుడి తండ్రి చలపతి పేరుతో ఆన్లైన్లో చేర్చినట్లు నమ్మించాయి. ఆ వెంటనే మరొకరి పేరుతో మార్చి ఇదే వంచనను కొనసాగించాయి. పచ్చమూకలు ఒకరి తరువాత ఒకరిని మోసగించాయి. ఇవేవీ నిన్ననో మొన్ననో జరిగిన వ్యవహారాలు కాదు. నిజానికి ఆ భూమిని సుబ్బారావుకే కాదు.. ఎవరికీ అసైన్మెంట్ (డీకేటీ) కింద ప్రభుత్వం కేటాయించనేలేదు. గతంలో ఎవరూ అధికారికంగా, అనధికారికంగా సాగు చేసిన దాఖలాలూ లేవు. ఆ భూమిని తనకు కేటాయించాలని బాధితుడు ఎన్నడూ కూడా అర్జీ పెట్టుకోలేదు. మరి అలాంటప్పుడు వ్యక్తిగత సమస్యలతో ఓ వ్యక్తి తన కుటుంబాన్ని బలి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడం ఏమిటనే ఇంగితం రాజ గురువుకు ఉండాలి కదా? రికార్డుల్లో లేకుండా ఆన్లైన్లో మాయ మృతుడు సుబ్బారావు తన తండ్రి వెంకట చలపతి పేరుతో 2187/2 సర్వే నెంబరులో 3.10 ఎకరాల భూమి (ఖాతా నెంబరు 1712) ఉన్నట్లు ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. ఆన్లైన్లో ఎక్కించినట్లు తొలుత సుబ్బారావును 2015లో నమ్మించగా ఆ తరువాత 2017లో కట్టా శ్రావణి పేరుతో ఆన్లైన్లో చేర్చారు. ప్రస్తుతం ఆన్లైన్లో ఉన్న కట్టా శ్రావణికి 2020 నుంచి రైతు భరోసా వస్తున్నట్లు వ్యవసాయాధికారి కిరణ్కుమార్రెడ్డి చెబుతున్నారు. రెవెన్యూ రికార్డుల మేరకు సర్వే నెంబరు 2050 కొండ నుంచి సబ్ డివిజన్ చేశారు. ఇందులో 9.12 ఎకరాల భూమి ఉండగా మూడు సబ్ డివిజన్లు చేశారు. 2187/1 విస్తీర్ణంలో 3.76 ఎకరాలు, 2187/2 విస్తీర్ణం 5.00 ఎకరాలు, 2187/3 విస్తీర్ణంలో 0.36 ఎకరాలు సబ్ డివిజన్ చేశారు. ఈ సర్వే నెంబర్లలో మృతుడి తండ్రి వెంకట చలపతి పేరుతో డీకేటీ పట్టా ఇచ్చినట్లు రికార్డులో నమోదు కాలేదని రెవిన్యూశాఖ స్పష్టంగా చెబుతోంది. మృతుడి తండ్రి పేరుతో ఉన్నట్లు చెబుతున్న భూమి సాగులో కానీ, ఎవరి అనుభవంలోగానీ లేదు. ఆ భూమి, రాళ్లు, చెట్లతో కూడుకుని ఉంది. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఈ అవకతవకలపై ఉన్నతస్ధాయి విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ శాఖ సన్నద్ధమైంది. నేతకు దూరంగా.. అప్పుల ఊబిలో విభజన అనంతరం 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ రికార్డుల తారుమారు మొదలుకొని లెక్కలేనన్ని భూ మాయాజాలాలు జరిగాయి. చేనేతకారుడు సుబ్బారావు దీనికి బలి పశువుగా మారాడు. సుబ్బారావు చాలా రోజులుగా చేనేత పనులకు దూరంగా ఉంటూ జీవనాన్ని నెట్టుకొస్తున్నాడు. మద్యానికి బానిస కావడం, ఆపైన క్రికెట్ బెట్టింగ్ లాంటి వ్యసనాలున్నాయి. అందిన చోట అధిక మొత్తంలో అప్పులు చేశాడు. తిరిగి వాటిని తీర్చలేక భార్య, కుమార్తెకు మత్తు ఇచ్చి హతమార్చి ఆ తరువాత ఒంటిమిట్ట చెరువు సమీపంలో రైల్వే ట్రాక్పై వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అది ప్రభుత్వ భూమే ఒంటిమిట్ట: కుటుంబాన్ని కడతేర్చి ఆత్మహత్యకు పాల్పడ్డ చేనేతకారుడు పాలా సుబ్బారావు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అప్పులు చేసినట్లు తమ విచారణలో వెలుగులోకి వచ్చినట్లు కడప డీఎస్పీ షరీఫ్ తెలిపారు. ఎవరెవరికి ఎంత అప్పు ఉన్నాడనే వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. బాధితుడు తన కుటుంబం పేరుతో ఉన్నట్లు చెబుతున్న 3.10 ఎకరాల భూమిపై కడప ఆర్డీవో ప్రత్యేకంగా విచారణ చేపట్టి పూర్తి స్పష్టత ఇచ్చారని వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం అది పక్కాగా ప్రభుత్వ భూమి అని, అందులో ఎలాంటి డీకేటీ పట్టాలు గానీ, ఇతర పట్టాలు గానీ ప్రభుత్వం ఇవ్వలేదని స్పష్టం చేశారు. 2015లో సుబ్బారావు ఇతరుల సహకారంతో ఆన్లైన్లో తన పేరు నమోదు చేశారని, అనంతరం రెండేళ్లకు (2017లో) మరొకరి పేరుతో అదే భూమి ఆన్లైన్లో మార్చేశారని చెప్పారు. ఆన్లైన్లో తారుమారు చేశారే గానీ ప్రభుత్వం తరపున 3.10 ఎకరాలకు సంబంధించి ఎలాంటి పత్రాలు ఇవ్వలేదన్నారు. నాడు ఆన్లైన్లో ఎవరు చేర్చారు? రెవెన్యూ శాఖలో ఎవరి ప్రమేయం ఉంది? అనే అంశాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. 2015లో పీఎం కిసాన్ లేదని, తర్వాత కూడా సుబ్బారావు పేరుతో పీఎం కిసాన్ సాయం పడలేదని తెలిపారు. సుబ్బారావు వ్యసనాలకు బానిసగా మారి క్రికెట్ బెట్టింగ్ కారణంగా అప్పుల పాలై చనిపోవాలని నిర్ణయించుకున్నాడన్నారు. :::ఎండీ షరీఫ్ డీఎస్పీ ,కడప బాబు శవ రాజకీయాలు: ఆకేపాటి అమరనాథ్రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు శవ రాజకీయాలతో పబ్బం గడుపుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్ధి ఆకేపాటి అమరనాథ్రెడ్డి విమర్శించారు. సుబ్బారావు, పద్మావతి, వినయ మృతదేహాలకు ఆయన నివాళులర్పించి పెద్ద కుమార్తెను ఓదార్చారు. తామున్నామని ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సుబ్బారావు భూమికి సంబంధించి ఆన్లైన్ వ్యవహారం టీడీపీ హయాంలోనే జరిగిందనే విషయం గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. సుబ్బారావు కుటుంబానికి అన్యాయం చేసిన వారు ఎవరైనా సరే ఉరి తీయాలన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలబడాల్సింది పోయి రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై బురదచల్లడం చంద్రబాబు చిల్లర రాజకీయానికి నిదర్శనమన్నారు. బీసీల సంక్షేమం కోసం సీఎం జగన్ ఎంత కృషి చేశారో బడుగులందరికీ తెలుసన్నారు. ఈ ఘటనను సీఎం జగన్ దృష్టికి తెచ్చి న్యాయం చేస్తామన్నారు. డీకేటీ పట్టా ఇవ్వలేదు.. పాల సుబ్బారావు అప్పులు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి వెంకట చలపతి పేరుతో డీకేటీ పట్టా మంజూరు చేసినట్లు రికార్డుల్లో ఎక్కడా నమోదు కాలేదు. ఆ సర్వే నంబరు ఉన్న భూమి సాగు, అనుభవంలో లేదు. రాళ్లు ,చెట్లతో నిండి ఉంది. అది కట్టా శ్రావణి పేరుతో ఎలా మార్పు జరిగిందనే అంశంపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. :::వెంకటరమణ, తహసీల్దారు, ఒంటిమిట్ట గతంలో జరిగిన మోసమే.. టీడీపీ పాలనలోనే సుబ్బారావు, కట్టా శ్రావణి ఆన్లైన్ భూముల వ్యవహారాలు జరిగాయన్నది సత్యం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదచల్లడం విచారకరం. గతంలో జరిగిన మోసాన్ని ఈ ప్రభుత్వంపై రుద్దడం ఎన్నికల స్టంట్ అని చేనేత కార్మికులతోపాటు ప్రజలందరికీ తెలుసు. భూమి ఆన్లైన్లో మారిన కొత్తపల్లెకు చెందిన కట్టా శ్రావణి విదేశాల్లో ఉన్నారని చెబుతున్నారు. సుబ్బారావు కుటుంబం మృతి ఘటన మమ్మల్ని కలిచివేసింది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. :::పి.శేషారెడ్డి, కొత్త మాధవరం, ఒంటిమిట్ట ఈ ప్రభుత్వానికి అంటగట్టడం అవివేకం.. మా గ్రామంలో ముగ్గురు చనిపోవడం చాలా బాధాకరం. అప్పుల బాధలు సుబ్బారావును చుట్టుముట్టాయి. ఆయన భూమి ఆన్లైన్ వ్యవహారం టీడీపీ హయాంలోనే జరిగింది. దాన్ని ఈ ప్రభుత్వానికి అంటగట్టడం అవివేకం. సుబ్బారావు తండ్రి చలపతి మూడేళ్ల క్రితం చనిపోయారు. వృత్తికి దూరమైన సుబ్బారావు మద్యం వ్యసనాలతో అప్పుల్లో కూరుకుపోయి తనువు చాలించాలనుకున్నాడు. భార్య, కుమార్తెను హత్య చేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. :::పన్నెల చంద్రశేఖర్, గ్రామపెద్ద, కొత్తమాధవరం, ఒంటిమిట్ట -
బాబు పాలన గంజాయి ఖజానా
చంద్రబాబు అక్రమాలను కడుపులో పెట్టుకుని దాచుకోవడంలో రామోజీ సిద్ధహస్తుడు. బాబు ఓటమి రామోజీ కళ్లముందు స్పష్టంగా కనిపిస్తుంటే...ఆ మనోవేదనలో చిత్తచాంచల్యపు రాతలతో జగన్ ప్రభుత్వంపై చెలరేగిపోతున్నారు. చంద్రబాబు పాలనలో గంజాయి దందాను సాక్షాత్తూ టీడీపీ నేతలే సాగించినా, ఆ సమయంలో ఏ రోజునా ఈ అక్రమాల గురించి రామోజీ రాయలేదు. నర్సీపట్నం కేంద్రంగా బాబుకు సన్నిహితులైన టీడీపీ నేతలు బరితెగించి, అంతర్ రాష్ట్ర సిండికేట్ నడిపారు. బాబు హయాంలో అక్రమాలను రాయడానికి రామోజీ లేని చత్వారాన్ని, బధిరత్వాన్ని అరువు తెచ్చుకుని, పెన్ను మూసుక్కూర్చున్నారు...వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి దందాలపై ఉక్కు పాదం మోపుతోంది. అన్ని మార్గాల్లోనూ గంజాయి దందాలకు చెక్ పెట్టి, దాని ఆనవాళ్లు లేకుండా చేయాలని నిరంతరం దాడులు చేస్తుంటే ఆ నేరనిరోధ చర్యలు రామోజీకి నచ్చడం లేదు... పనిలో పనిగా గంజాయి సాగును అరికట్టే క్రమంలో సంస్కరణలు సైతం చేపట్టింది. ఆపరేషన్ పరివర్తన్ కింద గంజాయి సాగును ధ్వంసం చేయడంతోపాటు గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధిగా ఆపరేషన్ నవోదయం పథకాన్ని తీసుకొచ్చింది. ఇలా సంస్కరణలనే ఆయుధంగా చేసుకుని, గిరిజన జీవితాల్లో వెలుగురేఖలు నింపుతోంది. సాక్షి, అమరావతి: రాబోయే ఎన్నికల్లో టీడీపికి మరోసారి ఓటమి ఖాయమన్న స్పష్టమైన సంకేతాలు ఈనాడు రామోజీరావుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హైదరాబాద్ శివారులోని ఫిల్మ్ సిటీ కొండపైన అక్రమంగా కట్టుకున్న కోటవంటి భవంతిలో నిద్రలేని రాత్రులు గడుపుతున్న రామోజీలో పైత్యం పరిపరి విధాలుగా ప్రకోపిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గంజాయి దందా అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని పిచ్చపిచ్చగా పచ్చ రాతలతో విరుచుకుపడుతున్నారు. ఏదో విధంగా రోజూ ఈనాడు పత్రిక నిండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుష్ప్రచారం చేయందే రామోజీకి తిన్న ఆ కాస్త ముద్ద అరిగేలా అనిపించడం లేదు. ఆ పైత్యపు రాతలతో రామోజీ కడుపు మంట తీరుతుందేమోగానీ, అవాస్తవాలను వాస్తవం అంటూ ప్రజల్ని మోసం చేయలేరు. చంద్రబాబు హయాంలో విశృంఖలంగా నడిచిన గంజాయి మాఫియాను ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు... వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి సాగును ధ్వంసం చేసిన ఆపరేషన్ పరివర్తన్ విజయవంతం కావడాన్నీ గుర్తించారు. మీ ఒక్కరే వీటిని గుర్తించనట్లు నటిస్తున్నారు రామోజీ... మీ నిద్రలేమి సమస్యకు... కడుపు మంటకు ఏదైనా డాక్టర్ను సంప్రదిస్తే మంచిది.... కట్టుకథలతో ఈనాడు పత్రికను నింపేస్తే చిరిగేది మీ చాటేనని చెప్పేందుకే ఈ ఫ్యాక్ట్ చెక్... చంద్రబాబు హయాంలోనే గంజాయి మాఫియా... చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో గంజాయి మాఫియా రాజ్యమేలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ... 2014లో విభజన అనంతరం 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్న కాలంలోనే రాష్ట్రంలో గంజాయి దందా యథేచ్చగా సాగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ గంజాయి దందాకు ఏపీ కేంద్ర బిందువుగా మారింది. అంటే అదంతా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. చంద్రబాబుకు సన్నిహితులైన టీడీపీ కీలక నేతలు నర్సీపట్నం కేంద్రంగా అంతర్రాష్ట్రస్థాయిలో గంజాయి సిండికేట్ను నిర్వహించారు. ఏకంగా పోలీసు ఉన్నతాధికారుల అండతో ఉత్తరాంధ్రలో అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో భారీ ఎత్తున గంజాయి సాగు చేయించారు. 2014 తరువాత అప్పట్లో ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా పోలీసు ఉన్నతాధికారిగా నియమితుడైన టీడీపీ రాజ్యసభ సభ్యుడి సమీప బంధువే ఈ దందాకు సూత్రధారిగా వ్యవహరించారు. గంజాయి సాగు కోసం విశాఖ ఏజెన్సీలో ఓ వ్యవస్థను సృష్టించారు. సాగును ధ్వంసం చేస్తే గిరిజనులు మావోయిస్టులకు సన్నిహితమయ్యే ప్రమాదముందని ఓ కట్టుకథను అధికారికంగా తెరపైకి తెచ్చారు. ఆ సాకుతో సాగును చూసీచూడనట్టు వదిలేయాలని టీడీపీ ప్రభుత్వం అధికారికంగా విధాన నిర్ణయం తీసుకుంది. ఇదే అదనుగా టీడీపీ గంజాయి మాఫియా చెలరేగిపోయింది. వేలాది ఎకరాల్లో దర్జాగా సాగు చేస్తూ... నర్సీపట్నం గుండా అటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు, ఇటు చెన్నై–కోల్కతా జాతీయ రహదారి మీదుగా ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా స్మగ్లింగ్ చేస్తూ బరితెగించి మరీ అక్రమాలకు పాల్పడింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి మాఫియా ద్వారా చంద్రబాబు కోటరీ వేల కోట్ల రూపాయలు ఆర్జించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే నవోదయం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో డ్రగ్స్ దందాను నిర్మూలించేందుకు విప్లవాత్మక విధాన నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానమైనది గంజాయి సాగును ధ్వంసం చేయడం. రాష్ట్రంలో దశాబ్దాలుగా వ్యవస్థీకృతమైన గంజాయి సాగును అడ్డుకోలేమని పలువురు అభిప్రాయపడినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ససేమిరా అన్నారు. యువత భవిష్యత్ను నాశనం చేస్తున్న ఈ మత్తు పంటను తుదముట్టించాల్సిందేనని విస్పష్టంగా ప్రకటించారు. గంజాయి, అక్రమ మద్యం, నాటుసారా దందాను సమూలంగా తుడిచిపెట్టడానికి ప్రత్యేకంగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేసి, ఈ బ్యూరోకు విస్తృత అధికారాలు కల్పించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ‘సెబ్’ గంజాయి సాగును నిర్మూలించేందుకు ‘ఆపరేషన్ పరివర్తన్’ కార్యక్రమాన్ని రెండు దశల్లో విజయవంతంగా పూర్తి చేసింది. అందుకోసం గిరిజనుల్లో చైతన్యం కలిగించి వారి సహకారం తీసుకోవడం వ్యూహాత్మకంగా సత్ఫలితాలనిచ్చింది. గంజాయి సాగు వల్ల అనర్థాల గురించి ప్రభుత్వం ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో విస్తృత అవగాహన కల్పించింది. పోలీసు, రెవెన్యూ, సెబ్, గ్రామ సచివాలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేపట్టిన అవగాహన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఈ పంట సాగు నిర్మూలన కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. శాటిలైట్ ఫొటోలతో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంత్రాన్ని జియో మ్యాపింగ్ చేశారు. అనంతరం ప్రత్యేక యంత్రాలతో రెండు దశల్లో ఏకంగా 11,550 ఎకరాల్లో పంటను ధ్వంసం చేశారు. ఏకంగా 4.50 కోట్ల గంజాయి మొక్కలను తొలగించి దహనం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి సాగు లేనేలేదు. ఆ విషయాన్ని స్వయంగా కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగును నిర్మూలించినప్పటికీ సరిహద్దు అవతల ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో సాగు కొనసాగుతోంది. ఆ రాష్ట్రాల్లో పండించిన గంజాయిని ఆంధ్రప్రదేశ్ మీదుగా సాగుతున్న అక్రమ రవాణానూ అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. అందుకోసం ప్రత్యేకంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, ఇతర చెక్ పోస్టులను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 4.50 లక్షల కేజీల గంజాయి, 131 లీటర్ల ద్రవ రూప గంజాయిని స్వాదీనం చేసుకుంది. 13,210 మందిని అరెస్ట్ చేయడంతో పాటు 2,950 వాహనాలను జప్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’కు జాతీయస్థాయిలో ప్రశంసలు లభించాయి. గంజాయి సాగును సమర్థంగా అడ్డుకున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మొదటిస్థానంలో నిలిచిందని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గిరిజనులకు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం దశాబ్దాలుగా జీవనోపాధి లేక గంజాయి సాగుపై ఆధారపడుతున్న గిరిజనుల జీవితాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా వారిని ప్రోత్సహించింది. అందుకోసం రూ.144 కోట్లతో ఆపరేషన్ నవోదయం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. కాఫీ, రాగులు, జొన్నలు, రాజ్మా, మామిడి, కొబ్బరి, నిమ్మ, జీడి మామిడి, వేరుశెనగ, డ్రాగన్ ఫ్రూట్ తదితర పంటల సాగు చేపట్టేలా ప్రోత్సహించింది. ఇందులో భాగంగా ఉచితంగా విత్తనాలను సరఫరా చేయడంతో పాటు ఈ–క్రాపింగ్ ద్వారా అన్నిరకాల పథకాలను అందుబాటులోకి తెచ్చింది. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పిస్తూ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేసింది. -
కాంట్రాక్టుపై రామోజీ విషం
ఐదేళ్ల చంద్రబాబు పాలన అంతా వంచన మయం.. కుట్రపూరితం... కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పైనా మాట తప్పిన అబద్ధాల కోరు చంద్రబాబు. ఈ నిజం రాయడానికి రామోజీకి మనసొప్పదు. మంచి చేయాలనే మనసుంటే మార్గముంటుందని జగన్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో నిరూపించుకుంది. తాను అధికారంలోకి వచ్చిన తర్వాతే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే పుణ్యం కట్టుకుంది. సుప్రీంకోర్టు తీర్పు సాకును వెతుక్కుని కాంట్రాక్టు ఉద్యోగులను చంద్రబాబు వంచిస్తే... పదివేల మంది నెత్తిన క్రమబద్ధీకరణ పాలు పోస్తున్న నేత సీఎం జగన్. తన శిషు్యడు బాబు చేసిన మోసం రాష్ట్రం మొత్తం తెలిసినా, రామోజీ ఒక్కరే తెలియనట్లు నటిస్తారు. కాంట్రాక్టు ఉద్యోగులకు మంచి జరిగిపోతే ఆ ఖ్యాతి జగన్ ప్రభుత్వానికి దక్కడం రామోజీకి సుతరామూ ఇష్టం లేదు. ఈ దుగ్ధతోనే తప్పుడు రాతలు రాస్తూ ప్రభుత్వంపై అక్షర విషాన్ని విరజిమ్ముతూనే ఉన్నారు.. ఈ అక్షర మాయావి ఎంతగా బాబును మోయాలనుకున్నా బాబు చేసిన పాపాలు జనానికి ఐదేళ్ల కిందటే తేటతెల్లమయ్యాయి... టీడీపీని శంకరగిరి మాన్యాలు పట్టించాయి.. ఇదంతా తెలిసినా తన తప్పుడు రాతలతో రోజురోజుకూ రామోజీ దిగజారిపోతూనే ఉన్నారు.. సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించకుండా మోసం చేసింది మీ చంద్రబాబు నాయుడేనని తెలుసుకోవాలి రామోజీ..గత చరిత్రను వదిలేసి ఇప్పుడు ఈనాడు కళ్లు మూసుకుని ఇష్టానుసారం రాతలు రాస్తే చెల్లదు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం క్రమబద్ధీకరణ పేరిట కాలక్షేపానికి మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమావేశాలతో కాలయాపన చేసి చివరికి సుప్రీం కోర్టు తీర్పు అడ్డొస్తోందని, అందువల్ల సాధ్యం కాదంటూ కాంట్రాక్టు ఉద్యోగులను నిలువునా వంచించింది చంద్రబాబు నాయుడే. ఇవేమీ ఈనాడు రామోజీకి అప్పట్లో కనిపించలేదు. దీనికి భిన్నంగా వైఎస్.జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ చేస్తూ నిర్ణయం తీసుకుని అమలు చేస్తుంటే ఈనాడు రామోజీ తప్పుపట్టడాన్ని ఉద్యోగులే జీర్ణించుకోలేకపోతున్నారు. ఈనాడు చెత్తరాతలంటూ వారు మండిపడుతున్నారు. నిబంధనల పేరుతో అర్హులను తగ్గిస్తున్నారంటూ మరో అవాస్తవ ప్రచారానికి రామోజీ దిగజారారు. ప్రభుత్వంలో రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు వంటివి పాటిసూ్తనే కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తారు. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు పాటించకపోవడానికి ఇదేమీ రామోజీ సొంత జాగీరు కాదు. ఈ మాత్రం కనీస అవగాహన లేకుండా ఈనాడు తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంది. వాస్తవానికి ఐదేళ్లు నిద్రపోయి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ సాధ్యం కాదని చెప్పింది మీ చంద్రబాబు నాయుడే రామోజీ. మంజూరైన పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండాలనే నిబంధన ఇప్పుడు వైఎస్.జగన్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిందేమీ కాదు. టీడీపీ ఆవిర్భవించక ముందు నుంచే కాకుండా, బాబు ప్రభుత్వంలోనూ ఉంది. అయినా చంద్రబాబుకు చేతకాని పనిని జగన్ ప్రభుత్వం చేసి చూపించి, కాంట్రాక్టు ఉద్యోగుల నెత్తిన పాలు పోసింది. అందుకే బాబును నమ్మం గాక నమ్మం ... అని 2019లో టీడీపీని చిత్తుగా ఓడించి, ఉద్యోగులు ఇంటి బాట పట్టించారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట మేరకు అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి ఆర్థిక శాఖ చర్యలను చేపట్టింది. ఎన్నికల కోడ్ కన్నా ముందే క్రమబద్ధీకరణ ప్రారంభమైంది. తదనుగుణంగా మార్గదర్శకాలను 13–12–2023న సర్క్యులర్ మెమో ద్వారా విడుదల చేసింది. క్రమబద్ధీకరణ కోసం రూపొందించిన సాఫ్ట్ వేర్లో ఉద్యోగులు తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాలి్సందిగా స్పష్టం చేసింది. అర్హులైన సుమారు పది వేల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు జగన్ ప్రభుత్వం చర్యలను చేపట్టింది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో 3000 మందిని క్రమబద్ధీకరించారు. మిగతా వారికి అవకాశవిుచ్చే క్రమంలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. మాట ఇస్తే మడమ తిప్పరనే నమ్మకం ఉన్నందునే మళ్లీ జగన్ను సీఎంను చేయడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. బాబు సర్కారుకు – జగన్ సర్కారుకు తేడా.. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ కోసం ఆర్థిక, మానవ వనరులు, ఆరోగ్య, ఐటీ శాఖల మంత్రులతో 09–09–2014న జీవో 3080 ద్వారా ఒక బృందాన్ని బాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తమ ఐదేళ్ల పాలనలో మంత్రుల బృందం సమావేశాలతో సాగదీయడమే కాకుండా చివరగా సుప్రీం కోర్టు తీర్పును బూచిగా చూపించి, క్రమబద్ధీకరణ సాధ్యం కాదంటూ చేతులెత్తేసి, ఇచ్చిన మాటను తప్పింది. ఇప్పుడు జగన్ సర్కారు 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు న్యాయపరమైన, చట్టపరమైన చిక్కులను అధిగమించి కాంట్రాక్టు ఉద్యోగులను వైఎస్ జగన్ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. వివిధ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసును పరిగణనలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తాం’ అని జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ మేరకు అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. మంత్రుల కమిటీతో పాటు సీఎస్ అధ్యక్షతన వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రుల కమిటీ, వర్కింగ్ కమిటీలు పలు సార్లు న్యాయపరమైన, చట్టపరమైన సమస్యలపై చర్చించాయి. క్రమబద్ధీకరణపై నిషేధం విధిస్తూ 1994లో చేసిన చట్టంలో సవరణలు చేయాలని ఈ కమిటీలు సూచించాయి. క్రమబద్ధీకరణకు ఎటువంటి చిక్కులు ఎదురుకాకుండా ఉండే విధంగా న్యాయపరంగా అన్ని అంశాలను జగన్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. సుప్రీం కోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుంటూనే ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే గత చంద్రబాబు సర్కారుకు – ఇప్పటి వైఎస్ జగన్ సర్కారుకు తేడా. -
‘ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్’పై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఆధ్వర్యంలో ఫ్యాక్ట్–చెకింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్పై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఇది భావ వ్యక్తీకరణకు సంబంధించిన అంశమని వెల్లడించింది. ప్రభుత్వంపై మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను, ఆన్లైన్లో నకిలీ కంటెంట్ను గుర్తించడానికి ఈ యూనిట్ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్–2021లో సవరణలు చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఇండియాతోపాటు పలువురు బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ఫ్యాక్ట్–చెకింగ్ యూనిట్ ఏర్పాటుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ మార్చి 11న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. మార్చి 11 నాటి బాంబే హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. -
ట్యాపింగ్ వీరుడు.. డేటా చోరుడు.. బాబే
సాక్షి, అమరావతి : ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఈనాడు రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. అందుకే టీడీపీ ఓటమికి ఇప్పటి నుంచే కుంటిసాకులు వెతికే పనిలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందంటూ చిత్తకార్తి రాతలు రాస్తూ వైఎస్సార్సీపీపై దుష్ప్రచార కుట్రకు తెరతీశారు. పచ్చ పైత్యం సోకి రామోజీరావుకు ఉద్దేశపూర్వక మతిమరుపు వచ్చిందేమోగానీ... రాష్ట్ర ప్రజలకు మాత్రం అన్నీ గుర్తున్నాయి. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం ఫోన్ల ట్యాపింగ్కు పాల్పడటం, ఓటర్ల వ్యక్తిగత డేటా చౌర్యానికి బరితెగించడం అంతా ప్రజలకు గుర్తుంది. ఫోన్ల ట్యాపింగ్ కోసం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఇజ్రాయెల్ వెళ్లి మరీ అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ను కొన్నారన్నది బహిరంగ రహస్యమే. చంద్రబాబు బాగోతాన్ని శాసన సభ ఉప సంఘం కూడా నిగ్గు తేల్చింది. మరోవైపు చంద్రబాబు పెగసస్ కంపెనీ నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే స్వయంగా ఆ రాష్ట్ర శాసన సభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ పోలీసు అధికారీ ఇజ్రాయెల్ వెళ్లలేదు. ఎలాంటి సాఫ్ట్వేర్ కొనలేదు. వీటన్నింటినీ మరుగున పరుస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే ధ్యేయంగా ఈనాడులో ఓ కట్టుకథ రాశారు. అసలు వాస్తవాలేమిటంటే... ట్యాపింగ్ చరిత్ర బాబుదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ అనే జాడ్యానికి ఆద్యుడు చంద్రబాబే. 2004 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్ కోసం ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అప్పటి ఇంటెలిజెన్స్ విభాగంలో ఓ కీలక అధికారిని, మరో పోలీసు ఉన్నతాధికారిని అందుకోసం ప్రత్యేకంగా నియమించారు. ప్రతిపక్ష నేత నుంచి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల వరకూ అందరి ఫోన్ల ట్యాపింగ్కు పాల్పడ్డారు. ఆ కుట్రలో భాగస్వామి అయిన ఆ పోలీసు ఉన్నతాధికారికి 2014లో చంద్రబాబు మళ్లీ సీఎం అయిన తరువాత రాష్ట్ర పోలీస్ బాస్గా పోస్టింగ్ ఇచ్చారు కూడా. భద్రతా చట్టాలను ఉల్లంఘించి మరీ పెగసస్ సాఫ్ట్వేర్ కొన్న చంద్రబాబు రాష్ట్ర విభజన తరువాత 2014లో ఆంధ్రప్రదేశ్కు సీఎం అయిన చంద్రబాబు మరోసారి ఫోన్ ట్యాపింగ్ అక్రమాలకు పాల్పడ్డారు. ప్రధానంగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు వ్యవహారంలో ‘మా వాళ్లు బ్రీఫ్డ్ మీ’ అంటూచంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. రాత్రికి రాత్రే విజయవాడకు మకాం మార్చేశారు. ఇక్కడ ఆయన మరోసారి ఫోన్ ట్యాపింగ్పై దృష్టి సారించారు. అందుకోసం అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంతో ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్తోపాటు ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడటం ఆ వ్యవస్థ లక్ష్యం. ఐటీ గ్రిడ్స్ అనే ప్రైవేటు కంపెనీ, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు కూడా భాగస్వామిగా ఉన్న ఆకాశ్ ఎంటర్ప్రైజస్ కంపెనీల ద్వారా ఏరోస్టాట్ బెలూన్లు, ఇతర ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనుగోలుకు పెగసస్తో సంప్రదింపులు జరిపారు. అందుకోసం ఏబీ వెంకటేశ్వరరావు బృందం ఇజ్రాయెల్లో పర్యటించింది. పెగసస్ సంస్థతో సంప్రదింపులు జరిపింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీ కంపెనీల నుంచి ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ కొనాలంటే రక్షణ శాఖ అనుమతి తప్పనిసరి. ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ఉగ్రవాద సంస్థలకు చిక్కితే దేశంలో విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్నందువల్ల దేశ భద్రత దృష్ట్యా ఈ నిబంధన విధించారు. కానీ, జాతీయ భద్రత చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించింది. రక్షణ శాఖకు సమాచారం ఇవ్వకుండానే పెగసస్ కంపెనీతో సంప్రదింపులు జరిపింది. ఐటీ గ్రిడ్స్ కంపెనీ ద్వారా ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసి దిగుమతి చేసుకుంది. అందుకోసం నిధులు కూడా చెల్లించింది. రూ.25 కోట్లతోచంద్రబాబు పెగసస్ సాఫ్ట్వేర్ కొన్నారు: మమత ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రూ.25 కోట్లు వెచ్చించి పెగసస్ నుంచి అక్రమంగా ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. 2022లో పశ్చిమ బెంగాల్ శాసనసభలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ డేటా చౌర్యం సాఫ్ట్వేర్ కొనాలని పెగసస్ కంపెనీ ప్రతినిధులు తనను సంప్రదించారని వెల్లడించారు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఆ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసిందని, మీరు కూడా కొనాలంటూ ఆ సంస్థ ప్రతిపాదించిందని తెలిపారు. చట్ట విరుద్ధమైన ఆ పనిని తాను చేయలేనని తిరస్కరించానని మమతా బెనర్జీ చెప్పారు. ఇవన్నీ చంద్రబాబు కుతంత్రాలను బయటపెట్టే వాస్తవాలు. వీటిని ఏనాడూ ప్రశ్నించని రామోజీరావు.. ఇప్పుడు మాత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫోన్ల ట్యాపింగ్కు పాల్పడకపోయినా, ఓ అసత్య కథనాన్ని ప్రజల్లోకి వదిలి, టీడీపీ ఓటమికి ఓ కుంటిసాకును సిద్ధం చేసుకున్నారు. యథేచ్ఛగా ఫోన్ ట్యాపింగ్..35 లక్షల మందిడేటా చౌర్యం అక్రమంగా కొన్న ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్వేర్తో చంద్రబాబు ప్రభుత్వం బరితెగించింది. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్తోపాటు వైఎస్సార్సీపీకి చెందిన 65 మంది నేతల ఫోన్ల ట్యాపింగ్కు పాల్పడింది. దీనిపై పూర్తి ఆధారాలతో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019 ఎన్నికలకు ముందు వివిధ కేసుల దర్యాప్తు ముసుగులో ఏకంగా వైఎస్సార్సీపీకి చెందిన 150 మంది ఫోన్లను ట్యాప్ చేయడం చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలకు నిదర్శనం. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన ఓటర్ల డేటా (సమాచారం) మొత్తాన్ని టీడీపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన ‘సేవా మిత్ర’ యాప్కు అనుసంధానించారు. రాష్ట్రంలోని ఓటర్ల వ్యక్తిగత సమాచారం చౌర్యానికి పాల్పడ్డారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్న 35 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర పన్నారు. ఈ కుట్రకు వ్యతిరేకంగా అప్పట్లోనే వైఎస్సార్సీపీ ఆందోళనలు చేసింది. పోలీసులు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదులు చేసింది. నిగ్గు తేల్చిన శాసనసభ ఉప సంఘం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ప్రభుత్వ డేటా చౌర్యంపై విచారణకు సభా సంఘాన్ని నియమించింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ హోం, ఆర్థిక, సమాచార–పౌర సంబంధాల శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులను విచారించింది. అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే తాము ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ సేవామిత్ర యాప్నకు బదిలీ చేశామని ఆ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్వేర్ను అక్రమంగా కొన్న మాట వాస్తవమేనని, అందుకే ఆ దేశంలో పర్యటించామని తెలిపారు. ఈ వ్యవహారంపై ఉప సంఘం మధ్యంతర నివేదికను కూడా శాసనసభకు సమర్పించింది. -
‘ఫ్యాక్ట్ చెక్ యూనిట్’ నోటిఫికేషన్పై సుప్రీం స్టే
ఢిల్లీ: కేంద్రం విడుదల చేసిన ‘ఫ్యాక్ట్ చెక్’ నోటిఫికేషన్పై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని అభిప్రాయపడింది. ఫేక్ న్యూస్ను అడ్డుకునేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో ‘ఫ్యాక్ట్ చెక్ (నిజనిర్ధారణ)’ యూనిట్కు సంబంధించి కేంద్ర ఐటీ శాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసిన తెలిసిందే. కాగా కేంద్ర ఐటీ శాఖ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ను నోటిఫై చేయగా.. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని ‘ద ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫ్యాక్ట్ చెక్ విభాగాన్ని నోటిఫై చేయకుండా ఆదేశాలివ్వాలంటూ ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే గురువారం దీనిపై సుప్రీం కోర్టు విచారణ జరిపి.. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ నోటిఫికేషన్పై స్టే విదిస్తున్నట్లు పేర్కొంది. ఆన్లైన్ కంటెంట్లో ఫేక్, తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు ఫ్యాక్ట్ చెక్ యూనిట్ను తీసుకువస్తామని కేంద్రం గతేడాది ఏప్రిల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే దీనికోసం ఐటీ రూల్స్-2021కి కూడా కేంద్రం సవరణలు చేసింది. ఈ కొత్త నిబంధనలు ఏకపక్షంగా, రాజ్యంగ విరుద్ధంగా ఉన్నాయిని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటుపై మధ్యంత స్టే ఇవ్వడానికి ముంబై హైకోర్టు నిరాకరించింది. ముంబై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్పై గురువారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయముర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మార్చి 11 ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. అయితే బాంబే హైకోర్టు ముందుకు వచ్చిన ప్రశ్నలను పరిశీలించాల్సి అవసంరం ఉందని సుప్రీం కోర్టు తెలిపింది. ఇక.. అంతవరకు మార్చి 20 (బుధవారం) కేంద్రం జారీ చేసిన నోటిఫికేష్పై స్టే విధిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
Fact Check: బాబు బాగోతమే ‘బెస్ట్’ట..!
సాక్షి, అమరావతి: ఒకటీ రెండూ కాదు.. రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి వచ్చాయి. కుల మత బేధాలు లేకుండా 47 లక్షల మంది పిల్లలకు ప్రభుత్వం అందరికీ సమాన అవకాశాలు కల్పించింది. పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాకుండా, జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, ఉన్నత విద్యకు ఫీజు రీయింబర్స్మెంట్.. ఒక్కటేంటి చదువుకోవాలనే ఆశ, ఆశయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా విద్యనందిస్తోంది ఈ సర్కారు. విదేశాల్లో చదువుకునేందుకు రూ.1.25 కోట్ల ఫీజును చెల్లిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో ‘ఏపీ చదువులు బెస్ట్’ అనిపించుకుంది. కానీ రామోజీకి మాత్రం ఇవి కనిపించకపోగా.. ‘‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా’’ అన్న కుసంస్కారికి సంఘ సంస్కర్త అని డబ్బా కొడుతోంది. బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్లను అటకెక్కించేశారంటూ గగ్గోలు పెడుతోంది. దళిత, గరిజన బిడ్డలు చదువులకు దూరం చేశారంటూ మొసలి కన్నీరు కారుస్తోంది. అట్టడువర్గాల యువతకు అందించే విదేశీ విద్యా పథకం పైనా ఈనాడు విషం కక్కింది. గత ప్రభుత్వం విదేశీ విద్య పథకాన్ని అవినీతి, అక్రమాలకు నిలయంగా మార్చేస్తే దానిపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టి అక్రమాలను వెలికి తీసింది. విదేశీ విద్యా పథకంలో మార్పులు చేసి నిజమైన అర్హులకు అందిస్తోంది. ఎంపిక చేసుకున్న యూనివర్సిటీలకు ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటి వరకు 41 మంది ఎస్సీ విద్యార్థులు ఈ పథకం కింద లబ్ధి పొంది విదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీల్లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. అడవి బిడ్డలు చదువుకునే గిరిజన విద్యాలయాలను అభివృద్ధి చేయడమే కాకుండా, వారి భోజన, ఇతర సదుపాయాల కోసం రూ.920.31 కోట్లను ఖర్చు చేసింది. అందుకు నిదర్శనమే ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులు 2019 నుంచి 23 మధ్య దాదాపు 400 మందికి పైగా ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ ర్యాంకులు సాధించారు. ఇవేమీ కనిపించని ఈనాడు పత్రిక కుళ్లు రాతలు రాస్తోంది. ఎస్సీ, ఎస్టీలను చిన్నచూపు చూసిన చంద్రబాబు పథకాలు ఇంతకంటే చాలా గొప్పవని చెబుతోంది. బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్ ఎన్ని రామోజీ? ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందించేందుకు దివంగత వైఎస్సార్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికే ‘బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్’గా చంద్రబాబు పేరుమార్చి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను తన కూటమిలోని సభ్యులు నడుపుతున్న 383 ప్రైవేటు స్కూళ్లలో కేవలం 33 వేల మందిని చేర్పించి, నిరుపేద విద్యార్థులకు బెస్ట్ ఇంగ్లిష్ మీడియం చదువులంటూ భారీగా నిధులను దోచుకున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రతి పేద విద్యార్థికి ఇంగ్లిష్ మీడియం విద్య అందించాలని రాష్ట్రంలోని దాదాపు 45 వేల ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లిష్ మీడియం బోధనలోకి మార్చారు. దాంతో 47 లక్షల మంది పిల్లలకు బెస్ట్ విద్య అందుతోంది. ఇక గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన 371 ఆశ్రమ పాఠశాలలు, 18 ప్రి మెట్రిక్ హాస్టళ్లు, 159 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, 1958 పాఠశాలలను ఆధునికీకరించారు. వీటిలో ఇప్పుడు 1,55,599 మంది విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుతోంది. వారి భోజన, సదుపాల కోసం ఒక్క 2023 సంవత్సరంలోనే ప్రభుత్వం రూ.920.31 కోట్లు ఖర్చు చేసింది. గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లో చవిదిన విద్యార్థులు గత నాలుగేళ్లలో 400 మందికిపైగా ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు సాధించారు. 50 మందికి పైగా నీట్ ర్యాంకులు సాధించి మెడిసిన్ చదువుతున్నారు. గిరిజన వర్సిటీ, మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల స్థాపన గత ప్రభుత్వంలో ప్రచారానికే పరిమితమైన అడవి బిడ్డల బెస్ట్ విద్యను ఈ ప్రభుత్వం వారి చెంతకు చేర్చింది. ఒకటో తరగతి నుంచి స్కూళ్లలో ఇంగ్లిష్ విద్యను అందించడమే కాకుండా ఉన్నత విద్యను సైతం వారి దరికి చేర్చింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో రూ.153.85 కోట్లతో నిర్మిస్తున్న ఇంజినీరింగ్ కళాశాలలో సగం సీట్లు (150) గిరిజన విద్యార్థులకే రిజర్వు చేసింది. సాలూరులో రూ.561.88 కోట్లతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని నిర్మిస్తోంది. పాడేరులో రూ.500 కోట్లతో గిరిజన వైద్య కళాశాలను మంజూరు చేసింది. ఇవేమీ రామోజీ పచ్చ కళ్లకు కనిపించకపోవడమే విడ్డూరం. ఎస్సీ విద్యా సంస్థల్లో ఉత్తమ విద్య గత టీడీపీ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వ విద్యారంగాన్ని, వైద్యరంగాన్ని నిర్వీర్యం చేసి అంతిమంగా పేదలపైన, దళితులపైన భారం మోపారు. చదువులు, వైద్యాన్ని కొనే స్తోమత లేక రెండింటికీ దూరమయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్కు బకాయి పెట్టి విద్యార్థులను వేదనకు గురి చేసింది. ఇవేమీ ఈనాడు దినపత్రికలో ఏరోజూ కనిపించలేదు. అలాంటి పరిస్థితులను తొలగిస్తూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మెరుగైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎస్సీ, ఎస్టీల కోసం చేపడితే అది తప్పు అన్నట్టు రాస్తోంది. గతంలో కనీస ప్రమాణాలు లేని స్కూళ్లకూ బెస్ట్ అవైలబుల్ స్కీంను అమలు చేసి నిధులను దోచుకున్నారు. ఇప్పుడు విద్యార్థులందరికీ నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య అందుతోంది. డిజిటల్ తరగతి గదులు, ఐఎఫ్పీ స్క్రీన్లు, ఇంటర్నెట్, విద్యార్థులకు ట్యాబ్లు, బైలింగువల్ టెక్టŠస్ బుక్స్తో, డిక్షనరీ, యూనిఫారం, షూలతో విద్యాకానుక అందిస్తున్నారు. టోఫెల్ శిక్షణనిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను ప్రకటించింది. మెయిన్స్కు అర్హత సాధిస్తే రూ.లక్ష , ఇంటర్వ్యూలకు క్వాలిఫై అయినవారికి అదనంగా రూ.50వేల చొప్పున ప్రోత్సాహకాలను ప్రకటించింది. గత ఏడాది ప్రకటించిన జేఈఈ అడ్వాన్డ్, మెయిన్స్ల్లో విద్యార్థులు 99.05 శాతం పర్సంటైల్ సాధించడంతో పాటు 200 మందికి పైగా ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు పొందారు. రూ.వేల కోట్ల నిధుల అభివృద్ధి కనిపించలేదా రామోజీ ఎస్సీ వర్గానికి చెందిన 8,84,131 మంది తల్లులకు రూ.15 వేల చొప్పున రూ.5,335.7 కోట్లు ఇప్పటివరకూ అందించింది. 2,86,379 ఎస్టీ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి ద్వారా రూ.1,714.75 కోట్లు అందించింది. జగనన్న వసతి దీవెన ద్వారా 5.06 లక్షల మందికి పైగా ఎస్సీ విద్యార్థుల తల్లులకు రూ.834 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో వేసింది. 83 వేల మంది ఎస్టీల తల్లులకు రూ.135.66 కోట్లను వారి ఖాతాల్లో జమచేసింది. జగనన్న విద్యాదీవెన ద్వారా రూ.5.4 లక్షల మంది ఎస్సీ విద్యార్థుల తల్లులకు రూ.2,081 కోట్లు అందించింది. 1.11 లక్షల మంది ఎస్టీ తల్లులకు రూ.346 కోట్లు అందాయి. ఈ పథకాలన్నీ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవినీతికి చోటు లేకుండా నేరుగా వారి ఖాతాల్లోనే జమ అయ్యాయి. ఇవేమీ బెస్ట్ అవెయిలబుల్కు సాటిరావంటోంది ఎల్లో మీడియా. ♦ గత ప్రభుత్వం హయాంలో విదేశీ విద్యా పథకంలో జరిగిన లోపాలను, అవినీతిని, అక్రమాలను గుర్తించి ఆ స్థానంలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని తీసుకు వచ్చింది. ప్రతిభ ఉన్న విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించింది. అభ్యర్ధులు ఎంచుకోదగ్గ 21 కోర్సులలో క్యూఎస్ ర్యాంకింగ్ లేదా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంక్ల ప్రకారం 50 ఉత్తమ ర్యాంకుల గల విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు లేదా ట్యుషన్ ఫీజు 100 శాతం చెల్లించేలా పథకాన్ని మార్చి అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 41 మంది విద్యార్థులు ఎంపికై విదేశాల్లో చదువుకుంటున్నారు. గత ప్రభుత్వం విదేశీ విద్యకు ఈ స్థాయిలో భరోసా ఇవ్వగలిగిందా? ♦ అంబేడ్కర్ స్టడీ సర్కిల్స్పైనా ఈనాడు పచ్చి అబద్ధాలు అచ్చేసింది. వాస్తవానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అంబేడ్కర్ స్టడీ సర్కిల్స్ మరింత ప్రయోజనకరంగా నిర్వహిస్తోంది. విశాఖలో సివిల్స్ కోచింగ్. విజయవాడలో గ్రూప్స్కి శిక్షణనిస్తోంది. తిరుపతిలో బ్యాంకు ఉద్యోగాలకు శిక్షణనిస్తోంది. ఈ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఉద్యోగ శిక్షణ కోసం ఇప్పటివరకు రు.15 కోట్లు పైగా ఖర్చు చేసింది. అయినా సరే.. బాబు బాగోతమే బాగుందంటోది పచ్చపత్రిక. -
చంద్రబాబుదే షాక్.. సబ్సిడీలకు బ్రేక్
చంద్రబాబు చేసిన తప్పులను, పాపాలను ఏ రోజూ అచ్చేయని రామోజీకి గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వంలో ఒప్పులు సైతం తప్పులుగానే కనిపిస్తున్నాయి. తానేం రాసినా ఈ రాష్ట్ర ప్రజానీకం నమ్మేస్తుందనే వెర్రి భ్రమల్లోంచి ఈ గురివింద బయట పడడం లేదు. వాస్తవాలను అచ్చేయడానికి ఈ పెద్దమనిషికి చేతులు రావడం లేదు. రోజూ అభూతకల్పనలతో పత్రిక స్థాయిని ఎంతగా దిగజార్చుకోవాలో అంతగా దిగజారుస్తూ పాత్రికేయ విలువలకు వలువలూడదీస్తున్నారు. రికార్డు పరంగా ఉన్న నిజాలను సైతం అబద్ధాలుగా వక్రభాష్యాలతో అచ్చేస్తూ పత్రికను టీడీపీ కరపత్రికగా మార్చే బరితెగింపు రామోజీకి మాత్రమే సాధ్యమైంది. విద్యుత్ చార్జీల విషయంలో ఐదేళ్ల వ్యవధిలో ఏ రోజూ ప్రభుత్వ సబ్సిడీలు ఇవ్వని చంద్రబాబు రామోజీ దృష్టిలో గొప్ప పాలకుడు. రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్న వైఎస్ జగన్ మాత్రం నచ్చని పాలకుడు. బొక్కబోర్లా పడిన టీడీపీని ఎలాగైనా నిలబెట్టాలని తెగ ఆరాట పడిపోతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ‘ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్’ శీర్షికతో ఈనాడులో అచ్చేసిన కథనంలో నిజానిజాలు ఇలా ఉన్నాయి. – సాక్షి అమరావతి ఆరోపణ: 2021–22లో వినియోగించిన విద్యుత్తుకు ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో రూ.3,082.99 కోట్ల భారం వాస్తవం : 2021–22లో వినియోగించిన విద్యుత్తుకు వాస్తవ, ఆమోదిత విద్యుత్తు కొనుగోలు ఖర్చులోని వ్యత్యాసాన్ని వసూలు చేస్తోంది. ఆ వసూలు భారం లేనిదే. ప్రతి యూనిట్కు కేవలం రూ.0.6455 పైసలు మాత్రమే వసూలు చేస్తోంది. ఇందులోనూ ప్రభుత్వ ప్రమేయం లేదు. పైగా ప్రభుత్వం సబ్సిడీ చెల్లించే కేటగిరీల వినియోగదారులకు ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ఆరోపణ: జగన్ ప్రభుత్వం నెలకు 500 యూనిట్లు వినియోగించే వినియోగదారులపై యూనిట్కు 90 పైసలు పెంచింది వాస్తవం : ఏటా విద్యుత్తు చార్జీల టారిఫ్పై ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి పంపిణీ సంస్థలు సమర్పిస్తాయి. ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చేలా కొత్త టారిఫ్ ప్రకటిస్తుంది. అంటే వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నెల రోజుల ముందే టారిఫ్ అమలులోకి వచ్చింది. అలాంటప్పుడు ఆ చార్జీలను కొత్త ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది ? ఎలా పెంచుతుంది? ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా వార్తలెలా రాస్తున్నారు డ్రామోజీ? చంద్రబాబు హయాంలోనే పెంచిన చార్జీలను జగన్ ప్రభుత్వంపై రుద్దడానికి ఇంత కన్నా మార్గం కనిపించలేదా? నాలుగేళ్లుగా ఈ చార్జీలు కొనసాగుతున్నాయంటే 500 యూనిట్ల పైన వినియోగించే వారంటే కచ్చితంగా పేదలు కాదని రామోజీకి తెలియదా? ఆరోపణ: 2023 ఏప్రిల్ నుంచి ప్రతినెలా విద్యుత్తు కొనుగోలుకు అదనంగా చేసిన ఖర్చును ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో వసూలు చేస్తోంది. వాస్తవం : 2023–24కు సంబంధించి విద్యుత్తు కొనుగోలు ట్రూ–అప్ (విద్యుత్తు కొనుగోలు వ్యయం, సర్దుబాటు)కు ఏపీఈఆర్సీ రెగ్యులేషన్–2 ప్రకారం ఏప్రిల్ నెల వినియోగానికి ఎఫ్ఏపీసీఏ మొత్తాన్ని జూన్లో వసూలు చేయాలి. అదీ యూనిట్కు గరిష్టంగా రూ.0.40 పైసలు వరకు మాత్రమే వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేందుకు అనుమతించింది. ఇందులో వ్యవసాయ, ఇతర సబ్సిడీ వినియోగదారులు చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఆరోపణ : గృహ, ఎల్టీ వాణిజ్య వినియోగదారులపై స్థిర చార్జీల భారం వాస్తవం : గృహ వినియోగ కేటగిరీలో అంతకు ముందు విధిస్తున్న కనీస వినియోగ చార్జీలను ఈ ప్రభుత్వం రద్దు చేసింది. నిజానికి గృహ కేటగిరీలో స్థిరచార్జీలు ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. కర్ణాటకలో కిలోవాట్కు రూ.110 తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో సింగిల్ ఫేజ్కు రూ.110, త్రీ ఫేజ్కు రూ.385 వసూలు చేస్తున్నారు. కేరళలో సింగిల్ ఫేజ్కు రూ.40 నుంచి రూ.260 వరకూ, త్రీఫేజ్కు రూ.100 నుంచి రూ.200 వరకూ విధిస్తున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి ముందు ఒక్కో సర్వీసుకు నెలవారీ కనీస చార్జీల మొత్తం రూ.25గా ఉండేది. ఆ తర్వాత 2021 ఏప్రిల్లో ఆ కనీస చార్జీని ఒక్కో కిలోవాట్కు రూ.10లుగా నిర్ణయిస్తూ రాష్ట్ర విద్యుత్తుæ నియంత్రణా మండలి ఆదేశాలు జారీ చేసింది. ఈ స్థిర చార్జీలను డిస్కంకు విద్యుత్తుæ ప్రసార, పంపిణీ వ్యవస్థ (íపీజీసీఐల్, ట్రాన్సిమిషన్, డిస్ట్రిబ్యూషన్)కు అయ్యే వ్యయం, విద్యుదుత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన స్థిర వ్యయంలో కొంత భాగాన్ని రికవరీ చేసుకోవడం కోసం విధిస్తున్నారు. ఇది గృహేతర కేటగిరీల్లో ముందు నుంచి వసూలు చేస్తున్నదే. వాస్తవానికి సుమారు 67 శాతం సర్వీసులు ఒక కిలోవాట్, అంతకంటే తక్కువ లోడ్ పరిధిలోనే ఉంటాయి. అందువల్ల ఒక్కో సర్వీసుపైన విద్యుత్తుæ సంస్థలు దాదాపు రూ.15 నష్టాన్ని భరిస్తున్నాయి. ఇందులో ప్రజలపై భారం వేసిందేముంది? ప్రభుత్వం తీసుకున్నదేముంది? ఆరోపణ: 2014–19 మధ్య ట్రూ–అప్ కింద ఇప్పటికే రూ.1,455.37 కోట్లు వసూలు వాస్తవం : 2014–15 నుంచి 2018–19 వరకు ఆమోదించిన దానికి వాస్తవ పంపిణీ ఖర్చు (నిర్వహణ వ్యయం, తరుగుదల, మూలధన ప్రతిఫలం తదితరాలు)లో ఏర్పడ్డ వ్యత్యాసం రూపేణా రూ.2,910.74 కోట్లు ట్రూ–అప్ చార్జీలను వసూలు చేసుకునేందుకు ఏపీఈఆర్సీ ఉత్తర్వుల మేరకు డిస్కంలు వసూలు చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఒక్కో యూనిట్కు రూ.0.07 పైసలు చొప్పున అనుమతించిన దానిలో సగం మాత్రమే డిస్కంలు వసూలు చేశాయి. అదీ ఆమోదిత, వాస్తవ పంపిణీ ఖర్చు (నిర్వహణ వ్యయం, తరుగుదల, మూలధన ప్రతిఫలం తదితరాలు) వ్యత్యాసాన్ని మండలి ఉత్తర్వుల మేరకు వసూలు చేస్తున్నాయి. నిజానికి ఈ చార్జీలు టీడీపీ హయాంలోనే సర్దుబాటు చేయాల్సి ఉంది. 2014–15 నుంచి 2018–19 వరకు ఐదేళ్లకు టీడీపీ ప్రభుత్వ సబ్సిడీ రూ.17,487 కోట్లు మంజూరు చేయగా, అందులో రూ.10,923 కోట్లు మాత్రమే చెల్లించింది. రూ.6,564 కోట్లు చెల్లించలేదు. ఆ పాపమే ట్రూ–అప్గా ప్రజలపై పడింది. 2019–20 నుంచి 2023–24 వరకూ నాలుగేళ్లలోనే సబ్సిడీ రూ.2,0375 కోట్లు మంజూరు చేసి, రూ.20,479 కోట్లను ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. ఆరోపణ: చార్జీల పెంపు.. శ్లాబుల్లో మార్పులు చేసి ఏటా రూ.1,400 కోట్లభారాన్ని 2022 ఏప్రిల్ నుంచి ప్రభుత్వం వేసింది. వాస్తవం : 2022 ఏప్రిల్ నుంచి శ్లాబులు, యూనిట్ రేట్లను పెరుగుతున్న సరఫరా వ్యయానికి అనుగుణంగాపెంచింది. అదీగాక గృహ వినియోగ కేటగిరీ సరఫరా వ్యయం రూ.7.79 కాగా, బిల్లింగ్ రేటు రూ.5.13 మాత్రమే ఉంది. అంటే గృహ వినియోగదారులకు సరఫరావ్యయంతో పోలిస్తే తక్కువ ధరే వసూలు చేస్తోంది. అప్పుడు భారం ఎవరిపై పడినట్లు డ్రామోజీ? మేలు చేయడం మోసమా? ♦ ఏటా విద్యుదుత్పత్తికి సంబంధించిన చార్జీలు పెరుగుతుండటంతో వాటికి అనుగుణంగా విద్యుత్తు కొనుగోలు చార్జీలూ పెరుగుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోనికి తీసుకునే వినియోగించిన విద్యుత్తుకు అనుగుణంగా చార్జీలపై ఏపీఈఆర్సీ నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో ప్రభుత్వానికిగానీ, విద్యుత్తు సంస్థలకుగానీ ఎలాంటి ప్రమేయమూ ఉండదు. జాతీయ టారిఫ్ విధానం ప్రకారం గతంలో ఉన్న టారిఫ్ శ్లాబులను స్థిరీకరణ చేయడం ద్వారా శ్లాబ్లలో మార్పులు జరిగాయి. కేటగిరీ వారీగా చూస్తే టారిఫ్ ధరలు పెరగడం లేదు. పైగా వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ సామాన్య ప్రజలపై ఎలాంటి భారం పడకూడదని ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ సూచనలతో విద్యుత్తు సంస్థల పరిధిలో సామాన్యులు మోయలేనంతగా చార్జీలను వసూలు చేయడం లేదు. వినియోగించిన విద్యుత్తుకు అనుగుణంగానే వసూలు చేస్తోంది. ♦ ఏటా విద్యుదుత్పత్తికి సంబంధించిన వ్యయం పెరుగుతుండడంతో వాటికి అనుగుణంగానే కొనుగోలు చార్జీలూ పెరుగుతున్నాయి. అలా పెరిగినా ఆ భారం పేదలపై పడకూడదని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు (గతంలో 100 యూనిట్లుగా ఉండేది), బాగా వెనుకబడిన తరగతుల వినియోగదారులకు 100 యూనిట్ల వరకు, క్షౌరశాలలకు 150యూనిట్ల వరకు, రజక వినియోగదారులకు 150 యూనిట్ల వరకు, చేనేత వృత్తి వినియోగదారులకు 100 యూనిట్ల వరకు, దోబీఘాట్లకు ఉచిత విద్యుత్తును ప్రభుత్వం రాయితీ ద్వారా అందిస్తోంది. ఇది ప్రణాళికతో చేస్తున్న మేలేగానీ మోసం ఎలా అవుతుంది రామోజీ? ♦ డిస్కంలు మరో రూ.7,200 కోట్లు ట్రూ–అప్ చార్జీలను వసూలు చేసుకోవడానికి అనుమతించాలని కోరితే ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రతిపాదనను ఏపీఈఆర్సీ పక్కన పెట్టిందని ఈనాడు అర్థంలేని ఆరోపణ చేసింది. రాజ్యాంగబద్ధంగా స్వతంత్ర ప్రతిపత్తిలో న్యాయమూర్తి హోదా కలిగిన అత్యున్నత వ్యక్తి నేతృత్వంలో నడిచే ఏపీఈఆర్సీ ఓ రాజకీయ పార్టీకిగానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వానికిగానీ జవాబుదారీ కాదనే విషయం రామోజీకి తెలియదా. అలాంటి ఏపీఈఆర్సీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుందని ఎలా అంటారు. పైగా రూ.7,200 కోట్ల భారం ప్రజలపై వేయడానికి అంగీకరించకపోవడం మంచి విషయం కాదంటారా? ♦ రాష్ట్రంలోని దాదాపు రెండు కోట్ల మంది వినియోగదారులకు వారి కుటుంబాలకు ఊరట కలిగిస్తూ.. ఎలాంటి చార్జీల భారం లేకుండా 2024–25 టారిఫ్ ఆర్డర్ను ఏపీఈఆర్సీ ఆమోదించింది. మూడు డిస్కంలకు ప్రభుత్వం నుంచి అవసరమైన సబ్సిడీ రూ.13,589.18 కోట్ల భారాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. గతేడాది కంటే ఇది రూ.3,453.96 కోట్లు అధికం. 2020–21 నుంచి రైల్వే ట్రాక్షన్కు టారిఫ్లో పెంపుదల లేనందున, వాస్తవ సేవా ఖర్చు, ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబించేలా ఇంధన చార్జీలు యూనిట్కు రూ.5.50 నుంచి రూ.6.50కి అంటే కేవలం రూ.1 పెంచడానికి కమిషన్ ఆమోదించింది. విద్యుత్తు వాహన చార్జింగ్ స్టేషన్లకు, డిస్కంలు అందించే విద్యుత్తు రేటును సేవా ఖర్చు (కాస్ట్ ఆఫ్ సర్వీస్) స్థాయికి పెంచాలని డిస్కంలు చేసిన ప్రతిపాదనను కమిషన్ ఆమోదించలేదు. విద్యుత్తు వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు వాటి టారిఫ్ను యథాతథంగా డిమాండ్ చార్జీలు లేకుండా, ప్రస్తుతం ఉన్న యూనిట్కు రూ.6.70గానే నిర్దేశించారు. మరి రాయితీ ఉపసంహరణ ద్వారా రూ.251 కోట్ల భారం త్వరలో అమలవుతుందని పచ్చి అబద్ధాలు ఎలా అచ్చేస్తారు డ్రామోజీ? -
Fact Check: పోలీసులపైకి టీడీపీ తప్పులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఏదో చేయబోతే మరేదో అయిందన్న తీరుగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి చిలకలూరిపేట సభ జరిగింది. మూడు పార్టీలు కూటమి కట్టాక జరుగుతున్న తొలి సభను, అదీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటున్న సభకు ఏర్పాట్లు సక్రమంగా చేయలేక, సభను సక్రమంగా నిర్వహించలేక, బోర్లాపడి, ఆ తప్పులను టీడీపీ నేతలు పోలీసులపైకి నెడుతున్నారు. అంతటితో ఆగక, సంబంధం లేనిదే అయినా ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశారు. అదీ కొందరు పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకొని ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని పోలీసులు, విశ్లేషకులు అంటున్నారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) చేతిలో ఉన్న అంశాలను కూడా పోలీసుల మీదకు రుద్దడాన్ని అధికారులు తప్పుపడుతున్నారు. ఈ నెల 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేట శివారు బొప్పూడి వద్ద ప్రజాగళం పేరుతో ఈ బహిరంగ సభ జరిగింది. ఇందులో ప్రధాని మాట్లాడుతుండగా మూడు సార్లు మైక్ మూగబోయింది. పోలీసులు మైక్ ఆపుతున్నారంటూ వేదిక మీద నుంచే నేతలు ఆరోపించారు. సాధారణంగా ప్రధాని పాల్గొనే కార్యక్రమాల్లో మైక్ ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మెషన్ బ్యూరో (పీఐబీ) చూస్తుంది. ఎన్నికల కోడ్ రావడంతో మైక్ ఏర్పాట్లను నిర్వాహకులే చూసుకున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు ఎటువంటి సంబంధం లేదు. మైక్ సిస్టమ్ కూడా ఎప్పుడూ లేనివిధంగా మీడియా గ్యాలరీలో పెట్టారు. మైక్ సిస్టమ్కు మొదటి నుంచి సాంకేతిక, రిమోట్ సమస్యలు ఉన్నట్లు కార్యక్రమం మొత్తాన్ని చూసిన ఎవరికైనా అర్ధమవుతుంది. జనం తొక్కిడి కారణంగా కేబుల్ కట్ అయి ఉంటే పునరుద్ధరణ సాధ్యం అయ్యేదే కాదు. మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే సమయంలోనే మైక్ పలుమార్లు ఆగిపోయింది. ఆ సమయంలో గ్యాలరీలో ప్రజలే లేరు. ప్రధాని హెలీకాప్టర్ వచ్చే సమయంలో కూడా మైకులు సరిగ్గా పనిచేయడంలేదు చూడండంటూ నిర్వాహకులు చెప్పడం వీడియోల్లో స్పష్టంగా కనపడుతోంది. అప్పుడే సాంకేతిక సమస్యల్ని పరిష్కరించి ఉంటే ప్రధాని ప్రసంగించే సమయంలో మైక్ సమస్యే ఉండేది కాదు. 4.15 గంటల సమయంలో టీడీపీ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు ఎడమ వైపు గ్యాలరీ నిండిపోయినందున మిగతా వారిని కుడివైపు గ్యాలరీలలోకి పంపాలంటూ అనౌన్స్ చేశారు. ప్రధాని వచ్చే సమయానికి జనం పల్చగా ఉండటంతో వెనుక ఉన్న వారందరినీ ముందుకు రప్పించారు. అప్పటివరకూ విఐపీ పాసులు ఉన్న వారు మాత్రమే కుడివైపు గ్యాలరీలోకి వచ్చి కూర్చొగా, పుల్లారావు చెప్పిన తర్వాత సాధారణ కార్యకర్తలు కూడా వీఐపీ గ్యాలరీలలోకి చొచ్చుకువచ్చారు. సభకు వచ్చే వారికి వాటర్ ప్యాకెట్లు మాత్రమే ఇవ్వాలని పోలీసులు, ఎస్పీజీ స్పష్టంగా చెప్పినా నిర్వాహకులు పట్టించుకోలేదు. వారికి అర లీటర్ వాటర్ బాటిల్స్ అందజేశారు. దీంతో కొంతమంది ఆకతాయిలు వేదిక ముందు ఉన్న డి–సర్కిల్లోకి వాటర్ బాటిళ్లు విసిరారు. ఇవన్నీ నిర్వాహకుల నిర్వాకాలే. శాలువా, బొకే తెచ్చుకోకుండా.. వేదిక పైన చంద్రబాబు ప్రధాని మోదీని సన్మానిస్తారని చెప్పి అవమానించిన ఘటనపై కూడా నిర్వాహకుల వైఫల్యాన్ని పోలీసుల పైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. బొకేలు తేకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. వాస్తవానికి హెలీప్యాడ్, డయాస్ అన్నీ ఢిల్లీ నుంచి వచ్చిన ఎస్పీజీ చేతుల్లో ఉంటుంది. హెలీప్యాడ్ వద్ద స్వాగతం చెప్పడానికి ఎవరు రావాలి, వీడ్కొలుకు ఎవరు రావాలి, వేదికపై ఎవరు ఉండాలనే విషయం కూడా ఎస్పీజీనే చూసుకుంటుంది. పోలీసులకు ఏమాత్రం సంబంధం లేదు. పాసులు కూడా ఎస్పీజీనే ఇస్తుంది. ఓ శాలువా, బొకే ముందుగా తెచ్చుకొంటే వాటిని ఎస్పీజీ ముందుగా తనిఖీ చేసి, అనుమతిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తెచ్చిన వినాయకుని ప్రతిమను అనుమతించలేదా? ఈ విషయం తెలిసి కూడా పోలీసులపై నిస్సిగ్గుగా ఆరోపణలు చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ వాళ్లు చేసిందే ట్రాఫిక్ జామ్కు సంబంధించి కూడా బాపట్ల జిల్లా మేదరమెట్ల నుంచి గుంటూరు వరకూ ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కోసం రెండు వేల మంది పోలీసులను ఉపయోగించారు. మామూలు సమయంలోనే చిలకలూరిపేట సెంటర్లో ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. ఆదివారం సభకు చిలకలూరిపేట, బొప్పూడి నుంచి వచ్చే వాహనాలు అన్నీ నాలుగున్నర తర్వాతే బయలుదేరాయి. దీంతో చిలకలూరిపేట వద్ద కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరోవైపు భారీ సంఖ్యలో ప్రజలు వాహనాల్లో వస్తున్నట్లుగా చూపించడం కోసం టీడీపీ నేతలే వాహనాలు అడ్డం పెట్టి ట్రాఫిక్ ఆపి డ్రోన్షాట్స్ తీశారు. దీనివల్ల వాహనాలు నిలిచిపోయాయి. సభ పూర్తయిన తర్వాత అవే వాహనాలు గంటలోనే తిరిగి వెళ్లిపోయాయి. పోలీసులు పట్టించుకోకపోతే ఇలా గంటలోనే ట్రాఫిక్ మొత్తం క్లియర్ అయ్యేది కాదు. 12 మంది ఐపీఎస్లు, వేల మందిపోలీసులతో బందోబస్తు సభ ఏర్పాట్ల కోసం సుమారు 3,960 మంది పోలీసులను ఉపయోగించారు. ఏడీజీ నుంచి, ఐజీ, ఎస్పీల వరకూ 12 మంది ఐపీఎస్ అధికారులు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. తనిఖీల కోసం 20 డాగ్ స్క్వాడ్లను వాడారు. ప్రధాన మంత్రి కార్యక్రమం పూర్తయ్యేసరికి చీకటి పడినప్పటికీ, హెలికాప్టర్ కూడా చీకట్లో సురక్షితంగా టేకాఫ్ తీసుకొని, ఆయన క్షేమంగా వెళ్లేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. సభలో చిన్నపాటి తొక్కిసలాటగానీ, లాఠీఛార్జిగానీ జరగలేదు. ఒక్కరు కూడా గాయపడలేదు. జనం ఎక్కువగా వచ్చారన్న బిల్డప్ కోసం టీడీపీ నేతల సూచనలతో మైక్, లైటింగ్ టవర్స్పైకి ఎక్కిన వారిని దించాలని ప్రధాని కోరినప్పుడు వారిని క్షేమంగా దింపింది కూడా పోలీసులే. ఇవన్నీ వీడియోల్లో కనపడుతూనే ఉన్నాయి. అయినా టీడీపీ నేతలు పోలీసులను, ప్రత్యేకించి కొందరిని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన మాధవరెడ్డిని హెలీప్యాడ్ వద్ద నియమించడం ఏమిటని వారు టీడీపీ వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవల ప్రధాన మంత్రి సత్యసాయి జిల్లా పర్యటన ఏర్పాట్లు చూసిన అనుభవం ఉన్నందున ఆయన్ని ఇక్కడ నియమించారు. దీనికితోడు మాధవరెడ్డి ఇటీవలి వరకు మూడేళ్లకు పైగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే విజిలెన్స్ ఎస్పీగా పనిచేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీకి ట్రాఫిక్ పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా ఒక సామాజిక వర్గానికి చెందిన నలుగురు ఎస్పీలపైనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం వెనుక కుట్ర కోణం ఉందన్న వాదన వినిపిస్తోంది. -
Fact Check: ‘పచ్చ’ ముసుగుతో ‘కోడ్’కూతలా?
ఉన్నపళంగా చంద్రబాబును గద్దెనెక్కించేయాలనీ... ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేయాలనీ... ప్రజలను తప్పుదారి పట్టించి అధికార పక్షంపై ఏవగింపు కలిగించాలన్నది రామోజీ ఆకాంక్ష. అందుకోసం పదేపదే అబద్దాలను అచ్చేయడం... లేనిపోని అభాండాలకోసం పేజీలకు పేజీలు కేటాయించడం... అడ్డగోలుగా ఆరోపణలతో శునకానందం పొందడం ఈనాడుకు నిత్యకృతమైపోయింది. వాస్తవాలు తెలుసుకోకుండా అత్యుత్సాహంతో నిబంధనల్ని సైతం వారికి అనుకూలంగా మలచుకుంటున్నారు. గతేడాది ఇచ్చిన పాఠ్యపుస్తకాలపై సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రాలున్నాయనీ... ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ‘వీటికెలా ముసుగేస్తారు?’ అంటూ సొంత పైత్యాన్ని వండివార్చింది. సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు గత ప్రభుత్వం పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు ఇవ్వడంలో విఫలమైంది. నోటు పుస్తకాలు అస్సలు ఇవ్వలేకపోయింది. అప్పులు చేసి వారంతా పుస్తకాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. పైగా ‘పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వానిది కాద’ంటూ ఓ కొత్త వాదాన్ని తీసుకొచ్చింది. ‘ప్రైవేటు స్కూళ్లున్నాయి.. అక్కడ వసతులు బాగుంటాయి, మీకు ఏది కావాలో నిర్ణయించుకోండి’ అంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సెలవిచ్చారు. ప్రజలకోసం ప్రభుత్వాలు ఏం చేయాలో తనకే తెలుసన్నట్టు నిత్యం గొంతు చించుకునే రామోజీకి ఆనాడు బాబు చేసిన వ్యాఖ్యల్లో తప్పిదం కనిపించలేదు. పైగా పూర్తిస్థాయిలో సర్కారు బడుల్లోని పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న సీఎం జగన్ ప్రభుత్వంపై విరుచుకు పడుతూ ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసిందనీ, పిల్లలకు పుస్తకాలు ఇవ్వలేదని బరితెగించి అబద్ధాలు రాసింది. తీరా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 47 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్లను జగన్ చిత్రంతో ఉన్నవి అందించినట్టు ఒప్పుకుంది. ‘కోడ్’ నిబంధనలేంటో తెలుసుకోరా.. బాబు కోసం బరితెగించిన ఎల్లో మీడియా అన్నింటికి ముసుగులు వేస్తున్నారు.. మరి ఈ పుస్తకాల సంగతేంటని ప్రశ్నించింది. ‘ఇవన్నీ ఎన్నికల సంఘం కళ్లకు కనిపించవా అని నిలదీసింది. వాస్తవానికి ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక’’ విద్యుత్, నీటి బిల్లులు, బోర్డింగ్ పాస్లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తదితర వాటిపై ప్రజా ప్రతినిధుల ఫొటోలు, సందేశాలు వంటివి ఉండరాదని ఎన్నికల సంఘంతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. అంటే ఈ నెల 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఇచ్చేవాటిపై ఉండరాదని. కానీ 2023 జూన్ 12న పాఠశాలలు తెరిచిన మొదటి రోజు ఇచ్చిన జగనన్న విద్యాకానుక బ్యాగ్, నోటు పుస్తకాలకు, గతేడాది డిసెంబర్లో ఇచ్చిన ట్యాబ్స్పై ఉన్న సీఎం జగన్ స్టిక్కర్లకు ఈ నిబంధన వర్తించదని తెలిసినా... పాపం బాబుకు ఎలాగైనా మేలు చేయాలని... వారి మెప్పుపొందాలనీ... అబద్దపు వార్తను రామోజీ నేతృత్వంలోని ఈనాడు పతాక శీర్షిక చేసింది. కానీ వారికి తెలియని విషయమేంటంటే... ఎన్నికల సంఘం నియమావళిని నూరుశాతం పాటించాలన్న లక్ష్యంతో మార్చి 16వ తేదీ తర్వాత పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చే చిక్కీలపై సీఎం ఫొటో ముద్రించిన ర్యాపర్ను తొలగించి విద్యార్థులకు అందించాలని పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఇవేమీ పట్టించుకోకుండానే ‘ఈనాడు’ ఉపాధ్యాయులపైనా, విద్యాశాఖ ఉన్నతాధికారులపైనా నిందలు వేస్తూ గాలివార్తను అచ్చేసింది. అసలు నిబంధన ఏంటంటే.. భారత ఎన్నికల సంఘం ప్రచురించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని పేజీ నంబరు 94లోని నిబంధన 5(1)లో ఏముందంటే.. లబ్దిదారుల కార్డులు, విద్యుత్ బిల్లులు, నిర్మాణ స్థలం ఫలకాలువంటి వాటిపై రాజకీయ కార్యకర్తల ఫోటోల ప్రదర్శన అంశంలో.. లబ్దిదారులకు పంపిణీ చేసిన లబ్దిదారుల కార్డులు, మోడల్ ప్రవర్తనా నియమావళి అమలు సమయంలో ఏర్పాటు చేసే ఫలకాలపై ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ కార్యకర్తల ఫొటోలు, సందేశాలు ఉండకూడదు. మోడల్ ప్రవర్తనా నియమావళి అమలుకు ముందు పంపిణీ చేసిన /ప్రతిష్టించిన లబ్దిదారుల కార్డులు, నిర్మాణ ఫలకాలు వంటి వాటిపై ఫొటోలు ఉన్నా తప్పులేదు. ఈనాడుపై చర్యలు తీసుకోండి ఈసీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ కార్యదర్శి అప్పిరెడ్డి ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ నడుపుతున్న ఈనాడు దినపత్రిక టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని... దానిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మంగళవారం ఎన్నిక సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రజలకు అవసరమైన వార్తా కథనాలను ప్రచురించేందుకు బదులు చంద్రబాబు అభిప్రాయాలను ప్రచురిస్తోందని పేర్కొన్నారు. కొన్ని నెలలుగా ఈనాడు ప్రధాన సంచికలో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు, ప్రజల్లో దానిపై దురభిప్రాయం కలిగించేలా వక్రీకరించి కథనాలు అచ్చు వేస్తోందన్నారు. అందుకు నిదర్శనంగా మంగళవారం ప్రచురించిన ‘‘వీటికెలా ముసుగేస్తారు?’’ కథనాన్ని ఎన్నికల సంఘానికి అందించారు. ఈ కథనంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందించిన బ్యాగులు, పుస్తకాలు, ఆహార పదార్థాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బొమ్మలకు ఎలా కవర్ చేయాలో ఈనాడు తన అభిప్రాయాలను వ్యక్తం చేసిందన్నారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన సూచన ప్రకారం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత లబ్దిదారుల కార్డులు, విద్యుత్ బిల్లులు, నిర్మాణ సైట్ ఫలకాలు వంటి వాటిపైనేతల ఫోటోలు ఉండకూడదని చెప్పారు. కోడ్ అమలుకు ముందు పంపిణీ చేసిన వాటికి ఈ నిబంధన వర్తించదని ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల పునరుద్ధరణ, పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా అన్ని పుస్తకాలు, బ్యాగులు, ఆహార పదార్థాలను ప్రభుత్వమే పంపిణీ చేసిందని వాటిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫొటో ఉందనీ, ఇవన్నీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలుకు ముందే అందజేసినవని ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ ఈనాడు పత్రిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరువు తీసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈ రకమైన వార్తా కథనాల ద్వారా సాధారణ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు, భారత ఎన్నికల సంఘం పరువు తీయడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఈ తప్పుడు కథనం ప్రచురించిన ఆ దినపత్రిక, దాని ప్రచురణకర్తపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
fact check: అది మీ బాబు రూటు
సాక్షి, అమరావతి: పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్న చందంగా... కళ్లకు పచ్చ పసరు రాసుకున్న రామోజీకి అంతా తన ‘బాబు’ లాగే కనిపిస్తున్నారు. తన బాబు దొంగ ఓట్లతో గెలిచాడు కాబట్టి మిగతా వారూ అలానే ఉంటారని భావిస్తూ ‘‘ఓటు హక్కుపై వేటు.. అదే జగన్ రూటు’’ అంటూ జగన్పై ఉన్న అక్కసును బయటపెట్టుకున్నారు. అసలు దొంగఓట్లకు ఆద్యుడు చంద్రబాబేనని, తమిళనాడుకు చెందిన వలస కూలీలను చేర్పించడం ద్వారా ఇన్నాళ్లూ కుప్పంలో గెలుస్తూ వచ్చాడని, ఇప్పుడు ఆ భాగోతం బయటపడటంతో సొంత నియోజకవర్గంలో తన బాబు’ ఓడిపోతాడనే భయంతోనే ఇటువంటి వార్తలు రాస్తున్నారంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సేవామిత్ర యాప్ పేరుతో వైఎస్సార్సీపీ మద్దతుదార్ల ఓట్ల తొలగింపు రాష్ట్రంలో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత డేటాను చౌర్యం చేసి ప్రైవేటు సంస్థలకు చంద్రబాబు అప్పగించారు. వాటిని సేవా మిత్ర యాప్తో అనుసంధానం చేసి, వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించారు. 2015లో 22,76,714, 2016లో 13,00,613, 2017లో 14,46,238 వెరసి 50,23,565 ఓట్లను చంద్రబాబు తొలగింపజేశారు. తద్వారా తనకు అలవాటైన రీతిలో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకు కుట్ర చేశారు. ఈ కుట్రను ప్రజాసంఘాలు బహిర్గతం చేశాయి. దీనిపై వైఎస్సార్సీపీ చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. అర్హుల ఓట్లను కూడా తొలగించినట్లు తేలి్చన ఎన్నికల అధికారులు.. 2019 ఎన్నికల నాటికి 31,97,473 ఓట్లను జాబితాలో అదనంగా చేర్చారు. దాంతో ఆ ఎన్నికల్లో 50 శాతంపైగా ఓట్లు సాధించి.. 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. ఈసీ స్పష్టం చేసినా వినపడలేదా! అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితాను రూపొందిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఇటీవల ఓ సమీక్షలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల నమోదు, గంపగుత్తగా ఓట్ల తొలిగింపు, జీరో ఇంటి నెంబర్పై ఓటర్ల నమోదు అంటూ తెలుగుదేశం పార్టీ, పచ్చ మీడియా చేసిన బోగస్ ప్రచారంలో వీసమెత్తు నిజం లేదన్న విషయాన్ని ఆయన విస్పష్టంగాచెప్పారు. 2023 జనవరి 6 నుంచి ఆగస్టు 30 మధ్య కాలంలో తొలగించిన 21 లక్షల ఓట్లను సమీక్షిస్తే అందులో కేవలం 13,061 ఓట్లలోనే తప్పులు దొర్లాయని ఆయన తేల్చారు. అంటే తొలగించిన మొత్తం ఓట్లల్లో ఇది కేవలం 0.61 శాతం మాత్రమే. వాటిని తిరిగి సవరించారు. మృతి చెందిన, ఇంటి మార్పు, డూప్లికేట్ ఓటర్ల నమోదుపై 14.48 లక్షల దరఖాస్తులు వస్తే అందులో 5.65 లక్షల ఓటర్లు చనిపోవడం లేదా శాశ్వతంగా వేరే చోటికి వెళ్లిపోవడం, ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండటాన్ని గుర్తించి వాటిని తొలగించారు. ఒకే ఇంటి నంబర్పై పది మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న కేసులను పరిశీలించడానికి 1.57 లక్షల ఇళ్లకు ఎన్నికల సిబ్బంది వెళ్లారు. ఇంటింటి సర్వే నిర్వహించి 20 లక్షల ఓట్లను పరిశీలించారు. జీరో ఇంటి నెంబర్తో 2.52 లక్షల ఓట్లు ఉండగా వాటిలో 97 శాతం అసలైన చిరునామా నమోదు చేసి సరిదిద్దారు. ఎన్నికల సంఘం ఇంత కచి్చతంగా వ్యవహరించినా రామోజీ కళ్లకు ఇవేవీ కనిపించలేదు. నామినేషన్ల దాఖలు చివరి రోజు వరకు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అనుమతిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఒకపక్క చెపుతున్నా.. పదేపదే అదే అబద్ధాన్ని రామోజీ ప్రచారం చేస్తున్నారు. దొంగ ఓట్లతో గెలిచిన బాబు 2014లో దొంగఓట్లతో గెలిచిన చంద్రబాబు నాయుడు 2019లో కూడా అదే దారిలో వెళ్లి భంగపడ్డారు. సేవామిత్ర యాప్ ద్వారా వైఎస్ఆర్సీపీ మద్దతుదార్ల ఓట్ల తొలగింపునకు కుట్ర పన్నారు. ఇప్పుడు 2024లో కూడా ఇదే విధంగా దొంగ ఓట్లను చేర్పించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి భారీ సంఖ్యలో గంపగుత్తగా ఫారం–6లను దాఖలు చేస్తూ పచ్చ మీడియా ద్వారా అధికారపార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో 99% స్వచ్ఛతతో ఓటర్ల జాబితా తయారు చేయడమే కాకుండా పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తున్నా రామోజీ పత్రిక మాత్రం ఓటర్ల జాబితాపై పదేపదే తప్పుడు ఆరోపణలతో విషకథనాలను ప్రచురిస్తోంది. 2014 ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాలో సుమారు 35 లక్షలకు పైగా దొంగ ఓట్లు ఉన్నట్లు అప్పట్లో ప్రజా సంఘాలు గుర్తించాయి. ఆ ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో టీడీపీ అధికారంలోకి రావడానికి కూడా అదే కారణమని తేల్చాయి. -
Fact Check: రొయ్య రాతల గొయ్యిలో రామోజీ
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేని విధంగా గత 57 నెలలుగా రొయ్య రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. ప్రతీ కౌంట్కు ప్రకటించిన గిట్టుబాటు ధర ప్రతీ రైతుకు దక్కేలా కృషి చేయడమే కాదు.,. పెంచిన ఫీడ్ ధరలను 3 సార్లు ఉపసంహరించుకునేలా ఈ ప్రభుత్వం చేసింది. ఆక్వాజోన్ పరిధిలో పదెకరాల్లోపు అర్హత ఉన్న ప్రతీ రైతుకు యూనిట్ రూ.1.50కే విద్యుత్తును అందిస్తోంది. ఫలితంగా ఐదేళ్లలో రొయ్యల ఉత్పత్తితో పాటు ఎగుమతులూ భారీగా పెరిగాయి. రొయ్యల ఉత్పత్తి బాబు ఐదేళ్ల పాలనలో 1.74 లక్షల టన్నులకు మాత్రమే పెరిగితే.. సీఎం జగన్ ప్రభుత్వంలో గత ఐదేళ్లలోనే ఏకంగా 6.94 లక్షల టన్నులకు పెరిగింది. బాబు హయాంలో జాతీయ స్థాయిలో రొయ్యల ఉత్పత్తి 67 శాతం ఉండగా, ప్రస్తుతం 77.55 శాతానికి పెరిగింది. ఇవేమీ రాజగురువు రామోజీకి మాత్రం కన్పించడం లేదు. ఆక్వా రంగానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నప్పటికీ, అదే పనిగా విషం కక్కుతూనే ఉన్నారు. తాజాగా ‘రొయ్య ఎగరలేదు..రైతు ఎదగలేదు’ అంటూ అబద్ధాలను అచ్చేశారు.. వాస్తవాలు ఏమిటంటే.. ఆరోపణ : పెరగని రొయ్యల ఉత్పత్తి వాస్తవం..: రాష్ట్రంలో 1.46 లక్షల హెక్టార్లలో మంచినీటి, 54 వేల హెక్టార్లలో ఉప్పునీటి కల్చర్ విస్తీర్ణం ఉండగా, 1.75 లక్షల మంది రైతులు ఆక్వాసాగు చేస్తున్నారు. ఈ–ఫిష్ ద్వారా ఆక్వాసాగును గుర్తిస్తూ, వారికి అందాలి్సన అన్నిసంక్షేమ ఫలాలను అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. 2018–19లో 39 లక్షల టన్నులు ఉన్న రొయ్య/మత్స్య ఉత్పత్తులు 2022–23కు వచ్చేసరికి ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగింది. మంచినీటి రొయ్యలు 4.55 లక్షల టన్నుల నుంచి 9.56 లక్షల టన్నులకు, ఉప్పునీటి రొయ్యలు 5.28 లక్షల టన్నుల నుంచి ఏకంగా 7.15 లక్షల టన్నులకు పెరిగాయి. ఇలా ఐదేళ్లలో సముద్ర, మంచినీటి, ఉప్పునీటి రొయ్యల ఉత్పత్తి 11.09 లక్షల టన్నుల నుంచి 18.50 లక్షల టన్నులకు పెరిగింది. ఆరోపణ : ఎగుమతులు పెరగలేదు వాస్తవం..: ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు చంద్రబాబు హయాంతో పోల్చుకుంటే గణనీయంగా పెరిగాయి. 2018–19లో రూ.13,855 కోట్ల విలువైన 2.61 లక్షల టన్నులు ఎగుమతులు జరిగితే.. 2022–23లో ఏకంగా రూ.19,847 కోట్ల విలువైన 3.28 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతులు జరిగాయి. జీవీఏ చూసుకుంటే రూ.48 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.68 వేల కోట్లకు పెరిగింది. ఏటా సగటున 5.12 శాతం వృద్ధిరేటు నమోదవుతోంది. గ్రోత్ రేట్ ఐదేళ్లలో జాతీయ స్థాయిలో 19.37 శాతం ఉంటే, ఏపీలో 25.59 శాతంగా నమోదవుతోంది. నాణ్యమైన ఉత్పత్తుల విషయంలో ప్రభుత్వ ప్రత్యేక చర్యల కారణంగా నాలుగేళ్ల క్రితం 86 శాతం ఉన్న యాంటీబయోటిక్స్ రెసిడ్యూల్స్ ఇప్పుడు 26 శాతానికి తగ్గాయి. దీంతో ఆక్వా ఉత్పత్తుల్లో నాణ్యత పెరిగి, ఎగుమతులు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. ఆరోపణ : సిండికేట్గా మారి దోపిడీ వాస్తవం..: నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరాకు ప్రభుత్వం ఐదేళ్లుగా ఎన్నో చర్యలు చేపట్టింది. ఆక్వా కార్యకలాపాలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకొచి్చన అప్సడా చట్టం ద్వారా. కంపెనీలు, సరఫరాదారులను రైతులకు జవాబుదారీతనంగా నిలిచేలా చేసింది. బాబు హయాంలో ఐదేళ్ల పాటు సాగిన వారి దోపిడీకి జగన్ పాలనలో అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయంగా ముడిపదార్థాల ధరలు 28 శాతం మేర పెరగడం వల్ల ఆ మేరకు రొయ్య మేత ధర 21.36 శాతం (రూ.72 నుంచి రూ.91.50లకు) మేర పెరిగింది. ఐదేళ్లలో 3 సార్లు కంపెనీలు పెంచిన ఫీడ్ ధరలను వెనక్కి తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా మేత ఖర్చుల భారం రైతులపై టన్నుకు రూ.860 పడకుండా అడ్డుకుంది. ఆరోపణ : నియంత్రణా ...అదెక్కడ? వాస్తవం..: రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పన కోసం గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ప్రభుత్వం కృషి చేసింది. ప్రతీ 15 రోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరల హెచ్చుతగ్గులను ‘అప్సడా’ ద్వారా సమీక్షిస్తూ ప్రతీ రైతుకు, ప్రతీ రొయ్యకు ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. 100 కౌంట్ రొయ్యకు రూ.210 ప్రభుత్వం నిర్ణయిస్తే, రూ.245 చొప్పున, 30 కౌంట్ రొయ్యకు రూ.380 చొప్పున నిర్ణయిస్తే రూ.470కు కొనుగోలు చేస్తోంది. ఈ స్థాయి ధరలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని రైతులే చెబుతున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రతీ ఆక్వా రైతుకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత ఈ ప్రభుత్వానిది.ఆక్వా కల్చర్ వ్యాపార కార్యకలాపాల పర్యవేక్షణ, నియంత్రణ, ప్రోత్సాహానికి వీలుగా ప్రభుత్వం ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ–2020. ఏపీ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్–2020లను అమలులోకి తీసుకొచి్చంది. ఇవే నేడు ఆక్వా రైతులకు రక్షణ కవచాలుగా నిలిచాయి. నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరా కోసం తీర ప్రాంత జిల్లాల్లో 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వాల్యాబ్స్ ఏర్పాటుతో ఇన్పుట్ టెస్టింగ్, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఆరోపణ: రాయితీ విద్యుత్తుకు మంగళం వాస్తవం..: పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి 57 నెలలుగా యూనిట్ రూ.1.50 చొప్పున విద్యుత్తు సరఫరా చేసింది. ఆక్వాజోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు సాగుచేసే 3.34 లక్షల ఎకరాలకు ఆక్వా సబ్సిడీ అందిస్తున్నారు. ఈ ఫిష్ సర్వే ద్వారా రాష్ట్రంలో 4.68 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా, ఇందులో జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు ఆక్వా సాగు చేసే వారికి సాయంగా 3.34 లక్షల ఎకరాలకు సబ్సిడీ విద్యుత్తు వర్తింప చేస్తున్నారు. మొత్తం 66,993 కనెక్షన్లలో 54,072 కనెక్షన్లకు విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. జోన్ పరిధిలో ఉన్న కనెక్షన్లలో 95 శాతం మంది ఆక్వా సబ్సిడీ పొందుతున్నారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.340 కోట్ల బకాయిలతో పాటు ఈ 57 నెలల్లో రూ.3,306 కోట్లు ఆక్వా సబ్సిడీ కింద ఈ ప్రభుత్వం ఖర్చుచేసింది. ఆరోపణ : ఆక్వా రైతులకు ఆదరణేది? వాస్తవం..: స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా ఫిష్ ఆంధ్రా బ్రాండింగ్తో డొమెస్టిక్ మార్కెటింగ్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. జిల్లాకొకటి చొప్పున 26 ఆక్వా హబ్లు, నాలుగు వేల మినీ అవుట్లెట్స్, 351 డెయిలీ, 149 సూపర్, 62 లాంజ్ యూనిట్లు ఏర్పాటు లక్ష్యం కాగా.. ఇప్పటివరకు అన్నీ కలిపి 2,500 యూనిట్లను ఏర్పాటు చేశారు. ఆర్బీకేల్లో నియమించిన 732 ఫిషరీస్ అసిస్టెంట్స్ ద్వారా మత్స్యకారులు, మత్స్య రైతులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపైన శిక్షణ ఇవ్వడమే కాక, పంట సాగు వేళ అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. నాణ్యమైన సీడ్, ఫీడ్ సప్లిమెంట్స్, మందులు, వలలు, ఇతర ఇన్ఫుట్స్ పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్ స్కోచ్ అవార్డుతో పాటు 2021–22, 2023–24 సంవత్సరాలకు రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు. దక్కాయి. ఇవేమీ రామోజీకి కన్పించడం లేదు. రామోజీ వక్రభాష్యాలకు హద్దూపద్దూ లేదు. చంద్రబాబు సాధించలేని ప్రగతిని సీఎంగా జగన్మోహన్ రెడ్డి సాధిస్తే ఓర్వలేనితనం, కడుపుమంట నిలువెల్లా రామోజీకి కంటగింపుగా మారాయి.. ప్రభుత్వం అన్ని వర్గాలకు జగన్ ప్రభుత్వం ఏ మంచి చేసినా, అది మంచే కాదని వక్రీకరణే పనిగా పెట్టుకుని పవిత్రమైన జర్నలిజానికే కళంకం తెస్తున్నారు. ఆక్వారంగంలో జగన్ సాధించిన నీలి విప్లవ పురోగమనం జాతీయ స్థాయిలోనే అబ్బురపరిచే ఫలితాలనిస్తుంటే...ఆ అభివృద్ధిని రామోజీ ఓర్వలేక పోతున్నారు.. చేపలు, రొయ్యల ఉత్పత్తులు బాబు హయాంలో 39 లక్షల టన్నులుంటే , అది జగన్ పాలనలో 51 లక్షల టన్నులకు పెరగడం ఈనాడుకు కనిపించలేదు. జాతీయ స్థాయిలో చూసినా బాబు పాలన నాటికి ఉన్న రొయ్యల ఉత్పత్తి అయిదింతలు పెరిగినా, అదీ రామోజీకి గొప్పగా అనిపించదు. ఎగుమతుల్లో ఏటా సగటున 5.12 శాతం వృద్ధి రేటు నమోదవుతున్నా అదీ తనకు నచ్చదు. ఇలా... జగన్ ప్రభుత్వం ఏ రంగంలో చూసినా అన్నీ నూరుశాతం ప్రగతిని సాధించినవే కనిపిస్తున్నాయి. దీనికి భిన్నంగా పాలనలో తనదంటూ ముద్ర ఏర్పరుచుకోలేక నిస్సహాయుడిగా మిగిలిపోయిన చంద్రబాబును గొప్పగా ప్రొజెక్టు చేయడానికి రామోజీ పడరాని పాట్లు పడుతున్నారు... వాస్తవాలకు ఈనాడు ఎంత మసిబూసి మారేడు కాయ చేయాలనుకన్నా , నిజాలను దాచేసి అబద్ధాలను అచ్చేయాలనుకున్నంత మాత్రాన సత్యాలు అసత్యాలుగా మారిపోవుకదా...ఆక్వా రంగంలో జగన్ ప్రభుత్వ విజయాలు, చంద్రబాబు వైఫల్యాలు ఇవిగో... -
మీ ధ్యాసంతా భ్రమరావతేనా?
చంద్రబాబును సీఎం కుర్చిలో కూర్చోబెట్టాలన్న తాపత్రయంతో రామోజీకి చెత్త రాతల ఉన్మాదం రోజురోజుకూ పెరుగుతోంది. అందుకే రోజుకో తప్పుడు కథనంతో ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరికీ పనికి రాని చంద్రబాబు కలల రాజధాని భ్రమరావతిపై ఇంకా మోజు తీరక.. అక్కడేదో జరగరానిది జరిగిపోతున్నట్లు కల కంటున్నారు. అక్కడి ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వివిధ గ్రామాల్లోని 625.25 ఎకరాలను భూసేకరణ పరిధి నుంచి తప్పిస్తూ గెజిట్ జారీ చేస్తే.. అదంతా కుట్ర పూరితమంటూ వక్ర రాతలు రాశారు. చంద్రబాబు రైతులను వంచించి, అవసరానికి మించి భూములు లాక్కున్నప్పుడు మీరేం చేశారు రామోజీ? సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాజధాని పేరుతో తమ నుంచి బలవంతంగా భూములు సేకరించారని రైతులు పలుమార్లు మొరపెట్టుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలోనూ వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు హామీ ఇచ్చారు. బలవంతంగా సేకరించిన భూమిని వెనక్కి ఇస్తామని చెప్పారు. ఈ హామీకి అనుగుణంగా న్యాయ అడ్డంకులను దాటి వారికి భూమిని వాపస్ చేయడానికి ఇటీవల గెజిట్ జారీ చేశారు. అంతే.. అమరావతిపై మరో విచ్చిన్నకర కుట్ర అంటూ ఈనాడు రామోజీ శోకాలు పెట్టారు. రాజధాని నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి గుట్టుగా గెజిట్ విడుదల చేశారంటూ గగ్గోలు పెట్టారు. వాస్తవానికి గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తమ అనుమతి లేకుండానే రాజధాని పేరిట తమ భూములను బలవంతంగా తీసుకున్నారని పలువురు రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వారి ప్రమేయం లేకుండానే తీసుకుని మాస్టర్ ప్లాన్లో పెట్టి రోడ్లకు కేటాయించేశారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఆ రైతులందరూ సీఆర్డీఏ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. బలవంతపు భూసేకరణ వల్ల ఇబ్బంది పడ్డ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలోని సీఆర్డీఏ సమావేశంలో వారి భూములను భూసేకరణ పరిధి నుంచి తప్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి 11న తీర్మానం చేశారు. కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, పిచ్చికల పాలెం, ఐనవోలు, రాయపూడి, కొండమారాజుపాలెం, లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, మల్కాపురం, నెక్కల్లు, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, అనంతవరం గ్రామాల్లోని 625.25 ఎకరాలను భూసేకరణ పరిధి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామం రామోజీకి ఆగ్రహం తెప్పించడంతో ఓ తప్పుడు కథనం వండిపడేశారు. అందులో నిజానిజాలు ఇలా ఉన్నాయి. ఆరోపణ : గుట్టుగా గెజిట్ జారీ చేశారు వాస్తవం: రాజధాని నిర్మాణం పేరిట తెలుగుదేశం ప్రభుత్వం 34,281 ఎకరాలను సేకరించింది. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ముందుకు రానిచోట్ల భూసేకరణకు నోటీసులు ఇచ్చింది. అలా 1,317.90 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి 274.86 ఎకరాలు పూలింగ్లో ఇచ్చేందుకు రైతులు ముందుకు రాగా, మిగిలిన భూమిని బలవంతంగా తీసుకున్నారు. అందులో 217.76 ఎకరాలు రోడ్లకు కేటాయించారు. కొన్ని చోట్ల రైతులకు తెలియకుండానే వారి స్థలాల్లో రోడ్లు వేయడమే కాకుండా రిటర్నబుల్ ప్లాట్ల కింద కొంత మందికి రిజి్రస్టేషన్ చేశారు. ఈ నేపథ్యంలో మిగిలిన 625.25 ఎకరాల భూమిపై ప్రస్తుత జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయి కసరత్తు చేసింది. సీఆర్డీఏకు చెందిన డిప్యూటీ కలెక్టర్లతో పలుమార్లు సమావేశమై రైతులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్డీఏ ఇచ్చిన ప్రతిపాదనల మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గెజిట్ జారీ చేశారు. ఆయా రైతులకు ఈ మేరకు సమాచారం అందించారు. ఆయా గ్రామాల సచివాలయాల్లో గెజిట్ను అందుబాటులో ఉంచారు. గెజిట్కు పత్రికా ప్రకటన ఇవ్వాల్సిన అవసరం లేకపోవడంతో దాన్ని ఇవ్వలేదు. ఆరోపణ : భూసేకరణ ఉపసంహరణ గెజిట్లను విడుదల చేసే ముందు రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేయాలి వాస్తవం: ఇప్పుడు గెజిట్ జారీ చేసిన ప్రాంతాల్లో ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించలేదు. అందువల్ల అసలు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపుల ప్రసక్తే రాదు. ఉండవల్లి గ్రామంలో 113.60 ఎకరాలు, పెనుమాక గ్రామంలో 458.45 ఎకరాలను భూసేకరణ నుంచి మినహాయించింది. ఈ రెండు గ్రామాల్లో మాస్టర్ప్లాన్ కింద 117.18 ఎకరాలు కవర్ అయింది. ఇదిపోగా మిగిలిన 572.05 ఎకరాలను మాత్రమే మినహాయించింది. హైకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్లను రైతులు ఉపసంహరించుకుని, భవిష్యత్తులో ఎలాంటి నష్టపరిహారం అడగబోమన్న హామీ కింద మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల 21 గ్రామాల్లోని రైతులతో పాటు, ఉండవల్లి, పెనుమాక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గెజిట్ జారీ చేయడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇది తట్టుకోలేని ఈనాడు కడుపుబ్బరంతో దిగజారి ప్రభుత్వంపై బురద జల్లే పనికి పూనుకుంది. ఆరోపణ: భూసేకరణ పరిధి నుంచి ఈ గ్రామాలను తప్పిస్తే మాస్టర్ ప్లాన్కు ఇబ్బందులు వస్తాయి వాస్తవం: ఈ అంశంపై అధికారులు భారీ కసరత్తు చేశారు. బాధిత రైతుల నుంచి కన్సెంట్ తీసుకున్నారు. మాస్టర్ ప్లాన్లో వారి భూముల్లో నుంచి రోడ్లు వెళ్తుంటే వాటిని మినహాయించి మిగిలిన భూమికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఆ స్థలాల్లో దేనికైనా కేటాయింపులు జరిగి ఉంటే ఆ భూముల జోలికి వెళ్లలేదు. దేనికీ కేటాయించని భూములను మాత్రమే భూసేకరణ పరిధి నుంచి మినహాయించారు. -
Fact Check: అసలే గుడ్డి.. ఆపై బాబు పొరలు
కళ్లకు చంద్రబాబు పొరలు కమ్మేసిన గుడ్డి రామోజీ మరోసారి బట్టలిప్పేశారు. ఉద్యోగాలివ్వకుండా యువతను జగన్ సర్కారు మోసం చేసిందంటూ చేతికొచ్చింది రాసి చిందులు తొక్కారు. తాను కట్టుకున్న కోట దాటి గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి చూస్తే అక్కడ సీఎం జగన్ సృష్టించిన ఉద్యోగాల విప్లవం ఈ బధిరుడికి కనిపించేది. చంద్రబాబు స్కిల్ స్కామ్ను బయటకు తీశారన్న అక్కసుతో జగన్ ఏలుబడిలో ఉద్యోగాల కల్పన లేదంటూ పచ్చి అవాస్తవాలను అచ్చు వేశారు. పదే పదే అవాస్తవాలను ప్రచారం చేస్తున్న రామోజీ ఒకసారి గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి ఉద్యోగాలు కల్పించలేదంటూ రాగం తీస్తే అప్పుడు ఎవరు ఎవరి కాలర్ పట్టుకుని నిలదీస్తారో తెలుస్తుంది. ఈ రాతలపై మండిపడుతున్న యువత ఎవరి కాలర్ పట్టుకోవాలో ఇప్పటికే నిర్ణయించేసుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే 1.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా పారదర్శకంగా భర్తీ చేసిన ఘనత జగన్ సర్కారుది. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో 10–11 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు కనిపిస్తారు. దేశ చరిత్రలో ఒకేసారి కొత్తగా 1.25 లక్షల ఉద్యోగాలను సృష్టించడం, వెంటనే భర్తీ చేయడం జరగనేలేదు. చంద్రబాబు హయాంలో నిరుద్యోగిత రేటు 5.3 శాతం ఉంటే ఇప్పుడు వైఎస్.జగన్ హయాంలో కేవలం 4.1 శాతమే. ఈ గణాంకాలు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వెలువరించినవి. 2014–19 మధ్య చంద్రబాబు భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య కేవలం 34,108. చంద్రబాబు దిగిపోయే మే 2019 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,97,123 మాత్రమే. ఇప్పుడు వైఎస్.జగన్ హయాంలో శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, ఇతర ఉద్యోగులు మొత్తం కలిపి 6,38,087 మంది ఉన్నారు. వైద్య ఆరోగ్య రంగాన్ని చంద్రబాబు గాలికి వదిలేస్తే, వైఎస్.జగన్ సర్కారు 53,466 ఉద్యోగాలను భర్తీ చేసింది. నైపుణ్య శిక్షణ మీ బాబు భక్షణే అసలు ఈనాడు రామోజీ ఏడుపు అంతా చంద్రబాబు స్కిల్ స్కామ్పై విచారణ చేపట్టడమేనని అక్కసుతో రాసిన ఈ కథనం చెప్పకనే చెబుతోంది. స్కిల్ పేరుతో చంద్రబాబు దోపిడీ అంతా ఇంతా కాదు. స్కిల్ పేరుతో కోట్లాది రూపాయల నిధులు తన ఇంటికి మళ్లించేశారు. కానీ వైఎస్.జగన్ ప్రభుత్వం 175 శాసనసభ నియోజకవర్గాల్లో కనీసం ఒకటి ఉండే విధంగా మొత్తం 192 స్కిల్ హబ్్సను ఏర్పాటు చేసింది. ఇక్కడ లెవెల్–4 లోపు కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి తక్కువ కాకుండా మొత్తం 26 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. హై ఎండ్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడానికి తిరుపతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తోంది. అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు రాష్ట్ర విద్యార్థులు అందుకునే విధంగా స్కిల్ ఇంటర్నేషనల్ పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. ఇందుకోసం పలు పరిశ్రమలు, విదేశీ సంస్థలతో ఒప్పందం చేసుకొంది. ఏపీఎస్ఎస్డీసీ ఆధ్యర్యంలో నైపుణ్య శిక్షణ కోర్సులను అందిస్తోంది. 2019–20 నుంచి 2023–24 వరకు 14,26,515 మంది యువతకు శిక్షణ ఇచ్చింది. అత్యధిక ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ నాలుగో స్థానం కేంద్రం విడుదల చేసిన ఇండియా 2023 స్కిల్ రిపోర్ట్ అత్యధిక ఉద్యోగావకాశాల కల్పనలో దేశంలోనే ఆంద్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉందని స్పష్టం చేసింది. సామాజిక, పారిశ్రామిక, సాంకేతిక మౌలిక సదుపాయాలు కల్పన భేష్ అని నివేదిక ప్రశంసించింది. ప్లేస్మెంట్లలో రూ.2.6 లక్షలు అంతకంటే ఎక్కువ వేతనాలు అందే రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని స్కిల్ రిపోర్ట్ పేర్కొంది. యువతకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు నైపుణ్య శిక్షణ ఇప్పించి పెద్ద పెద్ద ఉద్యోగాలు పొందేలాగా ప్రోత్సహిస్తున్నది సీఎం వైఎస్.జగన్ మాత్రమే. -
రామోజీ బధిర రాతలు
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) వేగంగా విస్తరిస్తుంటే ఐదేళ్లు గాఢ నిద్రలో ఉన్న ఈనాడు రామోజీ వాటిపై విషం కక్కుతూ ఒక కథనాన్ని వండి వార్చారు. గడిచిన ఐదేళ్ల కాలంలో వీటి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ప్రభుత్వ చర్యలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ కీర్తించింది. కళ్లకు, చెవులకు గంతలు కట్టుకొని పడుకున్న రామోజీకి ఇవేవీ కనిపించలేదు. ‘‘ఐదేళ్లు నిద్దరపోయి ఐదురోజుల్లో ఉద్ధరిస్తారట!’’ అంటూ అవాస్తవ కథనాన్ని రాసేశారు. ఏషియన్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థ ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలను కీర్తిస్తూ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర లాల్ దాస్ గడిచిన ఐదేళ్లలో ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు. పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మయోజన్, నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పనితీరు కనబరుస్తోందన్నారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పురోగతికి తిరుపతి, విజయవాడల్లో మరో రెండు ఎంఎస్ఎంఈ డీఎఫ్వో కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు సుభాష్ చంద్ర ప్రకటించారు. మౌలిక వసతులకు పెద్ద పీట ఎంఎస్ఎంఈలు ఒక సంఘంగా ఏర్పడి తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసుకునే విధంగా క్లస్టర్ రూపంలో ఉమ్మడి మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇందుకోసం ప్రతీ జిల్లాలో కనీసం రెండు చొప్పున మొత్తం 54 క్లస్టర్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించింది. అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నది ఈ క్లస్టర్ల ప్రధాన ఉద్దేశ్యం. తాజాగా విజయనగరం జిల్లా ఎస్.కోటలో జేఎస్డబ్ల్యూ ఇండ్రస్టియల్ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. సుమారు రూ.531 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఈ పార్కు అందుబాటులోకి వస్తే 35,750 మందికి ప్రత్యక్షంగానూ, 9,375 మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అనకాపల్లి, కొప్పర్తిల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వ, ఇతర సంస్థల నుంచి బకాయిలు వసూలు కాక ఇబ్బందులు పడుతున్న యూనిట్లకు అండగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలుల్లో ప్రాంతీయ ఫెసిలిటేషన్ కౌన్సిళ్లను ఏర్పాటు చేసింది. నూతన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల వ్యయంతో మరో టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఇలాంటిది విశాఖపట్నంలో ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు 25 శాతం తప్పనిసరిగా ఎంఎస్ఎంఈల నుంచే కొనుగోలు చేయాలంటూ చట్టం కూడా తీసుకు వచ్చింది. ఏడు లక్షలు దాటిన ఎంఎస్ఎంఈలు ♦ గత ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య 1,93,530. ఈ ఏడాది ఆగస్టు ముగిసే నాటికి వాటి సంఖ్య ఏకంగా 7,72,802. కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు ఇవి. ♦ ఈ నాలుగున్నర ఏళ్లలో కొత్తగా 15 లక్షలకు పైగా ఉపాధి లభించింది. ♦ గత ఆర్థిక సంవత్సరంలో సగటున ప్రతీ నెలా సగటున కొత్తగా 11,379 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైతే ఈ ఒక్క ఏడాదిలోనే 19,476కు చేరింది. ♦కోవిడ్ సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీ, వైఎస్ఆర్ నవోదయం వంటి పథకాలతో ఎంఎస్ఎంఈ రంగం పునర్జీవం పొందింది. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు, స్పిన్నింగ్ మిల్లులకు బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను ఈ ప్రభుత్వం విడుదల చేసింది. రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలను అందించింది. అభివృద్ధి కోసం సర్వే చేయడం కూడా తప్పేనా రామోజీ? వచ్చే నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంఖ్యను, వాటి వ్యాపారాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో రూ.118 కోట్లతో రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ (ర్యాంప్) పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈల వివరాలను ప్రత్యేక సర్వే ద్వారా సేకరిస్తోంది. ఉద్యమ్ పోర్టల్లో నమోదు కాని ఎంఎస్ఎంఈలను గుర్తించడం ఈ సర్వేలో ఓ భాగం. అవగాహన, శిక్షణ కార్యక్రమాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు, బ్యాంకు రుణాలు, డిలేడ్ పేమెంట్, పోర్టల్కు అనుసంధానం వంటి ప్రయోజనాలను కల్పించేందుకు ఈ సర్వే ఉపయోగపడనుంది. -
Fact Check: ‘కాపు’ కాసిందే జగన్..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కాపుల మదిలో విష బీజాలు నాటి చంద్రబాబుకు మేలు చేయాలనే కుతంత్రంతో రామోజీరావు అడ్డగోలుగా మరో తప్పుడు కథనాన్ని వండి వార్చారు. ‘కాపులకు జగన్ దగా’ అంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఈనాడులో విషం కక్కారు. అసలు కాపులను ఓటు బ్యాంకుగా వాడుకొని వారి ఓట్లతో గద్దెనెక్కి వారిని వంచించి వదిలేసిందే చంద్రబాబు. ఇది జగమెరిగిన సత్యం. రిజర్వేషన్లు, ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు వంటి ఎన్నో హామీలిచ్చి 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వాటిని అమలు చేయకుండా కాపులను దారుణంగా దగా చేశారు. ఒక్క కాపులే కాదు.. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలనూ మోసం చేశారు. మోసాలకు కేరాఫ్ చంద్రబాబు అన్న ముద్ర వేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ మాత్రం మాయ మాటలతో తాను మభ్య పెట్టలేనని, చేసేదే చెబుతానని నిఖార్సైన నాయకుడిగా నిలబడ్డారు. ఇచ్చి న మాటను నిలబెట్టుకుంటూ నవరత్న పథకాలతో కాపులను అన్ని విధాలుగా ఆదుకోవడంతోపాటు ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ పెట్టి వారికి నిజమైన మేలు చేశారు. కాపు నేస్తం, చేయూత, ఆసరా, అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుక వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా కాపుల్లోని పేద వర్గాలకు ఆర్థిక తోడ్పాటునందించి, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశారు. సీఎం జగన్ 58 నెలల పాలనలో కాపులకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.39,317.80 కోట్లు ఆర్థిక సాయమందించి సీఎం జగన్ రికార్డు సృష్టించారు. రాజకీయాల్లో విలువలు కలిగిన నాయకుడిగా సీఎం వైఎస్ జగన్ కాపుల ఉన్నతిలో తనదైన ముద్ర వేసుకున్నారు. విశ్వసనీయత, నిబద్ధత, నిజాయతీకి సీఎం వైఎస్ జగన్ మారుపేరు. ఈ విషయాలన్నీ తెలిసీ రామోజీ అసత్య కథనంతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేశారు. రామోజీ ఇలాంటి కథనాలు ఎన్ని అచ్చేసినా చంద్రబాబుకున్న మోసాలకు కేరాఫ్ ముద్రా పోదు.. సీఎం వైఎస్ జగన్కు ఉన్న విశ్వసనీయతకు మారు పేరన్న గౌరవమూ తగ్గదు. రామోజీ అచ్చేసిన కథనంలో వాస్తవాలేమిటో పరిశీలిస్తే.. ఆరోపణ: కార్పొరేషన్ను నిర్లక్ష్యం చేసిన వైకాపా సర్కారు? వాస్తవం: కాపు కార్పొరేషన్ను గత చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఇది తెలిసినా ఎన్నికలు సమీపిస్తుండటంతో బాబుకు రాజకీయ మేలు కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై రామోజీ బురద రాతలకు దిగజారారు. కాపులకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు జరుపుతానని మాట ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు కాపు కార్పొరేషన్ ద్వారా 2014 నుండి 2017 వరుకు ఒక్క రూపాయీ విదల్చలేదు. 2017 నుండి 2019 వరకు రూ.1,874.67 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. విడుదల చేసింది రూ.1,334 కోట్లే. అంతే ప్రకటించిన మొత్తంలో రూ.540 కోట్లు బకాయి పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కాపు కార్పొరేషన్కు పెట్టిన బకాయిలను సైతం వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. వైఎస్ జగన్ ప్రభుత్వం కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన పేద కుటుంబాల అభ్యున్నతికి కాపు కార్పొరేషన్ ద్వారా చేయూతనిచ్చి ంది. కాపు కార్పొరేషన్ ద్వారా రూ.15,044.64 కోట్లతో వైఎస్సార్ కాపు నేస్తం, జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న అమ్మ ఒడి, వాహన మిత్ర, జగనన్న చేదోడు, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ అసరా, వైఎస్సార్ నేతన్న నేస్తం, జగనన్న తోడు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఆరోపణ: గత ప్రభుత్వ హయాంలో రూ1,441 కోట్ల మేర రాయితీ రుణాలు వాస్తవం: గత ప్రభుత్వ హయాంలో రూ.1,441.75 కోట్లు మేరకు రాయితీ రుణాలు ఇచ్చి నట్టు చంద్రబాబు గురించి గొప్పలు చెప్పిన ఈనాడు.. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అంతకు మించి నిధులు కేటాయించినప్పటికీ మసిపూసి మారేడు కాయ చేసేలా అబద్ధాలు రాసేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 (ఈ ఏడాది మార్చి) వరకు 19,81,458 మంది లబ్దిదారులకు రూ.3,260.87 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూర్చింది. వైఎస్సార్ ఆసరా, జగనన్న తోడు, జగనన్న చేదోడు, వైఎస్సార్ సున్నా వడ్డీ వంటి వాటికి నిధులు విడుదల చేసింది. వాహన మిత్ర పథకంలో 58 నెలల కాలంలో 25,046 మందికి ఏడాదికి రూ.10 వేలు చొప్పున రూ.132.57 కోట్లు ఆర్థిక సాయం అందించింది. ఆరోపణ: నైపుణ్య శిక్షణ నిలిపేశారు వాస్తవం: నైపుణ్య శిక్షణ పేరుతో గత ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు శిక్షణ సంస్థలకు బకాయిలు పెట్టిన రూ.8.83 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వమే చెల్లించింది. గత ప్రభుత్వం విద్యోన్నతి అంటూ గొప్పలు చెప్పిన పథకంలో గత ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు శిక్షణ ఇచ్చి న సంస్థలకు బకాయి పెట్టిన రూ.6.15 కోట్లు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వమే చెల్లించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం 2023–2024 ఏడాదికి జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం ద్వారా అర్హత కలిగిన కాపు విద్యార్ధులకు లక్ష రూపాయలు చొప్పున 23 మందికి రూ.23 లక్షలు అందించింది. ఆరోపణ: కాపు భవన నిర్మాణాలపైనా జగన్ కన్నుకుట్టింది వాస్తవం: గత ప్రభుత్వం గొప్పలు చెప్పి మంజూరు చేసిన భవనాల్లో ఒక్క దానికీ నిర్మాణం పూర్తిచేసి ప్రారంభించలేదు. అదీ చంద్రబాబు సర్కారు ఘనత. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు 5 కాపు భవనాలకు రూ.వంద కోట్లు నిధులు విడుదల చేయడమే కాకుండా నెల్లూరు మున్సిపాలిటీలో, బాపట్ల జిల్లా ఏల్చూరు, అడవిపాలెం, చందలూరులో నాలుగు కాపు భవనాల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించింది. ఇదీ సీఎం వైఎస్ జగన్ నిబద్ధత. ఆరోపణ: విదేశీ విద్య దక్కకుండా కుతంత్రాలు వాస్తవం: గత ప్రభుత్వం చేపట్టిన విదేశీ విద్యా పథకంలో అక్రమాలు, అవినీతి జరిగినట్టు విజిలెన్స్ విచారణలో వెలుగు చూసింది. దీంతో ఈ పథకాన్ని మరింత మెరుగులు దిద్ది పేద వర్గాలకు మేలు చేసేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 2015–16 నుండి 2018–19 వరకు 307 మంది విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.20.97 కోట్ల మేర బకాయిలను కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. 2022 నుంచి 2024 (మార్చి) వరకు విదేశీ విద్యా దీవెనకు సంబంధించి 60 మంది విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ రూ.15.62 కోట్లు అందించి విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశం కల్పించింది. వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి పథకాల్లో 2019 నుంచి 2024 వరకు 8,41,677 మంది కాపు విద్యార్ధుల కోసం వారి తల్లులకు రూ.3,950.79 కోట్లు అందించింది. -
Fact Check: గ్రామాల్లో అభివృద్ధిపైనా ‘పచ్చ’పాతమే
సాక్షి, అమరావతి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా వేల కోట్ల నిధులు విడుదల చేస్తుంటే.. రామోజీ మాత్రం కడుపు మంటతో అబద్ధాలు అచ్చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రజలకు అవసరమైన ప్రాధాన్యత పనులను చేస్తున్నా.. అక్కసుతో అడ్డమైన రాతలు రాస్తున్నారు. ‘గడప గడపకు బోల్తా’ అంటూ పచ్చి అవాస్తవాలతో ఈనాడులో అవాస్తవాలను ప్రచురించారు. చంద్రబాబు హయాంలో గ్రామాలు, వార్డుల్లో ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనను ఏ మాత్రం పట్టించుకోకపోయినా రామోజీ ఒక్క కథనం రాయలేదు. ఆరోపణ: రూ. 3 వేల కోట్ల పనుల్లో మొదలైనవి రూ.వెయ్యి కోట్ల పనులే.. వాస్తవం: వైఎస్ జగన్ సర్కారు గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్రంగా ఆ పరిధిలోని ఇళ్లకు మంత్రులు, ఎమ్మెల్యేలను పంపించి వారి సమస్యలు తెలుసుకుంది. అక్కడి ప్రజలకు అవసరమైన అత్యంత ప్రాధాన్యత పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఒక్కో గ్రామ, వార్డు సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులను కేటాయించారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు అసలు గ్రామాలు, వార్డుల ముఖం చూసిన పాపాన పోలేదు. ప్రజలకు అవసరమైన పనులు చేపట్టకుండా నీరు–చెట్టు పేరుతో నామినేషన్పై వేల కోట్లు పచ్చ నేతలు జేబులు నింపుకున్నారు. ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో వేల సంఖ్యలో పనులు జరుగుతున్నా ఈనాడు రామోజీ అక్కసు వెళ్లగక్కారు. రూ.1000 కోట్ల విలువైన పనులు కూడా ప్రారంభం కాలేదని అవాస్తవలు ప్రచురించారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో గుర్తించిన అత్యంత ప్రాధాన్యత పనుల్లో ఇప్పటికే రూ.1100.78 కోట్ల విలువైన 30,025 పనులు పూర్తయ్యాయి. మరో 1978.46 కోట్ల విలువైన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆరోపణ: 65 వేల పనుల్లో 25 వేల పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.. వాస్తవం: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 11,753 సచివాలయాల పరిధిలో 65,857 పనులను మంజూరు చేశారు. వాటిలో చాలా పూర్తి కాగా.. మరికొన్ని కొనసాగుతున్నాయి. స్థానికంగా ఆయా సచివాలయాల పరిధిలో ప్రజలకు అవసరమైన అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత పనులను మంత్రులు, ప్రజాప్రతినిధులు గుర్తించిన వెంటనే ఆ పనుల వివరాలను గడప గడపకు మన ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత పనుల పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేసిన పనుల తక్షణ మంజూరు నిరంతరంగా కొనసాగుతోంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యత పనుల కోసం ఒక్కో గ్రామ, వార్డు సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున రూ.3000 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. పూర్తయిన పనులకు బిల్లులు చెల్లింపు చేస్తున్నారు. అత్యంత ప్రాధాన్యత పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత పనుల పోర్టల్లో అప్లోడ్ చేయాల్సిందిగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎంపీడీవోలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పూర్తి అయిన పనుల బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసి నిబంధన ప్రకారం చెల్లింపులు చేయాలని డీడీఓలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పనులు పూర్తయిన వాటికి ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లింపు చేస్తున్నారు. పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్ జైన్ తెలిపారు. -
fact check: కుంభకర్ణ నిద్ర మీదే రామోజీ
సాక్షి, అమరావతి: నిత్యం కుట్రపూరిత ఆలోచనలు, విషపూరిత రాతలు.. అక్షరాలకు అందని ఆక్రోశం.. ఇదీ ఈనాడు రామోజీరావు పరిస్థితి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పదేపదే అబద్ధాలను అచ్చేస్తూ వయోభారానికి తోడు తనకున్న అల్జీమర్స్ వ్యాధి ముదిరి పోయిందని సోమవారం మరోసారి రుజువు చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో ఖరీఫ్తో పాటు రబీలో పంటల సాగు తగ్గిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు వీలుగా ఒకే వ్యవసాయ సీజన్లో నాలుగు సార్లు సబ్సిడీపై విత్తనాలు ప్రభుత్వం అందించిన విషయాన్ని తన రాతల్లో మరుగున పరిచారు. 103 కరువు మండలాల పరిధిలో పంటలు నష్టపోయిన రైతులతో పాటు డిసెంబర్లో విరుచుకుపడిన మిచాంగ్ తుపాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకూ పెట్టుబడి రాయితీని నాలుగు రోజుల క్రితమే విడుదల చేసిన విషయాన్ని మరచిపోయారు. మూడో విడత రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీలు కలిపి ఏకంగా 75.96 లక్షల మందికి రూ.2588.92 కోట్లు లబ్ధి చేకూర్చిన అంశం ఈ కబోదికి కన్పించలేదు. ఆరోపణ: ఖరీఫ్, రబీలో కలిపి 45 లక్షల ఎకరాల్లో బీడు వాస్తవం: ఖరీఫ్, రబీ పంట కాలాల్లో సాధారణ విస్తీర్ణం 140.24 లక్షల ఎకరాలకు గాను 104.94 లక్షల ఎకరాల్లో సాగైంది. బెట్ట పరిస్థితుల వలన 35.30 లక్షల ఎకరాలలో పంటలు వేయలేదు. కానీ ఉద్యాన పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పండ్లు, ప్లాంటేషన్ తోటలు, కూరగాయలు, వాణిజ్య పూలు, ఇతర ఉద్యాన పంటల విస్తీర్ణం ఖరీఫ్, రబీల్లో 7,87,621 ఎకరాలకు చేరింది. సాధారణం కన్నా కేవలం 27.42 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు తగ్గింది. కానీ ఈనాడుకు మాత్రం ఏకంగా 45 లక్షల ఎకరాల్లో తగ్గినట్టుగా కని్పంచింది. ఆరోపణ: కరువు, తుపానులతో మరో 43 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాస్తవం: వర్షాభావ పరిస్థితుల వల్ల ఏడు జిల్లాల్లో 103 కరువు మండలాలను ప్రకటించారు. ఈ మండలాల్లో 14,24,245 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. ఇందులో ఉద్యాన, వ్యవసాయ పంటలున్నాయి. రబీ సీజన్ ఆరంభంలో విరుచుకుపడిన మిచాంగ్ తుపాన్ భారీ వర్షాల వలన 6,64,380 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. కరువు, మిచాంగ్ తుపాన్ వల్ల 20,88,625 ఎకరాలు పంటలు దెబ్బతింటే ఈనాడుకు మాత్రం 43 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా కని్పంచింది. ఆరోపణ: వెంటాడిన పొడి వాతావరణం వాస్తవం:దేశ వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్తో పాటు రబీలోనూ కొనసాగింది. కానీ పొడి వాతావరణం కని్పంచినంత మాత్రాన కరువు ఉన్నట్టు కాదన్న విషయం రామోజీకి తెలియంది కాదు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఏదైనా ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా గుర్తించాలంటే ఆరు ప్రామాణికాల ఆధారంగా తీసుకుంటారు. తొలుత ప్రాథమిక అంచనా, క్షేత్ర స్థాయి పరిశీలన, తర్వాత నిబంధనల మేరకు 33 శాతానికి పైగా మునిగిపోయి దెబ్బతిన్న పంటలను పరిగణనలోకి తీసుకొని నష్టం తుది అంచనాలను రూపొందిస్తారు. ఆ మేరకు పంటలవారీగా లెక్కించి పరిహారాన్ని (ఇన్పుట్æసబ్సిడీ) అందిస్తారు. ఆరోపణ: పడిపోయిన 3 కోట్ల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వాస్తవం: కరువు, మిచాంగ్ ప్రభావం ఉన్నప్పటికీ 2023–24లో ఆహార ధాన్యాల దిగుబడి 154.73 లక్షల టన్నులు నమోదవుతున్నట్టు డైరెక్టర్ ఆఫ్ స్టాటస్టిక్స్ (కేంద్ర గణాంక శాఖ) రెండో ముందస్తు అంచనా వేసింది. ఈ దిగుబడులు గడిచిన ఐదేళ్ల సగటు దిగుబడులతో పోలిస్తే తక్కువేమీ కాదు. వరితో సహా జొన్న, సజ్జ, రాగి, పెసలు, మినుము, ఉలవలు వేరుసెనగ, నువ్వులు, పత్తి పంటల ఎకరా దిగుబడి గత ఏడాదితో పోలిస్తే పెరిగింది. 2023–24 సీజన్లో 57.87 లక్షల ఎకరాలకు 48.93లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వాస్తవాలు ఇలా ఉంటే ఏకంగా 3 కోట్ల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి తగ్గిందంటూ కాకిలెక్కలు అచ్చేశారు. ఆరోపణ: కరువు విజృంభిస్తున్నా ఉపశమన చర్యలేవీ వాస్తవం: ఒకే సీజన్లో నాలుగు సార్లు సబ్సిడీపై విత్తనాలు అందించారు. బెట్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలకు అనుగుణంగా ఆర్బీకేల ద్వారా 80 శాతం సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేశారు. 2023లో జూలై– ఆగస్ట్ నెలల్లో కురిసిన అధిక వర్షాలకు వరి నారుమళ్ళు దెబ్బతిని నష్టపోయిన రైతులు మరలా విత్తుకునేందుకు 1479 క్వింటాళ్ళ స్వల్పకాలిక వరి రకాలు అందించారు. బెట్ట పరిస్థితుల వల్ల ఖరీఫ్ 2023లో పంటలు దెబ్బతిన్న రైతులకు 30వేల క్వింటాళ్ల ఉలవలు, అలసంద, మినుము, పెసర, కంది, రాగి, జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు విత్తనాలను రూ.26.02 కోట్ల సబ్సిడీతో 1.14 లక్షల మందికి ఇచ్చారు. 2023 డిసెంబర్లో మిచాంగ్ తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు 49,758 క్వింటాళ్ల శనగ, వేరుశనగ, మినుములు, పెసర, నువ్వులు, రాగి, తక్కువ పంట కాల వరి రకాలను రూ. 31.06 కోట్ల సబ్సిడీతో 71415 మందికి పంపిణీ చేశారు. మిచాంగ్ తుపాన్ వేళ రంగుమారిన, తడిసిన 6.79లక్షల టన్నుల ధాన్యాన్ని 1.11లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేసి వారికి జీఎల్టీతో సహా రూ.1483.61 కోట్లు జమ చేశారు. ఆరోపణ: కరువు, తుపాన్ వేళ సాయమేది? వాస్తవం: కరువు, మిచాంగ్, అకాల వర్షాల వల్ల అందించిన సాయానికి అదనంగా 2023–24 సీజన్లో వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.7226.08 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు వైఎస్సార్ ఉచిత పంటల బీమా పధకం ద్వారా రూ.1117.21కోట్లు, వై.ఎస్.ఆర్. సున్నావడ్డీ పంట రుణాల పథకం ద్వారా రూ.215.98 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసింది అంతేకాకుండా ఈ సీజన్లో ఇప్పటి వరకు రూ.326.14 కోట్ల ఖర్చుతో ఆర్బీకేల ద్వారా రైతులకు అందించారు. ఇవేమీ ఈనాడుకు కని్పంచకపోవడం విడ్డూరంగా ఉంది. ఆరోపణ: సాయంపై సర్కార్ మీనమేషాలు వాస్తవం: ఖరీఫ్ 2023 పంటకాలంలో మే–ఆగస్ట్ మధ్య కురిసిన వర్షాలు, వరదల వల్ల 12,198.62 ఎకరాల్లో దెబ్బతిన్న అరటి, కూరగాయలు, బొప్పాయి, తమలపాకు, మామిడి తదితర ఉద్యాన పంటల రైతులు 11,373 మందికి పెట్టుబడి రాయితీగా రూ.11 కోట్లు అందించారు. 2023 మార్చి–మే మధ్య కురిసిన అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న మొక్కొజొన్న, జొన్న పంటలకు సంబంధించి 1892 మంది రైతులకు క్వింటాలుకు రూ. 500 చొప్పున రూ.5 కోట్ల ప్రత్యేక పెట్టుబడి రాయితీ ఇచ్చారు. 2023లో కరువు వల్ల నష్టపోయిన 6.96 లక్షల మంది రైతులకు రూ.847.23 కోట్లు, మిచాంగ్ తుపాన్ వల్ల నష్టపోయిన 4.61 లక్షల మంది రైతులకు రూ.442.36 కోట్లు పెట్టుబడి రాయితీని రైతుల ఖాతాలకు ఇటీవలే విడుదల చేశారు. దీనికోసం జీవో ఎంఎస్ నెం.5 జారీ చేశారు. ఈ జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించారు. తమ పేరు లేదని కానీ, ఇన్పుట్ సబ్సిడీ రాలేదని ఒక్కరంటే ఒక్క రైతూ ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. అదే ఈనాడుకు కంటగింపుగా ఉంది. గతంలో ఎన్నడూ లేనంత దుర్భిక్షం చంద్రబాబు పాలనలో ఏటా సగటున 324 మండలాల్లో కరువు తాండవించేది. కరువు మండలాలను సీజన్కు అనుగుణంగా ప్రకటించిన దాఖలాలు లేవు. 2014 ఖరీఫ్ కరువు మండలాలను 2015 నవంబర్లో, 2015వి 2016 నవంబర్లో, 2016వి 2017 జూన్లోనూ, 2017వి 2018 ఆగష్టులోనూ ప్రకటించారు. 2018 ఖరీఫ్, 2018–19 రబీ సీజన్లలో ఏర్పడిన కరువు మండలాలను అసలు ప్రకటించనే లేదు. తన ఐదేళ్ల పాలనలో 24,79,985 మంది రైతులకు చెల్లించాల్సిన రూ.2558 కోట్లు ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుదే. -
Fact Check: కళ్లకు చత్వారం... చెవులకు బధిరత్వం
రామోజీ పచ్చ కళ్లద్దాలు పెట్టుకుని అదేపనిగా రోత రాతలు రాస్తూనే ఉన్నారు. ఆ కళ్లకు చత్వారం, చెవులకు బధిరత్వం వచ్చింది. అందుకే ఈనాడుకు నిజాలు కనిపించవు.. వినిపించవు. సీఎం జగన్ ప్రభుత్వం పేదలకు ఎంత మంచి చేసినా ఆ కళ్లకు చెడుగా కనిపిస్తోంది. ముదనష్టపు రాతలతో పచ్చకామెర్ల రోగి సామెతను దఫదఫాలుగా గుర్తు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు దగా పాలనలో 5 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టిస్తానని దాదాపు రూ.9 వేల కోట్ల అవినీతికి పాల్పడితే అదేదీ ఆనలేదు.. కానరాలేదు. 2019 మొదలు ఇప్పటి వరకు సీఎం జగన్ 1,24,680 టిడ్కో ఇళ్లను పేదలకు అందించినా, అసలు ఏమీ చేయనట్లుగా అబద్ధాలు అచ్చేయడం పరిపాటిగా మారింది. సాక్షి, అమరావతి : పట్టణ పేదలకు మెరుగైన జీవనానికి ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇళ్లపైనా ఈనాడుకే ఏడుపే. ఏడుపుతో పాటు అబద్ధాల విషాన్నీ చిమ్ముతోంది. ఈ ప్రాజెక్టు కింద అన్ని సదుపాయాలతో ఇప్పటి దాకా 1,24,680 యూనిట్లను లబ్దిదారులకు అందించినా, అట్టహాసంగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నా రామోజీకి కనిపించడం లేదు. లబ్ధిదారులు ఆనందంగా సొంతింట్లో నివాసమున్నా చూడలేకపోతున్నారు. గత చంద్రబాబు బృందం టిడ్కో ఇళ్ల పేరుతో రూ.8,929.81 కోట్ల దోపిడీకి పాల్పడింది. చ.అడుగు నిర్మాణ ధర రూ.1000 కంటే తక్కువే ఉండగా.. బాబు మాత్రం కంపెనీలు ఇచ్ఛిన ముడుపుల స్థాయిని బట్టి రూ.2,534.75 నుంచి రూ.2034.59గా నిర్ణయించి, సగటున చ.అ నిర్మాణ ధర రూ.2,203.45గా చెల్లించారు. అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే రూ.1203.45 అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేసినా, ఇప్పటి దాకా ఒక్కసారి చంద్రబాబును ఇదేం అక్రమమని రామోజీ ప్రశ్నించిందే లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వ తప్పిదాలను సరిచేసింది. టీడీపీ ప్రభుత్వం నిరుపేదలపై మోపిన అధిక ధరల భారాన్ని పక్కనబెట్టి 1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే ప్లాట్లను కేటాయించింది. మరో 1,18,616 మంది తక్కువ ఆదాయ వర్గాలకు ఫ్లాట్ ధరను సగానికి తగ్గించి ఇళ్లను అందిస్తోంది. అదీ తాగునీరు, విద్యుత్తు సదుపాయం, డ్రైనేజీ వంటి సకల సదుపాయాలు కల్పించిన తర్వాతే ప్లాట్లను కేటాయిస్తోంది. బ్యాంకు రుణాలు మంజూరైనా రెండేళ్ల మారటోరియం ఇచ్చింది. గడువులోగా ఇల్లు ఇవ్వకుంటే ప్రభుత్వమే లబ్దిదారుల ఈఎంఐ చెల్లిస్తోంది. అన్ని వసతులతో పేదలకు ఆధునిక ఇళ్లు రాష్ట్రంలోని 88 పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) పరిధిలోని 163 ప్రాంతాల్లో జీ+3 విధానంలో 2,62,212 టిడ్కో ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందులో 300 చ.అ. విస్తీర్ణంలో 1,43,600 యూనిట్లు, 365 చ.అ విస్తీర్ణంలో 44,304 యూనిట్లు, 430 చ.అ విస్తీర్ణంలో 74,312 యూనిట్లు ఉన్నాయి. మొత్తం ఇళ్లలో ఫేజ్–1 కింద 1,51,298 ఇళ్లు వంద శాతం నిర్మాణం పూర్తయింది. ఈనెల 7 వరకు 1,24,680 ఇళ్లను లబ్దిదారులకు అందించారు. ముఖ్యంగా 300 చ.అ. విస్తీర్ణంలో నిర్మించిన 1,43,600 యూనిట్లలో ఒక్కో ఇంటికి రూ.6.55 లక్షలు ఖర్చవగా, వీటిని నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగానే అందించింది. 365 చ.అ. ఇంటికి రూ.7.55 లక్షలు ఖర్చవగా, ప్రభుత్వం రూ.4.15 లక్షలు, లబ్దిదారులు తమ వాటాగా రూ.3.40 లక్షలు చెల్లించాలి. రూ.8.55 లక్షలతో నిర్మించిన 430 చ.అ. ఇళ్లకు ప్రభుత్వం రూ.4.15 లక్షలు, లబ్దిదారుల వాటాగా రూ.4.40 లక్షలు చెల్లించాలి. రెండు, మూడో కేటగిరీ ఇళ్ల లబ్దిదారులు, రుణాలు మంజూరు చేసిన బ్యాంకులు, సంబంధిత మున్సిపాలిటీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. రుణ వాయిదాల (ఈఏంఐ) చెల్లింపునకు 24 నెలల మారటోరియం ఉంది. 20 ఏళ్ల పాటు రుణ వాయిదాలు చెల్లించాలి. మారటోరియం గడువు లోగా లబ్దిదారులకు ఇళ్లు అప్పగిస్తే అప్పటి నుంచి రుణ వాయిదాలు వారే కట్టాలి. ఒకవేళ గడువులోగా ఇంటిని లబ్ధిదారులకు అప్పగించకపోతే రుణ వాయిదాలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇదంతా బహిరంగంగానే కనిపిస్తున్నా, బాబు భజనలో తరిస్తున్న ఎల్లో మీడియాకు వాస్తవాలు చెప్పే ధైర్యం లేదు. పేదల ఇళ్లలో చంద్రబాబు రూ.8,929.81 కోట్ల అవినీతి ♦ వెన్నుపోటు రాజకీయాల్లో ఆరితేరిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన అక్రమాలకు, అవినీతికీ పట్టణాల్లో ఇల్లు లేని నిరుపేదల జీవితాలను సైతం ‘తాకట్టు’ పెట్టారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు 2016–17లో రాష్ట్రంలో లేనంత అధికంగా నిర్మాణ వ్యయాన్ని చూపి లబ్ధిదారులను దోచుకున్నారు. ♦ ఏపీ టిడ్కో ద్వారా రాష్ట్రంలోని పట్టణాల్లో నివశిస్తున్న ఇళ్లు లేని పేదలు 5 లక్షల మందికి ప్రభుత్వ స్థలాల్లో 300, 365, 415 చ.అ విస్తీర్ణంలో జీ+3 విధానంలో ఫ్లాట్లు కట్టిస్తామని నమ్మబలికారు. ♦ 300 చ.గ విస్తీర్ణం గల ఫ్లాట్కు రూ.2.60 లక్షల ధర నిర్ణయించి బ్యాంకు రుణాలు ఇప్పించి, నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని (రూ.7.20 లక్షలు) షరతు పెట్టారు. ♦ ఇక్కడే చంద్రబాబు బృందం నిర్మాణ కంపెనీల నుంచి ముడుపులు తీసుకుని, అధికంగా ముడుపులు ఇచ్చుకున్న కంపెనీకి అధిక ధరకు, తక్కువగా ఇచ్ఛిన కంపెనీకి తక్కువ ధరకు నిర్మాణ అనుమతులు కట్టబెట్టారు. ♦ ఈ అవినీతి లోతు ఎంతంటే.. ఆనాడు మార్కెట్లో ఏ ప్రైవేటు బిల్డర్ వసూలు చేయనంతగా ధర నిర్ణయించారు. 2016–17లో మార్కెట్లో చ.అడుగు నిర్మాణ ధర రూ.900 నుంచి రూ.1000 మధ్య ఉండగా.. చంద్రబాబు మాత్రం కంపెనీలకు రూ.2,534.75 నుంచి రూ.2034.59గా నిర్ణయించి సగటు చ.అ నిర్మాణ ధర రూ.2,203.45గా చెల్లించారు. ♦ అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే రూ.1203.45 అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేశారు. వాస్తవానికి ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు మార్కెట్ ధర కంటే ఇంకా తగ్గాల్సింది పోయి భారీగా పెంచేశారు. ♦ టీడీపీ ప్రభుత్వం తలపెట్టిన 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం 3.15 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలెట్టింది. ♦ తొలి విడతగా 2,08,160 యూనిట్లను 7,42,01,820 చ.అ. విస్తీర్ణంలో నిర్మాణ అనుమతులిచ్ఛిన చంద్రబాబు బృందం రూ.8,929.81 కోట్ల అవినీతికి పాల్పడింది. ♦ పేదలు 300 చ.అ. ఇంటికి బాబు ప్రభుత్వం రూ.7.20 లక్షలు భారం మోపి, 20 ఏళ్ల పాటు ప్రతినెలా వాయిదాలు కట్టాలని షరతుపెట్టింది. ♦ దీని ప్రకారం లబ్ధిదారులపై రూ.3,805 భారం మోపింది. 365 చ.అ. ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ. ఇంటికి రూ.లక్ష వసూలు చేసింది. బాబు అక్రమాలకు జగన్ చెక్...ప్రజాధనం ఆదా... బాబు హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రస్తుత జగన్ సర్కారు రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్మాణ వ్యయాన్ని రూ.2,840 కోట్లకు తగ్గించించి. రూ.392 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. ♦ రివర్స్ టెండరింగ్లో చ.అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.1692 తగ్గించి, రూ.4,368 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేసింది. ♦ నిరుపేదలకు కేటాయించిన 300 చ.అ. ఇంటిని ఉచితంగా (రూ.1కి) ఇవ్వడంతో 1,43,600 మంది లబ్ధిదారులకు ఈఎంఐ రూపంలో చెల్లించే రూ.10,339 కోట్ల భారం లేకుండా పోయింది. ♦ 365 చ.అ ఇళ్లలో 44,304 మంది లబ్దిదారులు రూ.50 వేలు, 430 చ.అ. ఇళ్లలో 74,312 మంది లబ్దిదారులు రూ.లక్ష చొప్పున వాటా చెల్లించాలని గత ప్రభుత్వం నిబంధన పెడితే, దాన్ని సగానికి తగ్గించి, మిగతా సగం వాటా నగదు రూ.482.32 కోట్లను ప్రస్తుత ప్రభుత్వమే చెల్లించింది. ♦ జగన్ ప్రభుత్వం ఉదారత ఫలితంగా రెండు, మూడు కేటగిరీల లబ్దిదారులకు గత ధరల ప్రకారం రూ.10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తం రూ.4,590 కోట్లకు జగన్ సర్కారు తగ్గించింది. -
Fact Check: బాబు ధ్యానంలో పడి ‘అధ్వాన’ రాతలు
రాష్ట్రాన్ని ఉద్యాన హబ్గా తీర్చిదిద్దాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. పంటల మార్పిడి ద్వారా పెద్ద ఎత్తున దిగుబడి సాధించాలన్నది లక్ష్యం. ఆ దిశగానే నాలుగేళ్లుగా సాగుతోంది ప్రగతి ప్రయాణం. ఇప్పటికే దిగుబడి సాధనలో... ఎగుమతుల్లో పురోగతి సాధిస్తూనే ఉన్నాం. సకాలంలో రైతులకు బిల్లులు చెల్లిస్తూ వారి కళ్లల్లో ఆనందం చూస్తున్నాం. అయినా నిరంతరం బాబు ధ్యానంలోనే గడుపుతున్న రామోజీకి గానీ... ఆయన పచ్చకళ్లకు గానీ అవేవీ కనిపించడం లేదు. ఇంకా ఆ మత్తులోనే జోగుతున్న ఈనాడు పత్రికలో నిత్యం అసత్యాలు వల్లెవేయడం అలవాటైంది. అడ్డగోలు కథనాలు వండివార్చడం నిత్యకృత్యమైంది. గత పాలనలో ఎంతగా వెనుకబడినా వారికి మాత్రం పచ్చగానే కనిపించింది. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని చూడలేక ఇంకా అధ్వానంగానే ఆలోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా ఉద్యానాభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా ఏటా విస్తీర్ణంతో పాటు దిగుబడులు, ఎగుమతులు పెరుగుతున్నాయి. కానీ ఇవేవీ పట్టించుకోని ఈనాడు పత్రికలో ఓ అబద్ధాన్ని అందంగా అచ్చేసింది. అందులో వాస్తవాలు ఒక్కసారి పరిశీలిద్దాం. – సాక్షి, అమరావతి ఆరోపణ: ప్రోత్సాహం కరువై...తగ్గిన తోటల విస్తీర్ణం వాస్తవం: ఉద్యాన పంటలు 2018–19లో 42.5 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ కృషి ఫలితంగా 2022–23 నాటికి ఏకంగా 45.61 లక్షల ఎకరాలకు పెరిగింది. ఈ ఐదేళ్లలో 7.49లక్షల ఎకరాల్లో కొత్తగా ఉద్యాన పంటలు సాగులోకి వచ్చాయి. వీటిలో 4.23లక్షల ఎకరాల్లో పాత తోటలను పునరుద్ధరించగా, 3.25లక్షల ఎకరాల్లో కొత్తగా సాగవుతోంది. ప్రధానంగా 1.69లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్, 1.26లక్షల ఎకరాల్లో మామిడి, 84వేల ఎకరాల్లో బత్తాయిపంటలు కొత్తగా సాగవుతున్నాయి. 2018–19 నాటికి 305 లక్షల టన్నులున్న దిగుబడులు 2022–23 నాటికి 368.89 లక్షల టన్నులకు చేరింది. 2018–19 నాటికి ఉద్యాన రంగానికి రూ.43,101 కోట్లు ఉన్న జీవీఏ 2022–23 నాటికి రూ.54,550కు పెరిగింది. సాగులో 15 శాతం, దిగుబడుల్లో 20.9 శాతం, జీవీఏలో 26 శాతం వృద్ధి రేటు సాధించింది. ఆరోపణ: గణనీయంగా తగ్గిన ఎగుమతులు వాస్తవం: టీడీపీ హయాంలోని ఐదేళ్లలో నాలుగైదు లక్షల టన్నులు కూడా ఎగుమతయ్యేవి కాదు. గడచిన ఐదేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 23.99 లక్షల టన్నులు ఎగుమతులు జరిగాయి. దేశంలోనే ప్రప్రథమంగా అరటి కోసం ప్రత్యేకంగా కిసాన్ రైళ్లను నడిపిన ఘనత ఈ ప్రభుత్వానిది. తాడిపత్రి నుంచి ముంబాయి ఓడరేవు ద్వారా ఏటా కిసాన్ రైళ్లు నడుపుతున్నారు. అక్కడి నుంచి విదేశాలకు అరటి ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. 2014–18 మధ్య కేవలం 24 వేల టన్నుల అరటి ఎగుమతులు చేరగా, కేవలం నాలుగేళ్లలోనే 1.62 లక్షల టన్నుల అరటి ఎగుమతయ్యింది. మన రాష్ట్రం నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు టమాటా ఎగుమతి చేస్తూ ఆదర్శంగా నిలిచింది. ఇంకా వంగ, బీర, సొర, దొండ, బెండ వంటి కూరగాయలు సైతం దేశంలోని వివిధ నగరాలకు సరఫరా చేస్తున్నారు. ఆరోపణ: మాటల్లో తీపి.. రాయితీలకు కత్తెర వాస్తవం:2019–20 నుంచి ఇప్పటి వరకు రక్షిత సేద్యం కింద ప్రభుత్వం 15,490.53 హెక్టార్లకు రూ.41.30 కోట్లు సాయం అందించింది. కొత్తగా 29.83 ఎకరాల్లో అధిక విలువ కలిగిన కూరగాయల సాగుకోసం రూ.75.70 లక్షలు, 172.65 ఎకరాల్లో అధిక విలువ కలిగిన పూల సాగు కోసం రూ.5.85 కోట్లు ఆరి్థక సాయం చేసింది. అలాగే 478 సేకరణ కేంద్రాలు, 91 శీతల గిడ్డంగుల నిర్మాణం ద్వారా 2.44 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం పెంచారు. వీటి ద్వారా 3 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా, సబ్సిడీ రూపంలో రూ.138.56 కోట్లు వారి ఖాతాలకు జమ చేశారు. కొత్తగా 200 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసింది. ఆరోపణ: ఉద్యాన రైతుకు కానరాని సాయం వాస్తవం: వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా 3 విడతల్లో రూ.13,500ల చొప్పున ఐదేళ్లలో 53.58లక్షల మందికి రూ.34,288 కోట్లు పెట్టుబడి సాయం అందించారు. దాంట్లో ఉద్యాన రైతులకు రూ.10వేల కోట్లకు పైగా అందించారు. పైసా భారం పడకుండా ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా 2019 నుంచి ఇప్పటి వరకు 5,35,554 ఉద్యాన రైతులకు రూ.1,409.5 కోట్ల బీమా పరిహారాన్ని అందించారు. వైపరీత్యాల వేళ 2014–15 నుంచి 2018–19 మధ్య పంట నష్టపోయిన రైతులకు రూ.387 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లిస్తే ఈ ప్రభుత్వం గత ఐదేళ్లలో 4.92 లక్షల మందికి రూ.563.03 కోట్ల పెట్టుబడి రాయితీని జమ చేసింది. ఆరోపణ: సూక్ష్మసేద్యం, ఆయిల్పామ్ రైతులకు మొండిచేయి వాస్తవం: బిందు, తుంపర సేద్య పరికరాలకు సంబంధించి గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.969.40 కోట్ల బకాయిలను చెల్లించడమే గాకుండా ఈ ఐదేళ్లలో 7.22 లక్షల ఎకరాల్లో కొత్తగా సూక్ష్మ సేద్యం అమలు చేసి 3.55లక్షల మంది రైతులకు సబ్సిడీ రూ.2,050 కోట్లు జమ చేశారు. ఫలితంగా 2023–24లో ఏపీ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. జాతీయస్థాయిలో అత్యుత్తమ దిగుబడి సాధించిన 20 జిల్లాల్లో ఏపీకి చెందిన ప్రకాశం, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాలు ఉండటం విశేషం. గత ప్రభుత్వం రూ.162 కోట్లు ఖర్చు చేసి 83వేల ఎకరాల్లో ఆయిల్పామ్ను ప్రోత్సహిస్తే ఈ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.171.87 కోట్లు ఖర్చు చేసి 1.02 లక్షల ఎకరాల్లో ప్రోత్సహించింది. ఓఈఆర్ కింద గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.80 కోట్లను జగన్ ప్రభుత్వం చెల్లించగా, 32వేల మంది రైతులు లబ్ధి పొందారు. ఆరోపణ: ఉద్యాన రైతుకు చేయూత ఏదీ? వాస్తవం: గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆర్బీకేల ద్వారా ఉద్యాన రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. నాణ్యమైన దిగుబడులే లక్ష్యంగా ఐదేళ్లలో 8757 తోటబడుల ద్వారా 2.63లక్షల మంది రైతులకు శిక్షణ ఇచ్ఛింది. గత ఐదేళ్లలో రూ.2 కోట్ల రాయితీతో ఫ్రూట్ కవర్లను పండ్ల రైతులకు పంపిణీ చేసింది. దేశంలోనే ప్రప్రథమంగా ఉద్యాన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలిపింది. క్వింటా అరటికి రూ.800, పసుపునకు రూ.6,850, ఉల్లికి రూ.770, బత్తాయికి రూ.1,400, మిర్చికి రూ. 7.000 చొప్పున కనీస మద్దతు ధరలు ప్రకటించింది. ఆరోపణ: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలెక్కడ? వాస్తవం: టీడీపీ ఐదేళ్లలో 360 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పితే ఈ ఐదేళ్లలో రూ.460 కోట్లతో 3,843 మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు రూ.3,600 కోట్లతో పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేశారు. రూ.58.57 కోట్లతో వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్తోపాటు జిల్లాకు ఒకటి చొప్పున రూ.57 కోట్లతో 13 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. కర్నూలు జిల్లా పత్తికొండలో రూ.12.05 కోట్లతో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. రూ.15.50 కోట్లతో రాయలసీమ ప్రాంతంలో 20 ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, 20 పాలీ హౌస్లు, షేడ్నెట్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే 4 యూనిట్లు వినియోగంలోకి వచ్చాయి. 500 టన్నుల సామర్థ్యంతో 3వేల టమాటా, ఉల్లి సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్స్ ఏర్పాటు లక్ష్యం కాగా, ఇప్పటికే కర్నూలు జిల్లాలో 250 యూనిట్లు వినియోగంలోకి వచ్చాయి. పులివెందులలో రూ.4 కోట్లతో బనానా క్లస్టర్, ఎల్.కోటలో రూ.2.5కోట్లతో నువ్వుల ఆయిల్, చిక్కీల క్లస్టర్ యూనిట్ ఏర్పాటయింది. రాజంపేటలో రూ.290 కోట్లతో, నంద్యాలలో రూ.165 కోట్లతో టమాటా, పండ్ల గుజ్జు, విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. జీఐఎస్–2023లో ఉద్యనవన రంగానికి సంబంధించి రూ.5,765 కోట్లతో 33 ఒప్పందాలు చేసుకోగా, ఇప్పటికే రూ.3,921 కోట్ల పెట్టుబడులు రాగా, మరో 455 కోట్ల పెట్టుబడులు పురోగతిలో ఉన్నాయి. -
Fact Check: మీ రాతలే కల్తీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పాడిందే పాడరా పాచిపళ్ల దాసరా అన్న చందంగా ఒక అబద్ధాన్ని పదేపదే రాసి నిజం చేయాలనే రామోజీ తాపత్రయం ఈనాడులో అడుగడుగునా కొట్టొచ్ఛినట్లు కనిపిస్తుంది. రెండేళ్ల క్రితం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అనారోగ్యం, ఇతర కారణాలతో కొంతమంది మృతిచెందారు. టీడీపీ అనుకూల సోషల్ మీడియాలో కల్తీ సారా మరణాలని విష ప్రచారం మొదలుపెట్టారు. జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఇతర అధికారులు ప్రతి మరణంపై సమగ్ర విచారణ చేపట్టారు. కుటుంబసభ్యులతో మాట్లాడిన అనంతరం సాధారణ మరణాలని, కల్తీ సారా మరణాలు కావని తేల్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అసెంబ్లీలో స్పష్టంగా మాట్లాడి అనారోగ్య మరణాలను చిల్లర రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదని పచ్చ మీడియా గోబెల్స్ను తిప్పికొట్టారు. అయినా తన ఎల్లో మీడియా ‘ఈనాడు’లో కల్తీ రాతలు రామోజీ ఆపలేదు. ‘సారాక్షసి మింగినా సాయం అందలేదు’ అంటూ విషపు కథనాన్ని వండివార్చారు. ఆరోపణ: కల్తీ సారా వల్ల మరణాలు. వాస్తవం: 2022 మార్చి 6 నుంచి 12 మధ్య అనారోగ్య కారణాలు, వృద్ధాప్య కారణాలతో జంగారెడ్డిగూడెంలోని నాలుగు శ్మశాన వాటికల పరిధిలో 18 మంది మృతిచెందారు. మృతుల్లో కొందరికి మద్యం అలవాటు ఉంది. అనారోగ్య కారణాలు కూడా ఉండటంతో మరణాలు సంభవించాయి. 25 వేల మందికి పైగా జనాభా ఉన్న జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో నెలకు సగటున 20 నుంచి 25 మరణాలు అధికారిక లెక్కల్లో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహంతో కల్తీ సారా తాగి ఇద్దరు మరణించారంటూ 2022 మార్చి 4న సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 12న 25 మందికి పైగా మృతి.. అంటూ పోస్టులు పెట్టారు. అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించి జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో డోర్ టు డోర్ హెల్త్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెంలో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందిన నలుగురు కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడి మృతికి కారణాలు తెలుసుకోవడంతోపాటు వైద్యుల నివేదికలు పరిశీలించారు. ఈ విచారణలో అన్నీ అనారోగ్య కారణాలతో సంభవించిన మరణాలేనని, మరణించిన వారిలో కొందరికి మద్యం అలవాటు ఉందని, అయితే మృతికి మద్యం కారణం కాదని తేలింది. చంద్రబాబు వెంటనే శవ రాజకీయాలకు తెరతీశారు. 2022 మార్చి 14న చంద్రబాబు జంగారెడ్డిగూడెంలో పరామర్శ యాత్ర పేరుతో రాజకీయ యాత్ర నిర్వహించారు. 26 మంది చనిపోయారని ప్రతి ఇంటికీ వెళ్లి పరామర్శిస్తానని నానా యాగీ చేశారు. చివరకు సెంటర్లో సభ పెట్టి సభా వేదిక వద్దకే మృతుల కుటుంబాలను పిలిచి చేతిలో కొంత డబ్బు పెట్టి.. సారా తాగి చనిపోయారని చెప్పమని కోరినా.. వారినుంచి స్పందన రాలేదు. బుట్టాయగూడెంలో సత్యనారాయణ (73) పదేళ్ల నుంచి ఆస్తమాతో బాధపడుతూ మృతి చెందితే జంగారెడ్డిగూడెంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ మరణాన్ని కూడా సారా మరణమని ప్రచారం చేశారు. దీనిపై సత్యనారాయణ కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆరోపణ: ఇంతవరకూ సంక్షేమం అందలేదు. వాస్తవం: మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి కనీస సాయం గాని, ఎలాంటి సంక్షేమ పథకాలు గాని అందలేదని, వారు బాగా ఇబ్బందిపడుతున్నారంటూ అడ్డగోలు కథనం ప్రచురించారు. దీనిపై మృతుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీమా పరిహారంతో పాటు పలు సంక్షేమ పథకాలు తమకు అందాయని వారు తెలిపారు. రూ. లక్ష బీమాతో పాటుపింఛన్ నా భర్త చింతపల్లి సూరిబాబు మృతిచెందాక బీమా రూ.లక్ష ఇచ్చారు. నాకు వితంతు పింఛన్ రూ.3 వేలు వస్తోంది. పట్టణంలో జగనన్న లేఅవుట్లో ఇచ్చిన ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణం పూర్తయి ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి. మా పెద్దబ్బాయి రమేష్ ఐటీఐ చదివాడు. రెండేళ్లు జగనన్న విద్యాదీవెన అందింది. చిన్న కొడుకు కౌశిక్కి గతేడాది 10వ తరగతి పూర్తయ్యే వరకు ఏటా రూ.15 వేల చొప్పున అమ్మ ఒడి అందించారు. – చింతపల్లి రత్నకుమారి, జంగారెడ్డిగూడెం అన్ని విధాలా ‘చేయూత’ నా భర్త బంకూరు రాంబాబు మృతిచెందాక నాకు రూ.3 వేలు పింఛను వస్తోంది. చేయూత పథకంలో నాలుగు విడతలుగా ఏటా రూ.18,750 చొప్పున వస్తోంది. డ్వాక్రా రుణం రూ.27 వేలు మాఫీ అయ్యింది. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. – బంకూరి నాగేశ్వరమ్మ, జంగారెడ్డిగూడెం పథకాలతో ఆదుకున్నారు నా భర్త మృతిచెందే నాటికి నేను, నా భర్త విడిగా ఉంటున్నాం. అప్పటి నుంచి నాకు ఒంటరి మహిళ పింఛన్ వస్తోంది. నా తండ్రి బంకూరి రాంబాబు, నా భర్త ఆనంద్ అదే సమయంలో మృతిచెందారు. నాకు ప్రస్తుతం రూ.3 వేలు పింఛన్ వస్తోంది. నా కొడుకు బీటెక్ చదువుకుంటున్నాడు. మూడేళ్లుగా వరుసగా విద్యా దీవెన అందుతోంది. నాకు డ్వాక్రా రుణం రూ.27 వేలు మాఫీ అయ్యింది. – తలారి రామలక్ష్మి, జంగారెడ్డిగూడెం -
డబ్బా కాదు బాస్.. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ
సాక్షి, అమరావతి: దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం గ్రామ గ్రామాన, వాడవాడలా వైద్య శిబిరాలు నిర్వహించి, పేదల ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టిన దాఖలాలు ఉన్నాయా? అంత మంది వైద్యులు, వైద్య సిబ్బంది ప్రజలను పరీక్షించి, మందులు ఉచితంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే సాధ్యమైంది. ప్రజారోగ్యంపై సీఎం వైఎస్ జగన్కు ఉన్న చిత్తశుద్ధికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష (జేఏఎస్)’ కార్యక్రమం ఒక ప్రబల నిదర్శనం. ఆరోగ్య శ్రీ పథకం, 108, 104, తల్లీపిల్లల ఎక్స్ప్రెస్, ప్రభుత్వ ఆస్పత్రుల ఆధునీకరణ, వేల కోట్లతో నూతన వైద్య కళాశాలల ఏర్పాటు, వైద్య రంగంలో ఖాళీలన్నవి లేకుండా ఎప్పటికప్పుడు వైద్యులు, వైద్య సిబ్బంది నియామకం.. ఇవన్నీ ప్రజారోగ్యం పట్ల వైఎస్ జగన్ ప్రభుత్వ నిబద్ధతకు తార్కాణాలు. గ్రామగ్రామాన, వాడవాడలా జేఏఎస్ శిబిరాల్లో లక్షలాది మందికి స్పెషలిస్టు వైద్యులు పరీక్షలు చేసి, అవసరమైన వారిని ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ఇంత మంది శిబిరాలకు వచ్చి వైద్య సేవలు పొందితే రామోజీకి కనిపించవు. అంతా ఖాళీగా ఉన్నట్టు భ్రమిస్తూ ఉంటారు. ఉమ్మడి రాష్ట్రానికి, విభజిత ఆంధ్రప్రదేశ్కు కలిపి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏనాడైనా ఒక్క వైద్య శిబిరం నిర్వహించారా? ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాల కట్టించారా? ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక్క విభాగాన్నైనా ఆధునీకరించాచా? ఆయన హయాంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఎంత దయనీయ స్థితికి వెళ్లిందో ప్రతి ఒక్కరికీ కళ్లకు కట్టింది. ప్రభుత్వ ఆస్పత్రి అంటే పాములు, ఎలుకల నిలయాలుగా పేరుపడ్డాయి. ఇంత దారుణ వ్యవస్థ రాజ్యమేలిన రోజుల్లో కళ్లు మూసుకున్న రామోజీ.. నేడు ప్రజలంతా ఆరోగ్యాన్ని తిరిగి పుంజుకుంటుంటే చూడలేకపోతున్నారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్సలు అందిస్తుండటం ఆదర్శనీయమని దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తుంటే.. పచ్చ బాసు రామోజీకి మెదడు మొద్దుబారింది. పచ్చ రోగం ముదిరిపోయి కడుపు మంట కథనాలు అచ్చేస్తున్నారు. అదే క్రమంలో జేఏఎస్ శిబిరాలపైనా పడ్డారు. ‘ఎందుకీ శిబీరాలు!’ అంటూ ఈనాడులో ఓ కుటిల కథనం అచ్చేశారు. ప్రజలపై భారం లేకుండా చేయడం సొంత డబ్బానా? ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధి కలిగిన సీఎం జగన్ 58 నెలల పాలనలో అనేక సంస్కరణలు చేపట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి ప్రజలకు బీపీ, షుగర్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలు గుర్తించి, సురక్ష శిబిరాలను ఏర్పాటు చేసి స్పెషలిస్ట్ వైద్య సేవలు అందిస్తున్నారు. జేఏఎస్ తొలి విడతలో భాగంగా గత ఏడాది 1.45 కోట్ల ఇళ్లలో ఉన్న వారి ఆరోగ్య పరిరక్షణకు 6.45 కోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారు. 12 వేలకు పైగా వైద్య శిబిరాల్లో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 60.28 లక్షల మంది వైద్య సేవలు అందుకున్నారు. కంటి చూపు సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న 80,115 మందికి కేటరాక్ట్ సర్జరీలు చేయించారు. ఇరత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 86,713 మందిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు డాక్టర్లు పంపించారు. వీరందరికీ ప్రభుత్వమే ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద కేటరాక్ట్ సర్జరీలు, అవసరమైన చికిత్సలు చేయించింది. ఆస్పత్రులకు వెళ్లి రావడానికి ఖర్చుల కింద ఒక్కొక్కరికి రూ.500 చొప్పున అందించింది. 5.73 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేసింది. తొలి విడతలో 2.51 లక్షల మంది హైపర్టెన్షన్, 1.54 లక్షల మంది షుగర్ కేసులను కొత్తగా గుర్తించి, బాధితులకు ఫాలోఅప్ వైద్యం అందిస్తోంది. ఈ ఏడాది జనవరి నెలలో రెండో విడత జేఏఎస్ను ప్రారంభించి ఇప్పటివరకు 27.33 లక్షల మందికి సురక్ష శిబిరాల్లో వైద్య సేవలు అందించింది. 12,837 మందిని ఆస్పత్రులకు రెఫర్ చేయగా 4,609 మందికి ఇప్పటికే చికిత్సలు అందించారు. 2,313 మందికి కేటరాక్ట్ అవసరమని వైద్యులు సూచించగా ఇప్పటివరకు 1,740 మందికి సర్జరీలు చేశారు. ఈ మొత్తం ప్రక్రియలో ప్రజలు వైద్యుల కన్సల్టేషన్, పరీక్షలు, మందులు, చికిత్సలు, చివరికి దారి ఖర్చులకు కూడా ఒక్క రూపాయి చేతి నుంచి ఖర్చు పెట్టలేదు. పైపెచ్చు తాముంటున్న గ్రామం, వార్డులకే వైద్యులు వెళ్లి ప్రజలకు సేవలు అందించారు. ఇదంతా గమనిస్తే ఇంగితం ఉన్న ఎవ్వరికైనా ప్రజలకు ఎంతో మేలు జరిగిందనే వాస్తవం కనిపిస్తుంది. ఒక్క రామోజీకి తప్ప. -
యురేనియంపై ‘పచ్చ’ విషం
ఉన్నది లేనట్టు... లేనిది ఉన్నట్టు... భ్రమింపజేయడం పచ్చపత్రికల లక్ష్యం. ప్రతి అంశాన్నీ సర్కారుకు ముడిపెట్టి ప్రజలను తప్పుదారి పెట్టించాలన్నది వారి వ్యూహం. ఎలాగైనా జగన్ సర్కారును అప్రదిష్టపాలు చేయాలన్నది వారి సంకల్పం. కానీ వాస్తవాలు తెలిసిన ప్రజల విజ్ఞత ముందు వారికుట్రలు ఎన్నైనా కొట్టుకుపోవడం ఖాయం. పులివెందుల ప్రాంతంలోని యురేనియం కార్పొరేషన్ ప్రాజెక్టుపై వండివార్చిన అడ్డగోలు కథనాన్ని అందరూ ఛీదరించుకుంటున్నారు. అక్కడి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు తెలిసిన జనాలు ఆ అబద్ధాలను నిర్ద్వందంగా ఖండిస్తున్నారు. సాక్షి రాయచోటి/వేముల: పులివెందుల ప్రాంత నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నెలకొల్పిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్) ప్రాజెక్టుపై ఇప్పుడు పచ్చ పత్రికలు విషం చిమ్ముతున్నాయి. వైఎస్సార్ కుటుంబంపై దుమ్మెత్తి పోయడమే లక్ష్యంగా ఎల్లో మీడియా ప్రతి అంశాన్నీ వక్రీకరిస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి యురేనియం బాధిత గ్రామాల ప్రజలకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని సంకల్పించారు. అంతేగాకుండా గ్రామాల్లో పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరిస్తేనే మరోపక్క తాగు, సాగునీటికోసం ప్రత్యేక రిజర్వాయర్ నిర్మాణం మొదలుకొని పైపులైన్ల ద్వారా తుంగభద్ర, కృష్ణా నీటిని తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులను కేటాయించి...నిర్మాణ పనులు చరుగ్గా సాగేలా చర్యలు తీసుకున్నారు. కేవలం 15 నెలల వ్యవధిలోనే సగానికి పైగా ప్రాజెక్టు పనులు పూర్తయినా మార్చి వచ్చినా ఏమార్చారంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించారు. శర వేగంగా రిజర్వాయర్ పనులు వేముల మండలంలోని యురేనియం బాధిత గ్రామాలైన కేకే కొట్టాల, కణంపల్లె, మబ్బుచింతలపల్లె, తుమ్మలపల్లె, రాచకుంటపల్లె, భూమయ్యగారిపల్లె గ్రామ ప్రజల శాశ్వత పరిష్కారానికి రిజర్వాయర్ నిర్మాణమే ప్రధానమని భావించిన ప్రభుత్వం వేగంగా పనులు జరిగేలా చూస్తోంది. వైద్య శిబిరాలు, ఇతర ప్రత్యేక చర్యలు తీసుకుని వారి ఆరోగ్యంపై పత్యేక శ్రద్ధ తీసుకున్నారు. భూములు కోల్పొయిన రైతుల కుటంబాల్లో ఉద్యోగావకాశాలు కల్పించారు. స్వచ్చమైన నీటిని అందించాలన్న లక్ష్యంతో ప్రత్యేకంగా రిజర్వాయర్, భూ సేకరణ, చిత్రావతి నుంచి రూ. 1113 కోట్లు అంచనా వ్యయంతో రిజర్వాయర్ రూపొందించారు. వేంపల్లె మండలం గిడ్డంగివారిపల్లె వద్ద 2022 నవంబర్లో పనులకు భూమి పూజ చేశారు. యురేనియం బాధిత గ్రామాల్లో 10వేల ఎకరాలకు సాగునీటితో పాటు 6 గ్రామాల ప్రజలకు తాగునీటిని అందించేందుకు చేపట్టిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మాణ పనులు 53శాతం పూర్తయ్యాయి. అలాగే కాలువల పనులు కూడా వేగవంతంగా చేస్తున్నారు. లింగాల మండలం పార్నపల్లె వద్దనున్న చిత్రావతి ప్రాజెక్టు నుంచి పైపులకు నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించనున్నారు. బాబుకు మేలు చేకూర్చేందుకు రామోజీ తాపత్రయం ప్రతి అంశాన్నీ బాబుకు మేలు చేసే విధంగా కట్టుకథలతో తప్పుదారి పట్టించేందుకు రామోజీ తెగ తాపత్రయపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2021లో శంకుస్థాపన చేసి 2022 నవంబర్లో పనులకు భూమి పూజ చేయగా 32 నెలల కిందటే పనులు ప్రారంభించినట్లు ఈనాడులో తప్పుడు కథనాలు అల్లడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రూ. 650 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతలతోపాటు పైపులైన్ల పనులకు సుమారు రూ. 135 కోట్లు ఖర్చు చేశారు. కాలువ పనులకు సంబంధించి దాదాపు 20 కిలోమీటర్లకు పైగా పూర్తి చేశారు. మరో 13 కిలోమీటర్ల వరకు పైపులను కూడా అమర్చారు. కొన్నిచోట్ల అటవీ శాఖ భూముల పరిధిలో పైపులైన్ పనులు చేయాల్సి ఉన్నందున అనుమతుల కోసం నిరీక్షిస్తున్నారు. దానినీ రాజకీయం చేయాలని ఈనాడు చూస్తోంది. త్వరలోనే సమస్యల పరిష్కారం ♦ యురేనియం బాధిత గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కూడా యూసీఐఎల్ చర్యలు చేపట్టింది. తుమ్మలపల్లె సమీపంలో 2007 నవంబర్లో యురేనియం తవ్వకా లు చేపట్టేందుకు రూ.1106కోట్లతో కర్మాగారాన్ని నిరి్మంచింది. ♦ 2013లో యూసీఐఎల్ యురేనియం ఉత్పత్తి ప్రారంభించింది. ముడిపదార్థాన్ని శుద్ధి చేయగా వచ్చే వ్యర్థాలను కె.కె.కొట్టాల సమీపంలోని టెయిలింగ్ పాండ్కు తరలిస్తున్నారు. ♦ 2016లో భారీ వర్షాలతో వ్యర్థజలాలు భూగర్భజలాల్లో కలుషితమయ్యాయని, బోర్లలో కలుషిత నీరు వస్తోందని, పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన చేశారు. అప్పట్లో రైతులు ఈ విషయాన్ని ఎంపీ వైఎస్ అవినా ష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, యూసీఐఎల్ సీఎండీతో మాట్లాడి పరిష్కారానికి చొరవ చూపుతూ వస్తున్నారు. ♦ సంస్థ టెయిలింగ్ పాండ్లో 1.5 మీటర్ల మట్టి వేసి దానిపై 1.5 ఎం.ఎం హెచ్డీపీ షీట్ వేసి యురేనియం వ్యర్థాలను నింపుతోంది. ఇందుకోసం యూసీఐఎల్ రూ.39కోట్లు ఖర్చు చేసింది. ♦ యురేనియం పరిసర గ్రామాల్లో యూసీఐఎల్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామాలకు వైద్య బృందాలు వెళ్లి పరీక్షలు చేసి మందులను పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో రూ.60లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్ను యూసీఐఎల్ నిర్మించింది. సాగునీటికి ప్రత్యేక చర్యలు యురేనియం బాధిత గ్రామాల్లో తోటల్లోని బోరు బావుల్లో నీరు సైతం కలుషితం అవుతుందన్న శాస్త్రవేత్తల నివేదికల మేరకు ఆయా గ్రామాల పొలాలకు కూడా సూక్ష్మ సేద్యం ద్వారా సాగునీరు అందించాలని సంకల్పించారు. పైపులైన్లతోపాటు తోటలకు నీరు అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా పనులు కూడా చేస్తున్నారు. సుమారు 10 వేల ఎకరాలకు సూక్ష్మ సేద్యంతోపాటు ఐదు వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కింద సాగునీటిని అందించనున్నారు. -
Fact Check: అడ్డగోలు అప్పులు దాచేసి ముష్టి లెక్కలు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి స్వయంగా కేంద్రం ప్రభుత్వం లెక్కలేనన్ని సార్లు కీలక ప్రకటనలు చేసింది. పార్లమెంట్ సాక్షిగా వివరణలూ ఇచ్చింది. అప్పుల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా ఏపీ అట్టడుగునే ఉందనీ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు, నిబంధనలకు లోబడే ఆంధ్రప్రదేశ్ అప్పులున్నట్లు తేల్చి చెప్పింది. రాష్ట్ర అప్పులపై ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ కూడా చాలా వివరంగా చెప్పారు. టీడీపీ హయాంలో అప్పుల పెరుగుదల – వైఎస్సార్సీపీ పాలనలో అప్పుల గురించి ప్రజెంటేషన్ ద్వారా స్పష్టంగా తెలియచేశారు. ఏపీ రుణాల గురించి నేరుగా కేంద్రం, ఆర్బీఐ చెబుతున్నా తలకెక్కదా? చట్టసభల్లో ప్రభుత్వాలు వెల్లడించిన గణాంకాలను కాదని తనకు తోచిన లెక్కలతో రామోజీ తప్పుడు రాతలు ఎలా రాస్తారు? రూ.పది లక్షల కోట్ల అప్పులంటూ కాకి లెక్కలతో డప్పు కొట్టే గురివిందను ఏమనుకోవాలి? అసలు ఏ ప్రభుత్వాలకైనా తీసుకునే అప్పులను రహస్యంగా ఉంచడం సాధ్యం కాదనే ఇంగితం లేదా? పరిమితికి లోబడి తీసుకునే అప్పులను గ్రాఫిక్స్ ఆర్భాటాల కోసం కాకుండా వనరులను సృష్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. మన విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి చదువులను చక్కదిద్దేందుకు వైఎస్సార్ సీపీ ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.73 వేల కోట్లకు పైచిలుకే! మానవ వనరులపై పెట్టుబడి పెట్టడం పెత్తందారుల దృష్టిలో వృథానేనా? ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, పెద్ద ఎత్తున సదుపాయాల కల్పన అనవసరమా? సుదూర తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ పారిశ్రామికంగా రాష్ట్రం ఎదిగేందుకు ప్రతి 50 కి.మీ.కి ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటు చేయడం వృథానా? రాజధాని గుదిబండ రూ.5 వేల కోట్లు! అమరావతి పేరుతో చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు భవిష్యత్లో తప్పనిసరి ఆర్థిక బాధ్యతలుగా పరిణమించాయని కాగ్ స్పష్టం చేసింది. అమరావతి బాండ్ల పేరుతో గత సర్కారు ఏకంగా 10 సంవత్సరాల కాలానికి అత్యధిక వడ్డీతో అప్పు చేసినట్లు పేర్కొంది. మార్కెట్ రుణాల ద్వారా రూ.5,013.60 కోట్లు సమీకరించగా వడ్డీలకే ఏకంగా రూ.4,827.14 కోట్లు చెల్లించాల్సి ఉందని కాగ్ నివేదిక వెల్లడించింది. ఇప్పటికే 1,399.02 కోట్లు వడ్డీల కింద చెల్లించగా భవిష్యత్లో మరో రూ.3,428.12 కోట్లు వడ్డీలు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. ప్రపంచ స్థాయి రాజధాని నిజం కాలేదు గానీ తప్పనిసరి ఆర్ధిక బాధ్యతలు మాత్రం మోయాల్సి వస్తోందని కాగ్ వ్యాఖ్యానించింది. 2014–15 నుంచి 2018–19 వరకు టీడీపీ సర్కారు పేలవమైన ఆర్థిక నిబద్ధత చూపిందని తప్పుబట్టింది. ♦ ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో 2022–23కి సంబంధించి కాగ్ అకౌంట్స్ సమర్పించింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడే ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు, జీఎస్డీపీలో అప్పులు ఉన్నాయని అందులో స్పష్టం చేసింది. సొంత లెక్కలు కాకుండా కాగ్ అకౌంట్స్ను పరిశీలిస్తే రామోజీకి ఆ విషయాలు తెలుస్తాయి. ♦ అప్పుల కోసం సచివాలయం, ఇంకా కనిపించినవన్నీ తాకట్టు పెడుతున్నారంటూ రామోజీ పచ్చి అవాస్తవాలను కుమ్మరించారు. వాస్తవానికి రాజధాని అంటూ అమరావతి భూములను తాకట్టు పెట్టి బాండ్లు పేరుతో అత్యధిక వడ్డీలకు అప్పులు చేసింది చంద్రబాబు సర్కారే. కాగ్ నివేదికే ఆ విషయాన్ని ఎండగట్టింది. గ్రాఫిక్స్ బండారాన్ని బయట పెట్టింది. రాజధాని పేరుతో చంద్రబాబు సర్కారు అప్పుల నిర్వాకంతో ఇప్పుడు వడ్డీల చెల్లింపులు భారంగా మారాయి. అత్యధిక వడ్డీలకు అప్పులు చేయడంతో అప్పు తెచ్చిన పరిమాణానికి దాదాపు సమానంగా వడ్డీ కూడా ఉండటాన్ని కాగ్ నివేదిక తప్పుబట్టింది. ♦ నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు రూ.16 వేల కోట్లు వెచ్చించి ఉత్తమ మానవ వనరుల ద్వారా ఆస్తుల కల్పన చేయటాన్ని చూసి రామోజీ తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలను రూ.16 వేల కోట్లతో నిర్మిస్తుంటే మంచం పట్టారు! రూ.24,000 కోట్లతో నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణమూ ఆయనకు మింగుడు పడటం లేదు! ఎందుకంటే తాను ద్వేషించే వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే అనుకోవాలేమో! ♦ గత ఎన్నికల ముందు చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులను తాకట్టు పెట్టి, గ్రామీణ విద్యుద్ధీకరణ కార్పొరేషన్ నుంచి అప్పులు తెచ్చి పసుపు–కుంకుమ పేరుతో ఓటర్లను మభ్యపుచ్చేందుకు ప్రయత్నిస్తే రామోజీ కిక్కురుమనలేదెందుకో? ♦ రాష్ట్ర అప్పులు బడ్జెట్ లోపల, బయట కలిపి ఏకంగా రూ.10.21 లక్షల కోట్లకు చేరాయంటూ పచ్చి అబద్ధాలను రామోజీ తన కరపత్రంలో గుమ్మరించారు. 2022–23 నాటికి కాగ్ అసెంబ్లీకి సమర్పించిన అకౌంట్స్ ప్రకారం బడ్టెట్ లోపల, బడ్జెట్ బయట రాష్ట్రం అప్పులు రూ.5.68 లక్షల కోట్లు మాత్రమేనని వెల్లడించింది. బడ్జెట్ లోపల అప్పులు రూ.4,29,526 కోట్లు కాగా బడ్జెట్ బయట అప్పులు రూ.1,38,875 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట చేసిన అప్పులను శాసనసభకు సమర్పించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ద్రవ్య జవాబుదారీ పత్రం ద్వారా అందచేస్తూ ఎక్కడా దాపరికం లేకుండా ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తోంది. ఎఫ్ఆర్బీఎ నిబంధనల కన్నా తక్కువగానే అప్పులున్నట్లు 2022–23 కాగ్ అకౌంట్స్ స్పష్టం చేశాయి. -
Fact Check: వెలిగొండంత అక్కసు..
సాక్షి, అమరావతి: ఏ రోగానికైనా మందు ఉంటుందేమోగానీ ఈనాడు రామోజీని పీడిస్తున్న ‘కడుపుమంట’కు మాత్రం మందులేదు. నిత్యం ఆయన్ను దహించివేస్తున్న ఆ వ్యాధి రోజురోజుకూ ముదిరిపోతోంది. దాని నుంచి విముక్తి లభిస్తుందన్న ఆశ కూడా కనుచూపు మేరలో కనిపించడంలేదు. ఫలితంగా ఆయన రోజూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దీంతో.. కొంతలో కొంతనైనా ఉపశమనంగా ఉంటుందని ఆయన రోజూ తన క్షుద్ర పత్రిక ఈనాడులో సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక అశుద్ధ కథనాన్ని వండివారుస్తూ ఉదయం తనివితీరా చూసుకుని తన బాధను చల్లార్చుకుంటున్నారు. తాజాగా.. వెలిగొండ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన జంట సొరంగాలను పూర్తిచేసిన సీఎం వైఎస్ జగన్ బుధవారం వాటిని జాతికి అంకితం చేయడాన్ని రామోజీరావు తట్టుకోలేకపోతున్నారు. చాలా పనులు మిగిలే ఉన్నాయని.. ఆయకట్టుకు నీళ్లిచ్చే ఆస్కారమే లేదంటూ ‘వెలికొండంత పెండింగ్’ శీర్షికన తన ఆక్రోశాన్ని, కడుపులో పేరుకుపోయిన విషాన్ని గురువారం ఎప్పటిలాగే కక్కేశారు. నిజానికి.. వెలిగొండ ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ వడివడిగా పూర్తిచేస్తుండటంతో ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంత రైతుల దశాబ్దాల కల సాకారమవుతోంది. దాంతో ఆ ప్రాంత రైతుల్లో సీఎం జగన్పై ఆదరణ మరింతగా పెరిగింది. ఇది చంద్రబాబు రాజకీయ ఉనికికే ప్రమాదకరంగా మారడంతో రామోజీరావుకు నిద్రపట్టడంలేదు. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు కనికట్టు చేసి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆయనిలా నానా అవస్థలు పడుతున్నారు. వెలిగొండను పిండేసిన బాబు.. వాస్తవానికి.. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా 2004, అక్టోబరు 27న వెలిగొండ ప్రాజెక్టుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. తన హయాంలోనే రూ.3,610.38 కోట్లు ఖర్చుచేసి.. 37.587 కిమీల పొడవైన జంట సొరంగాల్లో 20.333 కి.మీ.ల పనులు.. ఆ ప్రాజెక్టులోనే అంతర్భాగమైన నల్లమలసాగర్ను పూర్తిచేశారు. ఇక 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 2014–19మధ్య ఈ ప్రాజెక్టుకు రూ.1,385.81 కోట్లు వ్యయంచేసినా కేవలం 6.686 కి.మీ.ల మేర మాత్రమే జంట సొరంగాల పనులు చేశారు. కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లు దోచిపెట్టడాన్ని ఇటీవల కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక బయటపెట్టింది. వెలిగొండకు ఖర్చుచేసిన నిధులను చంద్రబాబు మింగేయడంవల్లే ఎక్కడి పనులు అక్కడే మిగిలిపోయాయి. యుద్ధప్రాతిపదికన సొరంగాలు పూర్తి ఇక సీఎం వైఎస్ జగన్ రూ.978.02 కోట్లు ఖర్చుచేసి.. అందులో ప్రతి పైసాను సద్వినియోగం చేసుకుని వెలిగొండ జంట సొరంగాల్లో మిగిలిన 10.568 కి.మీ.ల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి, జాతికి అంకితం చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి.. రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక రెండు మూడు నెలల్లోనే నల్లమలసాగర్కు కృష్ణాజలాలను తరలిస్తామని ఆయన చెప్పారు. వచ్చే జూలై, ఆగస్టులలో నల్లమలసాగర్కు కృష్ణా జలాలను తరలించేలోగా రూ.1,200 కోట్లతో నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని స్పష్టంచేశారు. తొలిదశ కింద ఆయకట్టుకు నీళ్లందించడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. అలాగే, ప్రాజెక్టును మొత్తం ఒకేసారి పూర్తిచేసి ఆయకట్టు మొత్తానికి ఒకేసారి నీళ్లందించిన దాఖలాలు చరిత్రలో ఎక్కడాలేవు. ఎక్కడైనా ప్రాజెక్టును దశలవారీగా పూర్తిచేస్తూ అయకట్టుకు నీళ్లందిస్తారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులే అందుకు నిదర్శనం. వెలిగొండ ప్రాజెక్టులో కూడా మిగతా పనులను పూర్తిచేసి దశలవారీగా మొత్తం ఆయకట్టుకు నీళ్లందిస్తారు. అసలు వెలిగొండ ఒక్కటే కాదు.. 2022 సెప్టెంబరు 6న నెల్లూరు, సంగం బ్యారేజ్లు.. 2023 సెప్టెంబరు 19న హంద్రీ–నీవాలో అంతర్భాగమైనమైన లక్కసాగరం ఎత్తిపోతల.. 2023 నవంబరు 30న గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్.. 2024 ఫిబ్రవరి 26న హంద్రీ–నీవాలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తిచేసి, జాతికి అంకితం చేసినప్పుడు కూడా రాజగురువు ఇలాగే విషం చిమ్మారు. -
క్రీడలపై రామోజీ క్రీనీడ
సాక్షి, అమరావతి: కురుక్షేత్రంలో అర్జునుడు ‘గాండీవం’ సహాయంతో అధర్మాన్ని వధిస్తే.. క్రీడాక్షేత్రంలో టీడీపీ అదే గాండీవం పేరుపెట్టి అవినీతికి పురుడుపోసింది. మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తామంటూ (టాలెంట్ హంట్) పాఠశాలల్లో క్రీడాపోటీల నిర్వహణ పేరుతో తన అనుయాయులకు రూ. కోట్లు దోచిపెట్టింది. ఏ ఒక్క మైదానంలోనూ క్రీడాకారులు పోటీ పడలేదు. కానీ, వారికి సర్టిఫికెట్లు, మెడల్స్ మాత్రం వచ్చేశాయి. ఆ వచ్చిన విషయం క్రీడాకారుడికి కూడా తెలియకపోవడం ఆశ్చర్యం. అప్పట్లో పాఠశాలల నుంచి హాజరు పట్టిక తీసుకొచ్చి విద్యార్థుల పేర్లు గాండీవం ప్రాజెక్టులో రా సేసి ప్రజాధనాన్ని అప్పనంగా మింగేశారు. ఇది.. చంద్రబాబు రాజకీయ వికృతి క్రీడలో.. క్రీడారంగం బలైపోయిందనడానికి చిన్న ఉదాహరణ మాత్రమే. కానీ, ఎల్లో రాతల్లో ఎల్లలు దాటిన రామోజీకి మాత్రం ఇదొక ఉజ్వల కాలంగా కనిపిస్తోంది. పేదింటి బిడ్డల్లో క్రీడా ప్రతిభను వెలికితీస్తామని మోసం చేస్తే ‘ఈనాడు’ గొప్పగా అభివర్ణిస్తోంది. వాస్తవానికి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడారంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో పాటు రాష్ట్ర స్థాయిలోనూ పతకాలు సాధించిన వారికి వైఎస్సార్ నగదు పురస్కారాలు అందుతున్నాయి. ఆడుదాం ఆంధ్ర వంటి మెగా టోర్నీ ద్వారా క్రీడా ప్రతిభను వెలికితీస్తోంది. సీఎం కప్, శాప్ లీగ్స్, ఖేలో ఇండియా పోటీలకు వెళ్లే వారికి సైతం ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించి శిక్షణ అందిస్తోంది. ఫలితంగా పతకాల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్లో బ్యాచ్ ‘అవినీతి ఖేల్ ఖతం’ అవ్వడం.. ఇదే కొనసాగితే శాశ్వతంగా తమ ‘దుకాణం బంద్’ చేసుకోకతప్పదని రామోజీ.. క్రీడల ముసుగులో పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. సామగ్రి దొంగలెత్తుకుపోయారు! చంద్రబాబు హయాంలో టెన్విక్ పేరుతో ఏపీ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు రూ.కోట్లు వెచ్చించారు. విదేశాల నుంచి కొంత మంది కోచ్లను తీసుకొచ్చి తూతూ మంత్రంగా శిక్షణ ఇప్పించారు. ఈ శిక్షణ కాస్తా టీడీపీ ప్రభుత్వంలోనే ముగిసిపోవడం గమనార్హం. కానీ, ఈనాడు ఆపాపాన్ని సైతం ప్రస్తుత ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేసింది. గుంటూరులోని ఏఎన్యూలో నడిచిన టెన్విక్ క్యాంపు కోసం రూ.కోట్లు కుమ్మరించి క్రీడా పరికరాలు కొనుగోలు చేశారు. వాటిని సరిగా వినియోగించకుండానే ఒకానొక రాత్రి సమయంలో దొంగలు ఎత్తుకుపోయారు. దీనిపై అప్పట్లో మంగళగిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ, ఒక్క వస్తువు కూడా రికవరీ కాలేదు. అసలు నిజంగా దొంగతనం జరిగితే రికవరీ అవుతుంది. ఇందులో అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది కాబట్టి కేసులో ఎటువంటి పురోగతి లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ భిన్నవాదనలు కూడా లేపోలేదు. కేవలం పేపర్లపైనే వస్తువులు కొని దొంగతనం డ్రామా ఆడారన్న వాదన ఒకటైతే.. నిజంగా కొనుగోలు చేసిన వస్తువులను దొడ్డిదారిన తిరిగి డీలర్లకు ఇచ్చేసి సొమ్ము చేసుకున్నారన్న వాదన కూడా అప్పట్లో బలంగా వినిపించింది. టీడీపీ హయాంలో క్రీడలకు మకిలి.. టీడీపీ హయాంలోనే క్రీడా అసోసియేషన్లకు మకిలి పట్టింది. అప్పటి ప్రజా ప్రతినిధులే అసోసియేషన్లలో వర్గపోరుకు బీజం వేశారు. కేంద్రం.. రాష్ట్రాలు విధిగా స్పోర్ట్స్ కోడ్ను అమలు చేయాలని ఆదేశించినా.. అప్పటి టీడీపీ ప్రభుత్వం దానిని నిర్లక్ష్యం చేసింది. స్పోర్ట్స్ కోడ్ అమలులోకి వస్తే దశాబ్దాలుగా అసోసియేషన్ల పదవుల్లో పాతుకు పోయిన వారికి ఉద్వాసన తప్పదని.. అందుకే పట్టీపట్టనట్టు వ్యహరించారు. పైగా అప్పట్లో అసోసియేషన్లకు జిల్లాలో ఎన్నికలు నిర్వహించకుండానే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఇవ్వడం కూడా వర్గపోరుకు కారణం. దీనికి తోడు ఎప్పటి నుంచో దరఖాస్తు చేసుకుంటున్న వారికి కాకుండా సిఫారసులతో వచ్చిన వారికి గుర్తింపు ఇవ్వడం గమనార్హం. కొన్ని అసోసియేషన్లు టీడీపీ కాలం నుంచి అనాదిగా రాష్ట్ర, జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను కాగితాలపైనే ఎంపిక చేసే ఆచారాన్ని కొనసాగిస్తూ ప్రతిభ కలిగిన వారికి తీవ్ర అన్యాయం చేశాయి. కానీ, వైఎస్సార్ సీపీ హయాంలో క్రీడా సంఘాలకు పెద్దపీట వేసింది. అంతర్జిల్లా, జాతీయ పోటీల నిర్వహణకు 18 రాష్ట్ర క్రీడా సంఘాలకు రూ.3.05 కోట్లను మంజూరు చేసింది. ఎన్నికల ముందు హడావుడిగా.. టీడీపీ ఐదేళ్ల పాలనలో రూ.13.76 కోట్లు అందించినప్పటికీ చిన్న క్రీడాకారులకు మేలు జరగలేదు. క్రీడలను కూడా రాజకీయాలతో చూసే బాబు ఎన్నికలకు ముందు హడావుడిగా 2018–19 లో 115 మందికి రూ.7.75 కోట్లు ఇచ్చారు. అంతకు ముందు ఇచ్చింది రూ.6 కోట్లు వీటిల్లో సింహభాగం అంతర్జాతీయ క్రీడాకారులకు కేటాయించినదే. శ్మశానాల్లో కేవీకేలా? అవినీతి పరమావధిగా టీడీపీ నాయకులు క్రీడారంగాన్ని భ్రష్టు పట్టించారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు క్రీడా వికాస కేంద్రాలను తెరపైకి తెచ్చారు. ఊరికి దూరంగా మొండి గోడలతో భవనాలు ని ర్మించి బిల్లు చేసుకుని మింగేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ప్రాధాన్య క్రమంలో గుర్తించి పే అండ్ ప్లే ద్వారా క్రీడా కార్యక్రమాలను ప్రారంభించింది. ఇలా 41 కేవీకేలు వినియోగంలోకి వచ్చాయి. వీటితో పాటు మరో 428 క్రీడా సముదాయాలు ఏపీలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు శాప్ ఆధ్వర్యంలో 250 మంది కోచ్లు వివిధ రూపాల్లో నిత్యం 7356 మంది క్రీడాకారులకు సేవలందిస్తున్నారు. గ్రామీణ క్రీడాకారులకు ఉన్నత శిక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 25 జిల్లాల్లో ఖేలో ఇండియా సెంటర్లు, ఒక రాష్ట్ర ఖేలో ఇండియా సెంటర్ను స్థాపించింది. అడవి బిడ్డల ఆటకు పదును కడపలోని డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాలల్లో 10 క్రీడాంశాల్లో 279 మంది క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో 77 మంది జాతీయ స్థాయి, 5 గురు అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే పతకాలు సాధించారు. ఈ స్ఫూర్తితోనే శాప్, సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో తొలిసారిగా స్పోర్ట్స్ స్కూళ్లను ప్రారంభించింది. పశ్చిమగోదావరి జిల్లా బాలయోగి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో బాలురకు పెదవేగిలో, బాలికలకు పోలసానిపల్లిలో క్రీడా పాఠశాలలను నిర్వహిస్తోంది. ఇక్కడ అథ్లెటిక్స్, ఆర్చరీ, బాక్సింగ్, ఫెన్సింగ్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్లలో శిక్షణ అందిస్తోంది. దీనితో పాటు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఏకంగా 6 స్పోర్ట్స్ స్కూళ్లను ప్రవేశపెట్టింది. సీతంపేట(శ్రీకాకుళం), భద్రగిరి(విజయనగరం), ముసురిమిల్చి(తూర్పుగోదావరి), యర్రగొండపాలెం (ప్రకాశం), మహానంది (కర్నూల్), గొల్లలదొడ్డి(అనంతపురం)లో గిరిజన యువతను క్రీడాకారులగా తీర్చిదిద్దుతోంది. ఆయా స్పోర్ట్స్ స్కూళ్లలో 25 మంది కోచ్లను నియమించింది. దీనిని క్రీడాభివృద్ధిలో భాగంగా ఈనాడు చూడలేక నంగనాచి రాతలు రాసింది. రూ.20 కోట్లకుపైగా నగదు పురస్కారాలు సీఎం జగన్ ప్రభుత్వం క్రీడాకారులకు ఆర్థిక భరోసా కల్పించడంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో సుమారు 65 క్రీడాంశాల్లో పతకాలు సాధించిన 1800 మంది క్రీడాకారులకు రూ.9,61,06,369 నగదు ప్రోత్సాహకాలను అందజేసింది. అదే అంతర్జాతీయ స్థాయిలో 24 క్రీడాంశాల్లో 76 మందికి రూ.8,47,50,000 నగుదు పురస్కారాలు ప్రదానం చేసింది. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక విధానమంటూ లేకపోవడంతో చాలా మంది క్రీడాకారులు నష్టపోయారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ క్రీడా ప్రోత్సాహకాల’ను ప్రవేశపెట్టారు. గతంలో ఇచ్చే నగదు మొత్తాన్ని భారీగా పెంచారు. దీంతో 2014 నుంచి 2019 మధ్య కాలంలో పతకాలు సాధించినా అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన ఎందరో క్రీడాకారులకు లబ్ధి చేకూరింది. ముఖ్యంగా 33 క్రీడాంశాల్లో 51 మంది అంతర్జాతీయ అథ్లెట్స్కు మెరుగైన శిక్షణ అందించేందుకు రూ.2,24,47,160 ఆర్థిక సాయాన్ని అందజేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్క స్పోర్ట్స్ కోటాలోనే ఏకంగా 2వేల మందికిపైగా వివిధ శాఖల్లో ఉద్యోగాలు కల్పించింది. జగనన్న క్రీడా సంబరాల పేరుతో నాలుగు క్రీడాంశాల్లో రూ.50.24 లక్షల నగదు బహుమతులతో పోటీలను నిర్వహించింది. ఇందులో దాదాపు 15వేల మందికి పైగా క్రీడాకారులు పోటీ పడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 26 జిల్లాల్లో 1356 వేదికల్లో సమ్మర్ క్యాంప్లను నిర్వహించింది. ప్రతి శిబిరానికి రూ.7వేల చొప్పున స్పోర్ట్స్ మెటీరీయల్స్ కొనుగోలుకు ఇచ్చి యువతను క్రీడలవైపు నడిపిస్తోంది. దేశంలోనే అతిపెద్ద క్రీడా టోర్నీగా రూ.120 కోట్లతో ఆడుదాం ఆంధ్రను విజయవంతంగా చేపట్టింది. ఇందులో సుమారుగా 38 లక్షల మంది పురుషులు, మహిళా క్రీడాకారులు భాగస్వాములయ్యారు. వీటన్నింటిని ప్రపంచం మొత్తం క్రీడలు అంటుంటే.. ఈనాడు ఆంధ్రాలో ఆటలు లేవంటూ తన అంధత్వాన్ని ప్రదర్శించింది. -
Fact Check: పచ్చ‘రోగం’ ముదిరింది
గురివింద రామోజీ అర్జంటుగా కళ్లద్దాలు మార్పించుకుంటే బావుంటుంది. చూపు మందగించడంతో రాష్ట్రంలో అభివృద్ధిని ఎటూ చూడలేకపోతున్న ఈ రాజగురువు ప్రజల రోగాలతో కూడా ఆడుకోవడం దుర్మార్గం. గత ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చి.. ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపకపోతే పల్లెత్తు మాట అనని రామోజీ.. ఇప్పుడు కిడ్నీ పరిశోధన కేంద్రం, రీసెర్చ్ సెంటర్ అందరి కళ్లెదుటే అద్భుత పనితీరు కనబరుస్తున్నా కుళ్లుబోతు రాతలు రాస్తున్నారు. ఇదివరకెన్నడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ ఏకంగా కిడ్నీ వ్యాధిపై యుద్ధమే ప్రకటించి, ఉద్దానంకు ఆరోగ్య భరోసా కల్పించడం పట్ల యావత్ ప్రపంచం ప్రశంసిస్తుంటే రామోజీ మాత్రం తప్పుడు కథనాలు వండివారుస్తున్నారు. దుర్మార్గానికి కూడా ఓ హద్దు ఉంటుంది. రామోజీ ఈ హద్దును కూడా దాటేసి చంద్రబాబు కోసం బరితెగించారు. ఈయన గారి పచ్చ రోగానికి త్వరలో ప్రజలే తగిన వైద్యం చేయడం ఖాయం. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశాడు. కొన్ని దశాబ్ధాలుగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపడంలో పూర్తిగా విఫలం అయ్యారు. బాబుకు తొత్తుగా ఉన్న రామోజీరావుకు అప్పట్లో చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. ప్రజాశ్రేయస్సు పట్ల కమిట్మెంట్ ఉన్న సీఎం జగన్ కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఉద్దానం ప్రాంత సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపారు. బాబు చేయలేనిది సీఎం జగన్ చేసి చూపించడంతో రామోజీరావుకు కన్నుకుట్టింది. దశాబ్ధాల సమస్యలను అనతికాలంలోనే పరిష్కరించిన సీఎం జగన్కు, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పెరిగి, టీడీపీ కనుమరుగు అవుతుందని భయం పట్టుకుంది. దీంతో తన ‘ఛీ’నాడులో ‘కిడ్నీ రోగం పిండేస్తోంది’ అంటూ మంగళవారం ఓ కట్టుకథను రామోజీ అల్లాడు. కిడ్నీ వ్యాధిగ్రస్తులను సీఎం జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. బాబే వాళ్లను ఉద్దరించాడంటూ సన్నాయి నొక్కుడు రాతలు రాసుకొచ్చారు. ఈ రాతలను చూసి ఉద్దానం ప్రాంత వాసులతో పాటు, రాష్ట్ర ప్రజలు పచ్చపత్రికను ఛీదరించుకుంటున్నారు. రాష్ట్రంలో కిడ్నీ బాధితులను నిర్లక్ష్యం చేసింది.. మీ బాబు కాదా రామోజీరావ్ అని ప్రశ్నిస్తున్నారు. కళ్లెదుటే ప్రాజెక్టులుంటే కబోది రాతలా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపుతానని 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అడుగులు ముందుకు వేశారు. పలాసలో రూ. 85 కోట్లతో వైఎస్సార్ కిడ్నీ పరిశోధనా కేంద్రం, మరొకటి రూ. 700 కోట్లతో వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు. ఈ వ్యాధిపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. సుజలధార ప్రాజెక్ట్ ద్వారా కిడ్నీ ప్రభావిత పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా చేపడుతున్నారు. 6.78 లక్షల జనాభా 2051 నాటికి 7.85 లక్షలకు చేరుతుందన్న అంచనాతో అప్పటి అవసరాలకు కూడా సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు నిర్మించారు. కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు చేశారు. విరివిగా కేంద్రాలు నెలకొల్పి.. ప్రస్తుతం టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. 63 మెషిన్లతో 68 పడకలపై డయాలసిస్ అందిస్తున్నారు. సోంపేట సీహెచ్సీ డయాలసిస్ సెంటర్లలో గతంలో 13 పడకలు ఉండేవి. ఇప్పుడవి 19కి పెరిగాయి. కవిటి సీహెచ్సీ డయాలసిస్ సెంటర్లలో గతంలో 10 పడకలు ఉండేవి. ఇప్పుడవి 15కి పెరిగాయి. హరిపురంలో కొత్తగా 10 పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. కొత్తగా గోవిందపురం, అక్కుపల్లి, కంచిలి, బెలగాంలో డయాలసిస్ సెంటర్లు మంజూరయ్యాయి. ఇవికాకుండా రెండు కంటైన్డ్ బేస్డ్ సర్వీసెస్ డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేశారు. టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు 20 రకాల మందులే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు 37రకాల మందులను అందుబాటులో ఉంచారు. రోగులకు వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్, యూరిన్ ఎనలైజర్స్ను ఉద్దానం పరిధిలో ఉన్న 29ల్యాబ్లలో అందుబాటులో ఉంచారు. టీడీపీ హయాంలో జిల్లా నెఫ్రాలజీ విభాగమే లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం జీజీహెచ్లో నెఫ్రాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. పలాసలో కిడ్నీ ఆస్పత్రి నిర్మించాక స్పెషలిస్ట్లతో పాటు మొత్తంగా 17 మంది వైద్యులు, స్టాఫ్ నర్సులు 60 మంది, డీడీఏ స్టాఫ్ 50 మంది, సపోర్టింగ్ స్టాఫ్ 20 మంది సేవలు అందిస్తున్నారు. మొత్తం ఆస్పత్రిలో 195 పోస్టులు మంజూరుకాగా ప్రస్తుతం 127 పోస్టులను భర్తీ చేయడం జరిగింది. మిగతావి భర్తీ చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దాన ప్రాంతంలోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపు కొత్తూరు, పలాస తదితర 7 మండలాలు, ఇచ్ఛాపురం, పలాస మున్సిపాలిటీల్లో మొత్తం 807 హేబిటేషన్ల పరిధిలో కిడ్నీ రోగులున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కచ్చితంగా స్క్రీనింగ్ క్రమం తప్పకుండా వైద్యారోగ్య శాఖ సిబ్బందితోనే నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం 4,34,925 మంది జనాభాలో ఇప్పటివరకు 30,612 మందికి స్క్రీనింగ్ పూర్తి చేశారు. సీరమ్ క్రియాటిన్ సికెడి (క్రిటికల్ కిడ్నీ డిసీజ్) కేసులు సుమారుగా 3 వేల మందిని గుర్తించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో నిర్వహించిన వైద్యశిబిరాల్లో సుమారు 49,021 మంది ఓపి చూపించుకున్నారు. ఇందులో ఇప్పటివరకు 474 మందిని సికెడి అనుమానితులుగా గుర్తించారు. 2018లో టీడీపీ హయాంలో ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ రోగాలకు అసలైన కారణాల పరిశోధనకు అప్పటి ప్రభుత్వం జార్జి ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంతో రూ.5 కోట్ల చెల్లింపునకు ఎంవోయు కుదుర్చుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాచింగ్ గ్రాంట్ నిధులు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. జాతీయ హెల్త్ మిషన్ ద్వారా రూ.2 కోట్లను విడుదల చేసింది. మిగిలిన నిధులు విడుదల చేయలేదు. ప్రభుత్వం మారిపోగా...కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఎన్హెచ్ఎం నుంచి నిధులను సదరు జార్జి సంస్థకు పరిశోధనకై నిధులు కేటాయించేది లేదని స్పష్టం చేసింది. దీంతో మిగిలిన నిధులు ఆ సంస్థకు సర్దుబాటు కాలేదు. కొండూరు బాధితులకు కొండంత అండ ఎన్టీఆర్ జిల్లా కొండూరు ప్రాంత కిడ్నీ బాధితులకు ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తోంది. ఎ.కొండూరు, తిరువూరుల్లో కొత్తగా డయాలసిస్ సెంటర్లను నెలకొల్పింది. కొండూరు చుట్టుపక్కల తండాల్లో 30 ఏళ్లు పైబడిన వారందరికీ రక్త పరీక్షలను నిర్వహించి కిడ్నీ సమస్యలున్న వారిని గుర్తించింది. కిడ్నీ బాధితులకు రూ.వేల ఖరీదు చేసే మందులను ఉచితంగా సరఫరా చేస్తోంది. తిరువూరు, విజయవాడకు డయాలసిస్, ఇతర వైద్య సేవలు అవసరం ఉన్న కిడ్నీ బాధితులకు ఉచిత రవాణా కోసం ప్రత్యేకంగా ఓ అంబులెన్స్ను ఎ.కొండూరులో అందుబాటులో ఉంచింది. కిడ్నీ కేసులు నమోదు అవుతున్న గ్రామాలన్నింటికీ రక్షిత మంచినీటి ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం పరిసర ప్రాంతాల్లో కిడ్నీ బాధితులకు వైద్య సేవలను చేరువ చేయడంలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన మార్కాపురం బోధనాస్పత్రిలో యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలను ప్రభుత్వం మంజూరు చేసింది. పింఛన్ పెంచి.. బాసటగా నిలచి కిడ్నీ బాధితులకు గత ప్రభుత్వంలో రూ.2500 ఉన్న పింఛన్ను ఏకంగా రూ.10 వేలకు పెంచింది. . ప్రభుత్వం వ్యాధి తీవ్రత ఆధారంగా రెండు రకాలుగా పింఛన్లు అందజేస్తుస్తోంది. 5పైబడి సీరం క్రియేటినైన్ ఉన్న వారికి రూ.5వేలు, డయాలసిస్ రోగులకు రూ. 10వేల పింఛను ఇస్తున్నారు. ఈ లెక్కన ప్రస్తుతం 831మందికి రూ.10వేలు చొప్పున, 451 మందికి రూ.5వేలు ఇస్తున్నారు. ఈ రకంగా ఎంతమందికైనా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలా కిడ్నీ బాధితులకు ప్రతి అడుగులో ప్రభుత్వం అండగా నిలుస్తుంటే రామోజీ వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. -
Fact Check: సిగ్గు ‘ఈడీ’సి రాతలా?
గురివింద చెబుతున్నట్లు గత చంద్రబాబు పాలనలో ఇసుకను ఉచితంగా ఇచ్చి ఉంటే.. చింతమనేని ప్రభాకర్ మహిళా తహశీల్దార్ను ఎందుకు జుట్టు పట్టుకుని ఈడ్చినట్లు? అర్ధ రాత్రిళ్లు సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి వెనుక ప్రొక్లయినర్లతో ఎందుకు ఇసుక తవ్వకాలు సాగించినట్లు? వీటిని బట్టి బాబు అండ్ గ్యాంగ్ అందినకాడికి దోచుకున్నారని ఈ రాజగురివిందకు తెలీదా? ఈ లెక్కన ఈ ప్రభుత్వంలో ఇసుక విక్రయం వల్ల ఏటా రూ.765 కోట్లు ఆదాయం లభిస్తోంది. ఐదేళ్లలో సుమారు రూ.4 వేల కోట్ల ఆదాయం వస్తోంది. మరోవైపు అక్రమ ఇసుక రవాణాపై ఉక్కు పాదం మోపుతోంది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ద్వారా నిఘా పెట్టింది. ఏకంగా 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసింది. ఇదంతా కళ్లెదుటే అందరికీ కనిపిస్తున్నా.. రామోజీకి, పచ్చ మీడియాకు మాత్రం కనిపించదు. తమ చంద్రబాబును అధికారంలోకి తేవడానికి ఎంతకైనా దిగజారుతామని, అవసరమైతే బట్టలిప్పుకుని దుష్ప్రచారం చేస్తామని అనునిత్యం చాటుకోవడం వీరికి పరిపాటిగా మారింది. ఎవరు నవ్విపోతే మాకేంటని నిస్సిగ్గుగా రోజూ రోత రాతలు రాయడం రామోజీకే చెల్లింది. సాక్షి, అమరావతి: మోకాలికి బోడిగుండుకి ముడి పెట్టడం ఎంత తిక్క తనమో ఏపీలో జరుగుతున్న ఇసుక తవ్వకాలను తమిళనాడుతో పోల్చి అక్కసు వెళ్లగక్కడం అంతకంటే ఎక్కువ పిచ్చితనం. ఈ పిచ్చి రాతలనే నమ్ముకున్న రామోజీ అదే పనిగా ఇసుకపై తనకున్న పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎక్కడో తమిళనాడులో జరిగిన ఇసుక తవ్వకాలపై ఈడీ దృష్టి సారిస్తే, ఇక్కడ కూడా అలాగే జరగాలని కోరుకోవడం సీఎం వైఎస్ జగన్పై ఉన్న కక్ష కాకపోతే మరేమిటి?. ఇసుక తవ్వకాలు సక్రమంగా జరుగుతున్నా అక్కసుతో నిత్యం తాను బురద జల్లడమే కాకుండా ఏకంగా ఈడీ జోక్యం చేసుకోవాలని బరి తెగించి అడ్డగోలు రాతలు రాయడం గురువింద రామోజీకి చెల్లింది. నిజానికి ఈడీ దర్యాప్తు జరపాల్సింది డిపాజిటర్లను నిట్టనిలువునా ముంచిన రామోజీ సొంత సంస్థ మార్గదర్శిపైనే. మార్గదర్శికి అక్రమంగా డిపాజిట్లు సేకరించారని సాక్షాత్తూ కోర్టులే స్పష్టం చేశాయి. వేల కోట్లు దోచేసి నంగనాచి రాతలు, దొంగ ఏడుపులు, నక్క తెలివి తేటలతో తప్పించుకున్నారు. రామోజీ ఫిలిం సిటీ భూకుంభకోణాలపై ఈడీగానీ, సీబీఐగానీ విచారణ చేస్తే ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా నిజాలు బహిర్గతమవుతాయి. తన వెనుక ఉన్న ఈ అక్రమాలను దాచిపెట్టుకుని ప్రభుత్వంపై అదేపనిగా బురద చల్లడం రామోజీకి రోజువారీ ప్రక్రియగా మారిపోయింది. విష ప్రచారం ద్వారా చంద్రబాబుకు మేలు చేయాలనే ఆరాటం తప్ప నిజంగా ఇసుక తవ్వకాల వల్ల ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చిందో తెలిపే ఒక్క లైను ఈనాడు రాయలేకపోతోంది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు, ఇక్కడి ఇసుక విధానం, తమిళనాడులో ఇసుక విధానం, తవ్వకాలకు ఎలాంటి సంబంధం లేకపోయినా రెండు రాష్ట్రాలను పోలుస్తూ ఈనాడు ప్రచురించిన కథనంలో అక్కసు మాత్రమే కనిపిస్తోంది. బాబు హయాంలో జేబుల్లోకి రూ.వేల కోట్లు వాస్తవానికి గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం పేరుతో కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వానికి రాకుండా ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్ళింది. ఆ దోపిడీని నివారించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత పారదర్శకంగా నూతన ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. దీనివల్ల ప్రతి సంవత్సరం రూ.765 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ఈ సొమ్మును తిరిగి ప్రజా సంక్షేమానికే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ డబ్బంతా చంద్రబాబు హయాంలో ఏమైంది? సహజ వనరుల ద్వారా వచ్చే రెవెన్యూ ప్రజా సంక్షేమానికి వినియోగించడానికి బదులు, ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్లేలా చేసింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. ఇసుక కొనుగోలు చేయడానికి ప్రజలు బ్లాక్ మార్కెట్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి కల్పించింది చంద్రబాబు. ఆ అరాచక విధానాన్ని రూపు మాపి ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక లభించేలా, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా నూతన ఇసుక పాలసీని వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. దీంతో ఎక్కడా ఇసుక కొరత లేకుండా, అందుబాటు ధరలోనే, కావాల్సినంత ఇసుకను పొందే వీలు కల్పించారు. టెండర్ల ద్వారా ఇసుక తవ్వకాలను ఏజెన్సీలకు అప్పగించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు ఆదాయం లభిస్తోంది. ఐదేళ్లలో రూ.3825 కోట్ల ఆదాయం వస్తోంది. టన్ను ఇసుకను రూ.475కి విక్రయిస్తోంది. అక్రమ ఇసుక దందాపై ఉక్కుపాదం రాష్ట్రంలో అక్రమ ఇసుక దందాపైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. అక్రమాలకు పాల్పడితే రెండు లక్షల రూపాయల జరిమానా, రెండేళ్ళ వరకు జైలు శిక్షను విధించేలా చట్టాల్లో మార్పులు తీసుకువచ్చింది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసి దాదాపు 18 వేల కేసులను ఈ బ్యూరో నమోదు చేసింది. 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసింది. ఈ కేసుల్లో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటి తీవ్రంగా స్పందించింది. ఏకంగా రూ.100 కోట్లు జరిమానా విధించింది. ఈ తీర్పుకు సంబంధించి వచ్చిన ఆరోపణలు కూడా సీఎంగా చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ప్రాంతంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపైనే. అంటే ఉచిత ఇసుక విధానం వల్ల అటు ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా, ఇటు పర్యావరణానికి విఘాతం ఏర్పడింది. టీడీపీ హయాంలో ఇసుక మాఫియా ఎలా రెచ్చిపోయిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో ఆదాయం ఏమైంది ? ఈ ప్రభుత్వంలో ఇసుక టెండర్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న రూ.3,825 కోట్ల ఆదాయం గతంలో ఏమైంది? ఇంత ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతోందని తెలిసినా ఎందుకు టెండర్లు పిలువలేదు? పారదర్శక విధానాలను ఎందుకు ఎంచుకోలేదు? అప్పుడు రామోజీరావు ఈ అక్రమాలపై ఈడీ విచారణ జరిపించాలని ఎందుకు కోరలేదు.? ప్రస్తుతం పర్యావరణ అనుమతులు ఉన్న రీచ్ ల్లోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన లేదు. అలాగే సంబంధిత శాఖల అనుమతులతోనే రిజర్వాయర్లలో డీసిల్టింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడా అక్రమ తవ్వకాలు జరగడానికి అవకాశమే లేదు. దీనిపై పర్యవేక్షణకు నిఘా కోసం ఎస్ఈబిని ఏర్పాటు చేసింది. అలాగే జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్, గనులశాఖ అధికారులు కూడా తమకు ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి జిల్లాకు ఒక విజిలెన్స్ స్క్వాడ్ కూడా గనులశాఖలో పనిచేస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర సరిహద్దులతో పాటు కీలకమైన ప్రాంతాల్లో చెక్ పోస్ట్లు నిర్వహిస్తున్నారు. -
Fact check: సచివాలయంపై తా‘కట్టు కథ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా ఎల్లో మీడియా చేసిన కుట్ర బట్టబయలయ్యింది. రాష్ట్ర తాత్కాలిక సచివాలయాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారంటూ... ఒక పత్రికలో రాసిన కథనాన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖండించింది. ‘సచివాలయ భవనాలను తాకట్టు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి రూ.370 కోట్లు రుణం తీసుకుంది’ అంటూ ఒక పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్త అవాస్తమని, ఇది ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించేదిగా ఉందని, దానిని ఖండిస్తూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికార ప్రతినిధి సోమవారం ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబును అధికారంలో కూర్చోబెట్టడానికి ఎల్లో మీడియా ప్రతీ రోజు ఏదో ఒక విష ప్రచారంతో భారీ కుట్రలకు తెరతీస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రతిష్టను మంటకలపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇందులో భాగంగానే ‘సచివాలయం తాకట్టు’ అంటూ ఒక విష కథనాన్ని పకడ్బందీగా ప్రచారంలోకి తీసుకొచ్చింది. ‘తాకట్టులో సచివాలయం’ అంటూ ఎల్లో పత్రిక ఒక వార్తను ప్రచురించడం... దాన్ని తమ సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం.. దానిపై తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి జిల్లా స్థాయి నేతల వరకు మాట్లాడటం... తిరిగి ఆ వార్తను అన్ని పత్రికల్లో ప్రచురింపజేస్తూ... ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా ప్రజలు నిజం అని నమ్మే విధంగా చేయడానికి ఎల్లో మీడియా విశ్వప్రయత్నం చేసింది. కానీ ఆ వార్తను హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖండించడంతో తెలుగుదేశం పార్టీ గోబెల్స్ ప్రచారం మరోసారి బట్టబయలయ్యింది. -
బాబు, ఎల్లో మీడియాకు షాక్
సాక్షి, ఎన్టీఆర్: వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిత్యం అసత్యప్రచారాలతో పబ్బం గడుపుతున్న చంద్రబాబుకు.. ఎల్లో మీడియాకు గట్టి మొట్టికాయే పడింది. గత రెండు రోజులుగా అదే పనిగా.. తాత్కాలిక సచివాలయం తాకట్టు పెట్టారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారంపై వాళ్లు ఆరోపిస్తున్న బ్యాంక్ హెచ్డీఎఫ్సీ స్పందించింది. అదంతా పచ్చి అబద్ధమని తేల్చేసింది. తాత్కాలిక సచివాలయాన్ని తాము తనఖా పెట్టుకోలేదని.. ఎలాంటి రుణం ఇవ్వలేదని స్పష్టం చేసింది హెచ్డీఎఫ్సీ బ్యాంక్. ఈ మేరకు ఈమెయిల్ ద్వారా బదులు ఇచ్చారు బ్యాంక్ ఉన్నతాధికారులు. దీంతో.. రెండ్రోజులుగా టీడీపీ , ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం బట్టబయలైంది. ఇక.. ‘తాకట్టులో సచివాలయం’ అంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని రాసుకొచ్చింది. రూ.370 కోట్ల కోసం సచివాలయంను హెచ్డీఎఫ్సీకి వైఎస్సార్సీపీ సర్కార్ రాసిచ్చేసిందంటూ ఓ వార్తను వండి వార్చింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ- APCRDA క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. తాకట్టులో సచివాలయం అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం పూర్తిగా సత్యదూరమని చెప్పింది.. pic.twitter.com/iNeYd7qLDq — APCRDA (@PrajaRajadhani) March 3, 2024 ఇదిలా ఉంటే.. చంద్రబాబు సైతం రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటంటూ ఊగిపోయారు. ఆత్మ గౌరవం తాకట్టు పెట్టారంటూ దొంగ ఏడుపులు అందుకున్నారు. అయితే.. ఇప్పుడదంతా అవాస్తవం అని క్లారిటీ రావడంతో యెల్లో బ్యాచ్ గొంతులో పచ్చి వెలగకాయ పడ్డట్లయ్యింది. -
ప్రమాద ఘటనపైనా పైత్యపు రాతలే
సాక్షి, నరసరావుపేట: ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటనకూ రాజకీయాలు అంటగడుతున్నారు. లేనిపోని ఆరోపణలతో నిస్సిగ్గుగా కట్టుకథలు అల్లేస్తున్నారు. తమ కళ్లముందే సంఘటన జరిగినట్టు తప్పుడు సమాచారంతో అడ్డగోలు వార్తలు వండివార్చేస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో జరిగిన ఓ ప్రమాద ఘటనను కావాలనే వైఎస్సార్సీపీ సర్పంచ్ దగ్గరుండి చేయించినట్టు ఓ అబద్ధాన్ని ఈనాడులో అచ్చేశారు. ప్రతి చిన్న సంఘటన ద్వారా పచ్చనేతలకు మేలు చేసేలా ‘తాగు నీరు అడిగితే... తొక్కించి చంపాడు ‘ అంటూ రామోజీ పైత్యపు రాతకు తెగబడ్డారు. అసలేం జరిగిందంటే... మల్లవరం గ్రామంలో నీటి ఎద్దడి ఉండటంతో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాలతో సర్పంచ్ షేక్ నన్నే సాహెబ్ నీళ్ల ట్యాంక్లను ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా చేయిస్తున్నారు. రోజూ వాటర్ ట్యాంకర్ నడిపే ట్రాక్టర్ డ్రైవర్ శుక్రవారం సెలవు పెట్టాడు. అయినా నీటికోసం ప్రజలు ఇబ్బంది పడతారేమోనన్న ఉద్దేశంతో సర్పంచ్ సాహెబ్ శుక్రవారం ట్యాంకర్ బాధ్యత మణికంఠ నాయక్ అనే వేరే డ్రైవర్కు అప్పగించారు. ట్రాక్టర్ డ్రైవింగ్లో అంత నైపుణ్యంలేని మణికంఠ పొలం నుంచి గ్రామంలోకి వచ్చే క్రమంలో రివర్స్ చేస్తూ వెనుక ఉన్న సామునిబాయి అనే మహిళను చూసుకోకుండా ఢీకొట్టడంతో టైర్ కింద కాలు పడి విలవిలలాడింది. అది చూసి స్థానికులు కేకలు వేశారు. కంగారు పడిన డ్రైవర్ కాపాడుదామనే తొందరలో ట్రాక్టర్ మళ్లీ ముందుకు వెనక్కి నడిపారు దీంతో మరోసారి ఆమెపైకి ట్రాక్టర్ ఎక్కింది. తీవ్రమైన రక్తస్రావం కావడంతో మాచర్ల ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో ఆ మహిళ చనిపోయింది. సమాచారం అందిన వెంటనే ఎస్ఐ కె.వెంకట నారాయణరెడ్డి మల్లవరం గ్రామంలో సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. ప్రత్యక్ష సాక్షి, మృతురాలి చెల్లి కొడుకు బాణావత్ కృష్ణనాయక్ మాట్లాడుతూ.. మృతురాలు తనకు స్వయానా పెద్దమ్మని ట్రాక్టర్ నడుపుతున్న యువకుడికి డ్రైవింగ్లో అనుభవం లేకపోవడంవల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎస్ఐ వెంకటనారాయణరెడ్డికి వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. డ్రైవర్కు సరిగా ట్రాక్టర్ను నడపడం రాకపోవడమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలోనూ తేలింది. పచ్చరాతలతో రాజకీయం... ప్రతి సంఘటననూ పచ్చనేతలకు అనుకూలంగా మలచుకోవాలన్న రామోజీ దురాలోచనవల్ల వాస్తవాన్ని దాచేసి అబద్దాన్ని అచ్చేశారు. సామునిబాయి తాగునీరు అడిగితే ఇవి కేవలం వైఎస్సార్సీపీ వారికే ఇస్తామని డ్రైవర్ మణికంఠ చెప్పినట్లు, అక్కడ గొడవ జరిగి ట్రాక్టర్తో తొక్కించి చంపినట్టు వండి వార్చారు. దీన్ని పట్టుకొని చంద్రబాబు, లోకేశ్లు సిగ్గులేకుండా విషప్రచారాలు మొదలుపెట్టేశారు. ఈనాడు రాతలు చూసి మల్లవరం గ్రామ ప్రజలు మాత్రం విస్తుపోతున్నారు. రాజకీయాల కోసం ప్రమాదంలో మహిళ మృతి చెందితే ఇలా విషపురాతలు రాస్తారా అంటూ ఛీత్కరించుకుంటున్నారు. -
పాడికి భరోసాపై కాలకూట విషం
సాక్షి, అమరావతి: సంక్షోభంలో చిక్కుకుని మూతపడ్డ సహకార పాల డెయిరీలను పునరుద్ధరించారు.. ప్రైవేటు డెయిరీల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు సహకార రంగంలో అగ్రగామిగా ఉన్న అమూల్తో ఒప్పందం చేసుకుని పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించారు. లీటర్కు రూ.4 చొప్పున అదనపు లబ్ధి చేకూరుస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మిన్నగా లీటర్కు రూ.10 నుంచి రూ.20 వరకూ అదనపు లబ్ధి చేకూరుస్తున్నారు. ఇప్పుడు పాడి రైతు చిరునవ్వులు చిందిస్తుంటే ఈనాడు రామోజీకి నచ్చడం లేదు. తన హయాంలో పాడి రైతును దగా చేసిన చంద్రబాబుకు బాకా ఊదడమే లక్ష్యంగా విషపు రాతలతో తెగబడుతున్నారు. తన బురద రాతలతో పాడి రైతుకు భరోసాపై ఓర్వలేనితనంతో కాలకూట విషం కక్కుతున్నారు. ‘పాడి కష్టం..అమూల్ పాలు’ అంటూ కాకిలెక్కలతో ఈనాడు తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. ఈనాడు ఆరోపణ: ఏళ్లు గడుస్తున్నా..పెరగని పాలసేకరణ వాస్తవం: రాష్ట్రంలోని ప్రైవేటు డెయిరీలన్నీ కలిపి రోజుకు 22 లక్షల లీటర్ల పాలు సేకరిస్తుంటే..అమూల్ సంస్థ కేవలం 3.45 లక్షల లీటర్లు మాత్రమే సేకరిస్తోందని ఆరోపించారు. దశాబ్దాల చరిత్ర ఉన్న రాష్ట్రంలోని ప్రైవేట్ డెయిరీలు రోజుకు 4 లక్షల లీటర్ల పాలను సేకరిస్తున్నాయి. నిండా మూడేళ్లు కూడా నిండని అమూల్ సంస్థ రోజుకు 3.75 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. నేడు 4778 గ్రామాల్లో 4.15 లక్షల మంది మహిళా పాడి రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1,09,763 మంది రోజూ పాలు పోస్తున్నారు. 2023 జూలైలో రోజుకు 1.74 లక్షల లీటర్లు పాలు సేకరణ చేయగా.. 2024 జనవరి నాటికి 3.75 లక్షల లీటర్ల పాలసేకరణకు చేరుకుంది. 4 లక్షల లీటర్ల పాల సేకరణకు ప్రైవేటు డెయిరీలకు రెండు దశాబ్దాలకుపైగా పడితే అమూల్ కేవలం మూడేళ్లలో 4 లక్షల లీటర్లకు చేరువలో ఉంది. ఆరోపణ: నమ్మించి నట్టేట ముంచారు వాస్తవం: మధ్యవర్తులు లేకుండా మహిళా పాడి రైతులకు నేరుగా ప్రతి పదిరోజులకోసారి పాల బిల్లులను చెల్లిస్తున్నారు. ప్రత్యేక ప్రోత్సాహకం కింద ప్రతి లీటర్కు పాల నాణ్యత మేరకు రూపాయి నుంచి రూ.2.75 చొప్పున అందిస్తున్నారు. 180 రోజులకు తక్కువకాకుండా పాలు పోసే మహిళా పాడి రైతులకు మూడేళ్లలో రాయిల్టీ ఇన్సెంటివ్ కింద ఇప్పటి వరకు రూ.4.93 కోట్లు చెల్లించారు. ఆరోపణ: ప్రైవేటు డెయిరీ కంటే తక్కువ ధర? వాస్తవం: జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి పాల సేకరణ ధరలు ఏడు సార్లు పెంచారు. ఫలితంగా గేదె పాలు లీటరుకు రూ.18.29(రూ.71.47 నుంచి రూ.89.76) ఆవు పాలకు రూ.9.49(రూ.34.20 నుంచి రూ.43.69)కు పెంచారు. 13 శాతం కొవ్వు, 9 శాతం ఎస్ఎన్ఎఫ్తో లీటరుకు గరిష్టంగా రూ.104 చొప్పున పాడిరైతులకు ఇస్తున్నారు. ఈ ధర రాష్ట్రంలో ఏ ఒక్క ప్రైవేటు డెయిరీ చెల్లించడం లేదు. ప్రైవేటు డెయిరీలు పాల ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ ధర, ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ ధర చెల్లిస్తుంటే, జగనన్న పాల వెల్లువలో సీజన్తో సంబంధం లేకుండా గిట్టుబాటు ధర అందిస్తున్నారు. అమూల్ ధరలు పెంచడంతో ప్రైవేటు డెయిరీలు కూడా తమ పాలసేకరణ ధరలను పెంచాల్సి వచ్చింది. ఫలితంగా ప్రైవేటు డెయిరీల నుంచి పాలు పోసే రైతులకు ఈ ప్రాజెక్టు ఫలితంగా రూ.4818.05 కోట్ల అదనపు లబ్ధి చేకూరింది. ఆరోపణ: పాడి రైతులకు చేయూత ఏదీ? వాస్తవం: పాడి రైతులకు 20 శాతం సీపీతో అత్యంత నాణ్యమైన పశువుల దాణా సరఫరా చేస్తున్నారు. ఈ కారణంగానే గరిష్ట ధర పొందుతున్నారు. ఇంతవరకు 1065 టన్నుల దాణా పంపిణీ చేశారు. క్రమం తప్పకుండా పాలుపోసే వారికి నిర్వహణ ఖర్చులు, దాణా, పశువైద్య సాయం, నీరు, విద్యుత్ సరఫరా వంటి వాటి కోసం వర్కింగ్ క్యాపిటల్ రుణాలు కూడా అందిస్తున్నారు. పాల సేకరణకు 317 మండలాల్లో 6684 గ్రామాలను గుర్తించారు. ఇప్పటికే 137 చోట్ల బీఏంసీయూ భవనాలు నిర్మించారు. గ్రామ స్థాయిలో పాల సేకరణ, పరీక్ష, శీతలీకరణ కార్యకలాపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.126 కోట్లు విడుదల చేసింది. ఆరోపణ: గలీజు ఒప్పందాలు..అప్పు తీర్చి అప్పగించారు.. వాస్తవం: చంద్రబాబు ప్రభుత్వంలోనే ప్రైవేటు డెయిరీలు మూతపడ్డాయి. అలాగే యూహెచ్టీ, పౌడర్ ప్లాంట్లు, ఎంసీసీలతో పాటు 141 బీఎంసీయూలను మూసేశారు. మూతపడిన డెయిరీలను పునరుద్దరించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. లిక్విడేషన్లో ఉన్న చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ కోసం అమూల్తో ఒప్పందం చేసుకుంది. డెయిరీలోని కొంత భాగాన్ని మాత్రమే అమూల్కు లీజుకు ఇచ్చారు. వాటి ఆస్తులు, భూములపై అమూల్కు ఎలాంటి హక్కులు కల్పించలేదు. ఈ ప్రాజెక్టు కోసం అమూల్ రూ.385 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. చిత్తూరు డెయిరీకి రూ.182 కోట్లు అప్పులు తీర్చి అప్పగించారంటూ చేసిన ఆరోపణలో వాస్తవం లేదు. ఈ బకాయిలన్నీ గత ప్రభుత్వ హయాం నుంచి ఉన్నవే. వాటిని క్లియర్ చేసిందే తప్ప అమూల్కు లీజుకు ఇచ్చేందుకు చెల్లించలేదు. ఒంగోలు డెయిరీని మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో అమూల్కు లీజుకు ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయి. రూ.400 కోట్లకు పైగా పెట్టుబడులు అమూల్ పెట్టేందుకు ముందుకొచ్చింది. అలాంటపుడు రూ.60 వేల కోట్ల విలువైన ఆస్తులు ధారాదత్తం చేస్తున్నారని పస లేని రాతలు రాస్తున్నారు. -
డీఎస్సీపై దగాకోరు రాతలు
సాక్షి, అమరావతి: ఐదేళ్లు సీఎంగా పనిచేసి కేవలం 300 టీచర్ ఉద్యోగాలిచ్చిన చంద్రబాబును ఇదేమిటని ఎన్నడూ ప్రశ్నించరు ఈనాడు రామోజీరావు. గత ఐదేళ్లలో ఇప్పటికే 15 వేల టీచర్ ఉద్యోగాలిచ్చి పేదల పిల్లలకు చక్కటి చదువులు అందిస్తూ మరో 6,100 మంది ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై మాత్రం విషం చిమ్ముతారు అదే రామోజీ. ఎందుకంటే.. రామోజీ, చంద్రబాబు అంటేనే పెత్తందార్ల పెద్దలు. పేదల పిల్లల ఎదుగుదల, అభివృద్ధిని సహించలేరు. అందుకే పేదల చదువులపై ఎప్పుడూ విషం చిమ్ముతుంటారు. అదే క్రమంలో రాష్ట్రంలో తాజా డీఎస్సీపై పక్క రాష్ట్రంతో పోలిక పెట్టి.. మెగా.. దగా.. అంటూ ఓ కుటిల కథనం అచ్చేశారు. అసలు ఈ పోలికే ఓ దగా. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 1998, 2018 డీఎస్సీ నోటిఫికేషన్స్ పోస్టుల భర్తీ జరగనే లేదు. అలాంటి పోస్టులన్నీ మురగపెట్టి ఇప్పుడు 11వేల పోస్టులకు అక్కడి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దీనినే రామోజీ మెగా డీఎస్సీ అంటున్నారు. కానీ, మన రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం 1998 డీఎస్సీ నుంచి 2019 స్పెషల్ డీఎస్సీ, మరో 12,00 కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు కలిపి 15 వేల పోస్టులను ఇప్పటికే భర్తీ చేసింది. తాజాగా 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహిస్తోంది. ఇవన్నీ కలిపితే సీఎం జగన్ ఇచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగాలు 21,108. అంటే తెలంగాణలో భర్తీ చేస్తున్న పోస్టులకంటే ఏపీలో పోస్టులే అధికం. ఈ విషయం చెప్పకుండా రామోజీ పాఠకులను తప్పుదోవ పట్టిస్తూ కథనం ఇవ్వడం దగా కాక మరేమిటి? తాజా డీఎస్సీతో అన్ని ఖాళీల భర్తీ తాజాగా 2024 డీఎస్సీలో 6100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (ఆశ్రం), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ సొసైటీ విద్యా సంస్థల్లో మొత్తం అన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులు 2,280, స్కూల్ అసిస్టెంట్స్ 2,299, టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్ పోస్టులు 42 ఉన్నాయి. ఇకపై ప్రతి విద్యా సంవత్సరం చివర్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసి కొత్త విద్యా సంవత్సరంలో పూర్తిస్థాయి బోధన అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. బాబు డీఎస్సీ పెద్ద నాటకం చంద్రబాబు హయాంలో డీఎస్సీ ఓ పెద్ద నాటకం. చంద్రబాబు నాలుగేళ్లు అధికారాన్ని అనుభవించి ఎన్నికలకు ముందు ఏడాది 2018లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. దానిని కూడా సక్రమంగా నిర్వహించలేక చేతులెత్తేశారు. ఫలితంగా అభ్యర్థులకు అన్యాయం జరగడంతో కోర్టుకు వెళ్లాల్సివచ్చింది. ఇందులో 7,254 ఉపాధ్యాయ పోస్టులకు గాను.. చంద్రబాబు భర్తీ చేసిన పోస్టులు 300 మాత్రమే. కానీ, డీఎస్సీకి చంద్రబాబు పేటెంట్ అన్నట్టు ఈనాడు కలరింగ్ ఇస్తోంది. ఇది సీఎం జగన్ చేసిన మేలు 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించారు. ఒక్క పాఠశాల కూడా మూత పడకుండా, ఏ ఒక్క టీచర్ అభ్యర్థికి అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టారు. ప్రతి పాఠశాలలో నూరు శాతం టీచర్లను నియమిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పాత, కొత్త డీఎస్సీల ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2018 డీఎస్సీలో చంద్రబాబు చేతిలో దగాపడ్డ అభ్యర్థులకు సీఎం జగన్ న్యాయం చేశారు. కోర్టు కేసులు పరిష్కారమయ్యేలా ప్రత్యేక దృష్టి సారించి సుమారు 6,954 మంది అభ్యర్థులకు ఉపాధ్యాయులుగా పోస్టింగులు ఇచ్చారు. అంతకు ముందు 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులు కూడా దశాబ్దాలుగా పోస్టింగ్స్ కోసం ఎదురు చూశారు. చంద్రబాబు వీరినీ పట్టించుకోకుండా తీవ్ర అన్యాయం చేశారు. ఇలా చంద్రబాబు దొంగ నాటకానికి బలైపోయిన అభ్యర్థులను సీఎం జగన్ చొరవ తీసుకుని టైం స్కేల్ ప్రాతిపదికన నియమించారు. ఇలా 1998 డీఎస్సీలోని 4,059 మంది, 2008 డీఎస్సీలోని 2,193 మంది అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇచ్చారు. వీటితో పాటు కేజీబీవీల్లో సుమారు 1,200 మంది రెగ్యులర్ టీచర్లను నియమించారు. నిత్యం శుద్దపూస కబుర్లు చెప్పే రామోజీ.. చంద్రబాబు చేతిలో మోసపోయిన డీఎస్సీ అభ్యర్థులకు సీఎం జగన్ చేసిన ఈ మేలు గురించి ఒక్క అక్షరం రాయరు. ఇది రామోజీ కుటిలత్వం రామోజీ బోడి గుండుకు.. మోకాలికి ముడిపెట్టే ప్రయత్నం కూడా చేశారు. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ఉపాధ్యాయ ఖాళీలను దాచేస్తున్నారంటూ పాతరాగానికి కొత్త ట్యూన్ కట్టారు. ఇక్కడ పాఠశాలల అభివృద్ధిని కాంక్షిస్తూ రుణం వస్తుంది. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కీలక భూమిక పోషిస్తేనే ఆ పాఠశాల బాగుపడుతుంది. విద్యార్థికి ఉన్నత భవిష్యత్తు దక్కుతుంది. ఈనాడు చెప్పినట్టు కేవలం రుణం కోసం ఖాళీలను దాచేసి పాఠాలు చెప్పేవారు లేకుండా చేసి విద్యాభివృద్ధిని ఎలా సాధిస్తారు? కొంచెం జ్ఞానంతో ఆలోచిస్తే ఎవరికైనా రామోజీ రాతల్లోని కుటిలత్వం బోధపడుతుంది. తెలంగాణలో ఇవెందుకు లేవు రామోజీ? విద్యా రంగంలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క విద్యా రంగంపైనే రూ.73 వేల కోట్లు ఖర్చు చేశారు. ఏపీలో మనబడి నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ విద్యలో సమూల మార్పులు కళ్లకు కడుతున్నాయి. ఇంగ్లిష్ మీడియం, టొఫెల్, సీబీఎస్సీఈ సిలబస్, జగనన్న గోరుముద్ద, పేద విద్యార్థులకు ట్యాబ్స్, జగనన్న విద్యా కానుక, అమ్మఒడి సాయం, ద్విభాషా పాఠ్య పుస్తకం, ఐఎఫ్పీలు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ బోధనతో పాటు ప్రపంచం మెచ్చిన ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ మూరుమూల పల్లెలోని ప్రభుత్వ బడుల్లోకి వస్తున్నాయి. మన పిల్లలను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేస్తున్నాయి. ఇవన్నీ తెలంగాణలో లేవు. అక్కడి పేదల పిల్లలకు ఇలాంటి ఫలాలు దక్కట్లేదని ఈనాడు రాయదు. ఇక్కడ రామోజీ లక్ష్యం ఒక్కటే.. అది సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏదో రకంగా వ్యతిరేకత పెంచడం. -
కోటలు కూలుతాయనే కాకమ్మ కథలు
సాక్షి, అమరావతి: త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైతే తాను భూములను కబ్జాచేసి, చట్టాలను ఉల్లంఘించి కట్టుకున్న ఫిలిం సిటీ, సహా తన కోటలకు బీటలు వారుతాయన్న ఆందోళనతో రామోజీరావు కల్లు తాగిన కోతిలా చెలరేగిపోతున్నారు. ఏదో ఒకటి చేసి తన పార్ట్నర్ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న తపనతో సీఎం జగన్ ప్రభుత్వంపై తన అక్కసును నిత్యం వెళ్లగక్కుతున్నారు. తాజాగా.. పేదలకు ‘సొంతిళ్లు నమ్మక ద్రోహం’.. ‘ఏ నిమిషానికి ఏమి కూలునో!’ అంటూ నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంపై విషం చిమ్ముతూ గురువారం తన క్షుద్ర పత్రిక ఈనాడులో వాస్తవాలకు దూరంగా అవాస్తవ కథనాలను వండి వార్చడం ఇందులో భాగమే. జగనన్న ఇళ్లు ఏ నిమిషంలో కూలుతాయో.. తద్వారా పేదల ప్రాణాలకు ముప్పు అంటూ ఓ సరికొత్త డ్రామాకు ఈ కథనం ద్వారా రామోజీరావు తెరతీశారు. నిజానికి.. పేదలందరికీ ఇళ్ల పథకం కింద రాష్ట్రంలో 31.19 లక్షల మంది నిరుపేదలకు ఉచితంగా ఖరీదైన ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి, వాటిల్లో సొంతిళ్లు సమకూరుస్తుంటే సిగ్గూశరం లేకుండా ఈ రాతలు ఏమిటి రామోజీ అంటూ పేదలు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ పాలనలో పేదల గూటికి, పేదోడికి ఏ ఢోకాలేదు.. అసలు ఈ రాష్ట్రంలో పేదలకు పట్టిన ఏలినాటి శని నువ్వు, మీ బాబే రామోజీ అని పేదలు చెబుతున్నారు. దీంతో పేదలు ఈ జన్మలో బాబుకు ఓటు వేయరని.. అదే జరిగితే తన కోటలు కూలుతాయని రామోజీ బెంబేలెత్తి కట్టుకథలు, కాకమ్మ కబుర్లతో ఈనాడులో చేతికొచ్చింది నిస్సిగ్గుగా రాసిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పేదల గూడుపై ఈనాడులో ప్రచురించిన దుర్మార్గపు రాతల వెనుక వాస్తవాలు ఏమిటంటే.. ఈనాడు ఆరోపణ: అనంతపురం జిల్లా రాయదుర్గం పరిధిలోని మల్లాపురం లేఅవుట్లో ఓ లబ్ధిదారునికి ప్రభుత్వం కట్టించిన ఇల్లు నెలైనా కాకముందే కూలింది. కాంట్రాక్టర్ శ్లాబ్ వేస్తున్న సమయంలో సిమెంట్ తక్కువ వాడాడు.. వాస్తవం: రాయదుర్గం మున్సిపాలిటీలో ఉండే హేమజ్యోతి, ఆనందు దంపతులకు మల్లాపురం లేఅవుట్లో ఇల్లు మంజూరైంది. వీరు తమ ఇంటిని తామే నిర్మించుకునే ఆప్షన్ 1, 2 ఎంచుకున్నారు. ఇంటి నిర్మాణానికి బిల్లులు మంజూరుచేయడంతో పాటు, 15 టన్నుల ఇసుకను ఉచితంగా, 55 బస్తాల సిమెంట్, 270 కిలోల స్టీల్ సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేసింది. లబ్ధిదారులే ఒక తాపీ మేస్త్రీని గుర్తించి ఇంటి నిర్మాణం చేసుకున్నారు. గత ఏడాది ఆగస్టులోనే ఇంటి నిర్మాణం పూర్తయింది. ఈ ఇల్లు ఆప్షన్–3 (ప్రభుత్వమే నిర్మించి లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్లు) కింద నిర్మించినది కాదు. పైగా.. కూలింది శ్లాబ్ కాదు. ఇంటి ముందు భాగంలో ఉండే మూడు అడుగుల సన్షేడ్ భాగం. ఎక్కడ ఏం జరిగినా దానిని ప్రభుత్వానికి ఆపాదించి దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్న రామోజీరావు.. ఈ వ్యవహారంలోనూ తన దగుల్భాజితనాన్ని ప్రదర్శించారు. ఆరోపణ: పట్టణ ప్రాంతాల్లో పేదల ఇంటి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.30 వేలు మాత్రమే ఖర్చుచేస్తోంది. వాస్తవం: ఇల్లులేని నిరుపేదలందరికీ రూ.15 లక్షల వరకూ మార్కెట్ విలువైన ఇంటి స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఉచితంగా పంపిణీ చేసింది. ఈ లేఅవుట్లలో లెవెలింగ్, తాత్కాలిక నీటి సరఫరా కోసం రూ.రెండు వేల కోట్లు వెచ్చించారు. శాశ్వత మౌలిక సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు ఖర్చుచేస్తున్నారు. దీనికితోడు.. ఒక్కో యూనిట్కు ఇంటి నిర్మాణం కోసం రూ.1.80 లక్షలు ఇస్తున్నారు. ఇందులో పట్టణాల పరిధిలో రూ.30 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.78 వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. దీనికి అదనంగా పావలా వడ్డీకి రూ.35వేలు బ్యాంకు లోన్ సమకూరుస్తున్నారు. రూ.15 వేలు విలువైన 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇవ్వడంతోపాటు, రూ.40వేల వరకూ మేలుచేస్తూ స్టీల్, సిమెంట్ ఇతర నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తోంది. ప్రభుత్వం పేదలకు ఇంత పెద్దఎత్తున మేలు చేస్తుంటే కేవలం రూ.30 వేలు ఖర్చుచేస్తున్నారని రామోజీరావు రాయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. ఆరోపణ: ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణం కేవలం ఒక శాతం మాత్రమే పూర్తయింది. ఇళ్ల నిర్మాణాల కేటాయింపులో కేవలం ఒక ఏజెన్సీకే మేలు చేశారు.. వాస్తవం: ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోలేమని, ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని 3,55,256 మంది ఎంచుకున్నారు. వీరందరినీ స్థానికంగా గుర్తించిన లేబర్ ఏజెన్సీలకు అనుసంధానం చేసి ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తోంది. ఇప్పటివరకూ 72,906 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అంటే మొత్తం ఆప్షన్–3 ఇళ్లలో 20 శాతం నిర్మాణం పూర్తయ్యాయి. కానీ, ఈనాడు మాత్రం ఒక శాతం మాత్రమే పూర్తయ్యాయని ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించే రాతలు రాశారు. లబ్ధిదారుల అంగీకారం మేరకు లేబర్ ఏజెన్సీలతో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలా రాష్ట్రంలో మొత్తం 897 ఏజెన్సీలు నిర్మాణాలు చేపడుతున్నాయి. ఇందులో 57 ఏజెన్సీలు వివిధ జిల్లాల్లో పనులు చేస్తున్నాయి. గరిష్టంగా ఒక్కో ఏజెన్సీకి 40,590 ఇళ్లను కేటాయించారు. దీన్నిబట్టి చూస్తే ఒక ఏజెన్సీకే మేలు చేసినట్లు ఎక్కడాలేదు. -
నిర్వాసితులకు వారున్న కాలనీల్లోనే ఓటుహక్కు
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలైన దేవీపట్నం, తొయ్యేరు నిర్వాసితులకు వారు నివాసం ఉండే ఆర్అండ్ ఆర్ కాలనీలోనే ఓటు హక్కు కల్పించినా తట్టుకోలేని ‘ఈనాడు’ అబద్ధాలు, అసత్యాలతో కూడిన కథనాన్ని బుధవారం అచ్చేసింది. అధికారులు ఎన్నికల సంఘ నిబంధనల ప్రకారమే ఓట్లు మార్పు చేస్తే ఏదో మహా పాపం జరిగిపోయినట్టు పతాక శీర్షికలో ‘ఈ అరాచకం అనంతం’ అంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ తీవ్రంగా ఖండించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన దేవీపట్నం మండలంలోని గోదావరి తీరంలో ఉన్న గిరిజనేతరులకు గోకవరం మండలంలో పునరావాసం కల్పించినట్లు తెలిపారు. దేవీపట్నం, తొయ్యేరు నిర్వాసితులకు కృష్ణునిపాలెం సమీపంలో రెండేళ్ల క్రితం ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మించి 1,282 కుటుంబాలకు పునరావాసం కల్పించామని గుర్తు చేశారు. ఈనాడు కథనం పూర్తి వాస్తవ విరుద్ధంగా ఉందన్నారు. అంతా ఎన్నికల సంఘం నిబంధనల మేరకే.. కృష్ణునిపాలెం ఆర్అండ్ఆర్ కాలనీలో నివసిస్తున్న 2,475 మంది ఓటర్లను జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో చేర్చినట్లు సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. తొయ్యేరులోని 237, 238, 239 పోలింగ్ బూత్లకు చెందిన ఈ ఓటర్లందరినీ రెండేళ్ల క్రితం ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జగ్గంపేట నియోజకవర్గంలో ఓటర్లుగా నమోదు చేసేందుకు అప్పటి దేవీపట్నం తహసీల్దార్ సిఫారసు చేశారన్నారు. ఎన్నికల సంఘం ఆమోదం కూడా తెలిపిందన్నారు. ఓట్లను మార్చే ముందు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నామని తెలిపారు. నాటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అనుమతితోనే ఓట్లు మార్పు జరిగిందని వివరించారు. మండల స్థాయి నుంచి జిల్లా కలెక్టర్కు, అక్కడ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి వెళ్లి.. తిరిగి జిల్లా కలెక్టర్కు అనుమతులు వచ్చాకే ఓట్ల మార్పు సాధ్యపడుతుందని వివరించారు. నిబంధనల ప్రకారమే.. రెండేళ్ల క్రితమే నిర్వాసితుల ఓట్లు మార్చితే ఇప్పుడు ఈనాడు పత్రిక అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. నిర్వాసితులకు వారు ఉండే ప్రాంతంలోనే ఓటు హక్కు కల్పించామన్నారు. దొంగ ఓట్లు, వేరే రాష్ట్రాల వారి ఓట్లేమీ చేర్చలేదు కదా అని నిలదీశారు. ఓటు మార్చడంలో తప్పేముంది?పోలవరం ముంపులో తొయ్యేరు గ్రామం మునిగిపోయింది. కృష్ణునిపాలెం ఆర్అండ్ఆర్ కాలనీలో ఇళ్లు నిర్మించారు. శాశ్వతంగా ఎప్పటికీ ఇక్కడే నివాసం ఉండాలి. ఈ నేపథ్యంలో ఓటును ఇక్కడకు మార్చడంలో తప్పేముంది? కాలనీలోనే పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. –నండూరి సీతారామ్, కృష్ణునిపాలెం ఆర్అండ్ఆర్ కాలనీ ఓటు మార్పు వల్ల ఇబ్బందేమీ లేదు.. కాలనీకి వచ్చాక 18 ఏళ్లు నిండిన వారు కొత్త ఓట్లు నమోదు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం మేమున్న కృష్ణునిపాలెం ఆర్అండ్ఆర్ కాలనీలోనే ఓటు హక్కు కల్పించారు. ఓట్లు మార్చడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడే స్వేచ్ఛగా మా ఓటు హక్కును వినియోగించుకుంటాం. –దేవరపల్లి వీరబాబు, కృష్ణునిపాలెం ఆర్అండ్ ఆర్ కాలనీ -
చక్కెర కర్మాగారాలను పిప్పి చేసింది బాబే
సాక్షి, అమరావతి: ఎవరైనా ఓ మాట చెబితే దానికో హేతుబద్ధత ఉండాలి. కానీ, రామోజీ మాటలకు రోత పద్ధతే తప్ప హేతుబద్దత ఉండదు. ఇందుకు చక్కెర కర్మాగారాలపై ఈనాడు ప్రచురించిన కథనమే ఇందుకు నిదర్శనం. అసలు రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలను నమిలి, పీల్చి పిప్పి చేసిందే రామోజీ ప్రియ మిత్రుడు చంద్రబాబు. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఎన్నో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఎందరో చెరుకు రైతులు కుదేలైపోయారు. వేలాది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తర్వాత సహకార రంగంలో మూతపడిన చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చీరాగానే వీటి పునరుద్ధరణకు ఉప సంఘం వేశారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను రైతులు, ఉద్యోగులకు చెల్లించారు. మూతబడ్డ కర్మాగారాల్లో క్రషింగ్ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. క్రషింగ్ సామర్థ్యానికి తగినట్టుగా చెరుకు ఉత్పత్తి లేకపోవడంతో స్థానికంగా సాగయ్యే పంట ఉత్పత్తులకు అదనపు విలువ కల్పించడం ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పాలని సంకల్పించారు. రైతులకు ఇంతలా మంచి జరిగితే తట్టుకోలేని విపక్షాలు కోర్టును ఆశ్రయించి అడ్డుకున్నాయి. ఈ వాస్తవాలను విస్మరించి ఈనాడు పత్రికలో ‘‘తీపి మాటలు చెప్పి పీల్చి పిప్పి’ అంటూ రామోజీ మరో రోత కథ అచ్చేశారు. ఈ కథనంలో వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.. ఆరోపణ: చక్కెర కర్మాగారాలకు సమాధి కట్టారు వాస్తవం: సహకార రంగంలో ఉన్న డెయిరీలనే కాదు..చక్కెర కర్మాగారాలను కూడా నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదే. బాబు హయాంలో మూతపడిన చిత్తూరు, రేణుగుంట, కోవూరు, ఎన్వీఆర్ జంపని సహకార చక్కెర కర్మాగారాలను దివంగత మహానేత వైఎస్సార్ అధికారంలోకి వచ్చీరాగానే పునరుద్ధరిస్తే వాటిని మళ్లీ చంద్రబాబు మూతపడేలా చేశారు. లాభాల బాటలో నడుస్తున్న చిత్తూరు, రేణిగుంట, కోవూరు, ఎన్వీఆర్ జంపని చక్కెర కర్మాగారాలను తన అనుయాయులకు కట్టబెట్టే లక్ష్యంతో వాటిని నిర్వీర్యం చేసి 2003–04లోనే మూత పడేలా చేశారు. ఫలితంగా పదింటికి తొమ్మిది మూతపడగా, ఆ ప్రభావంతో 15 ప్రైవేటు కర్మాగారాలు సైతం మూత పడ్డాయి. ప్రస్తుతం ఆంధ్ర, కేసీపీ షుగర్స్లో ఒక్కొక్క యూనిట్, శ్రీకాకుళంలోని ఈఐబీ ప్యారీ, చిత్తూరులోని ఎస్ఎన్జే షుగర్స్ మాత్రమే పనిచేస్తున్నాయి. అదీ కూడా 45 లక్షల టన్నుల క్రషింగ్ సామర్థ్యం కల్గిన ఈ కర్మాగారాలు కేవలం 19 లక్షల టన్నుల సామర్థ్యంతో పని చేసే స్థాయికి చేరాయి. ఇదంతా బాబు చేసిన పాపాల ఫలితమే. ఆరోపణ: రైతులను ఆదుకోని వైఎస్సార్సీపీ సర్కారు? వాస్తవం: బాబు ఎగ్గొట్టిన బకాయిలతో సహా ఈ ఐదేళ్లలో రైతులకు రూ.346.47 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది. అలాగే ఉద్యోగులకు బకాయిపెట్టిన రూ. 72.86 కోట్లు చెల్లించింది. మరొక వైపు ఉప సంఘం సిఫార్సుల మేరకు బాబు హయాంలో నిర్వీర్యమైన అనకాపల్లి, తాండవ, ఏటికొప్పాక, విజయ రాయ కర్మాగారాల పునరుద్ధరణ చర్యలు చేపట్టినప్పటికీ, సామర్థ్యానికి తగినట్టుగా చెరుకు దొరకని పరిస్థితి నెలకొంది. సగటున రోజుకు 17,750 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో ఈ కర్మాగారాలకు కనీసం 4 నెలలకు 23.09 లక్షల టన్నుల చెరుకు అవసరం కాగా, రూ.2.80 లక్షల టన్నులకు మించి లభించడంలేదు. పైగా వీటిలోని యంత్ర పరికరాలన్నీ మూలపడి శిథిలావస్థకు చేరుకున్నాయి. ముడిì సరుకు లేకుండా వందల కోట్లు ఖర్చుపెట్టి ఆధునికీకరించడం వలన ఫలితమేమిటో రామోజీకే తెలియాలి. ఆరోపణ: చెరుకు రైతులకుప్రోత్సాహం కరువు వాస్తవం: వైఎస్ జగన్ ప్రభుత్వం చెరుకు సాగు చేసే ప్రతి రైతుకు అవసరమైన ఆర్థిక చేయూత అందిస్తోంది. ఓ వైపు రాయితీలు, ప్రోత్సాహకాలతో పాటు.. వైఎస్సార్ రైతు భరోసా కింద చెరుకు రైతులకు సైతం ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. పంట నష్ట పరిహారంతో పాటు సున్నా వడ్డీ రాయితీ, పైసా భారం పడకుండా పంటల బీమా అమలు చేస్తోంది. కూలీల కొరత, పెరిగిన పెట్టుబడి ఖర్చులకు తోడు గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల మెజార్టీ రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారు. ఫలితంగా ఒకప్పుడు లక్ష హెక్టార్లకు పైగా సాగైన చెరుకు.. ప్రస్తుతం (2023–24)లో 41 వేల హెక్టార్లకు పడిపోయి, 23.65 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. ఆరోపణ: రూ.2 వేల కోట్ల ఆస్తులు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం? వాస్తవం: సామర్థ్యానికి సరిపడా చెరుకు లేక క్రషింగ్ నిలిచిన ఈ కర్మాగారాలను ఆహార శుద్ధి పరిశ్రమలుగా మార్చాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. స్థానికంగా లభించే పంట ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడం ద్వారా వాటికి అదనపు విలువ చేకూర్చి తద్వారా రైతులకు అదనపు లబ్ధి చేకూర్చాలన్నది వైఎస్ జగన్ ప్రభుత్వ సంకల్పం. పైగా ఈ పరిశ్రమలన్నీ ప్రభుత్వమే స్వయంగా నిర్మించి లీజు పద్ధతిన వాటి నిర్వహణను మాత్రమే ఆసక్తి గల సంస్థలకు అప్పగించాలని భావించింది. కర్మాగారాల ఆస్తులు, స్థలాలపై లీజుకు తీసుకునే సంస్థలకు ఎలాంటి హక్కులు ఉండవన్నది సుస్పష్టం. అయితే, మూతపడిన చక్కెర కర్మాగారాల వ్యవహారంపై కోర్టులో స్టే ఉన్నందున ప్రభుత్వ ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు. అలాంటప్పుడు వేల కోట్ల విలువైన వీటిని ప్రైవేటు వ్యక్తులకు ఎలా ధారాదత్తం చేస్తారో రామోజీనే చెప్పాలి. -
గురివింద ప్రయాసే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను మసకబార్చడమే లక్ష్యంగా పొరుగు రాష్ట్రం నుంచి రాళ్లేస్తున్న రాజ గురివింద ప్రవాసాంధ్రులకు బీమా రక్షణ కరువైందంటూ కన్నీళ్లు పెట్టారు! చంద్రబాబు సర్కారు ఐదేళ్లలో బీమా క్లెయిమ్గా నలుగురు బాధిత కుటుంబాలకు చెల్లించిన మొత్తం రెండంటే రెండు లక్షల లోపే ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక 28 లక్షల మందికి రూ.42 లక్షలకుపైగా క్లెయిమ్ పరిహారం అందచేసింది. మరో రూ.25 లక్షల మొత్తానికి సంబంధించిన క్లెయిమ్లు ప్రాసెసింగ్లో ఉన్నాయి. ప్రవాసుల భద్రత, డబ్బు విషయంలో వెనుకాడే ప్రభుత్వమైతే సొంత ఖర్చులతో విపత్తు వేళ ఆగమేఘాలపై వారిని స్వస్థలాలకు తరలిస్తుందా? బీమా ప్రీమియం స్వల్ప మొత్తంలోనే రూ.ఐదారు వందలు లోపే ఉంటుంది. అయితే ప్రవాసాంధ్రుల్లో చాలా మంది విదేశాల్లో తాము పని చేస్తున్న చోట్ల బీమా కవరేజీని పొందుతున్నందున ప్రవాసాంధ్ర బీమా భరోసాను తీసుకోవడంపై అంతగా ఆసక్తి చూపడం లేదు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ తప్పిదమే అనే రీతిలో రోత కథనాలను అచ్చేసి రామోజీ పైశాచిక ఆనందాన్ని పొందడంపై విస్మయం వ్యక్తమవుతోంది. 2.5 లక్షల మందికి ఏపీ ఎన్ఆర్టీఎస్ సేవలు ఏపీ ఎన్ఆర్టీఎస్ గత నాలుగేళ్లలో 2,55,000 మంది ప్రవాసాంధ్రులకు వివిధ సేవలతో సాయాన్ని అందించింది. 24/7 ద్వారా ప్రవాసాంధ్రులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రవాసాంధ్రుల బీమా పథకం క్లెయిమ్ కింద కేవలం నలుగురికి రూ.2 లక్షల లోపే అందించగా ఇప్పుడు గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం 28 మందికి పరిహారంగా రూ.42,05,604 చెల్లించింది. రూ.25,53,700 విలువైన మరో పది క్లెయిమ్లు పురోగతిలో ఉన్నాయి. బీమానే కాకుండా అంబులెన్సు, ఎక్స్గ్రేషియా, రీ పాట్రియేషన్ ద్వారా అధిక సంఖ్యలో వలస కార్మికులు లబ్ధి పొందారు. అనారోగ్య బాధితులతోపాటు మృతుల భౌతిక కాయాలను విమానాశ్రయాల నుంచి స్వస్థలాలకు తరలించేందుకు 1,077 అంబులెన్సులను ప్రభుత్వం సమకూర్చింది. ఇందుకోసం రూ.1.93 కోట్లకు పైగా వెచ్చించింది. ప్రమాదవశాత్తు విదేశాల్లో మరణించిన 489 మంది కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కింద రూ.2.44 కోట్లకుపైగా చెల్లించింది. వివిధ కారణాలతో విదేశాల్లో చిక్కుకుపోయి ఇబ్బంది పడుతున్న 4,622 మందిని రీపాట్రియేషన్తో స్వస్థలాలకు క్షేమంగా తరలించింది. – వెంకట్ మేడపాటి, ఏపీ ఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ ♦ దాదాపు 20 లక్షల మంది ప్రవాసాంధ్రుల్లో గత సర్కారు కేవలం 16,713 మందికి (ఒక్క శాతం) మాత్రమే బీమా కల్పిస్తే అది చాలా గొప్పంటూ డప్పు కొట్టిన రామోజీకి కరోనా విపత్తులో వేల మంది ప్రవాసులను ఏపీ ఎన్ఆర్టీఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సురక్షితంగా మాతృభూమికి తరలించిన విషయం తెలుసా? ఉక్రెయిన్ యుద్థం లాంటి సందర్భాల్లో ప్రభుత్వం సత్వరమే స్పందించి డబ్బుకు వెనుకాడకుండా ప్రవాసులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచి్చంది. ఇమ్మిగ్రేషన్ అధికారులతో సంప్రదించి 50 వేల మంది వలస కార్మికులను రాష్ట్రానికి క్షేమంగా తరలించింది. ♦ బీమా రక్షణ అనేది స్వచ్ఛందం. అవగాహన కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. అవసరమైన వారు ముందుకొచ్చి తీసుకుంటారు. అమెరికా, కెనడా, యూకే, ఐరోపా, ఆస్ట్రేలియా తదితర చోట్ల తాము పని చేస్తున్న సంస్థల్లో బీమా ప్రయోజనాలు అందుతున్నందున ప్రవాసులు ప్రభుత్వ పథకంలో చేరడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. మరి ఇది కూడా ప్రభుత్వ తప్పిదమేనా రామోజీ? ♦కోవిడ్ విపత్తు, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం సమయంలో లక్షల మంది ప్రవాసాంధ్రులు వెనక్కి వచ్చేశారు. బీమా సౌకర్యం లేని వారిని గుర్తించి పథకం ప్రయోజనాలు వివరిస్తూ అందులో చేర్చేందుకు ఏపీ ఎన్ఆర్టీఎస్ పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. తద్వారా గత ప్రభుత్వ హయాం కంటే మెరుగ్గా 33,596 మందికిపైగా బీమా ప్రయోజనాన్ని పొందారు. విదేశాలకు వలస వెళ్లే కార్మికులకు మూడేళ్లకు కేవలం రూ.550 ప్రీమియం అంటే రోజుకు సుమారు 50 పైసలకే అందిస్తున్నా అది కూడా భారమే అంటూ రాగాలు తీయడం వారిని అవమానించడం కాదా? ♦ ఎలా చూసినా గత సర్కారు రెండేళ్లలో ప్రవాసాంధ్రులకు అందించిన ప్రయోజనం కంటే గత నాలుగేళ్లుగా చేకూరిన లబ్ధి 10 రెట్లు అధికంగా ఉంది. -
Fact Check: కుప్పం ప్ర'జల నవ్వుల'పై కుళ్లు రాతలు!
సాక్షి, తిరుపతి: ముప్పైఐదు ఏళ్లుగా తనను ఎన్నుకుంటున్న కుప్పం వాసుల కష్టాలను టీడీపీ అధినేత చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకపోయినా కరువు సీమలో కనకధారలు కురిపించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కంకణం కట్టుకున్నారు. ప్రతిపక్ష నేత ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గానికి కేవలం 57 నెలల కాలంలోనే కృష్ణాజలాలను అందించి అక్కడి ప్రజల పెదవులపై చిరునవ్వులు చిందేలా చేశారు. దీనిని తట్టుకోలేని ఈనాడు రామోజీ కుళ్లు రాతలతో విషం చిమ్మారు. నవ్విపోదురుగాక.. నాకేటి సిగ్గు అన్నట్టు కుప్పం బ్రాంచ్ కాలువలో కృష్ణా జలాలు ప్రవహిస్తున్నా నీరు రాలేదంటూ కథనం ప్రచురించింది. నిస్సిగ్గుగా ‘కుప్పం ఫక్కున నవ్వింది’ అంటూ ఏడుపుగొట్టు రాతలు రాసి రాక్షసానందం పొందింది. నాటి లీలలు గుర్తున్నాయా బాబూ అండ్ రామోజీ! కుప్పానికి కృష్ణాజలాలు అందించే 207.800 కి.మీ కుప్పం బ్రాంచ్ కెనాల్ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ మీదుగా 123.641 కి.మీ ప్రవహించి కుప్పం పట్టణం సమీపంలో పరమసముద్రం దగ్గర కలుస్తుంది. ఈ పని అంచనా విలువ రూ.468.53 కోట్లుగా నిర్ణయించారు. రూ.460.881కోట్లతో చేపట్టేలా హైదరాబాద్కు చెందిన ఆర్కే హెచ్ఈఎస్–కోయా సంస్థతో 2016 జనవరి 4న అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ సీఎం అండ్ సీడీ పనులు చేపట్టకుండానే పనులు పూర్తయినట్టు చేతులు దులుపుకుంది. ప్రశ్నించాల్సిన అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థకు వంతపాడింది. నాడు ఏర్పాటు చేసిన పైప్లైన్కు ఎయిర్ రిలీఫ్ వాల్యూమ్లు, స్కోర్ ఛాంబర్లూ నాసిరకంవి అమర్చారు. 2019 ఫిబ్రవరిలో కుప్పం బ్రాంచ్ కెనాల్కు నీటిని విడుదల చేశారు. కానీ ఆ పైప్లైన్ పలు చోట్ల పూర్తిగా దెబ్బతినడంతో ప్రభుత్వం నీటి విడుదలను ఆపివేసింది. ప్రభుత్వ నిబంధల ప్రకారం కెనాల్ డిజైన్, ఎస్ఎల్ఆర్బీ, డీఎల్ఆర్బీ, పైప్ కల్వర్ట్ క్రాస్ వర్క్లు ప్రణాళికాబద్ధంగా చేయడకపోవడమే దీనికి ప్రధాన కారణమని తేలింది. దీంతోపాటు రోడ్డు క్రాసింగ్ వద్ద, డ్రెయినేజీ కాలువల వద్ద పైప్లైన్ పనుల్లో నాణ్యతాలోపం వల్ల నీరు కలుషితమైంది. ఇవేమీ గుర్తులేని బాబు, రామోజీ ఇప్పుడు ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్ చెబితే చేస్తారంతే.. సీఎం జగన్ 2022 సెప్టెంబర్ 22న కుప్పంలో పర్యటించినప్పుడు బ్రాంచ్ కెనాల్ పనులపై స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీంతో పెండింగ్ పనులు పూర్తిచేసి త్వరలో కృష్ణాజ లాలను తీసు కువస్తానని సీఎం మాట ఇచ్చారు. వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్ట్ కంపెనీకి పనులను రద్దు చేసి హైదరా బాద్కు చెందిన ప్రముఖ ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి పనులను అప్పగించింది. సాంకేతిక నిపుణుల కమిటీ సూచనల ప్రకారం గతంలో వేసిన నాసిరకం ఎయిర్ రిలీఫ్ వాల్యూ మ్ల స్థానంలో 500 ఎంఎం సామర్థ్యంగల ఎ యిర్ వాల్యూమ్లను ఏర్పాటు చేయాలని సూ చించింది. రోడ్డు క్రాసింగ్, డ్రెయి నేజ్, ప్రధాన కాలువలు వద్ద వేసే పైప్లైన్ పను లను నాణ్యంగా చేపట్టేలా పర్యవేక్షించి సకాలంలో పనులు పూర్తిచేసింది. శ్రీశైలం నుంచి 676 కి.మీ. పొడువున, 733 మీటర్ల ఎత్తులో 27 ప్రాంతాల్లో లిఫ్టింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కృష్ణా జలాలతో నిండిన 2 చెరువులు మూడు రోజుల క్రితం కుప్పంలో పర్యటించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రామకుప్పం మండలం రాజుపేట వద్ద గేట్లు ఎత్తి కృష్ణా జలాలను విడుదల చేశారు. మరుసటి రోజు (మంగళవారం) శాంతిపురం మండలం వెంకటేష్పురం వద్ద ఉన్న శెట్టికుంట చెరువు నిండింది. అంతకు ముందే అధికారులు ట్రయల్ రన్లో భాగంగా నీటిని విడుదల చేశారు. సీఎం వైఎస్ జగన్ వచ్చాక అధికారికంగా నీటిని విడుదల చేశారు. అప్పటికే అధికారులు ట్రయల్ రన్ కోసం విడుదల చేసిన నీరు ఉండటంతో అదే రోజు సాయంత్రానికి రామకుప్పం మండలం దాటి శాంతిపురం మండలంలోకి కృష్ణా జలాలు ప్రవేశించాయి. గుండిశెట్టిపల్లి సమీపంలో ఉన్న వంతెన దాటి నీరు ముందుకు సాగింది. ఆ సమయంలో స్థానికులు పూజలు కూడా చేశారు. వెంకటేష్పురం వద్ద శెట్టివానిగుంట చెరువుకు ఉన్న పాయింట్ తెరిచి ఉండటంతో మంగళవారం మధ్యాహ్నానికి చెరువు కృష్ణా జలాలతో నిండిపోయింది. ఈ చెరువు నిండిపోయిందని, నీటిని మల్లించాలని స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. ఆ తరువాతే అధికారులు ఆ నీటిని రామకుప్పం మండలం మిట్టపల్లి వద్ద ఉన్న మద్దికుంట చెరువుకు మళ్లించారు. నీటిని మళ్లించటంతో ఆ కాలువపై నీటి ప్రవాహం ఉండదు. దీన్ని టీడీపీ, డ్రామోజీ, ఎల్లో మీడియా బూతద్దంలో చూపించటం ప్రారంభించాయి. కట్టుకథలు వల్లెవేశాయి. దీనిపై కుప్పం ప్రజలు మండిపడుతున్నారు. ఈనాడులో ప్రచురించిన కథనం పూర్తిగా సత్యదూరమని రాష్ట్ర జలవ నరులశాఖ పేర్కొంది. సీఎం గేటు ప్రారంభించిన ప్రాంతంలో తాత్కాలికంగా అమర్చిన స్విచ్లు, డెకరేషన్లనే తొలగించామంది. కృష్ణానీటితో 2 చెరువులు నిండాయని వెల్లడించింది. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన పనులు ఇలా.. ► పలమనేరు నియోజకవర్గం అప్పినపల్లి వద్ద 0 పాయింట్ నుంచి కుప్పం మండలం పరమసముద్రం వరకు సుమారు 124 కిమీ వరకు హంద్రీనీవా కాలువ తవ్వారు. ► 5.కి.మీ పశు పత్తురు వద్ద లిఫ్ట్ ఏర్పాటు.. 39వ కి.మీ. కృష్ణాపురం వద్ద లిఫ్ట్ ఏర్పాటు ► వి.కోట మండలం ఆదిరేపల్లి 54.కి.మీ. వద్ద లిఫ్ట్లు ► కుప్పం నియోజకవర్గంలో 110 చెరువులకు నీళ్ళు, 6500 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా పనులు ► 4 లక్షలు జనాభాకు తాగునీరు అందించేందుకు చర్యలు ► అనంతపురం జిల్లా చెర్లోపల్లి రిజర్వాయర్ 300 క్యూసెక్కుల నీరు హంద్రీనీవా కాలువలు ద్వారా తరలింపు -
Fact Check: కాదు కాదన్నా కట్టుకథలేనా?
విశాఖ సిటీ: విశాఖపై పచ్చపత్రికలు మరోసారి పూనకం వచ్చినట్లుగా ఊగిపోయాయి. విషపు రాతలతో రెచ్చిపోయాయి. జిల్లా అభివృద్ధిని జీర్ణించుకోలేక విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు.. ఇష్టానుసారం బురదజల్లాయి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా చేపడుతున్న ప్రాజెక్టులపై దుష్ప్రచారాలకు వలువలన్నీ విప్పేశాయి. నిత్యం అభాసుపాలవుతున్నా సిగ్గూఎగ్గూ లేకుండా అబద్ధాలనే అచ్చోస్తూ పైశాచికానందం పొందుతున్నాయి. తాజాగా.. విశాఖ నగరంలో చోటుచేసుకున్న ఓ చిన్న సంఘటనను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు తెగ ఆరాటపడ్డ పచ్చ మీడియా చివరికి బొక్కబోర్లా పడి తమ పరువును తీసుకున్నాయి. ఇక్కడ సాగర తీరంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జి పటిష్టతను పరిశీలించేందుకు బ్రిడ్జి నుంచి ప్లాట్ఫాంను డీ–లింక్ చేస్తే బ్రిడ్జి తెగిపోయిందంటూ చేతికొచ్చింది రాసిపారేశాయి. బ్రిడ్జి సిబ్బంది డీ–లింక్ చేస్తున్న వీడియోను అధికారులు విడుదల చేసినప్పటికీ.. వాటిని పట్టించుకోకుండా వాస్తవాలను సమాధి చేస్తూ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేయడమే పనిగా పెట్టుకుని అప్పటికప్పుడు కట్టుకథలు అల్లేశాయి. పచ్చపత్రికల విషపు రాతలపై ‘ఫ్యాక్ట్చెక్’ ఏమిటంటే.. శాస్త్రీయ అధ్యయనాలు చేశాకే.. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు విశాఖ బీచ్ రోడ్డులో సముద్ర అధ్యయన శాస్త్రవేత్తల సూచనలతో.. ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకునేలా పూర్తి భద్రతా ప్రమాణాలతో ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటుచేయాలని విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) సంకల్పించింది. కురుసుర సబ్మెరైన్ మ్యూజియానికి సమీపంలో దీనిని ఏర్పాటుచేశారు. దేశంలో ఈ తరహా ప్రాజెక్టుల తీరును పరిశీలించేందుకు వీఎంఆర్డీఏ అధికారులు, ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్ల బృందం కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ (కాలికట్) వద్ద బేపూర్ తీరంలోను, త్రిసూ్సర్ నగరంలోని చావక్కడ్ తీరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జిలను సందర్శించారు. అధికారులు, నిర్మాణ, నిర్వహణదారులతో మాట్లాడి అక్కడ ప్రాజెక్టు విధానాలు తెలుసుకున్నారు. కేరళలో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిలు ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న విషయాన్ని గమనించారు. ఇవి ఏర్పాటుచేసిన ప్రతిచోటా విజయవంతంగా నడుస్తున్నట్లు గుర్తించారు. దీంతో పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు వీఎంఆర్డీఏ గ్లోబల్ టెండర్లు ఆహ్వానించింది. ఇందులో సాయిమోక్షా షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ సంస్థ ఈ టెండర్ను దక్కించుకుంది. వీఎంఆర్డీఏకు ఏడాదికి రూ.15.3 లక్షలు ముందస్తు చెల్లింపుల ప్రతిపాదికన ఈ ప్రాజెక్టును చేపట్టింది. సముద్ర అధ్యయన శాస్త్రవేత్తల సూచనలతో.. తొలుత.. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిను తెన్నేటి పార్కు సమీపంలో ఏర్పాటుచేయాలని అధికారులు భావించారు. అయితే, ఆ ప్రాంతం అటవీశాఖ పరిధిలో ఉండడంతో అక్కడ విరమించుకున్నారు. రుషికొండ ప్రాంతంలో ఏర్పాటుపై ఆంధ్రా యూనివర్శిటీలో సముద్ర అధ్యయన, భూభౌతిక శాస్త్రవేత్తలను సంప్రదించారు. ఇక్కడ ప్రాణాంతకమైన రిప్ కరెంట్ అధికంగా ఉంటుందని, ప్రాజెక్టుకు అనుకూలమైన ప్రాంతం కాదని చెప్పి కురుసుర మ్యూజియం ఉత్తర దిశ ప్రాంతం ఫ్లోటింగ్ బ్రిడ్జికు అనుకూలమైనదని సూచించారు. దీంతో నిర్వాహకులు ఆ ప్రాంతంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. మాక్డ్రిల్ చేస్తే తెగిపోయిందంటూ రాద్ధాంతం.. సహజంగా పౌర్ణమి, అమావాస్య రోజుల్లో సముద్రపు ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయాల్లో ఫ్లోటింగ్ బ్రిడ్జిను డీ–లింక్ చేస్తారు. అయితే.. సోమవారం సముద్ర కెరటాల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఆ రోజు నుంచి బ్రిడ్జిపైకి సందర్శకులను అనుమతించాలని ముందు భావించినప్పటికీ అలల ఉధృతి కారణంగా అనుమతించలేదు. ఈ సమయంలో మాక్డ్రిల్ చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా సిబ్బంది సోమవారం మ.3 గంటల సమయంలో బ్రిడ్జి, ప్లాట్ఫాంలను విడదీశారు. ఆ ఫ్లాట్ఫాంను లాగి యాంకర్ వద్దకు తీసుకువెళ్లారు. ఇదంతా అక్కడ ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయింది. అయితే.. బ్రిడ్జి, ప్లాట్ఫాం మధ్య కొంత ఖాళీ ప్రాంతాన్ని ఫొటో తీసి ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయిందని పచ్చ పత్రికలు, మీడియా తెగ రాద్ధాంతం చేశాయి. వెంటనే అధికారులు, నిర్వాహకులు అప్రమత్తమై బ్రిడ్జి తెగిపోయిందని చేస్తున్న ప్రచారంలో వాస్తవంలేదని సా.5 గంటలకే సీసీ కెమెరా దృశ్యాలను విడుదల చేశారు. అందులో బ్రిడ్జి, ప్లాట్పాంను 10 మంది సిబ్బంది విడదీయడంతో పాటు తాళ్లతో యాంకర్ వద్ద తీసుకెళ్లిన దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి. అయినప్పటికీ.. పచ్చపత్రికలు, పచ్చ పార్టీల లక్ష్యం వేరు కదా.. వాటిని అస్సలు పట్టించుకోకుండా ప్రభుత్వంపై బురదజల్లాయి. వాస్తవ దృశ్యాలను తొక్కిపెట్టి విశాఖపై అక్కసు వెళ్లగక్కాయి. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, వీఎంఆర్డీఏ కమిషనర్ డాక్టర్ ఎ. మల్లికార్జున ఇచ్చిన వివరణను సైతం పట్టించుకోలేదు. కేవలం విశాఖ ఇమేజ్, అభివృద్ధిపై విషం చిమ్మడమే పనిగా తప్పుడు కథనాలు ప్రచురించాయి. బ్రిడ్జి తెగిపోలేదు.. లంగరు వేశాం.. ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయిందన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవంలేదు. మాక్డ్రిల్లో భాగంగా రెండింటిని వేరుచేసి లంగరు వేశాం. తెగిపోతే సముద్రంలో కొట్టుకుపోవడమో, ఒడ్డుకు రావడమో జరిగేది. ప్లాట్ఫాం ఒకేచోట ఉండదు. వాస్తవాలను పట్టించుకోకుండా పెనుప్రమాదం తప్పిందని వార్తలు ప్రచురించడం సరికాదు. సముద్రంలో ప్రతికూలతవల్ల అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో సందర్శకులను అనుమతించలేదు. ప్రధాన వంతెన, వ్యూ పాయింట్ వేరుగా ఉండడంతో మధ్య ఖాళీ ప్రాంతాన్ని ఫొటోతీసి దుష్ప్రచారం చేశారు. భవిష్యత్తులో కూడా ప్రతికూల పరిస్థితులున్న సమయాల్లో ఇటువంటి మాక్డ్రిల్స్ నిర్వహిస్తాం. సంచలనాల కోసం అసత్య వార్తలు రాకుండా అధికారుల నుంచి వివరాలు తీసుకుని ధృవీకరించుకుని ప్రచురించాలి. విశాఖ ఖ్యాతిని మరింత పెంచేందుకు అందరూ సహకరించాలి. – డాక్టర్ ఎ. మల్లికార్జున, వీఎంఆర్డీఏ కమిషనర్ పూర్తి భద్రతా ప్రమాణాలతో.. ♦ సబ్మెరైన్ మ్యూజియం ప్రాంతానికి సమీపంలో ముంబై నుంచి వచ్చిన నిర్మాణ నిపుణుల నేతృత్వంలో బ్రిడ్జిను ఏర్పాటుచేశారు. ♦ ఒకేసారి 200 మంది సామర్థ్యాన్ని తట్టుకునేలా బలమైన యాంకర్లతో పటిష్టంగా హెచ్డీపీఈ బ్లాక్లతో ఈ నిర్మాణం చేపట్టారు. ♦ మొత్తం 100 మీటర్లు ఉండే ఈ బ్రిడ్జి 20 మీటర్లు తీరం ఒడ్డున, 80 మీటర్లు సముద్రంపై ఉంది. ♦ అలల తాకిడికి దెబ్బతినకుండా ఉండేలా 38 యాంకర్లను వినియోగించారు. వాటిలో 150 కిలోలు బరువైనవి నాలుగు, 200 కిలోలతో 14.. 500 కిలోలతో 20 యాంకర్లు ఉన్నాయి. ♦ తాత్కాలికంగా నిర్మాణమైన ఈ బ్రిడ్జిలో వినియోగించిన బ్లాకులు, యాంకర్లు, ఇతర సామాగ్రి పూర్తిగా పర్యావరణ సానుకూలమైనవి. బ్రిడ్జి చుట్టూ నిరంతర గస్తీ.. ♦ సముద్రం అలలకు తగ్గట్లుగానే ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రతిస్పందిస్తుంటుంది. ♦ దానిపై నడిచే వారు అందుకు తగ్గట్టుగా సరికొత్త అనుభూతిని పొందుతారు. ♦ పర్యాటకాభివృద్ధి కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టులో పర్యాటకుల భద్రతపై కూడా వీఎంఆర్డీఏ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ♦ ఫ్లోటింగ్ బ్రిడ్జి చుట్టూ రెండు పడవలతో నిర్వాహకులు నిరంతరం గస్తీ నిర్వహించనున్నారు. ♦ అలాగే, సందర్శకుల భద్రత నిమిత్తం 10 మంది గజ ఈతగాళ్లను నియమించారు. ♦ వారి పర్యవేక్షణలో మాత్రమే వంతెనపై సందర్శనకు అనుమతిస్తారు. ♦ ప్రతి సందర్శకుడికి లైఫ్జాకెట్ అందజేస్తారు. అది ధరించకపోతే అనుమతించరు. ♦ ఇండియన్ నేవీ వారు వినియోగించే లైఫ్ జాకెట్లను ఇందుకోసం సిద్ధంచేశారు. ఇవి 200 కేజీల బరువును 14 గంటలపాటు సముద్రంలో తేలియాడేలా చేస్తాయి. ప్రమాద సమయాల్లో లైఫ్గార్డును అప్రమత్తం చేసేందుకు జాకెట్కు కుడివైపున విజిల్ ఉంటుంది. ♦ బ్రిడ్జిపై సందర్శకుల వెంట ఇద్దరు లైఫ్గార్డులు ఉంటారు. ♦ అలాగే, బ్రిడ్జి చుట్టూ లైఫ్గార్డులు రక్షణ వలయంగా ఉంటారు. ♦ రక్షణకు సంబంధించి ప్రజలకు శిక్షణనిచ్చేందుకు నేవీ విశ్రాంత అధికారి, మెరైన్ కమాండోను అందుబాటులో ఉంచారు. ♦ నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను సైతం ఏర్పాటుచేశారు. -
Fact Check: పట్టు రైతులకు అండగా ప్రభుత్వం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక వ్యవసాయం, అనుబంధ రంగాలను ప్రాధాన్యత రంగాలుగా గుర్తించింది. రైతులకు విత్తు నుంచి విక్రయం వరకు అండగా ఉండటానికి గ్రామాల్లోనే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద ఏటా రూ.13,500, పంట నష్టపరిహారం, రైతులకు ఉచిత విద్యుత్.. ఇలా ఒకటా రెండా దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని పథకాలు.. దేశవిదేశాల నుంచి ఏపీ వ్యవసాయ విధానాలపై ప్రశంసలు.. ఇన్ని కళ్ల ముందు కనిపిస్తున్నా పచ్చకళ్ల కబోధి, ఈనాడు పత్రికాధినేత రామోజీరావుకు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు. పట్టు రైతులు కష్టాలు పడుతున్నారని.. పథకాలకు ప్రభుత్వం పాతరేసిందని.. రైతులకు రాయితీలు నిలిపేసిందని అసత్యాలు, అబద్ధాలతో మంగళవారం జగనన్న మంకు‘పట్టు’ అంటూ ఒక విష కథనాన్ని వండివార్చారు. దీనికి సంబంధించిన అసలు వాస్తవాలు ఇవిగో.. ముడిపట్టు ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో గత ఐదేళ్లుగా పట్టుసాగు భారీగా విస్తరించింది. ప్రభుత్వం అండగా నిలవడంతో పట్టు రైతులు గతంలో ఎన్నడూ లేని స్థాయిలో లాభాలు కళ్లజూస్తున్నారు. కొత్తగా ఈ రంగంలో అడుగు పెట్టే ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇలా అడుగడుగునా చేయూతనిస్తుంటే ఈనాడు మాత్రం ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది. ఆరోపణ: గతమెంతో ఘనం.. నేడు దైన్యస్థితిలో పట్టు రైతులు వాస్తవం: 2014–15 నుంచి 2018–19 మధ్య కొత్తగా 39,433 ఎకరాల్లో 15,362 మంది రైతులు పట్టు సాగు చేపట్టారు. 25,632 మెట్రిక్ టన్నుల పట్టుగూళ్లు పండించారు. 2019–20 నుంచి 2023–24 మధ్య కొత్తగా 40,362 ఎకరాల్లో 17,852 మంది రైతులు పట్టు సాగు చేపట్టారు. అదనంగా 30,272 మెట్రిక్ టన్నుల పట్టుగూళ్లు పండించారు. ఇక గతేడాది రికార్డు స్థాయిలో రూ.4,075 కోట్ల విలువైన 55,363 టన్నుల క్రాస్ బ్రీడ్ పట్టుగూళ్లు, 12,542 టన్నుల బైవోల్టెన్ పట్టుగూళ్లు ఉత్పత్తయ్యాయి. రూ.3,687.15 కోట్ల విలువైన 9,311 టన్నుల నాణ్యమైన ముడిపట్టును సిల్క్రీలర్లు ఉత్పత్తి చేశారు. ఆరోపణ: రాయితీలకు కోత.. నిధుల విడుదలకు సతాయింపు వాస్తవం: ఈ ఐదేళ్లలో పట్టు రైతులకు ప్రభుత్వం రూ.19.41 కోట్ల బైవోల్టిన్ కకున్ ఇన్సెంటివ్ను అందజేసింది. ఈ ఏడాది మరో రూ.4.50 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేసింది. ఇక పట్టు రీలర్లకు 4 ఏళ్లలో రూ.8.20 కోట్ల ఇన్సెంటివ్స్ ఇ చ్చింది. ఈ ఏడాది మరో రూ.2.75 కోట్లు విడుదల చేసింది. ఈ ఏడాది పట్టు రైతులకు రాయితీలిచ్చేందుకు రూ.25 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఇలా క్రమం తప్పకుండా పట్టు రైతులకు ఇన్సెంటివ్లు, రీలర్లకు ప్రోత్సాహకాలు ఇస్తూంటే.. ఈనాడు పత్రిక సత్యదూరమైన ఆరోపణలు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఆరోపణ: 33 శాతం పైగా పెరిగిన ఉత్పత్తి వ్యయం వాస్తవం: కిలో పట్టు గూళ్లకు 2018–19లో మార్కెట్ ధర రూ.350లకు మించి ఉండేది కాదు. కానీ ప్రస్తుతం సరాసరి ధర రూ.480 నుంచి రూ.550 మధ్య పలుకుతోంది. అంటే 2018–19తో పోలిస్తే సరాసరి ఆదాయం కిలోకు అదనంగా రూ.200కు పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. గత ఐదేళ్లలో గరిష్టంగా బైవోల్టిన్ రకం పట్టు గూళ్లకు కిలోకి రూ.881కు పైగా లభించింది. పైగా రైతుల పట్టుగూళ్ల ఉత్పాదకత కూడా గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. ప్రతి వంద గుడ్లకు గతంలో 60 కిలోలొస్తే, ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తోన్న పట్టు సాగు బడుల ఫలితంగా ప్రస్తుతం 70–75 కిలోలు వస్తోంది. దీన్ని బట్టి చూస్తే రైతులు ఆర్థికంగా బలోపేతమయ్యారే తప్ప ఈనాడు ఆరోపించినట్టు ఏ దశలోనూ ఇబ్బందిపడిన దాఖలాలు లేవు. ఆరోపణ: వైఎస్సార్సీపీ ప్రభుత్వం శీతకన్ను వాస్తవం: చౌకీ పురుగులు నూరు శాతం సరఫరా చేయడం, రీరింగ్ షెడ్లలో టర్బో వెంటిలేటర్స్, కూలింగ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడం, షూట్ రీరింగ్ పద్ధతులపై పట్టుసాగు బడుల ద్వారా అవగాహన కల్పించడం వల్ల సమయంతో పాటు కూలీల ఖర్చు 40 శాతం వరకు తగ్గింది. పైగా 15–20 శాతం మేర మల్బరీ ఆదా అవుతోంది. ఫలితంగా పట్టు రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 వేల ఎకరాల్లో మల్బరీ విస్తరణ లక్ష్యం కాగా ఇప్పటికే 5,242 మంది రైతులు 7,720 ఎకరాల్లో కొత్తగా సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో రూ.3,462 కోట్ల విలువైన 66,593 టన్నుల నాణ్యమైన కకూన్స్, 13,246 టన్నుల బైవోల్టెన్ కకూన్స్ను ఉత్పత్తి చేశారు. రూ.3,560 కోట్ల విలువైన 9,150 టన్నుల రా సిల్క్ ఉత్పత్తి అయ్యింది. ప్రస్తుత ఏడాదిలో పట్టు పరిశ్రమ కోసం రూ.99.71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు జరపగా ఇప్పటికే రూ.28.80 కోట్లు విడుదల చేసింది. 2021–22లో పట్టు పరిశ్రమ స్థూలాదాయం రూ.11,638 కోట్లు ఉండగా 2022–23లో రూ.12,098 కోట్లతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఆరోపణ: యాంత్రీకరణ సహా పథకాల ఎత్తివేత వాస్తవం: క్రిమిసంహారక మందుల కొనుగోలుకు 9,525 మంది రైతులకు రూ.2.38 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. యంత్ర పరికరాల కోసం పట్టు పరిశ్రమ ద్వారా 1,524 మంది రైతులకు రూ.8.25 కోట్లు ఇచ్చింది. పట్టు రైతులు నిర్మించుకున్న షెడ్లతో పాటు మల్బరీ తోటల సాగు, రీలింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం రూ. 111.61 కోట్లు విడుదల చేసింది. పట్టు పురుగుల పెంపక షెడ్ల నిర్మాణానికి సంబంధించి ఉపాధి హామీ బకాయిలన్నింటినీ రైతుల ఖాతాకు జమ చేస్తోంది. ప్రభుత్వం ఇన్ని చేస్తున్నా యంత్ర పరికరాలకు మంగళం పాడేశారంటూ ఈనాడు అబద్ధాలను అచ్చేసింది. -
Fact check: ముదిరింది ఎండే కాదు..ఈనాడు పచ్చ పైత్యం కూడా
సాక్షి, అమరావతి: ఎండలు మండుతున్నాయో లేదో ఏసీ గదుల్లో కూర్చునే రామోజీకేం తెలుస్తుంది. ఒకసారి కళ్లు తెరిచి రోడ్డు మీదకు వస్తే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతుంది. వాతావరణ మార్పుల కారణంగా ఫిబ్రవరి నెలలోనే ఎండలు ముదురుతుండటంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. అయినప్పటికీ ప్రజలు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా కోతలు లేని నాణ్యమైన విద్యుత్ను రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు అందిస్తున్నాయి. కానీ ఎండ కన్నెరుగని డ్రామోజీ ‘ఎండలు ముదరక ముందే ఎడా పెడా కోతలు’ శీర్షికన ఈనాడులో అడ్డగోలుగా ఓ అబద్దాన్ని అచ్చేశారు. ఈ అసత్య కథనంపై రాష్ట్ర విద్యుత్ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. రాష్ట్రంలో ఏదైనా సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల సమయంలో వచ్చే స్వల్ప విద్యుత్ అంతరాయాలను వ్యవసాయ విద్యుత్ కోతలుగా చూపిస్తూ తరచూ కథనాలు ప్రచురించడం ఈనాడు దిగజారుడుతనానికి నిదర్శనమని, ఇలాంటి నీతిమాలిన పాత్రికేయం ఆ పత్రిక పతనానికి నాంది అని దుయ్యబట్టాయి. వాస్తవాలేమిటో వివరించాయి. ఈనాడు ఆరోపణ: విద్యుత్ కోతలతో పంటలు ఎండుతున్నాయని ప్రకాశం జిల్లాలో ఓ గ్రామం రైతులు, విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ గ్రామం రైతులు ఆందోళన చేశారు. వాస్తవం: పార్వతీపురం మన్యం జిల్లా యర్రసామంతవలస 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో ఏర్పడ్డ విద్యుత్ అంతరాయం, ప్రకాశం జిల్లా ఉమా మహేశ్వరపురం 33/11 కేవి సబ్ స్టేషన్, అద్దంకి దగ్గర గుండ్లకమ్మ వంతెన సమీపంలో 33 కేవీ కుంకుపాడు లైన్ మరమ్మతుల వల్ల తలెత్తిన అంతరాయాలను వ్యవసాయ విద్యుత్ కోతలుగా ఈనాడు ప్రచురించింది. అది అవాస్తవం. నిజానికి ఈ రెండు చోట్లా ప్రత్యామ్నాయంగా ఏపీ ట్రాన్స్కో హై వోల్టేజ్ సబ్ స్టేషన్ లైన్ల ద్వారా విద్యుత్ అందించడం కూడా జరిగింది. వ్యవసాయ వినియోగదారులకు పగటి పూట విద్యుత్ సరఫరాకు అధికారులు గతంలోనే చర్యలు తీసుకున్నారు. అక్కడక్కడా సమస్యలు తలెత్తినా వెంటనే నివారించేందుకు సబ్స్టేషన్, లైన్ల సామర్థ్యం పెంపుదల పనులు జరుగుతున్నాయి. ఇంక ఆందోళన చేయాల్సిన అవసరమేముంది? అదంతా కేవలం రామోజీ మార్కు సృష్టి మాత్రమే. ఈనాడు ఆరోపణ: రైతులకు పగటిపూట అంతరాయం లేకుండా 9 గంటలు విద్యుత్ ఇస్తామని చెప్పిన సర్కారు.. వేసవి ఆరంభంలోనే చేతులెత్తేసింది. ముందస్తు ప్రణాళికల్లో విఫలమైంది. వాస్తవం: రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం విద్యుత్ వినియోగం పెరుగుతోంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ను విద్యుత్ సంస్థలు అందిస్తున్నాయి. ఇందుకోసం బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ను కొనుగోలు చేస్తున్నాయి. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని అందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికను రూపొందిస్తున్నాయి. రైతులకు పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్తును ఎటువంటి ఆటంకాలు లేకుండా సరఫరా చేస్తున్నాయి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం ఈ ఎడాది రబీ సీజను నుండి సోలార్ విద్యుత్ను వ్యవసాయానికి ప్రత్యేకంగా సరఫరా చేయనున్నాయి. గడిచిన పది రోజుల్లో ప్రజలకు.. ముఖ్యంగా రైతులకు ఏమాత్రం కొరత లేకుండా విద్యుత్ అందిస్తున్నాయి. -
fact check: ఉన్నత విద్యపై ఉన్మాద రాతలు
సాక్షి, అమరావతి: ‘‘డబ్బులుండే వాళ్లకే క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది. విద్యార్థులు తమ కలను నెరవేర్చుకోవాలంటే ఏ విధంగా చదువుకోవాలో మీరే ఆలోచించుకోవాలి. విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదు. ఎక్కడ చూసినా కార్పొరేట్ సామాజిక బాధ్యత ద్వారానే మంచి విద్యా సంస్థలు వచ్చాయి. కార్పొరేట్లు తమ భుజస్కందాలపై విద్యా సంస్థలను పెట్టుకోవాలి’’. ..ఈ వ్యాఖ్యలు గుర్తున్నాయా రామోజీ!? స్వయంగా మీ పార్ట్నర్, మీ ఆత్మబంధువు చంద్రబాబు నోట జాలువారిన ఆణిముత్యాలు. విభజన ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరిస్తానంటూ మాయమాటలు చెప్పి సీఎం సీటుపై కూర్చున్న వ్యక్తి నేతృత్వంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే కుట్రకు బీజంపడిన రోజులవి. చంద్రబాబు చెప్పినట్లే తన ఐదేళ్ల పాలనలో ఉన్నత విద్య పేరుతో కార్పొరేట్లకు దోచిపెట్టారు. హాజరు పట్టికలో తప్ప తరగతి గదుల్లో పాఠాలు చెప్పని విద్యా సంస్థలకు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని దోచిపెట్టారు. కష్టపడి చదువుకునే విద్యార్థులకు అరకొర ఫీజు రీయింబర్స్మెంట్.. అది కూడా సకాలంలో చెల్లించకుండా నానా ఇబ్బందులు పెట్టారు. ఇదంతా జగమెరిగిన సత్యం. రామోజీ దివ్యదృష్టికి మాత్రం ఇది కనిపించకపోవడంలో ఆశ్చర్యంలేదు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదింటి బిడ్డలను గ్లోబల్ విద్యార్థులుగా తీర్చిదిద్దుతుంటే పెత్తందారి మనస్తత్వంతో రామోజీ ఆత్మ ఓర్వలేకపోతోంది. నిత్యం ప్రభుత్వంపై విషం చిమ్మేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ‘ఉన్నత విద్య పేదలకు మిథ్య’ అంటూ సోమవారం తన క్షుద్ర పత్రిక ఈనాడులో అభూతకల్పనను సృష్టించే ప్రయత్నం చేసి బొక్కబోర్లాపడింది. ఈనాడు కథనంలోని అంశాలపై ‘ఫ్యాక్ట్చెక్’ ఏమిటంటే.. ఆరోపణ: పేదలకు కొరకరాని కొయ్యగా ఉన్నత విద్య.. వాస్తవం: చంద్రబాబు పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన చెల్లింపులు ఏడాదికి సగటున రూ.2,428 కోట్లుగా ఉంటే ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి రూ.4,044 కోట్లు చెల్లిస్తోంది. విజనరీగా చెప్పుకునే చంద్రబాబు అత్యధికంగా ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఒక్కో విద్యార్థికి ఏడాదికి ఇచ్చింది కేవలం రూ.35 వేలలోపు మాత్రమే. అదే సీఎం జగన్ ప్రభుత్వం గరిష్టంగా ఒక్కో విద్యార్థికి రూ.3 లక్షల వరకు చెల్లిస్తూ ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. ఇలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు 27 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద ఏకంగా రూ.18,576 కోట్లు చెల్లిస్తోంది. టీడీపీ ఐదేళ్లలో రూ.12,141 కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. చివరికి గద్దె దిగుతూ 2019లో చంద్రబాబు 16.73 లక్షల మంది విద్యార్థులకు పెట్టిన బకాయి అక్షరాల రూ.1,778 కోట్లు. ఇది కూడా చెల్లించింది సీఎం జగన్ ప్రభుత్వమే. గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా అమలుకాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అనేక అవస్థలు పడేవారు. అప్పట్లో కాలేజీలకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచేవి. పరీక్షలకు హాల్టికెట్లు, పాసైతే సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవి. ఫలితంగా చాలా కుటుంబాలు అప్పులుచేసి మరీ తమ పిల్లలను చదివించాల్సిన దుస్థితి నెలకొంది. అదే ఇప్పుడు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుంటే విద్యార్థులపై ఏ విధంగా భారం పడుతోందో రాజగురువు రామోజీనే చెప్పాలి. ఆరోపణ: ఉన్నత విద్యలో తగ్గిన జీఈఆర్ నిష్పత్తి.. వాస్తవం: రాష్ట్రంలో ఐదేళ్ల కాలంలో ఉన్నత విద్యలో భాగంగా యూజీ, పీజీ, పీహెచ్డీ, సర్టిఫికేషన్ కోర్సుల్లో ప్రవేశాలు స్థిరంగా ఉన్నాయి. చంద్రబాబు హయాంలో 2017–18లో 16.97 లక్షలు ఉంటే ఇప్పుడు 2021–22 నాటికి 19.29 లక్షలకు పెరిగాయి. అంతకుముందు.. ఏడాది కంటే ఇది స్వల్పంగా తగ్గింది. దీనికి కారణం డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులు అత్యధికంగా కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడమే. అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఇంటర్న్షిప్, కరిక్యులమ్లో విప్లవాత్మక మార్పులతో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారుచేస్తున్నారు. అందుకు చంద్రబాబు హయాంలో గరిష్టంగా 35వేలు క్యాంపస్ ఎంపికలు నమోదైతే.. సీఎం జగన్ హయాంలో 1.80 లక్షలకు పెరిగాయి. ఇందులో ఒక్క సంప్రదాయ డిగ్రీలోనే 60వేలకు పైగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో పీజీకి వెళ్లేవారు సహజంగానే తగ్గుతారు. కానీ, ఉద్యోగం చేస్తూ వివిధ రూపాల్లో చాలామంది తమ ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారు. కానీ, కనికట్టు విద్యలో ఆరితేరిన ఈనాడుకు ఇదంతా కనిపించదు. ఆరోపణ: ప్రభుత్వ కళాశాలలు లేనిచోట పేద విద్యార్థులకు ఇబ్బందులు.. వాస్తవం: రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ఉన్నతస్థాయి ప్రమాణాలతో విద్యను అందించే మహా యజ్ఞాన్ని సీఎం జగన్ తలపెట్టారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను బలోపేతం చేస్తూనే.. ప్రైవేటు కళాశాలల్లో పేదింటి బిడ్డలు చదువుకునేందుకు వీలుగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. కానీ, ఈనాడు, ఎల్లో మీడియా వంటి దుష్టశక్తులు అసత్య కథనాలతో నిత్యం ఈ యజ్ఞంపై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నాయి. ఎయిడెడ్ కళాశాలల అంగీకారం మేరకే వాటిని ప్రభుత్వం టేకోవర్ చేస్తోంది. ఈ ప్రతిపాదనల్లో చాలా ఎయిడెడ్ కళాశాలలు ప్రైవేటుగా నిర్వహించుకునేందుకు ఇష్టపడ్డాయి. ఇలా 600 మంది టీచింగ్, 800 మందికి పైగా నాన్ టీచింగ్ సిబ్బందిని ప్రభుత్వానికి ఇచ్చేశాయి. వీళ్లందరూ ఆయా ప్రభుత్వ కళాశాలల్లో బోధనలో నిమగ్నమయ్యారు. అంటే ప్రభుత్వ కళాశాలల్లో టీచింగ్ సామర్థ్యం పెరిగినట్లే కదా? ఆరోపణ: ప్రభుత్వ కళాశాలల్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం.. వాస్తవం: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కొత్త ఒరవడిలో పయనిస్తున్నాయి. గత విద్యా సంవత్సరంలో దాదాపు 18వేల మందికి క్యాంపస్ ప్లేస్మెంట్లు దక్కాయి. ఇది మొత్తం అడ్మిషన్లలో 65 శాతానికి పైగా ఉండటం విశేషం. 2020 నుంచి 15 కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు వచ్చాయి. ఐదు ఎయిడెడ్ కళాశాలలు ప్రభుత్వంలో విలీనమయ్యాయి. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని అరకులో వంద శాతం అడ్మిషన్లు నమోదయ్యాయి. పాడేరులో 99, చింతపల్లిలో 97, గుమ్మలక్ష్మీపురం 92 శాతం ప్రవేశాలు కనిపిస్తున్నాయి. వీటికి తోడు 2019 నాటికి కేవలం 18 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు మాత్రమే నాక్ సర్టిఫికేషన్ ఉంటే.. ప్రస్తుతం వాటి సంఖ్య 61కి చేరడం ‘ప్రభుత్వ చదువుల అభివృద్ధికి’ నిదర్శనంగా కనిపిస్తోంది. ఇక రాష్ట్రంలో మొత్తం 168 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉంటే ఏప్రిల్ నాటికి 100 కళాశాలలకు న్యాక్ గుర్తింపుతో కొత్త విద్యా సంవత్సరంలోకి విద్యార్థులను ఆహ్వానించనున్నాయి. ఆరోపణ: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ప్రైవేటు కళాశాలలకు వెళ్లడంతో ఆర్థిక భారం.. వాస్తవం: ప్రభుత్వం పూర్తిఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంతో పాటు జగనన్న వసతి దీవెనను ఎటువంటి పక్షపాతం లేకుండా అందిస్తోంది. గతంలో వసతి దీవెనలో రూ.4వేల నుంచి రూ.10వేల మధ్య శ్లాబ్ పెట్టి మరీ ఇచ్చేవారు. కానీ, సీఎం జగన్ పాలనలో శ్లాబ్ విధానాన్ని తొలగించి అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సమానంగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. ఇక్కడ వీలైనంత మందిని అర్హులుగా చేర్పించేందుకు కుటుంబ వార్షిక ఆదాయం పరిమితిని పెంచింది. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు రూ.లక్ష ఉంటే.. ఎస్సీ, ఎస్టీలకు రూ.2 లక్షలు ఉండేది. కానీ, ఇప్పుడు అన్ని వర్గాల వారికీ కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువమందికి లబ్ధిచేకూర్చారు. పీజీ విద్యలో ప్రైవేటు కళాశాలల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వ వర్సిటీ విద్యను ప్రోత్సహించేలా అక్కడే పూర్తి రీయింబర్స్మెంట్ ఇస్తోంది. తద్వారా ప్రతిభగల విద్యార్థులు వర్సిటీల్లో ఉచితంగానే పీజీ విద్యను అభ్యసిస్తున్నారు. -
Fact Check: స్థిరాస్తులకు రక్షణ కల్పించినా ఏడుపేనా?
సామాన్యులకు మంచి జరిగితే తట్టుకోలేకపోతున్నారు. భూ యాజమాన్య హక్కులపై పటిష్ట చట్టం తీసుకొస్తే దానిపై దుష్ప్రచారం చేస్తున్నారు. వివాదాలు లేని భూ రికార్డుల వ్యవస్థ తీసుకొద్దామంటే అడ్డం పడుతున్నారు. దానిపై రెచ్చగొట్టేలా అబద్ధాల కథనాలు అచ్చేస్తున్నారు. ఇదీ రామోజీ సారధ్యంలో నడుస్తున్న ఈనాడు పనితీరు. అసలు హైదరాబాద్లో ఫిల్మ్సిటీకోసం వేలాది ఎకరాలు ఆక్రమించేసిన రామోజీ ఈ రాష్ట్రంలో పేదలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంటే దానివల్ల తీరిన నష్టమంటూ దెయ్యాలు వేదాలు వల్లించినట్టు గగ్గోలు పెడుతున్నారు. కనీసం నలుగురు నవి్వపోతారన్న ఇంకితం కూడా లేకుండా ‘కోర్టులకూ కత్తెర... భూ హక్కులకు పాతర’ అంటూ ఓ వికృత కథనాన్ని వండి వార్చారు. సాక్షి, అమరావతి: హైదరాబాద్లో ఫిల్మ్సిటీ పేరిట వందల ఎకరాల పేదల భూములను లాక్కున్న రామోజీరావు ఏపీలో భూ హక్కుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారు. విశాఖ, విజయవాడలోనూ ఈనాడు కార్యాలయాల కోసం అత్యంత విలువైన భూములను లీజు పేరుతో కబ్జా చేసిన ఆయన భూ మాఫియా డాన్లకు ఏమాత్రం తీసిపోరు. అలాంటి వ్యక్తి ఏపీలో ప్రజల స్థిరాస్తులకు రక్షణ కల్పించే ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై అడ్డగోలుగా వక్రీకరించి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఈ చట్టం ద్వారా ప్రజలకు ఎక్కడ మేలు జరుగుతుందోనన్న భయంతో అభూతకల్పనలతోదుష్ప్రచారానికి దిగారు. ఒకవైపు ఈ చట్టాన్ని మేధావులు, భూ చట్టాల నిపుణులు ప్రశంసిస్తుంటే దీనివల్ల ఏదో నష్టం జరిగిపోతోందంటూ అబద్ధాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. అన్నీ అభూత కల్పనలే... ఈ చట్టం ద్వారా కోర్టులకు కత్తెర పడుతోందని, అధికారులకే హక్కుల నిర్ణయాధికారం ఉంటుందనేది పచ్చి అబద్ధం. కోర్టుల పరిధి, నియంత్రణ ఎప్పటిలానే ఉంటుంది. రికా>ర్డ్ ఆఫ్ టైటిల్స్లో నమోదైన వివరాలు, కోర్టు అప్పీళ్లు, రివిజిన్ పిటిషన్లు ఉంటే వాటి గురించి టీఆర్ఓ(టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి)కి తెలపాల్సి వుంటుంది. ఏదైనా భూమికి సంబంధించి వివాదం ఏర్పడితే ఆ వివరాలను టీఆర్ఓకి తెలిపితే ఆ వివరాలను రిజిస్టర్లో నమోదు చేస్తారు. కోర్టుల్లో పరిష్కారమయ్యాకే తుది వివరాలను అందులో పొందుపరుస్తారు. అంటే భూ యజమానులకు కచ్చితమైన టైటిల్ ఇవ్వడం, దానిపై ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుండడం హక్కులకు పాతర వేయడం ఎలా అవుతుందో రామోజీకే తెలియాలి. తుది నివేదిక మీ భూమి పోర్టల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నపుడు భూ హక్కులకు ఎందుకు ప్రమాదం ఉంటుందనేది ఎవరికైనా అర్థమవుతుంది. వివాదాలు లేని భూ రికార్డుల వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీ ప్రభుత్వం తీసుకొచి్చన ఈ చట్టంపై ఈనాడు వక్రీకరిస్తోంది. రీ సర్వే తర్వాతే హక్కుల నిర్థారణ.. ప్రస్తుతం ఉన్న ప్రజెంటివ్ టైటిల్ విధానంలో భూమి ఆ«దీనంలో ఉన్నా రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదవకపోతే సంబంధిత యజమానికి ఇబ్బంది ఎదురవుతుంది. రీ సర్వేలో భూములపై ఉన్న వాస్తవ పరిస్థితిని సర్వే చేసి, వాటిని రెవెన్యూ రికార్డుల్లో అప్డేట్ చేస్తున్నారు. ఆ తర్వాతే భూ యజమానుల హక్కులను నోటిఫై చేస్తారు. దానిపై రెండేళ్ల వరకు ఎలాంటి వివాదాలు రాకపోతే అప్పుడు ఆ భూమిపై వారికి పూర్తి హక్కు ఇస్తారు. ఆ హక్కుకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. దీనివల్ల స్థిరాస్తులకు ఎసరు పెట్టడం ఎలా అవుతుందో రామోజీకే తెలియాలి. ► టీడీపీ హయాంలో వెబ్ల్యాండ్లో వివరాలు తప్పుగా నమోదు చేయడం వల్ల లక్షలాది ఎకరాలు ఆంక్షల జాబితాలో చేరిపోయాయి. వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి ఆ భూముల యజమానులు ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. అలాంటి తప్పులు ఈ విధానం ద్వారా తొలగించేందుకు అవకాశం ఉంటుంది. ► ప్రస్తుతం భూములపై రికార్డుల పరంగా కచి్చతమైన హక్కులు లేకపోవడం వల్ల దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని భూకబ్జాదారులు మోసాలకు తెగబడుతున్నారు. భూమిపై ఒకలా, రికార్డుల్లో మరోలా హద్దులు ఉండడంతో భూ వివాదాలు ఏర్పడుతున్నాయి. టైట్లింగ్ చట్టం ప్రకారం రీ సర్వే చేస్తే జియో కోఆర్డినేట్స్ ద్వారా హక్కులు నిర్థారించవచ్చు. ప్రజలను భయభ్రాంతులను చేసేందుకే... రీసర్వేలో అందరి సమక్షంలోనే ప్రతి భూ కమతం వివరాలు కొత్త టెక్నాలజీతో సర్వే చేసి, వారి దగ్గరున్న పత్రాలను పరిశీలించి కొత్త రిజిస్టర్లో నమోదు చేస్తారు. ప్రస్తుతం ఉన్న అనేక రకాల రికార్డుల స్థానంలో ఇకపై ఈ ఒక్క రిజిస్టర్ ఉంటే సరిపోతుంది. అంతవరకు ఉన్న రికార్డులు కూడా చెల్లుబాటవుతాయి. కానీ వాటి అవసరం ఉండదు. ఒకవేళ అన్ని పత్రాలున్నా రికార్డుల్లో నమోదవకపోతే అప్పిలేట్ అథారిటీని సంప్రదించే అవకాశం ఉంటుంది. కానీ దీనిపై భయభ్రాంతులకు గురిచేసేలా అడ్డగోలుగా ఈనాడులో అచ్చేశారు. ► ఒకసారి భూ హక్కు ఖరారయ్యాక రెండేళ్లలో అభ్యంతరాలు ఏమీ రాకుంటే అదే ఫైనల్ అవుతుంది. దీన్ని వక్రీకరించడం అన్యాయం. రీ సర్వేలో అభ్యంతరాలు లేని భూములు, వివాదాలున్న భూములు, వివిధ కోర్టు కేసుల్లో ఉన్న భూములు, తాకట్టు పెట్టిన భూములు సవివరంగా నమోదవుతాయి. ఎలాంటి వివాదాలు లేని భూములను రిజిస్టర్ ఆఫ్ టైటిల్లో ఎక్కిస్తారు. ఆ తర్వాత కూడా ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని దానిపై నిర్ణయం తీసుకుంటారు. తప్పుడు ప్రచారంతో పైశాచికానందం ► ఒక భూమితో సంబంధంలేని వ్యక్తి కేవలం వివాదం సృష్టించాలనే ఉద్దేశంతో సివిల్ కోర్టులో కేసు వేస్తే యజమాని కోర్టుల చుట్టూ తిరిగాల్సి వస్తుంది. కొత్త చట్టంలో ఇలాంటి సమస్యలపై సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం కాకుండా సహజ న్యాయ సూత్రాల ప్రకారం సంబంధిత రైతులు, సమీప రైతులు, గ్రామ పెద్దలందరి సమక్షంలో విచారణ నిర్వహించి వివాదాన్ని పరిష్కరించుకోవచ్చు. అయినా సమస్య పరిష్కారం కాకపోతే హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అయితే సివిల్ కోర్టుల అధికారాన్ని లాక్కుందనేది ఈనాడు తప్పుడు ప్రచారం. ► కోర్టు ఉత్తర్వులు వెంటనే తెలిస్తేనే రికార్డులు పారదర్శకంగా అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. పాత వివరాలే రికార్డుల్లో ఉంటే కోర్టు తీర్పు ద్వారా ఎలా న్యాయం జరుగుతుంది. న్యాయబద్ధంగా రికార్డులు ఉండడాలని కోరుకోవడం కోర్టు ఆదేశాలను సత్వరం పాటించకపోవడం కాదు కదా.. ► అప్పిలేట్ విధానంలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తుది రికార్డు తయారయ్యే వరకూ ఏ స్థాయి కోర్టుల్లో వివాదాలున్నా వాటిని కోర్టు పరిధిలో ఉన్న భూమిగానే చూపుతారు. కోర్టుల తుది ఉత్తర్వుల ప్రకారమే రికార్డుల్లో పొందుపరుస్తారు. న్యాయ వ్యవస్థలకు ముకుతాడు వేసేలా ఈ చట్టం ఉందనడం ఈనాడు వక్రబుద్ధికి నిదర్శనం. వివరాల నమోదు ఎప్పటినుంచో ఉంది ► అప్పుల వివరాలు రిజిస్టర్లో నమోదు చేయడం అన్నది ఇప్పుడే కొత్తగా రాలేదు. వాటివల్ల ఇటు భూ యజమానులు, తాకట్టు పట్టుకున్న వారికీ ఇబ్బంది ఉండదు. దీనివల్ల ఆ ఆస్తికి సంబంధించిన వివరాలు పారదర్శకంగా ఉంటాయి. ► 30 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్రాలు ఎంతగా ప్రయతి్నంచినా తీసుకురాలేని ఈ చట్టాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకురావడం సాహసమే. దానిని ప్రశంసించాల్సింది పోయిదుష్ప్రచారం చేయడం రామోజీ పైశాచిక చర్య. ► రెండేళ్ల సుదీర్ఘ కసరత్తు, కేంద్ర ప్రభుత్వ సూచనలు, రాష్ట్రపతి ఆమోదం తర్వాతే ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. రీ సర్వేలో రైతుల సమక్షంలోనే హద్దులు నిర్థారించి రికార్డులు అప్డేట్ చేయడం యజమానులకే మేలు. కానీ సొంత వారి కోసం రికార్డులు సృష్టిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గం. అధికారులపైనా ఈనాడు చిన్నచూపు ► బ్రిటీష్ కాలం నుంచి భూపరిపాలనా వ్యవస్థ అధికారుల చేతుల్లోనే ఉంది. ల్యాండ్ సీలింగ్, ఎస్టేట్ ఇనాం, అసైన్మెంట్, సర్వే, హద్దుల చట్టం, ఆర్ఓఆర్ వంటి చట్టాలన్నీ ప్రభుత్వంలోని అధికారులు చేసినవే. ఏ ప్రభుత్వం ఉన్నా అధికారులకే భూపాలన అధికారాలు ఇచ్చారు. హక్కుల నిర్ధారణ, రికార్డుల నిర్వహణ, క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ విభాగాలకు వందేళ్లకు పైగా అనుభవం ఉంది. అయితే వారికి ఎలాంటి నైపుణ్యం, అవగాహన లేదని చెప్పడం రామోజీ నీచబుద్ధికి నిదర్శనం. ► కన్క్లూజివ్ టైటిల్ని రాత్రికే రాత్రే ఇవ్వరు. రాత్రికి రాత్రే ఎవరి పేర్లూ మారిపోవు. రీ సర్వే పూర్తయ్యాక టైటిల్స్ ఇస్తారు. దీనికి రెండేళ్లు పడుతుంది. కానీ అధికార పార్టీ నేతలు రాత్రికి రాత్రి రైతుల భూములను ఇతరుల పేర్లకు మార్చేస్తారన్నది ప్రభుత్వంపై అక్కసే. ► ప్రస్తుతం మ్యుటేషన్కు దరఖాస్తు చేసుకుంటే అభ్యంతరాలకు 15 రోజుల సమయం ఇస్తున్నారు. కొత్త చట్టంలో రెండేళ్లు అవకాశం ఇచ్చారు. రెండేళ్ల తర్వాత కూడా ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే అప్పుడు కన్క్లూజివ్ టైటిల్ ఇస్తారు. దీన్ని వక్రీకరించడం ఈనాడుకే చెల్లింది. ► ప్రస్తుతం 1బీ, పాస్పుస్తకం, అడంగల్, రిజిస్ట్రేషన్ డీడ్ వంటి అనేక పత్రాలున్నాయి. ఈ చట్టం ప్రకారం వీటన్నింటి స్థానంలో ఒకే ఒక శాశ్వత హక్కు పత్రం ఇస్తారు. రికార్డులన్నీ పూర్తిగా అప్డేట్ అయి ఉంటాయి. వాటిని ఎవరూ తారుమారు చేసే అవకాశం ఉండదు. ఆన్లైన్లోనే సురక్షితంగా రికార్డులు ఉంటాయి కాబట్టి వాటికి ఇబ్బంది ఉండదు. రైతుల వద్ద ఉన్న దస్తావేజులకు విలువ ఉండదనే తప్పుడు ప్రచారం తీసుకొచ్చారు. ► భూపరిపాలనా వ్యవస్థలో అధికారం, కండబలం, ధనబలం లాంటి అంశాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ చోటుండకూడదనే ఉద్దేశంతోనే ఈ చట్టం తీసుకొచ్చారు. వివాదాల్లేని రీతిలో కన్క్లూజివ్ టైటిల్స్ను ఖరారు చేస్తారు. ఈ రికార్డులు ఆన్లైన్లో, ఇంటర్నెట్లో ప్రతి ఒక్కరు చూసే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా సరే వారి భూమిపై ఏ విధమైన మార్పు జరిగినా వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. అధికారం ఉన్న వారికి, కండబలం ఉన్న వారి చేతుల్లోకి భూములు వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నది రామోజీ వంకర బుద్ధికి నిదర్శనం. -
Fact Check: రామోజీ.. ఇసుకపై బురద రాతలు మానవా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై రామోజీరావు వక్రరాతలు మానడంలేదు. నిత్యం తన ఈనాడు పత్రికలో ఇసుకపై బురద వార్తలు రాస్తూనే ఉన్నారు. తన గలీజుతనాన్ని బయటపెట్టుకుంటూనే ఉన్నారు. ఇసుక తవ్వకాల్లో లేని అక్రమాలను ఉన్నట్లు చూపించేందుకు రామోజీరావు పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. ఇసుక తవ్వకాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) తనకు చెప్పినట్లే కథనాలు అల్లేస్తున్నారు. వాటిని చూసి ప్రజలు నమ్మేస్తారని అపోహ పడుతున్నారు. చంద్రబాబు హయాంలో గతంలో ఎప్పుడూ లేనంత పెద్దఎత్తున అక్రమ ఇసుక తవ్వకాలు జరిగినా పట్టించుకోకుండా ఇప్పుడు ప్రజలకు సులభంగా ఇసుక అందుతున్నా కూడా ప్రభుత్వంపై దు్రష్పచారానికి ఒడిగడుతున్నారు. నిజానికి ఇసుక తవ్వకాల్లో ఎన్జీటీ నిబంధనల ప్రకారమే ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 110 ఇసుక రీచ్లకు పర్యావరణ అనుమతులు ఉన్నా.. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలతో వాటిల్లో తవ్వకాలను నిలిపివేసింది. తర్వాత ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా తిరిగి అన్ని అనుమతుల కోసం గనుల శాఖ దరఖాస్తు చేసింది. అందులో భాగంగా ఇప్పటివరకు 61 ఓపెన్ రీచ్లకు అనుమతులు లభించాయి. మిగిలిన వాటికి మరో వారం రోజుల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సంబంధిత శాఖల నుంచి అనుమతులు ఉన్న డీసిల్టింగ్ పాయింట్లలో మాత్రమే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అయినా ‘ఉల్లంఘనలు నిజం’ అంటూ పతాక శీర్షికతో పచ్చి అబద్ధాలను ఈనాడు అచ్చేసింది. ఎన్జీటీకి 3 నెలలకోసారి నివేదిక ఇచ్చేలా చర్యలు ఇసుక విషయంలో ప్రభుత్వం అత్యంత పారదర్శక విధానాన్ని అమలు చేస్తోంది. ఎన్జీటీ నుంచి వచ్చిన సూచనలు, మార్గదర్శకాలతో దీన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు గనుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ కమిటీ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇసుక తవ్వకాలపై సమగ్ర నివేదికను ఎన్జీటీకి సమర్పించేలా ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం ఇంత బాధ్యతతో వ్యవహరిస్తోంది. న్యాయస్థానాల ఆదేశాల ప్రకారం తనిఖీలు న్యాయస్థానాల ఆదేశాలతో జిల్లాల కలెక్టర్లతో కూడిన బృందాలు రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్లను ఇటీవల పరిశీలించాయి. ఆయా రీచ్ల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయా? లేదా అనే అంశాలను రికార్డు చేశాయి. ఈ నివేదికలను న్యాయస్థానాలకు సమర్పించారు. ఎన్జీటీ ఆదేశాలకు అనుగుణంగా గనుల శాఖ తీసుకున్న చర్యల కారణంగా అనుమతి లేని రీచ్ల్లో తవ్వకాలు నిలిచిపోయాయి. ఇదే అంశాన్ని కలెక్టర్లు కూడా తమ నివేదికలో స్పష్టం చేశారు. ఈనాడు మాత్రం కలెక్టర్లు వచ్చి వెళ్లిన తరువాత ఇసుక తవ్వకాలు మళ్లీ జరుగుతున్నాయంటూ అడ్డగోలుగా అబద్ధాలు ప్రచురించింది. అదికూడా భారీ యంత్రాలను రీచ్లకు తరలించి వెంటనే తవ్వకాలు ప్రారంభించారంటూ నిస్సిగ్గుగా రాసింది. ఒకవైపు ఇసుక రీచ్ల్లో అధికారిక తనిఖీలు జరుగుతూ ఉంటే, మరోవైపు ఎవరైనా భారీ యంత్రాలను రీచ్లకు తరలిస్తారా? అసలు తవ్వకాలే జరగడం లేదని అధికారులు ప్రత్యక్షంగా తనిఖీ చేసి నివేదిక ఇస్తే, రోజుకు రెండు వేల టన్నుల ఇసుక తవ్వుతున్నారంటూ, కంప్యూటరైజ్డ్ వే బిల్లులు లేకుండానే ఆ ఇసుకను రవాణా చేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేసింది. పాత ఫోటోలతో ప్రజలను నమ్మించేందుకు విశ్వప్రయత్నం చేసింది. జరగని రవాణాకు జీపీఎస్ ట్రాకింగ్ లేదంటూ, రీచ్ల్లో సీసీ కెమేరాలు లేవని, అడుగడుగునా ఉల్లంఘనలే జరుగుతున్నాయని గగ్గోలు పెట్టడం రామోజీ వక్రబుద్ధికి నిదర్శనం. ఆ పత్రికకు నిబద్ధత ఎక్కడిది? గతేడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు వర్షాల వల్ల ఇసుక తవ్వకాలు రీచ్ల్లో జరగలేదు. వేసవికాలంలో ముందుజాగ్రత్తగా సిద్ధం చేసిన ఇసుక డిపోల నుంచే ప్రజలకు విక్రయాలు జరిగాయి. గతంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ ఈనాడు పత్రిక దానిని అక్రమ ఇసుక తవ్వకాలు కిందనే నిర్ధారించడం ఆ పత్రికకు ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది. బాధ్యతారహితంగా ఈనాడు ప్రచురించే ఇటువంటి కథనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, మైనింగ్ శాఖ -
ఉత్తరాంధ్రపై ఉత్తమాటలెందుకు?
సాక్షి ప్రతినిధి, విజయనగరం : నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి పదవీకాలం ఉన్నా చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడున్న ప్రాజెక్టుల్లో అధిక శాతం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం ఫలాలే. ఆయన అకాల మరణం తర్వాత మూడో దఫా అధికారం చేపట్టిన చంద్రబాబు.. ఆ ప్రాజెక్టుల పూర్తిపై చిత్తశుద్ధి చూపించలేదు. మొక్కుబడిగా నిధులు కేటాయించడమే తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడి పనులు అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. తన తండ్రి ఆశయాల మేరకు జలయజ్ఞం పూర్తిచేయాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే వీటిపై దృష్టి సారించారు. అయితే, కరోనాతో రెండేళ్లు వృధా అయ్యాయి. ఇక భూసేకరణలో ఇబ్బందులు, న్యాయవివాదాలు తలెత్తినా వాటన్నింటినీ అధిగమిస్తూ ప్రాజెక్టులను పూర్తిచేయాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీటన్నింటినీ విస్మరించి ‘ఈనాడు’లో రామోజీరావు ఎప్పటిలాగే విషంకక్కారు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులు ఈ దుస్థితిలో చిక్కుకుపోవడానికి చంద్రబాబు నిర్లక్ష్య పాలనే కారణమన్న విషయాన్ని మరుగునపరచడానికి ఆయన నానాపాట్లు పడ్డారు. ‘ఉత్తరాంధ్రంటే ఉత్తదనుకుంటివా?’ శీర్షికతో శుక్రవారం అవాస్తవాలను వండివార్చారు. ఇష్టారాజ్యంగా దగాకోరు రాతలు రాశారు. కానీ, వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రాజెక్టుల వారీగా ఈనాడు క్షుద్ర రాతలపై ‘ఫ్యాక్ట్చెక్’ ఏమిటంటే.. మడ్డువలస విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస వద్ద సువర్ణముఖి నదిపై నిర్మించిన ప్రాజెక్టు ప్యాకేజీ–1 పనులను డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే రూ.130.60 కోట్ల వ్యయంతో పూర్తిచేయించారు. తద్వారా 24,877 ఎకరాల మేర భూములు సస్యశ్యామలంగా మారాయి. మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ప్యాకేజీ పనుల కోసం రూ.26.90 కోట్లను మంజూరు చేశారు. ఇందుకు అవసరమైన భూసేకరణ పనులు జరుగుతున్నాయి. వంశధార శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు పనుల పూర్తికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ. 2,407.79 కోట్లను మంజూరు చేసింది. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయి. రానున్న జూన్కల్లా పూర్తిచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వంశధార ప్రాజెక్టు రెండో దశ పనుల కోసం 2004 నుంచి 2019 వరకూ అంటే 15 ఏళ్లలో రూ.1,614.82 కోట్లు ఖర్చుచేయగా, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019 నుంచి నేటివరకూ అంటే నాలుగేళ్ల 10 నెలల కాలంలో రూ.400.40 కోట్లు ఖర్చుచేసింది. అయినప్పటికీ ఒడిశా అభ్యంతరాలతో నేరడి బ్యారేజీ నిర్మాణంలో జాప్యం తప్పట్లేదు. ప్రాజెక్టును సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో గొట్టా బ్యారేజీ కుడికాలువపై ఎత్తిపోతల పథకం నిర్మించి హిరమండలం రిజర్వాయరులో 12 టీఎంసీల వరకూ నీటిని నింపాలనే భగీరథ ప్రయత్నానికి ప్రభుత్వం నడుంబిగించింది. 2022 సెప్టెంబర్ 14న రూ.176.35 కోట్ల నిధులను మంజూరుచేసింది. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి. వచ్చే అక్టోబరు నాటికి ఇవి పూర్తికానున్నాయి. మహేంద్రతనయ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రేగులపాడు వద్ద మహేంద్రతనయ నదిపై ఆఫ్షోర్ ప్రాజెక్టు నిర్మాణానికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నాంది పలికారు. తర్వాత వచ్చిన చంద్రబాబు దీన్ని పూర్తిచేయడంపై చిత్తశుద్ధి చూపించలేదు. విపరీతమైన జాప్యంతో ఆ పనులను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రద్దుచేసి, సవరించిన అంచనాలతో రూ.852.45 కోట్లతో 2022 సెప్టెంబరు 14న పరిపాలన ఆమోదాన్ని ఇచ్చింది. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి. జంఝావతి పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద 1976లో నిర్మాణ పనులను ప్రారంభించినా అంతర్రాష్ట్ర సమస్యతో జంఝావతి ప్రాజెక్టు పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. చంద్రబాబు తన పాలనలో ఏరోజు కూడా దాన్ని పూర్తిచేయడంపై దృష్టి పెట్టలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆసియాలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యాంను అక్కడ నిర్మించి జాతికి అంకితం చేశారు. రెండో ప్యాకేజీ కింద కాలువ అభివృద్ధి పనులను ప్రస్తుతం రూ.3.26 కోట్లతో చేపడుతున్నారు. తారకరామతీర్థ సాగర్ ఈ ప్రాజెక్టుతో ముంపునకు గురయ్యే విజయనగరం జిల్లాలోని కోరాడపేట, ఏటీ అగ్రహారం, పడాలపేట గ్రామాల వారికి పునరావాస పనులు ప్రస్తుతం పురోగతి సాధించాయి. కొన్నేళ్లుగా సారిపల్లి గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్న రూ.77 కోట్ల పునరావాస ప్యాకేజీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ప్రాజెక్టు నిర్మాణానికి 2006 నుంచి 2019 వరకూ రూ.166.80 కోట్లు.. భూసేకరణకు రూ.57.06 కోట్లు ఖర్చుచేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019 నుంచి ఇప్పటివరకూ రూ.56.56 కోట్లను నిర్మాణ పనులకు, భూసేకరణకు రూ.25.33 కోట్లను ఖర్చుచేసింది. 2025 మార్చి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేసి విజయనగరం పట్టణ ప్రజలకు సమృద్ధిగా తాగునీరు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అవసరాలకు సరిపడా నీటి సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనులు చేయిస్తోంది. తోటపల్లి ఉత్తరాంధ్రలో విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో 1,31,221 ఎకరాల ఆయకట్టుతో పాటు అదనంగా మరో 11,221 ఎకరాలను స్థిరీకరించేందుకు ఉద్దేశించిన తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో పూర్తిస్థాయిలో నిధులు సమకూర్చారు. ఆయన మరణానంతరం చంద్రబాబు కేవలం ప్రారంభోత్సవం చేశారు. కనీసం పిల్ల కాలువల నిర్మాణాన్ని సైతం గాలికి వదిలేశారు. ఆ మిగులు పనులను ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. రూ.123.21 కోట్లు మంజూరు చేసి పరిపాలనామోదాన్ని ఇచ్చింది. నేటి వరకూ 64.59 కోట్లను వెచ్చించారు. 2025 మార్చి నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గజపతినగరం బ్రాంచ్ కెనాల్ తోటపల్లి కుడి ప్రధాన కాలువ నుంచి గజపతినగరం బ్రాంచ్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీ కెనాల్ నిర్మాణానికి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాల చిన్నచూపు ఫలితంగా పనులు పడకేశాయి. వీటిన్నింటినీ రద్దుచేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2022 ఏప్రిల్ 22న తాజా అంచనాలతో రూ.137.80 కోట్లతో మిగులు పనులు చేపట్టేందుకు పరిపాలనా అనుమతులిచ్చింది. ప్రసుత్తం భూసేకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. -
Fact Check: బాబుపై భక్తితోనే ఉన్మాదరాతలు
కృష్ణా పుష్కరాలవేళ చంద్రబాబు ప్రభుత్వం పదుల సంఖ్యలో ఆలయాలు కూల్చేస్తే రామోజీకి చీమకుట్టినట్టయినా లేదు. అప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నట్టు ఆయనకు అనిపించలేదు. పచ్చ కళ్ల మత్తులో జోగుతున్న ఈనాడుకు నిలదీయాలన్న ధ్యాసే లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని బాధ్యతగా పునరుద్ధరిస్తే కనీసం ప్రశంసించేందుకు కూడా మనసురాలేదు. పైగా కరోనా కల్లోల వేళ కొన్ని అసాంఘిక శక్తులు చేసిన దుష్టచర్యలను ఆనాడే జగన్ హయాంలోని రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేస్తే ఇప్పుడు సర్కారును బాధ్యులను చేస్తూ ఈనాడులో వికృతరాతలు. ఎలాగోలా భక్తుల్లో అలజడి రేపితే మతఘర్షణలకు దారితీయదా... తద్వారా తెలుగుదేశానికి కలసిరాదా... ఈ ప్రభుత్వానికి అప్రదిష్ట కలగదా... అన్న ఉన్మాద రాతలకు తెగబడింది. ‘జగన్ ఏలుబడిలో దేవుళ్లకూ రక్షణ కరవే’ అంటూ ఓ అబద్ధాన్ని వండివార్చింది. సాక్షి, అమరావతి: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు రేపేందుకు ‘ఈనాడు’ పూనుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెరతీసింది. తద్వారా తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కల్పించేందుకు యత్నించింది. కరోనా విపత్కర వేళ ఎవరూ రోడ్డుపైకి రాలేకపోయిన రోజుల్లో వివిధ ఆలయాల్లో చోటు చేసుకున్న 26 దుస్సంఘటనలను ఉదహరిస్తూ దానికీ జగన్ ప్రభుత్వానికి ముడిపెట్టింది. 2020 మార్చి 12 నుంచి 2021 ఏప్రిల్ 16వ తేదీ మధ్య కొన్ని అసాంఘిక శక్తులు ఉద్దేశ పూర్వకంగా పనిగట్టుకొని ఆలయాల్లో కొన్ని దురాగతాలకు పాల్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం ఆలయాల్లో స్వామివార్ల నిత్య పూజలకు, భక్తుల దర్శనాలకు ఎలాంటి విఘాతం కలగకుండా అప్పటికప్పుడే పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. భవిష్యత్లో మరోచోట అలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. దేవదాయశాఖ పరిధిలోని అన్ని ఆలయాలతోపాటు ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని ఆలయాల్లో యుద్ధప్రాతిపదికన సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రాత్రివేళల్లో ఆలయాల వద్ద పోలీసు గస్తీని పెంచింది. తద్వారా రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి దుర్ఘటనలు జరగకుండాచేసింది. కానీ చంద్రబాబుపై తనకున్న ‘స్వామి భక్తి’తో పూర్తిగా ఉన్మాదిగా మారిన ‘ఈనాడు’ ఇప్పుడు.. ఉద్దేశపూర్వకంగా చేసిన ఘటనలను మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. నాడు ఆలయాలు కూల్చేస్తే నోరెత్తలేదేమీ... టీడీపీ హయాంలో పవిత్ర కృష్ణానదీ తీరాన విజయవాడ నగరంలో పదుల సంఖ్యలో పవిత్ర దేవాలయాలను అధికారికంగా కూల్చేశారు. ఆ సంఘటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నా.. ‘ఈనాడు’ కనీసం స్పందించనైనా లేదు. పైగా చంద్రబాబు ఓ గొప్ప విజనరీగా, దార్శనికుడిగా చూపిస్తూ ఆకాశానికెత్తేసింది. నాడు కూల్చేసిన ఆలయాలను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తిరిగి పునర్నిర్మించడంతో పాటు రాష్ట్రంలోని ఇతర దేవాలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. కేవలం నాలుగున్నరేళ్లలోనే రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయశాఖ రూ.539 కోట్లతో 815 పురాతన ఆలయాలను పునరుద్ధరించి, కొత్తగా ఆలయాలు నిర్మించింది. టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలల 2,872 ఆలయాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. దేవుడి ఆస్తుల రక్షణకు జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ♦ రాష్ట్రంలోని దేవుడి ఆస్తులు, విలువైన భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని కొందరు పెత్తందార్లు దర్జాగా వాటిని కైంకర్యం చేసేశారు. ♦ అలాంటి దుశ్చర్యలను కట్టడి చేస్తూ జగన్ ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆక్రమణలపై కోర్టు ప్రక్రియ ద్వారా కాలయాపన లేకుండా ఆక్రమణదారునికి కేవలం ఒక నోటీసు ఇచ్చి... వారం రోజుల తర్వాత ఆ భూమిని స్వా«దీనం చేసుకునే అధికారాన్ని ఆర్డినెన్స్ ద్వారా దేవదాయశాఖకు కట్టబెట్టింది. ♦ ఇప్పటి వరకు ఆ భూములు స్వాధీనం చేసుకోవడానికి దేవదాయ శాఖ అధికారులు ముందుగా ఎండోమెంట్ ట్రిబ్యునల్లో పిటీషన్ వేయాల్సి ఉండేది. ట్రిబ్యునల్ ఆక్రమణదారునికి సైతం తమ లాయర్ల ద్వారా వాదనలు వినిపించుకునే అవకాశమిచ్చింది. ట్రిబ్యునల్ దానిపై నిర్ణయం వెలువరించేవరకూ ఆ భూములు అనుభవించుకునే వెసులుబాటు ఆక్రమణదారులకే లభించేది. ♦ ఒకవేళ ట్రిబ్యునల్ దేవదాయశాఖకు అనుకూలంగా తీర్పునిస్తే, దానిపై మళ్లీ అప్పీల్ చేసుకుని కాలయాపన చేసే వెసులుబాటు ఆక్రమణదారులకుంది. దానివల్ల స్వాధీన ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చేది కాదు. కొత్త చట్టంతో దానికి కళ్లెం వేయగలిగింది. ♦ ఇంకోవైపు ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ ఖజానా నుంచి తొలిసారి ఆలయ అభివృద్ధి పనులకు నేరుగా నిధులను మంజూరు చేసేలా చర్యలు చేపట్టింది. ♦ ఏడాదికి రూ.5 లక్షల లోపు ఆదాయం ఉండే ఆలయాలన్నింటినీ కేవలం ఆయా ఆలయాల వంశపారంపర్య ధర్మకర్తలకు, లేదంటే వంశపారంపర్య అర్చకులకు, ఇతర హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించేందుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ♦ రాష్ట్రంలోనూ ఆలయాల నిర్వహణ, దేవదాయ శాఖ నిర్వహణలోనూ రాజకీయ జోక్యాన్ని పూర్తిగా తగ్గిస్తూ వివిధ స్వామీజీలు, రిటైర్డు జడ్జిలు, రిటైర్డు దేవదాయ శాఖ అధికారులు సభ్యులుగా ఉండే ధార్మిక పరిషత్ను సుదీర్ఘకాలం తర్వాత 2022లో జగన్ ప్రభుత్వం రెండో విడత ఏర్పాటు చేసింది. -
అప్పటి సర్వీస్ కమిషన్ కాదు బాసూ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్సర్వీస్ కమిషన్.. ఒకప్పుడు చంద్రబాబు సేవలో తరించిన ఈ సంస్థ.. ఇప్పుడు నిరుద్యోగుల సేవలో లీనమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సంస్థను పూర్తిగా ప్రక్షాళన జరిపి, నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే కేంద్రంగా మలిచారు. ఇది గత నాలుగున్నరేళ్లల్లో 78 నోటిఫికేషన్లు ఇచ్చి, 6,296 ఉద్యోగాలను వివాద రహితంగా భర్తీ చేసింది. అంతేకాకుండా సచివాలయాల్లో ఒకేసారి 1.21 లక్షల మందిని నియమించి రికార్డు సృష్టించింది. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి వివాదాల్లో ఉన్నవాటిని సైతం పరిష్కరించి, పోస్టుల భర్తీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఇందులో విద్యావంతులైన నిరుద్యోగ యువతకు మేలు చేసేలా గ్రూప్–1, గ్రూప్–2 వంటి గెజిటెడ్ పోస్టులతో పాటు, వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజినీర్లు, అగ్రికల్చరల్ ఆఫీసర్లు, మరెన్నో నాన్ గెజిటెడ్ పోస్టులకు నియామకాలు పూర్తి చేశారు. ఒక్క కోర్టు కేసు లేదు.. ఒక్క విమర్శా లేదు.. ఒక్క ఫిర్యాదూ లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదకలో దేశంలోని 15 రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకుంటే, వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడే పచ్చ మీడియా బాసు రామోజీకి కాలేది. ‘ఏ వివాదం లేకుండా, ఉద్యోగాలెలా ఇచ్చేస్తారు? అసలు వివాదాలు పెట్టేదే ఉద్యోగాలు ఎగ్గొట్టడానికి కదా. చంద్రబాబు హయాంలో అంతా ఇలానే జరిగింది కదా! ఇప్పుడంతా సక్రమంగా జరగడమేంటి’ అంటూ లోలోన మండిపోయి.. ఏపీపీఎస్సీపై ఓ బండ వేయాలని చూశారు. చంద్రబాబు హయాంలో ఏపీపీఎస్సీలో చైర్మన్, సభ్యుల నియామకాల్లో జరిగిన ఆశ్రిత పక్షపాతం, అవకతవకలను వదిలేసి, ఇప్పుడు కమిషన్ను ప్రక్షాళన చేసి నియామకాలన్నీ రాజ్యాంగబద్ధంగా జరిగినప్పటికీ, ‘‘ఏపీపీఎస్సీనా? వైసీపీఎస్సీనా?’’ అంటూ ఈనాడు పత్రికలో విషం కక్కారు. కమిషన్ను కమీషన్లతో నింపేసిన బాబు చంద్రబాబు సీఎంగా ఉండగా ఏపీపీఎస్సీని తన అభిమానులు, తనకు సేవ చేసే వారితో నింపేశారు. ఆయన హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చినా పరీక్షలు ఎప్పుడు జరిగేది, నియామకాలు ఎప్పుడు పూర్తయ్యేదీ తెలియని పరిస్థితి. ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ పైనా అనేక వివాదాలు.. కోర్టు కేసులు వంటి కారణాలతో నిలిచిపోవడమో లేక పరీక్షలు రద్దు కావడమో జరిగేవి. 2014–18 మధ్య ఇచ్చిన నోటిఫికేషను వేళ్లపై లెక్కించేవే అయినా దాదాపు 350కి పైగా కేసులు పడ్డాయి. అసలు సభ్యుల నియామకమే కమీషన్లపై జరిగిందని ఆ పార్టీలోని ముఖ్య నేతలే విమర్శించారు. 2014 ఎన్నికలకు ఎన్నారైల నుంచి నిధులు సేకరించినందుకు ఉదయ్ భాస్కర్కు ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి కట్టబెట్టారన్న విమర్శలు ఉండేవి. సభ్యుల విషయానికి వస్తే నాటి ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే కుమార్తె గుర్రం సుజాత, తాడికొండలో టీడీపీ అభిమాని విజయకుమార్, నాటి హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప సిఫారసుతో పద్మరాజును నియమించారు. చంద్రబాబు ప్రభుత్వంలో చక్రం తిప్పిన నాటి ఐఏఎస్ అధికారి సతీష్చంద్ర తన శిష్యుడు రామరాజుకు సభ్యుడిగా పదవి ఇప్పించారు. మరో సభ్యుడు రంగ జనార్థన్ కూడా ఇలా వచ్చినవారే. వీరికి పదవులు ఇచ్చే ముందే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఎస్వీ యూనివర్సిటీ ఉద్యోగి భాస్కర్ నాయుడు తిరుపతిలో వీరితో వేర్వేరుగా సమావేశమై, తాము చెప్పినట్టు వింటేనే పదవులు ఉంటాయని హెచ్చరించిన విషయం ఎల్లో మీడియా కప్పిపుచ్చినా బయటకు వచ్చేసింది. ♦ 2016లో నోటిఫికేషన్ ఇచ్చి, 2017 జూలైలో నిర్వహించిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్షను ఎంత వివాదాలతో నింపేశారో ప్రతి నిరుద్యోగికీ తెలుసు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరగాల్సిన పరీక్షను వారికి అవసరమైన వారికోసం విశాఖపట్నం గీతం కాలేజీ, మరికొన్ని చోట్ల సాయంత్రం 5 నుంచి రాత్రి 9.30 గంటల వరకు నిర్వహించి వేల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. కొన్ని ప్రశ్నలు ఉద్దేశపూర్వకంగా బయటకు వెల్లడించగా.. ఇవన్నీ గీతం కాలేజీ కేంద్రంగానే జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిపై పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. ♦ అధికార పార్టీ పెద్దలతో సాన్నిహిత్యమున్న కొన్ని కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు ఏపీపీఎస్సీలో తిష్టవేసి ఇష్టారీతిన వ్యవహారాలు నడిపించాయి. తమ వద్ద చదివిన వారు ఒకే కేంద్రంలో వరుసగా వచ్చేలా ఏర్పాట్లు చేయించుకొని మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రశ్నపత్రాలు, సమాధాన పత్రాల స్క్రీన్షాట్లు ఏకంగా వాట్సప్లలో ప్రత్యక్షమయ్యాయి. ♦ కమిషన్లో మెజారిటీ సభ్యుల ఆమోదంతో తీసుసుకోవాల్సిన నిర్ణయాలను నాటి చైర్మన్ ఉదయ్ భాస్కర్ ఒక్కరే తీసుకుని వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. ♦ ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానాన్ని ప్రోత్సహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంది. వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రాకుండా 2017లో జీవో నం.55 విడుదల చేసి, డిపార్ట్మెంటల్ టెస్టుల్లో ‘మైనస్ మార్కు’లను అమల్లోకి తెచ్చింది. దాంతో అంతకుముందు ఏటా సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ పరీక్షల్లో 60 శాతం మంది ఉత్తీర్ణులైతే.. జీవో నం.55 వచ్చాక ఆ సంఖ్య 4 నుంచి 6 శాతం మించలేదు. కొన్ని విభాగాల్లో ఒక్క శాతం కూడా పాసవలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ జీవోతో దాదాపు ఉద్యోగులు మూడేళ్లపాటు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు కోల్పోయారు. ♦ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2018 డిసెంబర్లో 32 నోటిఫికేషన్లు జారీ చేసి, భర్తీకి పరీక్షలు కూడా నిర్వహించలేదు. ఇప్పుడు నిబద్ధతతో పనిచేసే వారికే సభ్యులుగా అవకాశం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేసింది. అన్ని అర్హతలున్నవారు, సమర్థతతో పనిచేసే వారు, నిరుద్యోగుల కష్టాలు తెలిసిన వారిని సభ్యులుగా నియమించింది. దాంతో గత నాలుగేళ్లల్లో ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్లు ఇచ్చి, 6,296 పోస్టులను సకాలంలో భర్తీ చేసింది. ‘సచివాలయ’ వ్యవస్థలో ఒకేసారి 1.21 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చే బాధ్యతను కూడా కమిషన్ విజయవంతంగా నిర్వర్తించింది. ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగాల భర్తీ దేశచరిత్రలోనే లేదు. గత డిసెంబర్లో 899 గ్రూప్–2 పోస్టులతో పాటు గ్రూప్–1, పాలిటెక్నిక్ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు వంటి దాదాపు 1,446 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఈనెల 25న జరిగే గ్రూప్–2 పరీక్షకు ఎల్లో మీడియా, టీడీపీ కలిసి ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినప్పటికీ, సర్వీస్ కమిషన్ సమర్థంగా అధిగమించి ముందుకెళుతోంది. 2019–23 మధ్య ఏపీపీఎస్సీ నిర్వహించిన 78 నోటిఫికేషన్లలో ఒక్కటి కూడా వాయిదా పడలేదు. నిరుద్యోగుల నుంచి ఒక్క కేసు నమోదైందీ లేదు. కేంద్ర ప్రభుత్వ ప్రశంసలూ పొందింది. అయినా, వాస్తవాలన్నింటినీ కప్పిపుచ్చి ఎల్లో బాసు రామోజీ మాత్రం అక్రమాలంటూ అభాండాలు వేస్తున్నారు. -
బహిరంగ విచారణ దేనికి.!
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటలు నిరంతరాయంగా విద్యుత్ అందించడానికి, రైతులకు ఉచిత విద్యుత్పై రానున్న 30 ఏళ్ల పాటు హక్కు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. యూనిట్ కేవలం రూ.2.49 పైసలకే 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఈ ఒప్పందం కుదిరింది. విద్యుత్ చట్టాలకు అనుగుణంగానే అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాయి. తక్కువ రేటుకే విద్యుత్ కొని 30 ఏళ్ల పాటు రాష్ట్రంలోని అన్నదాతలకు ఉచితంగా విద్యుత్ అందించే మంచి కార్యక్రమం ఈనాడుకు నచ్చలేదు. రామోజీ ఏకంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)నే తప్పుబడుతూ ఈనాడులో కథనాలు ఇస్తున్నారు. సాక్షాత్తూ మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో జరుగుతున్న కార్యకలాపాలపైనే అడ్డగోలుగా అక్కసు వెళ్లగక్కుతున్నారు. రెండు రోజులుగా ఈనాడు పత్రికలో వస్తున్న అసత్య కథనాలను ఏపీఈఆర్సీ తీవ్రంగా పరిగణించింది. కనీస అవగాహన లేకుండా, చట్టం గురించి తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాయడంపై తీవ్రంగా మండిపడింది. ఈ మేరకు ఏపీఈఆర్సీ ‘సాక్షి’కి శుక్రవారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఈనాడు ఆరోపణ: సెకీతో 2021లో కుదుర్చుకున్న 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ జరపకుండా గోప్యత పాటించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. వాస్తవం: విద్యుత్ నియంత్రణ మండలి స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్ర స్థాయి అత్యున్నత సంస్థ. మండలి తీసుకునే ప్రతి నిర్ణయం అత్యంత పారదర్శకంగా, చట్టబద్ధంగా ఉంటాయి. ఇందులో ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేదు. మండలి నిర్ణయాలపై ఎలాంటి గోప్యతకు తావులేదు. బహిరంగ విచారణ విషయానికొస్తే మండలి అనుసరించే విచారణ ప్రక్రియ విద్యుత్ సరఫరా చట్టం, అందుకు అనుగుణంగా మండలి జారీ చేసే మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది. సెక్షన్ 62 – 64 ప్రకారం పంపిణీ సంస్థల టారిఫ్ను నిర్దేశించే క్రమంలో డిస్కంలు దాఖలు చేసిన ప్రతిపాదనలను పత్రికాముఖంగా తెలియజేయాలి. ఆ ప్రతిపాదనలపై వచ్చే అన్ని అభ్యంతరాలను పరిశీలించి, మండలి వాటిపై తుది నిర్ణయం తీసుకుంటుంది. అలాగే సెకీతో ఒప్పందం కుదుర్చుకునే ముందు డిస్కంలు మండలి అనుమతి కోరాయి. ఐదో నియంత్రిత కాలం లోడ్ ఫోర్కాస్ట్ రిసోర్స్ ప్లాన్ ప్రకారం ఉన్న విద్యుత్ అవసరాల రీత్యా 7 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం అని మండలి భావించింది. ఇందుకు సహేతుక కారణాలు తెలుపుతూ 2021 నవంబర్ 11న డిస్కంల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనలకు మండలి షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. విద్యుత్ టారిఫ్ విషయానికి వస్తే సంబంధిత విద్యుత్ నియంత్రణ మండలి మాత్రమే టారిఫ్ని నిర్ధారిస్తుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పింది. 2022లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ (సీఈఆర్సీ)లో దాఖలైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని యూనిట్ రూ.2.49 పైసలుగా టారిఫ్ను నిర్ధారించింది. దీనికి సంబంధించి ఏపీ హైకోర్టులో అభ్యంతరదారులు పిల్ దాఖలు చేశారు. ఆ కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఆరోపణ: విద్యుత్ పంపిణీ సంస్థలు సెకీతో చేసుకున్న ఒప్పందం ఆమోదం కోసం దాఖలు చేసిన పిటిషన్ను మండలి వెబ్సైట్లో ఉంచలేదు. వాస్తవం: ఈ విమర్శల్లో ఎటువంటి వాస్తవికత గాని, హేతుబద్ధత గాని లేదు. ఏదైనా ప్రతిపాదనపై విచారణ ప్రక్రియ చట్టానికి అనుగుణంగా జరుగుతుంది. వినియోగదారుల విద్యుత్ చార్జీల సవరణ, ట్రూఅప్ చార్జీలపై మాత్రమే కమిషన్ బహిరంగ విచారణ చేపడుతుంది. వాటికి సంబంధించిన అంశాలను మాత్రమే వెబ్సైట్లో ఉంచుతుంది. ఇతర ఏ ప్రతిపాదనలకు బహిరంగ విచారణ జరపాలని గానీ, వెబ్సైట్లో పెట్టాలని గానీ చట్టంలో నిబంధన లేదు. అందువల్ల పత్రికలో మండలిపై చేసిన ఆరోపణలు పూర్తి నిరాధారాలు. ఇటువంటి వార్తలు ప్రచురించడం ద్వారా మండలి లాంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలపై ప్రజల్లో అపోహలు కలిగించడం వ్యవస్థకు ఎంత మాత్రం మేలు చేయదు. -
Fact Check: పరిమితికి లోబడ్డా పైశాచిక రాతలే!
సాక్షి, అమరావతి : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రామోజీలో ఆవేశం శృతిమించుతోంది. సీఎం వైఎస్ జగన్ ‘సిద్ధం’ సభలు కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమవుతుండడంతో ఆయనలో కడుపుమంట తారాస్థాయికి చేరుతోంది. ఫలితంగా తన క్షుద్రపత్రిక ఈనాడులో రాతలు అదుపు తప్పడమే కాదు పట్టాలూ తప్పుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం అదే పనిగా అశుద్ధ కథనాలు వండివారుస్తున్న రామోజీ అప్పులపై అదే పనిగా కొట్టిన డప్పే మళ్లీ మళ్లీ కొడుతూ తన కడుపు ఉబ్బరాన్ని తీర్చుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. నిజానికి.. అప్పులపై నానా చెత్త పోగేసి విషం కక్కుతున్న ఆయన ఒకసారి కాగ్ వెబ్సైట్కు వెళ్లి చూస్తే బాబు హయాంలో ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు మించి ఎంత అప్పుచేశారో తెలుస్తుంది. అలాగే, వైఎస్సార్సీపీ హయాంలో కూడా ఆర్థిక సంఘం సిఫార్సులు ఏమిటి? ఎంత అప్పు చేశారనేది అర్థమైపోతుంది. కానీ, రామోజీ అలా చేయరు. ఎందుకంటే.. తన ఆత్మబంధువు చంద్రబాబు బండారం బయటపడిపోతుంది కాబట్టి. రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై రామోజీ ప్రచారం చేస్తున్న అబద్ధాల కుప్పలోని ‘ఫ్యాక్ట్చెక్’ఏమిటంటే.. బాబుకు, జగన్కు తేడా ఇదీ.. వైఎస్ జగన్ సర్కారు అప్పులపై నిత్యం అక్కసును రంగరించి తప్పుడు గణాంకాలతో డప్పు వాయించడంవల్ల నీ పత్రిక, నీ పరువు దిగజార్చుకోవడం తప్ప మరొకటి ఉండదు రామోజీ. వాస్తవానికి.. అప్పు చేయడం తప్పని ప్రతిపక్ష నేతగా జగన్ ఏనాడూ అనలేదు. పరిమితికి మించి అప్పు చేయడాన్నే ఆయన తప్పుబట్టారు. అయినా, చేసిన అప్పులతో ఒక శాశ్వత కట్టడం కూడా కట్టకుండా కేవలం హంగులు, ఆర్భాటాలు, విలాసాలకు వృధా వ్యయం చేయడాన్నే ఆయన తప్పుబట్టారు. పరిమితికి మంచి అప్పులు చేసినా మేనిఫెస్టోలో రైతులకు.. మహిళా సంఘాలకు, యువత తదితర రంగాలకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడాన్ని జగన్ తప్పుబట్టారు. అసలు చంద్రబాబు తన ఐదేళ్లు ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు మించి అప్పులు చేశారని కాగ్ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోవిడ్ రెండేళ్లు తప్ప మిగతా సంవత్సరాలు ఆర్థిక సంఘం సిఫార్సుల కన్నా తక్కువగానే అప్పులుచేసింది. కోవిడ్ సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆదాయంతో పాటు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రావాల్సిన రాబడి తగ్గిపోవడంతో వ్యయం పెరిగినా పరిమితికి లోబడే అప్పులు చేస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలుచేసింది. మీ చంద్రబాబు మాదిరిగా రైతులకు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చిన హామీలను జగన్ సర్కారు గాలికొదిలేయకుండా నవరత్నాలతో నేరుగా నగదు బదిలీ ద్వారా హామీలను నెరవేర్చింది. నిబంధనలకు లోబడి అప్పులు చేస్తున్నా ఏడుపేనా? మరోవైపు.. 2021–22 ఆర్థిక సంవత్సరంలో పరిమితి ఉన్నప్పటికీ ఏకంగా రూ.26,668.46 కోట్లు తక్కువగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పుచేసింది. రాష్ట్ర విభజనానంతరం 2021–22 ఆర్థిక సంవత్సరంలో జగన్ సర్కారు అతి తక్కువగా 2.18 శాతం ద్రవ్యలోటు రికార్డు చేసింది. కోవిడ్ లాంటి సంక్షోభం లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో ఏ ఏడాది కూడా ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి అప్పులు చేయలేదు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసినా ఈనాడు రామోజీకి అది కనిపించలేదు. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పుడు నిబంధనలకు లోబడి అప్పులు చేస్తున్నా నిత్యం అప్పులపై తప్పుడు గణాంకాలతో ఈనాడు రామోజీ విషం కక్కుతున్నారు. నిజానికి.. అప్పులుచేసి రాజధానిలో ఒక్క శాశ్వత భవనం కట్టకుండా, ఎన్నికల హామీలు అమలుచేయకుండా కన్సల్టెన్సీల పేరుతో, గ్రాఫిక్స్ పేరుతో, పోలవరం, తాత్కాలిక రాజధానికి బస్సుల్లో జనాన్ని పంపించి భజనలు చేయించుకోవడానికి చేసిన వృధా వ్యయాన్నే విపక్ష నేతగా జగన్ అప్పట్లో తప్పుబట్టారు ఇప్పుడు రెండేళ్ల పాటు కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ మరోపక్క పరిమితికి లోబడే అప్పులు చేస్తూ ఎన్నికల హామీలను తూచా తప్పకుండా అమలుచేస్తూ లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.2.55 లక్షల కోట్లను వారి ఖాతాల్లో జమచేశారు. అప్పుల గణాంకాలన్నీ కాగ్, ఆర్బీఐ నివేదికల్లో ఉన్నాయి. కళ్లు కనిపిస్తుంటే ఒకసారి చూడు రామోజీ యనమల మాటలు మర్చిపోతే ఎలా? ఇక ఆర్థిక సంఘం సిఫార్సులకు మించి మీ బాబు ఐదేళ్లతో పాటు ఎన్నికల ముందు ఏప్రిల్, మే నెలలో కలిసి మొత్తం రూ.37,354 కోట్లు ఎక్కువగా అప్పుచేశారు. బాబు హయాంలో చేసిన ఎక్కువ అప్పుల కారణంగా ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేయాల్సిన అప్పుల్లో కేంద్రం కోత విధించింది. అయితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో పరిమితి ఉన్నప్పటికీ ఇప్పటివరకు రూ.366.06 కోట్లు తక్కువ అప్పుచేసింది. వచ్చే ప్రభుత్వానికి అప్పు కూడా పుట్టకుండా మేమే అప్పులు చేశామని అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్న మాటలు మర్చిపోతే ఎలా రామోజీ? గుర్తున్నాసరే జగన్ సర్కారును తప్పుపట్టడమే పని కాబట్టి నిత్యం అప్పులపై తప్పుడు గణాంకాలతో డప్పు వాయిస్తున్నావా రామోజీ? అలాగే, చంద్రబాబు హయాంలో అప్పుల్లో సగటు వార్షిక వృద్ధి 21.87 శాతం ఉండగా.. ఇప్పుడు వైఎస్సార్సీపీ హయాంలో అది 12.13 శాతమే ఉంది. అప్పులు, ఆదాయ, వ్యయాల గణాంకాలన్నీ ప్రతీనెలా కాగ్ తన వెబ్సైట్లో ఉంచుతోంది. ఇది ఒక్క ఏపీవే కాకుండా అన్ని రాష్ట్రాల గణాంకాలు ఉంచుతోంది. ఇందులో దాపరికం ఎక్కడిది? నీవన్నీ తప్పుడు రాతలు తప్ప అందులో ఒక్కటీ వాస్తవంలేదు రామోజీ.. బాబుకు, జగన్కు తేడా ఇదీ.. వైఎస్ జగన్ సర్కారు అప్పులపై నిత్యం అక్కసును రంగరించి తప్పుడు గణాంకాలతో డప్పు వాయించంవల్ల నీ పత్రిక, నీ పరువు దిగజార్చుకోవడం తప్ప మరొకటి ఉండదు రామోజీ. వాస్తవానికి.. అప్పు చేయడం తప్పని ప్రతిపక్ష నేతగా జగన్ ఏనాడూ అనలేదు. పరిమితికి మించి అప్పు చేయడాన్నే ఆయన తప్పుబట్టారు. అయినా, చేసిన అప్పులతో ఒక శాశ్వత కట్టడం కూడా కట్టకుండా కేవలం హంగులు, ఆర్భాటాలు, విలాసాలకు వృధా వ్యయం చేయడాన్నే ఆయన తప్పుబట్టారు. పరిమితికి మంచి అప్పులు చేసినా మేనిఫెస్టోలో రైతులకు.. మహిళా సంఘాలకు, యువత తదితర రంగాలకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడాన్ని జగన్ తప్పుబట్టారు. అసలు చంద్రబాబు తన ఐదేళ్లు ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులకు మించి అప్పులు చేశారని కాగ్ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోవిడ్ రెండేళ్లు తప్ప మిగతా సంవత్సరాలు ఆర్థిక సంఘం సిఫార్సుల కన్నా తక్కువగానే అప్పులుచేసింది. కోవిడ్ సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆదాయంతో పాటు కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రావాల్సిన రాబడి తగ్గిపోవడంతో వ్యయం పెరిగినా పరిమితికి లోబడే అప్పులు చేస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలుచేసింది. మీ చంద్రబాబు మాదిరిగా రైతులకు, పొదుపు సంఘాల అక్కచెల్లమ్మలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చిన హమీలను జగన్ సర్కారు గాలికొదిలేయకుండా నవరత్నాలతో నేరుగా నగదు బదిలీ ద్వారా హామీలను నెరవేర్చింది. ఇదీ మీ బాబుకు వైఎస్ జగన్కు ఉన్న తేడా రామోజీ. -
Fact Check: రైతులకే ప్రా‘ధాన్యం’...'పచ్చ'రాతల్లోనే దైన్యం!
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2014–15లో రెండు సీజన్లలో కలిపి 1.18 లక్షల మంది రైతుల నుంచి 40.62 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇందు కోసం రూ.5,583 కోట్లు చెల్లించింది. ఇక్కడ సగటున ఒక రైతు నుంచి సేకరించిన ధాన్యం 34.42 టన్నులు. చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఉన్న రాష్ట్రంలో ఒక్కో రైతు నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఎలా కొనుగోలు చేశారన్నది ఎవరికైనా కలిగే సందేహం. అంటే ఇక్కడ దళారులు, మిల్లర్లు కొందరు రైతుల పేరిట ప్రభుత్వానికి ధాన్యం విక్రయించి మద్దతు ధర కొట్టేశారన్నది సుస్పష్టం. 2015–16లో సగటున ఒక రైతు నుంచి 24 టన్నుల ధాన్యం సేకరించినట్టు చూపారు. ఇక్కడ కూడా మద్దతు ధర మధ్యవర్తులే కాజేశారని తెలుస్తోంది కదా... దీనిని బట్టి టీడీపీ హయాంలో ధాన్యం దోపిడీ ఎంతగా సాగిందో అర్థమవుతోంది. కానీ నాడు కళ్లకు గంతలు కట్టుకున్న ఈనాడుకు ఇవేవీ కనిపించలేదు. ఇప్పుడు పారదర్శకంగా సేకరణ జరుగుతున్నా... లేనిపోని ఏడుపుగొట్టు రాతలు. సాక్షి, అమరావతి: రైతులకు మద్దతు ధర పేరుతో దళారులకు, మిల్లర్లకు దోచిపెట్టడం తెలుగుదేశం సంస్కృతి. వారి హయాంలో పేరుకే ప్రభుత్వం ధాన్యం సేకరించేది. కొనేదంతా మిల్లర్లు, దళారులే. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని 75 కేజీల బస్తాకు మద్దతు ధర కంటే రూ.200ల వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6వేలకు పైగా ప్రత్యేక్షంగా రైతులు నష్టపోయేవారు. కానీ, సీఎంగా జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ప్రతి సీజన్లోనూ ఆర్బీకేల ద్వారా ఈ–క్రాప్ ప్రామాణికంగా పంట కొనుగోలు చేపట్టడంతో వాస్తవ రైతుకు పూర్తి మద్దతు ధర దక్కుతోంది. దీంతో తమ దళారుల దోపిడీ వ్యవస్థను నాశనం చేశారన్న ఆక్రోశం రామోజీ రాతల్లో నిలువెల్లా కనిపిస్తోంది. వాస్తవానికి రైతుకు మద్దతు ధరతో పాటు గన్నీ, లేబర్, రవాణా చార్జీలను సొంతంగా పెట్టుకున్న రైతుకు టన్నుకు రూ.2,523ల వరకు ప్రభుత్వం చెల్లిస్తోంది. అందుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పంట విక్రయించేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా బయట మార్కెట్లోని వ్యాపారుల్లో ధాన్యానికి డిమాండ్ పెరిగింది. చేసేదేమీ లేక వారు సైతం ప్రభుత్వం చెప్పిన మద్దతు ధరకు మించి చెల్లిస్తూ కల్లాల్లోంచే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి వచ్చింది. అందువల్ల రైతులు మంచి రేటు వస్తున్న చోటే ధాన్యం అమ్ముకుంటున్నారు. అంత మాత్రాన ప్రభుత్వ సేకరణ తగ్గిందనడం ఎంతవరకు సమంజసం. ఈ వాస్తవాన్ని మరుగునపెట్టి రామోజీ రైతులపై కపట ప్రేమను ఒలకబోయడం చూస్తే జాలేస్తోంది. టీడీపీ ఐదేళ్లలో 17.94లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువలైన 2.65 కోట్ల టన్నులను ధాన్యాన్ని మాత్రమే సేకరించింది. కానీ, ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏకంగా 37.68 లక్షల మంది రైతుల నుంచి రూ.65,142.29 కోట్ల విలువైన 3.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి అండగా నిలిచింది. అంటే గతంతో పోలిస్తే దాదాపు 20లక్షల మంది అదనంగా రైతులు సంపూర్ణ మద్దతు ధరను అందుకున్నారు. ఆశాజనకంగా దిగుబడులు గత ఖరీఫ్లో దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయి. గతేడాది చివరల్లో మిచాంగ్ తుఫాన్ కొంత ఇబ్బంది పెట్టినా ఎకరాకు అత్యధికంగా 40–42 బస్తాల దిగుబడి వచ్చింది. జనవరి పండుగ సీజన్ కావడం, పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పథకాలకు బియ్యం అవసరం పెరగడంతో దాదాపు 15 లక్షల టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు మించి(సాధారణ రకానికి రూ.100కు పైగా ఫైన్ వెరైటీలకు రూ.200–500లకు పైగా) చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేయడం విశేషం. ఇదే క్రమంలో ఆర్బీకే ద్వారా 29.58లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ లెక్కన 44.58 లక్షల టన్నుల ధాన్యం రైతుల నుంచి బయటకు వెళ్లిపోయింది. అంటే దాదాపు ఈఖరీఫ్లో పంట మొత్తం విజయవంతంగా కొనుగోలు చేశారు. ఇంతటి ఫలితాన్ని రామోజీ కలలోకూడా ఊహించి ఉండరు. కానీ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు అడ్డగోలు అభాండాలు వేశారు. కేంద్ర నిబంధనలు రామోజీకి తెలియవా... కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర దక్కట్లేదని గుండెలు బాదుకున్న రామోజీకి.. ధాన్యం కొనుగోలు విషయంలో నిబంధనలు విధిస్తుందన్న విషయం తెలీదా? ఆ ప్రకారం తేమ 17శాతం మించితే కొనుగోలుకు ఎక్కడైనా అభ్యంతరం చెబుతారు కదా? ఇదే ఆసరాగా చేసుకుని టీడీపీ హయాంలో బస్తాలకు బస్తాలు అదనంగా రైతు నుంచి దోచేసినప్పుడు ఈనాడు గొంతెందుకు మూగబోయిందన్నది ఇక్కడి ప్రశ్న. అధికారంలో మనవాడు లేకుంటే దుమ్మెత్తి పోయడమే వారికి తెలిసిన న్యాయం. కానీ, సీఎం జగన్ రైతుకు ఒక్క రూపాయి నష్టం జరగకుండా తేమ శాతం ఎక్కువగా ఉన్నా మద్దతు ధరకు కొనుగోలు చేసి డ్రయర్ సౌకర్యం ఉన్న మిల్లులకు తరలిస్తున్నారు. ప్రకృతి వైప రీత్యాల సమయంలోనూ తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని సైతం యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నారు. ♦ ఇక దుడ్డు రకాలు(జయ రకం ధాన్యం) కేరళకు ఎగుమతి చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఒప్పందం చేసుకుంది. అందువల్ల గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు ఆ రకాలనే సాగు చేసేందుకు మొగ్గు చూపారు. గతేడాది తుఫాన్ కంటే ముందే అక్కడ కోతలు పూర్తవడం, ప్రభుత్వం కంటే ముందుగా బయట వ్యాపారులు వచ్చి మంచి రేటు ఇచ్చి పంట కొనుగోలు చేయడంతో ప్రభుత్వానికి సేకరించే అవకాశం రాలేదు. దీనిని కూడా ఈనాడు వక్రీకరించింది. ♦ ధాన్యం సేకరణలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వమే కళ్లాల్లోని ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తోంది. అక్కడ కస్టమ్ మిల్లింగ్ చేసిన తర్వాత బియ్యాన్ని బఫర్ గొడౌన్లు, మండల నిల్వ కేంద్రాలకు తరలించాలి. వీటిన్నింటికీ ప్రతి స్టేజీలో వేర్వేరు రవాణా వ్యవస్థలు ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ ప్రాంతాల్లో సమర్థవంతమైన వ్యవస్థను తీసుకురావాలని ప్రతిపాదించింది. దానిపై దీనిని ఈనాడు ధాన్యం సేకరణ మిల్లర్లకు అప్పగిస్తున్నారంటూ అబద్దపు ప్రచారం చేస్తోంది. -
నిబంధనల ప్రకారమే డీఎస్సీ
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2024లో ప్రతి అంశంలోను పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామని, అభ్యర్థులకు ఎటువంటి గందరగోళం లేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. అభ్యర్థులకు నష్టం జరగకుండా జీవో నం.77 ప్రకారం రోస్టర్ పాయింట్లు చూపించామని చెప్పారు. ప్రస్తుత డీఎస్సీని 2018 డీఎస్సీ నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నామన్నారు. దరఖాస్తు నుంచి పరీక్ష వరకు అప్పటి నిబంధనలే ఉంటాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ ‘ఈనాడు’ పత్రిక డీఎస్సీ అభ్యర్థులను గందరగోళంలోకి నెట్టేలా కథనం ప్రచురించిందన్నారు. రోస్టర్ విధానం తెలియకుండా ఆ పత్రిక ప్రచురించిన కథనం డీఎస్సీ అభ్యర్థులను ఆందోళనకు గురిచేసేలా ఉందని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టులో ఇచ్చిన జీవో 77 ప్రకారం అన్ని రోస్టర్లను చూపించామని, కానీ, బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో ఆ సంవత్సరం రిక్రూట్మెంట్ రోస్టర్లను అలాగే కొనసాగించాలని అన్నారు. జీవో ప్రకారం పాయింట్లు ప్రోస్పెక్టివ్గానే ఉంటాయిగానీ, రెట్రోస్పెక్టివ్గా ఉండదని చెప్పారు. ఆయన చెప్పిన వివరాలివీ.. ♦ మొదటి దరఖాస్తుదారులకు ఈడబ్లు్యఎస్ కోటా కనిపించలేదనడంలోనూ వాస్తవం లేదు. దరఖాస్తులు ప్రారంభమైన తేదీ నుంచే ఆప్షన్లో ఈడబ్లు్యఎస్ కోటా ఉంది. ఈనాడులో రాసింది తప్పు. ♦ పరీక్ష ఫీజుపైనా తప్పుగా రాశారు. వాస్తవానికి అభ్యర్థి అప్లికేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు మాత్రమే వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా 2018 డీఎస్సీ నిబంధనే. ♦ స్థానికేతర అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకున్న సమయంలో స్థానికేతర ఆప్షన్ (ఓపెన్) ఇవ్వవచ్చు. ఒకసారి ఈ ఆప్షన్ ఎంచుకుని దరఖాస్తు చేసుకుంటే అభ్యర్థి నియామకం కూడా ఎంచుకున్న జిల్లాకే పరిమితం అవుతుంది. ఇదే విధానం జోనల్ పోస్టులకూ వర్తిస్తుంది. అలాగే దరఖాస్తు చేసుకోవాలి. ♦ డీఎస్సీ వెబ్సైట్కు సర్వర్ సమస్య ఎప్పుడూ లేదు. ఇప్పటివరకు టెట్ – 2024కు 3,17,950 దరఖాస్తులు అందాయి. డీఎస్సీకి 3,19,176 మంది నమోదు చేసుకున్నారు. సర్వర్ సమస్య ఉంటే ఇంత మంది దరఖాస్తు చేసుకోలేరు. అభ్యర్థులు కొందరికి ఫీజు చెల్లించే సమయంలో ఇంటర్నెట్ సమస్య ఉత్పన్నమై ఉంటుంది. దరఖాస్తు అనంతరం అభ్యర్థులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా కల్పించాం. ఎవరైనా ఫీజు చెల్లించి ‘జర్నల్ నంబర్’ రాకుంటే చెల్లించిన ఫీజు మొత్తం వారి బ్యాంకు ఖాతాలో ఐదు రోజుల్లో తిరిగి జమ అవుతుంది. ♦ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన ఫిబ్రవరి 12 నుంచే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. బుధవారం వరకు మొత్తం 2,40,119 మంది ఫీజు చెల్లించారు. ♦సెంటర్ టెట్ (సీటెట్) విషయంలో కొందరికి అవగాహన లేదు. వాస్తవానికి ఏపీ విద్యా శాఖ వద్ద సీటెట్ డేటాబేస్ ఉండదు. సీటెట్ అభ్యర్థులు మొత్తం మార్కులు, గరిష్ట మార్కులను వారే స్వయంగా నమోదు చేయాలి. ఏపీ టెట్ అభ్యర్థులు మాత్రం హాల్ టికెట్ నంబరు నమోదు చేస్తే సరిపోతుంది. అభ్యర్థులకు ఎడిట్ అవకాశం దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్ లేకండా 30 వేల మంది అవస్థలు పడుతున్నారని అనడం కూడా సరికాదు. దరఖాస్తు సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పులు జరిగితే సవరించే అవకాశం లేదని బులెటిన్లోనే పేర్కొన్నాం. కానీ అభ్యర్థుల సమస్యను దృష్టిలో ఉంచుకుని అప్లికేషన్ను ఎడిట్ చేసుకొనే అవకాశం కల్పించాం. అభ్యర్థులు మొదట వెబ్సైట్లో డిలీట్ ఆప్షన్ ఎంచుకోవాలి. పాత జర్నల్ నంబర్, మొబైల్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి డిలీట్ ఆప్షన్ పొందవచ్చు. దీనిద్వారా ఎలాంటి రుసుం చెల్లించకుండా తప్పులు సరిదిద్దుకుని తిరిగి అప్లై చేసుకోవచ్చు. ఇందులో అభ్యర్థి పేరు, ఎంచుకున్న పోస్టు, జిల్లా తప్ప మిగిలిన అన్ని అంశాలూ ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ అభ్యర్థి తన పేరులో స్పెల్లింగ్ తప్పుగా ఉంటే పరీక్ష కేంద్రంలో నామినల్ రోల్స్లో సంతకం చేసే సమయంలో తప్పును సవరించుకునే అవకాశం ఉందని సురేష్ కుమార్ తెలిపారు. 25 వరకు ఫీజు చెల్లింపు గడువు డీఎస్సీ అభ్యర్థులు ఫీజు చెల్లించే గడువును పెంచినట్టు పాఠశాల కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఈనెల 25వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చని, ఈ ఆవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. అలాగే, హెల్ప్ డెస్క్ సమయాన్ని ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించామని తెలిపారు. -
బెదిరించిన విలేకరితో వాదించడమూ తప్పేనా?
సాక్షి, నరసరావుపేట: నిత్యం ప్రభుత్వంపై విషం చిమ్మే పచ్చ పత్రిక ఈనాడులో బుధవారం ప్రచురితమైన ‘పత్రికలపై పగబట్టిన వైకాపా’ వార్త పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో రాసిందే. అందులో పల్నాడు జిల్లా అమరావతి మండల న్యూస్టుడే విలేకరి పరమేశ్వరరావుపై దాడి చేశారని, చంపబోయారంటూ కట్టుకథలు అల్లారు. వాస్తవానికి ఆ విలేకరి సంఘ విద్రోహశక్తిగా పేరున్న టీడీపీ నేత దండా నాగేంద్రతో సాన్నిహిత్యంగా ఉంటూ అతని కనుసన్నల్లో ఇసుక సరఫరాపై నిత్యం తప్పుడు కథనాలు వండి వారుస్తున్నాడు. నాగేంద్ర పీడీ యాక్ట్పై జైలుకెళ్లి ఇటీవల విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ప్రశాంతంగా ఉన్న పెదకూరపాడు నియోజకవర్గంలో రాజకీయంగా అల్లర్లు సృష్టించేందుకు ఆ టీడీపీ నేత గత కొన్ని నెలలుగా కుట్రలు చేస్తున్నాడు. పరమేశ్వరరావు ఒక పత్రికలో విలేకరిగా పనిచేస్తూ అక్రమాలకు పాల్పడడంతో అతన్ని తొలగించారు. ఈ క్రమంలో అతనికి ఏడాది క్రితం నాగేంద్ర సిఫార్సుతో ఈనాడు విలేకరిగా అవకాశం కల్పించారు. అప్పటినుంచి స్వామిభక్తి చాటుకుంటూ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తప్పుడు కథనాలు రాస్తున్నాడు. దౌర్జన్యంగా ప్రవేశించి బెదిరింపులు.. ఈ నెల 13న పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి స్వయంగా మల్లాది ఇసుక రీచ్కు వచ్చి పరిశీలించివెళ్లారు.ఇసుక తవ్వకాలు ఆపమని జిల్లా, మండల స్థాయి అధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవటంతో మరుసటి రోజు యథావిధిగా ఇసుక తవ్వకాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఉదయం 10.30 గంటలకు తహసీల్దార్ కార్యాలయం నుంచి గ్రామస్థాయి అధికారులు వచ్చి వెంటనే ఇసుక తవ్వకాలు ఆపేయాలని నిర్వాహకులకు తెలిపారు. అప్పటికే పది ఇసుక వాహనాలకు లోడ్ చేయటానికి బిల్లులు రాశారు. బిల్లులు రాయకుండా ఉన్న 15 వాహనాలను వెనుకకు పంపారు. బిల్లులు రాసి లోడైన ఆరు వాహనాలు బయటకు వెళ్లాయి. ఈ సమయంలో మల్లాది గ్రామానికి చెందిన ఈనాడు కంట్రిబ్యూటర్ పరమేశ్వరరావు ఇసుకరీచ్లోకి వచ్చి నదిలో ఇసుక లోడ్ అవుతున్న నాలుగు వాహనాల ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ సమయంలో రీచ్లో కూలీకి పనిచేస్తున్న మల్లాది యువకులు తమ ఊరు వాడే కదా అనే చనువుతో ఏంటబ్బాయి ఫొటోలు, వీడియోలు తీస్తున్నావని అడగగా.. నేను ఈనాడు విలేకరిని, మాకు మా యాజమాన్యం నుంచి ఆదేశాలు అలాగే ఉన్నాయి, అయినా మీకు చెప్పాలా, మీ పర్మిషన్ తీసుకుని రావాలా ఏంటీ, అన్ని వాహనాలు సీజ్ చేయిస్తానంటూ దురుసుగా మాట్లాడాడు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈనాడు విలేకరి కవ్వింపు చర్యలకు పాల్పడటంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో అక్కడే ఉçన్న ఇసుక తవ్వకాలు జరిపే కంపెనీ విజిలెన్స్ అధికారి రాంబాబు వారిని విడదీసి విలేకరిని ద్విచక్రవాహనంపై దగ్గరుండి పంపించారు. కిందపడ్డ పరమేశ్వరరావు సెల్ఫోన్ను తరువాత అక్కడకు చేరుకున్న సీఐ బ్రహ్మం తీసుకు వచ్చి అతనికి అప్పగించారు. సంఘటన జరిగిన తరువాత విజిలెన్స్ అధికారి మీడియాకు ఈ విషయాన్ని వివరించారు. వాస్తవాలు దాచిపెట్టి ఈనాడు కథనం సంఘటన జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నానని, అయితే జరిగింది ఒకటైతే ఈనాడు పత్రికలో వచ్చింది మాత్రం మరొకటని ఇసుక కంపెనీ విజిలెన్స్ అధికారి రాంబాబు తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఈనాడు కంట్రిబ్యూటర్ పరమేశ్వరరావు ఇసుక రీచ్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న వారితో వాగ్వివాదానికి దిగాడన్నారు. దీంతో ఈ విషయంపై ఇద్దరి మధ్య తోపులాట జరిగిందన్నారు. అంతేగాని పెట్రోల్ తీసుకురండి.. తగలెట్టేద్దాం వంటి మాటలు అనటం, దాడి చేసి నిర్బంధించినట్లు రాయడం అవాస్తవమన్నారు. ఇసుక రీచ్కి సంబంధించిన సిబ్బంది ఎక్కడా వైఎస్సార్ సీపీ, ఎమ్మెల్యే శంకరరావు పేరు ప్రస్తావించలేదని చెప్పారు. దాడి జరిగిన వెంటనే మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ వచ్చి పరామర్శించి, దీనికి రాజకీయ రంగు పులిమారు. అమరావతి నుంచి దండా నాగేంద్ర కారులో పరమేశ్వరరావు గుంటూరు ఈనాడు కార్యాలయానికి చేరి.. అక్కడ అల్లిన కట్టుకథే ఈనాడులో ప్రచురితమైంది. -
Fact Check: కోర్టులను మోసం చేసే రామోజీకి పోర్టుల గురించి ఏం తెలుసు?
‘అసలే కోతి.. ఆ పైన కల్లు తాగింది.. ఆ తర్వాత దానికి పిచ్చెక్కింది.. తర్వాత దానికి దయ్యం పట్టింది.. ఇక ఈ కోతి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?.. పచ్చ పత్రిక ఈనాడు అధినేత రామోజీరావు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రతి అంశంలోనూ విషం జిమ్మడమే రామోజీ పనిగా పెట్టుకున్నారు. నిత్యం ప్రభుత్వంపై అసత్యాలు, అబద్ధాలు, వక్రీకరణలతో కూడిన కథనాలను అచ్చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇందులో భాగంగానే బుధవారం ‘రేవూ.. రేవూ.. ఎందుకు పూర్తికావు’ అంటూ ఈనాడులో ఒక విష కథనాన్ని వండివార్చారు. అభూత కల్పనలతో, అసత్యాలతో సాగిన ఈ కథనానికి సంబంధించి అసలు వాస్తవాలివీ.. – సాక్షి, అమరావతి దేశంలో గుజరాత్ తర్వాత అత్యధిక సముద్ర తీరం 974 కి.మీ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రాభివృద్ధికి సుదీర్ఘ సముద్ర తీరాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో తీర ప్రాంతం వెంట లక్షల్లో నివసిస్తున్న మత్స్యకారుల సంక్షేమంపై ముందుగా దృష్టి సారించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులు చేపల వేటకు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లేవారు. గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు వలసపోయేవారు. ఈ క్రమంలో పాకిస్థాన్ కోస్ట్గార్డుకు మన మత్స్యకారులు చిక్కారు. ఇలాంటి దుస్థితిని అరికట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరుతో వారికి ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. అంతేకాకుండా వలసలను నివారించడానికి రాష్ట్రంలోనే పది ఫిషింగ్ హార్బర్లను నిర్మించాలని తలపెట్టింది. వీటిలో ఇప్పటికే జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణం పూర్తి చేసుకుని వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మరో రెండు నెలల్లో పనులు పూర్తి చేసుకుని ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం అందుబాటులోకి రానున్నాయి. రెండో దశ కింద మరో ఆరు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా రామోజీరావు మాత్రం కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తున్నారు. ఏకంగా రూ.4 వేల కోట్ల వ్యయంతో.. మత్స్యకారులు ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన దుస్థితికి చెక్ పెడుతూ ఏకంగా రూ.4 వేల కోట్ల వ్యయంతో పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఏకంగా 60 వేల మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా.. వారు స్థానికంగానే ఉపాధి పొందేలా మినీ పోర్టుల స్థాయిలో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, మంచినీళ్లపేట, బుడగట్లపాలెం, పూడిమడక, ఓడరేవు, బియ్యపుతిప్ప, కొత్తపట్నం వద్ద ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తోంది. అదేవిధంగా విశాఖపట్నం జిల్లా భీమిలి, అనకాపల్లి జిల్లా రాజయ్యపేట, దొండవాక, విజయనగరం జిల్లా చింతపల్లి, తిరుపతి జిల్లా రాయదరువు, కాకినాడ జిల్లా ఉప్పలంకల్లో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తోంది. 12,000 బోట్లను సురక్షితంగా నిలుపుకోవడమే కాకుండా అక్కడే చేపలను వేలం వేసుకోవడం, శీతలీకరణ, ఎండబెట్టుకోవడం, మార్కెటింగ్ వంటి అన్ని సౌకర్యాలను సమకూరుస్తోంది. అలాగే ఈ ఫిషింగ్ హార్బర్ల పక్కనే ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులను కూడా అభివృద్ధి చేస్తోంది. అందుబాటులోకి తొలి దశ హార్బర్లు తొలి దశలో రూ.1,523 కోట్లతో అభివృద్ధి చేస్తున్న నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తయి వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధమవుతుండటంతో రామోజీ కడుపుమంటతో తట్టుకోలేకపోయారు. మిగిలిన మూడు హార్బర్లలో నిర్మాణ పనులు 65 శాతంపైగా పూర్తయినా కేవలం 30 శాతమే అయ్యాయంటూ ఎప్పటిలానే అబద్ధాలను అచ్చేశారు. దాదాపు రెండేళ్లపాటు కరోనా, మధ్యలో భారీ వర్షాలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను అధిగమిస్తూ ప్రభుత్వం పనులను వేగంగా పూర్తి చేస్తోంది. -
నిరుద్యోగంపై దగా కథ
సాక్షి, అమరావతి: బాబు వస్తేనే జాబు అంటూ నిరుద్యోగులను నిలుపునా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్ర కారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే 1.25 లక్షల గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలను కొత్తగా సృష్టించి మరీ భర్తీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇవే కాదు.. వైద్య రంగంతో సహా పలు రంగాల్లో వేలాది ఉద్యోగాలు ఇచ్చారు. బాబు దిగిపోయే 2019 మే నాటికి.. అంటే ఈ 75 ఏళ్లలో రాష్ట్రంలో ఉద్యోగాల సంఖ్య 3,97,128. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 6,38,087. ఈ ఒక్కటి చాలు ఈ నాలుగున్నరేళ్లలో సీఎం వైఎస్ జగన్ ఏ విధంగా ఉద్యోగాలిచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారో చెప్ప డానికి. ‘దగా క్యాలెండర్’ అంటూ సీఎం జగన్ సర్కారుపై రామోజీ కక్కిన అక్కసు పచ్చి అబద్ధమనడానికి. ఐదేళ్లలో ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వమూ ఇవ్వలేనన్ని ఉద్యోగాలు సీఎం వైఎస్ జగన్ ఇచ్చారని చెప్పడానికి. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 2.21 లక్షల ఉద్యోగాలను రెగ్యులర్ చేశారు. 43,923 కాంట్రాక్టు ఉద్యోగాలు ఇచ్చారు. 3.73 లక్షల ఔట్సోర్సింగ్ ఉద్యోగాలిచ్చారు. ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే ఏకంగా 53,446 పోస్టులను వైఎస్.జగన్ సర్కారు భర్తీ చేసింది. అంతే కాదు.. వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నడూ లేని విధంగా పోస్టులు ఖాళీ వెంటనే భర్తీ చేసేలా జగన్ సర్కారు ఉత్త ర్వులు జారీ చేసింది. ప్రైవేటు రంగంలోనూ పరిశ్రమలను ప్రోత్సహిస్తూ జగన్ సర్కారు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తోంది. ఇవన్నీ కళ్ల ముందు కనిపించే నిజాలు. అయినా, ఈనాడు రామో జీ మాత్రం కళ్లుండీ చూడలేని కబోదిలా జగన్ సర్కారుపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో నిరుద్యోగులను నిలువునా మోసం చేసింది చంద్రబాబే. జాబు రావాలంటే బాబు రావాలని, జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానంటూ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువత నోట్లో మట్టి కొట్టారు. బాబు హయాంలో ఐదేళ్లలో ఇచ్చింది 34,108 ఉద్యోగాలు మాత్రమే. చంద్రబాబు నిర్వాకంపై రామోజీ ఒక్క మాటా రాయరు. చంద్రబాబు సర్కారు ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ను పట్టించుకోకపోతే ఇచ్చిన మాట మేరకు సీఎం వైఎస్ జగన్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేస్తానని బాబు మాట ఇచ్చి గాలికి వదిలేస్తే, వైఎస్ జగన్ సర్కారు నెరవేర్చింది. సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరిగినట్లు ఇటీవల కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2018–19లో 44.85 లక్షల ఈపీఎఫ్ ఖాతాలుంటే 2022–23 నాటికి ఈపీఎఫ్ ఖాతాల సంఖ్య 60.73 లక్షలకు పెరిగినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంటే 35 శాతం మేర ఈపీఎఫ్ ఖాతాలు పెరిగాయి. అంటే ఆమేరకు ఉద్యోగావకాశాలు పెరిగినట్టే. అత్యధిక ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న రాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ నాలుగో స్థానంలో ఉందని 2023 స్కిల్ రిపోర్ట్ వెల్లడించింది. బాబు హయాంలో నిరుద్యోగ రేటు 5.3 శాతం ఉండగా, వైఎస్ జగన్ హయాంలో 4.1 శాతానికి తగ్గిపోయింది. బాబు హయాంలో ఉద్యోగుల వివరాలు 2014–19 మధ్య బాబు హయాంలో ఉద్యోగాల భర్తీ 34,108 బాబు దిగిపోయిన మే 2019 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,97,128 2019 జూన్ నుంచి వైఎస్ జగన్ సర్కారులో ఉద్యోగాల వివరాలు శాశ్వత ఉద్యోగుల సంఖ్య 2,21,003 కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య 43,923 ఔట్ సోర్సింగ్, ఇతర ఉద్యోగుల సంఖ్య 3,73,161 మొత్తంఉద్యోగాల సంఖ్య 6,38,087 -
Fact Check: మీ ‘మద్దతు’ బాధంతా బాబు కోసమేగా!
సాక్షి,అమరావతి: ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అనే చందంగా పచ్చ పత్రికాధినేత రామోజీరావు తీరు ఉంది. వ్యవసాయం దండగ అని చంద్రబాబు తీసిపారేస్తే.. వ్యవసాయం పండుగ అని వైఎస్ జగన్ ప్రభుత్వం నిరూపించింది. అధికారంలోకి వచ్చింది మొదలు గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు, అక్కడే విత్తు నుంచి విక్రయం వరకు అన్ని ఏర్పాట్లు, కనీస మద్దతు ధర దక్కని పంటలను ప్రభుత్వమే కొనుగోలు, మార్కెట్లో ధరలు పడిపోయిన ప్రతిసారి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వ జోక్యం, ఏకంగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, ఆరు పంటలకు కనీస మద్దతు ధర, సీఎం యాప్ ద్వారా ధరల పర్యవేక్షణ, ధాన్యాన్ని కొనుగోలు చేసినప్పుడు గోనె సంచులతోపాటు కూలీల భారం, రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే పెట్టుకుంటున్నా.. ఇంకా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో చేస్తున్నా రామోజీ విషం జిమ్ముతున్నారంటే ఏం అనుకోవాలి? ఈ ఏడుపుకు, కడుపుమంటకు అసలు మందు ఉందా? బుధవారం తన పచ్చ పత్రిక ‘ఈనాడు’లో ‘కనీస మద్దతు ధర.. గరిష్ట మోసం దొర’ అంటూ ఒక తప్పుడు కథనాన్ని అచ్చేశారు. దీనికి సంబంధించి అసలు వాస్తవాలివిగో.. ఆరోపణ: ధరల స్థిరీకరణ నిధి ఒక దగా వాస్తవం: మార్కెట్లో మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు రూ.3 వేల కోట్లతో ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. వాస్తవానికి ఈ 57 నెలల్లో 1–2 సీజన్లలో 2–3 పంట ఉత్పత్తులకు మినహా మిగిలిన పంటల మార్కెట్ ధరలు మద్దతు ధరకు మించి పలికాయి. ఈ ఏడాది కూడా మద్దతు ధరలు ప్రకటించిన పంట ఉత్పత్తులతో సహా పలు రకాల వ్యవసాయ, ఉద్యాన పంటల ధరలు ఎమ్మెస్పీకి మించి పలుకుతున్న మాట వాస్తవం కాదా? అలాంటప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకోవల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంటుందో ‘ఈనాడు’కే తెలియాలి. ఆరోపణ: సీఎం యాప్ సిగ్గు..సిగ్గు వాస్తవం: దేశంలోనే తొలిసారిగా గ్రామాల వారీగా మార్కెట్లో ధరలను సేకరించి ఎప్పటికప్పుడు వాటి హెచ్చుతగ్గులను సమీక్షించేందుకు సీఎం యాప్ను తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా ఈ 57 నెలల్లో ధరలు పతనమైన ప్రతిసారీ ప్రభుత్వమే మార్కెట్లో జోక్యం చేసుకొని వ్యాపారులతో పోటీపడి రైతులకు కనీసమద్దతు ధర దక్కేలా కృషి చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 3.74 లక్షల మంది రైతుల నుంచి రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల పంటల ఉత్పత్తులు కొనుగోలు చేస్తే.. ఈ 57 నెలల్లో 6.18 లక్షల మంది రైతుల నుంచి రూ.7,757.87 కోట్ల విలువైన 21.61 లక్షల టన్నుల ఉత్పత్తులను జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంటే... రెట్టింపు కన్నా అధికం. అలాగే చంద్రబాబు ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే.. ఈ 57 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం 37.34 లక్షల మంది రైతుల నుంచి 3.38 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.65 వేల కోట్లు చెల్లించింది. బాబు హయాంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోలుకు రూ.43,559 కోట్లు మాత్రమే వెచ్చిస్తే, వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ 57 నెలల్లో ఏకంగా రూ.72,445 కోట్లు ఖర్చుచేసింది అంటే.. సగటున చంద్రబాబు హయాంలో ఏడాదికి రూ.8,711 కోట్లు వెచ్చిస్తే, జగన్ ప్రభుత్వం ఏటా సగటున రూ.16,099 కోట్లు వెచ్చించింది. ఆరోపణ: గిట్టుబాటు ధర కల్పనలో చేతులెత్తేశారు వాస్తవం: గిట్టుబాటు ధరలు పడిపోతే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని సైతం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇలా ప్రభుత్వ భరోసా వల్లే మార్కెట్లో ధరలు స్థిరపడ్డాయి. అలాగే 2021–22లో ఉల్లి ధరలు పతనమైనప్పుడు మద్దతు ధరకు, 2022–23లో ధరలు పెరిగినప్పుడు మార్కెట్ ధరకు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇటు రైతులకు, అటు వినియోగదారులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఇలా రూ.64 కోట్ల విలువైన 9,025 టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి ప్రజలకు సబ్సిడీ ధరలకు అందించింది. 2022–23లో రూ.22.94 కోట్ల విలువైన 2,541 టన్నులు, 2023–24లో రూ.43.46 కోట్ల విలువైన 5,517 టన్నుల పసుపును కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. మిరప ఎమ్మెస్పీ రూ.7వేలు కాగా మూడేళ్లుగా మార్కెట్లో క్వింటా రూ.15వేల నుంచి రూ.30వేలకు పైగా ధరలు పలుకుతున్నాయి. నాలుగేళ్లుగా చిరుధాన్యాల మార్కెట్ ధరలు మద్దతు ధర కంటే ఎక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగానే ప్రస్తుత ఎమ్మెస్పీ ధరల కంటే మిరప, పత్తి, పసుపు, వేరుశనగ, మినుము, మొక్కజొన్న పంటలకు మార్కెట్లో రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయి. ఆరోపణ: వ్యవసాయ ఖర్చులు పెరిగాయి వాస్తవం: సహజంగా మద్దతు ధరలు ప్రకటించేది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని పంటలు వేసే రైతులు నష్టపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని విధంగా సొంతంగా వాటికి మద్దతు ధరలను ప్రకటించింది. మద్దతు ధరకు మించి పలికితే మార్కెట్లోనే రైతులు విక్రయించుకుంటారు. మార్కెట్లో ధర లేనప్పుడు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతుకు బాసటగా నిలుస్తోంది. రైతులకు పెట్టుబడి పెరిగిందని వాదిస్తున్న రామోజీ... అదే సమయంలో రైతుకు ఏటా రూ.13,500 చొప్పున ఇస్తున్న రైతు భరోసా సాయాన్ని మాటమాత్రం ప్రస్తావించలేదు. ఈ 57 నెలల్లో ప్రతి రైతుకు రూ.65,500 చొప్పున 53.53 లక్షల మందికి రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించినా రామోజీ పచ్చ కళ్లకు కనిపించలేదు. జీఎల్టీ ఖర్చులను కూడా భరిస్తూ.. రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాకుండా జీఎల్టీ (గన్నీ బ్యాగ్లు, కూలీలు, రవాణా)ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తోంది. ధాన్యం కొనుగోలు సందర్భంలో టన్నుకు రూ.2,523 (గోనె సంచులకు రూ.1,750, కూలీలకు రూ.220, రవాణా చార్జీలకు రూ.468తో పాటు ఒకసారి వాడిన గోనె సంచులకు రూ.85), ఇతర పంట ఉత్పత్తుల సేకరణ సందర్భంలో క్వింటాకు రూ.418 చొప్పున భరిస్తోంది. -
Fact check: ప్రభుత్వ బడులపైనే బండలా!
సాక్షి, అమరావతి: అచ్చోసిన ఆంబోతు తిని ఊరి మీద పడి తిరిగినట్టు.. ఎన్నికల ముందు ఈనాడు పత్రికాధినేత రామోజీరావు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి విషయంలోనూ విషం జిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే పేదింటి పిల్లలకు ప్రపంచ స్థాయి విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలపై కత్తిగట్టారు. వాస్తవాలను వక్రీకరించి అసత్యాలతో తనకలవాటైన రీతిలో చెలరేగిపోయారు. ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు, పేద పిల్లల ప్రగతిపై ఏనాడూ అక్షరం ముక్క రాయని ‘ఈనాడు’ ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు లేవంటూ అబద్ధాలను అచ్చేసింది. మొదటి విడత మనబడి: నాడు–నేడుతో సమూలంగా రూపురేఖలు మార్చుకున్న 15,715 ప్రభుత్వ పాఠశాలల గురించి మాటమాత్రంగా ప్రస్తావించలేదు. కానీ నాడు–నేడు రెండోవిడతలో పనులు జరుగుతున్న పాఠశాలలపై రామోజీ విషం కక్కారు. గత ప్రభుత్వంలో సర్కారు బడి భవనాలు బీటలు వారి కూలిపోతున్నా అడిగింది లేదు.. విద్యార్థులకు కనీస వసతులైన పుస్తకాలు, తాగునీరు, యూనిఫామ్ ఇవ్వకున్నా నిలదీసింది లేదు. ఇప్పుడు నాడు–నేడు రెండో దశలో బడులకు కొత్త భవనాలు, అదనపు తరగతి గదులు నిర్మాణ పనులు సాగుతుండగా ఫొటోలు తీసి పనులు నిలిచిపోయాయంటూ రామోజీ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా ఒకటీ రెండుసార్లు కాదు.. ఈ విద్యా సంవత్సరంలో 15 సార్లు ఒకే అంశంపై తప్పుడు రాతలు ప్రచురించడం ఆయన మానసిక దౌర్భల్యానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయని.. విద్యార్థులకు గొప్ప సదుపాయాలు కల్పిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సైతం ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి కొనియాడారు. వివిధ దేశాల ప్రతినిధులు సైతం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ప్రశంసిస్తున్నారు. తమ దేశంలోనూ ఏపీ విధానాలను అమలు చేస్తామని చెబుతున్నారు. కానీ రామోజీ పచ్చ కళ్లకు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు. నాడు–నేడు రెండో దశలో 22,344 స్కూళ్ల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం 2021–22 విద్యా సంవత్సరంలో నాడు–నేడు మొదటి దశ కింద 15,715 పాఠశాలలను రూ.3,669 కోట్లతో అభివృద్ధి చేసింది. నూతన భవనాలతో పాటు అవసరమైన 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పించింది. ఇక 2022–23 విద్యా సంవత్సరంలో 22,344 పాఠశాలల్లో రూ.8,000 కోట్లతో రెండో దశ పనులు చేపట్టారు. ఇందులో మొదటి దశలో లేని అదనపు పనులు సైతం జోడించారు. ఇప్పటికే 99.79 శాతం స్కూళ్లల్లో పనులు ప్రారంభించారు. 2,755 స్కూళ్లలో అభివృద్ధి పనులు పూర్తవగా, 1,331 స్కూళ్లను నూరుశాతం అందుబాటులోకి తీసుకొచ్చారు. మరో 6,340 స్కూళ్లల్లో టాయిలెట్లు, 4,707 స్కూళ్లల్లో కిచెన్ షెడ్లు, 11,840 స్కూళ్లల్లో మేజర్, మైనర్ రిపేర్లు పూర్తి చేశారు. అంతేకాకుండా ఆ పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు రూ.3,361 కోట్లు చెల్లించారు. వాస్తవం ఇదయితే ప్రస్తుతం పనులు కొనసాగుతున్న పాఠశాలల్లో ఫొటోలు తీసి, నిర్మాణ పనులు నిలిచిపోయాయంటూ ఈనాడు పత్రిక వక్రీకరిస్తోంది. ఇందుకోసం పార్వతీపురం మన్యం జిల్లాలోని మూడు స్కూళ్లు, ప్రకాశంలోని కొత్తపట్నం, ఏలూరు జిల్లా ఉంగుటూరు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, విజయనగరం జిల్లా గుర్ల మండలాల్లోని పాఠశాలను చూపించింది. వాస్తవానికి ఆ పాఠశాలల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి గాయాలు కాకూడదని ఆరుబయట ఉంచారు. ఈ ఫొటోలను అచ్చేసి రామోజీ పైశాచిక ఆనందం పొందుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇవే పాఠశాలల గోడలు బీటలు వారి, పైకప్పులు ఎప్పుడు కూలతాయోనన్న భయంతో చదువులు సాగాయి. కానీ తన శిష్యుడు చంద్రబాబు జమానా కావడంతో రామోజీకి ఒక్క ముక్క కూడా రాయాలనిపించలేదు. ఇప్పుడు అన్నీ బాగున్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి అన్నీ తప్పులే ఆయనకు కనిపిస్తున్నాయి. -
fact check: పచ్చమీడియాకు ‘అతి’సారం!
సాక్షి ప్రతినిధి, గుంటూరు/నెహ్రూనగర్(గుంటూరు): పచ్చమీడియాకు అతిసారం సోకినట్టుంది. గుంటూరు నగరంలో కలుషిత జలం కాటేసిందంటూ మరోసారి విషాన్ని విరజిమ్మింది. తప్పుడు కథనాలతో పేట్రేగిపోయింది. చికెన్పాక్స్, న్యూమోనియా కారణాలతో శుక్రవారం మరణించిన మహ్మద్ ఇక్బాల్ డయేరియాతో మరణించాడని దుష్ప్రచారానికి దిగింది. గత వారంలో మరణించిన పద్మ మరణంపైనా ఇలాగే రాక్షస రాతలు రాసింది. గుంటూరులో నివాసం ఉంటున్న మహ్మద్ ఇక్బాల్ ఈ నెల 11న సాయంత్రం విరేచనాలు , వంటిమీద చీము పొక్కులతో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స అందించడంతో విరేచనాలు తగ్గాయి. పొక్కులను చికెన్పాక్స్గా వైద్యులు గుర్తించారు. బ్లడ్షుగర్ లెవల్స్ కూడా 400 దాటి ఉండటంతో డెర్మటాలజీ డాక్టర్లు పరీక్షించి గోరంట్లలోని అంటువ్యాధుల ఆస్పత్రి(జ్వరాల ఆస్పత్రి)లో చేరాలని సూచించారు. ఇక్బాల్ అక్కడికి వెళ్లేందుకు నిరాకరించాడు. జీజీహెచ్లోనూ ఉండకుండా వెళ్లిపోయాడు. రెండురోజల తర్వాత 15న న్యూమోనియా లక్షణాలతో ఊపిరితీసుకోవడానికి ఇబ్బందిపడుతూ మళ్లీ వచ్చాడు. అప్పుడు కూడా వైద్యులు జ్వరాల ఆస్పత్రికి వెళ్లాలని సూచించినా వెళ్లలేదు. ఇంటికి వెళ్లిపోయాడు. మళ్లీ తర్వాత రోజు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చికెన్పాక్స్, న్యూమోనియా లక్షణాలతో తీవ్రంగా ఇబ్బందిపడుతూ జీజీహెచ్కు వచ్చాడు. వచ్చిన అరగంటలోనే మృతి చెందాడు. వైద్యులు చికెన్పాక్స్, అదుపులో లేని మధుమేహం, న్యూమోనియా లక్షణాలతో చనిపోయాడని నివేదిక ఇచ్చారు. కుటుంబ సభ్యులు భీమవరం వెళ్లడంతో గుంటూరు మేయర్ కావటి మనోహర్నాయుడు వారితో ఫోన్లో మాట్లాడారు. వారు కూడా అనారోగ్యం వల్లే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన జరిగిన వెంటనే మృతుడు ఇక్బాల్ నివాసం ఉన్న రైలుపేట ప్రాంతాలలో తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షించారు. ఎక్కడా నీరు కలుషితం కాలేదని నివేదికలొచ్చాయి. గుండెపోటుతోనే పద్మ మరణం ఈనెల 10న మరణించిన ఎం.పద్మ(18) కూడా కార్డియాక్ అరెస్టుతో చనిపోయిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. వాంతులు, విరేచనాలతో రెండురోజుల పాటు ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకుని ఆఖరి ఘడియల్లో జీజీహెచ్లో చేరింది. అస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే కార్డియాక్ అరెస్టుతో మృతి చెందింది. కలుషిత నీరైతే ఒకరిద్దరే జబ్బున పడతారా? కలుషిత నీరైనా, అతిసారం అయినా ఒకరిద్దరే జబ్బున పడరని వైద్యులు చెబుతున్నారు. ఆ కలుషిత నీరు తాగిన అందరూ రోగం బారిన పడతారని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు ఒక వేళ కలుషిత నీటి వల్ల ఇక్బాల్, పద్మ జబ్బు బారిన పడితే వారి కుటుంబాలు ఎలా ఆరోగ్యంగా ఉన్నాయన్న ప్రశ్నకు ఎల్లోవీుడియా వద్దగానీ, టీడీపీ నేతల వద్దగానీ సమాధానం లేదు. అధికారులు అప్రమత్తం ఎల్లోవీుడియావి కట్టుకథలే అయినా గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈనెల పది నుంచి నగరంలో రోజుకు వెయ్యికిపైగా తాగునీటి శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ఎక్కడా కూడా తాగునీరు కలుషితం అయినట్లు ఆధారాలు దొరకలేదు. మినరల్ వాటర్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని రీజనల్ మెడికల్ ల్యాబ్ రిపోర్టు ఇచ్చింది. పలు ఆర్ఓ ప్లాంట్లలో ఉండాల్సిన పీహెచ్ కన్నా తక్కువ ఉండటం, బ్యాక్టీరియా ఉండడాన్ని గుర్తించారు. వీటిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు పానీపూరి కోసం వాడుతున్న నీరు కలుషితంగా ఉండటం వల్ల వ్యాధులు వస్తున్నాయని రీజినల్ ల్యాబ్ నిర్ధారించింది. ఈ విషయాలన్నీ తెలిసినా కేవలం ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా పచ్చమీడియా రెచ్చిపోతోంది. స్వచ్ఛనీరే సరఫరా చేస్తున్నాం గుంటూరు నగర ప్రజలకు నగరపాలక సంస్థ ద్వారా స్వచ్ఛనీరే సరఫరా చేస్తున్నాం. కొన్ని పత్రికలు రాజకీయ అజెండాతో కలుషిత జలాలు అంటూ విషం చిమ్ముతున్నాయి. రైలుపేటకు చెందిన ఇక్బాల్ చికెన్పాక్స్, న్యూమోనియాతోనే చనిపోయాడు. ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులూ, జీజీహెచ్ వైద్యులూ ధ్రువీకరించారు. గత ప్రభుత్వ హయాంలో 2018లో గుంటూరు నగరంలో 27 మంది అతిసారంతో మృతి చెందారు. అప్పట్లో జీజీహెచ్లో రెండు వేల మంది చికిత్స తీసుకున్నారు. డయేరియా అయితే వందల మంది ఆస్పత్రుల పాలవుతారు. ప్రజలకు సరఫరా చేసిన ప్రతినీటిబొట్టునూ పరీక్షించిన తర్వాతే కుళాయిలకు వదులుతున్నాం. సీజనల్ వ్యాధులు సోకుతున్నందున ప్రజలంతా కాచి చల్లార్చిన నీటినే తాగాలని ముందే సూచించాం. ఇంటింటి ప్రచారమూ చేపట్టాం. రీజనల్ మెడికల్ ల్యాబ్ నివేదిక మేరకు మినరల్ వాటర్ ప్లాంట్ల నిర్వహణపై తగిన చర్యలు తీసుకోవాలని ఫుడ్ కంట్రోల్ శాఖకు లేఖ రాశాం. – మీడియాతో మేయర్ కావటి మనోహర్నాయుడు, కమిషనర్ కీర్తిచేకూరి, డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు -
Fact Check: పరిశ్రమలపై పనికిమాలిన కథ
సాక్షి, అమరావతి : అసత్యాలను అక్షరాలుగా పేర్చడంలో ఆరితేరిన రామోజీరావు అనేకానేక అబద్దల కథనాలతో ఈనాడును నింపేస్తున్నారు. రాష్ట్రంలో దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమలపైనా విషం చిమ్ముతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న పరిశ్రమలు తీసుకునే రుణాలపై రిజిస్ట్రేషన్ చార్జీలకు సంబంధించి కనీస అవగాహన లేకుండా, లేని భారాన్ని ఉన్నట్లు చూపిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై అభాండాలు వేశారు. ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు గతంలో ఎంత రుణం తీసుకున్నా రూ.10 వేలు చెల్లిస్తే సరిపోయేదని, ఇప్పుడు దాన్ని 25 రెట్లు పెంచి వాటిపై భారం వేశారంటూ పచ్చి అబద్ధాన్ని ఈనాడులో అచ్చేశారు. నిజానికి మార్ట్గేజ్ బాండ్కు చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులో ఎటువంటి మార్పు లేదు. గతంలో ఉన్న ఛార్జీలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. అయినా 25 రెట్లు పెరిగిందని అబద్దాలు ప్రచురించేశారు. ఎక్కడ ఏ పరిశ్రమకు ఎలా పెరిగిందో మాత్రం చూపలేకపోయారు. దాన్నిబట్టే ఈనాడులో అచ్చేసింది పచ్చి అబద్ధమని తేలిపోయింది. ఆ రెండింటికీ తేడా తెలియదా? డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ దస్తావేజుకి, మార్ట్గేజ్ బాండ్కి తేడా తెలియకుండా రామోజీ అవాస్తవాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. నిజానికి సూక్ష్మ, చిన్న పరిశ్రమలు రుణాలు పొందినప్పుడు ఇచ్చే డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్కు మాత్రమే వెయ్యి రూపాయల స్టాంప్ డ్యూటీ వర్తిస్తుంది. మ«ద్య తరహా పరిశ్రమలకు ఎప్పుడూ స్టాంప్ డ్యూటీ మినహాయింపు లేదు. మధ్యతరహా పరిశ్రమ రూ.5 కోట్లు రుణం తీసుకుంటే దాని మార్ట్గేజ్ బాండ్కి స్టాంప్ డ్యూటీగా 0.5 శాతం చొప్పున 2.5 లక్షలు చెల్లిస్తున్నారనడం పూర్తి అవాస్తవం. డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ని మార్ట్గేజ్బాండ్గా ఊహించుకుని దానికి 0.5 శాతం స్టాంప్ డ్యూటీ కట్టాలనే కాకి లెక్క వేసి ప్రజలను మాయ చేయాలనేది రామోజీ ప్రయత్నం. ఒకవేళ ఏదైనా పరిశ్రమ తీసుకునే ఎన్ని కోట్ల రుణానికైనా డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ దస్తావేజుకు చెల్లించే స్టాంప్ డ్యూటీ రూ.50 వేలు మాత్రమే. 0.5 శాతం స్టాంపు డ్యూటీ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్కు వర్తించదు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు స్టాంపుల చట్టం ప్రకారం వెయ్యి రూపాయల స్టాంప్ డ్యూటీ కడితే సరిపోతుంది. 25 రెట్ల భారం ఎక్కడ వేసినట్లు? ఈ కనీస పరిజ్ఞానం కూడా రామోజీకి లేదు. వాస్తవానికి రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రజలు, పరిశ్రమలకు అనుకూలంగా అనేక మార్పులు జరిగాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల వ్యవస్థతో పాటు ఈ–స్టాంపింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిద్వారా గతంలోకంటే సులభంగా ప్రజలు రిజిస్ట్రేషన్ల సేవలు పొందుతున్నారు. ఇలాంటి అంశాలను తప్పుదోవ పట్టించే క్రమంలో రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే పరిశ్రమలపై రిజిస్ట్రేషన్ల ఛార్జీలతో బాదేస్తున్నారంటూ ఒక కల్పిత కథనాన్ని ప్రచురించారు. -
Fact Check: ‘సున్నావడ్డీ’ నడ్డి విరిచింది మీ బాబే..
సాక్షి, అమరావతి : వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ పథకంపై ఈనాడు మరోసారి విషం కక్కింది. రైతులను గందరగోళపర్చేలా.. వాస్తవాలకు ముసుగేసి ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది. చిన్న, సన్నకారు, వాస్తవ సాగుదారులు సాగుకోసం తీసుకునే పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడం ద్వారా వారిలో ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడమే లక్ష్యంగా అమలుచేస్తున్న వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకంపై తన అక్కసును వెళ్లగక్కింది. ‘పావలా తీసేసి.. సున్నా చుట్టేశారు’.. అంటూ అబద్ధాలను అచ్చేసింది. ఈ అవాస్తవ కథనంపై ‘ఫ్యాక్ట్చెక్’ ఏమిటంటే.. ఆరోపణ : గతంలో తక్షణమే ప్రయోజనం.. వాస్తవం : సీజన్లో ప్రతీ రైతు వ్యవసాయ అవసరాల కోసం బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకునేవారు. రూ.లక్షలోపు రుణాన్ని తిరిగి చెల్లిస్తే బ్యాంకులు వసూలుచేసే ఏడు శాతం వడ్డీలో మూడుశాతం కేంద్రం రాయితీ ఇస్తోంది. మిగిలిన నాలుగు శాతం రైతులు భరించేవారు. గతంలో ‘వడ్డీలేని రుణ పథకం’ కింద రైతులు చెల్లించిన వడ్డీ రాయితీని బడ్జెట్ కేటాయింపులను బట్టి ఏడాదికో.. రెండేళ్లకో బ్యాంకులకు జమ చేసేవారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు రైతులు చెల్లించాల్సిన అప్పు ఖాతాలకు సర్దుబాటు చేసుకునే వారు. గతంలో క్లైయిమ్స్ డేటాను అప్లోడ్ చేయడానికి నోడల్ బ్రాంచ్లకు మాత్రమే యాక్సెస్ ఉండేది. బ్రాంచ్లకు ఉండేది కాదు. ఎంతమంది అర్హత పొందారు.. వారికెంత వడ్డీ రాయితీ జమైందో రైతులకే కాదు.. బ్యాంకులకు కూడా తెలిసేది కాదు. బ్యాంకుల వద్ద కానీ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద కానీ ప్రదర్శించే పరిస్థితులు ఉండేవి కాదు. ఆరోపణ : సవాలక్ష నిబంధనలు? వాస్తవం : వడ్డీలేని రుణ పథకానికి మరింత మెరుగులు దిద్ది ఖరీఫ్–2019 నుంచి ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని’ అమలుచేస్తున్నారు. వడ్డీ రాయితీ చెల్లింపుల్లో జాప్యానికి తావులేకుండా ఉండేందుకు ఏడాదిలోపు రుణం చెల్లించిన లబ్ధిదారుల డేటా బ్యాంకుల ద్వారా ఎస్వీపీఆర్ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ డేటా ఈ–క్రాప్ డేటాతో ధ్రువీకరించిన తర్వాత అర్హులైన రైతుల జాబితాను గుర్తించి సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. మొబైల్ ద్వారా https:// karshak.ap.gov.in/ysrsvpr/ వెబ్సైట్లోకి వెళ్లి హోంపేజి లో ‘ జుnౌఠీ yౌuట ట్ట్చ్టuట’’ అనే విండో ఓపెన్ చేసి ఆధార్ నంబరుతో చెక్ చేసుకునే వెసులుబాటు రైతులకు కల్పించారు. ఒకవేళ వడ్డీ రాయితీకి అర్హత పొంది, జాబితాలో తమ పేర్లు లేకపోతే దరఖాçస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇంతకంటే పారదర్శకత ఏముంటుంది? ఆరోపణ : కేవలం 12.3 శాతం మందికే వర్తింపు.. వాస్తవం : ఏటా 65 లక్షల మంది రుణాలు తీసుకుంటారు. వీరిలో ఏడాదిలోపు రుణాలు తీసుకునే వారికి ఏటా రూ.3వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.15వేల కోట్ల వడ్డీ రాయితీ చెల్లించాలి కదా అంటూ ఈనాడు కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. చంద్రబాబు హయాంలో రైతులు పొందిన రుణాలను బట్టి ఏటా రూ.2,500 కోట్ల చొప్పున కనీసం 12వేల కోట్లకు పైగా వడ్డీరాయితీ చెల్లించాలి కదా. కానీ, టీడీపీ ఐదేళ్లలో వడ్డీ రాయితీ చెల్లించింది ఎంతో తెలుసా అక్షరాలా 40.61 లక్షల మందికి కేవలం రూ.685.46 కోట్లు మాత్రమే. చెల్లించిన మొత్తం కంటే ఎగ్గొట్టిన బకాయిలే అధికం. ఏకంగా 39.08 లక్షల మందికి రూ.1,180.66 కోట్లు ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుదే. పోనీ ఐదేళ్ల పాలనలో ఇంత తక్కువ వడ్డీ రాయితీ ఎందుకు చెల్లించావని కానీ, బకాయిలు ఎందుకు ఎగ్గొట్టావ్ బాబు అని కానీ ఏనాడు రామోజీ సింగిల్ కాలమ్ వార్త రాసిన పాపాన పోలేదు కదా.. ఆరోపణ : అరకొరగా పథకం అమలు.. వాస్తవం : చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.1,180.66 కోట్ల చెల్లింపునకు ముందుకొచ్చి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పగ్గాలు చేపట్టిన వెంటనే అణాపైసలతో సహా బకాయిలు చెల్లించి రైతులపట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఇక 57 నెలల్లో బాబు ఎగ్గొట్టిన బకాయిలతో సహా 73.88 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.1,834.55 కోట్లు వడ్డీ రాయితీ సొమ్మును జమచేసింది. రబీ 2021–22, ఖరీఫ్ 2022 సీజన్లకు సంబంధించి అర్హత పొందిన 10.79 లక్షల మంది రైతులకు రూ.220 కోట్ల సున్నా వడ్డీ రాయితీ మొత్తాన్ని త్వరలో వారి ఖాతాలకు జమచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. బాబు హయాంలో సగటున ఏటా రూ.137 కోట్ల వడ్డిరాయితీ చెల్లిస్తే ఈ ప్రభుత్వం త్వరలో చెల్లించబోయే మొత్తంతో కలుపుకుంటే సగటున రూ.421 కోట్లు చెల్లించినట్లవుతుంది. ఎవరి హయాంలో వడ్డీ రాయితీ ఎక్కువగా చెల్లించారో ఇంతకంటే ఏం చెప్పాలి. నిజంగా అరకొరగా అమలుచేయాలని ఆలోచన చేస్తే బాబు ఎగ్గొట్టిన బకాయిలు చెల్లించాల్సిన అవసరమేముందో రామోజీకే తెలియాలి. ఆరోపణ : అంతంతమాత్రంగానే పంట రుణాలు.. వాస్తవం : బాబు ఐదేళ్ల పాలనలో 3.97 కోట్ల మందికి రూ.3.64 లక్షల కోట్ల రుణాలు అందిస్తే.. ఈ ప్రభుత్వ హయాంలో గడిచిన 57 నెలల్లో ఏకంగా 5.17 కోట్ల మంది రైతులకు రూ.8.59 లక్షల కోట్ల పంట రుణాలు అందించారు. పంట సాగుదారు హక్కు పత్రాల (సీసీఆర్సీ) ద్వారా ఇప్పటివరకు 14.13 లక్షల కౌలు రైతులకు రూ.8,346 కోట్ల వ్యవసాయ రుణాలు అందించారు. ప్రస్తుత 2023–24 సీజన్లో రికార్డుస్థాయిలో 8.31 లక్షల కౌలు రైతులకు సీసీఆర్సీలు జారీచేయగా, ఇప్పటికే వారిలో 5.48 లక్షల మందికి రూ1,907.8 కోట్ల వ్యవసాయ రుణాలు అందించారు. బాబు ఎగ్గొట్టిన బకాయిలు చెల్లించడమే కాదు.. రుణాల మంజూరులో కానీ, సున్నా వడ్డీ రాయితీ చెల్లింపుల్లో కానీ రైతు సంక్షేమమే పరమావధిగా ముందుకెళ్తుంటే ఈనాడు మాత్రం బురదజల్లడమే పనిగా పెట్టుకుంది. -
పోయింది మీ బ్రాండ్ ఇమేజే..
సాక్షి, అమరావతి : సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష కట్టి రోజూ అదేపనిగా తప్పుడు కథనాలను వండి వార్చే వ్రతం ఆచరిస్తున్న ఈనాడు రామోజీరావుకు బాబుపట్ల తనకున్న పిచ్చి పీక్స్కు చేరింది. అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా చెప్పిందే చెప్పడం.. రాసిందే రాయడం చేస్తూ క్షీణిస్తున్న తన మానసిక పరిస్థితిని సిగ్గూఎగ్గూ లేకుండా ఈనాడు పాఠకులకు ప్రదర్శించుకుంటూ తన బ్రాండ్ ఇమేజ్ను పూర్తిగా పోగొట్టుకున్నారు. కేవలం ప్రభుత్వంపై బురద జల్లి సీఎం కుర్చీలో తన ఆత్మబంధువు చంద్రబాబును ఉన్న ఫళంగా అందులో కూర్చోబెట్టాలన్న ఏకైక లక్ష్యంతో ఒకే వార్తను కేవలం శీర్షిక మార్చి నెలానెలా తిప్పితిప్పి వండి వారుస్తున్నారు. ఈ మధ్యనే ‘కక్షకట్టి పరిశ్రమలను వెళ్లగొట్టి’.. శీర్షకతో ఓ దిగజారుడు కథనాన్ని అచ్చోసి నెలరోజులు కాకుండానే ‘బ్రాండుకు బ్యాండు’ అంటూ మళ్లీ అదే వార్తను అటుఇటూ మార్చి మరోసారి తన పాఠకుల మీదకు రామోజీ వదిలారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పారిశ్రామికంగా రాష్ట్రం వేగంగా వృద్ధి చెందుతుండటమే కాకుండా అంబానీ, అదానీ, టాటా, బిర్లా, మిట్టల్, బంగూర్, భజంకా, సింఘ్వీ, ఐటీసీ, హెచ్యూఎల్ వంటి పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుంటే తన వర్గ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రగతిని దిగజారుస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలేదంటూ వికృతానందాన్ని పొందుతున్నాడు. నిజానికి.. రాష్ట్రానికి ఎప్పుడూలేని విధంగా దిగ్గజ సంస్థల ప్రతినిధులు స్వయంగా వచ్చి సీఎం వైఎస్ జగన్ను కలిసి పెట్టుబడులు పెడుతుంటే రాష్ట్ర బ్రాండ్ దెబ్బతినడంతో రూ.1.24 లక్షల కోట్ల పెట్టుబడులు వెళ్లిపోయాయని గుండెలు బాదుకుంటూ ఓ గాలి వార్తను ప్రచురించారు. ఈ నేపథ్యంలో.. ఈనాడు వార్తలోని అంశాలపై ‘ఫ్యాక్ట్చెక్’ ఏమిటంటే.. పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయా!? ♦ రిలయన్స్ అంబానీ స్వయంగా విశాఖ పెట్టబడుల సమావేశానికి హాజరై గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.50,000 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టే విధంగా సీఎం సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు వీటికి అదనంగా బయో ఎనర్జీ రంగంలో రిలయన్స్ గ్రూపు వ్యవసాయ వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయో గ్యాస్ను ఉత్పత్తి చేసేందుకు సుమారు రూ.1,900 కోట్లతో రాష్ట్రంలో 15 యూనిట్లును పెట్టడానికి ముందుకొచ్చారు. తొలిదశలో 8 యూనిట్ల నిర్మాణ పనులను మూడ్రోజుల క్రితం ప్రారంభించింది. ♦ ఆదిత్య బిర్లా గ్రూపు తూర్పుగోదావరి జిల్లా బలభ్రదపురంలో గ్రాసిం ఇండస్ట్రీస్ పేరుతో కాస్టిక్ సోడా తయారీ యూనిట్, పులివెందులలో ఆదిత్య బిర్లా రెడిమేడ్ గార్మెంట్స్ తయారీ యూనిట్లను ఏర్పాటుచేయగా తాజాగా చిత్తూరు జిల్లాలో రూ.1,700 కోట్లతో కార్బన్ బ్లాక్ తయారీ యూనిట్ను ఏర్పాటుచేసింది. ♦ ఐటీసీ గ్రూపు గుంటూరులో వెల్కమ్ గ్రూపు పేరుతో ఫైవ్స్టార్ హోటల్ నిర్మించడమేగాక స్పైసెస్ పార్క్ను ఏర్పాటు చేసింది. ♦ హిందుస్థాన్ యూనీ లీవర్ తాజాగా ఆయిల్పామ్ రిఫైనరీ యూనిట్తోపాటు రాష్ట్రంలో 30,000 హెక్టార్లలో ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించే విధంగా ఒప్పందం చేసుకుంది. ♦ అలాగే, వైఎస్సార్ జిల్లా బద్వేల్లో సెంచురీ ప్లేవుడ్స్, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో జపాన్కు చెందిన యకహోమా టైర్ల తయారీ యూనిట్లు కరోనా ఉన్నప్పటికీ రికార్డు సమయంలో యూనిట్లను నిర్మించి ఉత్పత్తి ప్రారంభించి తమ విస్తరణ ప్రణాళికలతో ముందుకెళ్తున్నాయి. ఇలా విశాఖ జీఐఎస్ సదస్సులో రూ.13.11 లక్షల కోట్ల ఒప్పందాలు కుదరడమే కాకుండా ఏడాది కాకుండానే వాటిలో ఇప్పటికే రూ.2.46 లక్షల కోట్ల పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తేవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించింది. వాస్తవాలిలా ఉంటే.. పెట్టుబడులు వెళ్లిపోయాయంటూ రామోజీ ఏ ఆధారాలతో రాశారో చెప్పాలి. అమరరాజా చెప్పినా సరే.. ఇక వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా అమరరాజా గ్రూపు తెలంగాణలో కొత్తగా పెట్టుబడులను పెట్టింది. రాష్ట్రంలో ప్రస్తుత పెట్టుబడులను కొనసాగిస్తూ ఇక్కడ కూడా విస్తరణ కార్యక్రమాలను చేపడుతోంది. ఇదే విషయాన్ని అమరరాజా గ్రూపే స్వయంగా ప్రకటించింది. కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం వివిధ రాష్ట్రాలు, దేశాల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. ఉదా.. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ హైదరాబాద్తో పాటు శ్రీకాకుళం, హిమాచల్ప్రదేశ్లలో యూనిట్లు పెట్టింది. అంతమాత్రానా ఆ సంస్థ తెలంగాణ నుంచి వెళ్లిపోయిందంటూ వార్త రాయగలమా? రామోజీకి చెందిన మార్గదర్శి గ్రూపు కర్ణాటకలో కొత్తగా బ్రాంచీలను ఏర్పాటుచేసింది. అంటే ఏపీ, తెలంగాణ నుంచి మీ గ్రూపు వెళ్లిపోయిందని రాస్తావా రామోజీ? టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఈ మధ్య పార్లమెంటు సమావేశాల్లోనే రాజకీయాల్లోకి రావడంవల్ల కేంద్ర, ఈడీ సంస్థల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్నారేగానీ ఆయన ఏ రాష్ట్రం గురించి ప్రస్తావించలేదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వ వేధింపులవల్ల అమరరాజా రాష్ట్రం నుంచి వెళ్లిపోయిందంటూ రామోజీ రాసిపారేశారు. విశాఖలో అత్యంత ఖరీదైన భూమిని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నిరి్మంచడం కోసం లులూ గ్రూపునకు గత ప్రభుత్వం భూమిని కేటాయించింది. కానీ, ఈ భూమికి చెల్లించాల్సిన మొత్తం ఆ గ్రూపు చెల్లించడంలో విఫలమైంది. భూమి ధర మొత్తాన్ని చెల్లిస్తే భూమిని అప్పగిస్తామంటూ ఏపీఐఐసీ పలు లేఖలు రాసినా స్పందన లేకపోవడంతో ఏపీఐఐసీ ఆ భూమిని కేటాయించలేదు. ఇది అభివృద్ధి కాదా రామోజీ.. ♦ 2019–20లో జీఎస్డీపీలో 22.04 శాతంగా ఉన్న పరిశ్రమల వాటా ఇప్పుడు 23.36 శాతానికి చేరింది. ♦ వరుసగా మూడేళ్లు నుంచి సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తోంది. ♦ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన లీడ్ ఇండెక్స్–2023లో మన రాష్ట్రం టాప్ అచీవర్గా నిలిచింది. ♦ రూ.1.59 లక్షల కోట్ల ఎగుమతులతో దేశంలో ఆరో స్థానానికి రాష్ట్రం ఎగబాకింది. ♦ 2019 నుంచి రాష్ట్రంలో 130 లార్జ్ అండ్ మెగా యూనిట్లు ప్రారంభమయ్యాయి. ♦ ఎగుమతుల సన్నద్ధ రాష్ట్రాల్లో ఏపీ 8వ స్థానానికి చేరింది. ..ఇలా వీటన్నింటి ద్వారా రూ.63,754 కోట్ల పెట్టుబడులు, 77,227 మందికి ఉపాధి లభించింది. అలాగే, ఎంఎస్ఎంఈలతో కలుపుకుంటే రాష్ట్రంలో 3,69,831 యూనిట్లు ఏర్పాటుకావడం ద్వారా రూ.14.18 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా 32,30,425 మందికి ఉపాధి.. పరోక్షంగా 64,60,850 మందికి ఉపాధి లభించనుంది. -
ఇసుకపై మళ్లీ అదే అక్కసు
సాక్షి, అమరావతి: అసలే కోతి.. కల్లు తాగింది.. ఆపై నిప్పు తొక్కితే ఎలా ఉంటుంది..? ఈనాడు రామోజీరావు పరిస్థితి ఇప్పుడు అచ్చు అలాగే ఉంది. సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం ఏదో ఒక విషం చిమ్మందే తెల్లారని రాజగురువు పాడిందే పాడరా పాచిపళ్ల దాసరా.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇసుక తవ్వకాలపై ఇప్పటికే టన్నుల కొద్దీ అబద్ధాలను తన విషపుత్రిక ఈనాడులో అచ్చేసిన ఆయన ఇప్పుడు మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించి వికృత రాతలతో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. జిల్లా కలెక్టర్లు చేసిన తనిఖీలను అడ్డగోలుగా వక్రీకరించి తన వక్రబుద్ధిని మళ్లీ బయటపెట్టుకున్నారు. ప్రభుత్వంపైనా, సీఎం వైఎస్ జగన్పైనా గుడ్డి వ్యతిరేకతతో ప్రతి విషయాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుని పారదర్శకంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై అవాస్తవాలు, అభూత కల్పనలు ప్రచురించారు. బాబు పాలనలో తవ్వకాల బరితెగింపు.. నిజానికి.. చంద్రబాబు హయాంలోనే ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరిగింది. సహజ వనరుల ద్వారా వచ్చే రెవెన్యూని ప్రజాసంక్షేమానికి వినియోగించడానికి బదులు, ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్లింది. ప్రజలు ఇసుక కొనుగోలు చేయడానికి బ్లాక్ మార్కెట్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి అరాచకాలను నిర్మూలించేందుకు సీఎం జగన్ కొత్త ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. దాని ప్రకారం టెండర్లు నిర్వహించి ఇసుక విక్రయాలను ఒక క్రమపద్ధతిలో నిర్వహించేలా చేస్తున్నారు. ఎక్కడా ఇసుక కొరత లేకుండా, అందుబాటు ధరలోనే, కావాల్సినంత ఇసుకను పొందే అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా.. రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ కోసం పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థగా గుర్తింపు పొందిన మినీరత్న ఎంఎస్టీసీ ద్వారా టెండర్లు నిర్వహించారు. అందులో సక్సెస్ఫుల్ బిడ్డర్లుగా ఎంపికైన ఏజెన్సీలు ఇసుక ఆపరేషన్స్ ప్రారంభించాయి. పర్యావరణ అనుమతులున్న రీచ్ల్లోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన లేదు. సంబంధిత శాఖల అనుమతులతోనే రిజర్వాయర్లలో డీసిల్టింగ్ జరుగుతోంది. దీనిపై పర్యవేక్షణ, నిఘా కోసం ఎస్ఈబీని ఏర్పాటుచేశారు. అలాగే, జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్, గనుల శాఖ అధికారులు కూడా తమకు ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి జిల్లాకు ఒక విజిలెన్స్ స్క్వాడ్ కూడా గనుల శాఖలో పనిచేస్తోంది. అంతేకాక.. రాష్ట్ర సరిహద్దులతో పాటు కీలకమైన ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. బాబు హయాంలో దోపిడీకి ఈనాడు వత్తాసు.. అసలు చంద్రబాబు పాలనలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరిగినా రామోజీరావు, ఈనాడు పత్రిక కళ్లుమూసుకున్నాయి. మహిళా సంఘాలకు ఇసుక తవ్వకాలను అప్పగించి, ఇసుక మాఫియా ధాటికి వారు పనిచేయలేని పరిస్థితిని కల్పించిన ఘనత చంద్రబాబుది. ఆ తర్వాత ఉచిత ఇసుక విధానం పేరుతో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా ప్రజలను దోచుకుంది. టీడీపీ నేతల జేబులు నింపేందుకే ఉచిత ఇసుక విధానం ఉపయోగపడింది. చంద్రబాబు హయాంలో ప్రభుత్వానికి రావాల్సిన దాదాపు రూ.3,825 కోట్ల ఆదాయానికి గండిపడింది. ఈ సొమ్మంతా ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్లింది. మరోవైపు.. ప్రజలు అధిక ధరల్లో బ్లాక్ మార్కెట్లో ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని కల్పించారు. అప్పట్లో ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా ఒక మహిళా ఎమ్మార్వోపైనే నాటి ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ దాడిచేసిన ఘటన ఇసుక మాఫియా ఆగడాలకు అద్దంపట్టింది. గత టీడీపీ ప్రభుత్వంలో ఇసుక లారీలు పెద్దఎత్తున పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. లెక్కాపత్రం లేకుండా విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరిగాయి. పలు రాష్ట్రాలకు రోల్ మోడల్గా.. ఇక మన రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్, పర్యవేక్షణకు పారదర్శకంగా అనుసరిస్తున్న విధానాలను పలు రాష్ట్రాలకు చెందిన మైనింగ్ అధికారులు కూడా పరిశీలించి, తమ రాష్ట్రాల్లో మోడల్గా అమలుచేసేందుకు విధానాలు రూపొందించుకుంటున్నారు. ఇవన్నీ ఈనాడుకు కనిపించడంలేదు. ఒకవేళ కనపడినా కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తూ.. అక్రమాలకు ప్రోత్సహిస్తున్నారని, దాడులకు సంబంధించిన సమాచారం ముందే లీక్ చేస్తున్నారంటూ అసత్యపు రాతలు రాస్తోంది. పొంతనలేని రాతలతో తప్పుడు ఆరోపణలు.. మరోవైపు.. రాష్ట్రంలో అక్రమంగా ఇసుక తవ్వకాలకు సంబంధించి అక్కడక్కడా వచ్చిన ఆరోపణలపై పలు జిల్లాల్లో కలెక్టర్లు, సంబంధిత అధికారులతో కూడిన బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ తనిఖీలు జరుగుతున్నాయని రాసిన ఈనాడు.. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు రీచ్ల వైపు రాలేదని, మరికొన్నిచోట్ల గనులు, కాలుష్య నియంత్రణ, భూగర్భ జలశాఖ, ఎస్ఈబీ అధికారులతో కమిటీలు వేసి వారితో తనిఖీలు చేయించారంటూ పొంతనలేని రాతలు రాసింది. అలాగే, తనిఖీలు కొనసాగుతుంటే.. అప్పుడే ఎన్జీటీకి నివేదికలు ఇచ్చారంటూ అడ్డగోలు వాదనకు తెరతీసింది. వాస్తవంగా ఏం జరుగుతుందో కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, కేవలం అధికారులపై బురదజల్లే ఉద్దేశంతోనే పరస్పరం పొంతనలేని కథనాలతో తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఏటా రూ.785 కోట్ల ఆదాయం.. ఇప్పుడు ప్రతిఏటా ప్రభుత్వానికి రూ.785 కోట్లు ఆదాయం వస్తోంది. టన్ను ఇసుక ఓపెన్ రీచ్లలో రూ.475కి విక్రయిస్తున్నారు. అలాగే, రీచ్లు, డిపోల వద్ద రవాణా చార్జీలతో కలిపి ఇసుక ధరలను కూడా ప్రతివారం పత్రికల ద్వారా ప్రభుత్వం ప్రకటిస్తోంది. అంతకన్నా ఎక్కువకు ఎవరు విక్రయించినా, లేదా ఇసుక కొనుగోళ్లు, రవాణాలో ఎటువంటి సమస్యలున్నా టోల్ఫ్రీ నెంబరు ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయం కల్పించారు. ఈ వాస్తవాలను పక్కనపెట్టి ఈనాడు పత్రిక తమ ఊహలను వార్తలుగా రాస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం ఇసుక తవ్వకాలపై పదేపదే అక్కసు వార్తలు వండి వారుస్తోంది. ఎన్జీటీ సంతృప్తి.. ఈనాడు మొద్దు నిద్ర.. ఇప్పుడు సీఎంగా వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత.. పర్యావరణానికి ఎటువంటి విఘాతం ఏర్పడకుండా, పూర్తి అనుమతులతో ఇసుక తవ్వకాలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా జరిగిన ఇసుక తవ్వకాల కారణంగా ఎన్జీటి ఏకంగా రూ.100 కోట్ల జరిమానాను విధించిన సంగతి తెలిసిందే. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఇసుక పాలసీ ద్వారా తీసుకున్న చర్యలను పరిశీలించిన ఎన్జీటి సంతృప్తి వ్యక్తంచేస్తూ, గత ప్రభుత్వం తప్పిదాలవల్ల విధించిన రూ.100 కోట్ల జరిమానాను కూడా రద్దుచేసింది. ఈ విషయం తెలిసినా ఈనాడు తెలియనట్లు మొద్దునిద్ర నటిస్తోంది. -
Fact Check: గొప్పగా చేసినా.. ‘పచ్చ’ రాతలేనా?
పాలన సవ్యంగా సాగిపోతుంటే పాపం రామోజీకి నిద్రపట్టడం లేదు. పథకాలు సక్రమంగా అమలవుతుంటే ఆయన విష‘పత్రిక’కు నచ్చడం లేదు. ప్రభుత్వానికి ప్రజాభిమానం రోజురోజుకూ పెరిగిపోతుంటే సహించడం లేదు. క్రమ పద్ధతిలో ప్రాజెక్టులు పూర్తవుతుంటే ఆ ‘పచ్చ’కళ్లకు కనిపించడం లేదు. అడ్డగోలు రాతలతో రెచ్చిపోయి... తప్పుడు కథనాలతో జనాన్ని తప్పుదారి పట్టించి... వికృతానందం పొందాలని తెగ తాపత్రయపడుతున్నారు. ‘బాబు’ కళ్లలో ఆనందం చూడాలని ఎంతగానో ఆరాటపడుతున్నారు. వాస్తవమేంటో కళ్లకు కనిపిస్తున్నా... జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాగే ప్రాజెక్టులపైనా లేనిపోని ఆరోపణలు చేసి ఓ కథనాన్ని వండివార్చేశారు. కానీ రాష్ట్రంలో ప్రాజెక్టులు పరుగులు పెట్టింది ఈ ప్రభుత్వంలోనే అన్నదిప్రజలందరికీ అర్థమవుతున్నా... పాపం ఈనాడుకే ఎందుకో తెలియడం లేదు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తుంటే ‘ఈనాడు’ రామోజీరావు ఓర్వలేకపోతున్నారు. రైతుల్లో సీఎం వైఎస్ జగన్కు మద్దతు రోజురోజుకూ పెరుగుతుండటం.. అది చంద్రబాబు రాజకీయ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తూండటంతో పచ్చబ్యాచ్ ఆందోళన చెందుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పుంఖానుపుంఖాలుగా సీఎం వైఎస్ జగన్పై విషపు రాతలకు తెగబడుతున్నారు. అ కోవలోనే ప్రాజెక్టులపై అబద్ధాలను అచ్చేసింది. గడచిన 57 నెలల్లో కరోనా ప్రభావం వల్ల దాదాపు 24 నెలలు ప్రపంచమే స్తంభించిపోయింది. మిగిలిన 33 నెలల్లోనే సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్, అవుకు రెండో టన్నెల్, లక్కసాగరం ఎత్తిపోతలను పూర్తి చేసి, జాతికి అంకితం చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్, వెలిగొండ జంట సొరంగాలు పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చిన వెంటనే ఆ జంట సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్కు తరలించనున్నారు. మరో 14 ప్రాజెక్టులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. ♦ బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్వాల్ లీకేజీలకు అడ్డుకట్ట వేయడం, నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడం ద్వారా పులిచింతల, గండికోట, చిత్రావతి, సోమశిల, కండలేరు జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. ♦ తెలుగుగంగ లింక్ కెనాల్, ప్రధాన కాలువకు లైనింగ్ చేయడం ద్వారా సకాలంలోనే వెలిగోడు, బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లను నింపుతున్నారు. ఏటా కోటి ఎకరాల ఆయకట్టుకు నీరందించారు. ♦ చంద్రబాబు అవినీతి వల్ల విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టు పనులను గాడిలో పెట్టి.. ప్రణాళికాయుతంగా సీఎం జగన్ పూర్తి చేస్తున్నారు. నిర్వాసి తులకు పునరావాసం కల్పించి, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు, స్పిల్ చానల్, స్పిల్ వేను పూర్తి చేసి 2021, జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని పోలవరం స్పిల్ వే మీదుగా మళ్లించారు. ♦ చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పునరుద్ధరణకు సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు జారీ చేసిన వెంటనే దాన్ని చేపట్టి.. ప్రధాన డ్యామ్ను పూర్తి చేయడం ద్వారా పోలవరం ఫలాలను రైతులకు అందించడానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు. ♦ 57 నెలల్లో సాగునీటి ప్రాజెక్టులకోసం వెచ్చించినది రూ.32,161.49కోట్లు ♦ సాగునీటికి నోచుకున్న మొత్తం విస్తీర్ణం 9.86 లక్షల ఎకరాలు నాడు బాబు నిర్లక్ష్యంపై ప్రశ్నించలేదెందుకు? 2014 జూలై 28వ తేదీన టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో జలయజ్ఞం ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తానని ప్రకటించారు. 2014, జూన్ 8 నుంచి 2019 మే 29 వరకూ సాగునీటి ప్రాజెక్టుల పనులకు రూ.68,293.95 కోట్లు ఖర్చు చేశారు. ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు. జీవో 22, జీవో 63లను అడ్డుపెట్టుకుని అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేసి.. ఆస్థాన కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టి భారీ ఎత్తున దోచుకున్నారు. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తికి పోలవరం పనులే తార్కాణం. సబ్ కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికే చంద్రబాబు ప్రతి సోమవారాన్ని సమీక్షల పేరుతో పోల‘వరం’గా మార్చుకున్నారని అప్పటి ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ అధినేత రాయపాటి రంగారావు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. పోలవరంలో రూ.2,917 కోట్ల విలువైన పనులను రామోజీ వియ్యంకుడికి చెందిన నవయుగకు కట్టబెట్టారు. చంద్రబాబు దోపిడీలో రామోజీ కి వాటా ఉండటం వల్లే అప్పట్లో సాగునీటి ప్రాజెక్టులో సాగిన దోపిడీపై ఒక్క అక్షరమైనా ఈనాడులో అచ్చేయ లేదన్నది బహిరంగ రహస్యం. -
ప్రజల కోసం రోడ్డేసినా ఓర్వలేకపోతున్న రామోజీ
సాక్షి ప్రతినిధి, బాపట్ల: రోడ్లపై గుంత కనబడితే చాలు అక్కడకి గద్దల్లా వాలిపోతున్న ఎల్లోమీడియా గ్యాంగ్.. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులతో ప్రజలు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేకపోతోంది. తమకు రోడ్డు సౌకర్యం కలిగి ప్రజలు, రైతులు ఆనందంగా ఉంటే అక్కసుతో ప్రభుత్వంపై విషం చిమ్ముతోంది. అబద్ధాల్లో ఆరితేరిన రామోజీరావు అభివృద్ధి పనులకు వక్రభాష్యం చెబుతూ పనిగట్టుకొని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ఈ పరంపరలో ఈనాడు పత్రిక మంగళవారం ‘‘వైవీ సుబ్బారెడ్డి వ్యవసాయక్షేత్రానికి రూ. 30 లక్షలతో రోడ్డు’’ అనే తప్పుడు కథనాన్ని ప్రచురించింది. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం అనమనమూరు వద్ద జనావాసాలు లేని, ప్రజలు తిరగని మార్గంలో రోడ్డు వేశారని, అధికారులు పెద్ద మొత్తంలో ధనాన్ని వెచ్చించి స్వామిభక్తి చాటుకున్నారంటూ ఆ కథనాన్ని అచ్చేశారు. రైతులకు, భక్తులకు సౌకర్యంగా.. వాస్తవానికి మేదరమెట్ల అనమనమూరు రోడ్డులో అనమనమూరు నుంచి మణికేశ్వరం క్రాస్రోడ్డు వరకూ 2.5 కిలో మీటర్ల మేర ఉపాధిహామీ నిధులతో రెండు సంవత్సరాల క్రితం తారురోడ్డు వేశారు. ఈ రహదారి పరిధిలో కొరిశపాడు మండలం అనమనమూరు, అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామాలున్నాయి. మణికేశ్వరం వద్ద దక్షిణకాశీగా పేరుగాంచిన శైవక్షేత్రం ఉంది. ఇక్కడికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఇక మూడు గ్రామాల పరిధిలో సుమారు నాలుగు వందల ఎకరాల పొలాలు ఉన్నాయి. ఈ పొలాల్లో రైతులు వరి, మామిడి, పుచ్చ తదితర పంటలు పండిస్తున్నారు. నిత్యం రైతులు రాకపోకలు సాగిస్తారు. గతంలో ఈ ప్రాంతానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. చిన్నపాటివర్షం కురిసినా రాకపోకలకు వీలుకాని పరిస్థితి. గతంలో గ్రావెల్ రోడ్డు వేసినప్పుడూ తప్పుడు రాతలే.. వైవీ సుబ్బారెడ్డి మేదరమెట్లకు చెందిన వారు కావడంతో అనమనమూరు, కొంగపాడు, మణికేశ్వరం గ్రామాల రైతులు, ప్రజలు దారి సౌకర్యం ఏర్పాటు చేయాలని గతంలో వైవీ సుబ్బారెడ్డిని కోరారు. దీంతో 2005లో మేదరమెట్ల నుంచి అనమనమూరు వరకూ తారురోడ్డును మంజూరు చేయించిన సుబ్బారెడ్డి.. అనమనమూరు నుంచి మణికేశ్వరం క్రాస్ వరకూ గ్రావెల్ రోడ్డును సైతం మంజూరు చేయించారు. రెండు సంవత్సరాల క్రితం అనమనమూరు నుంచి మణికేశ్వరం క్రాస్ వరకూ రెండేళ్ల క్రితం తారురోడ్డు పూర్తికావడంతో మణికేశ్వరం, శైవక్షేత్రంలకు వెళ్లే భక్తులకు నాలుగు కిలోమీటర్ల దూరం తగ్గింది. దూరాభారం తగ్గి, మెరుగైన రోడ్డు రావడంతో స్థానికులు ఆనందంగా ఉండటం.. రామోజీకి కంటగింపుగా మారింది. వైవీ సుబ్బారెడ్డి కుటుంబీకులకు నలభై ఎకరాలు కూడా లేని చోట.. ఏకంగా వంద ఎకరాలు ఉన్నాయంటూ ఈనాడు వక్రీకరించింది. ఇలాంటి అబద్ధపు రాతలు రాసిన ఈనాడుపై స్థానికులు మండిపడుతున్నారు. గతంలో గ్రావెల్ రోడ్డు వేసినప్పుడూ ఇలాంటి రాతలే రాశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు వేసింది ప్రజలకోసం అనమనమూరు గ్రామం నుంచి మణికేశ్వరం క్రాస్ వరకూ రోడ్డు నిర్మించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని చాలా సార్లు వైవీ సుబ్బారెడ్డి గారిని కోరాం. పొలాలకు వెళ్లేందుకు పడుతున్న కష్టాలను ఆయనకు చెప్పాం. దీంతో ఆయన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనమనమూరు నుంచి మణికేశ్వరం క్రాస్ వరకూ తారు రోడ్డు వేయించారు. గతంలో మేదరమెట్లనుంచి అనమనమూరువరకూ రోడ్డును కూడా సుబ్బారెడ్డి కుటుంబమే వేయించింది. ఈ రోడ్డుతో మా గ్రామాలకు వెళ్లడంతో పాటు పొలాలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉంది. ప్రజలకు మంచి జరగడం చూసి ఓర్వలేక ఈనాడు పత్రిక తప్పుడు రాతలు రాసింది.– జంపు హరిబాబు, అనమనమూరు సర్పంచ్ భక్తులకు రోడ్డు సౌకర్యంగా ఉంది గతంలో మాగ్రామాలకు, పంట పొలాలకు దారిలేక ఇబ్బందులు పడ్డాం. ప్రఖ్యాత మణికేశ్వర ఆలయానికీ సరైన దారిలేక భక్తులు ఇబ్బందులు పడాల్సివచ్చేది. ఈ విషయాన్ని మా గ్రామాల ప్రజలు వైవీ సుబ్బారెడ్డి గారికి చెప్పడంతో వారు రోడ్డు వేయించారు. దీంతో రైతులు, భక్తులకు ఇబ్బందులు తప్పాయి. అది చూడకుండా సుబ్బారెడ్డి పొలాలకు దారి వేసుకున్నారంటూ ఈనాడు తప్పుడు వార్త రాయడం దుర్మార్గం. – మందా నాగయ్య, మణికేశ్వరం సర్పంచ్ భర్త -
Fact Check: పేదల ఇళ్లపై కుళ్లు రాతలేలా?
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఒకేసారి 30 లక్షల మందికిపైగా పేదలకు ఇళ్ల స్థలాలను అప్పగించడం... వాటికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేస్తుండడం పెత్తందారు రామోజీరావుకు మింగుడు పడటంలేదు. నిరుపేదలు సొంతింట్లో ఉండటాన్ని జీర్ణించుకోలేక వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తన వంకర రాతలతో బురదజల్లి అలిసిపోయాడు. ఇక మిగిలిందల్లా ఆ ఇళ్ల స్థలాలకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తుండడాన్ని కూడా మాయాజాలమంటూ తప్పుడు రోత రాతలు రాస్తోంది. దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో 30 లక్షలకు పైగా పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతూ నిరుపేదల సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తుండడాన్ని, ఆ ఇళ్లను ఒక విలువైన ఆస్తిగా పేదలకు ఇచ్చేందుకు రిజిస్ట్రేషన్ చేయడాన్ని తప్పు పడుతూ ప్రజలను, నిరుపేదలు ఆందోళన చెందేలా ప్రయత్నాలు చేస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’పథకం కింద వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో ఏకంగా 17,005 ఊళ్లను కొత్తగా నిర్మించడం వారి కళ్లకు కనిపించడంలేదు. ఒక్కో కాలనీ ఒక్కో ఊరుగా మారుతున్నా ఆ పత్రికకు కనిపించదు. ఒక్కో పేదింటి అక్కచెల్లెమ్మ పేరిట ఇంటి రూపంలో రూ.20 లక్షల వరకూ విలువైన స్థిరాస్తి సమకూరుస్తుంటే ఈనాడుకు ముచ్చెమటలు పడుతున్నాయి. పేదలకు ఇంత పెద్దమేలు జరుగుతుండడం ద్వారా వైఎస్సార్సీపీకి ఆదరణ పెరుగుతుండడం.. అదే సమయంలో చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తు కనుచూపు మేరలో కనిపించకపోవడంతో రామోజీరావు గంగవెర్రిలెత్తిపోతున్నారు. దీంతో ఏదో రకంగా బాబుకు మేలు చేయాలని దింపుడు కళ్లెం ఆశతో వైసీపీ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సేవలపైనా నిత్యం వక్రీకరించడమే విధిగా పెట్టుకున్నారు. జియో ట్యాగ్ ఉంటే ప్లాట్లు గుర్తించడం కష్టమెలా అవుతుంది? ప్లాట్ ఎక్కడ ఉందో గుర్తించలేని స్థితిలో లబ్ధిదారులు ఉన్నారనడం పచ్చి అబద్ధం. ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడే ప్లాట్లు విభజన చేసి సరిహద్దు రాళ్లు వేశారు. లబ్ధిదారులను వారి ప్లాట్లలో ఫోటోలు తీసుకుని జియోట్యాగ్ కూడా చేశారు. ప్లాటులో నిలబడి ఫోటో దిగడం ద్వారా లబ్ధిదారులకు వారి ప్లాటు ఎక్కడ ఉందో తెలుసు. ’పచ్చ‘పాతంతో చూసే ఈనాడుకు ఇవేమీ కనిపించవు. కేటాయించిన ప్లాట్లో ఫోటో దిగి జియోట్యాగ్ చేయడమంటే వారి ప్లాట్ ఎక్కడ ఉందో తెలుసనే కదా? ఇది పేదలను బురిడీ కొట్టించే పన్నాగం ఎలా అవుతుంది..? గుంటూరు జిల్లాలో పేరేచర్ల లేఅవుట్లో 9,219 ఇళ్లను మంజూరు చేశారు. ఇంకా 6,152 ఇళ్ళకు సంబంధించి రెండవ విడత గృహ నిర్మాణ కార్యక్రమంలో ఇళ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే మంజూరైన ఇళ్లలో 1,230 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా, 486 రూఫ్ స్థాయిలోనూ, మిగతావి బేస్మెంట్ స్థాయిలోనూ ఉన్నాయి. మూడవ ఆప్షన్ కింద ఇళ్ల నిర్మాణానికి పదిమంది కాంట్రాక్టర్లను నియమించి, మూడు ఇటుక తయారీ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ లేఅవుట్లో ప్రతిరోజు సుమారు వెయ్యి మంది కార్మికులు పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ వాస్తవాలను చూడని ఈనాడు ప్రభుత్వంపై ఆక్రోశంతో విషం చిమ్ముతూ తన దిగజారుడుతనానికి ప్రదర్శించుకుంటోంది. రిజిస్ట్రేషన్ చేయడం మాయాజాలమా? పేదలందరికీ స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టించి ఇస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ 31 లక్షల 19 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అందులో 22 లక్షల ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను రిజిస్ట్రేషన్ చేయడం వల్ల బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి రుణం తెచ్చుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. ప్రభుత్వమే ఆయా రిజిస్ట్రేషన్లను చేస్తుంది కాబట్టి బ్యాంకులు రుణం మంజూరు చేస్తాయి. డాక్యుమెంట్ రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి డేటా బేస్లో ఆ వివరాలన్నీ పదిలంగా ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు సర్టీఫైడ్ కాపీ పొందడానికి అవకాశం ఉంటుంది. ఫోర్జరీ చేస్తారని గానీ, ట్యాంపర్ చేస్తారని గాని భయం ఉండదు. అమ్మే సమయంలో ఆ డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి లింకు డాక్యుమెంట్లు అవసరం లేదు. నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పేదలకు లబ్ధి చేకూరే రిజిస్ట్రేషన్ మాయాజాలం అవుతుందా? ఇప్పటికే 8 లక్షల మంది లబ్ధిదారులు తమ పేరున పట్టాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా మొదటి దశలో కృష్ణాజిల్లా కంకిపాడు మండలం గొడవర్రులో మొదటి దశ ఒకటవ లేఅవుట్లో 53 ఎకరాల 33 సెంట్లు 345 మంది లబ్ధిదారులకు, రెండో లేఅవుట్లో 29 ఎకరాల 66 సెంట్లు భూమిలో 777 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రైవేట్ అధీనంలో ఉన్న భూమిని రూ.43.93 కోట్లతో కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన భూమిని విజయవాడ మున్సిపల్ అధికారులకు లేఅవుట్ అభివృద్ధి కోసం అప్పగించారు. -
Fact check: అసత్య రాతలు.. తప్పుడు వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన’ పథకాలు చింతలేని ఉన్నత విద్యను అందిస్తున్నాయి. ఐటీఐ నుంచి ఐఐటీ, వైద్య విద్య వరకు పూర్తి ఫీజురీయింబర్స్మెంట్ కల్పిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఎందరో పేదింటి విద్యార్థులను అత్యున్నత ప్రమాణాలు కలిగిన కళాశాలల్లో చదివే అవకాశం కల్పిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. ఇది ఎల్లో మీడియాకు ఏమాత్రం రుచించట్లేదు. పేదింటి బిడ్డను ప్రభుత్వం ఉన్నత చదువులకు తీసుకెళ్తుంటే ఓర్వలేక దుష్ప్రచారానికి పాల్పుడుతోంది. దీనికి తోడు అసలు ప్రభుత్వ పథకం లక్ష్యం, అది ఎలా అమలవుతోంది కనీస పరిజ్ఞానం లేని కొన్ని ప్రతిపక్షాలు ఈ తప్పుడు వార్తల ఆధారంగా అర్థరహిత విమర్శలు చేస్తున్నాయి. తిరిగి వాటినే మళ్లీ ఎల్లో మీడియా పెద్దపెద్ద హెడ్డింగ్లతో ముద్రిస్తూ పైశాచిక ఆనందం ప్రదర్శిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన చెల్లింపులు ఏడాదికి సగటున రూ.2,428 కోట్లుగా ఉంటే ప్రస్తుత ప్రభుత్వం ఏడాదికి రూ.4,044కోట్లుగా ఉంది. అప్పట్లో అప్పులు చేసి ఫీజులు కట్టే దుస్థితి గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా అమలు కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అనేక అవస్థలు పడేవారు. ప్రభుత్వం కాలేజీలకు సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి పెంచేవి. పరీక్షలకు హాల్టికెట్లు, పాసైతే సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టేవి. ఫలితంగా చాలా కుటుంబాలు అప్పులుచేసి మరీ తమ పిల్లలను చదివించాల్సిన దుస్థితి ఉండేది. కళాశాలల ఫీజుల కంటే తక్కువగానే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంతో పేదలపై మరింత భారం పడేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టడంతో పేదింటి బిడ్డల చదువులకు భరోసా దక్కింది. టీడీపీ ప్రభుత్వంలో అత్యధికంగా ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏడాదికి రూ.35 వేలలోపు ఇస్తే.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.3లక్షలకు వరకు చెల్లిస్తూ పేదల విద్యను పట్టం కడుతోంది. జవాబుదారీ తనం పెంచేలా, పారదర్శకంగా తల్లి, విద్యార్థి జాయింట్ బ్యాంకు ఖాతాల్లో ప్రతి త్రైమాసికానికి విద్యాదీవెనను జమ చేస్తోంది. టీడీపీ హయాంలో సగటు చెల్లింపు స్వల్పం.. గత టీడీపీ ప్రభుత్వంలో ఫీజురీయింబర్స్మెంట్ కింద సగటున ఏడాదికి రూ.2066 కోట్లు, హాస్టల్ ఖర్చుల కింద రూ.362 కోట్లు మాత్రమే చెల్లించేది. ఈ లెక్కన ఐదేళ్లలో రూ.12,141 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ప్రభుత్వం 2017 నుంచి 16.73 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన రూ.1778 కోట్లు చెల్లించకుండా బకాయిలు పెడితే.. సీఎం జగన్ ప్రభుత్వం ఆ బకాయిలను కూడా తీర్చింది. ఈ ప్రభుత్వంలో పెరిగిన ఖర్చు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 27లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద ఏకంగా రూ.18,576 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలతో కలిపి) చెల్లించింది. ఏడాదికి సగటున విద్యాదీవెన కింద రూ.2835 కోట్లు, వసతి దీవెన కింది అత్యధికంగా రూ.1068.94 కోట్లు ఖర్చు చేస్తోంది. ఆదాయ పరిమితి పెంపుతో లబ్ధి గతంలో వసతి దీవెనలో రూ.4వేల నుంచి రూ.10వేల మధ్య స్లాబ్ పెట్టిమరీ ఇచ్చేవారు. కానీ సీఎం జగన్ స్లాబ్ విధానాన్ని తొలగించి అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సమానంగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. పేద విద్యార్థులకు భోజన వసతి ఖర్చు కోసం ఏడాదికి రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. ఇక్కడ వీలైనంత మందిని అర్హులుగా చేర్పించేందుకు కుటుంబ వార్షిక ఆదాయం పరిమితిని పెంచింది. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు రూ.లక్ష ఉంటే, ఎస్సీ, ఎస్టీ, డీబ్ల్యూలకు రూ.2లక్షలకు ఉండేది. కానీ, ఇప్పుడు అన్ని వర్గాలు వారికీ కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు. పీజీ విద్యలో ప్రైవేటు కళాశాలల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వ వర్సిటీ విద్యను ప్రోత్సహించేలా అక్కడే పూర్తి రీయింబర్స్మెంట్ ఇస్తోంది. -
fact check: అండగా ఉన్నా ఆర్తనాదాలే..
సాక్షి, అమరావతి: వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని పెద్దలంటారు. దీనినే స్ఫూర్తిగా తీసుకున్న రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఇదే సిద్ధాంతంతో లక్షలాది అబద్ధాలు ఆడైనా సరే సీఎం వైఎస్ జగన్ను గద్దె దించాలని కంకణం కట్టుకున్నాయి. అందుకే నిత్యం ఉన్నవీ లేనివీ పోగేసి ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం మీద నిరంతరం దుమ్మెత్తి పోస్తున్న ఈనాడు దినపత్రిక కథనాల్లోని అంశాలనే తీసుకుని కొన్ని రాజకీయ పార్టీలు పాచిపోయిన ఆరోపణలనే చేస్తున్నాయి. తాజాగా.. రైతుల మద్దతు ధర విషయంలోనూ వాటి రంకెలు తారాస్థాయికి చేరాయి. రైతులకు అడుగడుగునా అండగా ఉన్నా విపక్షాల ఆర్తనాదాలు మామూలుగా లేవు. ఎందుకంటే.. రైతుకు తాను పండించిన ప్రతీ పంటకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) దక్కేలా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా విపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి.. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను 99.5 శాతం తుచ తప్పకుండా అమలుచేస్తున్న ప్రభుత్వంపై నిరంతరం బురద జల్లుతూ ఈనాడు అబద్ధాలను అచ్చేస్తోంది. ఈ క్షుద్ర పత్రిక రాసిన అంశాలనే పట్టుకుని కొందరు అవగాహన, అర్థంపర్థంలేకుండా అదే పనిగా ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలపై ‘ఫ్యాక్ట్చెక్’ ఏమిటంటే.. మార్కెట్లో జోక్యంతో రైతులకు మేలు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేయడమే కాదు సీఎం యాప్ ద్వారా మార్కెట్ ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మద్దతు ధర దక్కేలా సీఎం జగన్ సర్కారు చేస్తోంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వ్యాపారులతో పోటీపడి కొనుగోలు చేయడం ద్వారా రైతులకు మద్దతు ధర దక్కేలా చేసింది. పొగాకు, పత్తితో జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, వేరుశనగ, పసుపు, ఉల్లి, టమాటా తదితర పంట ఉత్పత్తులకు మద్దతు ధర దక్కని ప్రతీసారి మార్కెట్లో జోక్యం చేసుకుని కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని మిర్చి, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, చీనీ వంటి పంటలకు దేశంలో మద్దతు ధర ప్రకటించడమే కాదు..ఆ ధరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తగ్గకుండా చూసింది. ఉదా.. మిరపకు రూ.7వేలు, పసుపుకు రూ.6,850, ఉల్లికి రూ.770, చిరుధాన్యాలకు రూ.2,500, అరటికి రూ.800, బత్తాయికి రూ.1,400 వచ్చేలా చూస్తోంది. మద్దతు ధర కల్పనకు పంచసూత్రాలు.. మద్దతు ధర కల్పించే విషయంలో ధాన్యంతో సహా పంట ఉత్పత్తులను ఆర్బీకేల ద్వారానే రైతుల నుంచి మాత్రమే కొనేలా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ తీసుకోవటం, కొనుగోళ్లలో చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యమివ్వడం, నాణ్యతకు పెద్దపీట వేయడం, నేరుగా రైతు ఖాతాల్లోకే నగదు జమ అనే పంచ సూత్రాలను నిక్కచ్చిగా అమలుచేస్తూ విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది. ఇలా ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగా ప్రస్తుతం వ్యవసాయ, వాణిజ్య పంట ఉత్పత్తులకు మార్కెట్లో ఎమ్మెస్పీకి మించి ధరలు పలుకుతున్నాయి. దీంతో ఈ ఏడాది కొనుగోలు చేయాల్సిన అవసరం పెద్దగా కన్పించడంలేదు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఈ 57 నెలల్లో ధరలు పడిపోయినపుడు ఈ రకమైన భరోసా ఇవ్వడంతో మార్కెట్లో ధరలు స్థిరపడ్డాయి. చంద్రబాబు హయాంలో రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఐదేళ్లలో ఏ ఒక్క బడ్జెట్లోనూ పైసా కూడా ప్రత్యేకంగా కేటాయించిన పాపాన పోలేదు. గతంలో అరకొరగా ధాన్యం సేకరణ.. నిజానికి.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ గతంలో సేకరణ కేంద్రాలకే పరిమితం అయ్యేది. అవికూడా అరకొరగానే ఉండేవి. దీన్ని పూర్తిగా మారుస్తూ నేరుగా ఫాంగేట్ వద్దే ఆర్బీకేల పర్యవేక్షణలో రైతుల భాగస్వామ్యంతో ధాన్యం కొనుగోలు ఈ ప్రభుత్వంలో హయాంలోనే జరుగుతోంది. రైస్మిల్లు ఎంపికలో మిల్లర్లను సంప్రదించాల్సిన అవసరంలేకుండా చేసింది. కొనుగోలు కేంద్రం వారే బ్యాంకు గ్యారంటీ లభ్యత, ధాన్యం రకం, మిల్లు లక్ష్యము, మిల్లు దూరం వంటి అంశాల ఆధారంగా ఆటోమేటిక్ పద్ధతిలో ఎంపిక చేసి రవాణా చేస్తోంది. బాబు కంటే రెట్టింపు కొనుగోలు.. ఇక పంట ఉత్పత్తుల కొనుగోలు విషయానికి వస్తే టీడీపీ తన ఐదేళ్లలో 3.74 లక్షల మంది రైతుల నుంచి రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేస్తే.. సీఎం వైఎస్ జగన్ హయాంలోని ఈ 57 నెలల్లో 6.18 లక్షల మంది రైతుల నుంచి రూ.7,757.87 కోట్ల విలువైన 21.61 లక్షల టన్నుల ఉత్పత్తులు కొనుగోలు చేసింది. అంటే.. రెట్టింపు కన్నా అధికం. చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని సైతం ఈ ప్రభుత్వం కొనుగోలు చేసింది. పోనీ ధాన్యం రైతులకైనా చంద్రబాబు మేలు చేశాడా అంటే అదీలేదు. టీడీపీ ఐదేళ్లలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,237 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఈ 57 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు క్షేత్రాల నుంచి ఆర్బీకేల ద్వారా 37.34 లక్షల మంది రైతుల నుంచి 3.38 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రూ.65 వేల కోట్లు చెల్లించింది. టీడీపీ హయాంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోలుకు రూ.43,559 కోట్లు వెచ్చిస్తే, ఈ ప్రభుత్వం ఈ 57 నెలల్లో ఏకంగా రూ.72,445 కోట్లు ఖర్చుచేసింది. అంటే.. సగటున ఏడాదికి చంద్రబాబు హయాంలో రూ.8,711 కోట్లు వెచ్చిస్తే, జగన్ ప్రభుత్వం ఏటా సగటున రూ.16,099 కోట్లు వెచ్చించింది. అంటే.. బాబు ఐదేళ్లతో పోలిస్తే ఈ 57 నెలల్లో రెట్టింపు విలువైన పంట ఉత్పత్తులను వైఎస్ జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ‘జీఎల్టీ’ భరిస్తున్న ఏకైక ప్రభుత్వం.. మరోవైపు.. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతు పొలం నుంచే నేరుగా కొనుగోలుకు అయ్యే జీఎల్టీ (గన్నీ బ్యాగ్లు, లేబర్, ట్రాన్స్పోర్టు) ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది. ధాన్యం కొనుగోలు సందర్భంలో టన్నుకు రూ.2,523 (గోనె సంచులకు రూ.1,750, కూలీలకు రూ.220, రవాణా ఛార్జీలకు రూ.468తో పాటు ఒకసారి వాడిన గోనె సంచులకు రూ.85), ఇతర పంట ఉత్పత్తుల సేకరణ సందర్భంలో క్వింటాకు రూ.418 చొప్పున భరిస్తోంది. ఇక గోనె సంచుల, హమాలీ, రవాణా చార్జీలకు సంబందించి 2022–23 పంట కాలానికి 15,74,285 మంది రైతుల ఖాతాలకు రూ.237.11 కోట్లు జమచేయగా, ఖరీఫ్ 2023–24 పంట కాలానికి సంబంధించి ఇప్పటివరకు 6,83,825 మంది రైతుల ఖాతాలకు రూ.91.47 కోట్లు జమచేశారు. గతంలో ఈ పరిస్థితిలేదు. ఇలా గోతాలు, కూలీలు, రవాణా ఖర్చుల (జీఎల్టీ) రూపంలో ఎకరాకు రూ.10 వేల వరకు ప్రభుత్వమే భరిస్తోంది. కానీ, గతంలో రైతులకు గోనె సంచులను సమకూర్చే పనిని గతంలో మిల్లర్లకు వదిలేసేవారు. అవి సరిపడా దొరక్క రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దీనికి చెక్ పెట్టింది. ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, పీఎస్ఏలు రైతులకు గోనె సంచులను సమకూరుస్తున్నాయి. పైగా.. సేకరించిన ధాన్యాన్ని గతంలో రవాణా అనేది గందరగోళంగా ఉండేది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందుల్లేవు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొన్ని ఏజెన్సీలను, రవాణాదారులను నియమించింది. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సజావుగా కొనుగోలు చేసిన ధాన్యం రవాణా కొనసాగుతోంది. ఇంత చేస్తున్నా దీన్ని మొక్కుబడిగా కొనుగోలు, నామమాత్రపు కొనుగోలు అంటారా? ధరల స్థిరీకరణ ద్వారా మద్దతు ధర కల్పన విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుంటే వాస్తవాలు తెలుసుకోకుండా విపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉంది. -
Fact Check: ఆర్బీకేలపై నిత్యం ఏడుపే
సాక్షి, అమరావతి: రైతుకు అడుగడుగునా అండగా నిలిచి, వారిని చేయిపట్టి నడిపించే లక్ష్యంతో రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలా అండగా నిలిచిన ఆర్బీకేలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే.. వాటి సేవలను రైతులకు దూరం చేయడమే లక్ష్యంగా ఈనాడు దినపత్రిక నిత్యం విషం కక్కుతోంది. ఏపల్లెకు వెళ్లినా సకల సౌకర్యాలతో ఆర్బీకేలు స్వాగతం పలుకుతుండడాన్ని.. రైతులు వీటి సేవలను కొనియాడుతుండడాన్ని ఓర్వలేక అదే పనిగా బురద జల్లే కార్యక్రమం చేపట్టింది. తాజాగా ‘రైతు సేవ వట్టిదే..భరోసా దక్కదే..!’ అంటూ అబద్ధాలు అచ్చేసింది. ఆరోపణ: వేధిస్తోన్న సిబ్బంది కొరత వాస్తవం: గ్రామ స్థాయిలో ఏర్పాటైన 10,778 ఆర్బీకేల్లో 14,323 మంది సిబ్బందితో పాటు 1,573 మంది ఎంపీఈవోలు సేవలందిస్తున్నారు. ప్రతీ ఆర్బీకేకు గ్రామ వలంటీర్తో పాటు బ్యాంకింగ్ కరస్పాండెంట్ను అనుసంధానం చేశారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు రేషనలైజేషన్ చేస్తున్నారు. పశుసంవర్ధక శాఖ పరిధిలో రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయగా, 1896 మంది అవసరమని గుర్తించి ఆ పోస్టుల భర్తీ చేపట్టారు. ఇటీవలే ఫలితాలు విడుదల చేయగా, ఎంపికైన వారికి అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. నెలకు రూ.12వేల వేతనంతో తాత్కాలిక సిబ్బంది(ఎంపీఈవో)ని రెండు దఫాలుగా నియమించి శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. ఇప్పటి వరకు ఏ ఒక్కర్ని ప్రభుత్వం తొలగించిన దాఖలాలు లేవు. ఆరోపణ: లక్ష్యాల పేరిట సిబ్బందిపై ఒత్తిళ్లు వాస్తవం: వివక్షకు తావులేకుండా అడిగిన ప్రతీ రైతుకు సర్టిఫైడ్ సాగు ఉత్పాదకాల పంపిణీ, సాగులో సలహాలు, సూచనలు, ఈ–క్రాప్ బుకింగ్, సంక్షేమ పథకాల అమలు, ధాన్యంతో సహా ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. వీరిపై అదనపు బాధ్యతలు మోపకుండా స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా పనిచేసుకునే వాతావరణాన్ని సృష్టించిందే తప్ప లక్ష్యాల పేరిట ఏ ఒక్కర్ని ఒత్తిడికి గురిచేసిన దాఖలాలు లేవు. అలా అని ఏ ఒక్క సిబ్బంది ఫిర్యాదు చేసిన ఘటనలు లేవు. సిబ్బందికి సచివాలయ శాఖ నుంచి సకాలంలో జీతభత్యాలు చెల్లిస్తున్నారు. మండల అధికారుల సిఫార్సుతో సెలవులు మంజూరు చేస్తున్నారు. రోజు మొత్తంలో ఏ సమయంలోనైనా హాజరు వేసే వెసులుబాటు కల్పించారు. సిబ్బంది అంతర్గత బదిలీలకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 186 మందిని వారు కోరుకున్న చోటకు బదిలీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసారు. ఆరోపణ: అద్దె భవనాలే దిక్కు వాస్తవం: 526 గ్రామాల్లో సొంత భవనాలుండగా, 10,252 గ్రామాల్లో రూ.2,260 కోట్ల అంచనాతో కొత్త భవనాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రూ.1090.23 కోట్లతో నిర్మించిన 4,554 ఆర్బీకే భవనాలను వ్యవసాయ శాఖకు అప్పగించారు. వీటిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.357 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన వాటిని మార్చిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాగు ఉత్పాదకాల బుకింగ్తో పాటు ఎప్పటికప్పుడు వాతావరణ, మార్కెట్ సమాచారం తెలుసుకునేందుకు వీలుగా 9,484 ఆర్బీకేల్లో కియోస్క్లను.. వీటి పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేక డాష్బోర్డును ఏర్పాటు చేశారు. ఆరోపణ: అద్దెలు, బిల్లులు, ఇంటర్నెట్ చార్జీలేవీ? వాస్తవం: అద్దె భవనాల్లో ఉన్న 3,830 ఆర్బీకేలకు అద్దెల రూపంలో రూ.43 కోట్లు ఖర్చుచేయగా, వచ్చే మార్చి వరకు అద్దెల నిమిత్తం సర్దుబాటు చేసేందుకు మరో రూ.32.98 కోట్లు విడుదల చేశారు. ఇప్పటికే రూ.22.98 కోట్లు భవన యజమానుల ఖాతాలకు జమ చేశారు. మిగిలిన మొత్తం చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. పెండింగ్లో ఉన్న విద్యుత్ బిల్లుల కోసం రూ.12 కోట్లు విడుదల చేయగా.. వచ్చే మార్చి వరకు బిల్లుల చెల్లింపునకు అవసరమయ్యే బడ్జెట్ను నేరుగా విద్యుత్ శాఖకే కేటాయించేలా ఉత్తర్వులిచ్చారు. స్టేషనరీ కోసం రూ.3 కోట్లు విడుదల చేయగా, స్టేషనరీ కోసం ఖర్చు చేసిన సిబ్బందికి నేరుగా రూ.53.48 లక్షలు జమ చేసారు. స్థానికంగా అందుబాటులో ఉన్న హైస్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ సదుపాయాన్ని సమకూర్చేందుకు రూ.23 కోట్లు విడుదల చేశారు. వైఎస్సార్ రైతు భరోసా మాస పత్రిక కోసం ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పించి ఔత్సాహిక రైతులు చందాదారులుగా చేర్చే‡ కార్యక్రమం చేపట్టారే తప్ప వీటి కోసం సిబ్బందికి ఎలాంటి టార్గెట్లు విధించలేదు. ఆరోపణ: ఆర్బీకేలకు ఆదరణ కరువు వాస్తవం: అదును దాటక ముందే.. సర్టిఫై చేసిన నాణ్యమైన సాగు ఉత్పాదకాలను బుక్ చేసుకున్న 24 గంటల్లోపే రైతులకు అందిస్తున్నారు. తొలి ఏడాది(2020–21) 1.07 లక్షల టన్నుల ఎరువుల విక్రయాలు జరగ్గా, 3వ ఏడాది (2022–23) 4 లక్షల టన్నులకు అమ్మకాలు చేరాయి. తొలి ఏడాదిలో 2.55 లక్షల మంది ఎరువులు తీసుకుంటే..గతేడాది 10.90 లక్షల మంది తీసుకున్నారు. 2023–24లో ఇప్పటివరకు 8.95లక్షల మంది రైతులు 3.89 లక్షల టన్నుల ఎరువులు తీసుకున్నారు. ఆర్బీకే ద్వారా అమ్మే ఎరువుల రవాణా, నిల్వ, అమ్మకానికి కావాల్సిన సదుపాయాల భారం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. మరొక వైపు 34.27 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రూ.1,040.39 కోట్ల రాయితీతో 58.74 లక్షల మంది రైతులకు, నాన్ సబ్సిడీ కేటగిరీ కింద రూ.13.90 కోట్ల విలువైన 1,784.47 క్వింటాళ్ల పత్తి, మిరప, సోయాబీన్ తదితర విత్తనాలను 44వేల మంది రైతులకు సరఫరా చేశారు. 2020–22 మధ్య 1.51 లక్షల మందికి రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను పంపిణీ చేయగా, ఈ ఏడాది ప్రస్తుత రబీలో ఇప్పటికే రూ.18.57లక్షల విలువైన 1657 లీటర్ల పురుగుల మందులను 6వేల మంది రైతులకు పంపిణీ చేశారు. ఆర్బీకేలు లాభాపేక్షతో కూడిన వాణిజ్య కేంద్రాలు కాదు. రైతులకు గ్రామస్థాయిలో ఏర్పాటైన సేవా కేంద్రాలన్న విషయాన్ని గుర్తించుకోవాలి. ఆర్బీకేల ద్వారా ఎరువులు, పురుగుల మందుల అమ్మకాలు వ్యాపారం కాదు..ఒక సదుపాయం మాత్రమే. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు, ఇథియోపియా, బంగ్లాదేశ్, జర్మనీ, వియత్నాం వంటి విదేశీ ప్రతినిధుల బృందాలు ఆర్బీకే సేవలను శ్లాఘిస్తున్నాయి. అనతికాలంలోనే అవార్డులు, రివార్డులతో పాటు ప్రపంచ స్థాయి ఖ్యాతి గడించిన ఆర్బీకేలపై ఈనాడు విషం కక్కడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
Fact Check: గిరిజనులను గుండెల్లో పెట్టుకున్నారు!
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనపై బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈనాడు రామోజీ రోజుకో అబద్ధాన్ని వల్లెవేస్తూ గిరిజనుల సంక్షేమానికి అగ్రపాధాన్యమిచ్చిన వైస్సార్సీపీ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారు. అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తుల కోనుగోలులో రికార్డు సృష్టిస్తున్న గిరిజన సహకార సంస్థ(జీసీసీ) వైఎస్ జగన్ హయాంలో గిరిజనులకు అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే అధికంగా చెల్లిస్తున్నా కబోది రామోజీ ‘గుండెల్లో పెట్టుకుంటానని.. గుదిబండగా మారారు!’ అంటూ ఈనాడులో అబద్ధాలు అచ్చేశారు. గిరిజన ఉత్పత్తులకు మద్దతు ధర కోసం ప్రత్యేకంగా అపెక్స్ కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా, కమిటీ సిఫార్సులకు అనుగుణంగా కొనుగోళ్లు, అమ్మకాలు జరిగేలా జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించడంతోపాటు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిన జగన్ ప్రభుత్వం గిరిజన రైతులను ప్రోత్సహిస్తోంది. ఆరోపణ: ఆదాయం చూడడమే తప్ప ఆదుకోరా? వాస్తవం: కాఫీకి అంతర్జాతీయంగా చెల్లించే ధర కంటే ఎక్కువకు జీసీసీ కొనుగోలు చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో కిలో ముడి కాఫీ రూ.215, చెర్రీ ముడి కాఫీకి రూ.130 చెల్లించేవారు. ఏజెన్సీలో పండించే కిలో ముడి కాఫీకి రూ.280, చెర్రీ ముడి కాఫీకి రూ.145 ఇస్తున్నారు. కొనుగోళ్ల సమయంలో కేంద్ర కాఫీ బోర్డు సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పార్చ్మెంట్ కాఫీ 10, చెర్రీ కాఫీ 10.5 తేమతో కొనుగోలు చేసేలా నిర్ణయించారు. ప్రైవేటు వ్యాపారుల బారిన పడి గిరిజన రైతులు నష్టపోకుండా కొనుగోలు సిబ్బందికి జీసీసీ తేమ శాతం నిర్ధారణ పరికరాలు అందించింది. ఖచ్చితమైన తేమ శాతం నిర్ధారించి కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇచ్చింది. ముడి కాఫీ కొనుగోలు రిపోర్ట్ను జీసీసీ మేనేజర్లు ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే గిరిజన రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో 1000 మెట్రిక్ టన్నుల ముడి కాఫీ సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా ఇంతవరకు 340 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అకాల వర్షాలతో కాఫీ దిగుబడి తగ్గడం వల్ల గత సీజన్ కంటే ఈ ఏడాది కొనుగోలు తగ్గింది. ఆరోపణ: మిగిలిన వాటికి ‘మద్దతు’ కరువే? వాస్తవం: మిగిలిన ఉత్పత్తులకు జీసీసీ మద్దతు ధర ప్రకటించి జీసీసీ కొనుగోలు చేస్తోంది. ప్రస్తుత సీజన్లో జీసీసీ కిలో కరక్కాయలు రూ.15 నుంచి రూ.18, ఎండు ఉసిరి రూ.90, రాజ్మా రూ.90కి జీసీసీ కొనుగోలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధరల్లో పిక్క చింతపండు రూ.23 నుంచి రూ.28 మాత్రమే ఉంటే జీసీసీ పిక్క చింతపండు రూ.32 నుంచి రూ.40, పిక్క తీసిన చింతపండు రూ.63 ధర ప్రకటించి కొనుగోలు చేస్తోంది. ఆరోపణ: లాభాలే పరమావధా? వాస్తవం: ఏజెన్సీ కాఫీకి మంచి గుర్తింపు తెచ్చిన ‘అరకు వ్యాలీ కాఫీ’ పేరుతో జీసీసీ బ్రాండింగ్ చేస్తోంది. ఫిల్టర్ కాఫీ, ఇన్స్టంట్ కాఫీ రకాలను జీసీసీ నెట్వర్క్ ద్వారా విక్రయిస్తోంది. వీటి గరిష్ట రిటైల్ ధర నిర్ణయించే సమయంలో ముడి కాఫీ ధర, శుద్ధీకరణ, తయారీ, ప్యాకింగ్, రవాణా ఖర్చులు, డిస్ట్రిబ్యూటర్, రిటైల్ మార్ట్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఇవేమీ తెలియనట్టుగానే వీటి అమ్మకాల ద్వారా జీసీసీ అధిక లాభాలు గడిస్తున్నట్టు ఈనాడు రోత రాతలు రాయడం దారుణం. శ్రీశైలం, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల అడవుల్లో గిరిజనుల నుంచి సేకరిస్తున్న తేనెను రాజమహేంద్రవరం, చిత్తూరులోని జీసీసీ తేనె శుద్ధి కర్మాగారాల్లో శుద్ధి చేసి ‘గిరిజన్‘ బ్రాండ్తో మార్కెటింగ్ చేస్తోంది. కేజీ తేనెను రూ.200 చెల్లించి కొనుగోలు చేస్తోంది. తేనెకు గరిష్ట రిటైల్ ధర నిర్ణయంలో ముడి తేనె ధర, శుద్ధీకరణ ఖర్చు, శుద్ధికరణలో తరుగుదల, బాట్లింగ్, ప్యాకింగ్, రవాణా ఖర్చులు, డిస్ట్రిబ్యూటర్, రీటైల్ మార్ట్లు, నాణ్యత ప్రమాణాల పరీక్షలకు అయ్యే ఖర్చులు పరిగణనలోకి తీసుకుని ధర నిర్ణయిస్తారు. అయితే తేనే విక్రయాల్లో జీసీసీ లాభాలు గడిస్తున్నట్టు ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది. అలాగే ప్రైవేటు వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేసేలా జీసీసీ అనేక చర్యలు చేపట్టింది. మద్దతు ధర నిర్ణయించడం వల్ల ప్రైవేటు వ్యాపారులు పోటీ పడి ఎక్కువ ధరకు కొనుగోలు చేయక తప్పని పరిస్థితి. ఆరోపణ: రుణాలిచ్చింది 160 మందికే? వాస్తవం: గిరిజన రైతులకు పెట్టుబడి సాయం, యంత్ర పరికరాలు అందించి ప్రోత్సహిస్తున్నారు. దీనికితోడు జీసీసీ గిరిజన రైతుల వ్యవసాయానికి, కాఫీ సాగుకు రుణాలు మంజూరు చేస్తోంది. గతేడాది తీసుకున్న రుణాలు చెల్లించిన వారికి తిరిగి రుణాలు ఇస్తున్నారు. 2016–17 నుంచి 2022–23 వరకు జీసీసీ ద్వారా 4,839 మంది గిరిజన కాఫీ రైతులకు రూ.528.28 లక్షల రుణాలు ఇచ్చారు. వీటిలో ఇంకా రూ.252.86 లక్షల బకాయిలు వసూలు కావాల్సి ఉంది. ప్రస్తుత సీజన్లో రూ.22.80 లక్షల రుణాలు మంజూరు చేశారు. -
Fact Check: కుంభకర్ణుడి వారసుడు మీ బాబే!
సాక్షి, అమరావతి: ఇనాం భూముల సమస్యను పరిష్కరించి లక్షలాది ఎకరాల భూములపై నిషేధం తొలగించిన వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఈనాడు తన అక్కసు వెళ్లగక్కింది. చంద్రబాబు అసమర్ధతను కప్పిపుచ్చుతూ తప్పుడు కథనాన్ని వండి వార్చింది. పచ్చకళ్లతో నిజాలు చూడకుండా వివాదాస్పద భూములకు హక్కులు కల్పించిన వైఎస్ జగన్ను కుంభకర్ణుడి వారసుడంటూ అసత్యాలు వల్లెవేస్తూ.. భూముల సమస్యలను పరిష్కరించలేక రైతులను నట్టేట ముంచిన చంద్రబాబును మాత్రం పేదల పెన్నిధి అంటూ ఆకాశానికెత్తారు. అసలు గ్రామ సర్వీస్ ఇనాం భూముల సమస్యను పరిష్కరించలేక చేతులెత్తేసింది చంద్రబాబు కాదా? ఆ విషయం రామోజీకి, ఈనాడుకు తెలియదా? ఓట్ల కోసం ఎన్నికలకు రెండు నెలల ముందు పనికిరాని ఆర్డినెన్స్ చేసి రైతులను ఇబ్బందుల్లోకి నెట్టిన చంద్రబాబు అసమర్ధత ఆ పత్రికకు కనిపించలేదా? ఆర్డినెన్స్కు చట్టబద్ధత కల్పించలేకపోయిన బాబును వదిలి ఆ సమస్యను పరిష్కరించిన వైఎస్ జగన్ను ఆడిపోసుకోవడం, కుంభకర్ణుడి వారసుడు, సైంధవుడంటూ ఇష్టానుసారం రాయడం దుష్టచతుష్టయంలో ఒకరైన రామోజీకే చెల్లింది. ఆర్డినెన్స్ పేరిట బాబు డ్రామాలు 1956 ఏపీ (ఆంధ్ర ప్రాంత) ఇనామ్స్ (ఎబాలిషన్ అండ్ కన్వర్షన్ ఇన్ టు రైత్వారీ) చట్టం ప్రకారం రైత్వారీ భూములు, అవి వ్యక్తిగతంగా ఉంటే రైతులు, వారి వారసులకు.. లేదంటే కౌలుదారులకు హక్కులను గుర్తించి రైత్వారీ పట్టాలు ఇవ్వవచ్చు. దేవదాయ శాఖ భూములైతే దేవాలయం పేరిట రైత్వారీ పట్టాలు మంజూరు చేయవచ్చు. ఆ చట్టం దుర్వినియోగం అవుతుండడంతో పాటు అందులో లోపాలు ఉన్నాయని గుర్తించారు. అలాగే కోర్టు ఆదేశాలతో 2013లో అప్పటి ప్రభుత్వం యాక్ట్–16 ఆఫ్ 2013 చట్టం చేసింది. దీని ప్రకారం దేవాలయ భూములను వ్యక్తులకు, దేవాలయానికి సేవలు చేసే వారికి ఇస్తే అవి రద్దయ్యాయి. ఆ భూముల క్రమవిక్రయాలు.. వారికి సంబంధించిన రైత్వారీ పట్టాలు రద్దు చేశారు. కులవృత్తుల వారికి కేటాయించిన ఇనాం భూముల రైత్వారీ పట్టాలు కూడా పొరపాటున రద్దయ్యాయి. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ సమస్యను పరిష్కరించలేకపోయారు. 2019లో ఎన్నికలకు రెండు నెలల ముందు ఆ సమస్యను పరిష్కరిస్తున్నట్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేతులు దులుపుకున్నారు. 1.79 లక్షల ఎకరాల భూములపై ఆంక్షల తొలగింపు వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుచూపుతో దేవాలయ భూములు, చారిటబుల్ భూములు, ఇనాం భూములు, గ్రామ సర్వీసు ఈనాం భూములను విడదీసింది. ప్రస్తుత చట్టాల ప్రకారం గ్రామ సర్వీసు ఇనాం భూములకు, గతంలో మంజూరు చేసిన రైత్వారీ పట్టాలకు జీఓ ఎంఎస్ నెం–310 ద్వారా గత సంవత్సరం చట్టబద్ధత కల్పించారు. దేవదాయ భూములకు, గ్రామ సర్వీసు ఇనాం భూములకు వ్యత్యాసాన్ని గుర్తించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమవగా దాన్ని ఈ ప్రభుత్వం సరిచేసింది. దీనివల్ల 1.79 లక్షల ఎకరాల సర్వీసు ఇనాం భూములపై ఆంక్షలు తొలగాయి. అంతేకాదు దేవదాయ ఇనాం భూములు, ఇన్స్టిట్యూషనల్ ఇనాం భూములు, చారిటబుల్ ఇనాం భూములు, గ్రామ సర్వీసు ఇనాం భూముల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా వివరించింది. దీనివల్ల సంవత్సరాలుగా వివాదంలో ఉన్న భూముల సమస్యలు పరిష్కారమయ్యాయి. ఇనాం భూములే కాదు చుక్కల భూములు, షరతుల గల పట్టా భూముల, ఇతర అనేక రకాల భూముల సమస్యను వైఎస్ జగన్ ప్రభుత్వం చాకచక్యంగా పరిష్కరించింది. 3 లక్షల ఎకరాలకు పైగా భూములను 22ఏ జాబితా నుంచి తొలగించి సంబంధిత రైతులకు మేలు చేకూర్చింది. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడంతో 27 లక్షల ఎకరాలకు చెందిన రైతులు లబ్ధి పొందారు. కళ్ల నిండా పచ్చ విషం నింపుకున్న రామోజీరావుకు, ఆయన పత్రికకు ఇవేమీ కనపడడలేదు. అందుకే పచ్చపాతంతో అసత్య కథనాలు అచ్చేసింది. పేదల పక్షపాతిని కాదని.. సైంధవుల పక్షపాతినని, కుంభకర్ణుడికి అసలు సిసలు వారసుడినని రామోజీరావు మరోసారి ఈ కథనం ద్వారా నిరూపించుకున్నారు. -
Fact Check: ఏపీలోనే వెలుగులు
సాక్షి, అమరావతి: విద్యుత్ ప్లాంటు కట్టేశామని స్ట్రక్చర్ పూర్తయినట్లు చూపిస్తే సరిపోదు. లోపల అనేక టర్బైన్లు, ఇతర యంత్రాలు అమర్చాలి. ఈ మాత్రం జ్ఞానం కూడా లేని రామోజీ..వాస్తవాలను వక్రీకరించి గత పదేళ్లుగా విద్యుత్ సంస్థలు చేస్తున్న కృషిని తక్కువ చేస్తూ వాటి మనోబలాన్ని దెబ్బతీసేలా ఓ తప్పుడు కథనాన్ని అచ్చేశారు. ఏపీ మొత్తం విద్యుత్ డిమాండులో ఏపీజెన్కో 45 నుంచి 50 శాతం వరకూ సమకూర్చుతుండగా, తెలంగాణలో జెన్కో, సింగరేణి ప్లాంట్లు అన్నీ కలిపి రాష్ట్ర డిమాండులో 37 నుంచి 38 శాతం విద్యుత్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాయి. నిజాలు ఇలా ఉండగా ‘తెలంగాణలో మిరుమిట్లు..ఏపీలో కునికిపాట్లు’ శీర్షికన ఈనాడు రాసిన ఆ అభూతకల్పనల కథనాన్ని విద్యుత్ సంస్థలు ఖండిస్తూ వివరాలు వెల్లడించాయి. ఆరోపణ: పొరుగు రాష్ట్రంతో పోటీ పడలేక పోయింది వాస్తవం: విభజన నాటికి రాష్ట్రంలో రోజుకు సరాసరి 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉండేది. అది అప్పటి రోజువారీ విద్యుత్ వినియోగంలో దాదాపు 18 శాతం. విభజన చట్టంలో ఆస్తులు భౌగోళికంగా, అప్పులు జనాభా నిష్పత్తిలో, విద్యుత్ ఒప్పందాలు అప్పటికున్న లోడ్ ప్రకారం విభజించారు. రాష్ట్ర విభజన తేదీ నాటికే హైదరాబాద్ వల్ల తెలంగాణలో విద్యుత్ వాడకం ఎక్కువగా ఉండేది. అలాగే ఆంధ్ర రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ జనాభా తక్కువ కావడంతో అక్కడ తలసరి విద్యుత్ వినియోగం ఎక్కువ. అందుకే దాదాపు 2017 వరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు తెలంగాణ సంస్థలకు విద్యుత్ అందించాయి. దానికి సంబంధించి దాదాపు రూ.7400 కోట్లు ఏపీకి రావాల్సి ఉంది. అంతటి విద్యుత్ కొరతను అధిగమించి మనకు భౌగోళికంగా అనుకూలంగా ఉన్న పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించుకుని, కావలసిన ధర్మల్ విద్యుత్ ను కూడా అభివృద్ధి చేసుకుని మన రాష్ట్రం విద్యుత్ రంగంలో అభివృద్ధి పథంలో పురోగమిస్తోంది. ఆరోపణ: తెలంగాణలో వ్యూహాత్మత అడుగులు.. ఏపీలో తడబాటు వాస్తవం: పునరుత్పాదక విద్యుత్ రంగంలో మన రాష్ట్రంలో దాదాపు 9 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాలు స్థాపించారు. కృష్ణపట్నంలో 2400 మెగావాట్ల ధర్మల్ కేంద్రం, విజయవాడలో 800 మెగావాట్ల కేంద్రం అందుబాటులోకి వచ్చాయి. పోలవరంలో 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం కూడా శరవేగంగా నిర్మాణమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి గనుల ద్వారా అక్కడి ధర్మల్ కేంద్రాలకు కావలసినంత బొగ్గు దొరుకుతోంది. మనం సుదూర ప్రాంతాల నుంచి, అంటే మహానది బొగ్గు క్షేత్రాలు– తాల్చేర్ ఒరిస్సా, సింగరేణి బొగ్గు గనుల నుంచి సేకరించవలసి వస్తోంది. మన రాష్ట్ర విద్యుత్ సంస్థలు కూడా వేరే రాష్ట్రాలలోని విద్యుత్ సంస్థలతో ముందస్తుగా విద్యుత్ బ్యాంకింగ్ విధానం.. అంటే మనకు అవసరం వున్నప్పుడు వాళ్ళు విద్యుత్ ఇచ్చేలా, మనకు మిగులు వున్నప్పుడు వారికీ తిరిగి విద్యుత్ అందించేలా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీనికి విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి కూడా ఇస్తోంది. ఆరోపణ: ఎక్స్చేంజీల పైనే ఏపీ ఆధారం వాస్తవం: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో విద్యుత్ ఎక్సే్చంజీలపై ఆధారపడకుండా ముందుగానే సెప్టెంబర్ నెలలో తగిన ప్రణాళికతో చర్యలు తీసుకుని జూన్ నెల వరకు పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా అత్యంత పారదర్శకంగా విద్యుత్ అమ్మకందార్లను ఎంచుకుని ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దానివల్ల ప్రస్తుత నెలలో ఏ విధమైన అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా అవుతోంది. ఆరోపణ: రాత్రిపూట రైతులు పొలంబాట పడుతున్నారు వాస్తవం: రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు. నిజానికి ఇది గత ప్రభుత్వ హయాంలో ఉండేది. ప్రస్తుతం వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు విద్యుత్ అందుతోంది. భవిష్యత్తులోనూ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో 7 వేల మెగావాట్ల విద్యుత్ యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు కొనుగోలు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంది. ఈ విద్యుత్ కొనుగోలుకు అయ్యే ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. వ్యవసాయ విద్యుత్ సరఫరా కోసం ఒక ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఆరోపణ: అక్కడ విద్యుత్ ప్లాంట్లకు ప్రణాళిక..ఇక్కడ ఆపసోపాలు వాస్తవం: కేవలం ఏడాది వ్యవధిలో కృష్ణపట్నంలో 800 మెగావాట్ల మూడో యూనిట్, డాక్టర్ ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల ఎనిమిదో యూనిట్ను ఏపీ అందుబాటులోకి తెచ్చింది. 2019 నాటికి కృష్ణపట్నంలో 60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. డాక్టర్ ఎన్టీటీపీఎస్లో ఎనిమిదో యూనిట్ నిర్మాణ పనులు 60 శాతం మాత్రమే పూర్తయ్యాయి. తర్వాత కరోనా లాంటి విపత్కర పరిస్థితులను అధిగమించి రెండు ప్లాంట్ల నిర్మాణ పనులు పూర్తి చేసి ఏపీజెన్కో విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. లోయర్ సీలేరులో మరో 230 మెగావాట్ల అదనపు ఉత్పత్తి కోసం 115 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్ల నిర్మాణ పనులను ఏపీజెన్కో శరవేగంగా జరిపిస్తోంది. పీక్ డిమాండును దృష్టిలో పెట్టుకుని ఎగువ సీలేరులో 1350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్లాంటు నిర్మాణానికి అన్ని అనుమతులు తీసుకుని ముందుకెళుతోంది. పోలవరంలో 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసి దశలవారీగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. సంయుక్త భాగస్వామ్యంలో 5 వేల మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజి ప్లాంట్లు నిర్మించే దిశగా ప్రణాళిక రూపొందించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్హెచ్పీసీతో ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. -
Fact check: బాబు కోసమేగా ‘హైవే’దన రామోజీ?
పచ్చపైత్యం ప్రకోపించడంతో మతిభ్రమించినట్టు ప్రవర్తిస్తున్నారు. తప్పుడు కథనాలతో జనాన్ని నమ్మించేందుకు వికృత రాతలతో పేట్రేగిపోతున్నారు. చేతిలో ఈనాడు పత్రిక ఉందని వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. కళ్లకు పచ్చ గంతలు కట్టుకున్న రామోజీ అడ్డగోలు కథనాలు అచ్చేయిస్తున్నారు. ప్రభుత్వంపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేసేందుకు ప్రతి అంశాన్నీ ఆయుధంగా మలచుకుంటున్నారు. జాతీయ రహదారులపైనా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఓ కథనాన్ని వండేశారు. కానీ వారికి తెలియందేంటంటే... వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారుల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడం. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఐదేళ్లలోనే జాతీయ రహదారుల నిర్మాణం జోరుగా సాగింది. అంతేగాదు... కొత్త జాతీయ రహదారుల పనులు కూడా ప్రజల కళ్లకు కనపడుతున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి పాదనలతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో జాతీయ రహదారులకు భారీగా నిధులు కేటాయించింది. 2019 నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి ఏకంగా రూ.71, 200కోట్లు కేటాయించడమే అందుకు నిదర్శనం. ఆ నిధులతో ఏకంగా 3,770 కి.మీ.మేర జాతీయ రహదారుల అభివృద్ధి పనులు చేపట్టారు. అందులో రూ.40వేల కోట్లు 2022–23లోనే మంజూరు చేశా రు. ఇక జాతీయ రహదారుల్ని అభివృద్ధి చేసేందుకు భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. కేవలం ఏడాదిలోనే 6,933 హెక్టార్ల భూమిని సేకరించి ఇచ్చింది. అందులో ప్రభుత్వ భూమి 1,571 హెక్టార్లు కాగా ప్రైవేటు భూమి 5,362 హెక్టార్లు. బాబు చేతులెత్తేస్తే జగన్ పూర్తి చేశారు ► చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.13,353 కోట్లు వెచ్చించగా... వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లలోనే రూ.25,304 కోట్లు ఖర్చు చేసింది. ► గత ప్రభుత్వం నిర్మించకుండా చేతులెత్తేసిన విజయవాడలోని బెంజ్ సర్కిల్ పశ్చిమ ఫ్లైఓ వర్, కనకదుర్గ ఫ్లైఓవర్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపేసిన విజయవాడ పశ్చిమ బైపాస్ ఆరులేన్ల రహదారి నిర్మాణాన్ని కూడా తుది దశ కు తీసుకువచ్చింది ఈ ప్రభుత్వమే. ► గొండిగొలను నుంచి అమరావతి మీదుగా గుంటూరు జిల్లా కాజా వరకు విజయవాడ పశ్చిమ బైపాస్ ఆరులేన్ల రహదారి నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ► విజయవాడ నుంచి గుంటూరు జిల్లా కాజా వరకు తూర్పు బైపాస్ నిర్మాణానికి ఆమోదించేలా కేంద్రాన్ని ఒప్పించింది. వాస్తవాలు మరచి దుష్ప్రచారం ► 2022–23లో కొండమోడు – పేరేచర్ల మధ్య జాతీయ రహదారిని రూ.1,032.52 కోట్లతో విస్తరించాలని నిర్ణయించింది. కానీ దేశవ్యాప్తంగా భారత్ మాల ప్రాజెక్టుల కింద మంజూరైన ప్రాజెక్ట్లను తదుపరి ఉత్తర్వుల వరకు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం 2023 డిసెంబర్ 18న ఆదేశించింది. దాంతో టెండర్ల ప్రక్రియ పూర్తి కావచ్చినప్పటికీ కాంట్రాక్టును ఖరారు చేయలేదు. ► 2021–22లో ముద్దనూరు–బి.కొత్తపల్లి రహదారిని రూ.1,020కోట్లతో మంజూరు చేశారు. ఆ ప్రాజెక్ట్ టెండరు ప్రక్రియ తుదిదశలో ఉంది. ► 2022–23 వార్షిక ప్రణాళికలో మొత్తం 450 కి. మీ. మేర 9 రహదారుల నిర్మాణానికి రూ.7,807 కోట్లతో ఆమోదించగా అందులో మూడు ప్రాజెక్ట్లకు ఎల్వోఏ మంజూరు చేయగా మిగిలిన ఆరు ప్రాజెక్ట్లు టెండరు దశలో ఉన్నాయి. ► 2023 నవంబర్ 10న కేంద్ర జాతీయ రహదారుల సంస్థ ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో దేశవ్యాప్తంగా భారత మాల ప్రాజెక్ట్లకు సంబంధించి ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కెబినెట్ సబ్కమిటీ అనుమతి వచ్చే వరకు దేశంలో భారత మాల కింద కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయకూడదని నిర్ణయించింది. అనంతరం 2017 తరువాత ఆమోదించిన భారత మాల ప్రాజెక్ట్లను 20శాతం కంటే ఎక్కువ నిధులు కేటాయించకూడదని మరో నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా దేశవ్యాప్తంగా భారత మాల ప్రాజెక్ట్ల టెండర్ల ప్రక్రియ నిలుపుదల చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం ఈనాడు రామోజీరావు వక్రబుద్ధికి నిదర్శనం. -
Fact Check: ధీమాగా 'బీమా'
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఎగ్గొట్టిన పాత బకాయిలను సైతం చెల్లించి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తుంటే ఈనాడు రామోజీ మాత్రం పరిహారం చెల్లింపుల్లో కోతలు విధించారంటూ అబద్ధాలను అచ్చేశారు. నిజంగానే పరిహారం భారాన్ని తగ్గించుకోవాలనుకుంటే గత సర్కారు ఎగ్గొట్టిన పాత బకాయిలతో సహా ప్రభుత్వం ఎందుకు చెల్లిస్తుంది? రైతులపై పైసా భారం పడకుండా దేశానికే ఆదర్శంగా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలియదా? ఆరోపణ: గతంలో స్వచ్ఛందంగా చేరేవారు.. వాస్తవం: 2016 నుంచి అమలవుతున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎం ఎఫ్బీవై)లో చేరాలంటే నోటిఫై చేసిన పంటలకు రుణం తీసుకున్నప్పుడు తప్పనిసరిగా ప్రీమియం వసూలు చేసే వారు. ఇష్టపూర్వకంగా చేరాలంటే ప్రీమియం చెల్లింపులు తలకు మించిన భారంగా పరిణవిుంచాయి. నమోదు ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటంతో మెజార్టీ రైతులకు పంటల బీమా అందని ద్రాక్షగా మారింది. మంజూరైన పరిహారం రుణ ఖాతాలకు సర్దుబాటు చేయడంతో సరిపుచ్చడంతో నష్టపోయిన రైతుకు భరోసా లభించేది కాదు. పైగా ఏనాడూ ఖరీఫ్ సీజన్ పరిహారాన్ని మరుసటి ఏడాది ఆగస్టు లోపు చెల్లించిన దాఖలాలు లేవు. ఆరోపణ: రైతులకు భారంగా ఉచిత పంటల బీమా వాస్తవం: పంటల బీమా అన్నదాతలకు గుదిబండ కాకూడదన్న సంకల్పంతో డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఖరీఫ్ 2019 సీజన్ కోసం కేవలం రూపాయి మాత్రమే ప్రీమియంతో పథకాన్ని అమలు చేయగా రైతుల వాటా రూ.468 కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.503 కోట్లు కలిపి మొత్తం రూ.971 కోట్లను తానే భరిస్తూ బీమా కంపెనీలకు చెల్లించింది. అవగాహన లేనందున కొద్దిమంది రైతులు బీమా పరిధిలోకి రాలేదని గుర్తించిన ప్రభుత్వం 2020 ఖరీఫ్ నుంచి పైసా కూడా భారం పడకుండా పూర్తిగా ఉచితంగా పంటల బీమాను వర్తింప చేసింది. ఇందుకు పీఎంఎఫ్బీవై నిబంధనలు అడ్డంకిగా మారడంతో ఆ పథకం నుంచి బయటకొచ్చి 2020–21, 2021–22 సీజన్లలో సొంతంగానే బీమా పరిహారం చెల్లించింది. 2022–23 నుంచి పీఎం ఎఫ్బీవైతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఆరోపణ: 2022–23 ఖరీఫ్లో కోతలు ఎందుకు విధించారు? వాస్తవం: దేశంలో ఏ కంపెనీ అయినా ఒక జిల్లాలో కనీసం 5 వేల ఎకరాల్లో సాగయ్యే నోటిఫైడ్ పంటలకు మాత్రమే బీమాను వర్తింప చేస్తున్నాయి. ఇలా ఖరీఫ్–2022–23లో 21, రబీ 2023–24లో 17 పంటలను నోటిఫై చేశారు. గతేడాది అక్టోబర్ 31 నాటికి ఈ – క్రాప్ ప్రాథమిక డేటా ఆధారంగా ఖరీఫ్ 2022లో తొలుత 34.70 లక్షల మంది రైతులు సాగు చేసిన 70.80 లక్షల ఎకరాల్లోని పంటల వివరాలను కేంద్రానికి పంపగా డూప్లికేషన్, సాంకేతిక కారణాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఈ – కేవైసీ ప్రామాణికంగా 33.02 లక్షల మంది రైతులు సాగు చేసిన 68.20 లక్షల ఎకరాల పంటల వివరాలను డిసెంబర్లో తిరిగి కేంద్రానికి పంపారు. ఇప్పటివరకు 64.60 లక్షల ఎకరాల్లో పంటలు, 29.3 లక్షల మంది రైతుల వివరాలను నేషనల్ క్రాప్ ఇన్స్రూెన్స్ పోర్టల్లో అప్లోడ్ చేశారు. ఆరోపణ: కప్ క్యాప్ మోడల్తో రైతులకు అన్యాయం.. వాస్తవం: పరిహారం తగ్గిన సందర్భాలలో అధిక ప్రీమియం వసూలు ద్వారా బీమా కంపెనీలు భారీగా ప్రయోజనం పొందుతున్నాయనే విమర్శల నేపథ్యంలో ప్రీమియం రేట్లను హేతుబద్ధీకరించగా కేంద్రం సూచించిన ఫార్మాట్లలో విజయవంతమైన కప్ అండ్ క్యాప్ (80–110 మోడల్ను 2023–24 సీజన్ నుంచి దిగుబడి ఆధారిత పంటల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఖరీఫ్ సీజన్లో 9 క్లస్టర్ల పరిధిలో దిగుబడి ఆధారిత పంటలకు ఈ విధానం అమలు చేస్తోంది. 110 శాతం కన్నా ఎక్కువ నష్టం సంభవిస్తే ఆ మేరకు సొంతంగా భరిస్తూ అదనపు పరిహారాన్ని రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే జమ చేస్తుంది. పరిహారం చెల్లింపులో ఎలాంటి కోతలు ఉండవు. మరోవైపు వాతావరణ ఆధారిత పధకానికి పాత పద్ధతిలోనే టెండర్లను ఖరారు చేశారు. దేశవ్యాప్తంగా అత్యల్ప ప్రీమియం రేట్లకు టెండర్లను ఖరారు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం విడ్డూరం. ఆరోపణః గతంలో ఘనంగా పంటల బీమా.. వాస్తవం: టీడీపీ హయాంలో 2016–18 మధ్య పీఎంఎఫ్బీవై పథకంలో చేరిన 74 లక్షల మంది రైతులు తమ వాటాగా రూ.871.26 కోట్ల ప్రీమియం చెల్లించగా 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల పరిహారం లభించింది. అయితే గత నాలుగున్నరేళ్లలో రైతులపై పైసా భారం పడకుండా 54,48,344 మందికి రూ.7,802.05 కోట్ల పరిహారాన్ని జమ చేశారు. టీడీపీ హయాంతో పోలిస్తే 23.63 లక్షల మంది రైతులు, రూ.4,390.85 కోట్లు అదనంగా లబ్ధి పొందారు. అంతేకాకుండా చంద్రబాబు 6.19 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల పంటల బీమా పరిహారాన్ని సైతం చెల్లించి రైతుల పట్ల సీఎం జగన్ తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. టీడీపీ హయాంలో 2.32 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పిస్తే గత నాలుగున్నరేళ్లలో 3.98 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ వర్తించింది. నాడు 74.40 లక్షల మందికి బీమా రక్షణ కల్పిస్తే నేడు 1.71 కోట్ల మందికి బీమా రక్షణ దక్కుతోంది. అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకాన్ని పలు సందర్భాల్లో కేంద్రంతో పాటు అంతర్జాతీయ సంస్థలు సైతం ప్రశంసిస్తుంటే ఈనాడు రామోజీ భరించలేకపోతున్నారు! -
fact check: పంటల‘కేసీ’ కళ్లెట్టుకు సూడు..
కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో సాగు చేసిన పంటలు ఎండిపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను జల వనరుల శాఖ ఇంజినీర్లు పక్కాగా అమలు చేస్తున్నారు. ఇది చూసిన పచ్చ పత్రిక ఈనాడు తట్టుకోలేక నీటి తడులపై తప్పుడు కథనాన్ని ప్రచురించింది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా కేసీ రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండించడం, కర్షకులు ఆనందంగా ఉండడాన్ని ఓర్వలేని రామోజీ తన అక్కసు వెళ్లగక్కారు. శ్రీశైలం నీళ్లు అమ్ముకుంటున్నారంటూ కి‘రాత’కానికి దిగారు. కర్నూలు సిటీ/ఆళ్లగడ్డ: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా వర్షాభావం నెలకొంది. ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత తక్కువగా ఉంది. దీంతో అప్రమత్తమైన జలవనరుల శాఖ అధికారులు కేసీ కెనాల్ పరిధిలోని ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లోని 2.65 లక్షల ఎకరాల ఆయకట్టులో వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. సాగు నీటి సలహా మండలి సమావేశంలోనూ తీర్మానం చేశారు. ఆ మేరకు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించారు. దీంతో రైతులూ ఆరుతడి పంటలను సాగు చేశారు. ఆ తరువాత సెప్టెంబరు, నవంబరు నెల చివరి వారాల్లో కొంత మేర వర్షాలు పడ్డాయి. దీంతో నవంబరు నెల 25న మరోసారి సాగు నీటి సలహా మండలి సమావేశం నిర్వహించి కేసీ కెనాల్కు డిసెంబరు 15 వరకు నీటిని ఇవ్వాలని తీర్మానించారు. రైతులు కలెక్టర్, ప్రజాప్రతినిధులను కలిసి శ్రీశైలంలో లెవెల్ పర్మిట్ చేసేంత వరకు నీటిని ఇవ్వాలని కోరారు. దీంతో నంద్యాల కలెక్టర్, జేసీ ఆదేశాల మేరకు వారాబందీ ప్రకారం నీరు విడుదల చేస్తున్నారు. నీరు వృథా కాకుండా జలవనరుల శాఖ అధికారులు రాత్రీపగలు కెనాల్పై గస్తీ కాసి ప్రతి ఎకరాకూ నీరు అందించారు. మంచి దిగుబడులు రావడంతో రైతులు సంబరపడ్డారు. జలవనరుల శాఖ ఇంజినీర్లను సన్మానిస్తున్నారు. అన్నీ తప్పుడు రాతలే రామోజీ పచ్చ పత్రిక బడా వాణిజ్య రైతులతో కుమ్మక్కై రబీలోని మిరప పంటకు నీటిని అమ్ముకుంటున్నారని కథనం వండివార్చింది. ఇదంతా అవాస్తవం. కేసీ కెనాల్ పరిధిలో మిరప సాగుచేసిన రైతుల్లో బడా రైతులు లేరు. ఒకరికి మాత్రమే పది ఎకరాలు ఉంది. మిగిలిన వారందరూ ఎకరా, ఎకరన్నర ఉన్న సన్నకారు రైతులే. కానీ అనధికారికంగా 20 వేల ఎకరాల్లో సాగు చేశారంటూ తప్పుడు గణాంకాలు ప్రచురించింది. ఇకపోతే పోతిరెడ్డిపాడు నుంచి తీసుకునే నీటిలో 5 టీఎంసీలు కేసీ కెనాల్కు తీసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడి నుంచి తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతోనే ముచ్చుమర్రి నుంచి నీటిని తీసుకుంటుంటే ఈనాడు తప్పుడు రాతలు రాసింది. ‘‘నీటి కేటాయింపులు లేవు. రైతులకు నీరు ఎలా ఇస్తారు? రైతులకు అన్యాయం జరుగుతుందనేలా విషపు కథనాన్ని కక్కింది. రైతుల నుంచి వసూళ్ళు చేసిన సొమ్ము రాష్ట్ర స్థాయి అధికారికి చేరిందంటూ అవాస్తవాలతో పైత్యం ఒలకబోసింది. దీనిపై ఇంజినీరింగ్ వర్గాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అది ముమ్మాటికీ తప్పుడు కథనమే ఉయ్యాలవాడ: శ్రీశైలం నుంచి ఎస్సార్బీసీ కేసీ కెనాల్కు వచ్చే సాగు నీటికి రైతులు డబ్బులు ఇచ్చారని ఈనాడులో వచ్చిన వార్తా కథనాన్ని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు బుడ్డా చంద్రమోహన్రెడ్డి, ఆళ్లగడ్డ మార్కెట్యార్డ్ డైరెక్టర్ గజ్జెల క్రిష్ణారెడ్డి, మాజీ గ్రామ సర్పంచ్ ఆరికట్ల శివరామక్రిష్ణారెడ్డి రైతులతో కలిసి తీవ్రంగా ఖండించారు. సోమవారం స్థానిక ఎంపీపీ బుడ్డా భాగ్యమ్మ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రైతుల అభ్యర్థన మేరకు రాష్ట్ర సాగునీటి జలవనరుల సలహాదారులు గంగుల ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ప్రభుత్వం, అధికారులతో మాట్లాడి నీరు విడుదల చేయించారని పేర్కొన్నారు. అనంతరం ప్రధాన రహదారిపై రైతులు ఈనాడు ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈనాడుది తప్పుడు కథనం కేసీ కెనాల్ పరిధిలో కర్నూలు, కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాల్లో ఆయకట్టు ఉంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్లో 97 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఆగస్టు, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన ఐఏబీ సమావేశాల్లో డిసెంబర్ 15 వరకు నీటిని అందించాలని తీర్మానం జరిగింది. రైతుల విన్నపం మేరకు శ్రీశైలంలో లెవెల్ పర్మిట్ చేసేంత వరకు నీటి విడుదలకు చర్యలు తీసుకున్నాం. ముచ్చుమర్రి ద్వారా వారాబందీ ప్రకారం రాత్రి, పగలు గస్తీకాసి నీరు అందిస్తుంటే ఇంజినీర్లు డబ్బులు వసూలు చేశారంటూ తప్పుడు కథనం రాయడం బాధాకరం. – వి.తిరుమలేశ్వర రెడ్డి, కేసీ ఈఈ సాగునీరు కొనుక్కొనే దుస్థితి లేదు సాగునీటి కోసం అధికారులకు లంచాలిచ్చి కొనుక్కొనే దుస్థితి రైతుకు దాపురించలేదు. వర్షాభావంలోనూ మా పంటలకు నీరు ఇచ్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకు వచ్చి పంటలు పండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తుగా కుంటలను నింపుకునేందుకు కేసీ కెనాల్కి నీరు వదిలారు. – రామాంజనేయరెడ్డి, రైతు, గుండుపాపల చివరి పంటలకు సాగునీరు ఇచ్చారు ప్రభుత్వం రైతులకు సాగునీరు ఇచ్చి ఆదుకుందనే చెప్పాలి. ఎందుకంటే జలాశయాల్లో నీరు అంతంత మాత్రమే. అయినా మా పంటలు ఎండకూడదనే ఉద్దేశంతోనే వారాబందీగా నీరు అందించారు. ప్రస్తుతం చివరి ఆయకట్టు పంటలకు సాగునీరు అందింది. – వాసుడు, రైతు, చాకరాజువేముల -
Fact Check: గుంతలు కాదు..రామోజీ కళ్లకు గంతలు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విషం చిమ్మడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈనాడు రామోజీరావు పైత్యం పరాకాష్టకు చేరింది. రాష్ట్రంలో రోడ్లపై పదే పదే కట్టుకథలను కొత్తగా వండివారుస్తున్నాడు. రోడ్ల పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నా సరే... కళ్లకు గంతలు కట్టుకున్న రామోజీ గుంతల పేరిట కొత్త కథ వినిపించారు. చంద్రబాబుకు రాజకీయంగా పరిస్థితులు కలిసి రాకపోవడంతో ఆక్రోషం కట్టలు తెంచుకుని రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెగబడుతూ దిగజారుడు పాత్రికేయం చేస్తున్నారు. పాత ఘటనలకు కొత్తగా రంగులద్దుతూ బాబుకు మేలు చేసేందుకు జాకీ లెత్తుతున్నారు. రాష్ట్రంలో 99 శాతం బాగున్న రోడ్లను చూడకుండా.. రంధ్రాన్వేషణకు పాల్పడుతూ ఎక్కడో ఒక చోట రోడ్డు కాస్త దెబ్బతిన్న ఫొటోలతో ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, జాతీయ రహదారులకు కలిపి మొత్తం రూ.23,792.19 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలో ఈ నాలుగేళ్లలోనే ఏకంగా రూ.42,236.28 కోట్లు వెచ్చించారు. ‘పచ్చ’ కామెర్లు కమ్మేసిన రామోజీ కళ్లకు ఈ నిజం ఎందుకు కనిపించలేదన్నది ఎవరికి తెలియదు?. బాబు పాలనలో 2017–18లో తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించారు. దాంతో 2019 నాటికి రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రోడ్ల మరమ్మతులకు కేవలం రూ.2,953.81 కోట్లు వెచ్చించింది. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో రోడ్ల మరమ్మతులకు రూ.4,148.59 కోట్లు వెచ్చించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం( 2023–24) తొలి నాలుగు నెలల్లోనే రూ.346 కోట్లు ఖర్చుపెట్టింది. రోడ్ల అభివృద్ధి సెస్ ద్వారా వచ్చిన రూ.3 వేల కోట్లను టీడీపీ చేసిన అప్పులు తీర్చడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేటాయించాల్సి వచ్చింది. సెస్ ద్వారా వచ్చిన మరో రూ.2 వేల కోట్లకు అదనంగా రూ.2,500 కోట్ల రుణం తీసుకుని మొత్తం రూ.4,500 కోట్లతో 7,600 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించింది. ఈనాడు దుష్ప్రచారం: పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన బత్తిన ఆనంద్ గతేడాది అక్టోబర్ 20న పిడుగురాళ్ల మండలం జూలకల్లు అడ్డరోడ్డు వద్ద తెల్లవారుజామున బైక్పై వెళ్తూ గుంతలో పడి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొని మరణించాడు. వాస్తవం: ఆ రోడ్డుపై ఎలాంటి గుంతలు లేవు. రైతులు తమ పొలాలకు నీటి కోసం రోడ్డు తవ్వి మట్టితో పూడ్చారు. అదే సమయంలో ఆనంద్ భార్య ఆస్పత్రి ఖర్చుల కోసం ఇంటి నుంచి నగదు తీసుకొని వేగంగా వెళ్తూ అక్కడికి వచ్చేసరికి సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఎదురుగా ఏ వాహనం ఢీకొనలేదు. ఈనాడులో రాసినట్టుగా ఆయన భార్య బైక్పై లేదు. వెంటనే ఆర్ అండ్ బీ అ«ధికారులు రోడ్డు తవ్విన రైతులతోనే తారు వేసి మరమ్మతులు చేయించారు. ఈనాడు దుష్ప్రచారం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మాకివలసకు చెందిన తోటాడ సింహాచలం 2021 జనవరి 4న మాకివలస– కిల్లాం రోడ్డుపై గుంత వల్ల ప్రమాదానికి గురై మరణించాడు. వాస్తవం: సింహాచలం మాకివలసకు మోపెడ్పై మద్యం మత్తులో వస్తూ ఒక మలుపు వద్ద అదుపు తప్పి మట్టి రోడ్డుపై నుంచి పొలాల్లో పడిపోయాడు. గాయపడిన సింహాచలంను కిళ్లాంకు చెందిన యాగేటి రమణ, నీలయ్యలు గమనించి కుటుంబ సభ్యులకు తెలిపారు. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. సింహాచలం మృతికి గుంతలు కారణమనడం సరికాదని నీలయ్య పేర్కొన్నాడు. ప్రమాదం జరిగిన స్థలంలో అసలు గుంతలే లేవు. ఈనాడు దుష్ప్రచారం: కర్నూలు నగరంలోని మద్దూర్నగర్కు చెందిన నర్సయ్య గతేడాది జూలై 29న లక్ష్మీనగర్లో ఉన్న గుంతలో పడి గాయపడ్డాడని, అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడని రాశారు. వాస్తవం: మద్దూర్నగర్లో వార్డు పరిధిలో విశాలమైన సీసీ రోడ్లు ఉన్నాయి. నర్సయ్య వెళ్లే దారిలో కుళాయి కోసం గుంత తవ్వి వదిలేశారు. రోజూ వెళ్లే మార్గమే అయినా.. కుళాయి కోసం తవ్విన గుంత గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది. అంతేకాని రోడ్లపై ఎలాంటి గుంతలు లేవు. ఈనాడు దుష్ప్రచారం: 2022 ఆగస్టు 4న అల్లిపురం నుంచి విశాఖ రైల్వేస్టేషన్కు వెళ్లే రహదారిలో ఫ్లై ఓవర్ వద్ద గుంతలో పడి సుబ్బారావు మృతిచెందాడు. వాస్తవం: ఆ నెలలో కురిసిన భారీ వర్షాలకు అల్లిపురం–విశాఖ రైల్వే స్టేషన్ రోడ్డుపై చిన్నపాటి గుంత పడింది. అక్కడ ఉన్న మర్రిచెట్టు కొమ్మల కారణంగా వీధిలైట్లు ఉన్నప్పటికీ వెలుతురు సరిగా లేదు. గుంతను దాటుకుంటూ ఎంతో మంది ప్రయాణించారని.. ఒక ద్విచక్రవాహనదారుడు స్పీడ్గా వెళ్లడంతో అక్కడ అదుపుతప్పి పడిపోయి తలకు గాయమై ఉండొచ్చని, లేదా మరేదైనా కారణం కావచ్చని సంబంధిత ఏఈ తెలిపారు. ఆ సంఘటన జరిగిన వారం రోజుల తర్వాత ఈనాడు పత్రిక గుంతవల్లేనంటూ వార్త రాసుకొచ్చింది.