notice
-
పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు
-
సీఈసీ రాజకీయాలు చేస్తున్నారు
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ రాజకీయాలు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. యమునా నదిని హరియాణాప్రభుత్వం విషపూరితం చేస్తోందంటూ తాను చేసిన వ్యాఖ్యలకు గాను ఎన్నికల సంఘం నోటీసు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తంచేశారు. కేజ్రీవాల్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం విశ్వసనీయతను రాజీవ్ కుమార్ దెబ్బతీస్తున్నారని, పదవీ విరమణ తర్వాత పెద్ద హోదాను కోరుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘానికి రాజీవ్ కుమార్ కలిగిస్తున్న నష్టం గతంలో ఎవరూ కలిగించలేదని ఆక్షేపించారు. రాజకీయాలపై ఆసక్తి ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయనకు సూచించారు. తాను బతికి ఉన్నంత వరకూ ఢిల్లీ ప్రజలను విషపూరిత జలాలు తాగనివ్వనని కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. రెండు రోజుల్లో తనను అరెస్టు చేస్తారని తెలుసని, అయినప్పటికీ భయపడబోనని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపాయని, ఢిల్లీ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని మండిపడ్డారు. హరియాణా ముఖ్యమంత్రి నాయబ్సింగ్ సైనీపై కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. యుమునా నది నీరు తాగకపోయినా తాగినట్లు ఆయన డ్రామాలాడుతున్నారని విమర్శించారు. యమునా నది నీటిలో విష రసాయనాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని తమ ముఖ్యమంత్రి అతిశీ కోరితే సైనీ పట్టించుకోలేదని ఆక్షేపించారు. యమునా నీటిని సీసాల్లో నింపి బీజేపీ, కాంగ్రెస్ పెద్దలకు ఇస్తామని, వారు ఆ నీటిని తాగితే... తాము చేసిన ఆరోపణలన్నీ తప్పు అని ఒప్పుకుంటామని చెప్పారు. తన సవాలును అమిత్ షా, నాయబ్సింగ్ సైనీ, రాహుల్ గాంధీ స్వీకరించాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ స్పష్టమైన వివరణ ఇవ్వాలి: ఈసీ యమునా నదిలో అమ్మోనియం స్థాయి పెరగడాన్ని విషంతో ముడిపెట్టొద్దని అరవింద్ కేజ్రీవాల్కు ఎన్నికల సంఘం సూచించింది. యమునా నది నీటి విషయంలో కేజ్రీవాల్ ఇచి్చన వివరణపై ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు. హరియాణా ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఏమిటో చెప్పాలని, అందుకు మరో అవకాశం ఇస్తున్నామని స్పష్టంచేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం కేజ్రీవాల్కు లేఖ రాసింది. బుధవారం ఇచ్చిన వివరణలో స్పష్టత లేదని పేర్కొంది. శుక్రవారం ఉదయం 11 గంటల కల్లా పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అందులో అన్ని అంశాలు ఉండాలని పేర్కొంది. తమ ఎదుట హాజరు కాకపోతే తగిన చర్యలు తీసుకోక తప్పదని తేల్చిచెప్పింది. ఎన్నికల సంఘం నుంచి లేఖ వచ్చిన తర్వాత కేజ్రీవాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సీఈసీ రాజీవ్ కుమార్పై ఆరోపణలు గుప్పించారు. -
TG: ఆర్టీసీలో సమ్మె సైరన్.. నేడు యాజమాన్యానికి నోటీసులు
సాక్షి,హైదరాబాద్:నాలుగేళ్ల తర్వాత తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. తాజాగా ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మెబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ (Tgsrtc) యాజమాన్యానికి సమ్మె నోటీసు ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. ఈ మేరకు కార్మిక సంఘాల నేతలు సోమవారం(జనవరి27) ఆర్టీసీ ఎండీని కలిసి సమ్మె నోటీసు అందజేయనున్నారు. కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కార్మికులు సుదీర్ఘ సమ్మె నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. అయితే సమ్మె సమయంలో పలువురు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనమైంది. 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ను ఓడించడంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతుండడం చర్చనీయాంశమవుతోంది. ఇదీ చదవండి: నేడు ఇండోర్కు సీఎం, డిప్యూటీ సీఎం -
అకారణంగా వదిలేశాడు...న్యాయం చేయండి
సుభాష్నగర్: కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నాడు..ఆపై బిడ్డను కన్నాడు..సన్నిహితంగా ఉంటూనే విడాకుల నోటీసు ఇచ్చాడు. ఇదేంటని అమ్మాయి తల్లిదండ్రులు, పెద్దమనుషుల సమక్షంలో ప్రశ్నస్తే నిష్కారణంగా నాకు వద్దు అంటున్నాడు. దీంతో ఆ అమ్మాయి తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ముందు మౌనదీక్షకు దిగింది. సూరారం పరిధిలోని లక్ష్మీనగర్లో చోటుచేసుకున్న ఈ సంఘటనపై పోలీసులు తెల్పిన వివరాలిలా ఉన్నాయి. ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విశ్వనాథ్, అనంతలక్ష్మి దంపతుల కుమార్తె శ్రీరమ్యకు సూరారం లక్ష్మీ నగర్ ప్రాంతానికి చెందిన మైనం భాస్కరరావు, విజయలక్ష్మిల కుమారుడు శ్రీ తేజతో 2023లో వివాహం జరిగింది. మొదట్లో 3 నెలల పాటు కాపురం సజావుగా సాగింది. ఈ క్రమంలో గర్భందాల్సిన రమ్యను అబార్షన్ చేయించుకోవాలని శ్రీతేజ ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆమె అంగీకరించక పోవడంతో భార్యపైకి కోపం పెంచుకున్నాడు. ప్రసవం కోసం పుట్టింటికి వెళ్ళిన భార్యతో ప్రేమగా ఉంటూనే పథకం ప్రకారం విడాకులకు దరఖాస్తు చేశాడు. ప్రసవం తర్వాత పుట్టిన బాబును చూడడానికి రాలేదు సరికదా..విడాకుల నోటీసు చేతిలో పెట్టాడు. దీంతో రమ్య 9 నెలల కొడుకును, తల్లిదండ్రులను తీసుకుని రెండురోజుల క్రితం భర్త ఇంటికి వచి్చంది. వీరిని శ్రీతేజతోపాటు కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వకుండా..తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో రమ్య తన గోడును కాలనీ వాసులకు చెప్పి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. శ్రీతేజపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని రమ్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇంటర్పోల్ మొట్టమొదటి సిల్వర్ నోటీస్
న్యూఢిల్లీ: సభ్య దేశాలకు రంగుల కోడ్ కలిగిన నోటీసులు జారీ చేసే ఇంటర్ పోల్ (ఇంటర్నేషనల్ పోలీస్ కో ఆపరేషన్ ఆర్గనైజేషన్) అమ్ముల పొదిలో మరో ఆయుధం చేరింది. సరిహద్దులు దాటి వెళ్లే అక్రమ సంపదను గుర్తించేందుకు మొట్టమొదటిసారిగా సిల్వర్ నోటీస్ జారీ చేసింది. ఈ మేరకు చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భారత్ సహా 54 సభ్య దేశాలు, ప్రాంతాలున్నాయని ఇంటర్ పోల్ శుక్రవారం తెలిపింది. సీనియర్ మాఫియా ముఠా సభ్యుడికి చెందిన ఆస్తుల వివరాలను కనుగొనాలంటూ ఇటలీ చేసిన వినతి మేరకు ఈ నోటీస్ జారీ చేశామంది. అయితే, ఆ వ్యక్తి ఎవరనేది సభ్య దేశాలకు మాత్రమే తెలుస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది నవంబర్ వరకు ఈ నోటీస్ అమల్లో ఉంటుందని వివరించింది. అక్రమాలు, అవినీతి, డ్రగ్స్ రవాణా, పర్యావరణ సంబంధ నేరాలు, ఇతర తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి సంబంధించిన ఆస్తులను గుర్తించేందుకు సిల్వర్ నోటీస్ జారీ చేస్తామని ఇంటర్ పోల్ తెలిపింది. ఈ నోటీసులను అవసరమైతే మొత్తం 196 సభ్య దేశాలకు లేదా ఎంపికైన దేశాలకు పంపవచ్చని పేర్కొంది. ఇటువంటి నేరగాళ్లు సంపాదించిన సొత్తును స్వాధీనం చేసుకోవడం ద్వారా సంస్థాగత నేరాలను అరికట్టేందుకు అక్రమార్కుల నెట్వర్క్ను చేధించవచ్చని వివరించింది. కాగా, ప్రస్తుతం భారత్కు చెందిన కనీసం 10 మంది నేరగాళ్లు ఇతర దేశాల్లో ఉంటున్నారు. వీరు ఎంత మొత్తం నల్లధనాన్ని ఇతర దేశాలకు తరలించారనే దానిపై కచ్చితమైన సమాచారమేదీ లేదు. తాజా పరిణామంతో, మనం కూడా మెహుల్ చోక్సీ తదితర పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల నుంచి నల్లధనాన్ని వెనక్కి తెప్పించేందుకు సిల్వర్ నోటీస్ జారీ చేయాలని కోరేందుకు అవకాశం ఏర్పడిందని ఓ అధికారి తెలిపారు. ఆ 8 నోటీసులు ఏవంటే.. ఫ్రాన్సులోని లియోన్ నగరం కేంద్రంగా ఇంటర్పోల్ కార్యకలాపాలు సాగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సభ్య దేశాల నుంచి అవసరమైన సమాచారం కోసం ఇంటర్పోల్ ప్రస్తుతం 8 రకాల కోడెడ్ నోటీసులను జారీ చేస్తోంది. ఇందులో రెడ్ నోటీస్ను మరో దేశంలో దాక్కున్న పరారైన నేరగాడిని పట్టుకునేందుకు లేదా గుర్తించేందుకు సభ్యదేశం విజ్ఞప్తి మేరకు జారీ చేస్తుంది. యెల్లో నోటీస్ను కనిపించకుండా పోయిన వారిని, ముఖ్యంగా చిన్నారులను వెదికి పట్టుకునేందుకు జారీ చేస్తుంది. ఓ నేర ఘటన దర్యాప్తులో భాగంగా ఓ వ్యక్తిని లేదా ప్రాంతాన్ని గుర్తించేందుకు బ్లూ నోటీస్ను పంపుతుంది. ప్రజల భద్రతకు ప్రమాదకరంగా మారిన వ్యక్తి, అతడి నేర కార్యకలాపాలపై గ్రీన్ నోటీసును, గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించిన సమాచారం కోసం బ్లాక్ నోటీసును, ఒక ఘటన, వ్యక్తి లేదా వస్తువు, ప్రక్రియ కారణంగా ప్రజల భద్రతకు ప్రమాదమని భావిస్తే ఆరెంజ్ నోటీసును, నేరగాళ్లు ఆవలంభించే వివిధ ఆయుధాలు, లక్ష్యాలు, రహస్య విధానాలకు సంబంధించిన సమాచారంతో పర్పుల్ నోటీసును సభ్య దేశాలకు పంపుతుంది. అంతేకాదు, ఐరాస సర్వప్రతినిధి సభ వివిధ వ్యక్తులు, సంస్థలు లక్ష్యంగా విధించే ఆంక్షలకు సంబంధించిన నోటీసులను సైతం ఇంటర్పోల్ జారీ చేస్తుంది. -
కేటీఆర్కు మళ్లీ ACB నోటీసులు!
-
మీకూ అందుతాయి ఐటీ నోటీసులు.. ఎప్పుడంటే..
డిజిటల్ ఇండియా(Digital India) యుగంలో చాలామంది ఆన్లైన్ నగదు లావాదేవీలు జరుపుతున్నారు. చిన్నమొత్తంలో జరిపే లావాదేవీల సంగతి అటుంచితే, పెద్దమొత్తంలో చేసే నగదు బదిలీలపై ప్రభుత్వం నిఘా వేస్తోంది. ఈ నగదు బదిలీల విషయంలో ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు ప్రభుత్వ పన్నుల యంత్రాంగం గుర్తిస్తే వారికి ఆదాయ పన్నుశాఖ నోటీసులు(IT Notices) తప్పవు. అయితే ఎలాంటి సందర్భాల్లో నోటీసులు అందుతాయో కొన్నింటి గురించి తెలుసుకుందాం.బ్యాంకు ఖాతాలో నగదు జమసెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నిబంధనల ప్రకారం, ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే, దానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. ఈ డబ్బు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో జమ చేసినా కొన్నిసార్లు నోటీసులు అందుకునే అవకాశం ఉంది. నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తే ఆదాయపు పన్ను శాఖకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.ఫిక్స్డ్ డిపాజిట్లో జమ చేయడంఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేసినప్పుడు నోటీసులు అందుతున్నట్లే, ఫిక్స్డ్ డిపాజిట్(Fixed Deposite)ల విషయంలోనూ అదే జరుగుతుంది. ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎఫ్డీలలో రూ.10 లక్షల కంటే అధికంగా డిపాజిట్ చేస్తే కొన్నిసార్లు ఆదాయపు పన్ను శాఖ నోటీసు అందవచ్చు.ఆస్తి లావాదేవీలుస్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపినట్లయితే రిజిస్ట్రార్ ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేస్తారు. అటువంటి పరిస్థితిలో భారీ లావాదేవీలు జరిపారు కాబట్టి, ఆ డబ్బు మీకు ఎలా సమకూరిందనే వివరాలు అడుగుతూ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపవచ్చు.క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులుక్రెడిట్ కార్డ్ బిల్లు(Credit card Bill) రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని నగదు రూపంలో చెల్లిస్తే ఆ డబ్బు ఎలా సమకూరిందో ప్రభుత్వం అడగొచ్చు. మరోవైపు, ఏ ఆర్థిక సంవత్సరంలో అయినా మొత్తం కలిపి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పేమెంట్ చెల్లించినట్లయితే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆదాయపు పన్ను శాఖ మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమాషేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్ల కొనుగోలుషేర్లు, మ్యూచువల్ ఫండ్లు, డిబెంచర్లు లేదా బాండ్లను కొనుగోలు చేయడానికి పెద్ద మొత్తంలో నగదు ఉపయోగించినట్లయితే ఇది ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. ఒక వ్యక్తి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే దానికి సంబంధించిన సమాచారం ప్రభుత్వం వద్ద నమోదు అవుతుంది. ఆ సందర్భంలోనూ నోటీసులు అందవచ్చు. -
అల్లు అర్జున్ కు పోలీసులు షాక్ !
-
మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు
-
పేర్ని నాని భార్యను పోలీస్ స్టేషన్ కు రప్పించే కుట్ర
-
కూటమి సర్కార్ ‘రాజకీయ’ కక్ష.. మహిళను అవమానించేలా..
సాక్షి, కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు కొనసాగిస్తూనే ఉంది. మరోసారి పేర్ని నాని సతీమణి జయసుధకు పోలీసులు నోటీసులిచ్చారు. రాజకీయ కక్ష సాధింపు కోసం మహిళలను అవమానించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పదే పదే విచారణకు పిలిచి పేర్ని నాని కుటుంబాన్ని అవమానించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ నాడు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు.మధ్యాహ్నం రెండు గంటల్లోగా విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బందరు తాలుకా పీఎస్కు పేర్ని నాని సతీమణి జయసుధ విచారణకు హాజరయ్యారు. తన న్యాయవాదులతో కలిసి పేర్ని జయసుధ పీఎస్కు వెళ్లారు. ఆమెను సుమారు రెండు గంటల పాటు విచారించారు.ఆరోగ్యం బాగోలేకపోయినా విచారణకు రావాల్సిందే..స్పైనల్ కార్డ్ సమస్యతో బాధపడుతూ జయసుధ విచారణకు హాజరయ్యారు. ఆరోగ్యం బాగోలేకపోయినా విచారణకు రావాల్సిందేనని పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణ సమయంలో జయసుధతో పాటు లాయర్లను పోలీసులు అనుమతించలేదు. జయసుధతో పాటు వచ్చిన వైఎస్సార్సీపీ మహిళా నేతలను సైతం పోలీసులు బయటికి పంపించేశారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.అనారోగ్యంతో ఉన్నప్పటికీ జయసుధ విచారణకు హాజరయ్యారు. పేర్ని జయసుధ తరఫు న్యాయవాది వరద రాజులు మీడియాతో మాట్లాడుతూ, న్యాయస్థానం విధించిన షరతులకు లోబడి పోలీసుల విచారణకు జయసుధ హాజరయ్యారయ్యారని.. జయసుధ స్పైనల్ కార్డ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ విచారణకు హాజరయ్యారన్నారు. గంట నుంచి పోలీసులు విచారిస్తున్నారని.. ఆనారోగ్యంతో ఉన్నప్పటికీ పోలీసుల విచారణకు జయసుధ సహకరిస్తున్నారని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇద్దరి ష్యూరిటీ సర్టిఫికెట్లను పోలీసులకు అందజేశామని వరద రాజులు తెలిపారు.అక్రమ కేసులతో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో అంతకంతకూ పెట్రేగిపోతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులతో అణచివేసే కుట్రలకు మరింతగా పదనుపెడుతోంది. పేర్ని నాని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసుల మీద అక్రమ కేసులు నమోదు చేస్తుండటం రాష్ట్రంలో హక్కుల హననానికి తాజా నిదర్శనం. ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తడవుగా అధికార యంత్రాంగం ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది. ఇదీ చదవండి: ఇదీ పన్నాగం.. చంద్రబాబు సర్కార్ బరితెగింపు.. -
ఫార్ములా కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు
-
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు
-
కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు
-
అల్లు అర్జున్కు షాక్.. పోలీసుల నోటీసులు
సంధ్య థియేటర్ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా అల్లు అర్జున్కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులిచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. పుష్ప-2 సినిమా రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.అల్లు అర్జున్ అరెస్ట్.. విడుదల..అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.మధ్యంతర బెయిల్..అయితే అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ బన్నీ హైకోర్టును ఆశ్రయించారు. బన్నీ పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం అరెస్ట్ అయిన రోజే నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత మరుసటి ఉదయమే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.(ఇది చదవండి: సంధ్య థియేటర్ ఘటన.. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల సాయం)అసలే జరిగిందంటే..ఈనెల 5న అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప-2 చిత్రం విడుదలైంది. అయితే అంతకుముందు రోజే ఈ మూవీకి సంబంధించిన బెనిఫిట్ షోను ప్రదర్శించారు. ఈ షోను వీక్షించేందుకు అల్లు అర్జున్ తన భార్యతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్కు వెళ్లారు. అదే సమయంలో అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్పై కూడా కేసు నమోదు చేశారు. -
కేటీఆర్ కు ACB నోటీసులు!
-
మాజీ మంత్రి పేర్ని నానికి పోలీసుల నోటీసులు
-
మోహన్ బాబుకు మరోసారి బైండోవర్ నోటీసులు
-
ధనుశ్ - నయనతార వివాదం.. కోర్టు కీలక ఆదేశాలు!
నయనతార- కోలీవుడ్ హీరో ధనుశ్ మధ్య వివాదం కీలక మలుపు తిరిగింది. ధనుశ్ ఇప్పటికే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన సినిమాలోని ఓ క్లిప్ను అనుమతి లేకుండా వినియోగించారంటూ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం హీరోయిన్ నయనతారకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీలోగా వివరణ ఇవ్వాలంటూ నయన్కు నోటీసులిచ్చింది. ఈ వ్యవహరంలో మీ వైఖరి చెప్పాలంటూ నయన్ దంపతులతోపాటు నెట్ఫ్లిక్స్ బృందాన్ని కోర్టు ఆదేశించింది. అసలేంటి వివాదం?ఇటీవల నయనతార తన ప్రేమ పెళ్లిపై రూపొందించిన డాక్యుమెంటరీని విడుదల చేసింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే పేరుతో రిలీజైన డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని మూడు సెకన్ల క్లిప్ను ఉపయోగించారు. దీంతో తన పర్మిషన్ లేకుండా తన సినిమాలోని క్లిప్ను వినియోగించారంటూ ధనుశ్ టీమ్ రూ.10 కోట్లకు దావా వేసింది. ఆ తర్వాత నయనతార ఈ వివాదంపై బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు. -
రాచకొండ సీపీ నోటీసులు
-
చంద్రబాబు మరో డైవర్షన్...
-
సినీ నటుడు అలీకి నోటీసులు
-
ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇంటికి సెర్చ్ వారెంట్
-
17,000 మంది ఉద్యోగుల తొలగింపు!
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సుమారు 10 శాతం మందిని తొలగించడానికి రంగం సిద్ధమైంది. ఈ ఏరోస్పేస్ దిగ్గజం 17,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే చాలా మందికి పింక్ స్లిప్పులు పంపిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇవి పొందిన వారు రెండు నెలలపాటు అంటే జనవరి వరకు నోటీస్ పీడియడ్లో ఉండబోతున్నట్లు స్పష్టం చేసింది.కంపెనీ తీవ్ర నష్టాల్లో ఉండడమే ఈ లేఆఫ్లకు కారణమని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో కంపెనీ మొత్తం సిబ్బందిలో దాదాపు 10 శాతం వర్క్ఫోర్స్ను తగ్గించుకుంటామని చెప్పారు. ఇటీవల సియాటెల్ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులకుపైగా సమ్మెకు దిగారు. ఈ సమ్మె కారణంగా 737 మ్యాక్స్, 767, 777 జెట్ ఎయిర్క్రాఫ్ట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కంపెనీ భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, ఉద్యోగులను తొలగించడానికి సంస్థ సిద్ధమైంది. బోయింగ్ ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు చాలా అవసరమని గతంలో కంపెనీ సీఈఓ పేర్కొన్నారు. సంస్థ తొలగించే ఉద్యోగుల్లో మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. అయితే ఏ విభాగంలో ఎంతమందిని తొలగిస్తున్నారనే స్పష్టమైన వివరాలు మాత్రం తెలియరాలేదు.ఇదీ చదవండి: దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధంఇటీవల బోయింగ్ ఉద్యోగుల సమ్మె కారణంగా విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో వివిధ విమానయాన సంస్థలకు అందించే 777 జెట్ ఎయిర్క్రాఫ్ట్ల డెలివరీలు ఆలస్యం కానున్నాయి. ఈ జెట్ 2026లో డెలివరీ చేయాల్సి ఉంది. కానీ ఉత్పత్తి ఆలస్యం కావడం వల్ల డెలివరీకి మరింత సమయం పడుతుందని అంచనా. దీనివల్ల సంస్థ షేర్స్ భారీగా క్షీణించాయి. ప్రస్తుతం కంపెనీ ఆర్థికంగా నిలబడటానికి ఉద్యోగుల తొలగింపు చాలా అవసరమని అధికారులు తెలిపారు. -
హైదరాబాద్ లో ఆర్జీవీ కి నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులు
-
ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి నోటీసులు రాలేదు: వికీపీడియా
భారత ప్రభుత్వం నుంచ తమకు ఎలాంటి నోటీసులు అందలేదని వికీపీడియా తాజాగా వెల్లడించింది. వికీపీడియాలో ఎడిటింగ్ పద్దతులు, కంటెంట్లో ఖచ్చితత్వానికి సంబంధించి భారత ప్రభుత్వం నుంచి గత రెండు రోజుల్లో ఎలాంటి అధికారిక నోటీసులు అందలేదని వికీపిడియా ఫౌండేషన్ పేర్కొంది. ఈ మేరకు వికీపీడియా ఫౌండేషన్ ప్రతినిధి మాట్లాడుతూ.. వికీపీడియా లాభాపేక్ష లేని సంస్థ అని,ా ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి ఖర్చు లేకుండా లక్షలాది మందికి అవసరమైన సమాచారాన్ని అందిస్తుందన తెలిపారు.‘ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా వాలంటీర్లు మా సైట్కు కంటెంట్ను అందిస్తున్నారు. ప్రతి నెల దాదాపు 850 మిలియన్లకు పైగా భారతీయులకు మా సైట్ ఉపయోగపడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక వీక్షకుల్లో భారత్ అయిదో స్థానంలో ఉంది. ఇందులో వాలంటీర్లు వారికి తెలిసిన సమాచారాన్ని సైట్లో అప్లోడ్ చేయరు. విశ్వసనీయ వార్తాసంస్థలు, ప్రముఖ ప్రచురణ సంస్థల నుంచి మాత్రమే సమాచారాన్ని సేకరిస్తారు. అందుకే మా ఆర్టికల్స్లోను విశ్వసిస్తారు. వికీపీడియాలోని ఎడిటింగ్ పద్ధతులు, కంటెంట్లోని కచ్చితత్వానికి సంబంధించి భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీసులు అందలేదు. మా సంస్థలోని తటస్థ నిబంధనలను సంపాదకీయులు ఆచరిస్తారు. రాజకీయ నేపథ్యం ఉన్న అనేకమంది వాలంటీర్లు మా సంస్థలో భాగమై ఉన్నారు. ఏ ఆర్టికల్ అయినా విస్తృత సమాచారంతోనే రాస్తాం. ఆ సమాచారానికి సంబంధించిన సోర్సుల వివరాలు కూడా ఆర్టికల్ పేజీల్లో పేర్కొంటాం’ అని తెలిపారు. కాగా ప్రముఖ ఉచిత సమాచార సంస్థ వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వికీపీడియాలో పక్షపాతంగా సమాచారం ఉంటుందని, కొన్ని తప్పుడు సమాచారాలు కూడా ఉంటున్నాయని పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. వీటిపై కేంద్రం తాజాగా చర్యలు చేపట్టింది. కేంద్రం రాసిన లేఖలో చిన్న సంపాదకులకు, సంస్థలకు కూడా కంటెంట్పై ఎడిటోరియల్ నియంత్రణ ఉంటుందని.. వికీపీడియాలో ఆ వ్యవస్థ ఎందుకు లేదని ప్రశ్నించింది. వికీపిడియాను కేవలం మధ్యవర్తిగా కాకుండా పబ్లిషర్గా(ప్రచురణకర్త) ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించింది. -
వికీపీడియాకు కేంద్రం నోటీసులు.. ఎందుకంటే!
న్యూఢిల్లీ: ప్రముఖ ఉచిత సమాచార సంస్థ వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వెబ్సైట్లో కచ్చితత్వం లేని కూడిన సమాచారం ఉందన్న ఫిర్యాదుల మేరకు కేంద్రం నోటీసులు ఇచ్చింది. వికీపీడియాలో పక్షపాతంగా సమాచారం ఉంటుందని, కొన్ని తప్పుడు సమాచారాలు కూడా ఉంటున్నాయని పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. వీటిపై కేంద్రం తాజాగా చర్యలు చేపట్టింది. కేంద్రం రాసిన లేఖలో చిన్న సంపాదకులకు, సంస్థలకు కూడా కంటెంట్పై ఎడిటోరియల్ నియంత్రణ ఉంటుందని.. వికీపీడియాలో ఆ వ్యవస్థ ఎందుకు లేదని ప్రశ్నించింది. వికీపిడియాను కేవలం మధ్యవర్తిగా కాకుండా పబ్లిషర్గా(ప్రచురణకర్త) ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించింది. కాగా ఇటీవలే వికీపీడియాపై న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమ సంస్థ పరువుకు భంగం కలిగించే విధంగా వికీపీడియా వ్యవహరించిందంటూ ఢిల్లీ హైకోర్టులో రూ. 2 కోట్ల పరువునష్టం దావా వేసింది. దీనిపై కోర్టు కూడా వికీపీడియాకి చీవాట్లు పెట్టింది. ‘కోర్టు ధిక్కార నోటీసులు’ కూడా జారీ చేసింది. భారత న్యాయవ్యవస్థ ఆదేశాలను పాటించకపోతే, భారత్ తమ వ్యాపారాన్ని మూసివేయమని ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. మీకు భారతదేశం నచ్చకపోతే ఇక్కడ మీ కార్యాకలాపాలు మూసివేయాలని తెలిపింది. ఇదిలా ఉండగా వికీపీడియాను జిమ్మీ వేల్స్ లారీ సాంగర్ 2001లో స్థాపించారు. ఈ వెబ్సైట్ యునైటెడ్ స్టేట్స్లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తుంది. -
గీత దాటితే చర్యలు తప్పవ్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు యాజమాన్యం వార్నింగ్
సాక్షి, విశాఖపట్నం : అధికారంలోకి రాక ముందు విశాఖ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికారు.. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత.. యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా పట్టించుకోవడం లేదంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు ప్లాంట్లో జరుగుతున్న పరిణామాలేనని అంటున్నారు.ఇటీవల యాజమాన్యం హెచ్ఆర్ఏ తొలగింపుపై గత నెల ఈడీ వర్క్స్ ముందు కార్మికుల నిరసన చేపట్టారు. నాడు నిరసన తెలిపిన కార్మికులకు తాజాగా నోటీసులు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్లో నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించింది. మళ్ళీ పునరావృతమైతే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చింది. అధికారులను కార్మిక సంఘాల నేతలు కలవకూడదంటూ సర్క్యులర్లో తెలిపింది. లోపల జరిగిన ప్రమాద వివరాలను బయట పెట్టకూడదు హూకం జారీ చేసింది.దీంతో గత ఆరు నెలల నుండి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులు తరుపున సీఎండీతో మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కావాలంటూ కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిపై సీఎండీ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో పాటు దసరాకు బోనస్ ఇవ్వలేదని, దీపావళికి జీతం లేదంటూ కార్మికులు వాపోతున్నారు. ఇంత జరగుతున్నా కూటమి నేతుల నోరు మెపదకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జీవన్ రెడ్డికి ఝలక్..
-
భారత దౌత్యవేత్తలపై నిఘా: కెనడా
ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి ఒట్టావాలోని భారత హైకమిషన్ర్ను కెనడా అనుమానితునిగా పేర్కొటంతో ఇరు దేశాల దౌత్య సంబంధాలు క్షిణించాయి. కెనడా చేసిన ఆరోపణులను ఇప్పటికే భారత్ తీవ్రంగా ఖండించింది. తాజాగా కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కీలక వ్యాఖ్యలు చేశారు. మిగిలిన భారత దౌత్యవేత్తలపై నిఘా వేసి ఉంచామని అన్నారు. ఒట్టావా హై కమిషనర్తో సహా ఆరుగురు భారత దౌత్యవేత్తలను తొలగించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా వియన్నా కన్వెన్షన్ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడితే సహించేది లేదన్నారు. చదవండి: కెనడాలో భారతీయుల హవా.. విద్యా, ఉద్యోగాల్లో ముందంజ‘‘మన దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదు. కెనడా గడ్డపై విదేశీ అణచివేత జరగదు. ఐరోపాలో ఇటువంటి ఘటన చూశాం. జర్మనీ , బ్రిటన్లో రష్యా విదేవీ జోక్యానికి పాల్పడింది. మేం ఈ విషయంలో చాలా దృఢంగా ఉన్నాం’’ అని అన్నారు. ఇతర భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరిస్తారా? మీడియా అడిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘‘ మిగిలిన భారత దౌత్యవేత్తలపై స్పష్టంగా నిఘా వేసి ఉంచాం. భారత దౌత్యవేత్తల్లో ఒట్టావాలోని హైకమిషనర్తో సహా ఆరుగురిని బహిష్కరించాం. ఇతరులు ప్రధానంగా టొరంటో, వాంకోవర్లో ఉన్నారని తెలిపారు. అదేవిధంగా భారత దౌత్య వేత్తలు వియన్నా కన్వెన్షన్ ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరిస్తే మేం సహించబోం’’ అని అన్నారు.నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సి ఉందంటూ భారత విదేశాంగ శాఖకు కెనడా సందేశం పంపింది. ఇక.. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన విషయం తెలిసిందే.చదవండి: దృష్టి మరల్చేందుకే.. నిజ్జర్ హత్య తెరపైకి -
ఓలా ఎలక్ట్రిక్కు మరో షాక్
న్యూఢిల్లీ: విద్యుత్ స్కూటర్ల సంస్థ ఓలా ఎలక్ట్రిక్కు వరుసగా షాకులు తగులుతున్నాయి. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అనుచిత వ్యాపార విధానాలతో నిబంధనలను ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలతో సెంట్రల్ కన్సూ్యమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) తాజాగా షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించినట్లు ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలిపింది. అయితే, తమ ఆర్థిక, నిర్వహణ కార్యకలాపాలపై దీని ప్రభావం ఉండదని పేర్కొంది. అలాగే, సీసీపీఏ ఎలాంటి జరిమానాలు విధించలేదని తెలిపింది. ఈ వార్తలతో ఓలా షేరు మంగళవారం మరో 6% పడింది. చివర్లో కోలుకుని 5 శాతం లాభంతో రూ. 95 వద్ద క్లోజైంది. వాహనాల సర్విస్ నాణ్యతపై సోషల్ మీడియాలో స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాతో ఓలా వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ మధ్య వాగ్వాదం ప్రభావంతో సోమవారం కంపెనీ షేరు 8 శాతం పైగా పతనమైంది. -
వేణుగోపాల్ ధూత్కు రూ.కోటి డిమాండ్ నోటీస్
ముంబై: వీడియోకాన్ ఇండస్ట్రీస్ షేర్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ కార్యకలాపాలకు పాల్పడినందుకుగాను దాదాపు రూ.1.03 కోట్లు చెల్లించాలని పారిశ్రామికవేత్త వేణుగోపాల్ ధూత్, మరో రెండు సంస్థలకు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ డిమాండ్ నోటీసులు పంపింది. 15 రోజుల్లోగా చెల్లింపుల్లో విఫలమైతే అరెస్ట్కు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఆయన ఆస్తులతో పాటు ఇతర సంస్థలను ఆస్తులనూ జప్తు చేస్తానని రెగ్యులేటర్ హెచ్చ రించింది.ధూత్తో పాటు, ఎలక్ట్రోపార్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, వీడియోకాన్ రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ నోటీసులు అందుకున్న సంస్థల్లో ఉన్నాయి. 2017లో ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను 2021 సెపె్టంబర్లో సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తమపై విధించిన రూ. 75 లక్షల జరిమా నాను చెల్లించడంలో ధూత్తో సహా ఈ సంస్థలు విఫలమైన నేపథ్యంలో తాజా డిమాండ్ నోటీసులు జారీ అయ్యాయి. ధూత్, మరో రెండు సంస్థలు ప్రచురితంకాని ప్రైస్ సెన్సి టివ్ ఇన్ఫర్మేషన్ (యూపీఎస్ఐ) వద్ద మార్కె ట్ లావాదేవీలను నిర్వహించినట్లు గుర్తించిన నేపథ్యంలో సెబీ ఈ చర్యలు తీసుకుంది. -
వినేశ్కు ‘నాడా’ నోటీసులు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నోటీసులు జారీ చేసింది. ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే అంశంపై 14 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. ఈనెల 9న హరియాణాలోని ఖర్ఖోడ గ్రామంలో డోప్ టెస్టు నిర్వహించాలనుకుంటే ఆ సమయంలో వినేశ్ అందుబాటులో లేకపోవడంతో ‘నాడా’ ఈ నోటీసులు జారీ చేసింది. పారిస్ ఒలింపిక్స్లో ఫైనల్కు చేరిన వినేశ్ ఫొగాట్... వంద గ్రాములు అధిక బరువు కారణంగా అనర్హతకు గురైంది. ఆ తర్వాత కెరీర్కు వీడ్కోలు పలికి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వినేశ్... హరియాణాలోని జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యరి్థగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న వినేశ్ హరియాణాలో విసృతంగా పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే వివరాలు అందించనందుకు గానూ వినేశ్కు నోటీసులు అందించాం. డోప్ నిరోధక అధికారి హాజరైన సమయంలో వినేశ్ అందుబాటులో లేదు. అందుకే ఈ నోటీసులు జారీ చేశాం’ అని ‘నాడా’ నోటీసులు పేర్కొంది. నిబంధనల ప్రకారం ఏడాది కాలంలో మూడుసార్లు వివరాలు అందించడంలో విఫలమైన అథ్లెట్లపై ‘నాడా’ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. -
జానీ మాస్టర్కు పోలీసుల నోటీసులు..!
-
మరో వివాదంలో ఎమర్జెన్సీ.. కంగనకు కోర్టు నోటీసులు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం వివాదాల సుడిలో చిక్కుకుంది. . తాజాగా ఆమెకు చండీగఢ్లోని జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. సినిమాలో సిక్కుల ప్రతిష్టను కించపరిచేలా నటించారని ఆరోపిస్తూ.. చండీగడ్ జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, అడ్వకేట్ రవీందర్ సింగ్ బస్సీ కంగనా రనౌత్ కు వ్యతిరేకంగా కోర్టులో పిటీషన్ వేశారు.అయితే సినిమాలను సిక్కు ప్రజలను అభ్యంతరకంగా చూపించారని, అనేక తప్పుడు సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ కంగనపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు.. కంగనకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్5కు వాయిదా వేసింది.ఇక నటి, బీజేపీ ఎంపీ అయిన కంగనా నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉండగా.. నిషేధాన్ని ఎదుర్కొంటుంది. సినిమాలో సిక్కులను తప్పుగా చిత్రీకరిస్తున్నారని, చారిత్రక వాస్తవాలను వక్రీకరించిందని శిరోమణి అకాలీదళ్తో సహా పలు సిక్కు సంస్థలు ఆరోపించడంతో వివాదంలో చిక్కుకుంది.సెన్సార్ సర్టిఫికేట్ పొందడంలో జాప్యం కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ కారణంగా ముంబైలోని తన ఆస్తిని బలవంతంగా విక్రయించాల్సి వచ్చిందని కంగనా ఇటీవల పేర్కొన్నారు. బాంద్రాలోని పాలి హిల్లో ఉన్న తన బంగ్లాను రూ. 32 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. -
ఎన్నారైలకూ సమన్లు వస్తాయ్..
మొదలైంది.. ఎన్నారైలకు నోటీసుల పరంపర!! ఎన్నారైలకు విదేశాల్లో ఉన్న ఆస్తుల గురించి, ఆదాయం గురించి.. ఆదాయపు స్టేటస్ గురించి.. ఆదాయపు పన్ను వారి ఇన్వెస్టిగేషన్ యూనిట్ నుంచి నోటీసులు మొదలయ్యాయి. మీకూ తెలిసే ఉంటుంది. పన్ను భారం విధించడానికి ప్రమాణం.. మీ రెసిడెంట్ స్టేటస్. అంతేకాని ఎటువంటి సందర్భంలో పౌరసత్వంతో సంబంధం లేదు.ఒక వ్యక్తి భారతదేశంలో 182 రోజులు లేదా ఎక్కువ రోజులు నివాసం ఉంటే రెసిడెంట్ అవుతారు లేదా ఆర్థిక సంవత్సరంలో 60 రోజులు ఉండి, గత నాలుగు సంవత్సరాల్లో 365 రోజులున్నా రెసిడెంట్లు అవుతారు. మిగతా వారందరూ నాన్–రెసిడెంట్లు అవుతారు. స్థూలంగా చెప్పాలంటే పన్ను విధింపు, లెక్కింపు మొదలైన విషయాల్లో రెసిడెంట్లకు, నాన్–రెసిడెంట్లకు ఎన్నో తేడాలున్నాయి. నోటీసులో ఏయే అంశాలు అడుగుతున్నారంటే..విదేశాలకు ఎప్పుడు వెళ్లారు?ఏ సంవత్సరంలో విదేశాల్లో బ్యాంకు అకౌంటు తెరిచారు? ఆ అకౌంటు వివరాలు ఆ రోజు నుంచి రెసిడెంట్ స్టేటస్ పాస్పోర్ట్లో రాక/పోకకి సంబంధించి ఎంట్రీలు బ్యాంకు అకౌంటు ఎటువంటిదైనా వివరాలు ఇవ్వాలి స్థిరాస్తి వివరాలు ఆదాయ వివరాలు పన్ను చెల్లింపు వివరాలు సంబంధిత వివరాలువిదేశీ సంస్థల ద్వారా సమాచారం తెలుసుకుని వారికి నోటీసులు.. అవసరమైతే సమన్లు ఇస్తున్నారు. నలభై సంవత్సరాల చరిత్ర అడుగుతున్నారని కొందరు వాపోతున్నారు. ఇది అసమంజసం అని అర్జీ పెట్టుకుంటే ఆ అర్జీని కొట్టేస్తున్నారని అంటున్నారు. చట్టప్రకారం ఒకప్పుడు 16 సంవత్సరాలుగా ఉన్న కాలపరిమితిని 10 సంవత్సరాలకు తగ్గించారు. ఆ పదిని 5 సంవత్సరాలకు తగ్గించారు. ఈ కాలపరిమితిని అనుసరించి విదేశీ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కేవలం ఎన్నారైలు కానివారి దగ్గర్నుంచి.. అంటే రెసిడెంట్లు దగ్గర్నుంచి అడుగుతారు.నాన్–రెసిడెంట్లు .. వారున్న దేశం – అంటే విదేశంలోని ఆస్తుల వివరాలు ఇవ్వనవసరం లేదు. ఎటువంటి బాధ్యత లేదు. మరయితే ఎవరిపైన ఈ అస్త్రాలు అంటే.. ‘‘రెసిడెంట్ స్టేటస్లో ఉంటూ నాన్–రెసిడెంట్లుగా చలామణీ అవుతున్న’’ వారి మీద. మనం వాడుక భాషలో విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారిని ‘ఎన్నారై’లు అనేస్తాం. కానీ, చట్టప్రకారం స్టేటస్ లెక్కించాలి. అనుమానం వస్తే నోటీసుల ఇస్తారు. సమాచారం అడుగుతారు. ఇవ్వకపోతే పెనాల్టీ వేస్తారు. మీరు కోర్టులను ఆశ్రయించవచ్చు. డిపార్ట్మెంట్ వారు బ్లాక్మనీ చట్టానికి సంబంధించిన అధికార్లకు రిఫర్ చేయొచ్చు. వారు వారి పని చేస్తారు. ఎలా బయట పడాలి? విదేశాల్లో ఉద్యోగం నిమిత్తం/చదువు కోసం వెళ్లినవారు విధిగా అన్ని రికార్డులు నిర్వహించండి. వీలుంటే ఫ్లైట్ టికెట్లు, బోర్డింగ్ పాస్లు, సంబంధిత ఈమెయిల్స్, పాస్పోర్టులు, పాతవి, లేటెస్టువి, వీసాకు సంబంధించిన కాగితాలు, విదేశాల్లో చేసిన ఇన్వెస్ట్మెంట్లు, ఏ తేదీ నాడు ఎంతెంత చేశారు.. ఏమి కొన్నారు .. స్థిరాస్తులు, మొదలైనవి రెడీగా ఉంచండి. అడిగినప్పుడు సకాలంలో ఇవ్వండి. నిజాయితీగా. ఆలస్యం అవుతుందంటే ఆ విషయం చెప్పండి. గడువు తేదీ లోపల స్పందించండి.మీరు నిజంగానే నాన్–రెసిడెంట్ అయితే, మీరు భయపడక్కర్లేదు. ఎవరినీ భయపెట్టడం లేదు. ముందు నుంచి మనం చెప్పేది ఒకటే. మీరు చేసే ఏ వ్యవహారానికైనా డాక్యుమెంట్లు తప్పనిసరి!! -
హైడ్రా రద్దు పిటిషన్.. తెలంగాణ సర్కార్కు కౌంటర్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తూ నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న ‘హైడ్రా’ను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి కౌంటర్ ఆదేశాలు జారీ చేసింది.హైడ్రా ఏర్పాటు కోసం ప్రభుత్వం తీసుకొచ్చి జీవో 99ను ఛాలెంజ్ చేస్తూ లక్ష్మీ అనే మహిళ పిటిషన్ ఫైల్ చేశారు. దీనిపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. హైడ్రా ఏర్పాటు నిబంధనలకు విరుద్దంగా జరిగిందని పిటిషనర్ వాదించారు. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం వాటి అధికారులను మరొక అథారిటీకి ఇవ్వకూడదని తెలిపారు. జీహెచ్ఎంసీకి ఉన్న అధికారులను హైడ్రాకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జీవో 99 ప్రకారం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి లేదా ప్రభుత్వ కార్యదర్శి అధికారిగా ఉండాలని కానీ ప్రస్తుతం హైడ్రాను ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి కాకుండా ఉన్న వ్యక్తిని నియమించారని ప్రస్తావించింది. వాదనల అనంతరం ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. -
గుడి గంట కాలుష్యం.. పీసీబీ నుంచి నోటీసు
ఆలయంలోని గంటను మోగిస్తే దుష్టశక్తులు దూరమవుతాయని చెబుతుంటారు. అయితే ఇప్పుడు కోర్టు నోటీసులు వస్తున్నాయి. ఇటువంటి ఉదంతం ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలోని ఒక సొసైటీలోగల ఆలయానికి ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(యూపీపీసీబీ) నుంచి నోటీసు వచ్చింది. ఆలయంలోని గంటలు మోగించడం వలన శబ్ధ కాలుష్యం ఏర్పడుతున్నదంటూ యూపీపీసీబీ సదరు సొసైటీకి నోటీసు పంపింది. ఇప్పుడు ఈ నోటీసు కాపీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం గౌర్ సౌందర్య సొసైటీలో చోటుచేసుకుంది. సొసైటీలో గల గుడిలో గంటలు మోగించడం వలన శబ్ద కాలుష్యం ఏర్పడుతున్నదని అక్కడ నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. దీనిని స్పందించిన యూపీపీసీబీ సొసైటీకి నోటీసులు పంపింది.సొసైటీలో నివసిస్తున్న ముదిత్ బన్సల్ జూలై 30న ఈ-మెయిల్ ద్వారా యూపీపీసీబీకి ఫిర్యాదు చేశారు. ఆగస్టు 5న యూపీపీసీబీ అధికారులు ఆలయ గంట కారణంగా కలుగుతున్న శబ్ద కాలుష్యాన్ని తనిఖీ చేశారు. ఆ గంట నుంచి 70 డెసిబుల్స్ శబ్ధం వస్తున్నదని గుర్తించారు. సొసైటీకి జారీ చేసిన నోటీసులో యూపీపీసీబీ.. శబ్ద కాలుష్య నివారణ నిబంధనలను పాటించాలని, స్థానికులు ఇబ్బందులు పడకుండా చూడాలని సొసైటీని సూచించింది. ఈ నోటీసుపై సమాధానం కూడా కోరింది. కాగా కొందరు ఈ నోటీసుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిని ఉపసంహరించుకోవాలని యూపీపీసీబీని కోరుతున్నారు. -
బాబు సర్కార్కు షాక్!.. జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు
-
కేటీఆర్కు మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలపై కామెంట్స్ చేసిన నేపథ్యంలో కేటీఆర్కు కమిషన్ నోటీసులు పంపింది. ఈ క్రమంలో ఆగస్టు 24వ తేదీన మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది.కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల బస్సుల్లో ప్రయాణిస్తున్న కొందరు మహిళలు చేస్తున్న పనులపై కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. దీంతో, కేటీఆర్ వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని తాజాగా నోటీసులు ఇచ్చింది. Telangana State Commission for Women has issued a notice to Sri K. Taraka Rama Rao, asking him to appear in person on 24 Aug 2024 regarding alleged derogatory remarks about women.@sharadanerella— Telangana State Commission for Women (@SCWTelangana) August 16, 2024 KTR's objectionable comments on womenమహిళలపై కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలుఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు వేసుకోవచ్చు అంటూ మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడిన కేటీఆర్.మనిషికో బస్సు పెట్టండి ...కుట్లు, అల్లికలు అవసరం అయితే డాన్స్ లు, రికార్డింగ్… pic.twitter.com/Ytv04X4vwc— Congress for Telangana (@Congress4TS) August 15, 2024 -
మారుతి సుజుకి ఇండియాకు షోకాజ్ నోటీసు
ప్రముఖ వాహన తయారీ దిగ్గజం 'మారుతి సుజుకి' రూ.3.81 కోట్లకు పైగా డిఫరెన్షియల్ డ్యూటీని చెల్లించాలని డిమాండ్ చేస్తూ కస్టమ్స్ అథారిటీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. కంపెనీ ముంబైలోని ఎయిర్ కార్గో కాంప్లెక్స్ కస్టమ్స్ (దిగుమతి), కమీషనర్ కార్యాలయం నుంచి షోకాజ్ నోటీసును అందుకుంది.ఈ షోకాజ్ నోటీసులో.. నిర్దిష్ట కేటగిరీ వస్తువుల దిగుమతిపై కస్టమ్ డ్యూటీ మినహాయింపును క్లెయిమ్ చేయడానికి & వడ్డీ, జరిమానాతో పాటు రూ.3,81,37,748 డిఫరెన్షియల్ డ్యూటీని చెల్లించడానికి గల కారణాలను అందించాల్సిందిగా అధికార యంత్రాంగం కంపెనీని కోరింది. -
ఇన్ఫీ జీఎస్టీ నోటీస్ వెనక్కి!
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్కు జారీ చేసిన జీఎస్టీ ఎగవేత నోటీసుపై అధికారులు వెనక్కి తగ్గారు. రూ.32,403 కోట్ల జీఎస్టీ ఎగవేత విషయంలో కంపెనీకి జారీ చేసిన ప్రీ–షోకాజ్ నోటీసులను కర్నాటక రాష్ట్ర జీఎస్టీ అధికారులు ఉపసంహరించుకున్నారు. అయితే, దీనిపై జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ సుంకం, సరీ్వస్ ట్యాక్స్ ఎగవేతలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ)కి వివరణ ఇవ్వాలని కంపెనీకి సూచించారు. బీఎస్ఈకి వెల్లడించిన సమాచారంలో ఇన్ఫోసిస్ ఈ విషయాన్ని తెలిపింది. 2017 నుంచి ఐదేళ్ల పాటు విదేశీ బ్రాంచ్ల నుంచి అందుకున్న సర్వీసులకు గాను రూ. 32,403 కోట్ల జీఎస్టీ చెల్లించాలంటూ పన్ను అధికారులు ఇనీ్ఫకి డిమాండ్ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. అయితే, ఇది కేవలం ప్రీ–షోకాజ్ నోటీసు మాత్రమేనని, అధికార యంత్రాంగం పేర్కొన్న వ్యయాలకు జీఎస్టీ వర్తించదని ఇన్ఫోసిస్ ఇప్పటికే స్పష్టం చేసింది.ఈ ఉదంతంపై ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ కూడా స్పందించింది. పన్ను అధికారులు ఐటీ పరిశ్రమ నిర్వహణ విధానాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని పేర్కొంది. కాగా, అంతర్జాతీయంగా భారీ వ్యాపార కార్యకలాపాలు గల కంపెనీలకు ఇలాంటి పన్ను నోటీసులను ఇచ్చే ముందు సరైన దర్యాప్తు, స్పష్టమైన రుజువులను సమరి్పంచాల్సి ఉంటుందని ఎస్కేఐ క్యాపిటల్ ఎండీ, సీఈఓ నరీందర్ వాధ్వా వ్యాఖ్యానించారు. -
ఇన్ఫోసిస్కు షోకాజ్ నోటీసు.. ఎందుకంటే?
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ. 32403 కోట్ల జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) ఎగవేతపై ప్రీ-షోకాజ్ నోటీసు అందుకుంది. బీఎస్ఈ ఫైలింగ్లో సంస్థ ఈ విషయం వెల్లడించింది.ఇన్ఫోసిస్ లిమిటెడ్.. విదేశీ బ్రాంచ్ ఆఫీస్ల కోసం చేసే ఖర్చుల వివరాలను వెల్లడించకలేదని, వాటికి జీఎస్టీ చెల్లించలేదని కర్ణాటక జీఎస్టీ అధికారులు ప్రీ-షోకాజ్ నోటీసు జారీ చేశారు. 2017 జులై నుంచి 2022 మార్చి వరకు 32403 కోట్ల రూపాయలకు జీఎస్టీ చెల్లింపు చేయలేదనేది ఈ ప్రీ-షోకాజ్ నోటీసు సారాంశం.దీనిపైన ఇన్ఫోసిస్ స్పందిస్తూ.. అటువంటి ఖర్చులపైన జీఎస్టీ వర్తించదని తాము విశ్వసిస్తున్నట్లు వెల్లడించింది. అంతే కాకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్స్, కస్టమ్స్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, భారతీయ సంస్థకు విదేశీ శాఖలు అందించే సేవలు జీఎస్టీ పరిధిలోకి రావని సంస్థ పేర్కొంది.ఇన్ఫోసిస్ ఎప్పటికప్పుడు జీఎస్టీ చెల్లిస్తూనే ఉందని, ఈ విషయంలో తాము కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధలనకు లోబడి పాటించాల్సిన అన్ని నిబంధవులను పాటిస్తున్నట్లు తెలిపింది.ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (ఐజీఎస్టీ) చట్టం ప్రకారం భారతదేశం వెలుపల ఉన్న ఇన్ఫోసిస్ కార్యాలయాలు కంపెనీ నుంచి విభిన్న సంస్థలుగా పరిగణించబడతాయని అధికారులు పేర్కొన్నారు. కాబట్టి బ్రాంచ్ కార్యాలయాలు అందించే అన్ని సేవలను దిగుమతిగా పరిగణిస్తామని, తద్వారా జీఎస్టీ విధించడం జరుగుతుందని వెల్లడించారు. -
కేజ్రీవాల్ అరెస్టు: సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: తన అరెస్టు అక్రమమని ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను ఢిల్లీహైకోర్టు మంగళవారం(జులై2) విచారించింది. కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై ఏడు రోజుల్లో కౌంటర్ వేయాలని కోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. పిటిషన్ విచారణను జులై 17కు వాయిదా వేసింది. అరెస్టు అక్రమమని పేర్కొంటూ వేసిన పిటిషన్లో పలు కీలక అంశాలను కేజ్రీవాల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.గత ఏడాది తనను సీబీఐ కేవలం సాక్షిగా పిలిచిందని, ఇప్పుడు మాత్రం కొత్తగా ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేసిందని తెలిపారు. ఛార్జ్షీట్లో పేర్కొన్న అంశాలనే సీబీఐ మళ్లీ రిపీట్ చేసిందని కోర్టు దృష్టికీ తీసుకువచ్చారు.ఇప్పటికే లిక్కస్కామ్కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులోఉన్న కేజ్రీవాల్ను జూన్26న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో కోర్టు కేజ్రీవాల్కు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ కూడా విధించింది. -
కొనసాగుతున్న కక్ష సాధింపు
భవానీపురం (విజయవాడ పశ్చిమ)/విజయనగరం/ఆదోని టౌన్ : రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై టీడీపీ సర్కారు కక్షగట్టింది. గతం మరచిపోయి కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని ఇటీవల చీకటిలో కూల్చి వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ విద్యాధరపురంలోని లేబర్కాలనీలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని కూల్చేయడానికి పావులు కదుపుతోంది. ఇందుకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి, పార్టీ ఆఫీస్ నిర్మాణానికి సంబంధించిన సిబ్బందికి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘విద్యాధరపురం లేబర్కాలనీ పార్టీ ఆఫీసుకు పాత తేదీలతో (గత నెలలో) నోటీసులు ఇస్తాం. దాని వల్ల మీకు ఇబ్బంది ఏమీ ఉండదు. మీరు ఒప్పుకుంటే రేపు తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి నోటీస్ ఇచ్చి వెళిపోతా. అధికారులు మాపై ఒత్తిడి తెస్తున్నారు’ అని కార్పొరేషన్కు చెందిన సిబ్బంది ఒకరు పార్టీ కార్యాలయం సంబంధికునికి ఫోన్ చేశారు.ఇందుకు ఇటు వైపు నుంచి సమాధానమిస్తూ ‘అలా ఎలా తీసుకుంటాం.. మీరు ఎప్పుడు నోటీస్ ఇస్తే ఆ రోజు తేదీ వేసి ఇవ్వండి. అది కూడా సైట్ దగ్గరకు వచ్చి నోటీస్ ఇస్తే తీసుకుంటాం. ఆ విషయాన్ని మాపై వారికి తెలియజేస్తాం’ అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్వీ ప్రసాద్.. అనుమతి లేకుండా పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారని సోమవారం నోటీస్ జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందిగా మారిన మురికి కుంటను పూడ్చేసి, అధికారుల అనుమతితోనే నిర్మాణం చేపట్టినప్పటికీ టీడీపీ సర్కారు కక్షగట్టి వ్యవహరిస్తోంది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మహారాజుపేటలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నిర్మాణం అక్రమమని టౌన్ ప్లానింగ్ అధికారి ఫిలిప్ సోమవారం నోటీసు జారీ చేశారు. అనుమతి లేకుండా నిర్మిస్తున్నందున తక్షణమే పనులు ఆపేసి, ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లేని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం అక్రమమని బీజేపీ నాయకుడు నాగరాజుగౌడ్, టీడీపీ నేత ఉమ్మి సలీంతో పాటు మరో ఇద్దరు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తగిన సమాధానం ఇవ్వాలని టౌన్ ప్లానింగ్ అధికారులు పార్టీ కార్యాలయానికి నోటీసు జారీ చేశారు. -
వైఎస్సార్సీపీ కార్యాలయాలు కూల్చేస్తాం: టీడీపీ ప్రభుత్వం
సాక్షి, విశాఖపట్నం/నెల్లూరు (వీఆర్సీసెంటర్)/అనంతపురం కార్పొరేషన్/సాక్షి, రాజమహేంద్రవరం : రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై వారం రోజులైనా గడవక ముందే కక్ష సాధింపు చర్యలకు దిగింది. ప్రజలేమనుకుంటారోననే భయం ఇసుమంతైనా లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాలను కూలదోయడానికి పూనుకుంది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ శనివారం తెల్లవారుజామున తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేసింది. ఇంతటితో ఆగక రాష్ట్ర వాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాలకు నోటీసులు జారీ చేసింది.పార్టీ కార్యాలయాలన్నింటినీ అక్రమంగా నిర్మిస్తున్నారని, వారం రోజుల్లో సరైన సమాధానం ఇవ్వకపోతే ఎందుకు కూల్చకూడదని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో విశాఖ, అనకాపల్లిలో వైఎస్సార్సీపీ కార్యాలయాలకు జీవీఎంసీ అధికారులు శనివారం నోటీసులు జారీచేశారు. వాస్తవానికి వీఏంఆర్డీఏకు అనుమతుల కోసం విశాఖ కార్యాలయం కోసం రూ.15.63 లక్షలు, అనకాపల్లి పార్టీ కార్యాలయం కోసం రూ.35.60 లక్షలు చెల్లించినా.. అనుమతుల్లేవంటూ శనివారం జీవీఎంసీ అధికారులు నోటీసులు కార్యాలయాల వద్ద అతికించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విశాఖపట్నం జిల్లా విశాఖ రూరల్ మండల పరిధిలోని ఎండాడ గ్రామంలో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని 33 ఏళ్ల పాటు లీజు పద్ధతిన ఎకరాకు రూ.1000 చొప్పున చెల్లించే విధంగా 2016 ఏడాదిలో ప్రభుత్వం జీవో జారీ చేసింది.గతేడాది ఫిబ్రవరి నెలలో వీఎంఆర్డీఏ అనుమతి కోరుతూ రూ.15.63 లక్షలు చెల్లించారు. 2023లో సెప్టెంబర్ 25న çఫస్ట్ ప్లోర్లో 120.34 స్క్వేర్ యార్డ్స్ ప్రపోజ్ చేస్తూ మార్ట్గేజ్ చేశారు. గతేడాది వీఎంఆర్డీఏ అనుమతులు కోరిన 21 రోజుల్లో ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పాల్సి ఉంటుంది. ఎటువంటి అభ్యంతరం లేకపోయినా..ఆటోమెటిక్గా ప్లాన్ అప్రూవల్ అయినట్లు పరిగణిస్తారు. వీఎంఆర్డీఏ ద్వారా జీవిఎంసీ అనుమతుల కోసం డీడీ తీసి ఆరు నెలలు కావస్తున్నా, ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. అయితే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే అనుమతుల్లేవని చెప్పటం పట్ల వైఎస్సార్సీపీ శ్రేణులు, నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కక్ష సాధింపు చర్యలేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, విశాఖ, అనకాపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయాల్లో ఎవరూ లేని సమయంలో జీవిఎంసీ అధికారులు నోటీసులు అతికించి వెళ్లిపోయారు. బుల్డోజర్తో కూల్చేస్తామంటూ..నెల్లూరులోని 54వ డివిజన్ జనార్దనరెడ్డి కాలనీలో నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయాన్ని బుల్డోజర్స్తో కూల్చేస్తామని నెల్లూరు టౌన్ ప్లానింగ్ అధికారులు శనివారం హడావుడి చేశారు. అక్కడ 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయ భవనం నిర్మాణంలో ఉంది. సమాచారం అందుకున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు సిటీ సమన్వయకర్త ఖలీల్ అహ్మద్ అక్కడికి చేరుకుని టౌన్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడారు.ప్రభుత్వం వద్ద 33 ఏళ్ల పాటు లీజుకు తీసుకుని, లీజు నగదునూ చెల్లించామని, అన్ని అనుమతులు తీసుకున్నామని, నిబంధనల మేరకు ఈ నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ఈ భవనం ఒక వ్యక్తికి సంబంధించినది కాదని, జిల్లా పార్టీ కార్యాలయం కాబట్టి దీని డాక్యుమెంట్లు తెప్పించేందుకు 2 రోజులు కావాలని చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోకుండా కూల్చేసామని చెప్పారు. ఏ క్షణంలోనైనా ఈ భవనాన్ని కూల్చేస్తామని చెప్పి వెళ్లారు. శనివారం రాత్రి కార్పొరేషన్ సిబ్బంది పార్టీ కార్యాలయం వద్ద నోటీసు అంటించి వెళ్లారు. 7 రోజుల్లో రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ..అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్ ఆదేశాలతో డిప్యూటీ సిటీ ప్లానర్ మారుతీహరిప్రసాద్ శనివారం వైఎస్సార్సీపీ కార్యాలయానికి నోటీసులిచ్చారు. అనంతపురం హెచ్ఎల్సీ కాలనీలో 1.50 ఎకరాల్లో పార్టీ కార్యాలయాన్ని అనధికారికంగా నిర్మిస్తున్నారని నోటీసులో పేర్కొన్నారు. 7 రోజుల్లో నోటీసుకు సమాధానం ఇవ్వాలని, అంతవరకు నిర్మాణాలు చేపట్టకూడదని, ఇప్పటివరకు అనధికారికంగా నిర్మాణం చేపట్టినందున చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించారు. స్థానిక రెండో రోడ్డులోని పార్టీ కార్యాలయంలో ఆఫీస్ బాయ్ శ్రీనివాసులుకు నోటీసు అందించారు. ఇది అనధికారిక కట్టడంరాజమహేంద్రవరంలోని వైఎస్సార్సీపీ తూర్పు గోదావరి జిల్లా కార్యాలయం అక్రమ కట్టడమని, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, పార్టీ జిల్లా అధ్యక్షుడి పేరుతో నగర పాలక సంస్థ అధికారులు శనివారం నోటీసులిచ్చారు. సువిశేషపురంలో రెండెకరాల్లో పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి 2023 జూన్ 10న అప్పటి రాష్ట్ర మంత్రులు చెల్లుబోయిన వేణు, తానేటి వనిత, పార్టీ జిల్లా అధ్యక్షుడు, నాటి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అప్పటి ఎంపీ మార్గాని భరత్రామ్ శంకుస్థాపన చేశారు.ఇప్పటికే కార్యాలయ పనులు సింహభాగం పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఇది అనధికారిక కట్టడమంటూ రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్ కె.దినేష్ కుమార్ నోటీసు జారీ చేశారు. ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. నోటీసు ప్రతిని నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయానికి అతికించారు. భవన నిర్మాణ పనులు తక్షణం నిలిపివేయాలని సూచించారు. ఇదంతా టీడీపీ నేతల కుట్రలో భాగమేనని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
వైఎస్సార్సీపీ ఆఫీస్కు నోటీసులు.. చించేసిన గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం, సాక్షి: తాడేపల్లి(గుంటూరు)లో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. మరో చర్యకు ఉపక్రమించింది. విశాఖపట్నం పార్టీ కార్యాలయానికి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నోటీసులు జారీ చేయించింది. ఈ నోటీసుల సంగతి తెలిసి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అక్కడికి చేరుకున్నారు. ఆగ్రహంతో ఆ నోటీసుల్ని చించిపడేశారు.విశాఖ రూరల్ చినగడిలి ఎండాడ వద్ద గత ఏడాది సెప్టెంబర్లో వైఎస్సార్సీపీ కార్యాలయం ప్రారంభించారు. అయితే.. జీవీఎంసీ పరిధిలో ఉన్న ఈ స్థలంలో వీఎంఆర్డీఏ నుంచి అనుమతులతో కార్యాలయం నడిపిస్తున్నారని, ఇది అక్రమ కట్టడమని పేర్కొంటూ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. తక్షణమే ఇందులో కార్యకలాపాలు నిలిపివేయాలని, వారం రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవని నోటీసుల్లో జీవీఎంసీ పేర్కొంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలను అధికార యంత్రాంగం టార్గెట్గా చేసుకుంది. నెల్లూరు పార్టీ కార్యాలయానికి కూడా మున్సిపల్ అధికారులు వెళ్లినట్లు సమాచారం. -
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు.. విద్యుత్ రంగ నిర్ణయాల్లో పాత్రపై జారీ చేసినట్లు జస్టిస్ నరసింహారెడ్డి వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి నోటీసు
శివాజీనగర: ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు నటి హేమకు సీసీబీ పోలీసులు మరో నోటీసు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాలని మొదటిసారి నోటీసు పంపగా, జ్వరం వచ్చినందున రాలేనని హేమ తెలిపారు. మంగళవారం రెండో నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మని చెప్పారు. రేవ్ పార్టీ ఏర్పాటు చేసిన వాసు, అరుణ్, సిద్ధికి, నాగబాబుతో పాటుగా ఐదుగురికి మే 27న 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం నుంచి వారిని సీసీబీ విచారణ చేపట్టింది. రేవ్ పార్టీ, డ్రగ్స్ సరఫరా వెనక ఉన్న వారిని తెలుసుకునే లక్ష్యంగా వీరిని పోలీసులు ప్రశ్నించనున్నారు. -
రూ. 2,599 కోట్లు వడ్డీతో సహా 15 రోజుల్లో కట్టాలి..
నష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న అనిల్ అంబానీ నేతృత్వంలోని కంపెనీకి అనుకోని ఎదురు దెబ్బ తగిలింది. రూ.2,599 కోట్ల భారీ మొత్తాన్ని రీఫండ్ చేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) నుంచి తుది నోటీసు అందింది. ఎన్డీటీవీ ప్రాఫిట్ నివేదిక ప్రకారం.. రూ. 2,599 కోట్లను ఎస్బీఐ ప్రైమ్ లెండింగ్ రేటుపై అదనంగా 2 శాతం చొప్పున వడ్డీతో పాటు 15 రోజులలోపు తిరిగి చెల్లించాలని కోరుతూ రిలయన్స్ ఇన్ఫ్రాకు చెందిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ (DAMEPL)కి డీఎంఆర్సీ నోటీసు జారీ చేసింది. చెల్లించడంలో విఫలమైతే కోర్టు ధిక్కార కేసును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.ఇదీ నేపథ్యం..న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి సెక్టార్ 21 ద్వారక వరకు నడిచే ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ లైన్ రూపకల్పన, నిర్వహణ కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, అనిల్ అంబానీకి చెందిన డీఏఎంఈపీఎల్ మధ్య ఒప్పందం జరిగింది. అయితే తాము గుర్తించిన కొన్ని నిర్మాణ లోపాలను డీఎంఆర్సీ పరిష్కరించలేదని ఆరోపిస్తూ 2012లో డీఏఎంఈపీఎల్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.దీనికి సంబంధించి కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 2017లో ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ రూ. 2,950 కోట్లు వడ్డీతో సహా డీఏఎంఈపీఎల్కి చెల్లించాలని ని ఆదేశించింది. దీంతో డీఎంఆర్సీ రూ. 2,599 కోట్లను యాక్సిస్ బ్యాంక్ వద్ద ఎస్క్రో ఖాతాలో జమ చేసింది. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రావడంతో తాము డిపాజిట్ చేసిన రూ. 2,599 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని అనిల్ అంబానీ సంస్థకు 15 రోజుల సమయం ఇచ్చింది. -
బాబు, లోకేష్ కు నోటీసులు..?
-
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
బెంగళూరు: లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. అసభ్య వీడియోలు సోషల్ మీడియాలో వైరలైన అనంతరం ఆయన దేశం వదిలి జర్మనీ వెళ్లిపోయారు. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.‘ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశాం. ఇంటర్పోల్ అన్ని దేశాలకు సమాచారం పంపించింది. ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడ ఉన్నా పట్టుకోవాలని ఇంటర్పోల్ ఇతర దేశాల పోలీసులకు ఆదేశించింది’ అని కర్ణాటక హోం మంత్రి జీ. పరమేశ్వర ఆదివారం పేర్కొన్నారు. ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకురావడానికి సిట్ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసు పంపాలని సిట్(SIT)సీబీఐకి విజ్ఞప్తి చేసింది.ఇప్పటికే సిట్.. ప్రజ్వల్ రేవణ్ణపై రెండుసార్లు లుక్ అవుట్ నోటీసుల జారీచేసింది. మరోవైపు.. మహిళా కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ తండ్రి హెడ్డీ రేవణ్ణను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక.. లోక్సభ ఎన్నికల వేళ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవి వైరల్ అయిన అసభ్యకర వీడియోలు, ప్రజ్వల్, ఆయన తండ్రిపై నమోదైన లైంగిక ఆరోపణల కేసు కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.బ్లూ కార్నర్ నోటీసులు అంటే?బ్లూ కార్నర్ నోటీసు ఇంటర్ పోల్ నోటీసుల్లో ఒక భాగం. ఇది ప్రపంచ వ్యాప్తంగా నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సమాచారం కోసం ఇతర దేశాలతో హెచ్చరికలు, అభ్యర్థనలకు అనుమతి ఇస్తుంది. ఇతర దేశాల్లోని పోలీసులతో సమన్వయమై.. కీలకమైన నేర సంబంధిత సమాచారాన్ని పంచుకోవడానికి అనుమతి ఇవ్వబడుతుంది. మొత్తం ఏడు రకాల నోటీసులు ఉంటాయి. రెండ్, ఎల్లో, బ్లూ, బ్లాక్, గ్రీన్, ఆరెంజ్, పర్పుల్. నేర దర్యాప్తులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సంబంధించి అదనపు సమాచారం సేకరించడానికి, వ్యక్తి గుర్తింపు, ఎక్కడ ఉన్నాడో తెలిపే లొకేషన్ వంటి కీలకమైన విషయాలను తెలుసుకోవడానికి ‘బ్లూ కార్నర్’ నోటీసులు జారీ చేస్తారు. -
అమిత్ షా ఫేక్ వీడియో.. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
-
ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి ఈసీ నోటీసులు
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ విద్వేష ప్రసంగాల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలకు గురువారం నోటీసులు జారీ చేసింది.ఎన్నికల కోడ్ను మోదీ, రాహుల్ ఉల్లంఘించినందుకు నోటీసులు ఇచ్చినట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్ 29, ఉదయం 11 గంటల లోపు ఇరువురు నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ చేసిన ప్రసంగాలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఇద్దరు నేతలు తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్వేషపూరిత ఆరోపణలు, విమర్శలు చేస్తూ ప్రసంగించారు. ఈ వ్యవహారంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్ను ఈసీ వివరణ కోరింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా పార్టీ అధ్యక్షులే జాగ్రత్త వహించాలని పేర్కొంది. ECI issues notice to BJP President JP Nadda seeking party’s response on complaints of violation of model code of conduct by PM Modi during campaign in Rajasthan.BJP asked to respond by April 29. pic.twitter.com/9TmNOoWlE7— Arvind Gunasekar (@arvindgunasekar) April 25, 2024 -
షర్మిలకు ఎన్నికల కమిషన్ షాక్
-
ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్: ఇరాన్ హెచ్చరిక నోటీసు ఇవ్వలేదు: అమెరికా
ఇజ్రాయెల్పై ఇరాన్ 300లకుపైగా డ్రోన్లు, మిసైల్స్తో భీకరదాడి చేసింది. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఆదివారం భారీగా ఎత్తును డ్రోన్లు, మిసైల్స్తో విరుచుకుపడింది. అయితే ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిసైల్స్ను 99 శాతం అడ్డుకున్నామని ఇజ్రాయెల్ పేర్కొంది. దాడి చేసే ముందు అమెరికాతో సహా ఇజ్రాయెల్ మిత్ర దేశాలకు తాము 72 గంటల ముందస్తు హెచ్చరిక నోటీసు ఇచ్చినట్లు ఇరాన్ పేర్కొంది. ఇజ్రాయెల్పై దాడికి ముందే అమెరికాకు 72 గంటల హెచ్చరిక నోటీసు ఇచ్చామని ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరాబ్డొల్లాహియాన్ చేసిన వ్యాఖ్యలను అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇరాన్ నుంచి తమకు ఎలాంటి హెచ్చరిక నోటీసులు రాలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో ఉన్నతధికారి ఒకరు పేర్కొన్నారు. ఇజ్రాయెల్పై దాడి విషయంలో ముందస్తుగా ఇరాన్ తమను హెచ్చరించలేదని.. దాడిచేసిన తర్వాతే తమకు ఇరాన్ సమాచారం అందించిదని అన్నారు. మరోవైపు ఇరాన్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాడి చేయాలని వార్ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ మరింత అప్రమత్తంగా ఉందని ఆ దేశ మిలటరీ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. ప్రమాదకర, రక్షణాత్మక చర్యల కోసం కార్యాచరణ ప్రణాళికలు ఆమోదించబడ్డాయని పేర్కొన్నారు. ఇక.. ఇజ్రాయెల్పై చేసిన దాడులను ఇరాన్ ఐక్యరాజ్యసమతి వేదికగా సమర్థించుకుంది. కేవలం ఆత్మరక్షణ కోసమే ఇజ్రాయెల్పై దాడులకు దిగాల్సి వచ్చిందని పేర్కొంది. దాదాపు 300లకుపైగా డ్రోన్లు, మిసైల్స్తో ఇజ్రాయెల్పై విరుచుకుపడిన ఇరాన్పై అదను చూసి.. తగిన రీతిలో ప్రతీకార దాడులకు దిగుతామని ఇజ్రాయెల్ మంత్రి బిన్నీ గంట్జ్ తెలిపారు. -
పవన్ కళ్యాణ్ కు ఈసీ నోటీసులు..
-
మంత్రి పొంగులేటి కుమారుడికి కస్టమ్స్ అధికారుల సమన్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్ష రెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు సమన్లు పంపించారు. ఖరీదైన చేతి గడియారాల అక్రమ రవాణాకు సంబంధించి హర్ష రెడ్డికి కస్టమ్స్ అధికారులు సమన్లు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన ఏప్రిల్ 27వ తేదీన హాజరు కావడానికి అంగీకరించినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. ఫ్రిబవరి ఐదో తేదీన చెన్నై విమానాశ్రయంలో రెండు లగ్జరీ వాచీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాచీలను మహమ్మద్ ఫహెర్దీన్ ముబీన్ అనే వ్యక్తి హాంకాంగ్ నుంచి సింగపూర్ మీదుగా భారత్లోకి తీసుకొచ్చినట్టు గుర్తించారు. ఆ వాచీల్లో ఒకటి పాటెక్ ఫిలిప్ 5740, రెండోది బ్రెగ్యుట్ 2759 ఉన్నాయి. అయితే, పాటెక్ ఫిలిప్ వాచ్కు మన దేశంలో ఎక్కడా డీలర్లు లేరు. ఇక, బ్రెగ్యుట్ కంపెనీల వాచీలు ఇండియా మార్కెట్లో స్టాక్ లేకపోవటంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. వాచీలను పరిశీలించడంతో వాటి విలువ ఏకంగా రూ.1.70 కోట్లపైగా ఉండటం చూసి వారే ఖంగుతున్నారు. దీంతో ముబీన్ను అరెస్టు చేసి, కోర్టు అనుమతితో విచారణ చేయగా మధ్యవర్తి నవీన్కుమార్ పేరును వెల్లడించారు. ఇదే క్రమంలో మార్చి 12న అలోకం నవీన్కుమార్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా మరిన్ని ఆధారాలు లభించినట్టు సమాచారం. స్పందించిన హర్ష.. ఈ సందర్భంగా రెండు వాచీలను పొంగులేటి కుమారుడు హర్షరెడ్డి కోసం కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ముబీన్ను లగ్జరీ వాచ్ డీలర్గా, నవీన్కుమార్ మధ్యవర్తిగా, హర్షరెడ్డి కొనుగోలుదారుడిగా అనుమానిస్తున్నారు. ఇక, ఈ వాచీల కొనుగోలుకు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ట్రెజరీ (యూఎస్డీటీ)కి చెందిన టెథర్ వంటి క్రిప్టో కరెన్సీ ఆధారంగా కొంత డబ్బు, మరికొంత హవాలా రూపంలో చెల్లించినట్టు తేలిందని కస్టమ్స్ వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే హర్షకు నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించాయి. కాగా, చెన్నై కస్టమ్స్ అధికారులు హర్షకు గత నెల 28వ తేదీన నోటీసులు ఇచ్చి ఏప్రిల్ నాలుగో తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే, ఇటీవల హర్షకు డెంగ్యూ ఫీవర్ రావడంతో అతను ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నాడు. దీంతో, ఏప్రిల్ 27వ తేదీన హాజరవుతానని ఈనెల మూడో తేదీన సమాధానం ఇచ్చినట్టు సమాచారం. ఇక, పరిమాణాలపై తాజాగా హర్ష స్పందిస్తూ వాచీల అక్రమ రవాణాలో తనకు ప్రమేయం లేదన్నారు. ఇవన్నీ నిరాధారమైనవని అన్నారు. అనారోగ్యం కారణంగా తాను విచారణకు హాజరుకాలేకపోయినట్టు తెలిపారు. మరోవైపు.. హర్షను విచారించే వరకు నవీన్ కుమార్కు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని మద్రాస్ కోర్టు స్పష్టం చేసింది. -
అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడికి ఈసీ నోటీసులు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు అచ్చెన్నాయడు, అయ్యన్నపాత్రుడికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు తప్పుడు ఆరోపణలు చేశారు. ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ నేతలపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. కోడ్ ఉల్లంఘనపై వివరణ కోరుతూ అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడికి సీఈఓ ముఖేష్కుమార్ మీనా నోటీసులు ఇచ్చారు. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 31న ఎమ్మిగనూరు సభలో చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. చంద్రబాబు ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించారని అందిన ఫిర్యాదుతో ఈసీ నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లోగా అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ఈసీ పేర్కొంది. -
124 ఏళ్ల భవనం కూల్చివేతకు నోటీసు.. కోర్టును ఆశ్రయించిన యజమాని!
ముంబైలోని ‘సాత్ బంగ్లా’ అనే ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. సుమారు 124 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏడు బంగ్లాలు నిర్మించారు. వాటిలో ఇప్పుడు రెండు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు వాటిలో ఒకదానిని కూల్చివేసేందుకు బీఎంసీ సిద్ధమవుతోంది. దీంతో భవన యజమాని కోర్టును ఆశ్రయించారు. సముద్రతీరానికి దగ్గరలో నిర్మించిన ఈ బంగ్లాలో పలు గదులు, గ్లాస్ వర్క్తో కూడిన హాలు, ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్లు, బసాల్ట్ స్టోన్ ఫ్లోరింగ్ ఉన్నాయి. ఈ బంగ్లాను ‘1900 ఏడీ’లో నిర్మించినట్లు ఆధారాలున్నాయి. ఈ భవనం చరిత్రకు ఆనవాలుగా నిలిచింది. కాగా గత ఫిబ్రవరి 29న రతన్ కుంజ్ పేరుతో ఉన్న ఈ భవనాన్ని కూల్చివేయనున్నట్లు బీఎంసీ దాని యజమానికి నోటీసు జారీ చేసింది. ఈ భవనం శిథిలావస్థలో ఉందని, కూలిపోయే అవకాశం ఉందని ఆ నోటీసులో పేర్కొంది. అయితే ఈ ఆస్తి సహ యజమానులు షాలు రాహుల్ బరార్తో పాటు అతని ఇద్దరు కుమారులు ఈ నోటీసు వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ‘మా ఆడిట్, ఇన్టేక్ నివేదికలో ఈ ఆస్తిని భద్రంగా చూస్తామని పేర్కొన్నాం. భవనానికి మరమ్మతులు చేశాం. ఈ కూల్చివేత నోటీసు మాకు పెద్ద దెబ్బ లాంటిది. మా చివరి శ్వాస వరకూ ఈ బంగ్లాను కాపాడుకునేందుకు పోరాడుతాం’ అని పేర్కొన్నారు. ఒకప్పుడు ఈ బంగ్లాను ‘తలాటి బంగ్లా’ అని పిలిచేవారు. సొరాబ్జీ తలాటి పార్సీ కుటుంబం దీనికి ఈ పేరు పెట్టింది. 1896లో దేశంలో ప్లేగు వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈ ‘ఏడు బంగ్లాలు’ నిర్మితమయ్యాయి. ఈ భవనం పూర్వ యజమానులు గ్వాలియర్ మహారాజా, కచ్ మహారాజా, దాదాభాయ్ నౌరోజీ, రుస్తమ్ మసాని, సొరాబ్జీ తలాటి, చైనాస్, ఖంబటాస్. ఇటువంటి వారసత్వ సంపదను కాపాడుకోవడం అవసరమని ఆ కుటుంబ సభ్యులు అంటున్నారు. దీనిని చారిత్రక భవనాలు జాబితాలో చేర్చాలని వారు కోరుతున్నారు. -
సీమా హైదర్కు రూ. 3 కోట్ల పరువు నష్టం నోటీసు!
పాక్ నుంచి భారత్లోకి అక్రమంగా ప్రవేశించి, తన ప్రియుని చెంతకు చేరిన సీమా హైదర్ ఇప్పుడు మరిన్ని చిక్కుల్లో పడ్డారు. పాక్లో ఉంటున్న సీమా హైదర్ భర్త గులాం హైదర్ తాజాగా సీమా హైదర్, ఆమె ప్రియుడు సచిన్ మీనాలకు పరువు నష్టం నోటీసు పంపారు. సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్ తరపు న్యాయవాది మోమిన్ మాలిక్ తాజాగా సీమా, ఆమె ప్రియుడు సచిన్ మీనాకు రూ. మూడు కోట్ల విలువైన పరువు నష్టం నోటీసు పంపారు. అలాగే సీమా తరపు న్యాయవాది డాక్టర్ ఏపీ సింగ్కు రూ. ఐదు కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. ఈ ముగ్గురికీ కోట్ల విలువైన పరువు నష్టం నోటీసులు పంపిన ఆయన వారంతా నెల రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని కోరారు. అలాగే జరిమానా కట్టకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాకిస్తాన్లో ఉంటున్న సీమా హైదర్ భర్త గులాం హైదర్ ఇటీవల హర్యానాలోని పానిపట్కు చెందిన సీనియర్ న్యాయవాది మోమిన్ మాలిక్ను తన తరపు న్యాయవాదిగా నియమించుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సీమా హైదర్ను పోలీసులు అరెస్టు చేసినప్పుడు, ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లన్నింటిలో సీమా హైదర్ భర్త పేరు గులాం హైదర్ అని రాసి ఉంది. ఇంతేకాదు కోర్టు నుండి ఆమె బెయిల్ పొందినప్పుడు, సంబంధిత పేపర్లలో గులాం హైదర్ భార్య సీమా హైదర్ అని రాసివుందన్నారు. ఈ విధంగా ఆమె తాను గులాం హైదర్ భార్యనని ప్రకటించుకున్నదని అన్నారు. అయితే సీమా తరపు న్యాయవాది ఏపీ సింగ్ ఇంకా సీమా హైదర్ సచిన్ భార్య అని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని ప్రశ్నించారు. ఈ కారణంగానే సీమా హైదర్ పాక్ భర్త గులాం హైదర్ ఆమెకు పరువు నష్టం నోటీసు పంపారని మోమిన్ మాలిక్ తెలిపారు. గులాం హైదర్ పంపిన నోటీసులో తాను సీమా హైదర్ నుండి ఇప్పటి వరకు చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదని, సచిన్ కారణంగానే తన నలుగురు పిల్లలు తనకు దూరమయ్యారని, వారి చదువులు దిగజారుతున్నాయని ఆరోపించారు. -
సీబీఐ విచారణకు 26న ఢిల్లీ రాలేను
సాక్షి, హైదరాబాద్: ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా ఈనెల 26న ఢిల్లీలో విచార ణకు హాజరుకావడం సాధ్యం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి స్పష్టం చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద తనకు జారీ చేసిన నోటీ సుల రద్దు లేదా ఉపసంహరించుకోవాలని సీబీఐని కోరారు. ఈ మేరకు ఆదివారం కవిత సీబీఐకి లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కవితకు సీబీఐ ఇటీవల సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు ప్రతిస్పందనగా రాసిన లేఖలో కవిత కీలకాంశాలను ప్రస్తావించారు. తనకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని, 2022 డిసెంబరులో అప్పటి విచారణ అధికారి ఇదే తరహా నోటీసు సెక్షన్ 160 కింద ఇచ్చారని, గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని చెప్పారు. సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదని, సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం లేదా సమాచారం కావాలంటే వర్చువల్ పద్ధతిలో హాజరయ్యేందుకు అందుబాటులో ఉంటానన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తనకు నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోందని పేర్కొన్నారు. తనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం వల్ల తాను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో నా పాత్ర లేదు సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో తన పాత్ర లేదని, పైగా ఆ కేసు కోర్టులో పెండింగ్లో ఉందని కవిత చెప్పారు. గతంలో ఈడీ నోటీసులు జారీ చేస్తే, తాను సుప్రీం కోర్టును ఆశ్రయించానని, అది పెండింగ్లో ఉందన్నారు. తనను విచార ణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారని, సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీ సీబీఐకి కూడా కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. గతంలో సీబీఐ బృందం హైదరాబాద్లోని తన నివాసానికి వచ్చినప్పు డు విచారణకు సహకరించానని, సీబీఐ దర్యా ప్తునకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తానని తెలిపారు. కానీ 15 నెలల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ ఢిల్లీకి పిలవడం, సెక్షన్ల మార్పు అనేక అనుమానాలకు తావిస్తుందని చెప్పారు. ‘ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మా పార్టీ (బీఆర్ఎస్) కొన్ని బాధ్యతలు అప్పగించింది. రానున్న ఆరు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటాను. ఈ రీత్యా ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేను. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసుల నిలిపివేత విషయాన్ని పరిశీలించండి’ అని కవిత సీబీఐకి సమాధానమిచ్చారు. -
లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు
-
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు లాస్ట్ ఛాన్స్ ! హాజరు కాకుంటే..
-
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు
-
అలా అయితే రెడీ అయిపోండి.. ఐటీ నోటీసులు వస్తున్నాయి..
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలు చేయవారికి ఆదాయపు పన్ను శాఖ త్వరలో నోటీసులు పంపనుంది. టీడీఎస్ కట్ అయినవారికి కూడా ఐటీ నోటీసులు సిద్ధమయ్యాయని ది ఎకనామిక్ టైమ్స్ తాజా కథనం పేర్కొంది. కచ్చితమైన సమాచారం ఉన్న పన్ను చెల్లింపుదారులకు మాత్రమే ఐటీ శాఖ నోటీసులు పంపుతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. రీఫండ్ వ్యవధిని తగ్గించడం దగ్గర నుంచి పెద్ద పెద్ద పన్ను వివాదాలను పరిష్కరించడం దాకా పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలు అందించడంపైనే తమ దృష్టి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పన్ను వివాదాల పరిష్కారం కోసం సీబీడీటీ మైసూరులో డిమాండ్ మేనేజ్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇది రూ. 1 కోటి కంటే ఎక్కువ పన్ను వివాదాలపై దృష్టి సారిస్తుందని చెప్పారు. గతంలో కర్ణాటక పరిధిలోని వివాదాలకే పరిమితమైన ఈ మేనేజ్మెంట్ సెంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా కేసులను స్వీకరిస్తోందని సీబీడీటీ చైర్మన్ వివరించారు. -
ఈడీ నోటీసులపై కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
-
అమెజాన్ కు కేంద్రం నోటీసులు
-
ఆంధ్రజ్యోతి డైరెక్టర్కు కార్మిక శాఖ నోటీసు
పలమనేరు(చిత్తూరు జిల్లా): తాను ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానెల్లో 20 ఏళ్లు విలేకరిగా వెట్టిచాకిరి చేశానని, కనీసం జీతం కూడా ఇవ్వకుండా తనను తొలగించారని, ఈ మేరకు సంస్థపై కార్మిక శాఖకు ఫిర్యాదు చేశానని ఆర్ఎస్ లోకనాథం అనే వ్యక్తి శుక్రవారం తెలిపారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... పలమనేరు పట్టణానికి చెందిన ఆర్ఎస్ లోకనాథం 20 ఏళ్లు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానల్లో పనిచేశారు. ఇటీవల చానల్లోని పలువురిని కుదించి పలమనేరు రిపోర్టరే మూడు నియోజకవర్గాలను కవర్ చేయాలని ఆదేశించారు. దీంతో లోకనాథం కారు అద్దెకు తీసుకుని ముఖ్యమైన కార్యక్రమాలను కవర్ చేశారు. ఇందుకు సంబంధించిన అద్దె బిల్లులను బ్రాంచ్ మేనేజర్ పెట్టుకుని డబ్బు డ్రా చేసుకోవడంతో కడుపుమండిన బాధితుడు తమ యాజమాన్యం పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే లోకనాథంపైనే ఆగ్రహం వ్యక్తంచేసి ఆయన్ను విధుల నుంచి తొలగించారు. దీనిపై బాధితుడు తిరుపతిలోని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ (డీసీఎల్) బాబూనాయక్కు గత నెల 22న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీసీఎల్ గత నెల 30వ తేదీన ఆంధ్రజ్యోతి డైరెక్టర్కు నోటీసులు జారీ చేశారు. -
టీసీఎస్ సంచలన నిర్ణయం?, ‘ ఆ 900 మంది ఉద్యోగుల శాలరీ నిలిపేసిందా?’
ఉద్యోగుల విషయంలో టెక్ దిగ్గజం టీసీఎస్ అమానుషంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా 2 వేల మంది ఉద్యోగుల్ని రీలొకేట్ చేసిందంటూ ఐటీ ఉద్యోగుల సంఘం ‘నైట్స్’ ఆరోపించింది. తాజాగా, వారిలో చెప్పిన మాట వినలేదన్న కారణంతో 900 మంది ఉద్యోగుల జీతాల్ని నిలిపివేసిందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ అంశం టెక్ కంపెనీల్లో చర్చాంశనీయంగా మారింది. ఇటీవల కాలంలో చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోంకు స్వస్తి చెబుతున్నాయి. ఉద్యోగులు ఆఫీస్కు రావాలంటూ పిలుపు నిస్తున్నాయి. 2 వేల మంది బదిలీ అయితే, గత ఏడాది నవంబర్లో టీసీఎస్ 2వేల మంది టెక్కీలకు వర్క్ ఫ్రమ్ హోంను రద్దు చేసింది. ఆఫీస్కు రావాలని ఆదేశించింది. ఆ సమయంలో వారికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే 2 వేల మంది ఉద్యోగుల్ని ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేసింది. ఇందుకోసం 15 రోజులు గడువు విధించింది. గడువు ముగిసే లోపు ఉద్యోగులు బదిలి చేసిన ప్రాంతానికి వెళ్లాల్సిందే. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ అంశంపై టీసీఎస్ ఉద్యోగులు.. ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్కు ఫిర్యాదు చేశారు. దీంతో నైట్స్ కేంద్ర కార్మిక శాఖను ఆశ్రయించింది. ఐటీ ఉద్యోగుల్ని కాపాడండి ఈ తరుణంలో నైట్స్ తాజాగా టీసీఎస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహరాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీంతో మహరాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ ఉద్యోగుల రీలొకేట్ అంశంపై వివరణ ఇవ్వాలని కోరుతూ టీసీఎస్కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న తమను కలవాలని టీసీఎస్ ప్రతినిధులను కార్మిక శాఖ ఆదేశించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా టీసీఎస్ చర్యలపై దర్యాప్తు చేయాలని, ఆ సంస్థ అనైతిక పద్దతుల నుంచి ఐటీ ఉద్యోగుల్ని కాపాడాలని కోరినట్లు నైట్స్ ప్రెసిడెంట్ హర్ప్రీత్ సింగ్ సలుజా ఒక ప్రకటనలో తెలిపారు. 900 మంది ఉద్యోగుల జీతాల నిలిపివేత ఈ నేపథ్యంలో ఉద్యోగుల పట్ల టీసీఎస్ వ్యవహరిస్తున్న తీరుపై విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగులకు బదిలీ నోటీసులు పంపిన కొద్ది నెలలకే తమ కంపెనీ విధానాలకు అనుగుణంగా లేరంటూ 900 మందికి పైగా జీతాలు చెల్లించకుండా నిలిపివేసినట్లు సమాచారం. దీనిపై టీసీఎస్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. జీతాల్ని నిలిపి వేసి “రీలొకేషన్ను వ్యతిరేకిస్తున్న ఉద్యోగుల జీతాలను టీసీఎస్ అనైతికంగా నిలిపివేసింది. బలవంతపు బదిలీలను అంగీకరించమని లేదా ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆదేశించింది. ఇలా ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలా ఉన్న టీసీఎస్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్ని నైట్స్ తీవ్రంగా ఖండిస్తుంది. రీలొకేషన్ వల్ల ఉద్యోగులకు కలిగి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ అంతరాయం, ఒత్తిడి, ఆందోళనలన్నింటినీ కంపెనీ విస్మరిస్తోంది’’ అని వ్యాఖ్యానించింది. నా జీతం 6వేలే మరోవైపు ఓ జాతీయ మీడియా సంస్థ బాధిత ఉద్యోగుల్లోని కొందరితో గూగుల్మీట్లో మాట్లాడింది. ‘‘మమ్మల్ని రీలొకేట్ చేసింది కానీ ఎలాంటి ప్రాజెక్ట్ ఇవ్వలేదు. కంపెనీ పోర్టల్ అల్టిమాటిక్స్లో టైమ్ షీట్ను అప్డేట్ చేయలేదనే కారణంతో కొంతమంది ఉద్యోగులకు డిసెంబర్ నెలకు కేవలం రూ. 6వేలు మాత్రమే చెల్లించింది’’ అని ఓ ఉద్యోగి వాపోయాడు. మాట వినలేదని బాధిత ఉద్యోగులలో ఓ ఉద్యోగికి టీసీఎస్ ఓ మెయిల్ పంపింది. అందులో ఇలా ఉంది.. “ఈ ఈమెయిల్ మిమ్మల్ని టీసీఎస్ ముంబై బ్రాంచ్ రీలొకేషన్కు సంబంధించింది. 14 రోజుల్లోపు సంబంధిత బ్రాంచ్కు సమాచారం అందించి.. ఈ కాపీలో ఉన్న వివరాల్ని మీరు పూర్తి చేసి మెయిల్కు రిప్లయి ఇవ్వండి’’ అని సారాంశం. ఈ మెయిల్ వచ్చిన కొద్దిరోజులకు మరో మెయిల్ వచ్చింది. మీరు ఇప్పటి వరకు బదిలీ చేసిన బ్రాంచ్కి రిపోర్ట్ చేయడంలో విఫలమయ్యారని గుర్తించాం. కంపెనీ నిర్ణయాన్ని పాటించనుందుకు మీ జీతాన్ని తక్షణమే నిలిపి వేస్తున్నాం అని మెయిల్లో తెలిపింది. చేతిలో ప్రాజెక్టేలేదు.. “ఆర్ధిక సమస్యల కారణంగా మా ప్రాజెక్ట్ ఆగిపోయింది. 3-4 నెలలు బెంచ్లో ఉన్నాం. ఆ సమయంలో, నాకు ప్రాజెక్ట్ ఇవ్వకుండా వేరే ప్రాంతానికి వెళ్లమని సంస్థ ఆదేశించింది. బెంచ్లో ఉన్నప్పుడు నేను ఎక్కడ ఉంటే ఏం లాభం’’ అని మరో ఉద్యోగి ప్రశ్నించాడు. -
టీడీపీ నాయకుడు కొలికపూడికి సీఐడీ నోటీసు
సాక్షి, అమరావతి: సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మను చంపి, ఆయన తల నరికి తెచ్చిన వారికి రూ.కోటి ఇస్తానంటూ టీవీ5 లైవ్ షోలో బహిరంగంగా సుపారీ ప్రకటించిన టీడీపీ నాయకుడు, అమరావతి జేఏసీ కన్వినర్ కొలికపూడి శ్రీనివాసరావును జనవరి 3వ తేదీన విచారణకు రావాలని ఏపీ సీఐడీ అధికారులు నోటీసు జారీ చేశారు. హైదరాబాద్లోని కొలికపూడి నివాసానికి శనివారం ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. సీఐడీ అధికారులు వస్తున్నారని తెలుసుకున్న కొలికపూడి పరారైనట్టు సమాచారం. కొలికపూడి లేకపోవడంతో ఆయన భార్య మాధవికి నోటీసు అందించారు. ఆయన్ను జనవరి 3న ఏపీ సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసు జారీ చేశారు. దర్శకుడిగా తాను తీసిన ‘వ్యూహం’ సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్తో రిలీజ్కు సిద్ధమవుతున్న తరుణంలో తనను లక్ష్యంగా చేసుకుని టీడీపీ, దానికి అనుకూలంగా కొన్ని టీవీ చానల్స్, వార్త పత్రికలు విమర్శలు చేస్తున్నాయని, పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారని రామ్గోపాల్ వర్మ సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వ్యూహం సినిమా రిలీజ్ అయితే ప్రజల్లో టీడీపీ చులకన అవుతుందని భావించి సినిమా రిలీజ్ను అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీవీల్లో చర్చలు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి సమాజంలో అశాంతి, అలజడులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేయడాన్ని వర్మ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. టీడీపీ అనుయాయుడైన కొలికపూడి శ్రీనివాసరావు, టీవీ5 చానల్ యజమాని బీఆర్ నాయుడు, యాంకర్ సాంబశివరావు తదితరులు నేరపూరిత ఆలోచనలతో కుట్రపూరితంగా ఈ నెల 27న లైవ్లో చర్చ పేరుతో బహిరంగంగా సుపారీ ఆఫర్ ఇవ్వడంపై వర్మ ఫిర్యాదు చేశారు. వర్మను చంపి, ఆయన తల తెచ్చి ఇచ్చిన వారికి రూ.కోటి ఇస్తానని, తానే వర్మ ఇంటికి వెళ్లి తగలబెడతానని కొలికపూడి శ్రీనివాసరావు టీవీ5 డిబేట్లో పబ్లిక్గా చెప్పడాన్ని వర్మ ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. తనను చంపడానికి ముందుగానే ప్లాన్ చేసుకుని పబ్లిక్గా కాంట్రాక్ట్ ఇచ్చినట్టు దీని ద్వారా స్పష్టమవుతోందిని వర్మ పేర్కొన్నారు. అదేవిధంగా ‘వర్మ కను గుడ్లు తెస్తే రూ.10 లక్షలు, కాళ్లు నరికి తెస్తే రూ.5 లక్షలు... 9985340280 కాల్ చేసి క్యాష్ తీసుకోండి’ అంటూ సోషల్ మీడియాలో సుపారీలు ప్రకటించడం గమనార్హం. ‘గురువుగారు మీ ఆఫర్ స్వీకరిస్తున్నాను.. వర్మ తల నరికి తెస్తాను..’ అని షేక్ ఫిరోజ్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా దేవభక్తుని జవహర్లాల్ అనే వ్యక్తి పెట్టిన పోస్టుకు బదులిచ్చాడు. ఈ నేపథ్యంలోనే వర్మను హత్య చేసేందుకు టీవీ5 లైవ్లో సుపారీ ఆఫర్ చేసిన వ్యవహారంపై సీఐడీ కేసు నమోదు చేసింది. టీవీ డిబేట్లో సుపారీ ఆఫర్ ఇచ్చిన టీడీపీ నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు, అందుకు ప్రోత్సహించిన టీవీ5 చానల్ యాంకర్ సాంబశివరావు, మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎడిటర్ బీఆర్ నాయుడు, టీవీ5 మేనేజ్మెంట్, డైరెక్టర్లు, షేక్ ఫిరోజ్తోపాటు మరి కొందరిపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 153(ఎ), 505(2), 506(2), రెడ్ విత్ 115, 109, 120(బి) కింద కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. -
దయచేసి 'న్యూ ఇయర్' రోజు ఇటువైపు వెళ్లకండి!
కరీంనగర్: న్యూ ఇయర్ సందర్భంగా లోయర్ మానేరు డ్యాం, కేబుల్ బ్రిడ్జిపైకి వెళ్లడాన్ని నిషేధిస్తున్నట్లు సీపీ అభిషేక్ మహంతి ఒక ప్రకటనలో తెలి పారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 31(ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి జనవరి 01(సోమవారం) ఉదయం 5 గంటల వరకు ఎల్ఎండీ కట్ట, తీగల వంతెనపై ఆ ంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. వేడుకలు జరుపుకునేందుకు వాటి పైకి అనుమతించబోమన్నారు. వాహనదారులు గమనించి, ఇతర మార్గాల్లో వెళ్లాలన్నారు. అలాగే, రోడ్లమీద వేడుకలు నిర్వహించడం, డీజేలను వినియోగించడం, బైక్ సైలెన్సర్లను మార్చి శబ్ధ కాలుష్యం చేస్తూ రోడ్లపై తిరగడం, ట్రిపుల్ రైడింగ్ వంటి వాటికి అనుమతి లేదని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, ముందస్తు అ నుమతి లేకుండా జనసమూహంగా ఏర్పడి, కార్యక్రమాలు చేపట్టినా, ప్రైవేట్ పార్టీలు నిర్వహించినా, ప్రజాశాంతికి భంగం కలిగించేలా వ్యవహరించినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవి చదవండి: భార్య మృతి.. ఆ కొద్ది సేపటికే భర్త కూడా! -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ విచారణ
-
జొమాటోకి గట్టి షాక్.. ఆ చార్జీలపైనా జీఎస్టీ కట్టాల్సిందే!
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) షాకిచ్చింది. రూ.401.7 కోట్ల జీఎస్టీ బకాయిలు చెల్లించాలని నోటీసులు పంపించింది. డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ చెల్లించనందుకు డీజీజీఐ తాజాగా ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీలకి పన్ను నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థలు వసూలు చేస్తున్న డెలివరీ ఛార్జీలు సేవల కేటగిరీ కిందకు వస్తాయని, వీటిపై 18 శాతం జీఎస్టీ చెల్లించాలని స్పష్టం చేసింది. పెనాల్టీలు, వడ్డీ కూడా.. జీఎస్టీ బకాయిలతోపాటు డెలివరీ భాగస్వాముల తరపున కస్టమర్ల నుంచి వసూలు చేసిన డెలివరీ ఛార్జీలపై పన్ను చెల్లించలేకపోవడంపై 2019 అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకు జరిమానాలు, వడ్డీని కూడా చెల్లించాలని జొమాటోను డీజీజీఐ ఆదేశించింది. జొమాటో స్పందన డీజీజీఐ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు జొమాటో స్పందించింది. తాము ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. "డెలివరీ ఛార్జ్ని డెలివరీ భాగస్వాముల తరపున కంపెనీ వసూలు చేస్తుంది. కానీ కంపెనీ నేరుగా డెలివరీ సర్వీసులు అందించదు. కాంట్రాక్టు నిబంధనలు, షరతుల మేరకు డెలివరీ భాగస్వాములు కస్టమర్లకు డెలివరీ సేవలు అందిస్తారు." అని పేర్కొంది. లీగల్, ట్యాక్స్ నిపుణుల అభిప్రాయాలను తీసుకుని షోకాజ్కు నోటీసుకు తగినవిధంగా స్పందన సమర్పిస్తామని ప్రకటనలో పేర్కొంది. -
లోకేశ్ అరెస్టుకు అనుమతివ్వండి
సాక్షి, అమరావతి: ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ అరెస్టుకు అనుమతివ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద ఇచ్చిన నోటీసులో నిర్దేశించిన షరతులను లోకేశ్ ఉల్లంఘించారని న్యాయస్థానానికి తెలియజేసింది. రెడ్బుక్ పేరుతో పోలీసులను, సాక్షులను బెదిరిస్తూ.. భయపెట్టేందుకు ప్రయత్నించారని వివరించింది. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా పలు చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో లోకేశ్ ఆరోపణలు చేశారని పేర్కొంది. సీఐడీ స్పెషల్ పీపీ శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి ఈ పిటిషన్ గురించి శుక్రవారం ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి దృష్టికి తీసుకువచ్చారు. ఉద్దేశపూర్వకంగానే బెదిరించారు.. ‘ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో లోకేశ్ 14వ నిందితునిగా ఉన్నారు. విచారణ నిమిత్తం తమ ముందు హాజరుకావాలని లోకేశ్కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద గతంలో నోటీసు ఇచ్చాం. అందులో పలు షరతులు విధించాం. ఈ కేసుతో సంబంధమున్న ఏ వ్యక్తినైనా బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయకూడదని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నాం. ఆ తర్వాత ఆయన ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అతన్ని 2 రోజుల పాటు విచారించింది. ఈ నేపథ్యంలో లోకేశ్ ఈనెల 19న ఏబీఎన్, ఈటీవీ తదితర చానళ్లకు ఇంటర్వ్యూలిచ్చారు. ఈ సందర్భంగా ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు పాత్రపై దర్యాప్తు చేస్తున్న పోలీసులను, అతని పాత్ర గురించి వాస్తవాలు తెలిసిన వ్యక్తులను బెదిరించారు. సాక్షులను భయపెట్టాలన్న ఉద్దేశంతోనే లోకేశ్ ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడారు. కోర్టులను కించపరిచేలా పలు ఆరోపణలు కూడా చేశారు. 53 రోజుల పాటు తన తండ్రి చంద్రబాబును రిమాండ్కు పంపడమన్నది రాష్ట్ర ప్రభుత్వం ‘వ్యవస్థలను మేనేజ్ చేయడం’ ద్వారానే జరిగిందని లోకేశ్ అన్నారు. నిందితులను రిమాండ్కు పంపడం న్యాయ ప్రక్రియలో భాగం. కానీ న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని లోకేశ్ మాట్లాడారు. ఆయన ఆరోపణల వల్ల ప్రజల్లో న్యాయవ్యవస్థ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. అలాగే ఓ రెడ్ బుక్ను సిద్ధం చేస్తున్నామని.. తాము అధికారంలోకి వస్తే అందులో ఉన్న వ్యక్తులు జైలుకెళ్లడం ఖాయమంటూ లోకేశ్ బెదిరించారు. చంద్రబాబు, లోకేశ్లపై దర్యాప్తు చేస్తున్న పోలీసులను దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ ఇంటర్వ్యూలను, అందుకు సంబంధించిన వివరాలను సీడీలో కోర్టు ముందుంచాం. వాటిని పరిగణనలోకి తీసుకుని లోకేశ్ అరెస్ట్కు ఆదేశాలివ్వండి’ అని దుష్యంత్రెడ్డి ఏసీబీ కోర్టును కోరారు. నేరుగా అరెస్టు చేయవచ్చు కదా? ఏసీబీ కోర్టు జడ్జి స్పందిస్తూ.. 41ఏ కింద నిర్దేశించిన షరతులను ఉల్లంఘిస్తే, మీరే నేరుగా అరెస్ట్ చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు. కోర్టు అనుమతి తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ పిటిషన్ దాఖలు చేశామని దుష్యంత్ బదులిచ్చారు. అలా అయితే ముందు తాను లోకేశ్ ఇంటర్వ్యూలను చూసి, ఆ తర్వాత స్పందిస్తానని జడ్జి చెప్పారు. ఇంటర్వ్యూలను చూసిన తర్వాత లోకేశ్కు నోటీసులు జారీ చేసి.. వారి వివరణ కూడా తెలుసుకుంటామన్నారు. అనంతరం తగిన ఉత్తర్వులు జారీ చేస్తానని తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబూ ఉల్లంఘించారు.. పోలీసులను, సాక్షులను పలు ఇంటర్వ్యూల్లో లోకేశ్ బెదిరించిన విషయాన్ని సీఐడీ హైకోర్టు దృష్టికి కూడా తెచ్చింది. ఆయన ఇంటర్వ్యూలను పెన్ డ్రైవ్లో ఉంచి వాటిని ఓ మెమో రూపంలో సీఐడీ స్పెషల్ పీపీ దుష్యంత్ శుక్రవారం హైకోర్టు జడ్జి జస్టిస్ తల్లాప్రగఢ మల్లికార్జునరావు ముందుంచారు. చంద్రబాబు, లోకేశ్లు ఎంతో పరపతి కలిగిన వ్యక్తులని ఆయన తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబుకు బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు పలు షరతులను విధించిందని గుర్తు చేశారు. కేసు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, సాక్షులను ప్రభావితం చేయడంగానీ, ప్రలోభపెట్టడం గానీ చేయరాదని స్పష్టం చేసిందన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించిందన్నారు. కానీ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా చంద్రబాబు స్కిల్ స్కామ్ గురించి మాట్లాడారని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై తీర్పు వెలువరించే ముందు చంద్రబాబు, లోకేశ్లు మాట్లాడిన మాటలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని దుష్యంత్ కోర్టును కోరారు. దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాది ఎస్.ప్రణతి అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు పిటిషన్పై ఇప్పటికే వాదనలు ముగిశాయని.. ఈ దశలో ఈ కేసుతో సంబంధం లేని వివరాలతో దాఖలు చేసిన మెమోను పరిగణనలోకి తీసుకోవదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. సీఐడీ మెమోపై అభ్యంతరాలుంటే వాటిని తమ ముందుంచాలని ప్రణతిని ఆదేశించారు. వాటిని పరిశీలించాక చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకుంటామన్నారు. తదుపరి విచారణను శనివారానికి వాయిదా వేశారు. -
జీవన్రెడ్డికి షాక్ల మీద షాక్లు
ఆర్మూర్: అధికారం చేజారగానే బీఆర్ఎస్కు చెందిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డికి ఆర్టీసీ, ట్రాన్స్కో అధికారులు ఏకకా లంలో బకాయిల వసూ లుకు చర్యలు ప్రారంభిస్తూ షాక్ ఇచ్చారు. పూర్వా పరాలిలా.. ఆర్మూర్ పట్టణంలోని టీఎస్ ఆర్టీసీ స్థలాన్ని జీవన్రెడ్డి సతీమణి రజితరెడ్డి తాను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న విష్ణుజిత్ ఇన్ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట లీజ్కు తీసుకుని మాల్ అండ్ మల్టిప్లెక్స్ పేరిట 5 అంతస్తుల భారీ షాపింగ్ మాల్ నిర్మించారు. గతేడాది దసరా రోజున ప్రారంభించిన ఈ మాల్లో రిలయన్స్ స్మార్ట్, ట్రెండ్స్, ఎలక్ట్రానిక్స్, కేఎఫ్సీ, పీవీఆర్ సినిమా హాళ్లకు అద్దెకు ఇచ్చారు. మొన్నటి వరకు జీవన్రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఈ మాల్ అద్దె బకా యిలు వసూలు చేయడంలో ఆర్టీసీ, ట్రాన్స్కో అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీంతో విష్ణుజిత్ ఇన్ఫ్ట్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ .. ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె 7 కోట్ల 23 లక్షల 71 వేల 807 రూపాయలు, విద్యుత్కు సంబంధించి ట్రాన్స్కోకు 2 కోట్ల 57 లక్షల 20 వేల 2 రూపాయలు బకాయిలుగా పేరుకుపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో, నియోజకవర్గంలో అధికార మార్పు జరగగానే ఆర్టీసీ, ట్రాన్స్కో అధికారులు ఈ బకాయిల వసూళ్లకు నడుం బిగించారు. మూడు రోజుల్లో చెల్లించాలి ఆర్టీసీ నిజామాబాద్ ఆర్ఎం జానీరెడ్డి, ఆర్మూర్ డిపో ఇన్చార్జి మేనేజర్ పృథ్వీరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన పోలీసు అధికారులు తోడు రాగా జీవన్ మాల్లో గురువారం హెచ్చరికలు జారీ చేసారు. మూడు రోజుల్లో లీజుదారులు అద్దె బకాయిలు చెల్లించని పక్షంలో మల్టీప్లెక్స్ను సీజ్ చేస్తామంటూ మైక్లో హెచ్చరించారు. మరో వైపు ట్రాన్స్కో ఆర్మూర్ ఏడీఈ శ్రీధర్ ఆధ్వర్యంలో ట్రాన్స్కో అధికారులు సైతం మూడు రోజుల్లో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో షాపింగ్ మాల్కు జనరేటర్లతో విద్యుత్ సరఫరా చేస్తున్నారు. -
సీఎం కేసీఆర్ కు ECI నోటీసులు
-
స్కిల్ స్కామ్ కేసులో వెలుగు చూసిన మరిన్ని వాస్తవాలు
-
అరవింద్ కేజ్రీవాల్, ప్రియాంక గాంధీకి ఈసీ నోటీసులు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ప్రియాంక గాంధీకి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై గురువారంలోగా సమాధానం ఇవ్వాలని కోరింది. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసింది. నిర్ణీత గడువులోగా స్పందించకపోతే తగిన చర్య తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. "ఆప్ తన అధికారిక హ్యాండిల్ నుండి ఓ వీడియోను పోస్టు చేసింది. ఇందులో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ అధినేత గురించి చాలా అనైతికమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోధయోగ్యం కావు" అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నవంబర్ 10న బీజేపీ ఎన్నికల కమిషన్ ని ఆశ్రయించింది. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అనైతిక వ్యాఖ్యలను పోస్ట్ చేసినందుకు ఆప్పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, పార్టీ జాతీయ మీడియా ఇన్ఛార్జ్, రాజ్యసభ ఎంపీ అనిల్ బలూనీ, పార్టీ నాయకుడు ఓం పాఠక్లతో కూడిన బీజేపీ ప్రతినిధి బృందం ఈ అంశంపై ఎన్నికల సంఘాన్ని సంప్రదించింది. ఇదీ చదవండి: కుక్క కాటు.. ఒక్కో పంటి గాటుకు రూ.10వేల పరిహారం! -
కర్ణాటక ప్రభుత్వానికి కేంద్ర పురావస్తు శాఖ నోటీసులు
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన హంపీలోని విరూపాక్ష ఆలయంలో చారిత్రక స్తంభాన్ని తవ్వినట్లు వచ్చిన ఆరోపణలపై భారత ఆర్కియోలాజికల్ సర్వే కర్ణాటక దేవదాయ శాఖకు నోటీసులు జారీ చేసింది. ఇటీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరైన కర్ణాటక రాజ్యోత్సవ కార్యక్రమంలో జెండా ఏర్పాటు కోసం అక్కడ డ్రిల్లింగ్ చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. చారిత్రక ప్రదేశంలో తవ్వే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆక్షేపిస్తోంది. హంపీ విరూపాక్ష ఆలయ సముదాయం కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలోని భారత ఆర్కియోలాజికల్ సర్వే రక్షణలో ఉందని, అనుమతులు లేకుండా ఆలయాన్ని మూసివేయడం, స్తంభాల మధ్య రంధ్రాలు చేయడం నిబంధనలకు విరుద్ధమని దేవదాయ శాఖ ఇన్ఛార్జ్ అధికారికి ఇచ్చిన నోటీసులో భారత ఆర్కియోలాజికల్ సర్వే పేర్కొంది.చారిత్రక కట్టడాల రక్షణ చట్టం (AMASR Act)లోని సెక్షన్ 30ను ఉల్లంఘించినందుకు గానూ వివరణ ఇవ్వాలని కోరింది. విజయనగర సామ్రాజ్య కాలంలో రాజధాని నగరంగా ఉన్న హంపిలోని స్మారక కట్టడాల సమూహంలో విరూపాక్ష ఆలయం భాగంగా ఉంది. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో విజయనగర రాజు రెండవ దేవరాయ నిర్మించారని చరిత్రకారులు భావిస్తున్నారు. 1986లో యునెస్కో హంపిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఇక్కడి వివిధ స్మారక చిహ్నాలను కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలోని భారత ఆర్కియోలాజికల్ సర్వే పరిరక్షిస్తోంది. -
టీసీఎస్కు కార్మిక శాఖ నోటీసులు.. ఎందుకంటే..
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS)కి మహారాష్ట్ర కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. 200 లేటరల్ రిక్రూట్ల ఆన్బోర్డింగ్ ఆలస్యం ఫిర్యాదుపై మహారాష్ట్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ టీసీఎస్ కంపెనీకి నోటీసు జారీ చేసినట్లు ‘మనీకంట్రోల్’ నివేదిక తెలిపింది. నవంబర్ 2న పుణె కార్మిక శాఖ కార్యాలయంలో డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశమై చర్చించాలని కార్మిక శాఖ టీసీఎస్ అధికారులకు నోటీసు జారీ చేసింది. టీసీఎస్ చేపట్టిన 200 మందికి పైగా లేటరల్ రిక్రూట్లను ఆన్బోర్డింగ్ చేయడంలో జాప్యం జరిగిందంటూ నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) గత జులైలో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. తర్వాత కేంద్ర కార్మిక శాఖ దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. వివిధ అనుభవ స్థాయిలు కలిగిన నిపుణులు ఆన్బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్నారని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయంలో జోక్యం చేసుకుని టీసీఎస్కు నిర్దిష్ట ఆదేశాలు జారీ చేయాలని కార్మిక శాఖను కోరింది. 1.8 సంవత్సరాల నుంచి 15 ఏళ్ల వరకు వివిధ స్థాయిల అనుభవమున్న ఉద్యోగులు ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా, ఆదాయ వనరులు లేకుండా మిగిలిపోయారని వాపోయింది. ప్రస్తుతం ఉన్న టాలెంట్ పూల్ను వినియోగాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో నియామకాలపై నెమ్మదిగా వెళ్తున్నట్లు టీసీఎస్ ఇటీవల తెలిపింది. ఈ లేటరల్ రిక్రూట్లను ఈ సంవత్సరం జనవరి, ఏప్రిల్ మధ్య టీసీఎస్ నియమించుకుంది. జులై 10న చాలా మందికి జాయినింగ్ తేదీలు ఇవ్వగా తాజాగా వాటిని అక్టోబర్కు వాయిదా వేస్తున్నట్లు అభ్యర్థులకు ఈమెయిల్స్ వచ్చాయి. లేటరల్ రిక్రూట్మెంట్ అంటే.. ఇప్పటికే మరో కంపెనీలో ఇదే హోదాలో పనిచేస్తున్న ఉద్యోగులను నియమించుకునే ప్రక్రియనే లాటరల్ రిక్రూట్మెంట్ అంటారు. నిర్దిష్ట నైపుణ్యం లేదా అనుభవం అవసరమయ్యే స్థానాలను భర్తీ చేయడం కష్టసాధ్యం అయినప్పుడు ఈ నియామక ప్రక్రియను అనుసరిస్తారు. -
ప్రగతి భవన్ కు ఈసీ నోటీసులు..
-
డెల్టా కార్ప్కు మరో రూ.6,384 కోట్ల జీఎస్టీ నోటీస్
న్యూఢిల్లీ: డెల్టా కార్ప్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. రూ. 6,384 కోట్ల షార్ట్ పేమెంట్ కోసం ఒక జీఎస్టీ నోటీసును అందుకుంది, దీనితో కంపెనీపై మొత్తం పన్ను డిమాండ్ దాదాపు రూ. 23,000 కోట్లు దాటింది. పన్ను డిమాండ్లు ఏకపక్ష మైనవని, చట్ట విరుద్ధంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. వీటిని సవాలు చేయనున్నట్లూ వెల్లడించింది. సంస్థ ప్రకటన ప్రకారం, డీజీజీఐ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్), కోల్కతా విభాగం అక్టోబర్ 13న డెల్టా కార్ప్ అనుబంధ సంస్థ అయిన డెల్టాటెక్ గేమింగ్కు జీఎస్టీ నోటీసు పంపుతూ, జనవరి 2018 నుండి నవంబర్ 2022 కాలానికి సంబంధించి రూ. 6,236.8 కోట్ల పన్ను చెల్లింపుల డిమాండ్ చేసింది. జూలై 2017 నుండి అక్టోబర్ 2022 వరకు మరో 147.5 కోట్ల రూపాయల పన్ను డిమాండ్ నోటీసునూ అందించింది. రూ. 16,800 కోట్ల షార్ట్ పేమెంట్ నిమ్తి్తం కంపెనీకి గత నెలలో షోకాజ్ నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. ఆన్లైన్ గేమింగ్ సంస్థలు, కాసినోలు తమ ప్లాట్ఫారమ్లపై ఉంచిన స్థూల పందెం విలువపై 28 శాతం జీఎస్టీ చెల్లించవలసి ఉంటుందని ఆగస్టులో జీఎస్టీ అత్యున్నత స్థాయి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కంపెనీకి తాజా జీఎస్టీ నోటీసులు వెలువడ్డం గమనార్హం. చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఈ–గేమింగ్ కంపెనీలకు రెట్రాస్పెక్టివ్ ప్రాతిపదికన జీఎస్టీ పన్ను డిమాండ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ ఇటీవల స్పష్టం చేశారు. డేటాను పూర్తిగా విశ్లేషించిన మీదటే పన్ను మొత్తంపై నిర్ధారణకు వస్తున్నట్లు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో డెల్టా కార్ప్ షేర్ ధర 9 శాతం పడిపోయి రూ.120కి పడింది. -
గ్రామంలో నివాసం ఉండగా నోటీసులిస్తారా?
మునగపాక : తాను నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా సేవలందిస్తుంటే బీఎల్వో ప్రవీణ తాను గ్రామంలో లేనంటూ తనకు నోటీసు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని మెలిపాక సర్పంచ్ అయినంపూడి విజయభాస్కరరాజు ప్రశ్నించారు. సర్పంచ్ స్థానికంగా నివాసం లేరంటూ బీఎల్వో బుధవారం నోటీసు ఇచ్చారు. దీనిపై విజయభాస్కరరాజు స్పందించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన కొంతమంది తాను గ్రామంలో నివాసం లేనంటూ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టకుండా నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. బీఎల్వోలు తమకు వచ్చిన ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాల్సి ఉండగా కేవలం ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చేలా ప్రవర్తించడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన వారి మాటలు నమ్మి, తప్పుడు నోటీసులు అందించిన బీఎల్వోపై చర్యలు తీసుకోవాలని విజయభాస్కరరాజు డిమాండ్ చేశారు. -
బంజారాహిల్స్ సీఐ నరేందర్, ఎస్ఐ నవీన్, హోంగార్డుకు 41-ఏ నోటీసులు
-
ఈడీ నోటీసులు: డ్రగ్ పెడ్లర్లతో నవదీప్ కు సంబంధాలున్నట్లు గుర్తింపు
-
ఎన్నికల ముందు ఉచితాలు.. ఆ రెండు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
జైపూర్: ఎన్నికల ముందు ఉచితాలను ఆక్షేపిస్తూ దాఖలైన పిటిషన్పై మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్డివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కేంద్రం, ఎన్నికల సంఘం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు కూడా నోటీసులు జారీ చేసింది. ఓటర్లను ఆకట్టుకోవడానికి పన్ను చెల్లింపుదారుల డబ్బును తప్పుడు దారిలో ఖర్చుచేస్తున్నారని పిటిషన్దారులు ఆరోపించారు. ఉచితాల పేరుతో ఎన్నికల ముందు ప్రజాధనాన్ని వృథాగా ఖర్చుచేస్తున్నారని ఆరోపిస్తూ భట్టులాల్ జైన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పన్ను చెల్లింపుదారులు ఇచ్చిన డబ్బును ఉచితాల రూపంలో వృథాగా ఖర్చుచేయడకుండా మార్గదర్శకాలు జారీ చేయాలని జైన్ కోరారు. ప్రజా శ్రేయస్సు పేరుతో ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఉచితాల కారణంగా రాష్ట్రాలు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నాయని పిటిషన్దారుడు పేర్కొన్నారు. ఆ అప్పు ప్రభావం చివరికి పన్ను చెల్లింపుదారులపై పడుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు డబ్బు పంచడం కన్నా నీచమైన నేరం ఉండదని ధర్మాసనానికి విన్నవించుకున్నారు. ఎన్నికల ముందు ఇచ్చే రాజకీయ ప్రమాణాలను అడ్డుకోవడం సాధ్యం కాదని సీజేఐ పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని నాలుగు వారాల గడువును ఇచ్చారు. -
ఆంధ్రప్రదేశ్లో ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్ స్కాంలో నారా లోకేశ్కు సీఐడీ నోటీసులుడి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ కు నోటీసులు
-
టీడీపీ నేతలకు షాక్.. జడ్జిలపై దూషణ కేసులో ఏపీ హైకోర్టు కిలక ఆదేశాలు
-
భారీ జరిమానాలు విధించిన ‘రెరా’
సాక్షి, హైదరాబాద్: నిబంధనల ఉల్లంఘన..షోకాజ్ నోటీసులకు స్పందించకపోవడం.. హియరింగ్కు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ‘రియల్’ సంస్థలపై ‘రెరా’ చర్యలు చేపట్టింది. సాహితీ గ్రూప్నకు చెందిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ‘రెరా’ రిజిస్ట్రేషన్ లేకుండా ‘సాహితీ సితార్ కమర్షియల్’ పేరుతో రంగారెడ్డిజిల్లా గచ్చిబౌలిలో కమర్షియల్, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కోసం కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రకటనలు ఇచ్చి విక్రయాలు చేపట్టగా, సాహితీతో పాటు కేశినేని డెవలపర్స్కు అపరాధ రుసుం విధించింది. ఇదే సంస్థ ‘సిసా ఆబోడ్‘ పేరుతో మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లిలో సరైన డాక్యుమెంట్లు సమర్పించకుండా రెరా’ రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేసింది. డాక్యుమెంట్లు సమర్పించాలని పలుసార్లు మెయిల్స్ పంపినా స్పందించలేదు. ప్రకటనల ద్వారా మార్కెటింగ్ చేస్తున్న కారణంగా ’రెరా’ నోటీసులు జారీ చేసింది. ఇదే సంస్థ సాహితీ సార్వానీ ఎలైట్ పేరుతో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అపార్ట్మెంట్స్ నిర్మాణం చేపట్టి సరైన డాక్యుమెంట్లు లేకుండా రెరా రిజిస్ట్రేషన్కు దరఖాస్తు చేసింది. పైగా మార్కెటింగ్ కార్యకలాపాల ద్వారా ప్లాట్స్ విక్రయించింది.ఈ ప్రాజెక్టులన్నింటికి కలిపి రూ.10.74 కోట్లు 15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. మంత్రి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో షేక్పేటలో ప్రాజెక్ట్ చేపట్టి ఫారం– ’బి’లో తప్పుడు సమాచారం పొందుపరిచి, వార్షిక, త్రైమాసిక నివేదిక సమర్పించలేదు. దీంతో ఈ సంస్థకు రూ.6.50 కోట్ల అపరాధ రుసుము విధించింది. సాయిసూర్య డెవలపర్స్ సంస్థ నేచర్కౌంటీ పేరుతో శేరిలింగంపల్లి మండల మనసానపల్లి గ్రామంలో రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్లాట్ల అభివృద్ధి పేరుతో ప్రాజెక్టు చేపట్టింది. దీనిపై ఫిర్యాదు రాగా, షోకాజ్ నోటీసు జారీ చేసి రూ.25లక్షలు అపరాధ రుసుం విధించింది. -
ఉదయనిధి స్టాలిన్కు సుప్రీం నోటీసులు
ఢిల్లీ: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉదయనిధితోపాటు ఏ రాజా, మరో 14 మందికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు పంపింది. ఇందులో సీబీఐ అధికారులతో పాటు తమిళనాడు పోలీసులు కూడా ఉన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది. అనంతరం ఈ వ్యాఖ్యలకు పాల్పడినవారికి నోటీసులు పంపింది. ఈ కేసును విద్వేష ప్రసంగంతో అనుసంధానం చేయడానికి నిరాకరించింది. ఉదయనిధి వ్యాఖ్యలు.. సనాతన నిర్మూళన కాన్ఫరెన్స్లో ఉదయనిధి మాట్లాడుతూ.. సనాతనా ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి రోగాలతో పోల్చారు. ఇలాంటి విషయాలను వ్యతిరేకిస్తే సరిపోదని, మొత్తానికి నిర్మూలించాలని అన్నారు. సామాజిక న్యాయానికి సనాతన ధర్మం వ్యతిరేకమని అన్నారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపాయి. ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆయన్ను అరెస్టు చేయాలని దేశవ్యాప్తంగా పలు స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయి. ఉదయనిధిని అరెస్టు చేసేలా ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇదీ చదవండి: ఎన్సీపీలో రగులుతున్న వివాదం.. శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? -
అనుమతి లేకుండా విదేశాలకు పారిపోయిన చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్
-
హైదరాబాద్ లో తన ఇంట్లోనే ఎమ్మెల్సీ కవిత
-
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరోసారి ఈడీ సమన్లు
-
చంద్రబాబు ఐటీ స్కామ్.. ఇద్దరు నిందితులు విదేశాలకు పరార్!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఐటీ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐటీ నోటీసుల సమాచారం తెలుసుకుని ఇద్దరు నిందితులు విదేశాలకు పరారయ్యారు. ఈనెల 5న దుబాయ్కు మనోజ్ వాసుదేవ్ పారిపోయారు. సాయంత్రం 7.10 గంటలకు దుబాయ్కు వెళ్లిపోయారు. చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస రావు కూడా హైదరాబాద్ నివాసంలో లేరు. శ్రీనివాసరావు ఈనెల 6న అమెరికాకు పరారయ్యారు. షెల్ కంపెనీల సృష్టికర్త యోగేష్ గుప్తా ఐటీ విచారణకు హాజరవుతానని తెలిపారు. కాగా అధికారంలో ఉన్నప్పుడు.. దొడ్డిదోవలో బోగస్ కాంట్రాక్ట్ల ద్వారా ప్రజాధనాన్ని మళ్లించి తన ఖాతాలో జమ చేసుకున్నారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అవినీతి బాగోతం బట్టబయలై.. ఐటీ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ విచారణ చేపట్టింది. 2016లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ శ్రీనివాస్ ద్వారా షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని సబ్ కాంట్రాక్టర్గా అవతారం ఎత్తారని ఐటీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో గత వారం తనిఖీలు చేపట్టారు. అనంతరం మనోజ్ వాసుదేవ్ను విచారించారు. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా ముడుపులు చేతులు మారినట్లు షాపూర్జి పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ అంగీకరించినట్లు ఐటీ తెలిపింది. మనోజ్ వాసుదేవ్ స్వయంగా 2016 నుంచి 2019 వరకు ఎన్ని కాంట్రాక్ట్లు పొందారు..అందుకు ఎలా డబ్బు సమకూర్చారు.. ముడుపులు ఎలా చేతులు మారాయనే అంశాలకు సంబంధించి ఐటీ శాఖకు మనోజ్ వాసుదేవ్ వాంగ్మూలం ఇచ్చారని ఐటీ స్పష్టం చేసింది. షాపూర్ జీ పల్లోంజీ సంస్థ ప్రతినిధి, ఎల్అండ్టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు అందినట్లు ఐటీశాఖకు మనోజ్ వాసుదేవ్ తెలియజేసినట్లు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు ఫోనిక్స్ ఇన్ఫ్రా& పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. చదవండి: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు -
బాబును కాపాడేందుకు పురంధేశ్వరి విచిత్ర భాష్యం
-
బలమైన సాక్ష్యాలు..చంద్రబాబుకు జీవిత ఖైదు..లేదా 10 ఏళ్ల జైలు శిక్ష!?
-
ఐటీ కేసు..ఈ సారి తప్పించుకోలేను..శ్రీలంక పారిపోతున్న బాబు
-
రేపో, మాపో నన్ను అరెస్ట్ చేస్తారు..! వణికిపోతున్న బాబు
-
బాబు నోట అరెస్ట్ మాట
-
ఐటీ నోటీసులతో చంద్రబాబు అవినీతి బండారం బట్టబయలైందన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
పాపం పండినప్పుడు చంద్రబాబు అరెస్ట్ ఖాయం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు వ్యవహారం దొంగతనం చేసి దబాయించినట్లుగా ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు రూ. 118 కోట్లు ముడుపులు తీసుకున్నట్లు తేల్చింది వైఎస్సార్ సీపీ కాదని, ఐటీశాఖ అని పేర్కొన్న సజ్జల.. ఐటీకి సమాధానం చెప్పాల్సిందిపోయి తనను రెండు మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తారంటూ చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. దోపిడీ చేసి నిజాయితీ పరుడైనట్లు చిత్రీకరించుకునేందుకు బాబు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈడీ కూడా విచారణ జరిపి చంద్రబాబును అరెస్ట్ కూడా చేయాల్సి ఉందన్నారు. కానీ ఇంతకాలం ఎందుకు చూస్తూ ఊరుకుందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ముడుపులన్నీ ఎటు ఎటు తిరిగి చంద్రబాబు గూటికి చేరాయో.. ఐటీశాఖ వివరంగా ఆ నోటీసుల్లో పేర్కొందని తెలిపారు. ‘తప్పుడు పునాదులపై ఎదిగిన నకిలీ మనిషి చంద్రబాబు. పాపం పండినప్పుడు చంద్రబాబు అరెస్ట్ కావడం ఖాయం. చంద్రబాబు చట్టానికి అతీతులు కారు. చంద్రబాబు తప్పులను కప్పిపుచ్చి సీఎం జగన్పై బురద జల్లటమే ఎల్లో మీడియా విధానం. చంద్రబాబు ఐటీ నోటీసులపై నిశ్శబ్ధాన్ని పాటిస్తున్నది అందుకే. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి సానుభూ పొందాలనేది చంద్రబాబు కుట్ర. పుంగనూరు, భీమవరంలో అదే జరిగింది. తనకు ఇబ్బంది ఎదురైతే జనాన్ని రెచ్చగొట్టటం చంద్రబాబు నైజం’ అని సజ్జల మండిపడ్డారు. చదవండి: ఆ క్రెడిట్ కూడా బాబుకే దక్కుతుంది.. విజయసాయిరెడ్డి సెటైర్లు -
నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చిన భీమవరం పోలీసులు
-
బాబుకే లేదట గ్యారెంటీ
-
నోటీసులపై నోరు విప్పు
సాక్షి, అమరావతి: ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులకు మాజీ సీఎం చంద్రబాబు తక్షణమే సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. విజనరీగా చెప్పుకునే ఆయన పొలిటికల్ స్కామ్స్టర్ అని ధ్వజమెత్తారు. కమీషన్లుగా దండుకున్న రూ.118.98 కోట్లపై నోరు మెదపకుండా నీతులు వల్లిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అక్రమార్జనలో ఇది చిన్న భాగం మాత్రమేనని, క్షుణ్నంగా విచారిస్తే భారీ కుంభకోణాలు బహిర్గతం కావడం ఖాయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కుంభకోణాలను అప్పట్లోనే తెహల్కా బయటపెట్టింది. అక్రమార్జనపై 17 కేసుల్లో చంద్రబాబు విచారణ ఎదుర్కోకుండా వ్యవస్థలను మేనేజ్ చేసి స్టేలు తెచ్చుకున్నారు. ఢిల్లీలో రూ.700–రూ.800 కోట్లతో అత్యద్భుతమైన పార్లమెంట్ భవనాన్ని కేంద్రం నిర్మిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రూ.500 – రూ.600 కోట్లతో సచివాలయ భవనాన్ని నిర్మించింది. ఏసీ, ఇంటీరియర్స్ సహా చదరపు అడుగు నిర్మాణానికి రూ.2 వేల నుంచి రూ.మూడు వేలు వ్యయం అవుతుంది. చంద్రబాబు మాత్రం చదరపు అడుగుకు రూ.13 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు పెట్టి రేకుల షెడ్డు లాంటి తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించారు. దీన్ని బట్టి చూస్తే షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థల నుంచి చదరపు అడుగుకు రూ.పది వేలకుపైగా ముడుపులు హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి చేరాయి. పోలవరంలో వరదను మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను నిర్మించకుండానే ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ను చంద్రబాబు చేపట్టారు. దీంతో 2019–20లో గోదావరికి వచ్చిన భారీ వరదలు ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో డయాఫ్రమ్ వాల్ కోతకు గురైంది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగాధాలు ఏర్పడ్డాయి. వాటిని యధాస్థితికి తేవడం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఇంత నష్టానికి కారకుడు చంద్రబాబే. ఈ పాపానికి చంద్రబాబు పాల్పడకుంటే పోలవరం ఈ పాటికి ఎప్పుడో పూర్తయ్యేది. చంద్రబాబు పాపాలను సీఎం వైఎస్ జగన్ ప్రక్షాళన చేస్తూ ప్రణాళికాబద్ధంగా పోలవరాన్ని పూర్తి చేస్తున్నారు. తొలి దశ పూర్తికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రాష్టంలో 2014–19 మధ్య పేదరికం 11.66 శాతం ఉండగా, సీఎం జగన్ సంక్షేమ పథకాల వల్ల 6 శాతానికి తగ్గింది. -
ఊహించని షాక్.. నోటీసులు జారీ చేసిన ఐటీ శాఖ, వణుకుతున్న ఐటీ ఉద్యోగులు!
మూన్ లైటింగ్.. ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. కరోనా లాక్డౌన్ టైంలో కొందరు ఉద్యోగులు ఒకేసారి రెండు జాబ్లు చేస్తూ అధిక అదాయాన్ని సంపాదించుకున్నారు. అయితే ఇటీవల ఈ బండారం బయటపడడంతో ఐటీ రంగాన్ని ఈ అంశం కుదిపేసిన సంగతి తెలిసిందే. తాజాగా మూన్లైటింగ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ సారి ఐటీ శాఖ దీనిపై ఫోకస్ పెట్టింది. అసలు ఏం జరుగుతోందంటే.. ఎకనామిక్ టైమ్స్లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగుల్లో కొందరు మూన్లైటింగ్ ద్వారా అధికంగా సంపాదించిన.. తమ ఆదాయాన్ని ఐటీ రిటర్నుల్లో చూపించలేదు. దీంతో ఆయా ఉద్యోగులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతానికి 2019-2020, 2020-2021 ఆర్థిక సంవత్సరాల ఆదాయాలకు సంబంధించి ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసింది. మూన్లైటింగ్ ద్వారా సంపాదిస్తున్న వారిలో ఎక్కువ మంది ఐటీ సెక్టార్, అకౌంటింగ్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ వున్నారని పేర్కొంది. వీరిలో విదేశాల నుంచి నగదు బదిలీ అయిన వారు చాలా మంది ఉన్నారు, అయితే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు, వారు తమ సాధారణ జీతంపై మాత్రమే పన్ను చెల్లించారు. ఈ క్రమంలో మూన్ లైటింగ్ సంపాదనపై పన్ను చెల్లించని దాదాపు మందికి పైగా ఉద్యోగులకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విశేషమేమిటంటే.. మూన్ లైటింగ్ ద్వారా సంపాదిస్తున్న చాలా మంది ఉద్యోగుల సమాచారాన్ని వారు పనిచేస్తున్న కంపెనీలే ఆదాయపు పన్ను శాఖకు అందజేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ లావాదేవీలను ట్రాక్ చేయడం ద్వారా ఐటీ శాఖ అలాంటి వారిని తేలిగ్గా గుర్తించింది. కరోనా కాలంలో మూన్లైటింగ్ చేసే వారి సంఖ్య పెరిగిన సంగతి తెలిసింది. మరో వైపు ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీన్ని సమర్థించగా.. మరికొందరు మాత్రమే తీవ్రంగా వ్యతిరేకించారు. చదవండి: Business Idea: ఒక్కసారి ఈ పంట పండించారంటే ప్రతి ఏటా రూ.60 లక్షల ఆదాయం! బ్లూబెర్రీ సాగుతో లాభాలే.. లాభాలు! -
ఐటీ నోటీసులు రాకూడదంటే.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు
ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలుకు జులై 31వ తేదీతో గడువు ముగుస్తుంది. గడువు సమీపిస్తున్న కొద్దీ పొరపాట్లు, తప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ తప్పులు ఆదాయపు పన్ను శాఖ నుంచి పెద్ద మొత్తంలో జరిమానాలు, నోటీసులకు దారి తీయవచ్చు. ఐటీఆర్ దాఖలును విస్మరించడం, ఆదాయాన్ని తక్కువగా, తప్పుగా చూపించడం వంటి వాటికి పాల్పడిన సుమారు లక్ష మంది పన్ను చెల్లింపుదారులకు నోటీసులు పంపినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా తెలిపారు. అటువంటి నోటీసులకు, జరిమానాలకు గురికాకూడదంటే ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఆదాయపు పన్ను శాఖ సూచన మేరకు రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐటీ శాఖ నోటీసులకు, జరిమానాలకు గురి చేసే అవకావం ఉన్న కొన్ని సాధారణ తప్పులు ఇక్కడ తెలియజేస్తున్నాం. వాటిని గుర్తించి ఆ తప్పులు లేకుండా ఐటీఆర్ దాఖలు చేయండి. సరికాని ఐటీఆర్ ఫారం ఎంపిక మీ ఆదాయ స్వభావం, పన్ను చెల్లింపుదారుల వర్గం ఆధారంగా తగిన ఐటీఆర్ ఫారమ్ను జాగ్రత్తగా ఎంచుకోండి. తప్పు ఫారమ్ను ఉపయోగించడం వలన మీ రిటర్న్ లోపభూయిష్టంగా మారవచ్చు. ఉదాహరణకు, జీతం పొందే వ్యక్తులు ఐటీఆర్ ఫారం-1ని ఫైల్ చేయాలి. మూలధన లాభాల ద్వారా ఆదాయం ఉన్నవారు ఐటీఆర్ ఫారం-2ని ఉపయోగించాలి. ఫారమ్ 26AS, టీడీఎస్ సర్టిఫికేట్ను విస్మరించడం మీ ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఫారమ్ 26ASని పూర్తిగా ధ్రువీకరించండి. ఈ పత్రంలో ముఖ్యమైన ఆదాయ వివరాలు, పన్ను మినహాయింపులు, ముందస్తు పన్ను చెల్లింపులు, స్వీయ అసెస్మెంట్ పన్నుతోపాటు అర్హత కలిగిన పన్ను క్రెడిట్లు ఉంటాయి. ఈ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఫారం 16తో సరిచూసుకోవడం అవసరం. దీంతోపాటు వార్షిక సమాచార ప్రకటన (AIS)తో కూడా చెక్ చేసుకోండి. ఐటీ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఈ రెండు పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధిక విలువ లావాదేవీలను దాచడం మీరు ఆదాయ వివరాల్లో ఆస్తి కొనుగోళ్లు లేదా గణనీయమైన క్రెడిట్ కార్డ్ బిల్లులు వంటి ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపాలను దాచిపెడతే ఐటీ శాఖ నోటీసు జారీ చేయవచ్చు. ఈ లావాదేవీల కోసం ఉపయోగించిన నిధుల మూలానికి సంబంధించి వారు వివరణ కోరవచ్చు. వ్యత్యాసాలను నివారించడానికి, మీ ఖర్చు, నివేదించిన ఆదాయం మధ్య స్థిరత్వం ఉండేలా చూసుకోండి. బోగస్ తగ్గింపులు, క్లెయిమ్లు మీకు వర్తించని తగ్గింపులను క్లెయిమ్ చేయొద్దు. ఉదాహరణకు, మీరు పనిచేసే సంస్థ జారీ చేసిన ఫారమ్ 16లో పేర్కొన్నదానికి విరుద్ధంగా హెచ్ఆర్ఏ లేదా సెక్షన్ 80C వంటి తగ్గింపులను క్లెయిమ్ చేస్తే ఐటీ శాఖ కచ్చితంగా దృష్టి పెడుతుంది. వీటిపై విచారణ కూడా చేపట్టే అవకాశం ఉంది. తప్పుడు వ్యక్తిగత సమాచారం మీ రిటర్న్లో పేరు, చిరునామా, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, పాన్, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను అందించేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈ వివరాలు వాస్తవ, తాజా సమాచారంతో సరిపోలుతున్నాయని నిర్ధారించుకోండి. సరైన బ్యాంక్ వివరాలను అందించకపోతే అర్హమైన పన్ను రీఫండ్లను పొందడంలో జాప్యం జరుగుతుంది. గడువు తేదీని దాటిపోవడం జరిమానాలను నివారించడానికి గడువు తేదీ జూలై 31లోపు మీ ఐటీఆర్ని ఫైల్ చేయండి. ఒక వేళ గడువు మించిపోతే రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకు ఆలస్య రుసుము, నెలకు 1 శాతం చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఆలస్యంగా దాఖలు చేయడం వలన ట్యాక్స్ రీఫండ్ పొందడం కూడా ఆలస్యమవుతుంది. ఆదాయ మార్గాలను దాచడం మీ ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు అన్ని ఆదాయ మార్గాలను తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది. మీరు జీతం పొందే వ్యక్తి అయినప్పటికీ, పన్ను నుంచి మినహాయించిన వాటితో సహా ఏదైనా ఇతర ఆదాయాన్ని పొందుతుంటే తప్పనిసరిగా ప్రకటించాలి. చాలా మంది పన్ను చెల్లింపుదారులు అవగాహన లోపం కారణంగా మినహాయింపు ఆదాయ వివరాలను అనుకోకుండా వదిలేస్తుంటారు. అసెస్మెంట్ సంవత్సరాన్ని తప్పుగా ఎంచుకోవడం మీ పన్ను రిటర్న్ను ఫైల్ చేస్తున్నప్పుడు మీరు ఆదాయాన్ని ఆర్జించిన ఆర్థిక సంవత్సరాన్ని అనుసరించే తగిన అసెస్మెంట్ సంవత్సరాన్ని ఎంచుకున్నారో లేదో నిర్ధారించుకోండి. ఈ సంవత్సరం అంటే 2022-2023 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ కోసం అసెస్మెంట్ ఇయర్ 2023-2024 అవుతుంది. ఇదీ చదవండి ➤ ITR filing: పన్ను రీఫండ్ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే.. -
బిగ్ బాస్ షో.. టీవీ ప్రసారాలకు సెన్సార్ లేకపోతే ఎలా?: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: టీవీల్లో అసభ్య, అభ్యతరకర రీతిలో రియాల్టీ షోలు, ఇతర కార్యక్రమాల ప్రసారానికి ముందు సెన్సార్ చేయకపోతే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామని, కేంద్రానికి తగిన సచనలు చేసే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. టీవీ కార్యక్రమాల పర్యవేక్షణకు ఓ యంత్రాంగం లేకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది. యువతను పెడదోవ పట్టిస్తున్న బిగ్బాస్ షో నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుత సామాజిక కార్యకర్త, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన పిల్పై జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, స్టార్ వ టీవీ ప్రైవేట్ లిమిటెడ్, ఎండేమోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బిగ్బాస్ షో వ్యాఖ్యాత అక్కినేని నాగార్జునకు నోటీసులు జారీ చేసింది. స్టార్ మా టీవీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి, బిగ్బాస్ షోను అభివృద్ధి చేసిన ఎండేమోల్ ఇండియా లిమిటెడ్ తరఫున సీనియర్ న్యాయవాది చిత్తరవు రఘు, పిటిషనర్ తరఫున గుండాల శివప్రసాద్రెడ్డి వాదనలు వినిపించారు. చదవండి: ఇదేమి యాత్ర నాయనా..! -
Singapore : చంద్రబాబు ఫ్రెండ్ ఈశ్వరన్ అరెస్ట్
సింగపూర్ : చంద్రబాబు ఆప్త మిత్రుడు, సింగపూర్ రవాణాశాఖ మంత్రిగా మొన్నటి వరకు పని చేసిన ఎస్.ఈశ్వరన్ అరెస్ట్ అయ్యారు. ప్రధాని ఆదేశాలతో ఇటీవలే పదవి నుంచి తప్పుకున్న ఈశ్వరన్ను జూలై 11నే అరెస్ట్ చేయగా.. బెయిల్పై విడుదల అయినట్లు అక్కడి అత్యున్నత దర్యాప్తు సంస్థ కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీపీఐబీ) శుక్రవారం వెల్లడించింది. అయితే ఈశ్వరన్పై విచారణ ప్రారంభించిన మరుసటి రోజే CPIB ఆయన సన్నిహితులపై కూడా దృష్టి సారించింది. మంత్రి ఈశ్వరన్ కొన్ని అక్రమ లావాదేవీలు జరిపినట్టు ఆధారాలు సేకరించి.. దీనికి సంబంధించి ఈశ్వరన్ అత్యంత సన్నిహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త హూంగ్ బెంగ్ సెంగ్ ను అరెస్ట్ చేసింది. (ఈశ్వరన్ సన్నిహితుడు సెంగ్ ను అరెస్ట్ చేస్తోన్న సింగపూర్ పోలీసులు) ఎవరీ హూంగ్ బెంగ్ సెంగ్ ? హూంగ్ బెంగ్ సెంగ్ ఒక హోటల్ అధినేత. ఆయన సంస్థ పేరు హోటల్ ప్రాపర్టీస్ లిమిటెడ్(HPL). దీని వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కూడా హూంగ్ బెంగ్ సెంగ్. 2008లో ఫార్ములా వన్ రేస్ను సింగపూర్కు తీసుకువస్తానంటూ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేసి కాంట్రాక్టు సంపాదించారు సెంగ్. ఈ కాంట్రాక్టు మొత్తం విలువ 135 మిలియన్ డాలర్లు. (F1 ప్రతినిధులతో ఈశ్వరన్) ఈశ్వరన్ పాత్ర ఏంటీ? ఫార్ములా వన్ రేస్ ప్రాజెక్టుకు సంబంధించి హూంగ్ బెంగ్ సెంగ్ సింగపూర్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి ఈశ్వరన్ ఈ వ్యవహారం నడిపించారు. మొత్తం 135 మిలియన్ డాలర్ల ఈ కాంట్రాక్టులో 40 శాతం వాటా ప్రమోటర్ గా హూంగ్ బెంగ్ సెంగ్ ది. ఆ మేరకు నిధులను సమకూరుస్తాడు. ఇక ఈ కాంట్రాక్టులో 60 శాతం నిధులను సింగపూర్ టూరిజం బోర్డు ఇవ్వాలి. ఈ మేరకు మంత్రిగా ఈశ్వరన్ ఈ ఒప్పందంలో ప్రభుత్వం తరపున సంతకాలు చేశారు. (తన స్నేహితుడు సెంగ్ తో ఈశ్వరన్ సెల్ఫీ) దర్యాప్తు సంస్థ అభియోగాలేంటీ? ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న CPIB సంస్థ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. అయితే ప్రభుత్వం కేటాయించిన 60 శాతం నిధులలో కుంభకోణం జరిగిందని గుర్తించింది. ఈ వ్యవహారంలో హూంగ్ బెంగ్ సెంగ్ పారదర్శకత పాటించకపోవడం, కొన్నిపెద్ద మొత్తాలకు సంబంధించిన వ్యవహారాన్ని గుప్తంగా ఉంచడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో హూంగ్ బెంగ్ సెంగ్ కు మొదటి నుంచి మద్దతిస్తోన్న మంత్రి ఈశ్వరన్ పైనా ప్రధానికి లేఖ రాసింది. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ CPIB నుంచి లేఖ రావడంతో హుటాహుటిన ఈశ్వరన్ ను బాధ్యతల నుంచి తప్పించారు ప్రధాని. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు ప్రధాని. ( సింగపూర్ ప్రధాని విడుదల చేసిన ప్రకటన) ఈశ్వరన్ వ్యవహారశైలి ఏంటీ? మొదటి నుంచి ఈశ్వరన్ వ్యవహారశైలి అనుమానస్పదంగానే ఉందన్నది సింగపూర్ వర్గాల సమాచారం. ప్రభుత్వంతో సంబంధం లేని ప్రాజెక్టుల్లో తలదూర్చడం, భారీ మొత్తంలో రిటర్న్స్ వస్తాయని మభ్యపెట్టడం, కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తారన్న ఆరోపణలున్నాయి. చంద్రబాబుకు, సింగపూర్ కు లింకేంటీ? చంద్రబాబు తన ప్రసంగాల్లో ఎక్కువ సార్లు పలికే దేశం పేరు సింగపూర్. సింగపూర్ లో చంద్రబాబుకు ఓ భారీ హోటల్ ఉందని తెలుగుదేశం వర్గాల్లోనే ప్రచారం ఉంది. సింగపూర్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులతో పరిచయాలు పెంచుకోవడం, అక్కడి వ్యవహారాల్లో తల దూర్చడం బాబుకు బాగా అలవాటని చెబుతారు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాడు. కొత్త రాజధాని కోసం కేంద్రం వేసిన శివరామకృష్ణన్ కమిటీ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని అసలే వద్దని సూచించింది. అయినా చంద్రబాబు అమరావతిలోనే రాజధాని అని ప్రకటించాడు. ఆ వెంటనే లాండ్ పూలింగ్ అంటూ రైతుల నుంచి భూమి సేకరించాడు. (నారా లోకేష్ తో సింగపూర్ ఈశ్వరన్) అమరావతి రాజధానిలో 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు సంబంధించి స్విస్ చాలెంజ్ విధానాన్ని తుస్సుమనిపించి ఇతర కంపెనీలేవీ బిడ్లు దాఖలు చేయకుండా సింగపూర్ సంస్థలను తెరమీదకు తెచ్చారు. అసెండాస్–సిన్బ్రిడ్జి–సెంబ్కార్ప్ కన్సార్టియంకి కట్టబెడుతూ 2017 మే 2న నాటి చంద్రబాబు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆ సంస్థల కన్సార్టియంకు స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టును అప్పగిస్తూ 2017 మే 12న ఈశ్వరన్తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. ఇది సింగపూర్ ప్రభుత్వమే అమరావతి ప్రాజెక్టు చేపడుతుందని చంద్రబాబు ప్రకటించగా.. దీనిపై అశ్వథ్థామ హతః.. అన్న టైపులో ఉద్దేశపూర్వక మౌనం వహించాడు. సింగపూర్ లోని ప్రైవేట్ కంపెనీల కన్సార్టియానికి ప్రభుత్వానికి సంబంధం లేకున్నా.. ఈశ్వరన్ ఎక్కడా ఆ విషయాన్ని బయటపెట్టలేదు. (బాబు నాడు కుదుర్చుకున్న అమరావతి ఒప్పందం, సంతకం చేస్తున్నది ఈశ్వరన్) కేసులో తాజా అప్ డేట్స్ ఏంటీ? హూంగ్ బెంగ్ సెంగ్ ను తన కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించిన CPIB సంస్థ.. ఈశ్వరన్ తో లావాదేవీల గురించి లోతుగా ప్రశ్నించినట్టు సింగపూర్ మీడియా పేర్కొంది. తనకు ఇప్పటికే విదేశాల్లో ఇతర షెడ్యూల్ ఉందని, ఆ మేరకు బెయిల్ ఇవ్వాలని హూంగ్ బెంగ్ సెంగ్ కోర్టులో అభ్యర్థించారు. ఆ మేరకు షరతులతో కూడిన బెయిల్ ను హూంగ్ బెంగ్ సెంగ్కు మంజూరు చేసింది. అయితే విదేశీ పర్యటన నుంచి వెనక్కు రాగానే.. హూంగ్ బెంగ్ సెంగ్ తన పాస్ పోర్టును CPIB సంస్థకు అప్పగించాలని సూచించింది. అలాగే బెయిల్ మంజూర్ చేయడానికి ఒక లక్ష అమెరికన్ డాలర్లను పూచీకత్తుగా పెట్టాలని కోర్టు సూచించింది. అలాగే ఈశ్వరన్ కు సంబంధించిన లావాదేవీల పూర్తి రికార్డులను సమర్పించాలని ఆదేశించింది. ఈశ్వరన్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు సింగపూర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎస్.ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా సీపీఐబీ ఓ అంచనాకు వచ్చింది. సేకరించిన ఆధారాల మేరకు ఈశ్వరన్ను విచారిస్తున్నామని సీపీఐబీ డైరెక్టర్ డెనిస్ టాంగ్ తెలిపారు. ఈ కేసును కొందరు మరో కేసుతో ముడిపెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మొదటి కేసు పార్లమెంటుకు సంబంధించిందని, దాంట్లో ఎలాంటి అవకతవకలు లేవన్నారు టాంగ్. అయితే ఈశ్వరన్ పై ఇప్పుడు పెట్టిన కేసు.. CPIB స్వయంగా గుర్తించిందని, ఆ మేరకు అభియోగాలు నమోదు చేసి, ప్రధానికి సమాచారం అందించామన్నారు డైరెక్టర్ టాంగ్. We have always been unapologetic in stamping out corruption even if it is potentially embarrassing for the @PAPSingapore . No means No. Check out my bro @LawrenceWongST explaining the difference between CPIB investigating #ridout Ridout and Iswaran. pic.twitter.com/hJlEu9aYpl — Edwin Tong Fan Bot (@EdwinFanBot) July 12, 2023 ఇదీ చదవండి: చంద్రబాబు సింగపూర్ పార్టనర్ ‘ఈశ్వరన్’ ఔట్ -
పవన్ కళ్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు
-
వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, అమరావతి: వాలంటీర్ల పట్ల పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు పవన్కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీనిపై 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పవన్ వ్యాఖ్యలు ఒంటరి మహిళల గౌరవానికి భంగం కలించేలా ఉన్నాయని పేర్కొన్న కమిషన్.. తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఇవ్వాలని తెలిపింది. కాగా మహిళలను ఉద్ధేశించి చేసిన పవన్ వ్యాఖ్యలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఈమెయిల్స్ ద్వారా మహిళా సంఘాలు, వాలంటీర్లు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో పవన్కు నోటీసులు జారీ చేస్తున్నట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు. వాలంటీర్లపై పవన్ విషం కక్కుతున్నారని, ఆయనకు ఏ ఇంటెలిజెన్స్ అధికార చెప్పారో సమాధానం చెప్పాలని అన్నారు. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి పవన్ తప్పించుకోలేరని విమర్శించారు. వాలంటీర్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందనే అనుమానం కలుగుతోందన్నారు. పవన్ చెప్తున్న 30 వేల మిస్సింగ్ కేసులకు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. యువత చెడిపోవడానికి పవన్ సినిమాలే కారణమని దుయ్యబట్టారు. చదవండి: పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్ల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ మరోవైపు పవన్ అనుచిత వ్యాఖ్యలపై వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలు చేస్తున్న తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. పవన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు. తమకు తక్షణమే పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: పవన్ ఎందుకు ఎమ్మెల్యే కాలేకపోయాడు?: మంత్రి అమర్నాథ్ -
ఆర్బీఐ గవర్నర్కు తెలంగాణ హైకోర్టు నోటీస్ - కారణం ఏంటంటే?
Telangana High Court Notice to RBI Governor: కోర్టు ధిక్కరణ కేసులో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదంటూ ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ వాటాదారులు కోర్టుకు వెళ్లారు. దీనిపైన జస్టిస్ భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టి.. ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో 2023 జులై 07 లోపల వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలకు సంబంధించి మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ షేర్హోల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి బ్యాంకు నిధులు దుర్వినియోగమయ్యాయని వెల్లడించింది. వినియోగదారుల రక్షణ కోసం బ్యాంకు రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు అధికారిని నియమించాలని ఆర్బీఐని కోర్టు అప్పట్లోనే ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు అధికారిని నియమించకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని, ఇది కోర్టు ధిక్కారంగా పరిగణించి అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరింది. ఈ కారణంగానే శక్తికాంతదాస్కు కోర్టు నోటీసులు జారీ చేసింది. -
ఫెమా ఉల్లంఘనకు షావోమీకి ఈడీ షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ: విదేశీ మారక నిర్వహణ చట్ట (ఫెమా) నిబంధనల ఉల్లంఘనకు గాను చైనా మొబైల్ తయారీ దిగ్గజం షావోమీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షోకాజ్నోటీసులు జారీ చేసింది. రాయల్టీ ముసుగులో అనధికారికంగా రూ. 5,551.27 కోట్ల విలువ చేసే మొత్తాన్ని విదేశాలకు బదలాయించడానికి సంబంధించి ఈడీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. సదరు మొత్తాన్ని జప్తు చేస్తూ.. షావోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సమీర్ రావు, మాజీ ఎండీ మను జైన్తో పాటు సిటీ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంక్, డాయిష్ బ్యాంక్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
రాహుల్కి ఢిల్లీ యూనివర్సిటీ నోటీసులు: ఇది మీ హోదాకి తగ్గ పని కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీ యూనివర్సిటీలో ఆకస్మికంగా పర్యటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఢిల్లీ యూనివర్సిటీ కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఇలా సడెన్గా యూనివర్సిటీలో పర్యటించడం కరెక్ట్ కాదని నోటీసులు పంపుతామని హెచ్చరింది. అన్నట్లుగానే ఢిల్లీ యూనివర్సిటీ రాహుల్ గాంధీకి బుధవారం నోటీసులు పంపించింది. జెడ్ప్లస్ భద్రతతో ఓ జాతీయ పార్టీ నాయకుడి హోదాలో ఉన్న రాహుల్కి ఇది తన స్థాయికి తగ్గ పని కాదని చురకలంటిస్తూ..రెండు పేజీల నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనను అతిక్రమణ, బాధ్యతరాహిత్యమైన ప్రవర్తనగా పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించింది. ఆ నోటీసులో హాస్టల్ ప్రవేశ నిర్దేశిత నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంది. ఏ నాయకుడు యూనివర్సిటీలో మూడు వాహానాలతో యూనివర్సిటీలోకి ప్రవేశించేటప్పుడు ఆ నిబంధనలను అనుసరించాలని తెలిపింది. అలాగే హాస్టల్ ప్రాంగణంలో అకడమిక్ అండ్ రెసిడెంట్స్ కౌన్సిల్ కార్యకలాపాల్లో తప్ప మరే ఏ ఇతర కార్యకలాపాల్లో పాల్లొనకూడదని పేర్కొంది. హాస్టల్ యూనివర్సిట్ ఆఫ్ ఢిల్లీ చట్టం ప్రకారం కొన్ని కార్యకలాపాల్లో పాల్గొనేందుకు దానికంటూ కొన్ని నియమ, నిబంధనలు ఉంటాయని తెలిపింది. నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా జరిగే ఏ కార్యక్రమాన్నైనా ఆపే హక్కు మాకు ఉందన్నారు. ఇది హాస్టల్ హ్యాండ్ బుక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రూల్కి సంబంధించిన క్రమశిక్షణలో భాగమని తెలిపారు. హాస్టల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, ఇతర సభ్యులు దీన్ని బాధ్యతరాహిత్యమైన చర్యగా పేర్కొంటూ తీవ్రంగా ఖండిస్తున్నామని నోటీసులో పేర్కొంది. అలాగే ఇలాంటి చర్య హాస్టలోని విద్యార్థుల భద్రతకు ప్రమాదం కలిగిస్తుందని, అందువల్ల ఇలాంటి ఆకస్మిక చర్యలను మానుకోవాలని రాహుల్కి సూచిస్తూ యూనివర్సిటీ నోటీసులో పేర్కొంది. ఇదిలా ఉండగా గత శుక్రవారం రాహుల్ గాంధీ ఢిల్లీ యూనివర్సిటీలో మెన్స్ పురుషుల హాస్టల్ని సందర్శించి..అక్కడ వారితో సంభాషించడమే గాక కలిసి భోజనం చేశారు. ఇదికాస్త సీరియస్ అంశంగా మారీ డీల్లీ యూనివర్సిటీ అధికారులు ఫైర్ అవ్వుతూ నోటీసులు పంపేందుకు దారితీసింది. (చదవండి: ఢిల్లీ యూనివర్సిటీలో రాహుల్ ఆకస్మిక పర్యటన! నోటీసులు పంపుతామని వార్నింగ్) -
బోర్నవిటాకు ఎన్సీపీసీఆర్ షాక్.. కారణం ఇదే!
బూస్ట్, బోర్నవిటా వంటి వాటికి భారతీయ మార్కెట్లో మంచి క్రేజు ఉంది. ఈ కారణంగానే వీటి అమ్మకాలు కూడా భారీగా ఉన్నాయి. ఇటీవల మాండెలెజ్ ఇండియాకు చెందిన బోర్నవిటా కొనుగోలుదారులను తప్పు దోవ పట్టించే వ్యాపార ప్రకటనలు, ప్యాకేజింగ్ లేబుళ్లను చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. జాతీయ పిల్లల హక్కుల కమీషన్ (NCPCR) నివేదికల ప్రకారం, బోర్నవిటాను తప్పుదోవ పట్టించే ప్రకటనలు మాండెలెజ్ ఇండియా చేసినట్లు తెలిసింది. దీనిపైన సమగ్రమైన వివరణ ఇవ్వాలని NCPCR ఆదేశించింది. బోర్న్విటాలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉందని ఆరోపిస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీడియోను పోస్ట్ చేయడం ద్వారా వివాదానికి దారితీసిన తర్వాత నోటీసు వచ్చింది. పిల్లల ఎదుగుదలను అభివృద్ధి పరుస్తామంటూ ప్రచారం చేయబోయే బోర్నవిటాలో పిల్లల ఆరోగ్యానికి హానిచేసే చక్కర శాతం, ఇతర పదార్థాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. లీగల్ నోటీసు అందించిన తర్వాత వీడియోను అన్ని ప్లాట్ఫారమ్ల నుండి తొలగించినప్పటికీ, ఇది ఇప్పటికే దాదాపు 12 మిలియన్స్ వ్యూవ్స్ పొంది బాగా పాపులర్ అయిపోయింది. మీ కంపెనీ వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తూ ప్యాకేజింగ్, వ్యాపార ప్రకటనలు చేసినట్లు కమిషన్ గుర్తించిందని మాండెలెజ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్-ఇండియా 'దీపక్ అయ్యర్'కు జారీ చేసిన ప్రకటనలో ఎన్సీపీసీఆర్ వెల్లడించింది. (ఇదీ చదవండి: భారీగా పెరిగిన అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ధరలు - కొత్త ధరలు ఇలా!) పోషకాహార నిపుణులు, ఆహార శాస్త్రవేత్తలు మా ఉత్పత్తిని సమగ్రంగా టెస్ట్ చేయడం జరిగిందని. ఉత్పత్తిలో ఆహార పదార్థాలు అన్ని విధాలా సరైనవే అని నిర్దారించిన తరువాత మార్కెట్లో విక్రయిస్తున్నట్లు బోర్నవిటా ప్రతినిధి గతంలో వెల్లడించారు. దీనిపైనా ఇప్పుడు ఎటువంటి సమాధానం లభిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేశాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
రిటర్నులు సమర్పించడంతోనే అయిపోదు.. తర్వాత ఏం చేయాలంటే?
గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధిం ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నులు దాఖలు చేసే సమయం వచ్చేసింది. సాధారణంగా జూలై 31లోపు రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎన్నో వివరాలను సిద్ధం చేసుకోవాలి. ఆదాయం, పెట్టుబడులు, గృహ రుణం చెల్లింపులు, అద్దె చెల్లింపులు, ఈపీఎఫ్, పీపీఎఫ్, బీమా ప్రీమియం చెల్లింపులు, మూలధన లాభాలు అన్నింటినీ ఒక పేపర్పై రాసి పెట్టుకుంటే రిటర్నులను సులభంగా దాఖలు చేయవచ్చు. పాత, కొత్త విధానాల్లో ఏది అనుకూలమో కూడా మదింపు వేసుకోవాలి. అయితే, రిటర్నులు సమర్పించడంతోనే పని పూర్తయినట్టు అనుకోవద్దు. రిటర్నులు దాఖలు తర్వాత చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలియజేసేదే ఈ కథనం. రిటర్నులు ధ్రువీకరణ రిటర్నులు దాఖలు చేసిన ప్రతి ఒక్కరూ వాటిని వెరిఫై చేయాల్సి ఉంటుంది. అప్పుడే రిటర్నులు విజయవంతంగా సమర్పించినట్టు అవుతుంది. ధ్రువీకరించకపోతే అవి మదింపునకు వెళ్లవన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. రిటర్నులు చెల్లుబాటు కూడా కావు. రిటర్నులు దాఖలు చేసిన తర్వాత వాటిని ధ్రువీకరించేందుకు 120 రోజుల గడువు ఉంటుంది. ఆలోపు ఎప్పుడైనా చేయవచ్చు. రిటర్నులు దాఖలు చేసిన తర్వాత వచ్చే అక్నాలెడ్జ్మెంట్ కాపీని ప్రింట్ తీసుకుని, దానిపై సంతకం చేసి లేదంటే ఇన్కమ్ట్యాక్స్ వెబ్సైట్ నుంచి ఫామ్ 5ను డౌన్లోడ్ చేసుకుని బెంగళరులోని ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆర్డినరీ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ చేయవచ్చు. కొరియర్ ద్వారా చేయకూడదు. ఆన్లైన్లోనూ వెరిఫై చేయవచ్చు. పోస్ట్ ద్వారా పంపించడం కంటే ఇది ఎంతో సులభ విధానం. నెట్బ్యాంకింగ్ అకౌంట్ లేదంటే ఆధార్ ఆధారిత ఓటీపీ లేదా డీమ్యాట్ అకౌంట్ ద్వారా చేసేందుకు అవకాశం ఉంటుంది. వీటిల్లో ఏది ఎంపిక చేసుకుంటే ఆ రూపంలో మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఆదాయపన్ను శాఖ పోర్టల్పై నమోదు చేయడం ద్వారా రిటర్నులను వెరిఫై చేయవచ్చు. వెరిఫికేషన్కు సంబంధించి ఎలక్ట్రానిక్ కోడ్ను బ్యాంకు ఏటీఎంల ద్వారా కూడా పొందొచ్చు. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఈ సేవలను అందిస్తున్నాయి. ఏటీఎంలో డెబిట్ కార్డును స్వైప్ చేసి, పిన్ నంబర్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత ‘జనరేట్ ఈవీసీ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్’ను ఎంపిక చేసుకోవాలి. ఆయా బ్యాంకుల్లో ఖాతాదారులై, పాన్ నంబర్ ఇచ్చి ఉన్న వారికే ఇది సాధ్యపడుతుంది. ఒకవేళ ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 44ఏబీ కింద పుస్తకాలను ఆడిట్ చేయించుకోవాల్సిన వారు రిటర్నులు దాఖలు చేసిన వెంటనే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ద్వారా వాటిని వెరిఫై చేయాల్సి ఉంటుంది. వ్యక్తులు రిటర్నులు వేసి, 120 రోజులు అయినా వాటిని వెరిఫై చేయలేదనుకుంటే.. అప్పుడు కండోనేషన్ ఆఫ్ డిలే సర్వీస్ రిక్వెస్ట్ సమర్పించాలి. తగిన కారణాన్ని పేర్కొనాలి. ఆదాయపన్ను శాఖ కండోనేషన్ రిక్వెస్ట్ను ఆమోదిస్తే అప్పుడు రిటర్నులను వెరిఫై చేయవచ్చు. లేదంటే రిటర్నులు దాఖలు చేయనట్టుగానే ఆదాయపన్ను శాఖ పరిగణిస్తుంది. తిరిగి రిటర్నులను దాఖలు చేయాల్సిందే. లేట్ ఫీజు చెల్లించి దాఖలు చేయాల్సి ఉంటుంది. పన్ను చెల్లించాల్సి ఉంటే, దానిపై వడ్డీ కూడా పడుతుంది. తప్పులు దొర్లితే? ఆదాయ పన్ను రిటర్నులను గడువులోపు సమర్పించిన వారు, అందులో తప్పులు దొర్లితే సవరించిన రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. దాఖలు చేసిన రిటర్నులు ఇంకా ప్రాసెస్ చేయకపోతే రివైజ్డ్ రిటర్నులు వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సవరించిన రిటర్నులు దాఖలు చేయడానికి ప్రత్యేకమైన ప్రక్రియ అంటూ ఏదీ లేదు. ఈఫైలింగ్ పోర్టల్కు వెళ్లి ‘రివైజ్డ్ రిటర్న్’ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. తాజా రిటర్నులు దాఖలు చేసే ప్రక్రియనే అనుసరించాల్సి ఉంటుంది. సవరించిన రిటర్నుల పత్రంలో మొదటిసారి దాఖలు చేసిన అసలు రిటర్నుల అక్నాలెడ్జ్మెంట్ నంబర్, డేట్ కూడా ఇవ్వాలి. అసెస్మెంట్ సంవత్సరం ముగియడానికి మూడు నెలల ముందు వరకు రివైజ్డ్ రిటర్నులు సమర్పించొచ్చు. పన్ను చెల్లింపుదారు దాఖలు చేసిన రిటర్నుల పత్రాన్ని ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేసినట్టయితే సెక్షన్ 143 (1) కింద ఇంటిమేషన్ పంపిస్తుంది. ఇది వచ్చిన తర్వాత రివైజ్డ్ రిటర్నులు వేయడానికి అనుమతి ఉండదు. ఆలస్యపు రిటర్నులు దాఖలు చేయడానికి తుది గడువు అసెస్మెంట్ సంవత్సరంగా గుర్తించాలి. రిటర్నులు దాఖలు చేసి, దాన్ని ఆదాయపన్ను శాఖ ఇంకా ప్రాసెస్ చేయనట్టయితే గడువులోపు ఎన్ని సార్లు అయినా సవరణలు దాఖలు చేసుకోవచ్చు. ఈ విషయంలో పరిమితి లేదు. ఒక్కసారి సవరించిన రిటర్నులు సమర్పించగానే, ముందు దాఖలు చేసినది చెల్లకుండా పోతుంది. తాజా రిటర్నుల పత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అవకాశం ఉంది కదా అని చాలా పర్యాయాలు సవరించిన రిటర్నులు సమర్పిస్తే అది పన్ను శాఖ అధికారుల దృష్టిలో పడుతుంది. దాంతో ప్రత్యేక స్క్రూటినీ చేయవచ్చు. ముఖ్యంగా సవరించిన రిటర్నుల్లో పెద్ద మార్పులు ఉంటే తప్పకుండా విస్తృత పరిశీలన ఉంటుంది. మొదటిసారి దాఖలు చేసిన పత్రాల మాదిరిగానే, సవరించిన రిటర్నులనూ వెరిఫై చేయడం మర్చిపోవద్దు. అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోండి. రిఫండ్ల సంగతి ఇదీ.. దాఖలు చేసిన రిటర్నుల్లో ఎలాంటి తప్పులు లేకపోతే అప్పుడు నిశ్చింతగా ఉండొచ్చు. ఒకవేళ చెల్లించాల్సిన మొత్తానికంటే అదనంగా పన్ను చెల్లింనట్టయితే అప్పుడు రిఫండ్ కోరడం ఒక్కటే మార్గం. యూజర్లు ఆదాయ పన్ను శాఖ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత డ్యాష్బోర్డులో ఇది కనిపిస్తుంది. పన్ను చెల్లింపుదారులు ఎన్ఎస్డీఎల్ పోర్టల్లోనూ పాన్ నంబర్ సమర్పించడం ద్వారా దీన్ని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫేస్లెస్ ప్రాసెసింగ్ నడుస్తోంది. రిఫండ్లు పన్ను చెల్లింపుదారు బ్యాంకు ఖాతాకు జమ అవుతాయి. ఇంటిమేషన్ అందుకున్న 15 రోజుల్లోగా ఇది సాధ్యపడుతుంది. బ్యాంకు వివరాలు సరిగ్గా లేకపోవడం వల్ల రిఫండ్లు నిలిపోతుంటాయి. అకౌంట్ నంబర్ లేదా ఐఎఫ్ఎస్సీ నంబర్లో తప్పులు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్ ద్వారా దీన్ని చెక్ చేసుకోవచ్చు. పన్ను చెల్లింపుదారుడికి రావాల్సిన రిఫండ్లు ఆలస్యం అయితే ఒక్కో నెలకు అర శాతం చొప్పున వడ్డీని చెల్లిస్తారు. టీడీఎస్ లేదా టీసీఎస్ రూపంలో పన్నును మినహాయించి ఉంటే లేదా ముందస్తు పన్ను చెల్లించి ఉండి, చివర్లో పన్ను బాధ్యత తగ్గడం వల్ల వెనక్కి తిరిగి రావాల్సి ఉంటే.. అప్పుడు ఏప్రిల్ 1 నుంచి చెల్లించే నాటి వరకు వడ్డీ కూడా లభిస్తుంది. ఐటీఆర్లను గడువు తర్వాత దాఖలు చేసిన వారు, ఆ తేదీ నుంచే రిఫండ్పై వడ్డీ చెల్లింపులకు అర్హులవుతారు. రిఫండ్పై వచ్చే వడ్డీ సంబంధిత ఆర్థిక సంవత్సరం అదనపు ఆదాయం కింద చపించాలి. సరిపోలేకపోతే..? దాఖలు చేసిన రిటర్నుల్లో వివరాల ఆధారంగా చెల్లించాల్సిన పన్నులో వ్యత్యాసం ఉంటే, ఆదాయపన్ను శాఖ పంపించే 143 (1) ఇంటిమేషన్లో ఆ వివరాలు ఉంటాయి. పన్ను లెక్కల్లో పొరపాట్లు ఉంటే, అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటే, ఆదాయపన్ను శాఖ ఈ ఇంటిమేషన్లో పేర్కొంటుంది. ఆదాయపన్ను శాఖ వివరాలతో, పన్ను లెక్కలతో ఏకీభవిస్తే అప్పుడు పన్ను చెల్లింపుదారు ఆ మేరకు అదనపు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. కొన్ని సందర్భాల్లో పన్ను మినహాయింపులు పేర్కొనడం మర్చిపోయినా.. పన్ను అదనంగా చెల్లించాల్సిన బాధ్యత ఏర్పడుతుంది. లేదంటే ఆదాయ పన్ను శాఖ అసెసింగ్ ఆఫీసర్ అయినా పొరపాటు పడొచ్చు. లేదా ఎర్రర్ చోటు చేసుకోవచ్చు. అప్పుడు యూజర్ రెక్టిఫికేషన్ రిక్వెస్ట్ సమర్పించాలి. అంటే దాన్ని సరిదిద్దాలని కోరడం. ఇంటిమేషన్ పంపించిన నాటి నుంచి నాలుగేళ్ల వ్యవధిలో ఎప్పుడైనా కానీ దీన్ని దాఖలు చేయవచ్చు. ఆదాయపన్ను శాఖ గుర్తించిన వాటితో మీరు ఏకీభవించకపోవచ్చు. లేదా మీరు పేర్కొన్న వివరాల పరంగానూ ఆదాయపన్ను శాఖ లేవనెత్తిన తాజా డిమాండ్ సమ్మతం కాకపోయినా రెక్టిఫికేషన్ రిక్వెస్ట్ దాఖలు చేయవచ్చు. ఇలా దాఖలు చేసిన నాటి నుంచి ఆరు నెలల్లోపు ఆదాయపన్ను శాఖ స్పందిస్తుంది. పన్ను చెల్లింపుదారులు సాధారణంగా నాలుగు రకాల రెక్టిఫికేషన్ రిక్వెస్ట్లు సమర్పించొచ్చు. పన్ను చెల్లింపుదారు తనవైపు నుంచి అన్ని రకాల వివరాలు సమర్పించినప్పటికీ, పన్ను శాఖ ఏదైనా సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోనట్టయితే అప్పుడు ‘రీ ప్రాసెస్ ద రిటర్న్’ను ఎంపిక చేసుకోవాలి. టీడీఎస్/టీసీఎస్ లేదా ఐటీ చలాన్లలో దిద్దుబాటు చేయాల్సి ఉంటే అప్పుడు ‘ట్యాక్స్ క్రెడిట్ మిస్వ్యచ్ కరెక్షన్’ రిక్వెస్ట్ను ఎంపిక చేసుకోవాలి. సెక్షన్ 234సీ కింద వడ్డీ లెక్కలను సరిదిద్దాల్సి ఉంటే ‘అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ 234సీ ఇంటరెస్ట్’ను ఎంపిక చేసుకోవాలి. వాస్తవ రిటర్నుల్లో ఇతర వివరాలను సరిదిద్దాలంటే అప్పుడు ‘రిటర్న్ డేటా కరెక్షన్’ను ఎంపిక చేసుకోవాలి. -
టీఎస్పీఎస్సీకి సిట్ టెస్ట్.. పేపర్ల లీకేజీలో సెక్రెటరీ, సభ్యుడికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ల లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డి, చైర్మన్ జనార్దనరెడ్డిల వాంగ్మూలాలను నమోదు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికారులు శుక్రవారం అనితా రామచంద్రన్, లింగారెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. జనార్దనరెడ్డికి నోటీసులు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ముగ్గురికీ అనువైన సమయంలో సిట్ అధికారులే టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లి వాంగ్మూలాలు తీసుకోనున్నారు. ఇక లీకైన పేపర్ల ‘మారి్పడి’ మొత్తం హార్డ్కాపీల (ప్రింటెడ్ కాపీల) రూపంలోనే జరిగిందని.. కేవలం ఇద్దరికి మాత్రమే ఎనీడెస్క్ అప్లికేషన్ ద్వారా అందిందని సిట్ అధికారులు తేల్చారు. రాజశేఖర్రెడ్డి తనకు కంప్యూటర్ యాక్సెస్ ఇచ్చినందుకు ప్రతిఫలంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ) షమీమ్కు గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం అందించాడని గుర్తించారు. ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ.. సిట్ అధికారులు ఏప్రిల్ 11న హైకోర్టుకు స్టేటస్ రిపోర్టు సమరి్పంచాల్సి ఉంది. దీంతో ప్రతి అంశంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రతి అంశంలో న్యాయ నిపుణులు, న్యాయ సలహాదారుల అభిప్రాయం తీసుకుంటున్నారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి చైర్మన్ నేతృత్వంలో పనిచేయడంతో పాటు కార్యనిర్వాహక బాధ్యతలను పర్యవేక్షిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి వాంగ్మూలాలు కేసులో కీలకమని సిట్కు న్యాయ నిపుణులు సూచించడంతో.. కార్యదర్శికి నోటీసులు జారీచేశారు, చైర్మన్కూ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గ్రూప్–1 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో అరెస్టైన డేటా ఎంట్రీ ఆపరేటర్ డామెర రమేశ్కుమార్ ఇంతకుముందు కమిషన్ సభ్యుడు లింగారెడ్డి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. ఈ క్రమంలో లింగారెడ్డికి నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు.. మిగతా సభ్యుల విషయమై న్యాయ సలహా తీసుకుంటున్నారు. కేవలం ప్రింటెడ్ పత్రాలే ఇస్తూ.. లీకైన పేపర్లలో గ్రూప్–1 ప్రిలిమ్స్, ఏఈ ప్రశ్నపత్రాలు మాత్రమే అభ్యర్థులకు చేరాయని సిట్ అధికారులు చెప్తున్నారు. ఇవి మొత్తం తొమ్మిది మందికి చేరాయని ఇప్పటివరకు తేలి్చనట్టు సమాచారం. కస్టోడియన్ కంప్యూటర్ నుంచి ప్రవీణ్, రాజశేఖర్ చేజిక్కించుకున్నవి సాఫ్ట్కాపీలే. అయినా ఈ ‘వాట్సాప్ జమానా’లో కూడా వారు ప్రశ్నపత్రాల ఆన్లైన్ షేరింగ్ జోలికి పోలేదు. న్యూజిలాండ్లో ఉన్న రాజశేఖర్ సమీప బంధువు ప్రశాంత్రెడ్డి, టీఎస్పీఎస్సీ సభ్యుడి వద్ద పీఏగా పనిచేసిన రమేశ్కు మాత్రమే ఎనీడెస్క్ అప్లికేషన్ ద్వారా సాఫ్ట్కాపీలు ఇచ్చారు. మిగతా వారికి ప్రింట్ఔట్స్ రూపంలో ఉన్న మాస్టర్ క్వశ్చన్ పేపర్ల పత్రాలే అందించారు. ఎక్కడా సాంకేతిక ఆధారాలు చిక్కకూడదనే ఇలా చేసినట్టు సిట్ అధికారులు భావిస్తున్నారు. కంప్యూటర్ యాక్సెస్ కోసం పేపర్ ఇచ్చి.. రాజశేఖర్ తన పెన్డ్రైవ్లో ఉన్న గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని ప్రశాంత్రెడ్డికి ఎనీడెస్క్ అప్లికేషన్ ద్వారా పంపినా.. ఇందుకోసం తన కంప్యూటర్ను నేరుగా వినియోగించలేదు. ఎవరైనా సహోద్యోగులు చూసే ప్రమాదం ఉందని, సాంకేతిక ఆధారాలు చిక్కకూడదని భావించాడు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేíÙంచిన అతడికి తన స్నేహితురాలైన ఏఎస్ఓ షమీమ్ కూడా గ్రూప్–1 రాస్తున్నట్టు తెలిసింది. ఆమెను సంప్రదించిన రాజశేఖర్.. తాను ఇచ్చే పెన్డ్రైవ్ను ఇంటికి తీసుకువెళ్లి ల్యాప్టాప్కు కనెక్ట్ చేయాలని, ఎనీడెస్క్ ద్వారా న్యూజిల్యాండ్లో ఉన్న ప్రశాంత్కు యాక్సెస్ ఇవ్వాలని కోరాడు. ఇలా చేసినందుకు అందులో ఉన్న ప్రశ్నపత్రాన్ని పేపర్ తీసుకోవచ్చని.. ఈ విషయం ఎవరికీ తెలియదని భరోసా ఇచ్చాడు. రాజశేఖర్ ఇచి్చన పెన్డ్రైవ్ను తీసుకువెళ్లిన షమీమ్ తన ఇంటివద్ద ల్యాప్టాప్కు కనెక్ట్ చేసింది. తర్వాత రాజశేఖర్ సూచనల ప్రకారం నిరీ్ణత సమయంలో ఎనీడెస్క్ ద్వారా ఈ ల్యాప్టాప్ను యాక్సెస్ చేసిన ప్రశాంత్రెడ్డి.. ఆ పెన్డ్రైవ్లో ఉన్న గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని తన కంప్యూటర్లోకి కాపీ చేసుకున్నాడు. తర్వాత రమేశ్కు ప్రవీణ్ ఇదే పంథాలో తన కంప్యూటర్ నుంచి ఎనీడెస్క్ ద్వారా ప్రశ్నపత్రం అందించాడు. గ్రూప్–1 మెయిన్స్ పేపర్లు సైతం ఇలానే చేజిక్కించుకోవాలని పథకం వేసిన ప్రవీణ్.. ఎక్కడా లీకేజ్ వ్యవహారం బయటపడకూదని, సాంకేతిక ఆధారాలు ఉండకూడదనే ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడని సిట్ అధికారులు చెప్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షలకు కంప్యూటర్లు, ల్యాప్టాప్ షమీమ్, రమేశ్, సురేశ్లను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సిట్ అధికారులు.. ఈ అంశాలను నిర్ధారించుకోవడంతోపాటు న్యూజిలాండ్లో ఉన్నది మినహా మిగతా కంప్యూటర్లు, ల్యాప్టాప్లను స్వా«దీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపనున్నారు. మరోవైపు సిట్ అధికారులు గ్రూప్–1 ప్రిలిమ్స్లో 100 కంటే ఎక్కువ మార్కులు వచి్చన 121 మందినీ ప్రశి్నస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం నాటికి 103 మందిని విచారించామని, ఎలాంటి అనుమానాస్పద అంశమూ తమ దృష్టికి రాలేదని సిట్ అధికారులు చెప్తున్నారు. చదవండి: రేవంత్ ఆరోపణలపై సిట్ రియాక్షన్ -
రాహుల్ గాంధీకి మరో షాక్.. బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు..
న్యూఢిల్లీ: ఇప్పటికే ఎంపీగా అనర్హత వేటు పడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది. ఆయన నివాసముంటున్న ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని లోక్సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు పంపింది. ఏప్రిల్ 22 లోగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని తెలిపింది. ఎంపీగా అనర్హత వేటు పడటంతో ప్రభుత్వ బంగ్లాలో ఉండే అర్హత లేదని పేర్కొంది. కాగా.. దేశంలోని దొంగల ఇంటిపేరు మోదీనే అని ఎందుకు ఉందని 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ అన్నారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పరువునష్టం కేసు పెట్టారు. సూరత్ కోర్టు రాహుల్ను దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం లోక్సభ సెక్రెటేరియట్ రాహుల్పై అనర్హత వేటు వేసి ఎంపీగా తొలగించింది. చదవండి: యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి.. నిరసనకారులపై లాఠీ ఛార్జ్ -
సుప్రీంకోర్టులో కవితకు షాక్.. ఈడీ నోటీసులపై స్టేకు నిరాకరణ..
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని ఆమె కోరారు. తనకు ఇచ్చిన నోటీసులో ఇతరులతో కలిపి విచారిస్తామన్నారని, కానీ అలా చేయలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మొబైల్ సీజ్ చేశారని తెలిపారు. సీఆర్పీసీ 160 సెక్షన్ ప్రకారం మహిళను తన ఇంట్లోనే విచారించాలని, కానీ ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ పిటిషన్పై ఈనెల 24న విచారణ చేపడతామని చెప్పింది. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత గురువారం(మార్చి 16) మరోసారి ఈడీ ఎదుట హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈనెల 11న ఈడీ అధికారులు ఆమెను 9 గంటలపాటు విచారించారు. 16న మళ్లీ విచారణకు హాజరుకావాలన్నారు. ఈనేపథ్యంలోనే ఆమె ఈడీ నోటీసులపై స్టే ఇవ్వాలని సుప్రీంను ఆశ్రయించగా.. నిరాశ ఎదురైంది. మరోవైపు మహిళా రిజర్వేషన్ల కోసం కవిత పోరాటం చేస్తున్నారు. ఢిల్లీలో ఇవాళ విపక్షాల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీకి పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు హజరుకానున్నారు. మహిళా రిజర్వేషన్లు అమలు చేసేవరకు తన పోరాటం ఆగదని కవిత బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. చదవండి: అదానీకి దోచిపెట్టడమే విదేశాంగ విధానమా? మోదీ తొమ్మిదేళ్లుగా దేశాన్ని భ్రమల్లోనే ఉంచుతున్నారు.. -
చిరంజీవికి షాక్.. హైకోర్టు కీలక ఆదేశాలు..!
-
ఈడీ నోటీసులపై స్పందించిన కవిత!
-
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సమన్లు
-
సాత్విక్ ఆత్మహత్య ఎఫెక్ట్: శ్రీ చైతన్య కాలేజీకి షాక్!
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ తరగతి గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. విద్యార్థి ఆత్మహత్యపై తాజాగా ఇంటర్ బోర్డ్ అధికారులు.. శ్రీ చైతన్య కాలేజీ మేనేజ్మెంట్కు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఇంటర్ బోర్డు విచారణ చేపట్టింది. ఇక, విద్యార్థి సాత్విక్ మృతి నేపథ్యంలో డీఈవో ఆధ్వర్యంలో బోర్డు అధికారులు కాలేజీని విజిట్ చేశారు. ఈ ఘటనపై అధికారులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. కాగా, కాలేజీ మేనేజ్మెంట్ ఇచ్చే వివరణపై ఫైనల్ రిపోర్టు సిద్ధం చేసి అధికారులు.. కమిషనర్కు నివేదిక అందజేయనున్నారు. మూడు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కాలేజీకి అధికారులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు, అధికారులు.. విద్యార్థులు, పేరెంట్స్, మిగిలిన లెక్చరర్ల నుంచి కూడా సమాచారం తీసుకుని నివేదిక తయారు చేయనున్నారు. ఇదిలా ఉండగా, నివేదిక అందిన వెంటనే కాలేజీ యాజమాన్యం, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని నవీన్ మిట్టల్ తెలిపారు. -
సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు: వైఎస్ భాస్కర్ రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: విచారణకు రావాలని సీబీఐ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని వైఎస్ భాస్కర్ రెడ్డి తెలిపారు. గతంలో నోటీసు ఇచ్చిన సందర్భంలో ఈ నెల 24 తరువాత అందుబాటులో ఉంటానని సమాచారం ఇచ్చానని, కానీ ఇవాళ సీబీఐ విచారణకు హాజరవుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరయ్యేందుకు తాను సిద్ధమని భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: సీబీఐ దర్యాప్తుపై సందేహాలు: ఎంపీ అవినాశ్రెడ్డి -
మెదక్లో ఖదీర్ ఖాన్ ‘లాకప్డెత్’.. తెలంగాణ సర్కార్కు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మెదక్లో జరిగిన ఖదీర్ ఖాన్ లాకప్డెత్ ఘటనపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర హోం కార్యదర్శి, డీసీపీ, మెదక్ ఎస్పీలకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది. మెదక్ పట్టణానికి చెందిన ఖదీర్ ఖాన్...గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 16వ తేదీ రాత్రి మృతి చెందాడు. దొంగతనం కేసులో అతన్ని పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే మృతి చెందాడంటూ ఆయన భార్య సిద్ధేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటో పిల్గా విచారణకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఏఏజీ రామచంద్రరావు పోలీసుల తరఫున వాదనలు వినిపిస్తూ...ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు ఖదీర్ను హాజరుపరిచిన 14 రోజుల తర్వాత అతను మృతి చెందాడని చెప్పారు. వాదనల తర్వాత ధర్మాసనం..ఖదీర్ భార్య తన భర్తను లాకప్డెత్ చేశారని ఆరోపిస్తోందని, దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సిట్తో విచారణ జరిపించాలి... ఖదీర్ మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని, ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కోరుతూ అతని భార్య సిద్ధేశ్వరి లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తను అత్యంత క్రూరంగా చంపారని, సీసీటీవీ ఫుటేజీ ఫ్రీజ్ చేసేలా ఎస్పీకి ఆదేశాలివ్వాలని న్యాయస్థానానికి ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ విజయ్సేన్రెడ్డి విచారణ చేపట్టారు. స్పెషల్ జీపీ సంతోశ్కుమార్ హాజరై.. సుమోటో పిల్ వివరాలను తెలిపారు. తదుపరి వాదనల కోసం ఈ పిటిషన్ను కూడా పిల్తోపాటే జతచేయాలని రిజిస్ట్రీకి సూచించారు. -
ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు
-
లైసెన్స్ లేకుండా అమ్ముతారా..? అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు నోటీసులు!
మందుల అమ్మకాల్లో నిబంధనల ఉల్లంఘనపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అమెజాన్, ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్ సహా 20 ఆన్లైన్ విక్రయ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2018లో ఢిల్లీ హైకోర్ట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం లైసెన్స్ లేకుండా ఆన్లైన్లో మందుల అమ్మకాలు సాగించకూడదు. ఈ మేరకు డీసీజీఐ 2019లోనే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం-1940 చట్టాన్ని ఉల్లంఘించి లైసెన్స్ లేకుండా మందులు విక్రయిస్తున్నందుకు రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని డీసీజీఐ ఈ-మెయిల్ ద్వారా ఆన్లైన్ విక్రయ సంస్థలను హెచ్చరించింది. దీనిపై ఫ్లిప్కార్ట్ హెల్త్ ప్లస్ సంస్థ స్పందిస్తూ తాము నాణ్యమైన మందులు, ఇతర హెల్త్ కేర్ ఉత్పత్తులను స్వతంత్ర అమ్మకందారుల నుంచి సేకరించి లక్షలాది మంది వినియోగదారులకు తక్కువ ధరకు అందిస్తున్నామని తెలిపారు. డీసీజీఐ నుంచి తమకు నోటీసు అందిందని, దీనికి తగినవిధంగా స్పందిస్తామని వివరించారు. స్థానిక చట్టాలు, నిబంధనలను తాము గౌరవిస్తామని, వాటికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: ఐఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు.. భారీ డిస్కౌంట్!) -
నటికి రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు పంపిన సుఖేష్
ముంబై: మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన సుఖేష్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటి ఛాహత్ ఖన్నాకు రూ.100కోట్ల పరువు నష్టం దావా నోటీసులు పంపాడు. తనపై చేసిన ఆరోపణలకు వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలని, లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధం కావాలని అతని తరఫు న్యాయవాది హెచ్చరించాడు. ఛాహత్ ఖాన్నా చేసిన ఆరోపణల వల్ల సుఖేష్ పరువు పోయిందని, మానసికంగా వేధనకు గురయ్యాడని న్యాయవాది పేర్కొన్నాడు. పలు బాలీవుడ్ సినిమాలతో పాటు, సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఛాహత్ ఖన్నా. ముఖ్యంగా 'బడే అచ్చే లగ్తే హై' సీరియల్తో బాగా పాపులర్ అయ్యింది. అయితే ఈమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుఖేశ్ తనను కూడా మోసం చేసేందుకు ప్రయత్నించాడని, తిహార్ జైల్లో అతడ్ని కలిసినప్పుడు పెళ్లి చేసుకుంటాని ప్రపోజ్ చేశాడని ఆరోపించింది. 'ఢిల్లీలో ఈవెంట్ ఉందని చెప్పి ఏంజెల్ ఖాన్(పింకీ ఇరానీ) అనే మహిళ నన్ను తీసుకెళ్లింది. తీహార్ జైలు రోడ్డు మార్గం నుంచి వెళ్లాలని పేర్కొంది. ఆ తర్వాత జైలు వద్ద ఆపి లోపలికి తీసుకెళ్లింది. అక్కడ సుఖేష్ చంద్రశేఖర్ నన్ను కలిశాడు. బ్రాండెడ్ షర్టు వేసుకొని బాగా సెంటు రాసుకొని మెడలో గోల్డ్ చైన్ ధరించి ఉన్నాడు. తాను ఓ సౌత్ ఇండియా టీవీ ఛానల్ ఓనర్నని, జే జయలలిత మేనల్లుడినని పరిచయం చేసుకున్నాడు. ఈవీఎం ట్యాంపరింగ్ కేసులో ఆరెస్టయ్యానన్నాడు. అసలు నన్ను ఇక్కడకు ఎందుకు పిలిపించారు? ఆరు నెలల బిడ్డను వదిలేసి వచ్చా అని నేను చెప్పా. అప్పుడు అతను నేనంటే ఇష్టం ఇన్నాడు. బడే అచ్చే లగ్తే హై సీరియల్లో నా నటన చూసి ఫ్యాన్ అయ్యానని చెప్పాడు. మోకాలిపై కూర్చొని నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. దీంతో నేను అతనిపై అరిచా. నాకు పెళ్లైంది. ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పా. నా భర్త నాకు సరైనోడు కాదని, తాను ఎంతగానో ప్రేమిస్తున్నాని సుఖేష్ చెప్పాడు. నేను కోపంతో అక్కడి నుంచి వచ్చేశా. ఆ తర్వాత నేను తిహార్ జైలుకు వెళ్లిన వీడియో చూపించి ఒకరు రూ.10లక్షలు ఇవ్వమని బెదిరించారు. దీంతో నేను జైలుకు వెళ్లిన విషయం ఎవరికీ తెలియవద్దని, తన పెళ్లిపై ప్రభావం పడొద్దని ఆ డబ్బు వాళ్లకు ఇచ్చేశా. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. నా భర్త నుంచి విడిపోవాల్సి వచ్చింది. నేను ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది. కానీ ఒకదాని తర్వాత మరొకటి వరుసగా జరుగుతూనే ఉన్నాయి. వాటన్నింటి నుంచి నేను బయటపడాలనుకున్నా.' అని ఛాహత్ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా.. సుకేశ్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కొన్నారు. చదవండి: మైనర్తో బాడీ మసాజ్ చేయించుకున్న క్రికెట్ కోచ్ -
మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: పీజీ మెడికల్ ఫీజులకు సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలంటూ రాష్ట్ర మంత్రి, మమతా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పువ్వాడ అజయ్ కుమార్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 17వ తేదీకి వాయిదా వేసింది. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయవద్దని, ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఎఫ్ఆర్సీ) నిర్ణయించిన మేరకే వసూలు చేయాలని పలు కాలేజీలను ఆదేశిస్తూ ఓ రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు 2022లో ఉత్తర్వులు ఇచ్చింది. ఒకవేళ అధిక ఫీజు వసూలు చేస్తే దాన్ని తిరిగి ఇచ్చేయాలని స్పష్టంచేసింది. అలాగే విద్యార్థుల సర్టిఫికెట్లు కూడా ఇచ్చేయాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను మమతా కాలేజీ యాజమాన్యం పాటించకపోవడంతో వరంగల్కు చెందిన డాక్టర్ నిఖిల్ గుర్రపు కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది సామ సందీప్రెడ్డి వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాలను మమతా కాలేజీ పలు కాలేజీలు కావాలనే పాటించలేదని.. దీంతో విద్యార్థులు అధిక ఫీజు చెల్లించాల్సి వచ్చిందన్నారు. వెంటనే ఆ ఫీజు తిరిగి ఇచ్చేలా కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. మంత్రి పువ్వాడకు నోటీసులు జారీ చేస్తూ, విచారణను వాయిదా వేసింది. చదవండి: సాహితీ ఇన్ఫ్రా పిటిషన్పై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు.. -
పాక్కు భారత్ నోటీసులు.. సింధు జలాల ఒప్పందం మార్చుకుందామా?
సింధునది జలాల(ఇండస్ వాటర్ ట్రిటీ(ఐడబ్య్లూటీ)) విషయమై పాకిస్తాన్కు, భారత్కు మధ్య చాలా ఏళ్లు విభేదాలు ఉన్నాయి. ఐతే ఇప్పుడూ అనూహ్యంగా ఈ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సింధు నది జలాల ఒప్పందం మార్చుకుందాం అంటూ భారత్ పాక్కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు భారత్ సింధు జలాల కమిషనర్ల ద్వారా జనవరి 25న పాక్కు నోటీసులు పంపింది. ఈ నోటీసు ప్రకారం.. పాక్ భారత్ల మధ్య ఈ విషయమై 90 రోజల్లోగా చర్చలు జరగాల్సి ఉంటుంది. అలాగే ఈ 62 ఏళ్లలో నేర్చుకున్న పాఠాల ఆధారంగా ఈ వివాదాన్ని సరైన విధంగా పరిష్కారించుకుని అప్డేట్ చేసుకునేందుకు మార్గం సుగం అవుతుంది. వాస్తవానికి కిషన్ గంగా, రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ల(హెచ్ఈపీ) వివాదాల పరిష్కారంలో పాక్ వ్యవహిరించిన మొండితనం కారణంగానే భారత్ ఈ నోటీసులు ఇచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 2015లో తొలిసారిగా పాక్ భారత్కు చెందిన కిషన్ గంగా, రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టులపై సాంకేతిక అభ్యంతరాలను పరిశీలించేందుకు నిపుణుడిని నియమించాల్సిందిగా కోరింది. ఆ తదనంతరం 2016లో పాక్ తన అభ్యర్థనను ఏకపక్షంగా ఉపసంహరించుకుంది. తన అభ్యంతరాలను మధ్యవర్తిత్వ న్యాయస్థానం ద్వారా నిర్ణయించాలని పాక్ సూచించింది. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించి... ఈ వ్యవహారాన్ని తటస్థ నిపుణుడికి అప్పగించాలని ప్రపంచ బ్యాంకును కోరింది. 2016లో ప్రపంచ బ్యాంకు స్పందిస్తూ.. ఇరు దేశాల అభ్యర్థనను నిలిపివేసింది. ఈ విషయంలో శాంతియుత పరిష్కారాన్ని కనుగొనాల్సిందిగా ఇరు దేశాలను సూచించింది. ఐతే పాక్ ఒత్తిడి మేరకు ప్రపంచ బ్యాంకు తటస్థ నిపుణుడితో పాటు మద్యవర్తిత్వ కోర్టు ప్రకియ రెండింటిని ప్రారంభించింది. దీంతో భారత్ స్పందించి. .ఒకే విషయంపై రెండు చర్యలు తీసుకోవడం అంటే.. సిందు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడం కిందకే వస్తుందని ఆరోపణలు చేసింది. 2017 నుంచి 2022 వరకు ఈ విషయమై పరిష్కారం కోసం భారత్ నిరంతరం ప్రయత్నించినప్పటికీ..ఈ విషయాన్ని చర్చించేందుకు పాక్ నిరాకరించింది. తరుచుగా ఒప్పంద నియమాలకు పాక్ ఆటంకం కలిగించింది. అందువల్లే భారత్ బలవంతంగా పాక్కు ఈ నోటీసులు జారీ చేసిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం ఎప్పుడూ ఏర్పడిందంటే... వాస్తవానికి భారత్ పాక్ల మధ్య 1960 సెప్టెంబర్ 19న సింధు జలాల ఒప్పందం(ఇండస్ వాటర్ ట్రిటీ(ఐడబ్ల్యూటీ) జరిగింది. ఈ ఒప్పందంపై భారత్ మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రు, పాక్ మాజీ ప్రధాని అయాబ్ ఖాన్ ఇద్దరూ సంతకాలు చేశారు. ఆ తర్వాత కొన్నేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం.. ప్రపంచ బ్యాంకు సహకారంతో ఇరుదేశాలకు జలాల పంపకాలు జరిగాయి. ఈ సింధు జలాల ఒప్పందంలో భాగంగా భారత్కు సట్లైజ్, బియాస్, రావి నదులు, పాక్కు జీలం, చినాబ్, సింధు నదులు దక్కాయి. (చదవండి: రాహల్ జోడో యాత్రకు సడెన్ బ్రేక్! కేవలం కిలోమీటర్ తర్వాతే..) -
Odisha College: ‘ఆ రోజులోపు బాయ్ఫ్రెండ్ ఉండాల్సిందే’
పారాదీప్(ఒడిశా): ‘కళాశాలలో చదివే ప్రతి ఒక్క అమ్మాయి ప్రేమికుల దినోత్సవం రోజుకల్లా బాయ్ఫ్రెండ్తో కనిపించాలి. లేదంటే కాలేజీలోకి అనుమతించబోము’ అంటూ ఒడిశాలో ఒక కాలేజీ తరఫున అధికారికంగా వెలువడిందని చెబుతున్న నోటీసు ఒకటి సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతోంది. దీనిని సీరియస్గా తీసుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదుచేసి తప్పుడు నోటీస్ తయారుచేసిన నిందితుల కోసం వెతికే పనిలో పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లాలోని ఎస్వీఎం అటానమస్ కాలేజీ ప్రిన్సిపల్ పేరిట ఒక నకిలీ నోటీసు వెలువడింది. కాలేజీపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో బిజయ్ కుమార్ వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశారు. సంతకాన్ని దుర్వినియోగం చేశారని, అది నకిలీ నోటీసు అని కాలేజీ పరువు తీసేందుకు కావాలనే ఎవరో కుట్ర పన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
వారిసు, తునివు థియేటర్ యాజమాన్యాలకు నోటీసులు
తమిళ స్టార్ హీరోలు విజయ్, అజిత్ చిత్రాల విడుదల చేసిన థియేటర్ల యాజమాన్యానికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విజయ్ నటించిన వారిసు, అజిత్ తుణివు చిత్రాలు పొంగల్ సందర్భంగా ఈ నెల 11వ తేదీన భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాలు విడుదలకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది. ముఖ్యంగా 11, 12వ తేదీల్లో మాత్రమే ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది. చదవండి: వారి వల్లే అనసూయ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిందా? అదేవిధంగా థియేటర్ల ముందు భారీ కటౌట్లు ఏర్పాటు చేయరాదని, వాటికి పూజలు, పాలాభిషేకాలు వంటివి నిర్వహించరాదని, సినిమా టికెట్లను అధిక రేట్లకు విక్రయించకూడదని నిబంధనలు విధించింది. అయితే ఈ రెండు చిత్రాలను ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ థియేటర్ యాజమాన్యం ఈనెల 17వ తేదీ వరకు ప్రత్యేక ఆటలను ప్రదర్శించారు. అంతేకాదు టికెట్లను బ్లాక్లో రూ.1000, రూ.2000 వరకు విక్రయించినట్లు ప్రచారం జరిగింది. ఇకపోతే థియేటర్ల ముందు అభిమానులు రచ్చ రచ్చ చేశారు. చదవండి: అల్లు అర్జున్కు దుబాయ్ ప్రభుత్వం అరుదైన గౌరవం కాగా నటుడు విజయ్ నటించిన వారిసు చిత్రం ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లోనే రూ. 210 కోట్లు వసూలు చేసినట్లు, అజిత్ నటించిన తుణివు రూ.150 కోట్లకుపైగా వసూలు చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కాగా ఇలాంటి అన్ని విషయాలపై వివరణ కోరుతూ ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. వారు సరైన వివరణ ఇవ్వకుంటే 1957లోని ప్రభుత్వం చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. -
రోహిత్ రెడ్డికి మరోసారి ఈడీ నోటీసులు
-
సునీల్ కనుగోలుకు నోటీసులు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. తెలంగాణ గళం పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన మీమ్స్ వీడియోల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు సిటీ సైబర్క్రైమ్ పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ 41 (ఏ) కింద ఇచ్చిన నోటీసుల్లో శుక్రవారం విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు. ఈ నోటీసులను సునీల్ తరఫున కాంగ్రెస్ నేత మల్లు రవి అందుకుని సంతకం చేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎం.శ్రీప్రతాప్, టి.శశాంక్, ఇషాంత్ శర్మ ఆదివారం విచారణకు హాజరుకావాల్సి ఉండగా పది రోజుల సమయం కోరడంతో పోలీసులు అనుమతించారు. తుకారాంగేట్ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఆర్.సామ్రాట్ ఫిర్యాదుతో గత నవంబర్ 24న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. దీని దర్యాప్తులో లభించిన క్లూ ఆధారంగా పోలీసులు ఈ నెల 13న రాత్రి మాదాపూర్లోని మైండ్షేర్ యునైటెడ్ ఫౌండేషన్లో ఉన్న కార్యాలయంపై దాడి చేశారు. అప్పుడే ఇది కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్గా తెలిసింది. అక్కడ పట్టుబడిన ముగ్గురి విచారణలో సునీల్ కనుగోలు పేరు వెలుగులోకి వచ్చింది. విచారణకు రాకపోతే అరెస్టు సçహా ఇతర చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు. -
మార్గదర్శిలో అవకతవకలను ఎత్తిచూపుతూ నోటీసులు జారీ
-
రోహిత్రెడ్డి ఈడీ విచారణలో కొత్త ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి – ఈడీ కేసులో కొత్త ట్విస్ట్. ఎమ్మెల్యేలకు ఎర కేసులోనే తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించిందని రోహిత్రెడ్డి చెప్పిన 24 గంటల్లోనే ఈడీ అధికారులు ‘7 హిల్స్ మాణిక్చంద్’ పాన్ మసాలా యజమాని అభిషేక్ ఆవాలకు నోటీసులు జారీచేశారు. గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్గోయల్ స్పష్టం చేశారు. 2015 నుంచి అన్ని బ్యాంకు ఖాతాల స్టేట్మెంట్లు, ఏయే సంస్థల్లో డైరెక్టర్గా ఉన్నారు, కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న స్థిర, చరాస్తుల వివరాలను తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు నందుకుమార్ తనను రూ.1.75 కోట్ల మేరకు మోసం చేశారంటూ బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో అభిషేక్ ఈనెల రెండోవారంలో ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. అభిషేక్, రోహిత్రెడ్డి సోదరుడి మధ్య రూ.7.75 కోట్ల మేరకు లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ లావాదేవీలు ఏ సందర్భంగా జరిగాయి? ఏ వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు? రోహిత్రెడ్డితో ఉన్న సంబంధాలపై పూర్తిస్థాయిలో కూపీ లాగేందుకు అభిషేక్కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. రెండురోజులపాటు ఈడీ విచారణను ఎదుర్కొన్న రోహిత్రెడ్డి తనను ఎమ్మెల్యేల ఎర కేసులోనే విచారించారని, ఈ కేసులో తాను ఫిర్యాదుదారుడిగా ఉన్నా.. దోషులను వదిలిపెట్టి తనను విచారణకు పిలవడం ఏమిటో అర్థం కావడం లేదని మీడియాతో వాపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈడీ అధికారులు మాత్రం ‘7 హిల్స్ మాణిక్చంద్’ పాన్ మసాలాకు సంబంధించిన లావాదేవీలపై రోహిత్రెడ్డిని ఎక్కువగా ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పాన్మసాలా కేసులోనే రోహిత్రెడ్డిని విచారించినట్లు స్పష్టమవుతోంది. 2015లోనే సొంత బ్రాండ్పై... మాణిక్చంద్ గుట్కాకు హైదరాబాద్ కేంద్రంగా ప్రధాన పంపిణీదారుగా ఉన్న అభిషేక్ ఆవాల 2015లో సొంత బ్రాండ్తో పాన్ మసాలా తయారీని ప్రారంభించారు. బీబీనగర్ సమీపంలోని నేమర గోముల గ్రామంలో ఓ యూనిట్ స్థాపించి ‘7 హిల్స్ మాణిక్చంద్’ పేరుతో పాన్ మసాల, జర్దా తదితరాలను ఉత్పత్తి చేసి విక్రయించడం మొదలెట్టాడు. ఆపై గుజరాత్ నుంచి గుట్కా తెచ్చి అక్రమంగా అమ్మకాలు సాగించినట్లు సమాచారం. ఆ దందాలో ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందుకుమార్ కూడా కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. అభిషేక్, నందుకుమార్ సంయుక్తంగా వే ఇండియా టుబాకో ప్రైవేట్ లిమిటెడ్, 7 హిల్స్ మాణిక్చంద్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, 7 హిల్స్ మార్కెటర్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, డబ్ల్యూ3 హాస్పిటాలిటీస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు డైరెక్టర్లుగా ఉన్నారు. డబ్ల్యూ3 సంస్థలో రాజేశ్వర్రావు కల్వకుంట్ల కూడా ఓ డైరెక్టర్గా ఉన్నారు. ఈ సంస్థను ముగ్గురూ కలిసి 2015 నవంబర్ 6న ఏర్పాటు చేశారు. ‘7 హిల్స్ మాణిక్చంద్ పాన్ మసాలా’ ఉత్పత్తులకు సంబ«ంధించిన ఫ్రాంచైజీలు, డిస్ట్రిబ్యూషన్స్, సీ అండ్ ఎఫ్ ఏజెన్సీలు ఇస్తానంటూ అభిõÙక్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఒడిశా, పశి్చమబెంగాల్లోని అనేక మందిని మోసం చేశారన్న అభియోగాలున్నాయి. ఈ వ్యవహారాల్లోనూ నందుకుమార్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయ్యప్ప దీక్షను విరమించిన రోహిత్రెడ్డి తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అర్ధాంతరంగా అయ్యప్ప దీక్ష విరమించారు. ఆయన అన్న కుమారుడు శశాంక్రెడ్డి మంగళవారం అర్ధరాత్రి బషీరాబాద్ మండలం ఇందర్చెడ్ గ్రామంలో మృతిచెందారు. దీంతో అయ్యప్ప దీక్షలో కొనసాగడం మంచిది కాదని, విరమించినట్లు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: 'ఫోన్ 10 సార్లు ఎందుకు మార్చారు కవిత? వాళ్ల ఇంటికి ఎందుకెళ్లారు?' -
దినసరి కూలీకి దిమ్మతిరిగే షాక్! ఏకంగా రూ. 14 కోట్లు చెల్లించమన్న ఐటీ శాఖ
దినసరి కూలీకి ఆదాయపు పన్ను శాఖ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఏకంగా రూ. 14 కోట్లు ట్యాక్స్ చెల్లించాలంటూ ఆ కూలీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఐతే నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులు సైతం అతడి పరిస్థితిని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ ఘటన బిహార్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...బిహార్లోని రోహ్తాస్ జిల్లాలోని యాదవ్ అనే దినసరి కూలీకి ఆదాయపు పన్ను శాఖ ఏకంగా రూ. 14 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న అతడి కుటుంబం ఒక్కసారిగా షాక్కి గురయ్యింది. తాను దినసరి కూలీనని, తన ఆస్తి మొత్తాన్ని పలుమార్లు విక్రయించిన కూడా అంత మొత్తం చెల్లించలేనని అధికారులకు తెలియజేశాడు. యాదవ్కి నోటీసులు జారీ చేసేందుకు వచ్చిన అధికారులు సైతం అతడి స్థితిని చూసి ఆశ్చర్యపోయారు. ఐతే యాదవ్ గతంలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్లలో వివిధ ప్రదేశాల్లో ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసినట్లు అధికారులకు తెలిపాడు. ఆ తర్వాత 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా బిహార్లోని తన ఇంటికి తిరిగి వచ్చేసినట్లు తెలిపాడు. ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో అక్కడ అధికారులు తన ఆధార్, పాన్కార్డుల కాపీలను తీసుకున్నట్లు వెల్లడించాడు. బహుశా వారే ఆదాయపు పన్ను నుంచి తప్పించుకునేందుకు ఇలా తన పేరిట నకిలీ బ్యాంకు ఖాతాలు తెరిచి లావాదేవీలు జరిపి ఉండవచ్చని ఐటీ అధికారులకు వివరించాడు. ఆ దినసరి కూలీ యదవ్కి ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కార్యాలయం నుంచే నేరుగా నోటీసులు పంపినట్లు ఐటీ అధికారి సత్యభూషణ్ ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా, యాదవ్ సోమవారం తన ఇంటికి తాళం వేసి కుటుంబంతో ఎక్కడికో వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. (చదవండి: షాకింగ్ ఘటన:రెస్టారెంట్లోకి దూసుకొచ్చిన టెంపో..ముగ్గురికి గాయాలు) -
స్కూల్ విద్యార్థినిపై యాసిడ్ దాడి ఘటన.. ఫ్లిప్కార్ట్, అమెజాన్కు నోటీసులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్కూల్ విద్యార్థినిపై బుధవారం జరిగిన యాసిడ్ దాడి ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇద్దరు యువకులు బైక్పై వెళ్లి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థినిపై యాసిడ్ చల్లారు. అయితే ఈ ఘటనతో ప్రమాదకరమైన యాసిడ్ అందరికీ ఎంత సులభంగా దొరుకుతుందో మరోసారి బహిర్గతమైంది. యాసిడ్ విక్రయాలపై సుప్రీంకోర్టు నిషేధం విధించినప్పటికీ అది మార్కెట్లో లభిస్తోంది. ఇప్పుడు ఢిల్లీ విద్యార్థినిపై దాడి చేసిన నిందితులు యాసిడ్ను ఆన్లైన్లో కొనుగోలు చేశారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టి ఇంటికి తెప్పించుకున్నారు. దీంతో ఇంత సులభంగా యాసిడ్ ఎలా దొరుకుతుందని ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్కు ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ సంస్థలు దీనిపై ఇంకా స్పందించాల్సి ఉంది. ఢిల్లీ విద్యార్థినిపై యాసిడ్ దాడి ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు 12 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. బైక్పై వచ్చి దాడి చేసిన సచిన్ అరోరా, హర్షిత్ అగర్వాల్తో పాటు వీరికి సాయం చేసిన వీరేందర్ సింగ్ను అరెస్టు చేశారు. మహిళలపై యాసిడ్ దాడులు పెరిగిన కారణంగా 2013లో వీటి విక్రయాలపై నిషేధం విధించింది సుప్రీంకోర్టు. లైసెన్స్ ఉన్న షాపు ఓనర్లే యాసిడ్ను విక్రయించాలని, వాటిని కోనుగోలు చేసే వారి వివరాలు సేకరించాలని నిబంధనలు తీసుకొచ్చింది. కానీ ఇప్పటికీ మార్కెట్లో కూరగాయలు కొన్నంత ఈజీగా యాసిడ్ను కొనుగోలు చేస్తున్నారు. చదవండి: బైకర్ మెడకు చుట్టుకున్న తాడు.. అమాంతం గాల్లో ఎగిరి.. -
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో భారీ స్కామ్.. వారందరికీ ఈడీ నోటీసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 2014-19 మద్య కాలంలో భారీగా అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. జర్మనీకి చెందిన సీమెన్స్ సంస్థతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చంద్రబాబు హయాంలో రూ.3,350 కోట్ల ప్రాజెక్టు ఒప్పందం చేసుకుంది. అందులో 10 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.370 కోట్లు. ఇందులో నుంచి రూ.241 కోట్లు దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. స్కిల్డెవలప్మెంట్లో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో ఈ మేరకు నిర్ధారణ అయింది. దీంతో స్కాంలో నిందితులుగా ఉన్న 26 మందికి ఈడీ నోటీసులు ఇచ్చింది. పలు షెల్ కంపెనీల ద్వారా నిధులను దారి మళ్లించినట్లు గుర్తించారు. ఈ కేసులో మాజీ ఛైర్మన్ గంటా సుబ్బారావు, మాజీ డైరెక్టర్ లక్ష్మినారాయణ, ఓఎస్డీ కృష్ణప్రసాద్లకు నోటీసులు ఇచ్చారు. సోమవారం రోజున హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ ఆదేశించింది. చదవండి: (Hyderabad: రేవ్పార్టీ భగ్నం.. పట్టుబడిన 33 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు) -
సీబీఐ నోటీసులకు ఎమ్మెల్సీ కవిత స్పందన
-
భద్రాద్రి కొత్తగూడెం ఏర్రబోడులోని గొత్తికోయలకు అటవీ అధికారుల నోటీసులు
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సిట్ నోటీసులు
-
బీఎల్ సంతోష్కు మరోసారి నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్కు 41–ఏ సీఆర్పీసీ కింద ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రెండోసారి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. సోమవారం ఉదయం బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరు కావాల్సిందిగా తొలిసారి జారీ చేసిన నోటీసులో సిట్ పేర్కొంది. కానీ సంతోష్ గైర్హాజరయ్యారు. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. నోటీసులు అందిన తర్వాత విచారణకు హాజరుకాకపోతే 41–ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని విచారణాధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ బి.గంగాధర్ తొలి నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆ నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సంతోష్ను అరెస్టు చేయవద్దని సిట్ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సిట్ ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. అయితే సంతోష్కు నోటీసులు అందించేందుకు ఢిల్లీ పోలీసులు సహకరించక పోవడంతో, ఢిల్లీ పోలీసు కమిషనర్కు నోటీసులు అందించాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో.. సిట్ ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. తుషార్, జగ్గుస్వామిలను అరెస్టు చేస్తారా? సంతోష్తో పాటు కరీంనగర్కు చెందిన న్యాయవాది శ్రీనివాస్, కేరళ బీడీజేఎస్ అధినేత తుషార్ వెల్లాపల్లి, ప్రధాన నిందితుడు రామచంద్రభారతి.. తుషార్కు మధ్యవర్తిత్వం వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్న కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలకూ సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే శ్రీనివాస్ మినహా మిగిలిన ముగ్గురూ విచారణకు హాజరుకాలేదు. దీంతో నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం తుషార్, జగ్గుస్వామిలను అరెస్టు చేయాలా? బీఎల్ సంతోష్కు మాదిరిగానే వారికి కూడా మరోసారి నోటీసులు జారీ చేయాలా? అనే అంశంపై న్యాయ నిపుణులతో సిట్ అధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. మరోసారి కస్టడీపై నేడు విచారణ ఈ కేసుకు సంబంధించి రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తర్వాత రెండురోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయితే నిందితుల నుంచి సంతృప్తికర సమాధానాలు రాలేదని, మరోసారి వారం రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ప్రస్తుతం ముగ్గురు నిందితులు చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సిట్కు స్వేచ్ఛ: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం స్పష్టీకరణ -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్కు సిట్ నోటీసులు
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం
-
ఎలాన్ మస్క్ భారీ షాక్.. మరోసారి వేల మంది ట్విటర్ ఉద్యోగుల తొలగింపు
మల్టీమిలియనీర్, ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ ఉద్యోగులకు మరోసారి భారీ షాక్ ఇవ్వనున్నారు. గత వారంలో ట్విటర్లో పనిచేసే మొత్తం ఉద్యోగుల్లో 50 శాతం అంటే సుమారు 3500 మందిపై వేటు వేశారు. అయితే ఈ వారం ముగిసేలోపే భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్లాట్ ఫార్మర్ కేసీ న్యూటన్ రిపోర్ట్ ప్రకారం..నవంబర్ 11న (శనివారం) ఎలాన్ మస్క్ ట్విటర్లో పనిచేసే సుమారు 5,500 మందిలో 4,400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఫైర్ చేసినట్లు తెలిపారు. ఒక వేళ సంస్థ తమని తొలగించిందని ఉద్యోగులు తెలుసుకోవాలంటే ఎలా? అన్న ప్రశ్నకు బదులిచ్చిన కేసీ న్యూటన్..ఫైర్ చేసిన సిబ్బందికి సంస్థతో ఉన్న అన్నీ రకాల కమ్యూనికేషన్లు నిలిచిపోతాయని అన్నారు. ఇక తాజాగా తొలగించిన ఉద్యోగులు యూఎస్తో పాటు ఇతర దేశాలకు చెందిన కంటెంట్ మోడరేషన్, రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, ఇంజినీరింగ్తో పాటు ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులని పేర్కొన్నారు. మేనేజర్లకే తెలియదు ఇక ట్విటర్, లేదంటే మస్క్ తొలగించిన ఉద్యోగుల్ని మేనేజర్లు గుర్తించడం కష్టమేనని. ఒక్కసారి ఉద్యోగుల్ని తొలగిస్తే వారికి, మేనేజర్ల మధ్య ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోతుందని కేసీ న్యూటన్ ట్విటర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపుపై ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. సమాచారం అందింది మస్క్ ఫైర్ చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే టెర్మినేషన్ మెయిల్ వచ్చినట్లు సమాచారం. ప్రాధాన్యత, ఖర్చు తగ్గింపు కారణాలతో తొలగించినట్లు, వేటు వేసిన ఉద్యోగుల లాస్ట్ వర్కింగ్ డే ఇవాళేనని (నవంబర్ 14) తెలుస్తోంది. చదవండి👉 8 డాలర్ల కోసం ఎలాన్ మస్క్ కక్కుర్తి.. దిగ్గజ సంస్థకు 1.20 లక్షల కోట్లు నష్టం! -
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఈసీ నోటీసు
-
యూనివర్సిటీలో యువతి నృత్యం వివాదాస్పదం... పాక్ స్ట్రాంగ్ వార్నింగ్
ఒక ప్రైవేట్ యునివర్సిటీ కార్యక్రమంలో యువతీ చేసిన నృత్యం వివాదాస్పదమైంది. దీంతో సదరు యూనివర్సిటీకి నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ ఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. పాక్లో పెషావర్లోని ఎన్ఎస్ యూనివర్సిటీలో హునార్ మేళ ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆ వేడుకల్లో దాదాపు 13 కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగానే ఒక యువతి డ్యాన్స్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఇలాంటి కార్యక్రమాలకు దేశానికి అవసరమా అంటూ మండిపడతూ ట్వీట్ చేశారు. సర్వత్రా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాక్ ఖైబర్ మెడికల్ యూనివర్సిటీ(కేఎంయూ) ఈ విషయమై సీరియస్ అయ్యి నోటీసులు జారీ చేసింది. ఆ వీడియోలో సదరు యువతి బిగుతుగా ఉండే డ్రస్ వేసుకుని వేదికపై డ్యాన్స్లు చేయడం వల్లే వివాదాస్పదంగా మారింది. ఈ మేరకు ఖైబర్ మెడికల్ యూనిర్సిటీ ఇలాంటి కార్యక్రమాలు చాలా అనేతికం, అసాంఘీకం అంటూ మండిపడుతూ చివాట్లు పెట్టింది. అంతేగాదు ఈ విషయమై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా సదరు యూనివర్సిటి ఎన్ఎస్సీ డైరెక్టర్కి నోటీసులు జారీ చేసింది. లేనిపక్షంలో క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇలాంటి కార్యక్రమాలను కేఎంయూ లోగో పేరుతో కార్యక్రమాలు నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యాసంస్థలు నైతిక విలువలతో కూడిన ప్రమాణాలు పాటిస్తూ పవిత్రతను కాపాడుకోవాలని మందలించింది. అవసరమనుకుంటే సదరు ప్రైవేట్ యూనివర్సిటీ గుర్తింపును సైతం రద్దు చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. pic.twitter.com/FhjROmiJbW — Sami (@Pediatric__OT) October 20, 2022 Pakistan: Khyber Medical University issues notice to NCS University System, Peshawar, warns of de-affiliation after this dance video from NCS goes viral 🤩 pic.twitter.com/MYd5P57gyN — Sonam Mahajan (@AsYouNotWish) October 21, 2022 (చదవండి: చైనా కమ్యునిస్ట్ పార్టీ ముగింపు వేడుకలో అనూహ్య ఘటన...హఠాత్తుగా నిష్క్రమించిన జుంటావో) -
రూ. 9 లక్షల లోన్ కట్టాలని బ్యాంక్ నోటీస్.. గంటల్లోనే అదృష్టం తలుపు తట్టింది
తిరువనంతపురం: అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. అదృష్టం కలిసొచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతుంటారు. కేరళలో ఓ వ్యక్తికి ఇలాగే జరిగింది. అయితే అతనికి కష్టం, అదృష్టం ఒకేసారి వచ్చి ఉక్కిరిబిక్కిరి చేశాయి. అప్పుల్లో కూరుకుపోయి బాధపడుతున్న అతడ్ని అదృష్టం వరించి లక్షాధికారిని చేసింది. వివరాలు.. కొల్లాం జిల్లా మినగపల్లికి చెందిన ఓ మత్స్యకారుడికి భార్య, పిల్లలు ఉన్నారు. అవసరాల నిమిత్తం ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 9 లక్షలు లోన్ తీసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల అది తీర్చలేకపోయాడు. అక్టోబర్ 12న చేపలు పట్టుకునేందుకు వెళ్తుండగా ప్రభుత్వానికి చెందిన అక్షయ లాటరీ రూ.70 లక్షల విలువైన టికెట్ కొనుగోలు చేశాడు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చే సరికి అతనికి బ్యాంక్ నుంచి నోటీస్ వచ్చింది. ఇంటిని తాకట్టు పెట్టి తీసుకున్న లోన్ డబ్బులు రూ.9 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు పంపించింది. లేకుంటే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని అందులో పేర్కొంది. బ్యాంక్ నోటీసులు చూసిన మత్స్యకారుడు తీవ్ర కుంగుబాటుకి లోనయ్యాడు. ఏం చేయాలో.. లోన్ డబ్బులు ఎలా కట్టాలో తెలియక తల పట్టుకున్నాడు. చివరికి ఇంటిని అమ్మి అయినా లోన్ కట్టాలని నిర్ణయించుకున్నాడు. చదవండి: లేడీ రజనీకాంత్.. సూపర్ టాలెంట్.. ‘వైరస్’ను గుర్తు చేసింది! అంతలోనే ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లువిరిశాయి. నోటీసులు అందుకున్న కొన్ని గంటల్లోనే అక్షయ లాటరీ టికెట్ దక్కినట్లు కాల్ వచ్చింది. రూ. 70 లక్షల విలువైన మొదటి బహుమతి గెలుచుకున్నట్లు చెప్పారు. దీంతో పీకల్లోతు అప్పుల్లో ఉన్న మత్య్సకారుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. లాటరీ డబ్బుల గురించి మాట్లాడుతూ.. ముందుగా ఇంటి లోన్ను తీర్చనున్నట్లు తెలిపారు. అలాగే తమ పిల్లలకు మంచి చదువులు అందించి వారిని గొప్ప స్థాయిలో నిలబెట్టాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: వాట్సాప్లో మహిళా పోలీసులకు ప్రైవేటు ఫోటోలు.. చిక్కుల్లో డీఎస్పీ