Naresh
-
టీటీడీ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పిన బోర్డు సభ్యుడు
సాక్షి, తిరుమల: టీటీడీ ఉద్యోగుల నిరసన ఫలించింది. టీటీడీ బోర్డుపై ఉద్యోగ సంఘాల నేతలు విజయం సాధించారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్తో ఉద్యోగికి క్షమాపణలు చెప్పించారు ఈవో. దీంతో, ఉద్యోగులు నిరసనను నిలిపివేసినట్టు తెలుస్తోంది.టీటీడీ ఉద్యోగుల నిరసన నేపథ్యంలో పాలక మండలి దిగొచ్చింది. ఎట్టకేలకు బోర్డు సభ్యుడు నరేష్తో ఉద్యోగికి క్షమాపణలు చెప్పించారు. అయితే, ఉద్యోగిపై దురుసు ప్రవర్తన నేపథ్యంలో పాలక మండలి సభ్యుడి వ్యవహారంపై భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. నరేష్ వెంటనే క్షమాపలు చెప్పాలని ఉద్యోగులు 48 గంటల పాటు నిరసనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నరేష్ వారిని క్షమాపణలు చెప్పారు. ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ నరేష్ బూతులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన పాలకమండలి సభ్యుడు నరేష్ ఆలయం వెలుపలి నుంచి వస్తున్న సమయంలో అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి గేటు తీయలేదు. మహా ద్వారం ముందున్న గేటు తీసేందుకు సదరు ఉద్యోగి నిరాకరించాడు. అయితే, ప్రోటోకాల్ పరిధిలో టీటీడీ బోర్డు సభ్యుడికి గేటు తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు బోర్డు మెంబర్ నరేష్. అనంతరం, సదరు ఉద్యోగిపై బూతులతో మండిపడ్డారాయన. బయటకు పోవాలని చిర్రుబుర్రులాడారు. ఇలాంటి వారిని ఇక్కడ విధుల్లో ఎందుకు ఉంచారని ఆగ్రహంతో రగిలిపోయారు. అతడిని వెంటేనే అక్కడ నుంచి పంపించి వేయాలని అధికారులకు సూచించారు. అనంతరం, అక్కడి నుంచి టీటీడీ బోర్డు మెంబర్ నిష్క్రమించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. -
డైరెక్టర్ అనిల్ రావిపూడికి విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ (ఫొటోలు)
-
ప్రతిష్టాత్మక ఈవెంట్కు జంటగా హాజరైన వీకే నరేశ్- పవిత్రా లోకేశ్.. వీడియో వైరల్
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు వీకే నరేశ్. విభిన్నమైన పాత్రలో వెండితెరపై అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. తొమ్మిదో ఏట పండంటి కాపురం మూవీతో బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు వీకే నరేశ్. చైల్డ్ ఆర్టిస్ట్గా పలు సినిమాలు చేసిన అతడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక చిత్రాల్లో కనిపించారు. ఇటీవల తన 65వ పుట్టిన రోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాకుండా ఈ వేడుకల్లో నటి పవిత్రా లోకేశ్ కూడా పాల్గొన్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.అయితే ప్రముఖ నటి, దర్శకురాలు, వీకే నరేశ్ తల్లి విజయ నిర్మల జయంతి సందర్భంగా హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తన తల్లి విజయ నిర్మల పేరిట అవార్డులను ప్రకటించారు. ఫిబ్రవరి 20న ఆమె జయంతి సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు ప్రతిష్టాత్మక అవార్డులను అందించారు. ఈ కార్యక్రమానికి నటి పవిత్ర లోకేశ్తో కలిసి ఆయన హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీరితో పాటు సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్ అనిల్ రావిపూడి, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా ఈ ఈవెంట్కు హాజరయ్యారు. కాగా.. ఈ ఈవెంట్లో జంధ్యాల జీవితంపై రైటర్ సాయినాథ్ రాసిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. నాకు సినిమాల్లో ఓనమాలు నేర్పించిన జంధ్యాలను చరిత్రలో ఒక భాగంగా ఉంచాలని ఆయన పేరుతో డబ్బింగ్, పోస్ట్ ప్రోడక్షన్ థియేటర్నుప్రారంభించినట్లు పేర్కొన్నారు.అయితే తన కెరీర్లోనే 2025 బిజీగా ఉండబోతోందని ఇటీవల ఓ ఈవెంట్లో వెల్లడించారు. ఏకకాలంలో తొమ్మిది సినిమాల్లో నటిస్తున్నా.. బ్యూటీ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సినిమా మ్యూజియమ్ అండ్ లైబ్రరీ అండ్ క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ పీపుల్ అనే కార్యక్రమాన్ని శ్రీమతి ఘట్టమనేని ఇందిరా దేవి పేరుతో ప్రారంభించినట్లు వెల్లడించారు. అందులో విజయకృష్ణ మందిరం ఏర్పాటు చేయడం జరిగిందని.. నేను, పవిత్ర దీనిని ఓ మిషన్లా తీసుకుని కళాకారుల ఐక్య వేదిక సంస్థ పేరుపై ఏర్పాటు చేసినట్లు ఇటీవలే వివరించారు.Visuals of Actor & MAA President @iVishnuManchu, Director @AnilRavipudi, Actor @ItsActorNaresh, and #PavitraLokesh from the Vijaya Nirmala Awards function in Hyderabad! 📸🤩#ManchuVishnu #AnilRavipudi #ShivaBalaji #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/LkIrqymsGi— Telugu FilmNagar (@telugufilmnagar) February 20, 2025 -
కృష్ణ గారి విషయం లో నేను, మహేష్ కొన్ని బౌండరీస్ పెట్టుకున్నాం
-
నటుడు నరేష్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
అమ్మ బయోపిక్ రూపొందించాలన్నది నా డ్రీమ్: వీకే నరేశ్
‘‘సినీ పరిశ్రమలో విజయవంతంగా 52 ఏళ్లు పూర్తి చేసుకోవడం హ్యాపీగా ఉంది. వృత్తిపట్ల అంకితభావం, క్రమశిక్షణ, ప్రేక్షకాదరణ వల్లే ఇది సాధ్యపడింది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలకు, ప్రేక్షకులకు, ఫ్యాన్స్కు ధన్యవాదాలు చెబుతున్నా’’ అని సీనియర్ నటుడు వీకే నరేశ్ అన్నారు. జనవరి 20న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో వీకే నరేశ్ మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాది రిలీజైన ‘గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు వందకోట్ల కలెక్షన్స్ను దాటడం మన సక్సెస్. ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం రూ. 300 కోట్లను దాటుతుందని విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది.ఇందులో నేను చేసిన ముఖ్యమంత్రి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోవడం సంతోషంగా ఉంది. నా కెరీర్లో 2025 బిజీయస్ట్ ఇయర్. ఏకకాలంలో తొమ్మిది సినిమాల్లో నటిస్తున్నాను. వీటిలో‘బ్యూటీ’ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాను. ఈ ఏడాది రెండు పెద్ద కార్యక్రమాలనూ తీసుకున్నాను. ‘సినిమా మ్యూజియమ్ అండ్ లైబ్రరీ అండ్ క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ పీపుల్’ అనే కార్యక్రమాన్ని శ్రీమతి ఘట్టమనేని ఇందిరా దేవిగారి పేరుతోప్రారంభించాం. అందులో విజయకృష్ణ మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. నేను, పవిత్ర దీనిని ఓ మిషన్లా తీసుకుని కళాకారుల ఐక్య వేదిక సంస్థ పేరుపై ఏర్పాటు చేశాం.జంధ్యాల, కృష్ణ, విజయ నిర్మలగార్లు నా గురువులు. నాకు సినిమాల్లో ఓనమాలు నేర్పించిన జంధ్యాలగారిని చరిత్రలో ఒక భాగంగా ఉంచాలని ఆయన పేరుతో డబ్బింగ్,పోస్ట్ ప్రోడక్షన్ థియేటర్నుప్రారంభించాం. రైటర్ సాయినాథ్గారి సహకారంతో ఆయనపై తయారు చేసిన పుస్తకాన్ని అమ్మగారి (దివంగత ప్రముఖ నటి– దర్శకురాలు విజయ నిర్మల) బర్త్ డే సందర్భంగా ఫిబ్రవరి 20న లాంచ్ చేస్తాం. ఈ ఏడాది ప్రతిష్టాత్మక విజయకృష్ణ అవార్డ్స్ని ఫ్యాన్స్ సమక్షంలో రిలీజ్ చేయబోతున్నాం. అమ్మ విజయ నిర్మలగారి బయోపిక్ చేయాలనే డ్రీమ్ ఉంది. అది నేనే రాయగలను. ఇక ‘చిత్రం భళారే విచిత్రం, శ్రీవారికి ప్రేమలేఖ’ చిత్రాలకు పార్టు 2 చేయాలని ఉంది’’ అని అన్నారు. -
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ బర్త్ డే.. పవిత్రా లోకేశ్ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే!
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ మరో ఏడాది పూర్తి చేసుకున్నారు. తాజాగా ఆయన 65వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా హైదారాబాద్లో ఆయన జన్మదిన వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో నటి పవిత్రా లోకేశ్ కూడా పాల్గొన్నారు. అభిమానుల మధ్య కేక్ కట్ చేసి బర్త్ డేను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ సందర్భంగా నరేశ్పై ప్రశంసలు కురిపించారు పవిత్రా లోకేశ్.పవిత్రా లోకేశ్ మాట్లాడుతూ..' నరేశ్ గారి బర్త్ డేను అందరు కలిసి సెలబ్రేట్ చేసుకోవడం శుభ పరిణామం. ఆయన వేసుకున్న షర్ట్ నేనే గిఫ్ట్ ఇచ్చాను. పెద్దల ఆశీర్వాదం ఆయనకు ఎప్పుడు ఉంటుంది. నరేశ్ గారికి ఇద్దరు గురువులు. వారిలో ఒకరు జంధ్యాల అయితే.. మరొకరు విజయనిర్మల. ప్రతి రోజు గురువుగారిని తలచుకుంటారు. తన కుటుంబాన్ని కూడా ఎప్పుడు గుర్తు చేసుకుంటారు. దాదాపు 10 మందికి ఉండే ఎనర్జీ నరేశ్ గారికి ఉంటుంది. ఏపని చేసినా చాలా సిస్టమాటిక్గా చేస్తారు. యంగ్ డైరెక్టర్స్కు చాలా టైమ్ ఇస్తారు. వాళ్లను బాగా ఎంకరేజ్ చేస్తారు' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. గతంలో వీరిద్దరు జంటగా మళ్లీ పెళ్లి అనే చిత్రంలో కనిపించారు. ఈ మూవీ చాలా వివాదానికి దారి తీసింది. అప్పట్లో నరేశ్ మూడో భార్య రమ్య రఘపతి బాహాటంగా గొడవపడటం, ఇదంతా కోర్టుల వరకు వెళ్లడం టాలీవుడ్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.Latest Visuals of Actor #VKNaresh along with #PavitraLokesh pic.twitter.com/39UnKTPV4e— Telugu Film Producers Council (@tfpcin) January 19, 2025#TFNExclusive: Visuals of Actor @ItsActorNaresh's birthday celebrations in Hyderabad!!🎊#Naresh #PavitraLokesh #TeluguFilmNagar pic.twitter.com/2kXbVEmaWr— Telugu FilmNagar (@telugufilmnagar) January 19, 2025 -
పద్మ అవార్డు కోసం నిరాహార దీక్ష చేసినా తప్పులేదు: నరేశ్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పద్మ అవార్డులపై సినీ నటుడు నరేశ్ (VK Naresh) సంచలన వ్యాఖ్యలు చేశాడు. 46 సినిమాలను డైరెక్ట్ చేసిన ఏకైక మహిళా దర్శకురాలు విజయ నిర్మల (Vijaya Nirmala) అని, కానీ ఇంతవరకు తనకు పద్మ పురస్కారం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమ్మకు పద్మ అవార్డు రావాలని ఢిల్లీదాకా వెళ్లి ప్రయత్నించాను. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో పద్మ పురస్కారం కోసం అమ్మ పేరును రికమండ్ చేశారు. నేను ఏ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు.పద్మ పురస్కారం కోసం పోరాడతాబీజేపీ వచ్చిన తరువాత నిజంగా ఆ స్థాయి ఉన్న వ్యక్తులకు పురస్కారాలు ఇస్తున్నారు. అందుకు సంతోషంగా ఉంది. ఎంజీఆర్ గారు బతికున్నప్పుడు పద్మ అవార్డు రాలేదు. సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా రాలేదు. మరణానంతరం ఇచ్చే పురస్కారంగా అయినా అమ్మకు పద్మ అవార్డు ఇవ్వాలి. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది అందుకు అర్హత కలిగిన వాళ్లు ఉన్నారు. మన వాళ్లకు పద్మ అవార్డులు వచ్చేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేసినా తప్పులేదు. మళ్లీ ఇప్పటి నుంచి అమ్మకు పద్మ అవార్డు రావడం కోసం ప్రయత్నిస్తాను అని చెప్పుకొచ్చాడు.చదవండి: దిల్ రాజు కోసం చరణ్ కీలక నిర్ణయం -
అందు కోసమే బచ్చలమల్లి మూవీ తీశా: డైరెక్టర్ సుబ్బు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అల్లరి నరేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం బచ్చలమల్లి. ఈ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో హనుమాన్ ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా చిత్రబృందం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ సుబ్బు ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.సుబ్బు మంగాదేవి మాట్లాడుతూ..'బచ్చలమల్లి క్యారెక్టర్ పేరు నిజమే. కథ మాత్రం నేనే రాసుకున్నా. నా లైఫ్లో మా అమ్మ గురించే నేను ఎక్కువగా ఆలోచిస్తా. ఈ చిత్రం కూడా మా అమ్మకు రాసిన క్షమాపణ లేఖ. నేను చేసిన తప్పు వల్ల చాలా బాధపడ్డా. నాలాగా ఇంకొకరు బాధ పడొద్దనే ఈ సినిమా ఉద్దేశం. తర్వాత అయినా అమ్మకు చెప్తా. నీ కోసం బచ్చలమల్లి సినిమా తీశానని' అంటూ డైరెక్టర్ మాట్లాడారు.(ఇది చదవండి: బార్డర్ దాటేసిన 'బచ్చల మల్లి' ట్రైలర్)ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న బచ్చలమల్లి ఈనెల 20న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు నరేశ్, అమృత అయ్యర్ కూడా హాజరయ్యారు. ఈవెంట్కు హాజరయ్యేందుకు హీరో, హీరోయిన్ సైకిల్పై వచ్చి ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు. -
వాహ్.. వ్యాక్స్ మినియేచర్
ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోలేదు.. తనలోని ప్రతిభకు పదునుపెట్టి చిన్నప్పుడు హాబీగా వేస్తున్న ఆర్ట్ని కొంగొత్త రీతిలో చూపెడుతూ తనకంటూ ఓ మార్క్ను క్రియేట్ చేసుకున్నాడు. ఆర్ట్లో రాణించడానికి శిక్షణ లేకపోయినా తన సృజనాత్మకతను జోడించి ప్రత్యేక డిజైన్స్ చేస్తూ సెలిబ్రిటీస్ని సైతం ఆకట్టుకుంటున్నాడు. ఆయనే నగరానికి చెందిన డిజిటల్ వ్యాక్స్ ఆర్టిస్ట్ నరేష్ రావులపల్లి.. తన ఆర్ట్ విషయాలను సాక్షితో పంచుకున్నారు.. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. నాకు అసలు ఆర్టిస్ట్ అవ్వాలనే ఆలోచనే లేదు.. ఏదైనా నచి్చన బొమ్మ కనబడితే వాటిని అలాగే వచ్చేలా గీసేవాడిని. ఆటోలు, బస్సులు, చెట్లు, జంతువులు, పక్షులు ఇలా ఏది కనబడితే వాటిని పేపర్ మీద పెట్టేవాడిని. నేను కేపీహెచ్బీలో ఉంటాను. స్కూలింగ్ సమయంలో పెయింటింగ్లో బహుమతులు వచ్చేవి. నా బొమ్మలు చూసి అందరూ మెచ్చుకునేవారు. కానీ తనలోని ప్రవృత్తి అయిన ఆర్ట్ని అలాగే అప్పుడప్పుడూ పదును పెడుతూ సివిల్ ఇంజినీరింగ్ చేసి జాబ్ చేయడం మొదలుపెట్టాను. సోషల్మీడియాతోనే గుర్తింపు.. నేను చేసిన డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ బొమ్మలను ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ ద్వారా పోస్ట్ చేసేవాడిని. అంతేకాకుండా తెలిసిన వారు కూడా నా ఆర్ట్ గురించి చెప్పేవారు. అలా ఆర్డర్స్ వచ్చేవి.. నా ఆర్ట్స్కి డబ్బుతోపాటు వినియోగదారుల ఆదరణ మరింత సంతోషాన్నిచ్చేది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్చరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమరం భీమ్ గెటప్స్ని చిన్నపిల్లలుగా నడిపించే రాజమౌళిగా ఆర్ట్ గీశాను. అప్పటికీ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ కాకపోవడంతో నా ఆర్ట్కి సోషల్మీడియా చాలా హైప్ వచి్చంది. చిత్ర అఫీషియల్ టీం ఆ పెయింటింగ్ని తమ సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చాలా గర్వంగా అనిపించింది. ఆ ఇన్స్పిరేషన్లో కొత్త కాన్సెప్ట్స్ని చేయడం మొదలుపెట్టాను.డిజిటల్ ఆర్ట్స్.. సోషల్ మీడియా, డిజిటలైజేషన్ సరికొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో డిజిటల్ ఆర్ట్స్నే చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మొదలైంది. అందరిలా కాకుండా కొత్తగా ట్రై చేద్దామని ఏడాది కష్టపడి డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ను నేర్చుకున్నాను. నా స్పేహితుడు మినియేచర్ (చిన్నచిన్న బొమ్మలు) కొనడానికి షాప్కి తీసుకెళ్ళాడు. చిన్నచిన్న బొమ్మలే ఐదువేల, పదివేలు, ఇంకా ఎక్కువ ధర ఉండటం చూసి షాక్ అయ్యాను. అప్పుడే నాలో కొత్త ఆలోచన మొదలైంది. మినియేచర్ బొమ్మల్లా కార్టూన్ ఫార్మాట్లో ఫినిషింగ్తో డిజిటల్ వ్యాక్స్ పెయింటింగ్స్ వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచి్చంది. వెంటనే ఆచరణలో పెట్టాను. -
Rajasthan Bypoll: రెబల్ నేతను సస్పెండ్ చేసిన కాంగ్రెస్
రాజస్థాన్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు మరో వారం రోజుల్లో (నవంబర్ 13న) ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన పార్టీ రెబల్ నేత నరేష్ మీనాను కాంగ్రెస్ గురువారం సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి సుఖ్జీందర్ సింగ్ రంధావా ఉత్తర్వులు జారీ చేశారు.ఉప ఎన్నికల్లో డియోలి-ఉనియారా అసెంబ్లీ స్థానం నుంచి నరేష్ మీనా పోటీ చేయాలని భావించారు. కానీ అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ కేసీ మీనాను బరిలోకి దింపింది. దీంతో పార్టీ టికెట్నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తి చెందిన నరేష్ మీనా.. భారత్ ఆదివాసీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన హస్తం పార్టీ నరేష్ మీనాపై సస్పెండ్ వేటు వేసింది .ఇదిలా ఉండగా కాగా రాజస్థాన్తోపాటు తొ మ్మిది రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న48 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13, 20న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. -
‘మన్యం ధీరుడు’ వచ్చేస్తున్నాడు!
నరేష్ డెక్కల దర్శకత్వం వహించిన తాజా చిత్రం మన్యం ధీరుడు’. ఆర్ వి వి సత్యనారాయణ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించాడు. ఈ చిత్రం కోసం భారీ ఖర్చుతో ఒక ఊరినే నిర్మించి అక్కడ షూట్ చేస్తున్నారట. అల్లూరి సీతారామరాజు నిజ రూప చరిత్రను వెండి తెరపై అవిష్కరించడానికి నటులు ఆర్ వి వి సత్యనారాయణ గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, విల్లు విద్యలో శిక్షణ తీసుకున్నారట. (చదవండి: తెలుగు ప్రేక్షకులకు ఇన్నాళ్లకు కాస్త గౌరవం)మన్యం ధీరుడు చిత్రంలో యదార్ధ సన్నివేశాలు, యదార్ధ సంఘటనలు ప్రజలకి అందించాలనే సంకల్పంతో ఆర్ వి వి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. బానిస సంకెళ్ళు తెంచుకుని బ్రిటీష్ తెల్ల దొరల పాలనకు చరమగీతం పాడే సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయని దర్శకుడు తెలిపారు. పవన్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
వీళ్లు పెళ్లి వద్దంటున్నారు.. మాకు మాత్రం మరొకటి: నరేశ్
తెలుగు సీనియర్ నటుడు నరేశ్ పేరు చెప్పగానే పవిత్ర లోకేశ్ గుర్తొస్తుంది. ఎందుకంటే కొన్నాళ్ల క్రితం నుంచి ఈమెతోనే కలిసుంటున్నాడు. ఈ విషయమై నరేశ్ మూడో భార్య రమ్య రఘపతి అప్పట్లో బాహాటంగా గొడవపడటం, ఇదంతా కోర్టుల వరకు వెళ్లడం జరిగింది. ఇదంతా మీకే తెలిసే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఓ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతూ పెళ్లి గురించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ వారం ఏకంగా 15 చిత్రాలు రిలీజ్)'సుందరకాండ' అనే సినిమా టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. దీని తర్వాత మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలోనే ఒకరు పెళ్లి చేసుకుంటే బెటరా? పెళ్లి చేసుకోకపోతే బెటరా అని నరేశ్ని అడగ్గా.. 'ఇప్పుడున్న జనరేషన్ ఏమో అసలు పెళ్లి వద్దు అంటున్నారు. మా జనరేషన్ ఏమో ఇంకోటి కావాలని అంటున్నారు' అని నవ్వుతూ సమాధానం చెప్పేశారు.నరేశ్ తన మూడో భార్య రమ్య రఘపతికి గత కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. నటి పవిత్రతో కలిసి ఉంటున్నారని టాక్. ఈ క్రమంలోనే నరేశ్-పవిత్ర లోకేశ్ జంటగా గతేడాది 'మళ్లీ పెళ్లి' అనే సినిమా కూడా రావడం విశేషం. అలాంటిది ఇప్పుడు నరేశ్.. ప్రస్తుత యువత పెళ్లి ఆలోచనపై అలా సెటైర్ వేసేశారు.(ఇదీ చదవండి: ఈ వయసులో మూడో పెళ్లి కష్టమేమో! కానీ..: ఆమిర్ ఖాన్) -
యాభై వసంతాల వేడుక
నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు నరేశ్ విజయకృష్ణ. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో విజయకృష్ణ మందిర్–ఘట్టమనేని ఇందిరాదేవి స్ఫూర్తి వనాన్ని ప్రారంభించారు. ఈ వేడుకకి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘ఈ పార్క్ గతం, భవిష్యత్ తరానికి మధ్య అద్భుతమైన వారధి’’ అన్నారు. ‘‘చిత్ర పరిశ్రమ కోసం కృషి చేసిన దిగ్గజాలందరికీ స్మారక చిహ్నంగా స్ఫూర్తి వనం రూపొందించాం’’ అని నరేశ్ విజయకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా నరే‹శ్ విజయకృష్ణ, పవిత్రా లోకేశ్, జయసుధలను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తరఫున మాదాల రవి, శివబాలాజీ, మహారాష్ట్ర సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పూనమ్ థిల్లాన్, జాకీ ష్రాఫ్, సుహాసిని, ఖుష్బూ తదితరులు సత్కరించారు. న్యాయమూర్తి ఎన్. మాధవరావు, తెలంగాణ హైకోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూరేపల్లి ప్రశాంత్, నటులు సాయి దుర్గా తేజ్, మనోజ్ మంచు, అలీ, దర్శకులు మారుతి, అనుదీప్, సతీష్ వేగేశ్న, సంగీత దర్శకుడు కోటి, నిర్మాతలు శరత్ మరార్, రాధామోహన్తో పాటు తెలుగు, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
‘కలి’ టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉంది: నాగ్ అశ్విన్
యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా "కలి". శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ టీజర్ని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేశారు. "కలి" మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుందని, ఒక కొత్త కాన్సెప్ట్ ను డైరెక్టర్ శివ శేషు తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నట్లు టీజర్ తో తెలుస్తోందని ఆయన అన్నారు. "కలి" మూవీ టీమ్ కు నాగ్ అశ్విన్ బెస్ట్ విశెస్ అందజేశారు.ఇక టీజర్ విషయానికొస్తే.. స్వార్థం నిండిన ఈ లోకంలో బతకలేక ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతాడు శివరామ్ (ప్రిన్స్). ఉరి వేసుకునే సమయానికి అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి (నరేష్ అగస్త్య) వస్తాడు. శివరామ్ జీవితంలో జరిగిన విషయాలన్నీ ఆ వ్యక్తి చెబుతుంటాడు. తన జీవితంలో జరిగిన ఘటనలు ఆ అపరిచితుడికి ఎలా తెలిశాయని ఆశ్చర్యపోతాడు శివరామ్. పెళ్లి చేసుకుని సంతోషంగా భార్యతో ఉన్న శివరామ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు?. అతని ఇంటికి వచ్చిన అపరిచితుడు ఎవరు?. అతనికి శివరామ్ జీవితంలో విషయాలన్నీ ఎలా తెలిశాయి?. కళ్లముందే శివరామ్ ఉంటే అతని పోలిక ఉన్న డెడ్ బాడీ ఎలా వచ్చింది? ఇలాంటి ఆసక్తికర అంశాలతో "కలి" టీజర్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. -
పవిత్ర-చందు మరణం.. అదే అసలు కారణమన్న నరేశ్
బుల్లితెర జంట చందు- పవిత్ర మరణం అందరినీ షాక్కు గురి చేసింది. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న వీరు త్వరలోనే భార్యాభర్తలుగా తమను పరిచయం చేసుకుందామనుకున్నారు. అంతలోనే రోడ్డు ప్రమాదంలో పవిత్ర మరణించగా తర్వాత ఐదు రోజులకే చందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటనపై ప్రముఖ నటుడు నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఎవరి జీవితం వాళ్లది!'ఉమ్మడి కుటుంబంలో ఒకరు కిందపడితే పదిమంది వచ్చి పైకి లేపేవాళ్లు. మేమున్నామంటూ సపోర్ట్ చేసేవాళ్లు. మా ఇంట్లో కూడా అలాగే ఉండేది. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీకి వచ్చేశాం. అమ్మానాన్న పిల్లలు.. ఇదే కుటుంబం! ఇక్కడ ఎవరి జీవితం వాళ్లది, ఎవరి ఆశయాలు వాళ్లవి.. ఒక స్టేజ్ దాటాక ఎవరూ ఎవరికి సపోర్ట్ చేయరు. పెద్దల మాటను పిల్లలు లెక్కచేయడం లేదు. ఒంటరితనంసంపాదన మొదలయ్యాక తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు. అసలేం కోల్పోతున్నారనేది వాళ్లకు అర్థం కావడం లేదు. ప్రియురాలు లేదా భార్య ఉన్నా సరే ఒంటరైపోతున్నారు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. మానసికంగా బలహీనమైపోతున్నారు. నా విషయమే తీసుకుంటే అమ్మ చనిపోయాక కృష్ణగారు, నేను ఎంతగానో బాధపడ్డాం. మేము ఒకరినొకరం ఓదార్చుకునేవాళ్లం. ఆ బలం వేరురోజూ ఉదయాన్నే ఆయనను పలకరించేవాడిని. మహేశ్బాబు కూడా మేము వచ్చి చూసెళ్తాం.. అని ధైర్యం చెప్పేవాడు. పది మంది నాకున్నారు అన్న బలం వేరు! ఎవరైనా మనకు దూరమైనప్పుడు ఓదార్చే వ్యక్తులు మన పక్కనుండాలి. ఈరోజుల్లో అది లేకుండా పోయింది. బంధాలు, బంధుత్వాలు లేకనే ఇలాంటివి జరుగుతున్నాయి' అని నరేశ్ అభిప్రాయపడ్డాడు.చదవండి: సడెన్గా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా -
అత్తింటి ఆరళ్లకు ముగ్గురు బలి
కరీంనగర్ రూరల్: అదనపు కట్నం కోసం అత్తింటివేధింపులను తట్టుకోలేక ఏడాది బిడ్డకు విషగుళికలు ఇచ్చి చంపిందా తల్లి. ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడింది. దీన్ని తట్టుకోలేక మృతురాలి తల్లి సైతం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకేరోజు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతితో కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో తీరని విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. బొమ్మకల్ గ్రామ పంచాయతీ విజయ్నగర్కాలనీలో ఉంటున్న ఉపాధ్యాయ దంపతులు గద్దె వెంకటేశ్వరచారి– జయప్రద(55) తమ చిన్న కూతురు శ్రీజ(25)కు మూడేళ్లక్రితం వరంగల్ జిల్లా మొగ్ధుంపూర్కు చెందిన నరేశ్తో కట్నకానుకలతో వివాహం జరిపించారు. ఏడాదిపాటు సక్రమంగా కాపురం చేసిన నరేశ్... కొడుకు ఆర్యన్(1) పుట్టాక శ్రీజను అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. అత్తమామలు సుజాత–కేశవచారి హింసించడంతో శ్రీజ గత నెల 29న బొమ్మకల్లోని పుట్టింటికి వచ్చింది. మంగళవారం ఉదయం 6గంటలకు కొడుకు మొదటి బర్త్డే గురించి నరేశ్కు శ్రీజ ఫోన్ చేయడంతో అత్తమామలు, భర్త కలిసి తీవ్రంగా దూషించారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన శ్రీజ క్రిమిసంహారక మాత్రలను కొడుకు ఆర్యన్కు తాగించి ఆ తర్వాత తానూ వేసుకుంది. అపస్మారకస్థితిలో పడి ఉన్న తల్లి, కొడుకులను జయప్రద, వెంకటేశ్వరచారి అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బిడ్డ మృతిచెందగా శ్రీజ చికిత్స పొందుతూ చనిపోయింది. కూతురు, మనవడి మృతిని తట్టుకోలేక జయప్రద ఇంటికివెళ్లి క్రిమిసంహారక మాత్రలు వేసుకుంది. ఆస్పత్రిలో చేరి్పంచగా పరిస్థితి విషమించి మృతి చెందింది. -
నన్ను చూసి అబ్బాయిలు కన్నుకొడుతూనే ఉంటారు: నరేశ్
సీనియర్ నటుడు నరేశ్ ఎంత మంచి యాక్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన వ్యక్తిగత జీవితం ఏంటనేది పక్కనబెడితే యాక్టింగ్ పరంగా ప్రతి సినిమాతోనూ మెస్మరైజ్ చేస్తుంటాడు. ఇకపోతే గత కొన్నాళ్ల నుంచి బయట పెద్దగా కనిపించని ఈయన.. తాజాగా 'భీమా' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఫుల్ జోష్తో మాట్లాడాడు. అలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేయడం విశేషం. (ఇదీ చదవండి: పెళ్లి ఫొటోలతో హీరోయిన్ ప్రగ్యా.. తమన్నాని చూస్తే తట్టుకోవడం కష్టమే!) దివంగత హీరోయిన్, దర్శకురాలు విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేశ్.. హీరోగా పలు సినిమాలు చేశాడు. కానీ నిలదొక్కుకోలేకపోయాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు వందలాది చిత్రాలతో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల దగ్గర నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు ప్రతి ఒక్కరితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలోకి రాబోతున్న గోపీచంద్ 'భీమా' సినిమాలోనూ నరేశ్ మంచి పాత్రే చేసినట్లు ఉన్నారు. తాజాగా హైదరాబాద్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. ఇందులో ఫుల్ జోష్తో స్పీచ్ ఇచ్చాడు. ఈ సినిమా చూసిన తర్వాత తనని చూసి అందరూ (అబ్బాయిలని ఉద్దేశించి) కన్నుకొడతారని నవ్వుతూ చెప్పాడు. అయితే సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ చేశాడనేది కొన్నిరోజులు ఆగితే తెలిసిపోతుంది. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?) -
మహేష్ బాబు గురించి చెప్తూ లైవ్ లో ఏడ్చేసిన నరేష్
-
బిర్యానీ కోసం వెళ్లి.. ముగ్గురు మృతి
గద్వాల క్రైం: ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడి కుమార్తె జన్మదిన వేడుకలను సిబ్బంది సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. అనంతరం సిబ్బంది బిర్యానీ తినేందుకు వైద్యుడి కారులో హోటల్కు వెళ్లారు. అయితే డ్రైవర్ అత్యు త్సాహంతో అతి వేగంగా కారును నడపడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడి కక్కడే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన జోగుళాంబ గద్వాల మండలం జమ్మిచేడ్ వద్ద శనివారం తెల్లవారుజమున చోటు చేసు కుంది. ప్రత్యక్ష సాక్షులు, గద్వాల సీఐ శ్రీనివాసులు కథనం ప్రకారం వివరాలు.. గద్వాలలోని అనంత ఆస్పత్రిలో స్థానిక చింతల్పేటకు చెందిన ఆంజనేయులు (50) సెక్యూరిటీగా పనిచేస్తుండగా, వనపర్తిజిల్లా పెబ్బేరుకు చెందిన పవన్ (28), మల్దకల్ మండలానికి చెందిన నరేశ్ (23), పాల్వా యి గ్రామానికి చెందిన నవీన్, కేటీదొడ్డి మండలం మైల గడ్డకు చెందిన గోవర్ధన్ ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నా రు. వైద్యుడు వెంకటేశ్ కూతురు పుట్టినరోజు ఉండటంతో శుక్ర వారం అర్ధరాత్రి సిబ్బంది సమక్షంలో వేడుకలు నిర్వ హించారు. ఆ తర్వాత ఆరుగురు సిబ్బంది బిర్యానీ తింటా మని చెప్పడంతో వెంకటేశ్ వారికి రూ.5వేలు ఇచ్చారు. డ్రైవర్ మ హబూబ్తో కలిసి ఆరుగురు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎర్రవల్లి వైపు బయలుదేరారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపి జమ్మిచేడ్ శివారులో కల్వర్టు వద్ద డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో కారు గాల్లోఎగిరి 100 మీ టర్ల వరకు పల్టీలు కొట్టింది. ఈ క్రమంలోనే కారు పైభాగం (సన్రూఫ్) తెరుచుకోవడంతో ఆంజనేయులు, పవన్, నరేశ్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ మహబూబ్, నవీ న్, గోవర్ధన్లను అనంత ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్న నవీన్ను మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. మృతుడు ఆంజనేయులు కుమారుడు నవీన్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
అలాంటి పాత్రల్లో నటించాలని ఉంది: నరేశ్ వీకే
‘‘మంచి నటుడు కావాలని పరిశ్రమలోకి వచ్చాను. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. 50 ఏళ్లు సినీ ప్రయాణం పూర్తి చేసుకోవడం ప్రేక్షకుల ప్రేమ, అభిమానాల వల్లే సాధ్యమైంది. నా జీవితాంతం చిత్ర పరిశ్రమకు సేవ చేస్తాను’’ అని నటుడు డా. నరేశ్ వీకే అన్నారు. నటుడిగా ఆయన ప్రయాణం మొదలై 50 ఏళ్లు పూర్తయ్యాయి. నేడు (జనవరి 20) నరేశ్ పుట్టినరోజు. (చదవండి: ప్రముఖ హీరో మంచి మనసు... ఆరుగురు ఖైదీలు విడుదల) ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని శుక్రవారం నరేశ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నా తొమ్మిదో ఏట ‘పండంటి కాపురం’ (1972)తో బాలనటుడిగా అడుగుపెట్టాను. మా అమ్మ విజయ నిర్మల, జంధ్యాల, కె. విశ్వనాథ్, బాపు, రమణ, ఈవీవీ సత్యనారాయణ, వంశీ, రేలంగి నరసింహారావు వంటి మహనీయులతో సినిమాలు చేసే అదృష్టం దక్కింది. రాజకీయాలు, ఆ తర్వాత సమాజ సేవ వల్ల దాదాపు పదేళ్లు పరిశ్రమకి దూరమయ్యాను. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, బిజీగా ఉన్నాను. నాకు నెగటివ్ రోల్స్ చేయాలని ఉంది. ఇక ఏ ప్రభుత్వమైనా సినీ పరిశ్రమకు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వాలి. నంది అవార్డులని పరిశ్రమ గౌరవంగా చూస్తుంది. కానీ ఇప్పుడా అవార్డులని ఇవ్వడం లేదు.. మళ్లీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మా అబ్బాయి నవీన్కి దర్శకుడిగా మంచి భవిష్యత్ ఉంటుందని నమ్ముతున్నాను. మా విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్ని మోడ్రన్ స్టూడియోగా చేస్తున్నాం’’ అన్నారు. -
కామెడీ కిస్మత్
నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్, రియా సుమన్ ప్రధాన పాత్రధారులుగా, ‘అవసరాల’ శ్రీనివాస్ ఓ కీలక పాత్రలో నటించిన కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘కిస్మత్’. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ పతాకాలపై రాజు నిర్మించారు. కాగా ఈ సినిమాను ఫిబ్రవరి 2న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ గురువారం వెల్లడించింది. ఈ సినిమాకు సంగీతం: మార్క్ కె. రాబిన్, సహ–నిర్మాత: సీహెచ్ భానుప్రసాద్ రెడ్డి. -
లేదంటే మాటొచ్చేత్తది!
అంజిగా మారిపోయారు ‘అల్లరి’ నరేశ్. నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఇందులోని కీలకమైన అంజి పాత్రను ‘అల్లరి’ నరేశ్ చేస్తున్నారు. శుక్రవారం ‘అల్లరి’ నరేశ్ పాత్ర అంజిని గురించిన గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘మా అల్లరి అంజిగాడ్ని పరిచయం చేస్తున్నాం. లేదంటే మాటొచ్చేత్తది’’ అంటూ ‘అంజి’ గ్లింప్స్ వీడియోను షేర్ చేశారు నాగార్జున. ‘‘చేసేయ్.. చేసేయ్.. లేదంటే మాటొచ్చేత్తది’’ అనే డైలాగ్ చెప్పారు ‘అల్లరి’ నరేశ్. పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి. -
వీకే నరేష్కి డాక్టరేట్ ప్రదానం
నటుడు వీకే నరేష్కి అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ‘ఐఎస్ సీఏహెచ్ఆర్’ నుంచి ఆయన ‘సార్’ అనే బిరుదుతోపాటు డాక్టరేట్ని అందుకున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తాజాగా జరిగిన 5వ ప్రపంచ కాంగ్రెస్ సమావేశాల్లో వీకే నరేష్కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ సమావేశాలను ‘నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్’ సంస్థతో పాటు ‘ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్)’ కలిసి నిర్వహించాయి. ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా వంటి దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా.. అక్కడ నరేష్కు మరో గౌరవం దక్కింది. మిలటరీ ఆర్ట్స్ గుడ్విల్ అంబాసిడర్తో పాటు లెఫ్టినెంట్ కల్నల్గా ఆయన్ను నియమించినట్లు సన్నిహితులు తెలిపారు. ఇకపై నరేష్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్... అనే హోదా చేరుతుంది. ఉగ్రవాదం, సామాజిక సమస్యలు వంటి అంశాలపై అనేక అంతర్జాతీయ వేదికలపై నరేష్ ప్రసంగించినందుకు గుర్తింపుగా ఈ గౌరవాలు దక్కాయి. -
లవర్ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!
తెలుగులో చాలామంది కమెడియన్స్ ఉన్నారు. సినిమాల్లో కావొచ్చు, షోల్లో కావొచ్చు తమదైన హాస్యంతో నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. అలా 'జబర్దస్త్' షోతో పాపులర్ అయిన నరేశ్.. అదేనండి పొట్టి నరేశ్. తనదైన శైలిలో కామెడీ చేస్తూ ఫేమ్ సంపాదించుకున్నాడు. తాజాగా ఓ షోలో భాగంగా తన ప్రేయసిని అందరికీ పరిచయం చేశాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!) ఇంతకీ ఎవరామె? టీవీ షోలతో కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న నరేశ్.. పలు కార్యక్రమాల్లో తనదైన మార్క్ హాస్యంతో నవ్విస్తున్నాడు. హైట్ తక్కువ ఉన్నప్పటికీ అది ఇతడికి ప్లస్ అయిందని చెప్పొచ్చు. తాజాగా ఓ షోలో భాగంగా తన ప్రేమలో ఉన్న విషయాన్ని యాంకర్ రష్మీతో చెప్పుకొచ్చాడు. అలానే అమ్మాయిని స్వయంగా స్టేజీపై తీసుకొచ్చాడు. ఆమె తమ ప్రేమ గురించి బయటపెట్టింది. గత రెండేళ్లుగా ఎక్స్ప్రెస్ చేయలేనంత ప్రేమని నరేశ్ ఇచ్చాడని చెప్పుకొచ్చింది. అలానే నరేశ్ తన ప్రేయసిని స్టేజీపైకి తీసుకురావడం పక్కనబెడితే.. ప్రపోజ్ చేసి, చేతిపై ముద్దు కూడా పెట్టాడు. అంతా బాగానే ఉంది కానీ ఇదంతా కూడా స్క్రిప్టెడ్ అనిపిస్తుంది తప్పితే ఎక్కడా కూడా ఒరిజినల్ అనే ఫీల్ రాలేదు. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని చూసి చూసి ప్రేక్షకులకు ఎప్పుడో బోర్ కొట్టేశాయి. అయినా కూడా షో నిర్వహకులు ఇలానే చేయడంపై నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'జబర్దస్త్' ఫైమా.. అసలు ఏమైందంటే?) -
నటుడు నరేశ్కు దక్కిన అరుదైన గౌరవం.. లెఫ్టినెంట్ కల్నల్గా గుర్తింపు
సీనియర్ నటుడు నరేశ్కు అరుదైన గౌరవం దక్కింది. సుమారు 300 చిత్రాలలో నటించిన నరేశ్ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. ఆయనలో మంచి వక్త కూడా ఉన్నారు. ప్రపంచ సమస్యలపై ఆయనకు లోతైన అవగాహన ఉంది. ఉగ్రవాదం, సామాజిక సమస్యలు, తదితర అంశాలపై అనేక అంతర్జాతీయ వేదికలపై ఆయన ఇప్పటికే ప్రసంగించారు. అందుకు గుర్తింపుగా 'సార్' అనే బిరుదుతోపాటు 'డాక్టరేట్'ని అందుకున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ నుంచి ఆయనకు ఈ గుర్తింపు దక్కింది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో తాజాగా జరిగిన 5వ ప్రపంచ కాంగ్రెస్ సమావేశాల్లో నటుడు నరేశ్కు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ సమావేశాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ సంస్థతోపాటు ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్) కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించాయి. ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా, తదితర దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా.. అక్కడ నరేశ్కు మరో గౌరవం దక్కింది. మిలటరీ ఆర్ట్స్ గుడ్విల్ అంబాసిడర్తో పాటు లెఫ్టినెంట్ కల్నల్గా నరేశ్ను నియమించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. దీంతో ఇక నుంచి నరేశ్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్... అనే హోదా చేరుతుంది. అంతర్జాతీయ ఉగ్రవాదం అంశంపై ఆయన ప్రసంగాలకు తగిన గుర్తింపు లభించింది. నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ (ఎన్ఏఎస్డీపీ), ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్) ఓ కార్యక్రమంలో నరేశ్కు 'సర్' బిరుదును ప్రదానం చేశాయి. ఫిలిప్పీన్స్ లోని మనీలా నగరంలో జరిగిన 5వ వరల్డ్ కాంగ్రెస్ సమావేశంలో ఈ బిరుదును అందించారు. ఐఎస్ సీఏహెచ్ఆర్ సంస్థ ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ. ఇది నాటో, యూరోపియన్ యూనియన్, అమెరికా, తదితర దేశాల గుర్తింపు ఉన్న సంస్థ కూడా. ఇక నుంచి నరేశ్ పేరు ముందు లెఫ్టినెంట్ కల్నల్, సార్... అనే హోదా చేరుతుంది. దేశంలో ఇలాంటి గౌరవాలు అందుకున్న తొలి నటుడిగా నరేశ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఉగ్రవాదంపై ఆయన చేసిన ప్రసంగాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయని ఈ కార్యక్రమంలో ప్రముఖులు తెలిపారు. ఉగ్రవాదాన్ని అరికట్టడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ సమావేశాల ఉద్దేశాన్ని ఓ దౌత్యవేత్తగా, కళాకారుడిగా ప్రజల్లోకి తీసుకెళతానని నరేశ్ ఈ సందర్భంగా తెలిపారు. తన ఉపన్యాసాలకు గుర్తింపుగా 'సర్' బిరుదును ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. -
కన్నకూతురిని కత్తులతో నరికి..
వైరా రూరల్: ఆస్తి కోసం కనీస విచక్షణ, మానవత్వం..చివరికి కన్నప్రేమను కూడా మరిచి మృగంలా మారిన ఓ తండ్రి కన్నకూతురును.. పైగా ఐదు నెలల గర్భవతి అని కూడా చూడ కుండా వేటకొడవళ్లు, గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. ఈ ఘటనలో కుమార్తె అక్కడికక్కడే మృతిచెందగా అల్లుడు చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలిలా ఉన్నాయి. తాటిపూడి గ్రామానికి చెందిన పిట్టల రాములు, మంగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులతోపాటు కుమార్తె ఉషశ్రీ(35) ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమారులు నరేశ్, వెంకటేష్ స్థానికంగానే ఉంటుండగా, మరొకరు దూరంగా నివసిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన రాములు మామ (మంగమ్మ తండ్రి) మన్నెం వెంకయ్య చిన్నతనం నుంచే ఉషశ్రీని పెంచి పెద్దచేసి పదేళ్ల కిందట కొణిజర్ల మండలం గోపారానికి చెందిన పర్శబోయిన రామకృష్ణకు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ సమయంలో వెంకయ్య తన రెండు ఎకరాల వ్యవసాయ భూమి, 10కుంటల ఇంటి స్థలాన్ని ఉషశ్రీ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో రామకృష్ణ ఇల్లరికంపై తాటిపూడికి రాగా, అక్కడే భార్యాభర్తలు టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పదేళ్ల క్రితం పెళ్లి కాగా, ఇన్నేళ్లకు ఉషశ్రీ గర్భం దాల్చింది. కాగా, తన మామ వెంకయ్య ఆస్తిని ఉషశ్రీకి రాయడాన్ని జీర్ణించుకోలేని ఆమె తండ్రి రాములు, సోదరులు నరేశ్, వెంకటేష్ తరచూ ఘర్షణ పడేవారు. ఈ విషయమై కేసు కూడా కోర్టులో పెండింగ్లో ఉంది. కూతురినీ నరికేశాడు.. శుక్రవారం ఉదయం ఉషశ్రీకి చెందిన ఇంటి స్థలంలో ఉన్న సుబాబుల్ చెట్లను నరికేందుకు పిట్టల రాములు, ఆయన కుమారులు నరేష్, వెంకటేశ్ వేటకొడవళ్లు, గొడ్డలి, గడ్డపలుగులతో వచ్చారు. ఇది చూసి రామకృష్ణ, ఉషశ్రీ అడ్డుకున్నారు. దీంతో వారు గడ్డపలుగు, వేటకొడవళ్లతో వెంటపడ్డారు. ఈ క్రమంలో రామకృష్ణపై దాడి చేస్తుండగా, ఉషశ్రీ తప్పించుకునే ప్రయత్నంలో ఇంకొకరి ఇంట్లోకి వెళ్లడంతో వెంబడించి మరీ నరికారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రగాయాలపాలైన రామకృష్ణను స్థానికులు 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మరక్షణ కోసం ఉషశ్రీ, రామకృష్ణ ప్రతిదాడి చేయడంతో రాములు, వెంకటేశ్, నరేశ్కు కూడా గాయాలవడంతో ఆస్పత్రిలో చేరారు. వైరా ఏసీపీ ఎం.ఎ రెహమాన్, సీఐ నునావత్ సాగర్, ఎస్సై మేడా ప్రసాద్ ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
Martin Luther King Movie Review:‘మార్టిన్ లూథర్ కింగ్’ మూవీ రివ్యూ
టైటిల్:మార్టిన్ లూథర్ కింగ్ నటీనటులు:సంపూర్ణేష్ బాబు, వీకే నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్ తదితరులు నిర్మాతలు: ఎస్. శశికాంత్, చక్రవర్తి రామచంద్ర క్రియేటివ్ ప్రొడ్యూసర్: వెంకటేష్ మహా దర్శకత్వం:పూజ కొల్లూరు స్క్రీన్ ప్లే, డైలాగ్స్: వెంకటేష్ మహా సంగీతం:స్మరణ్ సాయి సినిమాటోగ్రఫీ:దీపక్ యరగెరా విడుదల తేది: అక్టోబర్ 27, 2023 ‘మార్టిన్ లూథర్ కింగ్’ కథేంటంటే.. గ్రామీణ నేపథ్యంలో సాగే పొలిటికల్ డ్రామా చిత్రమిది. పడమరపాడు అనే గ్రామంలో ఉత్తరం వైపు ఒక కులం వాళ్లు.. దక్షిణం వైపు ఇంకో కులం వాళ్లు ఉంటారు. ఇరు కులాలకు అస్సలు పడదు. ఎప్పుడూ గొడవలు పడుతుంటారు. దీంతో ఆ ఊరి ప్రెసిడెంట్ రెండు కూలాల నుంచి ఒక్కొక్కరిని పెళ్లి చేసుకొని..ఉత్తరం, దక్షిణం వాళ్లకు సమ ప్రాధాన్యత ఇస్తుంటాడు. కానీ పెద్ద భార్య కొడుకు జగ్గు(వీకే నరేశ్), చిన్న భార్య కొడుకు లోకి(వెంకట్ మహా) మాత్రం ఎప్పుడూ గొడవపడుతుంటారు. వారిద్దరి గొడవల కారణంగా ఊరి ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ఊర్లో మరుగుదొండ్లు ఉండవు..రోడ్లు సరిగా ఉండదు. ఇలా పలు సమస్యలతో బాధపడుతున్న ఆ ఊరికి ఓ పెద్ద ఫ్యాక్టరీ వస్తుంది. కోట్లల్లో కమీషన్ వస్తుందని తెలిసి.. జగ్గు, లోకి ఇద్దరూ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడతారు. ఉత్తరం వాళ్లు, దక్షిణం వాళ్లు సమానంగా ఉండడంతో..ఒక్క ఓటు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క ఓటే స్మైల్ అలియాస్ మార్టిన్ లూథర్ కింగ్(సంపూర్ణేష్ బాబు). అతనొక అనాథ. ఊర్లో ఉన్న ఓ పెద్ద చెట్టుకింద చెప్పులు కుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తాడు. అతనికి తోడుగా మరో అనాథ బాటా ఉంటాడు. వీరిద్దరికి ఎలాంటి గుర్తింపు కార్డులు ఉండవు.ఆ ఊరికి కొత్తగా వచ్చిన పోస్టాఫీస్ ఉద్యోగిణి వసంత(శరణ్య) స్మైల్ పెరుని మార్టిన్ లూథర్ కింగ్గా మార్చి ఓటర్ కార్డుతో పాటు పోస్టాఫీస్లో ఖాతాని తెరిపిస్తుంది. అతని ఓటే కీలకం కావడంతో.. ఒకవైపు జగ్గు, మరోవైపు లోకి.. కింగ్కి కావాల్సినవన్నీ ఇస్తారు. మరి తన ఓటుని అడ్డుపెట్టుకొని కింగ్ ఎలాంటి కోరికలు తీర్చుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు తన ఓటు హక్కుతో ఊరి సమస్యలను ఎలా తీర్చాడు అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఓటు ప్రాధాన్యతని తెలియజేస్తూ గతంలో అనేక సినిమాలు వచ్చాయి. మార్టిన్ లూథర్ కింగ్ కూడా అలాంటి చిత్రమే. గ్రామాల్లో జరిగే అసలైన రాజకీయాలను తెరపై ఆవిష్కరించడం ఈ చిత్రం స్పెషాలిటీ. ప్రజాస్వామ్యం పవర్ ఏంటి? ఓటు హక్కు విలువ ఏంటి? అనేది ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశారు దర్శకురాలు పూజా కొల్లూరు. వాస్తవానికి ఈ చిత్రం రెండేళ్ల క్రితం తమిళంలో విడుదలై ఘన విజయం సాధించిన ‘మండేలా’కి తెలుగు రీమేక్. తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు దగ్గరగా కథలో చిన్న చిన్న మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా మొత్తం పొలిటికల్ సెటైరికల్గానే సాగుతుంది. పడమరపాడు గ్రామంలో మరుగుదొడ్డి ప్రారంభోత్సవం సీన్తో కథ ప్రారంభం అవుతుంది. ఆ ఒక్క సీన్తోనే జగ్గు, లోకి పాత్రల స్వభావంతో పాటు కథకు కీలకమైన స్మైల్ పాత్రని కూడా పరిచయం చేసి నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లారు దర్శకురాలు. పోస్టాఫీస్ ఉద్యోగి వసంత పాత్రతో కథను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. స్మైల్కి మార్టిన్ లూథర్ కింగ్ అనే పేరు పెట్టే క్రమంలో సాగే సన్నివేశాలు.. గ్రామాల్లో ఆధార్, ఓటర్ కార్డు లేని వారి దుస్థితిని చూపిస్తాయి. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం కులాల పేర్లతో ప్రజలను ఎలా విడదీస్తారనేది చూపించారు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తికి పెంచుతుంది. అయితే ద్వితియార్థం మాత్రం మొత్తం సీరియస్ సైడ్ తీసుకుంటుంది. ‘మండేలా’ లో వర్కౌట్ అయిన ఎమోషనల్ ఈ చిత్రంలో వర్కౌట్ కాలేదు. కామెడీ సీన్స్ కూడా ఆశించిన స్థాయిలో పేలలేదు. ముఖ్యంగా నరేశ్ పాత్ర కొన్ని చోట్ల చేసే కామెడీ కథకి అతికించినట్లుగా అనిపిస్తుంది. అలాగే కింగ్ ఓటు కోసం జగ్గు, లోకి ఇద్దరు పడే తంటాలు సాగదీతగా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఊహించినట్టే రొటీన్గా ఉంటుంది. స్క్రిప్టుని మరింత బలంగా రాసుకొని, ఎమోషన్స్పై ఇంకాస్త దృష్టి పెడితే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఇప్పటివరకు సంపూర్షేష్ బాబు అంటే మనకు కామెడీ హీరోగానే తెలుసు. అతను చేసిన స్పూఫ్ కామెడీని బాగా ఎంజాయ్ చేశాం. కానీ అతనిలోని మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. టైటిల్ పాత్రలో సంపూ ఒదిగిపోయాడు. తనదైన అమాయకపు ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్లో కూడా చక్కగా నటించాడు. తెరపై కొత్త సంపూని చూస్తాం. ఈ సినిమా సంపూకి ఓ కొత్త ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. ఇక ప్రెసెడెంట్ పదవి పోటీదారులు జగ్గుగా వీకే నరేష్.. లోకిగా వెంకట్ మహా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక సంపూ పాత్రకి అసిస్టెంట్ బాటా పాత్రను పోషించిన చిన్నోడి నటన బాగుంది.పోస్టాఫీసు ఉద్యోగి వసంత పాత్రకి శరణ్య న్యాయం చేసింది. ఊరి ప్రెసిడెంట్, లోకి, జగ్గుల తండ్రి పాత్రను పోషించిన రాఘవన్ కూడా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. స్మరణ్ సాయి నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగానే వస్తూ.. సినిమాలను ఎలివేట్ చేసేలా ఉంటాయి. దీపక్ యరగెరా సినిమాటోగ్రఫీ బాగుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పూజ కొల్లూరు.. ఎడిటర్గానూ వ్యవహరించడం విశేషం. కానీ ఎడిటర్గా తన కత్తెరకు మాత్రం సరిగా పని చెప్పలేకపోయింది. సినిమాలో చాలా చోట్ల సాగదీత సన్నివేశాలు కనిపిస్తాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
జయసుధ కొంగు పట్టుకొని వెళ్ళే వాడిని
-
మా అమ్మ కోరిక అది: నటుడు నరేష్
-
మేడమ్ అని కాకుండా సార్ అని పిలిచారు
సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో వీకే నరేశ్, శరణ్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. పూజా కొల్లూరు దర్శకత్వంలో వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో పూజా కొల్లూరు మాట్లాడుతూ– ‘‘సైంటిస్ట్ లేదా ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నప్పటికీ సినిమాతో సమాజాన్ని ప్రభావితం చేయవచ్చని సినిమా రంగాన్ని కెరీర్గా ఎంచుకున్నాను. తెలుగులో ‘మార్టిన్ లూథర్ కింగ్’ నా తొలి సినిమా. కానీ ఈ చిత్రం కంటే ముందు కొన్ని హాలీవుడ్ ్రపాజెక్ట్స్తో అసోసియేషన్ ఉంది. కొన్ని డాక్యుమెంటరీలు తీశాను. ఇక ‘మార్టిన్ లూథర్ కింగ్’ విషయానికి వస్తే.. వై నాట్ స్టూడియోస్ సంస్థ తమిళ చిత్రం ‘మండేలా’ కథను తెలుగులో చె΄్పాలనుకుని, వెంకటేశ్ మహాగారిని సంప్రదించారు. అయితే నిర్మాణంలో భాగమౌతానని, దర్శకత్వం వహించలేనని ఆయన చె΄్పారు. దీంతో నేను దర్శకత్వం వహిస్తానని వెంకటేశ్ మహాగారికి చెప్పడంతో ఆయన వారికి చె΄్పారు. ఓటర్లు వారి ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోవాలన్నది ఈ సినిమా థీమ్. ఓ సామాన్యుడు నటిస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలని సంపూర్ణేష్ని హీరోగా తీసుకోవడం జరిగింది. వెంకటేశ్ మహా ఈ చిత్రానికి స్క్రీన్ప్లే, డైలాగ్స్ ఇచ్చారు. నేను ఎడిటింగ్ కూడా చేశాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘ఏ భాషలోనైనా మహిళలకు అవకాశాలు తక్కువగానే ఉంటున్నాయి. నేను లేడీ డైరెక్టర్ని అయినా సెట్స్లో చాలాసార్లు ఓకే సార్ అన్నారు కానీ మేడమ్ అనలేదు. అంటే లింగ వివక్ష ఎంతలా నాటుకు΄ోయిందో అర్థం చేసుకోవచ్చు. సమస్యలున్నప్పటికీ మన పట్టుదలే మనల్ని ముందుకు నడిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. -
అనుకున్నవన్నీ జరగవు
శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటించిన చిత్రం ‘అనుకున్నవన్నీ జరగవు కొన్ని’. జి. సందీప్ దర్శకత్వంలో శ్రీ భరత్ ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 3న రిలీజ్ కానుంది. ఈ చిత్రం పోస్టర్ను హీరో ‘అల్లరి’ నరేశ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. నేను నటించిన ‘సిల్లీ ఫెలోస్’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన సందీప్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవడం ఆనందంగా ఉంది’’ అన్నారు. జి. సందీప్ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘నరేశ్గారు క్రైమ్, కామెడీ జానర్ చిత్రాలు ఎన్నో చేశారు. మా టైటిల్ లాంచ్ చేయడానికి ఆయనే కరెక్ట్ అనిపించింది’’ అన్నారు శ్రీరామ్ నిమ్మల. ఈ చిత్రానికి కెమెరా: చిన్నా రామ్, జీవీ అజయ్, సంగీతం: గిడియన్ కట్ట, ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్: బీవీ నవీన్. -
నరేశ్ అంటే ఎవరు అన్నారు
సంపూర్ణేష్ బాబు హీరోగా వీకే నరేష్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు వెంకటేశ్ మహా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అదించడంతో పాటు క్రియేటివ్ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. పూజా కొల్లూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన వీకే నరేశ్ మాట్లాడుతూ– ‘‘వినోదం, సందేశం... ఈ రెండు అంశాలు మిళితమై ఉన్న సినిమాలు తక్కువగా వస్తుంటాయి. ‘మార్టిన్ లూథర్ కింగ్’లో ఈ రెండూ ఉన్నాయి. ఓ గ్రామంలోని రాజకీయ వర్గానికి నాయకుడిగా నటించాను. తమిళ ‘మండేలా’ సినిమాకు ‘మార్టిన్..’ చిత్రం స్ఫూర్తి మాత్రమే. పూర్తి స్థాయి రీమేక్ కాదు. ఈ సినిమా సంపూర్ణేష్కు సెకండ్ ఇన్నింగ్స్లా ఉంటుంది. 30 మంది నటీనటులు ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘కొంతకాలం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాను. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేస్తున్నాను. జీవితంలో ఎత్తుపల్లాలు చూశాను. రాజకీయాల నుంచి ఇండస్ట్రీకి తిరిగొచ్చిన ప్పుడు నరేశ్ అంటే ఎవరు? అని కొందరు అన్నారు. ఎస్వీ రంగారావుగారిని స్ఫూర్తిగా తీసుకుని విభిన్నమైన పాత్రలు చేస్తున్నాను. ఈ తరం దర్శకులు నాకోసం పాత్రలు రాయడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. -
యూత్ఫుల్ కిస్మత్
నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, అవసరాల శ్రీనివాస్, విశ్వ దేవ్, రియా సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘కిస్మత్’. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో రాజు నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్లుక్ను హీరో సత్యదేవ్ విడుదల చేశారు. ‘‘బెస్ట్ బడ్డీస్ కామెడీ బ్యాక్డ్రాప్లో సాగే ఫన్ రైడ్ ‘కిస్మత్’. ప్రస్తుతం పోస్ట్ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: మార్క్ కె. రాబిన్, కెమెరా: వేదరామన్ శంకరన్, సహ నిర్మాత: సీహెచ్ భానుప్రసాద్ రెడ్డి. -
నాన్న పోలీస్.. కుమార్తె షూటర్
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): తండ్రి పోలీస్శాఖలో అత్యుత్తమ పనితీరుతో ప్రతిష్టాత్మక పతకాలు అందుకున్న అధికారి.. ఆ కుమార్తె తండ్రికి తగ్గ తనయ. షూటింగ్లో దిట్ట.. నాన్న స్ఫూర్తి, ప్రోత్సాహంతో ముందుకు సాగుతూ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. తన తండ్రితోపాటు గుంటూరు కీర్తిని చాటేందుకు సిద్ధమైంది. ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ తండ్రీకూతుళ్ల విజయగాధ.. అత్యున్నత గ్యాలంటరీ అవార్డు కై వసం సీఐ డి.నరేష్.. ప్రస్తుతం గుంటూరు దిశ పోలీసుస్టేషన్ సీఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1998లో ఎస్ఐగా ఉద్యోగజీవితం ప్రారంభించిన ఆయన గుంటూరు రేంజ్ పరిధిలోనే వివిధ విభాగాల్లో పనిచేశారు. అనంతరం సీఐగా ఉద్యోగోన్నతి పొందారు. సుమారు ఆరున్నరేళ్లపాటు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసి 2010 సంవత్సరంలో పోలీసు శాఖలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ఎంపిక చేసే గ్యాలంటరీ అవార్డును అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చేతుల మీదుగా అందుకున్నారు. 2006లో రాష్ట్ర ప్రభుత్వ సేవా పతకం, 2018లో ఉత్కృష్ట సేవా పతకం, 2022లో ఉత్తమ సేవా పతకం అందుకున్నారు. విశ్రాంత డీజీపీలు పేర్వారం రాములు, స్వర్ణజిత్సేన్, అప్పా డైరెక్టర్ గోపినాథ్రెడ్డితోపాటు అనేక మంది ఉన్నతాధికారుల చేతుల మీదుగా అనేక అవార్డులను పొందారు. విధుల్లో చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్క పనిష్మెంట్ కూడా లేదంటే.. ఆయన విధుల్లో ఎంత బాధ్యతగా ఉంటారో అర్థమవుతోంది. పుత్రికోత్సాహంతో ఉప్పొంగే.. సీఐ నరేష్ కుమార్తె సన్వితాషారోన్. ఇంటర్మీయెట్ పూర్తి చేశారు. ప్రస్తుతం లా చదవించేందుకు సిద్ధమవుతున్నారు. ఈమె షూటింగ్లోనూ దిట్ట. ఇప్పటికే అనేక పతకాలు కైవసం చేసుకున్నారు. ఇటీవల నేషనల్స్కు ఎంపికయ్యారు. చిన్ననాటి నుంచి కూతురు షూటింగ్పై ఆసక్తి కనబరచడంతో సీఐ నరేష్ ప్రోత్సహించారు. శిక్షణ ఇప్పించి మెళకువలు నేర్పించారు. రాష్ట్ర స్థాయిలో ఎయిర్ పిస్టల్ రేంజ్–10 జూనియర్, ఉమెన్ విభాగాల్లో సన్విత స్వర్ణ, వెండి పతకాలను సాధించారు. ఫైర్ఆమ్–25 రేంజ్ విభాగంలో భూపాల్, కేరళ, ఢిల్లీలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కర్మీసింగ్ షూటింగ్ రేంజ్, అహ్మదాబాద్, గుజరాత్ పోటీల్లో పాల్గొని రెండు గోల్డ్ మెడల్స్, నాలుగు సిల్వర్ మెడల్స్ సాధించారు. గత ఆగస్టులో త్రివేండ్రంలో జరిగిన సౌత్జోన్ షూటింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన సన్వితా.. త్వరలో జరగబోయే ఆలిండియా షూటింగ్ కాంపిటేషన్కు ఎంపికయ్యారు. సంతోషంగా ఉంది నాకు క్రీడలపై ఆసక్తి ఉంది. నేను 1998లో స్పోర్ట్స్ కోటాలో పోలీసుశాఖలో ఉద్యోగం సంపాదించా. నా కుమార్తె సన్వితషారోన్కు షూటింగ్ అంటే మక్కువ. తన కోరిక కాదనకుండా.. శిక్షణ ఇప్పించా. రాష్ట్ర, జోన్ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించింది. ఇటీవల త్రివేండ్రంలో జరిగిన షూటింగ్ కాంపిటేషన్లో పాల్గొని నేషనల్స్కు ఎంపికై ంది. ఎంతో సంతోషంగా ఉంది. – డి.నరేష్ (దిశ పీఎస్ సీఐ) అంతర్జాతీయ స్థాయికి వెళ్లడమే లక్ష్యం షూటింగ్ అంటే నాకు ఇష్టం. ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాను. నేషనల్స్కు ఎంపికయ్యాను. నా తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువుల రుణం తీర్చుకోలేనిది. వారి ప్రోత్సాహం మరువలేనిది. ఎప్పటికై నా దేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలనేది నా కల. అది సాధించి తీరతాను. – డి.సన్వితాషారోన్ -
నటుడు నరేశ్ ఎమోషనల్.. అది తలుచుకుని బాధపడి!
కొన్ని నెలల ముందు టాలీవుడ్లో ఓ జంట గురించి తెగ మాట్లాడుకున్నారు. వీళ్లిద్దరూ కలిసి తమ జీవితంపైనే ఓ సినిమా చేయడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. అవును పైన చెప్పిందంతా కూడా నరేశ్-పవిత్రా లోకేశ్ గురించే. వినాయక చవితి సందర్భంగా ఓ టీవీ ఛానెల్లో ప్రసారమైన షోలో పాల్గొన్నారు. అయితే ఈ ప్రోగ్రాంలో నరేశ్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సీనియర్ నరేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. తొలుత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మోస్ట్ బిజీయెస్ట్గా మారిపోయాడు. కెరీర్ పరంగా పీక్స్లో ఉన్న ఇతడు.. వైవాహిక జీవితంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. (ఇదీ చదవండి: 'ఖుషి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా?) నరేశ్, అతడి భార్య రమ్య రఘుపతి మధ్య చాన్నాళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. అయితే కొన్నాళ్లుగా ఇతడు, నటి పవిత్రా లోకేశ్ తో కలిసి ఉంటున్నారని వార్తలొచ్చాయి. ఇది నిజమనేలా బయటకూడా జంటగా కనిపించడం, 'మళ్లీ పెళ్లి' అని తమ జీవితాన్నే సినిమాగా తీయడం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. అయితే వినాయక చవితి సందర్భంగా నరేశ్-పవిత్రా లోకేశ్ని ఓ ఈవెంట్కి గెస్టులుగా పిలిచారు. నరేశ్.. ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. స్టేజీపై సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ నరేశ్ ఎమోషనల్ అయ్యాడు. '50 ఏళ్లు అయిపోయింది. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్లో రకరకాల ఒడిదొడుకులు. గతంలో చేసిన వాటి గురించి నేను బాధపడుతున్నాను' అని అన్నాడు. అయితే అది తన పెళ్లిళ్ల గురించి, లేదా మరేదైనా విషయమా అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' లుక్ లీక్.. కోట్ల నష్టపరిహారం డిమాండ్!) -
దుబాయి నుంచి వచ్చి.. భార్య ప్రియుడిపై.. పక్కా ప్లాన్తో రాత్రికి రాత్రే..
కరీంనగర్: భార్యతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని తెలుసుకున్న భర్త దుబాయి నుంచి వచ్చి యువకుడిని హత్య చేశాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలో సంచలనం సృష్టించింది. గ్రామస్తులు, చందుర్తి సీఐ కిరణ్కుమార్ తెలిపిన వివరాలు. మల్యాలకు చెందిన పడిగెల నరేశ్(27) అదే గ్రామానికి చెందిన వివాహిత(32)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన వివాహిత బావ కుమారుడు లక్ష్మణ్ దుబాయ్లో ఉంటున్న ఆమె భర్త మల్లేశంకు తెలిపాడు. ఈనెల 3వ తేదీన గల్ఫ్ నుంచి వచ్చిన మల్లేశం ఇంటికిరాకుండా ఎక్కడో తలదాచుకున్నాడు. నరేశ్ను చంపేందుకు అదును కోసం ఎదురుచూస్తున్నాడు. బుధవారం రాత్రి నరేశ్ సదరు వివాహిత ఇంట్లోకి వెళ్లడం గమనించిన బావ కొడుకు లక్ష్మణ్ ఆమె భర్త మల్లేశంకు సమాచారం అందించాడు. మల్లేశం మాస్కులు ధరించి బైక్పై ఇంటికి చేరుకుని.. భార్యతో ఇంట్లో ఉన్న యువకుడిపై కత్తితో దాడి చేశాడు. మంచం పై నుంచి కింద పడ్డ నరేశ్పై పదే..పదే కత్తితో దాడి చేయగా తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే హత్యకు పాల్పడ్డ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య విషయం తెలుసుకున్న చందుర్తి సీఐ కిరణ్కుమార, పలువురు ఎస్సైలు బుధవారం అర్ధరాత్రి ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. మల్లేశం కోసం పరిసర ప్రాంతాల్లో గాలించారు. హత్య జరిగేందుకు మరో నలుగురు సహకరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి సీఐ కిరణ్కుమార్ వివరించారు. సాయంత్రం విందు.. అర్ధరాత్రి హత్య.. పడిగెల నరేశ్కు అదే గ్రామానికి చెందిన వివాహితతో ఐదేళ్ల క్రితమే వివాహేతర సంబంధం ఏర్పడింది. అదే సమయంలో వివాహిత కుటుంబ సభ్యులకు, యువకుడి మధ్య గొడవలు జరుగడంతో నరేశ్ దుబాయి వెళ్లాడు. అక్కడే ఐదేళ్లపాటు ఉన్నాడు. గత ఆగస్టు 29న ఇంటికొచ్చిన నరేశ్ తిరిగి సదరు వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఇది గమనించిన వివాహిత భర్త అన్నలతోపాటు వారి కుమారుడు ఈ విషయాన్ని గల్ఫ్లో ఉంటున్న మల్లేశంకు తెలిపారు. ఈనెల 3న దుబాయి నుంచి ఇండియా వచ్చిన మల్లేశం బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. ముందస్తు పథకం ప్రకారం వివాహిత కుటుంబ సభ్యులు బుధవారం యువకుడి ఇంట్లోనే విందు చేసుకున్నారు. తర్వాత యథావిధిగా ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. బంధువుల ఇంట్లో తలదాచుకున్న మల్లేశంను అదే సమయంలో స్వగ్రామానికి పిలిపించుకున్నారు. ఇది తెలియని యువకుడు రాత్రి అందరూ పడుకున్న సమయంలో వివాహిత వద్దకు వెళ్లాడు. గమనించిన లక్ష్మణ్ తన చిన్నాన్న మల్లేశంకు ఫోన్ చేయడంతో బైక్పై వచ్చి యువకుడిపై దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. అనుమానితులను విచారిస్తున్న పోలీసులు.. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న మల్లేశం పరారీకాగా.. అనుమానం ఉన్న ముగ్గురితోపాటు వివాహితను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. హత్యకు సహకరించిన వారి వివరాలను కాల్డాటా ఆధారంగా సేకరిస్తున్నట్లు సమాచారం. వారం క్రితమే హత్యకు పథకం రచించినట్లు తెలిసింది. పోలీసుల లుక్ఔట్ నోటీసు.. యువకుని హత్యలో ప్రధాన నిందితునిగా భావిస్తున్న మల్లేశ దుబాయి నుంచి ఈనెల 3న ఇండియాకు వచ్చాడు. హత్య చేసేందుకు ముందుగానే తిరిగి దుబాయి వెళ్లేందుకు సిద్ధమై.. రాత్రి 11 గంటల ప్రాంతంలో హత్యచేసి ఎయిర్పోర్టుకు అదే రాత్రి వెళ్లిపోయాడన్న ప్రచారంతో పోలీసులు లుక్ఔట్ నోటీస్ జారీ చేసినట్లు తెలిసింది. -
నరేశ్ ముద్దుపేరు ఏంటో చెప్పేసిన పవిత్ర
తెలుగు ఇండస్ట్రీలో మిగతా కపుల్స్ సంగతేమో గానీ నరేశ్-పవిత్రా లోకేశ్ మాత్రం వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నరేశ్ ఇప్పటికే పలుమార్లు పెళ్లి చేసుకుని విడిపోయాడు. పవిత్ర కూడా ఇలానే పెళ్లి చేసుకుని విడిగా ఉంటుంది. అలాంటిది వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. ఈ మధ్య తమ జీవితం ఆధారంగా 'మళ్లీ పెళ్లి' పేరుతో ఓ సినిమా కూడా తీసిపడేశారు. అలాంటి ఈ ఇద్దరూ చాన్నాళ్ల తర్వాత జంటగా స్టేజీపై కనిపించారు. కొత్త జంటలా సందడి చేశారు. (ఇదీ చదవండి: పెళ్లి గురించి హింట్ ఇచ్చిన అనుష్క.. కానీ!) వినాయక చవితి సందర్భంగా ఓ ఎంటర్టైన్మెంట్ షో టెలికాస్ట్ కాబోతుంది. ఇందులోనే నరేశ్-పవిత్రా లోకేశ్ జంటగా పాల్గొన్నారు. కొన్నాళ్ల ముందు నుంచి ఎక్కడైనా సరే ఇద్దరూ జంటగా కనిపిస్తున్నారు. కెమిస్ట్రీ పండిస్తున్నారు. ఈసారి కూడా దానికి ఏ మాత్రం తక్కువ కాదు అనేలా.. స్టేజీపై 'మాస్టారూ మాస్టారూ' పాటకు డ్యాన్స్ చేయడంతోపాటు ముద్దులు కూడా పెట్టారు. అలానే నరేశ్ని ముద్దుగా ఏమని పిలుస్తుందో పవిత్ర బయటపెట్టింది. 'మళ్లీ పెళ్లి' ప్రమోషన్ లో భాగంగా పవిత్రని అమ్ములు అని ముద్దుగా పిలుస్తానని నరేశ్ చెప్పాడు. పవిత్ర మాత్రం నరేశ్ని 'రాయ' అని ముద్దుగా పిలుస్తుందట. తాజాగా రిలీజ్ చేసిన షో ప్రోమోలో ఈ విషయాన్ని పవిత్రా లోకేశ్ బయటపెట్టింది. ఇక వీళ్లపై హైపర్ ఆది చిన్నగా పంచులు కూడా వేయడం ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా నరేశ్-పవిత్రా లోకేశ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యేలా ఉన్నారు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో గొడవలు మొదలుపెట్టిన శోభాశెట్టి!) -
తల్లి పద్మ, చెల్లి అనూషను గెంటేసి.. తాళం వేసి..
మహబూబాబాద్: తండ్రి మృతి చెందిన అనంతరం ఓ ప్రబుద్ధుడు.. తల్లిని బెదిరించి ఆమె పేరుతో ఉన్న భూమి, ప్లాటు తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అనంతరం భార్యతో కలిసి ఇంటికి తాళం వేసుకుని తల్లిని బయటకు గెంటివేశాడు. దీంతో ఆ తల్లి దిక్కుతోచని స్థితిలో పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయినా ఆ తనయుడి తీరులో మార్పులేదు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నేలపోగులకు చెందిన కేమిడి పద్మ, అంజయ్య దంపతులకు కొడుకు నరేశ్, కూతురు అనూష ఉన్నారు. తండ్రి అంజయ్య పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అయినా కష్టాలు, బాధలు దిగమింగుతూ తల్లియే వీరిద్దరి వివాహం చేసింది. అంజయ్య మృతి చెందడంతో భూమి, ప్లాటు పద్మ పేరుతో ఉన్నాయి. కూతురు అనూషకు అప్పట్లో కట్నం ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వమంటే కుమారుడు నరేశ్ నిరాకరిస్తూ తల్లిని బెదిరించి ఆమె బంగారం బ్యాంక్లో కుదువ పెట్టుకుని, భూమి, ప్లాటు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకుని బెదిరిస్తున్నాడు. కొద్ది రోజులుగా తల్లి, కూతురుకు ఆరోగ్యం బాగులేకపోవడంతో నేలపోగులలోనే ఉంటున్నారు. శనివారం రాత్రి నరేశ్ తన భార్య భవానితో కలిసి తల్లి పద్మ, చెల్లి అనూషను గెంటేసి తాళం వేసి అత్తగారింటికి వెళ్లిపోయాడు. దీంతో పద్మ.. ఎస్సై ప్రవీణ్ను ఆశ్రయించింది. ఎస్సై వెంటనే సిబ్బందిని పంపించి తాళం తీయించి ఇంట్లోకి పంపించారు. ఆదివారం ఉదయం మళ్లీ వచ్చిన నరేశ్ తన భార్యతో వచ్చి పోలీసులకు చెబుతారా అంటూ తల్లిని, చెల్లిని తిడుతూ చంపుతానని బెదిరించడంతో ఆదివారం కొడుకు, కోడలిపై పద్మ.. పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
నరేశ్ పెళ్లిళ్లపై హైపర్ ఆది కౌంటర్!
కొన్నాళ్ల ముందు ఇండస్ట్రీలో ఓ జంట గురించి తెగ మాట్లాడుకున్నారు. విచిత్రం ఏంటంటే వాళ్ల లైఫ్ ని సినిమాగా తీసి మరీ థియేటర్లలో రిలీజ్ చేశారు. అవును మీరు ఊహించింది కరెక్టే. వాళ్లే నరేశ్-పవిత్రా లోకేశ్. 'మళ్లీ పెళ్లి' అని సినిమా వీళ్లు చేయడం మాటేమో గానీ కొన్నాళ్లపాటు తెగ ట్రెండ్ అయ్యారు. సరేలే వీళ్ల గురించి అందరూ మర్చిపోయారు అనుకునే టైంలో మరోసారి చర్చనీయాంశమయ్యారు. నరేశ్ పెళ్లిళ్లపై హైపర్ ఆది కామెంట్స్ దీనికి కారణం? విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నరేశ్.. తొలుత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సూపర్ ఫామ్లో ఉన్నాడు. నటుడిగా ఇతడిని వంకపెట్టడానికి లేదు. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఇప్పటికే పలు పెళ్లిళ్లు చేసుకున్న నరేశ్.. మాజీ భార్య రమ్య రఘుపతితో దూరంగా ఉంటున్నాడు. అదే టైంలో నటి పవిత్రా లోకేశ్తో రిలేషన్లో ఉన్నాడు. (ఇదీ చదవండి: విజయ్ సేతుపతికి ఇంత పెద్ద కూతురు ఉందా?) నరేశ్-పవిత్రా లోకేశ్ కలిసి తమ బంధంపై 'మళ్లీ పెళ్లి' అనే మూవీ తీయడం.. దానిపై రమ్య రఘుపతి కోర్టుకెళ్లడం లాంటి విషయాలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. సరే దాని గురించి వదిలేస్తే.. వీళ్లిద్దరూ జంటగా ఓ తెలుగు ఛానెల్లో ప్రసారం కాబోతున్న వినాయక చవితి ఈవెంట్లో పాల్గొన్నారు. దీని ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో భాగంగానే హైపర్ ఆది.. నరేశ్పై ఫన్నీగా కౌంటర్ వేశాడు. 'నాకు ఒక పెళ్లే అవ్వట్లేదు. పెళ్లి, మళ్లీపెళ్లి ఎలా సార్?' అని హైపర్ ఆది.. స్టేజీపై అందరూ చూస్తుండగానే నరేశ్ని అడిగేశాడు. పక్కనే పవిత్రా లోకేశ్ ఉంది. ఈ క్రమంలోనే ఈ క్వశ్చన్కి నరేశ్ నవ్వి ఊరుకున్నాడు. ప్రోమో కాబట్టి పెద్దగా రివీల్ చేయలేదు. బహుశా ఫుల్ ఈవెంట్లో నరేశ్ చెప్పిన ఆన్సర్ చూపిస్తారేమో? ఏదేమైనా అలా పెళ్లిళ్ల గురించి డైరెక్ట్గా అడిగేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. (ఇదీ చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్' చిరంజీవి చేయాల్సింది.. కానీ!) -
విజయనిర్మల ఆస్తి ఎవరి సొంతం.. వీలునామాలో ఎవరి పేరు రాశారంటే: నవీన్
చిత్రసీమలో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించారు విజయనిర్మల. ఒక మహిళ దర్శకురాలిగా 44 సినిమాలు తీసి గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకున్నారు. అలా ఆమె ఎనలేని ఘనతలతో పాటు కొన్ని వేల కోట్లకు అధిపతి కూడా అయ్యారు. 2019 జూన్లో విజయనిర్మల కన్నుమూయగా భర్త సూపర్ స్టార్ కృష్ణ కూడా 2022లో మరణించారు. వారు సంపాదించిన ఆస్తి ఎవరి సొంతం అనే ప్రశ్నలు చాలామందిలో మెదిలాయి. తాజాగ ఇదే విషయంపై విజయనిర్మల మనుమడు అయిన నటుడు నవీన్ స్పందించాడు. నరేష్ మొదటి భార్య కుమారుడే ఈ నవీన్ అనే సంగతి తెలిసిందే. 'విజయనిర్మలకు సంబంధించిన ఆస్తులలో సగ భాగం నాకు రాయాలని నాన్నను (నరేష్) కోరింది. అందుకు సరిపడా వీలునామను కూడా రాపించాలని నానమ్మ కోరింది. ఆస్తిలో మిగిలన సగభాగం నాన్నకు అని చెప్పేవారు. అప్పుడు ఆస్తి గురించి నేను పెద్దగా పట్టించుకునే వాడిని కాను. కొద్దిరోజుల తర్వాత ఆస్తి విషయంలో నేను, నాన్న ఇద్దరం ఒక అవగాహనకు వచ్చాం. ప్రస్తుతం ఈ ఆస్తికి నాన్నే బాస్.. ఆయన యాక్టివ్గా ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత ఎటూ ఈ ఆస్తికి వారసుడివే నువ్వే కదా అని నాన్న అన్నారు. ప్రస్తుత సమయంలో అస్తి వివరాలపై అంతగా నాకు అవగాహన లేదు. నాన్న పర్యవేక్షణలో ఉండటమే మంచిదని నేను కూడా అనుకున్నాను. అస్తి విషయంలో మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు.. ఉండదు కూడా ఇందులో ఏ ఒక్కరూపాయి నేను సంపాధించలేదు. నానమ్మ ఆస్తికి మేము గార్డియన్స్ మాత్రమే. నాన్న తర్వాత నాకు ఆస్తిని అప్పజెప్పుతే అది ఎటూ పోకుండా కాపాడటం నా డ్యూటీ. నా తమ్ముళ్లు, తేజ, రణ్వీర్ ఇద్దరూ నాకు ఇష్టమే. కానీ తేజ అంటే నాకు ప్రాణం. వాడంటే నాకు ఎనలేని ఇష్టం.. నేనన్నా కూడా వాడికి అంతే. మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది.' అని నవీన్ తెలిపాడు. తేజ నరేశ్ రెండో భార్య కుమారుడు కాగా రణ్వీర్ మాత్రం మూడో భార్య రమ్య రఘుపతి కుమారుడు అని తెలిసిందే. టాలీవుడ్లో నందిని నర్సింగ్ హోమ్ సినిమాతో నవీన్ పాపులర్ అయ్యాడు. తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ తనకు వచ్చే సంపాదనతో అతను ఇన్నిరోజులు ఒక ప్లాట్ను అద్దెకు తీసుకుని ఉన్నాడు. కానీ కుటుంబసభ్యులందరితో మంచి రిలిషన్షిప్ కొనసాగించేవాడు. విజయనిర్మల మరణించిన తర్వాత ప్రస్తుతం ఆ ఇంట్లోకి నవీన్ షిఫ్ట్ అయ్యాడు. కానీ ఇది తాత్కాలికమేనని నవీన్ తెలిపాడు. తనకు చెందిన ప్లాట్లో ఉండటమే ఇష్టమంటూ త్వరలో అక్కడికే షిఫ్ట్ అవుతానని ఆయన పేర్కొన్నాడు. తన తండ్రి నరేశ్ అంటే ఎంతో గౌరవం అని నవీన్ తెలిపాడు. (ఇదీ చదవండి; డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్కుమార్కు నోటీసులు) -
దివ్యాంగుడికి ‘గృహలక్ష్మి’ చేయూత
భూదాన్ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గ్రామానికి చెందిన దివ్యాంగుడైన చుక్క నరేశ్, పావని దంపతులు గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోనే మొదటి ప్రొసీడింగ్ను అందుకున్నారు. ఆదివారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి.. నరేశ్ ఇంటికి వెళ్లి రూ.3 లక్షల ఆర్థిక సాయానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. శనివారం పోచంపల్లి పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్.. కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్ను ప్రారంభించిన సందర్భంగా అక్కడ మగ్గం పనిచేస్తున్న చుక్క పావని, నరేశ్ కుటుంబం దీనస్థితిని తెలుసుకొన్నారు. వారికి సొంత ఇల్లు లేదని తెలుసుకొని వెంటనే స్పందించిన మంత్రి.. గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల ప్రొసీడింగ్ను అందజేయాలని అక్కడే ఉన్న కలెక్టర్ను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఆదివారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలసి నరేశ్ ఇంటికి వెళ్లి ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తమ సొంతింటి కల నెరవేరనుండటంతో ఆ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్, ఎమ్మెల్యే, కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలలక్ష్మిశ్రీనివాస్, సర్పంచ్ కోట అంజిరెడ్డి, ఎంపీటీసీ బత్తుల మాధవి శ్రీశైలంగౌడ్ పాల్గొన్నారు. -
పరీక్షా ఫలితాలు విడుదల.. పవిత్రా లోకేష్ రిజల్ట్ ఏంటంటే
నరేశ్-పవిత్రా లోకేష్ల జంట మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ ట్రెండింగ్గా మారింది. వీరిద్దరు కలిసి గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి రిలేషన్షిప్ గురించి పక్కన పెడితే. తాజాగా పవిత్రా లోకేష్ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. రీసెంట్గా కన్నడ యూనివర్సిటీ పీహెచ్డీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. అందులో పవిత్రా లోకేష్ సహా 259 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. (ఇదీ చదవండి; క్లీంకార గురించి చిరంజీవి చెప్పిందే నిజం అయిందా.. కలిసొచ్చిన వేల కోట్లు) కన్నడ విశ్వవిద్యాలయంలో సైన్స్ ఇన్స్టిట్యూట్తో పాటు, భాషా ఇన్స్టిట్యూట్, సోషల్ సైన్స్ ఇన్స్టిట్యూట్, లలిత ఆర్ట్ ఇన్స్టిట్యూట్లు వివిధ విభాగాల కింద పరిశోధన అందించబడుతుంది. ఇందులోని మూడు సంస్థలలో పీహెచ్డీ చేసేందుకు 981 మంది ఎంట్రన్స్ పరీక్ష రాశారు. కానీ 259 మంది అభ్యర్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారని కన్నడ యూనివర్సిటీ ఛాన్సలర్ సుబ్బన్న రాయ్ తెలిపారు. (ఇదీ చదవండి: బాధలో ఉన్నాం.. దయచేసి ఇలాంటి పని చేయకండి: నటి) కన్నడ విశ్వవిద్యాలయంలోని అధ్యయన విభాగంలో అందుబాటులో ఉన్న సీట్లను మెరిట్ ఆధారంగా ఫిల్ చేస్తామని ఆయన తెలిపారు. పవిత్రకు తన మాతృభాష అయిన కన్నడలో పీహెచ్డీ చేయాలని కోరిక ఉండేదని గతంలో చెప్పేది. అందులో భాగంగా భాషా నికాయ ఆధ్వర్యంలో బెల్గాం ఎక్స్టెన్షన్ సెంటర్లో పరిశోధన చేసేందుకు పవిత్రా లోకేష్ పరీక్ష రాశారు. మే 30న ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఆ సమయంలో తన వెంట నరేష్ కూడా వెళ్లారు. తాజాగ విడుదలైన ఫలితాలతో ఆమె సంతోషంగా ఉన్నా అక్కడి యూనివర్సిటీలో సీట్ వచ్చే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. -
ఇకపై నరేశ్ ఇంట్లోకి రమ్య రఘుపతికి నో ఎంట్రీ.. కోర్టు తీర్పు
మళ్లీ పెళ్లి సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లిన నటుడు నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతికి షాక్ తగిలింది. మెరిట్ లేని కారణంగా బుధవారం నాడు కేసు కొట్టివేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. మళ్ళీ పెళ్లి(తెలుగు), మట్టే మదువే (కన్నడ) చిత్రాన్ని థియేటర్లు, ఓటీటీ ప్లాట్ఫామ్లలో విడుదల చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ రమ్య రఘుపతి బెంగుళూరులోని సిటీ సివిల్ కోర్టులో ఇంజక్షన్ దావా వేశింది. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం.. రమ్య రఘుపతి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మెరిట్లు లేని కారణంగా కొట్టివేసింది. సినిమాను అడ్డుకునే ప్రసక్తే లేదు సినిమాల విడుదలకు వ్యతిరేకంగా రమ్యరఘుపతి కేసు దాఖలు చేసిన కారణాలను న్యాయస్థానం సమర్థించలేనిదని, న్యాయపరంగా నిలకడగా లేదని కోర్టు పేర్కొంది. బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా.. సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా ఈ సినిమా కంటెంట్ పూర్తిగా కల్పితమని న్యాయస్థానం నిర్ధారించింది. సెన్సార్ బోర్డ్ సినిమా కల్పితమని సర్టిఫై చేసిన తర్వాత సినిమా విడుదలను ప్రైవేట్ వ్యక్తి అడ్డుకునే ప్రసక్తే లేదని తెలిపింది. ఈ తీర్పు ప్రకారం సినిమాను ఎక్కడైనా నిర్మాతలు స్వేచ్ఛగా ప్రసారం చేయవచ్చు. నరేశ్ ఇంట్లో ప్రవేశానికి రమ్యపై నిషేధం మరో కేసులో నరేష్ కుటుంబ సభ్యులు.. రమ్య రఘుపతిని నరేష్ నానక్రామ్గూడ ఇంట్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ వేసిన ఇంజక్షన్ దావాను కోర్టు స్వీకరించింది. నరేష్, అతని కుటుంబం అందించిన సాక్ష్యాల ప్రకారం రమ్య రఘుపతి అక్కడి ప్రాపర్టీని వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుందని గుర్తించింది. ఆమె కోసం వస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల వల్ల అక్కడ నివసించే సీనియర్ సిటిజన్స్, నరేష్ అసౌకర్యంతో పాటు అందోళనకు గురవుతున్నారని కూడా పేర్కొంది. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు రమ్య రఘుపతిని నరేష్ ఇంట్లోకి రాకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 6 సంవత్సరాలుగా విడివిడిగా జీవనం ఇకపోతే నరేష్, రమ్య రఘుపతి 6 సంవత్సరాలుగా కలిసి జీవించడం లేదని కోర్టు నిర్ధారించింది. సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం భార్యాభర్తలు 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉండకపోతే వివాహం రద్దవుతుంది. కోర్టు ఇచ్చిన తీర్పు.. నరేష్, రమ్యల విడాకులకు మార్గం సుగమం చేసింది. కాగా రమ్య రఘుపతి.. నరేష్పై గృహ హింస కేసు, నరేష్, పవిత్ర లోకేష్ పై ఇతర కేసు వేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత నరేష్, ఆయన కుటుంబ సభ్యులు .. రమ్య రఘుపతిపై గృహ నిషేధం కేసు పెట్టారు. రమ్య రఘుపతిపై సైబర్ మాల్వేర్, సైబర్ ఎటాక్కు సంబంధించి సైబర్ క్రైమ్ కేసు పెండింగ్లో ఉంది. చదవండి: రామ్చరణ్ కూతురికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన బన్నీ -
దూసుకొచ్చిన మృత్యువు.. రక్షించేందుకు సోదరుడి యత్నం.. ఆపై..
మెదక్: వరినాట్ల పనుల్లో నిమగ్నమైన అన్నదమ్ములపై దమ్ముయంత్రం (కెజివీల్స్ ట్రాక్టర్) మృత్యురూపంలో దూసుకొచ్చింది. దీంతో తమ్ముడు మృతి చెందగా.. అన్న తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా శివ్వంపేటలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎనగండ్ల నరేశ్, తమ్ముడు ఎనగండ్ల రమేశ్(35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం వరినాట్లు వేసేందుకు దుక్కి సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. రమేశ్ వొరం చదును చేస్తున్న సమయంలో మూర్చవ్యాధితో బురదమడిలో పడికొట్టుకుంటున్నాడు. అక్కడే దమ్ము యంత్రం నడుపుతున్న నరేశ్ గమనించి తమ్ముడిని రక్షించేందుకు ట్రాక్టర్ను ఆఫ్ చేయకుండానే కిందికి దూకి పరుగెత్తుకుంటూ వచ్చాడు. దీంతో ట్రాక్టర్ ఒక్కసారిగా రమేశ్ తలపై, నరేశ్ కాళ్లపై నుంచి వెళ్లడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న కూలీలు ఇద్దరిని తూప్రాన్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా రమేశ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నరేశ్ను మెరుగైన చికిత్స నిమిత్తం కొంపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
కుటుంబ కలహాలతో ఆత్మహత్య !
ఖమ్మం: కుటుంబ కలహాల నేపథ్యాన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధిరకు చెందిన సంపసాల నరేష్(34) కొంతకాలం ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేశాక సొంతంగా మెడికల్ షాపు ఏర్పాటుచేసినా నష్టాలు రావటంతో మూసివేశాడు. ఈక్రమంలో దమ్మపేట మండలం రామచంద్రాపురానికి చెందిన మాధవిని కులాంతర వివాహం చేసుకోగా వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఏడాదికాలంగా నరేష్ భార్యాపిల్లలతో అత్తగారింట్లో ఉంటూనే ఉద్యోగం కోసం ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో ఈనెల 21న రామచంద్రాపురం నుంచి మధిరకు వచ్చిన నరేష్ శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, నరేష్ ఆత్మహత్యకు ముందు ‘ఎదుటివారికి కష్టం వస్తే కులం లేదు, మతం లేదు. సృష్టి వినాశనం వచ్చినపుడు ఎవరు వచ్చారో నువ్వు ఆలోచించు. నీ ప్రాణం మీదకు వస్తేనే నీకు తెలుస్తుంది. మళ్లీ చెబుతున్నా నీ ప్రాణం మీదకు వస్తేనే నీకు తెలుస్తుంది. సర్వేజనా సుఖినోభవంతు.’ అంటూ వాట్సాప్ స్టేటస్లో పెట్టినట్లు కుటుంబీకులు తెలిపారు. -
తుపాకీ లైసెన్స్ కావాలంటున్న నటుడు నరేశ్
సాక్షి, శ్రీ సత్యసాయి: సీనియర్ నటుడు నరేశ్ తుపాకీ లైసెన్స్ కావాలంటున్నాడు. ఈ మేరకు గురువారం నాడు పుట్టపర్తి ఎస్పీ మాధవరెడ్డిని కలిసి తనకు తుపాకీ లైసెన్స్ ఇవ్వాలని కోరాడు. స్వీయరక్షణ కోసమే అతడు తుపాకీ లైసెన్స్ కోసం అభ్యర్థించినట్లు తెలుస్తోంది. కాగా నరేశ్ హీరోగా నటించిన మళ్లీ పెళ్లి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది. పవిత్రా లోకేశ్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఎంఎస్ రాజు డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా జూన్ 24న ఆహా, అమెజాన్ ప్రైమ్లో రిలీజైంది. కాగా ఈ సినిమాపై నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే! తనను టార్గెట్ చేస్తూ పరువు తీసేందుకే మేకర్స్ సినిమాను నిర్మించారని మండిపడింది. సృజనాత్మక భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో వాస్తవాన్ని పక్కదారి పట్టిస్తున్నారంటూ ఆ మధ్య కోర్టుకు వెళ్లింది. ఈ సినిమా వల్ల తన గౌరవం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: 2016 నుంచి పిల్లల కోసం ట్రై చేస్తూనే ఉన్నాం: నటి -
రూ.1200 బిల్ లొల్లి.. కరెంట్ కట్ చేశాడని.. లైన్మన్పై పెట్రోల్ పోసి..
గజ్వేల్ రూరల్: బిల్లు చెల్లించలేదని ఇంటి విద్యుత్ కనెక్షన్ తొలగించిన జూనియర్ లైన్మన్పై వినియో గదారుడు పెట్రోల్ పోశాడు. గజ్వేల్ మున్సి పాలిటీ పరిధిలోని క్యాసారంలో శనివారం జరిగిన ఈ సంఘటనపై విద్యుత్ శాఖాధికారులు, వినియోగదా రుని కుటుంబ సభ్యులు, గజ్వేల్ పోలీసు లు తెలిపిన వివరాలివి. క్యాసారంలోని 2వ వార్డుకు చెందిన సుంకరి కరుణాకర్ ఇంటికి 2 నెలలకు రూ.1,200 బిల్లు వచ్చింది. ఇటీవల జూనియర్ లైన్మన్ నరేష్ తన విధుల్లో భాగంగా కరుణాకర్ను బిల్లు చెల్లించాల ని కోరాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇదే విషయాన్ని జేఎల్ఎం నరేశ్ విద్యుత్శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి.. శనివారం విద్యు త్ స్తంభం ఎక్కి కరుణాకర్ ఇంటికి కనెక్షన్ తొలగించాడు. దీంతో అసహనానికి గురైన కరుణాకర్ తన ద్విచక్ర వాహనంలోని పెట్రోల్ తీసి నరేశ్పై పోసి అగ్గిపెట్టె తీయడంతో అతని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో నరేశ్ ఈ విషయాన్ని విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, తనపై హ త్యాయత్నం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరప్రసాద్ తెలిపారు. కాగా తమకు జీతం రాలేదని, రెండుమూడు రోజుల్లో చెల్లిస్తామని చెప్పినప్పటికీ నరేష్ వినకుండా విద్యుత్ సరఫరాను తొలగించినట్లు కరుణాకర్ భార్య కావ్య పేర్కొన్నారు. -
‘సామజవరగమన’ మూవీ రివ్యూ
టైటిల్: సామజవరగమన నటీనటులు: శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్, వీకే నరేశ్, శ్రీకాంత్, వెన్నెల కిశోర్, సుదర్శన్ తదితరులు నిర్మాణ సంస్థ:హాస్య మూవీస్ నిర్మాత: రాజేశ్ దండా సమర్పణ: అనిల్ సుంకర్ దర్శకత్వం: రామ్ అబ్బరాజు సంగీతం: గోపీ సుందర్ సినిమాటోగ్రఫీ:రామ్ రెడ్డి ఎడిటర్: ఛోటా కె. ప్రసాద్ విడుదల తేది: జూన్ 29, 2023 వైవిద్యమైన సినిమాలు చేస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఒకప్పుడు వరుస హిట్లతో దూసుకెళ్లిన ఈ యంగ్ హీరోకి ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త వెనకబడ్డాడు. ఆయన నటించిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ‘సామజవరగమన’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్,ట్రైలర్ సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడేలా చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సామజవరగమనపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? శ్రీవిష్ణుకి అచ్చొచ్చిన కామెడీ జానర్తో హిట్ ట్రాక్ ఎక్కడా ? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. బాలసుబ్రహ్మణ్యం అలియాస్ బాలు(శ్రీవిష్ణు) థియేటర్ బాక్సాఫీస్లో ఉద్యోగం చేస్తుంటాడు. అతని తండ్రి ఉమామహేశ్వరరావు(నరేశ్)కు వేలకోట్ల ఆస్తి ఉంటుంది కానీ.. కొడుకు డిగ్రీ పాసైతేనే అది అతనికి చెందుతుందని బాలు తాత వీలూనామా రాసి చనిపోతాడు. దీంతో తన తండ్రిని ఎలాగైనా డిగ్రీ పాస్ చేయించాలని నానా ఇబ్బందులు పడుతూ చదివిస్తుంటాడు బాలు. ఉమామహేశ్వరరావు మాత్రం 30 ఏళ్లుగా డిగ్రీ పరీక్షలు రాస్తూనే ఉంటాడు. బాలు ఒక్కడే ఉద్యోగం చేసి ఫ్యామిలీని పోషిస్తుంటాడు. ఓ సారి ఎగ్జామ్ హాల్లో ఉమామహేశ్వరరావుకు డిగ్రీ పరీక్షలు రాసేందుకు వచ్చిన స్టూడెంట్ సరయు(రెబా మౌనికా జాన్) పరిచయం అవుతుంది. ఆమెకు హాస్టల్లో ఉండడం ఇబ్బంది కావడంతో బాలు ఇంట్లోకి పెయింగ్ గెస్ట్గా వస్తుంది. బాలు ప్రవర్తను చూసి అతనితో ప్రేమలో పడుతుంది. బాలుకి మాత్రం ప్రేమ అంటే అస్సలు నచ్చదు. అంతేకాదు ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తున్నాను అని చెబితే వెంటనే ఆమెతో రాఖీ కట్టించుకుంటాడు. అలాంటి బాలు సరయుతో ఎలా ప్రేమలో పడ్డాడు? ఐలవ్ యూ చెప్పిన అమ్మాయిలతో బాలు ఎందుకు రాఖీ కట్టించుకుంటాడు? సరయు తండ్రి(శ్రీకాంత్ అయ్యంగార్)కి ప్రేమ పెళ్లిళ్లు అంటే ఎందుకు నచ్చదు? సరయు అక్కకి, బాలు బావకి పెళ్లి సెట్ అయిన తర్వాత వీరి ప్రేమకు ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి? బాలు తండ్రి డిగ్రీ పాస్ అయ్యాడా? లేదా? చివరకు సరయు, బాలు ఎలా ఒక్కటయ్యారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కొన్ని సినిమాల కథలు చెప్పడానికి చాలా సింపుల్గా ఉంటాయి. కానీ తెరపై చూస్తే మాత్రం వినోదాన్ని పంచుతాయి. ఆ కేటగిరీలోకి ‘సామజవరగమన’ వస్తుంది. కథలో కొత్తదనం లేకున్నా చక్కటి స్క్రీన్ప్లేతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు రామ్. కరెంట్ పంచ్ డైలాగులతో హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో కథను రాసుకున్నాడు. అలా అని పూర్తిగా కామెడీనే నమ్ముకోలేదు. కావాల్సిన చోట ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునేందుకు ఎమెషనల్ సన్నివేశాలను కూడా యాడ్ చేశాడు. సినిమాలోని ప్రతి పాత్రకు కామెడీ టచ్ ఉంటుంది. తండ్రిని డిగ్రీ పరీక్ష పాస్ చేయించడం కోసం కొడుకు పడే ఇబ్బందులతో సినిమా ప్రారంభం అవుతుంది. ప్రతి సీన్ హిలేరియస్గా ఉంటుంది. ట్యూషన్ సెంటర్లో నరేశ్, హీరోయిన్ చేసే కామెడీ, రఘుబాబు వేసే ప్రశ్నలు నవ్వులు పూయిస్తాయి. ప్రేమ పేరుతో అమ్మాయిలు చేసే మోసాల గురించి హీరో చెప్పే నాన్స్టాప్ డైలాగ్ అయితే ఫస్టాఫ్కే హైలెట్. ఈ డైలాగ్కి యూత్ అంతా కనెక్ట్ అవుతారు. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా సెకండాఫ్పై ఆసక్తికి పెంచుతుంది.ఇక సెకండాఫ్ కూడా కథను పూర్తి వినోదాత్మకంగా మలిచాడు దర్శకుడు. అయితే ఈ క్రమంలో కొన్నిచోట్ల కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ‘కుల’ శేఖర్గా వెన్నెల కిశోర్ కామెడీ బాగా వర్కౌట్ అయింది.అయితే ఈ తరహా పాత్రతో యూట్యూబ్లో చాలా వీడియోలు వచ్చాయి. నాని ‘జర్సీ’లోని ఓ ఎమోషనల్ సీన్ని పేరడీ చేసి బాగా నవ్వించారు. బూతు సీన్లు, డబుల్ మీనింగ్ డైగాల్స్ లేకుండా క్లీన్ కామెడీతో ఇంటిల్లి పాది కలిసి చూసి నవ్వుకునే సినిమా ఇది. ఎవరెలా చేశారంటే.. ఎప్పటి మాదిరే శ్రీవిష్ణు మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు.తన కామెడీ టైమింగ్ సినిమాకు చాలా ప్లస్ అయింది. బాలు పాత్రలో ఒదిగిపోయాడు. కామెడీతో పాటు కావాల్సిన చోట ఎమోషన్ని కూడా చక్కగా పండించాడు. ఇక ఈ సినిమాలో శ్రీవిష్ణు తర్వాత బాగా పండిన పాత్ర నరేశ్ది. తండ్రి పాత్రలు నరేశ్కి కొత్తేమి కాదు కానీ.. ఈ సినిమాలో ఆయన నటించిన తండ్రి పాత్ర మాత్రం చాలా కొత్తది. ఆ పాత్రకు నరేశ్ మాత్రమే న్యాయం చేయగలడు అనేలా అతని నటన ఉంది. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమాకి నరేశ్ మరో హీరో అనొచ్చు. తనదైన కామెడీతో అందరికి ఆకట్టుకున్నాడు. సరయు పాత్రకి రెబా మౌనికా న్యాయం చేసింది. కుల శేకర్గా వెన్నెల కిశోర్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. ఉన్నంతలో కామెడీ పండించాడు. హీరో ఫ్రెండ్గా సుదర్శన్, హీరోయిన్ తండ్రిగా శ్రీకాంత్ అయ్యంగార్తో పాటు రాజీవ్ కనకాల, రఘుబాబు తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. గోపీసుందర్ సంగీతం పర్వాలేదు. పాటలు అంతగా ఆకట్టుకోలేవు కానీ నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. డైలాగ్స్ ఈ సినిమాకు చాలా ప్లస్. ఎడిటర్ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
ఓటీటీలో దూసుకెళ్తున్న 'మళ్లీ పెళ్లి'.. ఆ లిస్ట్లో ట్రెండింగ్!
సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరించారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రం మే 26న రిలీజైన ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. (ఇది చదవండి: 'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఎమోషనల్.. ఎందుకో తెలుసా?) అయితే ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో స్పందన వస్తోంది. ఈనెల 23 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ టాప్ టెన్లో ట్రెండింగ్లో నిలిచింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్లోనే టాప్-2లో నిలిచింది. మొదటిస్థానంలో ఇంటింటి రామాయణం కొనసాగుతుండగా.. రెండోస్థానంలో నరేశ్, పవిత్రల 'మళ్లీ పెళ్లి' ట్రెండ్ అవుతోంది. ఇటీవల కొన్ని సినిమాలు థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. థియేటర్లలో ఆదరణ దక్కని చిత్రాలకు ఓటీటీలో ఊహించని రీతిలో దూసుకెళ్తున్నాయి. (ఇది చదవండి: మరో సినిమా తీసేందుకు రెడీ అయిన 'ది కేరళ స్టోరీ' డైరెక్టర్!) Thank you everyone 🙏#MALLIPELLI ranked #10 among @Binged_ OTT Top 10 Most watched movies this weekend🤩 ▶️ https://t.co/bfLWwB1Hdk#MalliPelliOnAha#PavitraLokesh @MSRajuOfficial @vanithavijayku1 @VKMovies_ @ahavideoIN pic.twitter.com/0AmYZLX8Jv — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) June 25, 2023 -
'ప్రతి అమ్మాయితో రాఖీ కట్టించుకుంటే పాపం'.. ఆసక్తిగా ట్రైలర్
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. (ఇది చదవండి: ప్రముఖ కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురు పెళ్లి) తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. అనంతరం చిత్ర బృందానికి మెగాస్టార్ బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా విష్ణు షర్ట్పై చిరంజీవి ఆటోగ్రాఫ్ ఇచ్చిన ఫోటోలను ట్విటర్ షేర్ చేశారు హీరో. కాగా.. ట్రైలర్ చూస్తే పుల్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సీనియర్ నటుడు నరేశ్ ఈ చిత్రంలో శ్రీవిష్ణుకు తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతమందించారు. (ఇది చదవండి: సరికొత్తగా ‘సామజవరగమన’ ) Beyond blessed to have you launch our Trailer sir MEGASTAR @KChiruTweets 🤗 Forever indebted to you for taking out your time for us 🙏🏻 - https://t.co/6WsNyC9XzT #Samajavaragamana In cinemas from June 29 ✨ pic.twitter.com/VzIO1AwoXE — Sree Vishnu (@sreevishnuoffl) June 25, 2023 -
నరేశ్పై 'మళ్లీపెళ్లి' ఎఫెక్ట్
నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన 'మళ్లీపెళ్లి' ఇప్పటికే విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమాతో నరేశ్, పవిత్ర పలు వివాదాలతో మరింత పాపులర్ అయ్యారు. సినిమా విడుదలను ఆపేయాలంటూ గతంలో నరేశ్ భార్య రమ్య రఘుపతి కోర్టుకు వెళ్లింది. కానీ ఇదీ సినిమా మాత్రమే అని మేకర్స్ తెలపడంతో మూవీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (ఇదీ చదవండి: బాలీవుడ్ను భయపెడుతున్న ప్రభాస్.. కారణాలు ఇవే) తాజాగా ఈ సినిమా ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా (నేడు జూన్ 24) విడుదలైంది. దీంతో సినిమా స్ట్రీమింగ్ను ఆపేయాలంటూ ఆహాతో పాటు అమెజాన్కు రమ్య నోటీసులు జారీ చేశారు. సృజనాత్మక భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో వాస్తవాన్ని పక్కదారి పట్టిస్తున్నారని నోటీసులో తెలిపారు. రమ్య రఘుపతిని టార్గెట్ చేస్తూ పరువు తీయడానికే మేకర్స్ సినిమాను నిర్మించారని పేర్కొన్నారు. ఇలాంటి పనుల కోసం చలనచిత్రం వంటి కళారూపాన్ని ఉపయోగించుకోవడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. ఈ సినిమా వల్ల తన గౌరవం దెబ్బతింటుందని తెలిపారు. (ఇదీ చదవండి: యూత్ను టార్గెట్ చేస్తూ.. బోల్డ్ కామెంట్స్ చేసిన నటి) ఇప్పుడున్న పరిస్థితుల్లో OTT ఫ్లాట్ఫామ్ను వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అధిక సంఖ్యలో కంటెంట్ను రీచ్ చేస్తున్నాయి. కాబట్టి చిత్రంలో రమ్యరఘుపతి పాత్ర వల్ల తను మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని రమ్య తరుపున న్యాయవాది తెలిపారు. ఈ నోటీసుల వల్ల ఆమెజాన్ ప్రైమ్లో 'మళ్లీపెళ్లి' సినిమా స్ట్రీమింగ్ను నిలిపేశారు.. కానీ 'ఆహా' వారు మాత్రం ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి అందుబాటులో ఉంచారు. తర్వాత ఆహా కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
ఓటీటీకి మళ్లీ పెళ్లి.. స్ట్రీమింగ్ ఆరోజు నుంచే!
సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరించారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రం మే 26న రిలీజైన ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. (ఇది చదవండి: మళ్లీ పెళ్లి ఆపాలంటూ కోర్టును ఆశ్రయించిన నరేశ్ మూడో భార్య) అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈనెల 23 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ చిత్రాన్ని నరేశ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే తెరకెక్కించారు. (ఇది చదవండి: నరేశ్, పవిత్ర గొప్ప నటులు.. ‘మళ్లీ పెళ్లి’ ఎవరి కథో తెలిసేది అప్పుడే!) #MalliPelli streaming on @ahavideoIN from June 23rd. pic.twitter.com/UrBrXK475m — Vamsi Kaka (@vamsikaka) June 19, 2023 -
ప్రేక్షకుల స్పందనతో ఆనందం కలిగింది
‘‘మానవ సంబంధాల నేపథ్యంలో నడిచే చిత్రం ‘ఇంటింటి రామాయణం’. కుటుంబంతో, స్నేహితులతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. మా చిత్రానికి ప్రేక్షకుల స్పందన చూసి చాలా ఆనందం కలిగింది’’ అని డైరెక్టర్ సురేష్ నరెడ్ల అన్నారు. రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, వీకే నరేశ్, సురభి ప్రభావతి, గంగవ్వ ప్రధాన పాత్రలు ΄ోషించిన చిత్రం ‘ఇంటింటి రామాయణం’. సూర్యదేవర నాగవంశీ, మారుతి టీమ్ సమర్పణలో వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ యిన్నమూరి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో సురేష్ నరెడ్ల మాట్లాడుతూ– ‘‘మా సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. అమెరికాలోనూ మంచి స్పందన వస్తోంది. నాకు స΄ోర్ట్ చేసిన నాగవంశీ, మారుతిగార్లకు, ఆహా వారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఇంటింటి రామాయణం’కి మేం ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది.. ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని నటి నవ్య స్వామి అన్నారు. -
ప్రకాష్ రాజ్ నా గురించి మైక్ లో చెప్పిన మాట
-
పవిత్రతో పరీక్షలు రాయించిన నరేశ్.. నెటిజన్స్ ప్రశంసలు
నరేశ్-పవిత్రా లోకేష్ల జంట ఇప్పుడు టాలీవుడ్ ట్రెండింగ్గా మారింది. వీరిద్దరు కలిసి గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. వీళ్ల రిలేషన్షిప్ గురించి ఎప్పుడో అందరికి తెలుసు. కానీ ఈ మధ్య ‘మళ్ళీ పెళ్లి’సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం.. ఆ స్టోరీ వీళ్ల పర్సనల్ లైఫ్కు సంబంధించింది కావడంతో ఈ జంట మళ్లీ వార్తల్లో నిలిచింది. మొన్నటి వరకు వరుస ఇంటర్వ్యూలతో యూట్యూబ్ని షేక్ చేసిన ఈ జంట .. ఇప్పుడు మీడియాకు కాస్త దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ జంట గురించి చర్చ ఆగడం లేదు. ఏదో రకంగా వీరి పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా పవిత్ర విషయంలో నరేశ్ చేసిన ఓ పనిపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ నరేశ్ చేసిన ఆ గొప్ప పని ఏంటంటే.. పవిత్రతో పరీక్షలు రాయించాడు. (చదవండి: పెళ్లి ఎప్పుడు.. మాధవీలత స్ట్రాంగ్ కౌంటర్! ) పవిత్రకు తన మాతృభాష అయిన కన్నడలో పీహెచ్డీ చేయాలని కోరిక. అందుకోసం ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాయడానికి బళ్ళారి వెళ్లారు. ఆమెతో పాటు నరేశ్ కూడా బళ్ళారి వెళ్లి.. పరీక్ష రాసేంత వరకు అక్కడే ఉన్నాడట. దగ్గరుండి మరీ పరీక్ష రాయించడంతో నెటిజన్స్ నరేశ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గొప్ప పని చేశావంటూ మెచ్చుకుంటున్నారు. -
నా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అల్లు అర్జున్ అంటే నాకు ...
-
శారీరకంగా పర్ఫెక్ట్.. పిల్లలను కనడంపై నరేశ్, పవిత్ర బోల్డ్ కామెంట్స్!
సీనియర్ నటుడు నరేశ్, పవిత్ర లోకేష్ గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. తాము ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో సమాజానికి చెప్పడానికే ‘మళ్ళీ పెళ్లి’ అనే సినిమాను తెరకెక్కించారు. ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలైంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. నరేశ్, పవిత్రల రిలేషన్షిప్ మాత్రం అందరికి తెలిసిపోయింది. ఈ సినిమా ప్రమోషన్స్లో ఈ జంట చేసిన బోల్డ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. (చదవండి: స్నేహా కాదు.. ఫస్ట్ గర్ల్ఫ్రెండ్ పేరు రివీల్ చేసిన అల్లు అర్జున్ ) మాములుగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితం గురించి చిన్న బయటకు చెప్పాలన్నా భయపడతారు. కానీ నరేశ్, పవిత్రలు మాత్రం ప్రతీది చాలా ఓపెన్గా చెప్పేశారు. పెళ్లి విషయమే కాదు... పిల్లలు కనడంపై తమ అభిప్రాయం ఏంటో కూడా చెప్పేశారు. ఇప్పటికీ పవిత్రతో కలిసి పిల్లలు కనడంతో తప్పేమి లేదని నరేశ్ అంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నరేశ్ మాట్లాడుతూ.. తాను, పవిత్ర శారీరకంగా పర్ఫెక్ట్గా ఉన్నామని చెప్పారు. ‘ఇప్పటికీ మేము మెడికల్గా పిల్లలను కనొచ్చు. అయితే ఇప్పుడు మేము పిల్లలను కంటే.. నాకు 80 ఏళ్లు వచ్చేసరికి పుట్టే బిడ్డకి 20 ఏళ్లు వస్తాయి. అలా అవసరమా? భార్యభర్తలుగా మేము కలిసి ఉంటాం. పవిత్ర పిల్లలు, నా పిల్లలు.. ఇద్దరూ మా బిడ్డలే అనుకుంటాం. మాకు ఇప్పుడు 5 మంది పిల్లలు ఉన్నారనుకొని బతుకుతున్నాం. నా దృష్టిలో బ్లడ్ రిలేషన్షిప్ కంటే ఎమోషనల్ రిలేషన్ షిప్ చాలా గొప్పది. కృష్ణ గారిని చూస్తే అమ్మ కనిపించేంది. ఆయన పోయిన తర్వాత కుప్పకూలిపోయాను. మానసికంగా చాలా కృంగిపోయాను. పవిత్రలో మా అమ్మ విజయనిర్మల గారు కనిపించారు. ఆమె కళ్లు, పవిత్ర కళ్లు ఒకేలా ఉంటాయి. మా ఇద్దరి పిల్లలను చూసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడుపుతాం’అని నరేశ్ చెప్పుకొచ్చాడు. -
మళ్ళీ పెళ్లి కృష్ణగారికి అంకితం
‘‘రియల్ బోల్డ్ కపుల్ అంటే కృష్ణగారు, విజయ నిర్మలగారు. వాళ్ల రథం మళ్లీ ముందుకు వెళ్లాలని విజయ్ కృష్ణ మూవీస్ని మళ్లీ ప్రారంభించడం గర్వంగా ఉంది. సూపర్స్టార్ కృష్ణగారి 81వ జయంతి (మే 31) సందర్భంగా ‘మళ్ళీ పెళ్లి’ చిత్రాన్ని ఆయనకి అంకితం చేస్తున్నాను’’ అని వీకే నరేష్ అన్నారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో వీకే నరేష్, పవిత్రా లోకేష్ జంటగా నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. నరేష్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం (26) విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్మీట్లో వీకే నరేష్ మాట్లాడుతూ–‘‘ నేను బతికున్నంత కాలం నటిస్తాను. అలాగే సమాజ సేవ చేస్తా’’ అన్నారు. చిత్రపరిశ్రమలో వీకే నరేష్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సెలబ్రిటీ వరల్డ్ రికార్డ్’ నిర్వాహకులు ఆయన్ను సత్కరించారు. సంగీత దర ్శకుడు సురేష్ బొబ్బిలి, నటి అన్నపూర్ణమ్మ పాల్గొన్నారు. -
నరేశ్- పవిత్రా లోకేశ్ 'మళ్లీ పెళ్లి' సక్సెస్ మీట్ ఫోటోలు
-
ఆ ఓటీటీలోకే రానున్న 'మళ్లీ పెళ్లి'
సీనియర్ నటుడు నరేశ్ హీరోగా నటించి నిర్మించిన చిత్రం మళ్లీ పెళ్లి. నరేశ్ ప్రేయసి, నటి పవిత్రా లోకేశ్ హీరోయిన్గా నటించింది. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించాడు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాపై వీరలెవల్లో ప్రమోషన్స్ చేసినప్పటికీ మొదటి రోజు కలెక్షన్స్ అంతంతమాత్రంగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చాలామంది ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది? ఏ ఓటీటీలోకి రాబోతోందని ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం మళ్లీ పెళ్లి సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాకు వచ్చే ఆదరణ బట్టి ఎప్పుడు ఓటీటీలోకి తీసుకురావాలన్నది మేకర్స్ డిసైడ్ చేయనున్నారు. ఎంతకాదన్నా నెల రోజుల్లో మళ్లీ పెళ్లి ఓటీటీలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మధ్య పెద్ద సినిమాలు కూడా వెంటనే డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా వీలైనంత తొందరగానే ఓటీటీలో ప్రత్యక్షమయ్యే ఛాన్స్ ఉంది. మళ్లీ పెళ్లి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పవిత్ర లోకేశ్ ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
పవిత్ర లోకేశ్ ఇప్పటికే చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసింది. కానీ నరేశ్తో ప్రేమ వ్యవహారం తర్వాతే ఈమెకు ఇక్కడ బాగా గుర్తింపు వచ్చింది. గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. ఈ విషయాన్ని నరేశ్ బహిరంగంగా ప్రకటించాడు. ఇక వీరిద్దరు కలిసి నటించిన ‘మళ్ళీ పెళ్లి’ నిన్న(మే 26)విడుదలైన సంగతి తెలిసిందే. వీరిద్దరి నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఎమ్మెస్ రాజు. నరేశ్ ఈ చిత్రంలో నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడు.ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో నటించనందుకుగాను పవిత్ర భారీ రెమ్యునరేషన్ పుచ్చుకుందట. (చదవండి: మళ్ళీ పెళ్లి మూవీ రివ్యూ) వాస్తవానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన పవిత్ర లోకశ్ రోజుకు రూ.50 వేలు పారితోషికంగా తీసుకునేదట. అయితే నరేశ్ ప్రేమ వ్యవహారంతో పవిత్ర మరింత ఫేమస్ అయింది. దీంతో ఆమె తన రెమ్యునరేషన్ని కూడా పెంచేసిందట. ప్రస్తుతం రోజుకు లక్ష వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అంత మొత్తం ఇచ్చేందుకు కూడా నిర్మాతలు వెనకడుగు వేయడం లేదట. ప్రస్తుతం పవిత్రకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. తనపై వస్తున్న ట్రోల్స్ని పట్టించుకోకుండా వరుస సినిమాలతో బిజీ అవుతోంది. -
Malli Pelli Review: ‘మళ్ళీ పెళ్లి’ మూవీ రివ్యూ
టైటిల్: మళ్ళీ పెళ్లి నటీనటులు: వీకే నరేశ్, పవిత్రా లోకేష్, శరత్ బాబు, జయసుధ, అన్నపూర్ణమ్మ తదితరులు నిర్మాణ సంస్థ: విజయకృష్ణ మూవీస్ నిర్మాత: వీకే నరేశ్ దర్శకత్వం: ఎమ్మెస్ రాజు సంగీతం: సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి ఎడిటర్: జునైద్ సిద్ధిక్యూ విడుదల తేది: మే 26, 2023 ప్రశ్న: ‘నరేశ్ గారు.. ‘మళ్ళీ పెళ్లి’ రమ్యా రఘుపతిపై రివేంజ్ తీర్చుకోవడానికి తీశారా? జవాబు: ఆమె పై పగ తీర్చుకోవడానికి 15 కోట్లు పెట్టి సినిమా తియ్యాలా? ఇది ఎవరిని ఉద్దేశించి తీసిన సినిమా కాదు. ఒక వయస్సు వచ్చిన తర్వాత తోడు కావాలని అనిపిస్తుంది. అలా రెండు మనసులు ఎలా కలుసుకున్నాయి? అనేదే మేము ఈ చిత్రం చెప్పాం. ప్రశ్న: ఎమ్మెస్ రాజు గారు.. ట్రైలర్ చూస్తే ఇది నరేశ్గారి జీవితంలో జరిగిన సంఘటనలే గుర్తు చేస్తున్నాయి. ఇది నరేశ్గారి బయోపిక్ అనుకోవచ్చా? జవాబు: అలా ఎలా అనుకుంటారు? ఇది ట్రెండింగ్ టాపిక్. ట్రైలర్లో చూపించిన సీన్స్ నరేశ్ నిజ జీవితంలో జరిగినే అని ఎందుకు అనుకుంటారు? యూట్యూబ్లో వందల వీడియోలు ఉంటాయి. అలాంటివే ఇవి. ఇది సినిమా ప్రమోషన్స్లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చిత్రబృందం ఇచ్చిన సమాధానం. టైటిల్.. ట్రైలర్.. అందులో చెప్పించిన సంభాషణలు అన్ని నరేశ్ జీవితానికి సంబధించినవే అయినప్పటికీ.. ఎక్కడా ఇది నా కథ అనిఆయన చెప్పలేదు. మరి ఇది ఎవరి కథ? నరేశ్-పవిత్రల బయోపికా? లేదా కల్పిత కథనా? ‘మళ్ళీ పెళ్లి’ కథేంటంటే.. టాలీవుడ్కి చెందిన సీనియర్ హీరో నరేంద్ర(వీకే నరేశ్)కు, ఆయన మూడో భార్య సౌమ్యా సేనపతి(వనితా విజయ్ కుమార్) మధ్య విభేదాలు తలెత్తుతాయి. వ్యాపారం అంటూ ఆమె.. సినిమా అంటూ నరేంద్ర ఇద్దరూ బిజీ బిజీగా గడుపుతారు. అదే సమయంలో నరేంద్రకు కన్నడ నటి పార్వతి(పవిత్రా లోకేష్) పరిచయం అవుతుంది. పార్వతికి ఇద్దరు పిల్లలు. భర్త ఫణింద్ర(అద్దూరి రవివర్మ)తో గొడవలు ఉంటాయి. ఇలా ఇద్దరి వ్యక్తిగత జీవితాల్లో సంతోషం అనేది ఉండదు. సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు ప్రేమలో పడతారు. ఆ తర్వాత ఏం జరిగింది. అసలు నరేంద్రకు మూడో భార్య సౌమ్య సేతుపతికి మధ్య గొడవలు ఏంటి? నటుడు, రచయిత అయిన ఫణింద్ర.. భార్య పార్వతికి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? బెంగళూరు మీడియాను అడ్డుపెట్టుకొని సౌమ్య ఆడిన నాటకం ఏంటి? నరేంద్ర, పార్వతి కలిసి ఓ రోజు హోటల్లో ఎందుకు గడపాల్సి వచ్చింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. నరేశ్ నిజజీవితంలోకి పవిత్రా లోకేష్ వచ్చాక జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఎమ్మెస్ రాజు. ఈ విషయాన్ని సినిమా ప్రమోషన్స్లో ఎక్కడా చెప్పకపోయినా.. సినిమా చూస్తే అందరికి అర్థమైపోతుంది. మొత్తం ఐదు చాప్టర్లుగా సినిమాను తీర్చి దిద్దారు. మొదటి చాప్టర్లో నరేశ్-పవిత్రల పరిచయాన్ని .. రెండో చాప్టర్లో రమ్య రఘుపతిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చూపించారు. ఇక మూడో చాప్టర్లో పవిత్రా లోకేష్ కెరీర్.. పెళ్లి సంఘటనలను చూపించారు.నాలుగు, ఐదు చాప్టర్లలో నరేశ్-పవిత్రలు కలిసి ఉండడం.. మూడో భార్య మీడియాకెక్కడం తదితర సంఘటనలను చూపించారు. అయితే సినిమా మొత్తం చూస్తే.. నరేశ్-పవిత్ర మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పులేదు. నరేశ్ మూడో భార్య, పవిత్ర భర్తలు అస్సలు మంచి వాళ్లు కాదు. ఆస్తి కోసం వాళ్లను పెళ్లి చేసుకున్నారనేది ప్రేక్షకులకు అర్థమవుతుంది. మరి ఇందులో వాస్తవం ఎంతో, కల్పితం ఎంతో చెప్పలేం. కానీ సినిమాలో కొన్ని విషయాలను చాలా బోల్డ్గా చూపించారు ఎమ్మెస్ రాజు. ఫ్రంట్- బ్యాక్ స్క్రీన్ ప్లే తో కథనాన్ని ఆసక్తికరంగా మలిచాడు. అలాగే పవిత్రా లోకేష్ వ్యక్తిగత జీవితానికి సబంధించి తెలుగు ప్రేక్షకులకు తెలియని విషయాలను చూపించారు. ఇంటర్వెల్ సీన్ సెండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ఇక్కడ మైనస్ ఏంటంటే.. నరేష్, పవిత్ర జీవితంలో జరిగిన ఘటనలు.. వారి నేపథ్యం గురించి అంతగా తెలియని ప్రేక్షకులకు అంతగా అర్థం కాకపోవచ్చు. కానీ బెంగళూరులో రమ్య రఘుపతి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టింది? నరేశ్-పవిత్ర హోటల్లో మీడియాకు ఎలా దొరికిపోయారు? అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉన్నవాళ్లకు మళ్లీ పెళ్లి నచ్చుతుంది. అయితే ఇదంతా నరేశ్-పవిత్రల వెర్షన్ మాత్రమే. మరి రమ్య రఘుపతి వెర్షన్ ఏంటి అనేది ఇలాగే సినిమాను తెరకెక్కించి చెబుతారా? లేదా ప్రెస్ మీట్లో చెబుతారా అనేది తెలియాలంటే కొన్నాళ్లు మనం ఎదురు చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. నరేంద్ర పాత్రలో నరేశ్, పార్వతి పాత్రలో పవిత్రా లోకేశ్ తమ తమ పాత్రల్లో జీవించేశారు. కొన్ని రొమాంటిక్ సీన్స్ అద్భుతంగా పండించారు. సౌమ్యా సేతుపతిగా వనితా విజయ్ కుమార్ అద్భుతంగా నటించారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర తనది. అయితే తెలుగు డబ్బింగ్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇక సూపర్స్టార్ పాత్రలో శరత్ బాబు, నరేంద్ర తల్లి విమలమ్మ పాత్రలో జయసుధ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక యంగ్ పార్వతిగా అనన్యా నాగళ్ల తెరపై చాలా అందంగా కలిపించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రకు న్యాయం చేశారు. సాంకేతిక విషయాలకొస్తే.. సురేష్ బొబ్బిలి సంగీతం బాగుంది. పాటలతో కథలో భాగంగా వస్తుంటాయి. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ని చాలా అందంగా చూపించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నరేశ్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని సినిమా చూస్తే అర్థమతుంది. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
మళ్ళీ పెళ్లితో పెద్ద హిట్ సాధిస్తాం
‘‘పెళ్లనేది పవిత్రమైనది. దాన్ని గౌరవించాలనే కోణంలో ‘మళ్ళీ పెళ్లి’ సినిమా చేశాం. యువతరంతో పాటు అన్ని వయసుల వారికీ కనెక్ట్ అయ్యే కథ ఈ చిత్రంలో ఉంది. పెద్ద హిట్ సాధిస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు వీకే నరేశ్. ఆయన హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు. నరేశ్కి జోడీగా పవిత్రా లోకేష్ నటించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం వీకే నరేశ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మా అమ్మగారు (విజయ నిర్మల) తన ఆలోచనలను సినిమాల్లో చూపించాలని కృష్ణగారితో కలసి 1972లో విజయకృష్ణ మూవీస్ని స్థాపించారు. ఈ బేనర్ స్థాపించి 50 ఏళ్లు, నా సినీ జీవితం ప్రారంభించి కూడా యాభై ఏళ్లు. ఈ సమయంలో హీరోగా ‘మళ్ళీ పెళ్లి’ సినిమా చేయడం నా అదృష్టం. ఈ సినిమా వినోదంతో పాటు షాకింగ్గా ఉంటుంది.. నటుడిగా థ్రిల్గా ఉంది. పదికోట్ల మందిలో వందమంది కూడా బిజీగా ఉండరు. ఇక సినిమాలకు వస్తే.. పది మంది హీరోలే బిజీగా ఉంటారు. నేను హీరోగా హిట్స్ ఇచ్చాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాను. ఇప్పుడు మళ్లీ హీరోగా చేస్తున్నాను. విజయకృష్ణ మూవీస్ లాంటి పెద్ద బ్యానర్ని మళ్లీ తీసుకురావడం, కృష్ణ–విజయ నిర్మలగార్ల వారసత్వాన్ని కాపాడటం, ఒక మంచి ఎంటర్టైనర్ ఇవ్వడం.. ఇవన్నీ నిర్మాతగా నాకు పెద్ద బాధ్యత. ఈ విషయంలో రాజుగారిని నమ్మాను’’ అన్నారు. -
మళ్లీ పెళ్లి ఆపాలంటూ కోర్టును ఆశ్రయించిన నరేశ్ మూడో భార్య
సీనియర్ నటుడు నరేశ్, అతడి ప్రేయసి, నటి పవిత్రా లోకేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ సినిమా నుంచి లిప్ లాక్ వీడియో రిలీజ్ చేసినప్పటి నుంచి ఇదొక సెన్సేషన్గా మారింది. కారణం.. నరేశ్ నిజ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ సినిమాలో ఉండటమే! ఇందులో అతడి మూడు పెళ్లిళ్లు, పవిత్రతో ప్రేమాయణం.. హోటల్లో పట్టుబడ్డ సీన్.. ఇలా అన్నీ ఉన్నాయి. పైగా ప్రమోషన్స్లోనూ పవిత్రతో రొమాన్స్ చేయడం, తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడం విశేషం. ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నరేశ్ నిర్మిస్తున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా శుక్రవారం (మే 26న) విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమాపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి. మళ్లీ పెళ్లి సినిమా తన ప్రతిష్టను కించపరిచేలా ఉందని, ఈ సినిమా విడుదల ఆపాలంటూ పిటిషన్ వేసింది. దీంతో మళ్లీ పెళ్లి సినిమా మరోసారి వార్తల్లోకెక్కింది. చదవండి: తెలుగు ఇండస్ట్రీని చులకన చేస్తే ఊరుకోను: డైరెక్టర్ మాస్ వార్నింగ్ -
నేను బయటికి వచ్చానంటే కారణం నరేశ్: పవిత్రా లోకేష్
‘‘వినోదం, భావోద్వేగాలు, అద్భుతమైన సంగీతంతో రూపొందిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఈ చిత్రకథ సమాజానికి అద్దం పడుతుంది’’ అని నటి పవిత్రా లోకేష్ అన్నారు. వీకే నరేశ్, పవిత్రా లోకేష్ జంటగా ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. వీకే నరేశ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా పవిత్రా లోకేష్ మాట్లాడుతూ– ‘‘ఎమ్మెస్ రాజుగారు ‘మళ్ళీ పెళ్లి’లో నరేశ్గారు, నేను నటిస్తేనే బాగుంటుందనడంతో చేశాం. మళ్ళీ పెళ్ళి అంటే సమాజం ఇప్పటికీ తక్కువగానే చూస్తుంది. ఇదొక్కటే కాదు.. సమాజంలో చాలా నిబంధనలు ఉంటాయి. మా విషయంలో (నరేశ్–పవిత్ర) కొన్ని సంఘటనలు జరిగాయి. (చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్పై కేసు నమోదు.. ఎందుకంటే?) కొందరు పరిస్థితులని అడ్డుపెట్టుకొని చాలా తప్పుగా చూపారు. నా వ్యక్తిత్వ హననం చేసి, నా కెరీర్ పై బ్లాక్ మార్క్ పెట్టాలని చూశారు. దీని నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఆ సమయంలో నేను ఒంటరిగా ఉంటే ఆత్మహత్య చేసుకోవాలి లేదా ఇంట్లో కూర్చోవాలి. నేను బయటికివచ్చానంటే కారణం నరేష్ గారు..నా వెనుక బలంగా నిల్చున్నారు. నేను ఉన్నానని చెప్పారు. దేనికీ భయపడలేదు. నేను ఒక్క అడుగు వెనకి వేసినా పరిస్థితి దారుణంగా ఉండేది. నరేష్ గారు చాలా సపోర్ట్ గా ఉన్నారు. విజయ నిర్మల, కృష్ణగార్లతో పాటు మహేశ్బాబుగారిని కూడా కలిశాను. ఆ ఫ్యామిలీ మమ్మల్ని (నరేశ్–పవిత్ర) యాక్సెప్ట్ చేసింది’’ అన్నారు. -
నాకు.. నరేశ్కి ఆ అదృష్టం దక్కింది
‘‘చిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం అందరికీ కుదరదు. కానీ నాకు, నరేశ్కు ఆ అదృష్టం దక్కింది. విజయనిర్మలగారు ‘పండంటి కాపురం’ చిత్రం ద్వారా నన్ను, నరేశ్లను పరిచయం చేశారు. మన వ్యక్తిగత విషయాల పరంగా ఎవరికీ భయపడక్కర్లేదు’’ అని నటి జయసుధ అన్నారు. వీకే నరేశ్, పవిత్రా లోకేష్ జంటగా ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. విజయ కృష్ణ మూవీస్పై వీకే నరేశ్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ‘ఆకాశమే..’ అనే సాంగ్ను జయసుధ విడుదల చేశారు. నటిగా యాభై ఏళ్లు పూర్తిచేసుకున్న జయసుధను నరేశ్ సత్కరించగా, నటుడిగా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న నరేశ్ ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో జయసుధ సత్కరించారు. వీకే నరేశ్ మాట్లాడుతూ–‘‘నా రీల్ లైఫ్ బాగున్నా రియల్ లైఫ్ బాగోలేదు. ఇప్పుడు 50 ఏళ్లకు మా అమ్మ (విజయ నిర్మల) తర్వాత ఇంకో అమ్మను (పవిత్ర) కలుసుకున్నాను. జీవితంలో ఫస్టాప్ కంటే సెకండాఫ్ బాగుండా లని చెప్పే చిత్రమే ‘మళ్ళీ పెళ్లి’’ అన్నారు. ‘‘నా కొత్త జీవితం ప్రారంభమైంది. ‘మళ్ళీ పెళ్లి’లో నాకు మంచి పాత్ర ఇచ్చినందుకు రాజుగారు, నరేశ్గారికి థ్యాంక్స్’’ అన్నారు పవిత్రా లోకేశ్. ‘‘నా 12 ఏళ్లప్పుడు విజయ కృష్ణ మూవీస్లో ‘మీనా’ సినిమా చూశాను. ఇప్పుడు వారి బేనర్లో సినిమా చేస్తాననుకోలేదు. ‘మళ్ళీ పెళ్లి’ బోల్డ్ కథ’’ అన్నారు ఎమ్మెస్ రాజు. -
ఫోన్ రావడంతో కన్నీళ్లాగలేదు..చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నరేశ్!
సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్లోని ఆయన పార్థీవదేహానికి నివాళులర్పించారు. టాలీవుడ్ నటులు నరేశ్, రాజేంద్ర ప్రసాద్, నందమూరి బాలకృష్ణ, మా అధ్యక్షుడు మంచు విష్ణు, జయసుధ, మురళీ మోహన్, ఏడిద రాజా, శివాజీ రాజా, శివబాలాజీ, పవిత్రా లోకేశ్ తదితరులు ఆయనకు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. శరత్ బాబు పార్థీవదేహం వద్ద సీనియర్ నటుడు నరేశ్ బోరున విలపించారు. తాను ఒక మంచి మిత్రున్ని కోల్పోయానని కన్నీటి పర్యంతమయ్యారు. నరేశ్ మాట్లాడుతూ.. 'శరత్ బాబు గొప్పనటుడే కాదు.. అందగాడు. శరత్ బాబు నేను మంచి మిత్రులం. ఆయనతో కలిసి 12 సినిమాలు చేశాం. శరత్ బాబు ఒడ్డు పొడుగు చూసి అసూయపడేవాన్ని. మళ్లీ పెళ్లి చిత్రంలో జయసుధకు జోడిగా నటించమని అడిగితే వెంటనే ఒప్పుకున్నారు. ఆఖరి రోజుల్లో కుడా ఆరోగ్యంగా ఉన్నారు. పవిత్రను నన్ను దీవించి వెళ్లాడు. ఆఖరి రోజుల్లో తోడు అవసరమని చెప్పాడు. మనస్సు విప్పి మాట్లాడుకునే మంచి మిత్రుణ్ణి కోల్పోయా. మా బ్యానర్లో చివరి సినిమా చేశారనే ఆనంద పడాలో బాధపడాలో అర్థం కావడం లేదు. మళ్లీ పెళ్లి ఫస్ట్ కాపీ చూస్తుండగా ఆయన చనిపోయారని ఫోన్ రావడంతో కన్నీళ్లు ఆగలేదు.' అంటూ ఫుల్ ఎమోషనలయ్యారు. ఆయనతో పాటు పవిత్రా లోకేశ్ కూడా నివాళులర్పించారు. (ఇది చదవండి: కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ ఫేక్ రూమర్స్..) మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడు: రాజేంద్రప్రసాద్ శరత్ బాబు మృతి పట్ల నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..' మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడు శరత్ బాబు. నా ఎదుగుదలలో దగ్గరున్న వ్యక్తి శరత్ బాబు. ఆయన మరణం దైవ నిర్ణయం. శరత్ బాబు అనారోగ్యంతో పోరాడి తనను తాను కోల్పోయాడు. అత్యంత ఆప్తుడైన శరత్ బాబును కోల్పోవడం నాకు నా కుటుంబానికి ఎంతో తీరని లోటు.' అంటూ ఎమోషనలయ్యారు. అంకితభావం గల నటుడు: నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. 'శరత్ బాబు విలక్షణమైన నటనతో చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా తనదైన ముద్ర వేశారు. శరత్ బాబు గారు క్రమశిక్షణ, అంకితభావం గల నటులు. ఆయనతో కలసి పని చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. శరత్ బాబు మరణం పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనతో ఎన్నో సినిమాల్లో నటించా: జయసుధ సీనియర్ నటి జయసుధ మాట్లాడుతూ..' శరత్ బాబుతో నేను ఎన్నో సినిమాల్లో నటించా. నా బెస్ట్ మూవీస్ అన్నీ ఆయనతోనే ఉన్నాయి. ఇటీవలే ఆయనతో మళ్లీ పెళ్లి చిత్రంలో నటించాను. సినిమా షూటింగ్ అప్పుడు చాలా ఆరోగ్యంగానే ఉన్నారు. నెలరోజుల తర్వాత హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది. మంచి క్రమశిక్షణ కలిగిన నటుడు శరత్ బాబు. చిరునవ్వుతో పలకరించేవాడు. ఏ నటుడితో చులకనగా మాట్లాడేవాడు కాదు. శరత్ బాబు మరణం బాధగా ఉంది. శరత్ బాబు మరణం తెలుగు సినీ పరిశ్రమకే కాదు తమిళ సినీ పరిశ్రమకు కూడా తీరని లోటు.' అంటూ ఆయనను గుర్తు చేసుకున్నారు. (ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత) శరత్బాబు ఆత్మకు శాంతి చేకూరాలి : ఏడిద రాజా ఏడిద రాజా మాట్లాడుతూ.. 'దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు . మా పూర్ణోదయ సంస్థ తీసిన చిత్రాల్లో చాలా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. తాయారమ్మ బంగారయ్య ,సీతాకోకచిలక సాగర సంగమం ,స్వాతిముత్యం ,సితార , ఆపద్భాంధవుడు చిత్రాల్లో చాలా అధ్బుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. మా సంస్థకు శాశ్వత ఆర్టిస్ట్గా పనిచేశారు. మా కుటుంబ సబ్యుడిని కోల్పోయాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలి.' అంటూ శరత్ బాబును కొనియాడారు. -
ఆస్తి కోసమే పవిత్రా లోకేష్ నరేష్తో ప్రేమాయణం నడుపుతుందా? ఆమె చెప్పిందిదే..
టాలీవుడ్లో నరేష్, పవిత్రా లోకేష్ ఎంత ఫేమస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఈ జంట గురించి పలు ట్రోల్స్, మీమ్స్ వచ్చినా సరే డోంట్ కేర్ అంటూ ఇద్దరూ కలిసే ఉంటున్నారు,త్వరలోనే తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకుంటామని ప్రకటించారు. అయితే ఇప్పటికే మూడు పెళ్లిళ్లు పెటాకులు చేసుకున్న నరేష్తో పవిత్రా లోకేశ్ కేవలం డబ్బు కోసమే కలిసుంటుందని, అందుకే ప్రేమాయణం సాగిస్తుందంటూ రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా నరేష్ తన ఆస్తుల గురించి క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అవును, నేను బిలినియర్ని. నాకు వెయ్యికోట్ల కంటే ఎక్కువగానే ఆస్తి ఉంది. అందులో వారసత్వంగా వచ్చింది కొంత ఉంటే, నేను కష్టపడి సంపాదించుకుంది కూడా ఉంది. భూముల ధరలు బాగా పెరగడంతో నా ఆస్తుల విలువ రూ. 1000కోట్లు కాదు అంతకు మించి కూడా ఉండొచ్చు. నేనెప్పుడూ ఆ లెక్క చూసుకోలేదు. అందులో బ్లాక్ మనీ లేదు. మొత్తం వైట్ మనీనే. ఎక్కడైనా, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. చాలా గౌరవప్రదంగా నేను నా రాజ్యాన్ని స్థాపించుకున్నాను. నేను నమ్మేది ఒక్కటే.. దేవుడు ఇచ్చిన దాంట్లో మనం సంతోషంగా ఉండాలి. చుట్టూ ఉన్న వాళ్లని సంతోషంగా చూసుకోవాలి. ఇక నా డబ్బు చూసి పవిత్ర నాతో ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి నాతో డబ్బు లేదని వెళ్లిపోయినవాళ్లు ఉన్నారు. ఆస్తి కోసమే నా జీవితంలో వచ్చినవాళ్లూ ఉన్నారు.. కానీ మాది పవిత్రబంధం' అంటూ చెప్పుకొచ్చారు. ఇక నరేష్తో రిలేషన్పై పవిత్ర కూడా.. 'అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి చాలారోజుల వరకు నాకు తెలియదు. ఇప్పటికే మాకు పెళ్లి అయిపోయిందనే ఫీలింగ్ ఉంది. ఆయన నన్ను కాకుండా ఇంకెవరినీ చూడరు. చివరి వరకు మా బంధం ఇలాగే నిలుస్తుంది' అంటూ పేర్కొన్నారు. -
ఈ వారం ఓటీటీ/ థియేటర్స్లో సందడి చేసే చిత్రాలివే!
గతవారం లాగే ఈ వారం కూడా థియేటర్స్లో చిన్న సినిమాలు.. ఓటీటీలతో పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే థియేటర్స్లో విడుదలయ్యేవి చిన్న చిత్రాలే అయినా.. మంచి బజ్ని క్రియేట్ చేసుకున్నాయి. అలాగే ఓటీటీలోనూ కొన్ని హిట్ సినిమాలో స్క్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో చూద్దాం. మళ్లీ పెళ్లి నరేశ్ వి.కె, పవిత్ర లోకేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఎం.ఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్పై వీకే నరేశ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. మేమ్ ఫేమస్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం మేమ్ ఫేమస్. శరత్, అనురాగ్ రెడ్డి, చంద్రు మనోహరన్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఈ నెల 26న విడుదల కాబోతుంది. చిన్న సినిమానే అయినా.. వినూత్నమైన ప్రచారంతో భారీ హైప్ని క్రియేట్ చేసుకుంది. 2018 టొవినో థామస్, కుంచకో బోబన్, అసీఫ్ అలీ, లాల్ తన్వి రామ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘2018’. జూడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై భారీ విజయం సాధించింది. కేవలం 10 రోజుల్లోనే రూ.100 కోట్లు కొల్లగొట్టింది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ మే 26న విడుదల కాబోతుంది. మెన్ టూ నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం మెన్ టూ. శ్రీకాంత్ జీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 26న థియేటర్స్లోకి రాబోతుంది. వీటితోపాటు జైత్ర, గ్రే- ది స్పై హు లవ్డ్ మీ, గోవిందా భజాగోవింద అనే చిన్న సినిమాలు కూడా ఈ వారమే థియేర్స్లో సందడి చేయబోతున్నాయి. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే.. జీ5 కిసీ కా భాయ్ కిసీ కి జాన్ (మే 26) సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై (మే 26) జియో తోడేలు (మే 26) అమెజాన్ ఫ్రైమ్ వీడియో సిటాడెట్ చివరి ఎపిసోడ్ మిస్సింగ్ మూవీ(మే 24) ఆహా గీతా సుబ్రహ్మణ్యం సిరీస్ -3(మే 23) సత్తిగాడు రెండెకరాలు(మే 26) డిన్నీ +హాస్ట్స్టార్ అమెరికన్ బోర్న్ చైనీస్ మే 24 సిటీ ఆఫ్ డ్రీమ్స్ మే 26 -
మా బంధానికి మహేశ్ ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు : నరేష్
సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్రా లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. కొన్నాళ్లుగా వీరి వ్యవహారం టాలీవుడ్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ హాట్టాపిక్గా మారింది. ఇప్పటికే నరేష్కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. దీనికి తోడు పవిత్రతో సుమారు 20 ఏళ్ల తేడా ఉంటుంది. మొన్నటిదాకా మేం స్నేహితులమే అని చెప్పిన నరేష్-పవిత్రా లోకేశ్ ఇప్పుడు మాత్రం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. పైకి మాత్రం అది మా స్టోరీ కాదంటూనే వారి నిజజీవితంలో జరిగిన సంఘటను ఆధారంగా చేసుకొని 'మళ్లీ పెళ్లి' అనే సినిమాను రూపొందించారు. ట్రైలర్తో సినిమాపై అంచనాలను పెంచేసిన నరేష్-పవిత్ర ప్రమోషన్స్ కోసంరెచ్చిపోయారు. ఆకాశం విరిగిపడినా.. భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం అంటూ స్టేట్మెంట్లు ఇచ్చేశారు. ఈనెల 26న సినిమా రిలీజ్ కానుండటంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాకు కావాల్సినంత కంటెంట్,పుటేజీ ఇచ్చేస్తున్నారు. తాజాగా ఓ యాంకర్.. మీ ప్రేమని మహేశ్ బాబు కుటుంబం ఒప్పుకుందా అని నరేష్ని అడగ్గా.. తమ బంధం గురించి మహేశ్బాబుతో పాటు కృష్ణగారికి ముందే తెలుసని పేర్కొన్నారు. 'కృష్ణ గారు, విజయ నిర్మల గారు, మహేశ్ కుటుంబం మేమంతా ఒక్కటే. మేం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందరం కలిసే తీసుకుంటాం. మా రిలేషన్ గురించి వాళ్లకు ఎప్పట్నుంచో తెలుసు. ఫ్యామిలీ నుంచి మాకు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. మా ప్రేమని ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. మహేశ్కు పవిత్ర అంటే కూడా గౌరవం. ఆమె వంటను కూడా ఎంతో ఇష్టపడతారు' అంటూ నరేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. -
'మళ్లీ పెళ్లి' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నరేష్ మరియు పవిత్ర లోకేష్ తో సాక్షి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ
-
నరేశ్, పవిత్ర గొప్ప నటులు.. ‘మళ్లీ పెళ్లి’ ఎవరి కథో తెలిసేది అప్పుడే!
‘‘మళ్ళీ పెళ్లి’లో లవ్, డ్రామాతోపాటు సెన్సేషనల్ అంశాలు ఉన్నాయి. నా కెరీర్లో ఈ మూవీకి బెస్ట్ స్క్రీన్ప్లే ఇచ్చాను’’ అని డైరెక్టర్ ఎంఎస్ రాజు అన్నారు. వీకే నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. విజయకృష్ణ మూవీస్ బ్యానర్పై వీకే నరేశ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ – ‘‘విజయ నిర్మల, కృష్ణగారు నెలకొల్పిన బేనర్ విజయ కృష్ణ మూవీస్. నరేశ్గారి 50 ఏళ్ల కెరీర్ను బేస్ చేసుకుని మంచి సినిమా చేయాలని ‘మళ్ళీ పెళ్లి’ కథని నరేశ్, పవిత్రలకు చెప్పాను. వారికి బాగా నచ్చింది. ఈ స్టోరీని నేను రాశాను కాబట్టి ఇది నా కథా? లేక నరేశ్ కథా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ‘మళ్ళీ పెళ్లి’ కథ మొత్తం కల్పితం అని చెప్పలేను. నరేశ్, పవిత్ర గొప్ప నటులు. వారి నుంచి 50 శాతం పైగా నటన రాబట్టాను. వారి జీవితంలో జరిగిన కథే ఈ మూవీ అనుకోవచ్చు. కాలాన్ని బట్టి పరిస్థితులు, ఆలోచనలు మారుతుంటాయి. ఒంటరితనం అనేది ఎలా ఉంటుంది? వంటి అంశాలను ‘మళ్ళీ పెళ్లి’లో చూపించాం. ‘ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, డర్టీ హరి’ వంటి సినిమాలు ట్రెండీగా తీసినవే. ‘డర్టీ హరి’ చేయమని ఓ యువ డైరెక్టర్ని అడిగితే.. ‘బోల్డ్ కంటెంట్.. చేయను’ అనడంతో నేనే దర్శకత్వం వహించాను. కొత్తదనంతో సినిమా తీయాలనే తపనతో నేను దర్శకునిగా మారాను.. లేదంటే ఇంట్లో కూర్చునేవాణ్ణి’’ అన్నారు. -
Naresh - Pavitra: నా ప్రాణం ఉన్నంతవరకూ ఆమెకు అండగా ఉంటా: నరేశ్
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను ఈనెల 26న విడుదల చేయనుండగా ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా పాల్గొంటున్నారు నరేశ్, పవిత్రా లోకేశ్. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ జంట తమ రిలేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇది చదవండి: ఇలియానాకు ప్రెగ్నెన్సీ.. రైడ్కు వెళ్లిన ముద్దుగుమ్మ!) నరేశ్ మాట్లాడుతూ.. 'మళ్లీ పెళ్లి అనే సినిమా నా వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించింది కాదు. సమాజంలోని పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించాం. ఒత్తిడి, అనుమానం, అనుబంధాలు లేకపోవడం వంటి వాటివల్లే వివాహ వ్యవస్థ ప్రస్తుతం దెబ్బతింటోంది. వివాహాబంధంపై గౌరవానికి అద్దం పడుతూ దీన్ని రూపొందించాం. సోషల్మీడియాలో మాపై విమర్శలు వచ్చాయి. రివెంజ్ కోసమే సినిమా చేశానన్నారు. ఒకరిపై రివెంజ్ తీర్చుకోవాలంటే యూట్యూబ్లో వీడియోలు షేర్ చేయవచ్చు. రూ.15 కోట్లు పెట్టి రెండు భాషల్లో ఒక సినిమా చేయాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ప్రమేయంతో ఇవన్నీ వచ్చాయి. కొన్ని పరిస్థితుల తర్వాత నేను విడాకులకు అప్లై చేశా. ఆ తర్వాత మా ఇద్దరి బంధాన్ని బ్రేక్ చేయాలని చూసింది. ఆ వ్యక్తి పేరు చెప్పాలనుకోవడం లేదు. నన్ను నమ్మి పవిత్ర వచ్చింది. కాబట్టి నా ప్రాణం ఉన్నంతవరకూ ఆమెకు ఎప్పుడూ అండగా ఉంటా’ అని అన్నారు. (ఇది చదవండి: పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. 72 గంటలే డెడ్ లైన్: స్టార్ హీరోయిన్) పవిత్రా లోకేశ్ మాట్లాడుతూ..' ఓ సినిమా షూటింగ్లో మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. మేమిద్దరం కలిసి వరుసగా సినిమాలు చేశాం. మా వ్యక్తిత్వం ఒక్కటే. ఏ విషయంలోనైనా పాజిటివ్గానే చూస్తాం. ఒకరిపై రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ట్రోల్స్ వచ్చినప్పుడు నేను ఎంతో బాధపడ్డా. నరేశ్ నాకు అండగా నిలబడ్డారు.' అని అన్నారు. -
త్వరలోనే పవిత్రా లోకేశ్ను పెళ్లి చేసుకుంటా: నరేష్
సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే.కొన్నాళ్లుగా ఈ జంట పేర్లు సోషల్మీడియలో తెగ ట్రెండింగ్లో ఉన్నాయి. గతంలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్కు షాక్ ఇచ్చిన ఈ జంట అదంతా సినిమా కోసమంటూ ట్విస్ట్ ఇచ్చారు. వీరిద్దరు జంటగా నటిస్తున్న సినిమా మళ్లీ పెళ్లి. పైకి మాత్రం అది మా స్టోరీ కాదంటూనే నిజ జీవితంలో జరిగిన సంఘటనలే తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు నరేశ్. ట్రైలర్తో సినిమాపై అంచనాలను పెంచేసిన నరేష్-పవిత్ర ప్రమోషన్స్ కోసం మళ్లీ రెచ్చిపోయారు. ఆకాశం విరిగిపడినా.. భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం అంటూ ఇటీవలె ముద్దులతో స్టేజ్పై రెచ్చిపోయిన నరేష్ తాజాగా కర్ణాటకలో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి అభిప్రాయాలు, మనసు కలవడంతో కలిసి ఉంటున్నామని, అందరి ఆశీస్సులతో త్వరలోనే పవిత్రను పెళ్లి చేసుకుంటా అంటూ నరేష్ తెలిపాడు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'నిజానికి పెళ్లి అన్నది కశ్చితంగా అవసరం కాదు. చాలామంది ఇష్టం లేకపోయినా, సోసైటీ కోసం పెళ్లి బంధంలో ఉంటున్నారు. అలాంటి వాళ్లందరికోసమే మళ్లీ పెళ్లి సినిమా. ఇది మా బయోపిక్ కాదు. పవిత్రకు నాకు ఇంకా పెళ్లి కాలేదు..కానీ త్వరలోనే చేసుకుంటా' అంటూ నరేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. -
నరేశ్- పవిత్రా లోకేశ్ 'మళ్లీ పెళ్లి'.. రొమాంటిక్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన లిరికల్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు. (ఇది చదవండి: 'బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?) 'కావేరి గాలిలా' అంటూ సాగే సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటకు లిరిక్స్ అనంత శ్రీరామ్ అందించగా.. సింగర్ నరేశ్ అయ్యర్ ఆలపించారు. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా.. తమ నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. మే26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ‘రా రా హుజూర్ నాతో’.. అనే రొమాంటిక్ సాంగ్ను రిలీజ్ చేశారు. అనన్య నాగళ్ల, శరత్బాబు, వనితా శరత్కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
స్టేజీపైనే ముద్దులతో రెచ్చిపోయిన నరేశ్- పవిత్ర లోకేశ్..!
టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్కు షాక్ ఇచ్చారు. అయితే అదంతా అందరూ అది నిజమే అనుకున్నారు. కానీ ఆ తర్వాత ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు నరేశ్- పవిత్ర. ఓ సినిమా కోసం ఆ వీడియో చేసినట్లు వెల్లడించారు. మళ్లీ పెళ్లి అనే చిత్రంలో పవిత్ర లోకేశ్, నరేశ్ జంటగా నటిస్తున్నారు. ఎంఎస్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రబృందం. (ఇది చదవండి: Malli Pelli Teaser: నరేశ్- పవిత్రల 'మళ్లీ పెళ్లి'.. ముహూర్తం ఫిక్స్!) ఈ సందర్భంగా ఓ టీవీ షోలో నరేశ్, పవిత్ర పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. వేదికపైనే ఈ ప్రేమజంట ముద్దులతో రెచ్చిపోయారు. వీరిద్దరిని చూసిన యాంకర్ ఓ చిలిపి ప్రశ్న వేశారు. మీ ఇద్దరి రిలేషన్షిప్ ఏంటని అడగగా.. దీనికి క్రేజీ ఆన్సరిచ్చారు నరేశ్. 'ఆకాశం విరిగిపడినా.. భూమి బద్దలైనా మేమిద్దరం కలిసే ఉంటాం' నవ్వుతూ చెప్పారు. దీంతో ఈ ప్రేమజంటను చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: చిన్న రూమ్ రెంట్కు..ఒక్క పూట మాత్రమే తినేవాడిని : శివ బాలాజీ) -
దళితబంధు లబ్దిదారులకు న్యాయం చేయాలి
దురాజ్పల్లి (సూర్యాపేట): సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో దళితబంధు పథకంలో జరిగిన అవినీతిని గుర్తించి, మోసపోయిన లబ్ధిదారులకు న్యాయం చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహాజన సోషలిస్ట్ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి కందుకూరి సోమన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్సోజు నరేశ్, సీసీఎం మండల కార్యదర్శి కడెం లింగన్న, బీజేపీ నేత ధరావత్ సంతోష్, వైఎస్సార్ టీపీ నేత ఏపూరి యాకన్న మాట్లాడుతూ గ్రామంలో దళితబంధు పథకంలో లబ్దిదారులకు అందజేసిన గేదెల యూనిట్లలో రూ.10 లక్షలకు గాను కేవలం నాలుగు గేదెలు మాత్రమే ఇచ్చి యూనిట్ పూర్తయిందని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. తమ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ విచారణకు వెంటనే కమిటీని నియమిస్తామని, లబ్దిదారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. -
నరేశ్-పవిత్ర.. వారి బంధానికి ఇంతకన్నా ఏం కావాలి?
టాలీవుడ్లో నరేశ్, పవిత్ర లోకేశ్ ఎంత ఫేమస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ జంట చాలాసార్లు వార్తల్లో హాట్ టాపిక్గా నిలిచిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ జంట గురించి రకరకాలుగా వార్తలొచ్చాయి. వీరిద్దరు జంటగా 'మళ్లీ పెళ్లి' అనే సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ తర్వాత నరేశ్ చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇటీవలే మళ్లీ పెళ్లి చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు. అయితే తాజాగా ఓ ఈవెంట్కు హాజరైన నరేశ్.. పవిత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: అప్పట్నుంచి అన్నీ అమ్మతో అన్ని షేర్ చేసుకుంటున్నాను: శ్రీలీల) ప్రస్తుతం ఆయన 'అన్నీ మంచి శకునములే' చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన పవిత్ర లోకేశ్ గురించిన ఆసక్తికర కామెంట్స్ చేశారు. షూటింగ్ సమయంలో పవిత్ర భోజనం తీసుకొచ్చేదని అన్నారు. ఈ ఈవెంట్లో కొన్ని ఫోటోలు కెమెరాల్లో బంధించగా.. అదే సమయంలో కెమెరా నరేశ్ ఫోన్ను క్లిక్ మనిపించింది. ఆయన ఫోన్లో వాల్ పేపర్గా నరేశ్, పవిత్ర ఫోటో కనిపించింది. దీంతో వీరిద్దరి మధ్య ఎంత స్ట్రాంగ్ రిలేషన్ ఉందోనని కామెంట్లు పెడుతున్నారు. కాగా.. నరేశ్.. తన మూడో భార్యతో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఈ వారం ఓటీటీ/ థియేటర్స్లో సందడి చేసే చిత్రాలివే) -
డర్టీ హరి చూసి ఆయనకు ఫ్యాన్ అయిపోయా: నరేశ్
సీనియర్ నటుడు నరేశ్, పవిత్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఎమ్ఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ను గురువారం విడుదల చేశారు. నరేశ్ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'అమ్మకు గుడి కట్టడంతో నా పని అయిపోలేదు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే విజయకృష్ణ మూవీస్ను రీ లాంఛ్ చేశాను. ఎంఎస్ రాజు డైరెక్ట్ చేసిన డర్టీ హరి చూసి ఫ్యాన్ అయిపోయాను. మూడేళ్ల నుంచి రాజుగారితో ప్రయాణిస్తున్నాను. టీజర్, ట్రైలర్లో కంటే సినిమాలో ఇంకా మంచి కంటెంట్ ఉంది. అమ్మానాన్న కృష్ణ, విజయ నిర్మల కాంబినేషన్లో వచ్చిన మళ్లీ పెళ్లి సినిమా టైటిల్నే మా సినిమాకు వాడుకున్నాం' అన్నాడు నరేశ్. నటి పవిత్రా లోకేశ్ మాట్లాడుతూ.. 'నటీనటులను పాంపర్ చేసే దర్శకుడు ఎంఎస్ రాజు. ఆయన ఒక అన్నగా నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. సినిమాలో నా పాత్రకు వంద శాతం న్యాయం చేశాననుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కినన్న ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో జయసుధ, శరత్బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, ప్రవీణ్ యండమూరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. చదవండి: ఊహా లోకంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైన సినిమాలు -
మళ్లీ పెళ్లి ట్రైలర్.. రియల్ లైఫ్ స్టోరీని దింపేశాడుగా!
సీనియర్ నటుడు నరేష్-పవిత్రా లోకేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేసింది చిత్ర బృందం. 'తెలుగు ఇండస్ట్రీ కన్నడ వైపు చూపు తిప్పిందేంటి?..' అన్న డైలాగ్తో ట్రైలర్ ప్రారంభమైంది. పార్వతి.. మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా? అని నరేశ్ అడగ్గా.. చాలా బాగా చూసుకుంటాడని బదులిచ్చింది పవిత్ర అలియాస్ పార్వతి. అయినా పెళ్లైన ఆవిడతో మీకు లవ్వేంటి? సర్ అని మధ్యలో ఓ డైలాగ్ నరేశ్ మనసులోని మాటను బయటపెట్టింది. 'అసలైన సూపర్స్టార్ పెద్ద భార్య కొడుకే నరేంద్ర.. ఆయనకు మూడు పెళ్లిళ్లయ్యాయి..', 'నీతో రిలేషన్ ఉందని ఒప్పుకుంటే వాళ్లడిగే మొదటి ప్రశ్న.. ఉంచుకున్నారా? అని!' అంటూ వచ్చే డైలాగులు నరేశ్ రియల్ స్టోరీని గుర్తు చేసేలా ఉన్నాయి.. అలాగే నరేశ్ తన మూడో భార్యను తన్నడం.. చివర్లో నరేశ్, పవిత్ర ఒక హోటల్ గదిలో ఉంటే అతడి మూడో భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు రెడీ అయిన సన్నివేశం చూపించారు. మొత్తానికి ఈ ట్రైలర్ ద్వారా నరేశ్ తన రియల్ లైఫ్ స్టోరీని సినిమాగా తీస్తున్నాడని ఇట్టే అర్థమైపోతుంది. చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన శాకుంతలం -
నరేష్, పవిత్రా లోకేశ్ల 'మళ్లీ పెళ్లి' రొమాంటిక్ సాంగ్ రిలీజ్
సీనియర్ నటుడు నరేష్-పవిత్రా లోకేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నరేష్, పవిత్రా లోకేశ్ల ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. తమ నిజ జీవితంలో జరిగిన సంఘటనల్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మే26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ చిత్రం నుంచి ‘రా రా హుజూర్ నాతో’.. అనే రొమాంటిక్ సాంగ్ను రిలీజ్ చేశారు. అనన్య నాగళ్ల, శరత్బాబు, వనితా శరత్కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
నరేశ్- పవిత్ర 'మళ్లీ పెళ్లి'.. ముహుర్తం పెట్టేశారుగా!
టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరు కలిసి నటిస్తోన్న చిత్రం 'మళ్లీ పెళ్లి.' ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నరేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. తాజా ఈ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని ఈనెల 26న విడుదల చేయనున్నట్లు దర్శకుడు ఎంఎస్ సుబ్బరాజు ట్వీట్ చేశారు. (ఇది చదవండి: రెండు నెలల క్రితమే నరేశ్-పవిత్ర పెళ్లి చేసుకున్నారా? అరె ఏంట్రా ఇది!) కాగా.. సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. గతంలోనే ఈ జంట తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ వీడియోని విడుదల చేసి అందరికీ షాకిచ్చారు. అయితే అది నిజ జీవితానికి సంబంధించినది కాదని.. ఓ సినిమా కోసం అలా వీడియో చేశారని తర్వాత తెలిసింది. అయితే తన నిజ జీవితంలో జరిగిన సంఘటనలే తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు నరేశ్. ఈ చిత్రంలో జయసుధ, శరత్బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. (ఇది చదవండి: పెళ్లి చేసుకున్న నరేశ్-పవిత్ర?) Life Goes in a Full Circle 💞#MalliPelli Releasing in Worldwide Theaters On May 26th ❤️🔥 Lets Start the Celebrations with some crazy updates!🕺#MalliPelliOnMay26 💥@ItsActorNaresh #PavitraLokesh @MSRajuOfficial @vanithavijayku1@sureshbobbili9 @ArulDevofficial @VKMovies_… pic.twitter.com/RWJaL0JWkJ — MS Raju (@MSRajuOfficial) May 3, 2023 -
ఒకప్పుడు హీరోలు.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు.. మళ్లీ హీరోలుగా!
టాలీవుడ్లో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లు ఎవరంటే సీనియర్లలో రాజేంద్రప్రసాద్, వీకే నరేశ్, రావు రమేశ్, మురళీ శర్మ ఉంటారు. మంచి క్యారెక్టర్లు చేస్తున్న ఈ నటుల్లో రాజేంద్రప్రసాద్, నరేశ్ ఒకప్పుడు హీరోలుగా చేసిన విషయం తెలిసిందే. ఇన్నేళ్లూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అలరిస్తున్న రావు రమేశ్ ఇప్పుడు హీరోగా చేస్తున్నారు. ‘వీళ్లే చేయాలి’ అనే తరహా లీడ్ రోల్స్లో ప్రస్తుతం రాజేంద్రప్రసాద్, నరేశ్, రావు రమేశ్ నటిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మంచి పాత్రలు చేస్తున్న ఈ ముగ్గురూ ‘క్యారెక్టర్ హీరో’గా చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. రాజేంద్రప్రసాద్ షష్టిపూర్తి తెలుగులో హాస్య కథా చిత్రాల హీరో అనగానే రాజేంద్ర ప్రసాద్ గుర్తుకొస్తారు. హీరోగా ప్రేక్షకులపై వినోదాల జల్లులు కురిపించిన ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేతిలో అరడజనుకు పైగా చిత్రాలతో దూసుకెళుతున్నారు. అడపా దడపా లీడ్ రోల్స్ కూడా చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్. ఆయన లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్కి జోడీగా అర్చన నటిస్తున్నారు. ‘లేడీస్ టైలర్’ (1986) తర్వాత ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. షష్టిపూర్తి కథాంశంతో న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో రూపేష్ కుమార్ చౌదరి మరో హీరోగా నటించడంతో పాటు నిర్మిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూలైలో రిలీజ్ కానుంది. వీకే నరేశ్ మళ్ళీ పెళ్లి హీరోగా వీకే నరేశ్కి ప్రత్యేక గుర్తింపు ఉంది. తనదైన హాస్యం, నటనతో ప్రేక్షకులను అలరించిన ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గానూ వైవిధ్యమైన పాత్రలతో బిజీగా ఉంటున్నారు. కాగా నరేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వీకే నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించారు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్పై వీకే నరేశ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ‘మళ్ళీ పెళ్లి’, కన్నడలో ‘మత్తే మధువే’ టైటిల్స్తో ఈ చిత్రం తెరకెక్కింది. మేలో ఈ చిత్రం విడుదల కానుంది. అందులో భాగంగా సురేశ్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఉరిమే కాలమా..’ అంటూ సాగే పాటని గురువారం విడుదల చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి పాడారు. మారుతీనగర్లో రావు రమేశ్ విలక్షణమైన డైలాగ్ డెలివరీతో తనదైన శైలిలో విలనిజాన్ని పండించిన గొప్ప నటుడు రావు గోపాలరావు. తండ్రి వారసత్వంతో తెలుగు చిత్ర పరిశ్రమకి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పరిచయమయ్యారు ఆయన తనయుడు రావు రమేశ్. విలన్, కమెడియన్, తండ్రి.. ఇలా పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి, విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు రావు రమేశ్. ‘హ్యాపీ వెడ్డింగ్’ ఫేమ్ లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రావు రమేశ్కి జోడీగా ఇంద్రజ నటిస్తున్నారు. పీబీఆర్ సినిమాస్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగి పాత్రలో రావు రమేశ్ కనిపిస్తారు. ఆయన జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులే చిత్ర కథాంశం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరిస్తున్న రావు రమేశ్ తొలిసారి కథను నడిపే నాయకునిగా చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఉన్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా చేస్తున్న ఈ మూడు చిత్రాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్గా నిలిచాయి. -
టీజర్ తో షాక్ ఇచ్చిన నరేష్,పవిత్ర.. రియల్ కథనే సినిమాగా మళ్ళీపెళ్లి..
-
'మళ్లీ శోభనం' ఎప్పుడు రిలీజ్?.. టీజర్పై నెటిజన్స్ దారుణ కామెంట్స్!
టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణంపై ఏకంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 'మళ్లీ పెళ్లి' పేరుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించనుండగా.. నరేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్తో దూసుకెళ్తోంది. ఈ టీజర్లో చివర్లో వచ్చే కన్నుకొట్టే సీన్ నెటిజన్స్ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం పవిత్ర లోకేష్, నరేష్ జంటగా నటించిన ‘మళ్లీ పెళ్లి’ టీజర్ వైరల్గా మారింది. అయితే ఈ టీజర్పై కొందరు నెటిజన్స్ దారుణ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఇలాంటి సినిమాలు మరిన్నీ రావాలని పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఈ సినిమాను రాంగోపాల్ వర్మ తీసుంటే ఇంకా బాగుండేదని సలహాలు కూడా ఇస్తున్నారు. ఓ నెటిజన్ 'మళ్లీ … శోభనం' !! ఎప్పుడు రిలీజ్ అంటూ కామెంట్ చేశాడు. కాగా.. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో జయసుధ, శరత్బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నెటిజన్స్ చేసిన కొన్ని కామెంట్స్! 'నేను మాత్రం కామెంట్స్ చదివి నవ్వుకోవడానికి వచ్చాను' 'పరువు మనకి మనమే ఎలా తీయాలి అని ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు' 'బతుకుజట్కాబండి, ఇది కథ కాదు జీవితం...'అనే టైటిల్ కి కరెక్టుగా సరిపోయే సినిమా ఇది. 'ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 భాషల్లో రిలీజ్ అయ్యి 3000 కోట్ల వసూళ్లు సాధించాలని కోరుకుంటూ- జేమ్స్ కామెరూన్ ఫ్యాన్స్' 'ఈ సినిమాని ఆర్జీవి డైరెక్ట్ చేసి ఉంటే బాగుండు' 'ఇలాంటి భాగోతాల సినిమాలు మరిన్ని రావాలి.' 'మళ్లీ … శోభనం !! ఎప్పుడు రిలీజ్' -
"మళ్ళీ పెళ్లి" టీజర్ లో రచ్చ..
-
Malli Pelli Teaser: నరేశ్- పవిత్రల 'మళ్లీ పెళ్లి'.. ముహూర్తం ఫిక్స్!
టాలీవుడ్ సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ మధ్య ఈ జంట తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. అయితే అందరూ అది నిజమే అనుకున్నారు. కానీ ఆ తర్వాత ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు నరేశ్- పవిత్ర. ఓ సినిమా కోసం ఆ వీడియో చేశారని తర్వాతే తెలిసింది. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. పవిత్ర-నరేశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నరేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తే అందరూ అనుకుంటున్నట్లుగానే నిజ జీవితంలో జరిగిన సంఘటనలే తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. నరేశ్ తన జీవిత కథనే సినిమాగా రూపొందించినట్లు తెలుస్తోంది. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో జయసుధ, శరత్బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. -
నరేశ్-పవిత్రల ‘మళ్ళీ పెళ్లి’ క్రేజీ అప్డేట్
సీనియర్ నటుడు వీకే నరేశ్, పవిత్ర లోకేశ్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ మధ్య ఈ జంట తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ వీడియోని విడుదల చేసింది. అయితే అది నిజ జీవితానికి సంబంధించినది కాదని.. ఓ సినిమా కోసం అలా వీడియో చేశారని తర్వాత తెలిసింది. ఆ సినిమా పేరే ‘మళ్ళీ పెళ్లి’. మెగా మూవీ మేకర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నరేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పెద్ద వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని తెలుస్తుంది. తాజాగా ఈసినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా టీజర్ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఏప్రిల్ 13న ‘మళ్ళీ పెళ్లి’టీజర్ విడుదల చేయనున్నట్లు నరేశ్ ట్వీటర్ వేదికగా తెలిపాడు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా 'మళ్ళీ పెళ్లి' అని, ఇది పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఆయన తెలిపారు. జయసుధ, శరత్బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి స్వరాలు, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. Experience the Magic of Love with the Teaser of #MalliPelli - Telugu ❤️🔥#MattheMaduve - Kannada ❤️🔥 RELEASING ON APRIL 13th 🫶 Directed by @MSRajuOfficial #PavitraLokesh @vanithavijayku1 @VKMovies_ @EditorJunaid @adityamusic Summer 2023 Release! pic.twitter.com/3AT2b7HQvw — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) April 8, 2023 -
సందడి చేసిన నరేష్, పవిత్ర లోకేష్
పశ్చిమ గోదావరి: మండలంలోని ఏలూరుపాడులో సినీనటులు నరేష్, పవిత్ర లోకేష్ సందడి చేశారు. ఆదివారం గ్రామంలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వారు ప్రధాన కూడలిలో ఉన్న అల్లూరి సీతారామరాజు, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. -
నరేశ్- పవిత్ర పెళ్లి.. ఎట్టకేలకు వచ్చేసిన క్లారిటీ!
నటుడు నరేశ్, పవిత్రలు పెళ్లి చేసుకున్నారంటూ ఓ వీడియో తెగ వైరలయిన సంగతి తెలిసిందే! ఇద్దరూ లిప్ కిస్ ఇచ్చుకున్న ఫోటో కూడా తెగ చక్కర్లు కొట్టింది. వీళ్లిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నామని గతంలోనే ప్రకటించడంతో నిజంగానే వీరి పెళ్లి అయిపోయిందనుకున్నారంతా! కానీ కొందరు మాత్రం ఇది రియల్ పెళ్లిలా లేదే? రీల్ పెళ్లిలా ఉందే! అని అనుమానం వ్యక్తం చేశారు. తాజాగా వారి అనుమానమే నిజమైంది. నరేశ్- పవిత్రల పెళ్లి సినిమా ప్రమోషన్స్లో భాగమేనని రుజువైంది. పవిత్రతో కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా చేసినట్లు వెల్లడించాడు నరేశ్. ఈ చిత్రం వేసవి కానుకగా థియేటర్లలో విడుదల కానున్నట్లు పోస్టర్, వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశాడు. తెలుగులోనే కాకుండా కన్నడలోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్లు చావు దెబ్బ కొట్టావ్.. నీ పని బాగుంది అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. A beautiful project to celebrate the glorious 50th anniversary of #VijayakrishnaMovies🤩 Here’s the 1st Look of my next #MattheMaduve ❤️ Kannada - https://t.co/6jOBbGUKSP Directed by @MSRajuOfficial Co-starring #PavitraLokesh😍 Summer 2023 Release!@VKMovies_ pic.twitter.com/pbxIgzQQZc — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 24, 2023 #MalliPelli #MattheMaduve ❤️ pic.twitter.com/eqxa2TVELb — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 24, 2023 -
నరేష్తో పెళ్లి.. పవిత్ర లోకేష్పై మాజీ భర్త సుచేంద్ర సంచలన ఆరోపణలు!
సినీ నటుడు నరేష్-పవిత్రా లోకేష్లు పెళ్లిబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. కొంతకాలంగా సీక్రెట్ రిలేషన్లో ఉన్న వీరిద్దరు మార్చి 10న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినట్లు నరేష్ ప్రకటించాడు. మీ ఆశీర్వదాలు కావాలంటూ పెళ్లి వీడియో షేర్ చేశాడు. ఇక అప్పటి నుంచి వీరి పెళ్లి వ్వవహరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. నిజంగా పెళ్లి చేసుకున్నారా? లేక మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ వీడియో షేర్ చేశారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా నరేశ్కు ఇది నాలుగవ పెళ్లి కాగా.. పవిత్రకు మూడో పెళ్లి అనే విషయం తెలిసిందే. చదవండి: హీరోగా కొడుకు లుక్ షేర్ చేస్తూ మురిసిపోయిన యాంకర్ సుమ అయితే వీరి పెళ్లి వీడియో బయటకు వచ్చిన అనంతరం పవిత్ర మొదటి భర్త, కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్ ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రీసెంట్గా ఆయన కన్నడ మీడియాతో ముచ్చటించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పవిత్ర-నరేష్ పెళ్లిపై సుచేంద్రకు ప్రశ్న ఎదురవగా మాజీ భార్యపై ఆయన తీవ్ర ఆరోపణలు చేసినట్లు కన్నడ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తాజా బజ్ ప్రకారం సుచేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ప్లాన్ ప్రకారమే పవిత్ర నరేష్కు దగ్గరైందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడట. అంతేకాదు ‘పవిత్ర లగ్జరీ లైఫ్ కోసం ఆమె ఏమైనా చేస్తుంది. ఆస్తి కోసమే నరేష్తో లవ్ ట్రాక్ నడిపింది. డబ్బు కోసం ఆమె ఎంతకైన దిగజారుతుంది. చదవండి: నా పిచ్చిని భరించే ఏకైక వ్యక్తివి నువ్వు: లాస్య ఎమోషనల్ పోస్ట్ కేవలం డబ్బు పిచ్చితోనే గతంలో ఇద్దరికి విడాకులు ఇచ్చింది. పవిత్ర పచ్చి అవకాశవాది. ఆ విషయం నరేష్ ఇంకా అర్థం కావట్లేదు. నరేష్కు దగ్గరై విజయ నిర్మల గారు సంపాదించిన రూ. 1500 కోట్ల ఆస్తిని కొట్టేయాలనేదే ఆమె ప్లాన్. ఈ విషయం నరేష్కు కూడా త్వరలోనే అర్థం అవుతుంది’ అంటూ పవిత్రపై సుచేంద్ర ప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశాడు. దీంతో ఆయన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచాయి. ఆయన వ్యాఖ్యలతో మరోసారి నరేష్-పవిత్ర ప్రేమ, పెళ్లి వార్తల్లోకెక్కింది. కాగా గతంలో కూడా సుచేంద్ర ప్రసాద్ పవిత్రపై ఇలాంటి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పవిత్ర లోకేష్ మంచిది కాదని, ఆమెకు కాపురాలు కూల్చే బుద్ధి ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. -
నరేశ్- పవిత్ర పెళ్లి వీడియో.. స్పందించిన నటుడు
ఉదయం నుంచి నరేశ్- పవిత్ర పెళ్లి వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో అభిమానులు అయోమయంలో పడ్డారు. అయితే తాజాగా ఆ ట్రెండింగ్ పెళ్లి వీడియోపై సినీ నటుడు నరేశ్ స్పందించారు. త్వరలోనే అన్ని విషయాలు మీతో చెబుతానంటూ వివరణ ఇచ్చారు. 'ఇంటింటి రామాయణం' మూవీ సమావేశంలో పాల్గొన్న నరేశ్ 'మీ పెళ్లి ఎప్పుడు? పెళ్లి భోజనం ఎప్పుడు పెడతారు’ అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. త్వరలోనే వెల్లడిస్తా.. నరేశ్ మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. నాకు రీల్ లైఫ్తో పాటు రియల్ లైఫ్ కూడా ఉంది. త్వరలో ఈ అంశంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తా. అప్పటి వరకు కాస్తా ఓపిక పట్టండి. ఇప్పుడు నేను మాట్లాడితే ‘ఇంటింటి రామాయణం ప్రమోషన్స్పై ప్రభావం పడుతుంది. ’అని అన్నారు. అసలేం జరిగిందంటే... కాగా.. నరేశ్ తన ట్విటర్ ఖాతాలో 'ఒక పవిత్రబంధం.. రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు మీ పవిత్రా-నరేశ్' అని పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరలైంది. సమ్మోహనం చిత్రం కోసం కలిసి పనిచేసిన నరేశ్ - పవిత్ర ఆ తర్వాత చాలా సినిమాల్లో కనిపించారు. ఈక్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని గతంలో వార్తలు నెట్టింట హల్చల్ చేశాయి. అంతే కాకుండా కొత్త ఏడాదిలో స్వాగతం పలుకుతూ గతేడాది డిసెంబర్ 31న నరేశ్ షేర్ చేసిన వీడియో ఆ వార్తలకు మరింత ఊతమిచ్చింది. -
రెండు నెలల క్రితమే నరేశ్-పవిత్ర పెళ్లి చేసుకున్నారా? అరె ఏంట్రా ఇది!
సీనియర్ నటుడు నరేశ్, నటి పవిత్ర లోకేశ్ పెళ్లి బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. తాము ఒక్కటయ్యామంటూ ఈ రోజు(మార్చి 10న) నరేశ్ అధికారిక ప్రకటన ఇచ్చాడు. ఈ సందర్భంగా వీరి పెళ్లి వీడియోను షేర్ చేశాడు. అయితే ఈ వివాహ ప్రకటనలో నరేశ్ షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ సినిమాలో భాగంగా తీసిన వీడియో క్లిప్ను నరేశ్ షేర్ చేసినట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో నెటిజన్లు నరేశ్పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అరె ఎంట్రా ఇది... ఎన్ని సార్లు ఫూల్ చేస్తావంటూ నరేశ్పై విమర్శలు గుప్పిస్తున్నారు. చదవండి: పెళ్లి చేసుకున్న నరేశ్-పవిత్ర? ఇంతకి ఏం జరిగిందంటే.. ఈ రోజు నరేశ్ ‘‘ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. కొత్త ప్రయాణం ప్రారంభించాం. మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం’’ అంటూ పెళ్లి వీడియో షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ ట్విటర్ యూజర్ స్పందిస్తూ నరేశ్-పవిత్రల గురించి షాకింగ్ విషయం బయటపెట్టారు. ‘‘పవిత్ర బంధం’ అంటూ ఈ రోజు నరేశ్ ట్విట్టర్లో షేర్ చేసిన పెళ్లి వీడియో నిజం కాదు. రెండు నెలల క్రితమే నరేష్, పవిత్రను వివాహం చేసుకున్నాడు. ఈ వీడియో ఇంకా పేరు ఖరారు చేయని ఓ సినిమాలోనిది. దీనికి ఎం ఎస్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు’’అని ట్వీట్లో పేర్కొన్నారు. చదవండి: అందుకే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చా: ‘బలగం’ డైరెక్టర్ వేణు దీంతో ఈ ట్వీట్ నెట్టింట చర్చనీయాంశమైంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇది నిజమా? అంటూ సర్ప్రైజ్ అవుతున్నారు. దీంతో నరేశ్పై తమదైన స్టైల్లో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. కాగా నరేశ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకోగా.. మూడవ భార్య రమ్య రఘుపతి విడాకుల వ్యవహరం ఇంకా కోర్టులోనే ఉంది. మరోవైపు పవిత్రకు కూడా ఇదివరకే రెండుసార్లు పెళ్లై విడాకులైన సంగతి తెలిసిందే. సమ్మోహనం మూవీ సమయంలో పవిత్ర-నరేశ్లు మధ్య పరిచయం ఏర్పడగా అప్పటి నుంచి వీరిద్దరు సీక్రెట్ రిలేషన్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిపై రూమర్స్ రాగా న్యూ ఇయర్ సందర్భంగా తమ రిలేషన్పై నరేశ్ అధికారిక ప్రకటన ఇచ్చాడు. కాగా ప్రస్తుతం నరేశ్-పవిత్రలు దుబాయ్ వెకేషన్లో ఉన్నారు. పవిత్ర బంధం అంటూ ట్విట్టర్ లో పెళ్లి వీడియో పోస్ట్ చేసిన @ItsActorNaresh రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకున్న నరేష్. ఈ వీడియో ఇంకా పేరు ఖరారు చేయని ఒక సినిమా కి సంబంధించింది. సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న ఎమ్ ఎస్ రాజు https://t.co/SN8qYlpSEk — HEMA NIDADHANA (@Hema_Journo) March 10, 2023 -
Naresh-Pavitra Photos: పెళ్లి బంధంతో ఒక్కటైన నరేష్-పవిత్రా లోకేశ్? (ఫొటోలు)
-
పెళ్లి తర్వాత దుబాయ్కు చెక్కేసిన నరేష్- పవిత్రా లోకేశ్
సినీ నటుడు నరేష్-పవిత్రా లోకేశ్లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వీరి వివాహం మైసూర్లో జరిగినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పెళ్లి వీడియోను నరేష్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లోనే ఆ వీడియో వైరల్గా మారింది. ‘ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు, మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు, మీ #PavitraNaresh’అంటూ నరేష్ ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న నరేష్-పవిత్రా లోకేశ్లు తాజాగా మరోసారి పెళ్లి వీడియోతో టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు. నరేష్కు ఇది నాలుగో పెళ్లికాగా పవిత్రా లోకేశ్కు ఇది మూడో పెళ్లి. ఇక ప్రస్తుతం ఈ కొత్తజంట హనీమూన్ కోసం దుబాయ్కు వెళ్లినట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇద్దరూ కలిసి దుబాయ్ వీధుల్లో సందడి చేస్తున్నారు. Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗 ఒక పవిత్ర బంధం రెండు మనసులు మూడు ముళ్ళు ఏడు అడుగులు 🙏 మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు - మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023 -
నరేష్-పవిత్రా లోకేశ్ల పెళ్లిలో ఊహించని ట్విస్ట్! కనిపెట్టేసిన నెటిజన్లు
సినీ నటులు నరేష్- పవిత్రా లోకేశ్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం మూడుముళ్లు, ఏడడుగులు వేసి తమ బంధాన్ని పదిలం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పెళ్లి వీడియోను స్వయంగా నరేష్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ.. ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముడ్లు, ఏడు అడుగులు అంటూ నరేష్ రాసుకొచ్చారు. అయితే వీరి పెళ్లి ఎక్కడ జరిగిందనేది స్పష్టత లేదు. నరేష్కు ఇదివరకే మూడుసార్లు పెళ్లిళ్లు అయ్యాయి. దీంతో ఇది నాలుగోది. అటు పవిత్రా లోకేశ్కు సైతం ఇది మూడో పెళ్లి. ప్రస్తుతం వీరి పెళ్లి వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఇది నిజంగా జరిగిన పెళ్లేనా? లేదా ఏదైనా సినిమా ప్రమోషన్ కోసం రూపొందించిన వీడియో అన్నదానిపై క్లారిటీ లేదు. గతంలోనూ నరేష్ న్యూఇయర్ సందర్భంగా పవిత్రా లోకేశ్కు లిప్లాక్ ఇస్తూ..కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం.. మీ ఆశిస్సులు కావాలి అంటూ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే అది సినిమా కోసం చేసిన వీడియో. ఇప్పుడు కూడా నరేష్-పవిత్రా లోకేశ్లు రిలీజ్ చేసిన వీడియోలో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాం అంటూ వీడియోను రిలీజ్ చేశారు కానీ బ్యాక్గ్రౌండ్లో వారి కుటుంబసభ్యులు ఎవరూ కనిపించడం లేదు. వాళ్లెవరో క్యారెక్టర్ ఆర్టిస్టుల్లా కనిపిస్తున్నారు. మరోవైపు.. సూపర్స్టార్ కృష్ణ మరణించి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. హిందూ సాంప్రదాయం ప్రకారం తండ్రి మరణించి కనీసం ఆరు నెలలు కూడా గడవకుండా ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు కూడా జరిపించరు. వీటన్నింటిని బేరీజు వేసుకుంటే నరేష్-పవిత్రాలది కేవలం రీల్ పెళ్లిగా పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗 ఒక పవిత్ర బంధం రెండు మనసులు మూడు ముళ్ళు ఏడు అడుగులు 🙏 మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు - మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023 New Year ✨ New Beginnings 💖 Need all your blessings 🙏 From us to all of you #HappyNewYear ❤️ - Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022 -
పెళ్లి పీటలెక్కిన నరేష్, పవిత్ర
-
ఆ సినిమాలో నిజంగానే నాతో బీర్ తాగించారు: ఆమని
నటి ఆమని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అప్పట్లో శుభలగ్నం, మావిడాకులు, మిస్టర్ పెళ్ళాం.. వంటి సినిమాల్లోని ఆమె పాత్రల్లో ఎప్పటికీ గుర్తిండిపోతాయి. అనేక హిట్ చిత్రాల్లో నటించి సహజమైన తన నటనతో అందరి మన్ననలు అందుకున్నారు. కెరీర్ ఫామ్లో ఉన్న సమయంలోనే సినిమాల నుంచి తప్పుకొని వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోయారు. అయితే చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమని ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ఫస్ట్ మూవీ ‘జంబలకిడి పంబ’ షూటింగ్లోని ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకుంది. ఈ సినిమాలో మందుకొట్టే సీన్ ఉంటుందని డైరెక్టర్ ముందు నాకు చెప్పలేదు. డైరెక్ట్గా షూటింగ్ స్పాట్కు వెళ్లాక ఆ సీన్ చేయాలన్నారు. బాటిల్లో ఏదైనా కూల్డ్రింక్ కలిపి ఇస్తారేమో అనుకున్నా. కానీ నిజంగానే బీర్ ఇచ్చి జస్ట్ ఒక సిప్ చేయమన్నారు. అప్పుడు హీరో నరేష్ కూడా ఏం కాదమ్మ తాగు అని అన్నారు. అలా మొదటి సినిమాలోనే మందుతాగే సీన్ చేశాను అంటూ చెప్పుకొచ్చారు. -
గచ్చిబౌలి పీఎస్ పరిధిలో సినీ నటుడు నరేష్ ఇంటిపై దాడి
-
నటుడు నరేష్ ఇంటిపై దాడి.. మూడో భార్య చేయించిందని ఆరోపణ
సినీ నటుడు నరేష్ ఇంటిపై దుండగులు దాడి చేశారు. గచ్చిబౌలిలోని ఆయన ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడి కారును ధ్వంసం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన నరేష్.. తన మూడో భార్య రమ్య రఘుపతి దాడి చేయించిందని ఆరోపించాడు. నరేష్ ఫిర్యాదుపై రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. కాగా గత కొన్నిరోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న నరేష్ ఇటీవలె తన మూడో భార్య రమ్యపై సంచలన ఆరోపణలు చేశారు. ఆస్తి కోసం తనను చంపేందుకు రమ్య ప్రయత్నించిందని, ఇంటివద్ద రెక్కీ కూడా నిర్వహించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన ఇంటిపై దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న విజయనిర్మల మనవడు
దివంగత ప్రముఖ నటి–దర్శకురాలు విజయనిర్మల మనవడు శరణ్ కుమార్ (నరేశ్ కజిన్ రాజ్కుమార్ కొడుకు) హీరోగా రూపొందిన చిత్రం ‘మిస్టర్ కింగ్’. శశిధర్ చావలి దర్శకత్వంలో బీఎన్ రావు నిర్మించారు. యశ్విక నిష్కల, ఊర్వీ సింగ్ కథానాయికలు. ఈ నెల 24న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అతిథిగాపాల్గొన్న దర్శక–నిర్మాత ఎంఎస్ రాజు మాట్లాడుతూ – ‘‘ట్రైలర్ ప్రామిసింగ్గా వుంది. కొత్త కాన్సెప్ట్తో సినిమాని రూపొందించారనిపిస్తోంది’’ అన్నారు. ‘‘మా అల్లుడు శరణ్ హీరోగా పరిచయమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ, విజయ నిర్మలగార్ల ఆశీస్సులు ఉంటాయి’’ అన్నారు నరేష్. ‘‘ఈ చిత్రంలో బలమైన పాత్ర చేశాను’’ అన్నారు శరణ్. ‘‘ఆత్మాభిమానం వున్న ఓ అబ్బాయి కథ ఇది’’ అన్నారు శశిధర్. ‘‘సినిమా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు బీఎన్ రావు. -
బెడ్రూమ్లో దాక్కొని చూసినట్లు మాట్లాడుతున్నారు: నరేశ్
సినీనటుడు నరేశ్ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకోమంటూ గతంలోనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను సైతం పోలీసులకు సమర్పించారు. ఈ కేసులో విచారణ ఎంతవరకు వచ్చిందనేది తెలుసుకోవడానికి తాజాగా మరోసారి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. 'ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. సెలబ్రిటీలుగా మా గురించి మాట్లాడే హక్కు ఉంటుందేమో కానీ మమ్మల్ని కించపరిచే హక్కు మీకు లేదు. ఒక వ్యక్తి బెడ్రూమ్లో, బాత్రూమ్లో దాక్కుని చూసినట్లుగా వారి పర్సనల్ విషయాలు మాట్లాడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మధ్య డిస్టబింగ్ కాల్స్ కూడా వస్తున్నాయి. దీనిపై గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ ఎంతవరకు వచ్చిందో కనుక్కునేందుకు సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరకు వచ్చాను. ఆ కేసులో పోలీసులకు గట్టి సాక్ష్యాలు దొరికాయి. వీటి రిజల్ట్ కూడా త్వరలోనే మీడియాకు చెప్తాను' అని చెప్పుకొచ్చాడు నరేశ్. చదవండి: రెండు ఓటీటీల్లోకి లక్కీ లక్ష్మణ్ -
నరేశ్- రమ్య వ్యవహారంలో ట్విస్ట్.. రూ.10 కోట్ల సెటిల్మెంట్
సీనియర్ నటుడు నరేశ్- రమ్య రఘుపతి వ్యవహారంలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. తనకు ప్రాణహాని ఉందంటూ కోర్టుకెక్కాడు నరేశ్. తన మూడో భార్య రమ్య సుపారీ ఇచ్చి హత్య చేయించాలని ప్రయత్నిస్తోందన్నాడు. తనను చంపేందుకు రాకేశ్ శెట్టితో ఇంటి దగ్గర రెక్కీ చేయించిందని కోర్టులో పిటిషన్ వేశాడు. తన ఫోన్ హ్యాక్ చేసి బ్లాక్మెయిల్ చేస్తోందన్నాడు. రమ్య వేధింపులను తట్టుకోలేకపోతున్నానని, ఆమె నుంచి విడాకులు కావాలని కోరుతున్నాడు. పెళ్లైన నెల నుంచే తనను వేధించేదని, కనీసం తనకు తినడానికి తిండి కూడా పెట్టేది కాదన్నాడు. ఏదైనా ఫంక్షన్ జరిగితే తాగి రచ్చ చేసేదని చెప్తున్నాడు. తనపై కంటే తన ఆస్తి, డబ్బుపైనే రమ్యకు ప్రేమ ఎక్కువంటున్నాడు. మరోవైపు రూ.10 కోట్ల రూపాయలతో సెటిల్మెంట్ చేసుకునేందుకు రెడీ అంటూ రమ్య మాట్లాడిన ఆడియో లీక్ ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. చదవండి: ఎన్టీఆర్ను జమున కాలితో తన్నడంతో వివాదం -
నరేశ్ నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు: రమ్య
సినీ నటుడు నరేశ్ కొంతకాలంగా తన మూడో భార్య రమ్య రఘుపతికి దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో నటి పవిత్రా లోకేశ్కు దగ్గరైన అతడు ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది రమ్య. 'మా ఇద్దరికీ విడాకులు మంజూరయ్యాయని వార్తలు వస్తున్నాయి. అది పూర్తిగా అవాస్తవం. కోర్టులో కేసు ఇంకా నడుస్తోంది. తను విడాకులు తీసుకుని ఇంకొకరితో సెటిలైపోదామనుకుంటున్నాడు. కానీ మా బాబు మేమిద్దరం కలిసే ఉండాలని కోరుకుంటున్నాడు. వాడి కోసమైనా నేను విడాకులివ్వను. అతడికి పవిత్రతో పెళ్లి జరగనివ్వను. నరేశ్ ఎన్నోసార్లు అమ్మాయిలతో అడ్డంగా దొరికిపోతే వచ్చి కాళ్లు పట్టుకుని సారీ చెప్పేవాడు, ఏడ్చేవాడు. నేను తల్లిలా క్షమించేదాన్ని. మొన్నటికి మొన్న నరేశ్- పవిత్ర లిప్లాక్ చూసి మీ నాన్న పెళ్లంటగా అని బాబును వాడి ఫ్రెండ్స్ ఆటపట్టిస్తున్నారట. పిల్లాడి మనసు గాయపడుతోంది. అతడి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నేను రాఖీ కట్టిన వ్యక్తితో, డ్రైవర్తో.. ఇలా చాలామందితో నాకు అక్రమ సంబంధం అంటగట్టాడు. నన్ను బద్నాం చేస్తున్నాడు. ఇన్ని నిందలు పడుతున్నా కూడా నేను బతికున్నానంటే అది నా కొడుకు కోసమే! సమ్మోహనం సినిమా సమయంలో పవిత్ర ఓ సారి ఇంటికి వచ్చింది. పిచ్చిదానిలా నేను ఆమెకు వడ్డించి సరదాగా కలిసిపోయాను. 'మా' ఎలక్షన్స్ సమయంలో నాకు తనమీద కొంత అనుమానం మొదలైంది. అతడి బర్త్డే రోజు ఇష్టమైన కేక్ తీసుకొస్తే కట్ చేయకుండా వెళ్లిపోయాడు. తర్వాత పవిత్ర దగ్గరకు వెళ్లి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు. నా కంట్లో నీళ్లు వస్తే ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వనని నరేశ్ను హెచ్చరించింది అతడి తల్లి. కానీ ఎప్పుడైతే ఆమె మరణించిందో అతడికి హద్దు లేకుండా పోయింది' అని చెప్పుకొచ్చింది రమ్య. చదవండి: నరేశ్పై సంచలన ఆరోపణలు చేసిన రమ్య -
Actor Naresh: నరేశ్పై సంచలన ఆరోపణలు చేసిన మూడో భార్య
సినీనటుడు నరేశ్, ఆయన మూడో భార్య రమ్య రఘుపతి మధ్య విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే! కొంతకాలంగా రమ్యకు దూరంగా ఉంటున్న నరేశ్ నటి పవిత్రతో సన్నిహితంగా ఉంటున్నాడు. దీంతో రమ్య.. భార్యను నేనుండగా వేరొకరితో ఎందుకు తిరుగుతున్నావంటూ రచ్చచేసింది. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. తాజాగా రమ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నరేశ్ ఎలాంటివాడో చెప్పుకొచ్చింది. 'నరేశ్.. నాకు డ్రైవర్తో లింకు పెట్టాడు. ఎవరెవరితోనూ లింకులు కలిపాడు. అంత క్రియేటివిటీ ఆయనకే దక్కుతుంది. నా మీద అతడు నోటికొచ్చిన ఆరోపణలు చేస్తున్నకొద్దీ బాబు చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. నిద్ర లేని రాత్రుళ్లు గడుపుతున్నాడు. ఎంతో హర్ట్ అవుతున్నాడు. అతడి గురించి ఒక్కసారి కూడా ఆలోచించడం లేదు. అంతేకాదు, నరేశ్ పోర్న్ వీడియోలు చూస్తాడు. నాన్న డర్టీ వీడియోలు చూస్తున్నాడని నా కొడుకు రణ్వీర్ వచ్చి చెప్పడంతో ఆ విషయం నాకు తెలిసింది. తండ్రిగా ఎంత బాధ్యతగా ఉండాలి? కానీ అతడు ఎంతో చండాలంగా ప్రవర్తిస్తున్నాడు' ఆగ్రహం వ్యక్తం చేసింది రమ్య. కాగా నరేశ్ ప్రస్తుతం నటి పవిత్ర లోకేశ్తో ప్రేమలో ఉన్నాడు. త్వరలోనే వీరి పెళ్లి కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇందులో నరేశ్, పవిత్ర లిప్లాక్తో తమ ప్రేమను ప్రకటించారు. చదవండి: షారుక్ కొడుకే కాదు కూతురు కూడా లవ్లో పడింది -
నరేష్కు కలిసిరాని మూడు పెళ్లిళ్లు.. త్వరలోనే నాలుగో పెళ్లి
నటుడు నరేష్ త్వరలోనే నాలుగో పెళ్లి చేసుకోనున్నాడు. ఇప్పటికే మూడుసార్లు పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకున్న నరేష్ పవిత్ర లోకేష్ని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ వీడియోను షేర్ చేయగా పవిత్రా-నరేష్ల వ్యవహారం మరోసారి హాట్టాపిక్గా మారింది. ఈ క్రమంలో గతంలో నరేష్ చేసుకున్న మూడు పెళ్లిళ్లు ఇప్పుడు మరోసారి తెరమీదకి వచ్చాయి. మొదటగా సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను నరేష్ పెళ్లిచేసుకున్నాడు.వీరి కొడుకే హీరో నవీన్ విజయ్కృష్ణ. ఆమెతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి కూడా ఓ కొడుకు పుట్టాడు. ఆమెకు కూడా విడాకులు ఇచ్చేసి ముచ్చటగా మూడోసారి రఘువీరా రెడ్డి సోదరుడి కుమార్తె అయిన రమ్య రఘపతిని పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం సజావుగానే సాగిన వీరి కాపురం వీరిబంధం కూడా ఎక్కువకాలం నిలబడలేదు. దీంతో ఆమెకు దూరంగా ఉన్న నరేష్ కొన్నాళ్లుగా పవిత్రాలోకేశ్తో సహజీవనం చేస్తున్నారు. ఇటీవలె ఓ హోటల్ రూమ్లో నరేష్-పవిత్రా లోకేశ్లను నరేష్ మూడోభార్య రమ్య రఘుపతి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది కూడా. సీన్కట్ చేస్తే.. ఇప్పుడు 62ఏళ్ల వయసులో నాలుగో పెళ్లికి రెడీ అవుతున్నాడు నరేష్. -
త్వరలో నటుడు నరేష్, పవిత్రల పెళ్లి
-
పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నా.. నరేశ్ కీలక ప్రకటన
సీనియర్ నటుడు నరేశ్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. తన సహచర నటి, స్నేహితురాలు పవిత్ర లోకేష్ని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేస్తూ..‘కొత్త ఏడాది.. కొత్త ఆరంభాలు.. మీ అందరి ఆశిస్సులు కావాలి. త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం’అని నరేశ్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా నరేశ్, పవిత్ర పెళ్లి చేసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి వీరిద్దరిని ఓ హోటల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని గొడవ చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ బహిరంగంగా కలిసి తిరగడం తగ్గించారు. పవిత్ర సైతం కొన్నాళ్లుగా భర్తకు దూరంగా ఉంటుంది. ఎట్టకేలకు 2023లో నరేశ్, పవిత్రలు పెళ్లి చేసుకొని కొత్త కాపురం పెట్టబోతున్నారు. మూడో భార్య రమ్యతో విడాకుల వ్యవహారం పూర్తయిన తర్వాతే నరేశ్ పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. New Year ✨ New Beginnings 💖 Need all your blessings 🙏 From us to all of you #HappyNewYear ❤️ - Mee #PavitraNaresh pic.twitter.com/JiEbWY4qTQ — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) December 31, 2022 -
బైరి నరేష్ పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు
-
భార్యతో సఖ్యతగా మెలుగుతున్నాడనే ఘాతుకం
స్నేహ బంధానికి ద్రోహం చేసి తన భార్యతో సఖ్యతగా మెలుగుతున్నాడని అనుమానం పెంచుకున్నాడు.. మానసిక క్షోభకు కారణమయ్యాడని మిత్రుడినే బద్ధ శత్రువుగా భావించి అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అదును చూసి మరో మిత్రుడి సహకారంతో దారుణంగా హత్య చేసి.. ఆపై ప్రమాదంగా చిత్రీకరించాడు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూడడంతో చివరకు కటకటాలపాలయ్యాడు. ఇదీ.. సూర్యాపేట జిల్లా మోతె మండలం అన్నారిగూడెం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన హత్యోందంతం వెనుక ఉన్న ప్రధాన కారణం. నల్గొండ: మోతె మండలం అన్నారిగూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నరేశ్ మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అతడి మరణం ప్రమాదవశాత్తు జరిగిందని కాదని.. హత్యేనని తేల్చారు. ఘాతుకానికి ఒడిగట్టిన సూత్రధారితో పాటు మరో ఇద్దరు పాత్రధారులను అరెస్ట్ చేశారు. మునగాల పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన పంది నరేశ్ (28), పడిశాల శంకర్ది ఒకే సామాజిక వర్గం. ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. వివాహాలు చేసుకుని నరేశ్ ఆటో డ్రైవర్గా, శంకర్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అనుమానం పెంచుకుని.. నరేశ్, శంకర్ ఇద్దరూ స్నేహితులు కావడంతో ఒకరింటికి ఒకరు వచ్చి పోతుండేవారు. శంకర్ లేని సమయంలో కూడా నరేశ్ ఇంటికి వచ్చి వెళ్తూ తన భార్యతో సఖ్యతగా మెలుగుతున్నాడని అనుమానం పెంచుకున్నాడు. ఆ విషయంలో తాను ఎక్కడా భయటపడకుండా నరేశ్తో స్నేహంగా ఉంటూనే అతడిపై కక్ష పెంచుకున్నాడు. అదును చూసి హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. మరో మిత్రుడి సహకారం తీసుకుని.. నరేశ్ని హత్య చేయడం తన ఒక్కడితో కాదని కారుడ్రైవర్గా పనిచేస్తున్న ఖమ్మం జిల్లా తిరుమాలయపాలెం మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన తన మిత్రుడు గుండెపంగు మధుసూదన్ సహకారం తీసుకుని పథకం రూపొందించి అమలు కోసం వేచి చూస్తున్నాడు. అందుకు అతడికి రూ.30వేలు ఇచ్చాడు. అందులో భాగంగా నవంబర్ 26న నరేశ్ తన అత్తగారి గ్రామం మునగాలలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. అప్పటికే స్నేహితుడు మధుసూదన్ను రప్పించుకున్న శంకర్ మద్యం సేవిద్దామని నరేశ్కు కబురు పెట్టాడు. దీంతో నరేశ్ అదేరోజు రాత్రి మోతె మండలం విభళాపురం గ్రామ శివారులో గల స్టీలు ప్లాంటు వద్దకు ఆటోలో చేరుకొని వారిద్దరితో కలిసి పూటుగా మద్యం సేవించాడు. నరేశ్ పూర్తిగా మత్తులోకి వెళ్లాక ఆటోలోనే మెడకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం ఆటోను పక్కనే ఉన్న ఎస్ఆర్ఎస్పీ కాల్వలోకి తోసేసి ప్రమాదంగా చిత్రీకరించారు. అనంతరం అన్నారిగూడెం గ్రామానికి చెందిన మరో మిత్రుడు దున్నపోతుల వెంకటేశ్వర్లుకు హత్యోదంతాన్ని వివరించారు. మధుసూదన్ను బైక్పై అతడి స్వగ్రామంలో విడిచిపెట్టి శంకర్, వెంకటేశ్వర్లు అన్నారిగూడెం చేరుకున్నారు. అనుమానంతో అదుపులోకి తీసుకుని.. ఇటీవల ఎస్ఆర్ఎస్పీ కాల్వలో నరేశ్ విగతజీవుడిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు అతడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా నరేశ్ స్నేహితుడు శంకర్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. కేసులో భాగస్వాములైన మధుసూదన్ను ఖమ్మం జిల్లా నాయకన్గూడెం టోల్ప్లాజా వద్ద, వెంకటేశ్వర్లును అతడి స్వగ్రామంలో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివరించారు. కేసును ఛేదించిన మునగాల సీఐ ఆంజనేయులు, మోతె ఎస్ఐ ప్రవీణ్కుమార్, సిబ్బందిని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. సమావేశంలో మునగాల, నడిగూడెం ఎస్ఐలు లోకేశ్, నాగభూషణ్రావు తదితరులు ఉన్నారు. -
పవిత్ర లోకేష్, నరేష్ వ్యవహారంలో కీలక మలుపు
-
నరేశ్- పవిత్రా లోకేశ్ల వ్యవహారంలో కీలక మలుపు
నరేశ్- పవిత్రా లోకేశ్ల వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. తమ వ్యక్తిగత జీవితంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని నరేష్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. యూట్యూబ్ చానళ్లు, కిందరు వ్యక్తులపై పరువు నష్టం దావా వేశారు. దీంతో నరేశ్ ఫిర్యాదులో పేర్కొన్న 12 మందిపై విచారణ చేపట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమపై ఇష్టానుసారంగా వార్తలను ప్రసారం చేస్తూ తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ నటులు నరేశ్, పవిత్ర గతంలో సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.అసత్య ప్రచారం చేస్తూ తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నరేష్ ఫిర్యాదులో పేర్కొన్న ఇమండి టాక్స్ రామారావ్, రెడ్ టీవీ, లేటెస్ట్ తెలుగు డాట్ కామ్, లైఫ్ ఇన్స్పిరేషన్, రమ్య రఘుపతి, మూవీ న్యూస్, ది న్యూస్ క్యూబ్, తెలుగు న్యూస్ జర్నలిస్ట్ , దాసరి విజ్ఞాన్ , కృష్ణ కుమారి , మిర్రర్ టీవీ చానళ్లకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. -
Hyderabad: అర్థరాత్రి తప్పతాగి ఎస్ఐని ఢీకొట్టారు.. తీవ్రగాయాలతో..
సాక్షి, హైదరాబాద్(హిమాయత్నగర్): మద్యం మత్తులో బైక్పై వెళుతున్న ఇద్దరు యువకులు డ్యూటీలో ఉన్న ఎస్ఐని ఢీకొట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..శుక్రవారం అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో హిమాయత్నగర్ మెక్డోనాల్డ్స్ సమీపంలో ఎస్ఐ గౌనిగాని నరేష్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై వన ఇద్దరు యువకులను ఆపేందుకు నరేష్ ప్రయత్నించాడు. మద్యం మత్తులో ఉన్న సదరు యువకులు పోలీసులకు పట్టుబడతామనే భయంతో బైక్ వేగం పెంచారు. వారిని ఆపేందుకు అడ్డుగా వెళ్లిన నరేష్ను ఢీ కొట్టడంతో అతను అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఎస్ఐని హైదర్గూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అనంతరం నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు. మోకాలి కాలి నుంచి పాదం వరకు ఉన్న ప్రధాన ఎముక విరగడంతో సర్జరీ చేసిన వైద్యులు స్టీల్ రాడ్డును అమర్చారు. నిందితుల అరెస్ట్ ఎస్ఐని ఢీకొట్టి బైక్పై పరారైన యువకులను పోలీసులు వెంబండించి పట్టుకున్నారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ 190 కంటే ఎక్కువ మోతాదులో ఆల్కాహాల్ సేవించినట్లు నిర్థారణ అయ్యింది. నిందితులు రాంనగర్ రామాలయం ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్, న్యూ నల్లకుంటకు చెందిన యశ్వంత్గా గుర్తించిన పోలీసులు శనివారం ఉదయం వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చదవండి: (పెళ్లింట విషాదం.. కొద్దిక్షణాల్లో పెళ్లనగా పెళ్లికుమార్తె ఆత్మహత్య) -
నరేష్ మూడో భార్యపై ఫిర్యాదు చేసిన పవిత్రా లోకేశ్
సినీ నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై నటి పవిత్రా లోకేశ్ ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ను అడ్డుపెట్టుకొని తనను కించపరుస్తుందని ఆమె ఆరోపించింది. రమ్య, నరేష్ల మధ్య కుటుంబ వివాదాలున్నాయి. రమ్యపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసుల్లో జోక్యం చేసుకుంది. నా వ్యక్తిగత జీవితంపై రమ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. నా పరువుకు భంగం కలిగేలా రమ్య వ్యవహరిస్తుంది. యూట్యూబ్ ఛానళ్ల ప్రచారం వెనుక రమ్య హస్తం ఉంది.పలు యూట్యూబ్ ఛానళ్లను రమ్యే వెనుక ఉండి నడిపిస్తుంది.అంతేకాకుండా గతంలో కూడా నాపై దాడి చేసేందుకు ప్రయత్నించింది అంటూ పవిత్రా తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా నరేష్ తనకు సంబంధించి యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పవిత్రా లోకేశ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఫోటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతకర పోస్టులు చేస్తూ తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్, వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలని పవిత్రా తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా గతంలో నరేష్, పవిత్ర లోకేశ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అనంతరం ఓ హోటల్ రూమ్లో నరేష్, పవిత్ర ఉండగా నరేష్ భార్య వచ్చి గొడవ చేశారు. దీంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. -
పవిత్రా లోకేశ్ ఫిర్యాదు.. ఆ వెబ్సైట్లకు నోటీసులు జారీ
సినీనటి పవిత్రా లోకేశ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటివరకు 8 యూట్యూబ్ ఛానెల్స్, వెబ్సైట్స్కు నోటీసులు జారీ చేసిన పోలీసులు మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ మధ్యకాలంలో సినిమాల కంటే పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా పాపులర్ అయిన పవిత్రా లోకేశ్ ఇటీవలె సైబర్ క్రైమ్ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నటుడు నరేశ్, తన పట్ల కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆమె ఆరోపించింది. ఫోటోలు మార్ఫింగ్ చేసి అభ్యంతకర పోస్టులు వైరల్ చేస్తున్నారని పేర్కొంది. అసత్య ప్రచారం చేస్తూ తన ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్న యూట్యూబ్ ఛానెల్స్, వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలని పవిత్రా తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు సోషల్ మీడియాలో పవిత్ర-నరేష్లపై ట్రోలింగ్ చేస్తున్న యూట్యూబ్ చానల్స్కు నోటీసులు జారీ చేసింది. -
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సినీ నటి పవిత్ర
-
ఆహా ఒరిజినల్ 'ఇంటింటి రామాయణం', అప్పుడే స్ట్రీమింగ్!
షోలు, వెబ్ సిరీస్లు, సినిమాలతో తెలుగువారిని ఆకట్టుకుంటోంది ఆహా. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఇంటింటి రామాయణం అనే చిత్రం రాబోతోంది. నరేష్, రాహుల్ రామకృష్ణ, నవ్యస్వామి, గంగవ్వ, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో నటించారు. సురేష్ నారెడ్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డీజే టిల్లు, భీమ్లా నాయక్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా ద్వారా ఓటీటీలోకి ప్రవేశించనున్నారు. ఈ సినిమా టీజర్ నవంబర్ 25న విడుదల చేయనున్నారు. మధ్య తరగతి కుటుంబాల్లో సహజంగా జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కరీంనగర్ ప్రాంతంలో నివసించే రాములు (నరేష్) కుటుంబం ఓ సమస్యలో చిక్కుకుంటుంది. దీంతో కుటుంబ సభ్యుల్లోనే ఒకరిపై మరొకరికి అనుమానాలు పుట్టుకొస్తాయి. దీంతో వారిలో దాగి ఉన్న అసలు రూపాలన్నీ బయటకు వస్తాయి. ఈ కుటుంబ కథా చిత్రం డిసెంబర్ 16 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ ఎంట్రీపై సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో ఎంతో మంది మంచి నటులున్నారు. ఎంతో గొప్ప టీం పని చేసింది. ప్రతీ ఒక్కరూ ఈ సినిమా బాగా రావాలని కష్టపడ్డారు. ఆహాలో రాబోతోన్న ఇంటింటి రామాయణం అందరికీ ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా ఉంటుంది. మానవ బంధాలు, సంబంధాలు, జీవిత గుణపాఠాలు ఇలా అన్నింటిని ఈ చిత్రంలో చూపించాం. అంతా మనకు తెలిసిన ప్రపంచంలానే ఉంటుంది. కానీ కొత్తగా ఉంటుంది” అన్నారు. Iga mucchata shuru!😉 Ee gammatthu katha chudaniki ready kaandi thondarlo... Teaser out on November 25th. An @ahavideoIN Original.#IntintiRamayanamOnAHA @DirectorMaruthi @vamsi84 @eyrahul #NavyaSwamy @SitharaEnts @Sureshflms @Venkatupputuri @innamuri8888 @GangavvaMilkuri pic.twitter.com/9zoRyStvwZ — Sithara Entertainments (@SitharaEnts) November 21, 2022 చదవండి: ఆస్పత్రిలో ప్రేమదేశం హీరో అబ్బాస్ నీ నుంచి కంటెంటే రాదు, ఇంకా కోపం కూడానా.. యాంకర్ వెకిలి చేష్టలు -
‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ మూవీ రివ్యూ
టైటిల్: అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నటీనటులు: అలీ, నరేశ్, పవిత్రా లోకేశ్, మౌర్యాని, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సనా, వివేక్, సప్తగిరి, పృధ్వీ తదితరులు నిర్మాణ సంస్థ: అలీవుడ్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాత : కొనతాల మోహన్ దర్శకత్వం: శ్రీపురం కిరణ్ సంగీతం: రాకేశ్ పళిడమ్ సినిమాటోగ్రఫీ: ఎస్. మురళి మోహన్రెడ్డి ఎడిటర్: సెల్వకుమార్ విడుదల తేది: అక్టోబర్ 28, 2022(ఆహా) కమెడియన్ అలీ, సీనియర్ నటుడు నరేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. మలయాళ సూపర్ హిట్ ‘వికృతి’కి తెలుగు రీమేక్ ఇది. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు(అక్టోబర్ 28) ప్రముఖ ఓటీటీ ఆహాలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. శ్రీనివాసరావు(నరేశ్), పవిత్ర లోకేశ్(సునీత) మధ్యతరగతి కుటుంబానికి చెందిన జంట. జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కొడుకు, కూతురులను ప్రేమగా చూసుకుంటూ జీవితం కొనసాగిస్తుంటారు. మరోవైపు సమీర్(అలీ) ఆర్థిక సమస్యల కారణంగా దుబాయ్కి వెళ్లి చాలా రోజుల తర్వాత తిరిగి ఇండియాకు వస్తాడు. తన ఫ్యామిలీని చక్కగా చూసుకునే సమీర్కి సెల్ఫీలు, సోషల్ మీడియా పిచ్చి ఎక్కువ. ఏ విషయాన్ని అయినా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. అలీకి ఉన్న సోషల్ మీడియా పిచ్చి.. శ్రీనివాసరావు జీవితాన్నే మార్చేస్తుంది. నెట్టింట సమీర్ పెట్టిన ఓ పోస్ట్ కారణంగా శ్రీనివాసరావు జీవితంలోకి అనేక సమస్యలు వచ్చిపడతాయి. సమాజం అంతా అతన్ని తప్పుగా అపార్థం చేసుకుంటుంది. ఇంతకీ సమీర్ సోషల్ మీడియా పెట్టిన పోస్ట్ ఏంటి? దాని వల్ల శ్రీనివాస్ రావు ఫ్యామిలి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మలయాళ సూపర్ హిట్ ‘వికృతి’కి తెలుగు రీమేకే ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో చిన్న చిన్న మార్పులు చేసి సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు శ్రీపురం కిరణ్. సోషల్ మీడియాలో పెట్టే తప్పుడు పోస్టుల ద్వారా ఎన్ని ఇబ్బందులు ఏర్పడుతాయో, దాని వల్ల కొందరి జీవితాలు ఎలా తారుమారు అవుతాయో తెరపై చక్కగా చూపించాడు. సినిమా అంతా చాలా ఎమోషనల్గా సాగుతుంది. నరేశ్, పవిత్రా లోకేష్ మధ్య వచ్చే ప్రతి సీన్ ప్రేక్షకుడి హృదయాలను హత్తుకుంటాయి. ఇది ఎమోషనల్గా సాగే కథ అయినప్పటికీ.. హాస్యానికి కూడా కొదవ ఉండదు. హీరో లవ్ స్టోరీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే కథ చాలా నెమ్మదిగా సాగడం సినిమా స్థాయిని తగ్గిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సినిమాకి థియేటర్స్లో ఎలాంటి ఫలితం వస్తుందో తెలియదు కానీ.. ఓటీటీకి మాత్రం పక్కా సెట్ అయ్యే మూవీ. ఎలాంటి అశ్లీలత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రం ఇది. ఎవరెలా చేశారంటే.. అలీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రల్లో అయినా పరకాయ ప్రవేశం చేస్తుంటాడు. ఎంత నవ్వించగలడో..అంత ఏడిపించగలడు. ఈ సినిమాలో సమీర్ పాత్రకు న్యాయం చేశాడు. సోషల్ మీడియా, సెల్ఫీల పిచ్చి ఉండే పాత్ర తనది. ఇక సినిమాకు ప్రధాన బలం నరేశ్, పవిత్రా లోకేశ్. కథంతా వీరి చుట్టే తిరుగుతుంది. తెరపై నరేశ్, పవిత్రా లోకేశ్ల ఎమోషనల్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మూగ వ్యక్తిగా నరేశ్ నటన అద్భుతంగా ఉంది. కథను మలుపు తిప్పే మరో కీలక పాత్రలో నటించిన లాస్య చక్కగా నటించింది. ఆమె పాత్ర కారణంగానే సినిమాలో టర్నింగ్ పాయింట్ చోటు చేసుకుంటుంది.మనో, తనికెళ్ల భరని, మౌర్యానితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయానికి వస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం సంగీతం. ఏ.ఆర్ రెహమాన్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన రాకేశ్ పళిదం ఈ సినిమాకు అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫర్ మురళి మోహన్రెడ్డి , ఎడిటర్ సెల్వకుమార్ పని తీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. ఓ మంచి సినిమాతో అలీ నిర్మాణం రంగంలోకి అడుగుపెట్టాడని చెప్పొచ్చు. -
‘ఆహా’లో అలీ ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’
కమెడియన్ అలీ, సీనియర్ నటుడు నరేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. మలయాళ సూపర్ హిట్ ‘వికృతి’కి తెలుగు రీమేక్ ఇది. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్ సంయుక్తంగా నిర్మించారు. సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన రాకేశ్ పళిదంను ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం అక్టోబర్ 28న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరి వల్ల అమాయకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతుందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఆలీ హీరోగా, నరేష్ - పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల దారులుగా నటించగా, మౌర్యాని, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సనా, వివేక్, సప్తగిరి, పృధ్వీ, రామ్జగన్, భద్రం, లాస్య, ప్రణవి మానుకొండ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. Oka photo online lo sanchalanam chesthe. Ela untundi? 🤔 Daani venuka story enti? Watch the official remake of Vikruthi #AndaruBaagundaliOnAHA Premieres Oct 28#Ali pic.twitter.com/R8rA4yO6EZ — ahavideoin (@ahavideoIN) October 24, 2022 -
సినిమా రిలీజైన రెండో రోజుకే థియేటర్లు ఖాళీ: నరేశ్ ట్వీట్స్ వైరల్
జూలైలో వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో.. ఈ ఓటీటీలు వచ్చాక జనాలు థియేటర్లకు రావడమే మానేశారని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ కంటెంట్ ఉంటే జనాలు వస్తారని బింబిసార, కార్తికేయ 2, సీతారామం వంటి సినిమాలు నిరూపించాయి. అయితే జనాలు థియేటర్కు రాకపోవడానికి ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నాయంటున్నాడు సీనియర్ నటుడు నరేశ్. 'టికెట్ రేట్లు ఎక్కువ ఉండటంతో జనాలు థియేటర్కు రావడం లేదన్న మాట వాస్తవమే! కానీ అదొక్కటే కారణం కాదు. ఒకప్పుడు పెప్సి, పాప్కార్న్ రూ,20, రూ.30కే దొరికేవి. కానీ ఇప్పుడు వాటి ధర రూ.300. అంటే ఓ మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే మొత్తంగా రూ.2500 ఖర్చు పెట్టాల్సిందే! అలాంటప్పుడు ప్రజలు థియేటర్కు ఎందుకు వస్తారు? వారు మంచి సినిమాతో పాటు మంచి ఎక్స్పీరియన్స్ కోరుకుంటారు. కాస్త ఆలోచించండి' అని నరేశ్ ట్వీట్ చేశాడు. ఆ వెంటనే మరో ట్వీట్లో.. 'నేనేమంటున్నానంటే.. ఒకప్పుడు వారం రోజులపాటు సినిమాలు చక్కగా ఆడేవి. కానీ ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా రెండో రోజుకే థియేటర్ ఖాళీ అయిపోతుంది. ముందు థియేటర్స్లో ఖర్చు తగ్గిస్తే జనాలు ఎక్కువసార్లు సినిమాలు చూసేందుకు వస్తారు' అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్గా మారాయి. Y are people not coming to theatres? Simple. a middle class family needs about rs 2500 avg for the experience . Not just the tickets rates . If pepsi or pop corn which cost rs 20 or 30 costs about rs 300 . So people don’t want just a good film but. A good experience. Think!!! — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) August 27, 2022 What i mean to say is even an average film used to have collections for a week but now it needs to be a great film to fill the theatres the 2nd day. How many Extrodinary films can we make . So reduction of costs in the theatres can bring more people to many more films — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) August 27, 2022 చదవండి: ఓటీటీలో రామారావు ఆన్ డ్యూటీ, అప్పటినుంచే స్ట్రీమింగ్ అనసూయ వివాదం.. నన్నెందుకు తిడుతున్నారు? -
వారిద్దరూ కలిసి ఎలా ఉంటారో చూస్తా.. నరేష్ మూడో భార్య రమ్య శపథం
మైసూరు: తాను ఇంకా విడాకులు తీసుకోలేదని, అయినా కూడా పవిత్ర ఎందుకు తన భర్తతో కలిసి తిరుగుతోందని నరేష్ మూడో భార్య రమ్య మండిపడింది. భర్తకు విడాకులు ఇవ్వను, అందరి ముందు ఆయనను పెళ్లి చేసుకున్నాను, నా భర్త మరో మహిళతో కలిసి తిరగడం సరికాదు, వారికి పోలీసులు అండగా ఉండడం ఏమిటి అని ప్రశ్నించింది. వారిద్దరు కలిసి ఎలా ఉంటారో చూస్తానని శపథం చేసింది. చదవండి: వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..! కొన్నిరోజులుగా చర్చనీయాంశమైన సీనియర్ సినీ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్, నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మధ్య గొడవ పతాక స్థాయికి చేరింది. ఆదివారం మైసూరులో నరేష్, పవిత్ర ఓ హోటల్లో ఒకే గదిలో ఉండగా, రమ్య అక్కడకొచ్చి ఇద్దరితో గొడవకు దిగింది. హోటల్ సిబ్బంది, పోలీసులు అడ్డుకున్నా ఆమె శాంతించలేదు. నరేష్, పవిత్రలు శనివారం రాత్రి ఆ హోటల్లో దిగారు. ఆదివారం ఉదయం రమ్య వారి గది వద్దకు వచ్చి డోర్ బెల్ నొక్కింది. కానీ, నరేష్ తలుపు తీయలేదు. రమ్య అక్కడే ఉండిపోయింది. హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో వారు వచ్చి రమ్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె ససేమిరా అంది. పోలీసులు ఆమెను అడ్డుకుని పక్కకు తీసుకెళ్లగా నరేష్, పవిత్రలు తలుపు తీసుకుని బందోబస్తు మధ్య బయటకు వచ్చారు. రమ్య గట్టిగా అరుస్తూ చెప్పు తీసుకుని వారి మీద దాడి చేయడానికి యత్నించింది. ఇద్దరు పోలీసులపైనా ఆమె దాడికి దిగింది. నరేష్ పవిత్రను తీసుకుని అక్కడనుంచి వెళ్లిపోయారు. -
హోటల్లో నరేశ్, పవిత్ర జంట.. చెప్పుతో కొట్టబోయిన రమ్య
Actor Naresh And Pavitra Lokesh: సినియర్ నటుడు నరేశ్, పవిత్ర లోకేష్ జంట మైసూర్లో ప్రత్యేక్షమైంది. మైసూర్లోని ఓ హోటల్ ఉన్న ఈ జంటను నరేశ్ మూడో భార్య రమ్య అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పవిత్రను చెప్పుతో కొట్టేందుకు రమ్య ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. రమ్యను చూసి నరేశ్ విజిల్స్ వేసుకుంటూ.. పవిత్రతో కలిసి లిఫ్ట్లో వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. (చదవండి: దయచేసి నాకు, నరేశ్కు సపోర్డు ఇవ్వండి..) గత కొన్ని రోజులుగా నరేశ్, పవిత్ర పెళ్లి చేసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నరేశ్ మూడో భార్య రమ్య తెరపైకి వచ్చి తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రా లోకేశ్ను నరేశ్ పెళ్లి చేసుకుంటున్నాడంటూ ఆరోపించారు. ‘నరేశ్ నన్ను మోసం చేశాడు. కొంతకాలం మేం కలిసి లేము. అలాగని విడాకులు తీసుకోలేదు. మాకు పిల్లలు ఉన్నారు. మళ్లీ నరేశ్ ఎలా పెళ్లి చేసుకుంటాడు?’ అని ప్రశ్నించారు. దీనిపై పవిత్ర లోకేష్ కూడా స్పందించారు. రమ్య కావాలనే తనను బ్యాడ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఏదైన ఉంటే హైదరాబాద్లో మాట్లాడకుండా.. బెంగళూరు వచ్చి నన్ను చెడ్డగా చూపించడం కరెక్ట్ కాదన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో కూడా విడుదల చేశారు. -
దయచేసి నాకు, నరేశ్కు సపోర్టు ఇవ్వండి..
సీనియర్ హీరో, నటుడు నరేశ్ పెళ్లి వార్తలు ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాం అవుతున్నాయి. నటి పవిత్రా లోకేశ్ను ఆయన వివాహం చేసుకున్నాడంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నరేశ్ మూడో భార్య తెరపైకి వచ్చి నరేశ్కు తనకు ఇంకా విడాకులు కాలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. నరేశ్ నిజంగానే పవిత్ర లోకేశ్ను పెళ్లి చేసుకున్నాడని, అందుకే తనకు విడాకుల నోటీసులు ఇచ్చాడని ఆమె మీడియాతో చెప్పింది. చదవండి: పొన్నియిన్ సెల్వన్: చోళులు వచ్చేస్తున్నారు ఈ క్రమంలో నరేశ్ పెళ్లి అంశం, రమ్య ఆరోపణలపై నటి పవిత్ర స్పందించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నరేశ్ మంచి వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది. ‘నేను తెలుగు ఇండస్ట్రీకి కొత్తేమి కాదు. చాల సంవత్సరాల నుంచి తెలుగు సినిమాల్లో నటిస్తున్నాను. కన్నడ నుంచి వచ్చిన తెలుగు ప్రేక్షకులకు నేను దగ్గరయ్యాను. ఇప్పుడు నా ప్రాబ్లమ్ మీతో పంచుకోవాలనే ఇలా మీ ముందుకు వచ్చాను. నరేశ్ ఎవరనేది నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆయన గురించి ఆయన ఫ్యామిలీ గురించి కూడా ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన మూడో భార్య రమ్య ఇక్కడ బెంగళూరు మీడియాతో నా గురించి, నరేశ్ గురించి ఎన్నో ఆరోపణలు చేశారు. ఆయన గురించి, నా గురించి చాలా ఆసభ్యంగా మాట్లాడుతన్నారు. మేం రిలేషన్లో ఉన్నామని, పెళ్లి చేసుకున్నామంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. ఇదంత నాకు చాలా బాధగా ఉంది. ఇక్కడ నన్ను ఒక దోషిగా చిత్రీకరించారు ఆమె’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఆమె. ‘అయితే ఇప్పటికే నరేశ్ గారు కూడా బెంగళూరు వచ్చి మీడియాతో మాట్లాడారు. మా మధ్య ఏం లేదని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు నేను కూడా ఈ వార్తలపై మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. మా మధ్య ఏం లేదు. చదవండి: Ram Charan-RC15: భిన్నమైన లుక్లో రామ్ చరణ్, వీడియో వైరల్ ఏదైనా ఫ్యామిలీ మ్యాటర్ ఉంటే.. నాకు భర్త కావాలి అనుకుంటే హైదరాబాద్ వచ్చి మాట్లాడుకోవాలి. కానీ ఇలా బయటకు వచ్చి రచ్చ చేయడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. నరేశ్ గారు తెలుగులో మంచి పేరున్న నటుడు. ఆయన ఆమె భర్త అయితే ఏదైన ఉంటే హైదరాబాద్లో కదా ఆమె మాట్లాడిల్సింది. పెద్ద వాళ్లు ఉన్నారు. ఫ్యామిలీ ఉంది. వారందరిని పిలిచి ఇలాంటిది జరుగుతుందంటూ వారితో చర్చించి సమస్య పరిష్కరించుకోవాలి. కానీ బెంగళూరు వచ్చి నన్ను చాలా చెడ్డగా చూపిస్తున్నారు. ఇది అసలు కరెక్ట్ కాదు. ఇప్పటికైన మీరందరు నాకు, నరేశ్కు సపోర్టు చేయాలని మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. Actress #Pavitralokesh gives clarity on recent Allegations. #PavithraLokesh #naresh #tollywoodactress #Tollywood pic.twitter.com/1VyKpLG3LE — Medi Samrat (@Journo_Samrat) July 1, 2022 -
సినీ కార్మికుల సమ్మెపై సీనియర్ నటుడు నరేశ్ స్పందన
సినీ కార్మికుల సమ్మెపై తాజా సీనియర్ నటుడు నరేశ్ స్పందించాడు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు సమ్మెకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నేడు సినీ కార్మికులంతా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో సినిమా షూటింగ్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో నటుడు నరేశ్ సోషల్ మీడియా వేదికగా వీడియోలు షేర్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా మూడేళ్లు చిత్ర పరిశ్రమ ఎన్నో ఇబ్బుందులు ఎదుర్కొందని, ఇప్పుడిప్పుడే కాస్తా మెరుగుపడుతున్న సమంయలో సమ్మెబాట పట్టడం సరికాదని అన్నాడు. చదవండి: హెల్త్అప్డేట్: ‘కెప్టెన్’ విజయకాంత్ కాలివేళ్లు తొలగింపు ‘తెలుగు సినిమా బిడ్డలందరి నమస్కారం. నిన్నటి నుంచి టీవీలన్ని కూడా మారుమోగిపోతున్నాయి. షూటింగ్లు ఆగిపోతాయని, ఒకటి, రెండు యూనియన్లు వేతనాలు పెంచకపోతే షూటింగ్ ఆపేస్తామని పోరాటం చేస్తున్నారు. మంచిదే. పెద్దలందరు కలిసి ఇండిస్ట్రీపై నిర్ణయం తీసుకోవాలి, తీసుకుంటారు కూడా. అయితే అందరు ఒకటి గుర్తుంచుకోవాలి. గత మూడు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచంతో పాటు సినీ పరిశ్రమ అట్టడుగుకుపోయి కార్మికులు, చిన్న చిన్న ఆర్టిస్టులు పూట గడవ నానా ఇబ్బందులు పడ్డారు. అంతేకాదు వైద్య ఖర్చులు లేక చాలా మంది ప్రాణాలు కూడా కొల్పోయారు. ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ కాస్తా వెంటిలేటర్పై ప్రాణం పోసుకుని సినిమాలు రిలీజ్అవుతున్నాయి. మన సినీ పరిశ్రమకు మంచి పేరు కూడా వస్తుంది. మనందరికి బ్యాంకులు నిండకపోయిన కంచాలు నిండుతున్నాయి. ఈ పరిస్థితిలో మనమందరం కూడా ఆలోచించాలి. అన్నింటికి పరిష్కారం ఉంటుంది. నిన్నటి నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మొత్తం మునిగిపోతామండి అంటూ నాకు దర్శక-నిర్మాతలు, కార్మికులు, నటీనటులు ఫోన్ చేస్తున్నారు’ అని చెప్పుకొచ్చాడు. అలాగే మరో ట్వీట్లో ‘నేను ఇండస్ట్రీ బిడ్డగా కోరేది ఒకటే. వేతనాలు ఎంతోకొంత పెంచాలి. అది వారి డిమాండ్. అయితే నిర్మాతలు కూడా కరోనా సమయంలో సినిమాలు ఆగిపోయి కోట్ల రూపాయలు నష్టపోయారు. వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితులో ఉన్నారు. ఇప్పుడిప్పుడే మెల్లిగా స్థిరపడుతున్నారు. The media is buzzing with news that a few unions have pressurised the federation of TFI to stop shootings with immediate effect. It is our right to ask for a raise in wages. (1/3) — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) June 22, 2022 చదవండి: Film Employees Strike: తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ వద్ద టెన్షన్.. టెన్షన్ ఈ సమయంలో తొందరపాటు లేకుండా ఓ వారం, పది రోజులు టైం తీసుకుని అటూ ఫెడరేషన్కి, ఇటూ నిర్మాతలకు ఇబ్బంది లేకుండా అందరం కలిసి ఓ నిర్ణయానికి వద్దాం. కృష్ణానగర్కి, ఫిలింనగర్కి 3 కిమీ దూరమే ఉంది. అందరం కలిసి ఈ సమస్యను పరిష్కరించుకుందాం. మనందరం కలిస్తేనే ఒక కుటుంబం. ఇండస్ట్రీ బిడ్డగా నావంతుగా నేరు ఏం చేయలో ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. పెద్దలు అందరూ కలిసి కూడా నిర్ణయం తీసుకుని సినీ పరిశ్రమని మరొకసారి అంధకారంలోకి వెళ్లకుండ ఆపి ఈ యొక్క షూటింగ్లు ఇంకోన్ని రోజులు ముందుకు సాగేలా అందరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను’ అని నరేశ్ వ్యాఖ్యానించాడు. A knee-jerk stop will crush not only the producers but also the lower financial strata members who are the majority. As a son of the TFI it is my humble appeal to go slow on the lockdown & negotiate. Kindly cooperate with the federation & producers to avert a major crisis🙏 (3/3) pic.twitter.com/TwLa0iYvzW — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) June 22, 2022 -
మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ !
Is Senior Actor Naresh Getting Married With Pavithra Lokesh: ప్రేమకు వయసుతో సంబంధం లేదు అనే మాట చాలా సార్లు వింటుంటాం. కానీ అప్పుడప్పుడు కొన్ని సార్లు అది ప్రూవ్ అవుతుంటుంది కూడా. ప్రస్తుతం టాలీవుడ్ లో జోరుగా వినిపిస్తున్న టాక్ ప్రకారం సీనియర్ హీరో, నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీళ్లు చాలా కాలంగా లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో జంటగా కనిపించారు. ఆ పరిచయంతో నిజ జీవితంలో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారని భోగట్టా. ఇటీవల వీళ్లిద్దరూ కలిసి మహాబలేశ్వర్ వెళ్లి ఒక స్వామిజీని దర్శించుకోవడంతో ఇక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త గుప్పుమంది. నటుడు, విజయ నిర్మల తనయుడు నరేశ్ ఇప్పటికే దాదాపుగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారనే టాక్ ఉంది. కానీ తన భార్యలతో మనస్పర్థలు రావడంతో ఆయన విడాకులు ఇచ్చి ఒంటరి జీవితం గడుపుతున్నారు. అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్న నరేష్ తనకు ఈ వయసులో ఒక మంచి వ్యక్తి తోడుగా ఉండాలని భావిస్తున్నారని, అందుకే పలు సినిమాల్లో తనతో కలిసి నటించిన పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ ఇక పవిత్ర లోకేష్ విషయానికి వస్తే ఆమె 2007లో కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సుచేంద్ర ప్రసాద్ను వివాహం చేసుకుంది. కానీ భర్తతో మనస్పర్థల కారణంగా ఒంటరిగా జీవిస్తోంది. కాకపోతే ఇంకా ఆమెకు చట్టబద్ధంగా విడాకులు రాలేదు. కోర్ట్ త్వరలో విడాకులు మంజూరు అవ్వగానే వీరు ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని టాక్. అయితే ఈ వార్తను ఇద్దరూ ఖండించకపోవడం, కలిసి నటిస్తుండడం, కలిసి కనిపిస్తుండడంతో ఈ టాక్ మరింతగా పెరిగింది. అయితే ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలిగింది ఒక్క కాలం మాత్రమే. చదవండి: చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ సాయి పల్లవి వివరణపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. -
బర్త్డే రోజునే సూపర్ స్టార్ కృష్ణకు అరుదైన గౌరవం
తొలి తెలుగు జేమ్స్బాండ్, కౌబాయ్ సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే నేడు. మంగళవారంతో(మే 31న) ఆయన 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు తనయుడు, సూపర్ స్టార్ మహేశ్ బాబు, కోడలు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. అలాగే సీని ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక నేడు ఆయన బర్త్డే నేపథ్యంలో కృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. ‘సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ వరించింది. చదవండి: తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు మామయ్య.. నమ్రతా ఎమోషనల్ పోస్ట్ ఈ విషయాన్ని నరేశ్ తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ‘హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ కృష్ణ. 80 ఏళ్ల పాటు సినిమాకు, ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన పుట్టిన రోజునే ‘సెలబ్రెటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్’ అవార్డును అందుకోవడం సంతోషంగా ఉంది. ఆయన కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశిస్తున్నా’ అని ట్వీట్లో పేర్కొన్నారు. చదవండి: ఎన్టీఆర్ చిత్రంలో సోనాలి బింద్రే.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ Happy birthday SUPER STAR . Glorious 80 years of service to cinema and people . Received CELEBRITY BOOK OF WORld RECORDS on this occasion. Long live the superstar💕🌹 pic.twitter.com/WBuZko8EH3 — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) May 31, 2022 -
కలెక్టర్ బసంత్ కుమార్ను కలిసిన సినీ నటుడు నరేష్
పుట్టపర్తి టౌన్: రాష్ట్ర కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు, సినీ నటుడు నరేష్ కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ బసంత్ కుమార్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం కళాకారుల సంక్షేమం గురించి చర్చించారు. -
పుష్కరం కిందే యుద్ధ బీజాలు
ఇవ్వాళ ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్య రష్యా–ఉక్రెయిన్ యుద్ధమే. ఈ యుద్ధానికి కారణం ఉక్రెయిన్ నాటో సభ్యత్వాన్ని తీసుకోవడానికి చేసిన ప్రయత్నం మాత్రమే కాదు. అది ఒక సాకు మాత్రమే. అమెరికా–రష్యాల మధ్య ఉన్న ఆధిపత్య పోరే అసలు హేతువు. నిజానికి ఉక్రెయిన్కు నాటోలో సభ్యత్వం పొందే అర్హత లేదు. ఎందుకంటే, ఆగ్రూపులో సభ్యత్వం పొందాలనుకునే దేశానికి సరిహద్దు గొడవలు ఉండకూడదు. అయినా అమెరికా నాటోలో సభ్యత్వం ఇవ్వడానికి అంగీకరించింది. అంతేకాక ఇతర దేశం ఏదైనా అడ్డొస్తే... తను ఉక్రెయిన్కు మద్దతు ఇస్తానని హామీ ఇచ్చింది. ఈ హామీతోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యాని ఏమాత్రం లెక్కచేయకుండా తన ప్రజలను యుద్ధోన్ముఖులను చేసి ఇప్పుడు తలపట్టుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇరువర్గాల సైనికులనే కాదు ఉక్రె యిన్ పౌరులనూ బలి తీసుకుంటోంది. సామాన్య ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉక్రెయిన్ను విడిచి వెళ్తున్నారు. యుద్ధం వల్ల ఈ రెండు దేశాలు మాత్రమే కాక మొత్తం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ దెబ్బతింటాయి. అలాగే అంతర్జాతీయ సంబం«ధాలు ఎక్కువగా ప్రభావిత మవుతాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ అతి శక్తిమంతమైన దేశంగా అవతరించింది. తరువాత కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలో జడత్వం, తూర్పు యూరోప్ దేశాల ఆర్థిక వ్యవస్థల బాధ్యత, అవినీతి, నిరుద్యోగం లాంటి అనేక కారణాల వల్ల 1991లో పదిహేను స్వతంత్ర దేశాలుగా అది విడిపోయింది. వ్లాదిమిర్ పుతిన్ 2000 సంవత్సరంలో రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని ఆర్థికంగా, రక్షణ పరంగా ఎంతో పటిష్ఠపరిచారు. కానీ 2004లో ఒకప్పటి సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న లిథువేనియా, లాత్వియా, ఇస్తోనియాలు తమ ఆర్థికాభివృద్ధి, సార్వ భౌమాధికారం, సరిహద్దు రక్షణల కోసం ఆర్థికంగా అభివృద్ధి చెందిన పశ్చిమదేశాల ఆర్థిక కూటమి అయిన యూరోపియన్ యూనియన్లోనూ, రక్షణ కూటమి అయిన నాటోలోనూ చేరిపోయాయి. దీంతో నాటో బల గాలు ఆయా దేశాల్లో తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ చర్య తన భద్రతకు ముప్పు కలిగించేదని రష్యా మొదటి నుంచీ భావి స్తున్నది. కొత్తగా ఇప్పుడు ఉక్రెయిన్ కూడా పశ్చిమ దేశాల పొంతన చేరటానికి చేస్తున్న ప్రయత్నాలు రష్యాకు కోపం తెప్పించాయి. అసలు ఈ సంక్షోభానికి 2010లోనే బీజాలు పడ్డాయి, ఉక్రెయిన్లో ఉన్న నౌకాశ్రయాన్ని ఉపయోగించుకునేందుకు అప్పటి అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ రష్యాతో 25 సంవత్సరాలు కొనసాగే ఒప్పందం చేసుకున్నారు. దానికి ప్రతిఫలంగా రష్యా తన సహజ వాయువును 30 శాతం తక్కువ ధరకు ఉక్రెయిన్కు సరఫరా చేయ డానికి అంగీకరించింది. కానీ ఈ ఒప్పందం ఉక్రెయిన్ ప్రజలకు నచ్చ లేదు. తర్వాత 2013లో ఉక్రెయిన్కు ఈయూ సభ్యత్వ ప్రతిపాదనను తిరస్కరించటం, ఆ తర్వాత జరిగిన సంఘటనల కారణంగా ఉక్రె యిన్ ప్రజల్లో అతని పట్ల వ్యతిరేకత పెరిగింది. దీంతో విక్టర్ అధ్యక్ష పదవినుండి వైదొలగి రష్యాకి పారిపోయాడు. ఉక్రెయిన్లో ఉన్న 70 శాతం ఉక్రైనీ భాష మాట్లాడే ప్రజలు తమ దేశం యూరోపియన్ యూనియన్లో చేరితే ఉద్యోగ, వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉంటాయనీ, ఆర్థికాభివృద్ధి జరుగుతుందనీ భావించారు. కానీ మిగతా 30 శాతం రష్యన్ భాష మాట్లాడే ప్రజలు ఉక్రెయిన్ రష్యాలో కలవాలనీ, పశ్చిమ దేశాలు తమను బానిసలుగా చూస్తారనీ తలిచారు. ఇదే అదనుగా తీసుకోని రష్యా, 2014లో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైన క్రిమియాను ఆక్రమించింది. ఆ తర్వాత క్రిమియాలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపించి దానిని పూర్తిగా తన భూభాగంలో కలుపుకొంది. అప్పటినుండి ఉక్రెయిన్లోని మిగతా రెండు– డోనెట్సక్, లుహాన్సక్ ప్రాంతాల్లో వేర్పాటువాదులకు రష్యా సహాయం చేస్తోంది. అయితే 2019లో అధ్యక్షుడైన జెలెన్స్కీ ఆధ్వర్యంలో మళ్లీ ఉక్రెయిన్... నాటో సభ్యత్వం విషయం తెరపైకి తీసుకొచ్చింది. నాటోలో ఉక్రెయిన్కి సభ్యత్వం లభిస్తే... తన భద్రతకు ముప్పువాటిల్లే అవకాశం ఉందని రష్యా భావిస్తోంది. అందుకే అధ్యక్షుడు పుతిన్ వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. ఇదే విషయమై రష్యా కొంత కాలంగా పశ్చిమ దేశాలపైనా ఒత్తిడి తెస్తూనే ఉంది. దానిలో భాగంగానే, రష్యా తన మిత్ర దేశమైన బెలారస్తో సైనిక విన్యాసాలు చేసింది. తర్వాత తన రక్షణ దళాలను ఉక్రెయిన్ తూర్పు సరిహద్దుల్లో మోహరించి, రష్యన్ భాషను మాట్లాడే ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నామని హెచ్చరించింది. అయినా అటు అమెరికా, పశ్చిమ దేశాల నుండి కానీ; ఇటు ఉక్రెయిన్ నుండి కానీ నాటో విస్తరణ ఉండబోదని ఎలాంటి హామీ రాలేదు. పైగా ఆర్థిక ఆంక్షలు విధిస్తామని బెదిరింపులకు దిగాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి రష్యా మిలిటరీ ఆపరేషన్ మొదలు పెట్టింది. అయితే ఉక్రెయిన్ ఆక్రమణ తమ ఉద్దేశం కాదనీ, కేవలం మిలిటరీ ప్రదేశాలను నిర్వీర్యం చేయడమే తమ లక్ష్యం అనీ పుతిన్ చెప్పుకొచ్చాడు. అమెరికా, పశ్చిమ దేశాలపై ఒత్తిడి తెచ్చి ఉక్రెయిన్ని నాటోలో చేర్చుకోలేమని ప్రకటన చేయించటం లేదా ప్రస్తుతం ఉక్రెయిన్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టి రష్యాకి సన్ని హితమైన ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచి నాటో విస్తరణ జరగ కుండా అడ్డుకోవటం అనే లక్ష్యాలతో రష్యా సైనిక చర్యకు దిగింది. కానీ ఉక్రెయిన్ మాత్రం మొదటగా రష్యానే 1994లో జరిగిన బుడాపెస్ట్ ఒప్పందాన్ని ఉల్లంఘించి 2014లో క్రిమియాని ఆక్రమించిందని వాదిస్తో్తంది. ఈ ఒప్పందం ప్రకారం ఉక్రెయిన్ తన దగ్గర ఉన్న అణుశక్తి సంపదను రష్యాకి అప్పజెప్పినందుకు బదులుగా తను ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని గుర్తించి రక్షణ కల్పించాలి. ఆ పని చేయకపోగా తమ భూభాగమైన క్రిమియాను రష్యా ఆక్రమిం చిందనీ, ముందు ముందు తమ దేశంలోని మిగతా ప్రాంతాలను కూడా రష్యా ఆక్రమిస్తుందనీ, దాన్ని ఎదుర్కోవాలంటే తమ రక్షణ సామర్థ్యం సరిపోదు కాబట్టి నాటోలో భాగస్వామి కావాలను కుంటున్నామనీ ఉక్రెయిన్ అంటోంది. యూరోపియన్ యూని యన్లో చేరితే తమ దేశ ఆర్థికాభివృద్ధి జరుగుతుందనీ, అందువల్ల దానిలో చేరాలని భావిస్తున్నట్లూ పేర్కొంది. వాస్తవానికి ఉక్రెయిన్కు నాటోలో సభ్యత్వం పొందే అర్హత లేదు. ఎందుకంటే, ఆ గ్రూపులో సభ్యత్వం పొందాలనుకునే దేశానికి సరి హద్దు గొడవలు ఉండకూడదు. అయినా అమెరికా నాటోలో సభ్యత్వం ఇవ్వడానికి అంగీకరించింది. అంతేకాక ఇతర దేశం ఏదైనా అడ్డొస్తే... తను ఉక్రెయిన్కు మద్దతు ఇస్తానని హామీ ఇచ్చింది. దానితో అమెరికా, పశ్చిమదేశాలు తనకు యుద్ధంలో సహాయం చేస్తాయనీ, ఆర్థిక ఆంక్షలు విధిస్తే రష్యా ప్రపంచంలో ఒంటరి అయిపోతుందనీ ఉక్రెయిన్ అనుకుంది. జరిగిన ఈ తతంగమంతా చూస్తుంటే రష్యా– అమెరికాల మధ్య ఆధిపత్య పోరే ప్రస్తుత యుద్ధానికి అసలు కారణ మని స్పష్టమవుతోంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో రష్యా బాధ్యత ఎంత ఉందో అమెరికాకు కూడా అంతే బాధ్యత ఉంది. అమె రికా ఎప్పుడూ మొదట ఒక దేశాన్ని యుద్ధంలోకి తోసి తను మెల్లగా జారుకుంటుంది. అది అఫ్గానిస్థాన్∙కావొచ్చు లేదా ఉక్రెయిన్ కావొచ్చు... మధ్యలో అనవసరంగా బలయ్యేది అమాయకులైన ప్రజలే అని అర్థం చేసుకోవాలి. భారత దేశానికి ఉక్రెయిన్, రష్యా రెండూ మంచి మిత్రదేశాలు కాబట్టి రెండు దేశాలతో మాట్లాడి గతంలో జరిగిన ఒప్పందాన్ని గౌరవించేలా ఒప్పించాలి. ఇరువర్గాల మధ్య ఉన్న భద్రతా పరమైన ఆందోళనకు తెరదించేలా... ఆంక్షలు విధించకుండా దౌత్యంతోనే సమస్యని పరిష్కరించుకునేట్లు చేయాలి. ఈ యుద్ధం వలన భారత్ పైన ఆర్థిక ప్రభావం కన్నా వ్యూహాత్మక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రష్యా మొదటినుండీ అన్ని విషయాలలో ముఖ్యంగా కశ్మీర్ విషయంలో ప్రతి అంతర్జాతీయ వేదికపైనా సమర్థిస్తూ, భద్రతా మండలిలో అనుకూలంగా ఓటువేసి భారత్ను సమర్థించుకుంటూ వచ్చింది. ఇప్పటికే భారత్ అంతర్జాతీయ వేదిక పైన రష్యాను ఏకాకిని చేసే విషయంలో ఓటింగుకు దూరంగా ఉండి దానికి అనుకూలంగా వ్యవహరించిందనే చెప్పాలి. రష్యా– ఉక్రెయిన్లు తమ సమస్యలను యుద్ధంతో కాక చర్చల ద్వారానే పరిష్కరించుకోవడానికి భారత్ తన పలుకుబడిని ఉపయోగించాలి. డా. నరేష్ సుధావేణి – వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్; సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్, హైదరాబాద్ -
మూడో భార్య రమ్య మోసాలు.. వీడియో రిలీజ్ చేసిన నటుడు నరేష్
సీనియర్ నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతిపై చీటింగ్ కేసు నమోదైంది. నరేష్ పేరుతో పలువురు దగ్గర డబ్బులు వసూలు చేస్తోందంటూ ఆమెపై గచ్చిబౌలి పోలిస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఇప్పటికే నరేశ్ ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో నేడు(బుధవారం) ఉదయం దీనిపై వివరణ ఇస్తూ ఉదయం ఓ వీడియో వదిలారు. ఈ సందర్భంగా రమ్య జరిపే వ్యాపార, ఆర్థిక వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ మరోసారి స్పష్టం చేశాడు. ‘రమ్య రఘుపతి గారి ఇష్యూ(ఫైనాన్షియల్ ఇష్యూ) బయట పడినప్పటి నుంచి నాకు మీడియా, బంధుమిత్రుల నుంచి విపరితమైన ఫోన్కాల్స్ వస్తున్నాయి. తొమ్మిదేళ్ల క్రితం మాకు పెళ్లైయింది. చదవండి: స్పిరిట్ కంటే ముందు ‘రాజా డీలక్స్’ను సెట్స్పై తీసుకొచ్చే ప్లాన్లో ప్రభాస్? మనస్పర్థల కారణంగా రెండూ, మూడేళ్లకే విడిపోయాం. ఇలాంటివి జరుగుతాయనే భయంతోనే ఆమెతో విడిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు ఆమెకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అనంతపురం, హిందూపురం ఇష్యూ తర్వాత ఇలాంటివి భవిష్యత్తులో వస్తాయానే ఉద్దేశంతోనే 2, 3 నెలల క్రితమే ఓ ప్రకటన ఇచ్చాను. తనతో నాకు గాని, నా కుటుంబానికి గాని ఎలాంటి సంబంధం లేదని, ఆర్థికంగా కూడా. ఈ సమస్య ఎంత దూరం వెళుతుందో నాకు అర్థం కావడం లేదు. ఇంట్లో అందరూ భయంతో ఉన్నారు. డబ్బు తీసుకోవడం, మోసం చేయడం వంటివి ఇంతవరకు మా కుటుంబాల్లో ఎక్కడ లేదు. నేను చెప్పేదే ఒక్కటే రమ్య రఘపతి కేసులో నాకు, నా కుటుంబ సభ్యుల ప్రమేయం ఏం లేదు’ అంటూ వివరణ ఇచ్చారు. చదవండి: 11వ బిడ్డకు జన్మనివ్వబోతోన్న ప్రముఖ సింగర్ నటుడు నరేష్కు రమ్య రఘుపతి మూడో భార్య. మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె ఈమె. ఎనిమిదేళ్ల క్రితం వీరికి వివాహమైంది. అయితే కొన్నాళ్ల క్రితం మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే నరేష్ సహా ఆయన కుటుంబంతో దిగిన ఫోటోలను అడ్డు పెట్టుకొని కొందరు మహిళల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నరేష్కు చెందిన ఆస్తులను తన ఆస్తులుగా చెప్పి అధిక వడ్డీ పేరుతో, రిజిస్ట్రేషన్ల పేరుతో కోట్లల్లో మోసానికి పాల్పడింది. దీనిపై గచ్చిబౌలి పోలిస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. -
నటుడు నరేష్ మాజీ భార్యపై కేసు నమోదు.. కోట్లలో మోసం!
నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతిపై కేసు నమోదైంది. నరేష్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తోందంటూ ఆమెపై గచ్చిబౌలి పోలిస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. నటుడు నరేష్కు రమ్య రఘుపతి మూడో భార్య. మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె ఈమె. ఎనిమిదేళ్ల క్రితం వీరికి వివాహమైంది. అయితే కొన్నాళ్ల క్రితం మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే నరేష్ సహా ఆయన కుటుంబంతో దిగిన ఫోటోలను అడ్డు పెట్టుకొని కొందరు మహిళల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నరేష్కు చెందిన ఆస్తులను తన ఆస్తులుగా చెప్పి అధిక వడ్డీ పేరుతో, రిజిస్ట్రేషన్ల పేరుతో కోట్లల్లో మోసానికి పాల్పడింది. దీనిపై గచ్చిబౌలి పోలిస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. తాజాగా ఈ వివాదంపై స్పందించిన నటుడు నరేష్.. రమ్య వసూళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పాడు. కాగా ప్రస్తుతం నరేష్తో రమ్య దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతున్నాయి. -
ఇండస్ట్రీ పెద్దన్న, మా అందరి అన్న ఆయనే: నటుడు నరేష్
మూవీ అర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల సమయం నుంచి టాలీవుడ్ పెద్ద ఎవరనే అంశం హాట్టాపిక్గా మారింది. ఈ ఎన్నికల్లో హీరో మంచు విష్ణు గెలిచి మా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇది చర్చ కాస్తా సద్దుమణిగింది. ఇప్పుడు తాజా టిక్కెట్ల రేట్ల సమస్య విషయంలో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో సీనియర్ నటుడు, మా మాజీ అధ్యక్షుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జరిగిన మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఇండస్ట్రీ పెద్దన్న మోహన్ బాబు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చదవండి: మా బ్రేకప్కు చాలా కారణాలున్నాయి, సిరి వల్ల కాదు: షణ్ముక్ ‘తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్న, మా అందరికి అన్న, అందరికంటే మిన్న మోహన్ బాబు. ఇండస్ట్రీలో గొప్ప హీరోలున్నారు, గొప్ప విలన్లు ఉన్నారు. గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. కానీ అన్నీ కలిసిన ఒకే వ్యక్తి మోహన్ బాబు. ఆయనకు ఆయనే సాటి. రైతు కుటుంబంలో పుట్టి, ఉపాధ్యాయుడిగా ఎదిగి, యూనివర్శిటీ స్థాపించే స్థాయికి చేరుకున్న ఏకైక నాయకుడు మోహన్ బాబు’ అంటూ నరేశ్ వ్యాఖ్యానించాడు. అలాగే ఆయన సినిమా కోసం బతికే వ్యక్తి కాదని, సినిమా కోసమే పుట్టిన వ్యక్తి అంటూ కొనియాడాడు. దీంతో నరేష్ వ్యాఖ్యలు టాలీవుడ్ చర్చనీయాంశంగా మారాయి. చదవండి: ప్రపోజ్ చేస్తే జోక్ చేశాడనుకున్నా: హీరో నిఖిల్ భార్య -
లగ్జరీ కారు కొనుగోలు చేసిన నరేశ్
1972లో వచ్చిన 'పండంటి కాపురం' సినిమాతో నటుడిగా ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశాడు నరేశ్ విజయకృష్ణ. అప్పట్లో హీరోగా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడీయన. తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో సుపరిచితులైన ఈయన ఈ మధ్యే సకల సదుపాయాలు ఉండేలా ఓ కారవ్యాన్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. తాజాగా నరేశ్ ఓ ఖరీదైన స్పోర్ట్స్ కారును సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించాడు. 'నా కల నెరవేరిందోచ్, ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను' అని పేర్కొంటూ తన కారును చూపించాడు. పర్పుల్ కలర్లో ఉన్న ఈ కారును డ్రైవ్ చేస్తూ నగర రోడ్లపై చక్కర్లు కొట్టి మురిసిపోయాడు నరేశ్. వెంటనే తన ప్రొఫైల్ పిక్ కూడా మార్చేశాడు. కారు పక్కన నిల్చున్న ఫొటోను ప్రొఫైల్ పిక్గా పెట్టుకున్నాడు. ఇంత ఖరీదైన కారును కొన్న నటుడికి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Hi sharing my new dream come true with my twitter family💕 pic.twitter.com/rnxev9r2Ts — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) February 2, 2022 #NewProfilePic pic.twitter.com/J0c2BDDxhf — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) February 2, 2022 -
లగ్జరీ కారవ్యాన్ కొనుగోలు చేసిన నరేశ్.. ప్రత్యేకత ఏంటంటే?
కారవాన్... సినీతారలు సాధారణంగా ఉపయోగించే మల్టీపర్పస్ వాహనం. ఇందులో సకల సౌకర్యాలనూ ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే గతంలో ఇది కేవలం స్టార్ హీరో, హీరోయిన్లు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా కారవాన్లు వాడుతున్నారు. తమ పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీట్ అయితే చాలు వెళ్లి తమ కారవాన్లో సేద తీరుతారు. మరో షాట్ రెడీ కాగానే బయటకు వస్తున్నారు. తాజాగా సీనియర్ నరేశ్ లగ్జరీ కారవాన్ని కొలుగోలు చేశాడు. ఒకప్పడు హీరోగా రాణించిన నరేశ్.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వరుస సినిమాలతో దూసుకెళ్లున్నాడు. ఆయన ఇంట్లో కంటే ఎక్కువ సమయంలో షూటింగ్ స్పాట్లోనే గడుపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర నటీనటులు వాడిన కారవ్యాన్ని వాడడం అంత మంచిది కాదని భావించిన నరేశ్.. ప్రత్యేకంగా ఓ కారవ్యాన్ కొలుగోలు చేశాడట. తనకు కావాల్సిన సదుపాయాలు అన్ని ఉండేలా దాన్ని ఏర్పాటు చేయించుకున్నారట. అందులో ఏసీ బెడ్, మేకప్ ప్లేస్, జిమ్, వెయిటింగ్ రూమ్, వాష్రూప్తో సహా అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయట. ఈ వ్యాన్ని ఆయన ముంబై నుంచి తెప్పించారట. దీని కోసం నరేశ్ భారీగానే ఖర్చు చేశారట. ప్రస్తుతం టాలీవుడ్లో ఏ క్యారెక్టర్ ఆర్టిస్టుకి ప్రత్యేకంగా కారవ్యాన్ లేదు. కొంతమంది సీనియర్ నటులకు అయితే నిర్మాతలే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారట. అయితే నరేశ్ మాత్రం సొంతంగా క్యారవాన్ కొలుగోలు చేయడం విశేషం. -
అదే ఫాలో అవుతున్నా.. అందుకే ఇప్పటికీ టాప్లో ఉన్నాను : నరేశ్
Naresh VK actor: ‘‘విజయకృష్ణ మూవీస్’ బ్యానర్ స్థాపించి యాభై ఏళ్లు అవుతోంది. ఈ బ్యానర్ పతాకాన్ని మళ్లీ ఎగరవేయాలనుకుని ఈ ఏడాది నుంచి సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను’’ అని నటుడు నరేశ్ విజయకృష్ణ అన్నారు. నేడు (జనవరి 20) తన పుట్టినరోజుని పురస్కరించుకుని బుధవారం నరేశ్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘కరోనాను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం లేదు. 1972లో వచ్చిన ‘పండంటి కాపురం’ సినిమాతో తెరంగేట్రం చేశాను. నటుడిగా యాభై ఏళ్లు నిండాయి. ఇంతటి సుధీర్ఘ ప్రయాణానికి కారణమైన సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మలగార్లకు, నా గురువు జంధ్యాలకి థ్యాంక్స్. యాభై ఏళ్ల ప్రయాణం తర్వాత కూడా కొత్త పాత్రలు ఇస్తున్న రచయితలు, దర్శక–నిర్మాతలకు, నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ యాభై ఏళ్లలో ఓ పదేళ్లు సామాజిక సేవ, రెండేళ్లు ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అభివృద్ధి కోసం కృషి చేశాను. ఈ ఏడాది అమ్మ పేరుతో (విజయ నిర్మల) స్టూడియోను అందుబాటులోకి తీసుకొస్తున్నాను. ‘నాలుగు స్థంభాలాట’ సమయంలో ‘గౌరవం నువ్వు ఆశించకు.. అందరికీ ఇవ్వు’ అని మా అమ్మ చెప్పారు.. నేను అదే ఫాలో అవుతుండటం వల్లే ఇంకా టాప్లో ఉన్నాను. ఓటీటీ వచ్చినా థియేటర్ అనుభూతే వేరు. ప్రస్తుతం రామ్చరణ్–శంకర్ సినిమా, సితార ఎంటర్టైన్మెంట్స్తో పాటు నవీన్ పొలిశెట్టి సినిమా చేస్తున్నాను. భవిష్యత్తులో దర్శకత్వం చేయాలని ఉంది. ప్రస్తుతం రాజకీయాల గురించి ఆలోచించడం లేదు. ఇండస్డ్రీ, ఏపీ ప్రభుత్వం (టికెట్ ధరలు, ఇతర ఇండస్ట్రీ సమస్యలను ఉద్దేశించి) మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.. త్వరలోనే మంచి నిర్ణయం వస్తుందనుకుంటున్నాను’’ అన్నారు. -
ప్రేమించి, శారీరకంగా ఒక్కటై.. గర్భం దాల్చగానే..
సాక్షి, కంబదూరు: మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన చెన్నరాయుడు కుమారై నందిని (22) మృతి కేసు మిస్టరీ వీడింది. ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు పోలీసు దర్యాప్తులో వెలుగు చూసింది. కళ్యాణదుర్గంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ రాజేష్ వెల్లడించారు. నందిని, కనగానపల్లి మండలం భానుకోటకు చెందిన నరేష్ ప్రేమించుకున్నారు. శారీరకంగానూ ఒక్కటయ్యారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నరేష్పై ఒత్తిడి చేసింది. ఇష్టం లేని అతను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. చదవండి: (పెళ్లైన 13 రోజులకే.. సచివాలయ ఉద్యోగి బలవన్మరణం) ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందామని నమ్మబలికి ఈ నెల 13న బైక్పై దేవరమాన్ల నుంచి తిమ్మాపురం వైపు వెళ్లే కపిలబండ పొదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ బలవంతంగా పురుగు మందు తాపి హత్య చేశాడు. కాగా.. నందిని మృతదేహాన్ని ఈ నెల 18న కొందరు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పటికే మృతదేహం పాడైంది. పక్కనే పురుగు మందు డబ్బా ఉండడంతో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావించారు. కానీ పోస్టుమార్టంలో ఆమె గర్భవతి అని తేలింది. ఆమె అన్న కుళ్లాయిస్వామికి అనుమానం వచ్చి కంబదూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టగా.. నందినిని నరేష్ హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. అతన్ని మంగళవారం నూతిమడుగు సమీపంలో అరెస్టు చేసి.. రిమాండ్కు తరలించారు. -
‘పుష్పక విమానం’ మూవీ రివ్యూ
టైటిల్ : పుష్పక విమానం నటీనటులు : ఆనంద్ దేవరకొండ, గీత్ సైనీ, శాన్వీ మేఘన, సునీల్, నరేశ్, హర్థవర్దన్ తదితరులు నిర్మాణ సంస్థ : కింగ్ ఆఫ్ ది హిల్, టాంగా ప్రొడక్షన్స్ నిర్మాతలు : గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ మిట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి ని దర్శకత్వం : దామోదర సంగీతం : రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్ విడుదల తేది : నవంబర్ 12, 2021 దొరసాని, మిడిల్ క్లాస్మెలోడీస్ లాంటి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ.ఇక ఇప్పుడు ఇక ‘పుష్ఫక విమానం’తో నటుడిగా ఆనంద్ మరో మెట్టు ఎక్కేందుకు సిద్ధమవుతున్నాడు. పెళ్ళైన కొద్దిరోజులకే తన భార్య మిస్సయిందనే ఆసక్తికర పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎంనో అంచనాల మధ్య ఈ శుక్రవారం (నవంబర్ 12)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్పక విమానం’మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. పుష్పక విమానం కథేటంటే..? చిట్టిలంక సుందర్(ఆనంద్ దేవరకొండ) ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియని అమాయకపు చక్రవర్తి. అతనికి మీనాక్షి(గీత్ సైని)తో వివాహం జరుగుతుంది. అయితే పెళ్లైయిన కొద్ది రోజులకే మీనాక్షి వేరొకరితో పారిపోతుంది. ఊహించని ఈ విచిత్ర పరిస్థితిని సుందర్ ఎలా ఎదుర్కొంటాడు? అసలు మీనాక్షి ఎందుకు పారిపోయింది? భార్య పారిపోయిందనే విషయాన్ని సమాజానికి తెలియనీకుండా సుందర్ ఎలాంటి పనులకు ఒడిగట్టాడు? వాటి వల్ల సుందర్కు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి? వెబ్ సీరీస్, షార్ట్ఫిలిం హీరోయిన్ రేఖకు సుందర్కు మధ్య సంబంధం ఏంటి? ఈ కథలోకి పోలీసాఫీసర్ రంగా(సునీల్) ఎలా ఎంట్రీ ఇచ్చాడు? చివరకు మీనాక్షి దొరికిందా లేదా? అనేదే ‘పుష్పక విమానం’ కథ ఎలా చేశారంటే.. ఆనంద్ దేవరకొండకు మూడో సినిమా ఇది. మొదటి రెండు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఆనంద్ నటన కాస్త మెరుగుపడింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిట్టిలంక సుందర్ పాత్రలో ఆనంద్ ఒదిగిపోయాడు. అమాయకపు చేష్టలతో అందరిని నవ్వించే ప్రయత్నం చేశాడు. భార్య పారిపోయిందనే విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని, దానికి కప్పిపుచ్చడానికి సుందర్ చేసే పనులు అందరిని నవ్విస్తాయి. అలాగే సెకండాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్లో కూడా ఆనంద్ అద్భుత నటనను కనబరిచాడు. ఇక మీనాక్షిగా గీత్ సైని మెప్పించింది. కథ మొత్తం తన పాత్ర చుట్టే తిరుగుతుంది. కానీ తెరపై ఆమె చాలా తక్కువ సమయమే కనిపిస్తుంది. అయినప్పటికీ ఉన్నంతతో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక సుందర్ నకిలీ భార్య రేఖ పాత్రలో శాన్వీ మేఘన ఒదిగిపోయింది. వెబ్సీరీస్, షార్ట్ ఫిల్మ్లు తీసే క్యారెక్టర్ ఆర్టిస్ట్ రేఖ పాత్ర తనది. తెరపై మాస్ లుక్లో కనిపిస్తుంది.ఇక పోలీసాఫీసర్ రంగగా సునీల్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సీరియస్ లుక్లో కనిపిస్తూనే తనదైన పంచ్లతో నవ్వించాడు. స్కూల్ హెడ్మాస్టర్గా నరేశ్తో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. పుష్పక విమానం ఎలా ఉందంటే.. ? పెళ్ళైన కొద్దిరోజులకే తన భార్య మిస్సయిందనే ఆసక్తికర పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు దామోదర. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ.. తెరపై మాత్రం అంత ఆస్తక్తికరంగా చూపించలేకపోయాడు. ఫస్టాఫ్లో కథ పెద్దగా ఏమీ ఉండదు. భార్య మిస్సయిందనే పాయింట్ చుట్టూనే కథ తిరుగుతుంది. భార్య కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్స్ ఇస్తే పరువు పోతుందని.. తనే వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అదే సమయంలో కొన్ని సీన్స్ సాగదీతగా అనిపించి ప్రేక్షకుడి సహనానికి పరీక్షపెడతాయి. కానీ ఇంటర్వెల్ ముందు ఇచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోవడంతో పాటు సెకండాఫ్పై ఆసక్తిని పెంచుకుంది. మీనాక్షిని ఎవరు హత్య చేశారనే విషయాన్ని చివరివరకు చెప్పకుండా, సెకండాఫ్లో కథను ఆసక్తికరంగా నడిపించాడు. అయితే పోలీసు విచారణ మాత్రం నాటకీయంగా సాగడం సినిమాకు మైనస్. దానికి తోడు కొన్ని సాగదీత సీన్స్ ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తాయి. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని సంగీతం బాగుంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా.. వైభోగం’అనే సాంగ్ మినహా మిగతా పాటలన్ని అంతంత మాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతం చక్కగా అందించారు. కథలో భాగంగానే పాటలు వస్తాయి తప్ప తెచ్చిపెట్టినట్లు ఎక్కడా అనిపించదు. హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ రవితేజ గిరిజాల తన కత్తరకు చాలా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
మంచు విష్ణు 100 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు : నరేశ్
Maa elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ప్రకియ కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు 80-100 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తాడని నటుడు, మాజీ మా అధ్యక్షుడు నరేశ్ అన్నారు. భారీ ఓటింగ్ విష్ణు ప్యానెల్కే అనుకూలం అని అన్నారు. ఈసారి ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ జరిగిందని ఇతర రాష్ట్రాల నుంచి నుంచి వచ్చిన 30-40మంది ఓట్లు విష్ణు విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి అని నరేశ్ పేర్కొన్నారు. -
MAA Elections 2021: శివబాలాజీని కొరికిన హేమ!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశ్రాజ్ ఫ్యానల్ మెంబర్స్పై మంచు విష్ణు ప్యానల్ మెంబర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాగా, పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన గొడవపై నటుడు నరేశ్ స్పందించారు. ‘పెద్ద గొడవలేవి జరగలేదు. ఎవరో ఒకరు ప్రకాశ్ రాజ్ బ్యాడ్జ్ వేసుకొని రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం. నేను, ప్రకాశ్ రాజ్ కౌగిలించుకున్నాం. ‘నో ఫైటింగ్.. ఓన్లీ ఓటింగ్’అని చెప్పుకున్నాం. శివబాలాజీని నటి హేమ కొరికిందని నరేశ్ ఆ గాయాన్ని మీడియాకు చూపించారు. -
అసభ్య వ్యాఖ్యలతో వీడియో.. కరాటే కల్యాణి, నరేశ్పై హేమ ఫిర్యాదు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మద్దతుదారులు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ప్రతి రోజు ఇరు ప్యానల్స్కు చెందిన సభ్యుల నుంచి ఎవరోర ఒకరు మీడియా ముందుకు వచ్చి ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న పోస్టల్ బ్యాలెట్లో మంచు విష్ణు కుట్ర చేస్తున్నారని ప్రకాశ్ రాజ్ ఆరోపించగా.. ఓడిపోతామనే భయంతో ప్రకాశ్ రాజ్ అలాంటి ఆరోపణలు చేస్తున్నారని విష్ణు విమర్శించారు. (చదవండి: ‘మా’ ఎన్నికలపై రవిబాబు సంచలన వ్యాఖ్యలు) ఇదిలా ఉంటే తాజాగా ప్రకాశ్ రాజ్ ప్యానల్కు చెందిన హేమ.. బుధవారం మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్కు లేఖ రాశారు. తనపై కరాటే కల్యాణి , నరేశ్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని హేమ ఆరోపించారు. అసభ్య వ్యాఖ్యలతో ఓ వీడియోను విడుదల చేశారని ఆమె లేఖలో తెలిపారు. కళ్యాణి, నరేశ్లపై చర్యలు తీసుకోవాలని హేమ విజ్ఞప్తి చేశారు. -
నన్ను ఎందుకు టార్గెట్ చేశారు?: జీవితా రాజశేఖర్
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జీవితా రాజశేఖర్ మరోసారి నరేష్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 'మా' ఎన్నికల్లో నరేష్ మాటల్ని నమ్మి తప్పుచేశాం అని, ఆయన చెప్పింది ఒక్కటి కూడా జరగలేదని పేర్కొన్నారు. తప్పులు చేయడం సహజమని, వాటిని సరిదిద్దుకున్నామన్నారు. ఎవరు ఏ ప్యానెల్లో ఉంటారన్నది వాళ్ల ఇష్టమన్న జీవిత.. మా ఎన్నికలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జరగాలన్నారు. చదవండి: 'మా' ఎన్నికల్లో మద్దతుపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు 'బండ్ల గణేష్ నాపై ఆరోపణలు చేశారు కాబట్టే ఆయన గురించి మాట్లాడాను. పృథ్వీ కూడా నాపై ఆరోపణలు చేశారు. ఎందుకు జీవితా రాజశేఖర్ను టార్గెట్ చేశారు?పృథ్వీ చేసిన ఆరోపణలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. నరేష్ అందరిని కలుపుకొని ముందుకు పోనందుకే విబేధాలు వచ్చాయి. నరేష్తో ఎందుకు విభేదాలు వచ్చాయో స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాను' అని జీవిత పేర్కొన్నారు. చదవండి: మా ఎన్నికలు: కృష్ణం రాజును కలిసిన మంచు విష్ణు -
'మా' ఎన్నికల్లో మద్దతుపై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'పెద్దల ఆశీర్వాదం నాకొద్దు. మా ఎన్నికల్లో నా సత్తాపై గెలుస్తా. పెద్దలను ప్రశ్నించే సత్తా ఉన్నవాడే అధ్యక్షుడిగా గెలవాలి. దయతో గెలిస్తే వాళ్ల దగ్గరకు వెళ్లి కూర్చోవాలి. మా ఎన్నికలపై ప్రశ్నిస్తే బెదిరించారు. నేను ఒక ఉత్తరం రాస్తే మా అసోసియేషన్కు తాళం పడేది. సౌమ్యంగానే కాదు కోపంగా మాట్లాడటం కూడా తెలుసు. చదవండి: MAA Elections 2021: మంచు విష్ణుకు బాలయ్య మద్ధతు నరేష్ అహంకారి, ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి. మా అసోసియేషన్ సిగ్గుపడేలా నరేష్ ప్రవర్తిస్తున్నారు.నన్ను తెలుగువాడు కాదని నరేష్ అన్నారు. కానీ నా అంత తెలుగు మంచు విష్ణు ప్యానెల్లో ఎవరికి రాదు. నన్ను పెంచింది తెలుగు భాష. మా అసోసియేషన్ కోసం ఒక బాధ్యత పనిచేయాలని వచ్చాను. మా సభ్యుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆత్మాభిమానం ఉంది. చాలా బాధతో, ఆక్రోశంతో సమస్యలను పరిష్కరించాలని పోటీ చేస్తున్నాం. మీరు గెలవడానికి ప్రయత్నించండి, అవతలివారిని ఓడించడానికి కాదంటూ మంచు విష్ణుకు పరోక్షంగా ఆయన కౌంటర్ వేశారు. చదవండి: ఆర్టిస్టులకు లోకల్, నాన్ లోకల్ ఉండదు: సుమన్ -
మా ఎన్నికల్లో రాజకీయాలకు చోటు లేదు
-
మంచు విష్ణుకు నరేష్ మద్దతు
-
MAA Elections 2021: మంచు విష్ణుకు నరేష్ మద్దతు
Naresh Extends Support to Manchu Vishnu Pannel: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు ప్యానల్కు మా మాజీ అధ్యక్షుడు నరేష్ మద్దతు ప్రకటించారు. విష్ణు ప్యానల్లో వివాదాస్పద వ్యక్తులెవరూ లేరని, ఆయన ప్యానెల్ కొత్తగా ఉందని అభిప్రాయపడ్డారు. విష్ణు ప్యానల్లో ఉన్నవాళ్లు చాలా చదువుకున్నవాళ్లు, మంచివాళ్లు, అనుభవజ్ఞులున్నారని, ప్యానల్లో 10 మంది మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. విష్ణు తన ప్యానల్లో స్థానికులకు పెద్దపీట వేశాడని కొనియాడారు. కాగా ‘మా కోసం మనమందరం’ పేరుతో మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉపాధ్యక్షులుగా మాదల రవి, పృథ్వీరాజ్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా బాబుమోహన్, ట్రెజరర్గా శివబాలాజీ, జాయింట్ సెక్రటరీలుగా కరాటే కల్యాణి, గౌతమ్ రాజు సహా మొత్తం ప్యానల్ సభ్యులను విష్ణు ప్రకటించాడు. చదవండి : MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్ ఇదే -
హీరో శ్రీకాంత్కు నరేష్ కౌంటర్
-
శ్రీకాంత్ జాగ్రత్తగా మాట్లాడు ఏంటమ్మా ఆ మాటలు
-
సాయి ధరమ్ మా ఇంటి నుండే బయలుదేరాడు: నటుడు నరేశ్
-
కృష్ణగారు అలా అనగానే కన్నీళ్లొచ్చాయి!
‘‘డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యాను. నేను గొప్ప నటుడు కావాలనేది మా అమ్మ (దివంగత నటి–దర్శకురాలు విజయ నిర్మల) కోరిక. నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు (బాలనటుడిగానూ చేశారు) అవుతున్నా ఇప్పటికీ బిజీగా ఉండటం నా అదృష్టం. ‘శ్రీదేవి సోడా సెంటర్’లో నేను చేసిన పాత్ర గొప్పది.. ఇప్పుడు మా అమ్మ ఆత్మ సంతోషంగా ఉంటుందనుకుంటున్నాను’’ అన్నారు వీకే నరేశ్. సుధీర్ బాబు, ఆనంది జంటగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 27న విడుదలైంది. ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన వీకే నరేశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ నేను 200 సినిమాల్లో నటించాను. అయితే ‘శ్రీదేవి సోడా సెంటర్’లోని పాత్ర నా గత చిత్రాలను మించిపోయింది. విలన్ పాత్రలకు కూడా నరేశ్ని తీసుకోవచ్చనే ఆలోచన ఇండస్ట్రీ వర్గాల్లో రేకెత్తించింది. సినిమా చూసిన కృష్ణ (సూపర్ స్టార్ కృష్ణ)గారు.. ‘నువ్వు, సుధీర్ ఈ సినిమాకు ప్రాణం పోశారు.. నీ పాత్ర నాకు కన్నీరు తెప్పించింది’ అనడంతో నాకు కన్నీళ్లొచ్చాయి. కరుణ కుమార్ పెద్ద దర్శకుడు అవుతాడు. రామానాయుడుగారిలా మంచి అభిరుచి, ప్యాషన్ ఉన్న నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడి’’ అన్నారు. మా ఎన్నికల్లో కృష్ణుడి పాత్ర! రానున్న ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో నేను కృష్ణుడి పాత్ర పోషిస్తా. ఎన్నికలు ప్రకటించిన తర్వాత రథం ఎక్కుతా.. అది ఎవరి రథం అన్నది తర్వాత చెబుతా. నేను ఒక్కసారి మాత్రమే అధ్యక్షునిగా పని చేస్తానని గతంలో చెప్పా.. రానున్న ఎన్నికల్లో మరోసారి పోటీ చేయను.. నా విజన్ని ముందుకు తీసుకెళ్లగలిగే వారసుణ్ణి మాత్రం ‘మా’ కు అందిస్తా.