Heroine
-
ఆ పాట వల్ల మూడురోజులు నిద్రపోలేదు: జాన్వీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హిందీలో పలు సినిమాలు చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఎన్టీఆర్ 'దేవర'తో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీలో నటిస్తోంది.తాజాగా తాను నటించిన రూహి సినిమాకు నాలుగేళ్లు పూర్తయిన సందర్బంగా ఈ మూవీలో 'నదియో పార్' పాట చిత్రీకరణ అనుభవాల్ని పంచుకుంది. దీని షూటింగ్ టైంలో తాను చాలా టెన్షన్ పడ్డాడని, మూడు రోజులు నిద్రపోలేదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: దళపతి విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు)'రూహి సినిమా తీసే సమయానికి నటిగా నాకున్న అనుభవం చాలా తక్కువ. దీంతో నదియో పార్ పాట విషయంలో చాలా టెన్షన్ పడ్డాను. భారీ లైట్స్ వెలుగులో కళ్లు తెరిచి చూడలేకపోయేదాన్ని. ఓవైపు 'గుడ్ లక్ జెర్రీ' షూటింగ్ లో పాల్గొంటూనే ఈ పాట రిహార్సల్స్ చేసేదాన్ని. పటియాలాలో రాత్రంతా షూట్ చేసి.. పేకప్ తర్వాత ప్రయాణం చేసొచ్చి పాట షూటింగ్ లో పాల్గొనేదాన్ని.''నిద్రలేకపోయినా 7 గంటల్లో ఆ పాట పూర్తిచేయగలిగాను. మళ్లీ వెంటనే గుడ్ లక్ జెర్రీ షూటింగ్ కి వెళ్లేదాన్ని. అలా మూడురోజుల పాట నిద్రపోలేకపోయాను. కానీ కెమెరా ముందుకొచ్చేసరికి మాత్రం ఎనర్జీ వచ్చేసేది' అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
Tamannaah Bhatia: ఫ్యాషన్ షోలో మిల్కీ బ్యూటీ మెరుపులు (ఫోటోలు)
-
బెంగుళూరు ఎయిర్పోర్ట్లో కన్నడ నటి అరెస్ట్
బెంగుళూరు: బెంగుళూరు ఎయిర్పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. కన్నడ హీరోయిన్ రాన్యారావును గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి బెంగుళూర్కు 14 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డారు. రాన్యారావును అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా, అధికారులకు తాను డీజీపీ కూతురినంటూ రన్యారావు చెప్పినట్లు సమాచారం.తరచుగా దుబాయ్ వెళ్లే రన్యారావు.. ఈసారి కూడా వెళ్లి మార్చి 3వ తేదీ రాత్రి తిరిగి దుబాయ్ నుంచి వచ్చింది. బెంగుళూరు ఎయిర్ పోర్ట్లో అనుమానంతో ఆమెను అధికారులు చెక్ చేయగా, స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె దుస్తులలో 14.8 కిలోల బంగారం బయటపడింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ.12 కోట్లు ఉంటుందని అంచనా. కాగా, కన్నడలో సుదీప్తో మాణిక్య సినిమాలో రాన్యా నటించింది. -
ఫ్యామిలీతో కలిసి జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో మన్మధుడు హీరోయిన్ అన్షు (ఫోటోలు)
-
Priyanka Mohan: నేనొక శారీ లవర్ని
బంజారాహిల్స్: ‘నాకు చీరలంటే ఎంతో ఇష్టం.. ఒక్క మాటలో చెప్పాలంటే నేనొక శారీ లవర్ని’ అని చెప్పారు హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్. జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో గ్జితి వీవ్స్లో ఏర్పాటు చేసిన నూతన కలెక్షన్లను మంగళవారం ఆవిష్కరించారు. మహిళలకు చీర అందాన్ని ఇవ్వడమే కాకుండా మరింత గౌరవాన్ని ఇస్తుందని ప్రియాంక అన్నారు. తాను నిత్యం రకరకాల కలెక్షన్లు అన్వేషిస్తూ ఉంటానని, నచ్చిన చీరను తెప్పించుకోడం.. కట్టుకొని ముచ్చట తీర్చుకోడం జరుగుతుందన్నారు. మార్కెట్లోకి ట్రెండీ డ్రెస్లకు ధీటుగా శారీలు కూడా వస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గ్జితి వీవ్స్ ప్రతినిధులు సౌజన్య, బాబీ మాట్లాడుతూ ప్రతి అవసరానికీ ఓ చీర, ప్రతి సీజన్కు ఓ చీర అనే కాన్సెప్్టతో దేశంలోని భిన్న రకాల చేతి వృత్తుల చీరలతో పాటు డిజైనరీ చీరలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. – నటి ప్రియాంక -
మెహిందీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ : మెరిసిపోయిన అందాల భామ
పాకిస్తానీ హీరోయిన్ మావ్రా హొకేన్(Mawra Hocane) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తొలుత బుల్లితెరపై కనిపించిన మావ్రా ఆ తరువాత హీరోయిన్గా రాణించింది. ఇప్పటికే తన డ్రీమీ వెడ్డింగ్ ఫోటోలతో ఇంటర్నెట్లో సందడి చేసిన ఈ అమ్మడు తాజాగా తన మెహిందీ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. దీంతో ఆమె ఫ్యాషన్ శైలికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అమీర్ గిలానీ(Ameer Gilani)ని ఇటీవల(ఫిబ్రవరి 5న) రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు హాజరైన వివాహానికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇపుడు మెహిందీ లగాకే రఖ్లీ అంటూ, మెహందీ వేడుక నుండి అనేక చిత్రాలను పోస్ట్ చేసింది. ఇందులో అప్సరసలా మెరిసిపోయింది. View this post on Instagram A post shared by MAWRA (@mawrellous) గోల్డెన్ టోన్ ఎంబ్రాయిడరీ మస్టర్డ్ ఎల్లో -టోన్ ఘరారా సెట్ను ధరించింది.. దీనికి చిన్న ఫ్రాక్-శైలి కుర్తాతో పాటు ఫ్లేర్డ్ ఘరారాను జత చేసింది. అంతేకాదు డబుల్-దుపట్టా లుక్ లేటెస్ట్ ట్రెండ్కు అద్దం పడింది. మెజెంటా దుపట్టా , ఇంకోటి పర్పుల్ అండ్ బంగారు రంగు దుపట్టాను లుక్ను జత చేసింది. ఇక దీనికి జతగా బంగారు ఆభరణాలు, సింపుల్ మేకప్ లుక్తోతన ఫ్యాషన్ స్టైల్ను చాటుకుంది మావ్రా. మావ్రా హొకేన్ ప్రీవెడ్డింగ్ వేడుకల్లో ఎంబ్రాయిడరీ చేసిన సేజ్ గ్రీన్ షరారా సెట్లో అందంగా మెరిసింది.కాగా మావ్రా 2011లో ఈ అమ్మడు ‘కిచారి సాల్స’(Kichari Salsa) బాలీవుడ్ రొమాంటిక్ మూవీతో హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తరువత 2016లో ‘సనమ్ తేరీ కసమ్’ (Sanam Teri Kasam)తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. -
సిల్వర్ స్క్రీన్ క్వీన్ : తోపుడు బండిపై అనాథ శవంలా!
జీవితం పట్ల అవగాహన, క్రమశిక్షణ లేకపోతే మన సంపాదించిన కీర్తి ప్రతిష్టలు, వేల కోట్ల సంపద అన్నీ హారతి కర్పూరంలా కరిగిపోతాయి. సక్సెస్ ఒక్కటే సరిపోదు. జీవితం పట్ల స్పష్టత ఉండాలి. కీర్తి ప్రతిష్టలైనా, కోట్ల రూపాయల సంపద అయినా చివరిదాకా నిలుపుకునే కనీస అవగాహన, సత్తా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు, సినీతారల విషయంలో ఇది చాలా అవసరం. ఎదురు దెబ్బలు, అవమానాలు తప్పవు. మరీ ముఖ్యంగా మహిళలైతే అప్రమత్తంగా లేకపోతే పరిస్థితి మరింత దుర్భరంగా మారిపోతుంది. ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి, విలాసవంతమైన జీవితాన్ని గడిపి, చివరికి అనాథలా మిగిలిన ఒక తార జీవితం గురించి తెలుసుకుందాం.ఆమె ఒక గ్లామర్ హీరోయిన్. అద్భుతమైన అందం, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్ చక్కని నటన. తన అందం అభినయంతో, సినీ ప్రేక్షకుల హృదయాలను దోచుకుని సిల్వర్ స్క్రీన్ క్వీన్ గా ఒక పేరు దక్కించుకుంది. నటిగా అనేక విజయాలు, కోట్ల ఆస్తి కట్ చేస్తే 34 ఏళ్ల వయసులోనే అనాథలా ఈ ప్రపంచం నుంచి సెలవు తీసుకుంది. ఆమె బాలీవుడ్ నటి విమ్మీ (Vimi). 1943లో సిక్కు కుటుంబంలో జన్మించింది. చదువుకుంటున్న రోజుల్లోనే ఆల్ ఇండియా రేడియోలో పాటలు కూడా పాడేది.ముంబైలో సోఫియా కాలేజీలో సైకాలజీ చదివింది. బీఆర్ చోప్రా హాజరవుతారని తెలిసి, రవి తన కొడుకు పుట్టినరోజు పార్టీకి విమ్మీని, ఆమె భర్తను ఆహ్వానించాడు. ఈ పార్టీలో విమ్మీని చూసిన ప్రఖ్యాత ప్రముఖ నిర్మాత బీఆర్ చోప్రా ఆమెను బాలీవుడ్కు పరిచయం చేశాడు. 1967లో తీసిన హమ్రాజ్ చిత్రంలో ఆనాటి ఇద్దరు అగ్ర తారలు సునీల్ దత్ ,రాజ్ కుమార్ సరసన కొత్త హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రమే బ్లాక్ బస్టర్గా నిలిచింది. బాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. చాలా తక్కువ సమయంలో విమ్మీ పాపులారీటీ సాధించింది. ఆబ్రూలో అశోక్ కుమార్, పతంగాలో శశి కపూర్ వంటి అగ్ర తారలతో సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. 1960లలో ఒక పెద్ద స్టార్ హీరోయిన్ నిలిచింది. ఒకానొక దశలో బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా నిలిచింది. మరోవైపు ముంబైలాంటి వంటి విశ్వనగరంలో పుట్టి పెరిగినప్పటికీ,పాశ్చాత్య దుస్తులు ధరించడం , మేకప్ వేసుకొని విమ్మీ సినిమాల్లోకి రావడం ఇరుకుటుంబాలకీ నచ్చలేదు. దీనికి హమారాజ్సినిమా సమయంలో భర్తతో గొడవలు ఇది విమికి భారీగా నష్టం కలిగించింది.ఆమెతో మళ్ళీ పనిచేయడానికి నిరాకరించడం ఆమెకు భారీగా నష్టం కలిగించింది. అలాగే ఆమె భర్త అగర్వాల్ జోక్యంకారణంగా దర్శక నిర్మాతలు దూరంగా ఉండేవారు. క్రమంగా ఆమె స్టార్డమ్ తగ్గడం ప్రారంభమైంది. అలా పదేళ్ల కాలంలోనే ఆమె జీవితం తారుమారైపోయింది. 1970ల ప్రారంభం నాటికి, విమ్మీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పేలవంగా నిలిచాయి. దీంతో చిన్న చిన్న అతిధి పాత్రలు గుర్తింపు లేని నృత్య ప్రదర్శనలకు పరిమితమైపోయింది.విమ్మీ బాలీవుడ్లోకి అడుగుపెట్టే సమయానికే ఒక పారిశ్రామికవేత్త కుమారుడు శివ్ అగర్వాల్ (Shiv Agarwal)తో పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒక పక్క వృత్తి జీవితం చాలా హ్యాపీగా సాగుతుండగా, వ్యక్తిగత జీవితం మాత్రం చాలా బాధాకరంగా పరిణమించింది. తీవ్రమైన గృహహింను ఎదుర్కొంది. దీంతో భర్తనుంచి విడాకులు తీసుకుంది. నమ్మిన మరో మనిషి దారుణంగా మోసం చేయడంతో దయనీయ పరిస్థితులలోకి జారిపోయింది. జాలీ అనే చిన్న నిర్మాతతో సంబంధంలోకి ప్రవేశించింది. కానీ ఇది మరో పీడకలగా మారుతుందని ఊహించలేకపోయింది. బాధలో ఉన్న విమ్మీని అక్కున చేర్చుకోలేదు సరికదా అనేక రకాలుగా వేధింపులకు గురిచేశాడు. ఆర్థికంగా దోచుకున్నాడు. విమ్మీ సొమ్మునంతా వాడుకోవడం మాత్రమే కాదు ఆమెను బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడనే వార్తలు కూడా వినిపించాయి అప్పట్లో.చదవండి: భారీ వేతనమిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి.. ఐపీఎస్ అయ్యిందిలా!విషాదకరమైన ముగింపుఅయితే తన జీవితాన్ని పునర్నిర్మించుకునే ప్రయత్నంలో, విమ్మీ కోల్కతాలో విమి టెక్సటైల్ పేరుతో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించింది. దురదృష్టవశాత్తూ అదీ విఫలమైంది. నష్టాలతో దివాలా తీసింది. మరోవైపు అప్పలు ముంచుకొచ్చాయి. ఇక లాభం లేక దాన్ని అమ్మేయవలసి వచ్చింది. ఈ అవమాన భారంతో మానసికంగా దెబ్బతింది. మద్యానికి అలవాటు పడింది. ఇదే ఆమె ఆరోగ్యాన్ని నాశనం చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితిలో 1977న ఆగస్టు 22న అతి చిన్న వయసులో, విమ్మీ కాలేయ సమస్యలలో తనువు చాలించింది. దహన సంస్కారాలు నిర్వహించే దిక్కులేదు వెండి వెలుగుల్లో అకాల కీర్తి, దాని స్వభావాన్ని విషాదాంతాన్ని గుర్తు చేసిన మరో ఉదంతం ఏమింటే..ఆమె చనిపోయిన తర్వాత ఆమె భౌతిక కాయాన్ని ఒక తోపుడు బండిపై తరలించాల్సి రావడం. ఇదీ చదవండి: Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట -
ఫ్యామిలీతో 40వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న 'మన్మధుడు' హీరోయిన్ అన్షు (ఫోటోలు)
-
64 ఏళ్ల హీరోతో జత కడుతున్న 29 ఏళ్ల హీరోయిన్ (ఫోటోలు)
-
ప్రియుడితో ఆరెంజ్ హీరోయిన్ 'రోకా'.. పెళ్లెప్పుడంటే?
ఆరెంజ్ హీరోయిన్ షాజన్ పదంసీ (Shazahn Padamsee) గుడ్న్యూస్ చెప్పింది. ప్రియుడు, వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో రోకా జరిగినట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పలు ఫోటోలను షేర్ చేసింది. జనవరి 20న కొత్త ప్రయాణం మొదలైందంటూ '#roka #engagement' అన్న క్యాప్షన్ ఇచ్చింది. గతేడాది నవంబర్లోనూ అశీష్ తనకు ప్రపోజ్ చేసిన ఫోటోలు షేర్ చేసింది. అందులో ఆశిష్ నటి షాజన్ వేలికి ఉంగరం తొడిగాడు. ఇకపోతే జూన్లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఆరెంజ్ సినిమా (Orange Movie) వచ్చి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రీరిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో రామ్చరణ్, జెనీలియా ప్రధాన పాత్రలు పోషించారు. భాస్కర్ దర్శకత్వం వహించగా హరీశ్ జయరాజ్ సంగీతం అందించాడు.ఎవరీ షాజన్?పలు వాణిజ్యప్రకటనల్లో మెరిసిన షాజన్.. రాకెట్ సింగ్: సేల్స్మ్యాన్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. కనిమొళి అనే తమిళ చిత్రంలో నటించింది. దిల్ తో బచ్చా హై జీ, హౌస్ఫుల్ 2 సినిమాలు చేసింది. తెలుగులో ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ప్రేయసి రూబాగా యాక్ట్ చేసింది. మసాలా మూవీలో రామ్ పోతినేని సరసన కథానాయికగా నటించింది. 2015లో సాలిడ్ పటేల్స్ (హిందీ) సినిమా చేశాక ఇండస్ట్రీకి దూరంగా ఉంది. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత 2023లో పాగల్పన్: నెక్స్ట్ లెవల్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది.రోకా అంటే..రోకా అంటే తెలుగువారికి పెద్దగా తెలియకపోవచ్చు. ఇది ఉత్తరాది సాంప్రదాయం. రోకాతోనే పెళ్లి పనులు మొదలవుతాయి. మా అమ్మాయికి.. వారి అబ్బాయికి పెళ్లి కుదిరింది అని ప్రకటించే ప్రక్రియే రోకా వేడుక. ఇరు కుటుంబాలు తొలిసారి కలుసుకుని వివాహాన్ని నిశ్చయించుకుని స్వీట్లు తినిపించుకుంటారు. కొత్త జీవితం ప్రారంభించబోయే జంటను ఆశీర్వదిస్తారు. ఇది పెళ్లికూతురి ఇంటి వద్దనో లేదా ఆమె కుటుంబ సభ్యులు ఖరారు చేసిన వేదిక వద్ద జరుపుతారు. ప్రియాంక చోప్రా- నిక్ జోనస్, హీరో రానా- మిహికా బజాజ్ పెళ్లి సమయంలో ఈ రోకా గురించి చర్చ జరిగింది. View this post on Instagram A post shared by Shazahn Padamsee (@shazahnpadamsee) చదవండి: జైలుకు వెళ్లొచ్చిన హీరోయిన్కు సన్యాసమా? అంతా పబ్లిసిటీ కోసమే! -
జైలుకు వెళ్లొచ్చిన హీరోయిన్కు సన్యాసమా? అంతా పబ్లిసిటీ కోసమే!
జీవితంపై విరక్తి చెందినవారు, ఆధ్యాత్మిక మార్గంలోనే జీవితాన్ని కొనసాగించాలనుకునేవారు సన్యాసం బాట పడుతుంటారు. ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ మమతా కులకర్ణి (Mamta Kulkarni) కూడా అదే దారిలోకి వెళ్లాలని ఆశపడింది. ఇందుకోసం రెండు దశాబ్దాల తర్వాత ఇండియాకు వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో సన్యాసం పుచ్చుకుంది.సన్యాసం పుచ్చుకున్న హీరోయిన్కిన్నారా అఖాడా(ఆశ్రమం)లో ఆచార్య మహా మండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో సన్యాసిగా మారింది. ఇకపై సాధ్విగా తన ప్రయాగం సాగుతుందన్న ఆమె తన పేరును శ్రీయామై మమతా నందగిరి అని ప్రకటించింది. ఈ వ్యవహారంపై ట్రాన్స్జెండర్, జగద్గురు మహామండలేశ్వర్ హిమాంగి సఖి ఆగ్రహం వ్యక్తం చేశారు. మమను మహామండలేశ్వర్గా ప్రకటించడాన్ని తప్పుపట్టారు. ఏం చెప్పాలనుకుంటున్నారు?హిమాంగి సఖి మాట్లాడుతూ.. మమతా కులకర్ణి పబ్లిసిటీ కోసమే మహామండలేశ్వర్గా మారింది. తన గతమేంటో అందరికీ తెలుసు. డ్రగ్స్ కేసులో జైలుకు కూడా వెళ్లొచ్చింది. సడన్గా భారత్కు రావడం.. మహాకుంభమేళాకు హాజరవడం.. ఏకంగా సన్యాసిగా మారిపోవడం ఏంటో.. దీనిపై కచ్చితంగా విచారణ జరపాలి. అలాంటి వ్యక్తికి మహామండలేశ్వర్ హోదా ఇచ్చి సనాతన ధర్మానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అర్హత లేని మనిషికి గురువు హోదా ఎందుకిచ్చారు? ఇది అనైతికం అని మండిపడింది.(చదవండి: మోనాలిసా.. ఆంటీలతో పోలిక.. ఎంత అన్యాయమన్న విశ్వక్సేన్)ఎవరీ మమతా కులకర్ణి?1990'sలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది మమతా కులకర్ణి. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి పెద్ద పెద్ద హీరోల సరసన కథానాయికగా యాక్ట్ చేసింది. కరణ్ అర్జున్, బాజీ, ఆషిఖ్ ఆవారా, దిల్బర్, కిస్మత్, జానే జిగర్ ఇలా ఎన్నో చిత్రాలు చేసింది. తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ మూవీస్తో మెప్పించింది. 2003లో ఓ బెంగాలీ సినిమా చేసిన అనంతరం మళ్లీ వెండితెరపై కనిపించలేదు.వివాదంమమతా 2016లో ప్రియుడితో కలిసి డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడటం అప్పట్లో సంచలనమైంది. రూ.2 వేల కోట్ల విలువైన డ్రగ్ రాకెట్ కేసులో ఇరుక్కుంది. ఏళ్ల తరబడి విచారణ జరిపిన బాంబే హైకోర్టు గతేడాది ఆగస్టులో మమతకు క్లీన్చిట్ ఇచ్చింది. అప్పట్లో టాప్లెస్ ఫోటోషూట్తోనూ వివాదాల్లోకెక్కింది.చదవండి: మాఫియా డాన్తో ప్రేమాయణం.. జైలుకెళ్లిన ఈ నటి గుర్తుందా? -
గ్లామర్ హీరోయిన్.. మతిస్థిమితం కోల్పోయి.. చివరి రోజుల్లో తిండి మానేసి..
అందంతో కట్టిపడేసింది. నటనతో మంత్రముగ్ధుల్ని చేసింది. సినిమా ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె అందచందాలకు జనాలే కాదు సినీఇండస్ట్రీ దాసోహమైంది. తనతో పరిచయం పెంచుకోవాలని చూసినవారు కొందరైతే ప్రేమాయణం నడిపినవారు మరికొందరు. కానీ ఏ ప్రేమా పెళ్లిదాకా వెళ్లలేదు. సినీ ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ చూసిన ఆమె నిజ జీవితంలో మాత్రం ఫెయిల్యూర్స్తోనే సావాసం చేసింది. ఆఖరి రోజుల్లో మానసిక స్థితి సరిగా లేక.. అనారోగ్యంతో కన్నుమూసింది. వెండితెరకు గ్లామర్ టచ్ ఇచ్చిన ఆవిడ పేరు పర్వీన్ బాబి. నేడు (జనవరి 20) ఆమె ఇరవయ్యవ వర్ధంతి. ఈ సందర్భంగా తనపై ప్రత్యేక కథనం..పద్నాలుగేళ్లకు పుట్టిన ఆశాదీపం పర్వీన్పర్వీన్ బాబి (Parveen Babi) గుజరాత్లో పుట్టింది. పెళ్లయిన పద్నాలుగేళ్లకు పర్వీన్ పుట్టడంతో ఆ పేరెంట్స్ సంతోషపడిపోయారు. ఒక్కగానొక్క కూతురని అల్లారుముద్దుగా పెంచారు. కానీ తనకు ఆరేళ్ల వయసున్నప్పుడు తండ్రి క్యాన్సర్తో చనిపోయాడు. తండ్రి మరణం తర్వాత తల్లితో ఓ హవేలీలో నివసించింది. సైకాలజీ చదివిన పర్వీన్ మోడలింగ్లోనూ అడుగుపెట్టింది. అక్కడి నుంచి సినీపరిశ్రమవైపు అడుగులు వేసింది. క్రికెటర్ సలీమ్ దురానీ సరసన చరిత్ర మూవీలో యాక్ట్ చేసింది. ఆమెకు నటనలో శిక్షణ ఇచ్చింది దర్శకుడు కిశోర్ సాహు. వేశ్యగా నటించిన పర్వీన్తనకు గుర్తింపు ఇచ్చిన ఫస్ట్ మూవీ మజ్బూర్ అయితే సెన్సేషన్ సృష్టించింది మాత్రం దీవార్. ఈ సినిమాలో పర్వీన్.. వేశ్యగా నటించింది. తర్వా అమర్ అక్బర్ ఆంటోని, కాల పత్తర్, సుహాగ్, షాన్, నమక్ హలాల్, ద బర్నింగ్ ట్రైన్.. ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. అమితాబ్ బచ్చన్తో ఆరు సినిమాలు చేయగా అన్నీ హిట్లు, సూపర్ హిట్లుగానే నిలవడం విశేషం. ఎక్కువగా మోడ్రన్, గ్లామర్ పాత్రలే వేస్తూ టాప్ హీరోయిన్గా కొనసాగింది. అమెరికాకు చెందిన టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించిన మొట్టమొదటి బాలీవుడ్ నటిగానూ చరిత్ర సృష్టించింది.ప్రేమ- పెళ్లి?1969లో పాకిస్తాన్కు చెందిన దూరపు బంధువుతో ఎంగేజ్మెంట్ జరిగింది. 1971లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ యుద్ధం వల్ల ఆ నిశ్చితార్థం పెళ్లిదాకా రాకుండానే ఆగిపోయింది. తర్వాత నటుడు, విలన్ డేనీ డెంజోంగ్పా(Danny Denzongpa)ను ప్రేమించింది. చిత్రపరిశ్రమ అంతా పర్వీన్ వెంటపడుతుంటే ఆమె మాత్రం డానీ కోసం పరితపించింది. అతడు కూడా పర్వీన్ను చూసి ప్రపంచాన్నే మర్చిపోయాడు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో ఉండటం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. కానీ ఇద్దరూ సినిమాలతో బిజీ అవడంతో కాసేపు కలిసుండే సమయం కూడా కరువైంది. దీంతో ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుని ఫ్రెండ్షిప్ను కొనసాగించారు.(చదవండి: సంక్రాంతికి వస్తున్నాం ఖాతాలో మరో రికార్డు.. 'డాకు..' కలెక్షన్స్ ఎంతంటే?)పెళ్లయిన వ్యక్తితో లవ్అనంతరం నటుడు, వివాహితుడు కబీర్ బేడీ (Kabir Bedi)తో ప్రేమలో పడింది. ఇటాలియన్ సీరియల్ సెట్ వీరి ప్రేమకు పునాది వేసింది. కానీ కబీర్కు యూరప్లో గ్రాఫ్ పెరగడంతో బాలీవుడ్ రాలేకపోయాడు. అటు పర్వీన్.. తను సంతకం చేసిన సినిమాల కోసం ముంబై తిరిగిరాక తప్పలేదు. రెండేళ్ల లవ్ జర్నీకి ఫుల్స్టాప్ పెట్టింది. గుండె నిండా ఆ బాధ కూరుకుపోయినప్పుడే ఉన్నప్పుడే మహేశ్ భట్ (Mahesh Bhatt) పరిచయమయ్యాడు. ఇద్దరి పరిచయం.. స్నేహంగా, ప్రేమగా మారింది. కానీ అప్పటికే మహేశ్కు పెళ్లయి కూతురు (పూజా భట్) కూడా ఉంది. పర్వీన్కు పిచ్చి అభిమాని అయిన మహేశ్ కుటుంబాన్ని వదిలేశాడు. ఇల్లొదిలేసి పర్వీన్తో సహజీవనం మొదలుపెట్టాడు. మూడేళ్లు కలిసున్నారు.దిగజారిన మానసిక స్థితిఓ రోజు మహేశ్ ఇంటికి వచ్చేసరికి పర్వీన్ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. నన్ను చంపడానికి అమితాబ్ ఫ్యాన్లో ఏదో డివైజ్ పెట్టాడు అంటూ కత్తి పట్టుకుని నిల్చుంది. అమితాబ్ తనను కిడ్నాప్ చేయించాడంది. ఓ రోజు ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు అక్కడున్న శంఖంలో బాంబ్ ఉందంటూ అరిచి గోల చేసింది. తనను ఎవరో ఏదో చేస్తారని మంచం కింద దాక్కునేది. తనకు పెట్టే భోజనంలో విషం కలుపుతున్నారని అనుమానించేది. ఎవరైనా ఒక ముద్ద తింటేకానీ ప్లేటు ముట్టేది కాదు. ఇలా రోజురోజుకూ ఆమె మానసిక ఆరోగ్యం దిగజారుతుంటే మహేశ్కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఉన్న ఒక్క స్నేహితుడినీ గెంటేసిన హీరోయిన్సైకియాట్రిస్ట్కు చూపిస్తే పారనాయిడ్ స్కిజోఫ్రీనియా అని తేలింది. టాబ్లెట్స్తో ఫలితం లేకపోవడంతో సినిమా వాతావరణానికి దూరంగా బెంగళూరులో ఉంచారు. అక్కడ ఆమె ఎక్కువరోజులు ఉండలేక ముంబైకి తిరుగుప్రయాణమైంది. డానీ.. తనకు ఏ కాస్త సమయం దొరికినా పర్వీన్ దగ్గరకు వెళ్లి ఆమెను సరదాగా ఉంచేందుకు ప్రయత్నించాడు. కానీ ఓ రోజు డానీని ఇంట్లోకి రానివ్వలేదు పర్వీన్. నన్ను చంపేందుకు నిన్ను అమితాబ్ పంపాడు కదా.. గెటవుట్ అని అరిచింది. బిగ్బీ మనుషులు తనను చంపాలనుకుంటున్నారన్న అనుమానంతో నిద్రాహారాలకు దూరమైంది. ఒంటరిగా..మహేశ్ తన పరిస్థితి చూడలేక ఇంట్లో నుంచి వచ్చేశాడు. భార్యకు దగ్గరయ్యాడు. దీంతో పర్వీన్ ఒంటరిగానే మిగిలిపోయింది. మధుమేహం, కీళ్లనొప్పులతోనూ బాధపడింది. 2005 జనవరి 20న పర్వీన్ (50) చనిపోయింది. ఆ విషయం రెండు మూడు రోజులవరకు ఇరుగుపొరుగుకు కూడా తెలియలేదు. తిండి మానేయడంతో ఆమె ఆరోగ్యం క్షీణించి చనిపోయిందని చెప్తుంటారు. పర్వీన్ మరణవార్త తెలిసి పరుగెత్తికొచ్చిన మహేశ్ ఆమె అంత్యక్రియలు జరిపించాడు. పర్వీన్ తన ఆస్తిని ‘బాబీ’అనే ముస్లిం తెగలోని అనాథలకు, ముంబైలోని క్రిస్టియన్, హిందూ అనాథ శరణాలయాలకు సమానంగా రాసిచ్చింది.చదవండి:ర్మ కళ్లు తెరిపించిన సత్య.. ఒట్టు, ఇకపై అలాంటి సినిమాలు చేయను!చదవండి: అదివారం నాడు నాకో సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ -
నిర్మాత లవ్ రిజెక్ట్ చేశా.. ఆ కోపంతో రైల్లో నుంచి తోసేయాలని..: దృశ్యం నటి
దృశ్యం సినిమాతో పాపులరైంది అంజలి నాయర్ (Anjali Nair). తాజాగా ఈ బ్యూటీ తనకు గతంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. అంజలి మాట్లాడుతూ.. ఉన్నయే కాదలిప్పన్ (Unnaiye Kadhalipen) అనే తమిళ సినిమా చేస్తున్నప్పుడు ఆ మూవీ నిర్మాత నాకు ప్రపోజ్ చేశాడు. అతడు ఆ సినిమాను నిర్మించడంతో పాటు అందులో విలన్గానూ నటించాడు. తన ప్రపోజల్ను నేను తిరస్కరించాను. దాంతో అతడు నేను వేరే సినిమాకు వెళ్లినప్పుడు ఆ సెట్స్కు వచ్చి వేధింపులకు గురి చేశాడు.రైల్లో నుంచి నెట్టేయాలని..ఒకసారి రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్గా వచ్చి నా బ్యాగు తీసుకున్నాడు. తిరిగిచ్చేయమని అతడిని వెంబడించినప్పుడు రైలు డోర్ దగ్గర నన్ను బయటకు నెట్టేయాలని చూశాడు. ఒకసారి అతడి సోదరి నాకు ఫోన్ చేసి ఆమె తల్లి ఆరోగ్యం బాగోలేదని చెప్పింది. నన్ను చూడాలని కలవరిస్తోందని చెప్పింది. అతడు ఇంట్లో ఉంటే రానని చెప్పాను. అందుకామె.. తన సోదరుడు ఇంట్లో లేడని స్విట్జర్లాండ్కు వెళ్లిపోయాడని, కంగారుపడాల్సినం అవసరం లేదని సర్ది చెప్పింది.కత్తితో బెదిరించి సంతకం..నిజమేననుకుని వెళ్లాను. నేను ఇంట్లో ఓ గదిలోకి వెళ్లగానే బయట నుంచి గడియ పెట్టారు. ఆ గదిలో ఆ రాక్షసుడు ఉన్నాడు. కొన్ని పేపర్లు నా ముందు పెట్టి సంతకం పెట్టమన్నాడు. కత్తితో బెదిరించడంతో సంతకం చేశాను. ఆ పేపర్లలో లవ్ లెటర్ కూడా ఉంది. తర్వాత ఎలాగోలా ఆ గది నుంచి బయటపడ్డాను. అయితే అతడి నెక్స్ట్ సినిమాలో నేనే హీరోయిన్గా నటించాలని కాంట్రాక్ట్ పేపర్పై నాతో బలవంతంగా సంతకం చేయించుకున్నాడని అర్థమైంది.(చదవండి: 'సంక్రాంతికి వస్తున్నాం' బుల్లి రాజు.. తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్!)అంత చెండాలంగా లెటర్ రాస్తారా?నేను సినిమా చేయనని చెప్పాను. ఆధారాలతో సహా అతడిపై కేసు పెట్టాను. అప్పుడు అతడు నేను రాసినట్లుగా లవ్ లెటర్స్ను సాక్ష్యంగా చూపించాడు. నేనొకటే అడిగా.. ప్రేమించే ఏ అమ్మాయైనా అంత చెండాలంగా లవ్ లెటర్ రాస్తుందా? అని ప్రశ్నించాను. ఆ కేసు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తర్వాత మళ్లీ ఎప్పుడూ అతడు నాకు కనిపించలేదు అని చెప్పుకొచ్చింది. సినిమాఅంజలి.. మలయాళంలో ద కింగ్ అండ్ ద కమిషనర్, 5 సుందరికల్, పట్టం పోలే, వెనిసిలె వ్యాపారి, ఏంజెల్స్, టమార్ పడార్, 100 డిగ్రీ సెల్సియస్, సెకండ్స్, సెంట్రల్ థియేటర్, లైలా ఓ లైలా, బెన్, దూరం, తీరం, ఆమి, దృశ్యం 2, మాన్స్టర్ సినిమాలు చేసింది. తమిళంలో ఇదువుమ్ కాదంధు పొగుం, నెల్లు, ఆగడు సినిమాలు చేసింది. ఇటీవలే చిత్తా(తెలుగులో చిన్నా) సినిమాకుగానూ ఉత్తమ సహాయ నటిగా రాష్ట్రీయ అవార్డు గెలుచుకుంది. కాగా అంజలి దర్శకుడు అనీశ్ను 2011లో పెళ్లి చేసుకుంది. వీరికి అవని అనే కూతురు ఉంది. 2016లో అతడికి విడాకులు ఇచ్చింది. 2022లో అజిత్ రాజును రెండో పెళ్లి చేసుకోగా వీరికి ఓ కూతురు పుట్టింది.చదవండి: నాన్న చేసిన పనికి అమ్మ ఏడుస్తూ... ఈ బతుకే వద్దనుకున్నా! -
పిల్లలతో ఇదేం పని? టీఆర్పీ కోసం ఏదైనా చేయిస్తారా?
హీరోయిన్ కాయడు లోహర్ (Kayadu Lohar)కు వింత అనుభవం ఎదురైంది. డ్రాగన్ సినిమా (Dragon Movie) ప్రమోషన్స్లో భాగంగా ఆమె తమిళ సరిగమప లిటిల్ ఛాంప్స్ సీజన్ 4కు హాజరైంది. అక్కడ పాటలు పాడే ఓ బుడ్డోడు హీరోయిన్ను హత్తుకుని ముద్దుల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో హీరోయిన్ పెదాలపైనా ముద్దు పెట్టేందుకు ప్రయత్నించగా ఆమె తల పక్కకు తిప్పుకుంది. ఇది చూసిన జడ్జి ఎస్పీ చరణ్ ఏమీ చేయలేక చిరునవ్వు చిందించాడు. చెడిపోతున్నారుఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షో టీఆర్పీ కోసం పిల్లలతో ఇలాంటి పనులు చేయించడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో సోషల్ మీడియా వల్ల పిల్లలు చెడిపోతున్నారనడానికి ఇదే సాక్ష్యమంటున్నారు. తల్లిదండ్రులైనా పిల్లలు ఎలా నడుచుకోవాలనేది నేర్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పనులు చేసినప్పుడు నవ్వడానికి బదులు లాగి పెట్టి ఒక్కటిస్తే వారే దారికొస్తారని సలహా ఇస్తున్నారు.తెలుగులోనూ యాక్ట్ చేసిన హీరోయిన్తమిళంలో ప్రసారమవుతున్న సరిగమప లిటిల్ ఛాంప్స్ నాలుగో సీజన్కు సింగర్ శ్వేతా మోహన్తో పాటు, దివంగత గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ కాయడు లోహర్ విషయానికి వస్తే.. అస్సాం రాష్ట్రానికి చెందిన ఈ బ్యూటీ ముగిల్పేటె అనే కన్నడ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. పతనోపాతం నూట్టండుతో మలయాళంలో ప్రవేశించింది. అదే ఏడాది శ్రీవిష్ణు హీరోగా నటించిన అల్లూరి (2022) సినిమాతో తెలుగువారిని పలకరించింది. ప్రస్తుతం డ్రాగన్ సినిమా చేస్తోంది. లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది. 🤦♂️🤦♂️🤦♂️pic.twitter.com/KbZVlDlTU6— Christopher Kanagaraj (@Chrissuccess) January 18, 2025 చదవండి: సంక్రాంతికి వస్తున్నాం: ఐశ్వర్య కాకపోతే ఆ హీరోయిన్.. మీనాక్షికి బదులుగా! -
ఆడిషన్ ఇవ్వను.. అవకాశాలు అడుక్కోనంటున్న హీరోయిన్
టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు... ప్రతీ హీరోయిన్కు తనదంటూ ఒక టైమ్ వస్తుంది. ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలిసినవారికి తిరుగుండదు. అలా తెలియని వాళ్లు మాత్రం... ఫీల్డ్లో ఉన్నప్పటికీ... చేరుకోవాల్సిన స్థాయిల్ని చేరుకోలేక దొరికిన స్థాయితో సంతృప్తి చెందుతుంటారు. అలాంటి రెండో కోవలోకి వస్తుంది బాలీవుడ్ నిన్నటి తరం నటి శిల్పా శెట్టి కుంద్రా (Shilpa Shetty). తెలుగులో తళుక్కుమన్న హీరోయిన్బాజీగర్ లాంటి బాక్సాఫీస్ హిట్స్ ఇచ్చినా శిల్పాశెట్టికి బాలీవుడ్లో స్టార్డమ్ దక్కలేదు. ఉత్తరాది హీరోయిన్లలో తక్కువ మందికే సాధ్యమైన విధంగా టాలీవుడ్ సహా దక్షిణాదిలో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే సినిమాలు చేసినా ఇక్కడా పెద్దగా పేరు రాలేదు. వెంకటేష్తో సాహసవీరుడు సాగరకన్య, నాగార్జునతో అజాద్, వీడెవడండీ బాబు వంటి పలు తెలుగు సినిమాల్లో కూడా శిల్పాశెట్టి తళుక్కుమంది. ఇప్పటికీ ఏదో ఒక సినిమా చేస్తూనే ఉన్న ఈ యోగా క్వీన్... సినిమాల కంటే యోగా వీడియో ద్వారానే ప్రత్యేకమైన గుర్తింపు సాధించిందని చెప్పొచ్చు. బిగ్బాస్ గెలిచిన ఫస్ట్ బ్యూటీఅలాగే సినిమాలకు మరోవైపు... ప్రస్తుతం భారతదేశంలో అనేక భాషల్లో చిన్నితెరపై స్థిరపడిపోయిన బిగ్ బాస్కు పెద్దన్న లాంటి అంతర్జాతీయ బిగ్ బ్రదర్ సీజన్ను తొలిసారి గెలుచుకున్న ఏకైక భారతీయ నటి శిల్పాశెట్టి మాత్రమే కావడం గమనార్హం. తాజాగా లండన్ వెళ్లి రిలాక్స్ అయి తిరిగి వచ్చింది. భారతదేశంలో తన కుటుంబంతో కలిసి లోహ్రీ, మకర సంక్రాంతిని జరుపుకుంది. ప్రస్తుతం కన్నడ భాషలో కెడి ది డెవిల్ చిత్రంతో అరంగేట్రం చేస్తోందీ 49 ఏళ్ల నటి.ఆడిషన్స్ ఇవ్వనుబిజీ బిజీగా గడిపే రోజుల్లో చాలా అవసరమైన విరామంగా తన రిలాక్స్డ్ ట్రిప్ని అభివర్ణించింది. బాలీవుడ్ సరే... బిగ్ బ్రదర్ ద్వారా అంతర్జాతీయంగా పేరు వచ్చినప్పటికీ తనకెందుకు హాలీవుడ్ అవకాశాలు రావడం లేదు? ఈ సందర్భంగా ఇదే ప్రశ్నను ఒక ఇంటర్వ్యూలో ఆమె ముందుంచితే... తాను అవకాశాల కోసం ఆడిషన్స్ ఇచ్చే పరిస్థితిలో లేనని తేల్చి చెప్పింది. తాను కష్టపడి పనిచేసినందుకు తనకు దక్కినదానితో సంతృప్తిగా ఉన్నానని చెప్పింది. ఓపిక లేదుహాలీవుడ్ కోసమో మరో చోటో ఆఫర్ల కోసం ఆడిషన్ కు వెళ్లాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేసింది. తన మూడు దశాబ్దాల పాటు సాగిన కెరీర్లో బాజీగర్ (1993) వంటి కమర్షియల్ హిట్లు లైఫ్ ఇన్... ఎ మెట్రో (2007) అప్నే (2007) వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలలో కనిపించానని... ఇలా 30 ఏళ్ల పని తర్వాత, కొత్తగా ప్రారంభించే ఓపిక తనకు లేదని పేర్కొంది. నా టాలెంట్ గురించి తెలుసుకోవాలంటే తన గత చిత్రాలను చూడమని మాత్రమే తాను చెప్పగలనని అంటోంది. కుటుంబానికే ప్రథమ స్థానంతాను సరిగ్గా సరిపోతుంటే, ఆడిషన్ చేయవలసిన అవసరం లేదంది. ఏదేమైనా... తన జీవితంలో ఇక తన కుటుంబానికి మొదటి స్థానం అని శిల్పా నొక్కి చెప్పింది. పని కోసమో మరింత పేరు ప్రతిష్టల కోసమో ఆరాటపడుతూ ఎక్కువ కాలం తన పిల్లలకు దూరంగా ఉండడం తన వల్ల కాదని తేల్చి చెప్పింది. తన ప్రాధాన్యతల గురించి శిల్పాశెట్టి చాలా స్పష్టంగా ఉందనేది నిస్సందేహం..చదవండి: ఏ అమ్మాయి ఆ పని చేయదంటూ ఏడ్చేసిన తబిత.. ఓదార్చిన సుకుమార్ -
డబ్బు కోసం నన్నే చంపాలనుకుంది.. నా వందకోట్ల ఆస్తి..: హీరోయిన్ మాజీ భర్త
దేవిక.. అలనాటి అందాల తార. వందకుపైగా సినిమాలు చేసింది. తెలుగులో ఆడవాళ్లే అలిగితే, ఆడ బ్రతుకు, అన్నా చెల్లెలు, బాటసారి, దేశ ద్రోహులు, గాలిమేడలు, గండికోట రహస్యం, మంగళసూత్రం, రేచుక్క, నిండు మనసులు, పాపం పసివాడు, రక్త సంబంధం, శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం, సుగుణ సుందరి కథ, శ్రీ కృష్ణ సత్య.. ఇలా అనేక సినిమ్లాలో యాక్ట్ చేసింది. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ కనిపించి కనువిందు చేసింది.రియల్ లైఫ్లోనూ యాక్టింగ్1968లో దర్శకుడు దేవదాసు (Devadoss)ను పెళ్లాడింది. ఈ జంటకు పుట్టిన కూతురు కనక (Actress Kanaka) కూడా సినిమాల్లో రాణించింది. కానీ తర్వాత ఈ కుటుంబం ఛిన్నాభిన్నమైపోయింది. దేవిక వల్ల తన జీవితమే తలకిందులైదంటున్నాడు ఆమె మాజీ భర్త దేవదాసు. దేవిక రీల్ లైఫ్లో మాత్రమే నటించలేదని, నిజ జీవితంలోనూ యాక్ట్ చేసిందని చెప్తున్నాడు.కాళ్లమీద పడిందితాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేనెప్పుడూ దేవిక (Devika) వెంట పడలేదు. తనే పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేసింది. మీకూ, నాకూ సెట్టవదండని చెప్పాను. అయినా తను వినలేదు. నా కాళ్లమీద పడి పెళ్లి చేసుకోమని బతిమాలాడింది. ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరించింది. అలా తిరుపతిలో పెళ్లి చేసుకున్నాం.. కానీ తనది నిజమైన ప్రేమ కాదని నెమ్మదిగా అర్థమైంది.నన్ను హత్య చేయించాలని..నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు తన దగ్గర పైసా లేదు. డబ్బు కోసం నన్ను పెళ్లాడింది. నేను పెద్ద డైరెక్టర్ అయిపోతానని దేవిక అనుకుంది. నన్ను తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని చూసింది. కానీ నేను స్వతంత్ర భావాలున్న వ్యక్తిని. నాకు నచ్చినట్లుగానే ఉండేవాడిని. దీంతో ఆమె నన్ను మనిషిగా చూసేది కాదు. ఒకరోజు తాళిబొట్టు విసిరి నా మొహాన కొట్టింది. నన్ను చంపించాలని ట్రై చేసింది. అందుకోసం మనుషుల్ని కూడా పంపింది. అప్పుడు నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను.తల్లి సంతకం ఫోర్జరీ..నేను, దేవిక 32 ఏళ్లపాటు కోర్టుల చుట్టూ తిరిగాం. ఆ సమయంలో ఓ సంఘటన జరిగింది. దేవిక తల్లి చనిపోయేటప్పుడు వీలునామా రాయలేదు. అప్పుడు దేవిక తన తల్లి సంతకం ఫోర్జరీ చేసి ఆస్తి తనపై రాసుకుంది. అది నేను పసిగట్టాను. తనకు చెన్నైలో ఒక ఇల్లుతో పాటు 25 ఎకరాల భూమి ఉండేది. మాకు కూతురు కనక పుట్టింది కదా.. అది కూడా దేవికకు ఇష్టం లేదు. కానీ విడాకులయ్యే సమయానికి కోర్టు కూతుర్ని తల్లికే అప్పగిస్తుందిగా.. అలా దేవిక కనకను తీసుకెళ్లింది. దేవికలాగే కూతురూ తయారైందితన మనసును మార్చేసింది. నా కూతురి దృష్టిలో నన్ను చెడ్డవాడిగా చిత్రీకరించింది. తను నాపై వేసిన నిందలకు అందరూ నన్ను శత్రువుగా చూశారు. అందుకే దేవిక చనిపోయినప్పుడు కూడా తనను చూసేందుకు వెళ్లలేదు. తల్లిలాగే కూతురూ తయారైంది. ఇప్పుడు నేనుంటున్న ఇల్లు తనదేనని కనక నాపై కేసు పెట్టింది. తల్లిలాగే తనూ ఫోర్జరీ సంతకంతో ఈ ఇంటిని లాక్కోవాలని చూసింది. అది ఫోర్జరీ అని కోర్టులో తేలితే ఎనిమిదేళ్లు జైల్లో ఉండాల్సి వస్తుందని కాంప్రమైజ్కు వచ్చింది. నీ తండ్రెవరో తెలుసా?ఈ కేసు నడుస్తున్న సమయంలో నన్ను నానామాటలన్నప్పుడు.. బయట ఉన్న మగవాళ్లతో డీఎన్ఏ టెస్ట్ చేయించుకో.. అప్పుడు నీకు నిజమైన తండ్రెవరో తెలుస్తుందన్నాను. ఇకపోతే కనక మానసిక స్థితి కూడా సరిగా లేదు. ఇంటి ముందు అంతా అపరిశుభ్రంగా ఉండేది. ఇల్లు దాటి బయటకు రాకుండా లోపల తాళం వేసుకుని ఉండేది. ఓరోజు కనక చనిపోయినట్లు వార్త రావడంతో పోలీసులకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లాను. ఇంటికి వెళ్తే రానివ్వలేదుఅది తప్పుడు రిపోర్ట్ అని మీడియాకు చెప్పాక ఇంటి బయట మొత్తం క్లీన్ చేశాను. కానీ కనక.. నన్ను లోపలకు రానివ్వలేదు. తన మానసిక స్థితి అస్సలు బాగోలేదని అర్థమైంది. ఒకవేళ ఆమె ఆత్మహత్య చేసుకుంటే అందుకు నేను బాధ్యుడిని కాదని ముందుజాగ్రత్తగా కోర్టుకు చెప్పాను. తనతో నాకు సత్సంబంధాలు లేవు. జీవితంలో ఏదైనా పెద్ద తప్పు చేశానా? అంటే అది దేవికను పెళ్లి చేసుకోవడమే! నా మరణానంతరం దాదాపు రూ.100 కోట్ల ఆస్తి అంతా ట్రస్టుకు చెందాలని వీలునామా రాశాను అని దేవదాసు చెప్పుకొచ్చాడు.చదవండి: పీరియడ్స్ అన్నా పట్టించుకోరు... అతనొక్కడే...: నిత్యామీనన్ -
Pragya Jaiswal: డాకు మహారాజ్ మూవీ హీరోయిన్ అదిరిపోయే స్టిల్స్ (ఫోటోలు)
-
మన్మథుడు హీరోయిన్పై డైరెక్టర్ అసభ్యకర వ్యాఖ్యలు
సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మజాకా (Majaka Movie). రీతూ వర్మ, అన్షు హీరోయిన్లుగా నటించారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందించగా త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. ఆదివారం (జనవరి 12న) ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు త్రినాధరావు హీరోయిన్ అన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.హీరోయిన్ ఓ రేంజ్లో..ముందుగా త్రినాధ రావు (Trinadha Rao) మాట్లాడుతూ.. నా చిన్నప్పుడు మన్మథుడు సినిమా చూసి.. హీరోయిన్ (అన్షు) ఏంటి.. లడ్డూలా ఉందనుకునేవాళ్లం. హీరోయిన్ను చూసేందుకే సినిమాకు వెళ్లిపోయేవాళ్లం. ఆ మూవీలో ఓ రేంజ్లో ఉంటుంది. ఆ హీరోయిన్ మజాకాలో హీరోయిన్గా కళ్ల ముందుకు వచ్చేసరికి ఇది నిజమేనా? అని ఆశ్చర్యపోయాం. నేనే చెప్పా..అన్షు కొంచెం సన్నబడింది. నేనే తనను లావు పెరగమని చెప్పా.. అంటూ ఇంకా ఏదేదో మాట్లాడాడు. అతడి మాటలకు హీరోయిన్ అసౌకర్యానికి లోనయినట్లు తెలుస్తోంది. హీరోయిన్ శరీరం గురించి డైరెక్టర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి.కావాలనే..ఇక ఇదే ఈవెంట్లో సెకండ్ హీరోయిన్ పేరు.. అంటూ కావాలనే రీతూ వర్మ పేరు మరిచిపోయినట్లు నాటకం ఆడాడు. కాస్త వాటర్ ఇవ్వమని కొంత గ్యాప్ తీసుకుని గుర్తొచ్చింది రీతూవర్మ అని ఆమె పేరు చెప్పాడు. ఇదంతా చూసిన జనాలు.. డైరెక్టర్ ఓవరాక్షన్ ఎక్కువైందని కామెంట్లు చేస్తున్నారు. ఇక మజాకా మూవీ విషయానికి వస్తే.. ఇది ఫిబ్రవరి 21న విడుదల కానుంది. చదవండి: పెళ్లికి ముందే ప్రియుడితో పూజ.. అబ్బాయి పేరెంట్స్ అయినా ముందే చెప్పాలిగా -
చికెన్గున్యాతో బాధపడుతున్న సమంత.. ఒళ్లునొప్పులున్నా..!
కాస్త ఆరోగ్యం బాగోలేకపోతే చాలు చాలామంది ముసుగు తన్నిపడుకుంటారు. కానీ సమంత మాత్రం అనారోగ్యంతో బాధపడుతున్నా సరే ఫిట్నెస్పై ఫోకస్ పక్కన పెట్టలేదు. చికెన్ గున్యాతో సతమతమవుతున్న ఆమె ఒళ్లు నొప్పులున్నా సరే జిమ్లో చెమటలు చిందిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. చికెన్గున్యా నుంచి కోలుకోవడం భలే సరదాగా ఉంది అంటూ జిమ్లో వర్కవుట్స్ చేస్తోంది.చికెన్ గున్యాతో బాధపడుతున్న సామ్శరీరం సహకరించకపోయినా తను పట్టుదలతో వ్యాయామం చేస్తుండటం చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. సామ్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సమంత (Samantha) చివరగా సిటాడెల్: హనీ బన్నీ అనే వెబ్ సిరీస్లో కనిపించింది. ఈ సిరీస్ షూటింగ్లో ఓ రోజు సామ్ ఉన్నట్లుండి స్పృహ తప్పి పడిపోయింది. దీని గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను సడన్గా స్పృహ తప్పి కింద పడిపోయాను. ఆస్పత్రికి తీసుకెళ్లలేదుకళ్లు తెరిచేసరికి నాకు ఎవరి పేర్లూ గుర్తు రావడం లేదు. కొద్ది క్షణాలపాటు బ్లాంక్ అయిపోయాను. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటే నన్ను ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు అనిపిస్తోంది. ఏ ఒక్కరూ హాస్పిటల్కు వెళ్దామనలేదు అని చెప్పుకొచ్చింది. కాగా సమంత కొన్నేళ్లుగా మయోసైటిస్తో బాధపడుతోంది. తను ఈ వ్యాధి బారిన పడిన విషయాన్ని 2022లో వెల్లడించింది. అది కూడా నిర్మాతల బలవంతం వల్లే చెప్పింది. (చదవండి: అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టులో ఊరట)బలవంతం వల్లే..2022లో శాకుంతలం సినిమా రిలీజైంది. ఆ సమయంలో సమంత ఆరోగ్యం అస్సలు బాగోలేదు. మయోసైటిస్ తనను శారీరకంగా కుంగదీసింది. మరోవైపు సినిమా ప్రమోషన్స్ చేయాలి. నీకున్న బాధ బయటపెడితే తప్పేంటని నిర్మాతలు ఒత్తిడి తేవడంతో సామ్ మయోసైటిస్తో సతమతమవుతున్న విషయాన్ని బయటకు చెప్పింది. వారి ఒత్తిడి వల్లే నాకు మయోసైటిస్ ఉందని అందరికీ చెప్పానని, లేదంటే నిశ్శబ్ధంగానే ఆ వ్యాధితో పోరాటం చేసేదాన్ని అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.సినిమాఏ మాయ చేసావె సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది సమంత. దూకుడు, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలతో సెన్సేషన్ హీరోయిన్గా మారింది. బృందావనం, ఎటో వెళ్లిపోయింది మనసు, జబర్దస్త్, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, మనం, అల్లుడు శీను, రభస, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ, జనతా గ్యారేజ్, బ్రహ్మోత్సవం, రంగస్థలం, ఓ బేబీ, మజిలి, యశో, శాకుంతలం, ఖుషి.. ఇలా ఎన్నో చిత్రాలతో మెప్పించింది. పుష్ప:ద రైజ్ మూవీలో ఊ అంటావా మామా.. ఉఊ అంటావా మామా అనే ఐటం సాంగ్తో పాన్ ఇండియాను ఊపేసింది.సిటాడెల్ సిరీస్ఓటీటీలో ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో అలరించిన ఆమె చివరగా సిటాడెల్: హనీ బన్నీ సిరీస్లో యాక్షన్ అవతార్లో కనిపించింది. సిటాడెల్ సిరీస్ విషయానికి వస్తే.. ఇందులో సమంత ఏజెంట్గా నటించింది. సీతా ఆర్ మీనన్ కథ అందించగా రాజ్ అండ్ డీకే (Raj Nidimoru and Krishna DK) డైరెక్ట్ చేశారు. గతేడాది నవంబర్ 7న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో వరుణ్ ధావన్, కేకే మీనన్, సాఖిబ్ సలీమ్, సికిందర్ ఖేర్ ప్రముఖ పాత్రలు పోషించారు. "Recovering from Chikungunya is so fun 😌 😌 😌 The joint pains and ALL"~Queen @Samanthaprabhu2 💛#SamanthaRuthPrabhu𓃵#Samantha #SamanthaRuthPrabhu#CitadelHoneyBunny #RaktBramhand#MaaIntiBangaram pic.twitter.com/m94S1yMV8R— Samcults (@Samcults) January 10, 2025 చదవండి: తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు -
సినిమాలు మానేయాలనుంది, గతేడాదే ఈ పని చేయాలనుకున్నా!
మసాలా సినిమాల్లో నటించేదే లేదన్న నిత్యామీనన్ (Nithya Menen) ఇకమీదట అసలు సినిమాలే చేయనంటోంది. మొన్నటివరకు మంచి పాత్ర అయితే చాలు చిన్న సినిమా అయినా అంగీకరిస్తాన్న ఆమె ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేశాక సినీ ఇండస్ట్రీని శాశ్వతంగా వదిలేస్తానంటోంది.అమ్మ వల్లే ఇదంతా..ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం కాదలిక్క నెరమిళ్లై (Kadhalikka Neramillai Movie) సంక్రాంతికి విడుదలవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా నిత్యామీనన్ ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాడటం, డ్యాన్స్ చేయడం, యాక్ట్ చేయడం.. ఇవన్నీ కూడా మా అమ్మే చిన్నప్పటి నుంచి నాతో చేయించింది. నిజం చెప్పాలంటే నాకు సినిమా అంటే ఇష్టం లేదు. అయినా ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే ఉన్నాను.సినిమా నన్ను వదిలేలా లేదు!సినిమాలు మానేయాలని ఆలోచించిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. ఈసారి గప్చుప్గా పక్కకు వెళ్లిపోదామని ఆలోచిస్తున్నప్పుడే తిరుచిత్రంపళం మూవీకి జాతీయ అవార్డు వచ్చింది. అప్పుడు నాకో విషయం అర్థమైంది. నేను సినిమాలు మానేసినా.. సినిమా నన్ను వదిలేలా లేదు అని! ఇప్పటికిప్పుడు నాకు వేరే ఇండస్ట్రీలో ఏదైనా అవకాశం వస్తే కచ్చితంగా దాంట్లోకి వెళ్లిపోతాను.(చదవండి: తెలంగాణలో 'గేమ్ ఛేంజర్' టికెట్ల పెంపుపై విమర్శలు )అలాంటి జీవితం కావాలినాకు సాధారణ జీవితం గడపాలని ఉంది. నటిగా ఉన్నప్పుడు బయట స్వేచ్ఛగా జీవించలేం. నాకు పార్క్కు వెళ్లి వాకింగ్ చేయాలనుంటుంది. కానీ అది సాధ్యపడదు. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. పైలట్ అవ్వాలని కోరిక.. ఇలా ఎన్నో ఉంటాయి అని చెప్పుకొచ్చింది. నిత్య సినిమాలు మానేయాలనుకోవడం కొత్తేమీ కాదు..ఉత్తమ నటిగా జాతీయ అవార్డుకాగా తిరు సినిమాకుగానూ నిత్యామీనన్కు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది. ఈ మూవీలో ధనుష్ హీరోగా నటించగా రాశీ ఖన్నా హీరోయిన్గా యాక్ట్ చేసింది. హీరో స్నేహితురాలిగా నిత్య ఆకట్టుకుంది. మిత్రన్ జవహర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇది 2022లో విడుదలైంది. నిత్య లేటెస్ట్ మూవీ కాదలిక్క నెరమిళ్లై విషయానికి వస్తే.. ఇందులో జయం రవి, వినయ్, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. రెడ్ జియాంట్ సినిమా నిర్మిస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.తెలుగులో..అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నిత్యా మీనన్. అలా మొదటి చిత్రంతోనే జనాలకు బాగా నచ్చేసింది. 180, ఇష్క్, జబర్దస్త్, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, ఒక అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, అ, నిన్నిలా నిన్నిలా, భీమ్లా నాయక్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో ఇడ్లీ కడాయ్, డియర్ ఎక్సెస్ సహా మరో సినిమా చేస్తోంది.చదవండి: తిరుపతి తొక్కిసలాట: హృదయాన్ని కలిచివేసిందన్న మోహన్బాబు -
డబ్బుందన్న గర్వంతో ఎంతకైనా తెగిస్తారా? ఎంతని భరించాలి?: హనీరోజ్
డబ్బుందన్న గర్వంతో ఎవరినైనా అవమానిస్తారా? దీనికి మన న్యాయవ్యవస్థలో ఆడవారికి ప్రత్యేక రక్షణ కల్పిస్తే బాగుండు అంటోంది హీరోయిన్ హనీ రోజ్ (Honey Rose). కొంతకాలంగా ఓ బిజినెస్మెన్ వేధిస్తున్నాడంటోంది బ్యూటీ. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. నా పేరు వాడితే చాలు ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందనుకుంటున్నాడో వ్యక్తి. ఎక్కడపడితే అక్కడ నన్ను మాటలతో వేధిస్తున్నాడు. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీ (Movie Industry)లో కొనసాగుతున్న నేను ఈ వేధింపుల్ని ఎందుకు సహించాలి? నన్నే టార్గెట్ చేస్తున్నాడునాతో పాటు చాలా మంది సెలబ్రిటీలు అతడి బిజినెస్కు సంబంధించిన ఈవెంట్లకు వెళ్తూ ఉండేవాళ్లం. కానీ అతడు తన ఇంటర్వ్యూలలో నన్నే టార్గెట్ చేస్తున్నాడు. ప్రతిసారీ నా పేరే వాడుకుంటున్నాడు. ఇలా ఒకరిగురించి ఇష్టారీతిన మాట్లాడమనేది సంస్కారమనిపించుకోదు. మొదట్లో అతడి మేనేజర్లు కలిసేవారు. తర్వాత ఇతడినీ కలిశాను. అప్పుడు ఎంతో మర్యాదగా మసులుకున్నాడు. కానీ ఓ పబ్లిక్ ఈవెంట్లో నన్ను డబుల్ మీనింగ్తో పిలిచాడు. (చదవండి: నా కాలేయం ఇచ్చి బతికించా.. చివరకు నా చేతుల్లోనే ప్రాణం..: ఏవీఎస్ కూతురు)చులకన వ్యాఖ్యలుఒకసారి అతడి షాప్కు వెళ్లినప్పుడు కూడా మీడియా ముందు నాపై చులకన వ్యాఖ్యలు చేశాడు. అవి నన్నెంతో అసౌకర్యానికి గురి చేశాయి. అప్పుడు నేను మౌనంగానే ఉన్నాను. కానీ ఇంటికి వెళ్లాక ప్రోగ్రామ్ నిర్వాహకులకు కాల్ చేసి నాపై చీప్ కామెంట్లు చేస్తే సహించేది లేదని చెప్పాను. అప్పటినుంచి తన ప్రోగ్రామ్స్కు వెళ్లడమే మానేశాను. మళ్లీ అవే దిగజారుడు వ్యాఖ్యలుఅయితే నేను హాజరైన ఓ ప్రోగ్రామ్కు అతడు గెస్టుగా వచ్చాడు. అతడు వస్తున్నాడన్న విషయం నాకు తెలియదు. అక్కడికి వెళ్లాక నాతో డైరెక్ట్గా మాట్లాడలేదు కానీ అందరిముందు మళ్లీ నాపై చవకబారు వ్యాఖ్యలు చేశాడు. తర్వాత మరోసారి తన బిజినెస్ ప్రమోషన్స్లో పాల్గొనమని ఆఫర్ ఇచ్చాడు. నేను కుదరదన్నాను. అతడి మేనేజర్.. ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నేను వారి ఆఫర్ను తిరస్కరించాను. (చదవండి: 'వాటితో ఎలాంటి ఉపయోగం లేదు'.. పూనమ్ ట్వీట్పై మా అసోసియేషన్)ఇలాగే వేధిస్తే ఊరుకునేది లేదునేను కాకపోతే మరో సెలబ్రిటీని వెతుక్కుంటానన్నాడు. అలాంటప్పుడు నేను తప్పుకున్నా పెద్ద నష్టం లేదంటూ రాసుకొచ్చింది. హనీతో నువ్వు హోటల్స్లో ఉంటున్నావా? అంటూ కొందరు అతడిని పిచ్చి ప్రశ్నలు వేసినప్పుడు తనిచ్చే సమాధానాలు కూడా చెండాలంగా ఉంటున్నాయి. మౌనంగా ఉంటున్నానంటే అన్నింటికీ తలాడిస్తున్నట్లు కాదు. ఇంకా ఇలాగే వేధిస్తే పోలీసులను ఆశ్రయిస్తాను అని రాసుకొచ్చింది.సినిమాకాగా వీరసింహారెడ్డి చిత్రంతో హనీరోజ్ పేరు టాలీవుడ్ (Tollywood)లో మార్మోగిపోయింది. ఈ మలయాళ భామ 2008లో ఆలయం సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. మలయాళంలోనే వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ చేతిలో ప్రస్తుతం రాచెల్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఇందులో హనీ ఊరమాస్ లుక్లో కనిపించనుంది. View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) చదవండి: ప్రభాస్ 'కల్కి' సినిమా.. అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్! -
సౌత్ సినిమాతో హీరోయిన్గా పరిచయం.. ఇప్పుడు దేశంలోనే టాప్!
ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి మొదట్లో బ్యాడ్మింటన్ ప్లేయర్. జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొంది. కానీ సడన్గా బ్యాడ్మింటన్ వదిలేసి మోడల్గా మారిపోయింది. వెంటనే సినీ అవకాశాలూ తలుపుతట్టాయి. అలా 2006లో వెండితెరపై రంగప్రవేశం చేసింది. ఇప్పుడు ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా చెలామణీ అవుతోంది. ఇంతకీ ఇప్పుడైనా ఆ పాపాయిని గుర్తుపట్టారా? తనే దీపికా పదుకొణె.అప్పట్లో బ్మాడ్మింటన్ ప్లేయర్1986 జనవరి 5న డెన్మార్క్లో భారత సంతతికి చెందిన ప్రకాశ్ పదుకొణె దంపతులకు దీపిక (Deepika Padukone) జన్మించింది. ప్రకాశ్ ఒకప్పుడు పేరు మోసిన బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆమె తాతయ్య రమేశ్ మైసూర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్కు సెక్రటరీగా సేవలందించాడు. దీపికకు ఏడాది వయసున్నప్పుడే ఫ్యామిలీ అంతా బెంగళూరులో సెటిలైంది. బ్యాడ్మింటన్ ఆటకే ఎక్కువ సమయం కేటాయించే దీపిక చిన్న వయసులోనే మోడల్గా పలు యాడ్స్ చేసింది. మోడలింగ్ నుంచి సినిమాల్లోకినెమ్మదిగా తనకు గుర్తింపు, అవకాశాలు పెరుగుతూ ఉండటంతో బ్యాడ్మింటన్ మానేసి మోడలింగ్పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. తర్వాత సినీ ఛాన్సులూ రావడం మొదలైంది. దీంతో ఆమె ముంబైకి షిఫ్ట్ అయింది. 2006లో ఐశ్వర్య అనే కన్నడ చిత్రంతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది. ఇది తెలుగులో వచ్చిన మన్మథుడు మూవీకి రీమేక్! ఆ మరుసటి ఏడాది ఓం శాంతి ఓం చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఇది బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్టయింది. ఉత్తమ నటిగా మొదటి ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది.(చదవండి: క్లీంకారను అప్పుడే అందరికీ చూపిస్తా!: రామ్చరణ్)గతేడాది తల్లిగా ప్రమోషన్ఓం శాంతి ఓం చిత్రంతో దీపికా దశ తిరిగిపోయింది. బచ్నా ఏ హసీనో, లవ్ ఆజ్ కల్, హౌస్ఫుల్, కాక్టైల్, రేస్ 2, యే జవానీ హై దీవాని, చెన్నై ఎక్స్ప్రెస్, రామ్ లీలా, హ్యాపీ న్యూ ఇయర్, పీకు, బాజీరావు మస్తానీ, పద్మావత్, పఠాన్ ఇలా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. కల్కి 2898 ఏడీ మూవీతో తెలుగువారికీ పరిచయమైంది. ఈ బ్యూటీ ఒక్క సినిమాకు రూ.20 కోట్ల మేర పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ను 2018లో పెళ్లి చేసుకున్న ఈమె గతేడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.అది కూడా ముఖ్యమేనంటూ..మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే అంటూ ద లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ను స్థాపించింది. దీని ద్వారా భారత్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఫౌండేషన్ అందించిన సేవలకుగానూ వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ 2018లో క్రిస్టల్ అవార్డు ప్రకటించింది. 82°E అనే బ్యూటీ బ్రాండ్ కూడా స్థాపించింది.చదవండి: సంక్రాంతి రేసులో మూడు సినిమాలు.. ఏపీలో టికెట్ ధరలు పెంపు -
చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ.. హీరోయిన్గా దూసుకెళ్తున్న అతిరా (ఫోటోలు)
-
ఎవరూ అవకాశాలివ్వలేదు.. అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యా!
సినిమాలు ఎందుకు చేయడం లేదు? లైమ్ లైట్కు దూరంగా ఉన్న చాలామంది హీరోయిన్లను ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారు. మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నామని పలువురూ బదులిస్తుంటారు. తన విషయంలో మాత్రం అది నిజం కాదని, తనకెవరూ ఆఫర్స్ ఇవ్వకపోవడం వల్లే సినిమాలకు దూరమవ్వాల్సి వచ్చిందంటోంది హీరోయిన్ అర్చన కవి (Archana Kavi). తమిళ, మలయాళ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన ఈమె తెలుగు(Tollywood)లో హీరోయిన్గా బ్యాక్బెంచ్ అని ఒకే ఒక్క మూవీ చేసింది. తొమ్మిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న ఈమె ఐడెంటిటీ అనే మలయాళ చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది.బ్రేక్ ఇవ్వలేదు.. వచ్చింది!ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో అర్చన ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'నా అంతట నేనుగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకోలేదు. ఎవరూ నాకు అవకాశాలివ్వలేదు, అందుకే తొమ్మిదేళ్లలో ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. 2013లో నాకు పెళ్లయింది. తర్వాత విడాకులవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నెమ్మదిగా దాన్నుంచి కోలుకున్నాక ఈ సినిమా ఆఫర్ రావడంతో చేసేశాను' అని అర్చన చెప్పుకొచ్చింది.చదవండి: దిల్రూబా టీజర్: ప్రేమ గొప్పది.. కానీ అదిచ్చే బాధే భయంకరంగా ఉంటుంది! -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ లాంటి ప్రముఖులంతా కనిపించనున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు క్యారెక్టర్లను రివీల్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు.మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె నెమలి అనే రాకుమార్తెగా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ప్రీతి ముకుందన్ తన గ్లామర్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా.. అంతకుముందు ప్రీతి టాలీవుడ్ చిత్రం ఓం భీమ్ బుష్లో నటించింది. ఈ మూవీలో జలజ అనే పాత్రలో మెరిసింది.(ఇది చదవండి: 'కన్నప్ప' టీజర్... మూడు కోట్ల మంది చూశారు!) పాన్ ఇండియా ప్రాజెక్ట్గా తెరకెక్కుతోన్న కన్నప్ప చిత్రాన్ని అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన'కన్నప్ప' టీజర్ ప్రేక్షకులకు ఆకట్టుకుంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాకుండా యూట్యూబ్లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ సినిమాతో మంచు విష్ణు తనయుడు అవ్రామ్ అరంగేట్రం చేస్తున్నాడు. ఆయన కుమార్తెలు కూడా కన్నప్పలో నటిస్తున్నారు. ఇటీవల వారిద్దరి పోస్టర్లను కూడా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.✨ Behold the mesmerizing look of Preity Mukhundhan as Princess 𝐍𝐞𝐦𝐚𝐥𝐢 in #Kannappa 🏹✨ Sharing the screen with @iVishnuManchu, she adds grace and charm to this divine tale. 🌺Experience the magic and splendor of divinity! 🙏 #HarHarMahadevॐ@themohanbabu @Mohanlal… pic.twitter.com/UVgiPVwL4K— Kannappa The Movie (@kannappamovie) December 30, 2024 -
సీరియల్ నటి సంగీత కళ్యాణ్కుమార్ (ఫొటోలు)
-
కళ్లతోనే కవ్విస్తోన్న హీరోయిన్ అనుపమ.. ఫోటోలు
-
ఐకానిక్ లెహంగాలలో నేషనల్ క్రష్ స్టన్నింగ్ లుక్స్..!
-
25 ఏళ్ల తర్వాత ఇండియాకు.. అందుకోసమే వచ్చానన్న హీరోయిన్
సెన్సేషనల్ హీరోయిన్ మమత కులకర్ణి రెండున్నర దశాబ్దాల తర్వాత సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వనుందన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఆమె ముంబైకి తిరిగి రావడంతో ఈ పుకారుకు బీజం పడింది. ఇన్నేళ్ల తర్వాత తన మాతృభూమిపై అడుగుపెట్టినందుకు మమత భావోద్వేగానికి లోనైంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది.అందుకోసమైతే రాలేదు25 ఏళ్ల తర్వాత నా దేశంలోకి తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉంది. నా భావోద్వేగాలను వర్ణించలేకున్నాను అని చెప్పుకొచ్చింది. అలాగే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా చేతిలో 40 సినిమాలు, మూడు ఫ్లాట్స్, నాలుగు కార్లు, 50 ఈవెంట్స్ ఉన్న సమయంలో అన్నింటినీ వదిలేశాను. ఇప్పుడు నేను బాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వడానికో, బిగ్బాస్లో పాల్గొనేందుకో రాలేదు. ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించేందుకే వచ్చాను అని పేర్కొంది.డ్రగ్స్ కేసులో క్లీన్చిట్కాగా మమత కులకర్ణి గతంలో రూ.200 కోట్ల డ్రగ్స్ రాకెట్ కేసులో ఇరుక్కుంది. మమత ఏ తప్పూ చేయలేదంటూ బాంబే హైకోర్టు గత ఆగస్టులో క్లీన్ చిట్ ఇచ్చింది. 2016లో తనపై నమోదైన డ్రగ్స్ స్మగ్లింగ్ కేసును కొట్టివేసింది. వక్త్ హమారా హై, క్రాంతివీర్, సబ్సే బడా ఖిలాడి, బాజీ, కరణ్ అర్జున్, దిల్బర్, కిస్మత్, నజీబ్ వంటి చిత్రాలతో బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ప్రేమశిఖరం, దొంగ పోలీస్ చిత్రాల్లో కథానాయికగా నటించింది. View this post on Instagram A post shared by Mamta Kulkarni 🔵 (@mamtakulkarniofficial____) చదవండి: సుష్మిత కుటుంబానికి నేనున్నా.. ఏ అవసరం వచ్చినా.: నటుడు -
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ చిత్ర శుక్ల.. ఈమె ఎవరంటే? (ఫోటోలు)
-
వీడియో లీక్పై స్పందించిన హీరోయిన్.. జీవితం నాశనం చేస్తారా?
హీరోయిన్ ప్రగ్య నగ్ర ప్రైవేట్ వీడియో లీకైందంటూ నిన్నటినుంచి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ప్రియుడితో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియో ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. ఇది చూసిన హీరోయిన్ ప్రగ్య నగ్ర షాక్కు గురైంది. టెక్నాలజీని వాడుకుని తనను దారుణంగా చిత్రీకరించారని వాపోయింది. ఈమేరకు ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.పీడకల అయితే బాగుండుఇప్పటికీ నమ్మలేకున్నాను. ఇదంతా ఒక పీడకల అయితే బాగుండనిపిస్తోంది. టెక్నాలజీ మనకు సాయపడాలే కానీ మన జీవితాల్ని నాశనం చేయకూడదు. దరిద్రపుగొట్టు ఆలోచనలు ఉన్న దుర్మార్గులు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో చెత్త వీడియో సృష్టించారు. దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.ఎవరికీ ఇలా జరగడకూదుధైర్యంగా నిలబడటానికి ప్రయత్నిస్తున్నాను. ఈ సమయంలో నాకు అండగా ఉన్నవారికి చాలా థాంక్స్. ఏ అమ్మాయికీ ఇలాంటి దారుణ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి అని రాసుకొచ్చింది. దుండగులపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ పోలీసులను ట్యాగ్ చేసింది. ఇది చూసిన అభిమానులు నీ ధైర్యాన్ని కోల్పోవద్దంటూ కామెంట్లు చేస్తున్నారు.సినిమావరళరు ముఖ్యం అనే తమిళ సినిమాతో 2022లో వెండితెరపై కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాతి ఏడాది తమిళంలో ఎన్4, మలయాళంలో నదికళిల్ సుందరి యమున సినిమాలు చేసింది. ఈ ఏడాది లగ్గంతో తెలుగువారిని పలకరించింది.చదవండి: విజయ్ దేవరకొండ పెళ్లి టాపిక్.. తండ్రి ఏమన్నారంటే? -
టాలీవుడ్ హీరోయిన్ వీడియో!
హీరోయిన్ ప్రగ్య నగ్ర(#pragyanagra) పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమెకు చెందినదిగా పేర్కొంటున్న ప్రైవేట్ వీడియో ఒకటి ఆన్లైన్లో లీకైంది. అందులో ఆమె ప్రియుడితో ఏకాంతంగా ఉంది. ప్రగ్య పేరు చెడగొట్టేందుకు ఎవరో దుండగులు డీప్ ఫేక్ సాయంతో ఈ వీడియో సృష్టించారని అభిమానులు అంటున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.కాగా ప్రగ్య నగ్ర.. వరలరు ముఖ్యం అనే తమిళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. నదికలిళ్ సుందరి యమున అనే మలయాళ మూవీలోనూ నటించింది. లగ్గం సినిమాతో ఇటీవలే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.చదవండి: గౌతమ్ను ఈడ్చుకెళ్లిన నిఖిల్.. కావాలని కొడతావంటూ కామెంట్స్ -
నీలాంటి భర్త దొరకడం చాలా అదృష్టం.. తెగ సంబరపడిపోతున్న హీరోయిన్!
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న మలయాళ బ్యూటీ. గతేడాది నవంబర్లో తన ప్రియుడు జగత్ దేశాయ్ను పెళ్లాడింది. ఆ తర్వాత ఈ జంటకు ఓ కుమారుడు కూడా జన్మించాడు. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది అమలాపాల్.అయితే తాజాగా తన భర్తతో కలిసి మొదటి వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఏకంగా నది మధ్యలో తన భర్తతో కలిసి వేడుక జరుపుకుంది. ఇది నా జీవితంలో మరిచిపోలేని ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుందని తెలిపింది. నన్ను ఎంతో ప్రేమ, ఆత్మీయతలతో చూసుకునే భర్త దొరకడం నా అదృష్టమని ఇన్స్టాలో వీడియోను పోస్ట్ చేసింది. మీరు నాకు ప్రపోజ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు మీరు చూపిస్తున్న ప్రేమలో నిజాయితీ కనిపిస్తోందన్నారు. నువ్వు ఇచ్చే సర్ప్రైజ్లు జీవితాంతం గుర్తుంటాయని పోస్ట్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట తెగ వైరలవుతోంది.(ఇది చదవండి: కొడుకు ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్ అమలాపాల్)కాగా.. తమిళ సినిమాలతో హీరోయిన్గా పరిచయమైన అమలాపాల్.. టాలీవుడ్లో అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాల్లో అమలాపాల్ హీరోయిన్గా చేసింది. కానీ ఆ తర్వాత పూర్తిగా తమిళ, మలయాళ చిత్రాలకే పరిమితమైపోయింది. ఈ ఏడాది ఆడు జీవితం, లెవెల్ క్రాస్ చిత్రాలతో మెప్పించింది. మొదట తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ల బంధం నిలబడలేదు. మూడేళ్లకే విడిపోయారు. అలా 2017 నుంచి ఒంటరిగానే ఉంది. గతేడాది మాత్రం జగత్ దేశాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు జూన్లో కొడుకు పుట్టాడు. అతడికి ఇళయ్ అని పేరు పెట్టింది. గతంలో ఓనం సందర్భంగా కొడుకు ఫేస్ రివీల్ చేసింది అమలాపాల్. నదిలో పడవలో కొడుకు-భర్తతో కలిసి క్యూట్ పోజులిచ్చింది. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
ఎన్టీఆర్ హీరోయిన్ను పరిచయం చేసిన వై.వి.ఎస్.చౌదరి (ఫోటోలు)
-
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
బాలీవుడ్ నటి సోనాలి సెగల్ గుడ్న్యూస్ చెప్పింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోనాలి టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. సోనాలి సెగల్- అశేష్ సజ్నాని దంపతులకు కూతురు పుట్టింది. ఇది వారికెంతో సంతోషకరమైన సమయం. నవంబర్ 27న సాయంత్రం సోనాలి బిడ్డకు జన్మనిచ్చింది అని రాసుకొచ్చారు.బీర్ బాటిల్స్కు బదులు పాల సీసాలుకాగా సోనాలి ఈ ఏడాది ఆగస్టు 16న తన ప్రెగ్నెన్సీని బయటపెట్టింది. బీర్ బాటిల్స్ పట్టుకునే చేతిలో ఇకపై పాలడబ్బాలు పట్టుకునే సమయం ఆసన్నమైంది. అశేష్ జీవితంలో మార్పు మొదలుకానుంది. నా విషయానికి వస్తే ఇప్పటివరకు నా ఒక్కదానికోసమే తిన్నాను, ఇప్పుడేమో ఇద్దరికోసం తింటున్నాను. గతేడాది పెళ్లిమా కుక్కపిల్ల కూడా రాబోయే బేబీతో ఎలా ఆడుకోవాలా? అని ఆలోచిస్తోంది. డిసెంబర్లో డెలివరీ డేట్ ఉంది అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది. కాగా హీరోయిన్ సోనాలి, రెస్టారెంట్ యజమాని అశేష్ ఐదేళ్లపాటు డేటింగ్ చేశారు. గతేడాది జూన్లో సిక్కు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.సినిమాసినిమాల విషయానికి వస్తే సోనాలి సెగల్.. ప్యార్ కా పంచనామా సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. వెడ్డింగ్ పులావ్, ప్యార్ కా పంచనామా 2, హైజాక్, జై మమ్మీదీ, జో తేరా హై వో మేరా హై చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో బ్లాక్ కరెన్సీ, నూరని చెహ్రా, బూండి రైతా సినిమాలున్నాయి. View this post on Instagram A post shared by One Communication (@one__communication) -
హీరోయిన్లతో ఎఫైర్స్.. నాకు ముందే తెలుసు: హీరో భార్య
తొలిచూపులోనే ప్రేమ.. పరిచయమైన పదిహేను రోజుల్లోనే పెళ్లి.. ఇవన్నీ సినిమాలోనే ఉంటాయనుకునేరు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జరీనా వాహబ్ జీవితంలోనూ ఇదే జరిగింది. మతాలు వేరైనా మనసులు కలవడంతో జరీనా, హీరో ఆదిత్య పంచోలి పెళ్లి చేసుకున్నారు. మూడున్నర దశాబ్దాలుగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారు.36 ఏళ్ల దాంపత్యం తాజాగా ఓ ఇంటర్వ్యూలో జరీనా తన వైవాహిక జీవితం గురించి మాట్లాడింది. ఓ సినిమా చేస్తున్న సమయంలో నిర్మల్ (ఆదిత్య పంచోలి అసలు పేరు)ను కలిశాను. అతడు నాకంటే చిన్నవాడు. మీరు నమ్ముతారో, లేదో గానీ మేము కలుసుకున్న 15-20 రోజుల్లోనే పెళ్లి చేసుకున్నాం. ఐదు నెలలకంటే ఎక్కువ కలిసుండలేరని విమర్శించారు. ఇప్పుడేమైంది? 36 ఏళ్లుగా కలిసే ఉంటున్నాం. మా ఆయన ఉత్తమ భర్తఅయితే అతడు ఎవరితోనైనా ఎఫైర్స్ పెట్టుకునే ఛాన్స్ ఉందని నేను ముందుగానే ఊహించాను. ఇంటికి వచ్చాక నాతో ఎలా ఉంటున్నాడనేది మాత్రమే పట్టించుకున్నానే తప్ప తన ఎఫైర్స్ గురించి ప్రశ్నించేదాన్ని కాదు. అతడి మాజీ గర్ల్ఫ్రెండ్స్ అన్నట్లుగా అతడేమీ కిరాతకుడైతే కాదు. ఎన్నడూ నాపై చేయెత్తలేదు. బహుశా వాళ్లు కోరుకుంది దక్కలేదని అతడిపై నిందలు వేశారంతే! ఆదిత్య ఉత్తమ భర్త మాత్రమే కాదు గొప్ప తండ్రి కూడా! అని చెప్పుకొచ్చింది.ఆదిత్యపై హీరోయిన్ల ఫిర్యాదుకాగా ఆదిత్య పంచోలి కంటే జరీనా వయసులో ఆరేళ్లు పెద్దది కావడం గమనార్హం. వీళ్ల వివాహం 1986లో జరిగింది. తర్వాత ఇతడు హీరోయిన్లతో ఎఫైర్స్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. 1993లో పూజా బేడీ.. ఆదిత్య తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2004లో కంగనా రనౌత్.. ఆదిత్య తనను చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపించింది. అత్యాచారం చేశాడంటూ 2019లో పోలీస్ కేస్ కూడా పెట్టింది.చదవండి: బొక్కబోర్లా పడ్డ నబీల్.. తన సత్తా చూపించిన అవినాష్ -
అల్లు అర్జున్, ఎన్టీఆర్ హీరోయిన్.. ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)
-
హీటెక్కిస్తున్న కీర్తి సురేష్ (ఫోటోలు)
-
స్టార్ జంటకు ఘోర అవమానం.. 30 నిమిషాలైనా ఎవరూ కూడా!
సినీతారలు రోడ్డు మీద కనపడితే చాలు సెల్ఫీల కోసం ఎగబడతారు. అంతేకాదు పోటీపడి మరీ వారితో ఫోటోలు దిగేందుకు వెనుకాడరు. సినీతారలకు ఉన్న క్రేజ్ అలాంటిది. బయట ఎక్కడైనా సినీ సెలబ్రిటీలు కనిపిస్తే ఇంకేముంది ఎంచక్కా వారితో సెల్ఫీ కోసం ఎగబడతాం. కానీ అందుకు భిన్నంగా ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటో మీరు చూసేయండి.దక్షిణాది స్టార్ జంటగా గుర్తింపు ఉన్న సెలబ్రిటీ కపుల్ నయనతార- విఘ్నేశ్ శివన్. ఇటీవల నయన్ తన భర్తతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఓ హోటల్కు వెళ్లిన నయన్- విఘ్నేశ్ దాదాపు 30 నిమిషాల పాటు లైన్లోనే వెయిట్ చేసిన తర్వాత టేబుల్ దక్కించుకున్నారు. అయితే ఆ సమయంలో వీరిని అక్కడా ఎవరూ కూడా గుర్తు పట్టలేదు. అంతేకాదు వీళ్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. అదే మనమైతే పక్కన పెట్టి ఫోటోల కోసం పోటీ పడేవాళ్లేమో. దీనికి సంబంధించిన వీడియోను విఘ్నేశ్ శివన్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు.విఘ్నేశ్ శివన్ తన ఇన్స్టాలో రాస్తూ..'17 నవంబర్.. చాలా ఏళ్ల తర్వాత సింపుల్గా పుట్టినరోజు వేడుక జరుపుకున్నాం. ఇలా డిన్నర్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. దాదాపు 30 నిమిషాలు లైన్లో ఉన్నాం. చివరికీ ఒక మంచి టేబుల్ దొరికింది. ఈ వీడియో తీసిన వ్యక్తికి నా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతకుముందు విఘ్నేష్, నయనతార తమ కుమారులతో కలిసి ఢిల్లీలోని కుతాబ్ మినార్ను సందర్శించారు. ఆ జంట రాజధానిలోని ఓ ఫేమస్ హోటల్కి వెళ్లారు. అక్కడ కూడా వారిని ఎవరూ గుర్తించలేదు.నయనతార ఇటీవల తన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ తర్వాత వివాదంలో చిక్కుకున్నారు. ధనుశ్ హీరోగా నటించిన నానుమ్ రౌడీ ధాన్ సెట్స్ ఓ క్లిప్ను ఉపయోగించినందుకు ఆమెకు రూ. 10 కోట్ల లీగల్ నోటీసు పంపారు. ఆ తర్వాత దీనిపై నయనతార ఓ బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
చీరకట్టులో కొత్త హీరోయిన్ షాజ్ఞ శ్రీ వేణున్ మెరుపులు (ఫొటోలు)
-
తెలుగు హీరోతో పెళ్లి.. రెండేళ్లకే విడాకులు.. ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
పల్లెటూరి అల్లరి పిల్ల కేతిక.. లుక్కే మార్చేసిందిగా! (ఫొటోలు)
-
ఒక్కరు కాదు ఇద్దరు.. పుష్ప రాజ్ తగ్గేదేలే
-
హీరోయిన్లా మెరిసిపోతున్న టాప్ సింగర్.. ఎవరో గుర్తుపట్టారా..? (ఫోటోలు)
-
షాపులో నగలన్నీ చిరంజీవి హీరోయిన్ ఒంటిపైనే! (ఫొటోలు)
-
సాగర తీరాన మన్మధుడు హీరోయిన్.. రీ ఎంట్రీ ఇవ్వనుందా?
-
హీరోయిన్గా టాలీవుడ్ స్టార్ నటి కూతురు.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
రచ్చ సినిమాలో కనిపించిన ఈ చిన్నది ఇప్పుడెలా ఉందో తెలుసా..? (ఫోటోలు)
-
జగేశ్వర్ ధామ్లో మృణాల్ ఠాకుర్ పూజలు (ఫొటోలు)
-
దుబాయ్లో చిల్ అవుతున్న బర్త్డే గాళ్ (ఫొటోలు)
-
దసరా, దీపావళి సంబరాల్లో సమీరా రెడ్డి.. ఫ్యామిలీ ఫోటోలు చూశారా..?
-
హైదరాబాద్: నల్లగండ్లలో సందడి చేసిన సినీనటి వైష్ణవి చైతన్య (ఫొటోలు)
-
నాని రేంజే వేరు.. రూ.1200 కోట్ల హిట్ ఇచ్చిన హీరోయిన్తో జోడీ (ఫోటోలు)
-
కొడుకుని ముద్దాడుతున్న హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)
-
రాంగోపాల్ వర్మ కోసం భారీ ఆఫర్లను వదులుకున్న హీరోయిన్ (ఫోటోలు)
-
చీరకట్టులో హీరోయిన్ ప్రణీత.. ఇంత అందంగా ఉందేంటి!
-
పూజా కన్నన్ పెళ్లిలో సాయిపల్లవి ఎమోషనల్ మూమెంట్స్ (ఫోటోలు)
-
Pooja Kannan: చెల్లి మెహందీ ఫంక్షన్.. దగ్గరుండి రెడీ చేసిన సాయిపల్లవి (ఫోటోలు)
-
పూజా కన్నన్ హల్దీ ఫంక్షన్.. అందరి కళ్లు సాయిపల్లవిపైనే! (ఫోటోలు)
-
మాయలేడిని అడ్డుపెట్టుకుని బాబు సర్కార్ బెదిరింపులు!
సాక్షి, అమరావతి : బాలీవుడ్ హీరోయిన్గా చెప్పుకునే కాదంబరి జత్వానీ అత్యంత వివాదాస్పదురాలు. బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరో క్రాట్లు తదితరులను లక్ష్యంగా చేసుకుని ‘వలపు వల (హనీ ట్రాప్)’ వేసి...అనంతరం బ్లాక్ మెయిలింగ్ చేస్తూ భారీగా డబ్బులు గుంజడంలో ఆమె సిద్ధహస్తురాలు. అందుకోసం సంతకాలు ఫోర్జరీ చేయడం, బోగస్ పత్రాలను సృష్టించడం వంటి నేరాలకు పాల్పడుతూ మరీ భారీగా ఆస్తులను కొల్లగొట్టడం ఆమె చరిత్ర. ఈ విషయాలన్నీ పలు ఆధారాలతో సహా నిర్ధారణ అయ్యాయి. అయితే ఈ మాయలేడి బ్లాక్ మెయిలింగ్ దందాను ఆసరాగా తీసుకుని ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం దుష్ట రాజకీయాలకు తెరతీసింది. బాధితులకు బాసటగా నిలవాల్సింది పోయి.. బాధితులనే బెదిరింపులకు గురిచేస్తూ దొరికినకాడికి దండుకోవాలని వ్యూహం పన్నింది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు.. ఇన్నాళ్లూ ప్రత్యర్థి పార్టీ వరకే పరిమితం చేసిన వేధింపులను తాజాగా పారిశ్రామికవేత్తలకూ వర్తింపజేశారు. ఈ పరంపరలో బడా పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ను తాజాగా ఈ కేసులోకి లాగుతున్నారు. ఇందుకు ఎల్లో మీడియా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఊతమిస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో యునైటెడ్ బెవరేజస్ పరిశ్రమను.. వైఎస్సార్ జిల్లాలో జువారి, దాలి్మయా సిమెంటు పరిశ్రమల యాజమాన్యాన్ని సర్కారు పెద్దలు ముడుపుల కోసం బెదిరింపులకు పాల్పడ్డారు. జాతీయ రహదారి పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలను ముడుపుల కోసం వేధిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరు వల్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. అయినా సరే టీడీపీ పెద్దలు బరితెగించి మరీ బాడా పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు. మరోవైపు ఎన్నికల హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిన తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించాలన్నది కూడా చంద్రబాబు ప్రభుత్వ పన్నాగంగా ఉంది. దండుకునే దందా.. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా వలపు వల (హానీ ట్రాప్) పేరుతో బ్లాక్ మెయిలింగ్ దందా అది పెద్ద సమస్యగా మారింది. బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, రక్షణ రంగంలోని ఉన్నతాధికారులు, బ్యూరోక్రాట్లను లక్ష్యంగా చేసుకుని వలపు వల విసిరి.. అనంతరం వారీ నుంచి భారీగా డబ్బులు, ఆస్తులు కొల్లగొట్టడం ఓ మాఫియాస్థాయికి చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అటువంటి ఓ హనీట్రాప్ కేసును వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ పోలీసులు అత్యంత సమర్థంగా సత్వరం పరిష్కరించి శభాష్ అనిపించారు. పూర్తి ఆధారాలతో కేసు నమోదు చేసి.. న్యాయస్థానం అనుమతితో నిందితురాలిని ముంబయి నుంచి తీసుకువచి్చ... విజయవాడ న్యాయస్థానం రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. అంతా చట్ట ప్రకారం వ్యవహరించారని అందరూ ప్రశంసించారు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం ఆ వ్యవహారంలో బ్లాక్ మెయిలింగ్కు పాల్పడ్డ ఘరానా మోసగత్తెకు వత్తాసు పలుకుతోంది. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్గా చెప్పుకునే ‘హనీట్రాప్ స్పెషలిస్ట్’ కాదంబరీ జత్వానీని అడ్డంపెట్టుకుని టీడీపీ కూటమి ప్రభుత్వం ఐపీఎస్ అధికారులకు గురిపెట్టింది. రెడ్బుక్ రాజ్యాంగం సృష్టిస్తు న్న టెర్రర్లో మరో అంకానికి తెరతీసింది. వలపు వల.. ఆపై బ్లాక్ మెయిలింగ్ వలపు వల, బ్లాక్ మెయిలింగ్, ఫోర్జరీ దందా కోసం కాదంబరీ జత్వానీ పకడ్బందీగా వ్యవహరించేవారు. పోలీసుల విచారణలో ఆమె అక్రమాలలన్నీ పూర్తి ఆధారలతో సహా బట్టబయలయ్యాయి. అవేమిటంటే.. కాదంబరీ జత్వానీకి రెండు పాస్ పోర్టులు, రెండు ఆధార్ కార్డులు ఉన్నాయి. ఒక్కొక్కరి వద్ద ఒక్కో పేరుతో పరిచయం చేసుకునేది. ఈ పకడ్బందీ దందాలో కదాంబరీ తమ్ముడు అంబరీశ్ జత్వానీ కూడా ప్రధాన పాత్రధారే. దుబాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే తన తమ్ముడికి అండర్ వరల్డ్ మాఫీయాతో సంబంధాలు ఉన్నాయని... ఆ మాఫియా ద్వారా అంతం చేస్తామని కూడా కాదంబరీ తీవ్ర స్థాయిలో బెదిరించే వారు. మాఫియాతో సంబంధాలు ఉండటమే కాదు హవాలా రాకెట్ను కూడా అతను నిర్వహించే వాడు. ఈ విధంగా ముంబయి, ఢిల్లీ, బెంగళూరులతోపాటు దేశంలోని పలు నగరాల్లోని పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరో క్రాట్లను బ్లాక్ మెయిలింగ్కు పాల్పడి భారీగా ఆస్తులు కొల్లగొట్టారు. ఏసియన్ పెయింట్స్ ప్రమోటర్ మాలవ్ దానీ కూడా ఆమె బాధితుల జాబితాలో ఉన్నారు. ఆయన ఫిర్యా దుతో ముంబయిలోని గమ్దేవీ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదు చేశారు. అదే రీతిలో దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్పై తప్పుడు ఆరోపణలతో బ్లాక్ మెయిలింగ్కు పాల్పడింది. అంతా చట్టబద్ధంగానే.. తనకు అలవాటైన రీతిలోనే కాదంబరీ జత్వానీ ఓ రాజకీయ నేత కుక్కల విద్యాసాగర్పై వలపు వల విసిరి అనంతరం బ్లాక్ మెయిలింగ్కు పాల్పడింది. ఆయన నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా దుబాయిలోని మాఫియాతో అంతం చేయిస్తానని బెదిరించింది. విద్యాసాగర్కు చెందిన జగ్గయ్యపేటలో సర్వే నంబరు 396/2ఏ2హెచ్/1తో 5 ఎకరాల భూమిని ఫోర్జరీ పత్రాలతో సొంతం చేసుకుంది. ఆ భూమిని మరొకరికి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో విద్యాసాగర్కు విషయం తెలిసింది. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన విజయవాడ పోలీసులు చట్టానికి లోబడి విచారణ నిర్వహించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. మెజిస్ట్రీట్ నుంచి సెర్చ్ వారెంట్ తీసుకుని ముంబయి వెళ్లారు. ముంబయి పోలీçసు ఉన్నతాధికారులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి, వారి సమక్షంలోనే కాదంబరీ జత్వానీని అరెస్ట్ చేసి అక్కడి మేజి్రస్టేట్ ఎదుట హాజరు పరిచారు. పోలీసులు సమరి్పంచిన ఆధారాలతో సంతృప్తి చెందిన మెజి్రస్టేట్.. ఆమెను ఏపీకి తీసుకువచ్చేందుకు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేశారు. దాంతో కాదంబరీ జత్వానినీ పోలీసులు విజయవాడ తీసుకువచ్చి అదే రోజు స్థానిక మెజిస్ట్రీట్ ఎదుట హాజరు పరిచారు. మెజిస్ట్రీట్ రిమాండ్ విధించంతో ఆమెను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. అనంతరం ఆమెకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఆమె కొన్నాళ్లు ఇబ్రహీంపట్నంలో నివాసం ఉండి, తర్వాత ముంబయికి వెళ్లింది. దీన్ని బట్టి చూస్తే సినీ నటి అరెస్టులో అంతా చట్టబద్ధంగా జరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ మొత్తం ప్రక్రియలో ఆమెకు న్యాయవాదుల సహాయం అందించేందుకు పోలీసులు సంసిద్ధత చూపారు. కానీ ఆమె అందుకు తిర స్కరించి ముంబయి నుంచి తన సొంత న్యాయవాదులను రప్పించుకున్నారు. ఈ కేసు విషయంలో విజయవాడ పోలీసులు పూర్తిగా చట్టబద్ధంగా వ్యవహరించారు. న్యాయస్థానాల అనుమతితో, నిబంధనలకు లోబడి దర్యాప్తు ప్రక్రియ పూర్తి చేశారు. దేశంలోనే ఎందరో బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరో క్రాట్లను బ్లాక్మెయిలింగ్కు పాల్పడూ మోసం చేస్తున్న కాదంబరీ నేరాలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల చర్యను అభినందించాల్సింది పోయి టీడీపీ కూటమి ప్రభుత్వం.. పోలీసు అధికారులపై తప్పుడు ఆరోపణలతో వేధించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సర్కారే లీకులిచ్చి.. భారత రాజ్యాంగాన్ని గౌరవించం అని, తాము అమలు చేసేది లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగమేనని టీడీపీ కూటమి ప్రభుత్వం పదే పదే స్పష్టం చేస్తోంది. తాము లక్ష్యంగా చేసుకున్న పోలీసు అధికారులు, రాజకీయ నేతలను వేధించడమే ధ్యేయంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే కాదంబరీ జత్వానీ కేసును నేపథ్యంగా తీసుకుని పోలీసు అధికారులకు గురి పెట్టింది. ప్రభుత్వం దురుద్దేశంతోనే ఈ కేసుకు సంబంధించి అవాస్తవాలు, అభూతకల్పనలను టీడీపీ అనుకూల మీడియాకు లీకులు ఇచి్చంది. తద్వారా ఆ పోలీసు అధికారులు, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తోంది. టీడీపీ అనుకూల పత్రికల్లో పతాక శీర్షికలతో కథనాలు... పచ్చ టీవీ చానళ్లలో రోజంతా చర్చలతో రాద్ధాంతం చేస్తోంది. తాజాగా ఇంకో అడుగు ముందుకేసి.. కాదంబరీ జత్వానీ ఉదంతంపై పత్రికలు, టీవీల్లో వస్తున్న కథనాలపై విచారించాలని విజయవాడ ఏసీపీ కె.స్రవంతి రాయ్ను గురువారం విచారణాధికారిగా నియమించింది. -
స్పోర్ట్స్ ప్రజెంటర్ నుంచి టాలీవుడ్ హీరోయిన్గా.. ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ బ్యూటీ..
తమ అందాన్ని కాపాడుకోవాలని జాగ్రత్తపడే తారలు కొందరైతే దాన్ని రెట్టింపు చేసుకోవాలని ఉబలాటపడే బ్యూటీలు మరికొందరు. పెద్దగా అవకాశాల్లేక, వెండితెరకు దూరంగా ఉండే ముద్దుగుమ్మలైతే రీఎంట్రీ కోసం ఎన్నో పాట్లు పడుతుంటారు. పైన కనిపిస్తున్న బ్యూటీ ఆయేషా టకియా కూడా అదే కోవలోకి వస్తుంది. సూపర్ సినిమాతో తెలుగులో అదరగొట్టిన ఈ హీరోయిన్ బాలీవుడ్లో దిల్ మాంగే మోర్, టార్జాన్, సలాం ఇ ఇష్క్, వాంటెడ్, పాఠశాల వంటి హిట్ చిత్రాల్లో నటించింది.13 ఏళ్లుగా వెండితెరకు దూరం2011లో వచ్చిన మోద్ సినిమాలో చివరిసారిగా కనిపించింది. ఆ మరుసటి ఏడాది ఓ మ్యూజిక్ రియాలిటీ షోలోనూ తళుక్కుమని మెరిసింది. అనంతరం సోషల్ మీడియాలో మాత్రమే అలరిస్తోంది. తాజాగా ఆమె నీలిరంగు చీర కట్టి ఓ రీల్ చేసి ఇన్స్టాగ్రామ్లో వదలగా అది వైరల్గా మారింది. అందులో ఆమె పెదాలు ఉబ్బిపోయి ఉన్నాయి. ఇది చూసిన నెటిజన్లు తన లుక్ ఏమీ బాగోలేదని కామెంట్లు చేస్తున్నారు.గుర్తుపట్టలేనట్లుగా మారిపోయిందే..నువ్వు ఏడాది క్రితమే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావని తెలుసు. కానీ ఈ పోస్టులో మాత్రం అస్సలు గుర్తుపట్టలేనట్లే ఉన్నావు, తను ఆయేషా టాకియా అంటే నమ్మలేకపోతున్నాను. చిన్నప్పుడు తన సినిమాలు చూసి ముచ్చటపడిపోయాను. ఇప్పుడేంటి, ఇలా అయిపోయింది?, ఒకప్పుడు బాలీవుడ్లో రాణిగా వెలుగు వెలిగింది.. రీఎంట్రీ కోసమే ఈ అవతారం ఎత్తిందా? అని కామెంట్లు చేస్తున్నారు. కాగా లిప్ ఫిల్లర్స్ వేయించుకున్న తర్వాత ఈ బ్యూటీ ముఖమే మారిపోయింది. View this post on Instagram A post shared by 🧿Ayesha Takia Azmi (@ayeshatakia) View this post on Instagram A post shared by 🧿Ayesha Takia Azmi (@ayeshatakia) -
వరలక్ష్మి వ్రతం పూజలో సీనియర్ హీరోయిన్ లయ (ఫోటోలు)
-
ప్రభాస్కు జోడీగా ఈ ముద్దుగుమ్మ! ఇమాన్వీ ఎవరంటే..?
-
Samyuktha Menon: శారీలో అలా.. హారంతో ఇలా.. బింబిసార హీరోయిన్ లుక్స్ చూశారా?
-
Taapsee Pannu: పారిస్ ఒలింపిక్స్లో చీరలతో అలరిస్తున్న తాప్సీ..! (ఫోటోలు)
-
Hansika Motwani: పుట్టినరోజు జరుపుకుంటున్న హన్సికా మోత్వాని రేర్ ఫోటోలు
-
అప్పుడేమో పద్ధతి.. ఇప్పుడు హాట్నెస్.. రితిక గ్లామర్ డోస్ (ఫొటోలు)
-
నేహా శెట్టి గ్లామర్కు 'డిజె టిల్లు'తో పాటు ఎవడైనా పడిపోవాల్సిందే (ఫోటోలు)
-
అదిరిపోయే అవుట్ఫిట్తో ప్రియమణి స్టన్నింగ్స్ లుక్స్ (ఫోటోలు)
-
Digangana Suryavanshi: వావ్ అనిపిస్తున్న 'శివం భజే' హీరోయిన్ లుక్స్ (ఫోటోలు)
-
ఫ్యామిలీని పరిచయం చేసిన హీరోయిన్ నభా నటేశ్ (ఫొటోలు)
-
Anupama Parameswaran: ఉఫ్.. వర్షంలోనూ చెమటలు పట్టిస్తున్న బ్యూటీ (ఫోటోలు)
-
తొలి ఆషాడం.. పుట్టింటికి వచ్చిన హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ (ఫొటోలు)
-
ఆ డ్రెస్సేంటి? మెడలో ఆ నెక్సెట్ ఏంటి? వెరైటీ లుక్లో హన్సిక
-
70కి పైగా ఆడిషన్స్.. కాంప్రమైజ్ అడగడంతో ఏడ్చేశా: హీరోయిన్
అనూష కృష్ణ.. పేరుకు కన్నడమ్మాయే కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడగలదు. పక్కింటమ్మాయిలా కనిపించే ఈమె ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివింది. యాక్టింగ్ కోసం ఉద్యోగాన్ని మానేసింది. ఇంట్లోవాళ్లు తిట్టినా సరే ఇండస్ట్రీలో ప్రయత్నిద్దామన్న బలమైన కోరికతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పేకమేడలు సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది.అవకాశాల కోసం అన్నీ చేయలేను'నేను 70కి పైగా ఆడిషన్స్కు వెళ్లాను. కన్నడలో రెండు సినిమాలు చేశాను. కానీ ఇంకా రిలీజవ్వలేదు. కొన్ని ఆడిషన్స్లో మీరిలాగే చిన్న సినిమాలు చేస్తారా? పెద్ద చిత్రాలు చేస్తారా? అని ఆప్షన్స్ ఇస్తారు. వాళ్లు చెప్పినవాటికి తలూపి పెద్ద సినిమాలు నేను చేయలేను. నాకంటూ కొన్ని పరిమితులున్నాయి. వాటిని దాటలేను. చిన్న సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకుంటానని చెప్పేదాన్ని.చేదు అనుభవంఒకసారైతే భయంకరమైన సంఘటన జరిగింది. దర్శకనిర్మాతలు మాకు నచ్చేశావన్నారు. అయితే ఆ నిర్మాత వయసు సుమారు 60 ఏళ్లుంటుంది. ఆయన మీరు కాంప్రమైజ్ అయితే సినిమా చేసేద్దామన్నారు. భయంతో వణికిపోయాను. నాకు ఎంగేజ్మెంట్ అయిందని అబద్ధం చెప్పాను. అయినా పర్లేదన్నాడు. వెంటనే నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయాను. నేను బోరుమని ఏడుస్తుంటే ఆ కారు డ్రైవర్ ఏమైంది మేడమ్.. అంతా బానే జరుగుతుందని ఓదార్చాడు. పేకమేడలు షూటింగ్ అయిపోయాకే ఈ సంఘటన జరిగింది' అని అనూష తెలిపింది.చదవండి: మోసపోయా.. ఇప్పటికీ నాకు పారితోషికం చెల్లించలేదు: స్టార్ హీరో -
వృద్ధాశ్రమంలో హీరోయిన్ బర్త్డే సెలబ్రేషన్స్.. ఫ్యాన్స్ ఫిదా (ఫోటోలు)
-
30 ఏళ్లలోపు పెళ్లి.. కల నెరవేరిందంటున్న లియో నటి (ఫోటోలు)
-
Kriti Sanon: మహారాణిలా వెలిగిపోతున్న ఆదిపురుష్ హీరోయిన్ (ఫోటోలు)
-
సైకాలజీ చదివిన బ్యూటీ.. ప్రత్యేక పూజలు ఎందుకు చేయించుకున్నట్లో? (ఫోటోలు)
-
‘దేవర’ బ్యూటీ జాన్వీ కపూర్ లేటెస్ట్ స్టయిల్ చూశారా?
-
రెండో సినిమాకే రూ.100 కోట్లు.. ఎవరీ బ్యూటీ (ఫోటోలు)
-
ముంగురులతో హీరోయిన్ ప్రియాంక మోహన్.. క్యూట్నెస్ వేరే లెవల్ (ఫొటోలు)
-
Preethi Pagadala: పతంగ్ హీరోయిన్ ఎంత క్యూట్గా ఉందో! (ఫోటోలు)
-
జిమ్లో చెమట చిందిస్తోన్న రకుల్.. ఫిట్నెస్ కోసం ఎన్ని కష్టాలో! (ఫోటోలు)
-
జస్ట్ బ్రేక్... అంతే!
మనసుకి నచ్చిన కథ వచ్చే వరకూ కొందరు స్టార్స్ ఖాళీగా ఉంటారు తప్ప ఏ సినిమా పడితే అది చేయరు. కొందరికి నచ్చిన కథ వచ్చినా ఆరోగ్యం బాగా లేక ఇంటిపట్టున ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. వేరే వ్యక్తిగత కారణాల వల్ల కూడా కొందరు బ్రేక్ తీసుకుంటారు. కారణాలు ఏమైనా ఈ మధ్య కొందరు స్టార్స్ సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత కెమెరా ముందుకి వచ్చి, ఆ తారామణులు చేస్తున్న, చేసిన చిత్రాల గురించి తెలుసుకుందాం. ⇒ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో లేడీ సూపర్ స్టార్గా నిలిచిపోయారు నటి విజయశాంతి. ‘నాయుడమ్మ’ (2006) సినిమా తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లారామె. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహేశ్బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ (2020) సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు విజయశాంతి.ప్రోఫెసర్ భారతి పాత్రలో తనదైన నటనను, భావోద్వేగాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారామె. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మళ్లీ రాజకీయాల్లో బిజీ అయిన విజయశాంతి దాదాపు మూడున్నరేళ్ల తర్వాత ఓ సినిమా కమిట్ అయ్యారు. కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో నటిస్తున్నారామె. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వైజయంతీ ఐపీఎస్ అనే పవర్ఫుల్ పాత్ర చేస్తున్నారు. ఈ నెల 24న విజయశాంతి పుట్టినరోజుని పురస్కరించుకుని ఆమె పాత్ర తాలూకు గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘వైజయంతీ ఐపీఎస్. తాను పట్టుకుంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వస్తుంది.. వేసుకుంటే యునిఫామ్కి ΄ûరుషం వస్తుంది.. తనే ఒక యుద్ధం. మేమే తన సైన్యం’ అంటూ విడుదలైన గ్లింప్స్కి అద్భుతమైన స్పందన వస్తోంది. ⇒ తెలుగులో జేజమ్మగా ప్రేక్షకుల మనసు దోచుకున్నారు అనుష్క. గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ బ్యూటీ. 2018లో విడుదలైన ‘భాగమతి’ మూవీ తర్వాత ‘నిశ్శబ్దం’ (2020)లో కథానాయికగా నటించారు. ఈ రెండు చిత్రాలకు మధ్య ‘సైరా’లో అతిథి పాత్ర చేశారు. ‘నిశ్శబ్దం’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (2023) చేశారు. ఈ చిత్రం విడుదలైన ఏడాదికి కొత్త చిత్రాలు కమిట్ అయ్యారు.ప్రస్తుతం ఆమె ‘కథనార్–ది వైల్డ్ సోర్సెరర్’ అనే మలయాళ సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో అంగీకరించిన చిత్రం ‘ఘాటీ’. ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై ఈ సినిమా రూపొందుతోంది. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ‘ఘాటీ’ని తెరకెక్కిస్తున్నారని టాక్. అందుకే ఆంధ్రా–ఒడిశా బోర్డర్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరిపారట. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతోంది. ⇒ ‘ఛాతీ మీద చటాకు మాంసం లేదు నువ్వు పెద్ద రౌడీవా?, రేయ్.. నీకంటే పెద్ద రౌడీరా నేను.. ముందు నాతో కొట్లాడు.. సిద్ధిపేటలో అడుగు చాందినీ గురించి చెబుతారు’ అంటూ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో నభా నటేశ్ చెప్పిన మాస్ డైలాగులు ప్రేక్షకుల మనసుల్లో లోతుగా గుచ్చుకున్నాయి. సుధీర్ బాబు హీరోగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ (2018) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ.ఆ తర్వాత ‘అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్’ వంటి మూవీల్లో నటించారు. కాగా ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో హిట్ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో ‘ఇస్మార్ట్ బ్యూటీ’గా పేరు తెచ్చుకున్నారు నభా. ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె దాదాపు మూడేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందుతున్న ‘స్వయంభూ’లో హీరోయిన్గా నటిస్తున్నారు నభా. ⇒ మలయాళ తార మమతా మోహన్దాస్ తెలుగులో హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘యమదొంగ’(2007). ఈ చిత్రంలో ‘చంపేస్తాన్రా రేయ్.. ఆగండ్రా.. రేయ్ యాడికి పోతార్రా.. ఏదో ఒకరోజు దొరకాల.. నెల్లూరు ట్రంకు రోడ్డులో గుడ్డలూడదీసి తంతాను నాయాల్లారా..’ అంటూ ‘యమదొంగ’లో మమతా మోహన్దాస్ చెప్పిన డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకున్నారామె.నాగార్జున హీరోగా నటించిన ‘కేడీ (2009) తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ‘రుద్రంగి’ (2023) చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు మమతా మోహన్దాస్. ఇటీవల ఆమె నటించిన ‘మహారాజ’ (విజయ్ సేతుపతి హీరో) సినిమా ఈ నెల 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ⇒ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు శోభన. కృష్ణ, చిరంజీవి, మోహన్బాబు, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు వంటి హీరోలందరికీ జోడీగా నటించారామె. ప్రత్యేకించి కార్తీ హీరోగా నటించిన ‘అభినందన’ (1988) సినిమాలో ఆమె నటన అద్భుతం. ఇక ‘సూర్య పుత్రులు’ (1997) తర్వాత దాదాపు పదేళ్లు తెలుగు సినిమాల నుంచి విరామం తీసుకున్న ఆమె మోహన్బాబు, విష్ణు మంచు నటించిన ‘గేమ్’ (2006) మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం తర్వాత తెలుగులో దాదాపు పద్దినిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు శోభన. ఈ చిత్రంలో శంబాల రాజ్యానికి చెందిన నాయకురాలు మరియంగా తనదైన నటనతో ఆకట్టుకున్నారామె. ఈ చిత్రం ఈ గురువారం (మే 27) విడుదలైంది. -
ప్రగ్యా జైస్వాల్ అందాన్ని ఎలా వర్ణించాలి... (ఫొటోలు)
-
వెకేషన్లో 'విశ్వంభర' బ్యూటీ.. తెగ ముద్దొచ్చేస్తుంది! (ఫొటోలు)
-
'బంగార్రాజు' బ్యూటీ కిల్లింగ్ లుక్స్.. చూస్తే అంతే! (ఫొటోలు)
-
Seerat Kapoor: ఎర్ర చీరలో రాణిలా వెలిగిపోతున్న హీరోయిన్ (ఫోటోలు)
-
గుండు గీయించుకున్న హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
పై ఫోటోలో కనిపిస్తున్న మహిళ ఎవరో గుర్తుపట్టారా? తెలుగు, తమిళ సినిమాల హీరోయిన్. ఒకప్పుడు హీరోయిన్గా, సహాయ నటిగా అలరించింది. ఆవిడే శరణ్య. కాదల్ కవితై సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించింది. నీ మనసు నాకు తెలుసు అనే తెలుగు చిత్రంలో కాలేజీ స్టూడెంట్గా కనిపించింది. కాదల్ (ప్రేమిస్తే) సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫేమస్ అవడంతో అప్పటినుంచి కాదల్ శరణ్యగా ముద్రపడిపోయింది.నాలుకపై శూలం..ప్రేమ ఒక మైకం, దూసుకెళ్తా తదితర చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించిన శరణ్య.. 10th క్లాస్, పేరణ్మయి, మళైకాలం, రెట్టై వాలు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. తాజాగా ఈమె తమిళనాడు తిరుత్తనిలోని సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుని గుండు గీయించుకుంది. అలాగే నాలుకపై శూలం పొడిపించుకుని మొక్కు చెల్లించుకుంది. గుండు గీయించుకుని..ఇందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అమ్మాయిలకు జుట్టు అంటే ఎంతో ఇష్టం. అలాంటిది తన కేశాలను భగవంతుడి కోసం త్యాగం చేసిందంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే.. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sharanya Nagh (@sharanya_nagh) View this post on Instagram A post shared by Sharanya Nagh (@sharanya_nagh) View this post on Instagram A post shared by Sharanya Nagh (@sharanya_nagh) -
కలర్ఫుల్ డ్రెస్లో ఆదిపురుష్ భామ కృతి సనన్.. ఫోటోలు
-
Disha Patani Photos: వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న కల్కి 2898 ఏడీ హీరోయిన్ (ఫోటోలు)
-
ట్రెడిషనల్ లుక్లో ‘రాధిక’ తిరుగే లేదిక (ఫొటోలు)
-
అనన్య పాండే గ్లామర్ ట్రీట్.. వేరే లెవల్ అంతే! (ఫొటోలు)
-
ఈ హీరోయిన్ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)
-
సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్..
హీరోయిన్ సునయన పెళ్లికి రెడీ అయింది. కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో వెండితెరపై కథానాయికగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది. గతేడాది రెజీనా చిత్రంతో పలకరించిన ఈ బ్యూటీ ఈ ఏడాది ఇన్స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్లో తన నటనతో ఆకట్టుకుంది.తాజాగా ఈమె ఓ గుడ్న్యూస్ చెప్పింది. తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని వెల్లడించింది. కాబోయే భర్త వేలిని పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన నిశ్చితార్థం జరిగిందని పేర్కొంది. అభినందనలు చెప్పే ప్రతి ఒక్కరికీ ముందుగానే కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసింది. అయితే తను పెళ్లి చేసుకోబోయేది ఎవరన్నది మాత్రం పేర్కొనలేదు.సునయన 2005లో కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో నటప్రయాణం మొదలు పెట్టింది. తనకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా కాదలిల్ విడుదెన్(2008). నీర్పరవై చిత్రం తనను మరో మెట్టు ఎక్కించింది. తెలుగులో పెళ్లికి ముందు ప్రేమ కథ, రాజరాజ చోర సినిమాలతో పాటు చంద్రగ్రహణం, మీట్ క్యూట్ సిరీస్లతో సినీ ప్రియులకు మరింత దగ్గరైంది. Hi, I’ve seen some articles going around regarding my last post and wanted to clarify that I am indeed happily engaged. Thank you for all the wonderful messages that are coming in, it means so much ❤️ pic.twitter.com/CdVGVjKJyk— Sunainaa (@TheSunainaa) June 7, 2024 -
ఫ్యామిలీతో నయనతార సమ్మర్ వెకేషన్ (ఫోటోలు)
-
Janki Bodiwala: షైతాన్ మూవీలో దెయ్యం పట్టినట్లుగా.. రియల్ లైఫ్లో ఏంజెల్గా.. (ఫోటోలు)
-
Anikha Surendran: ‘ఓహ్ మై డార్లింగ్’ హీరోయిన్ అనిఖా సురేంద్రన్ అందమైన లుక్స్ (ఫోటోలు)
-
Aditi Rao Hydari HD Photos: పాలరాతి శిల్పంలాంటి స్టయిల్, కళ్లతోనే కనికట్టు: ఎవరీ ముద్దుగుమ్మ (ఫొటోలు)
-
'బేబి' ఫేమ్ వైష్ణవి చైతన్య న్యూ లుక్.. క్యూట్ ఫొటోలు
-
ఆ డైరెక్టర్ నన్ను చంపుతానని బెదిరించాడు.. నా వెంటే ఎయిర్పోర్టుకు..
హీరోయిన్ లయ.. అప్పట్లో యూత్కే కాదు ఫ్యామిలీ ఆడియన్స్కు కూడా ఫేవరెట్ హీరోయిన్. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసే ఈ అందాల రాశి సినిమాలకు దూరమై దాదాపు పద్దెనిమిదేళ్లవుతోంది. మధ్యలో 'బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం' అనే సినిమాలో అమ్మవారి పాత్రలో కనిపించింది. తర్వాత సినిమాలవైపు కన్నెత్తి చూడలేదు. అమెరికాలో సెటిలైన ఈమె అక్కడ నాలుగేళ్లపాటు ఐటీ ఉద్యోగం చేసింది. తర్వాత అది వదిలేసి డ్యాన్స్ స్కూల్ పెట్టింది. కోవిడ్ తర్వాత దాన్ని కూడా మానేసి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండటం మొదలుపెట్టింది.అందుకే ఇండియాకు వచ్చేశాతాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె ఎన్నో విషయాల గురించి మాట్లాడింది. 'నేను అమెరికా వెళ్లిపోయాక నా గురించి లేనిపోనివి ప్రచారం చేశారు. రోడ్డున పడ్డానని, అడుక్కుతింటున్నానని, ఇంకా ఎన్నో వదంతులు సృష్టించారు. అవి గుర్తు చేసుకున్నప్పుడల్లా బాధేస్తుంది. ఇప్పుడు నేను ఇండియాకు రావడానికి ప్రధాన కారణం.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాను. నితిన్ 'తమ్ముడు' సినిమాలో నటిస్తున్నాను' అని చెప్పుకొచ్చింది.నన్ను ఫాలో అవుతూ..అలాగే తన చేదు అనుభవాన్ని వెల్లడిస్తూ.. 'ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న డైరెక్టర్ నన్ను ఫాలో అయ్యాడు. బేగంపేటలో కారు పార్కింగ్ చేసే దగ్గరకు వచ్చి మీరు ఎలా వెళ్తారో చూస్తానని బెదిరించాడు. నేను ఎలాగోలా తప్పించుకుని ఎయిర్పోర్టుకు వెళ్లిపోయాను. కానీ ఆయన నన్ను ఫాలో అవుతూ అక్కడికీ వచ్చాడు. మీరు చంపుతానన్నా నేనేం చేయలేను.. ఇక్కడ ఎవరూ లేరు, మీ ఇష్టం చంపేయండన్నాను' అంటూ లయ ఆనాటి ఇబ్బందికర పరిస్థితిని గుర్తు చేసుకుంది. అయితే ఆ డైరెక్టర్ ఎవరన్నది మాత్రం బయటపెట్టలేదు.చదవండి: చేతికట్టు తొలగించి కేన్స్లో మెరిసిన ఐశ్వర్య రాయ్ -
Anjali Lavania: పంజా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా..! (ఫోటోలు)
-
తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
సీరియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి సినిమాల్లోకి వచ్చినవాళ్లు చాలామందే ఉన్నారు. హిందీలో అయితే టాలెంట్ చూపించిన సీరియల్ యాక్టర్స్ ఎందరో సిల్వర్ స్క్రీన్పై అడుగుపెట్టారు. పైన కనిపిస్తున్న బ్యూటీ కూడా ఇదే కోవలోకి వస్తుంది. హిందీ సీరియల్లో నటించిన ఈ బ్యూటీని తొలిసారి బిగ్స్క్రీన్కు పరిచయం చేసిందే తెలుగు సినిమా!బాలీవుడ్ నుంచి పిలుపుఆమె పేరు మధురిమ తూలి. 2008లో జగపతిబాబు, జేడీ చక్రవర్తిల 'హోమం' సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అదే ఏడాది తమిళంలోనూ రెండు చిత్రాలు చేసింది. తర్వాత బాలీవుడ్ నుంచి పిలుపు రావడంతో అక్కడికి వెళ్లిపోయి వరుస సినిమాలు చేసుకుంటూ పోయింది. మధ్యలో ఒకటీరెండు ఇంగ్లీష్ చిత్రాల్లో కూడా నటించింది. హిందీ బిగ్బాస్ 13వ సీజన్లోనూ పాల్గొంది.పెళ్లి ఊసే లేదుప్రస్తుతం టెహ్రాన్ అనే పెద్ద సినిమాలో నటిస్తోంది. ఇన్నేళ్లలో తిరిగి ఒక్కసారి కూడా తెలుగులో నటించలేదు. మరి టాలీవుడ్లో అవకాశాలు రాలేదా? లేదంటే వచ్చినవాటిని కాదనుకుని బాలీవుడ్లోనే సెటిలైపోయిందా? అన్నది ఆమెకే తెలియాలి! 37 ఏళ్ల వయసొచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ మధ్య ఒకరిని ప్రేమించి బ్రేకప్ చెప్పింది. అప్పటినుంచీ ప్రేమ, పెళ్లి ఊసే ఎత్తడం లేదు. View this post on Instagram A post shared by Madhurima Tuli (@madhurimatuli) -
ఆడపిల్లనే...ఐతే ఏంటంట
హీరోలకు ప్రేమ కబుర్లు చెప్పే పాత్రలే ఎక్కువగా చేసే హీరోయిన్లు ఫర్ ఎ చేంజ్ నేరస్తులకు బుద్ధి చెప్పే పనిలో పడ్డారు. న్యాయ పోరాటం కోసం ఏం చేయడానికి అయినా వెనకాడని పోలీసాఫీసర్లుగా బెల్టు బిగించారు... తుపాకీ గురి పెట్టారు.. లాఠీకి పని చెప్పారు. ‘ఆడపిల్లనే... ఐతే ఏంటంట’ అంటూ ఓ హీరోయిన్ పోలీస్ పాత్రలో రెచ్చిపోయారు. మిగతా కథానాయికలు కూడా దాదాపు అలానే అంటూ పోలీసు పాత్రల్లో విజృంభించారు. ఆ పోలీసాఫీసర్ల గురించి తెలుసుకుందాం. సత్యభామ సాహసంహైదరాబాద్ సిటీ ఏసీపీ కె. సత్యభామగా చార్జ్ తీసుకున్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఓ అమ్మాయి కేసు విషయంలో సత్యభామ పోలీసాఫీసర్గా ఆల్మోస్ట్ సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితి. మరి.. సత్యభామ ఈ కేసును ఎలా సాల్వ్ చేసింది? ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్నది ‘సత్యభామ’ సినిమాలో చూడాలి. సత్యభామగా కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పణలో తక్కలపల్లి శ్రీనివాసరావు, బాబీ తిక్క నిర్మించారు. ఓ అమ్మాయి హత్యాచారం నేపథ్యంలో ‘సత్యభామ’ సినిమా కథ ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం.ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో డీజీపీ నారాయణదాస్ పాత్రలో ప్రకాశ్రాజ్, అమరేందర్ అనే పాత్రలో నవీన్ చంద్ర లీడ్ రోల్స్లో నటించారు. నాగినీడు, హర్షవర్థన్, రవివర్మ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సంగతి ఇలా ఉంచితే... పోలీసాఫీసర్గా కాజల్ అగర్వాల్ నటించడం ఇది తొలిసారి కాదు. 2014లో తమిళ హీరో విజయ్ నటించిన ‘జిల్లా’, గత ఏడాది విడుదలైన తమిళ చిత్రం ‘ఘోస్టీ’లో కాజల్ పోలీసాఫీసర్గా నటించారు. ఆ రెండు చిత్రాల్లోనూ పవర్ఫుల్ పోలీస్గా ఒదిగిపోయారు కాజల్. తాజాగా ‘సత్యభామ’లో కూడా పవర్ఫుల్ ఆఫీసర్గా విజృంభించారని యూనిట్ పేర్కొంది.పాయల్ రక్షణహీరోయిన్ పాయల్ రాజ్పుత్ తొలిసారి ‘రక్షణ’ కోసం ఖాకీ డ్రెస్ ధరించి, లాఠీ పట్టారు. పాయల్ రాజ్పుత్ ఫస్ట్ టైమ్ పోలీసాఫీసర్గా నటించిన చిత్రం ఇది. ప్రణదీప్ ఠాకోర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఓ పోలీసాఫీసర్ జీవితంలోని ఓ ఘటనను ఆధారంగా చేసుకుని, ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ను తెరకెక్కించినట్లుగా యూనిట్ పేర్కొంది. రోషన్ , మానస్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ స్వరకర్త.అగ్ని నక్షత్రంమంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి లీడ్ రోల్స్లో నటిస్తున్న మర్డర్ మిస్టరీ చిత్రం ‘అగ్ని నక్షత్రం’. ఈ చిత్రంలో మంచు లక్ష్మి ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె దీక్ష అనే పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఎమ్. వంశీకృష్ణ దర్శకత్వంలో మంచు లక్ష్మి, మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మర్డర్ మిస్టరీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందుతోంది. మలయాళీ నటుడు సిద్ధిఖ్, సముద్రఖని, విశ్వంత్, చైత్ర శుక్లా ఈ సినిమాలో ఇతర కీ రోల్స్లో కనిపిస్తారు. ఈ చిత్రం విడుదలపై స్పష్టత రావాల్సి ఉంది.ఐతే ఏంటంట?‘కలర్ ఫొటో’, ‘గామి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు నటిగా మరింత దగ్గరయ్యారు హీరోయిన్ చాందినీ చౌదరి. ఈ బ్యూటీ ఇటీవల పోలీసాఫీసర్గా డ్యూటీ చేశారు. ఈ డ్యూటీ ‘యేవమ్’ సినిమా కోసం. ఈ సినిమాలో చాందినీ చౌదరితో పాటు వశిష్ట సింహా, జై భారత్, అషు రెడ్డి లీడ్ రోల్స్లో నటించారు. ప్రకాశ్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు నిర్మించారు. మహిళా సాధికారిత నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఎస్ఐ సౌమ్య పాత్రలో కనిపిస్తారు చాందినీ చౌదరి.ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్పై ‘ఆడపిల్లనే!.. ఐతే ఏంటంట?’ అనే క్యాప్షన్ ఉంది. దీన్నిబట్టి ఈ సినిమాలో చాందిని పాత్ర చాలా స్ట్రాంగ్గా ఉంటుందని ఊహించవచ్చు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా పోలీసాఫీసర్లుగా కనిపించనున్న దక్షిణాది హీరోయిన్లు మరికొంతమంది ఉన్నారు.హీరోయిన్ త్రిష నటించిన తొలి వెబ్ సిరీస్ ‘బృందా’. త్రిష టైటిల్ రోల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. ఇందులో త్రిష పోలీసాఫీసర్ పాత్ర చేశారు. సూర్య వంగల దర్శకత్వం వహించిన ఈ తెలుగు వెబ్ సిరీస్ చిత్రీకరణ పూర్తయింది. స్ట్రీమింగ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. పవర్ఫుల్ పోలీసాఫీసర్ క్యారెక్టర్ కావడంవల్లే త్రిష ఈ వెబ్ సిరీస్ చేశారని కోలీవుడ్ టాక్. -
తెలుగులో ఒకే ఒక్క సినిమా.. హీరోయిన్ను గుర్తుపట్టారా?
సినిమా ఇండస్ట్రీలో అలా వచ్చి ఇలా వెళ్లిపోయే జనాలే ఎక్కువ. హీరోయిన్లయితే సక్సెస్ రేటు లేకపోతే ఎక్కువరోజులు నెట్టుకురాలేరు. హిట్టు అనే ఆక్సిజన్ అందితేనే ఫిల్మీదునియాలో వారికంటూ స్థానం ఉంటుంది. పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు అంతర మాలి. ఈ రోజు (మే 11న) తన పుట్టినరోజు.. ఈ సందర్భంగా తన జర్నీని ఓసారి చూసేద్దాం..ఆయన కూతురే అంతరబాలీవుడ్లోని ఫేమస్ ఫోటోగ్రాఫర్ జగదీశ్ మాలి కూతురే ఆంతర మాలి! 35 ఏళ్లపాటు ఇండస్ట్రీలో ఉన్న ఆయన తర్వాత కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడ్డాడు. ఒకానొక సమయంలో అంతర తండ్రిని వదిలేయడంతో.. ఆయన ముంబై వీధుల్లో రోడ్డుపై దయనీయ స్థితిలో కనిపించాడని వార్తలు వచ్చాయి. అయితే సమయానికి ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోకపోవడం వల్లే అలా జరిగిందని, తాను ప్రెగ్నెంట్గా ఉండటం వల్లే తండ్రిని చూసుకోలేకపోయానని నటి వివరణ ఇచ్చింది.ఫస్ట్ సినిమా బోల్తాఅంతర విషయానికి వస్తే 1998లో ధూండ్తే రేహ్ జావోగే మూవీతో తన సినీజర్నీ మొదలైంది. కానీ తొలి సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ మరుసటి ఏడాది రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ప్రేమకథ అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించింది. తర్వాత వర్మ డైరెక్షన్లోనే పలు చిత్రాలు చేసింది.ఎక్కువ ఫ్లాప్స్రోడ్, కంపెనీ, డర్నా మర్నా హై, నాచ్, మిస్టర్ యా మిసెస్ వంటి మూవీస్లో మెరిసింది. చాలావరకు ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్గానే నిలిచాయి. 2009లో జీక్యూ మ్యాగజైన్ ఎడిటర్ చె కురియన్ను పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత .. అండ్ వన్స్ ఎగైన్ (2010) అనే ఒకే ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీకి గుడ్బై చెప్పేసింది.చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
లాపతా లేడీస్: సిమ్లా టూ బాలీవుడ్, ఎవరీ యాపిల్ బ్యూటీ (ఫొటోలు)
-
అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
ఒక్కోసారి హీరోయిన్లకు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా అభిమానుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ఏం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితి ఉంటుంది. తాజాగా నటి తాన్యా రవిచంద్రన్కు అలాంటి పరిస్థితే ఎదురైంది. ప్రఖ్యాత నటుడు రవిచంద్రన్ మనవరాలైన తాన్యా రవిచంద్రన్.. ఆయన వారసత్వాన్ని తీసుకుని సినీ రంగప్రవేశం చేశారు. ఆమె 2017లో భలే వెళైదేవా అనే చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు. శశికుమార్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ తాన్నా రవిచంద్రన్కు అవకాశాలు తలుపు తడుతూనే ఉన్నాయి. అలా బృందావనం, కరుప్పన్, నెంజుక్కు నీతి, మాయోన్, అకిలన్ వంటి చిత్రాల్లో నటించి తనకుంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.తాజాగా ఆమె రసవాది అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా తాన్యా రవిచంద్రన్ ఓ భేటీలో అభిమానులతో ముచ్చటించారు. వారితో తన చిత్రాల గురించి.. తాను నటించాలనుకుంటున్న పాత్రల గురించి వివరించారు. అదే సమయంలో తనకు ఎదురైన విచిత్రమైన ప్రశ్న గురించి చెప్పారు. ఒకసారి అభిమాని ఒకరు అనూహ్యంగా అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగారన్నారు. అతను అడిగిన విధానం తనకు అర్థం కాలేదన్నారు. అక్కా అన్నాడు.. పెళ్లి చేసుకుంటావా? అని సంబంధమే లేకుండా అడిగిన అతని ప్రశ్నకు బదులేం చెప్పాల్లో తనకు అర్థం కాలేదన్నారు. ఇలాంటి ఫన్నీ సంఘటనలు గుర్తొస్తే నవ్వొస్తుందని తాన్యా రవిచంద్రన్ పేర్కొన్నారు. కాగా రసవాది చిత్రం తనకు మంచి పేరు తెచ్చి పెడుతుందనే నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. -
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
పెళ్లి చేసుకునేది కలకాలం కలిసుండటానికే! విడిపోతారని ముందే తెలిస్తే పెళ్లెందుకు చేసుకుంటారు? ప్రేమ దగ్గరే ఆగిపోతారు. అయినా అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? కోటి ఆశలతో పెళ్లి చేసుకున్న ఎంతోమంది పలు కారణాల వల్ల ఆ బంధాన్ని మధ్యలోనే తెంచేసుకుంటున్నారు. అందులో మలయాళ హీరోయిన్ భామ కూడా చేరింది. భర్తతో విడిపోయిన విషయాన్ని తొలిసారి అధికారికంగా వెల్లడించింది.సింగిల్ మదర్ అయ్యాకే..ప్రస్తుతం తాను సింగిల్ పేరెంట్ అని తెలిపింది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 'నేను చాలా స్ట్రాంగ్ అని ఇంతవరకూ తెలీలేదు. సింగిల్ మదర్ అయిన తర్వాతే ఈ విషయం తెలిసొచ్చింది. ఇప్పుడు ధృడంగా నిలబడటమే నా ముందున్న ఏకైక ఛాయిస్. నా కూతురికి నేను.. నాకు నా కూతురు' అంటూ తన పాపతో ఆడుకుంటున్న ఫోటో పోస్ట్ చేసింది. ఇది చూసిన జనాలు నువ్వు చాలా ధైర్యవంతురాలివి.. మీ ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము అని కామెంట్లు చేస్తున్నారు.పెళ్లి తర్వాత సినిమాలకు దూరంకాగా భామ.. 2020లో అరుణ్ జగదీశ్ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఈ దంపతులకు ఓ పాప పుట్టింది. గత కొంతకాలంగా భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేయడమే మానేసింది నటి. ఇంతలోనే తను భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది. అందుకుగల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈమె తెలుగులో మంచివాడు అనే మూవీలో హీరోయిన్గా నటించింది. View this post on Instagram A post shared by Bhamaa (@bhamaa) చదవండి: తమిళంలో ఇటీవలే రిలీజ్.. నెల రోజుల్లోనే ఓటీటీలోకి! -
డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
అన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు.. అవి మనసులైనా, మనుషులైనా! ఒకప్పుడు అందంతో, నటనతో ఊదరగొట్టిన ఎంతోమంది తారలు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పైన కనిపిస్తున్న నటి కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఆమె తండ్రి గౌరీశంకర్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్.. తల్లి మమతా రావ్ కన్నడలో హీరోయిన్. సినీ బ్యాక్గ్రౌండ్ బాగానే ఉన్న ఈమెను ఇప్పటికైనా గుర్తుపట్టారా? తన పేరు రక్షిత.తొలి చిత్రంతోనే హిట్2002లో అప్పు సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాను తెలుగులో ఇడియట్గా, తమిళంలో ధమ్గా రీమేక్ చేశారు. ఈ రెండుచోట్లా రక్షితే కథానాయిక. ఈ మూవీ విజయం సాధించడంతో తెలుగులో పెళ్లాం ఊరెళితే.., నిజం, శివమణి, ఆంధ్రావాలా, అందరివాడు.. ఇలా అనేక సినిమాల్లో నటించింది.సినిమాలకు గుడ్బైకన్నడలో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. 2007లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్ను పెళ్లి చేసుకుంది. తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పేసి నిర్మాతగా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లినాటి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. 'కొన్నిచోట్ల మామయ్యే పెళ్లికూతుర్ని మండపానికి తీసుకెళ్తుంటాడు. అలా నన్ను కూడా మా మామయ్య తీసుకెళ్లాల్సి ఉంది. ఆ రోజు అంతా రెడీ అయ్యాం.నో ఎంట్రీసమయానికి ఆయన కనిపించలేదు. తీరా ఆయన బయట ఏదో పనిమీద వెళ్లాడని తెలిసింది. తిరిగి వచ్చేటప్పుడు సెక్యూరిటీ గార్డులు ఆయన్ను లోనికి అనుమతించలేదు. నేను ఆమె మామయ్యను.. వెళ్లనివ్వండి అని చెబుతున్నా వాళ్లు వినిపించుకోలేదు. ఆయన ఎలాగోలా లోపలికి వచ్చేసరికే పెళ్లి తంతు దాదాపు పూర్తయింది. ఇప్పటికీ ఇది గుర్తు చేసుకుని నవ్వుకుంటుంటాం' అని రక్షిత చెప్పుకొచ్చింది.చదవండి: ఆ వివాదంతో వార్తల్లో.. గుడ్న్యూస్ చెప్పిన సీరియల్ జంట -
నటిని కిడ్నాప్ చేసిన ఫ్రెండ్స్.. తల అడవిలో, మొండెం..
కరీనా కపూర్ హీరోయిన్గా 2012లో హీరోయిన్ మూవీ రిలీజైంది. ఇప్పుడు ప్రస్తావన సినిమా గురించి కాదు! ఇందులో యాక్ట్ చేసిన నటి మీనాక్షి థాపర్ గురించి! ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమెకు ఇదే చివరి సినిమా! చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన మీనాక్షి గురించే నేటి ప్రత్యేక కథనం..సినిమా ఛాన్స్కు ముందు1984 అక్టోబర్ 4న మీనాక్షి థాపర్ జన్మించింది. డెహ్రాడూన్లో తన విద్యాభ్యాసం జరిగింది. సినిమాల మీద ఆసక్తితో ముంబైలో అడుగుపెట్టింది. సినిమా ఛాన్సులు రావడానికి ముందు డ్యాన్స్ క్లాసులు నేర్పించింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత 2011లో 404 అనే హారర్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ అవలేదు.సెట్స్లో అదృశ్యంతర్వాత మధుర్ భండార్కర్ సినిమా 'హీరోయిన్'లో ఛాన్స్ వచ్చింది. కరీనా కపూర్తో యాక్ట్ చేసే అవకాశం వచ్చిందని సంబరపడిపోయింది. త్వరలోనే నటిగా గొప్ప స్థాయికి చేరుకోవచ్చని భావించింది. అంతలోనే ఆమె సంతోషాన్ని తుంచేశారు. హీరోయిన్ సినిమా కోసం సెట్స్కి రాగా అక్కడే ఆమె అదృశ్యమైంది. ఆమె ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ అర్థం కాలేదు. 2012 మార్చి 13న నటి తల్లికి ఫోన్ కాల్ వచ్చింది. రూ.15 లక్షలు డిమాండ్అందులో మీనాక్షి మాట్లాడుతూ.. తన ఫ్రెండ్స్ అమిత్ కుమార్ జైస్వాల్, ప్రీతి సురిన్తో కలిసి అలహాబాద్కు వెళ్తున్నట్లు వెల్లడించింది. మూడు రోజుల తర్వాత ముగ్గురి ఫోన్లు స్విచ్చాఫ్ అయ్యాయి. మార్చి 17న మీనాక్షి తల్లికి ఒక మెసేజ్ వచ్చింది. మీ కూతురు క్షేమంగా ఉండాలంటే రూ.15 లక్షలు పంపండి.. మూడు రోజులు మాత్రమే గడువు అని వార్నింగ్ ఇచ్చారు. పోలీసులకు చెప్తే తను దుస్తులు లేకుండా ఉన్న వీడియోలు ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తామని బెదిరించారు. రోజులు గడుస్తున్నాఈ బెదిరింపులకు నటి తల్లి లొంగలేదు. ఆర్మీలో పని చేస్తున్న తన కుమారుడితో కలిసి పోలీసులను ఆశ్రయించింది. జరిగిందంతా పూస గుచ్చినట్లు చెప్పింది. రోజులు గడుస్తున్నా మీనాక్షి ఆచూకీ దొరకలేదు. ఒకరోజు అమిత్, ప్రీతి(వీరిద్దరూ ప్రేమించుకున్నారు) బాంద్రాలోని యాక్సిక్ బ్యాంక్ ఏటీఎమ్కు చేరుకున్నారు. పోలీసులు వారిని పట్టుకుని విచారించగా అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మీనాక్షిని హత్య చేసినట్లు అంగీకరించాడు.శరీరాన్ని ముక్కలుగాఏప్రిల్ 16న పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. మీనాక్షిని కిడ్నాప్ చేసిన తర్వా ఆమె తల, మొండెం వేరు చేశారు. అలహాబాద్లో ప్రీతి ఇంటికి దగ్గర్లో ఓ సెప్టిక్ ట్యాంక్లో తన శరీరాన్ని ముక్కలుగా కోసి పడేశారు. తలను అలహాబాద్ నుంచి లక్నోకు వెళ్తుండగా మార్గ మధ్యలో బస్సులో నుంచి అడవిలో విసిరేశారు. 2018లో న్యాయస్థానంలో నిందితులిద్దరికీ జీవిత ఖైదు విధించింది.స్నేహితుల అత్యాశ వల్ల 27 ఏళ్ల వయసుకే నటి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఒక తల్లికి తీరని కడుపుకోత మిగిలింది.చదవండి: సింగర్పై బాటిల్ విసిరిన ఆకతాయి.. అయినా సహనం కోల్పోకుండా.. -
హీరామండిలో రిచా చద్దా లుక్స్.. ఫోటోలు
-
ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)
-
నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్
-
ఇస్మార్ట్ బ్యూటీ 'నభా నటేష్' ఖతర్నాక్ లుక్స్తో దుమ్మురేపిందిగా (ఫోటోలు)
-
Samantha: ఏ మాయ చేసిందో.. ఇప్పటికీ ఎంతోమంది ఫేవరెట్ హీరోయిన్ (ఫోటోలు)
-
జోడీ రిటర్న్స్
కొన్ని జంటలు ‘హిట్’ అవుతాయి. వెండితెరపై హిట్ అయిన ఆ జోడీలను మళ్లీ మళ్లీ చూడాలని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ, మళ్లీ ఆ జోడీకి తగ్గ కథ కుదరాలి, కథ కుదిరితే ఇద్దరి డేట్స్ సెట్ అవ్వాలి. ఈ రెండూ సెట్ అయి, వెంటనే రిపీట్ అయిన జోడీలు ఉంటాయి.. ఎన్నో ఏళ్లకు గానీ రిపీట్ అయ్యే జోడీలూ ఉంటాయి. అలా కొన్నేళ్ల తర్వాత రిపీట్ అవుతున్న జోడీల గురించి తెలుసుకుందాం.విశ్వంభర పిలిచాడు దాదాపు పద్దెనిమిదేళ్ల తర్వాత హీరో హీరోయిన్లుగా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు చిరంజీవి, త్రిష. ఈ ఇద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ‘స్టాలిన్’ 2006లో విడుదలైంది. ఆ తర్వాత మళ్లీ చిరంజీవి, త్రిష కలిసి నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని, సిస్టర్ సెంటిమెంట్తో పాటు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా ఈ కథలో ఉంటాయని ఫిల్మ్నగర్ సమాచారం.ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఓ షెడ్యూల్లో ఇంట్రవెల్ యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరించారు. వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ 2025 జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి కీరవాణి స్వరకర్త. షష్ఠిపూర్తి సంబరం రాజేంద్రప్రసాద్–అర్చన కలిసి నటించిన ‘లేడీస్ టైలర్’ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 1986లో విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ తర్వాత రాజేంద్రప్రసాద్, అర్చన కలిసి మళ్లీ వెంటనే మరో సినిమా చేయలేదు. 38 ఏళ్ల తర్వాత ఇప్పుడు ‘షష్ఠిపూర్తి’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్షా సింగ్ లీడ్ రోల్స్లో, ‘కాంతార’ ఫేమ్ అచ్యుత్ కుమార్, శకుంతల కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ కుటుంబకథా చిత్రానికి ఇళయరాజా స్వరకర్త. అప్పటి ‘లేడీస్ టైలర్’ సినిమాకు సంగీతం అందించిన ఇళయరాజాయే ఈ ‘షష్ఠిపూర్తి’ సినిమాకూ స్వరాలు సమకూర్చడం విశేషం. కుటుంబ విలువలు, కుటుంబ సభ్యుల అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపేష్ నిర్మిస్తున్నారు. తెరపై యాభైఆరోసారి... మలయాళ సిల్వర్ స్క్రీన్పై మోహన్లాల్, శోభనల జోడీ సూపర్ హిట్. ‘అవిడతే పోలే ఇవిడెయుమ్’ (1985) సినిమా కోసం తొలిసారి మోహన్లాల్, శోభన జత కట్టారు. ఆ తర్వాత ‘మణిచిత్ర తాళు’, ‘నాడోడిక్కట్టు’ వంటి హిట్ సినిమాలతో పాటు యాభైసార్లకు పైగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు మోహన్లాల్, శోభన. అయితే 1994లో విడుదలైన మలయాళ చిత్రం ‘తేన్మావిన్ కొంబాట్’ తర్వాత మరోసారి మోహన్లాల్, శోభన కలిసి లీడ్ రోల్స్లో నటించలేదు.ప్రస్తుతం మోహన్లాల్ హీరోగా నటించనున్న 360వ చిత్రంలో శోభన ఓ లీడ్ రోల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది మోహన్లాల్, శోభన కలిసి నటిస్తున్న 56వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో మోహన్లాల్కు జోడీగా కనిపిస్తారట శోభన. తరుణ్ మూర్తి దర్శకత్వంలో ఎమ్. రంజిత్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల మొదలైంది. ఈ చిత్రంలో మోహన్లాల్ టాక్సీ డ్రైవర్గా కనిపిస్తారని టాక్. ఈ ఏడాది ఓనమ్కు సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. పెళ్లి తర్వాత తొలి సినిమా? దాదాపు పాతికేళ్ల క్రితం తమిళ చిత్రం ‘పూవెల్లామ్ కేట్టుప్పార్’ (1999)లో తొలిసారి సిల్వర్ స్క్రీన్పై జోడీగా కనిపించారు సూర్య, జ్యోతిక. ఆ తర్వాత ‘ఉయిరిలే కలందదు, పేరళగన్, కాక్క కక్క, మాయావి’ వంటి సినిమాల్లో సూర్య, జ్యోతిక హిట్ జోడీ అనిపించు కున్నారు. చివరిసారిగా 2006లో ‘సిల్లున్ను ఒరు కాదల్’ సినిమాలో సూర్య–జ్యోతిక జోడీగా కనిపించారు.ఈ సినిమా విడుదలైన తర్వాత సూర్య, జ్యోతిక రియల్ లైఫ్ జోడీ కూడా అయ్యారు. అయితే ‘సిల్లున్ను ఒరు కాదల్’ తర్వాత సూర్య, జ్యోతిక కలిసి సినిమా చేయలేదు. పద్దెనిమిదేళ్ల తర్వాత ఆ సమయం ఆసన్నమైందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ‘కేరళ కేఫ్’, ‘బెంగళూరు డేస్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అంజలీ మీనన్ ఓ కథ సిద్ధం చేశారని, ఈ కథతో తెరకెక్కనున్న సినిమాలో సూర్య, జ్యోతిక జోడీగా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ సినిమా ఓకే అయితే పెళ్లి తర్వాత సూర్య, జ్యోతిక కలిసి నటించే చిత్రం ఇదే అవుతుంది. ఇంకా మరికొందరి హీరో హీరోయిన్ జోడీలు రిపీట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. -
అక్కడ అదృష్టం పరీక్షించుకోనున్న హీరోయిన్!
బుల్లితెర నుంచి వెండి తెరకు ప్రవేశించి ఆరంభంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారు ఐశ్వర్య రాజేశ్. ఇప్పుడు కోలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్నారు. కాక్కాముట్టై చిత్రం ఐశ్వర్య రాజేష్ కెరీర్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఆ చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించారు. అలాగే ధనుష్ కథానాయకుడిగా నటించిన వడచెన్నై చిత్రంలో బోల్డ్ పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలూ చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తూ బహుభాషా కథానాయికగా పేరు తెచ్చుకున్నారు.తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. కన్నడంలో సూపర్స్టార్ శివరాజ్ కుమార్, బాలి ధనుంజయ కలిసి నటిస్తున్న ఉత్తరాఖాండ అనే భారీ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఇందులో ఆమె నటుడు బాలి ధనుంజయకు జంటగా దుర్గి అనే ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రాన్ని రోహిత్ పడకి దర్శకత్వంలో కేఆర్జీ స్టూడియోస్ పతాకంపై కార్తీక్గౌడ, యోగి జి రాజ్ కలిసి నిర్మిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం బీజాపూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కాగా ఐశ్వర్య రాజేష్ జీవి ప్రకాష్కుమార్తో కలిసి నటించిన డియర్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తమిళంలో కరుప్పర్ నగరం, మోహన్ దాస్, తీయవర్ కులైగల్ నడుంగా చిత్రాలతో పాటు మలయాళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) చదవండి: -
కాలేజీ అమ్మాయిలా లంబసింగి హీరోయిన్ దివి.. ఫోటోలు
-
Priyanka Arul Mohan Photos: ఈ గ్లామర్ సరిపోదా అంటూ ఊపేస్తున్న హీరోయిన్ (ఫోటోలు)
-
ఒక్క చెంపదెబ్బతో జీవితమే తలకిందులు.. సోదరి వల్ల భర్తకు విడాకులు!
ఒకప్పుడు వెండితెరను ఏలింది.. మూకీ, టాకీ సినిమాల్లో కథానాయికగా నటించింది. కానీ ఒక్క దెబ్బ.. ఒకే ఒక చెంపదెబ్బ ఆమె జీవితాన్నే తలకిందులు చేసింది. హీరోయిన్ నుంచి సైడ్ క్యారెక్టర్లు చేసే స్థితికి తీసుకొచ్చింది. ఒంటి కన్నుతో విలనిజం పండించే పాత్రలు చేసుకుంటూ పోయింది.. ఆవిడే భారతీయ సినిమా తొలితరం నటి లలితా పవార్. ఆమె గురించే నేటి ప్రత్యేక కథనం.. హీరోయిన్గా, నిర్మాతగా.. మహారాష్ట్రలో 1916 ఏప్రిల్ 18న లలితా పవార్ జన్మించింది. తండ్రి లక్ష్మణ్ రావు వ్యాపారవేత్త. తొమ్మిదేళ్ల వయసులోనే లలిత నటనవైపు అడుగులు వేసింది. 1928లో వచ్చిన రాజా హరిశ్చంద్రలో బాలనటిగా కెరీర్ మొదలుపెట్టింది. 1940లో హిందీ, మరాఠీ, గుజరాతీ భాషల్లో హీరోయిన్గా సినిమాలు చేసింది. ఖైలాష్ (మూకీ చిత్రం), దునియా క్యా హై (టాకీ) చిత్రాలను నిర్మించింది. ఆమెకు వెండితెరపై తిరుగులేదు అనుకునే సమయంలో ఓ చెడు సంఘటన జరిగింది. జీవితం తలకిందులైన రోజు 1942లో 'జంగ్ ఇ ఆజాద్' సినిమాలో నటుడు మాస్టర్ భగవాన్.. ఆమె చెంప చెళ్లుమనిపించాలి. అతడు సీన్ బాగా రావాలని ఎంతో గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె చెవి నుంచి రక్తం కారింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా ఫేషియల్ పెరాలసిస్ (ముఖానికి పక్షవాతం) వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎడమ కన్ను కూడా డ్యామేజ్ అయినట్లు తెలిపారు. అలా మూడేళ్లు ఇంటికే పరిమితమైంది. తర్వాత చాలాకాలం వరకు ఒంటికన్నుతోనే సినిమాలు చేసింది. చికిత్స వికటించడం వల్లే.. అయితే వైద్యుల చికిత్స వికటించడం వల్లే తనకు శరీరం కుడివైపు కూడా పక్షవాతం వచ్చిందని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ ప్రమాదం తర్వాత తనకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. కానీ అన్నీ నెగెటివ్ పాత్రలే! అయినా అన్నింటినీ ప్రాణం పెట్టి చేసింది. గయ్యాలి అత్తగా, కుట్రలు కుతంత్రాలు చేసే దుష్టురాలిగా భయపెట్టింది. అనాది, శ్రీ 420, గోర కుంభర్.. ఇలా అనేక చిత్రాలతో దాదాపు ఏడు దశాబ్దాలపాలు సినీప్రియులను అలరిచింది. రామాయణం సీరియల్లో మందరగా నటించింది. 70 ఏళ్లపాటు ఇండస్ట్రీలో రాణించిన నటిగా గిన్నిస్ రికార్డుకెక్కింది. సొంత చెల్లితోనే ఎఫైర్ లలిత.. నిర్మాత గణపత్రావుని పెళ్లాడింది. కానీ అతడు తన సొంత చెల్లితోనే వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భరించలేకపోయింది, విడాకులిచ్చేసింది. అనంతరం నిర్మాత రాజ్ గుప్తాను పెళ్లాడింది. వీరికి జై పవార్ అనే కుమారుడు సంతానం. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో లలితకు నోటి క్యాన్సర్ వచ్చింది. అప్పటివరకు ముంబైలోనే ఉన్న ఆమె చికిత్స కోసం పుణెకు షిఫ్ట్ అయింది. నెగెటివ్ క్యారెక్టర్స్ పోషించడం వల్లే తనకు ఇలా జరిగిందని లోలోపలే మథనపడింది. 1998లో ఆమె కన్నుమూసింది. చదవండి: 'బ్రో'ని పెళ్లి చేసుకున్న నటి.. రెండేళ్లయినా పిల్లలు ఎందుకు లేరంటే? -
Malavika Mohanan: 'తంగలాన్' బ్యూటీ మాళవిక మోహనన్ గ్లామర్ ఫోటోలు వైరల్ (ఫొటోలు)
-
చీరలో 'నా సామి రంగ' బ్యూటీ.. అందం చూస్తే అసూయ పడతారేమో! (ఫోటోలు)
-
Priyamani: చీరలో మైమరిపిస్తున్న సీనియర్ హీరోయిన్ (ఫోటోలు)
-
హిట్ సినిమాలో రోల్.. నటిపై నెటిజన్స్ ట్రోలింగ్!
గుడ్నైట్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మణికందన్, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన చిత్రం లవర్. తమిళంలో ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లు సాధించింది. తెలుగులో ఫిబ్రవరి 10న 'ట్రూ లవర్'గా విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్గా ఐషు పాత్రలో నటి హరిణి సుందరరాజన్ కనిపించింది. ప్రభు రామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన లవర్ మంచి హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్రకు నెటిజన్ల ట్రోలింగ్కు గురైంది. తాజాగా తనపై వస్తున్న విమర్శలపై సోషల్ మీడియా వేదికగా నటి మండిపడింది. మీరు నాపై కోపం ప్రదర్శించడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. నా పాత్ర నచ్చకపోతే ఒక నటి పట్ల అలా నీచంగా, అగౌరవంగా ప్రవర్తించడం సరైంది కాదని ట్వీట్ చేసింది. ఇకనైనా ఇలాంటి విమర్శలకు ముగింపు పలకాలని కోరింది. కాగా.. హరిణి ఫింగర్టిప్ అనే తమిళ వెబ్ సిరీస్లో కూడా నటించింది. హీరోయిన్ స్నేహితురాలిగా.. లవర్ చిత్రంలో దివ్య (శ్రీ గౌరీ ప్రియ), అరుణ్ (మణికందన్) ప్రేమించుకుంటారు. అతనిపై అభద్రతా భావంతో అరుణను దివ్య తన మాటలతో దుర్భాషలాడుతూ ఉంటుంది. దీంతో అరుణ్కు బ్రేకప్ చెప్పాలనుకుంటుంది. అదే సమయంలో దివ్యకి స్నేహితురాలైన ఐషూ అతనితో బంధానికి ముగింపు చెప్పమని సలహా ఇస్తుంది. దీంతో నెటిజన్ల దృష్టిలో ఐషూ ఒక చెడ్డ స్నేహితురాలిగా కనిపించింది. ప్రేమ జంటకు సమస్యలు సృష్టించారంటూ ఆన్లైన్ ట్రోలింగ్కు గురైంది. చాలామంది నెటిజన్స్ ఆమె పాత్రపై కామెంట్స్ చేయడంతో హరిణి స్పందించింది. అది కేవలం సినిమాలో పాత్ర మాత్రమేనని మీకు తెలియదా? అంటూ ట్రోలర్స్కు ఇచ్చిపడేసింది. Secondly, don’t these thick heads realise that this behaviour only warrants the need for more Aishus? Disagreement does not have to be shown with disrespect. — Rini (@rinibot) April 10, 2024 This morning, I woke up to some idiots in my DMs swearing at me because they don’t like Aishu in Lover. Firstly, that they think it’s okay to be vile and disrespectful towards an actor because they didn’t like a character they played is beyond me. — Rini (@rinibot) April 10, 2024 -
నా సంపాదన.. భర్తతో పంచుకోలే: సీనియర్ హీరోయిన్
షర్మిల ఠాగూర్.. బెంగాలీ, హిందీ చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా వెలుగొందింది. సినీ ఇండస్ట్రీకి అందించిన సేవలకుగానూ ఫిలింఫేర్ లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డు పొందింది. 2013లో భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. ఈమె క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ను పెళ్లి చేసుకుంది. వీరికి సైఫ్ అలీ ఖాన్ అనే కుమారుడితో పాటు సబ, సోహ అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మన్సూర్ 2011లోనే కాలం చేశాడు. తర్వాత సినిమాలవైపే వెళ్లని షర్మిల గతేడాది గుల్మొహర్ అనే సినిమాతో మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. ముగ్గురికీ సమానంగా వీలునామా.. తాజాగా తన పర్సనల్ ఫైనాన్స్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. 'నేను కొన్న నగలు, కార్లు, ఇళ్లు.. ఇలా ఏవైనా సరే అవన్నీ నా పేరు మీదే ఉంటాయి. ఆ ఆస్తిని భర్తతో కూడా పంచుకోలేదు. అతడు కూడా తను సంపాదించిన ఆస్తులను తనే మేనేజ్ చేసుకునేవాడు. చనిపోవడానికి ముందే ఏవి ఎవరికి చెందాలనేది వీలునామా రాశాడు. నా ఆస్తులు కూడా నా ముగ్గురు పిల్లలకు సమానంగా పంచుతాను. ఆర్థిక విషయాలపై నాకంత అవగాహన లేకపోయేది. కానీ లాక్డౌన్లో నాకంటూ ఓ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్నాను. అప్పటినుంచే దీనిపై ప్రత్యేక దృష్టి సారించాను' అని చెప్పుకొచ్చింది. చదవండి: నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు చిత్రం -
‘టిల్లు’భామ : చీరలో స్టన్నింగ్ అండ్ గ్లామర్ లుక్స్ (ఫోటోలు)
-
టిల్లుతో మ్యాజిక్ సక్సెస్ : లిల్లీ అదిరిపోయే లుక్స్ (ఫొటోలు)
-
తెలుగు సినిమాతోనే కెరీర్ మొదలు.. ఎవరో గుర్తుపట్టారా?
పైన కనిపిస్తున్న హీరోయిన్ ఇప్పుడు ముగ్గురు పిల్లల తల్లి అంటే నమ్ముతారా? తల్లయినా తన అందాన్ని చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ వస్తోందీ బ్యూటీ. 17 ఏళ్ల వయసులోనే మోడలింగ్ చేసింది. 2006లో నటనారంగంలో అడుగుపెట్టింది. తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో నటించింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా...? తన పేరు వీజే మహి వినోద్. ఒకప్పుడు హీరోయిన్.. ఎవరైనా సీరియల్స్ నుంచి సినిమాలకు వెళ్తారు. కానీ ఈ నటి జర్నీ మాత్రం అందుకు రివర్స్గా ఉంటుంది. 2004లో తపన అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించింది. అదే ఏడాది అపరిచితన్ అనే మలయాళ మూవీ కూడా చేసింది. తర్వాత అవకాశాలే రాకపోవడంతో రెండేళ్లు ఎదురుచూసి సీరియల్లో నటించింది. ఆ తర్వాత 2008లో కన్నడలో ఓ సినిమా చేసి పూర్తిగా బుల్లితెరపైనే సెటిలైంది. రియాలిటీ షోలు, డ్యాన్స్ షోలు చేసుకుంటూ వచ్చిన ఈ బ్యూటీ 2020 తర్వాత మరే షోలోనూ కనిపించనేలేదు. ముగ్గురు పిల్లల బాధ్యత తనదే ఆమె పర్సనల్ విషయానికి వస్తే మహి 2011లో నటుడు జై భానుషాలిని పెళ్లాడింది. వీరికి తారా అనే కూతురు సంతానం. అలాగే రాజ్వీర్, ఖుషి అనే ఇద్దరు పిల్లలను పెంచి పోషిస్తోంది. వారికి అమ్మానాన్న ఉండటంతో దత్తత తీసుకోలేదు కానీ తరచూ ఆ పిల్లల్ని కలుసుకుంటూ ఉంటుంది. వారి పెంపకం, విద్య.. అన్ని బాధ్యతలను తన భుజాన వేసుకుంది. తన మంచి మనసుకు ఫిదా అయిన ఫ్యాన్స్ తిరిగి ఆమె సినిమాల్లోకి వస్తే బాగుండని ఆశపడుతున్నారు. View this post on Instagram A post shared by @khushiray2014 చదవండి: టిల్లు స్క్వేర్: శ్రీసత్యకు అన్యాయం! సిద్ధుతో నటించిన సీన్స్ ఎక్కడ? -
ఛాన్సులు ఇచ్చినట్లే ఇచ్చి లాక్కున్నారు: గాలిపటం హీరోయిన్
ఎరికా ఫెర్నాండేజ్.. సీరియల్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మోస్ట్ గ్లామరస్ బుల్లితెర నటిగా అవార్డులు అందుకున్న ఈ బ్యూటీ గాలిపటం, డేగ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. హిందీలో 'బబ్లూ హ్యాపీ హై' అని ఒకే ఒక్క సినిమా చేసింది. నెపోటిజం వల్ల తనకు సినీ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలే రాకుండా పోయాయని, వచ్చిన అవకాశాలను కూడా సెలబ్రిటీ కిడ్స్ ఎగరేసుకుపోయారని చెప్తోంది. ఆడిషన్కు వెళ్లేదాన్ని తాజాగా ఆమె మాట్లాడుతూ.. 'దక్షిణాది చిత్రపరిశ్రమలో నేను ఓ సినిమాకు సంతకం చేశాను. రెండు, మూడు రోజులు షూటింగ్ అయ్యాక నన్ను తీసేశారని తెలిసింది. అప్పుడే నాకు బాలీవుడ్లో ఎందుకు ట్రై చేయకూడదు అనిపించింది. చాలాసార్లు ఆడిషన్కు వెళ్లాను. ఆల్మోస్ట్ ఓకే అయిపోయిందనుకునే సమయంలో ఫేమస్ సెలబ్రిటీల కూతుర్లను హీరోయిన్గా సెలక్ట్ చేసేవారు. నన్ను పక్కన పెట్టేసేవారు. ఎంతో బాధేసేది. సినిమా అవకాశాల్లేనప్పుడు సీరియల్స్ చేశాను. మళ్లీ టీవీకి ఎందుకు వెళ్తున్నావని అడిగేవారు. ఏదైనా పనే అని నమ్మాను. సినిమా రోల్స్ అయినా, సీరియల్ పాత్రలయినా అన్నింటినీ అంతే గౌరవంగా స్వీకరించాను' అని చెప్పుకొచ్చింది. ఆ తిరస్కరణల వల్లే బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతూ.. 'గతంలో నేను ఎంత క్షోభ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. బక్కపలుచగా ఉండటంతో చాలా ప్రాజెక్టుల్లో నాకు ఛాన్సులు వచ్చినట్లే వచ్చి చేజారాయి. ఆత్మనూన్యతకు లోనయ్యాను. కానీ ఆ తిరస్కరణ వల్లే నేను మరింత బలంగా తయారయ్యాను' అని చెప్పుకొచ్చింది. ఇటీవలే ఎరికా 'లవ్ అధూర' అనే వెబ్ సిరీస్ చేసింది. చదవండి: వచ్చి ఇక్కడ పడుండు అని అరిచారు.. అన్నం కూడా తినబుద్ధి కాలే! -
నటుడి మెడలో తాళి కట్టిన హీరోయిన్ (ఫోటోలు)
-
ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాల్లేక..
సుకన్య.. ఒకప్పుడు తమిళంలో స్టార్ హీరోయిన్. తమిళంలోనే కాకుండా, మలయాళ, తెలుగు భాషల్లో అగ్ర హీరోలందరి సరసన కథానాయికగా నటించింది. ఒకప్పుడు ఎంతో ఫేమ్ అందుకున్న ఈ బ్యూటీ కొంతకాలంగా మాత్రం వెండితెరపై కనిపించడమే లేదు. అప్పటి హీరోయిన్లంతా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. కానీ ఈ బ్యూటీ మాత్రం కనిపించకుండా పోయింది. ఎన్నో ఏళ్ల తర్వాత తమిళంలో ఒకే ఒక్క సినిమా చేసింది. ఆ తర్వాత ఆమె ఊసే లేదు. కెరీర్లో వెనుకబడిపోయిన ఆమె వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. శ్రీధర్ రాజగోపాలన్ను పెళ్లాడి అమెరికాలో సెటిలైన ఈ నటి ఏడాదికే(2003లో) అతడికి విడాకులిచ్చేయడం గమనార్హం. అయినా సరే తనకు ఇష్టమైన యాక్టింగ్ను విడిచిపెట్టలేదు. మళ్లీ సినిమాల్లో ట్రై చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. కొన్ని టీవీ షోలలోనూ మెరిసింది. ప్రస్తుతం సినీ అవకాశాల్లేక ఓ సీరియల్లో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నేను సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించలేదు. పలు భాషల్లో నటించి ఎన్నో అవార్డులను అందుకున్నాను. సినిమా వల్లే నాకంటూ గుర్తింపు వచ్చింది. నాకు అవకాశాలు రాకపోవడం వల్లే సినిమాలు చేయడం లేదు. ఎవరూ నన్ను పిలవడం లేదు. మంచి ఛాన్స్ వస్తే మళ్లీ మూవీస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను' అని సుకన్య చెప్పుకొచ్చింది. చదవండి: డేనియల్ బాలాజీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. సంపాదించిన డబ్బంతా ఏమైంది? -
ఈ టాప్ హీరోయిన్ను గుర్తుపట్టారా? తెలుగులో అదే చివరి చిత్రం!
హీరోల కెరీర్కు పెళ్లనేది అడ్డంకే కాదు. కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. కొందరు పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తే మరికొందరు కాస్య గ్యాప్ ఇచ్చి రెండో ఇన్నింగ్స్ మొదలుపెడతారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ మాత్రం సినిమాలకు గుడ్బై చెప్పేసింది. ఇంతకీ ఆవిడెవరో గుర్తుపట్టారా? ఆమె సింధు మీనన్. కన్నడలో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించింది. బోలెడు సినిమాలు భద్రాచలం సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. త్రినేత్రం, శ్రీరామచంద్రులు, ఆడంతే అదో టైప్, ఇన్స్పెక్టర్, వైశాలి ఇలా పలు చిత్రాల్లో నటించింది. తనకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిన మూవీ మాత్రం చందమామ. ఈ సినిమాలో తన అల్లరి, అందానికి జనాలు ఫిదా అయిపోయారు. ఈ సినిమా బాగానే వర్కవుట్ అయినా టాలీవుడ్లో ఎక్కువగా అవకాశాలు రాలేదు. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనే సినిమాలు చేసుకుంటూ పోయింది. 2009లో వచ్చిన సిద్ధం తర్వాత తెలుగులో మరే మూవీలోనూ కనిపించలేదు. ఈ బెంగళూరు బ్యూటీ 2010లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రభును పెళ్లాడింది. వీరికి ఇద్దరు కుమారులతోపాటు ఓ కూతురు సంతానం. పెళ్లి తర్వాత ఒకే ఒక్క సినిమాలో కనిపించి వెండితెరకు దూరమైపోయింది. వార్తల్లో.. గతంలో తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచిందీ నటి. బ్యాంకుకు నకిలీ పత్రాలు సమర్పించి రూ.36 లక్షల రుణం తీసుకోవడమే కాకుండా దాన్ని సకాలంలో చెల్లించకపోవడంతో సింధుపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆ మధ్య అప్పుల బాధతో నటి ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు రాగా అవన్నీ ఉట్టి పుకార్లేనని కొట్టిపారేసింది. View this post on Instagram A post shared by Sindhu Menon Kathikeyan (@sindhu_menon17) చదవండి: ఇది కలకాలం ఉండాలంటూ తాప్సీ పోస్ట్.. పెళ్లి గురించేనా? -
Sonia Agarwal: డైరెక్టర్తో ప్రేమవివాహం- విడాకులు.. ఇప్పటికీ సింగిల్గానే! (ఫోటోలు)
-
తెలుగులో పదికి పైగా చిత్రాలు.. హీరోయిన్ను గుర్తుపట్టారా?
సినిమా ఇండస్ట్రీకి అనుకోకుండా వచ్చినవాళ్లున్నారు. కలలు కని మరీ దాన్ని సాకారం చేసుకున్నవాళ్లున్నారు. అయితే ఎవరెలా వచ్చినా ఎక్కువకాలం కొనసాగాలంటే కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు, అలా అని అదృష్టం ఒక్కటే ఉంటే సరిపోదు. ఈ రెండూ జతగా ఉంటేనే నిలదొక్కుకోగలరు. ఆ రెండింటిలో ఏది బ్యాలెన్స్ కోల్పోయినా రంగుల ప్రపంచంలో కంటిన్యూ అవడం కష్టమే! హీరోయిన్స్కైతే ఈ రెండింటితోపాటూ అందాన్ని కాపాడుకుంటూ ఉండాలి. తెలుగు సినిమాతో కెరీర్ ఆరంభం పైన కనిపిస్తున్న హీరోయిన్ తెలుగు సినిమాతోనే కెరీర్ మొదలుపెట్టింది. తన పేరు నిఖిత టుక్రాల్. 2002లో వచ్చిన హాయ్ మూవీలో కథానాయికగా మెరిసింది. వేణు, ప్రభుదేవాల 'కల్యాణ రాముడు', నితిన్ 'సంబరం', జగపతిబాబు 'ఖుషీఖుషీగా' చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. పునీత్ రాజ్కుమార్, ఫహద్ ఫాజిల్, దర్శన్ వంటి పెద్దపెద్ద హీరోల సరసన నటించింది. కన్నడ తర్వాత తెలుగులోనే ఆమెకు ఎక్కువ అవకాశాలు వరించాయి. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అలా.. ఏవండోయ్ శ్రీవారు, ఆగంతకుడు, మహారాజశ్రీ నీ నవ్వే చాలు, అవును 2, టెర్రర్.. ఇలా మొత్తం 14 సినిమాల్లో యాక్ట్ చేసింది. 2017లో గంగదీప్ సింగ్ మగోను పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలనుకుందో ఏమో కానీ రాజసింహ అని ఒకే ఒక కన్నడ చిత్రంలో చివరిసారిగా కనిపించింది. తర్వాత మరే మూవీలోనూ కనిపించనేలేదు. దాదాపు ఆరేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. అయితే మధ్యలో.. కన్నడ బిగ్బాస్ మొదటి సీజన్లోనూ పాల్గొని రెండో రన్నరప్గా నిలిచింది. ఈమెకు ఓ కూతురు కూడా ఉంది. తరచూ తనతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది నిఖిత. View this post on Instagram A post shared by Nikita Thukral (@nikkithukral) చదవండి: మొన్నేమో పెళ్లిచప్పుడే లేదంది.. ఇప్పుడేకంగా రహస్య వివాహం! -
దేవుడు నాకోసమే పంపాడు, ముంబై వెళ్లిపోతున్నా: హీరోయిన్
మలయాళ హీరోయిన్ సురభి సంతోష్ పెళ్లిపీటలెక్కింది. బాలీవుడ్ సింగర్ ప్రణవ్ చంద్రన్ను పెళ్లాడింది. హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. కొత్త లైఫ్ ప్రారంభిస్తున్న సురభికి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లి అనంతరం సురభి మాట్లాడుతూ.. 'మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. మేము ఎంగేజ్మెంట్ చేసుకుని చాలా నెలలు కావస్తోంది. ఒక ఆర్టిస్టును పెళ్లాడాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. చివరకు ఆ కల నెరవేరింది. పెళ్లి తర్వాత సినిమాలు చేస్తా ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అయినప్పటికీ అతడిని కలిసినప్పుడే నచ్చేశాడు.. తర్వాత ఇద్దరం ఒకరిగురించి ఒకరం తెలుసుకుని పెళ్లి చేసుకున్నాం. పెళ్లయిపోయిందని సినిమాలకు దూరంగా ఉండిపోను. తర్వాత కూడా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతాను. అతడు నాకెంతో సపోర్ట్గా ఉంటాడు. ప్రస్తుతం నేను ముంబైకి షిఫ్ట్ అవుతున్నాను. హనీమూన్ ఇంకా ప్లాన్ చేసుకోలేదు. అతడు నెక్స్ట్ మంత్ ఏదో షో కోసం హాంగ్కాంగ్ వెళ్తున్నాడు. నేనూ తనతోపాటు వెళ్తున్నాను. ఫస్ట్ టైమ్ అతడి లైవ్ షో చూడబోతున్నాను. నాకెలాంటి వ్యక్తి భర్తగా రావాలని కోరుకున్నానో అచ్చం అలాంటి మనిషినే ఆ దేవుడు నాకోసం పంపించాడు' అని సంబరపడిపోయింది. లాయర్ కాబోయి హీరోయిన్ కాగా తిరువనంతపురంలో పుట్టిపెరిగిన సురభి లాయర్ కాబోయి యాక్టర్ అయింది. బెంగళూరులో న్యాయవిద్యనభ్యసిస్తున్న సమయంలో తనకు అవకాశాలు రావడంతో సినీ ఇండస్ట్రీవైపు అడుగులేసింది. కుట్టనాదన్ మర్పప్పా, మై గ్రేట్ ఫాదర్, నైట్ డ్రైవ్, కినవల్లి, ఎన్ ఇంటర్నేషనల్ లోకల్ స్టోరీ వంటి పలు చిత్రాలతో మెప్పించింది. అటు ఎల్ఎల్బీ కూడా పూర్తి చేసింది. చదవండి: పిచ్చి కుక్కలా జైల్లో వేద్దామనుకున్నారంటూ నటి ఆవేదన.. గీతూ రాయల్పై పరువునష్టం దావా! -
Madhuri Dixit Photos: కుర్ర హీరోయిన్లకు కుళ్ళు పుట్టిస్తున్న ఈ స్టార్ ఎవరు?
-
పెళ్లి తర్వాత సినిమాలకు దూరం.. ఎందుకంటే?
బ్యాక్గ్రౌండ్ ఉంటే సినిమా ఎంట్రీ పెద్ద కష్టమే కాదు. ప్రతిభ ఉంటే వారిని ఆపడం ఎవరితరమూ కాదు. అందుకు శ్రీదేవి విజయ్కుమార్ ప్రత్యక్ష ఉదాహరణ. తన పేరెంట్స్ మంజుల-విజయ్ కుమార్ల నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని వెండితెరపై అడుగుపెట్టింది. బాలనటిగా తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసింది. 2002లో ఈశ్వర్ మూవీతో పదిహేనేళ్ల వయసుకే హీరోయిన్గా మారింది. సినిమాలకు దూరం నిన్నే ఇష్టపడ్డాను, నిరీక్షణ, పెళ్లికాని ప్రసాద్.. ఇలా పలు చిత్రాల్లో నటించింది. ఏడాదికి ఒకటీరెండు సినిమాలు చేసే ఈ బ్యూటీ 2009లో రాహుల్ను పెళ్లాడాక సినిమాలు తగ్గించేసింది. 2011లో వీర అనే సినిమా చేసిన ఐదేళ్లకు ఓ కన్నడ చిత్రంలో కనిపించింది. అదే ఆమె చివరి చిత్రం. తాజాగా సినిమాలకు దూరంగా ఉండటంపై శ్రీదేవి స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. 'పెళ్లయ్యాక సినిమాలు చేయొద్దని ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. నా భర్త అయితే మూవీస్ చేయమని ప్రోత్సహించాడు. టైం పట్టింది టాలెంట్ ఉంది, ఇష్టం ఉంది.. మరెందుకు చేయట్లేదని అడిగేవారు. కానీ పెళ్లి తర్వాత కొత్త లైఫ్ స్టార్ట్ చేయడంతో దానికి అలవాటు పడటానికి కాస్త సమయం పట్టింది. ఐదేళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చిన నేను దానికి దూరంగా ఉండాలని ఎన్నడూ అనుకోలేదు. పెళ్లయిన తర్వాత అనుకోకుండానే గ్యాప్ వచ్చింది. కానీ తర్వాత ఏదో ఒక షో ద్వారా ఇండస్ట్రీలోనే ఉంటున్నాను' అని శ్రీదేవి చెప్పుకొచ్చింది. చదవండి: OTT: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ మూవీ -
మరో ఆఫర్ అందుకున్న మలయాళ సెన్సేషన్
కోలీవుడ్లో కథానాయకుడిగా, నిర్మాతగా తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంసాదించుకున్నాడు హీరో విష్ణువిశాల్. ఈయన ఇంతకు ముందు కథానాయకుడిగా నటించిన రాక్షసన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు రామ్కుమార్.. విష్ణువిశాల్తో మరో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. ఇది విష్ణువిశాల్ నటిస్తున్న 21వ చిత్రం అవుతుంది. ఇటీవలే షూటింగ్ మొదలవగా.. హీరోయిన్ ఎవరన్నది వెల్లడించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం మలయాళ నటి మమితా బైజు నటించనున్నట్లు ఆమె ఫొటో వైరలవుతోంది. ఆల్రెడీ ఆమె షూటింగ్ సెట్స్లో అడుగుపెట్టిందని ప్రచారం జరుగుతోంది. ఈమె ఇటీవల వచ్చిన మలయాళ చిత్రం ప్రేమలుతో ఓవర్నైట్ స్టార్గా మారిపోయింది. ఇప్పటికే ఆమె కోలీవుడ్లో జీవీ.ప్రకాశ్కుమార్ సరసన రెబల్ చిత్రంలో నటించింది. ఈమె నటించిన తొలి తమిళ చిత్రం ఇదే. ఇది ఈ నెల 15వ తేదీన తెరపైకి రానుంది. తాజాగా ఇప్పుడు విష్ణువిశాల్ సరసన నటించే అవకాశం ఈ భామను వరించిందన్న మాట. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని దర్శకుడు రామ్కుమార్.. రాక్షసన్ చిత్రానికి భిన్నంగా ప్రేమతో కూడిన ఫాంటసీ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. చదవండి: ధనుష్ మా కుమారుడే అంటూ పిటిషన్.. తీర్పు ఇచ్చిన కోర్టు -
పెళ్లిచూపులు హీరోయిన్ బర్త్డే స్పెషల్ ఫోటోలు..
-
దేవర బ్యూటీ చీర సోయగాలు,ఒక్కసారి చూస్తే..! (ఫొటోలు)
-
తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన మరో స్టార్ హీరోయిన్
'కల్కి' హీరోయిన్ దీపికా పదుకొణె.. తాను తల్లి కాబోతున్నట్లు ఈ మధ్యే అనౌన్స్ చేసింది. దీంతో అందరూ ఈ బ్యూటీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగిస్తూ మరో స్టార్ హీరోయిన్ ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ఈమె ప్రముఖ హీరోకి భార్య కావడం విశేషం. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరు? ఎప్పుడు బిడ్డకు జన్మనివ్వనుంది? (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) కన్నడలో స్టార్ హీరోయిన్ మిలానా నాగరాజ్. అప్పట్లో పలువురు అగ్రహీరోలతో కలిసి సినిమాలు చేసిన ఈమె.. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీకే చెందిన డార్లింగ్ కృష్ణ అనే హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2021లో వీళ్ల వివాహం జరిగింది. 2013 నుంచి నటిస్తున్న ఈమె.. పెళ్లి తర్వాత కూడా ఓవైపు హీరోయిన్గా చేస్తూనే మరోవైపు నిర్మాతగానూ పలు చిత్రాలు తీస్తోంది. మిలానా నాగరాజ్ లేటెస్ట్ మూవీ 'ఫర్ రెన్'... రెండు వారాల క్రితమే అంటే ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఈమె చేతిలో 'అరామ్ అరవింద స్వామి' అనే సినిమా ఉంది. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు తాను ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు చెప్పి అందరికీ షాకిచ్చింది. సెప్టెంబరులో తాను బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో అందరూ రియల్ లైఫ్ హీరోహీరోయిన్ జోడీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: 'గామి' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Milana Nagaraj (@milananagaraj) -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా హీరోయిన్
టాలీవుడ్లోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. మరోవైపు పాత హీరోయిన్లు మెల్లమెల్లగా కనుమరుగు అవుతూనే ఉంటారు. ఫ్లాప్స్ పడ్డోళ్లు వెళ్లపోయారంటే ఓ అర్థముంది. కానీ బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన తర్వాత కొందరు బ్యూటీస్ సైడ్ అయిపోతుంటారు. ఈ బ్యూటీది కూడా సేమ్ అలాంటి స్టోరీనే. తెలుగులో ఒక్కటే సినిమాతో అద్భుతమైన క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాల్నే పక్కనబెట్టేసింది. మరి ఈమెని గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి కళ.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్) పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మూన్ మూన్ బెనర్జీ. కనీసం ఈ పేరు కూడా ఎప్పుడూ విన్నట్లు లేదే అని అనుకుంటున్నారా? కంగారూ పడకుండి. గోపీచంద్కి హీరోగా బ్రేక్ ఇచ్చిన ఫస్ట్ మూవీ 'యజ్ఞం' గుర్తుందా? అందులో హీరోయిన్గా చేసింది ఈమెనే. కోల్కతాకు చెందిన మూన్ మూన్ బెనర్జీ.. 1997 నుంచి హిందీ సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో హీరోయిన్గా ఛాన్స్ రావడంతో తెలుగులో మూవీ చేసింది. మరి ఏమైందో ఏమో గానీ 'యజ్ఞం' తర్వాత తెలుగుతో పాటు వేరే ఏ భాషలోనూ సినిమా చేయలేదు. సీరియల్స్ మాత్రం చేస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా 'దోరీ' అనే సీరియల్లో నటిస్తోంది. అయితే టాలీవుడ్లో చేస్తున్నప్పుడు యుక్త వయసులో ఉంది. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా కనిపించలేదు. తాజాగా వయసు పెరగడంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. ఇకపోతే 2010లో నీరజ్ శర్మ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Moon banerrjee (@moonbanerrjee) -
51 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రీ ఎంట్రీకి రెడీ!
తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఓ స్టార్ హీరోయిన్ చాలాకాలం తర్వాత రీఎంట్రీకి సిద్ధమైంది. దాదాపు 35 చిత్రాల్లో నటించిన ఈమె తెలుగులో కేవలం మూడే ముడు సినిమాలు చేయగా ఎక్కువగా బాలీవుడ్లోనే బిజీ అయింది. ఆమె నటించిన చివరి చిత్రం ఇన్సానియత్. ఈ మూవీ 1994లో విడుదలైంది. ఆ తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? పెళ్లి- విడాకులు ఆమె పేరు సోనమ్ ఖాన్. సామ్రాట్ అనే తెలుగు చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. తర్వాత హిందీలోనే వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. మధ్యమధ్యలో.. సూపర్స్టార్ కృష్ణ 'ముగ్గురు కొడుకులు' (ఇందులో రమేశ్ బాబుకు జంటగా నటించింది), మోహన్బాబు- చిరంజీవి 'కొదమసింహం' చిత్రాల్లో కనువిందు చేసింది. దర్శకరచయిత, నిర్మాత రాజీవ్ రాయ్ను పెళ్లి చేసుకున్న తర్వాత నెమ్మదిగా సినిమాలకు దూరమైంది. అయితే వైవాహిక జీవితంలో చికాకులు ఎదురవడంతో 2016లో ఆయనకు విడాకులిచ్చేసింది. 30 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న సోనమ్ 51 ఏళ్ల వయసులో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. వారికి నేను తెలీదు 'త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తున్నాను. చాలా ఆఫర్లు వస్తున్నాయి.. వాటి గురించి ఆలోచిస్తున్నాను. 40 కంటే తక్కువ వయసున్న వాళ్లకు నేను తెలిసి ఉండకపోవచ్చు. నన్నెవరూ గుర్తుపట్టడం లేదేంటని ఫీలవను. గతంలో ఈ ఇండస్ట్రీలో ఉన్నాను, ఇప్పుడు మళ్లీ ఇక్కడికే వచ్చాను.. ఇక మీదట కూడా ఇక్కడే కొనసాగుతాను, మీరంతా మళ్లీ గుర్తుపెట్టుకునేలా చేస్తాను. ఓటీటీకే నా ఓటు కమ్బ్యాక్ అనేది తప్పేం కాదు, అలాంటప్పుడు నేను తిరిగి ఇండస్ట్రీకి రావడం కూడా సబబైనదే! ఓటీటీలో హీరోహీరోయిన్లు ఉండరు.. కథ, అందులోని పాత్రలే బలంగా కనిపిస్తాయి. సినిమానా? ఓటీటీనా? అని అడిగితే నేనైతే ఓటీటీకే ఓటేస్తాను. ఏదైనా వెబ్సిరీస్లో నటించాలనుంది. నాతో పాటే కథ సాగాలి.. అలాంటి ఛాన్స్ వస్తేనే చేస్తా.. ఇలా అన్నానని నాకు ఇగో ఉందనుకోకండి' అని ముసిముసిగా నవ్వేసింది సోనమ్. చదవండి: కొత్త ప్రియుడితో కలిసి మాజీ లవర్కు చుక్కలు చూపించిన నటి.. బ్రేకప్ మంచిదే అంటూ.. -
రవితేజ వల్ల మాలాంటి వారికి ఇబ్బందులు: తేజ సజ్జా కామెంట్స్ వైరల్!
ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్తో సూపర్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. పెద్ద సినిమాలతో పోటీపడి మరీ సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఈ సినిమాలో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైన బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. మహేశ్బాబు- గుంటూరు కారం, వెంకటేష్- సైంధవ్, నాగార్జున- నా సామిరంగా చిత్రాలతో పోటీపడి నిలిచింది. అయితే ప్రస్తుతం ఈగల్ సినిమాతో ప్రేక్షకులను పలరించేందుకు వస్తోన్న మాస్ మహారాజా రవితేజ.. తేజ సజ్జాతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా హనుమాన్ హీరో తేజ సజ్జా ఆయనకు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు. వీరిద్దరి మధ్య జరిగిన ఓ ఫన్నీ సమస్యను గురించి ప్రస్తావించారు. రవితేజ వల్ల ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త హీరోలు చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ చెప్పి షాకిచ్చాడు తేజ సజ్జా. (ఇది చదవండి: దేవర భామకు బిగ్ ఛాన్స్.. ఏకంగా రూ.500 కోట్ల సినిమాలో!) మీరు చేసే ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఎందుకు ఉంటున్నారు? అంటూ రవితేజను తేజ సజ్జా ప్రశ్నించారు. టైగర్, రావణాసుర సినిమాల్లో అలాగే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. అందువల్ల మాలాంటి యంగ్ హీరోలకు చాలా ప్రాబ్లమ్ అవుతోంది. మీరు చేసే సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు. మీరు ఏడాదికి మూడు చిత్రాలు చేస్తున్నారు. దాదాపు 12మందిని ఆడిషన్స్ చేస్తారు. దీంతో ఎవరినీ అడిగినా.. మేం రవితేజతో సినిమా చేస్తున్నాం. ఆ తర్వాతనే చేస్తామని చెబుతున్నారు. మీరు ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ను తీసుకోవడం వల్ల మాలాంటి యువ హీరోలు ఇబ్బందులు పడుతున్నారు' అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు తేజ సజ్జా. కాగా.. రవితేజ నటించిన ఈగల్ కావ్య తాపర్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా.. పోటీ పెరగడంతో పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఫిబ్రవరి 9న విడుదలవుతోన్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. -
నేను హీరోయిన్గా పనికిరానని అవమానించారు.. ఇప్పుడు..
ప్రతిభ కలిగిన నటీమణుల్లో నటి ఇనయ ఒకరు. వాంగ చుడవా చిత్రంలో హీరోయిన్గా నటించి తానేమిటో నిరూపించుకుందీ బ్యూటీ. మాతృభాష మలయాళం అయినా తమిళంలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఇనయ ఎలాంటి పాత్రనైనా చాలెంజ్గా తీసుకుని నటించగలదు. ఒక పక్క హీరోయిన్గా బిజీగా ఉంటూనే, మరో పక్క వ్యాపార రంగంలోనూ రాణిస్తోంది. ఈమె అనోరా ఆర్ట్ స్టూడియో పేరుతో మహిళా దుస్తుల వ్యాపారాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహిస్తోంది. ఈమె ఈ వ్యాపారాన్ని ప్రారంభించి ఏడాదయ్యింది. బర్త్డే సెలబ్రేషన్స్ ఈ సందర్భంగా తన షాపు తొలి వార్షికోత్సవాన్ని, తన పుట్టినరోజు వేడుకను మంగళవారం ఘనంగా నిర్వహించింది. ఈ పార్టీకి పలువురు సినీ ప్రముఖులు, తన సంస్థ సిబ్బంది పాల్గొని ఇనయాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో ఇనయ మాట్లాడుతూ.. తాను హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ తుక్కుదురై. ఇందులో యోగిబాబు హీరోగా నటించారు. ఇది వినోదభరిత కథా చిత్రంగా ఉంటుంది. నేను పనికిరానన్నాడు ఈ తరహా కామెడీ కథా చిత్రంలో నటించడం నాకు ఇదే తొలిసారి! తొలి రోజుల్లో ఒక దర్శకుడు నేను సినిమాకు పనికి రానని అవమానించారు. అలాంటిది ఇప్పుడు తమిళం, మలయాళం భాషల్లో హీరోయిన్గా అలాగే వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నాను. నాకు దర్శకత్వం వహించాలని ఆసక్తి ఉంది. అందుకు కథలు కూడా రెడీగా ఉన్నాయి. అయితే డైరెక్టర్గా మారడానికి ఇంకా సమయం ఉంది' అని ఇనయ పేర్కొంది. చదవండి: నెల తిరగకుండానే ఓటీటీలోకి రానున్న విజయ్ సేతుపతి థ్రిల్లర్ సినిమా -
నాన్న లేకపోయుంటే తినడానికి తిండి కూడా దొరికేది కాదు!
కొన్ని సినిమాలు చూసి ఆనందించేలా ఉంటాయి. కొన్ని కళ్లు చెమ్మగిల్లేలా చేస్తాయి. మరికొన్ని మనల్ని వెంటాడుతాయి.. ఆలోచనల్ని ప్రేరేపిస్తాయి. ఈ భావోద్వేగాలన్నింటి సమ్మేళనమే 12th ఫెయిల్. ఈ సినిమాలో వినోదం ఉంది. అంతకుమించిన ఉద్వేగమూ ఉంది. మనసుల్ని మెలిపెట్టే సన్నివేశాలు బోలెడు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచే అంశాలకు కొదవే లేదు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో గుర్తుండిపోయే చిత్రం 12th ఫెయిల్. నాన్న మీదే ఆధారపడ్డా.. ఇందులో విక్రాంత్ మాస్సే హీరోగా నటించగా మేధా శంకర్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. గత రెండువారాలుగా హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా అటు థియేటర్లలో ఇప్పటికీ వసూళ్లు రాబడుతుండటం విశేషం. తాజాగా హీరోయిన్ మేధా శంకర్ తను ఎదుర్కొన్న ఇబ్బందులు, చేదు సంఘటనలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. 'నా జీవితంలో 2020 ఎంతో కష్టంగా గడిచింది. ఆ ఏడాది నేను పూర్తిగా మా నాన్న జీతం మీదే ఆధారపడ్డాను. అతడి వల్లే ముంబైలో బతకగలిగాను. నాన్నతో గనక కలిసి ఉండకపోయుంటే ఇక్కడ అద్దెలు కట్టేదాన్నే కాదు, కడుపు నిండా తినే దాన్నే కాదు. మూడుసార్లు నన్ను తీసేశారు 2020లో నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. చాలా బాగా నటిస్తానంటూ కొన్ని వెబ్ సిరీస్లకు నన్ను హీరోయిన్గా సెలక్ట్ చేశారు. అలా వరుసగా మూడు పెద్ద ప్రాజెక్టులు కూడా వచ్చాయి. కానీ చివరకు నా బదులుగా మరొకరిని తీసుకున్నారు. ఈ నమ్మకద్రోహాలను నేను భరించలేకపోయాను. మూడుసార్లు ఇలాగే జరగడంతో కుంగిపోయాను' అని చెప్పుకొచ్చింది. కాగా 12th ఫెయిల్ సినిమాలో మేధా శంకర్ ఐఆర్ఎస్ అధికారిణి శ్రద్ధా జోషి పాత్రలో కనిపించింది. చదవండి: గుంటూరు కారం టీమ్కు పార్టీ ఇచ్చిన మహేశ్బాబు.. -
హీరోయిన్గా మరో ఛాన్స్ కొట్టేసిన సీరియల్ నటి
నటి ప్రీతి అస్రాణీని మరో అవకాశం వరించింది. మొదట్లో ఈమె శశికుమార్ హీరోగా నటించిన అయోత్తి మూవీలో ఆయనకు జంటగా నటించింది. ఇస్లాం మతానికి చెందిన యువతిగా చక్కని హావభావాలను ప్రదర్శించింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు ప్రీతికి సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభించాయి. అంతేకాకుండా ఇటీవల జరిగిన చైన్నె అంతర్జాతీయ చిత్రోత్సవాలలో 'అయోత్తి' సినిమాకు గానూ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది. అయితే పెద్దగా సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. ఇంతకుముందు తమిళం, తెలుగు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈమె టీవీ సీరియళ్లలోనూ నటించింది. ఒక హిట్ చిత్రంలో నటించినా పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. అలాంటిది ఈమెకు తాజాగా ఒక చిత్రంలో నటించే అవకాశం వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. ఇంతకుముందు దాదా వంటి హిట్ చిత్రంలో నటించిన నటుడు కవిన్ తాజాగా కిస్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సతీష్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్లనుంది. ఇందులో కవిన్కు జంటగా ప్రీతి అస్రాణీని ఎంపిక చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Preethi Anju Asrani (@thepreethiasrani) చదవండి: లక్షలు నష్టపోయిన ప్రముఖ నటి.. మరీ అలా భయపెట్టేసరికి! -
ఇండస్ట్రీని వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకున్నా..
మంజరి ఫడ్నీస్.. 'రోక్ సకో టు రోక్ లో(2004)' అనే హిందీ చిత్రంతో సినీ ప్రయాణం మొదలుపెట్టింది. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇంకోసారి, శుభప్రదం సినిమాల్లో హీరోయిన్గా.. శక్తి మూవీలో కీలక పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత టాలీవుడ్లో కనిపించనేలేదు. తమిళ, కన్నడ, మలయాళ, మరాఠి, హిందీ భాషల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య ఓటీటీ ప్రాజెక్టులతో బిజీ అయింది. సెకండ్ హీరోయిన్గా అడిగారు తాజాగా ఆమె తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను మీడియాతో పంచుకుంది. మంజరి మాట్లాడుతూ.. 'జానే తు యా జానే నా(2008) సినిమా తర్వాత హీరోయిన్గా చాలా అవకాశాలు వస్తాయనుకున్నాను. కానీ అది జరగలేదు. కొన్ని యాక్షన్ సినిమాలు చేశాను తప్పితే.. అన్నింటిలోనూ సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడిగారు. తక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించడానికి నాకు మనసు ఒప్పలేదు. అందుకని మంచి ఛాన్సుల కోసం ఎదురుచూస్తూ ఉండిపోయాను. సంతృప్తి చెందలే.. మల్టీస్టారర్ సినిమాల్లో అవకాశాలు వస్తే చేశాను. దీనివల్ల నాకు మంచి జరిగిందేమో కానీ నటిగా నాకంత సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. 2017లో సినిమాలకు కొంతకాలం పాటు బ్రేక్ ఇద్దామనుకున్నాను. ఇండస్ట్రీని వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోదామనుకున్నాను. మళ్లీ చదువు కంటిన్యూ చేద్దామనుకున్నాను. అప్పుడు థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేసి స్కిల్స్ పెంచుకున్నాను. ఓటీటీల పుణ్యమా అని.. ఓటీటీల రాకతో నా దశ తిరిగింది. 2019లో బరోత్ హౌస్ అనే సినిమా చేశాను. ఇది నేరుగా ఓటీటీలో(జీ5లో) రిలీజైంది. ఈ ఒక్క సినిమా నా తలరాతనే మార్చేసింది. గతంలో కంటే మెరుగైన, ప్రాధాన్యమున్న పాత్రలు నాకు ఆఫర్ చేశారు. అలా మాసూమ్, మియా బివి ఔర్ మర్డర్, ద ఫ్రీలాన్సర్ అనే వెబ్ సిరీస్లు చేశాను' అని చెప్పుకొచ్చింది మంజరి ఫడ్నీస్. చదవండి: అనుహ్యంగా ఓటీటీలో రిలీజైపోయిన సుధీర్ కొత్త సినిమా.. అలాంటి కాన్సెప్ట్తో