heavy rain
-
వీడియో: సౌదీ ‘మక్కా’లో భారీ వర్షం.. కొట్టుకుపోయిన కార్లు, బస్సులు
జెడ్డా: సౌదీ అరేబియాలో అతి భారీ వర్షం కురిసింది. కుండపోత కారణంగా ముస్లిం పవిత్ర మక్కా నగరం చెరువును తలపిస్తోంది. ఒక్కసారిగా వచ్చిన వరదలతో మక్కా ప్రాంతం జలమయమైంది. వర్షం కారణంగా దర్శనానికి వచ్చిన లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సౌదీ అరేబియాలో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో భారీ నష్టం జరిగింది. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో కార్లు కొట్టుకుపోయాయి. మక్కా, మదీనా, జెడ్దాలో ఎడతెరిపలేని వర్షంతో భారీ వరదలు వచ్చాయి. ఉరుములు, మెరుపులతో సుడిగాలులు విరుచుకుపడ్డాయి. దీంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో మక్కాలో ఉమ్రా యాత్రకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డారు.#Breaking: 🇸🇦 Mecca is floating: Torrential rain with hail have led to severe flooding in the holy city for Muslims in Saudi Arabia.😭May Allah protect us from this danger.pic.twitter.com/OgUwGwNhp6— Md.Sakib Ali (@iamsakibali1) January 7, 2025 Scenes of heavy rain falling on Mecca and Jeddah in the Kingdom of #SaudiArabia pic.twitter.com/2EsGyc3IC5— Hamdan News (@HamdanWahe57839) January 6, 2025 SAUDI ARABIA :📹 POWERFUL STORM HIT JEDDAH CITY TODAYScenes from KING ABDULAZIZ International Airport pic.twitter.com/KBta0A0gDD— 𝛎í⸦𝛋𝚼 (@iv1cky) January 7, 2025 మక్కా, మదీన, జెడ్దాలో ఊహించని విధంగా వరదనీరు ముంచెత్తడంతో అనేక కార్లు, టూరిస్ట్ బస్సులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు కూలిన చెట్లు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇక, మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మూడు నగరాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. వర్షాల నేపథ్యంలో సౌదీలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు అధికారులు చెబుతున్నారు. #Mecca after rain outside.Haram Shareef pic.twitter.com/XYrR0FNdep— Saeed Hameed (@urdujournosaeed) January 7, 2025 Mecca, Saudi Arabia, experienced heavy rainfall today, leading to significant flooding. The city received an unusually high amount of rain within a short time. Thankfully, emergency teams are working hard, and the situation is under control. Rain is rare in Mecca, but it’s always… pic.twitter.com/KNfJyy16My— مدقق لغوي 👓 (@Lang_checker) January 6, 2025 మక్కాకు సౌత్ సైడ్ ఉన్న అల్-అవాలి పరిసరాల్లో వరదల్లో చాలామంది చిక్కుకున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని, గొలుసులు, తాళ్లతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షం, వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజా వర్షాల కారణంగా మరణాల సంఖ్య తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. గతంలో 2009లో సౌదీ కురిసిన వర్షం, వరదల కారణంగా దాదాపు 100 మంది చనిపోయారు. Heavy rainfall in the outskirts of *Al-Awali* near Mecca, Saudi Arabia, has caused many areas to flood. 🌧️🚗 Several vehicles were submerged in the floodwaters, and citizens faced severe difficult. #Flood #AlAwali #Rain pic.twitter.com/pOSvkaua1m— rebel (@Asifahm07207201) January 7, 2025 Heavy rain in Mecca.. pic.twitter.com/ciZh7odU66— TAJNIMUL (@tajnimul11606) January 6, 2025 Massive flooding due to extreme rainfall in Mecca, Saudi Arabia 🇸🇦 Today #Rain #macca #TodayNews #UPDATE pic.twitter.com/cCIRcbH0oL— ✩𝐒𝐇𝐀𝐇𝐈𝐃 𝐌𝐔𝐒𝐓𝐀𝐅𝐀✩ (@Shahidmustafa_m) January 6, 2025 -
ఢిల్లీలో కొత్త రికార్డు..వందేళ్ల తర్వాత అంతటి వర్షం
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీ(Delhi)లో వర్షం(Rain) సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఏకంగా 101 ఏళ్ల తర్వాత ఢిల్లీలో డిసెంబర్ నెలలో 24 గంటల వ్యవధిలో అత్యధిక వర్షం నమోదై రికార్డు సృష్టించింది. శనివారం(డిసెంబర్ 28) ఉదయం 8.30 వరకు గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 41.2మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.సరిగ్గా 101 ఏళ్ల క్రితం 1923 డిసెంబర్ 3వ తేదీన 75.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇంతటి వర్షం తర్వాత మళ్లీ డిసెంబర్(December)లో శనివారమే అత్యధిక వర్షం పడింది.వాతావరణ శాఖ ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.వర్షం ఆగకుండా కురుస్తుండడంతో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 13డిగ్రీలకు పడిపోయాయి. వర్షం వల్ల రోడ్లపై నీరు నిలిచి పలుచోట్ల ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడ్డాయి.భారీ వర్షం కారణంగా రాజధాని నగరంలో క్షీణించిన వాయునాణ్యత ఒక్కసారిగా మెరుగుపడింది.ఇదీ చదవండి: అమ్మో ఇవేం ఎండలు -
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
-
హైదరాబాద్లో మోస్తరు వర్షం.. పెరిగిన చలి తీవ్రత (ఫొటోలు)
-
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: తీవ్ర అల్పపీడనం అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు విస్తాయని పేర్కొంది.రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురవనున్నాయని.. నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ముందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 65 కిమీ వేగంతో గాలులు విస్తాయని.. ఏపీలో అన్ని పోర్టులకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన వాతావరణ శాఖ.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తెలిపింది.ఇక, తెలంగాణపై కూడా అల్పపీడన ప్రభావం చూపుతోంది. హైదరాబాద్లో పలు చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. రాబోయే నాలుగు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో 2,3 డిగ్రీలు అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేసింది. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణా వైపు శీతలు గాలులు వీస్తున్నాయని ఐఎండీ పేర్కొంది. దీంతో, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ.. ఆ వార్తల్లో నిజం లేదు Heavy Rain Forecast to Tirupati, Nellore Districts -
తెలంగాణపై అల్పపీడన ప్రభావం
-
రెండు రోజుల పాటు ఏపీకి వర్ష సూచన
-
తెలంగాణకు వానగండం
-
నైరుతి దిశగా అల్పపీడనం.. రెండు రోజులు పాటు వర్షాలు
-
ఏపీకి భారీ వర్ష సూచన
-
అల్పపీడనం ఎఫెక్ట్.. విశాఖ సంద్రం అల్లకల్లోలం (ఫొటోలు)
-
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
-
కోస్తాంధ్రకు భారీ వర్షసూచన
-
కోస్తాంధ్రకు భారీ వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం/అమరావతి/వాకాడు: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. తదుపరి రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. వాయుగుండంగా మారిన అనంతరం నెల్లూరు సమీపానికి చేరి.. అక్కడ దిశ మార్చుకుని తమిళనాడు వైపుగా పయనిస్తుందని, అక్కడే తీరం దాటే అవకాశాలున్నాయని వెల్లడించారు.దీని ప్రభావం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ తీర ప్రాంతంలోని కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 22 వరకూ రాష్ట్రానికి వర్ష సూచన ఉందని వెల్లడించారు. బుధవారం విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. 19న ఉత్తరాంద్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 గరిష్టంగా 55 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొన్నారు. మత్స్యకారులెవరూ ఈ నెల 22 వరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.తీరంలో అలజడిఅల్పపీడనం కారణంగా మంగళవారం వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. తిరుపతి జిల్లా సముద్ర తీరంలోని చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట మండలాల పరిధిలో సముద్రంలో భీకరమైన శబ్దాలతో అలలు ఎగసిపడుతున్నాయి. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు తలెత్తి మధ్యాహ్నం నుంచే చీకట్లు కమ్ముకుని తీవ్రమైన చలి గాలులు వీస్తున్నాయి. వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో భీకరమైన శబ్దాలతో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరప్రాంత ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. సాయంత్రం 4 గంటలకే రాత్రిని తలపిస్తూ బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వేటలో కొనసాగుతున్న మత్స్యకారులు తీవ్రమైన అలలు, చలి గాలులకి తట్టుకుని వేట చేయలేకున్నామని, తాము వేట ముగించుకుని, త్వరితగతిన ఒడ్డుకు వచ్చేస్తున్నామంటూ తోటి మత్స్యకారులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. -
జడివానతో జల దిగ్బంధంలో తిరుపతి నగరం.. ఇళ్లలోకి వరద నీరు (ఫొటోలు)
-
తిరుమలలో అర్ధరాత్రి నుంచి ఎడతెగని వర్షం
-
తిరుమలలో కుండపోత.. స్వామి వారిని దర్శించుకున్న స్నేహారెడ్డి, రాధిక (ఫొటోలు)
-
రేపు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు భారీ వర్ష సూచన
-
ఏపీలో భారీ వర్షాలు
-
తమిళనాడులో భారీ వర్షాలు.. కొట్టుకుపోతున్న కార్లు, బస్సులు (ఫొటోలు)
-
‘ఫెంగల్’ తడాఖా.. వరదల్లో కొట్టుకుపోతున్న బస్సులు, కార్లు..
చెన్నై: ఫెంగల్ తుపాన్ కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద చేరుకుంది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వరదకు రోడ్డుపై నిలిపిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో బస్సులు, కార్లు వరదల్లో కొట్టుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. ఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదకు రోడ్డుపై నిలిపిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి. పుదుచ్చేరి, విల్లుపురం, తిరువన్నామలై, ధర్మపురి జిల్లాలపై ఈ తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక, కృష్ణగిరి జిల్లాలో వరద ధాటికి బస్సులు, కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. వరదల్లో ఇళ్లు సైతం నీటి మునిగాయి. వరద నీటిలో పాములు కనిపించడం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. Scary visuals coming from Uthangarai, Krishnagiri district. Once in a lifetime historic rains of 500mm recorded. Super rare to see such numbers in interiors. Why slow moving cyclones are always dangerous. #CycloneFengal #Tamilnadu #Floods #Krishnagiri pic.twitter.com/K8Jla22VUc— Chennai Weatherman (@chennaisweather) December 2, 2024ఇదిలా ఉండగా.. తుపాన్ కారణంగా భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఇక, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.Cyclone Fengal Wreaks Havoc Along India’s Coast, Three DeadThe storm made landfall near Puducherry & unleashed torrential rains and winds, sparking severe flooding across Tamil Nadu, & submerging streets, homes, and businesses as well as leaving thousands displaced. pic.twitter.com/dyAOtrQQd4— COMMUNITY EARTH RADIO🌎 (@COMM_EARTH) December 2, 2024మరోవైపు.. తుపాన్ ప్రభావం తాజాగా కర్ణాటక మీద కూడా చూపిస్తోంది. కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో బెంగళూరు, హసన్, మాండ్యా, రామనగర జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ విధించింది. అలాగే, ఉడిపి, చిక్మంగ్లూర్, చిక్బల్లాపూర్ జిల్లాలకు ఆరెంట్ అలర్ట్ విధించారు వాతావరణ శాఖ అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. Remnant of Cyclone Fengal - WML has moved on from Bengaluru to further West #BengaluruRains #KarnatakaRainsParts of South Interior Karnataka districts of Tumakuru, Ramanagara & Mandya have got heavy rains from this & the action will now shift to Malenadu & Coastal Karnataka… https://t.co/oKb0uzIyqW pic.twitter.com/bdCYdYA8dC— Karnataka Weather (@Bnglrweatherman) December 2, 2024 -
ఢిల్లీలో తగ్గని కాలుష్యం, కేరళలో భారీ వర్షాలు, కశ్మీర్లో కురుస్తున్న మంచు
న్యూఢిల్లీ: దేశంలో చలి వాతావరణం కొనసాగుతోంది. జాతీయ రాజధాని ఢిల్లీలో విషపూరితమైన గాలి అక్కడి జనాలను పీడిస్తోంది. ఆదివారం కూడా గాలి నాణ్యత 'చాలా పేలవమైన' కేటగిరీలో ఉంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు భారీ వర్షాల కారణంగా పుదుచ్చేరి అతలాకుతలమయ్యింది. దీంతో సైన్యం వరద సహాయక చర్యలను చేపడుతోంది.పుదుచ్చేరిలో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఫలితంగా వరదలు సంభవించాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం. డిసెంబర్ 2న పుదుచ్చేరిలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విల్లుపురం, కళ్లకురిచ్చి, కడలూరు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.ఫెంగల్ తుఫాను ఉత్తర తమిళనాడు తీరాన్ని దాటింది. ఈ నేపధ్యంలో చెన్నై బీచ్లలో అధిక అలలు ఏర్పడ్డాయి. ఫెంగల్ తుఫాను పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరిలోని ఉత్తర తీర ప్రాంతాలపై క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. ఐఎండీ కేరళలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్లలో సోమవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉష్ణోగ్రతలు సున్నాకు దిగువకు పడిపోయాయి. డిసెంబరు 2వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ఎత్తయిన ప్రదేశాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. శ్రీనగర్లో ఉష్ణోగ్రత మైనస్ 3.6 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది. గుల్మార్గ్లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 2.6 డిగ్రీల సెల్సియస్గా నమోదు కాగా, దక్షిణ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉష్ణోగ్రత మైనస్ 0.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం -
బలహీనపడిన ఫెంగల్ తుపాను
-
ఫెంగల్ బీభత్సం.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
-
AP: ఫెంగల్ టెన్షన్.. మరో 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: పెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో మరో 24 గంటల పాటు తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.ఫెంగల్ తుపాన్ టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సందర్భంగా వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరో 24 గంటల పాటు తుపాను ప్రభావం ఉంటుంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు, నెల్లూరు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. పంట పొలాలు నీటి మునిగి చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో జనాలు బయట అడుగుపెట్టాలంటే భయపడుతున్నారు. ఇక, కృష్ణపట్నంలో సముద్రం పది మీటర్లు ముందుకు వచ్చింది.ఇదిలా ఉండగా.. ఫెంగల్ తుపాను కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ విధించింది వాతావరణ శాఖ. ఇక, పుదుచ్చేరిలో పలు కాలనీలు వరద ముంపులోనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
వణికించే చలిలో వరదలు..చెన్నైని చెల్లాచెదురు చేసిన ‘ఫెంగల్’(ఫొటోలు)
-
ఫెంగల్ టెన్షన్.. చెన్నై ఎయిర్పోర్టులోకి వరద నీరు
Cyclone Fengal Updates..👉 తీరం దాటుతున్న ‘ఫెంగల్’ తుపానుపుదుచ్చేరి సమీపంలో ‘ఫెంగల్’ తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపిన ఐఎండీఈ ప్రక్రియకు దాదాపు నాలుగు గంటలు పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలుదక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్నిచోట్ల తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం👉మహాబలిపురం వద్ద ఫెంగల్ తుపాన్ తీరాన్ని తాకింది. 👉తుపాను ఎఫెక్ట్.. విమానాలు రద్దు..వాతావరణం సరిగా లేని కారణంగా విశాఖ నుంచి వెళ్లే పలు విమానాలు రద్దు చెన్నై-విశాఖ-చెన్నై, తిరుపతి-విశాఖ-తిరుపతి విమానాలు రద్దుహైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లాల్సిన మూడు విమానాలు రద్దుహైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఏడు విమానాలు రద్దువిమానాల రద్దుతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేపు ఉదయం 4 గంటల వరకు చెన్నై విమానాశ్రయం మూసివేత. 👉ఫెంగల్ తుపాను ప్రభావం తమిళనాడు, చెన్నై, పుదుచ్చేరి, ఏపీపై చూపిస్తోంది. తుపాన్ ప్రభావంతో ఇప్పటికే చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. #ChennaiAirport During #FengalCyclone#CycloneAlert#Chennaipic.twitter.com/EPLZlM5CYt— Musharraf Mughal. (@marcanthony99) November 30, 2024 👉మరోవైపు.. లోతట్టు పప్రాంతాలు జలమయమయ్యాయి. తాజాగా చెన్నై విమానాశ్రయంలోకి వరద నీరు వచ్చి చేరుకుంది. 📍 சென்ட்ரல் ரயில் நிலையம் எதிரில். ✍️ ஆபத்தான முறையில் கீழே விழ இருந்த அறிவிப்புப் பலகை உடனடியாக அகற்றப்பட்டது. #ChennaiRains #chennaipolice #cyclone #Fengal pic.twitter.com/b3et05ClSi— Greater Chennai Traffic Police (@ChennaiTraffic) November 30, 2024 👉రన్వే పైకి వరద నీరు చేరుకోవడంతో పలు విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. అలాగే, కొన్ని సర్వీసులను దారి మళ్లించారు. 👉నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఫెంగల్ తుపాను భయపెడుతోంది. గంటకు 12 కిమీ వేగంతో తుపాను ప్రస్తుతం పుదుచ్చేరికి 150 కి.మీ దూరంలో , చెన్నైకి 140 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. శనివారం సాయంత్రానికి తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.👉తుపాన్ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరిలో గంటకు 70-80 కి.మీ వేగంలో గాలులు వీస్తున్నాయి. పలుచోట్ల ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. చెన్నై విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు. చెన్నైకు రావాల్సిన విమానాలను దారి మళ్లించారు. బలమైన గాలులు, భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలు సైతం ఆలస్యమవుతున్నాయి. పలు రైలు సర్వీసులను రద్దు చేసే అవకాశం ఉంది. Cyclone Fengal 🌀 effect on CHENNAI cityParts of the city have reported inundations due to spells of intense rainfall activityStay safe & indoors for the next crucial 36 hours#ChennaiRains #ChennaiRains2024 #ChennaiRain https://t.co/voiAq7RIiP pic.twitter.com/2GX6SbHD4K— Karnataka Weather (@Bnglrweatherman) November 30, 2024👉తమిళనాడులోని చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, విలుపురం, కల్లకురుచ్చి, కుద్దలూరు, పుద్చుచ్చేరికి వాతావరణ శాఖ రెడ్ అల్టర్ విధించింది. ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలో స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి.சிக்கி தவிக்கும் தலைநகரம். #Fengal #FengalCyclone #Chennai #ChennaRains #DMKFails pic.twitter.com/OHBlmMmy8D— D.Jackson Jayaraj (@VirugaiJackson) November 30, 2024👉ఫెంగల్ ప్రభావం ఏపీపై కూడా కొనసాగనుంది. తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. వాయుగుండం కారణంగా నెల్లూరు, చిత్తూరు , కడప జిల్లాల్లో ఫ్లాష్ఫ్లడ్కు అకాశముందని హెచ్చరికలు రావడంతో ఏపీ సర్కార్ అప్రమత్తమయ్యింది. పెంగల్ తుపాన్ ప్రభావంతో తిరుమలలో నిన్న రాత్రి నుంచి భారీ ఈదురుగాలులతో వర్షం పడుతుంది. నెల్లూరు జిల్లాలో కావలి, అల్లూరు, దరదర్తి, బోగోలు మండల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ஆட்டோ உள்ளே தண்ணீர்போகும் அளவுக்கு சூளைமேடு பகுதி #ChennaiRains @thatsTamil #Chennaiflood pic.twitter.com/6AohpLlbhb— Veerakumar (@Veeru_Journo) November 30, 2024 -
అల్లకల్లోలంగా సముద్రం.. ఏపీలో భారీ వర్షాలు
-
మళ్లీ తుఫానుగా బలపడిన వాయుగుండం
-
తుపాను ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు..
విశాఖపట్నం: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఫెంగల్ తుపానుగా బలపడి తీవ్ర వాయుగుండం వెంటనే బలహీనపడింది. ఈ క్రమంలో మరింత బలహీనపడి రేపు మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.ఇక, తుపాను కారణంగా నేటి నుంచి ఏపీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కాగా, ఈనెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
Cyclone Fengal: ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు
-
దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాన్..
-
వాయు'గండం'.. ఆరు రోజులపాటు వానలే వానలు
-
ముంచుకొస్తున్న ‘ఫెంగల్’ తుఫాన్ ...సముద్రం అల్లకల్లోలం (ఫొటోలు)
-
ఏపీకి హై అలర్ట్..
-
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి మరో అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.దక్షిణ అండమాన్ సమీపంలో గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. రెండు రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. వాయుగుండం కారణంగా ఏపీలో మంగళ, బుధవారాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.ఈ అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి, 27 నాటికి తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు, మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. -
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
-
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు సహా ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఏపీవైపు పయనిస్తోంది. అల్పపీడనం ప్రభావం తమిళనాడులోని 12 జిల్లాలతో సహా ఏపీలోకి దక్షిణ కోస్తా, రాయలసీమపై పడనుంది. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నేడు బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, గుంటూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.మరోవైపు.. అల్పపీడనం ప్రభావంతో తమిళనాడులో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, ప్రభుత్వం అప్రమత్తమైంది. Villupuram, Pondy, Cuddalore, Mayiladuthurai stretch getting very good rains. Rains will continue for next few hours.Our chennai radar is clear, no heavy rains expected for next 1/2 hours. Get ready for Schools and Colleges :(#ChennaiRains | #ChennaiRainsUpdate | #RainAlert pic.twitter.com/lvTvFtog2Y— TamilNadu Weather (@TamilNaduWeath2) November 13, 2024 -
తిరుమల తిరుపతిలో భారీ వర్షం (ఫొటోలు)
-
హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం
సాక్షి, హైదరాబాద్: నగరంలో శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా జోరుగా వాన పడడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అమీర్పేట, కొండాపూర్, కొత్తగూడ, మియాపూర్, బోరబండ, శేరిలింల్లి, పటాన్చెరు, ఎర్రగడ్డ తదితర ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. మరోవైపు.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టలోనూ వాన దంచికొట్టింది. వాన, నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో.. నవంబర్ 1వ తేదీ దాకా తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరించింది. -
210కి పెరిగిన స్పెయిన్ వరద మృతులు
మాడ్రిడ్: స్పెయిన్లో ఆకస్మిక భారీ వరదలకు బలైన వారి సంఖ్య 210 దాటింది. చాలామంది గల్లంతయ్యారు. మృతదేహాలను సహాయ బృందాలు వెలికి తీస్తున్నాయి. శిథిలాలుగా మారిన ఇళ్లు, బురదలో మునిగిన వీధులు, నేలకూలిన చెట్లు, కూలిన విద్యుత్ లైన్లు, గల్లంతైనవారి గురించి ఆత్మీయుల ఆందోళనలు... ఇలా ఎక్కడ చూసినా ఈ విషాద దృశ్యాలే కనబడుతున్నాయి. ఆకస్మిక తుఫాను కలిగించిన భారీ నష్టం సునామీ అనంతర పరిణామాలను తలపిస్తోందని స్థానికులు వాపోతున్నారు.Rescuer rescuing a women and her pet dog from flooded area in Spain.There is severe flash floor occurred serval region in Spain. The worst affected area is Valencia which records highest rainfall in 28 years. The death toll from the flood in Valencia alone has risen to 92.… pic.twitter.com/nUOcwBM4nW— Eagle EyE (@mkh_nyn) October 31, 2024 🤯The worst flood in the last 37 years: at least 72 people died in Spain, dozens went missing, RTVE.Three days of mourning have been declared in the country. There is still no normal access to some areas. pic.twitter.com/KLQQSuniCa— Nurlan Mededov (@mededov_nurlan) October 30, 2024Catastrophic flooding in Spain.#Flood#Spain pic.twitter.com/32Vwotrv4F— Jennifer Coffindaffer (@CoffindafferFBI) October 30, 2024⚠️Devastating images aftermath flood in the Alfafar in the province of Valencia, Spain63 reported deaths so far in Spain due to catastrophic floods…#Valencia #Spain pic.twitter.com/rnsexKKI3P— Culture War (@CultureWar2020) October 30, 2024 -
ఒడిశా-బెంగాల్లో 'దానా' విధ్వంసం (ఫొటోలు)
-
జలదిగ్బంధంలో బెంగళూరు..
-
‘ఉమ్మడి అనంత’లో కుంభవృష్టి
అనంతపురం అగ్రికల్చర్/పుట్టపర్తి అర్బన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 9 గంటలకు మొదలైన వాన జోరు మంగళవారం వేకువజాము వరకు కొనసాగింది. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో పలు మండలాల్లో కుంభవృష్టి కురిసింది. ఏకధాటిగా నాలుగైదు గంటలపాటు భారీ వర్షం కురవడంతో చాలా మండలాల్లో వాగులు, వంకలు, చెక్డ్యాంలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాప్తాడు మండలం బండమీదపల్లి చెరువు కట్ట తెగిపోయి దిగువ ప్రాంతానికి వరద పోటెత్తడంతో దాదాపు 70 గొర్రెలు కొట్టుకుపోయాయి. రామగిరి, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, పెనుకొండ, కొత్తచెరువు, పుట్టపర్తి ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో చిత్రావతి, వంగపేరు, కుషావతి, జయమంగళి నదులతోపాటు పలు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖరీఫ్లో సాగు చేసిన వరి, వేరుశనగ, పత్తి, ఆముదం, కంది, కొర్ర, మొక్కజొన్న తదితర పంటలు వందలాది ఎకరాల్లో దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురం గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి రెండున్నర ఎకరాల్లో సాగు చేసిన ద్రాక్ష తోట మొత్తం నేలమట్టమయ్యింది. రూ.20 లక్షలకు పైగా నష్టపోయినట్లు రైతు వాపోయారు. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లిలో రికార్డు స్థాయిలో 198.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో 89.4 మి.మీ., కంబదూరులో 65.4 మి.మీ., ఆత్మకూరులో 60 మి.మీ. చొప్పున భారీ వర్షం కురిసింది. కాగా.. రానున్న రెండు రోజులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పండమేరు ఉగ్రరూపం... నీట మునిగిన పలు కాలనీలు ఎగువన భారీ వర్షాలు కురవడంతోపాటు కనగానపల్లి చెరువుకట్ట తెగిపోవడంతో పండమేరు ఉధృతంగా ప్రవహించింది. పండమేరు వెంబడి ఉన్న అనంతపురం నగర శివారులోని గురుదాస్ కాలనీ, ఆటో కాలనీ, వనమిత్ర పార్క్ వెనుక కాలనీలు, రామకృష్ణ కాలనీ, కళాకారుల కాలనీ, బృందావన కాలనీ, పరిటాల సునీతమ్మ కాలనీ, దండోరా కాలనీ, రాజరాజేశ్వరి కాలనీలు నీట మునిగాయి. సుమారు 300 కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరదపై అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఫలితంగా కట్టుబట్టలతో మిగిలామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. -
భారీ వర్షాలతో బెంగళూరు అతలాకుతలం..
బనశంకరి: కర్ణాటక రాజధాని బెంగళూరులో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. నగరంలోని బాబుసాబ్ పాళ్యలో నిర్మాణ దశలో ఉన్న బహుళ అంతస్తుల కట్టడం మంగళవారం సాయంత్రం కుప్ప కూలింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది, స్థానికులు పది మందిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. శిథిలాల కింద మరో ఏడుగురి వరకు చిక్కుకుని ఉన్నట్లు చెబుతున్నారు. ఘటన సమయంలో భవనంలో 18 మంది వరకు కూలీలున్నట్లు తెలిసింది.జల దిగ్బంధంలో అపార్ట్మెంట్లు బంగాళాఖాతంలో అల్ప పీడనం, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మంగళవారం యలహంకలోని కేంద్రీయ విహార్ అపార్ట్మెంట్ సెల్లార్లోకి చెరువు నీరు పోటెత్తింది. దీంతో అపార్ట్మెంట్లోని 2 వేల మంది చిక్కుబడి పోయారు. 650 కుటుంబాలకు గాను 250 కుటుంబాలను బయటకు తరలించారు. -
ఆరబోసిన ధాన్యం నీటిపాలు
చౌటుప్పల్: సకాలంలో ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా నీటిపాలు చేయాల్సి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో మంగళవారం సాయంత్రం కురిసిన ఆకస్మిక భారీ వర్షానికి స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం రాశులు కొట్టుకుపోయాయి. ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టుకుని తిరిగి కుప్పలు పోసుకునే సమయంలో వర్షం రావడంతో రైతులు ఏమి చేయాలో తెలియక పరుగులుపెట్టారు. అప్పటికప్పుడు ధాన్యాన్ని కుప్పలుగా పోసుకున్నారు. పట్టాలు కప్పుకున్నారు. పెద్ద ధాన్యం కుప్పలను ట్రాక్టర్లతో దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేశారు. అయినా వర్షం భారీగా కురవడంతో వరద నీటి ప్రవాహంలో ధాన్యం కుప్పలు కొట్టుకుపోయాయి. దీంతో రైతులు బోరున విలపించారు. -
అనంత అతలాకుతలం.. ముంచేసిన పండమేరు (ఫొటోలు)
-
హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీగా వరద
సాక్షి, అనంతపురం: ఉమ్మడి అనంతపురంలో భారీ వర్షాలు ముంచెత్తాయి. అనంతపురం, పెనుకొండ, ధర్మవరం, రాప్తాడులో కురిసిన వర్షానికి.. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అనంతపురం పట్టణంలోని పలు శివారు కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి.వరదలో ఇళ్లు మునిగిపోగా ఆటోలు, బైక్లు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో కాలనీ వాసులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదకు సామాగ్రి, నిత్యవసర సరుకులు కొట్టుకుపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వరదనీటితో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. వరదలో బస్సులు, లారీలు, కారులు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
ఏపీకి పొంచి ఉన్న మరో వాయుగుండం..
-
తీరం దాటిన వాయుగుండం..
-
దూసుకొస్తున్న వాయుగుండం..
-
తీరం దాటిన వాయుగుండం.. సముద్రం అల్లకల్లోలం
AP Rains Updates..👉బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం గురువారం తెల్లవారుజామున తీరం దాటింది. నెల్లూరు జిల్లాలోని తడా వద్ద వాయుగుండం తీరం దాటినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అల్పపీడనంగా వాయుగుండం బలహీనపడనుంది. కోనసీమ: ఓడలరేవు వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది.సముద్రపు అలలు ఓఎన్జీసీ టెర్మినల్ గేటును తాకాయి.ఓఎన్జీసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు.విశాఖ:విశాఖలో ముందుకొచ్చిన సముద్రంసముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి.విశాఖ, గంగవరం పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక 👉తిరుపతిలో భారీ వర్షాలు..వర్షాల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు, జూనియర్ కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవుభారీ వర్షాలతో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్ వేంకటేశ్వ ర్భారీ వర్షాలు కారణంగా ఈరోజు శ్రీవారి మెట్టు మార్గం మూసివేసిన టీటీడీ 👉గడిచిన ఆరు గంటల్లో 22 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం తీరం దాటింది. వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, ఇప్పటికే అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లోనూ రెండు రోజులుగా ఎడతెగని వర్షాలు పడుతున్నాయి. వర్షాల తీవ్రతకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. నెల్లూరు నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై ఉండడంతో జన జీవనానికి ఇబ్బంది ఏర్పడింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వాయుగుండం కారణంగా తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
హైదరాబాద్లో కుండపోత వర్షం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట్, ఫిల్మ్నగర్, శేరిలింగంపల్లి, నిజాంపేట్, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్పేట్, చాదర్ఘాట్, కోఠి, నారాయణగూడ, హిమాయత్ నగర్, ఆర్టీసీ క్రాస్రోడ్, ఉప్పల్, రామంతాపూర్, అంబర్పేట్, సికింద్రాబాద్, ప్యారడైస్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకపూల్, వర్షం దంచికొట్టింది.వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. చాలా ప్రాంతాల్లో వరద నీరు రహదారులపైకి చేరడంతో ఇళ్లకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. -
తమిళనాడు, కర్ణాటకలో జడివానకు ప్రజలు అతలాకుతలం (ఫొటోలు)
-
తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు
-
వేగంగా కదులుతున్న వాయుగుండం ఏపీలో ఆ మూడు జిల్లాలకు ఎఫెక్ట్
-
సహారాకు కొత్త అందం!
ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారిలో వర్షం కురిసింది. అదీ భారీగా. రెండు రోజులపాటు కురిసిన వానకు అక్కడి ఇసుక తిన్నెల స్వరూపమే మారిపోయింది. హఠాత్తుగా ఆ ప్రాంతంలో పెద్దపెద్ద సరస్సులు వెలిశాయి. ఒయాసిస్ల వద్ద ఉండే చెట్ల ప్రతిబింబాలు వాన నీటిలో చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దశాబ్దాల కాలంలో కురిసిన అతి భారీ వర్షం ఇదేనని అక్కడి వారు సంబరపడుతున్నారు. సాధారణంగా సహారాలో ఏడాదిలో అదీ వేసవిలో కొద్దిపాటి వాన కురుస్తుంది. కానీ, మొరాకో ఆగ్నేయాన ఉన్న సహారాలో అల్ప పీడనం కారణంగా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల అతిభారీగా కూడా వానలు కురిశాయని నాసా ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. మొరాకాలో వాయవ్య నగరం ఇర్రాచిడియాలో ఏడు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. సెపె్టంబర్లో సాధారణంగా కురిసే వర్షపాతానికి ఇది ఏకంగా నాలుగు రెట్లు. అంతేకాదు, ఆ ప్రాంతంలో ఆరు నెలల్లో కురిసే వర్షపాతానికి ఇది సమానం. ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో వర్షాలు కురియడం 30–50 సంవత్సరాల కాలంలో ఇదే మొదటిసారని మొరాకో వాతావరణ అధికారి హొస్సేన్ చెప్పారు. దీంతో, ఎడారి ఇసుక తిన్నెలు, అక్కడక్కడ పెరిగే మొక్కలు, ఖర్జూర చెట్లు కొత్త ప్రకృతి అందాలను సంతరించుకున్నాయి. మెర్జౌగా ఎడారి పట్టణంలో అరుదైన ఇసుక తిన్నెల్లోకి భారీగా చేరిన వరద కొత్త సరస్సులను సృష్టించింది. మొరాకోలోని అతిపెద్ద నేషనల్ పార్క్గా ఉన్న ఇరిఖి నేషనల్ పార్క్లో ఇంకిపోయిన చెరవులు మళ్లీ నిండాయి. కొన్ని చోట్ల పచి్చక బయళ్లు అవతరించాయి. అంతగా జనం ఉండని ప్రాంతాల్లోనే ఎక్కువగా వానలు కురిశాయి. ఇక్కడ ఎలాంటి నష్టం జరగలేదు. అయితే, ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలతో పట్టణాలు, గ్రామాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ విపరీత మార్పులే ఈ పర్యవసానాలకు కారణమని నిపుణులు అంటున్నారు. వాతావరణం మరింతగా వేడెక్కితే మున్ముందు ఇక్కడ మరింతగా వర్షాలకు కురిసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దాదాపు 36 లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించిన ఉన్న సహారా ప్రపంచంలోనే అతి పెద్ద ఎడారి. –నేషనల్ డెస్క్, సాక్షి -
ఏపీకి 4 రోజుల పాటు భారీ వర్షం
-
నెల్లూరు జిల్లాలో దంచికొడుతున్న వర్షాలు
-
4 రోజులపాటు ఏపీలో అత్యంత భారీ వర్షాలు
-
ఏపీకి వాన గండం
-
హైదరాబాద్: పలు చోట్ల భారీ వర్షం
హైదరాబాద్: హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశంలో దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, ఖైరతాబాద్లో భారీ వాన పడుతోంది. ఇక.. ఇప్పటికే కాప్రా, నాగారం, దమ్మాయిగూడ, యాప్రాల్, నేరేడ్మెట్, మల్కాజిగిరి, తిరుమలగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బోవెన్పల్లి, కొంపల్లి, అమీర్పేట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.HyderabadRains ⚠️10-15min HEAVY DOWNPOUR reduced across Kapra, Nagaram, Dammaiguda, Yapral, Neredmet, Malkajgiri, Tirumalgiri further heading to Qutbullapur, Kukatpally, Bowenpally, Kompally, Ameerpet, Khairtabad, Madhapur, Jubilee Hills side. All will reduce in 10-15min ⚡🌧️⚠️— Telangana Weatherman (@balaji25_t) October 11, 2024 -
నవరాత్రి ఉత్సవాలు : అమృతవర్షంలో మధుర మీనాక్షి ఆలయ కోనేరు (ఫొటోలు)
-
రాయలసీమలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది.దీని ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో నేడు అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అక్కడక్కడా భారీ వర్షాలు పడేందుకు ఆస్కారముందని వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు.ఇదీ చదవండి: 9న పుంగనూరుకు వైఎస్ జగన్ -
హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకొని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.Heavy Rain Started In Hyderabad, Oldcity , ChandrayanGutta Surrounding Areas.. @Hyderabadrains pic.twitter.com/OFx6NoTpP0— RSB NEWS 9 (@ShabazBaba) October 4, 2024క్రెడిట్స్: RSB NEWS 9వర్షం కారణగా రోడ్లపై నీరు నిలిచి.. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం చోటు చేసుకుంది. వర్షంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
విశాఖలో భారీ వర్షం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. అల్ప పీడనం బలహీనపడినప్పటికీ నగరంలో భారీ వర్షం పడింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్ల మీద వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరోవైపు.. బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇదే సమయంలో నేడు, రేపు ఉత్తరాంధ్రలో విసార్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తాలో కూడా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉంది. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లవద్దనే హెచ్చరికలు కొనసాగుతున్నాయి.ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ దేవరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెగ -
నీట మునిగిన మహారాష్ట్ర..
-
వీడియో: జడివాన ఎఫెక్ట్.. ముంబై అతలాకుతలం
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం భారీ వర్షానికి అతలాకుతలమైంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నేడు ముంబై, పూణేలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే, పలు విమాన సర్వీసులను దారి మళ్లించారు.బుధవారం రాత్రి నుంచి ముంబై, పూణేలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లకు మీదకు భారీగా వరద నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే.. ఇండిగో, విస్తారా, స్పైస్జెట్ విమాన సంస్థలు పలు విమాన సర్వీసులను దారి మళ్లించినట్టు ఓ ప్రకటనలో తెలిపాయి. పలు సర్వీసులను రద్దు చేశారు. అలాగే, రైల్వే స్టేషన్లోకి వరద నీరు చేరడంతో రైల్వే ట్రాక్లు నీట మునిగాయి. దీంతో, పలు రద్దు రైళ్లను కూడా రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించినట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.#Ghatkopar Metro station right now on your left and LBS marg near #Vikhroli on your right !! non stop rains since past 3 hours #MumabiRains next #FlightsMumbai pic.twitter.com/J5iOqmU86R— sudhakar (@naidusudhakar) September 25, 2024The Kurla-Harbour line in Mumbai was heavily waterlogged last night due to heavy rain in the city. #MumbaiRain #MumbaiWeather pic.twitter.com/xLMF2kMn7w— Vani Mehrotra (@vani_mehrotra) September 26, 2024Heavy rainfall in mumbai It looks like Tsunami🥺ईश्वर सबकी रक्षा करें। सभी मुंबई वासी घरों में सुरक्षित रहे।#MumbaiRain #Mumbai #MumbaiWeather #MumbaiNews #Courreges #FreeCitizens pic.twitter.com/ziM0LeqTKA— Akshay jangid (@jangirakashay67) September 26, 2024ఇక, వాతావరణ శాఖ ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబై పరిధిలో ఈదురుగాలు, పిడుగుపాటుల కలయికగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముంబైతో పాటు మహారాష్ట్రలోని పాల్ఘర్, నందూర్బర్, ధూలే, జల్గావ్, సోలాపూర్, సతారాలలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బుధవారం రాత్రి వర్షాల కారణంగా మ్యాన్హోల్లో పడిపోయి ఓ మహిళ మృతిచెందింది. మరోవైపు.. ఈనెల 26 నుంచి 30 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ల పరిధిలోని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని ఐఎండీ అంచనా వేసింది. #WATCH | Mumbai, Maharashtra | Water recedes at the Andheri Railway Station after the city witnessed severe waterlogging and traffic followed by heavy rainfall yesterday. pic.twitter.com/8LtU2pgw0Z— ANI (@ANI) September 26, 2024 #WATCH | Thane, Maharashtra | Torrential rains in Mumbai lead to landslide at the Mumbra by-pass road. pic.twitter.com/SZ1kVUHmz7— ANI (@ANI) September 25, 2024#WATCH | Mumbai, Maharashtra | Railway commuters walked on tracks at the Chunabhatti Railway station as Mumbai faced severe waterlogging followed by torrential rains. (25.09) pic.twitter.com/ewA8caiAIO— ANI (@ANI) September 25, 2024 -
తెలంగాణ: 14 జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
సాక్షి, హైదరాబాద్: కోస్తాకు సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. కోసాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు.. పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలోని 14 జిల్లాల్లో నేడు, రేపు(బుధ,గురు) భారీ వర్షాలు కురిసే అవకాముందని ఎల్లో అలర్ట్ను జారీ చేసింది.నేడు(బుధవారం) నిజామాబాద్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.రేపు(గురువారం) నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.ఇదీ చదవండి: మూసీ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్.. బాధితుల కోసం ప్రభుత్వం స్పెషల్ ప్లాన్! -
మూడు రోజులు భారీ వర్షాలు..
-
హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం (ఫొటోలు)
-
హైదరాబాద్కు మరోసారి భారీ వర్షసూచన
సాక్షి,హైదరాబాద్:రాజధాని హైదరాబాద్ నగరంలో వరుసగా మూడోరోజు ఆదివారం(సెప్టెంబర్22) భారీ వర్షం పడే ఛాన్సుందని వాతావరణశాఖ తెలిపింది.నాగోల్, బండ్లగూడ, ఉప్పల్, బోడుప్పల్, మీర్పేట్, ఎల్బీనగర్,దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడనుందని వాతావరణశాఖ తెలిపింది.కాగా, శుక్ర,శనివారాలు సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి నగరంలో రోడ్లపై వరదలు పోటెత్తి ఎక్కడికక్కడ ట్రాఫిక్జామ్ అయింది. దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపై ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. పలు చోట్ల విద్యుత్తీగలపై చెట్లు,ఫ్లెక్సీలు పడి విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయి. ఇదీ చదవండి: హైదరాబాద్లో కుండపోత వర్షం -
హైదరాబాద్లో కుండపోత వర్షం
సాక్షి,హైదరాబాద్:రాజధాని హైదరాబాద్ నగరంలో మళ్లీ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శనివారం(సెప్టెంబర్21)సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచి కొట్టింది. కొండాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట, పంజాగుట్ట సికింద్రాబాద్, ఉప్పల్,బోడుప్పల్,నాగోల్,దిల్సుఖ్నగర్, చైతన్యపురి,కోఠి,అబిడ్స్,నాంపల్లి ప్రాంతాల్లో ఏకధాటిగా రెండుగంటల పాటు అతి భారీ వర్షం పడింది. #HYDTPinfoIt's #Raining heavily.Commuters are requested to drive carefully.#HyderabadRains pic.twitter.com/2tKy5y1vg9— Hyderabad Traffic Police (@HYDTP) September 21, 2024 భారీ వర్షంతో రోడ్లపై నీరు వరదలై పారింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా నగరంలోని పలు ప్రధాన రోడ్లపై ట్రాఫిక్జామ్ అయింది. కాగా, శుక్రవారం రాత్రి నగరమంతా రెండు గంటలపాటు భారీ వర్షం పడిన విషయం తెలిసిందే. భారీ వర్షం కారణంగా నిలిచిన నీళ్లు పూర్తిగా తొలగక ముందే మళ్లీ వర్షం పడడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.ఇదీ చదవండి: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలే -
#HyderabadRains : హైదరాబాద్ లో అర్ధరాత్రి భారీ వర్షం (ఫొటోలు)
-
విశాఖపట్నం లో మారిన వాతావరణం...భారీ వర్షం (ఫొటోలు)
-
ఢిల్లీలో ఎడతెగని వానలు.. దేశంలో వాతావరణం ఉందిలా..
న్యూఢిల్లీ: ఈసారి రుతుపవనాలు పర్వత ప్రాంతాలు మొదలుకొని నుండి మైదాన ప్రాంతాల్లో ఉండేవారి వరకూ అందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా, పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో చాలా రహదారులు మూసుకుపోయాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో ఎడతెగని వానల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. ఈ రోజు కూడా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో వర్షాల కారణంగా 10 మంది మృతిచెందారు. గడచిన 24 గంటల్లో ఉత్తరప్రదేశ్లో సగటున 28.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో 51 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మరోవైపు ఢిల్లీలో గురువారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ అధ్వాన్నంగా మారడంతో ఎక్కడైనా ప్రమాదాలు చోటుచేసుకుంటాయని పలువురు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు.వర్షం కారణంగా ఘజియాబాద్లోనిలోని పోలీస్ స్టేషన్ పరిధిలో శిథిలావస్థలో ఉన్న ఇంటి పైకప్పు కూలిపోయింది. ఆ ఇంట్లో నిద్రిస్తున్న మహిళ, ఆమె ఇద్దరు కూతుళ్లు అందులోనే సమాధి అయ్యారు. రాజస్థాన్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో సాధారణంగా పగటిపూట మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షం కురియనుంది. హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మొత్తం 117 రహదారులపై ట్రాఫిక్ను నిలిపివేశారు. శనివారం సిమ్లా, సిర్మౌర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా ఓ మోస్తరు వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఇది కూడా చదవండి: చైనాలో రిటైర్మెంట్ వయసు పెంపు ! -
‘దేవుడా.. ఇంకెన్ని రోజులు’!.. విజయవాడ వరద బాధితుల ఆవేదన (చిత్రాలు)
-
AP Rains: ఉత్తరాంధ్రలో పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన
-
రెండు రోజులపాటు కోస్తాంధ్రకు వర్ష సూచన
-
ఉత్తరాంధ్రకు డేంజర్ బెల్స్.. రెడ్ అలర్ట్ జారీ
-
అన్నదాతలకు అపార నష్టం
సాక్షి, అమరావతి: కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నది, బుడమేరుకు పోటెత్తిన వరదలు తోడవటంతో రైతుల ఆశలన్నీ గల్లంతయ్యాయి. గడచిన 10 రోజులుగా లక్షలాది ఎకరాల్లో పంటలన్నీ ముంపు నీటిలో చిక్కుకోవడంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 16 జిల్లాల పరిధిలో 5.03 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 4,53,845 ఎకరాల్లో వ్యవసాయ, 12 జిల్లాల పరిధిలో 49,340 ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్టు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 365 మండలాల్లో 2,475 గ్రామాల పరిధిలో 2.50 లక్షల మంది రైతులు ముంపు ప్రభావానికి గురైనట్టుగా లెక్కతేల్చారు.వరి పంటకు ఎనలేని నష్టంకృష్ణా నదీ పరివాహక ప్రాంతాలైన ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అత్యధిక విస్తీర్ణంలో పంటలకు అపారమైన నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. ఆయా జిల్లాల్లో వరి పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అత్యధికంగా 3.50 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతినగా.. ఆ తర్వాత పత్తి, మొక్కజొన్న, అపరాలు, చిరుధాన్యాలు, మిరప, అరటి, పసుపు, కంద, నిమ్మ, కూరగాయలు, ఉల్లి, ఆయిల్పామ్, బొప్పాయి, పూలు, కొబ్బరి తదితర పంటలు దెబ్బతిన్నాయి. ఇసుక మేటలు వేయడం ద్వారా 525 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా.. కృష్ణా జిల్లాలో 140 ఎకరాల్లో మల్బరీ తోటలకు నష్టం వాటిల్లింది. పాడి, మత్స్య రైతులకు తీవ్ర నష్టంఓ మత్స్యకారుడు మృతి చెందగా.. 83 బోట్లు పూర్తిగాను, 202 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నట్టు మత్స్య శాఖ గుర్తించింది. 349 మోటర్ బోట్లు పూర్తిగా దెబ్బతినగా.. 2,440 వలలు ధ్వంసమయ్యాయి. 10వేల హెక్టార్లలో ఫిష్ సీడ్ ఫామ్స్, ఇసుక మేటలు వేయడం వల్ల 18 వేల హెక్టార్లలో చేపల చెరువులు దెబ్బతిన్నాయి. పశు సంవర్ధక శాఖకు సంబంధించి 10 జిల్లాల పరిధిలో 116 పశువులు, 340 మేకలు, గొర్రెలు, 5 ఎద్దులు, 32 దూడలతో పాటు 71,639 కోళ్లు చనిపోగా, 92 పశువుల షెడ్లు కూలిపోయినట్టు లెక్కతేల్చారు. అత్యధికంగా కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, ఏలూరు జిల్లాల పరిధిలోని 73 మండలాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ జిల్లాల పరిధిలో 46,826 పశువులపై తీవ్ర ప్రభావం చూపింది. వ్యవసాయ పంటలకు రూ.301.35 కోట్ల నష్టంఎస్డీఆర్ ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్) నిబంధనల ప్రకారం ప్రాథమికంగా వ్యవసాయ పంటలకు రూ.301.35 కోట్లు, ఉద్యాన పంటలకు, రూ.40.97 కోట్లు, మత్స్య శాఖకు రూ.141.90 కోట్లు, సెరీ కల్చర్కు రూ.2.68 కోట్లు, పశు సంవర్ధక శాఖకు రూ.66.60 నష్టం వాటిల్లినట్టు లెక్కతేల్చారు. కాగా.. తుది నష్టం అంచనాలకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ నెల 10వ తేదీలోగా పంట నష్టం అంచనాలు రూపొందించి, 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సోషల్ ఆడిట్ కింద రైతు సేవా కేంద్రా(ఆర్బీకే)ల్లో జాబితాలు ప్రదర్శించనున్నారు. 18న తుది అంచనాల జాబితాలను ప్రదర్శిస్తారు. -
తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు
-
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు
-
TG: రెండు జిల్లాలో భీకర వర్షం.. ఈ రాత్రి ఎలా గడిచేనో..
సాక్షి, ఖమ్మం/మహబూబాబాద్: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల నుంచి కోలుకునేలోపే మరోసారి మహబూబాబాద్, ఖమ్మంలో శనివారం మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షం ధాటికి ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది.ఇక, శనివారం సాయంత్రం నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రం సహా బయ్యారం మండలంలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో, జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. అటు.. బయ్యారంలో జగ్నతండా జల దిగ్బంధమైంది. అన్ని వైపుల నుంచి వరద చుట్టుముట్టడంతో తండాలోని ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాల వలన మరోసారి పెరుగుతున్న మునేరు వాగు ప్రవాహం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటోందన్నారు. అవసరమైతే సహాయక శిబిరాలు మళ్లీ తెరవాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలు వెంటనే అక్కడినుండి తరలి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు వెళ్లాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సూచనలను పాటించి, తగినంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులతో సంప్రదించాలని కోరారు. అధికారులు వెంటనే అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు, ప్రజలకు సహాయ సేవలు నిరంతరం అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. Inatensive Heavy rain in Mahabubabad bro now pic.twitter.com/3JQBEnpwLP— MKS Goud (@KothaMukesh2) September 7, 2024 మరోవైపు.. ఖమ్మంలో కూడా మరోసారి పరిస్థితి దారుణంగా మారాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మున్నేరుకు వరద పెరిగే అవకాశం ఉంది. శనివారం అర్ధరాత్రి తర్వాత మున్నేరు ఉధృతి పెరిగే సూచనలు ఉండటంతో కేఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. కమిషనర్.. అధికారులను అందరినీ అత్యవసరంగా ఆఫీసుకు పిలిపించారు. ముంపు ప్రాంతాలను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు ప్రజలకు సూచించారు. Water level is rising in munneru due to heavy rains in mahabubabad and warangal.* Munneru river* Date: *07.09.2024*Time : 7.26 PMWater level: 8.75'ft1st warning 16.00 ft 2nd Warning 24.00ft. Trend:- steadyదాన్వాయిగూడెం, రమణపేట,… pic.twitter.com/mngqnDTD9U— Municipal Commissioner (@MC_Khammam) September 7, 2024 #Mahabubabad #Telangana has again got very heavy rain and many places in #Khammam as well as #Yellandu catchment of #Munneru is getting heavy rains in the last 2 hours. Strict vigil required along Munneru sub-basin. @APSDMA @10NDRF @CWCOfficial_FF @ndmaindia pic.twitter.com/3yErRTI7Vj— S Lakshminarayanan (@sln_1962) September 7, 2024 -
విజయవాడలో దంచికొడుతున్న వర్షం.. ఆందోళనలో ప్రజలు
సాక్షి, విజయవాడ: విజయవాడలో మళ్లీ వర్షం దంచికొడుతోంది. శనివారం ఉదయం నుంచే మళ్లీ వర్షం కురుస్తోంది. ఇక, ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో బుడమేరు కారణంగా విజయవాడ జల దిగ్బంధమైంది. దీంతో, తాజాగా వర్షం కురుస్తుండటంతో బెజవాడ ప్రజలు వణికిపోతున్నారు.మరోవైపు.. వర్షాల కారణంగా ఇప్పటికే వారం రోజులుగా పలు కాలనీలు వరద ముంపులోనే ఉన్నాయి. వరద తగ్గుతుందని ఆనందపడుతున్న వేళ మళ్లీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక.. కొత్తూరు తాడేపల్లి, వైఎస్సార్ కాలనీ, చిట్టినగర్, మిల్క్ ప్రాజెక్ట్, ఊర్మిళా నగర్, జోజినగర్, నందమూరి నగర్, వాంబే కాలనీ, పాత రాజేశ్వరి పేట, కొత్త రాజేశ్వరి పేట, కండ్రిక, పాయకాపురం, ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్, లూనా నగర్, ఎస్ఆర్సీ కాలనీ, అంబాపురం కాలనీలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి.విజయవాడలో మళ్లీ మొదలైన వర్షం 💔#VijayawadaRains pic.twitter.com/mDUpbPJRJR— MBYSJTrends ™ (@MBYSJTrends) September 7, 2024 Present situation in Ajith Singh Nagar area .....bad luck entante marala full rain paduthundi... God Please Save Andhra Pradesh #VijayawadaFloods #VijayawadaRains #AndhraPradeshFloods pic.twitter.com/AK9bZjsfTk— పల్నాడు అబ్బాయి 🔥💙🤍💚 (@BSRYsrcp) September 7, 2024ఇదిలా ఉండగా.. విజయవాడ వాసులను మళ్లీ “బుడమేరు” వణికిస్తోంది. క్రమ క్రమంగా వరద పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వరదలు వస్తాయని ముందే తెలిసినా ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమైందని, ఫలితంగా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ వాసులను మళ్లీ “బుడమేరు” వణికిస్తోంది. క్రమ క్రమంగా వరద పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వరదలు వస్తాయని ముందే తెలిసినా ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమైందని, ఫలితంగా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.… pic.twitter.com/GxJqpi0aw6— YSR Congress Party (@YSRCParty) September 7, 2024 -
AP: రెండురోజుల పాటు వర్షాలు
సాక్షి,విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమలో శని,ఆదివారాల్లో(సెప్టెంబర్7,8) విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రుతుపవన ద్రోణి ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నట్లు తెలిపింది.భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తీరంలో మత్స్యకారులకు మరో రెండు రోజులపాటు హెచ్చరికలు అమలులో ఉండనున్నాయి. కాగా, వాయుగుండం ప్రభావంతో ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలకు విజయవాడ నగరంలో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్న తరుణంలో వాతావరణ శాఖ రాష్ట్రానికి మరోసారి భారీ వర్షసూచన చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
హైదరాబాద్లో కుండపోత వర్షం..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా నల్లటి మేఘాలు కమ్ముకుని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బేగంపేట, అబిడ్స్, కోఠి, నాంపల్లిలో భారీ వర్షం కురిసింది. మియాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, బోడుప్పల్ సహా పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడింది. సాయంత్రం కావడంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. Very heavy smashing rain at Tellapur side. #Tellapur #HyderabadRains pic.twitter.com/dquYSIRmZx— Jagadish Reddy (@Jagadish_M) September 6, 2024 #06SEP 5:10PM⚠️Heavy Rain Spell ahead for West, Central, South &East #Hyderabad City.#Serilingampally, #Patancheru, #Kukatpally, #Begumpet, #Secunderabad,Abids,Khairatabad,Shaikpet, Charminar, Lb nagar Surroundings will see good Rains during the next 1hr⛈️⚠️#Hyderabadrains pic.twitter.com/vgpORYwzwg— Hyderabad Rains (@Hyderabadrains) September 6, 2024 Raining #Khajaguda 🌧️🌧️#Hyderabadrains pic.twitter.com/rnJ9GNbLBy— Hyderabad Rains (@Hyderabadrains) September 6, 2024 -
ఏపీకి తప్పిన గండం..
-
24 గంటల్లో భారీ వర్షాలు..
-
నేడు ఖమ్మం జిల్లాకు కేంద్ర మంత్రులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రానికి వాటిల్లిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏరియల్ సర్వేకు సిద్ధమైంది. ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.శివరాజ్సింగ్ శుక్రవారం ఉదయం 9 గంటలకు విజయవాడ నుంచి నేరుగా ఖమ్మం చేరుకోనుండగా బండి సంజయ్ ఆయనతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. అనంతరం పంట నష్టంతోపాటు ఆస్తి నష్టంపై కేంద్ర, రాష్ట్ర అధికారులతో వారు సమీక్షించనున్నారు. -
మరో మూడు రోజులు వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వాయవ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడిందని, దానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. వీటి ప్రభావంతో విస్తారంగా వానలు కురుస్తాయని తెలిపింది. ఆరు జిల్లాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తగ్గిపోయిన ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, ముసురు వాతావరణంతో ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. భద్రాచలం, ఖమ్మం, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీల మేర, మిగతా చోట్ల ఒకట్రెండు డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో రాత్రివేళల్లో చలిగాలులు వీస్తున్నాయి. గురువారం రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్లో 32.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.రెండు జిల్లాల్లో వానలు డబుల్ నైరుతి రుతుపవనాల సీజన్కు సంబంధించి వర్షాలు సాధారణాన్ని దాటిపోయాయి. సీజన్కు సంబంధించి ఇప్పటి (సెపె్టంబర్ 5)వరకు 60.32 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవాల్సి ఉండగా.. 40శాతం అధికంగా 84.72 సెంటీమీటర్లు కురిసింది. వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో సాధారణం కంటే రెండింతలకుపైగా వర్షాలు కురిసినట్టు తెలంగాణ ప్రణాళిక విభాగం గణాంకాలు చెప్తున్నాయి. వనపర్తి జిల్లాలో 37.15 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 79.14 సెంటీమీటర్లు, అంటే 114 శాతం అధికంగా వర్షం కురిసింది.నారాయణపేట జిల్లాలో 37.08 సెం.మీ. సాధారణ వర్షపాతానికిగాను 77.15 సెంటీమీటర్లు (108 శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది. మొత్తంగా చూస్తే.. రాష్ట్రంలో ఆరు జిల్లాలు వనపర్తి, నారాయణపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల, సిద్దిపేట జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా.. మిగతా జిల్లాల్లో అధిక వర్షం కురిసింది. -
బాబు తప్పిదమే ముంచేసింది
సాక్షి, అమరావతి: విజయవాడతోపాటు లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలకు కనీసం సమాచారం ఇవ్వకుండా బుడమేరుపై వెలగలేరు వద్ద ఉన్న రెగ్యులేటర్ గేట్లను శనివారం అర్థరాత్రి దాటాక హఠాత్తుగా ఎత్తివేయడంపై రిటైర్డు ఈఎన్సీలు (ఇంజనీర్–ఇన్–చీఫ్), చీఫ్ ఇంజనీర్లు, సాగు నీటిరంగ నిపుణులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం చారిత్రక తప్పిదం విజయవాడలో జల ప్రళయానికి.. కనీవినీ ఎరుగని ప్రాణ, ఆస్తి నష్టానికి దారి తీసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం చెలగాటమాడేలా వ్యవహరించడంపై నివ్వెరపోతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల 30వతేదీ (శుక్రవారం), 31న (శనివారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని గత నెల 28న ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలో శుక్రవారం పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు బుడమేరు ఉప్పొంగింది. శనివారం ఉదయానికి వెలగలేరు రెగ్యులేటర్ వద్దకు దూసుకొచ్చింది.బుడమేరు డైవర్షన్ ఛానల్ గుండా కృష్ణా నది వైపు పరుగులు తీసింది. ఎగువ నుంచి బుడమేరుకు భారీ వరద వస్తోందని.. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి, ఎస్ఈ, కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు శనివారం ఉదయమే సమాచారం ఇచ్చామని డీఈ మాధవ్ నాయక్ ‘సాక్షి’కి చెప్పారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి బుడమేరు వరద విజయవాడ చేరడానికి 20 గంటల సమయం పడుతుందని కూడా చెప్పామన్నారు. నిలువెల్లా నిర్లక్ష్యానికి తార్కాణం.. వెలగలేరు రెగ్యులేటర్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు దానికి దిగువన బుడమేరు పరీవాహక లోతట్టు ప్రాంతాల గ్రామాలు, విజయవాడలోని సింగ్ నగర్, కండ్రిక, పాత రాజరాజేశ్వరిపేట, పాయకాపురం తదితర కాలనీల ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసేలా చాటింపు వేయించాలి. సురక్షిత ప్రాంతాల్లో పునరావాస శిబిరాలకు తరలించాలి. ఆ తర్వాత గేట్లు ఎత్తడానికి వెలగలేరు రెగ్యులేటర్ సిబ్బందికి అనుమతి ఇవ్వాలి. కానీ.. ఈ విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. వెలగలేరు రెగ్యులేటర్ సిబ్బంది పంపిన సమాచారంపై శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ కనీసం స్పందించలేదు. కృష్ణా, బుడమేరు ఒకేసారి ఉప్పొంగడం.. బుడమేరు నుంచి 60 వేల క్యూసెక్కులపైగా వరద పోటెత్తడంతో సీఎం చంద్రబాబు ఇంటికి ముంపు ముప్పు ముంచుకొస్తుండటంతో శనివారం రాత్రి ప్రభుత్వం స్పందించింది. చంద్రబాబు ఇంటికి ముంపు ముప్పు తప్పించడం కోసం వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తేసి బుడమేరు వరదను మళ్లించాలని రెగ్యులేటర్ సిబ్బందిని ఆదేశించింది. విజయవాడలో జల ప్రళయం.. లోతట్టు ప్రాంతాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో శనివారం ఎప్పటిలానే బుడమేరు లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాలు, విజయవాడ ప్రజలు నిద్రకు ఉపక్రమించారు. అనంతరం రాత్రి వెలగలేరు రెగ్యులేటర్ గేట్లను ఎత్తేశారు. ఆదివారం తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్న విజయవాడ లోతట్టు ప్రాంతాల వాసులపై బుడమేరు వరద ఒక్కసారిగా విరుచుకుపడింది. తేరుకునే లోపే బుడమేరు వరద చుట్టుముట్టి ఇళ్లను ముంచెత్తింది. జలప్రళయానికి దారి తీసింది. అపార ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. చంద్రబాబు సర్కారు చారిత్రక తప్పిదం వల్లే ఈ ప్రళయం చోటుచేసుకుందని ఇంజనీర్లు, సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. గేట్లు ఎత్తాలంటే ప్రోటోకాల్ ఇదీ⇒ ఏదైనా ఒక ప్రాజెక్టు లేదా రెగ్యులేటర్ గేట్లు ఎత్తి దిగువకు వరదను విడుదల చేయాలంటే సంబంధిత ప్రాజెక్టు ఎస్ఈ (సూపరిండెంట్ ఇంజనీర్), జిల్లా కలెక్టర్, ప్రాజెక్టు దిగువ ప్రాంతంలోని ఆర్డీవో, ఆయా మండలాల తహసీల్దార్లకు కనీసం 12 గంటల ముందు సమాచారం ఇవ్వాలి. ⇒ ఇదే రీతిలో ప్రాజెక్టు ఉన్న జిల్లా ఎస్పీ, ప్రాజెక్టు దిగువ ప్రాంతాల పరిధిలోని డీఎస్పీ, సీఐలకు కూడా సంబంధిత ఎస్ఈ సమాచారం అందించి అప్రమత్తం చేయాలి. ⇒ కలెక్టర్, ఆర్డీవోలు దీనిపై తక్షణమే స్పందించి సంబంధిత తహసీల్దార్లను అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరిస్తూ ఆయా ప్రాంతాల్లో చాటింపు వేయించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పోలీసుల సహకారంతో సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాలకు తరలించాలి. ⇒ లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించే ప్రక్రియ పూర్తయ్యాక గేట్లు ఎత్తాలి.ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు చెందిన ప్లాంట్కు ఎన్వోసీని రద్దు చేస్తూ 2021లో ఇచ్చిన ఉత్తర్వులు ఆ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన రాధాకృష్ణ.. వాటిపై స్టే ఇచ్చిన హైకోర్టు రాధాకృష్ణకు రాసిచ్చారు..!బుడమేరు డైవర్షన్ ఛానల్(బీడీసీ)లో ఏడాది పొడవున రోజూ కనీసం 2 వేల క్యూసెక్కుల నీరు ఉంటుంది. ఈ నేపథ్యంలో బీడీఎస్పై 1,400 కిలోవాట్ల సామర్థ్యంతో జల విద్యుత్కేంద్రం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ 1994లో జెన్కో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అయితే 1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకోవడానికి సహకరించిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు నాడు చంద్రబాబు ఈ ప్రాజెక్టు కట్టబెట్టారు. 1,020 క్యూసెక్కులు వినియోగిస్తూ 500 కిలోవాట్ల సామర్థ్యంతో రెండు ప్లాంట్ల నిర్మాణానికి రాధాకృష్ణకు చెందిన ‘యాక్టివ్’ పవర్ ప్లాంట్కు 1998 ఏప్రిల్ 13న చంద్రబాబు అనుమతిచ్చారు. ఆ తర్వాత దాని సామర్థ్యాన్ని పెంచుతూ 1,520 క్యూసెక్కులు వినియోగించి ఒక్కో కేంద్రంలో 700 కిలోవాట్లు ఉత్పత్తి చేసేలా 1999 ఫిబ్రవరి 15న అనుమతి ఇచ్చారు. అయితే కృష్ణాలో బుడమేరు ప్రవాహం కలవడానికి యాక్టివ్ పవర్ ప్లాంట్ అడ్డంకిగా మారింది. దాంతో వరద వెనక్కి ఎగదన్నడంతో బీడీసీ కరకట్టకు గండిపడి తరచూ విజయవాడ లోతట్టు ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి. బుడమేరు వరదతో 2005లోనూ ఇదే రీతిలో విజయవాడ ముంపునకు గురైంది. ఈ క్రమంలో బీడీసీ సామర్థ్యాన్ని 37,555 క్యూసెక్కులకు పెంచేలా ఆధునికీకరించడం ద్వారా విజయవాడకు ముంపు ముప్పును శాశ్వతంగా తప్పించే పనులకు 2008 ఆగస్టు 12న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పనులు చేపట్టడానికి వీలుగా 2009 ఆగస్టు 29న రాధాకృష్ణ పవర్ ప్లాంట్కు నో అబ్జెక్షన్ సరి్టఫికెట్ (ఎన్వోసీ)ని రద్దు చేశారు. అయితే వైఎస్సార్ హఠాన్మరణంతో బీడీసీ ఆధునికీకరణ పనులు ముందుకు కదల్లేదు. రాష్ట్ర విభజనకు ముందు నాటి కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం రాధాకృష్ణ పవర్ ప్లాంట్కు షరతులతో ఎన్వోసీని పునరుద్ధరించింది. ఇక విభజన తర్వాత టీడీపీ సర్కారు రాధాకృష్ణకు లబ్ధి చేకూర్చడం కోసం బీడీసీ ఆధునీకరణను అటకెక్కించేసింది. అనంతరం 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక బీడీసీ ఆధునీకరణపై దృష్టి పెట్టింది. ఇందుకోసం 2021 జనవరి 6న రాధాకృష్ణ పవర్ ప్లాంట్కు ఎన్వోసీని రద్దు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించగా ఎన్వోసీ రద్దుపై స్టే విధించడంతో బీడీసీ ఆధునికీకరణ పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వానికి చెప్పాంశుక్రవారం బుడమేరు పరీవాహక ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో శనివారం బుడమేరుకు భారీ వరద వస్తుందని మాకు ముందే తెలుసు. వెలగలేరు రెగ్యులేటర్ వద్దకు 45 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేశాం. గరిష్టంగా వరద వస్తున్న నేపథ్యంలో వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి వరదను దిగువకు వదిలేయాల్సి ఉంటుందని ప్రభుత్వానికి శనివారం మధ్యాహ్నంలోపే సమాచారం ఇచ్చాం. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తిన 20 గంటల్లో విజయవాడకు వరద చేరుతుందని చెప్పాం. ప్రభుత్వ అనుమతితోనే శనివారం రాత్రి వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి వరదను దిగువకు వదిలేశాం.– మాధవ్ నాయక్, డీఈ, వెలగలేరు రెగ్యులేటర్‘‘గత శనివారం ఉదయమే బుడమేరుకు ఎగువ నుంచి వరద ఉద్ధృతి ప్రారంభమైందన్నది ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. కృష్ణా నదికి గరిష్ట ప్రవాహం వస్తుందన్నది కూడా తెలుసు. వెలగలేరు రెగ్యులేటర్ దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు కావాల్సినంత సమయం ఉంది. కానీ.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా హఠాత్తుగా వెలగలేరు గేట్లు ఎందుకు ఎత్తేశారు? ఎవరు ఎత్తమన్నారు? విజయవాడలో జల ప్రళయానికి ఇదే కారణం. అపార ప్రాణ, ఆస్తి నష్టానికి దారి తీసింది. ముమ్మాటికీ ప్రభుత్వ తప్పిదమే దీనికి కారణం’’ ఉమ్మడి రాష్ట్రంలో పలువురు సీఎంల వద్ద సలహాదారులుగా (జలవనరులు) పనిచేసిన రిటైర్డు ఈఎన్సీల నిశ్చితాభిప్రాయం ఇది.‘‘2005లో బుడమేరుకు 70–75 వేల క్యూసెక్కులకుపైగా వరద వచ్చింది. నాడు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాక వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తడం వల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం. అప్పటితో పోల్చితే ఇప్పుడొచ్చిన వరద తక్కువే. ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం ఆశ్చర్యకరం. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు హఠాత్తుగా ఎత్తేస్తే విజయవాడను బుడమేరు ముంచెత్తుతుందని, భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహించింది?’’ కృష్ణా డెల్టాలో సుదీర్ఘకాలం పనిచేసిన ఇంజనీర్ సూటి ప్రశ్న ‘‘2009 అక్టోబర్ 2న శ్రీశైలానికి 25.10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. కృష్ణా నదికి వచ్చిన గరిష్ట వరద ఇదే. దాన్ని సమర్థంగా నియంత్రించి ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరే వరదను 11.10 లక్షల క్యూసెక్కులకు తగ్గించగలిగాం. విజయవాడకు ముంపు ముప్పు తప్పించాం. దాంతో పోల్చితే ఇప్పుడు కృష్ణాకు, బుడమేరుకు వచ్చిన వరద తక్కువే. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా నివారించి ఉండొచ్చు. కానీ ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం విజయవాడలో జల విలయానికి దారితీసింది. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తడంలో ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వ పనితీరు ఎంత దయనీయంగా ఉందో బహిర్గతమవుతోంది’’ 2009లో కృష్ణా వరదలను సమర్థంగా నియంత్రించడంలో కీలక భూమిక పోషించిన రిటైర్డు ఈఎన్సీ -
విజయవాడలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం
-
తెలంగాణకు వరద భయం
-
హైదరాబాద్ లో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం..
-
అర్ధరాత్రి విజయవాడలో భారీ వర్షం
-
ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు..
-
ముందే చెప్పి ఉంటే.. ముంచేదా మున్నేరు!
ఉమేష్ చంద్ర, యాకేష్ సోదరులు. ఒకరు గ్రానైట్ బండలపై పేర్లు చెక్కే ఆర్టిస్ట్ కాగా.. మరొకరు సుతారి మేస్త్రి. ఈ కుటుంబాలు రెండూ మోతీనగర్లో రూ.14 లక్షలు వెచ్చించి నాలుగేళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకున్నాయి. గత ఏడాది వరద వచ్చినా వస్తువులు పాడయ్యాయే తప్ప ఇళ్లు దెబ్బతినలేదు. ఈసారి ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి.సామాన్లు, దర్వాజాలు, కిటికీలు కొట్టుకుపోయాయి. రేడియం స్టిక్కర్ మిషన్లు, కంప్యూటర్లు కొట్టుకుపోవడంతో రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. ముందస్తుగా వరద ముంపు సమాచారం ఇస్తే సామగ్రిని ఇతర చోట భద్రపరుచుకునే వారమని ఈ సోదరులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం ఇస్తే నష్టం తప్పేది.. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మున్నేటి వరద ఖమ్మం నగరాన్ని, ఖమ్మం రూరల్ మండలాల్లోని పలు ప్రాంతాలను ముంచేసింది. గత వందేళ్లలో కనీవినీ ఎరుగని జల ప్రళయం బీభత్సం సృష్టించింది. ఇళ్లను నేలమట్టం చేసింది. బియ్యం, ఉప్పు, పప్పుల్లాంటి నిత్యావసర సరుకుల్నే కాదు..విలువైన వస్తువుల్నీ ఊడ్చుకుపోయింది. ఉపాధికి, ఉద్యోగ అవకాశాలకు కీలకమైన వందలాది మంది యువత సర్టిఫికెట్లూ కొట్టుకుపోయాయి. అనేక కాలనీల్లో రోడ్లపైనే కాదు..వేలాది ఇళ్లు, దుకాణాల్లో బురద మేటలు వేసింది. వరద ముంచెత్తే ప్రమాదంపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ లేకపోవడం వల్లే సర్వం కోల్పోవాల్సి వచ్చిందని, కట్టుబట్టలతో ప్రాణాలు దక్కించుకున్న తమకు ఇప్పుడు బురదే మిగిలిందని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మున్నేరు పరీవాహక ప్రాంతంలో ఇప్పుడు ఎవరిని కదిలించినా ఇలాంటి కన్నీటి గాథలే విన్పిస్తున్నాయి. ఇళ్లు చూసి.. గొల్లుమంటూ.. గత నెల 31న మొదలైన వరద ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. 50కి పైగా కాలనీల్లో 10 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. వరద తగ్గడంతో పునరావాస కేంద్రాల నుంచి మున్నేటి ఒడ్డున ఉన్న ఇళ్లకు చేరుకుంటున్న వారు అక్కడి పరిస్థితి చూసి కన్నీళ్లు పెడుతున్నారు. ఇళ్లల్లో బురద మేటలు వేయగా.. అనేకచోట్ల ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయి నేలమట్టమయ్యాయి. మరికొన్నిచోట్ల పైకప్పులు లేచిపోయాయి. ఒక్కో ఇంట్లో రూ.5 లక్షల విలువైన గృహోపకరణాలకు నష్టం జరిగిందనుకున్నా.. మొత్తం నష్టం రూ.వేల కోట్లలో ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్రమత్తం చేయడంలో విఫలం గత ఏడాది జూలై 26 నుంచి 29వ తేదీ వరకు మూడురోజుల పాటు వరద వస్తే గరిష్టంగా 30.7 అడుగులుగా నమోదైంది. అప్పట్లో వరద ముంపును ముందే ఊహించి అప్రమత్తం చేయడంతో బాధితులు విలువైన సామగ్రితో పాటు పునరావాస కేంద్రాలు, బంధువుల ఇళ్లకు తరలిపోయారు. దీంతో ఆస్తినష్టం భారీగా తగ్గింది. అయితే ఈసారి మహబూబాబాద్ జిల్లాలోని మున్నేరు పరీవాహక ప్రాంతాల్లో 40 సెం.మీ.కు పైగా వర్షం కురవడం.. వరద ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ మండలాల్లోని లోతట్టు ప్రాంతాలకు పోటెత్తడం, దీనిపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ లేకపోవడంతో బాధితులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గత నెల 31న రాత్రి 9 గంటలకు 11 అడుగులుగా ఉన్న మున్నేరు ఈనెల 1న తెల్లవారుజామున 3 గంటలకు 19 అడుగులుగా నమోదైంది. ఆ తర్వాత గంట గంటకూ వేగంగా పెరుగుతూ ఉదయం 11 గంటలకే 36 అడుగుల పైకి చేరింది. అయితే ఎగువన భారీ వర్షంతో వరద వస్తుందన్న సమాచారాన్ని గత నెల 29, 30 తేదీల్లోనే నీటిపారుదల, ఇతర శాఖల అధికారులు సమన్వయం చేసుకుని ముంపు ప్రాంతాల ప్రజలకు చేరవేస్తే ఆస్తినష్టం ఇంతగా జరగకపోయేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఏడాది మాదిరి ముందుగా వరద సమాచారం ఇవ్వకపోవడం వల్లే సర్వం కోల్పోయామని బాధితులు విలపిస్తున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. రూ.లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగిందని.. అరకొర సాయమే తప్ప ప్రభుత్వం ఈ స్థాయిలో తమను ఆదుకుంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. వరద ముంచెత్తుతుండటంతో విలువైన సామాన్లు అటకలపై భద్ర పరిచామని, కానీ ఊహించని స్థాయిలో వరద రావడంతో అన్నీ కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా బురదే మున్నేటికి ఇరువైపులా ఉన్న దానవాయిగూడెం, రామన్నపేట, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప, జలగం నగర్, పెదతండా, వెంకటేశ్వరనగర్, మోతీనగర్, బొక్కలగడ్డ, మంచికంటినగర్, ప్రకాష్నగర్, పంపింగ్వెల్ రోడ్డు, ఎఫ్సీఐ గోడౌన్లు, టీఎన్జీవో కాలనీ, ధంసలాపురం, అగ్రహారం కాలనీలను వరద ఆగమాగం చేసింది. ముంపు కాలనీల్లో అంతా పేద, మధ్య తరగతి ప్రజలే నివసిస్తున్నారు. ఏళ్లుగా కూడబెట్టి కొన్న విలువైన వస్తువులు కొట్టుకుపోవడంతో తిరిగి తామెప్పుడు కోలుకుంటామోనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా అన్ని ఇళ్లల్లో బైక్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, బీరువాలు, ఏసీలు, మంచాలు, పరుపులు, దుప్పట్లు, వాషింగ్ మిషన్లు, టీవీలు, మిక్సీలు, గ్యాస్ స్టవ్లు, గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోయాయి. ఏ వస్తువూ మిగల్లేదు. అక్కడక్కడా సామగ్రి ఉన్నా బురదతో నిండిపోయి పనికొచ్చే పరిస్థితి కానరావడం లేదు. ఎగువ నుంచి కొట్టుకొచ్చిన చెత్తాచెదారం, చెట్ల మొద్దులు, వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయాయి. చిన్న కిరాణా షాపులు, మెకానిక్ షాపులు, పండ్ల దుకాణాల్లో సైతం బురద నిండిపోయింది. ఇళ్లు, దుకాణాలు శుభ్రం చేసుకుంటున్న బాధితులు అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టమవుతోంది. పరామర్శకు వచ్చే నేతలు, అధికారులు, సిబ్బంది బురదలోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ బురద మేటలు, వ్యర్థాలు తొలగించడం సహాయక సిబ్బందికీ, బాధితులకు సవాల్గా మారింది. జేసీబీలు, ట్రాక్టర్లతో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చెత్త, బురద తొలగిస్తున్నా ఇదంతా పూర్తికావడానికి ఎన్ని రోజులు పడుతుందో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. తిండి లేదు.. నీళ్లు లేవు వరద కాలనీల్లో బాధితులు తిండి, తాగునీటికి అల్లాడుతున్నారు. పునరావాస కేంద్రాల నుంచి వచ్చి ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న బాధితులు ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ సిబ్బందితో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, పార్టీల నేతలు ఆహారాన్ని పంపణీ చేస్తున్నా.. ఇవి ఏ మూలకూ చాలడం లేదు. మధ్యాహ్నం భోజనానికి పొట్లాలు అందిస్తే.. మళ్లీ రాత్రి సమయానికి భోజనం అందుతుందో లేదోననే అనుమానం వ్యక్తవుతోంది. ఇక ఇళ్లల్లో తాగునీటి బోర్ల మోటార్లు, మిషన్ భగీరథ పైపులైన్లు ధ్వంసం కావడంతో నీటికి అల్లాడాల్సి వస్తోంది. వస్తున్న మంచినీటి ట్యాంకర్లు ఎటూ సరిపోవడం లేదు. చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ.. వరద ప్రభావంతో ఈ కాలనీల్లో వందలాది విద్యుత్ స్తంభాలు నేలమట్టమై ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయాయి. సబ్ స్టేషన్లు నీట మునిగాయి. దీంతో మున్నేటి లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. దీంతో ముంపు బాధితులు ఇళ్లకు చేరుకుంటున్నా రాత్రివేళ చీకట్లోనే ఉంటున్నారు. పాములు, తేళ్ల బెడదతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇళ్లు సాయం అందేదెన్నడు? ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆర్వీ కర్ణన్, వీపీ గౌతమ్, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్దత్, కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఇతర శాఖల అధికారులు నష్టానికి సబంధించిన వివరాల సేకరణపై సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. అయితే రూ.కోట్లలో నష్టం రూ.కోట్లలో ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా..మున్నేరు ముంపు ప్రాంతమంతా బురద మేట వేయడంతో నష్టాన్ని ఎప్పటికి నిర్ధారిస్తారు? ఆపై సాయం ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.వినాయకుడి బొమ్మలు కొట్టుకుపోయి రూ.2 లక్షల నష్టం సూర్యాపేట జిల్లా చంద్రన్నకుంటకు చెందిన సత్నామ్సింగ్ ఏటా కాలువ ఒడ్డులో వినాయక విగ్రహాలు అమ్ముతాడు. ఈసారి వంద విగ్రహాలు తీసుకురాగా మున్నేరు వరదతో 20 విగ్రహాలు కొట్టుకుపోయాయి. ఒక్కో విగ్రహం రూ.10 వేల చొప్పున రూ.2 లక్షలు నష్టపోయాడు. మిగిలిన విగ్రహాలకు సైతం కొన్ని భాగాలు దెబ్బతిని, రంగులు కోల్పోవడంతో మళ్లీ సిద్ధం చేసేందుకు రూ.లక్ష వరకు ఖర్చవుతుందని సత్నామ్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. రూ.25 వేల విలువైన బియ్యం తడిసి ముద్ద.. ఖమ్మం వెంకటేశ్వరనగర్కు చెందిన భూమా ఉపేందర్, ధనలక్ష్మి ఇల్లు ఏటి ఒడ్డున ఉండడంతో సామగ్రి కొట్టుకుపోయింది. ఉపేందర్ గాందీచౌక్ లో హమాలీగా చేస్తున్నా డు. ఆయన ఇద్దరు పిల్ల లు తొమ్మిది, పదో తరగతి చదువుతున్నారు. బియ్యం ధరలు పెరుగుతాయని ముందుగానే రూ.25 వేలు వెచ్చించి నాలుగు క్వింటాళ్లు కొనుగోలు చేశాడు. అయితే భారీ వరదలో బియ్యం తడిసిపోయాయి. ఎందుకూ పనికి రాకుండా పోవడంతో తిండి గింజలు లేక దంపతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.కొట్టుకుపోయిన రూ.1.80 లక్షల క్యాష్బ్యాగ్ బొక్కలగడ్డకు చెందిన ఘంటసాల గోపాల్, బాలకృష్ణ సోదరులు. వీరి ఇళ్లు ఎదురెదురుగానే ఉన్నాయి. ఇద్దరి ఇళ్లల్లోనూ బురద చేరింది. బురదతో గోపాల్ ఆటో పాడైంది. పాత ఇనుము సామాను వ్యాపారం చేసే బాలకృష్ణ లావాదేవీల కోసం రూ.1.80 లక్షలు అప్పు తెచ్చి పెట్టాడు. వరదలో ఈ డబ్బుల బ్యాగ్ కొట్టుకుపోయింది. వీరి ఇళ్ల పైకప్పులు సైతం లేచిపోవడంతో రెండు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. -
బెజవాడను ముంచేసిన బుడమేరు! ముంపులోనే పలు కాలనీలు.. ఇంకా ఇతర అప్డేట్స్..
-
బెజవాడలో ఇదే అతి భారీ వర్షం
సాక్షి, అమరావతి: విజయవాడ పరిసరాల్లో రికార్డు స్థాయిలో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. శనివారం అమరావతిలో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంతటి భారీ వర్షం ఇంతకుముందెన్నడూ ఈ ప్రాంతంలో నమోదు కాలేదని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ శాఖ రికార్డుల ప్రకారం 1989లో గన్నవరంలో 21.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 20 సెం.మీ. దాటితే అతి భారీ వర్షం కింద లెక్క. సమీప కాలంలో ఈ స్థాయి వర్షం విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో కురిసిన దాఖలాలు లేవు. శనివారం ఆ స్థాయిలో వర్షం కురిసింది. అమరావతి కంటే ఎక్కువగా ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 32.3 సెం.మీ. వర్షం కురిసింది.తిరువూరులోనూ 26 సెం.మీ. వర్షం కురిసింది. 14 మండలాల్లో సగటున 24 గంటల వ్యవధిలో 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 62 ప్రాంతాల్లో 11.2 నుంచి 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 14 జిల్లాల పరిధిలోని 94 స్టేషన్లలో 7 నుంచి 12 సెం.మీ. వర్షం పడింది. మొత్తంగా రాష్ట్రమంతటా వర్షపాతాన్ని లెక్కించే యంత్రాలున్న ప్రాంతాల్లోని 75 శాతం ఏరియాల్లో వర్షపాతాలు నమోదయ్యాయి. ఒకేరోజు ఇంత ఏరియాలో వర్షం కురవడం చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాల తీవ్రత ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా ఉంది. 12 నుంచి 24 గంటల వ్యవధిలోనే క్లౌడ్ బరస్ట్ (మేఘాలు బద్ధలైనట్టు) అయినట్టు కుండపోత వర్షం పడింది.ఈ వాన నీరంతా సమీపంలోని వాగులు గుండా కృష్ణా నదిలోకి ప్రవహిస్తోంది. ఖమ్మం పరీవాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురవడంతో మున్నేరు, కట్టలేరు, రామిలేరు వాగులన్నీ పొంగి బుడమేరులో కలిశాయి. బుడమేరు కృష్ణా నదిలో కలిసే పరిస్థితి లేకపోవడంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లోకి ఈ నీరంతా వచ్చి చేరుతోంది. సాధారణంగా ఈ వర్షమంతా 48 గంటల్లో కురిస్తే అది నెమ్మదిగా వచ్చి డ్రెయిన్ల ద్వారా కృష్ణా నదిలో కలవాలి. కానీ.. 12 నుంచి 24 గంటల్లోనే అతి భారీ వర్షాలు కురవడంతో బుడమేరు ఒక్కసారిగా పొంగింది.కొండవీడు ఘాట్ రోడ్డులో కూలిన కొండచరియలు సాక్షి, అమరావతి: కొండవీడు ఘాట్ రోడ్డులో ఆదివారం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కొండవీడు నగరవనాన్ని సోమ, మంగళవారాలు మూసివేస్తున్నట్లు పల్నాడు జిల్లా అటవీ అధికారి ఎన్.రామచంద్రరావు తెలిపారు. ఘాట్ రోడ్డుపై పడిన బండరాళ్లను ఆర్అండ్బీ శాఖ సహకారంతో తొలగిస్తామని వెల్లడించారు. ఈ విషయాన్ని సందర్శకులు గమనించాలని కోరారు. -
#VijayawadaFloods : విజయవాడ : రికార్డు స్థాయిలో వరద ఉధృతి (ఫొటోలు)
-
#TelanganaRains : తెలంగాణ అంతటా దంచికొడుతున్న వానలు (ఫొటోలు)
-
హుస్సేన్ సాగర్ ఫుల్.. జీహెచ్ఎంసీ అలర్ట్
-
భారీ వర్షానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్..
-
తెలంగాణలో భారీ వర్షాలు..
-
దంచికొడుతున్న వర్షం.. జల దిగ్బంధంలో పలు ప్రాంతాలు..
-
తీరం దాటిన వాయుగుండం..
-
హైదరాబాద్ లో భారీ వర్షం..
-
వర్షాల బాధితులను ఉదారంగా ఆదుకోండి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జరిగిన ఘటనల్లో పలువురు మరణించడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడలో కొండచరియలు విరిగిపడి నలుగురు మరణించడంతో పాటు గుంటూరు జిల్లా ఉప్పలపాడులో వరద ఉధృతికి వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో టీచర్ సహా ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం, మంగళగిరి గండాలయ్యపేటలో కొండచరియలు విరిగిపడి వృద్ధురాలు మృతి చెందడంపై వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఆయా కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. భారీ వర్షాల వల్ల జనజీవనం స్తంభించిపోయిందని, విజయవాడ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఈ ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలన్నారు. బాధితులకు అండగా నిలవాలని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. -
అన్నదాతలకు వాయు‘గండం’..
సాక్షి, అమరావతి: భారీ వర్షాలకు పెద్దఎత్తున వ్యవసాయ, ఉద్యాన పంటలు ముంపునకు గురవుతున్నాయి. బుడమేరు, ఎర్రకాలువలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో ఎన్టీఆర్, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని వేలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయి. ఇక ఉద్యాన పంటల విషయానికొస్తే అత్యధికంగా కూరగాయలు, అరటి, పసుపు, మిరప, తమలపాకు పంటలకు అపార నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. కూరగాయల పంటలే ఎక్కువగా దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు.ఈ వర్షాలవల్ల 30వేల మందికి పైగా రైతులు ప్రభావితమైనట్లు సమాచారం. ప్రస్తుతం వరి పంట దుబ్బులు కట్టే దశలో ఉండడంతో ఈ వర్షాలు మేలుచేస్తాయని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. అయితే, ముంపునీరు 5–6 రోజులకు మించి చేలల్లో ఉంటే మాత్రం పంటలకు నష్టం వాటిల్లే అవకాశముందని చెబుతున్నారు. నిజానికి.. సీజన్ ఆరంభం నుంచి రైతులు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఖరీఫ్ సాగుచేస్తున్నారు. ఇప్పటికే జులైలో కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతినడంతో నష్టపోయిన రైతులు రెండోసారి విత్తుకున్నారు. తాజాగా.. కురుస్తున్న వర్షాలు వారిని మరింత కలవరపెడుతున్నాయి.13 జిల్లాల్లో పంటలపై తీవ్ర ప్రభావం..రాష్ట్రంలోని 13 జిల్లాల్లో.. 135 మండలాల పరిధిలోని 581 గ్రామాల్లో భారీ వర్షాలవల్ల పంటలు ముంపునకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనా ప్రకారం శనివారం రాత్రికి 1.60 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 10 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్లు గుర్తించారు. ఇది ఇంకా ఎక్కువే ఉంటుందని క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం. ఈ వర్షాలు ఉభయ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, నంద్యాల, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. -
సహాయ చర్యలకు జిల్లాకు రూ.3 కోట్లు
సాక్షి, అమరావతి: భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి అధికారి పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వర్షాల కారణంగా శనివారం ఓర్వకల్లు పర్యటను రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డీవోలు, డీఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. సహాయ చర్యలకు జిల్లాకు రూ.3 కోట్ల చొప్పున తక్షణం విడుదల చేయాలని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా 8 మంది చనిపోయినట్లు సమాచారం అందిందని అధికారులు వెల్లడించగా బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం సూచించారు.విజయవాడలో కొండ చరియలు విరిగి పడటంతో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆదివారం కూడా భారీ వర్షాలు ఉంటాయన్న సమాచారం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. బుడమేరు ఆక్రమణలతో ముంపు ముప్పు నెలకొందని అధికారులు తెలియచేయడంతో సమస్య పరిష్కారానికి అవసరమైన ప్రణాళికతో రావాలని సూచించారు. భారీ వర్షాలు పడే చోట్ల విద్యాసంస్థలకు సెలవు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు తగ్గేవరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరుతున్నట్లు చెప్పారు. ప్రాణనష్టం లేకుండా చూడండి: హోం మంత్రి అనితభారీ వర్షాలు, వరదల వల్ల ప్రాణనష్టం లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటూ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి అనిత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్, రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా తదితర అధికారులతో కలిసి స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి శనివారం రాష్ట్రంలోని పరిస్థితుల్ని పర్యవేక్షించారు. కూటమి శ్రేణులు సాయంగా నిలవాలి: పవన్కళ్యాణ్రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం కె.పవన్కళ్యాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ, వాతావరణ హెచ్చరికలను పాటిస్తూ జాగ్రత్తలు వహించాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో అధికారులకు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, శ్రేణులు సాయంగా ఉండాలన్నారు. విజయవాడలో కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో నలుగురు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి నిమ్మల భారీ వర్షాలు, వరదల విషయంపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు నీటి ప్రవాహాన్ని బేరీజు వేసుకుని ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సత్యకుమార్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలు మరికొద్ది రోజులు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నందున ప్రజల ఆరోగ్యం పట్ల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అన్ని స్థాయిల్లోనూ అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. అమెరికాలో ఉన్న మంత్రి శనివారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఇతర అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. వైద్య ఆరోగ్యశాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటురాష్ట్రంలో వరద, తుపాను నేపథ్యంలో అత్యవసర వైద్య సేవల కోసం వైద్య ఆరోగ్యశాఖ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర కంట్రోల్ రూమ్ నెంబర్ 9032384168, మెయిల్ edidemics.apstate@gmail.com, అడిషినల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి 7386451239, స్టేట్ హెల్త్ ఆఫీసర్ ఎంవీ పద్మజ 8374893549 సమాచారం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. -
తెలంగాణకు రెడ్ అలర్ట్
-
కుండపోత.. జల దిగ్బంధంలో విజయవాడ (ఫొటోలు)
-
బంగాళాఖాతంలో వాయుగుండం
-
గుంటూరు జిల్లాలో భారీ వర్షం
-
బెజవాడలో భారీ వాన..
-
విజయవాడలో భారీ వర్షం.. విరిగిపడిన కొండ చరియలు
-
వాయవ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం..
-
ఏపీలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు
-
#HeavyRainsAP : ఏపీలో దంచికొడుతున్న వానలు (ఫొటోలు)
-
హైదరాబాద్లో మొదలైన వర్షం.. రాత్రిలోపు భారీ వర్ష సూచన
హైదరాబాద్, సాక్షి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీనికితోడు మరో రుతు పవన ద్రోణి కూడా ఏర్పడడంతో రాష్ట్రం అంతటా వానలు మొదలయ్యాయి. రాజధాని నగరం హైదరాబాద్లో ఈ ఉదయం నుంచి వాన మొదలైంది. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం.. చురుకుగా కదులుతోంది. నేడు, రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో ఈ రాత్రిలోపు భారీ వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది.మరోవైపు శుక్రవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ములుగు జిల్లా మల్లంపల్లిలో 5.6 సెం.మీలు, వరంగల్ జిల్లా నల్లబెల్లిలో 4.2, దుగ్గొండిలో 4, భదాద్రి కొత్తగూడెం జిల్లాలో 3.8 సెం.మీటర్ల వర్షం కురిసింది. -
దూసుకొస్తున్న అప్పపీడనం..
-
ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు
-
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర వైపు అల్పపీడనం దూసుకొస్తోంది. రేపు తీవ్ర అల్పపీడనంగా బలపడి విశాఖ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావారణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని స్పష్టం చేసింది.ఈ సందర్భంగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ మాట్లాడుతూ.. అల్పపీడనం ప్రభావంతో నేడు ఏపీలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సెప్టెంబర్ రెండో తేదీ నాటికి అల్పపీడనం వాయుగుండంగా మారి తెలంగాణ మీదుగా పయనించనుంది. ఈ క్రమంలో తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దన్నారు. NOWCAST UPDATE Currently parts of Coastal prakasam, scattered parts of central Ap, Godavari, Uttrandhra getting light to moderate rains in few places. Low pressure is around 300km away from #Vizag coast. As system comes closer to coast we can see gradual increase in rainfall pic.twitter.com/qyep9CEEi2— Eastcoast Weatherman (@eastcoastrains) August 30, 2024వర్షం కురిసే అవకాశం జిల్లాల వారీగా..అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలుకృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశంశ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలుకర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. Daily Weather Inference 30.08.2024Influence of Low Pressure Area over North Bay Heavy rains will continue in Central & North Coastal AP Telangana Odissa Chhattisgarh Vidarbha Kerala & Coastal Karnataka. Moderate/Heavy Rains likely in Nilgiris Valparai Ghats OVer TN.Sivagnagai… pic.twitter.com/ZYWqT8iIjB— MasRainman (@MasRainman) August 30, 2024 -
ఉత్తరాంధ్ర వైపు అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఉత్తర బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా ఉత్తరాంధ్ర వైపు దూసుకురానుంది. ఈ నెల 31న విశాఖపట్నం సమీపంలో తీరాన్ని దాటే సూచనలు కనిపిస్తున్నాయి. తీవ్ర అల్పపీడనం తీరం దాటిన తర్వాత.. మరింత బలపడి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వైపు ప్రయాణిస్తూ సెప్టెంబర్ 2 నాటికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. శుక్ర, శనివారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. కోస్తా జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షం
-
విశాఖలో అర్ధరాత్రి భారీ వర్షం (ఫొటోలు)
-
ముంచుకొస్తున్న వాయు‘గండం’
సాక్షి, విశాఖపట్నం: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మేఘావృత వాతావరణం ఏర్పడుతుండటంతో రోజూ అర్ధరాత్రి సమయంలో వర్షాలు పడనున్నాయి. దీంతో పాటు ఈ నెల 29న తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారే సూచనలున్నట్లు తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోనే తీరం దాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, అది కూడా ఉత్తరాంధ్రలోనే దాటే సూచనలున్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత పెరుగుతుందన్నారు. సెప్టెంబర్ 5 వరకు వాయుగుండం ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో వానలకు ఆస్కారం ఉందని అధికారులు వెల్లడించారు. -
శ్రీశైలం డ్యాం వద్ద విరిగిపడ్డ కొండచరియలు
శ్రీశైలం ప్రాజెక్ట్: మంగళవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షం కారణంగా శ్రీశైలం డ్యాంకు సమీపంలోని ఘాట్ రోడ్డులో బుధవారం తెల్లవారుజామున కొండ చరియలు విరిగిపడ్డాయి. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం పైభాగంలోని హైదరాబాద్–శ్రీశైలం రహదారిలో కొండచరియలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వర్షాకాలంలో డ్యాం వ్యూ పాయింట్ నుంచి లింగాలగట్టు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి ఈగలపెంట వరకు వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, టూవీలర్పై వెళ్లే ప్రయాణికులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని అధికారులు సూచించారు. కాగా, మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా శ్రీశైలం మండలంలోని సున్నిపెంట, లింగాలగట్టు గ్రామాల్లో వరదనీరు పొంగి పొర్లింది. మండలంలో 130.80 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. సున్నిపెంటలోని మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయ ప్రహారీ గోడ కొంత భాగం కూలిపోయింది. -
Rain Alert : హైదరాబాద్లో వర్ష బీభత్సం.. చిత్రాల కోసం క్లిక్ చేయండి
-
హైదరాబాద్లో భారీ వర్షం
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్లో వర్షం దంచి కొట్టింది.. సోమవారం మధ్యాహ్నం కుండ పోతగా వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయ్యాయి. ముఖ్యంగా, రాజేంద్ర నగర్, మణికొండ, గండిపేట, జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, సికింద్రాబాద్, నాంపల్లి, మెహిదిపట్నం, టోలీచౌకి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్రం ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల రోడ్లపై నడుములోతు నీళ్లు నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనాలు మొరాయించాయి.హైదరాబాద్లో వర్షం పడడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు తీవ్రంగా ఎండ కాసింది. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. అంతలోనే భారీ వర్షం కమ్ముకొచ్చింది. తొలుత చిరుజల్లులు మొదలయ్యాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా భారీ వర్షం కురిసింది. రోడ్లపైన ఉన్నవాళ్లు ఎక్కడైనా తలదాచుకుందామా అనుకునేలోపు పూర్తిగా తడిచిపోయారు. దీనికి తోడు ఓ వైపు ట్రాఫిక్ జామ్, రోడ్లపై భారీగా నిలిచిపోయిన నీళ్లతో ప్రత్యక్షంగా నరకం చూసినంత పనైంది. మరోవైపు నగరంలో మరో రెండు మూడు గంటల్లో భారీగా వర్షం పడే అవకాశం ఉందని జారీ చేసిన హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. -
హైదరాబాద్లో మళ్లీ దంచికొట్టిన వాన.. తెలంగాణకు ఐదురోజులు భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరవ్యాప్తంగా దట్టమైన మేఘాలు కమ్ముకుని జడివాన కురిసింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా భారీ వర్షం పడింది. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరోవైపు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ సిబ్బంది హెచ్చరించారు. ఇదే సమయంలో హెల్ప్లైన్ నెంబర్లు ఇచ్చారు.హెల్ప్లైన్ నెంబర్స్ ఇవే:040-21111111, 9000113667నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, పంజాగుట్ట, అమీర్పేట్, నిజాంపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి, పటాన్ చెరు, రామచంద్రపురం, అమీన్ పూర్, ఖైరతాబాద్, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో, రోడ్లపై ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయింది. భారీ వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.#Hyderabadrains!!Now raining in Gachibowli 🌧️⚠️ pic.twitter.com/nLt7pXCZ3W— Telangana state Weatherman (@tharun25_t) August 16, 2024 మరోవైపు.. తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, గురువారం సాయంత్రం హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో, జనజీవనం అస్తవ్యస్తమైంది. Ee varsham andira eee Hyderabad laaa 🌦️⛈️🌧️☔️💧#HyderabadRains pic.twitter.com/v1bKqPSDqB— Heisenberg (@abhinayrdy) August 16, 2024 #Gachibowli#HyderabadRains pic.twitter.com/YzMEKvpkvu— Jagadish Reddy (@jagadish757) August 16, 2024 -
హైదరాబాద్లో భారీ వర్షం.. రోజంతా వర్ష సూచన
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో శుక్రవారం(ఆగస్టు16) మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మణికొండ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలిచౌకిలో వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్జామ్ అయింది. నగరవ్యాప్తంగా క్యుములోనింబస్మేఘాలు కమ్ముకోవడంతో మధ్యాహ్నం నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణకేంద్రం తెలిపింది. అత్యవసర పనులు ఉంటేనే ఇళ్లలో నుంచి బయటికి రావాలని, నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది.కాగా, గురువారం రాత్రి కురిసిన గాలివానకు నగరంలోని చాలా ప్రాంతాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరంతో పాటు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే ఛాన్సున్నట్లు సమాచారం. -
హైదరాబాద్ ను కుమ్మేసిన కుండపోత వర్షం
-
మూడు గంటల పాటు..హైదరాబాద్ లో కుండపోత వర్షం (ఫొటోలు)
-
హైదరాబాద్లో భారీ వర్షం
-
HYD: దంచికొట్టిన వర్షం.. రోడ్లపై వరద
సాక్షి,హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ నగరంలో మంగళవారం(ఆగస్టు13) ఉదయం భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్సార్నగర్, బాలానగర్, బేగంపేట్, సికింద్రాబాద్, అల్వాల్ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రోడ్లపై అక్కడక్కడా భారీగా నీరు నిలిచింది. దీంతో రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. -
వయనాడ్ విధ్వంసం.. కుటుంబాన్ని రక్షించేందుకు అధికారుల సాహసం
కేరళలోని వయనాడ్ విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంగళవారం కొండచరియలు విరిగిపడిన రోజు నుంచి ఇప్పటి వరకు ఈ ప్రకృతి విలయంలో మరణించిన వారి సంఖ్య 358కు చేరుకుంది. మృతుల సంఖ్య ఇంకా పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.అయిదో రోజు సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా వందలాది మంది ఆచూకీ తెలియాల్సి ఉంది, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలు, జగిలాలను ఉపయోగించి గల్లంతైన వారి ఆచూకీని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాగా వయనాడ్లో వర్షాలు పడుతున్నా, అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నా సహాయక బృందం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. అధికారుల సాహసోపేతమైన ఆపరేషన్పై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసలు కురిపించారు. ఈ వారం ప్రారంభంలో వాయనాడ్లో మూడు కొండచరియలు విరిగిపడటంతో 350 మందికి పైగా మరణించారు మరియు వందల మంది తప్పిపోయారు.ఈ క్రమంలో తాజాగా అటవీ శాఖ అధికారులు ఎనిమిది గంటలు శ్రమించి ఓ కుటుంబాన్ని ప్రాణాలతో రక్షించారు. కొండ ప్రాంతంలో చిక్కుకున్న గిరిజన వర్గానికి చెందిన నలుగురు చిన్నారులతో సహా తల్లిదండ్రులను ప్రాణాలకు తెగించి ఒడ్డుకు చేర్చారు.పనియా కమ్యూనిటీకి చెందిన కుటుంబం లోతైన లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఉన్న గుహలో చిక్కుకుపోయింది. దీంతో కల్పేట రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కె.హాషిస్ నేతృత్వంలోని బృందం అడవిలో చిక్కుకున్న గిరిజన కుటుంబాన్ని ప్రాణాలకు తెగించి వెళ్లి రక్షించారు. అయితే వారిని చేరుకోవడానికి రెస్క్యూ టీమ్ నాలుగున్నర గంటలపాటు ప్రమాదకరమైన ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.#WayanadLandslideTeam of Kerala Forest Officers Trekked deep down into the dense forest for 8 hrs & Saved 4 Tribal Toddlers & Mother who were hiding in a cave & starving from nearly 5 daysSalute to Real Heroes 🔥🫡#WayanadDisaster #Wayanad #Armypic.twitter.com/mJ78gpRuzx— Veena Jain (@DrJain21) August 3, 2024 అయితే వారు కొద్ది రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు నీరసించి పోయి ఉన్నారని రెస్య్కూ అధికారి తెలిపారు. దీంతో నలుగురు పిల్లల తల్లి ఆహారం కోసం అడవిలో వెతుకుతూ ఉండగా తమ కంటపడినట్లు అధికారులు తెలిపారు. తాము రక్షించిన వారిలో తల్లిదండ్రులు, 1 నుంచి 4 ఏళ్ల మధ్యనున్న నలుగురు పిల్లలు ఉన్నట్లు చెప్పారు. తమతో రావాల్సిందిగా వారిని కోరగా ముంగు ఆ కుటుంబం నిరాకరించిందని, సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని తెలపగా చివరకు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ కుటుంబాన్ని కాపాడిన అధికారులు సీఎం పినరయి విజయన్ ప్రశంసించారు. ‘‘వయనాడ్లో నెలకొన్న బీభత్సంలో అటవీ అధికారులు, రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రెస్క్యూ బృందం 8 గంటలపాటు శ్రమించి, ప్రాణాలకు తెగించి ఓ మారుమూల గిరిజన కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలను కాపాడింది. ఈ విషాద సమయంలో సహాయక బృందాలు అందిస్తున్న తోడ్పాటు వారిలోని గొప్పతనాన్ని తెలియజేస్తోంది. మనం ఇలా ఐక్యంగా ఉంటూ ధైర్యంగా కష్టాలను ఎదుర్కొందాం.. పునర్నిర్మించుకుందాం’’ అని ఎక్స్లో పోస్ట్ చేశారు. -
హిమాచల్: వరద బాధితులకు తక్షణ సాయం రూ. 50 వేలు
హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు ఎనిమిదిమంది మృతిచెందారు. 50 మంది గల్లంతయ్యారు. తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.సిమ్లా జిల్లాలోని సమేజ్, రాంపూర్, కులులోని బాఘిపుల్, మండిలోని పద్దర్లలో భారీ వర్షాలు కురిసి విధ్వంసం సృష్టించాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శి డీసీ రాణా తెలిపారు. భారీ వర్షాలకు 53 మంది గల్లంతయ్యారని తెలిపారు. ఆరు మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. 60కి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్లు సిమ్లా, కులు జిల్లాల్లో పర్యటించి వరద బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బాధితులకు తక్షణ సాయంగా రూ.50వేలు ఇస్తామని ప్రకటించారు. అలాగే వచ్చే మూడు నెలల పాటు నెలకు రూ.5వేలు చొప్పున ఇస్తామని, వంటగ్యాస్, ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులను కూడా అందజేస్తామని తెలిపారు. #WATCH | Shimla: On Himachal Pradesh disaster, Special Secretary, Disaster Management DC Rana says, "A cloudburst in the Samej area of Shimla district, Rampur region, Baghipul area of Kullu, and Paddar area of Mandi has led to widespread destruction. 53 people are missing and six… pic.twitter.com/s0CAl1Me4e— ANI (@ANI) August 3, 2024 -
వయనాడ్ విలయం.. 316కు చేరిన మరణాలు
Updates.. 👉వయనాడ్లో మెప్పాడీలోని రిలీఫ్ క్యాంపులో సీపీఎం, కాంగ్రెస్, ఐయూఎంఎల్కు చెందిన డీవైఎఫ్ఐ, యూత్ కాంగ్రెస్, యూత్ లీగ్ వాలంటీర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.Volunteers from DYFI,SFI, Youth Congress , Youth league, etc.. --- youth organisations linked with CPI(M), Congress, IUML, cleaning the Meppadi school relief camp together.#Kerala #WayanadLandslide pic.twitter.com/LD16fDHFwj— Korah Abraham (@thekorahabraham) August 2, 2024 వయనాడ్లో మలయాళ మనోరమ ఒక రిలీఫ్ డ్రైవ్ను ప్రారంభించింది.బాధిత ప్రాంతాలకు 10 లక్షల రూపాయల విలువైన నిత్యావసర సామాగ్రిని పంపింది.బేబీ మెమోరియల్ హాస్పిటల్ నుండి 20 మంది సభ్యుల వైద్య బృందాన్ని కూడా వయనాడ్ పంపారు.ఇక, వయనాడ్లో ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్తో పాటు భారత సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంటోంది.సహయక చర్యలను సమన్వయం చేసేందుకు కోజికోడ్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు.ప్రస్తుతం వాయనాడ్ అంతటా 7,000 మందికి పైగా ప్రజలు సహాయక శిబిరాల్లో ఉన్నారు.ఈ శిబిరాలు కొండచరియలు విరిగిపడటంతో నిరాశ్రయులైన వారికి ఆశ్రయం, ప్రాథమిక అవసరాలు కల్పిస్తున్నాయి.కేరళ ప్రభుత్వం, స్థానిక వాలంటీర్లతో పాటు, బాధితులను రక్షించడం, వారికి మానసికంగా మద్దతు అందించడంపై దృష్టి సారిస్తోంది. Salute to Madras Engineering Group of Indian Army who completed the 190 ft long critical Bailey bridge #Wayanad in record 16 hrs .Bharat Mata ki Jai chants heard after the mamath task was completed. Bridge can carry weight of 24 tons & will help connect with worst-affected… pic.twitter.com/myv52i9GGD— Bavachan Varghese (@mumbaislifeline) August 2, 2024 విపత్తు బాధితుల కోసం ఐసీయూలు ఏర్పాటు..ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ కామెంట్స్..విపత్తు ప్రాంతాల నుండి రక్షించబడిన వారి కోసం ఐసీయూలో ఏర్పాటు చేస్తున్నాము. ఇంటెన్సివ్ కేర్ అందించడానికి వయనాడ్ ఆసుపత్రులలో ఐసీయూలు సిద్ధంగా ఉన్నాయి.మంజేరి మెడికల్ కాలేజ్, కోజికోడ్ మెడికల్ కాలేజీ సహా ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేశాం.ఇవి ఎయిర్ లిఫ్ట్ ద్వారా చేరుకోవచ్చు.ఇప్పటి వరకు 199 మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది.ఇది కాకుండా, 130 బాడీలకు డీఎన్ఏ నమూనాలను కూడా తీసుకున్నారు Wayanad landslide | ICUs are ready in Wayanad hospitals to provide intensive care to those rescued from the disaster areas. Hospitals including Manjeri Medical College and Kozhikode Medical College, which can be reached by airlift, have also been set up. So far, the post-mortem…— ANI (@ANI) August 2, 2024 👉వయనాడ్లో నలుగురిని కాపాడిన ఆర్మీ రెస్క్యూ టీమ్.👉పడవెట్టికన్నులో శిథిలాల కింద చిక్కుకున్న నలుగురు బాధితులు.👉హెలికాప్టర్ సాయంతో ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్👉నలుగురిని కాపాడిన భారత సైన్యం.👉డ్రోన్ రాడార్లతో మృత్యుంజయల కోసం ఆర్మీ అన్వేషణ. #WATCH | Kerala: Latest visuals of the Dog squad conducting search and rescue operations in Wayanad's Chooralmala. A landslide that occurred here on 30th July, claimed the lives of 308 people. pic.twitter.com/jWvqQDHWQh— ANI (@ANI) August 2, 2024 👉వయనాడ్ విపత్తులో మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 316కు చేరుకుంది. #WATCH | Kerala: Search and rescue operations continue at landslide-affected Chooralmala in Wayanad.The current death toll stands at 308, as per Kerala Health Minister Veena George pic.twitter.com/CY0iOuPHf4— ANI (@ANI) August 2, 2024 👉 రెస్క్యూ టీమ్స్ ఇంకా చేరుకోలేదు: కేరళ గవర్నర్వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెల్లవారుజామున మొట్టమొదట కొండచరియలు విరిగిపడిన ప్రదేశానికి ఇప్పటికీ రెస్క్యూ టీమ్స్ చేరుకోలేదని ఆయన కామెంట్స్. కొండచరియలు విరిగిపడటంతో చలియార్ నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకొని.. పక్కనే ఉన్న ఓ గ్రామాన్ని ముంచేసిందని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విధంగా తుడిచి పెట్టుకుపోయిన గ్రామానికి ఇంకా రెస్క్యూ టీమ్స్ చేరుకోలేకపోవడం బాధాకరమని ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తెలిపారు. ఆ గ్రామాన్ని చేరుకోవడానికి ఆర్మీ ఇంజినీరింగ్ విభాగం ఒక పోర్టబుల్ వంతెనను నిర్మించే ప్రయత్నాల్లో ఉంది. అది పూర్తయితేనే అక్కడికి రెస్క్యూ టీమ్స్ చేరుతాయి అని ఆయన చెప్పుకొచ్చారు. 👉కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 289కి చేరుకుంది. వయనాడ్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, అక్కడ ఇంకా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.మరోవైపు.. వయానాడ్లో శిథిలాలను తీస్తున్న కొద్దీ మృత దేహాలు బయటపడుతూనే ఉన్నాయి. దారుణ స్థితిలో ఉన్న మృతదేహాలను చూసి వైద్యులు వణికిపోతున్నట్లు తెలుస్తోంది. అక్కడి హృదయ విదారక పరిస్థితులతో కలత చెందుతున్నట్లు శవ పరీక్షలు చేస్తున్న వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఛిద్రమైన మృతదేహాలకు పోస్టుమార్టం చేయలేక పారిపోవాలనుకున్నట్లు ఓ ప్రభుత్వ వైద్యురాలు చెప్పడం అక్కడి పరిస్థితులను చూపిస్తోంది#wayanad disaster was the serious reminder. Not to obstruct natures pathways for human greed. Moreover I see many tipper lorries carrying raw materials towards #Kerala Kumily, Vagamon to build houses. Remember the fate of many families before you construct houses on ghat sections pic.twitter.com/h2LyWOLX3l— Harry Callahan (@Golti_Slayer) August 2, 2024👉ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘ఎన్నో ఏళ్లుగా వైద్య వృత్తిలో ఉన్నా. ఎన్నో మృతదేహాలకు పోస్టుమార్టం చేశాను. ఇక్కడి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఓ శరీరం చూస్తే మొత్తం ఛిద్రమైంది. రెండో దాన్ని చూడలేకపోయా. అది ఏడాది చిన్నారిది. అటువంటి మృత దేహాలు వరుసగా వస్తూనే ఉన్నాయి. అందులో అనేకం గుర్తించలేనంతగా ఉండటం కలచివేసింది. ఇక పోస్టుమార్టం చేయలేనని అనుకున్నా. ఆ ప్రాంగణం నుంచి బాధితుల సంరక్షణ కేంద్రానికి పారిపోదామనుకున్నా. కానీ ప్రత్యామ్నాయం లేదు. అలా మొత్తంగా 18 మృతదేహాలకు శవ పరీక్ష నిర్వహించాను’ అంటూ కన్నీరు పెటుకున్నారు. Scary Visual From Wayanad Kerala. #WayanadLandslide pic.twitter.com/WnE3rlVD3L— Iyarkai (@iyarkai_earth) July 30, 2024 From Wayanad the Western Ghat have been completely destroyed,common people have with various agencies talking rescue action at Wayanad landslide disaster.🥲🥲Please save peoples🙏🙏#WayanadLandslide#WayanadDisaster #KeralaRains pic.twitter.com/gflHy9Nvi0— Suman Meena (@SumanNaresh4) August 1, 2024 Our beautiful state under devastation Please pray for Wayanad safety 🙏Please Repost it and follow us for flood updates in kerala pic.twitter.com/ygO44ge4jB— Go Kerala (@Gokerala_) July 31, 2024 -
Delhi Rains: భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలం (ఫొటోలు)
-
ఢిల్లీ అతలాకుతలం..
-
భారీ వర్షం.. స్కూల్స్ బంద్
-
వీడియో: భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలం
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక, బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఏకాధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో కేవలం ఒక గంట వ్యవధిలో 112.5 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.ఇక, భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీలో పలుచోట్ల నడుములోతు నీరు నిలిచిపోయి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు.. వర్షాల కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు విమాన సర్వీసులను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.#WATCH | Delhi: Waterlogging witnessed in several parts of the national capital after heavy rainfall; visuals from outside Civic Center near Ramlila Maidan. pic.twitter.com/19UhRO02ag— ANI (@ANI) July 31, 2024ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో నేడు ఢిల్లీలో అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిశి ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. ఇక, వర్షాలు కురుస్తున్న వేళ జాగ్రత్తగా ఉండాలని లెఫ్టినెంట్ గవర్నర్ ప్రజలకు సూచించారు. కాగా, ఢిల్లీలో రాబోయే 24 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ విధించింది. మరోవైపు.. వర్షాల కారణంగా ఢిల్లీలో 13 ఇళ్లు కూలిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. వర్షాల కారణంగా ఐదుగురు మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. #WATCH | Delhi: Traffic flow impacted near ITO as a result of heavy rains and waterlogging pic.twitter.com/clEyUfWurL— ANI (@ANI) July 31, 2024 Current Situation at Old Rajendra Nagar after Rains 🚨Years of Negligence and Corruption have Resulted into this. MCD and Delhi Govt should Wake Up to Such Conditions. Together, they have turned it into a Death Trap. pic.twitter.com/CeJosR4PTJ— Deepanshu Singh (@deepanshuS27) July 31, 2024 Delhi Minister & AAP leader Atishi tweets, "In light of very heavy rainfall today evening and forecast of heavy rainfall tomorrow, all schools - government and private - will remain closed tomorrow." pic.twitter.com/grisV4oFgT— ANI (@ANI) July 31, 2024 -
వయనాడ్లో వరద బీభత్సం.. కొనసాగుతున్న సహాయక చర్యలు (ఫొటోలు)
-
Kerala : వయనాడ్లో అతలాకుతలం (ఫొటోలు)
-
శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్..
-
సివిల్స్ కల జల సమాధి
సాక్షి, న్యూఢిల్లీ/శ్రీరాంపూర్ (మంచిర్యాల జిల్లా): ఎలాగైనా ఐఏఎస్ కావాలని ఆ యువతి కన్న కల జల సమాధి అయ్యింది. ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్లో ఉన్న రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ సెల్లార్ను వరద ముంచెత్తిన దుర్ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్కు చెందిన తానియా సోని (22) దుర్మరణం పాలయ్యింది. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా..అందులో సోని ఉన్నట్లు అందిన సమాచారంతో శ్రీరాంపూర్లో విషాదం నెలకొంది.ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్లోని ఔరంగాబాద్కు చెందిన విజయ్కుమార్ సింగరేణి శ్రీరాంపూర్ డివిజన్లోని ఎస్సారీ్ప–1 గని మేనేజర్గా పని చేస్తున్నారు. నస్పూర్లోని సీసీసీ టౌన్షిప్ బీ–2 కంపెనీ క్వార్టర్లో నివాసం ఉంటున్నారు. విజయ్కుమార్– బబిత దంపతులకు ముగ్గురు సంతానం కాగా సోనిపెద్ద కుమార్తె. రెండో కూతురు పలక్ ఉత్తరప్రదేశ్లోని లక్నోలో బీటెక్ చేస్తోంది.కుమారుడు ఆదిత్యకుమార్ హైదరాబాద్లో పదో తరగతి చదువుతున్నాడు. సోని గతేడాదే ఢిల్లీలోని అగ్రసేన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. కలెక్టర్ కావాలనే తన కోరికను తండ్రికి చెప్పింది. తండ్రి ఆశ కూడా అదే కావడంతో మూడు నెలల క్రితం రావూస్ కోచింగ్ సెంటర్లో చేరి్పంచి శిక్షణ ఇప్పిస్తున్నారు. శనివారం ఏం జరిగింది..? ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో ఓల్డ్ రాజేంద్రనగర్లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఉన్న భవనం బేస్మెంట్లోకి భారీగా వరద నీరు రావడం ప్రారంభమయ్యింది. విషయం గమనించిన విద్యార్థులు బయటపడేందుకు ప్రయతి్నంచారు. కానీ విద్యుత్ సరఫరా నిలిచిపోయి బేస్మెంట్లోని లైబ్రరీలో బయోమెట్రిక్ గేటు జామ్ అయింది. దీంతో విద్యార్థులు చిక్కుకుపోయారు. బల్లలపై నిల్చుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు.చూస్తుండగానే 10–12 అడుగుల లోతు నీళ్లు చేరాయి. పరిస్థితిని గమనించిన అక్కడివారు విద్యార్థులను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. రాత్రి ఏడు గంటల సమయంలో అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మోటార్లతో నీటిని తోడారు. 14 మందిని తాళ్ల సహాయతో రక్షించారు. అర్ధరాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగగా ఆదివారం తెల్లవారుజామున సోనితో పాటు యూపీకి చెందిన శ్రేయ యాదవ్ (22), కేరళకు చెందిన నెవిన్ డాలి్వన్ (29) మృతదేహాలను వెలికితీశారు. స్పందించిన సింగరేణి అధికారులు సమాచారం తెలిసిన వెంటనే సింగరేణి సీఎండీ, ఇతర డైరెక్టర్లు, శ్రీరాంపూర్లోని ఏరియా జీఎం బి.సంజీవరెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్రెడ్డి స్పందించారు. ఢిల్లీలోని సింగరేణి రెసిడెంట్ ఆఫీసర్ ఓజా, కోల్ కంట్రోలింగ్ ఆర్గనైజేషన్ డీజీఎం అజయ్కుమార్ను అప్రమత్తం చేశారు. దీంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని సోని మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో పోస్ట్మార్టమ్ అనంతరం మూడు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రయాణంలో ఉండగా మరణ వార్త విజయ్కుమార్–బబిత దంపతులు రెండో కూతురు పలక్ను కాలేజీలో దింపడం కోసం శనివారం రైల్లో లక్నో బయల్దేరారు. కాగజ్నగర్కు చేరుకోగానే వారికి సోని మరణవార్త తెలిసింది. దీంతో వారు తీవ్ర విషాదంలోనే నాగ్పూర్ వరకు వెళ్లి అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఆసుపత్రిలో విగతజీవిగా పడి ఉన్న సోనిని చూసి బోరున విలపించారు. అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం తమ స్వస్థలమైన ఔరంగాబాద్కు తరలించారు. విజయ్కుమార్కు పిల్లలంటే ఎంతో ఇష్టమని, వారి కేరీర్ గురించి ఎప్పుడు తమతో చర్చిస్తూ ఉండేవాడని తోటి అధికారులు తెలిపారు. 10 మందికి పైగా గల్లంతు? ముంపు ఘటన నేపథ్యంలో విద్యార్థులు అర్ధరాత్రి నుంచే ఆందోళనకు దిగారు. 10 మందికి పైగా గల్లంతయ్యారని ఆరోపించారు. మృతులు, గాయపడిన వారి వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులో స్టడీ సర్కిల్ యజమాని స్టడీ సర్కిల్ యజమాని అభిõÙక్ గుప్తాను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో బేస్మెంట్లోకి నీరు చేరిందని గుప్తా పోలీసుల విచారణలో అంగీకరించాడు. కాగా ఈ ఘటనపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) స్పందించింది. రావూస్ సంస్థకు బేస్మెంట్లో లైబ్రరీ నిర్వహణకు తాము అనుమతివ్వలేదని స్పష్టం చేసింది. ఘటనపై దర్యాప్తుకు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, రాష్ట్ర మంత్రి అతిషి ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై సీఎం రేవంత్రెడ్డి ఆరా ఢిల్లీ దుర్ఘటనపై సీఎం రేవంత్రెడ్డి ఆరా తీశారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బిహార్కు చెందిన సోని తండ్రి విజయ్కుమార్ మంచిర్యాలలో సింగరేణి సంస్థలో పని చేస్తున్నారని ఆయన వివరించారు. కాగా విజయ్కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిందిగా సీఎం ఆదేశించారు. ఢిల్లీలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయ్కుమార్ను ఫోన్లో పరామర్శించారు. విద్యార్థుల మృతిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. -
ఒడిశాలో భారీ వర్షాలు.. 18 గ్రామాలకు సంబంధాలు కట్
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశాలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే కొండచరియలు విరిగిపడటంతో మల్కన్గిరి జిల్లాలోని 18 గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ వివరాలను అధికారులు మీడియాకు తెలియజేశారు.మల్కన్గిరి జిల్లా కోరుకొండ బ్లాక్ పరిధిలోని బయపదర్ ఘాట్ రోడ్డులోని తుంబపదర్ గ్రామ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మల్కన్గిరి, కోరాపుట్లోని లమటాపుట్, నందాపూర్ ప్రాంతా నుంచి వాహనాల రాకపోకలపై ప్రభావం పడింది. ఉత్తర ఒడిశాలోని గంగా మైదానాల్లో అల్పపీడనం ప్రభావంతో జూలై 31 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బులెటిన్లో పేర్కొంది. ఆదివారం(నేడు) మల్కన్గిరి, కోరాపుట్, నబరంగ్పూర్, బోలంగీర్, నువాపాడా, సోన్పూర్, ఝర్సుగూడ, సుందర్ఘర్, సంబల్పూర్, కియోంజర్, అంగుల్, డియోగర్, కలహండి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ కార్యాలయం తెలిపింది.ఆదివారం బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. బార్గఢ్, జార్సుగూడ, సుందర్ఘర్, నుపాడా, నబరంగ్పూర్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. -
వరద నీటిలో పంట పొలాలు.. తీవ్ర ఆందోళనలో రైతులు