Meena
-
నయనతార 'అమ్మోరు2'లో పూజా కార్యక్రమంలో రెజీనా,మీనా (ఫోటోలు)
-
టాలీవుడ్ అందాల తారలు.. తళుక్కున మెరిశారు!
సినిమాలో కథానాయకలుగా రాణించడం అంత సులభం కాదు. అందం ఉండాలి, ప్రతిభ ఉండాలి. అంతకు మించి అవకాశాలు రావాలి. ఇవన్నీ కలగలిపిన తారలు ఎప్పటికీ అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుని ఉండిపోతారు. అలాంటి వారిలో నటి మీనా, రోజా, రంభ వంటి 1990 క్రేజీ కథానాయకలుగా గుర్తింపు పొందారు. నటి మీనా బాల నటిగా రంగప్రవేశం చేసి అందరి మనసులను గెలుచుకున్నారు. ఆ తరువాత తెలుగు, తమిళం, మలయాళం తదితర భాషల్లో కథానాయకిగా అగ్రస్ధానంలో రాణించారు. ఇక నటి రోజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ రాణించిన తార.అదే విధంగా అందాలకు చిరునామాగా మారిన నటి రంభ. వీరందరూ తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి పేరు గడించిన బ్యూటీలే. కాగా స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న తరుణంలోనే నటి మీనా విద్యాసాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయ్యారు. వీరికి నైనిక అనే కూతురు కూడా ఉంది. అలా ఆనందమయంగా సాగుతున్న మీనా జీవితంతో విధి ఆడుకుంది. ఆమె భర్త అనారోగ్యం కారణంగా కన్ను మూశారు. ఆ సంఘటన నుంచి బయట పడటానికి నటి మీనా చాలా కాలం పట్టింది.కాగా ఇటీవలే మళ్లీ బయట ప్రపంచంలోకి వస్తున్న మీనా ఆదివారం సాయంత్రం చెన్నైలో నటి రోజా, రంభ, సంగీత, మహేశ్వరి, శ్రీదేవి వంటి స్నేహితురాళ్లను కలిశారు. వీరితో పాటు డాన్సింగ్ స్టార్ ప్రభుదేవా, నటుడు భరత్ తదితరులు ఉన్నారు. వీరంతా మాటా ఆట పాటలతో సరదాగా గడిపారు. ఆ ఫొటోలను నటి మీనా తన ఇన్స్టా గ్రామ్లో పోస్ట్ చేశారు. అందులో ప్రేమ, ఆదరణ, గత మధుర జ్ఞాపకాలతో ఒక అందమైన సాయం సమయం అని పేర్కొన్నారు. కాగా ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
ఆయనో స్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్! మీనా పెళ్లిలో మాత్రం భావోద్వేగంతో..
సముద్రం సునామీగా ముంచెత్తి దాదాపు 6 వేల మందిని పొట్టనబెట్టుకుంది. అంతటి ప్రళయం నుంచి అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడినవాళ్లు కొందరే. అందులో రెండేళ్ల ఓ పసిప్రాణం కూడా ఉంది. పసికందుగా ఆమెను తన చేతుల్లోకి తీసుకున్న ఆ ఐఏఎస్ అధికారి.. ఇప్పుడు తండ్రి స్థానంలో ఆమెపై అక్షింతలు జల్లి దీవించి భావోద్వేగానికి లోనయ్యారు. హృదయాన్ని హత్తుకునే ఈ ఘటనలోకి వెళ్తే.. డిసెంబర్ 26, 2004 ముంచెత్తిన సునామీలో తమిళనాడుకు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే. నాగపట్టణంలో సహాయక చర్యలు పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరున్న రాధాకృష్ణన్కు అప్పగించింది. అప్పుడు ఆయన తంజావూరు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో.. డిసెంబర్ 28వ తేదీన కీచన్కుప్పం ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్న బృందాలకు.. శిథిలాల కింద ఓ పసికందు ఏడుపులు వినిపించాయి. దాదాపు రెండేళ్ల వయసున్న చిన్నారిని సురక్షితంగా బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించారు. అదృష్టం కొద్దీ ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఆ సునామీ నుంచి బయటపడిన అతిచిన్న వయస్కురాలు కూడా ఆమెనే!. అయితే ఆమె తల్లిదండ్రులు ఏమయ్యారో తెలియదు. అలాంటప్పడు చిన్నారి సంరక్షణ బాధ్యతలు ఎలా? అని అధికారులు ఆలోచన చేశారు.ఈలోపు.. విషయం తెలిసిన అప్పటి జిల్లా కలెక్టర్ రాధాకృష్ణన్-కృతిక దంపతులు ముందుకు వచ్చారు. ఆ చిన్నారికి మీనా అని పేరు పెట్టి.. అన్నై సత్య ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించారు. అప్పటి నుంచి ఆమె సంరక్షణ మొత్తం ఆ జంటే చూసుకుంటూ వచ్చింది. ఈలోపు రాధాకృష్ణన్కు ట్రాన్స్ఫర్ అయ్యింది. అయితే మరో ప్రాంతానికి బదిలీ అయినప్పటికీ.. రాధాకృష్ణన్ జంట మీనా సంరక్షణ బాధ్యతను మరిచిపోలేదు. వీలు చిక్కినప్పుడల్లా ఆమె దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. అదే ఆశ్రమంలో సౌమ్య ఆమెకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది. అలా.. ఏళ్లు గడిచిపోయాయి. సాధారణంగా 18 ఏళ్లు నిండిన తర్వాత.. వాళ్లకు ఆశ్రమంలో కొనసాగడానికి వీలు ఉండదు. ఆశ్రమంలో సౌమ్య, మీనాలకు మాత్రమే ఈ ఇబ్బంది ఎదురైంది. విషయం తెలిసి.. రాధాకృష్ణన్ ముందుకొచ్చారు. మీనా, సౌమ్య బాధ్యతలకు దాతల సహకారం తీసుకున్నారు. అలా.. వాళ్లిద్దరూ ఉన్నత చదువులు పూర్తి చేసుకున్నారు. అలా వాళ్లిద్దరికీ తండ్రికాని తండ్రిగా మారిపోయారు.రెండేళ్ల కిందట.. సౌమ్య ఓ టెక్నీషియన్ను వివాహం చేసుకుంది. ఆ వివాహానికి సౌమ్య తరఫున పెద్దగా రాధాకృష్ణన్ హాజరై ఆశీర్వదించారు. కిందటి ఏడాది సౌమ్య ఓ బిడ్డకు జన్మనిస్తే.. ఇంటికి పిలిపించుకుని మరీ మనవరాలిని దీవించారు. ఇక మీనా వయసు ఇప్పుడు 23 ఏళ్లు. నర్సింగ్ పూర్తి చేసుకుంది. మీనాను వివాహం చేసుకునేందుకు మణిమరన్ అనే బ్యాంక్ ఉద్యోగి ముందుకు వచ్చాడు. విషయం తెలిసి రాధాకృష్ణన్ సంతోషించారు. ఫిబ్రవరి 2వ తేదీన నాగపట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మీనా-మణిమరన్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ వేడుకకు సౌమ్య తన భర్త, కూతురితో హాజరైంది. ప్రస్తుతం రాధాకృష్ణన్ ప్రభుత్వంలో అదనపు చీఫ్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దత్త పుత్రిక వివాహానికి స్వయంగా హాజరై తండ్రి స్థానంలో ఉండి తన బాధ్యతను నిర్వర్తించారు. ఆశ్రమంలో సౌమ్య-మీనాలు గడిపిన రోజులను, వాళ్ల స్నేహాన్ని, ఆశ్రమ నిర్వహణకు సహకరించిన సూర్యకళను ఆయన గుర్తు చేసుకున్నారు. అన్నింటికి మించి.. 2018లో గాజా తుపాన్ సమీక్ష కోసం వెళ్లినప్పుడు మీనా తనను ‘‘నాన్నా..’’ అని పిలవడాన్ని గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఆ వివరాలను ఆయనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం గమనార్హం. -
హీరోయిన్ మీనా పొంగల్ సెలబ్రేషన్స్.. (ఫోటోలు)
-
బర్త్ డే మూడ్లో నభా నటేశ్.. పెళ్లి కూతురిలా ది రాజాసాబ్ హీరోయిన్!
బర్త్ డే మూడ్లో నభా నటేశ్..పెళ్లి కూతురిలా ముస్తాబైన ది రాజాసాబ్ హీరోయిన్!టోక్యోలో ఎంజాయ్ చేస్తోన్న మీనా..బుట్టబొమ్మలా తయారైన యాంకర్ శ్రీముఖి.. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by GQ India (@gqindia) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) -
చైల్డ్ ఆర్టిస్టులుగానే అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్.. ఈ తారల గురించి తెలుసా? (ఫొటోలు)
-
ప్రతి అర్జీని పరిశీలించి నష్ట పరిహారం అందిస్తాం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బుడమేరు వరద ముంపు ప్రభావంతో నష్టపోయిన ప్రతి కుటుంబానికీ నష్ట పరిహారం అందిస్తామని ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా స్పష్టం చేశారు. సాక్షి పత్రిక మెయిన్ ఎడిషన్లో మంగళవారం ‘అర్జీలు బుట్టదాఖలు ’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఇన్ఛార్జి కలెక్టర్ స్పందించారు. మంగళవారం నగరంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి వరకు బుడమేరు వరద నష్టంలో భాగంగా గృహ, ఎంఎస్ఎంఈ, వాహనాలు తదితర విభాగాలకు సంబంధించి 1,44,672 మంది వరద ప్రభావిత బాధితుల బ్యాంకు ఖాతాల్లో రూ.235.72 కోట్లను జమ చేశామని వివరించారు. 179 గ్రామ వార్డు సచివాలయాల్లో వరద గణన జాబితాల ప్రచురణతో పాటు అదనంగా వచ్చిన దరఖాస్తులను పిజిఆర్ఎస్ ఫ్లడ్ మాడ్యూల్లో నమోదు చేశారన్నారు. ఆధార్తో బ్యాంకు ఖాతా అనుసంధానించబడిన బ్యాంకు ఖాతాలకు నేరుగా పరిహారం జమ చేశారన్నారు. బ్యాంకు ఖాతాలు అనుసంధానం కాని 476 ఖాతాలను అనుసంధానం చేసి చెల్లింపుల ప్రక్రియ జరిపేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న 2,478 దరఖాస్తులను పరిశీలించి నష్ట పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈనెల 24వ తేదీలోగా అర్హులైన బాధితుల ఖాతాల్లో నష్ట పరిహారం జమ చేస్తామన్నారు. నష్టపోయిన ప్రతి బాధితునికి పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.కాగా.. సాయం కోసం కలెక్టరేట్కు ఎన్ని దరఖాస్తులొచ్చాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. -
అలాంటప్పుడు ఈ వేడుకకు నన్నెందుకు పిలిచారు: మీనా
సీనియర్ నటి మీనా సౌత్ ఇండియా ప్రేక్షకులతో మంచి అనుబంధమే ఉంది. బాలనటిగా రంగ ప్రవేశం చేసిన ఆమె స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్గా అబుదాబిలో జరిగిన ఐఫా-2024 అవార్డ్స్ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఆ వేదిక మీద మీనా తమిళ్ మాట్లాడుతుండగా తనపై బాషా విభేదం చూపించారు.ఒకప్పడు స్టార్ నటిగా కొనసాగిన మీనా.. ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెండ్ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల జరిగిన ఐఫా చిత్రోత్సవాల్లో మీనా మాట్లాడుతుండగా.. ఆ సమయంలో ఒక యాంకర్ హిందీ భాషలో మాట్లాడమని చెప్పడంతో నటి మీనాకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఇది హిందీ వేడుకనా, అయితే తనని ఎందుకు ఆహ్వానించారు..? తాను ఇది దక్షిణాది వేడుక అని భావించానంటూ అసంతప్తి వ్యక్తం చేశారు. ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. ఐఫా వేడుకల్లో హీరోయిన్ మీనా (ఫొటోలు)దక్షిణాది చిత్రాలు, దక్షిణాది నటీనటులు చాలా ఉత్తమ కళాకారులని, తాను దక్షిణాది నటినని చెప్పుకోవడానికి గర్వపడతానన్నారు. అదేవిధంగా ఐఫా చిత్రోత్సవ వేడుక దక్షిణాదికే కాకుండా భారతీయ కళాకారులను కలుపుతూ ఘనంగా జరుగుతోందని పేర్కొన్నారు. ఇలా నటి మీనా మాట్లాడిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
జానీ మాస్టర్కు మధ్యంతర బెయిల్.. కారణం ఇదే
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు మధ్యంతర బెయిల్ లభించింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు రంగారెడ్డి కోర్టు తెలిపింది. అయితే, ఈనెల 6 నుంచి 10 వరకు మాత్రమే ఆయనకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్న యువతిపై ఆయన లైంగిక దాడి చేశారని ఫిర్యాదు రావడంతో నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.మధ్యప్రదేశ్కు చెందిన యువతి ఫిర్యాదుతో జానీ మాస్టర్కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించిన విషయం తెలిసిందే. దీంతో చంచల్గూడ జైలుకు ఆయన్ను తరలించారు. అయితే, అక్టోబర్ 3 తో ఆయనకు విధించిన గడువు ముగిసింది. అయితే, జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరవ్వాలని బెయిల్ కోసం జానీ మాస్టర్ దరఖాస్తు చేసుకున్నారు. దానిని పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 8న ఢిల్లీలో జరిగే జాతీయ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. 70వ జాతీయ అవార్డ్స్లో జానీ మాస్టర్కు చోటు చోటు దక్కిన విషయం తెలిసిందే. తమిళ్లో తిరుచిట్రంబళం (తిరు) సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసిన ఒక పాట నేషనల్ అవార్డ్ను తెచ్చిపెట్టింది. ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ మాస్టర్ సంయుక్తంగా ఈ అవార్డ్ను అందుకోనున్నారు. -
ఐఫా వేడుకల్లో హీరోయిన్ మీనా.. బ్లాక్ డ్రెస్లో అదిరిపోయింది! (ఫొటోలు)
-
హీరోయిన్ మీనా బర్త్ డే వేడుకల్లో శరత్కుమార్.. ఫోటోలు వైరల్
-
మీనాపై చాలా నీచంగా దుష్ప్రచారం చేశారు: శరత్కుమార్
కోలీవుడ్ సీనియర్ హీరో శరత్కుమార్ పలు యూట్యూబ్ ఛానళ్లపై ఫైర్ అయ్యారు. సినీ సెలబ్రిటీల గురించి యూట్యూబ్ ఛానళ్లలో చెడుగా మాట్లాడటం, ట్రోల్ చేయడం చాలా తప్పు అంటూ ఆయన మండిపడ్డారు. కొద్దిరోజుల క్రితం టాలీవుడ్లో కూడా ఇలాంటి వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మా అధ్యక్షులు మంచు విష్ణు సుమారు 20కి పైగా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించేలా చర్యలు తీసుకున్నారు. అందుకు మీనా కూడా మంచు విష్ణును అభినందించారు.మీనాపై దుష్ప్రచారం చాలా తప్పు: శరత్ కుమార్ సౌత్ ఇండియాలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగిన మీనా గురించి కూడా పలు యూట్యూబ్ ఛానళ్లు తప్పుగా వీడియోలు చేశాయి. ఆమె మరో పెళ్లి చేసుకోనుందంటూ తీవ్రంగా ప్రచారం చేశాయి. దీంతో ఆమె పలుమార్లు మండిపడ్డారు కూడా. తాజాగా శరత్కుమార్ ఈ అంశం గురించి మాట్లాడారు. నటి మీనాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం చాలా దారుణం. ఒక ఆడబిడ్డ గురించి ఇలా తప్పుగా మాట్లాడం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. మీనా గురించి తప్పుగా మాట్లాడే అధికారం వీళ్లకు ఎవరిచ్చారని ఫైర్ అయ్యారు. యూట్యూబ్ ఛానళ్లలో కూర్చొని అలా మాట్లాడేవారి దగ్గర ఏదైనా రుజువు ఉందా..? ఏది కావాలంటే అది మాట్లాడటం చాలా నీచమైన చర్య అంటూ ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాలు తలచుకుంటే రాత్రికి రాత్రే ఇలాంటి వాటిని అదుపు చేయవచ్చని శరత్కుమార్ ధీమా వ్యక్తం చేశారు.వాళ్లు పురుగులతో సమానం: రాధికయూట్యూబ్ ఛానళ్లలో సినీ సెలబ్రిటీల గురించి హీనంగా మాట్లాడే వారు పురుగులతో సమానమని రాధికా శరత్కుమార్ అన్నారు. కోలీవుడ్లో కూడా సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తినంటూ చెప్పుకుంటున్న బైల్వాన్ రంగనాథన్ లాంటి వారు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం చాలా తప్పని అన్నారు. -
మంచు విష్ణును అభినందించిన మీనా
చిత్ర పరిశ్రమకు సంబంధించిన హీరోహీరోయిన్లను విమర్శిస్తూ కొందరు చేసిన, చేస్తున్న వీడియోలతో పాటు కామెంట్లను తొలగించాలంటూ మా అధ్యక్షుడు మంచు విష్ణు విజ్ఞప్తి చేయడమే కాకుండా వారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. తమ యూట్యూబ్ ఛానల్స్లలో ట్రోలింగ్ వీడియోలను తొలగించమని హెచ్చరించారు. ఇక నుంచి మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే సహించమని ఫైర్ అయ్యారు. దీంతో ఆయనకు నెటిజన్ల నుంచి కూడా మద్ధతు లభించింది.అభ్యంతరకరమైన కంటెంట్తో యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు పెట్టేలా మంచు విష్ణు చేశారు. మహిళలపై అసభ్యకర కంటెంట్తో రన్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ల గుర్తింపును శాశ్వితంగా రద్దు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇలా ఆయన చూపిన దూకుడుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. తాజాగా సినీ నటి మీనా రియాక్ట్ అయ్యారు.అనేక యూట్యూబ్ ఛానెల్లలో మహిళలను అవమానించేలా కంటెంట్తో నిండిపోయాయి. తప్పుడు కంటెంట్ను క్రియేట్ చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్తో పాటు అధ్యక్షుడు మంచు విష్ణుకు ధన్యవాదాలు. చిత్ర పరిశ్రమ సమగ్రతను కాపాడటంలో మీరు తీసుకుంటున్న చర్యలు అభినందనీయంగా ఉన్నాయి. భవిష్యత్లో కూడా వీటిని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లను తిప్పకొట్టడంలో నటీనటులు ఎన్నో ఇంబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి. ఇండస్ట్రీని కాపాడుకునేందుకు మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. చలనచిత్ర పరిశ్రమ గౌరవప్రదమైన స్థానంలో ఉండాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిందే. విష్ణు, మీ చర్యలు నిజంగా అభినందనీయం. అంటూ మీనా రియాక్ట్ అయ్యారు. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
ఈ ఫోటోలోని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ప్రముఖ నట దిగ్గడం శివాజీ గణేశన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్కు చెందిన ఆయన దాదాపు 250కి పైగా చిత్రాల్లో హీరోగా నటించారు. తమిళంలో నాలుగు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ఆయన జూలై 21, 2001లో కన్నుమూశారు. శివాజీ గణేశన్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ (స్పెషల్ జ్యూరీ), నాలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, మూడు తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను పొందారు.ఇటీవల ఆయన వర్ధంతి సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్, సీనియర్ నటి మీనా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆయన సినిమాలో నటించిన ఫోటోను ఇన్స్టాలో పంచుకున్నారు. ఆయన వర్ధంతి రోజున శివాజీ గణేశన్ను మీనా గుర్తు తెచ్చుకున్నారు. నన్ను భారతీయ సినిమాకి పరిచయం చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. మీతో నటించినందుకు గర్వంగా ఉందని రాసుకొచ్చింది. తాజాగా మీనా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.కాగా.. మీనా చిన్నారిగా ఉన్న సమయంలో శివాజీ గణేశన్తో దిగిన ఫోటో నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు మీనా చాలా క్యూట్గా ఉన్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన మీనా సినిమాల్లో నటించింది. ఆ రోజుల్లో తెలుగులో స్టార్ హీరోయిన్గా రాణించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
మీనా, ఆమె తల్లి నాతో దురుసుగా మాట్లాడారు.. నిర్మాత ఆవేదన
మీనా.. తెలుగు, తమిళ, మలయాళంలో స్టార్ హీరోయిన్. దాదాపు అందరు అగ్ర హీరోలతోనూ నటించింది. ఎన్నడూ వివాదాల జోలికి వెళ్లిందే లేదు. 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ నటిగా రాణిస్తోంది. అయితే మీనా, ఆమె తల్లి తనను అవమానించారంటున్నాడు ఓ నిర్మాత.దురుసు వ్యాఖ్యలుమాణిక్యం నారాయణన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టాడు. ఓ ప్రోగ్రామ్ చేయమని పిలవడానికి మీనా దగ్గరకు వెళ్లాను. కానీ అటు వైపు నుంచి నాకు సరైన స్పందన రాలేదు. మీనాయే కాదు ఆమె తల్లి కూడా చాలా దురుసుగా మాట్లాడారు. నేనొక నిర్మాతను.. నాలాంటి నిర్మాతలే కదా మీ సినిమాలకు కావాల్సింది. అలాంటి నన్ను పట్టుకుని అలా చీప్గా మాట్లాడతారా? నాకు చాలా బాధేసింది.వాళ్లందరూ నా స్నేహితులేఈ అనుభవంతో ఇంకెప్పుడూ ఎవరినీ ఏదీ అడగకూడదని తెలిసొచ్చింది. సౌత్ ఇండస్ట్రీలో ఖుష్బూ, రోజా, సుహాసిని ఇలా చాలామంది సూపర్ హీరోయిన్లు నాకు స్నేహితులే! వాళ్లు నా కుమారుడి వివాహానికి కూడా వచ్చారు. అయినా ఈ ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉండటమే నయం అని పేర్కొన్నాడు. ఈయన వ్యాఖ్యలు ఫిల్మీదునియాలో వైరల్గా మారాయి.చదవండి: ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్ -
Meena London Trip: లండన్ ట్రిప్ను ఎంజాయ్ చేస్తున్న మీనా
తమిళసినిమా: బాలతారగా సినీరంగ ప్రవేశం చేసి స్టార్ కథానాయకిగా ఎదిగిన అతి కొద్ది మంది నటీమణిల్లో మీనా ఒకరు. బాల నటిగానే రజనీకాంత్తో కలిసి నటించి, ఆ తర్వాత ఆయన సరసన కథానాయకిగా నటించిన చరిత్ర ఈమెది. బహుభాషా నటిగా పేరుగాంచిన మీనా తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషల్లో సూపర్ స్టార్స్ అందరితోనూ జతకట్టారు. మలయాళ చిత్రం దృశ్యం వరకు కథానాయకిగా నటించి రాణించిన మీనా ఇప్పుడు తన వయసుకు తగ్గ పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఈమె జీవితంలో ఎదుర్కొన్న విచారకరమైన సంఘటన భర్తను కోల్పోవడం. అనారోగ్యం కారణంగా భర్త చనిపోవడంతో మీనా కొంతకాలం ఆ బాధ నుంచి బయటపడలేకపోయారు. అయితే కాలమే అన్నింటికీ మందు అన్నట్టుగా నటి మీనా మళ్లీ కోలుకుని నటించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న ఈమె తాజాగా నటుడు అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో ముగ్గురు కథానాయకిల్లో ఒకరుగా నటించటానికి సిద్ధమవుతున్నారు. కాగా ప్రస్తుతం ఈమె లండన్ ట్రిప్ను ఎంజాయ్ చేస్తున్నారు. వేసవి విడిదిగా లండన్కు వెళ్లిన నటి మీనా అక్కడ పలు సుందరమైన ప్రదేశాల్లో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తున్నారు. అవి ఇప్పుడు నెట్లో వైరల్ అవుతున్నాయి. మంచి మోడ్రన్ దుస్తుల్లో కనిపిస్తున్న మీనాను చూసి ఆమెను అలా చూసి ఎన్నాళ్లైయిందో అంటూ అభిమానులు కృషి అవుతున్నారు. -
నిశ్చితార్థం రద్దయిందని ఘోరం
యశవంతపుర: నిశ్చితార్థం రద్దయిందనే ఉన్మత్త ఆవేశంలో 16 ఏళ్ల బాలికను తల నరికి హత్య చేసి పరారైన కిరాతకుడు ప్రకాశ్ను కొడగు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని సోమవారపేట పరిధిలో సుర్జబ్బి ప్రభుత్వ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న మీనా అనే బాలికతో అతనికి గతంలో ఇరుకుటుంబాల వారు నిశ్చితార్థం చేశారు. ఏడాది నుంచి ప్రేమ హత్యకు గురైన మీనా ఊరు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని హమ్మియాళకు చెందిన ప్రకాశ్ చిన్నచిన్న పనులు చేసుకొనేవాడు. ఏడాది నుంచి మీనా వెంటపడ్డాడు. రోజూ మీనాను ప్రకాశ్ బైకులో ఎక్కించుకొని స్కూల్ వద్ద వదిలేవాడు. ఫలితాలు వచ్చిన రోజునే నిశి్చతార్థంలో ఇద్దరినీ పెద్దలు కూర్చోబెట్టి ఉంగరాలు మారి్పంచారు. అయితే కొంతసేపటికి అధికారులు వచ్చి మైనర్ బాలికకు ఎలా పెళ్లి చేస్తారని ప్రశ్నించటంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు బాలిక తల్లిదండ్రులు సుబ్రమణ్య, జానకి తెలిపారు. ఆ తరువాత మీనాను మాటల్లో పెట్టిన ప్రకాశ్ ఆమె తల నరికి తీసుకెళ్లాడు. ఆమె తల్లిదండ్రులపైనా దాడి చేసి పరారయ్యాడు. ప్రకాశ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని శుక్రవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది నిజం కాదని తేలింది. ఒక గ్రామంలో దాగి ఉన్న నిందితున్ని అరెస్టు చేసి విచారణ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కె.రామరాజన్ తెలిపారు. ఘటనాస్థలికి తీసుకెళ్లి హత్య గురించి విచారించారు. -
Meena Durairaj: యెల్లో..యెల్లో..మీనా బ్యూటిఫుల్లో..! (ఫోటోలు)
-
అజిత్కి జోడీగా...
కోలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా నిలిచిన వార్తల్లో అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించనున్నారనే వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సిమ్రాన్, మీనా పేర్లు వినిపిస్తున్నాయి.ఈ ఇద్దరూ అతిథి పాత్రల్లో కాదు.. అజిత్ సరసన హీరోయిన్లుగా నటిస్తారని టాక్. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో అజిత్ మూడు పాత్రల్లో కనిపిస్తారట. మూడు పాత్రలకు ముగ్గురు హీరోయిన్లు ఉంటారని, శ్రీలీల, సిమ్రాన్, మీనాతో అజిత్ జతకడతారని చెన్నై కోడంబాక్కమ్ అంటోంది. ఈ వార్త నిజమైతే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సిమ్రాన్, మీనా అజిత్తో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు అవుతుంది. ‘అవళ్ వరువాళా (1998), వాలి’ (1999) వంటి విజయవంతమైన చిత్రాల్లో అజిత్ సరసన నటించారు సిమ్రాన్.అలాగే అజిత్కి జోడీగా ‘సిటిజెన్ (2001), విలన్’ (2002) వంటి చిత్రాల్లో నటించారు మీనా. ఇప్పుడు మళ్లీ ఈ హీరో సరసన సిమ్రాన్, మీనా నటిస్తే దాదాపు రెండు దశాబ్దాలకు ఈ కాంబినేషన్ కుదిరినట్లు అవుతుంది. మేలో ఈ చిత్రం షూటింగ్ని ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. సో... అజిత్ సరసన శ్రీలీల, సిమ్రాన్, మీనా నటించనున్నారా? అనేది త్వరలో తెలిసి΄ోతుంది. మహేశ్బాబు సినిమాలో...మహేశ్బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు సిమ్రాన్ని ఎంపిక చేశారని సమాచారం. గతంలో ‘యువరాజు’ (2000) చిత్రంలో మహేశ్బాబు–సిమ్రాన్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత ఈ ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. అయితే హీరో–హీరోయిన్గా కాదని, సిమ్రాన్ది అతిథి పాత్ర అని భోగట్టా. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను రాజమౌళి ప్రకటించనున్నారట. మరి.. సిమ్రాన్ ఈప్రాజెక్ట్లో ఉన్నారా? లేదా అనే ప్రశ్నకు అప్పుడు సమాధానం దొరుకుతుంది. -
స్టార్ హీరో సినిమా కోసం ఎంట్రీ ఇస్తున్న మీనా,సిమ్రాన్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలలో అజిత్ ఒకరు. ఈయన బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. దివంగత ప్రముఖ నటి శ్రీదేవి ప్రధానపాత్రను పోషించిన ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రంలో అజిత్ క్యామియో పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈయన 'విడాముయర్చి' చిత్రంలో నటిస్తున్నారు. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థకు ఈ చిత్రం చాలా కీలకమైనది. ఇటీవల ఈ సంస్థ నిర్మించిన చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేదు. కాగా విడాముయర్చి చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా అజిత్ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. దీనికి 'మార్క్ ఆంటోని' చిత్రం ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి గుడ్ బ్యాడ్ అగ్లి అనే టైటిల్ ఖరారు చేశారు. కాగా ఇందులో టాలీవుడ్ క్రేజీ నటి శ్రీలీల నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది. తాజా సమాచారం ఏమిటంటే ఇందులో నటుడు అజిత్ త్రిపాత్రాభినయం చేయబోతున్నారట. ఇందులో ఆయనకు జంటగా మరో ఇద్దరు సీనియర్ హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు నటి 'సిమ్రాన్' కాగా మరొకరు 'మీనా' అని తెలిసింది. కాగా నటి సిమ్రాన్ ఇప్పటికే అజిత్తో కలిసి వాలి, అవళ్ వరువాళా వంటి సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించగా, నటి మీనా సిటిజెన్, విలన్ చిత్రాల్లో అజిత్తో జత కట్టారు. దీంతో తాజాగా ఇద్దరూ కలిసి గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో ఆయన సరసన నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూన్ నెలలో సెట్పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారికంగా త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
63 ఏళ్ల టాప్ హీరోతో సినిమా.. నో చెప్పిన మీనా
కోలీవుడ్లో రెండు దశాబ్దాలకు పైగా ప్రముఖ హీరోగా కొనసాగిన సీనియర్ నటుడు రామరాజన్.. 2001 వరకు వరుసగా సినిమాల్లో కనిపించిన ఆయన ఆ తర్వాత పెద్దగా వెండితెరపై కనిపించలేదు. 2010లో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన రామరాజన్ బయటిప్రపంచానికి కూడా టచ్లో లేకుండాపోయారు. సుమారు 12 ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ ఒక సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.. ‘సామానియన్’ అనే చిత్రం ద్వార ఆయన రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 63ఏళ్లు కాగా ఆయన సరసన మీనా నటిస్తే కథకు బాగా సెట్ అవుతుందని ఆయన భావించారట. ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. 1986లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామరాజన్ తన 18వ సినిమా 'కరగట్టకరణ్' సూపర్ హిట్గా నిలిచింది. ఇది 25 కేంద్రాలలో 100 రోజులు, ఎనిమిది కేంద్రాలలో 360రోజులు, నాలుగు థియేటర్లలో 400 రోజులు ప్రదర్శించబడింది. అలా ఆయన 45 సినిమాల్లో హీరోగా నటించి భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. ఎక్కువగా ఆయన సినిమాల్లో ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పుడు వీరిద్దరూ 23 ఏళ్ల తర్వాత ‘సామానియన్’ చిత్రం కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమాలో రామరాజన్ లాయర్గా నటిస్తున్నారు. దీంతో తన సరసన సీనియర్ హీరోయిన్ 'మీనా' అయితే బాగుంటుందని దర్శకుడు ఆర్. రాకేష్ ద్వారా ఆమెను సంప్రదించారట. అందుకు మీనా అంగీకరించలేదట. కొన్ని కారణాల వల్ల రామరాజన్ సినిమాలో నటించలేనని మీనా తెలిపిందని అక్కడి ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. రజనీ-కమల్ లాంటి హీరోలను ఢీ కొట్టిన నటుడు రామరాజన్. అలాంటి హీరోతో నటించనని మీనా చెప్పడం ఏంటి..? అంటూ ఆయన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అదే రజనీకాంత్ సినిమాలో మీనాకు ఛాన్స్ వస్తే వదులుకుంటుందా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా పలురకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అసలు విషయం తెలియాలంటే మీనా చెప్పే వరకు వేచి ఉండాల్సిందే. 1998లో తిరుచెందూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రామరాజన్ భారీ మెజరాటీతో గెలిచి ఎంపీగా కూడా సేవలు అందించారు. ప్రస్తుతం అన్నాడీఎంకే కార్యదర్శిగా ఉన్నారు. -
ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి
మీన రాశి ఆదాయం–11 , వ్యయం–5 , రాజయోగం–2 , అవమానం–4 పూర్వాభాద్ర 4 వ పాదము (ది) ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దు, శ్య, ఝా, థా) రేవతి 1,2,3,4 పాదములు (దే, దొ, చా, చి) గురువు మే 1 వరకు మేషం (ద్వితీయం)లోను తదుపరి వృషభం (తృతీయం)లోను సంచరిస్తారు. శని కుంభం (వ్యయం)లోను రాహువు మీనం (జన్మం)లోను కేతువు (సప్తమం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో సరైన నిర్ణయాలు చేయలేక ఇబ్బందికి గురవుతుంటారు. గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా ఉండేలాగా మీ నడవడికను సరిచేసుకోండి. కొన్నిసార్లు దుర్మార్గులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలరు. జాగ్రత్తపడండి. రోజువారీ భోజనం విషయంలో కూడా మీకు సమయపాలన, సంతుష్టి ఉండవు. ప్రతిరోజూ చేయవలసిన పని వదిలి దూరంగా వెళ్ళాలి అనే కోరిక బాగా పెరుగుతుంది. నిత్య కర్మలను వాయిదా వేయవద్దు. ఏలినాటి శని ప్రథమ భాగంలో ఉన్నది. అయితే జన్మ రాహువు కూడా ఇబ్బందికరమే. ప్రతిపనీ శ్రమయుక్తమే. ఉద్యోగ విషయాలలో పని మీద ఉత్సాహం కలగక సరిగా పనిచేయరు. మీరు కుటుంబం, ఉద్యోగం తప్ప మరి ఏ ఇతర విషయాలకూ ప్రాధాన్యమివ్వ వద్దు. గుర్తింపు లేకుండా కాలక్షేపం చేయవలసి వస్తుంది. అయినా ఓర్పు వహించండి. ప్రమోషన్ అందడం కష్టసాధనం. మీరు సరైన జాగ్రత్తలు పాటింపకపోతే అయిష్టమైన స్థానానికి స్థానచలనం కలుగుతుంది. కొన్నిసార్లు వ్యాపారులకు అనవసర విషయాల ద్వారా, అధికారుల ద్వారా, గుమస్తాల ద్వారా ప్రతికూల స్థితులు రాగలవు. మైత్రీభావం ప్రదర్శించండి. కుటుంబ విషయాలు చూస్తే ఎవరితోనూ మీకు మాట కలవదు. వీలయినంతవరకు మౌనం పాటించండి. బంధువుల విషయంగా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా చాలా జాగ్రత్తలు పాటించండి. పిల్లల అభివృద్ధి విషయంలో అసంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది. అయితే మీ జాగ్రత్తల వలన మీరు అన్ని రకాల సమస్యలు దాటగలరు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే తరుచుగా అవసరానికి డబ్బులు సర్దుబాటు కాని సందర్భాలు ఎన్నో ఉంటాయి. పాత ఋణాలు విషయంగా హామీ నెరవేర్చలేరు. కొత్త ఋణాలు అవసరానికి అందవు. చాలా విచిత్ర స్థితి ఒక్కసారిగా ప్రారంభం అవడంతో మీరు కూడా అయోమయంలో ఉంటారు. మీ దగ్గర డబ్బులు తీసుకున్నవారు సమయానికి తీర్చరు. ఖర్చులు నియంత్రించిన వారికి మంచి కాలం. ఆరోగ్య విషయంగా పాత సమస్యలు తిరగపెట్టే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తలు పాటించవలసిన కాలం. వైద్య సలహాలు బాగా పాటించండి. ఆరోగ్యవంతులు కూడా ప్రతిరోజూ తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఏదో తెలియని చికాకులు తరచుగా వస్తుంటాయి. ఈ సంవత్సరం మీరు కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సమన్యాయం పాటించక ఇబ్బందులు పడతారు. గర్భిణీ స్త్రీల విషయమై బహు జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు క్రమం తప్పకుండా పాటించండి. షేర్ వ్యాపారులకు మంచి వ్యాపారం చేయలేకపోగా అనవసర సమయంలో పెట్టుబడులు పెడతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో వున్నవారికి పనులు సరిగా కావు. అందుకోసం చింతించనవసరం లేదు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి అన్ని పనులూ చికాకులు సృష్టిస్తాయి. ఎవరూ సరిగా సహకరించరు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం ప్రతి అంశంలోనూ ఎదురవుతుంది. విద్యార్థులకు చాలా విచిత్ర స్థితి ఉంటుంది. రాబోవు మూడు సంవత్సరాలు మీరు స్థిరబుద్ధిని బాగా ప్రదర్శించాలి. రైతుల విషయంలో కృషి సరిగా చేయకపోవడం, తప్పుడు సలహాలు అందడం వంటివి తరచుగా ఉంటాయి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ వారు మానసిక ఒత్తిడికి లోనవుతారు. పనులు మందగమనంగా ఉంటాయి. కిందస్థాయి వారితో వృత్తి నష్టాలు వస్తుంటాయి. ఉద్యోగ వ్యాపార శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఉద్యోగ వ్యాపారాలలో పనులు ఆలస్యమైనా, లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో కొత్త ప్రయోగాలకు మంచికాలం కాదు. రేవతి నక్షత్రం వారు గృహ, వ్యాపార నిర్వహణలలో పనివాళ్ల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. వృత్తి విషయాలలో అధికారుల సహకారం తక్కువగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. శాంతి మార్గం: శని, రాహు, గురువులకు తరచుగా శాంతి చేయించడం మంచిది. రోజూ ప్రాతఃకాలంలో ఆంజనేయస్వామికి ‘శ్రీరామశ్శరణం మమ’ అని, సాయం సమయంలో శివాలయంలో ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి. ఏప్రిల్: ఈ నెల ఆర్థిక సమస్యల వలన మానసిక ఒత్తిడి. ఋణం చేయవలసి వస్తుంది. పనులు ఎంత శ్రద్ధగా చేసినా, ఆశించిన ప్రతిఫలం ఉండదు. ఉద్యోగంలో పైఅధికారులతో సమస్యలు వస్తాయి. మీ పనులలో ఇతరుల ప్రమేయం వలన సమస్యలు వస్తాయి. శారీరక మానసిక ఒత్తిడి తప్పదు. మే: పనిలో నేర్పు ప్రదర్శిస్తారు. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. సమస్యలను పట్టుదలతో పరిష్కరిస్తారు. ధనలాభం ఉంది. ఆరోగ్యం కొంత ఇబ్బందికరం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. షేర్ వ్యాపారులు లాభాలు అందుకోలేరు. విద్యార్థులకు, రైతులకు, మార్కెటింగ్ ఉద్యోగులకు రాబోవు సంవత్సర కాలం అధిక జాగ్రత్తలు అవసరం. జూన్: ఆర్థిక విషయాలలో క్రమశిక్షణ అవసరం, అభిప్రాయ భేదాల వల్ల మనస్తాపం ప్రయాణాలవల్ల అలసట. పెద్దల అనుగ్రహంతో పనులు పూర్తవుతాయి. షేర్, ఫైనాన్స్, వ్యాపారాలలో చిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. విద్యార్థులకు, రైతులకు చికాకులు తప్పవు. షేర్ వ్యాపారులకు అనుకూలం. నూతన వ్యాపార ప్రయత్నాలలో విఘ్నాలు ఉంటాయి. జులై: కుటుంబ సమస్యలను తెలివితో పరిష్కరిస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. పట్టుదలతో పెద్దపనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఉద్యోగంలో రాణిస్తారు. భూ–వాహన–స్థిరాస్తి లాభం. ఇష్ట దైవారాధన శుభప్రదం. ధనం సర్దుబాటు కాకున్నా, కొన్ని పనులు వేగంగా సాగుతాయి. 16వ తేదీ తరువాత సానుకూలం. మాసాంతంలో కార్య విజయం. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు కాలం సామాన్యం. ఆగస్ట్: కాలం అనుకూలం. ఉద్యోగంలో శత్రు బాధలు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఋణ రోగ సమస్యలు తగ్గుతాయి. స్త్రీలతో వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ విషయాలలో మొండి వైఖరితో సమస్యలు పెంచుకుంటారు. వృత్తి విషయాలలో కోపావేశములతో కొన్నిసార్లు ఇబ్బంది పొందుతారు. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. సెప్టెంబర్: ఈనెల గ్రహానుకూలత తక్కువ. ఎదుటివారి విషయాలకన్నా స్వవిషంపై శ్రద్ధ వహించడం శ్రేయస్కరం. ఉద్యోగ బదిలీలు అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు. నూతన వాహన కొనుగోలు ఆలోచనలు విరమించండి. షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. విద్యార్థులకు, రైతులకు కాలం సరిగా లేదు. అక్టోబర్: మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఇంట్లో స్త్రీలకు ఆరోగ్య ఇబ్బందులు. కుజ శాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల శుభం కలుగుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. షేర్ వ్యాపారులు ఒత్తిడికి లోనవుతారు. రైతులకు, మార్కెటింగ్ వ్యాపారులకు అనుకూలం కాదు. ధనం వెసులుబాటు జరగదు. నవంబర్: ఇంటా బయటా మీమాటకు విలువ తగ్గును. ఏపనికైనా పలుమార్లు చెప్పవలసి వచ్చును. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో సమస్యల పట్ల ఆందోళన చెందక నేర్పుతో వ్యవహరిస్తారు. పిల్లల నుంచి సహకారం తక్కువ. ఉద్యోగ కుటుంబ వ్యవహారాల నిర్వహణలో సరైన దృష్టి ఉంచలేరు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలం. డిసెంబర్: ఉద్యోగంలో పెనుమార్పులు మీకు అనుకూలిస్తాయి. ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. పనులన్నీ లాభదాయకంగా ఉంటాయి. రాజకీయవేత్తలకు మంచి అవకాశాలు లభిస్తాయి. శివ దర్శనం శుభప్రదం. మీ ఆరోగ్యం అనుకూలమే కానీ మానసిక స్థితి కొంచెం ఇబ్బందికరం. విద్యార్థులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. రైతులకు, షేర్ వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు వేగం అవుతాయి. జనవరి: వృత్తిలో రాణిస్తారు. వ్యాపారం లాభదాయకం. రాజకీయవేత్తలు ప్రజల మన్ననలు పొందుతారు. అధికారయోగం ఉంది. శత్రుబాధల నుంచి విముక్తి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగ, వ్యాపారాలలో మీ స్థిరత్వానికి ఇబ్బంది రాకుండా జాగ్రత్తపడండి. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు సహకారం తక్కువ. ఫిబ్రవరి: తీర్థయాత్రలు చేస్తారు. సత్సాంగత్యం వలన లబ్ధి పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతోషాన్ని కలిగిస్తాయి. శుభకార్యాలు జరుగుతాయి. ఇష్టదైవ ధ్యానం శుభకరం. పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి విషయంలో ఆనందకరమైన పరిస్థితులు ఉంటాయి. ఋణాలు అవసరానికి అందుతాయి. పాత ఋణ సమస్యలను తెలివిగా అధిగమిస్తారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. మార్చి: ఎన్ని సమస్యలు ఉన్నా, ఓర్పుతో వ్యవహరిస్తారు. కుటుంబ సహకారంతో పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగ బదిలీల వల్ల అలసట, శారీరక శ్రమ ఉంటాయి. ఆర్ధిక విషయాలలో ఇతరులపై ఆధారపడవద్దు. మోసపూరిత పరిస్థితులు ఉంటాయి. -
తన రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ మీనా
-
నాలాగే ఒంటరిగా చాలామంది ఉన్నారు.. తప్పుగా రాయకండి: మీనా
బాలనటిగా వెండితెరపై రంగప్రవేశం చేసిన మీనా.. ఆ తర్వాత కొంతకాలానికే హీరోయిన్గానూ మారింది. దక్షిణాదిన ఎందరో స్టార్ హీరోలతో జోడి కట్టి తనదైన నటనతో కోట్లాదిమందిని తన అభిమానులుగా మార్చుకుంది. దాదాపు మూడు దశాబ్దాలపాటు అగ్రతారగా వెలుగొందింది. కెరీర్ పీక్స్లో ఉండగా వ్యాపారవేత్త విద్యాసాగర్ను పెళ్లాడింది. వీరికి నైనికా అనే పాప జన్మించింది. 2022లో మీనాను ఒంటరి చేస్తూ విద్యాసాగర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమెపై పలు పుకార్లు వ్యాప్తి చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఆమె పలుమార్లు వాటికి క్లారిటీ ఇచ్చింది.. అయినా కూడా ఆమెపై సోషల్ మీడియా దాడి తగ్గడం లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో హీరో ధనుష్తో మీనాకు లింక్ చేశారు. చాలామందితో సంబంధం అంటగట్టారు.. రెండో పెళ్లి అంటూ రూమర్స్ క్రియేట్ చేశారు. అవి చదివిన తన ఫ్యామిలీ ఎంత బాధపడుతుందని ఆమె పలుమార్లు చెప్పుకొచ్చింది. అయినా కూడా తాజాగా మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు రాయడం ప్రారంభించారు. దీంతో ఆమెకు ఓ ఇంటర్వ్యూలో రెండో పెళ్లి ప్రచారం గురించి మరోసారి ప్రశ్న ఎదురైంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇలాంటి రూమర్స్ని వైరల్ చేస్తున్నవారిపై మీనా ఆగ్రహం వ్యక్తం చేసింది. 'డబ్బు కోసం ఏమైనా రాస్తారా? సోషల్ మీడియా రోజు రోజుకు దిగజారిపోతుంది. వాస్తవాలు తెలుసుకుని రాయండి. వాస్తవాలు తెలుసుకొని రాస్తే.. అందరికీ మంచిది. దేశంలో నాలాగే ఒంటరిగా జీవించేవారు చాలామంది మహిళలు ఉన్నారు. నా తల్లిదండ్రులు, కూతురు భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి. ప్రస్తుతానికి రెండో పెళ్లి గురించి ఎటువంటి ఆలోచన లేదు. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటానో ఇప్పుడు ఎలా చెప్తాను. రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు ఉంటే తప్పకుండా నేనే మీడియాకు ప్రకటిస్తాను. అంతవరకు ఇలాంటి పుకార్లను ఎవరూ పట్టించుకోవద్దు.' అని చెప్పింది. -
సూపర్ హిట్ సినిమా అరుదైన ఘనత.. తొలి భారతీయ చిత్రంగా రికార్డ్!
మలయాళ బ్లాక్ బస్టర్ దృశ్యం మూవీకి అరుదైన ఘనత దక్కింది. ఈ సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఇంగ్లిష్, స్పానిష్లలో తెరకెక్కించన్నట్లు ప్రకటించింది. దీంతో హాలీవుడ్లో రీమేక్ కానున్న మొదటి భారతీయ చిత్రంగా దృశ్యం నిలవనుంది. ఈ చిత్రాన్ని మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత సీక్వెల్గా వచ్చిన దృశ్యం-2 కూడా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వెంకటేశ్ నటించగా.. భారీ హిట్ను సొంతం చేసుకుంది. హిందీలో అజయ్ దేవ్గణ్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే దృశ్యం సిరీస్ చిత్రాలను కొరియన్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా హాలీవుడ్కు చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యం సినిమాలను ప్రేక్షకులకు అందించనుంది. ఇండియన్ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ నుంచి అంతర్జాతీయ రీమేక్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది. దీంతో హలీవుడ్ దృశ్యంలో నటీనటులుగా ఎవరు కనిపించనున్నారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కాగా.. త్వరలోనే మలయాళంలో దృశ్యం 3 రానుంది. -
ఎక్స్పోజింగ్ పాత్రలు ఆయన వల్లే చేశా.. బయటకు రాలేకపోయా: మీనా
మీనా పేరు చెప్పగానే చాలా సూపర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి. 90ల్లో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. రజనీకాంత్, చిరంజీవి, వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. మంచి ఫామ్లో ఉండగానే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. కొన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వయసుకు తగ్గ పాత్రలు చేస్తోంది. మరోవైపు తమిళంలో ఓ రియాలిటీ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజా ఎపిసోడ్లో ఈమెకు బోల్డ్ రోల్స్, గ్లామర్ సీన్స్ గురించి ప్రశ్నలు ఎదురవగా.. పలు ఆసక్తికర విషయాల్ని మీనా బయటపెట్టింది. ఆయన సలహా వల్లే 'నేను నార్మల్ రోల్స్ ఎక్కువగా చేస్తూ వచ్చారు. అలాంటి సమయంలో నా చుట్టూ ఉన్నవాళ్లు గ్లామర్ రోల్స్ ఎందుకు ప్రయత్నించకూడదా అని అడిగారు. మరీ ముఖ్యంగా బోల్డ్ సీన్స్, స్విమ్ సూట్ వేసుకునే పాత్రలు చేయాలని.. కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ ప్రభుదేవా నాకు సలహా ఇచ్చాడు. అయితే కొన్నాళ్లకు అలాంటి ఛాన్స్ వచ్చింది. ప్రభుదేవాతో చేసిన సినిమాలో ఓ సీన్లో భాగంగా స్మిమ్మింగ్ డ్రస్ వేసుకున్నాను. కాకపోతే సిగ్గుతో మేకప్ రూమ్ నుంచి బయటకు రాలేకపోయాను' (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) వాళ్లకు దండం పెట్టాలి 'ఇక స్మిమ్మింగ్ డ్రస్ వేసుకున్న తర్వాత అసలు ఈ పరిస్థితి నుంచి ఎలా బయట పడతానో అని తెగ భయపడిపోయాను. ఏదేమైనా బోల్డ్ పాత్రల్లో నటించడం నిజంగా చాలా కష్టమైన పని. ఇంకా చెప్పాలంటే బోల్డ్ సీన్స్ చేసే హీరోయిన్ల పాదాలకు దండం పెట్టాలని అప్పుడే అనిపించింది' అని తనకెదురైన అనుభవాల్ని తాజాగా ఓ తమిళ షోలో చెప్పుకొచ్చింది. ఈ మధ్య కాలంలో 'దృశ్యం' సినిమాలతో పాటు పలు మలయాళ సినిమాల్లో కాస్త గుర్తింపు ఉన్న పాత్రలు చేస్తోంది. మరోవైపు ఈమె భర్త విద్యాసాగర్.. 2022లో అనారోగ్య సమస్యలతో చనిపోయారు. మీనా కూతురు కూడా 'తెరి' అనే తమిళ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) -
ధనుష్తో లింక్ చేశారు.. రెండో పెళ్లి గురించి..: మీనా
బాలనటిగా వెండితెరపై రంగప్రవేశం చేసింది మీనా. ఆ తర్వాత కొంతకాలానికే హీరోయిన్గానూ మారింది. దక్షిణాదిన ఎందరో స్టార్ హీరోలతో జోడి కట్టి వారి సరసన ఆడిపాడింది. దాదాపు మూడు దశాబ్దాలపాటు అగ్రతారగా వెలుగొందింది. కెరీర్ పీక్స్లో ఉండగా వ్యాపారవేత్త విద్యాసాగర్ను పెళ్లాడింది. వీరికి నైనికా అనే పాప జన్మించింది. గతేడాది మీనాను ఒంటరి చేస్తూ విద్యాసాగర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ బాధలో నుంచి నెమ్మదిగా కోలుకుని మళ్లీ సినిమాలు చేస్తూ బిజీ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పింది మీనా. ఒకే ఒక్కసారి అలాంటి డ్రెస్ 'అప్పట్లో చాలామంది హీరోయిన్స్ గ్లామర్ పాత్రలు చేస్తుండేవారు. నాకూ చేయాలనిపించేది. కానీ అంత కంఫర్ట్గా అనిపించేది కాదు. అయితే ఒకసారి ట్రై చేసి చూద్దామనుకున్నాను. అలా తమిళ సినిమాలో ఒకే ఒక్కసారి బికినీ వేసుకున్నాను. కానీ అప్పుడు చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను. అందుకే మళ్లీ అలాంటి డ్రెస్ వేసుకోలేదు. బాలీవుడ్లో ఒక్క సినిమా చేసేలోపు సౌత్లో నాలుగు చిత్రాలు చేయొచ్చని విన్నాను. ఇక్కడ బిజీ అవడంతో బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చినా అక్కడికి వెళ్లలేదు. నిన్నే పెళ్లాడతా నేను చేయాల్సింది గీతాంజలి సినిమాలో చిన్నపాపగా నేను చేయాల్సింది. కానీ అప్పుడు ఎగ్జామ్స్ ఉండటంతో అమ్మ ఒప్పుకోలేదు. అలా ఆ మూవీ మిస్ అయింది. నిన్నే పెళ్లాడతా సినిమాలో హీరోయిన్గా చేయాల్సింది. డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఒప్పుకోలేదు. నరసింహ సినిమాలో కూడా నేను చేయాల్సింది. అది కూడా మిస్ అయ్యాను. నా భర్తకు లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సింది. కానీ చికిత్స ఆలస్యం కావడంతో పరిస్థితి చేజారిపోయింది. తను వెళ్లిపోయిన బాధలో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఆయన చనిపోయిన రెండు నెలలకే నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ధనుష్తో లింక్ చేశారు హీరో ధనుష్తో లింక్ చేశారు. చాలామందితో సంబంధం అంటగట్టారు. అవి చదివి నా ఫ్యామిలీ ఎంత బాధపడుతుందనేది కూడా ఆలోచించట్లేదు! ఒకానొక సమయంలో నాకు చాలా కోపం వచ్చింది. మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందనేది నేను ఊహించలేను. ఇప్పట్లో మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మాత్రం అస్సలు లేదు. అలా అని జీవితాంతం ఒంటరిగా ఉంటానని చెప్పలేను. ఏం జరుగుతుందో చూద్దాం' అని చెప్పుకొచ్చింది మీనా. చదవండి: 'తల నరికితే రూ.కోటి'.. గట్టిగా బుద్ధి చెప్పనున్న వర్మ! -
టీడీపీ నేత బండారుపై సినీ నటి మీనా తీవ్ర ఆగ్రహం
-
మంత్రి రోజాకు మద్దతుగా మీనా.. బండారుపై కోర్టు చర్యలు తీసుకోవాలని..
సాక్షి, హైదరాబాద్: మంత్రి రోజాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సహ నటీమణులు, జాతీయస్థాయి నేతలు, పక్క రాష్ట్రాల నేతలు రోజాకు మద్దతుగా గళం విప్పుతున్నారు. ఇప్పటికే కుష్బూ, రాధిక వంటి నటీమణులు.. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజాగా నటి మీనా కూడా మంత్రి రోజాకు మద్దతుగా నిలిచారు. సత్యనారాయణ వెంటనే మంత్రి రోజాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా నటి మీనా ఓ వీడియోలో మాట్లాడుతూ.. మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు నీచమైన వ్యాఖ్యలు చేశారు. బండారు తక్షణమే మంత్రి రోజాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలి. బండారు ఎంత దిగజారుడు మనస్తత్వం ఉన్నవాడో అర్థమయ్యేలా ఉన్నాయి. అతని అభద్రత భావం, అసూయకి నిదర్శనం. మంత్రి రోజా సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి నాకు తెలుసు. ఆమెతో కలిసి నటించిన వ్యక్తిగా ఆమె గురించి నాకు పూర్తిగా తెలుసు. రోజా చాలా చిత్తశుద్ధితో హార్డ్ వర్క్ చేసే దృఢమైన మహిళ. రోజా నటిగా, తల్లిగా, రాజకీయ నాయకురాలిగా, మహిళగా అన్నింటిలోనూ సక్సెస్ అయిన వ్యక్తి. ఆమెపై ఇలా నీచంగా మాట్లాడితే రోజా భయపడుతుంది అనుకుంటున్నారా?. మంత్రి రోజా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడే హక్కు బండారు సత్యనారాయణకి ఎవరిచ్చారు. ఇలా మాట్లాడినంత మాత్రాన మహిళలు భయపడి పోతారు అనుకుంటున్నవా?. మంత్రి రోజా చేసే పోరాటానికి నేను అండగా ఉంటాను అని మీనా.. మంత్రి రోజాకు తన మద్దతు ప్రకటించారు. -
12 గంటల్లోనే తల్లిదండ్రుల చెంతకు..
తిరుపతి క్రైం: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న ఓ బాలుడు తెల్లవారుజామున కిడ్నాప్ కాగా... 12 గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించి తిరిగి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసు వివరాలను మంగళవారం తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డి మీడియాకు వివరించారు. చెన్నైకి చెందిన చంద్రశేఖర్, మీనా దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి సోమవారం అర్ధరాత్రి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లోని చెన్నై ప్లాట్ఫాం వద్ద నిద్రపోయారు. తెల్లవారుజామున మెలకువ వచ్చి చూడగా, రెండో కుమారుడు అరుల్ మురుగన్(2) కనిపించలేదు. దీంతో వెంటనే తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి డీఎస్పీ సురేందర్రెడ్డి, క్రైం డీఎస్పీ రవికుమార్, సీఐ మహేశ్వర్రెడ్డి నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు వెంటనే బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. సీపీ ఫుటేజ్ ఆధారంగా బాలుడిని తెల్లవారుజామున 2.12 గంటలకు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిని అవిలాల సుధాకర్గా నిర్ధారించుకుని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో అవిలాల సుధాకర్ కిడ్నాప్ చేసిన బాలుడిని ఏర్పేడు మండలంలోని మాల గ్రామంలో తన అక్క నెల్లూరి ధనమ్మ వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టినట్టుగా సమాచారం అందింది. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో పోలీసులు వెళ్లి బాలుడిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు సుధాకర్తోపాటు ధనమ్మ, మరికొందరిని ఈస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని సమగ్రంగా విచారణ చేపడుతున్నారు. -
జడ్జిపై టీడీపీ నేతల పోస్టులు.. రాష్ట్రపతి భవన్ నుంచి సీరియస్ లేఖ
సాక్షి, ఢిల్లీ: రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు విచారిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి రాష్ట్రపతి భవన్ నుంచి లేఖ రాసింది. రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పీసీ మీనా.. జవహర్ రెడ్డికి లేఖ రాశారు. అయితే, చంద్రబాబు కేసులో భాగంగా అడిషనల్ సెషన్స్ జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు వెళ్లింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అడ్వకేట్ రామానుజరావు ఈ-మెయిల్ ద్వారా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. కాగా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును రిమాండ్కు పంపించిన తర్వాత హిమబిందు వ్యక్తిగత జీవితంపై టీడీపీ నేతలు వివాదస్పదంగా వ్యవహరించారు. హిమబిందు వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని రామానుజరావు తన ఫిర్యాదు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రామానుజరావు ఫిర్యాదు రాష్ట్రపతి భవన్ స్పందించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి రాష్ట్రపతి భవన్ నుంచి లేఖ రాసింది. జడ్జి హిమబిందుకు సంబంధించిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని జవహర్రెడ్డికి పీసీ మీనా లేఖ రాశారు. ఇది కూడా చదవండి: ‘బ్లూజీన్’ ద్వారా కోర్టులో చంద్రబాబు హాజరు -
రెండో పెళ్లి చేసుకోమని మీనాకు సలహా.. నటి ఏమందంటే?
సినిమా ఇండస్ట్రీలో కొత్త నీరు రాగానే పాత నీరు వెళ్లిపోతుందంటారు. హీరోయిన్లు మారుతుంటారు, కానీ హీరోలు మాత్రం దాదాపు అలాగే ఉండిపోతారు. కానీ కొందరు హీరోయిన్లు వారి క్రేజ్ను కాపాడుకుంటూ పరిశ్రమలో ఏళ్లకు ఏళ్లు నిలదొక్కుకుంటారు. అలాంటివారిలో మీనా ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన మీనా స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. స్టార్ హీరోలతో ఆడిపాడిన ఈమె ఇప్పటికీ చేతినిండా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉంది. కుంగిపోయిన మీనా కెరీర్ పీక్స్లో ఉండగా మీనా 2009లో బెంగళూరుకు చెందిన బిజినెస్మెన్ విద్యాసాగర్ను పెళ్లాడింది. వీరికి నైనిక అనే కూతురు జన్మించింది. అటు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా సంతోషంగా సాగిపోతున్న మీనా జీవితం గతేడాది ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. గత సంవత్సరం జూన్లో ఆమె భర్త విద్యాసాగర్ మరణించడంతో తీవ్రంగా కుంగిపోయింది. నెమ్మదిగా ఆ బాధ నుంచి కోలుకుని సినిమాలతో బిజీ అవుతున్న తరుణంలో మీనా రెండో పెళ్లి చేసుకోనుందని వార్తలు వచ్చాయి. కానీ అవి ఉట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి. అప్పుడు మీనా దగ్గరే ఉన్నా తాజాగా ఈ వ్యవహారంపై మీనా స్నేహితురాలు కాలా మాస్టర్ స్పందించింది. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నాకు మీనాతోనే కాదు, ఆమె కుటుంబంతోనూ మంచి అనుబంధం ఉంది. మేము ఫ్రెండ్స్గా కంటే కూడా అక్కాచెల్లెలిగానే ఎక్కువ కలిసిపోయాం. తనకు ఏ అవసరం వచ్చినా వెంటనే నేను అక్కడ వాలిపోతాను. విద్యాసాగర్ ఆరోగ్యం బాలేనప్పుడు మూడు నెలలపాటు నేను తన దగ్గరే ఉన్నాను. కానీ జరగకూడనిది జరిగిపోయింది. ఆ బాధ నుంచి బయటకు రావడానికి.. తను ఎప్పుడైనా ఉన్నట్లుండి ఫోన్ చేసినా కూడా భయమేసేది. ఆ మూడు నెలలు ముళ్ల మీదే ఉన్నట్లనిపించింది. మీనా భర్త మరణించాక ఆమెను సాధారణ స్థితికి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. జీవితం ఇంకా చాలా ఉంది, ఆ బాధ నుంచి బయటకు రావాలని ఏవేవో చెప్పేదాన్ని. తను కూడా నేను చెప్పేది కరెక్టేనని తలూపుతూనే ఈ విషాదం నుంచి బయటకు రావడం ఎంత కష్టంగా ఉందో మాటల్లో చెప్పలేనని బాధపడేది. పెళ్లి ప్రస్తావన తెస్తే కోప్పడేవారు తర్వాత నెమ్మదిగా తను ఒప్పుకున్న సినిమాల కోసం సెట్స్కు రావడం మొదలుపెట్టింది. అప్పుడు తనతోపాటు నేను కూడా తిరిగి మామూలు మనుషులమయ్యాం. మీనా తల్లి గురించి తలుచుకుంటేనే బాధేసేది. మీనాది మరీ అంత పెద్ద వయసు కాదు కాబట్టి మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పాను. కానీ వాళ్లు నాతో గొడవపడేవారు. ముందు నీ పని నువ్వు చూసుకో లేదంటే సైలెంట్గా ఉండు అని నా నోరు మూయించేవాళ్లు. తనకు కూతురు ఉందని, అంతకుమించి ఎటువంటి రిలేషన్స్ కోరుకోవడం లేదని మీనా నాతో అంది' అని చెప్పుకొచ్చింది ఆమె స్నేహితురాలు. చదవండి: పూజలు, మొక్కులు పెళ్లి కోసమేనా..? .. అనుష్క ఆన్సర్ ఇదే! -
మృగశిర కార్తెలో ‘మీనం‘ దివ్యౌషధం
సాక్షి, అమలాపురం: భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక్కో కార్తెలో ఒక్కో రకం ఆహారం తీసుకోవడం ఆనవాయితీ. ఇటువంటి ఆహారపు అలవాట్లు ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా ఆరోగ్యానికి మేలు చేసేవి కావడం విశేషం. ఒక్కో మాసంలో ఒక్కో రకం ఆహారం తీసుకోవడం గోదావరి వాసులకు సంప్రదాయంగా, ఆనవాయితీగా వస్తోంది. వీటిలో పండ్లు, కూరగాయల వంటి శాకాహారమే కాదు. చేపల వంటి మాంసాహారాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత మృగశిర కార్తెలో చేపలు ఆహారంగా తీసుకోవడం కూడా ఈ ఆనవాయితీల్లో ఒకటి. మృగశిర కార్తె రోజుల్లో చేపలు తినడం ఆరోగ్యానికి మేలని నమ్మకం. రోళ్లు పగిలే స్థాయిలో ఎండలను మోసుకొచ్చిన రోహిణీ కార్తె ముగిసిన వెంటనే మృగశిర మొదలవుతుంది. తొలకరి వర్షాలు ఆరంభమవుతాయి. ఈ క్రమంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా అనేక హానికర సూక్ష్మ క్రిముల వంటివి ఉత్పత్తి అవుతాయి. ఇటువంటి వాతావరణంలో రోగ నిరోధక శక్తి తగ్గి జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేపలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఇటువంటి అనారోగ్యాల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాసీ్త్రయంగా కూడా నిరూపితమైంది. ఈ సీజన్లోనే హైదరాబాద్లో బత్తిని గౌడ్ సోదరులు ‘చేప ప్రసాదం’ ఇస్తూంటారు. దీనివల్ల ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయని విశ్వసిస్తారు. రుచిలో మిన్న.. గోదారి చేప నెల్లూరు అంటే కేవలం చేపల పులుసు మాత్రమే గుర్తుకు వస్తుంది. అదే గోదారి జిల్లాలంటే పులస చేపల పులుసు ఒక్కటే కాదు.. ఇక్కడ దొరికే రకరకాల చేపలు.. వాటితో తయారు చేసే రకరకాల వంటలు గుర్తుకొస్తాయి. గోదావరి నీటి మాహాత్మ్యమో.. లేక వండటంలో గొప్పతనమో చెప్పలేం కానీ గోదావరి చేప కూరలు తినాల్సిందేనని మాంసాహార ప్రియులు లొట్టలు వేసుకుంటూ చెబుతారు. చందువా వేపుడు, పండుగొప్ప ఇగురు, కొర్రమేను కూర, కొయ్యింగల పులుసు, గుమ్మడి చుక్క, కోన చేపల డీప్ ఫ్రై వంటివి తింటే జిహ్వ వహ్వా అనాల్సిందే. పెద్ద చేపల్లోనే కాదు.. చిన్న వాటిల్లో పచ్చి మెత్తళ్ల మామిడి, ఎండు మెత్తళ్ల వేపుడు, కట్టి చేపలు, బొమ్మిడాయిల పులుసు, రామల ఇగురు, చింతకాయ చిన్న చేపలు, చీరమేను కూరలకు ఫిదా కాని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఈ చేపలతో పులుసులు, కూరలు, ఇగురులు, వేపుళ్ల వంటివి చేయడంలో గోదావరి వాసులు సిద్ధహస్తులు. ఇక ఉప్పు చేప పప్పుచారు, ఆర్చిన చేప ఇగురు, టమాటా రసం తినాలే కానీ వర్ణించేందుకు మాటలు చాలవు. ఇవే కాదు జెల్లలు, మాతలు, గొరకలు, బొచ్చు, శీలావతి, మోసు, గోదావరి ఎర్రమోసు, వంజరం, గులిగింతలు, మట్టకరస ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి నగరాల్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఒక్కటే కాదు.. గోదారోళ్ల చేపల పులుసు, గోదావరి చేపల కూరల పేరుతో రెస్టారెంట్లు కూడా వెలిశాయంటే ఇక్కడ వండే రకాలకు ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. లెక్కకు మిక్కిలిగా ఔషధ గుణాలు ► చేపల్లో ఔషధ గుణాలు అపారంగా ఉంటాయి. ► ఇందులోని ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు ఆరోగ్యాన్నిస్తాయి. రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ను నియంత్రిస్తాయి. గుండె జబ్బులు, ఆస్తమా తదితర అనారోగ్య సమస్యలకు అడ్డుకట్ట వేయాలంటే చేపలు తినాలని వైద్యులు చెబుతారు. ► మనిషి తన రోజువారీ కార్యకలాపాలు సాఫీగా సాగించేందుకు మెదడులో న్యూరాన్లతో కూడిన గ్రే మ్యాటర్ ఉంటుంది. చేపలు తింటే ఇది మరింత చురుకుగా పని చేస్తుంది. ► వయస్సు మీద పడుతున్న సమయంలో మెదడులోని కణాల క్షీణతను నిరోధించడానికి చేపల ఆహారం తోడ్పడుతుంది. దీనివల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ► టైప్–1 డయాబెటిస్ను నియంత్రిస్తుంది. ► చేపలు తింటే దృష్టి లోపాలు, అంధత్వం వంటివి తగ్గుతాయి. ► గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే సీ్త్రలకు చేపలు తినడం ఎంతో మేలు. ► చిన్న పిల్లలకు సరిపడే స్థాయిలో పాలు ఇవ్వలేనప్పుడు బాలింతలకు మెత్తళ్ల కూర వండి పెట్టడం సర్వసాధారణం. అలాగే బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న వారికి పచ్చి మెత్తళ్లతో పాటు, ఎండు మెత్తళ్లు, చిన్న చేపలు (చేదు చేపలు) పత్యంగా అందిస్తారు. సొరచేపల ద్వారా శృంగార సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతారు. చేపలు.. కోకొల్లలు మాంసాహారులకు కార్తెతో సంబంధం లేదు. ఏడాది పొడవునా చేపలను ఆహారంగా తీసుకుంటారు. గోదావరి జిల్లాల్లో కూడా చేపలకు కొదవే లేదు. విస్తారమైన సముద్రం, అఖండ గోదావరితో పాటు నదీపాయలు, డెల్టా పంట కాలువలు, పర్రభూములు, మెట్టలో సాగునీటి చెరువులు, ప్రాజెక్టులు.. ఏజెన్సీని ఆనుకుని ఉండే సహజసిద్ధమైన చెరువులు (ఆవలు).. ఆపై వేలాది ఎకరాల్లో చేపల సాగు.. ఇలా ఎటు చూసినా రకరకాల చేపలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కొన్ని రకాల చేపలు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతూంటాయి. -
పీవీఆర్ సౌత్ వైస్ ప్రెసిడెంట్ అన్స్టాపబుల్ పేరుతో ఆటోబయోగ్రఫీ
పీవీఆర్ సంస్థ దక్షిణాది నిర్వాహకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మీనా చాబ్రియా తన జీవిత చరిత్రను అన్ స్టాపబుల్ పేరుతో రాసుకున్నారు. ఈ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం చైన్నె, రాయపేటలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటి ఐశ్వర్య రాజేష్, మైక్ సెట్ శ్రీరామ్, ఆటో అన్నాదురై, నిర్మాత యువరాజ్ గణేశన్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై నటి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ ఈ వేడుకలో పాల్గొనే ముందు తాను మీనా చాబ్రియా గురించి తెలుసుకోదలచానన్నారు. దీంతో ఆమెకు ఫోన్ చేసి అడిగి తెలుసుకుని ఆశ్చర్యపోయానన్నారు. 17 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని 20 ఏళ్ల వయసులోనే విడాకులు పొందిన ఇద్దరు పిల్లల తల్లి ఇంత ఉన్నత స్థానానికి ఎదగడం చూస్తే.. తనకు తన తల్లి జ్ఞాపకం వచ్చిందన్నారు. సినిమా రంగంలోకి తాను ప్రవేశించిన కొత్తలో నటిగా నువ్వు ఏం చేస్తావు? అని పలువురు ఎగతాళి చేశారన్నారు. అయితే అలాంటి అవమానాలను దాటి ఎదిగి తాను అన్ స్టాపబుల్ గా నిలిచానన్నారు. దీన్ని పేరుగా పెట్టిన మీనా చాబ్రియా రాసిన పుస్తకం మంచి సక్సెస్ కావాలని పేర్కొన్నారు. తాను పుస్తకాలు ఎక్కువగా చదవనని, అయితే ఈ పుస్తకాన్ని చదవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇకపోతే తాను మహిళ ఇతివృత్తంతో కూడిన చిత్రాల్లో నటించడం వల్ల తనకు పురుషులంటే ద్వేషం అని భావించరాదన్నారు. తనను స్త్రీ పక్షపాతివా అని కూడా అడుగుతున్నారన్నారు. నిజానికి అలాంటిదేమీ లేదని చెడు అనేది స్త్రీలలోనూ, పురుషుల్లోనూ ఉంటుందని నటి ఐశ్వర్యా రాజేష్ అభిప్రాయపడ్డారు. -
కొరియాలో దృశ్యం
భారతీయ ‘దృశ్యం’ కొరియా తెరపైకి వెళ్లనుంది. మోహన్లాల్ హీరోగా, మీనా, ఆశా శరత్, అన్సిబా హాసన్, సిద్ధిఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘దృశ్యం’. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించిన ఈ చిత్రం 2013లో విడుదలై అద్భుత విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ రీమేక్ అయి హిట్ అయింది. ‘దృశ్యం’ తర్వాత మోహన్లాల్–జీతూజోసెష్ కాంబోలో వచ్చిన ‘దృశ్యం 2’ కూడా వీక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఇక దృశ్యం సినిమా హిందీ రీమేక్లో అజయ్ దేవగన్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. కాగా ‘దృశ్యం’ ఫ్రాంచైజీ కొరియాలో రీమేక్ కానుంది. సౌత్ కొరియా ఆంథాలజీ స్టూడియోస్, ఇండియన్ పనోరమ స్టూడియోస్ పతాకాలపై చోయ్ జే వోన్, కుమార్ మంగత్ పాఠక్ హిందీ ‘దృశ్యం’ ని కొరియాలో రీమేక్ చేయనున్నారు. ఫ్రాన్స్లో జరుగుతున్న 76వ కాన్స్ చలన చిత్రోవత్సాల్లో ఈ విషయాన్ని చోయ్ జే, మంగత్ పాఠక్ ప్రకటించారు. ఇండియన్, కొరియన్ ప్రొడక్షన్ హౌస్లు కలిసి ఓ సినిమాను నిర్మిస్తుండటం ఇదే తొలిసారి. ‘‘సాధారణంగా కొరియన్ చిత్రాలు భారతీయ భాషల్లో రీమేక్ అవుతుంటాయి. కానీ, ఇప్పుడు ఓ ఇండియన్ సినిమా కొరియాలో రీమేక్ అవుతుంది’’ అన్నారు పాతక్. -
అమ్మ గురించి అలాంటివీ రాయొద్దు.. మీనా కూతురు ఎమోషనల్
చైల్డ్ ఆర్టిస్ట్గా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన నటి మీనా. దాదాపు మూడు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్గా రాణించింది. కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి అగ్ర హీరోలందరితో నటించింది. కెరీర్ పీక్స్లో ఉండగానే 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్ను పెళ్లాడింది. వీరి ప్రేమకు గుర్తుగా నైనికా అనే పాప కూడా జన్మించింది. అయితే గతేడాది జూన్లో ఆమె భర్త మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ.. ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా.. మీనా ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా గత నెలలో చెన్నైలో మీనాకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ తారలు కూడా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఎమోషనలయ్యారు. మీనా కూతురు నైనిక మాటలకు రజినీకాంత్, పలువురు సినీ తారలు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగ రిలీజ్ చేశారు. నైనిక మాట్లాడుతూ.. 'అమ్మా.. నువ్వు ఈ స్థాయికి వచ్చినందుకు నేను గర్విస్తున్నా. ఒక నటిగా నువ్వు కష్టపడుతూనే ఉంటావు. ఒక అమ్మగా నన్ను ప్రతిక్షణం జాగ్రత్తగా చూసుకుంటావు. నా చిన్నప్పుడు ఓ షాపింగ్ మాల్కు వెళ్లాం. మీతో చెప్పకుండా ఇంకో షాప్కు వెళ్లిపోయి చాక్లెట్స్ తింటూ కూర్చున్నా. ఆరోజు నువ్వు ఎంత టెన్షన్ పడ్డారో నాకిప్పుడు అర్థమవుతోంది. అందుకు నన్ను క్షమించు. నాన్న చనిపోయాక డిప్రెషన్కు గురయ్యావు. నువ్వు మానసికంగా దెబ్బతిన్నావు. ఇక నుంచి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా. ఇటీవల ప్రముఖ న్యూస్ ఛానెల్స్లో నీ గురించి ఫేక్ వార్తలు రాస్తున్నారు. మా అమ్మ కూడా మనిషే కదా. ఆమెకు ఫీలింగ్స్ ఉంటాయి. దయచేసి ఇలాంటి వార్తలు రాయొద్దు.' అంటూ విజ్ఞప్తి చేసింది. ఈ వీడియో చూసిన తలైనా రజినీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర సెలబ్రిటీలు సైతం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ వేడుకలో రజనీకాంత్, బోనీకపూర్, రాధిక, రోజా, సంఘవి, స్నేహా, జూనియర్ శ్రీదేవి, ప్రభుదేవా పాల్గొన్నారు. அம்மா வந்து ஒரு Heroine ah இருக்கலாம்.. ஆனா உங்கள மாதிரி ஒரு Human தான்.. அவங்களுக்கும் Feelings இருக்கு 🥲❤️❤️ #meena #nainika #meena40 #ladysuperstar #மீனா pic.twitter.com/rYZA4Avrk2 — Kamala மீனா (@MeenaNavy) April 22, 2023 -
తమిళ స్టార్ హీరోతో మీనా రెండో పెళ్లి..?
-
తమిళ స్టార్ హీరోతో మీనా రెండో పెళ్లి!: నటుడు సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ నటి మీనా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. గతేడాది జూన్లో భర్త విద్యాసాగర్ను కోల్పోయిన మీనా ఆ బాధ నుంచి తేరుకోవడానికి వరుసగా షూటింగ్స్లో పాల్గొంటుంది. చాలా గ్యాప్తో తర్వాత ఇటీవల విడుదలైన తెలుగు చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మీనా తమిళం, మలయాళంలోనూ పలు చిత్రాలకు సైన్ చేసింది. ఇదిలా భర్తను కొల్పోయిన బాధలో ఉన్న మీనాపై సోషల్ మీడియాలో రకరకాలు పుకార్లు వినిపిస్తున్నాయి. చదవండి: అప్పట్లోనే సొంత హెలికాప్టర్, వేల కోట్ల ఆస్తులు.. నటి కేఆర్ విజయ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఆమె రెండో పెళ్లికి సిద్ధమైందంటూ కొద్ది రోజులుగా నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తన పెళ్లి వార్తలపై స్పందించిన మీనా తీవ్రంగా ఖండిచింది. అయినప్పటికీ ఆమె రెండో పెళ్లికి సంబంధించిన రూమర్స్కు మాత్రం చెక్ పడటం లేదు. తాజాగో ఓ సినీ క్రిటిక్, నటుడు తమిళ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో మీనా రెండో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. మీనా త్వరలోనే ఓ తమిళ స్టార్ హీరోను పెళ్లి రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ హీరో పాన్ ఇండియా స్టార్ అని, గతేడాది భార్యతో విడాకులు తీసుకున్ని విడిపోయాడంటూ హింట్ ఇచ్చాడు. అంతేకాదు ఆ హీరో మీనా కంటే చిన్నవాడని, నిశ్చితార్థానికి కూడా ముహుర్తం పెట్టుకున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్ కోలీవుడ్లో హాట్టాపిక్గా నిలిచాయి. సోషల్ మీడియాలో అతడి వ్యాఖ్యలు వైరల్ అవుతుండటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అతడి కామెంట్స్ని కొట్టిపారేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం ఎలా చేస్తారు?’,‘ఏదైనా చెబితే నమ్మే విధంగా ఉండాలి’ అంటూ సదరు ఫిలిం క్రిటిక్కు చురకలు అట్టిస్తున్నారు. చదవండి: నాటు నాటుకు ఆస్కార్.. అజయ్ దేవగన్ షాకింగ్ కామెంట్స్ కాగా గతంలోనే మీనా తాను తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని మీనా ఇటీవల ఓ ఇంటర్య్వూలో తేల్చి చెప్పిన సంగతి తెలిసింది. ఓ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్యూలో మీనాకు రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నా భర్త చనిపోయినప్పటి నుంచి సోషల్ మీడియాలో నా గురించి ఆసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. బాధలో ఉన్న నాకు ఇలాంటి వార్తలు మరింత బాధిస్తున్నాయి. అసలు నాకు మరో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు’ అంటూ మీనా కుండ బద్దలు కొట్టారు. -
రాజస్తాన్లోనూ ఏపీ తరహా రైతు సేవలు
సాక్షి, అమరావతి: ఏపీలో రైతులకు అందిస్తున్న సేవలు అద్భుతమని.. తమ రాష్ట్రంలో కూడా వాటి అమలుకు కృషి చేస్తామని రాజస్తాన్ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. గతేడాది జూలైలో ఏపీలో పర్యటించిన రాజస్తాన్ వ్యవసాయ శాఖ మంత్రి లాల్చంద్ కటారియా ఆర్బీకే ద్వారా అందిస్తోన్న సేవలపై ప్రశంసలు కురిపించారు. ఈ తరహా సేవలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు.. త్వరలోనే ఉన్నతాధికారుల బృందాన్ని పంపిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర సీడ్ మార్కెటింగ్ చీఫ్ మేనేజర్ కేసీ మీనా నేతృత్వంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు అజయ్కుమార్ పచోరి, రాకేశ్ కుమార్ అతల్, దన్వీర్ వర్మ, తారాచంద్ బోచా లియా ఏపీకి వచ్చారు. బుధవారం గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్ను సందర్శించి.. వాటి పనితీరును అ«ధ్యయనం చేశారు. రాజస్తాన్లోని కాల్ సెంటర్ను కూడా ఏపీలో మాదిరిగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్బీకే చానల్ నిర్వహణ, రైతు భరోసా మ్యాగజైన్, ఈ క్రాప్ నమోదు చాలా వినూత్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. మరో 2 రోజుల పాటు ఆర్బీకే, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్, ఇతర సేవలను అధ్యయనం చేసి.. తమ రాష్ట్రంలో కూడా ఈ తరహా సేవల అమలు కోసం నివేదిక అందజేస్తామన్నారు. పర్యటనలో ఆర్బీకేల జాయింట్ డైరెక్టర్ వల్లూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ హీరో అంటే క్రష్.. పెళ్లి రోజు నా గుండె పగిలింది: మీనా
చైల్డ్ ఆర్టిస్ట్గా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోయిన్గా ఎదిగిన నటి మీనా. దాదాపు మూడు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్గా రాణించింది. కమలహాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. కెరీర్ పీక్స్లో ఉండగానే 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్ను పెళ్లాడింది. వీరి ప్రేమకు గుర్తుగా నైనికా అనే పాప జన్మించింది. గతేడాది జూన్లో ఆమె భర్త మృతి చెందిన సంగతి తెలిసిందే. భర్తను కోల్పోయిన దుఃఖం నుంచి ఈమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ.. ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే మీనా ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా ఓ తమిళ చానెల్కు ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. పెళ్లికి ముందు తనకు ఓ బాలీవుడ్ హీరో అంటే క్రష్ ఉండేదని, అలాంటి వ్యక్తినే వివాహం చేసుకుంటానని అమ్మతో చెప్పానని మీనా అన్నారు. మీనా మనసు పడ్డ హీరో ఎవరో కాదు... బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్. హృతిక్పై తనకు ఉన్న ప్రేమ గురించి చెబుతూ.. ‘హృతిక్ రోషన్ను చాలా ప్రేమించాను. నాకు హృతిక్ లాంటి అబ్బాయి కావాలి అని పెళ్లి ప్రపోజ్ చేస్తున్న మా అమ్మతో చెప్పాను. హృతిక్ పెళ్లి రోజు నా గుండె పగిలింది. అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు’ అని మీనా చెప్పుకొచ్చింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మీనా 40 ఏళ్ల సినీ ప్రయాణం.. స్టార్స్ గ్యాదరింగ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా!
‘‘ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తటానికే ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ తీశాం. తెరమీద పాత్రలు మిమ్మల్ని (ప్రేక్షకులు) నవ్విస్తుంటే.. మీరు నవ్వుతూ ఉంటే చూసే రోజు కోసం(3వ తేదీ) ఎదురు చూస్తున్నాను’’ అని డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. సోహైల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదల కానుంది. మంగళవారం నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘మా మూవీ ట్రైలర్కి ఇక్కడున్న వారు కొట్టిన చప్పట్లతో సినిమా విజయంపై మరింత విశ్వాసం పెరిగింది. ఈ సినిమాకు అన్నీ చక్కగా కుదిరాయి’’ అన్నారు. నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ–‘‘నా దృష్టిలో తరాలు మారొచ్చు కానీ సినిమా అనేది నిరంతరం సాగే ప్రపంచం. మనసున్న ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చేలా సన్నివేశాలు తీశారు కృష్ణారెడ్డిగారు’’ అన్నారు. ‘‘ఇప్పటి ట్రెండ్ను ఫాలో అవుతూ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కృష్ణారెడ్డిగారు’’ అని కె. అచ్చిరెడ్డి అన్నారు. ‘‘హీరోగా నిరూపించుకోవడానికి నాకు వచ్చిన మంచి అవకాశం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ చిత్రం అని గర్వంగా చెబుతున్నాను’’ అన్నారు సోహైల్. -
మామ.. అల్లుడు వస్తున్నారు
సోహెల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. కె.అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమాని మార్చి 3న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘ఫ్యామిలీ, యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
క్యారెక్టర్ ఉంటే తిరుగుండదు
‘‘యాక్టర్ కావటానికి నటన తెలిస్తే చాలు.. కానీ, సక్సెస్ఫుల్ యాక్టర్ కావాలంటే తప్పకుండా క్యారెక్టర్ కావాలి.. అది ఉంటే తిరుగుండదని ఈ తరం నటీనటులకు చెబుతున్నాను. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సోహైల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమా మార్చిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘వినోదం’ సినిమా తర్వాత నేను చేసిన కంప్లీట్ కామెడీ మూవీ ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ప్రేక్షకుల నవ్వులు చూసేందుకు ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. మీనా మాట్లాడుతూ– ‘‘రాజేంద్రప్రసాద్గారితో 30ఏళ్ల తర్వాత ఈ మూవీలో చేశాను. కృష్ణారెడ్డిగారితో సినిమా చేసే అవకాశం ఇన్నేళ్లకు కుదిరింది. తొలిసారి ఒక లేడీ ప్రొడ్యూసర్తో (కల్పన) పని చేయడం హ్యాపీ’’ అన్నారు. ‘‘ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అన్నారు కె. అచ్చిరెడ్డి. ‘‘ఈ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు సోహైల్. -
హైదరాబాద్లో ‘కళాతపస్వికి కళాంజలి’ కార్యక్రమం (ఫొటోలు)
-
భర్త చనిపోయాక తొలిసారి అలా కనిపించిన మీనా..
బాలనటిగా తెరంగేట్రం చేసిన మీనా ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అగ్రహీరోలందరితోనూ నటించి దక్షిణాది ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. నటిగా మంచి ఫామ్లో సమయంలో 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్ను పెళ్లాడింది. వీరి ప్రేమకు గుర్తుగా నైనికా అనే పాప జన్మించింది. ఓపక్క కుటుంబాన్ని చూసుకుంటూనే సినిమాలు చేస్తున్న మీనా జీవితంలో గతేడాది పెను విషాదం చోటుచేసుకుంది. గతేడాది జూన్ నెలలో ఆమె భర్త కన్నుమూశారు. ఎప్పుడూ బిజీగా ఉంటూ ఆ బాధ నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తోంది మీనా. సినిమాలకు కూడా సైన్ చేసి షూటింగ్స్లో పాల్గొంటోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఫోటోలు, రీల్స్ షేర్ చేస్తూ తిరిగి నార్మల్ అవడానికి ట్రై చేస్తోంది. అయితే భర్త చనిపోయాక మొదటిసారి డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. సీనియర్ హీరోయిన్ సంఘవితో కలిసి ఓ పాటకు స్టెప్పులేసింది. దీన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) చదవండి: నీ ప్రేమను ఎవరూ భర్తీ చేయలేరు: విష్ణుప్రియ రెండుసార్లు బ్రేకప్.. అది బ్లాక్డే అంటున్న బ్యూటీ -
పెను విషాదం తర్వాత చిన్న గ్యాప్.. మళ్లీ కెమెరా ముందుకు మీనా
నటి మీనా చిన్న విరామం తరువాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె ఆ తరువాత తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో అగ్ర కథానాయిగా రాణించిన విషయం తెలిసిందే. కాగా ఈమె నటిగా ఫుల్ఫామ్లో ఉండగానే విద్యాసాగర్ అనే బెంగళూరుకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి నైనిక అనే కూతురు కూడా ఉంది. అలాంటిది నటి మీన జీవితంలో ఇటీవల పెను విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్ ఈ ఏడాది కరోనా కారణంగా అనారోగ్యానికి గురై కన్నుమూశారు. దీంతో నటి మీనా బాధ నుంచి కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. ఆ మధ్య నటి కుష్భు, సంఘవి, రంభ తదితరులు ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. కాగా ఇటీవల మానసిక వేదన నుంచి బయటపడటానికి నటి మీనా విదేశీ పర్యటన చేసి వచ్చారు. దీంతో కాస్త తేరుకున్న ఆమె మళ్లీ చిత్రాలలో నటించడానికి సిద్ధమయ్యారు. గతంలో అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయడానికి రెడీ అవుతున్నారు. అలా ఆమె తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ఒక్కో చిత్రం చేయాల్సి ఉంది. దీంతో పాటు మలయాళంలో మోహన్లాల్ సరసన దృశ్యం–3 చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం మీనా ఒక ప్రచార చిత్రంలో నటిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. చదవండి: (నాకు బలహీనతలు ఉన్నాయ్.. ఆ కామెంట్స్ చాలా బాధించాయి) -
మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందా? ఆమె క్లోజ్ఫ్రెండ్ ఏమందంటే..
టాలీవుడ్ నటి మీనా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలె భర్త విద్యాసాగర్ను కోల్పోయిన మీనా ఆ బాధ నుంచి తేరుకోవడానికి వరుస షూటింగ్స్లో పాల్గొంటుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు సినిమాలకు ఆమె సైన్ చేసింది. ఇదిలా ఉండగా గత రెండు, మూడు రోజులుగా మీనా రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. తల్లిదండ్రుల ఒత్తిడి, కూతురి భవిష్యత్తును దృష్టిని ఉంచుకొని మీనా రెండో పెళ్లికి ఒకే చెప్పిందంటూ వార్తలు వైరల్ అవతున్నాయి. ఈ విషయం మీనా చెవిన కూడా పడిందట. దీంతో ఇలాంటి రూమర్స్ని వైరల్ చేస్తున్నందుకు మీనా ఆగ్రహం వ్యక్తం చేసిందట. 'డబ్బు కోసం ఏమైనా రాస్తారా? సోషల్ మీడియా రోజు రోజుకు దిగజారిపోతుంది. వాస్తవాలు తెలుసుకుని రాయండి. నా భర్త చనిపోయినప్పుడు కూడా సోషల్ మీడియాలో రకరకాల తప్పుడు ప్రచారాలు చేశారు. తనపై అసత్య వార్తలు రాస్తే వాళ్లపై చర్యలు తీసుకుంటా' అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక మీనా రెండో పెళ్లిపై వస్తున్న వార్తలను ఆమె క్లోజ్ఫ్రెండ్ ఒకరు తీవ్రంగా ఖండించారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, ఒకవేళ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మీనానే స్వయంగా ప్రకటిస్తుందని, పుకార్లు సృష్టించొద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు. -
రెండో పెళ్లికి సిద్ధమవుతున్న మీనా.. వరుడు అతడే?
నటి మీనా రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. బాలనటిగా తెరంగేట్రం చేసిన నటీమణుల్లో ఈమె ఒకరు. ఆ తర్వాత కథానాయిక స్థాయికి ఎదిగిన మీనా 1990 దశకంలో అగ్ర కథానాయికగా రాణించారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అగ్రహీరోల సరసన నటించి పాపులర్ అయ్యారు. ముఖ్యంగా రజనీకాంత్తో బాలనటిగా నటించి ఆ తర్వాత యజమాన్, ముత్తు వంటి చిత్రాల్లో కథానాయికగా నటించడం విశేషం. అదే విధంగా తెలుగులోనూ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి ప్రముఖ నటుల సరసన నటించారు. అలా నటిగా మంచి ఫామ్లో ఉండగానే 2009లో బెంగళూరుకు చెందిన విద్యాసాగర్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడారు. వీరికి నైనికా అనే కూతురు ఉంది. ఆ పాప కూడా తేరి తదితర చిత్రాల్లో బాలనటిగా గుర్తింపు పొందింది. కాగా వివాహానంతరం కూడా నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటిస్తున్న మీనా జీవితంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యానికి గురైన ఆమె భర్త గత జూన్ నెలలో కన్ను మూశారు. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మీనా మళ్లీ నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో ఆమె రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. తనకు మళ్లీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని.. ఆమె, కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆమె తల్లిదండ్రులు మీనాకు రెండో పెళ్లి చేయడానికి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దీంతో మీనా కూడా పెళ్లికి అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. వరుడు కూడా తెలిసిన వ్యక్తేనట. ఆమె భర్త మిత్రుడే అని సమాచారం. అయితే దీని గురించి మీనా తరఫు నుంచి ఎలాంటి స్పందన లేదు. కాగా మీనా మలయాళంలో మోహన్లాల్ జంటగా నటించిన దృశ్యం పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో పార్ట్ 3 త్వరలో ప్రారంభం కాబోతుందని సమాచారం. -
రెండో పెళ్లికి సిద్ధమవుతున్న సీనియర్ నటి.. అందులో నిజమెంత?
సీనియర్ నటి మీనా గురించి టాలీవుడ్లో పరిచయం అక్కర్లేదు. దక్షిణాది సినిమాల్లో కథానాయికగా రాణించారు. తెలుగు, తమిళం తదితర భాషల్లో కమలహాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి సూపర్స్టార్స్తో జత కట్టారు. కొద్ది నెలల క్రితమే మీనా జీవితంలో భర్తను కోల్పోయిన విషయం తెలిసిందే. (చదవండి: అలా అయితే నా భర్త బతికేవాడు.. జీవితం ఇంకోలా ఉండేది: మీనా ఎమోషనల్) అయితే తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రెండో పెళ్లికి సిద్ధమైందంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఆమె భర్తను కోల్పోయిన విషాదం నుంచి కోలుకుంటున్నారు. మెల్లమెల్లగా ఆమె తన ప్రొఫెషన్లో యాక్టివ్ అవుతున్నారు. ఈ క్రమంలో ఆమె కుటుంబ సభ్యులు రెండో పెళ్లి చేసుకోవాలని ప్రస్తావించినట్లు సమాచారం. అయితే ఆమెకు రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కూతురికి కోసమైనా రెండో పెళ్లి చేసుకోమ్మని కుటుంబ సభ్యులు ఆమెపై ఒత్తిడి తెస్తున్నారని టాక్. మరీ ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. మరోవైపు కూతురి భవిష్యత్తు దృష్ట్యా ఫ్యామిలీ ఫ్రెండ్ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్లు కోలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. -
అప్పటి చైల్డ్ ఆర్టిస్టులే ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలు
తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో స్టార్స్. నిజానికి హీరోలు, హీరోయిన్స్, కమెడియన్ ఇలా స్టార్స్ అంతా …టీనేజ్ తర్వాతే సిల్వర్ స్క్రీన్ మీద జర్నీ మొదలుపెడతారు. కానీ…వీరిలో కొందరు మాత్రం బాల్యం నుంచే వెండితెర మీద మెరిసిన వాళ్లు ఉన్నారు. అలాంటి టాలీవుడ్ సెలబ్రిటీస్పై స్పెషల్ స్టోరీ.. పసిప్రాయంలోనే తమలోనే నటనాసామర్థ్యాన్ని, చాతుర్యాన్ని ప్రదర్శించిన వాళ్లు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. 1979లో నీడ చిత్రంతో బాలనటుడుగా పరిచయం అయ్యా డు. బాలనటుడుగా తొమ్మిది సినిమాల్లో నటించాడు. బాలనటుడిగా వెండితెర మీద సత్తా చాటిన స్టార్స్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరొకరు. బ్రహ్మ శ్రీ విశ్వామిత్ర హిందీ వెర్షన్లో తొలిసారిగా నటించాడు జూ.ఎన్టీఆర్. ఆ తర్వాత ఎం.ఎస్. రెడ్డి నిర్మాణంలో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రామాయణం చిత్రంలో రాముడుగా అద్భుతమైన నటనని ప్రదర్శించాడు. ఏడవ ఏటే బాలనటుడిగా.. స్టార్ కమెడియన్ అలీ బాలనటుడుగానే వెండితెర మీద నవ్వులు పూయించాడు. తన ఏడవ ఏట నుంచే నటించడం మొదలుపెట్టాడు అలీ 1979లో సీతాకోకచిలుకతో బాలనటుడుగా పరిచయమైయ్యాడు. తొలి చిత్రం నుంచే హస్యాన్ని పండించడంలో తనదైన ప్రతిభను చాటాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ ఇమేజ్ ఇక బాలనటుడుగానే స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్న కొద్ది మందిలో తరుణ్ ఒకడు. మనసు మమత చిత్రంతో బాలనటుడుగా తరుణ్ కెరీర్ మొదలైంది. చైల్డ్ ఆర్టిస్ట్గా పదికి పైగానే చిత్రాల్లో నటించాడు. బాలనటుడుగా మూడు నంది అవార్డులను అందుకున్నాడు. అంజలి చిత్రానికి జాతీయ అవార్డు కూడా తీసుకున్నాడు. ప్రహ్లాద పాత్రలో రోజా రమణి ఇక బాలనటులు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మొదట ప్రస్తావించాల్సిన పేరు రోజా రమణినే. భక్త ప్రహ్లాద చిత్రంలో ప్రహ్లాద పాత్ర చేసిన రోజా రమణి నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత కథానాయికగా కూడా అనేక చిత్రాల్లో రోజా రమణి నటించారు. ఆ కొద్దిమందిలో శ్రీదేవి ఒకరు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో బాలనటిగా నటించి రికార్డు సృష్టించింది శ్రీదేవి. ఆ తర్వాత ఈ భాషా చిత్రాల్లో స్టార్ హీరోయిన్గా కూడా దశాబ్దాల పాటు తన సత్తా చాటింది. బాలనటిగా పదుల సంఖ్యలో చిత్రాలు చేసింది శ్రీదేవి. దక్షిణాదిన చైల్డ్ ఆర్టిస్ట్గానే స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకుంది. భావోద్వేగాలను అద్భుతంగా పలికించే కొద్ది మంది చైల్డ్ ఆర్టిస్టులో ఒకరుగా శ్రీదేవి గుర్తింపు పొందింది. బాలనటిగా హేమాహేమీల్లాంటి స్టార్స్తో పోటీ పడుతూ నటించి మెప్పించింది. శంకరాభరణంతో నంది అవార్డు చైల్డ్ ఆర్టిస్ట్గా,హీరోయిన్గా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన మరో నటి తులసి. తొలి చిత్రం భార్య. ఆ చిత్రంలో రాజబాబు కుమారుడుగా తులసి నటించింది.అప్పుడు ఆమె వయస్సు ఏడాదిన్నర మాత్రమే. ఆ తర్వాత సీతామహాలక్ష్మి చిత్రంతో అందరి దృష్టిలో పడింది తులసి. ఆ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఆమెదీ ఒకటి. తులసి పైన మూడు పాటలను చిత్రీకరించారు. ఇక శంకరాభరణం చిత్రం గురించి చెప్పక్కర్లేదు. ఆ చిత్రంలో అద్భుతంగా నటించింది. ఆ సినిమాకి గానూ ఉత్తమ బాలనటిగా నంది అవార్డును కూడా అందుకుంది. సిరివెన్నెల.. పెద్ద సంచలనమే బాలనటిగానూ, హీరోయిన్గానూ వెండితెర మీద వెలిగిన స్టార్ మీనా. చైల్డ్ ఆర్టిస్ట్గా మీనా తొలి చిత్రం నిన్జనగల్. తమిళంలో రజినీకాంత్, కమలహాసన్ ఇద్దరితోనూ బాలనటిగా నటించింది. హీరోయిన్గానూ చేసింది. బాలనటిగా మీనాకు బాగా పేరు తెచ్చిన సినిమా సిరివెన్నెల. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పెద్ద సంచలనమే రేపింది. ఆ చిత్రంలో హీరో సర్వదమన్ బెనర్జీ, మూగ అమ్మాయిగా నటించిన సుహాసి నిలతో పోటీ పడుతూ నటించింది మీనా. అంధ బాలికగా మీనా నటనకి చాలా ప్రశంసలు లభించాయి. -
జీవితంలో మొదటిసారి ఆమెను చూసి అసూయ కలిగింది: మీనా
తమిళసినిమా: బాల నటి నుంచి కథానాయకిగా ఎదిగిన నటి మీనా. దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణించిన ఈమె తెలుగు, తమిళం తదితర భాషల్లో కమలహాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటే‹Ù, నాగార్జున వంటి సూపర్స్టార్స్తో జత కట్టారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. అలాంటిది మీనా జీవితంలో ఇటీవల శోక సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. భర్తను కోల్పోయిన దుఃఖం నుంచి ఈమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈమెను మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడానికి నటి కుష్భు, సంగీత, సంఘవి తదితర స్నేహితురాళ్లు చేస్తున్న ప్రయత్నం సఫలం అవుతోంది. దీంతో నటి మీనా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమా చారం. అదే విధంగా సామాజిక మాధ్యమాలపైన దృష్టి సారిస్తున్నారు. ఇటీవల స్నేహితురాలితో కలిసి విదేశీ పర్యటన చేశారు. తాజాగా తన ఇన్ స్ట్రాగామ్లో నటి ఐశ్వర్యారాయ్ గురించి ఓ పోస్ట్ చేశారు. తన డ్రీమ్ క్యారెక్టర్ నందిని(పొన్నియన్ సెల్వల్లో ఐశ్యర్యరాయ్ చేసిన పాత్ర) కొట్టేసిన ఐశ్వర్యారాయ్ని చూసి, అసూయ కలిగిందన్నారు. తన జీవితంలో ఒకరిని చూసి అసూయ పడడం ఇదే మొదటిసారి అని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటించిన నటీనటులందరికీ తన అభినందనలు అని నటి మీనా పేర్కొన్నారు. ఈమె ట్విట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
అలనాటి హీరోయిన్ల మధ్య మీనా బర్త్డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
హీరోయిన్ మీనా తాజాగా తన 46వ పుట్టిన రోజును సెలబ్రెటీ స్నేహితులు మధ్య జరుపుకున్నారు. శుక్రవారం(సెప్టెంబర్ 16న) మీనా బర్త్డే. ఈ సందర్భంగా ఆమె తన ఇండస్ట్రీ స్నేహితులు, అలనాటి స్టార్ హీరోయిన్లు సంగీత, సంఘవి, రంభలతో కలిసి పుట్టిన రోజును జరుపుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీనాకు ఇండస్ట్రీలో చాలామంది సన్నిహితులు ఉన్నారు. సంగీత, రమ్యకృష్ణ, సంఘవి, శ్రీదేవి విజయ్ కుమార్, రంభ, స్నేహ ఇలా చాలామంది తనకు ఆప్తమిత్రులని మీనా పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల భర్తను కొల్పోయి విషాదంలో ఉన్న మీనాకు వారంతా అండగా నిలుస్తున్నారు. చదవండి: కాస్టింగ్ కౌచ్పై నోరు విప్పిన విష్ణుప్రియ, నన్ను కూడా అలా అడిగారు.. సందర్భం వచ్చినప్పుడల్లా వారంత మీనాను కలిసి కాసేపు ఆమెతో గడుపుతున్నారు. ఈ క్రమంలో నిన్న తన పుట్టిన రోజు కావడంతో రంభ, సంగీత, సంఘవిలు కలిసి ఆమె బర్త్డేను సెలబ్రెట్ చేశారు. మీనాతో కేక్ కట్ చేయించి తనతో కాసేపు సరదగా గడిపారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫొటోలను మీనా తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇలాటి కఠిన సమయంలో మీనాకు అండగా నిలుస్తున్న ఈ తారలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ‘నిజమైన స్నేహం అంటే మీది’, ‘మీనా గారు ఇండస్ట్రీలో మంచి స్నేహితులను పొందారు’ అంటూ ఆమె పోస్ట్పై ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
అలా అయితే నా భర్త బతికేవాడు.. జీవితం ఇంకోలా ఉండేది: మీనా ఎమోషనల్
ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. భర్త మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న మీనా.. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటున్నారు. ఇటీవల సినిమా షూటింగ్స్కి కూడా హాజరయ్యారు. పలువురు బంధువులు, స్నేహితులు తరుచూ కలుస్తుండడంతో మీనా మళ్లీ యాక్టివ్ అయ్యారు. అంతేకాదు తాజాగా ఆమె గోప్ప నిర్ణయం తీసుకున్నారు. తన తదనంతరం అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించి, అందరిచే శభాష్ అనిపించుకున్నారు. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే(ఆగస్ట్ 13) సందర్భంగా తాను ఆర్గాన్ డొనేట్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నానని, మీరు కూడా గొప్ప నిర్ణయాన్ని తీసుకోండి అని చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. (చదవండి: 'జబర్దస్త్' మానేయడంపై తొలిసారి నోరువిప్పిన అనసూయ) ‘ప్రాణాలను కాపాడటం కంటే గొప్ప పని ఇంకోటి ఉండదు. అవయవాలను దానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు. అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఒకరికి అవయవాలు దానం చేయడం వల్ల వారి కుటుంబంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో నేను కళ్లారా చూశాను. మా సాగర్కు(మీనా భర్త) ఇంకా అలాంటి దాతలు దొరికి ఉంటే నా జీవితం ఇంకోలా ఉండేది. ఒక దాత 8 మంది ప్రాణాలను కాపాడొచ్చు. అవయవ దానం గొప్పదనం గురించి ప్రతీ ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అవయవ దానం అనేది కేవలం డాక్టర్లు, పేషెంట్ల మధ్య సంబంధం కాదు.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా అందరికీ సంబంధించింది. నేను నా ఆర్గాన్స్ను డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నాను’అంటూ ఎమోషనల్ పోస్ని ఇన్స్టాలో షేర్ చేసింది. మీనా నిర్ణయం వెనుక ఆమె భర్త విద్యాసాగర్ ఆకస్మిక మరణం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. మీనా భర్తకు ఊపిరితిత్తులు మారిస్తే బ్రతికేవాడు. కానీ సమయానికి దాతలు దొరక్కపోవడంతో ఆయన మృతి చెందారు. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
భర్త చనిపోయాక మీనా తొలిసారి ఇలా.. ఫొటో వైరల్
ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మీనా ఇటీవలే భర్త విద్యాసాగర్ను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. అతడి మరణంతో ఆమె కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. తాజాగా మీనాను పరామర్శించేందుకు సీనియర్ హీరోయిన్స్ రంభ, సంగీత, సంఘవి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మీనా వారితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భర్త చనిపోయాక మీనా చేసిన తొలి పోస్ట్ ఇది. ఇందులో మీనా నవ్వుతూ కనిపించగా ఆమె ముఖంపై చిరునవ్వు ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నారు అభిమానులు. కాగా ఊపితిత్తుల సమస్యలతో బాధపడుతున్న మీనా భర్త విద్యాసాగర్ జూన్ 28న మరణించారు. ఆయన మరణంతో కుంగిపోయిన మీనా ఇప్పుడిప్పుడే సాధారణ జీవితానికి అలవాటు పడుతోంది. ఇటీవలే ఆమె ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమా షూటింగ్లోనూ పాల్గొంది. ఈ సినిమా సెట్స్లో రాజేంద్రప్రసాద్ బర్త్డే సెలబ్రేట్ చేయగా ఆ వేడుకల్లో మీనా తళుక్కున మెరిసింది. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) చదవండి: మహేశ్కు చిరు, వెంకీల స్పెషల్ బర్త్డే విషెస్ ‘మా అమ్మ ఉండుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదాన్ని’ -
ఇన్నాళ్లకు మీనా నాకు చిక్కింది: అలీ భార్య జుబేదా
నవ్వుల రారాజు రాజేంద్ర ప్రసాద్ ఇటీవలే తన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు. జూలై 19న తన పుట్టినరోజు సందర్భంగా 'ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు' సినిమా సెట్స్లో కేక్ కట్ చేశాడు. అయితే దీన్నంతటినీ తన కెమెరాలతో క్యాప్చర్ చేసింది కమెడియన్ అలీ భార్య జుబేదా. సెట్స్లోకి వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరించింది. ఇక ఈ సినిమా సెట్స్లో నటి మీనా కూడా ఉండటంతో ఆమెను కలిసింది జుబేదా. నీకు వీరాభిమానిని అంటూ మీనాతో మాటలు కలిపింది జుబేదా. గతంలో 'పెళ్లాం చెబితే వినాలి' సినిమా సమయంలో కలిశామని, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కలిశామని చెప్తూ సంతోషపడిపోయిందామె. పెళ్లాం చెబితే వినాలి సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసి 7వ తరగతి పరీక్షలు మానేసి మరీ మిమ్మల్ని కలిశానంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది జుబేదా. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు కలుద్దామన్నా సెట్ అవ్వలేదని చెప్పుకొచ్చింది. ఏదైతేనేం, ఇన్నాళ్లకు మీనా తన యూట్యూబ్కు చిక్కిందని సంబరపడిపోయింది. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత తెలుగులో నటిస్తున్నాననంది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తొలిసారి యాక్ట్ చేస్తున్నానని తెలిపింది. తెలుగులో సినిమాలు చేయట్లేదని ఇప్పటికే చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, తప్పకుండా తెలుగులో మూవీస్ చేస్తాను అని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. చదవండి: యంగ్ హీరో శ్రీవిష్ణుకు తీవ్ర అస్వస్థత తెలుగు సినిమాలకు అవార్డుల పంట, ఏ సినిమాకు ఏ అవార్డు వచ్చిందంటే? -
వెడ్డింగ్ యానివర్సరీ.. భర్తను తలచుకుంటూ మీనా ఎమోషనల్ పోస్ట్
నటి మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్గా, హీరోయిన్గా, నటిగా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. పెళ్లి అనంతరం కొంతకాలం నటనకు బ్రేక్ ఇచ్చిన ఆమె రీసెంట్గా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సహానటి, క్యారెక్టర్ అర్టిస్ట్గా రాణిస్తుంది. ఇదిలా ఉంటే గత నెల మీనా భర్త విద్యాసాగర్ హఠ్మారణం పొందిన సంగతి తెలిసిందే. చదవండి: లలిత్ మోదీ ప్రేమలో సుస్మితా.. ‘లవ్ ఆఫ్ మై లైఫ్’ అంటూ వీడియో.. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా బారిన పడిన ఆయన కోలుకున్నప్పటికి పోస్ట్ కోవిడ్, ఊపరితిత్తుల సమస్యలతో అనారోగ్య బారిన పడ్డారు. ఆయన లంగ్స్కు ఇన్ఫెక్షన్ రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందతూ జూన్ 29న తుదిశ్వాస విడిచారు. అయితే మంగళవారం(జూలై 12) మీనా పెళ్లి రోజు. ఈ సందర్భంగా భర్తను గుర్తు చేసుకుంటూ మీనా భావోద్యేగానికి లోనయింది. భర్తను తలచుకుంటూ ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ నోట్ పంచుకుంది. చదవండి: ప్రముఖ నటుడు, నటి రాధిక మాజీ భర్త మృతి భర్త విద్యాసాగర్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘మీరు దేవుడు ఇచ్చిన అద్భుతమైన ఆశీర్వాదం(బహుమతి). కానీ చాలా త్వరగా మిమ్మల్ని నా నుంచి ఆ దేవుడు తీసుకువెళ్లిపోయాడు. మీరు ఎప్పటికీ మా(నా) గుండెల్లో ఉంటారు. ఇలాంటి కఠిన సమయంలో మా పట్ల ప్రేమ, అప్యాయత చూపించిన ప్రపంచంలోని ప్రతి మంచి మనసుకు నేను, నా కుటుంబం ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇలాంటి పరిస్థితిలో మాకు అండగా ఉన్న బంధువులు, స్నేహితులకు కృతజ్ఞతరాలిని. మీలాంటి వారి ఆశ్వీర్వాదాలు మాకు ఎప్పటికీ కావాలి’ అంటూ మీనా రాసుకొచ్చింది. కాగా మీనా, విద్యాసాగర్ను 2009 జులై 12న పెళ్లాడింది. వీరికి కూతురు నైనిక జన్మించింది. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
భర్త మరణాంతరం తొలిసారి స్పందించిన నటి మీనా
భర్త మరణాంతరం మీనా తొలిసారి స్పందించారు. తన భర్త విద్యాసాగర్ మరణంపై సోషల్ మీడియాలో వస్తున్న ఆసత్య ప్రచారంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. తన భర్త మృతిపై అసత్య ప్రచారాలు చేయొద్దని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. ‘భర్త దూరమయ్యారనే బాధలో ఉన్నాను. ఈ సమయంలో మా కుటుంబ ప్రైవసీకి భంగం కలిగించకండి. దయచేసి పరిస్థితి అర్థం చేసుకోండి. చదవండి: ‘భర్తను కాపాడుకునేందుకు మీనా చివరి వరకు పోరాడింది’ ‘విద్యాసాగర్ మృతిపై ఎలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కష్టకాలంలో మాకు అండగా నిలిచి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా భర్త ప్రాణాలను కాపాడేందుకు ఎంతో కృషి చేసిన వైద్య బృందం, తమిళనాడు సీఎం, ఆరోగ్య మంత్రి, ఐఏఎస్ రాధాకృష్ణన్, సన్నిహితులు, మిత్రులకు కృతజ్ఞతలు. అలాగే ఆయన కోలుకోవాలని ప్రార్థించిన అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చారు మీనా. చదవండి: వివాదంలో నరేశ్ పెళ్లి.. తెరపైకి మూడో భార్య.. సంచలన విషయాలు.. కాగా గత కొంతకాలం ఊపితిత్తుల సమస్యలతో బాధపడుతున్న మీనా భర్త విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే భర్తను బతికించుకునేందుకు మీనా ఎంతో ప్రయత్నించారని ప్రముఖ కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ రీసెంట్గా ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
‘భర్తను కాపాడుకునేందుకు మీనా చివరి వరకు పోరాడింది’
ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలం ఊపితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. అయితే భర్తను బతికించుకునేందుకు మీనా ఎంతో ప్రయత్నించారని ప్రముఖ కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ తెలిపారు. విద్యాసాగర్ కరోనా బారిన పడకముందే ఆయనకు బర్డ్ ఇన్ఫెక్షన్ అయినట్లు వైద్యులు చెప్పారని ఆమె అన్నారు. చదవండి: బెనారస్: మాయ గంగ సాంగ్ వచ్చేసింది ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మీనా తన భర్తను కాపాడుకునేందుకు ఎంతో పరితపించారని ఆమె వివరించారు. ‘ఈ ఏడాది జనవరిలో కోరాన బారిన పడిన విద్యాసాగర్ అనంతరం కోలుకున్నారు. మీనా తల్లి బర్త్డే సందర్భంగా ఫిబ్రవరిలో వారి కుటుంబాన్ని కలిశాను. అప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఆ తర్వాత నెల రోజులకే ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. ఏప్రిల్లో మీనా ఫోన్ చేసి విద్యాసాగర్ ఆరోగ్యం బాగా క్షీణించిందంటూ ఆవేదన చెందారు. దీంతో నేను ఆసుపత్రికి వెళ్లి ఆయనను పలకరించాను’ అంటూ చెప్పుకొచ్చారు. చదవండి: షికారు అందరికీ తెలిసిన కథే, తప్పకుండా నచ్చుతుంది ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేయాలని వైద్యులు చెప్పారని ఆమె పేర్కొన్నారు. దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి సాయం చేయాల్సిందిగా కోరామని, వారంతా సాయం చేసినా ట్రాన్స్ప్లాంట్ కోసం అవయవం దొరకలేదని తెలిపారు. ఈ క్రమంలో భర్తను కాపాడుకునేందుకు మీనా చివరి క్షణం వరకు ప్రయత్నించారని, చిన్న వయసులోనే తను భర్తను కోల్పోవడం బాధాకరమని కళా మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
అశ్రునయనాల మధ్య మీనా భర్త అంత్యక్రియలు..రజనీకాంత్ కంటతడి
సాక్షి, చెన్నై: నటి మీనా భర్త విద్యాసాగర్ (48) భౌతిక కాయానికి బుధవారం బీసెంట్నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. విద్యాసాగర్ మరణం మీనా కుటుంబాన్ని శోకసముద్రంలో ముంచెత్తగా, సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. బుధవారం ఉదయం నుంచే సినీ ప్రముఖులు, అభిమానులు స్థానిక సైదాపేటలోని మీనా ఇంటికి తరలి వచ్చి ఆమె భర్త విద్యాసాగర్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. సినీ ప్రముఖులు మీనాను ఓదార్చి సంతాపం వ్యక్తం చేశారు. రజనీకాంత్ కంటతడి బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న నటి మీనా భర్తను కోల్పోవడంతో ఆమె బంధువులు, సన్నిహితులు, అభిమానులు చలించిపోయారు. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న మీనాకు ఆ బాధ నుంచి కోలుకోవడానికి తగిన శక్తిని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ విద్యాసాగర్ భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించారు. నటుడు రజనీకాంత్, మీనాలది సుదీర్ఘకాల సినీ అనుబంధం. ఆయన కథానాయకుడిగా నటించిన అన్భుళ్ల రజనీకాంత్ చిత్రంలో మీనా బాలనటిగా నటించారు. ఆ తరువాత యజమాన్, ముత్తు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో రజనీకి జంటగా మంచి గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ మీనా ఇంటికి వెళ్లి ఆమె భర్త భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. (చదవండి: మీనా భర్త మృతికి పావురాలే కారణమా?) రజనీకాంత్ను చూడగానే మీనా అంకుల్ అంటూ బోరున ఏడ్చారు. దీంతో ఆమెను ఓదార్చిన రజనీకాంత్ కంటతడి పెట్టారు. అలాగే నటుడు, విజయకుమార్, శరత్కుమార్, దర్శకుడు కేఎస్ రవికుమార్, మన్సూర్ అలీఖాన్, దర్శకుడు సుందర్ సి, కుష్భు, చేరన్, నటి లక్ష్మి, సంగీత, రంభ, స్నేహ తదితర సినీ ప్రముఖులు నివాళులర్పించారు. నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్, శరత్కుమార్, విశాల్ తదితరులు సామాజిక మాధ్యమాల్లో సంతాపం వ్యక్తం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నటి మీనా భర్త విద్యాసాగర్కు కోలీవుడ్ నివాళి (ఫొటోలు)
-
గుండెముక్కలైంది.. టాలీవుడ్ ప్రముఖుల సంతాపం
Actress Meena Husband Vidya Sagar Dies Celebrities Condolence: ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణించారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (జూన్ 28) రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. విక్టరీ వెంకటేశ్, మంచు లక్ష్మీ, ఖుష్బూతోపాటు పలువురు సినీ తారలు విద్యాసాగర్ మృతిపట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. 'విద్యాసాగర్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది చాలా బాధకరం. మీనా, ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.' అని వెకంటేశ్ ట్విటర్లో పేర్కొన్నారు. Extremely sad and shocked by the demise of Vidyasagar gaaru! My heartfelt condolences to Meena gaaru and the entire family! Wishing them with all the strength to sail through this! 🙏🏼 — Venkatesh Daggubati (@VenkyMama) June 29, 2022 'మీనా భర్త మరణించారన్న విషాదకరమైన వార్తతో మేల్కొన్నాను. విద్యాసాగర్ కోవిడ్ సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' అని లక్ష్మీ మంచు ట్వీట్ చేశారు. Woke up to devastating news of #meena garu’s husband, Vidyasagar garu passed away due to Covid complications. My deepest and heartfelt condolences to the entire family. — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) June 29, 2022 'చాలా బాధకరమైన వార్తతో మేల్కొన్నాను. మీనా భర్త సాగర్ ఇక మాతో లేడని తెలిసి గుండె ముక్కలైంది. అతను చాలా కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో పోరాడుతున్నాడు. విధి చాలా క్రూరమైంది. బాధను వ్యక్తపరిచేందుకు మాటలు సరిపోవు. మీనా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.' అని ఖుష్బూ తెలిపారు. Waking up to a terrible news.Heartbroken to learn actor Meena's husband, Sagar, is no more with us. He was battling lung ailment for long. Heart goes out to Meena n her young daughter. Life is cruel. At loss of words to express grief. Deepest condolences to the family. #RIP 🙏😭 — KhushbuSundar (@khushsundar) June 29, 2022 'మీనా భర్త విద్యాసాగర్ అకాల మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. మీనా, ఆమె కుటుంబ సభ్యులకు నా కుటంబం తరఫున ప్రగాఢ సానుభూతి. విద్యాసాగర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని నటుడు, రాజకీయవేత్త శరత్ కుమార్ తెలిపారు. It is shocking to hear the news of the untimely demise of Actor Meena's husband Vidyasagar, our family's heartfelt condolences to Meena and the near and dear of her family, may his soul rest in peace pic.twitter.com/VHJ58o1cwP — R Sarath Kumar (@realsarathkumar) June 28, 2022 -
మీనా భర్త మృతికి పావురాలే కారణమా?
సీనియర్ నటి మీనా భర్త విద్యాసాగర్(48) హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. శ్వాసకోశ సమస్యతో బాధ పడుతున్న ఆయన చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. కాగా, ఆయన మృతిపై ఇప్పుడు పలు అనుమానాలు మొదలయ్యాయి. పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే విద్యాసాగర్ మృతి చెందాడని స్థానిక మీడియాలో వార్తలు వెలుబడుతున్నాయి. మీనా ఫ్యామిలీ మొత్తానికి గతంలో కరోనా సోకింది. కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ... విద్యాసాగర్ కొన్ని నెలలుగా పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నాడు. (చదవండి: సినిమాలకు గుడ్బై చెప్పబోతున్న నాజర్!, కారణం ఇదేనా?) పోస్ట్ కోవిడ్ సమస్యలు మాత్రమే ఆయన మృతికి కారణం కాకపోవచ్చని, పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే శ్వాసకోశ సమస్య రెట్టింపై ప్రాణాంతకంగా మారిందని స్థానిక మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మీనా ఫ్యామిలీ నివాసం ఉండే ఇంటికి సమీపంలో పావురాలు ఎక్కువగా ఉంటాయి. వాటికి విద్యాసాగర్ తరచూ దానా వేస్తూ అక్కడే గడిపేవాడట. కోవిడ్ సోకిన సమయంలో విద్యాసాగర్ ఊపిరితిత్తులు పాడైపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఊపిరితిత్తుల మార్పిడి చేయించాలని వైద్యులు సూచించినప్పటికీ..దాతలు దొరక్కపోవడంతో విద్యాసాగర్ మృతి చెందినట్లు తెలుస్తోంది. మీనా, విద్యాసాగర్ల వివాహం 2009లో జరిగింది. వీరికి ఒక పాప. పేరు నైనిక. దళపతి విజయ్ హీరోగా వచ్చిన తేరీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే విద్యాసాగర్ మృతి చెందాడన్న వార్తల నేపథ్యంలో డాక్టర్ శ్రీలక్ష్మి(పల్మనాలజిస్ట్, అమోర్ హాస్పిటల్స్) ఈ విధంగా స్పందించారు. -
నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం
సీనియర్ హీరోయిన్ మీనా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మీనా భర్త విద్యాసాగర్ మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందాడు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడిన విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్తో 2009లో మీనా వివాహం జరిగింది. వీరికి ఒక పాప. పేరు నైనిక. దళపతి విజయ్ హీరోగా వచ్చిన తేరీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. ( ఫైల్ ఫోటో ) ( ఫైల్ ఫోటో ) -
మీనా తల్లి కాబోతుందా?.. నెట్టింట వీడియో వైరల్
Actress Meena Is Pregnant Video Goes Viral: ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగువెలిగింది అందాల నటి మీనా. బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె తన అందచందాలతో, చక్కటి అభినయంతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల అరుదైన దుబాయ్ గోల్డెన్ వీసాను కూడా అందుకుంది. అయితే కెరీర్ సరిగా లేని సమయంలో ప్రముఖ వ్యాపారవేత్త సాగర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి ఒక పాప నైనిక ఉంది. ఆమె కూడా సినిమాల్లో నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన పోలీసోడు చిత్రంలో అతనికి కూతురుగా యాక్ట్ చేసి మెప్పించింది. కూతురు పుట్టిన తర్వాత కొంతకాలం వరకు సినిమాలు చేయలేదు మీనా. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మీనా.. తల్లి, సోదరి తదితర పాత్రలతో అలరిస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే మీనా ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా మీనా పోస్ట్ చేసినా ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మీనా గర్భవతిగా కనిపిస్తుంది. 'చాలా మారిపోయింది. అప్పట్లో ఈ గెటప్ వేయడం చాలా సులభంగా ఉండేది. దీన్ని కవర్ చేసేందుకు హెవీ చీరలు కట్టుకునేదాన్ని. కానీ ప్రస్తుతం ఈ గెటప్కు, ఈ పాత్రకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. షిఫాన్ చీరలు కట్టుకున్నా చూడటానికి చాలా నాచురల్గా ఉంది.' అంటూ వీడియోకు క్యాప్షన్గా రాసుకొచ్చింది. చదవండి: గోల్డెన్ వీసా అందుకున్న సీనియర్ హీరోయిన్ View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) ఈ పోస్ట్ను బట్టి చూస్తే మీనా ఓ సనిమాలో గర్భవతిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగానే మీనా ఈ వీడియోను షేర్ చేసినట్లు సమాచారం. ఈ పోస్ట్పై చాలా మంది నెటిజన్లు 'కంగ్రాట్స్' అని, మరికొందరు 'కొత్త సినిమాకు ఆల్ ది బెస్ట్' అని కామెంట్స్ పెడుతున్నారు. చదవండి: కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా, ఆందోళనలో ఫ్యాన్స్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1591342813.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బతుకంతా బాలల కోసం!
మీనా స్వామినాథన్ మరణం తరాలుగా ఆమె పని నుండి స్ఫూర్తిని పొందిన పరిశోధకులకు, అభ్యాసకులకు, కార్య కర్తలకు తీరని లోటు. అన్నింటికంటే కూడా భారతదేశ అంగన్వాడీ రంగానికి నష్టం. ఆమె ఒక మార్గదర్శక విద్యావేత్త, పరిశోధకురాలు, మహిళా సమానత్వం కోసం కృషి చేసిన కార్యకర్త. ఆమె భారతదేశ బాలలకు, ముఖ్యంగా అభాగ్యులకు విరామమెరుగక సేవలందించిన స్నేహితురాలు. స్వాతంత్య్రానంతర దశాబ్దాలలో, మీనా స్వామినాథన్తో పాటుగా ఒక తరం మహిళా నాయకులు కొన్ని విశిష్టమైన ఆలోచనలకు ఊపిరి పోశారు. కొత్తగా రెక్కలొచ్చిన దేశంలో ఆ ఆలోచనలు పలు వర్గాలవారి సంక్షేమ కార్యక్రమాలకు పునాదులు వేశాయి. సెంటర్ ఫర్ ఉమెన్స్ డెవలప్మెంట్ స్టడీస్ (సీఎస్డీఎస్), సంచార శిశు లాలన కేంద్రాల వంటి వినూత్న సదుపాయాల కల్పనకు ఆచరణ రూపం ఇవ్వడంలో మీనా విస్తృత∙భాగస్వామిగా ఉన్నారు. భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) ఏర్పాటుకు మూలం అయిన నివేదిక బృందానికి ఆమె నేతృత్వం అత్యంత కీలకమైనది. మీనా 1933లో జన్మించారు. ఆమె తల్లి ప్రముఖ తమిళ రచయిత్రి ‘కృతిక’ మధురం. తండ్రి సుబ్రహ్మణ్యం భూతలింగం. ఆయన ప్రభుత్వోద్యోగి, ఆర్థికవేత్త. మీనా కేంబ్రిడ్జ్లో తన కాబోయే భర్త, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ను కలుసుకున్నారు. స్వతంత్ర భారతదేశంలో దేశ నిర్మాణానికి ఈ దంపతులిద్దరూ కట్టుబడి ఉన్నారు. బెంగాల్ కరవు వల్ల సంభవించిన వినాశనం తరువాత, స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రాన్ని అభ్యసించారు. భారతదేశంలో ‘హరిత విప్లవ పితామహుడు’గా గుర్తింపు పొందారు. ప్రతిష్ఠాత్మకమైన ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్’ తొలి విజేత కూడా! దేశానికి మీనా అందించిన సేవలు, కృషి కూడా అంతే విస్తృతమైనవి. 1970లో శిశు అభివృద్ధి అధ్యయన బృందానికి అధ్యక్షురాలయ్యే అవకాశం ఆమెకు లభించింది. ఈ బృందంలో చిత్రా నాయక్, జేపీ నాయక్, అనిల్ బోర్డియా వంటి ప్రముఖులు ఉన్నారు. 1972లో వెలువడిన ఆ బృందం నివేదిక ఒక శక్తి మంతమైన సంకల్పానికి పిలుపునిచ్చింది. ‘‘సాధారణ బాలలు, అభాగ్యులైన బాలల మధ్య ఏటా అంతరం పెరుగుతూ వస్తోంది. కనుక పాఠశాలకు పూర్వ దశలోనే సామాజిక న్యాయంతో ఆ అంతరాన్ని తగ్గించాలి. ఎందుకంటే మొదటి ఐదు సంవత్సరాలే బాలల్లో అన్ని రకాల అభివృద్ధికి కీలకం’’ అని మీనా వ్యాఖ్యా నించారు. ఆ నివేదిక ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం అయిన ఐసీడీఎస్ ఆవిర్భావానికి మూలం అయింది. పిల్లలకు, తల్లులకు మెరుగైన సదుపాయాలు, సహాయ సహకారాలు ఉండాలని మీనా విశ్వసించారు. ‘‘నా బిడ్డను చూసు కోవాల్సిన అవసరం ఉన్నందున నేను పని చేయడం మానేశాను’’ అని ఒక స్త్రీ చెప్పినప్పుడు, సమాజం దానిని సహజమైన విష యంగా భావిస్తుంది. ఇది సరైన భావన కాదు. ఏదో కన్నాం, పుట్టారు అని కాకుండా... సంతోషం కోసమే సంతానం అనుకున్న ప్పుడు ఆ బిడ్డల సంరక్షణను తండ్రి, కుటుంబ సభ్యులు కూడా స్వీకరించాలి. సమాజానికి, ప్రభుత్వానికి కూడా పిల్లల వికా సంలో ప్రమేయం ఉండాలి’’ అంటారు మీనా. తల్లిపాలే ఆరోగ్యం అని ప్రచారం చేస్తున్నప్పుడు తల్లికి పౌష్టికాహారపు అవసరం తెలియజెప్పాలని కూడా మీనా చెబుతారు. 1979లోనే మీనా పట్టణ పేదల పిల్లల ఆరోగ్యం, వికాసం గురించి అనేక అధ్యయన పత్రాలను సమర్పించారు. పట్టణ పేదరికంలో పెరుగుతున్న లక్షలాది మంది పిల్లలు విధాన నిర్ణేతలకు కనిపించడం లేదని ఆమె విమర్శించారు. ప్రభుత్వాలు గ్రామీణ భారతదేశంపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల కూడా పట్టణ బాలల్లో పేదరికం లేదన్న భావన ఏర్పడుతోందని అంటూ.. ‘‘ఫౌంటైన్లు, పార్కులు, నగర సుందరీకరణ కోసం నిధులు అక్కరలేదు. అదే వనరులను పేద పిల్లలకు అవసరమైన కార్య క్రమాల కోసం ఉపయోగించలేరా?’’ అని ఘాటుగా ప్రశ్నించారు. మీనా 1985లో సీఎస్డీఎస్ కోసం భారతదేశంలోని తక్కువ ఆదాయం కలిగిన శ్రామిక మహిళల కోసం పిల్లల సంరక్షణ సౌకర్యాలపై ‘హూ కేర్స్?’ అనే పేరుతో ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ‘కాళి ఫర్ ఉమెన్’ అనే స్త్రీవాద ప్రచురణాలయం దీనిని అచ్చు వేసింది. ముందుమాటలో వినా మజుందార్: ‘రాజ్యాంగంలోని సమానత్వ నిబంధనల నుంచి ప్రయోజనం పొందగలమని ఆశించిన మన మొదటి తరం మహిళల మాదిరిగానే... స్వాతంత్య్రం వచ్చినప్పుడు మహిళల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మీనా స్వామినాథన్ కూడా నమ్మారు’’ అని రాశారు. కానీ మహిళల సమస్యలు అలాగే ఉండిపోయాయి. మహిళలు సాధారణంగా అతి స్వల్ప వేతనం లభించే పిల్లల సంరక్షణ వంటి తక్కువ నైపుణ్యాలు అవసరమైన పనిలోకి వెళ్లే విధంగా సామాజిక, కుటుంబ పరమైన ఒత్తిళ్లకు గురవుతారు. తద్వారా వారు శ్రామికశక్తిలో భాగంగా కనిపించకుండా పోతారు. మీనా విద్యావేత్త. తన జీవితమంతా స్త్రీ, శిశు సంక్షేమానికి అవసరమైన అధ్యయనాలు చేస్తూ ప్రభుత్వానికి, పలు సంస్థలకు మార్గదర్శకంగా ఉన్నారు. ‘‘చివరికొచ్చే సరికి పరిశోధనా ఫలితాలన్నవి ఆచరణకు ప్రేరణవ్వాలి’’ అని అంటారు మీనా. యాభై సంవత్సరాల క్రితం, దేశవ్యాప్తంగా అంగన్వాడీలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడమంటే అదెంతో సాహస వంతమైన దృక్పథం అనే చెప్పాలి. మీనా అలాంటి ఆలోచన చేయగలిగారు. నేడు భారతదేశంలో పది లక్షల కంటే ఎక్కువ అంగన్వాడీలు ఉన్నాయి. అంతకు రెట్టింపుగా అంగన్వాడీ కార్య కర్తలు అనేక లక్షల మంది తల్లులకు, పిల్లలకు బహుళ సేవలను అందిస్తున్నారు. జార్జ్ బెర్నార్డ్ షా నాటకంలోని పాత్ర ఒకటి ఈ సందర్భంగా నాకు గుర్తుకు వస్తోంది: ‘‘మీరు జరుగుతున్నవి చూస్తారు. ‘ఎందుకు?’ అనుకుంటారు. కానీ నేను జరగనివాటిని కలగంటాను. ‘ఎందుకు కాదు?’ అని అడుగుతాను’’ అంటుంది ఆ పాత్ర. భారతదేశపు పిల్లల తరఫున మీనా స్వామినాథన్ అడిగిందీ ఇదే.. ‘ఎందుకు కాదు?’ అని! వ్యాసకర్త ఐఏఎస్ అధికారి (‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ సౌజన్యంతో) -
మీనా జ్యువెలర్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి!
-
మీనా జ్యువెలర్స్ గ్రూప్పై సీబీఐ కేసు నమోదు
-
గోల్డెన్ వీసా అందుకున్న సీనియర్ హీరోయిన్
Senior Actress Meena Receives UAE Golden Visa: ఈ మధ్య కాలంలో సినీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఇచ్చే గోల్డెన్ వీసాలను అందుకుంటున్నారు. 2019 నుంచి ఈ వీసాలతో సత్కరిస్తోంది దుబాయ్ ప్రభుత్వం. ఈ వీసాను అందుకున్న వారికి పదేళ్ల పాటు దుబాయ్ పౌరసత్వం ఉంటుంది. తర్వాత దానికదే రెన్యూవల్ అవుతుంది. ఈ అరుదైన గౌరవాన్ని తాజాగా సీనియర్ హీరోయిన్, నటి మీనాకు దక్కింది. ఈ వీసాను స్వీకరించిన మీనా దుబాయ్లో జరుగుతున్న ఎక్స్ఫోలో పాల్గొన్నారు. తనకు గోల్డెన్ వీసాను యూఏఈ ప్రదానం చేయడం పట్ల మీనా సంతోషాన్ని వ్యక్తం చేసింది. అలాగే అరబ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ వీసాను పొందగా.. టాలీవుడ్ నుంచి మెగా కోడలు ఉపాసన అందుకుంది. యూఏఈ ప్రభుత్వం జారీ చేసే ఈ వీసాను ఇండియా నుంచి మొదటగా బాద్ షా షారుఖ్ ఖాన్ దక్కించుకున్నాడు. తర్వాత బాలీవుడ్లో సంజయ్ దత్, సునీల్ శెట్టి, సింగర్స్ సోనూ నిగమ్, నెహా కక్కర్, బుల్లితెర హాట్ బ్యూటీ మౌనీ రాయ్, ఫరా ఖాన్, దివంగత నటి శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్తో పాటు బోనీ కపూర్ కుటుంబం ఈ వీసా పొందింది. ఈ వీసాను సాధించిన హీరోయిన్ త్రిష.. తొలి తమిళ కథానాయికగా అవతరించింది. తర్వాత అమలా పాల్ను కూడా గోల్డెన్ వీసా వరించింది. వీరితో పాటు మలయాళ ఇండస్ట్రీ నుంచి మొదటగా మోహన్ లాల్ తర్వాత మమ్ముట్టి, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ కూడా ఈ వీసాను పొందారు. -
పది రోజుల్లో పెళ్లి.. మెసేజ్లు, వాయిస్ రికార్డులు చూపించి..
సంతబొమ్మాళి (శ్రీకాకుళం): తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ యువతి.. ఆర్మీ జవాన్ ఇంటి ముందు బైఠాయించింది. ఈమెకు గ్రామస్తులంతా మద్దతు పలకడంతో సదరు వ్యక్తి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..సంతబొమ్మా ళి మండలం యామలపేటకు చెందిన మురాల తులసీరావు, పార్వతిల కుమార్తె మీనాకు గాజువాకకు చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 16న వివాహం కావాల్సి ఉంది. పది రోజుల క్రితం కుమార్తె తల్లిదండ్రులు కట్నం డబ్బులు ఇవ్వడానికి గాజువాక వెళ్లగా వరుడు పెళ్లికి నిరాకరించడంతో నిర్ఘాంతపోయారు. ఎందుకని ప్రశ్నించగా.. గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ పరపటి జగదీష్.. మీనాతో అతనికి ఉన్న స్నేహాన్ని తనకు చెప్పాడని, సెల్ఫోన్ మెసేజ్లు, వాయిస్ రికార్డులను చూపించాడని అన్నాడు. అందుకనే తనకు ఈ సంబంధం వద్దని తెగేసి చెప్పాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు ఆర్మీ జవాన్ జగదీష్ గ్రామానికి వెళ్లి గ్రామపెద్దలతో పంచాయతీ పెట్టారు. మీనాను పెళ్లి చేసుకోవాలని జగదీష్ను కోరారు. అయినా పట్టించుకోకపోవడంతో గురువారం జగదీష్ ఇంటిముందు నిరసన చేపట్టారు. దీంతో యువకుడు ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న నౌపడ ఏఎస్ఐ నర్సింగరావు సిబ్బందితో కలిసి గ్రామస్తులతో మాట్లాడారు. మీనా న్యాయం జరిగే వరకు కదిలేది లేదని తేల్చిచెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. చదవండి: (సోషల్ మీడియా పరిచయం, పెళ్లి.. ఆ తర్వాతే అసలు కథ..) -
మరోసారి కలసి నటించిన మోహన్ లాల్ మీనా
-
కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన మీనా, ఆందోళనలో ఫ్యాన్స్
కొత్త సంవత్సరంలో ఊహించని రీతిలో సీనియర్ నటి మీనా తన అభిమానులను పలకరించారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన మీనా ప్రస్తుతం తల్లి, సహానటి పాత్రలు చేస్తూ వస్తున్నారు. అయితే ఆమె మీడియా, సోషల్ మీడియాల్లో చాలా అరుదుగా కనిపిస్తారు. ఈ క్రమంలో న్యూ ఇయర్లో తొలిసారిగా సోషల్ మీడియాలోకి వచ్చిన మీనా ఓ బ్యాడ్ న్యూస్ పంచుకున్నారు. చదవండి: వారిని అలా చూస్తుంటే అసూయ కలుగుతోంది: స్టార్ హీరో అంతేకాదు అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలను హెచ్చరించారు. ఆమె ట్వీట్ చేస్తూ.. 2022లో వారి ఇంటికి వచ్చిన తొలి గెస్ట్ ఎవరో చెబుతూ ఆసక్తికంగా చెప్పుకొచ్చారు. ఇంతకి ఆ గెస్ట్ ఎవరో తెలుసా.. అయితే ఆమె పోస్ట్ చూడాల్సిందే. ‘2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి మిస్టర్ కరోనా. మా కుటుంబం మొత్తాన్ని ఇష్టపడింది. కానీ, నేను దానికి మా ఇంట్లో చోటు ఇవ్వను. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. చదవండి: నాకింగా 29యే, 30 తర్వాత ఆలోచిస్తా: సాయి పల్లవి బాధ్యతగా మసలుకోండి. కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రార్థనల్లో మాకు కూడా చోటివ్వండి’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఫన్నీగా, వ్యంగ్యంగా చేసిన ఆమె పోస్ట్ ప్రస్తుతం ఆకట్టుకుంటున్నప్పటికీ.. మీనా కుటుంబం మొత్తానికి కరోనా సోకడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘దీంతో మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. గెట్వెల్ సూన్ మేడం’ అంటూ ఆమె ట్వీట్పై నెటిజన్లు స్పందిస్తున్నారు. కాగా మీనా చివరిగా దృశ్యం 2లో కనిపించారు. First visitor to my home in 2022, Mr Corona. It liked my entire family. But I'm not letting it stay 😊 Beware people. Please stay safe ND healthy. Be responsible and don't let it spread. Keep us in your prayers 🙏 #stayhome #beresponsible #dontspread #weareinthistogether pic.twitter.com/sVmXKNLBzO — Meena Sagar (@Actressmeena16) January 5, 2022 -
‘దృశ్యం 2’ మూవీ రివ్యూ
టైటిల్ : దృశ్యం2 నటీనటులు : వెంకటేష్, మీనా, కృతికా, ఈస్టర్ అనిల్, నదియా, నరేష్, పూర్ణ, వినయ్ వర్మ తదితరులు నిర్మాణ సంస్థలు : సురేష్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ కథ, దర్శకత్వం : జీతు జోసెఫ్ సంగీతం : అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ : సతీష్ కురుప్ ఎడిటర్: మార్తాండ్ కే విడుదల తేది : నవంబర్ 25,2021 ఈ ఏడాది ప్రైమ్ లో చాలా కొత్త చిత్రాలు వచ్చాయి. కాని కొన్ని మాత్రమే నెటిజన్స్ ను మెప్పించడంతో పాటు ప్రైమ్ కు బోల్డంత పేరు తెచ్చిపెట్టాయి. అలాంటి సినిమాల్లో ఒకటి దృశ్యం 2, మలయాళ వర్షన్. దృశ్యం మొదటి భాగం థియేటర్స్ లో దుమ్మురేపింది. దృశ్యం 2 మలయాళ వర్షన్ ప్రైమ్ లో విడుదలై ఓటీటీ వరల్డ్ ను షేక్ చేసింది. ఇప్పుడు అదే దారిలో తెలుగు వర్షన్ కూడా వెళ్లింది. విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన దృశ్యం 2 తెలుగు వర్షన్ నేటి (నవంబర్ 25)నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎన్నో అంచనాల మధ్య ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. దృశ్యం 2 కథేటంటే..? దృశ్యం మూవీ ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచి 'దృశ్యం 2' సినిమా మొదలవుతుంది. తన ఇంట్లో హత్యకు గురైన వరుణ్ అనే కుర్రాడి శవాన్ని రాంబాబు (వెంకటేశ్) కన్ స్ట్రక్షన్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో పాతిపెట్టడంతో ‘దృశ్యం’ సినిమా ముగుస్తుంది. ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటపడిన రాంబాబు ఫ్యామిలీ ఉన్నత జీవితాన్ని గడుపుతుంటుంది. కెబుల్ బిజినెస్ చేసే రాంబాబు.. అంచెలంచెలుగా ఎదిగి సినిమా థియేటర్ ఓనర్ అవుతాడు. అంతేకాదు ఏకంగా ఓ సినిమాను నిర్మించేందుకు రంగంలోకి దిగుతాడు. ఇలా వారి జీవితంగా సాఫీగా సాగుతున్నప్పటీకీ.. వరుణ్ కేసు తాలూకు భయాలు మాత్రం అతడి కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటాయి. పోలీసులు ఎక్కడ కనిపించినా చాలు రాంబాబు భార్య జ్యోతి(మీనా, పిల్లలు అంజు (కృతిక), అను( ఏస్తర్ అనిల్) భయంతో వణికిపోతుంటారు. ఇదే క్రమంలో రాంబాబు జీవితంలోకి మళ్లీ పోలీస్ ఆఫీసర్ గీతా ప్రభాకర్ (నదియా), ప్రభాకర్ (నరేష్) మళ్లీ ప్రవేశిస్తారు. ఎలాగైనా రాంబాబు మీద పగ తీర్చుకోవాలని భావించిన గీత... తన స్నేహితుడు, ప్రస్తుతం ఐజీపీగా ఉన్న గౌతమ్ సాహు(సంపత్ రాజ్)సహాయంతో మళ్లీ ఆ కేసును రీఓపెన్ చేయిస్తుంది. మరి వరుణ్ కేసులో పోలీసులకు దొరికి ఆధారాలేంటి? కేసు నుంచి తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు రాంబాబు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? సరికొత్త సాక్ష్యాలతో రాంబాబు కుటుంబాన్ని కోర్టుకు ఈడ్చినప్పుడు ఈసారి అతను ఎలా బయటపడ్డాడు అనేదే ‘దృశ్యం 2’కథ. ఎవరెలా చేశారంటే..? రాంబాబు పాత్రలో వెంకటేశ్ ఒదిగిపోయాడు. దృశ్యం మాదిరే.. ఇందులో కూడా కథ మొత్తాన్ని తన భుజానా వేసుకొని నడిపించాడు. ‘దృశ్యం’లో కంటే ఈ సీక్వెల్ లో చాలా ఈజ్ తో ఆ పాత్రను పోషించాడు. సెకండాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ని అద్బుతంగా పండించాడు. ఈ మూవీతో వెంకటేశ్ నటుడిగా వెంకటేశ్ మరో మెట్టు ఎక్కాడనే చెప్పాలి. రాంబాబు భార్య జ్యోతి పాత్రకు మీనా న్యాయం చేసింది. నటన పరంగా బాగానే ఉన్నా.. డబ్బింగ్ అంతగా సూట్ కాలేదు. ఇక రాంబాబు పిల్లలుగా కృతిక, ఎస్తర్ అనిల్ కు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులుగా నదియా, నరేశ్ తమ పాత్రల్లో చక్కగా నటించారు. ఐజీగా సంపత్ రాజ్, కానిస్టెబుల్గా సత్యం రాజేశ్, రాంబాబు లాయర్ గా పూర్ణ, రచయితగా తనికెళ్ల భరణితో పాటు మిగిలిన నటీ,నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. దృశ్యం’కు సీక్వెల్ ఇది. అదే తారాగణం. అదే నేపథ్యం. అదే కొనసాగింది. తల్లీకూతుళ్లు కుర్రాణ్ణి హత్య చేసిన ఆరేళ్ల తర్వాత నుంచి కథ మొదలవుతుంది. ఈ మూవీ మలయాళ వర్షన్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్లో రిలీజై, సూపర్ హిట్ అయింది. అయినా.. మళ్లీ తెలుగు ప్రేక్షకుల కోసం దర్శకుడు జీతూ జోసెఫ్ ఫ్రెష్ లుక్తో ఈ మూవీని తెరకెక్కించాడు. మాతృకతో పోలిస్తే.. తెలుగు వర్షన్లో కొన్ని స్వల్ప మార్పులు చేశాడు దర్శకుడు. మలయాళంలో చివరి వరకు చెప్పని కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ని తెలుగులో ముందుగానే చెప్పాడు. మొదట కొంత భాగం బోర్ కొట్టించినా.. వరుణ్ కేసును పోలీసులు సీక్రెట్గా విచారిస్తున్నారని తెలియడంతో ప్రేక్షకుడిలో ఉత్కంఠ పెరుగుతుంది. ఎవరూ ఊహించని ట్విస్టులతో సినిమాపై ఆసక్తి పెంచేశాడు దర్శకుడు. సెకండాఫ్లో కథ చాలా స్పీడ్గా వెళ్తుంది. కేసు నుంచి తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు రాంబాబు వేసే ఎత్తులు, పైఎత్తులు చాలా ఉత్కంఠభరితంగా సాగుతాయి. ముఖ్యంగా చివరిలో రాంబాబు ఇచ్చే ట్విస్ట్కు ప్రేక్షకులు ఫిదా అవుతారు. కోర్టు సన్నివేశాలు సినిమాని మరోస్థాయికి తీసుకెళ్తాయి. మొత్తంగా దృశ్యం 2’ సినిమా దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనమనే చెప్పాలి. ఇక సాంకేతిక విషయాలకొస్తే..అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం అదిరిపోయింది. సతీష్ కురూప్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ప్రతి ఫ్రేమ్ని అందంగా, ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దాడు.ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పితే బాగుండేది. ముఖ్యంగా ఫస్టాఫ్లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ వెంకటేశ్ నటన కథ, కథనం సెకండాఫ్, క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ ఫస్టాఫ్లోని కొన్ని సన్నివేశాలు - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
Drushyam 2 : వరుణ్ మర్డర్ కేసు నుంచి రాంబాబు బయటపడ్డాడా?
విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘దృశ్యం 2’. సూపర్ హిట్ మూవీ దృశ్యం సీక్వెల్గా ఇది తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా నవంబర్ 25న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. విడుదల తేది దగ్గర పడటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ నేపథ్యంగా తాజాగా ట్రైలర్ని విడుదల చేశారు. దృశ్యం మూవీ ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచి 'దృశ్యం 2' సినిమా మొదలైంది. ఇందులో వెంకటేశ్ థియేటర్ ఓనర్ గా కనిపిస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ నదియా కొడుకు హత్య కేసు అనంతరం రాంబాబు కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. నదియా కుమారుడి హత్య కేసు ఏమైంది అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. వరుణ్ మర్డర్ కేసు విషయంలో రాంబాబు ఫ్యామిలీపై పోలీసు నిఘ పెట్టినట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ హత్యను రాంబాబే చేశాడని నిరూపించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆరేళ్ల తరువాత రాంబాబు జీవితంలో మళ్లీ ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ఈ కేసు నుంచి తన ఫ్యామిలీని కాపాడుకునేందుకు రాంబాబు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అనేది తెలియాలంటే నవంబర్ 25న ‘దృశ్యం 2’ చూడాల్సిందే. -
ఆ చీకటి ఙ్ఞాపకాల్లోకి మమ్మల్ని మళ్లీ లాగొద్దు : వెంకటేశ్
Venkatesh Drushyam 2 Movie Release Date Confirmed: వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రలో నటించిన 'దృశ్యం-2' రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అనుకోని ఆపదల నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కుమార్తెను ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు? అనే కథాంశంతో రూపొందిన సినిమా ఇది. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం 2’కు రీమేక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసఫే తెలుగు రీమేక్కు కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో ఈనెల 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. The truth has begun to unveil itself. But the question is - has it left a permanent scar on Rambabu? Watch #Drushyam2OnPrime, Nov. 25 on @PrimeVideoIN ▶️https://t.co/mL68iUtwzC#MeenaSagar #JeetuJoseph @SureshProdns @aashirvadcinema @antonypbvr @anuprubens #SatheeshKurup pic.twitter.com/YTkirX6oBH — Venkatesh Daggubati (@VenkyMama) November 12, 2021 -
‘పెద్దన్న’మూవీ ట్విటర్ రివ్యూ
సూపర్స్టార్ రజనీకాంత్ తనదైన స్టైల్లో బాక్సాఫీస్ వద్ద దీపావళి సంబరాలను ప్రారంభించాడు. ‘అన్నాత్తే’ సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగాడు. ఈ సినిమాను తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్లో రజనీకాంత్కు ఉన్నఛరిష్మా, స్టామినాను చూసుకుంటే ‘పెద్దన్న’ పెద్ద సినిమాగానే పరిగణించాలి. గతంలో దర్బార్, కబాలి, కాలా, 2.0, పెట్టా వంటి సినిమాలతో తెలుగువారిని పలుకరించిన ఈ సూపర్స్టార్ తన స్టామినాకు తగ్గ హిట్ను అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శివ దర్శకత్వంలో తొలిసారి రజనీకాంత్ నటిస్తున్న సినిమా కావడం.. ఈ సినిమాలో కీర్తి సురేశ్.. లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు సీనియర్ బ్యూటీ మీనా కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో ‘పెద్దన్న’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. Old school melodrama of brother sister sentiment didn't work initially with lot of filler scenes but movie picks pace exactly after an hour and gets intense and massy by end of first half #Peddanna #Annaththe #AnnaattheDeepavali #AnnaattheThiruvizha #AnnaattheFDFS — HarveySpector (@PoolaShirt) November 4, 2021 ఫస్ట్ హాఫ్ చాలా నీరసంగా వుంది.. అవుట్ డేటడ్ కామెడీ.. ఓవర్ సెంటిమెంట్ సీన్స్ చిరాకు తెప్పిస్తాయి.. రజిని మార్క్ మాస్ సీన్స్ మాత్రమే హైలెట్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. Just finished FDFS in #melbourne. @directorsiva best till date. It’s a sure shot industry hit. Mark my tweet. #Rajinikanth awesome sir. #Annaatthe — Glitz (@Jesse19100220) November 4, 2021 #Annaatthe first half - Superstar Rajinikanth is in fine form and his sister sentiment with @KeerthyOfficial picks up the momentum only towards the intermission with a twist. The interval bang with a powerful action episode packs a punch. @immancomposer songs are a big plus! — Rajasekar (@sekartweets) November 4, 2021 Basic gaa eedi @rajinikanth divasam yeppudoo chesesaaru..aa Sankarudi valla kona voopiri tho kottukunnaadu Robo nunchi Shivaji varaku..tarvatha aa sankarudu koodaa kaapaadaleka poyyaadu..yendhukuraa Rajini ga distributors ante antha kaksha niku💦💦 #Annaatthe #Peddanna — pSPk (@SimplySukiP) November 4, 2021 Okayish 1st half...Thalaivar pure mass from pre-interval to interval block🔥#Annaatte #Peddanna https://t.co/ehuMGyB9Se — 𝖀𝖕𝖕𝖎 (@__UpendraDhfm) November 4, 2021 One word Review: BLOCKBUSTER #Annaatthe: 🌟🌟🌟🌟 (4/5) 1½ Good in parts,2½ Bang for buck. Tantalizing Post-Interval sequence & climax.#Rajinikanth engages more with his lively emotions than action. Keerthi- Commendable Jaggu bhai- vicious villain role👌@directorsiva 🔥🔥 — Arun Kumar (@Prasannaactor) November 4, 2021 #Peddanna okkati ante okka show kuda fast filling lo ledhu Motham green ye ..oreyy bheemji entha pani chesav ra ayya — Nippu NagaRRRaju (@GopiNagaTeja) November 4, 2021 #Annaatthe First Half Report : “TORTURE UNLIMITED” 👉1950’s Outdated Story 👉Forced Emotions 👉Over-action Scenes & Over-action Comedy 👉ONLY POSITIVE - “MASS INTERVAL FIGHT”#peddanna #Rajini #Rajinikanth #Nayanthara #KeerthySuresh #AnnaattheReview #AnnaattheDeepavali — PaniPuri (@THEPANIPURI) November 4, 2021 #Annaatthe 1st half: #SuperstarRajinikanth's one-man show! @immancomposer songs are a highlight. Story revolves around brother - sister relationship; high on emotional melodrama! Interval block shot - massy & sentimental. — MALAYSIA RJ ARIVU (@MalaysiaRJArivu) November 4, 2021 #Annaatthe - A mashup of Dir Siva's earlier blockbusters with #SuperstarRajinikanth as the Annan who'll go to any lengths to protect his Thangam sister. Heavy sentimental action melodrama with Imman's overpowering score. Valiant #Thalaivar's efforts & evergreen screen presence👍 — Kaushik LM (@LMKMovieManiac) November 4, 2021 Hearing Super Duper Reviews For #Annaatthe Movie.. Congrats And Wishing For Massive BB Hit To Superstar @rajinikanth Sir And Our Dear @directorsiva Sir From THALA AJITH Fans ❤❤#Valimai || #Thala || #AjithKumar pic.twitter.com/RFFefOCuQ5 — EMPEROR AJITH FANS™ (@EmperorAjithFC) November 4, 2021 Trailer Routine Unna Banda Siva Gadu Masssss Audience Ki Min Guarantee Movie Ichi Untadani Anukunnane 😣 Asalu Families Chuse Scope Ivvaleda Kamal ? #Annaatthe #Peddanna https://t.co/m0WAFLk7JC — gupta (@guptanagu8) November 4, 2021 Hyderabad It's #HappyDeepavali morning.. People will be busy. But tickets are still getting booked on #bookmyshow early in the morning#Annaatthe #AnnaattheDeepavali #AnnaattheThiruvizha #Peddanna #PeddannaDeepavali #PeddannaFDFS #AnnaattheFDFS #AnnaattheReview — The Cursed Knight™ (@thecursedknight) November 4, 2021 First Half: Annaatthe is going to be one of the most emotional movies of Thalaivar.. Going to work for B and C like anything.. Siva Hit six in the pitch which works for him🔥🔥🔥🔥#AnnaattheDeepavali #AnnaattheFDFS #Annaatthe #AnnaattheReview#Rajinikanth pic.twitter.com/6dMbt6cIfm — midhun (@midhuntweets4u) November 4, 2021 #Thalaivar and @immancomposer hold the entire movie firmly🙌 Movie is almost similar to Viswasam, Vedalam & Thirupachi.. Will workout big time with family audience and ladies ✌️ 3-4 mass theatre moments for fans🔥 Tamilnadu box office will be on fire🥳#Annaatthe — ரௌடி (@Rowdy_3_) November 4, 2021 -
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అన్నత్తె’ మూవీ స్టిల్స్
-
మీనా కూతురుని చూశారా? ఎంత క్యూట్గా ఉందో.. ఫోటోలు వైరల్
అందాల నటి మీనా గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. బాలనటిగా ఎంట్రీ ఇచ్చి, తన అందచందాలతో, చక్కటి అభినయంతో చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచుకుంది. ఇప్పటికే అదే సౌందర్యంతో చూడచక్కని రూపంతో ఆకట్టుకుంటున్నారు మీనా. మీనా 1976 సెప్టెంబర్ 16న మద్రాసులో జన్మించారు. 2009లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ని మీనా వివాహం చేసుకుంది. వీరికి 2011లో నైనికా అనే ఓ అమ్మాయి పుట్టింది. శుక్రవారం (సెప్టెంబర్ 16) మీనా తన 45వ పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా తన కూతురితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది మీనా. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీనా కూతురు అచ్చం తల్లి లాగే ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ హీరోగా నటించిన ‘పోలీసోడు’చిత్రంలో అతనికి కూతురిగా నటించింది నైనిక. ఆ తర్వాత ‘భాస్కర్ ఒరు రాస్కెల్’లో అరవింద్ స్వామితోనూ నటించింది. ఇక మీనా విషయానికొస్తే శివాజీ గణేశన్ నటించిన నెంజన్ గళ్ చిత్రంలో తొలిసారి మీనా తెరపై కనిపించారు. తెలుగులో మీనా మొదటిసారి కనిపించిన చిత్రం కృష్ణ హీరోగా రూపొందిన సిరిపురం మొనగాడు. తెలుగులో వెంకటేష్, చిరంజీవి, నాగార్జున ఇలా అందరితో ఆడిపాడింది. రెండో ఇన్నింగ్స్ షురూ చేశాక వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం రజనీకాంత్ 'అన్నాత్తే'లో నటిస్తుంది. మరోవైపు విక్టరీ వెంకటేష్ హీరోగా రాబోతున్న దృశ్యం- 2 సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కూతురుతో హీరోయిన్ మీనా క్యూట్ ఫోటోలు
-
Sakshi Special Edition: ముసి ముసి నవ్వుల.. మీనా
-
‘మంచు’ వారి ఇంట్లో మోహన్లాల్ సందడి, ఫోటోలు వైరల్
డైలాగ్ కింగ్ మంచు మోహన్బాబుకు మలయాళ, తమిళ సీనియర్ నటులతో మంచి స్నేహం ఉంది. రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్లాల్ లాంటి సీనియర్ హీరోలు ఇప్పటికి మోహన్బాబుతో టచ్లో ఉంటారు. షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తే.. కచ్చితంగా మోహన్బాబుని కలిసి వెళ్తుంటారు. తాజాగా మలయాళీ ప్రముఖ నటుడు మోహన్లాల్.. మంచువారి ఇంట్లో సందడి చేశాడు. మంచు కుటుంబంతో కలిసి మోహన్లాల్ భోజనం చేశారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు మంచు లక్ష్మి. మోహన్లాల్ నటిస్తున్న ‘బ్రో డాడీ’మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఇందులో మోహన్ లాల్ సరసన మీనా నటిస్తోంది. వీరిద్దరినీ ఇటీవల మోహన్ బాబు తన ఇంటికి విందుకు ఆహ్వానించారు.మోహన్ బాబు సతీమణి నిర్మల, కుమార్తె మంచు లక్ష్మీ, కొడుకు కోడలు విష్ణు, విరోనికా వీళ్ళంతా కలసి మోహన్ లాల్ తో ఫోటోలు కూడా దిగారు. వీటిని మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
బాలయ్య సినిమాలో మీనా.. ప్రత్యేకంగా ఆ సీన్ కోసమేనట
నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో ఫుల్ జోష్లో ఉన్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. యదార్థ ఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అఖండలో మాదిరే ఈ సినిమాలోనూ బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కన్పించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ క్రేజీ ప్రాజెక్ట్లో సీనియర్ హీరోయిన్ మీనా కూడా నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా స్క్రిప్ట్ ప్రకారం బాలయ్య ఫ్లాష్బ్యాక్ సీన్స్ ఓ రేంజ్లో ఉంటాయని తెలుస్తోంది. ఈ ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో బాలకృష్ణకు జోడీగా మీనా కనిపించనున్నారట. ఈ చిత్రంలో ఎంతో కీలకమైన ఆయన భార్య పాత్రలో మీనా నటించబోతోందని సమాచారం. ఇక మెయిన్ హీరోయిన్గా శృతిహాసన్ నటించబోతున్నట్లు వార్తాలు వినిపిస్తున్నాయి. ఇక మీనా విషయానికొస్తే.. రెండో ఇన్నింగ్స్ షురూ చేశాక వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం రజనీకాంత్ 'అన్నాత్తే'లో నటిస్తుంది. మరోవైపు విక్టరీ వెంకటేష్ హీరోగా రాబోతున్న దృశ్యం- 2 సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. -
ఓటీటీలో దృశ్యం-2.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత సురేశ్బాబు
అనుకోకుండా చిక్కుకున్న ఓ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కూతురిని ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం-2. ‘దృశ్యం’ సినిమాకి సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ జంటగా నటించారు. మలయాళంలో డైరెక్ట్ చేసిన జీతూ జోసఫే తెలుగు రీమేక్ను కూడా తెరకెక్కిస్తున్నారు. సురేశ్బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా మలయాళంలో కేవలం 45 రోజుల్లో మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 19న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. అక్కడ ఈ మూవీకి మంచి స్పందన రావడంతో, అదే సినిమాను తెలుగులో వెంకటేశ్తో రీమేక్ చేశారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలాంటి తరుణంలో దృశ్యం-2 సబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి చెందిన ఒక ప్రముఖ సంస్థవారు భారీ ఆఫర్ ఇవ్వడంతో నిర్మాతలు అంగీకరించారనీ, త్వరలోనే ఈ సినిమా ఓటీటీ సంస్థలో విడుదల కానుందని పుకార్లు వచ్చాయి. వీటిపై తాజాగా నిర్మాత సురేశ్ బాబు స్పందించారు. ఓటీటీలో విడుదల అనేది కేవలం పుకారు మాత్రమేనని, తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తామే స్వయంగా చెప్పే వరకు ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. చదవండి: ఈ వీకెండ్లో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే.. హాట్ టాపిక్గా మారిన పవన్ కల్యాణ్ రెమ్యూనరేషన్ -
స్పీడు పెంచిన వెంకటేశ్
హీరో వెంకటేశ్ మంచి జోష్లో ఉన్నారు. సినిమాల మీద సినిమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ‘నారప్ప’ (తమిళ చిత్రం ‘అసురన్’కు తెలుగు రీమేక్) సినిమా షూట్ను పూర్తి చేసిన వెంకటేశ్ తాజాగా ‘దృశ్యం 2’ సినిమాకు కూడా పూర్తిగా ప్యాకప్ చెప్పారు. మలయాళ ‘దృశ్యం 2’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘దృశ్యం’ తొలి భాగంలో భార్యాభర్తలుగా నటించిన వెంకటేశ్, మీనాలే సీక్వెల్లోనూ నటిస్తున్నారు. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫే తెలుగు ‘దృశ్యం 2’కు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా వెంకటేశ్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయినట్లు చిత్రబందం ప్రకటించింది. ఇప్పుడు నదియా, మీనా కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు వెంకటేశ్ ‘ఎఫ్–3’ సినిమాతో బిజీ అవుతారు. -
దృశ్యం-2 రిలీజ్ డేట్ ఫిక్స్?
అనుకోని ఆపదల నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కుమార్తెను ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు? అనే కథాంశంతో ‘దృశ్యం 2’ సినిమా సాగుతుంది. మలయాళంలో ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్గా వచ్చిన ‘దృశ్యం 2’ సూపర్హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా తొలి భాగం రీమేక్లో నటించిన వెంకటేష్, మీనా ఇప్పుడు సీక్వెల్ రీమేక్లోనూ నటిస్తున్నారు. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసఫే తెలుగు రీమేక్ను కూడా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. ఇప్పటికే యాభై శాతం షూటింగ్ను పూర్తి చేసుకున్న ‘దృశ్యం 2’ సినిమాను ఫాదర్స్ డే సందర్భంగా జూన్ 20న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. కుటుంబం కోసం ఓ తండ్రి పడే తపన నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది కాబట్టి ఆ రోజు అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. -
కేరళలో ‘దృశ్యం 2’ కీలక సన్నివేశాలు
కుటుంబంతో సహా కేరళ వెళ్లారు రాంబాబు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికేనా? అంటే కథ ప్రకారం అంతే. ఇంతకీ రాంబాబు అండ్ ఫ్యామిలీ ఏం చేసింది? పోలీసులు ఎందుకు వెంటాడుతున్నారు? అనే విషయం ‘దృశ్యం 2’లో తెలుస్తుంది. ‘దృశ్యం’ చూసినవాళ్లకు విషయం ఏంటో తెలుసు. ఆ సినిమాలో కేసు క్లోజ్ అయిపోతుంది. రాంబాబు కుటుంబం హ్యాపీ ఫీలవుతుంది. కానీ మళ్లీ కేసు రీ ఓపెన్ అవ్వడమే ‘దృశ్యం 2’ కథ. మలయాళ ‘దృశ్యం’కి సీక్వెల్ ఇది. తొలి భాగం రీమేక్లో నటించిన వెంకటేష్, మీనా ప్రస్తుతం మలి భాగం ‘దృశ్యం 2’లోనూ నటిస్తున్నారు. వెంకటేశ్ పాత్ర పేరు రాంబాబు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ కేరళలో మొదలైంది. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమాను ఈ ఏడాది జూలైలో విడుదల చేయాలనుకుంటున్నారు. -
‘దృశ్యం 2’ సెట్స్లో జాయిన్ అయిన మీనా
‘దృశ్యం 2’ సినిమా సెట్స్లో జాయిన్ అయ్యారు హీరోయిన్ మీనా. సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’ (2014) సినిమాకు సీక్వెల్గా ‘దృశ్యం 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో హీరో హీరోయిన్లుగా నటించిన వెంకటేష్, మీనాయే సీక్వెల్లో కూడా చేస్తున్నారు. సోమవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు మీనా. ‘‘స్టార్ట్ రోలింగ్.. ‘దృశ్యం 2’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాను’’ అని పేర్కొన్నారు మీనా. ఈ సినిమాలో నటి పూర్ణ కూడా ఓ కీలకపాత్ర చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మలయాళ మాతృక ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ సినిమాలను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ తెలుగు ‘దృశ్యం 2’తో దర్శకుడిగా తెలుగుకి పరిచయం కానున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. చదవండి: ఈ ఆపరేషన్ నా జీవితాన్ని మార్చేసింది : బిగ్ బీ -
స్క్రీన్పై అలా నటించడానికి మీనా ఒప్పుకోలేదు
మోహన్లాల్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం’. 2013లో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఇటీవలె ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్గా ‘దృశ్యం 2’ను తెరక్కించిన సంగతి తెలిసిందే. థ్రిల్లర్ కథాంశం, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. అయితే మోహన్లాల్కు జోడీగా నటించిన మీనాను మాత్రం నెటిజన్లు తెగ ట్రోల్స్ చేసేస్తున్నారు. ఈ చిత్రంలో మధ్య వయస్కురాలున్న గృహిణి పాత్రలో కనిపించిన మీనా.. అందుకు తగిన విధంగా లేదని, అతిగా మేకప్ వేసుకుందని విమర్శిస్తున్నారు. ఎమోషనల్,ఏడుపుగొట్టే సన్నివేశాల్లోనూ చెదరని జుట్టు, డార్క్ లిప్స్టిక్తో కనిపించిందని ఇది రియలిస్టిక్ లేదని పేర్కొంటున్నారు. అయితే నెటిజన్లు చేస్తున్న విమర్శలపై స్పందించిన దర్శకుడు జితూ..వారి అభిప్రాయాలతో తాను సైతం ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. డీ-గ్లామరస్ లుక్లో కనిపించేందుకు తాను సుముఖంగా లేనని, స్క్రీన్పై అలా నటించడం తనకి ఇష్టం లేదని మీనా చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో మీనా నిర్ణయంతో తాను ఏకీభవించాల్సి వచ్చిందని తెలిపారు. ఇక జీతు జోసెఫ్ దర్శకత్వంలోనే మలయాళ ‘దృశ్యం 2’ రీమేక్లో వెంకటేశ్ నటించనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ‘దృశ్యం 3’ కూడా ఉంటుందని, ఆల్రెడీ మూడో భాగం క్లైమాక్స్ రాసుకున్నానని డైరెక్టర్ జీతూ వెల్లడించారు. కానీ ‘దృశ్యం 3’ తెరకెక్కడానికి మరో మూడేళ్ల సమయం పడుతుందని స్పష్టం చేశారు. చదవండి : ఆ యాడ్స్లో ఉన్న చిన్నారి ‘బేబమ్మే’! టాలీవుడ్లో తీవ్ర విషాదం.. -
అన్నయ్య రెడీ
‘అన్నాత్తే’ తిరిగి షూటింగ్ను స్టార్ట్ చేయబోతున్నాడు. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘అన్నాత్తే’. పెద్దన్నయ్య అని అర్థం. ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తీ సురేష్, నయనతార నటిస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో హైదరాబాద్లో ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ను స్టార్ట్ చేశారు. కానీ చిత్రబృందంలో కొందరు కరోనా బారిన పడటంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించడానికి దర్శకుడు శివ సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్లో స్వల్ప అస్వస్థతకు గురయ్యాక, విశ్రాంతిలో ఉన్న రజనీ షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అయ్యారట. మార్చి 15న చిత్రీకరణ ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్లోనే రజనీకాంత్ కూడా పాల్గొంటారట. ఇప్పటికే షూటింగ్ బాగా ఆలస్యమైందని...ఆర్టిస్టుల కాల్షీట్స్ ఇబ్బంది లేకుండా సినిమా షూటింగ్ను తొందరగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట శివ. నవంబరు 4న ‘అన్నాత్తే’ విడుదల కానుంది. -
దృశ్యం 2: మోహన్ లాల్ కథకు ప్రాణం పోశారు
మలయాళంలో సూపర్ హిట్గా నిలిచిన ‘దృశ్యం’ మూవీకి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘దృశ్యం-2’ ఈ రోజు అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు. ఆరేళ్ల క్రితం సెన్సెషనల్ హిట్ సాధించిన ఈ మూవీ తెలుగు, తమిళంతోపాటు మరో మూడు భాషల్లో రీమేక్ అయ్యిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇక తాజాగా మలయాళంలో విడుదలైన ఈ మూవీ సిక్వెల్కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా సీని రచయిత శీధర్ పిల్లై ట్వీట్ చేశారు. ‘అద్భుతమైన ఆరంభం. దృశ్యం లాగే ఈ సీక్వెల్ కూడా ప్రేక్షక ఆదరణతో ముందుకు వెళుతోంది. జీతూ జోసెఫ్ స్మార్ట్ రైటింగ్, థ్రిల్లింగ్ థాట్కు జార్టీ కుట్టిగా మోహన్ లాల్ కథకు ప్రాణం పోశారు’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా దృశ్యంలో తన కుటుంబం జోలికి వచ్చిన వరుణ్ను కూతురు హత్య చేయడం.. ఆ మృతదేహాన్ని ఎవరూ ఉహించని విధంగా పోలీస్ స్టేషన్లోనే పాతిపెడతాడు జార్జి కుట్టి (మోహన్ లాల్). ఇక ఆ తర్వాత జార్జి తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. కానీ ఆ కేసును మాత్రం పోలీసులు వదిలి పెట్టరు. జార్జికి తెలియకుండా ఆ కేసును ఇంకా దర్యాప్తు చేస్తుంటారు. ఈ క్రమంలోనే వారికి కొన్ని కీలక సాక్ష్యాలు దొరుకుతాయి. ఆ సాక్ష్యాలెంటీ.. మళ్లీ వాటి వలన జార్జి కుటుంబానికి ఎదురైన సమస్యలను దర్శకుడు దృశ్యం 2లో చూపించాడు. #Drishyam2 @PrimeVideoIN -Fantastic!A sequel as good as #Drishyam. #JeethuJoseph nailed it smart writing & taut thrilling moments. @Mohanlal as #Georgekutty is extraordinary along with #Meena & #MuraliGopy.Story opens 6 years after events of #D1 & police hasn’t closed the case... pic.twitter.com/ciAYV0J4LU — Sreedhar Pillai (@sri50) February 18, 2021 -
ప్రవర్తన మార్చుకోండి: వైట్హౌజ్ వార్నింగ్!
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సోదరి కుమార్తె మీనా హారిస్కు శ్వేతసౌధం హెచ్చరికలు జారీచేసింది. ఇకపై వైస్ ప్రెసిడెంట్ పేరును ప్రచారం కోసం వాడుకోవడం మానేయాలని విజ్ఞప్తి చేసింది. ‘‘ఆమె పేరిట బ్రాండ్ ప్రమోషన్ సరికాదు. కొన్ని చేయకూడని పనులు ఉంటాయి. అదే మేం చెప్పాం. ఇలాంటి ప్రవర్తన మార్చుకోవాలి’’ అని మీనా హారిస్కు వైట్హౌజ్ లీగల్ టీం స్పష్టం చేసినట్లు లాస్ ఏంజెల్స్ టైమ్స్ ఓ కథనం వెలువరించింది. వైస్ ప్రెసిడెంట్ ఆంటీ పేరిట స్వెట్షర్ట్స్, స్విమ్సూట్స్, ఇతర ఉత్పత్తులు తయారు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొంది. కాగా అగ్రరాజ్య తొలి ఉపాధ్యక్షురాలిగా చరిత్రకెక్కిన కమలా హారిస్ భారత- జమైకా సంతతికి చెందిన వారన్న విషయం తెలిసిందే. ఆమెకు ఏకైక సోదరి మాయా హారిస్ ఉన్నారు. ఈ అక్కాచెల్లెళ్లు ఇద్దరు న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. కమల రాజకీయాల్లో రాణిస్తుండగా.. మాయా, హిల్లరీ క్లింటన్ న్యాయవాదిగా, సలహాదారుగా పనిచేశారు. ఇక మాయాకు కుమార్తె మీనాక్షి ఆష్లే హారిస్ ఉన్నారు. ఆమె కూడా న్యాయవాదే. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకున్నారు. వృత్తితో పాటు ప్రవృత్తికి ప్రాధాన్యమిచ్చే ఆమె, చిన్నారుల కోసం పుస్తకాలు కూడా రాశారు. అంతేగాక సామాజిక కార్యక్రమాలకు సంబంధించి పలు ప్రచారోద్యమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఈ క్రమంలో నాలుగేళ్ల కిందట ఓ కంపెనీ స్థాపించిన మీనా.. టీ షర్టులు, స్వెట్షర్ట్స్ అమ్మకాలు చేపట్టారు. ఇందుకై కమలా హారిస్ పేరును ఆమె వాడుకున్నారు. ఇక ఇప్పుడు ఆమె దేశ రెండో అత్యున్నత హోదాలో ఉన్న నేపథ్యంలో ఇలాంటి పబ్లిసిటీ వల్ల చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని, కమల సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. చట్టపరంగా ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వైట్హౌజ్ ఈ మేరకు మీనా హారిస్కు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. చదవండి: 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ చదవండి:ఒక్కగానొక్క ఆడబిడ్డ అన్నట్లుగా.. -
Actress Meena HD Photos: హీరోయిన్ మీనా స్పెషల్ ఫోటోలు
-
ఫ్యాన్స్కు మోహన్లాల్ న్యూ ఇయర్ గిఫ్ట్
సూపర్ స్టార్ మోహన్ లాల్, మీనా నటించిన సూపర్ హిట్ థ్రిల్లర్ 'దృశ్యం2' న్యూ ఇయర్ కానుకగా అమెజాన్ ప్రైమ్లో విడుదల అయ్యింది. దీనికి సంబంధించి ఇప్పటికే అర్థరాత్రి టీజర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మోహన్లాల్ మాట్లాడుతూ..జార్జ్ కుట్టి, అతని కుటుంబం కథతో ముందుకు వస్తున్నామని, ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆసక్తితో ఉన్నట్లు పేర్కొన్నారు. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనా, సిద్దిక్, ఆశా శరత్, మురళి గోపీ, అన్సిబా, ఎస్తేర్, సైకుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2013లో విడుదలైన దృశ్యం మొదటి పార్ట్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మలయాళంలో బాక్సాఫీస్ వద్ద రూ .50 కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా రికార్డుకెక్కింది. మొదటి పార్ట్లో ఎక్కడైతే కథ ఆగిందో సెకండ్ పార్ట్లో అక్కడినుంచి కంటిన్యూ కానుంది. థ్రిల్లర్ కథాంశం, సస్పెన్స్ ఈ సినిమాను పెద్ద హిట్ చేశాయి. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ (శ్రీలంక) భాషల్లో ఈ చిత్రం రీమేక్ అయిన సంగతి తెలిసిందే. అది కాకుండా గత దశాబ్దంలో ఎక్కవ భాషల్లో రీమేక్ అయిన సినిమాల్లో ‘దృశ్యం’ ఒకటి. చైనీస్ భాషలో రీమేక్ అయిన తొలి భారతీయ సినిమా కూడే ఇదే కావడం విశేషం. మోహన్ లాల్ మే 21న తన 60 వ పుట్టినరోజు సందర్భంగా దృశ్యం సీక్వెల్ ప్రకటించినా కరోనా కారణంగా షూటింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యింది. కాగా మోహన్లాల్ తదనంతరం జీతు జోసెఫ్ దర్శకత్వంలోనే ‘రామ్’ అనే మరో చిత్రానికి సైన్ చేశారు. Georgekutty and his family are coming soon on @PrimeVideoIN#Drishyam2OnPrime #HappyNewYear2021 #MeenaSagar #JeethuJoseph @antonypbvr @aashirvadcine @drishyam2movie #SatheeshKurup pic.twitter.com/5l7cfCdCS3 — Mohanlal (@Mohanlal) December 31, 2020 -
నేరేడ్మెట్ కౌంటింగ్: ఆర్వో సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేరేడ్మెట్ కౌంటింగ్ సందర్భంగా జరిగిన వాదోపవాదనలపై ఆర్వో లీనా కలత చెందారు. ఎన్నికల్లో తాను ఏ అభ్యర్థికి, ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదని ఆర్వో లీనా వివరించారు. ఈ మేరకు బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నాపై పలువురు అభ్యర్థులు అనేక ఆరోపణలు చేశారు. నా విధులకు ఆటంకం కల్పించడం, నన్ను అసభ్యంగా దూషించడంపై నేరేడ్మెట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాను. నన్ను తిట్టిన కాల్ రికార్డులు నా దగ్గర ఉన్నాయి. ఎన్నికల సంఘానికి కూడా నివేదిక ఇస్తాను. ఎన్నికల్లో నేను పారదర్శకంగా పనిచేశా. ఎవరికీ అమ్ముడుపోలేదు. నా సెల్ఫోన్, కాల్ రికార్డ్స్ అన్ని చూపించేందుకు సిద్ధంగా ఉన్నా' అని ఆర్వో లీనా తెలిపారు. చదవండి: (నేరేడ్మెట్లో టీఆర్ఎస్ విజయం) ఇదిలా ఉండగా నేరేడ్మెట్ కౌంటింగ్ వద్ద బీజేపీ అభ్యర్థి ఆందోళన దిగారు. రిజక్ట్ అయిన 1,300 ఓట్లను కూడా లెక్కించాలంటూ బీజేపీ అభ్యర్థి డిమాండ్ చేస్తున్నారు. కాగా 544 ఓట్లు మాత్రమే లెక్కించినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. 544 ఓట్లలో 278 టీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. గతంలో టీఆర్ఎస్కు 504 ఓట్ల ఆధిక్యం ఉండటంతో.. మొత్తంగా 782 ఓట్లతో టీఆర్ఎస్పార్టీ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి విజయం సాధించింది. -
యుద్ధానికి వెళ్తున్నట్లనిపించింది
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణం అంటే యుద్ధానికి వెళ్తున్న భావన కలుగుతోంది’’ అంటున్నారు మీనా. మలయాళ చిత్రం ‘దృశ్యం’కి సీక్వెల్గా ‘దృశ్యం 2’ తెరకెక్కుతోంది. మోహన్ లాల్, మీనా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం ఏడు నెలల తర్వాత విమానయానం చేశారు మీనా. పీపీఈ కిట్ ధరించి ప్రయాణం చేశారామె. దీని గురించి మీనా మాట్లాడుతూ –‘‘ఈ దుస్తులన్నీ చూస్తుంటే అంతరిక్షానికి వెళ్తున్నట్టు అనిపించింది. అలాగే ఏదో యుద్ధానికి వెళుతున్న ఫీల్ కలిగింది. విమానాశ్రయం చాలా ఖాళీగా ఉంది. నాలా ఎవ్వరూ డ్రెస్ (పీపీఈ కిట్స్) చేసుకోకపోవడం భలే ఆశ్చర్యంగా అనిపించింది. ఈ డ్రెస్లో ప్రయాణం చాలా కష్టం. బయట చల్లగా ఉన్నప్పటికీ లోపల ఒకటే ఉక్కపోత. వీటితో రోజూ మన కోసం కష్టపడుతున్న అందరికీ నా సెల్యూట్’’ అన్నారు. -
సీబీఐ ఆఫీసర్ కామాక్షి
కరోనా లాక్డౌన్ వల్ల థియేటర్లు మూత పడటంతో వెబ్ సిరీస్లకు క్రేజ్ పెరిగింది. దీంతో స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు సైతం డిజిటల్ రంగంవైపు అడుగులేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి సీనియర్ నటి మీనా చేరారు. 90లలో తెలుగు, తమిళ భాషల్లో టాప్ స్టార్గా రాణించిన మీనా మొదటిసారి ‘కరోలిన్ కామాక్షి’ అనే వెబ్ సిరీస్లో నటించారు. ఆమె సీబీఐ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారట. మీనా పాత్ర పేరు కామాక్షి. లాక్డౌన్కి ముందు కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సిరీస్ లాక్డౌన్తో ఆగిపోయింది. ఈ నెల 11న బ్యాలె¯Œ ్స చిత్రీకరణని ప్రారంభించి శరవేగంగా పూర్తి చేశారట. వివేక్ కుమారన్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ని ట్రెండ్ లౌడ్ ప్రొడక్ష¯Œ ్స నిర్మించింది. త్వరలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. -
రజనీ వర్సెస్ జాకీ
రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఖుష్భూ, మీనా, నయనతార, కీర్తీ సురేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో విలన్గా ఎవరు నటిస్తారనే విషయం ఇప్పటివరకూ ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ నటిస్తారని తెలిసింది. ఈ ఫ్యామిలీ డ్రామాలో జాకీతో తలపడనున్నారట రజనీకాంత్. ఈ ఏడాది చివర్లో చెన్నైలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తారని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం అని చిత్రబృందం తెలిపింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది జరిగేలా కనిపించడం లేదు. -
రజనీ రెడీ
మెల్లిగా ఒక్కో సినిమా షూటింగ్లు స్టార్ట్ అవుతున్నాయి. రజనీకాంత్ కూడా తన తదుపరి చిత్రం ప్రారంభించడానికి రెడీ అయ్యారని సమాచారం. శివ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అన్నాత్తే’’. మీనా, కుష్బూ, కీర్తీ సురేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ లో ప్లాన్ చేశారు.. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రంలో ఎక్కువ షూటింగ్ చేయడం కరెక్ట్ కాదని, చాలా రిస్క్ తో కూడుకున్నదని భావించిన చిత్రబృందం చెన్నైలోనే ఓ భారీ సెట్ ను నిర్మిస్తోందట. మిగతా భాగాన్ని అక్కడే పూర్తి చేయాలన్నది ప్లాన్ . త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందట. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సన్ పిక్చర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
దృశ్యం 2
మోహన్లాల్ హీరోగా మలయాళంలో తెరకెక్కిన చిత్రం ‘దృశ్యం’ (2013). థ్రిల్లర్ కథాంశం, సస్పెన్స్ అంశాలు ఈ సినిమాను పెద్ద హిట్ చేశాయి. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చాలా భాషల్లో రీమేక్ అయింది. గత దశాబ్దంలో ఎక్కవ భాషల్లో రీమేక్ అయిన సినిమాల్లో ‘దృశ్యం’ ఒకటి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ (శ్రీలంక) భాషలో రీమేక్ అయింది. చైనీస్ భాషలో రీమేక్ అయిన తొలి భారతీయ సినిమా కూడే ఇదే కావడం విశేషం. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్టు జీతూ జోసెఫ్ ప్రకటించారు. మొదటి భాగంలో నటించిన మోహన్లాల్, మీనా ఇందులోనూ భార్యాభర్తలుగా నటిస్తారట. మిగతా నటీనటులు మారతారని తెలిపారు. కేరళలో సినిమా చిత్రీకరణలకు అనుమతి ఇచ్చిన వెంటనే ఈ సినిమాను ఆరంభించాలనుకుంటున్నారట. -
తల్లిదండ్రులు ఫోన్లో మాట్లాడొద్దు అన్నందుకు..
నారాయణఖేడ్: బాలిక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మండలంలోని జూకల్లో చోటు చేసు కుంది. ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గైని మీనా(17) ఇంట ర్ పూర్తిచేసి ఇంట్లోనే ఉంటోంది. రెండేళ్లు సంజీవన్రావుపేట్కు చెందిన బేగరి శ్రీకాంత్తో పరి చయం ఏర్పడింది. తరచుగా అతనితో ఫోన్లో మాట్లాడుతూ చాటింగ్ చేస్తోంది. రెండు నెలల క్రితం శ్రీకాంత్ జూకల్లో మీనా ఇంటికి రావడంతో కుటుంబీకులు రావద్దని పంపించి వేశా రు. మంగళవారం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా మీనా ఇంటి దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి గైని బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.(మూఢనమ్మకాలకు కుటుంబం బలి) -
పెద్దన్నయ్య
రజనీకాంత్ సినిమాలంటే ఆ ఎనర్జీయే వేరు. ఆయన సినిమా ప్రకటించినప్పటి నుంచే హంగామా మొదలవుతుంది. ఇక టైటిల్ ప్రకటన తర్వాత ఆ హంగామా రెండింతలవుతుంది. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారాయన. ఈ సినిమాకు ‘అన్నాత్తే’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సోమవారం ప్రకటించారు. ‘అన్నాత్తే’ అంటే పెద్దన్నయ్య అని అర్థం. ఇందులో ఖుష్భూ, మీనా, నయనతార, కీర్తీ సురేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో రజనీ కుమార్తె పాత్రలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. నయనతార విలన్గా కనిపిస్తారని టాక్. ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారు. -
చికుబుకు చికుబుకు రైలే
హైదరాబాద్లోని ఓ రైల్వేస్టేషన్కు రాబోతున్నారు రజనీకాంత్. కానీ ఇది నిజమైన రైల్వేస్టేషన్ కాదండోయ్. సినిమా కోసం వేసిన సెట్ రైల్వేస్టేషన్ . రజనీకాంత్ హీరోగా శివ ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలు పోషిస్తు న్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరగనున్నట్లు సమాచారం. ట్రైన్ బ్యాక్డ్రాప్లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తారట. ప్రకాష్రాజ్, సూరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది దసరా సందర్భంగా విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. -
లుక్ లీక్
శివ దర్శకత్వంలో ఓ కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నారు రజనీకాంత్. ఇందులో ఖుష్భూ, మీనా, నయనతార, కీర్తీ సురేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ లుక్ ఒకటి బయటకు వచ్చింది. పంచె కట్టు, మెలి తిప్పిన మీసాలతో కనిపిస్తున్నారు రజనీ. లుక్ అదిరిందంటున్నారు ఫ్యాన్స్. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని సమాచారం. ఈ ఏడాది దసరాకు ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. -
రజనీ కూతురు?
రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఖుష్బూ, మీనా, కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఓ పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించారని తెలిసింది. శనివారం ఖుష్బూ ఈ సినిమా సెట్లో జాయినయ్యారు. దాదాపు 28ఏళ్ల తర్వాత రజనీ–ఖుష్బూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అయితే ఈ సినిమాలో రజనీ కూతురి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారని, ఆల్రెడీ ఆమె షూటింగ్లో పాల్గొంటున్నారన్నది తాజా సమాచారం. అలాగే ఈ సినిమాలో రజనీ రెండు పాత్రలు చేస్తున్నారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. ప్రకాష్రాజ్, సూరి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. -
మీనా జ్యుయలర్స్పై ఎన్సీఎల్టీకి ఎస్బీఐ
హైదరాబాద్: రుణాల డిఫాల్ట్కు సంబంధించి మీనా జ్యుయలర్స్ సంస్థలపై దివాలా కోడ్ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆశ్రయించింది. మీనా జ్యుయలర్స్, మీనా జ్యుయలర్స్ ఎక్స్క్లూజివ్ ప్రైవేట్ లిమిటెడ్, మీనా జ్యుయలర్స్ అండ్ డైమండ్స్ అనే 3 సంస్థలు కలిసి దాదాపు రూ. 254 కోట్లు ఎగవేసినట్లు తెలిపింది. వాటిపై దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఎస్బీఐ పిటిషన్ను స్వీకరించిన ఎన్సీఎల్టీ.. మధ్యంతర పరిష్కార నిపుణుడిగా కొండపల్లి వెంకట్ శ్రీనివాస్ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్లో దివాలా చర్యలు ఎదుర్కొంటున్న తొలి ఆభరణాల సంస్థ.. మీనా జ్యుయలర్సేనని ఎస్బీఐ తెలిపింది. -
కొబ్బరికాయ కొట్టారు
కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టారు రజనీకాంత్. శివ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో రజనీ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో నటించనున్నారు. కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటించనున్నారు. ఈ సినిమా ముహూర్తం బుధవారం జరిగింది. 28 ఏళ్ల తర్వాత రజనీకాంత్ సినిమాలో ఖుష్బూ నటించనుండటం విశేషం. అలాగే ఖుష్భూ తమిళ సినిమాలో కనిపించి దాదాపు పదేళ్లు కావస్తోంది. ఈ నెల రెండోవారంలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. -
మీనా.. ఆ సినిమాలో విలనా !
రజనీకాంత్, మీనా అనగానే ఠక్కున గుర్తొచ్చే జ్ఞాపకం ‘థిల్లానా థిల్లానా.. నా కసి కళ్ల కూనా’ పాటే. ముత్తు సినిమాలోని ఈ పాట అంత పాపులర్. ‘వీరా, యజమాన్, ముత్తు’ సినిమాల్లో రజనీకాంత్ సరసన కథానాయికగా నటించారు మీనా. ఇప్పుడు మరోసారి కలసి నటించబోతున్నారని తెలిసింది. అయితే ఈసారి జంటగా కాదని సమాచారం. శివ దర్శకత్వంలో రజనీకాంత్ ఓ ఫ్యామిలీ డ్రామా చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ ఈ సినిమా నిర్మించనుంది. ఇందులో మీనా కీలక పాత్రలో కనిపిస్తారని తెలిసింది. విలన్ పాత్రలో అని కోలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ సరసన ఖుష్భూ, ఆయన కుమార్తెగా కీర్తీ సురేశ్ నటిస్తారన్నది మరో వార్త. ఈ నెల రెండోవారంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే ‘ఎంగేయో కేట్ట కురళ్’ సినిమాలో రజనీ కుమార్తెగా నటించారు మీనా. అలాగే రజనీ హీరోగా నటించిన ‘అన్బుళ్ల రజనీకాంత్’లో బాలనటిగా నటించారు మీనా. అలా బాలనటిగా ఒక హీరో సినిమాలో నటించి, ఆ తర్వాత అతని సరసనే హీరోయిన్గా నటించడం అంటే విశేషమే. ఇప్పుడు అదే హీరోకి విలన్గా అంటే ఇంకా విశేషం. -
కామాక్షితో కాస్త జాగ్రత్త
చట్ట వ్యతిరేక పనులు చేసినా మనల్ని ఎవరు పట్టుకుంటారులే అనే ఆలోచన ఉంటే అక్కడే ఆగిపోండి. ఎందుకంటే కామాక్షి మీ ప్రతీ కదలికను గమనిస్తూనే ఉంటుంది. ఆమెతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఆమె కామాక్షి.. కరోలిన్ కామాక్షి... సీబీఐ ఆఫీసర్. మీనా ముఖ్య పాత్రలో రూపొందుతున్న వెబ్ సిరీస్ ‘కరోలిన్ కామాక్షి’. వివేక్ కుమార్ కణ్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే మీనా తొలి వెబ్ సిరీస్. ఇందులో సీబీఐ పాత్రలో కనిపిస్తారామె. ఈ సిరీస్ ఫస్ట్ లుక్ను సోమవారం రిలీజ్ చేశారు. ఇటాలియన్ మోడల్ జార్జియా ఆండ్రియాని మరో కథానాయిక.గా నటిస్తున్నారు. అండర్ కవర్ పోలీస్ పాత్రలో ఆండ్రియాని కనిపిస్తారు. జీ5లో ఈ సిరీస్ త్వరలో ప్రసారం కానుంది. -
పవర్ఫుల్ కమ్బ్యాక్
వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఆడియన్స్ని అలరించడానికి స్టార్స్ వెనకాడట్లేదు. చాలామంది స్టార్స్ ఆల్రెడీ వెబ్ మీడియమ్కి ఎంట్రీ ఇచ్చేశారు. ఇప్పుడు హీరోయిన్ మీనా కూడా ఓ వెబ్ సిరీస్లో ఎంటర్టైన్ చేయనున్నారు. తమిళంలో ‘కరోలైన్ కామాక్షి’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఇందులో మీనా ముఖ్య పాత్ర చేస్తున్నారు. అండర్ కవర్ ఆపరేషన్ చేసే పవర్ఫుల్ పోలీస్ పాత్ర చేస్తున్నారామె. వివేక్ కుమార్ హర్షన్ రూపొందిస్తున్న ఈ సిరీస్లో జోర్జియా ఆండ్రియానియా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇటీవలే ‘కరోలైన్ కామాక్షి’ ప్రారంభం కానుంది. ట్రెండ్ లౌడ్, జీ5 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విశేషం ఏంటంటే తమిళంలో మీనా నటించి దాదాపు ఎనిమిదేళ్లు కావస్తోంది. 2011లో నటించిన ‘తంబికోటై్ట’ మీనా యాక్ట్ చేసిన చివరి తమిళ చిత్రం. -
'ఉన్నావ్' నువ్వు తోడుగా
‘ఉన్నావ్ బాధితురాలికి న్యాయం చేయండి’ అని నినదిస్తోంది మహిళాలోకం. ‘ఇలాంటి మృగాలు సమాజంలో బతకకూడదు’ అని కుల్దీప్ దిష్టిబొమ్మను తగులబెడుతోంది యువత. ‘న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’ అంటున్నాయి బాధితురాలి ఉచ్వాసనిశ్వాసలు. ఇలాంటప్పుడే... సరిగ్గా ఇలాంటప్పుడే... దుష్టశిక్షణ... శిష్ట రక్షణ కోసం ఒకరు రావాలి. అలా వచ్చినవారే... సీబీఐ జాయింట్ డైరెక్టర్సంపత్ మీనా. సంపత్ మీనా లక్నోలో సీబీఐ జాయింట్ డైరెక్టర్. ఇప్పుడామె దేశాన్ని కుదిపేసిన ‘ఉన్నావ్’ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టారు. ఉన్నావ్ కేసు దర్యాప్తు చేపట్టి 45 రోజుల్లో పూర్తి చేయవలసిందిగా సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించి కేసును సమర్థంగా దర్యాప్తు చేయగలిగిన అధికారి కోసం దృష్టి సారించిన సీబీఐకి సంపత్ మీనా అయితేనే కేసుకు న్యాయం జరుగుతుందనే భరోసా కలిగింది. ఫలితంగా ఉన్నావ్ కేçసును ఆమె చేతుల్లో పెట్టింది. సంపత్ మీనా కేసు దర్యాప్తు బాధ్యత చేపట్టడంతో న్యాయపోరాటం చేస్తున్న బాధిత యువతికి అధికారం, సమర్థత కలిగిన మహిళ ఆసరాగా వచ్చినట్లైంది. ఉన్నావ్ ఘటనతో ఏడాదికి పైగా నిరసనలు, ర్యాలీలతో అట్టుడిగిన దేశం ఇప్పుడు ‘హమ్మయ్య... బాధితురాలికి న్యాయం జరగబోతోంది’ అని ఊపిరి పీల్చుకుంటోంది. దేశ ప్రజలు ఆమెను సినిమాలో సీబీఐ ఆఫీసర్ను తెర మీద చూసినట్లు చూస్తున్నారు. కొన్ని సాహసోపేతమైన సంఘటనలు, మరికొన్ని సవాళ్లతో చట్టాన్ని పరిరక్షిస్తుందనే దృఢ నమ్మకం వారిది. సంపత్ మీనా మీద అంత నమ్మకాన్ని పెట్టుకోవడానికి కారణం గతంలో ఆమె సాధించిన విజయాలే. కుల్దీప్ సింగ్ సెంగార్ దిష్టిబొమ్మను తగల బెడుతున్న యువత ఆపరేషన్ ముస్కాన్ సంపత్ మీనా ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్. హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. జార్ఖండ్ కేడర్కు చెందిన 1994 బ్యాచ్ ఆఫీసర్. జార్ఖండ్ రాజధాని రాంచితోపాటు ధన్బాద్, జమ్తారా, ధమ్కా, దేవ్ఘర్, పాకుర్ జిల్లాల్లో ఎస్పీగా తన మార్కు చూపించారామె. చోటా నాగ్పూర్లో డీఐజీగా క్రియాశీలకంగా పనిచేశారు. చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అనే కాన్సెప్ట్ ఆమె మానస పుత్రిక. జార్ఖండ్లోనే ఆమె ఈ ప్రయోగాన్ని చేపట్టారు. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్’ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించారు సంపత్ మీనా. తప్పిపోయిన పిల్లలు, ఇంటి నుంచి పారిపోయిన పిల్లలు, అక్రమ రవాణా కారణంగా తల్లిదండ్రులకు దూరమైన పిల్లలను వెతికి పట్టుకుని, వాళ్లను తల్లిదండ్రుల దగ్గరకు చేర్చే కార్యక్రమం అది. ముస్కాన్ అంటే చిరునవ్వు. తల్లిదండ్రులకు దూరమయ్యి, నవ్వును మర్చిపోయిన బాల్యంలో తిరిగి నవ్వులు పూయించే కార్యక్రమం. ఈ ఆపరేషన్ ముస్కాన్లో ఒక్క జార్ఖండ్లోనే ఏడు వందల మందికి పైగా పిల్లలను తల్లిదండ్రుల దగ్గరకు చేర్చారు సంపత్మీనా. తల్లిదండ్రుల వివరాలు చెప్పలేని పిల్లలకు ప్రభుత్వ సంరక్షణ గృహాల్లో వసతి కల్పిస్తారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ ఐజీగా సంపత్మీనా పర్యవేక్షణలో ఆపరేషన్ ముస్కాన్ దేశవ్యాప్తంగా ఆశించిన ఫలితాలనిచ్చింది. లక్నోలో సీబీఐ జాయింట్ డైరెక్టర్కంటే ముందు ఆమె న్యూఢిల్లీలో పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్యూరోలో ఐజీ(ఇన్స్పెక్టర్ జనరల్). అప్పుడు కూడా పిల్లల అక్రమ రవాణా కేసులను ఛేదించడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు. ఆమెకు మహిళల సమస్యలు, మానవ హక్కుల కోసం ఆమె ప్రత్యేకంగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. జార్ఖండ్ రాజధాని రాంచిలో ‘సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్’ అయిన తొలి మహిళ సంపత్ మీనా. సీఐడీ ఐజీగా, రైల్వేస్ ఐజీగా కూడా మంచి సేవలందించారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సమర్థంగా పని చేశారు. ఉన్నావ్ కేసు దర్యాప్తు న్యాయరక్షణే లక్ష్యంగా సాగాలంటే సంపత్ మీనా వల్లనే సాధ్యమవుతుందని నమ్మకం కలగడానికి ఇవన్నీ కారణాలే. ఉన్నావ్ బాధితురాలికి న్యాయం కోసం గళమెత్తిన మహిళలు బెస్ట్ పోలీస్ సంపత్ మీనా విశిష్ట సేవలకు గాను ‘2008 చీఫ్ మినిస్టర్ మెడల్’, 2013 రాష్ట్రపతి మెడల్ అందుకున్నారు. పోలీస్ ట్రైనింగ్లో కూడా పై అధికారులకు సంపత్ మీనా ప్రత్యేకమైన పోలీస్ అధికారి అవుతుందనే నమ్మకం కలిగేది. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ సమయంలో బెస్ట్ అథ్లెట్స్ ట్రోఫీ అందుకున్నారు. ఇటలీలో పోలీస్ కోర్సులో గ్రాడ్యుయేషన్ చేశారామె. సీనియర్ లెవెల్ ప్రోగ్రామ్లో అమెరికాలో శిక్షణ పొందారు. రాజకీయ ప్రభావాలకు లోనుకాకుండా, పక్షపాతరహితంగా దర్యాప్తు జరగాలంటే సంపత్ మీనా ఒక్కరే బెస్ట్ అని ఇప్పుడు దేశమంతా నమ్ముతోంది. ‘ఉన్నావ్’ బాధితురాలికి న్యాయం జరగాలంటే సంపత్ మీనా లాంటి ఆఫీసరే అండగా నిలవాలని న్యాయం కోరుకునే ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. కరడు గట్టిన మృగాహంకారి కుల్దీప్ సింగ్ సెంగార్కు, అతడి బృందానికి గుణపాఠం చెప్పగలిగిన పోలీస్ ఆఫీసర్ సంపత్ మీనా. కుల్దీప్ సింగ్ సెంగార్ ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ పట్టణంలో నివసిస్తుండేవాడు. ఉన్నావ్ పట్టణం జిల్లా కేంద్రం కూడా. అతడు మొదట 2002లో ఉన్నావ్ నియోజకవర్గం నుంచి బిఎస్పీ అభ్యర్థిగా గెలిచాడు. తర్వాత 2007, 2014 లలో సమాజ్వాది పార్టీ తరఫున బంగేర్మావ్, భగవంత్ నగర్ల నుంచి గెలిచాడు. ఆ తర్వాత 2017 నాటికి బిజెపిలో చేరి బంగేర్మావ్ నుంచి గెలిచాడు. ఉద్యోగం కోసం వెళ్లిన పదిహేడేళ్ల అమ్మాయి మీద లైంగిక అఘాయిత్యానికి పాల్పడి ఇప్పుడు సీతాపూర్ జైల్లో ఉన్నాడు. మౌనసాక్షి... ఉన్నావ్ ఈ ఏడాది జూలై నెల 28వ తేదీ. ఉత్తర ప్రదేశ్లోని ఉన్నావ్ నుంచి ఒక కారు రాయ్బరేలీ వైపు వెళ్తోంది. రాయ్బరేలీకి చేరేలోపే ఒక ట్రక్కు భూతంగా వచ్చి కారుకు గుద్దింది. చూడడానికది ఊహించని ప్రమాదంగానే కనిపిస్తోంది, కానీ నిజానికి అది వ్యూహాత్మక ప్రమాదం. కారులో ఉన్న వాళ్లలో ఒక్కరు కూడా బతికి బట్టకట్టకూడదనేటంత క్రౌర్యంతో పన్నిన పన్నాగం. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరు మహిళల ప్రాణాలు పోయాయి. ఓ పంతొమ్మిదేళ్ల అమ్మాయి, ఓ మగ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాపాయం నుంచి బతికి బయటపడ్డారు. అంతకంటే ముందు... గత ఏడాది ఏప్రిల్ 13వ తేదీ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఉన్నావ్కు చెందిన రాజకీయ నాయకుడు, బంగేర్మావ్ నియోజకవర్గ శాసనసభ్యుడు కుల్దీప్ సింగ్ సెంగార్కు సిబిఐ నుంచి పిలుపు వచ్చింది. ప్రశ్నించిన తర్వాత అతడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వారం రోజులు జుడీషియల్కస్టడీని విధించింది అలహాబాద్ హైకోర్టు.అంతకు ముందు కూతురికి జరిగిన అన్యాయం మీద న్యాయపోరాటం చేస్తున్న ఓ తండ్రిని అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీ విధించడమైంది. తండ్రికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి భరించలేని అతడి కూతురు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఆత్మత్యాగానికి సిద్ధమైంది. ఇంత భావోద్వేగాలతో అట్టుడిగిపోతున్న ఉత్తరప్రదేశ్లో ఆ తండ్రిని చనిపోయేవరకు చిత్రహింసలకు గురిచేశారు పోలీసులు. కూతురి కోసం తండ్రి న్యాయ పోరాటం ఒకవైపు, తండ్రి ప్రాణాలు కాపాడ్డం కోసం కూతురి ఆవేదన పోరాటం మరో వైపు. ఇంత హృదయవిదారకమైన పరిస్థితికి దారి తీసిన దురాగతం 2017, జూన్ నాలుగవ తేదీన చోటుచేసుకుంది. ఆ రోజు ఉన్నావ్లోని కుల్దీప్ సింగ్ సెంగార్ ఇంటికి ఉద్యోగం ఇప్పించమని వెళ్లింది ఓ పదిహేడేళ్ల అమ్మాయి. ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ మృగాహంకారానికి బలయింది. మైనారిటీ తీరని అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడిన కుల్దీప్ సింగ్ను పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ హెరాస్మెంట్) చట్టం కింద అరెస్ట్ చేశారు. ఇప్పుడతడు సీతాపూర్ జైల్లో ఉన్నాడు. అతడి కేసు విచారణకు వస్తే శిక్ష పడడం ఖాయమని తెలిసిన కుల్దీప్... అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని భయబ్రాంతులను చేయడానికి తెగపడ్డాడు. బాధితురాలి తండ్రిని జైల్లో చిత్రహింసలకు గురి చేసి చంపించాడు. తండ్రి పోయిన తర్వాత కూడా బాధితురాలు న్యాయపోరాటాన్ని కొనసాగించడంతో ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్కుతో గుద్దించి హత్యాప్రయత్నం చేశాడు కుల్దీప్. ఆ ప్రమాదంలో గాయపడిన పంతొమ్మిదేళ్ల అమ్మాయి, ఆమె లాయరు (జూలై 31వ తేదీన) తమకు రక్షణ కల్పించి, కేసును విచారించి తగు న్యాయం చేయవలసిందిగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్కు ఉత్తరం రాశారు. తక్షణమే స్పందించిన అత్యున్నత న్యాయవ్యవస్థ ఈ కేసును సత్వరమే విచారించి నివేదిక ఇవ్వవలసిందిగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ సంపత్ మీనాకు బాధ్యతలకు అప్పగించింది.– వాకా మంజులారెడ్డి -
ఒకేలా కనిపిస్తారు.. ఒకేలా అనిపిస్తారు
ఒక కుటుంబం ఎదగాలంటే.. ఆ కుటుంబంలోని మహిళకు చేయూతనివ్వాలి. పిల్లల ముఖాల్లో సంతోషం చూడాలంటే... తల్లి చేతిలో నాలుగు డబ్బులు ఉండాలి. అందుకే.. ఇంటికే పరిమితమైన మహిళల్లో దాగిన నైపుణ్యానికి ఒక వేదిక కల్పిస్తున్నారు సంగీత, మీనా. ఒకే ఆలోచన, ఒకే అభిరుచి ఉన్న వీళ్లిద్దరూ కలిసి ఊరూవాడకు తోడుగా ఉంటున్నారు..బతుకు జాడ చూపిస్తున్నారు. ‘‘గురువారం ఉదయం పండ్లు కొందామని మొజాంజాహీ మార్కెట్కెళ్లాను. పండ్లు కొనుక్కుని డబ్బులిస్తుంటే ఆ షాపు కుర్రాడు డబ్బు తీసుకోకుండా ‘మేడమ్ బాగున్నారా’ అని పలకరించాడు. నేను ఇతడి షాపుకి రెగ్యులర్గా కస్టమర్ని కాదు, ఇంతకు ముందెప్పుడూ ఇతడిని చూసినట్లు కూడా లేదు’ అనుకుంటూనే ‘నీకు నేనెలా తెలుసు’ అని అడిగాను. మీరు మా కాలనీలో పిల్లలకు ఆటల పోటీలు పెట్టి, గెలిచిన వాళ్లకు బహుమతిగా బియ్యం, చక్కెర ఇచ్చేవాళ్లు. చాలా ఏళ్ల కిందట పార్దీవాడాలో మీ చేతుల మీద ఐదు కేజీల బియ్యం తీసుకున్నాను’ అని పదేళ్ల నాటి సంగతి గుర్తు చేశాడు. తన పేరు మాధేశ్ అని పరిచయం చేసుకున్నాడు. ‘నా సంతోషం కోసం ఇస్తున్నాను పండ్లు పట్టుకెళ్లండి, డబ్బులు వద్దు’ అన్నాడు. నేను కాదు కూడదంటే... అప్పుడు ధర తగ్గించి తాను కొన్న ధర మాత్రం తీసుకున్నాడు. ‘నా ఫోన్ నంబరు తీసుకోండి మేడమ్. ఏమైనా కావాలంటే చెప్పండి’ అని నంబర్ షేర్ చేశాడు. చెప్పలేనంత సంతోషం అది. మనం నాటిన మొక్క పెద్దదై పువ్వు పూచినప్పుడు కలిగే ఆనందం అది. ఇరవై ఏళ్లుగా అల్పాదాయ వర్గాలు నివసించే కాలనీల్లో సర్వీస్ చేస్తున్నాం. అప్పటి చిన్న పిల్లవాడు ఇప్పుడు ప్రయోజకుడై మమ్మల్ని గుర్తు పట్టి అభిమానంగా పలకరించాడు. ఇంతకంటే సంతృప్తి ఇంకేం కావాలి?’’ అని ఎంతో ఉద్వేగంగా అన్నారు మీనా కస్లీవాల్. ఆమెతోపాటే సంగీత మహేశ్వర్ ఉన్నారు. ‘‘గౌలిగూడా, పార్థీవాడా, ఎంజీమార్కెట్, జుమ్మేరాత్ బజార్ కాలనీలకు, జగదీశ్ కన్యా పాఠశాల, మార్వాడీ హిందీ విద్యాలయలకు వెళ్లినప్పుడు పిల్లలు మా దగ్గరకొచ్చి ‘మంచిగ చదువుకుంటున్నాం, పరీక్షలు బాగా రాశాం. వచ్చే ఏడాది కూడా మాకు పుస్తకాలు ఇస్తారా’ అని ఆశగా అడుగుతుంటారు. చిన్న పిల్లలు వచ్చి ‘మేము చదువుకుంటాం, పుస్తకాలిస్తారా’ అని అడిగితే కాదనగలమా. మేము చిన్నగా మొదలు పెట్టిన సర్వీస్ విస్తరించడానికి కారణం కూడా పిల్లల అభిమానమే’’ అన్నారు సంగీత. ‘మహిళా జాగృతి’ నిర్వహకులు సంగీత, మీనా. పండుగ రోజు పరమాన్నం సంగీత పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. వారిది హైదరాబాద్లో స్థిర పడిన రాజస్థాన్ కుటుంబం. మీనా పుట్టింది ఉత్తరప్రదేశ్లో. డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నారు. పెళ్లితో హైదరాబాద్కి వచ్చారామె. ఇద్దరూ పాతికేళ్లుగా స్నేహితులు. ఇద్దరూ వేర్వేరు సంస్థలతో పని చేసేవారు. ‘‘మా జైన్ కుటుంబాల్లో... మనిషి చనిపోయే లోపు సమాజానికి చేతనైన సహాయం ఏదయినా చేయాలని చెబుతారు. ఆ స్ఫూర్తితోనే ధార్మిక సేవా కార్యక్రమాల్లో పని చేశాం. సంగీత కూడా అలాగే చేస్తుండేది. అలా ఇద్దరం ఒకరికొకరం పరిచయమయ్యాం. మహిళల కోసం ఏదైనా చేయాలనే మా ఆలోచనలే ఇద్దర్నీ దగ్గర చేశాయి. ‘మహిళా జాగృతి’ పేరుతో సంస్థను స్థాపించాం. ఇంటికే పరిమితమైన మహిళలు బయటకు రావాలంటే వాళ్లకు పరిచయమైన వేదిక ఒకటి ఉండాలి. వాళ్లకు తెలిసిన పని అయితేనే ధైర్యంగా ముందుకు రాగలుగుతారు. అందుకే కుకింగ్ కాంపిటీషన్స్ పెట్టాం. ఇరవై ఏళ్ల కిందట మహిళల్లో ఆరోగ్యం పట్ల అవగాహన ఇప్పుడున్నంతగా ఉండేది కాదు. ముఖ్యంగా అల్పాదాయ వర్గాలు నివసించే కాలనీల్లో హెల్త్ క్యాంపుల అవసరం చాలా ఉండేది. ఆ కాలనీల్లో హెల్త్క్యాంపులతో పాటు పండుగ సమయాల్లో పిల్లలకు ఆటలపోటీలు పెట్టేవాళ్లం. గెలిచిన వాళ్లతోపాటు పోటీలో పాల్గొన్న అందరికీ బియ్యం, చక్కెర ఇచ్చేవాళ్లం. ఆ కుటుంబాల్లో నిజానికి వాటి అవసరం చాలా ఉండేది కూడా. పిల్లలకు తల్లులు పండగ రోజు మిఠాయిలు పెట్టలేకపోయినా కనీసం తియ్యటి అన్నమైనా పెట్టగలగాలనేది మా కోరిక. అలా పెట్టిన ఆటల పోటీల్లో పాల్గొన్న కుర్రాడే మాధేశ్’’ అన్నారు మీనా. జీవన నైపుణ్యాలపై బాలికలకు, మహిళలకు వర్క్షాప్ బంధువులే ముందుకొచ్చారు ‘‘ఉద్యోగినులు వాళ్ల బిజీలో వాళ్లుంటారు. చదువుకుని కూడా గృహిణిగా ఇంటికే పరిమితమైన వాళ్లలో ఏదో తెలియని వెలితి కనిపిస్తుండేది. వాళ్లంతా మేము ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవాళ్లు. మళ్లీ ఇలాంటి ప్రోగ్రామ్ ఎప్పుడు పెడతారా అన్నట్లు ఎదురు చూసేవాళ్లు. సోషల్ గ్యాదరింగ్స్ కూడా వాళ్లకు అందనివి అన్నట్లు ఉండేవి. చాలామంది నిరుత్సాహంగా రోజులు గడుపుతున్నట్లు కూడా అనిపించేది. వాళ్లలో స్కిల్ ఉంటుంది, దానిని ప్రదర్శించడానికి వేదిక లేకపోవడంతో టాలెంట్ మరుగున పడిపోతోంది. వేదిక ఒకటి ఉంటే వాళ్లలో హిడన్ టాలెంట్ బయటికొస్తుందనుకున్నాం. ఆ అనుకోవడమే... 2000లో ఒక ఎగ్జిబిషన్ రూపం సంతరించుకుంది. మేము మా ఆలోచన బయట పెట్టగానే బంధువుల్లోనే ఎక్కువ మంది మహిళలు ఉత్సాహంగా ముందుకొచ్చారు. అప్పటి నుంచి ఏటా మూడు రోజులు మహిళల కోసం ఎగ్జిబిషన్ పెడుతున్నాం. ఇది 19వ ఎగ్జిబిషన్ (జూలై 19, 20, 21 తేదీల్లో జరిగింది). ఇంట్లో ఖాళీ టైమ్లో వాళ్లకు చేత వచ్చిన హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేసుకుంటారు. మూడు రోజులు స్టాల్లో అమ్ముకుంటారు. టేబుల్ స్పేస్ నుంచి స్టాల్ వరకు వాళ్ల అవసరాన్ని బట్టి అద్దెకు తీసుకుంటారు. అలాగే ఏటా ఫ్రీ స్టాల్స్ కూడా ఉంటాయి. బేగంపేటలో దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్లో ఉండే అంధ విద్యార్థులు క్యాండిల్స్, పేపర్ ప్లేట్లు, గ్లాస్ల వంటివి తయారు చేస్తారు. ఆ స్టూడెంట్స్కి స్టాల్ ఉచితంగా ఇవ్వడంతోపాటు వాళ్లను హోమ్ నుంచి ఎగ్జిబిషన్కు తీసుకురావడం, భోజనాల వంటి ఏర్పాట్లు కూడా మేమే చూసుకుంటాం. అలాగే ఇతర దివ్యాంగులతోపాటు లంబాడీ మహిళలకు కూడా స్టాల్ ఉచితంగా ఇస్తున్నాం. ఈ ఏడాది 15 స్టాళ్లను ఉచితంగా ఇచ్చాం’’ అన్నారు సంగీత మహేశ్వర్. ఒకేలా కనిపిస్తారు.. ఒకేలా అనిపిస్తారు సంగీత, మీనా ఇద్దరూ ఒకేరకమైన వస్త్రధారణలో కనిపించారు. ఏడాదంతా కాదు, ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నప్పుడు, కాలనీల్లో ఇతర కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఇలా ఒకేరకమైన చీరలు కట్టుకుంటారు. ఎందుకంటే.. ఎవరికైనా అక్కడ సహాయం అవసరమైతే ఎవర్ని సంప్రదించాలనే అయోమయం లేకుండా చూడగానే అర్థం కావడం కోసమేనంటారు ఈ స్నేహితులు. ‘‘దీపం వెలిగించే వత్తుల నుంచి రత్నాలు, మరకతాల ఆభరణాల వరకు రకరకాల స్టాల్స్కు వేదిక ఇది. ఒక మహిళ తన చేత్తో పది రూపాయలు సంపాదించుకోవాలంటే ఎంతో చదువు అక్కర్లేదు. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పనులే డబ్బు సంపాదించి పెడతాయి. రుచిగా వండడం వస్తే అదే వాళ్ల పరిశ్రమకు పెట్టుబడి అవుతుంది. ఎగ్జిబిషన్లో ఎప్పుడూ ఫుడ్కోర్ట్లో చోళాబటూరా, వడాపావ్ల వంటి నార్త్ వంటకాలు ఎక్కువగా ఉండేవి. ఈ దఫా సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా ఉన్నాయి.. దోశె కోసమే ఒక స్టాల్ పెట్టాం. సంపాదించే వాళ్లకు మాత్రమే గౌరవాలందుతున్న సమాజంలో న్యూనతకు లోనవుతున్న గృహిణులకు భరోసా కల్పించడమే ‘మహిళా జాగృతి’ ఉద్దేశం. మహిళ సమాజంలో సగౌరవంగా జీవించాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. అందుకు తోడ్పాడునందించడంలో సంతృప్తి ఉంది. ఇన్నేళ్ల అనుభవంలో మహిళలకు మేము చెప్పేది ఒక్కటే... రోజుల్ని నిరుపయోగంగా గడిపేస్తే, జీవించడమే దుర్భరంగా ఉంటుంది. ప్రతి రోజునీ ఉపయుక్తంగా మలుచుకుంటే జీవితం మన విజయం వెంట పరుగులు తీస్తుంది. రోజును ఫలప్రదం చేసుకోండి’’ అంటున్నారు సంగీత, మీనా. మనకోసం చేసిన పనిలో ఫలితం మన చేతుల్లోకే వస్తుంది. ఇతరుకు చేసిన పనికి ఫలితం అభిమానం రూపంలో ఆత్మ సంతృప్తినిస్తుంది’’ అన్నారిద్దరూ సంతోషంగా. – వాకా మంజులారెడ్డి ఫొటోలు: జి. అమర్ -
స్క్రీన్ టెస్ట్
ప్రతిభకు కొలమానం ఏంటి? అంటే చెప్పలేం. అయితే ప్రతిభను గుర్తించి ప్రేక్షకులు కొట్టే చప్పట్లు, అభినందనలు, ప్రతిష్టాత్మక పురస్కారాలు ఏ కళాకారుడిలో అయినా ఉత్సాహాన్ని నింపుతాయి. భారతదేశ ప్రతిష్టాత్మక పురస్కారం అయిన ‘పద్మ’ అవార్డు వరిస్తే ఆ గౌరవమే వేరు. జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించిన సందర్భంగా ఇప్పటివరకూ ఈ అవార్డు అందుకున్న స్టార్స్లో కొందరి గురించి ఈ వారం స్పెషల్ క్విజ్. 1. ‘పడమటి సంధ్యారాగం’ చిత్రంలో సహాయ నటునిగా నటించారు ఈ నటుడు. 2019వ సంవత్సరంలో ఈయనను పద్మశ్రీ వరించింది. సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎవరాయన? ఎ) మణిశర్మ బి) యం.యం. కీరవాణి సి) శివమణి డి) కోటి 2. 2011వ సంవత్సరానికి పద్మశ్రీ అవార్డుగ్రహీత ఈ నటి. వెంకటేశ్ నటించిన ఓ సూపర్హిట్ సినిమా ద్వారా తెరంగేట్రం చేశారీమె. ఎవరా నటి? ఎ) టబు బి) రమ్యకృష్ణ సి) మీనా డి) కత్రినా కైఫ్ 3. 1968లో పద్మశ్రీ, 1988లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్లను దక్కించుకున్న ఏకైక నటుడెవరు? ఎ) యస్వీ రంగారావు బి) శోభన్బాబు సి) కాంతారావు డి) అక్కినేని నాగేశ్వరరావు 4. అద్భుతమైన నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, సింగర్గా చాలా ఫేమస్ ఈ నటి. 1966లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ అవార్డులను తన ఖాతాలో వేసుకున్న ఆ నటి ఎవరు? ఎ) భానుమతి బి) జమున సి) సావిత్రి డి) అంజలీదేవి 5. కామెడీ యాక్టర్గా ఎన్నో సంవత్సరాలు చిత్రపరిశ్రమను ఏలారు. 1990లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ ప్రకటించింది. ఆ నటుని పేరేంటి? ఎ) అల్లు రామలింగయ్య బి) పద్మనాభం సి) సుత్తివేలు డి) నగేశ్ 6. 2019వ సంవత్సరానికి గాను ప్రభుదేవాని పద్మశ్రీ వరించింది. తన నృత్యంతో అలరించిన ఆయన్ను ఏ ప్రభుత్వం పద్మశ్రీకి నామినేట్ చేసిందో తెలుసా? ఎ) తమిళనాడు బి) తెలంగాణ సి) కర్ణాటక డి) కేరళ 7. ‘సిరివెన్నెల’ చిత్రం తర్వాత చెంబోలు సీతారామశాస్త్రి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా మారిపోయారు. ఆయన్ను చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడెవరు? (సీతారామ శాస్త్రికి ‘సిరివెన్నెల’ మొదటి చిత్రం కాదు) ఎ) కె.రాఘవేంద్రరావు బి) కె.విశ్వనాథ్ సి)ఆదుర్తి సుబ్బారావు డి) దాసరి నారాయణరావు 8. తన గళంతో ఎన్నో భాషల్లోని పాటలను అలవోకగా ఆలపించే గాయకుడు కె.జె. ఏసుదాస్. భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ (1977), పద్మభూషణ్ (2002), పద్మవిభూషణ్లతో సత్కరించింది. ఆయన ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్ అందుకున్నారో తెలుసా? (సి) ఎ) 2011 బి) 2013 సి) 2017 డి) 2009 10 1968లో పద్మశ్రీ అవార్డు పొందిన నటుడెవరో కనుక్కుందామా? ఎ) యన్టీఆర్ బి) చిత్తూరు నాగయ్య సి) గుమ్మడి డి) కాంతారావు 9. 2006లో ఆయన్ను కేంద్రప్రభుత్వం పద్మభూషణ్తో గౌరవించింది. అదే సంవత్సరం ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ను కూడా పొందారు. ఎవరా హీరో? ఎ) కృష్ణంరాజు బి) చిరంజీవి సి) బాలకృష్ణ డి) నాగార్జున 11. 2009లో పద్మశ్రీ అవార్డు పొందిన ఈ నటుడు అప్పటికే ఒకే భాషలో దాదాపు 700 చిత్రాలు పైగా నటించారు. ఎవరతను? ఎ) కైకాల సత్యనారాయణ బి) అలీ సి) బ్రహ్మానందం డి) ధర్మవరపు çసుబ్రహ్మణ్యం 12. కమల్హాసన్ నటించిన ‘శుభసంకల్పం’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు ఈయన. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. ఎవరితను? ఎ) దాసరి నారాయణరావు బి) టి. సుబ్బరామిరెడ్డి సి) ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డి) డి. రామానాయుడు 13. అనేక భాషల్లో తన సంగీతం ద్వారా చాలా సుపరిచుతులు ఈయన. 2010లో పద్మభూషణ్, 2018లో పద్మవిభూషణ్ ఆయన్ను వరించాయి. ఎవరా సంగీత దర్శకుడు? ఎ) కె.వి. మహదేవన్ బి) ఇళయరాజా సి) మంగళంపల్లి బాలమురళీ కృష్ణ డి) పి.బి. శ్రీనివాస్ 14. 2013వ సంవత్సరంలో కేంద్రప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మభూషణ్ అవార్డ్ను తిరస్కరించిన ప్రముఖ సింగర్ ఎవరో తెలుసా? (అవార్డును నిరాకరించటానికి ఆ సింగర్ చెప్పిన కారణం ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని) ఎ) ఎస్. జానకి బి) పి. సుశీల సి) వాణీ జయరాం డి) జిక్కీ 15. కర్ణాటక ప్రభుత్వ సిఫార్సుతో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పద్మశ్రీ అవార్డును దక్కించుకున్నారు. ఆయన ఏ సంవత్సరంలో ఈ అవార్డును పొందారో తెలుసా? ఎ) 2014 బి) 2016 సి) 2018 డి) 2019 16. 340 తెలుగు చిత్రాలకు పైగా నటించారు ఈ ప్రముఖ నటుడు. 2009లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మభూషణ్ ప్రకటించింది. ఎవరా హీరో? ఎ) కృష్ణ బి) కృష్ణంరాజు సి) శోభన్బాబు డి) శరత్బాబు 17. కళలు, విద్యా రంగాలకు సంబంధించి 2007లో పద్మశ్రీ అవార్డును పొందిన ప్రముఖ తెలుగు నటుడెవరో తెలుసా? ఎ) మోహన్బాబు బి) మురళీమోహన్ సి) శ్రీధర్ డి) రంగనాథ్ 18. 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ అవార్డులను సొంతం చేసుకున్న ప్రముఖ హీరో ఎవరు? ఎ) కమల్హాసన్ బి) రజనీకాంత్ సి) విక్రమ్ డి) శరత్కుమార్ 19. నాటకరంగం నుండి సినిమా రంగానికి వచ్చి ఎన్నో సినిమాల్లో నటించారు ఈ ప్రముఖ క్యారెక్టర్ నటుడు. 2015లో ఆయన్ను పద్మశ్రీ వరించింది. ఎవరా నటుడు కనుక్కోండి? ఎ) జయప్రకాశ్ రెడ్డి బి) తనికెళ్ల భరణి సి) బెనర్జీ డి) కోట శ్రీనివాసరావు 20 .1992లో పద్మశ్రీ అవార్డు పొందారు ఈ ప్రముఖ దర్శకుడు. 2017లో భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. ఆ దర్శకుని పేరేంటి? ఎ) కె. భాగ్యరాజా బి) భారతీరాజా సి) కె. విశ్వనాథ్ డి) కె. బాలచందర్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (సి) 2) (ఎ) 3) (డి) 4) (ఎ) 5) (ఎ) 6) (సి) 7) (బి) 8) (సి) 9) (బి) 10) (ఎ) 11) (సి) 12) (సి) 13) (బి) 14) (ఎ) 15) (బి) 16) (ఎ) 17) (ఎ) 18) (బి) 19) (డి) 20) (సి) నిర్వహణ: శివ మల్లాల -
స్క్రీన్ టెస్ట్
రైతులకు సంక్రాంతి ఎంత పెద్ద పండగో, సినిమా పరిశ్రమకు కూడా అంతే పెద్ద పండగ. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ సంక్రాంతి మూడ్లోనే ఉన్నారు. అందుకే సంక్రాంతి సినిమాల గురించి, సినిమా వాళ్ల సంక్రాంతి గురించి ఈ వారం క్విజ్... 1. 2012, 2013, 2014 వరుసగా సంక్రాంతికి తన సినిమాలను విడుదల చేసిన టాప్ హీరో ఎవరో కనుక్కోండి? ఎ) ప్రభాస్ బి) మహేశ్బాబు సి) చిరంజీవి డి) అల్లు అర్జున్ 2. తెలుగు నిర్మాతల్లో ఏ నిర్మాతను ‘సంక్రాంతి రాజు’ అన్నారో తెలుసా? ఎ) జీవీజీ రాజు బి) ‘దిల్’ రాజు సి) అర్జున్ రాజు డి) యం.యస్. రాజు 3. ఈ సంక్రాంతికి (2019) విడుదలైన సినిమాల్లో ఏ బాలీవుడ్ హీరోయిన్ తెలుగు తెరకు పరిచయమయ్యారో చెప్పుకోండి? ఎ) విద్యాబాలన్ బి) కియరా అద్వానీ సి) శ్రద్ధాకపూర్ డి) కంగనా రనౌత్ 4. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అంటూ 2017 సంక్రాంతికి వచ్చారు నాగార్జున. ఆ చిత్రంలో బంగార్రాజు సరసన నటించిన నటి గుర్తున్నారా? ఎ) లావణ్యా త్రిపాఠి బి) రమ్యకృష్ణ సి) అనసూయ డి) అనుష్క 5. తెలుగు వారి పెద్ద పండగ ‘సంక్రాంతి’. ఆ పేరుతో విడుదలైన సినిమాలో తెలుగులో పేరున్న నలుగురు హీరోలు నటించారు. వెంకటేశ్, శ్రీకాం త్, శివబాలాజీలతో పాటు మరో తమ్ముడుగా నటించిన ఆ నటుడెవరో చెప్పండి? (ఇప్పుడు ఆ నటుడు తెలుగు సినిమాల్లో ఓ ప్రముఖ హీరో) ఎ) శర్వానంద్ బి) తరుణ్ సి) రోహిత్ డి) ఆకాశ్ 6. ‘సంక్రాంతి వచ్చిందే తుమ్మెద... సరదాలు తెచ్చిందే తుమ్మెద...’ అనే పాట ‘సోగ్గాడి పెళ్లాం’ చిత్రంలోనిది. ఈ పాటలో నటించిన హీరో ఎవరో గుర్తు తెచ్చుకోండి? ఎ) మోహన్బాబు బి) హరనాథ్ సి) చంద్రమోహన్ డి) శ్రీధర్ 7. మహేశ్బాబు, వెంకటేశ్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సంక్రాంతికి విడుదలై విజయం సాధించింది. ఆ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? ఎ) శ్రీకాంత్ అడ్డాల బి) సుకుమార్ సి) కృష్ణవంశీ డి) త్రివిక్రమ్ 8. ‘శతమానం భవతి ’ చిత్రంలోని సంక్రాంతి పాటలో శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ సందడి చేశారు. ‘‘గొబ్బిళ్లో గొబ్బిళ్లు....’ అంటూ సాగే ఆ పాట రచయితెవరో కనుక్కోండి? ఎ) అనంత శ్రీరామ్ బి) సిరివెన్నెల సి) రామజోగయ్య శాస్త్రి డి) శ్రీమణి 9. ఎన్టీ రామారావును ‘మనదేశం’ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు ఎల్వీ ప్రసాద్. వారిద్దరి కాంబినేషన్లో అనేక సినిమాలు వచ్చినప్పటికీ 1955లో వచ్చిన ఓ సినిమా సంక్రాంతికి విడుదలై సంచలనం సృష్టించింది. ఆ చిత్రం పేరేంటి? ఎ) మనదేశం బి) షావుకారు సి) సంసారం డి) మిస్సమ్మ 10. 2017 సంక్రాంతికి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ రిలీజైంది. అది ఆయన నటించిన 100వ చిత్రం. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గౌతమిగా నటించిన ప్రముఖ బాలీవుడ్ నటి ఎవరో తెలుసా? ఎ) రవీనా టాండన్ బి) టబు సి) హేమమాలిని డి) సుస్మితా సేన్ 11. ‘శంకర్ దాదా జిందాబాద్’ తర్వాత చిరంజీవి హీరోగా చేసిన చిత్రం ‘ఖైదీ నంబర్ 150’. ఎన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత చిరు ఈ సినిమా చేశారో తెలుసా ? (ఈ సినిమా సంక్రాంతికి విడుదలైంది) ఎ) 7 ఏళ్లు బి) 8 ఏళ్లు సి) 10 ఏళ్లు డి) 6 ఏళ్లు 12. 2010 సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించిన జూనియర్ యన్టీఆర్ సినిమా పేరేంటో తెలుసా? ( చిన్న క్లూ: ఆ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు) ఎ) అదుర్స్ బి) ఆం్ర«ధావాలా సి) యమదొంగ డి) నరసింహుడు 13. ఈ ప్రముఖ దర్శకుని సినిమా ఒక్కసారి కూడా సంక్రాంతి బరిలోకి రాలేదు. ఎవరా దర్శకుడు. కొంచెం మెదడుకి పదును పెట్టండి? ఎ) పూరి జగన్నాథ్ బి) వీవీ వినాయక్ సి) ఎస్.ఎస్. రాజమౌళి డి) సుకుమార్ 14. ప్రభాస్ కెరీర్లో ఇప్పటివరకు రెండు చిత్రాలు మాత్రమే సంక్రాంతి పందెంలో నిలిచాయి. అందులో ఒకటి వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ‘యోగి’. మరో చిత్రం ఏంటో కనుక్కుందామా? ఎ) వర్షం బి) పౌర్ణమి సి) బిల్లా డి) మున్నా 15. ‘సంక్రాంతి’, ‘గోరింటాకు’, ‘దీపావళి’ మూడు పండగల పేర్లతో ఉన్న సినిమాలలో హీరోయిన్గా నటించిన నటి ఎవరో కనుక్కుందామా? ఎ) స్నేహా బి) ఆర్తి అగర్వాల్ సి) సౌందర్య డి) కల్యాణి 16. ‘ఊరంతా సంక్రాంతి’ చిత్రంలో ఇద్దరు పాపులర్ హీరోలు నటించారు. అందులో ఒకరు ఏయన్నార్. మరో హీరో ఎవరు? ఎ) కృష్ణ బి) శోభన్బాబు సి) కృష్ణంరాజు డి) నాగార్జున 17. కమల్హాసన్ నటించిన ‘మహానది’ చిత్రంలో ‘సంక్రాంతి..సంక్రాంతి...’ అనే హిట్ పాట ఉంది. ఈ సినిమా సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) ఇళయరాజా బి) దేవా సి) ఎస్.ఎ. రాజ్కుమార్ డి) కేవీ మహదేవన్ 18. తన మొదటి చిత్రంతోనే సంక్రాంతి బరిలో నిలిచిన దర్శకుడెవరో తెలుసా? ఆయన దర్శకత్వం వహించిన మూడు చిత్రాలు ఇప్పటివరకు సంక్రాంతి పోటీలో నిలిచాయి. ఇంతకీ ఎవరా దర్శకుడు? ఎ) శ్రీను వైట్ల బి) బోయపాటి శ్రీను సి) క్రిష్ డి) శేఖర్ కమ్ముల 19. 2019 సంక్రాంతికి ఒకే ఒక డబ్బింగ్ సినిమా విడుదలైంది. ఆ చిత్రం ‘పేట’. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయన సరసన నటించిన ఇద్దరు హీరోయిన్లలో ఒకరు త్రిష. మరో హీరోయిన్? ఎ) నయనతార బి) రాధికా ఆప్టే సి) సిమ్రాన్ డి) మీనా 20. సంక్రాంతి అనగానే తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద సినిమాలు రిలీజవుతాయి. 2017 సంక్రాంతికి చిరంజీవి నటించిన 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’, బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ వచ్చాయి. ఈ రెండు చిత్రాలకు మాటల ర^è యిత ఒక్కరే. ఆయనెవరు? ఎ) వక్కంతం వంశీ బి) అబ్బూరి రవి సి) బుర్రా సాయిమాధవ్ డి) యం.రత్నం మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (బి) 2) (డి) 3) (ఎ) 4) (బి) 5) (ఎ) 6) (ఎ) 7) (ఎ) 8) (డి) 9) (డి) 10) (సి) 11) (సి) 12) (ఎ)13) (సి) 14) (ఎ) 15) (బి) 16) (ఎ) 17) (ఎ) 18) (సి) 19) (సి) 20) (సి) నిర్వహణ: శివ మల్లాల -
ప్రముఖ బ్యాంకర్, ఆప్ నేత కన్నుమూత
సాక్షి,ముంబై : ప్రముఖ బ్యాంకర్, ఆప్ నేత మీరా సన్యాల్ (57) కన్నుమూశారు. గతకొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మీరా సన్యాల్ అకాల మృతిపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంతాపం వ్యక్తం చేశారు. ఇంకా మనీష్ సిసోడియా తదితర పార్టీనేతలతో పాటు, మాజీ ఆప్ నేత, న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ఇంకా పలువురు ప్రముఖులు మీరా మరణంపై విచారం వ్యక్తం చేశారు. కాగా దేశంలో రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్కు సీఎండీగా మీరా పనిచేశారు. దాదాపు 30 సంవత్సరాల బ్యాంకునకు సేవలందించిన అనంతరం ప్రత్యామ్నాయ రాజకీయాలవైపు ఆమె ఆసక్తి చూపారు. ఈ నేపథ్యంలో సన్యాల్ పదవికి రాజీనామా చేసి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. పార్టీ తరపున 2014 లోక్సభ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అంతకుముందు 2009లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అప్లి ముంబై అనే సంస్థతో సామాజిక కార్యకర్తగా పేరొందిన మీరా.. దేశంలోని అమూల్యమైన సహజ సంపదను కేవలం వందలకోట్లకు కట్టబెడుతూ, వందల కోట్ల విలువైన ప్రాజెక్టులకోసం వేలకోట్ల రూపాయలకు కాంట్రాక్టర్లకు ముట్టచెబుతున్నారనీ, బ్యాంకింగ్ వ్యవస్థ స్కాంల మయంగా మారి పోయిందని ఆమె ఆందోళన వ్యక్తం చేసేవారు. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు ఒక పెద్ద స్కాం అని విమర్శించేవారు. ఈ నేపథ్యంలోనే పెద్ద నోట్ల రద్దుపై ‘‘ది బిగ్ రివర్స్: హౌ డిమానిటైజేషన్ నాక్డ్ ఇండియా ఔట్’’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. ప్రముఖ మాజీ నావీ అధికారి వైస్ అడ్మిరల్ గులాబ్ మోహన్లాల్ హీరా నందాని కుమార్తె మీరాకు భర్త ఆశిష్ సన్యాల్, ఇద్దరు సంతానం(ప్రియదర్శిని సన్యాల్, జై సన్యాల్) ఉన్నారు. గత ఏడాది పీఎన్బీ స్కాంపై మీరా సన్యాల్ ఫేస్బుక్ లైవ్ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు. Extremely sad to hear this. No words to express... https://t.co/YslA8TddvU — Arvind Kejriwal (@ArvindKejriwal) January 11, 2019 -
మీనాను హత్య చేసింది గ్రేహౌండ్స్ పోలీసులే
-
మీనాది హత్యే!
మల్కన్గిరి : మల్కన్గిరి జిల్లా చిత్రకొండ కటాఫ్ ఏరియా ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో మీనా మృతి చెందలేదని, ఇరు రాష్ట్రాల పోలీసులు కాల్చి చంపారని అమరవీరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు భవానీ, నిరసన నేతలు బషీద్ ఆరోపించారు. మీనాను పోలీసులు ఈ నెల 11వ తేదీన అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసినా లొంగకపోవడంతో 12వ తేదీన కాల్చి చంపారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అరకు ప్రాంతంలో అక్రమంగా బాక్సైట్ తవ్వకాలు చేపడుతున్నారన్న నేపథ్యంలోనే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమను మావోయిస్టులు చంపారని అన్నారు. ఇదే విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఒడిశా పోలీసులు సంయుక్తంగా కొరాపుట్, మల్కన్గిరి అడవుల్లో కూంబింగ్ నిర్వహించి, మావోయిస్టులను చంపడమే లక్ష్యంగా చేసుకుని మీనాని చంపారని తెలిపారు. 303 సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, ఒడిశా పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వరంగల్ జిల్లాలోని పొచ్చన్నపేటలో మీనాకు ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. విప్లవ జోహార్లు తెలుపుతూ అంతిమ సంస్కారాలు జరిపారు. ఈ అంతిమయాత్రలో వరంగల్ పౌరహక్కుల కార్యకర్త రంజిత్, తెలంగాణ రాష్ట్ర ఎస్ఎల్సీ అధ్యక్షుడు లక్ష్మణ్, మీనా కుటుంబ సభ్యులు సత్యం, భాస్కర్, గాజర్ల రవి, అశోక్, అనిత తదితరులు పాల్గొన్నారు. నలుగురు మావోయిస్టులను కోర్టుకు తరలింపు అలాగే మల్కన్గిరి పోలీసుల అదుపులో ఉన్న సుమారు నలుగురు మావోయిస్టులను ఆదివారం కోర్టుకు తరలించినట్టు ఎస్పీ జోగ్గా మోహన్ తెలిపారు. వీరిలో జయంతి అలియాస్ అంజన, గ్లోరి, రాధిక, సుమ అలియాస్ గీత, రాజేష్ కోరా ఉన్నట్టు పేర్కొన్నారు. చదవండి : కిడారి హత్యలో పాల్గొన్న మహిళా మావోయిస్టు ఎన్కౌంటర్! -
ఆమెను ముందే అదుపులోకి తీసుకున్నారా?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర– ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ఆండ్రపల్లి సమీపంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న పోలీసులు–మావోల ఎదురుకాల్పుల ఘటనపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనలో మహిళా మావోయిస్టు నేత మీనా అలియాస్ జిలానీ మృతి చెందగా మరో ముగ్గురు మహిళా మావోయిస్టులతోపాటు మిలీషియా సభ్యుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. చాలామంది కీలక నేతలు తప్పించుకున్నారని చెబుతున్న పోలీసుల వాదనలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ విప్ కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కాల్చిచంపాక పోలీసులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. రెండేళ్ల కిందట రామగుడ ఎన్కౌంటర్ తర్వాత ఏవోబీలో మావోలను చావు దెబ్బతీశామని భావిస్తున్న పోలీసులకు లివిటిపుట్టు ఘటన కోలుకోలేని షాక్నిచ్చింది. ఆ రోజు నుంచి పోలీసులు ఏవోబీని జల్లెడ పడుతూ వస్తున్నారు. (చదవండి: ఎదురుకాల్పులతో దద్దరిల్లిన ఏవోబీ) మావోయిస్టులు పోలీసుల కూంబింగ్ను లెక్కచేయకుండా ఏవోబీలోనే ఇటీవల రెండుసార్లు సమావేశమయ్యారు. ఒడిశాలోని జన్బై వద్ద నిర్మిస్తున్న గురుప్రియ వంతెనను వ్యతిరేకిస్తూ ఈనెల 2న ఏవోబీలోనే భారీ సభ నిర్వహించారు. ఆ తర్వాత 7న సుంకి అటవీ ప్రాంతంలో మావోయిస్టు నేతలు, దళ సభ్యులు సమావేశం కాగా పోలీసులు కాల్పులు జరిపారు. కూంబింగ్ను కూడా లెక్క చేయకుండా మావోలు ఏవోబీలోనే మకాం వేయడం, కటాఫ్ ఏరియాలోని మారుమూల ప్రాంతాలకు ఇప్పటికీ పోలీసులు వెళ్లలేకపోవడం, లివిటిపుట్టు ఘటన జరిగి దాదాపు మూడు వారాలవుతున్నా పోలీసుల అదుపులోకి పరిస్థితులు రాకపోవడం వెరసి వ్యూహాత్మకంగానే పోలీసులు ఎదురుకాల్పుల ఘటనను సృష్టించారనే వాదనలు వినిపిస్తున్నాయి. మీనాను ముందే అదుపులోకి తీసుకున్నారా? ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యాచరణ కమిటీ సభ్యుడు గాజర్ల రవి భార్య మీనా అలియాస్ జిలానీ కొన్నాళ్లుగా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఉద్యమానికి దూరంగానే ఉన్నారని చెబుతున్నారు. లివిటిపుట్టు ఆపరేషన్లో ఆమె పాల్గొన్నారా.. లేరా అనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ పోలీసులు ఆమెను కిడారి, సివేరిల హత్య కేసులో 21వ నిందితురాలిగా చూపిస్తున్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో కొన్నాళ్లుగా మీనా మల్కన్గిరి జిల్లాలోని ఆండ్రపల్లిలో తలదాచుకున్నట్టు చెబుతున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసి ఆండ్రపల్లిని గురువారం రాత్రే ముట్టడించారని తెలుస్తోంది. గ్రామంలోని ప్రతి ఇంటినీ శోధించి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు. మీనాను అదుపులోకి తీసుకున్నారని, అనారోగ్యంతో ఉన్న తాను లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె చెప్పినా.. ఎన్కౌంటర్ చేసి ఎదురుకాల్పుల కథ సృష్టించారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులు జయంతి అలియాస్ అంజనా, రాధిక గొల్లూరి, సుమలా అలియాస్ గీతలతోపాటు మిలీషియా సభ్యుడు రాజశేఖర్ కర్మ నెల రోజులుగా ఇదే గ్రామంలో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నెన్నో అనుమానాలు? ఎదురుకాల్పుల ఘటనలో మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్న మీనా మృతదేహాన్ని మీడియాకు, గ్రామస్తులకు పోలీసులు చూపించలేదు. గ్రామస్తులు చుట్టుముట్టినా మృతదేహాన్ని చూపించేందుకు పోలీసులు నిరాకరించారు. శుక్రవారం తెల్లవారుజామున మొత్తం ఏడుసార్లు మాత్రమే కాల్పుల శబ్దం వినపడిందని, ఎదురుకాల్పుల ఘటనల్లో లెక్కకు మించి కాల్పుల శబ్దాలు వస్తాయని గ్రామస్తులు వాదిస్తున్నారు. ఘటన జరిగిన ఆండ్రపల్లి ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా చిత్రకొండ పోలీస్స్టేషన్ పరిధిలోనిది కావడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. ఎమ్మెల్యే కిడారి హత్య దరిమిలా మూడు వారాలుగా మావోయిస్టులకు సవాల్ విసరాలని భావిస్తున్న పోలీసులు చివరికి.. అనారోగ్యంతో లొంగిపోవాలని చూస్తున్న ఓ మహిళా మావోయిస్టు నేతను ఎదురుకాల్పుల పేరిట మట్టుబెట్టి కలకలం సృష్టించేందుకు యత్నించారన్న వాదనలకే బలం చేకూరుతోంది. -
ఎన్కౌంటర్: కిడారి హత్యలో పాల్గొన్న మహిళా మావోయిస్టు హతం
-
కిడారి హత్యలో పాల్గొన్న మహిళా మావోయిస్టు ఎన్కౌంటర్!
సాక్షి, విశాఖ ఏజెన్సీ : ఆంధ్ర, ఒడిషా సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య శుక్రవారం హోరా హోరీ కాల్పులు జరిగాయి. విశాఖ ఏజెన్సీ బెజ్జంగిలోని పనసపుట్టి సమీపంలో పోలీసుల ఎదురు కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందారు. మృతురాలు గాజర్ల రవి భార్య జిలానీ బేగం అలియాస్ మీనాగా తెలుస్తోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలో మీనా పాల్గొన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఎన్కౌంటర్లో మీనా మృతి చెందగా, జయంతి, గీత, రాధిక, రాజశేఖర్ అనే మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపూర్ మండలానికి చెందిన మీనా గత 20 ఏళ్లుగా మావోయిస్టుగా ఉంటున్నారు. మీనా మృతి చెందినట్టు వార్తలు రావడంతో ఖానాపూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ మీనా
-
మా కాలంలోనూ అదే టార్చర్! : మీనా
తమిళసినిమా: ఇప్పుడు ఏ నోట విన్నా కాస్టింగ్ కౌచ్ మాటే. అంతకు ముందు అణగారి ఉన్న ఈ అంశం గాయని సుచిత్ర, తాజాగా నటి శ్రీరెడ్డిల కారణంగా కలకలం సృష్టిస్తోంది. ఏ నటితో మాట్లాడినా మీడియా కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించడం ఒక ఆనవాయితీగా మారింది. కొందరు భామలు తమ అభిప్రాయాలను ధైర్యంగానే వెల్లడించే ప్రయత్నం చేస్తుండడం విశేషం. ఇటీవల నటి మీనాకు ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. మీనా తమిళం, తెలుగు భాషల్లో స్టార్ హీరోలందరితోనూ నటించేసింది. ముఖ్యంగా కోలీవుడ్లో సూపర్స్టార్ రజనీకాంత్, కమలహాసన్ వంటి వారితోనూ జత కట్టింది. ఇంకా ఎవరితోనైనా నటించాలని కోరుకుని నటించలేకపోయిన నటులెవరైనా ఉన్నారా అన్న ప్రశ్నకు మీనా బదులిస్తూ నటడు అరవిందస్వామి సరసన నటించలేకపోయాను. రోజా చిత్రం సమయంలో ఆయనకు చాలా క్రేజ్ ఉంది. ఆ సమయంలో అరవిందస్వామికి జంటగా నటించే అవకాశం వచ్చినా కాల్షీట్స్ సమస్య కారణంగా ఆ అవకాశాన్ని వదులుకున్నాను. అలాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నానేమోనని ఇప్పటికీ అనిపిస్తోంది. అదే విధంగా విజయ్తో చాలా చిత్రాలు కమిట్ అయి కూడా నటించడం కుదరలేదు. తెరి చిత్రం షూటింగ్ సమయంలో విజయ్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కావాలనే నాతో నటించడానికి నిరాకరించారు కదూ అని వెంటనే అప్పట్లో మీ డైరీ గురించి నాకు తెలుసు ఊరికే సరదాగా అన్నాను అని నవ్వేశారు. అయితే విజయ్తో నటించలేదన్న కొరత పోవడానికే షాజహాన్ చిత్రంలో ఆయనతో ఒక పాటలో నటించాను. ఇక అవకాశాలు వచ్చి నేను మిస్ చేసుకున్న చిత్రాల పట్టిక చాలానే ఉంది. ఫ్రెండ్స్ (దేవయాని పాత్ర), ప్రిముడన్(కౌసల్య పాత్ర), వాలి(సిమ్రాన్ పాత్ర), దేవర్మగన్ (రేవతి పాత్ర), పడైయప్పా (రమ్యకృష్ణ పాత్ర), పొన్మణి(సౌందర్య పాత్ర) చిత్రాల కథలను విని అందులో నేను నటించలేకపోయిన పరిస్థితి. ఇక ప్రస్తుతం కలకలం చెలరేగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి అడుగుతున్నారు. అది చాలా విచారకరమైన విషయం. అన్ని రంగాల్లోనూ మహిళలకు సమస్యలు ఉన్నాయి. అలాంటి సంఘటనలను నేను ఎదుర్కోకపోయినా, మా కాలంలోనూ ఆ టార్చర్ ఉండేది. వక్ర బుద్ధి కలిగిన మగాళ్లు ఇకనైనా మారాలి. వారు ఒక స్త్రీతో డీల్ మాట్లాడే ముందు తమకు భార్య, పిల్లలు ఉన్నారన్నది గుర్తు చేసుకోవాలి. ప్రతిభను ప్రదర్శించే అవకాశాల కోసం ఎలాంటి సామరస్యానికి చోటు లేకుండా స్త్రీలు పోరాడాలి అని నటి మీనా పేర్కొంది. -
వివాహమైన మరుసటి రోజే..
వేలూరు: వివాహమైన మరుసటిరోజే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వానియంబాడి సమీపంలో గురువారం జరిగింది. వివరాలు.. వేలూరు జిల్లా వానియంబాడి నేతాజీనగర్కు చెందిన వినాయకం కుమార్తె మీనా (20). ఈమెకు విరిసలాంబట్టు గ్రామానికి చెందిన చిన్నస్వామి కుమారుడు గోవిందస్వామి(25)తో బుధవారం వివాహం జరిగింది. వివాహం జరిగిన వెంటనే పెళ్లి కుమార్తె ఇంటికి నూతన దంపతులు వచ్చారు. గోవిందరాజ్ గురువారం సాయంత్రం పని నిమిత్తం కురిసలాంబట్టుకు వెళ్లాడు. మీన అదే ప్రాంతంలోని యువరాజ్ ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మీనా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో ఇంటికి వచ్చిన బంధువు ఇది గమినించి కేకలు వేశాడు. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. వారి సమాచారంతో వానియంబాడి పోలీసులు అక్కడికి చేరుకుని మీనా మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
సీతారామయ్యగారింట్లో పెళ్లి!
తెలుగులో వచ్చిన సూపర్ హిట్ ఫ్యామిలీ డ్రామాల్లో ఎవర్గ్రీన్గా నిలిచిపోయే ఓ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఈ రోజుకీ ఈ సినిమా నుంచి పుట్టిన ఫార్ములాతోనే లెక్కలేనన్ని సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... సీతారామయ్యగారింట్లో పెళ్లి హడావుడి అప్పటికే మొదలైపోయింది. ఇంట్లో వాళ్లంతా ఏదో ఒక పనిలో పడిపోయి బిజీబిజీగా కనిపిస్తున్నారు. గేటుముందు ఒక ట్యాక్సీ వచ్చి ఆగింది. ‘‘ఎంతైందీ?’’ అంటూ ట్యాక్సీకి డబ్బులిచ్చి లగేజీ సర్దుకుంటోంది ఆ అమ్మాయి. ఇంట్లో వాళ్లంతా ‘ఎవరా?’ అనుకుంటూ ఆ అమ్మాయినే చూస్తూన్నారు. ‘‘ఇది సీతారామయ్యగారి ఇల్లే కదండీ?’’ అడిగింది ఆ అమ్మాయి కాస్త బెరుకుగానే. ‘‘అవునమ్మా!’’ అంది ఆ ఇంటి ఆడపడుచు. ‘‘నేను సీతారామయ్యగారి మనవరాలిని. అమెరికా నుండి వస్తున్నాను. డాక్టర్ శ్రీనివాసమూర్తిగారి అమ్మాయిని..’’ ఆ అమ్మాయి తనను తాను పరిచయం చేసుకుంది. ఆ ఇంటి ఆడపడుచుతో పాటే పక్కనే నిలబడి ఈ మాటలన్నీ విన్న ఒక పిల్లాడు ఇల్లంతా ఆ మాటను వినిపించాడు. ఆ ఇంట్లో ఇప్పుడు హడావుడి ఇంకాస్త ఎక్కువైంది. ‘‘అమ్మా, నాన్నా?’’ అడిగింది ఆడపడుచు. ‘‘రాలేదండీ! నాన్నకు తీరుబాటు కాలేదు. అమ్మ.. నాన్నతో ఉండకపోతే, వీలుకాదు. అందుకే పెళ్లికి నన్ను వెళ్లమని పంపారు.’’ సీతారామయ్య బయటికొచ్చి ఆ అమ్మాయిని చూశాడు. మనవరాలిని చూసిన సంతోషం అతనిలో కనిపిస్తున్నా, దాన్ని దాచేస్తూ గంభీరంగా చెప్పాడు – ‘‘వచ్చిన బంధువులకు ఇంట్లో సదుపాయాలు అవీ సరిగ్గా చూడండి. ఇది సీతారామయ్యగారింట్లో జరుగుతున్న పెళ్లి’’. సీతారామయ్య మనవరాలు రావడంతోనే ఇంట్లో అందరికీ నచ్చేసింది. ఇట్టే కలిసిపోయింది. ‘‘నాన్న నన్ను ‘నాన్నా నాన్నా’ అని పిలుస్తాడు నానమ్మా!’’ అని మనవరాలు చెప్తూ పోతుంటే సీతారామయ్యకు, ఆయన భార్యకు కళ్లలో నీళ్లు తిరిగాయి. కొడుకు గుర్తొచ్చాడు. ఎప్పుడు ఇల్లు వదిలేశాడతను? ఆ భార్యాభర్తలిద్దరూ ఇప్పటికీ కొడుకును తల్చుకోని రోజంటూ లేదు. మనవరాలు సీత పందొమ్మిదేళ్ల వయసు వచ్చిందాక ఎలా ఉందో కూడా వాళ్లు చూడలేదు. సీతను ఇలా ఇప్పుడు చూస్తూండడం వాళ్లకు సంతోషంగా ఉంది. సీతరామయ్యకు మాత్రం కొడుకు రాలేదనే కోపం, బాధ అలాగే ఉంది. అందుకే మనవరాలితో మాట్లాడటానికి కూడా ఇష్టంగా లేడు. కానీ ఆమె చేష్టలు, ఇంట్లో అందరితో ఇష్టంగా కలిసిపోవడం, ఏదో ఒకలా తనతో మాట్లాడాలని ప్రయత్నాలు చేస్తూ ఉండటం సీతారామయ్యకు తెలీకుండానే మనవరాలిని దగ్గర చేస్తున్నాయి. పెళ్లి రోజు రానే వచ్చేసింది. సీతారామయ్య ఇంట్లో పెళ్లి కాబట్టి ఊరంతా ఒకదగ్గర చేరినట్టుంది పెళ్లి మండపమంతా. సీతారామయ్య తన మనవరాలైన పెళ్లికూతురుకు పదివేలు కట్నం చదివించాడు. అలాగే సీత కూడా నాన్న తరపున కట్నం చదివించింది. పదివేల డాలర్లు. ‘‘మీరు పదివేలు చదివిస్తే, మీ వాడు పదివేల డాలర్లు చదివించాడు. అంటే మీకంటే పదిహేడు రెట్లు ఎక్కువ.’’ అన్నాడు పెళ్లిలో సీతరామయ్య పక్కనే కూర్చున్న ఓ పెద్దమనిషి. ‘‘ఎంతెక్కువైనా ఖర్చు విషయంలో ఇక్కడ రూపాయి ఎంతో అక్కడ డాలరూ అంతే. అదో గొప్పా!?’’ అంటూ కొట్టిపారేశాడు సీతారామయ్య. ఆ మాటలను వింటూ తాతయ్యనే చూస్తూ కూర్చున్న సీత చిన్నగా నవ్వింది. పెళ్లి అయిపోయింది. సీతంటే ఇప్పుడు ఇంట్లో అందరికీ ఇష్టం. సీతారామయ్య కూడా మనవరాలిని మూడు రోజులకు మించి దూరం పెట్టలేకపోయాడు. ఆయనే సీతను దగ్గరికి తీసుకొని ముద్దుపెట్టి ‘‘నువ్వు నా మనవరాలివి.’’ అన్నాడు. సీత ఆనందానికి అవధుల్లేవు. ఇల్లంతా తిరుగుతూ గట్టిగా అరిచి చెప్పింది – ‘‘తాతయ్య నాకు ముద్దు పెట్టాడు’’. రోజులు గడుస్తున్నాయి. పందొమ్మిదేళ్లు ఈ ప్రపంచాన్ని చూడని సీత ఇప్పుడిదే ప్రపంచంగా గడిపేస్తోంది. సీతరామయ్యకూ ఇదంతా ఓ కలలా ఉంది. సీత వచ్చాక ఆ ఇల్లు ఎంత సంతోషంగా ఉందో, అంత సంతోషంగా ఉన్న ఒకరోజు. అమెరికా నుంచి సీతారామయ్య కొడుకు శ్రీనివాసమూర్తి స్నేహితుడు వివేక్ సీతను చూడ్డానికి వచ్చాడు. సీతారామయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. సీతకు కబురెళ్లింది. పొలం చూసొస్తానని వెళ్లిన సీత పరిగెత్తుకుంటూ వచ్చింది. సీతారామయ్య, ఆయన భార్య, వివేక్ ఏం మాట్లాడకుండా కూర్చున్నారు. సీత కంగారు పడిపోతోంది. ఎవ్వరూ ఏం మాట్లాడటం లేదు. గట్టిగా అరిచినట్టు అడిగింది – ‘‘ఎవ్వరూ ఏం మాట్లాడరే!’’. ‘‘నువ్వు ఆడిన నాటకానికి ఇంకా మేం నీతో మాట్లాడాలా?’’ సీతారామయ్య గట్టిగా అడిగాడు. ‘‘నాటకమా?’’ అమాయకంగా నటిస్తూ అడిగింది సీత. ‘‘ఆయన అన్నీ వివరంగా మాతో చెప్పారు.’’ అంది సీతారామయ్య భార్య, వివేక్ను చూపిస్తూ. సీతలో కంగారు ఇంకా పెరిగిపోయింది. ‘‘చెప్పేశారా?.. అంకుల్..?’’‘‘అదీ.. సీతా..’’ వివేక్ మాటలను మధ్యలోనే ఆపేస్తూ, ‘‘బాబూ! మీరు దయచేసి కాసేపు మాట్లాడకండి.’’ అన్నాడుసీతారామయ్య. వెంటనే సీతవైపు చూస్తూ.. ‘‘ముందు నాకు సమాధానం చెప్పవే సీతా! ఈ విషయం మా ముందు దాచవలసిన అవసరం ఏమొచ్చింది?’’ అడిగాడు. ‘‘తాతయ్యా! అదీ..’’ సీత తడబడుతోంది. ‘‘హఠాత్తుగా మీ నాన్న వస్తున్నాడని తెలిస్తే, నేను గుండె ఆగి చచ్చిపోతాననుకున్నాడా? వాడింటికి వాడొస్తున్నాడు.’’తాతయ్య మాటలు వింటున్న సీత కంగారంతా ఎగిరిపోయింది. పొలం దగ్గర్నుంచి పరిగెత్తుకుంటూ వచ్చినప్పట్నుంచి ఉన్న కంగారు అది. వివేక్ ఎక్కడ నిజం చెప్పేశాడో అని. కానీ వివేక్ నిజం దాచేశాడు. సీతారామయ్యకు చెప్పిన చిన్న అబద్ధంతోనే ఆ నిజాన్ని దాచేశాడు. ఆ అబద్ధం అప్పటికి సీత కళ్లలో ఆనందాన్ని తెచ్చిపెట్టింది. కానీ నిజం.. నిజం ఏదో ఒకరోజు చెప్పాల్సి రావొచ్చు. కొడుకు ఎప్పటికీ రాడని తెలిస్తే, ఆ రోజు సీతారామయ్య ఏమవుతాడో!! -
రాములోరి కల్యాణానికెళ్లి..
ఆమె రోజు వారీ కూలి... భక్తిభావం ఎక్కువ.. తరుచూ దేవాలయాలకు వెళ్తుంటోంది.. శ్రీరాముడి కల్యాణం చూడాలని ఎప్పటి నుంచో ఆశ.. ఎట్లాగైనా చూద్దామనుకుంది.. సాధారణంగా భద్రచలం వెళ్తారు.. ఈ ఏడాది బంధువులు ఒంటిమిట్ట వెళ్తున్నారని తెలుసుకుంది.. వారితో ఆమె పయనమైంది.. కల్యాణ మండపానికి చేరింది.. కల్యాణాన్ని కనులారా వీక్షించాలని కోటి ఆశలతో ఎదురుచూస్తోంది... రాముడి కల్యాణ గడియాలు వచ్చేశాయి.. ఆ గడియాలు ఆమె చివరి గడియాలు అని ఊహించలేదు.. వరుణదేవుడు ఇరుసుకుపడ్డాడు.. సృష్టించిన బీభత్సంలో కొందరు మృత్యువు కౌగిలికి చేరారు.. అందులో పెడనకు చెందిన మీనా ఉంది. పెడన: శ్రీరాముడి కల్యాణం తిలకించేందుకు పెడన పట్టణంలోని రాజీవ్నగర్కు చెందిన మోర్ల మీనా, ఇదే కాలనికి చెందిన కౌతవరపు సాంబశివరావు(చిన్న) వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టకు ఈ నెల 28వ తేదీ రాత్రి బయలుదేరి వెళ్లారు. మచిలీపట్నంలో నివాసం ఉంటున్న తన అక్క కేశన కమల, మరికొందరు కలసి వెళ్లింది. 29వ తేదీన కడపకు చేరుకున్నట్లు పెంపుడు కుమార్తె నాగజ్యోతికి సమాచారం ఇచ్చింది. శుక్రవారం కల్యాణోత్సవం విషాదం చోటుచేసుకుంది. వరుణుడు దెబ్బకు నలుగురు చనిపోయారు. అందులో మీనా ఉన్నారు. సాంబశివరావు ఆచూకీ తెలియాల్సి ఉంది. కలంకారీ పనులకు వెళ్తూ.. మీనా తల్లిదండ్రులకు ఆరుగురు సంతానం. మీనాకు పెళ్లయిన కొత్తలోనే భర్త వెంకటస్వామి విడిపోవడంతో సోదరి కుమార్తెను పెంచుకుంది. కొత్తిమీర కట్టలను విక్రయిస్తూ, కలంకారీ పనులకు వెళ్తూ కుమార్తె నాగజ్యోతిని పెంచింది. తహసీల్దారు విచారణ.. ఒంటిమిట్టలో చనిపోయిన మోర్ల మీనా ఇంటికి తహసీల్దారు ఎంవీ సత్యనారాయణ వెళ్లి శనివారం మధ్యాహ్నం విచారణ నిర్వహించారు. ఎప్పుడు వెళ్లింది, ఎవరెవరు వెళ్లింది, తదితర వివరాలతో పాటు ఒంటిమిట్టకు వెళ్లిన వారి ఫోన్ నంబర్లు తీసుకుని ఆరా తీశారు. కౌతవరపు సాంబశివరావు వివరాలు మాత్రం పూర్తిగా అందలేదు. చంద్రన్న బీమా కింద తక్షణ సాయం మట్టిఖర్చుల నిమిత్తం రూ.5వేలను కుటుంబ సభ్యులకు అందజేశారు. నెల్లూరులో ఉన్న మీనా చెల్లెలు గోవర్ధన్ బంధువులు ఒంటిమిట్టకు వెళ్లి మృతదేహాన్ని తీసుకొస్తున్నట్లు సోదరి జ్యోతి తెలిపింది. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు చెప్పారు. తహసీల్దార్ వెంట వార్డు కౌన్సిలర్ గరికిముక్కు చంద్రబాబు, పట్టణ వీఆర్వో హరికృష్ణ ఉన్నారు. -
తల్లి కల నెరవేర్చిన తనయ
బేబీ మీనాని అంత సులువుగా మరచిపోలేం. బొద్దుగా, ముద్దుగా అందర్నీ ఆకట్టుకున్న మీనా కథానాయికగా కూడా మంచి మార్కులు కొట్టేశారు. ఇప్పుడు నైనిక... డాటరాఫ్ మీనా కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా అందర్నీ ఆకట్టుకుంది. దాంతో మీనా తెగ ఆనందపడిపోతున్నారు. ఆ ఆనందం రెట్టింపు అయ్యేలా నైనిక తన తల్లి కల నెరవేర్చింది. సౌత్లో ఎందరో హీరోలు, దర్శకులతో పని చేసిన మీనాకి తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు సిద్దిఖీతో పనిచేయాలని చిరకాల కోరిక అట. ఆ కల నెరవేరలేదు. అయితే కూతురి రూపంలో ఆ కల నెరవేరింది. ఈ విషయాన్ని ఇటీవల మీనా స్వయంగా తెలిపారు. ‘‘విజయ్ హీరోగా దర్శకుడు సిద్దిఖీ గతంలో ‘ఫ్రెండ్స్’ అనే సినిమా తీశారు. ఆ సినిమాలో విజయ్కి జోడీగా చేయమని దర్శకుడు నన్ను సంప్రదించారు. బిజీ షెడ్యూల్ వల్ల అప్పుడు కుదరలేదు. నా కూతురు నైనిక విజయ్ ‘తెరి’ సినిమాలో నటించి, అందరి ప్రశంసలు అందుకుంది. తాజాగా సిద్దిఖీ దర్శకత్వం వహిస్తోన్న ‘భాస్కర్ ఒరు రాస్కెల్’ చిత్రంలో నైనిక నటిస్తోంది. విజయ్, సిద్దిఖీలతో పనిచేయాలనే నా కల నెరవేరలేదు. కానీ, నైనిక నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు మీనా. -
నాకేమీ వద్దు!
సమ్సారం సంసారంలో సినిమా మా ఇద్దరికీ గొడవ అయింది. అది అవుతూనే ఉంటుంది. అవ్వకపోతేనే, గొడవ అవ్వలేదని చెప్పుకోవాలి. అసలు గొడవనేదే లేకుంటే భార్యాభర్తలన్న మాటకు అర్థమే లేదంటాడు మా మావయ్య. ఆయన పెళ్లి చేసుకోలేదు. కానీ ఈ విషయం గురించి మాత్రం బాగా మాట్లాడతాడు. చేసుకోకపోవడం వల్లే ఇంత తెలుసుకున్నాడా? ఏమో తెలియదు. ఆ మాటకొస్తే పెళ్లయిందన్న మాటే కానీ నేనూ గొప్పవాడినే! నాకూ గొప్ప పేరుంది. ఈ మాట మా ఆవిడ ముందు అంటే ఒప్పుకోదు. కుళ్లు అనుకోవచ్చు. భర్త గొప్పోడైతే భార్యకు కుళ్లు ఉంటుందా? ఉండొచ్చు.. మా ఆవిడకు ఉంది. చాలాసార్లు మేం గొడవ పడ్డ సందర్భాలు గుర్తుండవు. అసలు ఎందుకు గొడవ పడ్డామో ఇద్దరం మర్చిపోతుంటాం. కాకపోతే ఒకటుంది. గొడవ పడ్డప్పుడల్లా ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకుంటాం. దాన్ని ఎంత పద్ధతిగా అమలు పరుస్తాం అంటే... అంత పద్ధతిగా! మా పెళ్లి రోజుకి సరిగ్గా రెండు రోజుల ముందు గొడవ అయింది. చెప్పాను కదా, ఎందుకయిందో గుర్తుండదు. అప్పుడొక నిర్ణయం తీసుకున్నాం. ఇద్దరం ఎవ్వరం ఎవ్వరికీ గిఫ్ట్ ఇచ్చుకోకూడదు అని. అది ఏ గిఫ్ట్ అయినా, ఎంతటిదైనా! మాలో ఎవరు గిఫ్ట్ కొన్నా సర్ప్రైజ్లా కాకుండా ఇద్దరం షాపింగ్ చేసే కొంటాం. అది మేం ప్రేమలో ఉన్నప్పట్నుంచే జరుగుతూ వస్తోంది. పెళ్లిరోజు కేక్ కట్ చేశాం, డిన్నర్కి వెళ్లాం, పార్టీ చేసుకున్నాం. గిఫ్ట్లు మాత్రం ఇచ్చుకోలేదు. ఆ గొడవ అలా సద్దుమణిగిపోయింది. మేము తీసుకున్న నిర్ణయానికి మాత్రం కట్టుబడే ఉన్నాం. ప్రపంచానికి మేము మంచి భార్యాభర్తలం. మేమిద్దరమే ఉన్నా కూడా చక్కగా ఉంటాం. మా ఆవిడకు నేను గొప్ప వాడినని కుళ్లు అన్నా కదా, మా ఇద్దరినీ కలిసి చూస్తే ప్రపంచానికి కుళ్లు. అంత బాగుంటాం ఇద్దరం. గొడవలు గొడవలే! మా మావయ్య చెప్పింది నిజమే అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు.పెళ్లిరోజు పోయిన నెలకే నా పుట్టినరోజు. పొద్దున్నే ఆఫీసుకు వెళ్లేప్పుడే చెప్పింది, ‘‘ఇవ్వాళ తొందరగా వచ్చెయ్! నేను హాఫ్ డే లీవ్’’ అని. మధ్యాహ్నం అదే విషయం చెప్తూ మళ్లీ ఫోన్ చేసింది. ‘‘తిన్నావా?’’ ‘‘ఆ! తిన్నా’’ ‘‘సరే! నేనిప్పుడే ఇంటికి వచ్చా. ఇవ్వాళ హాఫ్ డే చేశా. నీకోసమే!’’ ‘‘రేపు నా పుట్టినరోజనా?’’ ‘‘అంత సీన్ లేదులే కానీ, త్వరగా వచ్చెయ్’’ నవ్వుతూ చెప్పింది. ‘‘సర్ప్రైజా? ఓ... వెయిట్.. సర్ప్రైజా?’’ అడిగా. ‘‘నువ్వైతే రా!’’ అంది. మా జంటను చూసి మీరు కుళ్లుకుంటే నేనేం చేయలేను. సాయంత్రం దాకా సర్ప్రైజ్ ఏంటా ఏంటా అనే ఆలోచిస్తూ కూర్చున్నా. నాకప్పుడు గుర్తొచ్చింది. నేను గిఫ్ట్స్ తీసుకోవద్దు అని. మొత్తం ఆలోచనలన్నీ ఎగిరిపోయాయి. ఎగై్జట్మెంట్ చచ్చిపోయింది. తను చెప్పింది కాబట్టి తొందరగానే ఇంటికెళ్లిపోయా. ‘‘సరే! రెడీ అయిరా.. బయటకెళ్దాం’’ అంది.. నేను ఇంట్లో అడుగుపెట్టడమే! ‘‘ఎందుకు?’’ ‘‘ఎందుకేంటి?’’ ‘‘అదే రెడీ అవ్వడం ఎందుకూ?’’ ‘‘రెడీ అయ్యి రా బాబూ.. బయటికెళ్దాం’’ ‘‘దేనికీ?’’ ‘‘రేపు నీ బర్త్డే కదా! నేనేదైనా కొనిపెడతా’’ ‘‘అవసరం లేదు.’’ ‘‘ఏం అవసరం లేదు?’’ ‘‘అవసరం లేదు. మన అగ్రిమెంట్ మర్చిపోయావా? ఎవ్వరం ఎవ్వరికీ గిఫ్ట్ ఇచ్చుకోవద్దు.’’ ‘‘ఇప్పుడవన్నీ ఎందుకు ఆలోచిస్తావ్?’’ ‘‘నేనిప్పుడే ఆలోచిస్తా. రేపు పార్టీ ప్లాన్ చేద్దాం. అంతే కానీ నువ్ నాకేం గిఫ్ట్ ఇవ్వనక్కర్లేదు.’’ కోపంగా చూసింది. నాకోసమే రెడీ అయి ఎదురుచూస్తూ కూర్చుందేమో, భలే అందంగా ఉంది. ‘‘చావ్!’’ అనుకుంటూ బెడ్రూమ్కు వెళ్లిపోయింది. గిఫ్ట్లేం ఇచ్చుకోకుండానే పుట్టినరోజు అయిపోయింది. నా పుట్టినరోజు పోయిన నెలన్నరకే తన పుట్టినరోజు వచ్చింది. మా అగ్రిమెంట్ బాగానే గుర్తుంది కానీ ఎందుకో ఏదోక గిఫ్ట్ ఇవ్వాలని అనిపించింది. ఎల్లుండి తన పుట్టినరోజు. టీవీలో ఏదో చూస్తూ కూర్చుంది. కాఫీ కలుపుకొని వెళ్లి ఇచ్చా. ‘‘థ్యాంక్యూ!’’ అని తీసుకుంటూ ‘రా కూర్చో’ అని సైగ చేసింది. ‘‘బర్త్డే ప్లాన్స్ ఏం చేద్దాం?’’ అనడిగా ‘‘రెగ్యులర్గానే చేద్దాం. కొత్తగా ఏం చేస్తాం?’’ ‘‘నేన్నీకు..’’ అని పూర్తి చేయకముందే ‘‘కొంపదీసి గిఫ్ట్ ఇస్తావా?’’ ‘‘అదే అనుకుంటున్నా. షాపింగ్కు వెళ్దాం పద’’ ‘‘నేను రాను’’ ‘‘అరే! ఏదైనా కొనిపెడతా అన్నా కదా..’’ ‘‘నాకేమీ వద్దు’’ ‘‘నేనేమన్నానని..’’ ‘‘నువ్ ఏమనడమో కాదు. నాకేమీ వద్దు. మొన్న నీ బర్త్డేకి అడిగితే వచ్చావా?’’ ‘‘అదేదో..’’ ‘‘అవసరం లేదు. నాకు నువ్విచ్చే గిఫ్ట్.. అదెంత చిన్నదైనా గొప్పే! కానీ వద్దు. వద్దంటే వద్దు.’’ ‘‘మొండి చెయ్యకు..’’ ‘‘సరే సార్! నాకేమీ వద్దు.’’ ‘‘చావ్!’’ అని అక్కణ్నుంచి వెళ్లిపోయా. తన పుట్టినరోజు కూడా అయిపోయింది. టైమ్ గిర్రున తిరిగి, మా పెళ్లి రోజు మళ్లీ వచ్చింది. అప్పుడూ గిఫ్ట్లు ఏమీ ఇచ్చుకోలే! నా పుట్టినరోజు వచ్చింది. అప్పుడూ గిఫ్ట్ మాట వచ్చింది కానీ, నేనే మళ్లీ ఓవరాక్షన్ చేసి వద్దన్నా. ఇప్పుడు తన పుట్టినరోజు వచ్చింది. ఈసారి మా అగ్రిమెంట్ ఎలాగైనా బ్రేక్ చేయాలనుకున్నా. ఇక్కడ నాకూ కాస్త ఈగో ఉందనే చెప్పుకోవాలి. తన పుట్టినరోజుకి మూడు రోజుల ముందు ఒక లెటర్ రాశా. అది చదివింది. ‘బాగుంది’ అని మెచ్చుకుంది. భార్యాభర్తల మధ్య మెచ్చుకోవడాలు ఏంటో! ఆ ఉత్సాహం మీదనే అడిగా, ‘‘నీ బర్త్డేకి..’’ ‘‘చెప్పు నా బర్త్డేకి..’’ ‘‘షాపింగ్కి వెళ్దామా?’’ నవ్వింది. ‘‘చెప్పు వెళ్దామా?’’ మళ్లీ అడిగా. వెళ్దామన్నట్టు తలూపింది. ‘‘నువ్వు ఒప్పుకుంటావనుకోలే! రెండేళ్లలో రెండు సార్లు నీకు గిఫ్ట్ ఇవ్వలేకపోయినందుకు ఎంత బాధపడ్డానో!’’ అన్నా. ‘‘అహా! ఎక్కడ పెట్టావ్ ఆ రెండు గిఫ్ట్లూ?’’ అడిగింది. నేను అయోమయంగా చూశా. లోపలికెళ్లింది. రెండు నిమిషాల్లో తను నాకోసం ఈ రెండేళ్లలో తీసుకున్న మూడు గిఫ్ట్లు తెచ్చి ముందు పెట్టింది. వాచీ, మొబైల్ ఫోన్, ఏడు టీ షర్ట్స్ ఉన్న ప్యాక్. నేనైతే తను ‘నాకేమీ వద్దు’ అనగానే ఏ గిఫ్టూ కొనలేదు. జరగబోయేది భయపెట్టేసింది. అరుస్తుందా? ఎలా కవర్ చేయాలి? దాచిపెట్టా అని చెప్పి రెండు రోజుల్లో ఎప్పుడో కొన్నట్టు కొత్తవి కొంటే? అయినా... సడెన్గా ఏంటీ ట్విస్ట్? సినిమాలో సంసారం ప్యాంటు, షర్టు కావాలని నేనడిగానా? చీరలు కావాలని నేను వేధించానా? భానుప్రసాద్(వెంకటేశ్), స్వప్న(మీనా) ప్రేమించుకుంటారు. వారి పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకుని వేరు కాపురం పెడతారు. భానుప్రసాద్ బస్సు క్లీనర్గా చేరతాడు. అడ్వాన్స్గా ఇచ్చిన 500 రూపాయలు భార్యకి ఇచ్చి, అందులో రూ.250 తీసుకుని సరుకులు తెస్తానని సంతకి వెళతాడు. అక్కడ ఒక చీర కొంటే మరో చీర ఉచితంగా ఇస్తుండటంతో సరుకులు తీసుకోకుండా చీరలు కొనుక్కొని ఇంటికొస్తాడు. ‘అదేంటండీ వట్టి చేతులతో వచ్చారు. సరుకులేవీ?’ అని భర్తని ప్రశ్నిస్తుంది భార్య. భానుప్రసాద్ గుంజిళ్లు తీస్తూ అసలు సంగతి చెబుతాడు. ‘ఉన్న డబ్బంతా పెట్టి చీరలు కొన్నారు.. మరిప్పుడు సాపాటు’ అంటుంది స్వప్న. ‘నేనంత తెలివి తక్కువ వాడినా.. నీ వద్ద రూ.250 ఉంది కదా.. వాటితో సరుకులు కొనేస్తా. వెళ్లి డబ్బులు తీసుకురా’ అంటాడు భానుప్రసాద్. స్వప్న కూడా గుంజిళ్లు తీస్తూ ఆ డబ్బుతో ప్యాంటు, షర్టు కొన్న విషయం చెబుతుంది. ‘ఉన్న డబ్బులన్నీ పెట్టి బట్టలు కొనేశావు. మరిప్పుడు సాపాటు?’ అని భర్త ప్రశ్నిస్తే.. అది చీరలు కొనేటప్పుడు ఆలోచించాలి అంటుంది స్వప్న. ‘ప్యాంటు, షర్టు కావాలని నేను అడిగానా అని భానుప్రసాద్, నేను మాత్రం చీరలు కావాలని వేధించానా?’ అని స్వప్న వాదించుకుంటారు. ఉన్న డబ్బుతో బట్టలు కొనేస్తే ఇల్లు గడిచేదెలా అనేదే వారి బాధ. భార్యాభర్తల మధ్య ప్రేమకు, ఒకరి పట్ల మరొకరికి ఉండాల్సిన కన్సర్న్కు ప్రతీకగా ఉంటుంది ‘సూర్యవంశం’ సినిమాలోని ఈ సన్నివేశం. ప్రతి సంసారంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. అప్పటికవి పెద్దవే. ఎలాగోలా గట్టెక్కుతాం. వాటివల్లనే సంసారం బలపడుతుంది. ఆ అనుభవంతో చిన్న, పెద్ద ఇబ్బందులను దాటుకుని హాయిగా జీవించడం నేర్చుకుంటాం. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదసలు సంకటమే కాదనిపిస్తుంది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కూడా. అలాంటి సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి. సాక్షి పాఠకులతో పంచుకోండి. ఈ మెయిల్: samsaaram2017@gmail.com – వి. మల్లికార్జున్ -
హీరో తల్లిగా మీనా..!
జయ జానకి నాయక సినిమాతో మంచి విజయం సాధించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తన నెక్ట్స్ సినిమాను కూడా వేగంగా పూర్తి చేస్తున్నాడు. కమర్షియల్ చిత్రాల దర్శకుడు శ్రీవాసు దర్శకత్వంలో ఓ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాలో హీరో తల్లిగా ఓ అందాల తార నటించనుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. తరువాత టాప్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన మీనా, శ్రీవాస్, బెల్లంకొండ సినిమాలో హీరోగా తల్లిగా నటిస్తోంది. అయితే హీరో చిన్నప్పటి సీన్స్ వరుకు మాత్రమే మీనా కనిపిస్తుందా..? లేక సినిమా అంత కనిపిస్తుందా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరో తల్లి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. కీలకమైన ఆ సీన్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. -
స్వీయ నిర్బంధం నుంచి విముక్తి...
రిమ్స్ ఆస్పత్రికి అక్కాచెల్లెళ్ల తరలింపు.. ‘సాక్షి’ చొరవపై ప్రశంసలు సాక్షి, ఆదిలాబాద్: స్వీయ నిర్బంధం నుంచి అక్కాచెల్లెళ్లకు విముక్తి కల్పించారు. ఆదిలా బాద్లో 8 నెలలుగా ఒకే గదిలో స్వీయ నిర్బం« దంలో ఉన్న అక్కాచెల్లెలు గంగీత (26), మీనా (24)లకు ప్రభుత్వ యంత్రాంగం కౌన్సెలింగ్ నిర్వహించి చికిత్సల కోసం ఆది లాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు, తమ్ముడి మృతి వారిని కుంగదీసింది. ఒంటరి వారమయ్యా మని జనం ఏం నిందలు వేస్తారోనని భావన వారిని బాహ్య ప్రపంచానికి దూరం చేసింది. దీంతో 8నెలలుగా స్వీయ నిర్బంధంలో బతు కీడుస్తున్నారు. ‘సాక్షి’ పత్రిక మెయిన్లో ఈ నెల 12న ‘అక్కాచెల్లెళ్ల స్వీయ గృహ నిర్బం ధం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో పలు స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు ముందుకువచ్చి వారికి భోజనం పెడుతూ సహాయ పడ్డారు. బట్టలు, నిత్యావసర సరుకు లు అందజేశారు. స్వచ్ఛంద సంస్థ వద్దకు వచ్చినపక్షంలో ఆదరిస్తామని చెప్పినప్పటికీ వారు అంగీకరించకపోవడంతో వెనుదిరిగా రు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఆదివారం రంగంలోకి దిగింది. ఆదిలాబాద్ జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు, సెడ్స్ స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలిసి ఆది లాబాద్ రూరల్ పోలీసుల బందోబస్తుతో ఖానాపూర్ శివారులో ఇందిరమ్మ కాలనీకి చేరుకున్నారు. జేసీ ఆదేశాలతో డీఎంహెచ్ఓ రాజీవ్రాజ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ సాధన వారికి వైద్య పరీక్షలు చేశారు. వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని నిర్ధారణ కావడంతో ఆస్పత్రికి తరలించారు. జేసీ ఆదేశాల మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ నిర్భయ కేంద్రం లీగల్ అడ్వైజర్ మంజుల వారి సంరక్షణ కోసం ఓ మహిళా హోంగార్డును ఏర్పాటు చేశారు. వారు మానసికంగా కోలుకున్న తర్వా త ఉపాధి కల్పిస్తామని జేసీ తెలిపారు. చొరవ చూపి ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ల పరిస్థితిని వెలు గులోకి తెచ్చినందుకు పలువురు మానవతా వాదులు ‘సాక్షి’కి అభినందనలు తెలిపారు. -
ఆ నిర్ణయమే కొంప ముంచింది!
మోటారు లాగడంతో మరింత లోతుకు చిన్నారి బోరుబావిలో పడిపోయిన ‘చిన్నారి’ని రక్షించడంలో అధికారులు పొరపాటు చేశారా? పది అడుగుల లోతుల్లో చిక్కుకుపోయిన పాప జాడ కనిపించకపోవడానికి అశాస్త్రీయంగా చేసిన ప్రయత్నాలే కారణమా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నారు కొందరు నిపుణులు. బోరుబావిలో జారిపడిన చిన్నారి మొదట పది అడుగుల లోతుల్లోనే చిక్కుకుపోయింది. ఈ విషయం తెలిసిన స్థానికులు.. బోరు మోటారును పైకి లాగితే పాప బయటకు వస్తుందని భావించారు. అనుకున్నదే తడువుగా మోటారును కొంతమేర లాగారు. అయితే లోపలి నుంచి ఏడుపు వినిపించడంతో పాపకు అపాయం జరుగుతుందని అంచనా వేసి ప్రయత్నాన్ని ఆపేశారు. ఈ క్రమంలోనే పాప 40 అడుగుల లోతుల్లోకి జారిపోయింది. ఆ తర్వాత సంఘటనా స్థలికి మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య, జిల్లా యంత్రాంగం చేరుకోవడం.. సహాయక చర్యలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం బోరు మోటారును బయటకు తీస్తే.. దాంతోపాటు పాప కూడా బయటకు వస్తుందని భావించారు. మోటారును పైకి లాగే క్రమంలో బలంగా గుంజడంతో ఒక్క ఉదుటున మోటారు బయటకు వచ్చింది. కానీ దీంతో అప్పటివరకు కనిపించిన పాప కదలికలు కనుమరుగయ్యాయి. ఈ ప్రయోగమే పాపకు అపాయం తలపెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. బోరుబావి చుట్టుకొలత 40 అడుగుల వరకు తొమ్మిది అంగుళాలే ఉంది. చిన్నారి ధరించిన గౌను సైజు 8.5 అంగుళాలు. అంటే పాప ఎట్టి పరిస్థితుల్లో కిందకు జారే అవకాశం లేదని కేఎల్లార్ రిగ్గుల కంపెనీ అధినేత, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. 40 అడుగుల తర్వాత బోరుబావి చుట్టుకొలత 6.25 అంగుళాలు ఉన్నందున.. పాప మరింత లోతుకు వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు. 10 అడుగుల లోతుల్లో చిక్కుకున్నప్పుడే పాపను రక్షించేందుకు సమాంతర గొయ్యి తవ్వితే ఫలితం ఉండేదని, కానీ హడావుడిగా స్థానికులు చేసిన ప్రయత్నంతో పాప 40 అడుగులకు జారిపోగా.. ఆ తర్వాత మోటారును బలంగా లాగడంతో పాప ఆచూకీ కూడా లభించకుండా పోయిందని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఇంజనీరింగ్ నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు. బోరు మోటారు పైకి లాగే సమయంలోనే పాప ప్రాణానికి ముప్పు వాటిల్లి ఉండవచ్చని అన్నారు. ‘‘మోటారును బయటకు తీస్తున్నప్పుడు బోరు సైడ్ భాగాల్లో పాప అతుక్కుపోవచ్చు. లేదా అడుగుభాగంలో (దాదాపు 500 అడుగులు) కూరుకుపోయి ఉండొచ్చు ఏదేమైనా పాపను రక్షించే క్రమంలో కొంత సంయ మనం, సమన్వయం పాటిస్తే బాగుండేది’’అని ఆయన అభిప్రాయపడ్డారు. -
200 అడుగుల కిందికి జారిన చిన్నారి
రంగారెడ్డి: చిన్నారి మీనా ఇంకా బోరుబావిలోనే ఉంది. నిన్న(శుక్రవారం) మధ్యాహ్నం 40 అడుగుల దగ్గర కనిపించిన చిన్నారి ప్రస్తుతం 200 అడుగుల వద్ద కూడా కెమెరాకు కనిపించడం లేదు. బోరు బావి 490 అడుగులు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. కెమెరా ద్వారా కొక్కెం సాయంతో చిన్నారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. పాపను సజీవంగానే బయటకు తీసేందుకు అంతా శతవిధాల ప్రయత్నిస్తున్నారు. మూడో రోజు మంత్రి మహేందర్ రెడ్డి దగ్గరుండి పనులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఓఎన్జీసీ సిబ్బందితో చర్చిస్తూ సహాయక చర్యలను మంత్రి ముమ్మరం చేశారు. ఈ నెల 22న సాయంత్రం 4.45గంటల ప్రాంతంలో ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి ప్రమాదవశాత్తు బోరు బావిలో పడింది. ఆటోమేటిక్ రోబో, మాన్యువల్ రోబో ద్వారా పాపను బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. మోటర్ తో సహా చిన్నారిని తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ విఫలయత్నం చేసింది. అయితే, మోటర్ మాత్రం బయటకు రాగా చిన్నారి మరింత లోతులోకి పడిపోయింది. ప్రస్తుతం నిరంతరాయంగా బోరుబావిలోకి ఆక్సిజన్ పంపిస్తున్నారు. బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలిని ఓఎన్జీసీ వాళ్లు సందర్శించారు. చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అత్యాధునిక కెమెరాలను బోరుబావిలోకి పంపించామని చెప్పారు. 210 అడుగుల వరకు కెమెరాలను పంపిస్తామన్నారు. చిన్నారి ఎలా ఉన్నా బయటకు తీసి కుటుంబానికి అప్పగిస్తాం అని చెప్పారు. -
ఇదో మనవరాలి కథ
నాటి సినిమా మాట తప్పని తండ్రి – ఆ తండ్రి పెంపకంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే వ్యక్తిగా పెరిగిన కొడుకు – తండ్రీకొడుకుల మంచితనాన్ని పుణికి పుచ్చుకున్న మనవరాలు. ముగ్గురూ మంచితనానికి కేరాఫ్ అడ్రస్. సీతారామయ్యగారు గొప్పవారు. తాతయ్యకు బాధ కలగకుండా ఉండటానికి మనసులో బాధను దిగమింగుకునే మనవరాలు ఇంకా గొప్ప. తండ్రీ–కొడుకు– మనవరాలు... ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ఎమోషనల్ జర్నీ ‘సీతారామయ్యగారి మనవరాలు’. ఈ తాతా మనవరాలి కథ ఏంటంటే... గోదావరి తీరంలోని సీతారామపురం ఊరి పెద్ద సీతారామయ్య (అక్కినేని నాగేశ్వరరావు). భార్య జానకి (రోహిణి హట్టంగడి), ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. ఇది సీతారామయ్య కుటుంబం. కొడుకు శ్రీనివాస మూర్తి అలియాస్ వాసు (రాజా)కి తండ్రంటే ప్రాణం. కొడుకంటే తండ్రికి కూడా బోల్డంత ప్రేమ. ఫాదర్–సన్ అనడంకంటే ‘బెస్ట్ ఫ్రెండ్స్’ అనడం కరెక్ట్గా ఉంటుంది. కొడుక్కి పెళ్లి సంబంధం చూస్తాడు సీతారామయ్య. ఆ విషయం చెప్పేలోపే వాసు తాను సుమతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని తండ్రికి చెబుతాడు. మునసబుని వియ్యంకుణ్ణి చేసుకుంటానని మాటిచ్చేసానంటాడు తండ్రి. సుమతికి మనసిచ్చానంటాడు కొడుకు. తండ్రి మాటకు ఊళ్లో ఎంత విలువ ఉందో చెప్పి, పెళ్లికి ఒప్పుకోమంటారు వాసు అక్కా బావ. అటువంటి తండ్రి కడుపున పుట్టిన కొడుకుగా మాట తప్పలేనంటాడు వాసు. తప్పక పెళ్లికి ఒప్పుకుంటాడు సీతారామయ్య. అవే చివరి మాటలు! పాతికేళ్లు ప్రతి మాటనూ పంచుకున్న కొడుకు మనసిచ్చిన అమ్మాయి గురించి ఒక్క మాట కూడా ముందు చెప్పకపోవడం తనను అవమానించినట్లుగా, అగౌరవించినట్లుగా భావిస్తాడు సీతారామయ్య. సుమతి, తానూ డాక్టర్స్ కాబట్టి, ఊళ్లో ఆస్పత్రి కట్టిస్తే, ఇక్కడే ఉంటామంటాడు వాసు. ఆస్పత్రి కావాలంటే ఆస్పత్రి, ఆస్తి కావాలంటే ఆస్తి.. ఏదైనా ఇచ్చేస్తా.. కానీ, ఎప్పటికీ నాతో మాట్లాడకూడదంటాడు. కొడుకుతో సీతారామయ్య మాట్లాడే చివరి మాటలవే. ఈ తండ్రీకొడుకుల మధ్య జానకమ్మ నలిగిపోతుంది. పుట్టిన తర్వాత కొడుకు చేసిన మొదటి తప్పుని క్షమించమని జానకమ్మ బతిమాలుతుంది. తాను కూడా మొదటిసారి మాట తప్పానంటాడు సీతారామయ్య. మరోవైపు కోడలు సుమతి అన్యోన్యంగా ఉన్న తండ్రీకొడుకులు తన కారణంగా విడిపోయారని బాధపడుతుంది. చేసేదేం లేక భార్యతో సహా ఇంటి నుంచి వెళ్లిపోతాడు వాసు. కాలం ఎవరికోసమూ ఆగదు. 20 ఏళ్లు గడిచిపోతాయ్. పైకి మామూలుగానే ఉన్నా సీతారామయ్య మనసులో కొడుకు జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. బాధను బయటపెట్టకుండా సీతారామయ్య, జానకమ్మ గంభీరంగా రోజులు గడుపుతుంటారు. కట్ చేస్తే... అమెరికా టు ఇండియాకి సీత సీతారామయ్య మనవరాలి (పెద్ద కుమార్తె కూతురు) వివాహం కుదురుతుంది. ఈ పెళ్లికి సీతారామయ్య మరో మనవరాలు (వాసు కూతురు) సీత (మీనా) అమెరికా నుంచి ఇండియా వస్తుంది. మనవరాలిని చూసి, మురిసిపోతుంది జానకమ్మ. సీతారామయ్య మనసు మురిసినా బయటపడడు. ‘నా పేరు సీత.. మీ పేరే’ అంటూ తాతయ్యతో మాటలు కలిపిన మనవరాలికి మెల్లమెల్లగా దగ్గరవుతాడు సీతారామయ్య. పెరిగింది అమెరికాలో అయినా తెలుగింటి పిల్లలా మనవరాలు ఉండటం, సంస్కృతీ సంప్రదాయాలకు విలువ ఇవ్వడం సీతారామయ్య మనసుని ఆకట్టుకుంటుంది. మనవరాలిలో కొడుకుని చూసుకుంటాడు. మాట పట్టింపుతో కొడుకు తన ఇంటికి రాలేదని ఓ మూల బాధపడతాడు. అంతా సాఫీగా సాగుతోందనుకుంటున్న సమయంలో అమెరికా నుంచి వాసు ఫ్రెండ్ (మురళీమోహన్) ఇండియా వచ్చి, సీతారామయ్యగారింటికి వెళతాడు. ‘మా అబ్బాయి ఎప్పుడు వస్తాడు’ అని సీతారామయ్య దంపతులు అడగడంతో తన తల్లిదండ్రులు చనిపోయిన విషయాన్ని సీత దాచిన విషయం అతనికి అర్థమవుతుంది. చెప్పొద్దని మురళీమోహన్తో సీత విన్నవించుకుంటుంది. అతను వచ్చిన దారినే అమెరికా చెక్కేస్తాడు. మనవరాలిలోనే కొడుకు ‘నీలో నన్ను చూసుకునేవరకూ తాతయ్యకు నేను చనిపోయిన విషయం చెప్పకు’ అని తండ్రి చివరి క్షణాల్లో చెప్పిన మాటను నిలబెట్టడానికి సీత విశ్వప్రయత్నం చేస్తుంది. దుఃఖాన్నంతా లోపల మింగేసుకుని, బయటికి నవ్వుతుంటుంది. ఇప్పుడో చిక్కొచ్చి పడుతుంది. సీతారామయ్య–జానకమ్మల షష్టిపూర్తి వేడుక నిర్ణయం అవుతుంది. ఆ వేడుకకు కొడుకు వస్తాడని ఆశిస్తారు. వాసు రాడు? మరీ ఇంత పట్టింపా? అని సీతారామయ్య బాధపడిపోతాడు. ఎలాగైతేనేం వేడుక బాగానే జరుగుతుంది. ఆ తర్వాత జరగకూడనిదే జరుగుతుంది, జానకమ్మ హఠాన్మరణం ఇంటిల్లిపాదినీ కుంగదీస్తుంది. ఇప్పుడైనా కొడుకు వస్తాడని ఎదురు చూస్తాడు సీతారామయ్య. రాకపోవడంతో ఈసారి బాధ.. కోపంగా మారుతుంది. ‘నువ్విక్కడే ఉంటే నా కొడుకు లేని వెలితి బాగా కనిపిస్తోంది. అమెరికా వెళ్లిపో’ అంటాడు మనవరాలితో. సీత కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. చివరకు తాతయ్య చెప్పినట్లే అమెరికా ప్రయాణమవుతుంది. కానీ, అప్పటివరకూ రాసుకున్న డైరీని మరచిపోయి, వెళ్లిపోతుంది. అది చదివి, కొడుకు చనిపోయిన విషయం తెలుసుకున్న సీతారామయ్య ఎయిర్పోర్ట్కి వెళ్లి మనవరాలిని వెనక్కి తీసుకొస్తాడు. కొడుకు అస్తికలను గోదావరిలో కలుపుతాడు. ‘మా నాన్న మీకు గిఫ్ట్ పంపించాడు’ అంటూ ఇంటికొచ్చిన రోజున మనవరాలు ఇచ్చిన చేతి కర్రను నదిలో విసిరేస్తాడు. దీని అవసరం లేదు.. నువ్వున్నావుగా అంటూ మనవరాలిని అక్కున చేర్చుకుంటాడు. ఇది ఓ మనవరాలి కథ. అందుకే ఏయన్నార్ లాంటి స్టార్ ఉన్నప్పటికీ ‘సీతారామయ్యగారి మనవరాలు’ అని టైటిల్ పెట్టారు. ఆ మనవరాలి ప్రేమ, త్యాగం మనసుని మెలిపెడతాయి. తప్పంతా పరిస్థితులదే మాట ఇచ్చిన తండ్రిదీ తప్పు కాదు. తండ్రి మాటను కాదన్న కొడుకుదీ కాదు. తప్పంతా పరిస్థితులదే. మానస రాసిన ‘నవ్వినా కన్నీళ్లే’ అనే నవల ఆధారంగా తీసిన సినిమా ఇది. గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిచయ వాక్యాలతో సినిమా గంభీరంగా మొదలవుతుంది. నవలను దర్శకుడు క్రాంతికుమార్ వెండితెరకు ట్రాన్స్ఫామ్ చేసిన తీరు బాగుంటుంది. కళ్లెదుటే జరుగుతున్న కథేనేమో అన్నంతగా హృదయాన్ని తాకే సన్నివేశాలతో తీశారు. అక్కినేని నాగేశ్వరరావు తొలిసారి విగ్ లేకుండా నటించిన సినిమా. ‘సీతారామయ్య’లాంటి పాత్రలు చేయడం ఆయనకు కష్టం కాదు. జీవించేశారు. ఏయన్నార్కి దీటుగా నటించగలిగింది మీనా. బాలనటిగా మెరిసిన మీనా మెయిన్ లీడ్ చేసిన మొదటి సినిమా ఇది. అద్భుతంగా నటించింది. ఈ పాత్రల్లో వీళ్లను తప్ప వేరేవాళ్లను చూడలేం అన్నంతగా రోహిణి హట్టంగడి, రాజా, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు తదితరులు నటించారు. అతిథి పాత్రలో దాసరి నారాయణరావు గోదావరి యాసలో నవ్వించారు. ‘పూసింది పూసింది పున్నాగ’, ‘భద్రగిరి రామయ్య’, ‘కలికి చిలకల...’ వంటి పాటలతో సినిమా హాయిగా సాగుతుంది. కీరవాణి ఇచ్చిన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ ప్లస్.1991లో వచ్చిందీ సినిమా. విడుదలై పాతికేళ్లవుతున్నా సీతారామయ్యగారు, ఆయన మనవరాలు మనసుల్లో నిలిచిపోయారంటే కథ గొప్పతనం అది. ఏయన్నార్ అభినందనను మరచిపోలేను – మీనా ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమాకి ఛాన్స్ వచ్చినప్పుడు కొంచెం భయపడ్డాను. అక్కినేని నాగేశ్వరరావుగారితో సినిమా చేయడం అంటే మాటలా? టెన్షన్ అనిపించినప్పటికీ మంచి ఛాన్స్ అని ఒప్పుకన్నా. నాగేశ్వరరావుగారు బాగా మాట్లాడేవారు. దాంతో నా భయం మొత్తం పోయింది. ‘మనం ఎవరి కోసమైనా వెయిట్ చేయొచ్చు.. మనకోసం ఎవరూ వెయిట్ చేయకూడదు. పంక్చువాల్టీ ముఖ్యం’ అని ఏయన్నార్గారు నాకో సలహా ఇచ్చారు. అది ఎప్పటికీ మరచిపోలేను. అలాగే సినిమా విడుదలైన తర్వత, ‘లొకేషన్లో నువ్వు యాక్ట్ చేసినప్పుడు ఏమీ అనిపించలేదు. కానీ, సినిమాలో చూస్తే చాలా బాగానే యాక్ట్ చేశావ్ అనిపించింది’ అని మెచ్చుకున్నారు. అది మరచిపోలేను. చెన్నయ్లో జరిగిన వందేళ్ల భారతీయ సినిమా పండగ (2014) అప్పుడు అన్ని భాషలవాళ్లు వచ్చారు. అక్కడే ఏయన్నార్గారి పుట్టినరోజు వేడుక జరిగింది. ఆ వేడుకలో నేను పాల్గొన్నాను. ఆయన్ను చూడటం అదే చివరిసారి. ‘మనం’ చూసినప్పుడు ఎమోషనల్ అయ్యాను. తల్లిదండ్రులు చనిపోయారనే విషయం తాతయ్య–నానమ్మలకు చెప్పలేక గోదావరి తీరాన మీనా ఏడవడం, తాతయ్య అమెరికా వెళ్లిపొమ్మన్నప్పుడు పడే బాధ ప్రేక్షకుల కళ్లు చెమర్చే సన్నివేశాలు. కొడుకు పంపిన బహుమతి (చేతికర్ర)ని సీతారామయ్య ఆప్యాయంగా తడిమి చూసుకునే సీన్, అది చూసి జానకమ్మ మురిసిపోవడం అలరిస్తాయి. ‘పెళ్లి చేసినట్లే చేసి నాకు మరణశిక్ష విధించారు’, ‘కన్నతండ్రికి అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడా మీ నాన్న.. వాడి కోసం ఒక్క మెట్టు కూడా దిగను’, ‘మాటకు విలువ తెలియనవాడితో నన్ను మాట్లాడమని అడగొద్దు’ వంటి డైలాగ్స్ సూపర్బ్. గణేశ్ పాత్రో రాసిన ఇలాంటి సంభాషణలు సినిమాకు బలం. 1991లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. నాలుగు నంది అవార్డులు దక్కించుకుంది. మలయాళంలో ‘సంధ్వానమ్’గా, కన్నడంలో ‘బెల్లి మొదగళు’ పేరుతో, హిందీలో ‘ఉదార్ కీ జిందగీ’గా రీమేక్ అయింది. – డి.జి. భవాని -
హరితహారం లక్ష్యాన్ని చేరుకోవాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ ముఖ్య కార్యదర్శి మీనా అధికారులకు సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి పీసీ సీఎఫ్ పీకే ఝాతో కలిసి వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో సమీక్షించారు. హరితహారం కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. నాటిన మొక్కలను సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నర్సరీల్లో అందుబాటులో ఉన్న మొక్కల వివరాలు, ఇప్పటివరకు నాటిన మొక్కలు, మొక్కల సైజు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువు గట్లపై ఈత మొక్కలు నాటాలని సూచించారు. ఈ వీసికి సోషల్ ఫారెస్టు డిఎఫ్ఓ రాంమూర్తి, ఎక్సైజ్ ఈఎస్ నర్సింహారెడ్డి, చిన్ననీటి పారుదల ఎస్ఈ సదాశివ హాజరయ్యారు. -
గిరిజన యువతి పట్టుదలముందు తలవంచిన పేదరికం
రామాయంపేట: ఆమె పట్టుదల, లక్ష్యంముందు పేదరికం తలవంచింది. తమ కుటుంబం తరతరాలుగా వ్యవసాయానికే పరిమితంకాగా, ఎలాగైనా తాను అందరిలా కాకుండా జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగి ఇతరులకు ఆదర్శంగా ఉండాలని కలలుగంది. వివాహామైనా ఆమె చదువుకు ఎలాంటి ఆటంకంలేకుండా భర్త ప్రోత్సాహంతో ముందుకుసాగి అనుకున్నది సాధించింది. వివరాల్లోకి వెలితే... రామాయంపేట గిరిజన తండాకు చెందిన లంబాడి మంగ్యా, పద్మ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులు. వారి పెద్ద కూతురు మీనా చదువులో ముందుంజలో ఉండగా, ఆమె ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. వారి ఆశలను అడియాశలు చేయకుండా పట్టుదలతో చదివి ఇంటర్లో 917 మార్కులు సాధించి గుర్తింపు పొందింది. ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించిన మీనాను ఆమె తల్లిదండ్రులు ఇంజనీరింగ్లో చేర్పించారు. ఇంజనీరింగ్ చదువుతున్న క్రమంలోనే మీనాకు మండలంలోని జడ్చెరువు తండాకు చెందిన రామావత్ రవినాయక్తో వివాహాం జరిగింది. దీనితో ఆమెకు మరింతగా భర్త ప్రోత్సాహాం లభించింది. దీనితో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకున్న మీనా ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వెళ్లి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. ప్రభుత్వ కొలువే లక్ష్యంగా ఆమె రాత్రింబవళ్లు కష్టపడి చదివి గ్రామీణ నీటి సరఫరా విభాగం( ఆర్డబ్ల్యూఎస్)లో ఏఈఈగా ఉద్యోగం సాదించింది. ఆమె మొదటి పోస్టు నిజామాబాద్ జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఏఈఈగా విధుల్లో చేరింది. భర్త ప్రోత్సాహాంతోనే... -మీనా... నాభర్త రవి ప్రోత్సాహాంతోనే ఉద్యోగం సాధించాను. పెళ్లయితే చదువుకు పులిస్టాప్ పడుతుందని చాలామంది అమ్మాయిలు బావిస్తుంటారు... ఇందుకు విరుద్దంగా రవి మాత్రం తన వెనుక ఉండి ప్రోత్సహించారు. తండాలో ఇతర విద్యార్థినులు చదువులో ముందుండేలా వారిని పోత్సహించడంతోపాటువారికి సలాహాలు, సూచనలు అందజేస్తాను... -
నిర్మాతగా మీనా?
ఒక సంచలన వార్త చిత్ర పరిశ్రమలో హల్చల్ చేస్తోంది. మీనా బహుభాషా నటి అన్న విషయం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళంలో రజనీకాంత్,కమలహాసన్, శరత్కుమార్ ఇలా ప్రముఖ నటులందరితోనూ జతకట్టారు. అలాగే తెలుగులో చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్స్ అందరి సరసన నటించారు. ఇప్పటికీ అడపాదడపా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఆ మధ్య తెలుగులో దృశ్యం చిత్రంలో వెంకటేశ్కు భార్యగా ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించిన విషయం విదితమే. తాజాగా తన వారుసురాలిని బాల నటిగా రంగంలోకి దింపారు. మీనా కూతురు నైనికా తెరి చిత్రంలో విజయ్కు కూతురిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇలా ఒక పక్క నటిస్తూ, మరో పక్క తన వారసురాలి సినీ పయనానికి బాటలు వే స్తూ ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్న మీనా తాజాగా నిర్మాతగా అవతారమెత్తడానికి రంగం సిద్ధం చేస్తున్నారన్నది తాజా సమాచారం. తమిళం,తెలుగు భాషల్లో భారీ చిత్రాలను నిర్మించడానికి సన్నద్ధం అవుతున్నారనిచిత్ర పరిశ్రమ వర్గాల సమాచారం. ప్రారంభంలోనే విశ్వనాయకుడు కమలహాసన్, టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్బాబులతో చిత్రాలు నిర్మించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ముందుగా బ్యానర్ను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. -
నిర్మాతగా మారుతున్న సీనియర్ హీరోయిన్
తొంబైలలో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసిన సీనియర్ హీరోయిన్ మీనా, త్వరలో మరో పాత్రకు రెడీ అవుతోంది. ఇటీవల దృశ్యం సినిమాతో మరోసారి నటిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న మీనా, ఇపుడు నిర్మాతగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది. ఇప్పటికే తన ప్రొడక్షన్ హౌస్కు సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టిన ఈ భామ టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో టాప్ స్టార్లతో సినిమాలు నిర్మించాలని భావిస్తోంది. తన నిర్మాణసంస్థలో మహేష్ బాబు, కమల్ హాసన్ లాంటి హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఈ ఇద్దరు హీరోలు ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. బ్రహ్మోత్సవం రిలీజ్ తరువాత మురుగదాస్ దర్శకత్వంలో బైలింగ్యువల్ సినిమాకు రెడీ అవుతున్నాడు మహేష్. ఆ తరువాత కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరీ జగన్నాథ్ల కాంబినేషన్లో తెరకెక్కే సినిమాలు లైన్లో ఉన్నాయి. కమల్ కూడా శభాష్ నాయుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత కూడా మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. మరి మీనా ఈ ప్రాజెక్ట్లు పూర్తయ్యేవరకు మీనా వెయిట్ చేస్తుందో లేక వేరే హీరోలతో నిర్మాణం మొదలెడుతుందో చూడాలి. -
నైనిక... నీకు తిరుగు లేదిక!
బాల తారగా, కథానాయికగా వెండితెరపై మీనా తిరుగు లేదనిపించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తల్లికి తగ్గ తనయ అనిపించుకోబోతోంది బేబి నైనిక... డాటరాఫ్ మీనా. విజయ్ హీరోగా రూపొందిన ‘తెరి’ (తెలుగులో ‘పోలీసోడు’) చిత్రంతో నైనిక బాల నటిగా అడుగుపెట్టింది. చిన్నప్పుడు మీనా లానే ఇప్పుడు నైనిక కూడా అందంగా ఉంది. తల్లి నోట్లో నుంచి ఊడిపడిందని చూసినవాళ్లు అంటు న్నారు. చూపులకే కాదు, నటనలో కూడా తల్లిలానే నైనిక చాలా ట్యాలెంటెడ్ అని ‘తెరి’ యూనిట్ అంటోంది. విజయ్కి దీటుగా నైనిక నటించిందని చిత్ర దర్శకుడు అట్లీ కితాబులిచ్చేశారు. ‘తెరి’ప్రెస్మీట్లో పాల్గొన్న నైనిక... ‘విజయ్ అంకుల్, అట్లీ అంకుల్’ అంటూ యూనిట్ సభ్యులందర్నీ వరసలు కలిపి ధన్య వాదాలు చెప్పి, అందరి మనసులనూ ఆకట్టుకుంది. ఇంతకీ, ‘మీ అమ్మాయి పెద్దయ్యాక హీరోయిన్ అవు తుందా?’ అని మీనాను అడిగితే, ‘‘ఆ సంగతి ఇప్పుడే చెప్పలేను. నైనిక నటిస్తానంటే నేనొద్దనను. నటించనంటే బల వంతం చేయను. ఇప్పటికైతే చదువు మీదే దృష్టి’’ అన్నారు. మొత్తానికి, తల్లికి తగ్గట్లే కూతురు కూడా పేరు తెచ్చుకొనే రోజు ఎంతో దూరంలో లేదు. -
తొలి సినిమాకే డబ్బింగ్ చెప్పేస్తోంది!
హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన వారు కూడా చేయని సాహసం ఓ బాలనటి చేస్తోంది. తన తొలి సినిమాకే సొంతం గొంతుతో డబ్బింగ్ చెప్పుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ తేరి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో బాలనటిగా నటించిన నైనిక డబ్బింగ్ చెపుతున్న ఫోటోనూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు చిత్ర దర్శకుడు అట్లీ. ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా ముద్దుల కూతురే నైనిక. మీనా కూడా బాలనటిగా తెరకు పరిచయం అందరినీ ఆకట్టుకుంది.అదే తరహాలో మీనా కూతురు నైనిక కూడా తొలి సినిమాలో నటనతోనే కాకుండా తానే డబ్బింగ్ కూడా చెపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విజయ్ సరసన సమంత హీరోయిన్గా నటించిన తేరి ఏప్రిల్ 14న గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. తెలుగులోనూ ఈ సినిమాను పోలీసోడు పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. Dubbing time with Nainika was the most insteresting stage during post work pic.twitter.com/DpLRt5YZ2j — atlee (@Atlee_dir) 7 April 2016 -
అటు చామంతి... ఇటు పూబంతి
‘ముద్దిమ్మంది ఓ చామంతీ... మనసిమ్మంది ఓ పూబంతి...’ అంటూ రమ్యకృష్ణ, మీనాతో ‘అల్లరి మొగుడు’లో మోహన్బాబు చేసిన రొమాన్స్ అప్పట్లో ప్రేక్షకులకు కనువిందు. ఆ పాటలో ముగ్గురూ చూడముచ్చటగా అనిపిస్తారు. ఆ హిట్ కాంబినేషన్ రిపీట్ అయితే ఆ ప్రాజెక్ట్కి భారీ ఎత్తున క్రేజ్ నెలకొనడం ఖాయం. ఈ ముగ్గురికీ ‘అల్లరి’ నరేశ్ కూడా తోడైతే ఇక చెప్పడానికి ఏముంటుంది...! రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్... ఇలా అన్ని అంశాలతో ఫుల్మీల్స్ లాంటి సినిమా తయారై ఉంటుందని ఊహించవచ్చు. ‘మామ మంచు - అల్లుడు కంచు’ టైటిల్తో రూపొందిన ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న విడుదల కానుంది. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ పతాకంపై మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రం పాటలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. చిత్రవిశేషాలను నిర్మాత చెబుతూ - ‘‘సినిమా టైటిల్ ప్రకటించినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ విడుదల చేసిన తర్వాత చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. కోటి, అచ్చు, రఘు కుంచె అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల వారికీ నచ్చుతుంది’’ అన్నారు. నరేశ్తో పూర్ణ జత కట్టిన ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, అలీ, కృష్ణభగవాన్, జీవా, రాజా రవీంద్ర తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కెమెరా: బాల మురుగన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్ కుమార్, సమర్పణ: అరియానా, వివియానా, విద్యా నిర్వాణ. -
ఆ హీరోయిన్ కూతురి తెరంగేట్రం
హైదరాబాద్: బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి, దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా వెలిగిన నటి మీనా కూతురు నైనిక వెండితెరకు పరిచయం కాబోతోంది. విజయ్ హీరోగా తెరకెక్కున్న ఓ కోలీవుడ్ మూవీలో మీనా ముద్దుల చిన్నారి తెరంగేట్రం చేయనుంది. మరోవైపు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టార్ డమ్ ని క్రియేట్ చేసుకున్న హీరోయిన్ సమంత ఈ సినిమాలో మరోసారి తల్లిపాత్రలో కనిపించబోతోంది. మొదటి సారి మనం సినిమాలో తల్లిపాత్రలో అలరించిన సమంత ఈ సారి మరో హీరోయిన్ కూతురికి తల్లిగా నటించనుంది. అయితే హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉన్న సమయంలో తల్లిపాత్ర ద్వారా సాహసం చేసిన సామ్స్ తర్వాత మళ్ళీ వెండితెరపై తల్లి పాత్రను చేయకూడదనుకొన్నదట. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకొని మళ్ళీ తల్లి పాత్రలో కోలీవుడ్ సినిమాలో కనిపించబోతున్నది. విజయ్ హీరోగా రాజా రాణి దర్శకుడు అట్లీ ... కలిపులి ధాను నిర్మాతగా ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా సమంత నటిస్తుండగా.. మరో హీరోయిన్ గా అమీ జాక్సన్ నటిస్తున్నది. కాగా ఈ సినిమాలో సమంత ఓ కూతురికి తల్లిగా నటించబోతోంది. ఈ కూతురు పాత్రలోనే నైనిక కనిపించబోతోంది. దీంతో బాలనటిగా నైనిక మురిపిస్తుందా...తల్లి మీనాను మరిపిస్తుందా అనే ఊహాగానాలు మొదలయ్యాయట. -
హ్యాపీ బర్త్ డే
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు మీనా (నటి), ప్రసూన్ జోషీ (రచయిత) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రసంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం విలాసంగా జీవిస్తారు. వివాహం కానివారికి వివాహం అవుతుంది. విలాస వస్తువులు, గృహోపకరణాల కొనుగోలు కోసం పెద్ద మొత్తం వెచ్చిస్తారు. కొత్త స్నేహితులు, కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. టీవీ, సినీ రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అజ్ఞాతంలో ఉన్న వారికి రచనలు వెలుగు చూస్తాయి. విద్యార్థులకు ముఖ్యంగా మెడిసిన్, ఫార్మసీ రంగాలలో ఉన్న వారు మంచిమార్కులతో ఉత్తీర్ణులవుతారు. వైద్యరగంలో ఉన్న వారు బాగా సంపాదిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. వీరు 16వ తేదీన పుట్టినందువల్ల వీరిపై కేతు ప్రభావం ఉంటుంది. కేతువు మోక్ష కారకుడు కాబట్టి వీరికి ప్రాపంచిక జీవనం కన్నా ఆధ్యాత్మిక జీవనంపై మక్కువ కలుగుతుంది. కేతుగ్రహ ప్రతికూల ప్రభావం వల్ల నిద్రలేమి, నరాల బలహీనత కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం. లక్కీ నంబర్లు: 2,6,7,9; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, లైట్ బ్లూ, సిల్వర్. లక్కీ డేస్: మంగళ, బుధ, శుక్ర వారాలు. సూచనలు: డబ్బు ఖర్చు చేసే ముందు, వస్తువులు కొనుగోలు చేసే ముందు కుటుంబ సభ్యులు, స్నేహితుల సలహా తీసుకోవడం మంచిది. శుక్రజపం, భృగుపాశుపత హోమం, గణపతి ఆరాధన, కన్నెపిల్లల వివాహానికి సాయం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
వెండితెరపై జూనియర్ మీనా!
మీనా తన చిన్నప్పుడు బోల్డన్ని సినిమాల్లో నటించారు. బాలతారగా ఆమె అప్పట్లో చాలా పాపులర్. కథానాయికగా కూడా మీనా ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మీనా కూతురు కూడా బాలనటిగా తెరపై మెరిసే అవకాశం ఉందని చెన్నయ్ టాక్. విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో విజయ్ కూతురి పాత్రకు నైనికాని అడిగారట. మీనా కూడా తన కూతుర్ని నటింపజేయడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అప్పట్లో బేబీ మీనా భలే ముద్దుగా ఉండేది. నైనికా కూడా భలే ముద్దుగా ఉంది కదూ. -
సీనియర్స్తో శింబు స్టెప్పులా?
సంచలన నటుడు శింబు సీనియర్ నటీమణులు సిమ్రాన్, మీనాలతో పాటు ప్రఖ్యాత నటి షావుకారు జానకితో స్టెప్స్ వేయనున్నారని ఈ అరుదైన గీతం సన్నివేశాలు వాలు చిత్రంలో చోటు చేసుకోనున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న చిత్రం వాలు. శింబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్. వీరిద్దరూ ప్రేమించుకోవడం మొదలెట్టింది ఈ చిత్ర సమయంలోనే. ఆ తరువాత వీరి లవ్ బ్రేక్ అప్ అవ్వడంతో వాలు చిత్రం సమస్యల్లో పడింది. ఈ చిత్రం కోసం ఇంకా ఒక పాట చిత్రీకరించాల్సి ఉండగా హన్సిక కాల్షీట్స్ కేటాయించనని మొరాయించారు. ఈ పాటకు శింబు, సిమ్రాన్, మీన, షావుకారు జానకిలతో చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం గురించి ఆ చిత్ర దర్శకుడు విజయ్ చందర్ను అడగ్గా అదంతా అసత్య ప్రచారం అని ఆయన కొట్టి పారేశారు. వాలు చిత్ర విషయాలను దర్శకుడు వివరిస్తూ ఒక పాటకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి వున్న విషయం నిజమేనన్నారు. అయితే ఇందులో నటించేది ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదన్నారు. త్వరలోనే ఆ నటి ఎంపిక ఉంటుందన్నారు. ఒక కీలక సన్నివేశంలో సిమ్రాన్, మీనా, షావుకారు జానకిలను నటింప చేయాలనే ఆలోచన ఉందని ఆ విషయం గురించి ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. వాలు చిత్రాన్ని డిసెంబర్ 24న విడుదల చేయాలని ఇంతకుముందు అనుకున్నా ఇప్పుడు శింబు పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 3న విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయని దర్శకుడు అన్నారు. నటుడు శింబు ఈ విషయమై ఒక ప్రకటన విడుదల చేస్తూ వాలు చిత్రం నిర్ణయించిన తేదీ ప్రకారం విడుదల కాకపోవడం తన అభిమానులకు నిరాశ కలిగించే విషయమేనన్నారు. చిత్ర షూటింగ్ సమయంలో తన సూచనలు, సలహాలు, సహకారాలు ఉంటాయి కానీ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ లాంటి వ్యాపారలావాదేవీల్లో తాను తలదూర్చనన్నారు. ఏదైమైనా ఫిబ్రవరి 3న వాలు చిత్రం విడుదల తరువాత ఇదు నమ్మ ఆళు చిత్రం సమ్మర్ స్పెషల్గా తెరపైకి వస్తుందని శింబు వెల్లడించారు. -
ఫార్మా, ఫిల్మ్సిటీల కోసం భూ పరిశీలన
ఆమనగల్లు: ఫార్మా, ఫిల్మ్సిటీ ఏర్పాటు కోసం రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల సరిహద్దులో ఉన్న ప్రభుత్వ భూములను ఆదివారం అధికారులు పరిశీలించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి ప్రదీప్చంద్ర, టీఐఐసీ ఎండీ జేఎస్ రంజన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ హైదరాబాద్ నుండి హెలికాప్టర్లో ఇక్కడికి వచ్చారు. రంగారె డ్డి జిల్లా ముచ్చర్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూముల్ని పరిశీలించారు. రంగారెడ్డి కలెక్టర్ శ్రీధర్, మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ప్రియదర్శినిలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ 3 జిల్లాల సరిహద్దులో విస్తరించి ఉన్న రాచకొండ ప్రాంతంలో ఫార్మా సిటీ, ఫిల్మ్సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈనెల 3న సీఎం కె.చంద్రశేఖర్రావు ఏరియల్ సర్వే చేయనున్నారు. -
భర్త ఆరోగ్యం నయం కావడంలేదని బలవన్మరణం
చేతి నరాలు, గొంతు కోసుకొని.. భవనంపై నుంచి దూకి మృతి కాటేదాన్: భర్త రెండు కిడ్నాలు పాడవ్వడం.. లక్షలు అప్పుచేసి వైద్యం చేయించినా నయం కాకపోవడంతో మనోవేదనకు గురై ఓ గృహిణి బలవన్మరణానికి పాల్పడింది. చేతినరాలు, గొంతుకోసుని.. ఆపై దాబా నుంచి దూకి చనిపోయింది. ఈ హృదయ విదారకఘటన మైలార్దేవ్పల్లిలోని పద్మశాలీపురం బస్తీలో జరిగింది. ఎస్సై మహేంద్రనాథ్ కథనం ప్రకారం... పద్మశాలీపురం బస్తీకి చెందిన చేపూరి యాదగిరి, మీనా (33) దంపతులు. వీరికి పాప, బాబు సంతానం. యాదగిరి టైలర్. మద్యం కారణంగా అనారోగ్యానికి గురైన యాదగిరిని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. కిడ్నీలు, కాలేయం పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు ధ్రువీకరించారు. నెలరోజులుగా ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్న యాదగిరి శనివారం రాత్రి ఇంటికి వచ్చాడు. ఆదివారం ఉదయం తిరిగి పొత్తికడుపులో నొప్పి రావడంతో మళ్లీ ఆస్పత్రికి తరలించారు. పిల్లల్ని పాఠశాలకు పంపి... లక్షలు అప్పు చేసి వైద్యం చేయించినా భర్తకు నయం కాకపోవడంతో మీనా కృంగిపోయింది. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. సోమవారం ఉదయం పిల్లల్ని పాఠశాలకు పంపిన తర్వాత బ్లేడ్తో రెండుచేతుల మణికట్లను, గొంతును కోసుకుంది. ఆ తర్వాత భవనం మొదటి అంతస్తు నుంచి కిందకు దూకింది. రక్తపుమడుగులో పడివున్న ఆమెను స్థానికులు ఉస్మానియాకు తరలించారు. అప్పటికే ఒంట్లోని రక్తమంతా పోవడంతో చికిత్స అందించేలోపే మీనా మృతి చెందింది. భయాందోళనకు గురైన స్థానికులు... పద్మశాలీపురం బస్తీలోని ప్రజలు ఉదయాన్నే జరిగిన ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. ఘటనా స్థలంలో రక్తపుమడుగులో పడివున్న మీనాను చూసి భయాందోళనకు గురయ్యారు. ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు మొదట ఎవ్వరూ సాహసించలేదు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న యాదగిరిని భార్య మృతదేహం చూసేందుకు బంధువులు అంబులెన్స్లో తీసుకొచ్చారు. భార్య మృతదేహాన్ని చూసిన ఆయన బోరుమన్నాడు. అనంతరం అతడిని ఆసుపత్రికి తిరిగి తీసుకెళ్లారు. తల్లి మృతి చెండం, తండ్రి ఆసుపత్రి పాలుకావడంతో వారి పిల్లలు దిక్కులేని వారిగా మారడం అందరినీ కలచివేసింది. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - మీనా
-
యాసిడ్ బాధితులకు ప్లాస్టిక్ సర్జరీ
చెన్నై, సాక్షి ప్రతినిధి : మధురై జిల్లా తిరుమంగళంలో యాసిడ్ దాడి కి గురై తీవ్రంగా గాయపడిన మీనా (18), అంగాళ ఈశ్వరీ (19)కి ప్లాస్టిక్ సర్జరీ చేసేందుకు జిల్లా కలెక్టర్ సుబ్రహ్మణియన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. చిన్నపూలాంపట్టికి చెందిన ఉదయసూర్యన్ కుమార్తె మీనా, అదే ప్రాంతానికి చెందిన శంకరపాండియన్ కుమార్తె ఈశ్వరీ ప్రతిరోజు బస్సులో తిరుమంగళం చేరుకుని అక్కడి కామరాజర్ యూనివర్సిటీలో బీఏ (ఇంగ్లీషు) చదువుతున్నారు. ఎప్పటి వలెనే శుక్రవారం సైతం మధ్యాహ్నం కాలేజీ ముగించుకుని ఇంటికి వెళుతుండగా 35 ఏళ్ల వయసున్న ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై అక్కడికి చేరుకుని మీనాపై యాసిడ్ పోశారు. దీనిని అడ్డుకునే ప్రయత్నంలో ఈశ్వరి సైతం గాయపడింది. విద్యార్థినులపై యాసిడ్ పోసిన దుండగులు పరారయ్యూరు. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ అక్కడే కళ్లు తిరిగి పడిపోగా తోటి విద్యార్థులు వారిని మదురై ఆస్పత్రిలో చేర్పించారు. యాసిడ్ ప్రభావంతో మీనాకు 30 శాతం, పరమేశ్వరీకి 15 శాతం శరీరం కాలిపోరుుంది. స్వగ్రామంలో మంచి నడవడిక కలిగిన యువతులుగా వారికి పేరుండడంతో శనివారం పెద్ద సంఖ్యలో ప్రజలు ఆస్పత్రికి తరలివచ్చారు. బాధిత యువతుల బంధువుల రోదనలు వర్ణనాతీతంగా మారాయి. ఆస్పత్రి వార్డుల పక్కనే కూర్చుని గుండెలవిసేలా రోదించారు. కళాశాలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మదురై జిల్లా ఎస్పీ విజయేంద్ర బిదారి ఆదేశాల మేరకు నిందితులను పట్టుకునేందుకు ఐదు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. విద్యార్థినుల స్వగ్రామానికి చేరుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి వరకు విచారణ సాగించారు. సొంత ఊరిలో వారికి ఎటువంటి సమస్యలు లేవని ప్రాథమిక విచారణలో తేలింది. ఇటీవల మీనా వెంటపడుతున్న యువకుడు ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. తిరుమంగళంలో పోలీసు బృందం శనివారం నాడు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించింది. వారిలో ఇద్దరు యువకులు పోలీసు ప్రశ్నలకు సంబంధంలేని సమాధానాలు ఇస్తున్నట్లు గుర్తించారు. వీరి ఫొటోలను బాధిత యువతులకు చూపగా వారు సైతం నిర్ధారించినట్లు తెలుస్తోంది. యాసిడ్ బాధితులను ఆస్పత్రిలో పరామర్శించిన జిల్లా కలెక్టర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, బాధిత యువతులకు 24 గంటల వైద్య పర్యవేక్షణను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు పోలీస్ యంత్రాంగం ఇప్పటికే రంగంలోకి దిగిందన్నారు. బాధిత యువతులు పూర్తిగా కోలుకునేందుకు అవసరమైతే ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరించి ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తుందని హామీ ఇచ్చారు. -
వాళ్లంతా వెంకటేశ్ పేరే చెప్పారు: శ్రీప్రియ
‘‘యాభై ఏళ్ల మా సంస్థ చరిత్రలో తొలిసారి లేడీ డెరైక్టర్తో నిర్మించిన చిత్రం ఘనవిజయం సాధించడం ఆనందంగా ఉంది. ఇక్కడే కాదు.. విదేశాల్లోనూ ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది’’ అని డి. రామానాయుడు చెప్పారు. వెంకటేశ్, మీనా జంటగా శ్రీప్రియ దర్శకత్వంలో రామానాయుడు సమర్పణలో డి. సురేశ్బాబు, రాజ్కుమార్ సేతుపతి నిర్మించిన ‘దృశ్యం’ చిత్రం విజయోత్సవం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ- ‘‘నటుడిగా నాలో ఆత్మవిశ్వాసం పెంచిన చిత్రం ఇది. నా కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేను’’ అన్నారు. ‘‘మలయాళ ‘దృశ్యం’ని తెలుగులో రీమేక్ చేస్తు, హీరోగా ఎవరైతే బాగుంటుందని నా స్నేహితురాళ్లు జయప్రద, జయసుధ, రాధికను అడిగితే.. వెంకటేశ్ పేరు చెప్పారు. తనతో సినిమా చేయడం ఓ మంచి అనుభవం’’ అని శ్రీప్రియ తెలిపారు. పరుచూరి గోపాలకృష్ణ, రాజ్కుమార్ సేతుపతి, మీనా, నదియా తదితరులు చిత్రవిజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
అందుకనే ఆయనతో పెళ్లికి ఒప్పుకున్నా!
మీనా నవ్వితే... పూసింది పూసింది పున్నాగ! మీనా మాట్లాడితే... రేపల్లె మళ్లీ మురళి విన్నది! మీనా కవ్విస్తే... ఎన్నెన్నో అందాలు.. ఏవేవో రాగాలు! మీనా కెరీర్లో ఎన్ని హిట్టు పాటలున్నాయో... ఎన్ని హిట్టు సినిమాలున్నాయో... నిజంగా మీనా కెరీర్... ఓ సుందరకాండ! బాలనటిగా మొదలుపెట్టి... దక్షిణాదిలో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన మీనా పెళ్లి తర్వాత సినిమా కెరీర్కు కామా పెట్టారు. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. చాలా రోజుల తర్వాత ‘దృశ్యం’తో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇక వరుసగా సినిమాలు చేస్తానంటున్న మీనా చెప్పిన సంసారం ముచ్చట్లు, కెరీర్ కబుర్లు... పెళ్లయిన తర్వాత సినిమాలు చేయడం చాలా తగ్గించేశారు... ఎందుకని? మీనా: దాదాపు మూడు, నాలుగేళ్లు మాత్రమే సినిమాలు చేయలేదు. ఆ నాలుగేళ్లూ మావారే నాకు మంచి కంపెనీ. రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. ఏది నచ్చితే అది చేసేంత తీరిక. నిజం చెప్పాలంటే నేను జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టింది పెళ్లి తర్వాతే. అప్పటివరకు పరిగెత్తి పరిగెత్తి సినిమాలు చేశాను. దాంతో పెళ్లి తర్వాత రిలీఫ్గా అనిపించింది. మీ శ్రీవారి గురించి చెబుతారా? మీనా: మావారి పేరు విద్యాసాగర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా ఇద్దరి మనస్తత్వాలూ ఒకటే. నాకు సరదాగా ఉండటం ఇష్టం. ఆయనకు కూడా అంతే. అయితే నాకన్నా నాలెడ్జబుల్ పర్సన్. నాకు తెలియని ఎన్నో విషయాలను ఆసక్తిగా చెబుతుంటారు. ఆయన దగ్గర నాకు నచ్చిన విషయాల్లో అదొకటి. మీది ప్రేమ వివాహమా? మీనా: అదేం కాదు కానీ, ఇద్దరికీ ముందే పరిచయం ఉంది. ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిశాం. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. అయితే, పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆ సమయంలో మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మా అమ్మే ఆయన ప్రస్తావన తీసుకొచ్చింది. ఆయ నను వద్దనుకోవడానికి కారణాలేవీ కనిపించలేదు. అందుకని ఒప్పుకున్నా. పెళ్లి తర్వాత మీ జీవితంలో ఏమైనా మార్పులొచ్చాయా? మీనా: మార్పంటే.. నాకు నేనుగా కొన్ని నిబంధనలు పెట్టుకున్నాను. ఒక దశ తర్వాత మన ప్రాధాన్యతలేంటో మనకు తెలిసిపోతాయ్. అలాగే, సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తున్నా. బయటకు నేను పెద్ద స్టార్ను కావచ్చు. ఇంట్లో మాత్రం సాదాసీదా అమ్మాయినే. భార్యగా, తల్లిగా మిగతా ఆడవాళ్లు తమ బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తారో నేనూ అంతే. పదిహేను, ఇరవయ్యేళ్లు బిజీగా సినిమాలు చేశారు కదా.. ఒక్కసారిగా ‘జాబ్ లెస్’ గా ఉండడం బాధగా అనిపించలేదా? మీనా: మొదట్లో అంత తీరిక బాగానే ఉన్నా, ఆ తర్వాత మాత్రం ఏదో ఒక వ్యాపకం లేకుండా ఉండలేం అనిపించింది. నా భర్త, పాపకు తగిన సమయం కేటాయిస్తూనే, అడపా దడపా సినిమాలు చేయాలనుకున్నాను. భార్య, తల్లి... బాధ్యతలు ఎలా అనిపిస్తున్నాయి? మీనా: చెప్పాలంటే పెళ్లయిన తర్వాత బాధ్యతలు పెరిగాయి. జీవితం గురించి బోల్డన్ని విషయాలు తెలిశాయి. ఇక, అమ్మ అయిన తర్వాత అయితే జీవితం ఇంకా అద్భుతంగా ఉంది. మా పాప పేరు నైనిక. పాపకు మూడేళ్లు వచ్చేశాయి. మాటలు రాకముందు తనెందుకు ఏడుస్తుందో తెలియక సతమతమయ్యేదాన్ని. ఇప్పుడు ఫరవాలేదు. ఇవన్నీ చూశాక, నన్ను పెంచడానికి మా అమ్మ ఎంత కష్టపడి ఉంటుందో అనిపించింది. ‘నేను కరెక్ట్గానే పెంచుతున్నానా’ అని అమ్మను చీటికీ మాటికీ అడుగుతుంటాను. పాపకు ఏం తినిపించాలి? ఎలాంటి దుస్తులు వేయాలి.. ఇలా అన్ని విషయాల్లోనూ నాకు టెన్షనే. షూటింగ్స్లో పాల్గొంటున్నప్పుడు మీ అమ్మాయిని మిస్ అయిన ఫీలింగ్ కలగదా.. మిమ్మల్ని సినిమాల్లో చూసి తనెలా స్పందిస్తుంది? మీనా: నాతో పాటు షూటింగ్స్కు తీసుకెళ్లిపోతుంటాను. ఒకవేళ ఇంట్లో వదిలి వెళితే నాకు మనశ్శాంతిగా ఉండదు. టీవీలో నా సినిమాలొస్తే ‘అమ్మా... నువ్వే’ అని గుర్తుపడుతోంది. నేను విడిగా బయటికెళ్లినప్పుడు అందరూ గుర్తుపట్టి, ‘హాయ్ మీనాగారు’ అని పలకరిస్తారు. అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. కానీ, నా సొంత కూతురే నన్ను గుర్తుపడితే ఇక ఆ ఆనందం మాటల్లో చెప్పలేనంత. మీ అమ్మా, నాన్నకు మీరొక్కరే కూతురు.. మీకు కూడా అంతేనా? మీనా: (నవ్వుతూ) ఏమోనండి.. ఆ విషయం గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు . మీ మాతృభాష తమిళమనీ, కాదు తెలుగు అనీ చాలామంది అంటారు? అసలు మీ మాతృభాష ఏంటి? మీనా: మా అమ్మగారు మలయాళీ. నాన్న గారు తెలుగువారు. నేను పుట్టి, పెరిగింది చెన్నయ్లోనే. ఇంట్లో ఎక్కువగా తమిళమే మాట్లాడతాం. మీ కెరీర్ విషయంలో మీ అమ్మా, నాన్న సపోర్ట్ చాలా ఉంది కదా? మీనా: నాకు అన్ని విధాల అండ మా అమ్మే. ఏది ఒప్పో.. ఏది తప్పో వివరించి చెప్పేది. నాన్న సపోర్ట్ లేకపోతే అసలు నా కెరీర్ సాఫీగా సాగేది కాదు. మీ అమ్మా, నాన్నకు మీరొక్కరే అమ్మాయి కాబట్టి, చాలా గారాబంగా పెంచారా? మీనా: ఎక్కడ స్ట్రిక్ట్గా ఉండాలో అక్కడ ఉంటారు. మిగతా సమయాల్లో మామూలుగా ఉంటారు. మరి.. మీ మీరెలాంటి మదర్? మీనా: మా అమ్మా, నాన్న నన్ను పెంచినట్లుగానే మా అమ్మాయిని నేను పెంచాలనుకుంటున్నా. అన్ని విషయాలూ నేర్పించి, మంచి గైడ్గా ఉండాలన్నది నా కోరిక. మా అమ్మా నాన్న తప్పొప్పులు చెప్పి, ‘నీకేది మంచి అనిపిస్తే అది చెయ్యి’ అనేవారు. మా అమ్మాయి విషయంలో నేనూ అదే చేస్తా. మీ సినిమాల విషయంలో మీ భర్త జోక్యం ఎంతవరకూ ఉంటుంది? మీనా: ఆయన జోక్యం అసలు ఉండదు. ఎందుకంటే, నాకో పది అవకాశాలొస్తే నేనే రెండు, మూడు మినహా ఒప్పుకోవడం లేదు. పాత్రల ఎంపిక పరంగా నేనంత జాగ్రత్తపడుతున్న విషయం ఆయనకు తెలుసు. అందుకే, ఆయన ఇన్వాల్వ్ కారు. ఓకే... ఇటీవల విడుదలైన ‘దృశ్యం’ విషయానికొద్దాం... మలయాళంలో మీరే చేసిన పాత్రను మళ్ళీ తెలుగులో చేసినప్పుడు ఎలా అనిపించింది? మీనా: మలయాళ సినిమా అంతా అయ్యాక చూసినప్పుడు ‘ఇది బాగుంది కానీ, ఇంకా బెటర్గా చేసుండొచ్చు’ అనుకున్నా. ఇప్పుడు మళ్లీ తెలుగులో అదే పాత్ర చేస్తూ, ఆ బెటర్మెంట్ ఉండేలా చూసుకున్నాను. గతంలో వెంకటేశ్తో ‘చంటి’, ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు. చాలా విరామం తర్వాత మళ్లీ ఆయనతో సినిమా చేయడం పట్ల మీ ఫీలింగ్? మీనా: వెంకీగారితో మళ్లీ యాక్ట్ చేయడం ఆనందం అనిపించింది. షూటింగ్ అంతా కూల్గా సాగింది. అయితే గతంలో నేనాయనతో సినిమాలు చేసినప్పుడు పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. అప్పట్లో నేను మితభాషిని. ఇప్పుడు చాలా మారాను. మితభాషిని అన్నారు... ఎందుకని? మీనా: మద్రాసులోనే పెరిగినందువల్ల తెలుగు సరిగ్గా వచ్చేది కాదు. ఒకటి మాట్లాడబోయి ఇంకోటి మాట్లాడితే.. ఎవరి మనసైనా నొచ్చుకుంటుందేమో... అపార్థం చేసుకుంటారేమోనని భయం. కొంచెం అమాయకంగా కూడా ఉండేదాన్ని.. అభద్రతాభావం ఉండేది. అందుకని నా పనేంటో నేనేంటో అన్నట్లుగా ఉండేదాన్ని. కలుపుగోలుగా ఉంటే, అడ్వాంటేజ్ తీసుకుంటారేమోనని భయం. దాంతో పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. దానివల్ల ‘మీనాకు తలబిరుసుతనం’ అన్నవాళ్లు ఉన్నారు. వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టాక నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎలాంటి పరిస్థితిని అయినా అధిగమించగలననే ధైర్యం ఏర్పడింది. ఆ తర్వాత కొంచెం మాట్లాడడం మొదలుపెట్టాను. చిన్నప్పటి నుంచీ ఈ రంగంలో ఉన్నారు. ఏదైనా పశ్చాత్తాపపడాల్సిన సంఘటనలున్నాయా? మీనా: వ్యక్తిగతంగా ఏమీ లేవు. కానీ, డేట్స్ అడ్జస్ట్ చేయలేక కొన్ని మంచి సినిమాలు వదులుకున్నాను. అది మాత్రం ఎప్పటికీ బాధగా ఉంటుంది. నేను వదులుకున్న సినిమాల్లో ‘నరసింహ’లో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి పాత్ర ఒకటి. ఆ సినిమా అప్పుడు రజనీకాంత్ సార్ ఫోన్ చేసి, ‘నువ్వు చేస్తున్నావ్.. కంగ్రాట్స్’ అన్నారు. మా అమ్మకు ఆ పాత్ర అంత సంతృప్తిగా అనిపించలేదు. డేట్సూ లేవు. కారణాలేవైనా ఓ మంచి పాత్ర వదులుకున్నా. చైల్డ్ ఆర్టిస్ట్గా నన్ను శివాజీ గణేశన్గారే పరిచయం చేశారు. ‘నరసింహ’లో ఆయన నటించిన విషయం తెలిసిందే. ఒకవైపు శివాజీ సార్, మరోవైపు రజనీ సార్ నటించిన సినిమాను వదులుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతుంటా. అలాగే, కృష్ణవంశీ కంటిన్యూస్గా రెండు నెలలు డేట్స్ అడగడంతో ‘నిన్నే పెళ్లాడతా’ మిస్సయ్యా. అప్పుడు నాలుగు భాషల్లో సినిమాలు చేయడం వల్ల ఒక సినిమాకు వరుసగా 20 రోజులు డేట్స్ ఇవ్వడమే గగనంగా ఉండేది. అలాంటిది 2 నెలలా అని ఆలోచనలోపడ్డాను. కరెక్ట్గా ప్లాన్ చేసి చెప్పమని కృష్ణవంశీని అడిగితే ‘కరెక్ట్గా ప్లాన్ చేసే చెబుతున్నా.. రెండు నెలలు కావాల్సిందే’ అన్నారు. దాంతో వదులుకోక తప్పలేదు. రజనీకాంత్తో బాలనటిగా చేసి, ఆయన పక్కనే హీరోయిన్గా చేశారు కదా.. ఎలా అనిపించింది? మీనా: రజనీ సార్తో తమిళంలో ‘అన్బుళ్ల రజనీకాంత్’ సినిమా చేసినప్పుడు ఆయన నన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దు చేసేవారు. నాకు బాగా నిద్ర వచ్చినప్పుడు, జో కొట్టేవారు కూడా. ఇక, నేను హీరోయిన్గా చేయడం మొదలుపెట్టిన తర్వాత దర్శకుడు ఆర్.వి. ఉదయ్కుమార్ ఒక కథ చెప్పి, రజనీగారి పక్కన యాక్ట్ చేయాలన్నారు. జోక్ చేస్తున్నారేమో అనుకున్నా. కానీ, ఆయన సీరియస్గానే చెబుతున్నారని తెలుసుకుని, ‘అసలు రజనీ సార్ నాతో చేస్తారా’ అన్నాను. కానీ, రజనీ సార్ కూడా చేస్తానన్నారట. వాస్తవానికి ఉదయ్కుమార్గారు ఆ సినిమాకు అడిగినప్పుడు, నేను తెలుగులో ఫుల్ బిజీ. పైగా, ఉదయ్కుమార్గారు అడిగిన డేట్స్ కమల్ హాసన్గారి సినిమాకిచ్చాను. అందుకని, ‘ఇది జరగదులే’ అనుకున్నాను. ఓ రోజు ఏవీయం శరవణన్గారు ఫోన్ చేసి, ‘ఈ సినిమా చేయాలి’ అన్నారు. ఎలాగోలా డేట్స్ అడ్జస్ట్ చేసి ఇచ్చాను. అదే ‘ముత్తు’ సినిమా. మొదటిరోజు షూటింగ్ అప్పుడు రజనీ సార్తో ‘ఏం మాట్లాడాలి.. ఎలా మెలగాలి’ అని సతమతమయ్యాను. సూపర్స్టార్ పక్కన చేస్తున్నామన్న థ్రిల్ ఓ వైపు.. భయం మరోవైపు.. ఇలా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండేదాన్ని. కొన్నిరోజుల తర్వాత అడ్జస్ట్ అయ్యాను. శివాజీ గణేశన్తో బాలనటిగా చేశారు కదా.. ఆ అనుభవాలు గుర్తున్నాయా? మీనా: తమిళ సినిమా ‘నెంజంగళ్’ అది. శివాజీ సార్ చుట్టూ, నా చుట్టూనే ఆ సినిమా తిరుగుతుంది. అప్పుడు నా వయసు మూడున్నరేళ్లు ఉంటుందేమో. అసలు సినిమా అంటే ఏంటో తెలియదు. డైలాగ్స్ నేర్పించేవారు.. చెప్పేసేదాన్ని. ఈ షూటింగ్ అప్పుడు నాకు బాగా గుర్తున్న విషయం ఒకటి చెబుతాను. లంచ్ టైమ్లో శివాజీ సార్ గదికి వెళ్లిపోయేదాన్ని. ఎందుకంటే, ఆయనకు ఇంటి నుంచి చికెన్ 65 లాంటి వెరైటీలు వచ్చేవి. వాటి కోసం వెళ్లిపోయేదాన్ని. మా అమ్మేమో ‘రోజూ వెళితే బాగుండదు’ అని మందలించేది. దాంతో ఎప్పుడైనా ఒక రోజు వెళ్లకపోతే... శివాజీ సారే ‘ఏంటీ ఇవ్వాళ్ల రాలేదు.. రారా.. కలిసి భోంచేద్దాం’ అని పక్కన కూర్చోబెట్టుకుని, నేను తినేవరకూ ఊరుకునేవారు కాదు. చిన్నప్పుడే సినిమాల్లోకి రావడం వల్ల చదువుకునే తీరిక చిక్కి ఉండేది కాదేమో? మీనా: ప్రైవేట్గా ఎం.ఏ హిస్టరీ చేశాను. అమ్మా, నాన్నకు చదువంటే ఇష్టం. వాళ్ల కోరిక తీర్చడం కోసమే చదువుకున్నాను. కానీ, సినిమాలు చేస్తూ, చదవడం అంత సులువు కాదు. ‘కర్తవ్యం’లో చిన్న పాత్ర చేశారు కదా.. వెంటనే హీరోయిన్ ఎలా అయ్యారు? మీనా: ఈతరం ఫిలింస్ పోకూరి బాబురావుగారు ఏదో సినిమాకి హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలిసింది. నేను వెళితే స్క్రీన్ టెస్ట్ చేసి, తీసుకున్నారు. అలా హీరోయిన్గా తెలుగులో ‘నవయుగం’ నా తొలి సినిమా. మీ కెరీర్లో కీలకంగా నిలిచిన ‘సీతారామయ్యగారి మనవరాలు’ జ్ఞాపకాలు...? మీనా: ముందు ఆ సినిమా చేయకూడదనుకున్నా. ఎందుకంటే అంతకుముందు చేసిన ‘నవయుగం’ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత చేసిన ‘ప్రజల మనిషి’ కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో ఇక చదువుకుందామనుకున్నాను. అమ్మా, నాన్న కూడా అదే మంచిదనుకున్నారు. అప్పుడు హరిగారని ఓ అసిస్టెంట్ డెరైక్టర్ వచ్చి, క్రాంతికుమార్గారు ఓ సినిమా చేయాలనుకుంటున్నారని, నన్ను తీసుకోవాలనుకుంటున్నారని చెప్పారు. మాకు ఇంట్రస్ట్ లేదని అమ్మ చెప్పింది. ‘ఈ ఒక్క సినిమా ట్రై చేయండి. చాలా మంచి కేరెక్టర్. ఓ తాత, మనవరాలి కాంబినేషన్లో జరిగే కథ. మీకు క్రాంతికుమార్గారి గురించి తెలియడం లేదు. చాలా గొప్ప డెరైక్టర్’ అన్నారు. సరేనని వెళ్లాం. కొద్దిగా మేకప్ వేసి, ఆ తర్వాత మేకప్ లేకుండా ఫొటోషూట్ చేసి, ఓకే అన్నారు. ‘అయ్యో.. ఓకే అయ్యిందా’ అనుకున్నా. కట్ చేస్తే ఆ సినిమా బాగా ఆడడం, నేను 200 చిత్రాల దాకా చేయడం జరిగిపోయాయి. ఆ సినిమా సమయంలో అక్కినేని నాగేశ్వరరావుగారు సలహాలిచ్చేవారా? మీనా: ‘మనం ఎవరి కోసమైనా వెయిట్ చేయొచ్చు.. మన కోసం ఎవరూ వెయిట్ చేయకూడదు’ అని ఏయన్నార్ గారు చెప్పారు. ఆయన నాకిచ్చిన మొదటి సలహా అది. ఆ సినిమా విడుదలైన తర్వాత... ‘లొకేషన్లో నువ్వు యాక్ట్ చేసినప్పుడు అంతగా అనిపించలేదు. కానీ, సినిమాలో చూస్తే చాలా బాగానే యాక్ట్ చేశావ్ అనిపించింది’ అని మెచ్చుకున్నారు. చివరిసారిగా నాగేశ్వరరావు గారిని ఎప్పుడు కలిశారు? మీనా: చెన్నైలో గత ఏడాది జరిగిన వందేళ్ల భారతీయ సినిమా పండగకు అన్ని భాషలకు చెందిన వాళ్లూ వచ్చారు. చెన్నైలోనే ఏయన్నార్గారి పుట్టినరోజు వేడుక జరిగింది. ఆ వేడుకలో నేనూ పాల్గొన్నా. ఆయనను చూడడం అదే చివరిసారి. ఆయన నటించిన ఆఖరి చిత్రం ‘మనం’ ఇటీవల చూసినప్పుడు, కొద్దిగా ఎమోషనల్ అయ్యాను. కథానాయికల కెరీర్ తక్కువ కాలం ఉంటుంది కదా. ఆ స్టార్ హోదా నుంచి పక్కకు రావాల్సొచ్చినప్పుడు చాలామంది ఎంతో బాధపడతారు. మరి మీరెలా? మీనా: కథానాయికల కెరీర్ చాలా తక్కువ కాలమని నాకు తెలుసు. అయినప్పటికీ నేను పది, పదిహేనేళ్లు చేయగలిగాను. ఉన్నంతవరకూ మంచి సినిమాలు చేయగలిగాను. మొత్తం నాలుగు భాషల్లోనూ 200కి పైగా సినిమాలు చేశాను. ఇక, ఇంతకన్నా ఏం కావాలి? దక్షిణాది భాషల్లో స్టార్ హీరోలందరి సరసన చేశారు కదా.. అప్పట్లో ఎలా అనిపించింది? మీనా: అసలా ఫేమ్ను గ్రహించే తీరిక ఉండేది కాదు. ఇంత పెద్ద స్టార్స్తో చేస్తున్నాం, ఇన్ని మంచి పాత్రలు చేస్తున్నాం అని ఎప్పుడూ ఆలోచించలేదు. వరుసగా సినిమాలు చేయడం, చేయబోయే సినిమాల కథలు వినడంతోనే సరిపోయేది. పెళ్లయిన తర్వాతే నా కెరీర్ వైభవం గురించి ఆలోచించే తీరిక చిక్కింది. అది కూడా ఎక్కడైనా బయటికెళ్లినప్పుడు ‘సినిమాలు ఎందుకు మానేశారు? మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాం’ అని అందరూ అంటున్నప్పుడు, ఫ్లాష్బ్యాక్లోకి వెళ్లి, చేసిన సినిమాలను గుర్తు చేసుకుంటుంటాను. మీనాకు తలబిరుసుతనం అనే వ్యాఖ్యలు విని, బాధపడేవారా? మీనా: మొదట్లో నాకు తెలియలేదు. ఆ తర్వాత తర్వాత తెలిసింది. ‘మన గురించి ఎందుకలా అనుకుంటున్నారు’ అని ఆలోచించేదాన్ని. ఆ తర్వాత తేలికగా తీసుకునేదాన్ని. మనమేంటో మనకూ, మన కుటుంబానికీ తెలుసు. బయటివాళ్లకు తెలియకపోతే ఏంటిలే అనుకునేదాన్ని. కానీ, నాతో ఫ్రెండ్స్ అయిన తర్వాత ‘మీరింత స్వీట్ పర్సనా? చాలా బాగా మాట్లాడుతున్నారే. కానీ, మీ గురించి మేం వేరేలా అనుకున్నాం’ అనేవారు. పోనీలే.. ఇప్పుడైనా తెలుసుకున్నారు కదా అనేదాన్ని. ఒకప్పుడు స్లిమ్గా ఉండేవారు... ఇప్పుడలా ఉండాలనుకోవడం లేదా? మీనా: పాప పుట్టిన తర్వాత బరువు పెరిగాను. మావారైతే నా బరువు గురించి ఆటపట్టిస్తుంటారు. మా పాప అన్నప్రాసన గుళ్లో చేస్తే, ఆ ఫొటోలు బయటికొచ్చాయి. అప్పుడు నేనింకా లావుగా ఉండేదాన్ని. పాప పుట్టిన తర్వాత నా గురించి నేను ఆలోచించడం మానేశాను. ఇప్పుడు మా నైనికకు మూడేళ్లు వచ్చేశాయ్. మాటలు వచ్చేశాయ్ కాబట్టి, తనకేం కావాలో చెబుతోంది. అందుకని టెన్షన్ తగ్గింది. ఇక, ఇప్పుడు నా గురించి కూడా ఆలోచించడం మొదలుపెడతా. - డి.జి. భవాని -
సినిమారివ్యూ: 'దృశ్యం'
నటీనటులు: వెంకటేశ్, మీనా, నదియా, నరేశ్, రవి కాలే, కృతిక, బేబి ఎస్తేర్, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు నిర్మాతలు: డి సురేశ్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి సంగీతం: శరత్ సినిమాటోగ్రఫి: ఎస్ గోపాల్ రెడ్డి ఎడిటింగ్: మార్తాండ్ వెంకటేశ్ దర్శకత్వం: శ్రీ ప్రియ పాజిటివ్ పాయింట్స్: ఆకట్టుకునే కథ, భావోద్వేగానికి గురి చేసే డైలాగ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెగిటివ్ పాయింట్స్: స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, సినిమాటోగ్రఫి ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను రీమేక్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించడంలో 'విక్టరీ' వెంకటేశ్ ది ఓ ఢిఫరెంట్ స్టైల్. రీమేక్ చిత్రాల్లో నటించి భారీ హిట్లను తన ఖాతాలో వెంకటేశ్ వేసుకున్న సంగతి తెలిసిందే. కాని ఇటీవల కాలంలో రీమేక్ చిత్రాలు వెంకటేశ్ కు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. అయితే రీమేక్ చిత్రాలు నిరాశ పరిచినా.. తాజాగా మలయాళంలో ఘనవిజయం సాధించిన 'దృశ్యం' చిత్రాన్ని ఎంపిక చేసుకుని.. అదే పేరుతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్, మీనాలు జంటగా నిర్మాత డి సురేశ్, రాజ్ కుమార్ సేతుపతిలు రూపొందించిన 'దృశ్యం' చిత్రం జూలై 11వ తేదిన విడుదలకు సిద్దమైంది. సస్పెన్స్, థ్రిలర్, ఫ్యామిలీ డ్రామాల మేళవింపులతో వచ్చిన 'దృశ్యం' ఎలాంటి టాక్ ను సంపాదించుకుందో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళ్తాం. కథ: పోలీస్ అధికారులైన నదియా, నరేశ్ లకు వరుణ్ (రోషన్) అనే కుమారుడు ఉంటాడు. వరుణ్ కనిపించకుండా పోయాడనే విషయం నదియా, నరేశ్ లకు తెలుస్తుంది. దాంతో వరుణ్ ఆచూకీ కోసం వేట మొదలెడుతారు పోలీసులు. అయితే ఈ విచారణలో రాజావరం అనే కుగ్రామంలో ఓ కేబులు ఆపరేటర్ రాంబాబు (వెంకటేశ్) కుటుంబాన్ని అనుమానిస్తారు. వరుణ్ ఆచూకీ తెలుసుకునేందుకు రాంబాబు కుటుంబాన్ని విచారిస్తారు. అయితే రాంబాబు కుటుంబానికి వరుణ్ కనిపించకుండా పోవడానికి కారణమేంటి? రాంబాబు కుటుంబాన్నే ఎందుకు అనుమానించారు? వరుణ్ కనిపించకుండా పోవడానికి రాంబాబు కుటుంబానికి సంబంధమేమిటి. సంతోషంగా భార్య, ఇద్దరు కూతుర్లతో జీవితాన్ని వెళ్లదీస్తున్న రాంబాబు కుటుంబానికే ఈ సమస్య ఎందుకు ఎదురైంది. పోలీసుల విచారణ నుంచి రాంబాబు కుటుంబం తప్పించుకుందా? పోలీసుల విచారణ నుంచి తప్పించుకోవడానికి రాంబాబు కుటుంబం చేసిన ప్రయత్నాలు ఏంటి? చివరకు రాంబాబు కుటుంబం సమస్య నుంచి ఎలా బయటపడ్డారు? పోలీస్ ఆఫీసర్లకు తమ కుమారుడి ఆచూకీ దొరికిందా? అనే ప్రశ్నలకు సమాధానమే 'దృశ్యం'. నటీనటుల ఫెర్ఫార్మెన్స్: రాంబాబుగా వెంకటేశ్ మరోసారి ఓ విభిన్నమైన పాత్రతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కేబుల్ ఆపరేటర్ గా, ఓ కుటుంబ పెద్దగా వెంకటేశ్ చక్కటి ఎమోషన్స్ పలికించారు. సమస్యల్లో చిక్కుకున్న తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాంబాబు పాత్ర ద్వారా వెంకటేశ్ సగటు ప్రేక్షకుడ్ని మరోసారి మైమరిపించారు. ఇమేజ్ కు భిన్నంగా పాత్రలను ఎంచుకోవడంలో వైవిధ్యం చూపే వెంకటేశ్ మరోమారు రాంబాబు పాత్ర ద్వారా తన సత్తాను చాటారు. గత కొద్దికాలంగా మంచి విజయం కోసం ఎదురు చూస్తూన్న వెంకటేశ్... 'దృశ్యం' ద్వారా మంచి అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. చాలాకాలం తర్వాత మీనా మరోసారి తనదైన నటనను ప్రదర్శించారు. 'దృశ్యం' ద్వారా మీనా టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ఆరంభించినట్టే. కాకపోతే అర్జంటుగా కొంచెం లావు తగ్గాల్సిందే. మంచి ఫెర్ఫార్మెన్స్ తో గతంలో ఆకట్టుకున్న మీనా.. మరోసారి 'దృశ్యం' ద్వారా చేరువయ్యారనే చెప్పవచ్చు. వెంకటేశ్ కూతుళ్లుగా నటించిన కృతిక, బేబీ ఎస్తేర్ లు మంచి మార్కులే సొంతం చేసుకున్నారు. చిన్న పాత్రైనా నరేశ్ ప్రాధాన్యత ఉన్న పాత్రతో అదరగొట్టేశారు. క్లైమాక్స్ లో నరేశ్ నటన బాగుంది. నదియా పాత్ర ఓకే అనిపించినా.. మరికొంత జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదనిపించింది. నదియా క్యాస్టూమ్స్, మేకప్ విషయంలో కొత్త అశ్రద్ద చేశారా అనే ఫీలింగ్ కలిగింది. ముఖ్యంగా ఈ చిత్రంలో కానిస్టేబుల్ గా నటించిన రవి కాలే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. నెగిటివ్ షేడ్స్ తో రవి కాలే ఆకట్టుకున్నారు. రాంబాబును, ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురిచేసే పాత్రలో రవి కాలే నటన సూపర్ అని చెప్పవచ్చు. వెంకటేశ్ అసిస్టెంట్ గా సప్తగిరి తన హాస్యంతో పర్వాలేదనింపించారు. పరుచూరి వెంకటేశ్వరావు, చిత్రం శ్రీను, ఉత్తేజ్ లు తమ పాత్రల స్వభావం, పరిధి మేరకు న్యాయం చేకూర్చారు. సాంకేతిక నిపుణుల పనితీరు: కథ డిమాండ్ మేరకు శరత్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. ముఖ్యంగా సెంటిమెంట్, భావోద్వేగాలకు గురిచేసేందుకు అవసరమైన టెంపోను బ్యాక్ గ్రౌండ్ స్కోరును మెయింటెన్ చేయడంలో శరత్ సఫలమయ్యారు. ఇక డార్లింగ్ స్వామి అందించిన డైలాగ్స్ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. సున్నితంగా, సహజంగా ఉండే డైలాగ్స్ అందించిన డార్లింగ్ స్వామి.. సెంటిమెంట్ సీన్లలో డైలాగ్స్ తో తన మార్క్ ను ప్రదర్శించారు. ఇక సగటు ప్రేక్షకుడిలో ఓ ఫీల్ నింపే విధంగా 'దృశ్యం' చిత్రాన్ని రూపొందించడంలో అలనాటి నటి శ్రీప్రియ సక్సెస్ అయ్యారు. అయితే ఈ చిత్ర తొలి భాగంలోనూ, రెండవ భాగంలోనూ కథనంలో వేగం మందగించడం ప్రేక్షకుడ్ని కొంత అసహనానికి గురి చేసేలా ఉంది. ఎడిటింగ్ కు దర్శకురాలు ఇంకాస్త పదను పెట్టి ఉంటే కథనంలో వేగం మరింత పెరిగేదనే ఫీలింగ్ కలిగింది. కెమెరా పనితనం గొప్పగా లేకున్నా.. ఓకే రేంజ్ లో ఉంది. అక్కడక్కడా తడబాటుకు గురైనా.. సస్పెన్స్, థ్రిలింగ్ అంశాలు పక్కదారి పట్టకుండా జాగ్రత్త వహించారు. అయితే క్లైమాక్స్ లో ఈ చిత్రాన్ని గాడిలో పెట్టడమే కాకుండా.. ప్రేక్షకుడికి పూర్తి స్థాయి సంతృప్తిని పంచడంలో దర్శకురాలు శ్రీప్రియ సఫలమయ్యారు. ఈ చిత్రంలో కొన్ని లోపాలున్నా.. సానుకూల అంశాలు ఎక్కువగా డామినేట్ చేశాయి. ఓవరాల్ గా ఈ మధ్యకాలంలో వచ్చిన చిత్రాలతో పోల్చుకంఉటే 'దృశ్యం' ఓ ఫీల్ గుడ్ చిత్రంగా నిలవడం ఖాయం. ట్యాగ్: 'దృశ్యం' ప్రేక్షకుల్లో ఓ చక్కటి అనుభూతిని నింపే ఓ సదృశ్యం! -- రాజబాబు అనుముల Note: Preview Show at Cinemax on Wednesday Follow @sakshinews -
దృశ్యం మూవీ పోస్టర్స్, స్టిల్స్