Manmohan Singh
-
పద్దు ప్రసంగాలు.. సుదీర్ఘమైతే సంచలనాలు!
రాబోయే బడ్జెట్ సెషన్కు సన్నాహాలు జరుగుతున్నాయి. కేంద్ర బడ్జెట్ 2025-26ను (Union Budget 2025-26) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. తమ ఆకాంక్షలకు ఈ బడ్జెట్లో చోటు లభిస్తుందోమోనని బడా వ్యాపారవేత్తల దగ్గర నుంచి చిరువ్యాపారుల వరకూ, వేతన జీవులు మొదలుకొని రోజుకూలీల వరకూ ఇలా.. వివిధ వర్గాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ సమర్పిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా ఏం ప్రకటిస్తారు.. ఎంత సేపు ప్రసంగిస్తారు..? అని ఆమె బడ్జెట్ ప్రసంగం కోసం దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలకు పన్ను మినహాయింపుల గురించి దేశం ఆశాజనకంగా ఉంది. శనివారం సీతారామన్ తన ఎనిమిదో బడ్జెట్ను పార్లమెంటులో సమర్పించి చేసే ప్రసంగంతో బడ్జెట్కు సంబంధించిన అన్ని ఊహాగానాలకు తెరపడనుంది.ఇది చదివారా? ముందే లీకైన బడ్జెట్.. ఎప్పుడో తెలుసా?బడ్జెట్ను సమర్పిస్తున్నప్పుడు ఆర్థిక మంత్రులు చేసే ప్రసంగాలకు ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. కొంత మంది మంత్రులు తమ ప్రసంగాలకు పొయెటిక్ టచ్ ఇచ్చి ఆకట్టుకుంటుంటారు. బడ్జెట్ ప్రసంగాలు కొన్నిసార్లు గంటలపాటు చాలా సుదీర్ఘంగా ఉంటాయి. మరికొన్ని మూడు ముక్కల్లో ముగుస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏమేం చేస్తుందో ప్రసంగాల ద్వారా ముందుకు తీసుకురావడం మన దేశంలో సంప్రదాయంగా వస్తోంది. అందుకే బడ్జెట్ ప్రసంగం అంటే అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. బడ్జెట్ 2025-26 మన ముందుకు వస్తున్న తరుణంలో భారత బడ్జెట్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన, సంక్షిప్తమైన ప్రసంగాలు ఏవో ఇప్పుడు చూద్దాం..సుదీర్ఘ ప్రసంగాలు2020 బడ్జెట్ సమర్పణ సమయంలో ఆర్థిక మంత్రి సీతారామన్ భారతీయ చరిత్రలో సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాన్ని చేసి మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టారు. 2020-21 బడ్జెట్ కోసం ఆమె ప్రసంగం 2 గంటల 42 నిమిషాల పాటు సాగింది. ఈ బడ్జెట్లోనే కొత్త పన్ను విధానం వంటి అనేక కీలక, సంచలన ఆర్థిక సంస్కరణలను సీతారామన్ ప్రవేశపెట్టారు.లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రారంభ పబ్లిక్ ఆఫర్ను కూడా ఆర్థిక మంత్రి అప్పుడే ప్రకటించారు. ఇంతటి సుదీర్ఘమైన ప్రసంగం మధ్యలో నిర్మలాసీతారామన్ ఒకానొక సమయంలో అస్వస్థతకు కూడా గురయ్యారు. ఈ ప్రసంగం 2 గంటల, 19 నిమిషాల నిడివితో ఉన్న 2019 రికార్డును (నిర్మలా సీతారామన్దే) బద్దలు కొట్టింది.సీతారామన్ కంటే ముందు, సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేసిన ఘనత జస్వంత్ సింగ్ది. 2003లో ఆయన 2 గంటల 13 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ జాబితాలో తర్వాతి స్థానం అరుణ్ జైట్లీది. ఆయన 2014లో 2 గంటల 10 నిమిషాల ప్రసంగం చేశారు.అత్యంత సక్షిప్తం ఇదే..దేశంలోనే అత్యంత తక్కువ బడ్జెట్ ప్రసంగాన్ని 1977లో అప్పటి ఆర్థిక మంత్రి హిరూభాయ్ ఎం.పటేల్ చేశారు. అప్పట్లో ఆయన మధ్యంతర బడ్జెట్ ప్రసంగం కేవలం 800 పదాలతోనే పూర్తయింది. 2024లో మధ్యంతర బడ్జెట్ ముందు ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేవలం 60 నిమిషాల వ్యవధిలో మధ్యంతర బడ్జెట్ను సమర్పించారు. ఇదే ఇప్పటి వరకు ఆమె చేసిన అత్యంత సంక్షిప్త బడ్జెట్ ప్రసంగం.మన్మోహన్ సింగ్ పదాలు సుదీర్ఘంపదాల పరంగా సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం రికార్డు అప్పటి ఆర్థిక మంత్రి దివంగత డా. మన్మోహన్ సింగ్ పేరిట ఉంది. 1991లో ఆయన చారిత్రాత్మక బడ్జెట్ ప్రసంగంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారతదేశ తలుపులు తెరిచారు. ఆ సంవత్సరం మన్మోహన్ సింగ్ బడ్జెట్ ప్రసంగ పాఠం 18,650 పదాలను కలిగి ఉంది. తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్న ఆ సంవత్సరంలో మన్మోహన్ సింగ్ సమర్పించిన ఆర్థిక సంస్కరణలు సరళీకృత ఆర్థిక వ్యవస్థకు దారితీశాయి. ఆయన సాహసోపేతమైన ప్రణాళికలు, వ్యూహాత్మక విధాన మార్పులు ప్రపంచంలో భారతదేశ స్థితిని మార్చేశాయి. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో 1991 నుండి 1996 వరకు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. -
మన్మోహన్కు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు కేంద్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి రాష్ట్ర శాసనసభ తరఫున విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఆర్థికవేత్త అయిన మన్మోహన్సింగ్.. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్గా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా వివిధ హోదాల్లో దేశానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. మన్మోహన్కు నివాళి అర్పించేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి మాట్లాడారు. మాజీ ప్రధాని కుటుంబ సభ్యులకు సభ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. సభలో రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్. 1991–96 మధ్య మన పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. ఆర్థిక స్థితిగతుల దశదిశను మార్చిన సంస్కరణల అమల్లో కీలక పాత్ర పోషించారు. ఆ పునాదులతోనే నేడు భారతదేశం ప్రపంచంతో పోటీపడుతోంది. ఆయన దార్శనికత, కృషిని అంతా స్మరించుకోవాలి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మన్మోహన్ విగ్రహం మన్మోహన్సింగ్ దేశానికి, ప్రత్యేకంగా తెలంగాణకు చేసిన సేవలకు శాసనసభ అపార కృతజ్ఞతలు తెలియజేస్తోంది. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆయనకు రుణపడి ఉన్నారు. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ ఇచ్చిన మాటను పార్లమెంటరీ ప్రక్రియలో నెరవేర్చిన గొప్ప నేత మన్మోహన్. రాజ్యసభలో రాజ్యాంగ సవరణపై వచ్చిన చర్చలో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతుందన్న గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పుడు మన్మోహన్ వ్యూహాత్మకంగా ప్రకటన చేయడంతోనే తెలంగాణ ఏర్పడింది. నాటి కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి ఆయనతో మాట్లాడి సమన్వయపర్చారు. రాష్ట్రానికి పురుడు పోసిన డాక్టర్గా, తెలంగాణ బిల్లును ఉభయ సభల్లో ఆమోదింప జేసిన సారథిగా ఆయనను తెలంగాణ సమాజం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది. తెలంగాణ ప్రజల తరఫున రాజకీయాలు, పార్టీలకు అతీతంగా కృతజ్ఞతలు తెలపడమే కాకుండా ఘన నివాళి అర్పించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు సోనియాకు ఎంత రుణపడి ఉంటారో మన్మోహన్కూ అంతే రుణపడి ఉంటారు. గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్సింగ్ విగ్రహాన్ని హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఆవిష్కరించుకుందాం. ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలు చేసుకుందాం. తెలంగాణ పట్ల ప్రత్యేక అభిమానం.. నేను మన్మోహన్ మరణవార్త తెలిసి హుటాహుటిన ఢిల్లీ వెళ్లి ఆయన కుటుంబాన్ని కలిసి తెలంగాణ సీఎంగా పరిచయం చేసుకున్నాను. మన్మోహన్ సతీమణి నాతో మాట్లాడారు. ‘మన్మోహన్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చారు. ఆయనకు తెలంగాణ పట్ల ప్రత్యేక అభిమానం ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి, ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి.’ అని ఆమె చెప్పారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన మన్మోహన్.. తన కుటుంబాన్ని అత్యంత నిరాడంబరంగా నడిపించారు. ఆయనను కోల్పోవడం వారి కుటుంబానికే కాదు యావత్ దేశానికి, ప్రపంచానికి తీరని లోటు. మౌనంగా ఉంటారని, మౌన ముని అని, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని రకరకాలుగా విమర్శించినా సహనాన్ని కోల్పోకుండా పనినే ధ్యాసగా, జీవిత లక్ష్యంగా చేసుకున్న గొప్ప వ్యక్తి మన్మోహన్. నేను, ఉత్తమ్, కోమటిరెడ్డి ఎంపీలుగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ధర్నా చేస్తుంటే.. మన్మోహన్ కూడా మా మధ్య కూర్చుని నిరసన తెలిపారు. మాకు జీవితకాలం గుర్తుండిపోయే ఘటన అది. గొప్ప మానవతావాదం చూపారు ఉపాధి హామీ, సమాచార హక్కు, విద్యా హక్కు, ఆహార భద్రత వంటి నిర్ణయాలతో మన్మోహన్ చరిత్ర సృష్టించారు. గతంలో ప్రభుత్వాలు యజమానులతో సంబంధం లేకుండా భూములను తీసుకునేవి. కానీ కేవలం భూమి కోల్పోయేవారికే కాకుండా కులవృత్తులు, చేతువృత్తులపై ఆధారపడిన వారు, ఇళ్లు లేనివారికి సహాయ పునరావాసం అందేలా 2013లో భూసేకరణ చట్టం తెచ్చి గొప్ప మానవతావాదం చూపించారు. 2006లో అటవీ హక్కుల చట్టాన్ని తీసుకురావడంతో ఆదివాసులు, గిరిజనులకు పోడుభూములకు పట్టాలు ఇవ్వగలుగుతున్నాం. గొప్ప పరిపాలన అందించడానికి అంబేడ్కర్ రాజ్యాంగం ఇచ్చి పునాదులు వేయగా.. ఆ స్ఫూర్తితో మన్మోహన్ చట్టాలు తెచ్చి ప్రజలకు మేలు చేశారు..’’ అని సీఎం రేవంత్ కొనియాడారు. -
మన్మోహన్ చిరస్థాయిగా నిలిచిపోతారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నంతకాలం మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరు నిలిచిపోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంట్లో అవసరమైన బలం లేకున్నా ప్రతిపక్షాలను ఒప్పించి నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాం«దీ, ప్రధాని మన్మోహన్ తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని గుర్తు చేసుకున్నారు. సోమవారం శాసనసభ ప్రత్యేక సమావేశంలో మన్మోహన్కు నివాళి అర్పిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చలో భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు మాట్లాడారు. రుణమాఫీకి స్ఫూర్తినిచ్చారు: భట్టి చర్చలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘‘ఎందరో పుట్టి మాయం అవుతారు. కొందరు మాత్రమే ఈ భూమిపై మానవీయ పరిమళాలు వెదజల్లుతారు. అందులో మన్మోహన్ ఒకరు. దేశంలో తొలిసారిగా రైతు రుణమాఫీ చేసిన ప్రధాని ఆయనే. నేడు రాష్ట్రంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలుకు స్ఫూర్తి ప్రదాత ఆయనే. దేశ ఆర్థిక, సామాజిక స్థితులను అర్థం చేసుకొని సమాచార హక్కు, అటవీ హక్కు, భూసేకరణ, ఉపాధి హామీ వంటి చట్టాలను తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడగా... ఉపాధి హామీతో దేశ ప్రజలు ఆర్థిక మాంద్యం బారిన పడకుండా కాపాడగలిగారు..’’అని పేర్కొన్నారు. అణు ఒప్పందం చేసుకున్న ధీశాలి: ఉత్తమ్ దేశానికి రైతు వెన్నెముక అయితే.. దేశ రైతాంగానికి మాజీ ప్రధాని మన్మోహన్ వెన్నెముకగా నిలిచారనని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. యావత్ దేశ రైతాంగానికి ఏకకాలంలో ఋణమాఫీ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవడంతోపాటు ప్రతిపక్షాలు వ్యతిరేకించినా ఉభయసభల్లో బిల్లు పెట్టి ఆమోదింపజేసుకున్న ధీశాలి మన్మోహన్ అని కొనియాడారు. తన రాజకీయ గురువు పీవీ నరసింహారావు జన్మదిన వేడుకలను సంవత్సరం పొడవునా నిర్వహించాలని తమకు సూచించి గురుభక్తిని చాటుకున్నారని చెప్పారు. 114 ప్రెస్మీట్స్ పెట్టినా మౌన ప్రధానిగా విమర్శలు: శ్రీధర్బాబు మన్మోహన్ ప్రధానిగా మీడియా, విపక్షాల నుంచి నిరంతరం విమర్శలను ఎదుర్కొన్నారని మంత్రి శ్రీధర్బాబు గుర్తు చేసుకున్నారు. ఆయన 114 ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడినా.. అన్యాయంగా మౌన ప్రధాని అని విమర్శించారని పేర్కొన్నారు. తెలుగు బిడ్డ పీవీ నాయకత్వంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ తీసుకొచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలే నేడు దేశ ప్రగతికి దోహదపడుతున్నాయని చెప్పారు. మన్మోహన్కు గుర్తుగా పార్కు: కోమటిరెడ్డి విగ్రహం ఏర్పాటు మాత్రమే కాకుండా మన్మోహన్ సింగ్కు గుర్తుగా మంచి పార్కును రూపొందించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోరారు. పార్లమెంటు ఎదుట ఎంపీలుగా తాము ధర్నాలో ఉండగా, తమ మధ్య కూర్చుకుని మద్దతు తెలపటాన్ని ఎన్నటికీ మరువలేమన్నారు. ఆయన వల్లే దేశ సుస్థిర ఆర్థిక పురోగతి: దామోదర రాజనర్సింహ దేశం స్థిరమైన ఆర్థిక పురోగతిని సాధించటంలో ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలే ప్రధాన కారణమని మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు. రాబోయే తరాలు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన గొప్ప వ్యవహార శైలి మన్మోహన్సింగ్దని పేర్కొన్నారు. దేశమంతా మాట్లాడుకునేలా చేశారు: మంత్రి పొన్నం మన్మోహన్సింగ్ ఎక్కువగా మాట్లాడరని అంతా అంటారని, కానీ తాను చేసిన కార్యక్రమాలపై ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసిన గొప్ప వ్యక్తి ఆయన అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రపంచంలో మరే రాజకీయ నేత సాహసించని రీతిలో ఆయన సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఆయన మాట్లాడితే ప్రపంచమంతా వింటుంది: సీతక్క విద్యకు ఒకేసారి రూ.70 వేల కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించటమే కాకుండా దేశవ్యాప్తంగా 30 వేల పాఠశాలలను ఏర్పాటు చేశారని మన్మోహన్ను మంత్రి సీతక్క కొనియాడారు. మన్మోహన్ మాట్లాడితే ప్రపంచమంతా వింటుందని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా గొప్పగా చెప్పారని గుర్తు చేశారు. -
మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి: హరీశ్ రావు
-
మన్మోహన్ తెలివితేటలను గుర్తించింది మన తెలంగాణ బిడ్డ పీవీనే: కేటీఆర్
-
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం
-
మన్మోహన్ సింగ్కు తెలంగాణ అసెంబ్లీ నివాళి
హైదరాబాద్, సాక్షి: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు తెలంగాణ అసెంబ్లీ నివాళి అర్పించింది. ఏడు రోజుల సంతాప దినాల నిర్వహణలో భాగంగా.. ఇవాళ(డిసెంబర్ 30) ప్రత్యేక సెషన్ నిర్వహించింది. సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ ఆ తీర్మానానికి మద్దతు ప్రకటించారు. అలాగే మన్మోహన్కు దేశఅత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలనే తీర్మానానికి సైతం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రజలకు మన్మోహన్కు రుణపడి ఉంటారు. 60 ఏళ్ల తెలంగాణ కల సాకారం ఆయనను తెలంగాణ సమాజం గుండెల్లో పెట్టుకుంటుంది. తెలంగాణ అంటే మన్మోహన్కు ప్రత్యేక అభిమానం ఉండేదని ఆయన సతీమణి తెలిపారు. ఆయన కుటుంబం చాలా నిరాడంబరంగా ఉంటుంది. గొప్ప విలువలతో తన కుటుంబాన్ని నడిపించారు. మన్మోహన్ పరిపాలనతోనే మనం గొప్ప ఆర్థిక శక్తిగా నిలబడగలిగాం. మన్మోహన్తో తెలంగాణకు ఉన్న బంధం ఎప్పటికీ మరవలేం. ప్రజలంతా గుర్తు పెట్టుకునే విధంగా మన్మోహన్ విగ్రహం ఏర్పాటు చేస్తాం. ప్రజలకు ఉపయోగపడే సంస్కరణల్లో ఆయన వెనకడుగు వేయలేదు. భూసేకరణ చట్ట సవరణ ద్వారా కోట్లాది మందికి లబ్ధి చేకూర్చారు. భూసేకరణ చట్టం-2013 ద్వారా చేతి వృత్తులు, కుల వృత్తుల వారు లబ్దిపొందారు. మన్మోహన్ చేసిన కృషిని అందరూ గుర్తుంచుకోవాలి. పోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వగలుగుతున్నామంటే అది ఆయన చలువే. అంబేద్కర్ స్పూర్తితో పరిపాలన చేశారు. మన్మోహన్ గొప్ప ఆర్థికవేత్త, తత్వవేత్త, మానవతావాది. ఐటీ రంగాన్ని శాసించగలుగుతున్నామంటూ ఆయన సంస్కరణలే కారణం అని చెప్పుకొచ్చారు.ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. పనే ధ్యాసగా పనిచేశారు. బ్యూరోక్రాట్గా వివిధ దశల్లో పనిచేసి మన్మోహన్ దేశ ప్రధాని అయ్యారు. నీతి, నిజాయితీతో మన్మోహన్తో పోటీ పడేవారు లేరు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. తన పనే లక్ష్యంగా మన్మోహన్ ముందుకు సాగారు. మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలి. 👉డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్.. ప్రతీ ఒక్కరి కోసం ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చారు. దేశ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన అందించారు. మన్మోహన్ సంస్కరణలతో అనేక కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. సమాచార హక్కు చట్టాన్ని 2005లో తీసుకువచ్చారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశ గతినే మార్చేసింది. ఆర్థిక మాంద్యం బారినపడకుండా ఉపాధి హామీ పథకం కాపాడింది. దేశ సామాజిక పరిస్థితులను అవగాహన చేసుకుని చట్టాలు చేశారు. ప్రతీ ఒక్కరి కోసం ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చారు. దశాబ్దాలుగా కొట్లాడుతున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. విపక్షాలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేలా చేశారు. మన్మోహన్ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. అసామాన్యమైన మహా మనిషి మన్మోహన్. దేశం కోసం ఆయన కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టారు. మన్మోహన్ భారత్లో పుట్టినందుకు గర్వపడుతున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాం. 👉 కేటీఆర్ కామెంట్స్..మన్మోహన్ సింగ్ నిబద్ధతతోనే తెలంగాణ ఏర్పడింది. సీఎం రేవంత్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నాం. మన్మోహన్ తెలివితేటలను గుర్తించింది మన తెలంగాణ బిడ్డ పీవీనే. ఎన్నో సంస్కరణలు చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్. ఎన్ని రకాలుగా ఆయన్ని అవమానించినా మౌనంగా భరించారు. అయినా అవన్నీ పంటి కింద బిగబట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తి. పీవీ నర్సింహారావు తెలంగాణ బిడ్డ. ఢిల్లీలో మెమోరియల్ లేదు. అక్కడ మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసన సభ తీర్మానం చేయాలి.రాజకీయాలతో సంబంధం లేని ఆర్థిక వేత్తగా ఉన్న మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రపంచం అంతా దేశం వైపు చూసే విధంగా మన్మోహన్ సింగ్ ఆర్థిక నిర్ణయాలు ఉన్నాయి. లాయల్టీకి నిలువుటద్దంగా నిలిచిన గొప్ప మహనీయుడు మన్మోహన్ సింగ్. కేసీఆర్కు షిప్పింగ్ పోర్టుపోలియో ఇస్తే డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేయగానే కేసీఆర్ తెలంగాణ కోసం అది త్యాగం చేశారు. తెలంగాణ ఏర్పాటు మన్మోహన్ సింగ్ నాయకత్వంలో జరిగింది. తెలంగాణ డెలిగేషన్ తీసుకొని మన్మోహన్ సింగ్ను కలిశాం. 5 నిమిషాలు కాదు, ఎక్కువ సమయం కావాలని అడిగాం. సమస్య తీవ్రత తెలుసుకొని గంటన్నర సమయం ఇచ్చారు. ఓబీసీ అంశాలపై బలహీన వర్గాల డెలిగేషన్ ఢిల్లీ వెళ్లి కలిసింది.మన్మోహన్ సింగ్కు జరిగిన గౌరవ వీడ్కోలు.. మన పీవీ నరసింహారావుకు దక్కలేదు. ఢిల్లీలో అందరి ప్రధాన మంత్రులకు ఘాట్స్ ఉన్నాయి. పీవీకి తప్ప. పీవీకి ఢిల్లీలో స్మారకం ఏర్పాటు చేసేలా సభలో తీర్మానం పెట్టాలని కోరుతున్నాం. మన్మోహన్ సింగ్ విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేసినా మేమంతా వస్తాం.👉మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..దేశాభివృద్ధికి మన్మోహన్ సింగ్ అనేక గొప్ప విధానాలు తెచ్చారు. సాధారణ స్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగారు. మన్మోహన్సింగ్ను ఆర్థికమంత్రిగా పీవీ నరసింహారావు ఎంపిక చేశారు. గ్రామీణ పేదలకు పని కల్పించే ఉపాధి హామీ పథకం తెచ్చారు. బీజేపీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్..పీవీ నరసింహారావు గురించి సభలో గుర్తు చేస్తున్నారు.పీవీని పదేళ్లు పట్టించుకోకపోతే.. బీజేపీ పీవీకి భారతరత్న ఇచ్చింది.పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పీవీకి భారత రత్న ఇవ్వలేదు.మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేంద్ర ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలు ప్రకటిస్తే..రాహుల్ గాంధీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వియత్నాం వెళ్లారట!రాజకీయాలకు అతీతంగా మన్మోహన్ సింగ్కు సంతాపం ప్రకటించాలి.మన్మోహన్కు దక్కిన గౌరవంతో పాటు అవమానం గుర్తు చేస్తున్నాం.సంతాప సభలో రాజకీయాలు ఎందుకు?. సభలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ.మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..సంతాప తీర్మానం రోజు దాని గురించే మాట్లాడాలి.నిజంగా ఆర్ఎస్ఎస్ నేతలు కూడా మహేశ్వర్ రెడ్డి లాగా మాట్లాడరు.మధ్యలో వెళ్లిన మహేష్ రెడ్డి చించుకుంటూ మాట్లాడుతున్నారు.రాహుల్ గాంధీ ఎటు వెళ్లారు అన్నది ఇక్కడ చర్చ కాదు.సంతాప తీర్మానం గురించి మాత్రమే మాట్లాడితే బాగుంటుందిఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్..కాంగ్రెస్ పార్టీ ఎందుకు మధ్యలో కలగజేసుకుంటుంది.దేశం అంతా మన్మోహన్ సింగ్ గురించి వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటన చేసి జరుపుతుంటే..రాహుల్ గాంధీ వేడుకల కోసం వియత్నం వెళ్లలేదా?కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ను అవమానించినట్లు కాదా ?మన్మోహన్ సింగ్ విగ్రహం గురించి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ.. పీవీకి కూడా విగ్రహం పెడితే బాగుండు.కూనంనేని కామెంట్స్..దేశ గతి, గమనాన్ని మన్మోహన్ మార్చారు. మన్మోహన్కు నివాళి అర్పించే కార్యక్రమంలో రాజకీయాలు తగదు.సంతాప సభల్లో వేరే అంశాలను జోడించడం ఇంతకు ముందెన్నడూ చూడలేదునివాళి కార్యక్రమంలో ఇలా చేయడం వల్ల మన్మోహన్ ఆత్మ క్షోభిస్తుందినివాళి కార్యక్రమంలో ఆయన గొప్పతనాన్ని చెప్పాలినిజాయతీ, నిబంద్ధతకు నిలువుటద్దం మన్మోహన్ సింగ్. హరీష్ రావు కౌంటర్..కేసీఆర్ గురించి మాట్లాడుకోవాలంటే ఆయనకు సభ ఏం గౌరవం ఇచ్చింది.సభ సభ లాగా జరగడం లేదుపీఏసీ చైర్మన్ మీకు నచ్చినట్లు ఇచ్చుకున్నారు.కేసీఆర్ను అడిగి పీఏసీ చైర్మన్ ఇచ్చారా?తెలంగాణ కోసం కేసీఆర్ రెండున్నర ఏళ్ల పాటు ఉన్న కేంద్ర పదవిని వదిలేశారు.శాసనసభ్యుల అనర్హత పై మీరు నిర్ణయం తీసుకున్నారా?ఆ లెక్కన వస్తే మేము చాలా మాట్లాడగలుగుతాం.కానీ ఇప్పుడు మన్మోహన్కు మాత్రమే పరిమితమవుతున్నాం. స్పీకర్ కామెంట్స్..కేసీఆర్ ప్రస్తావన రాగానే కలగజేసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ప్రత్యేక సమావేశాల కోసం కేసీఆర్కు స్వయంగా నేనే కాల్ చేశాను.అసెంబ్లీ సమావేశానికి రావాలని కేసీఆర్ను స్వయంగా ఆహ్వానించాను.కానీ, ఆయన రాలేదుహరీష్ రావు కామెంట్స్..మన్మోహన్ సింగ్ పెద్దల సభలో 33 ఏళ్లు ఉన్నారుఈరోజు శాసనసభతో పాటు పెద్దల సభ, మండలి కూడా సమావేశమై నివాళి అర్పిస్తే బాగుండేది.శాసన మండలిలో మన్మోహన్కు నివాళి అర్పిస్తే మరింత గౌరవంగా ఉండేదిశాసన మండలి సభ్యులు సైతం సంతాపం తెలిపేందుకు అడుగుతున్నారు.నెక్లెస్ రోడ్డుకు పీవీ పేరు పెట్టాం. పీవీ ఘాట్ ఏర్పాటు చేశాం.స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టాలి.మన్మోహన్కు భారతరత్న ఇవ్వాలి.దేశం ఆర్థికంగా బలోపేతం కావాడానికి మన్మోహన్, పీవీ కృషి ఎంతో ఉంది.కేసీఆర్ నాయకత్వంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని ఇదే అసెంబ్లీలో తీర్మానం చేశాం.కేంద్రం కూడా స్పందించి పీవీకి భారతరత్న ఇచ్చింది.మన్మోహన్ను మౌన ముని అని అంటారుమన్మోహన్పై చిన్న అవినీతి మరక కూడా లేదు.ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా చెరగని ముద్ర వేశారు.ఏఐసీసీ మీటింగ్లో మన్మోహన్ కంట తడి పెట్టారు.కాంగ్రెస్ ఓటమికి సంస్కరణలే కారణమని ఏఐసీసీలో చర్చించినా మన్మోహన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్ను రాహుల్ చించేసినా ప్రధానిగా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేసీఆర్కు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫోన్..👉నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని సభకు రావాలని కేసీఆర్కు తెలిపిన స్పీకర్. మరోవైపు.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి దూరంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. -
కాంగ్రెస్కు కౌంటర్.. సోనియాపై జేపీ నడ్డా విమర్శలు
ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు స్మారకం నిర్మాణం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. రెండు పార్టీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.మాజీ ప్రధాని మన్మోహన్కు స్మారకం నిర్మించడంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. మన్మోహన్ను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని, స్మారకం నిర్మించే ప్రాంతంలో కాకుండా నిగంబోధ్లో అంత్యక్రియలు నిర్వహించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా స్పందిస్తూ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు.తాజాగా జేపీ నడ్డా మాట్లాడుతూ..‘మన్మోహన్ మృతితో విషాదం నెలకొన్న సమయంలోనూ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మన్మోహన్ స్మారకం కోసం స్థలాన్ని కేటాయించింది. ఆ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశాం. మన్మోహన్ ప్రధానిగా ఉండగా.. సోనియా గాంధీ సూపర్ ప్రధానిగా వ్యవహరించి ప్రధాని పదవిని అవమానించారు. ఒక ఆర్డినెన్స్ను చించేయడం ద్వారా మన్మోహన్ను రాహుల్ గాంధీ కూడా అవమానించారు. అదే కాంగ్రెస్ ఇప్పుడు ఆయన మరణంపై రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.This is the way Gandhi family treated Ex PM #ManmohanSingh .. Shameful act by Sonia Gandhi .. watch pic.twitter.com/Bi8UrbNOU5— #Bagri (@Bagriml) December 27, 2024ఇదే సమయంలో పీవీ అంశంపై కూడా నడ్డా స్పందించారు. ఈ సందర్బంగా నడ్డా మాట్లాడుతూ..‘పీవీ నరసింహారావు స్మారకం నిర్మించడానికి సోనియా గాంధీ అంగీకరించలేదు. కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచడానికి కూడా ఆమె అనుమతించలేదు. చివరకు ఆయన అంత్యక్రియలను ఢిల్లీలోని నిర్వహించనీయలేదని ధ్వజమెత్తారు. అలాగే, 2015లో పీవీ కోసం ప్రధాని మోదీ స్మారకం ఏర్పాటు చేశారని, భారత రత్న కూడా ఇచ్చారని గుర్తు చేశారు. ప్రణబ్ ముఖర్జీ మరణించినప్పుడు కాంగ్రెస్ పార్టీ కనీసం సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. దీంతో, ఆయన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.Sonia Gandhi, who insulted PM Dr #ManmohanSingh ji in this manner, ever apologized till date??? Was this not an insult to the Prime Minister of India, Manmohan Singh ? pic.twitter.com/6Yj4OavpTT— Ayesha (@KashmiriAyesha1) December 27, 2024 -
మన్మోహన్సింగ్ అంత్యక్రియలకు హాజరైన సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: అశేష జనవాహిని అశ్రునయనాలు, అధికార లాంఛనాల మధ్య మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. శనివారం జరిగిన అంతిమయాత్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొన్నారు. పార్థివ దేహం తీసుకెళ్తున్న వాహనంలో రాహుల్ గాంధీ పక్కనే కూర్చున్న రేవంత్, నిగమ్బోధ్ ఘాట్ వరకు ఆయనతో కలిసి వెళ్లారు. అంతకుముందు ఏఐసీసీ కార్యాలయంలో మన్మోహన్ పార్థివ దేహానికి మంత్రులు పొంగులేటి సుధాకర్రెడ్డి, సీతక్క నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అలాగే.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, అనిల్కుమార్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, కేవీపీ రామచంద్రరావు, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ తదితరులు అంతిమయాత్రలో పాల్గొని అభిమాన నేతకు తుది వీడ్కోలు పలికారు. శ్రద్ధాంజలి ఘటించిన కేటీఆర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. అంత్యక్రియలు నిర్వహించిన నిగమ్బోధ్ ఘాట్లో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేశ్రెడ్డి, దీవకొండ దామోదర్రావులతో కలిసి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. -
అల్విదా మన్మోహన్జీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ విధానాలతో భారతదేశ దశదిశను మార్చిన మహోన్నత నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్(92)కు జాతి యావత్తూ ఘనంగా అంతిమ వీడ్కోలు పలికింది. ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్లో శనివారం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. దివంగత మాజీ ప్రధానమంత్రిని కడసారి దర్శించుకొని వీడ్కోలు పలకడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భూటాన్ రాజు జింగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగుచుక్, మారిషస్ విదేశాంగ మంత్రి ధనుంజయ్ రామ్ఫుల్తోపాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నాయకులు, వివిధ దేశా ల ప్రతినిధులు, ప్రముఖులు తరలివచ్చారు. మన్మోహన్కు కన్నీటి వీడ్కోలు పలికిన అనంతరం పూర్తి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాం«దీతోపాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ హాజరయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖీ్వందర్ సింగ్ సుఖూ, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినోద్ కుమార్ సక్సేనా, వివిధ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు భూపీందర్ సింగ్ హుడా, అశోక్ గహ్లోత్, భూపేష్ భగేల్ తదితరులు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ అమర్ రహే శనివారం ఉదయం 9 గంటలకు మన్మోహన్ పార్థివ దేహాన్ని పుష్పాలతో అలంకరించిన సైనిక వాహనంలో ఆయన నివాసం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆయనకు ఎంతో ఇష్టమైన నీలిరంగు తలపాగాను చివరి ప్రయాణంలోనూ ధరింపజేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాం«దీ, రాహుల్ గాంధీతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కడసారి నివాళులర్పించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మన్మోహన్ భార్య గురుశరణ్కౌర్, ఒక కుమార్తె కూడా పుష్పాంజలి ఘటించారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభమైంది. ‘మన్మోహన్ సింగ్ అమర్ రహే.. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా, తబ్ తక్ తేరా నామ్ రహేగా’ అనే నినాదాల మధ్య వేలాది మంది అనుసరిస్తుండగా యాత్ర ముందుకు సాగింది. ఉదయం 11.30 గంటల సమయానికి నిగమ్బోధ్ ఘాట్కు చేరుకుంది. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతోపాటు రాహుల్ గాంధీ సైతం యాత్రలో చివరివరకూ పాల్గొన్నారు. పాడెను సైతం మోశారు. త్రివర్ణ పతాకం చుట్టిన మన్మోహన్ భౌతికకాయాన్ని ప్రత్యేక వేదికపైకి చేర్చారు. సిక్కు మత సంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు, మత గురువులు పవిత్ర గుర్బానీ కీర్తనలు ఆలపించారు. భౌతికకాయం వద్ద పలువురు ప్రముఖులు పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. త్రివిధ దళాల సైనికులు 21 తుపాకులు గాల్లోకి పేల్చి గౌరవ వందనం సమర్పించారు. తర్వాత చితికి మన్మోహన్ పెద్ద కుమార్తె ఉపీందర్ సింగ్ నిప్పంటించడంతో అంత్యక్రియలు ముగిశాయి. మన్మోహన్ సింగ్ జ్ఞాపకాలతో అందరి హృదయాలు బరువెక్కాయి. అల్విదా మన్మోహన్జీ అంటూ కొందరు బోరున విలపించారు. సిక్కు సంప్రదాయం ప్రకారం మన్మోహన్ ‘అఖండ్ పథ్’ను జనవరి 1న ఢిల్లీలోని నివాసంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జనవరి 3న ‘భోగ్’ కార్యక్రమం ఉంటుందన్నారు. అంతిమ్ అర్దాస్(చివరి ప్రార్థనలు) జనవరి 3న ఢిల్లీలో గురుద్వారా రికబ్ గంజ్ సాహిబ్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మన్మోహన్ సింగ్ శ్రద్ధాంజలి సభను సోమవారం నిర్వహించనున్నట్లు గుజరాత్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఇండియా ప్రగతికి బాటలు వేసిన నేత మన్మోహన్: లారెన్స్ వాంగ్ మన్మోహన్ సింగ్ మృతిపట్ల సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ సంతాపం ప్రకటించారు. భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చిన గొప్ప నాయకుడు మన్మోహన్ అని కొనియాడారు. దార్శనికత, అంకితభావంతో దేశ ప్రగతికి బాటలు వేశారని, ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు. ఆంటోనియో గుటెరస్ సంతాపం మన్మోహన్ సింగ్ మృతిపట్ల ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ విచారం వ్యక్తంచేశారు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు, భారతదేశ ప్రజలకు, ప్రభుత్వానికి సంతాపం ప్రకటించారు. ఇండియా ఆర్థిక వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దడంలో ఆయన కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. మన్మోహన్ హయాంలో ఐక్యరాజ్యసమితితో భారత్ బంధం బలోపేతమైందని ఉద్ఘాటించారు. భూటాన్లో ప్రత్యేక ప్రార్థనలు భారత దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ ఆత్మశాంతి కోసం భూటాన్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. రాజధాని థింపూలోని బౌద్ధ మందిరంతోపాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రార్థనలు నిర్వహించారు. 20 జిల్లాల్లో ప్రార్థనలు జరిగినట్లు భూటాన్ ప్రభుత్వం తెలియజేసింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ రాయబార కార్యాలయా లు, కాన్సులేట్లలో తమ జాతీయ పతాకాన్ని అవనతం చేసినట్లు వెల్లడించింది. ఢిల్లీలో జరిగిన మన్మో హన్ అంత్యక్రియలకు భూటాన్ రాజు హాజరయ్యారు. మన్మోహన్ భౌతికకాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ధర్మరాజు స్థాపించిన శ్మశాన వాటిక! మన్మోహన్ అంత్యక్రియలు జరిగిన నిగమ్బోధ్ ఘాట్ శ్మశానవాటిక ఢిల్లీలో యమునా నది ఒడ్డునే ఉంది. నగరంలో అది అత్యంత రద్దీగా ఉండే అతిపెద్ద శ్మశానవాటిక. ప్రాచీనమైన ఈ మరుభూమిని పాండవుల అగ్రజుడు, ఇంద్రప్రస్థ పాలకుడైన యుధిష్టరుడు(ధర్మరాజు) స్థాపించాడని చెబుతుంటారు. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. రకరకాల పక్షులు విహరిస్తుంటాయి. అందుకే పక్షులను కెమెరాల్లో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు వస్తుంటారు. పక్షి ప్రేమికులకు ఇదొక చక్కటి వేదిక. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ, జనసంఘ్ నేత దీన్దయాళ్ ఉపాధ్యాయ, మాజీ ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్, ఢిల్లీ మాజీ సీఎం షీలాదీక్షిత్ సహా పలువురు ప్రముఖుల అంత్యక్రియలు ఇక్కడే జరిగాయి. 5,500 సంవత్సరాల క్రితం మహాభారత కాలంలో సాక్షాత్తూ బ్రహ్మ ఇక్కడ యమునా నదిలో స్నానం ఆచరించాడని, దాంతో ఆయన పూర్వస్మృతి జ్ఞప్తికి వచ్చిందని, అందుకే దీనికి నిగమ్బోధ్ అనే పేరు స్థిరపడిందని కొన్ని పుస్తకాల్లో రాశారు. నిగమ్బోధ్ ఘాట్ను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ) నిర్వహిస్తోంది. 1950వ దశకంలో ఎలక్ట్రిక్ దహన వాటిక, 2000 సంవత్సరం తర్వాత సీఎన్జీ దహన వాటిక సైతం ఏర్పాటు చేశారు. అధికారికంగా 1898లో ఈ శ్మశానవాటిక ప్రారంభమైంది. అప్పట్లో ఈ ప్రాంతం పేరు షాజహానాబాద్. మన్మోహన్ స్మారకం నిర్మించే చోటే అంత్యక్రియలు నిర్వహించాలని కాంగ్రెస్ కోరినప్పటికీ కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. ఈ పరిణామంపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశానికి తొలి సిక్కు ప్రధానమంత్రి అయిన మన్మోహన్ను కేంద్రం ఉద్దేశపూర్వకంగా అవమానించిందని మండిపడుతున్నారు. -
స్వాతంత్య్ర ఫలాలను కాపాడుకోవాలి!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. ఇప్పుడిక భూమ్మీద అత్యధిక జనాభా గల దేశంగానూ అవతరించనుంది. భారతావని 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటోంది. ఈ సమ యంలో మనందరిపై ప్రత్యేక బాధ్యత ఉంది. స్వాతంత్య్రం మనకు ప్రసాదించిన స్వేచ్ఛలను పరిరక్షించుకుంటూ ప్రపంచస్థాయి ప్రమాణాలతో వాటిని బలోపేతం చేసుకునేందుకు నడుం బిగించాలి. ఎంతో ఉన్నతంగా రెపరెపలాడే జాతీయ జెండాకు సగర్వంగా సెల్యూట్ చేసే ప్రతి భారతీయుడూ ఆ జెండాలోని మూడు రంగుల అంత రార్థాన్ని గ్రహించాలి. దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, దేశ సమైక్యతను ప్రతిఫలించే ఆ మువ్వన్నెలే మన ప్రజాస్వామ్యాన్ని అవని మీదే ఉన్నతమైందిగా రూపొందించాయి. భారత ప్రజల ఈ సమైక్యతను దెబ్బతీసే విద్వేష ప్రచారాలను అడ్డు కోవాలి. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అహంకార పూరితమైన నిరంకుశ అధికారం ఎప్పటికీ కబళించకుండా కాపాడుకోవాలి. ఈ చారిత్రక సందర్భంగా ఇలా చేస్తామని మనమందరం ప్రతిన పూనాలి. ఇదే జాతీయ పతాకానికి మనం అర్పించగల ఘన నివాళి. సమైక్యత మన సంపద వలస పాలన మృత్యు కౌగిలి నుంచి విముక్తమైన భారత్ నాడు తక్షణం జాతి సమైక్యతకు నడుం బిగించింది. చెల్లా చెదురుగా ఉన్న బ్రిటిష్ పాలిత ప్రాంతాలను, సంస్థానాలను విలీనపరచి ఒక సమైక్య జాతిగా అవతరించింది. ఈ సమైక్యత రాత్రికి రాత్రే మంత్రం వేసినట్లు వచ్చింది కాదు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతృత్వంలో సాగిన స్వాతంత్య్రోద్యమం, విదేశీ పాలనకు చరమగీతం పాడేందుకు భారతీయులందర్నీ ఏకం చేసింది. భాష, కులం, మతం, స్త్రీపురుష భేదం, సామాజిక అంతరాలు... వీటన్నిటికీ అతీతంగా భారతీయులను ఈ ఉద్యమం సమైక్యం చేసింది. ఈ సమైక్యత భారత్కు అమూల్య సంపద. కుల మత విభేదాలు, భాషా దురహంకారాలతో ఇది నాశనం కాకూడదు.ఇలాంటి కుట్రలతో భారతీయులను భారతీయుల మీదే ఉసిగొల్పి తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలను పొందితే పొందవచ్చు. కానీ, ఒక గొప్ప జాతిగా ఈ దేశం ప్రయాణం సాగించే ప్రగతి బాట మీద ఇవి అగాథాలను సృష్టిస్తాయి. వలస పాలకులు మనల్ని నిలువునా దోచారు. వారి నుంచి స్వాతంత్య్రం సాధించుకున్న మనం ఒక బీదదేశంగా కొత్త జీవితం ప్రారంభించాం. ఆ స్థాయి నుంచి నేడు ప్రపంచ అగ్రస్థాయి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదగగలిగాం. 1991లో చేపట్టిన ఆర్థిక సరళీకరణ విధానం మన ఆర్థిక ప్రగతికి ఊతం ఇచ్చింది. పేదరికం తగ్గింపు, ఆర్థిక అసమానతల తొలగింపు ప్రభుత్వ విధానానికి దిశానిర్దేశం అయ్యాయి. అందరి ఆర్థిక ప్రయోజనమే మనకు పరమావధి అయ్యింది. ఒకవైపు ఆర్థిక అంతరాలు పెరుగుతూ, మరోవైపు ఎంపిక చేసిన కొద్ది మంది వ్యాపార దిగ్గజాలే సంపద ప్రయోజనాలను పొందడాన్ని మనం అనుమ తించకూడదు.వేర్పాటు రాజకీయాలు కూడదు! ఉపాధి లేని వృద్ధి ఏ ఆర్థిక వ్యవస్థకూ క్షేమం కాదు. సామాజిక అసంతృప్తికి, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలకు నిరుద్యోగ సమస్య దారితీస్తుంది. జనాభాలో చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్న యువజనులకు విద్య, నైపుణ్యం, తగు ఉపాధి కల్పించాలి. ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తలకు, ఆవిష్కర్తలకు మద్దతు ఇవ్వాలి. తద్వారా గరిష్ఠ ఆర్థిక ప్రయోజనం పొందాలన్నదే ధ్యేయంగా రానున్న 25 సంవత్సరాలకు బాటలు వేసుకోవాలి. ఇది సుసాధ్యం కావాలంటే విద్య, ఉపాధి అవకాశాల కోసం ప్రజలు దేశం నలు మూలలకు స్వేచ్ఛగా వెళ్లగలగాలి. మతం, భాష వంటివి ఈ స్వేచ్ఛా గమనానికి అడ్డంకులు కాకూడదు. దేశ పారిశ్రామిక సారథులు అవరోధాల ప్రమాదాన్ని గుర్తించి జాతీయ సమైక్యతకు గళం విప్పాలి. విచ్ఛిన్న రాజకీయాలు ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతుంటే వారు మౌన ప్రేక్షుల్లా ఉండిపోకూడదు. శాస్త్రీయ సంప్రదాయం నిలబెట్టాలి! స్వాతంత్య్రం తొలినాళ్ల నుంచీ దేశం శాస్త్ర విజ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చింది. ప్రగతి సాధనకు దాన్ని మార్గం చేసుకుంది. పురోగమన దృక్పథంతో నేషనల్ సైన్స్ పాలసీ రూపుదిద్దుకుంది. విజ్ఞానం, బోధన, పరిశోధనలకు గొప్ప గొప్ప సంస్థలు ఏర్పాటయ్యాయి. అనేక భారతీయ సాంకేతిక సంస్థలు ప్రపంచ గుర్తింపు పొందాయి. వాటిలో చదివిన పలువురు విద్యావంతులు నేడు ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార సంస్థలకు సారథ్యం వహిస్తున్నారు. అంతరిక్ష, సాగర, అణుశక్తి కార్య క్రమాలు మనల్ని అంతటి సామర్థ్యం ఉన్న అతి కొద్ది దేశాల సరసన నిలిపాయి. శాస్త్రీయంగా, సాంకేతికంగా ప్రపంచ గుర్తింపు పొందిన మన వైజ్ఞానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల సారథ్య బాధ్యతల్లో సాంస్కృతిక పునరుజ్జీవనం పేరిట తక్కువ ప్రతిభావంతులకు చోటు కల్పిస్తే అంతకు మించిన దురదృష్టం ఉండదు. ప్రాచీనకాలం నుంచీ మనకు గర్వించదగిన సాంప్రదాయిక విజ్ఞానం ఉంది. అయితే అది ఆధునిక విజ్ఞానాన్ని మసకబరచి మేటి శాస్త్రవేత్త లకు అపఖ్యాతి తేకూడదు.స్పష్టమైన విదేశీ విధానాలురెండు అధికార కూటములు ప్రపంచంపై పట్టు సాధించడానికి పోటీపడుతున్న సమయంలో... దేశాల మధ్య శాంతి సామరస్యాలు మెరుగుపరచడానికి మనం అవలంబించిన విలువలు, విధానాలు, మన అలీన ఉద్యమ నాయకత్వం భారత్కు ఎనలేని గౌరవం తెచ్చి పెట్టాయి. మన పొరుగున ఉన్న అత్యధిక దేశాలతో మనకు సహృద్భావ సంబంధాలు ఉండేవి. కొన్నిటితో ఘర్షణలు ఉన్నప్పటికీ శాంతి యుత సహజీవనానికి వీలుకల్పించేలా వాటితో అవగాహనా వార ధులను నిర్మించుకునే ప్రయత్నం చేశాం. ప్రపంచ దేశాలు మనల్ని నమ్మదగిన గౌరవప్రదమైన మిత్రదేశంగా పరిగణించే స్థితి ఉండాలి. ముఖ్యంగా దక్షిణ ఆసియాలో ఈ విశ్వాసం పొందాలి. కేవలం కెమెరాల మందు ఆప్యాయతా ప్రదర్శనలకు పరిమితమైతే మన విదేశాంగ విధానం బలహీనం అవుతుంది. సమర్థులయిన దౌత్యవేత్తల సహకారంతో విజ్ఞులైన నాయకులు సుస్పష్టమైన చర్యలు చేపట్టాలి. యువత శ్రేయస్సు ముఖ్యం యువజనుల ఆరోగ్యం, విద్య, నైపుణ్యం మీద తప్పనిసరిగా దృష్టి సారించాలి. మన చిన్నారుల్లో ఎదుగుదల లోపం, బిడ్డల్ని కనే మహిళల్లో పోషణ లేమి, రక్తహీనత అధికంగా ఉన్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్ –5) తేల్చి చెప్పింది. కాబట్టి పౌష్టికాహార కార్యక్రమాలను అమలు చేయాల్సిన అవ సరం ఉంది. అలాగే, మంచినీరు, పారి శుద్ధ్య రంగాల్లో కూడా సరైన చర్యలు, విధానాలు అమలు చేయాలి. మన ఆరోగ్య వ్యవస్థలో ఉన్న అనేక బలహీనతలను కోవిడ్ – 19 బట్టబయలు చేసింది. వ్యాధులపై నిఘా పెంచాలి. ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వెయ్యాలి. వైద్య సేవల రంగాన్ని విస్తరించాలి. ఈ దిశగా పరిశీలిస్తే ఆ యా రాష్ట్రాల మధ్య ఆరోగ్య వ్యవస్థల పనితీరు, వాటి విస్తరణల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. రాష్ట్రాలు ఆరోగ్యం మీద మరిన్ని నిధులను వెచ్చించాలి. కేంద్ర ప్రాయోజిత పథకాల లక్ష్య సాధన కోసం రాష్ట్రాలకు ఇతోధికంగా మద్దతు అందించాలి. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందించడం సార్వత్రిక ఆరోగ్య సేవల కల్పన విధానాల లక్ష్యం కావాలి. దేశవ్యాప్తంగా సమరీతిలో ఈ లక్ష్యాన్ని సాధించాలి. పౌరుల బాధ్యతఅప్పట్లో నేను పధ్నాలుగేళ్ల కుర్రవాడిని. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆనంద పారవశ్యంతో మునిగిపోయాను. అదే సమయంలో దేశ విభజన అంతులేని విషాదం మిగిల్చింది. అలాంటి దుఃస్థితి తిరిగి ఎప్పటికీ రాని దృఢమైన దేశంగా భారత్ ఎదగాలని ఆశించాను. ఇండియా ఇన్నేళ్లల్లో సాధించింది చూసి నేనిప్పుడు గర్విస్తున్నాను. ఈ గొప్ప దేశం భవిష్యత్తు పట్ల నాకు ఎన్నో ఆశలున్నాయి. సమాజంలో çసుహృద్భావ వాతావరణాన్ని కలుషితం చేస్తూ, ప్రజల్ని విభజిస్తున్న వేర్పాటు నినాదాలు, మత విద్వేషాలు చూసి నేను ఆందోళన కూడా చెందుతున్నాను. మరో వంక, ప్రజాస్వామ్య స్వేచ్ఛలను పరిరక్షించి తీరాల్సిన, సుపరిపాలన నియమ నిబంధనలను నిలబెట్టాల్సిన, ఎన్నికలకు ధనబలం, ప్రభుత్వ ఏజెన్సీల నుంచి రక్షణగా ఉండాల్సిన వ్యవస్థలు బలహీనమవటం కూడా జరుగుతోంది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలను పరిరక్షించుకోవలసింది భారత పౌరులే! సగర్వంగా తల ఎత్తి మన జెండాకు వందనం చేసేటప్పుడు మనలో ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవలసిన గురుతర బాధ్యత ఇది!డాక్టర్ మన్మోహన్ సింగ్ (భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా 2022 ఆగస్ట్ 15న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాసిన వ్యాసం ఇది. ‘ది హిందూ’ సౌజన్యంతో.) -
ముగిసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
-
Magazine Story: ఆర్థిక మహర్షి - అడుగులు
-
సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
-
మన్మోహన్కు వైఎస్సార్సీపీ నేతల నివాళులు..
సాక్షి, విశాఖపట్నం: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి పలువురు వైఎస్సార్సీపీ నేతలు సంతాపం తెలిపారు. విశాఖలో మన్మోహన్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశం గొప్ప నేతను కోల్పోయిందని చెప్పుకొచ్చారు. ఆయన సంస్కరణలు దేశానికి, రాబోయే తరానికి ఎంతో ఉపయోగకరమని ప్రశంసించారు.విశాఖలో మన్మోహన్ సింగ్ మృతిపై వైఎస్సార్సీపీ నేతలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, రవీంద్ర బాబు, కుంభ రవిబాబు, బొత్స ఝాన్సీ, మంత్రి గుడివాడ అమర్నాథ్, జడ్పీ చైర్మన్ సుభద్ర సహా పార్టీ నేతలు పాల్గొన్నారు.అనంతరం, బొత్స సత్యానారాయణ మాట్లాడుతూ..‘దేశం గొప్ప నేతను కోల్పోయింది. అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. పనికి ఆహార పథకాన్ని తీసుకుని వచ్చి పేదల కడుపు నింపారు. రాజకీయాలకు అతీతంగా దేశం కోసం పని చేసిన గొప్ప వ్యక్తి. ఆయన మరణం దేశానికి తీరని లోటు అంటూ కామెంట్స్ చేశారు.మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ మాట్లాడుతూ..‘దేశ చిత్రపటాన్ని ప్రపంచంలో నిలిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్. సంస్కరణల వారధి మన్మోహన్ సింగ్. ఆయన మరణం దేశానికి తీరని లోటు. ఆయన సంస్కరణలు దేశానికి రాబోయే తరానికి ఎంతో ఉపయోగకరం అని అన్నారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘దేశానికి మన్మోహన్ సేవలు మరువలేము. స్టీల్ ప్లాంట్ విస్తరణకు ఎంతో కృషి చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం కాకుండా కాపాడారు. ఆయన సేవలను ఈ ప్రాంత ప్రజలు గుర్తు పెట్టుకుంటారు అని వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ..‘ఇండియాను గ్లోబల్ పవర్గా చేసిన ఘనత మన్మోహన్ సింగ్కు దక్కుతుంది. అనేక ఆర్థిక సంస్కరణలను ప్రవేశ పెట్టారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. మన్మోహన్ సింగ్ గొప్ప దేశ భక్తుడు అని తెలిపారు.కుంభ రవిబాబు మాట్లాడుతూ.. దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. దేశ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే అణు ఒప్పందం జరిగింది. గ్రామీణ దేశ ఆర్థిక వ్యవస్థను ఆయన తన సంస్కరణలతో మార్చారు అని చెప్పుకొచ్చారు. -
ఆర్ధిక సంస్కరణల సారధి మన్మోహన్ అస్తమయం
-
బీజేపీ Vs కాంగ్రెస్.. మన్మోహన్ స్మారక చిహ్నంపై రాజకీయం!
ఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియల వేళ కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మన్మోహన్కు స్మారక చిహ్నం నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ కోరడంపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఖర్గే లేఖపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ హేయమైన ప్రవర్తనకు ఇది ఉదాహరణ అని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ ఆరోపించారు.మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరుగుతున్నాయి. మరోవైపు, అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంలోనే మన్మోహన్కు స్మారక చిహ్నం నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో.. రాజనీతిజ్ఞులు, మాజీ ప్రధానులకు అంతిమ సంస్కారాలు జరిగిన స్థలంలోనే వారి స్మారకాలను నిర్మించిన సంప్రదాయాన్ని ఖర్గే గుర్తు చేశారు. భారత ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ అత్యంత గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించారని, ఆయన సేవలు, సాధించిన విజయాలు అపూర్వమైనవి’ అంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.అయితే, ఈ లేఖపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ హేయమైన ప్రవర్తనకు ఇది ఉదాహరణ అని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ ఆరోపించారు. ఈ సందర్భంగా కేశవన్ మాట్లాడుతూ..‘స్మారకాలను నిర్మించే సంప్రదాయాల గురించి మోదీకి కాంగ్రెస్ లేఖరాయడం విడ్డూరంగా ఉంది. 2004 నుంచి 2014 వరకు పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. పీవీకి స్మారకం నిర్మించలేదు. కానీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో కేవలం ప్రధాని మోదీ ఆయనకు స్మారకం నిర్మించారు. 2024లో భారతరత్న ప్రకటించి సముచిత గౌరవం ఇచ్చారు. అంతేకాదు, ఢిల్లీలో పీవీ అంత్యక్రియలకు కాంగ్రెస్ పార్టీ కనీసం చోటు కూడా ఇవ్వలేదని మన్మోహన్ సింగ్ మీడియా సలహదారు సంజయ్ బారు తన పుస్తకంలో రాశారు. ఢిల్లీకి బదులు హైదరాబాద్లో నిర్వహించే విషయమై పీవీ పిల్లలతో సంజయ్ మాట్లాడానని తెలిపారు’ అని మండిపడ్డారు.ఇదిలా ఉండగా.. స్మారక చిహ్నంపై కేంద్రం హామీ ఇచ్చింది. మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం నిర్మిస్తామని ప్రకటించింది కేంద్రం. తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి ఎంపీ సుధాంశు త్రివేది మాట్లాడుతూ..‘మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. స్మారక స్థలి నిర్మాణానికి అవసరమైన భూమి, ట్రస్టు ఏర్పాటుకు కొంత సమయం పడుతుంది. కేంద్ర క్యాబినెట్ స్మారక స్థలి నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే కేంద్ర హోం మంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గేకు వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేస్తాము. మన్మోహన్ జీవించి ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ సముచితంగా గౌరవించలేదు. ఇప్పుడు ఆయన స్మారక నిర్మాణంపై రాజకీయాలు చేస్తోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
నిగమ్బోధ్ ఘాట్లో మన్మోహన్ అంత్యక్రియలు
-
ప్రణబ్ చనిపోతే మీరేం చేశారు.. కాంగ్రెస్పై శర్మిష్ఠా ముఖర్జీ సీరియస్
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పెద్దలపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ చనిపోయినప్పుడు మీరేం చేశారని కాంగ్రెస్ హైకమాండ్ను ఆమె ప్రశ్నించారు. ఇదే సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్కు ప్రత్యేక స్మారకం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలు లేఖ రాయడంపై ఆమె మండిపడ్డారు.మాజీ ప్రధాని మన్మోహన్కు ప్రత్యేక స్మారకం ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు. ఈ అంశంపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ స్పందించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ చనిపోయినప్పుడు మీరేం చేశారని కాంగ్రెస్ను శర్మిష్ఠా ముఖర్జీ ప్రశ్నించారు.తన తండ్రి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చనిపోతే నివాళులర్పించడానికి కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రపతులకు ఆ సంప్రదాయం పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తనకు చెప్పారని ఆమె అన్నారు. అయితే, తర్వాత అది నిజం కాదని ప్రణబ్ రాసుకున్న డైరీ ద్వారా తనకు తెలిసిందని శర్మిష్ఠ వెల్లడించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతల తీరుపై ఆమె మండిపడుతున్నారు.ఇదిలా ఉండగా.. 92 ఏళ్ల మన్మోహన్ అనారోగ్యంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. మన్మోహన్ పార్థివదేహాన్ని శనివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. అక్కడ ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పిస్తారని, అనంతరం 9:30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఉదయం 11:45 గంటలకు స్థానిక నిగమ్బోధ్ ఘాట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. త్రివర్ణ పతాకం చుట్టిన మన్మోహన్ పార్థివదేహాన్ని శుక్రవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉంచారు.When baba passed away, Congress didnt even bother 2 call CWC 4 condolence meeting. A senior leader told me it’s not done 4 Presidents. Thats utter rubbish as I learned later from baba’s diaries that on KR Narayanan’s death, CWC was called & condolence msg was drafted by baba only https://t.co/nbYCF7NsMB— Sharmistha Mukherjee (@Sharmistha_GK) December 27, 2024 -
ముగిసిన మన్మోహన్ అంత్యక్రియలు
ముగిసిన మన్మోహన్సింగ్ అంత్యక్రియలుసిక్కు సంప్రదాయం ప్రకారం జరిగిన మన్మోహన్ అంత్యక్రియలు#WATCH | Former Prime Minister #DrManmohanSingh laid to rest with full state honours after leaders and family paid last respects at Nigam Bodh Ghat in Delhi. (Source: DD News) pic.twitter.com/Kk9RMgOMz1— ANI (@ANI) December 28, 2024సిక్కు పెద్దల సమక్షంలో అంత్యక్రియలుమన్మోహన్ పార్థివదేహం వద్ద చివరిసారిగా ప్రార్థనలు చేసిన కుటుంబసభ్యులురెండవ ప్రపంచ యుద్ధంలో వాడిన తుపాకులను గాల్లోకి పేల్చి మాజీ ప్రధానికి సైనికుల గౌరవ వందనంసైనిక లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అంత్యక్రియలుఢిల్లీ నిగమ్బోధ్ స్మశానవాటికలో జరిగిన మన్మోహన్సింగ్ అంత్యక్రియలుసైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలుఅంత్యక్రియలకు హాజరైన రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, ప్రధాని మోదీ, ఎల్ఓపీ రాహుల్గాంధీ, భూటాన్ రాజు కేసర్ నామ్గేల్ వాంగ్చుక్, సోనియాగాంధీ, ఖర్గే, అమిత్ షా, ఇతర నేతలుమన్మోహన్ పాడె మోసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీసిక్కు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలుసిక్కు మతపెద్దల సమక్షంలో సిక్కు సంప్రదాయం ప్రకారం జరిగిన మన్మోహన్ అంత్యక్రియలుపార్థివదేహం వద్ద ప్రార్థనలు నిర్వహించిన కుటుంబ సభ్యులుచివరిసారిగా నివాళులర్పించిన ప్రధాని, రాష్ట్రపతిచివరిసారిగా మన్మోహన్కు నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని#WATCH | President Droupadi Murmu arrives at Nigam Bodh Ghat in Delhi to pay her last respects to former Prime Minister #DrManmohanSingh(Source: DD News) pic.twitter.com/bEIFkZzjpb— ANI (@ANI) December 28, 2024ఆర్థిక సంస్కర్తకు నివాళులర్పించిన త్రివిధ దళాలు#WATCH | Delhi: Prime Minister Narendra Modi pays his last respects to former Prime Minister #DrManmohanSingh at Nigam Bodh Ghat(Source: DD News) pic.twitter.com/0Uc3KUhKfg— ANI (@ANI) December 28, 2024 #WATCH | Delhi: Prime Minister Narendra Modi arrives at Nigam Bodh Ghat to attend the last rites of former Prime Minister #DrManmohanSingh.Former PM Dr Manmohan Singh died on 26th December at AIIMS Delhi(Source: DD News) pic.twitter.com/qJGKjCA59g— ANI (@ANI) December 28, 2024 #WATCH | Delhi: CPP Chairperson Sonia Gandhi pays her last respects to former Prime Minister #DrManmohanSingh at Nigam Bodh Ghat, where his last rites will be performed. pic.twitter.com/lYkFIg9Yht#WATCH | Delhi | Mortal remains of former Prime Minister #DrManmohanSingh at Nigam Bodh Ghat for his last rites.Former PM Dr Manmohan Singh died on 26th December at AIIMS Delhi.(Source: Congress) pic.twitter.com/HJFv8GAPYP— ANI (@ANI) December 28, 2024— ANI (@ANI) December 28, 2024— ANI (@ANI) December 28, 2024 మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభం.. మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఏఐసీసీ ఆఫీసు నుంచి నిగమ్బోధ్ ఘాట్ వరకు అంతిమ యాత్ర కొనసాగనుంది. మన్మోహన్ అంతిమయాత్ర వాహనంలోనే కూర్చున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకాసేపట్లో నిగమ్బోథ్ ఘాట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. మన్మోహన్కు వైట్హౌజ్ సంతాపంమన్మోహన్సింగ్ మృతిపట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపంప్రకటన విడుదల చేసిన వైట్హౌజ్ #WATCH | Delhi | Mortal remains of former Prime Minister #DrManmohanSingh being taken out of the AICC headquarters. pic.twitter.com/ouuAgsQ5qf— ANI (@ANI) December 28, 2024 కాంగ్రెస్ ఆఫీసుకు మన్మోహన్సింగ్ పార్థివ దేహం ఇంటి నుంచి కాంగ్రెస్ ఆఫీసుకు చేరుకున్న మన్మోహన్సింగ్ అంతిమయాత్ర మన్మోహన్ పార్థివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ఖర్గే#WATCH | Delhi | Mortal remains of former Prime Minister #DrManmohanSingh kept at AICC headquarters where the party workers will pay their last respects. pic.twitter.com/bhR8iS2dM4— ANI (@ANI) December 28, 2024#WATCH | Delhi | The mortal remains of former Prime Minister #DrManmohanSingh being taken from his residence for AICC headquarters. The mortal remains will be kept at AICC headquarters for the party workers to pay their last respects. pic.twitter.com/iD5JYG102s— ANI (@ANI) December 28, 2024ఏఐసీసీ ఆఫీసులో ప్రజల సందర్శన కోసం పార్థివ దేహంఇక్కడి నుంచి 9.30కు అంతిమయాత్ర ప్రారంభం11.45కు నిగంబోధ్ ఘాట్లో అంత్యక్రియలుకాంగ్రెస్ కార్యాలయం నుంచి మన్మోహన్ అంతిమయాత్రఏఐసీసీ ఆఫీసు నుంచి ప్రారంభం కానున్న మన్మోహన్ అంతిమయాత్రపార్టీ ఆఫీసుకు చేరుకున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, జైరాంరమేష్, పవన్ ఖేరా9.30కు అంతిమయాత్ర ప్రారంభం #WATCH | Delhi: Vehicle in which the mortal remains of former PM Dr Manmohan Singh will be kept, reaches outside the residence of #DrManmohanSinghFormer PM Dr Manmohan Singh died on 26th December at AIIMS Delhi. pic.twitter.com/xlZvCyWVfu— ANI (@ANI) December 28, 202411.45కు నిగంబోధ్ ఘాట్ స్మశానవాటికలో అంత్యక్రియలుకాసేపట్లో మన్మోహన్సింగ్ అంత్యక్రియలుమాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయిప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్సింగ్కు అంత్యక్రియలు నిర్వహించనున్నారుఉదయం 8 గంటల నుంచి ప్రజల సందర్శనార్థం మన్మోహన్సింగ్ పార్థివ దేహాన్ని కాంగ్రెస్ ఆఫీసులో ఉంచుతారుకాంగ్రెస్ ఆఫీసు నుంచి 9.30కు మన్మోహన్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది11.45కు నిగంబోధ్ ఘాట్ స్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి#WATCH | Delhi | Funeral march preparations underway at Nigambodh Ghat ahead of the last rites of former Prime Minister Dr Manmohan SinghFormer PM Dr Manmohan Singh died on 26th December at AIIMS Delhi. pic.twitter.com/smaZvtQDbR— ANI (@ANI) December 28, 2024మన్మోహన్ స్మృతి వనం నిర్మించేందుకు స్థలం కేటాయించాల్సిందిగా కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని కోరారుదీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందిఇప్పటికే ఏడు రోజులు సంతాపదినాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందిశుక్రవారం మన్మోహన్ పార్థివ దేహానికి ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము సహా పలువురు నేతలు నివాళి అర్పించారు -
మన్మోహన్కు అంతర్జాతీయ మీడియా నివాళులు
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మరణానికి అంతర్జాతీయ మీడియా సంతాపం తెలిపింది. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి బాటన నడిపిన నాయకుడని ప్రపంచ మీడియా ప్రశంసించింది. ఆర్థిక సంస్కరణల రూపశిల్పి: బీబీసీ 1991లో ఆర్థిక మంత్రిగా, 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా భారత ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడంలో మన్మోహన్సింగ్ కీలక పాత్ర పోషించారు. ఆయన కీలక సరళీకృత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి. భారత అత్యున్నత పదవిని నిర్వహించిన మొదటి సిక్కుగా చారిత్రక ప్రాముఖ్యత కలిగిన నేత. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పారు. పదవులు నచ్చని రాజు: రాయిటర్స్ మన్మోహన్ సింగ్.. పదవులు నచ్చని రాజు. భారత్లో అత్యంత విజయవంతమైన నాయకులలో ఒకరు. ఆయన పాలనలో జరిగిన ఆర్థిక వృద్ధి లక్షలాదిమందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చింది. గొప్ప ప్రధానిగా ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందినా.. సోనియాగాంధీ చేతిలోనే ప్రభుత్వం ఉందనే విమర్శలను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. దూరదృష్టిగల నేత: న్యూయార్క్ టైమ్స్ మన్మోహన్సింగ్ భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వేదికపైకి నడిపించిన దూరదృష్టి గల నేత, మృదుభాíÙ. పాకిస్తాన్తో సయోధ్య కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. సమగ్రతకు చిహ్నం: వాషింగ్టన్ పోస్ట్ మన్మోహన్సింగ్ టెక్నోక్రాట్ నుంచి ప్రధాని స్థాయికి నాటకీయంగా ఎదిగారు. భారత్–అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్రను పోషించారు. ఆయన హయాంలో జరిగిన ఇండో–యూఎస్ పౌర అణు ఒప్పందం ఒక మైలురాయి. సమగ్ర నాయకుడైన ఆయన శక్తిహీనులని ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన వ్యక్తి: బ్లూమ్బర్గ్ మన్మోహన్సింగ్ గొప్ప సంస్కర్త. 1990లలో భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో కీలక పాత్ర పోషించారు. అవినీతి కుంభకోణాలతో రెండో పర్యాయంలో ఆయన సవాళ్లు ఎదుర్కొన్నారు. ఇది పెట్టుబడిదారులను నిరాశపరిచింది. ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసింది. ఎల్లలెరుగని స్నేహితుడు: ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో మన్మోహన్సింగ్ పాత్ర అమోఘం. వేగవంతమైన ఆర్థిక వృద్ధికి ఆయన చేసిన కృషి, సంస్కరణలు ఆయన పదవీకాలంలో మైలురాళ్లు. సామాజిక విధానం, దౌత్యంలో ఆయన నాయకత్వం గొప్పది. 2జీ స్పెక్ట్రమ్ కేసు, బొగ్గు కుంభకోణం వంటి వివాదాలు ఆయన తర్వాతి కాలాన్ని దెబ్బతీశాయి. సౌమ్యుడైన నాయకుడు: అల్ జజీరా మన్మోహన్ సింగ్ సౌమ్య ప్రవర్తన కలిగిన టెక్నోక్రాట్. గొప్ప వ్యక్తిగత సమగ్రత కలిగిన నాయకుడు. దూర దృష్టితో సామాజిక, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. -
అసాధారణ వ్యక్తి
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన జ్ఞాపకాలు ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’పుస్తకంలో మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అసాధారణ నాయకత్వానికి నివాళులు అర్పించారు. ‘‘అసాధారణ జ్ఞానం ఉన్న వ్యక్తి. ఆర్థిక సంస్కరణల పట్ల. భారత ప్రజల శ్రేయస్సు పట్ల ఆయనకు నిబద్ధత, అంకితభావం, అచంచలమైన చిత్తశుద్ధి ఉంది. ఆయన లక్షలాది మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చారు. తెలివైన వ్యక్తి. ఆలోచనాపరుడు. నిజాయితీపరుడు. భారత ఆర్థిక వ్యవస్థపై (Indian Economy) మన్మోహన్ సింగ్ ప్రభావం మరిచిపోలేనిది. వృద్ధిని ప్రోత్సహించే, పేదరికాన్ని తగ్గించే, విద్య, ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చే విధానాలను అమలు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా), సమాచార హక్కు చట్టం వంటి తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు దేశంపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. తన పదవీకాలంలో విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ, ఆయన భవిష్యత్ పట్ల ఆశాజనకంగా ఉన్నారు’’. – అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన అంకితభావాన్ని గుర్తుంచుకుంటాం : అమెరికా మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల భారత ప్రజలకు అమెరికా ప్రగాఢ సంతాపం తెలిపింది. ‘‘అమెరికా–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి దారులేసిన గొప్ప ఛాంపియన్లలో మన్మోహన్ సింగ్ ఒకరు. గత రెండు దశాబ్దాల్లో మన దేశాలు కలిసి సాధించిన అనేక అంశాలకు ఆయన కృషి పునాది వేసింది. అమెరికా–భారత్ పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లారు. భారత వేగవంతమైన ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చిన ఆర్థిక సంస్కరణలకు స్వదేశంలో మన్మోహన్ సింగ్ గుర్తుండిపోతారు. డాక్టర్ సింగ్ మృతికి సంతాపం తెలుపుతున్నాం. అమెరికా, భారత్లను మరింత దగ్గర చేయడానికి ఆయన చూపిన అంకితభావాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాం’’అని అమెరికా ప్రకటించింది. ఆయన పర్యటన మైలురాయి ‘‘మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానికి మాల్దీవుల ప్రజల తరపున సంతాపం తెలుపుతున్నా. 2011 నవంబరులో మాల్దీవుల్లో ఆయన చేసిన చారిత్రాత్మక పర్యటన మన ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. అభివృద్ధి పట్ల డాక్టర్ మన్మోహన్సింగ్కు ఉన్న నిబద్ధత, ‘లుక్ ఈస్ట్ పాలసీ’ని బలోపేతం చేయడంలో ఆయన నాయకత్వం దక్షిణాసియా ప్రాంత అభివృద్ధికి, సహకారం పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ విపత్కర సమయంలో ఆయన కుటుంబానికి, భారత ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా’’ – డాక్టర్ మొహమ్మద్ ముయిజు, మాల్దీవుల అధ్యక్షుడు మన్మోహన్సింగ్ నాకు గురువు ‘‘డాక్టర్ మన్మోహన్ సింగ్ను నేను గురువుగా భావిస్తా. జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కూడా ఆర్థిక అంశాలపై డాక్టర్ సింగ్ సలహాలు తీసుకున్నారు. 2013లో యూరోజోన్ క్రైసిస్ మీటింగ్ నిర్వహించినప్పుడు ఆమె డాక్టర్ సింగ్ సహాయం కోరారు’’ – జపాన్ మాజీ ప్రధాని షింజో అబే -
ఆ మట్టి.. ఆ నీరు
శ్రీకృష్ణుడికి అటుకులు తీసుకొచ్చిన బాల్యమిత్రుడు కుచేలుడి కథ అందరికీ తెలిసిందే. అలాంటిదే డాక్టర్ మన్మోహన్సింగ్ (Manmohan Singh) జీవితంలోనూ జరిగింది. అవిభాజ్య భారత్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న గాహ్ (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది) అనే గ్రామంలో సింగ్ జన్మించారు. పాఠశాల చదువు అక్కడే పూర్తి చేశారు. 1947 విభజన తరువాత కుటుంబం భారత్కు వచ్చింది. కానీ ఆయన బాల్యమంతా ఆ గ్రామంతోనే ముడిపడి ఉంది. స్నేహితులు అక్కడే ఉండిపోయారు. 2004లో ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ వార్త స్వగ్రామానికి చేరకుండా ఉంటుందా? మిత్రులంతా ఆయనను గుర్తు చేసుకున్నారు. మన్మోహన్సింగ్కు ప్రాణమిత్రుడైన రాజా మహమ్మద్ అలీకి చిన్ననాటి స్నేహితుడు మన్మోహన్ను కలవాలనిపించింది. ఆయన చిన్నతనంలో మన్మోహన్సింగ్ను అలాగే పిలిచేవారు. తన సామర్థ్యం మేరకు కానుకలను పట్టుకుని 2008 మే నెలలో ప్రధాని నివాసానికి వచ్చారు. తనను కలవడానికి వచ్చిన చిరకాల మిత్రుడు అలీకి మన్మోహన్ మరిచిపోలేని ఆతిథ్యమిచ్చారు. అప్పుడు ఇద్దరిదీ డెబ్బై ఏళ్ల వయసు. కానీ బాల్య జ్ఞాపకాలతో ఇద్దరి కళ్లు మెరిసిపోయాయి. ఆ పూటంతా జ్ఞాపకాలతో గడిచిపోయింది. మిత్రుడికి తలపాగా, శాలువాతోపాటు టైటాన్ వాచ్ను తన గుర్తుగా ఇచ్చారు మన్మోహన్. ఇక అలీ తిరిగి వెళ్తూ.. మన్మోహన్కోసం తీసుకొచ్చిన ఊరి మట్టిని, నీటిని, గాహ్ ఫొటోను బహూకరించాడు. స్నేహంకోసం మట్టిని ఎల్లలు దాటించి ఒక మిత్రుడు తీసుకొస్తే.. సరిహద్దులు ఎన్నున్నా స్నేహం ఎల్లకాలం ఉంటుందనడానికి గుర్తుగా గడియారాలను పంపారు. అలా బాల్యమిత్రులు ఒకరిపై ఒకరి ప్రేమను చాటుకున్నారు. -
ఆర్థిక సంస్కర్తకు అశ్రు నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: దివికేగిన ఆర్థిక సంస్కర్త మన్మో హన్ సింగ్కి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధా నమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తదితర ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. త్రివర్ణ పతాకం చుట్టిన మన్మోహన్ పార్థివదేహాన్ని ఢిల్లీలోని ఆయన నివాసమైన 3, మోతిలాల్ నెహ్రూ రోడ్డుకు తరలించారు. నివాళులర్పించడానికి శుక్రవారం పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో నాయకులు, కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధికి మన్మోహన్ అందించిన సేవలను స్మరించుకున్నారు. మన్మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన భార్య గురుశరణ్ కౌర్ను ఓదార్చారు. ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జె.పి.నడ్డాతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాందీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు మన్మోహన్ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, హిమాచల్ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఢిల్లీ సీఎం అతిశీ, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే కూడా నివాళులర్పించారు. నేడు నిగమ్బోధ్ ఘాట్లో అంత్యక్రియలు దివంగత మాజీ ప్రధాని అంత్యక్రియలు శనివారం ఉదయం జరుగుతాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ చెప్పారు. మన్మోహన్ పారి్థవదేహాన్ని ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తామని, ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ప్రజలు సందర్శించవచ్చని తెలిపారు. 9.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు. శనివారం ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్ శ్మశాన వాటికలో మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలియజేసింది. పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని రక్షణ శాఖకు సూచించినట్లు పేర్కొంది. కేంద్ర మంత్రివర్గం సంతాపం మన్మోహన్ మృతి పట్ల కేంద్ర మంత్రివర్గం సంతాపం ప్రకటించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ శుక్రవారం సమావేశమైంది. మన్మోహన్ ఆత్మశాంతి కోసం తొలుత రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ప్రభుత్వంతోపాటు యావత్తు దేశం తరఫున సంతాపం తెలియజేశారు. అనంతరం సంతాప తీర్మానం ఆమోదించారు. మహోన్నత రాజనీతిజు్ఞడు, ఆర్థికవేత్త, గొప్ప నాయకుడిని దేశం కోల్పోయిందని తీర్మానంలో పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా ఆయన మనందరిపై బలమైన ముద్ర వేశారని కొనియాడారు. మన్మోహన్ గౌరవార్థం ప్రభుత్వం ఏడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. సీడబ్ల్యూసీలో సంతాప తీర్మానం ఆమోదం మన్మోహన్ సింగ్కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నివాళులర్పించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యా లయంలో భేటీ అయ్యింది. సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ హాజరయ్యారు. మన్మోహన్కు సంతాపం ప్రకటిస్తూ ఒక తీర్మా నం ఆమోదించారు. భారత రాజకీయాల్లో, ఆర్థిక వ్యవస్థలో అగ్రగణ్యుడు మన్మోహన్ అని కొనియాడారు. ఆయన కృషితో ప్రపంచస్థాయిలో మన దేశానికి ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభించాయని పేర్కొన్నారు. దేశంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన మన్మోహన్ చిరస్మరణీయులని ఉద్ఘాటించారు. ప్రజల తలరాతలు మార్చేలా ఎన్నో విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత ఆయనదేనని ప్రశంసించారు. ఢిల్లీలో స్మారక చిహ్నం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు దేశ రాజధాని ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమాచారాన్ని కాంగ్రెస్కు కూడా అందించినట్లు శుక్రవారం ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఇందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు కొంత సమయం పడుతుందని తెలిపాయి. అయినప్పటికీ ఈ అంశంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని విమర్శించాయి.అదే సంప్రదాయం పాటించాలి: ఖర్గే ఢిల్లీలో మన్మోహన్ సింగ్కు స్మారకం నిర్మించడానికి వీలైన చోటేఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి రెండు పేజీల లేఖ రాశారు. మన మాజీ ప్రధానమంత్రులకు, రాజనీతిజు్ఞలకు అంత్యక్రియలు జరిగిన చోటే స్మారకం నిర్మించారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే సంప్రదాయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి మన్మోహన్ అందించిన విశిష్టమైన సేవలను ఖర్గే తన లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతకముందు ఆయన ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. మన్మోహన్ స్మారక నిర్మాణంపై చర్చించారు. మన్మోహన్ శాశ్వత విశ్రాంతి తీసుకొనే ప్రదేశాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని, అదొక పవిత్రమైన స్థలంగా ఉండాలని పేర్కొన్నారు. -
విలక్షణ జ్ఞాని... విధేయ ప్రధాని!
ఆర్థిక రంగంలో, మిశ్రమ రాజకీయాల్లో ఆయన భిన్న పాత్రలు పోషించినా... కేవలం సోనియా విధేయుడిగా మాత్రమే కొందరు మాట్లాడటం పాక్షికత్వాన్నే చెబుతుంది. నిస్సందేహంగా ఆయన దేశ సమగ్రతకూ, మానవీయ విలువలకూ విధేయుడిగా కనిపిస్తాడు. వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆయన అత్యధికంగా గౌరవించారంటే ఈ కొలబద్దలే కారణం. ‘వైఎస్ అక్కడ ఉన్నారు గనకే నేను ఇక్కడ ఉన్నాను’ అని ప్రధాని తనతో చెప్పేవారని మీడియా సలహాదారు సంజయ్ బారు ఇటీవల కూడా వెల్లడించారు. ‘మౌన ముని’ కాదు... మొండిమనిషిఅసహన రాజకీయాలూ, దూషణలూ– దుర్భాషలూ తాండవిస్తున్న ఈ రోజుల్లో కూడా... దశాబ్దకాలపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను దేశం మొత్తం ఏకోన్ము ఖంగా గౌరవించడం ఆయన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది. తన అధ్యయనం, అనుభవం, అంతర్గత విలువలు ఆయనను అందరికీ ప్రీతిపాత్రుణ్ణి చేశాయి. సరళీకరణ విధానా లతో పూర్తిగా, కచ్చితంగా విభేదించే వామపక్షాల వంటివి కూడా ఆయన లౌకిక నిబద్ధతను గౌరవించాయి. రాజకీయంగా బద్ధ శత్రువైన బీజేపీ నేతలు కూడా ఆర్థిక రంగంలో మన్మోహన్ ముద్రలను కీర్తిస్తున్నారు.బొత్తిగా పొసగని ఈ భిన్న శిబిరాల మన్ననకు పాత్రుడవడం ఆయనకే చెల్లింది. ఆర్థిక రంగంలో, మిశ్రమ రాజకీయాల్లో ఆయన భిన్న పాత్రలు పోషించినా... కేవలం, సోనియా విధేయుడుగా మాత్రమే కొందరు మాట్లాడటం పాక్షికత్వాన్నే చెబుతుంది. నిస్సందేహంగా ఆయన దేశ సమగ్రతకూ, మానవీయ విలువలకూ విధేయుడిగా కనిపిస్తాడు. వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆయన అత్యధికంగా గౌరవించారంటే ఈ కొలబద్దలే కారణం.‘వైఎస్ అక్కడ (ఉమ్మడి ఏపీలో) ఉన్నారు గనకే నేను ఇక్కడ ఉన్నాను’ అని ప్రధాని తనతో ఎప్పుడూ చెప్పేవారని మీడియా సలహాదారు సంజయ్ బారు ఇటీవల కూడా వెల్లడించారు. యాదృచ్ఛిక లేదా అనూహ్య ప్రధాని ఆని ఆయనపై పుస్తకమే రాసిన సంజయ్ బారు స్వయంగా చేసిన ఈ వ్యాఖ్యలు మన్మోహన్ మనస్తత్వాన్నీ, వ్యక్తిత్వాన్నీ చెబుతాయి. వైఎస్ హయాంలో ఎన్నో పథకాలకూ, కార్యక్రమాలకూ మన్మోహన్ ఇష్టపూర్వకంగా వచ్చేవారు. వామపక్షాల చొరవతో మొదలైన ‘గ్రామీణ ఉపాధి పథకా’న్ని అనంతపురంలోనే ప్రారంభించారు. విభజన ఉద్యమంతో తెలంగాణ విభజన చట్టాన్ని ఆమోదించడం ఒకటయితే... ఆలస్యంగానైనా ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించడం రెండు రాష్ట్రాలతో ఆయన బంధాన్ని బలోపేతం చేసింది.1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్న మవ్వడం, పీవీ నరసింహారావు ప్రధాని పదవి చేపట్టడం కాస్త అటూ ఇటూగా జరిగాయి. అప్పటి వరకూ అనుసరించిన అలీన, స్వావలంబన విధానాల నుంచి విడగొట్టుకుని... కార్పొరేట్, ప్రైవేటీకరణ విధానాల వైపు మరలే ప్రక్రియను జాగ్రత్తగా అమలు చేయడానికి మన్మోహన్ సరైన వ్యక్తి అని పీవీతో పాటు ఆ వర్గాలు కూడా భావించాయనేది నిర్వివాదాంశం. మళ్లీ 2004లో సోనియాగాంధీ ప్రధాని పదవి చేపట్టరాదని నిర్ణయించుకున్నాక ఆ స్థాయిలో విశ్వసనీయత, విషయజ్ఞత ఉన్న నేతగా మన్మోహన్నే ఎంచుకోవడంలో ఆశ్చర్యం లేదు. వ్యక్తిగతంగా ప్రణబ్ ముఖర్జీ సమర్థుడైనా ఆ విధంగా ఆమె ఆధారపడగల పరిస్థితి ఉండదు. వామపక్షాల మద్దతుపై ఆధారపడి ఏర్పడిన యూపీఏ–1కు సారథ్యం వహించడమంటే భిన్న కోణాలను సమన్వయం చేయవలసి ఉంటుందనీ తెలుసు. చిల్లర వ్యాపారంలో విదేశీ కంపెనీలకు ద్వారాలు తెరవడంతో మొదలై అమెరికాతో అణు ఒప్పందంతో పరాకాష్ఠకు చేరిన విభేదాలు వామపక్షాలను దూరం చేయడం ఊహించిన పరిణామమే. తర్వాత కాలంలో పదవులు, ప్రయోజనాల బేరాలు తప్ప మరే విధాన సమస్యలు లేని ప్రాంతీయ మిత్రులను నిలబెట్టుకోవడానికీ, ఇష్టం లేని వారిని మంత్రులను చేయడంతో సహా ఆయన చాలా విన్యాసాలే చేయవలసి వచ్చింది. రక రకాల ఆరోపణలు, కుంభకోణాల కేసులతో పెనుగులాడవలసి వచ్చింది. ఆ క్రమంలోనే మిశ్రమ ప్రభుత్వం గనక రాజీ పడాల్సి వచ్చిందని ఆయన బాహాటంగా ఒప్పేసుకున్నారు. చివరకు మీడియా ఛానళ్ల అధినేతలతో సమావేశమై... యూపీఏ అంటేనే అవినీతి అన్నట్టు చిత్రించవద్దని అభ్యర్థించాల్సి వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయమేమంటే... ఇన్ని ఆరోపణల మధ్యనా ఎవరూ ఆయన నిజాయితీని శంకించడం గానీ, తనకు వ్యక్తిగత బాధ్యత ఆపాదించడం గానీ జరక్కపోవడం!2014 ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలోనే వెలువడిన సంజయ్ బారు పుస్తకంలో... ప్రధానిగా మన్మోహన్ ఫైళ్లు సోనియాగాంధీకి పంపించిన తర్వాతే నిర్ణయాలు తీసుకునేవారని ఆరోపించడంతో బీజేపీ వారు రంగంలోకి దిగిపోయారు. ఇది మోదీ బృందం ప్రచారానికి అస్త్రంగా వేసిన అభాండమని నాటి ప్రధాని కార్యాలయం ఖండించింది. అణు ఒప్పందం కుదరకపోతే రాజీనామా చేస్తానని అధిష్ఠానానికి సంకేతాలు ఇవ్వడం కూడా ఆయన ఎంత మొండి మనిషో నిరూపించింది. ఆర్థిక మంత్రిగా ఇన్ని తీవ్ర నిర్ణయాలు ఎలా తీసుకున్నారంటే... ఎప్పుడూ జేబులో రాజీనామా లేఖ పెట్టుకుని తిరిగేవాడినని ఆయన ఇచ్చిన జవాబులో చాలా ఆర్థముంది. రాజీవ్ గాంధీ దారుణ హత్య తర్వాత అనూహ్య పరిస్థితుల్లో పీవీ నరసింహారావు ప్రధాని అవడం, తనను ఆర్థికమంత్రిగా ఎంపిక చేయడం వెనక ఉన్న బలీయమైన పాలక వర్గాలేవో ఆయనకు తెలుసు.మోదీని ప్రధాని అభ్యర్థిగా ముందుకు తెచ్చిన కొత్తలో మన్మోహన్ను తీవ్రంగానే ఢీకొన్నారు. మోదీ వచ్చాక దర్యాప్తు సంస్థలు ఆయనకు నోటీసులు పంపించాయి. అయినా తగ్గకుండా నిలబడ్డారు. నోట్లరద్దును చారిత్రక ఘోరతప్పిదం అని నిప్పులు కక్కారు. చక్రాల కుర్చీలో వచ్చి మరీ సభలో ఓటేశారు. అనారోగ్యంలోనూ మొన్నటి ఏప్రిల్ దాకా రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడిగానే ఉన్నారు. ఆయనను ‘మౌన ముని’గా బీజేపీ అపహాస్యం చేసింది కానీ కీలక విషయాల్లో మౌనంగా లేరు. వాస్తవానికి నోట్ల రద్దు నుంచి అదానీ వ్యవహారం వరకూ చాలా విషయాల్లో మోదీయే సభలో సమాధానమివ్వకుండా మౌనం పాటించారు. మన్మోహన్ను, గాంధీ కుటుంబాన్నీ ప్రత్యర్థులుగా చూపడానికి ఎన్నిసార్లు ఎంత రెచ్చగొట్టినా మాజీ ప్రధాని సంయమనం వీడలేదు. ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ తన ప్రభుత్వ ఉత్తర్వును చించి వేసి ఆధిక్యత చూపించినా భరించారే గాని భగ్గుమనలేదు. దీన్ని అతి విధేయత అనాలా సంయమనం అనాలా అన్నది వారి కోణాలను బట్టి ఉంటుంది. అయితే వాజ్పేయి వంటి దిగ్గజానికి మోదీ వంటి పరివార్ అగ్గి బరాటాకు మధ్యలో తొలి ఏకైక సిక్కు ప్రధానిగా తన స్థానం నిలబెట్టుకోవడం చిన్న విషయమేమీ కాదు. మన్మోహన్ స్వయంగా ఒకసారి కోరినట్టు... దేశం, చరిత్ర ఆయన పట్ల నిర్దయగా కాక వాస్తవికంగా గౌరవంగానే వ్యవహరిస్తున్నాయి. మూడో దీర్ఘకాల ప్రధానిగా ఇక ముందు కూడా మన్మోహన్ సింగ్కు ఓ ప్రత్యేక స్థానముండనే ఉంటుంది! వ్యాసకర్త సీనియర్ సంపాదకులు, విశ్లేషకులు- తెలకపల్లి రవిసంస్కరణల సారథిభారతదేశం గర్వించదగిన వ్యక్తులలో భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఒకరు. 90వ దశకంలో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించి భారత దేశ ఆర్థిక గమనాన్ని మార్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. 1991లో భారత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి సంక్షోభంలో పడిన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు సాహసోపేతమైనవి. 1990లో చంద్రశేఖర్ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతున్న కాలంలో రెండు అంకె లతో ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం, రుణ భారంతో పెరిగిన కోశలోటు, మూడు వారాలకి కూడా సరిపోని విదేశీ మారక ద్రవ్య నిల్వలు, పడిపోతున్న ఆర్థిక వృద్ధిరేటు, పెరిగిపోతున్న నిరుద్యోగం, పేదరికంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను... దేశ ఆర్థిక మంత్రి అయిన తర్వాత గాడిలో పెట్టడం, 2008లో వచ్చిన ఆర్థికమాంద్యాన్ని తట్టుకొని భారత్ నిలబడేలా చేయడం వంటివాటిలో మన్మోహన్ కృషి అజరామరం. నేడు భారత్ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి మూడవ స్థానం వైపుకి అడుగులు వేయటానికి మన్మోహన్ సింగ్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలే పునాది వేశాయి. రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా, యూజీసీ చైర్మన్గా, అంతర్జాతీయ వ్యాపార అర్థశాస్త్రంలో నిష్ణాతుడైన ప్రొఫెసర్గా, ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా, ఆర్థిక మంత్రిగా, భారత ప్రధాన మంత్రిగా... భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన గోడలు నిర్మించారనే చెప్పాలి. ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటాను పెంచే క్రమంలో తాను రూపొందించిన ఎగుమతులు– దిగుమతుల (ఎగ్జిమ్ పాలసీ) విధానం, విదేశాంగ విధానం భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాయి. 1991 బడ్జెట్లో 1992 నూతన సరళీకరణ ఆర్థిక విధాన ప్రకటనతో భారత ఆర్థిక వ్యవస్థసంకెళ్లను తెంచి ప్రపంచంతో పోటీపడే విధంగా ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దిన తీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. బంగారాన్ని తాకట్టుపెట్టి విదేశీ మారక ద్రవ్య నిల్వలను సమకూర్చుకునే స్థాయి నుండి నేడు ప్రపంచంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో భారత్ని 8వ స్థానంలో నిలబెట్టే స్థాయికి పునాదులు వేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్. పది సంవత్సరాలు వరుసగా ప్రధానమంత్రిగా తాను తీసుకున్న అనేక విప్లవాత్మక నిర్ణయాలు దేశ ప్రజల మనః ఫలకంపై చెరగని ముద్రవేశాయి. 2005లో సమాచార హక్కు చట్టం, అమెరికాతో పౌర అణు ఒప్పందం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం), గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్యం లేని వారి ఉపాధి కోసం చేసిన ‘ఉపాధి హామీ చట్టం’ (ఎంజీఎన్ఆర్ఈజీఏ) ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్), 2013లో తెచ్చిన భూ సేకరణ చట్టం, ఆహార భద్రతా చట్టాలు, ఆధార్ కార్డ్, రైతు రుణమాఫీ దేశ పాలన వ్యవస్థలో మైలు రాళ్లుగా నిలబడిపోయాయి. ‘దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి బయటపడవేసి ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికీ, స్థిరమైన వృద్ధిని సాధించడానికీ ఆర్థిక సంస్క రణలను ప్రారంభిస్తున్నాము. ఎవరి మెప్పు కోసమో ఆర్థికసంస్కరణలను ప్రారంభించడం లేద’ని నాడు తాను చెప్పిన మాటలు నేడు నిజమైనాయి. మాటల కంటే నిశ్శబ్దంగా పనిచేయటా నికి ప్రాధాన్యత ఇచ్చే మన్మోహన్ సింగ్ నిరాడంబర వ్యక్తిత్వం గల వివాదరహితునిగా పేరు తెచ్చుకున్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యులైన పి.వి. నరసింహారావుని భారత ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించిన విధంగానే మన్మోహన్ సింగ్కి కూడా భారతరత్న అవార్డు ఇవ్వాలి. ఆ పురస్కారానికి ఆయన అన్ని విధాలా అర్హులు. -వ్యాసకర్త కాకతీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ ‘ 98854 65877-డా‘‘ తిరునహరి శేషు -
స్టాక్ మార్కెట్ మన్మోహనుడు
దశాబ్దకాలంపాటు దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్ హయాంలో స్టాక్ మార్కెట్లు లాభాల దుమ్మురేపాయి. మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ దాదాపు 400 శాతం దూసుకెళ్లింది. వెరసి 10 ఏళ్లలో 8 సంవత్సరాలు లాభాలు పంచింది. 2006–07లో 47 శాతం జంప్చేయగా.. 2009లో మరింత జోరు చూపుతూ 81 శాతం ఎగసింది. వివరాలు చూద్దాం.. పలు కీలక నిర్ణయాలుఆర్థిక మంత్రిగా (1991–96) ఉన్నప్పటి నుంచే క్యాపిటల్ మార్కెట్లలో సంస్కరణలకు బీజం వేశారు మన్మోహన్ సింగ్. భారతీయ ఆర్థిక వ్యవస్థలను ఆధునీకరించడం, అంతర్జాతీయ స్థాయిలో పటిష్టం చేసే విధానాలకు రూపకల్పన చేసారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 1988లోనే ఏర్పాటైనప్పటికీ 1992లో సెబీ చట్టం ద్వారా దానికి చట్టబద్ధమైన అధికారాలు అందించారు. దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పారదర్శకతను పెంపొందించేందుకు, ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సెబీ ఒక పటిష్టమైన నియంత్రణ సంస్థగా మారేందుకు ఇది తోడ్పడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు కూడా భారతీయ స్టాక్ మార్కెట్లలో ప్రవేశం కలి్పంచడం ద్వారా మార్కెట్లో లిక్విడిటీకి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి మన్మోహన్ సంస్కరణలు దోహదపడ్డాయి.బుల్ పరుగుకు దన్ను మన్మోహన్ సింగ్ దేశానికి ఆర్థిక స్వేచ్చను కలి్పంచిన గొప్ప శిల్పి. 1991లో సంస్కరణలతో దేశీ స్టాక్ మార్కెట్లలో బుల్ రన్కు తెరతీశారు. వ్యాపారాలు భారీగా విస్తరించాయి. దీంతో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 1,000 పాయింట్ల స్థాయి నుంచి జోరందుకుంది. 780 రెట్లు ఎగసి ప్రస్తుతం 78,000 పాయింట్లకు చేరుకుంది. ఫలితంగా దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు అత్యుత్తమ రిటర్నులు అందించింది. – వీకే విజయకుమార్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్సంస్కరణల జోష్ ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ 1991లో చేపట్టిన సంస్కరణలు దేశీ క్యాపిటల్ మార్కెట్లలో చెప్పుకోదగ్గ మార్పులకు కారణమయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు జోష్నిచ్చాయి. ఆధునిక భారత్కు బాటలు వేశాయి. లైసెన్స్ రాజ్కు చెక్ పెట్టడంతోపాటు, స్వేచ్చా వాణిజ్యం, స్టాక్ మార్కెట్లలో పారదర్శకత, జవాబుదారీతనానికి ఆయన దారి చూపారు. విదేశీ ఇన్వెస్టర్లకు భారత్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. – పల్కా అరోరా చోప్రా, డైరెక్టర్, మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ 4,961 నుంచి 24,693కు మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదవిలో ఉన్న 2004 నుంచి 2014వరకూ పరిగణిస్తే సెన్సెక్స్ 4,961 పాయింట్ల నుంచి 24,693 వరకూ దూసుకెళ్లింది. ఈ కాలంలో మూడేళ్లు మినహా ప్రతీ ఏటా ఇండెక్స్ లాభాల బాటలో నే సాగడం గమనార్హం! ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా 2008లో ఇండెక్సులు పతనంకాగా.. 2011, 2014లోనూ మార్కెట్లు వెనకడుగు వేశాయి. 2011లో సెన్సెక్స్ అత్యధికంగా 27% క్షీణించింది. ఆరి్థక మంత్రిగా మన్మోహన్ 1991లో చేపట్టిన సంస్కరణలు ఆరి్థక వ్యవస్థకు జోష్నివ్వడంతో టర్న్అరౌండ్ అయ్యింది. విదేశీ పెట్టుబడులు భారీగా తరలివచ్చాయి. బక్కచిక్కిన రూపాయి బలోపేతమైంది. ప్రధానంగా విదేశీ మారక నిల్వలు భారీగా ఎగశాయి.సెన్సెక్స్ పరుగు ఏడాది లాభం(%) 2004 33 2005 42 2006 47 2007 47 2009 81 2010 17 2012 26 2013 9 -
ఫైనాన్స్లో దిట్ట.. అయినా వాటి జోలికి వెళ్లలేదు!
"సర్దార్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ" అని పిలిచే భారత మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ( Manmohan Singh ) కన్నుమూశారు. ఫైనాన్స్ పట్ల అసమానమైన అవగాహన ఉన్న ఆయన దేశ ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా ( Prime Minister ) పనిచేశారు. ఆర్థిక సంస్కర్తగా ( Economic Reforms ) ఘనత వహించిన మన్మోహన్ సింగ్ ఎక్కడ ఇన్వెస్ట్ (invest ) చేసేవారు.. ఆయన పొదుపు ప్రణాళికల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.సంప్రదాయ పెట్టుబడులకు ప్రాధాన్యత1991లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయినప్పుడు సెన్సెక్స్ 999 పాయింట్ల వద్ద ఉండేది. ఆయన సంచలనాత్మక బడ్జెట్ సంస్కరణల తరువాత ఆ సంవత్సరం చివరి నాటికి సెన్సెక్స్ ( Sensex ) దాదాపు రెండింతలు పెరిగింది. భారతదేశ ఆర్థిక రూపును దిద్దడంలో ముఖ్యమైన పాత్ర ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయలేదు. ఫిక్స్డ్ డిపాజిట్లు ( FD ), పోస్టాఫీసు పొదుపు పథకాలు వంటి సాంప్రదాయ పెట్టుబడి సాధనాలకు ప్రాధాన్యత ఇచ్చారు.ఎఫ్డీలు, పోస్టాఫీసు పొదుపులుప్రధానమంత్రిగా ఆయన 2013 అఫిడవిట్ ప్రకారం.. మన్మోహన్ సింగ్ మొత్తం ఆస్తుల విలువ రూ. 11 కోట్లు. మన్మోహన్ సింగ్, ఆయన సతీమణి గురు శరణ్ కౌర్ ఇద్దరూ కలిసి రూ. 1 లక్ష నుండి రూ. 95 లక్షల విలువైన ఎనిమిది ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టారు. 2013 నాటికి వారి ఎప్డీలు, బ్యాంకు సేవింగ్స్ మొత్తం రూ. 4 కోట్లు కాగా వారి పోస్టాఫీసు ( Post office ) పొదుపు రూ. 4 లక్షలు.ఆస్తులు ఇవే.. 2019 నాటికి మన్మోహన్ సింగ్ ఆస్తుల విలువ రూ. 15 కోట్లు. ఢిల్లీ, చండీగడ్లోని ఆయన ఆస్తుల విలువ రూ. 7 కోట్లు. ఇక గురుశరణ్ కౌర్ వద్ద రూ. 3 లక్షల విలువైన 150 గ్రాముల బంగారం ఉండగా వారి బ్యాంకు ఎఫ్డీలు, సేవింగ్స్ రూ. 7 కోట్లు ఉన్నాయి. అదనంగా, వారు జాతీయ పొదుపు పథకం ( NSS )లో రూ.12 లక్షలు పొదుపు చేశారు.ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనంమన్మోహన్ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం. ఉదాహరణకు 2013 ఫిబ్రవరి 2 నుండి క్రమశిక్షణతో కూడిన ఆయన ఆర్థిక ప్రణాళికను పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. ఆ రోజున ఆయన మూడు ఎఫ్డీలలో రూ.2 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మూడేళ్లలో ఇవి రూ. 2.62 కోట్లు అయ్యాయి. ఈ మొత్తాన్ని తిరిగి పెట్టుబడి పెట్టారు. ఆరేళ్లలో ఆయన సంపద రూ.4 కోట్లకు చేరింది. ఈ క్రమశిక్షణతో కూడిన విధానం ఆయన పెట్టుబడులును సురక్షితంగా, ఒత్తిడి లేకుండా ఉండేలా చూసింది.స్టాక్ మార్కెట్కు దూరంఫైనాన్స్ మీద అపారమైన అవగాహన ఉన్నప్పటికీ అధిక రాబడి కోసం మన్మోహన్ సింగ్ ఎన్నడూ స్టాక్ మార్కెట్ ( Stock market ) జోలికి వెళ్లలేదు. 1992లో స్టాక్ మార్కెట్ అస్థిరత సమయంలో అప్పటి ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ‘స్టాక్మార్కెట్ను తలుచుకొని నా నిద్రను చెడగొట్టుకోను’ అంటూ స్టాక్ మార్కెట్పై తన అంతరంగాన్ని పార్లమెంటులో వెల్లడించారు. -
అసలు సిసలు విజనరీ..
అదేంటి మావాడు పోస్టాఫీసులో రన్నర్గా పంజేస్తున్నాడు.. పర్మినెంట్ కాదు గానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం.. కట్నం కింద సైకిల్.. నేషనల్ టూ ఇన్ వన్ టేప్ రికార్డర్ ఇవ్వాల్సిందేఒరేయ్ రాముడూ బామ్మ సీరియస్.. స్టార్ట్ ఇమీడియట్లి అని హైదరాబాద్లో మీ అన్నకు టెలిగ్రామ్ పంపరాఒసేయ్ గీతా.. నీకు కొత్త పుస్తకాలు ఎందుకే.. మీ అక్క పాత బుక్స్ ఉన్నాయిగా అవి కొత్త అట్టలు వేసుకుని వాడుకోమొన్న దసరాకే లాగు చొక్కా కొన్నాను.. మళ్ళీ సంక్రాంతికి కొనాలంటే ఎలా..మళ్ళీ వచ్చే సారి చూద్దాంలేచుట్టాలొచ్చారు.. పప్పు.. గుడ్డు వండి అప్పడాలు వేయించాలిఒరేయ్ చింటూ సైకిల్ బాగా కడిగి..తుడిస్తే నీకు సాయంత్రం ఓ అరగంట తొక్కనిస్తాఢిల్లీ వెళ్ళాలంటే మాటలా రైల్లో మూడురోజులు పడుతుంది మరిఆకాశవాణిలో పుష్ప సినిమా సంక్షిప్త శబ్ద చిత్రం వచ్చిందట పెట్టాండర్రఈసారి పెళ్లి బంతిలో మొదట వేసే లడ్డూను జేబులో దాచేసి ఇంకో లడ్డూ అడగాలిపెళ్లవ్వగానే ఆయన వెళ్ళిపోయారు. లెటర్స్ వస్తున్నాయి కానీ ఆయన్ను చూస్తే బావుణ్ణు.. ఉత్తరాల్లో మనిషి కనిపిస్తే ఎంత బావుణ్ణుఅసలు ఈ పట్ట పగలు ఫుల్ చార్జి పే చేసి ఫోన్ ఎందుకు చేయాలి..రాత్రి పది తరువాత ఐతే హాఫ్ చార్జి ఉండేదిగాఒరేయ్ నాగులూ నాన్న ప్యాంట్ కాస్త సైజ్ చేసి వాడుకోరా నీకు సరిపోతుందిఅమెరికాలో జేబులో పెట్టుకునే ఫోన్లు ఉన్నాయట తెలుసా?ఎన్నైనా చెప్పు..రాజ్ దూత్ అంబాసిడర్..ఈ రెండూ భూమి ఉన్నంత వరకూ ఉంటాయ్బ్యాంకులో ఖాతా ఉండడం అంటే మాటలా.. అమ్మో ఆయనకు ఎంత పరపతి..మేం బ్లాక్ అండ్ వైట్ టివి మాత్రమే ఇస్తాం..కలర్ టీవీ ఇవ్వలేం.. సంబంధం క్యాన్సిల్ ఐనా ఫర్లేదు.. మేం తూగలేమురామారావు అప్పుడే బజాజ్ చేతక్ కోసం మొడువేలు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేశాడట.. అంటే ఆయన బయటి ఆదాయం ఎంత ఉందో మరిఎదురింటి లక్ష్మి గోద్రెజ్ పఫ్ ఫ్రిజ్ కొనింది.. మొగుడు బానే సంపాదిస్తున్నాడునేను ఎంత రాత్రయినా కానీ మీ అన్నయ్య వచ్చాకే వంట చేస్తాను.. మాకు గ్యాస్ పొయ్యి ఉందిగా వదినా..ఇదీ మన్మోహన్ సింగ్ అనే ఒక ఆర్థిక మేధావి లేకుంటే భారతదేశ పరిస్థితి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన్నుంచి 1990ల వరకూ దేశం ఇలాగే ఉండేది. ఏ మూల చూసినా నిరుద్యోగం. వెనుకబాటు.. ఒక చిన్న ఉద్యోగం కోసం పోరాటం.. ఇంటిల్లిపాదీ ఆ ఉన్న కొద్దిపాటి పొలంపైనే జీవనం. మూడు నెలలు పని ఉంటే మిగతా తొమ్మిది నెలలూ ఖాళీగా ఉండడమే. ఎకరాకు 18-20 బస్తాల ధాన్యం పండితే గొప్ప. అసలు ఇంత పెద్ద దేశానికి మన్మోహన్.. పీవీ నరసింహారావు వంటివాళ్లు ప్రధానులు.. అర్థికమంత్రులు కాకపోయి ఉంటే దేశం ఆకలితో అల్లాడిపోయేది. ఒరిస్సాలోని కలహండి ఒక్కటే కాదు దేశం నలుమూలలా ఆకలి చావులు ఉండేవి. దేశంలో ఇన్ని పరిశ్రమలు.. ఇంత ఉత్పత్తి.. ఇన్ని లక్షల ఉద్యోగాలు.. ఈ స్థాయి ఆదాయం ఉండేదే కాదు. ఇప్పుడు మన కళ్లముందు ఉన్న భారత దేశం అనే చిత్తరువు మన్మోహన్.. పీవీ అనే విజనరీ చిత్రకారులు తమ మనో నేత్రంతో ఊహించి గీసిన చిత్తరువే ఈ ఆధునిక భారతదేశం. వేలాది ఆటోమొబైల్ పరిశ్రమలు.. పోర్టులు.. టూరిజం..ప్రైవేటు బ్యాంకులు.. చెప్పులు.. వస్త్రాలు.. మొబైల్ ఫోన్లు ..దేశంలో వేసిన రహదారులు.. ఎయిర్పోర్ట్ లు..ప్రైవేటు విమానయాన సంస్థలు.. విద్యుత్ ప్రాజెక్టులు... రైల్వే లైన్లు.. ఐస్ క్రీములు.. ఆఖరుకు ఫ్లేవర్డ్ కండోమ్స్.. కోట్లలో ఉద్యోగాల కల్పన.. ఇవన్నీ ఆ ఇరువురి చలవే..అన్నిటికీ మించి భారత సాఫ్ట్వేర్ రంగం మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేసింది. దానిద్వారా ఉత్పన్నమైన సంపద దేశ రియల్ ఎస్టేట్.. నిర్మాణ రంగాన్ని సమున్నతంగా నిలిపింది.. ఇలా ఆ దర్శనికులు ఆనాడు శ్రీకారం చుట్టి మొక్కగా వేసిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చాయి. అంతర్జాతీయంగా మనను సగౌరవంగా నిలబెట్టింది. దేశానికి ఎంతోమంది ప్రధానులుగా పని చేసినా పీవీ.. మన్మోహన్ అనే జోడుగుర్రాలు మాత్రమే దేశాన్ని పేదరికం స్థాయి నుంచి మరో మెట్టు పైకి ఎక్కించారు.. ఇప్పుడు భారత్ పేద దేశం కాదు.. ఎన్నో రంగాల్లో ప్రపంచాన్ని శాసిస్తున్న ఒక మహా మేరు పర్వతమిది.. దీనికి ఇంధనం.. శక్తి నింపింది ఆ ఇద్దరే . మరోమారు ఆ మౌనముని మన్మోహన్ సింగ్కు అంజలి ఘటిస్తూ.. -సిమ్మాదిరప్పన్న -
మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి పీఎం నరేంద్ర మోదీ నివాళి
-
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బయోపిక్.. ఏ ఓటీటీలో చూడాలంటే?
భారత మాజీ ప్రధానమంత్రి, డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. మనదేశానికి ఆర్థికమంత్రిగా, ప్రధానిగా ఎన్నో ఏళ్లపాటు సేవలందించారు. ఈ సందర్భంగా ఆయన మృతిపట్ల దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ప్రధాని మోదీతో సహా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అన్ని రాష్ట్రాల సీఎంలు మాజీ ప్రధాని మృతి పట్ల సంతాపం ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.అయితే ఆర్థిక చాణక్యుడిగా పేరున్న మన్మోహన్ తన జీవితంలో ఎన్నో గొప్ప అవార్డులు సాధించారు. పద్మ విభూషణ్ లాంటి పురస్కారానికి ఎంపికయ్యారు. తన హయాంలో సమాచారం హక్కు చట్టంతో పాటు పలు సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా యావత్ భారతావని మన్మోహన్ సింగ్ సేవలను స్మరించుకుంటోంది.మన్మోహన్ సింగ్ బయోపిక్..అయితే మన్మోహన్ సింగ్ జీవిత చరిత్ర గురించి ఓ సినిమాను కూడా తెరకెక్కించారు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కించిన బయోపిక్ మూవీ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. 2019లో విడుదలైన ఈ సినిమా పలు వివాదాల తర్వాత విడుదలైంది. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రం 2019లో జనవరి 11న రిలీజైంది. "ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్" పుస్తకంలోని పలు సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీకి విజయ్ రత్నాకర్ గుట్టే దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో మన్మోహన్ సింగ్గా బాలీవుడ్ నటుడు అనుపమ ఖేర్ నటించారు. ఈ సినిమాను రుద్ర ప్రొడక్షన్స్ , పెన్ ఇండియా లిమిటెడ్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఇందులో 13వ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 మధ్య గల సంఘటనలను చూపించారు.ఓటీటీలో స్ట్రీమింగ్..ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ప్రస్తుతం ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. అయితే కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాపై మీరు కూడా ఓ లుక్కేయండి. -
Manmohan Singh: స్వతహాగా శాకాహారి కానీ ఆ ఫేమస్ రెసిపీ కోసం..!
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో యావత్తు దేశం దిగ్బ్రాంతికి లోనైంది. ఆర్థిక వేత్తగా, ప్రధానిగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, సేవలను గుర్తించేసుకుంటూ..ప్రముఖలు, రాజకీయనేతలు నివాళులర్పించారు. సుదీర్ఘకాలం ప్రధానిగా చేసిన తొలి సిక్కుగా ఘనత దక్కించుకున్నా మన్మోహన్ వ్యక్తిగత అలవాట్లు గురించి పెద్దగా ఎవ్వరికి తెలియవు. ఎందుకంటే మితభాషిగా ఉండే ఆయన వ్యవహారశైలినే కారణమని చెప్పొచ్చు. అయితే విదేశాలకు వెళ్లినప్పుడూ..అక్కడ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో తాను ఇష్టపడే వంటకాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. అవేంటో చూద్దామా.ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారతావనిగా రూపు ఇచ్చి.. యావత్ ప్రపంచం మనవైపు చూసేలా చేసిన దార్శనికుడు. పాలన, దౌత్యపరంగా ఆయన చేసిన కృషి అసామాన్యమైనది. రాజీయ చతురత, వినయపూర్వకమైన ప్రవర్తనకు తగ్గటుగానే ఆయన అభిరుచులు ఉండేవని చెప్పొచ్చు. ప్రత్యేకించి ఆయన ఆహారపు అలవాట్లు ఓ సాధారణ వ్యక్తి ఇష్టపడేవే. ఎందుకంటే ఆయన అమితంగా ఇష్టపడేది పెరుగు అన్నమే. దానిమ్మ, ఊరగాయలు అంటే మహా ఇష్టం. ఉత్తర భారతదేశంలో కధీ చావల్గా పిలిచే పెరుగన్నం(Curd Rice) మన్మోహన్ మెచ్చే వంటకమని చెబుతుంటారు సన్నిహితులు. ఇది శరీరానికి చలువ చేస్తుంది, పైగా మనసును ప్రశాంతంగా ఉంచే రెసిపీ అని అంటుంటారట మన్మోహన్. అయితే మధుమేహం(Diabetes) కారణంగా స్వీట్స్కి దూరంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారానికే ప్రాధాన్యత ఇచ్చేవారట. చెప్పాలంటే ఇక్కడ మన్మోహన్ పూర్తి శాకాహారి(Vegetarian). అయితే బంగ్లాదేశ్ పర్యటనలో ఆ శాకాహార నియమాన్ని ఉల్లంఘించే గమ్మతైన ఘటన జరిగిందంటే. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పేరుగాంచిన డిష్ బెంగాలీ హిల్సా ఫిష్ కర్రీ. ఈ రెసిపీలో చేపకు ఆవపిండిని పట్టించి అరటి ఆకుల్లో ప్యాక్ చేసి ఆవిరిపై వండుతారట. ఈ వంటకం రుచి గురించి తెలుసుకుని మరీ తెప్పించుకుని ఆస్వాదించారట మన్మోహన్. పైగా దీని రుచికి ఫిదా అయ్యి శాకాహార నియమాన్ని ఉల్లంఘించక తప్పలేదని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారట. ప్రస్తుతం ఆయన మన మధ్యలేకపోయినా..ఆయన విశిష్ట వ్యక్తిత్వం, ఆదర్శవంతమైన జీవితం తాలుకా జ్ఞాపకాలు సదా నిలిచే ఉంటాయి. (చదవండి: మన్మోహన్ సింగ్ ఆ డ్రైస్సింగ్ స్టైల్నే ఎంచుకోవడానికి రీజన్ ఇదే..!) -
గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయాం.. మన్మోహన్ సింగ్ మృతిపై సినీ ప్రముఖులు
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ (92) తుదిశ్వాస విడిచారు. వయో సంబంధిత సమస్యలతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో కన్నుమూశారు. నెహ్రూ, ఇందిర, మోదీ తర్వాత అత్యధిక కాలం ఆ పదవిలో కొనసాగిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. ప్రపంచమే మెచ్చిన ఆర్థికవేత్తగా ఆయన పేరు పొందారు. ఆర్థిక మంత్రిగా దేశాన్ని సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కించిన మేధావిగా ఎప్పటికీ గుర్తుంటారు. మన్మోహన్ సింగ్ మృతిపై సినీ ప్రముఖులు చిరంజీవి, కమల్ హాసన్ సంతాపం తెలిపారు. వారికి ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఎక్స్ వేదికగా తెలిపారు.చిరంజీవి తన ఎక్స్ పేజీలో ఇలా పంచుకున్నారు. 'మన దేశంలో గొప్ప రాజనీతిజ్ఞులలో మన్మోహన్సింగ్ ఒకరు. ఆయన ఉన్నత విద్యావంతులు, అత్యంత మృదుస్వభావి, వినయపూర్వకమైన నాయకుడు మన్మోహన్ సింగ్. ఆర్థిక మంత్రిగా అతని దార్శనికత దేశానికి ఎంతో ఉపయోగపడింది. వరుసగా రెండు పర్యాయాలు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న ఆయన చరిత్రలో నిలిచిపోయే మార్పులు తెచ్చారు. అలాంటి మహానుభావుడి హయాంలో పార్లమెంట్ సభ్యుడిగా, పర్యటక శాఖ సహాయ మంత్రిగా పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఆయన నుంచి నేను చాలా విషయాలను నేర్చుకున్నాను. ఆయన మరణం మన దేశానికి తీరని నష్టం. మన్మోహన్సింగ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి !!' అంటూ చిరు పేర్కొన్నారు.తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా మన్మోహన్సింగ్కు సంతాపం తెలిపారు. ' భారతదేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. నిశ్శబ్ద గౌరవం కలిగిన వ్యక్తి, అతను తన దూరదృష్టితో కూడిన ఆర్థిక, సామాజిక విధానాల ద్వారా దేశాన్ని పునర్నిర్మించారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు లక్షలాది మందికి ఉపయోగపడ్డాయి. భారతదేశం పురోగతి విషయంలో సమాజంలోని ప్రతి మూలకు ప్రభుత్వ లక్ష్యాలు చేరేలా నిర్ధారిస్తూ.. సమగ్రత, సామాజిక న్యాయం పట్ల లోతైన నిబద్ధతతో అతని పాలన కొనసాగింది. ఆయన వారసత్వం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' కమల్ హాసన్ పేర్కొన్నారు.మాజీ ప్రధానికి మోహన్ బాబు సంతాపం..మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల టాలీవుడ్ నటుడు మోహన్ బాబు సంతాపం తెలిపారు. ఆయన గొప్ప దార్శనికత కలిగిన నాయకుడని కొనియాడారు. అసాధారణ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ మరణించడం బాధాకరమని.. ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా భారతదేశ ఆర్థిక రంగంపై చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. రాజ్యసభలో ఆయనతో కలిసి పనిచేసిన ఘనత నాకు దక్కడం అదృష్టమన్నారు. ఆయన తెలివితేటలు, రాజనీతిజ్ఞత అందరికీ స్ఫూర్తినిచ్చాయని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. -
మన్మోహన్ సింగ్ డ్రైస్సింగ్ స్టైల్ ఎలా ఉండేదంటే..!
ప్రపంచమే మెచ్చిన ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ (92) ఇక లేరు. వయో సంబంధిత సమస్యలతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి, ప్రముఖులు, సెలబ్రిటీలు నివాళులర్పించారు. మౌనమునిగా కనిపించే గొప్ప రాజనీతిజ్ఞుడు. తానెంటనేది చేతల ద్వారానే చూపించే గొప్ప దార్శనికుడు. రెచ్చగొట్టే వ్యాఖ్యలను, విమర్శలను చాలా కూల్గా హ్యాండిల్ చేస్తూ..తన విలువేంటో చాటిచెప్పేవారు. అంతేగాదు తాను కూల్గా కనిపించినా..టైం వస్తే ఎలా దూకుడుగా వ్యవహరిస్తానో తాను తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలతో దేశానికి తెలిసొచ్చేలా చేశారు. అంతటి మహనీయుడు ఈ రోజు మన కళ్లముందు లేకపోయినా..ఆయన వదిలిన కొన్ని మధురమైన మాటలు, గడ్డు పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకం. అలాగే మన్మోహన్ వ్యవహార శైలికి తగ్గట్టుగానే ఆయన ఆహార్యం ఉంటుంది. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ మంత్రముగ్ధుల్ని చేసేలా ఉంటుంది. బహుశా ఈ స్టైల్తోనే ప్రత్యర్థులను మారుమాట్లడనీయకుండా తన మాటే శాసనమయ్యేలా చేసేవారిని చెబుతుంటారు అంతరంగికులు. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ దుస్తుల వార్డ్రోబ్ గురించి తెలుసుకుందామా..!రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలిసిక్కుగా ఘనత దక్కించుకున్న మృదుస్వభావి మన్మోహన్ సింగ్(Manmohan Singh). ఆయన ఎక్కువగా తెల్లటి కుర్తా, నెహ్రూ మాదిరి జాకెట్లు , నీలిరంగు తలపాగతో కనిపించేవారు. ఈ వేషధారణ తాను కార్యచరణకు, ప్రగతికి పెద్దపీట వేసే వ్యక్తి అని చెప్పకనే చెబుతోంది. ప్రఖ్యాత డిజైనర్ తరుణ్ తహిలియాన్ ప్రధాని ధరించి దుస్తులు దేశాన్ని నడిపించే బాధ్యతయుతమైన పనిలో ఉన్న వ్యక్తి ఆహార్యానికి అద్దంపట్టేలా ఉంటాయని అన్నారు. మన దేశ సంస్కృతిని తెలియజెప్పేలా ఆయన ధరించే నీలిరంగు తలపాగ(sky-blue turbans), తెల్లటి కుర్తా పైజామాలు ఉంటాయని ప్రశంసించారు. అంతేగాదు మాజీ ప్రధాని మన్మోహన్ ఆధునాతనంగా కనిపించేలా గౌరవప్రదమైన డ్రెస్సింగ్ని ఎంచుకుంటారని చెప్పారు. ప్రశాంతంగా కనిపించే తన వ్యవహారశైలికి సరిపోలిన డ్రెస్సింగ్ స్టైల్ అని అభిర్ణించారు డిజైనర్ తరుణ్. అంతేగాదు ఆయన ధరించే నీలిరంగు తలపాగా మన్మోహన్ ట్రేడ్మార్క్ అని చెప్పారు. ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ(University of Cambridge)లో చదివిన నేపథ్యం తనలో అంతర్భాగమని తెలియజేప్పేలా ఆయన ఇలా ఎక్కువగా నీలి ఆకాశం రంగులోని తలపాగను ధరించేవారని సన్నిహితులు చెబుతుంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ విధమైన రంగుల కలయికతో కూడిన దుస్తులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే శక్తికి సంకేతమని, పైగా సానుకూలంగా వ్యవహారం చక్కబెట్టుకునేలా చేస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు, నమ్రతతో, రిజర్వ్గా ఉంటే వ్యక్తులు ఎక్కువగా ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్నే ఎంచుకుంటారని అన్నారు.(చదవండి: యువ 'కలం'..! ట్రెండ్ సెట్టర్స్గా యంగ్ రైటర్స్) -
అందుకే మన్మోహన్ సైలెంట్గా ఉండేవారట!
విషయం వీక్గా ఉన్నప్పుడే.. పబ్లిసిటీ పీక్స్లో ఉంటుందనేది ఓ నానుడి. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విషయంలో అది పూర్తి వ్యతిరేకంగా. స్టేట్స్ మన్గా సెన్సేషన్సలిజానికి వీలైనంత దూరంగా ఉండేవారాయన. ఆయన వస్తున్నారంటే.. మీడియా కూడా పెద్దగా హడావిడి చేసేది కాదు. దీనిని అలుసుగా తీసుకునే ప్రతిపక్షాలు ఆయన వ్యక్తిత్వాన్ని మరోలా ప్రొజెక్ట్ చేశాయి. ఆయన్ని రకరకాలుగా నిందించాయి. అయితే ఆయన మౌనం వెనుక కారణాలు లేకపోలేదు.. ‘‘మన్మోహన్ అనే వ్యక్తి ఓ సైలెంట్ పీఎం.. దేశానికి డమ్మీ పీఎం. ఆయనకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడమంటే భయం. మన్మోహన్ సింగ్ కాదు.. ఆయన మౌనమోహన్ సింగ్. అధిష్టానం చేతిలో ఆయనొక కీలు బొమ్మ. జన్పథ్ నుంచే దేశ పాలన అంతా సాగుతోంది’’.. యూపీఏ రెండు టర్మ్ల పాలనలో ప్రతిపక్షాలు తరచూ ఈ విమర్శలు చేసేవి. కానీ.. ప్రధానిగా ఆయన ఎన్నోసార్లు మీడియా ముందుకు వచ్చారు. వాటిని నిశితంగా విశ్లేషిస్తే.. ఆయన ప్రెస్మీట్లో అనవసర అంశాలు కనిపించవు. దేశ, అంతర్జాతీయ, ఆర్థిక సంబంధిత అంశాలపై అలవోకగా మాట్లాడేవారు. అలాగే పాలనాపరమైన నిర్ణయాలను ప్రకటించేవారు. మైకుల ముందు మన్మోహన్ సింగ్(Manmohan Singh) ముక్కుసూటిగా మాట్లాడేవారు. విషయం ఏది ఉన్నా.. నిర్దిష్టంగా, స్పష్టంగా చెప్పేవారు. రాజకీయ విమర్శలు చేయడం అత్యంత అరుదుగా ఉండేది. అయితే.. నెమ్మదిగా మాట్లాడడం ఆయనకంటూ ఓ మైనస్ అయ్యింది.ఇక.. డిజిటల్ మీడియా ఆయన హయాంగా ఉన్న టైంలోనే అభివృద్ధి చెందింది. కానీ, సమకాలీన రాజకీయ నేతల్లో సోషల్ మీడియాను పరిమితంగా ఉపయోగించారాయన. సంప్రదాయ మీడియా మీదే ఆయన దృష్టంతా ఉండేది. మన్మోహన్ తన పుస్తకం ‘‘ఛేజింగ్ ఇండియా’’లోనూ ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తద్వారా తన నాయకత్వ లక్షణాలను సమర్థించుకున్నారు కూడా.‘‘ఆ టైంలో మీడియా ఫోకస్ అంతా వేరేలా ఉండేది. ఆయన ప్రెస్ మీట్ అంటే పెద్ద హడావిడి ఉండేది కాదు. ఆయన సూచన మేరకే అలా జరిగేది!. తనను ప్రధానిగా కూడా ప్రమోట్ చేసుకోవడానికి అంతగా ఆయన ఆసక్తి చూపించేవారు కాదు. అందుకు రాజకీయ పరమైన కారణాలూ ఉండొచ్చు. ఇప్పుడున్నట్లు సోషల్ మీడియా ఉండి ఉంటే.. ఆయన ఎంతటి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తో.. హుషారైన వ్యక్తో ప్రతీ ఒక్కరికీ తెలిసి ఉండేది’’ అని ఓ సీనియర్ జర్నలిస్ట్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. ఆయన నిష్క్రమణ తర్వాత మరికొందరు జర్నలిస్టులు ఆయనతో ఇంటెరాక్షన్ సమయంలో అనుభవాల్ని పంచుకోవడమూ చూస్తున్నాం.పదేళ్లపాటు.. 2004-2014 మధ్య యూపీఏ తరఫున ప్రధానిగా ఆయన 117సార్లు మీడియా సమావేశాల్లో పాల్గొన్నారు. మీడియా సమావేశాలు, విదేశీ పర్యటనల్లో విలేకరులతో ఇంటెరాక్షన్, దేశీయ పర్యటనలు, వార్షిక సమావేశాలు, రాజకీయ.. ఎన్నికల ప్రచారాలు మొత్తం కలిపి ఉన్నాయి. ప్రత్యేకించి విదేశీ పర్యటనలో.. తిరుగు ప్రయాణాల్లో.. ఆయన విమానాల్లోనే జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే అవి విమర్శలకు సైతం తావిచ్చాయి కూడా. అలాగే మీడియా ముందుకు వచ్చేందుకు ఏనాడూ ఆయన తటపటాయించేవారు కాదు.. అది ఎంత పెద్ద అంశమైనా అనర్గళంగా మాట్లాడేవారు. మీడియా ముఖంగా ఆయన కఠినంగా మాట్లాడింది లేదు. అయితే ఈ మృదు స్వభావమే ఆయన్ని మీడియాలో పెద్దగా హైలెట్ చేయలేకపోవడానికి ప్రధాన కారణమైంది. అదే సమయంలో.. డిగ్నిఫైడ్ లీడర్గా ఆయనకు గుర్తింపు తెచ్చి పెట్టింది.మన్మోహన్.. పుట్టిపెరిగిన పరిస్థితులు కూడా ఆయన రిజర్వ్డ్ నేచర్కు మరో కారణం. బ్రిటిష్ ఇండియాలో పంజాబీ సిక్కు కుటుంబంలో జన్మించిన మన్మోహన్.. విభజన తర్వాత భారత్కు వలస వచ్చారు. అయితే బాల్యంలో ఆయన అల్లరి మాములుగా ఉండేది కాదట. ఈ విషయాన్ని ఆయన బాల్య స్నేహితుడు రాజా ముహ్మద్ చాలా ఏళ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. మన్మోహన్ తండ్రి డ్రైఫ్రూట్స్ వ్యాపారి. దీంతో ఆయన తన జేబులో ఏవో ఒకటి తీసుకుని వచ్చేవారట. వాటి కోసం జరిగిన అల్లరి అంతా ఇంతా కాదని చెప్పారాయన.మన్మోహన్ ప్రధాని అయ్యాక.. తన బాల్య స్నేహితుడిని చూసేందుకు నేరుగా ఆయన నివాసానికే వెళ్లారు రాజా ముహ్మద్. ఇక తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో నాయనమ్మ దగ్గరే పెరిగారాయన. ఆ టైంలోనే ఆయనలోని అల్లరి మరుగున పడింది. ఆమె సంరక్షణలో ఆయన ఎంతో క్రమశిక్షణ అలవర్చుకున్నారు. కరెంట్ లేని ఓ గ్రామంలో కిరోసిన్ దీపపు వెలుగులోనే చదువుకునేవారు. స్నేహితులతో కలిసి ఆయన బయటకు వెళ్లడం.. ఆడడం అరుదుగా ఉండేవి. ఉన్నత విద్య సమయంలో.. ఆర్వాత ఉన్నత పదవులు అధిరోహించిన టైంలోనే ఆయన ఒద్దికగా ఉన్నారు. ప్రధానిగా దిగిపోయాక.. రాజకీయాలకు ఆ కుటుంబం దూరంగా ఉంటూ వచ్చింది!. పైగా చిన్నప్పటి నుంచి ఆయన ఓ విషయాన్ని అలవర్చుకున్నారు. ఎక్కువ వినడం.. ఎక్కువగా అర్థం చేసుకోవడం.. తక్కువగా మాట్లాడం.. వెరసి మౌనమునిగా బతకడం. ఇదే ఆయన తుదిశ్వాస విడిచేవరకు పాటిస్తూ వచ్చారు. మేధావులు మౌనం వహించినప్పుడు.. మూర్ఖుల సంఖ్య రెట్టింపు అవుతుంది. ఇది ఎదిగే సమాజ ఉనికికే ప్రమాదం::నెల్సన్ మండేలాఒక మూర్ఖుడి ఆవేశం కన్నా ఒక మేధావి మౌనం ఈ దేశానికి చాలా ప్రమాదకరం:::నేతాజీ సుభాష్ చంద్రబోస్ -
శోకసంద్రంలో మన్మోహన్ భార్య గురుశరణ్ : ఆ ప్రేమ గుర్తు ఇంకా ఆమెతోనే!
భారత మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ (RIP Manmohan Singh) అస్తమయంతో యావద్దేశం దిగ్బ్రాంతికి లోనైంది. ఆర్థికమంత్రి, ప్రధానమంత్రి, ఇలా పలు హోదాల్లో దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ అనేకమంది రాజకీయ నేతలు, ఆర్థికవేత్తలు నివాళులర్పిస్తున్నారు.సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన భారత్ ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్ పేరొందారు. పదేళ్ల పాటు మన్మోహస్ సింగ్ భారత దేశ ప్రధానిగా పనిచేసినప్పటికీ.. ఆయన కుటుంబం గురించి ప్రజలకు అంతగా తెలియదనే చెప్పాలి. మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కుమార్తెలు వారి సంబంధిత రంగాలలో విశేషమైన విజయాలు సాధించారు.92 ఏళ్ల వయసులో ఆయన ఆకస్మిక మరణం ప్రధానంగా ఆయన భార్య గురు శరణ్ కౌర్కి తీరని లోటు. ప్రశాంతమైన,గాంభీర్యంగా ఉండే ఆయన ప్రవర్తనతో మనందరికీ తెలిసిన వ్యక్తి అయితే, ఆయన వెనుకున్న నిజమైన శక్తి అతని భార్య గురుశరణ్ కౌర్. ఆయన వెన్నంటే వుంటూ, ఆయన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర ఆమెదే. పదవిలో 2019లో, మన్మోహన్ సింగ్కు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినపుడు ఆమె భర్తను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆయన ఆరోగ్యం కోసం గురుద్వారాలో ప్రార్థనలు చేశారు. అంతేకాదు మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా ఉన్న సమయంలోమన్మోహన్ సింగ్ భోజనాన్ని స్వయంగా తయారు చేసి ప్యాక్ చేసి పంపేవారట. Wow !! So beautifully rendered this soulful Kirtan by Mrs.Gursharan Kaur, w/o Dr. Manmohan Singh ( former Prime Minister of India) pic.twitter.com/0HPVtxfzA0— Indu Kumari (@InduKumari1) November 5, 2023డా. మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్ (GursharanKaur) ఎవరు?మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్ 1937, సెప్టెంబర్ 13; జలంధర్లో జన్మించారు. యాదృచ్చింగా మన్మోహన్ కూడా సెప్టెంబరు (1932, సెప్టెంబర్26) లోనే పుట్టారు. తండ్రి, సర్దార్ చత్తర్ సింగ్ కోహ్లీ, బర్మా-షెల్లో ఇంజనీర్. ఏడుగురు తోబుట్టువులలో ఈమె చిన్నది. 1958లో మన్మోహన్ సింగ్ , గురుశరణ్ కౌర్ వివాహం జరిగింది. మన్మోహన్ సింగ్ భార్య 2009లో ఫ్యాషన్ మ్యాగజీన్ వోగ్లో దర్శనమిచ్చారు. G-20 సమ్మిట్ సందర్భంగా ఏకైక ప్రథమ మహిళ. తన జట్టుకు రంగు వేసుకోకుండా, సహజత్వాన్ని మోసుకెళ్లిన మహిళగా వోగ్ ఆమెను గౌరవించింది. కౌర్ మంచి గాయని కూడా జలంధర్ రేడియోలో కూడా ఆమె కీర్తలను పాడారు. మన్మోహన్ సింగ్ లాగానే, గురుశరణ్ కౌర్ కూడా మృదుస్వభావి.చెక్కు చెదరని మారుతిగురుశరణ్ కౌర్ మన్మోహన్ సింగ్తో నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. పెళ్లి అయిన కొత్తలో తమ వివాహబంధానికి గుర్తుగా కొనుక్కున్న మారుతి-800ని ఇప్పటికీ ఆమె వాడతారు. అయితే వీరిది ప్రేమ వివాహమా, కాదా అనేదానిపై స్పష్టత లేదు. కానీ వీరి సుదీర్ఘ ఆదర్శ దాంపత్యం ఒక ప్రేమ కావ్యం లాంటిదే.ముగ్గురు కుమార్తెలుమన్మోహన్ సింగ్, కౌర్ దంపతులకు కుమార్తెలు ముగ్గరు. వారు ఉపిందర్ సింగ్, అమృత్ సింగ్, దమన్ సింగ్. పెద్ద కుమార్తె ఉపిందర్ సింగ్ ప్రఖ్యాత చరిత్రకారురాలు. ఆమె అశోక విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ డీన్. గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర విభాగం హెడ్గా పనిచేశారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, మాంట్రియల్లోని మెక్గిల్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి. ఆమె ప్రాచీన భారతీయ చరిత్ర, పురావస్తు శాస్త్రం, పొలిటికల్ ఐడియాస్పై విస్తృతంగా పరిశోధన జరిపారు. ఆమె రచనలలో ఎ హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ అండ్ ఎర్లీ మెడీవల్ ఇండియా, పొలిటికల్ వయొలెన్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా వంటి పుస్తకాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి.రెండో కుమార్తె అమృత్ సింగ్ ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది. స్టాన్ఫోర్డ్ లా స్కూల్లో ప్రాక్టీస్ ఆఫ్ లా ప్రొఫెసర్.రూల్ ఆఫ్ లా ఇంపాక్ట్ ల్యాబ్కు వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్నారు. యేల్ లా స్కూల్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీల నుంచి డిగ్రీలను పొందారు. హింస, ఏకపక్ష నిర్బంధ పద్ధతులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికపై సైతం ఆమె తన గళం వినిపించారు.ఇక చిన్న కుమార్తె దమన్ సింగ్ మంచి రచయిత్రి . లోతైన వ్యక్తిగత, విశ్లేషణాత్మక రచనలకు ప్రసిద్ధి చెందిన నిష్ణాత రైటర్. దమన్ సింగ్ తన తల్లిదండ్రుల జీవితాలలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రతిబింబిస్తూ.. స్ట్రిక్ట్లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్ అనే పుస్తకాన్ని కూడా రాశారు. ది సేక్రేడ్ గ్రోవ్, నైన్ బై నైన్ సహా ఆమె ఇతర పుస్తకాలు కథకురాలిగా ఉన్నారు. దమన్ సింగ్ పుస్తకాలు, రచనలు ఆమె బహుముఖ ప్రజ్ఞను ప్రతిబింబిస్తాయి. ఆమె భర్త అశోక్ పట్నాయక్ 1983 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి. -
మన్మోహన్ సింగ్ అంటే అందరి నోటా ఒకటే మాట
-
ఆర్ధిక మంత్రిగా చెరగని ముద్ర
-
మన్మోహన్ సింగ్ మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం
-
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
-
ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడు
ఆర్థిక సంస్కరణల సారథి, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ (92) వయో సంబంధిత సమస్యలతో నిన్న రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సమస్యలు తీవ్రంగా వెంటాడుతున్నా వాటిని తట్టుకుని భారత్ ప్రగతిపథంలో దూసుకుపోతోంది. ఎగుమతులు పెంచుకుంటోంది. దానికోసం దేశంలో సమర్థ ద్రవ్యోల్బణ నిర్వహణకు చాలామంది కృషి చేశారు. అందులో ప్రధానంగా వినవచ్చే పేరు మన్మోహన్ సింగ్. ఆర్థికశాఖలో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేసినా, ఆర్బీఐ గవర్నర్(RBI Governor)గా నిర్ణయాలు ప్రకటించినా, దేశ ఆర్థిక మంత్రిగా బడ్జెట్(Budget) ప్రవేశపెట్టినా ప్రతిదానిలోనూ ఆర్థిక చదురతే కనిపించేది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆయన ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం.ప్రధాన ఆర్థిక సలహాదారుగా..1970వ దశకం ప్రారంభంలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పదవీకాలంలో అనేక కీలక సంస్కరణలు, కార్యక్రమాలు చేపట్టి భవిష్యత్ ఆర్థిక సరళీకరణకు పునాది వేశారు.వాణిజ్య విధాన సంస్కరణలు: భారత ఆర్థిక వ్యూహంలో అంతర్గత వాణజ్య విధానం కీలకంగా ఉండేది. ప్రపంచీకరణ పెరుగుతున్న నేపథ్యంలో అంతర్గత దృక్పథానికి దూరంగా, బహిరంగ వాణిజ్య విధానాన్ని ప్రతిపాదించారు. ఎగుమతుల ఆధారిత వృద్ధితోపాటు వాణిజ్య అడ్డంకులను తగ్గించేలా కృషి చేశారు.పారిశ్రామిక విధానం: భారత పారిశ్రామిక రంగాన్ని ఆధునీకరించడం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, ఉత్పాదకతను మెరుగుపరచడం వంటి చర్యలను చేపట్టారు.ఆర్థిక రంగ సంస్కరణలు: ఆర్థిక వ్యవస్థలో మెరుగైన నియంత్రణ, స్థిరత్వాన్ని కల్పించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో సహా భారతదేశ ఆర్థిక సంస్థలను బలోపేతం చేయడానికి పూనుకున్నారు.ఆర్థిక ప్రణాళిక: ప్రణాళికా సంఘంలో భాగంగా సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పంచవర్ష ప్రణాళికల రూపకల్పనకు దోహదపడ్డారు.ఆర్బీఐ గవర్నర్గా..1982 నుంచి 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్గా మన్మోహన్ సింగ్ అనేక నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేశారు. ఇవి దేశ బ్యాంకింగ్ రంగంపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి.బ్యాంకింగ్ లా (సవరణ), 1983: ఈ చట్టం ద్వారా బ్యాంకులు లీజును అనుమతించడంతో కార్యకలాపాల పరిధి పెరిగింది. ఖాతాదారులకు నామినేషన్ సౌకర్యాలను అందించింది.అర్బన్ బ్యాంక్స్ డిపార్ట్మెంట్: అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల వ్యవహారాలను పర్యవేక్షించడానికి, మెరుగైన నియంత్రణ, పర్యవేక్షణను నిర్ధారించడానికి ఈ విభాగాన్ని స్థాపించారు.ద్రవ్య విధానం: ధరల స్థిరత్వాన్ని కాపాడుకుంటూ అధిక వృద్ధిపై దృష్టి సారించే ఆధునిక ద్రవ్య విధాన రూపకల్పనకు పునాదులు వేశారు.రుణ లభ్యత: నిరుపేద ప్రాంతాలకు రుణ లభ్యతను సమకూర్చడం, సమ్మిళిత వృద్ధికి మార్గం సుగమం చేయాలని సింగ్ నొక్కి చెప్పారు.ద్రవ్య విధానాల ఏకీకరణ: ప్రభుత్వ వ్యయాలకు నిధులు సమకూర్చడం కోసం ఆర్బీఐ పరపతిపై అధికంగా ఆధారపడకుండా ద్రవ్య, ఆర్థిక విధానాలను ఏకీకృతం చేయాలని చెప్పారు.ఇదీ చదవండి: రెండు పాలసీలుంటే క్లెయిమ్ ఎలా చేయాలి?ఆర్థిక మంత్రిగా..1991లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన అనేక నిర్మాణాత్మక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను మార్చేశాయి.సరళీకరణ: ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణను తగ్గించడం, ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించడం.ప్రైవేటీకరణ: గతంలో ప్రభుత్వ రంగానికి కేటాయించిన పరిశ్రమల్లో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని అనుమతించడం.విదేశీ పెట్టుబడులు: అధిక ప్రాధాన్యత కలిగిన పరిశ్రమల్లో 51% వరకు ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను అనుమతించడం, విదేశీ సాంకేతిక ఒప్పందాలకు అడ్డంకులను తొలగించడం.పారిశ్రామిక విధానం: చాలా ప్రాజెక్టులకు పారిశ్రామిక లైసెన్సింగ్ రద్దు చేయడం. వ్యాపార విస్తరణ, విలీనాలను సులభతరం చేయడానికి గుత్తాధిపత్యం, నిర్బంధ వాణిజ్య పద్ధతులను సవరించడం. -
ప్రముఖులతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (ఫొటోలు)
-
మన్మోహన్కు ప్రధాని,రాష్ట్రపతి నివాళి
మన్మోహన్సింగ్ పార్థివ దేహానికి ప్రధాని మోదీ నివాళులు..మన్మోహన్ సింగ్ ఇంటికి చేరుకున్న ప్రధాని మోదీమాజీ ప్రధాని పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన మోదీమన్మోహన్ సతీమణి గురుశరణ్కౌర్, కుటుంబ సభ్యులకు సంతాపంప్రధానితో పాటు మన్మోహన్ ఇంటికి వచ్చిన అమిత్ షా, జేపీ నడ్డా మన్మోహన్ పార్థివ దేహానికి రాష్ట్రపతి నివాళిమన్మోహన్సింగ్ పార్థివ దేహానికి రాషష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళిమన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపిన ముర్ము ఢిల్లీమన్మోహన్సింగ్ పార్థివ దేహానికి తెలంగాణ సీఎం రేవంత్ నివాళులుమన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిమన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్ను, ,కుటుంబ సభ్యులను పరామర్శించిన రేవంత్ రెడ్డిమన్మోహన్ నివాసానికి కాంగ్రెస్ అగ్రనేతలుమన్మోహన్ ఇంటికి వచ్చిన సోనియాగాంధీ రాహుల్గాంధీ, మల్లికార్జునఖర్గే, ప్రియాంకగాంధీమన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన నేతలు వ్యక్తిగతంగా నాకు తీరనిలోటు: మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మన్మోహన్ లేని లోటు పూడ్చలేనిదిచాలా కాలం నుంచి మన్మోహన్ నాకు తెలుసుసభ్యతకు నిలువెత్తు రూపం మన్మోహన్సింగ్వీడియో విడుదల చేసిన మాజీ రాష్ట్రపతిఆ మాటే నిజమైంది: శశిథరూర్ మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టిన శశిథరూర్చరిత్ర నా పట్ల దయతో ఉంటుందని 2014లో వ్యాఖ్యానించిన మన్మోహన్ఆయన చెప్పిన మాటలను గుర్తుచేస్తూ పోస్టు పెట్టిన కాంగ్రెస్ ఎంపీపదేళ్ల తర్వాత అదే నిజమైందని వ్యాఖ్యమన్మోహన్ దేశ సేవ..రాబోయే తరాలకు స్ఫూర్తి: సిక్కిం సీఎం తమాంగ్మన్మోహన్ మృతిపట్ల సంతాపం తెలిపిన సిక్కిం సీఎం ప్రేమ్సింగ్ తమాంగ్ఆర్థిక సంస్కరణలకు నాంది పలికి దేశాభివృద్ధికి గట్టి పునాది వేశారుదేశానికి మన్మోహన్ చేసిన సేవలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని వ్యాఖ్య మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పట్ల అమెరికా సంతాపంగత రెండు దశాబ్దాల్లో అమెరికా,భారత్ సాధించిన మన్మోహన్ పునాది వేశారుఅమెరికా, భారత్ పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మన్మోహన్ కీలక పాత్ర పోషించారుభారత్ వేగంగా అభివృద్ధి చెందడానికి ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజలకు గుర్తుండిపోతాయిప్రకటించిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ -
రేపు మన్మోహన్సింగ్ అంత్యక్రియలు
సాక్షి,ఢిల్లీ:మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను శనివారం(డిసెంబర్28) కేంద్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించనుంది. దేశ రాజధాని ఢిల్లీలోని శక్తిస్థల్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.మన్మోహన్ మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. అధికారిక కార్యక్రమాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కాగా,శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. మన్మోహన్ సింగ్కు క్యాబినెట్ సంతాపం తెలపనుంది.మన్మోహన్సింగ్(92) అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్లో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మన్మోహన్సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికన ఆర్థికవేత్త,ఆర్థిక మంత్రిగా మన్మోహన్సింగ్కు గొప్ప పేరున్న విషయం తెలిసిందే.ఇదీ చదవండి: మన్మోహన్సింగ్ అస్తమయం -
మన్మోహన్ చేసిన వంద రోజుల మ్యాజిక్..
రెండేళ్ల కిందట శ్రీలంకలో లీటర్ పాల ధర రూ.1,100. గ్యాస్ ధర రూ.2,657కి చేరుకుందనే వార్తలు వచ్చాయి. కోవిడ్ కారణంగా ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ స్థాయిలో కాకపోయినా భారత్కూ ఇదే తరహా పరిస్థితి దాపురించేదే. కానీ 30 ఏళ్ల కిందట అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు భారత్ను ఒడ్డున పడేశాయి. 1991 సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మైనార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానిగా పీవీ నరసింహారావు, ఆర్థికమంత్రిగా మన్మోహన్సింగ్లు జూన్ 25న పదవీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ అంపశయ్య మీద ఉంది. విదేశీ దిగుమతుల కోసం ఇండియా దగ్గరున్న మారకద్రవ్యం విలువ ఒక బిలియన్ డాలర్లకే పరిమితమైంది. ఈ నగదు రెండు వారాలకు మించి సరిపోదు. అప్పుడు రావ్ – సింగ్ల జోడీ బరిలో దిగింది. కేవలం వంద రోజుల్లోనే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకుందిపరపతి పెంచారు ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే సంచలన నిర్ణయం తీసుకున్నారు మన్మోహన్సింగ్. భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందనే వార్తలు బయటకు రాగానే ఎన్నారైలు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు జూలై 1న డాలరుతో రూపాయి మారకం విలువను 9.5 శాతం తగ్గించారు. దీంతో వెనక్కి మళ్లుతున్న ఎన్నారైల సంపదకు బ్రేకులు పడ్డాయి. దీన్ని శుభసూచకంగా భావించిన మన్మోహన్.. రెండు రోజుల తర్వాత రెండోసారి రూపాయి విలువను 12 శాతం తగ్గించారు. ఒక్కసారిగా రూపాయి విలువ 20 శాతానికి పైగా పడిపోవడంతో ఎన్నారైలు తమ దగ్గరున్న డాలర్లను ఇండియాలోకి పంప్ చేశారు. దీంతో విదేశీ మారకద్రవ్యం లోటుకు తాత్కాలిక అడ్డుకట్ట పడింది.పరువు కాపాడారు రూపాయి విలువను తగ్గించినా సరే విదేశీ మారక ద్రవ్యం కొరత దేశాన్ని వేధిస్తూనే ఉంది. ఈ సమస్యను తీర్చేలేక స్విస్ బ్యాంకులో 20 టన్నుల బంగారం తాకట్టు పెట్టి 240 మిలియన్ డాలర్లను అప్పుగా తెచ్చేందుకు అంతకు ముందు ఉన్న చంద్రశేఖర్ ప్రభుత్వం అప్పటికే ఐఎంఎఫ్తో చర్చలు జరిపింది. కానీ పీవీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతర్జాతీయ వాణిజ్యంలో అప్పటికే దిట్టగా పేరున్న మన్మోహన్ పూర్తిగా వేరే ప్రణాళిక అమలు చేశారు. 20 టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఇండియా దగ్గరే ఉంచి, దాన్ని గ్యారెంటీగా చూపిస్తూ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి 600 మిలియన్ డాలర్లు అప్పుగా వచ్చేలా వ్యూహం రచించారు. లైసెన్స్ రాజ్ని బద్దలు కొట్టారు ఆర్థికమంత్రి హోదాలో 1991 జూలై 25న మన్మోహన్సింగ్ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బడ్జెట్ చరిత్రాత్మకంగా నిలిచిపోయింది. లైసెన్స్ రాజ్ వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించడంతో పాటు ఎగుమతులపై ఉన్న సబ్సిడీలను ఎత్తి వేయడం, దిగుమతులపై ఉన్న అధిక పన్నులను తగ్గించడం వంటి నిర్ణయాలను ధైర్యంగా తీసుకున్నారు. అంతేకాదు కీలక రంగాల్లో ప్రభుత్వ పెత్తనానికి గుడ్బై చెప్పి, ప్రైవేటుకు రెడ్ కార్పెట్ వేశారు. ప్రత్యక్ష పన్నుల విధానాన్ని సరళీకరించారు. దీంతో బ్లాక్మనీకి చాలా వరకు అడ్డుకట్ట పడింది. నగదు వచ్చేలా.. బ్యాంకుల జాతీయీకరణతో రెడ్ టేపిజం పెరిగిపోయింది. కొత్త పరిశ్రమలకు పెట్టుబడులు సమకూర్చేందుకు బ్యాంకులు సతాయించేవి. ప్రభుత్వ ఆర్థిక సంస్థలు లేనిపోని నిబంధనలతో మోకాలడ్డేవి. ఈ రెండింటికీ చెక్ పెడుతూ ప్రైవేటు బ్యాంకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మన్మోహన్సింగ్. ప్రభుత్వ ఆర్థిక సంస్థల పెత్తనానికి చెక్ పెట్టారు. కీలకరంగాల్లో విదేశీ పెట్టుబడులను 51 శాతం వరకు అనుమతి ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ప్రైవేటు రంగం ఊపందుకుంది. పరిశ్రమలు విరివిగా వెలిశాయి. దేశ యువతకు ఉపాధి లభించడం మొదలైంది. మొత్తంగా మోకాళ్లపై నడుస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా లేచి దౌడు తీసేందుకు ఈ చర్యలు ఎంతగానో దోహదపడ్డాయి. ‘సెంచరీ’ ఫలితాలు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అవక ముందు 1990 అక్టోబర్లో కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ, ఇండ్రస్టియల్ వర్కర్స్) డబుల్ డిజిట్ క్రాస్ చేసింది. 1991 జూలైలో మన్మోహన్సింగ్ బడ్జెట్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి, రూపాయి విలువ తగ్గించి, లైసైన్స్ రాజ్కు చెక్ పెట్టారు. వీటి ఫలితాలు కనిపించేందుకు ఏడాది సమయం పట్టింది. ఫలితంగా 1992 సెప్టెంబర్ నుంచి వేజ్ ప్రైస్ లెవల్ 10కి దిగువకు పడిపోవడం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన ఆర్థిక ఫలాలను మనం ఈ రోజు అనుభవిస్తున్నాం. -
మహా నగరంలో మన్మోహన్!
సాక్షి, హైదరాబాద్: భాగ్య నగరంతో దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు అవినాభావ సంబంధం ఉంది. ఎన్నో కీలకమైన సందర్భాల్లో, ఆపదల్లో తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల సమయంలో నేరుగా సందర్శించి నగరవాసులకు ధైర్యాన్ని అందించారు. ఆయనకు ఎంతో ప్రీతిపాత్రుడైన గురువు శ్రేయోభిలాషి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కన్నుమూసిన సమయంలో నగరానికి వచ్చి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. అప్పటినుంచి ఇప్పటివరకు పీవీ కుటుంబం అంటే ఆయనకు ఎంతో అభిమానం. ఆయన కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉండేవారు.ఓయూ గౌరవ డాక్టరేట్..మన్మోహన్ సింగ్కు ఉస్మానియా యూనివర్సిటీ 1996లో గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. అర్థశాస్త్రంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసిన కృషిని గుర్తించి గౌరవ డాక్టరేట్ను అందజేసింది. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్కు మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేశారు. నగర మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేసింది కూడా మన్మోహన్ సింగే కావడం గమనార్హం.నేనున్నానని..2013లో జరిగిన దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల సమయంలో 16 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 150 మందికి పైగా గాయపడ్డారు. నగరం దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు.. నాడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఇక్కడ పర్యటించారు. నేనున్నానంటూ నగరవాసులకు భరోసా కల్పించారు. అంతకు ముందు 2012లో హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ బయో డైవర్సిటీ కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొని పైలాన్ను ఆవిష్కరించారు. అంతేకాకుండా.. ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు నగరాన్ని వేదిక చేసేందుకు, నగర ఖ్యాతి పెంచేందుకు అవిరళమైన కృషి చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా... నేరుగా రావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసుకున్నందుకు ఎంతో బాధ పడ్డట్లు వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆధార్’ పైలట్ ప్రాజెక్టును మహేశ్వరంలో ప్రారంభించేందుకు కృషి చేశారు. దీని కోసం ఆ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న నందన్ నిలేఖన్తో ప్రత్యేకంగా చర్చించారు. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగులకు భరోసానిచ్చారు. -
మన్మోహన్సింగ్ దార్శనికత ఎప్పటికీ ఆదర్శప్రాయమే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ మరణం పట్ల మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అని అన్నారు. అలాగే, పదేళ్లపాటు దేశ ప్రధానిగా గొప్ప సేవలందించారని ప్రశంసించారు.మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మన్మోహన్ మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మాజీ ప్రధాని మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటు. పదేళ్లపాటు దేశ ప్రధానిగా గొప్ప సేవలందించారని ప్రశంసించారు. ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా ఆర్థిక సంస్కరణలతో దేశ పురోభివృద్ధికి ఎంతగానో కృషిచేశారన్నారు.Deeply saddened by the sudden demise of former Prime Minister Dr. Manmohan Singh Ji. His visionary policies and economic reforms laid the foundation for India’s rise as a global power. Heartfelt condolences to his family members. May his soul rest in peace.— YS Jagan Mohan Reddy (@ysjagan) December 26, 2024రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా, ఆర్థికశాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం ఛైర్మన్గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్గా… ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్ గొప్ప మేధావి అని కొనియాడారు. దేశంలో పేదరికాన్ని పారదోలేందుకు అసమాన సేవలందించారని, ఆయన కలకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు. ఏ బాధ్యత నిర్వహించినా.. ప్రతీ చోటా తనదైన ముద్ర కనబర్చారని గుర్తు చేశారు. ఆయన దార్శనికత ఎప్పటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. మన్మోహన్సింగ్ మృతితో దేశం ఒక మహా నాయకుడిని కోల్పోయిందన్నారు. -
ఆర్థిక సంస్కరణల సారథి, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ అస్తమయం
-
ఆయన దార్శనికత ఎప్పటికీ ఆదర్శప్రాయం
అమరావతి: భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ మరణం పట్ల మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు. పదేళ్లపాటు దేశ ప్రధానిగా గొప్ప సేవలందించారని ప్రశంసించారు. ఆర్బీఐ గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా ఆర్థిక సంస్కరణలతో దేశ పురోభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా, ఆర్థికశాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం చైర్మన్గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్గా ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్ గొప్ప మేధావి అని కొనియాడారు. దేశంలో పేదరికాన్ని పారదోలేందు కు డాక్టర్ మన్మోహన్ సింగ్ అసమాన సేవలందించారని, ఆయన కలకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు. ఏ బాధ్యత నిర్వహించినాం ప్రతి చోటా తనదైన ముద్ర కనబరిచారని గుర్తు చేశారు. ఆయన దార్శనికత ఎప్పటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. మన్మోహన్సింగ్ మృతితో దేశం ఒక మహా నాయకుడిని కోల్పోయిందన్న వైఎస్ జగన్, ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.విశిష్ట నాయకుడు: మోదీమన్మోహన్ సింగ్ మృతికి జాతి యావత్తు నివాళులర్పిస్తోంది. విజ్ఞానం, వినయం కలిగిన అత్యంత విశిష్ట నాయకులలో ఒకరిని దేశం కోల్పోయింది. నిరాడంబరత కలిగిన వ్యక్తిగా ఆయన గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగారు. ఆర్థిక మంత్రితోపాటు ఎన్నో ప్రభుత్వం పదవుల్లో సేవలందించారు. ఆర్థిక విధానాల్లో తనదంటూ గట్టి ముద్ర వేశారు. మన ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఎనలేని కృషి చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ నా సానుభూతి. చదవండి: ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడుభరతమాత గొప్ప బిడ్డ: రాష్ట్రపతి ముర్ము భరతమాత గొప్ప బిడ్డల్లో మన్మోహన్ ఒకరు. భారత ఆర్థిక సంస్కరణలకు ఆయన సేవలు మర్చిపోలేనివి. దేశానికి ఆయన సేవలు అమూల్యం. మచ్చలేని రాజకీయ నేత. మనందరికీ తీరని నష్టం. ఆర్థిక సంస్కరణలకు బాటలు: ధన్ఖడ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులు. దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను ఆయన సమూలంగా మార్చేశారు. ముందుచూపున్న నేత: ఖర్గే మన్మోహన్ సింగ్ ముందు చూపున్న నేతను కోల్పోయాం. అసమానమైన పాండిత్యమున్న ఆర్థికవేత్త, దేశ అభివృద్ధి, సంక్షేమం, సమ్మిళిత విధానాలకు దారితీసే ఆయన విధానాలు ఎప్పటికీ గౌరవించబడతాయి. చరిత్రలో మీకు తగు స్థానం దక్కుతుంది. అరుదైన నేత: ప్రియాంకాగాంధీ రాజకీయాల్లో సర్దార్ మన్మోహన్ సింగ్ మాదిరిగా గౌరవం పొందేవారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. ఆయన నిజాయతీ మనందరికీ స్ఫూర్తిదాయకం. నమ్మిన వాటికి ఎన్ని అడ్డంకులెదురైనా కట్టుబడి ఉండే అరుదైన నేత.మార్గదర్శిని కోల్పోయా: రాహుల్ మాజీ ప్రధాని మన్మోహన్ మృతితో గొప్ప మార్గదర్శిని కోల్పోయా. మన్మోహన్ జీ తన అపారమైన విజ్ఞానం, వివేచనతో దేశాన్ని ముందుకు నడిపించారు. ఆయన వినయం, ఆర్థిక శాస్త్రంపై లోతైన అవగాహన స్ఫూర్తిగా నిలుస్తాయి. దార్శనికత కలిగిన ఆర్థికవేత్త: శరద్ పవార్ మన్మోహన్ మరణ వార్త విని ఎంతో విచారంలో మునిగిపోయాను. ఆయన కన్నుమూతతో దేశం గొప్ప ఆర్థిక వేత్తను, దార్శనికత కలిగిన సంస్కరణవాది, ప్రపంచ నాయకుడిని కోల్పోయింది. దిగ్భ్రాంతి కలిగించింది: మమత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హఠాన్మరణం వార్త విని షాక్కు గురయ్యాను. ఆయన విజ్ఞానం అపారం. దేశం ఆయన నాయకత్వాన్ని కోల్పోయింది. నేను ఆయన ఆప్యాయతను కోల్పోయాను. తరతరాలకు స్ఫూర్తి: నడ్డా మన్మోహన్ దార్శనికత కలిగిన నేత. దేశ రాజకీయాల్లో అగ్రగణ్యుడు. సుదీర్ఘ కాలం ప్రజా సేవలో కొనసాగిన ఆయన అణగారిన వర్గాల సంక్షేమం తరఫున నిలిచారు. పార్టీలతో ప్రమేయం లేకుండా ఆయన నాయకత్వం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆయన వారసత్వం దేశ నిర్మాణ సాధనలో తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. -
తెలంగాణ ఏర్పాటైంది మన్మోహన్ హయాంలోనే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైంది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోనే. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందింది. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు, రాజకీయ నిర్ణయాలు జరిగినప్పటికీ మన్మోహన్ ప్రధానిగా ఉన్న సభలోనే రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందడం గమనార్హం. హైదరాబాద్ మెట్రో రైలు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే మంజూరు కావడమే కాక, వయబిలిటీ గ్యాప్ ఫండ్ను ఇవ్వడంలో ఆయన కృషి ఉంది. కాగా, మన్మోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తదితరులు సంతాపం తెలిపారు. ఆయన జీవితం దేశానికి ఆదర్శమని, ఆయన మరణం దేశ ప్రజలకు తీరనిలోటని పేర్కొన్నారు. మన్మోహన్ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. -
దేశం గొప్ప భూమిపుత్రున్ని కోల్పోయింది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఈ మేరకు గురువారం రాత్రి ‘ఎక్స్’వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ‘దేశంలోనే గొప్ప ఆర్థిక వేత్త, నాయకుడు, సంస్కరణవాది, అన్నిటికంటే మించి మానవతావాది మన్మోహన్ సింగ్ ఇకలేరు. ధర్మానికి ప్రతీకగా, నిష్కలంకమైన సమగ్రత కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన మన్మోహన్ నవభారత నిర్మాతల్లో ఒకరు. తన రాజకీయ, ప్రజా జీవితంలో ఔన్నత్యాన్ని ప్రదర్శించిన భూమి పుత్రుడిని దేశం కోల్పోయింది. మన్మోహన్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’అని ట్వీట్లో రేవంత్ పేర్కొన్నారు. దేశానికి తీరని లోటు: డిప్యూటీ సీఎం భట్టి మన్మోహన్ సింగ్ మరణం పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం తెలిపారు. దూరదృష్టి గల నాయకుడు, ప్రఖ్యాత ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, భారతదేశ పురోగతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నా రు. దేశానికి మన్మోహన్ చేసిన కృషి, అభివృద్ధిలో ఆయన పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోతుందన్నారు. ఉద్యమాన్ని అర్థం చేసుకున్నారు: కేసీఆర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రశేఖర్రావు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. ‘పీవీ మనసు గెలిచిన మన్మోహన్ సింగ్ అనేక ఉన్నత శిఖరాలకు చేరుకున్న భరతమాత ముద్దుబిడ్డ. భారత ప్రధానిగా మన్మోహన్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం. తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’అని కేసీఆర్ పేర్కొన్నారు. మన్మోహన్ పాత్రను దేశం మర్చిపోదు: కేంద్రమంత్రి కిషన్రెడ్డి మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ‘ఆర్బీఐ గవర్నర్ గా, ప్రణాళికా సంఘంలో కీలక బాధ్యతల్లో, యూ జీసీ చైర్మన్గా, కేంద్ర ఆర్థిక శాఖమంత్రిగా మన్మోహన్ దేశానికి వన్నెతీసుకొచ్చారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు, దేశ ఆర్థిక మంత్రిగా దేశంలో సంస్కరణలు తీసుకురావడంలో మన్మోహన్ పోషించిన పా త్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆయన మరణం దేశానికి తీరని లోటు’అని పేర్కొన్నారు. ఆధునిక భారత నిశ్శబ్ద నిర్మాత : కేటీఆర్ ‘ఆధునిక భారత నిశ్శబ్ద నిర్మాత, దూర దృష్టి గల నేత, మేధావి, అద్భుతమైన మానవతావాది మన్మోహన్ సింగ్. చరిత్ర పుటల్లో వారి కీర్తి ఎల్లప్పుడూ అజరామరంగా నిలిచిపోతుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు, మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి’ దేశ ప్రగతిలో కీలక భూమిక: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ మొదట పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థికశాఖ మంత్రిగా సంస్కరణలను అమలుచేసి దేశం అభివృద్ధి పథంలో నడవడానికి పునాదులు వేశారు. 2004 నుంచి 2014 వరకు భారతదేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ భారతదేశ ప్రగతికి తోడ్పడ్డారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. మన్మోహన్ సింగ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రారి్థస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. పలువురు నేతల సంతాపం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపాన్ని తెలియజేశారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, శ్రీధర్బాబు, టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ చిన్నారెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్కుమార్ రెడ్డి, సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. -
నీ దూకుడు.. సాటెవ్వరూ..!
మన్మోహన్ సింగ్ ఎక్కువగా మాట్లాడరని, దూకుడుగా వ్యవహరించరని ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనపై ప్రతిపక్షాలు విమర్శలు చేసేవి. ఆయన్ని మౌనమునిగా వర్ణించేవి. మన్మోహన్ కేవలం కీలుబొమ్మని, రిమోట్ సోనియా చేతిలో ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసేవి. కానీ తాను మాటల మనిషి కాదు చేతల మనిషని ఎన్నోసార్లు మన్మోహన్ నిరూపించారు. ఆయన దూకుడు ఏంటనేది ఆర్థిక సంస్కరణలతోనే దేశానికి తెలిసొచ్చింది. నెహ్రూ ఆర్థిక విధానాలు, రష్యాతో అనుబంధం కారణంగా 90వ దశకం వరకు సోషలిజం నినాదమే దేశంలో బలంగా వినిపించేది. ఆ నినాదానికి ఎదురుగా వెళ్లి మాట్లాడే దమ్ము, ధైర్యం అప్పటి రాజకీయ నాయకులకు లేదు. సోషలిజంలో భాగంగా అప్పటి ప్రభుత్వాలు గుడ్డిగా విదేశీ దిగుమతులను తగ్గించేందుకు అడ్డగోలుగా పన్నులు విధించేవి. అదే సమయంలో విదేశాలకు చేసే ఎగుమతులకు అనేక ప్రోత్సాహకాలు అందించేవి. అయితే కాలానుగుణంగా ఇందులో మార్పులు చేయకపోవడంతో ఈ రెండు విధానాలు భ్రష్టుపట్టిపోయాయి. తగ్గేదే లేదు ఇక్కడి దిగుమతి సుంకాలకు భయపడి విదేశీయులు తమ వస్తువులు అమ్మేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించేవారు కాదు. అదే సమయంలో కీలక విభాగాల్లో ప్రభుత్వ గుత్తాధిపత్యం, లైసైన్స్రాజ్ కారణంగా పరిమితంగానే ఇక్కడి పరిశ్రమల నుంచి ఉత్పత్తి జరిగేది. అంతర్జాతీయ మార్కెట్లో వీటికి డిమాండ్ లేకపోయినా సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందించే వారు. ఇవి మంచి ఫలితాలు ఇవ్వకపోయినా మార్చే సాహసం ఎవరూ చేయలేదు. కానీ మన్మోహన్ ఏ మాత్రం సంకోచం లేకుండా విదేశీ దిగుమతులపై ఉన్న పన్నులు తొలగించడంతో పాటు స్వదేశీ వస్తువులకు అందిస్తున్న ప్రోత్సాహకాలను నిలిపేశారు. ఫలితాలు ఇవ్వకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకడానంటూ గట్టి సంకేతాలు పంపారు. చదవండి: నాయకత్వ లక్షణాలను చాటిన పౌర అణు ఒప్పందంతెగింపునకు మరో పేరుపీవీ నర్సింహారావు ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు దేశంలో రాజకీయ అస్థిరత నెలకొని ఉంది. అంతకు ముందు 11 నెలలకే వీపీ సింగ్ ప్రభుత్వం పడిపోగా, చంద్రశేఖర్ గవర్నమెంట్ పట్టుమని ఏడు నెలలు కూడా ఉండలేకపోయింది. ఇక పీవీది కూడా మైనార్టీ ప్రభుత్వమే అయినా ఇంతటి రాజకీయ అస్థిరతలో సైతం తెగించి ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు మన్మోహన్. పదవులు...బాధ్యతలు -
నాయకత్వ లక్షణాలను చాటిన పౌర అణు ఒప్పందం
ప్రధానిగా మన్మోహన్సింగ్ సాధించిన అతిపెద్ద విజయాల్లో అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం ప్రత్యేకమైంది. దేశ విదేశాంగ విధానంలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మన్మోహన్ దూరదృష్టికి, నాయకత్వ లక్షణాలకు అద్దంపట్టింది. అణ్వస్త్రపరంగా భారత్ను దశాబ్దాలపాటు ఏకాకిగా మిగిల్చిన ప్రపంచ దేశాలకు భారత్ ఈ చరిత్రాత్మక ఒప్పందంతో దీటుగా బదులిచ్చింది. అమెరికా నుంచి అణు ఇంధన లభ్యత, పౌర అణు సాంకేతికతలో సహకారం సహా ఎన్నో దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే ఈ ఒప్పందం కార్యరూపం దాల్చేలా మన్మోహన్ అవిరళ కృషి చేశారు. నాటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్యూ. బుష్తో కలిసి మన్మోహన్సింగ్ 2005 జూలై 18న పౌర అణు ఒప్పందానికి సంబంధించిన విధివిధానాలపై సంయుక్త ప్రకటన చేశారు. అయితే ఈ ఒప్పందాన్ని యూపీఏ–1 సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్రపక్షమైన వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉన్నా లెక్కచేయకుండా మన్మోహన్ ముందడుగు వేశారు. విశ్వాస పరీక్ష ఎదుర్కొని మరీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగారు. 2008 అక్టోబర్లో అణు ఒప్పందం కార్యరూపం దాల్చింది. చదవండి: ప్రపంచం మెచ్చిన రాజనీతిజ్ఞుడు -
ప్రపంచం మెచ్చిన రాజనీతిజ్ఞుడు
యాక్సిడెంటల్ పీఎం. ఈ పదబంధం డాక్టర్ మన్మోహన్సింగ్కు అచ్చు గుద్దినట్టుగా సరిపోతుంది. నిజానికి ఆయనకున్న భుజకీర్తులు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచమే మెచ్చిన ఆర్థికవేత్త. అనుకోకుండా వచ్చి పడ్డ ముళ్లకిరీటం వంటి ఆర్థిక మంత్రి బాధ్యతలను అత్యంత చాకచక్యంగా నిభాయించి దేశాన్ని సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కించిన మేధావి. ఏకంగా పదేళ్లపాటు ప్రధాని. ఆ ఘనత సాధించిన తొలి సిక్కు. నెహ్రూ, ఇందిర, మోదీ తర్వాత అత్యధిక కాలం ఆ పదవిలో కొనసాగిన నాయకుడు. సమాచార హక్కు వంటి కీలక చట్టాలు చేసిన సర్కారుకు సారథి. అయినా సరే, మన్మోహన్ పేరు చెప్పగానే ఎవరికైనా మదిలో మెదులేది ఆయన అనూహ్యంగా ప్రధాని అయిన తీరే! అందుకే ఆయనపై రాసిన పుస్తకానికి ప్రముఖ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు సంజయ బారు కూడా ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే పేరు పెట్టారు. ‘పీఎం మన్మోహన్’కు మీడియా సలహాదారుగా నాలుగేళ్ల పాటు ఆయనను అతి దగ్గరగా చూసిన అనుభవాలన్నింటినీ అందులో నిర్మొహమాటంగా పొందుపరిచారు. నిశ్శబ్ద సంస్కర్త ప్రధానిగా మన్మోహన్ సారథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మరింతగా పరుగులు పెట్టింది. మన దేశం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, సమాచార హక్కు, విద్యా హక్కు వంటి చరిత్రాత్మక చట్టాలు పుట్టుకొచ్చాయి. వామపక్షాలు వ్యతిరేకించినా, ఎన్ని అభ్యంతరాలు ఎదురైనా వెరవక అమెరికాతో మన్మోహన్ కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం మరో మైలురాయి. దౌత్య రంగంలో కూడా పలువిజయాలకు ఆయన హయాం వేదికైంది. అమెరికా, రష్యా, చైనా వంటి పెద్ద దేశాలతో బంధాలను బలోపేతం చేశారు. ఫలితంగా 2008లో ప్రపంచమంతా పెను ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నా మన్మోహన్ ముందుచూపు నిర్ణయాల వల్ల భారత ప్రస్థానం మాత్రం స్థిరంగా సాగింది. ఇన్ని చేసినా కృషికి తగ్గ పేరు రాని నిశ్శబ్ద సంస్కర్తగానే మిగిలిపోయారు మన్మోహన్.మీరు జోక్ చేస్తున్నారా? ఆర్థిక శాఖ ఆఫర్పై మన్మోహన్అది 1991. కేంద్రంలో పీవీ సారథ్యంలో కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వ ఏర్పాటు దేశమంతటా హాట్ టాపిక్గా మారింది. మర్నాడే ప్రమాణస్వీకారం. మంత్రివర్గ కూర్పుపై పీవీ మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ సమయాన మన్మోహన్ ఢిల్లీలో తన నివాసంలో కూర్చుని తాపీగా పేపర్ చదువుతున్నారు. అప్పుడు పీవీ ముఖ్య కార్యదర్శి ఆయన ఇంటికి వచ్చారు. ‘ప్రధాని మిమ్మల్ని కేబినెట్లోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆర్థిక శాఖ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి’ అని చెప్పారు. దాన్ని మన్మోహన్ నమ్మలేదు. ‘‘నేనా? కేబినెట్లోకా? మీరు జోక్ చేస్తున్నారా?’’ అంటూ నవ్వి ఊరుకున్నారు. తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదు. మర్నాడు ప్రమాణ స్వీకారానికి వేళవుతున్నా మన్మోహన్న్రాష్ట్రపతి భవన్ చేరుకోకపోవడంతో పీవీ ముఖ్య కార్యదర్శి నేరుగా ఆయన ఇంటికి ఫోన్చేశారు. ’ప్రమాణానికి టైం దగ్గర పడుతుంటే మీరింకా రాలేదేంటి?’ అంటూ హైరానా పడ్డారు. అప్పటికి గానీ తాను నిజంగానే మంత్రిని కాబోతున్నట్టు మన్మోహన్ నమ్మలేదు. దాంతో ఉన్నపళాన బయల్దేరి వెళ్లి ప్రమాణస్వీకారం చేశారు. ‘‘అలా నా రాజకీయ జీవితం హడావుడిగా మొదలైంది! కనీసం తయారయ్యే టైం కూడా లేకుండానే ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది’’ అంటూ 2005లో ఓ బ్రిటిష్ జర్నలిస్టుకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మన్మోహన్ గుర్తు చేసుకున్నారు. అవార్డులు.. రివార్డులు ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల నుంచి మన్మోహన్ లెక్కలేనన్ని గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ఎన్నోసార్లు ఉత్తమ పార్లమెంటేరియన్గా నిలిచారు. 1987లో దేశ రెండో అతి పెద్ద పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించింది. ఎన్నో దేశాలు ఆయనకు తమ అత్యుత్తమ పౌర పురస్కారాలు ప్రదానం చేశాయి. కష్టాల బాల్యం మన్మోహన్ 1932 సెప్టెంబర్ 26న పంజాబ్లోని గహ్ గ్రామంలో జని్మంచారు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. చిన్నప్పుడే తల్లి చనిపోతే అమ్మమ్మే అన్నీ తానై పెంచింది. 1947లో దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం అమృత్సర్ వలస వచ్చింది. ఆర్థిక కష్టనష్టాలను ఓర్చుకుంటూనే ఆయన విద్యాభ్యాసం సాగించారు. అసాధారణ ప్రతిభతో స్కాలర్షిప్లు పొందుతూ ఉన్నత విద్య పూర్తి చేశారు. 1952లో పంజాబ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్, 1954లో మాస్టర్స్ పట్టా పొందారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పొందారు. తర్వాత ఆక్స్ఫర్డ్లో నఫీల్డ్ కాలేజీలో పీహెచ్డీ చేశారు. ఆయన సమరి్పంచిన డాక్టోరల్ థీసిస్ ‘భారత ఎగుమతి ధోరణులు, స్వయం ఆధారిత వృద్ధి ప్రాతిపదికలు’ మన ఆర్థిక వ్యవస్థపై ఆయన లోతైన దృష్టికి తార్కాణం. అధ్యాపకునిగా, బ్యూరోక్రాట్గా...మన్మోహన్ కెరీర్ ఆర్థిక శాస్త్రంలో లెక్చరర్గా మొదలైంది. పంజాబ్ యూనివర్సిటీ ,ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో బోధించారు. ఆర్థికశాస్త్రం, విధానాలపై లోతైన అవగాహన ఆయనది. 1966–69 మధ్య ఐరాసలోనూ పని చేశారు. అనంతరం అనుకోకుండా బ్యూరోక్రాట్గా మారారు. తొలుత వాణిజ్య, పరిశ్రమల శాఖలో ఆర్థిక సలహాదారుగా చేశారు. అనంతరం 1972–1976 నడుమ కేంద్ర ఆర్థిక శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగావున్నారు. 1982–1985 మధ్య రిజర్వు బ్యాంకు గవర్నర్గా రాణించారు. తర్వాత రెండేళ్లు ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా సేవలందించారు. ఆయా పదవుల్లో ఉండగా మన్మోహన్ రూపొందించిన పలు కీలక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరణ బాట పట్టించడంలో ఎంతగానో దోహదపడ్డాయి.మచ్చలేని వ్యక్తిత్వం నిజాయితీకి, మచ్చలేని వ్యక్తిత్వానికి ప్రతీక మన్మోహన్. ప్రజా జీవితంలో నాయకులు పాటించాల్సిన విలువలకు బెంచ్మార్క్గా నిలిచారు. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. అతి నిరాడంబర జీవన శైలి, అన్ని అంశాల మీదా లోతైన అవగాహన సమకాలీన నాయకుల్లో ఆయన్ను అత్యంత విలక్షణంగా నిలిపాయి. నెహ్రూను కూడా కాదని మన్మోహన్ను అత్యుత్తమ ప్రధానిగా కుష్వంత్సింగ్ వంటి ప్రముఖులు కీర్తించారు. 1999 లోక్సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రచారం నిమిత్తం తన వద్ద తీసుకున్న రూ.2 లక్షలను మన్మోహన్ గుర్తుతో తిరిగిచ్చిన వైనాన్ని కుష్వంత్ చాలాకాలం పాటు ఎందరితోనో చెప్పుకున్నారు.పాలనపై విమర్శ...వ్యక్తిగతంగా మన్మోహన్ది ఏ మచ్చా లేని జీవితమే అయినా పాలనపరంగా మాత్రం కొన్ని విమర్శలూ ఎదుర్కొన్నారు. యూపీఏ–2లో రెండోసారి ప్రధాని అయ్యాక కామన్వెల్త్ క్రీడలు, బొగ్గు, 2జీ స్పెక్ట్రం వంటి కుంభకోణాలు ఆయన ప్రతిష్టను మసకబార్చాయి. బొగ్గు కుంభకోణంపై ప్రశ్నల పరంపరకు, ‘వెయ్యి సమాధానాల కంటే మౌనమే మేలు’ అంటూ ఆయన బదులిచ్చారు. అవినీతి, నమ్మకద్రోహం, క్రిమినల్ కుట్ర తదితర ఆరోపణలపై బదులిచ్చేందుకు కోర్టుకు రావాల్సిందిగా అనంతర కాలంలో సమన్లు కూడా అందుకోవాల్సి వచ్చింది.ఆ మలుపు... 1991లో మన్మోహన్ జీవితం అనుహ్యమైన మలుపు తిరిగింది. భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయమది. విదేశీ మారక ద్రవ్యం దాదాపుగా నిండుకుంది. ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలతో ఏ సంబంధమూ లేని మన్మోహన్ను ఎకాయెకిన కేంద్ర ఆర్థిక మంత్రిగా నియమించారు. దీనిపై అప్పట్లో పలువురు పెదవి విరిచినా ఆ నిర్ణయం మాస్టర్ స్ట్రోక్గా నిలిచింది. మన్మోహన్ విధానాలు, 1991 ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థనే సమూలంగా మార్చేశాయి. ఎగుమతులను ప్రోత్సహించడానికి రూపా యిని విలువ తగ్గించినా, విదేశీ పెట్టుబడులకు బాటలు పరిచినా, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించినా అన్నీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన నిర్ణయాలే! పీవీ మార్గదర్శకత్వంలో ఆయన చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించి, నేలచూపులు చూస్తున్న మన ఆర్థిక వ్యవస్థ సగర్వంగా తలెత్తుకునేలా చేశాయి. ‘ఏ శక్తీ ఆపలేని ఆలోచనలు మనవి’ అంటూ 1991 బడ్జెట్ ప్రసంగంలో మన్మోహన్ చెప్పిన మాటలు అక్షర సత్యాలని అనంతర చరిత్ర నిరూపించింది. ప్రధానిగా ప్రస్థానంమన్మోహన్ జీవితంలో 1991ని కూడా మించిన అత్యంత అనూహ్య మలుపుకు 2004 వేదికైంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ మెజారిటీ సాధించినా సోనియాగాంధీ ప్రధాని కావడంపై అభ్యంతరాలు తలెత్తాయి. సొంత పార్టీ నేతలే ఆమె విదేశీయతను ప్రశ్నించిన పరిస్థితి! దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాని పదవిని సోనియా ‘త్యాగం’ చేశారు. ప్రణబ్ సహా కాంగ్రెస్ దిగ్గజాలెందరో ఆ పదవికి పోటీ పడ్డా సోనియా మాత్రంసౌమ్యుడైన మన్మోహన్కేసి మొగ్గారు. అలా అనుకోకుండా దేశ 13వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా, ఆ అత్యున్నత పదవిలో ఏకంగా పదేళ్లపాటు నిరాఘాటంగా కొనసాగి ఆయన మరో చరిత్ర సృష్టించారు!రాహుల్ చించేసిన ఆ ఆర్డినెన్స్... ప్రధానిగా తన పాలనా కాలం పొడవునా సోనియా నీడలోనే మిగిలిపోయారన్న అపప్రథ మూటగట్టుకున్నారు మన్మోహన్. జాతీయ సలహా మండలి చైర్పర్సన్ హోదాలో పదేళ్ల పాటు ఆమె బాధ్యత లేని అధికారాలు చలాయించినా చేష్టలుడిగి చూశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక 2013లో సోనియా తనయుడు రాహుల్గాంధీ చేసిన పని మన్మోహన్ గౌరవ ప్రతిష్టలను మరింత దిగజార్చింది. కళంకిత నేతలు దోషులుగా తేలినా మూడు నెలల పాటు పదవుల్లో కొనసాగవచ్చంటూ 2013లో కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ను ‘నాన్సెన్స్’ అంటూ రాహుల్ కొట్టిపారేశారు. అంతటితో ఆగకుండా విలేకరుల సమావేశం సాక్షిగా ఆర్డినెన్స్ కాపీని చించేశారు. అది మన్మోహన్ను కూడా తీవ్రంగా కలచివేసిందని చెబుతారు. బహుశా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే కాబోలు, మన్మోహన్ను ‘దేశ చరిత్రలోనే అత్యంత బలహీన ప్రధాని’గా బీజేపీ దిగ్గజం ఎల్కే ఆడ్వాణీ, ‘నైట్ వాచ్మన్’గా, ‘గాంధీల చేతుల్లో కీలు»ొమ్మ’గా నరేంద్ర మోదీ అభిర్ణించారు! మన్మోహన్ తన రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా లోక్సభకు ఎన్నికవలేదు! ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం 2024 ఏప్రిల్తో రాజ్యసభ సభ్యుని హోదాలో ముగిసింది.‘మన్మోహనాలు’ మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ వివిధ అంశాలపై తన అంతరంగాన్ని ఆవిష్కరించే క్రమంలో పంచుకున్న మనసులోని భావాలు.ఆర్థిక సంస్కరణలపై..→ సమయం వచ్చినప్పుడు ఒక ఆలోచనను ఈ భూమ్మీద ఏ శక్తీ ఆపలేదు.గ్లోబలైజేషన్, ఆర్థిక వ్యవస్థపై:→ భారత్ ఇప్పుడు సమ్మిళిత, సమాన, స్థిరమైన వృద్ధి పథంలో సాగుతోందని నేను నమ్ముతున్నా→ ప్రపంచీకరణ ఒక వాస్తవం. దాన్ని అంగీకరించి అందుకు అనుగుణంగా మన విధానాలను రూపొందించుకోవాలి.నాయకత్వం, పాలనపై..→ భారత్కు అపారమైన శక్తిసామర్థ్యాలు ఉన్నాయని నిజంగా విశ్వసిస్తున్నా. వాటిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకొనేందుకు సుపరిపాలన అవసరం.ప్రపంచంలో భారతదేశం పాత్రపై→ భారత్ పురాతన దేశమే అయినప్పటికీ అది యువదేశం. ఎటుచూసినా యువతరం కనిపిస్తున్న మాదిరిగానే మనం ఆత్రుతలో ఉన్నాం. కానీ భవిష్యత్తు మనదే అని నేను బలంగా నమ్ముతున్నా.→ మనం ఎదురుదాడి కాకుండా సహకారం, పోటీతత్వం అనే సరైన మార్గాన్ని ఎంచుకుంటే భారత్ ఎదిగేందుకు ఈ ప్రపంచం చోటు కల్పిస్తుంది.ఆయనపై → పెద్ద బాధ్యత అందుకున్న చిన్న వ్యక్తిని నేను.ప్రధానిగా..→ వినయం, లక్ష్యానికితగ్గ పట్టుదల నాయకత్వానికి పునాదులని నేను ఎల్లప్పుడూ విశ్వసించా.విద్య, యువతపై..→ భవిష్యత్తుకు విద్యే కీలకం. దేశ ప్రజలు, భవిత కోసం దేశం చేసే అత్యంత ముఖ్యమైన పెట్టుబడి అదే.→ దేశ యువత గొప్ప కలలు కనాలి. గొప్ప కలలు కంటేనే మనం గొప్ప విజయాలను సాధించగలమని నమ్మొచ్చు.చరిత్ర ఉదారంగానే చూస్తుంది... సమకాలీన మీడియా కంటే చరిత్ర నా పట్ల ఉదారంగానే వ్యవహరిస్తుంది – 2014 జనవరిలో ప్రధానిగా చివరి మీడియా సమావేశంలో మన్మోహన్ చేసిన వ్యాఖ్యలివి! మీడియా శరపరంపరగా ప్రశ్నలు సంధించడంతో అలా స్పందించారాయన. ‘సంకీర్ణ రాజకీయాల అనివార్యతకు లోబడి నేను చేయగలిగినంత చేశాను. దానిపై చరిత్రే తుది తీర్పరి’ అన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
నేడు ప్రభుత్వ సెలవు
సాక్షి, హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అలాగే రాష్ట్రంలో వారం రోజులు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. -
Manmohan Singh : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత - అరుదైన ఫోటోలు
-
మన్మోహన్ అస్తమయం
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణల సారథి, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ (92) ఇక లేరు. వయో సంబంధిత సమస్యలతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆయన గురువారం ఢిల్లీలోని తన నివాసంలో చికిత్స పొందుతూ ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు. దాంతో అత్యంత విషమ స్థితిలో రాత్రి 8 గంటల వేళ హుటాహుటిగా ఎయిమ్స్ ఎమర్జెన్సీ విభాగానికి తరలించారు. ‘‘అన్నిరకాలుగా అత్యవసర చికిత్స అందించినా లాభం లేకపోయింది. 9.51 గంటల ప్రాంతంలో మన్మోహన్ తుదిశ్వాస విడిచారు’’ అని ఎయిమ్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. వివాద రహితునిగా, అత్యంత సౌమ్యునిగా, మృదుభాషిగా, మచ్చలేని రాజనీతిజు్ఞడిగా పేరొందిన మన్మోహన్ మృతి పట్ల రాజకీయ తదితర రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాందీ, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు. మన్మోహన్ అస్వస్థత గురించి తెలియగానే సోనియా తన కుమార్తె ప్రియాంకతో కలిసి హుటాహుటిన ఎయిమ్స్కు చేరుకున్నారు. మన్మోహన్ పార్థివదేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆయన మరణ వార్త తెలిసి సీడబ్ల్యూసీ భేటీ కోసం కర్ణాటకలోని బెల్గావీలో ఉన్న ఖర్గే, రాహుల్ తదితరులంతా హస్తిన బయల్దేరారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాపం ప్రకటించింది. మన్మోహన్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని ఆదేశించింది. కాంగ్రెస్ కూడా వారం పాటు పార్టీ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుంది. కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఉదయం సమావేశమై మన్మోహన్కు ఘనంగా నివాళులు అర్పించనుంది. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ రెండుసార్లు ప్రధానిగా చేశారు. ఆయనకు భార్య గురుచరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలున్నారు. ⇒ శాంతి, శ్రేయస్సు విడదీయలేనివి. శాంతి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. అదే సమయంలో అభివృద్ధి లేకుంటే శాంతి ఉండదు. భారతదేశ అసలైన భవితవ్యం దాని సహనశీలత, సమ్మిళిత, సమానత్వ సమాజంగా ఎదగగల సామర్థ్యంలో దాగి ఉంది.⇒ 1991లో మేం చేపట్టిన సంస్కరణలు ఎవరినీ సంతోషపరిచేందుకు కాదు. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంతోపాటు స్థిరమైన వృద్ధికి పునాది వేయడమే వాటి ఉద్దేశం.⇒ మన ప్రజల తలసరి ఆదాయం గురించి కంటే వారి ఆదాయాల్లోని అసమానతల గురించే నాకు ఎక్కువ ఆందోళన ఉంది.⇒ మన దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. కానీ వాటిని ప్రతిసారీ మనం మరింత బలంగా, మరింత ఐక్యంగా, మరింత పట్టుదలతో ఎదుర్కొని బయటపడ్డాం. మన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. కానీ కష్టపడేతత్వం, చిత్తశుద్ధి, సరైన విధానాలతో మనం మనుగడ సాగించగలం. -
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు అస్వస్థత
ఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను గురువారం రాత్రి హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. అత్యవసర విభాగంలో మన్మోహన్ సింగ్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. ఆయన ఆసుపత్రిలో ఏ అనారోగ్య సమస్య కారణంగా చేరారో తెలియరాలేదు.అయితే, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్లో చేర్చినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు దేశ ప్రధానిగా సేవలందించారు.మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో ఆర్బీఐ గవర్నర్ హోదాలో కీలక పాత్ర పోషించిన మన్మోహన్ సింగ్.. 1991 అక్టోబరు 1 నుండి 2019 జూన్ 14 వరకు ఐదు పర్యాయాలు అస్సాం నుండి రాజ్యసభ సభ్యునిగా, ఆ తర్వాత ఆయన 2019 ఆగస్టు 20 నుండి 2024 ఏప్రిల్ 3 వరకు రాజస్థాన్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు.ఇదీ చదవండి: అప్పటివరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన -
కశ్మీర్ వెళ్లేందుకు భయపడ్డా
న్యూఢిల్లీ: కశ్మీర్ వెళ్లేందుకు భయపడ్డానంటూ యూపీఏ హయాంలో కేంద్ర హోం మంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఢిల్లీలో సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ‘ఫైవ్ డికేడ్స్ ఆఫ్ పాలిటిక్స్’అనే పేరుతో తన ఆత్మకథను షిండే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అప్పట్లో జమ్మూకశ్మీర్లో నెలకొన్న పరిస్థితులను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. ‘హోం మంత్రి కాకమునుపు కశ్మీర్కు చాలాసార్లు వెళ్లాను. నా స్నేహితుడు, విద్యావేత్త విజయ్ ధార్ ఇంటికి అప్పట్లో వెళ్లేవాణ్ని.మంత్రి నయ్యాక మాత్రం ‘శ్రీనగర్లో దాల్ సరస్సును చూడు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగు. అంతేతప్ప, మిగతా చోట్లకు మాత్రం వెళ్లకు అని విజయ్ సలహా ఇచ్చాడు. దీంతో సాక్షాత్తూ దేశానికి హోం మంత్రినే అయినప్పటికీ కశ్మీర్ వెళ్లడానికి మాత్రం భయపడ్డా’అని చెప్పారు. ‘స్వయంగా హోం మంత్రిని అయిన నేను ఈ విషయం ఎవరికి చెప్పుకోను? ఇప్పుడెందుకు చెబుతున్నానంటే..కేవలం నవ్వుకోడానికి మాత్రమే. మాజీ హోం మంత్రి ఇలాంటి వాటిపై మాట్లాడకూడదు’అని షిండే చెప్పారు.మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో 2012–14 సంవత్సరాల్లో షిండే హోం మంత్రిగా ఉన్నారు. షిండే వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పాలనలో సాక్షాత్తూ దేశానికి హోం మంత్రే కశ్మీర్ వెళ్లేందుకు భయపడ్డారు. మోదీ హయాంలో మాత్రం ఏటా 2–3 కోట్ల మంది పర్యాటకులు జమ్మూకశ్మీర్ను సందర్శిస్తున్నారు. రెండు పార్టీల ప్రభుత్వాలకీ ఉన్న ముఖ్యమైన తేడా ఇదే’అని ఆయన పేర్కొన్నారు. -
‘ప్రసంగాలతో గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోదీ’
ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన విద్వేశపూరిత వ్యాఖ్యలను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రంగా ఖండిచారు. ప్రతిపక్షాలు, ఓ వర్గం ప్రజలపై ప్రధాని మోదీ చేసిన విద్వేశపూరిత వ్యాఖ్యలు.. ప్రధాని ఆఫీసు గౌరవాన్ని దిగజార్చాయి. ఇలా గౌరవాన్ని దిగజార్చిన తొలి ప్రధాని మోదీ అని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పంజాబ్ ప్రజలకు లేఖ రాశారు.‘‘ ప్రధాని మోదీ విద్వేశపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అవి దేశ ప్రజల్లో విభజన తీసుకువచ్చే విద్వేశ వ్యాఖ్యలు. 2022 వరకు మోదీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారు. మోదీ విధానాల వల్ల గత పదేళ్లలో రైతులు ఆదాయం దారుణంగా తగ్గిపోయింది. రోజుకు జాతీయ సగటు రైతు ఆదాయం రూ. 27 ఉంటే, సగటు అప్పు మాత్రం రూ. 27 వేలు ఉంది. ఇందనం, ఎరువులు అన్నింటి ధరలు పెరిగాయి. దీంతో రైతుల ఆదాయం తగ్గిపోయింది. పదేళ్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. జీఎస్టీ, నోట్ల రద్దు, కరోనాను సరిగా ఎదుర్కొకపోవటం వల్ల దేశం దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లింది. గ్రోత్ రేట్ కూడా పడిపోయింది. సుమారు 750 మంది రైతుల ఢిల్లీ సరిహద్దుల్లో మృతి చెందారు. లాఠీలు, రబ్బరు బుల్లెట్లతోనే కాకుండా ప్రధాని మోదీ తన మాటలతో రైతులపై దాడి చేశారు. రైతులను ‘‘ఆందోళన జీవులు’’ అని అవమానించారు. తమను సంప్రదించకుండా చేసిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు కోరారు. గడిచిన పదేళ్లలో పంజాబ్, పంజాబ్ ప్రజలను బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా దూషించింది’’ అని మన్మోహన్ సింగ్ తెలిపారు.ఏప్రిల్లో మోదీ రాజస్థాన్లోని ఎన్నికల ప్రచార ర్యాలీలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే.. దేశ సంపదను ఎక్కువ మంది పిల్లలు కనేవారికి పంచిపెడతారని అన్నారు. ముస్లీంలకు తొలి ప్రాధాన్యమని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించినట్లు కూడా మోదీ ఆరోపణులు చేసిన విషయం తెలిసిందే. -
ఒక శకం ముగిసింది.. మన్మోహన్పై ఖర్గే ప్రశంసలు
సాక్షి, ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేడు రాజ్యసభ సభ్యుడిగా రిటైర్ కానున్నారు. రాజ్యసభలో తన 33 ఏళ్ల పార్లమెంటరీ ఇన్నింగ్స్ను మన్మోహన్ సింగ్ ముగించారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్పై అన్ని పార్టీలు ప్రశంసలు కురిపించాయి. ఇక, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. మన్మోహన్ సింగ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సేవలను కొనియాడుతూ ఖర్గే లేఖ రాశారు. ఈ లేఖలో ఒక శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. భారత రాజకీయాలకు, దేశానికి మన్మోహన్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ ఎల్లప్పుడూ మధ్యతరగతి, ఆకాంక్ష యువతకు హీరో, పారిశ్రామికవేత్తలకు నాయకుడు మార్గదర్శకుడు అని కొనియాడారు. మన్మోహన్ ఆర్థిక విధానాల వల్ల పేదరికం నుండి బయటపడగలిగిన పేదలందరికీ శ్రేయోభిలాషి అని చెప్పుకొచ్చారు. ఉపాధి హామీ పథకంతో మన్మోహన్ సింగ్ గ్రామీణులకు కష్ట సమయాల్లో ఆదాయం, తలెత్తుకు బతికే అవకాశం కల్పించారని అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి మన్మోహన్ సింగ్ వేసిన ఆర్థిక పునాదుల ఫలాలు నేటి సమాజానికి అందుతున్నాయని తెలిపారు. కానీ, నేటి రాజకీయ నాయకులు ఆయన పాత్రను గుర్తించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా క్షమించగలిగే పెద్ద మనసు ఆయన సొంతమని ప్రశంసించారు. మన్మోహన్ రాజకీయ ప్రస్థానం.. ఆర్థిక రంగంలో ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలకు నాంది పలికిన మన్మోహన్ సింగ్ 1991 అక్టోబర్లో తొలిసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సింగ్ 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానిగా ఉన్నారు. 1991 అక్టోబర్ 1 నుంచి 2019 జూన్ 14 వరకూ అస్సాం నుంచి ఐదు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ తరువాత 2019 ఆగస్టు 20న రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైయ్యారు. ఏప్రిల్ 3న బుధవారం 91 ఏళ్ల మన్మోహన్ సింగ్ పదవీ కాలం పూర్తి కావస్తుండటంతో ఆ స్థానంలో తొలిసారి రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. -
మన్మోహన్ సింగ్ పై ప్రధాని మోదీ ప్రశంసలు
-
మన్మోహన్ సింగ్పై ప్రధాని మోదీ ప్రసంశలు
ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై ప్రధాని మోదీ ప్రసంశలు కురిపించారు. వీల్ చైర్లో కూడా వచ్చి పనిచేశారని పేర్కొన్నారు. రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న సభ్యుల వీడ్కోలు సందర్భంగా సభలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటింగ్ సమయంలో ట్రెజరీ బెంచ్ గెలుస్తుందని తెలిసినా.. మన్మోహన్ సింగ్ వీల్ చైర్లో వచ్చి ఓటేశారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. సభ్యుడు తన విధుల పట్ల అప్రమత్తంగా ఉంటాడనడానికి ఇదొక ఉదాహరణ అని కొనియాడారు. పదవీ విరమణ చేయనున్న రాజ్యసభ సభ్యులకు ఢిల్లీలోని చైర్మన్ జగదీప్ ధన్ఖర్ నివాసంలో గురువారం వీడ్కోలు ఇవ్వనున్నారు. ఈమేరకు ఇవాళ ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో రాజ్యసభ సభ్యులు గ్రూప్ ఫోటోలో పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు చైర్మన్ నివాసంలో పదవీ విరమణ చేస్తున్న సభ్యులకు వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదీ చదవండి: కాశీ, అయోధ్య.. ఇక మథుర: యోగి -
పెద్దల సభలో 68 మంది రిటైర్మెంట్!
న్యూఢిల్లీ: తొమ్మిది మంది కేంద్ర మంత్రులతో సహా అరవై ఎనిమిది మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఈ ఏడాదితో ముగియనుంది. పార్లమెంట్లో ఎగువసభ/ పెద్దలసభగా పిలుచుకునే రాజ్యసభలో ఈ ఏడాది పదవీకాలం పూర్తి చేసుకుంటున్నవాళ్లలో.. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, జయా బచ్చన్ కూడా ఉన్నారు. ఖాళీ అవుతున్న ఈ 68 స్థానాల్లో ఢిల్లీలోని మూడు స్థానాలకు ఎన్నికల నిర్వహణకు నోటిషికేషన్ జారీ అయ్యింది. ఆప్ నుంచి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంజయ్ సింగ్, నారాయణ్ దాస్ గుప్తా, సుశీల్కుమార్ గుప్తాలు జనవరి 27న తమ పదవీకాలం పూర్తవనుంది. ఇక సిక్కింలోని ఏకైక రాజ్యసభ స్థానానికి కూడా ఎన్నికలు త్వరలో జరగనుంది. ఎస్డీఎఫ్ నేత హిషే లచుంగ్పా ఫిబ్రవరి 23న పదవీ విరమణ చేయనున్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా 57 మంది నేతల పదవీకాలం ఏప్రిల్లో పూర్తవుతుంది. ►తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తరపున జోగినిపల్లి సంతోష్ కుమార్, రవిచంద్ర వద్దిరాజు, బి లింగయ్య యాదవ్ పదవీ విరమణ చేయనున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కనీసం ఇద్దరిని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని భావిస్తోంది. ► ఆంధ్రప్రదేశ్కి చెందిన టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్, వైఎస్సార్సీపీ సభ్యుడు ప్రభాకర్రెడ్డి వేమిరెడ్డి రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నారు. ►ఇక ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 10 సీట్లు, మహారాష్ట్ర 6, బీహార్ 6, మధ్యప్రదేశ్ 5, పశ్చిమ బెంగాల్ 5, కర్ణాటక 4, గుజరాత్ 4, ఒడిశా 3, తెలంగాణ 3, కేరళ 3, ఆంధ్ర ప్రదేశ్ 3, జార్ఖండ్ 2, రాజస్థాన్ 2, ఉత్తరాఖండ్ 1, హిమాచల్ ప్రదేశ్ 1, హర్యానా 1, ఛత్తీస్గఢ్ 1 స్థానం చొప్పున పదవీ విరమణ చేయనున్నారు. వీరితోపాటు జూలైలో నలుగురు నామినేటెడ్ సభ్యులు జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. పదవీ విరమణ చేస్తున్న సభ్యులలో మన్మోహన్ సింగ్, భూపేంద్ర యాదవ్ (రాజస్థాన్), అశ్విని వైష్ణవ్, బీజేపీ సభ్యులు ప్రశాంత నందా, అమర్ పట్నాయక్ (ఒడిశా), బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి అనిల్ బలూని (ఉత్తరాఖండ్), మన్సుఖ్ మాండవీయా,యు మత్స్య శాఖ మంత్రి పర్షోత్తమ్ రూపాలా, కాంగ్రెస్ సభ్యులు నరన్భాయ్ రత్వా ఉన్నారు. ►గుజరాత్కు చెందిన అమీ యాగ్నిక్. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్, ఎంఎస్ఎంఈ మంత్రి నారాయణ్ రాణే, మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, కాంగ్రెస్ సభ్యుడు కుమార్ కేత్కర్, ఎన్సీపీ సభ్యుడు వందనా చవాన్, శివసేన (ఉద్దవ్) సభ్యుడు అనిల్ దేశాయ్ మహారాష్ట్ర నుంచి పదవీ కాలం పూర్తి కానుంది. ►మధ్యప్రదేశ్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్, సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, బీజేపీ సభ్యులు అజయ్ ప్రతాప్ సింగ్ కైలాష్ సోనీ, కాంగ్రెస్ సభ్యుడు రాజమణి పటేల్ ఎగువసభ నుంచి పదవీ విరమణ చేయనున్నారు. ►కర్ణాటకలో బీజేపీకి చెందిన రాజీవ్ చంద్రశేఖర్, కాంగ్రెస్కు చెందిన ఎల్ హనుమంతయ్య, జీసీ చంద్రశేఖర్ సయ్యద్ నాసిర్ హుస్సేన్ పెద్దల సభ నుంచి వైదోలగనున్నారు. ►పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు అబిర్ రంజన్ బిస్వాస్, సుభాసిష్ చక్రవర్తి, మహమ్మద్ నడిముల్ హక్, శాంతాను సేన్, కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ పదవీ విరమణ చేయున్నారు. ►బీహార్లో ఆర్జేడీ నుంచి మనోజ్ కుమార్ ఝా, అహ్మద్ అష్ఫాక్ కరీం, జేడీయూ నుంచి అనిల్ ప్రసాద్ హెద్డే, బశిష్ట నారాయణ్ సింగ్, బీజేపీ తరపున సుశీల్ కుమార్ మోదీ, కాంగ్రెస్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న అఖిలేష్ ప్రసాద్ సింగ్ రాజ్యసభ పదవీకాలం పూర్తవుతోంది. ►ఉత్తరప్రదేశ్లో బీజేపీ నుంచి అనిల్ అగర్వాల్, అశోక్ బాజ్పాయ్, అనిల్ జైన్, కాంత కర్దమ్, సకల్దీప్ రాజ్భర్, జీవీఎల్ నరసింహారావు, విజయ్ పాల్ సింగ్ తోమర్, సుధాంషు త్రివేది, హరనాథ్ సింగ్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ సభ్యురాలు జయ బచ్చన్ పదవీ విరమణ చేస్తున్నారు. ►చత్తీస్గఢ్, హర్యానా నుంచి బీజేపీ తరపున సరోజ్ పాండే, డీపీ వాట్స్ పదవీ విరమణ చేయనున్నారు. ►జార్ఖండ్లో బీజేపీ నుంచి సమీర్ ఒరాన్, కాంగ్రెస్ సభ్యుడు ధీరజ్ ప్రసాద్ సాహు మేలో పదవీ విరమణ చేయనున్నారు. ►కేరళలో సీపీఎం పార్టీ నుంచి ఎలమరం కరీం, సీపీఐ నుంచి బినోయ్ విశ్వం, కేసీఎం సభ్యుడు జోస్ కె మణి జూలైలో పదవీ విరమణ పొందుతున్నారు. ►నామినేటెడ్ సభ్యుల్లో బీజేపీకి చెందిన మహేశ్ జెఠ్మలానీ, సోనాల్ మాన్సింగ్, రామ్ షకల్, రాకేష్ సిన్హా జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. -
మన్మోహన్ సింగ్పై పవార్ కీలక వ్యాఖ్యలు
పుణె: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ రైతుల సమస్యల పరిష్కారంపై సానుకూలంగా ఉండేవారని ప్రస్తుతం రైతుల సమస్యలను పట్టించుకునే వారే లేరన్నారు. రైతుల ఆత్మహత్యల గురించి తెలుసుకుని ప్రధానిగా ఉన్నపుడు మహారాష్ట్ర అమరావతి ప్రాంతంలో మన్మోహన్ పర్యటించారని పవార్ తెలిపారు. ‘మన్మోహన్ సింగ్ సామాన్య ప్రజలు, రైతుల సమస్యల పట్ల సున్నితంగా వ్యవహరించేవారు. అందుకే ఆయన రూ.72 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశారు. ప్రస్తుతం దేశంలో రైతుల సమస్యల వైపు కన్నెత్తి చూశే వారు లేరు’ అని పవార్ అన్నారు. పుణెలోని శేట్కారి ఆక్రోశ్ మోర్చా సమావేశంలో మాట్లాడుతూ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే కార్యక్రమంలో మాట్లాడిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు లేకుండా బీజేపీ కనీసం గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ పొత్తు ఈవీఎంలతోనేనన్నారు. ఈ కార్యక్రమానికి శివసేన(యూబీటీ)నేత ఉద్ధవ్ థాక్రేతో పాటు కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరట్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తదితరులు హాజరయ్యారు. ఇదీచదవండి..సన్బర్న్ షోలో ‘శివుడి ఫొటో’.. నిర్వాహకులపై ఫిర్యాదు -
కేంద్రానికి మద్దతు నిలిచిన మన్మోహన్ సింగ్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మద్దతుగా నిలిచారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారత్ అవలంభించిన విధానం సరైనదేనని అన్నారు. భారత్ తన సార్వభౌమాధికారాన్ని, ఆర్ధిక ప్రయోజనాలను కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిందని కొనియాడారు. అదే క్రమంలో ప్రపంచ శాంతికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. జీ-20 సమావేశాలకు ఆహ్వానాలు అందిన వారిలో మన్మోహన్ సింగ్ కూడా ఒకరు. ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు సమాధానమిచ్చారు. విదేశాంగ విధానం దేశీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు మన్మోహన్ సింగ్ తెలిపారు. దౌత్య సంబంధాలను రాజకీయాల కోసం వాడుకోవడంలో సమన్వయం పాటించాలని కోరారు. జీ20కి ఇండియా ఆతిథ్యం ఇచ్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో భారత్ పాత్రకు మద్ధతుగా నిలిచారు. సరైన పనే చేసిందని అన్నారు. Former PMs Manmohan Singh and HD Deve Gowda invited to G20 dinner#G20India2023 #G20SummitDelhi #G20 #ManmohanSingh #HDDeveGowda #G20Summit pic.twitter.com/7Dbe7XV3o4 — Mr. Nitish (@Nitishvkma) September 8, 2023 జీ20 సమ్మిట్కు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రాకపోవడం, చైనా-భారత్ సంబంధాలపై ఆయన స్పందించారు. దేశ సార్యభౌమాధికారాన్ని కాపాడటంలో ప్రధాని మోదీ ప్రభుత్వం కావాల్సినన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. క్లిష్టమైన దౌత్య వ్యవహారాలను ఎలా నిర్వహించాలో ప్రధానమంత్రికి సలహా ఇవ్వడం సరికాదని చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాకపోవడం దురదృష్టకరమని అన్నారు. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇంకా దేశంలో ఉన్న సవాళ్లపై ప్రశ్నించినప్పుడు.. తాను ఆశావాదంతో ఉన్నట్లు చెప్పారు. దేశంలో అభివృద్ధికి ఆశావాద స్వభావమే నాంది అని అన్నారు. చంద్రయాన్ 3 విజయంపై కూడా ఆయన స్పందించారు. ఇస్రో సాధించిన విజయంపై ఆయన అభినందనలు తెలిపారు. ప్రపంచంలో భారత్ మరింత ముందుకు వెళుతోందని అన్నారు. ఇదీ చదవండి: ఢిల్లీకి చేరిన ఐఎంఎఫ్ చీఫ్.. ఫోక్ సాంగ్కు డ్యాన్సులు.. -
ఢిల్లీ చేరుకున్న జో బైడెన్.. తొలిసారి భారత్లో పర్యటన
updates.. తొలిసారి భారత్ చేపడుతున్నప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్స కోసం దేశ రాజధాని ముస్తాబవుతోంది. ప్రపంచ దేశాధినేతలు ఒక్కొక్కరిగా ఢిల్లీ చేరుకున్నారు. దేశాధినేతలు బసచేసే హోటళ్ల పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ►అమెరికా అధ్యక్షుడు జో బైడెన్భారత్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. బైడెన్కు విదేశాంగశాఖ సహాయమంత్రి వీకే సింగ్ స్వాగతం పలికారు. తొలిసారి భారత్లో జోబైడెన్ పర్యటిస్తున్నారు. ఐటిసి మౌర్య హోటల్లో బస చేయనున్నారు జో బైడెన్. ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి అమెరికా అధ్యక్షుడు బయలుదేరారు. తన నివాసంలో జో బైడెన్కు మోదీ ప్రైవేటు డిన్నర్ ఏర్పాటు చేశారు. డిన్నర్ అనంతరం ఇరు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. భారతదేశంలో జెట్ ఇంజిన్లను సంయుక్తంగా తయారు చేసే ఒప్పందంపై పురోగతి, MQ-9B సాయుధ డ్రోన్ల కొనుగోలు, పౌర అణు బాధ్యత, వాణిజ్యంపై ఒప్పందం.. ప్రధాని, యూఎస్ అధ్యక్షుడు జోబైడెన్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్న ఎజెండాలో ప్రధాన అంశాలు ►జీ 20 సదస్సు కోసం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఢిల్లీకి చేరుకున్నారు. రైల్వే, బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే ఆయనకు స్వాగతం పలికారు. #WATCH | G 20 in India | South African President Cyril Ramaphosa arrives in Delhi for the G 20 Summit. He was received by MoS for State for Railways, Coal and Mines, Raosaheb Patil Danve. pic.twitter.com/3OKiXtJVhi — ANI (@ANI) September 8, 2023 ►రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అధ్యక్షుడు పుతిన్కు బదులుగా జీ20 సదస్సుకు లావ్రోవ్ హాజరవుతున్నారు. ►ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో ఘట్టర్స్కు గన స్వాగతం ►ఢీల్లీలో అర్జంటీనా ప్రెసిడెంట్ అల్బర్ట్ ఫెర్రాండెజ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలకు ఘన స్వాతం పలికారు. ► జీ20 సదస్సు కోసం జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఢిల్లీకి చేరుకున్నారు #WATCH | G 20 in India | Japanese Prime Minister Fumio Kishida arrives in Delhi for the G 20 Summit pic.twitter.com/9q5I0FhwHE — ANI (@ANI) September 8, 2023 ►రాత్రి 7 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీ చేరుకోనున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఢిల్లీ చేరుకున్నారు. పాలమ్ ఎయిర్పోర్టులోఆయన భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. రేపు ప్రధాని మోదీతో రిషి సునాక్ ధ్వైపాక్షిక భేటీ కానున్నారు. యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి భారత్కు విచ్చేశారు రిషి. అంతకుముందు బ్రిటన్లో బయలుదేరే ముందు రిషి సునాక్ అక్కడి మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్కు వెళ్లడం తనకు చాలా ప్రత్యేకమని అన్నారు. తనని ‘భారతదేశ అల్లుడు’గా వ్యవహరిస్తుండడాన్ని ఆయన సరదాగా గుర్తుచేసుకున్నారు. ఆప్యాయతతోనే తనని అలా పిలుస్తున్నారని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. భారత్ తన మనసుకు చాలా దగ్గరి దేశమని సునాక్ వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి అశ్వనీ చౌబే ► యూనియన్ ఆఫ్ కొమొరోస్ ప్రెసిడెంట్ మరియు ఆఫ్రికన్ యూనియన్ (AU) ఛైర్పర్సన్ అజలీ అసోమాని G20 సమ్మిట్ కోసం ఢిల్లీకి వచ్చారు. రైల్వే, బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే ఆయనకు స్వాగతం పలికారు. #WATCH | President of the Union of Comoros and Chairperson of the African Union (AU), Azali Assoumani arrives in Delhi for the G20 Summit. He was received by MoS for State for Railways, Coal and Mines, Raosaheb Patil Danve. pic.twitter.com/oEUI6gB57G — ANI (@ANI) September 8, 2023 ► జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి భారత్ చేరుకున్నారు. ఆమెకు స్వాగతం పలికేందుకు ఢిల్లీ విమానాశ్రయంలో సాంస్కృతిక నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేశారు. #WATCH | G 20 in India | Cultural dance performance at Delhi airport to welcome Italian Prime Minister Giorgia Meloni, who arrived to attend the G20 Summit, earlier today. pic.twitter.com/ZZHsn4lukZ — ANI (@ANI) September 8, 2023 ► మూడు రోజుల్లో 15 ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ. నేడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు.. జెట్ డీల్పై చర్చ జరిగే అవకాశం ఉంది. ► ప్రధాని మోదీ శుక్రవారం తన నివాసంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ద్వైపాక్షిక సమావేశాలు జరపనున్నారు. మారిషస్ నేతలతోనూ ఆయన భేటీ కానున్నారు. ► ఇక, శనివారం జీ-20 సదస్సు మధ్యలో యూకే ప్రధాని రిషి సునాక్తో పాటు జపాన్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలతోనూ ఆయన ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు. ► ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్తో ప్రధాని మోదీ లంచ్ మీటింగ్ నిర్వహించనున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత కెనడా ప్రధానితో కొంతసేపు ముచ్చటించనున్నారు. ► తుర్కియే, యూఏఈ, దక్షిణ కొరియా, కొమొరోస్, ఈయూ/ఈసీ (యూరోపియన్ కమిషన్), బ్రెజిల్, నైజీరియా దేశాల నేతలతోనూ ప్రధాని మోదీ ద్వైపాక్షికంగా భేటీ కానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. Prime Minister Narendra Modi to hold more than 15 bilateral meetings with world leaders. On 8th September, PM will hold bilateral meetings with leaders of Mauritius, Bangladesh and USA. On 9th September, in addition to the G20 meetings, PM will hold bilateral meetings with the… pic.twitter.com/OAGVTBjTyx — ANI (@ANI) September 8, 2023 ►జీ20 సదస్సు కోసం శుక్రవారం ఉదయం అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్ ఢిల్లీ చేరుకున్నారు. #WATCH | Argentina President Alberto Fernández arrives in Delhi for the G20 Summit. He was received by MoS for Steel and Rural Development, Faggan Singh Kulaste. pic.twitter.com/hWTmnMb9Ov — ANI (@ANI) September 8, 2023 ► జీ-20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించనున్న శనివారం విందు కార్యక్రమంలో నేతలందరూ పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధానులు హెచ్డీ దేవేగౌడ, మన్మోహన్సింగ్కు ఆహ్వానం అందింది. అయితే, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు మాత్రం ఆహ్వానం అందలేదని ఆయన ఆఫీసు వర్గాలు తెలిపాయి. ► ఇక, విందు కార్యక్రమానికి తాను హాజరు కావడంలేదని దేవేగౌడ.. ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆరోగ్య కారణల రీత్యా తాను హాజరు కాలేపోతున్నట్టు వెల్లడించారు. అయితే, జీ20 సమావేశాలు సక్సెస్ కావాలని తాను కోరుతున్నట్టు తెలిపారు. "I will not be attending the G20 dinner organised by the Hon. President of India Draupadi Murmuji, on 09 September 2023, due to health reasons. I have already communicated this to the government. I wish the G20 summit a grand success," tweets Former Prime Minister HD Deve Gowda https://t.co/pCl3dCxkY4 pic.twitter.com/Pj9NIqP9BI — ANI (@ANI) September 8, 2023 ► జీ-20 సమావేశాల నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. #WATCH | Security checks underway in the wake of the G20 Summit, scheduled to be held in the national capital from September 9 to 10. (Visuals from Minto Road) pic.twitter.com/PCIaIPOCB9 — ANI (@ANI) September 8, 2023 ► ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జీ-20 సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల నేతలు ఢిల్లీ చేరుకుంటున్నారు. సదస్సు కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. #WATCH | Delhi: For the G20 Summit, the national capital has been adorned with mural paintings. (Visuals from Lotus Temple) pic.twitter.com/eimW5AhvUp — ANI (@ANI) September 8, 2023 సెప్టెంబరు 9-10 తేదీల్లో జరిగే జీ-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల రాకతో ఇప్పటికే ఢిల్లీలో సందడి మొదలైంది. ఈ సమావేశం కోసం దేశ రాజధాని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉంది. గత ఏడాది కాలంగా జీ-20కి అధ్యక్షత వహిస్తున్న భారత్.. ఈ సమావేశంలో ఆ బాధ్యతలను బ్రెజిల్కు అప్పగించనుంది. -
వీల్ ఛైర్లో మన్మోహన్సింగ్.. బీజేపీ ఫైర్
ఢిల్లీ: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యులు మన్మోహన్ సింగ్ వీల్ ఛైర్లో పార్లమెంట్కి తీసుకువచ్చారు. ఈ అంశం అధికార విపక్షాల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. మన్మోహన్కు రాజ్యంగం పట్ల ఉన్న విధేయతపై ప్రతిపక్షాలు కొనియాడాయి. అదే తరుణంలో ఆరోగ్యం బాగులేకున్నా.. కేవలం ఢిల్లీ బిల్లును వ్యతిరేకించాలనే చెడు సంకల్పంతో ఆయన్ను సభలోకి తీసుకురావడంపై బీజేపీ మండిపడింది. ఈ చర్యను సిగ్గు చేటుగా అభివర్ణించింది. ఢిల్లీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి వచ్చిన మన్మోహన్ సింగ్కు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగ విలువల పట్ల ఆయనకు ఉన్న విదేయత ఎంతో గొప్పది అంటూ కొనియాడారు. బ్లాక్ ఆర్డినెన్స్పై స్పందించడానికి వచ్చినందుకు ఆయనకు రుణపడి ఉంటామని అన్నారు. మన్మోహన్ను రాజ్యసభలోకి తీసుకువచ్చిన తీరు దేశం గుర్తుంచుకుంటుందని బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పిచ్చి ఎంతటిదో అర్థమవుతుందని ఆరోపణలు చేశారు. రాత్రిపూట ఆరోగ్యం బాగులేని మన్మోహన్ను వీల్ ఛైర్లో తీసుకురావాల్సినంత అవసమేంటని కాంగ్రెస్ను నిందించింది. నిజాయితీ లేని తమ కూటమిని నిలుపుకోవాలనే కాంగ్రెస్ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టింది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు మొత్తానికి పార్లమెంట్లో ఆమోదం పొందింది. 131 సీట్లు బిల్లుకు ఆమోదం తెలుపగా.. 101 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. ఈ బిల్లు ఢిల్లీలో ఆప్, కేంద్రానికి మధ్య విమర్శలకు దారితీసింది. ఇదీ చదవండి: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. -
PV జయంతి నేడు: క్లిష్టకాలంలో దేశాన్ని గట్టెక్కించిన తెలుగు బిడ్డ
భారత దేశ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కలిగిన మేధావీ, పరిపాలనాదక్షుడూ పాము లపర్తి వెంకట నరసింహారావు. ఎవరి జీవితం, ఎట్లా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. తమిళ నాడు శ్రీపెరుంబుదూర్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాజీవ్ గాంధీని 1991 మే 21న ఎల్టీ టీఈ ఆత్మాహుతి దాడితో హత్య చేసింది. అత్యధిక మెజారిటీతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్ట బెట్టారు. భారత పదవ ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టారు పీవీ. ఆ సమయంలో భారతదేశం అంతర్జాతీయ చెల్లింపులపై డిఫాల్ట్ అయ్యి రెండు వారాలు కావ స్తోంది. విదేశీ మారక నిల్వలు కేవలం రెండు వారాల దిగుమతులకు మాత్రమే సరిపో యేంతగా ఉన్నాయి. అంతకు నెలరోజుల క్రితం మొత్తం 55 టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ తనఖా పెట్టింది. పెద్ద మొత్తంలో చెల్లింపులు తగ్గు ముఖం పట్టాయి. భారతదేశా నికి రుణం ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా నియమించారు పీవీ. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడడానికి ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా ఆయనకు స్వేచ్ఛ నిచ్చారు. అప్పటివరకూ ఉన్న కఠిన నిబంధనలను సడళించి సరళీకరణకు ద్వారాలు తెరచింది పీవీ ప్రభుత్వం. దాని ఫలితాలనే ఇప్పుడు మనమంతా అనుభ విస్తున్నాం. అంతర్జాతీయ సమాజంలో భారత్ పట్ల సన్నగిల్లిన విశ్వాసాన్ని తిరిగి పాదుకొల్పారు పీవీ. ఫలితంగా అంతర్జాతీయ ద్రవ్య సంస్థల సహాయం మళ్లీ ప్రారంభమయ్యింది. అలా దేశాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చారు. ప్రస్తుత తెలంగాణలోని హనుమకొండ జిల్లా లోని ‘వంగర’ గ్రామంలో 1921లో పీవీ జన్మించారు. అంచెలంచెలుగా రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో ఎదిగారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగింది. ఆ సమయంలో ఆయన తీవ్ర మైన విమర్శలను ఎదుర్కొన్నారు. దక్షిణ భారత్కు చెందిన పీవీకి వ్యతిరేకంగా ఆయన సొంత పార్టీ ప్రముఖులే పనిచేసి ఆయనను పదవి నుంచి లాగి వేయడానికి ప్రయత్నించారు. కానీ ఇటు ప్రతి పక్షాలు, అటు అసంతృప్తులైన సొంత పార్టీ వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఆయన విజయవంతంగా తన ఐదేళ్ల పదవీకాలాన్ని దిగ్విజయంగా ముగించారు. ఆయన మరణించి 18 ఏళ్లు గడిచాయి. పీవీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ తన సందేశాన్ని ట్వీట్ ద్వారా పంచుకున్నారు. Remembering Shri PV Narasimha Rao Ji on his birth anniversary. His far-sighted leadership and commitment to India’s development was noteworthy. We honor his invaluable contributions to our nation's progress. — Narendra Modi (@narendramodi) June 28, 2023 కాంగ్రెస్ పార్టీ పీవీ చేసిన సేవలను స్మరించుకుంది. On his birth anniversary, we remember the former PM of India, P.V. Narasimha Rao, who introduced some noteworthy liberal reforms to the Indian economy. Today, we pay a humble tribute to Mr. Rao, a distinguished statesman who reinvented India, both at home & abroad. pic.twitter.com/Cb0YPKbGjw — Congress (@INCIndia) June 28, 2023 ఈ తరుణంలో దేశానికి పీవీ చేసిన సేవను అన్ని వర్గాలూ మరచిపోవడం బాధాకరం. ఆయన శత జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించి ఆయన కీర్తి ప్రతిష్ఠలను ఇను మడింప చేశారు.ఇంతటి మహా మేధా వినీ, పరిపాలనా దక్షుణ్ణీ నేను నా జీవితంలో ఆరుసార్లు అతి దగ్గర నుండి చూశాను. ఆయనతో కొంత సమయం గడిపాను. నా జీవితంలో మరపు రాని సందర్భాలివి. 1977లో పెద్ద పల్లి జిల్లా మా కొలనూరు పక్క ఊరైన ‘పెగడ పల్లి’లో మా చుట్టాల ఇంటిలో పెళ్లి సందర్భంగా ఆయనతో కలిసి బంతి భోజనం చేశాను. మరొకసారి ఒక దినపత్రిక విలేక రిగా పెద్దపల్లి విశ్రాంత భవనంలో ఆయన పక్క కూర్చుని ముచ్చటించడం అరుదైన ఘటన. – దండంరాజు రాంచందర్ రావు, రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్, సింగరేణి భవన్, హైదరాబాద్ (నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి) -
మన్మోహన్ సింగ్ ఓ పిరికిపంద: అమిత్ షా ఫైర్
విశాఖపట్నం: బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న నేపధ్యంలో విశాఖపట్నం వేదికగా ఆ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంతకుముందు అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతర్గత భద్రత విషయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అంతర్గత భద్రత వ్యవహారం పటిష్టంగా తయారైందని అన్నారు. ప్రజలు ధైర్యంగా ఉన్నారు.. బీజేపీ ప్రభుత్వం 9 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్బంగా విశాఖపట్నంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన అమిత్ షా సభనుద్దేశించి మాట్లాడుతూ గత యూపీఏ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అంతర్గత భద్రత విషయంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరించేది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రజలు ధైర్యంగా ఉంటున్నారని అన్నారు. దేశంలో తీవ్రవాదాన్ని పెంచేశారు.. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆలియా, మాలియా, జమాలియా అనే పద్ధతిలో తీవ్రవాదాన్ని పెంచి పోషించింది. అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కు వారిపై చర్య తీసుకునే ధైర్యం లేదు. శత్రువులు మనపై దాడి చేసినా చేతులు ముడుచుకుని కూర్చునేవారు. నోరు విప్పేవారు కాదు. కానీ ఇప్పుడు మన ప్రధాని అలాంటి సవాళ్ళన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటున్నారన్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరవాతే దేశ అంతర్గత భద్రత పెంచి ప్రజలకు భరోసా కల్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత సైన్యం ఎంతో తెగువతో కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఉరి, పుల్వామా సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ లు నిర్వహించి శత్రువులకు ఎదురెళ్లి మరీ భారత దేశ సత్తా ఏంటో చాటిందన్నారు. ఇప్పుడు తీవ్రవాదులు నరేంద్ర మోదీ పేరు వింటేనే భయపడుతున్నారని అన్నారు. ఇది కూడా చదవండి: పూణేలో భక్తులపై లాఠీచార్జ్.. ఉత్సవాల్లో అపశ్రుతి -
సారీ చెప్పడం తెలియకపోతే...
విధి విచిత్రమైనది. విరుద్ధంగా తిరుగుతాయని ఎంతమాత్రమూ ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. 2013లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తెచ్చిన ఒక ఆర్డినెన్స్ ను ‘పూర్తిగా అర్థరహితం’ అని పేర్కొంటూ రాహుల్ చింపేశారు. తన విమర్శను బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా మన్మో హన్ను ఉద్దేశపూర్వకంగా అవమానించారు. ఆ ఆర్డినెన్స్ పాస్ అయి ఉంటే, పార్లమెంట్ నుంచి రాహుల్ ప్రస్తుత అనర్హతను అది అడ్డుకుని ఉండేది. ఆ విషయంలో ఎంత తప్పు చేశారన్నది ఇప్పుడు ఆయనకు కలిగిన దురవస్థ వెల్లడిస్తోంది. కానీ ‘దాన్ని చింపి, అవతల పారెయ్యాలి’ అన్న వ్యాఖ్య మన్మోహన్ను ప్రధానిగా బలహీనపర్చింది. అందుకే, మన్మోహన్ కు బహిరంగ క్షమాపణ చెప్పడాన్ని రాహుల్ బకాయి పడ్డారు. కానీ ఆయన మూర్ఖంగా ‘గాంధీలు ఎన్నడూ ఎవరికీ క్షమాపణ చెప్పరు’ అంటూ ప్రగల్భాలకు పోయారు. క్షమాపణ అవసరమైనప్పుడు కూడా అలాగే చేస్తానంటే ఆ బడాయికోరుతనం దోషం అవుతుంది. ఎలా క్షమాపణ చెప్పాలో తెలీని రాజకీయనాయకుడిగా ఆయన మిగిలిపోతారు. విధికి సంబంధించిన చమత్కారాలు, వక్రోక్తులు నాకు ఎంతో ఆసక్తి గొలుపుతుంటాయి. ఘటనలు మీకు విరుద్ధంగా జరుగుతాయని మీరు అసలు ఎంతమాత్రమూ ఊహించనప్పుడు, అవి వాస్తవంగా అలాగే పైకి తేలుతాయి. అవును, అలాగే జరుగుతాయి. వ్యావహారి కంగా దీన్ని ‘సోడ్ న్యాయం’ అని పిలుస్తారు. (ఒకటి తప్పుగా జరిగే అవకాశం ఉంటే, అది చివరకు తప్పుగానే జరుగుతుందని బ్రిటన్లో నవ్వుతూ చెప్పే మాట.) షేక్స్పియర్ వంటి నాటకకర్త చేతుల్లో అది మితిమీరిన గర్వంగా పరివర్తన చెందుతుంది. ఆయన గొప్ప విషాదాంత నాటకాలు ఈ వ్యవహారం పైనే ఆధారపడి రూపొందాయి. ఏ రకంగా చూసినా, ఇది ‘దేవుడి లీలావిలాసాలు’ మనకు వెల్లడయ్యే క్షణం! రెండు క్షమాపణలు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విషయంలో జరిగింది అదే. ఆడంబరంగా, అలా కాదనుకుంటే డాంబికంగా అయన పత్రికా సమా వేశంలో ఇలా ప్రకటించారు: ‘‘నా పేరు గాంధీ; గాంధీలు ఎన్నడూ ఎవరికీ క్షమాపణ చెప్పరు’’. దురదృష్టవశాత్తూ ఇద్దరు వ్యక్తులకు ఆయన క్షమాపణలు బాకీ పడ్డారని స్పష్టమైన సమయంలోనే, ఆయన ఈ వ్యాఖ్య చేశారు. చాలా స్పష్టంగా అది బహిర్గతమైన విషయం. పైగా అది కచ్చితంగా బహిరంగంగా జరిగిన విషయం. రాహుల్ తన తొలి క్షమాపణను మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్కు బాకీ పడ్డారు. 2013లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తెచ్చిన ఒక ఆర్డినెన్స్ను ‘‘పూర్తిగా అర్థరహితం’’ అని పేర్కొంటూ రాహుల్ దాన్ని చింపేశారు. విచిత్రమైన విషయం ఏమి టంటే, ఆ ఆర్డినెన్స్ పాస్ అయి ఉంటే, పార్లమెంట్ నుంచి రాహుల్ గాంధీ ప్రస్తుత అనర్హతను అది అడ్డుకుని ఉండేది. ఎందుకంటే, ఆ ఆర్డినెన్సు ఇలా ఒక శాసనాన్ని పొందుపర్చింది. ‘‘శిక్ష పడిన నాటి నుంచీ 90 రోజులలోపు, ఆ శిక్షను పునర్విమర్శ చేయమని కోరుతూ ఒక విజ్ఞప్తి లేదా అభ్యర్థనను దరఖాస్తు చేసినట్లయితే’’ కనీసం రెండేళ్ల శిక్ష పడిన పార్లమెంట్ సభ్యుడి తక్షణ అనర్హత అనేది అనిశ్చిత స్థితిలోకి వెళ్తుంది. (ఇంకోరకంగా చెప్పాలంటే, అప్పటికి నిలుపుదల అవు తుంది.) ముందుచూపు లేకపోవడం 2013లో రాహుల్ గాంధీ గుర్తించనిది – బహుశా, ఈరోజు ఆయన మర్చిపోనిది ఏమిటంటే, ఆయనకు పడిన శిక్షపై ఒకవేళ న్యాయస్థానం చివరకు స్టే విధించినప్పటికీ... ప్రస్తుత పార్లమెంటులో ఆయన చాలా వారాలపాటు అడుగుపెట్టే అవకాశం అప్పటికి కోల్పోయివుంటారు. ఇది కేవలం వ్యక్తిగత నష్టం మాత్రమే కాదు. అంతకంటే ముఖ్యంగా, ఆయన నియోజక వర్గమైన వయనాడ్ (కేరళ)కు ఈ కాలంలో ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. నిజానికి, ఇది భార తీయ ప్రజాస్వామ్యాన్ని క్షీణింపజేస్తుందని కూడా మీరు వాదించ వచ్చు. ఎందుకంటే మామూలుగా లోక్సభలో వ్యక్తీకరించగలిగిన ఒక అభిప్రాయం వినలేని పరిస్థితి వస్తున్నది కాబట్టి. 2013లో రాహుల్ గాంధీ ఆ ఆర్డినెన్్సను లాలూ ప్రసాద్ యాదవ్ను కాపాడటానికి తెస్తున్న ముతక, ఇంకా చెప్పాలంటే అనైతిక ప్రయత్నంగానే చూశారు. కానీ ఆ ఆర్డినెన్స్కు అంతకంటే మించిన విలువ ఉందని ఆయన చూడలేకపోయారు. ఇంకా చెప్పాలంటే చూడ దల్చలేదు కూడా. బహుశా ఆ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ప్రజాగ్రహం ఉందన్న అంశంపైనే ఆయన దృష్టి మొత్తంగా ఉండేది. అయితే ఆయన ఆ విషయంలో ఎంత తప్పు చేశారన్నది ఇప్పుడు ఆయనకు కలిగిన దురవస్థ వెల్లడిస్తోంది. ఇంకా ఘోరమైన సంగతి ఏమిటంటే, తన విమర్శను బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా మన్మోహన్ సింగ్ను ఉద్దేశపూర్వకంగా రాహుల్ అవమానించారు. ‘‘దాన్ని చింపి, అవతల పారెయ్యాలి’’. ఇది జూలియస్ సీజర్ను బ్రూటస్ పొడిచేయడం లాంటిదే. ఆ వ్యాఖ్య మన్మోహన్కు నష్టం చేయడమే కాదు, ప్రధానిగా ఆయన్ని బలహీన పర్చింది. అందుకే, డాక్టర్ మన్మోహన్ సింగ్కు పూర్తిగా బహిరంగ క్షమాపణ చెప్పడాన్ని రాహుల్ గాంధీ బకాయి పడ్డారు. సముచితం కాని స్పందన రెండో క్షమాపణ – అది చెప్పడం జరిగినట్లయితే– రాహుల్ ఎలాంటి వ్యక్తో వెల్లడవుతుంది. అది ఆయన స్వభావానికి, చివరకు తన నైతిక సమగ్రతకు కూడా పరీక్షే అవుతుంది. అందువల్ల, ఈ రెండు క్షమాపణలు చెప్పడం కష్టమైనవే కానీ అవి మరింతగా అవసర మైనట్టివి. ‘‘ఓబీసీ కమ్యూనిటీని రాహుల్ గాంధీ అవమానించారని బీజేపీ చేసిన ఆరోపణపై మీ అభిప్రాయం ఏమి’’టని మార్చి 25న జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్సులో అడిగిన ఒక జర్నలిస్టు పట్ల రాహుల్ చాలా గర్వంతోనూ, మొరటుగానూ వ్యవహరించారు. కచ్చితమైన, సముచి తమైన ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి బదులుగా రాహుల్ ఆ విలేఖరిపై మాటల దాడికి దిగారు. ‘‘నువ్వు బీజేపీకి ఇంత నేరుగా ఎందుకు పనిచేస్తున్నావ్... నీకు వారి నుంచి ఆదేశాలు అందాయా... నువ్వు బీజేపీ కోసం పనిచేయాల నుకుంటే, బీజేపీ జెండా... లేదా గుర్తు ... తెచ్చుకుని నీ ఛాతీపై పెట్టుకో... అప్పుడు వారికి నేను ఏ రీతిలో సమాధానం చెబుతానో నీకు కూడా అలాగే జవాబు చెబుతాను. అంతేకానీ పత్రికల మనిషిగా నటించవద్దు.’’ ఇబ్బంది కలిగించేలా తన స్థిరత్వాన్ని, స్థిమితాన్ని కోల్పోవడం సరిపోలేనట్టుగా– రాహుల్ గాంధీ ఆ జర్నలిస్టును మరింత వెటకారం చేశారు. ఇంకో ప్రశ్న (మరెవరో) అడుగుతుండగా, అందరికీ వినబడే ట్టుగా రాహుల్ గాంధీ ‘‘హవా నికల్ గయీ’’(గాలి పోయింది) అనే శారు. ఆయన ముఖంలో తెలివితో కూడిన నవ్వు పరిస్థితిని మరింతగా దిగజార్చివేసింది. క్షమాపణ మనిషిని తగ్గించదు రాహుల్ గాంధీ చెప్పింది సమర్థించుకోలేనిది. దీంతో ఎవరైనా అంగీకరించారంటే నాకు సందేహమే. అయినా సరే ఆయన క్షమాపణ చెబుతారా? ఇది యధాలాపంగా సంధించిన ప్రశ్న కాదు. ఇది రాహుల్ వ్యక్తిత్వానికి, నైతిక స్వభావానికి కొలమానం. నిజాయితీగా చెప్పాలంటే, రాహుల్ ఎలాంటి వ్యక్తి అని తెలిపే పరీక్ష ఇది. వివేకం, ఆత్మసాక్షి ఉన్న రాజకీయ నాయకుడు క్షమాపణ చెబుతారు. పైగా క్షమాపణ అనేది రాహుల్ గాంధీ స్థాయిని పెంచు తుంది. ఆయన పట్ల మన గౌరవం పెరిగేట్లు కూడా చేస్తుంది. కానీ ఆయన ఇప్పటికే మూర్ఖంగా ప్రగల్భాలకు పోయారు: ‘‘గాంధీలు ఎన్నడూ ఎవరికీ క్షమాపణ చెప్పరు.’’ ఒకవేళ అదే ఆయన వైఖరి అయితే, అంటే క్షమాపణ అవసరమైనప్పుడు, దాన్ని బాకీ పడిన ప్పుడు కూడా అలాగే చేస్తానంటే ఆ బడాయికోరుతనం అనేది దోషం అవుతుంది. ఎలా క్షమాపణ చెప్పాలో తెలీని రాజకీయనాయకుడిగా ఆయన మారిపోతారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పండిట్ నెహ్రూ, ఇందిరమ్మ రికార్డులను ఎవరు తిరగరాస్తారు!
దేశంలో ఒక ప్రధాని వరుసగా పదేళ్లు అధికారంలో ఉండడం గొప్ప విషయంగా మారిన రోజులివి. 2004లో అనూహ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ తరఫున ప్రధాని అయిన డా.మన్మోహన్ సింగ్ అధికారంలో ఉండగా జరిగిన ఎన్నికల్లో పార్టీ బలం పెరిగాక రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేసి పదేళ్లు ఆ పదవిలో ఉన్నారు. ఆయన తర్వాత బీజేపీ నేత నరేంద్ర మోదీ.. డా.మన్మోహన్ మాదిరిగా రెండోసారి ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా ఇప్పుడు 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఊహించని పరిణామాలు జరగకపోతే మన్మోహన్ జీ మాదిరిగానే 21వ శతాబ్దంలో వరుసగా పదేళ్లు భారత ప్రధానిగా పని చేసిన రికార్డును మోదీ సమం చేస్తారు. వీరిద్దరి కంటే ముందు వరుసగా ఎక్కువ కాలం ప్రధాని పదవిలో ఎవరెవరు ఉన్నారో పరిశీలిద్దాం. లాంగ్ రికార్డ్ నెహ్రూదే స్వతంత్ర భారతంలో అత్యధిక కాలం పదవిలో కొనసాగిన రికార్డు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూది. భారత రాజ్యాంగం అమలులోకి రావడానికి 2 ఏళ్ల 4 నెలల ముందు అంటే–1947 ఆగస్ట్ 15న ప్రధానిగా ప్రమాణం చేసిన నెహ్రూజీ 1964 మే 27న కన్నుమూసే వరకూ పదవిలో కొనసాగారు. ఆయన దేశ ప్రధానిగా 16 ఏళ్ల 286 రోజులు పదవిలో ఉండి సృష్టించిన రికార్డును ఈరోజుల్లో తిరగరాయడం కష్టమేనని రాజకీయ పండితులు భావిస్తున్నారు. నెహ్రూ మరణానంతరం తాత్కాలిక ప్రధాని గుల్జారీలాల్ నందా 13 రోజుల పాలన తర్వాత కాంగ్రెస్ తరఫున ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రీ 1966 జనవరి 11న గుండెపోటుతో మరణించడంతో ఆయన పదవిలో ఉన్నది ఏడాది 216 రోజులే. శాస్త్రీ జీ తర్వాత మళ్లీ తాత్కాలిక ప్రధానిగా 13 రోజుల జీఎల్ నందా సర్కారు దిగిపోయాక 1966 జనవరి 11న తొలిసారి ప్రధాన మంత్రి పదవి చేపట్టిన నెహ్రూ జీ కుమార్తె ఇందిరాగాంధీ వరుసగా 1967, 1971 ఎన్నికల్లో కాంగ్రెస్ను విజయపథంలో నడిపించారు. ఇందిరమ్మ 1977 మార్చి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయే వరకూ పదవిలో కొనసాగారు. తండ్రి తర్వాత కుమార్తెదే రికార్డు: ఇందిరమ్మ వరుసగా 11 ఏళ్ల 59 రోజులు ప్రధానిగా అధికారంలో కొనసాగి, తండ్రి నెహ్రూ తర్వాత ఎక్కువ కాలం పదవిలో కొనసాగిన రికార్డు స్థాపించారు. 1980 జనవరి 14న చివరిసారి ప్రధాని అయిన ఇందిరమ్మ 1984 అక్టోబర్ 31న హత్యకు గురికావడంతో ఆమె చివరి పదవికాలం 4 ఏళ్ల 291 రోజులకే ముగిసింది. ఇందిరమ్మ వారసుడిగా అధికారంలోకి వచ్చిన ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ 1984 డిసెంబర్ లోక్ సభ ఎన్నికల తర్వాత రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేశారు. కాని క్లిష్ట రాజకీయ పరిణామాల కారణంగా ప్రధానిగా ఆయన కొనసాగిన మొత్తం కాలం 5 ఏళ్ల 32 రోజులే. రాజీవ్ తర్వాత ప్రధానులైన వి.పి.సింగ్, చంద్రశేఖర్ లలో ఏ ఒక్కరూ ఏడాది పాటు ప్రధానిగా కొనసాగలేకపోయారు. వారి తర్వాత ప్రధాని అయిన కాంగ్రెస్ అధ్యక్షుడు పీవీ నరసింహారావు మరుసటి ఎన్నికల వరకూ దాదాపు ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. కమల సారథ్యం 1990లో దేశంలో బీజేపీ బలపడిన క్రమంలో ఈ పార్టీ అగ్రనేత అటల్ బిహారీ వాజపేయి మొదటిసారి 1996లో ప్రధానిగా ప్రమాణం చేసి మెజారిటీ లేక రెండు వారాలకే దిగిపోవాల్సివచ్చింది. ఆయన తర్వాత ప్రధానులైన జనతాదళ్ నేతలు హెచ్డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్ లలో ఏ ఒక్కరూ కూడా ఏడాది కాలం పదవిలో కొనసాగలేకపోయారు. 1998, 1999 పార్లమెంటు మధ్యంతర ఎన్నికల తర్వాత వరుసగా రెండుసార్లు బీజేపీ నేతగా ప్రధాని అయిన వాజపేయి ఈ రెండు సార్లు కలిపి మొత్తం 6 ఏళ్ల 64 రోజులు అధికారంలో ఉన్నారు. చదవండి: భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం: సుస్థిరత నుంచి సుస్థిరతకు! వాజపేయి పదవీకాలాన్ని డా.మన్మోహన్, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇద్దరూ దాటేశారు. ప్రధానిగా మోదీ వచ్చే ఏడాది మే నెలలో పదేళ్లు పూర్తిచేసుకుని మన్మోహన్ రికార్డును సమం చేసే అవకాశాలు సుస్పష్టమే. అయితే, వరుసగా 11 సంవత్సరాల 59 రోజులు ప్రధాని పదవిలో కొనసాగిన (నెహ్రూ తర్వాత రెండో రికార్డు) ఇందిరాగాంధీ రికార్డును దాటిపోయే అవకాశం బీజేపీ రెండో ప్రధానికి 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు కల్పిస్తాయా? అనే విషయం ఏడాదిలో తేలిపోతుంది. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు -
కుదిరి చెదిరిన ఒప్పందం
దీర్ఘకాల సరిహద్దు ఘర్షణలను పరిష్కరించే ఒక ఒప్పందం భారత్, పాకిస్తాన్ మధ్య దాదాపుగా కుదిరినట్లు కనిపించిందని సతీందర్ లాంబా పుస్తకం ‘ఇన్ పర్స్యూట్ ఆఫ్ పీస్’ వెల్లడిస్తోంది. ఈ ఒప్పందం కోసం ఇరుదేశాలు తెరవెనుక చర్చలను విస్తారంగా కొనసాగించాయనీ, దాదాపు సంతకాల దాకా వచ్చాయనీ ఈ పుస్తకం చెబుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికలపై భారత్ దృష్టి పెట్టిన తర్వాత ఈ ప్రక్రియ నత్తనడక నడిచి ఆగిపోయింది. ఈ ఒప్పందం కుదిరివుంటే, చరిత్రే మారిపోయేది. ఈ ఒప్పంద ప్రక్రియను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఇరుపక్షాలూ భావిస్తే దానికి అవసరమైన మార్గదర్శక సూత్రాలు సిద్ధంగా ఉన్నాయని ఈ పుస్తకం గట్టిగా చెబుతోంది. మాజీ రాయబారి సతీందర్ లాంబా రచించిన పుస్తకం ‘ఇన్ పర్సూ్యట్ ఆఫ్ పీస్’ విషాదకరంగా ఆయన మరణానంతరం ప్రచురితమైంది. అయితే భారత్, పాకిస్తాన్ బ్యాక్ చానెల్కు (గుప్త లేదా ద్వితీయ శ్రేణి సమా చార బదిలీ మార్గం) సంబంధించిన అద్భుతమైన వివరాలను ఈ పుస్తకం వెల్లడించింది. అలాగే రెండు దేశాలు ఒప్పందానికి ఎంత సమీపానికి వచ్చాయో కూడా ఇది చక్కగా వివరించింది. యూపీఏ ప్రభుత్వ రెండో పాలనా కాలంలో, ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ పదేళ్ల పాలన చివరలో ఈ ముసాయిదా ఒప్పందంపై సంతకాలు చేయడానికి కూడా అంగీ కారం కుదిరిందని ఈ పుస్తకం నిర్ధారిస్తోంది. ‘2003 మే నుంచి 2014 మార్చి వరకు బ్యాక్ చానెల్ సమా వేశాలు 36 జరిగాయి’ అని నాకు తెలిసిన సతీ (సతీందర్) రాశారు. ఈ ఒప్పందంలో చాలావరకు జనరల్ ముషారఫ్ హయాంలో ముగింపునకు వచ్చింది. ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఏమీ జరగ లేదు. కానీ నవాజ్ షరీఫ్ ‘ఈ ప్రక్రియకు కొత్త ఊపును, వేగాన్ని తీసు కొచ్చారు’. దురదృష్టవశాత్తూ, ఆ తర్వాత ‘భారత్ దృష్టి 2014 సార్వ త్రిక ఎన్నికల వైపు మళ్లింది.’ నేను అనుకునేది సరైనదే అయితే, రెండు సందర్భాల్లో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరే పరిస్థితులు ఏర్పడ్డాయి. మొదట 2007లో అది సాధ్యపడేట్టు కనిపించింది కానీ ముషారఫ్కు ఉన్న ‘అంతర్గత సమస్యల’ వల్ల వీగిపోయింది. ఇక రెండోది– ఇది నా వ్యాఖ్యానం – ఎన్నికల వైపు దృష్టిని భారత్ మరల్చడానికి ముందుగా నవాజ్ షరీఫ్ కాలంలో! అనూహ్య ఘటన అయితే, మోదీ గెలుపుతో ఆశలేమీ పోలేదు. ‘బ్యాక్ చానెల్ ప్రక్రియను కొనసాగించాలనే ఉద్దేశం ఉన్నట్లు కనిపించింది’ అని సతీ పేర్కొన్నారు. ‘ఈ అంశంపై ఫైల్ని సమీక్షించారు. ఈ ఒప్పందంలో ఎలాంటి ముఖ్యమైన మార్పూ ఉండబోదని కూడా నాకోసారి చెప్పారు. ప్రత్యేక దూతగా ఒక విశిష్ట రాయబారిని నియమించాలని కూడా ప్రధానమంత్రి మోదీ భావించారు. నన్ను ఆయన్ని కలవాలని కోరారు.’ కానీ ఆ రాయబారిని నియమించనేలేదు. మోదీ ప్రభుత్వం 2017 ఏప్రిల్లో మరోసారి ఆ ఒప్పందం కోసం ప్రయత్నించింది. ‘ప్రధాని కార్యాలయంలోని సీనియర్ అధికారి ఒకరు నన్ను కలవడానికి మా ఇంటికొచ్చారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్తో భేటీ కావడానికి మీరు పాకిస్తాన్ వెళ్లాలని ప్రధాని కోరుకుంటున్నారని ఆయన నాతో చెప్పారు’. అయ్యో! అయితే, భారత్ తరహా ఒక పరిణామం దీన్ని మొగ్గలోనే తుంచేసింది. షరీఫ్తో చర్చించాల్సిన అంశాల వివరాలతో పాటు పాకిస్తాన్కు ప్రయాణించడానికి అవసరమైన ట్రావెల్ డాక్యుమెంట్లను ఇవ్వాలని సతీందర్ కోరి, వాటికోసం వేచి ఉన్నారు. కానీ ఆ తరుణంలోనే విచిత్రమైన ఘటన జరిగింది. ‘దూతగా వ్యవహరిస్తున్న ఒక ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త తన వ్యక్తిగత విమానంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్తో భేటీ కావడానికి పాకిస్తాన్ వెళ్లారనే వార్తను నేను చూశాను. అలాంటి పరిస్థితుల్లో ఒకే ఉద్దేశం కోసం పాక్ ప్రధాని వద్దకు వెళ్లడానికి ఇద్దరు వ్యక్తులు ప్రాతినిధ్యం వహించడం సరైంది కాదు.’ ఆ వ్యాపారవేత్త పేరు సతీందర్ బయటపెట్టలేదు. అయితే ఆయన సజ్జన్ జిందాల్ కావచ్చునని పాకిస్తాన్ హైకమిషనర్గా పనిచేసిన అబ్దుల్ బాసిత్ అన్నారు. ‘ఈ అంశం మీద నేను జరిపిన చివరి సంభాషణ ఇదే’ అని సతీందర్ రాశారు. మన్మోహన్ సింగ్ పాలనలో ఇరుదేశాల మధ్య ఒప్పందం దాదాపుగా ఫలవంతమయ్యేటట్టు కనిపించిందని సతీందర్ చెప్పిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. ‘ప్రధాని మన్మోహన్తో నేను 68 సార్లు కలిసినట్లు నా డైరీ గుర్తుచేసింది’. పైగా ‘ఈ పరిణామాల గురించిన మొత్తం సమాచారం ప్రణబ్ ముఖర్జీకి తెలియజేయడమైంది’. 2006 నవంబర్లో సోనియాగాంధీకి ఈ ఒప్పంద వివరాలు తెలపడం జరిగింది. అంతకుముందు 2005లో ఆర్మీ చీఫ్ ఈ విషయంలో పాలు పంచుకున్నారు. పైగా అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అడ్వాణీ, బ్రజేశ్ మిశ్రా, ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీ మహమ్మద్ సయీద్, కరణ్ సింగ్, గులామ్ నబీ ఆజాద్లకు కూడా ఈ సమా చారం అందించడం జరిగింది. ఈ ఒప్పందం ఫలితం భారత రాజ్యాంగానికీ, జమ్ము–కశ్మీర్ రాజ్యాంగానికీ, పార్లమెంటరీ తీర్మానాలకూ అనుగుణంగా ఉండేలా ప్రయత్నాలు జరిగాయి. ప్రధాన న్యాయ మూర్తి ఆనంద్తో 2006 మార్చి నుంచి 2007 మార్చి మధ్యలో సతీందర్ ఆరుసార్లు సమావేశమయ్యారు. ప్రఖ్యాత న్యాయవాది ఫాలీ నారిమన్ను కూడా కలిశారు. సరిహద్దులు మారవు ముషారఫ్ నాలుగు సూత్రాల(ఫోర్–పాయింట్ ఫార్ములా)పై, మన్మోహన్ సింగ్ అమృత్సర్లో చేసిన ప్రసంగంలోని మూడు ఆలోచనలపై ఈ ఒప్పందం ఆధారపడింది. ఈ చర్చలకు పెట్టుకున్న 14 మార్గదర్శక సూత్రాలను సతీందర్ పేర్కొన్నారు. వాటిల్లో కొన్ని: ‘సరిహద్దులను తిరగరాసే ప్రసక్తి లేదు.’ ‘ఎల్ఓసీ(నియంత్రణ రేఖ)కి ఇరువైపులా, ముఖ్యంగా జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైనిక కదలికలను కనిష్ఠ స్థాయిలో ఉంచాలి.’ ‘నియంత్రణ రేఖకు ఇరు వైపులా అంతర్గత నిర్వహణ కోసం స్వయంపాలనను ఏర్పర్చాలి.’ ‘నియంత్రణ రేఖకు ఇరువైపులా ఉన్న ప్రజలు ఒక వైపు నుంచి మరొక వైపునకు వెళ్లడానికి స్వేచ్ఛ ఉండాలి.’ అలాగే, ‘ప్రభుత్వ విధానంగా ఉగ్రవాదాన్ని ఉపయోగించకుండా, తన భూభాగాన్ని రాజ్యేతర శక్తులకు అనుమతించకుండా పాక్ కట్టడి చేయాలి’. ఈ ఒప్పందం జరిగివుంటే, ‘చరిత్ర క్రమాన్ని మార్చివేయడం సాధ్యపడేది’. అయితే ఇప్పటికి కూడా ఇది ముగిసిపోలేదని సతీందర్ సూచిస్తున్నారు. ‘ఈ ఒప్పంద సంభావ్యత ఇప్పటికీ ఉనికిలో ఉంది. ముసాయిదా ఒప్పంద సూత్రాలు కానీ, దాని పాఠం కానీ ఇప్పటికీ ఉన్నాయి. ఒప్పంద ప్రక్రియను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉందని ఇరుపక్షాలూ భావించినప్పుడు ఎప్పుడైనా దాన్ని మొదలు పెట్టవచ్చు’. నేననుకోవడం ఆశ అనేది నిత్యవసంతం! - కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
పీవీ మధ్యే మార్గమే దేశానికి రక్ష!
సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా భిన్న పార్టీలకు చెందిన వారైనప్పటికీ.. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయిలు ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలని ప్రఖ్యాత జర్నలిస్టు, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సలహాదారు సంజయ్ బారు అభిప్రాయడ్డారు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందింది... అన్ని రంగాల్లోనూ ముందంజ వేసింది కూడా పీవీ, వాజ్పేయి, మన్మోహన్సింగ్ల ఏలుబడిలోనే అని ఆయన గణాంకాలతో సహా వివరించారు. పీవీ గ్లోబల్ ఫౌండేషన్ శనివారం ఏర్పాటు చేసిన పీవీ స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1950ల నుంచి 2015 వరకూ దేశ ఆర్థికాభివృద్ధిని పరిశీలిస్తే.. 2000 – 2015 మధ్యకాలంలోనే సగటు ఆర్థికాభివృద్ధి అత్యధికంగా 7.5 శా తంగా నమోదైందని, ఈ కాలంలోనే దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని తెలిపారు. 2015 తరువాత వృద్ధి తిరోగమనంలో ఉందని, కోవిడ్–19 విజృంభించిన ఏడాది రుణాత్మక వృద్ధిని మినహాయిస్తే 2014– 2023 మధ్యకాలంలో సగటున 6 శాతం మాత్రమే వృద్ధి నమోదైందని చెప్పారు. 1990లో ప్రధానిగా పీవీ చేపట్టిన ఆర్థిక సంస్కరణల ప్రభా వం 2000 సంవత్సరం నుంచి కనిపించడం మొదలైందని అన్నారు. మధ్యే మార్గంతో వృద్ధి పథంలోకి... 1990 వరకూ దేశంలో పేరెన్నిక కంపెనీలంటే ఓ వందకు మించి ఉండేవి కాదని, టాటా, బిర్లాలు, మోడీ, గోయాంకా, సింఘానియా, థాపర్లు వంటి పేర్లే ప్రతి రంగంలోనూ వినిపించేవని సంజయ్ బారు గుర్తు చేశారు. 1991లో పీవీ నరసింహారావు ఆర్థిక సరళీకరణ విధానాలను అవలంబించడం మొదలుపెట్టి.. పరిశ్రమల శాఖ మంత్రిగా వాటి అమల్లోనూ ముందున్న ఫలితంగా అంబానీలు మొదలుకొని మహింద్రా, ప్రేమ్జీ, ఇన్ఫోసిస్, టీవీఎస్ గ్రూపు వంటి దిగ్గజాలు ఎదిగాయని చెప్పారు. పీవీ ప్రధానిగా రోజుకో సవాలును ఎదుర్కొన్నా మధ్యే మార్గమన్న తారకమంత్రంతో వాటి ని అధిగమించారని రాజకీయ, ఆర్థిక విధానాల్లోనూ ఇదే రీతిన పాలన సాగిందని చెప్పారు. ఆధిపత్య రాజకీయాలతో చేటు...: పీవీ నరసింహరావు, అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్లు భారత జాతీయత పునాదులను పటిష్టం చేయడం ద్వారా ఆర్థికంగాఎదిగేందుకు సాధికారికంగా మెలిగేందుకు కారణమయ్యారని స్పష్టం చేశారు. రాజకీయ, ఆర్థిక ఆధిపత్యభావజాలం ఈ దేశానికి గతంలోనూ నష్టం కలుగజేసిందని, ఇప్పుడు జరిగేది కూడా అదేనని, దేశ కీర్తిని గతంలో తగ్గించినట్టే ఇప్పుడూ తగ్గిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. పీవీ తరహాలోనే అందరినీ కలుపుకుని పోయే రాజకీయాలు, మధ్యేమార్గాలు మాత్రమే మనల్ని రక్షించగలవని సంజయ్బారు అభిప్రాయపడ్డారు. భారత రత్నకు అన్ని విధాలుగా అర్హుడు పీవీ అని.. మన్మోహన్ ఏలుబడిలో ఆయనకు ఈ అవార్డు దక్కకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. కార్యక్రమంలో పీవీ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ పీవీ ప్రభాకర్ రావు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ, సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, మా శర్మ తదితరులు పాల్గొన్నారు. -
క్షమించండి అంటూ నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు... షాక్లో బీజేపీ
భోపాల్: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మధ్యప్రదేశ్లో నాసిరకంగా నిర్మించిన రహదారి విషయమై ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. పొరపాటు జరిగితే క్షమాపణలు కోరడానికి వెనుకడుగు వేయనని అన్నారు. ఈ మేరకు ఆయన మధ్యప్రదేశ్లో జబల్పూర్లోని ఒక అవార్డుల పంక్షన్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన జబల్పూర్ హైవేకి 63 కి.మీ బరేలా నుంచి మండలానికి సుమారు రూ. 400 కోట్లతో నిర్మించిన రహదారి నాసిరకంగా ఉందంటూ బాధపడ్డారు. దీని గురించి అధికారులతో మాట్లాడాను. ప్రాజెక్టు నిలిపివేయడమో లేక మరమ్తతులు చేయడమో చేస్తాను లేదా కొత్త టెండర్ వేయించి మంచి రహదారి అందించేలా చూస్తానని అన్నారు. ఇప్పటి వరకు మీరంతా ఈ రహదారి కారణంగా ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదర్కొన్నందుకు క్షమాపణలు కోరుతున్నాను అని అన్నారు. గడ్కరీ గతంలో తన హాయాంలో మధ్యప్రదేశ్కి రూ. 6 లక్షల విలువైన రోడ్డు ఇస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ విషయమై భూసేకరణ, అడవుల తొలగింపు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు కూడా. ఆ తర్వాత ఫంక్షన్ చివరిలో కాంగ్రెస్ గూర్చి అన్యూహ్యమైన వ్యాఖ్యలు చేసి బీజేపీని షాక్కి గురి చేశారు. ఈ మేరకు ఆ ఫంక్షన్లో మాట్లాడుతూ...2004 నుంచి 2014 మధ్య రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలకు నాయకత్వం వహించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన ఆర్థిక సంస్కరణలతో సరికొత్త సరళీకరణకు దిశా నిర్ధేశం చేశారంటూ ప్రశంసించారు. ఈ విషయమై దేశం ఆయనకు ఎంతగానో రుణపడి ఉంటుందని కొనియాడారు గడ్కరీ. ఐతే గడ్కరీ ఒక్కోసారి చేసే వ్యాఖ్యలు బీజీపీని ఇబ్బందుల్లోకి నెడుతుంటాయి. (చదవండి: కేరళ గవర్నర్కు షాక్.. వర్సిటీల ఛాన్సలర్గా తప్పించేందుకు సిద్ధమైన సర్కార్) -
మన్మోహన్ సింగ్పై గడ్కరీ ప్రశంసల జల్లు
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. రాజ్యసభ ఎంపీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై ఆయన ప్రశంసల జల్లు గుప్పించారు. ఆర్థిక సంస్కరణలకుగానూ దేశం మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు రుణపడి ఉందని గడ్కరీ మంగళవారం టీఐవోఎల్-2022 అవార్డుల కార్యక్రమంలో పేర్కొన్నారు. దేశంలోని పేదలకు ప్రయోజనాలు అందించాలంటే ఉదారవాద ఆర్థిక విధానం అవసరం. 1991లో ఆర్థిక మంత్రిగా మనోహ్మన్ సింగ్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు.. ఉదారవాద ఆర్థిక వ్యవస్థకు నాంది పలికి మన దేశానికి కొత్త దిశానిర్దేశం చేశాయి. సరళీకరణతో కొత్త దిశానిర్దేశం చేసిన మన్మోహన్ సింగ్కు ఈ దేశం రుణపడి ఉంది అని గడ్కరీ పేర్కొన్నారు. మాజీ ప్రధాని సింగ్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల కారణంగానే 1990ల మధ్యకాలంలో తాను మహారాష్ట్రలో మంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు నిర్మించడానికి డబ్బును సేకరించగలిగానని గడ్కరీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఏ దేశమైనా అభివృద్ధిలో ఉదారవాద ఆర్థిక విధానం ఎంతగానో దోహదపడుతుందని, అందుకు చైనా మంచి ఉదాహరణ అని గడ్కరీ అన్నారు. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, భారత్కు మరిన్ని క్యాపెక్స్ పెట్టుబడి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: ‘ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు’ -
మనవాళ్లే లైట్ తీసుకున్నారు.. ఇక వాళ్లు ఫోటో పెడతారా?
మనవాళ్లే లైట్ తీసుకున్నారు.. ఇక వాళ్లు ఫోటో పెడతారా? -
అండర్ అచీవర్!
భారత ప్రధాని (2004–2014) మన్మోహన్ సింగ్ను ‘ది అండర్అచీవర్’గా ‘టైమ్’ మ్యాగజీన్ తన ముఖచిత్ర కథనంలో అభివర్ణించింది. దేశ ఆర్థిక సంస్కరణల విషయమై సింగ్ అనుకున్నంతగా ఏమీ సాధించలేకపోయారని రాసింది. ‘ది అండర్అచీవర్ : ఇండియా నీడ్స్ రీబూట్’ (తక్కువ సాధించిన వ్యక్తి : పునరుత్తేజ అవసరంలో ఇండియా) అనే శీర్షికతో వచ్చిన ఈ కథనం భారతదేశ రాజకీయాల్లో కలకలం రేపింది. ధ్వని లేని గుంభనత్వంతో కూడిన సింగ్ ఆత్మవిశ్వాసపు వెలుగు క్షీణించడం మొదలైందని, ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు దేశ పురోగమనం కోసం ఆయనే ప్రవేశపెట్టిన ఆర్థిక సరళీకరణల నుంచి సింగ్ దూరం అవుతున్నారంటే, ప్రధానిగా ఆయన తన నిష్క్రియాశీలతతో సొంత మంత్రివర్గ సభ్యుల మీదే నియంత్రణ కోల్పోయారని స్పష్టం అవుతోందని ‘టైమ్’ సుదీర్ఘ కథనాన్ని అందించింది. దీనిపై మన్మోహన్ సింగ్ గానీ, కాంగ్రెస్ గానీ బహిరంగంగా ఏమీ వ్యాఖ్యానించలేదు. ప్రతిపక్షాలు మాత్రం టైమ్ కథనాన్ని ఒక ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం చేశాయి. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు అజ్మల్ కసబ్కు ఉరి (నవంబర్ 21) భారత్లోని అజ్మీర్ షరిఫ్ దర్గా సందర్శనకు పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ వ్యక్తిగత పర్యటన. 5000 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల అగ్ని–5 ను ప్రయోగించిన భారత్. భారత పార్లమెంట్ 60వ వార్షికోత్సవం. భారత 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ. దారాసింగ్, రాజేశ్ ఖన్నా, వర్ఘీస్ కురియన్, యశ్ చోప్రా, బాల్ థాక్రే, ఐ.కె.గుజ్రాల్, రవిశంకర్.. కన్నమూత. (చదవండి: చైతన్య భారతి: ‘గాంధీ’కి ఆస్కార్ డిజైనర్ భాను అథియా) -
తమిళనాడు గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఉద్దేశిస్తూ తుపాకీ ఉపయోగించే వారికి తుపాకీతోనే సమాధానం చెప్పాలంటూ వ్యాఖ్యానించారు. 2008 నవంబర్ 11న ముంబైలో పేలుళ్ల ఘటన జరిగిన నెలల్లోనే ఉగ్రవాదంపై పాకిస్థాన్తో భారత్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘అంతర్గత భద్రతకు సమకాలీన సవాళ్లు’ అనే అంశంపై కొచ్చిలో ఆదివారం గవర్నర్ మాట్లాడారు. నవంబర్ 11 ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులతో దేశం మొత్తం గాయపడిందన్నారు. ఉగ్రవాదుల కారణంగా దేశమంతా విషాదంలో మునిగిపోతే, ఘటన జరిగి 9 నెలలు గడవకముందే ఇరు దేశాలు (అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, పాక్ ప్రధాని) తీవ్రవాద బాధితులుగా పేర్కొంటూ సంతకాలు చేశాయని గుర్తు చేశారు. పాకిస్థాన్ మనకు మిత్రదేశమా, లేక శత్రు దేశమా ఈ అంశంలో క్లారిటీ ఉండాలని, కన్ఫ్యూజన్ ఉంకూడదని అన్నారు. పాకిస్థాన్పై ప్రతీకార చర్య పుల్వామా ఉగ్రదాడి ఘటన తరువాత సర్జికల్ స్ట్రైక్ ద్వారా పాకిస్థాన్కు తగిన బుద్ధి చెప్పామని గవర్నర్ రవి వెల్లడించారు. పుల్వామా దాడి అనంతరం భారత యుద్ద విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయని తెలిపారు. భారత్ సర్జికల్ స్ట్రైక్ పేరుతో ప్రతీకార చర్య తీసుకుందని అన్నారు. దీని ద్వారా ఎవరైనా ఉగ్రవాదానికి పాల్పడితే తిరిగి అందుకు తగిన భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందనే వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పారు. చదవండి: మంకీపాక్స్తో కేరళ వాసి మృతి.. కేంద్రం కీలక నిర్ణయం మన్మోహన్పై మండిపాటు మన్మోహన్ సింగ్ నాటి పాలనతో పోలిస్తే ప్రస్తుతం భారత అంతర్గత భద్రత మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన సమయంలో అంతర్గత భద్రతకు మావోయిస్టుల ముప్పు ఎక్కువగా ఉండేదని గవర్నర్ ఆరోపించారు. అప్పట్లో తీవ్రవాదుల హింస 185 జిల్లాల్లో ఉండేదని, ఇప్పుడు ఆ సంఖ్య 8 జిల్లాలకు తగ్గినట్లు వెల్లడించారు. ప్రజలు తీవ్రవాదాన్ని తిరస్కరించి సాధారణ పరిస్థితులకు సహకరించడం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు కశ్మీర్పై రవి మాట్లాడుతూ.. హింసను సహించేది లేదని స్పష్టం చేశారు. తుపాకీ ఉపయోగించే వారికి తుపాకీతోనే సమాధానం చెప్పాలన్నారు. దేశ సమైక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా మాట్లాడే వారితో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. గత ఎనిమిదేళ్లలో ఎలాంటి సాయుధ గ్రూపుతోనూ చర్చలు జరపలేదని పేర్కొన్నారు. ఒకవేళ జరిగినా రాజకీయాలకు తావులేకుండా.. మావోయిస్టుల లొంగిపోవడం, పునరావాసం కోసమేనని తెలిపారు. మావో ప్రాంతాల్లోని వారికి ప్రత్యేక ఐడియాలజీ ఉంటుందని, వాళ్లు పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాన్ని నమ్మరని అన్నారు. అయితే తాము దాన్ని అంగీకరించబోమని, ఇక వాళ్లతో చర్చలు అవసరం లేదని గవర్నర్ రవి తెలిపారు. చదవండి: Taiwan News: అమెరికా చైనా మధ్య... తైవాన్ తకరారు.. ఏమిటీ వివాదం? -
ఈ ప్రముఖుల గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు
అమీషాకు పింక్ పిచ్చి... నటి అమీషా పటేల్కు పింక్ కలర్ అంటే పిచ్చి. ఆమె డ్రెస్లు, చీరలు, ఇతరత్రా అలంకరణ వస్తువులతో పాటు దాదాపుగా ప్రతి వస్తువు పింక్ కలర్లో ఉండేలా చూసుకుంటుంది. బద్రీ భామ ఇంట్లో ఆఖరికి గోడలు, తలుపులు, ఫర్నిచర్ కూడా పింక్ మయమేనట. ముఖ్యమంత్రి కాక ముందు బొటిక్ ఓనర్.. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి.. (దివంగత) బిజు పట్నాయక్ రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు బొటిక్ నిర్వహించేవారు.. ‘సైక్డెల్హి’ పేరుతో. ఇది నిజం. న్యూఢిల్లీలోని ఓబెరాయ్ హోటల్లో ఉండేది అది. కాళీ కాదు చిత్రకారిణి.. కలకత్తా కాళీలా గర్జించే మమతా బెనర్జీ చిత్రకళలో మేటి తెలుసా! ఆమె చిత్రాలు ఎక్కువగా మహిళలకు సంబంధించే ఉంటాయి. అందులో కొన్ని చిత్రకళా ప్రదర్శనల్లో అమ్ముడు పోయి అధిక మొత్తంలో కాసులనూ సంపాదించి పెట్టాయి ఆమెకు. ప్రపంచంలో ఒకే ఒక్కడు మన మన్మోహనుడు.. ఆర్థిక సంస్కరణలను అద్భుతంగా అమలు చేసిన ఆర్థికవేత్తగా.. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ జగద్విదితం. ఆయనకు ఇంకో రికార్డ్ కూడా ఉంది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆయనంత చదువుకున్న.. క్వాలిఫైడ్ ప్రధాని మరొకరు లేరుట. చాంపియన్ ప్రెసిడెంట్.. మన తొలి మహిళా ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ ఎరుకే కదా! కానీ ఆమె టేబుల్ టెన్నిస్ చాంపియన్ అని తెలుసుండదు. అవును కాలేజీ రోజుల్లో ఆమె టీటీ చాంపియన్. మరీ ఇంత బిజీనా..? సుప్రసిద్ధ రచయిత హరుకి మురకామి డైలీ షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుందో ఓ ఇంటర్వ్యూలో ఆయన.. ‘నేను ఉదయం నాలుగింటికల్లా నిద్రలేస్తాను. లేవగానే రాయడం మీద కూర్చుంటాను అయిదు నుంచి ఆరుగంటల పాటు. మధ్యాహ్నం దాదాపు పది కిలోమీటర్లు నడవడమో.. లేక పదిహేను వందల మీటర్లు స్విమ్ చేయడమో లేదంటే రెండూ ఉంటాయి. ఆ తర్వాత కాసేపు నచ్చిన పుస్తకం చదవడమో.. మ్యూజిక్ వినడమో చేస్తాను. రాత్రి తొమ్మిదింటికల్లా నిద్రకుపక్రమిస్తాను. ఏమాత్రం తేడా లేకుండా. .రాకుండా రోజూ ఇదే షెడ్యూల్ కొనసాగుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. నోట్ చేసుకుంటున్న రిపోర్టర్ చివరి వాక్యం రాసి ఊపిరి పీల్చుకుంటూ నిట్టూర్చాడట. ఆయుష్మాన్ ఖురానా@దంతావధాని బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా.. దంతాల పట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు. ఎంతంటే ఆ శ్రద్ధ ఓ అబ్సేషన్ అయ్యేంతగా. సాధారణంగా ఉదయం, రాత్రి రెండు సార్లు బ్రష్ చేసుకుంటాం. కానీ ఆయుష్మాన్.. తరచుగా అంటే రోజులో వీలైనన్ని సార్లు బ్రష్ చేసుకుంటూంటాడట. అందుకే నిత్యం తన వెంట డెంటల్ కేర్ కిట్ను క్యారీ చేస్తూంటాడట! -
ఒక సీఈవో.. ఇద్దరు దేశాధినేతలు.. ఓ ఆసక్తికర సన్నివేశం
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని ఒకరు, మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఆన్ ఎర్త్కి ప్రెసిడెంట్ మరొకరు. వీరిద్దరు ఓ సమావేశంలో కలుసుకున్నారు. అక్కడే ఉన్న ఓ అంతర్జాతీయ సంస్థ సీఈవోని చూస్తూ.. తమ దేశానికి చెందినది అంటే తమ దేశానికి చెందినది అంటూ ఇద్దరు నేతలు పోటీ పడ్డారు. ఈ ఆరుదైన ఘటన 2009లో చోటు చేసుకుంది. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ 2009లో అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ దేశం సాధిస్తున్న ప్రగతిని అక్కడి కంపెనీల పనితీరుని ప్రధాని మన్మోహన్కి వివరిస్తున్నారు బరాక్ ఒబామా. ఈ క్రమంలో పెప్సీ కంపెనీ వంతు వచ్చింది. 2009లో పెప్సీ కంపెనీకి గ్లోబల్ సీఈవోగా భారత సంతతికి చెందిన ఇంద్రానూయి ఉన్నారు. ఆమెను చూడగానే ప్రధాని మన్మోహన్సింగ్ ఈమె మాలో ఒకరు అని ఒబామాతో అన్నారు. వెంటనే స్పందించిన బరాక్ ఒబామా ‘ ఆహ్! కానీ ఆమె మాలో కూడా ఒకరు’ అంటూ బదులిచ్చారు. శక్తివంతమైన రెండు దేశాలకు చెందిన అధినేతలు తనను మాలో ఒకరు అంటూ ప్రశంసించడం తన జీవితంలో మరిచిపోలేని ఘటన అంటూ ఇంద్రనూయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆనాడు జరిగిన ఘటనను గుర్తు చేసుకుని సంబరపడ్డారు. భారత సంతతికి చెందిన ఇంద్రానూయి అమెరికాలో స్థిరపడ్డారు. 25 ఏళ్ల పాటు పెప్సీ కంపెనీలో పని చేశారు. అందులో 12 ఏళ్ల పాటు సీఈవోగా కొనసాగారు. ఆమె సీఈవోగా ఉన్న కాలంలో పెప్పీ కంపెనీ రెవెన్యూ 35 బిలియన్ల నుంచి 63 బిలియన్లకు చేరుకుంది. తొలి గ్లోబల్ మహిళా సీఈవోగా ఇంద్రనూయి రికార్డు సృష్టించారు. ఆమె తర్వాత ఇటీవల లీనా నాయర్ ఛానల్ సంస్థకు గ్లోబల్ సీఈవోగా నియమితులయ్యారు. -
ప్రతి సమస్యకు తొలి ప్రధాని నెహ్రునే నిందిస్తున్నారు: మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ: పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీడియా సందేశంలో ప్రజలను కాంగ్రెస్కి ఓటు వేయాలని కోరారు. ప్రతి సమస్యకు తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూనే నిందిస్తున్నారంటూ మన్మోహన్ సింగ్ ప్రధాని నరేంద్రమోదీ పై విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి పదవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందంటూ ఆక్రోసించారు. అంతేకాదు ఆ వీడియోలో రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఎన్నడూ దేశాన్ని విభజించలేదని మోదీకి కౌంటరిచ్చారు. దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యతో ప్రజలు సతమతమవుతుంటే గత ఏడున్నరేళ్లుగా అధికారంలో ఉన ప్రస్తుతం ప్రభుత్వం తమ తప్పులన ఒప్పుకోకుండా ప్రతి సమస్యకు తొలి ప్రధాని నెహ్రూనే కారణమంటూ ఇప్పటికీ నిందిస్తూనే ఉన్నారని ఆరోపించారు. అంతేకాదు మీరు మీ స్వంత లోపాలను తగ్గించే క్రమంలో చరిత్రను నిందించలేరంటూ వక్కాణించారు. ప్రపంచం ముందు దేశ ప్రతిష్టను పోగొట్టుకోనివ్వను, అలాగే భారతదేశ గర్వాన్ని నేనెప్పుడూ కించపరచలేదంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు తనపై తప్పడు ఆరోపణలు చేసిన బీజేపీ, ఆ పార్టీకి సంబంధించిన బీ అండ్ సీ టీమ్లు గురించి దేశం ముందు బహిర్గతం అవుతున్నందుకు ఆనందంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. (చదవండి: సర్జికల్ స్ట్రైక్స్, అయోధ్య విషయంలో వారు సంతోషంగా లేరు! ప్రధాని ఆగ్రహం) -
రాజధాని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. కేంద్రం అదే చెప్పింది: మంత్రి బొత్స
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన చట్టంలో ఇచ్చిన హామీ అని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్ ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారు. సీఎం జగన్ ఆ హామీని నెరవేర్చమని కేంద్రాన్ని అడుగుతున్నారు. మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం. రాజధాని ఎక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. కేంద్రం కూడా అదే చెప్పింది అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చదవండి: (కొత్త జిల్లాల్లో కార్యాలయాలన్నీ ఒకే చోటు: విజయ్ కుమార్) -
ఈ బడ్జెట్లు స్వతంత్ర భారతంలో వెరీ స్పెషల్..
స్వతంత్ర భారతంలో 76 ఏళ్లుగా ఏటా బడ్జెట్ ప్రవేశపెడుతూనే ఉన్నారు. కానీ కొన్ని బడ్జెట్లు మాత్రం ఎంతో ప్రత్యేకం. ఆయా సందర్భాలుగానీ, బడ్జెట్లలో చేర్చే కీలక అంశాలుగానీ దీనికి కారణం. అలాంటి బడ్జెట్లు ఏమిటో చూద్దామా? బ్లాక్ బడ్జెట్ 197374లో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత్రావు చవాన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను ‘బ్లాక్ బడ్జెట్’గా వ్యవహరిస్తారు. అప్పటికే కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో.. 550 కోట్ల ఆర్థిక లోటుతో ఆ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పటి లెక్కల్లో ఈ మొత్తం తక్కువే అనిపిస్తున్నా.. నాటి పరిస్థితుల ప్రకారం.. భారీ లోటు అన్నమాట. క్యారట్ – స్టిక్ ఓ వైపు తాయిలాలు ఇస్తూనే.. మరోవైపు బెత్తంతో అన్నింటినీ నియంత్రణలోకి తెచ్చుకునే లక్ష్యంతో 1986లో కాంగ్రెస్ ఆర్థిక మంత్రి వీపీ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్నే ‘క్యారట్ అండ్ స్టిక్ బడ్జెట్’గా పిలుస్తారు. దేశంలో లైసెన్స్రాజ్ వ్యవస్థకు మంగళం పాడేదిశగా చర్యలు ఈ బడ్జెట్లోనే మొదలయ్యాయి. అంతేకాదు పన్నులపై మళ్లీ పన్నులు పడుతూ పెరిగిపోయే భారం నుంచి ఉపశమనం కలిగించేందుకు ‘మోడిఫైడ్ వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ క్రెడిట్’ను అమల్లోకి తెచ్చారు. అదే సమయంలో స్మగ్లర్లు, బ్లాక్ మార్కెటింగ్ చేసేవారు, పన్నులు ఎగ్గొట్టేవారిపై కఠిన చర్యల కోసం ప్రత్యేక డ్రైవ్ను చేపట్టారు. ప్రగతి బడ్జెట్ ఒక రకంగా ఆధునిక భారతదేశ చరిత్రనే మార్చినదిగా చెప్పుకొనేది 1991 బడ్జెట్. మన దేశం ఆర్థిక సంక్షోభం అంచున ఉండి, రోజువారీ వ్యవహారాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితుల్లో.. పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో మన్మోహన్సింగ్ ఆర్థిక మంత్రిగా విప్లవాత్మక సంస్కరణలతో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. లైసెన్స్రాజ్ వ్యవస్థకు పూర్తిగా మంగళం పాడుతూ.. స్వేచ్ఛాయుత వ్యాపారానికి దారులు తెరిచారు. ఎగుమతులను పెంచేందుకు భారీగా పన్నులు తగ్గించారు. కలల బడ్జెట్ వ్యాపారస్తుల నుంచి సామాన్యుల వరకు కలలుగనేది పన్నుల తగ్గింపు, సులువుగా వ్యాపార, వాణిజ్యాలు చేసుకునే అవకాశమే. అలా అందరి ఆశలు తీర్చినది 1997–98 బడ్జెట్. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన ఆ బడ్జెట్లో ఎన్నో సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. ఆదాయపన్నులో మార్పులు చేశారు. గరిష్ట శ్లాబును 40శాతం నుంచి 30 శాతానికి తగ్గించారు. దేశీయ కంపెనీలకు పన్నును 35 శాతానికి తగ్గించారు. స్వచ్ఛందంగా నల్లధనాన్ని వెల్లడించే పథకాన్ని ప్రకటించారు. కస్టమ్స్ డ్యూటీని ఏకంగా 40 శాతానికి తగ్గించి, ఎగుమతులు–దిగుమతులు ఊపందుకోవడానికి బాటలు వేశారు. ‘మిలీనియం’ ఐటీరంగంలో ప్రస్తుతం మన దేశం ప్రపంచంలోనే కీలకమైన స్థానంలో ఉంది. అలాంటి సాంకేతికతకు ప్రాధాన్యమిచ్చినదే 2000లో యశ్వంత్సిన్హా ప్రవేశపెట్టిన ‘మిలీనియం బడ్జెట్’. అందులో సాఫ్ట్వేర్ ఎగుమతులకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించారు. కంప్యూటర్లు, సంబంధిత ఉపకరణాలపై దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించారు. ‘రోల్బ్యాక్’ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏదైనా ప్రతిపాదన చేసిందంటే.. దాదాపుగా దాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టేనని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. అలాంటిది యశ్వంత్సిన్హా ప్రవేశపెట్టిన 2002–03 బడ్జెట్లోని చాలా అంశాలపై.. అప్పటి వాజ్పేయి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కొన్ని ప్రతిపాదనలనైతే మొత్తంగా వెనక్కి తీసుకుంది. అందుకే ఈ బడ్జెట్ను ‘రోల్బ్యాక్ బడ్జెట్’గా పిలుస్తుంటారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
Biggest Budget: అతిపెద్ద బడ్జెట్ మన్మోహన్దే..
సాక్షి, న్యూఢిల్లీ: ఏటా కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక మంత్రి ఆ బడ్జెట్లోని అంశాలను క్షుణ్నంగా వివరించడం ఆనవాయితీ. కొందరు ఆర్థిక మంత్రులు ఈ ప్రసంగాన్ని సుదీర్ఘంగా, మరోసారి క్లుప్తంగా చేస్తుంటారు. అయితే అత్యంత ఎక్కువ వివరాలు, పదాలతో కూడిన బడ్జెట్ ప్రవేశ పెట్టినది మన్మోహన్సింగ్. పీవీ నర్సింహారావు ప్రధానిగా, మన్మోహన్ ఆర్థికమంత్రిగా ఉన్న 1991లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏకంగా 18,650 పదాలు ఉన్నాయి. ఈ విషయంలో 2018లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీది రెండో స్థానం. ఆ బడ్జెట్లో 18,604 పదాలు ఉన్నాయి. అతి తక్కువ పదాలతో, తక్కువ సమయం ప్రసంగంతో కూడిన బడ్జెట్ రికార్డు హిరుభాయ్ ముల్జీభాయ్ పటేల్ది. 1977లో ఆయన 800 పదాలతో, కొద్ది నిమిషాల ప్రసంగంతో బడ్జెట్ను ముగించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే.. సుదీర్ఘ ప్రసంగం రికార్డు నిర్మలా సీతారామన్దే. 2020 ఫిబ్రవరి 1న ఆమె ఏకంగా 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. నిజానికి అప్పటికీ బడ్జెట్ ముగియలేదు. ఇంకో రెండు పేజీలు మిగిలిపోయాయి. ఆమెకు కాస్త అనారోగ్యంగా అనిపించడంతో.. మిగతా వివరాలను క్లుప్తంగా చెప్పి ముగించారు. సుదీర్ఘ ప్రసంగం విషయంలో రెండో స్థానం కూడా నిర్మలా సీతారామన్దే. 2019లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆమె 2 గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించారు. ఆమెకాకుండా మరొకరిని చూస్తే.. 2018లో బడ్జెట్ పెట్టిన అరుణ్జైట్లీ గంటా 49 నిమిషాల పాటు ప్రసంగించారు. -
మోదీ Vs దీదీ: ప్రధానిపై మమత అసహనం.. మళ్లీ రాజుకున్న రాజకీయ రగడ!
PM Modi Vs CM Mamata న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య వివాదం మళ్లీ రాజుకుంది. బుధవారం ప్రధాని మోదీతో జరిగిన డిజిటల్ మీటింగ్లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో దీదీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రిషి అరవింద్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం జరగనున్న మీటింగ్కు హాజరు కావడం లేదని మమతా బెనర్జీ నేడు ప్రకటించారు. అమృత్ ఫెస్టివల్ ఆఫ్ ఇండిపెండెన్స్కు సంబంధించి ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. ఐతే సుమారు రెండు గంటల పాటు వేచి చూసినా ఆమెకు మాట్లాడే అవకాశం రాలేదు. దీనికి సంబంధించి స్పీకర్ల జాబితాలో మమత పేరును చేర్చలేదని రాష్ట్ర సచివాలయం చెబుతోంది. దీనిపై మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గతంలోకూడా కరోనాకు సంబంధించి 10 రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన సమావేశంలో ఆమెకు మాట్లాడే అవకాశం లభించలేదు. ఐతే స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా నబన్లోని రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు (గురువారం) సీఎం మమతా బెనర్జీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం నాటి సమావేశంలో తాను పాల్గొనబోవడంలేదని తెలిపారు. అంతేకాకుండాప్రధాని మీటింగ్లో యోగేన్ చౌదరి, జై గోస్వామి మాట్లాడటానికి అనుమతించకపోవడాన్ని సీఎం మమతా తీవ్రంగా ఖండించారు. భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో జనవరి 26, ఆగస్టు 15 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. జనవరి 23 నుంచి జనవరి 30 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈ సమావేశంలో తెలిపారు. కాగా ఆధ్యాత్మిక గురువు రిషి అరవింద్ 150వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 53 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఇద్దరు మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డి దేవెగౌడ, మమతా బెనర్జీలతో సహా పలువురు కేబినెట్ మంత్రులు కూడా ఉన్నారు. ఈ కమిటీ సమావేశం శుక్రవారం జరగాల్సి ఉండగా, సీఎం మమతా బెనర్జీ ఈ సమావేశంలో పాల్గొనడం లేదని ఈ మేరకు ప్రకటించారు. చదవండి: ఐదేళ్లుగా ఈ హాస్పిటల్లో రోజూ 37 మంది శిశువుల మృతి.. అసలేం జరుగుతోందక్కడ? -
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డెంగ్యూతో బాధపడుతున్నారని, అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని ఎయిమ్స్ అధికారులు శనివారం తెలిపారు. మన్మోహన్సింగ్ ప్లేట్లెట్ల సంఖ్య వృద్ధి చెందుతోందని వైద్యులు తెలిపారు. చదవండి: కేంద్రమంత్రిపై మన్మోహన్ సింగ్ కుమార్తె ఆగ్రహం..‘వాళ్లేం జూలో జంతువులు కాదు’ కాగా మాజీ ప్రధాని జ్వరం, నీరసం వంటి అనారోగ్య సమస్యలతో బుధవారం ఎయిమ్స్లో చేరారు. డెంగ్యూ జ్వరం బారినపడిన మాజీ ప్రధాని.. ఎయిమ్స్ ఆస్పత్రిలోని కార్డియో న్యూరో సెంటర్లోని ఓ ప్రైవేట్ వార్డులో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ నితీష్ నాయక్ మార్గదర్శకత్వంలోని కార్డియాలజిస్ట్ బృందం మాజీ ప్రధాని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. చదవండి: వైరల్: వీడెవడ్రా బాబు.. నాకే పోటీగా వచ్చేలా ఉన్నాడు.. -
కేంద్రమంత్రిపై మన్మోహన్ సింగ్ కుమార్తె ఆగ్రహం..‘వాళ్లేం జూలో జంతువులు కాదు’
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై అభ్యంతరం తెలియజేశారు. తన తల్లిదండ్రులు వృద్ధులని, జూ లో జంతులు కాదని మండిపడ్డారు. కాగా డెంగ్యూ వ్యాధికి గురైన మన్మోహన్ సింగ్ రెండు రోజులుగా ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. చదవండి: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు అస్వస్థత ఈ క్రమంలో కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)వెళ్లి మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. అక్కడే ఉన్న మన్మోహన్ సింగ్ సతీమణి గురుశరన్ కౌర్ను కలిసి మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫొటోల్లో మన్మోహన్ సింగ్ మంచం మీద పడుకుని ఉండగా.. ఆయన భార్య పక్కన నిలబడి ఉన్నారు. అయితే కేంద్రమంత్రి తీరుపై మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ ఫైర్ అయ్యారు. మంత్రి తనతోపాటు ఫోటోగ్రాఫర్ను గదిలోకి తీసుకొచ్చినప్పుడు తల్లి చాలా బాధపడిందని, బయటకు వెళ్లాలని చెప్పిన ఆమె మాటలు అస్సులు వినిపించుకోలేదని అన్నారు. తమ తల్లిదండ్రుల కోరికకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు అసహనం వ్యక్తం చేశారు. ‘ఆరోగ్య మంత్రి మా కుటుంబాన్ని పరామర్శించడం సంతోషంగా ఉంది. అయితే ఆ సమయంలో మా తల్లిదండ్రులు ఫోటో దిగే స్థితిలో లేరు. నా తల్లిదండ్రులు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారు వృద్ధులు. జూలో జంతువులు కాదు. అని ఆమె పేర్కొన్నారు. -
నిలకడగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. గురువారం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మాజీ ప్రధాని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. బుధవారం ఆయన అస్వస్థతకు గురవటంతో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఎయిమ్స్ ఆస్పత్రికి చేరుకొని మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ట్విటర్లో పేర్కొన్నారు. I pray for the good health and speedy recovery of Dr. Manmohan Singh Ji. — Narendra Modi (@narendramodi) October 14, 2021 -
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు అస్వస్థత
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ బుధవవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో మన్మోహన్ సింగ్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు మాజీ ప్రధానికి చికిత్స అందిస్తున్నారు. ఆయన శరీరం బలహీనంగా ఉండి, జ్వరం లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. 88 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఈ ఏడాది మొదట్లో కరోనా వైరస్ బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. చదవండి: Lakhimpur Kheri Incident: ఆ కేంద్ర మంత్రిపై వేటు వేయకపోతే అంతే సంగతా? జరిగేది అదేనా? -
మరో మార్గం లేదు!
అధికార వ్యవస్థ నియంత్రణ అనే మృతహస్తం నుంచి ఆర్థిక వ్యవస్థను ఆర్థిక సంస్కరణలతో విముక్తి చేసినందుకు పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ద్వయానికి మనం కృతజ్ఞులమై ఉండాలి. సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనాలను అందించాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. దేశగతిని మార్చిన 1991 నాటి సంస్కరణలు మొదలై 30 ఏళ్లయిన సందర్భంగా అనేక వ్యాఖ్యానాలు, పునఃస్మరణలు వచ్చిపడుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏ దేశంలోనూ లేనంత కఠిన నిబంధనలతో కూడిన ఆర్థిక వ్యవస్థను కది లించివేసి సరళీకరించిన నాటి సందర్భం ఎప్పటికైనా చర్చనీయాంశమే. అయితే నాటి సంస్కరణలను సరళీకరణ పేరుతో సమర్థకులు ప్రశంసిస్తుండగా, దాన్ని నయా ఉదారవాదం పేరిట విమర్శకులు తూర్పారపడుతున్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలన్నింటిలో పేదల ఆదాయ స్థాయిలు దిగజారిపోతున్న వాతావరణంలో ఈ విమర్శనలను అర్థం చేసుకోవచ్చు. కానీ 1991 సంస్కరణల ఫలితాలపై పునరాలోచన్ని కూడా చేయలేని విధంగా దేశ ఆర్థికం మారింది. ఆరోజుల్లో ఆర్థిక వ్యవస్థలో నిర్ణాయక అంశాలు ప్రభుత్వ రంగానికే ప్రత్యేకించేవారు. ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి పెట్టాలంటే కూడా అవకాశం ఉండేది కాదు. ఇతర అన్ని రంగాల్లోనూ ప్రైవేట్ కంపెనీలు కొత్త పెట్టుబడులు పెట్టేవి. అయితే ప్రభుత్వం నుంచి పారిశ్రామిక లైసెన్సులు పొందగలిగే కంపెనీలకే అలాంటి అవకాశం ఉండేది. నేర విచారణ ప్రమాదంలో పడకుండా నాటి లైసెన్స్ రాజ్ అనుమతించిన దాని కంటే మించి ఉత్పత్తిని విస్తరించలేకపోతున్నందున బజాజ్ స్కూటర్ను పొందాలంటే బజాజ్ కస్టమర్లు సంవత్సరాల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఒక చర్చలో రాహుల్ బజాజ్ తన శ్రోతలకు చెప్పిన విషయం నేను గుర్తు చేసుకుంటున్నాను. నాటి భారతీయ వాణిజ్య విధానం కూడా సమర్థతకు ప్రోత్సాహకాలను నిర్మూలించే క్రమాన్ని వేగిరపర్చేది. వినియోగదారీ సరకుల దిగుమతిని పూర్తిగా నిషేధించారు. పోటీపడే విదేశీ కంపెనీల ఉత్పత్తిదారులను అవహేళన చేసి మరీ వారి సరకులను పక్కనపెట్టేవారు. ఉత్పత్తికి అవసరమైన మూలధన, మధ్యంతర సరకుల దిగుమతిని మాత్రమే దిగుమతి లైసెన్సులతో అనుమతించేవారు. ఈ దిగుమతులు అత్యవసరమా, వీటికి దేశీయంగా ప్రత్యామ్నాయాలు లేవా అని మదింపు చేసిన తర్వాత ఎగుమతి, దిగుమతుల కంట్రోలర్ జనరల్ ఈ అనుమతులను ఇచ్చేవారు. వాణిజ్య పరిస్థితులపై ఎలాంటి ఆచరణాత్మక జ్ఞానం లేని కొద్దిమంది ఉన్నతాధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకునేవారు. అయితే బ్యూరోక్రాటిక్ నియంత్రణ మృత హస్తం నుంచి ఆర్థిక వ్యవస్థను విముక్తి చేసినందుకు గాను పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ ద్వయానికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. అయితే ఈ గొప్ప మార్పు బిగ్ బ్యాంగ్ విస్ఫోటనం అంత వేగంగా జరగలేదు. క్రమానుగతంగా మార్పు జరిగింది. అంటే ఒక నిర్దిష్టం కాలంలో ఈ సంస్కరణల ప్రయోజనాలు అందుతూ వచ్చాయి. సంస్కరణలు ప్రయోజనాలను అందించాయనడంలో కాసింత సందేహం కూడా లేదు. సంస్కరణల ప్రధాన లక్ష్యం ఆర్థికాభివృద్ధి రేటును పెంచడమే. దీన్ని సాధించాం కూడా. నాటి సంస్కరణలు మొదలై 23 ఏళ్లు గడిచాక యూపీఏ పాలనాకాలం ముగింపు సమయానికి భారత ఆర్థిక వృద్ధి రేటు 7 శాతానికి పెరిగింది. సంస్కరణలకు ముందు 23 ఏళ్లవరకు ఇది 4.2 శాతంగా మాత్రమే ఉండేది. ఆర్థిక వృద్ధి వేగవంతం అయ్యే కొద్దీ, ఆ వృద్ధి ఫలితాలను పేదలకు కూడా అందించడానికి యూపీఏ ప్రభుత్వం సమీకృత వృద్ధి వ్యూహాన్ని చేపట్టింది. గ్రామీణ పనికి ఆహార పథకం ద్వారా గ్రామీణ కూలీలకు ఆదాయ మద్దతును అందించడం కూడా ఈ వ్యూహంలో భాగమైంది. 2004 నుంచి 2011 సంవత్సరాల మధ్య డేటా లభ్యమైనంత వరకు 14 కోట్ల మంది ప్రజలను దారిద్య్ర రేఖ నుంచి తప్పించడం జరిగింది. అయితే కోవిడ్ మహమ్మారి ప్రతిదాన్నీ మార్చివేసింది. ఈ మధ్యకాలంలో పలు అధ్యయనాలు దారిద్య్రం పెరుగుతూ వచ్చిందని అంచనా వేశాయి. కానీ ఇది మనం విడిగా నిర్వహించవలసిన, చర్చించవలసిన ఒక కొత్త పరిణామం అని గుర్తించాలి. మాంటెక్సింగ్ అహ్లూవాలియా వ్యాసకర్త మాజీ డిప్యూటీ చైర్మన్, ప్రణాళికా సంఘం -
పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ల మధ్య గొడవ.. దాని కోసమే !
ఓ వైపు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం.. మరోవైపు అడుగంటిపోయిన విదేశీ మారక ద్రవ్యం. దేశ దిగుమతి అవసరాలు తీరాలంటే బంగారం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి. అయితే ఆ క్షణంలో ప్రధానీ పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్సింగ్లు ఎంతో ధైర్యంగా 1991 జులై 24న ఆర్థిక సంస్కరణల అమలు చేయబోతున్నట్టు బడ్జెట్లో తెలిపారు. నేటితో ఆర్థిక సంస్కరణలకు 30 ఏళ్లు పూర్తయ్యాయి. కఠినమైన కాలం 1991లో ఇండియా ఆర్థికంగా కుదేలైన సమయం. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఇంటర్నెషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) సాయాన్ని భారత ప్రభుత్వం కోరింది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్లో చాలా కఠిన నిబంధనలను ఐఎంఎఫ్ పొందు పరిచింది. ఒక్క అక్షర ముక్క కూడా మార్చడానికి వీలు లేదన్నట్టుగా ఐఎంఎఫ్ భీష్మించుకుని కూర్చుంది. చివరకు అగ్రిమెంట్లో లేబర్ అన్న చోట LOBOR అంటూ అమెరికన్ పద్దతిలో రాస్తే కనీసం మన పరిస్థితులకు తగ్గట్టు LOBOUR గా అయినా మార్చాలంటూ కోరింది భారత ప్రభుత్వం. కనీసం స్పెల్లింగ్ మార్చే స్థితిలో కూడా అప్పటి భారత ప్రభుత్వం లేదు. అలాంటి స్థితి నుంచి ట్రిపుల్ బిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఎదిగింది. దీనికి బీజం వేసిన ఇద్దరు వ్యక్తులు పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్లు. అయితే ఆర్థిక సంస్కరణలకు అమలు సమయంలో నెలకొన్న పరిస్థితులు ఏంటీ ? పీవీ, మన్మోహన్ ద్వయం ఎలా మార్కెట్ని ఓపెన్ చేశారనే వివరాలను అప్పుడు పీవీకి సహాయకుడిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్, ఆఫ్ లయన్ పేరుతో పీవీ బయోగ్రఫీ రాసిన వినయ్ సీతాపతిలు ఇటీవల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ వివరాలు మీకోసం.. రూపాయి విలువ తగ్గింపు 1991 జున్ 21న ప్రధానిగా పీవీ నరసింహరావు, ఆర్థిక మంత్రిగా మన్మోహన్సింగ్లు ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు చేపట్టిందే ఆలస్యం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో పడ్డారు. అందులో భాగంగా జూన్ చివరి వారంలోనే రూపాయి విలువ తగ్గించాలంటూ ఆర్థిక మంత్రి మన్మోహన్సింగ్ ప్రతిపాదించారు. ఈ విషయంలో పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. రూపాయి విలువ తగ్గిస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని పీవీ వాదన, గతంలో 1966లో ఇందిరాగాంధీ ఇదే ప్రయత్నం చేసి చేదు ఫలితాలు చూశారు. అయితే విలువ తగ్గిస్తేనే మార్కెట్ పుంజుకుంటుందనేది మన్మోహన్ సింగ్ అభిప్రాయం. చివరకు రాజకీయ ఆటుపోట్లు తాను ఎదుర్కొంటానని చెబుతూ మన్మోహన్ సింగ్ నిర్ణయానికే ప్రధానీ పీవీ మద్దతు ఇచ్చారు. అభిప్రాయ బేధాలు రూపాయి విలువ తగ్గింపును రెండు అంచెల్లో ప్రవేశపెట్టనేది మన్మోహన్ సింగ్ వ్యూహం. ఒక్కసారి తగ్గింపుకే ప్రతిపక్షాలు గగ్గొలు పెడుతుంటే రెండు సార్లు తగ్గించడం ఎందుకంటూ పీవీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మొదటిసారి తగ్గింపు మార్కెట్ను పరీక్షించేందుకని, ఆ ఫలితాలను బట్టి అసలైన నిర్ణయం రెండోసారి అంటూ మన్మోహన్ వివరణ ఇచ్చారు. అయినా సరే పీవీ సంతృప్తి చెందలేదు. ఆర్బీఐ అధికారులకు ఫోన్ చేసి రూపాయి విలువ తగ్గించవద్దంటూ కోరారు. అయితే అప్పటికే రూపాయి విలువ తగ్గిస్తున్నట్టు మార్కెట్కి చెప్పేశామంటూ అటు నుంచి బదులు వచ్చింది. ఫలితంగా అయిష్టంగానే మన్మోహన్ సింగ్ వ్యూహానికి పీవీ మద్దతు పలకాల్సి వచ్చింది. ఇలా ప్రధాని, ఆర్థిక మంత్రిల మధ్య అభిప్రాయ బేధాలతోనే ఆర్థిక సంస్కరణలకు అడుగులు పడ్డాయి. మరో రెండు నిర్ణయాలు రూపాయి విలువ తగ్గించడంతోనే ఈ ద్వయం ఆగిపోలేదు. 1991 జులై మొదటి వారంలో కొత్త ట్రేడ్ పాలసీని తీసుకువచ్చారు. దీని ప్రకారం ఎగుమతులను హేతుబద్ధీకరించడంతో పాటు ప్రోత్సహకాలు పెంచారు. అనంతరం ఇండస్ట్రియల్ పాలసీని ప్రవేశపెట్టారు. ఇందులో అప్పటి వరకు పారిశ్రామికవేత్తలను వేధిస్తూ వచ్చిన బ్యూరోక్రసీలో ఉండే రెడ్టెపిజానికి అడ్డుకట్ట వేశారు. దీంతో లైసెన్సులు త్వరగా వచ్చేలా మార్పులు చేసి, విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించారు. విదేశీ ఎగుమతులు, దిగుమతులు సరళీకృతం చేశారు. ముందుమాటతో ఆర్థిక సంస్కరణలను వామపక్షాలు ముందు నుంచి తప్పుపడుతూనే ఉన్నాయి. అయితే ఇండస్ట్రియల్ పాలసీ, ట్రేడ్ పాలసీలకు సంబంధించి స్వపక్షం నుంచే పీవీకి సవాల్ ఎదురైంది. కేబినెట్ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలెవరు పీవీకి అండగా నిలవలేదు. ముసాయిదా డ్రాఫ్ట్లని రిజెక్ట్ చేశారు. దీంతో నెల రోజులుగా పడ్డ కష్టమంతా వృథా అయ్యే పరిస్థితి నెలకొంది. చివరకు ‘పరిస్థితులకు తగ్గట్టుగా ఈ చట్టంలో మార్పులు చేర్పులకు అవకాశం ఉంది’ అంటూ ముందు మాటను చేర్చారు. డ్రాఫ్ట్లో ఒక్క అక్షరం కూడా మార్చలేదు. కానీ ఈ ఒక్క ముందుమాటతో అప్పటి వరకు ముసాయిదాను వ్యతిరేకించిన మంత్రులంతా శభాష్ అంటూ ప్రధాని పీవీ, ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్లను మెచ్చుకున్నారు. అలా గండం గట్టెక్కి పార్లమెంటు ముందుకు వచ్చాయి ఆర్థిక సంస్కరణలు. పీవీ నేర్పు ఆర్థిక సంస్కరణల అమలును ఎప్పటిలాగే విపక్షాలు తప్పు పట్టాయి. పీవీపై తీవ్రమైన దాడి చేశాయి. పార్టీ నేతల నుంచి ఆశించిన సహకారం రాలేదు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వినాశకాలే సముత్ పన్నే.. అంటూ చెప్పిన సంస్కృత పద్యంతో బీజేపీ నేతలు పీవీని అర్థం చేసుకుని మాటల దాడి తగ్గించారు. ఆ తర్వాత పని సులువుగా జరిగిపోయింది. నిజానికి ప్రైవేటీకరణ అనే మాటను ఉపయోగించకుండానే ఎంతో నేర్పుగా పీవీ వ్యవహరించారు. పీవీ చాణక్యం పీవీ తన రాజకీయ జీవితంలో కేంద్రంలో రక్షణ, విదేశీ వ్యవహరాలు, మానవ వనరులు, ఆరోగ్యశాఖలను నిర్వహించారు. ఏపీకి ముఖ్యమంత్రిగా పని చేసినా తనదైన ముద్ర వేయలేకపోయారు. భూసంస్కరణలు మధ్యలో ఆగిపోతే జై ఆంధ్ర ఉద్యమ సెగలు చవిచూడాల్సి వచ్చింది. కానీ అనూహ్యంగా ప్రధాని పదవి చేపట్టిన పీవీ దేశంపై తన ముద్ర వేయగలిగారు. ఆర్థిక సంస్కరణల పితామహుడిగా నిలిచారు. అస్థిర ప్రభుత్వాలు నడుస్తున్న సమయంలో మైనార్టీ ప్రభుత్వంతో ఎవ్వరూ సాహసించలేని నిర్ణయాలను అమలు చేయగలిగారు. భవిష్యత్ దర్శనం 1991 జులై 24న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతూ మన్మోహన్ సింగ్ చెప్పిన మాటలు వాస్తవ రూపం తీసుకున్నాయి.. ‘సరైన సమయం వచ్చినప్పుడు నూతన ఆలోచనలను ఏ శక్తి అడ్డుకోలేదు. ప్రపంచంలోనే ఇండియాను ఆర్థిక శక్తిగా నిలిపే చర్యలు తీసుకుంటున్నాం. అమలు చేయడమేది ముళ్ల బాట వంటిది. అయినా సరే ఆ పని చేసి తీరుతాం. ఈ పని చేసినందుకు భవిష్యత్తు తరాల వారు ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పీవీ నరసింహరావుని గుర్తు పెట్టుకుంటారు’ అని తెలిపారు. ఈ రోజు దేశం మొత్తం పీవీ, మన్మోహన్ సింగ్లని స్మరించుకుంటోంది. - సాక్షి, వెబ్డెస్క్ -
నాటి సంస్కరణలే గుర్తుకొస్తున్నాయ్..!
భారత ఆర్థిక వ్యవస్థను మూలమలుపు తిప్పిన తీవ్ర సంస్కరణలు దేశంలో మొదలై నేటికి 30 ఏళ్లయింది. నాటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రారంభించిన సంస్కరణలు నేటికీ కొనసాగుతున్నాయి. కానీ, మూడు దశాబ్దాల తర్వాత కూడా దేశ ఆర్థికవృద్ధిపై నిరాశ అలుముకుంటోంది. 1991 నాటి తీవ్ర సంస్కరణలను పునఃసృష్టి చేయాలని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. జీడీపీ పతనం, కోవిడ్–19 కలిగించిన ఉత్పాతం మళ్లీ తీవ్రమైన నిర్ణయాలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రేరేపిస్తున్నాయి. పీవీ, మన్మోహన్ల సంస్కరణల వేగాన్ని మరోసారి తీసుకురావలసి ఉందనే అభిప్రాయాలు కొంతకాలంగా బలపడుతుండటం నాటి సంస్కరణల ప్రభావానికి తిరుగులేని నిదర్శనం. భారతదేశంలో 1991 సంస్కరణలు మొదలై నేటికి 30 ఏళ్లు. దేశ ఆర్థిక విధానాలను మూల మలుపు తిప్పిన ఆ గొప్ప దశ గురించి ఘనంగా చెప్పుకుంటున్నారు. ఏదైనా ఒక విశిష్ట ఘటనను తర్వాతి కాలక్రమంలో రజిత, స్వర్ణ, ప్లాటినమ్, శతాబ్ది వార్షికోత్సవాలతో గుర్తుంచుకోవడం కద్దు. వీటితో పోల్చి చూస్తే ముప్ఫై సంవత్సరాలకు అంతగా ప్రాధాన్యత లభించకపోవచ్చు. కానీ 1991 నాటి సంస్కరణలను ఇప్పుడు ఇంత విస్తృతంగా గుర్తించు కోవడానికి కారణం ఏమిటి? దీనికి ప్రధాన కారణం ఆర్థికవృద్ధికి సంబంధించి ప్రస్తుతం అలుముకుంటున్న నిరాశా దృక్పథమే. దేశంలో సంస్కరణలు కానీ, ప్రభుత్వ విధానాలు కానీ అసలు పని చేస్తున్నాయా లేదా అనే అంశంపై సందేహాలు తలెత్తుతున్న సందర్భ మిది. మనకు ఆర్థికవృద్ధికి సంబంధించి ఒక వ్యూహం కానీ విధానం కానీ ఉందా అనే ప్రశ్న రేగుతోంది. 1991లో చేపట్టిన ఉదారవాద, సరళీకరణ క్రమం ఇప్పుడు వెనకపట్టు పడుతున్న సూచనలు కనిపిస్తు న్నాయి. అందుకనే 1991లో జరిగినట్లుగా ఆర్థిక స్తబ్దతను బద్దలు గొట్టడానికి ఏదైనా నాటకీయ చర్యను తప్పకుండా చేపట్టాలని ఆర్థిక రంగ నిపుణులు పిలుపునిస్తున్నారు. అప్పట్లో మారకద్రవ్య విలువను తగ్గించడం, పారిశ్రామిక లైసెన్స్ రాజ్ను ఎత్తివేయడం వంటి చర్యలు వనరుల సమీకరణలో కీలకమైన మార్పులు తీసుకొచ్చాయి. రెండేళ్లక్రితమే మోదీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కోవిడ్– 19 నేపథ్యంలో ఆనాటి సంస్కరణలను గుర్తుచేసుకోవడం మరింతగా పెరిగింది. 1991లో దేశం చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు తీవ్ర చర్యలు చేపట్టినట్లే, ప్రస్తుత సంక్షోభాన్ని కూడా అవకాశంగా మార్చుకోవాలని చాలామంది సూచిస్తున్నారు. రెండేళ్లకు ముందు చమురుధరలు కుప్పగూలడంతో భారత ఆర్థిక వృద్ధికి చెందిన అడ్డం కులు తొలిగిపోయినట్లయింది. ప్రైవేట్ పెట్టుబడులకు డిమాండ్ కొరత కొనసాగింది. ఈ కొరతను ప్రభుత్వ పెట్టుబడి వ్యయాలతో భర్తీ చేయసాగారు. దీనికి చమురుపై పన్ను ద్వారా పెరిగిన రాబడులు దేవుడిచ్చిన బహుమతిగా ఉపయోగపడ్డాయి. అదే సమయంలో అంటే 2016–17 ఆర్థిక సంవత్సరంలో తీసుకొచ్చిన పెద్దనోట్ల రద్దు సగటు ఉత్పత్తి, ఉద్యోగితపై ప్రతికూల ప్రభావం చూపింది. రాజకీయ ఇచ్ఛ లోపించడం కారణంగా పెండింగులో ఉండిపో యిన ఉత్పత్తి–మార్కెట్ సంస్కరణలకు సంబంధించిన డిమాండ్ ఈ సమయంలోనే వేగం పుంజుకుంది. నిజానికి మొదలుపెట్టకుండా నిలిపివేసిన సంస్కరణలకు కొత్త దారి చూపేందుకు, 2014లో బల మైన కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఇదే రంగం సిద్ధం చేసిందని చెప్పాలి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తన తొలి హయాంలో వస్తుసేవల పన్నును 2017 జూలైలో ప్రవేశపెట్టడం ద్వారా తీవ్రమైన ఆర్థిక సంస్క రణలకు దారితీసింది. 2016లో బ్యాంకింగ్, కార్పొరేట్ రంగాల నుంచి చాలాకాలంగా పేరుకుపోయి ఉన్న మొండిబకాయిల పరి ష్కారం కోసం దివాలా కోడ్ని ప్రవేశపెట్టారు. అయినప్పటికీ, స్థూలదేశీయోత్పత్తి తదుపరి రెండేళ్లలో పతనాన్ని చవిచూసింది. 2018–2019 సంవత్సరాల్లో మన జీడీపీ వరుసగా 6.8 శాతం, 6.5 శాతాన్ని మాత్రమే నమోదు చేసింది. దీంతో 1991 తరహా సంస్కరణలకు అనుకూలంగా ప్రైవేట్ రంగం గొంతు విప్పసాగింది. 2019 మధ్యనాటికి కేంద్రంలో గత ప్రభుత్వమే మళ్లీ అధికారానికి వచ్చినప్పటికీ ఆర్థిక వృద్ధి విషయంలో నిరాశాతత్వం మరింత పెర గడం కాకతాళీయమే కావచ్చు. ఆర్థిక సంస్కరణల్లో సమూల మార్పులు తీసుకురావాల్సిందిగా పరిశ్రమ నుంచి అభ్యర్థనలు పెరి గాయి. అంతవరకు కొనసాగిన సంస్కరణలు అనుకున్నంత ప్రయో జనం కలిగించలేదని, ప్రభుత్వ మదుపు.. వాణిజ్య రంగానికి అవస రమైనంతమేరకు లభ్యం కావడం లేదని అభిప్రాయాలు బలపడ్డాయి. దీంతో ప్రైవేట్ మదుపును ప్రోత్సహించడానికి కేంద్రప్రభుత్వం వేగంగా స్పందించి 2019 సెప్టెంబర్లో కార్పొరేట్ పన్నులపై కోత పెట్టింది. ప్రతివారం అనేక ఇతర చర్యలు కూడా చేపట్టింది. కానీ జీడీపీ 5 శాతానికి దిగువకు పడిపోయింది. 2019 జూలై–సెప్టెంబర్లో 4.6 శాతానికి, అక్టోబర్–డిసెంబర్లో 3.3 శాతానికి 2020 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 3 శాతానికి మన స్థూల దేశీయోత్పత్తి దిగ జారిపోయింది. గత సంవత్సరం దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ వెన్నెముక విరిగినంత పనయింది. ఈ సంక్షోభాన్ని అవ కాశంగా మలచాలంటూ పిలుపులు మొదలైపోయాయి. దీంతో కార్మిక, వ్యవ సాయ చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర మార్పులు తీసుకొచ్చింది. అలాగే ఆత్మనిర్భర్ సిరీస్లో కూడా కొన్ని పథకాలు తీసుకొచ్చారు. కానీ, వ్యవసాయ మార్కెట్లు, సంస్థలలో తీసుకొచ్చిన కీలక మార్పులు ఎదురుతన్నడంతో ఈ రంగంలో భవిష్యత్ ప్రయో జనాలను ఊహించడం కష్టసాధ్యమవుతోంది. చరిత్ర గతిని మార్చిన ఆ వందరోజులు ముప్ఫై ఏళ్ల క్రితం పార్లమెంటు సభ్యుడు కూడా కాని నాటి కేంద్ర ఆర్థిక మంత్రి, భారత ఆర్థిక వ్యవస్థ క్రమాన్నే నాటకీయంగా మార్చివేసిన సాహ సోపేతమైన సంస్కరణలకు నాంది పలికారు. ద్రవ్య, చెల్లింపుల సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడవేసేందుకు నాటి ప్రభుత్వం తన తొలి వంద రోజుల పాలనలోనే వరుస సంస్కరణలకు తెరతీసింది. దీనికి బలమైన నేపథ్యం ఉంది. 1991 జూలై తొలి వారంలో భారత విదేశీమారక ద్రవ్య నిల్వలు కేవలం ఒక బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ప్రవాస భారతీ యులు తమ డిపాజిట్లను ఉపసంహరించుకోవడం మొదలెట్టడంతో పరి స్థితి మరింత తీవ్రమైంది. దీంతో నాటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆయన ఆర్థిక మంత్రి మన్మోహన్సింగ్ తమ తొలి వందరోజుల పాలన లోనే దేశ ఆర్థికక్రమాన్ని మలుపుతిప్పిన కఠిన చర్యలకు పూనుకున్నారు. మైనారిటీలో ఉన్న ప్రభుత్వం ఏర్పడిన తొలి పక్షం రోజుల్లోనే అంటే 1991 జూలై 2న అమెరికా డాలర్తో పోల్చినప్పుడు భారత కరెన్సీ విలువను 9.5 శాతానికి తగ్గించివేసింది. ఆ తర్వాత ఒక్క రోజు వ్యవధిలో రూపాయి విలువను మరో 12 శాతం మేరకు తగ్గించి షాక్ కలిగించింది. అదేరోజున నాటి వాణిజ్యమంత్రి పి. చిదంబరం ఎగుమతిదారులకు నగదు ప్రోత్సాహా న్నందిస్తున్న సబ్సిడీలను రద్దుచేశారు. కొన్ని రకాల సరకుల దిగుమతిపై ప్రభుత్వ రంగ సంస్థలు చలాయిస్తున్న గుత్తాధిపత్యాన్ని ఎత్తివేశారు. మార్కెట్కు స్వేచ్ఛకలిగించే ఎగ్జిమ్ చట్టాన్ని తీసుకువస్తూ సుంకం లేని దిగుమతులకు అవకాశమిచ్చే లైసెన్సులను రద్దు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల గుత్తాధిపత్యాన్ని తొలగించి పది కీలకరంగాల్లో ప్రైవేట్ సంస్థలకు అనుమతించారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాను క్రమంగా ఉపసంహరించుకునే విధానాన్ని ప్రకటించారు. గడిచిన ముప్ఫై ఏళ్లుగా ద్రవ్య, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ఇతర సంస్కరణలను ఎన్నింటినో తీసుకువచ్చారు. కానీ ఆరోజు పీవీ ప్రభుత్వం చేపట్టిన సంస్క రణల నమూనా తర్వాత గత ముప్ఫై ఏళ్లుగా కేంద్రంలో ఏర్పడిన ప్రభు త్వాలు, వాటి ఆర్థిక మంత్రులు అదే రీతిలో కొనసాగిస్తూ ఉండటం గొప్ప విషయంగానే చెప్పాలి. గత రెండేళ్లకుపైగా డీజీపీ రేటు పడిపోవడం, కోవిడ్– 19 దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుదేలవడం నేపథ్యంలో నాటి పీవీ, సింగ్ సంస్కరణల వేగాన్ని మరోసారి తీసుకురావలసి ఉందనే అభిప్రాయాలు గత కొంతకాలంగా బలపడుతుండటం నాటి సంస్కరణల ప్రభావానికి తిరుగులేని నిదర్శనం. రేణు కోహ్లి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
‘మా కంపెనీలో అటెండర్ షేర్ల విలువ రూ.15 కోట్లు’
30 Years Of Economic Reforms.. సాక్షి, వెబ్డెస్క్: అనుమతులు, ఆంక్షలు, రెడ్ టేపిజంల మధ్య కొట్టుమిట్టాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చి జులై 24తో 30 ఏళ్లు పూర్తవుతున్నాయి. పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ల ద్వయం అమల్లోకి తెచ్చిన ఈ సంస్కరణల ఫలితాలు అందిపుచ్చుకుని ఎదిగిన సంస్థల్లో మేటీగా నిలిచిన వాటిలో ఇన్ఫోసిస్ కూడా ఉంది. ఆర్థిక సంస్కరణలకు ముందు, ఆ తర్వాత దేశంలో పరిస్థితి ఎలా ఉండేది, ఇన్ఫోసిస్ ఎదుగుదల గురించిన వివరాలను ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి జాతీయ మీడియాకు తెలిపారు. ఆ విశేషాలు మీ కోసం... కలలు నిజమయ్యాయి 1991 జులై 21న పీవీ నరసింహారావు ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాతే మేము కన్న కలలన్నీ నిజం అయ్యాయి. నా దృష్టిలో ఎంటర్ప్రెన్యూర్ అంటే తనకు వచ్చిన ఐడియా ఎండ్ యూజర్కి ఉపయోగకరంగా ఉండాలి, కొత్త ఉద్యోగాలు సృష్టించగలగాలి, ఇన్వెస్టర్లకు లాభాలను అందివ్వాలి, పన్నుల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచాలి. అయితే ఆర్థిక సంస్కరణలకు ముందు ఇవన్నీ జరిగేందుకు ప్రతీ చోట అనుమతులు అనే అడ్డంకులు ఉండేవి. కానీ ఆర్థిక సంస్కరణలు ఈ పరిస్థితిని మార్చేశాయి. ఎంటర్ప్రెన్యూర్లు తాము కన్న కలలను నిజం చేసుకోవడానికి సులువైన దోవ దొరికింది. అంతకు ముందు కంప్యూటర్లు కొనడమనేది ఎంతో కష్టమైన వ్యవహారంగా ఉండేది. కంప్యూటర్లు కొనాలంటే 1981 జులైలో ఇన్ఫోసిస్ కంపెనీ స్థాపించిన కొత్తలో ఐబీఎం 4342 కంప్యూటర్లు కొనేందుకు మూడేళ్లలో 50 సార్లు ఢిల్లీకి వెళ్లి అధికారులతో మాట్లాడాల్సి వచ్చింది. ఎంతో కష్టపడితే కానీ కంప్యూటర్లు వచ్చేవి కాదు. ఇలా మేము ఎదురు చూపుల్లో ఉంటుండగా.. మరోవైపు టెక్నాలజీకి సంబంధించి ప్రతీ ఆరు నెలలకు అమెరికాలో మార్పులు వచ్చేవి. ప్రతీ ఆరు నెలలకు కొత్త కంప్యూటర్లు అక్కడ మార్కెట్లోకి వచ్చేవి. పైగా పాత కంప్యూటర్తో పోల్చితే యాభై శాతం మెరుగైన పనితీరు, 30 శాతం తక్కువ ధరతో కొత్త కంప్యూటర్లు వచ్చేవి. దీంతో మళ్లీ ఆర్డర్లలో మార్పులు చేయాల్సి వచ్చేది. వాటికి త్వరగా అనుమతులు సాధించడం మరో ప్రహసనంగా ఉండేది. ఒక్క కంప్యూటరనే కాదు ఆఖరికి టెలిఫోన్ పొందాలన్నా కష్టమే. ఆ రోజుల్లో ప్రభుత్వ అధికారులు, లేదా రిటైర్డ్ అధికారుల ఇళ్లకే కనెక్షన్ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. నిధుల సమస్య ఆరోజుల్లో టెలిఫోన్ కనెక్షన్, కంప్యూటర్లు కొనేందుకే ఇబ్బంది పడే మాకు నిధుల సేకరణ పెద్ద సమస్యగా ఉండేది. ఇక బ్యాంకులకు సాఫ్ట్వేర్ సర్వీసెస్, ఎక్స్పోర్ట్స్ గురించి ఎంత చెప్పినా అర్థం అయ్యేది కాదు, పెట్టుబడిదారులు మా వైపు చూసేవారు కాదు. ఇలా కంపెనీ స్థాపించిన తర్వాత పదేళ్ల పాటు బాలారిష్టాలనే ఎదుర్కొన్నాం. ఆ సమయంలోనే మా కంపెనినీ రూ. 2 కోట్లకు కొంటామంటూ ఆఫర్ వచ్చింది. ఫౌండర్లలో కొందరు అమ్మేద్దామనుకున్నారు కూడా. కానీ ఈ రోజు కంపెనీ విలువ 6.5 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ ఎదుగుదలకు ఆర్థిక సంస్కరణలు ఎంతగానో తోడయ్యాయి. ఐపీవోకి 1991లో ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో వేగం పెరిగింది. అనుమతుల కోసం వేచి చూసే సమయం తగ్గింది. విదేశాల నుంచి ఎదైనా తెప్పించుకోవడం తేలికైంది. ఈ సంస్కరణలు ఇచ్చిన ధైర్యంతో 1992 డిసెంబరులో ఇన్ఫోసిస్ స్థాపించిన పదేళ్లకు స్టాక్ మార్కెట్కి వచ్చాం. నందన్ నీలేకని, బీ బాలకృష్ణన్, వీఆర్ నాయక్లు కంపెనీ టార్గెట్, రిస్క్లను వివరిస్తూ మంచి ప్రొజెక్షన్ ఇచ్చారు. అదే సమయంలో ఇనామ్ వ్యవస్థాపకులు వల్లభ్ బన్సాలీ, నేమీష్ షాలు సహకారం అందించారు. స్టాక్ మార్కెట్కి రక్షణగా 1992లోనే సెబీ కూడా ఏర్పాటైంది. దీంతో ఇన్ఫోసిస్కు నిధుల సమస్య క్రమంగా దూరమైంది. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగాం. షేర్ వాల్యూ అత్యంత కింది స్థాయి ఉద్యోగి సంక్షేమం, అభివృద్ధి లక్క్ష్యంగా కంపెనీ పనితీరు ఉండాలని మహ్మాత్మా గాంధీ చెప్పిన మాటల స్ఫూర్తితో 1994, 1998లో ఎంప్లాయిస్ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈఎస్ఓపీ)ని అమలు చేశాం. మంచి ప్రతిభ కనబరిచిన ప్రతీ ఉద్యోగికి అటెండర్, ప్యూన్ నుంచి డైరెక్టర్ల వరకు షేర్లు కేటాయించాం. ఈ షేర్టు అట్టి పెట్టుకున్న చాలా మంది అటెండర్లు, ఫ్యూన్లు కనీసం 10 నుంచి 15 కోట్ల రూపాయల వరకు ఆదాయం పొందారు. 1994, 1998 ప్లాన్లో లేని ఎంప్లాయిస్ కోసం కనీసం పది షేర్ల వంతున 2008లో కేటాయించాం. ఇప్పుడు ఆ షేర్ల విలువల 1.30 లక్షల కోట్లుగా ఉంది. ఇప్పుడా ఉద్యోగులు ఆదాయపు పన్ను కడుతున్నారు, చూడచక్కని ఇళ్లు కట్టకున్నారు, మంచి కార్లలలో తిరుగుతున్నారు. సెలవుల్లో కుటుంబాలతో కలిసి విదేశీ ప్రయాణాలకు వెళ్తున్నారు. ఈ మార్పు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. ఆర్థిక సంస్కరణలు అమలు జరిగి ఉండకపోతే పరిస్థితి వేరేలా ఉండేది. విలువలతో.. దేశ బంగారు భవిష్యత్తు కొత్తతరం ఎంట్రప్యూనర్లపైనే ఆధారపడి ఉంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పోటీ తత్వంతో పాటు విలువలు పాటించే లక్షణం కూడా ఉండాలి. పవర్ బై ఇంటెలెక్ట్ డ్రైవెన్ బై వాల్యూస్ అనేది ముఖ్యం. అదే విధంగా మన దగ్గర జనాభా ఎక్కువ. కానీ ఇందులో నైపుణ్యం కలిగిన వారు చాలా తక్కువ. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంగ్లీష్ ప్రపంచ అనుసంధాన భాష, ఇంకా మాట్లాడితే ఇంగ్లీష్ ఇప్పుడు ఇండియా భాష. ఆ భాషపై పట్టు పెంచుకోవాలి. అదే విధంగా నిత్యం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చెప్పే విధంగా మన దగ్గర బోధన జరగడం లేదు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యం పెంచేలా విద్యావిధానంలో మార్పు రావాలి. ఉద్యోగాలు సృష్టించే స్టేట్స్, ఎగుమతులు పెంచే స్టేట్స్కి ప్రత్యేక ప్రోత్సహాకాలు అందివ్వాలి అప్పుడు మన సమాజం మరింతగా ముందుకు వెళ్తుంది. -
PV Narasimha Rao: విదేశాంగ విధానంలో వాస్తవికత తెచ్చారు
సాక్షి, హైదరాబాద్: భారత విదేశాంగ విధానంలో వాస్తవికతను తెరపైకి తెచ్చిన ఘనత పీవీ నర్సింహారావుకు దక్కుతుందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ కొనియాడారు. ఇరుగు, పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపర్చేందుకు ఆయన విశేష కృషి చేశారని ప్రశంసించారు. దేశ ప్రజల వాస్తవిక పరిస్థితులు, ప్రత్యేక స్వభావం, వారి ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, పేదలు, కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఆర్థిక సంస్కరణలను అమలు చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పీవీ శత జయంతి ఉత్సవాల ముగింపు సభ సోమవారం గాంధీభవన్ నుంచి వర్చువల్ విధానంలో జరిగింది. కమిటీ చైర్మన్ డాక్టర్ జె.గీతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేంద్ర మాజీ మంత్రులు మల్లికా ర్జున ఖర్గే, పల్లంరాజు, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, మాజీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. పీపీ సంస్కరణలతో సుదీర్ఘ కాలం మేలు ముఖ్య అతిథిగా హాజరైన మన్మోహన్సింగ్ మాట్లాడుతూ పీవీ నాయకత్వంలోనే ఆర్థిక, విదేశాంగ విధానాల్లో కీలక మార్పులు, సంస్కరణలు వచ్చాయని చెప్పారు. ఈ సంస్కరణల ఫలితాలు సుదీర్ఘ కాలం పాటు దేశ ప్రజలకు మేలు చేయనున్నాయని పేర్కొన్నారు. భారతదేశాన్ని తూర్పు, ఆగ్నేయాసియా దేశాలతో కలిపే విధంగా ‘లుక్ ఈస్ట్ పాలసీ’ని పీవీ తీసుకువచ్చారని చెప్పారు. ఆయన హయాంలోనే ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, బాలిస్టిక్ క్షిపణిల పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని, దార్శనికతతో శాస్త్ర, సాంకేతిక రంగాలను సద్వినియోగం చేసుకుంటూ దేశాన్ని ముందుకు నడిపించిన ఘనుడు పీవీ అని కొనియాడారు. ఈ సందర్భంగా పీవీ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ కె.శ్రీనాథరెడ్డికి అందజేశారు. వైద్య రంగంలో శ్రీనాథరెడ్డి చేసిన సేవలకు గుర్తింపుగా అవార్డు ఇవ్వడం సముచితమని మన్మోహన్ పేర్కొన్నారు. పీవీ సోదరుడు మనోహర్రావుకు కూడా ఈ అవార్డును అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, మాజీ మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్బాబు, వినోద్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఎ.మహేశ్వర్రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, పీసీసీ నేతలు వేణుగోపాల్, శ్రవణ్కుమార్రెడ్డి, నిరంజన్, బొల్లు కిష న్, నగేశ్ ముదిరాజ్, పాడి కౌశిక్రెడ్డి పాల్గొన్నారు. చదవండి: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు: కోమటిరెడ్డి -
నెగటివ్: కరోనా నుంచి కోలుకున్న మాజీ ప్రధానమంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా బారినపడిన మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎట్టకేలకు కోలుకున్నారు. తాజాగా చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగటివ్ రావడంతో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. ఏప్రిల్ 19వ తేదీన మన్మోహన్ కరోనా బారినపడ్డారు. రెండుసార్లు (మార్చి 4, ఏప్రిల్ 3) కరోనా టీకాలు తీసుకున్న తర్వాత కూడా ఆయన కరోనా బారినపడడం కలకలం రేపింది. కరోనా నిర్ధారణ అయిన అనంతరం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. పది రోజుల పాటు ఎయిమ్స్లో చికిత్స పొందిన అనంతరం మన్మోహన్ సింగ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. కరోనా టెస్ట్ చేయగా నెగటివ్ రావడంతో మన్మోహన్ సింగ్ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. అయితే మన్మోహన్ సింగ్ దేశంలో కరోనా వ్యాప్తి, కట్టడి చర్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. పలు సూచనలు చేయగా వాటిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: ఇప్పటివరకు లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రాలు ఇవే.. చదవండి: ఘోరం.. 577 మంది టీచర్లు కరోనాకు బలి -
కరోనా టెర్రర్.. 5 రాష్ట్రాల సీఎంలకు పాజిటివ్..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్య ప్రజలనుంచి పాలకుల వరకు ఎవర్నీ వదలిపెట్టడం లేదు. ఇప్పటికే మనదేశంలో అయిదుగురు ముఖ్యమంత్రులకు కరోనా సోకింది. తమిళనాడు సీఎం పళని స్వామి, కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం యడ్యూరప్ప, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లకు కరోనా బారిన పడిన వారిలో ఉన్నారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఈ జాబితాలో చేరారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కి కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. కాగా, కరోనా తీవ్రతను దృష్ఠిలో ఉంచుకున్నకేంద్రం వ్యాక్సిన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మే1 నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారందరికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని తీసుకుంది. -
మన్మోహన్ సింగ్కు కరోనా.. ఎయిమ్స్లో చికిత్స
న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కరోనా బారిన పడ్డారు. సోమవారం నాడు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయనకు పాజిటివ్గా తేలింది. దీంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా భారత్లో కరోనా వైరస్ వేగంగా అత్యంత వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆదివారం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అయిదు సూచనలు చేస్తూ ఓ లేఖను రాశారు. కరోనా నియంత్రణకు తీసుకొనే చర్యలతో పాటు.. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత వేగవంతం చేయాలని కోరారు.. తన సలహాలు, సూచనలను నిర్మాణాత్మక సహకార స్ఫూర్తితో స్వీకరించాలని పేర్కొన్నారు. -
భారత్ విజయగాథ అపూర్వం
వాషింగ్టన్ : ప్రభుత్వాలు తరచూ మారిపోయినా.. రాజకీయ పార్టీల్లో కుట్రలు ఎన్ని ఉన్నా.. సాయుధ వేర్పాటు ఉద్యమాలు ఎన్ని నడిచినా, అన్ని రకాల స్కామ్లు, అవినీతి ఉన్నప్పటికీ ఆధునిక భారత దేశం సాధించిన ఘనతలు పలు విధాలుగా ఓ విజయగాథ అని అగ్రరాజ్యం అమెరికా 44వ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకం ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో రాసుకున్నారు. 1990 తొలినాళ్లలో ఆర్థిక సరళీకరణలు చేపట్టడంతో భారత్లోని అసాధారణ భారతీయ వ్యాపార నైపుణ్యాలు ప్రపంచానికి పరిచయం అయ్యాయని, ఫలితంగా దేశ అర్థ వ్యవస్థ పరుగులు పెట్టిందని, టెక్నాలజీ రంగం వృద్ధి చెందిందని ఒబామా ఆ పుస్తకంలో వివరించారు. 2008లో ఒబామా చేపట్టిన అధ్యక్ష ఎన్నికల ప్రచారం మొదలుకొని అధ్యక్షుడిగా తన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. అల్ కాయిదా అధ్యక్షుడు బిన్ లాడెన్ను హతమార్చడంతో పాటు తొలి దఫా అధ్యక్ష పదవీ కాలం ముగిసేంత వరకూ జరిగిన పలు ఘట్టాలను ఆయన ఎ ప్రామిస్డ్ ల్యాండ్లో విపులీకరించారు. ఈ నెల 15న విడుదలైన ఈ పుస్తకంలో 2010లో ఒబామా భారత్ పర్యటన వివరాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులోని కొన్ని ముఖ్యాంశాలు.. మన్మోహన్పై ప్రశంసలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై ఒబామా ప్రశంసల వర్షం కురిపించారు. సిక్కు మైనార్టీ వర్గానికి చెందిన మన్మోహన్ దేశ అత్యున్నత పదవిని అందుకోవడం దేశ పురోగతికి ఓ తార్కాణమని, నిజాయితీపరుడిగా గుర్తింపు పొందడం వంటివి మన్మోహన్ సాధించిన విజయాలని ఒబామా వర్ణించారు. ఢిల్లీలో మన్మోహన్ సింగ్ను తాను కలిసినప్పుడు ఆయనలోని అసాధారణ విజ్ఞానాన్ని, హుందా వ్యవహారశైలిని గుర్తించానని చెప్పారు. వినడం సోనియాకు ఇష్టం.. 2010లో తొలిసారి ఢిల్లీ వెళ్లినప్పుడు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, రాహుల్గాంధీలతో విందు సమావేశంలో పాల్గొన్నట్లు ఒబామా వివరించారు. సోనియా మాట్లాడటం కంటే ఎదుటి వ్యక్తి చెప్పింది వినేందుకే ఎక్కువ ఇష్టపడేవారని తెలిపారు. రాహుల్ గాంధీ తెలివైనవాడిగా, పట్టుదల ఉన్నవాడిగానే కనిపించాడు. అయితే రాహుల్లో ధైర్యం లేని అపరిపక్వతను తాను గమనించానని, పాఠాలన్నీ చదివి టీచర్ వద్ద మంచి మార్కులు కొట్టేయాలని చూసే విద్యార్థిలా అనిపించాడని ఒబామా వ్యాఖ్యానించారు. -
మన్మోహన్జీ పుట్టినరోజు శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పుట్టిన రోజు నేడు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా మాజీ ప్రధానికికి శుభాకాంక్షలు తెలిపారు. ‘డాక్టర్ మన్మోహన్ సింగ్ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితం లభించాలని సర్వశక్తిమంతుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. Birthday greetings to Dr. Manmohan Singh Ji. I pray to Almighty that he is blessed with a long and healthy life. — Narendra Modi (@narendramodi) September 26, 2020 మీ వంటి వ్యక్తి ప్రధానిగా లేకపోవడంతో భారతదేశం లోటుగా భావిస్తోంది. ఆయన నిజాయతీ, మర్యాద, అంకితభావం మనందరికి స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. India feels the absence of a PM with the depth of Dr Manmohan Singh. His honesty, decency and dedication are a source of inspiration for us all. Wishing him a very happy birthday and a lovely year ahead.#HappyBirthdayDrMMSingh — Rahul Gandhi (@RahulGandhi) September 26, 2020 -
సెలవులు కోరుతున్న రాజ్యసభ ఎంపీలు
ఢిల్లీ : సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని వదలకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా సెగ పార్లమెంట్కు కూడా గట్టిగానే తగిలింది. ఇప్పటికే 25 మంది ఎంపీలు సహా 50 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ కావడం అలజడి రేపింది. కాగా సెప్టెంబర్ 12న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలకు ముందే లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా 17 మంది లోక్సభ, 8 మంది రాజ్యసభ ఎంపీలకు వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. (చదవండి : ప్రశ్నోత్తరాలు రద్దు, జీరో అవర్ అరగంటే) దీంతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా 14 మంది రాజ్యసభ ఎంపీలు తమకు సెలవులు కావాలంటూ దరఖాస్తు చేసుకోవడం ఆసక్తి కలిగించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు తమకు సెలవులు ఇవ్వాలంటూ ఎంపీలు తమ దరఖాస్తులో కోరారు. కాగా కోవిడ్-19 విసృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాజ్యసభ ఎంపీలు సెలవులు కోరినట్లు సమాచారం. కాగా కరోనా బారిన పడినవారిలో బీజేపీకి చెందినవారు అత్యధికంగా 12 మంది ఎంపీలుండగా.. వైఎస్సార్సీపీ నుంచి అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, శివసేన, డీఎంకే, ఆర్ఎల్పీ తదితర పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు ఉన్నారు. కోవిడ్ 19 పాజిటివ్గా తేలిన ఎంపీలు కొందరు క్వారంటైన్లో ఉండగా.. మరికొందరు ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. -
అగ్నివేశ్కు ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ: ఆర్యసమాజ్ నేత స్వామి అగ్నివేశ్ మృతి పట్ల పలువురు సామాజిక వేత్తలు, రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. వెట్టి కార్మికులు, స్త్రీల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన నిజమైన సెక్యులర్ నేతగా ఆయనను కొనియాడారు. అగ్నివేశ్ భౌతికకాయానికి శనివారం ఆర్యసమాజ్ నేతృత్వంలో అంత్యక్రియలు జరిగాయి. సమాజంలో అల్పసంఖ్యాకుల తరఫున ఆయన జీవితాంతం పోరాడారని, ఛత్తీస్గఢ్లో గిరిజనుల పక్షాన ఆయన తన గొంతు వినిపించారని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ నివాళులు అర్పించారు. దేశంలో మతసామరస్యం నెలకొల్పేందుకు ఆయన కృషి మరువలేనిదని మాజీ ప్రధాని మన్మోహన్ కొనియాడారు. వామపక్ష పోరాటాలకు ఆయన గొప్ప స్నేహితుడని, పైకి కాషాయం ధరించినా లోపల నిజమైన సెక్యులర్ అని సీపీఐ లీడర్ డి రాజా ప్రశంసించారు. డీఎంకే నేత స్టాలిన్, పీఎంకే నేత రామ్దాస్ సైతం అగ్నివేశ్ మృతి పట్ల సంతాపం తెలిపారు. తన సిద్ధాంతాలతో విభేదించేవారు ఆయనపై అనేకమార్లు దాడులకు దిగినా, నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడ్డారని లాయర్ మహమూద్ ప్రాచా ప్రశంసించారు. -
కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభంపై రచ్చ
-
గాంధీలదే కాంగ్రెస్..!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు స్వరాలతో రేగిన ప్రకంపనలు పాలపొంగు మాదిరి చప్పున చల్లారిపోయాయి. పార్టీ తాత్కాలిక చీఫ్గా కొనసాగాలని, సంస్థను బలోపేతం చేయడానికి అవసరమైన మార్పులు తీసుకురావాలని సోనియాగాంధీని కోరుతూ సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. అనువైన పరిస్థితులు రాగానే ఏఐసీసీ సదస్సు ఏర్పాటు చేయాలని, అందులో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని... అప్పటిదాకా పార్టీ అధ్యక్షురాలిగా సోనియానే కొనసాగాలని ఆ తీర్మానంలో సీడబ్ల్యూసీ పెద్దలంతా స్పష్టంచేశారు. ఎక్కువ మంది సోనియా గాంధీకి మద్దతుగా నిలిచినప్పటికీ.. సమావేశంలో వ్యతిరేక స్వరాలు కూడా వినిపించాయి. పార్టీలో మార్పులు కోరుతూ సీనియర్లు లేఖ రాసిన సందర్భంపై రాహుల్ గాంధీ మండిపడగా... సమావేశంలో ఉన్న గులాం నబీ ఆజాద్ కూడా అదే రీతిలో స్పందించారు. సమావేశం బయట ఉన్న కపిల్ సిబల్ కూడా బహిరంగంగా ట్వీట్ చేశారు. కానీ కొద్దిసేపటికే పరిస్థితులు మారిపోయి తాత్కాలికంగానైనా అంతా ఒక్క చేతికిందికి వచ్చేశారు. ఉదయం నుంచి హైడ్రామా.. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై ఏడు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో తొలుత సోనియా గాంధీ తాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. క్రియాశీలకంగా ఉండే, పూర్తి సమయం కేటాయించే అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ ఆగస్టు మొదటివారంలో పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, కపిల్ సిబల్ తదితర 23 మంది నేతలు రాసిన లేఖపైనే ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ లేఖ రాగానే పార్టీలో మార్పుల గురించి చర్చించేందుకు సోనియాగాంధీ ఈనెల 20న పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు లేఖ రాశారు. పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికపై చర్చ ప్రారంభించేందుకు వీలుగా సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో భాగంగా సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో 52 మంది పాల్గొన్నారు. ఒక్క తరుణ్ గొగోయ్ మినహా సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, ముఖ్యమంత్రులు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎక్కువ మంది సోనియా గాంధీకి మద్దతుగా నిలిచినప్పటికీ.. సమావేశంలో వ్యతిరేక స్వరాలూ వినిపించాయి. లేఖ రాసిన సమయం, సందర్భంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. లేఖ రాసినవారు బీజేపీతో కుమ్మక్కయ్యారని కూడా ఆయన ఒకదశలో వ్యాఖ్యలు చేసినట్లు తెలియవచ్చింది. దీనికి గులాం నబీ ఆజాద్ ఘాటుగా స్పందిస్తూ బీజేపీతో కుమ్మక్కయినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాలు విసిరినట్టు సమావేశంలో పాల్గొన్న సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. సోనియా గాంధీ ప్రారంభ ఉపన్యాసం అయ్యాక సీనియర్ నేతలు మన్మోహన్సింగ్, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్ మాట్లాడుతూ... సీనియర్ల లేఖను తప్పుపట్టారు. సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగాలని మన్మోహన్సింగ్ ఆకాంక్షించారు. లేఖ రాసిన వారిపై ఆయా నేతలు విమర్శలు గుప్పించారు. కొత్త పార్టీ చీఫ్ను ఎన్నుకునేందుకు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని, అందుకు వర్చువల్ ఏఐసీసీ సెషన్ నిర్వహించాలని పి.చిదంబరం సూచించారు. సందర్భాన్ని తప్పుపట్టిన రాహుల్ గాంధీ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ... లేఖపై సంతకం చేసిన వారిని ఘాటుగా విమర్శించారు. ముఖ్యంగా లేఖ రాసిన సమయాన్ని, సందర్భాన్ని తప్పుపట్టారు. సోనియాగాంధీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు, రాజస్తాన్లో పార్టీ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఈ లేఖ రాయడాన్ని తప్పుపట్టారు. దీనికి సంబంధించి సమావేశం పూర్తికాకముందే బయటకు లీకులు వెలువడ్డాయి. వీటి ఆధారంగా ఒక వార్తా సంస్థ చేసిన ట్వీట్ దుమారం రేపింది. లేఖ రాసిన వారు బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ గాంధీ మండిపడ్డారంటూ ఆ వార్తా సంస్థ చేసిన ట్వీట్కు కపిల్ సిబల్ ట్వీట్ ద్వారా సమాధానమిచ్చారు. పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా రంగంలోకి దిగారు. రాహుల్ గాంధీ అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదని ఆయన ట్వీట్ చేశారు. మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. పార్టీలో ఒకరితోనొకరు గొడవ పడడానికి బదులు మోదీ పాలనపై కలసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తాత్కాలికంగా సద్దుమణిగాయా? పార్టీలో, సమావేశంలో ధిక్కార స్వరాలు వినిపించాయనడానికి పార్టీ నేతలు చేసిన ట్వీట్లు చాలు. రణ్దీప్ సూర్జేవాలా ట్వీట్లో ‘పార్టీ్టలో ఒకరినొకరు కొట్టుకునే కంటే మోదీ పాలనపై కలిసికట్టుగా పోరాడాలి’ అన్న వ్యాఖ్య అంతర్గత పోరు నిజమేనన్న సంకేతాన్నిస్తోంది. అలాగే తన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించారని, రాహుల్ని అనలేదని, ఇతర కాంగ్రెస్ నేతలను మాత్రమే అన్నానని ఆజాద్ చేసిన ట్వీట్ కూడా సమావేశంలో జరిగిన వాడీవేడిని బయటపెడుతోంది. ఇక బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ అన్నట్టుగా వార్తలు వెలువడడంతో సిబల్ వెంటనే స్పందించి ట్వీట్ చేయడం కూడా అంతర్గత పోరుకు సంకేతమేనని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అంతర్గత పోరు బహిరంగం కావడం, ఒక దశలో పార్టీలో దాదాపు 400 మంది సీనియర్లు మూకుమ్మడి రాజీనామాలు చేయబోతున్నారని ప్రచారం కావడంతో రాహుల్ గాంధీ స్వయంగా సిబల్తో మాట్లాడారు. తాను అలా అనలేదని చెప్పడంతో సిబల్ వెంటనే ట్వీట్ తొలగించారు. అలాగే లేఖ రాసిన వారిలో సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన వారు ఆజాద్, ఆనంద్ శర్మ ఇద్దరే. సమావేశంలో వీరి వైఖరిని అహ్మద్ పటేల్ తదితరులు తీవ్రంగా ఆక్షేపించారు. లేఖను తయారు చేసింది ఆనంద్ శర్మే అని ఆరోపించినట్టు కూడా తెలిసింది. నేతలంతా చివరికి లేఖ రాసిన వ్యక్తుల్ని కాకుండా సందర్భాన్ని తప్పుపడుతూ గాంధీ కుటుంబానికి విధేయత ప్రకటించారు. అలాగే రాహుల్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని కూడా కోరారు. మరోవైపు సమావేశం వెలుపల, వివిధ ప్రాంతాల్లో రాహులే అధ్యక్షుడు కావాలంటూ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో చివరకు ఏఐసీసీ సెషన్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరిగేవరకు సోనియానే చీఫ్గా కొనసాగాలని సీడబ్ల్యూసీ తీర్మానించింది. ధిక్కార స్వరం వినిపించిన వారు కూడా ఈ తీర్మానంలో భాగం కావటంతో తాత్కాలికంగా పరిస్థితి సద్దుమణిగిందనే చెప్పాలి. సమావేశం చివరలో సోనియా ‘మనది పెద్ద కుటుంబం. భిన్న అభిప్రాయాలు ఉంటాయి. కానీ ప్రజల కోసం కలిసి పోరాడాలి. సంస్థాగత అంశాలు ఎప్పుడైనా పరిష్కరించుకోవచ్చు..’అని ప్రకటించినట్టు కేసీ వేణుగోపాల్ చెప్పారు. కాగా, సీడబ్ల్యూసీ భేటీ తర్వాత లేఖ రాసిన సీనియర్లు కొందరు గులాంనబీ ఆజాద్ నివాసంలో భేటీ అయ్యారు. కపిల్ సిబల్, శశిథరూర్, ముకుల్ వాస్నిక్, మనీష్ తివారీలు హాజరైన వారిలో ఉన్నారు. బలహీనపరచడాన్ని అనుమతించలేం: సీడబ్ల్యూసీ ఏఐసీసీ సమావేశం నిర్వహణకు పరిస్థితులు అనుకూలించేదాకా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగాలని సోనియా గాంధీని కోరుతూ సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానించింది. పార్టీ ముందున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సంస్థాగతంగా మార్పులు చేపట్టడానికి సోనియాకు అధికారాన్ని కట్టబెట్టింది. సోనియా, రాహుల్ల నాయకత్వాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించింది. పార్టీని, నాయకత్వాన్ని బలహీనపర్చేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేసింది. పార్టీ అంతర్గత వ్యవహారాలను మీడియాలో, బాçహాటంగా చర్చించకూడదని, వాటిని పార్టీ వేదికలపైనే లేవనెత్తాలని కోరింది. సుమారు 7 గంటల పాటు జరిగిన సీడబ్ల్యూసీ భేటీ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. ‘కాంగ్రెస్ అధ్యక్షురాలికి రాసిన లేఖపై సీడబ్ల్యూసీ లోతుగా చర్చించి ఈ తీర్మానాలు చేసింది. వేలాది మంది ప్రాణాలను తీసిన కరోనా మహమ్మారి, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, పేదరికం, చైనాతో ఉద్రిక్తతలు వంటి సవాళ్లను దేశం ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ప్రభుత్వం విభజన రాజకీయాలు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపడానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తమ స్వరం వినిపించారు. ఈ దిశగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయత్నాలను పార్టీ మరింత బలోపేతం చేయాలి’ అని తీర్మానంలో సీడబ్ల్యూసీ పేర్కొంది. గులాం నబీ ఆజాద్ రాజీనామాపై ట్వీట్ మీటింగ్ ఒకవైపు సాగుతుండగానే ఆజాద్ ఒక ట్వీట్ చేశారు. ‘మీడియాలోని ఒక వర్గం తప్పుగా అన్వయించింది. మేం ఆ లేఖ బీజేపీతో కుమ్మక్కై రాసినట్టు నిరూపించాలని రాహుల్ను ఉద్దేశించి నేను అన్నట్టుగా తప్పుగా అన్వయించింది. నేను భేటీలో ఏమన్నానంటే.. నిన్న కొందరు కాంగ్రెస్ వ్యక్తులు మేం బీజేపీతో కుమ్మక్కయి లేఖ రాశామని అన్నారు. అది చాలా దురదృష్టకర సంఘటన. ఈ ఆరోపణను నిజమని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నాను’ అని ట్వీట్ చేశారు. సోనియానే కొనసాగాలి పార్టీ ప్రెసిడెంట్గా సోనియా గాంధీనే కొనసాగాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గట్టిగా కోరారు. సీడబ్ల్యూసీ భేటీలో కేసీ వేణుగోపాల్, సోనియాగాంధీల అనంతరం మన్మోహన్ ప్రసంగించారు. నూతన అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ప్రారంభమయ్యే పూర్తిస్థాయి ఏఐసీసీ సమావేశాలు జరిగేవరకు అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగాలని ఆయన సోనియాను కోరారు. నాయకత్వ మార్పు కోరుతూ సీనియర్లు లేఖ రాయడాన్ని ఆయన తప్పుబట్టారు. అది దురదృష్టకరమన్నారు. ‘హైకమాండ్ బలహీనమయితే, కాంగ్రెస్ పార్టీ బలహీనమవుతుంది’అని వ్యాఖ్యానించారు. మరోవైపు, సోనియా గాంధీ కొనసాగనట్లయితే.. అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ స్వీకరించాలని మరో సీనియర్ నేత ఏకే ఆంటోనీ కోరారు. సీనియర్లు రాసిన లేఖ కన్నా.. ఆ లేఖలోని అంశాలు క్రూరంగా ఉన్నాయని ఆంటోనీ విమర్శించారు. అందుకే ఆ ట్వీట్ను తొలగించా!: సిబల్ రాహుల్ గాంధీని ఘాటుగా విమర్శిస్తూ చేసిన ట్వీట్ను ఆ తరువాత సీనియర్ నేత కపిల్ సిబల్ తొలగించారు. బీజేపీతో కుమ్మక్కు అయ్యారన్న వ్యాఖ్య తాను చేయలేదని రాహుల్ గాంధీ స్వయంగా తనతో చెప్పారని, అందువల్ల ఆ ట్వీట్ను తొలగిస్తున్నానని సిబల్ వివరణ ఇచ్చారు. ‘బీజేపీతో కుమ్మక్కయ్యామని రాహుల్ అంటున్నారు. రాజస్తాన్ హైకోర్టులో కాంగ్రెస్ తరఫున జరిపిన పోరాటంలో విజయం సాధించాం. మణిపూర్లో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే విషయంలో పార్టీ తరఫున విజయవంతంగా పోరాడాం. 30 ఏళ్లలో ఏ అంశంపైన కూడా బీజేపీకి మద్దతిస్తూ ఒక వ్యాఖ్య కూడా చేయలేదు. అయినా, బీజేపీతో కుమ్మక్కయ్యామని అంటున్నారు’అని తొలగించిన ఆ ట్వీట్లో సిబల్ పేర్కొన్నారు. పూర్తి సమయం పని చేసే నాయకత్వం ప్రస్తుతం పార్టీకి అవసరమని పేర్కొంటూ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతల్లో సిబల్ కూడా ఒకరు. నెహ్రూ– గాంధీ కుటుంబం నుంచి ఐదుగురు ► ఇతరులు 13 మంది ► స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సోనియాగాంధీ సిద్ధమయ్యారు. రాహుల్ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టడానికి విముఖంగా ఉన్నారని సమాచారం. ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పదోన్నతికి ప్రియాంకా గాంధీ సిద్ధంగా లేరని అంటున్నారు. గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్కు కొత్త అధ్యక్షుడు వస్తారా? కాలమే తేల్చాలి. ఇప్పటికైతే సోనియాను కొనసాగాల్సిందిగా సీడబ్ల్యూసీ తీర్మానించింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే... ఇప్పటిదాకా కాంగ్రెస్కు 18 మంది అధ్యక్షులుగా పనిచేశారు. వీరిలో నెహ్రూ– గాంధీ కుటుంబానికి చెందిన ఐదుగురే దాదాపు 40 ఏళ్లు పార్టీ పగ్గాలు చేపట్టారు. ఈ కుటుంబం నుంచి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా, రాహుల్లు అధ్యక్షులుగా పనిచేశారు. అందరికంటే అత్యధికకాలం పార్టీని నడిపింది సోనియా గాంధీనే. ఇప్పటిదాకా ఆమె 20 ఏళ్లు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ కుటుంబం నుంచి కాకుండా ఇతరులు 13 మంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. వారు... జేబీ కృపలానీ, పట్టాభి సీతారామయ్య, పురుషోత్తందాస్ టాండన్, యు.ఎన్.ధేబర్, నీలం సంజీవరెడ్డి, కె.కామరాజ్, ఎస్.నిజలింగప్ప, జగ్జీవన్ రామ్, శంకర్దయాళ్ శర్మ, డి.కె.బరూహ్, కాసు బ్రహ్మానంద రెడ్డి, పి.వి.నరసింహారావు, సీతారాం కేసరి. -
కరోనా సంక్షోభం : కేంద్రానికి మాజీ ప్రధాని సలహాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం, పౌరుల జీవనోపాధిపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రమైన దీర్ఘకాలిక ఆర్థిక మందగమనం అనివార్యమని మన్మోహన్ వ్యాఖ్యానించారు. కానీ ఈ అంశాన్ని ఆర్థిక గణాంకాలకంటే సమాజం దృష్టికోణం నుంచి చూడటం చాలా ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల జీవనోపాధిని కాపాడాలని, వ్యాపారాలకు రుణ హామీ ఇవ్వాలని ప్రధాని మోదీకి సూచించారు. ఆర్థిక మందగమనాన్ని "మానవతా సంక్షోభం"గా అభివర్ణించిన ఆయన ప్రజల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు గణనీయమైన ప్రత్యక్ష నగదు సహాయాలను అందించాలన్నారు. "ప్రభుత్వ మద్దతుగల క్రెడిట్ హామీ కార్యక్రమాల" ద్వారా వ్యాపారాలకు తగిన మూలధనాన్ని అందుబాటులో ఉంచాలి, సంస్థాగత స్వయం ప్రతిపత్తి ద్వారా ఆర్థిక రంగాన్ని రక్షించాలంటూ మూడు కీలక సూచనలు చేశారు. కరోనా కట్టడికి లాక్ డౌన్ అవసరమే అయినప్పటికీ కేంద్రం సరిగ్గా వ్యవహరంచలేదని ఆయన విమర్శించారు. అకస్మాత్తుగా, ఆలోచనా రహితంగా, ముందస్తు ప్రణాళిక లేకుండా విధించిన లాక్ డౌన్, కఠిన ఆంక్షలు ప్రజలు తీవ్రంగా బాధించాయని మన్మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి నిర్వహణను స్థానిక సంస్థలకు అప్పగించే బావుండేదని పేర్కొన్నారు. కేంద్ర విస్తృత మార్గదర్శకాలతో, స్థానిక పరిపాలనా సంస్థలు కోవిడ్-19 నివారణలో ఇంకా ఉత్తమంగా పనిచేసే ఉండేవని మాజీ ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లో "అధిక రుణాలు" అవసరమే అని చెప్పిన ఆయన సైనిక, ఆరోగ్యం, ఆర్ధిక సవాళ్ల అవసరాలకు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) లో అదనంగా 10 శాతం ఖర్చు చేయవలసి వచ్చినా, అది తప్పదన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి, సరిహద్దు రక్షణ, జీవనోపాధి పునరుద్ధరణ, ఆర్థిక వృద్ధికి అధిక రుణాలు అవసరమని చెప్పారు. కాగా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో కూరుకుపోయాయి. జీడీపీ గణనీయంగా తగ్గుదలను నమోదు చేస్తున్నాయి. దేశీయంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 5 శాతానికి క్షీణిస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్-జూన్ త్రైమాసిక జీడీపీ గణాంకాలు ఈ నెలలో వెల్లడికానున్నాయి -
ఆ పదవికి రాహులైతేనే బెస్ట్
న్యూఢిల్లీ: దాదాపు 135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఏళ్ల తరబడి దేశం అంతటిని పాలించిన పార్టీ నేడు కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యింది. కొన్ని చోట్ల అసలుకే గల్లంతయ్యింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో పార్టీ పగ్గాలను వదిలేసారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎందరు ఎన్ని రకాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన మాత్రం తన నిర్ణయం మార్చుకోలేదు. ప్రస్తుతం సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియాటుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టడానికి రాహుల్ గాంధీనే సరైన వ్యక్తిగా ప్రజలు విశ్వసిస్తున్నారని ఈ నివేదిక తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 23 శాతం మంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ అయితేనే బెస్ట్ అని అభిప్రాయపడ్డారని వెల్లడించింది. (అత్యుత్తమ సీఎంలలో వైఎస్ జగన్కు మూడో స్థానం) పార్టీని పునరుద్ధరించడానికి ఏ నాయకుడు బాగా సరిపోతారని మీరు అనుకుంటున్నారని ప్రశ్నించగా.. 23 శాతం మంది రాహుల్ గాంధీకి ఓటు వేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 18 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ 14 శాతం ఓట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇక రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ 2 శాతం ఓట్లతో ఆఖరి స్థానంలో ఉండగా.. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ 3 శాతం ఓట్లతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నారు. పార్టీని నూతన పునరుజ్జీవనం వైపు నడిపించడానికి రాహుల్ అయితేనే బెస్ట్ అని ఎక్కువ మంది ప్రజలు ఓటు వేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవి చూడటంతో 2019 ఆగస్టులో రాహుల్ గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. -
‘అప్పుడు వాజ్పేయిని, అడ్వాణీని విమర్శించలేదు’
న్యూఢిల్లీ: దాదాపు 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. 2019 ఎన్నికల తర్వాత పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. యువ నాయకులంతా సీనియర్ల మీద గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో గురువారం సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో యువ నాయకులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీద విమర్శలు కురిపించారు. ఆయన ప్రభుత్వ నిర్ణయాల వల్లనే గత ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయ్యిందని ఆరోపించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శశి థరూర్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ, ముంబై మాజీ కాంగ్రెస్ చీఫ్ మిలింద్ డియోరా మన్మోహన్ సింగ్కు మద్దతుగా నిలిచారు. యువ నాయకులంతా కావాలనే.. హానికరమైన విధానంలో మన్మోహన్పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (రాహుల్ సేనపై దృష్టి) ఈ క్రమంలో మనీష్ తివారీ ‘బీజేపీ కూడా 2004-2014 వరకు అధికారంలో లేదు. కానీ ఒక్క నాయకుడు కూడా వాజ్పేయిని గానీ, అడ్వాణీని కానీ విమర్శించలేదు. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్లో కొందరు మన్మోహన్ సింగ్ మీద అనవసర ఆరోపణలు చేస్తున్నారు’ అని ట్విట్ చేశారు. శశి థరూర్ కూడా మన్మోహన్కు మద్దతు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘నేను మనీష్ తివారీ, మిలింద్ డియోరాలతో ఏకీభవిస్తున్నాను. యూపీఏ పదేళ్ల పాలన గురించి కావాలనే హానికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మన అపజయాల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాంగ్రెస్కు పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటే ఎంతో కృషి చేయాలి. అంతేకానీ సైద్ధాంతికపరంగా మనం విభేదించే వారితో చేతులు కలిపి ఇలా విమర్శలు చేయడం మంచిది కాదు’ అంటూ ట్వీట్ చేశారు. (నెహ్రూకు ఠాగూర్ రాసిన లేఖ చూశారా!) I agree with @ManishTewari & @milinddeora. UPA's transformative ten years were distorted & traduced by a motivated & malicious narrative. There's plenty to learn from our defeats & much to be done to revive @INCIndia. But not by playing into the hands of our ideological enemies. https://t.co/Ui6WUlBl3F — Shashi Tharoor (@ShashiTharoor) August 1, 2020 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్ గాంధీ ఏకంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎంతమంది ఎన్ని రకాలుగా నచ్చజేప్పే ప్రయత్నం చేసినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆ తర్వాత మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా.. పార్టీ నుంచి వెళ్లిపోయి బీజేపీలో చేరారు. తాజాగా రాజస్తాన్లో సచిన్ పైలట్ తిరుగుబాటు చేశారు. సీనియర్లు తమకు అవకాశం ఇవ్వడం లేదని.. గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని.. గుర్తింపు దక్కడం లేదని.. అందుకే పార్టీ నుంచి వెళ్లి పోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం సోనియా గాంధీ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. (కొత్త సారథి కావలెను) దీనిలో గత యూపీఏ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారితో పాటు.. రాహుల్ గాంధీ టీం పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ నాయకత్వం వల్లనే గత ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయ్యిందని యువ నాయకులు ఆరోపించారు. రాహుల్ గాంధీ తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరారు. ఈ క్రమంలో యువ నాయకులు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థిక మాంద్యం, కరోనా వైరస్పై కేంద్ర వైఖరి, చైనాతో వివాదం వంటి అంశాల్లో మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడంలో వీరంతా విఫలమయ్యారని ఆరోపించారు. సీనియర్ నాయకులు ప్రధానిపై చేసే దాడి చాలా బలహీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో పార్టీలో మరింత ఆత్మ పరిశీలన, సంప్రదింపులు, చర్చలు ఉండాలని యువ నాయకులు కోరారు. -
'పుట్టుక నుంచి చనిపోయేదాకా ఆయన కాంగ్రెస్ వాది'
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రోజున ఘనంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ పీవీపై ప్రశంసల వర్షం కురిపించారు. పీవీ మాకు ఎల్లప్పుడూ గర్వకారణం. ఆయన శతజయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఏడాదిపాటు నిర్వహిస్తోంది. పీవీ గురించి ఎవరు వేడుకలు చేసిన స్వాగతిస్తాం. 2023లో పీవీ స్పూర్తితో పనిచేస్తూ తెలంగాణలో అధికారంలోకి వస్తామని సోనియాగాంధీ పేర్కొన్నారు. (సంస్కరణల ఆద్యుడు పీవీ) మరో సందేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ పీవీ శతజయంతి వేడుకల నిర్ణయం మంచి ఆలోచన. క్యాబినెట్లో ఆయన ఆర్థిక మంత్రిగా తొలి బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషంగా ఉంది. ఆదర్శవంతమైన వ్యక్తి పీవీ. ఆర్థిక సంస్కరణలు తెచ్చిన గొప్ప ప్రధాని. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. పీవీ సంస్కరణల వల్లనే దేశం ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడింది అని మన్మోహన్ సింగ్ కొనియాడారు. (వార్తల కెక్కని పీవీ చాణక్యం) హైదరాబాద్: ఇందిరాభవన్లో పీవీ జయంతి వేడుకలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పీవీ వంగరలో ఓ సామాన్య కార్యకర్తగా పని చేసి ప్రధాని స్థాయికి ఎదిగారు. ఆయనతో వ్యక్తిగతంగా నాకు మంచి పరిచయం. భూసంస్కరణలు తెచ్చిన ఘనత పీవీది. పుట్టుక నుంచి చనిపోయే వరకు కాంగ్రెస్ వాది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు తెచ్చిన గొప్ప నాయకుడు పీవీ. ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకి భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేశారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దేశాన్ని అదుకున్నది పీవీ సంస్కరణలే. జూలై 24, 1991 నాటి కేంద్ర బడ్జెట్ మన దేశ ఆర్థిక పరివర్తనకు మార్గం సుగమం చేసింది. ఆయన పదవీకాలం అనేక రాజకీయ, సామాజిక, విదేశాంగ విధాన విజయాలకు నాంది అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీవీ సోదరులు మనోహర్ రావ్, పీవీ శత జయంతి కమిట్ చైర్మన్ గీతారెడ్డి, గౌరవ చైర్మన్ వీ హనుమంత రావు, వైస్ చైర్మెన్ శ్రీధర్ బాబు, కన్వీనర్ మహేష్ గౌడ్, ముఖ్య నాయకులు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, దాసోజు శ్రవణ్, అనిల్ యాదవ్, మల్లు రవి, రుద్ర రాజు, వేణుగోపాల్, సీజే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. (నిరాడంబరతకు నిలువెత్తు ప్రతీక..) -
మోసపోయిన మన్మోహన్ మాజీ సలహాదారు
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు మీడియా సలహాదారుగా పని చేసిన సంజయ్ బారు ఆన్లైన్ మోసానికి గురయ్యారు. మద్యం పేరుతో ఓ వ్యక్తి తన నుంచి 24 వేల రూపాయలు తీసుకుని మోసం చేశారన్న ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం నిందితుడిని అరెస్టు చేశారు. లాక్డౌన్ కాలంలో సంజయ్ బారు మద్యం కోసం ఆన్లైన్లో వెతికారు. ఆయనకు లా కేవ్ వైన్స్ అండ్ స్పిరిట్స్ అనే షాపు మద్యం సరఫరా చేస్తున్నట్లు కనిపించింది. అందుబాటులో ఉన్న మొబైల్ నంబర్ కు ఫోన్ చేయగా, సదరు వ్యక్తి 24 వేల రూపాయలు ఆన్లైన్లో పంపాలని డిమాండ్ చేశారు. డబ్బులు పంపిన సంజయ్ బారు, మళ్లీ ఫోన్ చేయగా స్విచాఫ్ వస్తుండటంతో పోలీసులను ఆశ్రయించారు.(‘ప్రధాని ప్రశంసించారు.. అది చాలు’) మొబైల్ నెంబరు ట్రేస్ చేసిన పోలీసులకు నిందితుడు ఓ క్యాబ్ డ్రైవర్ అని తెలిసింది. అతన్ని అరెస్టు చేసి విచారించగా వాళ్లు ఓ ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించాడు. పలు రకాల సిమ్ కార్డులు, నకిలీ పేర్లు, అడ్రెస్సులు వాడుతూ టార్గెట్ చేసిన వ్యక్తులకు ఫోన్లు చేస్తామని తెలిపాడు. (బైక్పై చీఫ్ జస్టిస్ చక్కర్లు; ఫోటోలు వైరల్) తమకు వేర్వేరు రాష్ట్రాల్లో బ్యాంకు అకౌంట్లు కూడా ఉన్నాయని నిందితుడు వెల్లడించాడు. బాధితులు ట్రాన్స్ఫర్ చేసిన ఐదు నుంచి పది నిమిషాల్లో డబ్బు వేరే రాష్ట్రాల్లోని అకౌంట్లకు అక్కడి నుంచి అసలు ఖాతాలకు బదిలీ అవుతుందని వివరించాడు. పోలీసులకు అంతుచిక్కకుండా ఉండేందుకు రకరకాల ప్లాన్స్ గీస్తామని చెప్పాడు. -
సరిహద్దు వివాదంపై మన్మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు ఘర్షణల విషయంలో ప్రభుత్వం తాత్సారం చేయవద్దని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హితవు పలికారు. కరోనా మహమ్మారిని ప్రభుత్వం దీటుగా ఎదుర్కోవడంలో విఫలమైందని విమర్శలు గుప్పిస్తూ సరిహద్దు వివాదంలోనూ ఇలాగే వ్యవహరించవద్దని అన్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం సమర్ధవంతంగా చేపట్టలేకపోతోందని ఆరోపించారు. మహమ్మారి కట్టడికి ప్రభుత్వం ధైర్యంగా ముందుకు వెళ్లడం లేదని దుయ్యబట్టారు. మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో తలెత్తిన మరో సంక్షోభాన్నీ ఇదే తరహాలో ఎదుర్కొంటే తీవ్ర పరిస్థితికి దారితీస్తుందని మన్మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశంలో మన్మోహన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణ్దీప్ సింగ్ సుర్జీవాలా ట్వీట్ చేశారు. సింగ్ వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు. చదవండి : పర్యవసానాలపై అవగాహన ఉండాలి -
పర్యవసానాలపై అవగాహన ఉండాలి
న్యూఢిల్లీ: గల్వాన్ ఘటన, తదనంతర పరిణామాలపై ప్రభుత్వం, ప్రధాన విపక్షం కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి మాటలు.. చైనా తన చర్యలను సమర్ధించు కునేందుకు ఉపయోగపడేలా ఉండవద్దని మాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యానించారు. అత్యంత బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తికి తన వ్యాఖ్యల పర్యవసానాలపై కచ్చితంగా అవగాహన ఉండాలన్నారు. ‘దేశానికి నాయకత్వం వహిస్తున్న వారిపై పవిత్రమైన బాధ్యత ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఆ బాధ్యత ప్రధానిపై ఉంటుంది’ అన్నారు. ‘దేశ ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం అనేది దౌత్య నీతికి, సమర్ధ నాయకత్వానికి ప్రత్యామ్నాయం కాబోదు’ అని తేల్చిచెప్పారు. ‘చైనా భారత భూభాగంలో అడుగుపెట్టలేదు. భారత పోస్ట్లను స్వాధీనం చేసుకోలేదు’ అని ఇటీవల అఖిలపక్ష భేటీలో మోదీ చేసిన వ్యాఖ్యలపై మన్మోహన్ పై విధంగా స్పందించారు.సరిహద్దుల రక్షణలో ప్రాణాలు అర్పించిన జవాన్లకు సరైన న్యా యం జరగాలని పేర్కొన్నారు. ‘అందులో ఏమా త్రం లోపం జరిగినా అది ప్రజల విశ్వాసాలకు చేసిన చరిత్రాత్మక ద్రోహం అవుతుంది’ అన్నారు. -
‘ప్రకటనలపట్ల మోదీ జాగ్రత్తగా ఉండాలి’
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోకి ఎవరూ చొరబడలేదన్న నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ స్పందించారు. చైనాతో సరిహద్దు విషయమై కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేయడం సరికాదని అన్నారు. సరిహద్దు రక్షణ కోసం సైనికుల త్యాగాలు వృథా కాకూడదని అన్నారు. కల్నల్ సంతోష్ బాబు సహా జవాన్ల త్యాగాలకు న్యాయం జరగాలని మన్మోహన్ అభిప్రాయపడ్డారు. లేకుంటే ప్రజలకు చారిత్రాత్మక మోసం జరిగినట్లు అవుతుందని వ్యాఖ్యానించారు. దేశ ప్రాదేశిక సమగ్రతలో రాజీ పడొద్దని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. (చదవండి: ఆయన ‘సరెండర్’ మోదీ: రాహుల్) గల్వాన్ వ్యాలీ, ప్యాగ్యాంగ్ లేక్ వద్ద చైనా చొరబాట్లుకు పాల్పడుతోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రకటనల పట్ల జాగ్రత్త వహించాలని మన్మోహన్ సూచించారు. ప్రధాని మోదీ ప్రకటనలు వ్యూహాత్మక ప్రాదేశిక ప్రయోజనాలతో పాటు దేశ రక్షణపై ప్రభావం చూపుతాయన్నారు. ఈ సంక్షోభం ఎదుర్కొనేందుకు, ఉద్రిక్తలు తగ్గించేందుకు ప్రభుత్వ విభాగాలన్నీ ఏకతాటిపై పని చేయాలని ఆయన సూచించారు. దౌత్య, లేదా నిర్ణయాత్మక నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇవ్వడం ప్రత్యామ్నాయం కాదని మన్మోహన్ అన్నారు. (చదవండి: కరోనాపై యోగాస్త్రం) -
ఆస్పత్రి నుంచి మన్మోహన్ సింగ్ డిశ్చార్జి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆదివారం రోజున ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మన్మోహన్ సింగ్ ఆరోగ్యం మెరుగుపడటంతో వైద్యులు ఆయనను డిశ్చార్జి చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఎటువంటి సమస్య లేదని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. (చదవండి : మెరుగుపడిన మన్మోహన్ ఆరోగ్యం) కాగా, ఛాతీ నొప్పితో ఆయన ఆసుపత్రిలో చేరిన సమయంలో మన్మోహన్కు జ్వరం కూడా వచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా వైద్యులు.. ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. మొదట వైద్యులు ఆయన్ని కార్డియో థొరాసిక్ ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అనంతరం కార్డియో–న్యూరో టవర్లోని ప్రైవేట్ వార్డుకు తరలించారు. కాగా, 1990లో ఆయనకు తొలిసారిగా బైపాస్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత 2003లో ఆయనకు స్టంట్ వేశారు. 2009లో మరోసారి ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. -
మెరుగుపడిన మన్మోహన్ ఆరోగ్యం
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి, నిలకడగా ఉందని ఎయిమ్స్ తెలిపింది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్గా వచ్చిందని సోమవారం వెల్లడించింది. ఆదివారం ఆయనకు కొత్త మెడికేషన్ సరిపడక జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఎయిమ్స్లో చేర్చారు. ‘ఆయన్ను కార్డియో థొరాసిక్ ఐసీయూ నుంచి కార్డియో–న్యూరో టవర్లోని ప్రైవేట్ వార్డుకు తరలించాం. ఇవాళో రేపో డిశ్చార్జి చేసే అవకాశం ఉంది’ అని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. -
మన్మోహన్ సింగ్కు అస్వస్థత!
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు.ఢిల్లీలోని తన నివాసంలో ఉండగా, ఆదివారం రాత్రి 8.45 గంటల సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో, హుటాహుటిన ఎయిమ్స్కు తరలించారు. వెంటనే వైద్యులు, హృద్రోగ విభాగంలో చేర్చుకుని చికిత్స ప్రారంభించారు. మన్మోహన్ సింగ్ కార్డియో థొరాసిక్ విభాగం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన అవయవాలన్నీ సరిగానే పనిచేస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2009లో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. ఆర్థికవేత్తగా ప్రఖ్యాతిగాంచిన మన్మోహన్ యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా దేశానికి సేవలందించారు. మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పార్టీలకు అతీతంగా పలువురు నేతలు ట్వీట్ చేశారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. (చదవండి: రైలు ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్) Delhi: Former Prime Minister Dr Manmohan Singh has been admitted to All India Institute of Medical Sciences (AIIMS) after complaining about chest pain (File pic) pic.twitter.com/a38ajJDNQP — ANI (@ANI) May 10, 2020 -
లాక్డౌన్ని ఎంతకాలం పొడిగిస్తారు?
న్యూఢిల్లీ: కరోనాకు లాక్డౌన్ పరిష్కారమని భావించిన ప్రభుత్వం ఈ స్థితిని ఎంతకాలం కొనసాగిస్తుందో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రశ్నించారు. ‘మే 17 అనంతరం పరిస్థితి ఏమిటి?’ అని కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన సమావేశంలో సోనియా ప్రశ్నించారు. లాక్డౌన్ని ఎంతకాలం పొడిగిస్తారు? ప్రభుత్వం వద్ద లాక్డౌన్ అనంతర ప్రణాళిక ఏమిటని సోనియా ప్రశ్నించినట్టు కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా వెల్లడించారు. ఇంత క్లిష్టకాలంలో సైతం అత్యధిక గోధుమపంటను అందించడం ద్వారా ఆహార భద్రతకు కృషిచేసిన రైతాంగానికి ప్రధానంగా పంజాబ్, హరియాణా రైతులకు సోనియా గాంధీ కృతజ్ఞతలు తెలియజేశారు. వలస కార్మికుల సమస్యను కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆమె చర్చించారు. ప్రత్యేక రైళ్లలో వలస కార్మికుల నుంచి టిక్కెట్ ఛార్జీలు కేంద్రం వసూలు చేస్తుండటాన్ని ఇప్పటికే సోనియా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. వలస కార్మికులను తరలించడానికి అయ్యే ఖర్చును కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని అంతకుముందు ఆమె ప్రకటించారు. ఈ భేటీలో రాహుల్ గాంధీతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్డౌన్న కేంద్ర ప్రభుత్వం మే 17 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. (త్వరలో ప్రజా రవాణాకు పచ్చజెండా) -
డీఏ నిలుపుదలకు ఇది సమయం కాదు
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులకు ఇటీవల పెంచిన కరువు భత్యాన్ని (డీఏ) కేంద్ర ప్రభుత్వం నిలిపివేడయంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. ప్రస్తుత సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏను నిలిపివేయడం సరికాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ దళాలపై భారం వేయడం తగదన్నారు. కోవిడ్–19 సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2021 జూలై వరకు పెంచిన కరువుభత్యం(డీఏ) చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ప్రభావం 50 లక్షల మంది ఉద్యోగులతోపాటు 61 లక్షల మంది పింఛనుదారులపై పడనుంది. ‘కోవిడ్–19తో ఉత్పన్నమైన సంక్షోభం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర పింఛనుదారులకు 2020 జనవరి 1వ తేదీ నుంచి చెల్లించాల్సిన అదనపు వాయిదా డీఏను 2021 జూన్ 30 వరకు నిలిపివేయాలని నిర్ణయించడమైంది’ అని ఆర్థిక శాఖ తెలిపింది. అయితే, ప్రస్తుతం ఉన్న 17 శాతం డీఏను యథాప్రకారం చెల్లిస్తామని పేర్కొంది. దీంతో 2020 జూలై 1వ తేదీ, 2021 జనవరి 1వ తేదీల్లో ఇవ్వాల్సిన డీఏ బకాయిల చెల్లింపులు నిలిచిపోనున్నాయి. కేంద్ర ఉద్యోగులకు 4 శాతం, పింఛనుదారులకు 21 శాతం మేర డీఏను పెంచేందుకు గత నెలలో కేబినెట్ ఆమోదం తెలిపింది. కానీ, ఆర్థిక శాఖ తాజా ఉత్తర్వులతో ఆ నిర్ణయం అమలు ఆగిపోనుంది. డీఏను 2021 జూలై 1వ తేదీ నుంచి డీఏ పెంపుదలను వర్తింపజేస్తామని ఆర్థిక శాఖ వ్యయ విభాగం స్పష్టత నిచ్చింది. డీఏ విషయంలో కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రాలు కూడా అమలు చేసే అవకాశముంది. ఆర్థిక శాఖ ఉత్తర్వుల ఫలితంగా.. కేంద్రానికి రూ.37,530 కోట్లు, రాష్ట్రాలకు 82,566 కోట్లు కలిపి సుమారు రూ.1.20 లక్షల కోట్లు ఆదా కానున్నాయి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల డీఏను ద్రవ్యోల్బణం ఆధారంగా ఏడాదిలో రెండుసార్లు సవరిస్తారు. ఆర్థిక శాఖ నిర్ణయంతో మిగిలిన మొత్తాన్ని కోవిడ్పై పోరాటానికి మళ్లించేందుకు వీలు కలుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కోవిడ్పై పోరుకు గాను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, గవర్నర్ల వేతనాల్లో 30 శాతం కోత విధిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇలా ఆదా అయిన మొత్తం భారత ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్లో జమ అవుతుంది. ఈ నిధులను ఆరోగ్య సేవల నిర్వహణకు, కరోనాపై పోరుకు వాడతారు. -
మన్మోహన్ సింగ్ చైర్మన్గా ఓ కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి మనోహ్మన్ సింగ్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ శనివారం ఓ సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితులపై సమాలోచనలు చేయడంతో పాటు ముఖ్యమైన అంశాలపై పార్టీ వైఖరిని ఈ కమిటీ వెల్లడిస్తోంది. ఈ కమిటీలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ, ముఖ్యనేతలు పి. చిదంబరం, జైరాం రమేశ్, మనీశ్ తివారీ, ప్రవీణ్ చక్రవర్తి, గౌరవ్ వల్లభ్, సోషల్ మీడియా ఇన్చార్జీ రోహన్ గుప్త తదితరులు సభ్యులుగా ఉంటారు. కాంగ్రెస్పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా కన్వీనర్గా వ్యవహరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై సమాలోచనలు చేయడంతో పాటు, నిర్మాణాత్మక సలహాలను ఈ బృందం ఇస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. -
అమిత్ షాపై మండిపడ్డ సోనియా
న్యూఢిల్లీ: తన విధులను విస్మరించి దేశ రాజధానిలో చెలరేగిన హింసకు కారణమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను వెంటనే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఢిల్లీలో 34 మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం, అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించాయని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు తీవ్ర రూపందాల్చిన నేపథ్యంలో.. సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకుల బృందం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి మెమొరాండం సమర్పించారు. రాష్ట్రపతిగా ఉన్న అధికారాలను వినియోగించి రాజ ధర్మాన్ని నిర్వర్తించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను.. ప్రభుత్వం నిర్వర్తించాల్సిన విధులను గుర్తు చేయాల్సిందిగా కోరారు. అదేవిధంగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన హోం మంత్రిని పదవి నుంచి తొలగించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. (ఢిల్లీ అల్లర్లు : 35కు చేరిన మృతుల సంఖ్య) ఈ క్రమంలో రాష్ట్రపతిని కలిసిన అనంతరం సోనియా గాంధీ మీడియాతో మాట్లాడుతూ... హోం మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కొత్తగా ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వం తీరును కూడా ఆమె తప్పుబట్టారు. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ... రాజధర్మాన్ని కాపాడాల్సిందిగా రాష్ట్రపతికి విఙ్ఞప్తి చేశామని తెలిపారు. ఢిల్లీలో చెలరేగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం, అహ్మద్పటేల్, రణ్దీప్ సింగ్ సూర్జేవాలా తదితరులు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్లతో కలిసి రాష్ట్రపతిని కలిసిన బృందంలో ఉన్నారు. (ఢిల్లీ అల్లర్లు: అంకిత్ శర్మ హత్య కేసులో కొత్త ట్విస్ట్) ఢిల్లీ అల్లర్లు: సమగ్ర కథనాల కోసం క్లిక్ చేయండి -
‘ఆయనను ఎప్పుడూ అగౌరవపరచలేదు’
న్యూఢిల్లీ: దోషులుగా తేలిన చట్టసభల సభ్యులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో విభేదిస్తూ నాటి యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం విషయం తెలిసిందే. అయితే ఆనాటి సంఘటన మాజీ ప్రధాని మన్మోహన్కు ఇబ్బందికర పరిస్థితిని తీసువచ్చిందని మాజీ ప్రణాళికా సంఘం అధ్యక్షుడు అహ్లూవాలియా ఇటీవల వెల్లడించారు. ఈ విషయంపై కాంగ్రెస్ ముఖ్య ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా స్పందించారు. 2013 నాటి ఆర్డినెన్స్ సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, రాహుల్ గాంధీకి మధ్య ఏం జరిగిందో తెలియదు.. గానీ, మన్మోహన్ను.. రాహుల్ గాంధీ ఒక మార్గదర్శి, గురువుగా భావించేవారని తెలిపారు. కాంగ్రెస్పార్టీ కూడా ఏనాడు మన్మోహన్ సింగ్ను అగౌరవపరచలేదని అయన స్పష్టం చేశారు. (ప్రశాంత్కిశోర్కు జడ్ కేటగిరీ భద్రత !) కాగా, అన్ని పార్టీలు దోషులుగా తేలినవారిని చట్టసభల్లోకి అనుమతించాలని చేసే చట్టానికి ఆమోదం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో రాజకీయాలను శుభ్రపరిచి.. పార్టీ స్థాయిని పెంచే నాయుకుడిగా రాహుల్ ప్రవర్తించారని సుర్జేవాలా తెలిపారు. ‘ఆర్డినెన్స్ కాగితాల్ని చింపడం సమస్య కాదు. స్వచ్ఛమైన రాజకీయాల్లో నేరస్తులు ఉండాలా.. వద్దా.. అనేది సమస్య’ అని ఆయన అన్నారు. ఈ ఘటన తర్వాత సుప్రీంకోర్టు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు వారిపై ఉన్న కేసులను బహిరంగపరచాలని అన్నిపార్టీలకు ఆదేశాలు జారీ చేసిందని సుర్జేవాలా గుర్తు చేశారు. -
అగ్రనేతల జాబితాలో సిద్ధూ, సిన్హా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీకి ఫిబ్రవరి 8న జరిగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల్లో ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ జాబితాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, వాయ్నాడ్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఉన్నారు. అగ్ర నేతలు పాల్గొనే స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్జోత్ సింగ్ సిద్ధూ, ప్రముఖ బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ నేత శత్రుఘ్నసిన్హా, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, కమల్నాథ్, అమరీందర్ సింగ్లకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో చోటు లభించిడం విశేషం. ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆప్, కాంగ్రెస్లు పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 66స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేస్తుంది. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థిగా రోమేష్ సబర్వాల్ తలపడనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 70 స్థానాలకు జరగనున్న విషయం తెలిసిందే. చదవండి: మన సిద్దూ ఎక్కడా?: ఇమ్రాన్ ఖాన్ -
పౌరసత్వ చట్టంపై అప్పట్లో రాజ్యసభలో మన్మోహన్
-
పౌరసత్వ చట్టం తేవాలి : అప్పట్లో రాజ్యసభలో మన్మోహన్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో అధికార బీజేపీ గురువారం కీలక వీడియో విడుదల చేసింది. 2003లో రాజ్యసభలో కాంగ్రెస్ తరపున సభాపక్షనేతగా ఉన్న మన్మోహన్ సింగ్ పౌరసత్వ బిల్లు ఆవశ్యకత గురించి మాట్లాడారు. ఈ చట్టంపై పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్షా చెప్పిన మాటలనే అప్పట్లో మన్మోహన్ సింగ్ వెల్లడించారు. ఆ వీడియోలో పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో హింసకు గురవుతున్న మైనార్టీలకు ఉదారభావంతో భారత పౌరసత్వం ఇవ్వాలని ఆయన ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బీజేపీ వీడియోను విడుదల చేయడం వ్యూహాత్మక ఎత్తుగడగా భావిస్తున్నారు. ఒకరకంగా కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరిని, ఓటు బ్యాంకు రాజకీయాలను దేశ ప్రజల ముందు ఆవిష్కరించినట్లైంది. ఈ వీడియోతో బంతి కాంగ్రెస్ కోర్టులో పడింది. మరి ఈ వీడియోపై ఆ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. చదవండి : (షాహి ఇమామ్ సంచలన వ్యాఖ్యలు) -
'సిక్కుల ఊచకోత జరిగేది కాదు'
న్యూఢిల్లీ : ఐకే గుజ్రాల్ సలహా నాటి కేంద్ర హోం మంత్రి పీవీ నరసింహారావు విని ఉంటే, 1984 నాటి సిక్కుల ఊచకోత చోటు చేసుకునేదే కాదని మాజీ ప్రధాని మన్మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సంస్మరణ సభలో గురువారం మన్మోహన్ మాట్లాడారు. ‘1984లో ఆ విషాదకర సంఘటన జరిగిన రోజే.. గుజ్రాల్నాటి హోంమంత్రి పీవీ నరసింహారావు వద్దకు వెళ్లారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, తక్షణమే ఆర్మీని మోహరిస్తే మంచిదని పీవీకి సలహా ఇచ్చారు. ఆ సలహాను పీవీ పాటించి ఉంటే, సిక్కుల ఊచకోత జరిగి ఉండేది కాదు’ అని మన్మోహన్ వ్యాఖ్యానించారు. మన్మోహన్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందిస్తూ.. అంత చెడ్డవాడైన పీవీ కేబినెట్లో ఆరి్థకమంత్రిగా ఎందుకు పనిచేశారని మన్మోహన్ను ప్రశి్నంచింది. ఇప్పటికైనా వాస్తవం బయట పెట్టినందుకు మన్మోహన్కు కృతజ్ఞతలని ఐకే గుజ్రాల్ కుమారుడు అకాలీదళ్ నేత నరేశ్ గుజ్రాల్ వ్యాఖ్యానించారు. ఊచకోత బాధ్యతను రాజీవ్ గాంధీ నుంచి తప్పించేందుకు చేసిన వ్యాఖ్య ఇదని శిరోమణి అకాలిదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ పేర్కొన్నారు. మన్మోహన్ వ్యాఖ్యలపై స్పందించేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. -
‘పీవీపై మన్మోహన్ వ్యాఖ్యలు అవాస్తవం’
సాక్షి, హైదరాబాద్: 1984 సిక్కు అల్లర్లపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను పీవీ నరసింహారావు మనవడు ఎన్వీ సుభాష్ తీవ్రంగా ఖండించారు. పీవీపై మాజీ ప్రధాని చేసిన చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని అన్నారు. ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీపై నిందలు రాకూడదనే ఇలాంటి నిందలు వేస్తున్నారని విమర్శించారు. సిక్కుల ఊచకోత విషయంలో హోంమంత్రిగా వాటిని నివారించుటకు చర్యలు తీసుకున్నారు కానీ వాటికి కారణం ఆయన కాదని సుభాష్ అభిప్రాయపడ్డారు. గురువారం మన్మోహన్ వ్యాఖ్యలపై స్పందించిన సుభాష్.. కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి పీవీపై నిందలు వేస్తూనే ఉందని అసహం వ్యక్తం చేశారు. పీవీపై మన్మోహన్ చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని, ఆయన వెంటనే క్షమాపణలు చెప్పలని డిమాండ్ చేశారు. కాగా సిక్కు అల్లర్లు జరిగిన సమయంలో అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సలహామేరకు వ్యవహరించి ఉన్నట్లయితే ఆ అల్లర్లే జరిగి ఉండేవి కావని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గుజ్రాల్ సూచనలపై పీవీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అభిప్రాయపడ్డారు. ఆ అల్లర్లు జరిగే ముందు రోజు ఐకే గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు ఇంటికి వెళ్లారని ఆయన తెలిపారు. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఆర్మీని వెంటనే రంగంలోకి దించాలని గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీకి సూచించారని మన్మోహన్ గుర్తు చేసుకున్నారు. -
పీవీ ఆ మాట వినివుంటే.. మరోలా వుండేది
సాక్షి, న్యూఢిల్లీ: 1984 సిక్కు అల్లర్లపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిక్కు అల్లర్లు జరిగిన సమయంలో అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సలహామేరకు వ్యవహరించి ఉన్నట్లయితే ఆ అల్లర్లే జరిగి ఉండేవి కావని అన్నారు. గుజ్రాల్ సూచనలపై పీవీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అభిప్రాయపడ్డారు. ఆ అల్లర్లు జరిగే ముందు రోజు ఐకే గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు ఇంటికి వెళ్లారని ఆయన తెలిపారు. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఆర్మీని వెంటనే రంగంలోకి దించాలని గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీకి సూచించారని మన్మోహన్ గుర్తు చేసుకున్నారు. ఆ సలహాను పీవీ ఆచరించి ఉన్నట్లయితే సిక్కు అల్లర్లు జరిగి ఉండేవే కావని అన్నారు. కాగా ఐకే గుజ్రాల్ శత జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. మన్మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐకే గుజ్రాల్, తానూ ఒకే గ్రామంలో జన్మించామని, రాజకీయాల్లోనూ చాలా ఏళ్లు కలిసి పనిచేశామని మన్మోహన్ గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉప రాష్ట్రపతి అన్సారీ, కేంద్రమంత్రులు పీయూశ్ గోయల్, జైశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
జీడీపీ.. పల్టీ
భారత్ ఆర్థిక వ్యవస్థకు గణాంకాల షాక్ తగిలింది. మూడు కీలక అంశాలకు సంబంధించి... శుక్రవారం ఆందోళన కలిగించే గణాంకాలు వెల్లడయ్యాయి. రెండవ త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి పడిపోయింది. ఇక ప్రభుత్వ ఆదాయాలు– వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు... అక్టోబర్ ముగిసే నాటికే బడ్జెట్ అంచనాలు దాటిపోయింది. మరోవైపు మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో (ఐఐపీ) దాదాపు 44 శాతం వాటా ఉన్న 8 పారిశ్రామిక రంగాల గ్రూప్ అక్టోబర్లో అసలు వృద్ధి నమోదుచేసుకోకపోగా, –5.8 శాతం క్షీణతలోకి జారింది. న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వృద్ధి తీవ్ర మందగమనంలోకి జారినట్లు తాజా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి గణాంకాలు మరింత స్పష్టం చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్– 2020 మార్చి) రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) కేవలం 4.5 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. గడచిన ఆరు సంవత్సరాల్లో వృద్ధి వేగం ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. 2012–13 జనవరి–మార్చి త్రైమాసికంలో 4.3 శాతం వృద్ధి నమోదయ్యింది. 2018–19 రెండవ త్రైమాసికంలో వృద్ధి రేటు 7 శాతం నమోదయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ మధ్య ఈ రేటు 5 శాతం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎస్ఎస్ఓ) విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... - ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) వృద్ధి రేటు 4.8%గా నమోదయ్యింది. 2018–19 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి రేటు 7.5%. - ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా జీడీపీ వృద్ధి రేటు 6.1% ఉంటుందన్నది రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అంచనా. తాజా గణాంకాలు చూస్తే, ఆ స్థాయి వృద్ధి రేటయినా సాధ్యమేనా అన్న సందేహం కలుగుతోంది. - క్యూ2లో వృద్ధిరేటు కనీసం 4.7 శాతమే ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ ఫిచ్ దేశీయ విభాగం ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఇటీవలే విశ్లేషించింది. అంతకన్నా తక్కువ రేటు నమోదుకావడం గమనార్హం. - 2018–19 మొదటి త్రైమాసికంలో 8 శాతం వృద్ధి రేటు నుంచీ చూస్తే, వరుసగా ఆరు త్రైమాసికాల నుంచీ భారత్ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతోంది. అంటే ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తోంది. 2012 తరువాత ఇలాంటి పరిస్థితి ఇదే మొదటిసారి. - ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశం హోదాను గత ఆర్థిక సంవత్సరం (5 శాతం) వరకూ భారత్ పొందుతోంది. అయితే ప్రస్తుత జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి 7.3 శాతం వృద్ధి రేటుతో వియత్నాం మొదటిస్థానంలో ఉంది. చైనా వృద్ధి రేటు 6 శాతంగా (27 సంవత్సరాల కనిష్టం) ఉంది. తరువాత వరుసలో ఈజిఫ్ట్ (5.6 శాతం), ఇండోనేషియా (5 శాతం)లు ఉన్నాయి. దీనితో క్యూ2కు సంబంధించి ‘వేగవంతమైన వృద్ధి’ హోదాను వియత్నాం దక్కించుకున్నట్లు అయ్యింది. కాగా అమెరికా వృద్ధి రేటు ఈ కాలంలో 2.1 శాతం. రంగాల వారీగా చూస్తే... - జీడీపీలో దాదాపు 16 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగంలో అసలు వృద్ధిలేకపోగా క్యూ2లో ఒకశాతం క్షీణతను (మైనస్) నమోదుచేసుకుంది. 2018 ఇదే కాలంలో ఈ రంగంలో 6.9 శాతం వృద్ధిని సాధించింది. 2019–20 క్యూ1లో కనీసం 0.6 శాతం వృద్ధి నమోదయ్యింది. - వ్యవసాయ రంగంలో 4.9% వృద్ధి రేటు 2.1%కి పడిపోయింది. అయితే క్యూ1కన్నా (2%) కొంచెం మెరుగుపడ్డం గమనార్హం. - ఇక నిర్మాణ రంగం విషయానికి వస్తే, వృద్ధి రేటు 8.5% నుంచి 3.3%కి పడిపోయింది. - మైనింగ్ అండ్ క్వారీయింగ్ కొంత బాగుంది. 2018–19 క్యూ2లో వృద్ధిలేకపోగా –2.2 శాతం క్షీణత నమోదయితే, తాజా గణాంకాల్లో కొద్దిపాటి మెరుగుదలతో 0.1 శాతం వృద్ధిలోకి మళ్లింది. అయితే క్యూ1 కన్నా (2.7 శాతం) వృద్ధి భారీగా పడిపోవడం గమనార్హం. - విద్యుత్, గ్యాస్, నీటి పారుదల ఇతర యుటిలిటీ సర్వీసుల విషయంలో వృద్ధి రేటు 8.7% నుంచి 3.6%కి పడిపోయింది. క్యూ1లో ఈ వృద్ధి మరింత మెరుగైన స్థితిలో 8.6%గా ఉంది. - వాణిజ్యం, హోటెల్స్, రవాణా, కమ్యూనికేషన్లు, సేవల రంగంలో వృద్ధి రేటు 6.9 శాతం నుంచి 4.8 శాతానికి పడిపోయింది. - ఫైనాన్షియల్, రియల్టీ, బీమా ప్రొఫెషనల్ సర్వీసెస్ విషయంలో వృద్ధి రేటు 7 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గింది. ఆందోళనకరం... జీడీపీ వృద్ధి రేటు 4.5%గా నమోదుకావడం ఆందోళనకరం. ఆమోదనీయంకాని అంశం. వృద్ధిరేటు 8 నుంచి 9 శాతం మేర వృద్ధి చెందాలని భారత్ ఆకాంక్షిస్తోంది. కేవలం ఆర్థిక విధానాల్లో మార్పు వల్ల ఆర్థిక పునరుత్తేజం జరగదు. ముందు వ్యవస్థను భయాందోళనల నుంచి విశ్వాసం వైపునకు నడిపించాలి. అలాంటప్పుడే అధిక వృద్ధి రేటు బాటకు మళ్లుతాం. ఇప్పుడు జరగాల్సింది ఇదే. – మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని ఆర్థిక మూలాలు పటిష్టం... భారత్ ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయి. 2019–20 మూడవ త్రైమాసికం నుంచీ వృద్ధి పుంజుకుంటుంది. వృద్ధి రేటు 2019–20లో 6.1 శాతం, 2020–21లో 7 శాతం ఉంటుందని తన అక్టోబర్ వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్లో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొనడం ఇక్కడ గమనార్హం. – అతనూ చక్రవర్తి, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి పతనానికి ఇక అడ్డుకట్టే ప్రస్తుత గణాంకాలు కొంత నిరాశపరుస్తున్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థ మందగమనానికి ఇక ముగింపు పడినట్లేనని భావిస్తున్నాం. ప్రైవేటు వినియోగం పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న పలు ప్రగతిశీల చర్యలు ఫలితాలను ఇస్తాయని విశ్వసించవచ్చు. రానున్న త్రైమాసికాల్లో గణాంకాలు వృద్ధి బాటలో ఉండే వీలుంది. – పారిశ్రామికవర్గాలు కట్టుతప్పిన ద్రవ్యలోటు... ద్రవ్యలోటు విషయానికొస్తే, 2019–20 ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ పరిమాణం రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3 శాతం) బడ్జెట్ లక్ష్యం. కానీ అక్టోబర్ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు చేరింది. అంటే బడ్జెట్ అంచనాల్లో 102.4 శాతానికి చేరిందన్నమాట. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. సెప్టెంబర్లో కేంద్రం కార్పొరేట్ పన్నులను తగ్గించడంతో మొత్తం వసూళ్ల అంచనాలపై రూ.1.45 లక్షల కోట్లమేర ప్రతికూల ప్రభావం పడుతుందనేది అంచనా. మౌలిక రంగం నేలచూపు... పారిశ్రామిక ఉత్పత్తి(ఐఐపీ)లో దాదాపు 44 శాతం వాటా ఉన్న ఎనిమిది కీలక మౌలిక పారిశ్రామిక రంగాల గ్రూప్ అక్టోబర్లో అసలు వృద్ధి నమోదుచేసుకోకపోగా –5.8 శాతం క్షీణతకు పడింది. ఎనిమిది రంగాల్లో ఎరువులు, రిఫైనరీ ప్రొడక్టుల మినహా మిగిలిన ఆరు మైనస్లోనే ఉండడం గమనార్హం. 2018 ఇదే నెలలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 4.8 శాతం. ఈ ఏడాది సెప్టెంబర్లోనూ ఈ గ్రూప్ క్షీణతనే (–5.1 శాతం) నమోదు చేసుకుంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య ఈ గ్రూప్ వృద్ధి రేటు 5.4 శాతం నుంచి 0.2 శాతానికి పడిపోయింది. -
రాజ్యసభ ద్వితీయం కాదు.. అద్వితీయం
ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ (అధికారం ఒకేచోట వ్యవస్థీకృతం కాకుండా ఒక వ్యవస్థ చేసేతప్పుల్ని మరోచోట సరిచేసుకునే ఏర్పాటు) కోసం రాజ్యసభ అవసరం ఎంతైనా ఉంది. భారతసమాఖ్య వ్యవస్థకు పెద్దల సభ ఆత్మవంటిది. అదే ఎప్పటికీ శాశ్వతం. వాజ్పేయి సెంటిమెంట్తో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. రాజ్యసభ రెండో సభ అయినప్పటికీ దానినెప్పుడూ తక్కువ చేయకూడదు. జాతి అభివృద్ధికి ఈ సభ పలికే మద్దతు అత్యంత కీలకం – ప్రధాని మోదీ న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ (అధికారం ఒకేచోట వ్యవస్థీకృతం కాకుండా ఒక వ్యవస్థ చేసే తప్పుల్ని మరోచోట సరిచేసుకునే ఏర్పాటు) కోసం రాజ్యసభ అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సభ చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపడానికి, సభను స్తంభింపజేయడానికి మధ్య సమతుల్యత పాటించాలని పార్టీలకు సూచించారు. రాజ్యసభ చారిత్రక 250వ సమావేశాలను పురస్కరించుకొని సోమవారం ప్రధాని సభలో మాట్లాడారు. భారత సమాఖ్య వ్యవస్థకు పెద్దల సభ ఆత్మవంటిదని, అదే ఎప్పటికీ శాశ్వతమని అన్నారు. రాజ్యసభలో అధికార ఎన్డీయేకి మెజార్టీ లేకపోవడంతో ఎన్నో కీలక బిల్లులు చట్టరూపం దాల్చకపోవడంతో బీజేపీలోనే పెద్దల సభ ఆవశ్యకతపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వీటికి సమాధానంగా ప్రధాని మోదీ దివంగత మాజీప్రధాని వాజ్పేయి మాటల్ని గుర్తు చేసుకున్నారు. రాజ్యసభ సభ పేరుకే ద్వితీయ సభే కావొచ్చు. కానీ అదొక అద్వితీయ సభ అని వాజ్పేయి అన్న వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. ‘‘వాజ్పేయి సెంటిమెంట్తో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. రాజ్యసభ రెండో సభ అయినప్పటికీ దానినెప్పుడూ తక్కువ చేయకూడదు. జాతి అభివృద్ధికి ఈ సభ పలికే మద్దతు అత్యంత కీలకం’’అని అన్నారు. ఆర్టికల్ 370, 35(ఏ) వంటి బిల్లుల్ని ఆమోదించడంలో రాజ్యసభ పోషించిన కీలక పాత్రని ఎవరూ మర్చిపోలేరని అన్నారు. జాతి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలలో రెండు సభలు ఐక్యతతో ముందుకు సాగాలని మోదీ ఆకాంక్షించారు. విశేష అధికారాలివ్వాలి: మన్మోహన్ రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చడం వంటి ముఖ్యమైన అంశాలలో రాజ్యసభ మరింత విస్తృతమైన పాత్ర పోషించాలని మాజీ ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యుడు మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. కొన్ని అంశాలలో కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు మరింత గౌరవప్రదమైన స్థానం కల్పించాలని అన్నారు. జమ్ము కశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడాన్ని నేరుగా ప్రస్తావించకుండా మన్మోహన్ పలు సూచనలు చేశారు. రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చడం, రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం వంటి అంశాల్లో రాజ్యసభకు విశేష అధికారాల్ని కట్టబెట్టాలని అన్నారు. ఆత్మపరిశీలన అవసరం: వెంకయ్య ప్రజల ఆకాంక్షలకు తగినట్టుగా రాజ్యసభ పనితీరు లేదని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు. సభ్యులందరూ ఈ అంశంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. భారత రాజకీయాల్లో రాజ్యసభ పాత్ర, పురోగతి అన్న అంశంపై ఆయన మాట్లాడుతూ గత 67 ఏళ్లలో దేశం సామాజికంగా, ఆర్థికంగా రూపాంతరం చెందడంలో ఎగువ సభ ప్రధాన పాత్ర పోషించిందని, అయితే సభికులు ప్రజల అంచనాలను అందుకోలేదని అన్నారు. ప్రజా సమస్యలపై లోతైన చర్చలు సభ్యులు చేయాలంటూ పలు సూచనలు చేశారు. ఎన్సీపీ, బీజేడీ పాత్ర భేష్ ప్రధాని మోదీ అనూహ్యంగా శరద్ పవార్ నేతృత్వంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), నవీన్ పట్నాయక్ నేతృత్వంలో బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీలపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజ్యసభలో ఆ పార్టీల సభ్యులెవరూ వెల్లోకి దూసుకురాకుండానే, అత్యంత సమర్థంగా సమస్యల్ని లేవనెత్తుతారని కొనియాడారు. ‘పెద్దల సభ మనకి అత్యంత అవసరం. ఈ సందర్భంగా రెండు పార్టీలను కచ్చితంగా ప్రశంసించాలి. ఎన్సీపీ, బీజేడీ పార్లమెంటు నియమనిబంధనల్ని తు.చ. తప్పక పాటిస్తున్నా యి. ఆ రెండు పార్టీల సభ్యులు ఎప్పుడూ వెల్లోకి దూసుకువెళ్లలేదు. వారు చెప్పదలచుకున్నదేదో అద్భుతంగా, సమర్థవంతంగా చెబుతారు. వారి నుంచి అన్ని పార్టీలు ఎంతో నేర్చుకోవాల్సి ఉంది’అని ప్రధాని కొనియాడారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనతో ఎన్సీపీ చేతులు కలుపుతున్న వేళ మోదీ ఆకస్మికం గా ఆ పార్టీపై ప్రశంసల జల్లులు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. మార్షల్స్ డ్రెస్ మారింది రాజ్యసభ చారిత్రక 250వ సెషన్లను పురస్కరించుకొని సభలో చైర్మన్కు ఇరువైపులా నిలబడే మార్షల్స్ యూనిఫామ్ను చూసి సభికులు ఆశ్చర్య చకితులయ్యారు. ఎప్పుడూ తెల్లటి సంప్రదాయ దుస్తులు, తలపాగాతో కనిపించే మార్షల్స్ ఈ సమావేశాల సందర్భంగా మిలటరీ దుస్తుల్ని తలపించే యూనిఫామ్ వేసుకొని ఠీవీగా నిలబడ్డారు. నేవీ బ్లూ యూనిఫామ్, టోపీ, భుజాలకు బంగారు రంగు స్ట్రైప్స్, స్టార్స్తో మార్షల్స్ కొత్తగా కనిపించారు. వేసవి కాలం సమావేశాల్లో తెల్ల రంగు యూనిఫామ్లోనే మార్షల్స్ కనిపిస్తారు. ఈ దుస్తుల్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థ డిజైన్ చేసినట్టు రాజ్యసభ వర్గాలు వెల్లడించాయి. పెద్దల సభకు పెద్ద పండుగ 1952లో ఏర్పాటైన రాజ్యసభ 250 సెషన్లతో చరిత్ర సృష్టించింది. పెద్దల సభ ప్రయాణం ఎలా సాగిందంటే... మహిళా సభ్యుల ప్రాతినిధ్యం పెరిగింది ఇలా ! 1952లో 15 మంది మహిళా సభ్యులుంటే (6.94%) 2014 నాటికి వారి సంఖ్య 31కి (12.76%) చేరుకుంది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 250 మంది సభ్యులకు గాను 26 మంది మహిళలు (10.83%) చారిత్రక ఘట్టాలు ► రాజ్యసభ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒకే ఒక్కసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1991 ఆగస్టు 5న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డినెన్స్ను రద్దు చేయాలంటూ విపక్షాలు పెట్టిన తీర్మానం 39–39 ఓట్లతో టై అయింది. అప్పుడు ప్రిసైడింగ్ అధికారి ఓటు వేయడంతో ప్రతిపక్షాలు విజయం సాధించాయి. ► రాష్ట్రపతి పాలన గడువు పెంచిన చరిత్ర కూడా పెద్దల సభకుంది. 1977లో తమిళనాడు, నాగాలాండ్, 1991లో హరియాణాలో రాజ్యసభ రాష్ట్రపతి పాలనను పొడిగించింది. అప్పట్లో లోక్సభ మనుగడలో లేదు. ► రాజ్యసభ ఇప్పటికి ముగ్గురు సభ్యులను బహిష్కరించింది. 1976లో సభా మర్యాదకు భంగం కలిగిస్తున్నారంటూ సుబ్రమణ్య స్వామిని. 2005లోప్రశ్నలకు ముడుపులు కేసులో ఛత్రపాల్ సింగ్ను, ఎంపీలాడ్స్లో అవకతవకలకు 2006లో సాక్షి మహరాజ్ను సభ నుంచి బహిష్కరించింది. సభలో మాట్లాడుతున్న వెంకయ్య, పక్కన కొత్త యూనిఫామ్తో మార్షల్స్ -
కర్తార్పూర్ కారిడార్ ప్రారంభం
డేరాబాబా నానక్ (గురుదాస్పూర్)/ కర్తార్పూర్ (పాకిస్తాన్): పంజాబ్లోని డేరా బాబా నానక్ను పాకిస్తాన్లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాతో కలిపే కర్తార్పూర్ కారిడార్ శనివారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. సరిహద్దులకు సమీపంలోని డేరాబాబానానక్ వద్ద ప్రధాని మోదీ, కర్తార్పూర్లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అకల్ తఖ్త్ జతేదార్ హర్ప్రీత్ సింగ్ నేతృత్వంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్, మాజీ క్రికెటర్, పంజాబ్ మాజీ మంత్రి నవ్జ్యోత్ సింగ్ సిద్దూ తదితర 500 మంది ప్రముఖులతో కూడిన మొదటి యాత్రికుల బృందం ‘జాతా’ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. సతీసమేతంగా వచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్తో ప్రధాని మోదీ ముచ్చటించారు. అనంతరం ఆధునిక వసతులతో కూడిన యాత్రికుల భవనం ‘ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్’ను, సామూహిక వంటశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ప్రధాని మాట్లాడుతూ.. ‘కారిడార్ విషయంలో భారత్ మనోభావాలను గౌరవించిన ఇమ్రాన్ఖాన్ మియాజీకి కృతజ్ఞతలు. ప్రకాశ్ పర్వ్ సందర్భంగా ఈ కారిడార్ను ప్రారంభించడం నాకు లభించిన వరం. ఎంతో పవిత్రత సంతరించుకున్న ఈ ప్రాంతానికి రావడం ఆశీర్వాదంగా భావిస్తున్నా’అని తెలిపారు. నానక్ జీవితం సిక్కులకు మాత్రమే కాదు మానవాళికే స్ఫూర్తిదాయకమన్నారు. అదేవిధంగా, పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ కర్తార్పూర్లో భారత్తో పాటు వివిధ దేశాల నుంచి తరలివచ్చిన సుమారు 12 వేల మంది సిక్కు యాత్రికుల సమక్షంలో కారిడార్ ప్రారంభించారు. భారత్ నుంచి వచ్చిన యాత్రికులకు స్వాగతం పలికారు. మాజీ ప్రధాని మన్మోహన్కు కుశల ప్రశ్నలు అడిగారు. -
‘కర్తార్పూర్’కు మన్మోహన్ రారు
న్యూఢిల్లీ/లాహోర్: కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరుకారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే సాధారణ యాత్రికుడిలాగా మన్మోహన్ అక్కడికి వెళ్తారని ఆదివారం పేర్కొన్నాయి. కాగా, పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి షా మహమూద్ ఖురేషీ కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రావాలని తాము పంపిన ఆహ్వానాన్ని మన్మోహన్ అంగీకరించారని ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు వెల్లడించాయి. ‘నవంబర్ 9న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన్మోహన్ ఒక ప్రత్యేక అతిథిగా కాకుండా, ఒక సాధారణ వ్యక్తిగా హాజరవుతారు’ అని అక్కడి స్థానిక వార్తాపత్రిక డాన్ పేర్కొంది. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ నేతృత్వంలోని సిక్కు జాతా ప్రతినిధుల బృందంతో పాటు మన్మోహన్ సింగ్ పాల్గొననున్నారు. -
370 రద్దుకు కాంగ్రెస్ అనుకూలమే
ముంబై: పార్లమెంట్లో జమ్మూకశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు అనుకూలంగానే కాంగ్రెస్ ఓటేసిందని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఆ విషయంలో మొండిగా, నిరంకుశంగా వ్యవహరించిన ప్రభుత్వ తీరునే తాము వ్యతిరేకించామన్నారు. ఆర్టికల్ 370 రద్దు అనే కీలక నిర్ణయం తీసుకునే ముందు జమ్మూకశ్మీ ర్ ప్రజల విశ్వాసం చూరగొనాల్సిన అవసరం ఉం దని మన్మోహన్ పేర్కొన్నారు. దేశభక్తి విషయం లో కాంగ్రెస్కు ఎవ్వరి నుంచీ సర్టిఫికెట్ అక్కర్లేదన్నారు.రాజకీయ కక్ష సాధింపునకు ఎన్ఫోర్స్మెం ట్ డైరెక్టరేట్(ఈడీ) లాంటి సంస్థలను ఉపయోగిం చుకోవడం సరికాదని మన్మోహన్ వ్యాఖ్యానించా రు. ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోం దని మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పలుమార్లు ఆరోపిస్తు న్న నేపథ్యంలో మన్మోహన్ పై వ్యాఖ్యలు చేశారు. పీఎస్యూలను పంచుకుంటున్నారు: రాహుల్ న్యూఢిల్లీ: సూటు బూటు మిత్రులతో కలిసి ప్రభుత్వ రంగ సంస్థలను(పీఎస్యూ) పంచుకుంటున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘బేచేంద్ర మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను తన సూటుబూటు స్నేహితులతో కలిసి పంచుకుంటున్నారు. ఎన్నో ఏళ్ల శ్రమతో పీఎస్యూలు ఏర్పాటయ్యాయి’ అని గురువారం రాహుల్ ట్వీట్ చేశారు. హిందీ పదం ‘బేచ్నా’ అంటే అమ్మడం అని అర్థం. ఆ అర్థం స్ఫురించేలా బేచేంద్ర మోదీ అని రాహుల్ ప్రధాని మోదీని సంబోధించారు. పీఎస్యూల్లో పనిచేసే లక్షలాది ఉద్యోగుల పరిస్థితి అనిశ్చితిలో ఉంది. ఈ దోపిడీకి వ్యతిరేకంగా వారి పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నా’ అని పేర్కొన్నారు. -
ఆర్థిక మంత్రి వ్యాఖ్యలకు సర్ధార్జీ కౌంటర్
న్యూఢిల్లీ : బ్యాంకుల దీనస్థితికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్లే బాధ్యత వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. సమస్యకు పరిష్కారాలను అన్వేషించే బదులు ప్రభుత్వం ప్రత్యర్ధులపై నిందను మోపడంలో నిమగ్నమైందని మన్మోహన్ అన్నారు. ‘ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలను ఇప్పుడే చూశా..ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలని ఎవరైనా అనుకుంటే దాని అవలక్షణాలు, సమస్యకు మూలాలను సరిగ్గా పసిగట్టి చికిత్స చేయాలి..ప్రత్యర్ధులపై నింద మోపి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం భావిస్తోంద’ని మన్మోహన్ దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎంతమాత్రం ఉపకరించదని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ప్రధానిగా, రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్గా ఉన్న సమయంలోనే ప్రస్తుత బ్యాంకుల దుస్థితికి బీజం పడిందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వారి హయాంలో కొందరి ఫోన్కాల్స్తోనే బ్యాంకులు ఇబ్బడిముబ్బడిగా రుణాలు మంజూరు చేశాయని ఆమె ఆరోపించారు. -
అంతా వాళ్లే చేశారు..!
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ గవర్నర్ రఘురామ్రాజన్ హయాంలోనే ప్రభుత్వరంగ బ్యాంకులు దుర్భర పరిస్థితులను చవిచూశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. దెబ్బతిన్న ప్రభుత్వరంగ బ్యాంకులను బాగు చేయడమే తన ప్రాథమిక కర్తవ్యంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అమెరికాలోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్లో.. ‘భారత ఆర్థిక వ్యవస్థ: సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై ఆమె మాట్లాడారు. యూపీఏ–2 పాలనలో 2013 సెప్టెంబర్ 4 నుంచి 2016 సెప్టెంబర్ 4 వరకు ఆర్బీఐ గవర్నర్గా, 2012 ఆగస్ట్ 10 నుంచి 2013లో ఆర్బీఐ గవర్నర్ అయ్యే నాటి వరకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారుగా రఘురామ్రాజన్ పనిచేశారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాలను మంత్రి సీతారామన్ తన ప్రసంగంలో ఎండగట్టారు. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రాణవాయువు అందించడమే భారత ఆర్థిక మంత్రి ప్రాథమిక విధి. ఈ ప్రాణవాయువు అన్నది రాత్రికి రాత్రి రాదు’’ అని మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీలో రాజన్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ఆర్థిక రంగానికి సంబంధించి చెప్పుకోతగ్గది ఏదీ చేయలేదంటూ విమర్శించారు. ప్రభుత్వం పూర్తిగా కేంద్రీకృతమైందని, ఆర్థి క వృద్ధికి సంబంధించి నాయకత్వానికి స్పష్టమైన విధానం లోపించిందన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎదురైన ప్రశ్నకు సీతారామన్ గట్టిగానే బదులిచ్చారు. ఫోన్ కాల్స్తో రుణాలు ‘‘ఆర్బీఐ గవర్నర్గా రాజన్ హయాంలో సన్నిహిత నేతల నుంచి వచ్చిన ఫోన్కాల్స్తో రుణాలు మంజూరు చేశారు. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులు నాటి ఊబి నుంచి బయటకు వచ్చేందుకు నేటికీ ప్రభుత్వం అందించే నిధులపై ఆధారపడుతున్నాయి. ఎంతో ప్రజాస్వామ్యంతో కూడిన నాయకత్వం (మన్మోహన్సింగ్) కారణంగా భారీ స్థాయి అవినీతి చోటుచేసుకుంది. భారత్ వంటి వైవిధ్య దేశానికి గట్టి నాయకత్వం కావాలి. మరీ ప్రజాస్వామ్యంతో కూడిన నాయకత్వం అంటే నాకు భయమే. ఎందుకంటే అవినీతి తాలూకూ దుర్గంధాన్ని అది విడిచి వెళ్లింది. దాన్ని ఈ రోజూకీ శుద్ధి చేస్తున్నాం’’ అంటూ యూపీఏ పాలనను నిర్మలా సీతారామన్ విమర్శించారు. రాజన్ను తాను ఎగతాళి చేయడం లేదని, విద్యావంతుడైన ఆయన్ను గౌరవిస్తానంటూనే, వాస్తవాలను తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. బ్యాంకుల ఆస్తుల నాణ్యతను సమీక్షించినందుకు రాజన్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, బ్యాంకులు నేడు ఏ స్థితిలో ఉన్నాయో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల ఎన్పీఏలు రూ.8,06,412 కోట్లుగా ఉన్నాయి. గత మార్చి నాటికి ఉన్న రూ.8,95,601 కోట్లతో పోలిస్తే రూ.89,189 కోట్లు తగ్గాయి. -
బంగ్లా ప్రధానితో కాంగ్రెస్ అధినేత్రి భేటీ
న్యూఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్హసీనాతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆమెతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ వాద్రా, ఆనంద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. వీరు ఈ సందర్భంగా అనేక విషయాలపై చర్చించారు. నాలుగు రోజుల పర్యటనకు భారత్కు వచ్చిన బంగ్లా ప్రధాని హసీనా శనివారం ఢిల్లీలో ప్రధానితో భేటీలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు భారత్, బంగ్లాదేశ్ అంగీకరించాయి. అనంతరం రెండు దేశాల అధికారులు ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. తీరం ప్రాంతంలో ఉమ్మడి గస్తీ సహా మూడు ప్రాజెక్టుల ప్రారంభానికి అంగీకరించారు. కాగా, చర్చల సందర్భంగా అస్సాం ఎన్ఆర్సీ అంశాన్ని బంగ్లాదేశ్ ప్రధాని ప్రస్తావించారు. నాలుగు రోజుల పర్యటనకు ఈ నెల 3వ తేదీన భారత్ చేరుకున్న ప్రధాని హసీనా 3, 4 తేదీల్లో ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు. -
మోదీని కాదని మన్మోహన్కు..
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య ఒక మైలురాయిగా భావించే కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను ఆహ్వానించాలని పాక్ నిర్ణయించింది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి ఒక వీడియో సందేశంలో చెప్పారు. పాకిస్తాన్లోని కర్తార్పూర్లో దర్బార్ సాహిబ్, పంజాబ్ జిల్లా గురుదాస్పూర్లో డేరాబాబా నానక్ను కలిపే ఈ కారిడార్తో భారత్లో సిక్కు యాత్రికులు వీసా అనుమతులు లేకుండా కర్తార్పూర్ సందర్శించవచ్చును. ఈ సందర్శన కర్తార్పూర్ గురుద్వారాకు మాత్రమే పరిమితం. సిక్కు మత వ్యవస్థాపకుడు బాబా గురునానక్ 550వ జయంతి నవంబర్12న ఉన్న నేపథ్యంలో నవంబర్ 9న ఈ కారిడార్ను ప్రారంభించాలని పాక్ నిర్ణయించింది. భారత ప్రధాని మోదీకే ఈ ఆహ్వానం అందాల్సిందిగానీ కశ్మీర్పై ఆర్టికల్ 370 రద్దు కారణంగా మోదీపై ఇమ్రాన్ గుర్రుగా ఉన్నారు. దీంతో మోదీని కాదని మన్మోహన్ను ఆహ్వానించాలని పాక్ నిర్ణయించింది. ‘మన్మోహన్ మతపరమైన విశ్వాసాలు ఉన్నవారు. పాకిస్తాన్లో ఆయనకు ఎంతో గౌరవం ఉంది. సిక్కు మతానికి చెందిన ఆయనను ఆహ్వానించడమే అన్ని విధాల సముచితం’ అని ఖురేషి తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అయితే మన్మోహన్ సింగ్ ఈ కార్యక్రమానికి వెళతారా అన్నది సందేహమే. ఎందుకంటే పదేళ్లు ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడూ పాక్లో అడుగుపెట్టలేదు. ఆహ్వానం అందితే మన్మోహన్ దానిని తిరస్కరించే అవకాశాలే ఎక్కువని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. -
మోదీని కాదని..మన్మోహన్కు పాక్ ఆహ్వానం
ఇస్లామాబాద్ : కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని విస్మరించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను ఆహ్వానించాలని ఇమ్రాన్ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. గురునానక్ దేవ్ సమాధి నెలకొన్న దర్బార్ సాహిబ్ను కలుపుతూ భారత్, పాకిస్తాన్లు కర్తార్పూర్ కారిడార్ ప్రాజెక్టును సంయుక్తంగా చేపట్టాయి. ఈ కారిడార్ ద్వారా పంజాబ్లోని గురుదాస్పూర్ జిల్లా డేరా బాబా నానక్ మసీదుతో పాకిస్తాన్లోని కర్తార్పూర్ను అనుసంధానం చేస్తారు. రావి నదీ తీరంలోని కర్తార్పూర్కు భారత యాత్రికులు వీసా లేకుండా చేరుకునేందుకు అనుమతిస్తారు. గురునానక్ దేవ్ 550వ జయంతి సందర్భంగా నవంబర్లో ఈ కారిడార్ను ప్రారంభించనున్నారు. జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో భారత్పై విద్వేషం చిమ్ముతున్న పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని పదేపదే అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కర్తార్పూర్ కారిడార్పై ఇమ్రాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత వివాదం రాజేస్తోంది. -
మన్మోహన్కు శుభాకాంక్షల వెల్లువ!
న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని, రాజ్యసభ సభ్యుడు మన్మోహన్ సింగ్ గురువారం (సెప్టెంబరు 26) తన 87వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీతో సహా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం, పంజాబ్ సీఎం కెప్టెన్. అమరిందర్ సింగ్, శరద్ యాదవ్తో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. 'మన్మోహన్ సింగ్ జీ పుట్టినరోజు సందర్భంగా దేశ నిర్మాణానికి ఆయన అందించిన నిస్వార్థ సేవ, అంకితభావం, సహకారాలను గుర్తుచేసుకుందాం' అని రాహుల్ గాంధీ ట్వీటర్లో పేర్కొన్నారు. అంతేకాక మన్మోహన్ సాధించిన విజయాలను గుర్తుచేస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక వీడియో క్లిప్ను విడుదల చేసింది. ఈ వీడియోలో మన్మోహన్ను 'దూరదృష్టి గల ఆర్థికవేత్త' గా అభివర్ణించింది. తన బాల్యం పంజాబ్లో గడిచిన తీరు, అతను 'కిరోసిన్ దీపం కింద' చదువుకొని, జీవితంలో ఎదిగిన తీరును గుర్తు చేశారు. అంతేకాక 1991లో ఆర్థిక వ్యవస్థ సరళీకరించడంతో పాటు 2008లో చంద్రయాన్-1ను ప్రారంభించిన ఘనత మన్మోహన్ సింగ్కే దక్కుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ట్విటర్ మాధ్యమంగా మన్మోహన్కు శుభాకాంక్షలు తెలిపారు. ‘మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయూరారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ప్రార్థిస్తున్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా మన్మోహన్ సింగ్కు తన అభినందనలు తెలిపారు. As we celebrate Former PM Dr. Manmohan Singh, we look back at some of his greatest achievements. He has served our country for several decades & continues to do so with his renowned intelligence, humility & dedication. #HappyBirthdayDrSingh pic.twitter.com/AmRe39fc8s — Congress (@INCIndia) September 26, 2019 భారతదేశ భవిష్యత్తుపై తనకంటూ ఓ ఆలోచన ఉన్న రాజకీయ నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గురించి కొన్ని విషయాలు: 1991- 96 మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిగా, 2004-14లో ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ రాజకీయ జీవితాన్నిరెండు కాలాలుగా విభజించవచ్చు. తన పదేళ్ల పదవీకాలంలో బైపాస్ సర్జరీ (2009) చేయించుకున్నప్పుడు తప్ప.. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. అంతేకాక ప్రధానిగా ఉన్న సమయంలో రోజుకు 18 గంటలు పని చేసి, రోజుకు సగటున 300 ఫైళ్లు క్లియర్ చేసేవారు. జనవరి 2014లో మన్మోహన్ సింగ్పై మీడియా, బీజేపీ పార్టీ, ప్రత్యర్థి రాజకీయ నాయకులు.. ఆయన నాయకత్వం బలహీనంగా ఉందని తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. తాను బలహీనమైన ప్రధాని ఏమాత్రం కానని.. సమకాలీన మీడియా కంటే చరిత్ర తనకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలోకి వచ్చినా.. తాను మాత్రం ప్రధానిగా మూడవసారి కొనసాగబోనని ఆయన అనూహ్యంగా ప్రకటించారు. కాగా 2014 మేలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. -
జైల్లో చిదంబరంతో సోనియా భేటీ
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సోమవారం కలిశారు. తీహార్ జైలుకు వెళ్లిన సోనియా, మన్మోహన్లు సుమారు అరగంట సేపు ఆయనతో మాట్లాడారు. చిదంబరం ఆరోగ్యం గురించి వాకబు చేసిన ఇద్దరు నేతలు ఆయనపై మోపిన కేసులను రాజకీయంగా దీటుగా ఎదుర్కొంటామని, పార్టీ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కేంద్రం ఇటీవల కార్పొరేట్ ట్యాక్స్ను తగ్గించడం, జీఎస్టీ రాయితీల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని చిదంబరం, మన్మోహన్ సుదీర్ఘంగా చర్చించారని చెప్పారు. అధికారాన్ని వాడుకోలేదు వ్యక్తిగత లాభం కోసం ఆర్థిక మంత్రి హోదాను వాడుకోలేదని, అధికారులెవరినీ ప్రభావితం చేయలేదని మాజీ మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. తనకు బెయిల్ ఇవ్వరాదంటూ కోర్టులో సీబీఐ వేసిన పిటిషన్పై సోమవారం ఢిల్లీ హైకోర్టుకు ఆయన రీజాయిండర్ సమర్పించారు. తనపై ఇప్పటికే లుకౌవుట్ నోటీసు జారీ చేసిన సీబీఐ.. తాను విదేశాలకు పారిపోయే అవకాశముందని వాదించడం సరికాదని స్పష్టం చేశారు. ఐఎన్ఎక్స్ మీడియాకు వచ్చిన రూ.305 కోట్ల విదేశీ నిధులు అప్పటి నిబంధనల ప్రకారం 46.216 శాతం పరిమితికి లోబడే ఉందని తెలిపారు. ఈ కేసులో ప్రజా ధనం ఏదీ ముడిపడి లేదని చెప్పారు. -
పార్టీ బలంగా ఉన్నంతకాలం..నేను కూడా
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నంత కాలం తాను కూడా ధైర్యంగా ఉంటానని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని ఆగస్టు 21న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చిదంబరం విచారణ అనంతరం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోమవారం జైలులో చిదంబరాన్ని కలిశారు. చదవండి : చిదంబరాన్ని కలిసిన సోనియా, మన్మోహన్ ఈ నేపథ్యంలో వారితో భేటీ విషయమై చిదంబరం ట్విటర్లో స్పందించారు. ‘నా తరపున నా కుటుంబాన్ని ట్వీట్ చేయని కోరాను. ఈ రోజు శ్రీమతి సోనియా గాంధీ, డా. మన్మోహన్సింగ్ నన్ను కలిశారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నంత కాలం నేను కూడా బలంగా ఉంటాను’ అని పేర్కొన్నారు. కాగా చిదంబరం తనయుడు కార్తీ కూడా సోమవారం జైల్లో ఉన్న తండ్రిని కలిశారు. ఈ సందర్భంగా... ‘దేశం అంతా బాగానే ఉంది, నిరుద్యోగం, ఉన్న ఉద్యోగాన్ని తొలగించడం, తక్కువ వేతనాలు, కశ్మీర్ సమస్య, విపక్ష నాయకులను జైలుకు నెట్టడం మినహా’ అంటూ పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చిదంబరం మరో ట్వీట్లో పేర్కొన్నారు. I have asked my family to tweet on my behalf the following: I am honoured that Smt. Sonia Gandhi and Dr. Manmohan Singh called on me today. As long as the @INCIndia party is strong and brave, I will also be strong and brave. — P. Chidambaram (@PChidambaram_IN) September 23, 2019 -
జైల్లోని పార్టీ నేతను కలిసిన సోనియా, మన్మోహన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ సోమవారం ఉదయం తిహార్ జైల్లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని కలిశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిందితుడిగా ఉన్న చిదంబరం ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని ఆగస్టు 21న సీబీఐ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, మన్మోహన్ జైల్లో ఉన్న చిదంబరాన్ని పరామర్శించి.. కాసేపు ముచ్చటించారు. చిదంబరం తనయుడు కార్తీ కూడా సోమవారం జైల్లో ఉన్న తండ్రిని కలిశారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే చిదంబరాన్ని కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. లాయర్ అయిన చిదంబరం బెయిల్ అభ్యర్థనపై ఢిల్లీ హైకోర్టు త్వరలో విచారణ జరపనుంది. -
జైపాల్రెడ్డి మచ్చలేని నాయకుడు : మన్మోహన్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి అవినీతి మచ్చలేని గొప్ప నాయకుడని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించడంలో జైపాల్రెడ్డి కీలకపాత్ర పోషించారని తెలిపారు. జూలై 28నఅనారోగ్యంతో కన్నుమూసిన జైపాల్రెడ్డి సంస్మరణ సభ మంగళవారం సాయంత్రం ఢిల్లీలో జరిగింది. ఈ సభకు మన్మోహన్సింగ్తోపాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జైపాల్రెడ్డితో వారికున్న అనుబంధాన్ని నేతలు గుర్తుచేసుకున్నారు. మన్మోహన్సింగ్ మాట్లాడుతూ.. భారత రాజకీయాలు గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. జాతీయ రాజకీయాల్లో ఆయన క్రీయాశీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. నమ్మిన సిద్ధాంతాలపై ఎన్నడూ రాజీపడలేదని కొనియాడారు. ఏపీ విభజనలో ఆయన కీలక భూమిక పోషించారని చెప్పారు. పేద, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేశారన్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. జైపాల్రెడ్డి గొప్ప పార్లమెంటరీయన్ అని అన్నారు. ఆయన ప్రసంగాలు ఇప్పటికీ ఎంతో విలువైనవని తెలిపారు. ఏపీ అసెంబ్లీలో తమను తిరుపతి వెంకట కవులు అని పిలిచేవారని గుర్తుచేశారు. మురళీ మనోహర్ జోషి మాట్లాడుతూ.. నమ్మిన సిద్ధాంతాల కోసం రాజీపడని వ్యక్తి జైపాల్రెడ్డి అని కొనియాడారు. అనుకున్న విషయాన్ని నిర్భయంగా చెప్పడంలో ఆయన వెనక్కి తగ్గేవారు కాదన్నారు. భిన్న శక్తుల మధ్య ఎప్పుడూ చర్చ జరగాలని చెప్పారు. కొన్ని అంశాలపై పార్టీలు రాజకీయాలు పక్కనపెట్టి దేశహితం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. సెక్యూలర్ పదానికి జైపాల్రెడ్డి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ఆయనకు శత్రువులు ఎవరు లేరని అన్నారు. అవినీతిమయమైన ప్రపంచంలో ఆయన ఒక ఆశా కిరణమని పేర్కొన్నారు. అవినీతిని ఎదురించే క్రమంలో ఆయన చాలా కోల్పోయారని వ్యాఖ్యానించారు. శరద్యాదవ్ మాట్లాడుతూ.. జైపాల్రెడ్డి ఎక్కడ ఉన్నా నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదని గుర్తుచేశారు. పార్లమెంట్లో ఆయన అద్భుత ప్రసంగాలు చేశారని తెలిపారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా మాట్లాడుతూ.. జైపాల్రెడ్డిని వామపక్షాల స్నేహితుడిగా అభివర్ణించారు. ప్రస్తుతం ఉన్న నాయకులు ఆయన స్పూర్తిని కొనసాగించాలన్నారు. ఆయన గొప్ప ప్రజాస్వామ్యమవాదని చెప్పారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. జైపాల్రెడ్డి గొప్ప మానవతావాది అని అభివర్ణించారు. -
బీజేపీ స్వయంకృతం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా ఉందని.. బీజేపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు మాని... ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థ గాడితప్పడం బీజేపీ స్వయంకృతమని, అన్ని అంశాల్లోనూ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే వృద్ధిరేటు మందగమనంలో సాగుతోందని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పరిమితం కావడం.. ఆర్థిక మాంద్యం కొనసాగుతోందనేందుకు సూచన అని ఆయన చెప్పారు. ఇంతకంటే ఎక్కువ వేగంగా వృద్ధి చెందే సామర్థ్యం ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేకపోయిందని అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే యువత, రైతులు, వ్యవసాయ కూలీలు, పారిశ్రామిక వేత్తలకు మరిన్ని కష్టాలు తప్పవని హెచ్చరించారు. తయారీ రంగం వృద్ధి 0.6 శాతం మాత్రమే ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశమని వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమల్లో లోపాల ఫలితాల నుంచి దేశం బయటపడలేదు అనేందుకు తాజా పరిణామాలు నిదర్శనమని విమర్శించారు. మోదీ హయాంలో దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని, వాటి స్వతంత్ర ప్రతిపత్తికి ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్బీఐ నుంచి అందిన రూ.1.76 లక్షల కోట్లతో ఏం చేయాలన్న విషయంపై ప్రభుత్వానికి స్పష్టత లేదన్నది నిజమైతే... ఆర్బీఐకు పరీక్షేనని అన్నారు. పన్ను ఆదాయంలో భారీ కోత పడగా.. చిన్న, పెద్ద పారిశ్రామికవేత్తలందరూ ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వేధింపులకు గురవుతున్నారన్నారు. ఒక్క ఆటోమొబైల్ రంగంలోనే 3.5 లక్షల ఉద్యోగాలు పోయాయని, గిట్టుబాటు ధరల్లేక రైతుల ఆదాయాలు తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
మోదీపై మన్మోహన్ సింగ్ ఫైర్
-
మోదీపై సర్దార్ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కార్పై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిప్పులు చెరిగారు. ఆర్థిక వ్యవస్థ దీనావస్థకు మోదీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. జూన్ 30తో ముగిసిన త్రైమాసంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఆరేళ్ల కనిష్టస్ధాయిలో 5 శాతానికి పతనమైన నేపథ్యంలో మన్మోహన్ సింగ్ మోదీ సర్కార్ను తప్పుపట్టడం గమనార్హం. వృద్ధి రేటు ఈ స్ధాయిలో కొనసాగడం దేశానికి మంచిది కాదని, ప్రభుత్వం ఇప్పటికైనా కక్షపూరిత రాజకీయాలు మాని వ్యక్తుల తప్పిదాలతో కుదేలైన ఆర్థిక వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు కదలాలని వీడియో ప్రకటనలో మన్మోహన్ హితవు పలికారు. గత త్రైమాసంలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 5 శాతానికి పరిమితం కావడం మనం సుదీర్ఘ మందగమనంలోకి వెళ్లే స్థితిలో ఉన్నామనేందుకు సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా 1991లో పీవీ నరసింహారావు సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన సందర్భంలో మన్మోహన్ సింగ్ పీవీ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. -
కొత్త ఎఫ్డీఐ పాలసీ : దిగ్గజ కంపెనీలకు ఊతం
సాక్షి, ముంబై: భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తమ విధానాలను రూపొందిస్తోంది. ప్రపంచంలోని అన్ని దేశాలతో మంచి సఖ్యతతో మెలగాలనుకుంటోంది. చిల్లర వర్తకంలో నూతన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పాలసీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తద్వారా మీకు కోట్లాది వినియోగదారులనిస్తాం, మాకు ఉద్యోగాలివ్వండి అనే ఇచ్చిపుచ్చుకునే ధోరణిని పాటించాలనుకుంటోందని పలువురు ఎనలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్ధిక మాంద్యం వ్యాపిస్తున్న తరుణంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిలో భాగంగా చిల్లర వర్తకంలో ఎఫ్డీఐలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఆరు నెలల్లోనే వారికి అందించనుంది. గతంలో 30 శాతం ఇక్కడి వనరులనే ఉపయోగించాలనే నిబంధన ఉండేది, కానీ ఇప్పుడు ఆ నిబంధనను సడిలిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానంగా ఈ నిబంధన అమెరికా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్కు వరంగా మారనుంది. ఖర్చులు ఎక్కువగా ఉండడంతో గతంలో ఆపిల్ భారత్ వైపు మొగ్గుచూపలేదు.అలాగే ప్రస్తుతం భారత్లో రియల్మీ, ఒప్పో, శాంసంగ్ స్మార్ట్ఫోన్లు మెరుగైన అమ్మకాలను సాధిస్తున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్కరణలను తీసుకురావడానికి ప్రయత్నించగా సంకీర్ణ ప్రభుత్వంలో అవినీతి కుంభకోణాలు, ఆరోపణల నేపథ్యంలో యూపీఏ-2 అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. ఐకియా సంస్థ పన్నెండేళ్ల క్రితం అనుమతులు పొందినా నిబంధనల కారణంగా 2018లో మాత్రమే తమ స్టోర్లను ప్రారంభించ గలిగింది. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధంలో భాగంగా చైనా వియత్నాం వైపు మొగ్గు చూపగా, అమెరికా తమ కార్యకలాపాలను భారత్లో నిర్వహించే విధంగా నూతన రిటైల్ విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. యువకులు ఎక్కువగా ఉన్న మన దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న మూడు రంగాలలో వస్త్ర, ఎలక్ట్రానిక్స్, ఆటో పరిశ్రమలు ముందున్నాయి. ప్రధానంగా మధ్యతరగతి ప్రజల లక్ష్యంగా బహుళ జాతీయ కంపెనీలు వ్యాపార వ్యూహాలను రచిస్తున్నాయి. చదవండి : ఎఫ్డీఐ 2.0 కేబినెట్ కీలక నిర్ణయాలు : ఎఫ్డీఐ నిబంధనల సడలింపు -
మాజీ ప్రధానికి ఎస్పీజీ భద్రత ఉపసంహరణ
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఎస్పీజీ భద్రతను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది. ఎస్పీజీకి బదులు ఆయనకు సీఆర్పీఎఫ్ భద్రతను కల్పిస్తూ హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిఘా వర్గాల సమచారాన్ని విశ్లేషించి హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎస్పీజీ భద్రతను కొద్దిమందికే కల్పించనున్న క్రమంలో వార్షిక సమీక్షలో భాగంగా మన్మోహన్ సింగ్ భద్రతను పునఃసమీక్షిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం . ఎస్పీజీ భద్రత ప్రస్తుతం కేవలం నలుగురు అత్యున్నత రాజకీయ ప్రముఖులైన ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాలకు మాత్రమే పరిమితమైంది. మన్మోహన్ సింగ్కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగుతుందని హోం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. 3000 మందికి పైగా సిబ్బందితో కూడిన ఎస్పీజీ భద్రతను దేశ ప్రధాని, మాజీ ప్రధానులు వారి కుటుంబ సభ్యులకు వారికి ఉన్న ముప్పు ఆధారంగా ప్రత్యేక దళంతో భద్రత కల్పిస్తారు. -
అపర చాణక్యుడు.. ట్రబుల్ షూటర్!
బీజేపీకి ట్రబుల్ షూటర్ అనదగ్గ నాయకుడు, అపర రాజకీయ చాణక్యుడు అరుణ్ జైట్లీ.. తన మూడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో బీజేపీకి ఏ కష్టమొచ్చినా నేనున్నాంటూ జైట్లీ ట్రబుల్ షూటర్లా వ్యవహరించారు. వ్యూహకర్తగా తెరవెనుక ఉండి పార్టీని సంక్షోభ సమయాల్లో గట్టెక్కించారు. గతంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన జైట్లీ.. తన వాగ్ధాటితో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ సర్కారుకు ముచ్చెమటలు పట్టించారు. దేశంలోనే పేరొందిన న్యాయవాదిగా ఘనత సొంతం చేసుకున్న జైట్లీ నిశిత దృష్టికి, పదునైన విమర్శలకు చిక్కకుండా పలు బిల్లులను రాజ్యసభలో ఆమోదించుకోవడం నాటి యూపీఏకు సర్కారుకు కత్తిమీద సాములా ఉండేది. వరుస కుంభకోణాలపై యూపీఏ సర్కారును దునుమాడిన జైట్లీ మన్మోహన్ సర్కారు పతనంలో తనవంతు పాత్ర పోషించారు. అనంతరం నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తొలిహయాంలో అత్యంత కీలక మంత్రిగా ఉండి.. మోదీ సర్కారు నిలదొక్కుకోవడంలోనూ కీలక పాత్ర పోషించారు. న్యాయవాదిగా ప్రస్థానం.. న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన జైట్లీ.. ఇటు పాలిటిక్స్లోనే కాదు.. అటు లీగల్ సర్కిల్లోనే ప్రముఖుడిగా పేరొందారు. దేశంలోనే ప్రఖ్యాత న్యాయవాదిగా పేరొందిన జైట్లీని రాజకీయాలు సహజంగానే ఆకర్షించాయి. 1974లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ (డీయూఎస్యూ) అధ్యక్షుడిగా గెలుపొందడంతో రాజకీయ రంగంలో ఆయన ప్రవేశానికి మార్గం సుగమం అయింది. అనంతరం ఎమర్జెన్సీ సమయంలోనూ నాటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జైట్లీ పనిచేశారు. 1990లో దేశ రాజకీయ సామాజిక వాతావరణం విపరీతంగా మార్పులకు లోనవుతున్న సమయం. ఒకవైపు మండల్ రాజకీయాలు ఉత్తరాది రాష్ట్రాలను కుదిపేస్తుండగా.. మరోవైపు బాబ్రీ మసీదు కూల్చివేత ఒక చీకటి అధ్యాయంగా దేశ మౌలిక పునాదులను పేకలిస్తుందా? అన్నంతగా కల్లోల పరిస్థితి. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థలో సమూల సంస్కరణల కోసం అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థికమంత్రి మన్మోహన్సింగ్ నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతున్న సమయం. ఇలాంటి సమయంలో జైట్లీ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ.. బీజేపీలో క్రమంగా ఎదుగుతూ వచ్చారు. అటల్ బిహారీ వాజపేయి, ఎల్కే అద్వానీ తర్వాతిస్థానం జైట్లీదే అన్నంతగా ఆయన తెరపైకి వచ్చారు. పార్టీ ఎన్నికల వ్యూహాకర్తగా జైట్లీ తనను తాను నిరూపించుకున్నారు. 2003లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సర్కారును కూల్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పటివరకు బిజిలీ, సడక్, పానీ ఎన్నికల నినాదాలుగా ఉండేవి. కానీ జైట్లీ అభివృద్ధి అంశాన్ని ఎన్నికల నినాదంగా మార్చి బీజేపీకి విజయాన్ని అందించారు. పెద్దల సభలో గర్జించిన గళం బీజేపీలో కీలక నేతగా, ప్రఖ్యాత న్యాయవాదిగా అప్పటికే పేరు తెచ్చుకున్న జైట్లీ.. 1999లో తొలిసారి వాజపేయి ప్రభుత్వంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రిగా, డిజిన్వెస్ట్మెంట్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అనంతరం 2000 సంవత్సరంలో కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ పొంది.. కీలక లా, సామాజిక న్యాయం, కంపెనీ వ్యవహారాల శాఖలను సమర్థవంతంగా నిర్వర్తించారు. కేంద్ర కేబినెట్లో కంటే పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా జైట్లీ ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. 2004లో వాజపేయి ప్రభుత్వం అనూహ్యంగా ఓడిపోవడంతో రాజ్యసభలో ప్రతిపక్ష గళంగా జైట్లీ అవతరించారు. అదే ఊపులో 2009లో ఆయన పెద్దలసభలో ప్రతిపక్ష నేత పదవిని నిర్వర్తించి.. నాటి యూపీఏ సర్కారుకు చుక్కలు చూపించారు. మన్మోహన్ సర్కారును సభలో ఏకిపారేస్తూ.. తన వాగ్ధాటితో ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. కేంద్రాన్ని అనేకసార్లు జైట్లీ ఇరకాటంలో పెట్టారు. మన్మోహన్ సర్కారు పతనంలో ప్రతిపక్ష నేతగా తనవంతు పాత్రను జైట్లీ అత్యంత సమర్థంగా పోషించారు. ఎన్నికల్లో గెలువనప్పటికీ..! 2014లో మోదీ ప్రభంజనంతో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చింది. అయితే, మోదీ హవా కూడా జైట్లీని ఎన్నికల సమరంలో ఒడ్డున పడేయలేకపోయింది. అమృతసర్లో పోటీ చేసిన జైట్లీ.. కెప్టెన్ అమరీందర్ సింగ్ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే, ఈ ఓటమి.. బీజేపీలోని ఆయన చరిష్మాను, విశ్వసనీయతను చెదరగొట్టలేకపోయింది. నరేంద్రమోదీకి అత్యంత నమ్మకస్తుడిగా ఆయన కేబినెట్లో జైట్లీ కీలక పదవులు పోషించారు. ఎన్డీయే తొలి హయాంలో కీలకమైన ఆర్థిక, రక్షణ మంత్విత్వ శాఖలను జైట్లీ నిర్వర్తించారు. ఈ క్రమంలో ఆరోగ్య సమస్యలు నిత్యం వెంటాడటం ఆయనను బాగా ఇబ్బందిపెట్టింది. తరచూ ఆస్పత్రులకు వెళ్తూనే.. ఎన్డీయే తొలి హయాంలో కీలక వ్యక్తిగా, ఢిల్లీ పవర్ సర్కిల్లోని చిక్కులను మోదీ అర్థం చేసుకోవడంలో అండగా నిలిచిన నేతగా జైట్లీ వ్యవహరించారు. అనారోగ్య సమస్యలు తీవ్రం కావడంతో 2019 ఎన్నికలకు జైట్లీ దూరంగా ఉన్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే జైట్లీ పలు అంశాల్లో కాంగ్రెస్ వైఖరిని చీల్చిచెండాడుతూ బీజేపీకి చివరివరకు నైతిక, భావజాల మద్దతును అందించారు. ఇటీవల ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ వ్యవహరించిన వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ జైట్లీ సోషల్ మీడియాలోనే ఘాటైన విమర్శలు చేశారు. రాజకీయాలే కాదు న్యాయవ్యవస్థలోనూ జైట్లీ తనదైన ముద్ర వేశారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్లోనూ అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ తన పట్టు నిలుపుకున్నారు. మోదీ హయాంలో భారత క్రికెట్లోనూ ఆయన ఆధిపత్యం కొనసాగింది. భావజాలపరంగా రైట్ వింగ్ రాజకీయాలను అనుసరించినప్పటికీ జైట్లీ అన్ని రాజకీయ పార్టీల్లోనూ మంచి స్నేహితులు ఉన్నారు. పాత్రికేయులతో నిత్యం స్నేహపూరితంగా ఉండే జైట్లీ.. బీజేపీ అంతర్గత వ్యవహారాలు బయటకు పొక్కేలా చేస్తున్నారని పలు సందర్భాల్లో పార్టీ నేతలే అనుమానించేవారు. అయితే, జర్నలిస్టులతో మాత్రం ఆయన సన్నిహితంగా ఉండేవారు. అందుకే ఎడిటర్లకు కనుక ప్రధానమంత్రిని ఎన్నుకునే అవకాశమొస్తే.. కచ్చితంగా జైట్లీనే ఎన్నుకునే వారని పాత్రికేయ వర్గాలు చెప్పుకునేవి. చివరిక్షణం వరకు రాజకీయాల్లో, న్యాయవ్యవస్థలో తనదైన ముద్రను వేసిన జైట్లీ.. శనివారం శాశ్వతంగా ఈ లోకం నుంచి వీడ్కోలు తీసుకున్నారు. -
రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ ప్రమాణం
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ మరోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు శుక్రవారం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజస్తాన్ నుంచి మన్మోహన్సింగ్ తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పెద్దల సభకు మన్మోహన్ ఎన్నికవడం ఇది ఆరవసారి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, థావర్ చంద్ గెహ్లోత్, గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, అహ్మద్ పటేల్, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్తో పాటు కొంతమంది బీజేపీ నాయకులు కూడా హాజరయ్యారు. -
సవాళ్లెదురైనా పోరాటం ఆగదు
న్యూఢిల్లీ: ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ దేశ విభజన శక్తులకు వ్యతిరేకంగా బలమైన సైద్ధాంతిక పోరు కొనసాగిస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని ఆమె అన్నారు. తీవ్రమైన సవాళ్లు ఎదురైనప్పటికీ విభజన వాద శక్తులపై తమ సైద్ధాంతిక పోరాటం కొనసాగుతుందన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. దేశంలో 1984లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసుకున్నప్పటికీ రాజ్యాంగ సంస్థలను నాశనం చేయడానికో, ప్రజల్లో భయోత్పాతం సృష్టించేందుకో, బెదిరించటానికో దివంగత రాజీవ్ దానిని ఒక అవకాశంగా తీసుకోలేదని పరోక్షంగా మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ‘1989 ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా మెజారిటీ సీట్లు గెలుచుకోకపోవడంతో, ఏకైక పెద్ద పార్టీ అయినప్పటికీ రాజీవ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అంగీకరించలేదు. రాజీవ్ నిజాయితీని, మనస్సాక్షినే నమ్ముతారనేందుకు ఇదే నిదర్శనం’ అని తెలిపారు. రాజీవ్ నమ్మి, ఆచరించిన విలువలను కొనసాగించేందుకు పునరంకితం కావాలని, అదే రాజీవ్కు ఘనమైన నివాళి అని కార్యకర్తలకు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. రాజీవ్ వల్లే భారత సమాఖ్య బలోపేతం మాజీ ప్రధాని రాజీవ్ హయాంలో కుదిరిన పంజాబ్, అస్సాం, మిజోరం ఒప్పందాల వల్లే మన సమాఖ్య మరింత బలోపేతమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన సాధించిన విజయాలను రాహుల్ గుర్తు చేసుకున్నారు. -
రాజ్యసభకు మన్మోహన్ సింగ్ ఏకగ్రీవం
జైపూర్ : రాజస్ధాన్ నుంచి పెద్దల సభకు పోటీపడుతున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజస్తాన్ బీజేపీ చీఫ్ మదన్ లాల్ సైనీ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజస్తాన్లో కాంగ్రెస్కు మెజారిటీ ఉండటంతో ఇతర పార్టీలు అభ్యర్థుల్ని పోటీకి దింపలేదు. ఇక నామినేషన్ ఉపసంహరణ తేదీ సోమవారం ముగియడంతో ఆయన ఎన్నిక లాంఛనమే అయింది. మన్మోహన్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. గత మూడు దశాబ్దాలుగా ఆయన అసోం నుంచి పెద్దల సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాజస్తాన్ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లోత్ మన్మోహన్కు అభినందనలు తెలిపారు. -
రాజస్ధాన్ నుంచి రాజ్యసభ బరిలో మన్మోహన్
జైపూర్ : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ ఎన్నికలకు మంగళవారం జైపూర్లో నామినేషన్ దాఖలు చేశారు. రాజస్ధాన్ నుంచి పెద్దల సభకు పోటీపడుతున్న మన్మోహన్ సింగ్కు విమానాశ్రయంలో రాజస్దాన్ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లోత్ స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి మారియట్ హోటల్కు చేరుకున్న మన్హోహన్, గెహ్లోత్లతో డిప్యూటీ సీఎం సచిన్ పైలట్లు కొద్దిసేపు చర్చలు జరిపారు. అక్కడినుంచి ప్రదర్శనగా రాజస్ధాన్ అసెంబ్లీకి చేరుకున్న మన్మోహన్ సింగ్ రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. మన్మోహన్ సింగ్ గత మూడు దశాబ్ధాలుగా అసోం నుంచి పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజస్ధాన్ బీజేపీ చీఫ్ మదన్ లాల్ సైనీ మరణంతో ఖాళీ అయిన రాజ్యసభ స్ధానానికి మన్మోహన్ సింగ్ పోటీపడుతున్నారు. రాజస్ధాన్లో కాంగ్రెస్కు మెజారిటీ ఉండటంతో మన్మోహన్ రాజ్యసభకు సునాయాసంగా ఎన్నికవనున్నారు.