PAN card
-
పిల్లలకు పాన్ కార్డ్: సింపుల్గా అప్లై చేయండిలా..
ప్రస్తుతం అందరికీ పాన్ కార్డు తప్పనిసరి అయిపోయింది. కేవలం ఉద్యోగం చేసేవారికి మాత్రమే కాకుండా, మైనర్స్ లేదా ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు కూడా పాన్ కార్డు తీసుకోవచ్చు. ఆదాయపన్ను శాఖలోని సెక్షన్ 160 ప్రకారం, పాన్ కార్డు జారీ చేయడానికి కనీస వయసు అవసరం లేదు. కాబట్టి ఎవ్వరైనా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పిల్లలు స్వయంగా పాన్ కార్డు కోసం అప్లై చేసుకోలేరు. కాబట్టి వారి తరపున తల్లిదండ్రులే పాన్ కార్డు కోసం అప్లై చేయాల్సి ఉంటుంది.పిల్లలకు పాన్ కార్డు ఎందుకంటే?తల్లిదండ్రులు పిల్లల పేరుమీద ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నప్పుడు, లేదా వారి ఆస్తులకు నామినీలుగా చేర్చినప్పుడు పాన్ కార్డు అవసరం. అంతే కాకుండా పిల్లల పేరుమీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, మైనర్ కుమార్తె కోసం సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాల కోసం ఖాతాలను ఓపెన్ చేయడానికి కూడా పాన్ కార్డు అవసరం.పిల్లల కోసం పాన్ కార్డుకు అప్లై చేయాలనుకునేవారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అప్లై చేయడానికి తల్లిదండ్రుల చిరునామా, గుర్తింపు కోసం ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఓటరు ఐడీ వంటివి అవసరమవుతాయి.ఆన్లైన్లో అప్లై చేయడం.. ➤ముందుగా అధికారిక 'నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్' (NSDL) వెబ్సైట్ ఓపెన్ చేయాలి.➤అప్లికేషన్ ఫారమ్లో 'న్యూ పాన్ - ఇండియన్ సిటిజన్ (ఫారం 49ఏ)', 'వ్యక్తిగతం' అనే వర్గాన్ని ఎంచుకోవాలి.➤అప్లికేషన్ వివరాల విభాగంలో అవసరమైన వివరాలను ఫిల్ చేయాలి.➤మైనర్ ఫోటో & అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.➤డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తరువాత డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డిమాండ్ డ్రాఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లింపు కొనసాగించాలి. తరువాత 'సమర్పించు' బటన్ను క్లిక్ చేయాలి.➤పైవన్నీ పూర్తయిన తరువాత మీకు ఒక అక్నాలెజ్మెంట్ నెంబర్ వస్తుంది. దీని ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ధ్రువీకరణ పూర్తయిన తరువాత 15 నుంచి 20 రోజులలోపు మీ చిరునామాకు పాన్ కార్డు డెలివరీ అవుతుంది.ఇదీ చదవండి: కోట్లు సంపాదించే అవకాశం: నిఖిల్ కామత్ ట్వీట్ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవడం..➤అధికారిక NSDL వెబ్సైట్ నుంచి ఫారమ్ 49ఏను డౌన్లోడ్ చేసుకోవాలి.➤సూచనల ప్రకారం అన్ని వివరాలను పూరించండి. ➤సంబంధిత డాక్యుమెంట్స్ కాపీలను, పిల్లల ఫోటోలు రెండు జత చేసి, సమీపంలోని పాన్ సెంటర్లో ఫీజు చెల్లించి సమర్పించండి.➤మీ అప్లికేషన్ సమర్పించిన తరువాత మీకు అక్నాలెజ్మెంట్ నెంబర్ ఇస్తారు. దీని ద్వారా అప్లికేషన్ స్థితిని ట్రాక్ చేయవచ్చు. ➤తరువాత మీ చిరునామాలకు 15 నుంచి 20 రోజులలోపు పాన్ కార్డు డెలివరీ అవుతుంది. -
పాన్ కార్డ్తో గేమ్స్ వద్దు
పర్మినెంట్ అకౌంట్ నెంబర్ లేదా పాన్ (పాన్ కార్డు) అనేది ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకం. సంస్థలు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు అందరూ కూడా ఆర్ధిక కార్యకలాపాలలో దీని ద్వారానే భాగస్వాములవుతారు. టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో పాన్ కార్డును కూడా డిజిటలైజ్ చేయదలచి, కేంద్రం పాన్ 2.0 ప్రకటించింది. ఇది మరింత సేఫ్ అని పేర్కొంది.మన దేశంలో ఒక వ్యక్తికి ఒకే పాన్ కార్డు ఉండాలి. అలా కాకుండా ఒక వ్యక్తికి, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే.. అది చట్టరీత్యా నేరం. అలాంటి వారు జరిమానా కట్టాల్సి ఉంటుంది.మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను తీసుకుంటారు. తప్పుడు వివరాలతో.. ఫేక్ పాన్ కార్డులను పొందటం నేరం. ఈ నేరానికి సెక్షన్ 272 బీ ప్రకారం.. రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: పాన్ 2.0: అప్లై విధానం.. ఫీజు వివరాలుఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉండటం మాత్రమే కాకుండా.. అవసరమైన ఆర్ధిక కార్యకలాపాలకు పాన్ కార్డును ఉపయోగించకపోవడం కూడా నేరమే. అలాంటి వారు కూడా శిక్షార్హులే. కాబట్టి ఎక్కువ పాన్ కార్డులు ఉన్న వారు వెంటనే డీ-యాక్టివేట్ చేసుకోవాలి. అసలు పాన్ కార్డు లేనివారు వెంటనే.. పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి.పాన్ 2.0పాన్ 2.0 అనేది రూ. 1,435 కోట్ల బడ్జెట్తో క్యాబినెట్ ఆమోదించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం. దీని ద్వారా క్యూఆర్ కోడ్ పాన్ కార్డును పొందవచ్చు. ఈ కార్డు ద్వారా వేగవంతమైన, సమర్థవంతమైన ప్రక్రియలను నిర్ధారించడం లక్ష్యం. PAN 2.0 పన్ను చెల్లింపుదారులకు సున్నితమైన, సురక్షితమైన అనుభవాన్ని అందిస్తుంది. -
డబ్బు కావాలంటే ఇది చాలా కీలకం..
నెల్లూరు నగరానికి చెందిన కిశోర్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. వివిధ వస్తువుల కొనుగోలు కోసం అతను ఆన్లైన్ యాప్లో రూ.20 వేలు రుణం తీసుకున్నాడు. సకాలంలో చెల్లించలేకపోయాడు. యాప్ నిర్వాహకులు చాలా వడ్డీ వేశారు. దీనికితోడు సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోయింది.నెల్లూరులో నివాసం ఉంటున్న సంతోష్ ఓ షోరూంలో ఏడునెలల క్రితం ఏసీ కొన్నాడు. ఐదునెలలపాటు ఈఎంఐలు సమయానికి చెల్లించాడు. వివిధ కారణాలతో ఆ తర్వాత కట్టలేకపోయాడు. దీంతో రూ.750 అపరాధ రుసుము చెల్లించాలని బ్యాంక్ వారు పేర్కొన్నారు. అదనపు చెల్లింపుల భారంతోపాటు సిబిల్ స్కోర్ సైతం తగ్గిపోయింది.నెల్లూరు సిటీ: కాలం మారిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం పరుగులు పెడుతోంది. దీంతో జీవనశైలిలో అనేక మార్పులొచ్చాయి. నాడు ఎంతో నెమ్మదిగా జరిగిన పనులు నేడు నిమిషాల్లోనే అయిపోతున్న పరిస్థితి. ఒకప్పుడు బ్యాంక్ రుణం కావాలంటే కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. పొలం, ఇళ్ల డాక్యుమెంట్లు ఉన్నా డబ్బు ఇచ్చేందుకు బ్యాంక్లు ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవి. నేడు స్మార్ట్ ఫోన్లోని యాప్ నుంచి రూ.5వేల నుంచి రూ.లక్షల్లో రుణాలు పొందొచ్చు. ఇక్కడే ఒక మెలిక ఉంది. అదే సిబిల్ క్రెడిట్ స్కోర్. డబ్బు కావాలంటే ఇది చాలా కీలకం. దీని ఆధారంగా ఇప్పుడు బ్యాంక్లు, ఆన్లైన్ యాప్లు రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్కోర్ను 750 కంటే తగ్గకుండా చూసుకోవాల్సి బాధ్యత ఏర్పడింది. ఈఎంఐల్లోనే.. నేడు బ్యాంక్లు ఈఎంఐల పద్ధతిలో రుణ సౌకర్యం కల్పించాయి. చేతికి పెట్టుకునే వాచ్ నుంచి సెల్ఫోన్, కారు, ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, ఇళ్లు కొనుగోలుకు నెల వాయిదాల విధానంలో రుణాలు తీసుకుంటున్నారు. చిన్నచిన్న వస్తువుల కోసం ఈ–కామర్స్ యాప్లో క్రెడిట్, డెబిట్ కార్డులతో ఈఎంఐలు పెడుతున్నారు. అయితే కొందరు నిర్దేశిత తేదీల్లోగా ఈఎంఐ చెల్లించకపోతున్నారు. దీంతో భారీగా ఆలస్య రుసుము చెల్లించాల్సి వస్తోంది. లోన్ యాప్లు, ఒక్కోసారి కొన్ని బ్యాంక్ల ప్రతినిధుల బెదిరింపులూ తప్పడం లేదు. సులువుగా.. యాప్లు వచ్చిన నాటి నుంచి రుణం తీసుకోవడం సులభంగా మారిపోయింది. కేవలం పాన్కార్డు నంబర్ ఉంటే చాలు. సంబంధిత వెబ్సైట్ లేదా యాప్లో నమోదు చేయగానే కొద్ది నిమిషాల్లోనే రుణం వచ్చేది, రానిదీ తెలిసిపోతుంది. అలాగే వివిధ ఎలక్ట్రానిక్ దుకాణాలు, షాపుల్లోనూ పాన్కార్డు నంబర్ను నమోదు చేసి వెంటనే ఎంతవరకు రుణం వస్తుందో చెబుతున్నారు. దీంతో తమకు అవసరమున్నా, లేకున్నా చాలామంది ఎల్రక్టానిక్స్ వస్తువులపై ఆసక్తి చూపుతున్నారు. జీరో వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు లేదంటూ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు చెప్పే మాటలకు చాలామంది ఆకర్షితులవుతున్నారు. ఏ ప్రయోజనం లేకుండా ఆయా సంస్థలు ఎందుకు ఇలా చేస్తాయనే విషయాన్ని మర్చిపోతున్నారు. కనీస అవగాహన కూడా లేకుండా వాటి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. వస్తువులు తీసుకుని సకాలంలో చెల్లించలేకపోవడంతో సిబిల్ స్కోర్ గణనీయంగా పడిపోతోంది. దీనివల్ల భవిష్యత్లో అత్యవసరమైనప్పుడు రుణాలు పొందలేని పరిస్థితి ఏర్పడుతోంది.ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ.. కొత్త కొత్త లోన్ యాప్లు పుట్టుకుని రావడంతో యువత, విద్యార్థులు ఆ ఉచ్చులో ఇరుక్కుని పోతున్నారు. సరదాల కోసం రుణం తీసుకోవడం మొదలుపెట్టి, చివరికి తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. యాప్లలో ఇష్టారాజ్యంగా లోన్లు తీసుకుని బెట్టింగ్లు, మద్యంకు బానిసవుతున్నారు. రుణాలు సమయానికి చెల్లించకపోవడంతో నిర్వాహకులు వారిని బ్లాక్మెయిల్ చేయడం, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కాగా ఉన్నత చదువులకు రుణాలు తీసుకునే సమయంలో సమస్యలు త లెత్తే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. సిబిల్ను కాపాడుకుంటేనే.. రానున్న రోజుల్లో సిబిల్ స్కోర్ చాలా ముఖ్యం. ఇప్పటికే బ్యాంక్ రుణాలు తీసుకోవాలంటే ఇది కచ్చితంగా బాగుండాలి. రుణ చెల్లింపుల్లో ఆలస్యం చేస్తే చెక్»ౌన్స్తోపాటు సిబిల్ స్కోర్ కూడా తగ్గుతుంది. భవిష్యత్లో తీసుకునే రుణాలపై కూడా ప్రభావం పడుతుంది. బ్యాంక్ రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపులు ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. – సీహెచ్ వెంకటసందీప్, సీఏ తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి. బ్యాంక్ స్టేట్మెంట్లు, రుణాలు తీసుకోవడంపై దృష్టి సారించాలి. ముఖ్యంగా వారి అలవాట్లను నిత్యం గమనిస్తుండాలి. చెడు మార్గంలో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – వేణు, సీఐ, నెల్లూరు రూరల్ పోలీస్స్టేషన్ -
పాన్ 2.0: అప్లై విధానం.. ఫీజు వివరాలు
భారత ప్రభుత్వం పాన్ 2.0 ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం కూడా దీనికి ఆమోదం తెలిపింది. ఇది ఆర్ధిక మోసాలను, గుర్తింపు చౌర్యం వంటి వాటిని నిరోధించడమే కాకుండా.. సమాచారం మరింత భద్రంగా ఉంటుంది. అయితే.. పాన్ 2.0 ఎప్పుడు వస్తుంది అన్నదానికి సంబంధించిన అధికారిక వివరాలు ప్రస్తుతం వెలువడలేదు. అయితే కొత్త పాన్ కార్డులు వస్తే?.. పాత పాన్ కార్డులు ఏమవుతాయి. ఈ కొత్త పాన్ కార్డులు లేదా క్యూఆర్ కోడ్ పాన్ కార్డుల కోసం ఎక్కడ.. ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలను ఈ కథనంలో చూసేద్దాం.పాత పాన్ కార్డులు రద్దవుతాయా?క్యూర్ కోడ్ పాన్ కార్డులు వస్తే.. పాత పాన్ కార్డులు రద్దవుతాయా? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. కానీ పాత పాన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం లేదని ఆదాయ పన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది.పాన్ 2.0 ప్రవేశపెట్టడంలో ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. కొత్త టెక్నాలజీతో ట్యాక్స్ పేయర్లకు మెరుగైన సేవలు అందించడమే. నాణ్యమైన సేవలను సులభంగా, వేగవంతంగా అందించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పాన్ 2.0కు సిద్ధమైంది. కాబట్టి రాబోయే పాన్ కార్డులు క్యూఆర్ కోడ్తో రానున్నాయి.పాన్ 2.0 కోసం ఎలా అప్లై చేసుకోవాలి?➤పాన్ 2.0 కోసం అప్లై చేసుకోవాలంటే ముందుగా అధికారిక వెబ్సైట్లోని పోర్టల్ సందర్శించాలి (పాన్ 2.0 ప్రాజెక్ట్ ఇటీవలే ప్రవేశపెట్టారు, కాబట్టి దీనికి అప్లై చేసుకోవడానికి వెబ్సైట్లో పోర్టల్ ఇంకా అందుబాటులోకి రాలేదు).➤అవసరమైన చోట వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.➤గుర్తింపు, చిరునామా, పుట్టిన తేదీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.➤అవసరమైనన్నీ నమోదు చేసిన తరువాత అప్లికేషన్ సబ్మీట్ చేయాలి.అవసరమైన డాక్యుమెంట్స్➤ఐడెంటిటీ ప్రూఫ్ కోసం.. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్➤అడ్రస్ ప్రూఫ్ కోసం.. యుటిలిటీ బిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ లేదా రెంటల్ అగ్రిమెంట్➤డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం.. బర్త్ సర్టిఫికెట్, టీసీ, పాస్పోర్ట్పాన్ 2.0 కోసం అప్లై చేయాలంటే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాన్ కార్డు.. రిజిస్టర్ మెయిల్కు వస్తుంది. అయితే క్యూఆర్ కోడ్తో వచ్చే ఫిజికల్ కార్డు కావాలంటే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. క్యూఆర్ కోడ్ కలిగిన పాన్ కార్డును భారతదేశంలో ఎక్కడికైనా డెలివరీ చేసుకోవాలంటే ఈ 50 రూపాయలు చెల్లించాలి. అంతర్జాతీయ డెలివరీలకు ఫీజులు వేరే ఉంటాయి. కాబట్టి దీనికి అదనంగా చెల్లించాల్సి ఉండే అవకాశం ఉంది. -
కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
-
క్యూఆర్ కోడ్తో కొత్త పాన్కార్డ్లు: కేంద్రం కీలక నిర్ణయం
భారతదేశ ఆర్థిక, పన్ను వ్యవస్థలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం లేటెస్ట్ వెర్షన్ పాన్ 2.0 ప్రారంభించే ప్రణాళికలను ఆవిష్కరించారు. లేటెస్ట్ టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పౌరులకు సేవలందించడానికి ఇది ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139A కింద 1972లో ప్రవేశపెట్టిన పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PAN) ప్రవేశపెట్టారు. ఆ తరువాత పాన్ ఎప్పుడూ అప్డేట్ అవ్వలేదు.. కాగా ఇప్పటికే డిజిటల్ అప్డేట్ అందుకుంది. ఇప్పటికి 78 కోట్లకు పైగా సాధారణ పాన్కార్డులను జారీ చేశారు. అయితే రాబోయే రోజుల్లో క్యూఆర్ కోడ్తో కొత్త పాన్కార్డుల పంపిణీ చేయనున్నట్లు సమాచారం.1,435 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో.. ఆదాయపు పన్ను శాఖ పాన్ 2.0 ప్రాజెక్ట్కు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) సోమవారం ఆమోదం తెలిపింది. భద్రతను దృష్టిలో ఉంచునికి ఈ పాన్ 2.0 ప్రవేశపెట్టారు.#Cabinet approves PAN 2.0 Project of the Income Tax Department enabling technology driven transformation of Taxpayer registration services #CabinetDecisions pic.twitter.com/iQhZCgGWGu— Dhirendra Ojha (@DG_PIB) November 25, 2024 -
ఆధార్, పాన్ లింకింగ్: ఆలస్యానికి రూ.600 కోట్లు..
ఆధార్, పాన్ కార్డు లింకింగ్ అనేది చాలా అవసరం. బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయాలన్నా.. పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా.. ఇది తప్పనిసరి. అయితే ఈ లింకింగ్ కోసం కేంద్రం గడువును 2024 డిసెంబర్ 31 వరకు పెంచినట్లు సమాచారం. ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయకపోతే.. పాన్ కార్డులు డీయాక్టివేట్ అవుతాయి.నిజానికి 2023 జూన్ 30 నాటికి ఆధార్, పాన్ కార్డు లింకింగ్ గడువు ముగిసింది. గడువు లోపల లింక్ చేసుకొని వారు ఫెనాల్టీ కింద రూ.1,000 చెల్లించి మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాల్సి వచ్చింది. జనవరి 29, 2024 నాటికి ఆధార్తో లింక్ చేయని పాన్ల సంఖ్య 11.48 కోట్లు అని ఫిబ్రవరిలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటుకు తెలియజేశారు.దీంతో 2023 జులై 1 నుంచి 2024 జనవరి 31 వరకు ఆధార్, పాన్ కార్డు లింకింగ్ కోసం ఫెనాల్టీ కింద కేంద్రం 601.97 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పాన్ కార్డ్ డియాక్టివేట్ అయితే.. తరువాత లావాదేవీలలో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కొంత కష్టమే.ఇదీ చదవండి: 'ఆఫీసు నుంచి లేటుగా వెళ్తున్నా.. రేపు ఆలస్యంగా వస్తా': ఉద్యోగి మెసేజ్ వైరల్వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించే లక్ష్యంతో.. పాన్ ద్వారా వ్యక్తిగత వివరాల యాక్సెస్ను పరిమితం చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది. కాబట్టి తప్పకుండా పాన్, ఆధార్ లింకింగ్ చేసుకోవాలి. దీని కోసం అధికారిక వెబ్సైట్ సందర్శించి.. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 234H కింద రూ. 1,000 ఫెనాల్టీ చెల్లించాలి. -
పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!
ఆర్థిక మోసాలను అరికట్టేందుకు పాన్ కార్డుదారులందరికీ భారత ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టింది. వచ్చే డిసెంబర్ 31 లోపు పాన్ కార్డులను ఆధార్ కార్డులతో లింక్ చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. లేకపోతే ఆయా పాన్ కార్డ్ డియాక్టివేట్ కావడంతోపాటు ఇతర సమస్యలకు దారి తీస్తుంది.ఇదీ చదవండి: డిసెంబర్ 14 డెడ్లైన్.. ఆ తర్వాత ఆధార్ కార్డులు రద్దు!పలు ఫిన్టెక్ సంస్థలు వినియోగదారు అనుమతి లేకుండానే కస్టమర్ ప్రొఫైల్లను రూపొందించడానికి వారి పాన్ సమాచారాన్ని ఉపయోగిస్తున్నాయి. దీంతో గోప్యతా సమస్యలతోపాటు ఆర్థిక మోసాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించే లక్ష్యంతో పాన్ ద్వారా వ్యక్తిగత వివరాల యాక్సెస్ను పరిమితం చేయాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది.లింక్ చేయకపోతే ఏమౌతుంది? డిసెంబరు 31 లోపు ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్తో లింక్ చేయకపోతే తీవ్ర పరిణామాలు సంభవించవచ్చు. రెండు కార్డ్లను లింక్ చేయడంలో విఫలమైతే పాన్ కార్డ్ డియాక్టివేట్ అవుతుంది. తదుపరి లావాదేవీలలో ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయడం కూడా కష్టం. ఆన్లైన్లో వ్యక్తిగత డేటాను బహిర్గతం చేసేటప్పుడు డేటా గోప్యతా చట్టాల గురించి తెలుసుకోవడం, జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. -
ఆధార్ కార్డు కొత్త రూల్స్.. ఇక ఆ ఐడీతో కుదరదు!
దేశంలో ప్రజలు కొన్ని పత్రాలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ పత్రాలలో ఆధార్ కార్డ్ కూడా ఒకటి. దేశంలో చాలా చోట్ల ఆధార్ కార్డును ముఖ్యమైన పత్రంగా ఉపయోగిస్తున్నారు. ఆధార్ కార్డు లేకుండా ఆ పనులు చేయలేరు. ఈ ఆధార్ కార్డుకు సంబంధించిన రూల్స్ తాజాగా మారాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకోండి..దేశంలో మొదటి ఆధార్ కార్డ్ 2010 సంవత్సరంలో జారీ అయింది. ఇప్పటి వరకు, దేశంలోని జనాభాలో 90 శాతం మందికి ఆధార్ కార్డ్ ఉంది. ఆధార్ కార్డుకు సంబంధించి చాలా నిబంధనలు మారాయి. తాజాగా ఆధార్ కార్డుకు కొత్త రూల్ జారీ అయింది.ఇంతకు ముందు, ఆధార్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ ఐడీని కొన్ని పనులకు ఉపయోగించేవారు. ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసిన తర్వాత ఈ ఎన్రోల్మెంట్ ఐడీని జారీ చేస్తారు. అయితే ఇప్పుడు కొన్ని పనులకు ఈ ఎన్రోల్మెంట్ ఐడీని ఉపయోగించలేరు.ఇప్పుడు పాన్ కార్డ్ కావాలంటే ఆధార్ నంబర్ తప్పనిసరి. ఇంతకుముందులాగా ఆధార్ కార్డ్ లేకపోతే, ఎన్రోల్మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ కార్డ్ని పొందేందుకు ఇప్పుడు వీలులేదు. అలాగే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ సరిపోదు. ఆధార్ కార్డు నంబర్ ఉండాల్సిందే. -
డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయి పోలీసులకు చిక్కారా..? మీకోసమే ‘డిజీలాకర్’
ఏదైనా అత్యవసర సమయాల్లో ప్రయాణాలు చేసి డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డారా..? బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు విత్డ్రా చేసేపుడు అనుకోకుండా పాన్కార్డు మరిచిపోయారా..? టికెట్ రిజర్వేషన్ చేసుకొని ప్రయాణం చేసేపుడు ఆధార్కార్డు వెంట తెచ్చుకోవడం గుర్తులేదా..? కంగారు పడకండి. మీ కోసమే ఈ కథనం.నిత్యం ఏదో ఒక సందర్భంలో పాన్కార్డు, ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్..వంటి గుర్తింపుకార్డులు అవసరమవుతూ ఉంటాయి. నిత్యం ఫిజికల్గా వీటిని వెంటతీసుకెళ్లడం కుదరకపోవచ్చు. కానీ ఎంత అత్యవసరాల్లో అయినా మొబైల్ను మాత్రం దాదాపు గుర్తుంచుకుని తీసుకెళ్తుంటాం. మన చేతిలో ఉండే స్మార్ట్ఫోన్లో అన్ని గుర్తింపుకార్డులు డిజిటల్ రూపంలో ఉంటే ఎంత బాగుంటుందో కదా. అయితే, డిజీలాకర్ ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. అసలు ఈ లాకర్ ఏంటీ..? దీన్ని ఎలా వినియోగించాలో తెలుసుకుందాం.డిజీలాకర్ఇది కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇందులో సర్టిఫికెట్లు, కీలకపత్రాలను సురక్షితంగా దాచుకోవచ్చు. మీకు కావాల్సినప్పుడు సులువుగా వినియోగించుకోవచ్చు. పదోతరగతి సర్టిఫికెట్ నుంచి ఆధార్కార్డు, పాన్కార్డు, రేషన్కార్డు.. ఇలా ప్రభుత్వం జారీ చేసిన అన్ని డాక్యుమెంట్లనూ డిజిటల్ రూపంలో దాచుకోవడానికి ఈ లాకర్ ఉపయోగపడుతుంది. జీవిత బీమా వంటి ముఖ్యమైన పత్రాలను ఇందులో దాచుకోవచ్చు. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయి ట్రాఫిక్ పోలీసులకు చిక్కినా డిజీలాకర్లో ఉన్న పత్రాలు చూపించొచ్చు. ఇలా ఎక్కడైనా, ఎప్పుడైనా వీటిని వినియోగించుకోవచ్చు.వినియోగం ఇలా..ప్లేస్టోర్ నుంచి ఫోన్లో డిజీలాకర్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆరంకెల సెక్యూరిటీ పిన్ను వస్తుంది. దాన్ని సంబంధింత బ్లాక్లో ఎంటర్ చేయాలి. మీ ఆధార్కార్డ్ లింక్ అయిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అకౌంట్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఆధార్ నంబర్ లేదా ఆరంకెల సెక్యూరిటీ పిన్ సాయంతో లాగిన్ అవగానే మీ ఆధార్ కార్డు, పాన్కార్డు వివరాలు అందులో కనిపిస్తాయి. యాప్లో సెర్చ్ సింబల్పై క్లిక్ చేసి మీ రాష్ట్రాన్ని ఎంచుకోగానే పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికెట్ల లిస్ట్ ప్రత్యక్షమవుతుంది. వాటిలో మీ ప్రాంతం, యూనివర్సిటీకి సంబంధించిన ఆప్షన్ను ఎంచుకొని హాల్టికెట్ నంబర్, ఉత్తీర్ణత పొందిన సంవత్సరం ఎంటర్ చేసి డాక్యుమెంట్లు పొందొచ్చు. వీటితో పాటు రేషన్కార్డు..వంటి ప్రభుత్వ గుర్తింపుకార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవసరమైనపుడు ఆ డాక్యుమెంట్లను వినియోగించుకోవచ్చు.ఇదీ చదవండి: లోన్ కావాలా..? సిబిల్ స్కోర్ ఎంత ఉండాలంటే..ఇతర పత్రాలను ఎలా అప్లోడ్ చేయాలంటే..కేవలం ప్రభుత్వం అందించే డాక్యుమెంట్లే కాకుండా ఇతర విలువైన పత్రాలను డిజిటల్ రూపంలో ఈ లాకర్లో భద్రపరచుకోవచ్చు. డిజీలాకర్ యాప్లో సైన్-ఇన్ అవ్వగానే కిందకు స్క్రోల్ చేస్తే ‘డిజీలాకర్ డ్రైవ్’ అని ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ‘+’ సింబల్పై ప్రెస్ చేయాలి. మీకు కావాల్సిన డాక్యుమెంట్లను మాన్యువల్గా అప్లోడ్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్ మాదిరిగా అక్కడే ప్రత్యేక ఫోల్డర్లు కూడా క్రియేట్ చేసుకొనే సదుపాయం ఉంటుంది. డిజీలాకర్లో ప్రతీ యూజర్కు 1 జీబీ క్లౌడ్ డేటా లభిస్తుంది. 10 ఎంబీ వరకు సైజ్ ఉన్న ఒక్కో ఫైల్ను స్టోర్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సాయంతో ఎక్కడున్నా వీటిని యాక్సెస్ చేయొచ్చు. -
ఆన్లైన్లో పాన్ కార్డ్ వెరిఫికేషన్ ఇలా..
పర్మినెంట్ అకౌంట్ నంబర్ లేదా పాన్ కార్డు అనేది దేశంలో ప్రతి ఒక్కరికీ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది పన్ను సంబంధిత ప్రయోజనాలకు, గుర్తింపు రుజువుగానూ పనిచేస్తుంది. ప్రతి పాన్ కార్డు ప్రత్యేకమైన పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ సంఖ్యను కలిగి ఉంటుంది. దీన్ని ఆదాయపు పన్ను శాఖ లామినేటెడ్ కార్డు రూపంలో జారీ చేస్తుంది.ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు, ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ఏ ఉత్తరప్రత్యుత్తరాలపై పాన్ కార్డు నంబరును కోట్ చేయడం తప్పనిసరి. 2005 జనవరి 1 నుంచి ఆదాయపు పన్ను శాఖకు చెల్లించాల్సిన చెల్లింపులకు చలాన్లపై పాన్ కోట్ చేయడం తప్పనిసరి. ఈ క్రింది ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లలో పాన్ ను కోట్ చేయడం కూడా తప్పనిసరి. దీని కోసం పాన్ కార్డును ఎప్పటికప్పుడు వెరిఫై చేయాల్సి ఉంటుంది.ఆన్లైన్లో పాన్ కార్డు వెరిఫికేషన్ ప్రక్రియస్టెప్ 1: ఇన్కమ్ ట్యాక్స్ 'ఈ-ఫైలింగ్' పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి.స్టెప్ 2: 'క్విక్ లింక్స్' సెక్షన్ నుంచి 'వెరిఫై యువర్ పాన్ డీటెయిల్స్' హైపర్ లింక్పై క్లిక్ చేయండి.స్టెప్ 3: పాన్, పూర్తి పేరు (పాన్ ప్రకారం), పుట్టిన తేదీ ఎంటర్ చేసి 'స్టేటస్'పై క్లిక్ చేయండిస్టెప్ 4: ఇమేజ్లో ఉన్న విధంగా క్యాప్చా ఎంటర్ చేసి మీ పాన్ వివరాలను ధ్రువీకరించడానికి 'సబ్మిట్' పై క్లిక్ చేయండి. -
పాన్ కార్డులో మార్పులు చేసుకోండిలా..
పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) అనేది ఆదాయపు పన్ను ఫైలింగ్కు అవసరమైన కీలకమైన గుర్తింపు పత్రం. ఇందులో పేరు, పుట్టిన తేదీ, ఫోటో, సంతకం, తండ్రి పేరు, ఆధార్, లింగం, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, చిరునామా లేదా సంప్రదింపు సమాచారం వంటి వివరాలు సరైనవి ఉండడం చాలా అవసరం.ఈ వివరాల్లో ఏవైనా తప్పుగా ఉన్నా, మారినా వెంటనే సరిచేసి పాన్ కార్డును అప్డేట్ చేసుకోవడం మంచిది. ఎన్ఎస్డీఎల్ లేదా యూటీఐఐటీఎస్ఎల్ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మీరు మొదట ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్ ద్వారా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసి ఉంటే అదే వెబ్సైట్లోనే పాన్ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక వేళ యూటీఐఐటీఎస్ఎల్ వెబ్సైట్ ద్వారా చేసినట్లయితే ఆ వెబ్సైట్ ద్వారానే పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేయాలి.NSDL e-Gov పోర్టల్లో.. స్టెప్ 1: NSDL e-Gov పోర్టల్ను ఓపెన్ చేయండిస్టెప్ 2: 'సర్వీసెస్' ట్యాబ్లోకి వెళ్లి డ్రాప్డౌన్ మెనూ నుంచి 'పాన్' ఎంచుకోండి.స్టెప్ 3: 'చేంజ్/కరెక్షన్ ఇన్ పాన్ డేటా' అనే విభాగం కోసం స్క్రోల్ చేసి 'అప్లై' మీద క్లిక్ చేయండి.స్టెప్ 4: అవసరమైన వివరాలతో ఆన్లైన్ పాన్ అప్లికేషన్ ఫామ్ను పూర్తి చేయండిస్టెప్ 5: విజయవంతంగా నమోదు చేసిన తర్వాత, ఈ-మెయిల్ ద్వారా టోకెన్ నంబర్ వస్తుంది. ఈ టోకెన్ నెంబరు సెషన్ సమయం ముగిసినట్లయితే ఫారం డ్రాఫ్ట్ వెర్షన్ కు తీసుకెళ్తుంది. ఇక్కడ 'కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్' పై క్లిక్ చేయాలి.స్టెప్ 6: ఈ-కేవైసీ, ఈ-సైన్ (పేపర్ లెస్) ద్వారా డిజిటల్ గా సబ్మిట్ చేయండిస్కాన్ చేసిన ఇమేజ్ లను ఈ-సైన్ ద్వారా సబ్మిట్ చేయండిఅప్లికేషన్ డాక్యుమెంట్ లను భౌతికంగా ఫార్వర్డ్ చేయండి అని మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.ఆధార్ ఓటీపీ ద్వారా ఆన్లైన్లో ప్రక్రియను పూర్తి చేయడానికి, 'ఈ-కేవైసీ & ఈ-సైన్ (పేపర్లెస్) ద్వారా డిజిటల్గా సబ్మిట్ చేసే మొదటి ఆప్షన్ను ఎంచుకోండి.స్టెప్ 7: అప్డేట్ చేసిన పాన్ కార్డు కొత్త ఫిజికల్ కాపీ మీకు అవసరమని సూచించండి. దీనికి నామమాత్రపు ఛార్జీలు వర్తించవచ్చు.స్టెప్ 8: మీ ఆధార్ నంబర్ చివరి నాలుగు అంకెలను నమోదు చేయండి.స్టెప్ 9: అవసరమైన వివరాలను అప్డేట్ చేసి, సంబంధిత దిద్దుబాటు లేదా అప్డేట్ ఎంచుకోండి. 'కాంటాక్ట్ ఇతర వివరాలు' పేజీకి వెళ్లడానికి 'నెక్ట్స్' మీద క్లిక్ చేయండి.స్టెప్ 10: కొత్త చిరునామా, అప్డేటెడ్ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ చిరునామాను నమోదు చేయండి.స్టెప్ 11: పాన్ కాపీతో పాటు అప్డేట్ చేసిన వివరాలకు సంబంధించిన ప్రూఫ్ డాక్యుమెంట్లను జతచేయండి.స్టెప్ 12: మీ పేరును పేర్కొనడం ద్వారా డిక్లరేషన్ విభాగాన్ని పూర్తి చేయండి.స్టెప్ 13: మీ ఫోటో, సంతకం కాపీని జతచేసిన తర్వాత 'సబ్మిట్' మీద క్లిక్ చేయండి.స్టెప్ 14: ఫారం ప్రివ్యూను సమీక్షించుకుని, మీ ఆధార్ నంబర్ మొదటి ఎనిమిది అంకెలను నమోదు చేయండి.స్టెప్ 15: పాన్ కార్డ్ కరెక్షన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ పేజీకి వెళ్లండి. వివిధ పేమెంట్ గేట్ వేల ద్వారా పేమెంట్ చేయవచ్చు. విజయవంతంగా చెల్లించిన తరువాత, చెల్లింపు రశీదు జారీ అవుతుంది.స్టెప్ 16: పాన్ కార్డ్ అప్డేట్ / కరెక్షన్ ప్రక్రియను ఖరారు చేయడానికి, 'కంటిన్యూ' మీద క్లిక్ చేయండి. నియమనిబంధనలను అంగీకరించి 'అథెంటికేట్' మీద క్లిక్ చేయడం ద్వారా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.స్టెప్ 17: మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆన్లైన్ పాన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి.స్టెప్ 18: తర్వాత స్క్రీన్పై ఈ-సైన్తో 'కంటిన్యూ' మీద క్లిక్ చేయండి.స్టెప్ 19: నియమనిబంధనలను అంగీకరించి, మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, 'సెండ్ ఓటీపీ' పై క్లిక్ చేయండి.స్టెప్ 20: వెరిఫికేషన్ కోసం మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు పంపిన ఓటీపీని ఎంటర్ చేయండి. అక్నాలెడ్జ్ మెంట్ ఫారాన్ని డౌన్ లోడ్ చేసుకోండి. ఈ ఫైలును తెరవడానికి పాస్ వర్డ్ DD/MM/YYYY ఫార్మెట్ లో మీ పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.UTIITSL పోర్టల్లో ఇలా..స్టెప్ 1: UTIITSL వెబ్సైట్ను తెరవండిస్టెప్ 2: 'చేంజ్/కరెక్షన్ ఇన్ పాన్ కార్డ్' ట్యాబ్ను ఎంచుకుని ‘క్లిక్ టు అప్లయి’ మీద క్లిక్ చేయండిస్టెప్ 3: 'అప్లయి ఫర్ చేంజ్/కరెక్షన్ ఇన్ పాన్ కార్డ్ డీటెయిల్స్' ట్యాబ్ను ఎంచుకోండిస్టెప్ 4: డాక్యుమెంట్ సబ్మిషన్ విధానాన్ని ఎంచుకుని, మీ పాన్ నంబర్ ఎంటర్ చేసి, పాన్ కార్డ్ మోడ్ను ఎంచుకుని, 'సబ్మిట్' బటన్పై క్లిక్ చేయండి.స్టెప్ 5: విజయవంతంగా నమోదు చేసిన తర్వాత, మీకు రిఫరెన్స్ నంబర్ వస్తుంది. 'ఓకే' మీద క్లిక్ చేయండి.స్టెప్ 6: ఎక్కడెక్కడ అప్డేట్స్ అవసరమో అక్కడ కచ్చితమైన వ్యక్తిగత వివరాలను నమోదు చేసి 'నెక్ట్స్ స్టెప్' పై క్లిక్ చేయండిస్టెప్ 7: మీ ఆధార్ కార్డు ఆధారంగా చిరునామా అప్డేట్ అవుతుంది. మీ కాంటాక్ట్ వివరాలను నమోదు చేసి తదుపరి దశకు వెళ్లండి.స్టెప్ 8: పాన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్ట్స్ స్టెప్ బటన్ క్లిక్ చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.స్టెప్ 9: అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి.స్టెప్ 10: ఫారంలోని వివరాలను సమీక్షించి, 'మేక్ పేమెంట్' బటన్పై క్లిక్ చేయడం ద్వారా చెల్లింపు కొనసాగించండి.స్టెప్ 11: నచ్చిన ఆన్లైన్ పేమెంట్ మోడ్ను ఎంచుకుని పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయాలి. విజయవంతంగా పేమెంట్ చేసినప్పుడు ఒక సక్సెస్ మెసేజ్ డిస్ ప్లే అవుతుంది. ఈ ఫారాన్ని ప్రింట్ తీసుకోవడం మంచిది.సాధారణంగా పాన్ కరెక్షన్ ప్రక్రియలకు 15 రోజులు పడుతుంది. మీ పాన్ కార్డు పోస్ట్ ద్వారా పంపిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు నోటిఫికేషన్ వస్తుంది.ఆఫ్లైన్లో పాన్ అప్డేట్ ఇలా..» ఇంటర్నెట్ నుంచి పాన్ కార్డు కరెక్షన్ ఫామ్ను డౌన్ లోడ్ చేసుకోవాలి.» ఫారం అన్ని విభాగాలను కచ్చితంగా పూర్తి చేసి అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోండి» అవసరమైన డాక్యుమెంట్లతో నింపిన ఫారంను సమీపంలోని పాన్ సెంటర్లో సబ్మిట్ చేయాలి.» సబ్మిట్ చేసి, రుసుము చెల్లించిన తర్వాత, కేంద్రం నుంచి అంగీకార స్లిప్ పొందండి.» 15 రోజుల వ్యవధిలో, ఈ అంగీకార స్లిప్ను ఎన్ఎస్డీఎల్ ఆదాయపు పన్ను పాన్ సర్వీస్ యూనిట్కు పంపండి.కావాల్సిన డాక్యుమెంట్లుపాన్ కార్డు డూప్లికేట్ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి గుర్తింపు రుజువులు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, ఆస్తిపన్ను రశీదులు, యుటిలిటీ బిల్లులు వంటి చిరునామా రుజువులు. పుట్టిన తేదీ, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, బర్త్ సర్టిఫికేట్, మెట్రిక్యులేషన్ మార్క్ షీట్ తదితరాల ఆధారాలు. -
రూ.46 కోట్లు కట్టు! పీజీ విద్యార్థికి ఐటీ నోటీసు
గ్వాలియర్: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ప్రమోద్ దండోతియా(25) అనే పీజీ విద్యార్థి ఏకంగా రూ.46 కోట్ల ఆదాయ పన్ను నోటీసు అందుకున్నాడు! దాంతో షాకై పోలీసులను ఆశ్రయించాడు. తన పాన్ కార్డు వివరాల ద్వారా ఎవరో ఢిల్లీ, ఫుణేల్లో తన పేరిట ఓ కంపెనీని సృష్టించి ఈ లావాదేవీలు జరిపినట్లు ఐటీ, జీఎస్టీ అధికారుల ద్వారా తెలిసిందని బాధితుడు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారతనికి సూచించారు. ఐటీ నోటీసులు, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేయాలని ప్రమోద్కు చెప్పినట్టు ఏఎస్పీ షియాజ్ తెలిపారు. దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. -
పాన్కార్డ్ జాగ్రత్త.. ఈ విద్యార్థికి జరిగిందే మీకూ జరగొచ్చు!
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో ఓ కాలేజీ విద్యార్థికి ఆదాయపన్ను శాఖ నుంచి రూ.46 కోట్లకు ట్యాక్స్ నోటీసు వచ్చింది. మామూలు విద్యార్థికి అన్ని కోట్ల పన్ను నోటీసు రావడమేంటి అనుకుంటున్నారా? అతని పాన్ కార్డ్ను కొందరు దుర్వినియోగం చేశారు. దీంతో ఆ విద్యార్థికి ఐటీ నోటీసు వచ్చింది. తనకు తెలియకుండా తన బ్యాంకు ఖాతా నుండి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గ్వాలియర్కు చెందిన ప్రమోద్ కుమార్ దండోటియా అనే కాలేజీ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో 2021లో తన పాన్కార్డ్ నెంబర్తో ఓ కంపెనీ ప్రారంభించి లావాదేవీలు నిర్వహించారని ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ విభాగాల నుంచి నోటీసు వచ్చినట్లు పేర్కొన్నాడు. ఇది ఎలా జరిగిందో తనకు తెలియదని, తన పాన్ కార్డ్ దుర్వినియోగం అయినట్లు వాపోయాడు. ఆదాయపు పన్ను శాఖ నుంచి సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు ప్రమోద్ కుమార్ తెలిపారు. ఆ తర్వాత పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. శుక్రవారం మరోసారి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందిందని, మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ తెలిపారు. -
పాన్కార్డులో మార్పులు చేయాలా..? ప్రాసెస్ ఇదే..
ఫొటో ఐడెంటిటీలో భాగంగా మన వద్ద ఆదార్, ఓటర్ ఐటీ వంటి చాలా కార్డులే ఉంటాయి. అయితే నిత్యం వినియోగించే కార్డుల జాబితాలో ప్రస్తుతం పాన్ కార్డు కూడా వచ్చి చేరింది. విలువైన వస్తువులు కొనాలన్నా, అమ్మాలన్నా, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరపాలన్నా పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. సామాన్యుడి నుంచి పెద్ద వ్యాపారి వరకు అందరూ ఈ కార్డును వినియోగిస్తుంటారు. ఈ కార్డులో వ్యక్తికి సంబంధించిన పేరు, ఫొటో, పుట్టినతేదీ, సంతకం వంటి వివరాలు ఉంటాయి. నగదు లావాదేవీలకు పాన్కార్డు కీలకంగా ఉంటుంది. అలాంటి కార్డులో తప్పులున్నా, పేరును మార్చుకోవాలన్నా పెద్ద సమస్యేం కాదు. ఇంటి వద్దనే మనం వీటిని సరిచేసుకోవచ్చు. ముఖ్యంగా పెళ్లయిన తరవాత చాలా మంది మహిళలు పాన్ కార్డులో తమ ఇంటి పేరును మార్చాలనుకుంటారు. అయితే దాని కోసం ఎక్కడకీ వెళ్లే అవసరం లేకుండా తమ ఫోన్ ద్వారానే పేరు మార్చుకోవచ్చు. మార్పు చేసుకోండిలా.. మొబైల్/ డెస్క్టాప్ బ్రౌజర్లో టీఐఎన్ ఎన్ఎస్డీఎల్ (www.tin-nsdl.com) అని టైప్ చేస్తే, సంబంధిత వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో సర్వీసెస్ విభాగంలో PAN అనే ఆప్షన్ ఎంచుకోవాలి. కిందకు స్క్రోల్ చేశాక Change/Correction in PAN Data అనే సెక్షన్లో అప్లయ్పై క్లిక్ చేయాలి. అందులో ‘Application Type’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ‘Changes or Correction in existing PAN data’ని సెలక్ట్ చేయాలి. పాన్ నంబర్ సహా పేరు, పుట్టిన తేదీ, ఇ-మెయిల్, ఫోన్ నంబర్ తదితర వివరాలు అందులో ఇవ్వాలి. ఈ వివరాలన్నీ సబ్మిట్ చేశాక మీకో టోకెన్ నంబర్ జారీ చేస్తారు. తర్వాత కింద బటన్పై క్లిక్ చేసి తర్వాతి ప్రక్రియకు వెళ్లాలి. ఇప్పుడు పాన్ కార్డుకు సంబంధించిన కరెక్షన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ పేరు, పుట్టినరోజు, ఫోన్ నంబరు, ఇలా ఇక్కడ అన్నింటినీ మార్చుకొనే వీలుంటుంది. సబ్మిట్ చేశాక పేమెంట్ ఆప్షన్ వస్తుంది. నచ్చిన విధానంలో పేమెంట్ చేసే వెసులుబాటు ఉంటుంది. పేమెంట్ అయిన వెంటనే మీరు కార్డును అప్డేట్ చేసినట్టుగా ఓ స్లిప్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. -
పాన్కార్డు పనిచేయడం లేదా? మరి జీతం అకౌంట్లో పడుతుందా?
PAN - Aadhar link: ప్రతిఒక్కరి దైనందిన జీవితంలో పాన్ కార్డ్ ఓ భాగమైపోయింది. ఆర్థిక లావాదేవీలన్నింటికీ పాన్ కార్డ్ చాలా అవసరం. ఈ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనికి గడువు 2023 జూన్ 30తో ముగిసింది. ఆ తర్వాత ఆధార్తో లింక్ చేయని పాన్ కార్డులు పనిచేయకుండా (ఇనాపరేటివ్) పోయాయి. ఇప్పటికీ పాన్-ఆధార్ లింక్ చేయనివారు కొంతమంది ఉన్నారు. దీంతో వారి పాన్ కార్డులు ఇనాపరేటివ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అలాంటి పాన్ కార్డులున్నవారికి జీతం అకౌంట్లో క్రెడిట్ అవుతుందా అనే సందేహం తలెత్తింది. (ఎస్బీఐలో అద్భుత పథకం! గడువు కొన్ని రోజులే...) ఆధార్తో లింక్ చేయకపోవడంతో పాన్ కార్డులు ఇనాపరేటివ్గా మారడం వల్ల ఆర్థిక లావాదేవీల్లో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ జీతం బ్యాంక్ ఖాతాకు జమ కాకుండా ఆపదు. అయితే ఈ పనిచేయని పాన్ కార్డును ఎక్కడా ఉపయోగించడానికి వీలుండదు. కానీ జీతాలు జమ చేసేది యాజమాన్యాలు కాబట్టి బ్యాంకులు ఎలాంటి ఆంక్షలు పెట్టలేవు. ఇదీ చదవండి: నిమిషాల్లో లోన్.. ఆర్బీఐ ప్రాజెక్ట్ అదుర్స్! ఆనంద్ మహీంద్రా ప్రశంస మొదట ఉచితంగా పాన్-ఆధార్ లింకింగ్కి 2022 మార్చి 31 వరకు ప్రభుత్వం గడవు విధించింది. ఆ తర్వాత రూ. 500 జరిమానాతో 2022 జూన్ 30 వరకు గడువును పొడిగించింది. అనంతరం రూ. 1000 జరిమానాతో 2023 మార్చి 31 వరకు, చివరిసారిగా 2023 జూన్ 30 వరకు గడవులు పొడిగించుకుంటూ వచ్చింది. తర్వాత మరోసారి గడువును ప్రభుత్వం పొడించలేదు. దీంతో 2023 జూన్ 30 తర్వాత ఆధార్తో లింక్ చేయని పాన్ కార్డులు ఇనాపరేటివ్గా మారిపోయాయి. -
దెబ్బకు 10 కోట్ల పాన్ కార్డులు క్లోజ్ - ఐటీ శాఖ రిప్లై ఇలా..!
Aadhaar Pan Link: గత కొన్ని రోజులుగా ఆధార్-పాన్ లింకింగ్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. 2023 జూన్ 30 లింకింగ్ చివరి గడువు అంటూ పలుమార్లు సంబంధిత శాఖలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కాగా ఇప్పుడు ఆధార్ & పాన్ లింకింగ్ గడువు ముగిసింది. అయినప్పటికీ ఆదాయపన్ను శాఖ వినియోగదారుల నుంచి ప్రశ్నలను స్వీకరిస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఒక వ్యక్తి ట్విటర్ వేదికగా దాదాపు 10 కోట్లకు పైగా ఎన్ఆర్ఐ పాన్ కార్డులు పనిచేయడం లేదని, భారతదేశంలో వారి పెట్టుబడులు, బ్యాంక్ బ్యాలన్స్ వంటివి ఫ్రీజ్ అయినట్లు వెల్లడించాడు. ఎన్ఆర్ఐ అందించిన పిర్యాదు మేరకు ఆదాయ పన్ను శాఖ స్పందిస్తూ.. గతంలో వెల్లడించిన విధంగానే పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ లింక్ చేయకుండా పోతే.. పాన్ పనిచేసే అవకాశం లేదని, ఈ కారణంగా తప్పకుండా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే 10 కోట్ల పాన్ కార్డులు క్లోజ్ అయ్యాయా? లేదా? అనే దానిపైన ఎటువంటి అధికారిక వివరాలు వెల్లడి కాలేదు. (ఇదీ చూడండి: జీఎస్టీ కౌన్సిల్ సమావేశం - ధరలు తగ్గేవి & పెరిగేవి ఇవేనా?) నిబంధనల ప్రకారం.. ఎవరైతే ఎన్ఆర్ఐ లేదా ప్రవాస భారతీయులు ఉంటారో వారు ముందుగా వారి స్టేటస్ ఆదాయ పన్ను శాఖకు తెలియజేసినట్లయితే వారికి పాన్-ఆధార్ లింక్ నుంచి మినహాయింపు లభిస్తుంది. కావున వారికి ఎటువంటి సమస్య ఉండదని ఆదాయపన్ను శాఖ క్లారిటీ ఇచ్చింది. Dear @secureyoursites, It may be noted that non-linking of PAN with Aadhaar makes a PAN inoperative and not inactive, consequences of which have already been specified vide Press Release in https://t.co/N1IRieLOfr The NRIs who had intimated their NRI status to the Department are… — Income Tax India (@IncomeTaxIndia) July 10, 2023 అంతే కాకుండా ఇప్పటి వరకు ఎవరైనా ప్రవాస భారతీయులు తమ ఎన్ఆర్ఐ స్టేటస్ చెప్పకుండా.. పాన్ కార్డు పని చేయలేదని నిర్దారించుకుంటారో, అలాంటి వారు ఆన్లైన్ ద్వారా జ్యూరిస్డిక్షనల్ అసెస్సింగ్ ఆఫీసర్ (JAO)ని సంప్రదించవలసిందిగా వెల్లడించింది. ఇందులో భాగంగా వారి పాస్పోర్ట్ కాఫీ వంటివి వారికి అందించాల్సిన అవసరం కూడా ఉందని తెలిపింది. ఆలా కాకుంటే పాన్ కాఫీ, సంబంధిత డాక్యుమెంట్స్ adg1.systems@incometax.gov.in లేదా jd.systems1.1@incometax.gov.in అనే ఇమెయిల్కి కూడా పంపవచ్చని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. -
పాన్ - ఆధార్ లింక్లో కొత్త అప్డేట్
పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలని, ఈ ప్రక్రియ 2023 జూన్ 30 చివరి నాటికి పూర్తి చేసుకోవాలని గతంలోనే చాలా కథనాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు పాన్ కార్డు - ఆధార్ లింకింగ్లో కొత్త అప్డేట్ వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పాన్ కార్డు లింక్ చేసేందుకు రూ.1000 పెనాల్టీ చెల్లించి కూడా చేసుకోవచ్చు. అయితే డబ్బు చెల్లించడానికి ముందు ఆదాయపు పన్ను శాఖ అసెస్మెంట్ ఇయర్ ఆప్షన్ ఎంచుకోవాలి. గతంలో పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవానికి మార్చి 31 చివరి గడువుగా ప్రకటించారు. అయితే ఈ గడువు ప్రస్తుతం పొడిగించారు. కావున అసెస్మెంట్ ఏడాదిని 2023 - 24గా కాకుండా, అసెస్మెంట్ ఇయర్ను 2024-25గా ఎంచుకోవాలి. పేమెంట్ చేయడానికి అదర్ రిసిప్ట్స్ (500) అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ఈ మార్పుని డబ్బు చెల్లించడానికి ముందే గమనించాలి. ఆలా కాకుండా దావుబ్బు చెల్లిస్తే కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 ఏఏ ప్రకారం పాన్ కార్డు ఉన్న వారు తప్పనిసరిగా ఆధార్ నంబర్తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా మంది లింక్ చేసుకుని ఉంటారు. అలాంటి వారు ఓసారి స్టేటస్ చెక్ చేసుకుని పాన్-ఆధార్ లింక్ అయిదో లేదో చూసుకోవడం మంచింది. ఇప్పటివరకు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఎలా లింక్ చేయాలో ఇక్కడ చూడవచ్చు: మొదట https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి హోమ్ పోజీలో క్విక్ లింక్స్లో లింక్ ఆధార్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకుని పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. పేమెంట్ కోసం ఆప్షన్ ఎంచుకున్న తరువాత ఈ-పే ట్యాక్స్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో పాన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత అసెస్మెంట్ ఇయర్ 2024-25 సెలెక్ట్ చేసి, అదర్ రిసిప్ట్స్ (500) ఆప్షన్ క్లిక్ చేసి పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేయాలి ఆ తర్వాత చలాన్ జనరేట్ అవుతుంది. పేమెంట్ చేసిన 4 లేదా 5 రోజుల తర్వాత పాన్-ఆధార్ లింక్ చేయాలి. -
పాన్–ఆధార్ అనుసంధానానికి గడువు పెంపు
న్యూఢిల్లీ: పాన్, ఆధార్ను అనుసంధానం చేసేందుకు నిర్దేశించిన గడువును ప్రభుత్వం మరో మూడు నెలల పాటు జూన్ 30 వరకూ పొడిగించింది. వాస్తవానికి ఇది మార్చి 31తో ముగియాల్సి ఉంది. అయితే, ఆధార్తో పాన్ను అనుసంధానం చేసుకునేందుకు ప్రజలకు మరింత సమయం ఇవ్వాలంటూ రాజకీయ పార్టీలు సహా పలు వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్యాక్స్పేయర్లకు మరికాస్త సమయం ఇచ్చే క్రమంలో పాన్, ఆధార్ను లింక్ చేసుకునేందుకు గడువు తేదీని 2023 జూన్ 30 వరకు పెంచినట్లు ఆర్థిక శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. నిర్దేశిత గడువులోగా వీటిని లింకు చేసుకోని వారి పాన్ నంబర్లు జూలై 1 నుంచి పనిచేయవు. దీని వల్ల ట్యాక్స్పేయర్లు ట్యాక్స్ రీఫండ్లను గానీ వాటిపై వడ్డీలను గానీ క్లెయిమ్ చేసుకోవడానికి వీలుండదు. అలాగే వారికి టీడీఎస్, టీసీఎస్ భారం కూడా ఎక్కువగా ఉంటుంది. పాన్, ఆధార్ అనుసంధానానికి ప్రభుత్వం డెడ్లైన్ను పలు దఫాలు పొడిగిస్తూ వస్తోంది. వాస్తవానికి గతేడాది (2022) మార్చి ఆఖరు నాటికే పాన్ను ఆధార్తో లింక్ చేసుకోవాలని తొలుత గడువు విధించారు. అది దాటాకా 2022 ఏప్రిల్ 1 నుంచి రూ. 500 జరిమానా ప్రతిపాదించారు. దాన్ని గతేడాది జూలై 1 నుంచి రూ. 1,000కి పెంచారు. ప్రస్తుతం ఇదే పెనాల్టీ అమలవుతోంది. ఇప్పటివరకు 51 కోట్ల పాన్లు (పర్మనెంట్ అకౌంటు నంబర్) ఆధార్తో అనుసంధానమయ్యాయి. -
పాన్ అప్డేట్ అంటూ సందేశాలు.. క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా!
ఆధార్ అప్డేట్, పాన్ కార్డు అప్డేట్ వంటివి వినియోగదారులు ఆన్లైన్లో సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇటీవల కొంతమంది అప్డేట్ యువర్ పాన్ అనే సందేశంతో కొన్ని ఫేక్ మెసేజస్ పంపిస్తున్నారు. ఇలాంటి వాటిపై క్లిక్ చేయకూడదని ప్రభుత్వం ఆదేశిస్తోంది. గత కొన్ని రోజులుగా స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా పేరుతో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేరుతో కొన్ని ఫేక్ మెసేజిలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి ఇవి నకిలీ సందేశాలైనప్పటికీ @TheOfficialSBI అనే పేరుతో రావడం గమనార్హం. ఇందులో మీ పాన్ కార్డు అప్డేట్ చేసుకోవాలని, లేకపోతే బ్యాంకు అకౌంట్ నిలిచిపోతుందని ఉంటుంది. దీనికి భయపడి కొంతమంది దానిపైన క్లిక్ చేసి సైబర్ దాడులకు బలైపోతున్నారు. ఇలాంటి ఫేక్ సందేశాలపై ఎవరూ క్లిక్ చేయవద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వివరించింది. SBI ఎప్పుడూ మీ పర్సనల్ డీటైల్స్, అకౌంట్ వివరాలు సందేశాల ద్వారా అడగదు, కావున వినియోగదారుడు తప్పకుండా వీటిని గమనించి జాగ్రత్త వహించాలి. ఇదిలా ఉండగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి కూడా ఫేక్ మెసేజస్ వస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. ఇందులో గ్యాస్ ఏజెన్సీ డీలర్షిప్ల ప్రీ అప్రూవల్ కోసం కేవైసీ డాక్యుమెంట్స్ కావాలని కోరుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి వచ్చినట్లుగా ఈ మెసేజ్ వైరల్ అవుతోంది. దీనిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పంపించలేదని, దానికి ఎవరూ స్పందించవద్దని అధికారులు చెబుతున్నారు. A #Fake message issued in the name of @TheOfficialSBI is asking recipients to update their PAN on a suspicious link to prevent their account from getting expired.#PIBFactCheck ✅ Beware of such frauds. ✅ SBI never sends emails/SMS asking for personal/banking details. pic.twitter.com/1u8tFywQcf — PIB Fact Check (@PIBFactCheck) March 24, 2023 -
NRI PAN Card: ఎన్ఆర్ఐ పాన్ కార్డు కోసం సింపుల్ టిప్స్!
ప్రస్తుతం ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి వాటికి ఎంత ప్రాధాన్యత ఉందో అందరికి తెలుసు. దేశంలో ఉన్న ప్రజలందరూ దాదాపు ఆధార్ కార్డు, ఆదాయ పన్ను చెల్లించేవారు పాన్ కార్డు కలిగి ఉంటారు. అయితే కేవలం భారతదేశంలో ఉన్నవారు మాత్రమే కాకుండా ప్రవాస భారతీయులు (NRI) కూడా పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. పాన్ (పర్మనెంట్ అకౌంట్ నెంబర్) అనేది నెంబర్స్, ఇంగ్లీష్ అక్షరాలతో కలిసి ఉంటుంది. మనదేశంలోని ఆదాయ పన్ను శాఖ ఈ పాన్ నెంబర్తో కూడిన కార్డును జారీ చేస్తుంది. ఇండియాలో పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్నవారు ఖచ్చితంగా పాన్ కార్డ్ కలిగి ఉండాలి. పాన్ కార్డు కోసం ప్రవాస భారతీయులు ఎవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ తెలుసుకోవచ్చు.. ప్రవాస భారతీయులు ఎవరు అప్లై చేయాలి భారతదేశంలో ఇన్కమ్ టాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్న వారు. భారతదేశంలో స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునే వారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనునుకునే వారు. మ్యుచ్చువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలన్న ఆసక్తి చూపే వారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడం UTIITSL లేదా Proteanలో అప్లై ఆన్లైన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ టైప్ కింద ఫామ్ 49ఏ ఫర్ ఎన్ఆర్ఐ సెలెక్ట్ చేసుకోవాలి. విదేశీ పౌరసత్వం ఉన్నవారైతే ఫామ్ 49ఏఏ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో అన్ని వివరాలను నింపిన తరువాత క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తరువాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఎన్ఆర్ఐ పాన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఎన్ఆర్ఐ పాన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ పూర్తిగా ఫిల్ చేసిన అవసరమైన డాక్యుమెంట్స్, డిజిటల్ సిగ్నేచర్ వంటివి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. తరువాత ఓపెన్ అయ్యే పేమెంట్ పేజీలో అమౌంట్ పే చేసిన తరువాత అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడం ఆన్లైన్ విధానం గురించి అవగాహన లేనివారు, ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అప్లై చేయాలనుకునేవారు సమీపంలో ఉన్న ఐటి పాన్ సర్వీస్ సెంటర్ లేదా టిఐఎన్ ఫెసిలిటేషన్ సెంటర్ సందర్శించాలి. అక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి, ఫీజు చెల్లించి అక్కడే సబ్మిట్ చేయాలి. డీడీ ద్వారా కూడా చెల్లించాల్సిన ఫీజు చెల్లించవచ్చు. ఫీజు చెల్లించిన తరువాత వారు ఇచ్చే అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ని పాన్ కార్డ్ వచ్చేవరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. -
పాన్ నెంబర్తో ఆధార్ లింక్ అయిందా? ఈ సింపుల్ టెక్నిక్స్తో తెలుసుకోండి
ఆధునిక కాలంలో పాన్ కార్డు గురించి దాదాపు అందరికి తెలుసు. తాజాగా విడుదలైన కొన్ని నోటిఫికేషన్స్ ప్రకారం, పాన్ కార్డు కలిగిన వినియోగదారులు తమ ఆధార్ నెంబర్తో తప్పకుండా అనుసంధానించాల్సిన అవసరం ఉంది. ఆలా చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వినియోగదారుల పాన్ కార్డ్ ఆధార్తో లింక్ చేయబడిందా.. లేదా అని తెలుసుకోవడానికి, అదే సమయంలో పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తో లింక్ చేయాలనుకునేవారికి కొన్ని సులభమైన టిప్స్ ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆధార్ నంబర్తో పాన్ కార్డు లింక్ చేయడం ఎలా? ఇన్కమ్టాక్స్ అధికారిక వెబ్సైట్ వెళ్ళండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి. ప్రక్రియను ప్రారంభించడానికి పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. సిస్టమ్ మీ పాన్ నంబర్ & ఆధార్ నంబర్ని ధృవీకరిస్తుంది. మీ పాన్ కార్డుని ఆధార్తో లింక్ చేయడానికి రూ. 1,000 ఈ-పే టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత ఫీజు చెల్లించడానికి ఓటీపీ పొందటానికి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ-పే టాక్స్ పేజీలో, ఇన్కమ్టాక్స్ మీద క్లిక్ చేయండి. అసెస్మెంట్ సంవత్సరాన్ని 2023 - 2024గా, ఆధార్ పేమెంట్స్ కోసం అక్కడ ఎంచుకోండి. మీకు వర్తించే మొత్తం అమౌంట్కి సంబంధించి వివరాలు వేరే ట్యాబ్లో చూడవచ్చు. మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించిన తరువాత IT వెబ్సైట్లోని మీ ప్రొఫైల్ డ్యాష్బోర్డ్కి తీసుకెళ్తుంది. అక్కడ 'లింక్ ఆధార్ టు పాన్' అనే ఆప్సన్ చూడవచ్చు దానిపైన క్లిక్ చేసిన తరువాత మీ పాన్ కార్డ్తో మీ ఆధార్ను లింక్ చేయడానికి అభ్యర్థనను తెలియజేస్తుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. కావాల్సిన వివరాలను అందించిన తరువాత "లింక్ ఆధార్" బటన్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ దృవీకరించండి తరువాత, మీ పాన్ నంబర్తో ఆధార్ కార్డ్ని విజయవంతంగా లింక్ చేసారని తెలుసుకోవచ్చు. పాన్ కార్డ్ ఆధార్తో లింక్ చేయబడిందా, లేదా చెక్ చేసుకోవడం ఎలా? ఇక్కడ కూడా ఇన్కమ్టాక్స్ అధికారిక వెబ్సైట్ వెళ్ళండి అలా కాకపోతే ఇక్కడున్న రెండు లింకులతో దేనినైనా సెలక్ట్ చేసుకోవచ్చు. ఇన్కమ్టాక్స్ వెబ్సైట్ / పాన్ కార్డ్ వెబ్సైట్ మీరు ఆధార్-పాన్ లింక్ స్టేటస్ చెక్ చేయడానికి ఇన్కమ్టాక్స్ వెబ్సైట్ ఉపయోగించుకుంటే పాన్ నంబర్ & ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. అక్కడ 'లింక్ ఆధార్ స్టేటస్' మీద క్లిక్ చేయండి. సిస్టమ్ చెక్ చేసి పాన్ కార్డ్ మీ ఆధార్ నంబర్తో లింక్ చేయబడిందో లేదో తెలియజేస్తుంది. పాన్-ఆధార్ లింకింగ్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి పాన్ కార్డ్ వెబ్సైట్ ఉపయోగించవచ్చు. ఇక్కడ పాన్ నంబర్ & పుట్టిన తేదీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చివరగా సబ్మిట్ మీద క్లిక్ చేయండి మీ పాన్ నంబర్ ఆధార్తో లింక్ చేయబడిందో లేదో తెలియజేస్తుంది. పైన తెలిపిన సూచనలను పాటిస్తూ పాన్ కార్డ్ ఆధార్తో లింక్ చేయబడిందా, లేదా చెక్ చేసుకోండి. అంతే కాకుండా ఆధార్ నంబర్తో పాన్ కార్డు లింక్ చేయడం గురించి కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఈ నెల 31లోపు పాన్ నంబర్ను ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవాలి. ఈ నెల చివరిలోపు పాన్ నంబర్ను ఆధార్ కార్డ్తో లింక్ చెకపోతే పాన్ కార్డ్ పనిచేయదు. -
మార్చిలో ముఖ్యమైన డెడ్లైన్లు.. తప్పిస్తే నష్టమే!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ఈ మార్చి 31తో ముగుస్తుంది. ఆర్థికపరంగా ఈ మార్చి నెల ముగిసేలోపు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. పాన్- ఆధార్ లింక్, ముందస్తు పన్ను చెల్లింపు, పన్ను ఆదా చేసే పెట్టుబడులు, ప్రధానమంత్రి వయా వందన యోజన దరఖాస్తుకు మార్చిలో గడువులు ముగుస్తాయి. ఇదీ చదవండి: వాహనదారులకు షాక్! హైవే ఎక్కితే బాదుడే.. పెరగనున్న టోల్ చార్జీలు! పాన్-ఆధార్ కార్డ్ లింక్ మార్చి 31లోపు శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను ఆధార్తో లింక్ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇంతకు ముందు కూడా పాన్-ఆధార్ లింక్ చేయడానికి గడువును చాలాసార్లు పొడిగించింది. ప్రస్తుతం రూ. 1,000 పెనాల్టీ చెల్లించి లింక్ చేసుకోవాలి. ప్రస్తుత గడువు తప్పితే ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డ్ పని చేయదని ఆదాయపు పన్ను శాఖ చెబుతోంది. ముందస్తు పన్ను చెల్లింపు ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. ముందస్తు పన్ను చెల్లింపు చివరి వాయిదా చెల్లింపునకు చివరి తేదీ మార్చి 15. ముందస్తు పన్ను చెల్లింపులో ఏదైనా డిఫాల్ట్ అయితే పన్ను చెల్లింపుదారు సంబంధిత పెనాల్టీలను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. టీడీఎస్ మినహాయించిన తర్వాత రూ.10వేలు లేదా అంతకంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుందని అంచనా ఉన్న వ్యక్తి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ముందస్తు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పన్ను ఆదా చేసే పెట్టుబడులు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ఆదా చేసే పెట్టుబడులకు మార్చి 31 చివరి తేదీ. పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి, ట్యాక్స్ను ఆదా చేయడానికి ఈ పన్ను ప్రణాళిక సహాయపడుతుంది. పన్ను చెల్లింపుదారులు గణనీయమైన మొత్తంలో పన్ను ఆదా చేసుకోవడానికి అందుబాటులో ఉన్న పన్ను ఆదా అవకాశాలను ఉపయోగించుకోవచ్చు. ప్రధాన మంత్రి వయ వందన యోజన ఇది సీనియర్ సిటిజన్లకు భద్రతను అందించే బీమా పాలసీ కమ్ పెన్షన్ పథకం. ఈ పథకాన్ని భారతీయ బీమా సంస్థ అందిస్తోంది. ఇందులో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మార్చి 31 వరకు ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంపై 10 సంవత్సరాలకు ఏటా 7.4 శాతం వడ్డీ వస్తుంది. నెలవారీ, త్రైమాసికం, లేదా వార్షిక ప్రాతిపదికన పెన్షన్ పొందవచ్చు. ఇదీ చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్! రూ.295 కట్ అవుతోందా? ఎందుకో తెలుసుకోండి.. -
Aadhaar-Pan Linking: తరుముకొస్తున్న గడువు.. కానీ వీరికి ఆ టెన్షన్ లేదు!
పాన్కు ఆధార్ అనుసంధానం చేసుకోవాల్సిన గడువు తరుముకొస్తోంది. పాన్ ఆధార్ లింక్ కేంద్రం తప్పనిసరి చేసింది. ఇందుకు మార్చి 31 వరకు గడువు విధించింది. ఏప్రిల్ 1 తర్వాత ఆధార్ లింక్ చేయని పాన్లు చెల్లుబాటు కావని ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది. పాన్ను ఆధార్తో లింక్ చేయడానికి గడువును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు పొడిగించింది. ప్రస్తుతం రూ.1000 రుసుం చెల్లించి లింక్ చేసుకునేందుకు మార్చి 31 వరకు గడువు ఉంది. అప్పటికీ పాన్ను ఆధార్తో లింక్ చేసుకోకుంటే ఏప్రిల్ 1 నుంచి ఆ పాన్ చెల్లదు . ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానాల్లో పాన్ - ఆధార్ లింక్ చేసుకోవచ్చు. చదవండి: Google Bard: గూగుల్ బార్డ్ అంటే సెర్చ్ మాత్రమే కాదు.. అంతకు మించి.. ఆన్లైన్లో పాన్-ఆధార్ లింక్ చేసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ https://incometaxindiaefiling.gov.inను సందర్శించవచ్చు. అలాగే ఎస్సెమ్మెస్ ద్వారా పాన్ ఆధార్ లింక్ చేసుకునేందుకు 567678 లేదా 56161 నంబర్కి UIDPAN < SPACE > < 12 అంకెల ఆధార్ నంబర్ > < SPACE > < 10 అంకెల పాన్ నంబర్ > టైప్ చేసి ఎస్మెమ్మెస్ చేయొచ్చు. ఇన్ ఆఫ్లైన్ ద్వారా పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలనుకున్న వారు సమీపంలోని పాన్ సర్వీస్ సెంటర్ లేదా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించవచ్చు. వీరికి మినహాయింపు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139ఎఎ ప్రకారం.. పాన్ ఆధార్తో లింక్ చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి అది పనిచేయదు. అయితే దీని నుంచి కొందరికి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. 2017 మేలో కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. పాన్-ఆధార్ లింకింగ్ నిబంధన నుంచి ఈ నాలుగు వర్గాలకు మినహాయింపు ఉంది. అస్సాం, మేఘాలయ, జమ్మ కశ్మీర్ రాష్ట్రాల వాసులు. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం నాన్-రెసిడెంట్లు. 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు. భారతదేశ పౌరులు కాని వారు. చదవండి: బంగారు నగలపై కేంద్రం కొత్త రూల్.. ఇకపై ఇది తప్పనిసరి! -
ఆధార్తో 48 కోట్ల పాన్లు అనుసంధానం
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు వ్యక్తులకు సంబంధించి 48 కోట్ల పాన్లు ఆధార్ డేటాబేస్తో అనుసంధానం చేసుకున్నట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. మొత్తం 61 కోట్ల వ్యక్తిగత పాన్లు ఇప్పటి వరకు మంజూరు చేసినట్టు చెప్పారు. అంటే 80 శాతం కార్డులనే అనుసంధానించుకున్నట్టు తెలుస్తోంది. మిగిలిన 13 కోట్ల పాన్ హోల్డర్లు ఈ ఏడాది మార్చి 31లోపు అనుసంధానించుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. అనుసంధానం చేసుకుని పాన్లు పనిచేయకుండా పోతాయన్నారు. దీంతో వ్యాపార, పెట్టుబడులు, పన్నుల సంబంధిత ప్రయోజనాలు నష్టపోయే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వాస్తవానికి ఆధార్–పాన్ అనుసంధానానికి కేంద్రం ఇచ్చిన గడువు ఎప్పుడో ముగిసింది. దీంతో రూ.1,000 ఫీజు చెల్లించి ఈ ఏడాది మార్చి 31 వరకు అనుసంధానించుకునేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు ఎన్నో విడతలుగా గడువు పెంచుకుంటూ, ప్రచారం నిర్వహిస్తూ వచ్చిన విషయాన్ని నితిన్ గుప్తా వివరించారు. -
వ్యాపారం చేయాలనుకునేవారికి శుభవార్త.. ఇకపై అది ఒక్కటి చాలు!
న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం చర్యలు ప్రతిపాదించింది. వీటి ప్రకారం ఇకపై ప్రభుత్వ ఏజెన్సీల పరిధిలోని వివిధ డిజిటల్ వ్యవస్థలతో లావాదేవీల్లో వ్యాపార సంస్థలు తమ గుర్తింపు ధ్రువీకరణ కోసం పర్మనెంట్ అకౌంటు నంబరు (పాన్) కార్డు ఒక్కటే సమర్పించినా సరిపోనుంది. ప్రస్తుతం వ్యాపారాలకి అనుమతులు తీసుకునేందుకు జీఎస్టీఎన్, టిన్, ఈఎస్ఐసీ వంటి రకరకాల ఐడీలు అవసరమవుతున్నాయి. దేశీయంగా వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు ఇది తోడ్పడగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మరోవైపు, వాణిజ్య వివాదాల పరిష్కారం కోసం వివాద్ సే విశ్వాస్–2 (వీఎస్వీ–2) స్కీమును ప్రవేశపెడుతున్నట్లు ఆమె తెలిపారు. అసెస్మెంటుకు సంబంధించి పన్నులు, వడ్డీలు, జరిమానాలు వంటి అంశాల్లో వివాదాల పరిష్కారానికి ఇది ఉపయోగపడనుంది. పన్ను వివాదాల తగ్గింపుపై దృష్టి .. పన్నుపరమైన వివాదాలను తగ్గించేందుకు కూడా ఆర్థిక మంత్రి ప్రతిపాదనలు చేశారు. ఒకే తరహా లీగల్ వివాదాలపై అప్పీళ్లు చేసేందుకు బోలెడంత సమయం, వనరులు వృధా అవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిర్దిష్ట చట్టాన్ని సవాలు చేసే కేసు ఏదైనా న్యాయస్థానంలో పెండింగ్లో ఉంటే.. ఐటీ శాఖ మళ్లీ అదే తరహా కేసు మరొకటి దాఖలు చేయకుండా వాయిదా వేసేలా కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉండాలని ఆమె ప్రతిపాదించారు. రీక్లెయిమింగ్ సులభతరానికి ఐఈపీఎఫ్ షేర్లు, డివిడెండ్ల రీక్లెయిమింగ్ ప్రక్రియను సులభతరం చేసేందుకు సమీకృత ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్, ప్రొటెక్షన్ ఫండ్ (ఐఈపీఎఫ్)ను ఏర్పాటు చేయనున్నట్లు సీతారామన్ చెప్పారు. ఇక, ఫీల్డ్ ఆఫీసుల్లో దాఖలయ్యే వివిధ రకాల ఫారంలను కేంద్రీకృతంగా హ్యాండిల్ చేసేందుకు కంపెనీల చట్టం కింద సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తద్వారా కార్పొరేట్లకు మరింత వేగవంతంగా సమాచారం/స్పందన లభించగలదని ఆమె పేర్కొన్నారు. కేవైసీ.. ఈజీ.. కస్టమర్ల వివరాల సేకరణకు సంబంధించిన నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రక్రియను సరళతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా అందరికీ ఒకే తరహా ప్రక్రియ పాటించడం కాకుండా ’రిస్క్ ఆధారిత’ విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు, నియంత్రణ సంస్థలు, నియంత్రిత సంస్థల దగ్గర ఉండే వ్యక్తుల గుర్తింపు, చిరునామాలను ఒకే చోట అప్డేట్ చేసేలా నిర్దిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆమె ప్రతిపాదించారు. ఇందుకోసం డిజిలాకర్ సర్వీసును, ఆధార్ను ఉపయోగించనున్నారు. అలాగే, ఒకే సమాచారాన్ని వివిధ ప్రభుత్వ ఏజెన్సీలకు వేర్వేరుగా సమర్పించాల్సిన అగత్యం తప్పించేలా ఏకీకృత ఫైలింగ్ ప్రక్రియ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి ప్రతిపాదించారు. చదవండి: సరైన సమయం కాదు.. అందుకే రూ. 20,000 కోట్ల ఎఫ్పీవోను వెనక్కి ఇస్తున్నాం: అదానీ గ్రూప్ -
మీ పాన్ కార్డ్లో తప్పులు ఉన్నాయా? ఇలా ఈజీగా మార్చుకోవచ్చు!
ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరిగా వాడేవారు. భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిపే వ్యాపార వేత్తలు, కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు మాత్రమే పాన్ కార్డు వాడే వారు. కాల క్రమంలో ప్రతి ఒక్కరూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి రావడంతో పాన్ కార్డు తప్పనిసరి. ఇలా పాన్ కార్డు కీలక పాత్ర పోషిస్తోంది. ఒక్కోసారి ఇంటి పేరులోనూ, అసలు పేరులోనూ, లేదా అడ్రస్ ఇలాంటి వివరాల్లో తప్పులు దొర్లవచ్చు. కొన్ని సందర్భాల్లో పెళ్లైన యువతులకు వారి ఇంటి పేరు మారుతుంది. అలాంటి సమయంలో వారు తమ పాన్ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వారు ఇంటినుంచే తమ మొబైల్ ఫోన్లోనైనా, డెస్క్టాప్ కంప్యూటర్లలోనైనా ఆన్లైన్లో మార్చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఇలా మార్పులు చేర్పులు మీ మొబైల్ ఫోన్ లేదా డెస్క్ టాప్ కంప్యూటర్లో పాన్ అధికారిక అని టైప్ చేస్తే పాన్ కార్డుకు సంబంధించిన వెబ్సైట్ లోకి వెళ్లాలి. అక్కడ ఉన్న సర్వీస్ విభాగంలోకి వెళ్లి పాన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. కిందకు స్క్రోల్ చేస్తే Change / Correction in PAN Data సెక్షన్లోకి వెళ్లి ఆప్లై ఆప్షన్పై క్లిక్ చేయండి. అక్కడ మీ పాన్ నంబర్తోపాటు తదితర వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అనంతరం మీకు ఒక టోకెన్ నంబర్ వస్తుంది. ఆపై కింద బటన్ నొక్కి, తర్వాత ప్రక్రియలోకి వెళ్లాలి. ఇప్పుడు పాన్ కార్డ్ కరెక్షన్ పేజీ కనిపిస్తుంది. అక్కడ పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్, ఇంటి పేరు తదితర వివరాలన్నీ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ వివరాలు నమోదు చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. చెల్లింపు పూర్తి అయ్యాక పాన్ కార్డు అప్డేట్ చేసినట్లు స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ స్లిప్ ప్రింటవుట్ తీసుకుని, దానిపై రెండు ఫొటోలు అతికించి, సంబంధిత ఎన్ఎస్డీఎల్ కార్యాలయానికి పంపించేస్తే.. అక్కడి నుంచి అప్డేటెడ్ పాన్ కార్డు అందుకుంటారు. -
పాన్కార్డుపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం!
పాన్ కార్డ్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రజలు జరుపుతున్న కొన్ని ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ అవసరాన్ని పక్కన పెట్టనుంది. ఈ అంశమై రాబోయే బడ్జెట్ 2023 లో కొన్ని మార్పులు చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం, పాన్ కార్డ్ వివరాలు అందించని ఆర్థిక లావాదేవీలకు 20% టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. అన్నింటికి పాన్ అక్కర్లేదు.. త్వరలో నిర్ణయం! ప్రస్తుతం దాదాపు బ్యాంకు అకౌంట్లన్నీ ఆధార్తో లింక్ అయినవేనని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. కనుక ఈ నేపథ్యంలో పాన్ వివరాలు తప్పనిసరి అవసరం లేదని బ్యాంకులు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి సమాచారం అందిందని, వాటిని పరిశీలిస్తున్నామని, బడ్జెట్ సందర్భంగా ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. బ్యాంకుల నుంచి రుణాలకు సంబంధించి కూడా కొన్ని సమస్యలు తలెత్తుతున్నందున, ఆదాయపు పన్ను చట్టంలో సవరణలు చేయాలని కొందరు రుణదాతలు సూచించినట్లు అధికారి తెలిపారు. అయితే రాబోయే కేంద్ర బడ్జెట్ 2023-24లో, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధార్ మద్దతుతో ఆర్థిక లావాదేవీలకు అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు కేంద్రం అంగీకారం తెలిపితే కొన్ని లావాదేవీలకు పాన్ నెంబర్ అవసరం ఉండకపోవచ్చు. దీంతో పాన్ కార్డ్ లేనివారికి, కాస్త ఊరట లభించనుంది. అయితే దీనిపై పూర్తి సమాచారం, నియమ నిబంధనలు వంటివి వచ్చే బడ్జెట్లో తెలిసే అవకాశం ఉంది. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్! -
పాన్ కార్డ్ కోసం అప్లై చేస్తున్నారా.. అందుబాటులోకి కొత్త సేవలు వచ్చాయ్!
పాన్ కార్డు పొందాలని భావిస్తున్న వారికి గుడ్ న్యూస్. కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. గతంలో మాదిరిగా డాక్యుమెంట్లు సమర్పించి రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఈజీగా అప్లై చేసుకుని, అంతే ఈజీగా పొందవచ్చు. ఎలా అంటారా? కేవలం ఆధార్ కార్డు (Aadhaar Card) ఉంటే చాలు, కొన్ని గంటల వ్యవధిలోనే మీరు పాన్ కార్డు పొందచ్చు. ఫినో పేమెంట్స్.. కొత్త సేవలు ఫినో పేమెంట్స్ బ్యాంక్ కొత్త సేవలను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా వినియోగదారులు కొన్ని గంటల్లో ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ ద్వారా కొత్త పాన్ కార్డ్ల డిజిటల్ వెర్షన్లను పొందవచ్చు. ఇందుకోసం ఫినో పేమెంట్స్ బ్యాంక్ ప్రోటీన్ ఇగౌవ్ టెక్నాలజీస్ (ఎన్ఎస్డీఎల్ ఇగవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు పాన్ కార్డ్ జారీ సేవలను విస్తరించనున్నాయి. ఈ భాగస్వామ్య ఫలితంగా పేపర్లెస్ పాన్ కార్డ్ జారీ చేసే సేవలను ప్రారంభించిన మొదటి పేమెంట్స్ బ్యాంక్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ నిలిచింది. ఫినో పేమెంట్స్ బ్యాంక్కు దేశవ్యాప్తంగా 12.2 లక్షలకు పైగా మర్చంట్ పాయింట్లు ఉన్నాయి. ఇక ఈ పాయింట్లు అన్నింటిలో పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. వినియోగదారులు ఎటువంటి పత్రాలను సమర్పించకుండా లేదా అప్లోడ్ చేయకుండా ఆధార్ ఆధారిత ధృవీకరణను ఉపయోగించి పాన్ కార్డ్ పొందవచ్చు. ఇందుకోసం ఫినో బ్యాంక్ పాయింట్లలో పాన్ కార్డ్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాన్ కార్డు సేవను ఎంచుకున్న వారికి కొన్ని గంటల వ్యవధిలో ఇపాన్ కార్డు మెయిల్ వస్తుంది. అదే ఫిజికల్ పాన్ కార్డు ఎంచుకుంటే 4 నుంచి 5 రోజుల్లో ఇంటికి వచ్చేస్తుంది. ఈ-పాన్ చట్టబద్ధమైన పాన్ కార్డ్గా అంగీకరించబడుతుంది. చదవండి: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.7వేలకే అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్టీవీ! -
ఆధార్ కార్డు హోల్డర్లకు హెచ్చరిక.. ఇలా చేయకపోతే ఇబ్బందులు తప్పవ్!
ఇటీవల ఆధార్ కార్డ్ అనేది చాలా ముఖ్యంగా మారిపోయింది. ప్రస్తుతం ప్రతి దానిలో ఆధార్ అనుసంధానం చేయాల్సి వస్తోంది. ఇప్పటి వరకు చాలా వాటిలో ఈ అనుసంధాన ప్రక్రియ పూర్తవగా, పాన్ కార్డులో ఇది ఇంకా కొనసాగుతోంది. అందుకే ఆధార్ కార్డుతో పాన్ అనుసంధానం చేసుకోవడానికి ఆదాయాపన్ను శాఖ చివరి అవకాశాన్ని కల్పించింది. వచ్చే ఏడాది మార్చి 31వ ( March 2023) లోపు లింక్ చేసుకోవాలిని సూచిస్తోంది. వాస్తవానికి ఈ అనుసంధానం కోసం ఇప్పటికే పలుమార్లు గడువు ఇచ్చింది ఐటీ శాఖ. ఈ క్రమంలో మరో మారు గడువు పెంచే యోచనలో ప్రభుత్వం లేనట్లు తెలుస్తోంది. గడువు వచ్చే ఏడాది మార్చి వరకు ఇచ్చినా, ఇక్కడ ఇంకో నిబంధన కూడా తెలిపింది. ఈ ఏడాది జూన్ వరకు పాన్ కార్డుతో ఆధార్తో లింకు చేసుకోవడానికి ఉచితంగా అవకాశం కల్పించింది. జూన్ తర్వాత గడువు లోపు లింకు చేస్తున్న వారు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. గతంలోనే జూన్ 30 వరకు ఉన్న పాన్-ఆధార్ లింక్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. తాజా పరిస్థితులు గమనిస్తే.. మరోమారు ఈ ప్రక్రియకు పొడగించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ గడువు తేదిలోపు లింక్ చేసుకోవడం ఉత్తమం. మీ పాన్ను ఆధార్తో లింక్ చేయకపోతే బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో అసౌకర్యానికి గురి అయ్యే అవకాశం అవకాశం ఉంటుంది. ఇంకా పెన్షన్, స్కాలర్షిప్, ఎల్పీజి సబ్సిడీ వంటి పథకాలకు ద్రవ్య ప్రయోజనాలను పొందేటప్పుడు పాన్ తప్పనిసరి. చదవండి: ఆన్లైన్ షాపింగ్ మోసాలు: రూల్స్ ఏం చెప్తున్నాయి, ఎలా కంప్లైంట్ చేయాలి! -
ఇలాంటి పాన్ కార్డు మీకుంటే.. రూ.10,000 పెనాల్టీ!
ఇదే ప్రశ్నని పూర్తిగా అడుగుతున్నాం. మీకు రెండు పర్మనెంట్ అకౌంట్ నంబర్లు ఉన్నాయా? అదేనండి.. రెండు పాన్లు ఉన్నాయా? ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక అస్సెసీకి రెండు నంబర్లు ఉండకూడదు. అలాగే ఇద్దరు వ్యక్తులకు ఒక పాన్ ఉండకూడదు. ఈ రెండు పరిస్థితులూ చట్టరీత్యా నేరమే. ఒక అస్సెసీకి ఒకే నంబరు ఉండాలి. ఈ నంబర్ శాశ్వతం. ప్రత్యేకం. మీ సొంతం. ఊరు మారినా .. ఉనికి మారినా.. నంబరు మారదు. దేశంలో ఏ మూలనున్నా ఈ నంబర్ మీదే. మీకే సొంతం. మీరే వాడుకోవాలి. నంబరు కోసం దరఖాస్తు చేసి, వేచి చూసి, విసిగి మరో దరఖాస్తు ఇచ్చిన వారికి రెండు నంబర్లు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు.. స్త్రీలు పెళ్లి కాక ముందు ఒక నంబరు, పెళ్లి అయ్యాక ఒక నంబరు పొంది ఉండవచ్చు. డిపార్ట్మెంట్ వారు సరిగ్గా కనుక్కోకపోవడం వల్ల పొరపాటున ఒకే అస్సెసీకి రెండు రెండు వేరు నంబర్లు, లేదా కార్డులు జారీ చేసి ఉండవచ్చు. కనుక ఇలాంటి పాన్ కార్డులు ఉంటే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. పెనాల్టీ కట్టాల్సిందే.. ఒక అస్సెసీకి రెండు వేరు వేరు నంబర్లు ఉంటే సెక్షన్ 272బీ ప్రకారం పెనాల్టీ వేస్తారు. పెనాల్టీ మొత్తం రూ. 10,000. సరెండర్ చేయండి.. మీకు రెండు నంబర్లు ఉంటే ఒక దానిని సరెండర్ చేయండి. అసలు ఒకదానిని ఎటువంటి సందర్భంలోనూ వాడకండి. పక్కన పెట్టండి. ఎక్కడా ఆ నంబరును ప్రస్తావించకండి. తెలియజేయకండి. డిక్లేర్ చేయకండి. ఇలా చేయడం వల్ల మీరు మీ పాన్ని దుర్వినియోగం చేసినట్లు కాదు. అంతటితో ఆగిపోకుండా వెంటనే ఆ నంబరును సరెండర్ చేయండి. ఎలా సరెండర్ చేయాలి.. సరెండర్ అంటే కార్డుని ఫిజికల్గా డిపార్ట్మెంటు వారికి పంపనవసరం లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు. ఆఫ్లైన్లోనూ చేయవచ్చు. వెబ్సైట్లో లాగిన్ అయితే ఒక ఫారం కనిపిస్తుంది. ఏవైనా మార్పులు చేయడానికి ఇది అవసరం. దీన్ని డౌన్లోడ్ చేయండి. కొత్త పాన్ కోసం, మార్పుల కోసం దీన్ని వాడవచ్చు. కారణం అడగరు. వివరణ అక్కర్లేదు. విశ్లేషణ ఇవ్వనక్కర్లేదు. దరఖాస్తు చాలు. వెంటనే సరెండర్ చేయండి. పెనాల్టీ వేసే ముందు.. నంబరు ఉండటం కన్నా నంబరును దుర్వినియోగం చేయడం వల్ల పెనాల్టీ పడుతుంది. రెండు నంబర్లు, రెండు అసెస్మెంట్లు అనేవి పన్ను ఎగవేతకు దారి తీస్తాయి. ఎగవేతకు ఇదే నాంది కాగలదు. కాబట్టి, అలా చేయకండి. వాడిన సందర్భంలో ఎగవేత లేదని రుజువు చేయలేకపోతే పెనాల్టీ పడుతుంది. బండి అంతదాకా పోనివ్వకండి. చదవండి: Amazon: అమెజాన్ చరిత్రలో తొలిసారి..లక్షమంది ఉద్యోగులపై వేటు! -
పరేషాన్ వద్దు.. లోన్ మోసాలను గుర్తించండి ఇలా!
ఆన్లైన్లో నగదు లావాదేవీలు ఇటీవల కాలంలో అనూహ్యంగా పెరిగాయి. నగదు లావాదేవీలకు సంబంధించిన యాప్లు విరివిగా అందుబాటులోకి రావడంతో స్మార్ట్ఫోన్లతోనే ఆర్థిక కార్యకలాపాలు సులువుగా చక్కబెట్టుస్తున్నారు. ఇదే సమయంలో ఆన్లైన్ మోసాలు కూడా పెరిగాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మోసగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావు పాన్కార్డును దుర్వినియోగం చేసి రుణ మోసాలకు పాల్పడ్డారు దుండగులు. గతంలో సన్నీలియోన్ కూడా ఇదే తరహాలో మోసగాళ్ల బారిన పడ్డారు. దీంతో వారిద్దరి సిబిల్ స్కోర్ తగ్గిపోయింది. సిబిల్ స్కోర్ అంటే..? బ్యాంకులు వ్యక్తిగత రుణాలు మంజూరు చేయడానికి సిబిల్ ఇచ్చే స్కోర్(క్రెడిట్ స్కోర్)ను ప్రామాణికంగా తీసుకుంటాయి. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ ఇచ్చే మూడంకెల సంఖ్యనే సిబిల్ స్కోర్గా పరిగణిస్తారు. ఈ సంఖ్య 300 నుంచి 900 వరకు ఉంటుంది. వ్యక్తిగత రుణ చరిత్ర ఆధారంగా ఈ స్కోర్ ఉంటుంది. 900 పాయింట్ల దగ్గరగా మీ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకి ఎక్కువ రుణం లభించే అవకాశాలు ఉంటాయి. ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్ లేదా సీఆర్ఐఎఫ్ వంటి క్రెడిట్ బ్యూరోలు కూడా స్కోర్ అందిస్తుంటాయి. జాగ్రత్తలు పాటించాలి రుణ మోసాల నుంచి తప్పించుకోవాలంటే వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. క్రెడిట్ స్కోర్ను రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. కనీసం నెలకు ఒకసారైనా క్రెడిట్ స్కోరు చూసుకోవడం మంచిది. సిబిల్ వెబ్సైట్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా క్రెడిట్ స్కోరు చూసుకోవచ్చు. మీ పేరు మీద ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎంత మొత్తంలో రుణం తీసుకున్నారనే వివరాలు ఇందులో వెల్లడవుతాయి. (క్లిక్: మీ పాన్ కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నారో తెలుసుకోండి ఇలా..!) ఇలా చేయొద్దు! ► ఐడీ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. ► ఆధార్, పాన్కార్డ్ నంబర్లను మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ చేయొద్దు. ► స్కాన్ చేసిన ఆధార్, పాన్కార్డ్ కాపీలను మీ ఈ-మెయిల్లో పెట్టుకోవద్దు. ► ఈ-మెయిల్లో మీ పాన్కార్డ్ను షేర్ చేయాల్సివస్తే incognito మోడ్లో బ్రౌజర్ను వాడాలి. ► గుర్తింపు పత్రాల ఫొటో కాపీలను అటెస్ట్ చేసి మాత్రమే వాడాలి. ► ప్లబిక్ వై-ఫై వినియోగించి ఆన్లైన్ ట్రాన్టాక్షన్స్ చేయొద్దు. ► పాన్కార్డ్ ఇమేజ్ మీ ఫోన్లో సేవ్ చేసివుంటే.. లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఫొటోగ్యాలరీ యాక్సెస్ ఇవ్వొద్దు. వెంటనే స్పందించండి మీకు తెలియకుండా మీ పేరు ఎవరైనా రుణాలు తీసుకున్నట్టు గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. క్రెడిట్ బ్యూరో వైబ్సైట్ ద్వారా మీ ఫిర్యాదును ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లాలి. ఆన్లైన్లో cms.rbi.org.inకు ఫిర్యాదు చేయవచ్చు. crpc@rbi..org.inకు ఈ-మెయిల్ పంపవచ్చు. (క్లిక్: మీ సిబిల్ స్కోర్ పెరగాలంటే..) -
ఆధార్లో ‘కేరాఫ్’తో కొత్త చిక్కులు!
సాక్షి, హైదరాబాద్: విశిష్ట గుర్తింపు కార్డు (ఆధార్)లో చిన్న మార్పు కొత్త చిక్కులు తెచ్చింది. చిరునామాలో ‘కేరాఫ్’ను చేర్చడం వివాహితులైన మహిళలకు తలనొప్పిగా మారింది. ఈ సవరణ ఆదాయపన్నుకు సంబంధించిన శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కార్డు జారీలో తప్పిదాలకు దారితీస్తోంది. కొత్తగా పాన్కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే బంధుత్వాలు మారిపోతున్నాయి. తండ్రి స్థానంలో భర్త పేరుతో కార్డులు జారీ కావడం ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో పాన్ కార్డులో సవరణల కోసం మరోమారు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడుతోంది. కొత్త పాన్కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు అవగాహన లేక కొందరు ఏజెంట్లను ఆశ్రయిస్తుండటతో ఈ గందరగోళం ఏర్పడుతోంది. నిబంధనల ప్రకారం కొత్త పాన్కార్డు కోసం దరఖాస్తుపై రెండు సంతకాలు, పాస్పోర్టు సైజు ఫొటోతో పాటు పుట్టిన తేదీ నిర్ధారణ, చిరునామా ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు జిరాక్స్ సమర్పిస్తే సరిపోతుంది. అయితే వివాహితులైన మహిళలకు ఆధార్ చిరునామాలోని ‘కేరాఫ్’అంశం ఇబ్బందిగా మారింది. పాన్కార్డు దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో సంబంధిత ఆపరేటర్లు చాలావరకు దరఖాస్తులోని వివరాలు సరిగా చూడటం లేదు. పాన్కార్డు దరఖాస్తులో తండ్రి పేరు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఆధార్ కార్డు జిరాక్స్ ఆధారంగా నమోదు చేస్తుండటంతో.. కార్డులో తండ్రి పేరు స్థానంలో ఆధార్లో కేరాఫ్గా ఉండే భర్త పేరు వస్తోంది. సన్నాఫ్, డాటరాఫ్ స్థానంలో కేరాఫ్ పౌరుడి వ్యక్తిగత గోప్యతకు ఏ విధంగానూ భంగం కలగకూడదని గతంలో సుప్రీంకోర్టు చేసిన సూచనల మేరకు ఆధార్ కార్డులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగా ఆరు నెలల క్రితం ఆధార్ కార్డులో బంధుత్వాన్ని సూచించే సన్నాఫ్, డాటరాఫ్, వైఫ్ ఆఫ్ వంటి పదాలను తొలగించి కేవలం కేరాఫ్ మాత్రమే ఉండే విధంగా మార్పులు చేశారు. ఈ కేరాఫ్ వివాహిత మహిళలకు పాన్ కార్డు జారీలో పొరపాటుకు కారణమవుతోంది. ఆధార్ కార్డులో ఇంటి పేరు సాధారణంగా మొదట్లో ఉంటుండగా, పాన్ కార్డులో మాత్రం చివర్లో వస్తుండటంతో బ్యాంక్ ఖాతాల అనుసంధానానికి సమస్యగా మారుతోంది. -
పాన్–ఆధార్ లింక్ చేయకపోతే పెనాల్టీ
న్యూఢిల్లీ: ఆధార్తో పాన్ అనుసంధానానికి ఇచ్చిన గడువు గురువారం (మార్చి 31)తో ముగియనుంది. గడువులోపు అనుసంధానించుకోని వారు (లింకింగ్) ఆ తర్వాత రూ.500 నుంచి రూ.1,000 వరకు జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుందని ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. గడువులోపు ఆధార్తో పాన్ లింకింగ్ చేసుకోని వారికి కాస్త ఉపశమనం కల్పించింది. 2023 మార్చి 31 వరకు పాన్ పనిచేస్తుందని ప్రకటించింది. అప్పటికీ అనుసంధానం చేసుకోకపోతే పాన్ పనిచేయకుండా (ఇన్ ఆపరేటివ్) పోతుంది. ‘‘2022 జూన్ 30 వరకు పాన్–ఆధార్ లింకింగ్ చేసుకుంటే రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అనుసంధానించుకుంటే రూ.1,000 జరిమానా ఉంటుంది’’అని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్నర్ అమిత్ మహేశ్వరి స్పందిస్తూ.. ‘‘ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో విడతలుగా పాన్–ఆధార్ లింకింగ్ గడువును పొడిగిస్తూ వచ్చింది. చివరికి ఆలస్యపు రుసుములతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అనుసంధానించుకోడంలో విఫలమైతే పాన్ పనిచేయదు. దీంతో పన్ను రిటర్నులకు సంబంధించి పాన్ అందుబాటులో ఉండదు. కనుక పన్ను చెల్లింపుదారులు అందరూ ఒక్కసారి తమ పాన్, ఆధార్తో అనుసంధానమైందీ, లేనిదీ ఆదాయపన్ను శాఖ పోర్టల్కు వెళ్లి పరిశీలించుకోవాలి’’ అని పేర్కొన్నారు. అన్నింటికీ పాన్ అవసరమే.. ఆదాయపన్ను రిటర్నులు దాఖలుతోపాటు ఇతర ఐటీ వ్యవహారాలకు (రిఫండ్లు తదితర) ఇక మీదట పాన్ ను ఆధార్తో అనుసంధానించుకోవడం తప్పనిసరి అని నాంజియా ఆండర్సన్ ఎల్ఎల్పీ పార్ట్నర్ నీరజ్ అగర్వాల్ తెలిపారు. బ్యాంకు ఖాతా తెరిచేందుకు, స్థిరాస్తి కొనుగోళ్లకు పాన్ తప్పనిసరి. దీంతో పాన్ పనిచేయకపోతే పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘‘ఒక్కసారి పాన్ పనిచేయకుండా పోతే, ఆర్థిక లావాదేవీలు (ఫండ్స్, స్టాక్స్, బాండ్లలో పెట్టుబడులు) నిర్వహించడానికి అవకాశం ఉండదు. సెక్షన్ 171బీ కింద జరిమానాతోపాటు, అధిక టీడీఎస్ ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని అగర్వాల్ వివరించారు. గడువులోపు ఏౖదైనా సమస్య వల్ల అనుసంధానం చేసుకోని వారు ఆలస్యపు రుసుము చెల్లించి అయినా 2023 మార్చి 31లోపు లింక్ చేసుకోవడం తప్పనిసరి. లేదంటే పాన్ పనిచేయకుండా పోతుందని గుర్తుంచుకోవాలి. 2022 జనవరి 24 నాటికి 43.34 కోట్ల పాన్లు ఆధార్తో లింక్ అయ్యాయి. ఇప్పటి వరకు 131 కోట్ల ఆధార్లు జారీ అయ్యాయి. -
పాన్ - ఆధార్ లింక్ గడువు పొడిగించమని సెబీని కోరిన ఏఎన్ఎంఐ
ఇన్వెస్టర్లు తమ పాన్ను ఆధార్తో లింక్ చేసుకోవడానికి మరింత సమయం ఇవ్వాలని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)ని అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్స్ఛేంజ్ మెంబర్స్ ఆఫ్ ఇండియా (ఏఎన్ఎంఐ) కోరింది. చాలా మంది పెట్టుబడిదారులు తమ పాన్ను ఆధార్తో ఇంకా లింక్ చేయకపోవడం వల్ల చాలా మంది పెట్టుబడిదారులు మార్కెట్లలో ట్రేడ్ చేయలేరని ఎఎన్ఎంఐ హైలైట్ చేసింది. "పాన్ను ఆధార్తో లింక్ చేయకపోవడం వల్ల కొత్త & పాత ఇన్వెస్టర్లు ట్రేడ్ చేయలేకపోవడంతో పాటు వారి డీమ్యాట్ ఖాతాలను కూడా సస్పెండ్ చేయాల్సి ఉంటుంది" అని సెబీకి రాసిన లేఖలో ఏఎన్ఎంఐ పేర్కొంది. పాన్ను ఆధార్తో అనుసంధానం చేసుకునేందుకు తుది గడువు మార్చి 31. మార్చి 31 లోపు కూడా అనుసంధానం చేసుకోకపోతే పాన్ కార్డు చెల్లదు. రూ.10వేల వరకు జరిమానా కట్టి మళ్లీ పాన్ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పాన్ - ఆధార్ లింక్ తుది గడువును ప్రభుత్వం చాలాసార్లు పొడిగించింది. ప్రస్తుతానికి ఈ ఏడాది మార్చి 31 ఆఖరు తేదీగా ఉంది. ప్రభుత్వం మరోసారి తుదిగడువు పొడిగిస్తుందో లేదో స్పష్టత లేదు. అందుకే ఇంతవరకు పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేసుకోని వారు.. ఎంత వీలైతే అంత త్వరగా చేసుకుంటే మంచిది. పెద్ద సంఖ్యలో ఖాతాదారులు తమ పాన్ను ఆధార్తో లింక్ చేయలేకపోవడంతో క్లయింట్ ఖాతాలను నిలిపివేయడం వల్ల మార్కెట్ మీద భారీ ప్రభావం ఉంటుందని ఏఎన్ఎంఐ తెలిపింది. అందువల్ల, ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఏఎన్ఎంఐ సెబీని కోరింది. ఒకవేళ గడువును పొడిగించలేకపోతే పాన్ను ఆధార్తో లింక్ చేయకపోవడం వల్ల కలిగే చిక్కులకు పరిష్కార మార్గాన్ని ఆలోచించాలని, తద్వారా ఖాతాల సస్పెన్షన్ను 6 నెలల పాటు వాయిదా వేయాలని సెబీని ఏఎన్ఎంఐ కోరింది. (చదవండి: మీ పాన్ కార్డ్ పోయిందా..! వెంటనే ఇలా చేయండి..!) -
గడువులోగా పాన్-ఆధార్ లింక్ చేయకపోతే.. భారీ జరిమానా కట్టాల్సిందే!
మీకు పాన్ కార్డు ఉందా? అయితే, మీకు ఒక ముఖ్య గమనిక. కేంద్రం ప్రభుత్వం గత ఏడాదికి సంబంధించి ఒక కొత్త నిబంధనను అమలులోకి తీసుకొని వచ్చింది. ఈ కొత్త నిబంధన ప్రకారం.. కేంద్ర పేర్కొన్న గడువు తేదీలోగా మీ పాన్ కార్డ్ నంబర్ను ఆధార్ నంబర్తో లింకు చేయాల్సి ఉంటుంది. అయితే, గత ఏడాది ఆర్థిక శాఖకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) పాన్-ఆధార్ లింక్ గడువు తేదీని 2022 మార్చి 31 వరకు పొడగించినట్లు పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువు తేదీని పొడగించినట్లు అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేశారు. రూ. 10వేల జరిమానా..! పాన్ కార్డ్ హోల్డర్లు మార్చి 31 లోపు ఆధార్ కార్డ్ నంబర్తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన గడువులోగా లింక్ చేయడంలో విఫలమైతే ఆయా పాన్ కార్డ్ హోల్డర్ల పాన్ కార్డ్ చెల్లుబాటు కాదు. ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 272ఎన్ ప్రకారం.. సదరు వ్యక్తిపై 10 వేల జరిమానాను అసెస్సింగ్ అధికారి విధిస్తారు. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్లు, బ్యాంక్ ఖాతా తెరవడం మొదలైన వాటిలో తప్పనిసరిగా పాన్ కార్డ్ను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇలా లింక్ చేయండి ముందుగా ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ https://www.incometax.gov.in/ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలోనే Link Aadhaar లింక్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాన్ నెంబర్, రెండో కాలమ్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఆధార్ కార్డులో ఉన్నట్టుగా మీ పేరు నమోదు చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ ఆధార్ కార్డుపై పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే I have only year of birth in Aadhaar card సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత I agree to validate my Aadhaar details సెలెక్ట్ చేసుకొని Link Aadhaar క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి Validate పైన క్లిక్ చేయాలి. మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది. ఒకవేళ మీ పాన్, ఆధార్ నెంబర్ ముందే లింక్ అయితే Your PAN is already linked to given Aadhaar అనే మెసేజ్ కనిపిస్తుంది. (చదవండి: ఫోక్స్వ్యాగన్కి సవాల్ విసిరిన ఎలన్మస్క్) -
మార్చి 31లోగా ఈ పనులు పూర్తి చేయండి… లేకపోతే మీకే నష్టం..!
ప్రతి ఏడాదిలో కొత్త నెల వచ్చింది అంటే చాలు దేశంలో కొత్త నిబనంధనలు అమలులోకి వస్తాయి. రాబోయే ఏప్రిల్ నెల నుంచి కూడా అనేక కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా, మార్చి 31కి ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి అవుతుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభకానుంది. పాత నిబంధనలు స్థానంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేస్తాయి. అందుకే, ప్రతిఒక్కరూ తమ ఆర్థిక ప్రణాళిక విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం కూడా ఇదే. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సమయంలో కొన్ని ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన ముఖ్యమైన పనులను తప్పక పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పన్ను మినహాయింపుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు వర్తించే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, జాతీయ పింఛన్, జాతీయ ఫించను స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన, ఈఎల్ఎస్ఎస్ ఇలా అనేక స్కీమ్లలో మదుపు చేసేందుకు అవకాశం ఉంది. ఇంకా సెక్షన్ 80సీ పరిమితి రూ.1,50,000 పూర్తి కాకపోతే.. అనుకూలమైన పెట్టుబడి స్కీమ్ను ఎంచుకోవచ్చు. ఇప్పటికే తీసుకున్న పీపీఎఫ్, ఎన్పీఎస్, ఎస్ఎస్వై స్కీమ్లలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఒకసారైనా మదుపు చేయకపోతే మార్చి 31లోపు తప్పనిసరిగా కనీస మొత్తం అయినా పెట్టుబడి పెడితే మంచిది. ఆధార్-పాన్ లింక్ మీరు ఇంకా మీ పాన్ నెంబర్ను మీ ఆధార్ నెంబర్తో లింకు చేయకపోతే మీరు మార్చి 31, 2022 వరకు చేసుకోవచ్చు. ఈ తేదీలోగా లింక్ చేయకపోతే, మీ పాన్ నెంబర్ ఇన్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. మీరు రూ.1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీ పాన్ నెంబర్ పనిచేయకపోతే షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర సెక్యూరిటీలు వంటి ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడి పెట్టడానికి మీకు అవకాశం ఉండదు. అలాగే, మీకు ఎటువంటి రుణాలు కూడా రాకపోవచ్చు. ఐటీఆర్ ఫైలింగ్ ఐటీఆర్ ఫైలింగ్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీరు ఇంకా ఐటీ రిటర్న్ ఫైల్ చేయకపోతే మీకు మరో మంచి అవకాశం ఉంది. లేట్ రిటర్న్ దాఖలు చేయడానికి మీకు మార్చి 31, 2022 వరకు సమయం ఉంది. ఫైల్ చేయకపోతే తర్వాత లావాదేవీల విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొవచ్చు. 1961లోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం.. ఐటీ రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేయరాదు. అలా చేస్తే.. రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కేవైసీ అప్డేట్ మీ బ్యాంకులో మీ అకౌంట్కు కేవైసీ పూర్తి చేసుకోండి. పాన్, ఆధార్, చిరునామా ధృవీకరణతో పాటు బ్యాంకు అడిగిన ఇతర వివరాలను మార్చి 31లోపు పూర్తి చేసుకోండి. (చదవండి: ఇక తగ్గేదే లే.. ఈవీ రంగంలో సుజుకి మోటార్ భారీ పెట్టుబడులు!) -
గుర్తింపు కార్డుల్లో అమ్మ పేరు కోసం...
‘అమ్మ పేరు’ కోసం ఓ కొడుకు చేసిన పోరాటం వ్యవస్థలోని లొసుగులను బయటపెట్టింది. చట్టబద్దమైన గుర్తింపు పత్రాల్లో అమ్మ పేరు చేర్చడానికి ఏడేళ్లుగా అతడు అలుపెరగని ఫైట్ చేశాడు. ఎట్టకేలకు విజయం సాధించి ‘అమ్మ పేరు’ను సార్థకం చేశాడు. అతడి పేరు సువామ్ సిన్హా. ఆస్ట్రేలియాలోని అడిలైడ్లో లింగ్విస్టిక్ చదువుకుంటూ పనిచేస్తున్న 23 ఏళ్ల సువామ్ పోరాట పటిమను ‘హిందూ’ వెలుగులోకి తెచ్చింది. సుదీర్ఘ పోరాటం సువామ్ సిన్హా తల్లిదండ్రులు అతడి రెండేళ్ల వయసులో విడిపోయారు. అతని తండ్రి నేపాల్కు చెందినవాడు, తల్లి బీహార్లోని భాగల్పూర్ ప్రాంతవాసి. కోల్కతాలో హైస్కూల్ పూర్తి చేసిన తర్వాత, సువామ్ తన తండ్రి పేరు లేకుండా స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (SLC) కోసం తన స్కూల్ ప్రిన్సిపాల్ని సంప్రదించినప్పుడు.. బహుశా అతడు అనుకుని ఉండడు ఈ పోరాటం చాలా కాలం సాగుతుందని. అతడు ఊహించనట్టుగానే జరిగింది. భారత పౌరుడిగా తనకు అర్హత ఉన్న తన ప్రాథమిక గుర్తింపు కార్డులన్నింటిలో చట్టబద్ధమైన సంరక్షురాలిగా తన తల్లి పేరును చేర్చేందుకు అతడు సుదీర్ఘ పోరాటం చేశాడు. చాలా చర్చల తర్వాత సువామ్.. తన తల్లి మొదటి పేరుతో తొలిసారిగా స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ పొందాడు. అయితే, 2015 -2017 మధ్య కాలంలో ఆధార్ కార్డ్.. పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసినప్పుడు అడ్డంకులు తలెత్తాయి. ఫిబ్రవరి 11న పాన్కార్డు అందుకోవడంతో అతడి పోరాటం ముగిసింది. పాన్కార్డులో తన తల్లి పేరు చూసి ఆనందంతో అల్లంత దూరన ఉన్న అమ్మతో సంతోషాన్ని పంచుకున్నాడు. సిన్హా తల్లి నేపాల్లోని ఖాట్మండులోని ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో కంట్రీ మేనేజర్గా పనిచేస్తున్నారు. తాను కోరుకున్న విధంగా తన తండ్రి పేరు లేకుండా అన్ని గుర్తింపు కార్డులు పొందడానికి ఎన్ని అవమానాలు ఎదురైనా అతడు వెనుకడుగు వేయలేదు. తండ్రి పేరే కొలమానమా? ‘తండ్రి పేరు మాత్రమే గుర్తింపు కొలమానంగా ఎందుకు ఉండాలి. మా నాన్న నా జీవితంలో ఎప్పుడూ లేడు, అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని చెప్పే సువామ్ సిన్హా... తన గుర్తింపు పత్రాలన్నిటిలోనూ తల్లి పేరే ఉండాలని కోరుకున్నాడు. తల్లితో కలిసి దరఖాస్తులు పట్టుకుని ఆయా కార్యాలయాలకు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాలు తట్టుకుని ముందుకు సాగాడు. అప్పటి కేంద్ర మంత్రుల సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ నుంచి ఎంతో మంది ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా వినతులు పంపాడు. సింగిల్ పేరెంట్స్ అభ్యర్థనల మేరకు పాస్పోర్ట్ నియమాలను 2016 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం సవరించింది. పాస్పోర్ట్ దరఖాస్తులో చట్టపరమైన సంరక్షకులుగా తండ్రి లేదా తల్లి పేరు చేర్చేలా నిబంధనలను సవరించారు. అలాగే పాన్కార్డు నిబంధనలను కూడా ఆదాయపు పన్ను శాఖ 2018లో మార్చింది. అయితే ఆన్లైన్లో దీన్ని అప్డేట్ చేయలేదు. సువామ్ సిన్హా ఇ-దరఖాస్తు చేసిన ప్రతిసారి తండ్రి పేరు అడుగుతూనేవుంది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) జోక్యంతో అతడు చివరికి దరఖాస్తు చేయగలిగాడు. పాన్కార్డుతో సహా అన్ని గుర్తింపుకార్డుల్లో తనకు చట్టబద్ద సంరక్షకురాలిగా తల్లి పేరును లిఖించి అమ్మకు ఎనలేని ఆనందాన్ని కలిగించిన సువామ్ సిన్హాను నెటిజన్లు మనసారా మెచ్చుకుంటున్నారు. -
మార్చి నెల ముగిసేలోపు ఈ పనులు వెంటనే చేసేయండి.. లేకపోతే మీకే నష్టం!
ప్రతి ఏడాది కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి చాలా కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. అందులో భాగంగానే మార్చి చివరిలో, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో చాలా పాత నిబంధనలు మారుతాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఆర్థిక ప్రణాళిక కూడా తప్పనిసరి. ఏడాది పూర్తవుతున్నా కొన్ని పనులు పూర్తిచేయకపోతే మనం నష్టపోవాల్సి వస్తోంది. మార్చి 31లోపు పూర్తి చేయవలసిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆదాయపు పన్ను రిటర్న్ ఎవై 2021-22 కోసం ఆదాయపు పన్ను రిటర్న్ను దాఖలు చేయడానికి గడువు తేదీని మార్చి 31, 2022 వరకు పొడిగించబడింది. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం.. ఐటీ రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేస్తే జరిమానా రూ.10,000 వరకు విధించే అవకాశం ఉంది. జరిమానా నుంచి తప్పించుకోవడానికి మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ను చివరి తేదీకి ముందే ఫైల్ చేయండి. పాన్ నెంబర్తో - ఆధార్ లింకు ఆధార్ లింకింగ్ గడువు తేదీ మార్చి 31, 2022 వరకు ఉంది. ప్రభుత్వం సెప్టెంబర్ 30, 2021న గడువును పొడిగించిన తర్వాత మీ పాన్ నెంబర్ను- ఆధార్ నెంబర్తో చట్టాల ప్రకారం లింకు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గడువు తేదీలోగా రెండు డాక్యుమెంట్ లింక్ చేయడంలో విఫలమైనట్లయితే మీపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 272బి కింద మీరు రూ.10,000 జరిమానా విధించవచ్చు. కేవైసీ అప్డేట్ బ్యాంక్ ఖాతాలలో కేవైసీని పూర్తి చేయడానికి గడువు మార్చి 31 వరకు ఉంది. పాన్ చిరునామా రుజువు, బ్యాంక్ సూచించిన ఇతర సమాచారంతో సహా కేవైసీ అప్డేట్'లో భాగంగా సమర్పించాలి. పన్ను ఆదా ఈ సంవత్సరానికి మీ ఆదాయాన్ని అంచనా వేయడానికి, సెక్షన్ 80C కింద పన్ను ఆదా కోసం మీరు ఎంత పెట్టుబడి పెట్టవలసి ఉంటుందో తెలుసుకోవడానికి ఇది సరైన సమయం. మీరు ఇప్పటికే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన మొదలైన పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి పెట్టినట్లయితే, ఈ ఖాతాలను యాక్టివ్గా ఉంచడానికి మీరు మార్చి 31లోపు కనీస సహకారం అందించాలి. కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే ఖాతా క్లోజ్ చేసే అవకాశం ఉంది. (చదవండి: హైదరాబాద్లో డేటాసెంటర్.. ప్రపంచంలోనే అతి పెద్దదిగా) -
మీ పాన్ కార్డుతో ఎవరైనా లోన్ తీసుకున్నారో తెలుసుకోండి ఇలా..!
గతంలో వ్యక్తిగత రుణాలు మంజూరు కావాలంటే, చాలా పెద్ద విధానం ఉండేది. కానీ, ఇప్పుడు ఈ స్మార్ట్ యుగంలో అలా కాదు. చిటికిలో రుణాలు మంజూరు అవుతున్నాయి. ప్రస్తుతం అనేక ఫిన్టెక్ సంస్థలు తమ మొబైల్ యాప్ ద్వారా క్షణాలలో రుణాలను మంజూరు చేస్తున్నాయి. అయితే, ఈ రుణాల మంజూరు కోసం కేవల ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే సరిపోతుంది. అయితే, ఇక్కడే అసలు సమస్య ఉత్పన్నం అవుతుంది. భౌతిక తనిఖీ లేకుండా కేవలం ఆధార్ కార్డు, పాన్ కార్డు వివరాలతో రుణం మంజూరు కావడంతో కేటుగాళ్లు ఈ అవకాశాన్ని వినియోగించుకొని రుణాలు తీసుకుంటారు. ఈ రుణం తీసుకొని చెల్లించకపోవడంతో నిజమైన వ్యక్తికి చెందిన సీబీల్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది. కొద్ది కాలం క్రితం సినీ నటి సన్నీ లియోన్ పాన్ కార్డు సహాయంతో గుర్తుతెలియని వ్యక్తులు లోన్ తీసుకున్నారని తను పేర్కొంది. లోన్ తీసుకున్న విషయం కూడా తనకు తెలియదని ఆమె తెలిపింది. దీని వల్ల తన సిబిల్ స్కోర్పై ప్రభావం పడిందని ట్విట్టర్లో వివరించింది. ముఖ్యంగా ఇండియా బుల్స్కు చెందిన ఫిన్టెక్ ప్లాట్ఫామ్ అయిన ధని స్టాక్స్ లిమిటెడ్పై ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. సన్నీలియోన్ ట్వీట్ తర్వాత అనేక మంది బాధితులు ట్విట్టర్లో తాము ఎలా మోసపోయామో వివరించారు. అయితే, ఇతరులు ఎవరైనా మన వివరాలతో దేశ వ్యాప్తంగా లోన్ తీసుకుంటే మనం తెలుసుకునే వీలు ఉంది. పేటీఎమ్, బ్యాంక్ బజార్ వంటి ప్రముఖ ఫిన్టెక్ సంస్థలు వినియోగదారులకు వీటికి సంబంధించిన ఈ రిపోర్ట్స్ అందిస్తున్నాయి. ముందుగా వీటిలో మన పాన్ కార్డు, ఆధార కార్డు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు మీ క్రెడిట్ రిపోర్ట్ ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. ప్రతి నెల మనం మన క్రెడిట్ రిపోర్ట్ చెక్ చేసుకోవడం వల్ల ఇలాంటి మోసాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. (చదవండి: టెక్ మహీంద్రా భారీ స్కెచ్.. వెయ్యి మందితో అదిరిపోయే ప్లాన్!) -
ఎల్ఐసీ పాలసీదారులకు అలర్ట్.. ఆ అవకాశం మరో 3 రోజులే!
దేశంలోని అతిపెద్ద భీమా రంగ సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) త్వరలో ఐపీఓకు రాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎల్ఐసీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ఫైల్ చేసింది. కేంద్ర ప్రభుత్వం. 31.6 కోట్ల షేర్లను ఐపీఓ ద్వారా మార్కెట్లోకి తీసుకురానుంది. అయితే, ఈ ఎల్ఐసీ ఐపీఓలో పాలసీదారులకు ఆఫర్ సైజ్లో 10 శాతం కోటా లభించనుంది. అంటే ఎల్ఐసీ పాలసీ ఉన్నవారు ఈ ఐపీఓకి పాలసీహోల్డర్ కోటాలో దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి ఇష్యూ ప్రైస్లో డిస్కౌంట్ కూడా లభించనుంది. మరోవైపు ఉద్యోగుల కోటా 5 శాతం ఉండనుంది. అయితే, ఈ ఎల్ఐసీ పాలసీదారులు ఐపీఓకి పాలసీహోల్డర్ కోటాలో అప్లై చేయాలంటే తప్పనిసరిగా తమ పాన్ కార్డును పాలసీకి లింక్ చేయాల్సి ఉంటుందని ఎల్ఐసీ గతంలో సూచించింది. ఈ పక్రియను ఫిబ్రవరి 28న పూర్తి చేయాల్సి ఉంటుంది అని తెలిపింది. ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఈ బీమా కంపెనీ షేర్ల ధర ఒక్కొక్కటి రూ.2,000 నుంచి రూ.2,100 మధ్య ఉండవచ్చని బ్లూమ్ బెర్గ్ గతంలో నివేదించింది. దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి మూసాయదా పత్రాలను దాఖలు చేసింది. భారత ప్రభుత్వం తనకున్న 100 శాతం వాటాలో 5% వాటాను విక్రయించి దాదాపు 8 బిలియన్ డాలర్లను సేకరించాలని చూస్తుంది. (చదవండి: అదిరిపోయే బంపరాఫర్!! 60శాతం డిస్కౌంట్తో అమెజాన్ సేల్!) -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఆ గడువు మార్చి 31 వరకే..!
How To Link Aadhaar Pan Card With SBI Account Online: దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మార్చి 31 నాటికి తమ పాన్ నంబర్ను ఆధార్ నంబర్తో లింక్ చేయాలని తన ఖాతాదారులను కోరింది. ఒకవేళ మార్చి 31 నాటికి లింకు చేయడంలో విఫలమైతే వారు ఎస్బీఐ బ్యాంకింగ్ పూర్తి సేవలను వినియోగించుకోలేరు అని స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139AA ప్రకారం.. మార్చి 31, 2022లోగా ఆధార్ నంబర్కు పాన్ నంబర్ను లింక్ చేయాలని సూచించింది. ఆధార్తో పాన్ నెంబర్ లింక్ చేయండి ఇలా.. www.incometax.gov.inని ఓపెన్ చేయండి ‘క్విక్ లింక్స్’ హెడ్ కింద ‘లింక్ ఆధార్’ ఎంపికపై క్లిక్ చేయండి. కొత్త పేజీలో పాన్కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, మీ పేరు, మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయండి. ఇప్పుడు లింక్ ఆధార్పై క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన ఆరు-అంకెల ఓటీపీ నమోదు చేసి లింకింగ్ ప్రాసెస్ను ధృవీకరిస్తే సరిపోతుంది. (చదవండి: ఒక సీఈవో.. ఇద్దరు దేశాధినేతలు.. ఓ ఆసక్తికర సన్నివేశం) -
సన్నీ లియోన్ పేరుపై గుర్తు తెలియని వ్యక్తికి రుణం.. ఐవీఎల్ సెక్యూరిటీపై నటి ఫైర్..
Sunny Leone Says PAN Card Used for Loan Fraud: తన పాన్ కార్డును ఎవరో దుర్వినియోగం చేశారని బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఆరోపించింది. తన పాన్ కార్డు మీదు గుర్తు తెలియని వ్యక్తి రుణం తీసుకున్నారంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా మండిపడింది. ఈ మేరకు సన్నీ లియోన్ ట్వీట్ చేస్తూ.. ‘ఎవరో ఇడియట్ నా పాన్ కార్డు సాయంతో 2 వేల రూపాయల రుణం తీసుకుని నా సీబీల్ స్కోరును దెబ్బతీశాడు. ఈ విషయంలో ఐవీఎల్ సెక్యూరిటీస్ (ధనిస్టాక్స్, గతంలో ఇండియా బుల్స్ సెక్యూరిటీస్) నాకు సాయం చేయలేదు. ఇండియాబుల్స్ దీన్ని ఎలా అనుమతిస్తుంది’’ అంటూ సన్నీ లియోన్ ట్వీట్ చేసింది. చదవండి: నష్టాల్లో రామ్ చరణ్ బిజినెస్, నిలిచిపోయిన సేవలు అనంతరం కొద్ది సేపటి తర్వాత సన్నీ లియోన్ ఈ ట్వీట్ను డిలిట్ చేసి మరో ట్వీట్ ఐవీఎల్కు కృతజ్ఞతలు తెలిపింది. ‘ఐవీఎల్ సెక్యూరిటీస్, ఐబీ హోమ్ లోన్స్, సీబీల్కు ధన్యవాదాలు. వేగంగా నా సమస్యను పరిష్కరించారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కావని ఆశిస్తున్నాను. ఎందుకంటే చెత్త సీబీల్ స్కోర్ను ఎవరూ కోరుకోరు’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఇలాంటి మోసాలకు నిత్యం వందల మంది బాధ్యులు అవుతుంటారు. ఆ తర్వాత అవి పరిష్కారమవుతుంటాయి. కానీ సన్నీ లియోన్ తొందరపడి ఐవీఎల్ సెక్యూరిటీని విమర్శించడం, ఆ తర్వాత ట్వీట్ డిలిట్ చేయడంతో పలువురు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. Thank you @IVLSecurities @ibhomeloans @CIBIL_Official for swiftly fixing this & making sure it will NEVER happen again. I know you will take care of all the others who have issues to avoid this in the future. NO ONE WANTS TO DEAL WITH A BAD CIBIL !!! Im ref. to my previous post. — sunnyleone (@SunnyLeone) February 17, 2022 -
ఐపీఎల్ మెగావేలానికి వచ్చి పాన్కార్డ్ పోగొట్టుకున్న మాజీ క్రికెటర్
ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ కెవిన్ పీటర్సన్ పాన్కార్డును పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం స్టార్స్పోర్ట్ బ్రాడ్కాస్టర్లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న పీటర్సన్ ఐపీఎల్ మెగావేలం కవర్ చేయడానికి భారత్కు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ మాజీ ఆల్రౌండర్ పాన్కార్డు పోగొట్టుకున్నట్లు తెలిపాడు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలంటూ ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశాడు. చదవండి: అందుకే మా ఆయన్ని ఎవరూ కొనలేదు.. స్టార్ ఆల్రౌండర్ భార్య ''నా పాన్కార్డ్ ఎక్కడో పోయింది. ప్లీజ్ నాకు సాయం చేయండి. కొన్ని కార్యకలాపాల కోసం పాన్కార్డు అవసరం ఇప్పుడు చాలా ఉంది. అయితే పాన్కార్డును ఎలా పొందాలో తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా'' అంటూ ట్వీట్ చేశాడు. కాగా పీటర్సన్ ట్వీట్కు భారత ఆదాయపు పన్ను శాఖ స్పందించింది. ''డియర్ కెవిన్ పీటర్సన్.. మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మీ దగ్గర పాన్ వివరాలు ఉంటే మేము ఇచ్చే వెబ్సైట్ లింక్ను ఓపెన్ చేసి పాన్కార్డు రీ ప్రింట్కోసం ప్రయత్నించండి. ఒకవేళ పాన్కార్డు వివరాలు అందుబాటులో లేకపోతే రీప్రింట్ కోసం తమ శాఖకు దరఖాస్తూ చేసుకోవచ్చు'' అని తెలిపింది. దీంతో తన ట్వీట్కు స్పందించిన భారత ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కెవిన్ పీటర్సన్ కృతజ్ఞతలు తెలిపాడు. ⚠️INDIA PLEASE HELP⚠️ I’ve misplaced my PAN card & travelling Mon to India but need the physical card for work. Can some PLEASE PLEASE direct me to someone who I can contact asap to help me? 🙏🏽 — Kevin Pietersen🦏 (@KP24) February 15, 2022 Dear @KP24, We are here to help you. If you have your PAN details with you, please visit these links for the procedure to apply for reprint of physical PAN Card: (1/2)https://t.co/M2RFFlDsCThttps://t.co/fySMs6nm62 — Income Tax India (@IncomeTaxIndia) February 15, 2022 -
ఉచితంగా 5 నిమిషాల్లో ఈ-పాన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి ఇలా..!
పర్మినెంట్ అకౌంట్ నెంబరు(పాన్ కార్డు) అనేది ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పది అంకెల ప్రత్యేక ఆల్ఫాన్యూమరిక్ నెంబరు. మన దేశంలో ఆర్ధిక లావాదేవీలు నిర్వహించడం కోసం ఈ పాన్-కార్డు చాలా ముఖ్యమైనది. ఐ-టీ విభాగం జారీ చేసిన లామినేటెడ్ ప్లాస్టిక్ పాన్ కార్డు ఇప్పటి వరకు చాలా ప్రసిద్ధి చెందింది. గతంలో ఈ-పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే చాలా సమయం పట్టేది. అలాగే, అలా దరఖాస్తు చేసుకొన్న తర్వాత నెల రోజులకు గాని పాన్ కార్డు ఇంటికి వచ్చేది కాదు. అయితే, ఇప్పుడు ఆన్లైన్లో సులభంగానే పాన్ కార్డు పొందొచ్చు. అయితే దీని కోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. నిమిషాల్లో పాన్ నెంబర్ వచ్చేస్తుంది. దీన్ని ఈ-పాన్ అని పిలుస్తారు. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత జిరాక్స్ చేసుకోవచ్చు. ఎలాంటి చార్జీలు, ఫీజు చెల్లించాల్సిన పని లేదు. ఉచితంగానే పాన్ కార్డు వచ్చినట్లు అవుతుంది. ఈ-పాన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి ఇలా..! మొదట ఆదాయపు పన్నుశాఖ కొత్త (https://www.incometax.gov.in/iec/foportal) పోర్టల్ ఓపెన్ చేయండి. ఇప్పుడు 'Instant E-PAN' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత 'Get New e-PAN' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీ ఆధార్ నెంబర్ నమోదు చేయండి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఈ-పాన్ నెంబర్ జనరేట్ అవుతుంది. దీన్ని తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. (చదవండి: ట్యాక్స్ పేయర్స్కు అలర్ట్.. వెంటనే ఈ డాక్యుమెంట్స్ ఫైల్ చేయండి..!) -
ఇకపై అన్నింటికీ ఒకే కార్డు..! కేంద్రం కీలక నిర్ణయం..!
కేంద్ర ప్రభుత్వం తెర పైకి కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఆధార్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్, ఓటరు కార్డు వంటి అన్నిరకాల కార్డులను ఒకే కార్డులోకి తీసుకుని వచ్చేందుకు కేంద్రం యోచిస్తుంది. అన్నీంటికీ ఒకే కార్డు..! ప్రముఖ ఆంగ్ల పత్రిక నివేదిక మేరకు డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ , పాన్ కార్డు, ఆధార్ కార్డ్ వంటి ఇతర డిజిటల్ ఐడీ కార్డులను లింక్ చేస్తూ కొత్తగా “ఫెడరేటెడ్ డిజిటల్ ఐడెంటిటీస్” కొత్త మోడల్ రూపొందించేందుకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ప్రణాళికలను ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రభుత్వ సేవల కోసం ఆధార్ కార్డు, ఓటర్ కార్డు , పాన్ కార్డుతో పాటుగా పాస్ పోర్ట్ వంటి ప్రభుత్వ ఐడీల కోసం ఒకే డిజిటల్ ఐడీ ఉంటే బెటర్ అని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కార్డుపై గతంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. వన్ కార్డు మరోసారి తెరపైకి వచ్చింది. లక్ష్యం అదే..! ఫెడరల్ డిజిటల్ ఐడెంటిటీ కార్డుతో వేగవంతమైన పనితీరు, కచ్చితమైన ఫలితాల కోసం ఉపయోపడేలా రూపొందిస్తున్నట్టు సమాచారం. రానున్న రోజుల్లో వ్యక్తిగత కేవైసీ ప్రక్రియ అన్ని విభాగాల్లో మరింత సులభమయ్యే అవకాశం ఉందని కేంద్రం అభిప్రాయపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫెడరల్ డిజిటల్ ఐడెంటిటీ వన్స్టాప్ డెస్టినేషన్గా ఉంటుందని తెలిపింది. చదవండి: భారత కంపెనీల జోరు..! బొక్కబోర్లపడ్డ చైనా..! -
5 నిమిషాల్లో పాన్కార్టులోని పేరు, పుట్టిన తేదీని మార్చుకోండి ఇలా..!
ఆధార్ కార్డుతో పాటు పాన్కార్టు ఇప్పుడు తప్పనిసరిగా కలిగి ఉండాల్సి వస్తుంది. ఆర్థికపరమైన లావాదేవీలు, బ్యాంకు లావాదేవీల కోసం, ఐటీ రిటర్న్లు దాఖలు చేయడానికి పాన్కార్డు కచ్చితంగా ఉండాలి. అయితే ఒక్కసారి పాన్కార్టు తీసుకున్నామంటే పాన్ నంబర్ను ఎప్పటికీ మార్చలేం. అయితే పాన్కార్టులో పేరు, పుట్టిన తేదీ వంటి ఇతర వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని అప్డేట్ చేసుకునే అవకాశం ఆదాయపు పన్ను శాఖ కల్పించింది. పాన్కార్టులో పేరు, పుట్టిన తేదీ వంటి పలు వివరాలను ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు విధాలుగా మార్చుకోవచ్చు. అయితే ప్రస్తుతం అందరూ సులభమైన పద్దతి ఆన్లైన్లోనే మార్చుకునేందుకు ఇష్టపడుతున్నారు. అయితే, ఈ సేవలు ఉచితం కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఎన్ఎస్డిఎల్ పోర్టల్లో తెలిపిన వివరాల ప్రకారం రూ.100 వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉంది. పాన్కార్టులో పేరు, పుట్టిన తేదీని ఎలా సరిచేయాలి? ముందుగా ఎన్ఎస్డిఎల్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఆన్లైన్ పాన్ అప్లికేషన్ పేజిలో Application Typeపై క్లిక్ చేసి Changes or Correction in existing PANS Data/Reprint of PAN Card ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత Individual పై క్లిక్ చేసి పేరు, మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ పూర్తిచేయాలి. అనంతరం క్యాప్చా కోడ్ నమోదు చేయండి. కొత్త పేజిలో టోకెన్ నంబర్ వస్తుంది. దాన్ని సేవ్ చేసుకోండి. Submit digitally through e-KYC & e-sign (paperless) ఆప్షన్ను ఎంచుకోవాలి. దాని తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేసి వ్యక్తిగత వివరాలను నింపి Next బటన్ మీద క్లిక్ చేయాలి. అందులో మీరు మార్చాలనుకుంటున్న వ్యక్తిగత వివరాలు, అడ్రస్ను తప్పులు లేకుండా నింపాలి. మీ మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీని మార్చాలని అనుకున్నా దీనిలో మార్చుకోవచ్చు. అడ్రస్, కాంటాక్ట్ డిటైల్స్ అన్ని సరిగ్గా ఇచ్చిన తర్వాత పేజి కింద ఉన్న next బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేజిలో ఐడెంటిటీ, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. అలాగే ఫొటో, సంతకం కూడా మార్చాలనుకున్నా.. స్కాన్ చేసి jpeg ఫార్మట్లో అప్లోడ్ చేయాలి. అనంతరం సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ కాగానే.. అకనాలెడ్జ్మెంట్ స్లిప్ జనరేట్ అవుతుంది. ఫోన్ నెంబర్కు, మెయిల్కు మెస్సెజ్ కూడా వస్తుంది. అనంతరం ఆ స్లిప్ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ను ప్రింట్ తీసి, మీరు ప్రూఫ్ కింద సబ్మిట్ చేసిన వాటిని ఎన్ఎస్డిఎల్ ఆఫీస్((Building-1, 409-410, 4th Floor, Barakhamba Road, New Delhi, PIN: 110001))కు పంపించాలి. (చదవండి: దేశంలోనే అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఓపెన్.. ఎక్కడో తెలుసా?) -
తస్మాత్ జాగ్రత్త ! ఆదాయపు పన్ను శాఖ డేగకన్ను.. కొత్తగా అమల్లోకి..
ఆదాయపన్ను శాఖ (ఐటీ విభాగం) పన్ను చెల్లింపుదారులకు సంబంధించి ‘వార్షిక సమాచార నివేదిక పత్రం’ (ఏఐఎస్)ను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ముఖ్యమైన అన్ని ఆర్థిక లావాదేవీల సమాచారం ఇందులో పొందుపరిచి ఉంటుంది. ఇలా మొత్తం 46 రకాల ఆర్థిక లావాదేవీల వివరాలు నమోదవుతాయి. ‘‘ఏఐఎస్ అనేది సమాచార నివేదిక. వివిధ మార్గాల నుంచి వచ్చిన ఆదాయం వివరాలు ఉంటాయి. ఆ ఆదాయం నుంచి పన్ను (టీడీఎస్)ను వసూలు చేశారా? లేదా అన్న దానితో సంబంధం ఉండదు. ఏ పెట్టుబడి చేసినా వివరాలు ఇందులో ఉంటాయి’’ అని ఐటీఆర్ ఫైలింగ్ వెబ్సైట్ స్పష్టం చేస్తోంది. కనుక పన్ను చెల్లింపుదారులు ముఖ్యమైన ఆర్థిక లావాదేవీల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. ఫలానా లావాదేవీ వివరాలు ఐటీ శాఖకు తెలియదని అనుకోవద్దు. తర్వాత నోటీసు వస్తే సంజాయిషీ ఇచ్చుకునేందుకు కంగారుపడాల్సి రావచ్చు. ఏఐఎస్లో నమోదయ్యే ఆర్థిక లావాదేవీల వివరాలు చూద్దాం.. ఏఐఎస్ అంటే..? పలు సంస్థలు (ప్రభుత్వ, ప్రైవేటు) పాన్ నంబర్ ఆధారంగా నమోదైన లావాదేవీల వివరాలను ఆదాయపన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. ఆ వివరాలతో కూడిన వార్షిక సమాచార పత్రమే ఇది. ఏఐఎస్ అన్నది సంక్షిప్త నామం. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫామ్ 26ఏఎస్లో టీడీఎస్/టీసీఎస్, సంబంధిత ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారు స్వయంగా చేసిన చెల్లింపులు, ఆదాయపన్ను శాఖ నుంచి వచ్చిన రిఫండ్ వివరాలు ఉంటున్నాయి. దీన్ని మరింత విస్తరించి పన్ను చెల్లింపుదారునకు సంబంధించిన సమగ్ర ఆర్థిక వివరాల సమాచారాన్ని పొందుపరిచే పత్రమే ఏఐఎస్. ఫామ్ 26ఏఎస్ స్థానంలో దీన్ని అమల్లోకి తీసుకురావాలన్నది ఆదాయపన్ను శాఖ ప్రణాళిక. సమగ్ర సమాచారం అందుబాటులో ఉండడం వల్ల పన్ను చెల్లింపుదారులకు రిటర్నులు దాఖలు సౌలభ్యంగా ఉంటుందని భావిస్తోంది. అదే సమయంలో పన్ను ఎగవేతలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. పైన చెప్పుకున్నట్టు ఏఐఎస్లో అన్ని వివరాలు కచ్చితంగా నమోదవుతాయా? అన్న ప్రశ్న రావచ్చు. కచ్చితంగా నమోదు కావాలనేమీ లేదు. ఆర్థిక లావాదేవీల వార్షిక నివేదికను నిబంధనలకు అనుగుణంగా ఆయా సంస్థలు ఏటా ఆదాయపన్ను శాఖకు ఫైల్ చేయాలి. బ్యాంకులు, రిజిస్ట్రార్ కార్యాలయాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు (వాహన కొనుగోళ్ల సమాచారం), ఫారీన్ ఎక్ఛ్సేంజ్ డీలర్లు, స్టాక్ ఎక్ఛ్సేంజ్లు, ఫండ్స్, షేర్లు, డిబెంచర్లను జారీ చేసే కంపెనీలు, ఆర్బీఐ, పన్నును వసూలు చేసే వ్యక్తులు అందరూ ఈ వివరాలను ఐటీశాఖకు అందించాల్సి ఉంటుందని ముంబైకి చెందిన ట్యాక్స్ నిపుణుడుజైన్ తెలిపారు. అలా చేసినప్పుడే ఆ వివరాలు పన్ను చెల్లింపుదారుల ఏఐఎస్లో నమోదవుతాయి. అందుకే రిటర్నులు వేసే ముందు ఏఐఎస్ను ఒక్కసారి చూసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని జైన్ సూచించారు. అప్పుడే పన్ను చెల్లింపుదారులు రిటర్నుల్లో పేర్కొనే సమాచారానికి, ఐఏఎస్లోని వివరాలకు సరిపోలకపోవడం అనే సమస్య ఎదురుకాదన్నారు. పాన్–ఆధార్ అనుసంధానం అమల్లోకి రావడం తెలిసిందే. కనుక పాన్, ఆధార్ ఆధారితంగా ఏ లావాదేవీ నిర్వహించినా దానిని ఐటీ శాఖ ట్రాక్ చేయగలదు. ► విదేశీ కరెన్సీ కొనుగోళ్లు ఈక్విటీ షేర్లు, డెట్ సాధనాలు, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల కోసం విదేశీ కరెన్సీని కొనుగోలు చేస్తే ఆ వివరాలు తెలుస్తాయి. విదేశాల్లో బ్యాంకు ఖాతా తెరిచినా ఏఐఎస్లో చేరిపోతుంది. ► విదేశీ ప్రయాణం విదేశాల్లో వైద్య చికిత్స, విదేశీ విద్య కోసం లేదా విదేశీ పర్యటనలకు డాలర్లను కొనుగోలు చేసి ఉంటే ఆ వివరాలు ఏఐఎస్లో నమోదవుతాయి. విదేశీ పర్యటనకు టూరిజం ప్యాకేజీ తీసుకున్నా లేదా విదేశీ ప్రయాణానికి సంబంధించి చెల్లింపులు చేసినా ఆ వివరాలను ట్రావెల్ ఏజెన్సీలు ఐటీ శాఖకు కచ్చితంగా తెలియజేస్తాయి. ► స్థిరాస్తి కొనుగోళ్లు/విక్రయాలు రూ.50 లక్షలకు మించి ఇల్లు విక్రయించిన సందర్భాల్లో కొనుగోలుదారు పన్నును మినహాయించి ఫామ్ ‘16బీ’ని విక్రయదారుకు జారీ చేస్తారు. కొనుగోలుదారు ఈ సమాచారంతో ఫామ్ 26క్యూబీని ఆదాయపన్ను శాఖకు దాఖలు చేయాల్సి ఉంటుంది. అలాగే, ఇల్లు, భూముల విక్రయం రూపంలో ఆదాయం అందుకుంటే, దానిపై అమలు చేసిన టీడీఎస్ వివరాలు ఆదాయపన్ను శాఖకు తెలుస్తాయి. ► ప్లాంట్/మెషినరీలపై అద్దె ప్లాంట్, మెషినరీపై అద్దె అదా యం తీసుకుంటూ, ఆ మొత్తంపై 2 శాతం టీడీఎస్ను అమలు చేస్తే ఆ సమాచారం ఏఐఎస్కు వెళుతుంది. లాటరీ ఆదాయం లాటరీ/క్రాస్వర్డ్ గెలుచుకుని ప్రైజ్మనీ పొందితే, దానిపై టీడీఎస్ అమలు చేస్తే ఆ వివరాలను ఫామ్ 16ఏ రూపంలో చెల్లించిన సంస్థ ఆదాయపన్ను శాఖకు తెలియజేస్తుంది. గుర్రపు పందేలు గెలుచుకున్న సందర్భాల్లో టీడీఎస్ మినహాయించినా ఏఐఎస్లో నమోదవుతుంది. బీమా కమీషన్ బీమా ఏజెంట్గా చేస్తూ, బీమా సంస్థ నుంచి కమీషన్ పొందితే ఆ వివరాలు ఏఐఎస్లో ప్రతిఫలిస్తాయి. ఎందుకంటే కమీషన్పై టీడీఎస్ అమలవుతుంది. వ్యాపార ఆదాయం వ్యాపారం రూపంలో ఆదాయం, వ్యయాలూ ఏఐఎస్లో నమోదవుతాయి. వ్యాపారానికి సంబంధించే కమీషన్ లేదా బ్రోకరేజీ, వృత్తిపరమైన, సాంకేతిక ఫీజులు కూడా ఇందులో ఉంటాయి. ► లాటరీ టికెట్లపై కమీషన్ లాటరీ టికెట్ల విక్రయ రూపంలో అందుకునే కమీషన్ వివరాలు ఐటీ శాఖకు తెలు స్తాయి. ► క్రీడల రూపంలో ఆదాయం క్రీడాకారులు, క్రీడా అసోసియేషన్లు అందుకునే ఆదాయం ఏఐఎస్లో నమోదవుతుంది. ► వాహన కొనుగోలు, విక్రయం రూ.10 లక్షలకు మించి విలువైన వాహనాలను కొనుగోలు చేసినా, విక్రయించినా ఆ సందర్భంలో కొనుగోలుదారులు విక్రయదారులకు ఒక శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, వాహన కొనుగోలుకు రూ.2లక్షలకు మించి నగదు చెల్లింపులు చేసినా కానీ, టీడీఎస్ అమలవుతుంది. ఈ వివరాలే పాన్ నంబర్ ఆధారంగా వారి ఏఐఎస్లో నమోదవుతాయి. ► ఆఫ్ మార్కెట్ లావాదేవీలు షేర్లు, సెక్యూరిటీలను ఆఫ్ మా ర్కెట్ (వ్యక్తి నుంచి వ్యక్తికి మధ్య) ద్వారా క్రయ, విక్రయాలు చేస్తే ఆ వివరాలు రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ల ద్వారా ఐటీ శాఖకు చేరతాయి. దాంతో సంబంధిత వ్యక్తుల ఏఐఎస్లో నమోదవుతాయి. ► విదేశాల నుంచి జమలు/చెల్లింపులు రాయల్టీ లేదా సాంకేతిక సేవల రూపంలో రాయల్టీ లేదా ఫీజులను స్థానికేతరులు (ప్రవాసులు/నాన్ రెసిడెంట్) అందుకుంటే ఆ వివరాలు ఏఐఎస్లో రికార్డు అవుతాయి. విదేశాలకు పంపించే, విదేశాల నుంచి స్వీకరించే చెల్లింపుల వివరాలు కూడా ఇందులోకి చేరతాయి. ప్రవాసులు ఎవరైనా భారతీయ కంపెనీ నుంచి వడ్డీ ఆదాయం అందుకున్నా, ఈ మొత్తంపై టీడీఎస్ అమలైనా ఏఐఎస్లో నమోదవుతుంది. గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్ల (జీడీఆర్) రూపంలో ఆదాయం లభించినా ఏఐఎస్లో కనిపిస్తుంది. ► ప్రభుత్వ సెక్యూరిటీలు ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీల రూపంలో అందుకునే వడ్డీ పన్ను చెల్లింపుదారు ఆదాయంలో కలుస్తుంది. ఈ వివరాలు సైతం ఏఐఎస్లో చేరతాయి. ఒకవేళ దీనిపై టీడీఎస్ అమలు చేస్తే ఫామ్ 16ఏను జారీ చేస్తారు. ► ఇతర చెల్లింపులు జీవిత బీమా ప్రీమియం, హోటల్ చెల్లింపులు, క్రెడిట్ కార్డు లావాదేవీలు తదితర సమాచారం కూడా ఆదాయపన్ను శాఖకు వెళుతుంది. ► వేతనం సంస్థ నుంచి మీకు చెల్లించిన వేతనం, అందులోనుంచి పన్నును ఏమైనా వసూలు చేసి ఉంటే (టీడీఎస్) ఆ వివరాలు ఏఐఎస్లో నమోదవుతాయి. సంస్థ టాన్, ఉద్యోగి పాన్ వివరాలు కూడా ఉంటాయి. ఏఐఎస్లో పేర్కొనే మొత్తాన్ని స్థూల వేతనంగా అర్థం చేసుకోవాలి. ఇందులో అలవెన్స్లు కూడా కలిసే ఉంటాయి. పన్ను చెల్లింపుదారు రిటర్నులు దాఖలు చేయడం ద్వారా మినహాయింపులు, తగ్గింపు ప్రయోజనాలను పొందొచ్చు. ► అద్దె చెల్లింపులు కిరాయిదారు మీకు చెల్లించుకున్న అద్దె వివరాలే కాదు.. మీరు కిరాయికి ఉంటూ చేసే అద్దె చెల్లింపుల వివరాలు సైతం ఏఐఎస్లోకి చేరతాయి. అయితే, టీడీఎస్ అమలు చేసినప్పుడే. రూ.50,000 అంతకుమించి నెలవారీ అద్దె చెల్లిస్తే 5 శాతం టీడీఎస్ తగ్గించి ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి సందర్భాల్లో వివరాలు వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో నమోదవుతాయి. ఆయా అంశాల పట్ల అవగాహనతో వ్యవహరించడం అవసరం ► అద్దె ఆదాయం మీ ఇంట్లో అద్దెకు ఉండే కిరాయిదారుకి మీ పాన్ నంబర్ ఇచ్చారంటే.. మీ అద్దె ఆదాయం వివరాలు ఏఐఎస్లో చేరిపోతాయి. సదరు కిరాయిదారు మీ పాన్ నంబర్ను పనిచేస్తున్న సంస్థకు ఇచ్చి పన్ను మినహాయింపు కోరొచ్చు. దాంతో మీ పాన్, అద్దె వివరాలు అక్కడి నుంచి ఐటీ విభాగానికి చేరతాయి. ప్రతి నెలా రూ.50,000, అంతకు మించి అద్దె ఆదాయం స్వీకరించిన సందర్భంలో.. భూమి, భవనం, మెషినరీ రూపంలో ఆదాయం అందుకుంటే ఆ వివరాలు నమోదవుతాయి. ఎందుకంటే ఈ ఆదాయంపై 10 శాతం టీడీఎస్ను అమలు చేయాలని ఆదాయపన్ను చట్టం నిర్ధేశిస్తోంది. ► అకౌంట్ బ్యాలన్స్ సేవింగ్స్ ఖాతా లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు కాకుండా ఇతర ఏ ఖాతాను తెరిచినా అది ఏఐఎస్లో ప్రతిఫలిస్తుంది. అంతేకాదు ఆర్థిక సంవత్సరం చివర్లో రూ.50,000కు మించి బ్యాలన్స్ ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు కూడా ఉంటాయి. ► డిపాజిట్లు/ ఉపసంహరణలు బ్యాంకు ఖాతాల్లో (కరెంటు, సేవింగ్స్ తదితర) చేసిన నగదు జమల వివరాలు ఏఐఎస్లో కనిపిస్తాయి. నగదు డిపాజిట్ల వివరాలను పాన్ నంబర్ ఆధారంగా బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎన్బీఎఫ్సీ సంస్థలు ఫామ్61ఏ రూపంలో ఐటీ శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. ► క్రెడిట్/డెబిట్కార్డ్ ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్/డెబిట్ కార్డు మంజూరు చేసి ఉంటే ఆ వివరాలు నమోదవుతాయి. ► డివిడెండ్ ఈక్విటీ షేర్లు, ఫండ్స్ నుంచి పొందిన డివిడెండ్ వివరాలు ఉంటాయి. కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ మీకు పంపిణీ చేసిన డివిడెండ్పై టీడీఎస్ వసూలు చేసి ఉంటే అది కూడా కనిపిస్తుంది. ► సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై జమ చేసిన వడ్డీ వివరాలు కూడా నమోదవుతాయి. ఒక ఏడాదిలో వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు ఉంటే సెక్షన్ 80టీటీఏ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లు (60ఏళ్లకుపైన) అయితే టీటీబీ కింద రూ.50,000 ఆదాయంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. ► టైమ్ డిపాజిట్లు టైమ్ డిపాజిట్లలో చేసిన పెట్టుబడుల వివరాలు ఏఐఎస్లో నమోదవుతాయి. ► ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్ల రూపం లో పన్ను చెల్లింపుదారు అందుకున్న ఆదాయం వివరాలు ప్రతిఫలిస్తాయి. వీటిపై టీడీఎస్ అమలు చేస్తే ఆ వివరాలు సైతం కనిపిస్తాయి. ► సెక్యూరిటీలు, ఫండ్స్ కొనుగోళ్లు షేర్లు, బాండ్లు, ఫండ్స్ యూనిట్లలో చేసే పెట్టుబడుల సమాచారా న్ని ఆయా సంస్థలు ఐటీ శాఖకు రిపోర్ట్ చేస్తాయి. ► ఇతర వనరుల ద్వారా వడ్డీ సేవింగ్స్ ఖాతా, టర్మ్/ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్లు కాకుండా ఇతర రూపాల్లో వడ్డీ ఆదాయం మీకు అందితే.. మీకు వడ్డీ చెల్లించిన సంస్థల నుంచి ఆదాయపన్ను శాఖకు సమాచారం వెళుతుంది. ► నగదు చెల్లింపులు బ్యాంకు డ్రాఫ్ట్లు లేదా పేఆర్డర్లు లేదా పేచెక్లను కొనుగోలు చేసినా, వస్తు, సేవలకు నగదు రూపంలో చెల్లింపులు చేసినా ఏఐఎస్లో కనిపిస్తాయి. చట్టం కింద ఈ నగదు చెల్లింపుల లావాదేవీ వివరాలను తెలియజేయడాన్ని తప్పనిసరి చేశారు. ► పీఎఫ్ సొమ్ము ఉపసంహరించినా.. ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నుంచి బ్యాలన్స్ను ఉపసంహరించుకుంటే కూడా ఏఐఎస్లో నమోదవుతాయి. ఐదేళ్ల పనికాలం పూర్తి కాకుండానే రూ.50,000కు మించి ఉపసంహరించుకుంటే టీడీఎస్ వసూలు చేస్తారన్నది గుర్తుంచుకోవాలి. ఐదేళ్లు నిండిన తర్వాత పన్ను ఉండదు. ► జీవిత బీమా జీవిత బీమా పాలసీ రూపంలో లభించే ఆదాయానికి (మెచ్యూరిటీ తర్వాత/లేదా మరణ పరిహారం) ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 10(10డి) కింద పన్ను మినహాయింపు ఉంటుంది. కొన్ని షరతులను పాటించినప్పుడే ఈ వెసులుబాటు. లేదంటే ఈ మొత్తం నుంచి టీడీఎస్ కోసేస్తారు. జీవిత బీమా పాలసీల నుంచి అందుకునే మొత్తం ఏఐఎస్లో నమోదవుతుంది. ► ఎన్ఎస్సీ ఉపసంహరణలు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) నుంచి పెట్టుబడిని వెన క్కి తీసుకుంటే నమోదవుతాయి. ► పన్ను రిఫండ్పై వడ్డీ ఆదాయపన్ను రిఫండ్ జాప్యం అయితే ప్రతీ నెలా 0.5 శాతం చొప్పున ఆ మొత్తంపై వడ్డీని పన్ను చెల్లింపుదారులకు ఐటీ చెల్లిస్తుంది. ఈ వివరాలు కూడా కనిపిస్తాయి. రిటర్నుల్లో ‘ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్’ విభాగంలో ఆదాయంగా దీన్ని పేర్కొనాలి. -
పాన్కార్డు హోల్డర్లకు హెచ్చరిక..! వెంటనే..?
పాన్ కార్డ్ నంబర్తో ఆధార్ అనుసంధానానికి గడువు తేదీని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక శాఖకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఈ మేరకు గడువు తేదీని 2022 మార్చి 31 వరకు పొడిగించింది. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ తేదీని సవరిస్తూ మీడియా, టెక్నికల్ పాలసీ ఇన్కం ట్యాక్స్ కమిషనర్ సురభి అహ్లువాలియా అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేశారు. రూ. పదివేల జరిమానా..! పాన్ కార్డ్ హోల్డర్లు మార్చి 31 వరకు ఆధార్ కార్డ్ నంబర్తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన గడువులోగా లింక్ చేయడంలో విఫలమైతే ఆయా పాన్ కార్డ్ హోల్డర్ల పాన్ కార్డ్ చెల్లుబాటు కాదు. దాంతో పాటుగా రూ. 1,000 రుసుము జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా లావాదేవీలను చేసే సమయంలో ఆధార్తో లింక్ కానీ పాన్ కార్డ్ను అందజేస్తే ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 272ఎన్ ప్రకారం... సదరు వ్యక్తిపై 10 వేల జరిమానాను అసెస్సింగ్ అధికారి విధిస్తారు. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్లు, బ్యాంక్ ఖాతా తెరవడం మొదలైన వాటిలో తప్పనిసరిగా పాన్ కార్డ్ను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. చదవండి: రూ. 200 లిమిట్..! నగదు చెల్లింపులపై ఆర్బీఐ కొత్త ఫ్రేమ్వర్క్..! -
పాన్ కార్డుతో ఎన్ని లాభాలో.. అవేంటో తెలుసా?
పాన్ కార్డు(శాశ్వత ఖాతా సంఖ్య) అనేది ఆదాయపు పన్ను శాఖ ప్రతి పన్ను చెల్లింపుదారుడికి కేటాయించే ఒక ప్రత్యేకమైన 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ నెంబర్. ఇది గుర్తింపు రుజువుగా కూడా పనిచేస్తుంది. పన్ను పరిధిలోకి రాని వేతనం లేదా ప్రొఫెషనల్ ఫీజులు, నిర్ధిష్ట పరిమితులకు మించి ఆస్తుల అమ్మకం లేదా కొనుగోలు, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు వంటి ఆర్థిక లావాదేవీలకు పాన్ తప్పనిసరి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు మాదిరిగానే పాన్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటని చెప్పువచ్చు. పలు లావాదేవీలకు పాన్ కార్డు తప్పకుండా కావాలి. ఎటువంటి సందర్భాలలో ఈ పాన్ కార్డు అవసరమే మనం ఇప్పుడు తెలుసుకుందాం.. పాన్ నెంబరు ఎందుకు అవసరం? ప్రత్యక్ష పన్నుల చెల్లింపు కోసం ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువ చేసే స్థిరాస్తుల అమ్మకం లేదా కొనుగోలు చేసేటప్పుడు పాన్ కార్డు అవసరం. ద్విచక్ర వాహనం కాకుండా వేరే వాహనాన్ని అమ్మడం లేదా కొనుగోలు చేసేటప్పుడు పాన్ కార్డు అవసరం. హోటళ్లు లేదా రెస్టారెంట్లకు ఏదైనా సమయంలో రూ.50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించే సమయంలో ఇది అవసరం. ఏదైనా విదేశీ దేశానికి ప్రయాణించడానికి సంబంధించి రూ.25,000 కంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించే సమయంలో పాన్ నెంబర్ అవసరం. ఆర్బీఐ బాండ్ల కొనుగోలు సమయంలో రూ.50 వేలకు పైన లావాదేవీలు జరిపితే పాన్ నెంబర్ తప్పకుండా అవసరం. కంపెనీ డిబెంచర్లు లేదా బాండ్ల కొనుగోలు సమయంలో రూ.50 వేలకు మించి లావాదేవీలు నిర్వహిస్తే పాన్ కార్డు కావాలి. మ్యూచువల్ ఫండ్స్లో రూ.50 వేలకు పైన డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు పాన్ కార్డు అవసరం. రూ.50,000 కంటే ఎక్కువ మొత్తం బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసేటప్పుడు పాన్ కార్డు అవసరం. వస్తువుల క్రయవిక్రయాలకు సంబంధించి ఒక ట్రాన్సాక్షన్ విలువ రూ.2 లక్షలు దాటితే పాన్ నెంబర్ తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకప్పుడు పాన్ కార్డు పొందాలంటే 45 రోజుల వరకు ఆగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆధార్ ఉంటే చాలు కేవలం 10 నిమిషాల్లో పాన్ నెంబర్ పొందవచ్చు. (చదవండి: బీమా కంపెనీల ఆఫర్.. పెళ్లి క్యాన్సిల్ అయితే రూ.10 లక్షలు!) -
అప్పు కోసం బ్యాంకుకు వెళ్లిన మహిళా కానిస్టేబుల్కు షాక్.. పాన్ కార్డుపై అప్పటికే..
సాక్షి, హైదరాబాద్: రుణం కోసం బ్యాంకుకు వెళ్లిన ఓ మహిళా కానిస్టేబుల్కు విస్తుపోయే నిజం తెలిసింది. తన ప్రమేయం లేకుండా తన పేరుపై ఇతర రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి లోను తీసుకున్న విషయాన్ని బ్యాంకు అధికారులు చెప్పడంతో.. షాక్కు గురై సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించింది. వివరాలు.. సిటీ సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తి స్తున్న మహిళా కానిస్టేబుల్కు డబ్బులు అవస రం కావడంతో రుణం కోసం ఎస్బీఐకు వెళ్లింది. కానిస్టేబుల్ వివరాలు చెక్ చేసిన బ్యాంక్ అధికారులు ఆల్రెడీ మీ పేరుపై రూ.80 వేలు రుణం ఉన్నట్లు తెలిపారు. తన ప్రమేయం లేకుండా లోను ఎవరు తీసుకున్నారని ఆరాతీయగా.. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి కానిస్టేబుల్ పాన్కార్డ్పై లోను తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఆమె సైబర్క్రైం పోలీసులకు ఫిర్యా దు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధు తెలిపారు. చదవండి: ఈ టిప్స్ పాటిస్తే.. మీ ఆధార్ కార్డు సేఫ్..లేదంటే? దొంగ చేతికి తాళం ఇచ్చినట్లే -
ఈ టిప్స్ పాటిస్తే.. మీ ఆధార్ కార్డు సేఫ్..లేదంటే? దొంగ చేతికి తాళం ఇచ్చినట్లే
ప్రస్తుత సాంకేతిక యుగంలో మానవ జీవితం కార్డుల చుట్టూ తిరుగుతోంది. ఏటీఎం కార్డులు మొదలుకొని పాన్ కార్డు, ఆధార్, రేషన్ కార్డులు నిత్య జీవితంలో భాగమయ్యాయి. అందుకే వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఒక్కోసారి వివిధ కారణాల వల్ల ఆ కార్డులు చేతులు మారుతుంటాయి. అలాంటి సమయాల్లో ఆధార్ కార్డ్ నుంచి ముంపు పొంచి ఉందని గుర్తించాలి. ప్రపచం దేశాల్లో ఆర్దిక మాధ్యం పెరిగిపోయింది. అందుకే సైబర్ నేరస్తులు ఈజీ మనీ కోసం ఆధార్కార్డు, పాన్కార్డ్ సాయంతో బ్యాంక్ అకౌంట్లలో ఉన్న నగదును కాజేస్తుంటారు. అయితే మనం కొన్ని చిట్కాలు పాటించి సైబర్ నేరస్తుల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. ►ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆధార్ మరియు పాన్ వివరాలను తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు. ఇటువంటి వివరాలను మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగించవచ్చు ► మీ ఆధార్, పాన్ని సేకరించడం లేదా మీకు అవసరమైన చోట ధృవీకరణ కోసం ఇచ్చి మరిచిపోతుంటాం. అలా మరిచిపోవద్దు. అలా మరిచి పోవడం వల్ల నేరస్తులు ఆ ఆధార్ కార్డ్ సాయంతో సైబర్ నేరాలకు పాల్పడొచ్చు. లేదంటే మీ డేటాను అమ్ముకోవచ్చు. ► అనుమానంగా ఉన్న వెబ్ సైట్లలో ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ ఆధార్ కార్డ్లను అప్లోడ్ చేయొద్దు. ► మీ సిబిల్ స్కోర్ను ట్రాక్ చేస్తూ ఉండండి ► ఒకవేళ మీరు మీ సిబిల్ స్కోర్ చెక్ చేసే సమయంలో మీకు తెలియకుండా మరెవరైనా ఆధార్ కార్డ్ల సాయంతో మీ డేటాను సేకరించే అవకాశం ఉంటుంది. మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే పోలీసులను ఆశ్రయించండి. ► ఏ సందర్భంలోనైనా మీరు వన్ టైమ్ పాస్వర్డ్లను షేర్ చేయొద్దు. ప్రత్యేకించి ఆధార్, పాన్ లేదా ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించింది అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ► ఆధార్ కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వ ఏజెన్సీలు ప్రజల వ్యక్తిగత వివరాలను సెక్యూర్గా ఉంచేందుకు ఎప్పటికప్పుడు మీకు సలహాలు అందిస్తుంటాయి. మీ డేటా వినియోగానికి సంబంధించిన ఏజన్సీలపై అనుమానం ఉంటే ఫిర్యాదు చేయండి. ఇలా చేయడం వల్ల ఆధార్ కార్డ్ను సైబర్ నేరస్తుల నుంచి జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. చదవండి: సామాన్యుడి షాక్..క్యూ కట్టిన బ్యాంకులు..! -
మీ పాన్ కార్డు పోయిందా? ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి ఇలా..!
Download e-PAN Card: మన దేశంలో ఆధార కార్డుకు ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత పాన్ కార్డుకు ఉంది. అధిక మొత్తంలో నిర్వహించే ఆర్థిక లావాదేవీల కోసం పాన్ కార్డు తప్పనిసరి అనే విషయం మన అందరికీ తెలుసు. అలాగే, ఆదాయపు పన్ను రిటర్నుల(ఐటీఆర్) ఫైలింగ్ మొదలుకొని బ్యాంక్ ఖాతా తెరవడం, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు దరఖాస్తు చేసుకోవడం, వివిద పథకాలలో పెట్టుబడి పెట్టాలి అన్న పాన్ కార్డు అవసరం. అయితే, ఇలాంటి ముఖ్యమైన పాన్ కార్డ్ను పోగొట్టుకుంటే, ఇక నుంచి భయడాల్సిన అవసరం లేదు. మీ పాన్ కార్డు పోయినప్పుడు ప్రత్యామ్నాయంగా ఈ-పాన్ కార్డు డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని ఆదాయపు పన్ను శాఖ విభాగం కల్పిస్తోంది. పాన్ కార్డు పోతే కొత్త ఈ-పాన్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి ఇలా? మొదట ఈ ఎన్ఎస్డీఎల్ పోర్టల్ లింకు ఓపెన్ చేయండి. ఇప్పుడు పోగొట్టుకున్న మీ పాన్ కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్లీ మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, పిన్ కోడ్ నమోదు చేయాలి. మీరు నమోదు చేసిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నమోదు చేసిన తర్వాత మీరు ఈ-పాన్ కార్డు పీడీఎఫ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. (చదవండి: రేషన్ షాపుల్లో మినీ ఎల్పీజీ సిలిండర్లు..!) -
18 ఏళ్లలోపు వారికి కూడా పాన్ కార్డు.. పొందండి ఇలా?
మన దేశంలో ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు కూడా చాలా ముఖ్యం. ఏదైనా అధిక మొత్తంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలంటే పాన్ కార్డు తప్పనిసరి. ప్రభుత్వ కార్యాలయాల్లో డబ్బు బదిలీకి, అలాగే బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడానికి, ఎక్కడైనా పెట్టుబడి పెట్టడానికి పాన్ కార్డు అవసరం. పాన్ కార్డు సాధారణంగా 18 సంవత్సరాల వయస్సు నిండిన వారికి ఇస్తారు. అయితే, చాల మందికి తెలియని విషయం ఏమిటంటే 18 ఏళ్లలోపు వారు కూడా ఈ కార్డు పొందవచ్చు. మీరు మీ పిల్లల పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మైనర్లు ఎవరైనా సరే సొంతంగా పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోలేరని గుర్తించుకోవాలి. పాన్ కార్డు ధరఖాస్తు విధానం మీరు ఆన్లైన్లో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మొదట ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. సంబంధిత అభ్యర్థి కేటగిరీని ఎంచుకునేటప్పుడు వ్యక్తిగత సమాచారం మొత్తం వెల్లడించాలి. మీరు ఇప్పుడు మైనర్ వయస్సు రుజువును, తల్లిదండ్రుల ఫోటోతో సహా అనేక ఇతర కీలక పత్రాలను అప్లోడ్ చేయాలి. ఈ సమయంలో తల్లిదండ్రుల సంతకాన్ని మాత్రమే అప్లోడ్ చేయాలి. రూ. 107 ఛార్జీ చెల్లించిన తర్వాత మీరు ఫారమ్ను సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీకు ఒక రసీదు నెంబరు వస్తుంది. దాని సహాయంతో మీ అప్లికేషన్ స్థితిని చెక్ చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ-మెయిల్ వస్తుంది. విజయవంతంగా వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత 15 రోజుల్లోగా మీ పాన్ కార్డును ఇంటికి వస్తుంది. పాన్ కార్డు ఈ డాక్యుమెంట్లు అవసరం పాన్ కార్డు అప్లికేషన్ కోసం అనేక పేపర్లను సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. మైనర్ తల్లిదండ్రుల చిరునామా, గుర్తింపు ధృవీకరణ అవసరం దరఖాస్తుదారుడి చిరునామా, గుర్తింపు రుజువు అవసరం. మైనర్ సంరక్షకుడు గుర్తింపు రుజువుగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడిలలో ఏదో ఒకదానిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చిరునామా ధృవీకరణ కోసం మీ ఆధార్ కార్డు, పోస్టాఫీసు పాస్ బుక్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదా ఒరిజినల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కాపీ అవసరం. మీ పిల్లవాడు డబ్బు సంపాదించినప్పుడు, మీ బిడ్డ మీ పెట్టుబడికి నామినీ కావాలని మీరు కోరుకుంటే, పిల్లల పేరిట పెట్టుబడి పెట్టిన సమయంలో వారికి పాన్ కార్డు అవసరం అవుతుంది. (చదవండి: మెటావర్స్తో మహిళలు, పిల్లలకు ప్రమాదం) -
మరణించిన వ్యక్తుల పాన్కార్డ్, ఆధార్ కార్డులు భద్రపరచాలా? లేక..
మన గుర్తింపుకు ఆధార్, పాన్కార్డులే ఆధారాలు. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా పాస్పోర్ట్ కావాలన్నా ఆఖరికి సిమ్కార్డ్ తీసుకోవాలన్నా ఈ కార్డులే కీలకంగా మారుతాయి. అయితే ఓ వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆధార్ పాన్ ఏం చేయాలో చాలా మందికి తెలియదు. దానికి సంబంధించిన వివరాలు మీ కోసం.. ఆధార్, పాన్ కార్డులు పోగొట్టుకుంటే పలు అనర్థాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇక మరణించిన వారి కార్డులను ఎన్ని రోజులని భద్రపరచాలని సందేహం కూడా విలువైనదే. అయితే మరణించిన వ్యక్తి ఐటీ రిటర్న్స్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు పాన్ కార్డును జాగ్రత్తగా భద్రపరచాలి. ఐటీ రిటర్న్స్ లోని నగదు బ్యాంకు ఖాతాలో జమ అయ్యేంత వరకు పాన్ కార్డు యాక్టివ్ గా ఉండాలి. ఉద్యోగి డిపార్టుమెంట్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు మనుగడలో ఉండాలి. ఇవన్నీ పూర్తయ్యాక ఇక ఆ అకౌంట్ ను క్లోజ్ చేయవచ్చు. ఎలా క్లోజ్ చేయాలి పాన్ కార్డు క్లోజ్ చేయాలంటే.. తొలుత ఆదాయపు శాఖకు అప్లికేషన్ ఇవ్వాలి. ఇందులో వారి పూర్తి వివరాలను పొందపరచాలి. వ్యక్తి పేరు పాన్ కార్డు నంబర్ మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. వీటన్నింటిని జత చేసి ఐటీ శాఖకు అప్లికేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత తదుపరి ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం పాన్ కార్డు క్లోజ్ అవుతుంది. చట్టపరమైన వారసులే పాన్కార్డు క్లోజింగ్కి సంబంధించిన దరఖాస్తుని మరణించిన వారి చట్టపరమైన వారసులే సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జరిగే ప్రక్రియలో కూడా వారసులే కీలకం. ఇతరులు చేయడానికి వీలులేదు. బదిలీకి అవకాశం మరణించిన వారి పాన్ కార్డుని వారి వారసుల అభ్యర్థన మేరకు వేరే వారికి బదిలీ చేయోచ్చు. భవిష్యత్ లో ఆ పాన్ కార్డుతో అవసరం ఉంటుంది అనుకుంటే క్లోజ్ చేయకూడదు. ఆదాయపు శాఖకు చెల్లించాల్సిన పని లేదు. అయితే ముందుముందు ఎలాంటి ఉపయోగం లేదని భావిస్తే మాత్రం క్లోజ్ చేయడం ఉత్తమం అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అది దుర్వినియోగం జరిగితే లేనిపోని చిక్కులు వస్తాయని చెబుతున్నారు. జాగ్రత్తే ముఖ్యం గ్యాస్ సిలిండర్ నుంచి రైల్వే టికెట్ బుకింగ్ వరకు ఆధార్కార్డుది అవసరం. అందుకే ఆధార్ అనేది చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా తప్పనిసరి. మరణించిన వారి ఆధార్ కార్డు ఏం చేయాలనేది కొందరి సందేహం. అయితే పాన్ కార్డు లాగా ఆధార్ ను రిటర్న్ చేసే వెసలుబాటు లేదు. ఆధార్ నంబర్ ఒకరికి కేటాయిస్తే.. ఆ మనిషి బతికి ఉన్నా మరణించినా కూడా అతనికే వర్తిస్తుంది. ఎందుకంటే దానిపై సమస్త సమాచారాన్ని నిక్షిప్తం చేస్తారు. కాబట్టి ఆధార్ కార్డును క్లోజ్ చేసుకునే అవకాశం లేదు. అయితే ఇది దుర్వినియోగం అవ్వకుండా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. చదవండి:మీ పాన్ కార్డ్ పోయిందా..! ఇలా డౌన్లోడ్ చేసుకోండి -
ఫాస్టాగ్: ప్రయోజనాలెన్నో.. సద్వినియోగం చేసుకుందాం
ఏఎన్యూ: జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల సమయం, శ్రమ ఆదా చేయడంతోపాటు సులభతరమైన నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా ఫాస్టాగ్ను తప్పనిసరి చేసింది. దీంతో చాలా టోల్ ప్లాజాలు ఫాస్టాగ్ విధానాన్ని తప్పని సరిగా అమలు చేస్తుండగా, కొన్ని టోల్ ప్లాజాల వద్ద కొంత సడలింపునిచ్చి నగదు లావాదేవీలు జరపుతుండగా, మరికొన్ని పాజాల వద్ద ఫాస్టాగ్ లేని వాహనాలకు జరిమానా రూపంలో అధిక ఫీజులు కూడా వసూలు చేస్తున్నారని వాహన దారులు చెబుతున్నారు. ఫాస్టాగ్ పొందడం ఎలా.. ఫాస్టాగ్ను టోల్ ప్లాజాల వద్ద గుర్తింపు పొందిన బ్యాంకులు, వాలెట్ సంస్థలు టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాలు, లేదా ఫాస్టాగ్ సేవలకు అనుమతించిన జాతీయ బ్యాంకుల్లోనూ ఫాస్టాగ్ను వాహన దారుడు పొందవచ్చు. ఫాస్టాగ్ అనుమతి ఉన్న బ్యాంకులు, వాలెట్ సంస్థలు.. దేశ వ్యాప్తంగా 22 జాతీయ బ్యాంకులు పలు వాలెట్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ సేవలకు అనుమతించింది. బ్యాంకుల్లో.. ఐసీఐసీఐ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐడీఎఫ్సీ, కరూర్ వైశ్యా బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఐడీబీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సెస్ బ్యాంక్, కెనరా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సిటీ యూనియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆర్బీఎల్, సౌత్ ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్లతోపాటు ఎయిర్టెల్, పేటీఎం, ఈక్విటాస్, ఐహెచ్ఎంసీఎల్, పాల్ మర్చెంట్స్ వంటి వాలెట్లలో ఫాస్టాగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఫాస్టాగ్ పొందేందుకు ఏ పత్రాలు సమర్పించాలి... ఫాస్టాగ్ పొందేందుకు వాహనదారుడు తన వాహనానికి సంబంధించిన ఆర్సీ, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్స్లను సంబంధిత ధరఖాస్తుకు జత చేయాలి. సంబంధిత సంస్థ లేదా బ్యాంకు కేంద్రం వారు సంబంధిత పత్రాలను పరిశీలించిన వెంటనే ఫాస్టాగ్ జారీ చేస్తారు. రీఛార్జ్ ఎలా.. ఫాస్టార్ రీఛార్జ్ను వాహన దారుడు ప్రభుత్వం గుర్తించిన 22 బ్యాంకుల్లో ఏదైనా బ్యాంకులో ఖాతా కలిగి ఉంటే ఆ ఖాతాకు ఫాస్టాగ్ను జత చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతా నుంచి ఫాస్టాగ్ ద్వారా టోల్ ప్లాజా వద్ద ఆటోమేటిక్గా చెల్లింపులు చేయబడతాయి. లేదా ఫోన్ పే, గూగుల్ పే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ఫాస్టాగ్ కేంద్రాల ద్వారా ప్రీపెయిడ్ విధానంలో ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవచ్చు. చెల్లింపులు ఎలా జరుగుతాయి.. వాహన దారుడు దాటుటున్న టోల్ ప్లాజా వద్ద నిర్ధేశించిన టారిఫ్ను బట్టి ఫాస్టాగ్ ఎకౌంట్ నుంచి నగదు ఆటోమేటిక్గా కట్ అవుతుంది. సింగిల్ ప్రయాణమా, అప్ అండ్ డౌన్ కావాలా అనేది చెప్పాల్సినవసరం లేదు. ఒక సారి టోల్ ప్లాజా దాటుతుంటే సింగల్ జర్నీ క్రింద నిర్థేశించిన మొత్తం కట్ అవుతుంది. అదే వాహన దారుడు 24 గంటల లోపు మరలా అదే టోల్ గేట్ నుంచి తిరిగి వెనుకకు వెళితే సింగిల్ ప్రయాణంలో సగం మొత్తం మాత్రమే కట్ అవుతుంది. లోకల్ పాస్ విధానమూ అందుబాటులో... ఫాస్టాగ్ సౌకర్యం ఉన్న వాహన దారుడు తమకు దగ్గర్లోని టోల్ ప్లాజా వద్ద లోకల్ పాస్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. వాహనదారుడు ఆ టోల్ ప్లాజా నుంచి నిర్థేశించిన కిలోమీటర్లలోపు ప్రాంతంలో నివసిస్తున్నట్లు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, వాహనం ఆర్సీతోపాటు మూడు నెలల లోపు చెల్లింపులు జరిగిన గ్యాస్ బిల్లు వంటి అడ్రస్ ఫ్రూఫ్ జిరాక్సులను సంబంధిత టోల్ ప్లాజా వద్ద కేంద్రంలో సమర్పించాలి. లోకల్ పాస్ కోసం ఆ టోల్ ప్లాజా నిర్ధేశించిన మొత్తాన్ని చెల్లించాలి. లోకల్ పాస్ ఉన్న వాహనదారుడు నెలలో ఎన్నిసార్లయినా ఆ టోల్ప్లాజా నుంచి ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఐసీఐసీఐ ఫాస్టాగ్ లోకల్ పాస్ వినియోగదారులకు 11 నెలల ఆటో రెన్యువల్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. పదకొండు నెలల తరువాత మరలా నిర్ధేశిత పత్రాలు సమర్పించి ఆటో రెన్యువల్ పొందవచ్చు. లేదా టోల్ ప్లాజా వద్ద ఉన్న కేంద్రంలో ప్రతి నెలా ఒకటవ తారీఖు కల్లా నిర్ధేశించిన నగదు చెల్లించి మంత్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆటోరెన్యువల్ లోకల్ పాస్ సౌకర్యం ఉన్న ఫాస్టాగ్ వినియోగదారుడు ప్రతినెలా 27వ తేదీకల్లా తమ ఫాస్టాగ్ ఎకౌంట్లో నిర్ధేశించిన మొత్తం బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఒక వేళ ఆ ఎకౌంట్లో బ్యాలెన్స్ లేకపోతే ఆటోరెన్యువల్ జరగదు. -
మీ పాన్ కార్డ్ పోయిందా..! ఇలా డౌన్లోడ్ చేసుకోండి
పాన్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం మన దగ్గర ఉండాల్సిన కీలకమైన డాక్యుమెంట్లలో ఇది కూడా ఒకటి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం దగ్గరి నుంచి బ్యాంక్ ఖాతా ఓపెనింగ్, క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవడం వరకు చాలా సందర్భాల్లో పాన్ కార్డు అవసరం పడుతూ వస్తుంది. అందుకే పాన్ కార్డును జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒకవేళ మీ పాన్ కార్డు కనిపించకుండాపోతే మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు మళ్లీ పాన్ కార్డు కోసం అప్లిచేసుకోవచ్చు. డూప్లికేట్ పాన్ కార్డు మీ ఇంటికి వస్తుంది. దీనికి రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లోనే డూప్లికేట్ ఈ-పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ-పాన్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి.. ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్ ఓపెన్ చేయండి డౌన్లోడ్ ఈ-పాన్ కార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీ పాన్ నెంబరు, ఆధార్ నెంబరును నమోదు చేయాల్సి ఉంటుంది. మీ పుట్టిన తేదీని నమోదు చేసి, నియమ నిబంధనలను ఆమోదించండి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరుపై ఓటీపీని అందుకుంటారు. ఓటీపీ ధృవీకరించిన తర్వాత పేమెంట్ చేయడానికి ఒక ఆప్షన్ మీ ముందు కనిపిస్తుంది. మీరు రూ.8.26 చెల్లించాల్సి ఉంటుంది. మీరు పేటిఎమ్, యుపీఐ, క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఈ పాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు పేమెంట్ చేసిన తర్వాత పీడిఎఫ్ లో ఈ-పాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు పాస్ వర్డ్ అవసరం అవుతుంది. దీనికి పాస్ వర్డ్ మీ పుట్టిన తేదీ. ఒకవేళ మీరు ఎప్పుడైనా పాన్ కార్డును కోల్పోతే, మీరు ఒకేసారి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఇది కాకుండా, మీ పాన్ తో ఏదైనా బినామీ లావాదేవీ జరిగిందా లేదా అని ఫారం 26ఎఎస్ నుంచి మీరు తెలుసుకోవచ్చు.(చదవండి: రుణ గ్రహీతలకు ఎస్బీఐ పండుగ బొనాంజా ఆఫర్లు) -
మార్చిలోగా పాన్–ఆధార్ అనుసంధానం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాన్ కార్డ్ నంబర్తో ఆధార్ అనుసంధానానికి గడువు తేదీని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఆర్థిక శాఖకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఈ మేరకు గడువు తేదీని 2022 మార్చి 31 వరకు పొడిగించింది. పాన్ నంబర్తో అనుసంధానానికి ఆధార్ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు సమరి్పంచాల్సిన గడువు తేదీ వాస్తవానికి ఈ ఏడాది సెపె్టంబర్ 30. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ తేదీని సవరిస్తూ మీడియా, టెక్నికల్ పాలసీ ఇన్కం ట్యాక్స్ కమిషనర్ సురభి అహ్లువాలియా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదాయపు పన్ను చట్టం–1961 కింద జరిమానా విచారణలు పూర్తి చేయడానికి గడువు కూడా 2022 మార్చి 31 వరకు పొడిగించారు. -
పాన్ కార్డు- ఆధార్ కార్డు లింక్పై కేంద్రం కీలక ప్రకటన
గత కొన్నిరోజుల నుంచి ఆదాయపన్ను శాఖ వెబ్సైట్లో తలెత్తిన సమస్యలతో పన్ను చెల్లింపుదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటున్న విషయం తెలిసిందే. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆదాయపన్ను శాఖ కీలక ప్రకటన చేసింది. పాన్ కార్డును ఆధార్ కార్డ్తో లింక్ చేయడానికి చివరి తేదీని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలపాటు పొడిగించింది. పాన్ కార్డును ఆధార్తో లింక్ చేసే గడువు 2022 మార్చి 31. పాన్ కార్డును ఆదార్కార్డుతో లింక్ చేసే గడువును పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఒక ప్రకటనను విడుదల చేసింది. దీంతో ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కాస్త ఉపశమనం లభించనుంది. చదవండి: youtube: యూట్యూబ్ను దున్నేస్తున్నారు, రోజూ 1,500 కోట్ల షార్ట్ వీడియోస్ పాన్ కార్డును, ఆధార్తో అనుసంధాన గడువు పొడిగించడం ఇది నాలుగో సారి. ఈ ఏడాది ప్రవేశ పెట్టిన ఆర్ధిక బిల్లులో ప్రభుత్వం కొన్ని సవరణలను చేసింది. కొత్త నిబందనల ప్రకారం ఒక వ్యక్తి పాన్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే రూ.1000 వరకు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పాన్-ఆధార్ లింకింగ్ పొడగింపు నిర్ణయంతో పాటు మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగి కొవిడ్ చికిత్సకు కంపెనీలు చెల్లించే మొత్తానికి పన్ను మినహాయింపు వర్తిస్తుందని కూడా కేంద్రం పేర్కొంది. In view of the difficulties being faced by the taxpayers, the Central Govt has extended certain timelines. CBDT Notification No. 113 of 2021 in S.O. 3814(E) dated 17th September, 2021 issued which is available on https://t.co/qX8AZ4HCvf. pic.twitter.com/D3pIf64CoU — Income Tax India (@IncomeTaxIndia) September 17, 2021 మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇలా లింక్ చేయండి.. ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ వెబ్సైట్ www.incometaxindiaefiling.gov.inకి లాగిన్ అవ్వండి. 'లింక్ ఆధార్' ఆప్షన్పై క్లిక్ చేయండి సంబంధిత ఫీల్డ్లలో పాన్ నంబర్, ఆధార్ నంబర్, మీ పూర్తి పేరునమోదు చేయాలి. తరువాత పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయండి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి, పేజీ దిగువన ఉన్న ‘లింక్ ఆధార్’ బటన్పై క్లిక్ చేస్తే మీ పాన్ కార్డు విజయవంతంగా ఆధార్ కార్డుతో అనుసంధానం జరిగినట్లు పాప్ఆప్విండో వస్తుంది. చదవండి: Ford India Shutdown: భారత్కు దిగ్గజ కంపెనీ గుడ్బై, పరిహారంపై రాని స్పష్టత -
సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!
మీకు ఈపీఎఫ్ ఖాతా ఉందా? అయితే, వెంటనే మీ ఖాతాను ఆధార్ నెంబర్ తో లింకు చేయండి లేకపోతే వచ్చే నెల సెప్టెంబర్ 1 నుంచి కొత్త నిబందనలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెల సెప్టెంబర్ 1 నుంచి ఆధార్, పాన్ లింకింగ్, ఎల్పీజీ ధరలు, జీఎస్టీ నిబంధనలు, గూగుల్ యాప్స్ పర్మిషన్ లకు మార్పులు చోటు చేసుకోనున్నాయి. సాధారణంగా ప్రతీ నెల ప్రారంభంలో కొత్త నిబందనలు అమల్లోకి వస్తుంటాయి. మరి సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఏంటీ? అవి మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేయనున్నయో? తెలుసుకోండి. (చదవండి: అవును 'నేను ఏలియన్ని' : ఎలోన్ మస్క్) కొత్త పీఎఫ్ రూల్ సెప్టెంబర్ 1 వరకు పీఎఫ్ ఖాతాతో ఆధార్ కార్డును లింక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేల మీరు లింకు చేయకపోతే మీకు అందించే ఈపీఎఫ్ ప్రయోజనాలు తగ్గించవచ్చు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఆధార్ కార్డును పీఎఫ్ ఖాతాతో లింక్ చేయాలని గతంలో జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది. మీ ఈపీఎఫ్ ఖాతాలో సంస్థ జమ చేసే నగదు జమ కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఆధార్ - పాన్ లింకింగ్ మీరు పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇంకా లింక్ చేయలేదా? అయితే, వెంటనే లింక్ చేయండి. ఒకవేళ మీరు లింక్ చేయకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేగాకుండా రూ.1000 జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. పాన్ ఆధార్ లింక్ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధర ఎల్పీజీ సిలిండర్ ధరలు సెప్టెంబర్ 1 నుంచి మారనున్నాయి. ముఖ్యంగా, గత రెండు-మూడు నెలలుగా ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి. జీఎస్టీ కొత్త నిబంధన జీఎస్టీఆర్-3బీ రిటర్న్స్ ఫైల్ చేయని ట్యాక్స్పేయర్స్ జీఎస్టీఆర్-1 రిటర్న్స్ ఫైల్ చేయకుండా ఆంక్షలు విధించే సెంట్రల్ జీఎస్టీ రూల్స్లోని రూల్ 59(6) సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానుంది. వ్యాపారులు ఈ నెలకు సంబంధించిన జీఎస్టీఆర్-3బీ వచ్చే నెల 20 నుంచి 24 వరకు ఫైల్ చేయాలి. ఆ తర్వాతి నెలలో జీఎస్టీఆర్-1 ఫైల్ చేయాలి. చెక్స్ క్లియరెన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) చెక్స్ క్లియరెన్స్ కోసం పాజిటీవ్ పే సిస్టమ్ అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిస్టమ్ సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనుంది యాక్సిస్ బ్యాంక్. భారీ మొత్తంలో చెక్స్ ఇచ్చేముందు కస్టమర్లు సంబంధిత బ్యాంకులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. చెక్ మోసాలను అరికట్టడానికి పాజిటీవ్ పే సిస్టమ్ తీసుకొచ్చినట్లు ఆర్బీఐ పేర్కొంది. సెబీ కొత్త నిబంధన స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి పీక్ మార్జిన్ నార్మ్స్ అమలు చేస్తోంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నాలుగో దశ నియమ నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. -
పాన్, పీఎఫ్- ఆధార్ లింక్పై కీలక ప్రకటన
పాన్ కార్డు, ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్వో) అకౌంట్లతో ఆధార్ కార్డు లింక్ చేసే వ్యవహారంలో తీవ్ర గందరగోళం నెలకొంటోంది. చివరి తేదీలు ఎప్పుడు?, టెక్నికల్ ఇష్యూస్ తదితరాలపై రకరకాల కథనాలతో స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. యూఐడీఏఐ సిస్టమ్లో సమస్యలు తలెత్తుతున్నాయన్న మీడియా కథనాలపై Unique Identification Authority of India (UIDAI) స్పందించింది. ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేవని శనివారం ఒక ప్రకటన ద్వారా తేల్చి చెప్పింది. ఆధార్ లింక్కు తేదీలు దగ్గర పడుతుండడంతో సాంకేతిక సమస్యలుంటున్నాయని కొన్ని మీడియా హౌజ్లలో కథనాలు రావడం జనాల్లో గందరగోళానికి గురి చేస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే తాము స్పందించాల్సి వచ్చిందని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఎన్రోల్మెంట్, మొబైల్ నెంబర్ అప్డేట్ సర్వీసుల్లో మాత్రం కొంత అసౌకర్యం కలిగిందన్న మాట వాస్తవమేనని, ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం అయ్యిందని తెలిపింది. వీటికి పాన్ కార్డు, పీఎఫ్ అకౌంట్లకు ఆధార్ లింక్కు ఎలాంటి సంబంధం లేదని, లింక్ అప్గ్రేడేషన్ కొనసాగుతోందని పేర్కొంది. రోజుకు ఐదు లక్షల మందికి పైగా.. గత తొమ్మిది రోజుల్లో యాభై లక్షల మందికి పైగా అప్గ్రేడేషన్ చేసుకున్నారని యూఏడీఐఏ పేర్కొంది. ఇదిలా ఉంటే యూపీఎఫ్వో అకౌంట్తో ఆధార్ కార్డు లింక్కు తుది తేదీ సెప్టెంబర్ 1 కాగా, పాన్ కార్డుతో మాత్రం సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. ఈపీఎఫ్ కొత్త నిబంధనల ప్రకారం కచ్చితంగా పీఎఫ్ ఖాతాను ఆధార్తో లింక్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే పీఎఫ్ లో సంస్థ జమ చేసే నగదు మొత్తంపై ప్రభావం పడనుంది. క్లిక్ చేయండి: ఈపీఎఫ్ - ఆధార్ లింకు విధానం ఇలా.. -
పాన్ కార్డు హోల్డర్లకు హెచ్చరిక!
మీ దగ్గర పాన్ కార్డు ఉందా? ఇంకా మీరు పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇంకా లింక్ చేయలేదా? అయితే, వెంటనే లింక్ చేయండి. ఒకవేళ మీరు లింక్ చేయకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేగాకుండా రూ.1000 జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సమాచారాన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు తెలియజేస్తున్నాయి. పాన్ ఆధార్ లింక్ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. అంటే మీరు వచ్చే నెల చివరి వరకు కచ్చితంగా రెండింటినీ అనుసంధానం చేసుకోవాలి లేకపోతే మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. దీంతో మీరు పాన్ కార్డును అవసరం ఉన్న చోట ఉపయోగించలేరు. గతంలోనే జూన్ 30 వరకు ఉన్న పాన్-ఆధార్ లింక్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడగించింది. ఇప్పుడు మరోసారి పొడగించే అవకాశాలు కూడా తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ముందే మీరు లింక్ చేసుకోవడం మంచిది. మీ పాన్ను ఆధార్తో లింక్ చేయకపోతే బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో అసౌకర్యానికి గురి అయ్యే అవకాశం అవకాశం ఉంటుంది. ఇంకా పెన్షన్, స్కాలర్షిప్, ఎల్పీజి సబ్సిడీ వంటి పథకాలకు ద్రవ్య ప్రయోజనాలను పొందేటప్పుడు పాన్ తప్పనిసరి.(చదవండి: పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయడం ఎలా..?) -
సచివాలయాల్లోనే ఆధార్, పాన్ కార్డు సేవలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం మరిన్ని సేవలు అందుబాటులోకి తెస్తోందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆధార్, పాన్ కార్డ్ లాంటి సేవలు అందించనున్నట్టు చెప్పారు. విజయవాడలో గురువారం గ్రామ, వార్డు సచివాలయాలపై అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. సచివాలయ సేవలను మరింత విస్తరించడం, ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. వలంటీర్, సచివాలయ వ్యవస్థలు సీఎం వైఎస్ జగన్ మానసపుత్రికలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల నుంచి పుట్టిన ఈ వ్యవస్థల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందించగలుగుతున్నామన్నారు. ప్రతి నెలా చివరి శుక్ర, శనివారాల్లో సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటినీ సందర్శిస్తారన్నారు. ప్రభుత్వ పథకాలతో కూడిన కరపత్రాలను సచివాలయ సిబ్బంది, వలంటీర్లు తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి అందిస్తారని చెప్పారు. ఎవరికైనా ప్రభుత్వ పథకాలు అందకపోతే.. అర్హులను గుర్తిస్తారని వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చే ఫిర్యాదుల్లో పరిష్కారమైనవి, తిరస్కరించినవి వేర్వేరుగా చూపాలని అధికారులకు సూచించామన్నారు. సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లను ఆదేశించారని గుర్తు చేశారు. ఇకపై నెలకు రెండుసార్లు మంత్రులం కూడా సందర్శిస్తామని చెప్పారు. సీఎం జగన్ గ్రామ స్థాయి పర్యటనలు ప్రారంభించేలోపు సచివాలయాలన్నింటినీ పూర్తిగా సిద్ధం చేస్తామన్నారు. వాటి పనితీరును మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా డిపార్ట్మెంట్ పరీక్షలు ప్రొబేషన్ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను కొంతమంది తప్పుదారి పట్టిస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొబేషన్ విషయంలో ఎటువంటి రాజకీయాలు ఉండవన్నారు. ఉద్యోగులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కోరారు. ఆగస్టులో, సెప్టెంబర్లో డిపార్ట్మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 35 శాతం మందికి పరీక్షలు పూర్తయ్యాయన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక సీఎస్ అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్!
ఎస్బీఐ తన బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ తో తప్పనిసరిగా సెప్టెంబర్ 30, 2021లోపు లింక్ చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులను కోరింది. "ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139ఏఏ ప్రకారం ఆధార్ నంబర్ ను, శాశ్వత ఖాతా నంబర్(పాన్)తో 30 సెప్టెంబర్ 2021 నాటికి లింక్ చేయడం తప్పనిసరి" అని ఎస్బీఐ తెలిపింది. అయితే, ఖాతాదారులకు ఈ విషయాన్ని గుర్తు చేయడానికి బ్యాంకు కొన్ని రోజులుగా ట్వీట్ చేస్తూనే ఉంది. ఒకవేల ఖాతాదారులు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ తో లింకు చేయడంలో విఫలమైతే వారి బ్యాంక్ సేవల విషయంలో అంతరాయం ఇబ్బందులు ఎదుర్కొంటారని రుణదాత తెలిపారు. " ఎటువంటి అంతరాయం లేని బ్యాంకింగ్ సేవలను ఆస్వాదించడానికి పాన్ నెంబర్ ను, ఆధార్ తో లింక్ చేయమని మా కస్టమర్లకు మేము సలహా ఇస్తునాము" అని ఎస్బీఐ ట్వీట్ చేసింది. కరోనా వైరస్ మహమ్మారి దృష్ట్యా పాన్ ను ఆధార్ తో అనుసంధానం చేసే గడువును గత నెలలో కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు పొడగించిన విషయం తెలిసిందే. గతంలో ఈ గడువును మార్చి 30 నుంచి జూన్ 30 వరకు పొడగించారు. మీ పాన్ ను ఆధార్ తో లింక్ చేయడం కొరకు మీరు www.incometax.gov.in ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి లింకు చేయాల్సి ఉంటుంది. We advise our customers to link their PAN with Aadhaar to avoid any inconvenience and continue enjoying a seamless banking service.#ImportantNotice #AadhaarLinking #Pancard #AadhaarCard pic.twitter.com/p4FQJaqOf7 — State Bank of India (@TheOfficialSBI) July 16, 2021 ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్ తో పాన్ ను లింక్ చేయవచ్చు. దీని కొరకు మీరు UIDPAN ఫార్మెట్ లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి 567678 లేదా 56161కు ఎస్ఎమ్ఎస్ పంపాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి పాన్-ఆధార్ ని గడువు తేదీ నాటికి లింక్ చేయడంలో విఫలమైనట్లయితే, అప్పుడు అతడు/ఆమె గరిష్టంగా రూ.1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
మీ పాన్ కార్డు నకిలీదేమో గుర్తించండి ఇలా?
మనదేశంలో ఇప్పుడు ఆధార్ కార్డు ఎంత ముఖ్య మైనదో అదే మాదిరిగా పాన్ కార్డు చాలా విలువైనది. బ్యాంక్ ఖాతా తీసుకోవాలన్న, హోమ్ లోన్, పర్సనల్ లోన్ తీసుకోవాలి అన్న పాన్ కార్డు తప్పనిసరి. ఆదాయపు పన్ను శాఖ క్షణాల్లో పాన్ కార్డులను జారీ చేస్తుంది. మీరు ఆన్లైన్లో ద్వారా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆధార్ కార్డు ఉంటే చాలు కేవలం నిమిషాల్లోనే ఈ-పాన్కార్డును తీసుకోవచ్చు. ఎన్ఎస్డీఎల్, యూటీఐఐటీఎస్ఎల్ వెబ్సైట్ల ద్వారా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. ఈ పాన్ కార్డు అయితే కొందరు మోసాగాళ్లు కొత్త టెక్నాలజీని ఉపయోగించుకుని పాన్ కార్డ్ విషయంలో మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు నకిలీ కార్డులను సృష్టిస్తున్నారు. అలాగే, ఇతరులు ఇచ్చిన వివరాలు నిజమైనవేనా అనే గుర్తించే అవకాశం ఇప్పుడు ఉంది. అందువల్ల కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ పాన్ కార్డు నిజమైందా? కాదా? అని సులభంగానే తెలుసుకోవచ్చు. నకిలీ పాన్ కార్డు గుర్తించడం ఎలా..? ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి. Our Service విభాగంలో 'Verify Your PAN' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పాన్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ నమోదు చేసి 'Continue' మీద చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి క్లిక్ చేసి "ప్రొసీడ్" నొక్కాలి. ఇప్పుడు ఆ పాన్ సరైనది అయితే, "PAN is Active and details are as per PAN" అనే మెసేజ్ వస్తుంది. ఇలా వస్తే పాన్ కార్డు ఒరిజినల్ అని అర్ధం లేకపోతే నకిలిదీ అని గుర్తుంచుకోవాలి. పైన చెప్పిన విధంగా మీ పాన్ కార్డు నిజమైందో కాదో తెలుసుకోండి. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో మన పేరు మీదనే నకిలీ కార్డులను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. -
మరోసారి పాన్-ఆధార్ లింక్ గడువు పొడగింపు
పాన్-ఆధార్ లింకింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడగించింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో గడువును మూడు నెలలు సెప్టెంబర్ 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన గడువు జూన్ 30తో దగ్గర పడుతున్న వేళ కేంద్రం ఈ కీలక ప్రకటన చేసింది. మొదట పాన్-ఆధార్ లింకు గడువును మార్చి 31 పేర్కొన్నారు. తర్వాత కూడా కరోనా మహమ్మరి వల్లనే జూన్ 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తాజాగా మరోసారి మూడు నెలల పాటు పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ప్రవేశ పెట్టిన ఆర్ధిక బిల్లులో ప్రభుత్వం ఒక సవరణను కూడా చేసింది. కొత్త నిబందనల ప్రకారం ఒక వ్యక్తి పాన్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే రూ.1000 వరకు ఆలస్యం రుసుము కింద ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పాన్-ఆధార్ లింకింగ్ పొడగింపు నిర్ణయంతో పాటు మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగి కొవిడ్ చికిత్సకు కంపెనీలు చెల్లించే మొత్తానికి పన్ను మినహాయింపు వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. Relief to Income Tax Payer ✅Time to invest in residential house for tax deduction extension for more than 3 months. ✅PAN Aadhar Linking Extension of 3 months ✅Vivad se Vishwas Payment without interest - extension by 2 months from 30th June to 31st August https://t.co/xRz1SxfzKS pic.twitter.com/hEOLqXzGHh — Anurag Thakur (@ianuragthakur) June 25, 2021 అలాగే, కొవిడ్తో మరణించిన ఉద్యోగి కుటుంబాలకు కంపెనీలు చెల్లించే పరిహారానికి కూడా ఈ మినహాయింపు ఇచ్చినట్లు పేర్కొంది. వివాద్ సే విశ్వాస్ పథకం గడువును మరో రెండు నెలలు (ఆగస్టు 31 వరకు) పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఫారం-16 గడువును జులై 15 నుంచి జులై 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. అలాగే నిబందనల ప్రకారం మొదటిసారి ఇల్లును కొనుగోలు చేస్తే దానిపై పెట్టె పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇప్పుడు ఈ గడువును జూన్ 30 నుంచి మరో 3 నెలలు పొడగించింది. చదవండి: పీఎఫ్ ఖాతాలో బ్యాంక్ ఖాతా వివరాలు అప్ డేట్ చేయండి ఇలా? -
కొత్తరకం మోసం: ఆధార్కు రూ.200.. పాన్కు రూ.500
పెదగంట్యాడ(గాజువాక): ఆధార్ కార్డు ఉందా.. ఆ నంబరు చెప్పండి.. ఇక్కడ వేలి ముద్ర వేయండి.. ఇదిగో తీసుకోండి రూ.200.. పాన్ కార్డు ఉందా అయితే దీనికి ఇవిగో రూ.500 అంటూ కొంతమంది వ్యక్తులు కొత్తరకం మోసానికి తెరతీశారు.. అంతేకాకుండా పేదలను లక్ష్యంగా చేసుకుని వారికి డబ్బు ఎరచూపి.. వారి పేరుతో సిమ్ కార్డులు విక్రయానికి పథకం పన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి వారి అక్రమాలకు అడ్డుకట్ట వేసి అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి హార్బర్ ఏసీపీ శ్రీరాముల శిరీష తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని రాంబిల్లి మండలానికి చెందిన కొవిరి జగన్నాథం, జానకి రామిరెడ్డి, బండియ్య, కొవిరి నాని అనే నలుగురు వ్యక్తులు శనివారం మండలంలోని వికాస్నగర్ సెంటర్, బీసీ రోడ్డుకు ఆనుకొని ఉన్న కమ్మలపాకల్లో ఉంటున్న వారిని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామంటూ పేదలను నమ్మబలికారు. ఆధార్ కార్డు, పాన్కార్డు ఉన్న వారి వివరాలు సేకరించి, వారితో వేలిముద్ర వేయించి వారికి డబ్బులు ఇవ్వడం మండలంలో సంచలనమైంది. కొవిరి నాని అనే వ్యక్తి కొత్తపట్నంలో సెల్ షాప్ నడుపుతున్నాడు. అతను ఓ ప్రయివేటు కంపెనీ సిమ్కార్డులను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు. అక్రమంగా డబ్బు సంపాదించాలనే దురాశతో కొత్తరకం మోసానికి తెరలేపాడు. ఇందుకు మరో ముగ్గురితో కలిసి పేదలకు డబ్బులు ఇప్పించి.. వారి ఆధార్, పాన్ కార్డుల ద్వారా సిమ్కార్డులను ఎక్కువధరకు అమ్ముకునేలా పథకం రచించాడు. ఆ సిమ్లను ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడుకునే వారికి అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నాడు. ఆధార్ వివరాలు సేకరించి డబ్బులు ఇస్తున్నారని తెలియడంతో కొంతమంది వ్యక్తులు అది మోసం అని గ్రహించి వెంటనే 100కు సమాచారం ఇచ్చారు. వెంటనే న్యూపోర్టు పోలీసులు వారు ఉన్న స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసిన వెంటనే నలుగురిలో ముగ్గురు పరారయ్యారు. కొవిరి జగన్నాథంను శనివారం అదుపులోకి తీసుకున్నారు. జానకి రామిరెడ్డిని ఆదివారం అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేందుకు ప్రయత్నించిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. న్యూపోర్టు సీఐ ఎస్.రాము కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బంజారాహిల్స్: మూడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. భర్త కొట్టడంతో.. -
అలర్ట్: దగ్గర పడుతున్న ఆధార్ పాన్ లింక్ గడువు
పాన్ కార్డుదారులకు అలర్ట్. గతంలో మార్చి 31 వరకు ఉన్న ఆధార్-పాన్ లింకు గడువును కేంద్రం కరోనా మహమ్మారి నేపథ్యంలో జూన్ 30 వరకు పొడగించింది. ఒకవేల ఈ గడువు లోపు లింక్ చేయకపోతే రూ.1000 ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు 2021 ఆర్థిక బిల్లులో ప్రభుత్వం కొత్త సెక్షన్ 234 హెచ్ను ప్రవేశపెట్టింది. గతంలో మాదిరి ఈసారి పొడగించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. బ్యాంకు సంబంధిత పనులు, ఆదాయపు పన్ను సంబంధిత కార్యకలాపాల కోసం ఆధార్-పాన్ లింక్ చేయడం తప్పనిసరి. పాన్ ప్రధానంగా ఎక్కడ అవసరం? మోటార్ వేహికల్ లేదా టూ వీలర్ కాకుండా ఏదైనా వేహికల్ ని అమ్మలన్న లేదా కొనాలన్న ఆధార్ తప్పనిసరి. బ్యాంకింగ్ కంపెనీ/సహకార బ్యాంకులో ఖాతా తెరవడం. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి. డిపాజిటరీ, పార్టిసిపెంట్, సెక్యూరిటీల కస్టోడియన్ లేదా డీమ్యాట్ ఖాతాతెరవడం కోసం పాన్ తప్పనిసరి. ఒక హోటల్ లేదా రెస్టారెంట్ లో రూ.50,000 కంటే ఎక్కువ బిల్లు చెల్లించాలంటే. ఏ విదేశీ దేశానికైనా సంబంధించి రూ.50,000 మించి నగదు రూపంలో చెల్లించాలంటే. డిబెంచర్లు లేదా బాండ్లను కొనుగోలు చేయడానికి ఒక కంపెనీ లేదా సంస్థకు రూ.50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన బాండ్లను కొనుగోలు చేయడానికి రూ.50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తే. బ్యాంకు డ్రాఫ్ట్ లు, పే ఆర్డర్లు లేదా బ్యాంకింగ్ కంపెనీ లేదా కో ఆపరేటివ్ బ్యాంక్ నుంచి బ్యాంకర్ చెక్కుల కొనుగోలు కొరకు ఏదైనా ఒక రోజులో రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తానికి నగదు రూపంలో చెల్లించడం కోసం ఆధార్ తప్పనిసరి. చదవండి: పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయడం ఎలా..? -
పది నిమిషాల్లో ఈ-పాన్ కార్డు పొందండి ఇలా..?
పాన్ కార్డు తప్పనిసరి కానప్పటికీ ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్) ఫైలింగ్ చేయడానికి, బ్యాంక్ ఖాతా తెరవడం కోసం, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేయడం మొదలైన వాటికి కేవైసీ పూర్తి చేయడానికి కచ్చితంగా పాన్ అవసరం. అయితే, ఈ పాన్ కార్డు కోసం ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం మనం గంటల తరబడి గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు, కేవలం 10 నిమిషాల్లో తయారు చేయవచ్చు. ఈ-పాన్ కార్డు కోసం మనం ప్రత్యేకంగా ఎలాంటి ఫీజు లేదా ఛార్జీలు అవసరం లేదు. ఈ-పాన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ-పాన్ కార్డు పొందడం ఎలా? https://www.incometax.gov.in/iec/foportal/ వెళ్లి హోమ్ పేజీలో Our Service" విభాగంలో 'ఇన్ స్టంట్ ఈ-పాన్' ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు 'Get New e-PAN' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, చెక్ బాక్స్ క్లిక్ చేయండి. ఆధార్ నంబర్ తో లింకు చేసిన మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్ వివరాలను చెక్ చేసి మెయిల్ ఐడీ ఇవ్వకపోతే, ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేయండి. తర్వాత మీరు చెక్ స్టేటస్, డౌన్ లోడ్ పాన్ కార్డ్ మీద క్లిక్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్ లో పొందవచ్చు. గమనిక: ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త పోర్టల్ లో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ విషయం దృష్టిలో పెట్టుకోగలరు. -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే లింక్ చేయండి
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఖాతా ఉందా? మీరు ఇంకా పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేయలేదా? అయితే, వెంటనే లింక్ చేయండి లేకపోతే మీ ఖాతా, పాన్ కార్డ్ చెల్లవు. ఎస్బీఐ తన ఖాతాదారులను జూన్ 30 లోపు పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేయాలని కోరింది. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేసింది. "ఖాతాదారులు ఎటువంటి ఆటంకం లేని ఎస్బీఐ సేవలను పొందాలంటే మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని" ట్వీట్ లో పేర్కొంది పాన్ను ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి అని ట్వీట్లో పేర్కొన్నారు. పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయకుండా పోతుంది అని భవిష్యత్ లో లావాదేవీలను నిర్వహించడానికి కష్టం అవుతుంది అని పేర్కొంది. పాన్ను ఆధార్తో లింక్ చేయడానికి చివరి తేదీ జూన్ 30, 2021. గతంలో మార్చి 31 వరకు ఉన్న గడువును కరోనా మహమ్మారి దృష్ట్యా జూన్ 30 వరకు పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ను ఆధార్తో లింక్ చేయడానికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచే https://www.incometax.gov.in/ పోర్టల్ ద్వారా జూన్ 7 నుంచి లింక్ చేయవచ్చు. We advise our customers to link their PAN with Aadhaar to avoid any inconvenience and continue enjoying a seamless banking service.#ImportantNotice #AadhaarLinking #Pancard #AadhaarCard pic.twitter.com/LKIBNEz7PO — State Bank of India (@TheOfficialSBI) May 31, 2021 చదవండి: 2 నిమిషాల్లో పాన్-ఆధార్ అనుసంధానం -
Aadhaar Card: పోయినా... పొందవచ్చు
ప్రస్తుత సాంకేతిక యుగంలో మానవ జీవితం కార్డుల చుట్టూ తిరుగుతోంది. ఏటీఎం కార్డులు మొదలుకొని పాన్ కార్డు, ఆధార్, రేషన్ కార్డులు నిత్య జీవితంలో భాగమయ్యాయి. అందుకే వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకుంటాం. ఒక్కోసారి వివిధ కారణాల వల్ల ఆ కార్డులు పోయినప్పుడు ఆందోళనకు గురవుతుంటాం. అయితే కొంత సమయం తీసుకున్నా.. వాటిని తక్కువ ఖర్చుతోనే తిరిగి పొందవచ్చు. – కడప కార్పొరేషన్ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్న వెంటనే సంబంధిత పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. వారు అందించే నాన్ ట్రేస్డ్ సర్టిఫికెట్తోపాటు డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ను లాస్ ఆర్ డిస్ట్రడన్ ఆఫ్ లైసెన్స్ అండ్ అప్లికేషన్ ఫర్ డూప్లికేట్ ఫారం(ఎల్ఎల్డీ)తో రోడ్డు రవాణా కార్యాలయంలో అందించాలి. రూ.20 బాండ్ పేపర్పై కార్డు పోయిన వివరాలు తెలియజేయాలి. ఎల్ఎల్డీ ఫారంను సంబంధిత శాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రేషన్ కార్డు ప్రభుత్వం అందించే సబ్సిడీ సరుకుల కోసమే కాకుండా ఆదాయం సహా పలు రకాల ధ్రువపత్రాలు పొందేందుకు రేషన్ కార్డు ఉపయోగపడుతుంది. రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ కూడా వర్తిస్తుంది. ఆదాయ పత్రంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ కార్డు పోయినప్పుడు రేషన్ కార్డు నంబర్తో స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించాలి. వారు అదే నంబర్లో నామమాత్రపు రుసుంతో కొత్త కార్డు జారీ చేస్తారు. వెబ్సైట్ ద్వారా జిరాక్స్ కాపీ పొందవచ్చు. పాన్ కార్డు పాన్కార్డు(పర్మినెంట్ అకౌంట్ నంబర్) పోతే సంబంధిత ఏజెన్సీలో పాత పాన్కార్డ్ జిరాక్స్, రెండు కలర్ ఫొటోలు, నివాస ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనికి అదనంగా రూ.90 చెల్లించాలి. సుమారు 20 రోజుల్లో మరో కార్డును జారీ చేస్తారు. ఏటీఎం కార్డు బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించాలంటే ఏటీఎం కార్డు తప్పనిసరి. దీనిని పోగొట్టుకున్నా , ఎవరైనా దొంగిలించినా సంబంధిత బ్యాంకులో ఫిర్యాదు చేయాలి. సంబంధిత బ్యాంకు టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఏటీఎం కార్డును వెంటనే బ్లాక్ చేయించవచ్చు. బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించుకొని కొత్త కార్డు జారీ చేస్తారు. ఇందుకోసం సర్వీసు చార్జీలు వసూలు చేస్తారు. ఓటరు కార్డు కేవలం ఓటు వేయడానికి కాకుండా కొన్ని సార్లు నివాసం, పుట్టిన తేది ధ్రువీకరణ కోసం ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఓటరు కార్డును పోగొట్టుకుంటే పోలింగ్ బూత్ నంబర్, కార్డ్ నంబర్తోపాటు రూ.10 చెల్లించి, మీ సేవా కేంద్రంలో గానీ, గ్రామ, వార్డు సచివాలయంలో గానీ మళ్లీ కార్డు పొందవచ్చు. నంబర్ ఆధారంగా స్థానిక రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా అందజేస్తారు. ఆధార్ కార్డు ఈ కార్డు పోతే టోల్ఫ్రీ నంబర్ 18001801947కు కాల్ చేసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే.. కొత్త కార్డు మళ్లీ పోస్టు ద్వారా పంపిస్తారు. వెబ్సైట్లోగానీ, గ్రామ, వార్డు సచివాలయాల్లో గానీ పూర్తి సమాచారం పొందవచ్చు. పాస్పోర్ట్ పాస్పోర్ట్ పోగొట్టుకుంటే ముందుగా స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు విచారణ జరిపి ఆచూకీ లభించకపోతే.. నాన్ ట్రేస్డ్ ధ్రువీకరణ పత్రం ఇస్తారు. అనంతరం పాస్పోర్ట్ అధికారి పేరిట రూ.1000 డీడీ తీయాలి. ఈ రెండింటినీ జతపరిచి దరఖాస్తు చేయాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ జరిపి డూప్లికేట్ పాస్పోర్ట్ జారీ చేస్తారు. దీనికి 3 నెలల కాలం పడుతుంది. తత్కాల్ పాస్పోర్ట్ కోసం నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి. -
పది నిమిషాల్లో ఈ-పాన్ కార్డ్!
ఆధార్ కార్డు ఉంటే పది నిమిషాల్లోనే పాన్ కార్డును తీసుకునే సౌకర్యాన్ని ఆదాయపు పన్ను శాఖ కలిపిస్తుంది. గతంలో లాగా ఇప్పుడు ఈ-పాన్ కార్డు కోసం రెండు పేజీల్లో వివరాలు నింపి, కొద్దీ రోజుల పాటు వేచి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు తక్షణమే ఐటీ డిపార్టుమెంట్ ఈ-ఫైలింగ్ పోర్టల్ లో ఆధార్ కార్డు వివరాలు సమర్పించి పది నిమిషాల్లోనే పాన్ కార్డును తీసుకోవచ్చు. మరో ప్రయోజనకర విషయం ఏమంటే ఈ పాన్ కార్డు పూర్తిగా ఉచితం. అయితే ఇది ఈ-పాన్ నెంబర్. పీడీఎఫ్ రూపంలో దరఖాస్తుదారుడికి అందుతుంది. ఇప్పటివరకు పాన్ కార్డు లేని వారు దీనిని తీసుకోవడానికి అర్హులు. ఈ-పాన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ: ట్యాక్స్ పేయర్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్కు వెళ్లి లెఫ్ట్ సైడ్లోని క్విక్ లింక్స్ విభాగంలోని Instant PAN through Aadhaar పైన క్లిక్ చేయాలి. తర్వాత ఇప్పుడు మీకు కనిపించే Get New PANపైన క్లిక్ చేయాలి. కొత్త పాన్ కార్డు కోసం మీ ఆధార్ నెంబర్, కాప్చా ఎంటర్ చేయాలి. ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ, ఆధార్ వివరాలు ధృవీకరించాలి. పాన్ కార్డు అప్లికేషన్ కోసం మీ ఈ-మెయిల్ ఐడీని దృవీకరించాల్సి ఉంటుంది. ఆధార్తో ఈ-మెయిల్ అనుసంధానమై ఉంటే పాన్ పీడీఎఫ్ మెయిల్ రూపంలో వస్తుంది. చదవండి: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి! -
పాన్-ఆధార్ లింకు గడువును పొడగించిన కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్రం చివరికి పాన్ కార్డు-ఆధార్ లింకు గడువును పొడిగించింది. కొవిడ్-19 నేపథ్యంలో వీటిని లింక్ చేసేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. కొవిడ్-19 మహమ్మారి వల్ల తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 2021 మార్చి 31 నుంచి 2021 జూన్ 30 వరకు పాన్తో ఆధార్ నంబర్ను లింక్ చేసే గడువును పొడగిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. ఇంతకముందు మార్చి 31 వరకు మాత్రమే గడువు ఇస్తున్నట్లు పేర్కొన్న కేంద్రం.. ఆ లోగా లింక్ చేయకపోతే రూ.1000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. Central Government extends the last date for linking of Aadhaar number with PAN from 31st March, 2021 to 30th June, 2021, in view of the difficulties arising out of the COVID-19 pandemic.(1/2)@nsitharamanoffc@Anurag_Office@FinMinIndia — Income Tax India (@IncomeTaxIndia) March 31, 2021 చదవండి: గుడ్న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర -
ఇన్కం టాక్స్ వెబ్సైట్ క్రాష్
కోత్త ఆర్థిక సంవత్సరం 2021-22 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుండటంతో భారత ప్రభుత్వం మార్చి 31 వరకు ప్రజలు తమ శాశ్వత ఖాతా సంఖ్య(పాన్) ను ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి చివరి తేదీగా పేర్కొంది. గతంలో పాన్-ఆధార్ లింక్ గడువును పొడగించిన మాదిరిగానే ఈసారి కూడా పొడగిస్తారని వేచిచూశారు. కానీ, కేంద్రం గతంలో లాగే పాన్-ఆధార్ గడువును పొడగిస్తున్నట్లు ఎటువంటి సమాచారం లేదు. దీనితో చాలా మంది ప్రజలు పాన్-ఆధార్ లింక్ చేయడం కోసం ప్రయత్నించారు. కానీ, ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ మధ్యాహ్నం 12.30 గంటలకు రష్ పెరగడంతో పేజీ క్రాష్ అయింది. అప్పటి నుంచి పాన్ - ఆధార్ లింక్ పేజీ పనిచేయడం లేదు, దీనితో ప్రజలు నిరాశకు గురయ్యారు. చాలా మంది ప్రజలు వారి కోపాన్ని, ఆవేదనను ట్విట్టర్ ద్వారా వ్యక్తపరిచారు. మార్చి 31 నాటికి రెండు గుర్తింపు కార్డులు లింక్ చేయకపోవడం తప్పనిసరి, పాన్ కార్డు పనిచేయక పోవడమే కాకుండ అదనంగా రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కొత్త పాన్ కార్డు తీసుకోవాలని ప్రయత్నిస్తే భారీ మూల్యం భారీ జరిమానా విధిస్తారు. ఎక్కువ శాతం మంది గడువు తేదీని పొడిగించాలని లేదా వెబ్సైట్ను పునరుద్ధరించాలని ఆదాయపు పన్ను శాఖను కోరుతున్నారు. ప్రస్తుతం ఆ వెబ్సైట్లో పాన్ - ఆధార్ లింకు కనిపించక పోవడం మరొక విశేషం. @IncomeTaxIndia portal status on last date.#IncomeTax #ITRFiling #ExtendITRDueDate@FinMinIndia @nsitharaman @Anurag_Office pic.twitter.com/zzqbAa0naE — Saurabh Pandey (@ssaurabh05) March 31, 2021 చదవండి: నేడు చివరి తేదీ: పాన్-ఆధార్ లింకు స్టేటస్ చెక్ చేసుకోండిలా! వామ్మో! బ్యాంక్లకు ఇన్ని రోజులు సెలువులా? -
నేడు చివరి తేదీ: పాన్-ఆధార్ లింకు స్టేటస్ చెక్ చేసుకోండిలా!
మీరు ఇంకా పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయలేదా? అయితే, వెంటనే చేయండి లేకపోతే ఏప్రిల్ 1 నుంచి మీ పాన్ కార్డ్కు ఎలాంటి విలువ ఉండదు. పాన్ నెంబర్ ను ఆధార్ నెంబర్ తో లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా కోరుతున్నది. అనేకసార్లు చివరి తేదీని పొడగించిన ప్రస్తుతం మరోసారి పొడిగించే దాఖలాలు కనబడటం లేదు. ప్రస్తుతం పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేయడానికి నేడు (2021 మార్చి 31) చివరి తేదీ. ఈ రాత్రిలోగా మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయాల్సిందే. లేకపోతే మీ దగ్గర పాన్ కార్డ్ ఉన్నా లావాదేవీల కోసం వాడుకోలేరు. ఒకవేళ మీరు గడువు తర్వాత పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేసినట్టైతే రూ.1,000 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని లోక్సభలో ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్ 2021 లో నిబంధనను విధించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పాన్ కార్డుకు - ఆధార్ లింక్ చేసినట్లయితే ఈ-ఫైలింగ్ పోర్టల్ లింకు క్లిక్ చేసి ఆధార్, పాన్ నెంబర్ సమర్పించి స్టేటస్ తెలుసుకోవచ్చు. ఆధార్-పాన్ లింక్ విధానం: ఐటి విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్ను సందర్శించండి. 'క్విక్ లింకులు' విభాగం కింద వెబ్పేజీకి ఎడమ వైపున ఉన్న 'లింక్ ఆధార్'పై క్లిక్ చేయండి. ఆధార్ కార్డు ప్రకారం ఆధార్ నంబర్, మీ పేరు, పాన్ నెంబర్ వంటి వివరాలను నమోదు చేయండి. పుట్టిన సంవత్సరాన్ని మాత్రమే మీ ఆధార్ కార్డులో పేర్కొన్నట్లయితే కింద ఉన్న చెక్ బాక్స్ పై టిక్ చేయండి. 'నా ఆధార్ వివరాలను యుఐడిఏఐతో ధృవీకరించడానికి నేను అంగీకరిస్తున్నాను' అని ఉన్న బాక్స్ పై క్లిక్ చేయండి. మీ స్క్రీన్పై క్యాప్చా కోడ్ను ఎంటర్ స్క్రీన్ పై క్లిక్ చేయండి ఏదైనా దృశ్య లోపం ఉంటే వినియోగదారులు క్యాప్చా కోడ్కు బదులుగా వన్-టైమ్ పాస్వర్డ్ కోసం అభ్యర్థించవచ్చు. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. 'లింక్ ఆధార్' బటన్ పై క్లిక్ చేస్తే ఇప్పుడు మీ ఆధార్, పాన్ లింక్ అవుతాయి. చదవండి: ఈ స్కీమ్ గడువు పొడగించిన ఎస్బీఐ ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు -
మార్చి 31లోగా ఈ పనులను వెంటనే పూర్తి చేయండి!
కొత్త 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 1 నుంచి అనేక విషయాలలో కీలక మార్పులు జరగనున్నాయి. కాబట్టి మార్చి నెలలో ఎక్కువ శాతం ప్రజలు కొత్త నిబంధనల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, నిబంధనలకు గడువును పొడిగించిన విషయం తెలిసిందే. ఇందులో పాన్-ఆధార్ కార్డు లింకు, ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు గడువు వంటివి ఉన్నాయి. వీటి గడువు 2021 మార్చి 31వ తేదీతో ముగుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రింద తెలిపిన పనులను మార్చి 31వ తేదీ లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. పాన్ - ఆధార్ లింక్ పాన్ కార్డు - ఆధార్ కార్డును లింకు చేసే గడువును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు పొడిగించింది. ఈసారి పాన్-ఆధార్ లింక్ గడువును 2021 మార్చి 31 వరకు పొడిగించబడింది. ఈలోగా మీ పాన్ నంబర్ను ఆధార్తో లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫలితంగా పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరపడం సాధ్యం కాదు. అందుకే 31లోగా ఈ పని పూర్తి చేసుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఐటీఆర్ ఫైలింగ్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడంలో విఫలమైతే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నందున, వీలైనంత త్వరగా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే రూ.10,000 ఆలస్య రుసుము వసూలు చేయబడుతుంది. రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్న చిన్న చెల్లింపుదారులు రూ.1000 ఆలస్య రుసుము చెల్లించాలి. కాబట్టి మార్చి 31లోగా మీ ఐటీఆర్ దాఖలు చేయడం మంచిది. క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ కరోనా కారణంగా దెబ్బతిన్న వ్యాపారాలను పునరుద్దరించేందుకు కేంద్రం ఆత్మ నిర్భర్ భారత్ ప్రాజెక్టులో భాగంగా క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకాన్ని 2020 మే 13న ప్రకటించింది. కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారులకు ప్రభుత్వం హామీ లేకుండా రుణాలు మంజూరు చేసింది. ఈ రుణాలు తీసుకున్న వారు కాన్ఫిడెన్స్ బై కాన్ఫిడెన్స్ స్కీమ్ కింద డిక్లరేషన్ దాఖలు చేయడానికి గడువును 2021 మార్చి 31 వరకు పొడిగించింది. ఎల్టీసీ క్యాష్ వోచర్ ఎల్టీసీ క్యాష్ వోచర్ పథకం కింద బిల్లులు అందజేసేవారు ప్రయోజనాలను పొందేందుకు మార్చి 31లోగా మీ బిల్లులను సరైన ఫార్మాట్లో ప్రభుత్వానికి సమర్పించాలి. ఆ బిల్లులో జీఎస్టీ మొత్తం, వోచర్ నెంబర్ వంటి వాటిని పేర్కొనాలి. ఈ పథకాన్ని 2020 అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ ప్రభుత్వ ఉద్యోగులు 2021 మార్చి 31 వరకు రూ.10 వేల వరకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ పొందవచ్చు. ఎల్టీసీ క్యాష్ వోచర్ పథకంతో పాటు 2020 అక్టోబర్లో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ అడ్వాన్స్ తీసుకుంటే 10 వాయిదాల్లో డబ్బును తిరిగి చెల్లించవచ్చు. డబుల్ టాక్సేషన్ కోవిడ్ -19 కారణంగా చాలా మంది విదేశీ పౌరులు, వలసదారులు భారతదేశంలోనే ఉండాల్సి వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వారు ఇక్కడ సంపాదించే ఆదాయంపై రెట్టింపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి వారు మార్చి 31లోగా ప్రభుత్వానికి డిక్లరేషన్ సమర్పించి డబుల్ టాక్సేషన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. 2021 మార్చి 3న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. డబుల్ టాక్సేషన్ చెల్లింపుదారులు తమ వివరాలను ఫారం-ఎన్ఆర్ లో సమర్పించాల్సి ఉంటుంది. చదవండి: ఈ స్కీమ్లో చేరితే ప్రతి నెల పదివేల పెన్షన్ ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త! -
2 నిమిషాల్లో పాన్-ఆధార్ అనుసంధానం
ప్రస్తుత చట్టాల ప్రకారం ఆదాయపు పన్ను రిటర్నులను(ఐటిఆర్) దాఖలు చేయడానికి భారత ప్రభుత్వం పాన్(శాశ్వత ఖాతా సంఖ్య)ను ఆధార్తో లింకు చేయడం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ లింక్ చేయకపోతే రూ.10,000 జరిమానాను విధించనున్నట్లు తెలిపింది. ఆధార్ లేని పాన్ కార్డులను ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 139ఏ(2)ప్రకారం రద్దు చేస్తామని సీబీడీటీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆధార్ తో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డును రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం సైతం హెచ్చరించింది. 2021 మార్చి 31లోపు లింక్ చేయాలని కేంద్రం ప్రకటించింది. అలా చేయడంలో విఫలమైతే మీరు బ్యాంక్ ఖాతా తెరవడం లేదా పెన్షన్, స్కాలర్షిప్, ఎల్పీజీ సబ్సిడీ వంటి ప్రభుత్వాల ఆర్థిక ప్రయోజనాలను పొందలేరు. అయితే రెండు కార్డుల్లో మీ వివరాలు ముఖ్యంగా పేరు, పుట్టిన తేదీ వివరాలు వేరువేరుగా ఉంటే కార్డుల లింకింగ్ సాధ్యపడకపోవచ్చు. ఇంకా ఆధార్-పాన్ లింకు కోసం 15 రోజుల సమయం కాబట్టి రెండు నిమిషాల్లో క్రింద చెప్పిన విధంగా లింకు చేయవచ్చు. ఆధార్-పాన్ లింక్ విధానం: ఐటి విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్ను సందర్శించండి. 'క్విక్ లింకులు' విభాగం కింద వెబ్పేజీకి ఎడమ వైపున ఉన్న 'లింక్ ఆధార్'పై క్లిక్ చేయండి. ఆధార్ కార్డు ప్రకారం ఆధార్ నంబర్, మీ పేరు, పాన్ నెంబర్ వంటి వివరాలను నమోదు చేయండి. పుట్టిన సంవత్సరాన్ని మాత్రమే మీ ఆధార్ కార్డులో పేర్కొన్నట్లయితే కింద ఉన్న చెక్ బాక్స్ పై టిక్ చేయండి. 'నా ఆధార్ వివరాలను యుఐడిఏఐతో ధృవీకరించడానికి నేను అంగీకరిస్తున్నాను' అని ఉన్న బాక్స్ పై క్లిక్ చేయండి. మీ స్క్రీన్పై క్యాప్చా కోడ్ను ఎంటర్ స్క్రీన్ పై క్లిక్ చేయండి ఏదైనా దృశ్య లోపం ఉంటే వినియోగదారులు క్యాప్చా కోడ్కు బదులుగా వన్-టైమ్ పాస్వర్డ్ కోసం అభ్యర్థించవచ్చు. ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. 'లింక్ ఆధార్' బటన్ పై క్లిక్ చేస్తే ఇప్పుడు మీ ఆధార్, పాన్ లింక్ అవుతాయి. చదవండి: కొత్త ఏసీ కొనాలనుకునే వారికి షాక్! -
నగల కొనుగోళ్లపై ‘పాన్’ పిడుగు!
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలను రూ.2 లక్షలకు మించి కొనుగోలు చేస్తుంటే కేవైసీ వివరాలు ఇవ్వాలన్నది నిబంధన. అయితే, ఆభరణాల విక్రయదారులు (జ్యుయలర్స్) రూ.2 లక్షల్లోపు కొనుగోళ్లకూ కస్టమర్ల నుంచి కేవైసీ పత్రాలైన పాన్ లేదా ఆధార్ అడగడం మొదలు పెట్టేశారు. రానున్న బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల నగదు కొనుగోళ్లకు కేవైసీని తప్పనిసరి చేయవచ్చని వర్తకులు భావిస్తున్నారు. మనీల్యాండరింగ్ నిరోధక చట్టం పరిధిలోకి జ్యుయలరీ పరిశ్రమను తీసుకొచ్చినందున.. భవిష్యత్తులో ఏవైనా అనుమానాస్పద లావాదేవీని గుర్తించినట్టయితే తమపై కఠినచర్యలు తీసుకోవచ్చన్న భయం వర్తకుల్లో నెలకొని ఉంది. బంగారం మినహా ఇతర అన్ని రకాల పెట్టుబడి సాధనాలకూ కేవైసీ తప్పనిసరిగా అమల్లో ఉంది. బంగారానికి వస్తే రూ.2 లక్షలకు మించిన కొనుగోళ్లకే కేవైసీ ప్రస్తుతం అమల్లో ఉంది. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ మాదిరే బంగారాన్నీ పెట్టుబడి సాధనంగా గుర్తించాలన్న ప్రణాళికతో ప్రభుత్వం ఉందని.. ఇందుకోసం సమగ్రమైన బంగారం విధానాన్ని తీసుకురానుందని జ్యుయలరీ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఏటా మన దేశం 800–850 టన్నుల బంగారాన్ని వినియోగిస్తోంది. వివరాలను వెల్లడించాల్సిందే.. ఖరీదైన మెటల్స్, ఖరీదైన స్టోన్స్ డీలర్లను పీఎంఎల్ఏ కిందకు తీసుకురావడంతో.. బంగారం, వెండి, ప్లాటినమ్, వజ్రాలు, ఇతర రాళ్లను విక్రయించే జ్యుయలర్లు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్కు లావాదేవీల వివరాలను వెల్లడించాల్సి వస్తుందంటూ ‘ఇండియా బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్’ (ఐబీజేఏ) జాతీయ సెక్రటరీ సురేంద్ర మెహతా చెప్పారు. పీఎంఎల్ఏ కిందకు బంగారాన్ని గత డిసెంబర్ 28 నుంచి ప్రభుత్వం తీసుకొచ్చిందని.. దీంతో బంగారం ఆభరణాల వర్తకులు అనుమానిత లావాదేవీల వివరాలను, ఒక నెలలో రూ. 10 లక్షలకు మించిన నగదు కొనుగోళ్ల వివరాలను ప్రభుత్వ అధికారులకు నివేదించాల్సి ఉంటుందని మెహతా చెప్పారు. ‘‘కుటుంబ సభ్యుల కోసం రూ.2 లక్షల్లోపు కొనుగోలు చేసే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఇప్పటివరకు అభిప్రాయం ఉంది. అయితే, ప్రభుత్వ ఏజెన్సీలు మరింత కఠినంగా వ్యవహరించడం ద్వారా.. అన్ని లావాదేవీల వివరాలను అనుసంధానించి జ్యుయలర్లపై చర్యలు తీసుకోవచ్చు’’ అని ఆభరణాల పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అధిక విలువ కొనుగోళ్లకే కేవైసీ పరిమితం: ఆర్థిక శాఖ న్యూఢిల్లీ: అన్ని రకాల బంగారం కొనుగోళ్లకు కేవైసీ వివరాలు ఇవ్వడం తప్పనిసరి కాదని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. అధిక విలువ కలిగిన బంగారం, వెండి, జెమ్స్ కొనుగోళ్లకు చేసే నగదు చెల్లింపులకు కేవైసీ పత్రాలైన పాన్ లేదా ఆధార్ బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పీఎమ్ఎల్ఏ చట్టం కిందకు తమనూ చేర్చడంతో అన్ని రకాల నగదు కొనుగోళ్లకు కేవైసీ తప్పనిసరి చేయవచ్చని ఆభరణాల పరిశ్రమ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. డిసెంబర్ 28న వచ్చిన నోటిఫికేషన్పై కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం స్పందించింది. ‘‘నగదు రూపంలో ఆభరణాలు, బంగారం, వెండి, ఖరీదైన జెమ్స్, రాళ్ల విలువ రూ.2లక్షలు మించి కొనుగోళ్లు ఉంటే కేవైసీ ఇవ్వాలన్నది గత కొన్నేళ్ల నుంచి అమల్లో ఉన్నదే. పీఎమ్ఎల్ యాక్ట్, 2002 చట్టం కింద డిసెంబర్ 28 నాటి నోటిఫికేషన్.. వ్యక్తులు లేదా సంస్థలు బంగారం, వెండి, జ్యుయలరీ, ఖరీదైన రాళ్లను రూ. 10లక్షలు, అంతకుమించి కొనుగోలు చేస్తే కేవైసీ డాక్యుమెంట్లు అవసరం. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్)లో భాగమే ఇది’’ అని తెలిపింది. -
10 నిమిషాల్లో కొత్త పాన్ కార్డ్
న్యూఢిల్లీ: మీరు ఇప్పుడు పాన్ కార్డు తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీరు దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుండే కేవలం పది నిమిషాల్లో పాన్ కార్డు పొందే సదుపాయాన్ని కేంద్రం కల్పిస్తుంది. ప్రస్తుత పరిస్థితులలో మనకు ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో పాన్ కార్డ్ కూడా అంతే ముఖ్యం. ఈ రెండు లేకుండా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు పూర్తి చేయలేము. అందుకే ఆదాయ పన్ను శాఖ త్వరితగతిన పాన్ కార్డును పొందేందుకు కొత్త సేవలను ప్రారంభించింది. ప్రస్తుత కోవిడ్-19 సమయంలో బయటికి వెళ్తే ప్రమాదం కాబట్టి ఈ సేవలను తీసుకొచ్చినట్లు ఆదాయ పన్ను శాఖ తెలిపింది.(చదవండి: ‘ఆధార్’ కోసం కొత్త హెల్ప్ లైన్ నెంబర్) ఇన్స్టంట్ పాన్ సౌకర్యం కింద ఆధార్ కార్డు ద్వారా ఇ-పాన్ కార్డు ఇవ్వడానికి సుమారు 10 నిమిషాలు పడుతుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఈ సౌకర్యం కింద ఇప్పటివరకు సుమారు 7 లక్షల పాన్ కార్డులు జారీచేసినట్లు పేర్కొన్నారు. పాన్ కార్డును ఎస్ఎస్డీఎల్, యూటీఐటీఎస్ఎస్ వెబ్సైట్స్ ద్వారా కూడా పొందవచ్చు. వీటి ద్వారా అయితే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అదే ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ ద్వారా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే మీరు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఆదాయ పన్ను శాఖ పోర్టల్ లో https://www.incometaxindiaefiling.gov.in/e-PAN/ మీరు మీ ఆధార్ నెంబర్, ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి ఇకేవైసీ పూర్తి చేస్తే సరిపోతుంది. తర్వాత మీకు పీడీఎఫ్ ఫార్మాట్లో పాన్ కార్డ్ లభిస్తుంది. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. దింట్లో మీ పేరు, పుట్టిన తేదీ, ఫోటో మొదలైన మీ ముఖ్యమైన సమాచారంతో పాటు QR కోడ్ను కలిగి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత మీకు 15-అంకెల రసీదు సంఖ్య లభిస్తుంది. మీ పాన్ కార్డు యొక్క సాఫ్ట్ కాపీ మీ ఇ-మెయిల్ ఐడీకి కూడా పంపబడుతుంది. -
గుడ్న్యూస్: పాన్- ఆధార్ గడుపు పెంపు
న్యూఢిల్లీ : పాన్- ఆధార్ కార్డ్ లింక్ గడువును పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చాలా సార్లు దీని గడువును పొడిగించిన కేంద్రం.. తాజాగా సోమవారం మరోసారి పొడగించింది. రేపటితో (మంగళవారం) గడువు ముగుస్తుండగా.. వచ్చే ఏడాది (2021) మార్చి 31 వరకు పొడిగించింది. దేశంలో కరోనా వైరస్ దృష్ట్యా ఆదాయపు పన్నుశాఖ నిర్ణయం తీసుకుంది. కాగా పాన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుతో కచ్చితంగా అనుసంధానం చేసుకోవాల్సిందే. దీనిని ఈ ఏడాది ఏప్రిల్లో కేంద్రం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. లేకుంటే పాన్ కార్డు చెల్లదని ఐటీశాఖ ప్రకటించింది. -
ఈ నెల 31 తర్వాత పాన్ పనిచేయదు!
న్యూఢిల్లీ: పాన్ను ఆధార్తో అనుసంధానించడం తప్పనిసరి అని, ఇందుకు ఇచ్చిన గడువు ఈ నెల 31న ముగుస్తుందంటూ ఆదాయపన్ను శాఖ మరోసారి గుర్తు చేసింది. గడువు నాటికి అనుసంధానం చేసుకోకపోతే.. అప్పుడు పాన్ పనిచేయకుండా పోతుందని హెచ్చరించింది. బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ లేదా పాన్ సేవా కేంద్రాలను సందర్శించడం ద్వారా అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ఆదాయపన్ను శాఖ తన ట్విట్టర్ పేజీలో ఒక వీడియోను సైతం పోస్ట్ చేసింది. ్ఖఐఈ్కఅN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నంబర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి, పాన్ నంబర్ టైప్ చేసిన తర్వాత 567678 నంబర్కు ఎస్ఎంఎస్ చేయడం ద్వారా అనుసంధానం చేసుకోవచ్చు. అలాగే, ఆదాయపన్ను శాఖ ఈఫైలింగ్ పోర్టల్ ఠీఠీఠీ. జీnఛిౌఝ్ఛ్ట్చ్ఠజీnఛీజ్చ్ఛీజజీ జీnజ. జౌఠి. జీn కు వెళ్లి కూడా అనుసంధానం చేసుకోవచ్చు. -
ఆధార్ ఉంటే చాలు.. నిమిషాల్లోనే పాన్ కార్డ్!
న్యూఢిల్లీ: పాన్ కార్డ్ పొందడం అత్యంత సులభతరం కానుంది. ఇక నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా, కేవలం ఆధార్ నంబర్ ఆధారంగా సత్వరమే పాన్ కార్డును అందుకోవచ్చని రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే వెల్లడించారు. ఆదాయ పన్ను శాఖ వెబ్సైట్లో ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయగానే నమోదిత మొబైల్కు వన్ టైం పాస్ వార్డ్ (ఓటీసీ) వస్తుందని, దీనిని ఎంట్రీ చేసి వెంటనే ఈ–పాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఈ నెలాఖరు నాటికే నూతన సేవలను అందించాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
పాన్– ఆధార్ లింకింగ్ గడువు తేదీ డిసెంబర్ 31
న్యూఢిల్లీ: పాన్ కార్డ్ను ఆధార్తో అనుసంధానం చేసేందుకు ఈ నెల 31 గడువు తేదీగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం (సీబీడీటీ) ప్రకటించింది. ఆదాయ పన్ను సేవలు మరింత పారదర్శకంగా కొనసాగడం కోసం ఈ రెండింటి అనుసంధాన్ని తప్పనిసరి చేసినట్లు పేర్కొంది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 139 ఏఏ (2) ప్రకారం 2017 జూలై 1 నాటికి పాన్ కార్డును పొంది ఉండి, ఆధార్ పొందడానికి అర్హులైన ప్రతి వ్యక్తి, సంస్థ తమ ఆధార్ నంబర్ను ఆదాయ పన్ను శాఖకు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ సెక్షన్లోని అంశానికి గడువు తేదీని ఇంతకుముందు ఈ ఏడాది సెప్టెంబర్ 30గా ప్రకటించిన విషయం తెలిసిందే. -
పాన్, ఆధార్ లింక్ : మరోసారి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : పాన్ కార్డును ఆధార్తో అనుసంధానం చేసేందుకు డెడ్లైన్ను ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. గతంలో సెప్టెంబర్ 30లోగా ఈ ప్రక్రియను ముగించాలని నిర్ధేశించగా తాజాగా ఆ గడువును డిసెంబర్ 31 వరకూ పొడిగించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా పాన్ కార్డును ఇంకా ఆధార్తో లింక్ చేసుకోని వారికి ప్రభుత్వ నిర్ణయం ఊరట ఇస్తోంది. నిర్ధేశిత డెడ్లైన్లోగా పాన్తో ఆధార్ లింక్ కాకుంటే పాన్ కార్డు పనిచేయదు. ఈ క్రమంలో పాన్ను తప్పనిసరిగా పేర్కొనాల్సిన ఆర్థిక లావాదేవీలను కొనసాగించడంలో తమ పాన్తో ఆధార్ను లింక్ చేయని వ్యక్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి. -
పాన్–ఆధార్ లింక్ చేశారా?
సాక్షి, ప్రకాశం: నేడు ఆర్థికపరమైన లావాదేవీలకు పాన్కార్డు అనేది ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. ఏ లావాదేవీలకైనా పాన్కార్డు నంబర్ను తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ ప్రకారం పాన్కార్డు, ఆధార్కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా రెండింటిని అనుసంధానం చేసుకోవాలి. అలాగే ఇన్కం ట్యాక్స్ రిటర్న్ల ఫైలింగ్కు ఆధార్ నంబర్ కూడా అవసరం. పాన్కార్డు లేనివారు ఆధార్తో ఐటీ రిటరŠన్స్ దాఖలు చేయొచ్చు. ఈ నేపథ్యంలో ఆధార్ సంఖ్యను పాన్కార్డుతో అనుసంధానం ఆన్లైన్లోనూ, ఎస్ఎంఎస్ ద్వారా చేసుకోవచ్చు.\ లాగిన్ అయ్యేది ఇలా.. పన్ను చెల్లింపుదారులు ఇన్కం ట్యాక్స్ ఇ–ఫైలింగ్ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి. ఇదివరకే యూజర్ ఖాతా కలిగి ఉన్నవారు నేరుగా ఇ–ఫైలింగ్ పోర్టర్లో లాగిన్ కావచ్చు. లాగిన్ అయ్యేందుకు గతంలో క్రియేట్ చేసుకున్న యూజర్ ఐడీ, పాస్వర్డ్, కోడ్ నంబర్ను ఎంటర్ చేయాలి. దీంతో ఆధార్, పాన్ సంఖ్యల లింక్ వివరాలు తెలుసుకోవచ్చు. కొత్తగా లింక్ ఇలా.. ఆదాయపన్ను శాఖ ఇ–ఫైలింగ్ వెబ్సైట్ www.incometaxindiaefiling.gov.in లో లాగిన్ అయి ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే ముఖచిత్రంలో ఎడమ భాగంలో లింక్ ఆధార్ న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఒక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ పాన్కార్డు సంఖ్య, ఆధార్కార్డు సంఖ్య, పేరు వివరాలను పూర్తి చేయాలి. ఆదాయపన్ను శాఖ ఈ వివరాలను సరిచూస్తుంది. క్రాస్ చెక్ పూర్తి అయిన తర్వాత మీ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. వ్యాలిడేషన్ పూర్తయిన తర్వాత పాన్కార్డుతో ఆధార్ అనుసంధానం జరుగుతుంది. వివరాలన్నీ సరిపోతేనే ఈ అనుసంధాన ప్రక్రియ సజావుగా జరుగుతుంది. అనుసంధానం పూర్తయితే మీకు సమాచారం అందుతుంది. ఎస్ఎంఎస్ ద్వారా.. యూఐడీపీఏఎస్ అని ఆంగ్ల అక్షరాల్లో టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి పాన్ నంబర్ ఎంటర్ చేసి 567678కు ఎస్ఎంఎస్ పంపాలి. ఆధార్కార్డుతో లింక్ అయిన మొబైల్ నంబర్తోనే ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. అనుసంధానం ఎందుకు.. ఆదాయపన్ను శాఖ రిటర్న్స్ దాఖలు చేసినప్పుడు మీ మొబైల్కు వచ్చే ఓటీపీ మీ ఆధార్ అనుసంధానం అయిన సెల్ నంబర్కు ఇక నుంచి వస్తుంది. అలాగే ఆ శాఖ ఇ–వెరిఫికేషన్ మరింత సులువవుతుంది. పాన్తో పాటు ఆధార్ అనుసంధానం చేయని పక్షంలో సెప్టంబర్ 30 తర్వాత పాన్కార్డు నిరుపయోగంగా మారుతుందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఆదాయపన్ను రిటర్నులు చేసేవారు ఆధార్ను పాన్కు అనుసంధానించడం మంచిది. ఇన్కం ట్యాక్స్ వెబ్సైట్లో ఆధార్ అనుసంధానం జరిగి ఉంటే వీరు ఐటీఆర్–5ను ప్రింట్ తీసి పంపాల్సిన అవసరం ఉండదు. దీంతో పన్ను రిటర్నుల ప్రక్రియ త్వరితగతిన జరుగుతుంది. -
రేపటి నుంచి కాస్త జాగ్రత్తగా ఉండండి!
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేశారా? ఎంత ఆలస్యమైనా ఈరోజు ఫైల్ చేసేయండి. ఐటీ రిటర్న్ ఈ రోజులోపు సమర్పించకపోతే 10 వేల రూపాయల వరకు జరిమానా కట్టాల్సిరావొచ్చు. ఆదాయ పన్నుపై కేంద్ర ఆర్థిక బడ్జెట్లో ప్రవేశపెట్టిన ప్రతిపాదనలు రేపటి నుంచి (సెప్టెంబర్ 1) అమల్లోకి రానున్నాయి. వీటితో పాటు రేపటి నుంచి మోటారు వాహనాల సవరణ చట్టం, ఐఆర్సీటీసీ సర్వీస్ చార్జీలు అమల్లో రానున్నాయి. దీంతో సామాన్యులపై మరింత భారం పడనుంది. కాబట్టి వేతన జీవులు కాస్త కేర్ఫుల్గా ఉండ్సాలిందే. రేపటి నుంచి కొత్తగా అమల్లోకి రానున్నవి ఏంటో చూద్దాం. ఇల్లు కొనుగోలుపై టీడీఎస్ ఇంటి కొనుగోలు విలువ రూ.50 లక్షలు, అంతకుమించి ఉంటే విక్రయదారుకు నిర్ణీత విలువ చెల్లించడానికి ముందుగానే, దానిపై 1 శాతం టీడీఎస్ను మినహాయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత సమయంలోపు టీడీఎస్ను డిపాజిట్ చేయకపోతే, అప్పుడు 1–1.5 శాతం వడ్డీ రేటుతోపాటు పెనాల్టీ చార్జీలను కూడా చెల్లించాల్సి వస్తుంది. ఈ టీడీఎస్ను ఇంటి విక్రయ ధరపై కాకుండా, ఆర్జించిన మూలధన లాభాలపైనే అమలు చేయాల్సి ఉంటుంది. రూ. కోటి విత్డ్రా చేస్తే ‘ఫైవ్’ పడుద్ది ఒక సంవత్సరంలో ఒక అకౌంట్ నుంచి కోటి రూపాయలు పైబడిన విత్డ్రాయెల్స్ జరిపితే 2 శాతం టీడీఎస్ కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకటికి మించి ఖాతాలు ఉన్న పక్షంలో అన్ని అకౌంట్స్ నుంచి విత్డ్రా చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని రూ. 1 కోటి దాటితే 2 శాతం టీడీఎస్ విధిస్తారు. ఐఆర్సీటీసీ వడ్డన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఇ-టికెట్లపై సర్వీసు చార్జీలను పునరుద్ధరించింది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న నాన్ ఏసీ టికెట్పై రూ. 15, ఏసీ టికెట్పై రూ. 30 సర్వీసు ఛార్జీలను ఐఆర్సీటీసీ వసూలు చేయనుంది. సర్వీస్ ట్యాక్స్ బకాయిలకు చెక్ సేవా పన్ను బాకాయిలను వదిలించుకునేందుకు కొత్త పథకం అమల్లోకి రానుంది. దీని ద్వారా పెండింగ్లో ఉన్న సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ సుంకాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకుని బయటపడొచ్చు. బీమా డబ్బుకు తప్పదు పన్ను జీవిత బీమా ప్రీమియం గడువు ముగిసిన తర్వాత తీసుకునే నికర సొమ్ముపై 5 శాతం టీడీఎస్ కట్టాల్సి ఉంటుంది. కొత్త పాన్కార్డులు ఆధార్ నంబరుతో పాన్కార్డులు లింక్ చేయనివారికి ఆదాయపన్ను శాఖ కొత్త పాన్కార్డులు జారీ చేయనుంది. ఉల్లంఘిస్తే బాదుడే సవరించిన మోటారు వాహనాల చట్టం అమల్లోకి రానుంది. ట్రాఫిక్ నియమాలు ఉల్లఘించే వారు భారీగా జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ. 25 వేలు జరిమానా కట్టాల్సి రావొచ్చు. ట్రాఫిక్ రూల్స్ పాటించి డబ్బులు ఆదా చేసుకోవాలని గత కొద్దిరోజులుగా పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. (చదవండి: రూల్స్ బ్రేక్ .. పెనాల్టీ కిక్) షాపింగ్.. బ్రీఫింగ్ ఇప్పటివరకు 50 వేల రూపాయలకు పైబడి చేసిన షాపింగ్ గురించి మాత్రమే ఆదాయపన్ను శాఖకు బ్యాంకులు సమాచారం ఇచ్చేవి. టాక్స్ రిటర్న్స్లో ఎటువంటి అనుమానం కలిగినా చిన్న ట్రాన్స్క్షన్ గురించి కూడా బ్యాంకులు ఆరా తీసే అవకాశముంది. (ఇది చదవండి: సొంతిల్లు ఉన్నా.. కొంటున్నా!) -
అడ్డంగా వాడేశారు..
సాక్షి, సిటీబ్యూరో: ఫోర్జరీ చేసిన పాన్కార్డు, ఆధార్కార్డుల వివరాలు సమర్పించి క్రెడిట్ కార్డులు తీసుకుని రూ.5 లక్షలు వినియోగించిన నలుగురి సభ్యుల ముఠాను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ హరినాథ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొమ్మినేని బాలకృష్ణ, వక్దాని మహేష్, పొలగాని నరేశ్ కుమార్ అనే వ్యక్తులు గతంలో సోమాజిగూడలోని స్టాఫ్ రిక్రూటింగ్ కంపెనీలో పని చేశారు. ఈ సందర్భంగా డైరెక్ట్ సేల్స్ ఏజెన్సీతో దర ఖాస్తు చేసిన వారి పాన్కార్డు, ఆధార్కార్డులతో పాటు ఆయా వ్యక్తుల ఫొటో కాపీలను సేకరించారు. ప్లాస్టిక్ కార్డులపై ఆయా కార్డుల వివరాలను ఫోర్జరీ చేసిన సల్లూరి రాజేందర్ ఒరిజినల్ పాన్కార్డులు, ఆధార్కార్డుల తరహాలో నకిలీవి తయారు చేసి వారికి ఇచ్చాడు. అనంతరం ఫోర్జరీ కార్డులతో అసలు వ్యక్తులుగా క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేశారు. క్రెడిట్ కార్డులు మంజూరు కాగానే వ్యక్తిగత అవసరాల కోసం వాటిని వినియోగించారు. సైనిక్పురికి చెందిన వ్యాపారవేత్త ప్రవీణ్ ఇంటికి వచ్చిన బ్యాంక్ ఎగ్జిక్యూటివ్లు రూ.ఐదు లక్షలు చెల్లించాల్సి ఉన్నట్లు చెప్పడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో అతను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ అశిష్రెడ్డి నేతృత్వంలోని బృందం టెక్నికల్ డాటా ఆధారంగా సరూర్నగర్లో నిందితులు నలుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి ఆరు సెల్ఫోన్లు, ఏడు సిమ్కార్డులు, 16 ఏటీఎం కార్డులు, ఒక ల్యాప్టాప్, ఏడు డ్రైవింగ్ లైసెన్స్లు, 25 ఆధార్కార్డు కాపీలు, 15 పాన్కార్డు కాపీలు స్వాధీనం చేసుకున్నారు. రూ.2,30,000 నగదు రికవరీ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. కాగా నిందితులకు ప్రీ యాక్టివేటెడ్ సిమ్కార్డులను సమకూర్చడంతో పాటు క్రెడిట్ కార్డులపై ఉన్న వివరాలను ఫొటోషాప్ ద్వారా ఎడిటింగ్ చేసి ఇచ్చిన మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందని తెలిపారు. -
కోట్లున్నా.. పాన్కార్డు లేదు!
మధ్యప్రదేశ్కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు కోట్ల ఆదాయం ఉన్నా కొందరికి పాన్ కార్డు కూడా లేదని, మరికొందరు అసలు ఐటీ రిటర్నులు దాఖలు చేయలేదని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) వెల్లడించింది. 16 మంది ఎమ్మెల్యేలకు కోట్ల ఆస్తులున్నాయని, అయితే వారెవరూ ఐటీ రిటర్న్లు దాఖలు చేయలేదని ఏడిఆర్ నివేదిక పేర్కొంది. ఎన్నికల అఫిడవిట్లో కనీసం పాన్ కార్డు వివరాలు కూడా పేర్కొనని ఎమ్మెల్యేల్లో గదర్వార ఎమ్మెల్యే సునీతా పటేల్, సిరోంజి ఎమ్మెల్యే ఉమాకాంత్ శర్మ ఉన్నారు. సునీతకు ఆరు కోట్లకు పైగానే ఆస్తులున్నాయి. పాన్కార్డు వివరాలిచ్చి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని వారిలో బాలఘాట్ బీజేపీ ఎంపీ బోధ్సింగ్ భగత్ ఉన్నారు. ఈయన ఆస్తి రూ.2 కోట్లకు పై మాటే. షహదాల్ ఎంపీ జ్జాన్సింగ్, రేవా ఎంపీ జనార్దన్ మిశ్రా కూడా కోటీశ్వరులైనా ఐటీ రిటర్నులు దాఖలు చేయలేదు. వీరిద్దరూ బీజేపీ ఎంపీలేనని ఏడీఆర్ నివేదిక తెలిపింది. రూ.5 కోట్ల ఆస్తి ఉన్న బర్వానీ ఎమ్మెల్యే ప్రేమ్సింగ్, రూ.3 కోట్లకు పైగా ఆస్తి ఉన్న గుణ ఎమ్మెల్యే గోపీలాల్ జాతవ్, రెండు కోట్ల ఆస్తి ఉన్న కోటమ ఎమ్మెల్యే సునీల్ కుమార్, మంగోలి ఎమ్మెల్యే బ్రజేంద్ర సింగ్కు పాన్కార్డులు కూడా లేవు. వీరందరి వివరాలను ఏడీఆర్ మధ్యప్రదేశ్ ప్రధాన ఆదాయం పన్ను శాఖ కమిషనర్కు లిఖితపూర్వకంగా తెలిపింది. ఈ ఎమ్మెల్యేలు, ఎం పీల్లో కొందరు 2–3 సార్లు ఎన్నికైన వారూ ఉన్నారని, వారి ఆస్తులు ఎన్నో రెట్లు పెరిగాయని అయినా వారు పాన్, ఐటీ రిటర్నుల వివరాలను అఫిడవిట్లో పేర్కొనడం లేదని ఏడీఆర్ ఐటీ కమిషనర్కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల అఫిడవిట్లో ఆర్థిక లావాదేవీల గురించి పూర్తిగా చెప్పకపోయినా, తప్పుగా చెప్పినా వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టు 2013, సెప్టెంబర్ 13న తీర్పు ఇచ్చిందని, దాని ప్రకారం వీరిపై చర్య తీసుకోవాలని ఏడీఆర్ కోరింది. -
ఆధార్–పాన్ లింకేజ్ గడువు పెంపు
న్యూఢిల్లీ: ఆధార్–పాన్ కార్డుల అనుసంధానం గడువును కేంద్రం ఆరోసారి పెంచింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా పాన్కార్డును ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని తెలిపింది. ఈ విషయమై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోరు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘గతేడాది జూన్లో కేంద్ర ప్రభుత్వం పాన్కార్డును ఆధార్తో లింక్ చేసుకునేందుకు 2019, మార్చి 31ని గడువుగా నిర్ణయించింది. తాజాగా ఈ గడువును మరో ఆరు నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకూ పొడిగించింది. ఆధార్కు అనుసంధానం చేయని పాన్ కార్డులను రద్దుచేస్తారన్న వార్తల నేపథ్యంలో తాజాగా గడువును పెంచింది’ అని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేకంగా మినహాయిస్తే తప్ప అందరూ ఆధార్–పాన్ అనుసంధానం చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలుచేసే వారు తప్పనిసరిగా ఆధార్ నంబర్ను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆధార్ చట్టం రాజ్యాంగబద్ధమైనదేనని ఐదుగురు సుప్రీంకోర్టు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం గతేడాది తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్ వరకూ 41 కోట్ల పాన్ కార్డులు జారీకాగా, వీటిలో 21 కోట్ల పాన్ కార్డులు ఆధార్తో అనుసంధానమయ్యాయి. -
‘పాన్’కు ఆధార్ లింక్ తప్పనిసరి..
కుత్బుల్లాపూర్: ‘పాన్ కార్డు’... నిన్నటి వరకు చాలా మందికి ఒక ఐడెండిటీ కార్డ్..అయితే ఇప్పుడు పరిస్థితి మారింది.. ఒక వ్యక్తి ఎకనామిక్ స్టేటస్ (ఆర్థిక స్థితి)ని తెలిపే ముఖ్యమైన పర్సనల్ అకౌంట్ నెంబరు. కోట్లాది జనాభాలో కూడా పాన్ కార్డు ఆధారంగా ఆ వ్యక్తి యొక్క ఆర్థిక స్థితి గతులను ఇట్టే తెలిపే ముఖ్యమైన పత్రం.. ఐటీ రిటరన్స్ ధాఖలు చేయాలంటే ఖచ్చితంగా పాన్ నెంబరు సదరు వ్యక్తి కలిగి ఉండాల్సిందే. లేని పక్షంలో ఐటీ రిటరŠన్స్ ధాఖలు చేయలేము. ఇక అంతే ప్రాముఖ్యత ఉన్న మరొక ముఖ్యమైన పత్రం ఆధార్. ప్రతి సంక్షేమ పథకానికి, బ్యాంక్ అకౌంట్ ప్రారంభానికి, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లకు ఇప్పుడు ఆధార్ను తప్పనిసరి చేశారు. ముఖ్యంగా స్థిరాస్తుల కొనుగోళ్లల్లో ఆధార్ ఖచ్చితం చేయడంతో సదరు వ్యక్తి స్థిరాస్తుల లావాదేవీల వివరాలు రికార్డై ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఐటీ రిటరŠన్స్ ధాఖలు చేసే వ్యక్తులు లెక్కల్లో కొన్ని కొన్ని వివరాలను తప్పిస్తు పన్నులు తక్కువగా కట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు ఇప్పుడు ఐటీ రిటరన్స్ ధాఖలు చేసే ప్రతి వ్యక్తి వారి వారి పాన్ కార్డులకు ఆధార్ ను తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి ఉంది. ఇన్కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 139ఏఏ ను అనుసరించి ఆధార్ను పాన్ కార్డుకు తప్పకుండా లింక్ చేయాల్సిందే. దేశంలో ఇప్పటి వరకు 42 కోట్ల పాన్ కార్డులు ఉండగా వాటిలో ఇప్పటి వరకు 23 కోట్ల పాన్ కార్డులను ఆధార్కు అనుసంధానం చేశారు. మిగిలిన వారు ఇంకా చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు 31 మార్చి 2019 తో ముగియనున్నది. ఒక వేళ ఐటీ రిటరŠన్స్ దాఖలు చేసే వారు పాన్ కార్డులను ఆధార్కు లింక్ చేయకపోతే గడువు దాటిన తరువాత సదరు వ్యక్తుల పాన్కార్డు నెంబర్లు డిలీట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలో పాన్ కార్డును ఇన్కమ్ టాక్స్ డిపార్టుమెంట్ వెబ్సెట్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ ద్వారా పాన్ కార్డును లింక్ చేసుకోవచ్చు. అసలు సులువుగా పాన్ కార్డును ఆధార్కు లింక్ చేసుకునే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. వెబ్ సైట్ ద్వారా.. ముందుగా ఇన్కమ్ టాక్స్ డిపార్టుమెంట్ ఇ–ఫైలింగ్ వెబ్సైట్ incometax indiaefiling.govలో హోమ్ పేజీలో కనిపించే క్లిక్ లింక్స్ ఆప్షన్లో లింక్ ఆధార్ ను ఎంచుకోవాలి. ఇక్కడ సదరు వ్యక్తి పాన్ నెంబరు, ఆధార్ నెంబరు, ఆధార్ కార్డులో ఉన్న సదరు వ్యక్తి పేరును నమోదు చేసి స్రీన్పై కనిపించే కోడ్ను ఎంటర్ చేయడం ద్వారా లింక్ పూర్తవుతుంది. ఒక వేళ కోడ్ కొట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు రిక్వెస్ట్ ఓటీపీ ద్వారా ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా.. వెబ్సైట్ ద్వారానే కాకుండా చేతిలో ఉన్న ఫోన్తో కూడా పాన్ కార్డుకు ఆధార్ను లింక్ చేయవచ్చు. ఇది కేవలం ఒక ఎస్ఎంఎస్ చేస్తే సరిపోతుంది. ఇందుకు 12 ఈఐఎఐఖీ అఅఈఏఅఖN్ఖMఆఉఖ 10 ఈఐఎఐఖీ UIDPAN 12 DIGITS AADHAR NUMBER 10 DIGITS PAN NUMBER ఎంటర్ చేసి 567678 లేదా 56161 లకు ఎస్ఎంఎస్ చేస్తే సరిపోతుంది. 2019, మార్చి 31 లోపు కచ్చితంగా పాన్ కార్డులను ఆధార్ కు లింక్ చేసుకోవడానికి ఇచ్చే ఆఖరి గడువు. ఒక వేళ లింక్ చేసుకోక పోతే పాన్కార్డు డిలిట్ అవడమో లేదా పలు సందర్భాల్లో పాన్ కార్డులను అనుమతించక పోవడమో జరుగుతుంది. -
ఆధార్–పాన్ అనుసంధానం తప్పనిసరి
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను(ఐటీ) రిటర్నుల దాఖలుకు ఆధార్–పాన్ కార్డు అనుసంధానం తప్పనిసరని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ విషయాన్ని తాము గతంలోనే స్పష్టం చేశామనీ, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139ఏఏను సమర్థించామని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అబ్దుల్ నజీర్ల ధర్మాసనం గుర్తుచేసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది. శ్రేయా సేన్, జయశ్రీ సప్తుతే అనే వ్యక్తులు ఆధార్–పాన్ అనుసంధానం చేయకుండా 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. దీన్ని కేంద్రం వ్యతిరేకించగా, ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. తాజాగా కేంద్రం పిటిషన్పై స్పందించిన సుప్రీంకోర్టు 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి పాన్–ఆధార్ కార్డులను లింక్ చేశాకే రిటర్నులు దాఖలు చేయాలని ఇద్దరు ప్రతివాదులకు స్పష్టం చేసింది. అనంతరం కేంద్రం దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేసింది. ఆధార్ కార్యక్రమం చట్టబద్ధమైనదేనని 2018, సెప్టెంబర్ 26న ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆధార్–పాన్ అనుసంధానాన్ని సమర్థించిన కోర్టు.. స్కూలు అడ్మిషన్లు, బ్యాంకు ఖాతాలు, మొబైల్ కనెక్షన్ల కోసం ఆధార్ ఇవ్వాలన్న నిబంధనల్ని కొట్టివేసింది. -
ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఈ నెల ఆఖరి తేదీనే తుది గడువు. ఒకవేళ ఇప్పటికీ పాన్ కార్డు లేకపోతే.. ఆదాయపు పన్ను రిటర్నులను(ఐటీఆర్) దాఖలు చేయడానికి వీలులేదు. ఐటీఆర్ ఫైల్ చేయడానికి కచ్చితంగా పాన్ కార్డు కావాల్సిందేనని ఆదాయపు పన్ను అథారిటీ చెప్పింది. ఈ నేపథ్యంలో పాన్ కార్డు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం... పాన్ కార్డు అంటే.. పాన్ కార్డు అనేది పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ సంఖ్య. దీన్ని ఆదాయపు పన్ను శాఖ ల్యామినేటెడ్ రూపంలో జారీ చేస్తుంది. పాన్ కార్డు కలిగి ఉన్న వ్యక్తి అన్ని లావాదేవాలు డిపార్ట్మెంట్తో లింక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ లావాదేవీల్లో పన్ను చెల్లింపులు, ఆదాయం/సంపద/బహుమతుల రిటర్నులు వంటివన్నీ ఉంటాయి. పాన్ కార్డు వాలిడిటీ... ఒక్కసారి పాన్ కార్డు పొందితే, అది జీవితకాలం వాలిడిటీలో ఉంటుంది. దేశవ్యాప్తంగా వాలిడ్లో ఉంటుంది. ఒకవేళ అడ్రస్ మారినా.. లేదా ఆఫీసు మారినా దీనిపై ఎలాంటి ప్రభావం ఉండదు. పాన్ డేటాబేస్లో ఏమైనా మార్పులు చేసుకోవాల్సి ఉంటే అంటే పాన్ దరఖాస్తు చేసుకునే సమయంలో అందించిన వివరాల్లో ఏమైనా మార్చాల్సి ఉంటే ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్లో తెలపాలి. ఒక్క పాన్ కార్డు కంటే ఎక్కువ ఉండొచ్చా..? ఒక వ్యక్తి ఒక్క పాన్ కార్డు కంటే ఎక్కువ కలిగి ఉండకూడదు. మరో పాన్ కోసం దరఖాస్తు కూడా చేసుకోకూడదు. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉంటే, ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 272బీ కింద 10వేల రూపాయల జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు జారీ చేస్తే.. వాటిని వెంటనే ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఒక్క శాశ్వత ఖాతా సంఖ్యనే వారి వద్ద ఉంచుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఎందుకుంటాయి..? వివిధ సందర్భాల్లో ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉండే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో సరైన అవగాహన లేక ఇలా జరుగుతూ ఉంటుంది. పాన్ కార్డులో మార్పులు చేసుకోవాలనుకునేవారు, అలా మార్పులు చేసుకోకుండా.. కొత్త దాని కోసం దరఖాస్తు చేస్తారు. ఇలా ఒక వ్యక్తి దగ్గర ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉండే అవకాశాలుంటాయి. పెళ్లయిన యువతలు ఇంటి పేరు మార్పుతో కొత్త పాన్కు దరఖాస్తు చేస్తారు. ఇలా కూడా రెండు ఉండొచ్చు. లేని వ్యక్తుల పేరుతోనో, నకిలీ పేర్లతోనే ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు పొందిన వారు లేకపోలేదు. ఇలా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు పొందే వారిపై కొరడా ఝుళిపించేందుకు ప్రభుత్వం జరిమానా విధిస్తుంది. -
సర్వత్రా స్వాగతం : పాన్ కార్డు దరఖాస్తులో మార్పులు
న్యూఢిల్లీ : తల్లి మాత్రమే ఉన్న పిల్లలకు పాస్పోర్టు తరహాలోనే పాన్ కార్డుకు కూడా నిబంధనలు తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. తండ్రి పేరు నమోదు చేయకుండానే.. ఒంటరి తల్లుల పిల్లలు పాన్ కార్డును దరఖాస్తు చేసుకునేలా మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ(డబ్ల్యూసీడీ) ప్రతిపాదించింది. మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మహిళా కార్యకర్తలు, జాతీయ మహిళా కమిషన్ స్వాగతించాయి. జీ న్యూస్ రిపోర్టు ప్రకారం డబ్ల్యూసీడీ మంత్రి మేనకా గాంధీ ఈ విషయంపై తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాసినట్టు తెలిసింది. విడాకులు తీసుకున్న తల్లులు లేదా బిడ్డలను దత్తత తీసుకున్న ఒంటరి తల్లుల విషయంలో పాన్ కార్డులో తండ్రి పేరు తొలిగించే అవకాశాన్ని కల్పించాలని ఆమె కోరారు. జూలై 6న గోయల్కు ఈ లేఖ రాశారు. ఒంటరి తల్లుల విషయంలో సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, పలు ప్రభుత్వ అథారిటీల ముందు సమర్పించే దరఖాస్తుల్లో వారి మాజీ భర్తల పేర్లను నమోదు చేయాల్సినవసరం లేకుండా... అవకాశం కల్పించడం ఎంతో ముఖ్యమని మేనకా గాంధీ చెప్పారు. అంతేకాక పిల్లల్ని దత్తత తీసుకుని పెంచే తల్లులకు, తండ్రి ఉండరని, అలాంటి కేసుల్లో కూడా తండ్రి పేరు అవసరం లేకుండా పాన్ కార్డును దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మహిళల్లో సాధికారికత కల్పించడానికి దీన్ని ముందస్తుగానే అమలు చేయాల్సి ఉందని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ అన్నారు. ఇది చాలా ప్రగతిశీలమైదన్నారు. ప్రస్తుతం ఇది చాలా మంచి నిర్ణయమని శర్మ అభివర్ణించారు. ఓ పురుషుడితో మహిళలు తమను తాము గుర్తింపు పొందాల్సివసరం లేదని, వారికి సాధికారికత కల్పించే విషయంలో ఎంతో స్వాగతించాల్సిన విషయమని పేర్కొన్నారు. సీనియర్ సీపీఐ లీడర్, సామాజిక కార్యకర్త అన్నీ రాజా కూడా ఈ ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేశారు. పాన్ కార్డును పొందడానికి ఇబ్బందులు పడుతున్న చాలా మంది పిల్లలకు ఇది ఎంతో సహకరిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పాన్ కార్డు దరఖాస్తు చేసుకునేటప్పుడు తండ్రి పేరు నమోదు చేయడం తప్పనిసరి. దీన్నే గుర్తింపు కార్డుగా కూడా భావిస్తున్నారు. ఒంటరి తల్లులు ఎదుర్కొనే చాలా సమస్యలను ఇది పరిష్కరిస్తుందని మహిళా హక్కుల కార్యకర్త మరియం ధవాలే చెప్పారు. -
ఇక ఇన్స్టంట్ ఈ–పాన్ కార్డులు!
న్యూఢిల్లీ: వ్యక్తిగత, వ్యాపార అవసరాలరీత్యా తక్షణం పాన్ కార్డ్లను పొందాలనుకునే వారికోసం ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ఇన్స్టంట్ ఈ–పాన్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. తొలిసారిగా పాన్ నంబర్ కోసం దరఖాస్తు చేసే వ్యక్తులకు ఆధార్తో అనుసంధానమైన కేటాయింపు వ్యవస్థను ప్రారంభించింది. ‘ఆధార్ కార్డులు ఉన్నవారెవరైనాసరే ఇన్స్టంట్ ఈ–పాన్ సేవలను పరిమితకాలంపాటు ఉచితంగా పొందొచ్చు’ అని ఐటీ శాఖ వెల్లడించింది. ‘ఈ వ్యవస్థలో పాన్కు దరఖాస్తు చేసిన వారికి ఆధార్తో జత అయిన మొబైల్ నంబర్కు వన్టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) వస్తుంది. దీన్ని ఎంటర్ చేస్తే క్షణాల్లో ఈ–పాన్ నంబర్ కేటాయింపు పూర్తవుతుంది. ఆధార్లో ఉన్న విధంగానే పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, అడ్రస్ ఇతరత్రా వివరాలన్నీ కొత్త పాన్లో పొందుపరుస్తారు’ అని వివరించింది. స్వదేశంలో నివసిస్తున్న భారతీయులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు(హెచ్యూఎఫ్), సంస్థలు, ట్రస్టులు, కంపెనీలు మాత్రమే ఈ–పాన్ సౌకర్యాన్ని వినియోగించుకోగలరని పేర్కొంది. ఆన్లైన్లో ఈ–పాన్ నంబర్ కేటాయింపు జరిగిన తర్వాత కొద్ది రోజులకు పాన్ కార్డును పోస్ట్ ద్వారా పంపుతారని ఐటీ అధికారి వెల్లడించారు. ఈ–పాన్కు www.incometaxindiaefiling.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
మార్చి 31 వరకూ ‘పాన్–ఆధార్’ గడువు
న్యూఢిల్లీ: పాన్కార్డు–ఆధార్ అనుసంధానానికి గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) పొడిగించింది. శనివారంతో గడువు ముగిసిన నేపథ్యంలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 119 మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ ఆదేశాలు జారీచేసింది. ఆధార్తో వ్యక్తుల పాన్ నెంబర్ లింకింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించడం ఇది ఐదోసారి కాగా.. ఈ ఏడాది మార్చి 27న చివరిసారి పొడిగించారు. ఆధార్తో ఇతర సేవల అనుసంధానం కోసం ఇచ్చిన గడువును మార్చి 31, 2018 నుంచి పొడిగించాలని ఈ ఏడాది ప్రారంభంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీడీటీ తాజా నిర్ణయం తీసుకుంది. ఆధార్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించే వరకూ గడువును పొడిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా ఐటీ రిటరŠన్స్ దాఖలుకు, అలాగే కొత్త పాన్ కార్డు కోసం ఆధార్ నెంబరును గతేడాది కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. -
ఆధార్-పాన్ లింక్.. నేడే చివరి తేదీ
న్యూఢిల్లీ : మీ బయోమెట్రిక్ ఐడీ-ఆధార్తో పర్మినెంట్ అకౌంట్ నెంబర్(పాన్)ను లింక్ చేసుకున్నారా? ఒకవేళ చేసుకోకపోతే, వెంటనే చేసేసుకోండి. ఆధార్-పాన్ అనుసంధానానికి నేడే ఆఖరి తేదీ. ఆధార్ను పాన్తో లింక్ చేసుకోవడానికి ఇప్పటి వరకు ప్రభుత్వం నాలుగు సార్లు తుది గడువు పొడిగించింది. నేటితో ఈ గడువు ముగియబోతోంది. అయితే మరోసారి కూడా ఈ తుది గడువును పొడిగిస్తారా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. టెక్నికల్గా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 139ఏఏ(2) ప్రకారం ఆధార్తో పాన్ను తుది గడువు లోపు అనుసంధానం చేసుకోకపోతే, పాన్ కార్డు ఇన్వాలిడ్ అవుతుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నుంచి తుది గడువుపై ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో, వెంటనే ఆధార్తో పాన్ను అనుసంధానం చేసుకోవాలని పలువురు పన్ను నిపుణులు సూచిస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ప్రస్తుతం ఆధార్ తప్పనిసరి. ఐదు తేలిక పద్ధతుల్లో ఆధార్ను పాన్తో లింక్ చేసుకోవచ్చు. ఆధార్తో పాన్ను ఎలా అనుసంధానించుకోవాలో ఓసారి చూద్దాం.. స్టెప్ 1 : ఇన్కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్సైట్కి వెళ్లాలి. టాప్ మధ్యలో బ్లూ రంగు బాక్స్ కనిపిస్తుంది. దానిలో కొన్ని ఫ్లాష్లు కనిపిస్తాయి. ఒక ఫ్లాష్ లో ‘లింక్ ఆధార్’ అనే బాక్స్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. వెంటనే వేరొక పేజీకి వెళ్తాం.. స్టెప్ 2 : అక్కడ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయాలి. ఆ అనంతరం కింద ఉన్న ‘లింక్ ఆధార్’ అనే దానిపై క్లిక్ చేయాలి. స్టెప్ 3 : ఒక్కసారి రెండో స్టెప్ పూర్తయ్యాక, మీ అభ్యర్థనను యూఐడీఏఐకి పంపిస్తున్నట్టు మెసేజ్ కనిపిస్తుంది. హోమ్ పేజీలో ఉన్న ఆధార్ హైపర్ లింక్ను క్లిక్ చేసి స్టేటస్ను తెలుసుకోవాల్సిందిగా సూచిస్తుంది. స్టెప్ 4 : మరోసారి హోమ్ పేజీకి వెళ్లి, లింక్ ఆధార్ను క్లిక్చేయాలి. ఆ అనంతరం వచ్చే పేజీలో పైననే... ఒకవేళ లింక్ ఆధార్ అభ్యర్థనను ఇప్పటికే సమర్పించి ఉంటే, స్టేటస్ తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి అని కనిపిస్తుంటుంది. దాన్ని క్లిక్ చేసి ఆధార్-పాన్ లింక్ స్టేటస్ను తెలుసుకోవచ్చు. -
రెండు పాన్కార్డులు : జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్, పాన్ అనుసంధానం తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఒక్కరే రెండు లేదా అంతకన్నా ఎక్కువ పాన్ కార్డులు కలిగి వుంటే ఆదాయ పన్నుశాఖ కనిపెట్టేయడం చాలా సులువు. అలాగే మల్టీ పాన్ కార్డులను కలిగివుండటం నేరమని ఇప్పటికే ఆదాయ పన్నుశాఖ స్పష్టం చేసింది కూడా. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే.. పన్నులు ఎగవేసేందుకు, చాలామంది వ్యక్తులు అనుకోకుండా బహుళ పాన్కార్డులు కలిగి వుంటున్నారనీ ఐటీ శాఖ వ్యాఖ్యానించింది. కారణం ఏదైనా కావచ్చు కానీ, ఇలా ఒకటి కంటే ఎక్కువపాన్ కార్డును కలిగి ఉండటం చట్టవిరుద్ధం. ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్ 272బి ప్రకారం జరిమానా తప్పదని ఐటీ శాఖ తెలిపింది. ఇందుకు గాను 10,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చని తెలిపింది. ఇలా ఎవరైనా రెండు పాన్ కార్డులను కలిగి వుంటే తక్షణమే అదనంగా ఉన్న ప్యాన్ కార్డులను ఆన్లైన్, లేదా ఆఫ్లైన్ ద్వారా రద్దు చేసుకోవాలని ఆదాయ పన్నుశాఖ కోరింది. ఈ నేపథ్యంలో అదనంగా ఉన్న పాన్కార్డులను సరెండర్ చేయడం ఎలాగో ఒకసారి చూద్దాం.. ఆన్లైన్ ద్వారా పాన్ సరెండర్ చేయడం ఇందుకు ఆదాయ పన్ను శాఖ వెబ్సైట్ https://www.incometaxindia.gov.in. పేజీలోని ఎడమ దిగువ భాగంలోని 'ముఖ్యమైన లింక్స్' విభాగానికి వెళ్లండి. అప్లయ్ ఫర్ పాన్ అనే బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడొక న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. UTITSL అనే లింక్ క్లిక్ చేసి సీఎస్ఎఫ్ ఫాంలో ఐటెం నెం.11లో వివరాలు ఇవ్వాలి. అంటే రద్దు చేయాలనుకుంటున్న రెండవ పాన్ కార్డు సమాచారాన్ని జత చేయాలి. ఆఫ్లైన్ ద్వారా పాన్ సరెండర్ చేయడం ఆఫ్లైన్లో రెండవ పాన్ కార్డు సమాచారాన్ని అందజేయాలంటే లిఖిత పూర్వకంగా లెటర్ వ్రాసి NSDL TIN ఫెసిలిటేషన్ సెంటర్ లేదా UTI PAN సెంటర్లో ఉన్న అధికారులకు అందజేయాలి. ఫారం 49ఎ అప్లికేషన్లో ఉన్న చివరి కాలమ్లో రెండవ పాన్ కార్డు సమాచారాన్ని క్లుప్తంగా వ్రాయాలి. ఎవరైతే వ్యక్తి రెండవ పాన్ కార్డుని కలిగి ఉంటారో వారు అప్లికేషన్లో పూర్తి పేరు, పూర్తి చిరునామాతో పాటు పాన్ కార్డు వివరాలు పేర్కొనాలి. -
గుడ్ న్యూస్: పాన్ కార్డులో కొత్త ఆప్షన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్-పాన్ అనుసంధానంలో ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించింది. పాన్ కార్డులో థర్డ్జెండర్ ఆప్షన్ కల్పిస్తూ ..ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సిబిడిటి) సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పాన్కార్డు దరఖాస్తులో ట్రాన్స్జెండర్లను ప్రత్యేక కేటగిరీగా గుర్తించిన కేంద్రం వారికోసం ఈ ప్రత్యేక ఆప్షన్ను కేటాయించింది. స్త్రీ, పురుషుల మాదిరిగా ట్రాన్స్జెండర్లకు ఓ ఆప్షన్ను కేటాయిస్తూ ఆదాయ పన్ను శాఖ నిబంధనలను ప్రభుత్వం సవరించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను సీబీడీటీ సోమవారం విడుదల చేసింది. పాన్ కోసం దరఖాస్తు చేసే ట్రాన్స్జెండర్ల కోసం దరఖాస్తు ఫారంలో ప్రత్యేకంగా ఓ టిక్ బాక్స్ను ఏర్పాటు చేశారు. కాగా ఇన్ని రోజుల ఆధార్-పాన్ అనుసంధానంలో హిజ్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి కారణం ఆధార్ కార్డులో జెండర్ ఎంపికలో ఆడ, మగతోపాటు హిజ్రాలకు ప్రత్యేకంగా థర్డజెండర్ ఆప్షన్ ఉన్నప్పటికీ పాన్ కార్డు దరఖాస్తులో ఆ వెసులుబాటు లేకపోవడమే. ఆధార్కార్డుల్లో థర్డ్ జెండర్ అనీ, పాన్కార్డుల్లో మాత్రం పురుషుడు/మహిళ అని ఉండటంతో హిజ్రాలు తమ ఆధార్ నంబర్లను పాన్కు అనుసంధానించుకోలేక ఇబ్బందులకు గురయ్యారు.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హిజ్రాలకు పాన్ కార్డుల ధరఖాస్తుకు, ఆధార్తో అనుసంధానికి సంబంధించిన సమస్యలు తొలగిపోయాయి. -
హిజ్రాలకు ‘పాన్–ఆధార్’ తిప్పలు
న్యూడిల్లీ: దేశంలో వివిధ రకాలుగా వివక్ష, వేధింపులకు గురవుతున్న హిజ్రాలకు పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) రూపంలో కొత్త సమస్య ఎదురైంది. అందరూ తమ ఆధార్ సంఖ్యను పాన్తో ఈ నెల 31లోపు అనుసంధానించుకోవాలని కేంద్రం, సుప్రీంకోర్టు గతంలో ఆదేశించడం తెలిసిందే. ఆధార్ అనుసంధానం కాని పాన్ కార్డులు వచ్చే నెల నుంచి రద్దయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే ప్రస్తుతం అనేక ఆర్థిక లావాదేవీలకు, సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఆధార్, పాన్లను తప్పనిసరి చేసింది. అయితే ఆధార్–పాన్ అనుసంధానంలో హిజ్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఆధార్ కార్డులో జెండర్ ఎంపికలో ఆడ, మగతోపాటు హిజ్రాలకు ప్రత్యేకంగా థర్డజెండర్ ఆప్షన్ ఉన్నప్పటికీ పాన్ కార్డు దరఖాస్తులో ఆ వెసులుబాటు లేకపోవడమే. ఆధార్కార్డుల్లో థర్డ్ జెండర్ అనీ, పాన్కార్డుల్లో మాత్రం పురుషుడు/మహిళ అని ఉండటంతో హిజ్రాలు తమ ఆధార్ నంబర్లను పాన్కు అనుసంధానించుకోలేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రభావం దాదాపు 5 లక్షల మంది (తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 70 వేల మంది) హిజ్రాలపై పడుతోంది. ఎదురవుతున్న సమస్యలివీ ! ఆధార్–పాన్ లింకింగ్ తప్పనిసరి అయిన నేపథ్యంలో హిజ్రాలు ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేయలేకపోతున్నారు. రూ. 50 వేలకు పైబడిన ఆస్తుల క్రయవిక్రయాలకు, ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు పాన్, ఆధార్కార్డులు తప్పనిసరి కావడం వీరికి తలనొప్పిగా మారింది. 2017 మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం మ్యూచువల్ ఫండ్ ఖాతాలను అప్డేట్ చేయలేకపోతుండటం, బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకూ ఇబ్బందులు పడుతున్నారు. ‘ట్రాన్స్జెండర్గా నన్ను నేను అంగీకరించాను. దీనినే ప్రతి గుర్తింపు కార్డూ చాటిచెప్పాలని కోరుకుంటున్నాను. కారు యజమానిగా పత్రాల్లో గుర్తింపుతో పాటు, వైద్య బీమా, ఆస్తి పత్రాలు, పాన్కార్డు వరకు అన్నింట్లోనూ ఇదే స్పష్టంగా పేర్కొనాలి’అని హిజ్రాల హక్కుల కోసం పోరాడే కార్యకర్త రేష్మా ప్రసాద్ కోరుతున్నారు. ‘సుప్రీం’తీర్పు ఏం చెబుతోంది ? హిజ్రాలకు సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం లభించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) కేసులో సుప్రీంకోర్టు నాలుగేళ్ల క్రితం ఆదేశాలిచ్చింది. సంక్షేమ పథకాల లబ్ధితో మొదలుపెట్టి వీరికి అన్ని రకాల సహాయ, సహకారాలను అందించాలని సూచించింది. తమ గుర్తింపును తామే నిర్ధారించుకునే ప్రాథమిక హక్కును వారికి కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు హిజ్రాల కోసం సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేశాయి. పశ్చిమబెంగాల్లోని ఓ ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీ ట్రాన్స్జెండర్కు ప్రిన్సిపాల్గా అవకాశమిచ్చింది కూడా. కొచ్చి మెట్రో సంస్థ పలు విభాగాల్లో వీరి సర్వీసులు ఉపయోగించుకుంటోంది. -
నా గుర్తింపు ఏదీ ..?
దేశంలోని ట్రాన్స్జెండర్లు గుర్తింపు సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో వివక్ష, వేధింపులకు గురవుతున్న వారికి పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) రూపంలో కొత్త సమస్య ఎదురైంది. ఆదాయపు పన్ను మదింపుతో సహా సంక్షేమ పథకాల లబ్దికి, బ్యాంకు రుణాలు, ఇతర ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం ఆధార్–పాన్ అనుసంధానం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరుతో ఈ గడువు ముగుస్తుండడంతో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పురుషులు, మహిళల మాదిరిగానే ట్రాన్స్జెండర్ల పేరిట కూడా ఆధార్కార్టులు జారీచేస్తున్నారు. వచ్చిన చిక్కల్లా పాన్ కార్డుల్లో ఆ వెసులుబాలు లేకపోవడమే. ఆధార్కార్డుల్లో ట్రాన్స్జెండర్లుగా, పాన్కార్డుల్లో మాత్రం వారి గుర్తింపు పురుషుడు లేదా మహిళగా పేర్కొనడంతో ఆధార్–పాన్ లింకింగ్ కుదరడం లేదు. పుట్టిన సందర్భంగా మగ లేదా ఆడపిల్లగా పొందిన గుర్తింపు ఆధారంగా పాన్కార్డులిస్తుండడం, ట్రాన్స్జెండర్లను విడిగా గుర్తించకపోవడమే ఈ సమస్యకు కారణం. దీనితో వారు ఐటీ రిటర్న్స్ కూడా దాఖలు చేయలేకపోతున్నారు. దీని ప్రభావం ఇప్పుడు దాదాపు 5 లక్షల మంది (ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కలిపి దాదాపు 70 వేలు) మేర ఉన్న మొత్తం ట్రాన్స్జెండర్ల సమాజంపై పడనుంది. ‘సుప్రీం’ తీర్పు ఏం చెబుతోంది ? ట్రాన్స్జెండర్లకు సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) తీర్పు రూపంలో సుప్రీంకోర్టు నాలుగేళ్ల క్రితం ఆదేశాలిచ్చింది. సంక్షేమ పథకాల లబ్దితో మొదలుపెట్టి వీరికి అన్ని రకాల సహాయ,సహకారాలను అందించాలని సూచించింది. తమ గుర్తింపును తామే నిర్థారించుకునే ప్రాథమిక హక్కును వారికి కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్జెండర్ల సంక్షేమబోర్డులు ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలోనే పశ్చిమబెంగాల్లోని ఓ ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీ ట్రాన్స్జెండర్కు ప్రిన్సిపాల్గా అవకాశమిచ్చింది. కొచ్చి మెట్రో సంస్థ పలు విభాగాల్లో వీరి సర్వీసులు ఉపయోగించుకుంటోంది. ఎదురయ్యే సమస్యలివీ ! ఆధార్–పాన్ లింకింగ్ తప్పనిసరి అయిన నేపథ్యంలో ట్రాన్స్జండర్లకు ఎదురయ్యే సమస్యలు...ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేయలేకపోవడం, రూ. 50 వేలకు పైబడిన ఆస్తుల కొనుగోలు/విక్రయానికి పాన్ నెంబర్ తప్పనిసరి కావడంతో చిక్కులు. సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని రిజిష్టర్ చేసుకోవాలంటే పాన్, ఆధార్కార్డుల ఆవశ్యకత. 2017 మనీలాండరింగ్ నియంత్రణ చట్టప్రకారం మ్యూచువల్ ఫండ్ ఖాతాలను అప్డేట్ చేయకపోవడం, బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు ఇబ్బందులు ఎదురవడం వంటి సమస్యలున్నాయి. నన్ను నాలాగే గుర్తించండి... ‘ట్రాన్స్జెండర్గా నన్ను నేను అంగీకరించాను. దీనినే ప్రతి గుర్తింపు కార్డు చాటిచెప్పాలని కోరుకుంటున్నాను. కారు యజమానిగా పత్రాల్లో గుర్తింపుతో పాటు, మెడికల్ ఇన్సురెన్స్, ఆస్తి పత్రాలు, పాన్కార్డు వరకు అన్నింట్లోనే ఇదే స్పష్టంగా పేర్కొనాలి’ అని రేష్మా ప్రసాద్ అంటున్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ప్రాన్ కార్డుతో.. ప్రయోజనాలెన్నో..
నిడమర్రు : పాన్ కార్డు.. ప్రాన్ కార్డు.. అక్షరమే తేడా ఉన్నా రెండు కార్డులు ఎంతో ఉపయుక్తమైనవి. పాన్ కార్డు ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారందరికీ అవసరమైనదైతే, ప్రాన్ కార్డు ఉద్యోగులు, జాతీయ పింఛన్ పథకం ఖాతా దారులకు సంబంధించింది. కేంద్ర ప్రభుత్వమే దీన్ని అందజేస్తుంది. 2004 తర్వాత నియమితులైన ఉపాధ్యాయుల, ఉద్యోగులకు ఈ కార్డులు అందజేస్తుంది. చాలామంది పింఛన్దారులు వినియోగించక పోవడంతో దీని ప్రయోజనం పొందలేకపోతున్నారు. 2004 తర్వాత నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్ సదుపాయం లేదు. వీరి జీతాల నుంచే నెలనెలా కొంత మొత్తం ప్రభుత్వం వసూలు చేసి ప్రత్యేక ఖాతాకు ప్రభుత్వం జమ చేస్తుంది. దీన్ని కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అంటారు. ఈ సీపీఎస్ విధానంలో ఉన్నవారికి ప్రాన్ కార్డు తప్పనిసరి. చాలామందికి ప్రాన్ కార్డు గురించి అవగాహన ఉన్నా కార్డు గురించి పూర్తిగా తెలియదు. ఈ కార్డు ప్రయోజనం తెలుసుకుందాం. ప్రాన్ అంటే..? పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్(ప్రాన్).. ఏటీఎం కార్డు వంటిది. సీపీఎస్ విధానంలో జీతాలు పొందుతున్న వారితోపాటు పింఛన్ పొందుతున్న ఉద్యోగులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన కార్డు. తొలుత పింఛనర్లకే ఇచ్చేవారు. 2004లో కేంద్రం జాతీయ పింఛన్ పథకం బిల్లును ఆమోదించినప్పటి నుంచి ఈ కార్డు అమలులోకి వచ్చింది. ప్రాన్ కార్డు ద్వారా ఉద్యోగులు, పింఛన్దారులు ఎప్పటికప్పుడు తమ ఖాతా నిల్వలు తెలుసుకోవచ్చు. ఉద్యోగం మారినా కార్డు మార్చుకోనవసరం లేదు. పిన్ నంబర్ ఆధారంగా కార్డును వినియోగించు కోవచ్చు. అయితే ఈ కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకునే సదుపాయం మాత్రం లేదు. పొందడం ఇలా.. జీతాలు అందించే శాఖాధిపతుల(డ్రాయింగ్ అధికారులు) సిఫారసులతో జిల్లా కేంద్రాల్లో ఉండే కార్వీ కేంద్రాలకు పదో తరగతి సర్టిఫికెట్ అందించి నేరుగా గాని, గుర్తింపు పొందిన ఏజెంట్ల ద్వారాగాని దరఖాస్తు చేసుకోవాలి. సీపీఎస్ ఉద్యోగులైతే జీతాల స్లిప్ను జతచేయాలి. వంద రూపాయలు చెల్లిస్తే రిజిస్టర్ పోస్టులో కార్డు అందుతుంది. జీతాల నుంచి పీఎఫ్ కోత ఉన్న ఉద్యోగులు ఈ ప్రాన్ కార్డు పొందే వీలు లేదు. ఇందుకు సంబంధించిన వెబ్సైట్లో వివరాలు వచ్చాక పిన్ ఎంటర్ చేస్తే అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఉద్యోగులకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు వీటిని సవరించుకోవచ్చు. వరుసగా మూడు నెలలపాటు ఒక్కసారి కూడా కార్డు వినియోగించకుంటే బ్లాక్ అవుతుంది. మళ్లీ వేరే పాస్వర్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయోజనాలు.. ♦ ఖాతాలో సొమ్ము నిల్వ గురించి తెలుసుకోవచ్చు. ప్రభుత్వ పథకాలకు గుర్తింపు కార్డుగా ఉపయోగించుకోవచ్చు. ♦ సీపీఎస్ విధానంలో ప్రతినెలా తమ వాటా సొమ్ము ఖాతాకు జమ అవుతోందో లేదో తెలుసుకునే వీలు కలుగుతుంది. ♦ పింఛన్ లావాదేవీలకు పాన్ కార్డుతోపాటు ప్రాన్ కార్డు కూడా ఉపయోగించవచ్చు. ♦ ప్రభుత్వపరంగా రుణాలు తీసుకున్నప్పుడు ఉపయుక్తమవుతుంది. ♦ ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసే సమయంలో ప్రాన్ కార్డు తప్పనిసరి పిన్ నంబర్ మర్చిపోతే.. ప్రాన్ కార్డు పిన్ నంబర్ మర్చిపోతే ఎటువంటి ఇబ్బంది లేదు. కొత్త పిన్ నంబర్ తెలుసుకునేందుకు ఆన్లైన్ ద్వారా అవకాశం ఉంది. ఠీఠీఠీ.ఛిట్ఛ/nఛీట.ఛిౌఝ లోకి ఎంటర్ కావాలి. ఇందులో ఛిట్చnటఛీ∙పదాన్ని క్లిక్ చేయాలి. సీ యువర్ ప్రాన్ స్టేటస్ అనే పదం వద్ద క్లిక్ చేయాలి. సబ్స్క్రైబర్ ఇన్ఫర్మేషన్, నోడల్ అధికారి ఇన్ఫర్మేషన్ అనే రెండు బాక్స్లు వస్తాయి. సబ్స్క్రైబర్ బాక్స్లో ప్రాన్ నంబర్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అనే బాక్స్ వద్ద ఫర్ గెట్ పాస్వర్డ్/సీక్రెట్ క్వశ్చన్ రీసెట్ పాస్వర్డ్ అనే పదం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. పాన్ కార్డుపై ప్రింట్ వివరాలు అడుగుతుంది. వాటిని నమోదు చేసి ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత మన ఫోన్ నంబర్కు మెసేజ్ వస్తుంది. అలా వచ్చిన వన్టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) నంబర్ బాక్స్లో ఎంటర్ చేయాలి. అప్పడు కొత్త పాస్వర్డ్ వస్తుంది. దీన్ని తర్వాత వినియోగించుకోవచ్చు. -
ఆన్లైన్లో కొత్త పాన్ కార్డును పొందండిలా
నిడమర్రు : ఆదాయపు పన్ను శాఖ అందించే శాశ్వత ఖాతా సంఖ్య కార్డు (పాన్ కార్డు) కలిగి ఉండటం నగదు లావాదేవీల విషయంలో తప్పనిసరి అవుతుంది. బ్యాంకు లావాదేవీలకు, పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల్లో పర్మినెంట్ అకౌంట్ నెంబర్(పాన్ కార్డు) అవసరమవుతుంది. సార్వత్రికమైన ఈ 10 అంకెల అల్ఫాన్యూమరిక్ పాన్ కార్డును ఆదాయపన్ను శాఖ ప్రతీ పన్ను చెల్లింపుదారుకు దీన్ని జారీ చేస్తుంది. అయితే ఈ కార్డుకోసం రాతపూరక దరఖాస్తు చేసుకుంటే 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. అయితే అత్యవసర సమయాల్లో ఈ పాన్ కార్డు(సంఖ్య) ఆన్లైన్ ద్వారా 48 గంటల్లో పొందే అవకాశం ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్ ద్వారా ఆదాయపన్ను శాఖ కల్పిస్తుంది. ఆ వివరాలు తెలుసుకుందాం. పాన్ కార్డు జారీ ఇలా పాన్ కార్డును భారత ఆదాయపన్ను శాఖ దీన్ని జారీ చేస్తుంది. దీని కోసం www.tun-nsdl.com అనే వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. కనిపించే వెబ్సైట్ ముఖ చిత్రంలో దిగువభాగంలో ఆన్లైన్ పాన్ అప్లికేషన్ క్లిక్ చేయాలి. అక్కడ అప్లై ఆన్లైన్ వద్ద భారతీయులైతే న్యూ పాన్–ఇండియన్ సిటిజన్(ఫారం 49 ఏ)/విదేశీయులైతే న్యూ పాన్–ఫారిన్ సిటిజన్(ఫారం–49 ఏఏ) క్లిక్ చేయాలి. అక్కడ ఆన్లైన్ దరఖాస్తు విండో ఓపెన్ అవుతుంది. ఈ ఆన్లైన్ ఫారంలో చిరునామా, ఆదాయపన్ను శాఖ సర్కిల్, రేంజి, ఏరియా కోడ్, ఏవో కోడ్ వంటివన్నీ పూర్తి చేయాలి. ఆ వివరాలు అదే వెబ్సైట్లో పొందవచ్చు. గైడ్లైన్స్ చదవాలి : అదే విండోలో ఉన్న గైడ్లైన్స్ చదివి ఫారం రకాన్ని ఎంచుకోవాలి. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ కావాలా..? డిజిటల్ సిగ్నేజర్ లేని సర్టిఫికెట్ కావాలా..? అనే ఆప్షన్ ఎంచుకుని వివరాలు మొత్తం నింపాలి. పాన్ కార్డుకు సంబంధించిన వివరాలన్నీ అదే వెబ్సైట్లో ఎప్పటికప్పుడు లభ్యమవుతాయి. అలాగే ఇదే వెబ్సైట్లో పాన్/టాన్ కార్డ్ దరఖాస్తు స్థితి తెలుసుకోవడం, ఇ–రిటర్న్ రిజిస్ట్రేషన్ స్థితి తెలుసుకోవడం పాన్కు సంబంధించిన ఫిర్యాదులు చేయడం, పాన్ డేటాలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ఇలా సమర్పించాలి.. : వివరాలన్నీ ఆన్లైన్ దరఖాస్తు ఫారంలో నింపి, అవసరమైన సపోర్టడ్ డాక్యుమెంట్లు జతచేసి సమర్పించాలి. దరఖాస్తు నెంబరు ప్రకారం ఎకనాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. ఈ నెంబర్ ప్రకారం మీ అప్లికేషన్ స్టేటస్ ట్రాక్ చేసుకోవచ్చు, సాధారణంగా 15 నుంచి 29 పనిదినాల తర్వాత పాన్ కార్డు వస్తుంది. కానీ ఇలా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే కేవలం రెండు రోజుల్లో కేటాయిం చిన పాన్ కార్డు సంఖ్య తెలుసుకోవచ్చు. తర్వాత రిజిస్టర్ పోస్ట్ ద్వారా పాన్కార్డు అందుతుంది. పాన్ కార్డు భారతదేశం పరిధిలో పంపించడానికి రూ.110 (జీఎస్టీతో సహా), ఇతర దేశాలకు పాన్ కార్డు పంపాల్సి వస్తే అన్ని సర్వీసులు కలుపుకుని రూ.1,020 (జీఎస్టీతో సహా) ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే.. ఒకవేళ ఆఫ్ లైన్లో అయితే ఇదే వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని సంతకంతో కూడిన కలర్ ఫొటో, వ్యక్తిగత గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు, చిరునామా గుర్తింపు పత్రం, రూ.110 డీడీ సమర్పించాలి. -
14 కోట్ల పాన్కార్డులు ఆధార్తో అనుసంధానం
న్యూఢిల్లీ: పాన్ కార్డులను ఆధార్తో అనుసంధానించినవారి సంఖ్య ఇప్పటికి 14 కోట్లకు చేరుకుంది. దేశవ్యాప్తంగా 30 కోట్ల మందికి ఈ పాన్ (పర్మినెంట్ ఎకౌంట్ నంబర్)కార్డులున్నాయి. ఈ విషయాన్ని యునిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ ) ప్రధాన కార్యనిర్వహణ అధికారి అజయ్ భూషణ్ ఆదివారం వెల్లడించారు. 100 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ఉండగా అందులో 70 కోట్ల మంది తమ ఖాతాలను ఆధార్ నంబర్తో అనుసంధానించారని ఆయన చెప్పారు. కాగా బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లకు ఆధార్ సంఖ్యను అనుసంధాన గడువును సుప్రీంకోర్టు గతవారం వచ్చే ఏడాది మార్చి ఆఖరువరకూ పొడిగించడం తెలిసిందే. పన్ను ఎగవేతలు, నకిలీ ఖాతాలకు తెరదించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ అనుసంధాన ప్రక్రియను చేపట్టింది. -
ఆధార్కి లింక్ చేశారా?
మీ పాన్ కార్డ్ని మీ ఆధార్ కార్డుతో లింక్ చేశారా? గుడ్.మీ బ్యాంక్ అకౌంట్ని మీ ఆధార్ కార్డుతో లింక్ చేశారా?వెరీ గుడ్.మీ డ్రైవింగ్ లైసెన్స్ని మీ ఆధార్ కార్డుతో లింక్ చేశారా? ఓసమ్.మీ కాలేజ్ ఐడీని మీ ఆధార్ కార్డుతో లింక్ చేశారా? మైండ్ బ్లోయింగ్.ఇప్పుడు ఇంకొక్క లింక్ మిగిలింది! అది కూడా పూర్తి చేసేస్తే మీరిక స్వచ్ఛ భారతీయుడు లేదా భారతీయురాలు. ‘అన్నీ చేసేశాం కదా ఆ మిగిలిన ఒక్క లింకూ లింకు చేయకపోతే ఏమౌతుందీ’ అని తలకింద దిండేసుకుని, చలిగా ఉంది కదా అని చెవుల దాకా దుప్పటి కప్పుకుని పడుకుంటే మీ సిటిజన్షిప్ ఢమాలే! ఇంతకీ ఏంటా కొత్త లింకు? మీ ఆధార్ని మీ ఆధార్కి లింక్ చెయ్యడం! అవును. మీ ఆధార్ని మీరు ఎన్నిటికి లింక్ చేసినా, ఆధార్కి లింక్ చెయ్యకపోతే దేశంతో ఉన్న మీ లింకులన్నీ.. అంటే.. పుట్టిన ఊరు లింకు, చదివిన స్కూలు లింకు, చేస్తున్న జాబ్ లింకు, ఫ్యామిలీతో మీకున్న లింకూ.. అన్నిటినీ గవర్నమెంట్ తెంపేస్తుంది. ఆధార్ని ఆధార్కి లింక్ చెయ్యడానికి లాస్ట్ డేట్ డిసెంబర్ 31. న్యూ ఇయర్ డే ప్లాన్ ఏమైనా ఉంటే త్యాగం చేసి, మీ లైఫ్ని ప్లాన్ చేసుకోండి. -
ఆధార్తో లింక్ కాని పాన్కార్డుల రద్దు!
న్యూఢిల్లీ: పాన్ కార్డును ఆధార్తో అనుసంధానం చేయడంపై సుప్రీం కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిస్తే వీటి అనుసంధానానికి 3 నుంచి 6 నెలల గడువిస్తామని కేంద్రానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ గడువు అనంతరం ఆధార్తో లింక్ చేయని పాన్ కార్డులన్నింటినీ రద్దు చేస్తామని మీడియాకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 33 కోట్ల పాన్ కార్డులు ఉంటే..13.28 కోట్ల మంది తమ పాన్ కార్డుల్ని ఆధార్తో అనుసంధానం చేసుకున్నారని తెలిపారు. -
ఎల్ఐసీ పాలసీకి ఆధార్ లింక్ : అలా చేయకండి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మీ ఆధార్, పాన్ కార్డు వివరాలు, మీ ఎల్ఐసీ పాలసీలకు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని దేశంలోనే అతిపెద్ద లైఫ్ ఇన్సూరర్ తన వెబ్సైట్లో తెలిపింది. పాలసీ హోల్డర్స్ తమ పాలసీలకు ఆధార్ లింక్ చేసుకోవడం కోసం ఎల్ఐసీ ఆన్లైన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొంది. కానీ ఇటీవల ఎస్ఎంఎస్ను పంపించి.. ఆధార్తో ఎల్ఐసీ పాలసీని లింక్ చేసుకోవాలంటూ ఎల్ఐసీ పేరు మీద బూటకపు మెసేజ్లు వస్తున్నాయి. అలా వచ్చిన మెసేజ్ను నమ్మి, నిజంగా ఎస్ఎంఎస్తో ఆధార్ను లింక్ చేస్తే ఇక పాలసీదారుడి పని అంతేనని, వివరాలన్నీ లీకైపోతాయని ఎల్ఐసీ ప్రకటించింది. అలాంటి లింకుల మెసేజీలను నమ్మొద్దంటూ ఎల్ఐసీ సంస్థ తన మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో వెల్లడించింది. సోషల్మీడియాలో విస్తృతంగా వస్తున్న ఆ సమాచారాన్ని, ప్రచారాన్ని నమ్మొద్దని, తాము అలాంటి ఎస్ఎంఎస్లను పంపించట్లేదనీ స్పష్టం చేసింది. ప్రస్తుతానికైతే ఆన్లైన్ విధానం ద్వారానే పాలసీలను పాన్, ఆధార్తో లింక్ చేసుకునే ప్రక్రియను చేపడుతున్నామని ఎల్ఐసీ తెలిపింది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎల్ఐసీ పాలసీల వివరాలు దగ్గర పెట్టుకోవాలి ఎల్ఐసీ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. హోమ్పేజీలో కనిపిస్తున్న ఆధార్, పాన్ను ఎల్ఐసీ పాలసీలతో అనుసంధానించుకునే లింక్ను క్లిక్ చేయాలి. యూఐడీఏఐ వద్ద రిజిస్ట్రర్ అయిన మొబైల్ నెంబర్ను నమోదుచేసుకోవాలి. మీరు నమోదుచేసిన నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఒకవేళ ఆధార్లో మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని లేకపోతే, దగ్గర్లోని ఎల్ఐసీ బ్రాంచు ఆఫీసును సంప్రదించి, ఆధార్ లింక్ను చేపట్టవలసి ఉంటుంది. చెక్లిస్టులన్నీ చదివాక, పేజీ కింద ఉన్న ప్రొసీడ్ బటన్ను క్లిక్ చేయాలి. దరఖాస్తులో అన్ని వివరాలు నింపిన అనంతరం, ఆధార్ను అనుసంధానించే ప్రక్రియ విజయవంతమైనట్టు ఓ మెసేజ్ వస్తుంది. -
13.28 కోట్ల పాన్కార్డులు ..
సాక్షి, న్యూఢిల్లీ: ఇప్పటి వరకూ 13.28 కోట్ల శాశ్వత ఖాతా నంబర్లు (పాన్ ) కార్డ్ తో ఆధార్ నంబర్ల అనుసంధానం జరిగిందని కేంద్ర ప్రకటించింది. దీంతో ప్యాన్తో ఆధార్ లింకింగ్ ప్రక్రియలో 39.5 శాతం కార్డుల అనుసంధానం పూర్తయిందని అధికారిక వర్గాలు సోమవారం ప్రకటించాయి. సుమారు 33 కోట్ల పాన్ కార్డులు ఉండగా, ఆధార్ 115 కోట్ల మందికి ఆధార్ కార్డులను జారీ చేసినట్టు వెల్లడించాయి. జూలై 1 నుంచి ఐటీఆర్ ( ఆదాయన పన్ను టర్న్) దాఖలు కు పాన్-ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆదాయపు పన్ను చట్టం నిబంధనపై జూన్ నెలలో సుప్రీంకోర్టు సమర్థించింది అయితే గోపత్య అంశంపై రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వరకు ఈ ఆదేశాల అమలుపై పాక్షింగా స్టే విధించింది. అలాగే ఆధార్కార్డుకోసం నమోదు చేసుకున్న వారి పాన్ కార్డులు రద్దు కావని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బంగారం కొనేవారికి గుడ్ న్యూస్
సాక్షి,న్యూఢిల్లీ: జ్యూవెలర్లు, కొనుగోలుదారులకు భారీ ఊరట లభించింది. రూ 50,000కు మించి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే పాన్ కార్డు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం నిబంధనలను జ్యూవెలరీ కొనుగోళ్లకూ వర్తింపచేస్త జారీ చేసిన నోటిఫికేషన్ను ప్రభుత్వం ఉపసంహరించింది. దీంతో జ్యూవెలర్లు యాభైవేలకు మించి బంగారం కొనుగోలు చేసిన కస్టమర్ల వివరాలను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి నివేదించాల్సిన అవసరం లేదు. మనీల్యాండరింగ్ చట్ట నిబంధనలు బంగారు ఆభరణాల కొనుగోలుకు వర్తింపచేస్తే కేవైసీ నిబంధనల కారణంగా బంగారం సేల్స్ భారీగా తగ్గుతాయని జ్యూవెలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. బంగారంలో బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఆగస్ట్ 23న జెమ్స్, జ్యూవెలరీ రంగానికీ మనీ ల్యాండరింగ్ నియంత్రణ నిబంధనలను వర్తింపచేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆదాయ పన్ను చట్టం కేవైసీతో నిమిత్తం లేకుండా రూ2 లక్షల వరకూ నగదు అమ్మకాలకు అనుమతించినా మనీ ల్యాండరింగ్ నియంత్రణ నిబంధనల కింద పాన్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఆధారాలు లేకుండా రూ 50,000కు మించి నగదు లావాదేవీలు జరిపేందుకు వెసులుబాటు లేదు. -
ఆధార్తో 9.3 కోట్ల పాన్కార్డుల అనుసంధానం
న్యూఢిల్లీ: రిటర్నుల దాఖలుకు తుది గడువైన ఈ నెల 5 నాటికి ఆధార్తో అనుసంధానమైన పాన్ కార్డుల సంఖ్య 9.3 కోట్లకు చేరినట్టు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. మొత్తం 30 కోట్ల పాన్ కార్డుల్లో ఇవి 30 శాతంగా పేర్కొంది. ఈ నెల చివరి వరకు గడువు ఉన్నందున ఆధార్తో మరిన్ని కార్డులు అనుసంధానమవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆధార్తో అనుసంధానించుకునేంత వరకు ఆయా రిటర్నులను ప్రాసెస్ చేయడం జరగదని ఓ అధికారి తెలిపారు. ఈ ఏడాది జూలై 1 నుంచి కొత్తగా పాన్ కార్డు తీసుకునే ప్రతి ఒక్కరూ ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వడంతోపాటు, ఇప్పటికే కార్డులు తీసుకుని ఉన్న వారు రిటర్నుల దాఖలుకు గాను ఆధార్తో లింక్ చేసుకోవాలని ఐటీ శాఖ కోరిన విషయం తెలిసిందే. -
11.44 లక్షల పాన్ కార్డులు డీయాక్టివేట్
ముంబై: పాన్కార్డు హోల్డర్స్కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దేశ వాప్తంగా సుమారు 11.4 లక్షల పాన్ కార్డులను డీయాక్టివేట్ చేసింది. అందులో కొన్నింటిని డిలీట్ కూడా చేసింది. ఆగస్టు 31లోపు ప్రతి పౌరుడు ఆధార్ కార్డుతో పాన్కార్డును అనుసంధానం చేసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించిన విషయం తెలిసిందే. ఆలోపు ఆధార్ నెంబర్తో లింక్ చేయని పాన్కార్డులు చెల్లవని ఆర్థికమంత్రిత్వ శాఖ గతంలోనే సూచించింది. డీయాక్టివ్ అయిన పాన్కార్డుల్లో మీకార్డు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఐటీ డిపార్ట్ మెంట్ ఇ- ఫిల్లింగ్ వెబ్ సైట్ను ని సందర్శించండి. అందులో 'Know Your Pan' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిమీద క్లిక్ చేస్తే ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో నక్షత్రం గుర్తు ఉన్న ఖాళీలు అన్నీ జగ్రత్తగా నింపి సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ ఫోన్ నెంబర్ కి వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేసి వాలిడేట్ బటన్ పై క్లిక్ చేయండి. అనంతరం మీ పాన్ కనుక డీ యాక్టివేట్ కాకపోయి ఉంటే ‘యాక్టివ్’ అని కనిపిస్తుంది. ఇంకా చదవండి: ఆగస్టు 31 డెడ్లైన్..లేదంటే -
పాస్పోర్ట్కు డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు..
న్యూఢిల్లీ: మీరు పాస్పోర్టు దరఖాస్తు చేయాలి. మీ దగ్గర జనన దృవీకరణ పత్రం(డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్) ఉంటే త్వరగా వచ్చేస్తుంది. కానీ అదే మీదగ్గర లేకపోతే, అది రావటానికి ఓ 90రోజులు సమయం పడుతుంది. అంతేకాదు. దానికోసం మీసేవ కార్యాలయం, ఎమ్మార్వో కార్యలయం చూట్టూ తిరగాల్సి ఉంటుంది. కానీ ఇప్పడు మీకు ఆ బాధలన్నీ ఉండవు. ఎందకుంటే భారత ప్రభుత్వం కొత్త నియమాలను అమలు లోకి తెచ్చింది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా పాస్పార్ట్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, పాన్కార్డులోని మీ పుట్టిన రోజు విషయాలనే పరిగణలోకి తీసుకోవాలని భారతప్రభుత్వం సూచించింది. పాసుపోర్టు చట్టం 1980 ప్రకారం, 1989 జనవరి 26 తరువాత పుట్టిన వారు పాసుపోర్టు పొందాలంటే ఖచ్ఛితంగా జనన దృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అది అవసరం లేదు. స్కూల్ ట్రాన్సఫర్ సర్టిఫికేట్, పదో తరగతి మార్కుల మెమో, పాన్కార్డు, ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీకార్డు, ఎల్ఐసీ పాలసీ బాండ్లలో ఓ ఒక్కటైనా చూపించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఉత్తర్వులు జరీ చేస్తూ కేంద్రం చర్యలు తీసుకుంది. -
ఆదాయ పన్ను చెల్లింపులో కొత్త ఎత్తుగడ
న్యూఢిల్లీ: ఆధార్ కార్డు వివరాలు తెలపడం ఇష్టం లేని చాలామంది పన్ను చెల్లింపులకు కొత్త మార్గాలను కనుగొంటున్నారు. దేశ వ్యాప్తంగా అనేక మంది పన్ను చెల్లింపు దారులు తమ ఆదాయపు పన్నును మాన్యువల్గా చెల్లించారు. చాలా మంది జూన్ 30 వ తేదీకి ముందే తమ ఆదాయపన్నును ఆన్ లైన్ లో దాఖలు చేశారు. ఎందుకంటే జూన్ 30కు ముందు ఆధార్ కార్డు తప్పనిసరి కాకపోవడంతో ఎక్కువ మంది తమ పన్నును ముందుగానే రిటర్న్ చేశారు. ఈ ఫిల్లింగ్ వ్యవస్థలో లోపం వల్ల ఆధార్ కార్డు లేకపోతే ఆన్లైన్లో చెల్లించడానికి ఇ-ఫిల్లింగ్ వ్యవస్థలో వీలవదు. కొన్ని సందర్భాల్లో దరఖాస్తు సైతం తిరస్కరించబడుతుంది. కానీ రూ.5లక్షల ఆదాయం ఉన్నవారు ఖచ్చింతగా తమ ఆధార్ కార్డు నెంబర్ను జత చేయాల్సి ఉంటుంది. కానీ జత చేసిన ఆధార్కార్డు వివరాలకు భద్రత లేదని ప్రముఖ చిత్ర నిర్మాత రాకేష్ శర్మ అన్నారు. బెంగళూరుకు చెందిన కన్సల్టెంట్ తనభర్తతో, వారి స్నేహితులు పన్ను చెల్లింపులకు ఆధార్ కార్డు జత చేయడానికి నిరాకరించారని తెలిపింది. ఆధార్ డేటా ఆన్లైన్లో చోరీకి గురౌంతుందని అందువల్లే తాము ఆధార్కార్డును జత చేయలేదన్నారు. ఇంకా కొన్ని బ్యాంకులు వినియోగదారులను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోమని లేకపోతే లావాదేవీలు స్థంభింప చేస్తామని బెదిరింపులకు పాల్పడుతోందని ఆమె వాపోయింది. చాలా మంది వినియోగదారులు తమ ఆధార్కార్డును జత చేయడానికి ఇష్టపడట్లేదు. కావాలంటే ఓటర్ కార్డుతో జత చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆదాయ పన్ను చట్టం యొక్క సెక్షన్ 139ఏఏ ప్రకారం ఆదాయపన్ను రిటర్న్స్ దరఖాస్తుకు జులై 1 నుంచి ఆధార్ నంబర్ తప్పనిసరి చేసింది. జూన్ 9 న, సుప్రీం కోర్టు బెంచ్ దీనిని సమర్థించింది. అయితే ఆధార్ సమాచార భద్రతపై వచ్చిన పలు సందేహాలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు దానిని తాత్కాలికంగా రద్దు చేసింది. కానీ పాన్కార్డు తప్పని సరి చేసింది. జూలై 1నుంచి ఐటి రిటర్న్స్ దాఖలు చేయడానికి పన్ను ఆధార్ తప్పనిసరి. చెల్లింపుదారులకు ఆధార్ కార్డు లేకపోతే, పన్ను చెల్లింపుదారులు ఆధార్ నమోదు సంఖ్యను జతపరచాలని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఆధార్ అనుసంధానం కొన్ని సందర్భాల్లో, కొందరికి మాత్రమే ఉపశమనం లభించింది. విదేశీయులు, ఎన్నారైలు, అస్సాం, మేఘాలయ, జమ్మూ కశ్మీర్లో ఉంటున్న 80ఏళ్లు పైబడిన వారు ఆధార్ కార్డు జత పరచాల్సిన అవసరం లేదు. 5 లక్షల రూపాయలకు పైన సంపాదించిన వారికి మాన్యువల్ రిటర్న్ చెల్లిస్తామని ఐటీ అధికారులు చెప్పుకుంటున్నారని కానీ వాటిని అంగీకరించడానికి అవకాశం లేదని ఒక చార్టర్డ్ అకౌంటెంట్ చెప్పుకొచ్చాడు. సరైన సమయంలో రిటర్న్ దాఖలు చేస్తే ఆలస్య రుసుము రూ.10వేలు ఈఏడాదికి పడే అవకాశం లేదని మరోక నిపుణుడు తెలిపారు. మరికొంత మంది మాన్యువల్ దరఖాస్తులను అంగీకరించమని ఆదాయపన్ను కమీషనర్ వద్దకు వెళ్తున్నారని, సరైన కారణం లేకుండా అందుకు అంగీకరించే అవకాశం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతరం సెక్షన్ 139ఏఏపై తుది నిర్ణయం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. దీంతో ఆధార్ కార్డు లేకుండా దాఖలు చేసే ఐటీ రిటర్న్సను నిరాకరించే అవకాశం లేదనే వాదన ఉంది. పన్ను చెల్లింపుదారులు మాన్యువల్గా దాఖలు చేసినటప్పటికి, గతంలో ఏదైనా బకాయిలు ఉంటే, చెల్లింపులను వాపసు పొందలేరు. దీని కోసం, తిరగి ఆన్లైన్లో ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. -
దరఖాస్తుతో ఆధార్ – పాన్ లింక్
న్యూఢిల్లీ: ఆధార్ –పాన్ కార్డుల అనుసంధానానికి ఇప్పటివరకూ ఆన్లైన్లోనూ, మొబైల్ ఫోన్లతో ఎస్సెమ్మెస్ల ద్వారా మాత్రమే అవకాశముండేది. తాజాగా దరఖాస్తు ద్వారా కూడా అనుసంధానాన్ని చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులిచ్చింది. కొత్త దరఖాస్తులో ఆధార్ పాన్ కార్డుల నంబర్లు, ఆ కార్డుల్లో ఉన్న విధంగా పేర్లను తప్పనిసరిగా పేర్కొనడంతో పాటు మరే ఇతర పాన్ కార్డు లేదని ధ్రువీకరించాలి. ‘ఆన్లైన్, ఎస్సెమ్మెస్ల ద్వారా కాకుండా పత్రాల ద్వారా ఆధార్ –పాన్ కార్డుల అనుసంధానం చేయాలనుకునే వారికి ఈ కొత్త దరఖాస్తులు జూలై 1 నుంచి అందుబాటులో ఉంటాయ’ని ఆదాయపన్ను శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందుకు సంబంధించి ఐటీ శాఖ శనివారం నోటిఫై చేసింది. ఇక పోస్టాఫీస్ల్లోనూ ఆధార్ కార్డులో తప్పులను, సవరణలను చేసుకునే అవకాశాన్ని పోస్టల్ ఖాతాదారులకు తమిళనాడులోని పోస్టల్ శాఖ కల్పించింది. జూలై 3 నుంచి నగరంలో ఉన్న 10 పోస్టాఫీస్ల్లో ఎక్కడైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని పోస్టల్ శాఖ తెలిపింది. ఆధార్ (యూఐడీఏఐ) విభాగం పోస్టల్ శాఖలు కలసి ఈ అవకాశాన్ని అందిస్తున్నట్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. -
ఐటీ రిటర్న్స్కు ఆధార్ తప్పనిసరి
► జూలై 1 నుంచి ఆధార్ నంబర్ ఇవ్వాల్సిందే ► పాన్ కార్డు దరఖాస్తుకు కూడా: కేంద్ర ప్రభుత్వం ► సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో స్పష్టత న్యూఢిల్లీ: జూలై 1 నుంచి ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఆధార్ తప్పనిసరి అని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్తగా శాశ్వత ఖాతా సంఖ్య(పాన్) కార్డు కోసం దరఖాస్తు చేసే వారు ఆధార్ను సమర్పించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పేర్కొంది. పాన్ కార్డుకు, ఐటీ రిటర్న్స్కు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆధార్ లేనివారికి, దాని కోసం దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే సుప్రీం తాత్కాలిక మినహాయింపునిచ్చిందని, వారి పాన్కార్డుల్ని రద్దుచేయమని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో సందేహాల నివృత్తికి ‘తీర్పు ప్రభావం’ పేరిట మూడు అంశాలతో కూడిన ప్రకటనను సీబీడీటీ విడుదల చేసింది. 2017 జూలై 1 నుంచి ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేసేవారు, పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసే ప్రతి వ్యక్తి తమ ఆధార్ నంబర్ను లేదా తమ ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీని సమర్పించాలని స్పష్టం చేసింది. 2017 జూలై 1 నాటికి పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తీ.. ఆధార్ నంబర్ కలిగి ఉన్నా.. ఆధార్ నంబర్ పొందేందుకు అర్హత ఉన్న వారు.. తమ ఆధార్ నంబర్ను పాన్ కార్డుకు అనుసంధానం చేసేందుకు ఆదాయపుపన్ను అధికారులకు తెలియజేయాలని పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోయినా.. సదరు వ్యక్తి ఆధార్ నంబర్ను పొందకపోయినా ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా సీబీడీటీ వెల్లడించింది. ఆధార్ కార్డు లేని వారికి, ఆధార్ తీసుకోవడానికి ఇష్టపడని వారికీ సుప్రీంకోర్టు తాత్కాలిక ఊరట ఇచ్చిందని, అలాంటి వారి పాన్ కార్డులు చెల్లనివిగా ప్రకటించడం నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఒకవేళ పాన్ కార్డు చెల్లనిదిగా ప్రకటిస్తే.. సదరు వ్యక్తి తన బ్యాంకింగ్, ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించడం కుదరదని, అందువల్లే సుప్రీంకోర్టు ఈ మినహాయింపు ఇచ్చిందని తెలిపింది. ఇంతవరకూ 1.16 కోట్ల ఆధార్–పాన్కార్డుల అనుసంధానం సుప్రీంకోర్టు తీర్పును ప్రధాని కార్యాలయంలోని ఉన్నతాధికారుల బృందం, న్యాయ, ఆర్థిక శాఖ లు, సీబీడీటీ, ఆదాయపన్ను విభాగాలకు చెందిన అధికారుల బృందం సమీక్షించిందని, అనంతరం దీనిపై స్పష్టతనిస్తూ ప్రకటన జారీ చేశామని సీనియర్ అధికారులు వెల్లడించారు. కాగా ఇంతవరకూ ఐటీ శాఖ 1.16 కోట్ల ఆధార్ నంబర్లను పాన్కార్డులకు అనుసంధానం చేసింది. -
పాన్–ఆధార్ లింకు సరైందే
సుప్రీం కోర్టు సమర్థన ► ఆధార్లేని వారికి మినహాయింపు ► రాజ్యాంగ బెంచ్ నిర్ణయం వెలువడేవరకు నిబంధనపై పాక్షిక స్టే న్యూఢిల్లీ: పాన్ కార్డుకు, ఐటీ రిటర్న్స్కు ఆధార్ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. అయితే ఇప్పటివరకు ఆధార్ లేనివారికి, దాని కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఆ కార్డు పొందేవరకు మినహాయింపునిస్తూ పాక్షిక స్టే ఇచ్చింది. వ్యక్తిగత గోప్యత అంశంపై రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకునేవరకు ఈ మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఇంతవరకూ ఆధార్ లేనివారు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయవచ్చని.. అయితే ఇప్పటికే ఆధార్ ఉన్నవారు మాత్రం పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్)కు అనుసంధానం చేసుకోవాలని చెప్పింది. ఆధార్ కోసం దరఖాస్తు చేసి ఇంకా పొందని వారికి పాన్కార్డుతో అనుసంధానం నుంచి, వారి పాన్కార్డుల్ని చెల్లనివిగా ప్రకటించడం నుంచి మినహాయింపునిచ్చింది. పాన్ జారీ, ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలుకు ఆధార్ లింకును ఈ ఏడాది జూలై 1 నుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదాయ పన్ను(ఐటీ) చట్టంలో సెక్షన్ 139ఏఏను తీసుకురావడం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ సీపీఐ నేత బినయ్ విశ్వం తదితరులు వేసిన పిటిషన్లపై జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్ల బెంచ్ శుక్రవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనకు, ఆధార్ చట్టానికి మధ్య ఎలాంటి వైరుధ్యమూ లేదని పేర్కొంది. అయితే ఈ అంశంతో సంబంధమున్న 21వ అధికరణ(గోప్యత హక్కు)పై రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకునేవరకు కొత్త నిబంధనపై పాక్షిక స్టే అవసరమని బెంచ్ పేర్కొంది. రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం వెలువడే వరకు ఆధార్ జతచేయని పాన్ కార్డులు, గతంలో జరిపిన లావాదేవీలు కూడా చెల్లుతాయని స్పష్టం చేసింది. ఆధార్ సమాచారం లీక్ కాకుండా చర్యలు తీసుకోండి.. పాన్ కార్డుకు, ఐటీ రిటర్న్స్కు ఆధార్ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన ఆదాయ పన్ను(ఐటీ) చట్టంలో సెక్షన్ 139ఏఏను కోర్టు సమర్ధించింది. ఆధార్పై కోర్టు తరచూ ఉత్తర్వులు జారీ చేస్తోంది కనుక ప్రభుత్వం సెక్షన్ 139ఏఏను తీసుకురాకుండా ఉండాల్సిందన్న పిటిషనర్ల వాదనను బెంచ్ తోసిపుచ్చింది. ఈ సెక్షన్ రూపకల్పన, అమలులో పార్లమెంట్కు పూర్తి అధికారం ఉందని, అది కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించడం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా 139ఏఏ సెక్షన్ను కేంద్ర ప్రభుత్వం ఇదివరకే కోర్టులో గట్టిగా సమర్థించుకుంది. పాన్లకు నకిలీలను సృష్టించే అవకాశముందని, ఆధార్ విషయంలో ఇది సాధ్యం కాదని తెలిపింది. ఉగ్రవాదులకు నిధుల కోసం, నల్లధనం సృష్టికి వాడుతున్న నకిలీ కార్డుల ఏరివేత కోసం ఈ నిబంధన తెచ్చామని వివరించింది. అయితే ఆధార్ పౌరులకు తప్పనిసరి కాదని, స్వచ్ఛందమేనని సుప్రీం కోర్టు 2015లో ఇచ్చిన తీర్పును కేంద్రం తిరస్కరించకూడదని పిటిషనర్లు వాదించారు. గోప్యత హక్కు వంటి అంశాలపై తాము జోక్యం చేసుకోబోమని బెంచ్ పేర్కొంది. అయితే ఆధార్ సమాచారం లీకయ్యే అవకాశముందన్న ఆందోళన నేపథ్యంలో ఆ సమాచారం లీక్ కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. స్వాగతించిన కాంగ్రెస్ ‘పాన్–ఆధార్ తప్పనిసరి’ నిబంధనపై సుప్రీం కోర్టు విధించిన పాక్షిక స్టేను కాంగ్రెస్ స్వాగతించింది. గోప్యత హక్కు తీవ్రమైన అంశమని అత్యున్నత న్యాయస్థానం భావించినట్లు కనిపిస్తోందని పార్టీ ప్రతినిధి టోమ్ వడక్కన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్లోనే ఆధార్, పాన్ కార్డుల్లో మార్పులు
న్యూఢిల్లీ: పాన్, ఆధార్ కార్డులోని పేర్లు, ఇతర సమాచారంలో మార్పులు, చేర్పులకు వీలుగా ఆన్లైన్ సౌకర్యాన్ని ఆదాయపన్ను శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే సమయంలో ఈ రెండు కార్డులను ఆన్లైన్ వేదికగా అనుసంధానం కూడా చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ రిటర్నులు దాఖలు చేసే వెబ్సైట్లోనే ఆదాయపన్ను శాఖ రెండు హైపర్లింక్లను అందుబాటులో ఉంచింది. ఒకటి పాన్ కార్డు సమాచారంలో మార్పులు లేదా కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారి కోసం... మరొకటి ఆధార్ కార్డులో వివరాలను మార్చుకునేందుకు ఉద్దేశిం చినది. అయితే, ఆధార్ కార్డులో మార్పులకు ఆధారంగా స్కాన్ చేసిన పత్రాలను పంపిం చాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 1.22 కోట్ల మందికిపైగా పన్ను రిటర్నులు దాఖలు చేసే వారు తమ ఆధార్ కార్డును పాన్కార్డుతో అనుసంధానం చేసుకున్నారు. దేశంలో 25 కోట్ల పాన్లు ఉండగా, వీరిలో ఏటా 6 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేస్తున్నారు. -
పాన్కార్డుతో ఆధార్ అనుసంధానం ఈజీనే
న్యూఢిల్లీ: పాన్కార్డుతో ఆధార్ నంబర్ అనుసంధానానికి వీలుగా ప్రత్యేక లింక్ను ఆదాయపన్ను శాఖ తీసుకొచ్చింది. ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారు తప్పనిసరిగా తమ ఆధార్ నంబర్ను పేర్కొనడంతోపాటు, పాన్కార్డును ఆధార్ నంబర్తో అనుసంధానం చేసుకోవాలంటూ ఆదాయపన్ను శాఖ కొత్త నిబంధన ప్రవేశపెట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆధార్ నంబర్ను పాన్కార్డుతో సులభంగా అనుసంధానం చేసేందుకు ఈ–ఫైలింగ్ వెబ్సైట్ https://incometaxindiaefiling.gov.in/ హోమ్ పేజీలో ఎడమ వైపు ‘లింక్ ఆధార్’ పేరిట ప్రత్యేక లింక్ను ఏర్పాటు చేసింది. ‘‘అనుసంధానానికి పాన్ నంబర్తోపాటు, ఆధార్ నంబర్, ఆధార్ కార్డులో నమోదై ఉన్న పేరు, వివరాలు అవసరం. యూఐడీఏఐ ధ్రువీకరించిన వెంటనే అనుసంధానం పూర్తవుతుంది. ఆధార్ కార్డులో ఉన్న పేరు, అనుసంధానం చేసే సమయంలో ఇచ్చిన పేరులో తేడా ఉంటే అప్పుడు ఆధార్ ఓటీపీ అవసరం ఏర్పడుతుంది’’ అని ఆదాయపన్ను శాఖ పేర్కొంది. ఓటీపీ ఆధార్ డేటాబేస్లో నమోదై ఉన్న సంబంధిత వ్యక్తి మొబైల్ నంబర్కు, ఈ మెయిల్కు వస్తుందని తెలిపింది. అనుసంధానం విఫలమవకుండా ఉండాలంటే పుట్టిన తేదీ, పేరు రెండూ కూడా పాన్, ఆధార్ కార్డులో ఒకే విధంగా ఉండాలని సూచించింది. ఒకవేళ ఆధార్, పాన్లోని పేర్ల మధ్య తేడా ఉం టే, రెండింటిలో ఏదో ఒక దానిలో పేరు మార్పునకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. -
నకిలీ పాన్కార్డుల నియంత్రణకు ఆధార్ తప్పనిసరి
సుప్రీంకు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ న్యూఢిల్లీ: పాన్ కార్డుల జారీకి ఆధార్ను తప్పనిసరి చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సమర్థించుకుంది. దేశవ్యాప్తంగా నకిలీ పాన్ కార్డుల వినియోగాన్ని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఆదాయపన్ను రిటర్నుల దాఖలు, పాన్ కార్డుల జారీకోసం ‘ఆధార్’ నంబర్ను తప్పనిసరి చేస్తున్న ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 139 ఏఏను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్(ఏజీ) ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ‘పాన్’ కార్డుల జారీలో నకిలీకి అవకాశముందని, అదే సమయంలో ‘ఆధార్’ అత్యంత సురక్షితమైన, బలీయమైన వ్యవస్థ అని, ఇందులో నకిలీకి ఏమాత్రం ఆస్కారం లేదని స్పష్టం చేశారు. దాదాపు పది లక్షల పాన్ కార్డులను రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. దేశవ్యాప్తంగా 113.7 కోట్ల ఆధార్ కార్డులు జారీ చేస్తే ఒక్క నకిలీ కూడా బయటపడలేదని తెలిపారు. ‘ఆధార్’ వ్యవస్థ కారణంగా ప్రభుత్వం పేదలకు ప్రయోజనం కలిగించే వివిధ పథకాలు, పెన్షన్ పథకాలపై రూ.50 వేల కోట్లను ఆదా చేసుకోగలిగిందని వివరించారు. ఉగ్రవాద సంస్థలకు నిధుల పంపిణీ ప్రమాదాన్ని, అలాగే నల్లధన వ్యాప్తిని నివారించడంలో ఆధార్ అత్యంత ప్రభావవంతంగా ఉపయోగపడు తోందన్నారు. -
ఆధార్పై ఎంపీల మౌనమెందుకు?: సుప్రీం
న్యూఢిల్లీ: పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) కార్డు పొందటానికి ఆధార్ను తప్పనిసరిచేయడం పట్ల ఎంపీలు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘లోక్సభలో కూర్చున్న 542 మంది ఈ నిర్ణయంపై అభ్యంతరం చెప్పనపుడు మేమెందుకు కల్పించుకోవాలి?’ అని జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన ధర్మాసనం బుధవారం నిలదీసింది. ఆధార్ను తప్పనిసరి చేయబోమని గతంలోనే కేంద్రం చేసిన ప్రకటనను బెంచ్ దృష్టికి తీసుకురాగా, కేంద్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని లేదని, ఏదైనా చట్టం చేసే విషయంలో తాము పార్లమెంట్ను అడ్డుకోమని పేర్కొంది. ఐటీచట్టంలోని సెక్షన్ 139ఏఏ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించింది. -
పాన్–ఆధార్పై ‘సుప్రీం’ అసంతృప్తి
-
పాన్–ఆధార్పై ‘సుప్రీం’ అసంతృప్తి
న్యూఢిల్లీ: పాన్ కార్డు పొందాలంటే ఆధార్ నంబర్ను తప్పనిసరిగా జత చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తప్పుపట్టింది. ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డును ఐచ్ఛికంగానే ఉపయోగించాలని గతంలోనే తాము సూచించినప్పటికీ, తప్పనిసరి చేయడంపై జస్టిస్ ఏకే శిక్రీ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం తరుఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ బదులిస్తూ... నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి కొందరు ఒకటి కంటే ఎక్కవ పాన్ కార్డులు పొందుతున్నారని, తద్వారా నిధులను దారి మళ్లిస్తున్నారని చెప్పారు. దాన్ని అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. స్పందించిన ధర్మాసనం... ‘దాన్ని నియంత్రించడానికి ఇదొక్కటే మార్గమా? గతంలో కోర్టు వద్దని ఆదేశించినా ఆధార్ను తప్పనిసరి ఎందుకు చేస్తున్నారు?’అంటూ ఏజీని ప్రశ్నించింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139ఏఏను ఆర్థిక చట్టం 2017లో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు, పాన్ కార్డు పొందేందుకు ఆధార్ నంబర్ను తప్పనిసరిగా జతచేయాలి. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ సెక్షన్కున్న చట్టబద్దతను పిటిషనర్ తరుఫు న్యాయవాది అరవింద్ దతార్ సవాలు చేశారు. ఆధార్ లేకపోతే ఇక పాన్ కార్డు పొందలేరని, ఇది ఎన్నో సమస్యలకు కారణమవుతుందని వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. ధ్వంసమైన ప్రార్థనా స్థలాలకు ప్రభుత్వ నిధులా! శాంతి, భద్రతల పరిరక్షణలో వైఫల్యం కారణంగా దెబ్బతిన్న ప్రార్థనా స్థలాల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందించాలని కోర్టులు ఆదేశించొచ్చా అన్న అంశంపై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్లో ఉంచింది. ఈ విషయంలో మత ప్రమేయంలేని తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలియజేయాలని రాజకీయ పార్టీలను కోర్టు ఆదేశించింది. గోద్రా అల్లర్ల తర్వాత ధ్వంసమైన 500కు పైగా మసీదులకు నష్టపరిహారం ఇవ్వాలని గుజరాత్ హైకోర్టు జారీచేసిన ఆదేశాలను సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారించింది. చట్ట ప్రకారం హైకోర్టు ఆదేశాలను అమలుచేయడం సాధ్యం కాదని, వాటిని రద్దు చేయాలని ప్రభుత్వం వాదించింది. నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని ఓ స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. వితంతువులపై ఇంత నిర్లక్ష్యమా? దేశంలోని వితంతువుల సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సుప్రీం కోర్టు మండిపడింది. ‘ఈ విషయంలో మేం ఏవైనా ఆదేశాలిస్తే.. కోర్టులు ప్రభుత్వాన్ని నడిపేందుకు యత్నిస్తున్నాయి అని అంటారు. మీరు మాత్రం (ప్రభుత్వం) ఏమీ చేయరు. వితుంతుల సంరక్షణ కోసం ఏ చర్యలూ తీసుకోలేదు. అని శుక్రవారం ధ్వజమెత్తింది. దిక్కులేని వితంతువులను ఆదుకోవడానికి మార్గదర్శకాలతో రానందుకు ప్రభుత్వానికి రూ. లక్ష జరిమానా కూడా విధించింది. -
పాన్ తో పనులెన్నో..
► నోట్లరద్దుతో నగరంలో పెరిగిన పాన్ కార్డుల సంస్కృతి ► బ్యాంకు ఖాతాలకూ తప్పనిసరి చిత్తూరు ఎడ్యుకేషన్: నేడు ప్రతి ఒక్కరికీ పాన్ కార్డు అవసరం పెరిగింది. ఆదాయపన్ను శాఖ ప్రతి ఒక్కరికీ కేటాయించే శాశ్వత ఖాతా సంఖ్యను పర్మినెంట్ అకౌంట్ నంబర్ అంటారు. అంకెలు, అక్షరాలు కలిపి ఆ పాన్ కార్డులో పది ఉంటాయి. చాలా మందికి పాన్ కార్డు ఎక్కడ ఇవ్వాలి...? ఎక్కడ వద్దు..? అనే విషయంలో తికమకపడుతుంటారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ చాలా మందికి పాన్ కార్డు గురించి తెలియకపోవడం, ఎలా తీసుకోవాలో, దాని ఉపయోగాలేమిటీ...? అన్న అంశాలపై అవగాహన లేదు. ప్రస్తుతం చిత్తూరు నియోజకవర్గంలోని ప్రజలు పాన్ కార్డు పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. వాహనం కొనాలన్నా, బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయాలన్నా, అమ్మకాలు జరిపే సమయాల్లో తదితర వాటికి పా¯ŒSకార్డు తప్పనిసరి కావడంతో నగర వాసులు వీటిపై మక్కువ చూపుతున్నారు. దరఖాస్తు ఇలా.. పాన్ కార్డుకు సంబంధించిన సేవలను మెరుగుపరచడం కోసం ప్రతి నగరంలోని పాన్ సేవా కేంద్రాలుంటాయి. వీటితోపాటు స్పెషలిటేషన్ కేంద్రాల్లోనూ పాన్ కార్డుల కోసం సంప్రదించవచ్చు. ఆకార్డు కోసం సంబంధిత వ్యక్తి పాస్పోర్టు సైజు కలర్ ఫొటో, వ్యక్తిగత గుర్తింపు పత్రం, చిరునామా పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆధార్, పాస్పోర్టు, పదోతరగతి మార్కుల జాబితా, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు వాటిలో ఏదో ఒకటి తీసుకెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన 15 రోజుల తరువాత సంబంధిత వ్యక్తి చిరునామాకు పోస్టు ద్వారా పాన్ కార్డు అందుతుంది. ఎప్పుడు అవసరమంటే. ► రూ.50 వేలు పైబడి బ్యాంకులో నగదు డిపాజిట్ చేసే సమయంలో. ► బ్యాంకులో ఖాతా తెరిచేటప్పుడు ► డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు తెరవడానికి ► చెక్కులు, డీడీల లావాదేవీలు రూ.50 వేలను మించితే ► స్థిరాస్తి, వాహనాల కొనుగోలు, అమ్మకాలు జరిపేటప్పుడు ► హోటళ్లు, విలాసాలు ఖర్చుల వంటి వాటి కోసం రూ.20 వేల కంటే ఎక్కువ నగదు చెల్లించాల్సి వచ్చినప్పుడు -
నిమిషాల్లో పాన్కార్డు..
న్యూడిల్లీ: స్మార్ట్ఫోన్ ద్వారా టాక్స్ చెల్లింపులను ప్రోత్సహిస్తోన్న కేంద్ర ప్రభుత్వం ఇకపై మొబైల్ యాప్ ద్వారానే శాశ్వత ఖాతా సంఖ్య(పాన్) అందించాలని భావిస్తోంది. ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ విధానంలో పాన్ నంబర్ను జారీచేసే ప్రయత్నంలో ఆదాయపన్ను శాఖ ప్రయత్నం చేస్తోంది. బయోమెట్రిక్ ద్వారా దరఖాస్తుదారుడి చిరునామా, పుట్టిన తేదీని తెలుసుకోవచ్చని తద్వారా నిమిషాల్లో పాన్కార్డు నంబర్ జారీ చేయవచ్చని చెప్పారు. పాన్కార్డు కోసం దరఖాస్తు మొబైల్లో దరఖాస్తు చేసుకోవడం రిటర్న్లు ట్రాక్చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. సిమ్ కార్డు జారీకి ఉపమోగిస్తున్న తరహా ప్రక్రియనే పాన్ కార్డు జారీకి అనుసరించనున్నట్లు సమాచారం. దీనిగూర్చి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
రూ.50వేలతో ఆభరణాలు కొంటున్నారా? అయితే...
ముంబై : బంగారం లేదా వెండి ఆభరణాలు రూ.50వేల కంటే ఎక్కువ మొత్తంలో కొనదలుచుకున్నారా? అయితే తప్పనిసరి చేతిలో పాన్ కార్డు లేదా ఆధార్ నెంబర్ ఉండాల్సిందే. రూ.50 వేలు లేదా రూ.లక్ష కంటే ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోళ్లకు పాన్ కార్డు లేదా ఆధార్ నెంబర్ తప్పనిసరి చేయనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 2017 బడ్జెట్ ప్రకటన అనంతరం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం రూ.2 లక్షల కంటే ఎక్కువకు ఆభరణాలు కొనుగోలు చేస్తే, బంగారం మార్కెట్లో కేవైసీ కంప్లియన్స్ను సమర్పించాల్సి ఉంటుంది. బులియన్, జువెల్లరీలో కైవేసీ అవసరాన్ని ప్రస్తుతమున్న రూ. 2 లక్షల నుంచి మరింత తగ్గిస్తారని దేశంలోనే అతిపెద్ద బులియన్ అసోసియేసన్ సెక్రటరీ భార్గవ్ వైద్య అంచనావేస్తున్నారు. రూ.50వేలకు కేవైసీ కంప్లియన్స్ను తీసుకొస్తారని చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్లాక్మనీ హోల్డర్స్పై ఎక్కువగా దృష్టిసారించిన కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పెద్ద నోట్లను రద్దు చేశాక, చాలామంది బ్లాక్మనీ హోల్డర్స్ తమ దగ్గరున్న నగదును జువెల్లరీ, బులియన్, రియల్ ఎస్టేట్లోకి మరలించినట్టు తెలిసింది. దీంతో డీమానిటైజేషన్ అనంతరం ఎవరు ఎంతమొత్తంలో బంగారం కొనుగోళ్లు చేపట్టి అక్రమాలకు పాల్పడ్డారో తెలుసుకోవడంలో ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రెవెన్యూ ఇంటిలిజెన్సీ ఏజెన్సీలు నిమగ్నమై ఉన్నాయి. కేవైసీ అవసరాన్ని సమీక్షించి, వచ్చే బడ్జెట్లో రూ.లక్ష దాటిని కొనుగోళ్లకు ఈ నిబంధనలు తీసుకొస్తారని నేషనల్ సెక్రటరీ ఆఫ్ ఇండియా బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ సురేంద్ర మెహతా సైతం చెబుతున్నారు. -
పాన్ కార్డుకు కొత్త రూపు..
మరిన్ని సెక్యూరిటీ ఫీచర్లతో జారీ ముంబై: పాన్ కార్డు కొత్త రూపు సంతరించుకుంది. మరిన్ని భద్రతాపరమైన సదుపాయాలతో దెబ్బతినకుండా ఉండే, వివరాలను తారుమారు చేయడానికి వీల్లేని కార్డుల జారీని ప్రభుత్వం ప్రారంభించింది. ఇంగ్లిష్, హిందీ రెండు భాషల్లోనూ ‘పాన్ కార్డు అని రాసి ఉన్న’ కొత్త తరహా కార్డులను జారీ చేస్తున్నట్టు ఆదాయపన్ను శాఖ అధికారి ఒకరు తెలిపారు. వీటిని లోపరహితంగా రూపొందించినట్టు చెప్పారు. ఎన్ఎస్డీఎల్, యూటీఐఐటీఎస్ఎల్ జవనరి 1 నుంచే పంపిణీ చేయడం ప్రారంభించాయని... కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వీటిని జారీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే పాన్ కార్డు కలిగిన వారు కొత్త కార్డు తీసుకోవాలని కోరుకుంటే తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుం దని సూచించారు. ఈ కార్డులకు ప్రభుత్వం కొత్తగా క్విక్ రెస్పాన్స్ కోడ్ను చేర్చింది. దీంతో తనిఖీ ప్రక్రియ వేగంగా పూర్తి చేయవచ్చు. ఈ కోడ్ సాయంతో కార్డు దారుల వివరాలను అధికారులు వేగంగా తెలుసుకోవడం వీలవుతుంది. -
ఖాతాదారులందరి నుంచి ‘పాన్’ తీసుకోండి
బ్యాంకులను ఆదేశించిన కేంద్రం న్యూఢిల్లీ: పన్ను ఎగవేతదారులకు ముకు తాడు వేసే చర్యలకు కేంద్రం నడుం బిగించింది. బ్యాంకు ఖాతాలన్నింటికీ పాన్ కార్డు అనుసంధానం తప్పనిసరి చేసింది. ఇందులోభాగంగా ఖాతాదారులందరి నుంచి ‘పర్మినెంట్ అకౌంట్ నంబర్’ (పాన్)ను తీసుకోవాలంటూ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. పాన్ లేనట్లయితే.. వారి నుంచి ఫారమ్–60ను తీసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఫిబ్రవరి 28వ తేదీని గడువుగా నిర్దేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిబంధన జన్ధన్తోపాటు జీరో బ్యాలెన్స్ ఖాతాలైన సాధారణ పొదుపు ఖాతాలకు వర్తించదు. జీఎస్టీలో నమోదుకు పాన్ తప్పనిసరి ప్రస్తుతం ఎక్సైజ్, సేవా పన్ను చెల్లిస్తున్నవారు జీఎస్టీ వ్యవస్థకు మారేందుకు పాన్ నంబర్ కలిగి ఉండాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) పేర్కొంది. పాన్ ఆధారంగానే జీఎస్టీ పన్ను గుర్తింపు నెంబరు జారీ చేస్తారని తెలిపింది. -
స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు ‘పాన్’ తప్పనిసరి!
-
స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు ‘పాన్’ తప్పనిసరి!
విలువ రూ.10 లక్షలు దాటితే అమలు భారీగా జరిగే లావాదేవీలపై ఆదాయపన్ను శాఖ దృష్టి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు పాన్ కార్డు తప్పనిసరి కానుంది. స్థిరాస్తుల విలువ రూ.10 లక్షలు దాటితే సదరు విక్రయ, కొనుగోలుదారుల పాన్ నంబర్లను దస్తావేజుల్లో పొందుపర్చనున్నారు. గతంలోనే ఈ విధానం అమల్లో ఉన్నా.. రిజిస్ట్రేషన్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారు. తాజాగా పాత నోట్ల రద్దు నేపథ్యంలో కచ్చితంగా అమలు చేయాలని ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు, సబ్ రిజిస్ట్రార్ల సమావేశంలో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.10 లక్షలు దాటిన స్థిరాస్తుల క్రయ, విక్రయాలు, ఆస్తుల గిఫ్ట్ డీడ్లలో పాన్ కార్డు నంబర్ను తప్పనిసరిగా పొందుపర్చనున్నారు. ఒకవేళ పాన్ కార్డు లేకపోతే.. వారు ఫార్మ్-61లో వివరాలు పూర్తిచేసి దానిని దస్తావేజులతో జత చేయనున్నారు. స్థిరాస్తుల లావాదేవీలపై దృష్టి.. స్థిరాస్తుల లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ దృష్టి పెట్టింది. స్థిరాస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై నిఘా పెడుతోంది. స్థిరాస్తుల క్రయ, విక్రయాలు, గిఫ్ట్ డీడ్లకు సంబంధించిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లలో పరిమితికి మించి ఆదాయం గల వారు ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రిజిస్ట్రేషన్లకు పాన్ కార్డును తప్పనిసరి చేయాలని స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ, ఆదాయ పన్ను శాఖలు నిర్ణరుుంచారుు. విలువ రూ.10 లక్షలు దాటిన రిజిస్ట్రేషన్ల వివరాలను సబ్ రిజిస్ట్రార్ల వారీగా ఆదాయపన్ను శాఖకు పంపేలా చర్యలు చేపట్టనున్నారు. వీటిని పరిశీలించి క్రయ, విక్రయదారులను ఆదాయ పన్ను పరిమితిలోకి తెచ్చే విషయంపై ఆ శాఖ నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటివరకు రూ.30 లక్షలు దాటిన మార్కెట్ విలువకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల వివరాలను ఏడాదికోసారి ఆదాయ పన్ను శాఖకు పంపించే వారు. తాజాగా ప్రతి ఆరు నెలలకోసారి అందించేలా కొత్త నిబంధన పెట్టారు. అరుుతే తమ అవసరాల కోసమో లేదా అప్పు తీర్చేందుకో, పిల్లల పెళ్లిళ్ల కోసమో స్థిరాస్తులు అమ్మినా, కొనుగోలు చేసినా ఐటీ అధికారుల దృష్టిలో పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
డిపాజిట్ రూ.50వేలు మించితే పాన్ కార్డు ఉండాల్సిందే
బ్యాంకులకు ఆర్బీఐ సూచన న్యూఢిల్లీ: బ్యాంకుల్లో ఖాతాదారులు రూ.50 వేలకు మించి చేసే డిపాజిట్లకు పాన్ కార్డు జిరాక్స్ కాపీ తప్పనిసరిగా తీసుకోవాలని బ్యాంకులకు ఆర్బీఐ తాజాగా సూచించింది. వాస్తవానికి ఈ నిబంధన గతంలోనూ అమల్లో ఉంది. తమ ఖాతాలకు పాన్కార్డ్ నంబర్ సమర్పించని ఖాతాదారులు రూ.50 వేలకు మించి డిపాజిట్ చేస్తుంటే... ఆదాయపన్ను చట్టంలోని 114బీ నిబంధనకు అనుగుణంగా తప్పనిసరిగా పాన్ కార్డు జిరాక్స్ కాపీ తీసుకోవాలని ఆర్బీఐ కోరింది. ఈ నిబంధన కింద అమల్లోకి వచ్చే అన్ని రకాల లావాదేవీలకు పాన్ నంబర్ సమర్పించాలంటూ ఖాతాదారులను కోరాలని సూచించింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గతవారం నిర్ణయం తీసుకున్న తర్వాత పాత నోట్లను ప్రజలు తమ ఖాతాల్లో పెద్ద మొత్తాల్లో జమ చేసుకుంటున్న నేపథ్యంలో ఆర్బీఐ బ్యాంకులకు తాజా ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. పాన్ ఏఏ సందర్భాల్లో సమర్పించాలి...? ఆదాయపన్ను చట్టంలోని 114బీ నిబంధన ప్రకారం బ్యాంకులు, పోస్టాఫీసులు, కోపరేటివ్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల్లో రూ.50 వేలకు మించి చేసే టైమ్ డిపాజిట్లకు పాన్ తప్పనిసరి. అదే విధంగా ఒక ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లు రూ.5 లక్షలకు మించినా పాన్ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, మోటారు వాహనాల విక్రయం, అమ్మకం, బ్యాంకు ఖాతా ప్రారంభం, క్రెడిట్, డెబిట్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటున్న సమయాల్లో, డీమ్యాట్ ఖాతా ప్రారంభ సమయంలోనూ పాన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక, హోటళ్ల బిల్లులు, ప్రయాణ చార్జీల రూపేణా రూ.50 వేలకు మించి చేసే చెల్లింపులకు... రూ.50 వేలకు మించి విలువైన మ్యూచువల్ ఫండ్స, బాండ్లు, బ్యాంకు డ్రాఫ్ట్లు లేదా పే ఆర్డర్లు తదితర లావాదేవీల సమయాల్లోనూ పాన్ తప్పనిసరి. -
'నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ'
-
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
నేడు గ్రూప్-2 రాత పరీక్షలు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఈనెల 11, 13 తేదీల్లో గ్రూప్-2 రాత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది. 7,89,435 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,916 పరీక్ష కేంద్రాల్లో టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించరని ఇదివరకే టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. అంతేకాదు.. అభ్యర్థులు నిర్ణీత సమయానికి గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి చేరుకోవాలని సూచించింది. ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యే పరీక్షకు హాజరయ్యే వారిని ఉదయం 9.45 గంటల వరకే అనుమతిస్తామని, మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు హాజరయ్యే వారిని మధ్యాహ్నం 2.15 వరకే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులు హాల్టికెట్తో పాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు (పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్పోర్టు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స, ప్రభుత్వ ఉద్యోగి అరుుతే సంస్థ ఐడీ కార్డు ) తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని, హాల్టికెట్పై ఫొటో, సంతకం సరిగా లేని అభ్యర్థులు రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలను వెంట తెచ్చుకోవాలని సూచించింది. షూస్ వేసుకొని రావొద్దని, ఆభరణాలు, గొలుసులు, చెవిపోగులు, చేతిగడియారాలు ధరించవద్దని పేర్కొంది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, మొబైల్ఫోన్లు, ట్యాబ్లు, పెన్డ్రైవ్లు, బ్లూటూత్లు, గడియారాలు, కాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్స్, చేతిబ్యాగులు, పర్సులు, నోటు పుస్తకాలు, చార్టులు, రికార్డింగ్ పరికరాల వంటివి అనుమతించబోమని పేర్కొంది. బ్లాక్ బాల్పారుుంట్ పెన్నుతోనే రాయాలని సూచించింది. కాగా, దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటివరకు 6.81 లక్షల మంది అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు వెల్లడించారుు. 2500 ప్రత్యేక బస్సులు ఆర్టీసీ ఎండీ రమణారావు గ్రూప్-2 పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం 2,500 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎండీ రమణారావు ప్రకటించారు. ఈ బస్సుల్లో రూ.500, రూ.1000 నోట్లు చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నారు. అయితే వీలైనంత వరకు టికెట్కు సరిపడా చిల్లర ఇస్తే మంచిదని, అంత పెద్దనోట్లు ఇస్తే తిరిగి చిల్లర ఇవ్వడం సాధ్యం కాదనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ఇదీ షెడ్యూలు.. 11న ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు.. పేపరు-1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్) 11న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. పేపరు-2 (హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ) 13న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు... పేపరు-3 (ఎకానమీ అండ్ డెవలప్మెంట్) 13న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు... పేపరు-4 (తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్). -
మీ పాన్ వివరాలివ్వండి..
♦ 7 లక్షల మందికి త్వరలో ఐటీ శాఖ లేఖలు ♦ పాన్ రహిత భారీ లావాదేవీలపై కన్ను ♦ పన్ను ఎగవేతలకు అడ్డుకట్టే లక్ష్యం.. న్యూఢిల్లీ: పన్ను ఎగవేతల నిరోధం దిశగా ఆదాయపు పన్ను శాఖ మరో కీలక అడుగు వేయనుంది. భారీ విలువగల ఆర్థిక లావాదేవీల నిర్వహణ లేదా తమ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో రూ.10 లక్షలకన్నా అధికంగా ఉన్న 7 లక్షల మంది అసెసీల నుంచి వారి పాన్ వివరాలను ప్రత్యేకంగా సేకరించనుంది. త్వరలో వీరికి ఆదాయపు పన్ను శాఖ లేఖలు రాయనున్నట్లు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రకటన ప్రకారం, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిటర్న్స్ (ఏఐఆర్) కింద పలు అధిక విలువ ఆర్థిక లావాదేవీలు ఆదాయపు పన్ను శాఖ దృష్టికి వచ్చాయి. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో రూ.10 లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్లు, రూ.30 లక్షలు ఆపైన స్థిరాస్తి కొనుగోళ్లు, అమ్మకాలు వంటివి ఇందులో ఉన్నాయి. అయితే వీటిలో పలు లావాదేవీలు పాన్తో అనుసంధానం కాకపోవడాన్ని ఆదాయపు పన్నుశాఖ గుర్తించింది. నల్లధనం వివరాలు తెలియజేసి, 45 శాతం పన్ను చెల్లింపుల ద్వారా ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు పొందే వెసులుబాటును కల్పిస్తూ 4 నెలలు అమల్లో ఉండే ఒక కీలక పథకాన్ని జూన్ 1న కేంద్రం ప్రారంభించిన నేపథ్యంలోనే ఐటీ శాఖ తాజా చొరవ తీసుకోవడం గమనార్హం. 90 లక్షల పాన్ రహిత లావాదేవీల గుర్తింపు... 2009-10 నుంచి 2016-17 మధ్య పాన్ లేకుండా భారీ ఆర్థిక లావాదేవీలు దాదాపు 90 లక్షలు జరిగినట్లు అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో ఐటీ శాఖ గుర్తించింది. ఇందులో ఇప్పటికి 14 లక్షల లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించి, అందులో సందేహాస్పదమైన 7 లక్షల లావాదేవీలను వెలికితీసింది. పాన్ వివరాలు సమర్పించాలని వీరికి త్వరలో లేఖలు రాయాలని నిర్ణయించింది. అలాగే లేఖలు పంపుతున్న వారి సౌలభ్యం నిమిత్తం వారు తగిన సమాచారం ఇవ్వడం కోసం ఒక ఈ-పోర్టల్ను అభివృద్ధి చేసినట్లు కూడా అత్యున్నత స్థాయి వర్గాలు తెలి పాయి. పంపే లేఖలో ఒక యునిక్ ట్రాన్జాక్షన్ సీక్వెన్స్ నంబర్ ఉంటుంది. లేఖ అందుకున్న వ్యక్తులు తమ ఈ- ఫైలింగ్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత, ఈ నంబర్ సహాయంతో తమ లావాదేవీలకు తమ పాన్ వివరాలను జతచేసే వీలుంటుంది. అలాగే ఈ-పోర్టల్ ద్వారానే తమ సమాధానాన్ని కూడా తెలియజేయవచ్చు. -
వ్యాపార లావాదేవీలకు ఈ-వేబిల్లులు తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాలో జరిగే వ్యాపారానికి సంబంధించి ఈ-వేబిల్లులను వాణిజ్యపన్నుల శాఖ తప్పనిసరి చేసింది. దొంగ వేబిల్లులతో అంతర్రాష్ట్ర సరుకు రవాణా యథేచ్చగా సాగుతుండడంతో వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ వి.అనిల్కుమార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నుంచే ఈ నిబంధనను అమలులోకి తెచ్చినప్పటికీ, వ్యాపార వర్గాలు ఆచరణలో పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో వాణిజ్యపన్నుల శాఖ అధికారులకు కమిషనర్ క చ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ-వేబిల్లును రెండు గంటల్లో రద్దు చేసే సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఆన్లైన్ లాగిన్ అయ్యేటపుడు డీలర్లందరూ వారి వ్యాపారాలకు సంబంధించి పాన్కార్డు వివరాలు తప్పనిసరిగా పొందుపరచాలని తెలిపారు. -
అరుణ్జైట్లీ దిష్టిబొమ్మ దహనం
అనంతపురం న్యూటౌన్ : కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నగరంలోని బంగారు దుకాణదారులు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ముందుగా వారు స్వర్ణకారులు, కార్మిక, వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక సప్తగిరి సర్కిల్ వద్ద రాస్తారోకో చేశారు. అక్కడే మానవహారం నిర్మించి నిరసన వ్యక్తం చేశారు. జైట్లీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సంఘం అధ్యక్షుడు మహబూబ్బాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని పెంచడంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. రూ.2 లక్షల బంగారు కొనుగోళ్లపై పాన్కార్డు తప్పనిసరి నిబంధనను ఉపసంహరించుకోవాలన్నారు. ఈనెల 17 వరకు దుకాణాల బంద్ కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షుడు గొంది జనార్దన్, ప్రధాన కార్యదర్శి మన్సూర్ తదితరులు పాల్గొన్నారు. -
బంగారం దుకాణాల బంద్
కేంద్రప్రభుత్వ విధానాలకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన క్రయ,విక్రయాలు రాజ్ విహార్ సెంటరులో వ్యాపారుల ధర్నా కర్నూలు(అగ్రికల్చర్): కేంద్ర ప్రభుత్వం బంగారంపై ఎక్సైజ్ సుంకం విధించడాన్ని వ్యతిరేకిస్తూ జ్యువెలరీ వ్యాపారులు నిరవధిక సమ్మె చేపట్టారు. జాతీయ జ్యువెలరీ మర్చంట్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా బంగారం దుకాణాలు మూత పడ్డాయి. కర్నూలు నగరంలో బుధవారం స్థానిక షరాఫ్ బజారును మూసివేసి కేంద్రప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కొండారెడ్డిబురుజు దగ్గరి నుంచి రాజ్విహార్ సెంటరు వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా అసోసియేషన్ అధ్యక్షుడు పుణ్యమూర్తి రామయ్య మాట్లాడుతూ...ఇంతవరకు బంగారంపై ఎలాంటి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ లేదని అయితే తాజాగా బడ్జెట్లో ఒక్క శాతం ప్రకటించడం తగదని తెలిపారు. ఎక్సైజ్ సుంకం భారం ప్రజలపైనే పడుతుందని తెలిపారు. ఇప్పటికే ధరలు పెరగడంతో బంగారం కొనలేని స్థితిలో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. రూ 2 లక్షల బంగారం కొనుగోలుపై వినియోగదారులు పాన్ కార్డు చూపాలనే నిబందన పెట్టడం సరికాదన్నారు. ధర్నాలో అసోసియేషన్ ప్రతి నిధులు ఎస్.కృష్ణ, రమణకుమార్, శ్రీనివాస్ప్రసాద్, నరసింహయ్య తదితరులు పాల్గొన్నారు. -
జ్యువెలర్స్ సమ్మె: స్తంభించిన వ్యాపారం
ముంబై: దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 300 జ్యువెలరీ ట్రేడర్ అసోసియేషన్స్.. రూ.2 లక్షలు, అంతకుమించి విలువైన బంగారు ఆభరణాల కొనుగోలు లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరన్న కేంద్ర ప్రభుత్వ చర్యకు నిరసనగా బుధవారం సమ్మె నిర్వహించాయి. దీంతో పలు ప్రాంతాల్లో బంగారు అభరణాల లావాదేవీలు నిలిచిపోయాయి. ప్రధాన నగరాల్లో బులియన్ మార్కెట్లు పనిచేయలేదు. పాన్ కార్డు తప్పనిసరి చర్య కారణంగా జ్యువెలర్స్ ముఖ్యంగా గ్రామీణ, చిన్న చిన్న పట్టణాల్లో కస్టమర్లను కోల్పోవలసి వస్తోందని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ ఫెడరేషన్ (జీజేఎఫ్) డెరైక్టర్ అశోక్ మీనావాలా తెలిపారు. గత నెల కాలంలో (జనవరి 1 నుంచి పాన్ నిబంధనలు అమల్లోకి వచ్చిన దగ్గరి నుంచి) జ్యువెలర్స్ నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని, పరిశ్రమ టర్నోవర్ 30%పైగా తగ్గిందని వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే పరిశ్రమపై ఆధారపడ్డ చాలా మంది ఉపాధి కోల్పోవలసి వస్తుందన్నారు. ఈ విషయాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి తెలియజేశామని, అలాగే ఆర్థిక కార్యదర్శిని కూడా కలశామని చెప్పారు. పాన్ తప్పనిసరి నిబంధనలను రూ. 2 లక్షలు-10 లక్షల విలువైన బం గారు ఆభరణాల కొనుగోలు లావాదేవీలకు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం కోసం ప్రస్తుత బడ్జెట్ వరకు వేచిచూస్తామని, ఎలాంటి స్పందన లేకపోతే అటు తర్వాత నిరవధిక సమ్మెకు దిగుతామని పేర్కొన్నారు. కాగా ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజేఏ) ఈ సమ్మెకు దూరంగా ఉంది. -
రేపు రాష్ట్రంలో..బంగారం బంద్
సాక్షి, చెన్నై : పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలోని బంగారం దుకాణాలు గురువారం మూత పడనున్నాయి. రూ. రెండు లక్షలకు పైగా బంగారం కొనుగులు చేసే వారికి పాన్ కార్డ్ తప్పని సరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఒకరోజు సమ్మెకు వర్తకులు సిద్ధం అయ్యారు. మంగళవారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో అఖిల భారత జెమ్స్ అండ్ జ్యువెలరీస్ ట్రేడ్ ఫెడరేషన్ సౌత్ జోనల్ చైర్మన్ అనంత పద్మనాభన్ మాట్లాడుతూ, ఇది వరకు రూ. ఐదు లక్షలకు పైగా బంగారం కొనుగోలు చేసేవారికి పాన్కార్డ్ తప్పని సరి చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ మొత్తాన్ని పది లక్షలకు పెంచాలని తాము డిమాండ్ చేస్తూ వస్తున్నామని, అయితే, ప్రస్తుతం రూ. రెండు లక్షలకు బంగారం కొనుగోలు చేసే వారు తప్పని సరిగా పాన్ కార్డు నెంబర్ను బిల్లులో పొందు పరచాలని కేంద్రం ఆదేశించడం విచారకరంగా పేర్కొన్నారు. ఈ దృష్ట్యా, గత నెల 30 శాతం మేరకు వర్తకం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పాన్కార్డులు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేశారు. వివాహ శుభాకార్యాలు, ఇతర శుభకార్యాలకు బంగారం కొనుగోలుకు వస్తున్న పేద, మధ్య తరగతి కుటుంబాల్లో పాన్ కార్డులు లేని వాళ్లెందరో ఉన్నారని వివరించారు. గతంలో బ్లాక్ మార్కెటింగ్ దిశలో ఉన్న ఈ వర్తకాన్ని తాము క్రమబద్ధీకరించి గాడిలో పెట్టి ఉన్నామని, ఈ సమయంలో కొత్త నిబంధనల వల్ల మళ్లీ బ్లాక్ మార్కెటింగ్కు దారి తీయడం ఖాయం అని వ్యాఖ్యానించారు. తద్వారా ప్రభుత్వానికే నష్టం తప్పదని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రం నిర్ణయంతో వర్తకం తగ్గిన దృష్ట్యా, బంగారం ఉత్పత్తిలో ఉన్న కార్మికులు కష్టాల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉన్నదని వివరించారు. కేంద్రం దృష్టికి ఇది వరకే తాము సమస్యల్ని తీసుకెళ్లడం జరిగిందని, పాన్కార్డుకు మినహాయింపు ఇవ్వాలని కోరినా, ఇంతవరకు స్పందన లేదని వ్యాఖ్యానించారు. అందుకే ఒక రోజు సమ్మెకు నిర్ణయించామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బుధవారం సమ్మె జరగనున్నదని, అయితే, తమిళనాడు, పుదుచ్చేరిలో మాత్రం గురువారం దుకాణాల బంద్కు పిలుపు నివ్వడం జరిగిందన్నారు. 35 వేల దుకాణాలు మూత పడనున్నాయని, తదర్వాత వెయ్యి కిలోల వరకు బంగారం విక్రయం ఆగినట్టేనని వ్యాఖ్యానించారు. ఈ విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను రూపంలో ఒక శాతం, కేంద్రానికి పది శాతం మేరకు ఆదాయం గండి పడనున్నాదన్నారు. తాము బంద్కు పిలుపు నిచ్చిన విషయాన్ని వినియోగ దారులు పరిగణలోకి తీసుకోవాలని, ఎవ్వరూ బంగారం కొనుగోలు కోసం దుకాణాలకు రావద్దని సూచించారు. అప్పటికీ కేంద్రం స్పందించకుంటే నిరసన మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో బంగారు వర్తకుల సంఘం నాయకులు జయంత్ లాల్ జైన్, రాజ్కుమార్ జైన్, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పాన్.. లేకుంటే పరేషాన్
ట్యాక్స్ టాక్ * ఇక లావాదేవీలకు పాన్ తప్పనిసరి * బ్యాంకు ఖాతా.. డీమ్యాట్ తెరవాలన్నా కూడా * బ్యాంకు లావాదేవీలన్నిటిపై ఐటీ నిఘా నేత్రం కొత్త సంవత్సరం వస్తూనే... కొత్త నిబంధనలు తెచ్చింది. జనవరి 1 నుంచే... పాన్ నంబరు వెల్లడికి సంబంధించిన కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం ఇకపై పలు రకాల లావాదేవీలకు పాన్ నంబరు తప్పనిసరి. సుమారు 20కిపైగా లావాదేవీల విషయంలో దీన్ని అమలు చేస్తారు. ప్రస్తుతం కొన్ని లావాదేవీలకే దీన్ని పరిమితం చేసినా... రానున్న కాలంలో ఆర్థిక లావాదేవీలన్నిటికీ పాన్ నంబరును తప్పనిసరి చేస్తారని చెప్పటానికి దీన్నొక సంకేతంగా భావించొచ్చు. అంతేకాదు! పాన్కార్డు వివరాలను పేర్కొనకపోయినా, తప్పుడు వివరాలు అందించినా పెనాల్టీతో పాటు జైలు శిక్షా పడుతుంది. జనవరి 1, 2016 నుంచి ఈ దిగువ పేర్కొన్న లావాదేవీల్లో పాన్ కార్డు వివరాలను పేర్కొనాల్సి ఉంది. బ్యాంకులో డిపాజిట్ చేసేటపుడు రూ.50వేలు దాటితే పాన్ నెంబరును ఇవ్వాలన్న నిబంధన గతంలోనూ ఉంది. అయితే దాన్ని తప్పించుకోవటానికి సురేష్ ఎప్పుడూ రూ.49,999 మాత్రమే డిపాజిట్ చేసేవాడు. అలా ఎన్నిసార్లు చేసినా పాన్ అవసరం లేదు కనక తన లావాదేవీలపై ఐటీ అధికారుల దృష్టి ఉండదన్నది సురేష్ నమ్మకం. ఇప్పటిదాకా సాగినా ఇలాంటివాళ్ల ఆటలిక సాగవు. ఏడాదిలో రూ.5 లక్షలకుపైగా డిపాజిట్ చేస్తే పాన్ కార్డు వివరాలు తప్పనిసరి చేశారిప్పుడు. అంటే సురేష్ మాదిరి రూ.49,999 చొప్పున 10 సార్లు డిపాజిట్ చేసినా పాన్ వివరాలు ఇవ్వాల్సిన పనిలేదు. అదే 11వ సారి చేస్తే మాత్రం పాన్ నెంబరు తప్పనిసరిగా ఇవ్వాలి. అంతేకాదు!! ఇకపై మీరు బ్యాంకు ఖాతా తెరవాలంటే పాన్కార్డ్ తప్పనిసరి. బ్యాంకులు లేదా సహకార బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు పాన్ కూడా వివరాలివ్వాలి. ఇక ప్రతి ఫిక్స్డ్ డిపాజిట్కూ పాన్ తప్పనిసరి. అలాగే మీ ఖాతాలో రోజుకు రూ.50,000 మించి నగదు డిపాజిట్ చేసినా... మీ పాన్ వివరాలు ఇవ్వాల్సిందే. ఒక రోజులో రూ.50,000 మించి డీడీలు, బ్యాంకర్ల చెక్కులు తీసుకున్నప్పుడు కూడా పాన్ ఇవ్వాలి. పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ చట్టం ప్రకారం క్యాష్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డుల జారీ విలువ రూ.50,000 దాటితే అలాంటి సమయంలో కూడా పాన్ కార్డు వివరాలివ్వాలి. అలాగే క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటే పాన్కార్డు ఉండాలి. దీనర్థం ఇక నుంచి మీ ప్రతి బ్యాంక్ లావాదేవీనీ ఆదాయ పన్ను శాఖ ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. షేర్ల లావాదేవీల్లో... ఇక నుంచి పాన్కార్డ్ ఉంటేనే డీమ్యాట్ ఖాతా తెరవగలరు. అలాగే లక్ష రూపాయలకు మించిన షేర్లు కొన్నపుడు, ఏడాదిలో రూ.50,000 పరిమితి దాటి మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొన్నప్పుడు కూడా ఈ వివరాలివ్వాలి. లిస్ట్కాని కంపెనీకి సంబంధించిన షేర్లు రూ 1,00,000కు మించి కొన్నా, అమ్మినా వివరాలు ఇవ్వాలి. డిబెంచర్లు, బాండ్లు, రిజర్వ్ బ్యాంక్ జారీ చేసే బాండ్లు రూ.50,000 దాటి కొన్నప్పుడు. ఏడాదికి జీవిత బీమా ప్రీమియం రూ.50,000 దాటి చెల్లించినప్పుడు పాన్కార్డు వివరాలు పేర్కొనాలి. ఇకపై కొన్ని భారీ వ్యయాలు చేసినప్పుడు పాన్కార్డ్ వివరాలివ్వాల్సి ఉంటుంది. అవేంటంటే... * స్థిరాస్తి క్రయవిక్రయ విలువ రూ.10 లక్షలు దాటితే పాన్కార్డ్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలి. ఇక్కడ కొన్నవారు, అమ్మినవారు ఇద్దరూ కూడా పాన్కార్డ్ వివరాలివ్వాల్సి ఉంటుంది. గతంలో ఈ విలువ రూ. 5 లక్షలుండేది. * ప్రతి మోటార్ వాహనం కొనుగోలు సమయంలోనూ పాన్ నంబరు తప్పనిసరిగా ఇవ్వా లి. దీన్నుంచి ద్విచక్ర వాహన లావాదేవీలను మాత్రం మినహాయించారు. * ఇకపై ఏదైనా రెస్టారెంట్ లేదా హోటల్కు వెళ్లి రూ. 50,000 మించి బిల్ చేస్తే అప్పుడు కూడా పాన్ వివరాలు ఇవ్వాల్సిందే. * రూ. 2,00,000 మించి ఏదైనా బంగారు ఆభరణం కొంటే కూడా పాన్ వివరాలివ్వాలి. ఈ పరిమితిని రూ. 5,00,000 పెంచాలని గోల్డ్ జ్యూయెలరీ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. * బంగారం ఆభరణాలే కాదు! ఇకపై ఏ క్రయవిక్రయమైనా ఆ వ్యవహారం విలువ రూ.2 లక్షలు దాటితే పాన్ కార్డ్ వివరాలివ్వాలి. * విదేశీ ప్రయాణాల్లో నగదుతో టికెట్లు కొన్నప్పుడు, నగదుతో విదేశీ కరెన్సీ కొన్నప్పుడు కూడా పాన్ కార్డు వివరాలు ఇవ్వాలి. దాచేస్తే.. శిక్ష తప్పదు.. ఈ పైన పేర్కొన్న లావాదేవీలన్నింటిలో పాన్ కార్డు వివరాలను తప్పనిసరిగా పేర్కొనాలి. ఈ వివరాలివ్వకపోయినా.. తప్పుడు వివరాలిచ్చినా పెనాల్టీతో పాటు 3 నెలల నుంచి ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించవచ్చు. రెండు పాన్ కార్డులు కలిగి ఉన్నా, వేరే వారి పాన్కార్డ్ వివరాలు పేర్కొన్నా కూడా శిక్ష తప్పదు. అలాగే పాన్ కార్డు ఉండి వివరాలివ్వకపోయినా దాన్ని నేరంగానే పరిగణిస్తారు. పాన్కార్డు అవసరం లేనివారు ఈ లావాదేవీలు నిర్వహించినప్పుడు ఫారమ్-60 డిక్లరేషన్ ఇవ్వా ల్సి ఉంటుంది. కానీ ఈ డిక్లరేషన్లో ఉన్నది తప్పుడు సమచారం అని తేలితే దాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. 120 కోట్ల దేశ జనాభాలో ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారి సంఖ్య కేవలం 3-4 శాతం లోపే. చాలామంది పన్ను పరిధిలో ఉన్నా, లావాదేవీలను బ్లాక్లో నడిపించడం ద్వారా పన్ను ఎగ్గొడుతున్నారు. ఈ బ్లాక్ వ్యవహారాలకు అడ్డుకట్ట వేస్తూ లావాదేవీల్లో పూర్తి పారదర్శకత తీసుకురావాలన్నదే ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం. తద్వారా వీరినందరినీ ట్యాక్స్ బ్రాకెట్లోకి తీసుకురావాలన్నది కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ లక్ష్యంగా కనిపిస్తోంది. కాబట్టి ఇక నుంచి పాన్కార్డు వివరాలను సెల్ఫోన్లో సేవ్ చేసుకోవడంతో పాటు, లావాదేవీలు నిర్వహించేటప్పుడు కూడా ఒరిజినల్ పాన్కార్డ్ ఉండేలా చూసుకోండి. -
హైదరాబాద్లో నకిలీలలు
-
పాన్కార్డు ఉంటేనే రిజిస్ట్రేషన్
తణుకు :ఇకపై ఆస్తులు విక్రయించాలన్నా.. కొనుగోలు చేయాలన్నా.. విధిగా పాన్ కార్డు ఉండాలంటూ సర్కారు నిబంధన విధించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. పాన్కార్డు ఉంటేనే ఇకపై రిజిస్ట్రేషన్లు చేసేలా నిబంధనలు రూపొం దించారు. ఆదాయ పన్ను ఎగవేతదారులకు చెక్ పెట్టేందుకు దీని ని ప్రవేశపెట్టినప్పటికీ సామాన్యులకు మాత్రం ఇబ్బందులు ఎదురుకానున్నాయి. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టుకుని ఆదాయ పన్ను ఎగవేసే వారికి ఇక చెల్లు చీటీ పాడవచ్చని భావిస్తున్నారు. నల్లధనాన్ని బయటకు రప్పించడంతో పాటు ఆదాయ పన్ను పెంచుకునే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇందులో భాగంగానే ఇకపై ఆస్తులు అమ్మినా, కొనుగోలు చేసినా తప్పనిసరిగా పాన్కార్డు సమర్పించాల్సి ఉం టుంది. పాన్కార్డు నంబర్ ద్వారా క్రయ, విక్రయదారుల ఆర్థిక లావాదేవీలు బయటపడే విధంగా చట్టంలో మార్పులు చేశారు. ఇప్పటివరకు భూములు, ఇళ్ల క్రయ, విక్రయాలు జరిపి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో ఎక్కువ మంది ఆదాయపు పన్ను చెల్లించడం లేదు. రూ.లక్ష, అంతకన్నా ఎక్కువ విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు పాన్కార్డు వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ సమయంలో పాన్కార్డుతో పాటు ఫారం-61 కింద వివరాలు అందించేలా నమూనా రూపొం దించారు. క్రయ, విక్రయదారులు ఇద్దరూ పాన్కార్డు నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధన పొందుపరిచారు. ఇద్దరిలో ఏ ఒక్కరికి పాన్కార్డు లేకున్నా రిజిస్ట్రేషన్ చేయరు. నూతన విధానంలో ఎక్కడ రిజి స్ట్రేషన్ జరిగినా పాన్కార్డు ఆధారంగా ఆదాయ పన్ను శాఖ అధికారులకు తెలిసిపోతుంది. వారు సంబంధిత వ్యక్తి నుంచి ఆదాయ పన్ను రాబడతారు. తద్వారా సర్కారు ఆదాయం పెంచుతారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల వల్ల ఆస్తులు విక్రయించే వారికి ఈ నిబంధన ప్రతిబంధకంగా మారనుంది. -
పాన్ కార్డుల జారీ కోసం కొత్త కార్యక్రమం
న్యూఢిల్లీ: పాన్ కార్డులు లేనివారందరికీ వాటి జారీని కేంద్రం వేగవంతం చేయనుంది. ఇందుకోసం ఓ కార్యక్రమం చేపట్టాలని భావిస్తోంది. రూ. లక్షకు మించిన ఏ కొనుగోలుకైనా పాన్ (పర్మినెంట్ అకౌంట్ నెంబర్) వివరాలు సమర్పించడాన్ని తప్పనిసరి చేయనున్నట్లు కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. దేశంలో చాలా మందికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి పాన్ కార్డులు లేకపోవడం వల్ల ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పాన్ కార్డును ఆన్లైన్లో 48 గంటల్లోనే పొందేందుకు అవకాశమున్నప్పటికీ, గ్రామాలతో ప్రత్యేక క్యాంపుల ద్వారా పాన్ కార్డులు జారీ చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. -
సెంట్రల్ ఎక్సైజ్ రిజిస్ట్రేషన్కు పాన్ తప్పనిసరి
న్యూఢిల్లీ: వ్యాపార లావాదేవీలు, పన్ను చెల్లింపుల విషయంలో ఎటువంటి ఆర్థిక అవకతవకలకూ వీలులేకుండా తగిన చర్యలు తీసుకునే దిశలో కేంద్రం మరో ముందడుగు వేసింది. సెంట్రల్ ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ను కోరుకునే ప్రైవేటు సంస్థలకు సంబంధిత యజమాని లేదా చట్టబద్ధమైన సంస్థ పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్)ను తప్పనిసరి చేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే అప్లికెంట్ తన ఈ మెయిల్ అడ్రస్ను, మొబైల్ నంబర్ను కూడా అప్లికేషన్లో తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తును సమర్పించిన రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా తమ ఆన్లైన్ అప్లికేషన్లలో ప్రభుత్వ శాఖలు పాన్ను తెలపనక్కర్లేదని ప్రకటన పేర్కొంది. దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులపై విధించిన ఎక్సైజ్ సుంకం చెల్లింపునకు సెంట్రల్ ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. దీనివల్ల అసెస్సీ ఆన్లైన్లో చెల్లింపులు జరిపే వీలుంటుంది. -
పాన్కార్డు లేకున్నా పట్టుకుంటాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాన్ కార్డు లేదు కదా ఆదాయ పన్ను పరిధిలోకి రావడం లేదనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఆదాయం ఉండి పన్ను చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతున్న వారిని వెతికి పట్టుకునే శక్తి సామర్థ్యాలున్నాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) చైర్మన్ కె.వి.చౌదరి తెలిపారు. గతేడాది దేశవ్యాప్తంగా ఈ విధంగా 5,327 కేసులు నమోదు చేయడమే కాకుండా రూ. 90,000 కోట్లు లెక్కలు చూపించని ఆదాయాన్ని వెలికితీసినట్లు తెలిపారు. సంయుక్త ఆంధ్రప్రదేశ్లో 758 కేసులు నమోదు చేయడమే కాకుండా రూ. 1,133 కోట్లు లెక్క చూపని ఆదాయాన్ని కనుగొన్నట్లు ఆయన తెలిపారు. సీబీడీటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ వచ్చిన చౌదరి శుక్రవారం ఐటీ టవర్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ జనాభా 125 కోట్లు దాటినా అందులో కేవలం 3.5 కోట్లు మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారన్నారు. కానీ పాన్ కార్డు లేకుండా కూడా ఆదాయాన్ని సంపాదిస్తూ పన్ను ఎగవేస్తున్న వారు కూడా ఉన్నారని, వీరందరినీ వెలికితీసి పన్ను పరిధిలోకి తీసుకొస్తున్నామన్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, మొబైల్ ఫోన్ అమ్మకాలు, మైనింగ్ వ్యాపారాల్లో లెక్కలు చూపించని ఆదాయం ఎక్కువగా ఉంటోందన్నారు. బ్యాంకు లావాదేవీలు, బీమా, ఇతర ఆర్థిక సంస్థలు, రిజిస్ట్రేషన్ ఆఫీసులు, ఆటో మొబైల్ కంపెనీలు... ఇలా అనేక సంస్థల నుంచి సమాచారం తీసుకొని పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్న వారి వివరాలను సర్వే రూపంలో సేకరిస్తున్నట్లు చౌదరి తెలిపారు. అంతేకాకుండా కార్యాలయాలు, ఇళ్లను సోదా చేయడం ద్వారా అక్రమ ఆస్తులను గుర్తిస్తున్నామని ఈ విధంగా గతేడాది రూ. 19,792 కోట్లు తమ సోదాల్లో బయటపడ్డాయని, ఇందులో రూ. 808 కోట్లు సీజ్ చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ రీజియన్లో 50 గ్రూపులపై సోదా చేసి రూ. 1,441 కోట్లు వెలికి తీశామని, ఇందులో 11 గ్రూపులకు చెందిన రూ. 189 కోట్లు సీజ్ చేయడం జరిగిందన్నారు. పన్ను పరిధిలోకి వచ్చే వారి సంఖ్యను పెంచడానికి వివిధ డేటా బ్యాంకులు, బిజినెస్ ఇంటిలిజెన్స్ ప్రాజెక్ట్స్పై ఆధారపడుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రిటర్నులు వేయాల్సిన వారిలో 22 లక్షల మంది దాఖలు చేయని వారిని గుర్తించినట్లు తెలిపారు. పన్ను వివాదాల కేసుల్లో కోర్టుల వద్ద మూడు లక్షలకు పైగా అప్పీల్స్ పెండింగ్లో ఉన్నాయని, ఈ సంఖ్యను తగ్గించడానికి త్వరలో ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. వసూళ్లలో లక్ష్యం చేరుకుంటాం. ప్రసుత్త ఆర్థిక సంవత్సరంలో రూ. 7.36 లక్షల కోట్లు ఆదాయ పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చౌదరి తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఇది 15 శాతం అధికమని, ఈ ఏడాది ఇప్పటికే రూ. 53,936 కోట్లు రిఫండ్స్ చెల్లించిన తర్వాత నికరంగా రూ. 1.51 లక్షల కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ ఏడాది రూ. 38, 288 కోట్లు వసూ లు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు రూ. 5,978 కోట్ల వసూళ్లు జరిగాయని, ఇవి కాకుండా రూ. 3,175 కోట్లు రిఫండ్స్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాల్లో పన్ను వసూళ్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు చౌదరి తెలిపారు. స్పైస్ జెట్లో లోపాలు నిజమే.. స్పైస్ జెట్ ఆదాయ పన్ను వ్యవహారాల్లో కొన్ని అవకతవకలను గుర్తించామని, వీటి ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులనుంచి వసూలు చేసిన టీడీఎస్ను సకాలంలో చెల్లించకపోవడం, ఉద్యోగస్తులకు ఫామ్ -16 ఇవ్వకపోవడం వంటి అంశాలు తమ దృష్టికి వచ్చినట్లు చౌదరి తెలిపారు. టాక్స్ ఆడిటింగ్ గడువు పెంపు పరిశీలిస్తాం ట్యాక్స్ ఆడిట్ కేసుల్లో రిటర్నులు దాఖలు చేయాల్సిన సమయాన్ని పెంచే విషయాన్ని పరిశీలిస్తామని సీబీడీ టీ చైర్మన్ హామీ ఇచ్చినట్లు ఫ్యాప్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. మర్యాద పూర్వకంగా ఫ్యాప్సీ బృందం చౌదరిని కలిసింది. ఈ సందర్భంగా ట్యాక్స్ ఆడిటింగ్ రిటర్నుల గడువును పెంచాల్సిందిగా ఫ్యాప్సీ కోరింది. -
గుర్తింపు ‘కార్డు’ పోయిందా.. ఇలా చేయండి
డ్రైవింగ్ లెసైన్స్.. ఓటరు గుర్తుంపు కార్డు.. రేషన్ కార్డు.. ఏటీఎం.. ఆధార్ కార్డు.. ఇవన్నీ మనకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడేవి. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా కార్డుపోతే ఏం చేయాలో అర్థంగాక ఆందోళన పడుతుంటాం. అయితే వాటిని మళ్లీ పొందేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకోండి.. - చిత్తూరు టౌన్ పాన్కార్డు ఆదాయపు పన్నుకు అందించే పాన్(పర్మినెంట్ అకౌంట్ నంబర్)కార్డు పోగొట్టుకుంటే.. సంబంధిత ఏజెన్సీల్లో పాత పాన్కార్డు జిరాక్స్, రెండు కలర్ ఫొటోలు, నివాస, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు జత చేయాలి. కొత్తకార్డు కోసం అదనంగా మరో 96 రూపాయలు చెల్లించాలి. సుమారు 20 రోజుల్లో మరో కార్డును జారీచేస్తారు. www.nsdl.pan వెబ్సైట్లో మరింత సమాచారం తెలుసుకోవచ్చు. పాస్పోర్టు పాస్పోర్టు పోగొట్టుకుంటే ముందుగా స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. వారిచ్చే నాన్ట్రేస్డ్ పత్రంతో పాస్పోర్టు కార్యాలయం, హైదరాబాద్ పేరిట వెయ్యి రూపాయల డీడీ తీయాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ జరిపి కార్యాలయానికి సమాచారం అందిస్తారు. విచారణ పూర్తయిన మూడు నెలల తర్వాత డూప్లికేట్ పాస్పోర్టును జారీ చేస్తారు. తత్కాల్ పాస్పోర్టు అయిన పక్షంలో నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి. వివరాలకు www.passportindia.gov. in ను సంప్రదించవచ్చు. ఓటరు గుర్తింపు కార్డు ఓటు వేసేందుకు కాకుండా వివిధ సందర్భాల్లో గుర్తింపు కోసం ఉపయోగపడే ఓటరు గుర్తింపు కార్డును పొగొట్టుకుంటే పోలింగ్ బూత్, కార్డు నెంబర్తో *10 రుసుం చెల్లించి మీ సేవా కేంద్రంలో మళ్లీ కార్డు పొందవచ్చు. కార్డు నెంబర్ ఆధారంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే కార్డును ఉచితంగా తీసుకోవచ్చు. మరింత సమాచారం కోసం www. ceoandhra.nic.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఆధార్కార్డు ఆధార్కార్డు పోగొట్టుకుంటే టోల్ఫ్రీ నెంబర్ 18001801947లో పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే కొత్తకార్డును మళ్లీ పోస్టులో పంపిస్తారు. help@uidai. gov.in వెబ్సైట్లో పూర్తి సమాచారం పొందవచ్చు. డ్రైవింగ్ లెసైన్స్ వాహనం నడిపేందుకు డ్రైవింగ్ లెసైన్స్ తప్పనిసరి. అనుకోని పరిస్థితుల్లో డ్రైవింగ్ లెసైన్స్ పోగొట్టుకుంటే వెంటనే సంబంధిత పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. వారందించే నాన్ట్రేస్డ్ పత్రంతో పాటు డ్రైవింగ్ లెసైన్స్ ప్రతిని ఎల్ఎల్డీ దరఖాస్తుకు జతచేసి ఆర్టీవో కార్యాలయంలో అందజేయాలి. అలాగే 10 రూపాయల బాండ్పేపరుపై కార్డుపోవడానికి దారితీసిన పరిస్థితులను వివరించాలి. నెలరోజుల్లో తిరిగి అధికారుల నుంచి కార్డును పొందవచ్చు. aptransport.org వెబ్సైట్ నుంచి ఎల్ఎల్డీ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు పొందవచ్చు. ఏటీఎం కార్డు ఏటీఎం కార్డును పోగొట్టుకున్నా.. ఎవరైనా దొంగలించినా.. ముందుగా సంబంధిత బ్యాంకు వినియోగదారుల సేవా కేంద్రంలో ఫిర్యాదు చేయాలి. పూర్తి సమాచారం అందించి కార్డును వెంటనే బ్లాక్ చేయించాలి. తర్వాత ఫిర్యాదు నెంబర్ ఆధారంగా బ్యాంకులో కొత్త కార్డుకోసం దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంకు మేనేజర్ విషయాన్ని నిర్ధారించుకుని కొత్తకార్డును జారీ చేస్తారు. ఇందుకోసం ఆయా బ్యాంకులు నిర్ణీత మొత్తంలో చార్జీలు వసూలు చేస్తాయి. రేషన్కార్డు గుర్తింపుతో పాటు రేషన్షాపుల్లో సరుకులు తీసుకోవడానికి రేషన్కార్డు అవసరం. ఇదిపోతే www.icts2.ap.gov.in వెబ్సైట్లో లాగిన్ కావాలి. అక్కడ ఉన్న username guest, password guest123 సాయంతో విచారణ(క్వేరీ) ఉపయోగించి మన రేషన్కార్డు నంబర్ సాయంతో జిరాక్స్ ప్రతిని పొందవచ్చు. దాని ద్వారా ఏపీ ఆన్లైన్ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే మండల తహశీల్దార్ దానిని పరిశీలించి నామ మాత్రపు రుసుంతో అదే నంబరుపై కార్డు జారీ చేస్తారు. -
అఫిడవిట్...ఏమార్చారు
మచిలీపట్నం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శిష్ట్లా రమేష్ నిర్వాకం గుడివాడ వన్టౌన్లో క్రిమినల్ కేసు రెండు విలువైన స్థిరాస్తుల వివరాలు నిల్ భన్వర్లాల్కు గుడివాడ వాసి ఫిర్యాదు ఆయనపై ఎక్కడా కేసులు లేవట. ఎలాంటి విచారణలు, కేసులుగానీ పెండింగ్లో లేవట.. ఆయనో న్యాయవాది. కనీసం పర్మినెంట్ ఎకౌంట్ నెంబర్ (పాన్ కార్డు) లేదట...! ఇదీ మచిలీపట్నం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి శిష్ట్లా రమేష్ దాఖలు చేసిన అఫిడెవిట్లో పొందుపరచిన సమాచారం. స్క్రూట్నీ సమయంలో ఎలాంటి ఫిర్యాదులు అందకపోవడంతో అధికారులు అఫిడవిట్ను అమోదించారు. కానీ వాస్తవానికి రమేష్పై గుడివాడలో ఒక క్రిమినల్ కేసు, ఆఫిడవిట్లో చూపని రెండు స్థిరాస్తులున్నాయి. వీటిని స్థానికంగా ఒకరు గుర్తించి సమగ్ర ఆధారాలతో సహ ఎన్నికల కమిషనర్తో సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం బట్టబయలయింది. సాక్షి, విజయవాడ: శిష్ట్లా రమేష్బాబు కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా 19వ తేదీన నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో సిర్థాస్తులు, బంగారం, నగదు ఇలా అన్ని అంశాలను ప్రకటించారు. మొత్తం 70లక్షలు స్థిరాస్తులు తనపేరిట, తన భార్య పేరిట 10లక్షల స్థిరాస్తులు,3లక్షల చేతిలో నగదు, మరో3లక్షలు అప్పుగా ఉన్నట్లు అఫిడవిట్లో చూపారు. ఉన్న స్థిరాస్తులు కూడా హైదరాబాద్, చిత్తూరులో ఉన్నట్లు చూపారు. వీటితో పాటు తనపై ఎక్కడా క్రిమినల్ కేసులు నమోదవడం కానీ, క్రిమినల్ విచారణలు కానీ పెండింగ్లో లేవని ప్రకటించారు. అయితే గుడివాడ వన్టౌన్ పోలీసుస్టేషన్లో క్రైం నంబర్ 7/2011 నంబరుతో క్రిమినల్ కేసు నమోదయింది. గుడివాడలోని శాంతినగర్కు చెందిన ఎం. లక్ష్మణరావు అనే వ్యక్తి కోర్టులో ప్రైవేట్ కంప్లయింట్ దాఖలు చేశారు. గుడివాడ కోర్టు వన్టౌన్ పోలీసులను క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించటంతో కేసు నమోదయింది. వెంటనే రమేష్ హైకోర్టు నుంచి కేసు నిలుపుదల చేస్తూ స్టే ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఎంపీ అభ్యర్థి రమేష్ కారును అపహరించారనేది నమోదయిన కేసు సారాంశంగా ఉంది. అయితే గుడివాడలో రెండు సిర్థాస్తులు కూడా ఉన్నాయి. వీటిని కూడా అఫిడవిట్లో చూపలేదు. 2004 సంవత్సరంలో గుడివాడ పట్టణంలో మార్కెట్ విలువ రూ 3.22 లక్షలు విలువచేసే 227 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. అదికూడా రమేష్ పేరిటే కొనుగోలు చేశారు. అలాగే గుడివాడ పట్టణంలోడోర్నంబరు 4/22బిలో ఉన్న 638 చదరపు గజాల స్థలంలో ఉన్న శ్రీశ్రీనివాసరైస్, డాల్ మిల్లును 2006లో కొనుగోలు చేశారు. దీని మార్కెట్ విలువ రూ 29లక్షలుగా ఉంది. బహిరంగ మార్కెట్లో ఈ రెండు ఆస్థుల విలువ సుమారు రెండు కోట్లపైనే ఉంటుందని సమాచారం. ఈ రెండు ఆస్థులు, క్రిమినల్ కేసు వివరాలను అఫిడవిట్లో చూపించలేదు. అలాగే అఫిడవిట్లో తనకు పాన్కార్డు తనకు లేదని చూపారు. కానీ 2006 నుంచే ఆయనకు పాన్ కార్డు ఉంది. ఏఈఏపీఎస్7184ఎం నంబరుతో పాన్కార్డును వినియోగిస్తున్నారు. భన్వర్లాల్కు ఫిర్యాదు... గతంలో రమేష్పై ప్రైవేట్ కేసు దాఖలు చేసిన లక్ష్మణరావు ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్కి రాతపూర్వక ఫిర్యాదు పంపారు. వాస్తవానికి స్క్రూట్నీ సమయంలో ఇతనిపై ఆధారాలతో ఫిర్యాదులను కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, భన్వర్లాల్కు పంపారు. అయితే ఫ్యాక్స్, మెయిల్ ద్వారా పంపండతో వీటిని పరిగణలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో అన్ని అధారాలతో మళ్లీ ఫిర్యాదు చేసి ఎంపీ అభ్యర్థి రమేష్ను అనర్హుడుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. -
పన్ను ఎగవేతదారులపై ఈసీ కన్ను
సీబీడీటీతో కలసి అభ్యర్థుల పాన్ కార్డుల వివరాల సంయుక్త తనిఖీ ఎన్నికల రంగం నుంచి పన్ను ఎగవేతదారుల ఏరివేతే లక్ష్యం న్యూఢిల్లీ: ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థుల్లో రూ. 5 కోట్లకు పైగా ఆస్తులు ఉండి.. పాన్ కార్డు లేని వారిపై ఆదాయ పన్ను శాఖ, కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టిసారిస్తోంది. పన్ను ఎగవేతదారులను ఎన్నికల రంగం నుంచి ఏరివేయటానికి.. అనుమానిత పన్ను ఎగవేతదారుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. గత ఎన్నికల్లో ప్రకటించిన ఆస్తుల కన్నా ఇప్పుడు రూ. 2 కోట్లు అంతకన్నా ఎక్కువ స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించిన అభ్యర్థులను కూడా ఈ జాబితాలో చేర్చారు. వీరందరి ఆస్తులు, ఆదాయాల వివరాలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) అధికారులు క్షుణ్నంగా తనిఖీ చేయనున్నారని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. అనుమానిత పన్ను ఎగవేత కోణం నుంచి అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించటానికి ఈసీ, సీబీడీటీలు సంయుక్తంగా ఐదు కీలక ప్రమాణాలను రూపొందించాయి. అందులో పాన్ (శాశ్వత ఖాతా నంబరు) కార్డుల వాస్తవికతను పరిశీలించటం ఒకటి. ఎన్నికల అఫిడవిట్లో ఆయా అభ్యర్థులు ప్రకటించే ఆదాయం, ఆస్తుల వివరాలను తనిఖీ చేయటానికి ఇది చాలా ముఖ్యమైనది. అభ్యర్థులు తమ అఫిడవిట్లో తెలిపే పాన్ కార్డు వివరాలను తమకు అందించాలని.. దాని ద్వారా సదరు అభ్యర్థి ఆర్థిక మూలాలను తనిఖీ చేయటం సులభమని సీబీడీటీ ఇటీవల ఈసీని కోరింది. ఈసీ ఇచ్చిన పాన్ కార్డు వివరాలను తమ వద్ద గల సదరు అభ్యర్థికి సంబంధించిన పాన్ కార్డు వివరాలను పోల్చిచూసి.. అది బూటకపు పాన్ కార్డా లేక వాస్తవమైనదేనా అన్నది సీబీడీటీ నిర్థారించనుంది. అలాగే.. అభ్యర్థులు తమ అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తుల వివరాలను.. వారికి సంబంధించి ఐటీ విభాగానికి సమర్పించిన ఆదాయ పన్ను రిటర్నుల్లో పేర్కొన్న ఆస్తుల వివరాలను కూడా సరిపోల్చి తనికీ చేయనున్నారు. అభ్యర్థి వ్యక్తిగత ఆస్తుల వివరాలతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ఏ మేరకు చూపారనే అంశాలను కూడా సీబీడీటీ తనిఖీ చేయనుంది. ఈవీఎంలతోనే ఓటింగ్: ఈసీ సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాల్లోనూ ఈవీఎంలను వినియోగిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కింలోనూ.. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఉప ఎన్నికల్లోనూ ఈవీఎంలను వినియోగిస్తామని వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఈవీఎంలు తమకు అందుబాటులో ఉన్నాయన్నారు. మహిళా అభ్యర్థులకు అదనపు భద్రత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే మహిళా అభ్యర్థులకు అదనపు భద్రత కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రతి మహిళా అభ్యర్థికి ఓ పురుష గన్మెన్ను అందిస్తున్నారు. దీనికి అదనంగా ఒక మహిళా వ్యక్తిగత భద్రతా అధికారి(పీఎస్వో)ని కూడా నియమించాలని నిర్ణయించారు. సాధారణంగా అభ్యర్థులు మగవారైనా.. మహిళలైనా పీఎస్వోలుగా పురుషులనే నియమిస్తారు. -
కార్డు పోతే..?
ఖమ్మం ఖిల్లా, న్యూస్లైన్: ఇప్పుడు ఎవరిజేబులో చూసినా పచ్చనోట్ల కన్నా ఎక్కువ కార్డులే కనిపిస్తున్నాయి. ఏటీఎం కార్డు, పాన్కార్డు, డ్రైవింగ్లెసైన్స్, ఓటర్ గుర్తింపుకార్డు, ఆధార్కార్డు...ఇలా అన్నీ కార్డులే ఉంటున్నాయి. ఒకవేళ వీటిని పోగొట్టుకుంటే మళ్లీ ఎలా పొందాలో తెలియక చాలామంది ఆందోళన చెందుతుంటారు. పోయిన కార్డుల స్థానంలో కొత్తకార్డులను ఎలా పొందాలో తెలిపేదే ఈ కథనం... పాన్కార్డు... ఈ రోజుల్లో ఉద్యోగులు, వ్యాపారులతోపాటు సామాన్యులు సైతం పాన్కార్డు తీసుకుంటున్నారు. దీన్ని పోగొట్టుకుంటే దీనికి సంబంధించిన ఏజెన్సీలో ఫిర్యాదు చేయాలి. దీనికి పాన్కార్డు నంబర్, కలర్ఫొటో, నివాస ధృవీకరణపత్రం లేదా రేషన్కార్డు జిరాక్స్ జతచేయాలి. దరఖాస్తుకు రూ.5, మరో కార్డు మంజూరు చేసేందుకు రూ.60 వసూలు చేస్తారు. విచారించి 20 రోజుల్లోపు పాన్కార్డు పంపిస్తారు. రేషన్కార్డు పోతే... ప్రస్తుతం రేషన్కార్డు ప్రాధాన్యత ఎక్కువే. దీని ద్వారా సరుకులు పొందడంతో పాటు, బ్యాంకు అకౌంట్లు, సిమ్కార్డులు పొందటం ఇలాంటి వాటన్నింటికీ దీన్నే ఉపయోగిస్తారు. ఒకవేళ రేషన్కార్డు పోగొట్టుకుంటే ముందుగా తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. దానికోసం రూ.10 లేదా 20 చెల్లిస్తే దీని స్థానంలో మరోకార్డును అందజేస్తారు. ఇలాగే ఓటరు గుర్తింపు కార్డు కూడా పొందవచ్చు. ఒకవేళ కార్డు నంబర్ తెలిసి ఉంటే అప్పటికప్పుడే మీ సేవాలో నామమాత్రపు ఖర్చుతో పొందవచ్చు. పట్టాదారు పాసుపుస్తకం... పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ పోతే ముందుగా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. అక్కడ ఎఫ్ఐఆర్ ఆధారంగా పత్రికల్లో ప్రకటించాలి. ఏ ప్రాంతానికి చెందుతారో అక్కడ ఉన్న అన్ని బ్యాంకుల నుంచి ఒక ధ్రువీకరణ పత్రాన్ని పొందాలి. ఏ బ్యాంకులోనూ వీటిని తాకట్టు పెట్టలేదనే పత్రాన్ని సమర్పించాలి. వీటితో పాటు పట్టదారు పాసుపుస్తకానికి రూ.1000, టైటిల్ డీడ్ కోసం రూ.100 చలానా తీసి మీసేవాలో దరఖాస్తు చేస్తే మళ్లీ పొందవచ్చు. ఏటీఎం కార్డయితే... ఏటీఎం కార్డును పోగొట్టుకుంటే మాత్రం వెంటనే అప్రమత్తం కావాలి. లేదంటే అకౌంట్లోని డబ్బులను భారీగా నష్టపోయే అవకాశముంది. ఈ కార్డు ఎవరికైనా దొరికితే దానిద్వారా డబ్బులు తీయలేకపోయినప్పటికీ... విచ్చల విడిగా షాపింగ్ చేసే ప్రమాదం ఉంది. అందుకే కార్డు పోయిన వెంటనే సంబంధిత బ్యాంకుకు చెందిన వినియోగదారుల సేవా కేంద్రానికి ఫోన్ చేసి కార్డును బ్లాక్ చేయించాలి. ఆ తర్వాత బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేస్తే ముందుగా మన చిరునామాకు కార్డు పంపిస్తారు. ఆ తర్వాత వారం రోజులకు రహస్య పిన్కోడ్ నంబర్ ఇస్తారు. -
‘పాన్’కు పాత పద్ధతే!
న్యూఢిల్లీ: శాశ్వత ఖాతా సంఖ్య (పాన్)ను పొందేందుకు తాజాగా రూపొందించిన నిబంధనలను తాత్కాలికంగా పక్కన బెట్టినట్లు ఆర్థిక శాఖ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం అమలవుతున్న విధానం ప్రకారమే పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. తాజా నిబంధన ప్రకారం దరఖాస్తుతో పాటు జతపరిచిన ధ్రువపత్రాల ఒరిజినల్స్ను కూడా పరిశీలన కోసం దరఖాస్తుదారులు తీసుకురావాల్సి ఉంటుంది. ఆ నిబంధన ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతానికి ఆ నిబంధనను పక్కనబెట్టామని, గతంలో మాదిరిగానే అవసరమైన ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలను జతపరిస్తే సరిపోతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్ పేర్కొంది. -
పీవీసీ ఓటరు గుర్తింపు కార్డులు
కలెక్టరేట్, న్యూస్లైన్ : ఇకపై ఓటర్లందరికీ పాలీ వినైల్ క్లోరైడ్(పీవీసీ) ఓటరు గు ర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. జనవరి 31న ఓటర్ల తు ది జాబితా ప్రకటిం చిన అనంతరం దా ని ఆధారంగా జిల్లాలో ఉన్న ఓటర్లకు ఈ కార్డులు జారీ చేయాలని అధికారులు నిర్ణరుుంచారు. ఫిబ్రవరి ఆఖరు నుంచి పీవీసీ కార్డుల జారీ ప్రక్రియ జిల్లాలో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు. ప్రస్తుతం పాన్కార్డు, ఏటీఎం కార్డు, డ్రైవింగ్ లెసెన్స్లు పీవీసీతో తయారు చేసినవే వస్తున్నాయి. ఓటరు గుర్తింపుకార్డు మాత్రం కాగితంపై ప్రింట్తీసి లామినేషన్ చేయించేవారు. ఇది కొద్దిరోజులకే పాడవుతున్నందున పీవీసీ కార్డులు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం తొలిసారి ఓటర్లందరికీ పీవీసీ కార్డును ఉచితంగా ఇస్తారు. తరువాత కార్డులు రెండవసారి పొందాలంటే ఎంత ధర అన్న విషయం ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. కార్డుపై సూచనలు.. ప్రస్తుతం జారీ చేయనున్న పీవీసీ కార్డుల వెనుక వైపు ఎన్నికల సంఘం రెండు సూచలను చేస్తోంది. దీంట్లో ఒకటి ఓటరు గుర్తింపు కార్డు ఉన్నంత మాత్రాన జాబితాలో మీపేరున్నట్లు కాదు. ఎన్నికల ముందు జాబితాలో పేరు ఉందో.. లేదో సరిచూసుకోవాల్సిన బాధ్యత ఓటరుదేనని, కార్డుపై ఉన్న జన్మదిన తేదీ, వయస్సును ఇతర అవసరాల కోసం రుజువుగా చూపెట్టడానికి ప్రమాణికంగా పరిగణించడం కుదరదని స్పష్టంచేశారు. ఈ నిబంధనల వల్ల చిరునామా గుర్తింపునకు, వ్యక్తి గుర్తింపునకు.. ఓటరు గుర్తింపుకార్డును ప్రమాణికంగా తీసుకున్నవారు ఇకపై తిరస్కరించే అవకాశాలు ఉంటాయని ఓటర్లు అంటున్నారు. -
పాన్ కార్డు ఖరీదు 105!!
ఇప్పటివరకు మీకు పాన్కార్డు లేదా? కొత్తగా తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు ఆదాయపన్ను శాఖకు పన్నులతో కలిపి 105 రూపాయలు చెల్లించాల్సిందే. భారతీయ పౌరులకు పాన్ కార్డులు జారీ చేసేముందు వారి వారి పత్రాల పరిశీలనకు ఆదాయపన్ను శాఖ కొత్త విధివిధానాలను నోటిఫై చేసింది. ఒకే వ్యక్తికి రెండు మూడు పాన్ కార్డులు లేకుండా చూసేందుకే ఈ చర్య తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పుడు మొత్తం 105 రూపాయలు చెల్లించి పాన్ కార్డు పొందొచ్చు. అయితే సర్వీసు చార్జిని మాత్రం మార్చలేదు. జనన ధ్రువీకరణ, చిరునామా, గుర్తింపు ధ్రువీకరణకు ఒరిజినల్ డాక్యుమెంట్ల పరిశీలన ప్రక్రియను కూడా ఇటీవలే ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి మూడో తేదీ నుంచి కొత్తగా ఎవరైనా పాన్ కార్డులు కావాలనుకుంటే వాళ్లు తమ గుర్తింపు, చిరునామా, జనన ధ్రువీకరణ పత్రాల కాపీలను దరఖాస్తుతో పాటు జతచేయాలని, వాటి ఒరిజినల్స్ను చెక్ చేసి తర్వాత తిరిగిస్తామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దరఖాస్తుదారులు తమ పత్రాల కాపీల మీద సంతకాలు చేయాల్సి ఉంటుంది. బినామీ ఆస్తులు కూడగట్టుకోడానికి, పన్నులు ఎగవేయడానికి వీలుగా ఒకే వ్యక్తి రెండు మూడు పాన్ కార్డులు తీసుకుంటున్న వైనాన్ని ఆదాయపన్ను శాఖ పలు సందర్భాలలో గుర్తించింది. ఇప్పుడు అత్యాధునిక పరిజ్ఞానాన్ని కూడా ప్రవేశపెడుతుండటంతో, ఏమాత్రం పొరపాట్లు లేకుండా పాన్ కార్డులు జారీచేసే అవకాశం కనిపిస్తోంది.