jio
-
మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్.. స్టార్లింక్తో జియో ఒప్పందం
శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను భారతదేశంలో ప్రవేశపెట్టడానికి రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ సహకారం డిజిటల్ అంతరాన్ని పూడ్చడంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మారుమూల, సరైన డిజిటల్ కనెక్టివిటిలేని ప్రాంతాల్లో కమ్యునికేషన్ సేవలను అందించేందుకు తోడ్పడుతుందని నమ్ముతున్నారు. ఇప్పటికే ఎయిర్టెల్ కూడా దేశంలోని తన వినియోగదారులకు స్టార్లింక్ సేవలు అందించేందుకు స్పేస్ఎక్స్తో ఒప్పందం చేసుకుంది.భారత్లో స్టార్లింక్ సేవలు ప్రారంభం కావాలంటే రెగ్యులేటరీ అనుమతులు అవసరమవుతాయి. అందుకోసం కంపెనీ ట్రాయ్ వద్ద అనుమతులకు అవసరమైన పత్రాలు దాఖలు చేసింది. దీనిపై తుని నిర్ణయం వెలువడకుముందే దేశీయ టెలికాం కంపెనీలు స్పేస్ఎక్స్తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం దేశంలోని అన్ని ప్రాంతాల్లోని కస్టమర్లకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు చేస్తున్న కృషిని హైలైట్ చేస్తుంది. జియో ఫైబర్, జియోఎయిర్ ఫైబర్ వంటి ప్రస్తుత బ్రాడ్బ్యాండ్ సర్వీసులను స్టార్లింక్ భర్తీ చేయనుంది. సాంప్రదాయ ఫైబర్ నెట్వర్క్లు విస్తరించే అవకాశం ఉన్న ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించడం ఈ భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది.విస్తృతమైన రిటైల్ నెట్వర్క్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా స్టార్లింక్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని జియో యోచిస్తోంది. అందుకు అవసరమైన ఇన్స్టలేషన్, యాక్టివేషన్, సర్వీస్ అవసరాలకు అనుగుణంగా కస్టమర్ సపోర్ట్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తుంది. వినియోగదారులకు సరసమైన, విశ్వసనీయమైన బ్రాండ్బ్యాండ్ కనెక్టివిటీని అందించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు కంపెనీ పేర్కొంది. రిలయన్స్ జియో గ్రూప్ సీఈఓ మాథ్యూ వోమెన్ ఈ భాగస్వామ్యంపై స్పందిస్తూ..‘జియో బ్రాండ్బ్యాండ్ ఎకోసిస్టమ్లో స్టార్లింక్ను అనుసంధానించడం ద్వారా కనెక్టివిటినీ విస్తరిస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యుగంలో హై-స్పీడ్ బ్రాండ్బ్యాండ్ అవకాశాలను పెంచుతున్నాం’ అన్నారు. స్పేస్ఎక్స్ ప్రెసిడెంట్, సీఓఓ గ్విన్ షాట్వెల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ భారతదేశ డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడానికి జియోతో కలిసి పనిచేయడం పట్ల ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: ఎస్బీఐ యూపీఐ సేవల్లో అంతరాయంషరతులకు అంగీకారందేశంలో శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలకు సంబంధించిన షరతులను స్టార్లింక్ అధికారికంగా ఇప్పటికే అంగీకరించింది. ఈ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్ పొందడానికి భారత ప్రభుత్వం విధించిన నియమాలకు కట్టుబడి ఉంటానని తెలిపింది. స్టార్లింక్ భారత్లో ప్రవేశించేందుకు ఇది కీలక పరిణామమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలని స్టార్లింక్ ఎప్పటినుంచో యోచిస్తోంది.యూజర్ డేటాను దేశంలోనే నిల్వ చేసేలా..ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కంపెనీ మొత్తం యూజర్ డేటాను దేశంలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో ఈ సమాచారాన్ని నిర్ధారించుకోవాలి. దీనికి స్టార్లింగ్ అంగీకరించింది. అయితే ఇటీవల టెలికమ్యూనికేషన్స్ విభాగానికి (DoT) రాసిన లేఖలో స్టార్లింక్ కొన్ని షరతులను సడలించాలని అభ్యర్థించింది. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత కాలక్రమేణా వాటిని పాటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం కీలకం కానుంది. -
జియో కొత్త ప్లాన్.. జియోహాట్స్టార్ ఫ్రీ
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం కొత్త రూ.195 డేటా-ఓన్లీ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ డేటా యాడ్-ఆన్ వోచర్గా వస్తుంది. ఇది అదనపు డేటాతోపాటు జియోహాట్స్టార్ ఉచిత సబ్స్క్రిప్షన్ను కలిగి ఉంటుంది. ప్రత్యేక సబ్స్క్రిప్షన్ కొనుగోలు చేయకుండా జియోహాట్స్టార్లో లైవ్ క్రికెట్, ఇతర కంటెంట్ను వీక్షించాలనుకునే వారి కోసం ఈ ప్లాన్ను రూపొందించారు.రూ.195 ప్లాన్ ప్రయోజనాలురూ.195 డేటా ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. 15GB డేటాను అందిస్తుంది. క్రీడలు, వినోద ప్రియులకు ఇది తగిన ఎంపికగా ఉంటుంది. ఇతర ప్రామాణిక రీఛార్జ్ ప్లాన్ల మాదిరిగా ఈ ఆఫర్లో వాయిస్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. గుర్తించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో లభించే జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్ 90 రోజుల మొబైల్ ప్లాన్ మాత్రమే. అంటే యూజర్లు జియోహాట్స్టార్ను మొబైల్లో మాత్రమే వీక్షించగలరు.రీచార్జ్ ఇలా..వినియోగదారులు ఈ ఆఫర్ను మైజియో (MyJio) యాప్, జియో వెబ్సైట్ లేదా అధీకృత జియో రిటైలర్ల ద్వారా పొందవచ్చు. రీఛార్జ్ ప్రక్రియ ఇతర జియో ప్రీపెయిడ్ ప్లాన్ల మాదిరిగానే ఉంటుంది. థర్డ్-పార్టీ రీఛార్జ్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.మరో ప్లాన్రూ.195 డేటా ప్లాన్తోపాటు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా వచ్చే మరో స్టాండర్డ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. అదే రూ.949 ప్లాన్. దీనికి 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 2GB రోజువారీ డేటా, అపరిమిత 5G డేటా, 84 రోజుల పాటు జియో హాట్స్టార్ ఉచిత మొబైల్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలను ఈ ప్లాన్ అందిస్తుంది. -
స్మార్ట్ టీవీలకు జియో ఆపరేటింగ్ సిస్టమ్
స్మార్ట్ టీవీల కోసం దేశీయంగా తొలి ఆపరేటింగ్ సిస్టమ్ జియోటెలి ఓఎస్ను ఆవిష్కరించినట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. దీనితో తయారైన థామ్సన్, కొడక్, బీపీఎల్, జేవీసీ వంటి బ్రాండ్స్కి చెందిన స్మార్ట్ టీవీలు ఫిబ్రవరి 21 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఈ ఏడాది మరిన్ని బ్రాండ్స్ చేతులు కలిపే అవకాశం ఉందని వివరించింది.ఇదీ చదవండి: యూఎస్తో డీల్పై ఆందోళన అక్కర్లేదుభారతీయ వినియోగదారుల అవసరాలను తీరుస్తూ, సరికొత్త వినోద అనుభూతిని అందించే కొత్త తరం ప్లాట్ఫాంగా జియోటెలి ఓఎస్ను జియో అభివరి్ణంచింది. ఈ విభాగంలో గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ, వెబ్ఓఎస్, శాంసంగ్ టైజెన్లతో జియోటెలి ఓఎస్ పోటీపడనుంది. కౌంటర్పాయింట్ రీసెర్చ్ ప్రకారం భారత్లో స్మార్ట్ టీవీల మార్కెట్ 1.34 కోట్ల యూనిట్గా ఉండగా, ఆదాయాలు సుమారు రూ. 52 వేల కోట్ల స్థాయిలో ఉన్నాయి. ఓపెన్ సెల్స్పై కస్టమ్స్ సుంకాలు తగ్గిస్తూ బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలతో స్థానికంగా డిస్ప్లేల అసెంబ్లింగ్కి ఊతం లభించి, అంతిమంగా తయారీ సంస్థలకు ఖర్చులు 5–10% ఆదా కాగలవని కౌంటర్పాయింట్ రీసెర్చ్ వీపీ (రీసెర్చ్) నీల్ షా చెప్పారు. -
జియో థింగ్స్తో ప్యూర్ ఈవీ ఒప్పందం
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ప్యూర్ ఈవీ(PURE EV) తన ఉత్పత్తుల్లో స్మార్ట్ డిజిటల్ క్లస్టర్లను ఏకీకృతం చేయడానికి జియో ప్లాట్ఫామ్ లిమిటెడ్ అనుబంధ సంస్థ జియో థింగ్స్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం వల్ల అధునాతన ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) పరిష్కారాలు, అంతరాయం లేని కనెక్టివిటీ, పూర్తి డిజిటల్ ఇంటిగ్రేషన్ను అందించేందుకు తోడ్పడుతుందని కంపెనీ తెలిపింది.జియోథింగ్స్ ఇంటిగ్రేషన్ సాయంతో ద్విచక్రవాహనంలో ఎంటర్టైన్మెంట్, నావిగేషన్ సేవలు వంటివాటిని వాయిస్ ద్వారా నియంత్రించవచ్చని సంస్థ పేర్కొంది. వాహనదారులు వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా వాహనంలోని టెక్నాలజీ ఇంటర్ఫేస్ను మార్చుకోవచ్చు. అందుకోసం వాయిస్ కమాండ్లను ఉపయోగించవచ్చు. దాంతో మెరుగైన రైడింగ్ అనుభూతిని పొందవచ్చని కంపెనీ స్పష్టం చేసింది.ప్యూర్ ఈవీ జియోథింగ్స్ స్మార్ట్ డిజిటల్ క్లస్టర్ల సాయంతో ఎండ్-టు-ఎండ్ ఐఓటీ పరిష్కారాలు అందించేందుకు ప్రయత్నిస్తుంది. వాహనాల పనితీరును ట్రాక్ చేయడానికి 4G కనెక్టివిటీ ఎనేబుల్ చేసిన టెలిమాటిక్స్ ద్వారా రియల్ టైమ్లో వాహనం కండిషన్ను పర్యవేక్షించవచ్చు. ఇందుకోసం జియోథింగ్స్ 4జీ స్మార్ట్ డిజిటల్ క్లస్టర్ ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ (ఏఓఎస్పీ) ‘అవ్ని ఓఎస్’ను ఉపయోగిస్తుంది. ఇది రియల్ టైమ్ డేటా అనలిటిక్స్, టూ వీలర్ ఇంటర్ఫేస్ కస్టమైజేషన్, ఫుల్ హెచ్డీ టచ్స్క్రీన్ డిస్ప్లే కంపాటబిలిటీని అందిస్తుంది. జియోస్టోర్, మ్యూజిక్ స్ట్రీమింగ్, వెబ్ బ్రౌజింగ్, హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ అసిస్టెన్స్, నావిగేషన్, గేమింగ్తోపాటు మరెన్నో సదుపాయాలను అందిస్తున్నారు.ఇదీ చదవండి: రూ.80 వేలు ఇన్వెస్ట్ చేస్తే రూ.1.15 లక్షలు గ్యారెంటీ!జియో థింగ్స్ ఐఓటీ టెక్నాలజీ సాయంతో ప్యూర్ ఈవీ ఉత్పత్తులను పరిశ్రమ అత్యున్నత ప్రమాణాలకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు, ఎండీ డాక్టర్ నిశాంత్ డోంగారి అన్నారు. వాహనాల సామర్థ్యం, ఎలక్ట్రిక్ మొబిలిటీని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సంస్థ వినియోగదారులకు సాంకేతికత సాయంతో మెరుగైన కనెక్టివిటీ, ఫంక్షనాలిటీని అందించనున్నట్లు చెప్పారు. జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్ ఆశిష్ లోధా మాట్లాడుతూ.. ‘ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలో సృజనాత్మకతను పెంచుకోవాలనుకునే ప్యూర్ ఈవీ వంటి సంస్థతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. మా అధునాతన ఐఓటీ పరిష్కారాలను ఏకీకృతం చేయడం ద్వారా వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం’ అన్నారు. -
జియో హాట్స్టార్ ఆవిష్కరణ.. ఇకపై ఐపీఎల్ ఫ్రీ కాదు!
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ కంపెనీల అనుబంధ సంస్థలుగా ఉన్న జియోస్టార్, జియో సినిమా, డిస్నీ + హాట్స్టార్లను పరస్పరం విలీనం చేస్తూ సమగ్ర స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ‘జియో హాట్స్టార్(JioHotStar)’ను అధికారికంగా ప్రారంభించారు. ఈ విలీనంతో దేశంలోని తమ వినియోగదారులకు వినోదం, క్రీడలతోపాటు మరెన్నో ఎంటర్టైన్మెంట్ సదుపాయాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇరు సంస్థల అధికారులు తెలిపారు.సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ఇలా..జియో హాట్ స్టార్ హైబ్రిడ్ సబ్ స్క్రిప్షన్ మోడల్ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం హాలీవుడ్ సినిమాలు మినహా ప్రతి నెలా పరిమిత గంటల పాటు వినియోగదారులు కంటెంట్ను ఉచితంగా వీక్షించవచ్చు. అంతకుమించి వీక్షించాలంటే మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఐపీఎల్ను జియో, హాట్స్టార్లు ఫ్రీగా అందించేవి. కానీ మ్యాచ్ను పూర్తిగా వీక్షించాలంటే మాత్రం ఇకపై ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రకటనలతో కేవలం మొబైల్ మాత్రమే వీక్షించాలంటే త్రైమాసికానికి రూ.149 నుంచి సబ్స్క్రిప్షన్ ప్లాన్లు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. యాడ్-ఫ్రీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ త్రైమాసికానికి రూ.499గా నిర్ణయించారు. రెండు డివైజ్లకు సపోర్ట్ చేసేలా రెండు సూపర్ ప్లాన్ల(యాడ్ బేస్)ను తీసుకొచ్చింది. దీనికి త్రైమాసికానికి ధర రూ.299. ఏడాదికి రూ.899 చెల్లించాలి. ప్రకటనలు లేకుండా కంటెంట్ వీక్షించాలంటే ఏడాది వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.1499గా నిర్ణయించారు.ప్రస్తుత వినియోగదారులపై ప్రభావంజియో సినిమా, డిస్నీ + హాట్స్టార్లను ప్రస్తుతం వాడుతున్న చందాదారులు జియో హాట్స్టార్కు మారుతారు. జియో సినిమా ప్రీమియం చందాదారులు తమ ప్లాన్ల మిగిలిన కాలవ్యవధి కోసం జియో హాట్ స్టార్ ప్రీమియంకు మైగ్రేట్ అవుతారు. డిస్నీ+ హాట్స్టార్ సబ్స్క్రైబర్లు మూడు నెలలపాటు అదే ప్లాన్లో కొనసాగి తర్వాత జియో హాట్స్టార్కు మారే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: యాప్ స్టోర్లో టిక్టాక్ పునరుద్ధరణ!జియో హాట్స్టార్లో కంటెంట్..డిస్నీ, ఎన్బీసీ యూనివర్సల్ పీకాక్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ, హెచ్బీఓ, పారామౌంట్.ప్రాంతీయ, బాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు.ఎక్స్క్లూజివ్ ఒరిజినల్స్ అండ్ రియాలిటీ షోలు, డ్రామా, థ్రిల్లర్స్, ఎంగేజింగ్ రియాలిటీ కంటెంట్.ఐపీఎల్, డబ్ల్యుపీఎల్, ఐసీసీ ఈవెంట్లు వంటి ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్లు, ప్రీమియర్ లీగ్, వింబుల్డన్, ప్రో కబడ్డీ, ఐఎస్ఎల్ వంటి ప్రపంచ క్రీడా ఈవెంట్లు. -
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఒకసారి రీఛార్జ్ చేస్తే 12 నెలల పాటు సర్వీసులు పొందేలా కొత్త ప్లాన్ను విడుదల చేసింది. తరచూ రీఛార్జ్లు, ఇతర టెలికాం ప్రొవైడర్ల నుంచి పెరుగుతున్న ఖర్చుల భారంతో సతమతమవుతున్న వినియోగదారులకు ఊరటనిచ్చేందకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.సూపర్ రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ లేటెస్ట్ ఆఫర్ కేవలం రూ.1,999కే ప్రీపెయిడ్ ప్లాన్ను అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 12 నెలలు. నెలవారీ రీఛార్జ్ల ఇబ్బంది లేకుండా వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులోని కీలక ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.అన్ లిమిటెడ్ కాలింగ్: యూజర్లు అన్ని లోకల్, ఎస్టీడీ నెట్వర్క్లపై అపరిమిత ఉచిత కాలింగ్ను వినియోగించుకోవచ్చు.600 జీబీ డేటా: ఈ ప్లాన్లో రోజువారీ వినియోగ పరిమితులు లేకుండా మొత్తం 600 జీబీ డేటా లభిస్తుంది. యూజర్లు ఏడాది పొడవునా తమ సౌలభ్యం మేరకు ఈ డేటాను ఉపయోగించుకోవచ్చు.రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లు: నిరంతరాయంగా కమ్యూనికేషన్ కోసం రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లను కూడా ఈ ప్లాన్ అందిస్తుంది.బీఎస్ఎన్ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్లు, దీర్ఘకాలిక వాలిడిటీ ఆఫర్లను అందిస్తుంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లు ఇటీవల ధరలను పెంచడంతో చాలా మంది వినియోగదారులు చౌక రీఛార్జ్ ధరల కోసం బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్త సూపర్ రీఛార్జ్ ప్లాన్ మరింత మంది యూజర్లను ఆకర్షిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: రైల్వే అంతటా ‘కవచ్’ అమలుఇతర ప్రొవైడర్లు ఇలా..ఇతర టెలికాం ప్రొవైడర్లతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఉదాహరణకు, జియో పైన తెలిపిన సర్వీసులతో వార్షిక ప్లాన్ను రూ.3,599కు అందిస్తుంది. ఇందులో 2.5 జీబీ రోజువారీ పరిమితితో 912.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ ఉన్నాయి. ఎక్కువ డేటాను అందిస్తుండడంతో జియో ప్లాన్ బీఎస్ఎన్ఎల్ కంటే ఖరీదుగా ఉంది. అయితే అందుకోసం కొన్ని సర్వీసులు అదనంగా ఇస్తుంది. యూజర్లు నిజంగా ఈ సర్వీసులను పూర్తి స్థాయిలో ఉపయోగిస్తేనే ఆ ప్లాన్ మేలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలోనూ ఇలా బీఎస్ఎన్ఎల్తో పోలిస్తే అదనంగానే వసూలు చేస్తున్నాయి. -
ఇవి జియో బడ్జెట్ రీచార్జ్ ప్లాన్లు..
టారిఫ్ పెంపు తర్వాత జియో రీఛార్జ్ ప్లాన్లతో సంతృప్తి చెందని వారిలో మీరు కూడా ఉన్నట్లయితే వ్యాలిడిటీ, డేటా పరంగా అత్యధిక ప్రయోజనాలను అందించే మూడు ప్లాన్లను అందిస్తోంది. ఇవి అంత చవకైన రీఛార్జ్ ప్లాన్లు కానప్పటికీ అపరిమిత 5జీ వంటి సేవలను అందిస్తాయి.రూ. 349 ప్లాన్ఇది 28 రోజుల చెల్లుబాటు అందిస్తుంది అపరిమిత 5G డేటా, రోజువారీ 2 GB పరిమితితో 4G డేటా లభిస్తాయి. ఈ నెలవారీ రీఛార్జ్ ప్లాన్ తక్కువ మొత్తంలో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. ప్రతిరోజూ సెల్యులార్ డేటాను ఎక్కువగా వినియోగించే వారికి ఇది ఉత్తమ నెలవారీ రీఛార్జ్ ఎంపిక.రూ. 749 ప్లాన్ఈ ప్లాన్ రోజుకు 2 GB 4G డేటాతో పాటు అపరిమిత 5G, కాలింగ్తో 72 రోజులు అంటే రెండున్నర నెలలకుపైగా వ్యాలిడిటీని అందిస్తుంది. అదనంగా ఇది మొత్తం చెల్లుబాటు వ్యవధికి అదనంగా 20 GB 4G డేటా వస్తుంది. ఇది 5G కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికి ఉపయోగకరమైన యాడ్-ఆన్.రూ. 3,599 ప్లాన్ఇది వార్షిక రీఛార్జ్ ప్లాన్. అపరిమిత 5G డేటా, 2.5 GB రోజువారీ 4G డేటాతో 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. నెలకు కేవలం రూ. 276 ఖర్చుతో ఏడాది పొడవునా వ్యాలిడిటీ డేటా పరిమితుల గురించి చింతించకుండా ఒకేసారి రీఛార్జ్ చేయడానికి ఇష్టపడే వారికి ఈ ప్లాన్ అనువైనది. -
జియో కొత్త ప్లాన్: 365 రోజుల వ్యాలిడిటీ
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI).. కొన్ని రోజులకు ముందు ప్రత్యేకంగా కాలింగ్, ఎస్ఎమ్ఎస్ కోసమే రీఛార్జ్ చేసుకునేవారి కోసం రీఛార్జ్ ప్లాన్లను అందించాలని ఆదేశించింది. దీంతో జియో రెండు ప్లాన్స్ ప్రవేశపెట్టింది. వీటి గురించి తెలుసుకుందాం.జియో ప్రవేశపట్టిన కొత్త ప్లాన్ల జాబితాలో 84 రోజుల ప్లాన్, 365 రోజుల ప్లాన్ ఉన్నాయి. వీటి రీఛార్జ్తో యూజర్ కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ వంటివి మాత్రమే చేసుకోవచ్చు, డేటా లభించదు. ఇవి కీ ప్యాడ్ మొబైల్ లేదా.. డేటా అవసరం లేని మొబైల్స్ ఉపయోగిస్తున్నవారికి మంచి ఆప్షన్.రూ.458 : 84 రోజులుజియో యూజర్లు రూ. 458తో రీఛార్జ్ చేసుకుంటే.. 84 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ఈ ప్లాన్లో వినియోగదారులు అపరిమిత కాలింగ్, 1000 ఉచిత ఎస్ఎమ్ఎస్లు పొందుతారు. అంతే కాకుండా వినియోగదారులు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్లకు కూడా ఉచితంగానే యాక్సెస్ చేయవచ్చు.రూ.1,958 : 365 రోజులుజియో అందిస్తున్న మరో ప్లాన్ ధర రూ. 1,958. ఈ రీఛార్జ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ పొందుతుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. అపరిమిత కాలింగ్ మాత్రమే కాకుండా.. 3,600 ఉచిత ఎస్ఎమ్ఎస్లు పొందుతారు. జియో సినిమా, జియో టీవీ వంటి యాప్లకు కూడా ఉచితంగానే యాక్సెస్ చేయవచ్చు.జియో రెండు ప్లాన్లను తొలగించిందిజియో ఇప్పుడు తన జాబితా నుంచి రెండు పాత రీఛార్జ్ ప్లాన్లను తొలగించింది. అవి రూ. 479 ప్లాన్, రూ. 1899 ప్లాన్. 1899 రూపాయల ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీతో 24 జీబీ డేటాను అందించగా, రూ. 479 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో 6 జీబీ డేటాను అందించింది. ఇప్పుడు ఇవి రెండూ అందుబాటులో లేదని తెలుస్తోంది.ఇదీ చదవండి: కొత్త కారు కొంటున్నారా?: ఇలా చేస్తే.. ట్యాక్స్లో 50 శాతం తగ్గింపు -
జియో భారత్ ఫోన్లలో కొత్త ఫీచర్.. ‘జియో సౌండ్ పే’
దేశ వ్యాప్తంగా ఉన్న సుమారు 5 కోట్ల మంది చిరు వ్యాపారుల కోసం రిలయన్స్ జియో (Reliance jio) కీలక నిర్ణయం తీసుకుంది. జియో భారత్ ఫోన్లలో (Jio Bharat Phone) ‘జియో సౌండ్ పే’ (Jio Sound Pay) అనే కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఫీచర్తో జియో భారత్ వినియోగదారులు ప్రతి యూపీఐ పేమెంట్కి తాము ఎంపిక చేసుకున్న భాషలో కన్ఫర్మేషన్ మెసేజ్ ఉచితంగా వినొచ్చు. దీని కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.టెక్నాలజీని మరింత అందిపుచ్చుకుంటూ ప్రతి భారతీయుడి సాధికారతే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో ఇన్ఫోకామ్ లిమిటెట్ ప్రెసిడెంట్ సునీల్ దత్ పేర్కొన్నారు. ప్రస్తుతం కిరాణా షాప్లు, టీ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు తదితర చిన్న తరహా వ్యాపారాలు చేస్తున్న వారంతా పేమెంట్ కన్ఫర్మేషన్ కోసం సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని కోసం ప్రతి నెలా రూ.125 చెల్లిస్తున్నారు. తాజాగా తీసుకొచ్చిన ‘జియో సౌండ్ పే’ ఫీచర్తో ఎలాంటి సౌండ్ బాక్సులు అవసరం లేకుండానే ఫోన్లోనే కన్ఫర్మేషన్ మెసేజ్ వినొచ్చు. దీనివల్ల వ్యాపారులకు ఏడాదికి రూ.1500 వరకు ఆదా అవుతుందని జియో ప్రకటనలో వెల్లడించింది.భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జియోసౌండ్పేలో "వందేమాతరం" ఆధునిక సంస్కరణలను కూడా ప్రారంభించింది. ఈ ఆత్మీయ నివాళి సమకాలీన సంగీత అంశాలతో క్లాసిక్ మెలోడీలను మిళితం చేస్తుంది. వినియోగదారులు తమ దినచర్యకు దేశభక్తిని జోడించి మైజియో యాప్ లేదా జియో సావన్ ద్వారా ఈ రెండిషన్లను వారి జియోట్యూన్లుగా సెట్ చేసుకోవచ్చు. -
కాల్స్ కోసమే ప్రత్యేక ప్యాక్.. వాట్సప్కు ఊరట
న్యూఢిల్లీ: కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక ప్రీపెయిడ్ ప్యాక్స్ను టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో(Jio), భారతీ ఎయిర్టెల్(Airtel) పరిచయం చేశాయి. 84 రోజుల కాల పరిమితితో రూ.499 ధరలో కొత్త ప్లాన్ను ఎయిర్టెల్ అందుబాటులోకి తెచ్చింది. అపరిమిత కాల్స్, 900 ఎస్ఎంఎస్లు ఆఫర్ చేస్తారు. అలాగే రూ.1,959 ధరలో 365 రోజుల వ్యాలిడిటీ గల ప్యాక్ కింద అపరిమిత కాల్స్, 3,600 ఎస్ఎంఎస్లు అందుకోవచ్చు.రిలయన్స్ జియో రూ.458 ధరలో 84 రోజుల కాల పరిమితితో అపరిమిత వాయిస్కాల్స్, 1,000 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. ఏడాది కాల పరిమితితో రూ.1,958 ధరలో అపరిమిత కాల్స్, 3,600 ఎస్ఎంఎస్లను పొందవచ్చు. డేటా అవసరం లేకపోయినా బండిల్ ప్యాక్స్ వల్ల కస్టమర్లకు చార్జీల భారం పడుతోందన్న ఫిర్యాదుల పెద్ద ఎత్తున రావడంతో టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ గత నెలలో టారిఫ్ నిబంధనలను సవరించింది. దీనికి అనుగుణంగా డేటా అవసరం లేని కస్టమర్ల కోసం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం టెలికం కంపెనీలు ప్రత్యేక ప్లాన్స్ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: త్రైమాసిక ఫలితాల్లో కంపెనీలకు లాభాలుఎన్సీఎల్ఏటీలో వాట్సాప్కి ఊరటన్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్లో (NCLAT) వాట్సాప్కు ఊరట లభించింది. మాతృ సంస్థ మెటాతో వాట్సాప్ అయిదేళ్ల పాటు యూజర్ల డేటాను షేర్ చేసుకోరాదంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) నిషేధంపై ఎన్సీఎల్ఏటీ స్టే విధించింది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. ప్రకటనల అవసరాలరీత్యా యూజర్ల డేటాను మెటాతో పాటు గ్రూప్ కంపెనీలకు అందించేలా 2021లో వాట్సాప్ గోప్యతా పాలసీని అప్డేట్ చేసింది. అయితే, ఇలాంటివి అనుచిత వ్యాపార విధానాల కిందికి వస్తాయంటూ నవంబర్లో సీసీఐ అయిదేళ్ల నిషేధంతో పాటు మెటాపై రూ.213 కోట్ల జరిమానా విధించింది. దీన్ని సవాలు చేస్తూ మెటా, వాట్సాప్ సంస్థలు ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. -
కొత్త ఫీచర్.. ఇక సిగ్నల్ లేకపోయినా 4జీ సేవలు
మొబైల్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చే దిశగా భారత ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. ఇంటర్-సర్కిల్ రోమింగ్ (ICR) ఫీచర్ను పరిచయం చేస్తోంది. దీంతో బీఎస్ఎన్ఎల్ (BSNL), జియో (Jio), ఎయిర్టెల్ (Airtel) ఇలా నెట్వర్క్ ఏదైనా వినియోగదారులు వారి ప్రాథమిక ప్రొవైడర్కు సిగ్నల్ కవరేజ్ లేనప్పటికీ, అందుబాటులో ఉన్న ఏదైనా నెట్వర్క్ని ఉపయోగించి 4జీ (4G) సేవలను పొందే ఆస్కారం ఉంటుంది.ఏమిటీ ఇంటర్ సర్కిల్ రోమింగ్?ఇంటర్-సర్కిల్ రోమింగ్ (Inter-Circle Roaming) అనేది నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పంచుకోవడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను (TSP) ఎనేబుల్ చేసే ఒక అద్భుతమైన ఫీచర్. డిజిటల్ భారత్ నిధి (DBN)-నిధులతో కూడిన మొబైల్ టవర్ల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఈ సర్వీస్, తమ నెట్వర్క్ ప్రొవైడర్తో సంబంధం లేకుండా ప్రభుత్వం నిధులు సమకూర్చే టవర్ల ద్వారా 4జీ సేవలను ఉపయోగించుకునే వెసులుబాటును వినియోగదారులకు కల్పిస్తుంది.ఇంతకుముందు డిజిటల్ భారత్ నిధి టవర్లు వాటి ఇన్స్టాలేషన్కు బాధ్యత వహించే టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు మాత్రమే మద్దతిచ్చేవి. అంటే ఒకే ప్రొవైడర్కు మాత్రమే యాక్సెస్ ఉండేది. ఇంటర్-సర్కిల్ రోమింగ్ ఫీచర్తో వినియోగదారులు ఇప్పుడు భాగస్వామ్య నెట్వర్క్లను వినియోగించుకుని అంతరాయం లేని మొబైల్ సేవలు పొందవచ్చు.గ్రామీణ కనెక్టివిటీ మెరుగుఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ ప్రాథమిక లక్ష్యాలలో గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో కనెక్టివిటీ అంతరాన్ని తగ్గించడం ఒకటి. 35,400 గ్రామాలకు విశ్వసనీయమైన 4జీ సేవలు అందించడానికి ప్రభుత్వం సుమారు 27,000 మొబైల్ టవర్లకు నిధులు సమకూర్చింది. ఈ విధానం విస్తృతమైన కవరేజీని అందించడంలో భాగంగా అనవసరమైన మౌలిక సదుపాయాల కొరతను తగ్గిస్తుంది.గ్రామీణ ప్రాంతాల్లో పరిమిత నెట్వర్క్ కారణంగా తరచుగా సిగ్నల్ లభ్యతకు సంబంధించిన సవాళ్లు ఎదురవుతుంటాయి. దీంతో వినియోగదారులు అవసరమైన సేవలు అందుకోలేకపోతున్నారు. బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ మధ్య సహకారం ద్వారా ఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ ఈ సవాళ్లను పరిష్కరిస్తుంది. మరింత ఎక్కువమంది 4G కనెక్టివిటీని పొందేలా చేస్తుంది.మెరుగైన సేవలకు సహకారంఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ విజయవంతం కావడం అనేది బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో వంటి దేశంలోని ప్రధాన టెలికాం సంస్థల మధ్య సహకారంపై ఆధారపడి ఉంటుంది. నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను భాగస్వామ్యం చేయడం ద్వారా ఈ ప్రొవైడర్లు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడం, నిర్వహణ ఖర్చులను తగ్గించడం, తక్కువ సేవలందే ప్రాంతాల్లో స్థిరమైన సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సింధియా ఈ సహకారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ ప్రాజెక్ట్ దాదాపు 27,836 సైట్లను కవర్ చేస్తుందని, దేశవ్యాప్తంగా వినియోగదారులకు కనెక్టివిటీ అవకాశాలను పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఉమ్మడి ప్రయత్నం దేశ డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో టెలికాం రంగ నిబద్ధతను తెలియజేస్తుంది. -
రోజంతా అన్లిమిటెడ్ డేటా: కేవలం రూ. 49తో..
భారతదేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన 'రిలయన్స్ జియో' (Reliance Jio) ఎకనామిక్ రీఛార్జ్ ప్లాన్లతో మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. దేశంలోని సుమారు 490 మిలియన్లకు పైగా వినియోగదారులకు కనెక్ట్ అయి ఉండటానికి కంపెనీ ఎప్పటికప్పుడు వినూత్నమైన లేదా సరసమైన రీఛార్జ్లను అందిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా 49 రూపాయలతో డేటా రీఛార్జ్ అందిస్తోంది.రూ.49 రీఛార్జ్ ప్లాన్ వివరాలుజియో డేటా ప్యాక్ కేటగిరీ కింద రూ. 49 రీఛార్జ్ ప్లాన్ ప్రారంభించింది. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత డేటా మాత్రమే లభిస్తుంది. అయితే మీరు కాలింగ్, ఎస్ఎమ్ఎస్ సేవలను పొందలేరు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ ప్యాక్ వ్యాలిడిటీ కేవలం ఒక రోజు మాత్రమే. అయితే ఒకరోజు అపరిమిత డేటా కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.రిలయన్స్ జియో అందిస్తున్న ఒక్క రోజు అపరిమిత డేటా ప్లాన్.. దాని ప్రత్యర్ధ సంస్థలైన ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా (VI), బీఎస్ఎన్ఎల్ వంటి వాటిపై ఒత్తిడిని పెంచింది. కాగా జియో తన కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫ్రెండ్లీ బడ్జెట్ ప్లాన్స్ అందించింది.2024 జులైలో జియో తన కొత్త అన్లిమిటెడ్ ప్లాన్లను ప్రకటించింది. కొత్తగా అమలులోకి వచ్చిన ప్లాన్ ధరలు.. ఉన్న ప్లాన్ ధరల కంటే 20 శాతం ఎక్కువయ్యాయి. దీంతో 155 రూపాయల ప్లాన్ 189 రూపాయలకు, 209 రూపాయల ప్లాన్ 249 రూపాయలకు చేరుతుంది. రూ. 2999 యాన్యువల్ ప్లాన్.. త్వరలో 3599 రూపాయలకు చేరాయి.ఇదీ చదవండి: స్పామ్ కాల్స్కు అడ్డుకట్ట!.. వచ్చేసింది మొబైల్ యాప్రీఛార్జ్ ప్లాన్ ధరలు భారీగా పెరగడంతో.. చాలామంది బీఎస్ఎన్ఎల్ వైపు తిరిగారు. ఆ తరువాత మళ్ళీ తమ యూజర్లను ఆకర్శించడానికి జియో సరికొత్త ప్లాన్స్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా వచ్చినదే.. రూ. 49 డేటా ప్లాన్. ఇది ఇంటర్నెట్ బాగా వాడేవారికి ఎక్కువ ఉపయోగపడుతుంది. -
క్రిప్టో కరెన్సీకి పోటీగా జియో కాయిన్?
భారతీయ కుబేరుడు, ప్రముఖ వ్యాపార దిగ్గజం 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్నాలజీ అనుబంధ సంస్థ జియో ప్లాట్ఫారమ్.. భారతదేశంలో తన వెబ్3, బ్లాక్చెయిన్ అరంగేట్రం కోసం పాలిగాన్ ప్రోటోకాల్స్ డెవలపర్ విభాగమైన 'పాలిగాన్ ల్యాబ్స్'తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో కంపెనీ 'జియో కాయిన్' (Jio Coin) తీసుకురానున్నట్లు కొన్ని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.జియో కాయిన్ గురించి కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ చాలామంది జియో కాయిన్ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మొబైల్ రీఛార్జ్లు లేదా రిలయన్స్ గ్యాస్ స్టేషన్లలో కొనుగోళ్లు వంటి సేవలకు ఉపయోగించబడుతుందని బిటిన్నింగ్ సీఈఓ 'కాశిఫ్ రాజా' తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.క్రిప్టో కరెన్సీ మీద ముకేశ్ అంబానీ చాలా సంవత్సరాలకు ముందే కన్నేశారని. ఈ రంగంలోకి అడుగుపెట్టాలని, ఓ స్పెషల్ కరెన్సీ తీసుకురావాలని భావించగా సమాచారం. ఇందులో భాగంగానే జియో కాయిన్ తీసుకు వస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. దీనికోసమే పాలిగాన్ ల్యాబ్స్తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: 40 కోట్ల జనం.. రూ.2 లక్షల కోట్ల ఆదాయం! ఎలాగో తెలుసా?జియో కాయిన్ రావడం నిజమైతే.. క్రిప్టో కరెన్సీ(Crypto Currency)కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఎందుకంటే ప్రపంచంలో దాదాపు 500 మిలియన్ల మంది క్రిప్టో కరెన్సీ వినియోగదారులు ఉన్నారు. అయితే జియోకు 470 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. జియో కాయిన్ అందుబాటులో వస్తే.. వీరందరి ద్రుష్టి దీనిపైన పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.🇮🇳Big Breaking News:- Jiocoin Launched On Polygon.Reliance Jio, the world's largest mobile operator, has just surprised the crypto world by officially launching Jiocoins!What are Jiocoins?Jiocoins are digital tokens issued on Polygon.Jiocoins is a mechanism to reward… pic.twitter.com/MNRb5HGa08— Kashif Raza (@simplykashif) January 16, 2025 -
మొబైల్ రీఛార్జ్ మరింత భారం కానుందా..?
రిలయన్స్ జియో(Jio), భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సహా భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది టారిఫ్(Tariff)లను 10 శాతం పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో 2024 జులైలో 25 శాతం వరకు టారిఫ్ పెంచిన విషయం తెలిసిందే. ఆపరేటర్లు మార్జిన్లపై దృష్టి పెడుతున్నారని, త్వరలో 5జీ నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టవచ్చని జెఫరీస్ నివేదిక తెలిపింది.2025లో జియో లిస్టింగ్కు వెళ్లే అవకాశం ఉండడంతో కంపెనీ తన వృద్ధిని పెంచడానికి అధిక టారిఫ్లకు అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారతీ ఎయిర్టెల్ తన రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిమెంట్ (ROCE)ను మెరుగుపరచడానికి టారిఫ్లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా ఉన్నందున టారిఫ్ పెంపునకు అనుకూలంగా ఉండవచ్చనే అభిప్రాయాలున్నాయి.ఇదీ చదవండి: రూపాయి క్షీణత మంచిదేటారిఫ్ పెంపు వల్ల సగటు వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) కనీసం 25% పెరుగుతుందని, ఇది మెరుగైన మార్జిన్ విస్తరణ, నగదు ప్రవాహ ఉత్పత్తికి దారితీస్తుందని భావిస్తున్నారు. భారతీ ఎయిర్ టెల్, జియోలకు మార్జిన్లు 170-200 బేసిస్ పాయింట్లు పెరగడంతో టెలికాం రంగం ఆదాయ వృద్ధి ఏడాదికి 15 శాతం పెరుగుతుందని జెఫరీస్ అంచనా వేసింది. -
ఒక్క రీఛార్జ్తో 84 రోజులు - బెస్ట్ ప్లాన్ చూడండి
గతంలో రీఛార్జ్ అయిపోతే ఇన్కమింగ్ కాల్స్ అయినా వచ్చేవి. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. కాబట్టి రీఛార్జ్ ముగిసిన తరువాత తప్పకుండా మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సిందే. అయితే కొందరు ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోవాలంటే కొంత కష్టమనుకుంటారు, అలాంటి వారు ఆరు నెలలకు లేదా ఏడాదికి రీఛార్జ్ చేసుకుంటారు. ఈ కథనంలో 84 రోజుల ప్లాన్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..జియో (Jio)రిలయన్స్ జియో అందిస్తున్న అత్యంత చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.799 ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటా (మొత్తం 126 జీబీ), రోజులు 100 ఎస్ఎమ్ఎస్లు, అపరిమిత కాలింగ్స్ వంటివి లభిస్తాయి. రోజువారీ డేటా పూర్తయిన తరువాత 64 kbps వేగంతో ఇంటర్నెట్ వస్తుంది. జియో టీవీ, జిఓ సినిమా, జిఓ క్లౌడ్ వంటి వాటికి యాక్సెస్ కూడా ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు.బీఎస్ఎన్ఎల్ (BSNL)బీఎస్ఎన్ఎల్ 84 రోజుల ప్లాన్ ధర రూ. 628 మాత్రమే. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 3 జీబీ డేటా, 100 ఎస్ఎమ్ఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. రోజువారీ డేటా లిమిట్ అయిపోయిన తరువాత ఇంటర్నెట్ స్పీడ్ 40 kbpsకు తగ్గుతుంది.ఎయిర్టెల్ (Airtel)ఎయిర్టెల్ 84 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ. 509. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. వినియోగదారుడు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు, 6 జీబీ డేటా (84 రోజులకు) లభిస్తుంది. ఈ డేటా పూర్తయిపోతే.. ఒక ఎంబీకి 50 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారు.. అన్లిమిటెడ్ 5జీ డేటాకు అనర్హులు. ఇందులో ఫ్రీ హలోట్యూన్స్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్, అపోలో 24/7, స్పామ్ కాల్స్ వంటివి ఉన్నాయి.వీఐ (వొడాఫోన్ ఐడియా)వొడాఫోన్ ఐడియా అందించే అతి చౌకైన ప్లాన్లో రూ. 509 కూడా ఒకటి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. దీనిని రీఛార్జ్ చేసుకున్న యూజర్లు అన్లిమిటెడ్ కాల్స్, 1000 ఎస్ఎమ్ఎస్లు, 6 జీబీ డేటా వంటివి పొందుతారు. ఎస్ఎమ్ఎస్లు, డేటా అనేది మొత్తం ప్యాక్కు అని గుర్తుంచుకోవాలి. కాబట్టి అది ఖాళీ అయితే మళ్ళీ వాటి కోసం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర అదనపు ప్రయోజనాలు కూడా ఏమీ లభించవు. -
జియో కొత్త ప్లాన్.. రెండేళ్లు యూట్యూబ్ ఫ్రీ
2025 జనవరి 11 నుంచి రిలయన్స్ జియో తన ఎయిర్ ఫైబర్ & ఫైబర్ పోస్ట్పెయిడ్ వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన ప్రయోజనాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా అర్హులైన వినియోగదారులు 24 నెలల పాటు యూట్యూబ్ ప్రీమియమ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రయోజనాలను పొందుతారు. జియో.. యూట్యూబ్ మధ్య ఈ ముఖ్యమైన భాగస్వామ్యం, దేశవ్యాప్తంగా ఉన్న సబ్స్క్రైబర్ల కోసం డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించింది.యూట్యూబ్ ప్రీమియమ్ ప్రత్యేకతలు➤అడ్వర్టైజెంట్ బ్రేక్ లేకుండా.. ఇష్టమైన వీడియోలను ఎలాంటి అడ్డంకులు చూడవచ్చు.➤ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా (ఆఫ్లైన్) ఎప్పుడైనా కంటెంట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.➤ఇతర యాప్స్ ఉపయోగిస్తూనే లేదా స్క్రీన్ ఆఫ్ అయినప్పటికీ వీడియోలు చూడవచ్చు.. మ్యూజిక్ కూడా వినవచ్చు.➤యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియమ్ కింద 100 మిలియన్ల కంటే ఎక్కువ పాటల ఫ్రీ లైబ్రరీ వంటి వాటిని పొందవచ్చు.ప్లాన్ వివరాలురూ. 888, రూ. 1199, రూ. 1499, రూ. 2499, రూ. 3499 ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంది సంస్థ అందించే ప్రయోజనాలను పొందవచ్చు. ఈ అవకాశం జియో ఎయిర్ ఫైబర్ & జియో ఫైబర్ పోస్ట్పెయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: భారీగా పెరిగిన టిమ్ కుక్ జీతం: ఇప్పుడు వార్షిక వేతనం ఎంతంటే..యూట్యూబ్ ప్రీమియమ్ సబ్స్క్రిప్షన్ని యాక్టివేట్ చేయడం ఎలా➤ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న తరువాత, మై జియో యాప్లో మీ అకౌంట్లో లాగిన్ అవ్వండి.➤ఆ పేజీలో కనిపించే యూట్యూబ్ ప్రీమియమ్ బ్యానర్పై క్లిక్ చేయండి.➤మీ యూట్యూబ్ ఖాతాతో లాగిన్ అవ్వండి లేదా కొత్త ఖాతాను క్రియేట్ చేయండి.➤అదే వివరాలతో జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ సెటప్ టాప్ బాక్స్లో లాగిన్ అవ్వండి, యాడ్-ఫ్రీ కంటెంట్ను ఆస్వాదించండి.Enjoy ad-free YouTube on your big screen with JioAirFiber & JioFiber.Get 24 months of YouTube Premium today.#JioAirFiber #JioFiber #YouTubePremium #WithLoveFromJio pic.twitter.com/JN864Ki7UP— Reliance Jio (@reliancejio) January 11, 2025 -
మొబైల్ టారిఫ్ పెంపు తర్వాత భారీగా ఆదాయం
టెలికం ఆపరేటర్ల (Telecom Operators) స్థూల ఆదాయం 2024 సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలంలో 10.5 శాతం వృద్ధి చెంది రూ.91,426 కోట్లుగా నమోదైంది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్/దీనిపైనే ప్రభుత్వం పన్నులు వసూలు చేసేది) 13 శాతం పెరిగి రూ.75,310 కోట్లకు చేరింది. ఈ వివరాలను టెలికం రంగ నియంత్రణ సంస్థ (TRAI) విడుదల చేసింది.గతేడాది జూలైలో ఎయిర్టెల్ (Airtel), జియో (Jio), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) తమ మొబైల్ టెలిఫోనీ చార్జీలను 11–25 శాతం మధ్య పెంచడం తెలిసిందే. ఈ పెంపు అనంతరం సగటు యూజర్ నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) పెరిగింది. కానీ, అదే సమయంలో సబ్స్క్రయిబర్లను కొంత మేర కోల్పోవాల్సి వచ్చింది.టెలికం కంపెనీల నెలవారీ ఏఆర్పీయూ సెప్టెంబర్ త్రైమాసికంలో 10 శాతం పెరిగి రూ.172.57కు చేరింది. జూన్ త్రైమాసికంలో ఇది 157.45గా ఉంది. ప్రీపెయిడ్ కనెక్షన్ల ఏఆర్పీయూ రూ.171గా ఉంటే, పోస్ట్పెయిడ్ కనెక్షన్లకు రూ.190.67గా నమోదైంది. మొబైల్ చందాదారులు 1.68 కోట్ల మంది తగ్గి 115.37 కోట్లకు పరిమితమయ్యారు. జూన్ క్వార్టర్ చివరికి చందాదారుల సంఖ్య 117 కోట్లుగా ఉంది. కంపెనీల వారీగా ఏజీఆర్ భారతీ ఎయిర్టెల్ ఏజీఆర్ 24 శాతం పెరిగి రూ.24,633 కోట్లకు చేరింది. రిలయన్స్ జియో ఏజీఆర్ 14 శాతం వృద్ధితో రూ.26,652 కోట్లకు.. వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ 4 శాతం పెరిగి రూ.7,837 కోట్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్ త్రైమాసికానికి టెలికం కంపెనీల నుంచి ప్రభుత్వం వసూలు చేసిన లైసెన్స్ ఫీజు 13 శాతం పెరిగి రూ.6,023 కోట్లకు చేరింది. -
మళ్లీ మొబైల్ టారిఫ్లు పెంపు..?
దేశంలోని టెలికం ఆపరేటర్లు డిజిటల్ మౌలిక వసతుల్లో చేసిన భారీ పెట్టుబడుల ప్రయోజనాన్ని పొందాలంటే పన్నుల తగ్గింపు, టారిఫ్ల పెంపు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తదుపరి తరం 5జీ సేవల కవరేజీని విస్తరించేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు టెలికం మౌలిక సదుపాయాలు, రేడియోవేవ్స్ కోసం 2024లో సుమారు రూ.70,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. అయితే 18 కోట్ల 2జీ కస్టమర్లను కనెక్ట్ చేయడం, సమ్మిళిత వృద్ధి కోసం 4జీకి మళ్లేలా వారిని ప్రోత్సహించడం సవాలుగా మారింది.‘టెలికం రంగంలో పన్నులను హేతుబద్ధీకరించాలి. భారత్లోనే పన్నులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే టారిఫ్లు అత్యల్పంగా ఉన్నాయి. అధిక వినియోగ కస్టమర్లు ఎక్కువ చెల్లించడం, ఎంట్రీ లెవల్ డేటా వినియోగదారులు తక్కువ చెల్లించేలా మార్పులు రావొచ్చు. టెలికం సంస్థలు చేసిన పెట్టుబడులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయి. దీని ద్వారా స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ మొత్తం లాభపడింది. పన్నుల హేతుబద్ధీకరణ, టారిఫ్ల పెంపు ద్వారా పెట్టుబడులపై రాబడిని పొందే సమయం ఆసన్నమైంది’ అని ఈవై ఇండియా మార్కెట్స్, టెలికం లీడర్ ప్రశాంత్ సింఘాల్ అన్నారు. ఏఆర్పీయూ రూ.300 స్థాయికి..భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) రూ.300 స్థాయికి పెంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. గతేడాది జులైలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల పెంపు తర్వాత వొడాఫోన్ ఐడియా ఏఆర్పీయూ ఏప్రిల్–జూన్లో రూ.154 నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో 7.8 శాతం పెరిగి రూ.166కి చేరుకుంది. భారతీ ఎయిర్టెల్ రూ.211 నుంచి 10.4 శాతం వృద్ధితో రూ.233కి, రిలయన్స్ జియో రూ.181.7 నుంచి రూ.195.1కి దూసుకెళ్లింది. అయితే టారిఫ్ల పెంపు ఈ సంస్థలకు షాక్ తగిలింది. దాదాపు 2 కోట్ల మంది సబ్స్క్రైబర్లు తమ కనెక్షన్లను వదులుకున్నారు. 10–26 శాతం ధరల పెంపు కారణంగా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంయుక్తంగా 2.6 కోట్ల మంది వినియోగదారులను కోల్పోయాయి.మౌలికంలో పెట్టుబడులు..మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం భారతీ ఎయిర్టెల్ అక్టోబర్లో పట్టణ ప్రాంతాల్లో సబ్స్క్రైబర్స్ను కోల్పోగా, గ్రామీణ ప్రాంతాల్లో నికరంగా భారీ స్థాయిలో జోడించింది. రిలయన్స్ జియో మెట్రోలు, ప్రధాన సర్కిల్స్లో చందాదారులను పొందింది. చిన్న సర్కిల్స్లో కస్టమర్లను కోల్పోయింది. వొడాఫోన్ ఐడియా నుంచి అక్టోబర్లో భారీగా వినియోగదార్లు దూరమయ్యారు. 5జీ పర్యావరణ వ్యవస్థకు మద్దతుగా టెలికం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం 2022–2027 మధ్య రూ.92,100 కోట్ల నుంచి రూ.1.41 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు చేయనున్నట్టు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ (డీఐపీఏ) డైరెక్టర్ జనరల్ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. భారతీ ఎయిర్టెల్ రెండో త్రైమాసిక పనితీరుపై జేఎం ఫైనాన్షియల్ రిపోర్ట్ ప్రకారం టారిఫ్ పెంపులు మరింత తరచుగా జరిగే అవకాశం ఉంది. 5జీలో భారీ పెట్టుబడులు, ఐపీవోకు వచ్చే అవకాశం ఉన్నందున జియోకు అధిక ఏఆర్పీయూ అవసరం.ఇదీ చదవండి: గూగుల్ పే, ఫోన్పేకి ఎన్పీసీఐ ఊరటబీఎస్ఎన్ఎల్కు మార్పుధరల పెంపుదలకు దూరంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్కు దాదాపు 68 లక్షల మంది కస్టమర్లు కొత్తగా వచ్చి చేరారు. నష్టాల్లో ఉన్న ఈ సంస్థ ఇప్పటికీ పాత తరం 3జీ సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 4జీ సేవలను పరిచయం చేసేందుకు కసరత్తు చేస్తోంది. భారతీ ఎయిర్టెల్ నెట్వర్క్లో సబ్స్క్రైబర్ వృద్ధి ఈ రంగానికి కొంత ఆశను కలిగించింది. సేవలను అందించడంలో బీఎస్ఎన్ఎల్ అసమర్థత ఈ వృద్ధికి కారణంగా కొంతమంది విశ్లేషకులు పేర్కొన్నారు. భారతీ ఎయిర్టెల్ అక్టోబర్లో వైర్లెస్ విభాగంలో 19.28 లక్షల మంది వినియోగదారులను జోడించింది. క్రియాశీల చందాదారులు దా దాపు 27.23 లక్షలు అధికం అయ్యారు. వొడాఫోన్ ఐడియా 19.77 లక్షల వైర్లెస్ సబ్స్క్రైబర్లను కోల్పోయింది. యాక్టివ్ సబ్స్రైబర్ బేస్ దాదాపు 7.23 లక్షలు తగ్గింది. రిలయన్స్ జియో వైర్లెస్ కస్టమర్ల సంఖ్య అక్టోబర్లో మొత్తం 46 కోట్లకు వచ్చి చేరింది. సెప్టెంబర్లో ఈ సంఖ్య 46.37 కోట్లు నమోదైంది. క్రియాశీల వినియోగదారుల సంఖ్య బలపడింది. -
జియో న్యూ ఇయర్ ఆఫర్.. ఎన్ని ప్రయోజనాలో..
కొత్త సంవత్సరం 2025 వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెలికం కంపెనీ జియో (Jio)తన వినియోగదారుల కోసం ప్రత్యేక “న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్”ని (new recharge plan) ప్రారంభించింది. విస్తృతమైన కనెక్టివిటీ, ఖర్చు ఆదా, ప్రత్యేకమైన డీల్స్తో రూ. 2025 ప్లాన్ను తీసుకొచ్చింది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన వినియోగదారులకు మెరుగైన మొబైల్ అనుభవాన్ని అందించడం దీని లక్ష్యం.రూ.2025 ప్లాన్ ప్రయోజనాలుజియో రూ.2025 ప్లాన్తో సబ్స్క్రైబర్లు అపరిమిత 5జీ ఇంటర్నెట్ని ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ రోజువారీ పరిమితి 2.5 జీబీతో మొత్తం 500 జీబీ 4జీ డేటాను అందిస్తుంది. వినియోగదారులు అదనపు ఛార్జీలు లేకుండా అపరిమిత వాయిస్ కాల్స్ చేయవచ్చు. ఎస్ఎంఎస్ పంపవచ్చు. పెద్ద మొత్తంలో డేటా వినియోగించేవారికి, కమ్యూనికేషన్ కోసం ఫోన్లను విస్తృతంగా ఉపయోగించే వారికి ఈ ప్లాన్ అనువుగా ఉంటుంది.రూ.2150 విలువైన కూపన్లుజియో భాగస్వామి బ్రాండ్ల నుండి అదనపు విలువను పొందడం ఈ ప్లాన్ ప్రత్యేకమైన ఫీచర్లలో ఒకటి. వినియోగదారులు ఆకర్షణీయమైన డీల్స్, డిస్కౌంట్లను ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ ద్వారా అజియో (AJIO) నుండి కనీసం రూ. 2500 కొనుగోలుపై రూ. 500 తగ్గింపు లభిస్తుంది. అలాగే స్విగ్గీలో రూ. 499 కంటే ఎక్కువ ఫుడ్ ఆర్డర్లపై రూ. 150 తగ్గింపును పొందొచ్చు. ఇక ఈజ్మైట్రిప్లో (EaseMyTrip) విమాన బుకింగ్లపై రూ. 1500 ఆదా చేసుకోవచ్చు.డిసెంబర్ 11న ప్రారంభమైన రూ. 2025 ప్లాన్ 2025 జనవరి 11 వరకు అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు కొత్త సంవత్సరాన్ని అదిరిపోయే సేవింగ్స్, ఆఫర్స్తో మొదలు పెట్టవచ్చు. హై-స్పీడ్ 5జీ, పుష్కలమైన డేటా, అపరిమిత కాల్స్, పార్ట్నర్ డిస్కౌంట్స్ వంటి ఫీచర్లతో జియో రూ. 2025 ప్లాన్ ఆధునిక వినియోగదారుల అవసరాలను తీరుస్తుంది. -
అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.5000 రివార్డ్
కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసేవారికి జియో ఓ శుభవార్త చెప్పింది. 2024 డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 31 మధ్య 'జియో పేమెంట్స్ బ్యాంక్' (Jio Payments Bank)లో కొత్త సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేసిన కస్టమర్లకు రూ. 5,000 విలువైన రివార్డులను అందించనున్నట్లు ప్రకటించింది.మెక్డొనాల్డ్స్, ఈజ్మైట్రిప్(EaseMyTrip), మ్యాక్స్ ఫ్యాషన్ (Max Fashion) ప్రముఖ బ్రాండ్ల కూపన్లను.. జియో పేమెంట్స్ బ్యాంక్ రివార్డులలో భాగంగా అందించనుంది. డిజిటల్ ఫస్ట్ విధానానికి ప్రసిద్ధి చెందిన ఈ బ్యాంకులో కస్టమర్లు కేవలం ఐదు నిమిషాలలోపు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలంటే - ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లలో జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.ఆన్లైన్ విధానం➤గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్లో జియో మనీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.➤యాప్ ఓపెన్ చేసిన తరువాత మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఉపయోగించి జియో మనీ అకౌంట్ కోసం రిజిస్టర్ చేసుకోండి.➤రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీ ద్వారా మీ ఖాతాను ధృవీకరించండి.➤ధ్రువీకరించిన తరువాత మీ వ్యక్తిగత వివరాలు, చిరునామాతో పాటు.. ఇతర అవసరమైన సమాచారంతో అప్లికేషన్ ఫామ్ను పూరించండి.➤అప్లికేషన్ ఫామ్ పూరించిన తరువాత ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వంటి అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయండి.➤తరువాత యూజర్ నేమ్, పాస్వర్డ్ను క్రియేట్ చేసుకుని.. మీ ఖాతాను సెటప్ చేయండి.➤ఇవన్నీ పూర్తయిన తరువాత.. జియో స్టోర్ లేదా జియో పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్ని సందర్శించి మీ ఖాతాను యాక్టివేట్ చేసుకోండి.ఆఫ్లైన్ విధానం➡సమీపంలోని జియో స్టోర్ లేదా జియో పేమెంట్స్ బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లి.. జియో రిప్రెజెంటేటివ్ను కలవని.➡జియో పేమెంట్స్ బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయడానికి అప్లికేషన్ ఫామ్ తీసుకుని, అవసరమైన వివరాలను ఫిల్ చేయండి. ➡మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలను అందివ్వండి. ➡ఇవన్నీ పూర్తయిన తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీ ద్వారా ఖాతాను ధృవీకరించండి.➡యూజర్ నేమ్, పాస్వర్డ్ వంటి వాటిని సెట్ చేసుకోవడం ద్వారా మీ ఖాతాను యాక్టివేట్ చేసుకోండి.అవసరమైన డాక్యుమెంట్స్ & అర్హతలు● జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి.. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ (పాస్పోర్ట్, ఓటర్ ఐడీ కార్డ్) వంటివి అవసరమవుతాయి.● 18 సంవత్సరాలు నిండి, చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు కలిగిన భారతీయులు జియో పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అర్హులు. -
రిలయన్స్ జియోకు 37.6 లక్షల మంది దూరం
న్యూఢిల్లీ: టెలికం రంగ సంస్థ రిలయన్స్ జియో(reliance jio) అక్టోబర్లో 37.6 లక్షల మంది వైర్లెస్ సబ్స్క్రైబర్లను కోల్పోయింది. టెల్కోలు కీలకంగా వ్యవహరించే క్రియాశీల మొబైల్ సబ్స్క్రైబర్స్ జియోకు 38.47 లక్షల మంది పెరిగారు. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన నెలవారీ డేటా ప్రకారం.. అక్టోబర్లో భారతీ ఎయిర్టెల్ (Bharti Airtel) 19.28 లక్షల మంది వైర్లెస్ చందాదార్లను కొత్తగా దక్కించుకుంది. యాక్టివ్ కస్టమర్లు దాదాపు 27.23 లక్షలు అధికం అయ్యారు. వొడాఫోన్ ఐడియా 19.77 లక్షల వైర్లెస్ సబ్స్క్రైబర్లను కోల్పోయింది. క్రియాశీల చందాదార్లు 7.23 లక్షల మంది తగ్గారు.రిలయన్స్ జియో మొత్తం వైర్లెస్ వినియోగదార్ల సంఖ్య అక్టోబర్ నాటికి 46 కోట్లకు వచ్చి చేరింది. సెప్టెంబర్లో ఈ సంఖ్య 46.37 కోట్లుగా ఉంది. సెప్టెంబర్తో పోలిస్తే వొడాఫోన్ ఐడియా మొత్తం వైర్లెస్ యూజర్ బేస్ 21.24 కోట్ల నుంచి అక్టోబర్లో 21.04 కోట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ వైర్లెస్ సబ్స్క్రైబర్ల సంఖ్య 106.6 కోట్లుగా ఉంది. మొత్తం బ్రాడ్బ్యాండ్ (broadband) చందాదారులు అక్టోబర్ 2024 చివరి నాటికి 0.31 శాతం తగ్గి 94.14 కోట్లుగా ఉన్నారు. మొత్తం టెలిఫోన్ చందాదారుల సంఖ్య 119.06 కోట్ల నుండి 0.21 శాతం తగ్గి 118.82 కోట్లకు క్షీణించింది. ఇదీ చదవండి: ఆన్లైన్ ఉన్నా చివరకు షోరూంలోనే.. తెలుగు రాష్ట్రాల వైర్లైన్లో జియో వృద్ధిఆంధ్రప్రదేశ్, తెలంగాణలో (ఏపీ టెలికం సర్కిల్) వైర్లైన్ విభాగంలో అక్టోబర్లో గణనీయంగా వృద్ధి సాధించినట్లు రిలయన్స్ జియో తెలిపింది. ట్రాయ్ (TRAI) గణాంకాల ప్రకారం రెండు రాష్ట్రాల్లో నికరంగా 69,930 కనెక్షన్లు కొత్తగా జతయినట్లు వివరించింది. దీంతో సెప్టెంబర్లో 17,49,696గా ఉన్న సబ్స్కైబర్ల సంఖ్య అక్టోబర్లో 18,19,626కి చేరినట్లు సంస్థ పేర్కొంది. -
జియో.. ఎయిర్టెల్ పోటాపోటీ
ఎయిర్టెల్ కంటే రిలయన్స్ జియో అక్టోబర్ 2024లో యాక్టివ్ యూజర్ల సంఖ్యను పెంచుకున్నట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది. అయితే ఇదే సమయంలో ఎయిర్టెల్ మాత్రం అధికంగా చెల్లింపులు చేసే 4జీ/ 5జీ యూజర్లను పెంచుకున్నట్లు పేర్కొంది.ఇప్పటివరకు ఉన్న మొత్తం యాక్టివ్ యూజర్ల విషయంలో జియోనే అధికంగా వినియోగదారులకు కలిగి ఉంది. ఇన్-యాక్టివ్ యూజర్ల తొలగింపు కారణంగా అక్టోబర్ నెలలో జియో సబ్స్క్రైబర్లను కోల్పోయినట్లు తెలిసింది. ఎయిర్టెల్ మాత్రం తన 4జీ/ 5జీ యూజర్ బేస్లో వృద్ధిని సాధించింది. మరోవైపు వొడాఫోన్ ఐడియా 3జీ/ 4జీ యాక్టివ్ యూజర్లను కోల్పోయింది. కాగా, బీఎస్ఎన్ఎల్ మాత్రం స్వల్పంగా యూజర్లను పెంచుకుంది.ఇదీ చదవండి: పాప్కార్న్పై జీఎస్టీ.. నెట్టింట చర్చజులైలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్లను 10–27 శాతం వరకు పెంచాయి. అయితే బీఎస్ఎన్ఎల్ ప్రత్యర్థుల బాటను అనుసరించకపోగా.. సమీప భవిష్యత్తులో టారిఫ్ల పెంపుదల ఉండబోదని బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ రవి గతంలో స్పష్టం చేశారు. వినియోగదార్లను ఆకర్షించడానికి, మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు బీఎస్ఎన్ఎల్ ఇటీవల స్పామ్ బ్లాకర్స్, ఆటోమేటెడ్ సిమ్ కియోస్క్, డైరెక్ట్–టు–డివైస్ తదితర సేవలను ప్రారంభించింది. -
రిలయన్స్ ఫౌండేషన్ ESA డే : విద్యార్థులతో ఉత్సాహంగా
రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ESA) డే వేడుకలు జియో హామ్లీస్ వండర్ల్యాండ్లో ఉత్సాహంగా జరిగాయి. ఈఎస్ఏ ప్రోగ్రాంలో భాగంగా వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోని వెయ్యి మంది చిన్నారులతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. రిలయన్స్ ఫౌండేషన్ కహానీ, కాలా, ఖుషీ ప్రచారంలో భాగంగా ఈ విద్యార్థులకు ఆటలు, క్విజ్ పోటీలను ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.జియో వరల్డ్ గార్డెన్లో అజ్మీరా రియాల్టీతో కలిసి జియో ప్రెజెంట్స్ హామ్లీస్ వండర్ల్యాండ్లో జరిగే కార్నివాల్లో మాన్స్టర్ రైడ్, హామ్లీస్ విలేజ్, హాంటెడ్ సర్కస్, ఫెర్రిస్ వీల్, రంగులరాట్నాలు లాంటి పలు ఆకర్షణీయమైన గేమ్లు ఉన్నాయి.ముఖ్యంగా జంతు సంక్షేమ చొరవలో ‘వంటారా’ స్టాల్స్ ప్రత్యేకంగా కొలువు దీరాయి. వన్యప్రాణుల ఆవాసాలను సంరక్షించడం, చిక్కుకుపోయిన పక్షులను రక్షణ, రక్షించిన జంతువులను పోషించడం, జంతువులను అక్రమ రవాణా నుండి రక్షించడం వంటి పనుల్లో విద్యార్థులను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టనుంది. ఈ సందర్భంగా పిల్లలందరికీ రిలయన్స్ ఫౌండేషన్ క్యూరేటెడ్ వంటరా జంతు బొమ్మలు, విద్యా సామగ్రిని బహుమతిగా అందించింది.రిలయన్స్ 'వి కేర్' అనే చొరవలో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్, ఈఎస్ఏ ద్వారా విద్యార్థులకు విద్యాక్రీడా రంగంలో అవకాశాలను కల్పించేలా వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. డిసెంబరులో జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమం, వెనుకబడిన వర్గాల పిల్లల సాధికారత, ఊహలు ఆకాంక్షలకు రెక్కలు తొడిగేలా ప్రోత్సాహాన్నిస్తుంది. -
అదిరిపోయే బెనిఫిట్స్.. జియో న్యూ ఇయర్ ప్లాన్
రిలయన్స్ జియో తన వినియోగదారులకు కొత్త సంవత్సరం సందర్భంగా నూతన ప్లాన్ను తీసుకొచ్చింది. ఈ ప్రత్యేకమైన ‘న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ 2025’ గడువు డిసెంబర్ 11, 2024 నుంచి జనవరి 11, 2025 వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇందులో రీఛార్జ్ ప్లాన్తోపాటు కూపన్లను కూడా అందించనున్నట్లు పేర్కొంది. ఇందుకు రూ.2025తో రిఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: రూ.5 కోట్ల వాచ్తో జుకర్బర్గ్.. ప్రత్యేకతలివే..ప్లాన్ వివరాలు200 రోజుల పాటు అన్లిమిటెడ్ 5జీ ఇంటర్నెట్ యాక్సెస్.500 జీబీ 4జీ డేటా (రోజుకు 2.5 GB).అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సదుపాయం.పార్టనర్ కూపన్ల రూపంలో రూ.2150 విలువైన అదనపు ప్రయోజనాలు.రూ.500 అజియో కూపన్. రూ.2500 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలు చేస్తే ఈ కూపన్ ఉపయోగించవచ్చు.స్విగ్గీపై రూ.150 తగ్గింపు. కనిష్ట ఆర్డర్ రూ.499 పై వర్తిస్తుంది.ఈజ్ మై ట్రిప్ పై రూ.1500 తగ్గింపు: మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఫ్లైట్ బుక్ చేస్తే ఈ కూపన్ వినియోగించుకోవచ్చు.ఈ ప్లాన్ నెలవారీ రూ.349 ప్యాకేజీతో పోలిస్తే మొత్తంగా రూ.468 సేవింగ్స్ను అందిస్తుంది. -
ఎయిర్టెల్, జియో పరస్పరం విరుద్ధ వాదనలు
డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) ఆపరేటర్ల లైసెన్స్ ఫీజు రద్దు అంశంపై టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, భారతీ ఎయిర్టెల్ మరోసారి విభేదించాయి. డీటీహెచ్ ఆపరేటర్లను ఇతర టీవీ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్లతో సమానంగా పరిగణించాలని, లైసెన్స్ ఫీజును పూర్తిగా ఎత్తివేయాలని ఎయిర్టెల్ పట్టుబడుతోంది. మరోవైపు, లైసెన్స్ ఫీజు రద్దు చేస్తే కేబుల్ టీవీ, ఐపీటీవీ(ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) ప్రొవైడర్లకు నష్టం జరుగుతుందని రిలయన్స్ జియో వాదిస్తోంది.‘టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 పరిధిలో బ్రాడ్కాస్టింగ్ సేవల ప్రొవిజన్ కోసం సర్వీస్ ఆథరైజేషన్స్ ఫ్రేమ్వర్క్’ అనే అంశంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇటీవల టెలికాం సంస్థలతో సంప్రదింపులు జరిపింది. అందులో ఎయిర్టెల్, జియో వంటి దిగ్గజ కంపెనీలు పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపాయి. డీటీహెచ్ లైసెన్స్ ఫీజును పూర్తిగా తొలగించాలని ఎయిర్టెల్ కోరింది. ప్రస్తుతం కంటెంట్ ఆదాయంపై విధిస్తున్న లైసెన్స్ ఫీజు, డీటీహెచ్ ఆపరేటర్లు చెల్లించే లైసెన్స్ ఫీజును బ్రాడ్కాస్టర్లు భరించాలని, అంతిమంగా అలాంటి ఆదాయంతో ప్రయోజనం పొందవచ్చని ఎయిర్టెల్ సూచించింది. గతంలో ట్రాయ్ చేసిన సిఫార్సులను వీలైనంత త్వరగా అమలు చేయాలని, మార్కెట్లో బ్రాడ్కాస్టర్లు 20% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉండకుండా నిరోధించేలా క్రాస్ మీడియా ఆంక్షలను తొలగించాలని టాటా ప్లే ట్రాయ్ను కోరింది.టెలికాం రంగానికి కేబినెట్ నిర్దేశించిన స్థూల ఆదాయం (జీఆర్), సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) వంటి వాటిని డీటీహెచ్ లైసెన్సులకు కూడా వర్తింపజేయాలని ఎయిర్టెల్ సూచించింది. ఎయిర్ ప్రతిపాదించిన ఫీజు రద్దు అంశాన్ని జియో వ్యతిరేకించింది. ఉచిత స్పెక్ట్రమ్ కేటాయింపులు అందిస్తే డీటీహెచ్ సంస్థలు ప్రయోజనం పొందుతాయి కానీ, ఇది జాతీయ ఖజానాకు నష్టం కలిగిస్తుందని తెలిపింది. కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీ) ప్రొవైడర్లు తీవ్రంగా నష్టపోతారని వాదిస్తోంది. ఉచిత స్పెక్ట్రమ్ వల్ల డీటీహెచ్ సంస్థలు పొందే ప్రత్యేక ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇతర ప్లాట్ఫామ్లతో పోల్చి లైసెన్స్ ఫీజును మాఫీ చేయడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమేనని జియో ఇన్ఫోకామ్ పేర్కొంది.ఇదీ చదవండి: వేగంగా బ్యాంకు మోసాల దర్యాప్తునకు చర్యలుడీటీహెచ్ లైసెన్స్ ఫీజును ప్రస్తుతమున్న 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలని 2023 ఆగస్టులో ట్రాయ్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఈ సిఫార్సు వల్ల డీటీహెచ్, కేబుల్ టీవీ, ఐపీటీవీ ప్లాట్ఫామ్ల మధ్య సమాన వాటాను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
రూ.4.09 లక్షల కోట్లు: అప్పుల్లో టెలికాం కంపెనీలు
2024 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని నాలుగు ప్రధాన టెలికాం ఆపరేటర్ల మొత్తం అప్పు రూ.4,09,905 కోట్లుగా ఉంది. ఈ విషయాన్ని లోక్సభలో సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ వెల్లడించారు.ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ (BSNL) అప్పు.. ఇతర ఆపరేటర్లతో పోలిస్తే తక్కువని తెలుస్తోంది. మార్చి 31 నాటికి వొడాఫోన్ ఐడియా రూ.2.07 లక్షల కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ.1.25 లక్షల కోట్లు, జియో రూ.52,740 కోట్ల రుణాలుగా తీసుకున్నట్లు సమాచారం.బీఎస్ఎన్ఎల్ (BSNL) అప్పు రూ. 40,400 కోట్లు. అయితే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు ప్రకటించిన పునరుద్ధరణ ప్యాకేజీతో సంస్థ లోన్ రూ. 28,092 కోట్లకు తగ్గిందని పెమ్మసాని చంద్ర శేఖర్ పేర్కొన్నారు. అంతే కాకుండా.. రూ.89,000 కోట్లతో బీఎస్ఎన్ఎల్కు 4జీ/5జీ స్పెక్ట్రమ్ కేటాయింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. -
జియో, ఎయిర్టెల్ కథ కంచికేనా?.. వచ్చేస్తోంది స్టార్లింక్
భారతదేశంలో రిలయన్స్ జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి వాటినే ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే త్వరలోనే 'ఇలాన్ మస్క్' (Elon Musk) తన స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసును మన దేశంలో ప్రారంభించే అవకాశం ఉంది. ఇదే జరిగితే దేశీయ టెలికామ్ సంస్థలు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం.భారత్లో.. స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడికాలేదు. అయితే ఈ సర్వీస్ దేశంలో ప్రారంభమైన తరువాత.. ఇది చాలా ఖరీదైనదిగా ఉండే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి ధరలను కూడా కంపెనీ ప్రకటించలేదు.కంపెనీ మాజీ హెడ్ ప్రకారం.. స్టార్లింక్ మన దేశంలో ప్రారంభమైతే, మొదటి సంవత్సరంలో పన్నులతో సహా రూ. 1,58,000 ఖర్చు అవుతుంది. ఇందులో వన్టైమ్ ఎక్విప్మెంట్ ధర రూ. 37,400.. నెలవారీ సర్వీస్ ఫీజు రూ. 7,425గా ఉంటుంది. రెండో ఏడాది యూజర్ సుమారు రూ. 1,15,000 చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ పరికరాలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.స్టార్లింక్ సర్వీస్ చార్జీలతో పోలిస్తే.. జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి సర్వీస్ చార్జీలు చాలా తక్కువ. కాబట్టి స్టార్లింక్ మన దేశంలో మంచి ఆదరణ పొందుతుందా? అనేది ప్రశ్నార్థంగా ఉంది.స్టార్లింక్ సర్వీస్ ధరలు చాలా ఎక్కువ అయినప్పటికీ.. ఈ సేవలకు అవసరమైన లైసెన్స్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి 'జ్యోతిరాదిత్య సింధియా' ధృవీకరించారు. అయితే స్టార్లింక్ సక్సెస్ అనేది మొత్తం దాని చేతుల్లోనే ఉంది.భారతదేశంలోని వినియోగదారులను ఆకర్షించడానికి.. స్టార్లింక్ దాని ధరలను తగ్గించడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ధరలు మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయిస్తే.. స్టార్లింక్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు డిసెంబర్ 15 నాటికి వెల్లడయ్యే అవకాశం ఉంటుందని సమాచారం. -
మరో సంచలనానికి సిద్దమవుతున్న జియో.. త్వరలో 5జీ స్మార్ట్ఫోన్
అక్టోబర్ నెలలో రిలయన్స్ జియో అతి తక్కువ ధర వద్ద రెండు 4జీ మొబైల్ ఫోన్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఇదే బాటలో చౌకైన 5జీ స్మార్ట్ఫోన్ను తీసుకురావడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ యోచిస్తున్నట్లు సమాచారం.భారతదేశపు అతిపెద్ద టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ అయిన రిలయన్స్ జియో.. సరసమైన 5జీ స్మార్ట్ఫోన్ను తయారు చేయడానికి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చురర్ (OEMs), యూఎస్ చిప్మేకర్ క్వాల్కామ్తో జత కట్టనుంది. ఈ విషయాన్ని జియో వైస్ ప్రెసిడెంట్ సునీల్ దత్ వెల్లడించారు.రిలయన్స్ జియో అన్ని స్మార్ట్ఫోన్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. పరికరాల తయారీదారులు & బ్రాండ్లతో భాగస్వామ్యాన్ని అన్వేషిస్తోంది. 5జీ స్మార్ట్ఫోన్ నెట్వర్క్ను మెరుగుపరచడం మాత్రమే కాకుండా.. వినియోగదారులకు సరసమైన పరికరాలను అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోందని సునీల్ దత్ పేర్కొన్నారు.భారతదేశ టెలికామ్ ల్యాండ్స్కేప్ను విప్లవాత్మకంగా మార్చిన చరిత్ర జియోకు ఉంది. 2016లో సంస్థ జియో ఫోన్ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 999 మాత్రమే, నెలకు రూ. 123తో ప్రారంభమయ్యే సరసమైన రీఛార్జ్లను అందించింది. కాబట్టి ఇది మార్కెట్లో 10 కోట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది.ఇక రాబోయే జియో 5జీ స్మార్ట్ఫోన్ కూడా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నారు. అయితే ఇది మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుంది. దీని ధర ఎంత ఉండొచ్చు? అనే చాలా వివరాలు రాబోయే రోజుల్లో అధికారికంగా వెల్లడవుతాయి. -
మొబైల్ రీచార్జ్ ధరలు మరోసారి పెరుగుతాయా?
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు మరోసారి చార్జీలు పెంచే అవకాశం ఉందా? ఇన్వెస్టర్లతో ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ మూంద్రా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఎక్కువ డేటాను వినియోగించే టెలికం చందాదారులు పరిశ్రమకు సహేతుక రాబడిని అందించడానికి, సమాజంలోని అన్ని వర్గాలకు కనెక్టివిటీని చేర్చడానికి మరింత చెల్లించాలని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.కొత్త టెక్నాలజీ వినియోగానికి, డేటా వృద్ధికి తోడ్పడటానికి భారీ పెట్టుబడులు అవసరమని, అదే సమయంలో సమాజంలోని అన్ని వర్గాలకు కనెక్టివిటీని అందించడానికి టారిఫ్లు అందుబాటు ధరలో కొనసాగించాలని ఆయన అన్నారు. పెట్టుబడిపై సహేతుక రాబడిని అందుకోవడానికి పరిశ్రమకు వీలు కల్పించేందుకు డేటాను మరింత ఎక్కువగా ఉపయోగించే కస్టమర్లు ఎక్కువ చెల్లించినప్పుడు ఇది సాధ్యమవుతుందని వివరించారు.ఇదీ చదవండి: Jio: టీ ధర కంటే తక్కువకే 10 జీబీ డేటాపరిశ్రమ తన మూలధన వ్యయాన్ని తిరిగి పొందేందుకు టారిఫ్ల హేతుబద్ధీకరణ అవసరం అని నొక్కి చెప్పారు. టారిఫ్ పెంపు ఫలితంగా కంపెనీ త్రైమాసిక ప్రాతిపదికన కస్టమర్లను కోల్పోయినప్పటికీ.. మరొకసారి టారిఫ్ల పెంపు అవసరమని సూచించారు. టారిఫ్ల సవరణ కారణంగా రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా భారీగా చందాదార్లను కోల్పోయాయి. అత్యధికులు బీఎస్ఎన్ఎల్కు మారారు. ‘సెప్టెంబర్ త్రైమాసికంలో బీఎస్ఎన్ఎల్ ప్రభావం ఉంది. ఆగస్ట్ నుండి క్రమంగా నవంబర్ వరకు ఆ ప్రభావం చాలా త్వరగా తగ్గుతోంది’ అని మూంద్రా అన్నారు. -
Jio: టీ ధర కంటే తక్కువకే 10 జీబీ డేటా
రిలయన్స్ జియో తన డేటా-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను అప్డేట్ చేసింది. కొత్త చవక డేటా ప్లాన్ను పరిచయం చేసింది. ఈ ప్లాన్ 10జీబీ డేటాను అందిస్తుంది. పూర్తి యాక్టివ్ ప్లాన్ అవసరం లేకుండా తక్షణ డేటా అవసరమయ్యే వినియోగదారులకు ఇది ఉపయోగపడుతుంది.కొత్త డేటా ప్లాన్జియో పరిచయం చేసిన కొత్త చవక డేటా ప్లాన్ ధర రూ. 11. ఈ ప్లాన్ ఒక గంట చెల్లుబాటుతో 10జీబీ డేటాను అందిస్తుంది. ఈ "డేటా-ఓన్లీ" యాడ్-ఆన్లు జియో ప్రామాణిక బూస్టర్ ప్యాక్ల నుండి విభిన్నంగా ఉంటాయి. ఇప్పటికే ఉన్న సబ్స్క్రిప్షన్తో సంబంధం లేకుండా వినియోగదారుల కోసం స్వతంత్రంగా పనిచేస్తాయి. అయితే వాయిస్ కాల్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లేకపోయినప్పటికీ, వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్లతో ఈ పరిమితి పెద్దగా ప్రభావం చూపదు.జియోలో ప్రస్తుత డేటా ప్లాన్లు ఇవే..» రూ. 11 ప్లాన్: 10జీబీ డేటా, 1 గంట వ్యాలిడిటీ.» రూ. 49 ప్లాన్: 25జీబీ డేటా, 1 రోజు చెల్లుబాటు.» రూ. 175 ప్లాన్: 10జీబీ డేటా, 28 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. అలాగే జియోసినిమా ప్రీమియం, సోనీ లివ్తో సహా 10 ఓటీటీ ప్లాట్ఫారమ్లకు యాక్సెస్.» రూ. 219 ప్లాన్: 30జీబీ డేటా, 30 రోజుల చెల్లుబాటు.» రూ. 289 ప్లాన్: 40జీబీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ.ఇదీ చదవండి: రూ.6కే అన్లిమిటెడ్.. బీఎస్ఎన్ఎల్లో బెస్ట్ ప్లాన్ -
వేలం వేస్తేనే పోటీ.. ట్రాయ్కి జియో లేఖ
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్కి ఉపయోగించే స్పెక్ట్రంను వేలం వేస్తేనే విదేశీ దిగ్గజాలతో దేశీ టెల్కోలు పోటీపడేందుకు అవకాశాలు లభిస్తాయని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్కి రాసిన లేఖలో రిలయన్స్ జియో పేర్కొంది. దేశీయంగా మూడు టెల్కోలు అనేక సంవత్సరాలుగా నిర్మించుకున్న సామర్థ్యాల కన్నా స్టార్లింక్, క్విపర్ శాట్కామ్ బ్యాండ్విడ్త్ అధికమని తెలిపింది.శాట్కామ్ సంస్థలు కేవలం టెరెస్ట్రియల్ కవరేజీ లేని మారుమూల ప్రాంతాల్లో మాత్రమే సేవలు అందిస్తాయి కాబట్టి వాటికి ప్రాధాన్యతనిస్తామనడం సరికాదని జియో వ్యాఖ్యానించింది. స్టార్లింక్, క్విపర్, ఇతరత్రా శాట్కామ్ దిగ్గజాలు తాము పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్ సర్వీసులను కూడా అందించేందుకు పోటీపడతామని ఇప్పటికే వెల్లడించినట్లు తెలిపింది.ఇదీ చదవండి: వాట్సాప్ గ్రూప్లకు లైసెన్స్.. ఫీజు కూడా!ఈ నేపథ్యంలో స్పెక్ట్రంను వేలం వేయకుండా కేటాయించిన పక్షంలో వాటితో పోటీపడేందుకు దేశీ సంస్థలకు సమాన అవకాశాలు దొరకవని పేర్కొంది. అంతర్జాతీయ విధానాలకు తగ్గట్లుగా శాట్కామ్ స్పెక్ట్రంను వేలం వేయకుండా కేటాయించేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతుండటంతో జియో లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. -
రూ.11తో 10 జీబీ డేటా!
రిలయన్స్ జియో వినియోగదారులకు కొత్తగా బూస్టర్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కువగా డేటా వాడుకునే కస్టమర్లకు ఈ ప్లాన్ ఎంతో ఉపయోగమని కంపెనీ తెలిపింది. ఈమేరకు ప్లాన్ వివరాలు వెల్లడించింది.కేవలం రూ.11తో 10 జీబీ 4జీ డేటా వాడుకోవచ్చు.ఈ ఆఫర్ వ్యాలిడిటీ కేవలం ఒక గంట మాత్రమే ఉంటుంది.రీఛార్జ్ చేసుకున్న గంట తర్వాత డేటా స్పీడ్ 64 కేబీపీఎస్కు తగ్గిపోతుంది.ఈ ఆఫర్ కేవలం ఇంటర్నెట్ సర్వీసుకే పరిమతం. వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీసులను ఇది అందించదు.నిర్ణీత సమయంపాటు హైస్పీడ్ డేటా అవసరమయ్యేవారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగమని కంపెనీ తెలిపింది.లార్జ్ ఫైల్స్ లేదా సాఫ్ట్వేర్ అప్డేట్లు, డౌన్లోడ్ చేయాలనుకొనేవారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పింది.ఇదీ చదవండి: సీపీఐ నుంచి ఆహార ద్రవ్యోల్బణం మినహాయింపు? -
జియో దీపావళి ధమాకా ఆఫర్.. 90 రోజులు అన్లిమిటెడ్
దేశంలో అగ్రగామి టెలికం సంస్థ రిలయన్స్ జియో పరిమిత-కాల దీపావళి ధమాకా ఆఫర్లో భాగంగా రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ను అందిస్తోంది. మొత్తం 200GB డేటా, అపరిమిత కాల్స్, రూ. 3,350 వరకు విలువైన కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను అందించే ఈ ప్లాన్ కస్టమర్లకు నవంబర్ 5 వరకు అందుబాటులో ఉంటుంది.ప్రయోజనాలు ఇవే..జియో రూ. 899 ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రీపెయిడ్ ప్యాకేజీలో 2GB రోజువారీ డేటాతో పాటు 20GB అదనపు డేటాతో మొత్తం 200GB హై-స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. అలాగే రోజుకు 100 SMS, అపరిమిత కాలింగ్ను కూడా కవర్ చేస్తుంది. మీది 5G ఫోన్ అయితే, మీ ప్రాంతంలో 5G నెట్వర్క్ అందుబాటులో ఉంటే ఉచిత అపరిమిత 5Gని కూడా పొందవచ్చు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఏడాదంతా అదిరిపోయే ప్రయోజనాలు!అదనపు బెనిఫిట్స్ అజియోలో రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసే కస్టమర్లకు ఫ్లాట్ రూ. 200 తగ్గింపు లభిస్తుంది. ఈజీట్రిప్ ద్వారా చేసిన విమానాలు, హోటల్ బుకింగ్ చేస్తే రూ. 3,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. స్విగ్గిలో రూ. 399 లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్ చేసినప్పుడు రూ. 150 ఆదా చేయవచ్చు. -
మొబైల్ డేటా ట్రాఫిక్.. అగ్రగామిగా జియో
న్యూఢిల్లీ: మొబైల్ డేటా ట్రాఫిక్లో వరుసగా మూడవ త్రైమాసికంలో ప్రపంచ అగ్రగామిగా రిలయన్స్ జియో కొనసాగుతోందని కన్సల్టింగ్, రిసర్చ్ కంపెనీ టెఫిషంట్ తెలిపింది. ప్రపంచ ప్రత్యర్థులను జియో మించిపోయిందంటూ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించింది.జియో, చైనా మొబైల్, ఎయిర్టెల్, చైనా యునికామ్తోపాటు వొడాఫోన్ ఐడియా తదితర ఆపరేటర్ల మొబైల్ డేటా ట్రాఫిక్ను పోలుస్తూ ఒక పత్రాన్ని పంచుకుంది. ‘చైనా మొబైల్ కేవలం 2 శాతం వార్షిక వృద్ధి సాధించింది.జియో, చైనా టెలికాం 24 శాతం, ఎయిర్టెల్ 23 శాతం వృద్ధి నమోదు చేశాయి. చైనా మొబైల్లో ఏం జరుగుతోంది? అంటూ టెఫిషంట్ ప్రశ్నించింది. సెప్టెంబర్ చివరినాటికి జియో మొత్తం మొబైల్ చందాదార్ల సంఖ్య 47.88 కోట్లుంది. -
బీఎస్ఎన్ఎల్ దూకుడు! మరో మైలురాయికి చేరువలో,,
ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ దూసుకెళ్తోంది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది జూలైలో తమ టారిఫ్ ధరలను పెంచినప్పటి నుండి బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా తన నెట్వర్క్ను బలోపేతం చేస్తోంది. ప్రైవేట్ సంస్థల ప్లాన్ల కంటే చౌకగా ఉండే వివిధ రీఛార్జ్ ప్లాన్లను కూడా ప్రారంభించింది.ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 50,000 కంటే ఎక్కువ స్వదేశీ 4జీ సైట్లను దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలలో విజయవంతంగా ఏర్పాటు చేసిందని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అక్టోబర్ 29 వరకు ఇన్స్టాల్ చేసిన 50,000 సైట్లలో 41,000 సైట్లు ఇప్పుడు పనిచేస్తున్నాయని తెలిపింది.దేశంలో లక్ష కొత్త టెలికాం టవర్ల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.24,500 కోట్లు కేటాయించింది. ఇందు కోసం 4జీ పరికరాలను అందించడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నేతృత్వంలోని కన్సార్టియం సహకారంతో ఆత్మ నిర్భర్ భారత్ చొరవ కింద గతేడాది మేలో ఒప్పందం చేసుకుంది.వీటిలో దాదాపు 36,747 సైట్లు ఫేజ్ 9.2 కింద, 5,000 సైట్లు డిజిటల్ భారత్ నిధి ఫండ్ ద్వారా 4జీ శాచురేషన్ ప్రాజెక్ట్ కింద స్థాపితమయ్యాయి. "ఈ ప్రయత్నాలు 1,00,000 పైగా 4జీ సైట్లను విస్తరించాలనే బీఎస్ఎన్ఎల్ లక్ష్యాన్ని బలపరుస్తున్నాయి. ఇది దాని వేగవంతమైన విస్తరణకు నిదర్శనం" అని సమాచార శాఖ తెలిపింది. -
రిలయన్స్ దీపావళి గిఫ్ట్ చూశారా?
దీపావళి సందర్భంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు బహుమతులు ఇస్తాయి. కొన్ని కంపెనీలు బోనస్ల రూపంలో నగదు పంపిణీ చేస్తే మరికొన్ని స్వీట్లు, ఇతర గిఫ్ట్లు ఇస్తూంటాయి. భారత్లోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి బహుమతి అందించింది. రిలయన్స్ ఇచ్చిన గిఫ్ట్బాక్స్ అన్బాక్స్ వీడియో ప్రస్తుతం వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.రిలయన్స్ జియో ఇన్ఫోకామ్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని తనకు అందించిన గిఫ్ట్ బాక్స్ను అన్బాక్స్ చేస్తూ వీడియో రికార్డు చేసింది. ఈ వీడియోలో ఇంగ్లీషు, హిందీలో ‘దీపావళి శుభాకాంక్షలు’, ‘శుభ్ దీపావళి’ అని రాసిన తెల్లటి బాక్స్ను గమనించవచ్చు. ఇందులో మూడు ప్యాకెట్లు ఉన్నాయి. వాటిలో జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష(కిస్మిస్) ఉన్నాయి. View this post on Instagram A post shared by sumanasri😍 (@itlu_me_suma)ఇదీ చదవండి: ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, భార్య నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్తోపాటు తమ కుటుంబంలోని నలుగురు మనవరాళ్లు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు నోట్ ఉంది. -
జియోకు కస్టమర్లు షాక్.. కోటి మంది గుడ్ బై..!
-
తక్కువ రీచార్జ్తో ఉచితంగా ఓటీటీలు
వెబ్ సిరీస్ల నుండి సినిమాల వరకు అన్నింటినీ చూడటానికి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లు మంచి ఎంపికగా మారాయి. అయితే వీటిని వీక్షించాలంటే ప్రత్యేక సభ్యత్వం తీసుకోవాలి. అలాంటి అవసరం లేకుండా మొబైల్కి రీఛార్జ్ చేసుకుంటే చాలు కొన్ని ఓటీటీలను ఉచితంగా చూసేయచ్చు.దేశంలో అతిపెద్ద యూజర్ బేస్ కలిగిన టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో.. ఉచిత ఓటీటీ సబ్స్క్రిప్షన్తో వచ్చే అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. వీటి ఖర్చు కూడా చాలా తక్కువే. రూ. 500 కంటే తక్కువ ధరకే ఎంపిక చేసిన ప్లాన్లతో మీరు ఈ కాంప్లిమెంటరీ ప్రయోజనాలను పొందవచ్చు.రూ. 448 ప్లాన్జియోటీవీ ప్రీమియం ప్లాన్లలో భాగమైన ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో 2జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది. ఇది అన్ని నెట్వర్క్లకు అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు చేసుకోవచ్చు. ఇందులో సోనీలివ్, జీ5 వంటి డజను ఓటీటీ సేవలు ఉన్నాయి. అంతే కాకుండా జియో యాప్లకు యాక్సెస్ కూడా పొందవచ్చు.రూ. 175 ప్లాన్ఇది జియోలో చౌకైన డేటా ప్లాన్. 28 రోజుల చెల్లుబాటుతో 10జీబీ అదనపు డేటాను అందిస్తుంది. అయితే ఈ ప్లాన్లో కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. ఓటీటీల విషయానికి వస్తే సోనీలివ్, జీ5తో సహా 10 ఓటీటీ సేవలను ఉచితంగా ఆనందించవచ్చు.రూ.329 ప్లాన్కొంతమందికి మ్యూజిక్ వినడం ఇష్టంగా ఉంటుంది. యాప్ ద్వారా మ్యూజిక్ వింటున్నప్పుడు ప్రకటనలు చికాకు పెడతాయి. రూ. 329 ప్లాన్తో రీఛార్జ్ చేసుసుకుంటే ప్రకటన రహితంగా సంగీతాన్ని ఆనందించవచ్చు. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది 1.5జీబీ రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉంటాయి. దీంతో జియోసావన్ ప్రో సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. -
దీపావళి ఆఫర్: రూ. 699కే జియో 4జీ ఫోన్
రిలయన్స్ జియో.. జియో భారత్ దీపావళి ధమాకా ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద 999 రూపాయల వద్ద లభిస్తున్న 4జీ ఫోన్లను కేవలం రూ. 699లకు అందిస్తోంది. ఈ అవకాశం కేవలం కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2జీ ఫీచర్ ఫోన్స్ నుంచి అప్గ్రేడ్ అవ్వాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం.రూ.123 నెలవారీ సబ్స్క్రిప్షన్ & ప్రయోజనాలుపండుగ సీజన్ ఆఫర్ జియో భారత్ ప్లాన్తో వినియోగదారులు రూ. 123 నెలవారీ సబ్స్క్రిప్షన్ని ఆస్వాదించవచ్చు. ⋆అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్⋆నెలకు 14 జీబీ డేటా⋆455 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్లు⋆సినిమా ప్రీమియర్లు & కొత్త సినిమాలు⋆వీడియో షోలు⋆లైవ్ స్పోర్ట్స్⋆జియో సినిమాలో హైలెట్స్⋆క్యూఆర్ కోడ్ స్కాన్లతో కూడా డిజిటల్ ట్రాన్సక్షన్⋆జియోపే ద్వారా అందుకున్న చెల్లింపులకు సౌండ్ అలర్ట్లను స్వీకరించడం⋆గ్రూప్ చాట్లు⋆జియో చాట్లో వీడియోలు, ఫోటోలు, మెసేజింగ్ వంటివి షేర్ చేయడంఇతర ఆపరేటర్లు అందిస్తున్న అతి తక్కువ ఫీచర్ ఫోన్ ప్లాన్తో (నెలకు రూ. 199) పోలిస్తే.. జియో భారత్ ప్లాన్ (నెలకు రూ. 123) దాదాపు 40 శాతం చౌకగా ఉంటుంది. దీంతో యూజర్ ప్రతినెలా రూ. 76 ఆదా చేయవచ్చు. ఇలా ఆదా చేస్తే మీరు తొమ్మిది నెలల్లో ఫోన్ కొన్న డబ్బును తిరిగి పొందినట్లే అవుతుంది. ఇది కేవలం ఫోన్ కంటే కూడా మీకు ఇష్టమైనవారికి ఇచ్చే గిఫ్ట్గా కూడా పనికొస్తుంది. దీనిని జియోమార్ట్ లేదా అమెజాన్ వంటి వాటిలో కొనుగోలు చేయవచ్చు. -
జియో దీపావళి ఆఫర్స్: రూ.3,350 విలువైన బెనిఫిట్స్
ప్రముఖ టెలికామ్ దిగ్గజం రిలయన్స్ జియో 'దీపావళి ధమాకా' పేరుతో కొత్త ఆఫర్స్ ప్రకటించింది. దీపావళి పండుగ సందర్భంగా కంపెనీ ఈ వినియోగదారుల కోసం ఈ ఆఫర్స్ తీసుకువచ్చింది. వీటి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..రిలయన్స్ జియో ప్రకటించిన ఈ ఆఫర్స్ ద్వారా సుమారు రూ. 3,350 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. నవంబర్ 5లోపు రీఛార్జ్ చేసుకున్నవారికి మాత్రమే ఈ బెనిఫీట్స్ లభిస్తాయి. రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్లో భాగంగా రూ.899 రీఛార్జ్ ప్లాన్ మీద, రూ. 3,599 రీఛార్జ్ ప్లాన్ మీద అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.రూ.899 రీఛార్జ్ ప్లాన్ ద్వారా యూజర్స్ 90 రోజుల వరకు అన్లిమిటెడ్ 5జీ సేవలను పొందవచ్చు. అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు పొందవచ్చు. అదనంగా 20 జీబీ డేటా కూడా లభిస్తుంది. రూ. 3,599 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ (365 రోజులు) ద్వారా రోజుకు 2.5 జీబీ డేటాను పొందవచ్చు.ప్రయోజనాలుఈజీ మై ట్రిప్ వోచర్: రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్స్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే.. రూ. 3,000 విలువైన ఈజీ మై ట్రిప్ వోచర్ పొందవచ్చు. దీనిని విమాన ప్రయాణాలను, హోటల్ బుకింగ్స్ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు.అజియో కూపన్: రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్ళపైన రూ. 200 అజియో డిస్కౌంట్ లభిస్తుంది.స్విగ్గీ వోచర్: ఫుడ్ డెలివరీ కోసం రూ. 150 విలువైన స్విగ్గీ వోచర్ లభిస్తుంది.ఇదీ చదవండి: యూట్యూబ్ కొత్త ఫీచర్: మరింత ఆదాయానికి సులువైన మార్గంకూపన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే..రిలయన్స్ జియా దీపావళి ధమాకా ఆఫర్స్ ద్వారా పొందిన కూపన్లను మై జియో యాప్ సాయంతో క్లెయిమ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.➜మై జియో యాప్ ఓపెన్ చేసి ఆఫర్స్ విభాగంలోకి వెళ్ళాలి➜అక్కడ కనిపించే మై విన్నింగ్స్ మీద క్లిక్ చేసి కూపన్ ఎంచుకోవాలి➜కూపన్ కోడ్ కాపీ చేసి.. ఎక్కడ ఉపయోగించాలనుకుంటున్నారో ఆ వెబ్సైట్కు వెళ్లి కూపన్ కోడ్ అప్లై చేసుకోవచ్చు. -
JioHotstar: కోటి రూపాయలు ఇచ్చారంటే..: అంబానీకే ఆఫర్ ఇచ్చిన విద్యార్థి
ఢిల్లీ : ఓ విద్యార్థి తన ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ప్రతిసారీ ఏదో ఒక కారణంతో విఫలమయ్యేవాడు. కానీ ఈసారి గురి తప్పలేదు. యూ ఆర్ వెల్కమ్ అంటూ కేంబ్రిడ్జీ నుంచి ఆహ్వానం అందింది. త్వరలోనే విద్యార్థి ఇంగ్లాండ్కు వెళ్లాల్సి ఉంది. అందుకే ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీకి ఓ ఆఫర్ ఇచ్చాడు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి? విద్యార్థి ఇచ్చిన ఆఫర్ను ముఖేష్ అంబానీ స్వీకరిస్తారా? లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? ఆ కథా కమామిషు ఏంటో ఏంటో తెలుసుకుందాం పదండి.రిలయన్స్,డిస్నీ మీడియా వ్యాపారాల విలీనానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రిలయన్స్, డిస్నీ విలీనానికి కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విలీనానంతరం డిస్నీప్లస్,హాట్స్టార్లో జియో సినిమాను విలీనం చేయబోతున్నారని, రెండు సంస్థలను కలిసి జియో హాట్స్టార్గా వ్యవహరించనున్నారని మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.జియోహాట్స్టార్ పేరుతో ఈ తరుణంలో ఢిల్లీకి చెందిన ఓ డెవలపర్ జియోహాట్స్టార్ పేరుతో డొమైన్ బుక్ చేశాడు. ఆదే జియోహాట్స్టార్ పేరు మీద వ్యపారావ్యవహారాలు కొనసాగించాలనుకున్న రిలయన్స్కు సదరు డెవలపర్ ఆఫర్ ఇచ్చాడు. జియోహాట్స్టార్ డొమైన్ పేరును బుక్ చేసుకుంది తానేనని, అది మీకు కావాలంటే ఇస్తాను. ఇందుకోసం మీరు నాకు రూ.కోటి ఇవ్వాలని రిలయన్స్ సంస్థకు లేఖ రాశాడు.కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆఫర్ఆ లేఖలో.. నేను 2021లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ యాక్సిలరేట్ ప్రోగ్రామ్కు ఎంపికైన డెవలపర్ని. ఐఐటీ పూర్తి చేయలేకపోయాను. అయినప్పటికీ నేను నిత్య విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకునేందుకు మొగ్గుచూపుతుంటాను. టైర్-2 కాలేజీ నుంచి వచ్చిన తనకు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆఫర్ వచ్చింది. ఆంత్రప్రెన్యూర్షిప్ విభాగంలో పూర్తి స్థాయి డిగ్రీని పూర్తి చేసేందుకు అవకాశం కలిగింది. కానీ ఆ డిగ్రీలో చేరాలంటే ఖరీదైన వ్యవహారం. నేను భరించలేను. కోటి ఇవ్వాలంటూఅందుకే జియోహాట్స్టార్ విలీనం చివరి దశలోకి వచ్చిందని తెలిసింది. వెంటనే జియోహాట్స్టార్.కామ్ డొమైన్ను నేను కొనుగోలు చేశారు. విలీనం అనంతరం జియోహాట్స్టార్గా మీరు వినియోగదారులకు సేవలందించాలంటే నేను కొనుగోలు చేసిన డొమైన మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నేను అడిగినంత మీరు ఇస్తే నా కలను సాకారం చేసినవారవుతారు. ఈ మొత్తం రిలయన్స్ ఖర్చుగా భావిస్తుందేమో కానీ ఇది నాకు జీవితాన్ని మార్చే అవకాశం’అని పేర్కొన్నాడు.మరి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ విద్యార్థి అడిగిన మొత్తం ఇస్తారా? లేదంటే సదరు విద్యార్థిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. -
ఓటీటీలో యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ కథా చిత్రం 'ప్యూరియోసా ఎ మ్యాడ్ మ్యాక్స్' చిత్రం సమ్మర్ స్పెషల్గా మే 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సుమారు ఆరు నెలల తర్వాత ఓటీటీలో విడుదల కానుంది. 2015లో వచ్చిన మ్యాడ్ మ్యాక్స్ ప్యూరి రోడ్ చిత్ర ప్రాంచైజీలో భాగంగా ఐదో చిత్రంగా తెరకెక్కింది. గత చిత్రాల దర్శకుడు జార్జ్ మిల్లర్నే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే వాటికంటే భారీగా అదే సమయంలో ఒరిజినల్ కథతో రూపొందించారు.'ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా' ఓటీటీ విడుదల ప్రకటన రావడంతో ఫ్యాన్స్ జోష్లో ఉన్నారు. అక్టోబర్ 23నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు జియో సినిమా వెల్లడించింది. తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ,కన్నడ, తమిళం,బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుందని జియో పేర్కొంది. ఇందులో అన్యటైలర్ జాయ్ ఒక యువ మహిళా యోధుని పాత్రలో నటించారు. నటుడు క్రిస్ హేమ్స్ వర్త్ ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ సంస్థతో కలిసి మిల్లర్ ఆయన చిరకాల భాగస్వామి, ఆస్కార్ నామినేటెడ్ నిర్మాత డౌగ్ మిథ్చల్ ఆ్రస్టేలియా బేస్డ్ కెన్నడీ మిల్లర్ మిచ్చల్ పతాకంపై నిర్మించారు. -
జియోకి షాక్.. కోటి మంది టాటా!
కొన్ని రోజుల క్రితం రిలయన్స్ జియో తన రీఛార్జ్ ప్లాన్ల టారిఫ్ను పెంచిన తర్వాత యూజర్లు షాక్ ఇచ్చారు. నివేదికల ప్రకారం పెరిగిన టారిఫ్ల ప్రభావం దాని వినియోగదారు బేస్పై ప్రతిబింబించింది. రెండవ త్రైమాసికంలో దాదాపు 1.09 కోట్ల మంది వినియోగదారులు జియో నుండి వెళ్లిపోయారు.అదే సమయంలో జియో 5G సబ్స్క్రైబర్ బేస్ మాత్రం 17 మిలియన్లు పెరిగినట్లు మొత్తం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గతంలో యూజర్ బేస్ 130 మిలియన్లు ఉండగా ఇప్పుడు 147 మిలియన్లకు చేరుకుంది. ఇక ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) రూ. 181.7 నుండి రూ.195.1కి పెరిగింది. అయితే మొత్తంగా జియో సబ్స్క్రైబర్ బేస్ క్షీణించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త అడుగు.. దేశంలో తొలి D2Dతన యూజర్ బేస్కు సంబంధించిన పరిస్థితి గురించి తమకు తెలుసునని, లాభాలపై ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపదని జియో తెలిపింది. తమ కస్టమర్లకు అత్యుత్తమ 5జీ నెట్వర్క్ను అందించడంపైనే తమ దృష్టి ఉందని కంపెనీ పేర్కొంది. వినియోగదారులను కోల్పోవడం తమ వ్యాపారాన్ని ప్రభావితం చేయదని, అయితే ఇతర టెలికాం ఆపరేటర్లకు ఇది అవకాశం కల్పిస్తుందని జియో అంగీకరించింది. -
Jio నుంచి కొత్త టెక్నాలజీ కంప్యూటర్లుగా మారనున్న టీవీలు
-
Jio నుంచి కొత్త టెక్నాలజీ కంప్యూటర్లుగా మారనున్న టీవీలు
-
5జీ నెట్వర్క్లో నెంబర్ వన్: తెలుగు రాష్ట్రాల్లో జియో హవా..
5జీ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్లో రిలయన్స్ జియో నెంబర్ వన్గా అవతరించింది. 5జీ నెట్వర్క్ కవరేజ్లో మాత్రమే కాకుండా , లభ్యతలో కూడా జియో అద్భుతమైన పనితీరును ప్రదర్శిచింది. తాజాగా ఓపెన్ సిగ్నల్ విడుదల చేసిన నివేదికలో.. ఆంధ్రప్రదేశ్ టెలికామ్ సర్కిల్ (ఆంధ్ర, తెలంగాణ) జియో అసాధారణమైన పనితీరును కనపరిచినట్లు వెల్లడించింది.ఓపెన్ సిగ్నల్ నివేదిక ప్రకారం.. జియో 5జీ కవరేజ్ టవర్లు 66.7 శాతం నెట్వర్క్ లభ్యత స్కోర్తో దాని ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ సర్కిల్లోని జియో వినియోగదారులు మూడింట రెండు వంతులు 5జీ సేవలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద విస్తృతమైన, స్థిరమైన 5జీ కనెక్టివిటీని అందించడంలో జియో ముందంజలో ఉందని నివేదిక స్పష్టం చేస్తోంది.5జీ కవరేజ్ ఎక్స్పీరియన్స్లో జియో.. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలలో ముందుంది. 10 పాయింట్ల స్కేల్పై జియో 9.0 పాయింట్ల స్కోర్తో.. దాని ప్రధాన ప్రత్యర్థి ఎయిర్టెల్ (7.1 స్కోర్) కంటే ముందు వరసలో ఉంది. జియో ఎప్పటికప్పుడు నిరంతరాయ సేవలను అందిస్తూ ముందుకు సాగుతుండటంతో వినియోగదారులు ఈ సర్వీస్ ఎక్కువగా ఉపయోగించడానికి సుముఖత చూపుతున్నారు.జియో, ఎయిర్టెల్ తరువాత వోడాఫోన్ ఐడియా 3.7 పాయింట్ల స్కోర్, బీఎస్ఎన్ఎల్ 1.2 పాయింట్ల స్కోర్స్ సాధించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో 5G కవరేజీని విస్తరించడంలో బీఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఐడియాకు సవాలుగా మారింది. అయితే ప్రస్తుతం వినియోగదారులు జియో 5జీ ద్వారా స్పీడ్ డౌన్లోడ్ పొందుతూ మెరుగైన నెట్వర్క్ అనుభవం పొందుతున్నారని సమాచారం. -
జియో స్పీడ్ ఎక్కువే: ఓపెన్ సిగ్నల్!
వేగంగా నెట్వర్క్ సేవలందించడంలో జియో దూసుకుపోతుంది. నెట్వర్క్ స్పీడ్, కవరేజ్, స్థిరమైన సర్వీసులు అందించడంలో జియో మరింత మెరుగుపడిందని ఓపెన్ సిగ్నల్ నివేదించింది. దేశంలోని టెలికాం కంపెనీలతో పోలిస్తే జియో అధికంగా 89.5 ఎంబీపీఎస్ స్పీడ్ నెట్వర్క్ను అందిస్తున్నట్లు పేర్కొంది. ‘ఇండియా మొబైల్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో భారత టెలికాం నెట్వర్క్ కంపెనీల సేవలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించింది.నివేదికలోని వివరాల ప్రకారం..రిలయన్స్ జియో గరిష్ఠంగా 89.5 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్ కలిగిన నెట్వర్క్ను అందిస్తుంది. ఎయిర్టెల్ 44.2 ఎంబీపీఎస్, వొడాఫోన్ ఐడియా 16.9 ఎంబీపీఎస్తో తర్వాత స్థానాల్లో నిలిచాయి. జియో నెట్వర్క్ స్పీడ్ ఎయిర్టెల్ కంటే రెండింతలు ఎక్కువగా ఉంది. ఇది స్ట్రీమింగ్, గేమింగ్, ఇతర డేటా సేవలను మరింత మెరుగ్గా అందించే అవకాశం ఉంది. జియో నెట్వర్క్ సేవలు చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తరించాయి. ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..దేశీయంగా టెలికాం నెట్వర్క్ సేవలకు సంబంధించి కస్టమర్ల అంచనాలు పెరుగుతున్నాయి. ఆన్లైన్ గేమ్లు, వీడియో స్ట్రీమింగ్, ఇతర డేటా అవసరాల కోసం వేగంగా నెట్వర్క్ ఉండాలనుకుంటున్నారు. అదే సమయంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ పెరుతుతోంది. దాంతో సంస్థలు మెరుగైన సర్వీసులు ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది జులైలో జియోతోపాటు ఇతర కంపెనీలు టారిఫ్ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. దాంతో కస్టమర్ల అట్రిషన్ రేటు(నెట్వర్క్ మారడం) పెరగడంతో జియో విభిన్న మార్గాలు అనుసరిస్తోంది. టారిఫ్ రేట్లను పెంచినప్పటి నుంచి నెట్వర్క్ స్పీడ్ తగ్గిపోయిందనే అభిప్రాయాలున్నాయి. కాబట్టి క్రమంగా నెట్వర్క్ స్పీడ్ పెంచుతున్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. -
టీవీలు కంప్యూటర్లుగా మారిపోతే.. జియో కొత్త టెక్నాలజీ
రిలయన్స్ జియో మరో కొత్త టెక్నాలజీకి నాంది పలుకుతోంది. ఇంట్లోని స్మార్ట్ టీవీలను తక్కువ ఖర్చుతో సులభంగా కంప్యూటర్లుగా మార్చే సాంకేతికతను ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024లో ప్రదర్శించింది. జియో క్లౌడ్ పీసీ (Jio Cloud PC) అని పిలిచే ఈ టెక్నాలజీ కేవలం కొన్ని వందల రూపాయలకే టీవీని కంప్యూటర్గా మారుస్తుంది.ఇందుకోసం ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ టీవీ, టైపింగ్ కీబోర్డ్, మౌస్, జియో క్లౌడ్ పీసీ యాప్ మాత్రం ఉంటే చాలు. స్మార్ట్ టీవీలే కాకుండా సాధారణ టీవీలను సైతం జియోఫైబర్ లేదా జియోఎయిర్ఫైబర్తో వచ్చే సెట్-టాప్ బాక్స్ ద్వారా కంప్యూటర్లుగా మార్చుకోవచ్చు. జియో క్లౌడ్ పీసీ అనేది ఇంటర్నెట్ ద్వారా ఏదైనా టీవీని క్లౌడ్ కంప్యూటింగ్కు కనెక్ట్ చేసే సాంకేతికత.జియో క్లౌడ్ పీసీ టెక్నాలజీని ఉపయోగించడం చాలా సులభం. యూజర్ యాప్లోకి లాగిన్ అయితే చాలు. క్లౌడ్లో స్టోర్ అయిన డేటా మొత్తం టీవీ స్క్రీన్పై కనిపిస్తుంది. సాధారణంగా కంప్యూటర్లో చేసే ఈమెయిల్, మెసేజింగ్, సోషల్ నెట్వర్కింగ్, ఇంటర్నెట్ సర్ఫింగ్, స్కూల్ ప్రాజెక్ట్లు, ఆఫీసు ప్రెజెంటేషన్ల వంటి పనులన్నింటినీ ఇప్పుడు టీవీలో చేయవచ్చు.ఖరీదైన కంప్యూటర్లను కొనుక్కోలేని దేశంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఈ సాంకేతికత ఒక వరం లాంటిది. క్లౌడ్ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు కాబట్టి, సాధారణ కంప్యూటర్తో పోలిస్తే ఇది సురక్షితంగా ఉండటమే కాకుండా డేటా రికవరీని చాలా సులభతరం చేస్తుంది. ఇది టీవీలతో పాటు మొబైల్ పరికరాలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ యాప్కు సంబంధించిన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించనప్పటికీ, రాబోయే నెలల్లో దీనిని మార్కెట్లో విడుదల చేయవచ్చు. -
‘స్మార్ట్’ ఉన్నా ఫీచర్ ఫోన్లు ఎందుకు?
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ ఫోన్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. చాలా కంపెనీలు మొబైల్ ఫీచర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పరిచయం చేస్తున్నాయి. దాంతో మొబైల్ ఫోన్లను మరింత స్మార్ట్గా మార్చాలని విభిన్న ప్రయోగాలు చేపడుతున్నాయి. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా ఫీచర్ ఫోన్లకు ఆదరణ మాత్రం తగ్గడంలేదు. అయితే వివిధ కారణాలతో చాలామంది ఇంకా ఫీచర్ ఫోన్లవైపే మొగ్గు చూపుతున్నారు. అందుకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.ప్రాథమిక కమ్యునికేషన్ కోసం ఈ ఫీచర్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు.స్మార్ట్ఫోన్లతో పోలిస్తే బ్యాటరీ లైఫ్ అధికంగా ఉంటుంది.కేవలం కాల్స్, టెక్ట్స్ మెసేజ్లు చేయడానికి వీలుగా దీన్ని అధికంగా వాడుతున్నారు.కొన్ని ఆఫీసుల్లో వివిధ కారణాల వల్ల స్మార్ట్ఫోన్లను అనుమతించడం లేదు. దాంతో చాలామంది ఉద్యోగులు తప్పక ఈ ఫీచర్ ఫోన్ను కొనుగోలు చేస్తున్నారు.స్మార్ట్ఫోన్ ఉన్నా కూడా నిత్యం దూర ప్రయాణాలు చేసేవారు బ్యాకప్ కోసం దీన్ని వినియోగిస్తున్నారు.ఫోన్లకు సంబంధించి సింప్లిసిటీని ఇష్టపడేవారు వీటిని కొనుగోలు చేస్తున్నారు.ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు తక్కువ ఖర్చుతో కూడిన ఈ ఫీచర్ ఫోన్లను తీసుకుంటున్నారు. ఒకవేళ పిల్లలు ఫోన్ కావాలని మారాం చేసి తీసుకుని కిందపడేసినా పెద్దగా నష్టం ఉండదు.వృద్ధులు, కంటి చూపు సరిగా లేనివారు ఈ ఫీచర్ ఫోన్లను సులువుగా వినియోగించవచ్చు.ఆర్థిక స్థోమత సరిగాలేని వారు ఈ ఫీచర్ ఫోన్లను ఎంచుకుంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్ ఫోన్ మార్కెట్ 2018-2030 మధ్య కాలంలో ఏటా 3.5 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి. భారత్లో 2023 రెండో త్రైమాసికం లెక్కల ప్రకారం అంతకుముందు ఏడాది అదే త్రైమాసికంతో పోలిస్తే తొమ్మిది శాతం ఈ ఫోన్ల అమ్మకాలు పెరిగాయి.ఇదీ చదవండి: ఐదు కంపెనీల ప్రాపర్టీలు వేలంఇటీవల రిలయన్స్ జియో కంపెనీ 4జీ నెట్వర్క్ సదుపాయం కలిగిన ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. ఇటీవల ఢిల్లీలో ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్(ఐఎంసీ) 2024 సమావేశంలో భాగంగా ఈ ఫోన్లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వీటి ధర రూ.1,099గా నిర్ణయించారు. అయితే రిటైలరనుబట్టి ఈ ధరలో మార్పులుంటాయని గమనించాలి. -
జియోభారత్ కొత్త ఫోన్స్ ఇవే.. ధర తెలిస్తే కొనేస్తారు!
రిలయన్స్ జియో.. ఎట్టకేలకు జియోభారత్ సిరీస్లో వీ3, వీ4 ఫోన్లను ఆవిష్కరించింది. 2జీ ఫీచర్ ఫోన్స్ ఉపయోగించే వినియోగదారులను 4జీ డిజిటల్ ప్రపంచంవైపు తీసుకెళ్లడానికి కంపెనీ ఈ మొబైల్స్ రూపొందించింది. ఇవి చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. లేటెస్ట్ ఫీచర్స్ పొందుతాయి.ధరజియోభారత్ సిరీస్ మొబైల్ ఫోన్స్ ధర కేవలం రూ.1099 మాత్రమే కావడం గమనార్హం. వీ3, వీ4 రెండు మోడల్స్ త్వరలో ఫిజికల్ మొబైల్ సెల్లింగ్ అవుట్లెట్లలో మాత్రమే కాకుండా జియో మార్ట్, అమెజాన్లో కూడా అందుబాటులో ఉంటాయి. దీని ధర దాని ప్రత్యర్థుల కంటే కూడా 40 శాతం తక్కువ. జియో భారత్ సిరీస్ ఫోన్ కేవలం రూ.123 రీఛార్జ్ ప్లాన్తో వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14 జీబీ వరకు డేట్ లభిస్తుంది.బ్యాటరీ & స్టోరేజ్జియోభారత్ సిరీస్ వీ3, వీ4 ఫోన్స్ 1000 mAh బ్యాటరీ పొందుతాయి. 125 జీబీ వరకు స్టోరేజిని పెంచుకోవడానికి అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ మొబైల్స్ 23 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తాయి.వీ3, వీ4 రెండు మోడల్ల ద్వారా యూజర్స్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ కూడా పొందవవచ్చు. జియో టీవీ వినియోగదారులు ఈ మొబైల్స్ ద్వారా తమకు ఇష్టమైన షోలు, వార్తలు లేదా గేమ్స్ వంటి వాటిని వీక్షించడానికి 455 కంటే ఎక్కువ లైవ్ ఛానెల్ యాక్సెస్ పొందుతారు.ఇదీ చదవండి: లులు గ్రూప్ అధినేత మంచి మనసు.. ప్రశంసిస్తున్న నెటిజన్లుజియోపే, యూపీఐ ఇంటిగ్రేషన్, ఇంటర్నల్ సౌండ్ బాక్స్తో, డిజిటల్ పేమెంట్లు సులభంగా చేసుకోవడానికి కూడా ఈ మొబైల్స్ ఉపయోగపడతాయి. జియోచాట్ యూజర్లు అన్లిమిటెడ్ మెసేజింగ్, ఫొటో షేరింగ్, గ్రూప్ చాట్ వంటి ఆప్షన్స్ పొందుతారు. తద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈజీగా కనెక్ట్ ఈ ఫోన్స్ అనుమతిస్తాయి. -
బీఎస్ఎన్ఎల్ దూకుడు.. ఇక మరింత ‘స్పీడు’
దేశంలోని ప్రధాన టెలికాం ఆపరేటర్లు ఇటీవల తమ మొబైల్ టారిఫ్లను 15 శాతం వరకు పెంచాయి. ఈ ధరల పెంపు చాలా మంది వినియోగదారులను బీఎస్ఎన్ఎల్కి మారడానికి ప్రేరేపించింది. పెరుగుతున్న ఈ ఆసక్తికి అనుగుణంగా కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి బీఎస్ఎన్ఎల్ తన 4జీ సేవలను వేగంగా విస్తరిస్తోంది.దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో బ్రాడ్బ్యాండ్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయించే ప్రైవేటు టెలికాం కంపెనీలకు పోటీగా ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్ తన బ్రాడ్బ్యాండ్ ప్లాన్లను కూడా మెరుగుపరుస్తోంది. బీఎస్ఎన్ఎల్ ఇటీవల తన చవకైన ఫైబర్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై స్పీడ్ లిమిట్స్ను అప్గ్రేడ్ చేసింది. కంపెనీ తన రూ.249, రూ.299, రూ.329 ప్లాన్లలో వేగాన్ని పెంచింది.రూ. 249 ప్లాన్ఈ ప్లాన్లో గతంలో 10 Mbps వేగంతో నెట్ వచ్చేది. ఇప్పుడిది 25 Mbpsకి పెరిగింది. ఫెయిర్ యూసేజ్ పాలసీ కింద 10 GB నెట్ను విస్తృతంగా వినియోగించుకోవచ్చు. దీని తర్వాత వేగం 2 Mbpsకి తగ్గుతుంది. ఇది కొత్త సబ్స్క్రైబర్ల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త రీచార్జ్.. 105 రోజులు అన్లిమిటెడ్రూ. 299 ప్లాన్ఇందులోనూ నెట్ స్పీడ్ 10 Mbps నుండి 25 Mbpsకి పెరిగింది. పరిమితిని చేరుకున్న తర్వాత వేగం 2 Mbpsకి తగ్గుతుంది. ఇది కూడా ఫెయిర్ యూసేజ్ పాలసీ 20జీబీ నెట్ను అందిస్తుంది. ఈ ప్లాన్ కొత్త వినియోగదారులకు మాత్రమే.రూ. 329 ప్లాన్ఈ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లో మామూలుగా 20 Mbps నెట్ స్పీడ్ ఉండేది. ఇప్పుడిది 25 Mbpsకి పెరిగింది. ఇక 1000 జీబీ గణనీయమైన ఎఫ్యూపీని అందిస్తుంది. ఆ తర్వాత వేగం 4 Mbpsకి తగ్గుతుంది. ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. -
జియో కొత్త ఐఎస్డీ ప్లాన్లు.. రూ.39కే!
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన ఐఎస్డీ రీఛార్జ్ ప్లాన్లను పునరుద్ధరించింద. కొత్త ప్లాన్లు కేవలం రూ.39 నుంచి ప్రారంభమవుతాయి. కొత్త ప్లాన్లతో 7 రోజులపాటు ఐఎస్డీ కాల్స్ చేసుకోవచ్చని, అత్యంత తక్కువ ధరలకు ఐఎస్డీ మినిట్స్ అందిస్తున్నట్లు జియో పేర్కొంది.జియో బంగ్లాదేశ్, యూకే, సౌదీ అరేబియా, నేపాల్, చైనా, జర్మనీ, నైజీరియా, పాకిస్తాన్, ఖతార్, న్యూజిలాండ్, శ్రీలంక, స్విట్జర్లాండ్, స్పెయిన్, ఇండోనేషియా కోసం ఐఎస్డీ రీఛార్జ్ ప్లాన్ రేట్లను సవరించింది.యూఎస్, కెనడా కోసం జియో ఐఎస్డీ ప్లాన్ రూ.39 నుండి ప్రారంభమవుతుంది. 7 రోజుల చెల్లుబాటుతో 30 నిమిషాల టాక్ టైమ్ని అందిస్తోంది. అదే విధంగా బంగ్లాదేశ్కు రూ.49 ప్లాన్ 20 నిమిషాల టాక్ టైమ్, సింగపూర్, థాయ్లాండ్, మలేషియా, హాంకాంగ్లకు రూ.59 ప్లాన్ 15 నిమిషాల టాక్ టైమ్ని అందిస్తోంది.ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లకు 15 నిమిషాల టాక్ టైమ్తో రూ.69 రీఛార్జ్ ప్లాన్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్లకు 10 నిమిషాల టాక్ టైమ్తో రూ.79 రీఛార్జ్ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది. -
ఆకర్షణీయమైన బెనిఫిట్లతో జియో కొత్త రీచార్జ్ ప్లాన్లు
రిలయన్స్ జియో (Jio) తన ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను ఇటీవల సగటున 15 శాతం పెంచింది. దీనిపై కస్టమర్ల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అప్డేట్లో భాగంగా కంపెనీ ఇప్పటికే ఉన్న ప్లాన్లపై కొన్ని ప్రయోజనాలను జియో సవరించింది.వివిధ కస్టమర్ల అవసరాలకు అనుగుణగా జియో కొత్త ఆప్షన్లను రూపొందించింది. కొత్త ఆఫర్లలో రూ. 1,028, రూ. 1,029 రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. ఈ రెండూ వినియోగదారులకు సమగ్ర ప్రయోజనాలను అందించేలా రూపొందించారు. ఏ ప్లాన్ ఏయే బెనిఫిట్స్ ఆఫర్ చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.రూ. 1,028 ప్లాన్జియో రూ. 1,028 ప్లాన్ 84 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. అదనంగా సబ్స్క్రైబర్లు 2జీబీ రోజువారీ డేటాను అందుకుంటారు. ప్లాన్ వ్యవధిలో మొత్తం 168జీబీ లభిస్తుంది. జియో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులు అపరిమిత 5జీ డేటాను ఆనందివచ్చు.రూ. 1,028 ప్లాన్లో స్విగ్గీ వన్ లైట్ మెంబర్షిప్ ఉంది. తరచుగా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లకు ఇది సరైనది. అంతేకాకుండా జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్ సేవలకు కూడా యాక్సెస్ను పొందుతారు.రూ. 1,029 ప్లాన్జియో రూ. 1,029 ప్లాన్ విషయానికి వస్తే అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు 84 రోజులపాటు ఆనందించవచ్చు. రోజూ 2జీబీ 4జీ డేటా, అందుబాటులో ఉన్న చోట అపరిమిత 5జీ డేటా వినియోగించుకోవచ్చు. స్ట్రీమింగ్ కంటెంట్ను ఆస్వాదించే వినియోగదారులకు ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ లైట్ ప్రయోజనాలను అందిస్తుంది. దీంతోపాటు జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్కి యాక్సెస్ ఉంటుంది. -
ఆ మూడు కంపెనీల్లో లేని కొత్త ఫీచర్.. బీఎస్ఎన్ఎల్లో..
స్పామ్, ఫిషింగ్ వంటి చర్యలతో పెరుగుతున్న ముప్పును అరికట్టడానికి ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) చొరవ తీసుకుంది. కస్టమర్లకు మెరుగైన భద్రతకు భరోసానిస్తూ తన మొబైల్ యాప్లో కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు తమకు వచ్చిన మోసపూరిత ఎస్ఎంఎస్ సందేశాలపై సులభంగా ఫిర్యాదు చేయొచ్చు.ఈ కొత్త భద్రతా ఫీచర్తో హానికరమైన సందేశాల నుండి వినియోగదారులను రక్షించడానికి, వారి మొత్తం మొబైల్ అనుభవాన్ని మెరుగుపరచడానికి బీఎస్ఎన్ఎల్ చురుకైన చర్యలు తీసుకుంటోంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఇటీవల టారిఫ్ పెంచిన తర్వాత బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లలో గణనీయమైన పెరుగుదల వచ్చింది.కొత్తగా వస్తున్న వినియోగదారులతోపాటు ఇప్పటికే ఉన్న కస్టమర్లను నిలుపుకునేందుకు బీఎస్ఎన్ఎల్ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తమ వినియోగదారులు అవాంఛిత సందేశాలను నివేదించడానికి సులభమైన పద్ధతిని ప్రవేశపెట్టింది. పెరుగుతున్న స్పామ్, అన్సోలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్ (UCC) సమస్యను పరిష్కరిస్తోంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త టెక్నాలజీ.. బీఎస్ఎన్ఎల్ యూసీసీ కంప్లయింట్ సర్వీస్ ద్వారా వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్కేర్ యాప్లో మోసపూరిత ఎస్ఎంఎస్ లేదా వాయిస్ కాల్స్ను నివేదించవచ్చు. ఈ ఫీచర్ బీఎస్ఎన్ఎల్ మాత్రమే ప్రత్యేకంగా అందిస్తోంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ఇతర ప్రముఖ టెలికాం ఆపరేటర్లు ఏవీ ఇలాంటి ఫీచర్ను అందించడం లేదు.కంప్లయింట్ ఇలా ఫైల్ చేయండి» బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్కేర్ యాప్ను తెరవండి.» హోమ్ పేజీ ఎగువ ఎడమ మూలలో ఉన్న మూడు-లైన్ మెను చిహ్నంపై నొక్కండి.» కిందికి స్క్రోల్ చేసి 'కంప్లయింట్ అండ్ ప్రిఫరెన్స్' ఆప్షన్ను ఎంచుకోండి.» తదుపరి పేజీలో కుడి వైపున ఉన్న మూడు-లైన్ మెను చిహ్నంపై నొక్కండి.» అందుబాటులో ఉన్న ఎంపికల నుండి 'కంప్లయింట్స్' ఎంచుకోండి.» 'న్యూ కంప్లయింట్'పై నొక్కండి.» మీ కంప్లయింట్ను ఫైల్ చేయడానికి 'SMS' లేదా 'వాయిస్' ఎంచుకోండి.» అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసి మీ కంప్లయింట్ను సబ్మిట్ చేయండి. -
జియో-బీపీ 500వ ఈవీ చార్జింగ్ స్టేషన్ ప్రారంభం
-
జియో-బీపీ 500వ ఈవీ చార్జింగ్ స్టేషన్ ప్రారంభం
న్యూఢిల్లీ: జియో–బీపీ 500వ పల్స్ ఈవీ–చార్జింగ్ స్టేషన్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ ముకేశ్ అంబానీ, బీపీ సీఈవో ముర్రే ఆషిన్క్లాస్ గురువారం ప్రారంభించారు. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్, జియో వరల్డ్ ప్లాజా, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్కి వచ్చే వారికి ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.రిలయన్స్–బీపీ కలిసి ఇంధనాల విక్రయం, చార్జింగ్ ఇన్ఫ్రా కోసం జాయింట్ వెంచర్గా జియో–బీపీని ఏర్పాటు చేశాయి. కంపెనీ అత్యంత వేగంగా ఈవీ చార్జింగ్ పాయింట్లను విస్తరించింది. ఏడాది వ్యవధిలోనే 1,300 నుంచి 5,000కు పెంచుకుంది. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగవంతమయ్యేందుకు జియో–బీపీ కృషి చేస్తున్నాయని అనంత్ అంబానీ తెలిపారు. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించేందుకు వ్యూహాత్మక ప్రాంతాల్లో వేగవంతమైన చార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయడంపై దృష్టి పెడుతున్నట్లు ముర్రే వివరించారు. -
ఓటీటీ యాప్ల మినహాయింపు.. టెల్కోల ఆందోళన
న్యూఢిల్లీ: కొత్త లైసెన్సింగ్ నిబంధనలపై సిఫార్సుల్లో వాట్సాప్, టెలిగ్రాం వంటి మెసేజింగ్, కాలింగ్ యాప్లను మినహాయించడంపై టెలికం సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీలో తమ ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలిపాయి. అలాగే సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) సంబంధిత చెల్లింపుల అంశాల గురించి చర్చించాయి.రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ, వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ ముంద్రా, భారతి ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్, బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ జె. రవి ఇందులో పాల్గొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తన సిఫార్సుల్లో సర్వీస్ ఆథరైజేషన్ నుంచి ఓటీటీ యాప్లను మినహాయించడంపై అన్ని టెల్కోలు ఆందోళన వ్యక్తం చేసినట్లు వివరించాయి.వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్ సంస్థలు ఏజీఆర్ అంశాన్ని ప్రస్తావించినట్లు పేర్కొన్నాయి. ఏజీఆర్ లెక్కింపులో గతంలో జరిగిన తప్పిదాలను సవరించాలంటూ టెల్కోలు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటీషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. వొడాఫోన్ ఐడియా రూ. 70,320 కోట్ల మేర, భారతి ఎయిర్టెల్ రూ. 21,500 కోట్లు ఏజీఆర్ బకాయీలు కట్టాల్సి ఉంది. -
జియో సూపర్హిట్ ప్లాన్.. చవగ్గా అన్లిమిటెడ్ 5జీ, కాలింగ్..
చవకైన రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్న జియో కస్టమర్లకు ఓ సూపర్హిట్ ప్లాన్ ఉంది. అదే రూ. 198 ప్లాన్. ఇది 14 రోజుల పాటు అపరిమిత 5జీ డేటాను అందిస్తుంది. దీంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి.జియో రూ. 198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్తో వినియోగదారులు 14 రోజుల పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు, ప్రతిరోజూ 2 జీబీఆ 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ పొందుతారు. అదనంగా జియో క్లౌడ్, జియో సినిమా, జియో టీవీ వంటి జియో సూట్ యాప్లకు యాక్సెస్ను ఆనందించవచ్చు.రూ.198 ప్లాన్ను మైజియో యాప్ లేదా ప్రీపెయిడ్ సేవలను అందించే ఇతర ప్లాట్ఫారమ్ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. మైజియో యాప్లో రీచార్జ్ చేసుకుంటే ఎటువంటి అదనపు రుసుములు ఉండవు. కానీ గూగుల్ పే, పేటీఎం లేదా ఫోన్పే వంటి ప్లాట్ఫారమ్లలో రూ. 1 నుండి రూ. 3 వరకు అధిక రుసుము ఉంటుంది. -
దేశంలోనే అత్యంత విలువైన కంపెనీలు (ఫొటోలు)
-
ఉచితంగా 'జియో ఎయిర్ ఫైబర్': ఇలా చేయండి
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'దీపావళి డబుల్ ధమాకా' ఆఫర్ను రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది. దీంతో వినియోగదారులు ఒక సంవత్సరం ఫ్రీ 'జియో ఎయిర్ ఫైబర్' సేవను ఆస్వాదించే అవకాశాన్ని పొందవచ్చు. ఇంతకీ ఈ అవకాశాన్ని ఎలా పొందాలి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..ఉచితంగా జియో ఎయిర్ ఫైబర్ పొందాలంటే?ఫ్రీగా జియో ఎయిర్ ఫైబర్ సేవలను పొందాలంటే.. 2024 సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 3వరకు ఏదైనా రిలయన్స్ డిజిటల్ స్టోర్లో లేదా మైజియో స్టోర్లో రూ. 20000 లేదా అంతకంటే ఎక్కువ ధరకు షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినవాళ్ళే ఉచిత జియో ఎయిర్ ఫైబర్ పొందటానికి అర్హులు.ఈ ఆఫర్ కొత్త వాళ్ళకు మాత్రమే కాకుండా ఇప్పటికే జియో ఫైబర్ లేదా జియో ఎయిర్ ఫైబర్ ఉన్న కస్టమర్లు కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ పొందవచ్చు.ఇదీ చదవండి: కంపెనీలో సమస్యలు!.. సత్య నాదెళ్ల కీలక విషయాలుఅర్హత పొందిన కస్టమర్లు ప్రతి నెల నవంబర్ 24 నుంచి అక్టోబర్ 25 వరకు యాక్టివ్ ఎయిర్ఫైబర్ ప్లాన్కు సమానమైన 12 కూపన్లను పొందుతారు. ప్రతి కూపన్ను 30 రోజులలోపు సమీప రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్, జియో మార్ట్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ స్టోర్లో రీడీమ్ చేసుకోవచ్చు. ఈ దీపావళి డబుల్ ధమాకా ఆఫర్కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్ సంప్రదించండి. -
జియోలో అత్యంత చవకైన ప్లాన్ ఇదే..
ప్రైవేటు టెలికం సంస్థలు గత నెలలో తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచాయి. దీంతో చాలా మంది వినియోగదారులు ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్కి మారారు. బీఎస్ఎన్ఎల్ చవకైన ప్లాన్లను అందిస్తుండటమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో తమ వినియోగదారులను నిలుపుకోవడానికి పలు చవక రీఛార్జ్ ప్లాన్లను రూపొందించింది.సాధారణంగా కాలింగ్, డేటాతో కూడిన రీఛార్జ్ ప్లాన్కు నెలకు కనీసం రూ. 180 నుండి రూ.200 ఖర్చవుతుంది. కానీ ఈ జియో ప్లాన్తో రీచార్జ్ చేసుకుంటే అంతకన్నా తక్కువ ఖర్చవుతుంది. అదే రిలయన్స్ జియో రూ.1,899 రీఛార్జ్ ప్లాన్. ఇది 336 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే నెలకు రూ. 173 మాత్రమే ఖర్చవుతుంది.ఈ ప్లాన్ దేశంలోని ఏ నెట్వర్క్కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, దేశవ్యాపంగా ఉచిత రోమింగ్ అందిస్తుంది. రోజువారీ పరిమితి లేకుండా మొత్తంగా 24GB హై-స్పీడ్ డేటా, 3600 ఉచిత ఎస్ఎంఎస్లను ఆనందించవచ్చు. అంతేకాకుండా జియో అనుబంధ యాప్లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. -
వేగంగా టెలికాం సేవల పునరుద్ధరణ
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వరదలతో టెలికాం సేవల్లో అంతరాయం ఏర్పడింది. గడిచిన 24 గంటల నుంచి వర్షాలు కాస్త నెమ్మదించడంతో టెలికాం కంపెనీలు తమ సేవల పునరుద్ధరణపై దృష్టి సారించాయి. అందులో భాగంగా ప్రముఖ టెలికాం సేవల సంస్థ జియో తెలుగు రాష్ట్రాల్లో వేగంగా సేవలను పునరుద్ధరించింది. వరదల వల్ల దెబ్బతిన్న టెలికాం నెట్వర్క్ను మెరుగ్గా నిర్వహించేలా క్షేత్ర స్థాయిలో సిబ్బందిని రంగంలోకి దించింది. వరద ఉధృతి పూర్తిగా తగ్గకముందే తిరిగి జియో తన సేవలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంది.రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తన నెట్వర్క్ను మెరుగుపరచడానికి గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. ఇప్పటికే రూ.6,500 కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్లో 5జీ సేవలను ప్రారంభించింది. ముందుగా తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. క్రమంగా ఈ సర్వీసును విస్తరిస్తున్నారు. తెలంగాణలోనూ జియో 5జీ సేవలు అందిస్తోంది. దేశం అంతటా హై-స్పీడ్ ఇంటర్నెట్, మెరుగైన కనెక్టివిటీని అందించడానికి జియో చర్యలు తీసుకుంటుంది.ఇదీ చదవండి: పరుష పదజాలం, భారీ లక్ష్యాలు.. సెబీ చీఫ్ పనితీరుపై లేఖ -
జియో రెండు ఆఫర్లు.. ఒకే రూపాయి తేడా!
న్యూఢిల్లీ: ఇప్పుడున్న రోజుల్లో రూపాయికి ఏమొస్తుందని ఎవరినైనా అడిగితే చాక్లెట్ కూడా కష్టమే అని అంటారు. అయితే జియో సంస్థ కేవలం రూపాయికి ఎంతో తేడా చూపింది. మరింత విలువను ఆపాదించింది. వినడానికి వింతగానే ఉన్నా దీని గురించి తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. రిలయన్స్ జియో అందిస్తున్న రూ. 448, రూ. 449 ప్రీపెయిడ్ ప్లాన్లను పరిశీలిస్తే రూపాయి విలువెంతో అర్థం అవుతుంది. కేవలం రూపాయి తేడాతో జియో ఎంత మ్యాజిక్ చేసిందో ఇప్పుడు చూద్దాం.రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన రెండు ప్లాన్లను అందిస్తోంది. వీటిలో ఒక ప్లాన్ ధర రూ.448 కాగా, మరొక ప్లాన్ ధర రూ.449. దీనిని వినగానే ఒక్క రూపాయి తేడాతో రెండు ప్లాన్లు ఎందుకని మనకు అనిపిస్తుంది. పైగా చూసేందుకు ఈ రెండు ప్లాన్లు ఒకే విధంగా కనిపిస్తాయి.అయితే ఆ రెండు ప్లాన్ల వివరాలను చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. రూ. 448 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే కంపెనీ 28 రోజుల పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లను అందిస్తుంది. అయితే డేటా విషయానికి వస్తే ఈ ప్లాన్లో 56 జీబీ డేటా ఉంటుంది. దీనిలో రోజుకు 2 జీబీ డేటా అందుతుంది. ఈ ప్లాన్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే జియో సినిమా ప్రీమియం సబ్స్క్రిప్షన్ను ఉంటుంది. అలాగే జియో టీవీ యాప్, సోని లివ్, జీ5, లైన్గాటా ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, కన్చా లాంకా, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, ఫన్ కోడ్, హోయ్చోయ్ మొదలైన వినోద వేదికల్లో సబ్స్క్రిప్షన్ జతచేరుతుంది.ఇక రిలయన్స్ జియో రూ. 449 ప్లాన్ విషయానికొస్తే ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ కేవలం 28 రోజులు. అయితే ఇందులో 84 జీబీ డేటా ఉంటుంది. ప్రతిరోజూ 3 జీబీ డేటా అందుతుంది. దీనిలో అపరిమిత కాలింగ్, 100 ఉచిత ఎస్ఎంఎస్ సౌకర్యం కూడా జతచేరుతుంది. అయితే ఈ ప్లాన్లో ఎలాంటి సబ్స్క్రిప్షన్ ఉండదు. ఇదంతా తెలుసుకున్నాక ఈ రెండు ప్లాన్ల మధ్య తేడా ఇంత ఉందా అని అనిపిస్తుంది.ప్రతిరోజూ ఎక్కువ డేటా వినియోగం అవసరమయ్యే వారు రూ. 449 ప్లాన్ తీసుకోవచ్చు. దీనిలో ప్రతిరోజూ 3జీబీ డేటా లభిస్తుంది. ఫోనులో ఆటలు ఆడేవారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అయితే మరింత వినోదాన్ని కోరుకునేవారు రూ. 448 ప్లాన్ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే దీనిలో వివిధ వినోద మాధ్యమాల సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. అయితే రోజుకు 2 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు చెప్పండి... ఒక్క రూపాయిని జియో ఎంత పవర్ఫుల్గా మార్చిందో.. -
జియో కస్టమర్లకు గుడ్ న్యూస్
-
'జియో ఫోన్ కాల్ ఏఐ' లాంచ్: ఇదెలా పనిచేస్తుందంటే?
ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్.. ఏజీఎం సమావేశంలో 'జియో ఫోన్ కాల్ ఏఐ' (JioPhonecall AI) ఆవిష్కరించింది. రిలయన్స్ జియో ఛైర్మన్ 'ఆకాష్ అంబానీ'.. కంపెనీ 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్త కాల్ రికార్డింగ్ అండ్ ట్రాన్స్క్రైబ్ ఫీచర్ను ప్రకటించారు.జియో ఫోన్ కాల్ ఏఐ ప్రతి కాల్లో ఏను ఉపయోగించడానికి ముమ్మల్ని అనుమతిస్తుంది. ఇది కమ్యూనికేషన్ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.జియో ఫోన్ కాల్ ఏఐతో.. వినియోగదారులు జియో క్లౌడ్లో ఎటువంటి ఫోన్ కాల్నైనా రికార్డ్ చేసుకోవచ్చు. మాట్లాడే పదాలను కూడా ఏఐ ఆటోమాటిక్గా టెక్ట్ రూపంలోకి మారుస్తుంది. ఇది వివిధ భాషలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తద్వారా భాషాపరమైన అవరోధాలతో సంబంధం లేకుండా కమ్యూనికేషన్ను మెరుగుపరుస్తుంది.'జియో ఫోన్ కాల్ ఏఐ' ఎలా ఉపయోగించాలిజియో ఫోన్ కాల్ ఏఐను ఉపయోగించడం చాలా సులభం. దీనికోసం ఓ ప్రత్యేకమైన నెంబర్ కూడా అందుబాటులో ఉంటుంది. మీరు ఒకవ్యక్తికి కాల్ చేసినప్పుడు.. ఏఐ కాల్ నెంబర్ కూడా కాన్ఫరెన్స్ కాల్ సెటప్ మాదిరిగా డయల్ చేయాల్సి ఉంటుంది.👉జియో ఫోన్ కాల్ ఏఐ నెంబర్ 1-800-1732673కు డయల్ చేయాలి.👉నెంబర్ కనెక్ట్ అయిన తరువాత రికార్డింగ్ స్టార్ట్ చేయడానికి 1 క్లిక్ చేయాలి. ఇలా చేసిన తరువాత రికార్డింగ్ ప్రారంభమవుతుంది.👉మీరు ఏ సమయంలో అయిన ట్రాన్స్క్రిప్షన్ను పాజ్ చేయవలసి వస్తే 2 క్లిక్ చేయాలి. ఆ తరువాత ఏఐ మీకు ట్రాన్స్క్రిప్షన్ పాజ్ చేసినట్లు చెబుతుంది.👉మళ్ళీ స్టార్ట్ చేయడానికి 1 క్లిక్ చేయాలి, సెషన్ ముగించడానికి 3 క్లిక్ చేయాలి. -
‘అన్లిమిటెడ్’ ప్లాన్లు ఉంటాయా? కంపెనీల వైఖరి ఇదే..
టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ (TRAI) ప్రతిపాదనలతో అపరిమిత కాలింగ్, డేటా ప్లాన్ల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. తమ ప్రియమైన అన్లిమిటెడ్ మొబైల్ రీచార్జ్ ప్యాకేజీలు ఆగిపోతాయేమోనని కోట్లాది మంది టెలికాం యూజర్లు ఆందోళన చెందుతున్నారు.అవసరం లేకపోయినా అన్ని కలిపి అందించే అన్లిమిటెడ్ ప్యాక్లు కాకుండా గతంలో మాదిరి కాలింగ్, ఎస్ఎంఎస్లకు విడివిడిగా ప్యాక్లు అందించే విషయంపై టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ (TRAI) ఇటీవల టెలికాం కంపెనీల స్పందన కోరింది. దీనికి ప్రధాన టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా తమ వైఖరిని తెలియజేశాయి. తమ రీఛార్జ్ ప్లాన్ల ప్రస్తుత నిర్మాణాన్ని సమర్థించుకున్నాయి.ఎయిర్టెల్ ఏం చెప్పిందంటే.. ఎయిర్టెల్ ట్రాయ్కి ఇచ్చిన స్టేట్మెంట్లో తమ ప్రస్తుత ప్లాన్లు సూటిగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయని పేర్కొంది. ఈ ప్లాన్లు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా వాయిస్, డేటా, ఎస్ఎంఎస్ సేవలను కలిపి అందిస్తున్నాయని చెప్పింది. ప్రత్యేక వాయిస్, ఎస్ఎంఎస్ ప్యాక్ల మోడల్కి తిరిగి వెళ్లడం పరిశ్రమను కాలం చెల్లిన సిస్టమ్గా మారుస్తుందని, విడివిడి రీఛార్జ్లతో వినియోగదారులకూ భారం పడుతుందని బదులిచ్చింది.జియోదీ అదే వైఖరిఎయిర్టెల్ వైఖరికి సమర్థిస్తూ జియో కూడా తమ సర్వే డేటాను సమర్పించింది. 91 శాతం మంది వినియోగరులు ప్రస్తుత టెలికాం ప్లాన్లను మోస్ట్ అఫర్డబుల్గా భావిస్తున్నారని, 93 శాతం తమకు మెరుగైన ప్రయోజనాలు లభిస్తున్నాయని నమ్ముతున్నారని పేర్కొంది. ఈ గణాంకాలు వినియోగదారులలో అపరిమిత మోడల్ విస్తృత ఆమోదాన్ని తెలియజేస్తున్నాయని జియో వివరించింది.ఆధునిక టెలికాం సేవలలో డేటా ప్రధాన అంశంగా మారిందని, అపరిమిత డేటా, కాలింగ్ మోడల్ను పే-యాజ్-యు-గో ప్రత్యామ్నాయం కంటే మెరుగైనదిగా టెలికాం కంపెనీలు నొక్కిచెప్పాయి. ఈ ప్లాన్లలో మార్పులు ప్రస్తుత వినియోగదారు అనుభవానికి అంతరాయం కలిగించవచ్చని పరిశ్రమ ఏకీకృత వైఖరి తెలియజేస్తోంది. ఇక దీనిపై ట్రాయ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
ఫ్రీగా నెట్ఫ్లిక్స్, 2 జీబీ డేటా.. జియో బెస్ట్ ప్లాన్ ఇదే..
దేశంలో అత్యధిక యూజర్లు ఉన్న టెలికాం కంపెనీ రిలయన్స్ జియో. దీనికి సుమారు 48 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇటీవల టారిఫ్లు పెంచిన తర్వాత మంచి ప్రయోజనాలు ఉన్న బెస్ట్ ప్లాన్ల కోసం యూజర్లు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ను ఉచితంగా అందిస్తూ ఇతర బెనిఫిట్స్ లభించే ఒక బెస్ట్ జియో ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..నెట్ఫ్లిక్స్తో కూడిన కొత్త కాంబో ప్లాన్ను జియో ప్రారంభించింది. నెట్ఫ్లిక్స్తో పాటు మెరుగైన మొబైల్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్లాన్ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే ఇది నెట్ఫ్లిక్స్ (మొబైల్) ఉచిత సబ్స్క్రిప్షన్తో వస్తుంది. దీంతో మీరు స్మార్ట్ఫోన్లో నెట్ఫ్లిక్స్ విస్తారమైన లైబ్రరీలో ఉన్న వేలాది మూవీస్, వెబ్ సిరీస్లను ఆస్వాదించవచ్చు.ప్లాన్ బెనిఫిట్స్ఈ ప్లాన్ ధర రూ. 1,299. వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది. వినియోగదారులు ప్రతిరోజూ 2 జీబీ డేటాను పొందుతారు. అపరిమిత కాలింగ్తో యూజర్లు ఏ నెట్వర్క్లో అయినా ఎన్ని కాల్స్ అయినా చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీంతోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్కు ఉచిత యాక్సెస్ను పొందవచ్చు. 5జీ ఫోన్ని ఉపయోగిస్తున్నవారు తమ ప్రాంతంలో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉంటే 5జీ డేటాను ఉపయోగించవచ్చు. -
నెట్ఫ్లిక్స్ ఫ్రీగా కావాలా? ఈ ప్లాన్లు ట్రై చేయండి..
ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్తో వచ్చే ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే.. ప్రధాన టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా రూ.199 విలువ చేసే నెట్ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ను ఉచితంగా అందిస్తున్నాయి.ఫ్రీ నెట్ఫ్లిక్స్ అందిస్తున్న ప్లాన్లు ఇవే..జియో రూ.1,299 ప్లాన్: ఈ ప్లాన్తో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత 5జీ డేటాతో 84 రోజుల పాటు (మొత్తం 168 జీబీ మొత్తం) రోజుకు 2 జీబీ డేటాను ఆస్వాదించవచ్చు.జియో రూ.1,799 ప్లాన్: 84 రోజుల పాటు (మొత్తం 252 జీబీ) 3 జీబీ రోజువారీ డేటాతో పాటు రూ .1,299 ప్లాన్ మాదిరిగానే అపరిమిత ప్రయోజనాలను పొందండి.వొడాఫోన్ ఐడియా రూ.1,198 ప్లాన్: ఈ ప్లాన్ మొత్తం 70 రోజుల పాటు 2 జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది. అంటే మొత్తం 140 జీబీ. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.వొడాఫోన్ ఐడియా రూ.1,599 ప్లాన్: ఈ ప్లాన్తో 84 రోజుల పాటు 2.5 జీబీ రోజువారీ డేటాను మొత్తంగా 210 జీబీ డేటాను పొందుతారు. ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు కూడా ఉన్నాయి.ఎయిర్టెల్ రూ.1,798 ప్లాన్: ఈ ప్లాన్ 84 రోజుల పాటు రోజుకు 3 జీబీ డేటాను అందిస్తుంది. మొత్తం 252 జీబీ డేటా. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది. -
టెలికాం సేవల విస్తరణకు కొత్త ప్రాజెక్టులు
భారత్లో టెలికాం సేవలందించే ఎయిర్టెల్, జియోతోపాటు ఇతర దేశాల్లోని మెటా, సౌదీ టెలికాం, చైనా మొబైల్ వంటి కంపెనీలు కొత్తగా మూడు ప్రాజెక్ట్లను ప్రారంభించాలని యోచిస్తున్నాయి. ఇందులో భాగంగా సముద్రంలో కేబుల్స్ ఏర్పాటు చేసిన డేటాను సరఫరా చేయనున్నాయి. ‘2ఆఫ్రికా పిరల్స్’ అనే ప్రాజెక్ట్ ద్వారా 180 టెరాబిట్స్ పర్ సెకండ్(టీబీపీఎస్) సామర్థ్యంతో డేటాను సరఫరా చేయాలని ఎయిర్టెల్, మెటా, సౌదీ టెలికాం ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఆఫ్రికా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాలను ఈ ప్రాజెక్ట్ ద్వారా అనుసంధానం చేస్తున్నారు. ఇందులో భాగంగా సముద్రంలో మొత్తం 45,000 కిలోమీటర్లు పొడవున కేబుల్స్ ఏర్పాటు చేస్తారు.ఇదీ చదవండి: సెప్టెంబర్ 1 నుంచి ఆ మెసేజ్లు, కాల్స్ నిలిపివేత!ఇండియా-ఆసియా ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్లో భాగంగా జియో, చైనా మొబైల్ సంస్థలు కలిసి 200 టీబీపీఎస్ కెపాసిటీతో 16,000 కి.మీ పొడవున సముద్రంలో కేబుల్ సిద్ధం చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముంబయి, సింగపూర్, మలేషియా, థాయ్లాండ్, శ్రీలంక దేశాల్లో సర్వీసులు అందిస్తారు. ఇండియా-యూరప్ ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్ ద్వారా జియో, చైనా మొబైల్ కంపెనీలు 200 టీబీపీఎస్ కెపాసిటీతో 9,775 కి.మీ పొడవున కేబుల్స్ ఏర్పాటు చేస్తాయి. దీంతో ముంబయి, గల్ఫ్, యూరప్ ప్రాంతాల్లో సేవలందించనున్నాయి. ఇదిలాఉండగా, ఇప్పటికే ఎయిర్టెల్ కంపెనీ ఈ విధానం ద్వారా ఆఫ్రికాలో సేవలందిస్తోంది. -
జియో టీవీ ప్లస్: ఒక కనెక్షన్తో రెండు టీవీలు
రిలయన్స్ జియో స్మార్ట్ టీవీల కోసం 'జియో టీవీ ప్లస్ యాప్'ను తీసుకువస్తున్నట్లు.. 2 ఇన్ వన్ ఆఫర్ కూడా ప్రకటించింది. దీంతో వినియోగదారు ఒకే జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్తో రెండు టీవీలను కనెక్ట్ చేసుకోవచ్చు. జియో టీవీ ప్లస్ లాగిన్తోనే 800 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్లు, 13 కంటే ఎక్కువ ఓటీటీ యాప్లను యాక్సెస్ చేసుకోవచ్చు.జియో టీవీ ప్లస్ యాప్ను అనేది ఇప్పుడున్న అన్ని స్మార్ట్ టీవీలలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్లోని కంటెంట్ని యాక్సెస్ చేయడానికి ఎస్టీబీ అవసరం లేదు. దీనికోసం అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు & అదనపు కనెక్షన్లు అవసరం లేదు. ఇప్పటివరకు జియో ఎస్టీబీ ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్న జియో టీవీ ప్లస్ ఇప్పుడు అన్ని స్మార్ట్ టీవీలలో అందుబాటులో ఉంటుంది.స్మార్ట్టీవీ ఓఎస్లో జియో టీవీ ప్లస్ యాప్ ఫీచర్స్సింగిల్ సైన్ ఇన్ (ఒకే సైన్ ఇన్): ఒక్కసారి మాత్రమే సైన్ ఇన్ చేసి.. మొత్తం జియో టీవీ ప్లస్ కంటెంట్ కేటలాగ్ను యాక్సెస్ చేసుకోవచ్చు.స్మార్ట్ టీవీ రిమోట్: స్మార్ట్ టీవీ రిమోట్ని ఉపయోగించి అన్ని జియో టీవీ ప్లస్ కంటెంట్, ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు.స్మార్ట్ ఫిల్టర్: భాష, వర్గం లేదా ఛానెల్ నంబర్ ద్వారా ఛానెల్ని సెర్చ్ చేయవచ్చు.కంట్రోల్ ప్లేబ్యాక్ స్పీడ్: కావాల్సిన వేగంతో కంటెంట్ని చూడవచ్చు.క్యాచ్ అప్ టీవీ: గతంలో ప్రసారమైన షోలను చూడవచ్చు.పర్సనలైజ్డ్ రికమెండేషన్: వ్యక్తిగత ప్రాధాన్యతల ప్రకారం ఛానెల్లు, షోలు, సినిమాలను చూడవచ్చు.కిడ్స్ సేఫ్ సెక్షన్: పిల్లల కోసం ప్రత్యేకంగా క్యూరేటెడ్ విభాగం.డిజిటల్ టీవీ ఛానెల్స్జనరల్ ఎంటర్టైన్మెంట్: కలర్స్ టీవీ, ఈటీవీ, సోనీ షాబ్, స్టార్ ప్లస్, జీ టీవీన్యూస్: ఆజ్ తక్, ఇండియా టీవీ, టీవీ7 భరతవర్ష్, ఏబీపీ న్యూస్, న్యూస్18స్పోర్ట్స్: సోనీ టెన్, స్పోర్ట్స్18, స్టార్ స్పోర్ట్స్, యూరోస్పోర్ట్, డీడీ స్పోర్ట్స్మ్యూజిక్: బీ4యూ మ్యూజిక్, 9ఎక్స్ఎమ్, ఎంటీవీ, జూమ్కిడ్స్: పోగో, కార్టూన్ నెట్వర్క్, నిక్ జూనియర్, డిస్కవరీ కిడ్స్బిజినెస్: జీ బిజినెస్, సీఎన్బీసీ టీవీ18, ఈటీ నౌ, సీఎన్బీసీ ఆవాజ్భక్తి: ఆస్తా, భక్తి టీవీ, పీటీసీ సిమ్రాన్, సంస్కార్డౌన్లోడ్ & లాగిన్ చేసుకోవడం ఎలా?ఆండ్రాయిడ్ టీవీ, యాపిల్ టీవీ లేదా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ యాప్ స్టోర్ల నుంచి జియో టీవీ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.యాప్ డౌన్లోడ్ చేసిన తరువాత జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్తో లాగిన్ అవ్వాలి. ఓటీపీతో ద్రువీకరించుకోవాలి. -
టాప్ కంపెనీకి టెన్షన్.. ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారుల కోసం అనేక కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లు అపరిమిత వాయిస్ కాల్స్, డేటా వంటి ప్రయోజనాలను తక్కువ ధరలకే దీర్ఘ కాల వ్యాలిడిటీతో అందిస్తున్నాయి. ఇంత తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్లు టాప్ టెలికాం కంపెనీలలో దేనిలోనూ లేవు. అందుకే ఈ ప్లాన్తో టాప్ కంపెనీకి టెన్షన్ తప్పదు.బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన అద్బుతమైన రీఛార్జ్ ప్లాన్లలో రూ.997 ప్లాన్ ఒకటి. ఇది 160 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లో వినియోగదారులు రోజుకు 2జీబీ చొప్పున మొత్తం 320 జీబీ హై స్పీడ్ డేటాను పొందుతారు. అలాగే రోజూ 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పంపుకోవచ్చు. దేశంలోని ఏ నెట్వర్క్కైనా అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్ను ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ దేశం అంతటా ఉచిత రోమింగ్, జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ వంటి అనేక విలువ-ఆధారిత సేవలతో వస్తుంది.ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచడంతో చాలా మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్కి మారుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఈ ప్రభుత్వ టెలికాం కంపెనీ కూడా యూజర్లకు సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలో 4జీ సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీస్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. త్వరలో 5జీ సేవలను కూడా ప్రారంభించే పనిలో ఉంది. 5జీ నెట్వర్క్ టెస్టింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. -
జియో.. నచ్చిన నంబర్ తీసుకోండి..
ప్రతి ఒక్కరి జీవితంలో ఫోన్ నంబర్ అనేది చాలా ముఖ్యమైనది. ఒక సారి నంబర్ ఎంచుకుంటే అది కొన్నేళ్ల పాటు ఉంటుంది. అంతటి కీలకమైన ఫోన్ నంబర్ను వినియోగదారులు తమకు నచ్చినట్లుగా ఎంచుకునే అద్భుతమైన ఫీచర్ను రిలయన్స్ జియో అందిస్తుందని మీకు తెలుసా..?“జియో చాయిస్ నంబర్” గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. ఇది మీ అదృష్ట సంఖ్యలు, పుట్టిన తేదీ లేదా మీ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ వంటి వాటిని ప్రతిబింబించేలా మీ ఫోన్ నంబర్ను ఎంచుకోవడానికి అనుమతించే ప్రత్యేకమైన ఆఫర్. జియో చాయిస్ నంబర్ ద్వారా “జియోప్లస్ పోస్ట్పెయిడ్ ప్లాన్”కి సబ్స్క్రయిబ్ చేసినప్పుడు మీకు నచ్చిన మొబైల్ నంబర్ సిరీస్ని ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్లు ఒక వ్యక్తికి రూ. 349 నుంచి, ఫ్యామిలీ ప్లాన్కు రూ. 449 నుంచి ప్రారంభమవుతాయి.మీ జియో ఛాయిస్ నంబర్ పొందండిలా..జియో ఛాయిస్ నంబర్ను పొందడం సులభమైన ప్రక్రియ. మీరు దీన్ని మై జియో యాప్ లేదా జియో వెబ్సైట్ ద్వారా ఎంచుకోవచ్చు.MyJio యాప్ ద్వారా..» MyJio యాప్ని తెరవండి. ఒకవేళ యాప్ని డౌన్లోడ్ చేసి ఉండకపోతే, యాప్ స్టోర్ నుంచి MyJio యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి.» మెను విభాగంపై క్లిక్ చేసి నచ్చిన నంబర్ను ఎంచుకోండి.» ‘Let’s book now’పై నొక్కి మీ పేరు, పిన్ కోడ్, మీ నచ్చిన అంకెలను (4-5 అంకెల వరకు) నమోదు చేయండి.» మీ ప్రమాణాలకు సరిపోయే సంఖ్యల జాబితాను జియో మీకు చూపుతుంది. వీటిలో బాగా నచ్చినదాన్ని ఎంచుకోండి.» ప్లాన్ రుసుము రూ. 499 చెల్లించి బుకింగ్ను పూర్తి చేయండి. అదనపు ఖర్చు లేకుండానే నంబర్ మీకు డెలివరీ అవుతుంది.Jio.com వెబ్సైట్ ద్వారా.. » అధికారిక జియో వెబ్సైట్కి వెళ్లండి.» మీ ప్రస్తుత జియో నంబర్ను నమోదు చేసి దానిని ఓటీపీతో ధ్రువీకరించండి. » మీ పేరు, పిన్ కోడ్, ప్రాధాన్య అంకెలను జోడించి, ఆపై ‘Show available numbers’ పై క్లిక్ చేయండి.» అందుబాటులో ఉన్న నంబర్ల జాబితా నుంచి ఎంచుకుని, 'ప్రొసీడ్'పై క్లిక్ చేసి, చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయండి. -
జియో 365 రోజుల ప్లాన్.. ప్రయోజనాలెన్నో!
ఒక్కసారిగా రీఛార్జ్ ప్లాన్స్ పెంచేసిన జియో మళ్ళీ మెల్లగా దిగి వస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల నాలుగు కొత్త ప్రీపెయిడ్ ఆఫర్లు ప్రకటించింది. కాగా ఇప్పుడు 3599 రూపాయల వార్షిక ప్లాన్ వెల్లడించింది. ఈ ప్లాన్ వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.జియో వార్షిక ప్లాన్ రూ. 3599 ప్లాన్ విషయానికి వస్తే.. ఈ ప్లాన్ నెలకు రూ.276 వరకు వర్తిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు ప్రతి రోజూ హైస్పీడ్ 2.5 జీబీ డేటా పొందవచ్చు. అంటే 365 రోజులూ రోజులు 2.5 జీబీ లెక్కన 912.5 జీబీ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకున్న యూజర్లు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లను ఉపయోగించుకోవచ్చు.ఇటీవల ప్రవేశపెట్టిన నాలుగు ప్రీపెయిడ్ ఆఫర్లురూ.199 ప్లాన్: ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లు మాత్రమే కాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సబ్స్క్రిప్షన్లు (18 రోజులు) ఉన్నాయి.రూ.209 ప్లాన్: ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లతో పాటు 22 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్టైన్మెంట్ యాక్సిస్ లభిస్తుంది.రూ.249 ప్లాన్: రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లతో పాటు 28 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్టైన్మెంట్ యాక్సిస్ లభిస్తుంది.రూ.299 ప్లాన్: రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లతో పాటు 28 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్టైన్మెంట్ యాక్సిస్ లభిస్తుంది. -
ఏడాదిలో 42 వేల మంది రాజీనామా.. కారణం చెప్పిన రిలయన్స్
ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్)లో ఉద్యోగులు సంఖ్య తగ్గిపోయింది. గతేడాదితో పోలిస్తే ఈఏడాది 42,052 మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఆర్ఐఎల్ వార్షిక నివేదిక ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం శ్రామికశక్తి 3,47,362గా ఉంది. ఇది అంతకుముందు ఏడాదిలో 3,89,414గా ఉండేది. అయితే రాజీనామా చేసిన 42,052 మంది ఉద్యోగుల్లో 38,029 మంది రిలయన్స్ రిటైల్ నుంచే ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు.కంపెనీ నివేదికలోని వివరాల ప్రకారం..రిటైల్ రంగంలోని వ్యాపారానికి నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కొరత తీవ్ర అంతరాయంగా మారుతోంది. సాధారణంగా రిటైల్ రంగంలోని ఉద్యోగుల అట్రిషన్ రేటు(ఉద్యోగాలు మారే రేటు) ఎక్కువగా ఉంటుంది. దాంతో రిలయన్స్ రిటైల్ నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో అధికంగా 38,029 మంది రాజీనామా చేశారు. అందులోనూ జియోలో అత్యధికంగా ఉద్యోగం వీడారు. జియోలో 43% కాంట్రాక్ట్ ఉద్యోగులు(ఉద్యోగం రెగ్యులర్ కానివారు, ఒప్పంద ఉద్యోగులు, పార్ట్టైమ్ చేస్తున్నవారు, అప్రెంటిస్లు, ఇంటర్న్లు) ఉన్నారు. రిలయన్స్ రిటైల్లో పని చేస్తున్న మొత్తం శ్రామిక శక్తిలో సగానికి పైగా 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారేనని సంస్థ పేర్కొంది.ఇదీ చదవండి: ఊహించిందే జరిగింది.. వడ్డీరేట్ల మార్పు ఎప్పుడంటే..ఇదిలాఉండగా, రిలయన్స్ గ్రూప్ ఉద్యోగుల్లో 53.9% మంది 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారని వార్షిక నివేదికలో వెల్లడించారు. అందులో 21.4% మహిళలున్నారు. అలాగే, కొత్తగా నియమితులైన వారిలో 81.8% మంది 30 ఏళ్లలోపు వారు కాగా, 24.0% మంది మహిళలు. ఉద్యోగం మానేసిన వారిలో 74.9% మంది 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారే కావడం విశేషం. అందులో 22.7% మంది మహిళలు ఉన్నారు. -
జియో యూజర్లకు అంబానీ గిఫ్ట్!.. సైలెంట్గా నాలుగు కొత్త ప్లాన్స్
జియో రీఛార్జ్ ప్లాన్స్ భారీగా పెంచేసిందని యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ ముకేశ్ అంబానీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇందులో భాగంగానే అంబానీ నాలుగు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టారు.జియో కొత్త ప్రీపెయిడ్ ఆఫర్లురూ.199 ప్లాన్: ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లు మాత్రమే కాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సబ్స్క్రిప్షన్లు (18 రోజులు) ఉన్నాయి.రూ.209 ప్లాన్: ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే.. రోజుకు 1 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లతో పాటు 22 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్టైన్మెంట్ యాక్సిస్ లభిస్తుంది.రూ.249 ప్లాన్: రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లతో పాటు 28 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్టైన్మెంట్ యాక్సిస్ లభిస్తుంది.రూ.299 ప్లాన్: రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లతో పాటు 28 రోజుల చెల్లుబాటుతో జియో ఎంటర్టైన్మెంట్ యాక్సిస్ లభిస్తుంది.రీఛార్జ్ ప్లాన్స్ పెంచడం వల్ల ఇప్పటికే చాలామంది జియో యూజర్లు 'బీఎస్ఎన్ఎల్'కు మారిపోతున్నారు. ఇప్పటికే లక్షలమంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తీసుకున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. దీంతో ఇక యూజర్లను మళ్ళీ ఆకట్టుకోవడానికి సంస్థ ఈ ప్లాన్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. -
జియోపై బీఎస్ఎన్ఎల్ స్ట్రాంగ్ ఎఫెక్ట్
జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తమ రీఛార్జ్ ప్లాన్స్ భారీగా పెంచిన తరువాత చాలామంది బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) నెట్వర్క్కు మారిపోతున్నారు. దీంతో బీఎస్ఎన్ఎల్ కొత్త సబ్స్క్రైబర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే 2.75 మిలియన్ల యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తీసుకున్నట్లు సమాచారం.బీఎస్ఎన్ఎల్ వైపు వచ్చిన యూజర్లలో ఎక్కువ భాగం మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది. జియో, ఎయిర్టెల్ వంటి రీఛార్జ్ ప్లాన్లతో పోలిస్తే.. బీఎస్ఎన్ఎల్ చార్జీలు, వ్యాలిడిటీ వంటివి చాలామందిని ఆకర్షిస్తున్నాయి. మొత్తం మీద బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్స్ ముకేశ్ అంబానీ జియోపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.ప్రభుత్వం నిర్వహిస్తున్న బీఎస్ఎన్ఎల్ చందాదారుల సంఖ్య పెరుగుతోందని, స్వదేశీ 4జీ నెట్వర్క్ కూడా సిద్ధంగా ఉందని.. దానిని 5Gకి మార్చడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. అంతే కాకుండా బీఎస్ఎన్ఎల్ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ కంపెనీలు 4జీ నెట్వర్క్ను తీసుకువచ్చినప్పుడు బీఎస్ఎన్ఎల్ 4జీ ఎందుకు దీనిని ప్రవేశపెట్టలేదని చాలామంది అడిగారు. అయితే ప్రభుత్వం నిర్వహించే కంపెనీ నెట్వర్క్ను అభివృద్ధి చేయవలసి వస్తే.. స్వదేశీ టెక్నాలజీ, పరికరాలను మాత్రమే ఉపయోగించాలని.. చైనా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసే పరికరాలను ఉపయోగించకూడదని ప్రధానమంత్రి తీర్మానమని జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు.భారత్ తన స్వంత 4జీ స్టాక్, కోర్ సిస్టమ్ లేదా రేడియేషన్ యాక్సెస్ నెట్వర్క్ అని పిలువబడే టవర్లను అభివృద్ధి చేస్తుందని ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రధాని మోదీ వెల్లడించారు. భారతదేశం తన సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది, దేశప్రజలకు 4G నెట్వర్క్ను అందిస్తుందని అన్నారు. స్వదేశీ సాంకేతికతను కలిగి ఉన్న ఐదవ దేశంగా భారత్ అవతరించిందని సింధియా చెప్పారు.టవర్ల ఏర్పాటుకోసం తేజస్ నెట్వర్క్, సీ-డాట్, టీసీఎస్ వంటి భారతీయ సంస్థలతో బీఎస్ఎన్ఎల్ పనిచేస్తోంది. 2024 అక్టోబర్ నాటికి 80000 టవర్లు, వచ్చే ఏడాది మార్చి నాటికి 21000 టవర్లను ఇన్స్టాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద 2025 నాటికి 4G నెట్వర్క్కు చెందిన లక్ష టవర్లు ఇన్స్టాల్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. -
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్.. 'క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ'
రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ ఇటీవల భారీగా పెరిగాయి. ఈ తరుణంలో అంబానీ 'క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ' పేరుతో ఓ ప్లాన్ తీసుకువచ్చారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ ప్లాన్ కోసం రూ.319 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే నెల రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఈ రోజు (ఆగష్టు 2) ప్లాన్ యాక్టివేట్ లేదా రీఛార్జ్ చేసుకుంటే.. సెప్టెంబర్ 1వరకు యాక్టివ్గా ఉంటుంది. మళ్ళీ మీరు సెప్టెంబర్ 2న రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ ప్లాన్ ఫీచర్స్ఈ ప్లాన్ ఎంచుకునే యూజర్లు రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా పొందవచ్చు. లిమిటెడ్ ముగిసిన తరువాత ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది.ఈ ప్లాన్లో భారతదేశం అంతటా ఏ నెట్వర్క్కైనా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. యూజర్లు రోజుకు గరిష్టంగా 100 ఎస్ఎమ్ఎస్లు పంపుకోవచ్చు.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI).. టెలికాం కంపెనీలు 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్లను అందించాలని కోరింది. దీనికి స్పందించిన జియో రూ.296, రూ.259 ప్లాన్లను విడుదల చేసింది. రూ.296 ప్లాన్లో అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS మరియు 30 రోజుల పాటు 25GB డేటా ఉన్నాయి. అదే విధంగా రూ.259 ప్లాన్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి. -
రూ.1,799కే 4జీ ఫోన్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలోని నెట్వర్క్ సేవలందించే జియో ‘జియో భారత్ జే1’ పేరుతో 4జీ మొబైల్ ఫోన్ను ఆవిష్కరించింది. ఈ ఫీచర్ ఫోన్లో జియో టీవీ, జియో సినిమా, జియో పే వంటి యాప్స్ ఇన్స్టాల్ చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది.2.8 అంగుళాల డిస్ప్లే కలిగిన ఈ ఫోన్ ధర రూ.1799గా నిర్ణయించినట్లు సంస్థ పేర్కొంది. దీన్ని కొనుగోలు చేసినవారికి జియో ప్రత్యేకంగా రిఛార్జ్ ప్లాన్ను కూడా అందిస్తుంది. రూ.123 జియో భారత్ ప్లాన్తో 14 జీబీ 4జీ డేటా ఇస్తుంది. ప్రస్తుతం ఇతర వినియోగదారులకు ఇదే ప్లాన్ ధర రూ.189గా ఉంది. ఈ ఫోన్ 128జీబీ వరకు ఎస్డీ కార్డు సపోర్ట్ చేస్తుంది. 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.ఇదీ చదవండి: అమెరికా చట్టంతో భారత్కు లాభం..!ఫీచర్ ఫోన్ వాడే వినియోగదారులను 4జీ నెట్వర్క్తో కనెక్ట్ చేయడానికి ఈ మొబైల్ విడుదల చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. జియో..నెట్వర్క్ సేవలందిస్తున్నా మొబైళ్లను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తోంది. జియో రీఛార్జ్ ప్లాన్ను కూడా కస్లమర్లకు ఇవ్వొచ్చనే ఆలోచనతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. దీనివల్ల కంపెనీ రెవెన్యూ కూడా వృద్ధి చెందుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
జియో ఫ్రీడమ్ ఆఫర్.. 30 శాతం డిస్కౌంట్
రిలయన్స్ జియో ఇటీవలే రీఛార్జ్ ధరలను భారీగా పెంచింది. అయితే తాజాగా తన ఎయిర్ఫైబర్ కనెక్షన్లపై ఏకంగా 30 శాతం తగ్గింపులను ప్రకటించింది. పైగా రూ. 1000 ఇన్స్టాలేషన్ ఛార్జీలను పూర్తిగా మాపీ చేస్తోంది. ఈ ఆఫర్స్ 2024 జులై 26 నుంచి ఆగష్టు 15 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.జియో తన ఎయిర్ఫైబర్ వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ కింద భారతదేశంలో 1.2 కోట్ల గృహాలకు పైగా కవరేజీని ప్రకటించింది. ఈ ఆఫర్ ఎయిర్ఫైబర్ 5జీ, కొత్త వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.సాధారణంగా జియో ఎయిర్ఫైబర్ మూడు నెలల స్టాండర్డ్ ప్లాన్ రూ. 2121, అదనంగా రూ. 1000 ఇన్స్టాలేషన్ ఛార్జ్. ఇలా మొత్తం రూ. 3121 చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఫ్రీడమ్ ఆఫర్ కింద 3 నెలల ఆల్ ఇన్ వన్ ప్లాన్ ధర రూ. 2121 మాత్రమే. అంటే ఇందులో ఇన్స్టాలేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.జియో కొత్త ఆఫర్ 3 లలు, 6 నెలలు, 12 నెలల ప్లాన్లకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆగస్టు 15 వరకు అన్ని కొత్త, ఇప్పటికే ఉన్న బుకింగ్లు ఈ కొత్త ఆఫర్లో కవర్ అవుతాయి. జియో తన ఎయిర్ఫైబర్ సర్వీస్ను అందించే చోట మాత్రమే ఈ ఆఫర్ను పొందవచ్చు. కొత్త జియో ఎయిర్ఫైబర్ కనెక్షన్ కోసం రిలయన్స్ అధికారిక వెబ్సైట్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
మీడియాటెక్తో జియోథింగ్స్ జట్టు
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల సంస్థ మీడియాటెక్, జియో ప్లాట్ఫామ్స్ అనుబంధ సంస్థ జియోథింగ్స్ జట్టు కట్టాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్లాట్ఫాంను ఆవిష్కరించాయి. ఇది టూవీలర్ల మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్మార్ట్ డిజిటల్ క్లస్టర్, స్మార్ట్ మాడ్యూల్స్ను అందిస్తుంది.ఈ విభాగంలో తమ కార్యకలాపాలను బలోపేతం చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి.రియల్ టైమ్ డేటా అనలిటిక్స్, స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ మొదలైన వాటికి స్మార్ట్ డిజిటల్ క్లస్టర్ ఉపయోగపడుగుతుంది. జియో వాయిస్ అసిస్టెంట్, జియోసావన్ మొదలైన సర్వీసులు ఉండే జియో ఆటోమోటివ్ యాప్ సూట్కి ఈ ప్లాట్ఫాం ద్వారా యాక్సెస్ లభిస్తుంది. -
బీఎస్ఎన్ఎల్కి వెళ్తుంటే ఇది తెలుసుకోండి..
తక్కువ ధరకు టెలికం సేవలు అందించే ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్కి మారాలనుకుంటున్నారా..? సిగ్నల్స్ ఎలా ఉంటాయోనని ఆలోచిస్తున్నారా..? అయితే మీకు దగ్గరలో బీఎస్ఎన్ఎల్ టవర్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో ఇక్కడ తెలియజేస్తున్నాం..పలు ప్రైవేటు టెలికాం కంపెనీలు టారిఫ్లు పెంచడంతో అందుబాటు ధరలో రీఛార్జ్ ప్లాన్లు ఉన్న ప్రభుత్వ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వైపు చాలా మంది వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. బీఎస్ఎన్ఎల్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఇది ఇప్పుడు తన 4G సేవలను చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల జూలై 21న తన 4G సంతృప్త ప్రాజెక్ట్ కింద 1000 టవర్ల ఏర్పాటు లక్ష్యాన్ని సాధించింది.ఈ నేపథ్యంలో మీరు బీఎస్ఎన్ఎల్కి మారాలని ప్లాన్ చేస్తుంటే, మీరు నివసిస్తున్న ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ టవర్ ఉందో లేదో నిర్ధారించుకోవాలి. మీ మొబైల్ ఫోన్లో చిన్న రేడియో ట్రాన్స్మిటర్, రిసీవర్ ఉంటుంది. ట్రాన్స్మిటర్ సిగ్నల్లను పంపుతుంది. రిసీవర్ ఇతర ఫోన్ల నుంచి సిగ్నల్లను అందుకుంటుంది. ఈ సిగ్నల్స్ బలహీనంగా ఉంటాయి. తక్కువ దూరం మాత్రమే ప్రయాణించగలవు. అందుకే సమీపంలో మొబైల్ టవర్లు ఉన్నప్పుడు మీ ఫోన్లో సిగ్నల్స్ ఉంటాయి.సమీపంలో టవర్ ఉందో లేదో తెలుసుకోండి ఇలా..ముందుగా https://tarangsanchar.gov.in/ వెబ్సైట్కి వెళ్లండిపేజీని కిందికి స్క్రోల్ చేసి, ‘మై లొకేషన్’పై క్లిక్ చేయండి.తదుపరి పేజీలో, మీ పేరు, ఈమెయిల్, మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ని నమోదు చేయండి.Send me a mail with OTP బటన్ పై క్లిక్ చేయండి.మీ ఈమెయిల్కు వచ్చిన OTPని నమోదు చేయండి.తర్వాతి పేజీలో, మీ చుట్టూ ఉన్న అన్ని మొబైల్ టవర్లను చూపించే మ్యాప్ మీకు కనిపిస్తుంది.ఏదైనా టవర్పై క్లిక్ చేస్తే సిగ్నల్ రకం (2G/3G/4G/5G), అది ఏ కంపెనీ టవర్ అనేది మీకు సమాచారం అందుతుంది. -
బీఎస్ఎన్ఎల్కు వెళ్తున్న వారికి గుడ్న్యూస్..
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ శుభవార్త చెప్పింది. ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమైంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెల్కోలు ఇటీవల తమ టారీఫ్లను పెంచడంతో చాలా మంది ఇపుడు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే వినియోగదారులు ఎదుర్కొంటున్న సిగ్నల్ సమస్యలను నివారించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమైన బీఎస్ఎన్ఎల్ దీనికి ముందే యుద్ధప్రాతిపదికన భారీ సంఖ్యలో 4జీ టవర్లను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారంలోనే సుమారు వెయ్యి 4జీ టవర్లను ఏర్పాటు చేసినట్లు సోషల్ మీడియా ద్వారా బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది.4జీ, 5జీ నెట్వర్క్ల కోసం దేశవ్యాప్తంగా సుమారు 1.12 లక్షల టవర్లను ఇన్స్టాల్ చేయనున్నట్లు బీఎస్ఎన్ఎల్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ 1 2వేల వరకు సెల్ టవర్లను ఏర్పాటు చేసింది. 4జీ సేవల కోసం బీఎస్ఎన్ఎల్ టీసీఎస్, తేజస్ నెట్వర్క్, ప్రభుత్వ ఐటీఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రైవేట్ టెల్కోలు టారిఫ్లు పెంచినప్పటి నుంచి 2.5 లక్షల మందికిపైగా బీఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయ్యారు. -
జియో కొత్త యాప్ - సంవత్సరం పాటు ఫ్రీ..
జియో సంస్థ యూజర్ల కోసం 'జియోసేఫ్' అనే యాప్ పరిచయం చేసింది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్లలో అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ చాలా సురక్షితమైనదని, ఎక్కువ ప్రైవసీ ఉంటుందని జియో పేర్కొంది. ఇది ప్రస్తుతం రూ. 199 నెలవారీ సబ్స్క్రిప్షన్తో అందుబాటులో ఉంది. ఈ యాప్ను మొదటి సంవత్సరం ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు.జియో పరిచయం చేసిన ఈ కొత్త అప్లికేషన్ సురక్షితమైన వీడియో కాలింగ్, ఆడియో, టెక్స్టింగ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ యాప్ కేవలం 5జీ నెట్వర్క్లో మాత్రమే వినియోగించడానికి అవకాశం ఉంది. 4G నెట్వర్క్లలో లేదా Jio SIM లేని వినియోగదారులు యాప్ను ఉపయోగించలేరు, ఇది భారతదేశానికి పరిమితం.ఈ యాప్ మెటా వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇది చాలా సురక్షితమైన యాప్, కాబట్టి దీనిని ఎవరూ హ్యాక్ చేయలేరని సంస్థ పేర్కొంది. కాబట్టి ఇది మెటా వాట్సాప్కు గట్టి పోటీ ఇస్తుందనే చాలామంది భావిస్తున్నారు. అయితే ఒక సంవత్సరం ఉచితంగా ఉపయోగించుకున్న తరువాత నెలవారీ చెల్లింపులు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.జియోసేఫ్ సేఫ్టీ అనేది జియో 5జీ క్వాంటం సెక్యూర్ నెట్వర్క్పై ఆధారపడి ఉంటుంది. ఇది 256 బిట్ నెట్వర్క్ ఎన్క్రిప్షన్ను అందిస్తుంది. వినియోగదారును గోప్యంగా ఉంచడానికి సబ్స్క్రైబర్ కన్సీల్డ్ ఐడెంటిటీ (SCI) సాంకేతికతను ఉపయోగిస్తుంది. -
జియోకి భారీ డామేజ్ 25 లక్షల మంది BSNLకి పోర్ట్?
-
గతేడాదితో పోలిస్తే 34.5 శాతం పెరిగిన యూజర్లు
రిలయన్స్ జియో వైర్డ్ బ్రాడ్బ్యాండ్ యూజర్లు ఏడాదిలో 34.5 శాతం పెరిగారు. ఇదే సేవలందిస్తున్న ఎయిర్టెల్ వినియోగదారలు గతేడాదితో పోలిస్తే 24.2 శాతం పెరిగినట్లు ప్రకటన విడుదల చేశారు.భారత్లో 5జీ ఆధారిత ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (ఎఫ్డబ్ల్యూఏ) సేవలు వేగంగా పెరుగుతున్నాయి. దానికి అనుగుణంగా వైర్డ్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు కూడా అధికమవుతున్నారు. ఈ విభాగంలో సేవలందిస్తున్న జియో తన ప్రత్యర్థిగా ఉన్న ఎయిర్టెల్ యూజర్ల సంఖ్యను అధిగమించింది.మే 2023-మే 2024 మధ్య జియో వైర్డ్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు ఎయిర్టెల్ 24.2%తో పోలిస్తే 34.5% పెరిగారు. మే చివరి నాటికి ఎయిర్టెల్ వాడుతున్న 80 లక్షల వినియోగదారులతో పోలిస్తే జియో వైర్డ్ బ్రాడ్బ్యాండ్ యూజర్ల సంఖ్య 1.2 కోట్లకు చేరుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం మే చివరి నాటికి భారతదేశ వైర్డు బ్రాడ్బ్యాండ్ యూజర్లు 4.13 కోట్లుగా ఉంది.ఇదీ చదవండి: కొత్త కోడలి అదృష్టం!! పెళ్లి తర్వాత రూ.25వేల కోట్ల సంపద! -
రీఛార్జ్ ప్లాన్స్ ఎఫెక్ట్.. ఇప్పుడు అందరి చూపు దానివైపే..
ఇటీవల జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా వంటి టెలికాం దిగ్గజాలు రీఛార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచాయి. పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ కూడా యూజర్లను ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది. ఈ తరుణంలో యూజర్ల చూపు గవర్నమెంట్ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) వైపు పడింది.రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెరగడంతో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్కు మారుతున్న యూజర్ల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు సమాచారం. దీనికి కారణం ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ చార్జీలు తక్కువగా ఉండటమే. డేటా కోసం కాకుండా.. కేవలం కాల్స్ కోసం మాత్రమే ఉపయోగించేవారు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.2024 జులై 3, 4 తేదీల నుంచి జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాల టారిఫ్ ధరలు 15 శాతం నుంచి 20 శాతం పెరిగాయి. ధరలు పెరిగిన వారం రోజుల్లో సుమారు 2.5 లక్షల మంది బీఎస్ఎన్ఎల్కు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ద్వారా మారినట్లు తెలుస్తోంది. మరో 25 లక్షల మంది కొత్త బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లు తీసుకున్నట్లు సమాచారం. -
అదిరిపోయే ప్లాన్లతో వినియోగదారునికి ఊరట..
-
కొత్త యూజర్లలో జియో, ఎయిర్టెల్ జోరు
న్యూఢిల్లీ: కొత్త యూజర్ల విషయంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ జోరు కొనసాగుతోంది. మే నెలలో రెండు సంస్థలకు కలిపి 34.4 లక్షల కనెక్షన్లు జతయ్యాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మే నెలలో జియోకి కొత్తగా 21.9 లక్షల మంది యూజర్లు, ఎయిర్టెల్కి 12.5 లక్షల మంది మొబైల్ కస్టమర్లు జతయ్యారు. జియో మొత్తం సబ్్రస్కయిబర్స్ సంఖ్య 47.46 కోట్లకు చేరింది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా మరో 9.24 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. మేలో 1.2 కోట్ల మంది మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్పీ) కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ట్రాయ్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఎంఎన్పీని అమల్లోకి తెచి్చనప్పటి నుంచి మే నెలాఖరు వరకు వచి్చన మొత్తం ఎంఎన్పీ అభ్యర్థ్ధనల సంఖ్య 98.56 కోట్లకు చేరినట్లు వివరించింది. అటు బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రయిబర్స్ సంఖ్య నెలవారీగా 0.72 శాతం వృద్ధితో 93.5 కోట్లకు చేరింది. -
దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు రిలయన్స్ సిద్ధం..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అతిపెద్ద ఐపీఓకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. టెలికాం విభాగంలో సేవలందిస్తున్న జియోను పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు తెచ్చే ప్రతిపాదనలున్నట్లు కొన్ని మీడియా సంస్థల కథనాల ద్వారా తెలిసింది. మార్కెట్ అనుకునేలా జియో ఐపీఓకు వస్తే దేశంలో మునుపెన్నడూ లేనివిధంగా రూ.55,000 కోట్ల నిధులు సమీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అది దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డు నెలకొల్పనుంది.రిలయన్స్ జియో ఇటీవల మొబైల్ టారిఫ్లను పెంచింది. దాంతో టెలికాం రంగంలో సేవలందిస్తున్న ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా వంటి ఇతర కంపెనీలు జియో పంథానే ఎంచుకున్నాయి. అవి కూడా టారిఫ్లను పెంచాయి. దాంతో వినియోగదారుల నుంచి కొంత విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఇలా ఐపీఓ వార్తలు రావడం గమనార్హం. వచ్చే ఏడాది ప్రారంభంలో జియో ఐపీఓ రావొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు జియో 4జీ టారిఫ్లతోనే 5జీ సేవలు అందిస్తుండగా, ఇకపై 5జీకి ప్రత్యేక టారిఫ్ నిర్ణయించే అవకాశం ఉందని చెబుతున్నాయి.జులై నెలలో మొదటి త్రైమాసిక ఫలితాలు వెలువడే అవకాశం ఉండడంతో ఆగస్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వార్షిక సాధారణ సమావేశాన్ని (ఏజీఎమ్) నిర్వహిస్తుంది. ఇందులో జియో ఐపీఓకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ ఊహిస్తున్న విధంగా జియో ఐపీఓ ద్వారా రూ.55 వేలకోట్లు సమీకరించానుకుంటే దేశంలో అతిపెద్ద ఐపీఓగా నిలువనుంది. ఇప్పటివరకు రూ.21 వేలకోట్లు సమీకరించి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఐపీఓనే అతిపెద్దదిగా ఉంది. జియో మొత్తం విలువ దాదాపు రూ.11 లక్షల కోట్లుగా అంచనా. పెద్ద కంపెనీ ఐపీఓకు వస్తే అందులో సుమారు 5 శాతం విక్రయించాల్సి ఉంటుంది. కాబట్టి దాని విలువ రూ.55 వేలకోట్లుగా లెక్కిస్తున్నారు.ఇదీ చదవండి: గ్యాస్ సిలిండర్లకు క్యూఆర్ కోడ్.. మంత్రి ప్రకటనఇటీవల పెంచిన టారిఫ్లతో కంపెనీ సగటు వినియోగదారు ఆదాయం (ఆర్పు) పెరుగుతుందని మార్కెట్ అంచనా వేస్తుంది. 5జీకు ప్రత్యేకంగా టారిఫ్లు తీసుకురావడంతో మరింత ఆదాయం సమకూరుతుంది. దాంతో కంపెనీ రెవెన్యూలో పెరుగుదల ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఫలితంగా కంపెనీ షేర్లను కొనుగోలు చేస్తున్నారు. కేవలం గడిచిన నెల రోజుల్లో స్టాక్ ధర ఏకంగా 11.4 శాతం పెరిగింది. -
రేపటి నుంచే కొత్త రీచార్జ్ ప్లాన్లు.. ఇక నెలకు కనీసం..
ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లపై టారిఫ్ పెంపును ప్రకటించాయి. ఆయా కంపెనీలు 25 శాతం వరకు పెంచాయి. ఇవి మరి కొన్ని గంటల్లో అమల్లోకి వస్తాయి. ఎయిర్టెల్, జియో కొత్త ప్లాన్లు జూలై 3 నుంచి, వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్లు జూలై 4 నుంచి వర్తిస్తాయి.మునుపటి ప్లాన్ల మాదిరిగానే, మూడు టెల్కోలు వేర్వేరు యూజర్ల కోసం ఉద్దేశించిన వేర్వేరు బండిల్స్ను అందిస్తున్నాయి. వీటిలో నెలవారీ, త్రైమాసిక, వార్షిక రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. అయితే చాలా మంది నెలవారీ ప్లాన్లను రీచార్జ్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో మూడు టెల్కోలకు సంబంధించిన మంత్లీ మినిమమ్ రీచార్జ్ ప్లాన్ల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం..ఎయిర్టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ఎయిర్టెల్ తన కనీస నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను రూ .179 నుంచి రూ .199 కు పెంచింది. ఈ ప్లాన్తో 28 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ 4జీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉంటాయి. కేవలం కాల్స్, మెసేజింగ్ కోసం సిమ్ కార్డును ఉపయోగించాలనుకునే వారికి ఈ ప్లాన్ చాలా మంచిది.జియో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్జియో అత్యంత తక్కువ నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ధర రూ .199. ఇది రూ .155 నుంచి భారీగా పెరిగింది. 28 రోజుల వాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్లు, 2 జీబీ 4జీ డేటా లభిస్తుంది. హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉండి, ఎక్కువ మొబైల్ డేటాను ఉపయోగించని వారికి ఈ ప్లాన్ బాగా సరిపోతుంది.వీఐ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్వొడాఫోన్ ఐడియాలో కూడా అత్యంత సరసమైన నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ధర రూ .199. ఈ ప్లాన్తో 28 రోజుల వ్యాలిడిటీ, 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. -
వొడాఫోన్ ఐడియా టారిఫ్లు పెంపు
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ బాటలోనే వొడాఫోన్ ఐడియా కూడా మూడేళ్లలో మొదటిసారి టారిఫ్లను పెంచింది. గత రెండేళ్లలో 5జీ టెక్నాలజీలో పెట్టిన పెట్టుబడులను రాబట్టుకునేందుకు సిద్ధమైంది.మొదటగా జియో టారిఫ్లను 13 నుంచి 27 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆ మరుసటి రోజే ఎయిర్టెల్ కూడా 10 నుంచి 21 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా వంతు. జూలై 4 నుంచి ప్రీపెయిడ్, పోస్ట్-పెయిడ్ ప్లాన్లపై టారిఫ్లను 10 నుంచి 23 శాతం పెంచనున్నట్లు తెలిపింది.ప్లాన్ల కొత్త ధరలు ఎంట్రీ లెవల్ ప్లాన్, 28 రోజుల మొబైల్ సర్వీస్కు కనీస రీఛార్జ్ ధరను 11 శాతం రూ .179 నుంచి రూ .199 కు పెంచింది. రోజుకు 1.5 జీబీ డేటాతో పాపులర్ 84 రోజుల వాలిడిటీ ప్లాన్ ధరను రూ .719 నుంచి రూ .859 చేసింది. కంపెనీ తన వార్షిక అన్లిమిటెడ్ ప్లాన్ ధరను 21 శాతం పెంచి ప్రస్తుతం రూ.2,899 నుంచి రూ.3,499 చేసింది. 24 జీబీ డేటాతో 365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ .1,799 ప్లాన్లో ఎటువంటి మార్పు చేయలేదు. -
ఎయిర్టెల్ కూడా పెంచేసింది! జియోను మించి..
టెలికం యూజర్లకు ఛార్జీల మోత మోగనుంది. ప్రత్యర్థి రిలయన్స్ జియో రేట్లను 12-15 శాతం పెంచిన మరుసటి రోజే భారతీ ఎయిర్టెల్ కూడా తన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ యూజర్లకు టారిఫ్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. వివిధ ప్లాన్లపై టారిఫ్లను 10-21 శాతం పెంచింది.దేశంలో టెల్కోలు ఆర్థికంగా ఆరోగ్యకరమైన వ్యాపార నమూనాను అవలంభించడానికి మొబైల్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఏఆర్పీయూ) రూ .300 కంటే ఎక్కువగా ఉండాలని భారతీ ఎయిర్టెల్ పేర్కొంది. "ఈ స్థాయి ఏఆర్పీయూ నెట్వర్క్ టెక్నాలజీ, స్పెక్ట్రంలో అవసరమైన గణనీయమైన పెట్టుబడులకు వీలు కల్పిస్తుందని, మూలధనంపై స్వల్ప రాబడిని అందిస్తుందని మేము నమ్ముతున్నాం" అని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.పెంచిన మొబైల్ టారిఫ్లు జూలై 3 నుంచి అమల్లోకి రానున్నాయి. బడ్జెట్ సవాళ్లతో కూడిన వినియోగదారులపై ఎటువంటి భారం పడకుండా ఉండటానికి ఎంట్రీ లెవల్ ప్లాన్లపై చాలా తక్కువ ధరల పెరుగుదల (రోజుకు 70 పైసల కంటే తక్కువ) ఉండేలా చూశామని టెల్కో తెలిపింది. వొడాఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది.ఏ ప్లాన్ ఎంత పెరిగిందంటే..» గతంలో రూ.179గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.199» గతంలో రూ.455గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.509» గతంలో రూ.1799గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.1999» గతంలో రూ.265గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.299» గతంలో రూ.299గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.349» గతంలో రూ.359గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.409» గతంలో రూ.399గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.449» గతంలో రూ.479గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.579» గతంలో రూ.549గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.649» గతంలో రూ.719గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.859» గతంలో రూ.839గా ఉన్న ప్లాన్ ధర ఇప్పుడు రూ.979» గతంలో రూ.2999గా ఉన్న ప్లాన్ ఇప్పుడు రూ.3599 -
యూజర్లకు షాక్!.. ఒక్కసారిగా పెరిగిన రీఛార్జ్ ప్లాన్స్
భారతీయ టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ జియో తన కొత్త అన్లిమిటెడ్ ప్లాన్లను ప్రకటించింది. కొత్తగా ప్రకటించిన ఈ ప్లాన్స్ జులై 3నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్లాన్లతో పోలిస్తే కొత్తగా అమలులోకి వచ్చే ప్లాన్స్ ధరలు 20శాతం ఎక్కువ.కంపెనీ వెల్లడించిన డేటా ప్రకారం.. జులై 3నుంచి 155 రూపాయల ప్లాన్ 189 రూపాయలకు, 209 రూపాయల ప్లాన్ 249 రూపాయలకు చేరుతుంది. రూ. 2999 యాన్యువల్ ప్లాన్.. త్వరలో 3599 రూపాయలకు చేరుతుంది. దీనికి సంబంధించిన వివరాలను జియో అధికారికంగా వెల్లడించింది.జియో మొత్తం మీద 2 పోస్ట్ పెయిడ్ ప్లాన్ల ధరలు, 17 ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను ఒక్కసారిగా పెంచుతూ ప్రకటించింది. జియో ప్రస్తుతం ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ నేతృత్వంలో ఉంది. కొత్త రీఛార్జ్ ధరలు తప్పకుండా యూజర్ల మీద భారం చూపిస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.Reliance Jio introduces new unlimited 5G plans to be available from 3rd July pic.twitter.com/TsDMAG682r— ANI (@ANI) June 27, 2024 -
ముగిసిన స్పెక్ట్రం వేలం.. ఎయిర్టెల్ టాప్!
న్యూఢిల్లీ: ఈసారి టెలికం స్పెక్ట్రం వేలం ప్రక్రియ రెండు రోజుల్లోనే ముగిసింది. మొత్తం రూ. 96,238 కోట్ల బేస్ ధరతో 800 మెగాహెట్జ్ నుంచి 26 గిగాహెట్జ్ బ్యాండ్విడ్త్లో 10 గిగాహెట్జ్ స్పెక్ట్రంను వేలానికి ఉంచగా.. ఏడు రౌండ్లలో 141.4 మెగాహెట్జ్ మాత్రమే అమ్ముడైంది. టెల్కోలు సుమారు రూ. 11,340.78 కోట్ల విలువ చేసే బిడ్లు దాఖలు చేశాయి. ప్రధానంగా గడువు తీరిపోతున్న స్పెక్ట్రంను రెన్యువల్ చేసుకోవడం, కవరేజీని పెంచుకునేందుకు నిర్దిష్ట ఫ్రీక్వెన్సీల్లోనే కొనుగోలు చేసేందుకు టెల్కోలు ప్రాధాన్యమివ్వడం ఇందుకు కారణం. భారతీ ఎయిర్టెల్ అత్యధికంగా స్పెక్ట్రం కొనుగోలు చేసింది. తొలిరోజైన జూన్ 25న (మంగళవారం) అయిదు రౌండ్లు జరగ్గా, రెండో రోజున పెద్దగా స్పందన లేకపోవడంతో వేలం ముగిసినట్లు బుధవారం అధికారులు ప్రకటించారు.టెల్కోలు తమ సర్వీసులను కొనసాగించడంతో పాటు కార్యకలాపాలను విస్తరించేందుకు కూడా స్పెక్ట్రంను కొనుగోలు చేసినట్లు కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈసారి విక్రయానికి ఉంచిన స్పెక్ట్రంలో 12 శాతానికి మాత్రమే బిడ్లు వచ్చాయి. గత వేలంలోనే టెల్కోలు గణనీయంగా స్పెక్ట్రం తీసుకోవడంతో నిర్దిష్ట బ్యాండ్లకు ఈసారి పెద్దగా డిమాండ్ కనిపించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.900, 1800 మెగాహెట్జ్ బ్యాండ్లపై ఎక్కువగా ఆసక్తి నెలకొంది. 2022లో జరిగిన స్పెక్ట్రం వేలం బ్లాక్బస్టర్గా నిల్చింది. అప్పట్లో ఏడు రోజులు సాగిన వేలంలో రూ. 1.5 లక్షల కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను టెల్కోలు కొనుగోలు చేశాయి. జియో అత్యధికంగా రూ. 88,078 కోట్లతో దాదాపు సగం స్పెక్ట్రంను దక్కించుకుంది. ఎయిర్టెల్ రూ. 6,857 కోట్ల బిడ్.. భారతీఎయిర్టెల్ అత్యధికంగా రూ.6,856.76 కోట్లు, వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) రూ. 3,510 కోట్లు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రూ. 973.6 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. ఎయిర్టెల్ 97 మెగాహెట్జ్, వీఐఎల్ 30 మెగాహెట్జ్, జియో ఇన్ఫోకామ్ 14.4 మెగాహెట్జ్ దక్కించుకున్నాయి. కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించేందుకు ఎప్పటికప్పుడు అవసరమైనంత స్పెక్ట్రంను సమకూర్చుకుంటామని భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు.బిహార్, పశ్చిమ బెంగాల్ సర్కిళ్లలో 1,800 మెగాహెట్జ్ స్పెక్ట్రంను కొనుగోలు చేయడం ద్వారా తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ చెప్పారు. నిర్దిష్ట మార్కెట్లలో స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా స్పెక్ట్రంను కొనుగోలు చేసినట్లు వీఐఎల్ సీఈవో అక్షయ ముంద్రా తెలిపారు. -
తెలుగు రాష్ట్రాల్లో జియో జోరు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రిలయన్స్ జియోకి కస్టమర్లు భారీగా పెరిగారు. ట్రాయ్ (TRAI) విడుదల చేసిన తాజా టెలికాం చందాదారుల గణాంకాల ప్రకారం, రిలయన్స్ జియోలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి 1.56 లక్షలకు పైగా కస్టమర్లు కొత్తగా వచ్చి చేరారు.ట్రాయ్ గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో జియో అత్యధికంగా 1,56,296 మంది మొబైల్ చందాదారులను చేర్చుకుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జియో కస్టమర్ల సంఖ్య ఏప్రిల్ నెలాఖరి నాటికి 3.29 కోట్లకు చేరుకుంది. ఇదే నెలలో ఎయిర్టెల్ లో 55 వేల మంది కొత్త మొబైల్ చందాదారులు చేరారు. మరోవైపు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ లో భారీగా 2.57 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. వోడాఐడియా కూడా 23,456 మంది కస్టమర్లను కోల్పోయింది.ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా కూడా జియో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. జియో లో 26.8 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. ఈ గణాంకాల ప్రకారం ఏప్రిల్ 2024 నాటికి దేశంలో మొత్తం జియో మొబైల్ కస్టమర్ల సంఖ్య 47.24 కోట్లకు చేరుకుంది. 7.52 లక్షల కొత్త కస్టమర్లు, 26.75 కోట్ల మొత్తం కస్టమర్లతో ఎయిర్టెల్ తర్వాత స్థానంలో ఉంది. దేశీయంగా మొత్తం టెలికాం యూజర్ల సంఖ్య ఏప్రిల్ నాటికి 120 కోట్లు దాటడం విశేషం. -
టెలికం యూజర్లు @120 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా టెలి కం యూజర్ల సంఖ్య ఏప్రిల్లో 120 కోట్లు దాటింది. ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్లో మొత్తం సబ్స్క్రయిబర్స్ సంఖ్య 120.12 కోట్లుగా నమోదైంది.ఈ ఏడాది మార్చిలో ఇది 119.92 కోట్లుగా ఉంది. చివరిసారిగా 2017 జూలైలో 121 కోట్ల రికార్డు స్థాయిని తాకింది. తాజాగా, వైర్లెస్ విభాగంలో రిలయన్స్ జియోకి ఏప్రిల్లో 26.8 లక్షల మంది కొత్త యూజర్లు జత వడంతో మొత్తం యూజర్ల సంఖ్య 47.24 కోట్లకు చేరింది.7.52 లక్షల కొత్త కస్టమర్లు, మొత్తం 26.75 కోట్ల యూజర్లతో ఎయిర్టెల్ తర్వాత స్థానంలో ఉంది. బీఎస్ఎన్ఎల్ యూజర్ల సంఖ్య 12.3 లక్షలు, వొడాఫోన్ ఐడియా యూజర్లు 7.35 లక్షల మేర తగ్గారు. -
దేశ వ్యాప్తంగా జియో సేవలు డౌన్.. గగ్గోలు పెడుతున్న యూజర్లు
ప్రముఖ టెలికం నెట్వర్క్ జియోలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న యూజర్లు వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్, స్నాప్చాట్, యూట్యూబ్, గూగుల్ను వినియోగించుకోలేక పోతున్నామంటూ ఫిర్యాదులు చేస్తున్నారు.ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్డిటెక్టర్ మేరకు..మొబైల్ ఇంటర్నెట్లో సమస్యలు తలెత్తుతున్నాయని 54 శాతం ఫిర్యాదు, 38 శాతం జియో ఫైబర్, 7 శాతం మొబైల్ నెట్వర్క్లో సమస్య ఉత్పన్నమైనట్లు సమాచారం.మరోవైపు యూజర్లకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ జియో కస్టమర్ కేర్ విభాగం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నెటిజన్లు జియో సంస్థ తీరుకు నిరసనగా మీమ్స్ షేర్ చేస్తున్నారు. -
సూపర్ రీచార్జ్ ప్లాన్: రెండు కంపెనీల్లో ఒకటే.. మరి ఏది బెస్ట్?
దీర్ఘకాల వ్యాలిడిటీ రీచార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్న వారి కోసం ప్రముఖ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్టెల్లలో అద్భుతమైన ప్లాన్లు ఉన్నాయి. రూ.395తో రెండు కంపెనీలు ప్లాన్లను అందిస్తున్నాయి. ధర ఒకటే అయినా వ్యాలిడిటీ, డేటా, ఇతర ప్రయోజనాల్లో తేడాలున్నాయి. ఏ కంపెనీ రీచార్జ్ ప్లాన్లో ఎలాంటి బెనిఫిట్లు ఉన్నాయో ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం..జియో రూ.395 ప్లాన్» 84 రోజుల వ్యాలిడిటీ» అపరిమిత 5జీ డేటా» 5జీ కనెక్టివిటీ, 5జీ ఎనేబుల్డ్ హ్యాండ్సెట్ లేకపోతే వాడుకునేందుకు 6 జీబీ డేటా» అపరిమిత వాయిస్ కాలింగ్ » మొత్తం 1000 ఎస్ఎంఎస్లు» జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్కు కాంప్లిమెంటరీ యాక్సెస్» "మై జియో యాప్ ఎక్స్ క్లూజివ్" ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ఎయిర్ టెల్ రూ.395 ప్లాన్» 70 రోజుల వ్యాలిడిటీ » మొత్తంగా 6 జీబీ హైస్పీడ్ డేటా» 600 ఎస్ఎంఎస్లు» అపోలో 24|7 సర్కిల్కు 3 నెలల పాటు యాక్సెస్» ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు» అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్» రీఛార్జ్ ప్లాన్ ఎయిర్టెల్ యాప్, వెబ్సైట్లో లభ్యం -
ఆఫ్రికా దేశంలో రిలయన్స్ సేవలు!
భారత్లో మొబైల్ బ్రాడ్బ్యాండ్ సేవలందిస్తోన్న ప్రముఖ కంపెనీ రిలయన్స్ ఆఫ్రికాలోనూ తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశానికి చెందిన ఒక కంపెనీతో 5జీ షేర్డ్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్లను అందించేందుకు ఒప్పందం చేసుకోనుంది.రిలయన్స్ ఇండస్ట్రీస్లో భాగంగా ఉన్న రాడిసిస్ అనే కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి ఘనాలో తన కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి. వాటి ప్రకారం..నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫ్రాకో(ఎన్జీఐసీ) అనే ఘనా కంపెనీకి అవసరమయ్యే కీలకమైన మౌలిక సదుపాయాలు, అప్లికేషన్లు, స్మార్ట్ఫోన్లను రాడిసిస్ అందిస్తుంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో మెరుగైన డిజిటల్ సేవలను అందించేలా కంపెనీ పని చేస్తోందని ఎన్జీఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హర్కిరిత్ సింగ్ బ్లూమ్బెర్గ్ నివేదికలో పేర్కొన్నారు.భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే 14 ఆఫ్రికన్ దేశాల్లో మొబైల్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందిస్తోంది. సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని ఈ కంపెనీ ఆఫ్రికాలో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా చలామణి అవుతోంది. ఇకపై రిలయన్స్ కూడా అక్కడ టెలికాం సేవలు ప్రారంభించడం పట్ల ఇరుకంపెనీల మధ్య పోటీ నెలకొంటుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ఎన్జీఐసీ పదేళ్లపాటు ఘనాలో 5జీ సేవలను అందించేలా అనుమతులను పొందింది. అయితే ఆ లైసెన్స్ను పదిహేనేళ్లపాటు పొడిగించే అవకాశం ఉంది. ఈ కంపెనీ మూడేళ్ల మూలధన వ్యయం 145 మిలియన్ డాలర్లని అంచనా. ఎలాగైతే భారత్లో జియోను ఆవిష్కరించి టెలికాంరంగంలో రిలయన్స్ ప్రత్యేకత చాటుకుందో అక్కడ కూడా తనదైన ముద్రవేయాలని చూస్తుంది. -
ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ జియో సినిమా యూజర్లకు శుభవార్త చెప్పింది. జియో సినిమా 12 నెలల ప్రీమియం యాడ్ ఫ్రీ ప్లాన్ను రూ. 599కే అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రారంభం ధర 50 శాతం డిస్కౌంట్తో రూ.299 లకే అందిస్తుంది. సంవత్సరం తర్వాత మళ్లీ రీఛార్జ్ చేసుకోవాలంటే రూ.599 చెల్లించాలి. జియో సినిమా గతంలో రూ.999 వార్షిక ప్లాన్ అందించింది. ఇప్పుడు దాన్ని రూ.599కి తగ్గించి.. ప్రారంభం ఆఫర్ కింద భారీ డిస్కౌంట్ ఇస్తోంది.నెలవారీ ప్లాన్ మాదిరిగానే, వార్షిక సబ్స్క్రిప్షన్ హెచ్బీఓ, పీకాక్, పారామౌంట్ ప్లస్ వంటి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ను సైతం జియో సినిమాలో వీక్షించవచ్చు. దీంతో పాటు ఐపీఎల్ ఇతర ప్రాంతీయ కంటెంట్ను ఫ్రీగా చూడొచ్చని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. -
మొబైల్ యూజర్స్కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
మొబైల్ ఫోన్ యూజర్లకు షాక్. త్వరలో ఫోన్ బిల్లలు తడిసి మోపెడు కానున్నాయి. దేశంలోని మొత్తం లోక్సభ స్థానాల ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే నాలుగో రౌండ్ టారిఫ్ ధరల్ని పెంచేందుకు టెలికం కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం.. టెలికం కంపెనీలు యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ఏఆర్పీయూ) ను పెంచుకునేందుకు కంపెనీలు తప్పుకుండా 25 శాతం టారిఫ్ ధరల్ని పెంచనున్నాయి. మార్కెట్లో కాంపిటీషన్, 5జీ టెక్నాలజీ కోసం భారీ పెట్టుపడులు ఇతరాత్ర కారణాల వల్ల టారిఫ్ ధరల పెంపు అనివార్యం కానుంది. వినియోగదారులపై ప్రభావం25 శాతం టారిఫ్ ధరల పెంపు భారీగా ఉన్నప్పటికీ.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల యూజర్లకు భరించే ఆర్ధిక సామర్ధ్యం ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా టెలికం సేవల్ని వినియోగించుకునేందుకు గాను ప్రస్తుతం పెట్టే ఖర్చు 3.2 శాతంతో పోలిస్తే పట్టణ గృహాల మొత్తం వ్యయంలో 3.6 శాతానికి పెరుగుతుందని అంచనా. అదేవిధంగా, గ్రామీణ చందాదారుల కోసం, ఈ సంఖ్య ప్రస్తుత 5.2 శాతం నుండి 5.9 శాతానికి పెరుగుతుందని అంచనా.టారిఫ్ ధరలు పెరిగితేటారిఫ్ 25 శాతం పెంచితే టెలికాం ఆపరేటర్ల ఏఆర్పీయూ 16 శాతం పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. ఎయిర్టెల్కు ఒక్కో యూజర్ నుంచి వచ్చే ఆదాయం అత్యధికంగా రూ.29, జియో 26 శాతం ఉందని యాక్సిస్ కేపిటల్ ఎస్టిమేట్ తెలిపింది. కంపెనీలకు లాభమేమార్చితో ముగిసిన త్రైమాసికంలో జియో ఏఆర్పీయూ రూ.181.7 గా ఉంది. ఎయిర్టెల్కు రూ.208, వొడాఫాన్ ఐడియాకు రూ.145 గా ఉంది. టారిఫ్ ధరలు పెరిగితే ఒక్కో యూజర్ నుంచి వచ్చే ఆదాయం పెరుగుతుంది. ఆ ప్రభావం కంపెనీ లాభాలు పెరిగేందుకు దోహదం చేస్తోంది. -
జియో గుడ్న్యూస్.. నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా 15 ఓటీటీ యాప్స్
జియో ఫైబర్ తమ యూజర్లకు గుడ్న్యూస్ చెప్పింది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్స్టార్ ప్రాథమిక సబ్స్క్రిప్షన్తో సహా 15 యాప్ల ప్రీమియం సేవలను రూ. 888 మంత్లీ ప్లాన్కే అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇది 30 ఎంబీపీఎస్ ఎంట్రీ లెవల్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్.నెట్ఫ్లిక్స్ యాక్సెస్ గతంలో రూ. 1,499 ప్లాన్ని కలిగి ఉన్న జియోఫైబర్ (JioFiber) కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఎంట్రీ లెవల్ 30 ఎంబీపీఎస్ ప్లాన్తో కస్టమర్లకు ఎంటర్టైన్మెంట్ యాప్ల యాక్సెస్ ఉండేది కాదు. అదేవిధంగా, ఎయిర్ ఫైబర్ (AirFiber) కస్టమర్ల కోసం రూ. 1499 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న ప్లాన్లలో మాత్రమే నెట్ఫ్లిక్స్ యాక్సెస్ అందుబాటులో ఉంది.కంపెనీ సమాచారం ప్రకారం.. జియో రూ.888 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ అందిస్తున్న 15 ఓటీటీ యాప్ల సేవల్లో నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా సోనీ లివ్, జీ5, లయన్స్గేట్, డిస్కవరీ ప్లస్, ఆల్ట్బాలాజీ వంటివి ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో పోటీ నెలకొన్న నేపథ్యంలో తమ కొత్త ప్లాన్లు వినియోగదారులను ఆకట్టుకుంటాయన్న నమ్మకంతో జియో ఉంది. -
రూ.1కే హాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు.. ఎక్కడో తెలుసా..
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన జియోసినిమా సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరను తగ్గించింది. క్రికెట్ మ్యాచ్ల వంటి లైవ్ ప్రోగ్రామింగ్ను ఉచితంగా అందిస్తున్న కంపెనీ కేవలం రోజూ రూ.1కే హాలీవుడ్ సినిమాలు, టీవీ షోలను అందించనుంది.రిలయన్స్ అనుబంధ సంస్థ వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ యాజమాన్యంలోని ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ జియోసినిమా దాని సబ్స్క్రిప్షన్ను మూడింట రెండు వంతులు తగ్గించి నెలకు రూ.29కి చేర్చింది. ఈ ప్లాన్లో ఆన్లైన్, ఆఫ్లైన్తోపాటు 4K క్వాలిటీ, విదేశీ సినిమాలు, టీవీ సిరీస్లు, పిల్లల ప్రోగ్రామ్లను ఐదు భాషల్లో అందిస్తున్నట్లు వయాకామ్18 డిజిటల్ విభాగం సీఈఓ కిరణ్ మణి తెలిపారు. ‘నాలుగు డివైజ్ల్లో ఏకకాలంలో జియోసినిమాను యాక్సెస్ చేసేలా నెలకు రూ.89తో ఫ్యామిలీప్యాక్ను తీసుకొచ్చాం. జియోసినిమా చూడడం కుటుంబ సభ్యులకు అలవాటుగా మార్చడానికి సరసమైన ధరలతో సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందుబాటులో ఉంచాం. పిల్లల కంటెంట్తో కూడిన అతిపెద్ద లైబ్రరీ కూడా ఇందులో ఉంది’ అని మణి అన్నారు.ఇదీ చదవండి: నెట్ లేకుండానే ఫైల్ షేరింగ్.. ప్రముఖ కంపెనీ కొత్త ఫీచర్1 బిలియన్(100 కోట్లు) ప్లస్ వీక్షకుల కోసం ఇప్పటికే నెట్ఫ్లిక్స్, సోనీ గ్రూప్, అమెజాన్ ప్రైమ్ వంటి ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు పోటీ పడుతున్నాయి. తాజాగా జియో సినిమా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ మీడియా సంస్థల మధ్య పోటీని మరింత తీవ్రతరం చేస్తుందని పలువురు భావిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాల్ట్ డిస్నీ విలీనానికి రిలయన్స్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జియోసినిమా ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను ఉచితంగా ప్రసారం చేస్తోంది. -
పోటెత్తుతున్న యూజర్లు.. జియోకు కొత్తగా 42 లక్షల సబ్స్కైబర్లు
ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సబ్స్కైబర్లతో దూసుకుపోతుంది. ట్రాయ్ (TRAI) విడుదల చేసిన తాజా టెలికాం గణాంకాల ప్రకారం.. రిలయన్స్ జియో ఈ ఏడాది జనవరి నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2.59 లక్షలకు పైగా చందాదారులు కొత్తగా వచ్చి చేరారు. జనవరిలో జియో అత్యధికంగా 2,59,788 మొబైల్ చందాదారులను చేర్చుకుంది. దీంతో జియో కస్టమర్ల సంఖ్య 3.24 కోట్లకు చేరుకుంది. ఇదే నెలలో ఎయిర్టెల్కు 1.18 లక్షల మంది చేరారు. వోడాఐడియా 44,649 మంది, బీఎస్ఎన్ఎల్ 16,146 మంది కస్టమర్లను కోల్పోయాయి. జనవరి నెలలో దేశవ్యాప్తంగా జియోలో అత్యధికంగా 41.78 లక్షల మంది కొత్త చందాదారులు చేరారు. ఎయిర్టెల్లో 7.52 లక్షల మంది చేరగా, వోడాఐడియా,బీఎస్ఎన్ఎల్లు తమ కస్టమర్లను కోల్పోయాయి. ఈ గణాంకాల ప్రకారం జనవరి 2024 నాటికి దేశంలో మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్య 52.67 కోట్లకు చేరుకుంది. -
ఫ్లైట్ ఎక్కుతున్నారా? అయితే ఈ రీచార్జ్ ప్లాన్స్ తెలుసుకోండి..
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు మనిషి జీవితంలో భాగమైపోయాయి. వీటిని వినియోగించకుండా నిమిషాలు కూడా ఉండలేని పరిస్థతి. విమాన ప్రయాణంలో సాధారణ రీచార్జ్ ప్లాన్లు పనిచేయవని మనందరికీ తెలుసు. ప్రత్యేక రీచార్జ్ ప్లాన్లు ఉంటేనే ఫ్లైట్లో ఉన్నంత సేపూ కాలింగ్ కానీ, ఇంటర్నెట్ కానీ వినియోగించుకునేందుకు వీలుంటుంది. టెలికాం ఆపరేటర్లు ఎయిర్టెల్, రిలయన్స్ జియో కొన్ని ఇన్-ఫ్లైట్ రీచార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇవి ఫ్లైట్లో ఉన్నప్పుడు యూజర్లు కనెక్ట్ అయి ఉండేందుకు వీలు కల్పిస్తాయి. ఈ ప్లాన్లు డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలను అందిస్తాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ అందిస్తున్న ఇన్-ఫ్లైట్ ప్లాన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. జియో రూ.195 ప్లాన్ డేటా: 250MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు జియో రూ. 295 ప్లాన్ డేటా: 500MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు జియో రూ. 595 ప్లాన్ డేటా: 1GB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు ఎయిర్టెల్ రూ.195 ప్లాన్ డేటా: 250MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు ఎయిర్టెల్ రూ. 295 ప్లాన్ డేటా: 500MB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు ఎయిర్టెల్ రూ. 595 ప్లాన్ డేటా: 1GB కాలింగ్: 100 అవుట్గోయింగ్ కాలింగ్ నిమిషాలు ఎస్ఎంఎస్: 100 అవుట్గోయింగ్ SMS చెల్లుబాటు: 1 రోజు -
ఆ క్రెడిట్ అంతా ఆమెదే! జియో ఆలోచనకు బీజం పడిందిలా..
దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ ఏది అంటే రిలయన్స్ జియో అని టక్కున చెప్పేస్తాం. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో 2023 డిసెంబర్లో 3.99 మిలియన్ల మంది యాజర్లను సంపాదించి అతిపెద్ద విజేతగా నిలిచింది. దీంతో జియో సబ్స్క్రైబర్ బేస్ 459.81 మిలియన్లకు పెరిగింది. అయితే ఈ జియో ఏర్పాటుకు బీజం ఎలా పడిందో ఈ కథనంలో తెలుసుకుందాం.. దేశంలో అత్యంత సంపన్నుడు, దేశ మొబైల్ బ్రాడ్బ్యాండ్ డేటా వినియోగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన టెలికాం దిగ్గజం జియో వెనుక ఉన్న ముఖేష్ అంబానీ.. 2018లో లండన్లో జరిగిన ఫైనాన్షియల్ టైమ్స్ ఆర్సెలర్ మిట్టల్ బోల్డ్నెస్ ఇన్ బిజినెస్ అవార్డ్స్లో తన అంగీకార ప్రసంగంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఆ క్రెడిట్ ఇషాదే.. 2011లో జియోను ప్రారంభించడం వెనుక తన కుమార్తె ఇషా అంబానీ ఉన్నారని, ఆ క్రెడిట్ అంతా ఆమెదే అని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. అప్పుడు యేల్లో చదువుతున్న ఇషా అంబానీ సెలవులకు ఇంటికి వచ్చింది. వారి నివాసంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడం ఆమెను అసహనానికి గురి చేసింది. అదే కోట్లాది మంది భారతీయులకు సరసమైన, హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలనే సంచలనాత్మక ఆలోచనకు దారితీసింది. ముఖేష్ అంబానీ తన ప్రసంగంలో ఇలా పంచుకున్నారు. "2011లో నా కుమార్తె ఇషా ద్వారా జియో ఆలోచనకు బీజం పడింది. ఆమె యేల్లో చదువుకుంటున్నప్పుడు సెలవులకు ఇంటికి వచ్చింది. కోర్స్వర్క్ చేసుకుంటుండగా ఇంట్లో ఇంటర్నెట్ సక్రమంగా రాలేదు. దీంతో 'నాన్న , మన ఇంట్లో ఇంటర్నెట్ పోయింది' అని చెప్పింది" అని అంబానీ చెప్పుకొచ్చారు. తన పిల్లలు ఇషా, ఆకాష్లు.. సృజనాత్మకంగా ఆలోచిస్తూ ప్రపంచ స్థాయిలో రాణించడానికి పోటీ పడుతున తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పుకొచ్చిన ముఖేష్ అంబానీ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ అనేది దేశానికి అత్యంత ఆవశ్యకరమైన అంశమని తనను వారే ఒప్పించారని వివరించారు. -
జియో ఫైనాన్షియల్ సరికొత్త రికార్డులు!
దేశీయ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో సరికొత్త రికార్డ్ లను నమోదు చేశాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్ ధర 35 శాతం పెరిగింది. ఫలితంగా ఆ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారి రూ. 2 లక్షల కోట్లను అధిగమించింది. ఫిబ్రవరి 23న పేరెంట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సైతం రికార్డు స్థాయిని తాకింది. ఉదయం 10.30 గంటల సమయానికి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 8 శాతం పెరిగి.. ఒక్కోషేర్ ధర రికార్డు స్థాయిలో రూ. 326కి చేరుకుంది. ఈ స్టాక్ వరుసగా ఐదవ సెషన్లో 17 శాతం వృద్ధిని నమోదు చేయడంతో సంస్థ విలువ పరంగా రూ. 2.08 లక్షల కోట్లు దాటేందుకు దోహదపడింది. ఆర్ఐఎల్ ఇంట్రాడేలో రికార్డు స్థాయిలో రూ.2,989ను తాకింది. బీఎస్ఈలో ఈ షేరు మునుపటి ముగింపుతో పోలిస్తే 0.5 శాతం పెరిగి రూ.2,978 వద్ద ట్రేడవుతోంది. వ్యూహాత్మక అడుగులు జియో ఫైనాన్షియల్ సెక్యూర్డ్ లోన్లు అందించేందుకు దృష్టి సారిస్తోంది. ఆర్ధిక విభాగంలో ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది రెండు కొత్త ఉత్పత్తులను ప్రారంభించడం ద్వారా దాని సురక్షిత రుణ వ్యాపారాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. దాని అనుబంధ సంస్థ జియో ఇన్ఫర్మేషన్ అగ్రిగేటర్ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా ఎయిర్ ఫైబర్, ఫోన్లు, ల్యాప్టాప్ల వంటి పరికరాల కోసం ఆపరేటింగ్, ఫైనాన్సింగ్ లీజులను అందించడం, చైన్ ఫైనాన్సింగ్, సరఫరాదారుల వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చేలా వ్యూహాత్మకంగా వడివడిగా అడుగులు వేస్తోంది. కాగా, జనవరిలో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్లాక్రాక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సంస్థలు సంయుక్తంగా భారత్ లో మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు పత్రాలను దాఖలు చేశాయి. 39 కంపెనీలు@ రూ. 2 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం, 39 కంపెనీలు స్టాక్ మార్కెట్ లో రూ. 2 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే ఎక్కువ ట్రేడింగ్ చేస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.20.05 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో అగ్రస్థానంలో ఉండగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ.14.78 లక్షల కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.10.78 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్: మొత్తం షేర్ల సంఖ్యను మార్కెట్ విలువతో గుణిస్తే వచ్చే విలువను మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. -
జియో కొత్త ప్లాన్.. అదనపు డేటాతోపాటు 14 ఓటీటీలు ఫ్రీ!
Reliance Jio new plan : సరసమైన రీఛార్జ్ ప్లాన్లకు పేరుగాంచిన దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థల్లో రిలయన్స్ జియో ఒకటి. ఈ కంపెనీ టెలికాం రంగంలోకి ప్రవేశించినప్పటి నుంచి వినియోగదారులకు చౌకైన, సరసమైన ప్లాన్లను అందిస్తోంది. అందుకే జియోకి 44 కోట్ల కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్నారు. జియో తాజాగా 84 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. అదనపు డేటాతోపాటు 14 ప్రముఖ ఓటీటీలకు ఉచిత సబ్స్క్రిప్షన్ను ఈ ప్లాన్ అందిస్తోంది. జియోకి సంబంధించిన ఓటీటీలతోపాటు అనేక ఇతర ఓటీటీల ఉచిత ప్రయోజనాలను అందించే రూ. 1,198 విలువైన కొత్త ప్లాన్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. రూ. 1198 ప్లాన్ వివరాలు రిలయన్స్ జియో రూ. 1198 విలువైన ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.ఏ నెట్వర్క్లోనైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. 84 రోజుల పాటు 168జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత 64kbps వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఉచిత ఓటీటీలు ఇవే.. ఓటీటీలు చూడడాన్ని ఇష్టపడే వారి కోసం జియో రూ. 1198 ప్లాన్ 14 ఓటీటీలకు ఉచిత సబ్స్క్రిప్షన్లు అందిస్తోంది. వీటిలో సోనీ లివ్, జీ5, లయన్స్గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ NXT, కంచ లంక, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, డాక్యుబే, ఎపిక్ ఆన్, జియో టీవీ యాప్ ద్వారా Hoichoi, ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ వంటివి ఉన్నాయి. -
జియో, ఎయిర్టెల్ కొత్త రీచార్జ్.. ప్లాన్ ఒక్కటే! మరి బెనిఫిట్లు..
దేశంలో దిగ్గజ టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో ( Jio ), భారతీ ఎయిర్టెల్ ( Airtel ) రెండూ ఒకే రకమైన కొత్త రీచ్చార్జ్ ప్లాన్లను తీసుకొచ్చాయి. రెండింటి ధర రూ. 666. అయితే ప్రయోజనాల్లో మాత్రం చాలా తేడా ఉంది. రెండు ప్లాన్లతో కస్టమర్లకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. జియో రూ.666 ప్లాన్ ➥ 84 రోజుల వ్యాలిడిటీ ➥ 84 రోజుల పాటు అన్ని నెట్వర్క్లకు ఉచిత కాలింగ్ ➥ వ్యాలిడిటీ ఉన్నన్ని రోజులకు 126జీబీ డేటా అందిస్తుంది. రోజుకు 1.5జీబీ డేటాను ఉపయోగించవచ్చు. ➥ రోజుకు 100 SMS ➥ జియో టీవీ, జియో సినిమా, జియో సావన్ సబ్స్క్రిప్షన్లు ఎయిర్టెల్ రూ.666 ప్లాన్ ➥ మొత్తంగా 115జీబీ డేటా. రోజుకు 1.5 జీబీ డేటా వాడుకోవచ్చు. ➥ 77 రోజుల వరకు వ్యాలిడిటీ ➥ అమెజాన్ ప్రైమ్ వీడియోకు సబ్స్క్రిప్షన్ ➥ వింక్ మ్యూజిక్తోపాటు హలో ట్యూన్స్కి ఉచిత సబ్స్క్రిప్షన్ ఈ ప్లాన్లో రెండు కంపెనీలు తమ కస్టమర్లకు అపరిమిత 5G డేటాను అందిస్తున్నాయి. రిలయన్స్ జియోకు 44 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. మరోవైపు ఎయిర్టెల్కు దేశవ్యాప్తంగా 37 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. రెండు టెలికాం కంపెనీలు తమ కస్టమర్ల కోసం అనేక రకాల రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. మీ బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా ఈ రీఛార్జ్ ప్లాన్లలో దేనినైనా ఎంచుకోవచ్చు. -
ఎయిర్టెల్ నెత్తిన పాలు పోసిన పేటీఎం!
గత కొద్ది రోజులు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్కు యూజర్ల తాకిడి ఎక్కువైనట్లు తెలుస్తోంది. బ్యాంక్ అకౌంట్లు తెరవడం, ఫాస్టాగ్ వంటి ఆఫర్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే కొత్త కస్టమర్ల సంఖ్య బాగా పెరిగిందని సీఈఓ అనుబ్రత బిస్వాస్ తెలిపారు. అయితే, మరో పేమెంట్ బ్యాంక్ పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షలతోనే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్కు యూజర్లు క్యూకట్టారా? లేదంటే ఇంకేవైనా కారణాలున్నాయా? అనేది తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 29 తర్వాత డిపాజిట్ల స్వీకరణ, ఫాస్టాగ్ కార్యకలాపాల్ని నిలిపివేయాలని ఆర్బీఐ పేటీఎంను ఆదేశించింది. అయితే, ఇది ఆర్బీఐ ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కాదని, రెగ్యులేటరీ నిబంధనల్ని పేటీఎం పాటించకపోవడం వల్లే కఠిన చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. 5 నుంచి 7 రెట్లు పెరిగిన యూజర్లు అదే సమయంలో పేటీఎం యూజర్లు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ను వినియోగించుకునేందుకు పోటెత్తారు. ఫలితంగా లావాదేవీలు సంఖ్య పెరిగింది. ఫిక్స్డ్ డిపాజిట్లు, కరెంట్ అకౌంట్స్, యూపీఐ, ఫాస్టాగ్తో పాటు ఇతర సర్వీసుల్ని వినియోగించుకునే కస్టమర్ల సంఖ్య జనవరి నుంచి 5-7 రెట్లు ఎక్కువ చేరిందని సీఈఓ బిశ్వావ్ తెలిపారు. 59మిలియన్లకు పెరిగి ఇదిలా ఉండగా,ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ డిసెంబరు 2023 త్రైమాసికంలో రూ. 469 కోట్ల ఆదాయంలో వృద్ధిని కనబరించింది. దీంతో ఏడాది ప్రాతిపదికన 47 శాతం పెరిగి నికర లాభం రూ.11 కోట్లకు చేరిందని పేర్కొంది. సంవత్సరం క్రితంతో పోలిస్తే ఈ మొత్తం 120 వృద్దిని నమోదు చేసింది. బ్యాంక్ నెలవారీ లావాదేవీలు జరిపే యూజర్లు 59 మిలియన్లకు పెరిగారు. భారీ స్థాయిలో డిపాజిట్లు చేశారు. ఇది త్రైమాసికంలో సంవత్సరానికి 50 శాతం పెరిగి రూ.2,339 కోట్లకు చేరుకుంది. అంతకంతకూ ఎయిర్టెల్ ఆదాయం బ్యాంక్ గ్రాస్ మెర్చండైజ్ వ్యాల్యూ రూ. 2,62,800 కోట్లకు చేరింది. ఇక డెబిట్ కార్డ్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో సహా కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఇతర సేవల వల్ల.. కస్టమర్ల నుంచి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవల్ని వినియోగించుకున్నందుకు గాను ఎయిర్టెల్ ఆదాయం అంతకంతకూ పెరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. -
దేశవ్యాప్తంగా వేతనంతో కూడిన సెలవు.. అంబానీ కీలక ప్రకటన
అయోధ్యలో జనవరి 22వ తేదీన బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సగం రోజు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. మోదీ నిర్ణయానికి మద్ధతుగా ప్రతిష్టాత్మక రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అదే బాటలో నిర్ణయం తీసుకున్నారు. జనవరి 22వ తేదీన రిలయన్స్ ఇండస్ట్రీ ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. రిలయన్స్ ఆధ్వర్యంలోని అన్ని కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవుదినం ప్రకటించారు. జనవరి 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో అయోధ్యలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిలయన్స్ ఇండస్ట్రీ ఆఫీసులు, కంపెనీలు, ఫ్యాక్టరీలకు సెలవు ప్రకటించినట్లు అంబానీ వెల్లడించారు. ఇదీ చదవండి: రిలయన్స్ లాభం 17,265 కోట్లు దీంతో జనవరి 22వ తేదీన తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఉన్న ట్రెండ్స్ షోరూంలు, ఇతర రిలయన్స్ ఇండస్ట్రీ ఆఫీసులకు వేతనంతో కూడిన సెలవుదినంగా ప్రకటించారు. ముఖేష్ అంబానీ సోమవారం అయోధ్యలో జరిగే కార్యక్రమంలో ఫ్యామిలీతోపాటు హాజరుకానున్నట్లు తెలిసింది. -
రిలయన్స్ లాభం 17,265 కోట్లు
న్యూఢిల్లీ: ఆయిల్ నుంచి రిటైల్ వరకు ఎన్నో వ్యాపారాలు నిర్వహిస్తున్న డైవర్సిఫైడ్ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ డిసెంబర్ త్రైమాసికంలో మిశ్రమ పనితీరు చూపించింది. రిటైల్, టెలికం వ్యాపారాలు రాణించగా, ఆయిల్ టు కెమికల్స్ (ఓటూసీ) నిరాశపరించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 9.3 శాతం పెరిగి రూ.17,265 కోట్లకు చేరుకుంది. షేరువారీ ఆర్జన రూ.25.52గా ఉంది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 3.6 శాతం వృద్ధితో రూ.2.28 లక్షల కోట్లుగా నమోదైంది. కానీ, 2023 సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చి చూస్తే నికర లాభం 0.7 శాతం, ఆదాయం 3 శాతం చొప్పున తక్కువగా నమోదయ్యాయి. ఎబిటా (ఆపరేటింగ్ మార్జిన్) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2.10 శాతం మేర, 2023 డిసెంబర్ త్రైమాసికంతో పోల్చితే 0.50 శాతం మేర పెరిగి 18 శాతానికి చేరింది. రుణాలపై వ్యయాలు 11 శాతం పెరిగి రూ.5,789 కోట్లుగా ఉన్నాయి. బ్యాలన్స్ షీటులో నగదు, నగదు సమానాలు రూ.1.92 లక్షల కోట్లుగా ఉన్నాయి. కన్సాలిడేటెడ్ రుణ భారం రూ.3.12 లక్షల కోట్లుగా, నికర రుణ భారం రూ.1,19,372 కోట్లుగా ఉంది. రిటైల్ భేష్... ► రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) కన్సాలిడేటెడ్ లాభం క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 40 శాతం పెరిగి రూ.3,165 కోట్లకు చేరింది. ►స్థూల ఆదాయం క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 23 శాతం వృద్ధితో రూ.83,063 కోట్లకు చేరింది. ఒక త్రైమాసికంలో కంపెనీకి ఇదే అత్యధిక ఆదాయం. ► ఎబిటా 31% పెరిగి రూ.6,258 కోట్లు. ► గత త్రైమాసికంలో 252 స్టోర్లను కొత్తగా ప్రారంభించింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 18,774కు చేరింది. ఆయిల్, కెమికల్స్... ఆయిల్ టు కెమికల్స్ విభాగంలోనే బలహీనత కనిపించింది. నిర్వహణ పనుల కోసం జామ్నగర్లోని రిఫైనరీ ప్లాంట్లను ఏడు వారాలు మూసివేయడం ప్రభావం చూపించింది. ఆయిల్ టు కెమికల్స్ ఆదాయం 2.4% తగ్గి రూ.1.41 లక్షల కోట్లుగా ఉంది. ఆయిల్ అండ్ గ్యాస్ ఆదాయం 50% వృద్ధితో రూ.6,719 కోట్లకు ఎగసింది.రిలయన్స్ షేరు ఫ్లాట్గా రూ.2,736 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. జియో జూమ్... టెలికం, డిజిటల్ వ్యాపారం రాణించింది. నికర లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12% పెరిగి రూ.5,445 కోట్ల గా ఉంది. ఆదాయం 11 శాతానికి పైగా వృద్ధితో రూ.32,510 కోట్లుగా నమోదైంది. జియో వరకే చూస్తే లాభం 12% పెరిగి రూ.5,208 కోట్లుగా ఉంది. ఆదాయం 10% వృద్ధితో రూ.25,368 కోట్లకు చేరింది. ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయ రూ. 181.70కి చేరింది. ఏడాది క్రితం రూ. 178గా ఉంది. 2023 సెప్టెంబర్ క్వార్టర్తో పోలి స్తే ఫ్లాట్గా ఉంది. డిసెంబర్ నాటికి కస్టమర్ల సంఖ్య 470.09 మిలియన్లకు చేరింది. నికరంగా 11.2 మిలియన్ల కస్టమర్లు జతయ్యారు. 9 కోట్ల మంది 5జీ నెట్వర్క్కు మళ్లారు. -
పటిష్టమైన దేశీ బ్రాండ్ ఏంటో తెలుసా..
గ్లోబల్–500 కంపెనీల జాబితాలో పటిష్టమైన దేశీ బ్రాండ్గా రిలయన్స్ ఇండస్ట్రీస్లో భాగమైన జియో చోటు దక్కించుకుంది. బ్రాండ్ పటిష్టత సూచీలో 88.9 పాయింట్లతో 17వ ర్యాంకులో నిలి్చంది. 2024 సంవత్సరానికి గాను బ్రాండ్ ఫైనాన్స్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ జాబితాలో ఎల్ఐసీ 23వ స్థానంలో, ఎస్బీఐ 24వ స్థానంలో నిల్చాయి. గతేడాది (2023) కూడా పటిష్టమైన భారతీయ బ్రాండ్ల జాబితాలో జియో అగ్రస్థానం దక్కించుకుంది. 2024కి సంబంధించిన జాబితాలో వుయ్చాట్, యూట్యూబ్, గూగుల్, డెలాయిట్, కోకా కోలా, నెట్ఫ్లిక్స్ వంటి సంస్థలు టాప్లో ఉన్నాయి. టెలికమ్యూనికేషన్స్ రంగంలో మిగతా పోటీ సంస్థలతో పోలిస్తే కొత్త కంపెనీ అయినప్పటికీ పరిశ్రమలో జియో అత్యంత వేగంగా ఎదిగిందని నివేదిక పేర్కొంది. ఇదీ చదవండి: గూగుల్పే యూజర్లకు శుభవార్త.. అదేంటంటే? కస్టమర్ల సంఖ్య వేగంగా పెరగడం, నవకల్పనలు, బ్రాండ్పై సానుకూల అభిప్రాయం మొదలైనవన్నీ కూడా జియో బ్రాండ్ పటిష్టత, ట్రిపుల్ ఏ రేటింగ్లో ప్రతిఫలిస్తున్నాయని తెలిపింది. టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటర్స్ వంటి దిగ్గజ కంపెనీలున్న టాటా గ్రూప్.. దక్షిణాసియాలోనే అత్యంత విలువైన బ్రాండ్గా నిలి్చందని నివేదిక పేర్కొంది. -
రూ.4000 కోట్ల పెట్టుబడికి సిద్దమైన అంబానీ.. పెద్ద ప్లానే ఇది!
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఎప్పటికప్పుడు తన వ్యాపారా సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన జియో సేవలను పొరుగుదేశమైన శ్రీలంకలో కూడా ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఆర్థిక సంక్షోభం మధ్య ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి అధికారులు ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో శ్రీలంక టెలికాం పిఎల్సిలో వాటాను రియలన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు. శ్రీలంక టెలికాం పీఎల్సీలో వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న మొదటి మూడు కంపెనీలలో అంబానీ జియో ప్లాట్ఫామ్ కూడా ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం ఇటీవలే పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం పీఎల్సీ మార్కెట్ విలువ రూ.4000 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. శ్రీలంక టెలికాం పీఎల్సీ సంస్థను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిన కంపెనీల జాబితాలో జియో మాత్రమే కాకుండా.. గోర్ట్యూన్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ లిమిటెడ్, పెట్టిగో కమర్సియో ఇంటర్నేషనల్ ఎల్డిఎ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీ ఎవరి హస్తగతం అవుతుందనేది త్వరలోనే తెలుస్తుంది. ఇండియాలో జియో ప్లాట్ఫారమ్ భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే సంచలనం సృష్టించిన జియో 2023 అక్టోబర్ నాటికి 31.59 లక్షల వినియోగదారులను కలిగి ఉన్నట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన తాజా గణాంకాల ద్వారా తెలిసింది. ఈ సంఖ్య దాని ప్రత్యర్థి భారతీ ఎయిర్టెల్ కంటే కూడా ఎక్కువని స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: భయాన్ని ఎదుర్కోండి.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా గత వారం గాంధీనగర్లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2024లో ముఖేష్ అంబానీ పెట్టుబడి ప్రకటనల తర్వాత రిలయన్స్ అండ్ జియో షేర్లు స్టాక్ మార్కెట్లో భారీ లాభాలను పొందాయి. షేర్లలో పెరుగుదల ముఖేష్ అంబానీ ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తి స్థానాన్ని తిరిగి పొందేందుకు దారితీసింది. దీంతో మళ్ళీ భారతదేశంలో అత్యంత సంపన్నుడుగా ముకేశ్ అంబానీ నిలిచారు. -
కీలక టారిఫ్లను తొలగించనున్న జియో, ఎయిర్టెల్?
ఖర్చులను తట్టుకోవడానికి టెలికం రంగ సంస్థలు టారిఫ్లను పెంచడానికి రెడీ అవుతున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ ప్రీమియం కస్టమర్లకు ప్రస్తుతం అందించే తమ అన్లిమిటెడ్ 5జీ డేటా ప్లాన్లను ఆపేసే అవకాశం ఉంది. ఆదాయం పెంపునకు 2024 జూన్ నుంచి 4జీతో పోలిస్తే 5జీ సేవలకు కనీసం 5-10శాతం ఎక్కువ ఛార్జీ విధించవచ్చని టెలికం రంగ నిపుణులు చెబుతున్నారు. టెలికం కంపెనీలు 5జీ సేవల కోసం భారీగా ఇన్వెస్ట్ చేశాయి. ఈ ఖర్చును రాబట్టుకోవడానికి 2024 సెప్టెంబర్ క్వార్టర్లో రెండు టెలికాం ఆపరేటర్లు మొబైల్ టారిఫ్లను కనీసం 10శాతం పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. కస్టమర్లను 5జీకి అలవాటు చేయడానికి, ఇప్పటికే ఉన్న వినియోగదారులను ఆకర్షించడానికి ఈ రెండు కంపెనీలు 5జీ అన్లిమిటెడ్ డేటా ఆఫర్లతో పాటు 4జీ ధరలకే 5జీ సేవలను అందిస్తున్నాయి. జనం 5జీకి అలవాటు పడటం మొదలైనందున కంపెనీలు మానిటైజేషన్పై దృష్టిసారించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు సంస్థలు కొన్ని నెలల్లో 5జీ- కోసం ప్లాన్లను ప్రకటించవచ్చని జెఫ్రీస్ ఒక రీసెర్చ్ నోట్లో తెలిపింది. ఎయిర్టెల్, జియో 5జీ రేట్లు 4జీ కంటే 5-10శాతం ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఇటువంటి ప్లాన్లకు 30-40శాతం అదనపు డేటాను జోడించి మార్కెట్ షేరును పెంచుకొని, లాభాలు పొందవచ్చని తెలిసింది. ఇదీ చదవండి: రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే.. తగిన సమయంలో ఛార్జీలు పెంచడానికి వెనకాడబోమని గతంలో ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ అన్నారు. ప్రతి కస్టమర్ నుంచి వచ్చే నెలవారీ సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) ప్రస్తుతం ఉన్న రూ.200 నుంచి దాదాపు రూ.250కి పెంచుకుంటామని ప్రకటించారు. జియో, ఎయిర్టెల్కు కలిపి ఇప్పటికే 12.5 కోట్ల మంది 5జీ యూజర్లు ఉన్నారు. దేశం మొత్తం 5జీ యూజర్ బేస్ 2024 చివరి నాటికి 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. -
12 ఓటీటీలు అందించే జియో కొత్త ప్లాన్ ఇదే..
ప్రముఖ టెలికామ్ దిగ్గజం 'రిలయన్స్ జియో' (Reliance Jio) ఇటీవల తన సబ్స్క్రైబర్ల కోసం కొత్త ప్లాన్ తీసుకువచ్చింది. ఈ ప్లాన్లో భాగంగా రూ.148 చెల్లించి ఏకంగా 12 ఓటీటీలను పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వీడియో స్ట్రీమింగ్ యాప్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో టెలికాం సంస్థలు అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ఇటీవల రిలయన్స్ జియో రూ.148తో కొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా 12 ఓటీటీలు లభిస్తున్నాయి. జియో రూ.148 ప్లాన్ కేవలం డేటా ప్యాక్ మాత్రమే. వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్లు ఉండవు. 10 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు. దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే కచ్చితంగా బేస్ ప్లాన్ ఉండాల్సిందే. జియో సినిమా ప్రీమియం కూపన్ మైజియో అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. దీన్ని ఉపయోగించి ఆ ఓటీటీని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: అకౌంట్లో మినిమం బ్యాలెన్స్.. ఆర్బీఐ కీలక ఆదేశాలు 12 ఓటీటీలు ఇవే.. జియోసినిమా ప్రీమియం జీ5 సోనీలివ్ లయన్స్గేట్ ప్లే డిస్కవరీ+ సన్నెక్ట్స్ డాక్యుబే హోఇచోయ్ ప్లానెట్ మరాఠీ చౌపాల్ ఎపిక్ఆన్ కంచ లంక -
Jio New Year Offer: జియో ‘కొత్త’ ఆఫర్! బెనిఫిట్స్ ఇవే..
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) నూతన సంవత్సరం సందర్భంగా కొత్త ఆఫర్ను ప్రకటించింది. ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2024’ పేరిట రీచార్జ్ ప్లాన్ను తీసుకొచ్చింది. దీని కింద ఇప్పటికే ఉన్న ఏడాది కాలపరిమితి రీఛార్జ్ ప్లాన్ రూ.2,999పై అదనపు వ్యాలిడిటీని అందిస్తోంది. దీనివల్ల లాంగ్టర్మ్ ప్లాన్ వినియోగించే వారికి ప్రయోజనం కలుగుతుంది. ప్లాన్ ప్రయోజనాలు ఇవే.. జియో రూ.2,999 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్పై 24 రోజుల అదనపు వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే మొత్తం 389 రోజులు ఈ ప్లాన్ని వినియోగించుకోవచ్చు. దీని ప్రకారం.. రోజుకు రూ.8.21 పడే ప్లాన్ ధర రూ.7.70లకే తగ్గుతుంది. రోజుకు 2.5 జీబీ అపరిమిత 4జీ డేటా, అన్లిమిటెడ్ 5జీ డేటా, వాయిస్కాల్స్, 100 ఎస్సెమ్మెస్లు అందిస్తోంది. వీటితో పాటు జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా వంటి జియో యాప్లకు ఉచిత సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. అయితే ఈ ప్లాన్తో జియో సినిమా ప్రీమియం మెంబర్షిప్ ఉండదు. ఇది కావాలంటే విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జియో న్యూ ఇయర్ ప్లాన్ ప్రయోజనాలు డిసెంబర్ 20 తర్వాత రీచార్జ్ చేసుకున్నవారికి వర్తిస్తాయి. కాగా ఆఫర్ను పొందేందుకు చివరి తేదీ అంటూ కంపెనీ ప్రత్యేకంగా వెల్లడించలేదు. -
భారీ ధరకు డంకీ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాలీవుడ్ బాద్షా హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైపోయాడు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన డంకీ సినిమాతో ప్రేక్షకులను ముందుకొచ్చారు షారుక్ ఖాన్. గతంలో వీరిద్దరి కాంబోలో చాలా చిత్రాలు వచ్చాయి. దీంతో వీరి సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న ఈ చిత్రం రిలీజైంది. అయితే డంకీ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే అప్పుడే ఈ స్టార్ మూవీ ఓటీటీ రిలీజ్పై ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. అభిమాన హీరో సినిమా ఎక్కడ స్ట్రీమింగా కానుందని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. అయితే డంకీ ఓటీటీ పార్ట్నర్ ఇప్పటికే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రం జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ ఈవెంట్లో జియో స్టూడియోస్ ప్లాట్ఫామ్లో రానున్న సినిమాలు, సిరీస్ల జాబితాను ఆవిష్కరించారు. ఆ లిస్ట్లో షారుక్ డంకీ సినిమా కూడా ఉంది. దీంతో డంకీ జియో సినిమాలో స్ట్రీమింగ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే డంకీ చిత్రాన్ని జియో సినిమా రూ. 155 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. ఇక సినిమా టాక్ను బట్టి, కలెక్షన్స్ ఆధారంగా మేకర్స్ ఓటీటీ రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. సాధరణంగా థియేట్రికల్ రిలీజ్ నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేస్తారని తెలిసిందే. అలాగే జరిగితే వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డే కానుకగా డంకీని ఓటీటీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. -
తిరుగులేని జియో.. భారీగా పెరిగిన యూజర్లు
న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగంలో రిలయన్స్ జియో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్లో కంపెనీ యూజర్ల సంఖ్య మరో 34.7 లక్షలు పెరిగి మొత్తం 44.92 కోట్లకు చేరింది. అటు పోటీ సంస్థ భారతి ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ 13.2 లక్షలు పెరగ్గా వొడాఫోన్ ఐడియా యూజర్లు 7.5 లక్షలు తగ్గారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ బుధవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం భారతి ఎయిర్టెల్ యూజర్ల సంఖ్య 37.77 కోట్లుగా, వొడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్స్ సంఖ్య 22.75 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ ఆఖరు నాటికి మొత్తం వైర్లెస్ సబ్స్క్రైబర్స్ సంఖ్య 115 కోట్లకు చేరింది. పట్టణ ప్రాంతాల్లో యూజర్ల సంఖ్య 63 కోట్లకు, గ్రామీణ ప్రాంతాల్లో సబ్స్క్రైబర్స్ సంఖ్య 52 కోట్లకు చేరింది. 88.5 కోట్లకు బ్రాడ్బ్యాండ్ యూజర్లు.. ట్రాయ్ గణాంకాల ప్రకారం మొత్తం బ్రాడ్బ్యాండ్ యూజర్ల సంఖ్య ఆగస్టులో 87.65 కోట్లుగా ఉండగా సెప్టెంబర్ ఆఖరు నాటికి 88.5 కోట్లకు చేరింది. టాప్ 5 సర్వీస్ ప్రొవైడర్ల మార్కెట్ వాటా 98.35 శాతంగా ఉంది. ఇందులో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (45.89 కోట్లు), భారతి ఎయిర్టెల్ (25.75 కోట్లు), వొడాఫోన్ ఐడియా (12.65 కోట్లు), బీఎస్ఎన్ఎల్ (2.51 కోట్లు) ఉన్నాయి. -
జియో ఫైనాన్స్ పర్సనల్ లోన్స్.. ఇవి ఉంటే చాలు!
న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కు చెందిన జియో ఫైనాన్స్ తన రుణ వితరణ వ్యాపారాన్ని ప్రారంభింంది. తొలుత పర్సనల్ లోన్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్, మర్చంట్ ట్రేడ్ క్రెడిట్ ఫెసిలిటీని ఆరంభింంది. జియో ఫైనాన్స్, మై జియో మొబైల్ అప్లికేషన్స్ ద్వారా వేతన జీవులు, స్వయం ఉపాధిలో ఉన్న వారికి డిజిటల్ పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తోంది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నంబర్ ఉంటే చాలు. రుణాన్ని వేగంగా పొందొచ్చు. కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ కింద ఖరీదైన మొబైల్ ఫోన్లు, ఏసీలు, కెమెరా కొనుగోళ్లకు రుణాలను అందిస్తోంది. మర్చంట్ వెబ్ సైట్లపై నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కింద ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవచ్చు. ‘‘జియో ఫైనాన్స్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రుణాలను అందిస్తోంది. తయారీదారులు, ఓఈఎంలు లేదా డీలర్లు ఈ రుణాలపై వడ్డీని భరిస్తారు. దీంతో నో కాస్ట్ ఈఎంఐ ప్రయోజనాన్ని వినియోగదారులు పొందొచ్చు. కాకపోతే కస్టమర్లు ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది’’అని జియో ఫైనాన్స్ పేర్కొంది. ఇన్వెంటరీ కొనుగోళ్లకూ రుణాలు వ్యాపారస్థులకు రుణాలను కూడా జియో ఫైనాన్స్ ప్రారంభింంది. అన్ సెక్యూర్డ్ మర్చంట్ ట్రేడ్ క్రెడిట్ ఫెసిలిటీని తన ప్లాట్ఫామ్పై నమోదైన వర్తకులకు అందించనుంది. జియో ఫైనాన్షియల్ రిలయన్స్ నుం విడిపోయి ఎక్సే్ఛంజ్లలో లిస్టయింది. ఇన్సూరెన్స్ బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్ సేవలను సైతం ఈ సంస్థ త్వరలోనే అందించనుంది. -
ఉచితంగా నెట్ఫ్లిక్స్.. ఎయిర్టెల్, జియో లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే!
ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్టెల్, జియోలు యూజర్లకు శుభవార్త చెప్పాయి. ఉచితంగా నెట్ఫ్లిక్స్ను వీక్షించేలా ప్రీపెయిడ్ ప్లాన్ బండిల్స్ను అందుబాటులోకి తెచ్చాయి.. ఈ ఏడాది ప్రారంభంలో జియో సైతం ఈ తరహా రీఛార్జ్ ప్లాన్లను యూజర్లకు అందించగా.. ఎయిర్టెల్ తాజాగా సబ్స్క్రిప్షన్ బండిల్స్ను ప్రారంభించింది. ఎయిర్టెల్, జియోలు దేశంలో 5జీ సేవల్ని అందిస్తున్నాయి. అయితే కస్టమర్ల కోసం ఈ రెండు సంస్థలు కలిసి నెట్ఫ్లిక్స్ బండిల్స్తో పాటు అన్లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తుండగా.. వాటిల్లో నెట్ఫ్లిక్స్ని ఫ్రీగా వీక్షించే అవకాశం కల్పించాయి. ఇక ఎయిర్టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్ల విషయానికొస్తే..84 రోజుల వ్యాలిడిటీతో రూ.1499 విలువైన ప్లాన్లో ప్రతి రోజు 3జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ను అందిస్తుంది. 5జీ సేవలున్న ప్రాంతాల్లో పైన పేర్కొన్న ప్లాన్ను ఉపయోగిస్తే 5జీ కంటే ఎక్కువ డేటా పొందవచ్చు. కొత్తగా విడుదల చేసిన ఈ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లో బేసిక్ నెట్ఫ్లిక్స్ ప్లాన్ సైతం వినియోగించుకోవచ్చు. ల్యాప్ట్యాప్స్, స్మార్ట్ఫోన్స్, ట్యాబ్లెట్, టీవీ ఇలా ఏదైనా ఒక డివైజ్లో ఓటీటీ సేవల్ని పొందొచ్చు. ఉచితంగా ఎయిర్టెల్ హలోట్యూన్స్ను యాక్సెస్ చేయొచ్చు. మరోవైపు జియో అందిస్తున్న రెండు ప్లాన్లలో ఉచితంగా నెట్ఫ్లిక్స్ వీక్షించవచ్చు. అందులో ఒక ప్లాన్ ఖరీదు రూ.1,099 ఉండగా ప్రతి రోజు 2జీబీ డేటాను వాడుకోవచ్చు. మరో ప్లాన్ రూ.1,499లో ప్రతి రోజు 3జీబీ డేటాతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ రెండు జియో ప్లాన్లలో ముందుగా చర్చించిన నెట్ఫ్లిక్స్ బేసిక్ సబ్స్క్రిప్షన్ కూడా ఉంది. ఎయిర్టెల్ ప్లాన్ మాదిరిగానే, ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్లు కూడా ఒక్కొక్కటి 84 రోజుల వ్యాలిడిటీ ఉంది. జియో ప్లాన్లు రోజువారీ డేటా ప్యాక్తో పాటు అపరిమిత 5జీ డేటాను కూడా అందిస్తుంది. -
ఇషా అంబానీకి ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్.. జియో ఫైనాన్షియల్ డైరెక్టర్లుగా మరో ఇద్దరు
జియో ఫైనాన్షియల్ డైరెక్టర్లుగా ముఖేష్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ'తో పాటు అన్షుమాన్ ఠాకూర్, హితేష్ కుమార్ సేథియాలను నియమించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆర్బీఐ ఈ నియామకాలకు నవంబర్ 15న ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం నియామక తేదీ నుంచి ఆరు నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ గడువులోపల ప్రతిపాదనలను అమలు చేయడంలో కంపెనీ విఫలమైతే.. ముందుగా ప్రతిపాదించిన మార్పులను అమలు చేయకపోవడానికి గల కారణాన్ని పేర్కొంటూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ వెల్లడించింది. 'ఇషా అంబానీ' యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎమ్బీఏ గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఆ తరువాత రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ టీమ్లో చేరింది. ఆ తరువాత రిలయన్స్ రిటైల్ విభాగాన్ని చేపట్టి కంపెనీకి లాభాలు రావడానికి కృషి చేసింది. ఇటీవల ఈమె నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎంపికైంది. అన్షుమాన్ ఠాకూర్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేట్, ఐఐఎం అహ్మదాబాద్లో MBA పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత కార్పొరేట్ స్ట్రాటజీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వంటి విభిన్న పరిశ్రమలలో పనిచేశారు. ప్రస్తుతం ఇతడు జియో ప్లాట్ఫారమ్ లిమిటెడ్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇదీ చదవండి: దీపావళికి నెట్లో ఎక్కువగా ఏం సర్చ్ చేసారంటే..? రివీల్ చేసిన సుందర్ పిచాయ్ హితేష్ కుమార్ సేథియా.. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పృథివీ విద్యార్ధి, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కూడా. యితడు ఐరోపా, ఆసియా, ఉత్తర అమెరికా వంటి దేశాల్లో సుమారు 20 సంవత్సరాలు ఫైనాన్సియల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. ఆ తరువాత ఐసీఐసీఐ బ్యాంక్ కెనడా, ఐసీఐసీఐ బ్యాంక్ జర్మనీ, యూకే, హాంకాంగ్లలో కూడా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వర్తించారు. -
రెండు కంపెనీలకు ఐఎస్పీ లైసెన్స్
న్యూఢిల్లీ: జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, భారతి గ్రూప్ ప్రమోట్ చేస్తున్న వన్వెబ్ తాజాగా టెలికం శాఖ నుంచి ఇంటర్నెట్ సరీ్వస్ ప్రొవైడర్ (ఐఎస్పీ) లైసెన్స్ అందుకున్నట్టు సమాచారం. శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించేందుకు ఈ రెండు సంస్థలకు ఏడాది క్రితమే అనుమతులు లభించాయి. ఈ కంపెనీలు టెరెస్ట్రియల్ నెట్వర్క్లతో లేదా వీశాట్ ద్వారా శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించవచ్చని ఒక అధికారి తెలిపారు. -
జియో వినియోగదారులకు శుభవార్త
వినియోగదారులకు రిలయన్స్ శుభవార్త చెప్పింది. వాట్సాప్, లైవ్ టీవీ స్ట్రీమింగ్, యూపీఐ పేమెంట్స్ వంటి ఫీచర్లతో మెరుగైన వెర్షన్లో 4జీ ఫోన్లను రూ.999కే అందించనుంది. ఈ నేపథ్యంలో నోకియా, లావా, ఐటెల్ వంటి మొబైల్ ఫోన్ బ్రాండ్లతో కలిసి స్మార్ట్ఫోన్ సొంత వెర్షన్లను అభివృద్ధి చేయడానికి పనిచేస్తుందని రిలయన్స్ జియో ప్రెసిడెంట్ (పరికరాల విభాగం) సునీల్ దత్ తెలిపారు. 250 మిలియన్ల 2జీ వినియోగదారులు 4జీ టెక్నాలజీని వినియోగించేలా కృషి చేయాలని కంపెనీ భావిస్తుందన్న ఆయన .. 450కి పైగా ఛానళ్లతో లైవ్ టీవీ, లేటెస్ట్ సినిమాలు, పాటలు, ఐపీఎల్ స్ట్రీమింగ్, ఇతర కంటెంట్ వంటి ఫీచర్లను రిలయన్స్ జియో 30 శాతం తక్కువ ధరకే అందిస్తోంది. స్కాన్ అండ్ పే ఆప్షన్ తో యూపీఐ పేమెంట్స్ ను జియో ప్రవేశపెట్టిందని దత్ వెల్లడించారు. గత నెలలో రిలయన్స్ జియో కొత్త 4జీ ఫోన్ జియోభారత్ బి1ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కంపెనీ అధికారిక వెబ్సైట్లో ఈ ఫోన్ ధర రూ.1,299గా ఉంది. ఈ ఫోన్లో 2.4 అంగుళాల స్క్రీన్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. సినిమాలు, వీడియోలు, స్పోర్ట్స్ హైలైట్స్ అందించేందుకు జియో యాప్స్ను ఫ్రీ ఇన్ స్టాల్ చేసింది. 23 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుండగా.. యూపీ పేమెంట్స్ కోసం జియోపేని ఉపయోగించుకునే అవకాశాన్ని వినియోగదారులకు జియో కల్పిస్తుంది. జియో ఫోన్, జియో ఫోన్ 2, జియో ఫోన్ నెక్స్ట్, జియో భారత్ వీ2, కే1 కార్బన్ వంటి ఫోన్లను జియో ప్రవేశపెట్టింది. -
Reliance JioMotive: ఒక్క గ్యాడ్జెట్.. కారు మరింత సేఫ్ - ధర కూడా తక్కువే!
రిలయన్స్ జియో 'జియోమోటివ్' (JioMotive) పేరుతో భారతీయ మార్కెట్లో ఓ సరికొత్త డివైజ్ లాంచ్ చేసింది. కేవలం రూ.4,999 వద్ద లభించే ఈ లేటెస్ట్ గ్యాడ్జెట్ కారులోని సమస్యలను ఇట్టే పసిగట్టేస్తుంది. ఈ కొత్త జియోమోటివ్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జియోమోటివ్ అనేది ప్లగ్ అండ్ ప్లే 'ఓబీడీ' (On-Board Diagnostics) గ్యాడ్జెట్. ఏ కారునైనా స్మార్ట్గా మార్చే ఈ డివైజ్.. రియల్ టైమ్ పర్ఫార్మెన్స్తో పాటు కారులోని సమస్యలను కూడా ముందుగానే తెలియజేస్తుంది. దీంతో వినియోగదారుడు వాటిని పరిష్కరించుకోవచ్చు, తద్వారా మెయింటెనెన్స్ పెంచుకోవచ్చు. ఈ గ్యాడ్జెట్ రిలయన్స్ డిజిటల్, జియో.కామ్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో ఉంటుంది. జియోమోటివ్ ఫీచర్స్ రియల్ టైమ్ ట్రాకింగ్: జియోమోటివ్ గ్యాడ్జెట్ కారులో ఫిక్స్ చేస్తే.. వాహనాన్ని 24 గంటలు పర్యవేక్షించవచ్చు. ఇది దొంగతనాలకు ఖచ్చితంగా చెక్ పెడుతుంది. జియో-ఫెన్సింగ్: ఈ ఫీచర్ ద్వారా మ్యాప్లో వర్చువల్ సరిహద్దులను(బౌండరీస్) సెట్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ సమయంలో ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. వెహికల్ హెల్త్ మానిటరింగ్: జియోమోటివ్ గ్యాడ్జెట్ ద్వారా 100 కంటే ఎక్కువ డీటీసీ అలర్ట్ పొందవచ్చు. తద్వారా సమస్య పెద్దదికాకముందే పసిగట్టి పరిష్కరించుకోవచ్చు. డ్రైవింగ్ అనలిటిక్స్: డ్రైవర్ డ్రైవింగ్ బిహేవియర్ని కూడా ఈ గ్యాడ్జెట్ ఎనలైజ్ క్సహిస్తుంది. ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ, హార్ష్ డ్రైవింగ్- బ్రేకింగ్, హార్ష్ యాక్సలరేషన్ వంటి అంశాలపై అలర్ట్ పొందొచ్చు. ఇదీ చదవండి: ఏడుసార్లు రిజెక్ట్.. విరక్తితో ఆత్మహత్యాయత్నం.. ఇప్పుడు లక్ష కోట్ల కంపెనీకి బాస్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుంచి జియోథింగ్స్ (JioThings) యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. జియో నెంబర్ ద్వారా లాగిన అయిన తరువాత '+' మీద క్లిక్ చేసి జియోమోటివ్ ఎంచుకుని, ఐఎమ్ఈఐ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కారు రిజిస్ట్రేషన్ నెంబర్, కారు పేరు (బ్రాండ్ నేమ్), మోడల్, ఫ్యూయెల్ టైప్ వంటి మీ కారు వివరాలను ఎంటర్ చేసి సేవ్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత ఓబీడీ పోర్ట్కి జియోమోటివ్ గ్యాడ్జెట్ ప్లగ్ చేసి.. తరువాత దశలను కంప్లీట్ చేయాలి. JioEverywhereConnect నెంబర్ షేరింగ్ ప్లాన్ రూల్స్ అంగీకరిస్తున్నట్లు టిక్ చేసి, ఎనేబుల్ మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత JioJCR1440 మీద క్లిక్ చేసి ప్రొసీడ్ అవ్వగానే మీకు జియో నుంచి యాక్టివేట్ అభ్యర్థనకు ఓకే మెసేజ్ వస్తుంది. ఇది యాక్టివేట్ కావడానికి 10 నిముషాలు కారును ఆన్లోనే ఉంచాలి. రిజిస్ట్రేషన్, యాక్టివేట్ వంటి వివరాలకు సంబంధించి ఏదైనా సందేహం ఉన్నట్లతే.. పరిష్కారం కోసం కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయవచ్చు. -
జియో కొత్త స్మార్ట్ గ్లాస్.. కళ్ల ముందే సరికొత్త ప్రపంచం!
రిలయన్స్ సంస్థ టెక్ గ్యాడ్జెట్ల ఉత్పత్తిమీద దృష్టి సారిస్తోంది. ఇప్పటికే జియో ఫీచర్ ఫోన్స్, ల్యాప్టాప్స్, గేమింగ్ కంట్రోలర్స్ వంటివి ఆవిష్కరించింది. కాగా ఇటీవల ఓ సరికొత్త స్మార్ట్ గ్లాస్ విడుదల చేసింది. ఈ లేటెస్ట్ గ్యాడ్జెట్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) ఈవెంట్లో కనిపించిన ఈ కొత్త స్మార్ట్ గ్లాస్ మెటాలిక్ ఫ్రేమ్తో రెండు లెన్స్లు పొందుతుంది. దీన్ని యూఎస్బీ కేబుల్ సాయంతో స్మార్ట్ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వైర్లెస్ కనెక్టివిటీకి కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి స్మార్ట్ఫోన్ను ఉపయోగించి జియో గ్లాస్ను కంట్రోల్ చేయవచ్చు. కేవలం 75 గ్రాముల బరువున్న ఈ స్మార్ట్ గ్లాస్ 100 ఇంచెస్ వర్చువల్ డిస్ప్లేగా.. కళ్ళముందే గాలిలో తేలియాడే స్క్రీన్ను సృష్టిస్తుంది. బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేయడానికి ట్రాక్ప్యాడ్ కంట్రోల్స్ ఇందులో లభిస్తాయి. ఆడియో కోసం రెండు వైపులా స్పీకర్లు, మైక్రోఫోన్ ఇందులో ఉండటం వల్ల వాయిస్ కాల్లకు రిసీవ్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ - వైరల్ వీడియో 4000mAh బ్యాటరీ కలిగిన ఈ జియో సన్ గ్లాస్ ఒక ఫుల్ ఛార్జ్తో మూడుగంటలు పనిచేస్తుంది. రెండు వెర్షన్లలో లభించనున్న ఈ సన్ గ్లాస్ ధరలను కంపెనీ అధికారికంగా వెల్లడికాలేదు. అయితే ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లో లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధరలు కూడా అప్పుడే వెల్లడవుతాయని భావిస్తున్నారు. -
Jio World Plaza Launch: జియో వరల్డ్ ప్లాజా లాంచ్ ఈవెంట్.. బాలీవుడ్ తారల సందడి (ఫొటోలు)
-
జియో 4జీ ఫోన్ వచ్చేసింది..ధర రూ.2,599 మాత్రమే!
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ సంస్థ యూజర్ల కోసం మరో కొత్త ఫోన్ ‘జియో ఫోన్ ప్రైమా 4జీ’ ఆవిష్కరించింది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్-2023 (ఐఎంసీ)లో ప్రదర్శించింది. ఈ సందర్భంగా జియో ఫీచర్ ఫోన్లో వాట్సాప్,యూట్యూబ్,జియోపే, యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చని తెలిపింది. ధర ఎంతంటే? దీపావళి పండుగ నుంచి కస్టమర్లకు అందుబాటులోకి రానున్న ఈ 4జీ ఫోన్ ధర రూ.2,599గా ఉంది. జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్ షోరూంలలో కొనుగోలు చేయొచ్చని వెల్లడించింది. ఫీచర్లు జియో ఫోన్ ప్రైమా 4జీ వాట్సాప్,ఫేస్బుక్, యూట్యూబ్లను వీక్షించవచ్చు. అదనంగా జియో సినిమా, జియో సావన్,జియో టీవీ, జియో,యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. 512 ఎంబీ ర్యామ్తో వస్తున్న ఈ షోన్ మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 128 జీబీ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. 1800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. బ్యాటరీతో ఏఆర్ఎం కార్టెక్స్ ఏ53 చిప్సెట్ను కలిగి ఉంది. -
జియో గుడ్న్యూస్.. ఆ కస్టమర్లే టార్గెట్!
దేశంలో అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio).. కోట్లాది మంది టెలికం కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 5జీ ప్లాన్లు విస్తరిస్తున్నప్పటికీ టారిఫ్లు మాత్రం పెంచబోమని హామీ ఇచ్చింది. దేశంలోని మిగతా అన్ని టెలికమ సంస్థల కంటే తమ రీచార్చ్ ప్లాన్లు చవగ్గానే ఉంటాయని వెల్లడించింది. అసలు టార్గెట్ వారే.. టెలికం పరిశ్రమలో రిలయన్స్ జియో దూకుడును మరింత పెంచింది. రానున్న రోజుల్లో 5జీ ప్లాన్లపైన కూడా టారిఫ్లను పెంచబోమని ప్రకటించింది. అయితే దీని వెనుక అసలు టార్గెట్ వేరే ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో ఇప్పటికీ 2జీ నెట్వర్క్ను ఉపయోగిస్తున్న 24 కోట్ల మందికిపైగా ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా, బీఎస్ఎన్ఎల్/ఎమ్టీఎన్ఎల్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఈ "సరసమైన టారిఫ్లు" ప్రకటన చేసినట్లు అర్థమవుతోంది. అంబానీల దృష్టి కూడా అదే.. జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ మాట్లాడుతూ.. కంపెనీ టారిఫ్లను నాటకీయంగా పెంచాలని భావించడం లేదని, యూజర్లు ఇంటర్నెట్-హెవీ, డేటా ప్లాన్లకు మారుతున్న నేపథ్యంలో కస్టమర్లను మరింత పెంచుకోవడంపై దృష్టి సారిస్తుందని చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీల దృష్టి కూడా అదేనని ఆయన వివరించారు. ఇదీ చదవండి: 70 hours work: ఆయనైతే 90 గంటలు పనిచేసేవారు.. భర్తకు అండగా సుధామూర్తి -
RIL: 29.7 శాతం పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం 29.7 శాతం పెరిగింది. దాంతో రూ.19,878 కోట్లు ఆర్జించినట్లు వెల్లడించింది. కంపెనీ తన సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్తోపాటు జియో, రిటైల్ వ్యాపారం మంచి పనితీరు కారణంగా కంపెనీ లాభాల్లో పయనిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ స్థూల ఆదాయం 1.2 శాతం పెరిగి రూ.2,55,996 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ డిజిటల్ విభాగమైన జియో ప్లాట్ఫామ్లు సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం 12 శాతం పెరిగి రూ.5,297 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.4,729 కోట్లుగా ఉంది. కొత్తగా చేరే సబ్స్క్రైబర్ బేస్లో 7.5 శాతం పెరుగుదల నమోదైంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ నికర లాభం 21 శాతం పెరిగి రూ.2,790 కోట్లకు చేరుకుంది. ఆదాయం 18.8 శాతం పెరిగి రూ.77,148 కోట్లుగా నిలిచింది. శుక్రవారం బీఎస్ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 1.75 శాతం పెరిగి రూ.2,265.25 వద్ద స్థిరపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ..డిసెంబర్ 2023 నాటికి దేశవ్యాప్తంగా వేగంగా 5జీ సేవలు విస్తరిస్తామన్నారు. రిలయన్స్ రిటైల్ విస్తరణను కొనసాగిస్తామని చెప్పారు. ఇంధన మార్కెట్లలో అస్థిరత ఉన్నప్పటికీ ఆయిల్2కెమికల్ విభాగానికి డిమాండ్ పెరిగిందన్నారు. -
‘జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ 2023’ తారల సందడి (ఫొటోలు)
-
దేశంలో మొదటి స్పేస్ఫైబర్ ఇంటర్నెట్ను ప్రారంభించిన జియో
న్యూఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023’ ప్రారంభం సందర్భంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ స్పేస్ఫైబర్ను ఆవిష్కరించింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సేవలను ప్రారంభించారు. దేశంలోని మొట్టమొదటి శాటిలైట్ గిగాఫైబర్ సేవల ద్వారా వినియోగదారులకు మరింత వేగంగా ఇంటర్నెట్ అందే అవకాశం ఉందని సంస్థ చైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. లక్షలాది కుటుంబాలు, వ్యాపారాలు మొదటిసారిగా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ను అనుభవించే అవకాశాన్ని జియో కల్పించిందన్నారు. జియో స్పేస్ఫైబర్తో ఇంకా కొన్ని ఇంటర్నెట్ అందని ప్రాంతాలకు సేవలందించే వెసులుబాటు ఉంటుదన్నారు. జియోస్పేస్ఫైబర్తో ఎవరైనా, ఎక్కడి నుంచైనా గిగాబిట్ యాక్సెస్తో ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ, విద్య, ఆరోగ్య, వినోదాత్మక సేవలను పొందొచ్చని ఆయన చెప్పారు. రిలయన్స్ జియో ఇప్పటికే భారత్లో 45 కోట్ల కస్టమర్లకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తోంది. దేశంలోని ప్రతి ఇంటికీ డిజిటల్ సేవలను చేరువ చేయడంలో భాగంగానే జియోఫైబర్, జియోఎయిర్ఫైబర్ వంటి సర్వీసుల సరసన జియోస్పేస్ఫైబర్ను చేర్చినట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి. తాజా శాటిలైట్ నెట్వర్క్తో జియో ట్రూ5జీ సేవలు సైతం దేశంలోని ప్రతి ప్రాంతానికి అందుతాయని కంపెనీ తెలిపింది. ప్రపంచంలో శాటిలైట్ టెక్నాలజీ(మీడియం ఎర్త్ ఆర్బిట్-ఎంఈఓ) కోసం జియో ఎస్ఈఎస్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు జియో తెలిపింది. గిగాబిట్, స్పేస్ నుంచి ఫైబర్ తరహా సేవలను అందించగల ఎంఈఓ ఉపగ్రహాల కూర్పు ఇదొక్కటేనని పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా అత్యంత కచ్చితత్వంతో ఈ అత్యాధునిక సాంకేతితతో బ్రాడ్బ్యాండ్ సేవలను అందిస్తున్న ఏకైక సంస్థగా జియో నిలుస్తుందని పేర్కొంది. జియోస్పేస్ఫైబర్ ఇప్పటికే గుజరాత్ గిర్, ఛత్తీస్గఢ్ కోర్బా, ఒడిశా నవరంగాపూర్, అసోం ఓఎన్జీసీ జోర్హట్ వంటి మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తుంది. -
ద్వారకాధీశ్ దేవాలయంలో అంబానీ పూజలు
దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ మంగళవారం గుజరాత్ రాష్ట్రంలోని దేవ్భూమి ద్వారకా జిల్లాకు చెందిన ద్వారకాధీశ్ దేవాలయాన్ని సందర్శించారు. స్వామివారి పాదాలకు నమస్కరించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఇద్దరిని శాలువాలతో సత్కరించారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సమాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతుంది. #WATCH | Gujarat | Reliance Industries Chairman, Mukesh Ambani and his son Anant Ambani offered prayers at Dwarkadhish Temple in Devbhumi Dwarka district yesterday, on 24th October. pic.twitter.com/6efbOI2zNj — ANI (@ANI) October 25, 2023 -
ఇండియాలోనే ఉత్తమ నెట్వర్క్..ఊక్లా అవార్డులు అన్నీ సంస్థకే..
దేశంలో అగ్రగామి నెట్వర్క్గా రిలయన్స్ జియో నిలిచింది. ఊక్లా సంస్థ ప్రకటించే స్పీడ్టెస్ట్లకు సంబంధించిన అవార్డులను అన్నింటినీ రిలయన్స్జియో గెలుచుకుంది. 5జీ నెట్వర్క్, మొబైల్ నెట్వర్క్ విభాగంలో మొత్తం అవార్డులను జియో గెలుపొందినట్లు ఊక్లా ఓ ప్రకటనలో తెలిపింది. ఉత్తమ, వేగవంత, టాప్ రేటెడ్ మొబైల్ నెట్వర్క్, ఉత్తమ మొబైల్ కవరేజీ, ఉత్తమ మొబైల్ వీడియో, గేమింగ్ అనుభూతి, 5జీ మొబైల్ నెట్వర్క్, 5జీ మొబైల్ వీడియో అనుభూతి, 5జీ మొబైల్ గేమింగ్ అనుభూతి అవార్డులను జియో దక్కించుకుందని తెలిపింది. ఊక్లా స్పీడ్టెస్ట్ అందించే సూచనల ద్వారా తమ సంస్థతోపాటు ఇతర సంస్థల వినియోయోగదారులకు అత్యుత్తమ సేవలను అందించేలా ప్రయత్నిస్తున్నట్లు సంస్థ సీఈఓ, ప్రెసిడెంట్ స్టీఫెన్ తెలిపారు. ఈ అవార్డులు, గుర్తింపుతో భారత్లో అత్యుత్తమ నెట్వర్క్గా జియో మారిందన్నారు. టెక్నాలజీ ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూల మార్పు తీసుకురావడంతోపాటు డిజిటల్ సమాజాన్ని సృష్టించాలన్నది జియో లక్ష్యమని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ అన్నారు. -
Jio financial services: ఇకపై రిలయన్స్ జియో డెబిట్ కార్డులు!
రిలయన్స్ జియో టారిఫ్ పరంగా టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఆ దెబ్బతో అదే రంగంలోని కొన్ని కంపెనీలు కుదేలయ్యాయి. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రత్యేకంగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి పూర్తిస్థాయి ఆర్థిక సేవలు అందించేలా సన్నద్ధమవుతుంది. రిలయన్స్ ఫైనాన్షియల్ మార్కెట్లోనూ తన సత్తా చాటాలనుకుంటోంది. పేమెంట్ విభాగం సేవింగ్స్ అకౌంట్లను, బిల్ పేమెంట్ సర్వీసులను సంస్థ రీలాంచ్ చేసింది. త్వరలో డెబిట్ కార్డులు కూడా తీసుకురావాలని భావిస్తున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ త్వరలో ఆటో, హోమ్లోన్లను కూడా జారీ చేయనుంది. ఇటీవల సంస్థ తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు కొన్ని అంశాలను వెల్లడించారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దేశవ్యాప్తంగా ఉన్న 300 స్టోర్లలో గృహ వినియోగ వస్తువులపై రుణాలను మంజూరు చేస్తోంది. ఇప్పటికే ముంబయిలోని వేతన జీవులకు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి వ్యక్తిగత రుణాలు అందిస్తుంది. త్వరలో వ్యాపారులకు సైతం రుణాలు జారీ చేస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే 24 బీమా సంస్థలతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ జతకట్టింది. తన ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ చేసేందుకు ఓ యాప్ను సైతం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ సిద్ధం చేస్తోంది. -
క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక డేటా ప్లాన్లు
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభం కావడంతో టెలికం కంపెనీలు ఎయిర్టెల్, జియో క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక ప్లాన్లను ఆవిష్కరించాయి. ► జియో రూ.328 ప్లాన్ రోజూ 1.5 జీబీ హైస్పీడ్ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మూడు నెలల డిస్నీప్లస్ హాట్స్టార్ మొబైల్ సబ్స్రి్కప్షన్ ఇందులో భాగంగా ఉంటుంది. ► జియో రూ.758 ప్లాన్లో రోజూ 1.5 జీబీ హైస్పీడ్ డేటా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులోనూ మూడు నెలల డిస్నీప్లస్ హాట్స్టార్ మొబైల్ సబ్స్రి్కప్షన్ ఉచితం. ► జియో రూ.388 ప్లాన్ రోజువారీ 2జీబీ హైస్పీడ్ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, మూడు నెలల డిస్నీహాట్ స్టార్ సబ్స్క్రిప్షన్తో ఉంటుంది. ► జియో రూ.808 ప్లాన్ రోజువారీ 2జీబీ డేటా, 84రోజుల వ్యాలిడిటీ, మూడు నెలల డిస్నీ ప్లస్ హాట్స్టార్ సబ్్రస్కిప్షన్తో వస్తుంది. ► జియో రూ.598లో 84 రోజులు, రూ.3,178 ప్లాన్లో ఏడాది పాటు డిస్నీ హాట్స్టార్ ఉచితంగా లభిస్తుంది. ► భారతీ ఎయిర్టెల్ 6జీబీ డేటా, ఒక రోజు వ్యాలిడిటీతో రూ.49 ప్లాన్ను తీసుకొచ్చింది. అలాగే, రెండు రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ డేటా ఆప్షన్తో రూ.99 ప్లాన్ను ఆవిష్కరించింది. -
ఉచితంగా ఓటీటీ సబ్స్క్రిప్షన్లు.. అదిరిపోయే జియో కొత్త ప్లాన్స్
రిలయన్స్ జియో మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్లు ఒక సంవత్సరం వ్యాలిడిటీతో వస్తాయి. అపరిమిత కాలింగ్, డేటా అలాగే సోనీ లివ్ (SonyLiv), జీ5 (Zee5) కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ను అందిస్తాయి. రూ. 3662 ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత కాలింగ్, రోజుకు 2.5 GB డేటా, అపరిమిత 5G డేటా, రోజుకు 100 SMSలతో వస్తుంది. ఈ ప్లాన్లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్తో పాటు సోనీలివ్, జీ5 సబ్స్క్రిప్షన్లు ఉచితంగా వస్తాయి. 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రూ. 3226 ప్లాన్: ఈ ప్లాన్లో అపరిమిత కాలింగ్, 5G డేటాతో పాటు 2GB రోజువారీ 4G డేటా, రోజుకు 100 SMSలు ఉంటాయి. జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్తో పాటు సోనీలివ్, జీ5 సబ్స్క్రిప్షన్లు జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్తో పాటు సోనీలివ్ సబ్స్క్రిప్షన్లు ఇతర ప్రయోజనాలు. రూ. 3225 ప్లాన్: ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్, 5G డేటాతో పాటు 2GB రోజువారీ 4G డేటా కోటా, రోజుకు 100 SMS వంటి ప్రయోజనాలు ఉంటాయి. జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్తో పాటు ఈ ప్లాన్లో జీ5 సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఇక ఓటీటీ సబ్స్క్రిప్షన్లు వద్దనుకున్నవారికి తక్కువ ధరకు మరో వార్షిక ప్లాన్ అందుబాటులో ఉంది. అదే రూ. 1,999 ప్లాన్. ఇది అపరిమిత 5G డేటా, కాలింగ్తో వస్తుంది. వీటితో పాటు 2.5GB రోజువారీ 4G డేటా, రోజుకు 100 SMS కూడా అందిస్తుంది. ఈ ప్లాన్లో థర్డ్-పార్టీ ఓటీటీ ప్రయోజనాలేవీ లేవు కానీ ఇందులో జియో యాప్లు, సేవలకు యాక్సెస్ ఉంటుంది. -
‘జియో ఎయిర్ఫైబర్’ కొత్త వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్.. పనితీరు, ధర ఎంతంటే?
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సెప్టెంబర్ 19న వైర్లెస్ ఇంట్నెట్ సర్వీస్ జియో ఎయిర్ఫైబర్ ప్రారంభించనుంది. ఇళ్లు, ఆఫీసుల్లో వినియోగించేలా పోర్ట్బుల్ వైర్లెస్ ఇంట్నెట్ 1.5 జీబీపీఎస్ వేగంతో పనిచేస్తుంది. తద్వారా యూజర్లు ఎలాంటి అంతరాయం లేకుండా వీడియోలు వీక్షించడం, ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవడంతో పాటు వీడియో కాన్ఫరెన్స్లను నిర్వహించుకోవచ్చని రిలయన్స్ 46వ సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. సెప్టెంబర్ 19 వినాయక చవితి సందర్భంగా అందుబాటులోకి రానున్న ఈ జియో ఎయిర్ఫైబర్ను తల్లిదండ్రులు నియంత్రించొచ్చు. వైఫై 6కి సపోర్ట్ చేయడంతో పాటు ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫైర్వాల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. జియో ఎయిర్ఫైబర్ అంటే ఏమిటి జియో ఎయిర్ఫైబర్ అనేది జియో నుండి వచ్చిన కొత్త వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్. ఇది హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి 5జీని ఉపయోగిస్తుంది. సాంప్రదాయ ఫైబర్-ఆప్టిక్ కనెక్షన్లతో పోలిస్తే దీని స్పీడ్ ఎక్కువ. వినియోగదారులు గరిష్టంగా 1 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. జియో ఎయిర్ఫైబర్ కాంపాక్ట్ మాత్రమే కాకుండా సెటప్ చేయడం చాలా సులభమని జియో పేర్కొంది. దీన్ని ప్లగ్ ఇన్ చేసి, ఆన్ చేస్తే సరిపోతుంది. దీంతో వైఫై హాట్ స్పాట్, 5జీతో అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతుంది. జియో ఎయిర్ఫైబర్తో ఇల్లు లేదా ఆఫీస్లో గిగాబిట్-స్పీడ్ ఇంటర్నెట్కు త్వరగా కనెక్ట్ చేయడం సులభం’ అని జియో ఓ ప్రకటనలో పేర్కొంది. జియో ఎయిర్ఫైబర్ వర్సెస్ జియో ఫైబర్ టెక్నాలజీ: జియో ఫైబర్ దాని కవరేజ్ కోసం వైర్డు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ను ఉపయోగిస్తుంది. అయితే జియో ఎయిర్ఫైబర్ మాత్రం పాయింట్-టు-పాయింట్ రేడియో లింక్లను ఉపయోగించి వైర్లెస్ ఇంటర్నెట్ను అందిస్తుంది. అంటే జియో ఎయిర్ఫైబర్ గృహాలు, కార్యాలయాలను నేరుగా జియోకి వైర్లెస్ సిగ్నల్స్ ద్వారా అనుసంధానిస్తుంది. తద్వారా ఫైబర్ కేబుల్స్ వల్ల తలెత్తే ఇబ్బందుల గట్టెక్కొచ్చు. స్పీడ్: జియో ఎయిర్ఫైబర్ గరిష్టంగా 1.5 Gbps ఇంటర్నెట్ స్పీడ్ను అందిస్తుంది. ఇది జియో ఫైబర్ 1జీబీపీఎస్ను మాత్రమే అందిస్తుంది. అయితే, జియో ఎయిర్ఫైబర్ స్పీడ్ స్థానికంగా ఉండే టవర్ల ఆధారంగా మారుతుందని గమనించాలి. కవరేజ్: జియో ఫైబర్, విస్తృత కవరేజీని అందిస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా అందుబాటులో లేదు. జియో ఎయిర్ఫైబర్ వైర్లెస్ టెక్నాలజీ సాయంతో విస్తృతమైన కవరేజీని అందింస్తుంది. ఇన్స్టాలేషన్: జియో ఎయిర్ఫైబర్ ప్లగ్-అండ్-ప్లే చేయడానికి రూపొందించబడింది.యూజర్ ఫ్రెండ్లీ, కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. జియో ఫైబర్కు సాధారణంగా ప్రొఫెషనల్ ఇన్స్టాలేషన్ అవసరం. ధర: జియో ఎయిర్ఫైబర్ ధర దాదాపు రూ. 6,000. జియో ఎయిర్ఫైబర్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కంటే ఖరీదైంది. ఎందుకంటే ఇందులో పోర్టబుల్ డివైజ్ ఉంటుంది. చదవండి👉🏻 గూగుల్కు బిగ్ షాక్ -
జియో బంపరాఫర్, ఉచితంగా నెట్ఫ్లిక్స్ చూడొచ్చు.. ఫుడ్ ఐటమ్స్ తినొచ్చు
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ఆ సంస్థ 7వ వార్షికోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన యూజర్లకు ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తున్నట్లు అధికారికంగా తెలిపింది. ఇందులో భాగంగా రూ.299 ప్లాన్లో 7జీబీ డేటా,రూ.749 ప్లాన్లో 14జీబీ, రూ.2999 ప్లాన్లో 21 జీబీ డేటాను అదనంగా ఇస్తుంది. వీటితో పాటు ఉచితంగా నెట్ఫ్లిక్స్ వీక్షించే అవకాశం కల్పించడంతో పాటు.. నిబంధనలకు అనుగుణంగా మెక్డొనాల్డ్స్లో ఫుడ్ ఐటమ్స్ను ఫ్రీగా తినొచ్చు. రూ.299 ప్లాన్ రూ.299 ప్లాన్లో జియో కస్టమర్లు ప్రతిరోజు 2జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లతో పాటు రోజువారీ 2జీబీ డేటాను అందిస్తుంది. ప్రత్యేకంగా జియో ప్రీపెయిడ్ ప్లాన్లో జియో వార్షికోత్సవ ఆఫర్లో అదనంగా 7జీబీ డేటా కూడా ఉంది. ఈ ప్లాన్కి 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. రూ.749 ప్లాన్ రూ. 749 జియో ప్రీపెయిడ్ ప్లాన్లో ప్రతి రోజు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. కస్టమర్లు అదనంగా 14జీబీ డేటాను అందుకుంటారు. 90 రోజుల వ్యాలిడిటీతో 7జీబీ డేటాను రెండు సార్లుగా పొందవచ్చు. రూ.2,999 ప్లాన్ రూ.2,999 ప్లాన్లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజు 100 ఎస్ఎంఎస్లు, 2.5జీబీ డేటాను అందిస్తుండగా..ప్రత్యేక ఆఫర్లో భాగంగా కస్టమర్లు అదనంగా 21జీబీ డేటాను అందుకుంటారు. మూడు సార్లు 7జీబీ డేటాను జియో కూపన్ల రూపంలో అందిస్తుంది. కాగా, కొత్త జియో వార్షికోత్సవ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఇది కాకుండా అజియోపై 200 తగ్గింపు, నెట్మెడ్స్పై 20శాతం వరకు తగ్గింపు (రూ. 800 వరకు), స్విగ్గీలో రూ.100 తగ్గింపు, రిలయన్స్ డిజిటల్లో 10 శాతం తగ్గింపు పొందవచ్చు.తరచుగా ప్రయాణం చేసే వారికి విమానా ఛార్జీలలో రూ.1500, హోటళ్లపై 15 శాతం తగ్గింపు, ట్రావెల్ ఏజెన్సీ వెబ్పోర్టల్ యాత్రలో ఏదైనా హోటల్స్ను బుక్ చేసుకుంటే రూ. 4000 వరకు డిస్కౌంట్, భోజన ప్రియులైతే రూ.149 కంటే ఎక్కువ ధర ఉన్న ఫుడ్ ఐటమ్స్ను ఫ్రీగా తినే అవకాశాన్ని జియో కల్పించింది. జియో ప్రీపెయిడ్ నెట్ఫ్లిక్స్ బండిల్ రూ.1099 ప్లాన్ - 84 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాలింగ్తో పాటు 2జీబీ డేటాను పొందవచ్చు. అయితే, 5జియో వెల్కమ్ ఆఫర్లో 5జీ నెట్వర్క్ సపోర్ట్ చేసే మొబైల్పై అన్లిమిటెడ్ 5జీ డేటాను పొందవచ్చు. ఇక ఇదే ప్లాన్లో నెట్ఫ్లిక్స్ను మీ స్మార్ట్ఫోన్లలో 480pలో కంటెంట్ను వీక్షించవచ్చు. 1499 ప్లాన్ - ఈ ప్లాన్లో బేసిక్ నెట్ఫ్లిక్స్ ఆఫర్స్ సొంతం చేసుకోవచ్చు. మొబైల్స్, ట్యాబ్స్ ,ల్యాప్టాప్లు, టీవీలలో 720పీలో చూడొచ్చు.నెట్ఫ్లిక్స్ బండిల్తో పాటు, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజువారీ 3జీబీ డేటాను సైతం సొంతం చేసుకోవచ్చని జియో ప్రతినిధులు చెబుతున్నారు. -
జియో వినియోగదారులకు ముఖేష్ అంబానీ శుభవార్త!
జియో వినియోగదారులకు రిలయన్స్ శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 19న వినాయక చవితి సందర్భంగా ఎయిర్ఫైబర్ను ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ అధికారికంగా ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా జియో ఎయిర్ఫైబర్, జియో 5జీ గురించి కీలక ప్రకటన చేశారు. జియో ఎయిర్ఫైబర్ ఎలా పనిచేస్తుందంటే? జియో ఎయిర్ఫైబర్ డివైజ్ సాయంతో వైఫై తరహాలో ఎటువంటి వైర్లు లేకుండా ఇంట్లో 5జీ ఇంటర్నెట్, హాట్స్పాట్ వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఎయిర్ఫైబర్ డివైజ్ను ఆఫ్, ఆన్ చేస్తే సరిపోతుంది. సులభంగా, వేగంగా ఇంట్లో, ఆఫీస్లో గిగాబైట్ (సెకనుకు వెయ్యి మెగాబైట్స్) స్పీడ్ ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చు. ఫైబర్ ఆప్టికల్స్ వర్సెస్ జియో ఎయిర్ఫైబర్ సాధారణంగా బ్రాండ్ బ్యాండ్ సేవలు ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారా అందిస్తారు. ఈ సేవలను పొందాలంటే వైర్తో పాటు, మోడెమ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. జియో ఎయిర్ఫైబర్ విషయానికొచ్చేసరికి దీనికి కేబుల్స్తో పనిలేదు. ఇదో సింగిల్ డివైజ్. దగ్గర్లోని జియో టవర్స్ నుంచి వీటికి సిగ్నల్స్ అందుతాయి. గత ఏడాది ఎయిర్ఫైబర్ గురించి జియో వీడియో ప్రజెంటేషన్ ఇచ్చింది. అందులో ఇంట్లో జియోఫైబర్తో పిల్లలు వినియోగించే యాప్స్, వెబ్సైట్స్ను కుటుంబసభ్యులు కంట్రోల్ చేయొచ్చు. సంబంధిత వెబ్సైట్లను, యాప్స్ను ఎలాంటి టెక్నీషియన్ అవసరం లేకుండా బ్లాక్ చేసే సౌలభ్యం ఉన్నట్లు పేర్కొంది. 5జీ నెట్వర్క్తో 1.5జీబీపీఎస్ స్పీడ్ పొందవచ్చని తెలిపింది. జియో ఎయిర్ఫైబర్ ధర గత ఏడాది అక్టోబర్లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC)లో 5జీ నెట్వర్క్తో పాటు జియో ఎయిర్ ఫైబర్ డివైజ్ గురించి ప్రస్తావించింది. తాజాగా ఆ డివైజ్ను ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. పలు నివేదికలు.. జియో ఎయిర్ఫైబర్ ధర ఎంత ఉంటుందో ఓ అంచనా వేశాయి. వాటి ఆధారంగా పోర్టబుల్ రూటర్లను (జియోఫై ఎం2ఎస్) రూ. 2,800కి, మెష్ ఎక్స్టెండర్ (వైఫై ధర రూ. 2,499), జియో ఎక్స్టెండర్ 6 మెష్ వైఫై సిస్టం ధర రూ. 9,999గా నిర్ణయించింది. ఇప్పుడు ఈ సరి కొత్త వైర్లెస్ రూటర్ ధర రూ. 10,000 ఉంటుందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి. జియో ఎయిర్ ఫైబర్ ధర ఎంతనేది అధికారంగా వెల్లడించాల్సి ఉంటుంది. -
ఎయిర్టెల్కి షాకిచ్చిన జియో.. పాపం వొడాఫోన్ ఐడియా!
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం యూజర్ల సంఖ్య జూన్లో స్వల్పంగా పెరిగి 117.38 కోట్లకు చేరింది. రిలయన్స్ జియోకి 22.7 లక్షల మంది, భారతీ ఎయిర్టెల్కు 14 లక్షల మంది యూజర్లు కొత్తగా జతయ్యారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం మే ఆఖరు నాటికి టెలిఫోన్ సబ్స్క్రయిబర్స్ సంఖ్య 117.25 కోట్లుగా ఉంది. మరోవైపు, వొడాఫోన్ ఐడియా (వీఐఎల్), ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ యూజర్లు తగ్గారు. బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రయిబర్స్ 18.7 లక్షల మంది, వీఐఎల్ 12.8 లక్షల మంది, ఎంటీఎన్ఎల్ 1.52 లక్షల మంది యూజర్లను కోల్పోయాయి. జియో 2.08 లక్షలు, భారతీ ఎయిర్టెల్ 1.34 లక్షలు, వీ–కాన్ మొబైల్ అండ్ ఇన్ఫ్రా 13,100 కలెక్షన్లు నమోదు చేసుకున్నాయి. -
చంద్రయాన్-3 విజయం, భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు?
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ సత్తా చాటుతోంది. దీంతో మరో సారి భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలపై చర్చ ప్రారంభమైంది. ఈ తరుణంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారతీయులకు శుభవార్త చెప్పనున్నారు. త్వరలో దేశీయంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించనున్నారు. ఇందుకోసం భారత్ నుంచి అనుమతులు తీసుకోనున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, మస్క్కు చెందిన స్టార్లింక్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 32 దేశాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తుంది. అయితే, గతంలో స్టార్లింక్ భారత్లో శాటిలైట్ సేవల్ని అందించేందుకు సిద్ధమయ్యింది. కానీ పలు కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా, సెప్టెంబర్ 20న స్టార్లింక్ ప్రతినిధులు భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం దేశీయ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ (డాట్) విభాగం అధికారులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే అనుమతులు తీసుకోన్నట్లు నివేదికలు తెలిపాయి. ఈ సందర్భంగా స్టార్లింక్ భారత్లో గ్లోబుల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాలిలైట్ (జీఎంపీసీఎస్) లైసెన్స్ తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. స్టార్లింక్తో పాటు ఎయిర్టెల్ ఇక, భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ను అందించే సంస్థల జాబితాలో స్టార్లింక్తోపాటు ఎయిర్టెల్, జియోలు పోటీ పడుతున్నాయి. ఎయిర్ టెల్ వన్ వెబ్, జియో.. జియో స్పేస్ టెక్నాలజీలు ఉపగ్రహ ఇంటర్నెట్పై పనిచేస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు సైతం జీఎంపీసీఎస్ లైసెన్స్ తీసుకున్నాయి. చదవండి👉 భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ పోటీ.. ముఖేష్ అంబానీ - ఎలాన్ మస్క్లలో ఎవరి మాట నెగ్గుతుందో? -
ఎదురుచూపులకు ఫుల్స్టాప్.. జియో ఫైనాన్స్ లిస్టింగ్ ఎప్పటినుంచంటే?
ముంబై: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి విడివడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్(జేఎఫ్ఎస్ఎల్) స్టాక్ ఎక్సే్ఛంజీలలో సోమవారం(21న) లిస్ట్కానుంది. జియోఫిన్ పేరుతో టీ గ్రూప్లో షేర్లు లిస్ట్కానున్నట్లు బీఎస్ఈ తాజాగా పేర్కొంది. ఫైనాన్షియల్ సర్వీసుల విభాగాన్ని(రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్) గత నెలలో రిలయన్స్ ప్రత్యేక కంపెనీగా విడదీసింది. దీంతో షేరు ధరను నిర్ధారించే బాటలో డమ్మీ టికర్తో మూడు రోజులపాటు బీఎస్ఈ ట్రేడింగ్కు వీలు కల్పించింది కూడా. దాదాపు రూ. 262 ధర వద్ద జియో ఫైనాన్షియల్ స్థిరపడిన సంగతి తెలిసిందే. కంపెనీ మార్కెట్ క్యాప్(విలువ) రూ. 1.66 లక్షల కోట్లు(20.3 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. వెరసి దేశీయంగా బజాజ్ ఫైనాన్స్ తదుపరి రెండో పెద్ద ఎన్బీఎఫ్సీగా నిలవనుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో వచ్చే వారం నుంచి ట్రేడింగ్ షురూ కానుంది. ట్రేడ్ ఫర్ ట్రేడ్ విభాగంలో 10 రోజులపాటు కంపెనీ లిస్ట్కానున్నట్లు బీఎస్ఈ తాజాగా వెల్లడించింది. జేఎఫ్ఎస్ఎల్ షేర్లను గత వారం తమ వాటాదారులకు రిలయన్స్ కేటాయించింది. వివిధ ఫైనాన్షియల్ సర్వీస్ సొల్యూషన్లు అందిస్తున్న జేఎఫ్ఎస్ఎల్ బీమా, డిజిటల్ చెల్లింపులు, అసెట్ మేనేజ్మెంట్ విభాగాలలో కార్యకలాపాలు విస్తరించనుంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏర్పాటుకు గత నెలలో అసెట్ మేనేజ్మెంట్ దిగ్గజం బ్లాక్రాక్తో చేతులు కలిపింది. -
ఇదే తొలిసారి.. రిలయన్స్ జియో యూజర్లకు బంపరాఫర్!
యూజర్లకు జియో శుభవార్త చెప్పింది. తొలిసారి నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రకటించింది. జియో యూజర్లు నెట్ఫ్లిక్స్ను వీక్షించేలా రెండు ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. తొలి రూ.1,099 ప్లాన్లో 84 రోజుల వ్యాలిడిటీ నెలకు రూ. 149 విలువైన నెట్ఫ్లిక్స్ (మొబైల్) ప్లాన్ను అందిస్తుంది. దీంతో పాటు జియో వెల్కమ్ ఆఫర్తో అపరిమిత 5జీ డేటా, 2జీబీ/రోజు డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ మాట్లాడవచ్చు. రెండో ప్లాన్లో 84 వ్యాలిడిటీతో రూ.1,499 చెల్లించవచ్చు. ప్రీపెయిడ్ ప్లాన్ నెలకు రూ. 199 విలువైన నెట్ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ను వినియోగించుకోవచ్చు. జియో వెల్కమ్ ఆఫర్ కింద ప్రతి రోజూ 3జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్తో యూజర్ అపరిమిత 5జీ డేటాను సొంతం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా జియో ప్లాట్ఫారమ్ సీఈవో కిరణ్ థామస్ మాట్లాడుతూ.. “వినియోగదారులకు ప్రపంచ స్థాయి సేవల్ని అందించేందుకు కట్టుబడి ఉన్నాం. మా ప్రీపెయిడ్ ప్లాన్తో నెట్ఫ్లిక్స్ బండిల్ను వినియోగదారులకు అందించేందుకు మరో అడుగు ముందుకు వేశాం. నెట్ఫ్లిక్స్ లాంటి గ్లోబల్ పార్టనర్లతో చేతులు కలపడం సంతోషంగా ఉందని అన్నారు. చదవండి👉 ఆ వార్తల్లో వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన రిలయన్స్ -
జియో 5జీ @ 2 జీబీపీఎస్.. న్యూ బ్యాండ్, హై స్పీడ్!
న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ సర్వీసులను 26 గిగాహెట్జ్ మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్లో ఆవిష్కరించినట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వెల్లడించింది. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో 2 జీబీపీఎస్ (సెకనుకు గిగాబిట్స్) స్పీడ్ను సాధించినట్లు తెలిపింది. దీనితో దేశవ్యాప్తంగా మొత్తం 22 టెలికం సర్కిళ్లలోని జియో కస్టమర్లు .. 26 గిగాహెట్జ్ వేవ్ అధారిత బిజినెస్ కనెక్టివిటీని పొందుతున్నారని జియో వివరించింది. దాదాపు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా, పూర్తి సామర్ధ్యంలో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించేందుకు మిల్లీమీటర్ వేవ్ ఉపయోగపడగలదని తెలిపింది. తమకు నిర్దేశించిన గడువులోగానే 22 టెలికం సర్కిళ్లలో కనీస స్థాయిలో సర్వీసులను ప్రారంభించాలన్న నిబంధనను అమలు చేయగలిగినట్లు జియో తెలిపింది. 5జీని అత్యంత వేగంగా అందుబాటులోకి తెచ్చిన సందర్భాల్లో ఇది కూడా ఒకటని వివరించింది. -
జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. సూపర్ ప్లాన్ అంటే ఇదే, రూ.6వేల వరకు బెనిఫిట్స్ కూడా!
కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇవి పండుగల లాంటి సమయాల్లో వీటి డోస్ మరింత పెంచుతూ పోతుంటాయి. తాజాగా రిలయన్స్ సంస్థ స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా తన కస్టమర్ల కోసం అదిరిపోయే కొత్త ప్లాన్ని తీసుకొచ్చింది. లాంగ్ టర్న్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్లాన్పై ఓ లుక్కేస్తే.. రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ కింద రూ.2,999తో ఏడాది వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈ ప్లాన్ లో భాగంగా దాదాపు రూ.5000 వరకు విలువైన కూపన్లను జియో తన కస్టమర్ల కోసం జత చేసింది. కాలింగ్, డేటాతో పాటు, Jio నుంచి అనేక రకాల ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇందులో ప్రముఖ ఫుడ్ డెలివరీ, ట్రావెల్, ఆన్లైన్ షాపింగ్తో పాటు మరిన్నింటిపై తగ్గింపులు కూడా ఉన్నట్లు వెల్లడించింది. ఈ ప్లాన్లో ఏమున్నాయంటే.. వినియోగదారులు రోజుకు 2.5GB డేటా, అపరిమిత వాయిస్ కాల్ ప్రయోజనాలు, 365 రోజుల పాటు రోజుకు 100 SMSలను పొందుతారు. వినియోగదారులకు మొత్తం 912.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్యాక్ వినియోగదారులకు 5G డేటాను కూడా అందిస్తుంది. వీటితో పాటు రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ విలువైన స్విగ్గీ ఆర్డర్లపై రూ. 100 తగ్గింపు, అలాగే యాత్ర ద్వారా బుక్ చేసుకున్న విమానాలపై రూ. 1,500 వరకు పొదుపు పొందే అవకాశం ఉంది. దేశీయ హోటల్ బుకింగ్లపై 15 శాతం తగ్గింపు (రూ. 4,000 వరకు) పొందవచ్చు. Ajioలో ఎంపిక చేసిన ఉత్పత్తుల కోసం రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆర్డర్లపై రూ. 200 తగ్గింపు కూడా ఉంది. నెట్మెడ్స్లో అదనపు NMS సూపర్క్యాష్తో పాటు రూ. 999 కంటే ఎక్కువ ఆర్డర్లపై 20 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు. అంతేకాకుండా, ఈ ఆఫర్ నిర్దిష్ట ఆడియో ఉత్పత్తులు, రిలయన్స్ డిజిటల్ నుంచి కొనుగోలు చేసిన దేశీయ ఉపకరణాలపై ఫ్లాట్ 10 శాతం తగ్గింపును అందిస్తుంది. ఇలా దాదాపు ఈ ప్యాక్తో రూ.6000 అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. చదవండి: China Company: భారీ నష్టాల్లో చైనా కంపెనీ.. అదే జరిగితే 70 వేల మంది ఉద్యోగాలు పోతాయ్! -
ఆ వార్తల్లో వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన రిలయన్స్
ఆన్లైన్ మిల్క్, గ్రోసరి డెలివరీ సంస్థ మిల్క్బాస్కెట్ ఉద్యోగుల్ని తొలగించనుందంటూ వస్తున్న నివేదికలపై ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ స్పందించింది. గ్రోసరీ డెలివరీ సంస్థలో ఉద్యోగుల్ని తొలగించడం లేదని స్పష్టం చేసింది. రియలన్స్ సంస్థ 2021లో మిల్క్ బాస్కెట్ను 40 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే, వ్యాపార విస్తరణలో భాగంగా రిలయన్స్ సంస్థ ఈ మిల్క్ బాస్కెట్ను తన రీటైల్ సంస్థ జియో మార్ట్లో కలపనుందని పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. ఇంటిగ్రేట్లో భాగంగా గ్రోసరీ డెలివరీకి చెందిన ఉద్యోగుల స్థానాల్ని పునర్వ్యవస్థీకరించనున్నట్లు మిల్క్ బిస్కెట్ ప్రతినిధి తెలిపారు. అంతే తప్పా ఉద్యోగుల్ని తొలగించడం లేదని అన్నారు. లేఆఫ్స్పై వస్తున్న నివేదికల్ని కొట్టి పారేశారు. ఈ సందర్భంగా ‘మిల్క్ బిస్కెట్ ప్రస్తుతం, 24 నగరాల్లో కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. టైర్-1 సిటీల్లో డైలీ సబ్స్క్రిప్షన్ సర్వీసుల్ని అందించడమే తమ లక్ష్యమని’ పేర్కొన్నారు. ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం, రిలయన్స్ మిల్క్బాస్కెట్ బ్రాండింగ్ను రీటైల్ విభాగంలో కలిపేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, కొంత కాలం మిల్క్బాస్కెట్ బ్రాండ్గా కొనసాగనుంది. మిల్క్ బాస్కెట్ను విడిచి పెట్టిన ఇటీల మిల్క్ బాస్కెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యతీష్ తల్వాడియా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభినవ్ ఇమండీ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గౌరవ్ శ్రీవాస్తవ కంపెనీని విడిచిపెట్టారు. సంస్థను విడిచిపెట్టిన చివరి కోఫౌండర్ తల్వాడియా కాగా, ఇతర సహ వ్యవస్థాపకులు ఆశిష్ గోయెల్, అనురాగ్ జైన్, అనంత్ గోయెల్లు 2021లో ఆ సంస్థను రియలన్స్ కొనుగోలు చేసిన తర్వాత నిష్క్రమించారు. కాగా, మిల్క్ బాస్కెట్లో మొత్తం 600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
అదిరే ఫీచర్లతో జియో కొత్త ల్యాప్ టాప్..ధర ఇంత తక్కువా!
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లకు శుభవార్త చెప్పింది. అతి తక్కువ ధరకే జులై 31న జియోబుక్ పేరుతో ల్యాప్ టాప్ను మార్కెట్లో విడుదల చేయనుంది. జియో తొలిసారి 2022 అక్టోబర్లో తొలి జియో బుక్ ల్యాప్ టాప్ను యూజర్లకు పరిచయం చేసింది. ఆ ల్యాప్ట్యాప్ బరువు 990 గ్రాములు ఉండగా.. త్వరలో విడుదల చేయనున్న జియో బుక్ బరువు 1.2 కేజీలు ఉండడం గమనార్హం. పలు నివేదికల ప్రకారం.. కొత్త జియో బుక్ ల్యాప్ టాప్ ఆక్టోబర్ ప్రాసెరస్తో పనిచేయనుంది. 4జీ కనెక్టివిటీతో బ్యాటరీ లైమ్ టైమ్ 24 గంటలు పనిచేయనుంది. జియోఓస్తో పనిచేసే ఈ బడ్జెట్ ల్యాప్ టాప్లో జియోమార్ట్, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ వంటి యాప్స్ ప్రీలోడ్తో రానున్నాయి. ఇక కల్సర్ విషయానికొస్తే జియోబుక్ బ్లూ, గ్రే రెండు కలర్లలో లభ్యం కానుంది. దీని ధర రూ.20,000గా ఉంది. గత ఏడాది విడుదల చేసిన జియోబుక్ ఫస్ట్ జనరేషన్ ల్యాప్ టాప్ ధర రూ.15,777గా ఉంది. -
ఆర్ఐఎల్ కౌంటర్లో ప్రత్యేక ట్రేడింగ్
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్చేంజి దిగ్గజం ఎన్ఎస్ఈ.. ప్రయివేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) కౌంటర్లో ప్రత్యేక ట్రేడింగ్కు తెరతీస్తోంది. ఫైనాన్షియల్ సర్వి సెస్ బిజినెస్ను రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేక కంపెనీగా ఆర్ఐఎల్ విడదీయనుంది. తదుపరి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్గా మార్పు చేయనుంది. దీనిలో భాగంగా ఆర్ఐఎల్ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ షేరుకూ ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరును కేటాయించనుంది. ఇందుకు రికార్డ్ డేట్ జూలై 20కాగా.. అదే రోజు కొత్తవిధానంలో ప్రత్యేక ప్రీఓపెన్ సెషన్ను ఎన్ఎస్ఈ నిర్వహించనుంది. దీని ప్రకారం నిఫ్టీ ఇండెక్స్లో ఆర్ఐఎల్ కొనసాగనుంది. 19 ఇండెక్సులలో..: జియో ఫైనాన్షియల్ను తాత్కాలికంగా నిఫ్టీ–50లో కొనసాగించడంతోపాటు.. 19 ఇండెక్సులలో చోటు కల్పించనుంది. దీంతో జూలై 20 నుంచి కనీసం మూడు రోజులపాటు నిఫ్టీకి తాత్కాలికంగా 51 షేర్లు ప్రాతినిధ్యం వహించనున్నాయి. జియో ఫైనాన్షియల్ లిస్టయిన రోజు నుంచి మూడు రోజులు( ఖీ+3) పూర్తయ్యాక ఇండెక్సుల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఇదంతా నిఫ్టీ ఇండెక్సుల కొత్త విధానం ప్రకారం ఎన్ఎస్ఈ చేపట్టనుంది. ఏప్రిల్లో ఎన్ఎస్ఈ ఇండైసెస్ లిమిటెడ్ కొన్ని సవరణల ద్వారా కొత్త విధానానికి తెరతీసింది. కంపెనీల విడదీతసహా కార్పొరేట్ చర్యలకు అనుగుణంగా తాజా విధానానికి రూపకల్పన చేసినట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. దీనిలో భాగంగా ఎన్ఎస్ఈ ప్రత్యేక ప్రీఓపెన్ సెషన్ను నిర్వహిస్తే నిఫ్టీలో విడదీత కంపెనీకి చోటు కల్పించవచ్చు. రికార్డ్ డేట్ ఎఫెక్ట్.. అనుబంధ సంస్థ జియో ఫైనాన్షియల్ సర్వి సెస్ విడదీతకు రికార్డ్ డేట్ జూలై 20 కాగా.. 19 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేసిన వాటాదారులకు జియో ఫైనాన్షియల్ షేర్లు పొందేందుకు వీలుంటుంది. ఇక గురువారం (20న) ఎన్ఎస్ఈ రెగ్యులర్ ట్రేడింగ్ కంటే ముందుగా ప్రత్యేక ప్రీ–ఓపెన్ సెషన్ను నిర్వహిస్తోంది. ఉదయం 9–10 మధ్య జియో ఫైనాన్షియల్ షేరు ధర నిర్ణయానికి ఇది సహకరించనున్నట్లు ఎన్ఎస్ఈ పేర్కొంది. దీనికి సంబంధించి బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ ఇచ్చిన ఉదాహరణను చూద్దాం.. 19న (టీ–1) ఆర్ఐఎల్ ముగింపు ధర రూ. 2,800 అనుకుంటే.. 20న రూ. 2,600 ధర పలికిందనుకుందాం.. వెరసి జియో ఫైనాన్షియల్ షేరు ధరను రూ. 200గా పేర్కొనవచ్చు. -
జియోకి పోటీగా ఎయిర్టెల్, అతి తక్కువ ధరకే 4జీ స్మార్ట్ఫోన్..
దేశీయ టెలికాం రంగంలో దిగ్గజ సంస్థలైన ఎయిర్టెల్, జియోల మధ్య పోటీ నెలకొంది. ఇతర టెలికాం కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని, కొత్త యూజర్లను రాబట్టుకునేందుకు జియో, ఎయిర్టెల్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రిలయన్స్ జియో అతి తక్కువ ధర (రూ.999)కే 4జీ ఫోన్ను యూజర్లకు అందించింది. ఇందుకోసం కార్బన్ కంపెనీతో జతకట్టింది. జులై 7 నుంచే ఈ ఫోన్ అమ్మకాలు సైతం ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో మరో టెలికం కంపెనీ ఎయిర్టెల్ మొబైల్ తయారీ సంస్థ పోకోతో ఒప్పందం కుదర్చుకుంది. ఈ మేరకు, ఎయిర్టెల్ కస్టమర్ల కోసం ఎక్స్క్లూజివ్గా పోకో సీ51 ను అందుబాటులోకి తెచ్చింది. జులై 18 నుంచి ఫ్లిప్కార్ట్లో రూ.5,999కే సేల్స్ ప్రారంభం కానున్నాయి. ♦ పోకో సీ51లో 6.52 అంగుళాల హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్,120 హెచ్జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, స్మూత్ అండ్ రెస్పాన్సీవ్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్, ♦ మూమెమ్స్ను క్యాప్చర్ చేసేందుకు 8 ఎంపీ ఏఐ డ్యూయల్ రేర్ కెమెరా, సెల్ఫీల కోసం 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రానుంది. ♦ పనితీరు బాగుండేందుకు ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియా జీ 36 ఎస్ఓఎస్తో వస్తుంది. ♦ యాప్స్, మీడియా, ఫైల్స్ స్టోరేజ్కోసం 4జీబీ ఇంటర్నల్ స్టోర్జ్ను అందిస్తుంది. ♦ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రోజంతా వినియోగించుకోవచ్చు. 10డబ్ల్యూ ఛార్జింగ్కు సపోర్ట్ ఇస్తుంది. ♦ ఫింగర్ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం హెడ్ఫోన్ జాక్, బ్లూటూత్ 5.0, 2.4జీహెచ్జెడ్ వైఫై వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. ♦ పవర్ బ్లాక్, రాయల్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇక ఈ ఫోన్ కొనుగోలు చేసిన ఎయిర్టెల్ కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ఇప్పటికే ఎయిర్టెల్ కస్టమర్లుగా ఉన్నవారు, కొత్తగా ఎయిర్టెల్ నెట్వర్క్లోకి పోర్ట్ అవ్వాలనుకునే వారు ఈ మొబైల్ను కొనుగోలుపై పలు ఆఫర్లు అందిస్తుంది. ఫోన్ కొనుగోలు చేసిన యూజర్లు 18 నెలల పాటు ఎయిర్టెల్ నెట్వర్క్కు లాక్ అయ్యి ఉంటుంది. ఆ సమయంలో నెలకు రూ.199 చొప్పున ఏ ప్లాన్ అన్లిమిటెడ్ ప్లాన్తోనైనా రీఛార్జి చేసుకోవచ్చు. 18 నెలల తర్వాత ఇతర నెట్వర్క్ సిమ్ను వినియోగించుకోవచ్చు. దీంతో పాటు 50జీబీ డేటా ఉచితం. 10 జీబీ చొప్పున మొత్తం 5 కూపన్లు ఐదు నెలల పాటు లభించనున్నట్లు సంయుక్తంగా విడుదల చేసిన ఎయిర్టెల్ -పోకో’ల ప్రకటనలో తెలిపాయి. జియో ఫోన్ ఎంతంటే? ప్రపంచం 5జీ వైపు అడుగులు వేస్తుండగా, భారత దేశంలో 25కోట్ల మంది వినియోగదారులు ఇప్పటికీ 2జీని వినియోగిస్తున్నారు. వారందరి కోసం మార్కెట్లోనే అత్యంత చౌకైన ఇంటర్నెట్ ఫోన్ జియోభారత్ V2ని రిలయన్స్ విడుదల చేసింది. ఈఫోన్ ధర రూ.999కే నిర్ధేశించింది. ఇక ఈ ఫోన్ 1.77 అంగుళాల స్క్రీన్, 0.3మెగాపిక్సెల్ కెమెరా ఎస్డీ కార్డ్తో 128జీబీ స్టోరేజ్ సామర్థ్యం, హెచ్డీ వాయిస్ కాలింగ్, లౌడ్ స్పీకర్, 1000 ఎంఏహెచ్ బ్యాటరీ, జియో సినిమా, యూపీఐ పేమెంట్స్ చేసేందుకు వీలుగా జియోపేని యూజర్లకు అందిస్తుంది. చదవండి👉 మీరు స్టూడెంట్సా? యాపిల్ బంపరాఫర్.. భారీ డిస్కౌంట్లు, ఫ్రీగా ఎయిర్ పాడ్స్!