mla
-
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం
-
ప్రభుత్వ విప్ లపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
-
రికార్డింగ్ డ్యాన్సర్కు ముద్దు.. బూతు పాటతో ఎమ్మెల్యే రచ్చ
అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ యూబ్యూటర్పై ఏకంగా ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే మండిపడ్డారు. అలాంటిది ఒక ప్రజాప్రతినిధే బహిరంగంగా అశ్లీల నృత్యాలను ప్రొత్సహించడం.. అందునా ఆయనే అసభ్యంగా ప్రవర్తించడం.. పైగా వేదిక మీదే బూతు పాట పాడడంతో.. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అని పలువురు నెట్టింట ప్రశ్నలు గుప్పిస్తున్నారు.బీహార్ జనతా దల్(యునైటెడ్) ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ నీరజ్ అలియాస్ గోపాల్ మండల్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. భగల్పూర్ జిల్లా నౌగాచియాలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అక్కడ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది.వేదిక మీద ఉన్న నృత్యకారిణి దగ్గరకు వెళ్లి.. ఆమె పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. కరెన్సీ నోటును ఆమె చెంపకు అతికించాడు. అక్కడితో ఆగకుండా.. నేను డ్యాన్స్ మాత్రమే చేయలేదు.. ఆమెను ముద్దు కూడా పెట్టుకున్నా అంటూ మైకులో ప్రకటించారు. ఇది ఇక్కడితోనే ఆగలేదు. రాత్రి సయమంలో జరిగిన వేడుకల్లోనూ ఆయన పాల్గొన్నారు. రికార్డింగ్ డ్యాన్సర్లతో చిందులేశారు. ఆపై మైక్ అందుకుని బూతు పాటలు పాడి అక్కడున్నవాళ్లను హుషారెత్తించారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఆర్జేడీ భగ్గుమంది. ఇలాంటి వాళ్లపై కేసులు నమోదు చేస్తారా? చర్యలు తీసుకుంటారా? అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ప్రజాప్రతినిధులపై కూడా న్యాయస్థానాలు తీవ్ర వ్యాఖ్యలు చేయాలని పలువురు కోరుకుంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.होली मिलन समारोह में जदयू विधायक गोपाल मंडल ने महिला डांसर के गाल पर नोट चिपकाया और साथ में मंच पर लगाए ठुमके।#Gopalmandal #Bihar #BiharNews #Bhagalpur #Holi2025 pic.twitter.com/ZBNs32uQz1— FirstBiharJharkhand (@firstbiharnews) March 10, 2025JDU विधायक गोपाल मंडल#gopalmandal @Jduonline @RJDforIndia #BiharNews #bhagalpur pic.twitter.com/1nikGeTmWV— Shri Dhiraj Sharma (Journalist) (@ShriDhiraj) March 11, 2025గోపాల్ మండల్ వార్తల్లోకి ఎక్కడం తొలిసారేం కాదు. గతంలో ఆయన అండర్వేర్పై రైలులో తిరిగి వైరల్ అయ్యారు. కొందరు ప్రయాణికులు ఆ చర్యను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ టైంలోనూ ఆయనపై విమర్శలు రాగా.. కంపార్ట్మెంట్లో మహిళలు లేరని, బాత్రూం వెళ్లాల్సి రావడంతో అలా వెళ్లానని అప్పుడు తన చర్యను సమర్థించుకున్నారాయన. -
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం
-
ఎమ్మెల్యేలూ.. కాసేపు బజ్జోండి!
సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం విలాసవంతమైన సౌకర్యాలు కల్పిస్తుంటాయి. ఆఫీస్కు రాగానే బ్రేక్ఫాస్ట్.. కాస్త బోర్ కొడితే సేదతీరడానికి పలు రకాల ఆటలు.. మధ్యాహ్న భోజనం.. ఆ తర్వాత కునుకు వస్తే నిద్ర పోవడానికి బెడ్లు.. మధ్యమధ్యలో టీ, కాఫీ, జ్యూస్లు.. ఇలా ఎన్నో రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తుంటాయి. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యూటీ ఖదీర్ కూడా ఇటువంటి ఆలోచనే చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా కర్ణాటక అసెంబ్లీలో శాసనసభ్యులకు పలు సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. ఉదయం సభకు రాగానే బ్రేక్ఫాస్ట్.. మధ్యాహ్నం భోజనం.. ఆ తర్వాత కునుకు తీసేందుకు రిక్లైనర్ కుర్చీలు.. రిలాక్సేషన్ కోసం మసాజ్ కుర్చీలు ఏర్పాటు చేయించారు. ఈనెల 3 నుంచి మొదలైన కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు 21వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే సమావేశాల సమయంలో చాలా మంది సభ్యులు మధ్యాహ్న భోజనం తర్వాత సభా కార్యక్రమాలకు గైర్హాజరవుతున్నారని స్పీకర్ ఖదీర్ గుర్తించారు. ఆ పరిస్థితిని నివారించేందుకు, హాజరుశాతాన్ని పెంచేందుకు గాను.. సభ్యులు మధ్యలో కాసేపు నిద్రపోవడానికి 15 రిక్లైనర్లను, రెండు మసాజ్ కుర్చీలను అద్దెకు తీసుకున్నారు. ఒక్క సమావేశాలప్పుడు తప్ప మిగతా సమయాల్లో వీటి ఉపయోగం ఉండనందున.. ప్రస్తుతం వాటిని కొనుగోలు చేయకుండా అద్దెకు మాత్రమే తీసుకున్నామని స్పీకర్ చెప్పారు. 15 రిక్లైనర్లను, రెండు మసాజ్ కుర్చీలను అధికార, విపక్ష లాంజ్లలో ఏర్పాటు చేశామన్నారు. మరిన్ని మసాజ్ కుర్చీలకు ప్రతిపాదన..స్పీకర్ ఖదీర్ మరో అడుగు ముందుకేసి శాసనసభ్యుల కోసం మరిన్ని మసాజ్ కుర్చీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మసాజ్ కుర్చీలతో పాటు సభ్యుల గదులకు స్మార్ట్ లాక్స్ ఏర్పాటు చేయడానికి రూ.3 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఖదీర్ తెలిపారు. స్మార్ట్ లాక్స్ ఏర్పాటు వల్ల సభ్యులకు భద్రత పెరగడంతో పాటు వారి గదుల్లోకి ఇతరులెవ్వరూ ప్రవేశించే అవకాశం ఉండదని చెప్పారు. ఎక్కువ గంటలు పని చేయడం వల్ల ఎమ్మెల్యేలు ఒత్తిడి ఎదుర్కొంటున్నారని వివరించారు. వారు చేస్తున్న పనికి ఇవి విలాసాలు కావని.. అవసరాలు మాత్రమేనని చెప్పారు. ఈ సౌకర్యాలకు ఎమ్మెల్యేలు పూర్తిగా అర్హులంటూ తన చర్యలను సమర్థించుకున్నారు. ఈ సదుపాయాల వల్ల సభ్యులు ఇక ఏ కారణంతోనూ బయటకు వెళ్లబోరని అన్నారు. కాగా, స్పీకర్ నిర్ణయాన్ని పలువురు మంత్రులు, అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు సమర్థించగా.. బీజేపీ నేతలు విమర్శించారు. ఎమ్మెల్యేలు ఒత్తిడితో పని చేస్తారని, పైగా చాలా మంది సీనియర్ సిటిజన్లు ఉన్నందున ఇలాంటి ఏర్పాట్లు మంచివేనని అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే చెప్పారు. పాలనా సమస్యలపై దృష్టి పెట్టకుండా.. ఇలాంటి అనవసరమైన ఖర్చులు చేయడం ఏమిటంటూ బీజేపీ నేత సీటీ రవి విమర్శించారు. -
సీపీఐకి ఒకటి.. ఎస్టీ నేతకు మరొకటి!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం అధికార కాంగ్రెస్ చేపట్టిన కసరత్తు తుదిదశకు చేరుకుంది. వచ్చే సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను టీపీసీసీ వేగవంతం చేసింది. ఎమ్మెల్యేల కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశమున్న నేపథ్యంలో.. ఒక సీటును మిత్రపక్షమైన సీపీఐకి ఇవ్వాలని, మిగతా మూడింటిలో ఒక స్థానాన్ని ఎస్టీ వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. అందులోనూ మహిళకు అవకాశమివ్వాలని ఇటీవల సీఎం రేవంత్ నివాసంలో జరిగిన భేటీలో నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. మిగతా రెండింటి కోసం ఎస్సీ, ఓసీ, బీసీ వర్గాలకు చెందిన నేతల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఢిల్లీలో అభ్యర్థుల ఖరారు.. కేబినెట్ విస్తరణతో ముడిపెట్టి జరుగుతున్న కసరత్తులో భాగంగా ఈ మూడు సామాజిక వర్గాల నుంచి అవకాశం కలి్పంచాల్సి ఉంటుందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో రెండు ఎమ్మెల్సీ సీట్లలో ఒకటి, రెండు రాజ్యసభ ఎంపీ స్థానాల్లో ఒకటి చొప్పున బీసీలకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో.. ఈసారి బీసీ నేతలకు ఎమ్మెల్సీ అవకాశం ఉండకపోవచ్చని గాం«దీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ఎస్టీ, ఎస్సీ, ఓసీ వర్గాల నేతలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయవచ్చని అంటున్నారు. అభ్యర్థుల ఖరారు ప్రక్రియ శని, ఆదివారాల్లో ఢిల్లీ వేదికగా జరగనుంది.అధిష్టానం పెద్దలు కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యేందుకు గాను సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ శనివారం మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ వెళుతున్నారు. ఆదివారం ఉదయం ఏఐసీసీ పెద్దలతో భేటీ అయి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. మధ్యాహా్ననికల్లా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.మిత్ర పక్షానికి.. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా మిత్రపక్షం సీపీఐకి అవకాశం ఇవ్వడం దాదాపు ఖరారైనట్టేనని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుదిరిన పొత్తులో భాగంగా, నాడు ఇచ్చిన మాట ప్రకారం సీపీఐకి ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందని.. ఈ మేరకు టీపీసీసీ నాయకత్వానికి సమాచారం ఇచ్చిందని పేర్కొంటున్నాయి. -
ఈవెంట్ తెచ్చిన తంటా.. రష్మికకు ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్
శాండల్వుడ్లో వివాదం మరింత ముదురుతోంది. ప్రతిష్టాత్మక ఈవెంట్కు కన్నడకు చెందిన అగ్ర సినీతారలు హాజరు కాకపోవడం రాజకీయ రంగు పులుముకుంది. ఈ అంశంపై ఇప్పటికే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అందరికీ నట్లు, బోల్టులు ఎప్పుడు బిగించాలో తమకు తెలుసని మండిపడ్డారు. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే నేషనల్ క్రష్, పుష్ప భామ రష్మిక మందన్నాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు రష్మిక హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గణిగ మండిపడ్డారు. కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో తన కెరీర్ను ప్రారంభించిన రష్మిక తన మూలాలు మరిచిపోవడం సరైంది కాదని హితవు పలికారు. గతేడాది కూడా ఈవెంట్కు ఆహ్వానించగా నిరాకరించిందని వెల్లడించారు. తాను కెరీర్ ప్రారంభించిన ఇండస్ట్రీని చిన్నచూపు చూస్తున్న రష్మికకు తగిన గుణపాఠం చెప్పకూడదా? అంటూ అని మాండ్యా నియోజకవర్గ ఎమ్మెల్యే రవి గణిగ ప్రశ్నించారు. కాగా.. రష్మిక 2016లో కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో రక్షిత్ శెట్టి సరసన సినీ రంగ ప్రవేశం చేసింది.(ఇది చదవండి: ఇలాగే ఉంటే నటీనటులకు నట్లు, బోల్టులు బిగిస్తాం: డిప్యూటీ సీఎం)రష్మిక కన్నడ చిత్ర పరిశ్రమను పూర్తిగా విస్మరించిందని ఆయన అన్నారు. అలాగే కన్నడ భాషను కూడా విస్మరించి అగౌరవపరిచేలా మాట్లాడిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కార్యక్రమానికి రష్మిక మందన్నను చాలాసార్లు ఆహ్వానించినప్పటికీ.. బెంగళూరు రావడానికి సమయం లేదని సమాధానమిచ్చిందని అన్నారు. మా శాసనసభ్యురాలు ఒకరు ఆమెను ఆహ్వానించడానికి 10 నుంచి 12 సార్లు ఆమె ఇంటికి వెళ్లారని గుర్తు చేశారు. కానీ రష్మిక కన్నడ పరిశ్రమను పట్టించుకోలేదని.. ఇలాంటి వారికి వారికి గుణపాఠం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. రష్మిక ప్రవర్తనకు తగిన పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. కాగా.. ఇటీవల బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-16 వేడుకలు గ్రాండ్గా నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు శాండల్వుడ్ అగ్రతారలు హాజరు కాకపోవడంపై డీసీఎం డీకే శివకుమార్ సైతం మండిపడ్డారు. -
‘నేను బీఆర్ఎస్లోనే ఉన్నా’.. పోలీసుల్ని ఆశ్రయించిన ఎమ్మెల్యే
సాక్షి,హైదరాబాద్: తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నానంటూ ఆ పార్టీ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Bandla Krishnamohan Reddy) జోగులాంబ గద్వాల టౌన్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ నెల 11న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగులాంబ గద్వాల టౌన్ పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో తాను పార్టీ మారానని, అనుమతి అనుమతి లేకుండా తన ఫోటోను కొందరు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలపై ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, తన ప్రతిష్టకు భంగం కలిగేలా తన ఫొటోలతో ఫ్లెక్సీలు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
Delhi: అసెంబ్లీలో హంగామా.. 11 మంది ఆప్ ఎమ్మెల్యేలు సస్పెండ్
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం(BJP government) అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈరోజు(మంగళవారం)అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు. కాగ్ నివేదికను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. సమావేశం ప్రారంభంకాగానే ఆప్ ఎమ్మెల్యేల నినాదాలతో గందరగోళం నెలకొన్న దరిమిలా ప్రతిపక్ష నేత అతిషితో సహా 11 మంది ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా సస్పెండ్ చేశారు. అనంతరం ఆప్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ వెలుపల నిరసనకు దిగారు.ఢిల్లీ అసెంబ్లీ బయట అతిషితో పాలు ఆప్ ఎమ్మెల్యేలు భగత్ సింగ్(Bhagat Singh) తదితరులు భీమ్రావ్ అంబేద్కర్ ఫోటోలను పట్టుకుని నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని భగత్ సింగ్, అంబేద్కర్ ఫోటోలను ఎందుకు తొలగించారని అతిషి ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీ నుంచి ఈ రోజంతా సస్పెండ్ అయిన ఆప్ ఎమ్మెల్యేలలో ఒకరైన సంజీవ్ ఝా మీడియాతో మాట్లాడుతూ ‘నిన్న సీఎం కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటో స్థానంలో ప్రధాని మోదీ ఫొటో పెట్టారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కంటే ప్రధాని మోదీ గొప్పవారా? అని తామంతా స్పీకర్ను అడగడంతో ఆయన తమను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. వారు (బీజేపీ) డాక్టర్ బిఆర్ అంబేద్కర్(BR Ambedkar)ను ద్వేషించడాన్నిదేశం దీనిని అంగీకరించదు’ అని అన్నారు. ఈరోజు సభ ప్రారంభం కాగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు పలు నినాదాలు చేసిన దరమిలా అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా వారిని శాంతంగా ఉండాలని కోరారు. అయితే ఆ ఎమ్మెల్యేలు నినాదాలు ఆపకపోవడంతో విజయేందర్ గుప్తా ఆప్ నేత అతిషితో సహా 11 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు.ఇది కూడా చదవండి: ‘ఆ గోధుమలతోనే జుట్టూడింది’ -
నేడు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేల కేసుపై మంగళవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోసారి విచారించనుంది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతూ జనవరి 15న బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్లు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎం.సంజయ్కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీలపై బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ రెండు పిటిషన్లపై ఈనెల 10న సుప్రీం కోర్టు విచారించింది. విచారణ సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. రాజకీయ పారీ్టల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే చూస్తూ ఊరుకోం’అంటూ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం పేర్కొంది. అనంతరం ఈనెల 18కి విచారణను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. -
పోలీసుల నుంచి ప్రాణహాని ఉంది : వల్లభనేని వంశీ
సాక్షి,విజయవాడ: పోలీసుల (Andhra Pradesh Police) నుంచి తనకు ప్రాణ హాని ఉందని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ‘నాకు శ్వాసకోశ ఇబ్బంది ఉందని చెబుతున్నా పోలీసులు నా పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. అరెస్ట్ విషయంలో పూర్తిగా సహకరించినా నన్ను ఇబ్బందులకు గురి చేశారు. నాకు వైద్య సహాయం అందకుండా పోలీసులు ప్రతీక్షణం అడ్డుకున్నారు. అరెస్ట్ నుంచి కోర్టుకు తరలించే వరకు పోలీసులు నా పట్ల అనుచితంగా ప్రవర్తించారు’అంటూ న్యాయమూర్తికి స్టేట్మెంట్ ఇచ్చారు. కాగా, విజయవాడ (Vijayawada) జైల్లో ఉంటే వంశీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు, వల్లభనేని వంశీ పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన సతీమణి పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. నా భర్తను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇప్పటికీ చెప్పలేదని వాపోయారు. గురువారం రాత్రి 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ ఇస్తూ 4th ACMM కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా విజయవాడ సబ్ జైల్కి పోలీసులు వంశీని తరలించారు. వల్లభనేని వంశీతో పాటు లక్ష్మీపతి, కృష్ణప్రసాద్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో వంశీ అరెస్ట్పై ఆయన సతీమణి పంకజశ్రీ స్పందించారు.‘నా భర్త అరెస్టుపై న్యాయపోరాటం చేస్తా. అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉంది. వంశీకి ఆరోగ్యం బాగాలేదు. నేనే టాబ్లెట్స్ ఇచ్చాను. ఉదయం నుండి కనీసం కాఫీ కూడా తాగలేదు. ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇప్పటికీ చెప్పలేదు. ఎక్కడికి తీసుకు వెళుతున్నారో కూడా కనీస సమాచారం ఇవ్వలేదు. హైకోర్టుకి కచ్చితంగా వెళ్తాం. న్యాయపరంగానే ఎదుర్కొంటాం’ అని వ్యాఖ్యానించారు. -
ఫిరాయింపు MLAలపై సుప్రీంకోర్టు విచారణ
-
జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ రౌడీయిజం
-
దీపాదాస్ మున్షీ సీరియస్.. ఎమ్మెల్యేలకు వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సీరియస్ అయ్యారు. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ఐదున్నర గంటల పాటు జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని కులగణన, ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో చేసినా, అనుకున్న స్థాయిలో ప్రచారం చేయడం లేదన్న మున్షీ.. పార్టీ అంతర్గత విషయాలు బహిరంగ వేదికలపై మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.సీఎల్పీ సమావేశం అనంతరం కూడా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సమస్య ఉంటే నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలని.. ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యేలకు, కార్యకర్తల మధ్య గ్యాప్ ఉందంటూ మున్షీ వ్యాఖ్యానించారు. పార్టీ లైన్ దాటుతున్న నేతలపై సీరియస్గా ఉండాలని సీఎల్పీ సమావేశం నిర్ణయించింది.ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశంబీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించిన సీఎల్పీ.. రెండు భారీ సభలు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. సభలకు రాహుల్, ఖర్గే ఆహ్వానించాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని.. అత్యధిక గ్రామాలను ఏకగ్రీవం చేసే బాధ్యతతో పాటు బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల పదవులను కేటాయించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని రేవంత్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు!ఫిబ్రవరిలో రెండు భారీ బహిరంగ సభలు: టీపీసీసీ చీఫ్సీఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్ అంశాలపై ప్రధానంగా చర్చించామని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించామని.. సమావేశంలో ఎమ్మెల్యేలు కూడా వారి అభిప్రాయాలు చెప్పారన్నారు. ఫిబ్రవరిలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని మహేష్కుమార్ గౌడ్ వెల్లడించారు.మల్లన్న విషయంలో వారిదే నిర్ణయం: కోమటిరెడ్డి బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని జనాల్లోకి తీసుకువెళ్లాలని సీఎం చెప్పారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ తెలంగాణలో లేదు. బీజేపీ స్టేట్మెంట్లకు మాత్రమే పరిమితం అయ్యింది. వచ్చే 5 ఏండ్లు కూడా మళ్లీ మేము అధికారంలో ఉంటాం. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు జనాలకు అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. మా ఎమ్మెల్యేలు కూర్చొని భోజనం చేస్తే తప్పా.. మంత్రులం మేము కూడా కలిసి భోజనం చేస్తాము. ప్రతిపక్షాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మల్లన్న విషయంలో ఏఐసీసీ, టీపీసీసీ చీఫ్ నిర్ణయం తీసుకుంటారు. ఒక కులంపై అసభ్య పదజాలంతో మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా’’ అని కోమటిరెడ్డి చెప్పారు. -
ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వమే ఉండదు: ఎమ్మెల్యే విరూపాక్షి
సాక్షి,తాడేపల్లి:రాష్ట్రంలో ప్రత్యర్ధి పార్టీ ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం(ఫిబ్రవరి4) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విరూపాక్షి మీడియాతో మాట్లాడారు.‘కొంతమంది ఐఏఎస్,ఐపీఎస్లు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగ బద్దంగా గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న నాకు అధికారులు గౌరవం ఇవ్వడం లేదు. ఓడిపోయిన టీడీపీ నాయకులు చెప్పినట్టు అధికారులు చేయకడం ఏంటి?ఈ రాష్ట్రంలో రాజ్యాంగానికి విలువ లేకుండా చేశారు. ప్రోటోకాల్ పాటించాలని కూడా ఈ అధికారులకు తెలియదా? ఎమ్మెల్యే మాటలకు గౌరవం ఇవ్వరా? మేము ప్రజలు ఓట్లేస్తే గెలిచాం. ఎమ్మెల్యేగా ప్రజాసమస్యలను చెబితే అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారుల్లో మార్పు రావాలి. అధికారులు కూటమి నేతల మోచేతి నీళ్లు తాగొద్దు. ఎప్పుడూ కూటమి ప్రభుత్వమే ఉండదన్న విషయాన్ని అధికారులు గ్రహించాలి.ఎమ్మెల్యేగా గెలిచిన మేము అసెంబ్లీకి వెళ్తామే తప్ప టీడీపీ ఇన్ఛార్జ్లు వెళ్లరు. ఎవరి విలువ ఏంటో అధికారులు గుర్తించి వ్యవహరిస్తే మంచిది. ఎమ్మెల్యేల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అధికారులదే.పరిటాల శ్రీరామ్కు ప్రాణరక్షణ కావాలని అడిగితే అదనంగా మరో ఇద్దరు గన్మెన్లను వైఎస్ జగన్ కేటాయించారు. పార్టీలు చూడకుండా వైఎస్ జగన్ అందరికీ న్యాయం చేశారు. గత 8 నెలలుగా రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. చంద్రబాబు సీఎంగా ఉంటే ఏపీలో మర్డర్లు జరుగుతుంటాయి. వైఎస్ జగన్ ఇలాంటి అరాచకాలకు వ్యతిరేకం.చంద్రబాబు పాలనలో మహిళలు,ఆడపిల్లలకు రక్షణే లేదు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ఇప్పుడు ఏ వీధిలోకి వెళ్లినా మందుబాబులే కనిపిస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో కరోనా వచ్చినా సంక్షేమ పథకాలను ఆపలేదు.చంద్రబాబు ఏ పథకాన్నీ అమలు చేయడం లేదు.లోకేష్,పవన్ కళ్యాణ్ కాలర్ను ప్రజలు పట్టుకునే రోజు దగ్గర్లోనే ఉంది’అని విరూపాక్షి హెచ్చరించారు. -
డిన్నర్ పే ‘చర్చ’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్లో ఇప్పుడు ‘డిన్నర్ పే చర్చ’హాట్టాపిక్గా మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఓ యువ ఎమ్మెల్యే తన సన్నిహిత ఎమ్మెల్యేలకు డిన్నర్ ఇవ్వడం, ఆ డిన్నర్కు వెళ్లిన ఎమ్మెల్యేలు పలు వివాదాస్పద అంశాలపై చర్చించడంతో కాంగ్రెస్ పార్టీలో ఏదో జరిగిపోతుందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఈ ఎమ్మెల్యేల డిన్నర్పై ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన సుదీర్ఘ భేటీలో ఈ అంశం కూడా చర్చకు వచ్చిందని సమాచారం. మనం లేకపోతే.. వాళ్లున్నారా ? ఆ ఎమ్మెల్యే ఆహ్వనం మేరకు హైదరాబాద్లోని ఓ హోటల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదారుగురు ఎమ్మెల్యేలు ఇటీవల డిన్నర్కు వెళ్లారు. ఈ డిన్నర్కు వెళ్లిన ఓ ఎమ్మెల్యే కథనం ప్రకారం.. డిన్నర్లో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రుల గురించి చర్చించుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన, మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేలకు ఇస్తున్న నిధులు, మంత్రులతో సఖ్యత, ఓ కీలకశాఖకు చెందిన మంత్రి వ్యవహారశైలి తదితర అంశాలపై వారు మాట్లాడుకున్నారు.మంత్రులు తమ నియోజకవర్గాలకు వేల కోట్ల రూపాయల నిధు లు తీసుకెళుతున్నారని, ఎమ్మెల్యేలకు మాత్రం నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఓ ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రస్తావించారు. అసలు ఎమ్మెల్యేలు లేనిదే మంత్రులు ఎక్కడి నుంచి వస్తారని, ఎమ్మెల్యేలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యా నించినట్టు తెలిసింది. పాలమూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రభుత్వంలోని కీలకశాఖకు చెందిన మంత్రి గురించిన అంశాన్ని లేవనెత్తారు.విచ్చలవిడిగా ఆయన తన వ్యవహార శైలితో పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని, ఆయనపై తన పోరాటాన్ని ఆపేది లేదని, ఈ విషయంలో ఎంతవరకైనా వెళతానని ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యానించినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రజాపాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు ప్రయత్నం జరుగుతోందని, ఈ తరుణంలో పార్టీని, ప్రభుత్వాన్ని క్రమశిక్షణగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందని వారు మాట్లాడుకున్నారు. విభేదాలు రానివ్వొద్దన్న సీఎం ! కాగా, ఎమ్మెల్యేల డిన్నర్ వ్యవహారం నిఘా వర్గా ల ద్వారా సీఎం రేవంత్రెడ్డి దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన మంత్రులతో భేటీలో ఈ అంశాన్ని ప్రస్తా వించినట్టు సమాచారం. ఎమ్మెల్యేలతో విభేదాలు రానివ్వొద్దని, వారితో గ్యాప్ రావడం ద్వారా పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని, ఇన్చార్జ్ మంత్రులు ఆయా జిల్లాల ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటే బాగుంటుందని సూచించినట్టు సమాచారం. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య కూడా సమన్వయం అవసరమని సీఎం రేవంత్ మంత్రులకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. -
Delhi Elections: ఆప్కు భారీ షాక్..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపధ్యంలో రాజధానిలో వివిధ రాజకీయ పార్టీలు ప్రచారంలో మునిగితేలుతున్నాయి. ఇటువంటి సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది.కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్ పార్టీలో అసంతృప్తి నెలకొంది. టికెట్లు దక్కకపోవడంతో ఆగ్రహించిన ఎనిమిదిమంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో జనక్పురి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజేష్ రిషి, కస్తూర్బా నగర్ ఎమ్మెల్యే మదన్ లాల్, మెహ్రౌలి ఎమ్మెల్యే నరేష్ యాదవ్, త్రిలోక్పురి ఎమ్మెల్యే, దళిత నేత రోహిత్ కుమార్, పాలం ఎమ్మెల్యే భావన గౌర్, బిజ్వాసన్ ఎమ్మెల్యే భూపేంద్ర సింగ్ జూన్ ఉన్నారు.వీరంతా తమ రాజీనామా పత్రాలలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party)తో పాటు అరవింద్ కేజ్రీవాల్పై పలు ఆరోపణలు చేశారు. ఈ ఎమ్మెల్యేలకు పార్టీ తిరిగి టిక్కెట్లు ఇవ్వలేదు. ఇంతవరకూ మౌనం వహించినవారంతా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంతో రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసిన వారిలో ఒకరైన రోహిత్ కుమార్ మెహ్రోలియా తన రాజీనామా పత్రాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ‘వారికి బాబా సాహెబ్ ఫొటో మాత్రమే కావాలి. ఆయన ఆలోచనలు కాదు. అలాంటి అవకాశవాద, కృత్రిమ వ్యక్తులతో నా సంబంధాన్ని ముగించుకుంటున్నాను’ అని రాశారు.ఇదేవిధంగా ‘పార్టీ ప్రాథమిక సభ్యత్వం(Membership)తో సహా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను.ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిలో చిక్కుకుంది’ అని పేర్కొంటూ మెహ్రౌలి ఎమ్మెల్యే నరేష్ యాదవ్ రాజీనామా చేశారు. అవినీతికి వ్యతిరేకంగా సాగిన అన్నా ఉద్యమం కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్భవించిందని, కానీ నేడు ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి ఊబిలో కూరుకుపోవడం బాధాకరంగా ఉందని నరేష్ యాదవ్ పేర్కొన్నారు.పాలం ఎమ్మెల్యే భావన గౌర్ తన రాజీనామాలో అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీపై తనకు ఇకపై నమ్మకం లేదని స్పష్టంగా రాశారు. అందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తూ ‘ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీ సిద్ధాంతం నుండి వైదొలిగిందని’పేర్కొన్నారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా తమ రాజీనామా పత్రాలలో ఇటువంటి ఆరోపణలు చేశారు.ఇది కూడా చదవండి: మరొకరిని బలిగొన్న పూణె వైరస్ -
పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ ముగిసేంత సమయం కావాలా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు? అసలు మీకెంత సమయం కావాలి? అసెంబ్లీ కాలపరిమితి ముగిసేంత సమయం కావాలా?’అంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మీకెంత సమయం కావాలో చెప్పండంటూ ఆదేశించింది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి, పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా శాసనసభ స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఈనెల 15న సుప్రీం కోర్టును ఆశ్రయించింది.ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ పేర్లతో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పి)ను దాఖలు చేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎం.సంజయ్కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాం«దీలపై బీఆర్ఎస్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్రావు తదితరుల పేర్లతో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎస్ఎల్పిపై శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మసిహ్తో కూడిన ధర్మాసనం విచారించింది. పది నెలలుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై పది నెలలుగా స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ల తరపు న్యాయవాదులు దామ శేషాద్రి నాయుడు, పొనుగోటి మోహిత్రావు సుప్రీంకోర్టుకు తెలిపారు. తమ పిటిషన్లపై హైకోర్టు ఉత్తర్వులు వచ్చి ఏడు నెలలైనా స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని నివేదించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారని స్పీకర్ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ చెప్పగా.. ఫిర్యాదులపై నోటీసులు ఇచ్చేందుకు స్పీకర్ కార్యాలయానికి పది నెలల సమయం పట్టిందా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. రీజనబుల్ టైం అంటే ఎంత? పార్టీ ఫిరాయింపులపై స్పందించేందుకు స్పీకర్ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఎంత అని న్యాయవాది రోహత్గీని జస్టిస్ గవాయి ప్రశ్నించారు. ఇందుకు రోహత్గీ బదులిస్తూ.. స్పీకర్ నిర్ణయానికి సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతంలో ఇచి్చన తీర్పును చదివి వినిపించారు. నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ ఎమ్మెల్యేలకు తగిన సమయం ఇవ్వాలని ఆ తీర్పులో ఆదేశాలు ఇచ్చిందన్నారు.జస్టిస్ గవాయి జోక్యం చేసుకుని ‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో అసెంబ్లీ కాలపరిమితి ముగింపు దశలో నిర్ణయం తీసుకుంటారా? అనర్హత విషయంలో మహారాష్ట్ర స్పీకర్ మాదిరిగా వ్యవహరిస్తారా?’అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపులపై స్పందించేందుకు ఎంత సమయం కావాలో అసెంబ్లీ సెక్రటరీ కనుక్కుని చెప్పాలని ధర్మాసనం సూచించింది. ఇందుకు మీకెంత సమయం కావాలో చెప్పాలని ధర్మాసనం రోహత్గీని అడగ్గా.. రెండు వారాలు కావాలని బదులిచ్చారు. రోహత్గీ విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ.. ‘ఈ అంశం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరమైతే లేదు. ఫోన్ కాల్ సరిపోతుంది’అంటూ జస్టిస్ గవాయి చమత్కరించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి ధర్మాసనం వాయిదా వేసింది. -
పొలిటికల్ ‘గ్యాంగ్వార్’: ఎమ్మెల్యేపై కాల్పులు.. మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
రూర్కీ: ఉత్తరరాఖండ్లో పొలిటికల్ గ్యాంగ్వార్ చోటుచేసుకుంది. రూర్కీలోని ఖాన్పూర్ ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ క్యాంప్ ఆఫీస్పై కాల్పులు జరిపిన కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ సింగ్ ఛాంపియన్ను హరిద్వార్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.గత కొంతకాలంగా ఈ నేతలిద్దరూ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం, ఖాన్పూర్ మాజీ ఎమ్మెల్యే ఛాంపియన్ తన అనుచరులతో కలిసి కుమార్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఇద్దరి నేతల అనుచరుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. అలాగే కర్రలతో దాడి చేసుకున్నారు.ఖాన్పూర్ ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ 2022లో అసెంబ్లీ ఎన్నికల్లో ఖాన్పూర్ నియోజకవర్గంలో ఛాంపియన్ భార్య కున్వరాణి దేవయానిని ఓడించినప్పటి నుండి ఇద్దరి మధ్య వైరం నెలకొంది. ఆదివారం బీజేపీ నేత ఛాంపియన్ గాల్లోకి బుల్లెట్లను పేల్చాడని, దీంతో ఉద్రిక్తత నెలకొందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.హరిద్వార్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ దోవల్ మాట్లాడుతూ భారత శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఛాంపియన్ను అరెస్టు చేశామని తెలిపారు. అలాగే ఛాంపియన్ నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే ఉమేష్ కుమార్పై కూడా కేసు నమోదు చేశామని, ఆయనతో పాటు ఆయన మద్దతుదారులను కూడా అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ నేతలకు చెందిన ఆయుధ లైసెన్స్లను నిలిపివేయాలని హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్కు సిఫారసు చేసినట్లు దోవల్ తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.కాగా చట్టంతో ఆటలాడుకోవడం ప్రజా ప్రతినిధులకు తగదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మహేంద్ర భట్ అన్నారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని, భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని కోరినట్లు భట్ ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ లేదా దేశ రాజ్యాంగం లేదా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి అనుమతించవని ఆయన అన్నారు.ఇది కూడా చదవండి: కుంభమేళా నుంచి వస్తుండగా ప్రమాదం.. కుటుంబమంతా దుర్మరణం -
నేను మారాను.. మీరూ మారండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని.. వర్గాలను దూరం పెట్టి కార్యకర్తలకు సమయం ఇవ్వండంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో గెలవాలని పిలుపునిచ్చారు. ‘‘మీ ప్రోగ్రెస్ రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయి. నేను మారాను.. మీరూ మారండి’’ అంటూ సీఎం సూచించారు.కొందరు ఎమ్మెల్యేలు అతి ఉత్సాహం చూపిస్తున్నారు. అతి చేస్తే సహించేది లేదని రేవంత్ స్పష్టం చేశారు. ప్రతి పక్షాలకు ధీటుగా కౌంటర్ ఇవ్వండి. కాంగ్రెస్ సంక్షేమంపై విస్తృత ప్రచారం జరగాలి’’ అని రేవంత్ చెప్పారు.సీఎం రేవంత్రెడ్డి బృందం జనవరి 21 నుంచి 23 వరకూ స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటించనున్నారు. దావోస్లో 20 నుంచి 24వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ వార్షిక సదస్సు జరగనుంది. ప్రస్తుత పర్యటనలోనూ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ బృందం కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసినట్లు సమాచారం.ఇదీ చదవండి: హైదరాబాద్ వాసులకు గుడ్న్యూస్.. -
ఎమ్మెల్యే అని కూడా చూడకుండా గుడ్డు పగలగొట్టారు బ్రో..
-
కోడిగుడ్లతో బీజేపీ సీనియర్ ఎమ్మెలేపై దాడి
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ఆర్ ఆర్ నగర్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడి(Muniratna Naidu)పై కొందరు ఆగంతకులు కోడిగుడ్డు విసిరారు. అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి మునిరత్న బెయిల్ మీద బయటకు వచ్చి రెండు నెలలు అయ్యింది. అయితే అప్పటి నుంచి ఆయనకు ప్రజల్లోకి వచ్చింది ఇదే తొలిసారికాగా.. ఆ టైంలోనే దాడి జరగడం గమనార్హం.బుధవారం లక్ష్మీ నగర్లో నిర్వహించిన వాజ్పేయి(Vajpayee) శతజయంతి ఉత్సవాల్లో మునిరత్న పాల్గొన్నారు. తిరిగి తన అనుచరులతో వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఆయనపైకి గుడ్డు విసిరారు. ఆపై మంటతో కాసేపు ఆయన విలవిలలాడిపోయారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఆయనకు రకరకాల వైద్య పరీక్షలు జరిపారు. చివరకు ఆయన బాగానే ఉన్నారని ప్రకటించి అర్ధరాత్రి పూట వైద్యులు డిశ్చార్జి చేశారు.ఇదిలా ఉంటే.. మునిరత్న నాయుడు రాజకీయాలతోనే కాదు.. సినిమాలతోనూ పేరు సంపాదించుకున్నారు. ఉపేంద్ర, దర్శన్ లాంటి అగ్ర తారాలతో ఆయన చిత్రాలను నిర్మించారు. 2013, 2018, 2020, 2024 ఎన్నికల్లో రాజరాజేశ్వరి నగర్(RR Nagar) నుంచి ఆయన ఎమ్మెల్యేగా నెగ్గారు. గతంలో కర్ణాటక కేబినెట్ మినిస్టర్గానూ పని చేశారు. అయితే.. In a dramatic incident on Wednesday, #BJP MLA #Munirathna was targeted with an egg during an event marking the birth anniversary of former Prime Minister #AtalBihariVajpayee in #Bengaluru's #NandiniLayout.Police have arrested three individuals in connection with the attack and… pic.twitter.com/TWavEBJADq— Hate Detector 🔍 (@HateDetectors) December 25, 2024ఈ ఏడాది సెప్టెంబర్లో ఆయనపై అనూహ్యమైన ఆరోపణలు వచ్చాయి. సోషల్ వర్కర్గా పని చేసే ఓ మహిళ(40) ఫిర్యాదుతో ఈ బీజేపీ ఎమ్మెల్యేపై పలు నేరాల కింద కేసు నమోదయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద మూడు రోజులుల్లో ఉండి బయటకు వచ్చారాయన. అయితే బయటకు వచ్చి కొన్నినిమిషాలకే.. అత్యాచారం కేసు(Rape Case)లో ఆయన్ని మరోసారి అరెస్ట్ చేశారు.వాపై నెలరోజులపాటు సెంట్రల్ జైల్లో గడిపిన ఆయనకు.. అక్టోబర్ మూడో వారంలో ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఊరట ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది. గుడ్డు దాడిపై రాజకీయం తమ పార్టీ సీనియర్ నేత మునిరత్నపై కోడిగుడ్డు దాడి కాంగ్రెస్ కార్యకర్తల పనేనని బీజేపీ(BJP) ఆరోపిస్తోంది. మునిరత్న మరో అడుగు ముందుకు వేసి.. ఇది తనను చంపేందుకు జరిగిన కుట్ర అని ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మరికొందరు కాంగ్రెస్ నేతలు ఈ కుట్రలో భాగమయ్యారని అన్నారాయన. అయితే ఘటనపై నందిని లేఅవుట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల వివరాలను వెల్లడించాల్సి ఉంది. -
వాకౌట్.. వాయిదాలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల రెండో రోజు సోమవారం బీఆర్ఎస్ నిరసన లు, వాకౌట్, అధికారపక్ష సభ్యుల విమర్శల మధ్య శాసనసభ అర్ధంతరంగా ముగిసింది. ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ ఒక్క రోజే భేటీ నిర్వహించి, 16వ తేదీకి (సోమవారానికి) వాయిదావేశారు. ఈమేరకు సోమవారం ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశం ప్రారంభమైనా.. ప్రశ్నోత్తరా లు, సంతాప తీర్మానాలు, ప్రభుత్వ బిల్లుల ప్రతిపాదనకే పరిమితమైంది.మాజీ సర్పంచ్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం నిర్దిష్ట హామీ ఇవ్వలేదని నిరసన తెలుపుతూ బీఆర్ఎస్ ప్రశ్నోత్తరాల సమయంలో సభ నుంచి వాకౌట్ చేసింది. ప్రశ్నోత్తరాలు, టీ విరామం తర్వాత సభ తిరిగి సమావేశంకాగానే.. ‘లగచర్ల’అంశంపై చర్చకోసం బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఈ గందరగోళంతో స్పీకర్ సభ ను మంగళవారం ఉదయానికి వాయిదా వేశారు. నిర్దేశిత సమయంలోనే ప్రశ్నోత్తరాలు సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలకు సంబంధించి స్పీకర్ ప్రకటన చేశారు. రోజూ గంటపాటు జరిగే ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో.. పది ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఆరు నిమిషాల సమయం లభిస్తోందని తెలిపారు. కానీ నిర్దేశిత సమయంలో పూర్తి చేయకపోవడం, కొన్ని ప్రశ్నలు మిగిలిపోవడంతో సభ్యులు అసంతృప్తి చెందుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో సభ్యులు, మంత్రులు ప్రశ్నలు, సమాధానాలు సూటిగా, క్లుప్తంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. సంతాప తీర్మానాలు.. బిల్లులు.. ⇒ ఉమ్మడి ఏపీ శాసనసభలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు దివంగత సభ్యులకు శాసనసభ రెండు నిమిషాల పాటు సంతాపం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతిదేవి (మెట్పల్లి), ఊకె అబ్బయ్య (బూర్గంపాడు, ఇల్లందు), డి.రామచంద్రారెడ్డి (దొమ్మాట) మరణం పట్ల స్పీకర్ ప్రసాద్కుమార్ సంతాప తీర్మానం ప్రతిపాదించారు. ⇒ ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ బిల్లు 2024’ను సీఎం రేవంత్ పక్షాన మంత్రి శ్రీధర్బాబు సభకు సమరి్పంచారు. ‘తెలంగాణ యూనివర్సిటీస్ (సవరణ) బిల్లు–2024’ను సీఎం తరఫున మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టారు. వాయిదా తీర్మానాలన్నీ తిరస్కరించిన స్పీకర్ ⇒అసెంబ్లీ సమావేశాల రెండో రోజున బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ సభ్యులు ఇచి్చన పలు వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. ⇒ ‘లగచర్ల’అంశంపై చర్చించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, కాలేరు వెంకటేశ్, కొత్త ప్రభాకర్రెడ్డి, విజయుడు, మర్రి రాజశేఖర్రెడ్డి వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి దాడులను అరికట్టడం, బాధితులకు పరిహారం అందించే అంశంపై బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్, పాయల్ శంకర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. ⇒ మూసీ ప్రక్షాళన, హైడ్రాపై చర్చించాలంటూ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. -
ఎమ్మెల్యేలకు పాఠాలు
-
ఆప్ ఎన్నికల వ్యూహం.. ఎమ్మెల్యేలకు మొండిచెయ్యి
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది(2025) ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో పార్టీలన్నీ ఎన్నికల్లో పోటీకి వ్యూహప్రతివ్యూహాలు సాగిస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వెలువరించిన అభ్యర్థుల రెండో జాబితాలో పార్టీ వ్యూహం వెల్లడయ్యింది.సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచెయ్యిఆప్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పాతవారికి తిరిగి టిక్కెట్లు దక్కలేదు. పార్టీ ఇప్పటి వరకు 31 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే ఆయా స్థానాల్లోని ఎమ్మెల్యేలకు పార్టీ తిరిగి టిక్కెట్లు కేటాయించలేదు. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లాన్ల స్థానాలు కూడా మారాయి. ఇదే సమయంలో అంత్యంత ఆసక్తికరంగా 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తమ అభ్యర్థులు, కౌన్సిలర్లపై ఎమ్మెల్యేలకు మించిన రీతిలో ఆప్ వారిపై నమ్మకం వ్యక్తం చేసింది.విమర్శలకు చెక్ పెడుతూ..పక్కా ప్రణాళికతో ఆమ్ ఆద్మీ పార్టీ స్థానిక ఎమ్మెల్యేలపై ఓటర్లకు ఉన్న ఆగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో కొత్తవారికి అవకాశం ఇచ్చిన కారణంగా ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేలను విమర్శించే అవకాశాలు తక్కువగా ఉంటాయనే ఎత్తుగడను ఆప్ ప్లే చేసింది. ఈసారి ఎన్నికలు అంత సులువు కాదని వ్యూహకర్తలు కూడా భావిస్తున్నారట. పార్టీ అంతర్గత సర్వేల్లోనూ ఇదే విషయం తేలిందంటున్నారు.ప్రజాభిప్రాయ సేకరణఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న ఆప్ తమ అభ్యర్థుల ఎంపికలో ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించిందని సమాచారం. అభ్యర్థులను ఖరారు చేసిన చాలా స్థానాల్లో ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బదులు కౌన్సిలర్లకే ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. గత ఎన్నికల్లో ఆప్ టిక్కెట్పై మూడు స్థానాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఆప్ ఈ స్థానాల నుంచి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించింది. మిగిలిన 20 సీట్లలో రాఖీ బిర్లాన్, మనీష్ సిసోడియాల సీట్లు కూడా మారాయి. 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల టిక్కెట్లు మార్చి కొత్త అభ్యర్థులను పార్టీ రంగంలోకి దించింది. వీరిలో 90 శాతం మంది ఆప్ కౌన్సిలర్లు కావడం విశేషం. ప్రజల ఫీడ్బ్యాక్ ఆధారంగా ప్రజాదరణ పొందిన కౌన్సిలర్లకు రాబోయే ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆప్ అవకాశం కల్పించింది.ఈ కౌన్సిలర్లకు ఆప్ టిక్కెట్లునరేలా నుంచి దినేష్ భరద్వాజ్, ఆదర్శ్ నగర్ నుంచి ముఖేష్ గోయల్, జనక్పురి నుంచి ప్రవీణ్ కుమార్, డియోలి నుంచి ప్రేమ్ కుమార్ చౌహాన్, చాందినీ చౌక్ నుంచి పునర్దీప్ సింగ్ సాహ్ని, త్రిలోక్పురి నుంచి అంజనా పర్చా (మాజీ కౌన్సిలర్)కు ఆప్ టిక్కెట్లు కేటాయించింది. ఇదేవిధంగా త2020లో ఓడిపోయిన అభ్యర్థులు మళ్లీ టిక్కెట్లు కేటాయించింది. ఈ జాబితాలో రోహిణి నుంచి ప్రదీప్ మిట్టల్, గాంధీ నగర్ నుంచి నవీన్ చౌదరి ఉన్నారు. ఆ పార్టీ ఇప్పటి వరకు 31 మంది అభ్యర్థులను ప్రకటించింది.ఇది కూడా చదవండి: కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత -
రాక్షస పాలనలో దళితులపై కక్ష
సాక్షి, అమరావతి: ‘‘ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..?’’ అంటూ అహంకారపూరితంగా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు! ఆ వర్గాన్ని ఉక్కుపాదంతో అణగదొక్కుతూ.. దళితులకు అసలు నాయకత్వమే లేకుండా చేయాలనే దుర్నీతితో సాగుతున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడం.. ప్రశ్నించడమే పాపమన్నట్లు వ్యవహరిస్తున్నారు.ఒకపక్క ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అనుక్షణం వేధింపులకు గురిచేస్తూ.. మరోవైపు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఆర్డీవో, డీఎస్పీ, మండల స్థాయి అధికారులపై కక్ష సాధింపు చర్యలకు ఉపక్రమించారు. సూపర్ సిక్స్ సహా హామీల అమలు, అక్రమాలు, వైఫల్యాలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకు ఎస్సీ వర్గానికి చెందిన సామాజిక కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వారిని పోలీసు స్టేషన్లలో అర్ధ నగ్నంగా నిలబెట్టి అవమానాలకు గురి చేసిన ఘటనపై సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచి ఎస్సీలను ఉక్కుపాదంతో అణచివేత చర్యలను రోజు రోజుకు ఉద్ధృతం చేస్తున్నారని ఆ సామాజిక వర్గ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులు..» అధికారంలోకి వస్తూనే వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను లక్ష్యంగా చేసుకున్న కూటమి ప్రభుత్వం ఆయనపై వరుసగా కేసులు నమోదు చేస్తూ రాజకీయ వేధింపులకు తెర తీసింది. దళితులకు నాయకత్వం లేకుండా చేయాలనే కుట్రపూరిత ధోరణితో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా కేసులు నమోదు చేస్తూ బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. నందిగం సురేష్ పై అసలు ఎక్కడెక్కడ, ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలంటూ స్వయంగా హైకోర్టు ఆదేశించడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. అన్యాయంపై ప్రశ్నించడం.. దళితుల్లో స్ఫూర్తి రగల్చడమే పాపమనే విధంగా దళిత నేతల పట్ల కూటమి సర్కారు దుర్నీతితో వ్యవహరిస్తోంది. » చంద్రబాబుపై గతంలో గులకరాయి పడిన ఘటనకు సంబంధించి నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్లపై కూటమి సర్కారు ఇప్పుడు అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు దిగింది. » కూటమి సర్కారు రాజకీయ క్షక్ష సాధింపుల్లో భాగంగా నారా లోకేశ్పై ట్వీట్ చేశారంటూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై స్థానిక పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు చేసింది. జోరుగా సాగుతున్న పేకాట కార్యకలాపాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చిన ఓ ప్రజాప్రతినిధి పట్ల ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. జరుగుతున్న విషయాన్ని చెబితే దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా విపక్షంలో ఉన్నారనే ఏకైక కారణంతో ఓ ఎమ్మెల్యేపై కేసులు బనాయించడం కూటమి సర్కారు అరాచకాలకు పరాకాష్ట. » బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గతేడాది ఓ వలంటీర్ మృతి చెందిన ఘటనకు సంబంధించి మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న కూటమి సర్కారు అధికారంలోకి రాగానే ఈ కేసులో ఎలాంటి సంబంధం లేని విశ్వరూప్ కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ను అక్రమంగా అరెస్టు చేసింది. డాక్టర్ శ్రీకాంత్ను ఏ 1గా చేర్చి జైలుకు తరలించింది. ఇటీవల ఆయన బెయిల్పై విడుదలయ్యారు. » మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు మేరుగు నాగార్జునపై టీడీపీ నేతలు ఓ మహిళతో తప్పుడు కేసు పెట్టించారు. నాగార్జున డబ్బులు తీసుకుని మోసం చేశారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు బనాయించారు. అయితే తనపై అధికార పార్టీ నాయకులు తీవ్ర ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించినట్లు ఆ మహిళ అఫిడవిట్లో పేర్కొంది. తాను ఎన్నడూ మేరుగు నాగార్జునను చూడలేదని, తమ ఇద్దరి మధ్య ఎలాంటి ఆరి్థక లావాదేవీలు లేవని అందులో వెల్లడించడం గమనార్హం.విద్యావంతుడికి అవమానాలు.. రాజమహేంద్రవరంలో వరదలు వచి్చనప్పుడు ప్రజలు పడిన ఇబ్బందులను నెల రోజుల్లోనే పరిష్కరించినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై స్పందించిన విద్యావంతుడైన దళిత యువకుడు పులి సాగర్ తాను నివాసం ఉండే కృష్ణానగర్, బ్రదరన్ చర్చి ప్రాంతాల్లో వరద నీరు ఇంకా నిల్వ ఉండటం, సమస్యలు తొలగకపోవడంపై ప్రశ్నిస్తూ పోస్టు పెట్టారు. దీంతో ఆయనపై కేసులు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం దారుణ అవమానాలకు గురి చేసింది. పోలీసు స్టేషన్కు రావాలని ఆదేశించడంతో ఈ నెల 2న ఆయన రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ స్టేషన్కు వెళ్లారు. బీఎస్సీ, బీఈడీ చదివిన తనను పోలీసులు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ, బెదిరిస్తూ.. సెల్లో అర్ధనగ్నంగా నిలబెట్టి.. మహిళా పోలీసు కానిస్టేబుళ్లను కాపలాగా ఉంచారని పులి సాగర్ వాపోయారు. దళిత యువకుడిని పోలీసులు ఘోరంగా అవమానించిన తీరును సామాజికవేత్తలు ఖండిస్తున్నారు. » చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గంలో గత ఎన్నికల సమయంలో విద్యుత్తు సబ్ స్టేషన్లో ప్రమాదానికి సంబంధించి టీడీపీ నాయకుల ప్రోద్బలంతో దళితుడైన యాదమరి ఎంపీపీ సురేష్ బాబుపై చిత్తూరు టూ టౌన్ సీఐ అక్రమ కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడగానే పూతలపట్టు మండలం ఎగువ పాలకూరు దళితవాడలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హరి, జయపాల్, భారతి, బాబుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. » రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లెలో ఇటీవల దళిత వర్గానికి చెందిన ప్రభుపై టీడీపీ సానుభూతిపరులు మరుగుతున్న నూనెను ఒంటిపై పోయడంతో తీవ్ర గాయాలతో కడప రిమ్స్లో చేరాడు. » దళితుడనే చిన్న చూపుతో రాజంపేట మున్సిపల్ కమిషనర్ రాంబాబును టీడీపీ నాయకులు ఆయన కార్యాలయంలోనే వేధించారు. తీవ్ర మానసిక వేధింపులతో కలత చెందిన ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికార యంత్రాంగంపై వేధింపులు» ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐపీఎస్ సంజయ్కు నిష్పక్షపాతంగా పని చేస్తారనే పేరుంది. ఆయన ఏ రాజకీయ పక్షానికీ కొమ్ము కాయరని ఐపీఎస్ అధికారులే స్పష్టం చేస్తున్నారు. అగి్నమాపక డీజీ, సీఐడీ చీఫ్ హోదాల్లో సంజయ్ అక్రమాలు, నిధుల దురి్వనియోగానికి పాల్పడ్డారనే నెపం మోపి ఆయన్ను కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. » ఐపీఎస్ అధికారి పీవీ సునీల్కుమార్ను వేధింపులకు గురి చేస్తున్న కూటమి సర్కారు ఐపీఎస్లు పాల్రాజు, జాషువాకు పోస్టింగ్లు ఇవ్వకుండా కక్ష సాధిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారి అన్బురాజన్కు పోస్టింగ్ ఇవ్వలేదు. రాజకీయ దురుద్దేశాలతో రిటైర్డ్ సీనియర్ పోలీస్ అధికారి విజయ్పాల్ను వేధించి అరెస్టు చేసింది. » ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణకు నిజాయితీగా, చట్ట ప్రకారం వ్యవహరిస్తారని అధికార వర్గాల్లో పేరుంది. గత ప్రభుత్వంలో ఆయన స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ ఐజీగా పని చేశారు. విధి నిర్వహణలో నిక్కచి్చగా వ్యవహరించిన రామకృష్ణపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. మార్గదర్శి చిట్ఫండ్స్లో తనిఖీలు నిర్వహించి అక్రమాలను వెలికి తీసినందుకు ఆయనపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు దిగింది. -
నాలుగుసార్లు ఎంపీ.. ఐదుసార్లు ఎమ్మెల్యే.. ఇప్పుడు గ్యాంగ్స్టర్
బీహార్: కొందరు రాజకీయ నేతలు అక్రమ దందాలు సాగిస్తున్నారనే వార్తలను మనం అప్పుడప్పుడు వింటుంటాం. అయితే నాలుగు సార్లు ఎంపీ, ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ప్రజాప్రతినిధి ఇప్పుడు గ్యాంగ్స్టర్గా మారాడంటే ఒక పట్టాన నమ్మలేం. కానీ ఇది నిజం. యూపీకి చెందిన ఒక నేత ప్రజాప్రతినిధి అనే పదానికే మచ్చతెచ్చేలా ప్రవర్తించాడు.రాజకీయాల్లో విజయంకల్తీ మద్యం కేసులో నిందితుడైన యూపీకి చెందిన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే రమాకాంత్ యాదవ్ రాజకీయాల్లో పలు విజయాలను అందుకున్నారు. అజంగఢ్ నుంచి నాలుగు సార్లు ఎంపీ, ఫూల్పూర్ పొవై అసెంబ్లీ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2022లో మహూల్లో చోటుచేసుకున్న విషపూరిత మద్యం కుంభకోణం కేసులో చిక్కుకున్న ఆయన రెండేళ్లకు పైగా జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు రమాకాంత్ యాదవ్ ఐఆర్-42 గ్యాంగ్గా జాబితాలో చేరారు.1985లో రాజకీయ ప్రవేశంఫుల్పూర్ ప్రాంతంలోని అంబారి నివాసి రమాకాంత్ యాదవ్ 1985లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆఫుల్పూర్ పొవై అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996లో అజంగఢ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నాలుగు సార్లు ఎంపీ అయ్యారు. 2019లో బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్లో చేరారు. అయితే ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీలో చేరి 2022లో ఫూల్పూర్ పోవై అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.బీఎస్పీ అభ్యర్థిపై దాడి1998 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపునకు ముందు రమాకాంత్ యాదవ్ బీఎస్పీ అభ్యర్థి అక్బర్ అహ్మద్ డంపీపై దాడి చేసినందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 2022లో మహుల్లో విషపూరిత మద్యం ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ కేసులో రమాకాంత్ యాదవ్ హస్తమున్నట్లు దర్యాప్తులో తేలింది. అప్పటి నుంచి ఆయన జైలులో ఉన్నారు.ఐఆర్ -42 ముఠా జాబితాలో..వారణాసి జోన్ ఏడీజీ హత్య, కల్తీ మద్యం తయారు చేయడం, లైసెన్స్ పొందిన దేశీయ మద్యం షాపులో దానిని విక్రయించడం లాంటి నేరాలకు పాల్పడి, జైలుకెళ్లిన ఎమ్మెల్యే రమాకాంత్ యాదవ్, అతనితో సంబంధం ఉన్న 15 మంది సభ్యులను ఐఆర్ -42 ముఠా జాబితాలో పోలీసులు చేర్చారు. ఇతనితో పాటు ఇతని ముఠా సభ్యులపై గ్యాంగ్స్టర్ చట్టం కింద పోలీసులు చర్యలు చేపడుతున్నారు.ఇది కూడా చదవండి: Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం -
Ambati Rambabu: లోకల్ ఎమ్మెల్యే టాక్స్.. క్యాష్ కొట్టందే పని కాదు
-
పవనూ.. ఎవరి మీద ఈ ఆవేశం? (ఫొటోలు)
-
Maharashtra: తొలిసారిగా అసెంబ్లీకి 78 మంది..
సాక్షి ముంబై: రాష్ట్రంలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 78 మంది తొలిసారిగా విజయం సాధించారు. దీంతో ఈ 78 మంది మొదటిసారిగా అసెంబ్లీ మెట్లు ఎక్కనున్నారు . మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలకుగాను ఒక విడ తలా నవంబరు 30వ తేదీ ఎన్నికలు జరగగా నవంబరు 23వ తేదీ ఫలితాలు వెలువడ్డ సంగతి. తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (ఏపీ)ల మహాయుతి కూటమి చారిత్రాత్మక విజయం సాధించింది. బీజేపీకి 1152, శివసేన (షిండే)కు 57, ఎన్సీపీ (ఏపీ)కి 41 స్థానాలను దక్కించుకున్నాయి. కాగా ఈసారి గెలుపొందిన అభ్యర్థులలో 78 మంది మొదటిసారిగా విజయం సాధించి అసెంబ్లీకి వెమెట్లెక్కనున్నారు. వీరిలో బీజేపీ నుంచి 33 మంది, శివసేన (ఉంటే) నుంచి 14 మంది, ఎన్సీపీ (ఏపీ)కి చెందిన ఎనిమిది మంది. శివసేన (యూబీటి)కి చెందిన 10 మంది, కాంగ్రెస్ నుంచి ఆరు. ఎన్సీపి (ఎస్పీ)కి చెందిన నలుగురు అభ్యర్థులున్నారు. వీరితోపాటు చిన్న పార్టీలకు చెందిన మరో ఇద్దరు అభ్యర్థులతోపాటు ఒక ఇండిపెండెంటు కూడా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మహాయుతి, మహావికాస్ అఘాడికి చెందిన నేతలు తమ వారసులను బరిలోకి బరిలోకి దింపినప్పటికీ ప్రజలు అందరికీ పట్టంకట్టలేదని స్పష్టమైంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన వారసులలో లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కూతుడు శ్రీ జయా చవాన్ నాందేడ్ జిల్లా బోకర్ అసెంబ్లీ సియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ లేని విజయం సాధించారు. మరోవైపు మాజీ మంత్రి బాబన్ రాన్ పాచ్పుతే సుమారుడు విక్రమ్ శ్రీగోంధా నుంచి మాజీ ఎంపీ హరిభావు జూవలే కుమారుడు అమోల్ జావలే రావేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీవేసి విజయం సాధించారుఇదిలా ఉండగా ఆర్వీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యక్తిగత సహాయకుడైన సుమిత్ వాంఖడ, అదుల బాబా భోస్లే కరాడ్ నుంచి విజయం సాధించారు. అదే విధంగా శిసేన(షిండే) పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనీల్ బాబర్ కుమారుడు సహాస్ బాబర్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందగా ఎంపీ సందీపన్ భూమరే కుమారుడు విలాస్ భూమరే పైఠన్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్చే చిమణరావ్ పాటిల్ కుమారుడు అమోల్ పాటిల్ ఎరండోల్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా విజయం సాధించారు.ఇక ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ కుమార్తె సనా మాలిక్ ముంబైఓలని అణుశక్తినగర్ నుంచి తొలిసారిగా పోటీ చేసి విజయం సాధించారు. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి వర్షా గైక్వాడ్ సోదరీ జ్యోతి గైక్వాడ్ కూడా ధారావీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా గెలుపొందారు. వీరితోపాటు మాజీ ఉపముఖ్యమంత్రి, దివంగత ఆర్ ఆర్ పాటిల్ కుమారుడు ఎన్సీపీ(ఎస్పీ) పార్టీ తరపున తాస్ గావ్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేసి గెలుపొందారు. మరోవైపు తూర్పు బాంద్రా అసెంబ్లీ నుంచి శివసేన(యూబీటీ) తరపున ఉద్దవ్ ఠాక్రే బంధువైన వరుణ్ దేశామ్ మొదటిసారిగా విజయం సాధించారు.ముంబై నుంచి తొమ్మిది మంది..ఈ ఎన్నికల్లో ముంబై నుంచి తొమ్మిది. అభ్యర్థులు తొలిసారిగా విజయం సాధించిన వీరిలో మాహిం అసెంబ్లీ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధక్షుడు రాజ్ కాక్రే కుమారుడైన అమిత్ ఠాక్రే తొలిసారిగా బరిలోకి దిగగా శివసేన(షిండే) నుంచి సదా సర్వస్కర్, శివసేన(యూబీటీ) నుంచి మహేష్ సావంత్ పోటీ చేశారు. వీరిద్దరి మధ్య భారీగా ఓట్లు చీలి మహేష్ సావంత్ విజ సాధించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు, -
ఏం సందేశం ఇస్తున్నావు అధ్యక్షా?
సాక్షి, టాస్క్ఫోర్స్: గూడూరు ఎమ్మెల్యే తీరు స్థానికులను విస్మయానికి, గందరగోళానికి దారితీస్తోంది. ఆయన పోలీసులతో రహస్య సమావేశాలు నిర్వహించి రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఆదేశిస్తున్నారు. సభలు సమావేశాల్లోనూ రౌడీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఆపై రౌడీ షీటర్ల పుట్టిన రోజు వేడుకలు, వారి ఇళ్లల్లో జరిగే శుభకార్యక్రమాలకు వెళ్తూ వారిని మరింత ప్రోత్సహించే రీతిలో వ్యవహరిస్తున్నారు. పోలీసులు కూడా ఏమి చేయాలో దిక్కుతోచక రౌడీ షీటర్లతో సఖ్యతగా ఉంటున్నారు. వారికి ప్రతి పనిలోనూ సహకారం అందిస్తూ వస్తున్నారు. ఐడీ కానిస్టేబుళ్లు అయితే రౌటీ షీటర్ల అనుచరులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం చర్చనీయాంశమైంది.పట్టించుకుంటే ఒట్టునియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కడ హత్యలు జరిగినా దానికి కేంద్ర బిందువుగా గూడూరులోని రౌడీ షీటర్ల హస్తం ఉన్నట్లు విచారణలో తేలుతోంది. గూడూరుకు చెందిన ఓ రౌడీషీటర్ చిల్లకూరు మండల పరిధిలోని జాతీయ రహదారిపై పబ్లిక్గా దాబా నడుపుతున్నారు. అక్కడ పలు అసాంఘిక కార్యకలాపాలు చేపడుతున్నా పోలీసులు ఆ ప్రాంతం వైపు కన్నెత్తి చూడని పరిస్థితి. గతంలో గూడూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ భూమిలో దాబాకు ఎలా అనుమతులు మంజూరు చేస్తారంటూ డివిజన్ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీన్ని మనసులో పెట్టుకుని సదరు వ్యకిపై బెదింపులకు దిగి ఫిర్యాదును ఉప సంహరించుకునేలా చేశారు. అదే రౌడీ షీటర్ దాబా వద్ద తనతో పాటుగా తిరుగుతున్న ఓ యువకుడ్ని వారం రోజుల క్రితం తన అనుచరులతో కలసి హత్య చేశారు. ఆపై వాకాడు ప్రాంతంలో శవాన్ని పారేశారు. ఇదంతా చూస్తుంటే ప్రజాప్రతినిధుల నుంచి వీరికి ఎంత మద్దతు ఉందో అర్థం చేసుకోవచ్చు. గూడూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక ఏడాదిలో ఇన్ని హత్యలు, రౌడీయిజం, అక్రమాలు లాంటి దారుణాలు చోటు చేసుకున్న దాఖలాలు లేవని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
కాంగ్రెస్ గ్యారెంటీలపై సొంత ఎమ్మెల్యే నుంచే వ్యతిరేకత!
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు.. సొంత ప్రభుత్వాన్నే ఇరకాటంలో పడేశారు. ఎన్నికల హామీల్లో కొన్నింటిని రద్దు చేయాలంటూ సదరు ఎమ్మెల్యే చేసిన బహిరంగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలను కర్ణాటక కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించింది. ఆ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు.విజయనగర ఎమ్మెల్యే హెచఆర్ గవియప్ప.. తాజాగా ఓ పబ్లిక్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఎన్నికల హామీల వల్ల జనాలకు ఇళ్ల సదుపాయం కల్పించలేకపోతున్నామని, కాబట్టి వాటిలో కొన్నింటిని రద్దుచేయాలని సీఎం సిద్ధరామయ్యను పబ్లిక్గా కోరారాయన.ఉచిత పథకాల వల్ల ఇళ్ల నిర్మాణ పథకం సజావుగా ముందుకు సాగడం లేదు. ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రిగారికి విజ్ఞప్తి చేసేది ఒక్కటే. రెండు నుంచి 3 గ్యారెంటీ స్కీంలను తీసేయాలని కోరుతున్నా. అవి లేకపోయినా పెద్దగా ఫర్వాలేదు. తద్వారా కొందరికైనా ఇళ్లను నిర్మించి ఇవ్వగలం. ఇక నిర్ణయం సీఎంకే వదిలేస్తున్నా. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటా అని అన్నారు.ಗ್ಯಾರಂಟಿ ಯೋಜನೆಗಳಿಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಶಾಸಕರಿಂದಲೇ ವಿರೋಧ - ಒಂದೆರಡು ಗ್ಯಾರಂಟಿ ಸ್ಕೀಂ ತೆಗೆಯುವಂತೆ ಸಿಎಂಗೆ ಮನವಿ ಮಾಡ್ತೀವಿ ಎಂದ ಶಾಸಕ ಗವಿಯಪ್ಪ#CongressGuarantee #Congress #Gaviyappa #Bellary pic.twitter.com/3fsw27C1HD— soumya Sanatani (Modi Ka Parivar) (@NaikSoumya_) November 26, 2024అయితే .. ఎమ్మెల్యే వాదనను డీకే శివకుమార్ కొట్టిపారేశారు. ఎన్నికల హామీల అమలులో వెనకడుగు వేయబోయేది లేదని స్పష్టం చేశారాయన. ఆయన ఇలా చేయాల్సింది కాదు. ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేస్తాం. ఎలాంటి పథకాన్ని ఆపే ప్రసక్తే లేదు. మేం కర్ణాటక ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. దానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడిన సహించేది లేదు అని శివకుమార్ పేర్కొన్నారు.గవియప్ప సొంత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో తన నియోజకవర్గానికి నిధుల విషయంలో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారంటూ ఆరోపించారాయన. అయితే.. ఆ ఆరోపణలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సిరాజ్ షేక్ ఖండించారు. అంతేకాదు.. ఆరెస్సెస్తో ఉన్న అనుబంధమే గవియప్పతో అలా మాట్లాడిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. -
మహా పోరులో తెలుగోడి ఢంకా : బాబాయ్- అబ్బాయ్ల గెలుపోటములు తీరిదీ!
సోలాపూర్: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో కొందరి కలలు నెరవేరగా.. అనేకమంది వైఫల్యాలను చవిచూశారు. కోటే కుటుంబానికి చెందిన మహేశ్ కోటే, ఆయన తమ్ముడి కుమారుడు దేవేంద్ర కోటే వేర్వేరు పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. ఒకే కుటుంబం తరఫున ఇరువురు అందులో తెలుగువారు శాసనసభ్యులు అయ్యే కల నెరవేరుతోందని వారి అనుచరులు భావిస్తూ వచ్చారు. అయితే ఎమ్మెల్యే కావాలన్న మహేశ్ కోటే కల చెదిరిపోగా.. ఆయన తమ్ముడు కొడుకు దేవేంద్ర ఎమ్మెల్యేగా పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే గెలుపొందారు. పట్టణంలో పేరు గాంచిన కోటే కుటుంబం కాంగ్రెస్కు, ముఖ్యంగా సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ శిందేకు విధేయులుగా గుర్తింపు పొందింది. సుశీల్ కుమార్ శిందే ఎన్నికల్లో విజయం సాధించడంలో, రాజకీయ ఆధిపత్యం అంతా దివంగత విష్ణు పంతు కోటే ఎన్నికల వ్యూహంలో ప్రధానపాత్ర పోషించేవారు. అయితే సుశీల్ కుమార్ శిందే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత ఇక్కడి ఎంపీ టికెట్ విష్ణు పంతు కోటేకు వస్తుందని అంతా భావించారు. అయితే విష్ణు పంతుకోటేకు మాత్రం అవకాశం రాలేదు. ఆ తర్వాత 2009లో సోలాపూర్ సిటీ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విష్ణు పంత్ కుమారుడైన మహేశ్ కోటేకు కాంగ్రెస్ పార్టీ అభ్యరి్థత్వం లభించింది. అయితే అప్పటి మిత్రపక్షమైన ఎన్సీపీకి చెందిన వ్యక్తి రెబల్స్ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల మహేశ్ కోటే ఎన్నికల్లో పరాభవం చెందారు. తర్వాత కాంగ్రెస్లో ఉంటే తన ఎమ్మెల్యే కల నెరవేరదని తెలుసుకున్న మాజీ మేయర్ మహేశ్ కోటే శివసేనలో చేరారు. సోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి 2014లో శివసేన తరపున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఆయనకు తీరా సమయంలో శివసేన పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కూడా ఆయన మూడో స్థానంలో నిలిచారు. గత మూడు ఎన్నికలలో పరాభవం చవిచూసిన మహేశ్ కోటే గత సంవత్సరం కిందట శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరి ఎలాగైనా ఈసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలని గట్టిగా సన్నాహాలు చేసుకున్నారు. మహా వికాస్ అఘాడీకి చెందిన నేతలు అందరూ ఈ ఎన్నికల్లో మహేశ్కు వెన్నంటి ఉండి ప్రచారాలు నిర్వహించారు. అయినప్పటికీ ఆయనే సోలాపూర్ నార్త్ సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో ద్వితీయ స్థానంలో నిలిచి పరాభవం చెందారు. మరోవైపు ఆయన తమ్ముడి కుమారుడు దేవేంద్ర కోటే లోక్సభ ఎన్నికలకు ముందు ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో బీజేపీలో చేరారు. లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో ఆయన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ర్యాలీలో దూకుడుగా ప్రసంగించడం ద్వారా కరుడుగట్టిన హిందుత్వ వాదిగా ఇమేజ్ను సృష్టించుకున్నారు. ఆ తర్వాత కాలంలో మరింత దూకుడుగా వ్యవహరించి పార్టీలో క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ అధిష్టానం దృష్టిలో పడి అభ్యరి్థత్వాన్ని పొందారు. తద్వారా ఎన్నికల్లో పోటీ చేసి విజయ ఢంకా మోగించిన తెలుగువాడిగా రికార్డు సృష్టించారు. ఇదీ చదవండి: మహాయుతి గెలుపులో ‘లాడ్కీ బహీన్’: పట్టం కట్టిన మహిళా ఓటర్లు! -
Jharkhand: ఇలా గెలిచి.. అలా రాజీనామాకు సిద్ధమై.. ఏజేఎస్యూలో విచిత్ర పరిణామం
రాంచీ: జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం సాధించింది. జార్ఖండ్లో ఇండియా కూటమి విజయం సాధించింది. జార్ఖండ్లో హేమంత్ సోరెన్కు చెందిన జేఎంఎం (జేఎంఎం) 34 సీట్లు గెలుచుకుంది. ఇంతలో ఒక విచిత్ర పరిణామం చోటుచేసుకుంది.ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్యూ)పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే నిర్మల్ మహతో ఇంతలోనే రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ చీఫ్ సుదేష్ మహతోను అసెంబ్లీకి పంపేందుకు తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నానని ప్రకటించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఏజేఎస్యూ పార్టీ అధినేత సుదేష్ మహతో ఓటమి పాలయ్యారు.భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మిత్రపక్షమైన ఏజేఎస్యూ పార్టీ జార్ఖండ్లోని 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. అయితే కేవలం ఒక సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. అది కూడా కేవలం 231 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో ఈ విజయం సాధించింది. ఈ ఒక్క సీటు నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే నిర్మల్ మహతో కూడా ఇప్పుడు రాజీనామాకు సిద్ధమయ్యారు. మండూ స్థానం నుంచి ఎన్నికైన ఈయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ చీఫ్ సుదేష్ మహతోకు లేఖ పంపానని అన్నారు.తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా ఆయనను అభ్యర్థించానన్నారు. తద్వారా సుదేష్ మహతో ఇక్కడ(మండూ) జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. సుదేష్ మహతో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అభ్యర్థి అమిత్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇతనితో పాటు ఏజేఎస్యూకి చెందిన మరో 8 మంది అభ్యర్థులు కూడా ఓడిపోయారు. ఈ పార్టీ కేవలం మండూ సీటును మాత్రమే గెలుచుకుంది.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర ఫలితాల ఎఫెక్ట్.. మార్కెట్లు పుంజుకునే చాన్స్ -
జార్ఖండ్లో భట్టి బిజీబిజీ
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాల నేప థ్యంలో ఏఐసీసీ పరిశీలకు ని హోదాలో రాంచీలో మ కాం వేసిన తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదివారమంతా బిజీబిజీగా గడిపారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో జార్ఖండ్ పీసీసీ కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు. జేపీసీసీ అధ్యక్షుడు కేశవ్ మహతో కమలేశ్తో పాటు పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపిన భట్టి.. కొత్త ప్రభుత్వ ఏర్పాటు క్రమంలో పార్టీ వ్యూహాలను ఎమ్మెల్యేలకు వివరించారు.ఆ తర్వాత ఇండియా కూటమి ఎమ్మెల్యేలతో కలిసి జార్ఖండ్ గవర్నర్ సంతోశ్ గంగ్వార్ను కలిశారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో పాటు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐఎంఎల్ పార్టీల ఎమ్మెల్యేలతో కలిసి రాజ్భవన్లో గవర్నర్ను కలిసి ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. కాగా, జార్ఖండ్ ఎన్నికల ప్రక్రియలో కీలకపాత్ర పోషించిన భట్టి ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు తదితర అంశాల్లో కాంగ్రెస్ పక్షాన కీలకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఎన్నుకున్న ప్రజల కోసం కష్టపడి పనిచేయండి దేశాన్ని ఓ వికృత పార్టీ పాలిస్తోందని, ఆ పార్టీని కాదని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నందున వారి కోసం కష్టపడి పనిచేయాలని జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు భట్టి దిశానిర్దేశం చేశారు. రాంచీలోని హోటల్ చాణక్యలో జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీలో ఆయన మాట్లాడారు. ‘ఇక్కడ కూర్చున్న వాళ్లు అదృష్టవంతులు. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయాలనుకున్నారు. కానీ అందరికీ టికెట్లు దక్కలేదు. కాంగ్రెస్ పారీ్టలో పనిచేయడం అదృష్టం’ అని వ్యాఖ్యానించారు.తెలంగాణ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పార్టీ పక్షాన కొత్త ఎమ్మెల్యేలను అభినందించిన భట్టి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన రాష్ట్రానికి రావాలని కోరుతూ జార్ఖండ్ ఎమ్మెల్యేలకు సాదర ఆహా్వనం పలికారు. ఈ సమావేశంలో జార్ఖండ్ పార్టీ ఇన్చార్జి సిరివెళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
TG: ‘సీఎస్’ వస్తే ఎవరూ ఉండకూడదా? పోలీసులపై ఎమ్మెల్యే ఫైర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో శుక్రవారం(నవంబర్22) ఎస్పీఎఫ్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సచివాలయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సచివాలయం ఆరవ అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతకుమారి వస్తున్న సమయంలో వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.సీఎస్ శాంతకుమారి వస్తున్నారు పక్కకు ఉండాలని వనపర్తి ఎమ్మెల్యేకు పోలీసులు సూచించారు.తాను ఎమ్మెల్యేను అని చెప్పినా మేఘారెడ్డిని పోలీసులు పక్కన నిలబెట్టారు.సీఎస్ వస్తె ఫ్లోర్ అంతా ఎవ్వరూ ఉండకూడదా? అని ఈ సందర్భంగా పోలీసులను మేఘాారెడ్డి ఆగ్రహంగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేను ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తుపట్టకపోవడవం వల్లే వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలను గుర్తు పట్టడం లేదని ఎస్పీఎఫ్పై పలు ఫిర్యాదులుండడం గమనార్హం. -
తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు తీర్పు
-
ఢిల్లీ వక్ఫ్ బోర్డు కేసు: ఆప్ నేత అమానతుల్లా ఖాన్కు బెయిల్
ఢిల్లీ: ఢిల్లీ వక్ఫ్ బోర్డు మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అమానతుల్లా ఖాన్కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అమానతుల్లా ఖాన్, ఇతరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకోవడానికి కోర్టు నిరాకరించింది. వెంటనే అమానతుల్లాను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.ఇక..ఆయనపై విచారణ జరపడానికి అవసరమైన అనుమతి లభించలేదని పేర్కొంది. సప్లిమెంటరీ చార్జిషీట్లో పేరున్న మరియం సిద్ధిఖీపై కేసును కొనసాగించడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. అమానతుల్లా ఖాన్కు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు అంగీకరించగా, అవసరమైన అనుమతులు లేకుండా విచారణ కొనసాగదని కోర్టు తెలిపింది. అవసరమైన అనుమతి పొందిన తర్వాత, ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకోవచ్చని పేర్కొంది. -
ఎమ్మెల్యేలు బడ్జెట్పై అవగాహన పెంచుకోవాలి
సాక్షి, అమరావతి: బడ్జెట్పైన, బడ్జెట్ సమావేశాలపైన అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై ప్రతి ఎమ్మెల్యే అధ్యయనం చేయాలని అన్నారు. పబ్లిక్ గవర్నెన్స్లో ఎమ్మెల్యేలనూ భాగస్వాములను చేస్తామని చెప్పారు. వెలగపూడి అసెంబ్లీ కమిటీ హాలులో మంగళవారం ఎన్డీఏ ఎమ్మెల్యేలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో ఒకే అంశంపై ఎంత సమయమైనా చర్చించేవాళ్లమని, ఎమ్మెల్యేలకు సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి క్రమంగా తగ్గుతోందని చెప్పారు.కేంద్ర బడ్జెట్లో కూడా నిధుల కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. సభలో ప్రతిపక్షం లేదని అనుకోవద్దని, వాళ్లకు బాధ్యత లేదని అన్నారు. అసెంబ్లీకి తాము పంపిన ప్రతినిధి తమ కోసం ఏం మాట్లాడుతున్నారని ప్రజలు ఎప్పుడూ గమనిస్తారని చెప్పారు. సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు స్వాగతించరని తెలిపారు. స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు అసెంబ్లీ రూల్స్ తెలియాలని చెప్పారు. అనంతరం బడ్జెట్పై పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు.ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంఆ తర్వాత సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. 150 రోజుల పాలనలో చాలా నిర్ణయాలు తీసుకున్నాని చంద్రబాబు చెప్పారు. ఎమ్మెల్యేలు హుందాగా ఉండాలని, వారి దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపైన చర్చించాలని సూచించారు. ఈ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్రాజు, ఎన్డీఏ కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేలకు ముడుపులు.. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతల దందా
తూర్పుగోదావరి జిల్లా : పేరుకే ఉచిత ఇసుక విధానం. కానీ కూటమి నేతలకు కాసులు కురిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో టీడీపీ నేతలు ఇసుక దందాకు తెరలేపారు. యథేశ్చగా కూటమి నేతలు దోచుకుంటున్నారు. ఎమ్మెల్యేకు ముడుపు ఇవ్వాలంటూ టీడీపీ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారు.బాట ఛార్జీల పేరుతో లారీకి రూ.2,500వరకు వసూలు చేస్తున్నారు. కొవ్వూరు టీడీపీ ఎంపీపీ కాకర్ల నారాయుడు వాడపల్లి ర్యాంప్లో తన అనుచరులతో దగ్గరుండి వసూలు చేయిస్తున్నాడు. ర్యాంపుల నుంచి ట్రాక్టర్లు, ఎండ్లబండ్లతో రహస్య ప్రదేశాలలో ఇసుక డంప్ చేసి.. మొత్తంలో ఇసుకను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు కూటమి నేతలు. అందుకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు వైరల్గా మారాయి. -
టీడీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై కేంద్రమంత్రి పెమ్మసాని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: టీడీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై ఆ పార్టీ ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడే ఎమ్మెల్యేలు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును ఒకసారి చూసుకోవాలని హెచ్చరించారు.ఓ కార్యక్రమంలో పాల్గొన్న పెమ్మసారి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒకేసారి ఎమ్మెల్యే అయితే చాలు అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. మళ్లీ మళ్లీ ఎమ్మెల్యేలు అవ్వాలనుకున్నవారు ఎవరు అవినీతికి పాల్పడిన అది తప్పే. లిక్కర్ షాపులు నిర్వహించుకోవాలంటే అందుకు పెద్దమొత్తంలో వాటాలు అడుగుతున్న ఎమ్మెల్యేల నుంచి సమస్యలు ఎదురవ్వొచ్చు. వ్యవస్థ గురించి మాట్లాడాలంటే ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి.ఇవాళ ఎన్నికలంటే డబ్బులతో కూడుకున్న పెద్ద ప్రక్రియ. ఈ వ్యవస్థను చూస్తుంటే ఒకరకంగా అసహ్యం వేస్తుంది. నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయాలి ప్రజా సేవ చేయాలనే వారికి రాజకీయాలు దూరమయ్యాయి.ఎన్నికలు వచ్చాయంటే నాయకులు డబ్బుల కోసం పీక్కుతింటున్నారు. ప్రజలు కూడా మాకు డబ్బు రాలేదని అడుగుతున్నారు’ అని పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై మండిపడ్డారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్పై విచారణ వాయిదా
హైదరాబాద్, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. గురువారం మరోసారి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టింది. తొలుత కడియం శ్రీహరి తరఫున న్యాయవాది మయూర్రెడ్డి వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది గండ్ర మోహన్రావు వాదనలు వినిపించారు.అసలు ఈ అప్పీల్లు దాఖలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదని సీజే ధర్మాసనం తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని సింగిల్ జడ్జి ఆదేశించారు. ఆ తర్వాత స్పీకర్ సూచన మేరకు షెడ్యూల్ను రిజిస్ట్రీ ముందు ఉంచాలని అన్నారు. స్పీకర్ ముందు ఉంచనని చెప్పే అధికారం కార్యదర్శికి లేదని కోర్టు తెలిపింది. అసెంబ్లీ కార్యదర్శి ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్నారు. ఆయన కోర్టు ఉత్తర్వులు పాటించాల్సిందే. అధికారాలను ఎంజాయ్ చేస్తా.. విధులను మాత్రం నిర్వహించనని అంటే సరికాదని పేర్కొంది.అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ మెయింటనబుల్ కాదని అందుకే కొట్టివేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు కోర్టుకు తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఓ ఎమ్మెల్యే ఏకంగా ఎంపీగా పోటీ చేశారని చెప్పారు. వాదనల అనంతరం.. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. అంతకుముందు సింగిల్ జడ్జి తీర్పును సీజే ధర్మాసనంలో అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు. స్పీకర్ నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని పిటిషన్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి తీర్పు వెలువరించారు.చదవండి: ‘ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు'.. 4 వారాలు గడువు -
ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలపై దాడి
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై దాడి జరిగింది. వీరిపై వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. మింఖాకు చెందిన టీఎంసీ ఎమ్మెల్యే ఉషారాణి మండల్పైన, సందేశ్ఖాలీకి చెందిన టీఎంసీ ఎమ్మెల్యే సుకుమార్ మహతాపైన దాడి జరిగింది. పోలీసులు ఈ రెండు కేసులను నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.ఎమ్మెల్యే ఉషారాణి మండల్ కాళీపూజ మండపానికి వెళ్లి, పూజలు నిర్వహించి, తిరిగి వస్తుండగా ఆమెపై దాడి జరిగింది. హరోవా ప్రాంతంలో 150 మంది ఆమెను చుట్టుముట్టారు. తనను కారులోంచి బయటకు లాగి తుపాకీతో కాల్పులు జరిపారని టీఎంసీ ఎమ్మెల్యే ఉషారాణి మండల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు అక్రమ కార్యకలాపాలకు పాల్పడి, పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేత తనపై దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు.ఇదేవిధంగా సందేశ్ఖాలీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుకుమార్ మహతాపై దాడి జరిగింది. నజత్లో జరిగిన కాళీ పూజకు వెళ్లి, తిరిగి వస్తుండగా ఎమ్మెల్యే సుకుమార్ మహతాపై దాడి జరిగింది. దాడి అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తాను కాళీ పూజ పూర్తిచేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, కొందరు దుండగులు తన వాహనంపై దాడి చేశారన్నారు. అలాగే తనతో పాటు వస్తున్న పార్టీ కార్యకర్తలపైనా దాడి చేశారన్నారు. తీవ్రంగా గాయపడిన ఒక కార్యకర్తను ఆస్పత్రిలో చేర్చామని తెలిపారు. ప్రత్యర్థి వర్గం వారే ఈ దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే సుకుమార్ మహతా ఆరోపించారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసుల్లో కొందరిని అరెస్టు చేయగా, మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఇది కూడా చదవండి: అగ్ని ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సజీవ దహనం -
టికెట్ నిరాకరణ.. సిట్టింగ్ ఎమ్మెల్యే అదృశ్యం
మహారాష్ట్రలో ఎన్నికల తేదీ దగ్గరపడుతోన్నకొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మంగళవారం సాయంత్రంతో నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో ఓవైపు నామినేషన్ వేసిన వారు ప్రచారాలతో విజయం కోసం హోరెత్తిస్తుండటంతో.. మరోవైపు టికెట్ దక్కని వారు నిరశలో కూరుకుపోయారు.ఈ క్రమంలో ఓ అనూహ్య విషయం వెలుగులోకి వచ్చింది. టికెట్ దక్కలేదని సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తనను కాదని మరొకరికి టికెట్ ఇవ్వడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురై కనిపించకుండాపోయారు. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ వంగకు ఈసారి పార్టీ టికెట్ ఇవ్వలేదు. పాల్ఘర్ స్థానం నుంచి ఆయనకు బదులు మాజీ ఎంపీ రాజేంద్ర గోవిట్ను బరిలోకి దింపింది. దాంతో శ్రీనివాస్ తీవ్ర వేదనకు గురైన శ్రీనివాస్ సోమవారం సాయంత్రం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు.కాగా 2022లో ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని వీడి చీలికవర్గమైన షిండేతో వెళ్లిన నేతల్లో శ్రీనివాస్ వంగా ఒకరు. ఎమ్మెల్యే అదృశ్యంతో సీఎం షిండే వంగా భార్యతో ఫోన్ మాట్లాడారు. అతను కనిపించకుండా పోయే ముందు.. వంగా మీడియాతో మాట్లాడుతూ.. షిండే కోసం దేవుడిలాంటి వ్యక్తిని (ఉద్ధవ్ ఠాక్రే) విడిచిపెట్టానని, ప్రస్తుతం తనకు తగిన శాస్తి జరిగిందని చెప్పారు.షిండేకు విధేయుడిగా ఉన్నందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నట్లు తెలిపారు.ఇక ఆ తర్వాత నుంచి శ్రీనివాస్ జాడ తెలియరావడం లేదు. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తనకు సీటు ప్రకటించకపోయే సరికి తీవ్ర నిరాశకు గురైనట్లు శ్రీనివాస్ భార్య తెలిపారు. సోమవారం బ్యాగ్ సర్దుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే.. మళ్లీ అందుబాటులోకి రాలేదని చెప్పారు. అయితే అదృశ్యమయ్యే ముందు తాను షిండే వర్గంలో చేరినందుకు పశ్చాత్తాపడుతున్నానని, ఉద్దవ్ ఠాక్రేను కలిసి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నట్లు తనతో చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు.ప్రస్తుతం పోలీసులు ఆయనకోసం గాలిస్తున్నారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
హనీట్రాప్ కేసులో కూటమి ఎమ్మెల్యే?
విశాఖ సిటీ: హనీట్రాప్ కేసు వ్యవహారంలో కూటమి ఎమ్మెల్యే ఉన్నారా? బీజేపీ యువనేతలకు కూడా ఈ కేసుతో ప్రమేయముందా? వీరూ హనీట్రాప్ బాధితులా? లేదా యువతి ద్వారా వ్యాపారులను దోచుకుంటున్న సూత్రధారులా? ఇప్పుడివే సందేహాలు సర్వత్రా చక్కర్లు కొడుతున్నాయి. వ్యాపారులు, బిగ్షాట్స్ లక్ష్యంగా జాయ్ జమీనా అనే యువతి వలపు వల విసిరి.. వీడియోలు, ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి రూ.లక్షలు కాజేసిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ముందు వ్యాపారులు మాత్రమే ఆమె వలలో చిక్కుకున్నట్లు భావించినప్పటికీ.. ఆ జాబితాలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారన్న వార్తలు గుçప్పుమంటున్నాయి. ఈ కేసు వివరాలు బయటకు వెల్లడించకుండా పోలీసులు అత్యంత గోప్యత పాటిస్తుండడం కూడా ఈ వాదనలకు బలాన్ని చేకూరిస్తోంది. వలపు వల విసిరి.. రేప్ కేసు పెట్టి.. జాయ్ జమీనా కోసం ఎన్ఆర్ఐ యువకుడు అమెరికా నుంచి వచ్చి.. ఆమె వలలో చిక్కుకొని రూ.లక్షలు పోగొట్టుకున్నాడని.. అతడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హనీట్రాప్ వ్యవహారం బట్టబయలైంది. అప్పటి నుంచి ఈ కేసు పోలీసులకు తలనొప్పిగా మారింది. విచారణలో ఆమె వ్యవహరించిన తీరు పట్ల పోలీసులు విస్తుపోయారు. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా ఆమె నోరువిప్పనట్లు తెలిసింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి.. గతంలో ఈ తరహా కేసులు ఎక్కడైనా నమోదయ్యాయా? అని దృష్టి పెట్టారు. ఈ క్రమంలో గతంలో ఆమె ఒక వ్యక్తిపై పీఎంపాలెం పోలీస్స్టేషన్లో రేప్ కేసు నమోదు చేసినట్లు గుర్తించారు. ఆ కేసు వివరాలను ఆరా తీయడంతో హనీట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు ఆమెను భీమిలి పోలీస్స్టేషన్లో విచారించినప్పటికీ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పనట్లు సమాచారం. దీంతో ఆమెను అరెస్టు చేసి కోర్టుకు ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు. ఇంతలో కంచరపాలెం, ఎయిర్పోర్ట్ పోలీస్స్టేషన్ పరిధిలో కూడా ఆమె ఇద్దరి వ్యాపారులను ఇదే తరహాలో మోసం చేసినట్లు ఫిర్యాదు అందాయి. స్ప్రే కొట్టి.. ముగ్గులోకి దించి.. జాయ్ జమీనా ట్రాప్లో చిక్కుకున్న వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఆమె వ్యాపారులను దోచుకున్న తీరుపై కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా రెస్టారెంట్, కాఫీషాప్, రాజకీయ నేతలు ఇలా ఆర్థికంగా బలమైన వారినే ఎంచుకుంది. వారిని ఏదో ఒక విధంగా పరిచయం చేసుకొని, ఫోన్ నెంబర్ తీసుకొని, కవ్వింపు మాటలతో ముగ్గులోకి దింపేది. ఒక రోజు వారితో కారులో బయటకు వెళ్లడం.. ఆ సమయంలో వారి ముఖంపై ఒక రసాయనాన్ని స్ప్రే చేయడం.. ఇంటికి తీసుకువెళ్లడం.. వారు వద్దన్నా డ్రింక్ లేదా కాఫీ బలవంతంగా తాగించడం.. ఆ తరువాత బాధితులు మత్తులోకి జారిపోవడం.. లేచి చూసేసరికి ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం.. రూ.లక్షలు డిమాండ్ చేయడం.. పెళ్లి చేసుకోమని కత్తితో బెదిరించడం.. డబ్బు ఇవ్వని వారిపై రేప్ కేసు పెట్టడం.. ఇదే తరహాలో అనేక మందిని ఆమె దోచుకున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ఈ జాబితాలో వ్యాపారులు, ఎన్ఆర్ఐలతో పాటు రాజకీయ నేతలు సైతం ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. రెండు సార్లు కస్టడీకి తీసుకున్నా..జమీనా నుంచి పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే భీమిలి స్టేషన్లో నమోదైన కేసులో ఆమె అరెస్టయింది. కోర్టు ద్వారా ఆమెను కస్టడీకి తీసుకొని విచారించారు. ఆమె వెనుక ఉన్న ముఠా సమాచారం కోసం పోలీసులు ఎన్ని విధాలుగా ప్రశ్నించినా.. నోరు విప్పడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆమె ల్యాప్టాప్, మొబైల్లో ఉన్న సమాచారం సేకరించడానికి చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రశ్నలకు సమాచారం చెప్పాల్సిన అవసరం తనకు లేదని, నచ్చింది చేసుకోమని ఆమె సమాధానమివ్వడంతో పాటు తిరిగి వారినే బెదిరిస్తూ మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కస్టడీ సమయం ముగియడంతో ఆమెను మళ్లీ జైలుకు పంపించారు. అయితే కంచరపాలెం పోలీస్స్టేషన్ పరిధిలో ఒక కాఫీషాప్ యజమాని ఫిర్యాదుపై నమోదైన కేసులో కూడా గత రెండు రోజుల క్రితం ఆమెను రెండోసారి కస్టడీకి తీసుకున్నారు. ఇక్కడ కూడా ఆమె నుంచి వివరాలు రాబట్టడానికి ప్రయతి్నంచారు. -
ఇనుప ఖనిజం అక్రమ ఎగుమతి కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు
బెంగళూరు: బెళెకెరి నౌకాశ్రయంలోని ఇనుప ఖనిజం దొంగతనం, అక్రమ ఎగుమతి కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ కృష్ణ సాయిల్కు ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.6 కోట్ల భారీ జరిమానా విధించింది. ప్రజాప్రతినిధులపై కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం సాయిల్తోపాటు ఆరుగురికి జైలు శిక్ష, భారీగా జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. శ్రీ మల్లికార్జున షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఉన్న సాయిల్(58) తాజా పరిణామంతో ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యే అవకాశముంది. బళ్లారి గనిలో అక్రమంగా వెలికి తీసిన ఇనుప ఖనిజాన్ని 2010లో బెళెకెరి పోర్టులో అధికారులు నిల్వ ఉంచారు. దీనిపై కన్నేసిన సాయిల్, మరికొందరు కోట్లాది రూపాయల ఖనిజాన్ని దొంగచాటుగా చైనాకు ఎగుమతి చేశారు. తాజాగా దోషులుగా తేలిన వారిలో ప్రైవేట్ కంపెనీల నిర్వాహకులతోపాటు పోర్టుల డిప్యూటీ కన్జర్వేటర్ మహేశ్ జె బిలియె కూడా ఉన్నారు. ఈ నెల 24వ తేదీన తీర్పు వెలువడిన వెంటనే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు సాయిల్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
శివుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఎమ్మెల్యేపై కేసు
ఇండోర్: ఆదిదేవుడు శివుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్ పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబు జండెల్పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే బాబు జండెల్ శివుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ శుక్రవారం రాత్రి విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) లీగల్ సెల్ నేత, న్యాయవాది అనిల్ నాయుడు టుకోగంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ హన్స్రాజ్ సింగ్ చెప్పారు. శివుడిపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే జండెల్పై ఇప్పటికే ఇండోర్లో కేసు నమోదైందన్నారు. అయితే, తాను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్యే జండెల్ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఆ వీడియో మారి్ఫంగ్ చేసిందని చెబుతున్నారు. -
గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యేపై రేప్ కేసు
గాందీనగర్: గుజరాత్ హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు శనివారం బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచారం కేసు నమోదు చేశారు. ప్రంతిజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి గజేంద్రసిన్హ్ పర్మార్ 2020 జూలై 30న గాందీనగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్కు తనను పిలిపించుకున్నారని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లోబర్చుకున్నారని దళిత బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత తన ఫోన్కాల్స్కు ఆయన స్పందించలేదని తెలిపింది. ఓసారి మాత్రం తమ మధ్య సంబంధం విషయం ఎవరికైనా చెబితే కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెడతానంటూ కులం పేరుతో దూషించారని పేర్కొంది. ఈ మేరకు ఆమె అందజేసిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. దీంతో, బాధితురాలు 2021లో హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసుల తీరును ప్రశ్నించింది. ఎమ్మెల్యేపై వెంటనే అత్యాచారం కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు గాం«దీనగర్ సెక్టార్–21 పోలీస్స్టేషన్ పోలీసులు అత్యాచారం, పోక్సో తదితర కేసులు పెట్టారు. -
ఎన్నికల వేళ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సస్పెన్షన్
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు అమరావతి నియోజకవర్గం ఎమ్మెల్యే సుల్భా ఖోడ్కేపై కాంగ్రెస్ ఆరేళ్లపాటు సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఏడాది ప్రారంభంలో శాసన మండలి ఎన్నికల్లో.. ప్రతిపక్షాల మహా వికాస్ అఘాడి కూటమి అభ్యర్థి పీడబ్ల్యూపీ నేత జయంత్ పాటిల్ ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ చేసిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో సుల్భా ఖోడ్కే ఒకరు.Maharashtra Pradesh Congress has expelled Amravati MLA Sulabha Khodke from the party for six years due to anti-party activities. pic.twitter.com/p3lUIbWEYk— ANI (@ANI) October 12, 2024అయితే ఆమె పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అనేక ఫిర్యాదులు వచ్చాయని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ఒక ప్రకటనలో తెలిపారు. అందుకే పార్టీ మహారాష్ట్ర ఇంచార్జి రమేష్ చెన్నితాల ఆదేశాల మేరకే ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
బీజేపీ ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టిన న్యాయవాది.. వీడియో వైరల్
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఓ ఎమ్మెల్యేపై జరిగిన దాడి సర్వత్రా చర్చనీయాంశమైంది. లఖింపూర్లో బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మ చెంప చెళ్లుమనించాడు ఓ న్యాయవాది చెంపపై న్యాయవాది కొట్టాడు. పోలీసుల సమక్షంలోనే ఈ సంఘటన జరగ్గా. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అసలేం జరిగిందంటే.. అక్టోబర్ 14న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఓటర్ల జాబితాను తారుమారు చేశారని, కొంత మంది సభ్యులను జాబితా నుంచి తొలగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సునీల్సింగ్, ఎమ్మెల్యే యోగేష్ వర్మ డిమాండ్ చేశారు. బుధవారం అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం)కు వినతి పత్రం సమర్పించారు. కానీ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) సంజయ్ సింగ్ ధృవీకరించారు.అయితే, కలెక్టర్ కార్యాలయం నుంచి తిరిగి వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ వర్మపై స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, న్యాయవాది అవధేష్ సింగ్ దాడికి ప్రయత్నించాడు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఎమ్మెల్యే చెంపపై ఆయన కొట్టాడు. అంతేగాక సింగ్ మద్దతుదారులు, మరికొంతమంది న్యాయవాదులు కూడా ఎమ్మెల్యేపై చేయిచేసుకున్నారు. ఎమ్మెల్యే తిరిగి ప్రతి దాడికి ప్రయత్నించినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.Uttar Pradesh: In Lakhimpur, tensions flared during the Urban Cooperative Bank election as Sadar MLA Yogesh Verma and Bar Association President Avadhesh Singh clashed pic.twitter.com/qF9mFi5Mps— IANS (@ians_india) October 9, 2024 -
Haryana: అభ్యర్థి చొక్కా చించిన మాజీ ఎమ్మెల్యే
చండీగఢ్: హర్యానాలో ఈరోజు (శనివారం) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. కొన్నిచోట్ల చెదురుమదురు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మెహమ్ నుంచి పోటీ చేస్తున్న హర్యానా జనసేవక్ పార్టీ అభ్యర్థి బాల్రాజ్ కుందు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే తనపై దాడి చేసి, తన బట్టలు చించేశారని ఆరోపించారు. దీనిపై వీడియో సందేశం ద్వారా ఆయన ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.జన్ సేవక్ పార్టీ అభ్యర్థి బాల్రాజ్ కుందు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ డాంగి తనపై దాడి చేశారని ఆరోపించారు. తాను, తన పీఏ రోహ్తక్ జిల్లాలోని ఒక బూత్కు వెళ్ళినప్పుడు మాజీ ఎమ్మెల్యే డాంగి దాడిచేశారని, తన దుస్తులను చింపేశారని కూడా ఆరోపించారు.కాంగ్రెస్ అభ్యర్థి బలరామ్ డాంగి ఓడిపోతారనే భయంతోనే అతని తండ్రి ఆనంద్ సింగ్ డాంగి ఈ దాడికి పాల్పడ్డారని బాల్రాజ్ కుందు ఆరోపించారు. హర్యానా జనసేవక్ పార్టీ అభ్యర్థి బాల్రాజ్ కుందు మెహమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఆనంద్ సింగ్ డాంగి కుమారుడు బలరామ్ డాంగి ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి. ఇక్కడి నుంచి బీజేపీ తరపున దీపక్ హుడా పోటీ చేస్తున్నారు. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా, దశాబ్దం తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోంది. ఇది కూడా చదవండి: హర్యానా ఓటింగ్ వేళ.. నలుగురు నేతలకు బీజేపీ షాక్ -
మహారాష్ట్రలో ధంగర్లకు ఎస్టీ హోదాపై నిరసన.. సెక్రటేరియట్ భవనం నుంచి దూకిన నేతలు
ముంబై: మహారాష్ట్రలోని ధంగర్ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చినందుకు నిరసనగా రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ సహా గిరిజన నేతలు సెక్రటేరియట్ భవనం మంత్రాలయం మూడో అంతస్తు నుంచి దూకారు. అయితే, పోలీసులు ముందు జాగ్రత్తగా దిగువన రెండో అంతస్తులో నెట్లో పడటంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, ఈ ఘటన మంత్రాలయం సముదాయంలో శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో ఉద్రిక్తతకు దారి తీసింది.దూకిన వారిలో జిర్వాల్తోపాటు ఎన్సీపీకే చెందిన ఎమ్మెల్యే కిరణ్ లహమతే, బీజేపీ గిరిజన ఎంపీ హేమంత్ సవర తదితరులున్నారు. వీరిని పోలీసులు నెట్ నుంచి బయటకు తీశారు. అనంతరం ఈ నేతలంతా గ్రౌండ్ ఫ్లోర్లో బైఠాయించారు. కోటా విషయమై సీఎం షిండే వెంటనే తమతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని వారు డిమాండ్ చేశారు. మంత్రాలయం భవనం పైనుంచి గతంలో ఆత్మహత్యకు యత్నించిన ఘటనలున్నాయి. దీంతో, అక్కడ పోలీసులు నెట్ను ఏర్పాటు చేసి ఉంచారు. కాగా, గిరిజనులకు సంబంధించిన నిర్ణయాలపై అధికార కూటమిలోని అంతర్గత విభేదాలను ఈ ఘటన మరోసారి బహిర్గతం చేసింది. -
ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ నెల 24న వాదనలు వింటామని తెలిపింది.సెప్టెంబర్ 9న ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ మూడు అంశాలపై ప్రధానంగా చర్చించింది. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్లు అసెంబ్లీ కార్యదర్శి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ పిటిషన్లకు సంబంధించిన అంశాన్ని స్పీకర్ దగ్గరకు తీసుకెళ్లాలి. అనర్హత వేటుకు సంబంధించిన అంశాల్లో వాదనలు వినాలి. అలాగే షెడ్యూల్ ఖరారు చేయాలి. వీటన్నింటికి సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ను హైకోర్టుకు సమర్పించాలన్నదే ఆ తీర్పులోని సారాంశం. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని, స్టేటస్ రిపోర్ట్ను తమకు అందజేయాలని తీర్పిచ్చింది. అయితే కోర్టు ఇచ్చిన నాలుగు వారాల గడువు ముగియనుంది. ఈ తరుణంలో రెండ్రోజుల క్రితం అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపైన స్టే విధించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సమయంలో అడ్వకేట్ జనరల్ ఈ అంశంపై స్టే విధించి, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.అయితే దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్ మాత్రం అందుకు అంగీకరించలేదు. అసెంబ్లీ కార్యదర్శి తరుఫున కోర్టులో వాదించిన అడ్వకేట్ జనరల్ చెప్పే విషయాలన్నింటిని తాము వినేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ నెల 24న వాదనలు వింటామని సూచించింది. -
పీఎస్లో రెడ్బుక్ రాజ్యాంగం.. అమలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, ఏలూరు జిల్లా: తలకడిపూడి పీఎస్లో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ హల్చల్ చేశారు. ఎస్సై కుర్చీలో కూర్చొని టిఫిన్ చేసిన ఆయన.. పోలిస్ స్టేషన్లో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసినట్లుగా వ్యవహరించారు. పోలిస్ స్టేషన్ను సెటిలిమెంట్లకు అడ్డగా మార్చారు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్. పోలిస్ స్టేషన్లో ఎస్సై కుర్చీలో కూర్చొని ఆదేశాలిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కోల్కతా ఘటన.. సీబీఐ విచారణకు టీఎంసీ ఎమ్మెల్యే
కోల్కతా: కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ సోమవారం సీబీఐ ఎందుట హాజరయ్యారు. పానిహతి ఎమ్మెల్యేఘోష్ ఈ ఉదయం 10.30 గంటలకు సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారని దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు.అయితే ఆర్జి కర్ ఆసుపత్రి ఘటనపై విచారణకు ఆయన్ను పిలిపించామని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. వైద్యురాలి మరణం తర్వాత అంత్రక్రియలను తొందరపాటుగా ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా వైద్యురాలిపై హత్యాచారం అనంతరం మృతదేహానికి హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నిర్మల్ ఘోష్ జోక్యం చేసుకున్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు సమన్లు జారీ చేయగా.. నేడు విచారణకు హాజరయ్యారు.చదవండి: మళ్లీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో రాదో కానీ..: నితిన్ గడ్కరీ -
బీఆర్ఎస్ నేతల అరెస్టులపై కేటీఆర్ ఫైర్
సాక్షి,హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల అంశంలో ఎమ్మెల్యేలు కౌశిక్రెడ్డి వర్సెస్ గాంధీ వివాదంలో బీఆర్ఎస్ నేతల అక్రమ నిర్భంధాలు...హౌస్ అరెస్ట్లపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు. మీటింగ్ పెట్టుకునే హక్కు కూడా బీఆర్ఎస్ నేతలకు లేదా ? అని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులను గుర్తు తెస్తున్నారు. బీఆర్ఎస్ నేతలంటే ముఖ్యమంత్రి వెన్నులో ఎందుకంత వణుకు? దాడి చేసిన కాంగ్రెస్ గూండాలను వదిలి బీఆర్ఎస్ నేతల అరెస్టులా? సిగ్గు...సిగ్గు. సీఎం కనుసన్నల్లో సాగుతున్న ఈ అక్రమ విధానాలను తెలంగాణ సమాజం గమనిస్తోంది. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు’అని కేటీఆర్ హెచ్చరించారు. ఇదీ చదవండి.. మళ్లీ ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హౌజ్ అరెస్టులు -
తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల స్టేటస్ ఏమిటో 4 వారాల్లోగా చెప్పండి.. : రాష్ట్ర హైకోర్టు ఆదేశం
-
స్పీకర్ స్పందించకుంటే మళ్లీ కోర్టుకే!
సాక్షి, హైదరాబాద్: పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో అసెంబ్లీ స్పీకర్ నుంచి సానుకూల స్పందన రాని పక్షంలో మరోమారు కోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఫిరాయింపులపై పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కేపీ వివేకానంద వేసిన రిట్ పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు సోమవారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. స్పీకర్ నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.ఈ నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్కుమార్ అనుసరించే వైఖరిని బట్టి తమ భవిష్యత్తు న్యాయ పోరాటం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), కడియం శ్రీహరి (స్టేషన్ ఘనపూర్)పై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఈ ఏడాది మార్చిలో స్పీకర్కు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. స్పీకర్ స్పందించకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్లో హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా కోర్టు తీర్పు నేపథ్యంలో.. ఇటీవలి కాలంలో ఇదే తరహాలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఆయా రాష్ట్రాల స్పీకర్లు అనుసరించిన వైఖరిని బీఆర్ఎస్ పరిశీలిస్తోంది. మహారాష్ట్ర, హిమాచల్ప్రదేశ్లో చోటు చేసుకున్న ఫిరాయింపులు, ఆయా సందర్భాల్లో స్పీకర్, కోర్టులు స్పందించిన తీరును అధ్యయనం చేస్తోంది. మహారాష్ట్ర, హిమాచల్లో ఏం జరిగింది? మహారాష్ట్రలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశం సుమారు రెండేళ్లుగా అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. 2022 జూన్ 21న ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కొందరు శివసేన ఎమ్మెల్యేలతో సొంత గ్రూప్ను ఏర్పాటు చేసుకుని బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో కొందరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు కూడా షిండే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో చేరారు. షిండే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ అప్పట్లో సీఎంగా ఉన్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే డిప్యూటీ స్పీకర్ (స్పీకర్ పదవి ఖాళీగా ఉండటంతో)కు పిటిషన్లు సమరి్పంచారు.మరోవైపు తమదే అసలైన శివసేన అంటూ షిండే వర్గం అనర్హత పిటిషన్లు ఇచి్చంది. అయితే కొత్త స్పీకర్ ఈ అనర్హత పిటిషన్లపై స్పందించకపోవడంతో విషయం సుప్రీంకోర్టుకు చేరింది. తొలుత 2023 డిసెంబర్ 31లోగా అనర్హత పిటిషన్ల అంశాన్ని తేల్చాలని స్పీకర్కు గడువు విధించిన సుప్రీంకోర్టు.. ఆ తర్వాత మరో పది రోజులు పొడిగిస్తూ ఈ ఏడాది జనవరి 10వరకు గడువు విధించింది. అయితే స్పీకర్.. షిండే, ఉద్ధవ్ వర్గాలు ఇచ్చిన అనర్హత పిటిషన్లను తిరస్కరించారు.దీంతో అనర్హత వేటు అంశం మరోమారు సుప్రీంకోర్టుకు చేరింది. ఇక హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర స్పీకర్ ఈ ఏ డాది ఫిబ్రవరి 29న అనర్హత వేటు వేశారు. అయితే తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉపఎన్నిక నిర్వహించవద్దని అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఈ అంశంలో స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఉప ఎన్నికలు జరిగాయి. మరో ఏడుగురు ఎమ్మెల్యేలపైనా వేటు వేయాలి హిమాచల్ తరహాలో ఉప ఎన్నికలు జరిగేలా చూడాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరితో పాటు మరో ఏడుగురు ఎమ్మెల్యేలపై ఇచ్చిన అనర్హత పిటిషన్లపైనా స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరుతోంది. కాంగ్రెస్లో చేరిన అరికెపూడి గాం«దీ, ప్రకాశ్గౌడ్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, డాక్టర్ సంజయ్, గూడెం మహిపాల్రెడ్డి, పోచారం శ్రీనివాస్రెడ్డిని కూడా అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పిటిషన్లు సమరి్పంచింది. కోర్టు తీర్పులో పేర్కొన్న ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఈ ఏడుగురు ఎమ్మెల్యేలను కూడా అనర్హులుగా ప్రకటించని పక్షంలో కోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. -
ప్రాణాలు తెగించి యువకుడిని కాపాడిన YSRCP ఎమ్మెల్యే
-
ఉత్కంఠ నడుమ ‘ఆప్’ ఎమ్మెల్యే అరెస్టు
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎమ్మెల్యే అమనతుల్లాఖాన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. వక్ఫ్ బోర్డులో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఖాన్ను ఈడీ సోమవారం(సెప్టెంబర్2) అదుపులోకి తీసుకుంది. అమనతుల్లాఖాన్ అరెస్టుకు ముందు సోమవారం ఉదయం నుంచి ఆయన ఇంటి వద్ద పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయమే తన ఇంటికి ఈడీ వచ్చిందని, తనను అరెస్టు చేస్తుందని ఎమ్మెల్యే ఖాన్ ఎక్స్ (ట్విటర్)లో పోస్టులు పెట్టారు. ఆయన చెప్పినట్లుగానే కొన్ని గంటల పాటు సోదాలు జరిపిన అనంతరం ఈడీ ఎమ్మెల్యేను అరెస్టు చేసింది. అయితే సోదాల సందర్భంగా ఈడీ అధికారులు మానవత్వం లేకుండా ప్రవర్తించారని, నాలుగు రోజుల క్రితమే క్యాన్సర్ సర్జరీ జరిగిన తన తల్లిని వేధించారని ఖాన్ తెలిపారు. రెండేళ్ల నుంచి తనపై తప్పుడు కేసుపెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అమరావతి.. అస్తవ్యస్తం
సాక్షి, అమరావతి/తాడేపల్లి/తాడికొండ: భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉధృత రూపం దాల్చడంతో రాజధాని అమరావతి ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. హైకోర్టు, సచివాలయం పరిసర ప్రాంతాల చుట్టూ నీరు చేరింది. ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారుల నివాస భవనాల లోపలికి నీరు ప్రవహించింది. ఇతర ప్రభుత్వ భవనాలు సైతం జలమయమయ్యాయి. రహదారులు.. వాగులు, వంకలుగా మారాయి. సీడ్ యాకిŠస్స్ రోడ్డుపైన వరద నీరు భారీగా ప్రవహించింది. రాజధాని ప్రాంతంలో ఏర్పాటైన ఎస్ఆర్ఎం, విట్ యూనివర్సిటీలు సైతం నీటమునిగాయి. రహదారులు నీటితో నిండిపోయి నదుల్ని తలపిస్తుండటంతో రాజధాని ప్రాంతానికి రెండు రోజులుగా ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉధృత రూపం దాలి్చన కొండవీటి వాగు.. భారీ నుంచి అతి వర్షాలకు కొండవీటి వాగు ఉప్పొంగింది. అదే సమయంలో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజ్లోని ఉండవల్లి అవుట్పాల్ స్లూయిజ్ల ద్వారా కృష్ణా వరద కొండవీటి వాగులోకి ఎగదన్నింది. రాజధాని అమరావతిని కొండవీటి వాగు వరద చుట్టుముట్టింది. ఈ వాగు రాజధాని ప్రాంతంలో 31.15 కి.మీల పొడవునా ప్రవహిస్తోంది. 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు కొండవీటి వాగును పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు. వాగు కట్టలను బలోపేతం చేసి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు.కాని ఒక్క అడుగు కూడా ముందుకుపడకపోవడంతో కొండవీటి వాగు సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది. తుళ్లూరు మండలంలోని కోటేళ్లవాగు, అయ్యన్నవాగు, నక్కవాగు, పాలవాగుల ద్వారా వచ్చే వరద ఉధృతి కూడా కొండవీటి వాగులో ప్రవహించాల్సిన పరిస్థితి రావడంతో రాజధానికి నీటి గండం తప్పడం లేదు. ముంపు ప్రాంతమైన అమరావతిలో రాజధాని వద్దని శివరామకృష్ణన్, బోస్టన్, జీఎన్ రావు కమిటీలు మొత్తుకున్నా చంద్రబాబు పెడచెవిన పెట్టారు. పైగా ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను రైతులను భయపెట్టి, బెదిరించి సేకరించారు. ఇలా నిరి్మంచిన రాజధాని నిర్మాణాలు ఇప్పుడు రెండు రోజులపాటు కురిసిన వర్షాలకే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సారపాక వాగు కల్లోలంకృష్ణా నది వరద నీరు రాజధాని ప్రాంతంలోని సారపాక వాగులోకి ప్రవహిస్తుండడంతో కలకలం రేగింది. వరద నీరు సారపాక వాగు గుండా బయటకుపోయేందుకు మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద గతంలో పైపులైను వేశారు. ఆదివారం అందులో నుంచి రాజధాని గ్రామాల్లోకి నీరు రావడాన్ని స్థానికులు గమనించి ఆపేందుకు ప్రయతి్నంచారు. అయినా కుదరకపోవడంతో అధికారులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే రాకపోవడంతో గ్రావెల్, ఇసుక, బూడిదను తీసుకువచ్చి తూముల వద్ద వేయడంతో ప్రవాహం కొంచెం ఆగింది. స్థానికులు దీన్ని గుర్తించకపోతే వెంకటపాలెం, కృష్ణాయపాలెం, మందడం గ్రామాలు ముంపునకు గురయ్యేవి.కొట్టుకుపోయిన కొండవీటి వాగు గేట్లుసాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉండవల్లి–అమరావతి కరకట్ట వెంబడి కొండవీటి వాగు కృష్ణా నదిలో కలిసేచోట ఉన్న గేట్లలో రెండు గేట్లు ఆదివారం రాత్రి కొట్టుకుపోయినట్టు సమాచారం. ప్రకాశం బ్యారేజీ వద్ద కొండవీటి వాగు నుంచి నీటిని ఎత్తిపోసేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. ఆ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద 17.5 అడుగుల నీటిమట్టం వస్తేనే తోడాల్సిన పరిస్థితి ఏర్పడింది.కాగా.. కృష్ణా నదిలో భారీగా వస్తున్న వరద నీరు కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం సంపులో చేరడం.. వాగుకు పైనుంచి వచ్చే వరద నీరు సంపు వరకు రాకపోవడంతో గంటగంటకు కొండవీటి నీటిమట్టం పెరుగుతోంది. సాయంత్రం 4 గంటలకు ఉండవల్లి గుహల వద్ద కొండవీటి వాగు 8 అడుగుల ఎత్తులో ప్రవహిస్తుండగా.. రాత్రికి 11 అడుగులకు చేరింది.మరో రెండు అడుగులు పెరిగితే ఉండవల్లిలో కొంత భాగం, పెనుమాకలో పంట పొలాలు, టిడ్కో నివాసాలు మునిగిపోతాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. సీఆర్డీఏ కమిషనర్, ఇరిగేషన్ అధికారులు కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద సిబ్బందితో సమీక్షిస్తున్నారు.కృష్ణా నది నుంచి కొండవీటి వాగులోకి నీరు రాకుండా ఇసుక బస్తాలు వేయించడంతోపాటు ఎత్తిపోతల పథకం వద్ద నీటి సంపులో పేరుకుపోయిన తూటికాడను తొలగించే పనులు చేపట్టారు.రైతు కష్టం ‘కృష్ణా’ర్పణంసాక్షి, అమరావతి: రెక్కలు ముక్కలు చేసుకొని సాగు చేసిన పంటలన్నీ కృష్ణార్పణమయ్యాయి. భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వాణిజ్య, ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కృష్ణా నదీపరివాహాక ప్రాంతంలో మాగాణి, మెట్ట అనే తేడా లేకుండా వాణిజ్య, ఆహారపంటలు దెబ్బతిన్నాయి. 2.30 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న వరిపంటఆదివారం సాయంత్రానికి అందిన ప్రాథమిక అంచనాల ప్రకారం 2.75 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 50వేలకు పైగా ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. అత్యధికంగా 2.30 లక్షల ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైంది. ఆ తర్వాత 40 వేల ఎకరాల్లో పత్తి, 12వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే అత్యధికంగా 2.30 లక్షల ఎకరాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. ఆ తర్వాత గోదావరి డెల్టా పరిధిలో 25వేల ఎకరాలు, ఉత్తరాంధ్రలో 1500 ఎకరాల్లో పంటలు మునిగినట్టు లెక్కతేల్చారు. ఉభయగోదావరి జిల్లాల్లో 20వేల ఎకరాలు, కర్నూలు జిల్లాలో 15వేల ఎకరాలు, నంద్యాలలో 10వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. ముంపునకు గురైన పంట పొలాల్లో 60 నుంచి 70 శాతం పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. 30–40శాతం పంటలు ముంపు నుంచి తేరుకునే అవకాశాలు ఉన్నప్పటికీ దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు. -
ప్రభుత్వంపై జనసేన ఎమ్మెల్యే అసంతృప్తి.. గన్మెన్ల సరెండర్
సాక్షి,అనకాపల్లిజిల్లా: కూటమి ప్రభుత్వంపై పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు అసంతృప్తి వ్వక్తం చేశారు. ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ తన ఇద్దరు గన్మెన్లను సరెండర్ చేశారు. తాను సిఫారసు చేసిన కాపు సామాజికవర్గం సీఐకి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలోని పరవాడ పోలీస్ స్టేషన్కు కాపు సామాజికవర్గానికి చెందిన సీఐని రమేష్బాబు సిఫారసు చేశారు. రమేష్బాబు సిఫారసును పక్కన బెట్టి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మల్లిఖార్జున్కి మంత్రి నారా లోకేష్ పోస్టింగ్ ఇప్పిచ్చినట్లు సమాచారం. కాగా, జనసేన ఎమ్మెల్యేల సిఫార్సులను టీడీపీ నాయకులు పక్కన బెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
ఎఫ్టీఎల్, బఫర్జోన్లను పక్కాగా తేల్చండి
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రమూల గ్రామంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి చెందిన ‘గాయత్రి’నిర్మాణాలపై చట్టప్రకారం ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. తొలుత అక్కడి నాదెం చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్జోన్లను పక్కాగా నిర్ధారించాలని ఆదేశించింది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ల సహకారంతో ఈ ప్రక్రియ చేపట్టి.. చెరువు ఎన్ని ఎకరాలు, ఆక్రమణలు ఎంతమేర జరిగాయన్నది తేల్చి.. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేసింది. వారి వాదనలు విన్నాక చట్టప్రకారం చర్యలు చేపట్టాలని తేల్చిచెప్పింది. లాంటి నిర్మాణాలు చేపట్టవద్దు.. చట్ట విరుద్ధంగా తమ విద్యా సంస్థల భవనాల కూలి్చవేతకు హైడ్రా, అధికారులు ప్రయతి్నస్తున్నారంటూ.. గాయత్రి విద్యా, సాంస్కృతిక ట్రస్టు, అనురాగ్ వర్సిటీ, నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, గూడ మధుకర్రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 796, 813 సర్వే నంబర్లలోని 17.21 ఎకరాల్లో ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషన్లపై జస్టిస్ టి.వినోద్కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి, ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘1954, 1955 కాస్రా పహాణీ ప్రకారం నాదెం చెరువు విస్తీర్ణం 61 ఎకరాలు. పిటిషనర్ విద్యా సంస్థలు బఫర్ జోన్లోనే ఉన్నాయి.కూల్చివేత సహా ఎలాంటి చర్యలు చేపట్టినా పిటిషనర్కు నోటీసులు జారీ చేస్తాం. ఆ భూముల్లో ఇకపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా పిటిషనర్ను ఆదేశించాలి’’అని న్యాయమూర్తిని స్పెషల్ జీపీ కోరారు. దీనికి న్యాయమూర్తి సమ్మతిస్తూ.. అధికారుల నుంచి అనుమతి పొందినా కూడా తదుపరి ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని పిటిషనర్లను ఆదేశించారు. నాగోల్లోని సర్వే ఆఫ్ ఇండియా, సనత్నగర్, షాద్నగర్లలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీల నుంచి నాదెం చెరువుకు సంబంధించి స్పష్టమైన మ్యాప్లను తీసుకుని.. వాటి ఆధారంగా చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్థారించాలని స్పెషల్ జీపీకి సూచించారు. ఆ తర్వాత అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. -
మాకు జీతాలేం వద్దు.. సీఎం, మంత్రుల తీర్మానం
రాష్ట్రంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా సీఎం, రాష్ట్ర మంత్రులు, ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శులు (సీపీఎస్), క్యాబినెట్ స్థాయి సభ్యులందరూ రెండు నెలల పాటు జీతాలు తీసుకోరని గురువారం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు.రానున్న రెండు నెలలపాటు జీతాలు, టీడీ, డీఏలు తీసుకోబోమని కేబినెట్లో చర్చించిన తర్వాత మంత్రివర్గంలోని సభ్యులంతా నిర్ణయించారు’ అని సుఖ్వీందర్ సింగ్ సుఖు చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్యేలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, జూన్-ఆగస్ట్ నెలలో హిమాచల్ ప్రదేశ్లో పలు రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి.100 మంది మృతి చెందారు. బ్రిడ్జ్లు, రోడ్లు, పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ తరుణంలో మధ్యప్రదేశ్ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు రెండు నెలల పాటు తమ జీత భత్యాల్ని తీసుకోమని తీర్మానించారు. -
కంట్రోల్లో ఉండండి
సాక్షి, అమరావతి: కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహార శైలి బాగోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారి వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది వస్తోందన్నారు. మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులతో రాజకీయ అంశాలపై మాట్లాడిన ఆయన.. ఒకరిద్దరు చేసే తప్పుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. బుధవారం నాటి పత్రికల్లో వచ్చి న గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి భర్త, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్రెడ్డి ఉదంతాలను ఆయన పరోక్షంగా ప్రస్తావించినట్లు తెలిసింది. అలాంటి వారిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మంత్రులదేనని చెప్పినట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల కుటుంబ సభ్యులు అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, అలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిదేనని చెప్పినట్లు తెలిసింది. వంద రోజుల ప్రభుత్వ పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇద్దామని సీఎం చెప్పారు. అలాగే మంత్రుల పనితీరుపైనా ప్రోగ్రెస్ రిపోర్టు ఇస్తానని చెప్పి, జనసేన మంత్రుల రిపోర్ట్ పవన్ కళ్యాణ్కు అందిస్తానన్నారు. ఉచిత ఇసుక విధానంపై ఇంకా విమర్శలు వస్తున్నాయని, దానిపైనా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇసుక సరఫరాను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పగటి సమయాల్లో కాకుండా రాత్రిళ్లు కూడా ఇసుక లోడింగ్, సరఫరాకి అవకాశం కల్పిస్తే స్టాక్ పాయింట్ల వద్ద లారీల రద్దీ తగ్గుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పట్టా భూముల్లోనూ ఇసుక తవ్వకాలకు అనుమతివ్వాలని సూత్రప్రాయంగా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సార్టెక్స్ బియ్యం సరఫరాను నిలిపివేస్తే విమర్శలు వస్తాయేమోనని సమావేశంలో చర్చ జరిగింది. చివరికి బాగా అధ్యయనం చేసిన తర్వాత దీనిపై ముందుకెళ్లాలని నిర్ణయించారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల కల్పనకు సంబంధించి ప్రతి కేసులోనూ విచారణ జరపాలని చంద్రబాబు సూచించారు. ఫ్రీ హోల్డ్ అయ్యాక జరిగిన ప్రతి రిజి్రస్టేషన్పైనా విచారణ చేపట్టాలని ఆదేశించారు. -
ఎమ్మెల్యేలు.. డమ్మీలు
కూటమి ఎమ్మెల్యేలు డమ్మీలు. నియోజకవర్గ స్థాయిలో పెత్తనమంతా చిన్నబాబు లోకేష్.. ఆయన అనుచరులదే. పచ్చమీడియా ప్రతినిధులే షాడో ఎమ్మెల్యేలు. వీరు సిఫార్సు చేస్తేనే కానిస్టేబుల్ నుంచి ఎస్పీల వరకు.. బిల్ కలెక్టర్ నుంచి కలెక్టర్ వరకు పోస్టింగ్ లు ఇస్తున్న పరిస్థితి. చిన్నబాబు ఆజ్ఞ లేనిదే చిన్న పోస్టింగ్ కూడా ఇవ్వలేమని ఉన్నతాధికారులు తెగేసి చెబుతున్నారు. చిన్న పోస్టింగ్ కూడా వేయించుకునే శక్తి లేక ఎమ్మెల్యేలు నిస్సహాయత ప్రదర్శిస్తున్నారు. జిల్లాలో కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెంలో సీఐ, ఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సాక్షిప్రతినిధి, ఒంగోలు: అధికారంలోకి వచ్చాక తమ అధికార దర్పాన్ని ప్రదర్శిద్దామని కలలు కన్న ఎమ్మెల్యేలు డమ్మీలయ్యారు. ఏది చేయాలన్నా చిన్నబాబు టీమ్ అనుమతి కావాల్సిందే. జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి అధికారులు సైతం అక్కడి నుంచి క్లియరెన్స్ రావాలంటూ ఎమ్మెల్యేలకు ఓపెన్గా చెప్పేస్తున్నారు. దీంతో చిన్నబాబును కలిసి చెప్పలేక, పనులు కాక, ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. చివరకు సీఐ, ఎస్సై పోస్టింగ్లలో సైతం తాము చెప్పిన వారికి వేయించుకోలేని దుస్థితిలో ఉన్నామంటూ కూటమి ఎమ్మెల్యేలు తమ అనుయాయుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. పోలీసు పోస్టింగ్లు ఏవైనా చిన్నబాబు లోకేష్ టీమ్ చెక్ చేసి ఓకే అంటేనే పోస్టింగ్లు వేసేలా ఐజీ, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి అభ్యర్థించినా అక్కడి నుంచి ఆమోదం రానిదే పోస్టింగ్లు వేయలేమంటూ తెగేసి చెబుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు అయితే మంత్రులు, జిల్లా ముఖ్యనేతలతో సహా ఉన్నతాధికారులకు చెప్పించినా చివరకు డీజీపీని కలిసి అభ్యరి్థంచినా ఫలితం లేకపోవడంతో కొత్త పేర్లు ఇవ్వకుండా అలిగి కూర్చున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు అలిగినా, ఆగ్రహించినా చిన్నబాబు టీమ్ మాత్రం డోంట్ కేర్ అంటోంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు రిపోర్టర్లు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, యువగళం పాదయాత్రలో పాల్గొన్న టీడీపీ యువనేతలతో పోలీసు అధికారుల గురించి సమాచారం తెప్పించుకుని దాని ప్రకారం మాత్రమే క్లియరెన్స్ ఇస్తున్న పరిస్థితి. దీంతో టీడీపీ సామాజికవర్గం మినహా ఎస్సై పోస్టింగ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పోలీసు అధికారులకు దక్కక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యేల లిస్ట్కు నో.. జిల్లాలో కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో ఎస్సై, సీఐ పోస్టింగ్లు వేయించుకోలేని నిస్సహాయ పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలంతా సీఐ, ఎస్సై పోస్టింగ్లకు తమకు కావాల్సిన వారికి ఇవ్వమని లిస్టు పంపినప్పటికీ చిన్నబాబు టీమ్ పరిశీలనకు వెళ్లినట్లు సమాచారం. దీంతో అక్కడి నుంచి క్లియరెన్స్ రాని సీఐ, ఎస్సైలకు ఇప్పటికీ పోస్టింగ్లు దక్కలేదు. రెండు దఫాలుగా మార్చి కొత్తపేర్లు ఇచ్చినప్పటికీ వాళ్లు కూడా మన పారీ్టకి సంబంధించిన వారు కాదంటూ చిన్నబాబు టీమ్ అడ్డుపుల్ల వేశారు. జిల్లాలో కనిగిరి, పామూరు, మార్కాపురం, కంభం, యర్రగొండపాలెం, త్రిపురాంతకం తదితర సర్కిల్లకు సీఐల పేర్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పంపినప్పటికీ వారికి ఇవ్వడం కుదరదంటూ చిన్నబాబు టీమ్ నిరాకరించినట్లు సమాచారం. దీంతో అక్కడి నుంచి క్లియరెన్స్ రానిదే పోస్టింగ్లు ఇవ్వమంటూ పోలీసు ఉన్నతాధికారులు సైతం చేతులెత్తేస్తున్న పరిస్థితి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలు దాటుతున్నా సీఐ, ఎస్సై పోస్టింగ్లు కూడా వేయించుకోలేకపోతున్నామని, గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి తాము చూడలేదంటూ ఎమ్మెల్యేలు మనోవేదన చెందుతున్నట్లు తెలిసింది. ఆయా జిల్లాల మంత్రులు సిఫార్సు చేసినా ఫలితం లేకపోవడంతో ఇక తమగోడు ఎవరికి చెప్పుకోవాలంటూ ఎమ్మెల్యేలు అలిగి కూర్చున్నట్లు తెలిసింది. తాము చెప్పిన వారికి పోస్టింగ్ వేయకపోతే ఇక కొత్త పేరు చెప్పేది లేదంటూ ఎమ్మెల్యే భీషి్మంచి కూర్చొవడంతో ఇప్పటికీ జిల్లాలో సీఐ, ఎస్సై పోస్టింగ్లు ఇవ్వకుండా పాతవారినే కొనసాగిస్తున్న పరిస్థితి. టీడీపీకి పూర్తి అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే పోస్టింగ్ ఇవ్వాలనేది చిన్నబాబు టీమ్ ప్రతిపాదనగా ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ హయాంలో పోస్టింగ్లు చేసిన పోలీసు అధికారులకు ఎమ్మెల్యేలు అంగీకరించినా పోస్టింగ్ ఇచ్చే సమస్యే లేదని లోకేష్ టీమ్ మోకాలడ్డుతోంది. ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో చిన్నబాబు టీమ్, ఎమ్మెల్యేల మధ్య అంతర్యుద్ధం నడుస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఎటు దారితీస్తుందోననే ఆందోళన టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
పోలీసులు బదిలీల్లో మితిమీరిన రాజకీయ జోక్యం
నంద్యాల, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో అన్నింటా మితిమీరిన రాజకీయ జోక్యం నడుస్తోంది. కూటమి నేతల్లో ప్రభుత్వం ఏర్పాటు నుంచి అధికార దర్పం ప్రదర్శించడం మరీ ఎక్కవైపోయింది. ఈ క్రమంలో వాళ్ల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో అధికారులు నలిగిపోతున్నారు. నందికొట్కూరులో నంద్యాల ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య పోస్టింగ్ ల రగడ నెలకొంది. పోలీసులు బదిలీల్లో రాజకీయ జోక్యం శ్రుతి మించిపోయింది. మొన్న నందికొట్కూరు సర్కిల్ సీఐ పోస్టింగ్ లో నువ్వా నేనా అంటూ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరగ్గా.. ఇవాళ జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్ ఎస్ఐగా కేశవకి పోస్టింగ్ ఇప్పించుకున్నారు ఎంపీ శబరి. అయితే.. ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్న ఐదు నిమిషాల్లోనే ఎస్ఐ కేశవను బదిలీ చేపించారు ఎమ్మెల్యే జయసూర్య. ఇదే తరహాలో ముచ్చుమర్రి పీఎస్ ఎస్ఐగా ఎవరివారే సిఫార్సు చేసిన వాళ్లకు పోస్టింగ్ ఇవ్వాలంటున్న పట్టుపట్టారు ఇద్దరు. పోలీస్ ఉన్నతాధికారులు డీఓలు వేయడం, వెంటనే రద్దు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నేతల సిఫార్సులకు నాలుగు సింహలు తలోగుతుండగా.. అధికారుల తీరుతో సర్కిల్ పోలీస్ సిబ్బంది నలిగిపోతున్నారు. -
నాడు అత్యుత్సాహం.. నేడు అతి వినయం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/తిరువూరు: తిరువూరు ఎమ్మెల్యే నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పటి నుంచీ వివాదాలే.. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని వివాదాల మయం చేస్తున్నారు. ఏదోక దుందుడుకు చర్యతో వార్తల్లో నిలుస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో సైతం వివాదాస్పద వ్యాఖ్యలతో సొంత క్యాడర్లోనే అసంతృప్తి రేగింది. ఆది నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నవారిని లెక్క చేయపోవడంతో ఆయన తీరుపైన పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఆయన ప్రవర్తనలో మాత్రం మార్పురాలేదు. తీరా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాక కూడా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వివాదం అవుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త, చెన్నారావు నిర్మించిన భవనాన్ని అక్రమ కట్టడం పేరుతో కూల్చివేసే ప్రయత్నం చేశారు. తానే స్వయంగా బుల్డోజర్ని తీసుకెళ్లి కూల్చివేస్తానని హంగామా చేశారు. పోలీసులు, అక్కడ అధికారులు వారిస్తున్నా వినకుండా డాబా దిగువన ఉన్న గదిని కూల్చేశారు. రోడ్లపైన ఉన్న గోతులను పూడ్చాల్సింది అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆయనదే బాధ్యత. అయితే బాధ్యత మరిచి రోడ్డుపై ఉన్న నీటి గుంత ముందు కూర్చొని నిరసన తెలిపారు. సొంత పార్టీనేతలను లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండటంతో విస్సన్నపేటలో గ్రామ కమిటీ నాయకులు పార్టీకి గుడ్బై చెప్పారు.తాజాగా మరొక వివాదంతో..తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదానికి తెరతీశారు. ఎమ్మెల్యే ప్రధానవీధిలో నడిబొడ్డున ఉన్న ఒక భారీ అక్రమ కట్టడంపై నగరపంచాయతీ తీసుకున్న చట్టపరమైన చర్యలను వ్యతిరేకిస్తున్నారు. ఆ కట్టడం ఒక వార్డు కౌన్సిలర్కు చెందినది కావడంతో ఆ సామాజికవర్గానికి తాను అండగా ఉంటానంటూ సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే చేస్తున్న హడావుడి చర్చనీయాంశమైంది. దీనికి తోడు అక్రమ కట్టడంపై చర్యలు తీసుకోవాలని మరో వార్డు కౌన్సిలర్ చేస్తున్న ఆందోళనకు ఎమ్మెల్యే రాజకీయ రంగు పులిమారు. మంగళవారం అక్రమ కట్టడాలపై నగర పంచాయతీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. నగర పంచాయతీ పాలకవర్గం వైఎస్సార్ సీపీ ఆధీనంలో ఉండగా, వ్యాపారులకు నష్టం కలిగించే చర్యలకు ఆ పార్టీ పాల్పడుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యే పోస్టు చేస్తున్నారు. ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ, అక్రమ కట్టడాలపై చర్య తీసుకోవాలంటూ 9వ వార్డు కౌన్సిలర్ దుర్గారావు నగరపంచాయతీ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు.ప్రజల దృష్టి మళ్లించేందుకే..అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికే తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఇతర అంశాలను తెరపైకి తెస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఏనాడూ తిరువూరులో వ్యాపారులతో కక్షసాధింపు ధోరణికి పాల్పడలేదని, సామరస్య పూర్వకంగానే వ్యవహరించిందని పార్టీ నాయకులు చెబుతున్నారు.పార్టీకి సంబంధం లేదు..అక్రమ కట్టడాల విషయంలో అధికారులే తగు నిర్ణయం తీసుకుంటారు. ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు సైతం తనకు సంబంధం లేని అంశాల్లో తలదూరుస్తూ నియోజకవర్గంలో అభద్రతా వాతావరణాన్ని సృష్టించడం సరికాదు. ఆయన వివాదాస్పద వైఖరి ఇకనైనా మార్చుకోవాలి.– నల్లగట్ల స్వామిదాసు, తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి -
టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా తమను టార్గెట్ చేశారంటున్న బాధితులు
-
టీడీపీ ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్..
-
గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఓవరాక్షన్
సాక్షి, గుంటూరు: గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఓవరాక్షన్ ప్రదర్శించారు. రాజీవ్ గాంధీ నగర్లో శిలాఫలకాలను పగలగొట్టారు. గత ప్రభుత్వంలో రోడ్ల కోసం వేసిన శిలాఫలకాలను తానే స్వయంగా ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే హోదాలో ఉండి ఇదేం పని అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పచ్చ మూకల దౌర్జన్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు దాటింది. ఇంకా ప్రతిచోటా దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాహనాలు తగులబెట్టడం, కొట్టడం, ఊరిలో ఉండవద్దంటూ బెదిరించడం పరిపాటిగా మారింది. తాజాగా వట్టిచెరుకూరు మండలం గారపాడులో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ సీపీ నాయకులు గ్రామంలో ఉండటానికి వీలులేదంటూ టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. -
తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ : తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు..పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా బీఆర్ఎస్ పార్టీ తరుఫున సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇదే అంశంపై న్యాయనిపుణులతో మాట్లాడేందుకు కేటీఆర్తో పాటు హరీష్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణలతో,రాజ్యాంగ నిపుణులతో ఇవాళ సాయంత్రం (ఆగస్ట్ 5న)భేటీ కానున్నారు.ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు తప్పదు. త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరఫున కేసు వేయనున్నాం. కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంలో స్పష్టత వస్తుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు.పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజా క్షేత్రంలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. -
మాధవీరెడ్డి దుందుడుకు చర్య.. కమిషనర్ తేజ్ భరత్ విముఖత
సాక్షి ప్రతినిధి, కడప: కడప గడపలో సరికొత్త సంప్రదాయం కొనసాగుతోంది. మునుపెన్నడూ లేని రీతిలో సాధింపు చర్యలు తెరపైకి వస్తున్నాయి. ప్రజాస్వామ్యం స్థానంలో నియంత పాలన నడుస్తోంది. ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత ప్రజాప్రతినిధులకు ప్రజలంతా ఒక్కటే అన్న స్ఫూర్తిని విస్మరిస్తున్నారు. మీరు మాకు ఓటేశారా? మీరు ఫలానా పార్టీ కదా? ఇలాంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా కడపకు అధికారులు విధుల్లో చేరాలంటే వెనుకంజ వేస్తున్నారు. ఆమేరకు రెండు వారాలైనా కమిషనర్గా నియమితులైన తేజ్ భరత్ బాధ్యతలు చేపట్టేందుకు విముఖత చూపుతున్నట్లు సమాచారం.⇒ కడప కమిషనర్గా సూర్యసాయి ప్రవీణ్చంద్ సమర్థవంత అధికారిగా తక్కువ కాలంలో గుర్తింపు పొందారు. అనంతరం తనదైన శైలిలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నగర పాలకమండలిని సమన్వయం చేసుకుంటూ ప్రధాన సర్కిల్స్ విస్తరణ, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న రహదారుల వృద్ధి, డ్రైనేజీ వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టేందుకు కృషి చేశారు. కాగా టీడీపీ సర్కార్ జూలై 20న అమరావతికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్థానంలో ఐఏఎస్ అధికారి తేజ్ భరత్ను నియమించారు. రెండు వారాలు గడిచినా ఆయన బాధ్యతలు చేపట్టేలేదు. నూతన కమిషనర్ విముఖత వ్యక్తం చేయడం వెనుక కడప నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులే ప్రధాన కారణమని తెలుస్తోంది. వైఎస్సార్సీపీ ప్రాతినిథ్యంలో పాలకమండలి ఉండడం ఒకే ఒక్క కార్పోరేటర్ మాత్రమే టీడీపీ పరిమితం కావడం, పైగా స్థానిక ఎమ్మెల్యే మాధవీరెడ్డి దుందుడుకు చర్యలు వెనుకంజకు ప్రధాన కారణంగా ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా ప్రొటోకాల్కు విరుద్ధ నిర్ణయాలు ఇలాంటి విషయాలన్నీ పరిగణలోకి తీసుకున్న ఆయన కడపకు వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. అదే విషయాన్ని సహచర సన్నిహితులతో వెల్లడించినట్లు తెలుస్తోంది.అధికారుల్లో విస్మయంఎమ్మెల్యే మాధవీరెడ్డి ఏకపక్ష చర్యలతో అనతికాలంలోనే కడప నగరంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు వ్యవహారాల్లో అనవసర జోక్యమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. డివిజన్ పరిధిలో కార్పొరేటర్ ప్రథమ పౌరుడు అన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులంతా భాగస్వామ్యులే అన్న స్పృహ అసలే లేదు. ఈపరిస్థితులను పరిశీలిస్తున్న అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్ష చర్యలతో ఎంతోకాలం మనుగడ సాధించలేమని ఆవేదన సైతం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్గా విధుల్లో చేరేందుకు తేజ్ భరత్ విముఖత వ్యక్తం చేయడంపై స్థానికంగా అధికారులు సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది. కమిషనర్ విముఖత విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ఆర్డీఓ ఒకర్ని సంప్రదించినట్లు సమాచారం. తొలుత సుమఖత చూపిన ఆర్డీఓ విషయాలు తెలుసుకున్న తర్వాత వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కమిషనర్ అన్వేషణలో టీడీపీ నేతలు ఉన్నట్లు సమాచారం. -
‘దానం’ దమ్ముంటే రా.. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సవాల్
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీలో తనను ఉద్దేశించి ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసెంబ్లీ మీడియాహాల్లో కౌశిక్రెడ్డి శనివారం(ఆగస్టు3) మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్ మాటలు చెప్పరాకుండా ఉన్నాయన్నారు. సభలో రూల్స్కి వ్యతిరేకంగా ఆయన స్థానం నుంచి కాకుండా వేరే సీటు నుంచి మాట్లాడారన్నారు.‘దానం నాగేందర్ నేను హైదరాబాద్లోనే ఉన్నా. నువ్వు మొగోడివైతే రా చూసుకుందాం. ఎక్కడో స్పాట్ చెప్పు రావడానికి నేను రెడీ. దానం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎవడు ఇక్కడ భయపడటం లేదు. కేసిఆర్ పెట్టిన బిక్షపై నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. నువ్వు రాజీనామా చేసి మళ్ళీ గెలువు.గతంలో ఇలాగే మాట్లాడితే ఉప్పల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎల్బీనగర్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు ఉరికించి కొట్టిన సంగతి మరువకు. మేము మళ్లీ కొట్టే సమయం వచ్చింది. దానం నాగేందర్ నువ్వు తాజ్ క్రిష్ణ హోటల్కు టీషర్ట్, పౌడర్ వేసుకుని వెళ్లి చేసే వేశాలు మాకు తెలుసు’అని కౌశిక్రెడ్డి దానంపై విరుచుకుపడ్డారు. -
సభ్యత్వం రద్దు చేస్తే బుద్ధొస్తుంది
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు చెందిన అరడజను మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తే అప్పుడు వారికి బుద్ధొస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంటక్రెడ్డిని, సంపత్కుమార్ను గత సభలో ఏం చేశారో మనం చూడలేదా? అని అన్నారు. బీఆర్ఎస్ సభ్యుల తీరును ఓపికతో చూస్తున్నామని అన్నారు. దానం నాగేందర్ సభలో మాట్లాడితే తప్పేంటని, ఓ సభ్యుడికి మైక్ ఇవ్వొద్దనే అధికారం వారికి ఎక్కడిదని ప్రశ్నించారు. లాంగ్వే జ్, నాలెడ్జ్ వేర్వేరని కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 30 ఎకరాల్లో కొత్త ఉస్మానియా ఆస్పత్రి ‘మిషన్ భగీరథ ద్వారా గజ్వేల్కు నీళ్లు ఇచ్చామని చెబుతున్న కేటీఆర్కు నేను సవాల్ విసురుతున్నా. కాంగ్రెస్ వేసిన శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు వచ్చే నీటినే మధ్య లో పైప్లైన్ ద్వారా గజ్వేల్కు అందించారు. మీరు కట్టిన మేడిగడ్డ మేడిపండు అయింది. కాళేశ్వరం కట్టడం, కూలడం అయిపోయింది. అయినా ఇంతవరకు డీపీఆర్ లేదు. కానీ మూసీ అభివృద్ధి పనులు మొదలు పెట్టకముందే కేటీఆర్ డీపీఆర్ అడుగుతున్నారు.అప్పుడే ఏదో జరిగిపోయినట్టు ఎందుకు వాళ్లకు ఇంత బాధ. పది నెలలైనా కాకముందే మాపై ఎందుకింత ఆక్రోశం? 200 ఏళ్లు ఏలిన నిజాం నవాబులే ప్రజాస్వామ్యానికి తలొగ్గారు. పదేళ్లు ఏలిన మీరెంత? మేము అమెరికాతో పాటు కొరియాకు కూడా వెళుతున్నాం. పెట్టుబడులు, పరిశ్రమలకు సంబంధించి అక్కడ చర్చలు జరుపుతాం. గ్రీన్ తెలంగాణ–2050 తయా రు చేస్తాం. మూసీ కబ్జాలను తొలగిస్తాం. మూసీపై 10,800 ఇళ్లు ఉన్నాయి.వాటిని ఖాళీ చేయించి అవసరమైన వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తాం. గోషామహల్ పోలీస్ క్వార్టర్స్ స్థలంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తాం. 30 ఎకరాల స్థలంలో నిర్మాణం చేస్తాం. ప్రస్తుతం ఆసుపత్రి ఉన్న భవనాన్ని హెరిటేజ్ బిల్డింగ్గా కొనసాగిస్తాం.. ’ అని సీఎం తెలిపారు. మీరాలం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జి ‘మీరాలం చెరువుపై 2.6 కిలోమీటర్ల సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మి స్తాం. లండన్ ఐ లాంటి టవర్ను మీరాలం చెరువులో నిర్మి స్తాం. దానికి హైదరాబాద్ ఐ అని పేరు పెడతాం. బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా యంటున్నారు. మొయినాబాద్ దగ్గర బీఆర్ఎస్ నాయకుడు రేప్, మర్డర్ చేస్తే చర్యలు శూన్యం. ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి అమ్మే దమ్ము ఎవరికైనా ఉందా? రాష్ట్ర అభివృద్ధికి కలసి పనిచేద్దామని చెప్పినా కిషన్రెడ్డి ముందుకు రాలేదు. బండి సంజయ్, కిషన్రెడ్డిని సచివాలయంలో సన్మానం చేసి రాష్ట్ర అభివృద్ధికి నిధులు కోరాలని భావించాం. ఆ మేరకు ఆహా్వనించినా వారు స్పందించలేదు..’ అని రేవంత్ వెల్లడించారు. హైదరాబాద్ మెట్రోను వైఎస్సార్ తీసుకొచ్చారు ‘హైదరాబాద్ మెట్రోను వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు. వైఎస్కు, చంద్రబాబుకు మధ్య భిన్నాభిప్రాయాలున్నా వారిద్దరూ హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డును వైఎస్సార్ మణిహారంగా తీర్చిదిద్దారు. సైబరాబాద్ను కూడా వైఎస్సారే నిర్మించారు. మద్యం షాపులు మినహా రాత్రి ఒంటి గంట వరకు హైదరాబాద్లో వ్యాపారాల నిర్వహణకు అనుమతిస్తా. ఈ మేరకు వెంటనే ఆదేశాలు ఇస్తున్నా. హైదరాబాద్ను 2 వేల కిలోమీటర్ల వైశాల్యం వరకు విస్తరించనున్నాం. హైదరాబాద్ నగరాన్ని 12 జోన్లుగా విభజిస్తున్నాం. 12 మంది అధికారులను నియమిస్తాం..’ అని సీఎం చెప్పారు. రోడ్లపై నీళ్లు నిల్వకుండా హార్వెస్టింగ్ వెల్స్ ‘భారీ వర్షాలు పడినప్పుడు రోడ్లపై నీళ్లు నిలవకుండా హార్వెస్టింగ్ వెల్స్ డిజైన్ చేయాల్సిందిగా అధికారులకు సూచించాం. 141 ప్రాంతాలను గుర్తించి డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బందిని అప్రమత్తం చేసేలా చర్యలు చేపట్టాం. ట్రాఫిక్ నియంత్రణకు హైదరాబాద్లోని పోలీసు కమిషనర్లు బయటకు రావాలి. వాళ్లు రోడ్లపైకి రాకపోతే నేనే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తా. నగరంలో చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. ఆక్రమణలను నియంత్రించే బాధ్యత హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) తీసుకోనుంది..’ అని సీఎం తెలిపారు. -
మా బావ ఎమ్మెల్యే.. అంతా నా ఇష్టం
‘అందరూ వినండి. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నాకు బావ వరుస అవుతాడు. నేను చెబితే ఆయన చెప్పినట్లే’ ఇదీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మండలంలో ఓ వ్యక్తి ధోరణి. వలేటివారిపాళెం మండలానికి చెందిన ఈయన ప్రస్తుతం ఉలవపాడు మండలంలో పెత్తనం చేస్తున్నాడు. సీనియర్ నాయకులు సైతం తన వద్దకు రావాల్సిందే అంటున్నాడు. ప్రస్తుతం మండలంలో సర్వాధికారం నాదేనని చెబుతున్నాడు. ఉలవపాడు: ‘నేను చెప్పిన వారే రేషన్ డీలర్. నాకు నచ్చిన వారే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్గా ఉంటారు. నేను చూపించిన వారే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (వీఓఏ)గా పనిచేస్తారు. నేను చెప్పినట్లే అధికారులంతా నడుచుకోవాలి.’ ఇదీ పొడపాటి సుధాకర్ అనే వ్యక్తి ఉలవపాడు మండలంలో చేస్తున్న పని. వలేటివారిపాళెం మండలానికి చెందిన ఈయన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు సమీప బంధువు, బావమరిది వరుస అవుతాడు. ఎన్నికల సమయంలో సుధాకర్ ఇంటూరి కోసం ఉలవపాడు మండలంలో పనిచేశాడు. దీంతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిఫలంగా ఇక్కడ ఇష్టమొచ్చినట్లు చేసుకోమని సుధాకర్కు నాగేశ్వరరావు బాధ్యతలు అప్పజెప్పినట్లుప్రచారం జరుగుతోంది. అధికారులు ఏ పనిచేయాలన్నా, ప్రజలకు ఏ పని కావాలన్నా ఆయన్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.తొలగింపులు.. నియామకాలుమండలంలో ప్రస్తుతం ఉన్న డీలర్లు, వీఓఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలను మార్చడానికి ఏకంగా పార్టీ కార్యాలయంలోనే సోమవారం సుధాకర్ సమావేశం ఏర్పాటు చేశాడు. ఎమ్మెల్యే అండతోనే ఇలా చేసినట్లు కొందరు నేతలు భావిస్తున్నారు. ఈ సమావేశంలో రేషన్ డీలర్షిప్, భోజన ఏజెన్సీలు తమకే కావాలంటూ కార్యకర్తలు పట్టుబట్టారు. ఇప్పుడున్న వారిని తొలగించి కొత్తవారిని నియమించాలని తహసీల్దార్ కార్యాలయానికి పేర్లు పంపించినట్లు సమాచారం. ఈ విషయాలు సీనియర్ నాయకులకు మింగుడు పడడంలేదు. సుధాకర్ వ్యవహారశైలి నచ్చక సమావేశానికి డుమ్మా కొట్టారు. గతంలో పోతుల రామారావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా ఇలానే పలువురు అధికారం చెలాయించారు.ఆగ్రహంగా సీనియర్ నేతలుఎమ్మెల్యే ఆదేశాలతో వేరే మండలానికి చెందిన సుధాకర్ ఉలవపాడు మండలంలో పెత్తనం చెలాయించడాన్ని స్థానిక టీడీపీ సీనియర్ నేతలు అంగీకరించడం లేదు. ఈ వ్యవహారంపై గుర్రుగా ఉన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి తాము ఎంతో శ్రమించామని, ఇప్పుడు మమ్మల్ని కాదని సుధాకర్కు బాధ్యతలు ఇవ్వడాన్ని వారు సహించలేకపోతున్నారు. తమ మాట చెల్లుబాటు కావడం లేదని, ఎమ్మెల్యే మండలాన్ని అతనికి రాసిచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుధాకర్ చేస్తున్న పనులపై ద్వితీయ శ్రేణి నాయకులంతా అసంతృప్తిగా ఉన్నా ఇంటూరి మాత్రం చూసీచూడనట్లు ఉన్నట్లు విమర్శలున్నాయి. అతను ఏం చేసినా ఫర్వాలేదన్నట్లుగా ఎమ్మెల్యే వ్యవహారశైలి ఉందని పార్టీలో చర్చ నడుస్తోంది. -
బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరికి వారే యమునా తీరే!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ శాసనసభ్యుల మ«ధ్య సమన్వయలోపం బయటపడింది. పార్టీ పక్షాన గెలుపొందిన 8 మంది ఎమ్మెల్యేలు ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం కొంతకాలంగా ఉంది. తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండోవిడత రుణ మాఫీ కార్యక్రమానికి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం చర్చనీయాంశమయ్యింది.అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని ఒకపక్క పార్టీ డిమాండ్ చేస్తూ ఉంటే.. మంగళవారం నాటి కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎలా పాల్గొంటారనే ప్రశ్నలు ఇటు పార్టీలో అటు శాసనసభాపక్షంలో వినిపిస్తున్నాయి.శాసనసభా సమావేశాల తొలిరోజునే లిబర్టీ అంబేడ్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ దాకా రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు పాదయాత్రగా వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ వైఖరికి భిన్నంగా ప్రభుత్వం నిర్వహించిన రుణమాఫీ కార్యక్రమంలో ముగ్గురు ఎమ్మెల్యేలు పాల్గొంటే ఎలాంటి సంకేతాలు వెలువడతాయనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్ర పార్టీ నాయకత్వం స్పష్టతనివ్వకపోవడం వల్లే..!అసెంబ్లీలో బీజేఎల్పీ వివిధ ముఖ్యమైన అంశాలపై ఎలాంటి వైఖరి అనుసరించాలనే దానిపై రాష్ట్రపార్టీ నాయకత్వం స్పష్టతనివ్వక పోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమౌ తోంది. అసెంబ్లీలో కేటాయించిన గదికి సభలోంచి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి వచ్చేటప్పటికే ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, రామారావు పటేల్ రుణమాఫీ కార్యక్రమానికి వెళ్లిపోయారు.దీంతో ఆశ్చర్యపోవడం ఆయన వంతైంది. ఇలా చేస్తే పార్టీ కేడర్కు ఎలాంటి సంకేతాలు వెళతాయంటూ ఆ కార్యక్రమానికి హాజరుకాని ఓ బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించడం గమనార్హం. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికి తోచినట్టుగా వారు పెద్దసంఖ్యలో వాయిదా తీర్మానాలను ప్రతిపాది స్తున్నారనే అంశంపై కూడా పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది.సీనియర్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ అప్పుడప్పుడు మాత్రమే సమావేశాలకు హాజరవుతున్నారు. రాష్ట్ర పార్టీ నాయకత్వంతోనూ ఆయన అంత సఖ్యతగా లేరనే అభిప్రాయం ఇప్పటికే పార్టీవర్గాల్లో ఉంది. మొత్తంగా 8 మంది ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా తమ సొంత ఇమేజీని పెంచుకునే ప్రయత్నాల్లో మునిగినందునే సమన్వయలేమి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. -
పారిస్ ఒలింపిక్స్ బరిలో బీజేపీ మహిళా ఎమ్మెల్యే
-
బీఆర్ఎస్ బృందం ‘కాళేశ్వరం’ సందర్శన రేపు
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం గురువారం(జులై 25) బయలుదేరనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం బయలుదేరనుంది. అసెంబ్లీ నుంచే నేరుగా ప్రత్యేక బస్సులో వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. పర్యటనలో భాగంగా మొదట ఎల్ఎండీ రిజర్వాయర్ సందర్శించనున్న బీఆర్ఎస్ బృందం గురువారం రాత్రి రామగుండంలో బస చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంపు హౌజ్ సందర్శిస్తారు. 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పరిస్థితిని పరిశీలిస్తారు. అనతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం హైదరాబాద్ తిరిగిరానుంది. -
మా నాయకుడి కోసం ఏమైనా చేస్తాం.. అందుకే ఢిల్లీ వెళ్లి..
-
హామీలను పక్కదారి పట్టించే ప్రయత్నమిది: వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ గళం విప్పింది. సోమవారం నల్లకండువాలతో అసెంబ్లీకి వచ్చిన సభ్యులు.. గవర్నర్ ప్రసంగ సమయంలోనూ ‘హత్యా రాజకీయాలు నశించాలి.. సేవ్ డెమోక్రసీ’నినాదాలు చేశారు. అయినా గవర్నర్ ప్రసంగం కొనసాగడంతో.. నిరసనగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో అదుపుతప్పిన శాంతిభద్రతలపై మీడియాతో మాట్లాడారు. ‘‘ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. శాంతిభద్రతలు కాపాడటంలో కూటమి ప్రభుత్వం విఫలం అయింది. రాష్ట్రంలో రెడ్బుక్ పాలన నడుస్తోంది. ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళలు బయటకు రావాలంటే బయటపడుతున్నారు. రాష్ట్రంలో రోజుకో అత్యాచారం, హత్య. ఏపీలో రాష్ట్రపతిపాలన విధించాలి’’ అని అన్నారు.ఏపీలో మహిళలకు రక్షణ లేదు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి‘‘ ఏపీలో మహిళలకు రక్షణ లేదు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణలో ఘటన జరిగితే ఏపీలో దిశా చట్టాన్ని రూపొంచించాం. కూటమి ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, 36 మందిని హత్య చేశారు. హామీలు అమలు చేయలేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు... ప్రజలగొంతుకగా వైఎస్సార్సీపీ ఉంటుంది. ఢిల్లీలో బుధవారం ధర్నా చేస్తాం. దేశ వ్యాప్తంగా ఏపీలో ఏం జరుహుతుందో చెబుతాం. హోంమంత్రి అనిత ఫ్రస్టేషన్లో ఉన్నారు. హోంమంత్రి నియోజకవర్గంలోనే ఒక అమ్మాయి దారుణ హత్య జరిగింది. ముచ్చుమర్రిలో ఒక బాలిక హత్యకు గురైతే ప్రభుత్వం స్పందించలేదు. ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించలేదు’’ అని ఆమె మండిపడ్డారు.ప్రజల మధ్యనే మా నిరసనఅప్పులు చేయటానికే ఈ ప్రభుత్వం పని చేస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు. ‘‘శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతున్నా పట్టించుకోవడం లేదు. హత్యలు, అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అందుకే గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. అయినా పట్టింపులేనందునే బాయ్ కట్ చేశాం. హోంమంత్రి మీడియా సమావేశాలు పెట్టి కామెడీ చేస్తున్నారు. ప్రధాని, రాష్ట్ర పతికి కూడా ఫిర్యాదు చేశాం. ఒక వర్గం మీడియా దారుణంగా వ్యవహరిస్తోంది. అందుకే ప్రజల మధ్యనే మా నిరసన తెలుపుతున్నాం’’ అని అన్నారు. -
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్ అయ్యారు
-
కొత్త పుంతలు తొక్కుతున్న ఎమ్మెల్యేలు..
-
సుప్రీం కోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది పార్టీ మారిన ప్రతి ఒక్కరికి
-
‘డిగ్రీలతో ఉపయోగం లేదు.. పంక్చర్ షాప్ తెరవండి’
భోపాల్: మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య విద్యార్థులను ఉద్దేశించి విచిత్రమైన వ్యాఖ్యాలు చేశారు. ఆయన సోమవారం గుణ అసెంబ్లీ నియోజకవర్గంలో పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్లెన్సీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డిగ్రీలు చదవటం వల్ల ఏం రాదు.. డబ్బులు సంపాదించాలంటే విద్యార్థులు మోటర్ సైకిల్ రిపేర్ చేసే.. పంక్చర్ షాప్ను పెట్టుకొవాలని సూచించారు.‘మేము ఇవాళ పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్లెన్సీని ప్రారంభించాం. నేను అందరికీ ఒక్కటే మాట చెప్పదల్చుకున్నా.. దానిని మీరు గుర్తు పెట్టుకోండి. కాలేజీలో డిగ్రీలతో ఏం రాదు. దాని బదులు మోటర్ సైకిల్ రిపేర్ చేసే.. పంక్చర్ షాప్ను పెట్టుకోండి. కనీసం దాని వల్ల రోజువారిగా డబ్బులు సంపాదించుకోవచ్చు’ అని అన్నారు.डिग्री से कुछ नहीं होने वाला, पंक्चर की दुकान खोल लेना" गुना से BJP विधायक पन्नालाल शाक्य ने कहा #Guna | Pannalal Shakya | #PannalalShakya pic.twitter.com/j3u7w4HvQ7— Deshhit News (@deshhit_news) July 15, 2024 ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మధ్యప్రదేశ్లోని 55 జిల్లాలో ఏర్పాటు చేసిన పీఎం కాలేజీ ఆఫ్ ఎక్స్లెన్సీని వర్చువల్గా ప్రారంభించారు. బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. -
టీడీపీ సూపర్ సిక్స్ పై అరకు ఎమ్మెల్యే సెటైర్లు
-
35 మందిని ఒకేసారి విలీనం చేసుకోండి
గజ్వేల్రూరల్/ప్రశాంత్నగర్: ‘బావ, బామ్మర్ది, మామ (హరీశ్, కేటీఆర్, కేసీఆర్).. ముగ్గురిని వదిలేసి, 35 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఒకేసారి విలీనం చేసుకోవాలి’అని మెదక్ ఎంపీ రఘునందన్రావు వ్యంగ్యంగా అన్నా రు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మహంకాళీ బోనాల ఉత్సవాలకు హాజరైన ఆయన అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం రేవంత్రెడ్డి.. సంతలో పశువులను కొన్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొంటున్నారని ధ్వజమెత్తారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పార్లమెంట్లో రాజ్యాంగ విలువల గురించి మట్లాడుతూ, ఇక్కడ రేవంత్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడాన్ని ఎందుకు చెక్ పెట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. ఒక సీఎం వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కండువా కప్పిన మరుక్షణం ఆ ఎమ్మెల్యేను డిస్క్వాలిఫై చేయాలని కర్ణాటకలో హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయంలో తెలంగాణ న్యాయ మూర్తులు, సుప్రీంకోర్టు జడ్జీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పాలనపై దృష్టిపెట్టాలి..:బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పార్టీ ఫిరాయింపులపై కాకుండా పరిపాలనపై సీఎం దృష్టి సారించాలని ఎంపీ రఘునందన్రావు హితవు పలికారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో నంబర్ టూగా చెలామణి అవుతున్న మంత్రి, బీఆర్ఎస్ బెదిరింపులు ఆపేదాక ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఉంటాయనడం సరికాదన్నారు. -
కేదార్నాథ్ బీజేపీ ఎమ్మెల్యే శైలా రాణి మృతి
ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ బీజేపీ ఎమ్మెల్యే శైలా రాణి రావత్ మరణించారు. డెహ్రాడూన్లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 68 ఏళ్లు. వెన్నెముక గాయం కారణంగా ఇటీవలే ఆసుపత్రిలో చేరిన ఆమెకు వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందించారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.కాగా శైలారాణి రావత్.. 2012లో కాంగ్రెస్ టికెట్పై తొలిసారిగా కేదార్నాథ్ స్థానం నుంచి ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే, 2016లో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్పై 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. వారిలో ఆమె కూడా ఉన్నారు. ఆ తర్వాత 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2022లో బీజేపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.. నేడు హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్ : బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై నేడు తెలంగాణ హైకోర్టు విచారించనుంది. ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి పిటిషన్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్లను ప్రధానంగా ప్రస్తావించారు. -
గుమ్మనూరు జయరాంకు ఎమ్మెల్యే విరుపాక్షి కౌంటర్
-
‘సాక్షి’ విలేకరిపై జనసేన ఎమ్మెల్యే దాడి
రాంబిల్లి (అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండల సాక్షి విలేకరి, యలమంచిలి ప్రెస్క్లబ్ అధ్యక్షుడు బుదిరెడ్డి అప్పారావుపై జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ దాడికి పాల్పడ్డారు. శనివారం దిమిలి గ్రామంలో తన నివాసంలో అప్పారావు తనపై దాడి ఘటనను మీడియాకు వివరించారు. ‘ఈ నెల 3వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ నా మొబైల్కు ఫోన్ చేశారు. నేను లిఫ్ట్ చేయకపోవడంతో తర్వాత ఆయన పీఏ చంద్రారావుతో ఫోన్ చేయించారు.అయినప్పటికీ నేను ఫోన్ తీయలేదు. మళ్లీ 20 నిమిషాల తర్వాత ఎమ్మెల్యే ఫోన్ చేసి మీతో మాట్లాడాలని, అచ్యుతాపురంలోని ఎస్టీబీఎల్ లేఅవుట్లో ఉన్న తన స్వగృహానికి రావాలని చెప్పారు. దానికి నేను రానని చెప్పాను. అయితే వెంటనే పంపించేస్తానని.. రాంబిల్లి మండలం కొత్తూరు వరకు కారు పంపిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. అయినప్పటికీ నేను రానంటే రావాలని ఒత్తిడి తెచ్చారు. తప్పనిసరి పరిస్థితిల్లో నా స్వగ్రామం దిమిలి నుంచి బైక్పై కొత్తూరుకు వెళ్లాను. అప్పటికే అక్కడ బ్లాక్ స్కార్పియోతో ఎమ్మెల్యే డ్రైవర్ జగదీష్ ఉన్నాడు. నన్ను కారు ఎక్కించుకుని ఎస్టీబీఎల్లో అచ్యుతాపురం సీఐ బుచ్చిరాజు ఇంటి ముందు దించారు. అక్కడ 40 నిమిషాలు ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ కోసం ఎదురుచూశాను. అప్పటికి కూడా ఎమ్మెల్యే నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో నేను వెళ్లిపోతానని ఎమ్మెల్యే పీఏకు ఫోన్ చేసి చెప్పాను. దానికి పీఏ తన రూమ్ పక్కనే ఉందని, అక్కడకు రమ్మని చెప్పారు. నేను అక్కడికి వెళ్లగా గదిలో ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ ఉన్నారు. తాను లోపలకు వెళ్లగానే రూమ్ డోర్ మూసేశారు’ అని అప్పారావు వివరించారు.చంపేస్తానని హెచ్చరించారు..‘నన్ను గదిలో బంధించి ‘యథేచ్ఛగా తరలిస్తున్న అక్రమ మట్టి తవ్వకాలు’ పేరిట సాక్షిలో ఎందుకు వార్త రాశావు? అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అలాగే ఎన్నికలకు ముందు సాక్షిలో ప్రచురించిన కథనాలపై నిలదీశారు. తనకు టికెట్ రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ వచ్చాక ఎన్నికల్లో ఓడించడానికి కథనాలు రాశావంటూ మండిపడ్డారు. ఆ కథనాలు నేను రాయలేదని, విశాఖ ప్రధాన కార్యాలయం నుంచి సీనియర్లు రాశారని సమాధానమిచ్చినా ఆయన వినిపించుకోలేదు. వారం క్రితం ‘యథేచ్ఛగా మట్టి దందా’ పేరుతో ఎందుకు వార్త రాశావని బెదిరించారు. దానికి నేను సమాధానంగా అక్రమంగా మట్టి దందా చేస్తే ఖచ్చితంగా రాస్తానని.. ఇదే వార్త సాక్షితో పాటు ఈనాడులో కూడా వచ్చిందని చెప్పాను. దీంతో వెంటనే ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నిన్ను చంపేస్తాను’ అని హెచ్చరించారు. నా తల్లిని తిట్టడంతోపాటు నీ సంగతి తేలుస్తానంటూ కోపంతో మెడ పట్టుకుని చంపేస్తా అని బెదిరించారు. ఆ క్షణంలో నాకు ప్రాణహాని ఉందని గ్రహించి అక్కడ నుంచి ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బయటపడ్డాను. నాకు, నా కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని విన్నవిస్తున్నా’ అని అప్పారావు తెలిపారు. -
బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై
-
తిరుపతిలో షాడో ఎమ్మెల్యే!
సాక్షి టాస్క్ఫోర్స్: తిరుపతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒకరైతే... అన్నీ తానై వ్యవహరిస్తున్న షాడో ఎమ్మెల్యే మరొకరు. ఈ షాడో ఎమ్మెల్యే తీరుపై కూటమి నేతలే విస్మయం వ్యక్తంచేస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్న కుమారుడు ఆరణి శివకుమార్కు ఎలాంటి హోదా లేకపోయినా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. ఆయన సోమవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఐఏఎస్ అధికారి అయిన కమిషనర్ అదితి సింగ్తో కలిసి విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఈ విషయం మంగళవారం వెలుగుచూసింది. ఎమ్మెల్యే అన్న కుమారుడు అధికారికంగా సమీక్ష నిర్వహించడం ఏమిటని మున్సిపల్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అదేవిధంగా స్విమ్స్లో నిర్వహించిన డాక్టర్స్ డే వేడుకల్లో కూడా ఆరణి శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించడం తీవ్ర దుమారాన్ని లేపింది. ఆయా కార్యక్రమాల్లో అన్నీ తానే అన్నట్లుగా శివకుమార్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఆయనతోపాటు మరో నలుగురు వ్యక్తులు సైతం తాము ఎమ్మెల్యేకు సమీప బంధువులం.. అంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో హల్చల్ చేస్తుండటం కలకలం రేపుతోంది. ఎన్నడూ లేనివిధంగా తిరుపతిలో వింత సంస్కృతిని చూస్తున్నామని అధికారులు, కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
కార్యకర్తలనే నేతలుగా చేస్తా
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి వెళ్లి దొంగల్లో కలుస్తున్న నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, వారి గురించి బాధ పడొద్దని భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు అన్నారు. సమైక్యవాదులతో నిలబడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ శ్రేణులకు ప్రస్తుత పరిస్థితులు ఎంతమాత్రం లెక్క కాదన్నారు. ఒక్కరు పార్టీ నుంచి బయటకు వెళ్తే పది మంది నాయకులను తీర్చిదిద్దుకునే సత్తా బీఆర్ఎస్కు ఉందని చెప్పారు. ‘తెలంగాణ ఉద్యమ సాధన కోసం నడుం కట్టినపుడు మనతో ఎవరున్నారు? నాడు, నేడు, ఏనాడైనా నాయకులను పార్టీయే తయారు చేసుకుంటుంది. పార్టీ తయారు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే దొంగల్లో కలిశాడు. భవిష్యత్తులో అంతకన్నా మెరుగైన నాయకత్వాన్ని పార్టీ తయారు చేసుకుంటుంది. భవిష్యత్తులో కార్యకర్తల నుంచి మెరికల్లాంటి యువ నాయకులను సృష్టిస్తా..’అని కేసీఆర్ అన్నారు. జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఇతర జిల్లాల నుంచి వచి్చన నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో ఆయన భేటీ అయ్యారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది బీఆర్ఎస్సే‘తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్లు అనేకం మిగిలి ఉన్నాయి. తెలంగాణ ఆకాంక్షలు, కలలు నెర వేర్చగలిగే అవగాహన బీఆర్ఎస్కు మాత్రమే ఉంది. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యల లోతును పట్టుకు ని పరిష్కరించగలిగే సత్తా ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించిన మన పారీ్టకే ఉంది.ప్రజాస్వామ్య వ్యవస్థలో అబద్ధపు ప్రచారాలకు లోనై కొన్నిసార్లు ప్రజలు బోల్తా పడుతుంటారు. మొన్నటి ఎన్నికల్లో అలా జరిగినంత మాత్రాన నిరుత్సాహపడొద్దు. అధికారం ఉంటేనే పని చేస్తామనే పద్ధతిని వీడి ఏ హోదాలో ఉన్నా ప్రజల కోసం పనిచేయాలి. తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి బీఆర్ఎస్ అంతిమ లక్ష్యం. నెరవేరాల్సిన ప్రజల కలలను పూర్తి స్థాయిలో నెరవేర్చేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే..’ అని కేసీఆర్ చెప్పారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి ‘మనం రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో ఇంకా బాగా ప్రజల కోసం పనిచేయాల్సి ఉంది. ప్రజలు పదేళ్లు అధికారమిస్తే కులమతాలకు అతీతంగా పనిచేసి వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ తదితర రంగాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచి ప్రజా సమస్యలు పరిష్కరించాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాం..’అని బీఆర్ఎస్ అధినేత పేర్కొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వైద్యుడిగా, ఎమ్మెల్యేగా ప్రజా సేవతో మన్ననలు పొందుతున్నారని అభినందించారు.ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్రెడ్డి, డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్రెడ్డి, జాజుల సురేందర్, గంప గోవర్దన్, హనుమంతు షిండే, ఎమ్మెల్సీ ఎల్.రమణ, జగిత్యాల జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేశ్, పెద్దపెల్లి బీఆర్ఎస్ నేత ఉష తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా నేతలతో ప్రత్యేకంగా జరిపిన భేటీలో పార్టీ బలోపేతంపై కేసీఆర్ చర్చించారు. సందడిగా ఎర్రవల్లి పరిసరాలు కేసీఆర్ను కలిసేందుకు ఎర్రవల్లి నివాసానికి పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తుండటంతో ఫామ్ హౌస్ పరిసరాలు సందడిగా మారాయి. వాహనాల రద్దీతో హడావుడి నెలకొంది. నినాదాలు చేస్తూ పోటెత్తుతున్న నేతలు, కార్యకర్తలు కేసీఆర్కు పుష్పగుచ్చాలు, మొమెంటోలు ఇచ్చి ఫోటోలు దిగేందుకు పోటీలు పడుతున్నారు. ఆత్మియ సమావేశాలకు విరామం మూడు రోజుల పాటు కేసీఆర్కు విశ్రాంతి సాక్షి, హైదరాబాద్: ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలకు మూడు రోజుల పాటు విరామం ప్రకటించారు. శని, ఆది, సోమవారాల్లో మూడు రోజుల పాటు కేసీఆర్కు విశ్రాంతి ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఆత్మియ సమావేశాలు తిరిగి ఎప్పుడు ప్రారంభమయ్యేది వెల్లడిస్తామని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. రెండు వారాలుగా కేసీఆర్ ఆత్మియ సమావేశాలు కొనసాగిస్తుండగా, పక్షం రోజుల్లో సుమారు 50 వేల మందికి పైగా మంది కార్యకర్తలు, ప్రజలు ఆయనతో భేటీ అయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందస్తు సమాచారం అందుకుని కేసీఆర్ను కలుస్తున్నారు. ఎర్రవల్లి నివాసానికి వస్తున్న వారిని కేసీఆర్ పలకరిస్తూ వారితో ఫొటోలు, సెలీ్ఫలు దిగుతున్నారు. ఈ ఆత్మియ సమావేశాలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా షెడ్యూల్ను ప్రకటిస్తామని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
‘ఆరు’ నూరవకుండా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో వలసల రాజకీయం జోరుగా సాగుతోంది. విపక్ష బీఆర్ఎస్ పారీ్టకి చెందిన నేతలకు అధికార కాంగ్రెస్ వల విసురుతోంది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు కారు దిగి హస్తం గూటికి చేరగా, తాజాగా కాలె యాదయ్య చేరికతో ఇప్పటివరకు కాంగ్రెస్ కండువా కప్పుకున్న గులాబీ ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది. శాసనమండలిలో అధికార పారీ్టకి నామమాత్ర సంఖ్యాబలం మాత్రమే ఉండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు లక్ష్యంగా కూడా ఆ పార్టీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. పార్టీ బీ ఫామ్పై గెలిచిన నేతలు చేజారకుండా చూసేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు స్వయంగా రంగంలోకి దిగారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న కేసీఆర్.. వలసలకు అడ్డుకట్ట వేయడంపై దృష్టి సారించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సుదీర్ఘ భేటీలు జరుపుతూ బీఆర్ఎస్లో కొనసాగితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇస్తున్నారు. మరోవైపు పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులతోనూ ఎర్రవల్లి నివాసంలో వరుస భేటీలు జరుపుతూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరొకరుగా కీలక నేతల నిష్క్రమణ గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో కీలక నేతలు ఒకరొకరుగా పార్టీ నుంచి నిష్క్రమించడం మొదలు పెట్టారు. వీరంతా పార్టీ అధికారంలో కొనసాగిన కాలంలో కీలక పదవులు అనుభవించిన వారే కావడం గమనార్హం. పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తదితరులు పార్టీని వీడిన ముఖ్య నేతల జాబితాలో ఉన్నారు.లోక్సభ ఎన్నికల్లో తన కుమారుడు అమిత్రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పారీ్టతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్షి్మ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వజూపినప్పటికీ కడియం కూతురు కావ్య, ఎంపీలుగా ఉన్న రంజిత్రెడ్డి, బీబీ పాటిల్, పి.రాములు తదితరులు ఇతర పారీ్టల్లో చేరి టికెట్లు దక్కించుకున్నారు.ఇక బీఆర్ఎస్ను వీడిన మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పదుల సంఖ్యలోనే ఉన్నారు. కాగా అధికారంలో ఉండగా కీలక పదవులు అనుభవించిన నేతలు కూడా చడీ చప్పుడు లేకుండా రాత్రికి రాత్రే పార్టీ మారడం బీఆర్ఎస్కు మింగుడు పడని వ్యవహారంగా మారగా..పార్టీ శ్రేణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. గ్రేటర్, చుట్టూ జిల్లాలపై కాంగ్రెస్ దృష్టి అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది బీఆర్ఎస్ తరఫున గెలుపొందారు. అయితే ఇప్పటికే దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), పోచారం శ్రీనివాస్రెడ్డి (బాన్సువాడ), డాక్టర్ సంజయ్ (జగిత్యాల), కడియం శ్రీహరి (స్టేషన్ ఘనపూర్) గులాబీ పారీ్టకి గుడ్బై కొట్టారు. తాజాగా కాలె యాదయ్య (చేవెళ్ల) కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్కు మెజారిటీ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి చేరికల కోసం కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుతో సన్నిహిత సంబంధాలు ఉన్న కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మినహా మిగతా వారు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఉద్యమ కాలం నుంచి అనుబంధం ఉన్న కొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు విముఖతతో ఉన్నారు. అయితే 2014, 2018 ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరి, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఎందరు పారీ్టలో కొనసాగుతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలో చేరి ప్రత్యేక రాష్ట్రంలో కీలక పదవులు అనుభవించిన నేతలు కేకే, కడియం, పోచారం తదితరులు సైతం పార్టీని వీడటం, మరోవైపు పార్టీ సృష్టించిన నాయకుడు డాక్టర్ సంజయ్ కూడా ని్రష్కమించడంతో ఎవరుంటారో, వీడతారో తెలియని పరిస్థితి బీఆర్ఎస్లో ఉందనే చర్చ జరుగుతోంది. భరోసా నింపుతున్న కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఒకరొకరుగా పార్టీనీ వీడుతుండటంతో కేసీఆర్ అప్రమత్తమయ్యారు. ఎర్రవల్లి నివాసంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నేరుగా లంచ్ భేటీలు జరుపుతున్నారు. పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, తన వెంట నిలిచే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందంటూ భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యమ సమయంలోనూ పార్టీని బలహీన పరిచేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు, అప్పట్లో ఎదురొడ్డి నిలిచిన తీరును విడమరిచి చెప్తున్నారు.ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగకుండా పారీ్టలో కొనసాగాలని బుజ్జగింపు ధోరణిలో కోరుతున్నారు. మరోవైపు కింది స్థాయిలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులతోనూ సమావేశమవుతున్నారు. దీంతో జిల్లాల నుంచి పార్టీ నేతలు కేసీఆర్ను కలిసేందుకు ఎర్రవల్లి నివాసానికి పోటెత్తుతున్నారు. అయితే కేసీఆర్తో భేటీ తర్వాత కూడా కాలె యాదయ్య పార్టీని వీడటం గమనార్హం. కొత్త నాయకత్వానికి ప్రోత్సాహం అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన మహబూబ్నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. కానీ లోక్సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక, ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. దీంతో సమీప భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే ఔత్సాహికుల్లో ఆందోళన కనిపిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న నాయకత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించడంపై కేసీఆర్ దృష్టి సారిస్తున్నారు.ఉద్యమ సమయంలో క్రియాశీలంగా పనిచేసిన యువ నాయకులకు క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత అప్పగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గ్యాదరి కిషోర్తో పాటు ఎర్రోల్ల శ్రీనివాస్, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్, ఆంజనేయ గౌడ్, తొట్ల స్వామి యాదవ్, తుంగ బాలు వంటి నేతలకు క్రియాశీల బాధ్యతలు అప్పగిస్తున్నారు. పారీ్టలో సుదీర్ఘంగా కొనసాగుతున్న వారికి రాష్ట్ర, జిల్లా కమిటీల్లో కీలక స్థానం ఇచ్చే దిశలో కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. -
ధైర్యంతో అందరం ముందడుగు వేయాలి
-
అసెంబ్లీ లోక్ సభ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో వైఎస్ జగన్ కీలక సమావేశం
-
నాన్న ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నా..
పాలకుర్తి: నా జీవిత ప్రయాణంలో నాన్న ప్రోత్సాహం ఎంతో ఉంది. మేం ఇద్దరం అక్కాచెల్లెళ్లం. నాన్న హైదరాబాద్లో బీటెక్ వరకు చదివించారు. వివాహం తర్వాత అమెరికాలో మేనేజర్గా పనిచేశా. మా అత్తమ్మ ఝాన్సీరెడ్డి ఆహ్వానంతో రాజకీయాల్లోకి వచ్చా. ఇందులో మా నాన్న మామిడాల తిరుపతిరెడ్డి ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాన్న వెన్నంటి ఉండి నడిపించారు. ఆయన ప్రోత్సాహంతో సభలు, సమావేశాల్లో పాల్గొన్నా. ఘన విజయం సాధించా. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా.– మామిడాల యశస్వినిరెడ్డి, ఎమ్మెల్యే, పాలకుర్తి -
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఒడిశా రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర శాసనసభకు తొలిసారిగా ముస్లిం మైనారిటీకి చెందిన మహిళ ఎన్నికైంది. ఆమె పేరు సోఫియా ఫిర్దౌస్.. వయసు 32 ఏళ్లు. కాంగ్రెస్ అభ్యర్థిగా బారాబతి-కటక్ స్థానం నుంచి పోటీ చేసి తన ప్రత్యర్థి బీజేపికి చెందిన పూర్ణ చంద్ర మహాపాత్రను ఎనిమిది వేల మెజార్టీ ఓట్ల తేడాతో ఓడించారు. ఇంతకీ ఈ సోఫియాకున్న ఆసక్తికర నేపథ్యాన్ని పరిశీలిస్తే.. ఫిర్దౌస్ ఒడిశా సీనియర్ కాంగ్రెస్ నేత మహమ్మద్ మోకిమ్ కుమార్తె. తండ్రిపై అవినీతి ఆరోపణలు ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడింది. దీంతో ఆయన స్థానంలో కూతురు ఫిర్దౌస్ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే తండ్రి అవినీతి మరక.. ఈ యువ నేత గెలుపును ఆపలేకపోయింది. అంతేగాదు స్వాతంత్యం వచ్చిన తర్వాత ఒడిశాలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె విజయం ఒడిషా రాజకీయ పుటల్లోకి ఎక్కింది.కెరీర్..ఫిర్దౌస్ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చూశారు. ఆ తర్వాత 2022లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎంబీ) నుంచి ఎగ్జిక్యూటిబవ్ జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంను కూడా పూర్తి చేశారు.2023లో కాన్ఫెడరేషన్ ఆప్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసీయేషిన్ ఆఫ్ ఇండియా(సీఆర్ఈడీఏఐ) అధ్యక్షురాలిగా ఫిర్దౌస్ ఎన్నికయ్యారు. అలాగే సీఆర్ఈడీఏఐ మహిళా విభాగానికి ఈస్ట్ జోన్ కో ఆర్డినేటర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆమె ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ)కి కో చైర్మన్గా కూడా చేశారు. అంతేగాదు మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ఐఎన్డబ్ల్యూఈసీ సభ్యురాలు కూడా. ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త షేక్ మెరాజ్ ఉల్ హక్ను వివాహం చేసుకున్నారు. రాజకీయాల్లో ఒడిషా తొలి మహిళా ముఖ్యమంత్రి నందిని సత్పతి, ఫిర్దౌస్కు ఆదర్శమట. విశేషం ఏంటంటే.. 1972లో బారాబతి-కటక్ నియోజకవర్గం నుంచే నందిని సత్పతి గెలుపొందారు. కాగా, ఈ 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు గణనీయమైన రాజకీయ మార్పును చవిచూశాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 147 సీట్లలో 78 స్థానాలను గెలుచుకోని విజయం సాధించింది. దీంతో 24 ఏళ్ల పాటు ఏకధాటిగా పాలించిన బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీ నాయకుడు నవీన్ పట్నాయక్ పాలనకు తెరపడింది. (చదవండి: మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా..) -
కుర్చీలపై కన్ను!
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. టీడీపీ నుంచి 135 మంది ఎమ్మెల్యేలుగా గెలిచినందున ఆశావహుల సంఖ్య భారీగా ఉంది.అయితే మొత్తం 24 మంత్రి పదవులే ఇచ్చే అవకాశం ఉన్నందున అందులోనే మూడు పార్టీలకు సర్దుబాటు చేయడం కత్తిమీద సాములా మారింది. జనసేనకు కనీసం ఐదు మంత్రి పదవులు దక్కుతాయనే ప్రచారం జరుగుతుండగా బీజేపీకి రెండు పదవులు ఇచ్చే అవశాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రెండు పార్టీలకూ ఇవ్వగా మిగిలిన మంత్రి పదవులను టీడీపీ సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. అచ్చెన్నా..! రామ్మోహనా!ఉమ్మడి శ్రీకాకుళం నుంచి టీడీపీ సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్ర మంత్రివర్గంలో ఆయన సోదరుడి కుమారుడు రామ్మోహన్ నాయుడికి అవకాశం దక్కితే మాత్రం అచ్చెన్నాయుడికి ఛాన్స్ ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. ఒక కుటుంబంలో ఒకరికే పదవి ఇచ్చే యోచన ఉంటే వీరిలో ఒకరికే అవకాశం లభించవచ్చు. అదే జిల్లా నుంచి కూన రవికుమార్, కొండ్రు మురళీమోహన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా నుంచి గెలిచిన కళా వెంకట్రావు, అదితి గజపతిరాజు పేర్లు సైతం పరిశీలనలో ఉన్నాయి.విశాఖ జిల్లాలో ఈసారి గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కకపోవచ్చని చెబుతున్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడికి కచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని.. మహిళ, ఎస్సీ కోటాలో వంగలపూడి అనితకు అవకాశం లభిస్తుందనే చర్చ నడుస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి నుంచి జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకునే వీలుందని చెబుతున్నారు. సీనియర్ల అవసరం ఉందని భావిస్తే యనమల రామకృష్ణుడిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఆయన కుమార్తె దివ్య తుని నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా యనమలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నారు.నిమ్మలకు పక్కాఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నిమ్మల రామానాయుడికి మంత్రివర్గంలో పక్కాగా చోటు దక్కుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. క్లిష్ట సమయంలో పార్టీ కోసం చురుగ్గా పని చేసి చంద్రబాబు, లోకేశ్కి దగ్గరవడంతో ఆయనకు అవకాశం కచ్చితంగా లభిస్తుందని చెబుతున్నారు. బీసీ కోటాలో పితాని సత్యనారాయణ పేరు బలంగా వినిపిస్తోంది. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకి మంత్రి పదవిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఆయన మంత్రిగా పని చేయరని పార్టీలో కొందరు చెబుతుండగా, ఇస్తే తీసుకుంటారని మరి కొందరు వాదిస్తున్నారు.చింతమనేని ప్రభాకర్ పేరు కూడా రేసులో వినిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్ర ఖాయంగా మంత్రి అవుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ నేతగా పని చేసిన అనుభవం, ప్రతిపక్షంలోనూ చురుగ్గా వ్యవహరించడంతో ఆయనకు అవకాశం ఖాయమని భావిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, రామాంజనేయులు, నక్కా ఆనంద్బాబు పేర్లు సైతం వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి అవకాశం లభించవచ్చని చెబుతున్నారు.నారాయణకు మళ్లీ ఛాన్స్ ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డి. బాలవీరాంజనేయస్వామిలో ఒకరికి మంత్రి పదవి దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లా నుంచి గెలిచిన వారిలో పి.నారాయణ గ్యారంటీగా మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనతోపాటే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్లు కూడా చంద్రబాబు పరిశీలనలో ఉన్నాయి.చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్రెడ్డి, పులివర్తి నానిలో ఒకరిని మంత్రిగా చేస్తారని చెబుతున్నారు. కడప జిల్లా నుంచి రెడ్డప్పగారి మాధవి, వరదరాజులరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి మంత్రి అవుతారని చెబుతున్నారు. అనంతపురం జిల్లా నుంచి గెలిచిన వారిలో పయ్యావుల కేశవ్, పరిటాల సునీతలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చు. కాల్వ శ్రీనివాసుల పేరు కూడా పరిశీలనలో ఉంది.పవన్కు పదవిపై అస్పష్టతే..జనసేన నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే విషయంపై స్పష్టత రాలేదు. నాదెండ్ల మనోహర్ మంత్రివర్గంలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కొణతాల రామకృష్ణ, పంతం నానాజీ, కందుల దుర్గేష్, పులపర్తి రామాంజనేయులు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.బీజేపీ కోటాలో సుజనాబీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరికి మంత్రివర్గంలో చోటు పక్కాగా ఉంటుందని చెబుతున్నారు. కామినేని శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తున్నా ఎంత వరకు అవకాశం దక్కుతుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుజనా చౌదరి పోటీలో ఉన్నందున ఆయనకు అవకాశాలు సన్నగిల్లాయి. సత్యకుమార్, విష్ణుకుమార్రాజులో ఒకరిని మంత్రి పదవి వరించే అవకాశం ఉందని చెబుతున్నారు. -
పుణే ఘటన: లంచాల మోజు.. పోలీసుల అక్రమాలు వెలుగులోకి!
రెండు నిండు ప్రాణాల్ని బలిగొన్న పుణే పోర్షే హిట్ అండ్ రన్ కేసు.. రకరకాల కోణాల్లో చర్చకు దారి తీసింది. వాహనం నడిపింది ఓ మైనర్ కావడంతో పేరెంటింగ్ కోణంలో ప్రధాన చర్చ నడిచింది. మైనర్ బాలుడి తండ్రి తన పలుకుబడి ఉపయోగించి కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం.. ఆ ప్రయత్నంలో నిర్లక్ష్యం ధోరణి ప్రదర్శించిన పోలీసు అధికారులపై చర్యలు, రక్త నమూనాలు తారుమారు చేయటంతో డాక్టర్ల అరెస్టు.. తండ్రి, తాతల అరెస్ట్.. పోర్షే కథలు రోజుకొకటి వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ కేసు కారణంగానే.. నగరంలో అర్ధరాత్రుల దాకా అనుమతులు లేకుండా బార్లు, పబ్ల నిర్వహణ, వాటిల్లో డ్రగ్స్ వాడకం.. ఆ మొత్తం వెనుక అధికారుల అవినీతి బాగోతం బయటపడింది ఇప్పుడు.. పుణేలో అర్ధరాత్రి దాకా అక్రమంగా కార్యకలాపాలు నిర్వహించే పబ్లు, బార్లు.. పైగా డ్రగ్స్ కోణాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చారు ఓ ఎమ్మెల్యే. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్.. ఈ హిట్ అండ్ రన్ కేసుపై ఇదివరకే నిరసన వ్యక్తం చేశారు. పబ్లు, బార్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన యెరవాడ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అయితే ఆయన ఇప్పుడు మరో సంచలన చర్చకు దారితీశారు.చదవండి: Pune Porsche Case: రీల్ను మించిన రియల్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇవేం ట్విస్టులు బాబోయ్!లంచాల మోజుతో పోలీసులు అక్రమంగా నిర్వహిస్తున్న పబ్ యజమానులు, డ్రగ్స్ ట్రేడర్ల వద్ద నెలకు లక్షల్లో లంచాలు తీసుకుంటున్నారని రవీంద్ర ధంగేకర్ ఆరోపణులు చేశారు. పుణె ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రతినెలా లంచాలు తీసుకుంటున్నారని, లంచాల సేకరణకు కానిస్టేబుళ్లు, ప్రైవేట్ వ్యక్తులను ఉపయోగించుకున్నారని తెలిపారు.#Pune #Porsche Case: Ravindra Dhangekar Discloses Names Of Persons Involved In ' HAFTA 'From Pubs, Clubs and Liquor Shops In a major crackdown, the Kasba Peth MLA Ravindra Dhangekar revealed that police are collecting monthly bribes amounting to lakhs of rupees from the owners… pic.twitter.com/5ehtFFSuW8— Pune Pulse (@pulse_pune) May 27, 2024 విమాన్ నగర్, కోరేగావ్ పార్క్, కళ్యాణి నగర్, భుగావ్ భూకుమ్, బానేర్, హింజవాడి, పింప్రి చించ్వాడ్, లోనావాలా ప్రాంతాల్లో ఉండే అర్ధరాత్రి, రూఫ్టాప్లో నిర్వహించినే హోటళ్ల వద్ద లంచాలు తీసుకొని చూసిచూడనట్లు వ్యవహరిస్తారని అన్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పోలీసు నెలకు వసూలు చేసే మొత్తం దాదాపు రూ. 78 లక్షలు ఉంటుందని లెక్కలతో సహా మీడియాకు తెలిపారు. లంచాలు తీసుకునే ప్రాంతాలు, వాటిని వసూలు చేసే పోలీసు కానిస్టేబుల్స్ పేర్లను ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్ బయటపెట్టారు.కస్బా పేట్ ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్ బయటపెట్టిన ఈ వివరాలు ప్రస్తుతం మహారాష్ట్రలో సంచలనంగా మారాయి. అదేవిధంగా పుణె పోలీసు డిపార్టుమెంట్లో ఎప్పటి నుంచో ఉన్న అవినీతి వ్యవహారం తాజాగా బట్టబయలు అయింది. పుణె సిటీ కల్చర్, చట్టాల అమలుపై తీవ్ర చర్చ జరుగుతోంది. -
బీజేపీ ఎంపీ- ఆప్ ఎమ్మెల్యే వాగ్వాదం.. వీడియో వైరల్!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో పలు ఆసక్తికర వైనాలు వెలుగు చూస్తున్నాయి. ఇటువంటి ఉదంతం గుజరాత్లో చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నారని గుజరాత్కు చెందిన బీజేపీ ఎంపీ ఆరోపించిన నేపధ్యంలో ఈ ఇద్దరు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.వీరిద్దరూ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో భరూచ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. నర్మదా జిల్లాలోని దేడియాపాడలో బీజేపీకి చెందిన భరూచ్ ఎంపీ మన్సుఖ్ వాసవా, ఆప్ ఎమ్మెల్యే చైత్ర వాసవా మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.జనం మధ్యలో ఈ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం జరగడాన్ని వీడియోలో చూడవచ్చు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేశారు. అనంతరం ఇద్దరు నేతలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లోకేష్ యాదవ్ తెలిపారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. బీజేపీ ఎంపీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఆప్ ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పించిన దరిమిలా ఈ వివాదం చోటుచేసుకుంది. મારી ગેર હાજરી ના 6 માસમાં થયેલ કામગીરી મનરેગા માં 22 cr, વિકાસશીલ તાલુકા જોગવાઈ 4 cr, આદિ આદર્શગામ 68 cr,નલ સે જલ યોજનામાં 40 cr, SBM 2 cr,F. R.A માં 3.90 cr ના આયોજન બાબતે ડેડીયાપાડા TDO સાથે ચર્ચા કરતાની સાથે જ મનસુખ વસાવા અને ભાજપ ના હોદ્દેદારો ને 420 વોલ્ટનો કરંટ લાગતા 1/2 pic.twitter.com/FRPFFmbRWN— Chaitar Vasava AAP (@Chaitar_Vasava) May 18, 2024 -
‘ఇందిరమ్మ’కు కొత్త దరఖాస్తులు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరోసారి ప్రారంభం కాబోతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో శాసన సభ్యులదే కీలక భూమిక కానుంది. ముఖ్యంగా లబ్ధిదారుల జాబితాలు రూపొందించే విషయంలో వీరు ప్రధాన పాత్ర పోషించనున్నారు. నాలుగు నెలల క్రితం ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వివిధ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.వీటిల్లో ఇందిర మ్మ ఇళ్ల కోసం 80 లక్షలకుపైగా దరఖాస్తులు అందగా, వాటిల్లో ప్రాథమిక స్థాయిలో 16 లక్షల దర ఖాస్తులను అధికారులు తిరస్కరించారు. 64 లక్షల దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. కానీ ఇప్పుడు శాసనసభ్యుల ఆధ్వర్యంలో జాబితా రూపొందించనున్నందున, ఈ దరఖాస్తులతో పాటు కొత్తగా మళ్లీ దరఖాస్తులు స్వీకరించే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యేలదే హవా..నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికీ ఏ పథకంలో కూడా ఇళ్లు అందని పేదలనే ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో దరఖాస్తుల స్క్రూటినీ కీల కంగా మారనుంది. ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల్లో చాలావరకు గతంలో ఇళ్లు పొందిన వారికి సంబంధించినవీ ఉన్నాయని సమాచారం. ఆధార్ నంబరు, ఇతర వివరాల ఆధారంగా ఇప్పటికే ఆ విధంగా ఇళ్లు పొందినవారి దరఖాస్తులను తొలగించనున్నారు.అయితే గతంలో ఇల్లు పొందినా, ఆ తర్వాత వారి పిల్లల పెళ్లిళ్లు కావటంతో మరో ఇంటి అవసరం ఉంటుంది. అప్పుడు ఆ దరఖాస్తు అర్హమై నదే అవుతుంది. దీంతో దరఖాస్తుల్లోని వివరాల పరిశీలనే కాకుండా, క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీ లించాల్సి ఉంటుంది. దీనిపై పెద్దయెత్తున కసరత్తు అవసరం కాగా.. లబ్ధిదారుల ఎంపికలో తుది ఆమోదముద్ర జిల్లా ఇన్చార్జి మంత్రే వేయను న్నారు.అంటే ఎమ్మెల్యేలు సిఫారసు చేసే వాటికే ఆమోదముద్ర పడే అవకాశం ఉంటుంది. ఏయే ఊళ్లను ఎంపిక చేయాలి, ఆ ఊళ్లలో ఎవరికి ఇళ్లు మంజూరు చేయాలి అన్న దానిపై ఎమ్మెల్యేల నిర్ణయానికే ప్రాధాన్యం దక్కనుంది. దీంతో ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులకే వీరు పరిమితం అయ్యే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.పాత దరఖాస్తులు అలంకారప్రాయమే!ఇలాంటి పథకాలకు దరఖాస్తు చేసుకోవ టం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. లబ్ధిదారుల ఎంపికలో చాలా అంశాలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ క్రమంలోనే కొత్తగా దరఖాస్తులు స్వీకరించి మరీ జాబితాలు రూపొందించే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులు అలంకారప్రాయంగానే మిగిలిపోయే పరిస్థితి ఉండనుంది. -
చిడతలు వాయిస్తూ బీజేపీ ఎమ్మెల్యే సందడి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లో లోక్సభ నాలుగో దశ పోలింగ్ సందడిగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్కు చేరుకోవడం ప్రారంభించారు. ఈ దశలో యూపీలోని 13 స్థానాలకు జరుగుతున్న పోలింగ్లో మొత్తం 130 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కన్నౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు.కాన్పూర్లో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర మైతాని సందడి చేశారు. చిడతలు, తాళాలు, డోలు వాయిస్తూ ఊరేగింపుగా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఓటర్లందరూ ఉత్సాహంగా బయటకు వచ్చి ఓటేసేలా చైతన్యపరచడానికి ఇలా చేసినట్లు ఆయన వివరించారు. -
ఎమ్మెల్యే కారును ఢీకొని ఇద్దరు మృతి
తలకొండపల్లి, కల్వకుర్తి /కల్వకుర్తి టౌన్: కల్వకుర్తి ఎమ్మెల్యే కసి రెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారు ఢీకొన్న ఘటనలో ద్విచ క్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. తలకొండపల్లి మండల పరిధి వెల్జాల్ సమీపంలో సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్క డికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి హైదరాబాద్లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. వివరాలి లా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే నారాయణ్రెడ్డి వెల్జాల్ నుంచి మిడ్జిల్ వెళ్తుండగా రామాసిపల్లి మైసమ్మ దేవాలయం వద్ద ఎదురుగా వచ్చిన బైక్ ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. బైక్ను తప్పించే క్రమంలో ఎమ్మెల్యే వాహనం రోడ్డు దిగి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వెంకటాపూర్ గ్రామానికి చెందిన పబ్బతి నరేశ్ (25) అక్కడిక్కడే మృతి చెందగా బైరపాక పరశురాం(35) గాయపడ్డాడు. అతన్ని చికిత్స కోసం వెల్దండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడినుంచి హైదరాబాద్కు తరలించగా పరిస్థితి విషమించి రాత్రి మృతి చెందాడు. ఎమ్మెల్యే కారులోని ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ కావడంతో ఎమ్మెల్యేతో సహా మిగిలిన వారికి స్వల్పగాయాలయ్యాయి. ఎమ్మెల్యే నారాయణ రెడ్డిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. -
స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి నానారావ్ పార్కులో బీజేపీ ప్రభుత్వం నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ఎన్నాళ్లయినా అందుబాటులోకి రాకపోవడంపై సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్పాయ్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.కాన్పూర్ పట్టణంలోని నానారావ్ పార్క్ ఎంతో పురాతనమైనది. యోగి ప్రభుత్వం పార్కు నిర్వహణ, సుందరీకరణకు సంబంధించి పలు వాగ్దానాలు చేసింది. వీటిలో స్విమ్మింగ్ పూల్ను నిర్మించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఒకటి. అయితే ఏళ్లు గడుస్తున్నా ఈ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పూర్తికాలేదు. దీనిపై ఎస్పీ ఎమ్మెల్యే అమితాబ్ బాజ్పాయ్ నిరసన ప్రదర్శన చేపట్టారు.ఆయన ఒక చిన్న బాత్ టబ్తో ఈ పార్కుకు చేరుకుని, దానిని నీటితో నింపారు. ఆ తర్వాత ఆ టబ్లో ఆయన కూర్చున్నారు. దానిలోనే ఎంజాయ్ చేస్తూ, స్వీట్లు కూడా తిన్నారు. పైగా పక్కనే ఒక బ్యానర్ తగిలించి, దానిపై ‘రూ.11 కోట్ల విలువైన స్విమ్మింగ్ పూల్ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు’ అని రాశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్విమ్మింగ్ పూల్పై సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివలన ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, నగర ప్రజలు వేసవిలో ఇక్కడ ఎంజాయ్ చేయలేకపోతున్నారని వాపోయారు. ఈ కొలను 2023లోనే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకోలేదన్నారు. దీని నిర్మాణంలో ఆర్థిక సమస్య లుంటే తమకు తెలియజేయాలని, అప్పుడు ప్రజల నుండి విరాళాలు సేకరించి అందజేస్తామన్నారు. -
మాకు ఓటు వేయకుంటే కరెంట్ కట్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపు!
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పలు ఆసక్తికర వైనాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కోవలోకే వస్తుంది కర్నాటకకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యవహారం. సదరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కర్నాటకలోని కాగ్వాడ్ ఎమ్మెల్యే రాజు కాగే ఎన్నికల ప్రచారంలో ఓటర్లను బెదిరించారు. ఓటర్లంతా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్కు ఓటు వేయాలని, లేకుంటే వారి ఇళ్లకు సరఫరా అయ్యే విద్యుత్ను నిలిపివేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీకి ఆయుధంగా మారాయి.రాజు కాగే తన నియోజకవర్గమైన బెలగావిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. వీడియోలో ఆయన ‘నాకు గతంలో కొన్ని చోట్ల తక్కువ ఓట్లు వచ్చాయి. నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడను. ఇకముందు మాకు ఎక్కువ ఓట్లు రాకపోతే, అప్పుడు మేము మీ ఇంటికి అయ్యే విద్యుత్తును నిలిపివేస్తాం. దీనిని గుర్తుంచుకోండి నేను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాను’ అని ప్రజల ముందు వ్యాఖ్యానించడం చూడవచ్చు.దీనిపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి పూనావాలా ఈ వ్యాఖ్యలను రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటనతో ముడిపెట్టారు. డీకే శివకుమార్ తన సోదరుడు డీకే సురేష్కు ఓటు వేయాలని, లేకపోతే మీరనుకున్న పనులు జరగవని ప్రజలతో అన్నారు. ఇది కాంగ్రెస్కు ఉన్న అర్హత, అహంకారాన్ని తెలియజేస్తోందని, ఓటర్లను తమ బానిసలు అని కాంగ్రెస్ నేతలు ఎలా అనుకుంటారని పూనావాలా ప్రశ్నించారు.కగ్వాడ్ అసెంబ్లీ నియోజకవర్గం చిక్కోడి లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఏప్రిల్ 26న రెండో దశలో ఇక్కడ ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలోని 28 స్థానాలకు గాను 14 స్థానాలకు రెండో దశలో ఓటింగ్ జరిగింది. మూడో దశలో మిగిలిన స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. -
వలసలు ఆగేదెలా?
సాక్షి, ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతోంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగడం లేదు. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంపింగ్స్ కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు ముఖ్యనేతలు కారు మార్చగా, ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయకుల వంతు వచ్చింది. ఈ పరిస్థితుల్లో వలసలు ఆగేదెలా అనే తర్జనభర్జన పార్టీలో సాగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరగనుంది. ఇదీ పరిస్థితి.. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ క్రమంగా ఢీలా పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వా త ఈ పార్టీ నుంచి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ముఖ్యనేతలు మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, విఠల్రెడ్డి ఇది వరకే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి ఐకేరెడ్డి కూడా చేరుతారనే ప్రచారం ఉంది. ఇదిలా ఉంటే తాజాగా నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని సోమవారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే వారు హస్తం గూటికి చేరనున్నారు. వీరితో పాటు ఆదిలాబాద్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారన్న ప్రచారం ఉంది. జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ బీజేపీలోకి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి కాంగ్రెస్లోకి ఇది వరకే పార్టీ మారారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో పార్టీ బలహీన పడింది. పార్లమెంట్ అభ్యర్థిగా ఆత్రం సక్కు పార్టీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. బూత్ స్థాయిలో కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు కేటీఆర్ పర్యటన తోడ్పడుతుందా? అనేది వేచి చూడాల్సిందే. ఇవి చదవండి: కోర్టు తీర్పుపై ఉత్కంఠ.. కవితకు ఊరట దక్కేనా? -
Lok sabha elections 2024: మ్యాచ్ ఫిక్సింగ్ అంటారని..
బాలాఘాట్: అనుభా ముంజారే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈమె భర్త కంకర్ ముంజారే గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికయ్యారు. తాజాగా బాలాఘాట్ లోక్సభ స్థానానికి బీఎస్పీ అభ్యరి్థ. తామిద్దరి మధ్య సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నందున ఒకే ఇంట్లో ఉండలేకపోతున్నానంటూ కంకర్ ముంజారే ఓ విచిత్ర నిర్ణయం తీసుకున్నారు. ‘భిన్న సిద్ధాంతాలు కలిగిన పారీ్టల్లో కొనసాగుతూ ఇద్దరం ఒకే చోట ఉంటే మ్యాచ్ ఫిక్సింగ్ అని అందరూ మమ్మల్ని అనుమానిస్తారు. అందుకే శుక్రవారం నుంచి వేరే చోట ఓ గుడిసెలో ఉంటున్నాను. ఎన్నికల పోలింగ్ రోజున ఏప్రిల్ 19వ తేదీన తిరిగి మా ఇంటికి వెళ్తా’అని ఆయన తెలిపారు. భర్త నిర్ణయం తనను బాధిస్తోందని అనుభ చెప్పారు. ‘గతంలో ఆయన గోండ్వానా గణతంత్ర పార్టీ తరఫున పారస్వాడ స్థానానికి, నేను బాలాఘాట్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పుడు కూడా ఒకే ఇంట్లో ఉన్నాం. పెళ్లైనప్పటి నుంచి 33 ఏళ్లుగా కుమారుడితోపాటు కలిసే సంతోషంగా ఉంటున్నాం’అని ఆమె అన్నారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో భర్త కంకర్పై విమర్శలు చేయబోనన్నారు. కాగా, 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాలాఘాట్లో బీజేపీ సీనియర్ నేత గౌరీశంకర్ బిసెన్పై అనుభా ముంజారే ఘన విజయం సాధించారు. -
పీతను హింసించారు.. ఎమ్మెల్యేపై ‘పెటా’ ఫిర్యాదు
ముంబై, సాక్షి: ఇటీవల విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ పవార్ పీతను వేలాడదీయడంపై జంతు హక్కుల సంస్థ పెటా (PETA) ఎన్నికల అధికారులకు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరత్ పవార్) చీఫ్ శరద్ పవార్కు లేఖ రాసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, మహారాష్ట్ర మోడల్ ప్రవర్తనా నియమావళి, ఎన్నికల ప్రచారానికి, ఎన్నికలకు జంతువులను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ 2014 మార్చి 24న జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించారని పెటా పేర్కొంది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఎమ్మెల్యే రోహిత్ పవార్ పీతను హింసించారని వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోందని, మీడియా స్టంట్ కోసం మూగ ప్రాణులకు నొప్పి, బాధ కలిగించారని శరత్ పవార్తోపాటు జిల్లా ఎన్నికల అధికారి మినల్ కలస్కర్కు రాసిన లేఖలో పెటా ఇండియా అడ్వకేసీ అసోసియేట్ శౌర్య అగర్వాల్ పేర్కొన్నారు. అలాగే వెటర్నరీ కేర్, పునరావాసం కోసం పీతను తిరిగి ప్రకృతిలోకి వదిలిపెట్టాలని కోరుతూ ఎమ్మెల్యే రోహిత్ పవార్కు కూడా పెటా ఇండియా లేఖ రాసింది. -
ఈశాన్యం ఎవరి వశం!
సెవెన్ సిస్టర్స్గా పేరొందిన ఈశాన్య రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు తక్కువగానే ఉన్నప్పటికీ, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఏడు రాష్ట్రాలతో పాటు సిక్కింను సోదర రాష్ట్రంగా వ్యవహరింటారు. భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, చైనాలతో సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్న ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. కొన్నేళ్లుగా జాతీయ పార్టీలు వాటికి తీవ్రంగా పోటీ ఇస్తున్నాయి. గత రెండు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలతో ఈశాన్యంలో పాగా వేసింది. అయితే ఇటీవలి మణిపూర్ మారణకాండ నేపథ్యంలో సమీకరణాలు మారుతున్నాయి... నోట్: ఈశాన్య రాష్ట్రాల్లో 14 లోక్సభ సీట్లున్న అసోంపై విడిగా కథనం అందిస్తాం మణిపూర్.. కాంగ్రెస్కు షాక్ మణిపూర్లో అసెంబ్లీతో పాటు లోక్సభ స్థానాల్లోనూ పట్టు నిలుపుకుంటూ వస్తున్న కాంగ్రెస్కు 2019లో తొలిసారి షాక్ తగిలింది. ఇక్కడి రెండు సీట్లలో ఓటమి పాలైంది. ఒకటి బీజేపీ, మరోటి ప్రాంతీయ పార్టీ నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)కు గెలుచుకున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరింది. 60 సీట్లకు గాను బీజేపీ 32 స్థానాలు కైవసం చేసుకుని సొంతంగా మెజారిటీ దక్కించుకుంది. ప్రాంతీయ పార్టీలైన ఎన్పీఎఫ్, ఎన్పీపీ, లోక్ జనశక్తి పార్టీలతో కలిసి బీరేన్ సింగ్ సీఎంగా ఎన్డీఏ సర్కారు కొలువుదీరింది. గతేడాది కుకీ, మెయితీ తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు దేశమంతటా ప్రకంపనలు సృష్టించాయి. అత్యాచారాలు, సజీవ దహనాలతో మణిపూర్ అట్టుడికింది. ఇప్పటికీ పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ప్రభుత్వం అల్లర్ల బీజీపీ నివారణలో విఫలమైందని, మోదీ కనీసం ఒక్కసారైనా పర్యటించలేదంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మేఘాలయ... బీజేపీకి అందని ద్రాక్ష ఇక్కడా ప్రాంతీయ పార్టీల హవాయే సాగుతోంది. కాంగ్రెస్ పోటీ ఇస్తున్నా బీజేపీ పెద్దగా సోదిలో లేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అంతే. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్పీపీ చెరో సీటు గెలవగా బీజేపీ ఖాతా తెరవలేదు. ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగేలా కన్పిస్తోంది. ఇక మిజోరంలో ఏకైక లోక్సభ స్థానం ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్ మధ్య చేతులు మారుతోంది. 2019లో ఎంఎన్ఎఫ్ గెలిచింది. నాగాలాండ్లో ఏకైక లోక్సభ సీటును 2004, 2014ల్లో నాగాలాండ్ పీపుల్స్ పార్టీ గెలుచుకుంది. 2019లో నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ గెలిచింది. ఈసారి ఎన్సీపీ కూడా గట్టి పోటీ ఇస్తోంది. సర్వేలు ఏమంటున్నాయి... అరుణాచల్, త్రిపురల్లోని 4 సీట్లూ బీజేపీవేనని, మణిపూర్లో బీజేపీ, కాంగ్రెస్ చెరోటి, మిజోరంలో జెడ్పీఎం, నాగాలాండ్లో ఎన్డీపీపీ, సిక్కింలో ఎస్కేఎం, మేఘాలయలో ఎన్పీపీకి 2 సీట్లు దక్కుతాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే బీజేపీ ఈశాన్యంలో తన 5 సీట్లను నిలబెట్టుకోనుంది. కాంగ్రెస్ ఒక స్థానాన్ని చేజార్చుకోనుంది. రెండు విడతల్లో పోలింగ్ అసోం మినహా ఈశాన్య రాష్ట్రాల్లో 11 లోక్సభ స్థానాలున్నాయి. అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, త్రిపురలో రెండేసి, మిజోరం, నాగాలాండ్, సిక్కింలో ఒక్కో సీటు ఉన్నాయి. అరుణాచల్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర వెస్ట్, ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గాల్లో తొలి విడత (ఏప్రిల్ 19) ఎన్నికలు జరగనున్నాయి. త్రిపుర ఈస్ట్, ఔటర్ మణిపూర్లో రెండో దశలో (ఏప్రిల్ 26) పోలింగ్ నిర్వహించనున్నారు. త్రిపుర.. కమ్యూనిస్టుల కోట బద్దలు ఈ కమ్యూనిస్టుల కంచుకోటలో ఎట్టకేలకు కాషాయ జెండా ఎగరింది. 1998 నుంచి 2018 దాకా రాష్ట్రాన్ని సీపీఎం నేత మాణిక్ సర్కార్ ఏలారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 60 ఎమ్మెల్యే సీట్లలో 36 స్థానాలు దక్కించుకుని బిప్లవ్ కుమార్ దేవ్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ రెండు సీట్లలోనూ బీజేపీ చేతిలో సీపీఎం ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త ప్రభావం చూపుతున్నా లోక్సభ పోరులో మాత్రం పూర్తిగా వెనకబడింది. అరుణాచల్లో బీజేపీ పాగా కాంగ్రెస్ కంచుకోట అయిన ఈ రాష్ట్రంలో ఎట్టకేలకు కమలనాథులు పాగా వేశారు. ఇక్కడ లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. 2004 నుంచి 2014 దాకా రాష్ట్రంలో కాంగ్రెసే అధికారాన్ని చేజక్కించుకుంది. లోక్సభ ఎన్నికల్లో మాత్రం రెండు సీట్లనూ 2004లో బీజేపీ, 2009లో కాంగ్రెస్ నెగ్గాయి. 2014లో చెరో సీటు దక్కించుకున్నాయి. 2019 మాత్రం మోదీ సునామీ ఈశాన్యాన్ని కూడా ముంచెత్తింది. దాంతో అరుణాచల్ పూర్తిగా బీజేపీ ఖాతాలో చేరింది. రెండు లోక్సభ సీట్లతో పాటు అసెంబ్లీలోనూ ఎన్డీఏ పాగా వేసి కాంగ్రెస్ (యూపీఏ) సుదీర్ఘ పాలనకు తెరదించింది. 60 సీట్ల అరుణాచల్ అసెంబ్లీలో ఎన్డీఏ భాగస్వాములు బీజేపీ 41 సీట్లు, జేడీయూ 7, నేషనల్ పీపుల్స్ పార్టీ 5 గెలుచుకున్నాయి. పెమా ఖండూ సీఎంగా తొలిసారి పూర్తి మెజారిటీతో బీజేపీ సర్కారు కొలువుదీరింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోలింగ్కు ముందే ఖాతా తెరిచింది. సీఎం పెమా ఖండూతో సహా 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019లో కూడా ఖండూతో పాటు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. ఈసారి మొత్తం 60 సీట్లలోనూ బీజేపీ బరిలో ఉంది. సిక్కింలో లోకల్ హవా ఈ బుల్లి రాష్ట్రంలో కూడా లోక్సభతో పాటు అసెంబ్లీకీ ఎన్నికలు జరుతున్నాయి. ఇక్కడ లోకల్ పార్టీలదే పూర్తి హవా. దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం సీఎం పదవిలో కొనసాగిన రికార్డు దక్కించుకున్న (1994 నుంచి 2019 వరకు, 5 సార్లు) పవన్ కుమార్ చామ్లింగ్కు గత ఎన్నికల్లో షాక్ తగిలింది. ప్రేమ్ సింగ్ తమాంగ్ నేతృత్వంలోని సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం) చేతిలో చామ్లింగ్ పార్టీ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) ఓటమి చవిచూసింది. లోక్సభ సీటు కూడా ఎస్కేఎం వశమైంది. దాంతో ఈసారి పోరు ఆసక్తికరంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టికెట్ ఎవరి చేతికో? అభయ ‘హస్తం’పై ఉత్కంఠ!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రకటించలేదు. ముందుగా అనుకున్న విధంగా అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి పేరు కాకుండా తెరపైకి మరో రెండు కొత్త పేర్లు రావడంతో కేడర్ అయోమయంలో పడింది. ఇప్పటికే కరీంనగర్లో లోకల్ నాన్ లో కల్ అంటూ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ వినోద్కుమార్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ మరో స్థానికేతరుడు తీన్మార్ మల్లన్నకు టికెట్ ఇస్తే తాము పనిచేసే పరిస్థితి ఉండదని స్థానికనేతలు కుండబద్ధలు కొడుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన హస్తం అధిష్టానం తెలంగాణలో ఎంతో కీలకమైన కరీంనగర్ ఎంపీ స్థానానికి మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం, స్థానికేతరులకు అవకాశం ఇస్తారన్న ఊహాగానాలు మొదలవడంతో కేడర్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రవీణ్రెడ్డి అభిమానుల గుస్సా అసెంబ్లీ ఎన్నికల్లో తన సీటును పార్టీ కోసం త్యాగం చేసిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డికి అదే సమయంలో ఎంపీ సీటు ఇస్తామని అధిష్టానం మాటిచ్చింది. ప్రవీణ్రెడ్డి పోటీకి సిద్ధమయ్యారు. పార్లమెంటు పరిధిలో ప్ర చార పోస్టర్లు వేసుకున్నారు. కానీ, అకస్మాత్తుగా తెరపైకి వెలి చాల రాజేందర్రావు పేరు వచ్చింది. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తూ అధిష్టానాన్ని ఒప్పించే పనిలో పడ్డారు. ఈ పరిణామాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ప్రవీణ్రెడ్డి వర్గం కిమ్మనడం లేదు. ఇది చాలదన్నట్లుగా అదనంగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పేరును తెరపైకి కాంగ్రెస్ నేతలు తీసుకువచ్చారు. దీంతో ప్రవీణ్రెడ్డి అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తమకు హుస్నాబాద్, హుజూరాబాద్, మానకొండూరు, కరీంనగర్ నియోజవకర్గాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉందని, తమను కాదని ఎక్కడి నుంచో నాయకులను తీసుకురావాల్సిన అగత్యమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే దూరమైన రోహిత్రావు పార్టీ టికెట్ కోసం కొన్నేళ్లుగా ఎమ్మెస్సార్ మనవడు మేనేని రోహిత్రావు కాంగ్రెస్లో పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన అధిష్టానం ఎంపీ ఎన్నికల సమయంలో పరిశీలిస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు. దీంతో ఆయన కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. తనకు టికెట్ రాకున్నా.. ప్రవీణ్రెడ్డి కోసం పనిచేసేందుకు రోహిత్రావు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిసింది. తీరా ప్రవీణ్రెడ్డిని కాదని ఇంకెవరికి ఇచ్చినా రోహిత్రావు వర్గం పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని, కనీసం పార్టీలో సభ్యత్వం లేనివారిని పోటీలోకి దింపడంపై జిల్లా కాంగ్రెస్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. త్వరలో కాంగ్రెస్లోకి గులాబీ నేతలు బీఆర్ఎస్ అధిష్టానానికి వరుసషాకులు తగులుతున్న వేళ.. కరీంనగర్ జిల్లా మాత్రం కంచుకోటలా ఉంటూ వస్తోంది. కొంతకాలంగా హస్తం పార్టీ నేతల లాబీయింగ్ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జిల్లాకు చెందిన కీలక గులాబీ నేతలు ఈనెల 6న హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో జరిగే రాహుల్గాంధీ సభలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చకోనున్నారని సమాచారం. తెరపైకి మరో వ్యక్తి.. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి, తీన్మార్ మల్లన్న, వెలిచాల రాజేందర్రావులతోపాటు మరో ఆసక్తికర వ్యక్తి పేరు వినిపిస్తోంది. బీఆర్ఎస్లో ముఖ్యనేతగా ఉన్న ఓ వ్యక్తిని పార్టీలోకి చేర్చుకోగానే అతన్నే ఎంపీగా పోటీ చేయిస్తారన్న ప్రచారం ఆసక్తిగా మారింది. ఒకవేళ అదే వాస్తవరూపం దాలిస్తే.. కరీంనగర్ రాజకీయాలు ఊహించని మలుపు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. టికెట్ ప్రకటించిన పెద్దపల్లిలో అనిశ్చితే.. పెద్దపల్లి పార్లమెంట్లో కాంగ్రెస్ టికెట్ ఖరారైనా అనిశ్చితే నెలకొంది. గడ్డం కుటుంబానికి చెందిన వినోద్కుమార్ బెల్లంపల్లికి, వివేక్ చెన్నూర్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తాజాగా పెద్దపల్లి ఎంపీగా ఆదే కుటుంబానికి చెందిన గడ్డం వంశీకృష్ణకు టికెట్ కేటాయించడంపై నియోజకవర్గంలో రచ్చ జరుగుతోంది. మాదిగలు ఎక్కువగా ఉండే పెద్దపల్లి స్థానానికి మాదిగ సామాజికవర్గం వారికే టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుడికి సమాచారం ఇవ్వకుండా గడ్డం వంశీకి టిక్కెట్ కేటాయించారని, పునరాలోచన చేయకపోతే వచ్చే నెల 5న న్యాయ దీక్ష చేస్తానంటూ యువజన జాతీయ మాజీ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్ అధిష్టానాన్ని హెచ్చరించారు. తాజాగా రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలతో టికెట్ మార్పుపై ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని మూడు రిజర్వ్డ్ స్థానాల్లోని పెద్దపల్లి, నాగర్కర్నూల్లో మాల సామాజికవర్గానికి టికెట్ కేటాయించింది. వరంగల్లో మాదిగ సామాజికవర్గంలోని ఉప కులానికి చెందిన కడియం శ్రీహరికే టిక్కెట్ కేటాయించనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి టికెట్ మార్పు చేస్తుందా? గడ్డం వంశీనే కొనసాగిస్తాందో వేచి చూడాల్సి ఉంది. కాగా.. టికెట్ ఖరారు చేసుకున్న గడ్డం వంశీ ప్రచారంలో దూసుకపోకపోయినా.. వివిధ పార్టీల్లో ఉన్న నేతలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుతూ బలాన్ని పెంచుకుంటున్నారు.. ఇవి చదవండి: ఆర్థికంగా దెబ్బతీసేందుకు మోదీ కుట్ర : ఎమ్మెల్యే కవ్వంపల్లి -
ఆమెకు వంట మాత్రమే తెలుసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగింది. దావణగెరె స్థానం నుంచి బరిలో బీజేపీ అభ్యర్థికి "వంటగదిలో వంట చేయడం మాత్రమే తెలుసు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కోడలు ప్రభా మల్లికార్జున్ కోసం ఆయన ప్రచారం చేస్తున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. దావణగెరె స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రస్తత ఎంపీ జీఎం సిద్దేశ్వర భార్య గాయత్రి సిద్దేశ్వరను బరిలోకి దింపింది. గాయత్రి సిద్దేశ్వర ఉద్దేశించి ఎమ్మెల్యే శామనూరు శివశంకరప్ప మాట్లాడుతూ.. ‘ఆమె ఎన్నికల్లో గెలిచి (ప్రధాని) మోదీకి కమలం అందించాలనుకుంటోందని మీ అందరికీ తెలుసు. ముందు దావణగెరె సమస్యలను అర్థం చేసుకోండి. ఈ ప్రాంతంలో మేము అభివృద్ధి పనులు చేశాం. మీకు మాట్లాడటం తెలియదు. కిచెన్లో వంట చేయడం మాత్రమే తెలుసు. ప్రతిపక్ష పార్టీకి బహిరంగంగా మాట్లాడే శక్తి లేదు" అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. శివశంకరప్ప తనపై చేసిన వ్యాఖ్యలపై గాయత్రి సిద్దేశ్వర స్పందిస్తూ.. ప్రస్తుతం మహిళలు అన్నింటా రాణిస్తున్నారని, కానీ మహిళలు వంటింట్లోనే ఉండాలి అనే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు ఇంట్లోని మగవాళ్లకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ ఎంత ప్రేమగా వంట చేస్తారో ఆయనకు తెలియదన్నారు. మహిళలు స్వతంత్రంగా ఎదగడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సాహం అందిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. -
బాసరలో మంత్రి సీతక్క పూజలు..
ఆదిలాబాద్: బాసర సరస్వతి అమ్మవారిని రాష్ట్ర గిరిజన, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి మాజీ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, నారాయణ్రావుపాటిల్ స్వాగతం పలి కారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతకుముందు బాసరలోని పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సీతక్క సమావేశం నిర్వహించారు. మంత్రివెంట ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, నాయకులు ఉన్నారు. కదిలి పాపహరేశ్వరాలయంలో.. మండలంలోని శ్రీమాతాన్నపూర్ణ పాపహరేశ్వర స్వామిని ఆదివారం రాష్ట్రమంత్రి సీతక్క దర్శించుకున్నారు. అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రికి ఆలయ పరిసరాలు, విశిష్టతను అర్చకులు వివరించారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, కాంగ్రెస్ నాయకులు ఆత్రం సుగుణ, ఆత్రం భాస్కర్, నాయకులు రాజారెడ్డి, రమణ, విద్యాసాగర్రెడ్డి, పరుశురాం, ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రావు పాటిల్ ఉన్నారు. ఇవి చదవండి: బీఆర్ఎస్ పాలన దోచుకోవడం.. దాచుకోవడమే.. : కోదండరామ్ -
బీజేపీతోనే దేశ సమగ్రాభివృద్ధి : మాజీ ఎమ్మెల్యే రఘునందన్
సంగారెడ్డి: దేశ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఆత్మకూర్ గ్రామంలో బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించి ప్రధాని మోదీకి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. మోదీ పాలనా దక్షతతో దేశం ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి పులిమామిడి రాజు, నాయకులు మాణిక్ రావు, సంగమేశ్వర్, చిన్న పటేల్, విష్ణువర్థన్ రెడ్డి, సుధాకర్ పాల్గొన్నారు. మోదీ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి దేశ ప్రజలకు ఉపయోగపడే పథకాలను పీఎం మోదీ అమలు చేస్తున్నారని, వీటిని గ్రామగ్రామాన వివరించాలని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిన్నారంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు జగన్రెడ్డి, ప్రతాప్రెడ్డి, రవీందర్రెడ్డి, రాజిరెడ్డిల పాల్గొన్నారు. ఇవి చదవండి: కేసీఆర్ కీలక నిర్ణయంతో.. ఉత్కంఠకు తెర! -
ఆరుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు..
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యులుగా ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పలు పిటిషన్లకు సంబంధించి కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ముగ్గురు, ఒక సీపీఐ ఎమ్మెల్యేకు హైకోర్టు శుక్రవారం వేర్వేరుగా నోటీసులు జారీ చేసింది. వారంతా వచ్చే నెలలోగా స్పందించి కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చేనెల (ఏప్రిల్ 16, 18, 19 తేదీలకు) వాయిదా వేసింది. అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ (బీఆర్ఎస్), జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ (బీఆర్ఎస్), ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మి (బీఆర్ఎస్), మహబూబ్నగర్ నుంచి యెన్నం శ్రీనివాస్రెడ్డి (కాంగ్రెస్), దేవరకద్ర నుంచి జి.మధుసూదన్రెడ్డి (కాంగ్రెస్), కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు(సీపీఐ) విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఓడిన ప్రత్యర్థులు కొందరు వీరి ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వారు ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారని, సరైన సమాచారం ఇవ్వలేదని వాటిలో పేర్కొన్నారు. ఆ ఎమ్మెల్యేల ఎన్నికను కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి, జస్టిస్ సూరేపల్లి నందా తదితరులతో కూడిన వేర్వేరు ధర్మాసనాలు శుక్రవారం విచారణ చేపట్టారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేశాయి. ఎవరెవరిపై పిటిషన్లు..? మహబూబ్నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన యెన్నం శ్రీనివాస్రెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిటిషన్ వేశారు; జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్, నవీన్యాదవ్..; కొత్తగూడెం నుంచి సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ఎన్నికను సవాల్ చేస్తూ కొత్తగూడెం పట్టణానికి చెందిన నందూలాల్ అగర్వాల్..; ఆసిఫాబాద్ నుంచి బీఆర్ఎస్ నేత కోవ లక్ష్మి ఎన్నికను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్..; ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్ (ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు) ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి పి.విజయారెడ్డి..; దేవరకద్ర నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన జి.మధుసూదన్రెడ్డి ఎన్నిక రద్దు కోరుతూ బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. -
‘పల్లా’కు మతిభ్రమించింది.. : సుంకెట అన్వేష్రెడ్డి
నిజామాబాద్: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకెట అన్వేష్రెడ్డి విమర్శించారు. నగరంలోని కాంగ్రెస్ భవన్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. పల్లా రాజేశ్వర్రెడ్డి రైతు సమన్వయ సమితి ఉన్న అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రకతి వైపరీత్యాలు వచ్చినా స్పందించలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలపై సర్వే చేయిస్తున్నట్లు చెప్పారు. సర్వే కాకుండానే రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు రాజేశ్వర్రెడ్డి ఎలా చెబుతారని ప్రశ్నించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్హందాన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి, సిరికొండ గంగారెడ్డి, అల్లూరి మహేందర్ రెడ్డి, శశిధర్రెడ్డి, సుంకెట బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఇవి చదవండి: పసుపుబోర్డు ఎక్కడుందో చెప్పాలి.. : ఎంపీ బాజిరెడ్డి -
బీజేపీలో అసమ్మతి రాగం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా
గాంధీ నగర్, సాక్షి : లోక్సభ ఎన్నికలకు ముందు గుజరాత్ బీజేపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే కేతన్ ఇనామ్దార్ తన పదవికి రాజీనామా చేశారు. వడోదర జిల్లా సావ్లి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్ శంకర్ చౌదరికి అందించారు. కేతన్ ఇనమాదార్ 2020 లోనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే దానిని స్పీకర్ ఆమోదించలేదు. సీనియర్ ప్రభుత్వ అధికారులు, మంత్రులు తనను, తన నియోజకవర్గాన్ని విస్మరిస్తున్నారని అన్నారు. బీజేపీలో చాలా మంది ఎమ్మెల్యేలు తనలాగే నిరాశ చెందుతున్నారని ఇనామ్దార్ నాడు పేర్కొన్నారు. ఇక కేతన్ ఇనామ్దార్ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందారు. అయితే బీజేపీలోకి చేరి 2017,2022లలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మే 7న పోలింగ్ గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 సీట్లలో ప్రస్తుతం బీజేపీకి 156 ఉన్నాయి. 26 లోక్సభ స్థానాలకు మే 7న ఒకే దశలో పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
నంద్యాలలో YSRCP జెండా ఎగరేస్తాం
-
YSRCP బిగ్ టార్గెట్ ఇదే
-
ఎమ్మెల్యే సోదరుడు మధు అరెస్టు
పటాన్ చెరు టౌన్, పటాన్చెరు: అక్రమ మైనింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోద రుడు గూడెం మధుసూదన్ రెడ్డిని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీసులు శుక్రవారం తెలవారుజా మున అరెస్టు చేశారు. పటాన్చెరు మండలం లక్డా రం గ్రామంలో మధుసూదన్ రెడ్డికి చెందిన సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్పై వచ్చిన ఆరోపణలపై సంగారెడ్డి ఆర్డీవో ఆధ్వర్యంలోని టాస్క్ఫోర్స్ తని ఖీలు చేపట్టి అక్రమాలు నిజమేనని తేల్చింది. దీంతో పటాన్చెరు తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేర కు పోలీసులు 379, 447, 427, 409, 420 ఐపీసీ సెక్షన్ 3 పీడీపీపీ యాక్ట్ సెక్షన్ 21, 23, 4 క్లాస్ (1),4 క్లాస్ (1)ఏ కేసు నమోదు చేసి శుక్రవారం తెల్లవారుజామున గూడెం మధును అరెస్టు చేశారు. రిమాండ్కు తరలించే ముందు ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు పటాన్చెరుకు కాకుండా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరచగా మూడో అదనపు మేజిస్ట్రేట్ 14 రోజులపాటు రిమాండ్ విధించారు. అనంతరం కందిలోని జిల్లా జైలుకు తరలించారు. మంత్రి దామోదర ఆదేశాలతోనే అక్రమ కేసులు: ఎమ్మెల్యే హరీశ్రావు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి సోదరుడుమధుసూదన్ రెడ్డి అరెస్టును మాజీమంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో చేరాలి.. లేకుంటే అక్రమ కేసులు నమోదు చేస్తాం’’ అన్న విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతోనే తమ పార్టీ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. బెదిరింపులకు భయపడం?: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తాను తప్పు చేస్తే మూడుసార్లు గెలిచేవాడిని కాదని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో పదేళ్లలో ఎవరి మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. 2012–13లో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పూర్తి అనుమతితోనే క్వారీలను ప్రారంభించామని గుర్తు చేశారు. చట్టపరంగా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, బెదిరింపులకు భయపడబోమన్నారు. సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. -
బీజేపీకి నో చెప్పా... ఈడీ వచ్చింది: జార్ఖండ్ ఎమ్మెల్యే
రాంచీ: లోక్సభ ఎన్నికల వేళ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలు ప్రకటిస్తున్నాయి. చివరి నిమిషంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారేవారికి కూడా ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితాల్లో చోటు దక్కుతున్న విషయం తెలిసిందే. ఈ నేపపథ్యంలో జార్ఖండ్లోని బర్కాగాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ తనకు ఆఫర్ ఇచ్చిందని ఈ ఆఫర్ రిజెక్ట్ చేసినందుకే తన నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తో అర్ధరాత్రి దాడులు చేస్తోందన్నారు. VIDEO | ED raids to break morale ahead of LS polls: Congress MLA Amba Prasad's mother READ: https://t.co/J7UeiSbEIC "I was offered an MP ticket from the BJP for Hazaribagh, which I declined. Some people from the BJP side pressurised me to contest from the side of BJP MP Chatra.… pic.twitter.com/rDocABkLvp — Press Trust of India (@PTI_News) March 12, 2024 ‘నాకు బీజేపీ హజారీబాగ్ ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది. కొందరు బీజేపీ నేతలు నన్ను ఛాత్రా నుంచి పోటీ చేయాల్సిందిగా కోరారు. ఈ ఆఫర్లను నేను తిరస్కరించాను. దీంతో ఈడీని రంగంలోకి దించి నాపై దాడులు చేయిస్తున్నారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని ఎమ్మెల్యే మండిపడ్డారు. మనీలాండరింగ్ కేసులో అంబ ప్రసాద్కు సంబంధించిన 17 ప్రదేశాల్లో ఈడీ మంగళవారం అర్ధరాత్రి సోదాలు ప్రారంభించింది. జార్ఖండ్లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా ఉన్న అంబ ప్రసాద్ మాజీ మంత్రి యోగేంద్ర సా కుమార్తె. హజారీబాగ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో అంబప్రసాద్ కుటుంబానికి గట్టి పట్టుండటం గమనార్హం. #WATCH | Ranchi, Jharkhand: The Enforcement Directorate (ED) leaves after conducting raids on the premises of Congress MLA Amba Prasad for almost 18 hours. pic.twitter.com/2vrhhMimsW — ANI (@ANI) March 12, 2024 ఇదీ చదవండి.. పోలీసుల బందోబస్తు మధ్య ఒక్కటైన గ్యాంగ్స్టర్, రివాల్వర్ రాణి -
Lok Sabha elections 2024: టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యే
కోల్కతా: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమబెంగాల్లో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. కాషాయ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ముకుట్ మణి అధికారి గురువారం అధికార టీఎంసీలో చేరారు. నడియా జిల్లా రాణాఘాట్ దక్షిణ్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన అధికారి గురువారం కోల్కతాలో జరిగిన టీఎంసీ ర్యాలీలో సీఎం మమతా బెనర్జీతోపాటు పాల్గొన్నారు. సిట్టింగ్ ఎంపీ జగన్నాథ్ సర్కారుకే మళ్లీ రాణాఘాట్ టిక్కెట్ ఇవ్వాలన్న బీజేపీ అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తితో పార్టీ మారారు. ప్రజల కోసమే పనిచేసే పార్టీ టీఎంసీ, అందుకే పార్టీలో చేరానని చెప్పారు. ముకుట్ మణి అధికారి తమ పార్టీలో చేరారని టీఎంసీ తెలిపింది. దీంతో, 2021లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక టీఎంసీలో చేరిన బీజేపీల సంఖ్య ఎనిమిదికి చేరింది. -
పొత్తుల కామెడీ..
-
‘స్వాగతం’.. సుప్రీంకోర్టు తీర్పును ప్రశంసించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: లంచాల కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపులు లేవంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. ‘స్వాగతం.. సుప్రీంకోర్టు గొప్ప తీర్పు ఇచ్చింది.’ అని కొనియాడారు. ఇకపై దేశంలో స్వచ్ఛమైన రాజకీయాలు కొనసాగుతాయని, సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ పోస్టుకు సుప్రీం తీర్పునకు సంబంధించిన కథనాన్ని కూడా జత చేశారు. కాగా లంచాల కేసులో ప్రజా ప్రతినిధులకు ఎలాంటి మినహాయింపులు ఉండవని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం సోమవారం సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే, ఎంపీలు లంచాలు తీసుకుంటే విచారణ ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. 1998లో పీవీ నరసింహారావు కేసులో అయిదుగురు జడ్జీల తీర్పును ధర్మాసనం కొట్టివేసింది. పార్లమెంట్, శాసనసభలో లంచాలు తీసుకొనిలో ప్రసంగాలు చేయడం. ఓటు వేసే ఎంపీలు, ఎమ్మెల్యేలు విచారణ నుంచి మినహాయింపు ఇస్తూ ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. లంచం కేసుల్లో ప్రజా ప్రతినిధులకు రాజ్యాంగ రక్షణ కల్పించలేమని తేల్చిచెప్పింది. చదవండి: సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులో ముఖ్యాంశాలు -
అందుకే క్రాస్ ఓటేశాం.. హిమాచల్ రెబల్స్
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి క్రాస్ ఓటు వేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్య ఓట్లు టై కావటంతో టాస్ వేసి ఫలితాలు ప్రకటించారు. ఈ అనూహ్య పరిణామాల నడుమ బీజేపీ అభ్యర్థి హర్ష మహాజన్ గెలుపొందారు. అయితే సర్కార్ కూలిపోయే అవకాశాలు కనిపించడంతో.. ఆ వెంటనే క్రాస్ ఓటింగ్కు పాల్పడిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర స్పీకర్ అనర్హత వేటు వేశారు. తాజాగా ఈ మొత్తం పరిణామాలపై రెబల్ ఎమ్మెల్యేలు స్పందించారు. ఎమ్మెల్యే రాజేంద్ర రానా క్రాస్ ఓటింగ్ విషయంపై మాట్లాడుతూ.. ‘హిమాచల్ ప్రదేశ్ ప్రజలపై ఉన్న గౌరవం, మర్యాద ప్రకారం మేం క్రాస్ ఓటు నిర్ణయం తీసుకున్నాం. హిమాచల్ ప్రదేశ్కు దేవభూమిగా పేరుంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా నిలపడానికి ఇంకా ఎవరూ లేరా?. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు కాంగ్రెస్కి కనిపించలేదా?. అసలు హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎవరూ ప్రాతినిధ్యం వహించాలి?’ అని రాజేంద్ర రానా ప్రశ్నించారు. ‘మేము కోర్టుకు వెళ్తాం. తీవ్రమైన ఒత్తిడి కారణంగా స్పీకర్ మాపై అనర్హత వేటు వేశారు. పోలీసు మా అనుచరులకు చలాన్లు జారీ చేయటం మొదలుపెట్టారు. మేము రాష్ట్రం ఆత్మాభిమానాన్ని రక్షిస్తాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.. కేవలం సుఖ్విందర్ సింగ్ సుఖు స్నేహితుల ప్రభుత్వం. ప్రతిఒక్కరికి రాష్ట్ర పరిస్థితి ఏంటో తెలుసు. యువత ఉద్యోగ పరీక్షలు రాసి రోడ్లమీద ఉన్నారు. వారు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చటం లేదు. కొంత మంది ఎమ్మెల్యేలను అవమాన పరుస్తున్నారు. మరో తొమ్మిది మంది మా వెంట వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని రాజేంద్ర రానా అన్నారు. -
రామ్లల్లా ముందు పిల్లాడిలా ఏడ్చిన ఎమ్మెల్యే!
అయోధ్యలో కొలువైన రామ్లల్లాను యూపీలోని గోసాయిగంజ్ సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే అభయ్ సింగ్ దర్శించుకున్నారు. ఈ సమయంలో ఆయన చిన్నపిల్లాడిలా కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో అభయ్ సింగ్ బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ వేశారు. పార్టీకి దూరమైన అనంతరం అయోధ్యకు వచ్చిన ఆయన బాలరాముని ముందు సాష్టాంగపడి భావోద్వేగానికి గురయ్యారు. అయోధ్యలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘గత జనవరి 22వ తేదీన జరిగిన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపనకు రావాలనుకున్నామని, అయితే తమకు ఆహ్వానం అందలేదన్నారు. దీంతో తమను రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి తీసుకెళ్లాలని అసెంబ్లీ స్పీకర్ను ఎస్పీ ఎమ్మెల్యేలంతా కోరారని తెలిపారు. అయితే సమాజ్వాదీ పార్టీ మినహా అన్ని పార్టీల ఎమ్మెల్యేలను అయోధ్యకు తీసుకువెళ్లారని’ ఆయన ఆరోపించారు. తాజాగా రామ్లల్లాను దర్శించుకున్న ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో శ్రీరాముని చిత్రాలను షేర్ చేశారు. ఇటీవలి పరిణామాలను చూస్తుంటే అభయ్ సింగ్ కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు
హిమాచల్ ప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల అనంతరం నెలకొన్న రాజకీయ గందరగోళం మరో మలుపు తిరిగింది. ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యింది. కాంగ్రెస్ పిటిషన్ నేపధ్యంలో స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా ఈ నిర్ణయం తీసుకున్నారు. ధర్మశాల ఎమ్మెల్యే సుధీర్ శర్మ, సుజన్పూర్ ఎమ్మెల్యే రాజేంద్ర రాణా, కుత్లహర్ ఎమ్మెల్యే దేవేంద్ర భుట్టో, గాగ్రెట్ ఎమ్మెల్యే చైతన్య శర్మ, లాహౌల్ స్పితి ఎమ్మెల్యే రవి ఠాకూర్, బాద్సర్ ఎమ్మెల్యే ఇంద్ర దత్ లఖన్పాల్ తదితరులు సభ్యత్వం రద్దయిన ఎమ్మెల్యేల జాబితాలో ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ ఈ నిర్ణయం తీసుకుని వీరందరినీ అనర్హులుగా ప్రకటించారు. ఈ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎన్నికల అభ్యర్థి హర్ష్ మహాజన్కు అనుకూలంగా ఓటు వేశారు. ఈ ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలనే డిమాండ్ను రాష్ట్ర బడ్జెట్ సమావేశంలో ఇతర సభ్యులు లేవనెత్తారు. బుధవారం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ను ఆమోదించింది. మరోవైపు భోజన విరామానికి ముందు భారతీయ జనతా పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు సస్పెన్షన్కు గురయ్యారు. ఇది కాకుండా మిగిలిన ఎమ్మెల్యేలు తమ మాట విననందుకు నిరసనగా సభను బహిష్కరించారు. సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు లేకపోవడంతో అధికార పక్షానికి అనుకూలంగా మూజువాణి ఓటుతో బడ్జెట్ ఆమోదం పొందింది. అనంతరం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కార్యకలాపాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు తలెత్తకపోతే, తదుపరి సమావేశాలు జూలై, ఆగస్టులలో వర్షాకాల సమావేశాలుగా ప్రారంభమయ్యే అవకాశముంది. #WATCH | Himachal Pradesh Assembly Speaker Kuldeep Singh Pathania says, "Six MLAs, who contested on Congress symbol, attracted provisions of anti-defection law against themselves...I declare that the six people cease to be members of the Himachal Pradesh Assembly with immediate… pic.twitter.com/QQt92aM10v — ANI (@ANI) February 29, 2024 -
జోరుగా క్రాస్ ఓటింగ్
బెంగళూరు/లఖ్నవూ/సిమ్లా/న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో జోరుగా క్రాస్ ఓటింగు సాగింది. దాంతో సంఖ్యాబలం ప్రకారం 8 స్థానాలు నెగ్గాల్సిన బీజేపీ మరో రెండు చోట్ల అనూహ్య విజయం సాధించింది! యూపీలో సమాజ్వాదీ పార్టీకి, హిమాచల్ప్రదేశ్లో పాలక కాంగ్రెస్కు గట్టి షాకిచ్చింది. ఏప్రిల్లో ఖాళీ అవుతున్న 56 రాజ్యసభ స్థానాలకు గాను 41 చోట్ల ఎన్నిక ఇప్పటికే ఏకగ్రీవం కావడం తెలిసిందే. యూపీలో 10, కర్ణాటకలో 4, హిమాచల్లో ఒకటి చొప్పున మిగతా 15 స్థానాలకు మంగళవారం ఓటింగ్ జరిగింది. అసెంబ్లీల్లో సంఖ్యాబలం మేరకు యూపీలో బీజేపీ 7, ఎస్పీ 3; కర్ణాటకలో కాంగ్రెస్ 3, బీజేపీ 1; హిమాచల్లో ఏకైక స్థానంలో కాంగ్రెస్ గెలవాల్సి ఉంది. కానీ బీజేపీ హిమాచల్లో పోటీకి దిగడమే గాక యూపీలో 8వ అభ్యర్థిని రంగంలోకి దించింది. కర్ణాటకలో కూడా ముగ్గురు కాంగ్రెస్, ఒక బీజేపీ అభ్యర్థితో పాటు దాని మిత్రపక్షం జేడీ(ఎస్) నుంచి ఐదో అభ్యర్థీ పోటీకి దిగారు. యూపీలో ఏడుగురు ఎస్పీ, ఒక బీఎస్పీ ఎమ్మెల్యేలు; హిమాచల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. దాంతో హిమాచల్లోని ఏకైక సీటుతో పాటు యూపీలో 8వ రాజ్యసభ స్థానమూ బీజేపీ కైవసమయ్యాయి. కర్ణాటకలో మాత్రం బీజేపీ ఎత్తులు పారలేదు. సంఖ్యాబలానికి అనుగుణంగా కాంగ్రెస్ 3, బీజేపీ ఒక స్థానంలో నెగ్గాయి. అయితే ఒక బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్కు అనుకూలంగా ఓటేయడమే గాక మరొకరు ఓటింగ్కు దూరంగా ఉండి పార్టీకి షాకిచ్చారు! మూడు పార్టీలూ క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై చర్యలకు తమ సిద్ధమవుతున్నాయి! హిమాచల్లో టాస్ హిమాచల్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలకు గాను పాలక కాంగ్రెస్కు 40 మంది ఎమ్మెల్యేలుండగా బీజేపీకి 25 మందే ఉన్నారు. అయితే ముగ్గురు స్వతంత్రులతో పాటు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థి హర్‡్ష మహాజన్కు ఓటేశారు. దాంతో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి అనుహ్య ఓటమి చవిచూశారు. అభ్యర్థులిద్దరికీ సమానంగా చెరో 34 ఓట్లు రావడంతో టాస్ ద్వారా హర్‡్షను విజేతను తేల్చారు. ఇక యూపీలో హైడ్రామా చోటుచేసుకుంది. ఓవైపు పోలింగ్ జరుగుతుండగానే సమాజ్వాదీ పార్టీ చీఫ్ మనోజ్ పాండే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నిర్వహించిన సమావేశానికి ఆయనతో పాటు మరో ఏడుగురు ఎస్పీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వీరిలో కనీసం ఏడుగురు బీజేపీకి అనుకూలంగా ఓటేసినట్టు తేలింది. ఒక బీఎస్పీ ఎమ్మెల్యే కూడా బీజేపీకి ఓటేశారు. దాంతో ఆ పార్టీ అభ్యర్థులు ఆర్పీఎన్ సింగ్, తేజ్వీర్సింగ్, అమర్పాల్ మౌర్య, సంగీతా బల్వంత్, సుధాన్షు త్రివేది, సాధనాసింగ్, నవీన్ జైన్, సంజయ్ సేథ్ విజయం సాధించారు. సమాజ్వాదీ నుంచి జయాబచ్చన్, రాంజీలాల్ సుమన్ నెగ్గగా అలోక్ రంజన్ ఓటమి పాలయ్యారు. కర్ణాటకలో మాత్రం ఊహించిన ఫలితాలే దక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థులు అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్, బీజేపీ అభ్యర్థి నారాయణ కె.బాండే గెలుపొందగా జేడీ(యూ) అభ్యర్థి కుపేంద్రరెడ్డి ఓటమి చవిచూశారు. అయితే యశవంతపుర బీజేపీ ఎమ్మెల్యే ఎస్.టి.సోమశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయగా యల్లాపుర బీజేపీ ఎమ్మెల్యే శివరాం హెబ్బార్ పోలింగ్కు దూరంగా ఉన్నారు! వారిద్దరూ కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. వారిపై చర్యలకు బీజేపీ సిద్ధమైంది. క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో హిమాచల్లో సుఖ్విందర్ సింగ్ సుఖు సర్కారు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వాలను కూల్చేయడం మోదీ సర్కారుకు అలవాటుగా మారిందంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. -
ఉండి టీడీపీలో చల్లారని అసమ్మతి సెగలు
-
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారమే చర్యలు: స్పీకర్ తమ్మినేని
గుంటూరు, సాక్షి: ఎన్నికల ముందర అధికార, ప్రతిపక్ష పార్టీల్లో పార్టీ ఫిరాయించిన ఎనిమిది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై స్పీకర్ తమ్మినేని సీతారాం సాక్షితో స్పందించారు. నిష్పక్షపాతంగా తాను వ్యవహరించానని.. చట్ట ప్రకారమే నడుచుకున్నానని అన్నారాయన. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ ముగించాం. విచారణ అంతా నిబంధనల ప్రకారమే జరిగింది. వాదనలు వినిపించేందుకు వాళ్లకు తగిన సమయం ఇచ్చాం. కానీ, వాళ్లు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. కాబట్టే విచారణ ముగించి అనర్హత వేటు వేశాం. ఈ విషయంలో నేను నిష్ఫక్షపాతంగా వ్యవహరించా. చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నా అని తెలిపారాయన. అలాగే.. వైఎస్సార్సీపీలో చేరినవాళ్లపైనా చర్యలు తీసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ‘‘అనర్హత వేటు పడ్డవాళ్లు కావాలనుకుంటే కోర్టుకు వెళ్లొచ్చు. మాదీ(అసెంబ్లీని ఉద్దేశించి..) కోర్టు లాంటిదే. ఇక వారిష్టం’’ అని స్పీకర్ తమ్మినేని అన్నారు. -
AP: 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
సాక్షి, అమరావతి: పార్టీ ఫిరాయించిన 8 మంది శాసన సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. వీరిలో వైఎస్సార్సీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి నలుగురు ఉన్నారు. వైఎస్సార్సీపీ నుంచి శాసనసభకు ఎన్నికై పార్టీ ఫిరాయించిన కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (నెల్లూరు రూరల్ నియోజకవర్గం), ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖరరెడ్డి (ఉదయగిరి), ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ)పై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. టీడీపీ నుంచి శాసన సభకు ఎన్నికై పార్టీకి దూరంగా ఉంటున్న వాసుపల్లి గణేష్కుమార్ (విశాఖ దక్షిణ), కరణం బలరాం (చీరాల), మద్దాల గిరి (గుంటూరు వెస్ట్), వల్లభనేని వంశి (గన్నవరం)పై అనర్హత వేటు వేయాలని టీడీపీ విప్ డోలా బాల వీరాంజనేయస్వామి స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఈ రెండు పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ తమ్మినేని సీతారాం పలుమార్లు ఎమ్మెల్యేలను విచారించారు. ఎమ్మెల్యేల నుంచి వివరణలు తీసుకున్నారు. పార్టీల విప్లు చేసిన ఫిర్యాదులు, ఎమ్మెల్యేలు ఇచి్చన వివరణలను క్షుణ్ణంగా పరిశీలించిన స్పీకర్.. ఆ 8 మంది సభ్యులు పార్టీ ఫిరాయించినట్టు తేల్చారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. స్పీకర్ ఆదేశాల మేరకు ఏపీ లెజిస్లేచర్ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. -
TN: ‘‘మహిళలకు ఆ పార్టీలో విలువ లేదు’’
చెన్నై: కాంగ్రెస్లో మహిళలకు చోటు లేదని తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన తమిళనాడు ఎమ్మెల్యే విజయ వర్థిని అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్కు గత 14 ఏళ్లుగా ఉన్న ఒకే ఒక మహిళా ఎమ్మెల్యేను నేను. నన్ను కూడా పార్టీలో నుంచి వెళ్లకుండా ఆ పార్టీ ఆపలేకపోయింది. దీన్ని బట్టే ఆ పార్టీ ఎలా పనిచేస్తోందో అర్థమవుతోంది. ఒక మహిళ ఎమ్మెల్యే పదవి దగ్గరే ఎందుకు ఆగిపోవాలి. బీజేపీ మహిళలకోసం ఎంతో చేస్తోంది. ఆపార్టీ తరపున పార్లమెంట్లో మహిళా ఎంపీలు చాలా మంది ఉన్నారు. బీజేపీ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చింది. త్రిపుల్ తలాక్ను రద్దు చేసింది. ముస్లిం మహిళలు కేవలం బీజేపీకే ఓటు వేస్తారు’అని విజయవర్థిని అన్నారు. కన్యాకుమరి జిల్లాలో విల్వన్కోడ్ నియోజకవర్గం నుంచి 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయవర్థిని ఎమ్మెల్యేగా గెలిచారు. శనివారం(ఫిబ్రవరి 24)న ఆమె కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. ఇదీ చదవండి.. మహారాష్ట్రలో మళ్లీ రిజర్వేషన్ మంటలు -
కాంగ్రెస్ గూటికి ‘పాల్వాయి’?
సాక్షి, ఆసిఫాబాద్: సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్బాబు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారనే ప్రచారం ఊపందుకుంది. బుధవారం ఎమ్మెల్యే హరీశ్బాబు సీఎం రేవంత్రెడ్డిని కలవడం ఆ ప్రచారానికి బలం చేకూర్చినట్లయింది. అయితే ఎమ్మెల్యే హరీశ్బాబు మాత్రం తాను కేవలం నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్రెడ్డిని కలిశానని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ నుంచే రాజకీయ ప్రస్థానం.. సిర్పూర్ నియోజకవర్గంలో హరీశ్బాబు గట్టి ప ట్టుంది. హరీశ్బాబు తండ్రి పాల్వాయి పురుషోత్తంరావు 1989, 1994లో వరుసగా రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తల్లి రాజ్యలక్ష్మి సైతం 1999లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం. రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన పాల్వాయి హరీశ్బాబు ఆర్థోపిడిక్ సర్జన్. 2017 నవంబరులో రాజకీయ అరంగ్రేటం చేశారు. బెజ్జూర్ మండలం రెబ్బన గ్రామంలో 10 అంశాలతో రాజకీయ ఎజెండాను రూపొందించి ప్రజల్లోకి వచ్చారు. ఏడాది పాటు రాజకీయ కార్యక్రమాలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో కాంగ్రెస్ టికెట్తో సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకుని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్లమెంట్ ఎన్నికలే ధ్యేయంగా పావులు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతల్ని కాంగ్రెస్లోకి చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది. పాల్వాయి హరీశ్బాబు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చాక హరీశ్బాబు వెంటే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ రావడం.. ప్రజల్లో కూడా అతనిపై సానుభూతి ఉండటం అసెంబ్లీ ఎన్నికల్లో పాల్వాయికి కలిసొచ్చిందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇలాంటి వారిని పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కలిసొచ్చే అంశంగా పార్టీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ కార్యక్రమాలకు దూరంగా..? అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఎమ్మెల్యే హరీశ్బాబు పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. కేవలం నియోజవర్గంలో తిరుగుతూ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు తదితరాల్లో పాల్గొంటున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఐదు విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మంగళవారం కుమురంభీం క్లస్టర్ యాత్రను అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు ప్రారంభించారు. రెండు రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హరీశ్బాబు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలవడంతో పార్టీ మారుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ‘సిర్పూర్ అభివృద్ధి కోసమే కలిశా’ కౌటాల(సిర్పూర్): సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసమే సీఎం రేవంత్రెడ్డిని కలిసినట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు తెలిపారు. హైదరాబాద్లోని సీఎం నివాసంలో రేవంత్రెడ్డిని ఎమ్మెల్యే హరీశ్బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయంపై ‘సాక్షి’ ఎమ్మెల్యేను సంప్రదించగా.. ముఖ్యమంత్రి కేవలం పార్టీ ప్రతినిధి కాదని.. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత అని అన్నారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు పనుల కోసం సీఎంను కలుస్తున్నారని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలకు తావులేదని స్పష్టం చేశారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని సీఎంకు వినతిపత్రం అందించినట్లు తెలిపారు. -
Telangana: ప్రమాదంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కు గాయాలు
సాక్షి, జగిత్యాల: తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాదానికి గురయ్యారు. ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లక్ష్మణ్ కుమార్తో పాటు కారులో ఉన్న ఇతరులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కరీంనగర్కు తరలించి చికిత్స అందిచగా.. అడ్లూరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలిస్తున్నట్లు సమాచారం. -
సీపీఐ (ఎంఎల్)ఎమ్మెల్యేపై అనర్హత వేటు
పట్నా: సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ పారీ్టకి చెందిన ఎమ్మెల్యే మనోజ్ మంజిల్ను బిహార్ అసెంబ్లీ అనర్హుడిగా ప్రకటించింది. ఓ హత్య కేసులో న్యాయస్థానం ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించినందున, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విధాన సభ సెక్రటేరియట్ తెలిపింది. కోర్టు శిక్ష ప్రకటించిన ఫిబ్రవరి 13వ తేదీ నుంచి అనర్హత అమల్లోకి వస్తుందని శుక్రవారం జారీ చేసిన నోటిఫికేషన్లో తెలిపింది. భోజ్పూర్ జిల్లా తరారీ స్థానం నుంచి మంజిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం నాటి హత్య కేసు విచారించిన ఎంపీ/ఎమ్మెల్యే కేసుల ప్రత్యేక కోర్టు మంజిల్ను దోషిగా నిర్థారించిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో బిహార్ అసెంబ్లీలో వామపక్షాల బలం 11కు తగ్గినట్లయింది. -
బీజేపీతో టచ్లో బీఆర్ఎస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు చెందిన ఐదుగురు ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ చెప్పారు. బీజేపీలోకి వచ్చేందుకు వారు సంప్రదింపులు జరుపుతున్నారని తెలుసుకున్న మాజీ సీఎం కేసీఆర్.. తామే బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఎన్డీఏలో చేరబోతున్నామంటూ అబద్ధాలు చెబుతున్నారని, ఎవరూ పార్టీ వీడకుండా డ్రామాలాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీయేలో చేర్చుకోలేదని, ఇప్పుడు మునిగిపోయే నావ, ఒక్కసీటు కూడా రాని ఆ పార్టీ తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదని వ్యాఖ్యానించారు. శుక్రవారం పార్టీ నేతలతో సమావేశమైన సంజయ్, మలిదశ ప్రజాహిత యాత్ర ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అవినీతిపరులను రానీయం ‘కేసీఆర్ భాషలో చెప్పాలంటే మెడమీద తలకాయ ఉన్నోడెవ్వడూ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోడు. ఒకవేళ అదే జరిగితే బీజేపీలో సగం మంది అభ్యర్థులు పోటీ చేయడానికి కూడా వెనుకాడతారు. కేసీఆర్ వెళ్లి కలిసినా ఎన్డీఏలో చేర్చుకునేది లేదని మోదీ తెగేసి చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన బహిరంగంగానే చెప్పారు. బీజేపీకి సొంతంగానే 400 సీట్లు రాబోతున్నాయి. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించే వాళ్లు, బీజేపీ సిద్ధాంతాలు, మోదీ నాయకత్వంపై నమ్మకం ఉన్నోళ్లు ఎవరు వచి్చనా పార్టీ లోకి స్వాగతిస్తాం. అవినీతిపరులను మాత్రం రానీయం. ఇది మోదీ విధానం. కాంగ్రెస్ పార్టీని ప్రజలు బహిష్కరించబోతున్నారు కేసీఆర్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు తేడా ఏమీ లేదని ప్రజలు గ్రహించారు. ఈసారి బీజేపీకి ఓటేయాలనే నిర్ణయానికి వచ్చారు. బీజేపీ వైపు రాముడున్నాడు.. నరేంద్రమోదీ ఉన్నాడు..కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు రజకార్లున్నరు..ఎంఐఎం నేతలున్నరు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బహిష్కరించబోతున్నరు. బీఆర్ఎస్ అవినీతిపై కళ్ల ముందు ఇన్ని ఆధారాలున్నా కేసీఆర్, అప్పటి మంత్రులు, బాధ్యులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడం లేదు? ఎన్నికలకు ముందు కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఎందుకు మాట తప్పుతోంది? సిట్టింగ్ జడ్జితో విచారణ సాధ్యం కాదని చీఫ్ జస్టిస్ తేలి్చన తరువాత కూడా సీబీఐతో విచారణను ఎందుకు కోరడం లేదు? బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్, కేటీఆర్ను జైల్లో వేసి, వాళ్ల ఆస్తులు జప్తు చేసే వాళ్లం..’అని సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ‘తొలిదశ ప్రజాహిత యాత్రకు మంచి స్పందన లభించింది. ఈనెల 25 నుంచి మలి విడత యాత్రను కొనసాగిస్తాం. మధ్యలో మూడురోజుల పాటు (ఈ నెల 20 నుంచి) రాష్ట్ర నాయకత్వ ఆదేశాల మేరకు బస్సు యాత్రల్లో పాల్గొంటాం. తెలంగాణలో 17కు 17 ఎంపీ స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. హైదరాబాద్ పార్లమెంట్లో బోగస్ ఓట్లు ఏరివేస్తే ఈసారి అక్కడ గెలుపు బీజేపీదే. బీఆర్ఎస్కు ఒక్కసీటు కూడా దక్కే పరిస్థితి లేదు. కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది..’అని సంజయ్ చెప్పారు. -
నేడు బీహార్లో ఏం జరగనుంది? ఎవరి బలం ఎంత?
2024, జనవరి 28.. లాలూకు చెందిన రాష్ట్రీయ జనతాదళ్తో కూడిన మహాకూటమి ప్రభుత్వానికి ముగింపు పలికిన బీహార్ సీఎం నితీష్.. బీజేపీ మద్దతుతో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీఏ) ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపధ్యంలో నితీష్ విశ్వాస పరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది. 14 రోజుల తరువాత అంటే ఈరోజు (ఫిబ్రవరి 12) బీహార్ అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ ప్రభుత్వం మనుగడ సాగిస్తుందా లేదా అనేది తేలిపోనుంది. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని 14 రోజుల ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీ ఉందని నేడు బీహార్ అసెంబ్లీలో నిరూపించుకోవాల్సి ఉంది. దీనినే ఫ్లోర్ టెస్ట్ అని అంటారు. బీహార్ అసెంబ్లీలోని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 243. దీనిలో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య మూడింట రెండు వంతులు ఉండాలి. అంటే 122 లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే ప్రభుత్వం చెక్కుచెదరకుండా ఉంటుంది. ఈ సంఖ్య 122 కంటే తక్కువగా ఉంటే ప్రభుత్వం పడిపోతుంది. జనవరి 28న మహాకూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి పదవికి సీఎం నితీశ్ కుమార్ రాజీనామా చేసినప్పుడు, ఆయనకు బీజేపీ మద్దతు లేదు. ఆయన పార్టీ అయిన జనతాదళ్ యునైటెడ్కు చెందిన 45 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆయన వెంట ఉన్నారు. అయితే ఆయన రాజీనామా తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ తన 78 మంది ఎమ్మెల్యేల మద్దతును జేడీయూకి అందించింది. వీరితో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన హిందుస్థానీ అవామ్ మోర్చాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా నితీష్కు మద్దతు పలికారు. ఒకే స్వతంత్ర అభ్యర్థి నితీష్ కుమార్ వెంట నిలిచారు. ఈ విధంగా నితీష్ కుమార్ రాజ్ భవన్లో మొత్తం 128 మంది ఎమ్మెల్యేల మద్దతును చూపించారు. అనంతరం కొత్త మంత్రివర్గంతో పాటు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతి పక్షంలో 114 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నందున రాజ్భవన్ వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు. ప్రస్తుతం ఆర్జేడీలో 79 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో 19 మంది, వామపక్షాలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరే కాకుండా అసదుద్దీన్ ఒవైసీ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఉన్నారు. ఇలా మొత్తంగా 114 మంది ఎమ్మెల్యేలున్నారు. -
హైదరాబాద్ నుంచి బయల్దేరిన బీహార్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: క్యాంపు రాజకీయాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్ నుంచి 19 మంది బీహార్ ఎమ్మెల్యేలు ఆ రాష్ట్రానికి బయలుదేరారు. ఈ నెల 4 నుంచి హైదరాబాద్లో ఎమ్మెల్యేల శిబిరం కొనసాగింది. రేపు బీహార్ శాసనసభలో బల నిరూపణకు ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. జార్ఖండ్ రాజకీయం అయిపోగానే తెలంగాణలో బిహార్ రాజకీయం ప్రారంభమయిన సంగతి తెలిసిందే. రాంచీ నుంచి వచ్చిన జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోగానే, బిహార్కు చెందిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్కు చేరుకున్నారు. బీహార్లో ఇండియా కూటమి నుంచి జేడీయూనేత నితీష్కుమార్ బయటకు వచ్చి.. ఎన్డీఏలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీహార్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం రేపు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడుకోవాలని ఏఐసీసీ భావించింది. అందుకే వెంటనే వారిని కాపాడే టాస్క్ను టీపీసీసీకి అప్పగించింది. దీంతో బీహార్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఇబ్రహీంపట్నంలోని ఓ రిసార్ట్లో వసతి కల్పించారు. ఇదీ చదవండి: ఏఐసీసీకి తెలంగాణ సేఫ్ జోన్గా మారిందా? -
‘కుప్టి’కి నిధులు కేటాయించేలా చూస్తా..
ఆదిలాబాద్: బోథ్ నియోజకవర్గంలో ప్రాజెక్టులు, మారుమూల గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణాల కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్ తెలిపారు. నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కుప్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం బడ్జెట్ కేటాయించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలిపారు. అటవీశాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలో పలు రోడ్ల పనులు మధ్యంతరంగా నిలిచి పనులు ముందుకు సాగడంలేదని పేర్కొన్నారు. దీంతోని యోజకవర్గంలోని మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నియోజకవర్గలో నూతనంగా మరో 20 చెరువుల మంజూరు కోసం అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. సాగునీరు, రోడ్ల సౌకర్యాల ఏర్పాటు కోసం అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్లు పేర్కొన్నారు. ఇవి చదవండి: తెలంగాణ అసెంబ్లీ: గవర్నర్ తమిళిసై ప్రసంగం ఇదే.. -
కేసీఆర్ను దూషించడం పద్ధతి కాదు..
నిజామాబాద్: ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారికి హుందాతనం ఉండాలని, మాజీ సీఎం కేసీఆర్ను రేవంత్రెడ్డి దూషించడం పద్ధతి కాదని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. బాన్సువాడ సమీపంలోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో బుధవారం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో 1.8 శాతం తక్కువ ఓట్ల తేడాతో అధికారం కోల్పోయమన్నారు. 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారిస్తే సరిపోయేదన్నారు. 2028లో ప్రజలు బ్రహ్మండమైన మెజారిటీతో బీఆర్ఎస్ను గెలిపిస్తారని అన్నారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకుడు సిగ్గులేకుండా బాన్సువాడ నియోజకవర్గంలో తిరుగుతున్నారని, ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉండి సొంత ఊరిలో పేదలకు ఒక్క ఇల్లు కట్టించలేదన్నారు. ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయాలన్నారు. చేయకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతు బంధు రూ.15 వేలు ఇంతవరకు ఇవ్వలేదన్నారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గెలుపును బాన్సువాడ నియోజకవర్గమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. నిజాంసాగర్ నీటి విడుదల విడతల వారీగా జరుగుతుందని, ఎకరం కూడా ఎండిపోకుండా చూస్తానన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీకి సిద్ధం.. పార్టీ ఆదేశిస్తే జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో కీలకమైన నియోజకవర్గం బాన్సువాడ అన్నారు. ప్రతి కార్యకర్తకు తమ కుటుంబం అండగా ఉంటుందన్నారు. నాయకులు పోచారం సురేందర్రెడ్డి, మోహన్నాయక్, అంజిరెడ్డి, బద్యా నాయక్, నీరజావెంకట్రాంరెడ్డి, శ్యామల ఉన్నారు. ఇవి చదవండి: గ్రామపాలనపై.. ప్రత్యేకాధికారులకు సవాల్! -
జార్ఖండ్ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు.. బిహార్ ఎమ్మెల్యేలు వచ్చారు
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ రాజకీయం అయిపోగానే తెలంగాణలో బిహార్ రాజకీయం ప్రారంభమయింది. 3 రోజుల క్రితం రాంచీ నుంచి వచ్చిన జేఎంఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోగానే, బిహార్కు చెందిన 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్కు చేరుకున్నారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ను ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో చంపయీ సొరేన్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. చంపయీ సొరేన్ బలనిరూపణకు సోమ వారం వరకు గడువు ఉండడంతో జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ శివార్లలోని శామీర్పేటలో ఉన్న ఓ రిసార్టుకు తీసుకువచ్చారు. శుక్ర, శని,ఆదివారం ఉదయం వరకు అక్కడే ఉన్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రాంచీకి వెళ్లిపోయారు. వారు అటు వెళ్లిపోగానే బిహార్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్నా నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. సాయంత్రం 5 గంటలకు వచ్చిన వారికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ ప్రొటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, సీనియర్ నేత మల్రెడ్డి రాంరెడ్డిలు ఎయిర్పోర్టులో ఆహ్వానం పలికారు. వారిని అక్కడి నుంచి నేరుగా ఇబ్రహీంపట్నంలోని ఓ రిసార్ట్కు తరలించారు. ఈనెల 10వ తేదీన బిహార్లో నితీశ్కుమార్ ప్రభుత్వం బల నిరూపణ చేసుకోనుండటంతో అప్పటివరకు వీరంతా రిసార్ట్లోనే ఉంటారని గాం«దీభవన్ వర్గాల ద్వారా తెలిసింది. -
రాంచీ టు శామీర్పేట
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్కు చేరింది. మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంపయ్ సోరెన్ అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉండడంతో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్ పార్టీలకు చెందిన 41 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్ క్యాంప్కు తరలించారు. రాంచీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రత్యేక విమానంలో బయలుదేరిన జార్ఖండ్ ఎమ్మెల్యేలు నేరుగా బేగంపేట విమానాశ్రయంలో దిగారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్లు వారికి ఆహ్వనం పలికి రెండు ప్రత్యేక బస్సుల్లో శామీర్పేటలోని ఓ రిసార్టుకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి వెళ్లే వరకు ఈ ముగ్గురు నేతలు ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు. బలపరీక్ష జరిగేవరకు ఇక్కడే.. జార్ఖండ్లో పరిణామాల నేపథ్యంలో ఏఐసీసీ నేతలు బుధవారమే సీఎం రేవంత్రెడ్డి, ఇతర టీపీసీసీ ముఖ్యులతో టచ్లోకి వచ్చారు. ఎమ్మెల్యేలను క్యాంపు కోసం హైదరాబాద్కు తీసుకువస్తామనే సమాచారం అందించారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నమే వీరు హైదరాబాద్కు రావాల్సి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో శుక్రవారానికి వాయిదా పడింది. కాగా ఏఐసీసీ నేతలు ఆదేశాల మేరకు టీపీసీసీ వీరి క్యాంపునకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మాజీ జెడ్పీటీసీ నక్కా ప్రభాకర్గౌడ్ పేరిట శామీర్పేట రిసార్ట్స్లో 38 రూంలు వీరి కోసం బుక్ చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యేలంతా మరో రెండు రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. ఈనెల ఐదో తేదీన జార్ఖండ్ అసెంబ్లీలో చంపయ్ సోరేన్ బలనిరూపణ జరగనున్న నేపథ్యంలో అదేరోజు ఉదయం లేదంటే ముందు రోజు అర్ధరాత్రి వారు ప్రత్యేక విమానంలో రాంచీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. శిబిరానికి సీఎం రేవంత్! శుక్రవారం ఇంద్రవెల్లి పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి ఎప్పటికప్పుడు ఈ ముగ్గురు నేతలతో సంప్రదింపులు జరిపారని, ఆయన కూడా క్యాంపునకు వెళ్లి జార్ఖండ్ ఎమ్మెల్యేలను కలుస్తారని గాం«దీభవన్ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఎమ్మెల్యేలు సురక్షితంగా ఉంటారన్న ఆలోచనతో వారిని హైదరాబాద్కు తరలించాలని ఏఐసీసీ నిర్ణయించిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా క్యాంపు నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను టీపీసీసీ పూర్తి చేసింది. శుక్రవారం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావుతో పాటు పలువురు నాయకులు రిస్టార్టుకు వెళ్ళారు. -
జార్ఖండ్ సీఎంగా చంపయ్ సొరెన్ ప్రమాణం
రాంచీ: జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంపయ్ సొరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు. 10 రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. బలనిరూపణ వరకు ఉండేందుకు జేఎంఎం సంకీర్ణ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకోనున్నారు. బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రత్యేక విమానంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలు మరికాసేపట్లో రానున్నారు. మాజీ సీఎం హేమంత్ సొరెన్ను ఈడీ అధికారుల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చంపయ్ సోరెన్ 1956 నవంబర్లో జిలింగోరా గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. మెట్రిక్యులేషన్ చదివారు. తొలిసారిగా 1991లో సెరికేలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి వరుసగా విజయం సాధిస్తూనే ఉన్నారు. జేఎంఎం అధినేత శిబూ సోరెన్కు విధేయుడిగా పేరుగాంచారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే, శిబూ సోరెన్ కుటుంబంతో చంపయ్ సోరెన్కు ఎలాంటి బంధుత్వం లేదు. హేమంత్ సొరెన్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటారు. చంపయ్ను ప్రజలు జార్ఖండ్ టైగర్ అని పిలుస్తుంటారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రవాణా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. #WATCH | JMM vice president Champai Soren takes oath as the Chief Minister of Jharkhand, at the Raj Bhavan in Ranchi. This comes two days after Hemant Soren's resignation as the CM and his arrest by the ED. pic.twitter.com/WEECELBegr — ANI (@ANI) February 2, 2024 రాష్ట్ర మాజీ హేమంత్ సోరెన్ను బుధవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం సోరెన్ను 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. అలాగే సోరెన్ను ఒకరోజుపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టును హేమంత్ సొరెన్ ఆశ్రయించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. ఇదీ చదవండి: సుప్రీంకోర్టులో హేమంత్ సోరెన్కు ఎదురుదెబ్బ -
ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ శాసనసభ్యుడిగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మధ్యాహ్నం 12:15 గంటలకు అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్... స్పీకర్ చాంబర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యేగా దైవసాక్షిగా ప్రమాణం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కేసీఆర్తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్రెడ్డి, మధుసూదనాచారితోపాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. పార్టీ నేతల ఘన స్వాగతం గతేడాది డిసెంబర్లో ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్లో జారి పడటంతో కేసీఆర్ తుంటి ఎముక విరగడం తెలిసిందే. దీంతో ఆయనకు వైద్యులు తుంటి మారి్పడి శస్త్రచికిత్స నిర్వహించారు. ఫలితంగా అప్పుడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేకపోయారు. ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్న కేసీఆర్ గురువారం ఊతకర్ర సాయంతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు. తొలిసారిగా అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. మాజీ మంత్రులు కె. తారక రామారావు, హరీశ్రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్గౌడ్ తదితరులతోపాటు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ వెంట స్పీకర్ చాంబర్కు చేరుకున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణం అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాసనసభ ప్రాంగణంలోని పీవీ హాల్లో కేసీఆర్కు పార్టీ నేతలు పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు. చాంబర్లో పనులు పూర్తికాకపోవడంతో ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందిన కేసీఆర్... అసెంబ్లీలో తనకు కేటాయించిన చాంబర్లో ప్రత్యేక పూజలు చేయాలని భావించారు. అయితే వసతుల కల్పన పనులు పూర్తి కాకపోవడంతో నందినగర్లోని తన నివాసానికి తిరిగి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా జనసమూహంలోకి వచ్చిన కేసీఆర్ను కలిసేందుకు బీఆర్ఎస్కు నేతలు పోటీ పడ్డారు. -
Jharkhand: ‘గవర్నర్గారూ.. మా మెజార్టీ ఇది!’
రాంచీ: హేమంత్ సొరెన్ అరెస్ట్ వెంటనే జార్ఖండ్లో నూతన ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఆలస్యం చేయకుండా జేఎంఎం సీనియర్ నేత చంపయ్ రాయ్ను లెజిస్టేటివ్ లీడర్గా ప్రకటించారు. కానీ, గవర్నర్ మాత్రం ప్రభుత్వ ఏర్పాటునకు వెంటనే ఆహ్వానించలేదు. దీంతో తీవ్ర సస్పెన్స్ తర్వాత.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను చంపయ్ సొరెన్ కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు మెజారిటీ ఉందని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు తెలిపారు. అంతేకాదు.. అప్పటికే తీసిన మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల వీడియోను గవర్నర్కు చూపించడం గమనార్హం. జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్జేడీ)ల అధికార కూటమి చంపయ్ సొరెన్కు మద్దతు తెలుపుతున్న 43 మంది ఎమ్మెల్యేల వీడియోను విడుదల చేసింది. గవర్నర్ను చంపయ్ సొరెన్ కలవడానికి వెళ్లే ముందు ఎమ్మెల్యేలు వీడియో రికార్డింగ్ ద్వారా మద్దతు చెప్పించారు. महामहिम राज्यपाल जी बहुमत यंहा साफ-साफ बिना चश्मा को देखा जा सकता है। फिर भी नया सरकार का गठन में देरी किस बात का? जब विद्यायकों का समर्थन का लेटर आपके पास पहुंचा हुआ है, तो किस शुभ घड़ी का इंतज़ार कर रहे है आप? जनता को जवाब दे महामहिम @jhar_governor जी।#JharkhandCM pic.twitter.com/BNuc8jaHu2 — Md Furkan Ahmad (@Furkanjmm) February 1, 2024 ఆ వీడియోలో చంపయ్ సొరెన్తో పాటు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత అలంగీర్ ఆలం, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తా, సీపీఐ (ఎంఎల్) ఎల్ ఎమ్మెల్యే వినోద్ సింగ్, ప్రదీప్ యాదవ్లు ఉన్నారు. సమావేశానంతరం చంపయ్ సొరెన్ మాట్లాడుతూ.. 'ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెజారిటీ సాధించి 22 గంటలైంది. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ చెప్పారు.' అని అన్నారు. మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ బుధవారం రాత్రి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో హేమంత్ సొరెన్ అరెస్టు కావడంతో చంపయ్ సొరెన్ వెంటనే సీఎంగా ప్రమాణం చేస్తారని అంతా భావించారు. కానీ, రాజ్భవన్ వద్ద నాటకీయ పరిణామాల నేపథ్యంలో అది వాయిదా పడుతూ వస్తోంది. ఇదీ చదవండి: Jarkhand Crisis: కొత్త సీఎంగా చంపయ్ సొరెన్ ఎంపికకు అసలు కారణం ఇదే? -
‘సాక్షి’లో ఏం రాశారు..?
కౌటాల(సిర్పూర్): కౌటాల మండలంలో బుధవారం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కుమురం భీం చౌరస్తాలో గల ఓ టీస్టాల్లో ఆయన కాసేపు సాక్షి పేపర్ చదివా రు. ప్రతిరోజూ దినపత్రికలు చదవడం అలవాటని ఆయన తెలిపారు. అనంతరం స్థానికులు, కార్యకర్తలతో మాట్లాడారు. వ్యాపారం ఎలా ఉందని టీస్టాల్ యజమాని శర్మను అడిగి తెలుసుకున్నారు. తనకు ఇల్లు లేదని, ప్రభుత్వం నుంచి మంజూరు చేయించాలని శర్మ కోరడంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. -
Panjagutta PS: సిబ్బందిపై వేటు వెనక కారణాలివే?
హైదరాబాద్, సాక్షి: రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇదో సంచలనం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే పీఎస్ లోని మొత్తం 86 మందిని బదిలీచేస్తూ ఉత్తర్వులిచ్చారు పోలీస్ కమీషనర్. ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డ్ వరకు అందరినీ బదిలీ చేశారు. పంజాగుట్ట పోలీసులపై పలు ఆరోపణలు రావడంతో.. తొలిసారి పీఎస్ లో ఉన్న 80శాతం సిబ్బందిని బదిలీచేస్తూ సీపీ శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ట్రాన్స్ఫర్స్తో పోలీసులు అవినీతికి పాల్పడితే ఇలాంటి పరిణామాలే ఉంటాయని రాష్ట్రవ్యాప్తంగా వార్నింగ్ ఇచ్చినట్లయింది. సిటీలో ప్రధాన పోలీస్ స్టేషన్స్ లో పంజాగుట్ట ఒకటి. నాలుగేళ్ల క్రితం దేశంలోనే రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా అవార్డు పొందింది. మూడున్నర లక్షల మంది జనాభా.. ఐదు సెక్టార్లు.. వందకు పైగా పోలీస్ సిబ్బంది.. అంతటి పేరున్న పంజాగుట్ట పీఎస్ రీసెంట్ గా వివాదాల్లో నిలిచింది. రాజకీయ పలుకుబడితో ఈ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్స్ కోసం ఆఫీసర్లు వెంటబడేవారు. ఇట్లాంటి పోలీస్ స్టేషన్స్ లోని సిబ్బంది పలు కీలక కేసులను తప్పుదారి పట్టిస్తున్నారు. దీంతో స్టేషన్ సిబ్బందిని భారీగా ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. నిన్న జరిగిన ఇన్స్పెక్టర్ల బదిలీల్లో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ ని బదిలీ చేస్తూ శోభన్ అనే కొత్త ఇన్స్పెక్టర్ ని సీఐగా నియమించారు. ఈరోజు పీఎస్లోని ఆరుగురు ఎస్సైలు, 9 మంది ఏఎస్సైలు, 16 మంది హెడ్ కానిస్టేబుల్స్ తో పాటు కానిస్టేబుల్స్, హోమ్ గార్డులను బదిలీ చేస్తూ సర్క్యులర్ జారీ చేశారు సీపీ. పీఎస్లో మొత్తంగా వందకు పైగా సిబ్బంది ఉండగా అందులో 85 మందిని ఈరోజు ట్రాన్స్ ఫర్ చేశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, ఎస్సైలను మినహా మిగతా అందరినీ ట్రాన్స్ ఫర్ చేశారు. ట్రాన్స్ ఫర్ అయిన వారి స్థానంలో కొత్తగా 82 మందిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ప్రజాభవన్ ముందు జరిగిన యాక్సిడెంట్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ని తప్పించి మరొకరిపై కేసు పెట్టారని అప్పట్లో పని చేస్తున్న సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు సీపీ. సీఐ దుర్గారావుకు మరికొంత మంది సిబ్బంది సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. రీసెంట్ గా పంజాగుట్టలో ఒక వ్యక్తి ఫుల్లుగా తాగి తన కారుతో రోడ్డుపై ఉన్నవారందరినీ గుద్దుకుంటూ వెళ్లాడు. అతడ్ని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రిమాండ్ కి తరలిస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. వివిధ కేసుల్లో అరెస్టయిన నిందితులను కోర్టులకు, జైళ్లకు తరలించే టైమ్ లో పంజాగుట్ట పోలీసులు ఏమరపాటుగా ఉంటున్నారనే విమర్శలు వచ్చాయి. నిందితులకు సహకరిస్తూ వారి బంధువులతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. నెల క్రితం డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి.. న్యూసెన్స్ క్రియేట్ చేసిన ఇద్దరిని ట్రాఫిక్ పోలీసులు పంజాగుట్ట పోలీసులకు అప్పగించగా.. వారిద్దరూ పోలీసుల నుంచి పారిపోయారు. గతంలో ఇదే పీఎస్ కి చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ పెట్రోలింగ్ డ్యూటీ చేస్తూ, లిక్కర్ తాగుతూ పట్టుబడ్డారు. ఇదే పీఎస్ లోని ఓ ఎస్సై.. మహిళా బాధితుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ కదలికల్ని సైతం లీక్ చేస్తున్నారని సమాచారం అదింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఒకేసారి భారీగా ట్రాన్స్ ఫర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నగర కమీషనర్. అవినీతికి పాల్పడ్డా.. సివిల్ వివాదాల్లో తలదూర్చినా.. ట్రాన్స్ ఫర్స్ తో పాటు సస్పెన్షన్స్ ఉంటాయంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఆరోపణలు వచ్చిన ప్రతీ పోలీస్ పై స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేయించి, రుజువైతే చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇదీ చదవండి: తెలంగాణ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మళ్లీ పెంపు -
ఎమ్మెల్యేగా రేపు కేసీఆర్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన రెండో రోజే కేసీఆర్ బాత్రూంలో జారి పడంతో ఆయన తుంటి విరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కేసీఆర్కు శస్త్ర చికిత్స జరిగింది. అనంతరం డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కర్ర సాయంతో నడవగలుగుతున్నారు. ఈ క్రమంలో అసంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో రేపు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆహ్వానించారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి తరలిరానుండటంతో అసెంబ్లీ వర్గాలు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించాయి. -
YSRCPకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిపై అనర్హత వేటు వేయాలి