Harish Rao
-
బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు: హరీష్
సాక్షి, సిద్ధిపేట: బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. ఏపీ, తెలంగాణ రెండు కళ్లు అన్న చంద్రబాబు.. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కేంద్రానికి డజన్ల కొద్దీ లేఖలు రాశారని హరీష్ గుర్తు చేశారు.‘‘నాగార్జున సాగర్ ఎడమ కాలువలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఇదేనా మీ రెండు కళ్ల సిద్ధాంతం. చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొడుతున్నారు. తెలంగాణకి సాగునీరు, తాగునీరు అందక రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేఆర్ఎంబీ నీటి వాటాలో.. సమ న్యాయం అనేది మాటల్లో తప్ప చేతల్లో లేదు. చంద్రబాబుది పక్షపాత ధోరణే తప్ప సమన్యాయం కాదు...చంద్రబాబు సీఎం కాగానే ప్రాజెక్ట్ల డీపీఆర్లు రిటర్న్ వస్తున్నాయి. రేవంత్ రెడ్డికి బీజేపీ ప్రశ్నించే తెగువ, తెలివి లేదు. చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్ట్ను ఆపే ప్రయత్నం చేయలేదా... గతంలో ఆయన దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాసింది నిజం కాదా’’ అంటూ హరీష్రావు నిలదీశారు. -
సీఎం రేవంత్కు హరీష్రావు స్ట్రాంగ్ కౌంటర్
హైదరాబాద్, సాక్షి: శ్రీశైలం ఎడమ గట్టు సొరంగం పనులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టన్నెల్ పనులు ముందుకు కదలేదని రేవంత్ చేసిన ఆరోపణలనూ హరీష్ ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో SLBC టన్నెల్ పనులు జరగలేదని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. లేకుంటే సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేస్తారా? అని హరీష్ రావు సవాల్ విసిరారు. మా హయాంలో టన్నెల్ పనులు జరిగాయి. 11. కిమీలకు పైగా సొరంగం తవ్వాం.. ఇందుకుగానూ రూ.3 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం.ఈ విషయంలో మేం చర్చకు సిద్ధం అని హరీష్ రావు అన్నారు. అలాగే.. తన దుబాయ్పై పర్యటనపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. దుబాయ్లో మిత్రుడి కుమార్తె వివాహానికి వెళ్లాను. ఫిబ్రవరి 21న దుబాయ్కి వెళ్లే.. 22వ తేదీన ప్రమాదం జరిగింది. దీనిని రాజకీయం చేయడం తగదు అని అన్నారాయన. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద పది రోజుల కింద సొరంగం పైకప్పు కూలిపోయి ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం పాలమూరు పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టన్నెల్ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఆపై టన్నెల్ వద్దకు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారాయన. -
అప్పుడు లేని తపన ఇప్పుడెందుకు?: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ సీఎం రేవంత్, మంత్రులు కూడా ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రధాని మోదీ.. సీఎంతో ఫోన్లో మాట్లాడారు. కేంద్రం కూడా బృందాలు పంపి సహకరిస్తుంది. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. రిస్క్ అని తెలిసి కూడా అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు’’ అని జగ్గారెడ్డి అన్నారు.ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య శాశ్వతంగా పోవాలని మంచి నీళ్లు ఇచ్చేందుకు దీనిని వైఎస్ చేపట్టారు. ఫ్లోరైడ్తో నల్గొండలో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వైఎస్ గుర్తించి.. శ్రీశైలం నీళ్ళు నల్గొండ ప్రజలకు ఇవ్వాలని భావించారు. రూ.1925 కోట్లతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం జరిగింది. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎస్ఎల్బీసీ పూర్తి కావాల్సి ఉండే.. కానీ కాలేదు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేయాలని మంచి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నల్గొండలో 4 నుంచి 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఘటనను ప్రతిపక్షాలు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. కనీస అవగాహన ఉండాలి. ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తిస్తుంది.’’ అని జగ్గారెడ్డి తెలిపారు.‘‘హరీష్రావు ఆర్థిక మంత్రిగా.. ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఎందుకు పూర్తి చేయలేదు? అప్పుడు లేని తపన ఇప్పుడు ఎందుకు?. హరీష్రావు ముసలి కన్నీరు కారుస్తున్నారు. కొండగట్టు బస్సు ప్రమాదం జరిగితే.. అప్పటి సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లలేదు. హరీష్రావు గొంతు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం జవాబుదారీ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. బీజేపీ క్రమశిక్షణ లేని పార్టీ. కిషన్ రెడ్డి బీసీలను అణచివేస్తుందని ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు’’ అని జగ్గారెడ్డి గుర్తు చేశారు. -
‘రాజకీయాలు చేయడం కోసం వెళ్లారా?’
హైదరాబాద్: ఎస్ఎల్బీసీకి వెళ్లిన బీఆర్ఎస్ నేతల తీరు చూస్తుంటే వారు రాజకీయాలు చేయడం కోసమే అక్కడకు వెళ్లినట్లు ఉందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ ఘటనను ప్రకృతి విలయలాగా చూడాలి కానీ రాజకీయాలు చేస్తామనడం సరైంది కాదన్నారు. ‘హరీష్ రావు రాజకీయాలు చేయడం కోసం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదాన్ని వాడుకోవడం నిజంగా సిగ్గుచేటు. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జరిగింది.కాళేశ్వరం టన్నెల్ కూలినప్పుడు ప్రాణ నష్టం జరిగింది.. మీరు ప్రతిపక్షాలకు అనుమతి ఇచ్చిన చరిత్ర లేదు. మేము పోయి రాజకీయం చేయలేదు. శ్రీశైలంలో పవర్ హౌస్ పెయిల్ అయినప్పుడు ఆ జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని, మల్లు రవిని పోనియ్యలేదు. మీరు పర్మిషన్ అడగకున్నా slbc కి పోతం అంటే పోనిచ్చినం. హరీష్ రావు రెస్క్యూ టీమ్ కు సలహాలు ఇవ్వనక్కర్లేదు. అక్కడ ఏజెన్సీలు పని చేస్తున్నాయి. ఎనిమిది మంది కుటుంబాలను ఎలా ఆదుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. రెస్క్యూ ను ప్రభుత్వం రిజాల్వ్ చేస్తుంది’ అని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. -
Uttam Kumar: 11 విభాగాల నిపుణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు
-
SLBC ఘటనలో ప్రభుత్వం విఫలమైంది: హరీష్రరావు
-
కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చి ఉంటే కాంగ్రెస్ సగం ఖాళీ అయ్యేది
సాక్షి, హైదరాబాద్: తమ నాయకుడు కేసీఆర్ అంగీకరించి ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సగం మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయేవారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 36 పర్యాయాలు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రాష్ట్రానికి సాధించిందేమీ లేదని, ప్రైవేటు కార్లలో ఒంటరిగా వెళ్లి అక్కడ ఎవరితో భేటీ అవుతున్నారో చెప్పాలన్నారు. హరీశ్రావు మంగళవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు. ‘మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు కోసం కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేత రూ.90 కోట్లు ఖర్చు పెట్టించి ఆ పార్టీ ఎమ్మెల్యేలు డబ్బులు నొక్కేశారని ప్రణాళిక సంఘం అధ్యక్షుడు, కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి చెప్పారు. ప్రతీ చిన్న విషయానికి స్పందించే సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలు దీనిపై ఎందుకు విచారణ జరపడం లేదు. కాంగ్రెస్, బీజేపీ నడుమ బంధానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి.ఎల్ఆర్ఎస్ను పేదల రక్తం తాగే స్కీమ్గా ప్రతిపక్షంలో ఉన్నపుడు జనాలను రెచ్చగొట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, సీతక్క, ఎమ్మెల్సీ కోదండరాం గొంతు ఎందుకు మూగబోయింది. ఎల్ఆర్ఎస్ వసూళ్ల కోసం ౖఆషాడం సేల్, దీపావళి బొనాంజా మాదిరిగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు.డిస్కౌంట్ల పేరిట మోసం చేస్తున్న రేవంత్ జనం దృష్టిలో ‘మిస్ కౌంట్’గా మిగిలిపోతారు. ఢిల్లీ కాంగ్రెస్ను సాకేందుకు గల్లీ కాంగ్రెస్ ప్రజలను బాదుతోంది. ఢిల్లీకి ఎప్పటికప్పుడు కప్పం కట్టించేందుకు కాంగ్రెస్ కొత్త వైస్రాయ్ను నియమించింది’ అని హరీశ్రావు చెప్పారు.హౌస్ అరెస్టులు చేయకుండా చూడాల్సిన బాధ్యత ‘పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కిలోమీటర్ సొరంగం కూడా తవ్వలేదని మంత్రి ఉత్తమ్ అబద్ధాలు చెప్తున్నాడు. అనేక సాంకేతిక సమస్యలు ఎదురైనా 12 కిలోమీటర్లు తవ్వడంతో పాటు డిండి, పెండ్లిమర్రి రిజర్వాయర్ పనులు 90శాతం మేర పూర్తి చేశాం. గురువారం మహబూబ్నగర్, నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ నేతలతో కలిసి ఎస్ఎల్బీసీని సందర్శిస్తాం. పోలీ సులు హౌస్ అరెస్టులు చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీయేతర అభ్య ర్థుల్లో మంచి వారిని చూసి ఎన్నుకోవాలని పిలుపునిస్తున్నాం. వానాకాలం రైతుబంధు, రెండు లక్షల ఉద్యోగాలు, కళ్యాణలక్ష్మి లో తులం బంగారం, నిరుద్యోగ భృతి, పీఆర్సీ, డీఏ పెండింగ్ బకాయిలు వచ్చాయని భావిస్తేనే కాంగ్రెస్కు ఓటేయండి లేదంటే ఆ పార్టీ అభ్యర్థులను ఓడించండి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపి, మెడికల్ కాలేజీల స్థాపనలో అన్యా యం చేసిన బీజేపీని ఓడించాలి’ అని హరీశ్రావు చెప్పారు. -
‘సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదనే..’
హైదరాబాద్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ ప్రమాద స్థలిని సందర్శించడంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఇప్పటివరకూ తాము అక్కడకు వెళ్లకపోవడానికి సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో మాత్రమేనన్నారు. ఎల్లుండి(గురువారం) ఉదయం ఎస్ఎల్బీసీ టన్నెల్ ను సందర్శిస్తామని ఆయన స్పష్టం చేశారు. తాము అక్కడకు వెళ్లే క్రమంలో పోలీసులు ఎటువంటి ఆటంకం కల్గించకూడదని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలిఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలన్నారు.8 మందిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం..టన్నెల్ లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 18, 19 మీటర్ల ఎత్తులో బురద పేరుకుపోయిందని, దేశంలో చాలా టన్నెల్ ప్రమాదాలు జరిగాయని, కాకపోతే అత్యంత క్లిష్టమైన టన్నెల్ ప్రమాదం ఇదేనన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. -
KCR: హైకోర్టులో కేసీఆర్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
సాక్షి,హైదరాబాద్: మేడిగడ్డ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్(KCR), మాజీ మంత్రి హరీష్ రావులు వేసిన పిటిషన్ను విచారించిన కోర్టు.. తీర్పు రిజర్వు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. మేడిగడ్డ కుంగిన వ్యవహరంపై భూపాలపల్లి కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఇవాళ (ఫిబ్రవరి24) హైకోర్టు విచారణ జరపింది. విచారణ సందర్భంగా.. లోయర్ కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తి(Raja Lingamurthy) చనిపోయాడని కేసీఆర్, హరీష్ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే.. కేసు వేసిన పిటిషనర్ చనిపోయినా లీగల్ హైర్(Legal Heir)ను ఇంప్లీడ్ చేస్తే.. పిటిషన్ మెయింటేనబుల్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. కాబట్టి, మళ్లీ లోయర్ కోర్టుకు రిఫర్ చేయాలని బెంచ్కు విజ్ఞప్తి చేశారు. అయితే.. ఇది క్రిమినల్ పిటిషన్ కాబట్టి లీగల్ హైర్కు ఆస్కారం ఉండబోదని కేసీఆర్ అడ్వకేట్ వాదించారు. లీగల్ హైర్ ను ఇంప్లీడ్ చేయడం సమన్స్ కేసుకు మాత్రమే వర్తిస్తుందని కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. -
హరీష్ రావు వ్యాఖ్యలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్
-
కృష్ణా జలాలపై సర్కార్ మొద్దునిద్ర: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నది జలాలను అక్రమంగా తరలిస్తున్నా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. తెలంగాణ సాగు, తాగునీటి ప్రయోజనాలకు నష్టం కలుగుతున్నా రేవంత్రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయని, వేసవిలో తాగునీటి సమస్య తీవ్రమయ్యే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, జైపాల్ యాదవ్తో కలసి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ గురించి పట్టింపులేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి జరిగే నష్టం ఏమిటో తెలుస్తోందన్నారు. రోజుకు 10 వేల క్యూసెక్కులు అక్రమంగా తరలింపు‘నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి ఏపీ ప్రభుత్వం మూడు నెలలుగా రోజుకు 10 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని అక్రమంగా తరలిస్తోంది. గడచిన 25 రోజుల్లో 60 టీఎంసీల నీటిని తరలించారు. కృష్ణా జలాల్లో ఏపీ తాత్కాలిక వాటా 512 టీఎంసీలు కాగా ఇప్పటికే 657 టీఎంసీలు తరలించింది. తెలంగాణకు రావాల్సిన వాటా 343 టీఎంసీలు కాగా 220 టీఎంసీలు మాత్రమే వాడుకుంది. ఏపీకి మిగిలింది కేవలం 9 టీఎంసీలు కాగా తెలంగాణకు మరో 123 టీఎంసీల వాటా రావాలి. కానీ శ్రీశైలం, సాగర్లో అందుబాటులో ఉన్న నీరు వంద టీఎంసీలు మాత్రమే. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి అన్యాయాన్ని అడ్డుకోవాలి’అని హరీశ్ అన్నారు.సాగర్ను అధీనంలోకి తీసుకోవాలి‘సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించుకుని సాగర్ ప్రాజెక్టును తెలంగాణ అధీనంలోకి తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఏపీ ఇష్టారాజ్యంగా నీళ్లు తరలిస్తున్నా చంద్రబాబును అడిగే ధైర్యం లేదు, కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము లేదు’అని హరీశ్రావు మండిపడ్డారు. ‘సాగర్ ఎడమ కాలువ, ఏఎంఆర్ ఎస్సెల్బీసీ కింద సుమారు 9 లక్షల ఎకరాలకు 35 టీఎంసీల మేర నీరు కావాలి. ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, హైదరాబాద్ తాగునీరు నాగార్జున సాగర్పై ఆధారపడి ఉంది. ఏపీ జలదోపిడీపై కేఆర్ఎంబీ, జలశక్తి మంత్రి కార్యాలయాల ముందు ధర్నాకు సిద్ధం, ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్లాలి. ఉమ్మడి ప్రాజెక్టులపై త్రిసభ్య కమిటీ సమావేశం కోసం డిమాండ్ చేయాలి. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి’అని హరీశ్రావు విమర్శించారు. వెంటనే సాగర్ కుడి కాల్వకు నీటి విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. -
నీటిపారుదల రంగంలో తెలంగాణకు అన్యాయం
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్రావుకు ఊరట
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్రావు ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్లో నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలిచ్చేవరుకూ అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది.తన ఫోన్ ట్యాప్ చేశారంటూ రియల్టర్ చక్రధర్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. తదుపరి విచారణను హైకోర్టు మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధా కిషన్ రావుకు కూడా ఊరట లభించింది. -
ఫోన్ టాపింగ్ కేసులో ట్విస్ట్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్..హరీష్ రావు పీఏ అరెస్ట్!
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు పీఏ వంశీకృష్ణతో సహా ముగ్గురు అరెస్ట్ అయ్యారు.సిద్ధిపేట్ జిల్లా, నియోజకవర్గానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫోన్ను ట్యాపింగ్ చేసి బెదిరింపులు, వేధింపులకు గురిచేసిన ఫిర్యాదుకు సంబంధించిన కేసులో పంజాగుట్ట పోలీసులు వేగం పెంచారు. ఓ రైతుకు తెలీకుండా అతని డాక్యుమెంట్స్తో హరీష్ రావు పీఏ వంశీకృష్ణ సిమ్కార్డు కొనుగోలు చేశారు. ఆ సిమ్ను వినియోగించి చక్రధర్ గౌడ్కు బెదిరింపు కాల్స్ చేసి వసూళ్లకు పాల్పడ్డారు. ఫోన్ ట్యాపింగ్, బెదిరింపులపై చక్రధర్ గౌడ్ గతేడాది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు నిందితుల్ని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 28వరకు ముగ్గురికి రిమాండ్ విధించారు. కాగా, ఇదే కేసులో ఏ-1గా హరీష్ రావు,ఏ-2గా రాధాకిషన్ రావులు ఉన్నారు. -
కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంతో
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంతో రాష్ట్రం నీటి సంక్షోభం దిశగా పయనిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భజలాలు గణనీయంగా తగ్గడంపై శనివారం ఒక ప్రకటనలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణను భూగర్భజల సంరక్షణలో ఆదర్శంగా నిలిపిన గత బీఆర్ఎస్ ప్రభుత్వ నీటి ప్రణాళికలు కాంగ్రెస్ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయని మండిపడ్డారు. ‘కేసీఆర్ హయాంలో భూగర్భజలాలు 56 శాతం పెరిగాయి. మిషన్ కాకతీయ ద్వారా 27 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించడంతో నీటి నిల్వ సామర్థ్యం 8.93 టీఎంసీలకు పెరిగింది. దీంతో సాగు, తాగునీటి రంగాలు బలోపేతమయ్యా యి. కానీ కేవలం 14 నెల ల కాంగ్రెస్ పాలనలోనే ఈ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో భూగర్భ జలమట్టం రెండు మీటర్లకు పైగా పడిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ వైఫల్యంతో 120 కిలోమీటర్ల పొడవునా నీరు లేక గోదావరి నది ఎడారిని తలపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ సహా ప్రాజెక్టు నీటి భద్రతను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. మిషన్ భగీరథ పథకం కుంటుపడటంతో తాగునీటి కోసం మళ్లీ బోరుబావులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది’అని హరీశ్రావు పేర్కొన్నారు. నీటిపారుదల రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండటంతో వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తే అవకాశముందని హెచ్చరించారు. ఈ పరిస్థితిని తప్పించడానికి వెంటనే నీటి పరిరక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. -
రేవంత్.. 12 రోజులు దాటినా జీతాలెక్కడ?: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) సీరియస్ కామెంట్స్ చేశారు. హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చే పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు.. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజా వ్యతిరేక పాలన అంటూ ఘాటు విమర్శలు చేశారు.తెలంగాణలో హోంగార్డుల జీతాల విషయమై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో హరీష్..‘రాష్ట్రవ్యాప్తంగా 16వేలకు పైగా ఉన్న హోంగార్డులకు 12 రోజులు గడస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల బ్యాంకు అధికారులు ఫోన్లు చేసి నిలదీస్తున్న పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతున్నా పట్టించుకునే వారే లేరు. మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరికి ఏం సమాధానం చెబుతారు?. పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు.. ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. హోంగార్డులకు వేతనాలు తక్షణం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 16వేలకు పైగా ఉన్న హోం గార్డులకు 12 రోజులు గడస్తున్నా జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్న హోంగార్డులు.. చేతిలో చిల్లిగవ్వలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం అప్పులు…— Harish Rao Thanneeru (@BRSHarish) February 12, 2025 -
పీఏసీ చైర్మన్ ఎంపిక అప్రజాస్వామికం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ టికెట్పై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ (పీఏసీ)గా నియమించడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. పీఏసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు నామినేషన్ పత్రాలను మాయం చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడితో సంప్రదింపులు జరిపి పీఏసీ చైర్మన్ను ఎంపిక చేయాలనే సంప్రదాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు. శాసనసభలో కమిటీ హాల్లో మంగళవారం జరిగిన పీఏసీ మూడో సమావేశం నుంచి బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎల్.రమణ వాకౌట్ చేశారు.అనంతరం బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున, అరికెపూడి గాంధీ పీఏసీ చైర్మన్ హోదాలో సమావేశం నడపడం సమంజసం కాదని ప్రశాంత్రెడ్డి అన్నారు. సంప్రదాయాలకు విరుద్ధంగా జరిగిన పీఏసీ చైర్మన్ నియామకాన్ని అంగీకరించేది లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అసెంబ్లీతోపాటు పీఏసీ భేటీలోనూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైకులు కట్ చేస్తున్నారని ఆరోపించారు. పీఏసీ చైర్మన్ పదవి నుంచి అరికెపూడిని తొలగించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. పీఏసీ చైర్మన్తోపాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని రమణ డిమాండ్ చేశారు.అధికారుల తీరుపై పీఏసీ అసంతృప్తివైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులపై పీఏసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఈ శాఖలపై సమీక్ష నిర్వహించారు. భేటీకి అధికారులు తగినంత సమాచారంతో రాకపోవడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తదుపరి సమావేశానికి పూర్తి సమాచారం ఇస్తామని అధికారులు తెలిపారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు పీఏసీ సభ్యులు పలు సూచనలు చేశారు. -
సీఎం రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి హరీశ్ రావు లేఖ
-
కాంగ్రెస్కు ‘గాడిద గుడ్డు’ మిగిలింది: హరీశ్రావు
సాక్షి,హైదరాబాద్:దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్కు గాడిద గుడ్డు మిగిలిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. శనివారం(ఫిబ్రవరి8) ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.రాహుల్గాంధీ, రేవంత్లు కలిసి ఢిల్లీలో బీజేపీకి విజయం కట్టబెట్టారన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీలను ప్రజలు నమ్మలేదన్నారు. రేవంత్రెడ్డి ఇక నుంచి తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేసిన తర్వాతే ఇక నుంచి ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేసుకోవాలని సూచించారు. -
హైదరాబాద్ : అర్జున్ టీవియస్ షోరూంను ప్రారంభించిన హరీశ్రావు (ఫొటోలు)
-
దరఖాస్తుల పేరిట సర్కారు దగా
సాక్షి, హైదరాబాద్/చిన్నకోడూరు (సిద్దిపేట): అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని పదేపదే చెప్పిన కాంగ్రెస్ పార్టీ .. ప్రజలను ముప్ప తిప్పలు పెడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. దరఖాస్తుల పేరిట దగా చేయడం మినహా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. అభయ హస్తం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని దుయ్యబట్టారు.ములుగు జిల్లా బుట్టాయిగూడెంలో కుమ్మరి నాగయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై హరీశ్రావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదనే ఆవేదనతో ములుగు జిల్లా బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య గ్రామ సభలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. నాగయ్య ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం. రోడ్డున పడ్డ నాగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. కాగా, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెల్కలపల్లి ప్రజలను భూ నిర్వాసితులుగా గుర్తించి ఆదుకోవాలని నీటిపారుదల మంత్రి ఉత్తమ్కు హరీశ్రావు గురువారం లేఖ రాశారు. -
‘ఎన్నికల యావ తప్ప చేసిందేంటి?.. నాగయ్య మృతి కాంగ్రెస్ పాపమే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన వారికి పథకాలు ఇవ్వకపోవడం వల్లే నాగయ్య చనిపోయాడని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే యావతో, ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరపకుండా, జాబితా విడుదల చేస్తూ ప్రజల్లో గందరగోళం రేపింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. తెలంగాణలో దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప, ఏడాది పాలనలో మీరు చేసిందేముంది? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా..‘లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ములుగు జిల్లా, బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య (నాగేశ్వర్ రావు) గారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖం చాటేస్తే, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పింది బీఆర్ఎస్ పార్టీ. నాగయ్యకు మంచి వైద్యం అందించి, ప్రాణాలు కాపాడేందుకు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రయత్నించింది. కానీ దురదృష్టవశాత్తు నాగయ్య ప్రాణాలు వదిలారు. తన చావుతోనైనా అర్హులైన పేదలకు పథకాలు ఇవ్వాలని అధికారులకు చెబుతూ పురుగుల మందు తాగి, ఆసుపత్రి పాలైన నాగయ్య దుస్థితికి ప్రభుత్వమే కారణం. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య.ఉన్నదాంతో కుటుంబాన్ని పోషిస్తూ జీవితం గడుపుతున్న నాగయ్య కుటుంబంలో గ్రామ సభల పేరిట నిప్పులు పోసింది కాంగ్రెస్ ప్రభుత్వం. భర్తను, తండ్రిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్న భార్య, ముగ్గురు ఆడబిడ్డలను ఎవరు ఆదుకోవాలి. పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే యావతో, ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరపకుండా, జాబితా విడుదల చేస్తూ ప్రజల్లో గందరగోళం రేపింది కాంగ్రెస్ పార్టీ.దీంతో పాటు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు అంటూ బాహాటంగా ప్రకటించడంతో గ్రామ సభల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పట్ల ప్రజల్లో ఆందోళన మొదలైంది. దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప, ఏడాది పాలనలో మీరు చేసిందేముంది. గ్రామ సభల సాక్షిగా తిరగబడ్డ జనం, ఎక్కడిక్కడ నిలదీసిన దృశ్యాలు.. మీ 14 నెలల పాలన వైఫల్యాన్ని ఎత్తి చూపాయి.లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ములుగు జిల్లా, బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య (నాగేశ్వర్ రావు) గారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజా…— Harish Rao Thanneeru (@BRSHarish) February 6, 2025వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం. రోడ్డున పడ్డ నాగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలారా.. ఆత్మహత్యలు పరిష్కారం కాదు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ పార్టీపై కొట్లాడుదాం. హక్కుగా రావాల్సిన పథకాలను సాధించుకుందాం. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నాం. -
రైతుభరోసాపై చేసింది గోరంత.. చెప్పుకునేది కొండంత
సాక్షి, హైదరాబాద్: రైతుభరోసా విషయంలో చేసింది గోరంత, చెప్పుకునేది కొండంత.. అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఈ ప్రభుత్వం రైతులందరికీ ఎకరాకు రూ.7,500 చొప్పున రైతుభరోసా ఇస్తామని ప్రకటించి దానిని రూ.6 వేలకు కుదించిందని బుధవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా విదిల్చి, ఇచ్చిన మాట మీద నిలబడ్డట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. రాష్ట్రంలో 68 లక్షల మంది రైతులుండగా ఇందులో 21,45,330 మందికి రైతు భరోసా ఇచ్చినట్లు చెప్తోంది. మరి మిగతా రైతుల పరిస్థితి ఏమిటి. 2023 వానాకాలానికి సంబంధించి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరం లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 22,55,181గా గుర్తించి రైతుబంధును ఇచ్చిoది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వీరి సంఖ్యను 21,45,330 మందిగా గుర్తించింది. అంటే ఎకరాలోపు భూమి ఉన్న 1,09,851 మంది రైతులకు కోత విధించింది’అని హరీశ్రావు అన్నారు. లక్ష మందికి పైగా రైతులకు ఎందుకు రైతు భరోసా లేకుండా చేసారో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి రైతులు, పేదల సంక్షేమం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ 14 నెలల పాలనలో 415 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదన్నారు. -
హరీష్ను అరెస్ట్ చేయొద్దు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నెల 12వరకు బీఆర్ఎస్ నేత హరీష్ రావును అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫోన్ ట్యాంపింగ్ ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్రావుపై మంగళవారం(డిసెంబర్3) కేసు నమోదైంది. తన ఫోన్ ట్యాప్ చేశారని బాచుపల్లికి చెందిన చక్రధర్గౌడ్ హరీశ్రావుపై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పంజాగుట్ట పోలీసులు హరీశ్రావుపై 120బి,386,409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీష్రావుతో పాటు టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావును కూడా పోలీసులు చేర్చడం గమనార్హం. ఆ ఎఫ్ఐఆర్పై హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని కోరారు. హరీష్ రావు పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు తదుపరి తీర్పు వచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని పోలీసులు సూచించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును పొడిగించింది. -
హైడ్రాతో రియల్ ఎస్టేట్ కుదేలు
కుత్బుల్లాపూర్: హైడ్రా ఏర్పాటుతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని.. బిల్డర్ వేణుగోపాల్రెడ్డి ఆత్మహత్య ప్రభుత్వ హత్యే అని మాజీ మంత్రి హరీశ్రావు ఆరో పించారు. అప్పుల బాధతో ఆత్మహత్మకు పాల్పడిన కొంపల్లికి చెందిన బిల్డర్ వేణుగోపాల్రెడ్డి కుటుంబసభ్యులను ఆదివారం ఆయన ఎమ్మెల్యే వివేకానందతో కలిసి పరామర్శించారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగం పెనుముప్పును ఎదుర్కొంటోందని, పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం, ఆపదలో ఉన్నవారు అమ్ముకుందామంటే ప్లాట్లు అమ్ముడుపోని దుస్థితి నెలకొందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం దేశానికే దిక్సూచిగా నిలిచిందని, నాటి సీఎం కేసీఆర్ హైదరా బాద్ను పెట్టుబడులకు స్వర్గధామంగా మారిస్తే, నేడు కాంగ్రెస్ పాలకుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను భయపెట్టే విధంగా హైడ్రా ఏర్పాటు చేయడంతో పెట్టుబడులు ముంబై, నోయిడా, బెంగళూరులకు తరలి పోతున్నాయని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి రియల్ఎస్టేట్ అంటే నాకు బాగా తెలుసు అని మాటల్లో చెప్పడం కాదు..మీరు వచ్చి వేణుగోపాల్రెడ్డి కుటుంబంతో మాట్లాడండి, వారి కష్టాన్ని అర్థం చేసుకోండి, భవిష్యత్లో మిగతా బిల్డర్లకు ఈ పరిస్థితి రాకుండా చర్యలు చేపట్టండని çహరీశ్రావు అన్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో అనుమతులు ఎందుకు ఆలస్యమవుతు న్నాయని ప్రశ్నించారు. సీఎం రియల్ ఎస్టేట్ రంగంపై సమీక్ష సమావేశం నిర్వహించి బిల్డర్లకు భరోసా కల్పించాలన్నారు. -
‘సుప్రీం’ తీర్పుతో తెలంగాణకు నష్టం
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ సీట్ల రిజర్వేషన్లలో 50 శాతం స్థానిక కోటా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ తీర్పుతో మెడికల్ కాలేజీల ఏర్పాటులో అగ్రగామిగా ఉన్న తెలంగాణలో స్థానిక విద్యార్థులు ఉన్నత వైద్య విద్యను చదివే అవకాశం కోల్పోతారని తెలిపారు. సుప్రీం తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ధర్మాసనాన్ని ఆశ్రయించాలని సూచించారు. కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలని గురువారం ఒక ప్రకటనలో కోరారు. ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ చొరవతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో వాటి సంఖ్య 34కు చేరింది. ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో పాటు పీజీ సీట్లలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలోని 2,924 పీజీ మెడికల్ సీట్లలో 50 శాతం స్థానిక రిజర్వేషన్ కింద 1,462 సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేవి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో అన్ని సీట్లు ఆల్ ఇండియా కోటాలోకి వెళ్తాయి. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కోబోతున్నారు. దక్షిణాది రాష్ట్రాలు గడిచిన 77 ఏండ్లుగా ప్రత్యేక దృష్టి సారించి వైద్య విద్యను ప్రోత్సహించాయి’అని హరీశ్రావు తెలిపారు. రిజర్వేషన్లు కూడా దెబ్బతినే ప్రమాదం సుప్రీంతీర్పు రిజర్వేషన్లను కూడా ప్రభావితం చేస్తుందని హరీశ్రావు అన్నారు. ‘ఈ తీర్పుతో రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కూడా దెబ్బతి నే ప్రమాదం ఉంది. పీజీలో ఇన్సర్వీస్ కోటా ప్రశ్నార్థకంగా మారి, గ్రామీణ ప్రాం తాల్లో వైద్య సేవలకు విఘాతం కలుగుతుంది. వైద్య సేవలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. పీజీ విద్యార్థులకు స్టైఫెండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ తీర్పుతో నష్టం జరుగుతుందని భావించిన తమిళనాడు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం కూ డా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్లి స్టే తీసుకురావాలి. అవసరమైతే దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా రాజ్యాంగ సవరణకు పట్టుబట్టాలి’అని హరీశ్ సూచించారు. -
సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్
-
తడి బట్టలతో గుడికి రా రేవంత్.. హరీష్ రావు సవాల్
సాక్షి, సిద్ధిపేట: మహబూబ్నగర్ పెండింగ్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదంటూ సీఎం రేవంత్ అబద్దాలాడుతున్నారని మాజీ మంత్రి హరీష్రావు మండిపడ్డారు. ఆదివారం ఆయన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం అభినందన సభలో మాట్లాడుతూ.. ‘‘దేవుడిపై నమ్మకం ఉంటే కురుమూర్తి ఆలయానికి రేవంత్ రావాలి.. తడి బట్టలతో నువ్వు, నేను గుడిలోకి వెళ్దాం’’ అంటూ హరీష్రావు సవాల్ విసిరారు. టీడీపీ పదేళ్లు, కాంగ్రెస్ హయాంలో పదేళ్ల పాటు ప్రాజెక్టులను పట్టించుకోలేదు. కొడంగల్లో ప్రశ్నించిన పాపానికి రైతులకు బేడీలు వేయించారు. ఆనాడు ఏ దరఖాస్తు లేకుండా కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేయలేదా? అంటూ హరీష్రావు ప్రశ్నించారు.‘‘11 విడతల్లో రూ.73 వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. 13 లక్షల మందికి లక్ష రూపాయల చొప్పున తిప్పలు పడకుండ కళ్యాణ లక్ష్మి ఇచ్చినం. ఏ దరఖాస్తు లేకుండా 57 ఏళ్లకే ఆసరా పెన్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్ది...ఎంత సేపు ప్రతిపక్షాలను తిట్టుడు.. కేసీఆర్ను తిట్టుడు తప్పా రేవంత్ రెడ్డికి పాలన చేతకాదు. అప్పుడేమో దేవుళ్ల మీద ఒట్టు పెట్టి ముక్కోటి దేవుళ్లను మోసం చేసిండు. ఈ రోజేమో గణతంత్ర దినోత్సవం సాక్షిగా అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి మళ్ళీ కొందరికే అని గణతంత్ర దినోత్సవం రోజున అంబేద్కర్ను కూడా మోసం చేసిండు’’ అంటూ హరీష్రావు ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: బండి సంజయ్ వ్యాఖ్యలపై కవిత ఫైర్ -
ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నారా?... బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆగ్రహం
-
ఒక్క చుక్కా తరలించలేదు
సాక్షి, హైదరాబాద్: ‘గోదావరి–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును ఏపీ నిర్మించి 200 టీఎంసీలు తరలించుకుపోతుంటే మేము మౌనంగా ఉన్నామని మాజీమంత్రి హరీశ్రావు పచ్చి అబద్ధాలు, అసత్యాలను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అసలా ప్రాజెక్టు నిర్మాణమే జరగలేదు. 200 టీఎంసీలు కాదుకదా ఒక్క చుక్కనీరు ఎవరూ తీసుకుపోలేదు’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. హరీశ్రావు చేసిన ఆరోపణలను ఖండిస్తూ శుక్రవారం రాత్రి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుకు నిధుల కోసం ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాస్తే ఆ లేఖను ఆమె కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్కు పంపించారని వివరించారు. ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమైన ఈ అక్రమ ప్రాజెక్టుకు నిధులు కేటాయించొద్దని కోరుతూ తాము నిర్మలా సీతారామన్, సీఆర్ పాటిల్కు ఇప్పటికే కౌంటర్ లేఖలు రాశామని స్పష్టం చేశారు. ‘ఈ అంశంపై అఖిలపక్షం పెట్టాలని అడగడానికి వారెవరు ? పిలవాలో లేదో మేము నిర్ణయం తీసుకుంటాం.. అబద్ధాలు మాట్లాడి పిలవమంటే ఎలా?’అని హరీశ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు కోలుకోలేని నష్టం.. ‘బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు నీటి కేటాయింపుల్లో అన్ని విధాలుగా తీవ్రమైన నష్టం జరిగింది’అని ఉత్తమ్ అన్నారు. ఆ నష్టాలను పూడ్చడానికి ప్రయత్నిస్తుంటే ఓర్వలేకనో అధికారం పోయిందనో అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రానికి కృష్ణా జలాల్లో 811 టీఎంసీల వాటా ఉండగా, తెలంగాణ ఏర్పడ్డాక 2015 జూన్ 18, 19న, అలాగే 2016 జూన్ 21, 22న కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశాలకు హాజరై తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల ఇచ్చుకోండి అని చెప్పి వచ్చారని తప్పుబట్టారు.అదే ఏడాది సెప్టెంబర్ 21న జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్తోపాటు ఆ తర్వాత జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి నాటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు హాజరై తెలంగాణకు 299 టీఎంసీలు చాలని ఒప్పుకొని సంతకం పెట్టి వచ్చారన్నారు. కృష్ణా ట్రిబ్యునల్–1 ప్రాజెక్టుల వారీగా కాకుండా గంపగుత్తగా కేటాయింపులు జరిపిందని, దీని ఆధారంగా మనకు ఎక్కువ వాటా అడగాల్సింది పోయి తక్కువ వాటా అడిగారన్నారని విమర్శించారు. క్యాచ్మెంట్ ఏరియా, జనాభా, సాగుకు యోగ్యమైన భూములు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని తెలంగాణకు కృష్ణా జలాల్లో 70 శాతం, ఏపీకి 30 శాతం కేటాయింపులు జరపాలని తాము కృష్ణా ట్రిబ్యునల్–2, కేఆర్ఎంబీతోపాటు సుప్రీం కోర్టులో పోరాడుతున్నామన్నారు. ‘రాయలసీమ’కు బీఆర్ఎస్ సహకారం ఏపీలోని ముచ్చుమర్రి ప్రాజెక్టు సామర్థ్యం బీఆర్ఎస్ హయాంలో 3,850 నుంచి 6,738 క్యూసెక్కులకు పెరిగినా నాటి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ నిశ్శబ్దంగా ఉన్నారని ఉత్తమ్ ఆరోపించారు. నాడు ఏపీ నిర్వహించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు సాఫీగా జరిగేలా, 2020 ఆగస్టు 5న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నాటి కేసీఆర్ ప్రభుత్వం వాయిదా వేయాలని కోరిందని తప్పుబట్టారు. రోజుకు 3 టీఎంసీలను తరలించడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టుతో మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తీవ్ర నష్టమన్నారు. కేసీఆర్ పాలనలోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 44,000 నుంచి 92,000 క్యూసెక్కులకు పెరిగిందని, హెచ్ఎన్ఎస్ఎస్, మల్యాల, ముచ్చుమర్రి నుంచి గతంలో కంటే ఎక్కువ నీటిని తీసుకెళ్లడం ప్రారంభమైందన్నారు. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం నుంచి రోజుకు 4.1 టీఎంసీలను తరలిస్తే గత ప్రభుత్వ హయాంలో 9.69 టీఎంసీకి పెరిగిందని ఆరోపించారు. -
నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది
-
గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే.. రేవంత్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సీఎం రేవంత్కు ఏపీని ఆపటం చేతకాకుంటే.. అఖిలపక్షాన్ని తీసుకుని పోవాలి. సీఎం రేవంత్ గురుదక్షిణ చెల్లించుకుంటున్నారన్న అనుమానం కలుగుతుందంటూ హరీష్రావు వ్యాఖ్యానించారు.బంకచర్ల ద్వారా 200 టీఎంసీలను ఏపీ తరలించుకుపోతుంటే.. రేవంత్ మౌనంగా ఉండటానికి కారణమేంటి?. ప్రాజక్ట్ నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి ఉత్తరాలు రాస్తున్నారు. ఏపీ, కర్ణాటకలు గోదావరి జలాలు తరలించుకుపోతే దావోస్, ఢిల్లీ యాత్రల్లో బిజీగా ఉన్నారు. గోదావరి నీటిని ఏపీ.. తుంగభద్ర నీళ్లను కర్ణాటక తరలించుకుపోతున్నాయి. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా నీటిని తరలించుకుపోతుంటే సీఎం, ఇరిగేషన్ మంత్రి ఎందుకు స్పందించరు?. ఇరిగేషన్ శాఖమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిల్. ఉత్తమ్కు చేతనైతే.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి’’ అంటూ హరీష్రావు డిమాండ్ చేశారు.‘‘హక్కుగా రావాల్సిన నీటిని కూడా 13 నెలలుగా తెలంగాణ ప్రభుత్వం సాధించలేకపోయింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 40వేల కోట్లు ఏపీకి ఇప్పిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. తుంగభద్ర నుంచి నీళ్లు రాకుండా కర్ణాటక అడ్డుకుంటోన్న సీఎం స్పందించటం లేదు.’’ అని హరీష్రావు పేర్కొన్నారు. -
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు
-
ఇవాల్టీ నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభం
-
‘అందుకే ఓడిపోయా’
సాక్షి,సంగారెడ్డి : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (jagga reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో సహా,ఏ నాయకుడైనా డబ్బులు తీసుకోండా పనిచేస్తున్నామని చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు. సంగారెడ్డిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత ఎన్నికల్లో నేను ఓడిపోవడానికి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావే (harish rao) కారణం. సిద్దిపేటలో గెలవడానికి హరీష్ ఎంత కష్టపడ్డారో, నన్ను ఓడగొట్టడానికి అంతే కష్టపడ్డారు. నా ప్లానింగ్ అంత హరీష్ భగ్నం చేశారు. పోలింగ్కు మూడు రోజుల ముందు జరగాల్సిన మీటింగ్ చేసుకొనివ్వకుండా హరీష్ వ్యూహం పన్నారు. రివేంజ్ పాలిటిక్స్ ఎవరు చేసిన మంచిది కాదు. తెలంగాణ ప్రజల రక్తంలో కక్ష సాధింపు గుణం ఉండదు. కక్ష సాధింపు చర్యలకు నేను వ్యతిరేకం. కాంగ్రెస్ నాయకులు రివేంజ్ పాలిటిక్స్ చేసినా మంచిది కాదు. నేను రాజకీయ యుద్ధం చేస్తాను. రివేంజ్ పాలిటిక్స్ చేయను. వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి రివేంజ్ పాలిటిక్స్ చేయలేదు. రివేంజ్ పాలిటిక్స్ చేసిన రాజకీయనాయకులు ఏదో ఒకరోజు బాధపడక తప్పదు.సంగారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నే ఫస్ట్ ప్రోటోకాల్. నా భార్య కార్పోరేషన్ ఛైర్మన్. ఆమె ప్రోటోకాల్ సెకండ్ ఉండాల్సిందే. 60 శాతం, 40 శాతంగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచిస్తా. నాతో సహా ఏ రాజకీయ నాయకుడైనా డబ్బు తీసుకోకుండా రాజకీయం చేస్తున్నామని చెప్పగలరా’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం, జగ్గారెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. -
కోతలపైనే సర్కారు దృష్టి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టకుండా, కోతలు విధించడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఆరు గ్యారంటీల హామీ తో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం వాటిని నిజాయితీగా అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. రేషన్ కార్డులు, వ్యవసాయ కూలీలకు భరోసా, రైతుబంధు, పేదల గృహ నిర్మాణ పథకాల్లో లబ్ధిదారుల సంఖ్యను భా రీగా కుదిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివా రం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, చింత ప్రభాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, పెద్ది సుదర్శన్రెడ్డి, పార్టీ నాయకుడు దేవీప్రసాద్తో కలసి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. రేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ ఈ సందర్భంగా హరీశ్రావు బహిరంగ లేఖను విడుదల చేశారు. ‘రేషన్కార్డు లబ్ధిదారుల ఎంపికను గ్రామాల్లో చేయకుండా, కులగణన సర్వే ఆధారంగా జాబితా తయారు చేశారు. గతంలో ప్రజాపాలనలో వచ్చిన 11 లక్షల దరఖాస్తులతో పాటు రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను చెత్తబుట్టలో వేశారు’అని ఆయన ధ్వజమెత్తారు. ఆదాయ పరిమితి పెంచాలి.. ‘పదేళ్ల క్రితం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదల ఆదాయ పరిమితిని పెంచి కొత్తగా 6.47 లక్షల రేషన్కార్డులు ఇచ్చాం. ఇప్పుడు కూడా పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ, ఆశ వర్కర్లు, ప్రైవేటు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, పేద వర్గాలకు లాభం జరిగేలా ఆదాయ పరిమితిని పెంచాలి. లేకుంటే అనేక కుటుంబాలు కొత్త రేషన్కార్డులకు అర్హత కోల్పోతాయి. అర్హులందరికీ రేషన్కార్డులు ఇవ్వకుంటే బీఆర్ఎస్ తరఫున నిలదీస్తాం. వ్యవసాయ కూలీలకు ఇచ్చే భరోసా విషయంలోనూ క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులను గుర్తించడం లేదు. 20 రోజుల పనిదినాలు అనే నిబంధనతో అర్హుల సంఖ్యను ఆరు లక్షలకు కుదించారు. రైతు రుణమాఫీలో రేవంత్ చేసిన మోసంతో ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారాన్ని ఆ రైతు కుటుంబానికి చెల్లించాలి’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. నెలలు గడిచినా వేతనాలేవీ.. ముఖ్యమంత్రి పాలనలో చిరుద్యోగులకు నెలల తరబడి వేతనాలు అందడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు ఒక ప్రకటనలో విమర్శించారు. చిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే మంత్రి సీతక్క రాజకీయం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారని హరీశ్రావు పేర్కొన్నారు. -
కేసీఆర్ హయాంలో అందరికీ న్యాయం జరిగింది
-
భట్టి విక్రమార్కకు హరీశ్రావు ఛాలెంజ్
సాక్షి,సంగారెడ్డి: కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఏమైందని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. సంగారెడ్డిలో హరీశ్రావు సోమవారం(జనవరి13) మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేతల ప్రభుత్వం.రూ.15వేలు రైతు భరోసా ఇస్తామని మోసం చేశారు. రుణమాఫీకి నవంబర్ 30న సీఎం రేవంత్ ఇచ్చిన చెక్కు ఏమైంది.వ్యవసాయ కూలీలకు రూ.15వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడేమో సెంటు భూమి ఉన్నా ఇవ్వబోమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎలా మోసం చేస్తోందో పండుగకు ఊళ్లకు వెళ్లేవారు రైతులకు చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలన్నీ మోసాలే. కాంగ్రెస్ మోసాలపై పోరాడాల్సిన సమయం వచ్చింది’అని హరీశ్రావు అన్నారు. భట్టి గోబెల్స్ను మించి పోతున్నారు: ఆయనకిదే నా ఛాలెంజ్..రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ రైతులను దగా చేస్తోందిసీఎం మాటలు కోటలు దాటుతున్నాయికానీ చేతలు గడప దాటడం లేదు2750 కోట్ల రూపాయలు చెక్కుని రుణమాఫీ కోసం నవంబర్ 30న సీఎం రేవంత్ ఇచ్చారుసీఎం రేవంత్ ఇచ్చిన చెక్కు డమ్మీది కావచ్చు..లేదా దారి తప్పిపోయిందా..?రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దగాని ప్రజలు గమనించాలికేసీఆర్ రైతుల కడుపులో సల్ల కదలకుండా చూసుకుంటే 13 నెలల్లో సీఎం రేవంత్ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాడుకాంగ్రెస్ పథకాల తీరు అయితే ఎగవేతలు లేకపోతే కోతలురైతులందరూ కలిసి ఉద్యమానికి సిద్ధం కావాలికాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి... మనకి రావాల్సిన పథకాలు తీసుకుందాంఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అంటే దళిత గిరిజన రైతుల పొట్ట కొట్టుడేనా..?కోటి మంది కూలీలు ఉంటే 10 లక్షల మందికే పథకాన్ని ఇస్తామని చెబుతున్నారుమాట తప్పినందుకు సీఎం రేవంత్ రైతులకు, కూలీలకు క్షమాపణ చెప్పాలిగ్రామసభలు పెడితే మీపై కూలీలు తిరగబడతారు జాగ్రత్తఎకరం లోపు భూమి ఉన్నవారిని కూడా కూలీలుగా గుర్తించి వారికి రూ. 12 వేలు ఇవ్వాల్సిందేఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క గోబెల్స్ ని మించిపోతున్నారుపూటకో తీరుగా ఆయన మాట్లాడుతున్నారునిన్న నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదు అని అంటున్నారుమేము మహబూబ్నగర్ జిల్లాలోనే 600 లక్షల ఎకరాలకు నిరిచ్చాంభట్టి వ్యాఖ్యలపై నేను బహిరంగ చర్చకు సిద్ధం...ఎక్కడికి రమ్మంటే అక్కడకు వస్తాఇదీ చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాలుగు కేసులు -
ఇదేనా రైతురాజ్యం: హరీష్రావు
సిద్దిపేట జిల్లా: తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు మరోసారి ధ్వజమెత్తారు. రైతులకు అది చేస్తా.. ఇది చేస్తాం అని రైతులను ముంచాడన్నారు. ఈరోజు(ఆదివారం) సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హరీష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘ తెలంగాణ సీఎం రేవంత్.. రైతులను ముంచుండు, మోసం చేసిండు, ఇదే విషయంలో కాంగ్రెస్ నాయకుల్ని గ్రామాల్లో నిలదీస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పిన హామీని కూడా నిలబెట్టుకోలేదు.. చర్చకు సిద్ధం.ఎకరాకు రూ. 9 వేలు ఎగబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎకరానికి రూ. 15 వేలు ఇచ్చే వరకూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయండి. రేవంత్రెడ్డి మూడు పంటలకు రైతుబంధు ఇస్తానని చెప్పి.. కౌలు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు.గొంతు మూగబోయింది. ఇదేనా రైతు రాజ్యం.. కౌలు రైతు రైతుబంధు ఎగబెట్టినందకుకు పాలాభిషేకం చేయాలా?, కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. ఎన్నికలు అప్పుడు మాటలు కోటలు దాటాయి.. ఇప్పుడు కోతలు పెడుతున్నారు. ఒక ఎకరం భూమి ఉన్నా వ్యవసాయ కూలీలుగా గుర్తించాలి. వారికి రూ. 12వేలు ఇవ్వాలి. ఐదు గంటలు ఉంటే వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం వర్తించక నష్టపోతున్నారు. ఇదేమీ పథకం. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఇలా చేస్తాడా, మట్టి పనికి పోయే ఒక కోటి మందికి వ్యవసాయ కూలీ పథకం ఇవ్వాలి. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రేవంత్రెడ్డి రుణమాఫీ అయిపోయిందని సంకలు గుద్దుకుంటున్నారు. దీనికి సమాధానం చెప్పాలి. కనపడ్డ దేవుళ్ల మీద ఒట్టు పెడితివి. లక్ష రుణమాఫీ ఉన్న రైతులకు కూడా కాలేదు. నారాయణ ఖేడ్ రైతు భీముని అంజయ్య రుణమాఫీ కాలేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రేవంత్రెడ్డిని అడిగితే గూండాలను నా ఇంటికి మీదకి పంపుతాడు. పంటల బీమా పథకం అటకెక్కింది. రూ. 15 వేల కోట్లు ఇంకా రుణమాఫీ పెండింగ్లో ఉంది. ఏ ముఖం పెట్టుకుని పాలాభిషేకం చేయమంటారు’ అని ప్రశ్నించారు హరీష్.అందుకే ఈ దాడులు..అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. అన్ని రంగాల్లో ప్రజలు దృష్టి మరల్చడానికి నా కార్యాలయం మీద, కేటీఆర్, అల్లు అర్జున్ మీద దాడులు చేస్తోంది. రేవంత్రెడ్డి హింస రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. శాంతి భద్రతల సమస్యను రేవంత్రెడ్డి సృష్టిస్తున్నారు. శాంతి భద్రతల సమస్యను రేవంత్ సృష్టిస్తున్నారు’ అని విమర్శించారు. -
టాలీవుడ్కి ఏఐ, వీఎఫ్ఎక్స్ టెక్నాలజీ చాలా అవసరం : హరీశ్ రావు
‘మన తెలుగు చిత్ర పరిశ్రమ బాలీవుడ్, హాలీవుడ్తో పోటీ పడుతుంది. రాబోయే కాలంలో హాలీవుడ్తో మరింత పోటీని ఎదుర్కొవాలంటే.. ఇలాంటి వీఎఫ్ఎక్స్, ఏఐ(AI) టెక్నాలజీ చాలా అవసరం. సినిమా బడ్జెట్ను తగ్గిస్తూ.. విజువల్ ఎఫెక్ట్స్ను పెంచుతూ ప్రేక్షకులు అట్రాక్ట్ చేయాలంటే ఈ టెక్నాలజీ అవసరం ఉంది’ అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. తాజాజా హైదరాబాద్లో కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ టెక్నాలజీ తమ నూతన బ్రాంచ్ను హైదరాబాద్లో లాంచ్ చేశారు డాక్టర్ మల్లీశ్వర్. ఈ వేడుక శుక్రవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్లో గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) , దర్శకులు శ్రీనువైట్ల , కరుణ కుమార్, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టర్ వందన , నటులు విక్రాంత్ రెడ్డి, రఘు కుంచె హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ వెంట పరుగెడుతుంది. అమెరికా నుంచి ఇండియా వచ్చి ఇది స్థాపించిన మల్లీశ్వర్ గారు ఇంకా ఎదగాలని, చిత్ర పరిశ్రమ ఎదుగుదలకు తనవంతు కృషి చేయాలని కోరుతున్నా. ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రానికి ఆస్కార్ వచ్చిందంటే తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వ కారణం. ఇలాంటి టెక్నాలజీని తెలుగు పరిశ్రమకు రావడం అభినందనీయం’ అని అన్నారు. దర్శకులు శ్రీనువైట్ల(Srinu Vaitla) మాట్లాడుతూ ‘మల్లీశ్వర్ గారు మంచి ఆలోచనతో వీఎఫ్ఎక్స్తో పాటు ఏఐ బ్రాంచ్ను ఇక్కడ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో తమ వంతుగా పాలుపంచుకోవడంతో పాటు అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం సంతోషంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఆయనకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ డైరెక్టర్ వందన గారు కల్పర వీఎఫ్ఎక్స్ టీమ్కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.దర్శకులు కరుణ కుమార్ మాట్లాడుతూ ‘తెలుగు సినీ ఇండస్ట్రీలో వీఎఫ్ఎక్స్కు చాలా ప్రాధాన్యత ఉంది. టెక్నికల్గా మంచి వారిని గుర్తించడం సమస్యగా మారిన ఈ తరుణంలో మల్లీశ్వర్ గారు ఈ కంపెనీ పెట్టడం హ్యాపీ. సరైన క్వాలిటీతో అనుకున్న టైమ్కి అవుట్పుట్ ఇవ్వగలగితే వారికి కాంపిటీషన్ ఉండదు. ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు. రఘు కుంచె మాట్లాడుతూ ‘కల్పర వీఎఫ్ఎక్స్ సంస్థ ద్వారా మల్లీశ్వర్ గారు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవ చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.హీరో విక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ ‘గత పదేళ్ల కాలంలో చిత్ర పరిశ్రమకు వీఎఫ్ఎక్స్ అవసరం బాగా పెరిగింది. వీఎఫ్ఎక్స్ లేని మూవీ అంటూ ఉండదు. టాలీవుడ్తో పాటు కోలీవుడ్, శాండిల్వుడ్, బాలీవుడ్ సహా ప్రతి సినీ పరిశ్రమకు మేజర్ సర్వీస్ అందిస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు. కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ సర్వీసెస్ సీఈవో డాక్టర్ మల్లీశ్వర్ గారు మాట్లాడుతూ ‘ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ వెరీ మచ్. యూఎస్లో నాకు ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఏఐ ద్వారా కొన్ని ప్రొడక్ట్స్ డెవలెప్ చేశాం. సినీ పరిశ్రమలోనూ అడుగుపెట్టాలని అనుకున్నాం. వీఎఫ్ఎక్స్కు ప్రాధాన్యత ఇచ్చే చిత్రాలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో ఇక్కడ బ్రాంచ్ను ఏర్పాటు చేస్తున్నాం. హాలీవుడ్లో వాడే టెక్నాలజీని ఇక్కడ కూడా పరిచయం చేస్తున్నాం. ఈ టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడుతుందో దర్శకులు రాజమౌళి గారు, నాగ్ అశ్విన్ గారికి తెలుసు. తక్కువ బడ్జెట్ సినిమాలకు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడాలని మేం అనుకున్నాం. టాలీవుడ్తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తమవంతు పాత్ర పోషిస్తాం. నా ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ’ అని అన్నారు. -
మరిన్ని పిచ్చి కేసులతో వేధిస్తారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పసలేని కేసులు నమోదు చేసి, పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేసినా ప్రజా సమస్యలను ఎత్తి చూపడంపైనే దృష్టి కేంద్రీకరించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పార్టీ నేతలను ఆదేశించారు. ‘ఫార్ములా ఈ– రేస్’కేసులో ఏసీబీ విచారణకు హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శుక్రవారం కేసీఆర్తో భేటీ అయ్యారు. గురువారం ఏసీబీ విచారణ అనంతరం నందినగర్ నివాసానికి వెళ్లిన కేటీఆర్, శుక్రవారం తన భార్యతో కలసి ఎర్రవల్లి నివాసానికి వెళ్లారు. మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మరో నేత కార్తీక్రెడ్డి కూడా కేసీఆర్తో జరిగిన ఈ భేటీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏసీబీ విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలు, తాను ఇచ్చిన సమాధానాలు, సమర్పించిన పత్రాలు.. తదితర అంశాలను ఈ సమావేశంలో కేటీఆర్ వివరించారు. ఇదిలా ఉండగా, ‘రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని పిచ్చి కేసులతో పార్టీ నేతలను ప్రభుత్వం వేధిస్తుంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని రేవంత్ పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒక గందరగోళం సృష్టించి స్థానిక సంస్థల గండం నుంచి బయట పడేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా జనంతో ఉంటే వారే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు’అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.ఏడాదిలోనే కాంగ్రెస్ తేలిపోయింది‘అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే కాంగ్రెస్ ప్రభుత్వం తేలిపోయింది. ఉన్న పథకాలు అమలు చేయలేక, కొత్త పథకాలు తెచ్చే తెలివిలేక ప్రభుత్వం చేతులెత్తేసింది’అని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. ఎన్నికల హామీలేవీ అమలు చేసే పరిస్థితి లేదని ప్రజలకు అర్థమైందని, గతంలో మనం చేసిన మంచితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చెడును కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బీఆర్ఎస్పై ఉందని ఆయన అన్నట్లు్ల సమాచారం. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన రీతిలో పనిచేస్తే ఫలితాలు మనకే అనుకూలంగా ఉంటాయి. పండుగ తర్వాత దృష్టి అంతా పార్టీ నిర్మాణం, బలోపేతంపైనే ఉంటుంది’అని కేసీఆర్ పేర్కొన్నారు. -
హరీష్ను అరెస్ట్ చేయొద్దు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ టాపింగ్ కేసులో హైకోర్టు విచారణ జరిపింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దీంతో పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ హరీష్రావు హైకోర్టును ఆశ్రయించారు.పోలీసులు దర్యాప్తు, అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హరీష్రావు కోరారు. గత విచారణ సందర్భంగా హరీష్ రావును అరెస్ట్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిన హైకోర్టు.. ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. చక్రధర్ గౌడ్ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 28వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు.. అప్పటి వరకు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది.ఇదీ చదవండి: Telangana: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ -
రేవంత్.. టికెట్ల రేటు పెంపు ఎవరి కోసం?: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి.. రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారని ఎద్దేవా చేశారు. సినిమా టికెట్ రేట్ల పెంపునకు ఎలా అనుమతి ఇచ్చారు? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు ట్విట్టర్ వేదికగా..‘ఒక మహిళ మృతి చెందారు, ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారు. టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు సైతం స్వల్ప వ్యవధిలోనే నీటి మూటలు అయ్యాయి.అసెంబ్లీలో ప్రకటించిన దానికే విలువ లేకపోతే ఎట్లా ? అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టిస్తూ టికెట్ రేట్లు, అదనపు షోలకు అనుమతి ఇవ్వడం సభను అవమానించడమే. అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు ముఖ్యమంత్రి, మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన కింద ప్రివిలేజ్ మోషన్ పెడతాను. మాట తప్పం , మడమ తిప్పం అంటూ బీరాలు పలికి ఇప్పుడు టికెట్ రేట్ల పెంపునకు ఎలా అనుమతి ఇచ్చారు? ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?గతంలో మీరు బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వడం వల్లే ఒక మహిళ మృతి చెందారు, మరో పసివాడు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ పాపం మీ ప్రభుత్వానిదే కదా రేవంత్ రెడ్డి. ఆ దురదృష్ట ఘటనను మరిచిపోకముందే ఎందుకు ఈ యూటర్న్?. దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి? అని ప్రశ్నల వర్షం కురిపించారు.ఒక మహిళ మృతి చెందారు, ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారు.టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మరో మంత్రి… pic.twitter.com/hO1Q7ELAWE— Harish Rao Thanneeru (@BRSHarish) January 10, 2025 -
హరీష్రావు క్వాష్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు క్వాష్ పిటిషన్పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని హరీష్ రావు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్పై నేడు విచారణ చేపట్టనున్నారు.కాగా, తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చక్రాధర్ గౌడ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేసి హరీశ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో హరీష్రావు.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.పలుకుబడి ఉన్న నేత కావడంతో హరీశ్ రావు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు కోర్టులో అభిప్రాయపడ్డారు. ఆయనను అదుపులోకి తీసుకొని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో అదుపులోకి తీసుకొని విచారించాలని పోలీసుల కౌంటర్ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనకు సంబంధించి హైకోర్టు కీలకమైన తీర్పు ఇవ్వనుంది. అవన్నీ అబద్ధారోపణలని, తనకు రాజకీయంగా నష్టం కలిగించేందుకే ఈ కేసు చేశారని హరీశ్ రావు తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఆరోపణల వల్ల తన వ్యక్తిత్వానికి, ప్రజా సేవకు మచ్చ తగలకుండా కోర్టు న్యాయం చేయాలని కోరారు. తన ఫోన్ ట్యాపింగ్కు ఎలాంటి ఆధారాలు లేవని, కేసును కొట్టివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు.ఇక, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావును అరెస్ట్ చేయవద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని కోర్టును కోరారు. దీంతో, నేడు మరోసారి క్వాష్ పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. హైకోర్టులో జరగనున్న విచారణపై రాష్ట్ర రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ కేసులో హైకోర్టు తీసుకునే నిర్ణయం హరీష్ రావు రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. -
కింగ్ ఫిషర్ బీర్ల నిలిపివేత.. అందుకేనా?: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీర్ల అమ్మకాలు నిలిపివేయడానికి యునైటెడ్ బ్రూవరీస్(UB) తీసుకున్న నిర్ణయం పలు ప్రశ్నలు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అనుమానం వ్యక్తం చేశారు. బీర్లకు సంబంధించి యునైటెడ్ బ్రూవరీస్ ప్రకటనపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.బీర్లకు సంబంధించిన బకాయిలను బెవరేజెస్ కార్పొరేషన్(TGBCL) చెల్లించలేదని యునైటెడ్ బ్రూవరీస్ పేర్కొందన్న హరీష్ రావు.. దీంతో రాష్ట్రంలో కింగ్ ఫిషర్, హినెకెన్ వంటి ప్రీమియం బ్రాండ్ల లభ్యతకు అంతరాయం కలుగుతుందని భావిస్తున్నారని చెప్పారు.బూమ్ బూమ్, బిర్యానీ వంటి స్థానిక బ్రాండ్ల బీర్లను ప్రోత్సహించేందుకు ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నమా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. బిల్లుల చెల్లింపులో వరుస క్రమాన్ని కాకుండా ప్రత్యేక ప్రాధాన్యతల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందా అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: తెలంగాణకు కింగ్ఫిషర్ బీర్లు బంద్ -
కేటీఆర్ కేసుపై న్యాయ పోరాటం సాగిస్తాం: హరీశ్ రావు
-
కేటీఆర్ తప్పు చేయలేదు కాబట్టే విచారణకు వెళ్లారు
-
కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకొస్తారు: హరీష్రావు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేస్ కేసులో తనపై ఏసీబీ(ACB) దాఖలు చేసిన కేసును కొట్టేయాలన్న ఆయన అభ్యర్థనను ఉన్నతన్యాయస్థానం కొట్టేసింది. ఈ పరిణామంపై తెలంగాణ రాజకీయ వర్గాలు స్పందిస్తున్నాయి.హైకోర్టు తీర్పు అనంతరం నందినగర్లోని కేటీఆర్ నివాసం వద్ద బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్రావు మీడియాతో మాట్లాడారు. ‘‘రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్(Diversion Politics), కక్ష సాధింపు చర్యలు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ తరహా రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్పై అక్రమ కేసు పెట్టారు. ఫార్ములా ఈ రేస్ కేసు వల్ల తెలంగాణకు మంచే జరిగింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం కేటీఆర్ కష్టపడ్డారు. ఈ వ్యవహారంలో అవినీతికి ఆస్కారమే లేదు. న్యాయ స్థానాలు, చట్టంపై గౌరవం ఉంది. కేటీఆర్ ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే కేటీఆర్ విచారణకు సహకరిస్తానన్నారు. ఏసీబీ విచారణకు వెళ్తే.. 40 నిమిషాలు బయట నిల్చొబెట్టారు. అయినా ఆయన ఓపికగా వ్యవహరించారు. తిరిగి 9వ తేదీన విచారణకు రమ్మన్నారు. ఆ రోజు కూడా ఆయన విచారణకు హాజరవుతారు. ఇది కుట్రపూరితమైన కేసు. మేం సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకు వస్తారు. మా పార్టీ వాళ్లపై రేవంత్ రెడ్డి ఇంకా కేసులు పెట్టొచ్చు. కానీ, మేం అధైర్య పడం. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరఫున పోరాడతాం. రేవంత్ అక్రమాలకు ప్రశ్నిస్తూనే ఉంటాం.హైకోర్టు తీర్పు కాపీ ఇంకా అందలేదు. అది వచ్చాక ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటాం. సోషల్ మీడియాలో హైకోర్టు తీర్పుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్ను విచారణ జరపమని మాత్రమే హైకోర్టు చెప్పింది. అసలు విచారణే ప్రారంభం కానప్పుడు.. ఇది తప్పుడు కేసు ఎలా అవుతుంది. కేటీఆర్కు శిక్ష పడుతుందంటూ బోగస్ వార్తలు ప్రచురిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు అవి మానుకుంటే మంచిది’’ అని హరీష్ అన్నారు.👉కేటీఆర్ యాక్టింగ్ చూసి సినిమా వాల్లే ఆశ్చర్యపోతున్నారు. జైలు కు పోవడానికి సిద్దం అని..ఇప్పుడు ఈ దొంగ నాటకాలు ఎందుకు.ఈ ఫార్ములా కేసు ను లొట్టపీసు కేసు అన్నది కేటీఆర్ కాదా?. జైలు కు పోయి యోగా చేస్తా అన్నది కేటీఆర్ కాదా?. తప్పే చేయలేదు , సుద్దపూస అని ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ కు చట్టం తెలియదా? అడ్వకేట్ లతో ఏసీబీ ఆఫీస్ కు ఎలా వెళ్తారు?. కోర్టు పర్మిషన్ లేకుండా అడ్వకేట్ లను ఏసీబీ అనుమతించదని తెలియదా?:::బల్మూరి వెంకట్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ👉కేటీఆర్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఫార్ములా ఈ రేసు.. మనీ లాండరింగ్ కేసులాగా అనిపిస్తోంది. ప్రభుత్వంలో ఉంటే ఏ తప్పైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటే.:::వీహెచ్, మాజీ ఎంపీ -
కాంగ్రెస్ మోసానికి పరాకాష్ట
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా పేరుతో ఏటా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఆశచూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రైతులను దారుణంగా మోసం చేసిందని బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘శనివారం సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం రైతుల ఆశలను అడియాశలు చేసింది. రైతు భరోసా పథకాన్ని రైతు గుండె కోతగా మార్చారు. రైతు భరోసా కింద ఎకరానికి ప్రతి సీజన్లో రూ.7,500 చొప్పున ఇస్తామని చెప్పి.. ఇప్పుడు రూ.6 వేలకు కుదించారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది పరాకాష్ట. మోసానికి పర్యాయపదం రేవంత్రెడ్డి అనే విషయం నగ్నంగా బయటపడింది’అని హరీశ్రావు మండిపడ్డారు. కేబినెట్లో కౌలు రైతుల ఊసేలేదు కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా గుండెకోత మిగిల్చిందని హరీశ్రావు ఆరోపించారు. ‘కౌలు రైతులకు కూడా రెండు వ్యవసాయ సీజన్లలో కలిపి ఎకరా కు రూ. 15 వేలు పంట పెట్టుబడి సహాయం అందిస్తా మని కాంగ్రెస్ ప్రమాణం చేసింది. కానీ తాజా కేబినెట్ సమావేశంలో ఈ అంశమే చర్చించలేదు. కౌలు రైతులకు గుండె కోత కలిగిస్తూ దారుణంగా ధోకా చేశారు. తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించదు. తగిన సమయంలో బుద్ధి చెబుతారు’అని హెచ్చరించారు. -
సీఎం రేవంత్కు పాస్ మార్కులు కూడా రాలే!
సాక్షి, హైదరాబాద్ /సిద్దిపేట అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై ఎన్ని సంస్థలు సర్వేలు చేసినా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పాస్ మార్కులు కూడా రావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎ మ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా చేశారు. గ్యారంటీల అ మలుకు బదులుగా ప్రభుత్వం గారడీ విన్యాసా లు చేస్తోందని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ‘డిక్లరేషన్ల అమలుకు బదులుగా డైవర్షన్ రా జకీయాలు చేస్తూ, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారు. పంటలకు బోనస్ అంటూ ఇప్పడు బోగ స్ మాటలు చెప్తున్నారు. లబి్ధదారులకు ప్రభుత్వం ఇస్తున్న చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. బీఆర్ఎస్ నేతలపై క్షణాల్లో కేసులు నమోదు చేస్తూ, కాంగ్రెస్ నేతలపై వచ్చే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు. విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా సీఎం ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను వక్రమార్గం పట్టిస్తూ.. అయితే లూటీ లేకుంటే లాఠీ అన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారు. ఏడాదిలో కాంగ్రెస్, బీజేపీ స్నేహం మరింత బలపడింది’ అని హరీశ్రావు విమర్శించారు. పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఆరు వేల మంది రిసోర్స్ పర్సన్ల కు ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదని మండిపడ్డారు. వారి పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు బట్టలు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకొని అమలు చేయలేక విఫలమవుతోందని హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లిలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో మంగళవారం ఆయన విద్యార్థులకు దుప్పట్లు, టీషర్టు లు పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి చెప్పిన మెనూకు.. హాస్టళ్లలో అమలవుతున్న మెనూకు సంబంధమే లేదని అన్నారు. పిల్లలకు ఇప్పటివరకు కనీసం బట్టలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వంతో మాట్లాడి పెండింగ్ మెస్ బిల్లులు, కాస్మొటిక్ ఛార్జీలు ఇప్పిస్తానని, మంచిగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. పదో తరగతిలో 10 జీపీఏ సాధించినవారికి తన సొంత ఖర్చులతో ఐప్యాడ్లు అందజేస్తానని, మెడిసిన్ చదివిస్తానని హామీ ఇచ్చారు. -
స్పీకర్ Vs హరీష్ రావు.. దద్దరిల్లిన అసెంబ్లీ
-
మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి: హరీశ్ రావు
-
మహిళలు, బాలికలపై దాడులు పెరగడం సిగ్గుచేటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్రావు ఆదివారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. వారిపై గతంలోకంటే ఇప్పుడు దాడులు పెరిగా యని పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాల రేటు 22.5 శాతం పెరిగిందన్నారు. అత్యాచార కేసులు 28.94 శాతం పెరిగాయని, ఏడాదిలో మొత్తం 2,945 కేసు లు నమోదయ్యాయని వివరించారు.మహిళలపై అఘా యిత్యాలకు సంబంధించి రాష్ట్రంలో రోజుకు సగటున 8 కేసు లు నమోదవుతున్నాయని, ఇందులో 82 శాతం మైనర్ బాలి కల అపహరణ కేసులు నమోదవడం సిగ్గుచేటని అన్నారు. ఇవన్నీ గమనిస్తే.. కాంగ్రెస్ పాలనలో మహిళలకు భద్రత లేదని స్పష్టమవుతోందని, ప్రజా భద్రత పూర్తిగా దిగజారిందని ఆయన ధ్వజమెత్తారు. అంబర్పేటలో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గంగారెడ్డి, ఆయన భార్య హత్య (నాలుగు నెలల క్రితం) కేసు ఇంకా పరి ష్కారం కాలేదని, ఆర్నెల్లక్రితం హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్రెడ్డి కేసులో కూడా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.రాష్ట్రంలో 163కి పైగా ప్రధాన కేసులు ఇప్పటికీ పరిష్కారం కాలేదని, రూ.10 కోట్ల విలువైన ఆర్థిక మోసాలకు సంబంధించి రికవరీ జరగలేదని ఆక్షేపించారు. రాష్ట్రంలో నేరాల గుర్తింపు రేటు 31 శాతంగా ఉందని, ఈ విషయంలో బిహార్లాంటి రాష్ట్రాలతో పోటీపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు గోల్డెన్ పీరియడ్ స మయాన్ని వృథా చేయడం వల్ల బాధితులకు న్యాయం జర గడం లేదని పేర్కొన్నారు. నిందితులు స్వేచ్ఛగా తిరుగు తున్న పరిస్థితి పోలీసుల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. హోంశాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనా వైఫల్యం వల్ల తెలంగాణ పోలీసులకు ఉన్న మంచి నైపుణ్యాన్ని, శక్తిని కోల్పోతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడానికి సీఎం రేవంత్రెడ్డే కారణమని హరీశ్రావు అన్నారు.కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు బతికితే చాలనుకుంటున్నారు: మాజీ మంత్రి హరీశ్రావు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో పిల్లలు ప్రాణాలతో బతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆదివారం ఒక ప్రకటనలో అన్నారు. గురుకులాలు, కేజీబీవీలు, హాస్టళ్లలో పెడుతున్న బువ్వ తమ కొద్దని, ఇక్కడ తాము ఉండలేమంటూ విద్యార్థులు తల్లిదండ్రులను వేడుకుంటున్నారని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురుకులాల దీనస్థితి చూస్తే బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతోందన్నారు.అనంతపేట్ కేజీబీవీలో విషాహారం తిని పదిమంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన దుస్థితి బాధాకరమని, విషాహారం తిని వాంకిడి గురుకుల విద్యారి్థని మరణించిన ఘటన మరువకముందే ఇలాంటివి పునరావృతం కావడం సిగ్గుచేటని హరీశ్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న పోలీసుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై, కానిస్టేబుల్, సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్.. ఇలా స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. పని ఒత్తిడి, పెండింగ్ హామీలను తీర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే పోలీసులపై తీవ్ర ప్రభావం పడుతోందని హరీశ్రావు తెలిపారు. -
పోలీసుల మరణ మృదంగం.. సర్కార్కి పట్టింపు లేదా?: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: పోలీసుల మరణ మృదంగం.. ప్రభుత్వానికి పట్టింపు లేదా? అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు మండిపడ్డారు. ఎక్స్ వేదికగా రేవంత్ సర్కార్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ములుగు జిల్లాలో ఎస్ఐ, సిద్ధిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్ఐ, కానిస్టేబుల్, ఈ రోజు సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్.. వీరంతా స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ పోలీసులు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే వరసగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శాంతి భద్రతలు పరిరక్షించవలసిన రక్షకుల జీవితాలకే రక్షణ కరువైంది.’’ అని హరీష్రావు ట్వీట్ చేశారు.పని ఒత్తిళ్లు, పెండింగ్ హామీలను తీర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోలీసులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ ఆత్మహత్యలపై నిజానిజాలు వెలుగులోకి రావడానికి శాఖాపరమైన దర్యాప్తు చేయాలని డీజీపీని కోరుతున్నా. పోలీసుల్లో ఆత్మహత్యల ఆలోచనలు రాకుండా సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని హరీష్రావు పేర్కొన్నారు.ఇదీ చదవండి: తెలంగాణలో పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ‘‘పోలీస్ మిత్రులారా.. సమస్యలు ఏవైనప్పటికీ ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ఎంతో కష్టపడి ఈ ఉద్యోగాలు సాధించారు. మీ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి. విలువైన జీవితాలను కోల్పోకండి. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన మీరు ఆత్మస్థైర్యంతో విధులు నిర్వహిస్తేనే సమాజానికి భద్రత.’’ అంటూ హరీష్రావు సూచించారు.పోలీసుల మరణ మృదంగం.. ప్రభుత్వానికి పట్టింపు లేదా ? ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై , కానిస్టేబుల్, ఈ రోజు సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్... వీరంతా స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ పోలీసులు.…— Harish Rao Thanneeru (@BRSHarish) December 29, 2024 -
అందుకే రాజకీయాలు మాట్లాడాల్సి వస్తోంది.. రేవంత్కు హరీష్రావు సూటి ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతల బృందం పరామర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా హరీష్రావు మీడియాతో మాట్లాడుతూ గాయపడిన శ్రీతేజ్ను కేసీఆర్ సూచనతో బీఆర్ఎస్ నేతలం పరామర్శించామని తెలిపారు.‘‘శ్రీతేజ్ కోలుకుంటున్నారు.. వైద్యానికి స్పందిస్తున్నాడు. స్పర్శ కూడా మెరుగైందని డాక్టర్లు చెబుతున్నారు. భగవంతుడి దీవెనలతో శ్రీతేజ్ కోలుకుని మళ్లీ మామూలు మనిషిలా బయటకు రావాలని కోరుకుంటున్నాం. కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం భాస్కర్ రావు నేతృత్వంలో శ్రీతేజ్కు మంచి వైద్యాన్ని అందిస్తోంది. తొక్కిసలాటలో మరణించిన రేవతికి మా ప్రగాఢ సానుభూతి. తాను మరణిస్తున్నా కొడుకు శ్రీ తేజ్ను రక్షించుకోవడానికి రేవతి పడ్డ తపన మనం చూశాo. రేవతి అందరి మనసును కరిగేలా చేసింది’’ అని హరీష్రావు పేర్కొన్నారు.‘‘ఇక్కడ రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదు. ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ నెపాన్ని నెడుతున్నపుడు రాజకీయాలు మాట్లాడలేక ఉండని పరిస్థితి. సంధ్య థియేటర్ ఘటన జరిగిన పది రోజులకు సీఎం, మంత్రులు స్పందించారు. గురుకులాల్లో చనిపోతున్న పిల్లల కుటుంబాలను రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గం ఎందుకు పరామర్శించలేదు. గురుకులాల పిల్లల మాతృ మూర్తుల శోకాన్ని సీఎం ఎందుకు గుర్తించడం లేదు. చట్టం అందరికీ సమానమే అంటున్న సీఎం రేవంత్ కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు..సాయిరెడ్డి రాసిన ఆత్మహత్య లేఖలో ఉన్న తన సోదరులపై రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోరు?. రేవంత్ రెడ్డి సోదరులను కనీసం పోలీస్ స్టేషన్కు కూడా పిలవరా?. సినీ ఇండస్ట్రీ రాష్ట్ర ప్రభుత్వం చర్చల గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో అందరికీ తెలుసు.. ప్రేమానురాగాలతో మనసులు గెలవాలి కానీ భయాందోళనలు సృష్టించి కాదు. రాష్ట్రానికి మంచి జరిగితే అందరం హర్షించాలి’’ అని హరీష్రావు చెప్పారు. -
కాంగ్రెస్ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ.. రాక్షస పాలన కొనసాగిస్తున్నారని కాంగ్రెస్పై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇది ఇందిరమ్మ రాజ్యమా? లేక పోలీస్ రాజ్యమా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని ఆరోపించారు.మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా..‘ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా?. అడిగితే అరెస్టులు.. ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే బెదిరింపులు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం పూర్తిగా అప్రజాస్వామికం.ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. సెలవు రోజుల్లో కావాలని మా నేతలను అరెస్ట్ చేస్తూ, సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారు. హోం మంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైన రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే దృష్టి పెట్టారు. ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదు. సీఎం రేవంత్ రెడ్డి, మీ పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడే వారు మేము కాదని గుర్తుంచుకోండి. తెలంగాణ సమాజమే మీకు తగిన బుద్ధి చెబుతుంది అంటూ కామెంట్స్ చేశారు. ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా?అడిగితే అరెస్టులు..ప్రశ్నిస్తే కేసులు..నిలదీస్తే బెదిరింపులు...బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి…— Harish Rao Thanneeru (@BRSHarish) December 26, 2024 -
అల్లు అర్జున్ నోటీసులపై హరీష్ రావు రియాక్షన్
-
అల్లు అర్జున్ కేసు..హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: సినీ హీరో అల్లు అర్జున్(AlluArjun)ను సీఎం రేవంత్రెడ్డి(Revanthreddy) పర్సనల్గా టార్గెట్ చేస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్రావు(Harishrao) ఆరోపించారు. ఈ విషయమై హరీశ్రావు మంగళవారం(డిసెంబర్ 24) మీడియాతో మాట్లాడారు.‘రేవంత్రెడ్డి సొంత అన్న టార్చర్ వల్ల ఒక రైతు సూసైడ్ చేసుకుంటే ఇప్పటి వరకు దానిపై కనీసం కేసు నమోదు కాలేదు. రాష్ట్రంలో 50 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే,రేవంత్ రెడ్డి కనీసం దాని మీద మాట్లాడలేదు. 500 మంది రైతులు, 80 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే మాట్లాడటానికి రేవంత్రెడ్డికి సమయం లేదు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీని టార్గెట్ చేయడానికి మాత్రం సమయం ఉంది’అని హరీశ్రావు అన్నారు.కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లుఅర్జున్కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల సీఎం రేవంత్ అసెంబ్లీలో ఈ కేసు విషయమై చేసిన వ్యాఖ్యలకు అల్లు అర్జున్ ప్రెస్మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. అనంతరం మంగళవారం అల్లు అర్జున్ను పోలీసులు చిక్కడపల్లి పోలీస్స్టేషన్లో విచారించారు. ఇదీ చదవండి: కేసీఆర్,హరీశ్రావులకు హైకోర్టులో ఊరట -
తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు క్వాష్ పిటిషన్లు
సాక్షి,హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్,మాజీ మంత్రి హరీష్ రావులు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ భూపాలపల్లి కోర్టు పంపిన నోటీసుల్ని కొట్టివేయాలని కోరారు.మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ గతంలో భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన కోర్టు ఈ ఏడాది జులై 10న కేసీఆర్, హరీశ్రావుకు నోటీసులు పంపింది. అయితే, ఈ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో కేసీఆర్, హరీష్రావు తాజాగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. -
కాంగ్రెస్ నేతలను తొక్కుకుంటూ సీఎంగా రేవంత్: హరీష్ రావు
సాక్షి, వరంగల్: తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను తొక్కుకుంటూ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ముఖ్యమంత్రి అయ్యారని సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడమే కాంగ్రెస్(Congress) ప్రభుత్వం పనిగా పెట్టుకుందని తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ హయాంలో తలపెట్టిన ఆసుపత్రుల నిర్మాణాలపై సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) వరంగల్లో మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. అన్నీ డిపార్ట్మెంట్సలో పేదలకు అందుబాటులో ఉండాలని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టాం. గతంలో నేను వచ్చినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అలాగే ఉంది. భవన నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదు. ఒక కార్పొరేట్ ఆసుపత్రి వైద్యం పేదలకు అందాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు. ఉత్తర తెలంగాణ పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా 2000 పడకల ఆస్పత్రికి శ్రీకారం చుట్టారు.ఈ ఆసుపత్రి నిర్మాణం.. 2024 జూన్ వరకు రెడీ కావాలని ప్రతిపాదనలు చేశాం. ఇప్పుడూ ఎలా ఉందో చూస్తున్నాం. పేదలకు సరైన వైద్యం అందడం లేదు. వరంగల్ జిల్లాలో హైటెక్ టవర్లో వైద్య సేవలకు ఆస్పత్రి నిర్మాణం చేపట్టాం. 14వ ఫ్లోర్లో హాస్పిటల్, 10 ఫ్లోర్లో అడ్మినిస్ట్రేషన్ ఉండేలా ప్లాన్ చేశాం. మన ఆసుపత్రి ఎత్తు 91 మీటర్లు. ఇక్కడ గుండె, కిడ్నీ, లివర్, క్యాన్సర్కు అత్యాధునిక టెక్నాలజీతో వైద్యం అందించాలనుకున్నాం. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది కాలం ఓపిక పట్టాం. ఎలాంటి అభివృద్ధి లేదు. వెంటనే ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి.తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్న పథకాలను నిలిపేశారు. కొత్త పథకాలు ఇవ్వడం లేదు. ఆరు గ్యారెంటీలకు గ్యారెంటీ లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంది అంటూ ఆరోపించారు. -
అల్లు అర్జున్ పై కాదు..ప్రజలపై దృష్టి పెట్టు..
-
సీఎం రేవంత్రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారు: Harish Rao
-
రుణమాఫీపై సీఎం రేవంత్తో చర్చకు సిద్ధం: హరీష్రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో తాను చర్చకు సిద్ధంగా ఉన్ననాని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు సవాల్ విసిరారు. అసెంబ్లీలో సీఎం చేసిన ప్రసంగంలో అన్నీ అబద్ధాలే చెప్పారని, అబద్ధాల్లో ఆయన గిన్నిస్బుక్లోకి ఎక్కుతారని ఎద్దేవా చేశారు హరీష్.రుణమాఫీ, రైతు భరోసా, బోనస్లపై క్లారిటీ ఇవ్వలేదని, ఏడాది దాటినా రుణమాఫీ పూర్తి చేయలేదని విమర్శించారు. ఇక సంద్య థియేటర్ ఘటన చాలా బాధాకరమన్న హరీష్.. వాంకిడి హాస్టల్లో విషాహారం తిని బాలిక చనిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ సమయంలో బాలిక కుటుంబాన్ని ఎవరూ పరామర్శించలేదన్నారు. ఒక వ్యక్తి సీఎం సోదరుడి కారణంగా చనిపోతే చర్యలు మాత్రం శూన్యమని మండిపడ్డారు హరీష్.సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్అల్లు అర్జున్పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు -
అసెంబ్లీలో రేవంత్వన్నీ అబద్ధాలే
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా – ఈ కార్ రేస్ అంశంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో హైకోర్టు ఇచి్చన తీర్పుతో తొలి అడుగులోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నైతిక విజయం సాధించారని ఆ పార్టీ నేత హరీశ్రావు అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు, గోబెల్స్ ప్రచారమని హైకోర్టు తీర్పుతో స్పష్టమైందని తెలిపారు. రేస్ నిర్వహణ సంస్థకు ప్రభుత్వం రూ.47 కోట్లు చెల్లిస్తే.. రూ.600 కోట్లు నష్టం అంటూ సీఎం అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. రేవంత్ తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రానికి రూ.700 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు.తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ అబద్ధాలతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశారని విమర్శించారు. ఫార్ములా – ఈ రేస్ అంశంలో ప్రొసీజర్ ల్యాప్స్ జరిగి ఉండవచ్చు కానీ అక్రమాలు జరగలేదని స్పష్టంచేశారు. ప్రశ్నిస్తే అరెస్టులు, నిర్బంధాలు కాంగ్రెస్ చేతికి అధికారం వచ్చి ఏడాదైనా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని హరీశ్రావు అన్నారు. ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, నిర్బంధాలతో ప్రభుత్వం అణచివేస్తోందని విమర్శించారు. ‘సీఎం రేవంత్, ఆయన సోదరులు, అల్లుడు, బావమరిది అవినీతి బండారాన్ని కేటీఆర్ క్రమ పద్ధతిలో బయట పెడుతున్నారు. ఫోర్త్ సిటీ, మూసీ సుందరీకరణ అంశాల్లో అవి నీతిని ప్రశ్నించడంతో కేటీఆర్ను జైలులో పెట్టే కుట్రకు తెరలేపారు. అరెస్టుల పేరిట నాయకులను భయభ్రాంతులకు గురిచేసే యోచనలో రేవంత్ ప్రభుత్వం ఉంది’అని మండిపడ్డారు. అక్రమ కేసులు బనాయించు, అబద్ధాలతో బుకాయించు అనే రీతిలో రేవంత్ పాలన ఉందని ధ్వజమెత్తారు. కేటీఆర్పై కేసు నమోదైన వెంటనే ఈడీ జోక్యం చేసుకోవడం బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు అద్దం పడుతోందన్నారు. -
సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు
-
మరోసారి కోమటిరెడ్డి, హరీష్ రావు మధ్య మాటల యుద్ధం
-
మరోసారి కోమటిరెడ్డి, హరీష్ రావు మధ్య మాటల యుద్ధం
-
హరీశ్రావు ఏమైనా డిప్యూటీ లీడరా?: కోమటిరెడ్డి
ాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రి కోమటిరెడ్డి, హరీష్రావు మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. హరీష్రావు ఏ హోదాలో ప్రశ్నలు అడుగుతున్నారని కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీంతో, పొలిటికల్ హీట్ నెలకొంది.తెలంగాణలో ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం సభ ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలోని నీటి సమస్యలు చెప్పారు. అనంతరం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు స్పందిస్తూ.. ఒక మంత్రి లేచి మరో మంత్రిని ప్రశ్నలు అడిగితే ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందన్నారు. ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీదే మూసీ పాపం. కాళేశ్వరం జలాలను నల్లగొండకు అందించామన్నారు. దీంతో, కోమటిరెడ్డి.. హరీష్ వ్యాఖ్యలు మండిపడ్డారు. Are You a Deputy Leader or an MLA?-- Harish Rao Questioned by Minister Komatireddyమీకు LP లీడర్ లేడుహరీష్ రావు.. నువ్వు డిప్యూటీ లీడర్ వా..?లేక శాసనసభ్యుడిగా...??అసలు ఏ హోదాలో నువ్వు మైక్ అడుగుతున్నావ్-- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి#TelanganaAssembly •… pic.twitter.com/zjt3SUAHEG— Congress for Telangana (@Congress4TS) December 19, 2024అనంతరం, మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. అసలు హరీష్రావు ఎవరు?. డిప్యూటీ లీడర్నా? ఎమ్మెల్యేనా? ఏ హోదాలో మాట్లాడుతున్నారు?. ఆయనకు అడిగే హక్కు లేదు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎక్కడున్నారు? తెలంగాణ ప్రజలను ఆయన అవమానపరచడమే అవుతుంది. నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన ఎలా ఉంటుందో చెప్పాను. డబ్బున్న వాళ్లు హైదరాబాద్ వచ్చారు. లేని వాళ్లు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. ఆయనకు నల్గొండ గురించి, నా గురించి మాట్లాడే హక్కు లేదు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ మూసీని పట్టించుకోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. బుధవారం కూడా సభలో వీరద్దరి మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. అంతకుముందు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న నిరసన తెలిపారు. రైతు సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బీజేపీ నేతలు ఎడ్ల బండ్లపై అసెంబ్లీకి వచ్చి నిరసన ప్రదర్శన చేపట్టారు. -
కాళేశ్వరం నిర్ణయం కేసీఆర్, హరీశ్రావులదే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణం విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకున్నది నాటి సీఎం కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావులేనని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి చెప్పారు. నాటి సీఎం కేసీఆర్ అధ్యక్షతన వ్యాప్కోస్, సీఈ–సీడీఓ, ఇంజనీర్లతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 2016 మే 2న మేడిగడ్డ వద్ద భూమిపూజ చేసి బరాజ్ల నిర్మాణాన్ని కేసీఆర్ ప్రారంభించారని వివరించారు. అదే రోజు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పేరును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చినట్టు వెల్లడించారు. కాళేశ్వరం బరాజ్ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ బుధవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్లో ఆయన పాల్గొన్నారు.సీఎం నిర్ణయాన్ని సాధారణంగా వ్యతిరేకించరు బరాజ్ల నిర్మాణంపై విధానపర నిర్ణయం ఎవరిది? అని కమిషన్ ప్రశ్నించగా, నాటి సీఎం నేతృత్వంలో మంత్రివర్గం, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. అని తొలుత బదులిచ్చారు. నిర్ణయం మంత్రివర్గందా? సీఎందా? ప్రభుత్వం అంటే ఎవరు? అని కమిషన్ గుచి్చగుచ్చి ప్రశ్నించగా, నిర్ణయం సీఎందేనని, మంత్రివర్గం బలపరిచిందని తెలిపారు. మంత్రివర్గ భేటీలో ఎవరైనా మంత్రి అసమ్మతి వ్యక్తం చేయలేదా? అని ప్రశ్నించగా, అలాంటి విషయం తన దృష్టికి రాలేదన్నారు. సీఎం నిర్ణయంపై అసమ్మతి తెలిపితే మరుసటి రోజే మంత్రి పదవి కోల్పోవాల్సి వస్తుందనే భావనతో ఎవరూ అలా చేయరన్నారు. ‘మహా’ అభ్యంతరాలు, నీటి లభ్యత లేదనడంతోనే.. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్కి మహారాష్ట్ర అభ్యంతరాలు, వణ్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రతిబంధకాలుగా మారడం, తగిన నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) లేఖ రాయడంతో బరాజ్ను మేడిగడ్డకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎస్కే జోషి వివరణ ఇచ్చారు. మేడిగడ్డ బరాజ్ వైఫల్యానికి కచి్చతమైన కారణాలు చెప్పలేనని, డిజైన్లకు అనుగుణంగా నిర్మాణం జరగకపోవడం, నాణ్యతా లోపాలు, నిర్వహణ/పర్యవేక్షణ లోపాలు వంటి అనేక కారణాలు ఉండవచ్చని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేవలం ఒకే ఒక పరిపాలనపర అనుమతి జారీ చేయలేదని, సుమారు 200కి పైగా అనుమతులు జారీ చేశారని తెలిపారు. సబ్ కాంట్రాక్టర్లపై సమాచారం లేదు మేడిగడ్డ బరాజ్ నిర్మాణ సంస్థ ఇతర సంస్థలకు (సబ్ కాంట్రాక్టర్లకు) ఏమైనా పనులు అప్పగించిందా? వేరే సంస్థలు నిర్మించడంతోనే 7వ బ్లాక్ కుంగిందా? అని కమిషన్ ప్రశ్నించగా, దీనిపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని జోషి, క్రాస్ ఎగ్జామినేషన్కు హాజరైన నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్లు వేర్వేరుగా బదులిచ్చారు. అప్పట్లో బరాజ్లలో లోపాలు కనబడలేదు: రజత్కుమార్ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే మేడిగడ్డ బరాజ్లోని 7వ బ్లాక్ కుంగిందని రజత్కుమార్ చెప్పారు. నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికే మేడిగడ్డ వంటి బరాజ్లను నిర్మిస్తారని, నిల్వల కోసం నాగార్జునసాగర్ వంటి జలాశయాలు నిర్మిస్తారని చెప్పారు. ఓ స్థాయి వరకే బరాజ్లలో నిల్వలను కొనసాగించి, మిగిలిన ప్రవాహాన్ని విడుదల చేయాల్సిన బాధ్యత ప్రాజెక్టు సీఈదేనని అన్నారు. ప్రభుత్వం రుణాలు తీసుకోక తప్పదు డిఫెక్ట్ లయబిలిటీ కాలంలోనే బరాజ్లు దెబ్బతిన్నా మరమ్మతులు చేయకుండా నిర్మాణ సంస్థలకు డిపాజిట్లను ఎలా చెల్లిస్తారు? అని కమిషన్ ప్రశ్నించగా, 2020 ఫిబ్రవరిలో తాను శాఖ బాధ్యతలు చేపట్టే నాటికి పనులు పూర్తయ్యాయని రజత్కుమార్ వివరణ ఇచ్చారు. అప్పట్లో బరాజ్లలో ఎలాంటి లోపాలు కనబడలేదన్నారు. కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్మించడం సాధ్యం కాదని, రుణాలు తీసుకోక తప్పదని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ చైర్మన్ సీబీ కామేశ్వర్ రావు కూడా కమిషన్ ముందు హాజరయ్యారు. బరాజ్ల వైఫల్యాలపై తన నివేదికలో పేర్కొన్న అంశాలన్ని వాస్తవాలేనంటూ వాంగ్మూలం ఇచ్చారు. కాగా గురువారం మాజీ సీఎస్ సోమేశ్కుమార్, మాజీ సీఎం కేసీఆర్ కార్యదర్శిగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. -
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్
-
గుంతల రోడ్లపై సభలో రచ్చ రచ్చ
-
హరీష్ రావు సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారు: మంత్రి పొంగులేటి
-
హరీష్ రావును ఉద్దేశించి మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు
-
సభలో పొలిటికల్ రచ్చ.. అసెంబ్లీ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు పెట్టాలన్న హరీష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేడీవేడిగా కొనసాగుతున్నాయి. నేడు సభలో మంత్రులు వర్సెస్ మాజీ మంత్రి హరీష్ అన్నట్టుగా వాతావరణం నెలకొంది. సభలోనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నేడు రోడ్ల అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ..‘హరీష్రావుకు దబాయించడం తప్ప పని చేయడం తెలియదు. నేను మాట్లాడుతుండగా ఎంత రిక్వెస్ట్ చేసినా కూర్చోవడం లేదు. ఆయనకు కూలిపోయే కాళేశ్వరం కట్టి కమిషన్ తీసుకోవడం మాత్రమే తెలుసు. హరీష్.. 10వేల కోట్లు దోచుకున్నాడు. రోడ్లు వేయడం బీఆర్ఎస్ నేతలకు చేతకాదు.. కూలిపోయే ప్రాజెక్టులు కట్టారు. లక్ష కోట్ల విలువ చేసే ఓఆర్ఆర్ అమ్ముకున్నారు. ఏడేళ్లు అయినా ఉప్పల్లో ఉన్న ఫ్లై ఓవర్ పూర్తి చేయలేదు. మాజీ సీఎం కేసీఆర్ కోసం మాత్రం నాలుగు లైన్ల రోడ్లు ఫామ్ హౌస్ వరకు వేసుకున్నారు. వచ్చే మార్చి నాటికి రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాము. వచ్చే నాలుగు ఎండ్లలో ఆర్ఆర్ఆర్ను పూర్తి చేస్తాం అన్నారు.ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డికి హరీష్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ మాట్లాడుతూ..‘వ్యక్తిగతమైనటువంటి విమర్శలు సభలో చేయకూడదని కొద్దిసేపటి క్రితమే మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. సిద్ధులు మాకే కాదు తమ మంత్రులకు కూడా చెప్పాలి. సభలో ఎవరు తప్పు మాట్లాడినా వారికి రూల్స్ వర్తిస్తాయా. కమీషన్ గురించి మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్టాలు అన్ని వరుసగా చదువుతాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాపై చేసిన వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలి. నేను కమీషన్ తీసుకున్నట్టు నిరూపించాలి అని సవాల్ విసిరారు. అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టాలి. కొంతమంది సభ్యులు మద్యం తాగి సభకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సభ్యులు తాగొచ్చి ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. హరీష్ రావు మాట్లాడిన మాటలు బాధిస్తున్నాయి. సభ్య సమాజం ఇబ్బంది పడే విధంగా హరీష్ రావు మాటలున్నాయి. హరీష్ రావు వెంటనే సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.విప్ బీర్ల ఐలయ్య కామెంట్స్.. హరీష్రావుకు వాళ్ళ మామ గుర్తుకు వచ్చినట్టు ఉన్నాడు. అందుకు గుర్తుకొచ్చి సభలో మాట్లాడుతున్నారు. ఫామ్ హౌస్లో పడుకునే మీరా మా ప్రభుత్వం గురించి మాట్లాడేది. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం డ్రామాలు ఆడిందన్నారు. అనంతరం, స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ..‘హరీష్ రావు, బీర్ల ఐలయ్య మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. -
తెలంగాణ అప్పులపై అసెంబ్లీలో అధికార, విపక్షాల సమరం
-
అప్పుల లెక్కలు.. అన్నీ అబద్ధాలే
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేసిన అప్పులు.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో చేసిన అప్పులు.. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని వేడెక్కించాయి. ఆరోపణలు.. ప్రత్యారోపణలు, సవాళ్లు.. ప్రతి సవాళ్లతో స భ అట్టుడికింది. ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్రావుల మధ్య వాడివేడి వాదనలు కొనసాగాయి. అసత్యాలతో ప్రజలను త ప్పుదోవ పట్టిస్తున్నారని పరస్పరం విమర్శించుకుంటూ వారివారి లెక్కలను సభ ముందుంచారు. ప్రివిలేజ్ మోషన్పై మాట మార్చారు: భట్టి ‘రాజకీయాలు చేయటమే లక్ష్యంగా వ్యవహరించే హరీశ్రావు సభలో అన్నీ అబద్ధాలే చెబుతారు. ఏడాదిలో మేం చేసిన అప్పులపై ఆయన చెప్పే లెక్కలు సరికాదు. పదేళ్ల వారి పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని చక్కదిద్దేందుకు కొంత అప్పు చేయక తప్పలేదు. ఇక పదేళ్ల వారి హయాంలో చేసిన అప్పుల లెక్కల్లోనూ ఆయనది ప్రజలను తప్పుదారి పట్టించే పద్ధతే. అందుకే మేం అధికారంలోకి రాగానే శ్వేతపత్రం రూపంలో వాస్తవాలను ప్రజల ముందుంచాం. మళ్లీ చర్చ పెడితే నిరూపించేందుకు సిద్ధం. బీఆర్ఎస్ నేతలు 10 సంవత్సరాల పాలనలో తప్పులు చేసినందుకు గత డిసెంబర్లో జనం శిక్షించారు.ఆరు నెలల్లో పార్లమెంటు ఎన్నికలప్పుడు డిపాజిట్ దక్కకుండా వారికి మతిపోయేలా చేశారు. అయినా వారిలో మార్పు రాలేదు. ఆ పార్టీది భూస్వామ్య మనస్తత్వం. భూమిలేని నిరుపేదలకు ఆర్థిక సాయం చేయరా? అని ఖమ్మంలో ఓ విలేకరి అడిగినప్పుడు, వారికి ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పా. దాని ఆధారంగా ప్రివిలేజ్ మోషన్ ఇచ్చి, ఇప్పుడు అప్పుల మీద అవాస్తవాలు మాట్లాడితే ఇచ్చామంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వారికి అనుకూలంగా సభ నియమాలు రూపొందించుకున్నారు.వారి నిబంధనల్లోనే సభలోకి ప్లకార్డులు తీసుకురావద్దని ఉంది..కానీ నిన్న తీసుకొచ్చారు. వీరా నామీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది? వారి హయాంలో స్పీకర్ శ్రీనివాస్రెడ్డి ఉన్నప్పుడు బీఏసీలో పాటించిన పద్ధతినే మేం ఇప్పుడు అనుసరిస్తున్నాం. ఇప్పుడు ప్రసాద్కుమార్ స్పీకర్గా ఉన్నారు. వ్యక్తి మారారు తప్ప స్పీకర్ స్థానం అదే. ఆ స్థానాన్ని గౌరవించాలి కదా.. నిన్న బీఏసీలో కాగితాలు విసిరి బయటకొచ్చి ఏవేవో మాట్లాడుతున్నారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.లక్ష కోట్లు అప్పు చేసిందని విపక్షాలు చేసే ప్రచారంలో వాస్తవం లేదు. ఎఫ్ఆర్బీఎం కింద మేము రూ.51,277 కోట్లు మాత్రమే అప్పు చేశాం. గ్యారంటీల కింద రూ.61,991 కోట్లు, గ్యారంటీ లేని రుణా లు రూ.10,999 కోట్లు సమీకరించాం. మీ హయాంలో చేసిన అప్పుపై వడ్డీ రూపేణ రూ.66 వేల కోట్లు చెల్లించాం. మీరు పెట్టిపోయిన పెండింగు బిల్లులు రూ.40 వేల కోట్లలో ఇప్పటికి రూ.14 వేల కోట్లు చెల్లించాం.ప్రజల ఆస్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ఔటర్ రింగురోడ్డును ఆ ప్రభుత్వం 30 ఏళ్ల లీజు పేరుతో అమ్ముకుంది. అదే పద్ధతిలో మేం వచ్చే 30 ఏళ్ల కాలానికి జీఎస్టీ లాంటి ఆదాయ వ్యవహారాలను ఏ అదానికో, అంబానికో లీజుకిస్తే రాష్ట్ర పరిస్థితి ఏం కావాలి?..’అని భట్టి నిలదీశారు. పరిమితంగానే మా అప్పులు: హరీశ్రావు ‘మా ప్రభుత్వం పరిమితంగా చేసిన అప్పును తప్పుడు లెక్కలతో పెంచి భూతద్దంలో చూపి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అబద్ధపు అప్పుల బూచి చూపి ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ ఆటలు సాగనివ్వం. మేం చెప్పే లెక్కలే సరైనవని నిరూపించేందుకు సిద్ధం. సభలో ప్రత్యేక చర్చ పెట్టండి, ఆడిటర్లను, ఆర్థిక నిపుణులను పిలిపించుకోండి.. నేను చెప్పేవే సరైన లెక్కలని నిరూపిస్తాను.ఇది నా ఛాలెంజ్. ఆర్బీఐ నేటి లెక్కల ప్రకారం గత ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు రూ.1,27,208 కోట్లు. ఐదేళ్లలో చేయబోయే అప్పు దాదాపు రూ.6,36,400 కోట్లు. కానీ మా ప్రభుత్వం పదేళ్ల కాలంలో తెచి్చన అప్పులు కేవలం రూ.4,17,496 కోట్లు మాత్రమే. ‘ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలను ఆయన ఉటంకించారు) కరోనా కారణంగా కేంద్రం అదనంగా 1.75 శాతం అప్పు తీసుకోవాలని సూచించడంతో తీసుకున్నాం. లేకపోతే అంతకూడా అప్పు అయ్యేది కాదు.దీనిపై నేను సవాల్ విసురుతున్నా.. చర్చకు సిద్ధం. మేం రూ.6,71,757 కోట్లు అప్పు తీసుకున్నామని ఒకసారి, రూ.7 లక్షల కోట్లు అని మరోసారి, సభలో రూ.7,11,911 కోట్ల అప్పులంటూ నోటికొచి్చనట్లు అబద్ధాలు చెబుతున్నారు. ప్రత్యేక చర్చ పెడితే వాస్తవాలు నిరూపిస్తా. ఏడాది పూర్తవుతున్నా ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా, గత ప్రభుత్వం చేసిన అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఏసీతో సంబంధం లేకుండా సభలో బిల్లులు ప్రవేశపెట్టడం వింతగా ఉంది. గత సభలో అప్పుల గురించి తప్పుడు లెక్కలు చూపినందుకే భట్టి విక్రమార్కపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. కానీ మరో అంశంపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నారు. చర్చ పెడితే వాస్తవాలు నిరూపిస్తాం..’అని హరీశ్రావు సవాల్ చేశారు. -
‘వాళ్ల చేతులకు బేడీలేవీ?.. నిరసనల్లోనూ దురహంకారమేనా?’
హైదరాబాద్, సాక్షి: అసెంబ్లీలో ఇవాళ నల్ల దుస్తులు, చేతులకు బేడీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసనపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిరసనల్లోనూ బీఆర్ఎస్లో సమానత్వమే లేదని అన్నారామె. అసెంబ్లీ లాబీలో మీడియా చిట్చాట్లో ఆమె మాట్లాడుతూ.. ‘‘కేటీఆర్, హరీష్ రావుల దొరతనం మరోసారి బయటపడింది. నిరసనల్లోనూ వాళ్లు తమ దురహంకారాన్ని ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారే తప్ప వాళ్లు వేసుకోలేదు. కనీసం వాళ్ల నిరసనల్లోనూ సమానత్వం లేదనే విషయం బయటపడింది’’ అని అన్నారామె. అలాగే.. లగచర్ల రైతుకు బేడీల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సంబంధిత అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు. కానీ, బీఆర్ఎస్ హయాంలో కనీసం పదిసార్లు అయినా రైతులకు బేడీలు వేసి ఉంటారు. ఆ టైంలో అధికారులపై కనీస చర్యలు కూడా తీసుకోలేదు. ఆ లెక్కన ఇప్పుడు రైతులకు బేడీలు వేశారంటూ మాట్లాడే అర్హత బీఆర్ఎస్ లేనేలేదు. గతంలో.. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా వెల్లోకి వెళ్తే సభ నుంచి సస్పెండ్ చేసేవాళ్లు. కానీ, ఇప్పుడు వాళ్లు పెట్టిన నిబంధనలనే వాళ్లు కాలరాస్తున్నారు. అయినా సభలో వాళ్ళు పెట్టిన రూల్స్ పై వాళ్ళే అభ్యంతరం చెప్పడం ఏంటో? అని సీతక్క అన్నారు. -
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు మేం తీర్చాల్సి వస్తుంది: భట్టి
-
అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
-
ప్రజా యుద్ధనౌక గద్దర్ లేకుండా ఏ ఉద్యమాలూ లేవు: హరీశ్రావు
-
సీఎం రేవంత్ తెలంగాణ ద్రోహి
సిద్దిపేట జోన్: సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ ద్రోహి అని, ఆయన ఏనాడూ జై తెలంగాణ అనలేదని బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ సాహిత్య పుస్తకావిష్కరణ సభలో హరీశ్రావు పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి అవార్డుల పేరుతో తన మరకలను కడిగేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను తీసేసి, విగ్రహ రూపాన్ని మార్చడం నచ్చకనే కవి నందిని సిధారెడ్డి ప్రభుత్వ ఇవ్వజూపిన నజరానా, ఇంటి స్థలాన్ని తిరస్కరించారని తెలిపారు. రూ.కోటి రూపాయలు ముఖ్యం కాదని, మూడు కోట్ల తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలే ముఖ్యమని చాటిన నందిని సిధారెడ్డి ఎంతో గొప్పవారని అభినందించారు. మలిదశ ఉద్యమంలో కీలక పాత్రతెలంగాణ ఉద్యమానికి గద్దర్ ప్రజాగొంతుకగా నిలిచారని హరీశ్రావు అన్నారు. ఆయన లేనిది ఏ ఉద్యమం లేదు.. మలిదశలోనూ గద్దర్ కీలక పాత్ర పోషించారు అని కొనియాడారు. గద్దర్ పోరాటం భావితరాలకు తెలిసేలా పుస్తకాలు ముద్రించటం మంచి ఆలోచన అని ప్రశంసించారు. తండ్రి పోరాటాన్ని, గొప్పతనాన్ని రేపటి తరాలకు అందించి నిజమైన వారసుడు అనిపించుకున్నారని గద్దర్ కుమారుడు సూర్యకిరణ్ను అభినందించారు. గద్దర్ పాట ఉన్నంత కాలం ప్రజల మధ్య ఆయన సజీవంగా ఉంటారన్నారు. సిద్దిపేటలో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసే ఆలోచన అభినందనీయమని, గద్దర్ జీవిత చరిత్రతో కూడిన డాక్యుమెంటరీ తయారీ చేయాలని, అందుకు తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. -
రేవంత్ను ఎందుకు అరెస్ట్ చేయరు?: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: అల్లు అర్జున్ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అసలు ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చిందెవరు?. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? అంటూ ప్రశ్నలు గుప్పించారు. సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. దీనికి అసలు కారకులు రాష్ట్ర పాలకులే. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అని హరీష్రావు మండిపడ్డారు.రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ బ్రదర్స్ని ఎందుకు అరెస్టులు చేయరు?. రేషన్ కార్డు నిబంధనల వల్లే, రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ లెటర్ రాసి మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కారకుడైన రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయరు?. అరెస్టు చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలి’’ అని హరీష్రావు పేర్కొన్నారు.అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి‘‘ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలి?. ఫుడ్ పాయిజన్లతో 49 మంది విద్యార్థులు చనిపోయారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి. ఫార్మా సిటీ పేరుతో లగచర్ల గిరిజన బతుకులను ఛిద్రం చేశారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి?. చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు ఎనుముల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలి. చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదు’’ అని హరీష్రావు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ‘అల్లు అర్జున్ అరెస్ట్తో నాకేం సంబంధం లేదు’ -
రేవంత్-అదానీ టీషర్టు వేసుకుని సభలోకి వస్తే ఇబ్బందేంటి? : హరీశ్ రావు
-
ఏడాది పాలన.. ఎడతెగని వంచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలన ఎడతెగని వేదనను మిగిల్చిదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ పాలన అంతా పరపీడన పరాయణత్వంలా మారిందని విమర్శించారు. భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడుతామని అధికారంలోకి వచ్చి.. ఏడాదిలోనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎరుగని నిర్బంధకాండను రేవంత్ ప్రభుత్వం అమలుచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పాలనపై ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ తరఫున హరీశ్రావు చార్జిషీట్ విడుదల చేశారు. త్వరలో ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలపై మరో చార్జిïÙట్ విడుదల చేస్తామని ప్రకటించారు. ‘సీఎం సొంత ఊరికి ఎవరైనా వెళ్లాలంటే స్థానిక పోలీస్స్టేషన్లో అనుమతి తీసువాల్సిన పరిస్థితి. బుల్డోజర్లతో పేదల ఇండ్లు కూల్చి ఎమర్జెన్సీని తలపిస్తున్నాడు’అని మండిపడ్డారు. శ్వేతపత్రాల పేరిట రోత పత్రాలు.. ‘రేవంత్ పాలన ప్రతికూల దృక్పథంతో ప్రారంభం కావడంతో ప్రతికూల ఫలితాలే వస్తున్నాయి. శ్వేతపత్రాల పేరిట రోత పత్రాలు విడుదల చేసి రాష్ట్రం దివాలా తీసిందనే నెగెటివ్ ఇమేజ్ సృష్టించారు. రేవంత్ మార్పు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది. ప్రభుత్వ ౖశాఖల మధ్య సమన్వయం లేదు. సీఎం నిర్వహిస్తున్న శాఖల్లోనే పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యలు పెచ్చుమీరాయి.కృష్ణా నది ప్రాజెక్టులపై పదేండ్లు కేసీఆర్ కాపాడిన హక్కులను.. అధికారంలోకి వచ్చి నెల తిరక్కుండానే కేంద్రానికి కట్టబెట్టారు. కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ పెరిగితే, రేవంత్ పాలనలో ఇరిటేషన్ పెరిగింది. రైతు సంక్షేమానికి రాహుకాలం.. వ్యవసాయానికి గ్రహణం పట్టింది. బడిలో చదువుకోవాల్సిన పిల్లలు ఆసుపత్రుల్లో కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. హైడ్రా రూపంలో రేవంత్ రెడ్డి విధ్వంసం సృష్టించారు. మూసీ ప్రక్షాళన పేరిట మూటలు వెనకేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తిక్క విధానం, తిట్ల పురాణం అవలంబిస్తున్న సీఎంకు దుర్భాష దురంధరుడు అనే బిరుదు ఇవ్వవచ్చు’అని హరీశ్రావు ఎద్దేవా చేశారు. -
కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్
-
ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేయాలి
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగంలో భూములు కోల్పోతున్నవారికి న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. రింగ్రోడ్డు కోసం చౌటుప్పల్ జంక్షన్ వద్ద 184 ఎకరాల భూమిని సేకరిస్తున్నారని.. ఆ భూములు, ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం ఏ మాత్రం సరిపోదని తెలిపారు. ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు శనివారం హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసి తమ సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించిన తర్వాత వారి అంగీకారంతోనే భూ సేకరణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 26న దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నిర్వహించే మహాధర్నాకు రావాల్సిందిగా ఆ సంస్థ ప్రతినిధులు శనివారం హరీశ్రావును కలిసి ఆహ్వానించారు. వారి సమస్యలపై కూడా పోరాడుతామని ఆయన హామీ ఇచ్చారు. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, దివ్యాంగులను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని ప్రకటించి.. ఏడాది అవుతున్నా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని ప్రకటించారు. -
HYD: కౌశిక్రెడ్డికి అర్ధరాత్రి బెయిల్
సాక్షి,హైదరాబాద్:బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ సీఐని దుర్భాషలాడిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గురువారం(డిసెంబర్5)అర్ధరాత్రి ఒంటిగంటకు కొత్తపేటలోని జడ్జి నివాసంలో పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు ప్రవేశపెట్టగా జడ్జి బెయిల్ మంజూరు చేశారు.రూ.5వేల పూచీకత్తుతో కౌశిక్రెడ్డికి బెయిల్ ఇచ్చారు.కౌశిక్రెడ్డికి బెయిల్ ఇచ్చిన సందర్భంగా జడ్జి నివాసం వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్,రాగిడి లక్ష్మారెడ్డి, శ్రీధర్రెడ్డి తదితరులతో భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. కౌశిక్రెడ్డిని గురువారం ఉదయం ఆయన ఇంటివద్ద బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసినప్పుడు హైడ్రామా జరిగింది. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగి అడ్డుకోవడంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని సాయంత్రం విడుదల చేశారు. ఇదీ చదవండి: కౌశిక్రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత -
హరీశ్రావు అరెస్టు..10 గంటల హైడ్రామా
గచ్చిబౌలి/ బంజారాహిల్స్/ సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అరెస్టుతో గచ్చిబౌలి ఠాణా అట్టు డికింది. పార్టీ మరో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిని అరెస్టు చేస్తారనే సమా చారంతో గురువారం ఉదయం కొండాపూర్లోని ఆయన ఇంటికి వెళ్లిన హరీశ్ను గచ్చిబౌలి పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అనంతరం కౌశిక్రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు బంజారాహిల్స్ స్టేషన్కు తీసుకెళ్లారు. అనంతరం కౌశిక్రెడ్డి ఇంటికి వచ్చిన మాజీమంత్రి జగదీశ్రెడ్డి తదితరులను అదుపులోకి తీసుకుని రాయదుర్గం పీఎస్కు తీసుకెళ్లారు. అయితే హరీశ్రావు అరెస్టుతో గచ్చిబౌలి పోలీస్స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించారు. మరోవైపు హరీశ్రావును పరామర్శించేందుకు ఎమ్మెల్సీ కవిత సహా పలువురు ముఖ్య నేతలు, పార్టీ శ్రేణుల తరలిరావడం, భారీయెత్తున బలగాల మోహరింపుతో గందరగోళం నెలకొంది. సీఎం రేవంత్రెడ్డి, పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేయడంతో 50 మందికి పైగా నాయకులను అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.కాగా హరీశ్రావును ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8.30 వరకు పీఎస్లోనే ఉంచిన పోలీసులు ఆ తర్వాత విడుదల చేశారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తదితరులు పోలీస్స్టేషన్లో హరీశ్రావును పరామర్శించారు.ఇందిరమ్మ రాజ్యం కాదు పోలీస్ రాజ్యం హరీశ్రావు, జగదీశ్వర్రెడ్డి, కౌశిక్రెడ్డిలను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కాదు..ఎమర్జెన్సీని తలపించేలా పోలీస్ రాజ్యం నడుస్తోందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఫిర్యాదును తీసుకోని ప్రభుత్వం కేసులు పెట్టడం అన్యాయం అని అన్నారు. తెలంగాణ సమాజం అణచివేతను సహించదని, తమ గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు.ప్రజల పక్షాన ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, నిర్బంధించడం ప్రభుత్వానికి తగదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. హమీలు అమలు చేయడం చేతగాని సీఎం రేవంత్రెడ్డి, అక్రమ అరెస్టులతో గొంతులు మూయాలని ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. సీఐని బెదిరించారనే ఆరోపణలపై కౌశిక్రెడ్డి అరెస్టు పోలీసు విధులను అడ్డుకోవడమే కాకుండా అంతు చూస్తానంటూ బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రను బెదిరించారనే ఆరోపణలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. కొండాపూర్లోని కోలా లగ్జారియా విల్లాస్లో ఉంటున్న ఆయన్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ సీఎం రేవంత్రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్రెడ్డిలపై ఫిర్యాదు చేసేందుకు బుధవారం బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు వచ్చిన కౌశిక్రెడ్డి..తనతో వాగ్వివాదానికి దిగడమే కాకుండా పోలీసు వాహనానికి తన కారును అడ్డుగా పెట్టి విధులకు ఆటంకం కలిగించారని ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు.దీంతో బీఎన్ఎస్ సెక్షన్లు 57, 126 (2), 127 (2), 132, 224, 333, 451 (3), 191 (2) రెడ్విత్ 190, 3(5) కింద కౌశిక్రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అరెస్టు చేశారు. ఉదయం ఇంట్లో ఉన్న కౌశిక్రెడ్డి బయటకు రాకపోవడంతో, తమకు సహకరించాలని లేనిపక్షంలో తామే బలవంతంగా లోపలికి రావాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. దీంతో ఆయన తలుపులు తీశారు. అప్పటికే లోపల ఉన్న హరీశ్రావును తొలుత అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అనంతరం కౌశిక్రెడ్డిని అరెస్టు చేశారు. ఆయన కానును సీజ్ చేశారు.పోలీస్స్టేషన్లో ఉన్న కౌశిక్రెడ్డిని ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు వివేక్గౌడ్, సంజయ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తదితరులు పరామర్శించారు. కౌశిక్రెడ్డి అరెస్టు విషయం తెలిసి అక్కడికి చేరుకున్న మాజీమంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, రాకేష్రెడ్డి తదితరులను అరెస్టు చేసిన పోలీసులు రాయదుర్గం, నార్సింగి పీఎస్లకు తరలించారు. -
సీఎం రేవంత్ పగ పట్టారు: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పగ, ప్రతీకారాలతో పనిచేస్తోదంటూ మాజీ మంత్రి హరీష్రావు మండిపడ్డారు. తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు. గురువారం రాత్రి గచ్చిబౌలి పీఎస్ నుంచి విడుదలైన అనంతరం హరీష్రావు మాట్లాడుతూ, ఎఫ్ఐఆర్లు పోలీస్స్టేషన్ నుంచి కాదు.. గాంధీభవన్ నుంచి వస్తున్నాయంటూ నిప్పులు చెరిగారు.రేవంత్రెడ్డి పాలనపై దృష్టి లేదు. అక్రమ కేసులు, అక్రమ సంపాదనపైనే ఆయన దృష్టి. ప్రశ్నించే వారి గొంతు నొక్కాలని చూస్తున్నారు. వందరోజుల్లో హామీలు అమలు చేస్తామని బాండ్ పేపర్పై సంతకాలు చేసి. ప్రజల కాళ్లా వేళ్లా పడి ఓట్లు వేయించుకున్నారు. ఆ హామీలు అమలు చేయాలని మేం అడుగుతున్నాం.. తప్పా?. రేవంత్రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అవ్వాతాతలకు 4వేల పెన్షన్ ఇస్తానన్నావ్ ఎప్పుడిస్తావ్?. మూసీలో పేదల ఇళ్లు కూలగొట్టొద్దన్నారు. ఇది సూచన కాదా?. సూచనలు తీసుకునే సోయి నీకు లేదు. గల్లీ నాయకుడిలా, ముఠా నాయకుడిలా కక్షతో రేవంత్రెడ్డి పనిచేస్తున్నారు’’ అంటూ హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, అంతకు ముందు మాజీ మంత్రి హరీష్రావును విడుదల చేయాలంటూ గచ్చిబౌలి పోలీస్స్టేషన్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొన్ని గంటల పాటు గచ్చిబౌలి పోలీస్స్టేషన్లోనే ఉన్న హరీశ్రావును ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు, బీఆర్ఎస్నేతలు కలిశారు. కేసీఆర్ కట్టించిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించకుండా రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగిన తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇదీ చదవండి: హైకోర్టులో హరీష్ రావుకు ఊరట -
Harish Rao Arrest: గచ్చిబౌలి పీఎస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి హరీశ్రావును విడుదల చేయాలంటూ గచ్చిబౌలి పోలీస్స్టేషన్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా గచ్చిబౌలి పోలీస్స్టేషన్లోనే ఉన్న హరీశ్రావును ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులు, బీఆర్ఎస్నేతలు కలిశారు. ఎన్టీఆర్ మార్గ్లో ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద రేపు(శుక్రవారం) బీఆర్ఎస్ నిరసనకు పిలుపునిచ్చింది. నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొనున్నారు.ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేస్తూ.. రేవంత్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని బీఆర్ఎస్ మండిపడుతోంది. కేసీఆర్ కట్టించిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించకుండా రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మాజీ మంత్రి హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన హరీష్ రావు, జగదీష్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇక, ఇదే సమయంలో కౌశిక్రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని క్రైం నెంబర్ 1127/ 2024 కింద కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఈ క్రమంలో బుధవారం కౌశిక్రెడ్డిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గురువారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లారు. దీంతో, హరీష్, జగదీష్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. -
హైదరాబాద్ లో BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్
-
హైకోర్టులో హరీష్ రావుకు ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు ఊరట లభించింది. పంజాగుట్ట పోలీసు స్టేషన్లో హరీష్పై నమోదైన కేసులో ఆయనను అరెస్ట్ చేయవద్దంటూ కోర్టు ఆదేశించింది.వివరాల ప్రకరారం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పంజాగుట్ట పీఎస్లో నమోదైన కేసుపై ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్బంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హరీష్ను పోలీసులు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చు అని తెలిపింది. -
సూటుకేసులు మీకు.. అరెస్టులు మాకు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. అలాగే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల అరెస్ట్ అప్రజాస్వామికం.. వారిని వెంటనే విడుదల చేయాలని కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు !పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు !పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు !గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు !ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు !ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు !ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులు !ప్రజలపై కేసులు.. ప్రజాప్రతినిధులపై కేసులుకేసులు .. కేసులు .. కేసులు.. కాసులు మీకు-కేసులు మాకుసూటుకేసులు మీకు .. అరెస్టులు మాకుమాజీ మంత్రులు మా నాయకులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గార్లతోపాటు మా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,నాయకుల అరెస్ట్ లు అప్రజాస్వామికం..తక్షణం విడుదల చెయ్యాలి...జాగో తెలంగాణ జాగో’ అంటూ కామెంట్స్ చేశారు ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు !పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు !పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు !గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు !ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు !ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు !…— KTR (@KTRBRS) December 5, 2024 ఎమ్మెల్యే @KaushikReddyBRS ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారని తెలిసి ఏసీపీ పరార్... సీఐ పారిపోతారు... ఎంత అధికార పార్టీకి ఊడిగం చేస్తే మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేను అధికారికంగా మీ ఆఫీసులోనే కలిసేందుకు కూడా భయమా? పట్టుకొని నిలదీస్తే... అక్రమ కేసులా? ఇదెక్కడి రాజకీయం? ఇదేనా ప్రజా…— KTR (@KTRBRS) December 5, 2024 -
మాజీ మంత్రి హరీష్రావు అరెస్టు
-
మాజీ మంత్రి హరీష్రావు, కౌశిక్ రెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మాజీ మంత్రి హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన హరీష్ రావు, జగదీష్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఇదే సమయంలో కౌశిక్రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని క్రైం నెంబర్ 1127/ 2024 కింద కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఈ క్రమంలో బుధవారం కౌశిక్రెడ్డిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గురువారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లారు. దీంతో, హరీష్, జగదీష్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..‘తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనే నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు వెనుకడుతారు, మళ్ళీ ఉల్టా కేసు బనాయిస్తరు?. ఇదేం విడ్డూరం. ఇదెక్కడి న్యాయం? ఇదేం ప్రజాస్వామ్యం?. రేవంత్ మీ పాలన మార్పు మార్కు ఇదేనా?. రాజ్యాంగాన్ని కాపాడుదామని రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతడు. నువ్వేమో తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూనే ఉంటవు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది లేదు, బెదిరేది లేదు. ప్రజాక్షేత్రంలో నిన్ను నిలదీస్తూనే ఉంటాం. నీ వెంట పడుతూనే ఉంటాం’ అంటూ విమర్శలు చేశారు. ఇందిరమ్మ రాజ్యమా...? ఎమర్జెన్సీ పాలనా?ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఉల్టా కేసు బనాయించారు.ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు.ఈ దుర్మార్గాన్ని… pic.twitter.com/aXvinFpkqY— Harish Rao Thanneeru (@BRSHarish) December 5, 2024 -
పదేళ్లలో కోటి మంది మహిళలు 'కోటీశ్వరులు': రేవంత్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాబోయే పదేళ్లలో ఆర్టీసీ, సోలార్ విద్యుత్ కేంద్రాలు, ఐకేపీ కేంద్రాలు తదితర అన్ని రంగాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు అవకాశాలు కల్పించడం ద్వారా కోటిమందిని కోటీశ్వరు లుగా మార్చేవరకు తాము విశ్రమించబోమని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఆడబిడ్డల ఓట్లతోనే విజయం సాధిస్తామన్నారు. గత పదేళ్లకాలంలో ఒక్క విమానాశ్రయం కట్టలేదని, కానీ తాము రామగుండం, వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలను కడతామని తెలిపారు. గత ప్రభుత్వం యువతకు ఉద్యోగాలివ్వలేదు కానీ, కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ ఉద్యోగాలొచ్చాయని విమర్శించారు. తమ ఇందిరమ్మ పాలనలో ఏడాదిలోనే 55,143 మందికి ఉద్యోగాలిచ్చామని, ఇదే వేదికపై 8,084 మందికి నియామక పత్రాలు అందజేస్తున్నామని వెల్లడించారు. డిసెంబర్ 10 వరకు తాము చేసిన పనులన్నీ చెప్పుకుంటామన్నారు. రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేసి చూపించామని, దీనిపై ప్రధాన మోదీ, కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి తమతో చర్చకు రావాలని సవాల్ చేశారు. కేటీఆర్, హరీశ్లను అచ్చోసిన ఆంబోతుల్లా సమాజంలోకి కేసీఆర్ వదిలిండని, తెల్లారిలేస్తే సోషల్ మీడియాలో తమపై విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా బుధవారం పెద్దపల్లిలో యువవికాసం పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.బలమైన కుర్రాడు ఒక్క రోజులో పిల్లాడిని కనలేడుగా..‘రూ.లక్ష కోట్లు వెచ్చించి కేసీఆర్ కాళేశ్వరం కడితే కూలింది. మేం 50 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్టులేవీ చెక్కు చెదరలేదు. కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క ఎత్తకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. అందులో పెద్దపల్లి అగ్రగామిగా నిలిచింది. గతంలో వర్సిటీలు నిరాదరణకు గురయ్యాయి. మేం 10 వర్సిటీలకు వీసీలను నియమించాం. శాతవాహన వర్సిటీకి లా, ఇంజనీరింగ్ కాలేజీలు మంజూరు చేస్తున్నాం. డీఎస్సీ పిలిచి 11 వేల టీచర్ కొలువులిచ్చాం. చెప్పినవన్నీ చేసుకుంటూ పోతున్నాం. ఇందిరా పార్కు వద్ద మూసేసిన ధర్నా చౌక్ తెరిపించాం. మా ప్రమాణ స్వీకారం రోజునే ప్రగతిభవన్ ముళ్ల కంచెను తొలగించాం. ప్రగతిభవన్లో ప్రతివారం చిన్నారెడ్డి ప్రజల ఫిర్యాదులు తీసుకుని పరిష్కరిస్తున్నారు. పేద పిల్లలకు 40% కాస్మెటిక్, డైట్ చార్జీలు పెంచాం. ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను పరిష్కరించుకుంటాం. ప్రతిదానికీ ఒక విధానం ఉంటుంది. బలమైన కుర్రాడికి పెళ్లి చేసినంత మాత్రాన.. ఒక్కరోజులో పిల్లాడిని కనలేడుగా..’ అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.పదేళ్లలో ఉద్యాగాలెందుకు ఇవ్వలేదు? ‘కవితమ్మ ఎంపీగా ఓడిపోతే 3 నెలల్లో ఎమ్మెల్సీని చేశారు. సంతోష్కు రాజ్యసభ, ఎంపీ ఎ్ననికల్లో ఓడిన వినోద్కు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ ఇచ్చారు. అదే పదేళ్లలో ఎందుకు ఉద్యోగాలివ్వలేదు. ఇందుకోసమేనా తెలంగాణ విద్యార్థులు బలిదానం చేసింది? కొలువుల్లేక దాదాపు 35 లక్షల మంది ఉపాధి కూలీలుగా, అడ్డా కూలీలుగా మారారు. వందలాది బలిదానాలు, లక్షలాదిమంది కేసులు ఒక్క కుటుంబం కోసమా? తెలంగాణ ప్రజల కోసమా? 80 వేల పుస్తకాలు చదివిన మీకు నిరుద్యోగుల కష్టం అర్థం కాలేదా? అందుకే మేం ఆలోచన చేసి 55 వేల ఉద్యోగాలు ఇచ్చాం. కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఆత్మహత్యలు చేసుకోవద్దని యువ వికాసం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం..’ అని సీఎం పేర్కొన్నారు. కొందరు విష ప్రచారం చేస్తున్నారు..‘పెద్దపల్లి జిల్లా ప్రజల వెన్నుదన్నుల వల్లే ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం. కేసీఆర్ పదేళ్ల కాలంలో రైతాంగానికి గిట్టుబాటు ధర రాలేదు. కనీసం తనలా ఎకరానికి రూ.కోటి ఆదాయం ఎలా తీయాలో నేర్పలేదు. నాడు ఎస్సారెస్పీ నీటి కోసం అరెస్టయిన విజయరమణారావు కల నేడు ఫలించింది. ఇవాళ ఆ ప్రాజెక్టులను పూర్తి చేసుకునే అవకాశం వచ్చింది. పెద్దపల్లి జిల్లాకు రూ.1,030 కోట్లతో ఆర్అండ్బీ, పీఆర్ పనులు, ఆర్టీసీ డిపో వచ్చాయంటే అందుకు కారణం మీ అభిమాన విజ్జన్న, శ్రీధర్బాబులే. వాస్తవానికి ఈ పనులు కావాలని మంత్రి శ్రీధర్బాబు మమ్మల్ని అడగలేదు..బెదిరించారు (నవ్వులు). తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి కరీంనగర్, ఆదిలాబాద్కు నీరిస్తాం. రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాం. కొందరు తమకు భవిష్యత్తు లేదన్న భయంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారు చేసే విష ప్రచారాన్ని డిసెంబరు 10 వరకు తిప్పికొట్టి చరిత్ర తిరగరాస్తాం. నరేంద్ర మోదీ 14 ఏళ్లు గుజరాత్ సీఎంగా ఉన్నారు. 11 సంవత్సరాల నుంచి పీఎంగా ఉన్నారు. గుజరాత్లో తొలి ఏడాదిలో 55వేల ఉద్యోగాలు ఇచ్చారా? చర్చకు సిద్ధమా? మోదీకి ప్రత్యేక విమానం పెడతాం. సచివాలయంలో చర్చ పెడతాం..’ అని సీఎం సవాల్ చేశారు. మద్దతు ధర, బోనస్ ఇస్తున్నాం..‘రైతులకు ఎమ్మెస్పీ ఇవ్వడమే కాదు.. 66 లక్షల ఎకర్లాలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి మేం కట్టిన ప్రాజెక్టులతోనే సాధ్యమైంది. ఆనాడు ఐకేపీ కేంద్రాలు తెరవమంటే ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు.. వరి వేసుకుంటే ఉరే అని కేసీఆర్ చెప్పారు. నేడు ఇందిరమ్మ రాజ్యంలో మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తున్నాం. రైతుబంధు రూ.7,625 కోట్లు ఇచ్చాం. రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీతో ఈ ప్రభుత్వం చరిత్రను తిరగరాసింది. గుజరాత్లో రైతు రుణమాఫీ చేశారా? చర్చకు సిద్ధమేనా?..’ అని రేవంత్ ప్రశ్నించారు.కులగణనలో కేసీఆర్ ఎందుకు పాల్గొనడం లేదు?‘రాహుల్గాంధీ పిలుపుతో కులగుణన చేపట్టాం. 95 శాతం పూర్తి చేశాం. కులగణనలో కేసీఆర్ ఎందుకు పాల్గొనడం లేదు? బీసీ దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కులగణన చేస్తుంటే.. కేసీఆర్ కుటుంబం ఎందుకు దూరంగా ఉంది. మేం ప్రతిపక్షంలో ఉన్నపుడు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనలేదా? బీసీ సంఘాలు ఆలోచించాలి. బీసీ కులగణనలో పాల్గొనని వారిని సామాజికంగా బహిష్కరించాలి..’ అని ముఖ్యమంత్రి అన్నారు. -
‘కుట్ర’ కేసు కొట్టేయండి.. హైకోర్టులో హరీష్రావు పిటిషన్
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్స్టేషన్లో తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ వేశారు. సిద్ధిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిసెంబర్ 1న హరీష్రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారంటూ హరీష్రావు తన పిటిషన్లో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసి సంబంధం లేని కేసు పెట్టారంటూ పేర్కొన్న హరీష్ రావు.. కేసు కొట్టివేయడంతో పాటు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు.తన, కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారని, తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి కుట్రతో అక్రమ కేసులు పెట్టారని... రియల్ ఎస్టేట్ వ్యాపారి జి.చక్రధర్గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో హరీష్రావుపై ఈ కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి, రిమాండ్లో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్రావును సైతం నిందితుడిగా చేర్చారు. వివిధ సెక్షన్ల కింద ఆదివారమే ఎఫ్ఐఆర్ నమోదవగా.. ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది.పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. ‘‘సిద్దిపేటకు చెందిన చక్రధర్గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. 2022 సెప్టెంబర్ 25న సిద్దిపేటలోని కొండ భూదేవి గార్డెన్స్లో చక్రధర్.. ఆత్మహత్యలకు పాల్పడ్డ వంద మంది కౌలురైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఆ తర్వాత మరో 150 మందికి రూ.లక్ష నగదు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో భవిష్యత్తులో చక్రధర్గౌడ్ తనకు పోటీ అవుతారని హరీశ్రావు భావించారు.అనంతరం సిద్దిపేట జిల్లాలో ‘అగ్గిపెట్టె మచ్చా‘ పేరిట మ్యాచ్బాక్స్ కంపెనీని ప్రారంభించనున్నట్టు చక్రధర్గౌడ్ ప్రకటించారు. దీనితో హరీశ్రావు చక్రధర్పై శామీర్పేట పోలీసుస్టేషన్లో తప్పుడు కేసు నమోదు చేయించి, అరెస్టు చేయించారు. అయితే 2023 మార్చి 15న చక్రధర్ బీజేపీలో చేరారు. అదే ఏడాది ఏప్రిల్ 28న హైదరాబాద్లోని పంజగుట్ట నాగార్జున సర్కిల్లో చక్రధర్కు చెందిన ‘ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్’ ఆఫీసుకు మఫ్టీలో వచ్చిన పోలీసులు ఆయనను టాస్క్ఫోర్స్ ఓఎస్డీగా ఉన్న పి.రాధాకిషన్రావు ముందు హాజరుపర్చారు.ఆయన చక్రధర్ను తీవ్రస్థాయిలో బెదిరించి, హరీశ్రావు అనుమతి లేకుండా సిద్దిపేట నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని హెచ్చరించారు. ఒకసారి పోలీసులు చక్రధర్ ఐఫోన్ తీసుకుని, తర్వాత తిరిగిచ్చారు. ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా వివరాలన్నీ తెలుసుకుని చక్రధర్ను, అనుచరులను బెదిరించారు. గతంలో మంత్రిగా పనిచేసిన హరీశ్రావు అధికార దురి్వనియోగానికి పాల్పడి ఈ చర్యలకు పాల్పడ్డారు’’ అని పోలీసులు ఎఫ్ఆర్లో పేర్కొన్నారు. -
లక్ష తప్పుడు కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను. మాజీమంత్రి హరీశ్రావు వ్యాఖ్య.. ఇంకా ఇతర అప్డేట్స్
-
లక్ష కేసులు పెట్టినా నన్ను ఆపలేరు..
-
మిస్టర్ రేవంత్.. అంత వరకు నేను ఆగను: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం అంటూ విమర్శించారు. ఇదే సమయంలో తనపై లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, తాను మాత్రం ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను అంటూ వార్నింగ్ ఇచ్చారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా..‘మిస్టర్ రేవంత్ రెడ్డి.. అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం.రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినవు అని అన్నందుకు యాదగిరి గుట్ట పోలీసు స్టేషన్లో తప్పుడు కేసు పెట్టించినవు. ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగం బజార్ పోలీసు స్టేషన్లో తప్పుడు కేసు పెట్టించినవు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో నా మీద సంబంధం లేని కేసు పెట్టించావు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డుమీద ఈకలు పీకి, తలాతోక లేని కేసు మానకొండూరులో అక్రమ కేసు పెట్టించినవు.నీ రెండు నాలుకల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఇవాళ పంజాగుట్ట స్టేషన్లో మరో తప్పుడు కేసు పెట్టించినవు. నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను. #CongressFailedTelangana అంటూ ఘాటు విమర్శలు చేశారు. మిస్టర్ @revanth_anumula అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు.నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం,…— Harish Rao Thanneeru (@BRSHarish) December 3, 2024 -
బాచుపల్లికి చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో హరీష్రరావుపై కేసు
-
ఫోన్ట్యాపింగ్ ఆరోపణలు..హరీశ్రావుపై కేసు నమోదు
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్రావుపై మంగళవారం(డిసెంబర్3) కేసు నమోదైంది. తన ఫోన్ ట్యాప్ చేశారని బాచుపల్లికి చెందిన చక్రధర్గౌడ్ హరీశ్రావుపై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పంజాగుట్ట పోలీసులు హరీశ్రావుపై 120బి,386,409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీశ్రావుతో పాటు టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావును కూడా పోలీసులు చేర్చడం గమనార్హం. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఫోన్ట్యాపింగ్ కేసు విచారణలో ఉంది. బీఆర్ఎస్ హయాంలో టాస్క్ఫోర్స్లో పనిచేసిన పలువురు పోలీసు అధికారులను ఈ కేసులో అరెస్టు చేశారు.ఇటీవలే ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలకనేత హరీశ్రావుపై ఫోన్ట్యాపింగ్ ఆరోపణలపై మరో కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.ఇదీ చదవండి: ప్రభుత్వ వైఫల్యాలపై 7న ఛార్జ్షీట్: హరీశ్రావు -
ప్రభుత్వ వైఫల్యాలపై 7న చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి రెండు నాలుకల మనిషి అని, అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు ప్రజలను నిలువునా ముంచేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. పూటకో రకంగా మాట్లాడే విద్యలో రేవంత్ పీహెచ్డీ చేశాడని ఎద్దేవా చేశారు. రేవంత్ నిజ స్వరూపాన్ని ప్రజల ముందు పెట్టాలన్నదే తన ప్రయత్నమని చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ నెల 7న ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ సవివర చార్జిషీట్ విడుదల చేస్తామని ప్రకటించారు.సోమవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు మహమూద్ అలీ, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్రెడ్డి, మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, చిరుమర్తి లింగయ్య తదితరులతో కలసి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ‘గత ఏడాది పాలనలో సీఎం ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పట్టే ఆణిముత్యాలు’ అంటూ వివిధ అంశాలపై రేవంత్ చేసిన ప్రకటనల వీడియో క్లిప్పింగులను హరీశ్రావు విడుదల చేశారు.ఏడాది పాలనలో ఎడతెగని వంచనతెలంగాణ ప్రజలను మోసగించడం, వంచించడం రేవంత్ నైజమని హరీశ్ విమర్శించారు. ఏడాది నుంచి ఫిరాయింపులు, దబాయింపులు, బుకాయింపులతో పాలన సాగుతోందని.. సీఎం అపరిచితుడిలా పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. మూడో పంటకు రైతు బంధు ఇవ్వాలని... కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని ప్రకటించిన రేవంత్ ప్రస్తుతం మాట మార్చారని ఆరోపించారు.‘బతుకమ్మ చీరల పథకం, ఎల్ఆర్ఎస్, పోటీ పరీక్షల వాయిదా, కుల సర్వే, ఆక్రమణల కూల్చివేతలు వంటి అంశాలపై రేవంత్ మాటలు మారుస్తున్నారు. ఏక్ పోలీసు విధానం, మద్యం, కాళేశ్వరం ప్రాజెక్టు తదితర అంశాలపై రేవంత్ మాటలు మార్చారు. పచ్చ పార్టీలో ఉన్నప్పుడు సోనియాను బలిదేవత అన్నారు.. ఇప్పుడు అమ్మ అంటున్నారు. రేవంత్ అవసరమొస్తే కాళ్లు పట్టగలడు, అవసరం తీరిన తర్వాత కాళ్లు లాగగలడు..’’ అని హరీశ్ వ్యాఖ్యానించారు.నిర్బంధాలు, అణచివేతలే..కాంగ్రెస్ ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెప్పిందని... గత ఏడాది పాలనలో నిర్బంధాలు, అణచివేతలు, లాఠీచార్జీలు, కంచెలు, ఆంక్షలు నిత్యకృత్యం అయ్యాయని హరీశ్ ఆరోపించారు. న్యాయం కావాలని రోడ్డెక్కిన నిరుద్యోగులపై కేసులు, లగచర్ల గిరిజనులపై దాడులు ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరిట ప్రజాస్వామ్య హననానికి పాల్పడుతున్నారని.. రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులను కాలరాసి, రాక్షస పాలన కొనసాగిస్తురని మండిపడ్డారు. విపక్ష నేతగా నక్సలైట్లపై మొసలి కన్నీరు కార్చిన రేవంత్.. బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని ఆరోపించారు. -
సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే
-
అన్నీ అబద్ధాలు.. అసత్య ప్రచారాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నీ అబద్ధాలు, అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ‘ఈ సర్కారు ఉత్త బేకారు ఉన్నదని ప్రజలు అనుకుంటున్నరు. ఎవరు మెచ్చుకునే పరిస్థితి లేదు గనుక, ముఖ్యమంత్రి తన భుజం తానే తట్టుకుంటున్నడు. మాది సుపరిపాలన అని డబ్బా కొట్టుకుంటున్నడు’అని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో హరీశ్రావు పేర్కొన్నారు.సీఎం రేవంత్ అపరిపక్వత (ఇమ్మెచ్యూరిటీ), అసమర్థత (ఇన్ క్యాపబులిటీ), ప్రతికూల వైఖరి (నెగెటివ్ ఆటి ట్యూడ్)తో రాష్ట్రంలో అన్నిరంగాల్లో ప్రతికూల వాతావరణం నెలకొందన్నారు. ‘మేము మంచి ఆర్థిక/వృద్ధితో రాష్ట్రాన్ని అప్పగిస్తే, నీ రాక తర్వాత ఆశించిన మేరకు ఆర్థికవృద్ధి రేటు పెరగలేదు. వృద్ధి రేటు పెంచే సత్తా లేదు, సంపద పెంచలేక, ప్రజలకు పంచలేక నోటికి వచ్చినట్టు వాగుతున్నావు. నెపం ప్రతిపక్షం మీదకు నెట్టుతున్నవు.కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే.. ముందు దగా, వెనుక దగా, కుడి ఎడమల దగా దగా అన్న శ్రీశ్రీ కవిత లాగ ఉంది’అని హరీశ్రావు విమర్శించారు. ‘ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి రైతుబంధు ఆపిన విషయం, అధికారంలోకి వస్తే 15వేలు ఇస్తామని చెప్పిన విషయం. నీకు గుర్తులేకపోవచ్చు రేవంత్రెడ్డి. ఆ ఫిర్యాదు కాపీ, ఎన్నికల కమిషన్ ఆదేశాలను, మీరు మాట్లాడిన వీడియోను పంపుతున్నా చూడండి’ అని హరీశ్రావు పేర్కొన్నారు. -
తెలంగాణకు మణిహారం.. తెలుగు ప్రజలకు సంజీవని
సాక్షి, సిద్దిపేట: మరణం అంచుకి వెళ్లిన చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేసి పునర్జన్మనిస్తూ, తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా, తెలుగు ప్రజలకు సంజీవనిలా సత్యసాయి ఆస్పత్రి సేవలందిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో శ్రీసత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్కేర్, రీసెర్చ్లో తొలిసారి గుండె ఆపరేషన్లు జరగ్గా.. శనివారం హరీశ్రావు సందర్శించిన అనంతరం మాట్లాడారు. దేశంలో 5వ ఆస్పత్రిని సిద్దిపేటలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం చేయని పనిని సత్యసాయి ట్రస్ట్, మధుసూదన్ సాయి చేస్తున్నారని కొనియాడారు. గుండె ఆపరేషన్ల కోసం రూ.3 నుంచి రూ.5 లక్షలు ఖర్చు పెట్టలేక ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని, ఉచితంగా సర్జరీలు చేయడం అభినందనీయం అని హరీశ్రావు పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో 5.77 లక్షల మందికి ఓపీ, 33,600 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేశారన్నారు. ఆరు రోజుల్లో 18 మంది చిన్నారులకు సర్జరీలు పూర్తి చేసి వారికి పునర్జన్మ ప్రసాదించడం గొప్ప విషయం అని కొనియాడారు. మధుసూదన్ సాయి కళాశాల వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమానికి వచి్చనప్పుడు ఇక్కడ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని 2022లో కోరానని, దీంతో స్పందించి 2023లో ఓపీ ప్రారంభించారని తెలిపారు. మంత్రి, ఎమ్మెల్యే పదవుల్లో అనుభూతి కంటే గుండె ఆపరేషన్ అయిన తర్వాత పిల్లల్లో సంతోషం చూసి తన జన్మ ధన్యమైందన్నారు.శ్రీసత్యసాయి ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ మొదట కొండపాకలో యంగ్ అడోల్సెంట్ కార్యక్రమం నిర్వహించాలనుకున్నా.. హరీశ్రావు చొరవతో ఇక్కడ గుండె శస్త్రచికిత్సల ఆస్పత్రిని ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్కఫొటోతో బాడీ ప్రొఫైల్ వచ్చే విధంగా హెచ్డీ స్టెత్తో గుండె పనితీరు తెలుసుకునే అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమణాచారి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొన్నారు. ఆరు నెలల కిందట తెలిసింది నా బిడ్డ పేరు రక్ష. వయసు పదేళ్లు. ఆర్నెల్ల కిందట నిలోఫర్లో డాక్టర్లు పరిశీలించి గుండెలో హోల్ ఉందని చెప్పారు. బయట ఆస్పత్రుల్లో రూ.5 లక్షలు అవుతాయన్నారు. అయితే సిద్దిపేటలో ఫ్రీగా గుండె ఆపరేషన్లు చేస్తారని నిలోఫర్ డాక్టర్లు చెప్పారు. దీంతో అక్కడ ఆపరేషన్ చేయించాం. ఈ డాక్టర్లకు, ట్రస్ట్కు మేము రుణపడి ఉంటాం. నా బిడ్డ కూడా డాక్టర్ అయి ఇలా ఉచితంగా సేవలందిస్తుంది. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేంమాది మెదక్ జిల్లా చిన్నశంకరంపే ట. మెకానిక్ గా పని చేస్తా. నా బిడ్డ వయసు ఆరేళ్లు. దగ్గు, జలుబు, వాంతులు అయ్యా యి. అప్పుడు వెంటనే లోకల్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం. వారు చూసి గుండె స్పీడ్ గా కొ ట్టుకుంటోంది అని చెప్పారు. దీంతో నిమ్స్, నిలోఫర్ ఆ స్పత్రులు తిరిగాం. ఇక్కడ ఫ్రీగా చేస్తారని తెలిసింది వెంటనే వచ్చాం. నా బిడ్డకు పునర్జన్మనిచి్చన డాక్టర్లు, ట్రస్ట్ వారికి ఏమిచి్చనా రుణం తీర్చుకోలేం. -
‘రైతుపండుగ’పై హరీశ్రావు సెటైర్లు
సాక్షి,హైదరాబాద్:రైతులను విజయవంతంగా మోసం చేసినందుకు రైతు పండుగ నిర్వహిస్తున్నావా రేవంత్రెడ్డి? అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు నిలదీశారు. ఈ మేరకు హరీశ్రావు శనివారం(నవంబర్ 30) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘మేనిఫెస్టోలో చెప్పి,రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక దగా చేసినందుకు విజయోత్సవాలా రేవంత్ రెడ్డి? రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని నిలిపివేసే కుట్రను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.నేడు మహబూబ్నగర్లో నిర్వహించే కార్యక్రమంలో రైతు బంధు అమలుపై స్పష్టత ఇవ్వాలి.పెండింగ్లో ఉన్న వానకాలం రైతుబంధుతో పాటు యాసంగికి పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. -
మరోమారు పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది
-
రేవంత్రెడ్డి ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నారా?
సాక్షి, సిద్దిపేట: సీఎం రేవంత్ రెడ్డి ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నా రా? ఉద్యమంలో ఒక్క కేసైనా ఉందా? ఒక్కనాడైనా అమరులకు పూ లు వేశారా? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. ‘కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాడట. అలుగునూరులో కేసీ ఆర్ను అరెస్టు చేసిన ఆనవాళ్లు, ఖమ్మం జైలులో దీక్ష చేసిన అనవాళ్లు తుడుస్తావా? లేదా తెలంగాణ సాధించి, తెలంగాణ తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆనవాళ్లు తుడిచి వేస్తావా?’అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009, నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన దీక్షను గుర్తు చేస్తూ శుక్రవారం సిద్దిపేటలో దీక్షా దివస్ను చేపట్టారు.ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడారు. లగచర్లలో గిరిజనులు తిరగబడితే వెనక్కి తగ్గారని, హైదరాబాద్లో హైడ్రా, మూసీలపై పేదలు తిరగబడటం, పోరాటాల ఫలితంగా రేవంత్ వెనక్కి తగ్గారన్నారు. డిసెంబర్ 9న చేసిన తెలంగాణ ప్రకటనను ఆంధ్రవారికి తలొగ్గి కేంద్రంలోని కాంగ్రెస్ డిసెంబర్ 23న వెనక్కి తీసుకుందని గుర్తుచేశారు. నాడు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని కోరితే సీఎం రేవంత్ రెడ్డి, కిషన్రెడ్డి చేయలేదని హరీశ్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్, టీడీపీ తెలంగాణకు అనుకూలమని తీర్మానాలు చేసి, అవసరాలు తీరాక మాట మార్చారని మండిపడ్డారు. బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి మాట తప్పిందన్నారు. ప్రజావ్యతిరేక సర్కార్ను గద్దె దించుదాం కేసీఆర్ దీక్ష స్ఫూర్తితో ఈ ప్రజావ్యతిరేక సర్కారును గద్దె దించేవరకు రైతులు, యువకులు, బాధితుల పక్షాన పోరాటానికి సంకల్పం తీసుకుందామని హరీశ్రావు పిలుపునిచ్చారు. కొందరు దొంగలు పారీ్టలోకి వచ్చి పందికొక్కుల్లాగా తిని వెళ్లిపోయారని విరుచుకుపడ్డారు. తెలంగాణను కాపాడాలని ఆ రోజు కేసీఆర్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, ఇకపై అలాంటి వారికి పారీ్టలో చోటు ఉండదని హరీశ్రావు స్పష్టం చేశారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరుల స్తూపానికి నివాళులరి్పంచారు. పార్టీ కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమంలో చేసిన దీక్షలు, ఆందోళన ఫొటోలతో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డితో పాటు నాయకులు పాల్గొన్నారు. -
కేటీఆర్, హరీష్ రావులది నా స్థాయి కాదు: కోమటిరెడ్డి
సాక్షి, నల్గొండ జిల్లా: కేటీఆర్, హరీష్ రావులది తన స్థాయి కాదని.. వాళ్లు కేవలం కేసీఆర్ కుమారుడు, అల్లుడు మాత్రమేనంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడారు.‘‘బంగారు తెలంగాణ అంటూ అప్పులు చేసి కేసీఆర్ ఫాంహౌస్లో పడుకున్నాడు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు అవుతున్నాయా?. ఇప్పటికే 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. మిగతా రుణమాఫీ ఈ నెల 30న చేస్తాం’’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.మోదీ సొంత రాష్ట్రంలో పదమూడు వందలకు గ్యాస్ సిలిండర్ విక్రయిస్తున్నారు. తెలంగాణలో రూ.500కే సిలిండర్ ఇస్తున్నాం. రూ.500కే గ్యాస్ ఎందుకు ఇవ్వడం లేదో ప్రధాన మోదీ, బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి’’ అని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తారిలా మార్చారు. ఒక ఇళ్లు కట్టకుండా కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పులు చేశాడుకేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకుంటే మోదీ విదేశాల్లో తిరుగుతున్నారు. డిసెంబరు మొదటి వారంలో సీఎం రేవంత్ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తారు’’ అని కోమటిరెడ్డి తెలిపారు. -
మూసీ రివర్ పై సర్కారు వాస్తవాలు దాచి పెడుతుంది: హరీష్ రావు
-
పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. చికిత్స పొందుతూ విద్యార్థిని శైలజ మృతి
సాక్షి, హైదరాబాద్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్కి గురై గత కొన్ని రోజులుగా నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి చెందింది. అక్టోబర్ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగగా 64 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు (మహాలక్ష్మి, జ్యోతి, శైలజ) పరిస్థితి సీరియస్గా ఉండడంతో హైదరాబాద్లోని నిమ్స్లో చేర్పించారు.వీరిలో మహాలక్ష్మి, జ్యోతి కోలుకోగా శైలజ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆమెకు ఉపిరితిత్తుల సమస్యతో పాటు మూత్రపిండాలపై ప్రభావం పడింది. దీంతో పలుసార్లు వైద్యులు డయాలసిస్ చేశారు. ఈ నెల 11 నుంచి శైలజను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో శైలజ నేడు మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కాగా దీనిపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ శైలజ మృతి ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యానికి బలైపోయిన వాంకిడి గిరిజన గురుకుల విద్యార్థిని శైలజకు కన్నీటి నివాళి అర్పిస్తున్నట్లు మాజీ మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు. మీ ప్రాణాలు బలి తీసుకున్న పాపం.. ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతదన్నారు. గిరిజన విద్యార్థినీ కుటుంబానికి బాధ్యత వహించి రూ. 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్రావు పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పరిపాలన మరో పేదబిడ్డ ప్రాణం తీసిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కన్నతల్లికి కడుపు కోత మిగిల్చింది. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురై 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శైలజ మరణ వార్త తననును ఎంతగానో కలచి వేసింది అని కవిత పేర్కొన్నారు.ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది ప్రాణాలు బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సంక్షేమ పాఠశాలలో కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టకుండా, పదకొండు నెలల్లో 43 మంది విద్యార్థుల ప్రాణాలు తీసింది. ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలే అని కవిత ఆరోపించారు. -
‘‘100 కోట్లు వెనక్కి సరే.. ఒప్పందాల మాటేమిటి రేవంత్?’’
సాక్షి,హైదరాబాద్ : రూ.100 కోట్ల నిధులు వెనక్కి ఇస్తున్నారు సరే.. అదానీతో కుదుర్చుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతి ఏంటని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన రూ.100 కోట్ల నిధులను వెనక్కి ఇస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి అధికారికంగా ప్రకటించారు. రేవంత్ సర్కార్ నిర్ణయంపై హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రేవంత్రెడ్డి .. మరి, రాహుల్ గాంధీ అదాని అవినీతి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్ లో మీరు ఆదానితో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతేమిటి?అదానీకి రాష్ట్రంలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు మీరు చేస్తున్న కుట్రల మాటేమిటి?. 20 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడుతామనే ప్రతిపాదనతో వస్తే, మర్యాదపూర్వకంగా కలిసి చాయ్ తాగించి పంపించేశాం. కానీ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించింది. రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచింది.ఢిల్లీలో రాహుల్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆదానితో రేవంత్ రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నాడు. ఇప్పుడు ఆదాని అవినీతి బయటికిరాగానే మాట మార్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లో హరీష్ రావు స్పష్టం చేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారూ...మరి, రాహుల్ గాంధీ గారు అదాని అవినీతి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్ లో మీరు ఆదానితో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల… pic.twitter.com/XuxVIF7IgM— Harish Rao Thanneeru (@BRSHarish) November 25, 2024 -
Harishrao: అబద్ధాలు ఆడడంలో రేవంత్కు డాక్టరేట్ ఇవ్వాలి
సాక్షి, కరీంనగర్ జిల్లా: అబద్ధాలు చెప్పడంలో రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డికి డాక్టరేట్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. హుజూరాబాద్లో బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశం జరిగింది.ఈ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. ‘అబద్ధాలు చెప్పడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డాక్టరేట్ ఇవ్వాలి. అందుకే ఇక్కడి ఆరు గ్యారంటీల మోసాన్ని గ్రహించే.. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ను ఓడించి బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు, సీఎం కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకుని ఆరు గ్యారంటీలు అమలు చేయాలి.మీరు ఇచ్చిన ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యం కూడా తెలంగాణాలో ఖూనీ అయిపోయింది. హుజూరాబాద్లో కొందరికి దళితబంధు ఆగింది. ఆగిపోయిన దళితబంధు రెండోవిడత డబ్బులిమ్మంటే పోలీసులతో దాడి చేయించారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దళితులకు చేసే మేలు ఇదేనా..? జులై 19, 2024 నాడు ఫార్మాసిటీ పేరిట గెజిట్ ఇచ్చి.. ఇప్పుడు ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ సీఎం మాట మారుస్తున్నారు. పచ్చని పంటలు పండే భూములను.. తొండలు గుడ్డు పెట్టని భూములుగా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు.కాళేశ్వరం కూలిపోయిందని చెబుతున్న నీవు.. 20 టీఎంసీల నీటిని అదే ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ కు ఎలా తీసుకెళ్తావు? మిషన్ భగీరథపై సాక్షాత్తు ప్రధానమంత్రి లోక్ సభలో మెచ్చుకున్నది నిజం కాదా..?. ఇవాళ కోటి 60 లక్షల ధాన్యం పండడానికి కాంగ్రెస్ ఘనత అని చెప్పుకుంటున్నాడు రేవంత్రెడ్డి.తెలంగాణ రావడానికి ముందు ఇక్కడ పండింది 30 లక్షల మెట్రిక్ టన్నులే.. కేసీఆర్ హయాంలోనే కోటి 56 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది. వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఒక్కటైనా అమలైందా..? హుజూరాబాద్లో దళిత సోదరులపై పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నాం. డిసెంబర్ 9 నుంచి జరిగే అసెంబ్లీలో దళితుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం’ అని హరీష్రావు అన్నారు. -
మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారు: హరీష్ రావు
-
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ కామెంట్
సాక్షి, హైదరాబాద్: దేశ భవిష్యత్తుకు ప్రాంతీయ పార్టీలే బలమైన పునాదులని మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని కాంగ్రెస్ పార్టీ...దేశంలో ప్రాంతీయ పార్టీలను నాశనం చేసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ చేతగానీ, అసమర్థత కారణంగానే బీజేపీ మనుగడ కొనసాగుతోందని విమర్శలు గుప్పించారు.ఈ మేరకు ఎక్స్లో కేటీఆర్ స్పందిస్తూ.. ‘ప్రాంతీయ పార్టీల కృషిని విస్మరిస్తూ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి నీ స్పీచ్లు, బ్యాగులు, ఛాపర్లు కూడా మీ పార్టీని ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాయి. ఆయన అసత్య ప్రచారాన్ని మరాఠా ప్రజలు నమ్మలేదుఇకనైనా తెలంగాణలో గెలిపించి ప్రజల కోసం.. వాళ్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చటం కోసం పనిచేయాలి. ఏడాది క్రితం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలుపై దృష్టి పెట్టాలి. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనే కుట్రలో కాంగ్రెస్ ఎక్కువ కాదు.. బీజేపీ తక్కువ కాదు’అని కేటీఆర్ పేర్కొన్నారు.హేమంత్ సోరేన్ కు శుభాకాంక్షలు: హరీష్ రావు‘మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీ ప్రజలు నమ్మలేదు అని స్పష్టం అయ్యింది. ెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారు. తెలంగాణలో మహిళలకు ₹ 2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్ర లో రూ.3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసారా ధోఖ, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వంటివి మహారాష్ట్రలో తీవ్ర ప్రభావం చూపెట్టాయి. తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలోని ముంబై, షోలాపూర్, పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తుండడం వలన కాంగ్రెస్ మోసాలు విరివిగా మహారాష్ట్ర లో ప్రచారం అయ్యాయి అనేది సుస్పష్టం. బీజేపీ పార్టీ.. హేమంత్ సోరేన్ పై పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు, పార్టీ చీల్చే ప్రయత్నాలను జార్ఖండ్ ప్రజలు తిప్పి కొట్టారు. బీజేపీ కక్ష సాధింపు విధానాలని ప్రజలు హర్శించడం లేదని తేలిపోయింది. విజయం సాధించిన హేమంత్ సోరేన్ కు శుభాకాంక్షలు.’ అని తెలిపారు -
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసింది
-
ఎనుముల కాదు.. ‘ఎగవేతల’ రేవంత్రెడ్డి: హరీష్రావు సెటైర్లు
సాక్షి, ఖమ్మం జిల్లా: చింతకాని మండలంలోని మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్ పర్యటించారు. భూ వివాదంలో ఆత్మహత్యకు పాల్పడిన బోజెడ్ల ప్రభాకర్రావు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం సభలో హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మార్పు వచ్చిందని.. అన్ని సంక్షేమ పథకాలు ఆగిపోయాయన్నారు.‘‘కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసింది. ఆరు లక్షల తులాల బంగారం కళ్యాణలక్ష్మీకి బాకీ పడింది. భద్రాద్రి రాములోరి సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు. పాలకుడే మాట తప్పితే.. ప్రజలకు అన్యాయం జరుగుతుంది. యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకుని ఈ ముఖ్యమంత్రికి మంచి బుద్ధి ప్రసాదించమని కోరుకున్నా.. కాంగ్రెస్లో పనిచేసేది తక్కువ.. లొల్లి మాత్రం ఎక్కువ’’ అంటూ హరీష్రావు ఎద్దేవా చేశారు.‘‘ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఇంటింటికి బాండ్ పేపర్ ఇచ్చారు.. అమలు చేశారా?. ఏడాది పాలనలో ఆత్మ విమర్శలు చేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కరోనా కష్టకాలంలో కూడా రైతులకు కేసీఆర్ రైతుబంధు ఇచ్చారు. ఏ ఒక్క హామీ అమలు చేయని మోసపూరిత పార్టీ కాంగ్రెస్. ముఖ్యమంత్రి పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి.’’ అంటూ హరీష్రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.‘‘లచ్చగూడెంలో విద్యుత్ షాక్తో మరణించిన ప్రసాద్ అనే రైతుకు ఎక్స్గ్రేషియా అడిగినందుకు అక్రమ కేసులు బనాయించారు. అక్రమంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసు పెడితే.. వడ్డీతో సహా చెల్లిస్తాం. ఆరు గ్యారంటీలు అమలు చేసేలా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా పనిచేపిస్తాం. అధికారం చేపట్టిన దగ్గర నుంచి అవ్వతాతలకు 4 వేల పెన్షన్ ఇవ్వాల్సిందే’’ అని హరీష్రావు డిమాండ్ చేశారు. -
బోనస్ను బోగస్ చేసిన కాంగ్రెస్ సర్కార్: హరీష్ రావు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులకు సాయం చేయలేని ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఒక్కటేనని ఘాటు విమర్శలు చేశారు. అలాగే, ఈరోజు పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు గురువారం ఉదయం ఖమ్మంలోని పత్తి మార్కెట్ను సందర్శించారు. ఈ క్రమంలో రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, హరీష్ మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్లో ఒకటి ఖమ్మం పత్తి మార్కెట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పరిస్థితి దారుణంగా మారింది. వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. పత్తికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఆ బోనస్ను బోగస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం మద్దతు ధర వచ్చే పరిస్థితి కూడా లేదు.మార్కెట్ సెక్రటరీ ఇచ్చిన లెక్కల ప్రకారం రూ.6,500 మద్దతు ధర దాటడం లేదు. అకాల వర్షాలతో పంట దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కనీసం మద్దతు ధరకు కూడా పండించలేని పరిస్థితి ఉంది. రూ.500 బోనస్ దేవుడే ఎరుగు, కానీ మద్దతు ధరకు వెయ్యి రూపాయలు రైతు నష్టపోతున్నారు. రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇబ్బంది?. రైతులను ఆదుకోలేదు, వ్యవసాయ కూలీలను ఆదుకోలేదు, ఏ ఒక్క వర్గాన్నీ ఆదుకోలేదు. పత్తి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. పత్తి మద్దతు ధర రూ.7,500 ఉండాల్సి ఉండగా, కేవలం రూ.6,500 మాత్రమే రైతులకు అందిస్తున్నారు. ఇవి మార్కెట్ యార్డ్ సెక్రటరీ ఇచ్చిన లెక్కలే. ఖమ్మం పత్తి మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి.శంకర్ రమాదేవి అనే రైతులు ఎనిమిది ఎకరాల్లో పత్తి పండిస్తే, కనీసం ఐదు క్వింటాళ్ల పంట కూడా రాలేదని, వచ్చిన దానికి కూడా మద్దతు ధర ఇవ్వడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021లో రూ.11,000కు పత్తి కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు సగానికి సగం పత్తి ధర పడిపోయింది? ఇది దళారుల దోపిడీ వల్లే. రూ.7,520 మద్దతు ధరను పత్తి రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు కనీసం రూ.500 బోనస్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. దళారులు రూ.6,500కు పత్తి కొనుగోలు చేసి, సీసీఐ కేంద్రాలకు రూ.7,500కు అమ్ముతున్నారు.మిర్చి రైతులను కూడా ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసింది. గత సంవత్సరం రూ.23,000 మద్దతు ధర వస్తే, ఈసారి రూ.13,000 కూడా రావడం లేదు. మాయమాటలు చెప్పి రైతులను నట్టేట ముంచడం మంచిది కాదు. రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారు. రూ.15,000 రైతు భరోసాను ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. రూ.15,000 కౌలు రైతులకు ఇస్తామని ఇవ్వలేదు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా, ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు.ఒకరిపై ఒకరు పైచేయి కోసం పాకులాటమే తప్ప, ప్రజా సమస్యల కోసం పనిచేయడం లేదు. నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లు ఖమ్మం జిల్లాలో పండితే, ఇప్పటివరకు 19 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఒక రైతుకైనా వడ్లకు బోనస్ వచ్చిందా?. సకాలంలో మిల్లులు అనుసంధానం చేయకపోవడం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడం వల్ల ధాన్యం దళారుల పాలైంది. సీసీఐ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం పెట్టామని చెబుతున్నా, వాస్తవానికి సీసీఐ కేంద్రాలు కనబడటం లేదు.ముఖ్యమంత్రి పత్తి కొనుగోలుపై సమీక్ష చేయడం లేదు. మద్యం అమ్మకాలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.. కానీ పత్తి, వరి కొనుగోళ్లపై సమీక్ష ఎందుకు చేయడం లేదు. మద్దతు ధరకు ధాన్యం కొనకపోతే, ఎవరికీ మెమోలు జారీ చేయడం లేదు. తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా చేయాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారేమో?. ఈరోజు పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అన్ని రకాల పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. -
దమ్ముంటే కబ్జా నిరూపించు..: హరీశ్రావు
వట్పల్లి (అందోల్): రంగనాయక్ సాగర్ వద్ద ఇరిగేషన్ భూములను తాను ఆక్రమించలేదని, రైతుల వద్ద 13 ఎకరాల పట్టా భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు చెప్పారు. దమ్ముంటే కబ్జాలను నిరూపించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సవాల్ విసిరారు. గురువారం అందోల్ మండల పరిధిలోని మాసాన్పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు విలేకరులతో మాట్లాడారు. పేదల భూములను, ప్రభుత్వ భూములను కబ్జా చేసే అలవాటు తమకు లేదని, అటువంటి చరిత్ర రేవంత్దేనన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించగా, పౌరసరఫరాల శాఖ కమిషనర్ మాత్రం 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారని, దీంతో మిగతా 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దళారుల పాలైందని అన్నారు. ఈ సీజన్లో 40 నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే పరిస్థితిలేదన్నారు. బోనస్ మాట దేవుడెరుగు మద్దతు ధర కంటే రూ.500 తక్కువకు రైతులు ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యం అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత, గిరిజనుల భుములను కంపెనీల పేరుమీద కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ ప్రశ్నించేవారి గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారంటీల అమలు జరిగేదాకా కేసీఆర్ నాయకత్వంలో ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, టీజీటీపీసీ మాజీ చైర్మన్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
హరీశ్రావు కొన్న భూములపై విచారణ: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దగ్గర రైతులను బెదిరించి అప్పటి మంత్రి హరీశ్రావు భూములు కొనుగోలు చేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ రిజర్వాయర్ కోసం తొలుత భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారని.. దీనివల్ల రైతుల భూములు పోతాయని బెదిరించి హరీశ్ ఆ భూములు కొన్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. హరీశ్ భూములు కొన్నాక భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేశారని దుయ్యబట్టారు. రైతుల నుంచి చట్టబద్ధంగా భూములు కొన్నానని... ధరణిలో రికార్డు కోసం ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లాలని చెబుతున్న హరీశ్రావు.. భూసేకరణ నోటిఫికేషన్ విషయాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదని పొంగులేటి ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో పొంగులేటి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఒకసారి నోటిఫికేషన్ జారీ అయ్యాక దాన్ని రద్దు చేయలేరని.. గతంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ శివార్లలో భూసేకరణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ ఇప్పటికీ మనుగడలో ఉందని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆరెస్టు చేయట్లేదంటూ ప్రశ్నిస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి.. అందుకు వీలుగా గవర్నర్ చేత అనుమతి ఇప్పించాలని సూచించారు. పక్కా ఆధారాలతోనే ముందుకు వెళ్తున్నామని, తొందరపడి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన తమకు లేదని మంత్రి చెప్పారు. డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం అవుతాయని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ సమావేశాల్లో రికార్డ్స్ ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్) చట్టాన్ని తీసుకొస్తామన్నారు. అలాగే కులగణన, రైతు రుణమాఫీ, మూసీ పునరుజ్జీవం తదితర అంశాలను చర్చించే అవకాశం ఉందని చెప్పారు. డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాల అనంతరం సచివాలయంలో తెలుగుతల్లి విగ్రహావిష్కరణ, సోనియాగా>ంధీ జన్మదిన వేడుకలతోపాటు బహిరంగ సభను నిర్వహించనున్నట్లు వివరించారు. కాగా, ఛత్తీస్గఢ్తో నాటి ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంతోపాటు యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి జస్టిస్ మదన్ బి. లోకూర్ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చంచనున్నట్లు సమాచారం. కేంద్రం స్పష్టత ఇస్తే ఇందిరమ్మ ఇళ్లలో వేగం.. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు కాస్త అస్పష్టంగా ఉన్నాయని, వాటిపై స్పష్టత కోరుతున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. కేంద్రం నుంచి స్పష్టత వస్తే ఇందిరమ్మ ఇళ్లలో వేగం పెరుగుతుందన్నారు. ఒకసారి లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమైతే పథకం వేగం పుంజుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మంత్రివర్గ విస్తరణ! మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల తర్వాత రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి అన్నారు. మంత్రులుగా ఎవరెవరికి అవకాశం ఉంటుందన్న ప్రశ్నకు ఆయన నేరుగా స్పందించలేదు. తాను మంత్రిని మాత్రమేనని, మంత్రి పదవులు ఇప్పించే స్థాయిలో లేనని వ్యాఖ్యానించారు. -
ఇరిగేషన్ భూములు కబ్జా చేశానని నాపై తప్పుడు ఆరోపణలు: హరీష్
-
కబ్జాల చరిత్ర రేవంత్ రెడ్డిదే: హరీష్ రావు
సాక్షి, సంగారెడ్డి: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. భూ కబ్జాలకు పాల్పడుతున్నానంటూ సీఎం రేవంత్ తప్పుడు ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపుతున్నాడని, కబ్జాల చరిత్ర ఆయనదేనని మండిపడ్డారు. గురువారం అందోల్ మండలం మాసాన్పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని తనపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేశారని మండిపడ్డారు.పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు కబ్జాలు చేసే చరిత్ర నీదని ధ్వజమెత్తారు. రైతుల పట్టా భూములను ధరణి ద్వారా13 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వివరించారు. ఒక గుంట కానీ, ఒక ఎకరా కానీ ఇరిగేషన్ భూమి కానీ, ప్రభుత్వ భూమి కానీ తీసుకున్నట్టు నా చరిత్రలో లేదని స్పష్టం చేశారు. ఏ భూమిని అయితే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానో ఆ భూమిలోనే ఉన్నానని, రంగనాయకసాగర్ దగ్గరికి రా.. కలిసి భూమిని కొలుద్దామని సవాల్ విసిరారుజ‘నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు రేవంత్ రెడ్డి.. నీ సమక్షంలోనే సర్వే చేద్దాం. నువ్వు ఎన్ని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసినా భయపడేది లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డి రైతులకు తొమ్మిది హామీలను అమలు చేస్తామని ప్రకటించారు. ఇందులో ఏ ఒక్క హామీనైనా నెరవేర్చగలిగాడా?’ అని ప్రశ్నించారు. -
ప్రభుత్వ స్కూల్లో ఫుడ్పాయిజన్.. హరీశ్రావు ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్పై మాజీ మంత్రి,బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్రావు ఆగ్రహం వ్వక్తం చేశారు. తాజాగా నారాయణపేట ప్రభుత్వ పాఠశాలలో భోజనం తిని 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై బుధవారం(నవంబర్20) ఒక ప్రకటన విడుదల చేశారు. అవి గురుకులాలా లేక నరక కూపాలా? ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విష వలయాలా? అని ప్రశ్నించారు.‘నల్లగొండ జిల్లాలో పాముకాటుకు గురైన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.నారాయణపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. రాష్ట్రంలోని గురుకులాల్లో,ప్రభుత్వ పాఠశాలల్లో అసలు ఏం జరుగుతున్నది.పాఠాలు నేర్చుకోవడం కాదు ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితిని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.రేవంత్ ఇందుకేనా మీరు విజయోత్సవాలు జరుపుతున్నది? మీ నిర్లక్ష్య పూరిత వైఖరికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి? ఆస్పత్రి పాలైన విద్యార్థులను హైదరాబాదుకు తరలించి మెరుగైన వైద్యం అందించాలి’అని హరీశ్రావు డిమాండ్ చేశారు. -
KCR మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో MLA హరీష్ రావు స్పీచ్
-
11 నెలల పాలనలో బూతులు తప్ప నీతులు లేవు
సాక్షి, హైదరాబాద్: చేతకాని వాడికి మాటలెక్కువ. చేవలేనోడికి బూతులు ఎక్కువ అనే రీతిలో సీఎం రేవంత్రెడ్డి వైఖరి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. వరంగల్ వేదికగా రేవంత్ చేసిన వ్యాఖ్యలపట్ల ఆయన ‘ఎక్స్’వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘11 నెలల పాలనలో సీఎం నోటి వెంట బూతులు తప్ప నీతులు రాలేదు. కాంగ్రెస్ విజయోత్సవ సభ అని పేరు పెట్టుకొని 11 నెలల్లో చేసింది చెప్పుకోవడానికి లేక పిచ్చి మాటలు వదిలిండు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుంచి లంబాడీల బిడ్డల దాకా ఆయన చేసిన ఘోరాలు సమసిపోవు’అని హరీశ్ వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన నీ పాపం పోదు. తొక్కుకుంటూ వచ్చానని గప్పాలు కొడుతున్నవు. నీ వదరుబోతు తనంతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు’అని పేర్కొన్నారు. కాంగ్రెస్ జరపాల్సింది అపజయోత్సవాలు నిర్వహించాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ కవులకు అవమానం: కాళోజీ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఏటా ఇచ్చే పురస్కారాన్ని కవి, రచయిత నలిమెల భాస్కర్కు ప్రదానం చేయకపోవడం శోచనీయమని హరీశ్రావు విమర్శించారు. 2024 సంవత్సరానికి గాను నలిమెల భాస్కర్కు ప్రభుత్వం కాళోజీ సాహితీ పురస్కారాన్ని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కాళోజీ జయంతి సందర్భంగా సాహితీవేత్తలకు పురస్కారాలు అందజేసి గౌరవించే సంస్కృతిని ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా విస్మరించి కవులను అవమానించిందన్నారు. -
విజయోత్సవాలు కాదు.. అపజయోత్సవాలు చేయండి: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను విజయవంతంగా మోసం చేసిందని.. విజయోత్సవాలను కాకుండా అపజయోత్సవాలు నిర్వహించాలంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలని.. వరంగల్ డిక్లరేషన్, మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పది నెలల్లో రాష్ట్రాన్ని పదేళ్ల వెనక్కి తీసుకువెళ్లారని.. ‘ఎవరనుకున్నరు ఇట్లవునని.. ఎవరనుకున్నరు ఇట్లవునని’ ప్రజాకవి కాళోజీ నినదించినట్లు కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగాపడ్డారన్నారు. రైతులు దారుణంగా మోసపోయారని రోరపించారు. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, అపజయాలను కప్పిపుచ్చుకునేందుకు వరంగల్ వేదికగా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు.ఏం సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారు రేవంత్ రెడ్డి? అంటూ హరీష్రావు ప్రశ్నించారు. ఇదే వరంగల్ వేదికగా ఇచ్చిన రైతు డిక్లరేషన్ కు ఏడాది అయినా అతీగతీ లేదని విమర్శించారు. డిక్లరేషన్లో చెప్పిన మొట్టమొదటి హామీ రూ.2లక్షల రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదన్నారు. రైతులు, కౌలు రైతులకు ఇస్తామన్న రూ.15వేల భరోసా దిక్కులేదని.. ఉపాధిహామీ రైతు కూలీలకు ఏడాదికి ఇస్తామన్న 12వేలు ఇవ్వనేలేదన్నారు. పది రకాల పంటలకు ఇస్తామన్న బోనస్ బోగస్ చేశారని విమర్శించారు. ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ఇందుకేనా మీ వరంగల్ విజయోత్సవ సభ రేవంత్ రెడ్డి? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ పది నెలల పాలనలో రాష్ట్రాభివృద్ధి పదేండ్ల వెనక్కి వెళ్లిందని.. కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ, నేడు తిరోగమనం బాట పట్టిందని విమర్శలు గుప్పించారు. -
‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రేవంత్ హిట్ వికెట్
తుర్కయాంజాల్: పేదల ఇళ్ల జోలికెళ్లి సీఎం రేవంత్రెడ్డి హిట్ వికెట్ అయ్యారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్లోని జేబీ క్రికెట్ గ్రౌండ్స్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాధవరం నర్సింహారావు ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ చాంపియన్ ట్రోఫీ– 2024 క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమానికి హరీశ్ ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క పేదవాడి ఇల్లు కూల్చకుండానే తాము అభివృద్ధి చేశామన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేస్తూ సెల్ఫ్ బౌల్డ్ అయిందన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేసిందని, కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కళాశాలల యాజమా న్యాలు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరితే.. 8 శాతం కమీషన్ అడుగుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకేఒక్కడు కేసీఆర్: హరీశ్ రావు‘సహజంగా ఎవరైనా పవర్లో ఉన్న పార్టీ కోసం సినిమా తీస్తారు. కానీ, అధికారంలో లేకపోయినా కేసీఆర్పై సినిమా తీశాడంటే అది రాకేష్లో ఉన్న ప్రేమ అనుకోవచ్చు, లేకుంటే దమ్ము, ధైర్యం అనుకోవచ్చు. ముఖ్యమంత్రులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకేఒక్కడు కేసీఆర్. ఆ అవకాశం ఇంకొకరికి లేదు’ అని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. ‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘కేసీఆర్’ (కేశవ చంద్ర రమావత్) ప్రీ రిలీజ్ వేడుకలో హరీశ్రావు మాట్లాడారు. ‘కేసీఆర్పై రాకేష్ ఒక అద్భుతమైన సినిమా తీయడం చాలా సంతోషం. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు.. ఈ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు. రజనీకాంత్ ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు.. 22 ఏళ్ల తర్వాత నేను ఇక్కడికి వచ్చాను.. నేను హైదరాబాద్లో ఉన్నానా? న్యూయార్క్లో ఉన్నానా? అని అన్నారు. అంటే కేసీఆర్గారు పల్లెల్నీ అభివృద్ధి చేశారు. హైదరాబాద్నీ అభివృద్ధి చేశారు.’ అని చెప్పారు. -
రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ మాట అన్నారు: మూవీ ఈవెంట్లో హరీశ్ రావు
జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్). గరుడవేగ అంజి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య కృష్ణన్ కథానాయికగా నటించారు. రాకింగ్ రాకేష్ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి, తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..'ముఖ్యమంత్రులు వస్తు ఉంటారు. పోతుంటారు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకే ఒక్కడు కేసీఆర్. ఆయన పేరు మీద సినిమా తీయడం సంతోషం. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. తెలంగాణను సాధించడమే కాదు అద్భుతంగా 10 సంవత్సరాలు పరిపాలించారు. రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక మాట అన్నారు. నేను హైదరాబాద్లో ఉన్నానా? న్యూయార్క్లో ఉన్నానా అని. కేసీఆర్ పల్లెలను, హైదరాబాద్ను ఎంతో అభివృద్ధి చేశారు. మనం చూసే భౌతికమైన అభివృద్దే కాదు. సామాజిక పరంగా సంస్కృతి పరంగా తెలంగాణని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఒక దశ దిశను చూపించారు. దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలబడింది అంటే కేసీఆర్ చేసిన కృషి. అధికారంలో ఉన్న పార్టీ వారి మీద సినిమాలు తీస్తారు. కానీ అధికారంలో లేకపోయినా రాకేష్ ప్రేమతో, దమ్ము ధైర్యంతో ఈ సినిమా తీశారు' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. లంబాడీ వర్గానికి చెందిన ఓ యువకుడి నిజ జీవితం నుంచి స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందించారు. -
BRS సోషల్ మీడియా ఇంచార్జ్ దిలీప్ అరెస్ట్
-
హరీశ్రావు పక్కచూపులు చూస్తున్నారు: పీసీసీ చీఫ్ మహేష్గౌడ్
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్రావుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్గౌడ్ సవాల్ విసిరారు. గత పదేళ్లో ఎంత అభివృద్ధి చేశారో హరీశ్రావు చెప్పాలని డిమాండ్ చేశారు. తాము 11 నెలల్లో ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తామన్నారు. ఈ మేరకు మహేష్గౌడ్ సోమవారం(నవంబర్ 18) సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదన్నారు. హరీశ్రావు వేరే దారి వెతుక్కుంటున్నారన్నారు. ఆయన ఇప్పటికే పక్క చూపులు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్లో మిగిలేది కేసీఆర్,కేటీఆర్,కవితలేనని మహేష్గౌడ్ ఎద్దేవా చేశారు.మహేష్కుమార్గౌడ్ ఇంకా ఏమన్నారంటే...కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదుసీఎం రేవంత్ని వ్యతిరేకించినా అది పార్టీ కోసమే కానీ వ్యక్తిగతం కాదుకాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంత నారాజ్ ఉన్నారు...ఆ విషయం తెలుసుమీకు ఆ హక్కుంది...మేము మీకు అండగా ఉంటాంజనవరిలో కొంతమంది పార్టీ నాయకులకు పదవులు ఇస్తాంస్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటాలిఅధికారంలోకి వచ్చి 11 నెలల్లోనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయిబీజేపీ,బీఆర్ఎస్ కుమ్మకై కాంగ్రెస్ పార్టీపై కుట్ర పన్నుతున్నాయికార్యకర్త కూడా సీమని కలిసే వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందికార్యకర్తలు నారాజ్ అయితే మేం కుర్చీ దిగాల్సిందేమరోసారి మనం అధికారంలోకి రావాలి ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలికేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే కాంగ్రెస్ పార్టీ రిపేర్లు చేస్తుందిబంగారు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయం అయ్యిందికాళేశ్వరం ప్రాజెక్టులో బీటలు బారుతున్నాయికాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు 70 ఏళ్లయిన చెక్కు చెదరలేదుహరీష్ రావుకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్మీరు పదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో చెప్పండిమేము 11 నెలల్లో ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తాంవచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదుహరీశ్రావు కూడా పక్క చూపులు చూస్తున్నాడుచివరికి పార్టీలో తండ్రి, కొడుకు, కూతురు తప్ప ఎవరూ మిగలరు -
గురుకులాల్లో మృత్యుఘోష
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత టి. హరీశ్రావు ధ్వజమెత్తారు. 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఒక ప్రకటనలో ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా బీసీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం మరో విద్యారి్థని ఆత్మహత్య చేసుకోవడం కలచివేసిందని అన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతుంటే, వారిని కాపాడాల్సిన ప్రభు త్వం చోద్యం చూడడం శోచనీయమని విమర్శించా రు. వాంకిడిలోని గురుకుల పాఠశాల విద్యారి్థని గత 17 రోజులుగా నిమ్స్లో వెంటిలేటర్పై కొట్టుమిట్టాడుతున్నదని, బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యారి్థని బలవన్మరణానికి కారణం ఎవర ని ప్రశ్నించారు. గత 11 నెల ల్లో సగటున నెలకు ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో దేశానికి రోల్ మోడల్గా నిలిచిన గురుకులాలు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోజురోజుకు దిగజారిపోతున్నా యని అన్నారు. విద్యార్థుల మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించి, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుకులాలు నరకకూపాలుగా మారాయని ధ్వజమెత్తారు. విద్యాశాఖతోపాటు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ, మైనార్టీ శాఖల నిర్వహణలో ముఖ్యమంత్రి నిర్లక్ష్యం అభం శుభం తెలియని విద్యార్థుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. గురుకులాల భోజనంలో నాణ్యత లేకుంటే జైలుకే అని బాలల దినోత్సవం నాడు సీఎం ప్రగల్బాలు పలకడం తప్ప, ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదని విమర్శించారు. -
కేటీఆర్ ఇంటికి హరీష్, బీఆర్ఎస్ శ్రేణులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ ఇంటికి హరీష్ రావు సహా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకుంటున్నారు. దీంతో, ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.లగచర్ల ఘటనకు సంబంధించిన కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ఉంది. ఈ నేపథ్యంలో అరెస్ట్ అనుమానంతో కేటీఆర్ ఇంటికి భారీగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో, నందినగర్లోని కేటీఆర్ నివాసం గులాబీమయం అయ్యింది. -
వడ్లు కొనమంటే నోట్ల లోడ్ ఎత్తుతున్నారు
మర్రిగూడ: రాష్ట్రంలో రైతుల వడ్ల లోడ్ ఎత్తమంటే సీఎం రేవంత్రెడ్డి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోట్ల కట్టల లోడ్ ఎత్తుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు. గత సంవత్సరం నల్లగొండ జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో వరి సాగైతే ఈ సంవత్సరం కృష్ణా నదిలో పుష్కలంగా నీరు రావడం వల్ల 5.50 లక్షల ఎకరాల్లో వరి సాగైందన్నారు. కానీ, సీఎం రేవంత్రెడ్డి నిర్లక్ష్యం వల్ల నల్లగొండలో కనీసం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదని మండిపడ్డారు. హరీశ్రావు బుధవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని, రైతులకు అవసరమైనన్ని గన్నీ బ్యాగులను అందించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని హరీశ్రావు అన్నారు. ప్రభుత్వం రైతులను పట్టించు కోకపోవడంతో రైతులు రూ.1,800కే దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్రెడ్డి మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటివర కు నల్లగొండ జిల్లాలో ఒక కిలో సన్న వడ్లనూ కొన్న పాపాన పోలేదన్నారు. వడ్లు కొనకపోతే అధికారులను ఎందుకు కొనట్లేదని అడగడం లేదు కాని మ ద్యం తక్కువ అమ్మిన ఎక్సైజ్ అధికారులకు మా త్రం మెమోలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనే పరిస్థితి లేదన్నారు. పక్క రాష్ట్రం నుంచి దళారులు వచ్చి తెలంగాణ రైతుల వద్ద తక్కువ రేటుకు ధాన్యాన్ని కొంటున్నారని చెప్పారు. రేవంత్రెడ్డి రాజ్యంలో రైతులు రోదిస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులను సమీకరించి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కాగా, గతంలో ధాన్యం కొనుగోలులో జరిగిన అవకతవకల్లో రూ.48 లక్షలు అవినీతి చోటుచేసుకోగా.. కొనుగోలు డబ్బులు నేటికీ రైతుల ఖాతాలో జమ కాలేదని రైతు మోదుగు రాజేందర్.. హరీశ్రావుకు చెబుతుండగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ను ఖండించిన కేటీఆర్
-
ఇది ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది: హరీశ్రావు
సాక్షి,జగిత్యాల: రైతు సీఎం కేసీఆర్ అయితే,బూతుల సీఎం రేవంత్రెడ్డి అని మాజీ మంత్రి,బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు విమర్శించారు. కోరుట్ల నుంచి జగిత్యాల వరకు కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్న హరీష్రావు మాట్లాడారు.‘ఎమ్మెల్యే సంజయ్ రైతుల కష్టాలు చూసిండు కాబట్టే పాదయాత్ర చేపట్టిండు. ధాన్యం దళారుల పాలైపోయింది. రూ.500 బోనస్ ఇస్తానన్నాడు. బోనస్తో కలిపి 2820 రూపాయలు క్వింటాలుకు అందాల్సి ఉంటే పద్దెనిమిది,పందొమ్మిది వందలకే దళారులకు అమ్ముకుంటున్రు.వడ్లు కొన్న 24 గంటల్లో పైసలు పడాలని నాడు కేసీఆర్ చెబుతుండే.ఈ కాంగ్రెస్ ప్రభుత్వానివి మాటలెక్కువ,పని తక్కువ. ఎన్నికల సమయంలో కూడా రైతుల విషయంలో రాజకీయం చేసిన్రు, రైతుబంధు విషయంలో ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసిన్రు. ఈ సర్కారు వచ్చాక ఒక్క విడత కూడా రైతుబంధు పడలే. దాన్ని ప్రశ్నించడానికే మా సంజయ్ పాదయాత్ర చేసిండు.అసెంబ్లీ ఎన్నికలప్పుడు బాండ్ పేపర్లు రాసిచ్చిండు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఒట్లు పెట్టిండు రేవంత్. రైతు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తా అన్నడు. రుణమాఫీ అయిందా..?రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు కొందరు రైతుల మిత్తీ పెరిగి ఇబ్బందులు పడుతున్నారు.రైతుబంధుకు, రుణమాఫీకి డబ్బుల్లేవంటగానీ మూసీకి మాత్రం లక్షా యాభై వేల కోట్ల ఖర్చు పెడతానంటుండు రేవంత్ రెడ్డి. 24 గంటల కరెంట్ ఇచ్చి చూపిన ఘనత కేసీఆర్ది. మా సంజయ్ పాదయాత్ర కేవలం ట్రైలర్ మాత్రమే..రేపు ముందర ఉంది 70 ఎంఎం సినిమా.జగిత్యాల జైత్రయాత్ర స్ఫూర్తిగా దండోరా ప్రకటించాం’అని హరీశ్రావు అన్నారు.ఇదీ చదవండి: ఢిల్లీలో హీట్.. ఇటు కేటీఆర్..అటు రేవంత్.. గవర్నర్ కూడా -
మహారాష్ట్ర ఎన్నికలకు తెలంగాణ డబ్బు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డబ్బును మహారాష్ట్రకు పంపే పనిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బిజీగా ఉన్నారని.. కాంగ్రెస్కు మహారాష్ట్ర ఎన్నికల కోసం డబ్బులు రేవంతే సమకూర్చుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆరోపించారు. తెలంగాణలో రుణమాఫీ చేశామని, రైతు బంధు, వరికి బోనస్ ఇచ్చామంటూ మహారాష్ట్రలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్ల మీద ఉన్న వడ్ల కుప్పలే రేవంత్ అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర మంత్రులు రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి, గాలిమోటార్లలో రాష్ట్రాలు పట్టి తిరుగుతున్నారని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘సీఎం రేవంత్ నోరు విప్పితే అన్నీ అబద్ధాలే. ఆ అబద్ధాల ప్రవాహాన్ని మహారాష్ట్రలో కొనసాగించారు. తెలంగాణలో మోసం చేసినట్టు అక్కడి ప్రజలనూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెండు లక్షల ఉద్యోగాల కల్పనపై మహారాష్ట్రలో పచ్చి అబద్ధాలు చెప్పారు. విద్యార్థులను వీపులు పగలకొట్టించిన చరిత్ర కాంగ్రెస్ సర్కార్దే. తెలంగాణలో 40 లక్షల మందికి రుణమాఫీ చేశామని రేవంత్ అవాస్తవాలు చెప్పారు. 2023 డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారు. 42 లక్షల మందికి రూ.31 వేలకోట్లు రుణమాఫీ చేస్తామని రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారు. అది కూడా 7 నెలలు ఆలస్యం చేసి రైతులపై వడ్డీల భారం మోపారు. ఇంకా 22 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. తెలంగాణలో పోలీసు కానిస్టేబుళ్లు రోడ్ల మీదికి వచ్చే పరిస్థితి నెలకొంది. హాస్టళ్లలో విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారు. గ్యారంటీలు గ్యారేజ్కు పోయాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది పూర్తవుతున్నా ఆరు గ్యారంటీలు అమలు చేయలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలు గెలిచాక గ్యారేజీకి పోయాయి. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ ఇచ్చారు. ఏ హామీలు అమలు చేశారో, ఎక్కడ చర్చిద్దామో చెప్పండి. బహిరంగ చర్చకు నేను సిద్ధం. మహిళలకు అభయ హస్తం ఏదీ? మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామని అభయ హస్తంలో చెప్పిన మొదటి హామీకే దిక్కులేదు. మహారాష్ట్రలో మాత్రం కోతలు కోస్తున్నారు. ఆ హామీ మేరకు ప్రభుత్వం ఒక్కో మహిళకు రూ.27,500 బాకీ ఉంది. రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు, రైతుకూలీలకు రూ.12 వేలు, వరికి రూ.500 బోనస్ వంటి ఎన్నో హామీలిచ్చారు. ఒక్కటి కూడా అమలు చేయలేదు. హామీలను ఎగవేయటమే కాంగ్రెస్ నైజంగా మారింది. సోనియమ్మ మాట.. రాహుల్ గాంధీ మాట అంటూ కాంగ్రెస్ నాయకులు హామీలిచ్చారు. ఇప్పుడా గాం«దీలు ఎక్కడికి పోయారో తెలియదు. రైతుల ధాన్యం కొనేదెవరు? రాష్ట్రంలో మద్దతు ధరకు వరి ధాన్యం కొనకపోవటంతో రైతులు నష్టపోతున్నారు. క్వింటాల్ వడ్లు రూ.1,900కే వడ్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. రేవంత్రెడ్డి అసమర్థ పాలనకు రోడ్లపై వరికుప్పలే సాక్ష్యం. పైగా బోనస్ ఇచ్చామంటూ మహారాష్ట్రలో బోగస్ మాటలు మాట్లాడారు. అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి రేవంత్. జీవో 29 పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేశారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటతప్పారు. ప్రశ్నించిన నిరుద్యోగులను పోలీసులతో అణచివేసే ప్రయత్నం చేశారు. ఉద్యోగాల భర్తీలో వైఫల్యంపై మహారాష్ట్రలో ఎందుకు మాట్లాడలేదు. పైగా కేసీఆర్ ఇచ్చనా ఉద్యోగాలను తాను ఇచ్చినట్టు రేవంత్ చెప్పుకోవడం సిగ్గుచేటు..’’అని హరీశ్రావు మండిపడ్డారు. -
సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు
-
కేసీఆర్పై ఆ మంత్రి వ్యాఖ్యలు అప్రజాస్వామికం: హరీశ్రావు
సాక్షి,మెదక్జిల్లా: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు మండిపడ్డారు. శనివారం(నవంబర్ 9) నర్సాపూర్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. ‘మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికం.రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసిన మంత్రులు, ముఖ్య మంత్రి గాలిమెటార్లలో తిరుగుతున్నారు. మూసీ దుస్థితికి కారణం కాంగ్రెస్,తెలుగుదేశం పాలనే. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మూసీ నది సమస్యలపై పాదయాత్రకు తాను సిద్ధం. మూసి కంపు కంటే రేవంత్రెడ్డి నోటీ కంపు ఎక్కువ. కేటీఆర్పై కక్ష సాధింపుతోనే ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ప్రజాబలంతోనే కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొంటాం’అని హరీశ్రావు అన్నారు. కాగా, మూసీ పాదయాత్ర సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం నిర్వహించిన సభలో సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ప్రధాని మోదీ ఆ ట్వీట్ను డిలీట్ చేశారు: సీఎం రేవంత్ -
రేవంత్రెడ్డి వ్యాఖ్యలు అత్యంత హేయం
సాక్షి, హైదరాబాద్/సిద్దిపేటజోన్: రేవంత్రెడ్డి తన పుట్టినరోజున కూడా తండ్రి వయసున్న కేసీఆర్ మీద, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి మీద చేసిన నీచమైన వ్యాఖ్యలు అత్యంత హేయమని మాజీమంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి పిచ్చి ప్రగల్బాలు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలని, నిరంకుశత్వం మాని నిర్మా ణాత్మక నిర్ణయాలపై శ్రద్ధ వహించాలని హితవు పలికారు. శుక్రవారం విడుదల చేసిన వేర్వేరు ప్రకటనల్లో హరీశ్రావు సీఎంపై ధ్వజమెత్తారు.కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని నువ్వు, సీఎం స్థాయి దిగజారి మాట్లాడుతున్నావని, నీలాగా వికృతంగా మాట్లాడే ముఖ్యమంత్రిని ఈ దేశం ఎప్పుడూ చూసి ఉండదని పేర్కొన్నారు. ఇది ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డికి సరిగ్గా సరిపోతుందన్నారు. తప్పు మీద తప్పు చేసి వదరబోతులా ప్రవర్తిస్తున్న రేవంత్రెడ్డి తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. మూసీ నీళ్ల మురికితో కడిగినా నీ నోరు మురికిపోదని, నీ వంకర బుద్ధి ఇగ మారదన్నారు. బ్యాగులు మోసి, బ్యాగులు పంచి అడ్డ తోవన అధికారంలోకి వచి్చన నీచ చరిత్ర నీదని ఆరోపించారు. నీ దోపిడిని, నీ దొంగబుద్ధిని నిరూపించి ప్రజాక్షేత్రంలోనే నీకు బుద్ధి చెబుతామని హరీశ్రావు హెచ్చరించారు.ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో వరుసగా విషాహార ఘటనలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వ తీరులో మార్పు లేదని హరీశ్రావు విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వంతో గురుకుల విద్యార్థుల కష్టాలు తీరడం లేదన్నారు. విషాహారం తిని మంచిర్యాల గిరిజన గురుకులంలో 12 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన ఘటన జరిగి 24 గంటలు కూడా కాకమునుపే మరోసారి వాంతులు, కడుపునొప్పితో విద్యార్థులు ఆస్పత్రిలో చేరారన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గాడితప్పిన పాలనకు వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పారు. సీఎం రేవంత్వన్నీ కోతలే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం గడప దాటడం లేదని, ప్రజలంతా గమనిస్తున్నారని మాజీమంత్రి హరీశ్రావు ఆరోపించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో 237మందికి రూ. 55.57 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల గుండెల్లో ఈ భూమి ఉన్నంత కాలం కేసీఆర్ పదిలంగా ఉంటారని అన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా.. తెలంగాణ రాకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేనా అని ప్రశ్నించారు. -
మాటల సీఎం.. చేతలు శూన్యం
సాక్షి, హైదరాబాద్/ సిద్దిపేటరూరల్: సీఎం రేవంత్రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కాని... చేతలు దాటడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం రాఘవాపూర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులతో మాట్లాడి ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ . గొప్పలకు పోయిన రేవంత్రెడ్డి నేటికి పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటివి అందించలేదని, బోనస్ కాస్త బోగస్ చేసి రైతులను మోసం చేశాడన్నారు. మంత్రి ఉత్తమ్ రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తానని చెప్పారన్నారు. కానీ ఇప్పటికే 30 శాతం ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని చెప్పారు. ప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. చదువుకునేందుకు వెళితే ప్రాణాలు పోతున్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేందుకు వెళుతున్న విద్యార్థుల ప్రాణాలు కోల్పోయే దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలల్లో ‘విష పూరిత ఆహారం’ఘటనలు చోటు చేసుకోవడంపై బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన ఘటన మరువకముందే.. మరో ఘటన జరగటం దారుణమని పేర్కొన్నారు. మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు అస్వస్తతకు గురై ఆస్పత్రి పాలుకావడం బాధాకరమని చెప్పారు. విషపూరిత ఆహారం ఘటనలు పదేపదే జరుగుతున్నా.. ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని, గురుకుల విద్యాసంస్థల్లో ఏం జరుగుతుందని ప్రశ్నించారు. -
రాహుల్ గాంధీపై మాజీ మంత్రి హరీశ్రావు ఫైర్
-
12 నుంచి ఐఏఎస్ల విచారణ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్లపై విచారణ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈ నెల 12 నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను పునరుద్ధరించనున్నట్టు తెలిసింది. ఈ నెల 11న జస్టిస్ పినాకి చంద్రఘోష్ హైదరాబాద్కు రానున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నిర్వహించిన రెండు విడతల క్రాస్ ఎగ్జామినేషన్లో నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వ ర్లు, బి.నాగేంద్రరావుతోపాటు పలువురు చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నంచింది. మూడో విడతలో ప్రధానంగా ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను ప్రశ్నించాలని నిర్ణయించినట్టు తెలిసింది. నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎస్కే జోషి, రజత్కుమార్, ఇన్చార్జి కార్యదర్శిగా వ్యవహరించిన సోమేశ్కుమార్, వికాస్రాజ్, గత ప్రభుత్వంలో సీఎం కార్యదర్శిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షించిన స్మితా సబర్వాల్ తదితరులను కమిషన్ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఓసారి కమిషన్ వీరికి సమన్లు జారీ చేసి విచారించింది. అఫిడవిట్ రూపంలో సమాధానాలను తీసుకుంది. ఆ అఫిడవిట్ల ఆధారంగానే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తోంది. మొత్తానికి ఈ నెలాఖరులోగా అధికారులు, మాజీ అధికారుల విచారణను కమిషన్ ముగించే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ చివరి నాటికి నివేదిక! కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న గత ప్రభుత్వ పెద్దలను పీసీ ఘోష్ కమిషన్ వచ్చే నెలలో విచారించే అవకాశాలు ఉన్నాయి. మాజీ సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్రావుతోపాటు ఇతర ప్రజాప్రతినిధులను విచారించవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇంజనీర్లు, అధికారుల నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ లో సేకరించే అంశాల ఆధారంగా కేసీఆర్, హరీశ్రావులను విచారించాలని కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది. వచ్చే నెల లో వారికి కమిషన్ నుంచి నోటీసులు అందే అవకాశం ఉంద ని సమాచారం. మొత్తంగా కమిషన్ డిసెంబర్ నెలాఖరులో గా ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచనున్నట్టు తెలిసింది. మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన ఛత్తీస్గఢ్ విద్యుత్ కొను గోలు ఒప్పందం, యాదాద్రి, భదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ గత నెలాఖరులోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇంకా గడువు పొడిగించని సర్కారు! వాస్తవానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు గత నెలాఖరుతోనే ముగిసింది. మరో రెండు నెలలు పొడిగించాలని ప్రతిపాదిస్తూ సీఎం కార్యాలయానికి ఫైల్ వెళ్లినా.. ఇంకా నిర్ణయం వెలువడలేదు. గడువు పొడిగింపుపై ఉత్తర్వులు వస్తే ఈ నెల 11న హైదరాబాద్కు వస్తానని జస్టిస్ పీసీ ఘోష్ అధికారులకు సమాచారం ఇచి్చనట్టు తెలిసింది. -
మాజీ సర్పంచ్ల చలో హైదరాబాద్ భగ్నం
బంజారాహిల్స్/ రసూల్పురా (హైదరాబాద్): గ్రామ పంచాయతీల్లో చేసిన వివిధ పనులకు సంబంధించి తమకు రావాల్సి ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలంటూ సర్పంచుల సంఘం చేపట్టిన చలో హైదరాబాద్ పోరుబాట కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. సోమవారం ఆందోళనకు సిద్ధమైన మాజీ సర్పంచులను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు చేరుకుని, పోరుబాటకు సిద్ధమైన మాజీ సర్పంచులు, సంఘం నేతలను బంజారాహిల్స్ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. చలో పోరుబాట పేరుతో సీఎం రేవంత్రెడ్డిని కలసి వినతిపత్రాన్ని అందజేస్తామని వారు కోరినా పోలీసులు వినిపించుకోలేదు. ఈ సమయంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ఇతర నేతలు మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించకుండా.. ప్రభుత్వం వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలకు వెళతామనడం సరికాదని పేర్కొన్నారు. 2019 నుంచి హరిత హారం, మిషన్ భగీరథ, నర్సరీల పెంపకం, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డుల, రైతు వేదికలు, సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు ఇతర అభివృద్ధి పనులకు అప్పటి సర్పంచులు అప్పులు చేశారని.. పెండింగ్లో ఉన్న ఆ బిల్లు లు ఇవ్వకుండా ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించా రు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే మాజీ సర్పంచుల కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని వాపోయారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్రెడ్డి, మాట్ల మధు, కార్యదర్శి రాపాక నాగయ్య, నవీన్గౌడ్, సుభా‹Ùగౌడ్, గణేశ్ ముదిరాజ్, రాజేందర్, మల్లేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్లకు మద్దతుగా హరీశ్రావు నిరసన పోలీసులు మాజీ సర్పంచ్లను అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్స్టేషన్కు తరలించారు. దీనితో మాజీ మంత్రి హరీశ్రావు, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు అక్కడికి చేరుకుని మాజీ సర్పంచులకు మద్దతుగా ఆందోళనకు దిగారు. దీనితో పోలీసులు హరీశ్రావు, ఇతర నేతలను అదుపులోకి తీసుకుని తిరుమలగిరి పోలీస్స్టేషన్కు తరలించారు. దీనితో వారు పోలీస్స్టేషన్ ఎదుట రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. చలో హైదరాబాద్కు పిలుపునిచి్చన మాజీ సర్పంచులను ఎక్కడికక్కడ దొంగలనో, టెర్రరిస్టులనో అరెస్టు చేసినట్టుగా అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. మాజీ సర్పంచుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. వారు అప్పులు చేసి, భార్యాపిల్లల మీద బంగారం అమ్మి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశారని.. ఆ పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్, కొత్త ప్రభాకర్రెడ్డి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి. పద్మా దేవేందర్రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.సర్పంచ్ల బకాయిలకు మాదీ గ్యారంటీ» పొలిటికల్ ట్రాప్లో పడకండి: పొన్నం» సర్పంచుల ఆత్మహత్యలకుకారణం బీఆర్ఎస్ ప్రభుత్వమే సాక్షి, హైదరాబాద్: సర్పంచులు పొలిటికల్ ట్రాప్ లో పడొద్దని, వారి బకాయిలను చెల్లించే గ్యారంటీ తాము తీసుకుంటామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. నాడు సర్పంచ్ల ఆత్మహత్యలకు కారణమైన బీఆర్ఎస్ ఇప్పుడు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాహుల్గాంధీ పర్యటన ఏర్పాట్లపై సమావేశం నిర్వహించేందుకు సోమవారం గాంధీభవన్కు వచ్చిన ఆయన మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు.సర్పంచులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఓపిక పట్టాలని, మార్చి నెలాఖరులోగా సర్పంచుల బకాయిలు దఫాలవారీగా చెల్లిస్తామని అన్నారు. సర్పంచులకు నిధుల బకాయిలు బీఆర్ఎస్ చేసిన పాపమేనని, వారి ఆత్మహత్యలకు బీఆర్ఎస్ కారణం కాదా అని ప్రశ్నించారు. కిషన్రెడ్డిది తెలంగాణ డీఎన్ఏ కాదు కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి తెలంగాణ డీఎన్ఏ లేదని, ఆ డీఎన్ఏ ఉంటే తెలంగాణ కోసం ఆయన ఏదైనా చేసేవారని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో అమరవీరుల స్తూపం వద్ద చర్చకు రావాలని ఆ పార్టీ నేతలకు పొన్నం సవాల్ విసిరారు. కేసీఆర్ సలహాతో బీజేపీ అధ్యక్షుడు అయిన కిషన్రెడ్డి విమర్శలు చేస్తే తాము ఊరుకోవాలా అని ప్రశ్నించారు. -
రైతుల ఉసురు తీస్తున్న రేవంత్
నంగునూరు (సిద్దిపేట): అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనేవారు లేక ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, జిల్లాల కలెక్టర్లు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. నాడు రైతుల శ్రేయస్సు కోసం మాజీ సీఎం కేసీఆర్ కృషి చేస్తే.. నేడు రేవంత్రెడ్డి వారి ఉసురు తీస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని హరీశ్రావు ఆదివారం సందర్శించారు. రైతులు తమ సమస్యలను ఆయనకు వివరించారు. అనంతరం హరీశ్రావు విలేకరులతో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో వసతులు లేవని, పట్టించుకునే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. చేసేదిలేక రైతులు తమ ఉత్పత్తులను తక్కువ ధరకు దళారులకు విక్రయిస్తున్నారని అన్నారు. రైతుల గోస ఎవరికీ పట్టడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనేవారు లేరని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో 11 సీజన్లలో రూ.72,815 కోట్లు రైతుబంధు డబ్బులు అన్నదాతల ఖాతాల్లో వేస్తే.. నేడు కనీసం గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. పత్తికి మద్దతు ధర లేదని, మక్కలు కూడా ఎవరూ కొనడంలేదని తెలిపారు.ప్రభుత్వ నిర్లక్ష్యం..గురుకుల విద్యార్థులకు శాపంసాక్షి, హైదరాబాద్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన గురు కులానికి చెందిన 60 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన ఘటనపై మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం.. గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నదని, సోకాల్డ్ ప్రజాపాలనలో అభంశుభం తెలియని పిల్లల భవిష్యత్ ఆందోళనకరంగా మారిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ఆదివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. 60 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనైతే ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేకపోవడం దుర్మార్గమన్నారు. -
రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది
-
రైతులకు సంచులిచ్చే తెలివి లేదా?.. కాంగ్రెస్పై హరీష్ రావు ఫైర్
సాక్షి, సిద్దిపేట: రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రైతులను నట్టేట ముంచారు. రాష్ట్రంలో రైతుల వడ్లు కొనే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, రైతులకు బోనస్ ఇవ్వరు.. రైతుబంధు ఇవ్వరు అని ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలకు పని తక్కువ.. కోతలు ఎక్కువ. రైతులకు సంచులు పంపే తెలివి లేదా?. హైదరాబాద్లో కూర్చోవడం కాదు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. సీఎం రేవంత్ ఒక్కసారైనా ధాన్యం కొనుగోళ్లపై రివ్యూ చేశారా?. రైతులను నట్టేట ముంచిన వ్యక్తి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో రైతులకు రైతుబంధు లేదు.. వడ్లకు బోనస్ లేదు. తెలంగాణలో వడ్లు కొనే దిక్కు లేదు. ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోవాలి. 30 శాతం వడ్లు దళారులు కొన్నారు. ఎలక్షన్ కన్నా ముందు రైతు ఓట్లు అన్ని నాకే కావాలన్నారు. నెల రోజులైనా సంచులు ఇవ్వలేదు. చాలా జిల్లాలో రైతులు ధర్నాలు చేస్తున్నారు.రుణ మాఫీకి 31 రకాల కోతలు పెట్టిన వ్యక్తి రేవంత్. లక్షా 50వేల కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తారు కానీ.. రైతులకు బోనస్ ఇవ్వరు. అకాల వర్షాల కారణంగా చాలా చోట్ల వడ్లు తడిసిపోయాయి. తడిచిన వడ్లు మీరు కొనరు. కలెకర్లు అక్కడికి రారు.. మీ మంత్రులు అటువైపు కూడా చూడరు. దీనిపై ముఖ్యమంత్రి వెంటనే రివ్యూ చేయాలి. రైస్ మిల్లరతో చర్చలు చేయాలి. రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలని డిమాండ్ చేశారు. -
రేవంత్.. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ చూపించు: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని మోసం చేస్తున్నారని అన్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటికీ నోటిఫికేషన్లు కూడా ఇవ్వకపోవడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో డిసెంబర్ తొమ్మిదో తేదీలోపే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి సగం మందికి కూడా చేయనిది నిజం కాదా అని నిలదీశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది నెరవేర్చని హామీల కథ . సీఎం రేవంత్రెడ్డి కేవలం తెలంగాణనే కాదు.. దేశం మొత్తాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో 1.61 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. రేవంత్రెడ్డి దుష్ప్రచారం చేయడం దురదృష్టకరం. ఎన్నికల కోడ్ కారణంగా పెండింగ్లో ఉన్న నియామక పత్రాలను మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెబుతున్న 50వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, ధ్రువపత్రాల పరిశీలన చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా?. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటికీ నోటిఫికేషన్లు కూడా ఇవ్వకపోవడం వాస్తవం కాదా?. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి సగం మందికి కూడా చేయనిది నిజం కాదా?. Mr. @revanth_anumula The BRS government, within nine years, has recruited 1,61,000 positions. It’s unfortunate that you continue to spread falsehoods on recruitments. Mr. Chief Minister, is it not true that almost all the 50,000 jobs claimed by you were notified, examination… https://t.co/eoExyVOd1x— Harish Rao Thanneeru (@BRSHarish) November 2, 2024రాష్ఠ్రంలో పెన్షన్ను రూ.4వేలకు పెంచుతామని హామీ ఇచ్చి 11 నెలలైనా అమలు చేయకపోవడం వాస్తవం కాదా?. 18 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చి ఇంకా అమలు చేయలేదు. విద్యా భరోసా కింద ఒక్కో విద్యార్థికి రూ.5లక్షలు ఇస్తామని ఇంకా ఇవ్వలేదు. అన్ని పంటలకూ బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం ప్రీమియం బియ్యం రకాలకు మాత్రమే పరిమితం అయ్యారు. కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు తులం బంగారం హామీ ఇంకా నెరవేర్చలేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తామన్న కాంగ్రెస్.. 300 రోజులు గడచిపోయినా అమలు చేయడంలో విఫలమైంది’ అంటూ కామెంట్స్ చేశారు. అలాగే, తెలంగాణలో రైతుబంధు, దళిత బంధు, బీసీ బంధు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, బతుకమ్మ చీరలను కూడా నిలిపివేసిందని మండిపడ్డారు.