Oath ceremony
-
Delhi: కొత్త సీఎం రేఖా గుప్తా కుమారుని వీడియో వైరల్
న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన సీఎంగా రేఖా గుప్తా(Rekha Gupta) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్గా మారాయి. తాజాగా ఆమె కుమారుడు నికుంజ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఒక మహిళకు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించడం ఆనందించాల్సిన విషయం. #WATCH | Delhi CM-designate Rekha Gupta's son, Nikunj says, "It is good that a woman has been given the opportunity to be the CM. We are confident that she will be able to shoulder her responsibility very well. Her 30-year-long hard work has proved to be successful. She has… pic.twitter.com/UXesCIMM8g— ANI (@ANI) February 20, 2025 ఆమె ఈ బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించగలదని నేను నమ్ముతున్నాను. ఆమె 30 ఏళ్ల కష్టానికి తగిన ఫలితం లభించింది. ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. ఆమెకు ఈ అవకాశం కల్పించిన ప్రధానమంత్రి మోదీ(Prime Minister Modi)కి, పార్టీకి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. రేఖా గుప్తా అత్త మీరా గుప్తా తన కోడలికి అభినందనలు తెలిపారు. #WATCH | Delhi CM-designate Rekha Gupta's mother-in-law Meera Gupta says, "...Work well."When asked if she sends her best wishes to the CM-designate, she says, "Yes, certainly..." pic.twitter.com/vTaT3RWgZq— ANI (@ANI) February 20, 2025 ఇది కూడా చదవండి: Delhi: రేఖా గుప్తా క్యాబినెట్ మంత్రులలో ఎవరి విద్యార్హతలేమిటి? -
ఢిల్లీ సీఎం ప్రమాణానికి కేజ్రీవాల్కు ఆహ్వానం?
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ జోరుగా సన్నాహాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత కేజ్రీవాల్ను సీఎం ప్రమాణ స్వీకార మహోత్సవానికి పిలుస్తారా లేదా అనే ప్రశ్న చాలామంది మదిలో మెదులుతోంది. ఇప్పుడు దీనికి సమాధానం దొరికింది. బీజేపీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను, మరో మాజీ ముఖ్యమంత్రి ఆతిశీని ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నారు.నూతన సీఎం ప్రమాణస్వీకారోత్సవానికి ఢిల్లీలోని లక్షమంది చోటామోటా నేతలను బీజేపీ ఆహ్వానించనుందని తెలుస్తోంది. అయితే కొత్త సీఎం ఎవరనేది బీజేపీ అధిష్టానం ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ ప్రమాణస్వీకారానికి సన్నాహాలు ముమ్మరమయ్యాయి. బీజేపీ నేతలు వినోద్ తావ్డే, తరుణ్ చుగ్, వీరేంద్ర సచ్దేవ్ తదితరులు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు.ఫిబ్రవరి 19న జరగబోయే బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఢిల్లీ సీఎంగా ఎవరిని ఎంపిక చేయనున్నారనేది వెల్లడికానుంది. తొలుత ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 19న నిర్వహించాలని బీజేపీ అధిష్టానం భావించింది. తరువాత ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 20న నిర్వహించాలని నిశ్చయించారు. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పేరుపై తుది నిర్ణయం తీసుకునేందుకు బీజేపీ కేంద్ర పరిశీలకులను నియమించనున్నదని సమాచారం. ఈ పరిశీలకులు ఢిల్లీ అసెంబ్లీ ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తారు. వీటి ఆధారంగా పార్టీ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటిస్తుంది. కాగా ముఖ్యమంత్రి రేసులో న్యూఢిల్లీ ఎమ్మెల్యే ప్రవేశ్ వర్మ, ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా, రేఖ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ పేర్లు ముందు వరుసలో ఉన్నాయని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ప్రపంచంలో 10 పేద దేశాలు: కనిపించని బంగ్లా, పాక్ -
Trump oath ceremony: ‘అమెరికా ది బ్యూటీఫుల్’ గాయని ఘనత ఇదే
అమెరికా 47వ అధ్యక్షునిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగేళ్ల తర్వాత డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో గాయని, పాటల రచయిత్రి క్యారీ అండర్వుడ్ ‘అమెరికా ది బ్యూటిఫుల్’ ను ప్రదర్శించారు. ఈ నేపధ్యంలో క్యారీ అండర్వుడ్ గురించి తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.క్యారీ అండర్వుడ్.. అమెరికన్ గాయని, నటి, రచయిత. ఆమె 1983 మార్చి 10న ఒక్లహోమాలోని పిల్ల్స్బోరోలో జన్మించారు. ఆమె సంగీత ప్రస్థానం 2005లో ‘అమెరికన్ ఐడల్’ రియాలిటీ షోలో విజేతగా నిలిచిన అనంతరం ప్రారంభమైంది. క్యారీ అండర్వుడ్ అద్భుతమైన గాయనిగా పేరొందారు. దీనికి తోడు ఆమె పలువురి అభినందనలను అందుకున్నారు. సంగీతం పరంగా ఆమె పలు రికార్డులను సృష్టించారు.క్యారీ ఇప్పటివరకూ ఏడు ఆల్బమ్స్ విడుదల చేశారు. అందులో మొదటిది ‘Some Hearts’. ఇది 2005లో విడుదలకాగా, ఎనిమిది మిలియన్లకు మించిన కాపీలు విక్రయమయ్యాయి. ఆమె మొదటి నాలుగు సింగిల్స్ హిట్ కావడంతో ఆమె మరింత గుర్తింపును పొందారు. క్యారీ అండర్వుడ్.. తన కంట్రీ మ్యూజిక్లో అత్యంత ప్రభావవంతమైన రెండవ వ్యక్తిగా నిలిచారు.అమెరికా పాటగా గుర్తింపుగా నిలిచిన ‘అమెరికా ది బ్యూటిఫుల్’కు ఆమె ప్రదర్శన తోడవడంతో ఆ పాటకు మరింత ప్రధాన్యత ఏర్పడిందంటారు. ఈ పాటు దేశభక్తి, నేషనలిజం, సమానత్వం తదితర అంశాలను ప్రతిబింబిస్తుంది. ఈ ప్రదర్శన 2021లో జరిగిన బైడెన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలోనూ ప్రదర్శితమయ్యింది. క్యారీ అండర్వుడ్ వ్యక్తిగత జీవితం కూడా చర్చల్లో నిలిచింది. ఆమె మైక్ ఫిషర్ అనే హాకీ క్రీడాకారుడిని 2010లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు సంతానం. అమెరికా ది బ్యూటిఫుల్ ప్రదర్శనలో క్యారీ అండర్వుడ్ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. అండర్వుడ్ పలువురు యువ కళాకారులకు, అభిమానులకు స్ఫూర్తినిస్తున్నారు. ఇది కూడా చదవండి: Kumbh Mela: కుంభమేళాకు వెళితే వీటిని తప్పక చూడండి -
ఇక స్వర్ణయుగం.. అన్నింటా ‘అమెరికాయే ఫస్ట్’: ట్రంప్
వాషింగ్టన్: అమెరికాకు తిరిగి స్వర్ణయుగాన్ని తీసుకొస్తానని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ జె.ట్రంప్ ప్రకటించారు. దేశ 47వ అధ్యక్షునిగా సోమవారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఆ వెంటనే జాతినుద్దేశించి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. నాలుగేళ్ల డెమొక్రాట్ల పాలనలో అమెరికాకు అన్ని రంగాల్లోనూ తీరని ద్రోహం జరిగిందని ఆక్షేపించారు. దాన్ని సమూలంగా సరిదిద్దేలా ప్రజలు ఎన్నికల్లో తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారన్నారు. ‘‘అమెరికా పతనానికి ఈ క్షణమే అడ్డుకట్ట పడింది. స్వర్ణయుగం మొదలైంది. ఈ జనవరి 20 అమెరికా పాలిట విముక్తి దినం. భవిష్యత్తంతా ఇక మనదే. మన దేశం నేటినుంచి అన్నిరంగాల్లోనూ అద్భుతంగా రాణిస్తుంది. భూమిపైనే అత్యంత శక్తిమంతమైన, గౌరవప్రదమైన దేశంగా ప్రపంచమంతటా మన్ననలు పొందుతుంది. ప్రతి దేశమూ అబ్బురపడేలా, అసూయ చెందేలా, అభినందించేలా అభివృద్ధి చెందుతుంది. అన్ని విషయాల్లోనూ ‘అమెరికా ఫస్ట్’ అన్నదే మన నినాదం. అదే మన మూలమంత్రం’’ అని 78 ఏళ్ల ట్రంప్ ప్రకటించారు. ‘‘మీ నమ్మకాన్ని మీ సంపదను, ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను మీకు తిరిగిస్తా’’ అని అమెరికా ప్రజలకు వాగ్దానం చేశారు. అరగంట పాటు సాగిన తొలి ప్రసంగంలో ట్రంప్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంటలు రేపే నిర్ణయాలు ప్రకటించారు. మెక్సికో సరిహద్దుల్లో తక్షణమే జాతీయ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు. ‘‘అమెరికాలోకి వలసలపై ఉక్కుపాదం మోపుతాం. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మారుస్తున్నాం. పనామా కాల్వను అమెరికా స్వా«దీనం చేసుకుంటుంది’’ అని ప్రకటించారు. పనామా కాల్వపై చైనా పెత్తనం సాగుతోందని, వద్ద అమెరికా నౌకలపై భారీగా సుంకాలు విధిస్తున్నారని ఆక్షేపించారు. ‘‘వరక్త వ్యవస్థను సమూలంగా మారుస్తాం. అమెరికన్లను సంపన్నులుగా మార్చడమే లక్ష్యంగా పలు దేశాలపై సుంకాలు, ఇతర టారిఫ్లను పెంచుతాం. వాటి వసూలుకు ప్రత్యేక ప్రభుత్వ విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. డ్రగ్ కార్టల్స్ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటిస్తాం. 1978 నాటి విదేశీ శత్రువుల చట్టాన్ని తిరిగి తెచ్చి వాటిని అంతం చేస్తాం. పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతోంది’’ అని ప్రకటించారు. లూథర్కింగ్ కలలను నిజం చేస్తా ట్రంప్ తన ప్రసంగంలో బైడెన్ పాలనపై నిప్పులు చిమ్మారు. ‘‘ఆర్థిక, విద్య, ఆరోగ్య వ్యవస్థలన్నింటినీ బైడెన్ యంత్రాంగం కుప్పకూల్చింది. లాస్ ఏంజెలెస్ మంటల వంటి మామూలు సమస్యలను కూడా పరిష్కరించలేకపోయింది. భయంకరమైన నేరగాళ్లకు, డ్రగ్స్ బానిసలకు దేశాన్ని స్వర్గధామంగా మార్చింది. న్యాయవ్యవస్థను విషపూరితంగా, హింసాత్మకంగా మార్చి ఆయుధంలా వాడుకుంది’’ అని ఆరోపించారు. ‘‘న్యాయవ్యవస్థకు సంకెళ్ల నుంచి విముక్తి కల్పిస్తా. అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న ధరలకు, ద్రవ్యోల్బణానికి కళ్లెం వేస్తా. దేశీయ చమురు ఉత్పత్తిని భారీగా పెంచుతా. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం’’ అని ప్రకటించారు. ‘‘250 ఏళ్ల అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడూ ఎదుర్కోనన్ని పరీక్షలను ఎనిమిదేళ్లుగా ఎదుర్కొంటూ వచ్చా. బహుశా అమెరికాను తిరిగి గొప్పగా తీర్చిదిద్దేందుకే దేవుడు నన్ను హత్యాయత్నం నుంచి కాపాడాడేమో’’ అన్నారు. దాంతో రిపబ్లికన్ నేతలంతా పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. బైడెన్, హారిస్ మౌనంగా వీక్షించారు. ‘‘ఈ రోజు హక్కుల ఉద్యమకారుడు మార్టీన్ లూథర్కింగ్ జూనియర్ డే. అమెరికా కోసం ఆయన కన్న కలలను సాకారం చేసి చూపిస్తా. మార్టీన్ లూథర్ లక్ష్యాల సాధనకు మనమంతా సమైక్యంగా కృషి చేద్దాం’’ అని ప్రజలకు ట్రంప్ పిలుపునిచ్చారు. వైట్హౌస్కు స్వాగతం: బైడెన్ అంతకుముందు సోమవారం ఉదయం బైడెన్ తన వారసుడు ట్రంప్ను అధ్యక్ష భవనం వైట్హౌస్లోకి ఆత్మియంగా ఆహ్వానించారు. ట్రంప్ దంపతులు వాహనం దిగగానే ప్రధాన ద్వారం వద్ద భార్య జిల్తో కలిసి స్వాగతించారు. ‘వైట్హౌస్కు మరోసారి స్వాగతం’ అంటూ అభినందనలు తెలిపారు. అధ్యక్ష సంప్రదాయం ప్రకారం ట్రంప్ కోసం ఓవల్ కార్యాలయంలో లేఖ రాసిపెట్టారా అని మీడియా ప్రశ్నించగా, ‘అది మా ఇద్దరి మధ్య వ్యవహారం’ అంటూ చమత్కరించారు. అనంతరం ట్రంప్ దంపతులను లోనికి తీసుకెళ్లారు. సంప్రదాయం ప్రకారం వారికి తేనీటి విందు ఇచ్చారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దంపతులు కూడా కాబోయే ఉపాధ్యక్షుడు వాన్స్, ఉష దంపతులకు స్వాగతం పలికారు. వాన్స్కు హారిస్ అభినందనలు తెలిపారు. ఫొటోలకు పోజులిచ్చాక వాన్స్ దంపతులను హారిస్ దంపతులు వైట్హౌస్ లోనికి తోడ్కొని వెళ్లారు. అంతకుముందు ట్రంప్ తన కుటుంబీకులతో కలిసి వైట్హౌస్ సమీపంలోని చారిత్రక సెయింట్ జాన్ ఎపిస్కోపల్ చర్చి వద్ద సంప్రదాయ ప్రార్థనలు జరిపారు. అర్జెంటీనా ప్రెసిడెంట్ మెయిలీతో పాటు కూడా పారిశ్రామిక దిగ్గజాలంతా వాటిలో పాల్గొనడం విశేషం.ప్రమాణస్వీకారం ఇలా..ట్రంప్ నాలుగేళ్ల విరామం అనంతరం వైట్హౌస్లో తిరిగి అడుగుపెట్టారు. సోమవారం మధ్యాహ్నం క్యాపిటల్ హిల్ భవనంలోని రొటుండా హాల్లో డెమొక్రాట్ నేత 82 ఏళ్ల జో బైడెన్ నుంచి లాంఛనంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. విపరీతమైన చలి నేపథ్యంలో ఇండోర్లో జరిగిన కార్యక్రమంలో అమెరికా మాజీ అధ్యక్షులు జార్జి డబ్లు్య.బుష్, బిల్ క్లింటన్ దంపతులు, బరాక్ ఒబామా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మెయిలీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుని ప్రమాణస్వీకారానికి దేశాధినేతలు రావడం ఇదే తొలిసారి. దిగ్గజ టెక్ కంపెనీల సారథులు, పారిశ్రామికవేత్తలు ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్, మార్క్ జుకర్బర్గ్, జెఫ్ బెజోస్, టిమ్ కుక్, ముకేశ్ అంబానీ దంపతులు, రూపర్డ్ మర్డోక్ షౌ చూ తదితరులు కూడా హాజరయ్యారు. అంతకుముందు ట్రంప్ దంపతులు వైట్హౌస్లో అధ్యక్షుడు జో బైడెన్ దంపతుల నుంచి సంప్రదాయ తేనీటి విందు స్వీకరించారు. తర్వాత బైడెన్తో కలిసి ట్రంప్ ఒకే కారులో క్యాపిటల్ హిల్కు చేరుకున్నారు. ఇద్దరూ కలిసే రొటుండా హాల్లో అడుగుపెట్టారు. వెంటనే హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఆహూతులంతా ట్రంప్కు, ఆయన రన్నింగ్మేట్ జె.డి.వాన్స్, ఉష దంపతులకు ఘనస్వాగతం పలికారు. తొలుత వాన్స్తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రెట్ కవనా ఉపాధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మరో న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ట్రంప్తో ప్రమాణస్వీకారం చేయించారు. ‘‘అమెరికా అధ్యక్షునిగా నా బాధ్యతలను విశ్వాసపాత్రునిగా నెరవేరుస్తా. అమెరికాను, దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తా’’ అంటూ తన తల్లి ఇచి్చన వ్యక్తిగత బైబిల్తో పాటు లింకన్ బైబిల్పై ప్రమాణం చేశారు. అనంతరం భార్య మెలానియా చెంపపై ముద్దాడారు. ఆమె హ్యాట్ అడ్డురావడంతో చిరునవ్వులు చిందించారు. ట్రంప్కు ప్రపంచం నలుమూలల నుంచీ అభినందనల సందేశాలు వెల్లువెత్తాయి. ‘నా ప్రియమిత్రుడు ట్రంప్కు హృదయపూర్వక అభినందనలు’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉత్తర్వులే ఉత్తర్వులు! బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వలసలపై ఉక్కుపాదం, మెక్సికో సరిహద్దుల్లో మరిన్ని సైనిక దళాల మోహరింపు, జన్మతః పౌరసత్వ విధానం రద్దు, చైనా, కెనడాలపై టారిఫ్ల పెంపు, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడం వంటివి వీటిలో ఉన్నట్టు వైట్హౌస్ వర్గాలు చెప్పాయి. వివరాలు వెల్లడించేందుకు నిరాకరించాయి. అయితే చాలా ఉత్తర్వుల అమలుపై న్యాయపరమైన సవాలు ఎదురవడం ఖాయమంటున్నారు. ట్రంప్ రాకతో వైట్హౌస్ వెబ్సైట్ కూడా కొత్త రూపు సంతరించుకుంది. ‘అమెరికా ఈజ్ బ్యాక్’ అనే హెడ్డింగ్తో ‘నా ప్రతి శ్వాసతోనూ అమెరికన్ల కోసమే పోరాడతా’ అంటూ ట్రంప్ సందేశాన్ని హోం పేజీలో హైలైట్ చేసింది. ట్రంప్ తాజా నిర్ణయాలను పోస్ట్ చేసింది. ‘‘పన్నులు, చమురు ధరలు, విద్యుత్ చార్జీలు తగ్గుతాయి. సైన్యాన్ని ఆధునికీకరిస్తారు. విఫల విధానాలు రద్దవుతాయి. పలు దేశాల్లో జరుగుతున్న యుద్ధాలకు తెర దించేందుకు ట్రంప్ ప్రాధాన్యమిస్తారు’’ అని పేర్కొంది. ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టా వంటి వైట్హౌస్ సోషల్ మీడియా ఖాతాలకు కూడా కొత్త రూపు వచ్చింది.విక్టరీ ర్యాలీలో ట్రంప్ డ్యాన్స్ ఆశ్చర్యపరిచిన విలేజ్ పీపుల్ ప్రదర్శన వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’విక్టరీ ర్యాలీని తన ఐకానిక్ డ్యాన్స్ మూవ్స్తో ముగించారు. 1978 నుంచి హిట్ అయిన ‘విలేజ్ పీపుల్’ట్రాక్ మరోసారి మార్మోగింది. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఈ విలేజ్ పీపుల్ బ్యాండ్ ఈ పాటను ప్రదర్శించగా వారి వెనుక నిలబడిన ట్రంప్ అప్పుడప్పుడు పాడారు. స్టేజ్ మీద విలేజ్ పీపుల్ ఏడో సభ్యుడిగా చేరి ట్రంప్ డ్యాన్స్ చేశారు. మార్పుకోసం ఎదురుచూస్తున్నా వాషింగ్టన్: ట్రంప్ సారథ్యంలో అమెరికాలో చాలా మార్పులు చేయడానికి తాను ఎదురు చూస్తున్నానని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా ప్ర మాణ స్వీకారానికి ముందు వాషింగ్టన్లోని క్యాపిటల్ వన్ ఏరీనాలో ఆదివారం రాత్రి జరిగిన మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ విజయోత్సవ ర్యాలీలో మస్క్ పాల్గొని ప్రసంగించారు. ‘‘మేం చాలా మార్పులు చేయాలని చూస్తున్నాం. శతాబ్దాలపాటు అమెరికా బలీయశక్తి గా కొనసాగేందుకు వీలుగా మార్పులు చేయ డం ముఖ్యం. అమెరికాను మళ్లీ గొప్పగా మా ర్చుదాం’’అని మస్క్ అన్నారు. మస్క్... లిటి ల్ ఎక్స్ అని పిలుచుకునే తన కుమారుడు ఎ క్స్ ఎ–12 ను కూడా వేదికపైకి తీసుకొచ్చారు. -
డోనాల్డ్ ట్రంప్ పట్టాభిషేకానికి సర్వం సిద్ధం
-
Trump 2.0: మనపై ప్రభావమెంత?
రెండోసారి అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. శ్వేతసౌధంలోకి ఆయన పునరాగమనం అక్కడి భారతీయులకు పలు అవకాశాలతో పాటు సవాళ్లను కూడా మోసుకొస్తున్నట్టే కనిపిస్తోంది. అమెరికాలో భారత సంతతికి చెందినవారు 45 లక్షలకు పైగా ఉన్నారు. సంఖ్యాపరంగా తక్కువగా అనిపిస్తున్నా కొన్నేళ్లుగా వాళ్లు ప్రబల శక్తిగా ఆవిర్భవించారు. ఐటీ, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదక శక్తులుగా మారారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల రాజకీయ రంగంలో కూడా సత్తా చాటుతున్నారు. అధ్యక్షునిగా ట్రంప్ తొలి హయాం భారత అమెరికన్లకు కాస్త తీపి, కాస్త చేదుగానే గడిచింది. ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ సాన్నిహిత్యం అందరినీ ఆకర్షించింది. ‘హౌడీ మోడీ’ పేరిట 2019లో హూస్టన్లో ట్రంప్ అట్టహాసం చేస్తే, అంతకుమించి అన్నట్టుగా మరుసటేడే మోదీ అహ్మదాబాద్లో నమస్తే ట్రంప్ పేరుతో భారీ సభ నిర్వహించారు. దానికి తరలివచ్చిన లక్ష పైచిలుకు జన సందోహాన్ని చూసి ఆశ్చర్యానందాల్లో మునిగిపోవడం అధ్యక్షుని వతయింది. ఆసియాలో చైనా ప్రాబల్యానికి చెక్ పెట్టడం వంటి ఉమ్మడి వ్యూహాత్మక లక్ష్యాలు ఇరు దేశాలను మరింత సన్నిహితం చేశాయి. వరక్త వ్యాపారాలూ ఇతోధికంగా పుంజుకున్నాయి. భారత్–అమెరికా సంబంధాలు మొత్తమ్మీద మరింత బలోపేతమే అయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ 2.0 భారత్కు, అమెరికాలోని మనవారికి ఎలా ఉండనుందన్నది ఆసక్తికరంగా మారింది. సామాజిక ఆందోళనలు ట్రంప్ తొలి హయాంలో జాతి విద్వేష, విద్వేష నేర ఘటనలు పెరిగాయి. వాటిలో తరచూ దక్షిణాసియా మూలాలున్న వారినే లక్ష్యంగా చేసుకునే ఆందోళనకర ట్రెండుకు తెర లేచింది. దీని ప్రభావం భారతీయ అమెరికన్లపైనా బాగానే పడింది. దానికి తోడు ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదానికి ఈసారి మరింత ప్రాధాన్యమిస్తానని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. తమపట్ల వివక్షకు తావులేని వాతావరణాన్ని కోరుకుంటున్న భారతీయ అమెరికన్లలో ఈ ప్రకటన మరింత గుబులు రేపుతోంది. ఈ ఆందోళనలను తొలగించేందుకు రిపబ్లికన్ పార్టీలోని భారత మూలాలున్న నేతలు ఏ మేరకు కృషి చేస్తారన్నది కీలకం కానుంది. వర్తకం.. ఆచితూచి ట్రంప్ తొలి హయాంలో వర్తకానికి పెద్దపీటే వేసినా కొన్నిసార్లు వివాదాలూ తప్పలేదు. ఉక్కు, అల్యూమినియం, వ్యవసాయోత్పత్తుల వంటివాటిపై టారిఫ్లు గొడవకు దారితీశాయి. రిటైల్ నుంచి టెక్ స్టార్టప్ల దాకా రెండు ఆర్థిక వ్యవస్థల్లోనూ కీలకంగా మారిన భారత అమెరికన్ వ్యాపారవేత్తలకు ట్రంప్ తొలి హయాంలో మిశ్రమ ఫలితాలే ఎదురయ్యాయి. పన్ను తగ్గింపులు, నిబంధనల సడలింపు వంటి ట్రంప్ సర్కారు నిర్ణయాలు వ్యాపార విస్తృతికి దోహదపడినా మొత్తమ్మీద టారిఫ్ల విషయంలో కొనసాగిన అనిశ్చితి ఎప్పటికప్పుడు వారికి సవాలుగానే నిలుస్తూ వచ్చింది. వాటిపై సంప్రదింపులు కూడా పెద్దగా ఫలితమివ్వలేదు. ఈసారి వాటిని చక్కదిద్దుకోవడానికి ట్రంప్ ప్రాధాన్యమిచ్చే అవకాశముంది. → విధానాలు ఇరు దేశాలకూ లాభసాటిగా ఉండేలా మెరుగు పరిచేందుకు ద్వైపాక్షిక వర్తకంతో ప్రత్యక్ష భాగస్వామ్యమున్న భారతీయ అమెరికన్ వ్యాపార దిగ్గజాలు ప్రయత్నించవచ్చు. → ఫార్మా, జౌళి, టెక్నాలజీ వంటి రంగాల్లో టారిఫ్లు తగ్గడమో, లేదంటే సరళంగా మారడమో ఖాయంగా కనిపిస్తోంది. → పన్ను ప్రోత్సాహకాలపై నియంత్రణల ఎత్తివేతతో పాటు చిన్న వ్యాపారాలకు ఇతోధికంగా వృద్ధి అవకాశాల కల్పన దిశగా అడుగులు పడవచ్చు. → ట్రంప్ అత్యంత ప్రాధాన్యమిస్తున్న ‘అమెరికా ఫస్ట్’ విధానం భారతీయ అమెరికన్ వ్యాపారవేత్తలకు సవాలుగా పరిణమించే ఆస్కారమూ లేకపోలేదు.వలసలపై ఉత్కంఠే అమెరికాలో భారతీయుల విజయగాథకు హెచ్–1బీ వీసా విధానమే దశాబ్దాలుగా మూలస్తంభంగా నిలుస్తూ వచ్చింది. ముఖ్యంగా ఐటీ, వైద్య తదితర రంగాల్లో మన నిపుణులు అగ్ర రాజ్యంలో తిరుగులేని రీతిలో జెండా పాతారు. అంత కీలకమైన హెచ్–1బీ వీసా విధానం ట్రంప్ తొలి హయాంలో ఒడిదుడుకులకు లోనైంది. మితిమీరిన వడపోతలు, కఠినమైన అర్హత ప్రమాణాల వంటివి అమెరికా కలలుకనే భారతీయ ఔత్సాహికుల్లో, వారి కుటుంబాల్లో తీవ్ర అనిశి్చతికి దారితీశాయి. → ఈ సవాళ్లు ట్రంప్ 2.0లో మరింత పెరిగే సూచనలే కన్పిస్తుండటం ఆందోళనకరం. → గ్రీన్కార్డు కోసం దశాబ్దాలుగా ఎదురుతెన్నుల్లోనే గడుపుతున్న భారత అమెరికన్లు మరిన్ని సమస్యలు ఎదుర్కోక తప్పేలా లేదు. → జీవిత భాగస్వామి ప్రధానంగా హెచ్–4 వర్క్ వీసా పర్మిట్లపై ఆధారపడే కుటుంబాల పరిస్థితి మరింత డోలాయమానంగా తయారైంది. ఆ వీసాలకు వర్క్ పర్మిట్లు రద్దు చేస్తామని ట్రంప్ గతంలో చేసిన ప్రకటన ఇప్పుడు మళ్లీ భయపెడుతోంది. అదే జరిగితే భారత మహిళలకు కోలుకోలేని దెబ్బే అవుతుంది. కుటుంబానికి ఆర్థిక భద్రత, వృత్తిగత ఎదుగుదలకు కీలకమైన అవకాశం వారి చేజారుతుంది. → వీసా పర్మిట్ల గందరగోళంతో నిపుణులైన భారతీయులపై ఎక్కువగా ఆధారపడే అమెరికా వ్యాపార సంస్థలు కూడా బాగా ప్రభావితమవుతాయి. → వర్క్ వీసాలపై పరిమితులు కీలక రంగాల్లో మానవ వనరుల కొరతకు దారితీస్తాయి.రూటు మారిన రాజకీయం భారత అమెరికన్లు మొదటినుంచీ డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులుగా ఉంటూ వచ్చారు. వలసలు, వైవిధ్యం, సామాజిక న్యాయం తదితర విధానాల్లో ఆ పార్టీ ప్రగతిశీల వైఖరే అందుకు ప్రధాన కారణం. కానీ వలస సంస్కరణలపై బైడెన్ సర్కారు నిర్లిప్తత, అంతూపొంతూ లేని గ్రీన్కార్డుల వెయిటింగ్ లిస్టు వంటివి ఆ పార్టీపై వారిలో అసంతృప్తికి దారితీశాయి. ఈ నేపథ్యంలో కుటుంబ విలువలు, విద్య తదితరాల్లో అచ్చం తమను పోలి ఉండే రిపబ్లికన్ పార్టీ వైఖరి, దాని సరళీకృత ఆర్థిక విధానాలు సంప్రదాయ భారతీయులను కొంతకాలంగా అమితంగా ఆకర్షిస్తున్నాయి. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి వంటి భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేతలు మరింతగా వారి ఆదరణను చూరగొంటున్నారు. ముఖ్యంగా దూకుడుకు మారుపేరైన ట్రంప్ రిపబ్లికన్ పగ్గాలు చేపట్టిన నాటినుంచీ ఈ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. భారత అమెరికన్ సమాజం నానాటికీ ఆ పార్టివైపు మొగ్గుతోంది. ట్రంప్ 2.0 విధానాలను బట్టి ఇది మరింత ఊపందుకున్నా ఆశ్చర్యం లేదు. -
ట్రంప్ ప్రమాణానికి... జోరుగా ఏర్పాట్లు
వాషింగ్టన్: అగ్రరాజ్యాధినేతగా డొనాల్డ్ ట్రంప్ (78) రెండోసారి శ్వేతసౌధంలో అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. అమెరికా 47వ అధ్యక్షునిగా సోమవారం ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా శనివారం నుంచి నాలుగు రోజుల పాటు అట్టహాసంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రమాణస్వీకార కమిటీ ప్రకటించింది. ‘‘శనివారం బాణసంచా నడుమ కార్యక్రమాలు లాంఛనంగా మొదలవుతాయి. అనంతరం ఫ్లోరిడాలోని ట్రంప్ గోల్ఫ్ కోర్స్ బయట, వాషింగ్టన్ డీసీలోనూ పలు వీఐపీ ఈవెంట్లు జరుగుతాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (ఎంఏజీఏ) పేరిట విజయోత్సవ ర్యాలీలుంటాయి. సోమ వారం ట్రంప్ ముందుగా సెయింట్ జాన్స్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం వైట్హౌస్లో తేనీటి విందు జరుగుతుంది. ఆ తర్వాత కాపిటల్ భవనంలోని వెస్ట్ లాన్లో (స్థానిక కాలమానం ప్రకారం) ఉదయం 9.30 నుంచి ప్రధాన కార్యక్రమం ఉంటుంది. సంగీత కార్యక్రమాల అనంతరం ట్రంప్ లాంఛనంగా పదవీ ప్రమాణం చేసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. తర్వాత జె.డి.వాన్స్ ఉపాధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం తన లక్ష్యాలు తదితరాలను వెల్లడిస్తూ అధ్యక్ష హోదాలో ట్రంప్ తొలి ప్రసంగం చేస్తారు. తర్వాత సెనేట్ చాంబర్లోని ప్రెసిడెంట్ రూమ్లో కీలక పత్రాలపై సంతకం చేయడంతో ప్రమాణ కార్యక్రమం ముగుస్తుంది. మధ్యాహ్నం తొలి అధికారిక విందు అనంతరం క్యాపిటల్ హిల్ భవనం నుంచి పెన్సిల్వేనియా అవెన్యూ మీదుగా వైట్హౌస్ దాకా ట్రంప్ పరేడ్గా వెళ్తారు’’ అని వెల్లడించింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచీ ఏకంగా 2 లక్షల మంది సోమవారానికల్లా వాషింగ్టన్ చేరుకుంటారని కమిటీ తెలిపింది. నవంబర్ 6న జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్పై ట్రంప్ ఘనవిజయం సాధించి రెండోసారి అధ్యక్షుడు కానున్నారు. 2017–2021 మధ్య తొలిసారి అధ్యక్షునిగా పని చేయడం తెలిసిందే. మాజీ అధ్యక్షులంతా హాజరు సోమవారం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, కమలతో పాటు మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి డబ్లు్య.బుష్, బరాక్ ఒబామా కూడా పాల్గొంటారు. వీరిలో ఒబామా మినహా మిగతా వారంతా సతీసమేతంగా వస్తున్నారు. పలువురు దేశాధినేతలు, వీవీఐపీలు, ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా తరఫున ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్తో పాటు ఐటీ, ఇతర దిగ్గజ సంస్థల అధినేతలు కూడా హాజరవుతున్నారు. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్ (ఫేస్బుక్), జెఫ్ బెజోస్ (అమెజాన్) రూపంలో ప్రపంచ కుబేరుల్లో ముగ్గురు వేదికపై కనిపించనుండటం విశేషం. ట్రంప్ హయాంలో అమెరికా టెక్ బిలియనీర్ల అడ్డగా మారనుందని బైడెన్ తాజాగా తన వీడ్కోలు సందేశంలో హెచ్చరించడం తెలిసిందే.అధికారిక ఫొటోల విడుదల ప్రమాణస్వీకార సంబంధిత కార్యక్రమాల్లో ఉపయోగించేందుకు ట్రంప్, వాన్స్ అధికారిక చిత్రాలను తాజాగా విడుదల చేశారు. వాన్స్ చేతులు కట్టుకుని సరదాగా చిరునవ్వులు చిందిస్తుండగా ట్రంప్ ఫొటో అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. పెదాలు బిగించి, నుదురు చిట్లించి కెమెరావైపు తీక్షణంగా చూస్తూ కనిపిస్తున్నారు. ఇది అచ్చం కాపిటల్ హిల్ దాడి కేసులో 2023లో ట్రంప్ న్యాయ విచారణకు హాజరైన సందర్భంగా పోలీసు అధికారులు తీసుకున్న ఆయన మగ్ షాట్ను పోలి ఉండటం విశేషం. రెండో టర్ములో సంప్రదాయ పోకడలను మరింతగా ధిక్కరించి తీరతానని ప్రతీకాత్మకంగా చెప్పేందుకు ట్రంప్ కావాలనే ఇలాంటి ఫొటోను ఎంచుకున్నారని భావిస్తున్నారు.హాలీవుడ్ ప్రత్యేక రాయబారులుగా గిబ్సన్ తదితరులు నటులు జాన్ వొయిట్, మెల్ గిబ్సన్, సిల్విస్టర్ స్టాలోన్లను హాలీవుడ్ ప్రత్యేక రాయబారులుగా నియమిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. నాలుగేళ్లుగా నేలచూపులు చూస్తున్న హాలీవుడ్ను బలోపేతం చేసి పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నాల్లో వారు తనకు సహాయ సహకారాలు అందిస్తారని వెల్లడించారు. వీరిలో వొయిట్ చిరకాలంగా ట్రంప్కు మద్దతుదారు కాగా గిబ్సన్, స్టాలోన్ కూడా తాజా ఎన్నికల్లో ట్రంప్ను బలపరిచారు. -
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్
-
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే అమెరికాకు తిరిగి వచ్చేయండి
న్యూయార్క్: అమెరికా 47వ అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే.. శీతాకాల సెలవులకు స్వదేశాలకు వెళ్లిన అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాకు తిరిగి వచ్చేయాలని పలు యూనివర్సిటీలు సూచించాయి. ప్రవేశాల నిషిద్ధం, విమానాశ్రయాల్లో నిబంధనలు కఠినతరం అయ్యే అవకాశాలుంటాయి కాబట్టి జనవరి 20కి ముందే తిరిగి వచ్చేయాలని భారతీయ విద్యార్థులను పలు వర్సిటీలు హెచ్చరించాయి. వలసదారులను అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేనంత అత్యధికంగా వెనక్కి పంపిస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పడాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సూచన జారీచేశాయి. చెల్లుబాటయ్యే వీసా, ఇతర ప్రయాణ పత్రాలు సక్రమంగా ఉన్న భారతీయ విద్యార్థులకు వచ్చే నష్టమేమీ లేకున్నా.. అవకాశం తీసుకోవద్దని హెచ్చరించాయి. అమెరికా వర్సిటీల్లో చదువున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత విద్యార్థులే అధికం కావడం గమనార్హం. 2023–24 కాలంలో భారత విద్యార్థులు చైనాను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని ఆశ్రయించారు. అమెరికా వర్సిటీల్లో 3.3 లక్షల భారతీయ విద్యార్థులు ఉండగా.. చైనా విద్యార్థులు 2.7 లక్షల మంది ఉన్నారు. సాధారణంగా అయితే నూతన సంవత్సర వేడుకల తర్వాత వారం రోజులకు తరగతులు ప్రారంభమవుతాయని, ట్రంప్ వైఖరిని దృష్టిలో పెట్టుకొని ఈసారి జనవరి 2 నుంచే తరగతులు మొదలుపెడుతున్నారని ఒక విద్యార్థి తెలిపారు. జనవరి మొదటి వారాంతం తర్వాత రావడం రిస్క్ అవుతుందని ప్రొఫెసర్లు చెప్పినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా అమెరికాకు తిరిగి వెళ్లాలని తమపై ఒత్తిడి ఉందని తెలిపారు. అమెరికాకు ఎప్పుడు తిరిగి రావాలనే విషయంలో సందేహాలను తీర్చడానికి యేల్ యూనివర్సిటీ అయితే విద్యార్థులకు ప్రత్యేకంగా ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. అమెరికాకు వెళ్లడానికి జనవరి 10న రిటర్న్ టికెట్ను బుక్ చేసుకున్నానని, అయితే మసాచుసెట్స్ యూనివర్సిటీ సూచన మేరకు రూ.35 వేలు అదనంగా పెట్టి.. తిరిగివెళ్లే తేదీని ముందుకు జరిపానని ఎస్.సర్సన్ అనే విద్యార్థి తెలిపారు. నిబంధనలు కఠినతరం కావచ్చని, నిశిత పరిశీలన, తనిఖీలు ముమ్మరం కావచ్చని తమ ప్రొఫెసర్లు చెప్పారని వెల్లడించారు. పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదని, అనవసరంగా సమస్యలు కొనితెచ్చుకొనే బదులు.. ముందుగా అమెరికాకు తిరిగి రావడమే ఉత్తమమని వెస్లెయాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరు అన్నారు. -
జార్ఖండ్ సీఎంగా హేమంత్
రాంచీ: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)కు చెందిన గిరిజన నేత హేమంత్ సోరెన్(49) ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని రాంచీలోని మొరాబాది మైదానంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. తెల్లని కుర్తా పైజామా, నెహ్రూ జాకెట్ ధరించిన హేమంత్ ముందుగా జేఎంఎం చీఫ్, తన తండ్రి శిబూ సోరెన్ను కలుసుకున్నారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష ఇండియా కూటమి అగ్ర నేతలు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజనులు సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలతో అలరించారు. ఈ సందర్భంగా రాంచీలోని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ దంపతులు ఉన్నారు. పంజాబ్ సీఎం మాన్, సీపీఐఎంఎల్ లిబరేషన్ జనరల్ సెక్రటరీ దీపాంకర్ భట్టాచార్య, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ కూడా హాజరయ్యారు. కాగా, సీఎంగా హేమంత్ ప్రమాణం చేయడం ఇది నాలుగోసారి.ఇది చారిత్రక దినంప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని హేమంత్ సోరెన్ ‘ఎక్స్’లో..‘ఇది చారిత్రక దినం..రాష్ట్ర ప్రజలు ఐకమత్యమే ఆయుధంగా చేసుకుని ఎన్నికల్లో తిరుగులేని తీర్పిచ్చారు. మా గొంతు నొక్కేందుకు వాళ్లు ప్రయత్నించిన ప్రతిసారీ ఉద్యమం మరింతగా తీవ్రతరమైంది. జార్ఖండ్ వాసులు ఎవరికీ తలొంచరు. తుది శ్వాస వరకు మా పోరాటం కొనసాగుతుంది’అని బీజేపీను ద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీలోని 81 సీట్లకు గాను జేఎంఎం సారథ్యంలోని కూటమి అత్యధికంగా 56 సీట్లను సొంతం చేసుకుంది. 43 స్థానాల్లో పోటీకి దిగిన జేఎంఎం మొదటిసారిగా ఏకంగా 34 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. #WATCH | JMM executive president Hemant Soren takes oath as the 14th Chief Minister of Jharkhand, in Ranchi.(Video: ANI/Jhargov TV) pic.twitter.com/30GxxK9CXe— ANI (@ANI) November 28, 2024 -
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్.. ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే?
రాంచీ : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా తిరుగులేని విజయం సాధించింది. ఈ తరుణంలో సోమవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.అరెస్ట్లు,కేసులు, కోర్టులు, తిరుగుబాట్లు, అవినీతి ఆరోపణలు, ఇక చొరబాటుదారులదే రాజ్యం అవుతుందని స్వయాన ప్రధాని మోదీ చేసిన హెచ్చరికలు.. వీటన్నిటినీ ఎదుర్కొని హేమంత్ సోరెన్,కల్పనా సోరెన్ దంపతులు విజయం సాధించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా 88 స్థానాలకు గాను 56 స్తానాల్ని కైవసం చేసుకుంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరుతూ హేమంత్ సోరెన్ ఆదివారం (నవంబర్24) జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గాంగ్వార్తో భేటీ కానున్నారు. మనీ లాండరింగ్ కేసులో ఐదు నెలల జైలు జీవితం గడిపారు. అనంతరం.. బెయిల్ మీద బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేశారు. బర్హైత్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన హేమంత్ సోరెన్ తన ప్రత్యర్థి, బీజేపీ నేత గామ్లియెల్ హెంబ్రోమ్ను 39,791 ఓట్ల తేడాతో ఓడించారు.ఇక భర్త జైలు జీవితంతో హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ తొలిసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తన భర్తపై కేంద్రం చేస్తున్న కుట్రను వివరిస్తూ ఎన్నికల బరిలోకి దిగారు. 200కు పైగా సభలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గాండే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 17,142 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
రేపు సీజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం
ఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం ఇవాళ్టి(ఆదివారం)తో ముగిసింది. దీంతో సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.. 51వ భారత ప్రధాన న్యాయమూర్తిగా రేపు(సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక.. ఆయన వచ్చే ఏడాది మే 13 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఇవాళ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ విరమణ చేశారు.జస్టిస్ ఖన్నా 1960 మే 14న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వొకేట్గా నమోదయ్యారు. వేర్వేరు కోర్టుల్లో పనిచేశారు. తీస్ హజారీ జిల్లా కోర్టు, ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా వ్యవహరించారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2006లో అదే కోర్టులో శాశ్వత జడ్జిగా చేరారు. ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ చైర్మన్గా సేవలందించారు. వృత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతూ 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, భోపాల్లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ గవరి్నంగ్ కౌన్సిల్ సభ్యుడిగానూ పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా పలు కీలక తీర్పులు వెలువరించారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలకు(ఈవీఎంలు) సంబంధించి వీవీప్యాట్లలోని 100 శాతం ఓట్లను లెక్కించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన పిటిషన్ను 2024లో కొట్టివేసిన డివిజన్ బెంచ్కు ఆయన నేతృత్వం వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని 2024లో చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరి్టకల్ 370ని రద్దు చేయడాన్ని సమర్థిస్తూ 2023లో తీర్పు ఇచ్చిన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారు. వివాహ బంధం పూర్తిగా విఫలమైన సందర్భాల్లో దంపతులకు నేరుగా విడాకులు మంజూరు చేసే అధికారం ఆరి్టకల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉందని 2023లో స్పష్టంచేశారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి సుప్రీంకోర్టు కార్యాలయం వస్తుందంటూ 2019లో మరో కీలక తీర్పు వెలువరించారు. -
ఇండోనేసియా అధ్యక్షుడిగా సుబియాంతో
జకార్తా: ఇండోనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబొవో సుబియాంతో(73) ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన కార్యక్రమంలో సుబియాంతో తోపాటు ఉపాధ్యక్షుడిగా గిబ్రాన్ రకబుమింగ్ రకా(37) ప్రమాణం చేశారు. మాజీ అధ్యక్షుడు విడొడొ కుమారుడైన రకా సుకార్తా మేయర్గా సైతం పనిచేశారు. ప్రమాణ స్వీకారం ఓపెన్ టాప్ వ్యాన్లో వచ్చిన సుబియాంతోకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రజలతో పార్లమెంట్ భవనం, అధ్యక్ష భవనం రహదారి కిక్కిరిసింది. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఆయన ముందుకు సాగారు. సుబియాంతో ఖురాన్ సాక్షిగా ప్రమాణం చేశారు. -
హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం
చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సైనీ చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. హర్యానాలో మూడోసారి బీజేపీ సర్కార్ కొలువుదీరింది.#WATCH | Nayab Singh Saini takes oath as Haryana CM for the second consecutive time, in PanchkulaPrime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, BJP national president JP Nadda, Defence Minister Rajnath Singh, UP CM Yogi Adityanath and other CMs, Deputy CMs, Union… pic.twitter.com/WK9ljGLwzd— ANI (@ANI) October 17, 2024 కంప్యూటర్ ఆపరేటర్ టు సీఎం..బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన సైనీ1996లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా చేరికమాజీ సీఎం ఖట్టర్ సాన్నిహిత్యంలో రాజకీయంగా ఎదిగిన సైనీ2014లో నారాయణ్ గఢ్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నిక మనోహర్ లాల్ ఖట్టర్ కేబినెట్లో హోంమంత్రిగా సేవలు 2019లో కురుక్షేత్ర నుంచి లోక్సభకు ఎన్నిక2023 అక్టోబర్లో హర్యానా బీజేపీ అధ్యక్షుడిగా నియామకం2024 మార్చిలో హర్యానా సీఎంగా బాధ్యతలు200 రోజుల్లో హర్యానా బీజేపీకి హ్యాట్రిక్ విజయంలో కీలక పాత్రపుట్టిన తేదీ: 1970 జనవరి 25సొంతూరు అంబాల జిల్లా మిర్జాపూర్ మజ్రా గ్రామంబీఏ, ఎల్ఎల్బీ, ఆర్ఎస్ఎస్తో సుదీర్ఘ అనుబంధం హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు పంచకుల సెక్టార్ 5లోని దసరా మైదానానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు.#WATCH | Prime Minister Narendra Modi reaches Dussehra Ground in Sector 5, Panchkula, for the swearing-in ceremony of Haryana CM-designate Nayab Singh Saini and the new Haryana government pic.twitter.com/pycGFJoZMY— ANI (@ANI) October 17, 2024 #WATCH | Haryana CM-designate Nayab Singh Saini to shortly take oath as Haryana CM, in Panchkula pic.twitter.com/2mzAKm0iGf— ANI (@ANI) October 17, 2024 హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.#WATCH | Union Home Minister Amit Shah, BJP national president JP Nadda, Union Minister Nitin Gadkari, Maharashtra CM Eknath Shinde, UP CM Yogi Adityanath and other CMs, Deputy CMs, Union Ministers, NDA leaders present at the swearing-in ceremony of Haryana CM-designate Nayab… pic.twitter.com/evktPWkU7p— ANI (@ANI) October 17, 2024 హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చండీగఢ్ చేరుకున్నారు.#WATCH | Union Minister and BJP national president JP Nadda arrives in Chandigarh to attend the swearing-in ceremony of Haryana CM-designate Nayab Singh Saini pic.twitter.com/zTkoc24GC7— ANI (@ANI) October 17, 2024 పంచకులకు బీజేపీ, ఎన్డీయే పాలిత సీఎంలు చేరుకుంటున్నారు.ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అగ్రనేతలు హాజరుకానున్నారు. సైనీ రెండోసారి సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక.. బుధవారం పంచకులలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సైనీ.. బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.#WATCH | Panchkula: Haryana CM-designate Nayab Singh Saini says, "CMs, Deputy CMs and senior leaders of NDA will participate in the swearing-in ceremony today. After that, there will be a meeting of NDA leaders." pic.twitter.com/uSebe32S6s— ANI (@ANI) October 17, 2024 ఈనెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు నెగ్గి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలన్నీ అంచనా వేసిన కాంగ్రెస్ 37 స్థానాల వద్దే నిలిచిపోయింది.Haryana CM-designate Nayab Saini offers prayers at Valmiki Temple, says double engine government will take state forward at fast paceRea @ANI story | https://t.co/Uidj8lvTvK#Haryana #NayabSaini #BJP #NDA pic.twitter.com/nUlUyWdSCh— ANI Digital (@ani_digital) October 17, 2024 -
J&K: సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
Updates కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ తొలి ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణం చేశారు.శ్రీనగర్లోని షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కేఐసీసీ)లో జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సీఎంగా ఒమర్తో ప్రమాణం చేయించారు.#WATCH | Omar Abdullah takes oath as the Chief Minister of Jammu and Kashmir.The leaders from INDIA bloc including Lok Sabha LoP Rahul Gandhi, Congress leader Priyanka Gandhi Vadra, JKNC chief Farooq Abdullah, Samajwadi Party chief Akhilesh Yadav, PDP chief Mehbooba Mufti, AAP… pic.twitter.com/IA2ttvCwEJ— ANI (@ANI) October 16, 2024 ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇండియా కూటమి నేతలు.. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, ఎన్న్సీపీ-ఎస్స్పీ ఎంపీ సుప్రియా సూలే, సీపీఐ నేత డీ. రాజా హాజరయ్యారు.అంతకు ముందు.. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శ్రీనగర్ చేరుకున్నారు. #WATCH | Congress President Mallikarjun Kharge reaches Srinagar to attend the swearing-in ceremony of Omar Abdullah as the Chief Minister of Jammu and Kashmir. pic.twitter.com/3OCIoQKqMP— ANI (@ANI) October 16, 2024 ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శ్రీనగర్ చేరుకున్నారు. Rahul Gandhi, Priyanka Gandhi arrive in Srinagar to attend swearing-in ceremony of Omar AbdullahRead @ANI Story | https://t.co/u7dPfwgpJc#RahulGandhi #OmarAbdullah #PriyankaGandhi #SwearingInCeremony #JKChiefMinister pic.twitter.com/SRTlRKJ6N8— ANI Digital (@ani_digital) October 16, 2024 జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు.. నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ భారత ప్రభుత్వంతో సహకారంతో పనిచేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. అయితే ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సీఎంగా స్వంత హక్కు ఉంది. నేను విచిత్రమైన సవాళ్లను కలిగి ఉన్నా. పూర్తి ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసిన చివరి ముఖ్యమంత్రిని నేను. ఇప్పుడు నేను జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి ముఖ్యమంత్రిని అవుతాను. జమ్ము కశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం ద్వారా మా పాలన మొదలవుతుంది’’ అని అన్నారు.ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ఇప్పటికే ఇండియా కూటమి నేతలు.. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, ఎన్న్సీపీ-ఎస్స్పీ ఎంపీ సుప్రియా సూలే, సీపీఐ నేత డీ. రాజా చేరుకున్నారు. Samajwadi Party chief Akhilesh Yadav, DMK MP Kanimozhi Karunanidhi, NCP-SCP MP Supriya Sule and CPI leader D Raja in Srinagar to attend the swearing-in ceremony of J&K CM-designate Omar AbdullahOmar Abdullah to take oath as J&K CM today. (Pics: Akhilesh Yadav's social media… pic.twitter.com/TO4tSGzFmn— ANI (@ANI) October 16, 2024ఆర్టీకల్ 370 ఆర్టీకల్ రద్దు అనంతరం మొదటిసారిగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి విజయం సాధించడం తెలిసిందే. -
ఒమర్అబ్దుల్లా ప్రమాణ స్వీకార తేదీ ఖరారు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సీఎంగా నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకార తేదీ ఫైనల్ అయింది. తాను సీఎంగా బుధవారం (అక్టోబర్ 16) ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఈమేరకు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్సిన్హా నుంచి తనకు లేఖ అందిందని చెప్పారు.సీఎంగా ప్రమాణ స్వీకారానికి లేఖలో తనను ఆహ్వానించారన్నారు. జమ్ముకశ్మీర్లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాల అనంతరం ఇటీవలే జమ్ముకశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా అక్కడ రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది.దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.ఇదీ చదవండి: హిమాచల్లో రెండు డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు -
ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం నేడే
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకురాలు అతిషి ఇవాళ (శనివారం) ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు సీఎంగా అతిషితో సహా ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఢిల్లీ సీఎంగా అతిశి నియామకం సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం అతిషి సీఎం నియామకానికి సంబంధించి గెజిట్ విడుదల చేసింది. ఇక.. ఇవాళ జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.President Murmu officially appoints Atishi as Delhi CM; accepts Kejriwal's resignationRead @ANI Story | https://t.co/R278OnyQt6#DroupadiMurmu #Atishi #ArvindKejriwal pic.twitter.com/RwgGCmrHXn— ANI Digital (@ani_digital) September 20, 2024ఇటీవల ఢిల్లీ సీఎంగా రెండు రోజుల్లో అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తానని ప్రకటించారు. ప్రకటించిన విధంగానే ఆయన రాజీమానా చేసి.. తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా సీనియర్ నాయకురాలు అతిషిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ముందు ఆమెను శాసనసభా పక్షనేత ఎన్నుకున్నారు. అనంతరం ప్రమాణస్వీకార తేదీని ప్రతిపాదిస్తూ.. లెఫ్టినెంట్ గరర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాకు లేఖ అందజేశారు. ఇక.. ఢిల్లీకి అతిషి ఎనిమిదో సీఎం కానున్నారు. ఆమె ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్నారు. చదవండి: ప్రభుత్వ సలహాదారు నుంచి ప్రభుత్వాన్నే నడిపించేదాకా.. -
Bangladesh Political Crisis: బంగ్లా సారథిగా యూనుస్
ఢాకా: నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనుస్(84)ను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా నియమితులయ్యారు. ఈ హోదా ప్రధానమంత్రితో సమానమైనది. గురువారం అధ్యక్ష భవనం ‘బంగభవన్’లో అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ ఆయనతో ప్రమాణం చేయించారు. యూనుస్కు 16 మందితో కూడిన సలహాదారుల మండలి పాలనలో సహకరించనుంది. ఈ మండలికి ఎంపికైన వారిలో రిజర్వేషన్ కోటా ఉద్యమానికి నాయకత్వం వహించిన నాహిద్ ఇస్లాం, ఆసిఫ్ మహ్మూద్తోపాటు మహిళా హక్కుల కార్యకర్త ఫరీదా అఖ్తర్ తదితరులున్నారు. వీరితో కూడా అధ్యక్షుడు ప్రమాణం చేయించారు. పౌరులకు భద్రత కలి్పంచడానికి తన ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందుకు తనకు సాయపడాలని యూనుస్ ఈ సందర్భంగా అన్ని వర్గాల వారిని కోరారు. -
Muhammad Yunus: రేపే బంగ్లా తాత్కాలిక ప్రధానిగా ప్రమాణం
ఢాకా: బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం రేపే కోలువుదీరనుంది. నోబెల్ అవార్డు గ్రహీత డా.మహమ్మద్ యూనస్(84) ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుమారు 15 మంది మంత్రులతో కొత్త కేబినెట్ ఏర్పడనుంది. ఈ మేరకు బుధవారం ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ ఓ ప్రకటనలో తెలిపారు. రిజర్వేషన్ల కోటా నిరసనలు హింసాత్మకంగా మారటంతో అవామీ లీగ్ నేత షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం బంగ్లాదేశ్ ఆర్మీ పాలనలోకి వెళ్లింది. ఆపై అన్ని రాజకీయ పార్టీలు(అవామీ లీగ్ తప్ప), నిరసనల్లో ఉధృతంగా పాల్గొన్న విద్యార్థి సంఘాలతో సైన్యం చర్చలు జరిపింది. చివరకు.. మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక పాలన కొనసాగనుందని ఆర్మీ ప్రకటించింది. -
నేపాల్ ప్రధానిగా ఓలీ ప్రమాణం
కఠ్మాండు: నెలల వ్యవధిలో ప్రభుత్వాలు కూలి కొత్త ప్రభుత్వాలు కొలువుతీరే హిమాలయాల దేశం నేపాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్–యూనిఫైడ్ మార్కిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్–యూఎంఎల్) అధినేత కేపీ శర్మ ఓలీ ప్రధానిగా సోమవారం ప్రమాణం చేశారు. ప్రచండ నేతృత్వంలోని కమ్యూనిస్ట్పార్టీ ఆఫ్ నేపాల్ ప్రభుత్వానికి ఓలీ, షేర్ బహదూర్ దేవ్బా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించడంతో ఆయన విశ్వాసపరీక్షలో ఓడిపోవడం, ప్రధానిగా రాజీనామా చేయడం తెల్సిందే. దీంతో ఓలీ, దేవ్బా ఏడు అంశాలపై ఏకాభిప్రాయంతో కూటమిగా ఏర్పడి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. నేపాలీ రాజ్యాంగంలోని ఆరి్టకల్76–2 ప్రకారం ఓలీని నూతన ప్రధానిగా దేశాధ్యక్షుడు రామ్చంద్ర పౌడెల్ ఆదివారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఓలీ ప్రధానిగా ప్రమాణంచేశారు. ఓలీ ప్రధాని పదవి చేపట్టడం ఇది నాలుగోసారి కావడం విశేషం. సోమవారం కాఠ్మాండూలోని రాష్ట్రపతిభవన్(శీతల్ నివాస్)లో దేశాధ్యక్షుడు పౌడెల్ ఈయన చేత ప్రధానిగా ప్రమాణంచేయించారు. సుస్థిర సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని నెలకొల్పాలని ఆశించారు. కూటమిలోని నేపాలీ కాంగ్రెస్ నుంచి ఎవరెవరిని మంత్రివర్గంలోని తీసుకోవాలన్న విషయంలో భేదాభిప్రాయాలు పొడచూపడంతో ప్రమాణస్వీకార కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో నూతన ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయని ప్రపంచ పార్టీ విమర్శలు సంధించింది. కూటమిలో కీలక పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ భార్య అర్జో రాణా దేవ్బాకు విదేశాంగ మంత్రి పదవి కట్టబెట్టారు. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన 30 రోజుల్లోపు ఓలీ పార్లమెంట్లో బలపరీక్షలో నెగ్గాల్సి ఉంటుంది. -
Weekly Roundup : పార్లమెంట్ చిత్రం
18వ లోక్ సభ కొలువుదీరింది. పార్లమెంట్ తాత్కాలిక సమావేశాల్లో భాగంగా నూతనంగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార సమయంలో పలువురు ఎంపీలు చేసిన నినాదాలపై ఎన్డీయే కూటమి అభ్యంతరం వ్యక్తం చేసింది. 48 ఏళ్ల లోక్ సభ చరిత్రలో తొలి సారి స్పీకర్కు ఎన్నిక జరిగింది. స్పీకర్ ఓం బిర్లా ఎన్నిక, రాష్ట్రపతి ఎమర్జెన్సీపై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా నీట్ పరీక్ష పేపర్ లీక్పై చర్చ జరగాలని ప్రతి పక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉభయ సభలు హోరెత్తిరిపోవడంతో సోమవారానికి (జులై 1)కి వాయిదా పడ్డాయి. 18వ లోక్సభ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు ప్రధాని మోదీతో సహా 262 మంది ఎంపీలు ప్రమాణం చేశారు.ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, కన్నడ, తెలుగు, మరాఠీ ఇలా భారతీయ భాషలలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం వల్ల లోక్సభ భాషా వైవిధ్యాన్ని ప్రదర్శించింది.మోదీ ప్రమాణం చేసేటప్పుడు ఎన్డీయే నేతలు జైశ్రీరామ్ నినాదాలు చేశారు. అప్పుడు విపక్ష నేతలంతా లేచి రాజ్యాంగ ప్రతిని చూపించారు.ఏపీ నుంచి కేంద్రమంత్రిగాఉన్న రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ కు పంచె కట్టులో వెళ్లారు.రైతు నేత వీపీఐ (ఎం) ఆమ్రా రామ్ ట్రాక్టర్లో పార్లమెంట్ కు వచ్చారు.తీహార్ జైలులో ఉన్న బారాముల్లా స్వతంత్ర ఎంపీ, నిందితుడు అబ్దుల్లా రషీద్ షేక్ బెయిల్ దొరక్కపోవడంతో ప్రమాణం చేయలేకపోయారు.పార్లమెంట్ సమావేశాల తొలి రోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ హౌజ్కు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు సైకిల్పై చేరుకున్నారు. లోక్సభలో తొలిసారి అడుగుపెట్టిన అప్పలనాయుడు, ఢిల్లీలో తన అతిథి గృహం నుంచి సైకిల్పై పార్లమెంట్కు చేరుకున్నారు.ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ప్రమాణ స్వీకార సమయంలో నీట్ అంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. నీట్ ఫెయిల్డ్ మినిస్టర్ అని నినాదాలు చేశారు.రెండో రోజు ప్రమాణ స్వీకారాలు..రెండో రోజు 274 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.రెండో రోజు ప్రమాణ స్వీకారంలో భాగంగా స్వతంత్ర సభ్యుడు రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ ' నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి' అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన గోపీనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం. తాజాగా జరిగిన ఎన్నికల్లో క్రిష్ణగిరి ఎంపీగా గోపీనాథ్ 1,92, 486 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన జయప్రకాష్ పై గెలుపొంది పార్లమెంటులో అడుగు పెట్టారు.రెండో రోజు సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు.హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఉర్ధూలో ప్రమాణం చేస్తూ.. జై భీం, జై తెలంగాణ, జై పాలస్తీనా, అల్లాహో అక్బర్ అంటూ ప్రమాణం పూర్తి చేశారు. ఇక అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా నినాదం ఇవ్వడంపై పలువురు మంత్రులు, బీజేపి సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీనిపై సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తానని, నిబంధనలు పరిశీలించి.. రికార్డుల నుంచి తొలగించే విషయాన్ని పరిశీలిస్తానని సభ్యులకు సూచించారు.ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రమాణం చేసి.. 'జై హింద్, జై సంవిధాన్' అని నినదించారు. ఆయన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా సందర్శకుల గ్యాలరీ నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీదాదాపు పదేళ్ల తర్వాత లోక్సభలో విపక్ష పార్టీ సభ్యుడికి ప్రతిపక్ష నేత హోదా దక్కింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ బాధ్యతలు స్వీకరించారు. దీంతో కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలు పొందనున్నారు. లోక్సభలో విపక్ష కూటమికి నేతృత్వం వహించడమే కాకుండా.. ఈసీ, సీబీఐ, ఈడీ వంటి ప్రభుత్వ సంస్థలకు బాస్ల నియామకంలో కీలక భూమిక పోషించనున్నారు.2014, 2019లలో మొత్తం సీట్లలో 10 శాతం దక్కించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే అవకాశం ఎవరికీ రాలేదు. దీంతో రెండుసార్లు ప్రతిపక్ష సభ్యుడి హోదా ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈసారి 99 సీట్లను గెలుచుకోవడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్కు ఆ హోదా దక్కింది. మూడో రోజు సమావేశాల్లో మూజూవాణి ఓటు ద్వారా బుధవారం స్పీకర్గా ఓం బిర్లా రెండోసారి ఎన్నిక అయ్యారు.అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల లోక్ సభ చరిత్రలో తొలి సారి స్పీకర్ కు ఎన్నిక జరిగింది. మూజువాణి ఓటుతో ఎన్డీయే స్పీకర్ అభ్యర్థి కోట ఎంపీ మరోసారి స్పీకర్గా ఎన్నిక అయ్యారు.స్పీకర్ తొలి ప్రసంగంలో ఎమర్జెన్సీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యంతం తెలపగా.. ఎన్డీయే ఎంపీలు అనుకూలంగా నినాదాలు చేశారు. రాష్ట్రపతి నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 1975 నాటి ఎమర్జెన్సీ రోజుల్ని ప్రస్తావించారు.మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు 61 ఏళ్ళ ఓం బిర్లాను స్పీకర్ స్థానం వరకు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు.స్పీకర్ ఎన్నిక అయ్యక బిర్లాను పోడియం వరకు తీసుకువెళ్లే సందర్భంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిర్లాను అభినందించే క్రమంలో మోదీ, రాహుల్ కరచాలనం చేసుకున్నారు.స్పీకర్ ఎన్నిక సందర్భంగా రాహుల్ సరికొత్త వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. తెలుపు రంగు లాల్చీ పైజామ ధరించి లోక్ సభకు వచ్చారు.స్పీకర్ బాధ్యతలు చెబడుతూనే ఓం బిర్లా తీసుకున్న తొలి నిర్ణయం లోక్ సభ కాక రేపింది.1975 నాటి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధానాన్ని ఖండిస్తూ స్పీకర్ స్వయంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఎమర్జెన్సీ ప్రస్తావన నిరసిస్తూ ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉభయ సభలను ఉదేశిస్తూ ప్రసంగించారు. ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. రాజ్యాంగంపై దాడి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఎమర్జెన్సీ అంశాన్ని చొప్పించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.రాష్ట్రపతి ప్రసంగం పూర్తిగా ప్రభుత్వ స్క్రిప్ట్. తప్పుల తడక అని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. చివరికి రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ఎమర్జెన్సీ ప్రస్తావన తీసుకురావడం సిగ్గుచేటు. నిజానికి మోదీ పదేళ్ల పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని విపక్షాలు దుయ్యబట్టాయి. ప్రధాని మోదీ మంత్రి వర్గ సభ్యులను ఎగువ సభకు పరిచయం చేశారు.పార్లమెంట్ లో నీట్ రగడ..శుక్రవారం నీట్ పరీక్ష లో అక్రమాలపై వెంటనే చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్ సభ స్పీకర్ , రాజ్య సభలో చైర్మన్ అంగీకరించలేదు. దీంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.నీట్ పరీక్షపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఎందుకు వెనకంజ వేస్తోందని రాజ్య సభలో విపక్షాలు నిలదీశాయి. నీట్పై చర్చించాలని 22 నోటీసులు వచ్చాయని, వాటిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్లోకి దూసుకువెళ్లారు. బిగ్గరగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. రాజ్య సభ మూడు సార్లు వాయిదా పడింది.ప్రతి పక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం వెల్లోకి దూసుకురావటంపై రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు చేశారు. అనంతరం నీట్ రగడ నడుమ ఉభయ సభలు సోమవారానికి (జులై 1) వాయిదా పడ్డాయి. -
Parliament Session: లోక్సభ ఎంపీల ప్రమాణ స్వీకారం
పార్లమెంట్ సమావేశాలు.. అప్డేట్స్ ఏపీ నుంచి వైఎస్సార్సీపీ నాయకురాలు గుమ్మా తనుజా రాణి హిందీలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.మీ అందరి ఆశీస్సులతో.. జగనన్న దీవెనలతో ఈరోజు పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.. pic.twitter.com/DqRcsYMdc5— Dr Gumma Thanuja Rani (@ArakuPalguna) June 24, 2024 పార్లమెంట్ భవనం మెట్లు దిగుతూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్.. అక్కడే ఉన్న కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్, కె.సురేష్ను ఆప్యాయంగా పలికరించారు.#WATCH | Delhi: Congress MPs KC Venugopal and K Suresh, and Union Minister-BJP MP Giriraj Singh share a candid moment on the staircase of the new Parliament building. pic.twitter.com/po1LQqqJLg— ANI (@ANI) June 24, 2024 తెలుగులో బండి సంజయ్ ప్రమాణంతెలంగాణ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలుగులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Ministers Bandi Sanjay Kumar and Sukanta Majumdar take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/re8wf295RF— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రులు జి. కిషన్రెడ్డి, చిరాగ్ పాశ్వాన్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Ministers G Kishan Reddy and Chirag Paswan take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/aUiSfimQyU— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, గజేంద్ర షెకావత్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Ministers Bhupender Yadav and Gajendra Singh Shekhawat take oath as members of the 18th Lok Sabha. pic.twitter.com/BAXUduVIVt— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Union Minister and BJP MP Dharmendra Pradhan takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/9rcS4OSwkj— ANI (@ANI) June 24, 2024 ఏపీ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister Ram Mohan Naidu Kinjarapu takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/d3E1DC8Yjw— ANI (@ANI) June 24, 2024 లోక్సభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister and BJP MP Piyush Goyal takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/Ls4hhIIDbb— ANI (@ANI) June 24, 2024 కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister Shivraj Singh Chouhan takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/nZpQ0GGxmz— ANI (@ANI) June 24, 2024 కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 18 లోక్సభ పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.Union Minister Nitin Gadkari takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/XMLofSCdX8— ANI (@ANI) June 24, 2024 అమిత్ షా ఎంపీగా ప్రమాణంహోంమంత్రి అమిత్ షా ఎంపీగా లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Union Home Minister Amit Shah takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/3rlhhGKLbJ— ANI (@ANI) June 24, 2024 రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | Defence Minister Rajnath Singh takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/GDJFlyqkth— ANI (@ANI) June 24, 2024 ఎంపీగా మోదీ ప్రమాణంమొదటగా నరేంద్ర మోదీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత లోక్సభ ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్ ఎంపీ ప్రమాణం చేయించారు.#WATCH | Prime Minister Narendra Modi takes oath as a member of the 18th Lok Sabha. pic.twitter.com/3tjFrbOCJ0— ANI (@ANI) June 24, 2024 రాహుల్ గాంధీ వయనాడ్ స్థానం రాజీనామాను ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఆమోదించారు.Pro-tem Speaker Bhartruhari Mahtab accepts the resignation of Congress leader Rahul Gandhi from Wayanad Lok Sabha seat.Rahul Gandhi kept the Raebareli Lok Sabha seat. pic.twitter.com/rFoya8nCJb— ANI (@ANI) June 24, 2024 పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. ప్రారంభమైన 18వ లోక్సభప్రమాణం చేయనున్న ఎంపీలులోక్సభ ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్మొదట ఎంపీగా ప్రమాణం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీపార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో ప్రధాని మోదీఇది చాలా పవిత్రమైన రోజుఎంపీలందరికీ స్వాగతం పలుకుతున్నాఎంపీలు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలిమాకు మూడోసారి వరుసగా సేవ చేసేందుకు అవకాశం ఇచ్చారు10 ఏళ్లలో దేశాభివృద్ధికి కృషి చేశామూడోసారి ప్రధానిగా ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు దక్కిందికొత్త లక్ష్యాలు చేరుకోవడానికి మనమంతా కృషి చేయాలివికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి#WATCH | PM Narendra Modi says, "...The 18th Lok Sabha is starting today. The world's largest election was conducted in a very grand and glorious manner... This election has also become very important because for the second time after independence, the people of the country have… pic.twitter.com/bASHVtfh3S— ANI (@ANI) June 24, 2024 ఆ ఖర్మ నాకు పట్టలేదు: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డివైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు, రాజంపేట ప్రజల మద్దతుతో మూడోసారి ఎంపీ ఎన్నికయ్యాహ్యాట్రిక్ విజయాలతో పార్లమెంట్లు అడుగుపెట్టడం సంతోషంగా ఉందిమా పార్టీ అధినేత వైయస్ జగన్కు ధన్యవాదాలురాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంట్లో పని చేస్తాజాతీయ, రాష్ట్ర ప్రయోజనాల ఉండే బిల్లులకు మద్దతిస్తాంరాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే వ్యతిరేకిస్తాం బీజేపీలో చేరాల్సిన కర్మ నాకు పట్టలేదుకూటమినేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారుగతంలో నేను విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే బీజేపీలో చేరుతారని ప్రచారం చేశారువైయస్ జగన్మోహన్ రెడ్డి నన్ను సొంత తమ్ముడిలా భావిస్తారువైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం సాధించే వరకు కష్టపడతారాజంపేటలో అత్యధిక రోడ్లు వేయించిన ఘనత మాదేసాక్షి టీవీతో ఎంపీ మిథున్ రెడ్డి మరికాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంఎంపీలుగా ప్రమాణం చేయనున్న సభ్యులుప్రధాని మోదీ సహా 280 మంది ప్రమాణంమోదీ తర్వాత కేంద్ర మంత్రులుఆ తర్వాత ఇంగ్లీష్ అక్షర క్రమంలో ఒక్కొక్కరుగా సభ్యుల ప్రమాణంనేడు ఏపీ, రేపు తెలంగాణ ఎంపీల ప్రమాణంప్రొటెం స్పీకర్గా భర్తృహరి మెహతాబ్ ప్రమాణంలోక్సభ ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేసిన భర్తృహరి మెహతాబ్భర్తృహరితో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము#WATCH | Delhi: BJP MP Bhartruhari Mahtab takes oath as pro-tem Speaker of the 18th Lok SabhaPresident Droupadi Murmu administers the oath pic.twitter.com/VGoL5PGEkT— ANI (@ANI) June 24, 2024ఎన్డీయే అలా ముందుకు..పార్లమెంట్ సమావేశాలు సజావుగా నిర్వహించాలని భావిస్తున్న ఎన్డీయేసభా కార్యకలాపాలకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరే అవకాశంస్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కోరనున్న బీజేపీ అగ్రనేతఅమిత్ షా లేదంటే రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యే ఛాన్స్ ఐక్యంగా ఇండియా కూటమిపార్లమెంట్ సమావేశాల తొలిరోజే ఐక్యత చాటాలని ఇండియా కూటమి నిర్ణయంగతంలో గాంధీ విగ్రహం ఉన్న గేట్-2 వద్ద భేటీఐక్యంగా పార్లమెంట్లోకి ఎంట్రీప్రొటెం స్పీకర్ ఎంపిక నిర్ణయంపై నిరసన తెలిపే అవకాశంనీట్పైనా కేంద్ర ప్రభుత్వాన్నినిలదీసే ఛాన్స్సంబంధిత వార్త: ప్రొటెం స్పీకర్కు ఇండియా కూటమి సహాయ నిరాకరణ?! కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మెహతాబ్ ప్రమాణం18వ లోక్సభ తొలి సమావేశంనేడు, రేపు ఎంపీలుగా సభ్యుల ప్రమాణ స్వీకారంసభ్యులతో ప్రమాణం చేయించనున్న ప్రొటెం స్పీకర్ఎల్లుండి స్పీకర్ ఎన్నికడిప్యూటీ స్పీకర్ పోస్టు ఉంటుందా? ఉండదా?.. ఉంటే ఎవరికి వెళ్తుంది? అనే దానిపై చర్చ27న ఉభయ సభల సభ్యుల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం -
నేటి నుంచి పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. 18వ లోక్సభకు ఎన్నికైన సభ్యులు సోమవారం, మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి వారితో మెహతాబ్ ప్రమాణం చేయిస్తారు. తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ప్రొటెం స్పీకర్గా భర్తృహరితో ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం తొలుత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ తర్వాత సీనియారిటీ ఆధారంగా మంత్రులు, ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఆంగ్ల వర్ణక్రమంలో రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. బుధవారం లోక్సభ సభ్యులందరూ కలిసి నూతన స్పీకర్ను ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం వచ్చే నెల 3వ తేదీన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ముగియనున్నాయి. వర్షాకాల సమావేశాలు జూలై 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. స్పీకర్గా మళ్లీ ఓం బిర్లా! ప్రొటెం స్పీకర్ ప్యానెల్లో ఉండడానికి విపక్ష నేతలు విముఖత చూపడంతో స్పీకర్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారి స్పీకర్ పదవిని ఎన్డీయేలో బీజేపీయేతర పక్షాలకు కేటాయిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు మిత్రపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో బీజేపీ నాయకత్వం స్పీకర్ పదవిని ఇతరులకు ఇచ్చే అవకాశం తక్కువేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్పీకర్ పదవిని మహిళలకు కేటాయించే పక్షంలో గుజరాత్కు చెందిన పూనంబెన్, ఆంధ్రప్రదేశ్కు చెందిన దగ్గుబాటి పురందేశ్వరి పేర్లు వినిపిస్తున్నాయి. గత లోక్సభను తనదైన రీతిలో ముందుకు నడిపించిన ఓం బిర్లా పేరు కూడా తెరపైకి వచి్చంది. గత లోక్సభలో విపక్ష సభ్యులు తక్కువైనప్పటికీ వారు వినిపించిన ప్రభుత్వ వ్యతిరేక గళం అధికార పక్షంపై ప్రభావం చూపకుండా సభను నడిపించడంలో ఓం బిర్లా చాతుర్యం చూపించారు. -
అమిత్ షా-తమిళిసై మధ్య అసలేం జరిగింది!
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికపై ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. బీజేపీ అగ్రనేత అమిత్ షా ఆ పార్టీ మహిళా నేత తమిళిసై సౌందరరాజన్ మధ్య జరిగిన సన్నివేశమది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ కూడా హాజరయ్యారు. అక్కడే వేదిక మీద ఉన్న బీజేపీ పెద్దలకు నమస్కారం చేసి ముందుకు వెళ్లబోయారు. అయితే.. కేంద్ర మంత్రి అమిత్ షా ఆమెను వెనక్కి పిలిచారు. ఒక్కసారిగా ఆమెపై సీరియస్ అయ్యారు. తమిళిసై ఏదో చెప్పబోతుండగా.. అడ్డుకుని మరీ అమిత్ షా ఆమెను ఏదో వారించినట్లు ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అన్నామలై తో పంచాయతీ బంద్ చెయ్ అంటున్నాడా ?? pic.twitter.com/NVeTII7Sxl— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) June 12, 2024తమిళిసైకి, కేంద్ర మంత్రి అమిత్ షాకి మధ్య అసలు ఏం జరిగింది?. ఆమెపై కేంద్రమంత్రి అమిత్ షా ఎందుకు అంత సీరియస్ అయ్యారని షోషల్మీడియాలో చర్చ జరుగుతోంది.ఇటీవల లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలైతో పాటు తమిళిసై కూడా ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే ఆమె అన్నామలైకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా పంచాయితీలు పెట్టొద్దంటూ ఆమెను వారించి ఉంటారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై బీజేపీ స్పందిస్తేనే అసలేం జరిగిందనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
చంద్రబాబు ప్రమాణస్వీకారం.. హాజరైన ప్రముఖులు
-
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. బుధవారం ఉదయం గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు చేత సీఎంగా ప్రమాణం చేయించారు. ఏపీ ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు.. ప్రధాని మోదీ సమక్షంలో ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును ప్రధాని మోదీ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత వరుసగా కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్, చంద్రబాబు తనయుడు.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు.. .. కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్(జనసేన), పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్(బీజేపీ), నిమ్మల రామానాయుడు, మహ్మద్ ఫరూఖ్, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, బాల వీరాంజనేయ స్వామి, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డి బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్(జనసేన), గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్ధన్రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్రెడ్డి.. ఒకరి తర్వాత ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులందరూ ప్రమాణం చేసిన తర్వాత ప్రధాని మోదీ, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, చంద్రబాబు కొత్త కేబినెట్తో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులు, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై తదితర మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు మాజీ సీజే ఎన్వీ రమణ, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ, మూడు పార్టీల కీలక నేతలు హాజరయ్యారు. సినీ రంగం నుంచి చిరంజీవి, రజినీకాంత్, నారా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఈ కార్యక్రమంలో పాల్గొంది. తమిళిసైకి షా వార్నింగ్చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం వేదికగా ఆసక్తికరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా.. ఆ పార్టీ తమిళనాడు నేత తమిళిసైని దగ్గరకు పిలిచి మరీ ఏదో సీరియస్గా మాట్లాడారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయంపైనే ఆయన అంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఉంటున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.మెగా బ్రదర్స్తో మోదీ సందడిప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక వేదికపై కాసేపు సందడి వాతావరణం నెలకొంది. తన దగ్గరకు వచ్చిన పవన్ను ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని మోదీ. కాస్త దూరంలో ఉన్న ఆయన సోదరుడు చిరంజీవి దగ్గరకు తీసుకొచ్చి.. ఇద్దరి చేతులు పైకి ఎత్తి అభివాదం చేశారు. ఆ తర్వాత ఇద్దరికి దగ్గరకు తీసుకుని కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్ షా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రామ్మోహన్ నాయుడికి చిరు ఆత్మీయ ఆలింగనంవేదికపైకి చేరుకున్న రజినీకాంత్రజినీకాంత్ దంపతులతో నందమూరి బాలకృష్ణ➡️ కేసరపల్లి వేదికపైకి చేరుకున్న తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం➡️ వేదికపైకి చేరుకున్న నందమూరి బాలకృష్ణ.. అతిథుల్ని ఆహ్వానిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే➡️ పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో బస్సులో కేసరపల్లికి బయల్దేరిన మెగా ఫ్యామిలీపవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో బస్సులో కేసరపల్లికి బయల్దేరిన మెగా ఫ్యామిలీ ఇదీ చదవండి: ఏపీ కొత్త మంత్రుల పూర్తి జాబితా ఇదే -
ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
-
ఏపీలో స్కూల్స్ రీ-ఓపెన్ తేదీ పొడిగింపు ఉత్తర్వులు జారీ
అమరావతి, సాక్షి: వేసవి సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్లోని అన్ని పాఠశాలల పునఃప్రారంభ తేదీని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో రేపు కాకుండా.. ఎల్లుండి(జూన్13న) పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఏటా జూన్ 12 వ తేదీన పాఠశాలలు తెరుచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో ఒక్కరోజు సెలవును పొడిగించింది విద్యాశాఖ. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉండగా.. ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో..కంగనా దేశీ లుక్ అదుర్స్!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకుంది. హిమాచల్ ప్రదేశ్లోని మండి స్థానంలో బీజేపీ తరఫున పోటీ చేసిన కంగనా తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్పై 72,088 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె రాజకీయనాయకురాలిగా తన ప్రస్థానం మొదలుపెట్టనుంది. ముచ్చగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ జూన్ 9న ప్రమమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో కంగనా రనౌత్ సరికొత్త స్టన్నింగ్ లుక్లో కనిపించింది. ఆమె నిజమైన బంగారం, వెండితో నేసిన చీరలో తళుక్కుమంది. అందుకు తగట్టు ధరించిన నగలతో అందర్నీ ఆకర్షిచింది. రాజకీయనాయకురాలిగా హుందాగా కనిపించేలా సరికొత్త దేశీ స్టయిల్ని అనుసరిస్తోంది. My oath day look, howz it ? 🙂 pic.twitter.com/VgKGJof69S— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) June 9, 2024ఈ వేడుక కోసం చేనేత చీర, అమ్రపాల జ్యువెలరీస్ని ఎంపిక చేసుకుంది కంగనా. లైట్ మేకప్తో వెరైటీ హెయర్ స్టయిల్తో సరికొత్త లుక్లో కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖేష్ అంబానీ, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ తదితర ప్రముఖులు కూడా హాజరయ్యారు.(చదవండి: ఇలాంటి బంపర్ ఆఫర్ ఇస్తే..బరువు తగ్గడం ఖాయం!) -
తొలిసారి కేంద్రమంత్రి పదవి చేపట్టిన వారిలో పలువురి విశేషాలు...
‘మామ’కు తొలిసారి కేంద్ర మంత్రి పదవి నాలుగు సార్లు మధ్యప్రదేశ్ సీఎంగా చేసిన బీజేపీ సీనియర్ నేత ‘మామ’ శివరాజ్సింగ్ చౌహాన్కు తొలిసారి కేంద్ర మంత్రి పదవి దక్కింది. 1977లో ఆర్ఎస్ఎస్లో వాలంటీర్గా చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ఆరు సార్లు ఎంపీగా గెలిచారు. సీఎంగా రైతులు, మహిళలు, గ్రామీణ ప్రజల అభివృద్ధికి పెద్దపీట వేశారు. మృదు స్వభావి. నిరాడంబర నాయకుడు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో బీజేపీకి బంపర్ మెజారిటీ సాధించినా సీఎంగా కొనసాగింపు దక్కలేదు. ఆయనను పూర్తిగా పక్కన పెడతారన్న ప్రచారానికి భిన్నంగా కేంద్ర మంత్రి పదవి దక్కడం విశేషం.నడ్డా.. వివాదాలకు దూరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు 63 ఏళ్ల జగత్ ప్రకాశ్ నడ్డా హిమాచల్ ప్రదేశ్ నుంచి కేబినెట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక నాయకుడు. ఏబీవీపీలో చురుగ్గా పనిచేశారు. బీజేపీలో పలు హోదాల్లో పలు రాష్ట్రాల్లో పనిచేశారు. 2012లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. మోదీ తొలి కేబినెట్లో 2014 నుంచి 2019 దాకా ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. 2020లో బీజేపీ అధ్యక్షుడయ్యారు. వివాదరహితుడు.మోదీ సన్నిహితుడిగా పదవీ యోగం గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు 69 ఏళ్ల చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్కు అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి లభించింది. నాలుగోసారి ఎంపీగా నెగ్గారు. ఈసారి ఏకంగా 7.73 లక్షల మెజారీ్ట సాధించారు. మహారాష్ట్రలో జని్మంచిన పాటిల్ గుజరాత్లో బీజేపీకి సారథ్యం వహించడం విశేషం. కానిస్టేబుల్గా చేసిన ఆయన 1989లో బీజేపీలో చేరారు. 1991లో నవగుజరాత్ అనే పత్రికను స్థాపించారు. 1995 నుంచి మోదీతో సాన్నిహిత్యముంది. సామాన్యులకు నిత్యం అందుబాటులో ఉంటారు.బిహార్ దళిత తేజం లోక్జనశక్తి పారీ్ట(రామ్విలాస్) పార్టీ చీఫ్, దళిత నాయకుడు చిరాగ్ పాశ్వాన్ తన తండ్రి, దివంగత రామ్విలాస్ పాశ్వాన్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బిహార్లో ఐదుకు ఐదు ఎంపీ స్థానాలూ గెలుచుకున్నారు. 41 ఏళ్ల చిరాగ్ 2011లో ఓ హిందీ సినిమాలో నటించారు. అందులో హీరోయిన్ ఈసారి బీజేపీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచిన బాలీవుడ్ నటి కంగానా రనౌత్ కావడం విశేషం. చిరాగ్కా రోజ్గార్ సంస్థ ద్వారా బిహార్ యువతకు ఉపాధి కలి్పంచేందుకు చిరాగ్ కృషి చేస్తున్నారు.యాక్షన్ హీరో మాస్ ఎంట్రీ ప్రముఖ మలయాళ యాక్షన్ హీరో 65 ఏళ్ల సురేశ్ గోపి తన సొంత రాష్ట్ర కేరళలో బీజేపీ తరఫున గెలిచిన తొలి ఎంపీగా చరిత్ర సృష్టించారు. అలా మాస్ ఎంట్రీ ఇచ్చి, అదే ఊపులో కేంద్ర మంత్రి అయ్యారు! ఆయన వామపక్షాలు, కాంగ్రెస్కు పట్టున్న త్రిసూర్ లోక్సభ స్థానంలో 2019 లోక్సబ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా పట్టు విడవకుండా ఈసారి గెలవడం విశేషం. బీజేపీతో ఆయనకు చాలా ఏళ్లుగా అనుబంధం ఉంది. మోదీ, అమిత్ షాలకు సన్నిహితుడు. 2016లో రాజ్యసభకు నామినేటయ్యారు. ‘మోదీ ఆదేశిస్తారు, నేను పాటిస్తా’ అంటారు సురేశ్ గోపి. బిహార్ ఈబీసీ నేత ప్రముఖ సోషలిస్టు నాయకుడు, భారతరత్న కర్పూరి ఠాకూర్ కుమారుడైన రామ్నాథ్ ఠాకూర్ మోదీ మంత్రివర్గంలో చేరారు. జేడీ(యూ) అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్కు ఆయన సన్నిహితుడు. ప్రముఖ ఈబీసీ నాయకుడిగా ఎదిగారు. 74 ఏళ్ల రామ్నాథ్ 2014 ఏప్రిల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన తండ్రి కర్పూరి ఠాకూర్ రెండు సార్లు బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.ప్రతాప్ జాదవ్64 ఏళ్ల జాదవ్కు శివసేన కోటాలో చోటు దక్కింది. నాలుగుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీగా లోక్సభలో పలు చర్చల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు.ఒకప్పటి చురుకైన విద్యార్థి నేత..సంజయ్ సేథ్ (64) జార్ఖండ్కు చెందిన వ్యాపారవేత్త. 1976లో ఏబీవీపీ నేతగా ప్రస్థానం ప్రారంభించి అనేక సమస్యలపై జైలుకూ వెళ్లారు. ఈయనను 2016లో జార్ఖండ్ ప్రభుత్వం ఖాదీ గ్రామోద్యోగ్ బోర్డు చైర్మన్గా నియమించడం వివాదానికి దారి తీసింది. 2019లో తొలిసారి రాంచీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేత సుబోధ్ కాంత్ సహాయ్ను, తాజా ఎన్నికల్లో ఆయన కుమార్తె యశస్వినిని ఓడించారు!గిరిజన నేత ఉయికెమధ్యప్రదేశ్కు చెందిన గిరిజన నేత దుర్గా దాస్ ఉయికె(58). తాజా ఎన్నికల్లో బెతుల్(ఎస్టీ) నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున వరుసగా రెండోసారి లోక్సభకు ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే స్కూల్లో ఈయన టీచర్గా పనిచేసేవారు. 2019లో బీజేపీలో చేరి మొదటిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్కు చెందిన రాము టెకంపై 3.79 లక్షల మెజారిటీతో విజయం సాధించారు. కుల సమీకరణాల ఆధారంగానే తాజాగా కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఈయన్ను వరించిందని భావిస్తున్నారు. రెండుసార్లు సీఎం.. నేడు కేంద్ర మంత్రిమాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ కుమారుడు కుమారస్వామి (64). ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ, కాంగ్రెస్లతో వేర్వేరుగా జట్టుకట్టి రెండుసార్లు కర్నాటక సీఎంగా చేశారు. జేడీఎస్ అధ్యక్షుడు. కర్ణాటకలోని పలుకుబడి గత వొక్కలిగ వర్గానికి చెందిన నేత. సినిమాలంటే తెగపిచ్చి. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని చెబుతుంటారు!వీరేంద్ర కుమార్మధ్యప్రదేశ్లో షెడ్యూల్డ్ కులానికి చెందిన బీజేపీ సీనియర్ నేత వీరేంద్ర కుమార్(70). ఎనిమిదిసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. చిన్నతనంలో తండ్రి నడిపే సైకిల్ షాపులో పంక్చర్లు వేశారు. అంచెలంచెలుగా ఎదిగి బాల కార్మికుల వెతలే అంశంగా పీహెచ్డీ చేయడం విశేషం. 2017లో మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో 16 నెలలపాటు జైలు శిక్ష అనుభవించారు. ఇప్పటికీ సొంతూళ్లో స్కూటర్పై తిరుగుతూ సైకిల్ రిపేర్ దుకాణదారులతో ముచ్చటిస్తుంటారు.మాంఝీకి దక్కిన ఫలితంబిహార్ రాజకీయాల్లో సుపరిచితుడు జితన్ రాం మాంఝీ(80). మాజీ సీఎం. హిందుస్తానీ ఆవామ్ మోర్చా(సెక్యులర్) వ్యవస్థాపకుడు. 2014 నితీశ్ కుమార్ వైదొలగడంతో సీఎం అయినా ఆయనతో విభేదాలతో కొద్దినెలలకే తప్పుకుని సొంత పార్టీ పెట్టారు. కాంగ్రెస్తో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం జనతాదళ్, ఆర్జేడీ, జేడీయూల్లో సాగింది.టంటా.. ఉత్తరాఖండ్ సీనియర్ నేతఉత్తరాఖండ్కు చెందిన సీనియర్ బీజేపీ ఎంపీ అజయ్ టంటా(51). అల్మోరా నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. అంతకుపూర్వం, 2009లో తన చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ నేత ప్రదీప్ టంటా చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత 2014, 2019, 2024 ఎన్నికల్లో ప్రదీప్పై వరుస విజయాలు సాధించడం గమనార్హం. 2014లో టెక్స్టైల్స్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2007, 2012 ఎన్నికల్లో రెండుసార్లు రాష్ట్ర శాసనసభకు సైతం ఎన్నికయ్యారు. 2007లో రాష్ట్రమంత్రిగా ఉన్నారు. 23 ఏళ్లకే రాజకీయాల్లోకి ప్రవేశించి పంచాయతీ స్థాయిలో చురుగ్గా అనేక ఏళ్లపాటు పనిచేశారు. వివాదరహితుడిగా, స్వచ్ఛమైన నేతగా పేరుంది.ఖట్టర్.. ప్రచారక్ నుంచి కేంద్ర మంత్రి 1977లో ఆర్ఎస్ఎస్ శాశ్వత సభ్యుడిగా మారిన మనోహర్ లాల్ ఖట్టర్(70)కు ఆ సంస్థతో దాదాపు 40 ఏళ్ల అనుబంధం ఉంది. బ్రహ్మచారి. మోదీకి సన్నిహితునిగా పేరుంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈయన 2014లో హరియాణా సీఎం అయ్యారు. పదేళ్ల అనంతరం గత మార్చిలో నాయబ్ సింగ్ సైనీకి బాధ్యతలు అప్పగించారు. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి ఈయన కుటుంబం వలస వచ్చి 1954లో హరియాణాలోని రొహ్తక్ జిల్లా నిందానలో స్థిరపడింది.ఓరం.. ఒడిశా గిరిజన నేత63 ఏళ్ల జువల్ ఓరమ్ఒడిశాలో గిరిజన నేతగా ఎంతో పేరుంది. వాజ్పేయీ కేబినెట్లో గిరిజన సంక్షేమ శాఖకు తొలి మంత్రిగా చరిత్ర నెలకొల్పారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. మూడుసార్లు ఒడిశా బీజేపీ చీఫ్గా చేశారు.రాజీవ్ రతన్ సింగ్ ‘లలన్’లలన్ సింగ్గా సుపరిచితుడు. 69 ఏళ్ల ఈ నేత బిహార్లో పలుకుబడి కలిగిన భూమిహార్ వర్గానికి చెందిన నేత. నితీశ్ కుమార్కు అత్యంత సన్నిహితుడు. 2009, 2019, 2024 ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ రాజ్యసభకు నితీశ్ కుమార్ ఈయన్ను జేడీయూ తరఫున నామినేట్ చేశారు.జిల్లా పంచాయతీ సభ్యురాలి నుంచి కేంద్రమంత్రిగాఇటీవలి ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని ధార్ లోక్సభ నియోజకవర్గం(ఎస్టీ)నుంచి సావిత్రీ ఠాకూర్(46) ఎన్నికయ్యారు. 2003లో మొదటిసారిగా జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఈమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. పార్టీలో వివిధ పదవులను రాష్ట్రం, జాతీయ స్థాయిలో నిర్వహించిన సావిత్రీ ఠాకూర్ మధ్యప్రదేశ్లో ప్రముఖ గిరిజన మహిళా నేతగా ఎదిగారు. 2014లో మొదటిసారిగా లోక్సభకు ఎన్నికయ్యారు. 2019లో బీజేపీ ఆమెకు టిక్కెటివ్వలేదు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాధేశ్యామ్ మువెల్పై 2.18లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. రెండుసార్లు భావ్నగర్ మేయర్..తాజా లోక్సభకు గుజరాత్ నుంచి ఎన్నికైన ముగ్గురు మహిళల్లో నిముబెన్ బంభానియా(57) ఒకరు. భావ్నగర్ నుంచి ఆప్ అభ్యర్థి ఉమేశ్ మక్వానాపై 4.55 లక్షల భారీ మెజారిటీతో ఈమె విజయం సాధించారు. 2009–10, 2015–18 సంవత్సరాల్లో భావ్నగర్ మేయర్గా రెండు సార్లు పనిచేశారు. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలిగా 2013 నుంచి 2021 వరకు బాధ్యతల్లో ఉన్నారు. కోలి వర్గానికి చెందిన మాజీ ఉపాధ్యాయిని అయిన నిముబెన్ 2004లో బీజేపీ కండువా కప్పుకున్నారు. అదే ఏడాదిలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది రాజకీయ జీవితం ప్రారంభించారు.సినీ నిర్మాత.. రాజకీయ నేతరెండు సాంస్కృతిక మేగజీన్లకు ఎడిటర్గా ఉన్న పబిత్రా మర్ఘెరిటా(49)..అస్సామీస్ ఫీచర్, షార్ట్ ఫిల్మ్లను నిర్మించారు. జున్బాయ్ సిరీస్తో తీసిన తక్కువ నిడివి కలిగిన చిత్రాలకు ఎంతో పేరు వచ్చింది. ఈయన నటించిన ఫీచర్ ఫిల్మ్ ‘మొన్ జాయ్’ పలువురి ప్రశంసలు అందుకుంది. ప్రముఖ అస్సామీ నటి గాయత్రి మహంతాను పెళ్లి చేసుకున్నారు. 2014లో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2022 మార్చిలో రాజ్యసభకు ఎన్నికయ్యారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం - ఆనంద్ మహీంద్రా ట్వీట్
'నరేంద్ర మోదీ' భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. దీనిని ఉద్దేశించి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అతి పెద్ద ఎన్నికలు జరగడం, ఎలాంటి ఆటంకాలు లేకుండా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం గర్వించదగ్గ విషయం. తమ ముఖ్యమైన ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నందుకు భారతీయ ఓటర్లకు అభినందనలు. మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ జీకి అభినందనలు. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వేల సంఖ్యలో లైక్స్ పొందిన ఈ ట్వీట్ మీద పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. దేశ ప్రధానికి శుభాకంక్షాలు చెబుతున్నారు.दुनिया के सबसे बड़े लोकतंत्र में इतिहास के सबसे बड़े चुनाव होना और बिना किसी बाधा के नए सरकार का गठन होना गर्व की बात है। भारतीय मतदाताओं को अपने महत्वपूर्ण लोकतांत्रिक अधिकार का प्रयोग करने के लिए बधाई।नरेंद्र मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनने पर शुभकामनाएं। आशा है कि… pic.twitter.com/t6ylld6FNM— anand mahindra (@anandmahindra) June 9, 2024 -
మోదీ ప్రమాణా స్వీకారోత్సవానికి అతిధులుగా మహిళా లోకో పైలట్లు!
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ ముచ్చటగా మూడోసారి దేశానికి ప్రధాని కాబోతున్నారు. ఈ స్వీకారోత్సవానికి దాదాపు ఎనిమిది వేల మందికి పైగా అతిథులు హాజరుకాబోతున్నారు. ఈ అతిథుల జాబితాలో ఇద్దరు మహిళా లోకో పైలట్లకు కూడా స్థానం దక్కింది. దేశాధినేతలు, అతిరథ మహారథులు విచ్చేయు ఈ వేడకకు ఈ మహిళా పైలట్లకు ఆహ్వానం దక్కడం విశేషం. ఆ మహిళలు ఎవరంటే..రెండు లక్షల గంటలకు పైగా..ఈ వేడుకలో పాల్గొననున్న మహిళా లోకో పైలట్ పేరు ఐశ్వర్య ఎస్ మీనన్. మీనన్ దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్లో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్. దక్షిణ రైల్వే నుంచి ఆమెకు ఆహ్వానం అందింది. ఆమె వందే భారత్, జన్ శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలో లోకో పైలట్గా రెండు లక్షల గంటలకు పైగా పనిచేసిన మహిళగా ప్రసిద్ధి. ఈ ఘనతను సాధించడం అంత ఈజీ కాదు. ఇది మీనన్ అంకితాభావానికి నిదర్శనం. రైల్వే సిగ్నలింగ్పై ఆమెకున్న సమగ్ర పరిజ్ఞానం, వృత్తి పట్ల ఆమెకు ఉన్న నిబద్ధతకు ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఆమె ప్రస్తుతం చెన్నై నుంచి విజయవాడ, చెన్నై-కోయంబత్తూరూ వందే భారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులలో పనిచేస్తుంది.మరో మహిళా లోకో పైలట్..మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవునున్న మరో మహిళా లోకో పైలట్ పేరు సురేఖ యాదవ్. ఆమె ఆసియా తొలి మహిళా లోకో పైలట్ కూడా. యాదవ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి సోలాపూర్ వెళ్లే వందే భారత్ రైలులో లోక్ పైలట్గా పనిచేస్తున్నారు. ఈ రోజు (ఆదివారం జూన్ 9న) న్యూఢిల్లీలో జరగనున్న వేడుకకు ఆహ్వానించబడిన పదిమంది లోకో పైలట్లలో ఆమె కూడా ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలోని సతారాకు చెందిన యాదవ్ 1988లో భారతదేశపు తొలి మహిళా రైలు డ్రైవర్గా నిలిచింది. ఆమె రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక అవార్డులను అందుకుంది. ముంబైలోని షోలాపూర్ నుంచి సీఎస్ఎంటీ మధ్య నడిచే సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్ప్రెస్కి తొలి మహిళా లోకో పైలట్ కూడా. ఈ ప్రతిష్టాత్మక వేడుకలో ఇద్దరు మహిళా లోకో పైలట్లకు పాల్గొనే అవకాశం రావడం విశేషం. కాగా, ఈ వేడుకలో బీజేపీ మిత్ర పక్షాలు, టీడీపీ, శివసేన, ఎల్జీపీ(ఆర్) తదితరులందరూ హాజరుకానున్నారు. (చదవండి: ఒడిశా రాజకీయాల్లో సోఫియా సంచలనం.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్) -
మహాత్మునికి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ మూడోసారి దేశానికి ప్రధాని కాబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన ఈరోజు ఉదయాన్నే రాజ్ఘాట్కు వెళ్లారు. అక్కడ జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద పూలమాలలు ఉంచి, నివాళులర్పించారు.మోదీ ప్రమాణాస్వీకారోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పలు చోట్ల దీనికి సంబంధించిన పోస్టర్లు అతికించారు. ఈ కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే లను ఆహ్వానించారు. #WATCH | Delhi: PM-designate Narendra Modi arrives at Rajghat to pay tribute to Mahatma Gandhi, ahead of his swearing-in ceremony, to be held today at Rashtrapati Bhawan.He will take the Prime Minister's oath for the third consecutive term, today at 7:15 PM. pic.twitter.com/L7u5S0uvHo— ANI (@ANI) June 9, 2024 ఇదీ చదవండి: నేడు మోదీ మూడోసారి -
ఢిల్లీలో మాల్దీవుల అధ్యక్షుడికి వెల్కమ్ బ్యానర్
న్యూఢిల్లీ, సాక్షి: భారత దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణం చేయబోతున్న వేళ.. హస్తినలో సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో పాటు బీజేపీ, ఇతర పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు, ప్రత్యేక అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మరోవైపు.. పొరుగుదేశాల అధినేతకు సైతం ఢిల్లీ వర్గాలు ఆహ్వానం పంపాయి. ఈ క్రమంలో వాళ్లకు ఆహ్వానం పలికేందుకు ఢిల్లీలో ప్రత్యేకంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో మాల్దీవుల అధ్యక్షుడి కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకుంటోంది.కిందటి నవంబర్లో మాల్దీవ్స్ అధ్యక్షుడిగా మహమ్మద్ ముయిజ్జు బాధ్యతలు చేపట్టాక.. ఒకవైపు భారత్తో అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ, మరోవైపు చైనాతో సత్సంబంధాలు నడిపించేందుకు యత్నించారాయన. ఈ క్రమంలో భారత్తో ఆ దేశ సంబంధాలు క్షీణిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. భారత్ను విమర్శించడంతో పాటు బలగాలు తమ భూభాగం నుంచి వైదొలగాలంటూ వ్యాఖ్యలు చేశారాయన.ఇలాంటి పరిస్థితుల్లో.. మోదీ ప్రమాణ స్వీకారానికి ఆ దేశ అధ్యక్షుడికి ఆహ్వానం పంపింది భారత్. అయితే ఆ ఆహ్వానానికి ముయిజ్జు అంతే సానుకూలంగా స్పందించారు. ఆహ్వానాన్ని స్వీకరించడంతో పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతానంటూ బదులిచ్చారు. అంతేకాదు.. తన పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య సానుకూలంగా సంబంధాలు కొనసాగాలని ఆశిస్తున్నట్లు చెప్పారాయన. అంతకు ముందు.. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సోషల్ మీడియా వేదికగా ఆయన మోదీ విజయంపై అభినందనలు తెలియజేశారు.Congratulations to Prime Minister @narendramodi, and the BJP and BJP-led NDA, on the success in the 2024 Indian General Election, for the third consecutive term.I look forward to working together to advance our shared interests in pursuit of shared prosperity and stability for…— Dr Mohamed Muizzu (@MMuizzu) June 4, 2024ఆదివారం సాయంత్రం జరగబోయే మోదీ ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మారిషస్.. దేశాల నేతలు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
మారిన మోదీ ప్రమాణ స్వీకార తేదీ? ఈ దేశాల అగ్రనేతలకు ఆహ్వానం!
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం మోదీ జూన్ 9న ఢిల్లీలోని కర్తవ్యపథ్లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. తొలుత జూన్ 8న మోదీ ప్రమాణ స్వీకార ఉంటుందని వార్తలు వెలువడగా.. తాజాగా ఆ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రానికి మార్చినట్లు సమాచారం. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.కాగా దేశంలో నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తి మోదీనే కావడం విశేషం. మోదీ ప్రమాణ స్వీకారానికి దక్షణాసియా దేశాలకు చెందిన అగ్ర నేతలు తరలిరానున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే హాజరు అయ్యే విషయం ఖరారైంది. ఈ మేరకు ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా రణిల్ విక్రమసింఘేను ప్రధాని మోదీ ఆహ్వానించారని ఆ దేశ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. బంగ్లాదేశ్ ప్రధాని సైతం శనివారం నాటి కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈవెంట్ కోసం ఆమె ఒకరోజు ముందే అంటే శుక్రవారమే ఢిల్లీకి చేరుకోనున్నారు. వీరితోపాటు భూటాన్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ ప్రచండ, భూటాన్ షెరింగ్ టోబ్గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్లకు కూడా ప్రధాని మోదీ ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. ఇటీవల ప్రకటించిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలను గెలుచుకుంది. 2014లో 282 సీట్లు, 2019లో 303 చోట్ల విజయ కేతనం ఎగరవేసి సొంతంగా మేజార్టీ స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. ఈసారి ఈసారి మెజార్టీ(272) కంటే తక్కువ స్థానాలకే పరిమితమైంది. కేవలం 240 సీట్లను గెలుచుకున్న బీజేపీ.. ఎన్డీయే కూటమి మిత్రపక్షాల సాయంతో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేయనుంది. కూటమి నేతల మద్దతుతోే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. -
రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేసిన సోనియా గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ సోనియా గాంధీ చేత ప్రమాణం చేయించారు. సోనియా గాంధీ రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. సోనియాగాంధీతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ ప్రమాణ స్వీకారం చేశారు. #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the newly - elected member Shrimati Sonia Gandhi in the Parliament House.#RajyaSabha @VPIndia @SoniaGandhi_FC @harivansh1956 pic.twitter.com/HdeqVvUUh7 — SansadTV (@sansad_tv) April 4, 2024 మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో గెలుపొందిన అభ్యర్థులు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ సభ్యులుగా వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రమాణం స్వీకారం చేయించారు. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. వద్దిరాజు రవిచంద్ర తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. #WATCH | Rajya Sabha Chairman #JagdeepDhankhar administers Oath/ Affirmation to the re- elected member Ravi Chandra Vaddiraju in the Parliament House.#RajyaSabha @VPIndia @vaddirajumprs @harivansh1956 pic.twitter.com/2hCKkYkOAd — SansadTV (@sansad_tv) April 4, 2024 -
విశాఖ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉంది: సీఎం జగన్
-
ఆప్ నేతకు తొలగిన అడ్డంకి.. ప్రమాణ స్వీకారానికి అనుమతి
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్.. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అడ్డంకి తొలగింది. సంజయ్ సింగ్ ఫిబ్రవరి 5న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయడానికి శనివారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేయటానికి సంజయ్ సింగ్ చేసిన విజ్ఞప్తిని.. ప్రత్యేక న్యాయముర్తి ఎం.కే నాగ్పాల్ అనుమతి ఇచ్చారు. ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో సంజయ్ సింగ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యూడిషియల్ కస్టడీని కోర్టు పొడగించింది. సంజయ్ సింగ్, మనీష్ సిసోడియాలను ఫిబ్రవరి 17 తమ ముందు ప్రవేశపెట్టాలని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఎంపీగా సంజయ్ సింగ్ పదవి కాలం జనవరి 27న ముగిసింది. ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్ను తిరిగి రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: పంజాబ్ గవర్నర్ పదవికి బన్వరీలాల్ పురోహిత్ రాజీనామా -
అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణం
-
మధ్యప్రదేశ్ సీఎం ప్రమాణస్వీకారం..హాజరైన ప్రధాని మోదీ
భోపాల్:మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. భోపాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా,బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తదితర ప్రముఖులు ప్రమాణ స్వీకారానికి విచ్చేశారు. కాగా, ఉప ముఖ్యమంత్రిగా జగదీష్ దేవ్డా పదవీ బాధ్యతలు చేపట్టారు. సీఎం,డిప్యూటీ సీఎంలతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మూడు సార్లు సీఎంగా పనిచేసిన శివరాజ్సింగ్ చౌహాన్ను కాదని యాదవ సామాజిక వర్గానికి చెందిన మోహన్ యాదవ్కు బీజేపీ ఈసారి మధ్యప్రదేశ్ సీఎంగా అవకాశం కల్పించింది. రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఈ మార్పు చేసిందన్న ప్రచారం జరుగుతోంది. ఇదీచదవండి..కర్ణిసేన చీఫ్ హత్య: ‘డుంకీ’ టెక్నిక్తో సూత్రధారి పరార్ -
రేవంత్ రెడ్డి పాలన అక్కడనుంచేనా..?
-
ఈరోజే సీఎం ప్రమాణ స్వీకారం !..రాజ్ భవన్ లో భారీ ఏర్పాట్లు
-
ముగ్గురు జడ్జీలతో ప్రమాణం చేయించిన సీజేఐ
న్యూఢిల్లీ: ఢిల్లీ, రాజస్తాన్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు గురు వారం సుప్రీంకోర్టు జడ్జీలు గా ప్రమాణం చేశారు. వీరి నియామకంతో అత్యున్నత న్యాయస్థానంలో జడ్జీల సంఖ్య పూర్తి స్థాయి 34కు చేరింది. సుప్రీంకోర్టు భవన సముదాయంలో జరిగిన కార్యక్రమంలో మూడు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్, జస్టిస్ సందీప్ మెహతాలతో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ వైవీ చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శర్మ, రాజస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మసీహ్, గౌహటి హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ మెహతాలను సుప్రీంకోర్టులో జడ్జీలుగా నియమించినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ‘ఎక్స్’లో ప్రకటించారు. వీరి పేర్లను కొలీజియం ఈ నెల 6న ఎంపిక చేసి కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణం చేస్తున్న జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సందీప్ మెహతా -
ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
-
ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం
-
కర్ణాటక సీఎంగా సిద్ధూ ప్రమాణం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో వీరి చేత గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు. వీరితోపాటు మరో 8 మంది.. డాక్టర్ జి.పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, సతీశ్ జారకిహోళి, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్ ఖాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దేవుని పేరిట, డీకే శివకుమార్ శ్రీ గంగాధర అనే ఆయన తాత గారి పేరిట ప్రమాణం చేశారు. పరమేశ్వర రాజ్యాంగంపై, సతీశ్ బుద్ధుడు, బసవణ్ణ అంబేడ్కర్ పేరిట, జమీర్ అహ్మద్ అల్లా, తన తల్లి పేరిట ప్రమాణం చేశారు. మిగిలిన వారు దేవుని పేరిట ప్రమాణం చేశారు. అనంతరం, సాయంత్రం నూతన సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో మంత్రివర్గం మొట్టమొదటి సమావేశం జరిగింది. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన వివిధ హామీల అమలుకు కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. వీటి అమలుకు ఏడాదికి రూ.50 వేల కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడుతుందని అంచనా. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఆర్థికం సహా ఎటువంటి ఇబ్బందులెదురైనా తప్పక అమలు చేస్తామని అనంతరం సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ఈనెల 22 నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుందన్నారు. నూతన ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని, కొత్త స్పీకర్ ఎంపిక ఈ సమావేశాల్లో ఉంటుందని చెప్పారు. ఇలా ఉండగా, సీఎం, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన సిద్ధరామయ్య, శివకుమార్లకు ప్రధాని మోదీ, మాజీ ప్రధాని దేవె గౌడ, మాజీ సీఎం బొమ్మై అభినందనలు తెలిపారు. జాతీయ నేతలు హాజరు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియాగాంధీ హాజరు కాలేదు. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ప్రదేశ్ సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేశ్ బఘేల్, సుఖ్వీందర్ సింగ్లతోపాటు తమిళనాడు, బిహార్, జార్ఖండ్ సీఎంలు ఎంకే స్టాలిన్, నితిశ్ కుమార్, హేమంత్ సోరెన్లు పాల్గొన్నారు. వీరితోపాటు బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆర్ఎస్పీ అధ్యక్షుడు ఎన్కే ప్రేమచంద్రన్, సీపీఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, వీసీకే అధ్యక్షుడు డాక్టర్ తిరుమల వలన్, ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి, నటుడు కమల్ హాసన్ కూడా ఉన్నారు. నేతలంతా చేతులు కలిపి సంఘీభావం ప్రదర్శించారు. -
త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణం
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రిగా డాక్టర్ మాణిక్ సాహా ప్రమాణం చేశారు. అగర్తలాలోని వివేకానంద మైదాన్లో బుధవారం ఉదయం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల సమక్షంలో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. కాగా, మాణిక్ సాహా సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా రెండోసారి. కిందటి ఏడాది.. విప్లవ్ కుమార్ దేవ్ రాజీనామాతో అనూహ్యంగా మాణిక్ సాహాను తెర మీదకు తెచ్చింది బీజేపీ. మే 15వ తేదీన మాణిక్ సాహా త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బోర్దోవాలీ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకు ముందు ఆయన రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. త్రిపుర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా 2020 నుంచి 2022 మధ్య ఆయన పని చేశారు. అయితే.. ఆయన రాజకీయ ప్రస్థానం మాత్రం మొదలైంది కాంగ్రెస్ పార్టీతోనే. 2016లో ఆయన కాంగ్రెస్ను వీడి.. బీజేపీలో చేరారు. గతంలో.. త్రిపుర క్రికెట్ అసోషియేషన్కు ఆయన అధ్యక్షుడిగా పని చేశారు. Prime Minister Narendra Modi arrives at Swami Vivekananda Maidan in Agartala for the swearing-in ceremony of Tripura CM-designate Manik Saha. (Source: DD) pic.twitter.com/5QrhWbl0fp — ANI (@ANI) March 8, 2023 సాహా డెంటల్ డాక్టర్. రాజకీయాల్లోకి రాకమునుపు.. హపానియాలోని త్రిపుర మెడికల్ కాలేజీలో పాఠాలు చెప్పారు కూడా. ఆయనకు భార్య స్వప్న, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రధాన నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో 'ఉన్నత త్రిపుర', 'శ్రేష్ట త్రిపుర' నిర్మించేందుకు అన్ని సంక్షేమ వర్గాల ప్రజలతో కలిసి పని చేస్తాం అని మాణిక్ సాహా పేర్కొన్నారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లతో అధికారం దక్కించుకుంది. తర్వాతి స్థానంలో తిప్ర మోత పార్టీ 13 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్) 11 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకుంది. ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ) కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. (చదవండి: బైక్ ట్యాక్సీ నడుపుతున్న విదేశీయుడు.. ఆటో డ్రైవర్ సీరియస్ వార్నింగ్) -
ఏపీ కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణానికి ముహూర్తం ఖరారు
-
ఏపీ: కొత్త గవర్నర్ ప్రమాణానికి ముహూర్తం ఖరారు
సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ను కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నెల 24వ తేదీన గవర్నర్గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రేపు(బుధవారం) అబ్దుల్ నజీర్, ఏపీకి రానున్నారు. సతీసమేతంగా సాయంత్రం ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకి చేరుకుంటారాయన. ఏపీకి మూడో గవర్నర్గా సయ్యద్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటకకు చెందిన అబ్దుల్ నజీర్.. సుప్రీంకోర్టు మాజీ జడ్జి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకుండానే.. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రమోషన్ పొందిన మూడో న్యాయమూర్తిగా ఆయనకు ఓ గుర్తింపు ఉంది. జనవరిలోనే ఆయన పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నజీర్ పలు కీలక తీర్పులను వెల్లడించారు. ట్రిపుల్ తలాక్, అయోధ్య-బాబ్రీ మసీదు వివాదం, నోట్ల రద్దు, గోప్యత హక్కు వంటి కేసుల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో ఆయన ఒకరు. 2017లో వివాదాస్పద ట్రిపుల్ తలాక్ కేసును విచారించిన బహుళ ధర్మాసనంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏకైక మైనారిటీ న్యాయమూర్తి. -
ఇజ్రాయెల్ ప్రధానిగా మళ్లీ నెతన్యాహు
జెరుసలేం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా లికుడ్ పార్టీ చీఫ్ బెంజమిన్ నెతన్యాహు(73) ఆరోసారి ప్రమాణం చేశారు. 120 మంది సభ్యులుండే నెస్సెట్(పార్లమెంట్)లో గురువారం జరిగిన బలపరీక్షలో నెతన్యాహుకు అనుకూలంగా 69 మంది, వ్యతిరేకంగా 54 మంది సభ్యులు ఓటేశారు. నెతన్యాహు బలహీనుడంటూ నినాదాలు చేసిన పలువురు ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి బహిష్కరించారు. అనంతరం నెతన్యాహు పదవీ ప్రమాణం చేశారు. అదే సమయంలో పార్లమెంట్ వెలుపల పెద్ద సంఖ్యలో జనం గుమికూడి నూతన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. కొత్తగా సంకీర్ణంలో లికుడ్ పార్టీతోపాటు ఛాందసవాద షాస్, యునైటెడ్ టోరా జుడాయిజం, ఓట్జ్మా యెహుడిట్, జియోనిస్ట్, నోమ్ పార్టీలున్నాయి. -
గుజరాత్ సీఎంగా భూపేంద్ర ప్రమాణం.. మోదీ సహా కీలక నేతల హాజరు
అహ్మదాబాద్: గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత భూపేంద్ర పటేల్(60).. నేడు(సోమవారం) ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీనగర్లోని కొత్త సెక్రటేరియట్ సమీపంలో ఉన్న హెలిప్యాడ్ మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గుజరాత్ 18వ సీఎంగా భూపేంద్రతో ప్రమాణం చేయించారు. సీఎంతోపాటు బీజేపీ నేతలు హర్ష సంఘవి, జగదీష్ విశ్వకర్మ గుజరాత్ కేబినేట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అదే సమయంలో వివిధ రాష్ట్రాల నుంచి 200 మంది సాధువులకు ప్రత్యేక ఆహ్వానం అందించడం గమనార్హం. BJP leaders Harsh Sanghavi and Jagdish Vishwakarma take oath as ministers in the Gujarat cabinet. pic.twitter.com/IYzM8sHPWy — ANI (@ANI) December 12, 2022 ఇటీవల రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 182 సీట్లకు గాను 156 స్థానాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేనంతగా 53 శాతం ఓటు బ్యాంక్ సాధించింది ఆ పార్టీ. కాగా కిందటి ఏడాది సెప్టెంబర్లో విజయ్ రూపానీని తప్పించి.. భూపేంద్రను సీఎంగా ఎపింక చేసింది గుజరాత్ బీజేపీ. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఘన విజయం సాధించారాయన. ఈ తరుణంలో.. నేడు వరుసగా రెండోసారి సోమవారం ప్రమాణం చేశారు. -
ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణస్వీకారం
-
ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ 8వ సారి ప్రమాణస్వీకారం
-
ఇదేం విడ్డూరం! ఎన్నికైంది ఒకళ్లు... ప్రమాణ స్వీకారం చేసింది మరోకళ్లు
భోపాల్: మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలోని గైసాబాద్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక వివాదం తెరపైకి వచ్చింది. ఈ మేరకు గైసాబాద్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు అంచెల ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో సర్పంచ్గా షెడ్యూల్డ్ కులానికి చెందని ఒక మహిళ ఎన్నికైంది. అంతేకాదు ఆ ఎన్నికల్లో ఆమె తోపాటు మరికొంతమంది మహిళలు పంచాయతీ సభ్యులగా ఎన్నికయ్యారు ఐతే ప్రమాణా స్వీకారోత్సవానికి ఎన్నికైన మహిళలెవరూ హాజరు కాలేదు. పైగా ఆయా మహిళల స్థానంలో వారి భర్తలే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు సంబంధిత అధికారి కూడా ఆయా మహిళల భర్తల చేత ప్రమాణ స్వీకారం చేయించినట్లు ఫిర్యాదుల వచ్చాయి. దీంతో జిల్లా యంత్రాంగం సంబంధిత అధికారులను నిజానిజాలు విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దామోహ గ్రామ పంచాయతీ ఎన్నికల చీఫ్ ఎగ్జూక్యూటివ్ ఆఫీసర్ అజయ్ శ్రీవాస్తవ్ నిబంధనలకు విరుద్ధంగా ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఘటనపై వివరణాత్మక నివేదికను ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామని, నివేదిక వచ్చిన వెంటనే పంచాయతీ సెక్రటరీ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. (చదవండి: ఎంత ఘోరం.. నాలుగో అంతస్తు నుంచి చిన్నారిని పడేసిన తల్లి!) -
ప్రథమ పౌరురాలిగా ద్రౌపది ముర్ము (ఫొటోలు)
-
రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్ము
-
నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని మోదీ, అమిత్ షా అభినందలు
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమం.. అప్డేట్స్ TIME: 3.00PM రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపదికి ముర్ముకు దేశం నలుమూలల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నూతన రాష్ట్రపతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. దేశానికి ఇదొక ఉద్వేగభరిత క్షణాలని హర్షం వ్యక్తం చేశారు. TIME: 2.30PM కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలిపారు. ముర్ము తన పదవీకాలంలో దే శ గర్వాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని నమ్మకం ఉందన్నారు. నేడు చరిత్రలో నిలిచిపోయే రోజు అని అన్నారు. 11:35AM ► రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. ఆమె మొదటి గార్డ్ ఆఫ్ ఆనర్ను తనిఖీ చేశారు. #WATCH President Droupadi Murmu inspects her first Guard of Honour after taking the oath, at Rashtrapati Bhavan in Delhi pic.twitter.com/T47qfSWHBu — ANI (@ANI) July 25, 2022 11:00AM ►రాష్ట్రపతి భవన్కు చేరుకున్న ద్రౌపది ముర్ము ► 10:48AM గుర్రపు కవాతు నడుమ అధికారిక వాహనంలో రాష్ట్రపతి భవన్కు బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ► 10:47AM పార్లమెంట్ హాల్ నుంచి రాష్ట్రపతి భవన్కు బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ► హాల్ నుంచి బయటకు వచ్చిన రాష్ట్రపతి ముర్ము. వెంట.. సీజే ఎన్వీ రమణ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, స్పీకర్ ఓం బిర్లా. గౌరవ వందనం స్వీకరణ. ► 10:44 AM ముర్ము ప్రసంగం అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. అనంతరం ప్రధాని , కేంద్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులకు అభివాదం చేశారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ► 10:15AM రాష్ట్రపతి హోదాలో ముర్ము తొలి ప్రసంగం జాతినుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం దేశ ప్రజలకు కృతజ్ఞతలు నాపై మీరు చూపిన ప్రేమ, అభిమానం, నమ్మకం రాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించడానికి ప్రోత్సహిస్తాయి దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టేందుకు కృషి చేస్తా మా గ్రామం పదో తరగతి చదువుకున్న మొదటి బాలికను నేను: ముర్ము భారత్ ప్రగతి పథంలో నడుస్తోంది. ఇంకా వేగంగా అభివృద్ది చెందాలని ఆశిస్తున్నా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ► 10:12AM భారత రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణం భారత దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు ద్రౌపది ముర్ము. ప్రమాణం చేయించారు భారత దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. అనంతరం పదవీ పత్రాలపై ఆమె సంతకాలు చేశారు. ► 10:08AM పార్లమెంట్కు చేరిన కోవింద్, ముర్ము పార్లమెంట్కు చేరుకున్న రామ్నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము. వెంట సుప్రీం కోర్టు సీజే ఎన్వీ రమణ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ముర్ముకు త్రివిధ దళాల గన్ సెల్యూట్. ► 10:00AM పార్లమెంట్ సెంట్రల్ హాల్లో 15వ రాష్ట్రపతిగా సీజే ఎన్వీ రమణ సమక్షంలో ప్రమాణం చేయనున్న ద్రౌపది ముర్ము. ► పార్లమెంట్కు బయలుదేరిన రామ్నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము. ► రాష్ట్రపతి ఫోర్కోర్టులో గౌరవ వందనం స్వీకరించిన రామ్నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము. ► రాజ్ఘాట్లో జాతిపిత మహాత్మాగాంధీకి ద్రౌపది ముర్ము నివాళులు. #DroupadiMurmu at Rajghat before taking oath as President NDTV's Sunil Prabhu reports pic.twitter.com/jsrQ30X4Sw — NDTV (@ndtv) July 25, 2022 ► ఉదయం 10గం.15ని. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్న ద్రౌపది ముర్ము ► ప్రమాణం తర్వాత 21 గన్ సెల్యూట్ స్వీకరించనున్న ద్రౌపది ముర్ము. ► ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ఉప రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్ తదితరులు పాల్గొననున్నారు. ► ప్రమాణం అనంతరం నూతన రాష్ట్రపతిగా ముర్ము ప్రసంగిస్తారు. ►భారత 15వ రాష్ట్రపతిగా గిరిజన ఆడబిడ్డ ద్రౌపది ముర్ము(64) ఇవాళ(సోమవారం) ప్రమాణం చేయనున్నారు. ► పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉదయం 10.15 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ► సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించనున్నారు. ► తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26న ప్రమాణం చేశారు. అయితే.. 1977 తర్వాత జూలై 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న పదో రాష్ట్రపతిగా ముర్ము చరిత్రలో నిలిచిపోనున్నారు. ► నీలం సంజీవరెడ్డి ఆరవ రాష్ట్రపతిగా 1977 సంవత్సరం జూలై 25న ప్రమాణం చేశారు. ► ప్రమాణ స్వీకారం, ప్రసంగం తర్వాత ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్కు చేరుకుంటారు. అక్కడ సైనిక సిబ్బంది ఆమెకు గౌరవ వందనం సమర్పిస్తారు. -
Droupadi Murmu: అత్యున్నత పీఠంపై గిరి పుత్రిక
న్యూఢిల్లీ: అత్యున్నత పీఠంపై గిరి పుత్రిక కొలువుదీరడానికి సమయం ఆసన్నమయ్యింది. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము(64) సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉదయం 10.15 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ముర్ముతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయిస్తారని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ప్రమాణ స్వీకారం అనంతరం ముర్ముకు సైనిక సిబ్బంది 21 గన్ సెల్యూట్ సమర్పిస్తారని తెలిపింది. తర్వాత ఆమె ప్రసంగం ఉంటుందని పేర్కొంది. అంతకంటే ముందు రామ్నాథ్ కోవింద్, ముర్ము కలిసి పార్లమెంట్ సెంట్రల్హాల్కు చేరుకుంటారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రి మంత్రులు, దౌత్యవేత్తలు, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సైనికాధిరులు పాల్గొంటారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ప్రమాణ స్వీకారం, ప్రసంగం తర్వాత ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్కు చేరుకుంటారు. అక్కడ సైనిక సిబ్బంది ఆమెకు గౌరవ వందనం సమర్పిస్తారు. రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపదీ ముర్ము ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతిగా చరిత్రకెక్కారు. ప్రతిభా పాటిల్ తర్వాత రాష్ట్రపతి పదవిని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము మరో రికార్డు సృష్టించనున్నారు. -
రాజ్యసభ సభ్యులుగా 27 మంది ప్రమాణం
న్యూఢిల్లీ: రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన 57 మందిలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయెల్ సహా 27 మంది సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చాంబర్లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు రాజ్యాంగానికి విధేయులుగా ఉంటామంటూ వారితో ప్రమాణం చేయించారు. 10 రాష్ట్రాలకు చెందిన 27 మంది సభ్యులు తెలుగు తదితర 9 భాషల్లో ప్రమాణం చేశారు. కొత్తగా ఎన్నికైన 57 మందిలో నలుగురు ఇప్పటికే ప్రమాణం చేశారు. మిగతా వారు వర్షాకాల సమావేశాల మొదటి రోజు ప్రమాణం చేయనున్నారు. ఇంకా ప్రమాణం చేయని కొత్త సభ్యులు కూడా 18వ తేదీన జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చైర్మన్ వెంకయ్యనాయుడు అనంతరం స్పష్టతనిచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో విజేతల పేర్లను నోటిఫికేషన్లో ప్రకటించిన నాటి నుంచి వారిని సభ్యులుగానే పరిగణిస్తామన్నారు. సభా కార్యక్రమాలు, కమిటీల సమావేశాల్లో పాల్గొనేందుకు మాత్రం ప్రమాణం చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. తాజాగా ప్రమాణం చేసిన వారిలో కాంగ్రెస్కు చెందిన జైరాం రమేశ్, వివేక్ కె.తన్ఖా, ముకుల్ వాస్నిక్తోపాటు బీజేపీ నుంచి సురేంద్ర సింగ్ నాగర్, కె.లక్ష్మణ్, లక్ష్మీకాంత్ వాజ్పేయి తదితర 18 మంది ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేస్తున్న గోయల్ -
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ మాణిక్ సాహా
అగర్తల: త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా డాక్టర్ మాణిక్ సాహా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. అగర్తలాలోని రాజ్భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ ఎస్.ఎన్. ఆర్య ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టేంతవరకూ సాహా.. త్రిపుర రాష్ట్ర బీజేపీ చీఫ్గా ఉన్నారు. త్రిపుర క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2016లో బీజేపీలో చేరిన మానిక్ సాహా అంచెలంచెలుగా ఎదిగారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన త్రిపుర మెడికల్ కాలేజీలో డెంటల్ ఫ్యాకల్టీగా పనిచేశారు. మరో ఆరునెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. బిప్లవ్ దేవ్తో రాజీనామా చేయించిన బీజేపీ అధిష్ఠానం మానిక్ సాహాకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. -
భగత్ సింగ్ సొంతూళ్లో ప్రమాణం
చండీగఢ్: ‘పంజాబ్ కొత్త కేబినెట్ ప్రమాణస్వీకార కార్యక్రమం రాజ్భవన్లో జరగదు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలన్లో నిర్వహిస్తాం’ అని ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ వెల్లడించారు. కార్యక్రమం తేదీలను తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. ఏ సర్కారు ఆఫీసులో కూడా ముఖ్యమంత్రి చిత్రపటాలు ఉండవని స్పష్టం చేశారు. బదులుగా భగత్సింగ్, అంబేద్కర్ ఫొటోలు ఉంటాయన్నారు. ఇప్పుడిక పంజాబ్ను మళ్లీ పంజాబ్గా మారుస్తామని చెప్పారు. పంజాబ్ ప్రజలు ఆప్కు పట్టం కట్టారని ట్రెండ్ను బట్టి తెలియడంతో ధురిలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో మాన్ మాట్లాడారు. పాఠశాలల స్థితిగతులను మెరుగుపరచడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెంచడం, పరిశ్రమలను తీసుకురావడం, సాగును లాభసాటిగా మార్చడం, మహిళలకు భద్రత కల్పించడం, క్రీడా మౌలిక సదుపాయాలను పెంచడం ప్రాధాన్యాంశాలని ఆయన వివరించారు. క్రీడలను ప్రోత్సహించడానికి గ్రామాల్లో ట్రాక్స్, స్టేడియంలు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని ప్రాంతాల్లో మంత్రులు ఎప్పటికప్పుడు పర్యటిస్తుంటారని.. ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటారని చెప్పారు. ‘ఆప్కు ఓటేయని వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని వర్గాల ప్రజల కోసం పార్టీ పని చేస్తుంది’ అని చెప్పారు. ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను తిరిగి తీసుకురావడంపై స్పందిస్తూ.. ‘మన పిల్లలు చదువుకోవడానికి బయటకు ఎందుకు వెళ్లాలి. మనమే తక్కువకు సదుపాయాలు ఎందుకు కల్పించకూడదు’ అన్నారు. -
7 న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
-
కరోనా సోకినా.. వీల్ ఛైర్పై ప్రమాణస్వీకారానికి హాజరై!
పరాగ్వే: కరోనా వైరస్ సోకితే వెంటనే వైద్యుల సూచనల మేరకు ఐసోలేషన్లోకి వెళుతాము. అయితే కరోనా సోకి ఐసోలేషన్లో ఉన్న చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు మిలోస్ జెమాన్ మాత్రం.. ప్రత్యేక పరిస్థితుల్లో దేశ నూతన ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రెసిడెంట్ మిలోస్ జెమాన్.. ప్రమాణ స్వీకారం చేసే ప్రాంగణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గాజు బాక్స్లోకి వీల్ఛైర్ మీద వచ్చి పీటర్ ఫియాలా చేత ప్రధానమంత్రిగా ప్రమాణం చేయించారు. చదవండి: Omicron: పెను ముప్పు.. డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు ఎన్నికల్లో పీటర్ ఫియాలా నేతృత్వంలోని సెంటర్-రైట్ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల అధ్యక్షుడు మిలోన్.. అస్వస్థకు గురై ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఆయనకు కరోనా పరీక్షలు చేయగా.. కోవిడ్ సోకినట్లు నిర్థారణ అయింది. చదవండి: చైనా బల ప్రదర్శన.. ఏకంగా 27 విమానాలు బఫర్ జోన్లో ప్రవేశం ఇక కొత్త ప్రధాని ఫియాలా మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతికుల సవాళ్లు ఎదుర్కొనే గడ్డు కాలంలో ఉందని తెలిపారు. అయితే భవిష్యత్తులో తమ ప్రభుత్వం దేశంలో మార్పు తీసుకువస్తుందని పేర్కొన్నారు. దేశ ప్రజలంతా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. కరోనా కాలంలో సేవలందించిన వ్యైదులు, వైద్య సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. -
విష్ణు ప్రమాణ స్వీకారం, చిరంజీవికి అందని ఆహ్వానం!
Manchu Vishnu MAA President: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న మంచు విష్ణు, గెలిచిన కార్యవర్గ సభ్యులు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో పదవి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా రానున్నారు.. అలాగే నందమూరు బాలకృష్ణను సైతం విష్ణు ప్రత్యేకంగా ఆహ్వానించారు. చదవండి: ప్రమాణ స్వీకారం తర్వాత బాలకృష్ణతో భేటీ అయిన మోహన్ బాబు, విష్ణు కాగా శుక్రవారం నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లి ఆయనతో అరగంట పాటు మోహన్ బాబు, విష్ణులు చర్చించిన సంగతి తెలిసిందే. అలాగే.. సినీ పెద్దలు పరుచూరి బ్రదర్స్, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందంను కలిసి ప్రమాణా స్వీకార మహోత్సవానికి రావాలని విష్ణు కోరారు. అయితే సినిమా పెద్దలను ఆహ్వానించిన విష్ణు.. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించనట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందు కౌంటింగ్ రోజున.. త్వరలో చిరంజీవిని వ్యక్తిగతంగా కలుస్తానని మంచు విష్ణు చెప్పిన సంగతి విదితమే. చదవండి: ‘మా’ కుటుంబాన్ని ఒక చోట చేర్చమని సూచించారు: మంచు విష్ణు కానీ ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీకి చెందిన ఎవరిని విష్ణు ఆహ్వానించనట్లుగా సమాచారం. ఇక గురువారం విష్ణు సోదరుడు మంచు మనోజ్, పవన్ కల్యాణ్ను ఓ సినిమా సెట్లో కలిశారు. అక్కడ పవన్ అరగంట పాటు చర్చిన మనోజ్ విష్ణు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా పవన్ను కోరినట్లు వార్తలు వినిపించాయి. అయితే దీనిపై విష్ణు టీం కానీ, పవన్ టీం కాని స్పష్టత ఇవ్వలేదు. అసోసియేషన్ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్తానన్నా మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్, అతని ప్యానెల్లో గెలిచిన సభ్యులకు ప్రమాణ స్వీకారానికి రావాలని ఫోన్లో ఆహ్వాన సందేశం పంపారు. అలాగే ప్రతి మా సభ్యుడికి మా కార్యాలయం మెసెజ్ ద్వారా ఆహ్వానం పంపింది. -
పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్జిత్ సింగ్ చన్నీ
-
కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన బసవరాజ్ బొమ్మై
-
Puducherry: కొలువుదీరిన రంగన్న కేబినెట్
సాక్షి, చెన్నై: పుదుచ్చేరిలో 55 రోజుల అనంతరం ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి నేతృత్వంలోని మంత్రి వర్గం కొలువుదీరింది. ఐదుగురు మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. 40 ఏళ్ల అనంతరం ఓ మహిళ మంత్రి పగ్గాలు చేపట్టారు. పుదుచ్చేరిలో బీజేపీతో కలిసి ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత, సీఎం రంగస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆయన కరోనా బారిన పడడం, ఆ తదుపరి పరిణామాలతో కొత్త కేబినెట్ కొలువులో జాప్యం నెలకొంది. బీజేపీతో చర్చలు ఫలించడంతో మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం రాజ్ నివాస్ ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. తొలుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే నమశ్శివాయంతో ఎల్జీ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎన్ఆర్ కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణన్, బీజేపీ ఎమ్మెల్యే సాయి శరవణన్ కుమార్కు, ఎన్ఆర్ కాంగ్రెస్కు చెందిన తేని జయకుమార్, చంద్ర ప్రియాంక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమం అరగంటలో ముగించారు. దీన్ని డీఎంకే బహిష్కరించింది. మంత్రి పదవి ఆశించి భంగపడిన బీజేపీ ఎమ్మెల్యే జాన్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరుకావడం విశేషం. 1980–1983లో కాంగ్రెస్ డీఎంకే కూటమి మంత్రివర్గంలో డీఎంకేకు చెందిన రేణుకా అప్పాదురై మంత్రిగా పనిచేశారు. తర్వాత 40 ఏళ్లకు మహిళా మంత్రిగా చంద్ర ప్రియాంక పగ్గాలు చేపట్టారు. ఆమె కారైక్కాల్ ప్రాంతీయం నుంచి నెడుంగాడు రిజర్వుడు స్థానంలో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. విద్యావంతురాలైన చంద్రప్రియాంక మాజీ మంత్రి చంద్రకాశి కుమార్తె కావడం గమనార్హం. కాగా కేంద్రాన్ని డీఎంకే సర్కారు యూనియన్ ప్రభుత్వం (ఒండ్రియ అరసు) అని పిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పుదుచ్చేరిలో ప్రమాణ స్వీకార సమయంలో ఎల్జీ అదే పదాన్ని ఉపయోగించే రీతిలో ఇండియా ఒండ్రియం (భారత యూనియన్) పరిధిలోని పుదుచ్చేరి అని మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడం గమనించదగ్గ విషయం. చదవండి: బంగారు పతకం గెలిస్తే రూ.3 కోట్లు -
అట్టహాసంగా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారోత్సవం
-
పినరయి విజయన్ ప్రమాణస్వీకారం
-
అస్సాం సీఎంగా హిమంత ప్రమాణ స్వీకారం
-
మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం
-
బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మమతతో గవర్నర్ జగదీప్ ధన్కడ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా కొద్దిమంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం వేదికపైనే గవర్నర్, మమతా పోటాపోటీ విమర్శలు చేసుకున్నారు. రాష్ట్రంలో హింస చెలరేగిపోతోందన్నారు. సీఎం మమత హింసను నియంత్రించాని గవర్నర్ జగదీప్ ధన్కడ్ తెలిపారు. కొత్త ప్రభుత్వంలో శాంతి నెలకొనేలా మమత పని చేయాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రం ఎన్నికల సంఘం పరిధిలో ఉందని సీఎం మమత అన్నారు. ప్రస్తుతం నెలకొన్నా పరిస్థితులు ఎన్నికల సంఘం, గవర్నర్ కారణమన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, తమ హయాంలో బెంగాల్ ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో తృణముల్ కాంగ్రెస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈ విజయంతో మమత బెనర్జీ మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక రేపు(గురువారం) కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్ర శాసనసభలోని 294 స్థానాలకు గాను 292 సీట్లకు ఎన్నికలు జరగ్గా ఇందులో టీఎంసీ 213 స్థానాలు, బీజేపీ 77 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్లో పోటీచేసిన మమతా బెనర్జీ తన సమీప బీజేపీ అభ్యర్థి సువేంధు అధికారి చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లో మమత ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. పశ్చిమబెంగాల్లో శాసనమండలి ఉండి ఉంటే మమత వెంటనే ఎమ్మెల్సీగా ఎన్నికై ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉండేది. కాకపోతే అక్కడ శాసనమండలి లేకపోవడంతో ఇప్పుడు విధిగా ఆమె ఆరో నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిందే. చదవండి: కరోనా: దేశంలో కొత్తగా 3,82,315 కేసులు -
టీపీఏడీ 2021 ఫౌండేషన్ సభ్యుల ప్రమాణ స్వీకారం
డల్లాస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపీఏడీ) ఆధ్వర్యంలో 2021 సంవత్సరానికి ఫౌండేషన్ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారకార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిస్కోలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్, కో-చైర్ పర్సన్, కో-ఆర్టినేటర్, ప్రెసిడెంట్తో పాటు ఇతర ఆఫీసు బేరర్లు ప్రమాణం స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రవికాంత్ మాట్లాడుతూ.. 2020 కరోనా కాలంలో టీపీఏడీ స్వచ్ఛంద కార్యకలాపాలను చేపట్టిందన్నారు. న్యూయార్క్లోని ఫ్రంట్లైన్ సిబ్బందికి ఎన్ 95 మాస్క్లు అందించామన్నారు. అలాగే ఇండియాలో ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో నిత్యవసర సరుకులు, అవసరమైన వస్తు సామాగ్రి పంపిణీకి టీపీఏడీ నుంచి విరాళాలు సేకరించి పంపించామన్నారు. హైదరాబాద్లోని పేద కళాకారులకు కూడా నిత్యవసర సరుకులు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. అనంతరం మహమ్మారి కాలంలో ప్రజలకు సేవ చేస్తున్న ఫ్రంట్ లైన్ కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత టీపీఏడీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు మధుమతి వైజరాజు మాట్లాడుతూ.. ఫౌండేషన్ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను వివరించారు. ఫౌండేషన్ చైర్ పర్సన్ రావు కల్వాలా మాట్లాడుతూ.. బ్లడ్ డ్రైవ్ ద్వారా టీపీఏడీ గత కొన్ని సంవత్సరాలుగా వందలాది మంది ప్రాణాలను కాపాడిందన్నారు. అవసరమున్న వారికి రక్తదానం ఇవ్వడంలో సహాయపడటానికి బ్లడ్ డ్రైవ్ను మరింత కఠినంగా నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు. బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ చైర్ మాధవి సుంకిరెడ్డి మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడంతో పాటు సమాజానికి ఏ విధంగానైనా సేవ చేయడమే టీపాడ్ లక్ష్యం అన్నారు. 2021లో టీపీఏడీ మరిన్ని స్వచ్ఛంద కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సంస్థ సీనియర్ నాయకత్వ సభ్యులు అజయ్ రెడ్డి, జానకి రామ్ మాండాడి, రఘువీర్ బండారులు ప్రపంచ శాస్త్రీయ సమాజానికి కృషి చేసి, కోవిడ్-19కు వ్యాక్సిన్ను తక్కువ సమయంలో అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా కోఆర్డినేటర్గా ఎన్నికైన గోలీ బుచి రెడ్డి బృందాన్ని అభినందించారు, సంస్థకు బలమైన పునాది వేసినందుకు టీపీఏడీ గత అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. 2021 సంవత్సరానికి కొత్తగా ఎన్నికైన ఫౌండేషన్ సభ్యులు.. రావు కల్వాలా (చైర్, ఫౌండేషన్ కమిటీ), రఘువీర్ బండారు (వైస్ చైర్, ఫౌండేషన్ కమిటీ), మాధవి సుంకిరెడ్డి (చైర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు), ఇంద్రాణి పంచెరుపుల (వైస్ చైర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్), బుచి రెడ్డి గోలి (కో-ఆర్డినేటర్), రవికాంత్ మామిడి (ప్రెసిడెంట్), చంద్రరెడ్డి పోలీస్ (గత అధ్యక్షుడు), రూప కన్నయ్యరి (ఉపాధ్యక్షుడు), అనురాధ మేకల (ప్రధాన కార్యదర్శి), లింగా రెడ్డి అల్వా (సంయుక్త కార్యదర్శి), శంకర్ పరిమల్ (కోశాధికారి), మధుమతి వైజరాజు (సంయుక్త-కోశాధికారి), కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మాధవి లోకిరేడ్డి, లక్ష్మి పోరెడ్డి, రత్న వుప్పల, రోజా అడెపు, శ్రీధర్ వేముల, మంజులా తోడినావూరు ధర్మకర్తలు రామ్ అన్నాడి, అశోక్ కొండల, పవన్ గంగాధర, సుధాకర్ కలసాని, పాండురంగ రెడ్డి పాల్వే,అజయ్ రెడ్డి, రఘువీర్ బండారు, జానకిరామ్ మందాడి ఈ ఏడాదికి గాన నూతన ఫౌండేషన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. -
ఫలించిన మూడు దశాబ్దాల కల
అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్ వ్యక్తిగత జీవితమంతా విషాదాల మయమే. ఈ విషాదాల మధ్యే గడిపిన బైడెన్ ఆ అభద్రతా ఛాయల మధ్యే 40 ఏళ్లుగా అపార రాజకీయ అనుభవాన్ని గడిస్తూ వచ్చారు. ఏరోజుకైనా అధ్యక్ష పదవి చేపట్టాలన్నది ఆయన కల. ఆ కల సాకారంలో ఎన్నో సార్లు విఫలమైనా చివరికి తన లక్ష్యాన్ని సాధించారు. పట్టువిడుపులు ప్రదర్శించడం, చేసిన తప్పులు ఒప్పుకోవడం, తన పరిమితులను గుర్తించడం, ప్రజాజీవితంలో అనేకమందితో కనెక్ట్ కావడం.. ఈ లక్షణాలతోనే ఇప్పుడు శ్వేతసౌధంలోకి అడుగుపెడుతున్న బైడెన్ ప్రపంచ వ్యాప్తంగా ఉదారవాద ప్రజాస్వామ్యం భవిష్యత్తును నిర్దేశించడానికి సమాయత్తమవుతున్నారు. తనకు ముందు పనిచేసిన అధ్యక్షులతో పోలిస్తే జో బైడెన్ అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్ష పదవి చేపట్టడానికి చేసిన ప్రయాణం పూర్తిగా భిన్నమైనది, విలక్షణమైనది అనే చెప్పాలి. బిల్ క్లింటన్ తన ప్రత్యర్థి అయిన సీని యర్ జార్జి బుష్తో పోలిస్తే అత్యంత పిన్నవయస్కుడిగా చెప్పుకోవడమే కాకుండా తన రుణవిధానంపై చర్చ ద్వారా అధ్యక్షుడు కాగలి గారు. సీనియర్ బుష్ తనయుడు జార్జి డబ్ల్యూ బుష్ వివాదాస్పద కోర్టు తీర్పు ద్వారా అధ్యక్షుడు కాగలిగారు. ఇక ఒబామా విషయానికి వస్తే ఆకర్షణీయమైన ప్రసంగాలు, తన గొప్పదైన వ్యక్తిగత గాథ ద్వారా అమెరికన్లను మంత్రముగ్ధులను చేసి అధికారంలోకి వచ్చారు. ఇక బైడెన్ విషయానికి వస్తే అనేక అంశాలలో తేలిపోయారు, గత సంవత్సరం జరిగిన డెమోక్రాటిక్ పార్టీ చర్చల్లో కూడా బైడెన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. తన పార్టీలోని ప్రత్యర్థులు ఎలిజబెత్ వారెన్, బెర్నీ శాండర్స్లతో పోలిస్తే బైడెన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. లైవ్ ప్రసంగాల్లో కూడా తాను సమాధానాలు ఇవ్వలేకపోయారు. పైగా తన టెలిప్రింటర్ చూపుతున్న దాన్ని కూడా తప్పుగా చదివేశారు. పైగా గతంలో జాతుల మధ్య విభజనను ప్రోత్సహించే సెనేటర్లకు తాను ప్రాతినిధ్యం వహించడంపై పార్టీలో ప్రత్యర్థిగా నిలిచిన కమలా హ్యారిస్ తనపైనే దాడి చేయడంతో బైడెన్ బిత్తరపోయాడు. తర్వాత డొనాల్డ్ ట్రంప్ విసుగెత్తించిన పాలన, డెమోక్రాటిక్ ప్రతినిధి జిమ్ క్లైబర్న్ కీలక సమయంలో ఇచ్చిన మద్దతు కారణంగా సౌత్ కరోలినా నుంచి బైడెన్ గెలుపొందారు. ఆ తర్వాతే సూపర్ ట్యూస్డే సందర్భంగా డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్షపదవికి అభ్యర్థిగా గెలుపొందడం, అనంతరం దేశాధ్యక్ష పదవిని గెల్చుకోవడం వరుసగా జరిగిపోయాయి. అయితే బైడెన్ గురించి ఇప్పటికీ అనుమానాలు ఉంటూనే వస్తున్నాయి. చాలామంది బైడెన్ మంచి కాలం ఎప్పుడో ముగిసిపోయిం దని, ఒక దఫా అధ్యక్షుడిగా మాత్రమే ఉండగలరని, కమలా హ్యారిస్ కోసం తన స్థానాన్ని త్యాగం చేస్తారని, వివిధ వర్గాలుగా చీలిపోయిన అమెరికాలో టెక్నోక్రాటిక్, రాజకీయ సవాళ్లతో వ్యవహరించగలిగిన శక్తి కానీ సైద్ధాంతిక జ్ఞానం కానీ, తనకు లేదని ప్రజల్లో రకరకాల అభిప్రాయాలు చలామణిలో ఉంటూ వస్తున్నాయి. చివరకు ‘జోబైడెన్ అమెరికన్ డ్రీమర్’ పేరిట ఇవాన్ ఒసోన్స్ రాసిన లఘు జీవిత చరిత్ర కూడా బైడెన్ సంభాషణలు, ఆయన సహచరులు, వ్యతిరేకుల సంభాషణలను పొందుపరుస్తూ, ప్రపంచం విస్మరించిన లేక తక్కువ చేసి చూపిన జోబైడెన్ గురించి కాస్త మెరుగైన ధోరణిలో బైడెన్ని మలచడం విశేషం. బైడెన్ భావోద్వేగంతో కూడిన సంక్లిష్టతను, ప్రగాఢమైన, వృత్తిపరమైన అనుభవాన్ని తనతోపాటు వైట్హౌస్కి తీసుకెళుతున్నారని, ఇది గడచిన దశాబ్దాల్లో పనిచేసిన అధ్యక్షులతో పోలిస్తే అరుదైన విషయమని ఒస్నోస్ రాసిన పుస్తకం చెబుతోంది. బైడెన్ బాల్యంలో నత్తితో ఇబ్బందిపడ్డాడు కానీ చిన్న వయసులోనే అధ్యక్షుడు కావాలన్న ఆకాంక్షను మాత్రం వ్యక్తం చేశారట. ఆ ప్రకారంగానే 29 ఏళ్ల వయసులోనే బైడెన్ సెనేటర్ అయ్యారు. కానీ క్రిస్మస్ ట్రీని కొనుగోలు చేయడానికి బయటకు వచ్చిన ఆయన భార్య, కుమార్తె కారు ప్రమాదంలో మరణించారు. అది తనను తీవ్ర విచారంలో ముంచెత్తింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన జిల్ జాకబ్స్ని పెళ్లాడారు. జిల్ మా జీవితాలను కాపాడింది. ఏ మనిíషీ ఒక గొప్ప ప్రేమకు మించి అర్హుడు కాదు. ఇక రెండు గొప్ప ప్రేమల గురించి చెప్పేదేముంది అని జోబైడెన్ తర్వాత చెప్పారు. కానీ విషాదం తన జీవితాన్ని వెంటాడుతూనే ఉంది. 2015లో తానెంతగానో ప్రేమించిన కుమారుడు బ్యూని కేన్సర్ కబళించింది. ఇక రెండో కుమారుడు హంటర్ మాదకద్రవ్యాల సేవనం నుంచి బయటపడే విషయంలో పోరాడుతున్నారు. బైడెన్ తనజీవితం పొడవునా అభద్రతతో జీవిస్తూనే 1987లో అధ్యక్షపదవికి పోటీ చేసి ఘోరంగా విఫలుడయ్యారు. ఈ పరాజయాల నడుమ కూడా ప్రజలతో సంభాషించగల రాజకీయవేత్తగా కొనసాగడాన్ని నిలిపివేయలేదు. వ్యక్తులను పలకరించడంలో, వారితో సంబంధాలు నెరపడంలో బైడెన్ వెనుకబడలేదు. తన జీవితంలో ఎదురైన అభద్రతా అనుభూతులు దాపరికంలేని తత్వాన్ని, సులభంగా ప్రమాదాల్లో చిక్కుకుపోవడానికి అవకాశం ఇచ్చాయని బైడెన్ స్వీయజీవిత రచయిత ఓస్నోస్ రాశారు. ఆ క్రమంలోనే వాషింగ్టన్లో సెనేటర్గా విస్తృతమైన అనుభవం గడించారు. ఒప్పందాలను సమర్థంగా కుదర్చడం, శాసనాల రూపకల్పనలో ప్రావీణ్యత సాధించడం, సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ చైర్మన్గా ప్రపంచ నేతలతో సంబంధాలు నెలకొల్పుకోవడంలో రాటుదేలిపోయారు. తన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో బైడెన్ అనేక తప్పిదాలు చేశారు. డెమోక్రాటిక్ పార్టీలోనే ఛాందసవాదిగా ఉంటున్నందుకు సంతోషించేవారు. సుప్రీకోర్టులో క్లేరిన్స్ థామస్ నామినేషన్ విషయంలో అనితా హిల్ చేసిన ఆరోపణలను సమర్థించడమే కాకుండా ఇతర మహిళలు సాక్ష్యం చెప్పడానికి బైడెన్ అనుమతించలేదు. ఇక పౌర హక్కుల విషయంలోనూ బైడెన్కి ఏమంత ఘనమైన రికార్డు లేదు. నల్లజాతి ప్రజలను దెబ్బతీసిన 1994 క్రైమ్ బిల్లు ముసాయిదాను బైడెన్ రూపొందించారు. భావజాలపరంగా మార్పు చెందుతూ కూడా బైడెన్ మనగలగడానికి కారణం.. తన తప్పిదాలను అంగీకరిస్తూనే నిత్యం తన్ను తాను మార్చుకోవడానికి ప్రయత్నించడంలో విజయం పొందడమే. కొన్ని సందర్భాల్లో బైడెన్ తప్పిదం లేదని తర్వాత బయటపడేదనుకోండి. ఒస్నోస్ తన పుస్తకంలో కొన్ని మరచిపోలేని విషయాలు పొందుపర్చారు. వాటిలో ఒకటి ఏమిటంటే, ఒకానొక కాన్ఫరెన్సులో హన్నా అరెంట్ చదివిన పత్రం గురించి బైడెన్ ఒక పత్రికలో చదివి ఆ కాపీని తనకు పంపాలని బైడెన్ ఆమెను అభ్యర్థించారట. ఇటీవలే ‘హౌ డెమోక్రసీస్ డై’ అనే వ్యాసం చదివి ట్రంప్, ఇతర నిరంకుశ నేతలు ప్రపంచానికి తీసుకొస్తున్న ప్రమాదాలను గురించి హెచ్చరించారట. నల్లజాతి పురుషులను ‘బాయ్స్’ అని ప్రస్తావించినందుకు బైడెన్ తర్వాత ఒక టీవీ చర్చలో సెనేటర్ కోరీ బుకర్కి క్షమాపణ చెప్పిన వైనాన్ని బైడెన్ స్వీయరచనా కర్త ఓస్నోస్కి బుకర్ తెలిపారు. ‘బైడెన్ తన దుర్భలత్వాన్ని నాముందు గొప్పగా అంగీకరించారు. తనలోని అసంపూర్ణత్వాన్ని దాచుకోకుండా బయటికి చెప్పుకున్నారు. చాలాకాలంగా నేను రాజకీయాల్లో ఉంటున్నాను. బైడెన్ మారడాన్ని నేను దగ్గరగా చూస్తూ వచ్చాను’ అన్నారామె. ఇక సెనేట్లో తొలి సంవత్సరం ఆందోళనతో గడుపుతున్న సందర్భాల్లో తాను చేసిన ఒక ప్రసంగానికి గాను బైడెన్ తనను అభినందించారని సెనేటర్ అమీ క్లోబుచర్ పేర్కొన్నారు. కుటుంబంలో ఒకరిని కోల్పోయినప్పుడు నా స్నేహితులలో ఒకరికి కాల్ చేసి ఓదార్చడాన్ని కూడా అమీ గుర్తు చేశారు. చాలా మంది ప్రజలు బైడెన్ పట్ల ప్రేమ చూపుతారు. పైగా ఆయన గురించి వారికి సన్నిహితంగా తెలుసు అని అమీ అన్నారు. ఒబామా అంటే బైడెన్కి వీరారాధన. రాజకీయనేతగా తన పరిణామంపై ఒబామా పాత్ర చాలా ఎక్కువ అని బైడెన్ చెప్పారు. బైడెన్ని తన వైస్ ప్రెసిడెంట్గా ఒబామా ఎంచుకున్నారు. అందుకు బైడెన్కు విదేశీ వ్యవహారాలపై ఉన్న విస్తృతమైన అనుభవమే కారణం. అధ్యక్షుడిగా పాలించడంలో తనకు సహాయం చేయాలని ఒబామా కోరినట్లు బైడెన్ చెప్పారు. సమగ్రతా వైఖరి, మృదుస్వభావం, ఇతరుల అవసరాలను పట్టించుకునే తత్వం వంటి లక్షణాలు కలిగిన అధ్యక్షుడిని తానెన్నడూ చూడలేదని, ఒబామా ఈ అన్ని విషయాల్లోనూ తనకు స్ఫూర్తి అని బైడెన్ కృతజ్ఞతలు తెలిపారు. సలహాదారులు ఎన్ని చెప్పినా తనదైన నిర్ణయాన్ని తీసుకోవడంలో ఒబామా సాహసోపేతంగా ఉండేవారని బైడెన్ పేర్కొన్నారు. అదేసమయంలో రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు ఒబామాపై చేసే దాడులన్నింటికీ వ్యతిరేకంగా బైడెన్ నిలబడి ఒబామాకు రక్షణగోడలా నిలబడేవారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ప్రజా జీవితంలో సభ్యతను పునరుద్ధరించడం, కాస్త నాగరికంగా వ్యవహరించడం, ప్రభుత్వ పని తీరును మెరుగుపర్చడం, అమెరికాను మార్చే ప్రయత్నంలో వాషింగ్టన్లో సహకార భావనతో పనిచేయడం.. ఇవన్నీ కొత్త అధ్యక్షుడి ముందు సవాళ్లే. ఒబామా అధ్యక్ష పదవి గురించి గతంలో మాట్లాడేటప్పుడు తన దేశానికి గుర్తించదగిన పనులు చేయగలిగిన అద్భుతమైన మని షితో నేను భాగమవుతున్నానని బైడెన్ పేర్కొన్నారు. ఇప్పుడు తన చరిత్రను తానే రాసుకుంటున్న బైడెన్ ఉదారవాద ప్రజాస్వామ్యం భవిష్యత్తును నిర్దేశించడానికి సమాయత్తమవుతున్నారు. సుశీల్ అరోన్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు (ది వైర్ సౌజన్యంతో) -
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం
-
చరిత్ర సృష్టించిన జో బైడెన్
వాషింగ్టన్: భద్రత బలగాల పటిష్ట పహారా మధ్య బుధవారం అమెరికా 46వ అధ్యక్షుడిగా జోసెఫ్ రాబినెట్ బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. క్యాపిటల్ భవనంలో సంప్రదాయంగా ప్రమాణ స్వీకారం జరిగే ప్రదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్.. బైడెన్తో దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు. తమ కుటుంబానికి చెందిన 127 ఏళ్లనాటి బైబిల్పై ప్రమాణం చేసి బైడెన్ దేశాధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. గతంలో సెనేటర్గా, ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఆయన ఈ బైబిల్పైనే ప్రమాణం చేయడం విశేషం. అధ్యక్షుడుగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు, దేశ 49వ ఉపాధ్యక్షురాలిగా మన తమిళనాడు మూలాలున్న ఇండో–ఆఫ్రో అమెరికన్ మహిళ కమల హ్యారిస్(56) ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వయస్కుడైన అధ్యక్షుడిగా జో బైడెన్(78) చరిత్ర సృష్టించారు. భార్య జిల్ బైడెన్తో కలిసి ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదట సెనేటర్ అమీ క్లాబుకర్ ప్రారంభోపన్యాసం చేశారు. సెనెటర్ రాయ్బ్లంట్ ప్రారంభ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అనంతరం, బైడెన్ కుటుంబానికి సన్నిహితుడైన రోమన్ కాథలిక్ మత ప్రబోధకుడు లియో జెరెమి ఓ డోనోవాన్ ప్రార్థనలు చేశారు. ఆ తరువాత లేడీ గాగా జాతీయ గీతాన్ని ఆలపించారు. జార్జియాలోని సౌత్ ఫల్టన్లో ఫైర్ రెస్క్యూ డిపార్ట్మెంట్కు కెప్టెన్గా ఎంపికైన తొలి ఆఫ్రో అమెరికన్ మహిళ ఆండ్రియా హాల్ ప్రతిజ్ఞ చేశారు. ఆ తరువాత, కమల హ్యారిస్తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్ ప్రమాణం చేయించారు. అనంతరం 2017లో తొలి యువ కవయిత్రి పురస్కారాన్ని పొందిన అమండా గార్మన్.. తాను రాసిన ఒక కవితను చదివి వినిపించారు. ఆ తరువాత, నటి, గాయని జెన్నిఫర్ లోపెజ్ ఒక పాటను ఆలపించారు. అనంతరం, డెలావర్లోని విల్మింగ్టన్లో ఉన్న బెతెల్ ఆఫ్రికన్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చ్ పాస్టర్ సిల్విస్టర్ బీమన్ ఆశీస్సులు అందజేశారు. దేశాధ్యక్షుడిగా జో బైడెన్తో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం బైడెన్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అధ్యక్ష పదవిని వీడుతున్న డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు అల్లర్లకు, దాడులకు పాల్పడే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో.. క్యాపిటల్ భవనంలో, ప్రమాణ స్వీకార ప్రదేశంలో అసాధారణ స్థాయిలో బలగాలను మోహరించారు. ట్రంప్ రాలేదు.. పెన్స్ వచ్చారు నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పదవి నుంచి వైదొలగుతున్న అధ్యక్షడు పాల్గొనడం ఆనవాయితీ. కానీ, ఆ సంప్రదాయాన్ని తోసిపుచ్చుతూ, బైడెన్ ప్రమాణ స్వీకారానికి ట్రంప్ హాజరు కాలేదు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. అలాగే, కోవిడ్–19 ముప్పు నేపథ్యంలో అసాధారణంగా, ఎంపిక చేసిన కొందరు ఆహూతుల సమక్షంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు ఒబామా, జార్జ్ బుష్, క్లింటన్ తమ సతీమణులతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన సుమారు వెయ్యి మందిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కాంగ్రెస్ సభ్యులు కూడా ఉన్నారు. బైడెన్కు మోదీ అభినందనలు న్యూఢిల్లీ: అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు గాను బైడెన్తో కలిసి పనిచేయడానికి కంకణబద్ధుడనై ఉన్నానని పేర్కొన్నారు. ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొనేందుకు, అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఐక్యంగా నిలుద్దామని అమెరికా నాయకత్వానికి పిలుపునిచ్చారు. ►జో బైడెన్ అమెరికాకు రెండో క్యాథలిక్ అధ్యక్షుడు. అలాగే దేశానికి 46వ అధ్యక్షుడు. ►127 ఏళ్ల నాటి తన కుటుంబ బైబిల్పై ప్రమాణం చేశారు. ►ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, జార్జి బుష్ బరాక్ ఒబామా హాజరయ్యారు. ►ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ జస్టిస్ థర్గుడ్ మార్షల్కు చెందిన బైబిల్పై ప్రమాణం చేశారు. ►డొనాల్డ్ ట్రంప్ వీడ్కోలు కార్యక్రమానికి గైర్హాజరైన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బైడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చెత్త రికార్డు సృష్టించనున్న ట్రంప్
వాషింగ్టన్: నాలుగేళ్ల పాటు అమెరికా అధ్యక్షుడిగా హోదాలో పని చేసిన డొనాల్డ్ ట్రంప్ చివరివరకు టెంపరితనంతోనే ఉన్నారు. అధ్యక్షుడిగా ఉన్న చివరి రోజు కూడా సంప్రదాయాలు పాటించకుండా తన వ్యవహార శైలిలోనే నడుచుకున్నారు. వాస్తవంగా కొత్తగా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోయే కార్యక్రమంలో అధ్యక్ష పదవిని వీడే వ్యక్తి పాల్గొనాల్సి ఉంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న వారికి అభినందనలు తెలపాలి. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారని ఒక ప్రకటన విడుదల చేయాలి. కానీ అలాంటివేమీ లేకుండా చివరి వరకు జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు ఎక్కడా ధ్రువీకరించలేదు. కొత్తగా బాధ్యతలు స్వీకరించే బృందానికి శుభాకాంక్షలు అని చెప్పారు. శతాబ్దంన్నర సంప్రదాయం తూచ్ కొత్తగా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే వ్యక్తికి పాత అధ్యక్షుడు స్వాగతం చెబుతూ ప్రమాణ కార్యక్రమానికి హాజరవ్వడం సంప్రదాయం. అయితే బైడెన్కు తాను స్వాగతం చెప్పే ప్రసక్తేలేదని గతంలోనే ట్రంప్ ప్రకటించారు. 150 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి ట్రంప్ తూట్లు పొడిచారు. అయితే తన ప్రమాణానికి ట్రంప్ హాజరుకాకపోవడమే మంచిదని బైడెన్ తెలిపారు. 1869లో అప్పటి అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ తదుపరి అధ్యక్షుడు ఎస్ గ్రాంట్ ప్రమాణానికి హాజరుకాలేదు. ఇప్పుడు ట్రంప్ ఆ జాబితాలో చేరిపోయాడు. -
పది మంది రాజ్యసభ ఎంపీలు ప్రమాణం
సాక్షి, ఢిల్లీ: ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొత్తగా ఎన్నికైన పది మంది రాజ్యసభ సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా రాజ్యసభ ఛాంబర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కేంద్రమంత్రి హార్దీప్ సింగ్ పూరీ కూడా ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన పది మంది సభ్యులలో కర్ణాటకకు చెందిన నారాయణ కొరగప్ప. చదవండి: (రాజీవ్ గాంధీ విగ్రహానికి మసి పూశారు) బ్రిజ్లాల్, గీతా అలియాస్ చంద్రప్రభా, రాంజీ, హార్డ్వర్ దుబే, హర్దీప్ సింగ్ పూరి, నీరజ్ శేఖర్, బి ఎల్ వర్మ ,రామ్ గోపాల్ యాదవ్ వీరందరు యూపీ నుంచి ఎన్నికైనారు. నరేష్ బన్సల్ ఉత్తరఖండ్ కి చెందినవారు. కొత్తగా, తిరిగి ఎన్నికైన సభ్యులను స్వాగతించిన రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు వారికి శుభాకాంక్షలు తెలిపారు. పెద్దల సభకు ఎన్నికైన ఎంపీలపై ప్రజలకు అంచనాలు అధికంగా ఉంటాయని, వారి ఆకాంక్షలకు మించి పనిచేయాలని సూచించారు. రాజ్యసభ పెద్దల సభ కావడంతో, యువకులకు, ప్రజలకు మార్గనిర్ధేశం చేసేందుకు సభ్యులు ప్రవర్తన ఉన్నత ప్రమాణాలతో పాటించడం అత్యవసరం వెల్లడించారు. సభ సంప్రదాయాలను అందరు గౌరవించాలని ఆయన కోరారు. కోవిడ్ మహమ్మారి గురించి ఆందోళన వ్యక్తం చేసిన ఛైర్మన్, ప్రజలకు ఆదర్శంగా నిలిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సభ్యులకు పిలుపునిచ్చారు.మాస్క్ ధరించడం, సురక్షితమైన దూరాన్ని పాటించడం తప్పనిసరి అని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా సామాజిక దూరం కన్నా సురక్షిత దూరం అనే పదాన్ని తాను ఇష్టపడుతున్నానని పేర్కొన్నారు. -
ఎమ్మెల్సీలుగా జకియా, సురేష్ ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన జకియా ఖానమ్, పెనుమత్స సూర్యనారాయణరాజు (సురేష్) మంగళవారం పదవీ ప్రమాణస్వీకారం చేశారు. వీరిద్దరి చేత ఉదయం 11 గంటలకు మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ తన చాంబర్లో ప్రమాణస్వీకారం చేయించారు. దైవసాక్షిగా వారు పదవీ స్వీకారం చేశారు. దీంతో మండలిలో వైఎస్సార్సీపీ బలం 10కు చేరుకుంది. ఈ సందర్భంగా లెజిస్లేచర్ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు, ఉపముఖ్యమంత్రులు షేక్ అంజాద్బాషా, పి.పుష్పశ్రీవాణి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు కిలారు రోశయ్య, జోగి రమేష్, బి.అప్పలనాయుడు, బూడి ముత్యాల నాయుడు, మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీల పదవికి ఎంపికలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీని నమ్ముకున్న వారిని కచ్చితంగా గౌరవిస్తామనే సంకేతాన్ని ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో అన్నారు. దేశ చరిత్రలోనే ఒక ముస్లిం మైనారిటీ మహిళను తొలిసారి శాసనమండలికి పంపిన ఘనత వైఎస్ జగన్దే అన్నారు. అలాగే, తొలి నుంచీ పార్టీని వెన్నంటి ఉన్న పెనుమత్స కుటుంబం నుంచి సురేష్కు సముచిత స్థానం ఇచ్చారన్నారు. మైనారిటీ మహిళలు రాజకీయంగా ఎదగాలి అనే ఉద్దేశంతో జకియా ఖానమ్ను ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి జగన్ ఎంపిక చేశారని ఉప ముఖ్యమంత్రి అంజాద్బాష అన్నారు. మైనారిటీ మహిళకు వైఎస్ జగన్ సముచిత స్థానం కల్పించారని మరో ఉపముఖ్యమంత్రి పి.పుష్పశ్రీవాణి ప్రశంసించారు. తనను ఎమ్మెల్సీగా చేసినందుకు తాము వైఎస్సార్ కుటుంబానికి రుణపడి ఉంటానని జకియాఖానమ్ అన్నారు. -
ఎమ్మెల్సీలుగా సురేష్, జకియా ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలుగా పెనుమత్స సురేష్, జకీయా ఖానుమ్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ షరీఫ్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి, అంజాద్ భాషా, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పల నాయుడు, జోగి రమేష్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ‘సీఎం జగన్ ఎమ్మెల్సీల ఎంపికలో ప్రత్యేక శైలి పాటించారు. చరిత్రలో తొలిసారి మైనారిటీ మహిళ జకీయా ఖానుమ్ను శాసన మండలికి పంపారు. జగన్తో తొలి రోజు నుంచి వెన్నంటే ఉన్న సాంబశివరాజు కుమారుడు సురేష్కి అవకాశం ఇచ్చారు. ఇద్దరి ఎంపిక పార్టీని నమ్ముకున్న వారికి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యం ఇచ్చారని రుజువు చేసింద’ని అన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. 'మైనారిటీ మహిళను ఎమ్మెల్సీ చేయడం మైనారిటీలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న ప్రేమకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ముస్లిం మహిళకు గౌరవం ఇచ్చిన ఘనత సీఎం జగన్ది. ముస్లిం సమాజం మొత్తం సీఎం జగన్ను అభినందిస్తున్నారు. వైఎస్ కుటుంబం అంటేనే ముస్లిం పక్షపాత కుటుంబం. సామాన్య మైనారిటీ మహిళను మండలికి పంపడం విశేషమ'ని పేర్కొన్నారు. (ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ) ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. 'విజయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపింది పెనుమత్స సాంబశివరాజు. పార్టీని నమ్ముకున్న వారికి సీఎం జగన్మోహన్రెడ్డి గుర్తింపు ఇస్తారని మరోసారి నిరూపించారు. రాష్ట్రంలోని కార్యకర్తలు అందరిలోనూ గౌరవాన్ని పెంచారు. మైనారిటీ మహిళకూ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి జగన్మోహన్రెడ్డి మహిళా పక్షపాతి అని నిరూపించార'ని ప్రశంసించారు. -
కొత్త మంత్రుల ప్రమాణం.. సింధియా మార్క్!
భోపాల్ : మధ్యప్రదేశ్లో శివరాజ్సింగ్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో గురువారం కొత్తగా 28 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మధ్యప్రదేశ్ అడిషనల్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గురువారం ఉదయం వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన మంత్రివర్గంలో అత్యధికులు జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందినవారు కావడం విశేషం. కాంగ్రెస్తో విభేదాల అనంతరం బీజేపీలో చేరి రాజ్యసభకు ఎన్నికైన సింధియా తనతో పాటు వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గ విస్తరణలో తన వర్గీయులకు పదవులు దక్కించుకోవడంలో తన బలాన్ని నిరూపించుకున్నారు. మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో సింధియా వర్గంతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు గోపాల్ భార్గవ, ఇమార్తి దేవి, ప్రభురామ్ చౌదరి, ప్రధుమాన్ సింగ్ తోమర్తో పాటు సిందియా అత్త, బీజేపీ ఎమ్మెల్యే యశోధర రాజే సింధియాలు ఉన్నారు. (ముగ్గురు ముఖ్య నేతలకు కీలక బాధ్యతలు) కమల్నాథ్తో ఏర్పడిన విభేధాలతో కాంగ్రెస్ పార్టీకి మార్చి 10న రాజీనామా చేసిన సింధియా బీజేపీలో చేరారు. సింధియాతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు రాజీనామా చేయడంతో కమల్నాథ్ ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, మార్చి నెలలో సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యతలు చేపట్టారు. నెల రోజుల తర్వాత మంత్రిమండలిలోకి ఐదుగురిని తీసుకున్నారు. అయితే రాజ్యసభ ఎన్నికలతోపాటు, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింథియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఎవరెవరికి మంత్రిమండలిలో చోటుకల్పించాలనే అంశంపై స్పష్టత లేకపోవడంతో క్యాబినెట్ విస్తరణ ఇన్నిరోజులుగా వాయిదాపడుతూ వస్తున్నది. దీనికి తోడు లాక్డౌన్ ఉండడంతో మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. తాజాగా గురువారం 28 మంది మంత్రులు ప్రమాణం చేయడంతో శివరాజ్ సింగ్ ప్రభుత్వంలో పూర్తి కేబినెట్ కొలువు దీరినట్లయింది. (కాషాయ ‘కుటుంబం’లోకి సింధియా) -
ఎమ్మెల్సీగా ఉద్దవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం
ముంబై : మహారాష్ర్ట ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సహా శాసనమండలికి ఎన్నికైన 8 మంది సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ రామ్రాజే నాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి వెంట ఆయన సతీమణి, కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా ఉన్నారు. మండలిలో ఖాళీగా ఉన్న 9 స్థానాలకు తొమ్మిది మంది సభ్యులే నామినేషన్ దాఖలు చేయడంతో వీరంతా మే 14న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్దవ్ ఠాక్రేతో పాటు శివసేన నుంచి నీలం గోర్హే, బీజేపీ నుంచి గోపీచంద్ పడల్కర్, ప్రవీణ్ దాట్కే, రంజీత్సింహ్ మోహితే పాటిల్, రమేష్ కరాద్, కాంగ్రెస్కు చెందిన రాజేష్ రాథోడ్, ఎన్సీపీకి చెందిన శశికాంత్ షిండే, అమోల్ మిట్కారి ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. (లాక్డౌన్ : మహారాష్ట్ర కీలక నిర్ణయం ) మహారాష్ర్ట ముఖ్యమంత్రిగా ఉద్దవ్ ఠాక్రే 2019 నవంబర్ 28న ప్రమణ స్వీకారం చేశారు. అయితే అప్పటికీ ఆయన ఏ చట్టసభల్లోనూ ( అసెంబ్లీ, మండలి ) సభ్యుడు కాదు. దీంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం సీఎంగా భాద్యతలు చేపట్టిన ఆరు నెలల్లోపు ఏదేని ఉభయ సభకు ఎన్నిక కావాల్సి ఉండగా, కరోనా కారణంగా ఎన్నికలు రద్దయ్యాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతో ఎన్నికల నిర్వహణకు గవర్నర్ భగత్సింగ్ కోష్యారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్దవ్కు పదవీ గండం తప్పినట్లయ్యింది. ( సీఎం పదవి ఊడకుండా కాపాడండి: ఠాక్రే ) ఒకవేళ ఎమ్మెల్సీగా నామినేట్ కాకపోయి ఉంటే మే 28 లోపు స్వయంగా ఆయనే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చేది. ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఉద్దవ్ సీఎంగా కొనసాగనున్నారు. కాగా మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దవ్ నేతృత్వంలోని శివసేన..బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ తర్వాత జరిగిన పరిణామాల నేపధ్యంలో బీజేపీతో ఎన్నో ఏళ్ల మైత్రి బంధానికి శివసేన దూరమైంది. కూటమి తరపున నవంబర్ 28న ముఖ్యమంత్రిగా ఉద్దవ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టారు. (ఎమ్మెల్సీగా ‘మహా’ సీఎం ఏకగ్రీవం.. ) -
హైకోర్టు న్యాయమూర్తిగా విజయ్సేన్రెడ్డి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బొల్లంపల్లి విజయ్సేన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన చేత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ప్రమాణం చేయించారు. న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమానికి అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, న్యాయాధికారులు, జస్టిస్ విజయసేన్రెడ్డి కుటుంబసభ్యులు హాజరయ్యారు. కరోనా వైరస్ నేపథ్యంలో వీరంతా మాస్క్లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ కోర్టు హాల్లోకి ప్రవేశించారు. తొలుత హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర్రెడ్డి, జస్టిస్ విజయసేన్రెడ్డి నియామక ఉత్తర్వులను చదివి వినిపించారు. జస్టిస్ విజయసేన్ రెడ్డి 12 ఏళ్లపాటు న్యాయమూర్తిగా కొనసాగే సర్వీస్ ఉంది. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ విజయసేన్రెడ్డి ప్రమాణస్వీకారాన్ని యూట్యూబ్ ఆన్లైన్ ద్వారా వీక్షించే సౌకర్యం కల్పించడంతో వెయ్యి మంది ప్రత్యక్షంగా చూశారు. ప్రధాన న్యాయమూర్తితో కలిపి హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 14కు చేరింది. మరో పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చదవండి: కామన్ పేపర్.. ఎక్కువ చాయిస్లు -
సమాచార కమిషనర్ల ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా (ఆర్టీఐ) సీనియర్ జర్నలిస్టులు కట్టా శేఖర్రెడ్డి, మైదా నారాయణరెడ్డి, గిరిజన విద్యార్థి నేత గుగులోతు శంకర్నాయక్, న్యాయవాదులు సయ్యద్ ఖలీలుల్లా, మహ్మద్ అమీర్ హుస్సేన్ ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో వారితో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ఎస్.రాజా సదారాం ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఐదుగురు కమిషనర్లు బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వీరు మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బుద్ధా మురళి, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పాటతో అదరగొట్టిన కేజ్రీవాల్
-
వైరల్ : పాటతో అదరగొట్టిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో 'ధన్యవాద్ ఢిల్లీ' పేరుతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు సమయంలో కేజ్రీవాల్ పాడిన ఒక పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'నేను ఇప్సుడు ఒక పాట పాడతాను. కానీ ఒక కండీషన్.. అదేంటంటే.. నేను పాట పాడితే నాతోపాటు మీరు కూడా పాడాలి. మనందరి సమిష్టి కలను నెరవేర్చుకునేందుకు ఈ ప్రార్థన చాలా అవసరం' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 'హమ్ హోంగే కామ్ యాబ్'(వి షాల్ ఓవర్కమ్) పాటను పాడి.. అందరితో పాడించారు. ప్రస్తుతం ఈ పాట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. (కాంగ్రెస్, బీజేపీ అని కాదు.. అంతా నా వాళ్లే..!) 1960లలో యూఎస్ లో పౌర హక్కుల ఉద్యమం సమయంలో (వి షాల్ ఓవర్కమ్) పాట ఎంతో ప్రాచుర్యం పొంది.. వారి ఉద్యమానికి బాసటగా నిలిచింది. ఇదే పాటను హిందీ కవి గిరిజా కుమార్ మాథుర్ 'హమ్ హోంగే కామ్ యాబ్' పేరుతో హిందీలోకి అనువాదం చేశారు.ఇంతకుముందు కూడా రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార ముగింపు సమయంలో కేజ్రీవాల్ ఇలాగే హిందీ చిత్రం 'పైగాం'లోని 'ఇన్సాన్ కా హో ఇన్సాన్ సే భైచారా' అనే దేశభక్తి గీతం ఆలపించడం విశేషం. ఇక కేజ్రీవాల్తో పాటు ఆరుగురు ఆప్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో మనీష్ సిసోడియా, కైలేష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, రాజేంద్ర పాల్ గౌతమ్లు ఉన్నారు. ఢిల్లీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ 62 గెలవగా, బీజేపీ 8 స్థానాలను గెలుచుకుంది. -
ఆర్య వైశ్యులకు టీడీపీ చేసిందేమీ లేదు: మంత్రులు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఆర్య వైశ్య వేల్ఫేర్, డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కుప్పం ప్రసాద్ ప్రమాణం చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో కుప్పం ప్రసాద్తో మంత్రులు బాలినేని శ్రీనివాస్రెడ్డి, ఆదిమూలపు సురేష్, శంకర్ నారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రులు ప్రసంగించారు. వైశ్యులకు గత ప్రభుత్వం చేసిందేమీ లేదు.. గత టీడీపీ ప్రభుత్వం ఆర్య వైశ్యులకు చేసిందేమీ లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్రంలో 10 శాతం జనాభా ఆర్యవైశ్యులు ఉన్నారని.. వేల కోట్లతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలపరుస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశ్వసనీయత, నిబద్ధతకు నిదర్శనం అయితే.. చంద్రబాబు మోసం, దోపిడీకి నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబు.. ఎన్నికలకు ఐదు నెలల ముందు కార్పొరేషన్ ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా నిధులు కేటాయించారని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వం కుల రాజకీయాలకు చేసిందని ధ్వజమెత్తారు. కుల, మత, పార్టీలకతీతంగా సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద వైశ్యులకు కార్పొరేషన్ అండగా నిలవాలని కోరారు. ఆర్య వైశ్యులకు అండగా నిలవాలి.. ఆర్థికంగా వెనుకబడిన వైశ్యులకు అండగా ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన కుప్పం ప్రసాద్కు ఆయన అభినందనలు తెలిపారు. ప్రాంతాలకు అతీతంగా పనిచేసి.. పేదలకు చేయూత నివ్వాలని ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వానికి, వైశ్యులకు సంధాన కర్తగా ప్రసాద్ పనిచేయాలన్నారు. సీఎం వైఎస్ జగన్ తనపై ఉంచిన బాధ్యతను నెరవేర్చాలన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. వైశ్యులకు ఇచ్చిన మాటను సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపకుండా పొట్టి శ్రీరాములు త్యాగాన్ని అవమానించారని ధ్వజమెత్తారు. నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరిపి సీఎం జగన్ గౌరవించారని పేర్కొన్నారు. ఆయనకు వైశ్యులంతా అండగా ఉండాలని కోరారు. వైశ్యుల ఆరాధ్య దైవం పెనుగొండ వాసవిమాత ఆలయ అభివృద్ధి సీఎం వైఎస్ జగన్ కోటిన్నర నిధులు మంజూరు చేశారని వెల్లడించారు. ఆర్య వైశ్యులకు ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో పేదలైన ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. ఆ ఆరోపణలు అవాస్తవం.. ఆర్య వైశ్యుల్లో అధిక శాతం పేదలున్నారని.. కార్పొరేషన్ ద్వారా వారికి ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రోశయ్య సీఎం గా ఉన్నప్పుడు ఆయనను వైఎస్ జగన్ చిన్నచూపు చూశారనే ఆరోపణలు అవాస్తమన్నారు. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు జగన్ గౌరవించారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ తన పోరాటం సోనియాగాంధీపై చేశారే తప్ప రోశయ్యపై కాదని వివరించారు. రోశయ్యను జగన్ ఎన్నడూ ఒక మాట కూడా అనలేదని.. రోశయ్య సీఎం గా ఉన్నంత కాలం జగన్ కాంగ్రెస్లోనే ఉన్నారని పేర్కొన్నారు. కిరణ్కుమార్ రెడ్డి సీఎం అయిన తర్వాతే జగన్ వైఎస్సార్సీపీ పార్టీని స్థాపించారని తెలిపారు. కార్పొరేషన్కు సీఎం జగన్ వచ్చే బడ్జెట్లో తగిన నిధులను కేటాయిస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్య వైశ్యులందరికీ కార్పొరేషన్ ద్వారా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైశ్యులంతా వైఎస్సార్సీపీ వెంటే.. ఆర్య వైశ్య సమాజం అంతా వైఎస్సార్సీపీ వెంట నడుస్తోందని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాలనా కృషి ఫలితంగానే ఆర్య వైశ్యులంతా వైఎస్సార్సీపీకి అండగా నిలిచారని పేర్కొన్నారు. పేద వైశ్యులకు కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా పరిపుష్టి కల్పించాలని కోరారు. బీసీ సంక్షేమ శాఖ నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. చంద్రబాబు మోసం చేశారు.. వైశ్యులంటే సేవ, నిజాయితీకి నిదర్శనమని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు అన్నారు. గత టీడీపీ పాలనలో అనేక కులాలకు కార్పొరేషన్లు ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. అడిగితే వరాలు ఇచ్చేది దేవుడయితే... పేదల కళ్లలో కష్టాలు చూసి వరాలు ఇచ్చే దేవుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని పేర్కొన్నారు. గాంధీజీ, పొట్టి శ్రీరాములు ఆశయ సాధనలో పాలన సాగిస్తున్న వైఎస్ జగన్కు అందరూ అండగా నిలవాలని కోరారు. -
‘మహా’ డిప్యూటీ అజిత్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎవరు కానున్నారనే విషయంలో ఉత్కంఠ వీడింది. శివసేన చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్పవార్ ఉప ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఉన్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల అనంతరం సోమవారం మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్తగా 36 మందిని ఉద్ధవ్ ఠాక్రే తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఎన్సీపీ నుంచి 14 మంది, కాంగ్రెస్ నుంచి 10 మంది, శివసేన నుంచి 12 మంది మంత్రి పదవులు పొందారు. వీరితో విధాన భవన్ ప్రాంగణంలో గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. తాజా విస్తరణలో ఎన్సీపీకి 10 కేబినెట్, 4 సహాయమంత్రి పదవులు, శివసేనకు 8 కేబినెట్, 4 సహాయమంత్రి పదవులు, కాంగ్రెస్కు 8 కేబినెట్, 2 సహాయమంత్రి పదవులు లభించాయి. ఈ విస్తరణ అనంతరం ముఖ్యమంత్రితో కలుపుకుని, మొత్తం మంత్రుల సంఖ్య 43కి చేరింది. 15% నిబంధన మేరకు.. 288 మంది శాసనసభ్యులున్న మహారాష్ట్ర మంత్రివర్గ సంఖ్య 43కి మించకూడదు. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణం చేసిన సమయంలోనే ఈ మూడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్కు తాజా విస్తరణలో చోటు దక్కలేదు. ఆయనకు రాష్ట్ర పీసీసీ పీఠం అప్పగించే అవకాశాలున్నట్లు సమాచారం. మిత్ర పార్టీ క్రాంతికారీ షేట్కారీ ప„Š నుంచి శంకర్రావు గడఖ్కు కేబినెట్ హోదాతో మంత్రిపదవి, మరో మిత్రపక్షం ప్రహార్ జనశక్తి పార్టీ నుంచి బచ్చు కడుకు సహాయమంత్రి పదవి లభించాయి. ప్రభుత్వానికి మద్దతిచ్చిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాజేంద్ర పాటిల్కు కూడా సహాయమంత్రి పదవి లభించింది. ఎన్సీపీ సీనియర్ నేతలు నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ముఖ్, దిలిప్ వాల్సే పాటిల్, ధనుంజయ ముండే, కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ వాడెట్టివర్లకు కూడా తాజాగా మంత్రివర్గంలో స్థానం లభించింది. సంజయ్ రౌత్కు కోపమొచ్చింది!: కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకాలేదు. తన సోదరుడు, సేన ఎమ్మెల్యే సునీల్ రౌత్కు మంత్రివర్గంలో చోటు దక్కని కారణంగానే సంజయ్ హాజరుకాలేదని భావిస్తున్నారు. బీజేపీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కేసి పడవీపై గవర్నర్ ఆగ్రహం: తొలిసారి కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసి పడవీపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాణం చేసేటపుడు స్క్రిప్ట్లో ఉన్నదే చదవాలని, లేనిది చదవొద్దని పడవీని మందలించారు. ‘సీనియర్ నేతలు శరద్ పవార్, మల్లికార్జున్ ఖర్గే ఇక్కడే ఉన్నారు.కావాలంటే వారిని అడగండి’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం పడవీ చేత మళ్లీ ప్రమాణస్వీకారం చేయించారు. నాలుగోసారి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణం చేయడం దాదాపు నెల రోజుల వ్యవధిలో ఇది రెండో సారి. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా నవంబర్ 23న ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో ఎన్సీపీ తిరుగుబాటు నేతగా అజిత్ డిప్యూటీ సీఎంగా ప్రమాణంచేశారు. తర్వాత ఆయన మనసు మార్చుకుని మళ్లీ సొంత గూటికి వెళ్లడంతో ఫడ్నవీస్ ప్రభుత్వం కుప్పకూలింది. దాంతో 80 గంటల సీఎంగా ఫడ్నవీస్, 80 గంటల డిప్యూటీ సీఎంగా అజిత్ చరిత్రకెక్కారు. అయితే, అజిత్పవార్ గతంలో రెండు పర్యాయాలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. తొలిసారి 2010 నవంబర్లో, ఆ తరువాత 2012లో అజిత్పవార్ ఉపముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. మహారాష్ట్ర ప్రజలకు దాదాగా చిరపరిచితుడైన అజిత్పవార్ ఎన్సీపీ చీఫ్ శరద్పవార్ సోదరుడి కుమారుడు. 1980వ దశకంలో శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయ ప్రవేశం చేశారు. 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి ఏడు సార్లు ఆ స్థానం నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లో 1.65 లక్షల భారీ మెజారిటీ సాధించారు. తొలిసారి 1991 జూన్లో సహాయమంత్రి పదవి స్వీకరించారు. -
సోరెన్ ప్రమాణ స్వీకారానికి హేమాహేమీలు
రాంచీ : దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ, సీఏఏపై ఆందోళనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో విపక్ష నేతలంతా ఒకే వేదికను పంచుకోనున్నారు. జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా హేమంత్ సొరేన్ ఈనెల 29న రాంచీలో ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ప్రమాణస్వీకారోత్సవానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు (ఎన్డీయేతర), పార్టీల అధినేతలు హాజరుకానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీలను స్వయంగా కలిసిన హేమంత్.. ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానించారు. (29న సీఎంగా హేమంత్ ప్రమాణం) మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తదితరులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. అయితే సోనియా గాంధీ రాకపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి విపక్ష నేతలంతా పెద్ద ఎత్తు హాజరైన విషయం తెలిసిందే. -
ఫిన్ల్యాండ్ కేబినెట్లో 12 మంది మహిళలు
హెల్సింకి: ప్రపంచ దేశాల్లో అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన ఫిన్ల్యాండ్ ప్రధాని సన్నా మారిన్ తన కేబినెట్లోనూ మహిళలకే అత్యధికంగా చోటు కల్పించారు. కొత్త కేబినెట్లో 12 మంది మహిళలకి అవకాశం లభించింది. ఈ మంత్రుల్లో ఒక్కరు మినహాయించి మిగిలిన వారంతా 30–35 ఏళ్ల మధ్య వయసున్నవారే. ఆమె కేబినెట్లో ఏడుగురు పురుషులు కూడా ఉన్నారు. ఆర్థికం, విద్య, అంతర్గత వ్యవహారాలు వంటి ముఖ్యశాఖలన్నీ మహిళలకే అప్పగించారు. 34 ఏళ్ల వయసున్న సన్నా మారిన్ మంగళవారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులో విశ్వాస పరీక్ష ఎదుర్కొని నెగ్గారు. మారిన్కు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 70 ఓట్లు వచ్చాయి. ఫిన్ల్యాండ్లో అధికారంలో ఉన్న సెంటర్ లెఫ్ట్ సంకీర్ణ సర్కార్ను నడపడం ఆమె ముందున్న అతి పెద్ద సవాల్. ‘‘మర్యాద మన్ననల మధ్య ప్రతీ చిన్నారి ఎదుగుదల ఉండాలి. ఎవరైనా ఏదైనా సాధించేలా సమాజాన్ని నిర్మించడమే నా ధ్యేయం‘‘అని మారిన్ ట్వీట్ చేశారు. దేశంలో పోస్టల్ సమ్మెను ఎదుర్కోవడంలో విఫలమైనందుకు గతవారంలో అంటి రిన్నె ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో మారిన్ పగ్గాలు తీసుకున్నారు. సెంటర్ పార్టీకి చెందిన కత్రి కులుమణి (32)కి ఆర్థిక శాఖ, గ్రీన్ పార్టీ నాయకురాలు మారియా ఒహిశాలో (34)కు అంతర్గత వ్యవహారాలు, లెఫ్ట్ కూటమి చైర్వుమెన్ లీ అండెర్సన్ (32)కు విద్యాశాఖ అప్పగించారు. కార్మికుల అసంతృప్తి జ్వాలలు, ఎటు చూసినా సమ్మెలు నడుస్తున్న వేళ ప్రధానిగా మారిన్ తన ఎదుట ఉన్న సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. -
ప్రమాణ స్వీకారానికి మోదీ, షా వస్తారా ?
ముంబై : మహారాష్ట్రలో దాదాపు నెలరోజుల పాటు రసవత్తరంగా సాగిన పొలిటికల్ డ్రామాకు మంగళవారంతో తెరపడింది. దేవేంద్ర పడ్నవీస్, అజిత్ పవార్లు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులకు రాజీనామా చేయడంతో ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్లకు లైన్ క్లియర్ అయింది. కాగా, మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన ఛీప్ ఉద్ధవ్ ఠాక్రే గురువారం సాయంత్రం దాదర్లోని శివాజీ పార్క్లో ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఠాక్రే ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలను ఆహ్వానించే విషయమై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. దీనిపై శివసేన నేత సంజయ్ రౌత్ స్పందించారు. ' ఠాక్రే ప్రమాణ స్వీకారానికి ప్రతీ ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. మోదీ, అమిత్ షాలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తాం' అని తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం పీఠంపై ఇరు పార్టీల మధ్య విబేదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో శివసేన బీజేపీతో తెగదెంపులు చేసుకొని బయటికి వచ్చింది. తర్వాత చోటు చేసుకున్న పరిణామాల తదనంతరం ఎన్సీపీ, కాంగ్రెస్లతో జట్టు కట్టి అధికారంలోకి రానుంది. అయితే వీరి ఆహ్వానాన్ని మన్నించి బీజేపీ నేతలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. (చదవండి : ఉద్దవ్ ఠాక్రేకే పీఠం..) -
ఆ ఎమ్మెల్యేలపై శరద్ పవార్ మండిపాటు
న్యూఢిల్లీ/సాక్షి,ముంబై: అజిత్ పవార్తోపాటు అతని వెంట ఉన్న ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మండిపడ్డారు. ఎన్సీపీలో అంతర్గత పోరుతోనే అజిత్ బయటకు వెళ్లారన్నది అవాస్తవమన్నారు. బీజేపీ చీకటి రాజకీయాలు చేస్తోందని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. కాగా, ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన ఫడ్నవీస్తో హడావుడిగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడం చట్ట విరుద్ధమంటూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సుప్రీంకోర్టు తలుపుతట్టాయి. గవర్నర్ నిర్ణయాన్ని రద్దు చేయాలని, తక్షణమే శాసనసభను రద్దు పరిచి, బల పరీక్ష జరిపించాలని కోరాయి. ఈ పిటిషన్ ఆదివారం ఉదయం 11.30 గంటలకు విచారణకు రానుంది. మా వాళ్లంతా తిరిగి వస్తారు: పవార్ ఆకస్మిక రాజకీయ పరిణామాలపై శనివారం ఉదయం ఆయన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘ ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రమాణస్వీకార సమయంలో అక్కడున్న 10–11 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో ఐదుగురు మళ్లీ మా వద్దకు వచ్చారు. మిగతా వారూ వస్తారు’ అని శరద్ తెలిపారు. అజిత్ చర్య క్రమశిక్షణారాహిత్యమని ఆయన పేర్కొన్నారు. ‘అజిత్తోపాటు వెంట ఉన్న ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. ఫడ్నవీస్ ప్రభుత్వం బలపరీక్షలో ఓడిపోవడం ఖాయం. అజిత్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేలను ఒక వేళ ఉప ఎన్నికలు వస్తే ప్రజలే ఓడిస్తారు’అని అన్నారు. శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమికి అసెంబ్లీలో 170 మంది సభ్యుల బలముంది’ అని అన్నారు. బీజేపీవి చీకటి రాజకీయాలు: ఉద్ధవ్ తాజా పరిణామాలపై ఉద్ధవ్ స్పందించారు. ‘శివసేన ఏదైనా బాహాటంగానే చేస్తుంది. చీకటి రాజకీయాలు మేం చేయం. ఇదివరకు బీజేపీ ఈవీఎం వ్యవహారం నడిపించింది. ఇప్పుడు ఇదో కొత్త నాటకం. ఇకపై ఎన్నికలు కూడా అవసరమని నేను అనుకోను. సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో మాదిరిగానే కేంద్ర కేబినెట్ ఉదయాన్నే తీసుకున్న ఈ నిర్ణయం నకిలీస్టైక్స్(ఫర్జికల్ స్టైక్స్). మహారాష్ట్ర ప్రజలు శిక్షించక తప్పదు’ అని ఉద్ధవ్ పేర్కొన్నారు. ఇదో చీకటి అధ్యాయం: కాంగ్రెస్ మహారాష్ట్రలో అక్రమ మార్గంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి బీజేపీ ప్రజాస్వామ్యాన్ని చంపేసిందని, భారతదేశ చరిత్రలో ఇదో చీకటి అధ్యాయమని కాంగ్రెస్ విమర్శించింది. ప్రజాస్వామ్యాన్ని చంపేందుకు కాంట్రాక్టు పుచ్చుకున్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తింది. మహారాష్ట్రలో కాంగ్రెస్–ఎన్సీపీ–శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ధీమా వ్యక్తం చేసింది. విశ్వాస పరీక్షలో కాంగ్రెస్–శివసేన–ఎన్సీపీ కూటమి బీజేపీని ఓడిస్తుందని పేర్కొంది. ఉదయం సుప్రీం విచారణ ఫడ్నవీస్తో సీఎం ప్రమాణం చేయిస్తూ గవర్నర్ కోష్యారీ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎమ్మెల్యే బేరసారాలకు మరింతగా అవకాశం ఇవ్వకుండా వెంటనే శాసనసభలో బల నిరూపణ చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరాయి. ఆదివారం ఉదయం 11.30 గంటలకు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టనుంది. అజిత్ పవార్పై వేటు ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఉన్న అజిత్ పవార్ను ఆ పార్టీ తొలగించింది. ఎన్సీపీ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీతో చేతులు కలిపినందున అతన్ని తొలగించినట్లు తెలిపింది. దీంతో విప్జారీచేసే అధికారం అజిత్ కోల్పోయారని తెలిపింది. శనివారం సాయంత్రం ముంబైలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త శాసనసభాపక్ష నేత ఎన్నికయ్యే వరకు ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ రాజ్యాంగపర హక్కులు కలిగి ఉంటారని చెప్పారు. ఈ సమావేశానికి మొత్తం 54 మందికిగానూ 49 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వానికి బలం నిరూపించుకునేందుకు ఈ నెల 30 వరకూ సమయం ఉందని, అందులో బీజేపీని ఓడించి శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ చెప్పారు. ఫడ్నవీస్, అజిత్ పవార్ల ప్రమాణ స్వీకారం సమయంలో రాజ్భవన్లో ఉన్న తొమ్మిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు తుదకు శరద్ పవార్ వద్దకు చేరడం గమనార్హం. ఎప్పుడేం జరిగింది ? దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగాæ ప్రమాణం చేయడానికి ముందు రాత్రి నుంచి జరిగిన పరిణామాలివీ... నవంబర్ 22 8:00 (రాత్రి) ప్రభుత్వ ఏర్పాటు గురించి ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ నేతల భేటీ 8:45–9:00 భేటీ మధ్యలోనే వెళ్లిపోయిన అజిత్ పవార్ 10:00–10:30 ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా అన్ని పార్టీలు అంగీకరించాయని ప్రెస్మీట్లో వెల్లడించిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ 11:30–11:50 బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న అజిత్ నవంబర్ 23 12:00 (అర్ధరాత్రి): తెల్లవారేసరికి ప్రమాణ స్వీకారం ముగుస్తుందని కీలక వ్యక్తులకు సమాచారమిచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్ 12:15–12:40: ఢిల్లీ వెళ్లే పర్యటనను రద్దు చేసుకున్న మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోష్యారీ. ఉదయం ఆయన ప్రయాణం కావాల్సి ఉంది. 12:30: రాష్ట్రపతి పాలన ఎత్తివేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తన కార్యదర్శిని కోరిన కోష్యారీ 2:30–2:45: రాష్ట్రపతి పాలన ఎత్తివేసే పత్రాలు తయారు చేయడానికి రెండు గంటలు పడుతుందని చెప్పిన గవర్నర్ కార్యదర్శి. ఉదయం ఏడున్నర గంటలకల్లా ప్రమాణ స్వీకారం చేయవచ్చని సూచన. 5:30: రాజ్భవన్ చేరుకున్న అజిత్, ఫడ్నవీస్ 5:47: రాష్ట్రపతి పాలన ఎత్తివేసినట్లు ప్రకటించిన గవర్నర్ 7:50: ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ కోష్యారీ. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్ల ప్రమాణ స్వీకారం. 8:45: ఫడ్నవీస్, అజిత్ పవార్లను అభినందించిన ప్రధాని మోదీ. 8.50: ప్రమాణస్వీకారం బయటికి తెలియడంతో శరద్ పవార్ నివాసం ‘సిల్వర్ ఓక్’ వద్దకి చేరుకున్న ఎన్సీపీ నేతలు 9.00: ఉద్దవ్ ఠాక్రే నివాసస్థానం మాతోశ్రీ, శరద్ పవార్ నివాసస్థానం సిల్వర్ ఓక్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు. 10.10: బీజేపీ ఎమ్మెల్యేలందరూ ముంబైకి రావాలని ఆదేశాలు 10.30: శరద్తో భేటీ అయిన నవాబ్ మాలిక్ 11:00: హోటల్ మరీన్ ప్లాజాలో కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీ 12.30: వైబీ చవాన్ సెంటర్లో శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల మీడియా సమావేశం 1.50:తాను ఇప్పుడేమీ చెప్పలేనని సరైన సమయంలో అన్ని విషయాలు చెప్తానన్న అజిత్ 2.30: తమ ఎమ్మెల్యేలను సురక్షిత స్థలాలకు తరలించాలని కాంగ్రెస్ నిర్ణయం సాయంత్రం 5.15: సోదరుడు శ్రీనివాస్ పవార్ నివాసంలో ఎన్సీపీ ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ భేటీ. పటిష్ట భద్రత ఏర్పాటు. 6.20: సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన. రాత్రి 8.00 అజిత్పై వేటు వేసిన ఎన్సీపీ నవంబర్ 24 ఉదయం 11.30: పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభం -
సీజేగా బాబ్డే ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే (63) ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. 2021 ఏప్రిల్ 23 వరకు 17 నెలల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడతో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సుప్రీంకోర్టు మాజీ సీజే రంజన్ గొగోయ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎల్కే అద్వానీ, జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. అనంతరం వారంతా బాబ్డే శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్య అంశంలో తీర్పునిచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా ఉన్నారు. మహారాష్ట్ర లోని నాగ్పూర్కు చెందిన న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి బాబ్డే. తన తర్వాత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ బాబ్డే పేరును చీఫ్ జస్టిస్గా గొగోయ్ సిఫారసు చేయడం, రాష్ట్రపతి ఆమోదం తెలుపడం తెలిసిందే. చీఫ్ జస్టిస్గా రంజన్ గొగోయ్పై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను కొట్టివేసిన ముగ్గురు సభ్యుల ధర్మాసనంలోనూ బాబ్డే ఉన్నారు. ఆధార్ లేదన్న కారణంగా ఏ ఒక్క పౌరునికీ కనీస సేవలు, ప్రభుత్వ సేవలను తిరస్కరించడానికి వీల్లేదంటూ తీర్పునిచ్చిన ధర్మాసనంలోనూ భాగం పంచుకున్నారు. నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ డిగ్రీలను అందుకున్నారు. మహారాష్ట్ర బార్కౌన్సిల్లో 1978లో న్యాయవాదిగా నమోదయ్యారు. బోంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్లో లాయర్గా ప్రాక్టీస్ చేశారు. 2000 మార్చి 29న బోంబే హైకోర్టు న్యాయమూర్తిగా, 2012 అక్టోబర్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులైన బాబ్డే, 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు చేపట్టారు. సీజేఐ జస్టిస్ గొగోయ్ ఆదివారం రిటైరయ్యారు. -
సీజేఐగా బాబ్డే ప్రమాణం నేడు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే (63) నేడు ప్రమాణం చేయనున్నారు. 2021 ఏప్రిల్ 23 వరకు 17 నెలల పాటు ఈ పదవిలో ఉంటారు. అయోధ్య అంశంలో తీర్పునిచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా ఉన్నారు. మహారాష్ట్ర లోని నాగ్పూర్కు చెందిన న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ప్రముఖ సీనియర్ న్యాయవాది అరవింద్ శ్రీనివాస్ బాబ్డే కుమారుడు. తన తర్వాత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ బాబ్డే పేరును చీఫ్ జస్టిస్గా గొగోయ్ సిఫారసు చేయడం, రాష్ట్రపతి ఆమోదం తెలుపడం తెలిసిందే. చీఫ్ జస్టిస్గా రంజన్ గొగోయ్పై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను కొట్టివేసిన ముగ్గురు సభ్యుల ధర్మాసనంలోనూ బాబ్డే ఉన్నారు. ఆధార్ లేదన్న కారణంగా ఏ ఒక్క పౌరునికీ కనీస సేవలు, ప్రభుత్వ సేవలను తిరస్కరించడానికి వీల్లేదంటూ తీర్పునిచ్చిన ధర్మాసనంలోనూ భాగం పంచుకున్నారు. నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ డిగ్రీలను అందుకున్నారు. మహారాష్ట్ర బార్కౌన్సిల్లో 1978లో న్యాయవాదిగా నమోదయ్యారు. బోంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్లో లాయర్గా ప్రాక్టీస్ చేశారు. 2000 మార్చి 29న బోంబే హైకోర్టు న్యాయమూర్తిగా, 2012 అక్టోబర్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులైన బాబ్డే, 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు చేపట్టారు. సీజేఐ జస్టిస్ గొగోయ్ ఆదివారం రిటైరయ్యారు. -
కశ్మీర్కు ముర్ము.. లదాఖ్కు మాథుర్
శ్రీనగర్/లెహ్: జమ్మూకశ్మీర్ రాష్ట్రం స్థానంలో నూతనంగా అవతరించిన కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్కు లెఫ్ట్నెంట్ గవర్నర్గా జీసీ ముర్ము, లేహ్కు లెఫ్ట్నెంట్ గవర్నర్గా ఆర్కే మాథుర్ గురువారం పాలనాపగ్గాలు చేపట్టారు. జమ్మూకశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దుతోపాటు ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ ఆగస్టు 5వ తేదీన కేంద్ర తీసుకున్న నిర్ణయం అక్టోబర్ 31వ తేదీ నుంచి అమల్లోకి రావడం తెల్సిందే. లదాఖ్ రాజధాని లెహ్లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆర్కే మాథుర్తో జమ్మూకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జస్టిస్ గీతా మిట్టల్ శ్రీనగర్ వెళ్లారు. అక్కడ రాజ్ భవన్లో జరిగిన కార్యక్రమంలో జీసీ ముర్ము(59)తో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన రాధాకృష్ణ మాథుర్(66) 1977 బ్యాచ్ త్రిపుర కేడర్ ఐఏఎస్ అధికారి. ఈయన రక్షణ శాఖ కార్యదర్శిగా, సమాచార హక్కు ప్రధాన కమిషనర్గా పనిచేసి రిటైరయ్యారు. గుజరాత్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి ముర్ము స్వస్థలం ఒడిశా. విధుల్లో ఉండగానే లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తొలి అధికారి ముర్మునే. కాగా, జమ్మూకశ్మీర్కు స్వతంత్రప్రతిపత్తి రద్దు అనంతరం కేంద్ర విధించిన ఆంక్షలు, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. -
సుప్రీంకోర్టు నలుగురు జడ్జీల ప్రమాణం
సాక్షి, న్యూ ఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ వీ రామసుబ్రమణియన్, జస్టిస్ హృతికేశ్రాయ్లు సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తన కార్యాలయంలో వీరి చేత ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30గా ఉండగా కొత్త జడ్జీల ప్రమాణస్వీకారం అనంతరం ఆ సంఖ్య 34కు చేరింది. -
కొత్త గవర్నర్ బాధ్యతల స్వీకరణ నేడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన గవర్నర్గా నియమితులైన తమిళిసై సౌందర రాజన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉద యం 8 గంటలకు ఆమె చెన్నై నుంచి హైదరాబాద్కు చేరుకుంటారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర ఎస్.చౌహాన్ ఆదివారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొంటారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రెండో గవర్నర్గా, తొలి మహిళా గవర్నర్గా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజ్భవన్లో ఏర్పాట్లు చేస్తున్నారు. -
8న కొత్త గవర్నర్ బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్గా నియమితులైన తమిళిసై సౌందర రాజన్ ఈ నెల 8న బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర ఎస్.చౌహాన్ ఆదివారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొననున్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తమిళిసై రెండో గవర్నర్, తొలి మహిళా గవర్నర్ కాబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా కొత్త గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ నియామకాన్ని ప్రకటిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుత గవర్నర్ నరసింహన్ ఈ నెల 7న బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. -
గోవా మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ
పణజి: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శనివారం మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భాగంగా కేబినెట్లో ఉన్న గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్పీ)కి చెందిన ముగ్గురు, స్వతంత్ర అభ్యర్థి ఒకరికి ఉద్వాసన పలికారు. వీరి స్థానంలో ఇటీవల కాషాయ కండువా కప్పుకున్న కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేల్లో ముగ్గురికి పదవులు దక్కాయి. శనివారం రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మృదులా సిన్హా.. చంద్రకాంత్ కవ్లేకర్, జెన్నిఫర్ మొన్సర్రెట్, ఫిలిప్ నెరి రొడ్రిగ్స్తోపాటు బీజేపీకి చెందిన మైఖేల్ లోబోతో ప్రమాణం చేయించారు. 2017 ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం బీజేపీకి లేని సమయంలో మనోహర్ పారికర్ ప్రభుత్వం ఏర్పాటులో జీఎఫ్పీ కీలకంగా నిలిచింది. బీజేపీపై జీఎఫ్పీ విమర్శలు కేబినెట్ నుంచి తమను తప్పించడం ద్వారా బీజేపీ మోసానికి పాల్పడిందని జీఎఫ్పీ అధ్యక్షుడు, మంత్రివర్గం నుంచి వైదొలగిన డిప్యూటీ సీఎం విజయ్ సర్దేశాయ్ ఆరోపించారు. ఆయన శనివారం దివగంత సీఎం మనోహర్ పారికర్ మెమోరియల్ వద్ద జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘పారికర్ రెండుసార్లు చనిపోయారు. భౌతికంగా మార్చి 17వ తేదీన ఒకసారి, రాజకీయ సిద్ధాంతాలను చంపడం ద్వారా నేడు మరోసారి’ అని వ్యాఖ్యానించారు. కాగా, జీఎఫ్పీ విమర్శలను సీఎం తోసిపుచ్చారు. -
పెళ్లి తర్వాత ప్రమాణ స్వీకారం
-
ఎమ్మెల్యేలుగా మేము...
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బుధవారం శాసన సభలో ప్రమాణ స్వీకారం చేశారు..రాష్ట్ర శాసనసభకు జిల్లా నుంచి ఎన్నికైన 17 మంది శాసనసభ్యుల్లో బుధవారం 16 మంది శాసనసభ్యులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. నరసరావుపేట నుంచి ఎన్నికైన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత కారణాల వలన హాజరుకాలేకపోయారు. శాసనసభలో ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పలనాయుడు శాసనసభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభ్యులు వరుసగా విడదల రజని, డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావు, కాసు మహేష్రెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, కిలారి వెంకట రోశయ్య, మేరుగ నాగార్జున, మద్దాళి గిరిధర్, అనగాని సత్యప్రసాద్. -
ఉత్సాహంగా ఎమ్మెల్యేల ప్రమాణం
సాక్షి,విశాఖపట్నం : నవ్యాంధ్ర రెండో శాసనసభ కొలువు తీరింది. బుధవారం నుంచి ప్రారంభమైన తొలి అసెంబ్లీ సమావేశాల్లో జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు స్పీకర్ ఫోడియం ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో నాలుగు స్థానాల్లో టీడీపీ సభ్యులు గెలుపొందగా.. మిగిలిన 11 స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. విజయకేతనం ఎగురవేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థుల్లో ఆరుగురు తొలిసారి సభలో అడుగుపెట్టగా..ఒకరు మూడోసారి అడుగుపెట్టారు. మిగిలిన నలుగురు రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేల్లో ఇరువురు నాలుగోసారి సభలో అడుగుపెట్టగా, మిగిలిన ఇరువురు మూడోసారి అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రతిపక్షనేత ఎన్.చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశాక, మంత్రులు, ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు, ఆపై అక్షర క్రమంలో మిగిలిన ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. తొలిసారి సభలో అడుగుపెట్టిన వైఎస్సార్సీపీకి చెందిన ఆరుగురు శాసనసభ్యులు తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. సభలో అడుగు పెట్టగానే తొలుత ముఖ్యమంత్రిని, ఆ తర్వాత మంత్రులను,సహచర ఎమ్మెల్యేలను పలుకరిస్తూ అసెంబ్లీ హాల్లోకి ప్రవేశించారు. వీరంతా తొలుత నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దగ్గరకు వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకుని, ఆ తర్వాత స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ఎలాంటి తడబాటు లేకుండా ప్రమాణం చేశారు. ప్రమాణం చేసే సమయంలో ఒకింత ఉద్వేగానికి గురయ్యారు. సభలో తొలిసారి అడుగుపెట్టిన వారిలో నాగిరెడ్డి మినహా మిగిలిన వారంతా పిన్న వయస్కులే. ఇప్పటి వరకు బయట నుంచి చూసిన శాసనసభలో నేడు తాము సభ్యులు కావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వీరంతా తమ కుటుంబ సభ్యులతో సభకు చేరుకున్నారు. వారు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తుండగా విజిటర్స్గ్యాలరీ నుంచి చూస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఒకింత ఉద్విగ్నానికి గురయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం సభ ముగియగానే కుటుంబ సభ్యులతో ఆనందపరవశులయ్యారు. -
ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మేము
సాక్షి, విజయనగరం: రాష్ట్ర శాసనసభలో విజయనగరం జిల్లా కళకళ లాడింది. జిల్లాకు చెందిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలూ వైఎస్సార్సీపీవారే కావడం ఒక ఎత్తయితే... అందులో ఒకరు డిప్యూటీ సీఎం కావడం మరో ప్రత్యేకత. అంతేకాదు... రాష్ట్రంలోని సీఎం, ప్రతిపక్షనేతతో సహా అందరు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించే ప్రొటెం స్పీకర్ శంబంగి మన జిల్లావారు కావడం మరో విశేషం. మొత్తమ్మీద రాష్ట్ర శాసనసభ చరిత్ర పుటల్లో మరోసారి విజయనగరం జిల్లాకు సముచిత స్థానం లభించడం ఈ జిల్లావాసులకు గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదిహేనవ శాసన సభ బుధవారం కొలువుతీరింది. విజయనగరం జిల్లాకు ఆదినుంచీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ జిల్లా నుంచే ఉద్దండులైన ఎందరో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇన్నాళ్లూ జిల్లాకు ఉన్న గుర్తింపు ఒకెత్తయితే ఇప్పుడు వచ్చిన గుర్తింపు మరొకెత్తు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జిల్లాలోని విజయనగరం పార్లమెంట్తో పాటు, తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించింది. క్లీన్స్వీప్ చేసిన జిల్లాకు రెండు మంత్రి పదవులను ఇచ్చి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సముచిత స్థానం కల్పించారు. అక్కడితో ఆగిపోకుండా ఉపముఖ్యమంత్రి పదవిని కూడా జిల్లాకే కేటాయించి మరింత గౌరవాన్ని పెంచారు. అప్పటికీ సరిపెట్టకుండా సీఎంతో పాటు, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించే ప్రొటెం స్పీకర్ బాధ్యతను జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు అప్పగించి రాష్ట్రంలోనే జిల్లాకు ప్రత్యేక స్థానం కల్పించారు. దీంతో శాసనసభలో విజయనగరం జిల్లా ప్రత్యేకంగా కనిపించింది. జిల్లా మంత్రులు బొత్స సత్యనారాయణ, పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనరసయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు చేత ప్రొటెం స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. నిలిచిన శంబంగి ఆత్మగౌరవం రాష్ట్ర శాసనసభలో ప్రమాణస్వీకారోత్సవాన్ని మాత్రమే అందరూ చేశారు. అయితే ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న శంబంగి వెంకట చినఅప్పలనాయుడు మాత్రం తన ఆత్మగౌరవాన్ని తలెత్తుకునేలా చేశారు. విషయం ఎమిటంటే శంబంగి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీశారు. అప్పట్లో హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే, తెర్లాంలో ఒక ఎమ్మెల్యే చనిపోయారు. బై ఎలక్షన్ వచ్చింది. నామినేషన్కు ఆఖరి రోజు వరకు టీడీపీ అధ్యక్షుడి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు అభ్యర్థి పేరు ప్రకటించలేదు. నామినేషన్ ముందురోజు ఫోన్ చేసి ఫలానా వ్యక్తిని అభ్యర్థిగా వేస్తున్నట్లు శంబంగికి చెప్పారు. ఆయనకు ఏ ప్రాతిపదికన టిక్కెట్ ఇచ్చారని, మీరు తీసుకున్న నిర్ణయం కూడా తప్పని చంద్రబాబుకి చెప్పినా వినలేదు. ఒకసారి వచ్చి సమస్య పరిష్కరించాల్సిందిగా అర్థించారు. రావడానికి తనకు ఖాళీ లేదన్నారు చంద్రబాబు. ఇది రాజకీయ సమస్య కాబట్టి మీరు ఒకసారి ఖాళీ చేసుకుని రావాల్సిందేనని శంబంగి నచ్చజెప్పినా తనకు ఖాళీ అయ్యాక చెబుతానంటూ నిర్లక్ష్యంగా చంద్రబాబు బదులిచ్చారు. ఆ మాటకు నొచ్చుకున్న శంబంగి తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పార్టీలో కొనసాగలేనంటూ టీడీపీని వదిలి బయటకు వచ్చేశారు. ఇప్పుడు ప్రొటెం స్పీకర్ హోదాలో ఉన్న శంబంగి ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న చంద్రబాబు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు ప్రొటెం స్పీకరైన శంబంగి వద్దకు వెళ్లి చేతులు పట్టుకుని మరీ అభివాదం చేశారు. -
ఎమ్మెల్యేల శాసన ప్రమాణం
సాక్షి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు శాసనసభలో అడుగు పెట్టారు. బుధవారం 15వ శాసన సభ కొలువు దీరింది. ‘..అను నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను..’ అంటూ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎనిమిది మంది శాసనసభ్యులు శాసన పదవీ ప్రమాణం చేశారు. వీరందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 11.05 గంటలకు శాసనసభ తొలి సమావేశం ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్గా నియమితులైన శంబంగిచిన వెంకట అప్పలనాయుడు సభాపతి స్థానంలో ఆసీనులయ్యారు. జాతీయ గీతంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అక్షర క్రమంలో సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా నుంచి ఎన్నికైన 10 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్లో మంత్రులైన మేకపాటి గౌతమ్రెడ్డి, పోలుబోయిన అనిల్కుమార్యాదవ్తోపాటు మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వెలగపల్లి వరప్రసాద్రావు ప్రమాణ స్వీకారం చేశారు. -
ఎమ్మెల్యేలు అనే మేము...
సాక్షి, ఒంగోలు : రాష్ట్ర రాజధాని అమరావతిలోని శాసనసభలో బుధవారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైన వారు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారులో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్తో పాటు మరో 10 మంది శాసన సభ్యులతో బుధవారం వెలగపూడి సభలో ప్రొటెం స్పీకర్ శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వీరంతా శాసనసభ వ్యవహారాల సలహాసంఘ సమావేశంలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన 12 మందిలో ఇద్దరు అత్యధికంగా 5 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయిన వారుండగా మరో ఇద్దరు ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మూడోసారి ఒకరు, రెండో సారి ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా తొలిసారిగా నలుగురు శాసనసభకు ఎన్నికయినవారున్నారు. ఒంగోలు నుంచి ఐదు సార్లు విజయం.. బాలినేని శ్రీనివాసరెడ్డి (వాసు) అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను... అంటూ ఒంగోలు అసెంబ్లీ నుంచి 5వ సారి శాసన సభకు ఎన్నికైన బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. తర్వాత వరుసగా 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికైన బాలినేని 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. తిరిగి 2019 ఎన్నికల్లో అదేపార్టీ నుంచి పోటీ చేసి ఐదోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. మూడు స్థానాలు ఐదు సార్లు.. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో మార్టూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం బలరాం కృష్ణమూర్తి తొలిసారి శాసన సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1985లో మార్టూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1989, 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచే అద్దంకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ సారి 2019 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ అభ్యర్థిగా శాసన సభకు ఎన్నికయ్యారు. ఈ ఇద్దరూ 4వ సారి.. 1989లో కందుకూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మహీధర్రెడ్డి తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు.తర్వాత 2004,2009 లలో కాంగ్రెస్ అభ్యర్థిగా శాసన సభకు ఎన్నికయ్యారు.2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 4వ సారి ఎన్నికయ్యారు. 2004లో మార్టూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలిసారి శాసన సభకు ఎన్నికైన గొట్టిపాటి రవికుమార్ ఆ తర్వాత 2009లో అద్దంకి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా శాసన సభకు ఎన్నిక కాగా 2019 ఎన్నికల్లో అద్దంకి నుంచి టీడీపీ తరుపున శాసన సభకు ఎన్నికయ్యారు. 3వసారి ఆదిమూలపు సురేష్ : 2009లో యర్రగొండపాలెం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదిమూలపు సురేష్ తొలిసారి శాసన సభకు ఎన్నికయ్యారు. 2014లో సంతనూతలపాడు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో తిరిగి యర్రగొండపాలెం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి శాసన సభకు ఎన్నికయ్యారు. ముగ్గురు 2వసారి.. 2009 ఎన్నిలో గిద్దలూరు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరుపున పోటీ చేసిన అన్నా రాంబాబు తొలిసారి శాసన సభకు ఎన్నిక కాగా 2019లో వైఎస్సార్ సీపీ తరపున అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి మరోమారు రికార్డు మెజారిటీతో శాసన సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో కొండపి, అద్దంకి నియోజకవర్గాల నుంచి టీడీపీ తరుపున పోటీ శాసన సభకు ఎన్నికైన డోలా బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావులు 2019 ఎన్నికల్లోనూ అదే స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులుగా మరో మారు ఎన్నికయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేలుగా.. 2019 ఎన్నికల్లో మార్కాపురం, దర్శి, కనిగిరి, సంతనూతలపాడు నియోజకవర్గాల నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన కుందురు నాగార్జునరెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్, బుర్రా మధుసూదన్యాదవ్, టీజేఆర్ సుధాకర్బాబులు తొలిసారి శాసన సభకు ఎన్నికయ్యారు. -
శాసనసభకు ఎన్నికైన మేము...
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్ర శాసనసభ కొలువుదీరింది. ప్రజాక్షేత్రంలో విజయాన్ని దక్కించుకున్న జిల్లాకు చెందిన పదిమంది ఎమ్మెల్యేలు శాసనసభలో సభ్యులుగా ప్రమాణం చేశారు. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాసనసభ తొలి సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సభలో ఆరోసారి అడుగుపెడుతున్న ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం అత్యంత సీనియర్ నాయకుడిగా నిలిచారు. శాసనసభాపతిగా గురువారం ఆయన ఎన్నిక లాంఛనప్రాయమే! రెడ్డి శాంతి, డాక్టర్ సీదిరి అప్పలరాజు, గొర్లె కిరణ్కుమార్ తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. ఎన్నో విశేషాలు ఈసారి శాసనసభలో జిల్లాకు సంబంధించి అనేక విశేషాలున్నాయి. పది నియోజకవర్గాల్లో ఎనిమిది చోట్ల వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. 2014 ఎన్నికలలో మూడు స్థానాలకే పరిమితమైన వైఎస్సార్సీపీ ఈసారి మాత్రం తిరుగులేని ఆధి క్యం సాధించింది. అధికార పార్టీగా బరిలోకి దిగిన టీడీపీ చావుతప్పి లొట్టబోయి రెండు స్థానాలకు పరిమితమైంది. ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి బెందాళం అశోక్ రెండోసారి గెలుపొందారు. గత ఐదేళ్లలో జిల్లా మంత్రిగా చక్రం తిప్పిన కింజరాపు అచ్చెన్నాయుడికి టెక్కలిలో మరోసారి గె లుపొందడానికి ముచ్చెమటలు పట్టాయి. ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఈసారి టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతగా బుధవారం అడుగుపెట్టారు. శాసనసభలో సీనియారిటీ... ఎన్నోసారి ఎంతమంది ఎవరు ఆరోసారి ఒకరు తమ్మినేని సీతారాం (ఆమదాలవలస) ఐదోసారి ఇద్దరు ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం) కింజరాపు అచ్చెన్నాయుడు (టెక్కలి) నాలుగోసారి ఒకరు ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట) మూడోసారి ఒకరు కంబాల జోగులు (రాజాం) రెండోసారి ఇద్దరు విశ్వాసరాయి కళావతి (పాలకొండ) బెందాళం అశోక్ (ఇచ్ఛాపురం) తొలిసారి ముగ్గురు రెడ్డి శాంతి (పాతపట్నం) డాక్టరు సీదిరి అప్పలరాజు (పలాస) గొర్లె కిరణ్కుమార్ (ఎచ్చెర్ల) అత్యంత సీనియర్ తమ్మినేని ఆమదాలవలస నుంచి ఆరోసారి విజయం సాధించిన తమ్మినేని సీతారాం జిల్లాలోనే సీనియర్ నాయకుడిగా నిలిచారు. 1983లో టీడీపీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన ఆయన నాటి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పైడి శ్రీరామమూర్తిని ఓడించారు. 1985 ఎన్నికలలోనూ ఆయనపైనే గెలిచినా 1989లో మాత్రం పరాజయం తప్పలేదు. కానీ శ్రీకాకుళం రాజకీయ ఉద్దండుడైన బొడ్డేపల్లి రాజగోపాలరావును 1991 ఉప ఎన్నికలలో ఓడించి సంచలనం సృష్టించారు. టీడీపీ నుంచే 1994, 1999 ఎన్నికలలోనూ విజయం సాధించారు. అయితే 2004లో మాత్రం మహానేత డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంతో ఓటమి తప్పలేదు. తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసినా బొడ్డేపల్లి సత్యవతి చేతిలో ఓడిపోయారు. 2014లోనూ త్రుటిలో విజయం చేజారింది. ఇలా వరుసగా మూడుసార్లు ఓటమి ఎదురైనా మొక్కవోని దీక్షతో, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనంతో 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించారు. బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. శాసనసభాపతిగా గురువారం ఆయన ఎన్నిక లాంఛనప్రాయం కానుంది. జిల్లా నుంచి ఈ పదవిని నిర్వహించిన మూడో వ్యక్తిగా సీతారాం నిలిచారు. గతంలో తంగి సత్యనారాయణ, కావలి ప్రతిభాభారతి స్పీకరుగా పనిచేశారు. నాడు తమ్ముడు... నేడు అన్న... నరసన్నపేట నియోజకవర్గం నుంచి 1989, 1999 ఎన్నికలలోనూ, తర్వాత శ్రీకాకుళం నుంచి 2004, 2009 ఎన్నికలలోనూ, తాజాగా 2019 ఎన్నికలలోనూ విజయం సాధించిన ధర్మాన ప్రసాదరావు నలుగురు ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో పని చేశారు. ఇప్పుడు అదే నరసన్నపేట నుంచి నాలు గోసారి భారీ మెజార్టీతో గెలుపొందిన ఆయన అన్న ధర్మాన కృష్ణదాస్ వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో రోడ్లు–భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సోదరులిద్దరూ బుధవారం ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరెంతో ప్రత్యేకం... ఎమ్మెల్యేగా మూడోసారి శాసనసభలో అడుగుపెట్టిన కంబాల జోగులు, రెండోసారి అడుగుపెట్టిన విశ్వాసరాయి కళావతి బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. రాజాం నియోజకవర్గంలో 2014 ఎన్నికలలో మాజీ స్పీకరు, మాజీ మంత్రి కావలి ప్రతిభాభారతిని, 2019 ఎన్నికలలో మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ను మట్టికరిపించిన ఘనత జోగులుకు దక్కుతుంది. ఆ ముగ్గురికీ తొలి అడుగు... 2014 ఎన్నికలలో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేసి త్రుటిలో ఓటమి పొందిన రెడ్డి శాంతి ఈసారి మాత్రం పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. గత ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలుపొంది తర్వాత చంద్రబాబు ప్రలోభాలతో టీడీపీలోకి ఫిరాయించిన కలమట వెంకటరమణను కంగుతినిపించారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆమె బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక గౌతు కుటుంబానికి కంచుకోటగా ఉన్న పలాసలో శివాజీ వారసురాలు శిరీషపై భారీ విజయం సాధించిన డాక్టర్ సీదిరి అప్పలరాజు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయనతో పాటు ఎచ్చెర్ల నుంచి విజయం పొందిన గొర్లె కిరణ్కుమార్ కూడా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు వంటి సీనియర్ నాయకుడిని కిరణ్ అవలీలగా ఓడించారు. -
వీఐపీలకు పాసుల కేటాయింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెల్సిందే. దీని కోసం స్టేడియం లోపల, పరిసర ప్రాంతాలు, వచ్చే మార్గాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సివిల్ సర్వీస్ అధికారులు, ఇతర నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా భద్రతాధికారులు ఐదు రకాల పాసులను ప్రముఖులకు జారీ చేశారు. పాసులు ఏఏ పాస్లు-350 జారీ(జ్యుడీషియరీ, సమాచార కమిషనర్లు, రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారు) ఏ1 పాస్లు-500 జారీ(ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకి ఇచ్చారు) ఏ2 పాస్లు-800 జారీ(ఎమ్మెల్యే, ఎంపీ కుటుంబసభ్యులు) బీ1 పాస్లు-500 జారీ(ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు) బీ2 పాస్లు- 500 జారీ(బార్ అసోసియేషన్ సభ్యులు, ఇతర అధికారులు) స్టేడియం లోపలికి రావడానికి ఆరు గేట్ల ఏర్పాటు గేట్1(మొయిన్ గేట్)- గవర్నర్, తెలుగు రాష్ట్రాల సీఎంలు, డీఎంకే చీఫ్ స్టాలిన్) గేట్2- వీఐపీలు(ఎమ్మెల్యే, ఎంపీ, సీనియర్ అధికారులు, జ్యుడీషియరీ, మీడియా ప్రతినిధులు) గేట్3, గేట్6లలో పాస్లు ఉన్నవారికి ప్రవేశం గేట్4, గేట్5లలో సాధారణ ప్రజలకు ప్రవేశం -
మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి దీదీ
కోల్కతా : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ నెల 30న నరేంద్ర మోదీ రెండో సారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరవుతున్నారు. ఈ విషయం గురించి మమతా మాట్లాడుతూ.. ‘ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లానే నాకు కూడా మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందింది. ఈ విషయం గురించి ఇతర సీఎంలతో చర్చించాను. దేశ ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం కాబట్టి హాజరవ్వాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపారు. West Bengal CM Mamata Banerjee on PM Modi's oath taking ceremony: I have spoken to other Chief Ministers also. Since it is a ceremonial program we thought of attending it.Yes I will go pic.twitter.com/qbgIomrvCL — ANI (@ANI) May 28, 2019 -
మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు
-
వైఎస్ జగన్ ప్రమాణస్వీకార ఏర్పాట్లపై ఆహిలారుల సమీక్ష
-
వైఎస్ జగన్ ప్రమాణ ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకార ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30న మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం శనివారం సాయంత్రం అధికారిక బులెటిన్ విడుదల చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని గవర్నర్ కార్యాలయం తెలిపింది. శనివారం ఉదయం శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం వై.ఎస్. జగన్ సతీసమేతంగా గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట కు చేరుకొని నేరుగా రాజ్భవన్ వెళ్లారు. గవర్నర్తో వైఎస్ జగన్ దంపతులు, విజయసాయి రెడ్డి, ఇతర నేతలు శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన జగన్కు గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను ఎన్నుకుంటూ ఎమ్మెల్యేలు చేసిన ఏకవాక్య తీర్మాన ప్రతిని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గవర్నర్కు అందజేశారు. తీర్మాన కాపీని పరిశీలించిన గవర్నర్... ప్రభుత్వం ఏర్పా టు చేయాలంటూ వై.ఎస్. జగన్ను ఆహ్వానించారు. జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డి, సీని యర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ఆదిమూలపు సురేశ్ ఉన్నారు. దాదాపు గంటపాటు ఈ భేటీ జరిగింది. ఉప్పొంగిన అభిమానం ఏపీ శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సాధించిన ఘన విజయంపట్ల ఆనందోత్సవాల్లో ఉన్న పార్టీ అభిమానులు శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తరువాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన జగన్కు విమానాశ్రయంలోనే పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆ తరువాత రాజ్భవన్ వస్తారని తెలుసుకొని వందలాది మంది పార్టీ జెండాలు, బ్యానర్లతో కదిలివచ్చారు. రాజ్భవన్ వద్ద వైఎస్సార్సీపీ అభిమానుల కోలాహలం జై జగన్.. సీఎం జగన్ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. జగన్ కాన్వాయ్ రాజ్భవన్కు రాగానే ఒక్కసారిగా అభిమానులు చొచ్చుకురావడం తో పోలీసులు వారిని నియంత్రించడానికి కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసేందుకు వెళ్లిన సమయంలోనూ వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలను అదుపు చేయడానికి భద్రతా సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ఆ తరువాత జగన్ తన లోటస్పాండ్ నివాసానికి వెళ్లినప్పుడు కూడా అదే రీతిలో కార్యకర్తలు, అభిమానులు హర్షధ్వానాలు చేశారు. గవర్నర్ దంపతులతో భేటీ... గవర్నర్ నరసింహన్ దంపతులు జగన్, ఆయన సతీమణి భారతీరెడ్డితో కొద్దిసేపు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 30న జరిగే ప్రమాణస్వీకారానికి రావాలని గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ను ఆహ్వానించగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. -
కలసి సాగుదాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యంగా కలసి ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన వైఎస్ జగన్కు ప్రగతి భవన్లో అపూర్వ స్వాగతం లభించింది. శనివారం సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలసిన అనంతరం నేరుగా ప్రగతిభవన్ చేరుకున్న జగన్ దంపతుల కారు వద్దకు సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి ఆత్మీయ స్వాగతం పలికారు. జగన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ప్రగతి భవన్లోనికి తీసుకెళ్లారు. లోపల అప్పటికే వేచి ఉన్న తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్య నేతలను కేసీఆర్.. వైఎస్ జగన్కు పరిచయం చేశారు. ఏపీ శాసనసభ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న వైఎస్ జగన్ను కేసీఆర్ అభినందించి మిఠాయి తినిపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన జగన్ను శాలువాతో సన్మానించారు. హంసవీణ (కరీంనగర్ పిలిగ్రీ) జ్ఞాపికను బహూకరించారు. జగన్ దంపతులకు కేసీఆర్ దంపతులు కొత్త వస్త్రాలు అందించి సత్కరించారు. ఏపీ ముఖ్యమంత్రి బాధ్యతల్లో విజయవంతం కావాలని జగన్ను దీవించారు. జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డికి కేసీఆర్ సతీమణి శోభారాణి, కేటీఆర్ సతీమణి శైలిమ స్వాగతం పలికారు. వైఎస్ భారతీరెడ్డి కొద్ది సేపువారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నెల 30న విజయవాడలో నిర్వహించే ప్రమాణ స్వీకారోత్సవానికి తప్పనిసరిగా రావాలని కేసీఆర్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు. జగన్ వెంట ఏపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్ ఉన్నారు. కేసీఆర్తో పాటు జగన్కు స్వాగతం పలికిన వారిలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాసగౌడ్, మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఎంపీ జె.సంతోశ్కుమార్, మాజీ ఎంపీలు బి.వినోద్ కుమార్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ రెడ్డి తదితరులున్నారు. జగన్కు కేసీఆర్ స్నేహ హస్తం... ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడమే తమ విధానమని, ఆంధ్రప్రదేశ్తో కూడా అదే విధానం అవలంబిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. గోదావరి, కృష్ణా నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటే రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాల విషయంలో నేతలిద్దరూ కొద్దిసేపు చర్చించారు. ఆంధ్రప్రదేశ్తో మంచి సంబంధాలు నెలకొల్పుదామని కేసీఆర్ స్నేహహస్తం అందించారు. ‘‘ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించడం మంచిదని మేము మొదటి నుంచి భావిస్తున్నాం. నేను స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను కలిశా. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్–మహారాష్ట్ర మధ్య ఉన్న జల వివాదాల కారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోవడంపై నేనే చొరవ తీసుకుని మాట్లాడా. లివ్ అండ్ లెట్ లివ్ మా విధానమని చెప్పా. వివాదాలు పరిష్కరించుకోవడంతో రెండు రాష్ట్రాలకు మేలని అన్నా. దీంతో సహకరించడానికి మహారాష్ట్ర ముందుకొచ్చింది. ఫలితంగా కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులు నిర్మించుకోగలుగుతున్నాం. ఏపీతోనూ ఇలాంటి సంబంధాలనే కొనసాగించాలన్నది మా విధానం. రెండు రాష్ట్రాలకు మేలు కలిగేలా వ్యవహరిద్దాం’’అని కేసీఆర్ అన్నారు. ‘‘గోదావరి నది నుంచి ప్రతీ ఏటా 3,500 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణ గరిష్టంగా 700–800 టీఎంసీలే వాడుకోగలదు. మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్ వాడుకునే వీలుంది. ప్రకాశం బ్యారేజీ ద్వారా సోమశిల వరకు గ్రావిటీ ద్వారానే గోదావరి నీటిని పంపించవచ్చు. దీంతో యావత్ రాయలసీమను సస్యశ్యామలం చేయొచ్చు. కేవలం 2 లిఫ్టులతో గోదావరి నీళ్లను సీమకు పంపొచ్చు. గోదావరి నీళ్లను వాడుకుని ఆంధ్రప్రదేశ్ రైతులకు సాగునీరు ఇవ్వొచ్చు’’అని సూచించారు. త్వరలోనే రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో సహా సమావేశమై అన్ని అంశాలపై చర్చించుకోవాలని ఇద్దరు నాయకులు నిర్ణయించారు. -
రాష్ట్రంలో వికృత రాజకీయ క్రీడ
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా సంపాదించిన సొమ్ముతో టీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో వికృత రాజకీయ క్రీడ ఆడుతున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి సీఎం పదవిని చేపట్టిన కేసీఆర్ అధికార అహంకారంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, రాష్ట్రాన్ని తన కుటుంబం మాత్రమే పాలించాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసే కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన అనంతరం సోమవారం గాంధీభవన్లో టీపీసీసీ ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. ఈ సభలో ఉత్తమ్ మాట్లాడుతూ.. నిత్యం ప్రజలతో సంబంధాలుండి మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్న జీవన్రెడ్డి ఎమ్మెల్సీగా గెలవడం కాంగ్రెస్ భవిష్యత్కు మలుపు అని అన్నారు. మండలిలో జీవన్రెడ్డి తెలంగాణ ప్రజల గొంతుక కావాలని, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన పనిచేయాలని కోరారు. నాడు టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీలతో కలసి మండలిలో సీఎల్పీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించే చిల్లర రాజకీయాలకు పాల్పడిన కేసీఆర్.. ఇప్పుడు అసెంబ్లీలో సీఎల్పీని విలీనం చేస్తానంటూ వికృత క్రీడ ఆడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా ఎదుర్కొంటామని, పోరాడుతామని ఉత్తమ్ చెప్పారు. రాష్ట్రాన్ని సొంత ఎస్టేట్గా భావిస్తున్నారు... కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేయడం కేసీఆర్ తరం కాదని, తమ పార్టీ నుంచి జీవన్రెడ్డిలు పుడుతూనే ఉంటారన్నారు. తెలంగాణలో అత్యంత అవమానకర రాజకీయ పరిస్థితులున్నాయని, రాష్ట్రాన్ని కేసీఆర్ సొంత ఎస్టేట్గా భావిస్తున్నారని ఆరోపించారు. ‘కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరిగి బీఫారాలు తీసుకుని ఎన్నికల్లో పోటీ చేసి చేయి గుర్తు మీద గెలిచారు. గెలిచాక పార్టీ మీద భరోసా లేదంటూ పార్టీని వీడి వెళుతున్న వారిని ఏమనాలి? పార్టీ మీద భరోసా లేనప్పుడు ఎందుకు టికెట్ అడిగారు.. పోటీ చేసి ఎలా గెలిచారు? ఇప్పుడు పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తున్నారు.’అని భట్టి వ్యాఖ్యానించారు. ఎంతమంది ఎమ్మెల్యేలు మిగిలితే అంతమందితో పోరాడతామే తప్ప కేసీఆర్ ముందు మోకరిల్లబోమని అన్నారు. కొన్నాళ్లు పోతే కేసీఆర్ను కుక్కలు కూడా కానని పరిస్థితి వస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మాట్లాడుతూ.. మేధావులు, విద్యావంతులు తనపై నమ్మకం ఉంచి గెలిపించార ని, దాన్ని బాధ్యతగా తీసుకుని ప్రజల పక్షాన మండలిలో గళం వినిపిస్తానన్నారు. పార్టీ రాష్ట్ర వ్యవ హారా ల ఇన్చార్జీ కుంతియా, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ తదితరులు ప్రసంగించిన ఈ సభలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చీఫ్ కో–ఆర్డినేటర్గా జీవన్రెడ్డి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు గాను రాష్ట్ర చీఫ్ కో–ఆర్డినేటర్గా ఎమ్మెల్సీ జీవన్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో పార్టీ గెలుపు కోసం ఆయన సమన్వయం వహిస్తారని పేర్కొన్నారు. -
ఎమ్మెల్యేగా రాజాసింగ్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శనివారం ఉదయం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసనసభ నూతన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన చేత ప్రమాణం చేయించారు. గురువారం అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి రాజాసింగ్ సహా మరో నలుగురు ఎమ్మెల్యేలు హాజరు కాని విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన అనంతరం మీడియా సమావేశంలో రాజాసింగ్ మాట్లాడారు. ఎంఐఎం పార్టీ నాయకులు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారని, సీఎం కేసీఆర్ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్ను చేసినందుకు ఆలోచించాలన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే అందరినీ కలుపుకొని వెళ్లాలని కేసీఆర్కు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉంటానని, హిందూ ధర్మం పట్ల వ్యతిరేకంగా ఉండే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే, ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ముందు తాను ప్రమాణం చేయనని రాజాసింగ్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. -
కొలువుదీరిన అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభ గురువారం కొలువుదీరింది. ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన సభలో సీఎం కేసీఆర్ సహా 114 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయగా, ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. కొందరు ఎమ్మెల్యేలుగా తాము రాజ్యాంగబద్ధులమై ఉంటామని, మరికొందరు సభా నియమాలకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేశారు. 15 మంది ఎమ్మెల్యేలు పవిత్ర హృదయంతో.. మిగిలినవారు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఆరుగురు సభ్యులు మాత్రమే ఇంగ్లిష్లో, మిగిలిన వారు తెలుగులో ప్రమాణ స్వీకార పత్రం చదివారు. ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం.. ఎమ్మెల్యేగా గెలిచినట్లుగా రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని శాసనసభ అధికారులకు అందజేసి ప్రమాణం చేశారు. ఆ తరువాత రిజిస్టర్లో సంతకాలు చేశారు. ప్రమాణం సమయంలో కొందరు ఎమ్మెల్యేలు సభా నియమాలకు కట్టుబడి ఉంటామని పలకడానికి బదులుగా సభ నియామకాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రమాణ పత్రం చదవడంలో తడబడ్డారు. ముందుగానే వచ్చిన కేసీఆర్: ఉదయం 11:30 గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉండగా.. టీఆర్ఎస్, మజ్లిస్ ఎమ్మెల్యేలు ఉదయం 11:15 గంటలకే సభలోకి వచ్చారు. తర్వాత 10 నిమిషాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారు. సీఎం కేసీఆర్ 11:26కు సభ లోపలికి చేరుకున్నారు. ఉదయం 11:30 గంటలకు ఎమ్మెల్యేలంతా లేచి నిలబడి ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్కు గౌరవంగా స్వాగతం పలికారు. జాతీయగీతం జనగణమనతో సభాకార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార క్రమాన్ని ప్రొటెం స్పీకర్ వెల్లడించారు. ముందుగా సీఎం, తర్వాత మహిళా ఎమ్మెల్యేలు, మిగిలిన సభ్యుల ప్రమాణ స్వీకారం వరుస క్రమంలో ఉంటుందని వెల్లడించారు. ఆ ప్రకారమే సీఎం కేసీఆర్ 11:34 గంటలకు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ వద్దకు వెళ్లి ధన్యవాదాలు తెలియజేసి, రిజిస్టర్లో సంతకం చేశారు. ఈసారి మహిళా సభ్యులకు అవకాశం సాధారణంగా సీఎం తర్వాత మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేత ప్రమాణం చేస్తారు. అయితే ఈసారి హోం మంత్రి (ఆయన కూడా ఎమ్మెల్సీ) మినహా ఇతర శాఖలకు మంత్రులు లేకపోవడంతో సీఎం తర్వాత మహిళ ఎమ్మెల్యేలు, ఆ తర్వాత మిగిలినవారు ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం తర్వాత వరుసగా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, అనసూయ ధనసరి (సీతక్క), గొంగిడి సునీత, బానోత్ హరిప్రియ, పద్మాదేవెందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రమాణం చేశారు. మిగతా ఎమ్మెల్యేల ప్రమాణం అలంపూర్ ఎమ్మెల్యే వీఎం అబ్రహంతో మొదలై మధాహ్నం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డితో (1:39 గంటలకు) ముగిసింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ సహా 119 మంది (ప్రొటెం స్పీకర్ మినహా)లో 114 మంది ప్రమాణం చేశారు. ఒక్కో కారణంతో దూరం ఐదుగురు ఎమ్మెల్యేలు వేర్వేరు కారణాలతో ప్రమాణస్వీకారానికి హాజరుకాలేదు. మజ్లిస్ ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, జాఫర్ హుస్సేన్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సభకు హాజరు కాలేదు. వారంతా సభకు గైర్హాజరైనట్లు సభ చివరలో ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. మజ్లిస్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్గా ఉండగా తాను ప్రమాణ స్వీకారం చేయబోనని ముందుగానే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పూర్తిస్థాయి స్పీకర్ వచ్చాక ఆయన ప్రమాణం చేసే అవకాశం ఉంది. కాగా, మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్ వైద్య పరీక్షల కోసం లండన్ వెళ్లడంతో, ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్.. మక్కా యాత్రకు వెళ్లడంతో సభకు రాలేకపోయారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అత్యవసరపనిపై బయటకు వెళ్లడంతో గైర్హాజరయ్యారు. ఆయన శుక్రవారం ప్రమాణం చేయనున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా నియోజకవర్గంలోనే ఉండిపోయారు. ఆయన శనివారం ప్రమాణం చేసే అవకాశం ఉంది. వీల్ చైర్లో సభకు సాయన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యం కారణంగా వీల్ చైర్లో సభకు హాజరయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా గురువారమే ప్రమాణం చేశారు. అనంతరం అటెండర్ల సహకారంతో ప్రొటెం స్పీకర్ వద్దకు వెళ్లి ధన్యవాదాలు తెలిపారు. ఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన ప్రమాణ స్వీకార కార్యక్రమం దాదాపు రెండు గంటలకుపైగా కొనసాగింది. అనంతరం ప్రొటెం స్పీకర్ ముంతాజ్ ఖాన్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. శుక్రవారం ఉదంయ 11 గంటలకు తిరిగి ప్రారంభం అవుతుందని ఆయన ప్రకటించారు. పవిత్ర హృదయంతో.. ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన వారిలో అత్యధికంగా దైవసాక్షిగా ప్రమాణం చేయగా, 15 మంది ఎమ్మెల్యేలు మాత్రం పవిత్ర హృదయంతో ప్రమాణం చేశారు. వారిలో అనసూయ ధనసరి (సీతక్క), అంజయ్య, రసమయి బాలకిషన్, ఈటల రాజేందర్, జగదీశ్రెడ్డి, గురుక జైపాల్ యాదవ్, కాలె యాదయ్య, కేటీఆర్, కందాల ఉపేందర్రెడ్డి, క్రాంతి కిరణ్ చంటి, నరేందర్ నన్నపనేని, నోముల నర్సింహయ్య, పొదెం వీరయ్య, సోలిపేట రామలింగారెడ్డిలు ఉన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దైవసాక్షిగా, పవిత్ర హృదయంతో అని ప్రమాణం చేశారు. తొలిరోజు అసెంబ్లీలో సందడి తెలంగాణ అసెంబ్లీలో తొలిరోజు సందడి నెలకొంది. ఉదయం 9 గంటల నుంచే సభకు సభ్యుల రాక మొదలయింది. సీఎల్పీ సమావేశం ఉండటంతో కాంగ్రెస్ సభ్యులు ముందుగా సభకు వచ్చారు. ఆ తర్వాత టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు సభాప్రాంగణానికి వచ్చారు. అసెంబ్లీ సమావేశ మందిరం లోపలికి ప్రవేశించే గేటు వద్ద శాసనసభ డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ హోదాలోని అధికారులతోపాటు సిబ్బంది బొకేలతో ఎమ్మెల్యేలకు స్వాగతం పలికారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభ ఆవరణను సర్వాంగ సుందరంగా అలంకరించారు. పూలదండలు, రంగురంగుల కర్టెన్లతో అసెంబ్లీ ప్రాంగణం కనువిందు చేసింది. అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలను ఫొటోలు తీసేందుకు, చిత్రీకరించేందుకు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఉత్సాహం చూపారు. కొందరు ఎమ్మెల్యేలు నేరుగా వీడియోలు, కెమెరాల వద్దకు వెళ్లి ఫొటోలకు పోజులిచ్చారు. ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని తిలకించేందుకు ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు అసెంబ్లీకి వచ్చారు. ఎమ్మెల్యేల బంధుమిత్రులతో అసెంబ్లీలోని విజిటర్స్ గ్యాలరీ కిటకిటలాడింది. సీఎల్పీ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాకతో సీఎల్పీ కార్యాలయం వద్ద హడావుడి నెలకొంది. పెరిగిన బలంతో సభకు వచ్చిన టీఆర్ఎస్ సభ్యులు సందడి చేశారు. జర్నలిస్టుగా పనిచేసిన అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అసెంబ్లీలోకి రాగానే సహచర జర్నలిస్టులంతా అభినందనలు తెలిపారు. మెడలో పెన్నులదండ వేసి స్వాగతం పలికారు. కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సీతక్క, హరిప్రియానాయక్ ఉదయం నుంచి సభ అయిపోయేవరకు కలిసే ఉన్నారు. హరిప్రియ తొలిసారి అసెంబ్లీకి రావడంతో ఆమెను సబితా ఇంద్రారెడ్డి దగ్గరుండి సభలోకి తీసుకెళ్లారు. ఆమెకు మార్గదర్శనం చేశారు. ఎమ్మెల్యేలందరికీ శాసనసభాపక్షాన తిరుపతి, యాదగిరిగుట్ట దేవస్థానాల కేలండర్లు, డైరీలు, యాదగిరిగుట్ట లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈసారి సభలో వయసురీత్యా పెద్దవారైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చాలా ఉత్సాహంగా కనిపించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మె ల్యేలు, జర్నలిస్టులను ఆయన ఆత్మీయంగా పలకరించడం కనిపించింది. సీఎల్పీ కార్యాలయం ఎదుట నిల్చొని ఉన్న భట్టి వద్దకు ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల వచ్చారు. ఇద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకుని చెవులు కొరుక్కున్నారు. స్పీకర్ ఎన్నిక కాకపోవడంతో తొలిరోజు సభ్యులకు సమావేశ మందిరంలో స్థానాలు కేటాయించలేదు. ప్రస్తుతానికి వీలున్నచోట కూర్చోవాలని, కొత్త స్పీకర్ ఎన్నిక జరిగిన తర్వాత సభ్యులకు అధికారికంగా సీట్లు కేటాయిస్తారని ప్రొటెం స్పీకర్ అసెంబ్లీలో ప్రకటించారు. యథావిధిగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గులాబీ కండువాలతో, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూడు రంగుల కండువాలతో సభకు హాజరయ్యారు. సమావేశ మందిరంలోకి ఎమ్మెల్యేలు వెళ్లే ప్రవేశద్వారాన్ని మార్చారు. ఉమ్మడి ఆంధ్ర«ప్రదేశ్లో ఉన్న విధంగా అసెంబ్లీ భవనంలోకి ప్రవేశించగానే మొదటి ఎడమ ప్రవేశ ద్వారం ద్వారా సభ్యులు సమావేశ మందిరంలోకి వెళ్లేలా ఏర్పాటు చేశారు. గత అసెంబ్లీ సమయంలో ఈ ద్వారం వైపు ఏపీ మంత్రుల చాంబర్లు ఉండేవి. అప్పుడు రెండో ఎడమ ప్రవేశ ద్వారం నుంచి సభ్యులు సమావేశ మందిరంలోకి వెళ్లేవారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు శాసనసభా ప్రాంగణానికి వచ్చారు. ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, సీతారాంనాయక్, జోగినపల్లి సంతోష్కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, షబ్బీర్అలీ, పొంగులేటి సుధాకర్రెడ్డి ప్రాంగణంలో కనిపించారు. -
ముగ్గురు సీఎంల ప్రమాణ స్వీకారానికి హాజరవుతా..
సాక్షి, అమరావతి: మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ నెల 17న మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి తాను హాజరుకానున్నానని శనివారం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో బాబు వివరించారు. బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకు రావాలని, ఆ పార్టీలన్నింటినీ ఏకం చేయాలన్న ఆకాంక్ష తనకుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని, దేశాన్ని కాపాడేందుకు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు లౌకికవాద శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. అందుకు మూడు రాష్ట్రాల సీఎంల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు వేదిక కావాలనే భావన తనకుందన్నారు. నిరంకుశ పాలన, పెత్తందారీ పాలన, అహంభావ పోకడలు అంతరించాలని అన్ని వర్గాలు కోరుకుంటున్నాయని చెప్పారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేవని చంద్రబాబు స్పష్టం చేశారు. -
కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అనే నేను..
‘కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాస నాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’. సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గురువారం మధ్యాహ్నం 1.25గంటలకు కేసీఆర్తో ప్రమాణం చేయించారు. కేసీఆర్తోపాటు మహమూద్ అలీ మంత్రిగా ప్రమా ణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్ ముందుకు ఒంగి వినయపూర్వకంగా అందరికీ నమస్కారం చేశారు. అనంతరం కేసీఆర్కు గవర్నర్ నరసింహన్ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. రాజ్భవన్లో సాదాసీదాగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎంగా కేసీఆర్, మంత్రిగా మహమూద్ అలీల నియామకాన్ని నోటిఫై చేస్తూ ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, నిజామాబాద్ ఎంపీ కవిత దంపతులు, సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ ఎమ్మె ల్యే రాజాసింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధా కర్రెడ్డి హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, వివిధ కార్పొరేషన్ చైర్మ న్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారాని కి ముందు గవర్నర్ కార్యాలయంలో ఒవైసీ తో కలిసి కేసీఆర్ కాసేపు కూర్చున్నారు. ముహూర్త సమయానికి సీఎంతో కలిసే ఒవైసీ బయటికొచ్చారు. వీరు మినహా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకాలేదు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, టీజేఎస్ అధ్య క్షుడు కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఎం కార్యదర్శి తమ్మినేనితోపాటు ఆయా పార్టీల నేతలకు ఆహ్వానం రాలేదని సమాచారం. రాజన్న ఆశీర్వాదం సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం గవర్నర్తోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ను రాజ్భవన్లోనే ఆశీర్వదించారు. వేములవాడ ఎమ్మెల్యే సీహెచ్ రమేశ్బాబు, ఆలయ ఈవో దూస రాజేశ్వర్ కేసీఆర్ను సత్కరించారు. అనంతరం ప్రగతిభవన్ చేరుకున్న సీఎంను భద్రాద్రి ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. పలువురు ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, డీజీపీ మహేందర్ రెడ్డి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్రావు తదిత రులు కేసీఆర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్కు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ గారికి శుభాకాంక్షలు. ఆయన మరింత ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అని ట్వీట్ చేశారు. ఇదీ ప్రస్థానం పేరు: కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (కేసీఆర్) పుట్టిన తేదీ: 17.2.1954 తల్లిదండ్రులు: వెంకటమ్మ, రాఘవరావు స్వగ్రామం: సిద్ధిపేట జిల్లా చింతమడక విద్యార్హత: ఎంఏ కుటుంబం: భార్య శోభ, కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత. రాజకీయ జీవితం: యువజన కాంగ్రెస్లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. రాఘవాపూర్ సింగిల్ విండో చైర్మన్గా ఎన్నికయ్యారు. 1983లో తెదేపాలో చేరి సిద్దిపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో సిద్దిపేట నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994 ఎన్టీఆర్ కేబినేట్లో కరు వు మంత్రిగా పని చేశారు. 1996–1999 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో రవాణా మంత్రిగా పనిచేశారు. 1999–2001 వరకు శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పని చేశారు. 2001లో ఎమ్మెల్యే పదవి, డిప్యూటీ స్పీకర్ పదవికి, టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. 2001 ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచి గెలిచారు. 2004లో సిద్దిపేట శాసనసభ, కరీంనగర్ లోక్సభ స్థానాలకు పోటీ చేసి విజయం సాధిం చారు.యూపీఏ ప్రభుత్వంలో కార్మికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2006లో కేంద్రమంత్రి పదవికి, కరీంనగర్ లోక్సభ స్థానానికి రాజీనామా చేశారు. కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నికలలో విజయం సాధించారు. 2008 ఉప ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా మరోసారి గెలిచారు. 2009లో మహబూబ్నగర్ ఎంపీగా గెలిచారు. 2009 నవంబర్ 29న సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్షకు ప్రయత్నించి అరెస్టయ్యారు. 2009 నుంచి తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేశా రు. 2014 ఎన్నికల్లో మెదక్ లోక్సభ, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజైన 2014 జూన్ 2న తొలి సీఎంగా ప్రమాణం చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గురువారం ఆయన రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు. -
హోం మంత్రిగా మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోం మంత్రిగా మహమూద్ అలీని నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం కేసీఆర్తోపాటు మంత్రిగా మహమూద్ అలీ ఒక్కరే ప్రమాణం చేశారు. మహమూద్ అలీ నియామకాన్ని నోటిఫై చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జీవోలో ఉప ముఖ్యమంత్రి అని పేర్కొనలేదు. దీంతో ప్రస్తుత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులు ఉండకపోవచ్చని తెలిసింది. మహమూద్ అలీ గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ బాధ్యతలు నిర్వహించారు. తాజా బాధ్యతలతో.. తెలంగాణ రాష్ట్రంలో హోం శాఖ బాధ్యతలను చేపట్టిన తొలి ముస్లిం నేతగా గుర్తింపు పొందారు. అలీ శాఖ మారిన నేపథ్యంలో గత ప్రభుత్వంలోని మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. పాల వ్యాపారం నుంచి.. హైదరాబాద్లోని మలక్పేటకు చెందిన మహమూద్ అలీ 1953 మార్చి 2న జన్మించారు. ఆయన తండ్రిపేరు పీర్ మహ్మద్ బాబూమియా, తల్లి సయీదున్నీసా బేగం. భార్యపేరు నస్రీన్ ఫాతిమా. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లు (ఫిర్దోస్ ఫాతిమా, అఫ్రోజ్ ఫాతిమా), కుమారుడు మహ్మద్ ఆజం అలీ. బీకాం వరకు చదివిన ఆయన పాల వ్యాపారం చేశారు. మలక్పేట ప్రాంతం నుంచి చురుకైన మైనారిటీ నేతగా ఆయనకు మంచి పేరుంది. ఇంటర్మీడియట్ చదివే రోజుల నుంచే మహమూద్ అలీ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. టీఆర్ఎస్ అవిర్భావం నుంచి కేసీఆర్ వెంటే ఉన్నారు. 2001లో టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా, ఆ తర్వాత హైదరాబాద్ నగర టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడిగా.. 2005, 2007లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2009లో టీఆర్ఎస్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. 2013లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2014లో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన మహమూద్ అలీ గురువారం మరోసారి మంత్రిగా ప్రమాణం చేశారు. కీలకమైన హోం శాఖ బాధ్యతలను అప్పగించారు. -
రాజ్భవన్ దారిలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆ దారిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మోనప్ప ఐలాండ్–వీవీ స్టాచ్యూ, పంజగుట్ట–రాజ్భవన్ క్వార్టర్స్ మధ్య ఉన్న మార్గాల్లో సాధారణ వాహన చోదకులను అనుమతించరు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గేట్ నెం.3–అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మధ్య పార్కింగ్ ఏర్పాటు చేశారు. మీడియా వాహనాలకు దిల్కుష గెస్ట్హౌస్లో, ప్రభుత్వ వాహనాలు, ప్రముఖుల వాహనాలకు ఎంఎంటీఎస్ పార్కింగ్ లాట్లో పార్కింగ్ కేటాయించారు. మిగిలిన వారి వాహనాలను మెట్రో రెసిడెన్సీ–నాసర్ స్కూల్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్–వీవీ స్టాచ్యూ మధ్య మార్గంలో రోడ్డు పక్కన నిలుపుకోవచ్చు. -
నేడు కేసీఆర్ ప్రమాణం...
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 1.25 గంటలకు రాజ్భవన్లో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతానికి కేసీఆర్ ఒక్కరే ప్రమాణం చేయనుండగా.. జిల్లాలు, సామాజిక వర్గాల కూర్పు అనంతరం వారంలోపు పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరనుంది. రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో సీఎంతోపాటు 17 మంది మంత్రులు ఉండాలి.. ఈ లెక్కల ప్రకారం.. సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం బుధవారం తెలంగాణభవన్లో జరిగింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ శాసనసభపక్ష నేతగా కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ఎల్పీ నేతగా కేసీఆర్ను ఎన్నుకునే తీర్మానాన్ని ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత ప్రవేశపెట్టారు. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ బలపరిచారు. అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరు చప్పట్లతో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. గవర్నర్కు అందజేత టీఆర్ఎస్ శానససభాపక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక అనంతరం 11 మంది ఎమ్మెల్యేల బృందం రాజ్భవన్కు వెళ్లింది. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలిసి ఎన్నికకు సంబందించిన పత్రాలను అందజేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా టీఆర్ఎస్ఎల్పీ నేతను ఆహ్వానించాలని కోరింది. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, సి.లక్ష్మారెడ్డి, కొప్పుల ఈశ్వర్, పద్మా దేవేందర్రెడ్డి, గొంగడి సునీత, అజ్మీరా రేఖానాయక్, దాస్యం వినయభాస్కర్, వి.శ్రీనివాస్గౌడ్, రవీంద్రకుమార్, కాలె యాదయ్యలు గవర్నర్ను కలిశారు. అంతకుముందు కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ నర్సింహన్కు అందజేసింది. అన్నింటినీ పరిశీలించిన అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ నర్సింహన్ టీఆర్ఎల్పీనేత కేసీఆర్ను ఆహ్వానించారు. రాజీనామాలు ఆమోదం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాజీనామా చేస్తూ గవర్నర్ నరసింహన్కు లేఖ పంపారు. గవర్నర్ దీన్ని ఆమోదించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి.. రాష్ట్ర మంత్రివర్గ రాజీనామా ఆమోదాన్ని ధ్రువీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మంత్రులంతా మాజీలయ్యారు. అసంతృప్తులు లేకుండా! మంత్రివర్గంలో ఎక్కువ మంది కొత్తవారికి చోటు కల్పించాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గురువారం తనతోపాటు ఒక్కరినే మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. అదేరోజు పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్న వారిలో అవకాశం దక్కని వారు అసంతృప్తితో ఉంటారు. కొన్ని రోజుల తర్వాత అయితే ఇప్పటి వరకు మంత్రులుగా ఉన్న వారిలో ఎక్కువ మందిని పక్కనపెట్టే అవకాశం ఉంటుంది. మంత్రులుగా ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు, అజ్మీరా చందులాల్, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్రెడ్డి ఓటమిపాలయ్యారు. వీరి స్థానంలో కొత్తగా నలుగురికి అవకాశం కల్పించాల్సి ఉంది. జిల్లాలు, సామాజికవర్గాల కూర్పుతో కొత్త జట్టును ఎంపిక చేసుకోనున్నారు. పరిశీలనలో దానం, వివేకా సామాజికవర్గాల వారీగా ఎర్రబెల్లి దయాకర్రావు, డీఎస్ రెడ్యానాయక్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్లకు చోటు కల్పించే అవకాశం ఉంది. వచ్చే మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రులు ఉంటారా లేదా అనేదానిపై స్పష్టతలేదు. అయితే.. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి స్థానంలో మాదిగ సామాజికవర్గానికి చెందిన అరూరి రమేశ్, మహమూద్ అలీ స్థానంలో మహ్మమ్మద్ ఫరీదుద్దీన్లు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. టి పద్మారావుగౌడ్ స్థానంలో కేపీ వివేకానంద్ గౌడ్, జోగు రామన్న స్థానంలో దానం నాగేందర్ లేదా దాస్యం వినయభాస్కర్ పేర్లను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలిస్తున్నారు. స్పీకర్ పదవిని ఎవరికి అప్పగించాలనే విషయంపై స్పష్టత వచ్చిన తర్వాతే మంత్రివర్గ కూర్పు తుదిదశకు రానుంది. -
రేపు మధ్యాహ్నం 1.25 గంటలకు ప్రమాణస్వీకారం!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు (గురువారం) మధ్యాహ్నం రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా.. అతి సాధారణంగా ప్రమాణ స్వీకారం చేయాలనే కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం. రాజ్భవన్లో రేపు మధ్యాహ్నం 1.25 గంటలకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం స్వీకరించనున్నారని, ఆయనతోపాటు ఒక మంత్రి కూడా ప్రమాణం చేస్తారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎన్నికల అనంతరం దేశరాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానన్న కేసీఆర్.. ప్రమాణస్వీకారంతోనే ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించాలని తొలుత భావించారు. కానీ పలు రాష్ట్రాల్లో కొత్తగా ప్రభుత్వాలు ఏర్పాటు కానుండటం.. జాతీయ పార్టీలకు చెందిన సన్నిహిత నేతలు వారి పనుల్లో బిజీగా ఉండటంతో ఆయన తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో ఈ విషయాలపై గులాబీ బాస్ కూలంకషంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. తొలుత ప్రమాణస్వీకారాన్ని పూర్తి చేసి... అనంతరం మరో భారీ వేదికపై కాంగ్రెస్, బీజేపీయేతర శక్తులను కూడగట్టాలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది. గురువారం రాజ్భవన్లో కేసీఆర్ ప్రమాణస్వీకారానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారని, ఈమేరకు గవర్నర్ కార్యాలయానికి అనధికార సమాచారం అందిందని తెలుస్తోంది. తెలంగాణ భవన్లో జరుగుతున్న టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో టీఆర్ఎస్ శాసనసభ పక్షనేతగా కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. ఈ సమావేశం అనంతరం కేసీఆర్, పలువురు సీనియర్ నేతలు గవర్నర్ నరసింహన్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. కేసీఆర్తో పాటు ఐదుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. -
46వ సీజేఐగా జస్టిస్ గొగోయ్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ (63) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈశాన్య రాష్ట్రాలనుంచి ఇంతటి కీలక బాధ్యతలు స్వీకరించిన తొలి వ్యక్తిగా నిలిచారు. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. జస్టిస్ గొగోయ్తో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లిన గొగోయ్ కోర్టు నంబర్ 1 (సీజేఐ కోర్టు)లో సుప్రీంకోర్టు న్యాయవాదులతో మాట్లాడారు. కొన్ని నిబంధనలు మార్చాల్సి ఉందని, అంతవరకు.. ఉరిశిక్ష, దేశ బహిష్కరణ శిక్షలకు సంబంధించిన కేసులు మినహా ఇతర ఏ కేసులను కూడా అత్యవసరంగా విచారించాలంటూ.. కోర్టు ముందుకు తీసుకురావద్దని సూచించారు. నవంబర్ 17, 2019లో ఆయన పదవీకాలం ముగుస్తుంది. వస్తూనే రోస్టర్పై ఈయన తన ముద్ర చూపించారు. కేసుల కేటాయింపులో పలు మార్పులు చేశారు. దేశానికి ఆ అనుభవం అవసరం: మోదీ సీజేఐగా రంజన్ గొగోయ్ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీతోపాటు మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడలు కూడా హాజరయ్యారు. ‘సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ రంజన్ గొగోయ్కు నా హృదయపూర్వక అభినందనలు. ఆయన విశేషానుభవం, అంతఃశుద్ధి, న్యాయపరమైన అంశాలపై నైపుణ్యత దేశానికి ఎంతగానో మేలుచేస్తాయని భావిస్తున్నాను. ఆయన పదవీకాలం ఫలప్రదంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అక్టోబర్ 2న సీజేఐగా జస్టిస్ దీపక్ మిశ్రా పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. ఆయన వారసుడిగా జస్టిస్ గొగోయ్ ఎంపికపై అనుమానాలు నెలకొన్నప్పటికీ.. సీనియారిటీ ప్రకారం ఆయన్నే సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా ఈయనను తదుపరి సీజేఐగా ప్రతిపాదించారు. ఈ ఏడాది జనవరి 11న సుప్రీంకోర్టు నలుగురు సీనియర్లు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో (జస్టిస్ గొగోయ్, జస్టిస్ ఎంబీ లోకుర్, జస్టిస్ జోసెఫ్ కురియన్) నాటి సీజేఐ దీపక్ మిశ్రాపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. కోర్టు నంబర్ 1లో జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్లు సభ్యులుగా ఉన్న ధర్మాసనంతో కలిసి జస్టిస్ గొగోయ్ న్యాయవాదులతో మాట్లాడారు. అత్యంత ప్రాధాన్యత, అత్యవసరంగా విచారించాల్సిన కేసుల పేరుతో కోర్టుముందుకు పిటిషన్లు తీసుకురావద్దని వారికి సూచించారు. ఇలాంటి కేసుల విచారణ విషయంలో పలు నిబంధనలను మార్చాల్సి ఉన్నందున అంతవరకు అత్యవసర కేసులను స్వీకరించబోమని సీజేఐ స్పష్టం చేశారు. ‘కొన్ని నిబంధనలను మార్చాలని భావిస్తున్నాం. ఆ తర్వాత వాటి ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. రేపు ఎవర్నయినా ఉరితీస్తున్నారు. దీన్ని ఆపాల్సిందే అనే పరిస్థితి ఉంటే.. మేమే దాన్ని అత్యవసరంగా అర్థం చేసుకుంటాం. అవి మినహా మిగిలిన కేసుల్లో అత్యవసరాన్ని చేర్చకండి’ అని సీజేఐ గొగోయ్ సూచించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యక్ర మంలో గొగోయ్ మాట్లాడుతూ.. ‘నేను, నా సహచరులు కలిసి ఉత్తమమైన ఫలితాలు సాధించే వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రయత్నాన్ని కొద్దిసేపటి క్రితమే ప్రారంభించాం. రెండ్రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది. కేసుల ఫైలింగ్, లిస్టింగ్ మధ్య సమయాన్ని తగ్గించే ఆలోచనలో ఉన్నాం. జాబితా నుంచి కేసులు తొలగించకుండా ఉండే వ్యవస్థను తీసుకొస్తాం’ అని పేర్కొన్నారు. రోస్టర్పై గొగోయ్ ముద్ర గొగోయ్ బాధ్యతలు స్వీకరించగానే సుప్రీంకోర్టులో రోస్టర్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సుప్రీంకోర్టు వెబ్సైట్లో తాజా మార్పులను ఉంచారు. సీజేఐ ఆదేశాల ప్రకారం అక్టోబర్ 3 నుంచి తదుపరి సవరణలు వచ్చేంతవరకు కొత్త కేసులకు ఇదే రోస్టర్ అమలవుతుందని అందులో పేర్కొన్నారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కొత్త సీజేఐ తన వద్దే ఉంచుకున్నారు. ఈయన నేతృత్వంలోని ధర్మాసనం.. సామాజిక న్యాయం ఎన్నికలు, కంపెనీ చట్టాలు, గుత్తాధిపత్యం, నియంత్రిత వాణిజ్య విధానాలు, ట్రాయ్, సెబీ, బీమా, ఆర్బీఐ, మధ్యవర్తిత్వం, హెబియస్ కార్పస్, క్రిమినల్ కేసులు, కోర్టు ధిక్కరణ, సాధారణ సివిల్ అంశాలకు సంబంధించిన కేసులను విచారిస్తుంది. సీజేఐ తర్వాత సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ మదన్ బీ లోకుర్ నేతృత్వంలోని ధర్మాసనానికి ప్రజాప్రయోజన వ్యాజ్యం కేసులతోపాటు లేఖల ఆధారిత విషయాలు, భూ సేకరణ, అటవీ, పర్యావరణానికి సంబంధించిన కేసులు అప్పజెప్పారు. చేతల్లోనూ ఆదర్శప్రాయుడు! ఉన్నత కుటుంబంలో భోగభాగ్యాల మధ్య పెరిగినా సాధారణ జీవితం గడపడంలో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. తన ఆస్తులు, ఆదాయం ఇతర విషయాల్లో దాపరికానికి అవకాశం లేని విధంగా తన స్థిర, చరాస్తులు, ఇతర ఆర్థిక వ్యవహారాల వివరాలను సుప్రీంకోర్టు వెబ్సైట్లో వెల్లడించారు. ప్రస్తుతమున్న 25 మంది సిట్టింగ్ జడ్జీల్లో 11 మందే ఈ విధంగా ఆస్తుల ప్రకటన చేశారు. 2012 ఏప్రిల్ 23న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టినపుడే ఇచ్చిన డిక్లరేషన్లో తనకు ఇల్లు, వాహనం, బంగారు ఆభరణాలు లేవని, వివాహ సమయంలో భార్యకు పుట్టింటి నుంచి 150 గ్రాముల బంగారు ఆభరణాలు లభించినట్టు ప్రకటించారు. సొంత వ్యక్తిగత వాహనం లేదు. బ్యాంకు రుణాలు కూడా లేవు. రెండు బ్యాంకు ఖాతాల్లో సేవింగ్స్ రూపంలో రూ.6.5 లక్షలు, రూ.16 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయి. 1999లో తీసుకున్న రూ.5 లక్షల విలువైన ఎల్ఐసీ పాలసీ ముగిశాక వచ్చిన డబ్బే ఆయన బ్యాంకు బాలెన్స్లో ప్రధాన వాటాగా నిలుస్తోంది. పిల్లల పెళ్లిళ్ల కోసం రూ.1.6 లక్షల విలువైన బంగారాన్ని కొన్నా రు. 1999లో గువాహటిలో కొనుగోలు చేసిన రూ.1.10 లక్షల విలువైన స్థలాన్ని 2018 జూన్ 6న విక్రయించారు. అస్సాంలోని కామ్రూప్ జిల్లా జపోరిగోగ్ బెల్టోలా గ్రామంలో తల్లి ద్వారా సంక్రమించిన కొంత భూమి (అందులో నిర్మించిన ఇంటిని కూల్చివేశారు) మాత్రమే కలిగి ఉన్నారు. దిబ్రూగఢ్ నుంచి సీజేఐగా 1954 నవంబర్ 18న అస్సాంలోని దిబ్రూగఢ్లో ఆయన జన్మించారు. 1978 లో తొలిసారి న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. గువాహతి హైకోర్టులో రాజ్యాంగం, టాక్సేషన్, కంపెనీ వ్యవహారాలపై ప్రాక్టీస్ చేశారు. 2001, ఫిబ్రవరి 28న గువాహతి హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు.2010, సెప్టెంబర్ 9న పంజాబ్–హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2011, ఫిబ్రవరి 12న అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2012, ఏప్రిల్ 23 నుంచి సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
సారీ..! ఇమ్రాన్ : గావస్కర్
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్ ఖాన్కు సునీల్ గావస్కర్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఆగస్టు 18న ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గావస్కర్కు ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. అయితే, అదే రోజు భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే టెస్టు మ్యాచ్లో కామెంటరీ చేయాల్సి ఉన్నందున.. తాను ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నానని ఇమ్రాన్కు వెల్లడించినట్టు తెలిపారు. కాగా, గావస్కర్తో పాటు కపిల్దేవ్, నవజోత్సింగ్ సిద్ధూ కూడా ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్నారు. ఇమ్రాన్ నాయకత్వంలో పాకిస్తాన్ జట్టు 1992లో వన్డే క్రికెట్ వరల్డ్కప్ గెలుచుకున్న సంగతి విదితమే. అప్పటి పాకిస్తాన్ జట్టు సభ్యులందరికీ కూడా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పంపినట్టు పీటీఐ అధికార ప్రతినిధి ఫైజల్ జావెద్ తెలిపారు. -
పాకిస్తాన్ వెళ్లనున్న భారత క్రికెట్ దిగ్గజాలు..!
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం మరోమారు వాయిదా పడింది. మొదట ప్రకటించినట్లుగా ఆగస్టు 14న కాకుండా 18న ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా బాధ్యతలు చేపడతారని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అధికార ప్రతినిధి ఫైజల్ జావేద్ శుక్రవారం వెల్లడించారు. ఇప్పటికే భారత్ నుంచి ఇమ్రాన్ ఖాన్ స్నేహితులైన సునీల్ గావస్కర్, కపిల్దేవ్, నవజోత్సింగ్ సిద్ధూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పంపామని తెలిపారు. 1992 వరల్డ్కప్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు సభ్యులందరికీ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పంపినట్లు ఆయన శుక్రవారం వెల్లడించారు. కాగా, ఆగస్టు 13న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికైన నూతన సభ్యులు ప్రమాణం చేస్తారని పీటీఐ ఇన్ఫర్మేషన్ సెక్రటరీ ఫవాద్ ఛౌధురి తెలిపారు. అదేరోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. సభలో తమకు 180 మంది సభ్యుల మద్దతు ఉందని ఫవాద్ చెప్తుండగా.. మరోవైపు ఇమ్రాన్ఖాన్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. పీటీఐని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని కూటమిగా ఏర్పడిన పాకిస్తాన్ ముస్లింలీగ్ పార్టీ, (నవాజ్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ముత్తహిదా మజ్లిసే అమల్ పార్టీ నాయకులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడిన నేపథ్యంలో.. తాము ఆగస్టు 18న జరిగే ఇమ్రాన్ ఖాన్ ప్రమాణం స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి పాకిస్తాన్కు వెళ్తున్నామని సునీల్ గావస్కర్, కపిల్దేవ్, నవజోత్సింగ్ సిద్ధూ మీడియాకు శనివారం వెల్లడించారు. -
అతిథులపై క్లారిటీ
-
విదేశీ నేతలకు ఆహ్వానంపై క్లారిటీ ఇచ్చిన ఇమ్రాన్!
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధిపతి, లెజెండరీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్(65) పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి పలు కథనాలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో పాక్ విదేశాంగ శాఖ తాజాగా వివరణ ఇచ్చింది. ఆగస్టు 11న జరగనున్న ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశీ నేతలను ఆహ్వానించడం లేదని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమానికి ఇమ్రాన్కు అత్యంత సన్నిహతులైన విదేశీ వ్యక్తులను కొందరిని మాత్రమే ఆహ్వానించినట్లు తెలిపింది. అటు వేడుకలకు హాజరు కాబోయే అంతర్జాతీయ నాయకులు, ఉన్నతాధికారుల గురించి మీడియా ఊహాగానాలు సరైనవి కావు అని పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్ చౌదరీ వెల్లడించారు. ఇవాన్-ఇ-సదర్ లేదా ప్రెసిడెంట్ హౌస్లో సాధారణంగా ఈ ప్రమాణ స్వీకరణ వేడుకను నిర్వహించాలని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నట్టు చెప్పారు. సార్క్ దేశాల అధినేతలతో పాటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానం పంపుతారని వార్తలు వెలువడ్డాయి. తాజా వివరణతో ఈ ఊహాగానాలకు తెరపడింది. అలాగే బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్, భారత మాజీ క్రికెటర్లు సునీల్గవాస్కర్, కపిల్దేవ్, నవజోత్ సింగ్ సిద్ధూలకు ఆహ్వానం అందినట్టు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కథనాలపై సిద్ధూ సానుకూలంగా స్పందించగా ఇమ్రాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తాను హాజరుకానున్నానని వచ్చిన వార్తలను ఆమీర్ ఖాన్ కొట్టిపాశారు. ఇటీవల జరిగిన పాక్ ఎన్నికల్లో పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం లేకపోవడంతో చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు కోసం ఇమ్రాన్ ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు 11న ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ప్రమాణం చేయనున్న సంగతి తెలిసిందే. -
మోదీని అనుసరిస్తున్న ఇమ్రాన్ఖాన్
-
మమతా బెనర్జీ అసంతృప్తి..!!
బెంగుళూరు : కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల కూటమి తరపున జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలతో పాటు పలు రాష్ట్రాల కీలక నేతలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ ప్రతిపక్షాల కూటమిని చూస్తే 2019లో జరగబోయే ఎన్నికలకు ముందుగానే సమరశంఖం పూరించారన్నట్లు ఉంది. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా హజరయిన సంగతి తెలిసిందే. అయితే దీదీ వేదిక వద్దకు వచ్చేటప్పుడు ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. వేదిక వద్దకు వెళ్లడానికి ఏర్పాటు చేసిన భద్రతా చర్యల వల్ల మమతా బెనర్జీకి ఇబ్బంది తలెత్తిందని సమాచారం. ప్రమాణ స్వీకారం జరుగుతున్న వేదిక వద్దకు చేరుకోవడానికి ఉన్న దారిలో కదలడానికి వీలు లేకుండా వాహనాలతో రోడ్డును మూసివేసారని, దాని వల్ల దీదీ వేదికను చేరుకునేందుకు కొద్దీ దూరం నడిచి వచ్చారని సమాచారం. దీదీ వేదిక మీదకు వస్తున్నప్పుడు ఆమె అసహనం ఉండటం కెమెరా కంటికి చిక్కింది. అంతేకాకుండా తనకు కలిగిన ఇబ్బంది గురించి కర్ణాటక డీజీపీ నీలమణి రాజు వద్ద కూడా మమతా బెనర్జీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ అతిథులు ఉన్న వేదిక వద్దకు చేరారు. అక్కడ మమతా బెనర్జీని మాజీ ప్రధాని, కుమార స్వామీ తండ్రి హేచ్డీ దేవగౌడ వేదిక మీదకు ఆహ్వానించారు. అనంతరం అతిథులకు కేటాయించిన ప్రదేశంలో కూర్చున్న తర్వాత మిగతా ప్రముఖులతో మమతా ముచ్చటించారు. అలానే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హజరయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పాటు మరికొంత మంది ఆప్ పార్టీ నాయకులకు కూడా ప్రమాణ స్వీకార వేదిక వద్దకు హజరు కావడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. ఈ విషయం గురించి ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్ చదా ‘బెంగుళూరులో ఉన్నంత ట్రాఫిక్ దేశంలో మరెక్కడా ఉండదు. అందువల్లే మేము ప్రమాణ స్వీకార వేదిక వద్దకు నడుచుకుంటూ వెళ్లాము’అని ట్విట్ చేశారు. -
ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం
-
కుమారస్వామి ప్రమాణ స్వీకారం: హాజరైన వివిధ పార్టీల నేతలు
-
కర్ణాటక రాజకీయం..ప్రమాణస్వీకారం ఆపాలంటూ పిటిషన్
ఢిల్లీ: హస్తినలో అర్ధరాత్రి హైడ్రామా నడుస్తోంది. కర్ణాటక రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. బీజేపీ శాసనసభాపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఆపాలని కోరుతూ కాంగ్రెస్-జేడీఎస్లు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. పిటిషన్ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. కాసేపట్లో ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ భూషణ్, జస్టిస్ బోబ్డేలతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. కాంగ్రెస్-జేడీఎస్ల తరపును కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. బీజేపీ తరపున ఏఎస్జీ తుషార్ మెహతా వాదనలు వినిపించనున్నారు. గురువారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేయడానికి గవర్నర్ ఆయనను ఆహ్వానించిన సంగతి తెల్సిందే. గురువారం కేవలం యడ్యూరప్ప ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారు. బల నిరూపణకు గవర్నర్ వాజూభాయ్ 15 రోజుల గడువు కూడా ఇచ్చిన సంగతి తెల్సిందే. బల నిరూపణ తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తారు. -
ఆ రోజులు.. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ!
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాణస్వీకారానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. ఒక్కసారి గత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ప్రధానంగా తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భాలను ఆయన ఒక్కసారిగా గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. గుజరాత్లో బీజేపీ వరుసగా ఆరోదఫా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం విజయ్ రూపానీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రూపానీ ప్రమాణ స్వీకారానికి హాజరైన మోదీ.. ఒక్కసారిగా తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001, 2002, 2007, 2012 సంవత్సరాల్లో చేసిన ప్రమాణ స్వీకర సందర్భాలను ఆయన ట్విటర్లో ట్వీట్ చేశారు. గుజరాత్ రాష్ట్రాన్ని పాలించే అవకాశాన్ని మరోసారి బీజేపీకి కల్పించిన ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు చెప్పారు. గుజరాత్-బీజేపీ బంధం చాలా ప్రత్యేకమైందిగా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధికి మైలురాయిగా నిలుపుతామని ఆయన గుజరాత్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్కు 13 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. Attending today’s oath taking ceremony in Gujarat brought back memories of the ceremonies in 2001, 2002, 2007 and 2012 when I got the opportunity to serve Gujarat as CM. pic.twitter.com/tLQSpRIbgX — Narendra Modi (@narendramodi) 26 December 2017 -
సీజేఐగా జస్టిస్ దీపక్ మిశ్రా
► సుప్రీంకోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం ► జస్టిస్ మిశ్రాకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ దీపక్ మిశ్రా(64) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ జేఎస్ ఖేహర్ స్థానంలో 45వ సీజేఐగా దీపక్మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ మిశ్రా చేత ప్రమాణం చేయించారు. జస్టిస్ దీపక్ మిశ్రా ఇంగ్లిష్లో దేవునిపై ప్రమాణం చేసి బాధ్యతలను స్వీకరించారు. ఆయన 2018 అక్టోబర్ 2 వరకూ సీజేఐగా కొనసాగనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ మిశ్రా పేరును జస్టిస్ ఖేహర్ గత నెలలో ప్రతి పాదించారు. జస్టిస్ దీపక్ మిశ్రా 1977లో ఒరిస్సా హైకోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. 1996లో ఒరిస్సా హైకోర్టులో అదనపు జడ్జిగా నియమితులయ్యారు. అనంతరం మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయిన ఆయన 1997 డిసెంబర్ 19న శాశ్వత జడ్జి అయ్యారు. 2009లో పట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు. 2010లో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన పట్నా హైకోర్టు, ఢిల్లీ హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2011 అక్టోబర్లో సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్ మిశ్రా ప్రస్తుతం కీలకమైన కావేరీ, కృష్ణా జలాల వివాదాలు, బీసీసీఐ సంస్కరణలు, సహారా తదితర కేసులకు సంబంధించి వాదనలు వింటున్న ధర్మాసనాల్లో సభ్యునిగా ఉన్నారు. సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని పాడాలని తీర్పునిచ్చిన ధర్మాసనానికి జస్టిస్ మిశ్రా నేతృత్వం వహించారు. అలాగే నిర్భయ కేసులో నిందితులకు మరణశిక్ష విధించిన ధర్మాసనం లోనూ ఆయన సభ్యునిగా ఉన్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణïస్వీకార కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, పలువురు కేంద్ర మంత్రులు హాజర య్యారు. నూతన సీజేఐగా బాధ్యతలు స్వీకరిం చిన జస్టిస్ మిశ్రాకు ప్రధాని మోదీ అభినంద నలు తెలిపారు. ఆయన పదవీ కాలం ఫలప్రదంగా కొనసాగాలని కోరుకుంటున్నానని ట్వీటర్లో ఆకాంక్షించారు. -
ప్రమాణస్వీకారానికి పలువురు ప్రముఖులు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి బిజెపి అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, సినీమా రంగంతోపాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తరలి వస్తున్నారు. గుంటూరు-విజయవాడ మధ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న 70 ఎకరాల ఖాళీ ప్రదేశంలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. టిడిపి కార్యకర్తలు వేలాదిగా తరలివస్తున్నారు. ఈ కార్యక్రమానాకి బయలుదేరిన బిజేపి అగ్రనేత అద్వానీ, కేంద్ర మంత్రులు మురళీమనోహర్ జోషి, నిర్మలా సీతారామన్, ప్రకాష్ జవదేకర్ తదితరులతోపాటు అయిదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా వారు సభాస్థలికి చేరుకుంటారు. అయితే రోడ్డు మార్గంలో వాహనాల రాకపోకల రద్దీ బాగా ఉంది. ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రముఖుల రాకతో విజయవాడ-గుంటూరు నగరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. బిజెపి నాయకులతోపాటు సినిమా నటులు కూడా రావడంతో వారిని చూసేందుకు జనం తరలి వస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు నారా కుటుంబ సభ్యులు గన్నవరం విమానాశ్రయం నుంచి బస్సులలో సభాస్థలికి వస్తున్నారు. ఈ రోజు రాత్రి 7 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారు. ఆయనతోపాటు 19 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. -
కోదండరాంకు అందని కేసీఆర్ ఆహ్వానం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రమాణస్వీకారానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖలను ఆహ్వానించారు. రాజభవన్ లో జరిగే ప్రమాణా స్వీకారానికి అమరవీరుల కుటుంబ సభ్యులను కేసీఆర్ ఆహ్వనించారు. తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సైనా నెహ్వల్ , గోపీచంద్ తోపాటు సిఐఐ వంటి రంగాలకు చెందిన వారికి కేసీఆర్ ఆహ్వనం పంపారు. అయితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాంకు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశమైంది. కోదండరాంను ఆహ్వానించకపోవడం వివాదస్పదమైంది. కేసీఆర్, కోదండరాంల మధ్య విభేదాలు నెలకొన్నాయనే వార్తలకు ఈ ఘటన మరింత బలాన్ని చేకూరుస్తోంది. -
కేసీఆర్ 'ప్రమాణ' ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రమాణస్వీకారం, అవిర్భావ సభ ఏర్పాట్లపై సచివాలయంలో ప్రభుత్వ కార్యదర్శి పీకే మహంతి సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. జూన్ 2 తేదిన ఉదయం 8:15గంటలకు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆతర్వాత పరేడ్గ్రౌండ్లో నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ సభ లో కేసీఆర్ పాల్గొంటారు. రాజభవన్ లో జరిగే ప్రమాణ స్వీకారం, పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సభ ఏర్పాట్లు, భద్రతపై ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు చర్చించారు.