protest
-
విశాఖ ఏయూ విద్యార్థుల ఆందోళన
-
శాసన మండలిలో పెద్దఎత్తున YSRCP సభ్యుల నినాదాలు
-
విశాఖ స్టీల్ప్లాంట్ కార్మికుల ఆందోళన
సాక్షి, విశాఖపట్నం: కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును నిరసిస్తూ విశాఖ స్టీల్ప్లాంట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే వెయ్యి మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించగా.. మరికొందరిని తొలగించే యోచనలో ఉంది. నేటితో యాజమాన్యం కోరిన గడువు ముగియనుంది. నేడు రిజనల్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో మరోసారి చర్చలు జరపనున్నారు. స్పష్టత ఇవ్వకపోతే రేపటి నుంచి సమ్మెలోకి వెళ్లే అవకాశం ఉంది.కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై సమావేశం కొనసాగుతోంది. యూనియన్ నేతలతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సమావేశమైంది. కాంట్రాక్టు కార్మికుల తొలగింపుపై చర్చలు కొలిక్కి రాలేదు. యాజమాన్యం తీరుపై కార్మిక సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇప్పటివరకు వెయ్యి మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని... తొలగించిన వాటిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని.. లేదంటే నిరవధిక సమ్మెకు దిగుతామని యూనియన్ నేతలు హెచ్చరించారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించమనే హామీ ఇప్పటివరకు యాజమాన్యం నుంచి రాలేదని.. యాజమాన్యం చెబుతోంది ఒకటి, చేస్తోంది ఒకటని కార్మికులు మండిపడుతున్నారు.స్టీల్ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికులను అక్రమంగా తొలగిస్తున్నారని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. అక్రమ తొలగింపులను ఆపకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. స్టీల్ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికులను తొలగింపును నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పాతగాజువాకలో ఆదివారం మహాధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే.స్టీల్ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలను ముమ్మరం చేసిందని అందులో భాగంగా ప్రైవేట్ పెట్టుబడిదారులు కోరినట్టుగా ఇక్కడి కార్మికుల సంఖ్యను తగ్గిస్తోందన్నారు. దీన్ని ప్రశ్నిస్తున్న నాయకులకు యాజమాన్యం షోకాజ్ నోటీసులను జారీ చేయడం దుర్మార్గమని సీపీఎం నేతలు ధ్వజమెత్తారు. -
మాకు న్యాయం జరిగేవరకు మా పోరాటం ఆగదు.. బాబుపై అంగన్వాడీ వర్కర్లు ఫైర్
-
‘డౌన్ డౌన్ చంద్రబాబు.. మా సత్తా ఏంటో చూపిస్తాం’
ఎన్టీఆర్ జిల్లా, సాక్షి: వేతనాల పెంపు డిమాండ్తో అంగన్వాడీలు చేపట్టిన విజయవాడ మహా ధర్నా.. కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మారుమోగుతోంది. చంద్రబాబూ.. డౌన్ డౌన్.. కూటమి సర్కార్కు మా సత్తా ఏంటో చూపిస్తామంటూ నినాదాలతో విజయవాడ మారుమోగుతోంది. అంతకు ముందు.. ఛలో విజయవాడ ధర్నాను అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించారు. ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు తనిఖీలు నిర్వహించారు. అయినప్పటికీ రాష్ట్రం నలుమూలలా నుంచి అంగన్వాడీలు తరలి వచ్చారు. వేతనాల పెంపు సహా పలు సమస్యల పరిష్కార డిమాండ్లతో అంగన్వాడీలు సోమవారం (మార్చి 10న) ఛలో విజయవాడ ధర్నా నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు తమ గుప్పిట పెట్టుకున్నారు. అంగన్వాడీలను ఎక్కడికక్కడే అడ్డుకుంటూ నిరంకుశంగా వ్యవహరించారు. కానీ.. 👉టియర్ గ్యాస్ వాహనంతో..పోలీసుల వలయం దాటి.. విజయవాడకు ఇప్పటికే భారీగా చేరుకున్న అంగన్వాడీలు మహా ధర్నాకు సిద్ధమయ్యారు. అలంకార్ సెంటర్కు అంగన్వాడీలు చేరుకోవడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ సంఖ్యలో మహిళా పోలీసులు, సిబ్బంది మోహరించారు. రోడ్డు బ్లాక్ చేసి ఎవరిని ముందుకు కదలనివ్వడం లేదు. ఈ క్రమంలో.. టియర్ గ్యాస్ వాహనం సైతం అక్కడ కనిపించడం గమనార్హం. అయితే ధర్నాను అడ్డుకుంటే తమ సత్తా చూపిస్తామంటూ అంగన్వాడీలు చెబుతున్నారు.👉రైళ్లోంచి బలవంతంగా.. అనంతపురం నుంచి అంగన్వాడీలు రైలులో విజయవాడకు బయల్దేరారు. అయితే..వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల స్టేషన్లో కార్యకర్తలతో పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. బలవంతంగా వాళ్లను బయటకు దించేశారు. ఈ క్రమంలో చంద్రబాబు డౌన్.. డౌన్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.👉మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ లో పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ప్రతి వాహనాన్ని.. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. -
జగన్ పిలుపుతో అన్ని జిల్లాల్లో యువత పోరు
-
కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును నిరసిస్తూ అఖిలపక్షం ఉద్యమం
-
అంగన్వాడీలపై కూటమి సర్కార్ కుట్ర
-
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కక్ష సాధింపు
సాక్షి, విశాఖ : ఉక్కు పోరాట కమిటీ నేతలపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ప్లాంట్ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని పోరాట కమిటీ నేత అయోధ్యరామ్కు నోటీసులు అందించింది. వారంలోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. -
విజయవాడలోని ధర్నా చౌక్ కు భారీగా చేరుకున్న ఆశా వర్కర్లు
-
తాడో పేడో తేల్చుకుంటాం.. విజయవాడకు భారీగా చేరుకున్న ఆశావర్కర్లు
సాక్షి, విజయవాడ: ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకొనేందుకు ఆశావర్కర్లు సిద్ధమవుతున్నారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. గత సమ్మె కాలంలో ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాలపై జీవోలు విడుదల చేయాలని ఆశావర్కర్లు కోరుతున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.గురువారం.. అన్ని జిల్లాల నుంచి ధర్నా చౌక్కు భారీగా చేరుకున్న ఆశా వర్కర్లు.. రోడ్లపై సైతం కార్పెట్లు వేసుకుని ఎండలో ధర్నాకు దిగారు. ఆశా వర్కర్ల కదలికలపై డ్రోన్లు, ఇంటిలిజెన్స్ బృందాల ద్వారా పోలీసులు నిఘా పెట్టారు. ధర్నాచౌక్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.దాదాపు 10 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంటుందని యూనియన్ నాయకులు అంటున్నారు. ఆర్ముడ్ రిజర్వ్, సివిల్, ర్యాపిడ్ యాక్షన్ టీంలను పోలీసులు సిద్ధం చేశారు. ఏడీసీపీ, ఏఎస్పీ, ముగ్గురు డిఎస్పీలు, నలుగురు సీఐలు, ఇతర సిబ్బందితో భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్వష్టమైన ప్రకటన చేస్తే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఆశా వర్కర్లు చెబుతున్నారు. -
AP: గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన ఉధృతం.. సీఎం డౌన్ డౌన్ అంటూ..
సాక్షి, విశాఖపట్నం: గ్రూప్-2 అభ్యర్థులను చంద్రబాబు ప్రభుత్వం నట్టేట ముంచేసింది. మెయిన్స్ వేయిదా వేస్తామని ఎమ్మెల్సీ చిరంజీవి ద్వారా అభ్యర్థులను ప్రభుత్వం నమ్మించింది. టీడీపీ నేతల మాటలు నమ్మి గ్రూప్-2 అభ్యర్థులు మోసపోయారు. పరీక్ష వాయిదా కోసం ఆందోళనలు చేసినా చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదు.విశాఖలో గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన ఉధృతమైంది. ఇసుకతోట నేషనల్ హైవేపై బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాస్తారోకో చేస్తున్నారు. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సీఎం డౌన్ డౌన్ అంటూ గ్రూప్-2 అభ్యర్థులు నినాదాలు చేస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా పోలీసులు ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆందోళన విరమించాలని పోలీసులు కోరుతున్నారు.కళ్లు తిరిగి పడిపోయిన గ్రూప్-2 అభ్యర్థిగ్రూప్-2 అభ్యర్థి శ్యామ్ కళ్లు తిరిగిపడిపోయాడు. శ్యామ్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మరో అభ్యర్థి చిరంజీవి కూడా సొమ్మసిల్లి పడిపోయాడు. రోస్టర్లో సవరణలు చేశాకే పరీక్షకు హాజరవుతామని.. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని.. ప్రభుత్వం మా గోడు పట్టించుకోవాలని గ్రూప్-2 అభ్యర్థులు చెబుతున్నారు. విజయవాడ: రేపు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ సంబంధించి స్పష్టత ఇంకా రాలేదు. ఏపీపీఎస్సీ కార్యాలయానికి గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మూడు రోజులుగా ధర్నాలోనే ఉన్నామని గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థి నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేస్తామని.. వాయిదా పడుతుందంటూ లోకేష్ చంద్రబాబు చెప్పారు. ఆ నమ్మకంతోనే ఎక్కడ వాళ్లం అక్కడే ఆగిపోయాం. రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రోస్టర్ విధానాన్ని సరిచేసి ఎగ్జామ్ పెట్టాలి. రాష్ట్ర విధానాన్ని సరిచేసి ఎగ్జామ్ పెట్టకపోతే మళ్లీ జ్యూడిషల్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇంకో రెండు, మూడు సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికే గ్రూప్-2 ప్రిపరేషన్ కోసం ఇల్లు వదిలి కోచింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నాం. ఇటువంటి ఆందోళనకర పరిస్థితుల్లో పరీక్షలు ప్రశాంతంగా రాయలేమని నాయక్ అన్నారు. -
‘రామోజీ ఫిలింసిటీ’ కబ్జాలపై రైతుల ఆందోళన
సాక్షి,రంగారెడ్డిజిల్లా : రామోజీ ఫిలింసిటీ భూ ఆక్రమణల వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఫిలింసిటీ కోసం తమ భూములు ఆక్రమించారని అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్పూర్ గ్రామ రైతులు శుక్రవారం(ఫిబ్రవరి21) ఉదయం ఆందోళన చేపట్టారు.వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఫిలింసిటీకి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. రైతుల భూములను ఆక్రమించిన రామోజీ ఫిలింసిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిలింసిటీ కబ్జాలో ఉన్న తమ భూములను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్లో వేల ఎకరాల్లో రామోజీ ఫిలింసిటీ నిర్మాణానికిగాను చుట్టుపక్కల ఉన్న రైతులు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారని ఫిలింసిటీ యాజమాన్యంపై గతంలో పలువురు ఆరోపణలు చేశారు. తాజాగా అనాజ్పూర్ రైతులు ఇదే విషయమై ఆందోళన చేపట్టడంతో కబ్జాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. -
టీటీడీ ఉద్యోగ సంఘాలతో బోర్డు సభ్యుల చర్చలు విఫలం
సాక్షి, తిరుపతి: టీటీడీ ఉద్యోగుల నిరసన నేపథ్యంలో టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులతో టీటీడీ అడిషనల్ ఈవో, జేఈవో చర్చలు జరిపారు. ఆందోళన విరమించాలని టీటీడీ సభ్యులు కోరారు. పాలక మండలి సభ్యుడు నరేష్ను తొలగించే వరకు ఆందోళన విరమించేది లేదని ఉద్యోగులు తేల్చి చెప్పారు.ఉద్యోగిని దూషించినందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని.. టీటీడీ ఉద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి 48 గంటలపాటు మౌన నిరసన చేయాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. టీటీడీ ఉద్యోగ సంఘాలతో బోర్డు సభ్యుల చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని టీటీడీ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక హెచ్చరించింది. -
TTD పరిపాలనా భవనం వద్ద ఉద్యోగుల ఆందోళన
-
చిక్కుల్లో రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం!
రంగారెడ్డి, సాక్షి: రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్య అరాచకాలపై పేదలు నిరసన గళమెత్తారు. ఆక్రమించుకున్న తమ ఇళ్ల స్థలాలను తిరిగి అప్పజెప్పాలంటూ సోమవారం కలెక్టరేట్ ఎదుట పోరాటానికి దిగారు. ఈ ఆందోళనకు వామపక్ష సీపీఎం తమ మద్దతు ప్రకటించింది. దివంగత మహానేత వైఎస్సార్(YSR) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంచింది. ఇందుకుగానూ ఇబ్రహీంపట్నం మండలం నాగన్ పల్లి సర్వే నెంబర్ 189, 203లో 20 ఎకరాలను 577 మందికి పంపిణీ చేశారు. అయితే.. 2007 నుంచే ఆ స్థలాలను రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City) యాజమాన్యం తమ గుప్పిట్లో ఉంచుకుంది. అప్పటి నుంచి వాళ్ల పోరాటం కొనసాగుతూనే వస్తోంది. అయితే.. లబ్ధిదారులను తమ ప్లాట్ల వద్దకు వెళ్లకుండా గేట్లు, ప్రహరీ గోడలు నిర్మాణం చేసుకుంది ఫిల్మ్ సిటీ యాజమాన్యం. దీంతో.. సీపీఎం(CPM) ఆధ్వర్యంలో బాధితులు ఇవాళ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. వైఎస్సార్ హయాంలో కేటాయించిన.. ఆ ఇళ్ల పట్టాల స్థలాలను చూపించాలంటూ కలెక్టర్ను డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
Bangladesh: ‘అవన్నీ ప్రభుత్వ హత్యలే’.. దడపుట్టిస్తున్న ఐక్యరాజ్యసమితి రిపోర్టు
బంగ్లాదేశ్లో గత ఏడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం ఎగసిపడింది. అనంతరం జరిగిన పరిణామాలపై తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ఒక నివేదికను వెలువరించింది. నాడు చెలరేగిన హింసలో 1,400 మంది హతమయ్యారని ఆ నివేదిక బయటపెట్టింది. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని పరోక్షంగా పేర్కొంది. నాడు బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న మానవహక్కుల ఉల్లంఘనల ఉదంతాలను కూడా ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం ఆ నివేదికలో తెలియజేసింది.బంగ్లాదేశ్లో 2024లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. నాటి షేక్ హసీనా ప్రభుత్వం.. నేటి మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాల కాలంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలను ఈ నివేదికలో వివరంగా పొందుపరిచారు.2024 విద్యార్థి ఉద్యమంలో సుమారు 1,400 మంది హతమయ్యారని నివేదిక పేర్కొంది. భద్రతా దళాలు చిన్నారులతో సహా పలువురు నిరసనకారులను కాల్చిచంపాయని తెలిపింది.తిరుగుబాటు తొలి రోజుల్లో షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం 150 మంది మరణాలను మాత్రమే నిర్ధారించింది. అయితే ఈ నివేదికలోని వివరాల ప్రకారం వందలాదిగా సాగిన చట్టవిరుద్ధ హత్యలు, ఏకపక్ష అరెస్టులు, నిర్బంధాలు మొదలైనవన్నీ షేక్ హసీనా ప్రభుత్వంతో పాటు భద్రతా అధికారుల సహకారంతోనే జరిగాయని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ ఈ నివేదికలో పేర్కొంది.ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం కూడా మతపరమైన మైనారిటీలపై హింసను ప్రోత్సహిస్తున్నదని ఆ నివేదిక ఆరోపించింది. మహిళలు వారి నిరసనను వ్యక్తం చేయకుండా నిరోధించేందుకు వారిపై శారీరక దాడి, అత్యాచారం చేస్తామని పోలీసులు బెదిరించారని కూడా నివేదిక పేర్కొంది. నిరసనలను అణిచివేసే నెపంతో రాజకీయ నేతలు, భద్రతా అధికారులు ఉద్దేశపూర్వకంగా చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారని మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ పేర్కొన్నారు. విద్యార్థి నేత, అమరవీరుడు అబూ సయీద్ హత్య కూడా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ఆ నివేదిక పేర్కొంది.ఇది కూడా చదవండి: మళ్లీ పాక్ సరిహద్దు ఉల్లంఘన.. బుద్ధి చెప్పిన భారత్ -
విశాఖ: ‘సీజ్ ద నారాయణ కాలేజ్’
విశాఖపట్నం, సాక్షి: సీజ్ ద నారాయణ కాలేజ్ నినాదంతో మధురవాడ పరదేశి పాలెం నారాయణ కాలేజ్ క్యాంపస్ మారుమోగుతోంది. యాజమాన్యం ఒత్తిడితో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడగా.. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని విద్యార్థి సంఘాలు ఈ ఉదయం ఆందోళనకు దిగాయి.ఒడిశా రాయ్పూర్కు చెందిన చంద్రవంశీ(17) అనే విద్యార్థి.. మధురవాడ పరదేశి పాలెం నారాయణ కాలేజీలో సెకండ్ఇయర్ చదువుతున్నాడు. ఏం జరిగిందో తెలియదుగానీ.. కాలేజీ మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే.. కాలేజీ యాజమాన్యం నుంచి ఒత్తిడి భరించలేకనే అతను చనిపోయినట్లు విద్యార్థి సంఘాలు ఇప్పుడు ధర్నాకు దిగాయి.చంద్ర వంశీ ఆత్మహత్యపై కళాశాలలో నిన్న రాత్రి(బుధవారం) స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. దీంతో యాజమాన్యం విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడింది. గేట్లు వేసి, హాస్టల్ రూమ్లకు తాళాలు వేసి విద్యార్థులను లోపలే బంధించింది. ఆపై రంగ ప్రవేశం చేసిన పోలీసులు సైతం విద్యార్థులను బెదిరించినట్లు సమాచారం.విషయం తెలిసిన ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాలు కాలేజ్ దగ్గరకు చేరుకుని ధర్నాచేపట్టాయి. చంద్ర వంశీ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని, కాలేజీని తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ అండదండలతో నారాయణ కళాశాల యాజమాన్యం రెచ్చిపోతుందని ఆరోపించాయవి. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన.. ఏజెన్సీ బంద్
సాక్షి, అల్లూరి జిల్లా: పాడేరు ఏజెన్సీలో బంద్ కొనసాగుతోంది. గిరిజన హక్కులకు భంగం కలిగేలా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. 1/70 యాక్ట్ను సవరించాలన్న అయ్యన్న వ్యాఖ్యలపై నిరసనలకు దిగాయి. అయ్యన్న వ్యాఖ్యలపై రాజకీయ, గిరిజన, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఉదయం నుంచే వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు బంద్లో పాల్గొన్నారు. 1/70 యాక్ట్ను సవరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని గిరిజన సంఘాలు హెచ్చరించాయి. టూరిజం ముసుగులో గిరిజన భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని గిరిజనులను దోపిడీ చేసే కుట్ర జరుగుతుందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న పాత్రుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని.. క్షమాపణ చెప్పాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశాయి.1/70 చట్టాన్ని సవరించాలన్న అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల అఖిల పక్షం నేడు(మంగళ), రేపు( బుధవారం) మన్యం బంద్ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ బంద్కు వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపింది. గిరిజన హక్కులు, చట్టాలను గౌరవించాల్సిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇటీవల విశాఖలో జరిగిన పర్యాటక సదస్సులో 1/70 చట్టాన్ని సవరింలంటూ చెప్పడంపై రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో పలు రాజకీయ పార్టీలు, గిరిజన సంఘాలు మన్యం బంద్ చేపట్టాయి. -
అరగంట కేటాయిస్తే పనైపోద్ది.. రోడ్డెక్కిన జనసేన
సాక్షి, కృష్ణాజిల్లా: పెడనలో న్యాయం కోసం జనసేన పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కారు. టీడీపీ నేతల అరాచకాలపై జనసేన పోరాట దీక్షకు దిగింది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ వాహనం ముందు జనసేన కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ కార్యక్తలకు అన్యాయం జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కోరుతూ జనసేన కార్యకర్తలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పెడన నియోజకవర్గం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సీరం సంతోష్ ఆధ్వర్యంలో దీక్షకు దిగారు. అరగంట కేటాయిస్తే పనైపోద్ది.. మా గోడు తెలియజేయడానికి సమయం ఇవ్వాలంటూ బ్యానర్లు కట్టారు.కార్యకర్తలకు అవమానాలు జరుగుతున్నా పవన్ కల్యాణ్ పట్టించుకోకపోవడంతో ఆయన అపాయింట్మెంట్ కోరుతూ ఆమరణదీక్ష చేపట్టిన సీరం సంతోష్ దీక్షతో టీడీపీ,జనసేన పార్టీలో కలవరం రేగుతోంది. జనసేన కృష్ణాజిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, పెడన టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దీక్షా శిబిరానికి చేరుకున్నారు. దీక్ష విరమింపజేయాలని ప్రయత్నాలు చేస్తుండగా, సీరం సంతోష్ మాత్రం ససేమిరా అంటున్నారు. మరో వైపు, నిన్న(బుధవారం) కోనసీమలో మంత్రి అచ్చెన్నాయుడికి జనసేన కార్యకర్తలు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పి.గన్నవరంలో మంత్రి పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి సమావేశంలో గందరగోళం నెలకొంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్న మాట్లాడుతున్న సమయంలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా అచ్చెన్నాయుడు ఎలా మాట్లాడతారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.జనసేన ఎమ్మెల్యే ఉన్న చోటే పవన్ పేరు పలకరా అంటూ నిరసన వ్యక్తం చేశారు. జనసేన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో పవన్ పేరు ప్రస్తావించక పోవడంతో టీడీపీ, జనసేన నేతల మధ్య వాగ్వాదం జరిగింది. జనసేన కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోబోయారు. దీంతో వివాదం మరింత ముదిరింది. షాక్ తిన్న అచ్చెన్నాయుడు సభ నుంచి వెళ్లిపోయారు. -
వైఎస్సార్సీపీ ‘ఫీజు పోరు’ వాయిదా
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ నిర్వహించతలపెట్టిన ఫీజు పోరు నిరసన కార్యక్రమం వాయిదా పడింది. ఫిబ్రవరి 5న జరగాల్సిన కార్యక్రమాన్ని మార్చి 12కి వాయిదా వేసింది. ఈ మేరకు పార్టీ సోమవారం(ఫిబ్రవరి3) ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఫీజుపోరు వాయిదా నిర్ణయం తీసకున్నట్లు తెలిపింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తమ ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని ఆదివారమే ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ కోరింది. అయితే ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో నిరసనను వాయిదా వేయాలని నిర్ణయించారు. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నపుడు ప్రవేశపెట్టిన పీజు రీయింబర్స్మెంట్ స్కీమ్తో ఎందరో ఐటీ నిపుణులుగా, ప్రొఫెషనల్ కోర్సులు చదువుకున్నారు. తర్వాత వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనూ ఈ స్కీమ్ విజయవంతంగా కొనసాగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఈ స్కీమ్ అమలు చేయకుండా పేద, మధ్య తరగతి విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు.ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్థులు,వారి తల్లిదండ్రుల పక్షాన ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఫీజుపోరు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఈ కార్యక్రమం మార్చి 12కి వాయిదా పడింది. -
పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళం
-
రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు
-
GHMC కౌన్సిల్ మీటింగ్ హిట్.. బీజేపీ కార్పొరేటర్ల వినూత్న నిరసన
-
BRS కార్పొరేటర్లు సస్పెండ్.. ఆపై అరెస్ట్.. జీహెచ్ఎంసీ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్, సాక్షి: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాల నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లను మేయర్ విజయలక్ష్మి సస్పెండ్ చేశారు. సమావేశానికి అడ్డుపడడంతో పాటు తనపై పేపర్లు విసిరడంతో జీహెచ్ఎంసీ సెక్షన్ 89/1 ప్రకారం ఆమె ఈ చర్యకు ఉపక్రమించారు. ఆపై రంగప్రవేశం చేసిన మార్షల్స్.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను బయటకు తీసుకెళ్లారు. అయితే బీహెచ్ఎంసీ బయటే బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టగా.. పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.అంతకు ముందు.. ప్రశ్నోత్తరాలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. అప్పటికే బయటకు తీసుకెళ్లిన తమవాళ్లను లోపలికి తీసుకురావాలంటూ డిమాండ్ చేశారు. అయితే.. బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఎవరో తనకు తెలియదని, ఆ పార్టీ సభ్యులు తనపై పేపర్లు విసిరారని మేయర్ విజయలక్ష్మి ఆరోపణలకు దిగారు. దీంతో.. మేయర్కు క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్ఎస్కు కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో మేయర్ పోడియం వద్ద చేరుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు పరస్పరం దూషించుకున్నారు. దీంతో.. సమావేశాన్ని మేయర్ మరోసారి వాయిదా వేశారు. అంతకుముందు.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో రసాభాస చోటు చేసుకోవడంతో కాసేపు సమావేశాన్ని మేయర్ వాయిదా వేశారు. ప్రజా సమస్యలపై చర్చించాలని బీఆర్ఎస్ ఫ్లకార్డులతో నిరసనకు దిగగా.. బడ్జెట్ ఆమోదం విషయంలో మొండిపట్టుతో ఉన్న కాంగ్రెస్ సభ్యులు వాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో బీఆర్ఎస్ సభ్యుల్లో కొందరిని మార్షల్స్ సాయంతో మేయర్ బయటకు పంపించేశారు. ఆపై విపక్షాల ఆందోళన నడుమ గందరగోళం నెలకొనడంతో సభ వాయిదా పడింది.ఎన్నికల హామీల మాటేంటి?గురువారం ఉదయం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే.. ముందుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు మేయర్ ప్రకటించారు. అయితే.. ప్రజా సమస్యలపై ముందు చర్చించాలని బీఆర్ఎస్, బీజేపీలు పట్టుబట్టాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు గురించి నిలదీశాయి. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారింది. ఫ్లకార్డులు పట్టుకుని బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. మేయర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో సభను వాయిదా వేసిన మేయర్.. ఆ వెంటనే బడ్జెట్ను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఇది మరింత అగ్గి రాజేసింది.ఏకపక్షంగా బడ్జెట్ను మేయర్ ఆమోదించడంపై నిరసనకు దిగిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల చేతుల్లోని ఫ్లకార్డులు లాక్కొని చించేశారు కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్. దీంతో.. కార్పొరేటర్లు ఒకరినొకరు తోసేసుకున్నారు. మేయర్ ఎంత విజ్ఞప్తి చేసినా సభ్యులు తగ్గలేదు. మేయర్కు వ్యతిరేకంగా కౌన్సిల్లో విపక్షాలు ఆందోళనకు దిగారు. దీంతో సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారామె. ఆపై కౌన్సిల్ హాల్లోకి మార్షల్స్ ప్రవేశించి.. బీఆర్ఎస్ కార్పొరేటర్లలో కొందరిని బయటకు తీసుకెళ్లారు.అంతకుముందు.. కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపించింది. సర్వసభ్య సమావేశం సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారులు భావించారు. ఈ క్రమంలోనే ఆఫీస్ బయట భారీగా పోలీసులు, మీటింగ్ హాల్ వద్ద మార్షల్స్ను మోహరించారు. ‘బిచ్చగాళ్లు’గా బీజేపీ కార్పొరేటర్లుబీజేపీ కార్పొరేటర్ల(BJP Corporaters) వినూత్న నిరసనకు దిగారు. బిచ్చగాళ్ల వేషధారణ తో జీహెచ్ఎంసీ(GHMC) కౌన్సిల్ మీటింగ్కి వచ్చారు. ట్యాక్సులు కడుతున్నా తమ డివిజన్లకు నిధులు కేటాయించడం లేదని ఆరోపిస్తున్నారు వాళ్లు. ‘‘మా డివిజన్కి నిధులు ఇవ్వండి సారూ..’’ అంటూ అడుక్కుంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ఇక.. కౌన్సిల్ లో గందరగోళం నెలకొంటే కారకులైన ఆ వ్యక్తులను బయటకు పంపుతామని అధికారులు చెబుతున్నారు.సర్వసభ్య సమావేశంలో రూ.8,440 కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్పై చర్చించనున్నారు. మరోవైపు కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగగ్రెస్ చర్చలు జరుపుతోంది. ఈ ఉదయం మంత్రి పొన్నం నివాసంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు చర్చలు జరుపుతున్నారు. ఇక.. ఫిబ్రవరి 10 తర్వాత మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. -
పోరుబాటకు సిద్దమవుతున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు
-
ఇదేనా తొలిసంతకం విలువ? కూటమి సర్కార్పై ఆగ్రహ జ్వాలలు
కృష్ణా, సాక్షి: అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచినా మెగా డీఎస్సీ ఊసేత్తడం లేదు కూటమి ప్రభుత్వం. దీంతో.. అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. తాజాగా.. మంగళవారం అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్ధులు రోడ్డెక్కి నిరసన తెలియజేశారు. ‘‘కూటమి ప్రభుత్వం డీఎస్పీ అభ్యర్ధులను నయవంచన చేస్తోంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. తక్షణమే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రకటించాలి. పరీక్షల తేదీతో సహా ప్రకటన చేయాలి ... లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతాం అని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న హెచ్చరించారు. మరోవైపు.. డీఎస్సీ అభ్యర్ధులు సైతం కూటమి సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం తొలి సంతకానికి ఉన్న విలువ ఇదేనా?. ఆరునెలల్లో మెగా డీఎస్పీ పూర్తిచేస్తామన్నారు. కనీసం ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో చెప్పడం లేదు. తక్షణమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి’’ అని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. అవనిగడ్డ గ్రంధాలయం నుంచి వంతెన సెంటర్ వరకూ ప్లకార్డులతో నిరనన ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. -
జేపీసీ సమావేశంలో రగడ
న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లుపై జరిగిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సమావేశంలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నేత, చైర్మన్ జగదాంబికా పాల్ నేతృత్వంలో జేపీసీ శుక్రవారం సమావేశమైంది. చైర్మన్ తీరుపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే ఆయన నడుచుకుంటున్నారని, నియమ నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. మీటింగ్ ఎజెండాను రాత్రికి రాత్రే ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారని ధ్వజమెత్తారు. జేపీసీ కార్యకలాపాలను ఒక ఫార్స్గా మార్చేశారని దుయ్యబట్టారు. విపక్ష సభ్యుల తీరుపై జగదాంబికా పాల్ అభ్యంతరం వ్యక్తంచేశారు. తనను ఇష్టానుసారంగా దూషిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు కల్యాన్ బెనర్జీపై మండిపడ్డారు. సమావేశానికి అంతరాయం కలిగించడానికే వచ్చారా? అని నిలదీశారు. దీంతో జగదాంబికా పాల్కు వ్యతిరేకంగా విపక్ష సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. రెండో చైర్మన్ సమావేశాన్ని రెండు సార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పది మంది విపక్ష సభ్యులను ఒకరోజుపాటు సస్పెండ్ చేస్తూ బీజేపీ సభ్యుడు నిశికాంత్ దూబే తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మాన్ని జేపీసీ ఆమోదించింది. దీంతో కల్యాణ్ బెనర్జీ, నదీమ్–ఉల్ హక్(తృణమూల్ కాంగ్రెస్), మొహమ్మద్ జావెద్, ఇమ్రాన్ మసూద్, సయీద్ నసీర్ హుస్సేన్(కాంగ్రెస్), ఎ.రాజా, మొహమ్మద్ అబ్దుల్లా(డీఎంకే), అసదుద్దీన్ ఓవైసీ(ఎంఐఎం), మొహిబుల్లా(సమాజ్వాదీ పారీ్ట), అరవింద్ సావంత్(శివసేన–ఉద్ధవ్) జేపీసీ భేటీ నుంచి సస్పెండయ్యారు. విపక్ష సభ్యులు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఒక లేఖ రాశారు. ఈ నెల 27న జరగాల్సిన జేపీసీ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరారు. మరోవైపు జమ్మూకశీ్మర్కు చెందిన మతపెద్ద మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ నేతృత్వంలో ఓ బృందం శుక్రవారం జేపీసీతో సమావేశమైంది. వక్ఫ్ సవరణ బిల్లుపై తమ అభ్యంతరాలను కమిటీ దృష్టికి తీసుకొచి్చంది. ఈ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ నెల 29వ తేదీన తమ తుది నివేదికను సిద్ధం చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వక్ఫ్ సవరణ బిల్లు–2024ను కేంద ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 8వ తేదీన జేపీసీకి పంపించిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ పఠాన్ చెరు చౌరస్తా వద్ద ఉద్రిక్తత
-
నాగర్ కర్నూల్ జిల్లా మైలారంలో ఉద్రిక్తత
-
విజయవాడ: ‘గో బ్యాక్ అమిత్ షా’
విజయవాడ, సాక్షి: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీ పర్యటనలో నిరసన సెగ తగిలింది. అంబేద్కర్పై షా చేసిన వ్యాఖ్యల ఆధారంగా ‘‘ గో బ్యాక్ అమిత్ షా’’ నినాదాలతో నగరంలో ఆదివారం వామపక్షాలు నిరసన చేపట్టాయి. అంబేద్కర్ని అవమాన పరిచిన అమిత్ షా రాజీనామా చేయాలని, ఆయన వెంటనే వెనక్కి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు వాళ్లు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రధాని మోది అమిత్ షాకు మద్దతు ఇవ్వడం సిగ్గుమాలిన చర్య. రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడికి మీరు ఇచ్చిన గౌరవం ఇదేనా. అంబేద్కర్ ను అవమానించిన షా.. తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలి. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారు. ‘‘పార్లమెంట్ వేదికగా నిండు సభలో అవమానించారు. పైగా ఆయన తన వ్యాఖ్యల్ని సమర్ధించుకుంటున్నారు. అమిత్ షా ఆ వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పాలి’’ అని సీపీఎం నేత ఉమా మహేశ్వరరావు అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఇతర వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. కేంద్ర సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి: అమిత్ షానగరంలోని నోవాటెల్ హోటల్లో ఏపీ బీజేపీ (BJP) నేతలతో ఆ పార్టీ అగ్రనేత అమిత్షా (Amit shah) సమావేశం ముగిసింది. సుమారు గంటన్నరపాటు ఈ భేటీ కొనసాగింది. కీలక అంశాలపై రాష్ట్ర భాజపా నేతలకు అమిత్షా దిశానిర్దేశం చేశారు.ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయం, రాష్ట్ర అభివృద్ధికి చేపడుతున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి రాష్ట్రంలో భాజపా బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. ‘హైందవ శంఖారావం’ సభ విజయం పట్ల పార్టీ, వీహెచ్పీ నేతలకు అమిత్షా అభినందనలు తెలిపారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై కేంద్రహోంశాఖ దృష్టిపెట్టిందని అమిత్షా చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేతలు ముందుకెళ్లాలని ఆయన సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ వేడుకల్లో షా.. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(NDRF) 20వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని 10వ NDRF బెటాలియన్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ (NIDM) సౌత్ క్యాంపస్ను అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ముగ్గురు మొక్కలు నాటారు. అంతకు ముందు.. నగరంలోని నోవాటెల్లో అమిత్ షాతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పది నిమిషాలపాటు భేటీ అయ్యారు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి కొండపావులూరు చేరుకున్నారు. అంతకంటే ముందే పవన్ అక్కడికి చేరుకున్నారు. -
మోకాళ్లపై కూర్చొని మంత్రి పొన్నం నిరసన
సాక్షి,హన్మకొండజిల్లా: హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి సంక్రాంతి జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిరసన తెలిపారు. జాతర సందర్భంగా కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు సరిగా చేయకుండా నిర్లక్ష్యం వహించారని పలువురు భక్తులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని వీరభద్రస్వామి ఆలయ కమిటీ మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అలిగిన మంత్రి పోలీసు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆలయ గెస్ట్హౌజ్ వద్ద నేలపై కూర్చొని అధికారుల తీరుపై నిరసన తెలిపారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలోనూ మోకాళ్లపై నిలబడి తన అసహనాన్ని వెల్లడించారు. కాగా,హైదరాబాద్ ఇంఛార్జ్గా మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గతేడాది హైదరాబాద్లో బోనాల ఉత్సవాల సందర్భంగా బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఆలయంలో అధికారులపై అలిగి గుడిలోనే బైఠాయించారు.తనకు, జీహెచ్ఎంసీ మేయర్కు ప్రోటోకాల్ పాటించలేదని అధికారులపై తన నిరసనను తెలిపారు. అనంతరం అధికారులు బుజ్జగించిన తర్వాత పొన్నం అలకవీడడం గమనార్హం. సొంత హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొత్తకొండ జాతరలోనూ తాజాగా పొన్నం అధికారులపై బహిరంగంగానే తన అసహనాన్ని తెలపడం చర్చనీయాంశమైంది. -
విశాఖ ఉక్కు కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
సాక్షి, విశాఖపట్నం: పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు కార్మికుల (vizag steel) అర్ధ నగ్న ప్రదర్శన చేపట్టారు. జీతాలు లేకపోతే పండగ ఎలా చేసుకోవాలంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఈ దౌర్భాగ్య పరిస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని మండిపడుతున్నారు.మరో వైపు, కార్మికులను సాగనంపేందుకు యాజమాన్యం కుట్రకు తెరతీసింది. కార్మికుల్ని సాగనంపేందుకు సిద్ధమైంది. వీఆర్ఎస్ పథకం అమలుకు ఆర్ఐఎన్ఎల్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్లో 45 ఏళ్ల వయసు, 15 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారు వీఆర్ఎస్ దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. తద్వారా 2025 మార్చిలోపు వెయ్యి మందిని బయటకు పంపేందుకు యాజమాన్యం సిద్ధమైంది.అధికారంలోకి రాక ముందు విశాఖ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికారు.. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత.. యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా పట్టించుకోవడం లేదంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల యాజమాన్యం హెచ్ఆర్ఏ తొలగింపుపై ఈడీ వర్క్స్ ముందు కార్మికుల నిరసన చేపట్టారు. నాడు నిరసన తెలిపిన కార్మికులకు తాజాగా నోటీసులు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్లో నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించింది. మళ్ళీ పునరావృతమైతే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చింది. అధికారులను కార్మిక సంఘాల నేతలు కలవకూడదంటూ సర్క్యులర్లో తెలిపింది. లోపల జరిగిన ప్రమాద వివరాలను బయట పెట్టకూడదు హూకం జారీ చేసింది.దీంతో గత ఆరు నెలల నుండి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులు తరుపున సీఎండీతో మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కావాలంటూ కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిపై సీఎండీ ఏమాత్రం పట్టించుకోలేదు. దసరాకు బోనస్ , దీపావళికి జీతం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వీఆర్ఎస్ పేరుతో యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా కూటమి నేతుల నోరు మెపదకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: పల్లె కన్నీరు పెడుతోందో -
మెడపై కత్తితో దివ్యాంగుల నిరసన
-
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రెండో రోజు పోరాట కమిటీ నిరహార దీక్ష
-
విద్యుత్ చార్జీల భారంపై వామపక్షాలు వినూత్న నిరసన
-
బీహార్లో టెన్షన్.. ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహార దీక్ష భగ్నం
పాట్నా: బీహార్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ప్రశాంత్ కిషోర్ను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పట్నాలోని గాంధీ మైదాన్ వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.బీహార్(bihar)లో రాజకీయం మరోసారి వేడెక్కెంది. జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్ ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం తెల్లవారుజామునే ప్రశాంత్ కిషోర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులతో వెళ్లేందుకు ప్రశాంత్ కిషోర్ నిరాకరించడంతో బలవంతంగా ఆయనను అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో గాంధీ మైదాన్ వద్ద వేదికను పోలీసులు ఖాళీ చేయించారు. దీంతో, పార్టీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.#WATCH | BPSC protest | Bihar: Patna Police detained Jan Suraaj chief Prashant Kishor who was sitting on an indefinite hunger strike at Gandhi Maidan pic.twitter.com/JQ7Fm7wAoR— ANI (@ANI) January 6, 2025ఇదిలా ఉండగా.. బీపీఎస్సీ(BPSP) వ్యవహారంలో గత నాలుగు రోజులుగా ప్రశాంత్ కిషోర్ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన గాంధీ మైదాన్లో దీక్షకు దిగారు. బీహార్లో బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అభ్యర్థులు పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీహార్లో ఆందోళనలకు దిగారు. పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థుల డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతుగా ప్రశాంత్ కిషోర్ దీక్షకు దిగారు. అంతకుముందు.. అభ్యర్థుల నిరసనల సందర్భంగా వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 13న బీపీఎస్సీ పరీక్ష జరిగింది.#WATCH | Bihar | A clash broke out between Patna Police and supporters of Jan Suraaj chief Prashant KishorPrashant Kishor who was sitting on an indefinite hunger strike at Gandhi Maidan, was detained by the police pic.twitter.com/2RwVVtYcYU— ANI (@ANI) January 6, 2025 -
TG: మరో ఘటన.. వాష్రూమ్లో వీడియో రికార్డింగ్..
సాక్షి, మహబూబ్నగర్: జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల టాయిలెట్లో అమ్మాయిల వీడియోలు చిత్రీకరించడం కలకలం రేపుతుంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన నక్క సిద్ధార్థ అనే థర్డ్ ఇయర్ విద్యార్థి.. అమ్మాయిల టాయిలెట్ గోడపై సెల్ ఫోన్ నుంచి వీడియోలు చిత్రీకరించాడు దీన్ని గమనించిన ఓ విద్యార్థిని విషయాన్ని కళాశాల సిబ్బందికి తెలిపింది.వెంటనే ఆ ఫోను స్వాధీనం చేసుకున్న ప్రిన్సిపల్ షీ టీమ్స్కు సమాచారం ఇచ్చారు పరీక్ష పూర్తయిన ఆ విద్యార్థి తన సెల్ ఫోన్ చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యాన్ని గురిచేసింది అనుమానించిన ప్రిన్సిపల్ అతన్ని బయటకు వెళ్లకుండా అక్కడే ఉంచుకొని పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగితే తాము ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులు మాత్రం తమకు న్యాయం చేయాలని ఆ వీడియోలు ఏం రికార్డయిందనే అనే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తనకు తెలిసిన వెంటనే సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించినట్టు చెప్తున్నారు. మొత్తంగా కళాశాల టాయిలెట్లలో జరిగిన వీడియో చిత్రీకరణ ఇప్పుడు సంచలనంగా మారింది.ఇదీ చదవండి: పోలీస్స్టేషన్లో మహిళతో నీచ కృత్యం.. డీఎస్పీ అరెస్ట్ -
యూటర్న్ బాబు.. వాలంటీర్ల వినూత్న నిరసన
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్పై వాలంటీర్ల(Volunteers) పోరాటం కొనసాగుతోంది. తాజాగా విజయవాడ(Vijayawada)లో వాలంటీర్ల నిరసన ఉధృతంగా మారింది. రోడ్డుపై వెనక్కి నడుస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ యూటర్న్ విధానానికి వ్యతిరేకంగా బ్యాక్ వాక్ చేశారు. ఈ సందర్భంగా బాబు వచ్చారు.. జాబ్ తీశారంటూ నినాదాలు చేశారు. అలాగే, పెండింగ్ జీతాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.ఏపీలో వాలంటీర్ల(Volunteers) పోరాటం ఉధృతంగా కొనసాగుతోంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ప్రాధాన్యత ఇస్తామని, వేతనాన్ని కూడా పెంచుతామని కూటమి నాయకులు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల సేవలను చంద్రబాబు ప్రభుత్వం వినియోగించుకోలేదు. ఈ నేపథ్యంలో కూటమి మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి నెలకు రూ.10వేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, విశాఖలోనూ వాలంటీర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనల్లో వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమను విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిలించాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తూ నిరనసలు చేపట్టారు. చంద్రబాబు సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే అమరావతిలో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
చంద్రబాబుకు జ్ఞానాన్ని ప్రసాదించండి
అజిత్సింగ్నగర్ (విజయవాడసెంట్రల్)/కపిలేశ్వరపురం/అయినవిల్లి : ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే బుద్ధి, జ్ఞానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రసాదించాలని కోరుతూ వలంటీర్లు ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఏపీ వలంటీర్ అసోసియేషన్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సింగ్నగర్ కృష్ణా హోటల్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద గురువారం వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ వలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ.. చంద్రబాబు 2024 ఎన్నికలకు ముందు వలంటీర్లను కొనసాగిస్తామని, వారికి నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని, అన్ని విధాలా న్యాయం చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇటీవల విజయవాడలో బుడమేరు వరదల సమయంలో కూడా వలంటీర్లతో సేవలు చేయించుకొని, సచివాలయాల్లో కనీసం అటెండెన్స్ వేసుకునే అవకాశాన్ని కూడా కల్పించకుండా వివక్ష చూపుతోందన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా బకాయి పడ్డ గౌరవ వేతనం చెల్లించలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు తగిన జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదించి వలంటీర్లకు న్యాయం చేసేలా చూడాలని కోరుతూ ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మమత, దమ్ము రమేష్, నరేష్, కల్యాణ్, షేక్ సైదాబీ, భాను, తేజస్విని, స్వప్న, షైనీ, రాజ్ కుమార్, సీపీఐ నాయకుడు కె.వి.భాస్కరరావు, ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు.ఎన్నికల హామీని అమలు చేయాలి గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసి, తమను విధుల్లోకి తీసుకోవాలని వలంటీర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఏడు నెలలుగా తమకు జీత భత్యాలు ఇవ్వడం లేదని ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదారిలంక, అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంలోని పంచాయతీ కార్యాలయాల్లో ఈ మేరకు గురువారం వారు వినతిపత్రాలు అందజేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో వలంటీర్లు తమ సమస్యలపై సచివాలయంలో వినతిపత్రం అందజేశారు. -
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కక్ష సాధింపులకే: విద్యార్ధులు
-
కరెంట్ చార్జీల బాదుడుపై జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట
-
బాబు బాదుడుపై ధర్మవరం YSRCP నేతలు పోరుబాట
-
బాబు బాదుడుపై తుని YSRCP నేతలు పోరుబాట
-
బాబు బాదుడుపై రామచంద్రపురం YSRCP నేతలు పోరుబాట
-
బాబు బాదుడుపై అనంతపురం YSRCP నేతలు పోరుబాట
-
చంద్రబాబు తీరు దుర్మార్గం.. సీపీఎం నిరసన
సాక్షి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ.. జగదాంబ సెంటర్లో సీపీఎం నిరసన చేపట్టింది. మిట్టల్ స్టీల్ కోసం చంద్రబాబు గనులు అడగడం దుర్మార్గం అంటూ సీపీఎం నేతలు మండిపడుతున్నారు. వైజాగ్ స్టీల్ పరిస్థితి ఏమిటంటూ వామపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.వైజాగ్ స్టీల్ కోసం గనులు అడగకుండా మిట్టల్కు చంద్రబాబు ఎలా గనులు ఇవ్వాలని కోరుతారంటూ సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని.. వైజాగ్ స్టీల్ను కాపాడకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీపీఎం హెచ్చరించింది. -
గురుకుల పాఠశాల విద్యార్థుల నిరసన
-
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆందోళన
-
హైదరాబాద్ లో బీజేపీ ఎమ్మెల్యేల వినూత్న నిరసన
-
ఛలో రాజ్ భవన్.. కాంగ్రెస్ నిరసన ర్యాలీ
-
ఆదోనిలో మున్సిపల్ ఇంజనీర్ కార్మికులు అర్ధనగ్న నిరసన
-
‘వాళ్ల చేతులకు బేడీలేవీ?.. నిరసనల్లోనూ దురహంకారమేనా?’
హైదరాబాద్, సాక్షి: అసెంబ్లీలో ఇవాళ నల్ల దుస్తులు, చేతులకు బేడీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసనపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిరసనల్లోనూ బీఆర్ఎస్లో సమానత్వమే లేదని అన్నారామె. అసెంబ్లీ లాబీలో మీడియా చిట్చాట్లో ఆమె మాట్లాడుతూ.. ‘‘కేటీఆర్, హరీష్ రావుల దొరతనం మరోసారి బయటపడింది. నిరసనల్లోనూ వాళ్లు తమ దురహంకారాన్ని ప్రదర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారే తప్ప వాళ్లు వేసుకోలేదు. కనీసం వాళ్ల నిరసనల్లోనూ సమానత్వం లేదనే విషయం బయటపడింది’’ అని అన్నారామె. అలాగే.. లగచర్ల రైతుకు బేడీల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సంబంధిత అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారు. కానీ, బీఆర్ఎస్ హయాంలో కనీసం పదిసార్లు అయినా రైతులకు బేడీలు వేసి ఉంటారు. ఆ టైంలో అధికారులపై కనీస చర్యలు కూడా తీసుకోలేదు. ఆ లెక్కన ఇప్పుడు రైతులకు బేడీలు వేశారంటూ మాట్లాడే అర్హత బీఆర్ఎస్ లేనేలేదు. గతంలో.. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా వెల్లోకి వెళ్తే సభ నుంచి సస్పెండ్ చేసేవాళ్లు. కానీ, ఇప్పుడు వాళ్లు పెట్టిన నిబంధనలనే వాళ్లు కాలరాస్తున్నారు. అయినా సభలో వాళ్ళు పెట్టిన రూల్స్ పై వాళ్ళే అభ్యంతరం చెప్పడం ఏంటో? అని సీతక్క అన్నారు. -
‘లోకేష్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారా?’
గుంటూరు, సాక్షి: ఏపీలో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్న పోలీసుల తీరును వైఎస్సార్సీపీ ఎండగడుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో అక్రమ అరెస్టులు చేస్తున్న ఖాకీలు.. వైఎస్సార్సీపీ ఫిర్యాదులను మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సోషల్ మీడియా ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబటి నిరసన చేపట్టారు. ‘‘మా ఫిర్యాదులపై చర్యలు తీసుకోరా?..’’ అంటూ ఫ్లెక్సీలు చేతిలో పట్టుకుని నేతలతో కలిసి పీఎస్ మెట్ల మీద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారాయన. తమ ఫిర్యాదులపై ఎప్పుటిలోగా కేసులు నమోదు చేస్తారో? చెప్పాలంటూ పోలీసులను కోరుతూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో.. వైఎస్సార్సీపీ నేతల డిమాండ్లతో దిగొచ్చిన పోలీసులు.. ఈ నెల 21లోగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో.. వైఎస్సార్సీపీ నేతలు తమ నిరసన విరమించుకున్నారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు.. ‘‘పట్టాభిపురం పీఎస్ ఎదుట నిరసన తెలియజేశాను. జగన్ తో పాటు నా కుటుంబంపై కూడా సోషల్ మీడియాలో ద్రుష్ప్రాచారం చేయడంపై ఫిర్యాదు చేశాం. మా ఫిర్యాదులపై కూడా ఇప్పటివరకు కేసులు నమోదు చేయలేదు. పోలీసులే చట్టాన్ని ధిక్కరిస్తున్నారు. లోకేష్ నుండి ఆదేశాలు కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. మా కార్యకర్త ప్రేమ్ కుమార్ ను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. మాపై కక్ష తీర్చుకోవడానికే లోకేష్ చట్టాలను ఉపయోగించుకుంటున్నారు. కానీ, చట్టం ప్రకారం పోలీసులు నడుచుకోవాలి. మా ఫిర్యాదులపై కేసులు నమోదు చేయకపోతే మరోసారి మా నిరసన తెలియజేస్తాం. మేము చట్టబద్దంగానే వ్యవహరిస్తున్నాం. న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మాపై సోషల్ మీడియా లో పోస్టింగ్స్ పెట్టిన వారిపై చర్యలు తీసుకునేంత వరకూ మా పోరాటం ఆగదు. తిరిగి ఎప్పుడైనా నిరసన తెలియజేస్తాం అని హెచ్చరించారాయన. -
దద్దరిల్లిన అసెంబ్లీ: చేతికి సంకెళ్లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ నిరసన చేపట్టారు. నల్ల దుస్తులు, బేడీలతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. లగచర్ల రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.‘లగచర్ల’ఘటనపై నిన్న (సోమవారం) కూడా శాసనసభ అట్టుడికింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, నినాదాలతో హోరెత్తింది. ‘రాష్ట్రంలో పర్యాటక విధానం’అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు లఘుచర్చను ప్రారంభించగానే బీఆర్ఎస్ సభ్యులంతా లేచి.. ‘లగచర్ల’రైతుల నిర్బంధం, అరెస్టులపై చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ అంగీకరించకపోవడంతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. వెల్లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు.మరోవైపు, లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, చిత్రహింసలకు గురిచేశారని.. దీనిపై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలపాలని బీఆర్ఎస్ పిలుపు ఇచ్చింది. జైళ్లలో నిర్బంధించి, రైతన్న చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ అమానవీయ, అణచివేత విధానాలను నిలదీయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. లగచర్ల రైతులపై కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ‘ఈ కార్ రేసు’ కేసు.. స్పందించిన కేటీఆర్ -
మీడియా పై దాడి సిగ్గు చేటు.. కూటమి నేతలపై జర్నలిస్టులు ఫైర్
-
రోడ్డెక్కిన అన్నదాతలకు YSRCP బాసట
-
Watch Live: రైతు కోసం పోరుబాట
-
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సచివాలయ ఉద్యోగుల నిరసన
-
నేడే వైఎస్సార్ సీపీ రైతు పోరుబాట
-
రైతు కోసం వైఎస్ జగన్ పోరుబాట
-
ఆంధ్రప్రదేశ్లో నేడు రైతు పోరు... కూటమి సర్కార్ మోసాలపై అన్నదాతల నిరసనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాసట
రైతులు, ధర్నా, ఆంధ్రప్రదేశ్
-
కూటమి సర్కార్ నిరంకుశ పాలన.. నేతల కనుసన్నల్లో పోలీసులు
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో చట్టం టీడీపీ వారికి ఒకలా, వైఎస్సార్సీపీ వారికి మరోలా అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.గత నెల 19న తమపై , తమ కుటుంబ సభ్యుల గురించి టీడీపీ నేతల ప్రోద్బలంతో ఆ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఆధారాలతో సహా వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే, వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోలేదు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. రాష్ట్రంలో పోలీసులు కూటమి ప్రభుత్వానికి ఒకలా, వైఎస్సార్సీపీ వారికి మరోలా వ్యవరిస్తున్నారని, తాము ఫిర్యాదు చేసిన పోలీసులు కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుపై పోలిస్ స్టేషన్ల ఎదుట వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలపాలని నిర్ణయించారు. -
ఢిల్లీలో రైతుల పోరుబాట
-
మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్.. సీన్ రివర్స్!
అమరావతి, సాక్షి: కూటమి ప్రభుత్వం ఒకటి అనుకుంటే.. మరొకటి జరుగుతోంది. ఏపీవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వానికి పెద్దషాకే ఇస్తున్నారు. ఆర్భాటంగా జరుగుతుందని భావించిన పేరెంట్స్ టీచర్స్ డే మీటింగ్లో అడుగడుగునా నిలదీతలు ఎదురవుతున్నాయి. తల్లిదండ్రులు తమ ప్రశ్నలతో.. నిరసనలతో కూటమి నేతలను ఉక్కిరి బిక్కిరి చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా శనివారం తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల మెగా సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు , విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. కడప మున్సిపల్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అంతా సవ్యంగానే నడుస్తోందంటూ మంత్రులు, కూటమి నేతలు ప్రకటించుకున్నారు. కానీ..కర్నూల్లో.. విద్యార్థుల సమస్యలపై అడుగడుగునా తల్లిదండ్రులను కూటమి నేతలను నిలదీస్తున్నారు. కర్నూల్లో మంత్రి టిజి భరత్ను ఓ విద్యార్థి తల్లి నిలదీశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని మండిపడ్డారు. ఆ భోజనం కారణంగానే తన బిడ్డ అస్వస్థతకు గురైందని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారామె. కర్నూలు నగరంలోని హైస్కూలో మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్లో మంత్రి భరత్కు ఈ చేదు అనుభవం ఎదురైంది.అల్లూరి సీతారామరాజు జిల్లాలో..ఏజెన్సీ కూనవరం ఏపీ టీ డబ్ల్యూ ఆశ్రమ పాఠశాలలో జరిగిన పేరెంట్స్ మీటింగ్లో రచ్చ రేగింది. అన్ని సబ్జెక్టులకు సరిపడా అధ్యాపకులు లేకపోవడాన్ని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. సిలబస్ పూర్తికాకుండా తమ పిల్లలు పరీక్షలు ఎలా రాస్తారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. స్కూల్ ముందు రోడ్డుపై తమ పిల్లలతో బైఠాయించారు. -
ఓ వైపు సంబురాలు.. మరో వైపు నిరసనలు
-
నేడు పంజాబ్ రైతుల ఢిల్లీ ఛలో మార్చ్
-
అరెస్ట్ లు, నిర్బంధాలకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళన
-
రైతులపైకి టియర్ గ్యాస్
శంభు: పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని శంభు వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి పలు డిమాండ్లతో రైతు సంఘాలు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని ప్రకటించడం తెలిసిందే. ఇందులో భాగంగా రైతులు, రైతు సంఘాల నేతలతో కూడిన 101 మందితో కూడిన రైతు జాతా సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటకు శంభులోని నిరసన దీక్షా శిబిరం నుంచి కాలినడకన బయలుదేరింది. సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ సంఘ్ జెండాలను చేబూనిన రైతులు కొన్ని మీటర్ల దూరం మాత్రమే వెళ్లగలిగారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, ముందుకు రావద్దని పోలీసులు వారిని పదేపదే కోరారు. అయినప్పటికీ, రైతులు పలు అంచెల బారికేడ్లను దాటుకుని, వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుగా ఏర్పాటు చేసిన ఇనుప మేకులను, ఇనుప ముళ్ల కంచెను తొలగించారు. సిమెంట్ బారికేడ్లనూ దాటేందుకు యత్నించారు. ఇనుప కంచెను కొందరు ఘగ్గర్ నదిలోకి దొర్లించారు. దీంతో, పోలీసులు వారిపైకి పలు రౌండ్ల టియర్ గ్యాస్ను ప్రయోగించారు. రైతులు టియర్ గ్యాస్ నుంచి రక్షణ కోసం తడి గన్నీ బ్యాగులతో కళ్లు, ముఖాన్ని కప్పేసుకున్నారు. బారికేడ్లపై నుంచి వస్తున్న వారిపైకి పోలీసులు లాఠీలు ఝళిపించారు. టియర్ గ్యాస్తో గాయపడిన కనీసం ఆరుగురు రైతులను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. రైతులు గాయపడిన నేపథ్యంలో జాతాను శుక్రవారానికి నిలిపి వేస్తున్నట్లు రైతు నేత సర్వాన్ సింగ్ చెప్పారు. తదుపరి కార్యాచరణపై చర్చించుకుని, నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, అంబాలా జిల్లాలో గురువారం నుంచే నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. ఐదు, అంతకంటే ఎక్కువ మంది ఒకే చోట గుమికూడరాదని ప్రకటించారు. ముందు జాగ్రత్తగా శుక్రవారం జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అంబాలా జిల్లాలోని 11 గ్రామాల పరిధిలో ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను ఆ మార్గంలో మోహరించారు. -
అలాంటి ఆంక్షలు నన్ను ఆపలేవు.. కళ నా స్వరం
మార్పు రావాలనుకున్న వ్యక్తి చిత్రకారుడు అయితే అతని కుంచె నుంచి పుట్టే చిత్రం జనాలను ఆలోచింపజేస్తుంది. అస్సాంలో గ్రాఫిటీ అనేది కళ కంటే గొప్పది అని నిరూపిస్తుంది. రాజకీయ, పర్యావరణ సమస్యలపై అవగాహన పెంచడానికి దృశ్యమాన స్వరాన్ని వినిపిస్తోంది. సుసంపన్నమైన సాంస్కృతిక సంప్రదాయాలు, రాజకీయ పరిణామాలతో నిండిన ప్రాంతంగా అస్సాం పేరొందింది. అలాంటి చోట చాలా కాలంగా కేవలం స్వీయ వ్యక్తీకరణ రూపమే కాకుండా సామాజిక మార్పు కోసం ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేస్తోంది కళ. ఇక్కడ గ్రాఫిటీ, స్ట్రీట్ ఆర్ట్ సామాజిక పర్యావరణ సమస్యలకు వ్యతిరేకంగా నిరసనకు పదునైన రూపాలుగా ఉద్భవించాయి.ఆకర్షించిన జాతీయ దృష్టిగ్రాఫిటీ ఇప్పుడు అక్కడ నిరసన మాధ్యమంగా ఉంటోంది. అటవీ నిర్మూలన, ప్రభుత్వ విధానాలు, సహజ వనరులు కలుషితం అవడం.. వంటి విషయాలపై ఆరోపణలే కాదు సమస్యలను పరిష్కరించడానికి స్థానిక కళాకారులు గ్రాఫిటీని ఉపయోగిస్తున్నారు. స్థానిక కళాకారుడు మార్షల్ బారుహ్. అతని బోల్డ్ గ్రాఫిటీ కళాఖండాలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో వాడి, వేడి సంభాషణలకు దారితీశాయి. ముఖ్యంగా పర్యావరణ సమస్యలపై దృష్టిని ఆకర్షించాయి. బారుహ్ ఇటీవల జోర్హాట్లోని హోలోంగపర్ గిబ్బన్ వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రతిపాదిత చమురు అన్వేషణను వ్యతిరేకిస్తూ తన కళాకృతి కోసం జాతీయ దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రాజెక్ట్ అంతరించిపోతున్న గిబ్బన్ల నివాసాలను బెదిరించింది. గౌహతి, ఎగువ అస్సాంలోని గోడలు, ఫ్లైఓవర్లపై అతని అద్భుతమైన విజువల్స్ ఈ సమస్య గురించి ప్రజలకు అవగాహన కల్పించాయి. ఇది చివరికి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ (NBWL)కు చేరింది.కళకు సంకెళ్లు‘నా కళాఖండాలు రాజకీయ విధాన నిర్ణయాలు వాయిదా వేయడానికి ఎంతవరకు దోహదపడ్డాయో నాకు తెలియదు. కానీ నా రచనలను గమనించిన తర్వాత ప్రజలు ఈ సమస్య గురించి తెలుసుకున్నారని నేను సంతృప్తి చెందాను. కళకు ప్రజలను ఆలోచింపజేసే సామర్ధ్యం ఉంది. ఉపరితలం దాటి చూసేలా వారిని ప్రేరేపించగలదు’ అని బారుహ్ చెబుతాడు. అతని ఈ నినాదం ఉద్యమం తేవడానికి కాదు. హింస, నిరుద్యోగం, చెట్ల నరికివేత, ప్రభుత్వ విధానాలకు సంబంధించి చాలా మంది పౌరులు అనుభవించిన నిరాశకు ప్రతిబింబం ‘కళ కేవలం సామాజికంగా ప్రతిబింబించాలి వాస్తవాలు నగరాన్ని సుందరీకరించడంపై మాత్రమే దృష్టి సారిస్తే, క్లిష్టమైన సమస్యల నుండి దృష్టిని మళ్లించే ప్రమాదం ఉంది’ అని యువ కళాకారుడు గట్టిగానే సమాధామిస్తాడు. అన్నింటికంటే, బారుహ్ అరెస్టు కళాత్మక వ్యక్తీకరణ, ప్రభుత్వ అధికారం మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతను హైలైట్ చేస్తుంది.కళా శక్తిప్రకృతి విధ్వంసంపై దృష్టి సారించే అతని రచనలు, చెట్ల నరికివేత, గౌహతిలోని జలుక్బరి ఫ్లైఓవర్లోని గోడలపై అడవుల సమస్యలు, పేలవంగా ఉండే ప్రజా మౌలిక సదుపాయాల స్థితి వంటి పర్యావరణ సంబంధిత ఆందోళనల గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. నిరసన కళతో ప్రమాదాలు ఉన్నప్పటికీ, ఈ కళాకారులు అధైర్యపడలేదు. ‘కళకు అపారమైన శక్తి ఉంది. జాతీయ రహదారులపై కళాఖండాలను రూపొందించకుండా ఒక సంవత్సరం పాటు నన్ను నిషేధించారు. కొన్ని నిరసనల సమయంలో నేను గౌహతిలో ఉండి ఉంటే నన్ను అరెస్టు చేసి ఉండేవారని తెలుసు. కానీ అలాంటి ఆంక్షలు నన్ను ఆపలేవు. కళ నా స్వరం’ అని చెబుతాడు అతను. చదవండి: ఒంటరి చెట్టు అత్యంత ప్రమాదకరం.. పిడుగులతో జాగ్రత్త!‘నిరసన కళ రాజకీయాలు అస్సాంలోని వివాదాస్పద స్వభావాన్ని చట్టాన్ని అమలు చేసే అధికారులు గుర్తించారు. రాజకీయ నాయకులు మద్దతు కూడగట్టడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. కానీ అదే సాధనాలను వారి ప్రత్యర్థులు ఉపయోగించినప్పుడు, బెదిరింపులకు గురవుతారు’ అంటూ ఒక సీనియర్ పోలీసు అధికారి మీడియాతో ప్రస్తావించారు. అస్సాంలో కళాత్మక స్వేచ్ఛ, రాజకీయ అధికారం మధ్య ఉద్రిక్తత రాష్ట్రానికి మాత్రమే కాదు. ఇది భారతదేశం అంతటా విస్తృత ధోరణిని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ నిరసన కళ వివాదాస్పద సమస్యగా మారింది. జాతి కలహాలు, పర్యావరణ క్షీణత, రాజకీయ అశాంతి వంటి సమస్యలతో రాష్ట్రం చాలా కాలంగా పోరాడుతోంది. అస్సాంలో కళ అసమ్మతి స్వరంగా మారింది. న్యాయం కోసం పిలుపునిచ్చే శక్తివంతమైన అహింసా మార్గంగా రూపు కట్టింది.ఆర్టిస్ట్స్ వర్సెస్ అథారిటీ కళను నిరసన సాధనంగా, విధ్వంసకరంగా భావించే రేఖ దీంతో మరింత అస్పష్టంగా మారింది. మరొక ప్రముఖ గ్రాఫిటీ కళాకారుడు నీలిమ్ మహంత (Neelim Mahanta) ఈ భావాలను ప్రతిధ్వనిస్తూ, నిరసన కళ గురించి మరింత బహిరంగ సంభాషణకు పిలుపునిచ్చారు. ‘కళను నిరసన రూపంగా స్వాగతించాలి. దీనికి వ్యతిరేకంగా చట్టాలు విధించే బదులు, కళాకారులు హైలైట్ చేస్తున్న సమస్యలపై ఆరోగ్యకరమైన చర్చలను ప్రభుత్వం ప్రోత్సహించాలి’ అని మహంత అన్నారు. బారుహ్, గ్రాఫిటీని సృష్టించడం అనేది కేవలం ఒక కళాత్మక ప్రయత్నం కాదు. ప్రభుత్వ చర్యల పట్ల అసంతృప్తిని తెలియజేయడానికి ఒక మార్గం.‘మేము మా అసమ్మతిని పదాలకు బదులుగా చిత్రాల ద్వారా వ్యక్తపరుస్తున్నాం’ అని భేజల్ అనే స్థానిక గ్రాఫిటీ కళాకారుడు పర్యావరణ సమస్యలను ఎత్తిచూపారు. -
పార్లమెంట్లో అదే రచ్చ.. ఉభయసభలు రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో చెలరేగిన హింస, పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ అవినీతి తదితర అంశాలపై చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సోమవారం కూడా పార్లమెంట్లో ఇదే పరిస్థితి కొనసాగింది. శుక్రవారం వాయిదా పడిన ఉభయసభలు తిరిగి ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి. భారత్-చైనా సరిహద్దు ఒప్పందం పురోగతిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్సభలో ప్రకటన చేస్తారని ముందుగా భావించారు. కానీ ఎగువ, దిగువ సభలు ప్రారంభం కాగానే సభలో అదానీ, సంభాల్లో హింసాకాండపై చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబట్టారు.విపక్షాల ఆందోళనలతో సభలను మధ్యాహ్నం 12 గంటల వాయిదా వేస్తున్నట్లు లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రకటించారు. ఇక సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా నిరసనలు కొనసాగాయి. విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతులు అనుమతించలేదు. విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతులు అనుమతించలేదు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కోరారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కోరారు. విపక్షాల ఆందోళనలతో ఉభయసభలు రేపటికి (డిసెంబర్ 3)కి వాయిదా పడ్డాయి. -
ఎల్లుండి తెలంగాణలో స్కూళ్ల బంద్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పాఠశాలల్లో జరుగుతున్న వరుస పుడ్ పాయిజన్ ఘటనలపై సర్కార్ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి (శనివారం) ప్రభుత్వ పాఠశాలల బంద్కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. రాష్ట్రంలో వరుసగా పుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని.. రక్షణ కరువై, పర్యవేక్షణ లేకుండా పోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కీలకమైన విద్యారంగానికి మంత్రి లేకుండానే ఏడాది గడిచిందన్నారు. ఈ సమస్యలపై కనీసం సమీక్ష చేసే పరిస్థితి రాష్ట్రంలో లేకుండా పోయిందన్నారు.అందుకే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 30న ప్రభుత్వ పాఠశాలల బంద్కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. తక్షణమే వసతిగృహాలు, గురుకులాలు, కేజీబీవీలపై ముఖ్యమంత్రి, విద్యాశాఖ అధికారులు సమీక్షించి, సమస్యలు పరిష్కారించాలని ఎస్ఎఫ్ఐ విజ్ఞప్తి చేసింది. విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. -
Pakistan: నిరసన ప్రదర్శనలకు పీటీఐ పార్టీ స్వస్తి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని అధికార షాబాజ్ షరీఫ్ ప్రభుత్వ తీరుకు నిరసనగా మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) నేతలు, కార్యకర్తలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపధంయలో ఈ నిరసనలను అణచి వేసేందుకు ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి తోడు నిరసన ప్రదర్శనలు హింసాత్మక ఘటనలకు దారితీయడంతో పీటీఐ పార్టీ ఆందోళనలకు స్వస్త పలుకుతున్నట్లు ప్రకటించింది. పీటీఐ నిసరనల నేపధ్యంలో రాజధాని ఇస్లామాబాద్లోని డీ చౌక్తో ఆ పరిసర ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేధ్యంలో పాక్ భద్రతా సిబ్బంది కఠిన చర్యలు చేపట్టారు. దీంతో మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ మద్దతుదారులు నిరసనలు విరమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే తదుపరి వ్యూహం ఏమిటనేది పార్టీ ఇంకా వెల్లడించలేదు. భద్రతా సిబ్బంది చేపట్టిన చర్యలను పీటీఐ ‘ఫాసిస్ట్ మిలిటరీ పాలన’ చేపట్టిన జాతి నిర్మూలన ప్రయత్నంగా అభివర్ణించింది.ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న 450 మంది ఆందోళనకారులను అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పీటీఐ నేతలు మీడియాతో మాట్లాడుతూ వీలైనంత ఎక్కువ మందిని చంపాలనే ఉద్దేశ్యంతోనే భద్రతా దళాలు నిరసనకారులపై కాల్పులు జరిపాయని ఆరోపించారు. పీటీఐ మద్దతుదారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాగా షాబాజ్-జర్దారీ-అసిమ్ కూటమి నేతృత్వంలో భద్రతా దళాలు మారణహోమం కోసం ప్రయత్నించాయని పీటీఐ ట్విట్టర్లో ఒక పోస్ట్లో పేర్కొంది. గత ఏడాది ఆగస్టు నుంచి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాణ్ నవంబర్ 24న దేశవ్యాప్త నిరసనలకు చివరి పిలుపునిచ్చారు. ఇది కూడా చదవండి: తానా ఆధ్వర్యంలో వైభవంగా 'మన భాష–మన యాస’ 'మాండలిక భాషా అస్తిత్వం' -
దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసనలు
-
సీపీఐ,సీపీఎం ఆందోళన..అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
సాక్షి,అనంతపురం: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్సిక్స్ హామీలను అమలు చేయాలని సీపీఐ,సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు,కార్మికులు అనంతపురం జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కలెక్టర్ వినోద్కుమార్ వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆందోళకారులు కలెక్టర్ వాహనాన్ని అరగంట సేపు దిగ్భందించారు.ఈ సందర్భంగా పోలీసులు,ఆందోళకారులకు మధ్య వాగ్వాదం,తోపులాటజరిగింది. హామీల అమలులో టీడీపీ,బీజేపీ, జనసేన విఫలమయ్యాయని సీపీఎం నేతలు మండిపడ్డారు. చంద్రబాబు కు రైతుల ఆత్మహత్యలు పట్టవా అని వారు ప్రశ్నించారు.రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతుకు 20 వేల రూపాయల ఆర్థిక సాయం ఎందుకివ్వలేదో చెప్పాలని నిలదీశారు.వైఎస్సార్ వాహనమిత్ర ఇవ్వకపోవడం వల్ల ఆటో,ట్యాక్సీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: Andhra Pradesh: ఆందోళనలతో అట్టుడికిన రాష్ట్రం -
Pakistan: ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసనలు.. కనిపిస్తే కాల్చివేతకు ప్రభుత్వ ఆదేశం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు షాబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి తలనొప్పిగా తయారయ్యారు. ఖాన్ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ‘పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్’ (పీటీఐ) కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు.దేశం నలుమూలలకు చెందిన పీటీఐ కార్యకర్తలు నిరసనలు చేపడుతూ రాజధాని ఇస్లామాబాద్కు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పుతోంది. చాలా చోట్ల హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలతో అతని పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ‘డూ ఆర్ డై’ నిరసనను నిర్వహించడానికి రాజధానికి తరలి వెళుతున్నారు.ఇప్పటికే పలువురు పీటీఐ నేతలు, కార్యకర్తలు ఇస్లామాబాద్ నగరంలోనికి ప్రవేశించారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఇస్లామాబాద్ను రెడ్ జోన్గా ప్రకటించింది. ఇక్కడ పాక్ సైన్యాన్ని భారీ ఎత్తున మోహరించారు. ఈ రెడ్ జోన్ లోపల ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధానమంత్రి నివాసం, పార్లమెంట్, రాయబార కార్యాలయం ఉన్నాయి. ఈ రెడ్జోన్లో ఎవరైనా నిరసనకారులు కనిపిస్తే, వెంటనే వారిని కాల్చివేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఇస్లామాబాద్లోకి ప్రవేశించడంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పాకిస్తాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ నేతలు అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ను కలుసుకున్నారు. ఖాన్ గత సంవత్సరం నుండి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. అతనిపై 200కు పైగా కేసులు నమోదయ్యాయి. వాటిలో కొన్నింటిలో ఖాన్కు బెయిల్ లభించగా, కొన్నింటిలో ఆయన దోషిగా తేలాడు. మరికొన్నింటిపై విచారణ జరుగుతోంది.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా -
చిత్తూరు జిల్లా కుప్పంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల వినూత్న నిరసన
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల నిరసన
-
విశాఖలో హైటెన్షన్.. ప్రధాని పర్యటన.. ఉక్కు కార్మికుల ఆందోళన ఉధృతం
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ఈ నెల 29న ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కార్మికులు ఆందోళన ఉధృతం చేశారు. ఆదివారం.. పాత గాజువాక కూడలి నుంచి కొత్త గాజువాక వరకు కార్మికులు నిరసన చేపట్టారు. ప్రధాని స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేయాలని ఉక్కు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవడంతోపాటు ప్లాంట్ను సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్)లో విలీనం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి డిమాండ్ చేసింది. విశాఖ వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ప్రకటన చేయాలని కోరుతూ తీర్మానించింది. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిన్న(శనివారం) అఖిలపక్ష రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. స్టీల్ప్లాంట్ పరిరక్షణ కోసం 1,380 రోజులుగా కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు పోరాటం చేయడం గొప్ప విషయమన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని రాజకీయ కోణంలో చూడరాదని, 5 కోట్ల ఆంధ్రుల సెంటిమెంట్తో ముడిపడి ఉందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలన్నారు. టీడీపీ, జనసేనకు చెందిన 18 మంది ఎంపీల మద్దతు ఉపసంహరిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నారు.కేంద్రానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటిస్తే ఆయనకు పాలాభిషేకం చేస్తానన్నారు. కర్ణాటకలో స్టీల్ ప్లాంట్కు కేంద్రం రూ.15వేల కోట్లు సాయం అందించిందని, మరో రూ.15 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతాలు, హెచ్ఆర్ఏ తగ్గింపు, వీఆర్ఎస్ సర్వే, ఉద్యోగులు తమంతట తాము మానేసే విధంగా ప్లాంట్ను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. 2,200 ఎకరాల స్టీల్ప్లాంట్ భూమి రూ.2 లక్షల కోట్ల విలువ ఉంటుందని, దానిని పల్లీలకు అమ్మేస్తారా అని ప్రశ్నించారు. స్టీల్ప్లాంట్ అప్పుల్లో ఉంది కానీ, నష్టాల్లో లేదని గుర్తించాలన్నారు. గతంలో ఒకే ఏడాది 950 కోట్లు లాభం ఆర్జించిందన్నారు. సొంత గనులు కేటాయించాలనే డిమాండ్ తన చిన్నప్పటినుంచే ఉందని, కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. స్టీల్ప్లాంట్ పరిరక్షణకు చేపట్టే ఉద్యమానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. పరిరక్షణ కమిటీ చైర్మన్లు ఆదినారాయణ, అయోధ్యరామ్, మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. జనవరి 27 నాటికి ఉక్కు ప్రైవేటీకరణ పోరాట ఉద్యమం ప్రారంభించి నాలుగేళ్లు పూర్తవుతుందన్నారు. విశాఖ వస్తున్న ప్రధాని మోదీ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించాలని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, సెయిల్లో విలీనం చేస్తామని ప్రకటించాలని తీర్మానిస్తున్నట్టు తెలిపారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. మోదీ రాక సందర్భంగా బైక్ ర్యాలీలు, నిరాహార దీక్షలు వంటి కార్యక్రమాలతో ఈ నెల 28న ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నట్టు తెలిపారు. -
నల్గొండ డీఈవో లీలలు.. భార్య ఉండగానే మరో మహిళతో..
సాక్షి, నల్గొండ జిల్లా: నల్గొండ డీఈవో భిక్షపతి లీలలు వెలుగులోకి వచ్చాయి. భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆ మహిళ ద్వారా ముగ్గురు పిల్లలకు భిక్షపతి తండ్రి అయినట్లు మొదటి భార్య ఆరోపిస్తోంది. ప్రియురాలితో ఉండగా డీఈవో భిక్షపతిని భార్య రెడ్ హ్యాండెడ్ పట్టుకుంది. పెళ్లైన నెలకే వదిలేశాడంటూ డీఈవో ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. గతంతోనూ డీఈవోపై అనేక ఆరోపణలు రాగా, గత కొన్నేళ్లుగా నల్లగొండ డీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. తనను మోసం చేసి వేరే కాపురం పెట్టాడంటూ డీఈవో భిక్షపతి భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో మహిళతో ఉంటూ తనకు విడాకుల నోటీసులు పంపించారని.. ఈ వ్యవహారం ఏంటని ప్రశ్నిస్తే చంపుతానంటూ బెదిస్తున్నారని ఆమె తెలిపారు. -
విశాఖలో వీఏఓల నిరసన జ్వాలలు
-
మణిపూర్లో మళ్లీ హింస... మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై నిరసనకారుల దాడి
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో హింసాత్మక ఘటనలు మళ్లీ రాజుకున్నాయి. కుకీ, మైతీ వర్గాల మధ్య వైరంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుకీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన మైతీ వర్గానికి చెందిన వారి ఆరుగురి మృతదేహాలు లభ్యం కావడంతో రాష్ట్రంలో తాజాగా అలజడి రాజుకుంది. ఈ క్రమంలో వీరి హత్యకు నిరసనగా జిరిబామ్ జిల్లాలో నిరసనలు ఆందోళన చేపట్టారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇంఫాల్లో ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు నిరసనకారులు దాడి చేశారు. శాసనసభ్యుల ఇళ్లపై అల్లరి మూకలు దాడులు చేయడంతో జిరిబామ్ జిల్లాలో అధికారులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఇంఫాల్ వెస్ట్, ఈస్ట్, బిష్ణుపూర్, తౌబల్, కక్చింగ్, కాంగ్పోక్పి, చురచంద్పూర్ జిల్లాల్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను నిలిపివేశారు.లాంఫెల్ సనకీతెల్ ప్రాంతంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్ నివాసంపై ఒక గుంపు దాడి చేసిందని సీనియర్ అధికారి తెలిపారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని సగోల్బంద్ ప్రాంతంలో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే ఇమో నివాసం ముందు నినాదాలు చేశారు. ముగ్గురిని హత్య చేసిన నిందితులను 24 గంటల్లోగా పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు.కైషామ్థాంగ్ నియోజకవర్గ స్వతంత్ర శాసనసభ్యుడు సపం నిషికాంత సింగ్ను తిడ్డిమ్ రోడ్లోని ఆయన నివాసంలో కలవడానికి నిరసనకారులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే రాష్ట్రంలో లేరని చెప్పడంతో ఆయనకు చెందిన స్థానిక వార్తాపత్రిక కార్యాలయ భవనాన్ని లక్ష్యంగా చేసుకొనిదాడులు చేశారు.కాగా ఈ వారం ప్రారంభంలో అనుమానిత కుకీ మిలిటంట్లు జిరిబామ్ జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్పై దాడి చేయడంతో భద్రతా దళాలకు, మిలిటెంట్ల మధ్య కాల్పులు జరిగాయి. ఈ భారీ ఎన్కౌంటర్ అనంతరం ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులను కుకీలు బందీలుగా తీసుకెళ్లారు. వారి మృతదేహాలు శనివారం ఉదయం గుర్తించారు. -
నిరసనలతో దద్దరిల్లిన మండలి..
-
వీ వాంట్ జస్టిస్.. సేవ్ డెమోక్రసీ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నిరసన
అమరావతి, సాక్షి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమైన కాసేపటికే.. శాసనమండలిలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారంపై చర్చకు వైఎస్సార్సీపీ పట్టుబట్టగా.. చైర్మన్ అందుకు నిరాకరించారు. దీంతో.. ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం చుట్టుముట్టి అరగంట పాటు నినాదాలతో తమ నిరసన తెలియజేశారు. సోషల్ మీడియా అరెస్టులతో పాటు డీఎస్సీపై పీడీఎఫ్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే చైర్మన్ కొయ్యే మోషేన్రాజు ఆ రెండు తీర్మానాలను తిరస్కరించారు. తమ వాయిదా తీర్మానంపై చర్చించాల్సిందేనని చైర్మన్ను మండలిలో ప్రతిపక్ష నేత బొత్స కోరారు. అయినా అందుకు చైర్మన్ అంగీకరించలేదు. దీంతో.. పోడియం వద్దకు వచ్చి చేరిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ‘‘వీ వాంట్ జస్టిస్..’’, ‘‘సేవ్ డెమోక్రసీ’.. అంటూ నినాదాలు చేస్తుండగా.. మరోవైపు కూటమి ఎమ్మెల్సీలు వాళ్లతో వాగ్వాదానికి దిగి రెచ్చగొట్టేందుకు యత్నించారు. కానీ, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాత్రం సోషల్ మీడియా పోస్టుల ప్రతులను చైర్మన్కు చూపిస్తూ నినాదాలు కొనసాగించారు. చేసేది లేక ఆ నినాదాల నడుమే ఏపీ మంత్రులు మాట్లాడేందుకు యత్నించారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొనగా.. మండలిని కాసేపు వాయిదా వేశారు చైర్మన్. ఇదీ చదవండి: చావు లెక్కలు నవ్వుతూ.. -
రేణిగుంట ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల నిరసన
సాక్షి, తిరుపతి: విమాన సర్వీస్ రద్దు కావడంతో రేణిగుంట విమానాశ్రయంలో45 మంది ప్రయాణికుల నిరసనకు దిగారు. ఫ్లైట్ హైదరాబాద్ నుంచి ఉదయం 7.15 నిమిషాలకు రేణిగుంట వచ్చి తిరిగి 8.15 నిమిషాలకు వెళ్లాల్సి ఉంది. అయితే, విమాన సర్వీస్ రద్దు విషయం ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికుల ఆందోళనకు దిగారు. ఉదయం నుండి వేచి ప్రయాణికులు బైఠాయించి నిరసన తెలిపారు. ఎటువంటి ప్రత్యామ్నయ ఏర్పాట్లు కల్పించకపోవడంతో ప్రయాణికులు సహనం వ్యక్తం చేశారు. ఎయిర్ లైన్స్ మేనేజర్, సిబ్బంది నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు మండిపడ్డారు. -
ధాన్యం కొనాలి.. మద్దతు ధర చెల్లించాలి
మిర్యాలగూడ: ధాన్యం కొనాలని..మద్దతు ధర కల్పించాలని అన్నదాతలు రోడ్డెక్కారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలోని అవంతీపురం వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజే మిర్యాలగూడ పరిధిలోని రైస్ మిల్లులకు 3వేల ట్రాక్టర్లకుపైగా ధాన్యం తరలివచి్చంది. దీంతో కోదాడ రోడ్డు వైపు యాద్గార్పల్లి మిల్లుల్లో ఉదయం పూట ధాన్యం నిల్వలు భారీగా పేరుకుపోయాయని, నిల్వ సామర్థ్యం లేదని ఉదయం 11గంటల వరకు ధాన్యం కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో మద్దతు ధరకు వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రోడ్లపైనే ట్రాక్టర్లు నిలిపి రైతులు రాస్తారోకో చేశారు.మరోవైపు నల్లగొండ రోడ్డులో వేములపల్లి మండల పరిధిలోని రైస్ మిల్లుల వద్ద ట్రాక్టర్లు భారీ ఎత్తున తరలివచ్చాయి. ఒక ట్రాక్టర్ ప్రమాదానికి గురై రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో 2 గంటల పాటు ధాన్యం ట్రాక్టర్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందు లు కలిగాయి. వెంటనే అధికారులు ఆ ట్రాక్టర్ను తొలగించడంతో పలు మిల్లుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. మహీంద్ర, పద్మ చింట్లు తదితర ఎర్ర రకం ధాన్యానికి క్వింటాల్కు రూ.2,150 నుంచి రూ.2,250 వరకు ధర వేస్తు న్నారని రైతులు యాద్గార్పల్లి మిల్లుల వద్ద, వేములపల్లి మండల పరిధిలోని మిల్లుల వద్ద ధర్నా చేశారు. అదనపు కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్షించినా... ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలంటూ శనివారం మిర్యాలగూడ సబ్కలెక్టర్ కార్యాలయంలో మిర్యాలగూడ ఏరియా రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్అమిత్ 3గంటల పాటు సమీక్షించారు. సన్నరకం ధాన్యానికి రూ.2,320 నుంచి రూ.2,400 వరకు కొనుగోలు చేయాలని సూచించారు. దీనికి రైస్ మిల్లర్లు అంగీకరించారు. కానీ, ఆదివారం మిల్లుల వద్ద భారీగా ట్రాక్టర్లు బారులుదీరడంతో పచ్చి గింజ, తేమ అధికంగా ఉందని, ధాన్యం రంగు మారిందని పలు సాకులతో రూ.2,150 నుంచి రూ.2,350 వరకు కొనుగోలు చేశారు.ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ చెప్పినా కూడా మద్దతు ధర చెల్లించకుండా కేవలం రూ.2,300లోపు ధరకు చాలా ధా న్యం కొనుగోలు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వి షయం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని మిల్లర్లను ఆదేశించారు.పచ్చి వడ్లు అని ధర తగ్గిస్తున్నారు వడ్లలో నాణ్యత లేదని, పచి్చ గా ఉన్నాయని, తేమ శాతం అధికంగా ఉందని, తాలుగింజలు ఉందని సాకు చూపి మిల్లర్లు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. క్వింటాకు రూ.2,250కే కొన్నారు. అధికారులు మిల్లుల వద్దకు రాకపోవడం వల్లే రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు క్షేత్ర పర్యటన చేసి మద్దతు ధర ఇప్పించాలి. – వీరబోయిన లింగయ్య, రైతు, పాములపహాడ్ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాంమిర్యాలగూడ పరిసర ప్రాంతాల మిల్లులకు ఆదివారం సుమారు 3వేలకు పైగా ట్రాక్టర్లలో ధాన్యం వచ్చింది. రైతులు సహకరిస్తే కొనుగోళ్లు వేగవంతమవుతాయి. ఆదివారం ఉద యం 10గంటల వరకు కొనుగోలు కాస్తా మందగించాయి. మధ్యాహ్నం 1గంట వరకు కొనుగోలు చేశాం. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొస్తే రూ.2,320కు పైగా ధర చెల్లిస్తున్నాం. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం. తడిసి రంగు మారి న ధాన్యాన్ని కూడా కొనాలని అన్ని మిల్లులకు ఫోన్లు చేసి చెప్పాం. – కర్నాటి రమేశ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
బ్రాంప్టన్ ఆలయంపై దాడి: ఢిల్లీలో కెనడా ఎంబసీ వద్ద భారీ నిరసన
ఢిల్లీ: కెనడాలోని హిందూ టెంపుల్పై ఇటీవల జరిగిన దాడులకు నిరసనగా న్యూఢిల్లీలోని కెనడా హైకమిషన్ వెలుపల హిందూ సిక్కు గ్లోబల్ ఫోరమ్ సభ్యులు నిరసన వ్యక్తం చేయడానికి భారీగా చేరుకున్నారు. దీంతో తీన్ మూర్తి మార్గ్ వద్ద పోలీసులు భారీగా తరలివచ్చిన నిరసనకారులను బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ఉద్రిక్తతంగా మారిన ఈ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కెనడాలో హిందువులపై ఖలిస్థానీ తీవ్రవాదులు హింసను పెంపొందించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకారులు పెద్దఎత్తును నినాదాలు చేశారు. హిందూ, సిక్కు సంఘాల కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూ సిక్కు గ్లోబల్ ఫోరమ్.. దాడులకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలనే డిమాండ్ను మార్చ్ను నిర్వహించింది.ఈ సందర్భంగా హిందూ సిక్కు గ్లోబల్ ఫోరమ్ అధ్యక్షుడు తర్విందర్ సింగ్ మార్వా మీడియాతో మాట్లాడారు. ‘‘ హిందూ, సిక్కు వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మిలిటెన్సీ సమయంలో మొత్తం మా తరం నాశనం అయింది. మావాళ్లు కొందరు హత్యకు గురికాగా.. కొందరు ఇతర దేశాలకు వలస వెళ్లారు. అప్పుడు మా యువతరం జీవితాన్ని వాళ్లు నాశనం చేసేందుకు డ్రగ్స్ను ప్రవేశపెట్టారు. బలవంతపు మత మార్పిడుల ప్రయత్నాలతో సహా.. ఐక్యతకు భంగం కలిగించడానికి కుట్రలు జరిగాయి. ఇప్పుడు ఆలయాలపై దాడులు చేయడం వాళ్లకు కొత్త కాదు. మేమంతా కలిసి ఉన్నామని చెప్పడానికే ఇక్కడకు వచ్చాం. నిజమైన సిక్కు ఖలిస్థానీ కాలేడు. మన త్రివర్ణ పతాకాన్ని, దేశాన్ని ఎల్లవేళలా గౌరవించాలని మేం కోరుకుంటున్నాం భారతదేశంలోని సిక్కులు భారతదేశానికి అండగా నిలుస్తారు. ఖలిస్తాన్కు మద్దతు ఇవ్వరు’’ అని అన్నారు.#WATCH | Delhi: People of the Hindu Sikh Global Forum on their way to the High Commission of Canada, Chanakyapuri, to protest against the attack on a Hindu Temple in Canada, were stopped at Teen Murti Marg by Police. pic.twitter.com/ONaXu46gJi— ANI (@ANI) November 10, 2024ఇక.. నవంబర్ 3న కెనడాలోని బ్రాంప్టన్లోని హిందూ సభ ఆలయంపై ఖలిస్తానీ అనుకూల దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా నేతలు తీవ్రంగా ఖండించారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడోతో సహా ప్రతిపక్షనేత తీవ్రంగా ఖండించారు.చదవండి: కాంగ్రెస్కు బిగ్ షాక్.. సీనియర్ నాయకుడు రాజీనామా -
ఖబడ్డార్ నారా లోకేష్.. బాబు, పవన్ పై ABVP నేత ఫైర్
-
ఇందిరాపార్క్ వద్దకు ఆటోలో ప్రయాణించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల మహా ధర్నాకు మద్దతు తెలిపిందేందుకు వెళ్లిన ఆయన ఆటోలో ప్రయాణించారు. కేటీఆర్ మొదట నందినగర్లోని తన నివాసం నుంచి కారులో బయలుదేరారు. ఆ తర్వాత కొందరు సీనియర్ నాయకులతో కలిసి ఆటో ఎక్కిన కేటీఆర్ మహాధర్నా వద్దకు చేరుకున్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన ఆటో డ్రైవర్తో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆటో యూనియన్స్ మహాధర్నాకు నాయకత్వం వహిస్తున్న ఆటో కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు పథకం కారణంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామన్న ప్రభుత్వ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.Live: "ఆటో డ్రైవర్ల మహా ధర్నా"కు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS https://t.co/GLu6PB9jbC— BRS Party (@BRSparty) November 5, 2024 తెలంగాణ వచ్చాక ఆటో డ్రైవర్లకు రోజు రూ. 2 వేలు సంపాదిస్తే అన్ని ఖర్చులూ పోను.. 8 వందలు మిగిలేవి. అదే ఇప్పుడు మహాలక్ష్మి పథకంతో 8 వందలు వస్తే ఖర్చులు పోను 2 వందలు మిగలడం లేదు, అధికారంలోకి రాక ముందు గతంలో ఆటోలో తిరిగిన రాహుల్ గాంధీ అన్నారు. అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి 12,000 వేలు ఇస్తాను అన్నారు. కానీ ఏమీ ఇవ్వలేదు. 12 నెలల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు తీర్చిన గ్యారంటీలు ఎన్ని అని ఆలోచన చేయాలి. ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కోలేక ఈ 12 నెలల్లో ఎందరు తనువు చాలించారో లెక్కలతో సహా అసెంబ్లీలో ఇచ్చాం. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నారు. కానీ చేయలేదు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. ఆనాడు కేసీఆ ర్తెచ్చిన ఇన్స్యూరెన్స్ను తొలగించాలి అనుకుంటున్నారు. ఓలా, ఉబర్తో జరుగుతున్న నష్టాన్ని పురిస్తా అన్న మాట మీద ప్రభుత్వం నిలబడాలి.రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది. బయటకు పోతే తంతారు అని.. పోలీసుల బందోబస్తు లేనిది బయటకు పోవుడు కష్టం అన్నట్లు ఉంది. హోమ్ గార్డుతో సహా అందరు పోలీసులు కష్టల్లోనే ఉన్నారు. ఇంకా నాలుగు ఏళ్ల సినిమా ఉంది. జైల్లో పెట్టిన మేము వెనక్కి తగ్గము మీరు మా వెంట ఉండాలి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి అని కోరుతున్నాం. ఏఐటీయూసీతో పాటు అనేక ఆటో కార్మికులు అందరూ వల్ల సమస్యల పట్ల జెండాలు ఒకటవ్వాలి. అసెంబ్లీలో శాసన సభ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. మీ తరుపున మేము కొట్లడతాము. ఆటో కార్మిక ఐక్యత వర్ధిల్లాలి.’ అని తెలిపారు. -
కెనడా: హిందూ దేవాలయాలపై దాడి ఘటనలో కీలక పరిణామం
ఒట్టావా: కెనడాలో ఖలిస్థానీ వేర్పాటు వాదులు హిందూ దేవాలయాలపై దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖలిస్థానీ వేర్పాటు వాదులకు మద్దతు పలుకుతూ హిందూ దేవాలయాలపై దాడికి పాల్పడ్డ వారిపై కెనడా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.బ్రాంప్టన్లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని కొందరు ఖలిస్థానీలు భక్తులపై దాడులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనను కెనడా ప్రధాని జెస్టిన్ ట్రూడో తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ఖలిస్థానీలకు మద్దతు పలుకుతున్న ప్రభుత్వ అధికారులపై కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఖలిస్థాని జెండాతో కెనడా పీల్ ప్రాంత రీజనల్ పోలీసు అధికారి హరీందర్ సోహీపై ఆందోళన చేపట్టారు. ఖలిస్థానికి మద్దతుగా, భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హరీందర్ సోహీ నినాదాలు చేస్తున్న వీడియోలు వైరల్గా మారాయి. దీంతో కెనడా పోలీస్ శాఖ సోహీపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. కెనడా కమ్యూనిటీ సేఫ్టీ, పోలీసింగ్ యాక్ట్ నిబంధనల్ని ఉల్లంఘించినందనే హరీందర్ సోహీపై చర్యలు తీసుకున్నట్లు రిచర్డ్ చిన్ తెలిపారు. మరోవైపు హిందూ దేవాలయాలపై ఖలిస్థానీ వేర్పాటు వాదుల దాడిని సీరియస్గా తీసుకున్న కెనడా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఖండించిన మోదీకెనడాలోని హిందూ ఆలయం లక్ష్యంగా జరిగిన దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ విధ్వంసక ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద ప్రయత్నాలు కూడా అంతే దారుణమైనవి పేర్కొన్నారు. ఇలాంటి హింసాత్మక చర్యలు భారత్ స్థైర్యాన్ని ఏమాత్రం బలహీనపరచలేవన్నారు. ఈ ఘటనపై కెనడా ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. -
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ తొలిరోజు సమావేశాల్లో గందరగోళం
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.. ఆరేళ్ల తర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజే గందరగోళం నెలకొంది. నేటి సమావేశంలో భాగంగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) ఎమ్మెల్యే వహీద్ పారా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పుల్వామా నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న పారా.. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక హోదా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన స్పీకర్ అబ్దుల్రహీమ్ రాథర్కు తీర్మానాన్ని సమర్పించారు. అయిదు రోజుల అసెంబ్లీ సెషన్ ఎజెండాలో ఈ అంశం లేకపోయినప్పటికీ ప్రజల కోరకు మేరకు స్పీకరర్గా తన అధికారాలను ఉపయోగించి దీనిపై చర్చించాలని ఆయన కోరారు.అయితే ఈ తీర్మానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీనిని అనుమతించకూడదని కాషాయ పార్టీకి చెందిన 28 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా తీర్మానం తీసుకొచ్చినందుకు పారాను సస్పెండ్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే షామ్ లాల్ శర్మ డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ పదేపదే అభ్యర్థించినప్పటికీ వారు తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో కాసేపు అసెంబ్లీలో రగడ చోటుచేసుకుంది.అనంతరం అధికారిక నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన స్పీకర్ రహీమ్ రాథర్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు లాంటి తీర్మానాన్ని తాను ఇంకా అంగీకరించలేదని చెప్పారు. ఈ తీర్మానానికి ప్రాధాన్యత లేదని సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా తేల్చిచెప్పారు. సభ ఎలా జరగాలనేది, ఏం చర్చించాలనే ఏ ఒక్క సభ్యులచే నిర్ణయించరాదని అన్నారు. 2019 ఆగస్టు 5న తీసుకున్న ఆర్టికల్ 370ని రద్దు నిర్ణయాన్ని జమ్ముకశ్మీర్ ప్రజలు ఆమోదించడం లేదని అన్నారు. అయితే రాష్ట్ర పునరుద్దరణకు తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా 2019లో జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది. దీంతో, ఆ ప్రాంతం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. జమ్మూకశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలని ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ డిమాండ్ చేస్తోంది. జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ ఇటీవల ఒమర్ మంత్రివర్గం తీర్మానం చేసింది. దానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం కూడా తెలిపారు. ఈ పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించే యోచనలో కేంద్రం ఉందని, ఈమేరకు హామీ లభించిందని ప్రచారం జరుగుతోంది. -
మాజీ సర్పంచులు అరెస్ట్ .. అసలు కారణం ఇదే ?
-
‘నన్నయ్య’ విద్యార్థినుల ఆకలి కేకలు
తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థినులు ఆకలి కేకలు జాతీయ రహదారిపై ప్రతిధ్వనించాయి. తాము ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి సుమారు 650 మంది విద్యార్థినులు ఆందోళనకు దిగారు. దీంతో గంటన్నరపాటు యూనివర్సిటీలోకి రాకపోకలు స్తంభించిపోయాయి.– రాజానగరం జీతాల కోసం ‘108’ ఆందోళనప్రభుత్వం 108 ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలని చిత్తూరు జిల్లా పుంగనూరులో బుధవారం నిరసన తెలిపారు. పుంగనూరులోని ఏరియా ఆస్పత్రి వద్ద 108 ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, మోకాలిపై నిలబడి నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యోగేష్ మాట్లాడుతూ జిల్లాలో మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జీతాలు ఇవ్వాలని కోరారు. – పుంగనూరు -
బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనపై పోలీసు శాఖ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ బెటాలియన్లలో పనిచేసే కానిస్టేబుళ్ల ఆందోళనలపై రాష్ట్ర పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. విధులు బహిష్కరించి రోడ్లపైకి వచ్చి పోలీసులు ఆందోళన చేయడం తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనగా భావిస్తున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించమని హెచ్చరించారు. పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తూ సామాన్య జనానికి ఇబ్బంది కలిగేలా రోడ్లపై వచ్చిన పోలీసులపై చట్టపరమైన, శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సెలవుల విషయంలో పాత పద్ధతినే అనుసరిస్తామని ఇప్పటికే చెప్పినప్పటికీ మళ్లీ ఆందోళన చేయడంపై సరికాదన్నారు. ఆగ్రహం వ్యక్తం చేసింది. బెటాలియన్స్లో ఆందోళన చేస్తున్న వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానిస్టేబుళ్ల ఆందోళన వెనక ప్రభుత్వ వ్యతిరేక శక్తుల హస్తముందని అనుమానం ఉందన్నారు.కాగా తెలంగాణలో ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అన్ని జిల్లాలోలనూ కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారువరంగల్ జిల్లా మమూనూరు క్యాంపులో మొదలైన ఆందోళన సెక్రటేరియట్ చేరింది. క్రమంగా రాష్ట్రంలోని అన్ని బెటాలియన్లకు పాకింది.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, నల్గొండ రూరల్, మంచిర్యాలలో నిరసనలు చేపట్టారు. అయితే మామునూరు బెటాలియన్ ఆవరణలో ఏకంగా యూనిఫాం ధరించిన పోలీసులే నిరసనకు దిగారు. టీజీఎస్పీ వద్దు ఏక్ పోలీస్ ముద్దు, టీజీఎస్పీకో హఠావో.. ఏక్ పోలీస్ బనావో అంటూ నినాదాలు చేశారు. -
రేవంత్ డౌన్ డౌన్.. బెటాలియన్ పోలీసుల ధర్నా!
సాక్షి, నల్లగొండ: తెలంగాణ పోలీసుల్లో తిరుగుబాటు మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులపై తాజాగా పోలీసులు సిబ్బంది ధర్నాకు దిగారు. నల్లగొండలో ఎస్ఐను సస్పెండ్ చేయాలని బెటాలియన్ పోలీసులు డిమాండ్ చేయగా.. సిరిసిల్లలో సీఎం రేవంత్ డౌన్ డౌన్ అంటూ పోలీసులు నినాదాలు చేశారు.వివరాల ప్రకారం.. నల్లగొండలోని అన్నెపర్తి 12వ బెటాలియన్లో సిబ్బంది మరోసారి ఆందోళన దిగారు. నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబును సస్పెండ్ చేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆందోళన చేస్తున్న తమతో పాటు తమ కుటుంబ సభ్యుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ సిబ్బంది ఆరోపించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున నినాదాలు చేస్తూ బెటాలియన్ నుంచి రోడ్డుపైకి ర్యాలీగా వస్తున్న సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. గేట్లు వేయడంతో సిబ్బంది బయటకు రాకుండా ఆగిపోయారు. ప్రతీకార బాంబులు అణుబాంబులు మిరపకాయ బాంబులుతాటాకు బాంబులు కాదుతెలంగాణకు కావాల్సింది.. !మీ..మాయ హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఎలాగో మంచి చేయలేదు.. !కనీసం ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులనైనా మనుషులుగా చూడండి.. !ఒక సంవత్సరంలోనే ఇంత చెండాలమైనా ప్రభుత్వం బహుశా..ఈ ప్రపంచంలోనే… pic.twitter.com/0x7DDbFRpy— Mallaiah Yadav Bollam (@BollamMallaiah) October 26, 2024 మరోవైపు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17వ బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ దగ్గర పోలీసులు నిరసన, ధర్నాకు దిగారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణలో ఒకే పోలీసు విధానం ఉండాలని డిమాండ్ చేశారు. మాకు డ్యూటీలు వేసి కుటుంబాన్ని దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. మాతో లోపల కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేయిస్తున్నారని చెప్పారు. ఈ సందర్బంగా ధర్నా చేస్తున్న కానిస్టేబుల్ వద్దకు జిల్లా ఎస్పీ అఖిల్ చేరుకొని పోలీసులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో ఎస్పీ కాళ్లపై పడి తమ బాధను తీర్చాలని కానిస్టేబుల్ వేడుకున్నారు. పోలీస్ లే కార్మికుల తరహాలో స్లొగన్స్.. సమ్మె కానీ సమ్మె ఇది!#CongressFailedTelangana pic.twitter.com/00v54OZsLb— Harish Rao Thanneeru (@BRSHarish) October 26, 2024 సంచలనం.. యూనిఫాం వేసుకుని బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళనతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుల్స్ https://t.co/HvAS9vFfGe pic.twitter.com/9NyrTl0JBr— Telugu Scribe (@TeluguScribe) October 26, 2024 Video Credit: Telugu scribe -
AP: మద్యంపై మహిళల పోరు.. పునాదులు తొలగించి..
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి సర్కార్ పాలన తీరుపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ముఖ్యంగా మద్యం విషయంలో చాలా చోట్ల ప్రజల నుంచి నిరసన ఎదురవుతోంది. తాజాగా కాకినాడ జిల్లాలో మద్యంపై మహిళలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాపు నిర్మాణం చేపట్టిన చోట పునాదుల నుంచి రాళ్లను తొలగించారు.కాకినాడ జిల్లాలోని తునిలో మద్యం మహిళలు అసహనం వ్యక్తం చేశారు. గ్రామంలో మద్యం షాపులు ఏర్పాటు చేస్తామంటే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఇదే క్రమంలో డి.పోలవరం గండిలో మద్యం షాపు నిర్మాణాన్ని మహిళలు అడ్డుకున్నారు. చంద్రబాబు సర్కార్పై ఆగ్రహంతో పునాదుల నుంచి రాళ్లను తొలగించారు. మళ్లీ నిర్మాణం చేపడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
బంగ్లాలో నిరసనలు.. అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్
ఢాకా: బంగ్లాదేశ్లో మరోసారి నిరసన జ్వాలలు రగులుతున్నాయి. దేశ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ రాజీనామా విద్యార్థి సంఘాలు, నిరసనకారులు డిమాండ్ చేస్తూ అధ్యక్ష భవనం ‘బంగా భబన్’ను చుట్టుముట్టారు. షేక్ హసీనాను ప్రధాన మంత్రిగా తొలగించాలనే డిమాండ్లో నిరసనలు చేపట్టిన విద్యార్థి సంఘం మంగళవారం ఢాకాలోని సెంట్రల్ షాహీద్ మినార్ వద్ద ర్యాలీ నిర్వహించింది. అధ్యక్షుడి రాజీనామాతో సహా తమ డిమాండ్లను ప్రకటించారు.🚨🇧🇩BANGLADESH: CALLS FOR PRESIDENT SHAHABUDDIN’S REMOVAL GROWProtests intensify against President Shahabuddin, accusing him of backing "fascism" and demanding his resignation.Source: Times of India pic.twitter.com/bzD4amPq7w— Info Room (@InfoR00M) October 22, 2024 ఇక.. ఆందోళనకారులు రాత్రి ‘బంగా భబన్’ మార్చ్గా వెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన సైన్యం బారికేడ్లతో నిరసనకారులను ఎదుర్కొవడానికి ప్రయత్నించారు. అధ్యక్ష పదవికి మహ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ బంగా భవన్ బయట ఆందోళనకారులు పెద్ద ఎత్తున గుమిగూడారు.అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్.. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా నిరంకుశ ప్రభుత్వానికి మిత్రుడు.ఆయన వెంటనే రాజీనామా చేయాలని ఓ నిరసనకారుడు మీడియాతో మాట్లాడారు. 1972 రాజ్యాంగాన్ని రద్దు చేసి ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించే కొత్త రాజ్యాంగాన్ని రూపొందించాలని విద్యార్థి సంఘం నేతలు పిలుపునిచ్చారు. అవామీ లీగ్ పార్టీకి సంబంధించిన విద్యార్థి సంస్థ ‘బంగ్లాదేశ్ చత్రా లీగ్’ను నిషేధించాలి. అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.Violence has erupted once again in Bangladesh, this time with students and protesters demanding the resignation of the President. #Bangladesh Violent protests continue at Bangabhaban in Dhaka. Scuffles between police and security personnel. Protesters blocked Gulistan Road… pic.twitter.com/QISEV9BNnN— Ashoke Raj (@Ashoke_Raj) October 22, 2024షేక్ హసీనా హయాంలో 2014, 2018, 2024లో జరిగిన ఎన్నికలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన పార్లమెంటు సభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరారు. విద్యార్థులు జూలై-ఆగస్టు చేసిన తిరుగుబాటు స్ఫూర్తికి రిపబ్లిక్ బంగ్లాదేశ్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.చుప్పు అని కూడా పిలువబడే మహమ్మద్ షహబుద్దీన్ బంగ్లాదేశ్కు 16వ అధ్యక్షుడు. అవామీ లీగ్ పార్టీ.. నామినేట్ చేయగా 2023 అధ్యక్ష ఎన్నికలలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
ఇలా చేస్తున్నావేంటి పవన్?.. ఉద్యోగుల బైఠాయింపు
సాక్షి, విజయవాడ: వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినా పట్టించుకోరా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీరుపై ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మండిపడుతున్నారు. నిన్నటి(సోమవారం) నుంచి పవన్ ఆఫీస్ వద్ద ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. పవన్ అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాస్తున్నారు.పవన్ కలవడం కోసం కటిక నేల మీదే కూర్చొని నిన్నంతా మహిళ ఉద్యోగులు కష్టాలు పడ్డారు. వినతిపత్రం ఇవ్వడానికి ఉద్యోగులు రాగా, పవన్ వారిని కలకుండా వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ కలవరు.. వెళ్ళిపొమంటూ సిబ్బంది చెప్పారు. నిన్నంతా జనసేన ఆఫీసే దగ్గరే మహిళా ఉద్యోగులు ఉన్నారు. పవన్ను కలిసేంత వరకు వెళ్లబోమంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జనసేన ఆఫీస్ దగ్గరే బైఠాయించారు.పిఠాపురం కూటమిలో కుంపట్ల రచ్చమరోవైపు, పిఠాపురం కూటమిలో కుంపట్ల రచ్చ సాగుతోంది. ‘పల్లె పండుగ’ సాక్షిగా టీడీపీ-జనసేన మధ్య విభేదాలు బయటపడ్డాయి. దళిత సర్పంచ్లకు విలువ ఇవ్వడం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవఖండ్రవాడ పల్లె పండుగలో ఇరుపార్టీల నేతల మధ్య రగడ నెలకొంది. పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్పై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పొత్తు ధర్మాన్ని పాటించని శ్రీనివాస్ను తక్షణమే ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించాలని.. ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు.ఇదీ చదవండి: పచ్చపార్టీలో కొత్త చిచ్చు -
నేను కాంగ్రెస్ పార్టీలో ఉండలేను: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల, సాక్షి: జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ధర్నా విరమించారు. ఆయన ఇవాళ పార్టీ నేత గంగారెడ్డి హత్యను నిరసిస్తూ ధర్నా చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వటంతో జీవన్ రెడ్డి వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో సొంత ప్రభుత్వంపైనే జీవన్రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విప్ అడ్లూరి లక్ష్మణ్పై జీవన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ‘‘ నీకో దండం... నీ పార్టీకో దండం’’ అంటూ లక్ష్మణ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం.. జీవన్ రెడ్డికి సీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ ఫోన్ చేయగా.. ‘‘నేను పార్టీలో ఉండలేను. నాలుగు దశాబ్దాల కష్టానికి మంచి బహుమతి ఇచ్చారు’’ అని ఫోన్ మాట్లాడుతుండగానే ఫోన్ కట్ చేశారు. ‘‘ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలకే భరోసా లేదు. ఫిరాయింపులు ప్రోత్సహించొద్దని నాటి రాజీవ్ గాంధీ నుంచి నేటి రాహూల్ గాంధీ వరకు కోరుకున్నారు. కానీ, ఇవాళ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ దాన్ని విస్మరించింది. కేసీఆర్ ఏదైతే చేశాడో.. అదే ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఆచరిస్తున్నారు. రాహూల్ గాంధీ మన నాయకుడనే విషయాన్ని మర్చిపోతున్నట్టున్నారు. కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నాయి. నేనెవ్వరికీ భరోసా ఇచ్చే స్థితిలో లేను. నా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను’’ అని జీవన్రెడ్డి అన్నారు.అంతకు ముందు గంగారెడ్డి హత్యపై కాంగ్రెస్ నేతలు జగిత్యాల-ధర్మపురి రహదారిపై నిరసన చేపట్టారు. రోడ్డుపై సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ బైఠాయించిన నిరసన తెలిపారు. జగిత్యాలలో 2 గంటలుగా జీవన్రెడ్డి రోడ్డుపైనే బైఠాయించారు.పోలీసులకు వ్యతిరేకంగా భారీగా నినాదాలు చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో సహనం కోల్పోయిన జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యతో జగిత్యాలలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.జగిత్యాల రూరల్ జాబితాపూర్లో కాంగ్రెస్ సీనియర్ నేత మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.గంగారెడ్డిని కారుతో వెనుక నుంచి ఢీకొట్టి, సంతోష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశారు. కత్తిపోట్లకు గురైన గంగారెడ్డిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. పాత కక్షలతోనే హత్య చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.చదవండి: జగిత్యాల: కాంగ్రెస్ నేత గంగారెడ్డి దారుణ హత్య -
హైదరాబాద్ అశోకనగర్ లో మరోసారి ఉద్రిక్తత
-
విగ్రహాల ధ్వంసంపై ఆందోళన.. నిందితుడు అరెస్ట్
భాగల్పూర్: బీహార్లోని భాగల్పూర్లో దేవతా విగ్రహాల ధ్వంసంతో స్థానికంగా కలకలం చోటుచేసుకుంది. సన్హౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఒక శివాలయంలో దేవుళ్లు, దేవతల విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ రోడ్లపైకి చేరుకుని ఆందోళనకు దిగారు.విగ్రహాల ధ్వంసం దరిమిలా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా సంహౌలా ప్రధాన మార్కెట్ను మూసివేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విగ్రహాల ధ్వంసం ఘటనలో ప్రమేయమున్న ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.భాగల్పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంహౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఆలయంలో కొన్ని విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. శాంతి కమిటీ, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించామని, పోలీసులు ఫ్లాగ్మార్చ్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, శాంతిభద్రతలు సాధారణంగానే ఉన్నాయని చెప్పారు. వదంతులకు దూరంగా ఉండాలని స్థానికులకు పోలీసులు సూచించారు. ఇది కూడా చదవండి: నిమి–వసిష్ఠుల పరస్పర శాపాలు -
అశోక్నగర్లో మరోసారి ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అశోక్ నగర్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రూప్-1 అభ్యర్థులు ఆదివారం ఉదయం రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. అభ్యర్థులు మీడియా సమావేశం పెట్టే ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.వివరాల ప్రకారం.. గ్రూప్-1 అభ్యర్థులు పెద్ద సంఖ్యలో అశోక్నగర్లో రోడ్లపైకి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు.. వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు మాట్లాడుతూ.. మా జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయి. మా బాధలు వినండి సీఎం రేవంత్ రెడ్డి. మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. కొద్దిగా కనికరించండి. జీవో నంబర్ 29ని రద్దు చేయండి.ప్రిలిమ్స్ హాల్ టికెట్, మెయిన్స్ హాల్ టికెట్ నంబర్లు వేరు వేరుగా ఉన్నాయి. ఇలా చరిత్రలో నంబర్లు వేరే వేరేగా ఎప్పుడూ రాలేదు. ఎగ్జామ్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఒక్కరే రాసినప్పుడు వేరే వేరే హాల్ టికెట్ నంబర్లు ఎలా వస్తాయి. ఇదే విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి మమ్మల్ని పిలిచి మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు.మరోవైపు.. గ్రూప్-1 అభ్యర్థులు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అశోక్ నగర్లో భారీ సంఖ్యలో బందోబస్తే ఏర్పాటు చేశారు. అలాగే, గాంధీ భవన్ వద్ద ముందస్తుగా భద్రతను పెంచారు. -
గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనకు పులుముకున్న రాజకీయ రంగు
-
Group-1 Exam: అట్టుడికిన సిటీ
సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగరం అట్టుడికింది. ఆందోళనలు, ధర్నాలు, ముట్టడి, బంద్ పిలుపులతో నగరం గరం గరంగా మారింది. ఎక్కడికక్కడ ర్యాలీలు, ఆందోళనలు చేపట్టడంతో పోలీసులకు చుక్కలు కనిపించాయి. ఆందోళనకారుల అరెస్టులు, లాఠీచార్జ్లతో శనివారం నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీఓ నం–29ను రద్దు చేయాలని గ్రూప్–1 అభ్యర్థుల మూడు రోజులుగా అశోక్నగర్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి బండి సంజయ్, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యర్థులకు మద్దతు తెలపడంతో ఆందోళన తీవ్రతరమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సెక్రటేరియట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అభ్యర్థులను, మంత్రిని పోలీసులు నిలువరించడంతో అశోక్నగర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. దీంతో అశోక్నగర్ చౌరస్తా నుంచి ఇందిరాపార్కు చౌరస్తా వరకు పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సెక్రటేరియట్ ముట్టడికి వెళ్తున్న క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. సికింద్రాబాద్ బంద్లో లాఠీచార్జ్.. కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ శనివారం పలు హిందూ సంఘాలు ఇచి్చన సికింద్రాబాద్ బంద్లో ఉద్రిక్తత నెలకొంది. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయం వద్ద నుంచి వేలాది మంది ర్యాలీగా బయలుదేరారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్తో పాటు వీహెచ్పీ, భజరంగ్దళ్, హిందూవాహిని, బీజేపీ తదితర సంస్థలకు చెందిన ఆందోళనకారులతో కలిసి మహంకాళి దేవాలయం వద్ద బైఠాయించి హనుమాన్ చాలీసా చదివి అక్కడి నుంచి బాటా వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఆందోళనకారులు చెప్పులు, రాళ్లు, కురీ్చలు విసరడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జిలో నలుగురు యువకులకు తలలు పగిలి గాయాలు కాగా ఓ యువకుడి చేయి విరిగిపోయింది. బంద్, ర్యాలీలతో సికింద్రాబాద్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.స్వచ్ఛందంగా షాపులు మూసిన వ్యాపారులు రాంగోపాల్పేట్: కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయ ఘటనను నిరసిస్తూ హిందూ సంఘాలు ఇచి్చన బంద్ శనివారం ప్రశాంతంగా సాగింది. వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి మద్దతు పలికారు. -
గ్రూప్ వన్ ఆందోళనలు.. అశోక్నగర్లో హై టెన్షన్ (ఫొటోలు)
-
TG గ్రూప్-1 రగడ: సచివాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత
Updatesసచివాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తతపోలీసులు, గ్రూప్-1 అభ్యర్థుల మధ్య తోపులాటగ్రూప్-1 వాయిదా వేయాలంటూ ఆందోళనజీవో 29 రద్దు చేయాలంటూ డిమాండ్బీజేపీ నేత బండి సంజయ్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు అరెస్ట్గ్రూప్-1 అభ్యర్థులతో సచివాలయానికి వెళ్తుండగా అరెస్ట్సచివాలయం వైపు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలు అరెస్ట్బీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ గౌడ్, ఆర్ ఎస్ ప్రవీణ్, దాసోజు శ్రవణ్లు అరెస్టుబండి సంజయ్ను బీజేపీ ఆఫీస్కు తరలించిన పోలీసులుసచివాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరింపుసచివాలయం గేట్లు మూసేసిన పోలీసులుఅంతకుముందు హైదరాబాద్ అశోక్ నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ మద్దతు పలికారు. వారిని పరామర్శించి.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి సెక్రటేరియట్కు ర్యాలీగా బయల్దేరారు. దీంతో ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. గ్రూప్-1 బాధితులకు న్యాయం చేయాలంటూ బండి సంజయ్ రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంను కలిసి వాస్తవాలు చెప్పేందుకే సచివాలయానికి వెళ్తున్నామని, ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడికి వెళ్లి తీరుతామని చెప్పారు. దీంతో పోలీసులు బండి సంజయ్ను అదుపులోకి తీసుకున్నారు.గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అశోక్నగర్ చౌరస్తాకు ఇవాళ ఉదయం భారీ సంఖ్యలో గ్రూప్-1 అభ్యర్థులు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో 29 వద్దు.. జీవో 55 ముద్దు అని నినాదాలు చేశారు. తక్షణమే జీవో 29ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో 29 కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అశోక్ నగర్ నుంచి సెక్రటేరియట్కు ర్యాలీగా వెళ్లిన గ్రూప్-1 అభ్యర్థులను ఇందిరా పార్క్, రామకృష్ణ మఠం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అశోక్ నగర్ నుంచి సెక్రటేరియట్ వరకు పోలీసులు భారీగా మోహరించారు. దీంతో అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. అశోక్ నగర్, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
తెలంగాణలో గ్రూప్ -1 టెన్షన్..టెన్షన్
-
జంగారెడ్డిగూడెంలో ఉద్రిక్తత.. బాబు సర్కార్పై ట్రాక్టర్ డ్రైవర్లు సీరియస్
సాక్షి, జంగారెడ్డిగూడెం: ఏపీలో కూటమి సర్కార్ పాలన తీరు కారణంగా ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. తమపై పోలీసులు అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ ట్రాక్టర్ డ్రైవర్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెంలో ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. శ్రీనివాసపురం రోడ్ బైపాస్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సందర్భంగా తమపై పోలీసులు అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుకను తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్నారని నిరసన తెలిపారు.ఇదే సమయంలో ఉచిత ఇసుక అంటూ కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలను ఎలా పోషించాలంటూ ప్రభుత్వాన్ని డ్రైవర్లు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో రహదారిని దిగ్బంధం చేయడంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి డ్రైవర్లను బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘పత్రికా స్వేచ్ఛ అంటే కేవలం ఎల్లో మీడియాకేనా?’ -
భగ్గుమన్న భారత్, కెనడా బంధం. నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ పేరు చేర్చిన కెనడా. నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించిన భారత్
-
సత్యసాయి జిల్లాలో వాటర్ వర్కర్స్ నిరసన
-
మహారాష్ట్రలో ధంగర్లకు ఎస్టీ హోదాపై నిరసన.. సెక్రటేరియట్ భవనం నుంచి దూకిన నేతలు
ముంబై: మహారాష్ట్రలోని ధంగర్ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చినందుకు నిరసనగా రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ సహా గిరిజన నేతలు సెక్రటేరియట్ భవనం మంత్రాలయం మూడో అంతస్తు నుంచి దూకారు. అయితే, పోలీసులు ముందు జాగ్రత్తగా దిగువన రెండో అంతస్తులో నెట్లో పడటంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, ఈ ఘటన మంత్రాలయం సముదాయంలో శుక్రవారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో ఉద్రిక్తతకు దారి తీసింది.దూకిన వారిలో జిర్వాల్తోపాటు ఎన్సీపీకే చెందిన ఎమ్మెల్యే కిరణ్ లహమతే, బీజేపీ గిరిజన ఎంపీ హేమంత్ సవర తదితరులున్నారు. వీరిని పోలీసులు నెట్ నుంచి బయటకు తీశారు. అనంతరం ఈ నేతలంతా గ్రౌండ్ ఫ్లోర్లో బైఠాయించారు. కోటా విషయమై సీఎం షిండే వెంటనే తమతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని వారు డిమాండ్ చేశారు. మంత్రాలయం భవనం పైనుంచి గతంలో ఆత్మహత్యకు యత్నించిన ఘటనలున్నాయి. దీంతో, అక్కడ పోలీసులు నెట్ను ఏర్పాటు చేసి ఉంచారు. కాగా, గిరిజనులకు సంబంధించిన నిర్ణయాలపై అధికార కూటమిలోని అంతర్గత విభేదాలను ఈ ఘటన మరోసారి బహిర్గతం చేసింది. -
సచివాలయంపై నుంచి దూకిన డిప్యూటీ స్పీకర్
ముంబై: మహారాష్ట్ర సచివాలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్.. సచివాలయంలోని మూడో అంతస్తుపై నుంచి కిందకు దూకేశారు. అయితే ఆయన దూకిన సమయంలో భవనానికి సేఫ్టీ నెట్ ఏర్పాటు చేసి ఉండటంతో వారు అందులో పడిపోయారు. పోలీసులు వెంటనే వారిని రక్షించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు.పెసా చట్టం ప్రకారం ఉద్యోగ నియామకాలను వ్యతిరేకిస్తూ గత 15 రోజులుగా మహారాష్ట్రలో గిరిజన విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. ఎస్టీ కేటగిరీలో ఉన్న ధంగర్ కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలో గిరిజన ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు. అయినప్పటికీ ప్రభుత్వం వీరి గోడు పట్టించుకోకపోవడంతో గిరిజన ఎమ్మెల్యేలు, గిరిజన సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ స్పీకర్ విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్, మరికొందరు గిరిజన ఎమ్మెల్యేలు నేరుగా నేడు మంత్రాలయ భవనం వద్దకు చేరుకుని మూడో అంతస్తు నుంచి కొన్ని డాక్యుమెంట్లను గాల్లోకి విసిరేస్తూ దూకేశారు. అయితే భవనానికి నెట్ కట్టి ఉండటంతో ఎవరికీ ఏం కాలేదు.#WATCH | NCP leader Ajit Pawar faction MLA and deputy speaker Narhari Jhirwal jumped from the third floor of Maharashtra's Mantralaya and got stuck on the safety net. Police present at the spot. Details awaited pic.twitter.com/nYoN0E8F16— ANI (@ANI) October 4, 2024 ఈ వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్తో ఇప్పటికే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చర్చలు జరిపారు. ఈ సమస్య పరిష్కారానికి సానుకూలంగానే ఉన్నామని సీఎం చెప్పినప్పటికీ అందుకు తగ్గట్టుగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో గిరిజన ప్రజాప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
తిరుపతి సభలో పవన్ కు నిరసన సెగ..
-
మూడో రోజుకు ఉక్కు ఉద్యమం.. సీఎండీ ని కలవనున్న కార్మిక నేతలు
-
స్టీల్ ప్లాంట్ కార్మికుల సమరం
-
రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల నిరసన
-
ఉద్యమాన్ని ఉధృతం చేసిన విశాఖ ఉక్కు కార్మికులు
-
నావెల్ డాక్ యార్డు ఎదుట మహిళల ఆందోళన
సాక్షి,విశాఖపట్నం: నావెల్ డాక్ యార్డు ప్రధాన ద్వారం ఎదుట మహిళల ఆందోళన కొనసాగుతుంది. తమ భర్తల ప్రాణాలకు రక్షణ కావాలంటూ డాక్ యార్డ్ ఉద్యోగస్తుల భార్యలు ఆందోళన బాట పట్టారు. ఇటీవల నూతన వంతెన నిర్మాణం కోసం పోర్ట్ యాజమాన్యం రహదారిని మూసివేసింది. దీంతో ప్రత్నామాయ ఏర్పాటు చేసి నావికా దళానికి చెందిన ఎస్బీసీ నుండి రాకపోకలకు అనుమతి ఇవ్వాలంటూ సుమారు 200 మహిళలు రోడ్డెక్కారు. మల్కాపురం, సిందియా, రామకృష్ణాపురం ప్రాంతాలనుండి విధులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రోడ్డెక్కిన స్టీల్ ప్లాంట్ కార్మికులు
-
ఒకేసారి 4 వేల మంది తొలగింపు!.. రోడ్డెక్కిన ఉక్కు కార్మికులు
సాక్షి, విశాఖపట్నం: కాంట్రాక్టు కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరసనకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మహా పాదయాత్ర చేపట్టారు. స్టీల్ప్లాంట్ నుంచి వడ్లపూడి, కణితి, శ్రీనగర్, పాత గాజువాక, పెద గంట్యాడ వరకు పాదయాత్ర నిర్వహించారు.యాజమాన్యం నిర్ణయం వల్ల నాలుగు వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును పూర్తిస్థాయిలో నడపాలి. నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను చంద్రబాబు పవన్ నిలబెట్టుకోవాలి. స్టీల్ ప్లాంట్ను వెంటనే సెయిల్లో విలీనం చేయాలి. ప్లాంట్కు కావాల్సిన ముడి సరుకు ఇవ్వాలి. మూడు బ్లాస్ట్ ఫర్నిస్ను పూర్తిస్థాయిలో నడపాలి’’ అని కార్మికులు కోరుతున్నారు.కాగా, ప్లాంట్ను కాపాడతామని గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ప్లాంట్ నిర్వీర్యం అవుతుంటే చేష్టలుడిగి చూస్తోంది. స్ట్రాటజిక్ సేల్ పేరిట ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం వేస్తున్న అడుగులకు రాష్ట్ర ప్రభుత్వం మడుగులొత్తుతోంది.నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ రచ్చరచ్చ కావడంతో ఉక్కు యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయం తాత్కాలికమేనని, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు జరగొచ్చనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.దీని వెనక కూటమి ప్రభుత్వం కుయుక్తి ఉందని తెలుస్తోంది. ఒకే సారి తొలగిస్తే ఉద్యమాలు ఉధృతమవుతాయని.. విడతల వారీగా తొలగించాలని సూచించినట్లు సమాచారం. ఒకవైపు కార్మిక సంఘాలు, కార్మికులను మభ్యపెడుతూ.. మరోవైపు ప్రైవేటీకరణ చర్యలను ముమ్మరం చేసిన కేంద్ర ప్రభుత్వానికి అడ్డు చెప్పకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ప్రస్తుత పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి.ఇదీ చదవండి: తిరుమలలో మరోసారి చిరుత కలకలం -
సీఎంను తాకిన వైద్యుల నిరసన సెగ
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్విస్ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ పీహెచ్సీ వైద్యులు చేపట్టిన నిరసన సెగ సీఎం చంద్రబాబును తాకింది. బుధవారం విజయవాడలోని ఎన్డీఆర్ జిల్లా కలెక్టర్రేట్లో వరద బాధితులకు పరిహారం పంపిణీ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. దీంతో వందలాది పీహెచ్సీ వైద్యులు ఉదయాన్నే కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇన్సర్విస్ కోటా కుదింపు జీవో 85ను రద్దు చేయడంతో పాటు, ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ ఫ్ల కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ పరిసరాల్లో నిరసన తెలపడానికి వీల్లేదని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని వైద్యులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎంను కలిసి తమ సమస్యలు ఆయన దృష్టికి తీసుకువెళ్లే వరకూ అక్కడి నుంచి వెళ్లేది లేదని వైద్యులు తెగేసి చెప్పారు. సీఎంను కలవడానికి ఇంత మందిని అనుమతించబోమని, ఇద్దరు మాత్రమే రావాలని పోలీసులు చెప్పారు. పోలీసుల షరతుకు అంగీకరించి, ఇద్దరు వైద్యులే సీఎంను కలిశారు. మిగిలిన వైద్యులందరూ అక్కడే రోడ్డుపై గంటల తరబడి పడిగాపులు కాశారు. జీవో రద్దు చేయం వైద్యుల ప్రతినిధులు సీఎంను కలిసి జీవో 85 రద్దు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు. అయితే, జీవో 85ను రద్దు చేయడం కుదరదని సీఎం తేల్చి చెప్పినట్టు తెలిసింది. జీవోలో సవరణకు ఇప్పటికే సానుకూలత తెలిపామని అన్నట్లు సమాచారం. జీవో రద్దుకు పట్టుబడితే కుదరదని సున్నితంగా హెచ్చరించినట్టు వైద్యులు చెప్పారు.ఇన్సర్విస్ కోటా కుదించిన బాబు సర్కారు పీజీ వైద్య విద్యలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని పీహెచ్సీల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (సీఏఎస్)లుగా సేవలందించే ఎంబీబీఎస్ వైద్యులకు ఇన్సర్వీస్ రిజర్వేషన్ సౌకర్యం ఉంది. గత ప్రభుత్వం క్లినికల్ పీజీ కోర్సుల్లో 30 శాతం, నాన్–క్లినికల్ కోర్సుల్లో 50 శాతం రిజర్వేషన్ ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం క్లినికల్లో ఎంపిక చేసిన స్పెషాలిటీల్లో 15 శాతం, నాన్–క్లినికల్ కోర్సుల్లో 30 శాతానికి ఈ కోటా కుదించింది. దీంతో 2023–24లో క్లినికల్లో 389, నాన్–క్లినికల్లో 164 పీజీ సీట్లు పొందిన వైద్యులు, ఇప్పుడు క్లినికల్లో 270, నాన్ క్లినికల్లో 66 చొప్పున సీట్లను కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 10 నుంచి వైద్యులు ఉద్యమం చేపట్టారు. 15వ తేదీ నుంచి పీహెచ్సీల్లో వైద్య సేవలకు సైతం దూరంగా ఉన్నారు. -
రఘురామను సస్పెండ్ చెయ్యాలి
సాక్షి ప్రతినిధి, ఏలూరు/చిలకలపూడి (మచిలీపట్నం)/తణుకు అర్బన్/భీమవరం/పాలకొల్లు సెంట్రల్/నగరి/తిరుపతి కల్చరల్/మంగళగిరి/ కోటవురట్ల/కాకినాడ క్రైం : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుపాడులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫ్లెక్సీని చింపి ఆయన్ను అవమానించిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేయాలని దళిత సంఘాలు, నేతలు డిమాండ్ చేశారు. అలాగే ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం పలు చోట్ల రఘురామ దిష్టి బొమ్మను దహనం చేశారు. అలాగే దళిత డాక్టర్పై దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సత్యవేడు ఎమ్మెల్యేపై తక్షణం చర్యలు తీసుకున్న చంద్రబాబు.. రఘురామపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. దళిత వర్గాలకు ఒక న్యాయం, అగ్రవర్ణాల వారికి ఒక న్యాయమా అంటూ నిలదీశారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని దళిత సంఘాల నేతలు హెచ్చరించారు. పలుచోట్ల పోలీస్ స్టేషన్లలో దళిత నేతలు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి పశ్చిమ జిల్లా వ్యాప్తంగా నిరసనలుఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని ఉమ్మడి పశ్చిమ జిల్లావ్యాప్తంగా సోమవారం నిరసనలు వెల్లువెత్తాయి. టీడీపీ ఎమ్మెల్యే రఘురామ తీరుపై దళిత సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే అణచివేత ధోరణిలో ప్రభుత్వం పోలీసులతో కేసులు నమోదు చేయిస్తోందని దళిత నేతలు మండిపడ్డారు. అనేక నియోజకవర్గాల్లో రఘురామ దిష్టిబొమ్మలు దహనం చేశారు. అంబేడ్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. భీమవరంలో దళిత సంఘాలు తలపెట్టిన భారీ ధర్నాను అడ్డుకునేలా హౌస్అరెస్టులు కొనసాగాయి. రఘురామను బర్తరఫ్ చేయాలికృష్ణాజిల్లా మచిలీపట్నం ధర్నాచౌక్ వద్ద దళిత యాక్షన్ కమిటీ నాయకులు నిరసన తెలిపారు. రఘురామను ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధి జక్కుల ఆనంద్బాబు మాట్లాడుతూ.. ఎస్సీలను నోటికొచ్చినట్లు మాట్లాడి రఘురామకృష్ణరాజు అవమానించారన్నారు. ఆ ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే నమోదు చేయాలన్నారు. న్యాయవాదుల రాస్తారోకో.. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై దేశద్రోహం చట్టం కింద, దళిత వైద్యుడిపై దాడి చేసిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి వారిని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని ఆలిండియా పూలే–అంబేడ్కర్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు, న్యాయవాది పొట్ల సురేశ్ డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నా చేసిన వారిపై ప్రభుత్వం పోలీసులతో అరెస్టులు చేయిస్తోందని మండిపడ్డారు. కూటమి ఎమ్మెల్యేల తీరుకు నిరసనగా తణుకులో సోమవారం బార్ అసోసియేషన్ న్యాయవాదులు రాస్తారోకో నిర్వహించారు. కూటమి ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయాలి కూటమి ఎమ్మెల్యేల కుల దుహంకార చర్యలను నిరసిస్తూ అంబేడ్కర్ భవన్ అసోసియేషన్, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం తిరుపతిలోని బాలాజీ కాలనీలో పూలే విగ్రహం వద్ద ఎమ్మెల్యేల దిష్టి బొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్యేలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రఘురామపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాల సంఘాల రాష్ట్ర జేఏసీ కన్వీనర్ గుర్రం రామారావు డిమాండ్ చేశారు. సోమవారం మాల మహానాడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రఘురామపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘురామ దిష్టిబొమ్మ దహనంచిత్తూరు జిల్లా, నగరి బస్టాండు వద్ద అంబేడ్కర్ సర్కిల్లో ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం నేతలు రఘురామ కృష్ణరాజు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై నిందపడగానే సస్పెండ్ చేసిన చంద్రబాబు.. అంబేడ్కర్ను అవమానించిన రఘురామను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. రఘురామ, నానాజీపై కఠిన చర్యలు తీసుకోండిడా.బీఆర్ అంబేడ్కర్ను తీవ్రంగా అవమానించిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై, దళిత వైద్యుడిపై దాడి చేసిన కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కఠిన చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ఎం.అప్పలరాజు, అంబేడ్కర్ గ్లోబల్ మిషన్ నాయకుడు కంచా లోవరాజు డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే నానాజీపై నిరసనలు వద్దు..వైద్యులు, వైద్య విద్యార్థులకు పోలీస్, వైద్య శాఖల అధికారుల ఫోన్లుసాక్షి, అమరావతి: రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఉమామహేశ్వరావుపై దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన అనుచరులపై చర్యలు తీసుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ వ్యవహారాన్ని నీరుగార్చేందుకు కంకణం కట్టుకున్న ప్రభుత్వం తరఫున పోలీసులు, వైద్య శాఖ ఉన్నతాధికారులతో వైద్యులు, వైద్య విద్యార్థులకు ఫోన్లు చేయిస్తూ నిరసనలు ఆపాలంటూ ఒత్తిడి తెస్తోంది.ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారని.. ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయాలంటూ సయోధ్య కుదిర్చేందుకు పోలీసులు, వైద్య శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నామమాత్రపు సెక్షన్లతో కేసు నమోదు చేసి చేతులు దులుపుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై దాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో వైద్యులు, వైద్య విద్యార్థులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కళాశాలలు, ఆస్పత్రి ప్రాంగణంలో ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. వైద్యులకు రాష్ట్రంలో భద్రత లేకుండా పోతోందంటూ నినాదాలు చేశారు. ఊరుకుంటే.. ఉద్యమిస్తాండాక్టర్ ఉమామహేశ్వరరావుపై ఇంతటి దాష్టీకం జరిగినా ప్రభుత్వ అధినేతలెవరికీ చీమకుట్టినట్టయినా లేదని వైద్య సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. నానాజీని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దాడిలో పాల్గొన్న తూము బన్నీ సహా ఇతర అనుచరులను గుర్తించి శిక్షించాలని కోరారు. ఇంత జరుగుతున్నా పట్టనట్టు ఊరుకుంటే మాత్రం ఉద్యమిస్తామని హెచ్చరించారు. సోమవారం హోరు వానలో కాకినాడ జీజీహెచ్ వద్ద వైద్యులు నిరసన తెలిపారు. -
షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని రైతుల రాస్తారోకో
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎలాంటి షరతులు లేకుండా రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సోమవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని కామారెడ్డి– ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు రోడ్డుపై పాలు పోసి నిరసన వ్యక్తం చేశారు. గంటసేపు రైతులు బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. రైతు ప్రతినిధులు మాట్లాడుతూ రుణమాఫీ విషయంలో ప్రభుత్వం కొర్రీలు పెడుతూ రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు రైతుబంధు వేయలేదన్నారు. అన్ని రకాల ధాన్యానికి క్వింటాల్కు రూ. 500 చొప్పున బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాడి రైతులకు విజయ డెయిరీ నుంచి నాలుగు నెలల బిల్లులు రావాలని, వెంటనే వాటిని రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న తాడ్వాయి, గాంధారి ఎస్సైలు తమ సిబ్బందితో అక్కడకు చేరుకొని రైతుల ఆందోళనను విరమింపజేశారు. అనంతరం రైతులు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ రహిమొద్దీన్కు వినతిపత్రం అందజేశారు. -
AP:వరదబాధితులపై పోలీసుల దౌర్జన్యం
సాక్షి,విజయవాడ:వరద బాధితులపై పోలీసుల దౌర్జన్యం కొనసాగుతోంది. పరిహారం కోసం వరద బాధితులు రోడ్డెక్కారు.పరిహారం లెక్కల్లో అధికారులు గోల్మాల్ చేయడంతో సోమవారం(సెప్టెంబర్23) సాయంత్రం విజయవాడ కుమ్మరిపాలెంలో ఉద్రిక్తత నెలకొంది.పెద్ద ఎత్తున వరద బాధితులు ఆందోళనకు దిగారు.ఉదయం ఆర్ఆర్పేటలోనూ వరద బాధితులు సాయం కోసం ఆందోళన చేశారు.సాయంత్రం కుమ్మరిపాలెంలో వరద బాధితులు ఆందోళనకు దిగారు.ఆందోళన చేస్తున్నవారిపై పోలీసులు దౌర్జన్యం చేశారు.ఆందోళన చేస్తున్న మహిళలను తోసేశారు.ఆందోళన చేస్తే కేసులు పెడతామని వరద బాధితులను బెదిరించారు.దీంతో వరద బాధితులు,పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు డౌన్ డౌన్ అంటూ వరద బాధితులు నినాదాలు చేశారు.పోలీసులు,వరద బాధితులకు మధ్య పెనుగులాట చోటు చేసుకుంది.అర్హులైన వరద బాధితుల పేర్లను ప్రభుత్వం జాబితాలో చేర్చకపోవడం వల్లే ఘర్షణలు ఏర్పడ్డాయి. -
ఉక్కు ఉద్యమాలు..
-
ఇది రాజకీయ ఎత్తుగడల వైఫల్యం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గుండ్రంగా వేసిన ఖాళీ తెల్లని కుర్చీల ముందు కూర్చుని, వైద్యులతో భేటీ కోసం ‘వేచి వేచి వేచి’ చూసిన చిత్రం చాలా ఆసక్తిని పుట్టించింది. ప్రత్యేకించి దాని తర్వాత ముఖ్యమంత్రి చేతులు జోడించి, నిరసన తెలుపుతున్న వైద్యు లతో చర్చించే విషయమై ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడంలో జరిగిన వైఫల్యానికి క్షమాప ణలు చెప్పడం... నాటకీయంగా ఉద్వేగభరితంగా తాను ‘రాజీ నామాకు సిద్ధంగా ఉన్నాను’ అనే ఎత్తుగడను వేయడం మరీ విశేషం.వాస్తవానికి, ఆ క్షణమాత్రపు దృశ్యంలో ప్రదర్శితమైన ప్రహసనం ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి చేసిన ఈ వ్యాఖ్యలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. విశేషం ఏమంటే, ఇదే ప్రత్యక్ష ప్రసారం విషయంలోనే ఆ చర్చలు ప్రారంభం కావడానికి ముందే విఫలమయ్యాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలో యువ వైద్యురాలిపై జరిగిన హత్యాచారంపైనా... దాని వెంబడే చోటు చేసుకున్న తప్పుడు చర్యలు, వాటిని కప్పిపుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాల పైనా గత నెల రోజులకు పైగా ఆందోళన చేస్తున్న వైద్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రితో తమ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిందేనని ముందస్తు షరతు పెట్టారు. సుప్రీంకోర్టు ఈ కేసును ప్రత్యక్ష ప్రసారం చేయగలిగినప్పుడు, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం దానిపై విభేదించడానికి ఎటువంటి కారణం లేదని వాదిస్తూ, వారు ఈ డిమాండ్పై ఇప్పటికీ మొండిగా ఉన్నారు. అదే సమయంలో చర్చలను రికార్డ్ చేసి, సుప్రీంకోర్టు అను మతితో తర్వాత విడుదల చేయాలనే ప్రతిపాదనను వైద్యులు అంగీకరించలేదు.మమతా బెనర్జీ ఈ పనిని నిరసనల ప్రారంభంలోనే ఎందుకు చేయలేదని ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. ముడిచిన చేతులు, మధురమైన స్వరం, ప్రతిష్టంభనను ఛేదించలేక పోయినందుకు క్షమాపణ చెప్పడం, వైద్యుల కోసం రెండు గంటలకు పైగా వేచి ఉండటాన్ని నొక్కి చెప్పడం... బహుశా నేరం జరిగిన కొన్ని గంటలు లేక రోజులలో ఇదే విధానం పాటించి ఉంటే, ఇంత సంక్షోభం ఏర్పడేది కాదు. ఉద్య మాలలో పుట్టి, రూపుదిద్దుకున్న ఈ రాజకీయ నాయకురాలు ఇలా సహజ ప్రవృత్తి రాహిత్యాన్ని ప్రదర్శించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కోల్కతా పోలీసు చీఫ్ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రతిపాదించినప్పటికీ రాబోయే పండుగ సీజన్ కారణంగా తాను దానిని తిరస్కరించినట్లు ఆమె వెల్లడించడం మరింత అయోమయం కలిగించింది. ఆమె ప్రకటనపై స్పందిస్తూ ఒక యువ వైద్యుడు ఇలా అన్నాడు: ‘ప్రస్తుతం పండుగల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు?’ (ప్రభుత్వం అనంతరం కోల్కతా నగర కమిషనర్ను మార్చింది.) ముఖ్యమంత్రి మమతా బెనర్జీని విమర్శించడంలో భార తీయ జనతా పార్టీ రాష్ట్రంలో అందరికంటే ముందు ఉండ వచ్చు; కానీ, మణిపుర్ విషయానికి వస్తే, అక్కడ బీజేపీ ఏ సహజ ప్రవృత్తినీ ప్రదర్శించకపోవడం గురించి ఇలాంటి ప్రశ్న లనే ఆ పార్టీ నాయకత్వంపై సంధించవలసి ఉంటుంది.మళ్ళీ, స్పష్టంగా చెప్పాలంటే, 2023 మే నుండి హింసా త్మక జాతి ఘర్షణల్లో 200 మందికి పైగా మరణించిన మణి పుర్ రాష్ట్రానికీ, పశ్చిమ బెంగాల్లోని ఆర్జి కర్ హాస్పిటల్ కేసుకూ మధ్య నేను వాచ్యార్థంగా కూడా ఎలాంటి పోలికలను చూపడం లేదు. చిన్న, పెద్ద సంక్షోభ సమయాల్లో రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తారనే దానికే ఈ సారూప్యత పరి మితం. ఇంగితజ్ఞానం చాలా అవసరమైనప్పుడే అది వారికి లేకుండా పోయినట్లు కనిపిస్తుంది.మణిపుర్లో ఎన్. బీరేన్ సింగ్ను ముఖ్యమంత్రి స్థానం నుండి తొలగించడానికి బీజేపీ మొండిగా నిరాకరించడం ఏ రకంగానూ వివరించలేనిది. రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఆందో ళనకరంగా ఉందంటే, చాలామంది దీనిని అంతర్యుద్ధంతో పోల్చారు. అక్కడ మైతేయి, కుకీ సమాజాల మనుషులు ఒకరు ఆధిపత్యం వహించే భౌగోళిక ప్రాంతాలలోకి మరొకరు ప్రవేశించలేరు. జాతి సమూహాలను స్పష్టంగా వేరు చేసే ‘బఫర్ జోన్’ను ప్రమాదవశాత్తూ దాటిన కారణంగా సైన్యా నికి చెందిన ఒక మాజీ సైనికుడు వారం క్రితం హత్యకు గుర య్యాడు. ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చని పోయిన 11 మందిలో మహిళలు కూడా ఉన్నారు. రెండు వర్గాల ప్రజలు, రైతులు, విద్యార్థుల చేతుల్లో వేల సంఖ్యలో ఆయుధాలు ఉన్నాయి.ప్రతి ఒక్కరికి దేశభక్తి పరీక్షలను నిర్వహించే కీ–బోర్డ్ జాతీయవాదులు, స్వల్పంగా అసమ్మతి వ్యక్తం చేసే ప్రజలను జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయడానికి వెనుకాడరు. అలాంటిది ఒక మాజీ సైనికుడు అయిన హవల్దార్ లిమ్ఖోలాల్ మాతే భార్య ‘నా భర్త భారతదేశం కోసం పోరాడాడు, కానీ తనను ఒక జంతువులా చంపేశారు’ అని ఏడుస్తూ చెప్పిన ప్పుడు, జాతీయవాదానికి స్వీయ నియమిత మధ్యవర్తులందరూ ఎక్కడ ఉన్నారు? మణిపుర్లో రాజకీయ పార్టీలు పతనమయ్యాయి. ఈ గొడవలో ముఖ్యమంత్రి పాత్రపై విచారణ జరిపించాలని కోరిన పది మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు బీజేపీకి చెందిన వారే. హింస బయటినుంచి ఉన్నప్పుడు, ఉదాహరణకు తిరుగుబాట్లు లేదా యుద్ధ సమయంలో రాజకీయ నాయ కత్వం కొనసాగింపును నేను అర్థం చేసుకోగలను. కానీ ఇది తనపై తాను యుద్ధంలో ఉన్న రాష్ట్రం. ఇది శాంతి భద్రతల వైఫల్యం. కానీ ఇది అన్నింటికంటే, రాజకీయాల వైఫల్యం. ముఖ్యమంత్రిని తొలగించడం అనేది స్పష్టంగా సరైన పని కావడమే కాకుండా, ఘర్షణ పడుతున్న పార్టీలను చర్చల బల్ల వద్దకు తీసుకురావడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. పశ్చిమ బెంగాల్ నుండి మణిపుర్ వరకు, తప్పక చేయ వలసిన చర్యే చాలాసార్లు సరైనది అవుతుంది. కానీ అలా చేయకపోగా దాన్ని ప్రతిఘటించడమే ఇక బాగు చేయలేని పరిస్థితికి నెట్టినట్టు అవుతోంది.బర్ఖా దత్వ్యాసకర్త ప్రముఖ జర్నలిస్టు, రచయిత(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
3 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల నిరసన..
-
వరద సాయంలోనూ టీడీపీ నేతల పక్షపాతం
-
వైద్యుల నిరసన... చలో విజయవాడ
-
4 రోజుల నిరసనకు 4ఏళ్ల శిక్ష
భూమిపై వాతావరణ మార్పులు, కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల తవ్వకానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నాలుగు రోజులపాటు శాంతియుతంగా నిరసన తెలిపిన నలుగురు సామాజిక కార్యకర్తలకు నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష పడింది. మరో కార్యకర్తకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. పురాతన ప్రజాస్వామ్య దేశమని చెప్పుకొనే యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. కోర్టు తీర్పును ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తప్పుపడుతున్నారు. యూకేలోని ఉత్తర సముద్రంలో చమురు తవ్వకాలకు 2022లో అప్పటి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. లైసెన్స్లు ఇచ్చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2022 నవంబర్లో ‘జస్ట్ స్టాప్ ఆయిల్’అనే నినాదంతో సామాజిక కార్యకర్తలు నిరసన బాటపట్టారు. అనుమతులు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమాలను 22 ఏళ్ల గ్రెస్సీ గెథిన్ అనే యువతి ముందుండి నడిపించింది. ఈ ఉద్యమం పలువురిని ఆకర్శించడంతో వారు ఇందులో భాగస్వాములయ్యారు. భూగోళాన్ని కలుషితం చేసే చమురు తవ్వకాలు వద్దంటూ నినదించారు. లండన్ చుట్టూ ఉన్న మేజర్ రింగ్ రోడ్డుపై నాలుగు రోజులపాటు నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. చెట్లు, భవనాలపైకి ఎక్కి బిగ్గరగా నినాదాలు చేశారు. ఇదంతా పూర్తిగా శాంతియుతంగానే సాగింది. హింస అనే మాటే లేదు. ఆస్తులకు గానీ, ప్రజలకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదు.లక్షల డాలర్ల నష్టం వాటిల్లిందట! రింగ్ రోడ్డుపై బైఠాయింపులు, నిరసనలతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపిస్తూ గ్రెస్సీ గెథిన్తోపాటు పలువురు సామాజిక కార్యకర్తలపై పోలీసులు అభియోగాలు మోపారు. దాదాపు రెండేళ్లపాటు లండన్ కోర్టులో విచారణ జరిగింది. ‘జస్ట్ స్టాప్ ఆయిల్’నిరసనల వల్ల నాలుగు రోజులపాటు రింగ్ రోడ్డుపై 7 లక్షలకుపైగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని పోలీసుల తరఫున ప్రాసిక్యూటర్లు వాదించారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు 9.80 లక్షల డాలర్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. రోడ్డుపై పరిస్థితిని చక్కదిద్దడానికి పోలీసులు 1.3 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వచి్చందని తెలిపారు. నిరసనకారులు కుట్రపూరితంగానే ప్రజలకు ఇక్కట్లు కలుగజేశారని ఆరోపించారు. ప్రాసిక్యూటర్ల వాదనతో లండన్ కోర్టు ఏకీభవించింది. గ్రెస్సీ గెథిన్తోపాటు లూయిసీ లాంకాస్టర్, డేనియల్ షా, లూసియాకు నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష విధిస్తూ ఈ ఏడాది జూలైలో తీర్పు వెలువరించింది. ‘జస్ట్ స్టాప్ ఆయిల్’సహా వ్యవస్థాపకుడు రోజర్ హల్లామ్ ఐదేళ్లపాటు జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం దోషులంతా జైలులో ఉన్నారు. వారి విడుదల కోసం సామాజిక కార్యకర్తలు పోరాడుతున్నారు. న్యాయం పోరాటం కొనసాగిస్తున్నారు. అహింసాయుతంగా జరిగిన నిరసనలకు నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష విధించడం యూకే చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. శాంతియుత నిరసనలకు సైతం జైలుశిక్ష విధించేలా యూకేలో రెండు వివాదాస్పద చట్టాలు అమల్లో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్టీల్ ప్లాంట్ కోసం మహాధర్నా
-
నేటి నుంచి ఏపీ పీహెచ్సీలలో వైద్య సేవలు బంద్
-
ఈ భోజనం తినేదెలా?
అఎస్.రాయవరం: అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం యూపీ స్కూల్లో మధ్యాహ్న భోజనం అత్యంత దారుణంగా ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మెనూ ప్రకారం వండాల్సిన సాంబారు కిచిడీని మాడ్చేసి వడ్డించడంతో విద్యార్థులు దాన్ని తినలేక పారబోశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వడ్డించిన భోజనాన్ని పరిశీలించారు. ఆరోగ్యంగా ఎదగాల్సిన పిల్లలకు ఇంత దారుణమైన భోజనం పెడతారా? దీన్ని తినేదెలా? అని మండిపడ్డారు. పేరెంట్స్ కమిటీ సమావేశం రోజే.. ఇక గురువారం మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు భోజనం తినేసరికి మాడు వాసన రావడంతో పడేసి ఆందోళనకు దిగారు. అదే సమయంలో పేరెంట్స్ కమిటీ సమావేశం సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అందుబాటులో ఉండటంతో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను, ఉపాధ్యాయులను నిలదీశారు. తరచూ భోజనం నాసిరకంగా పెడుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారని ఆరోపించారు. పేరెంట్స్ సమావేశం ఉన్నప్పుడే ఇంత దారుణంగా ఉంటే సాధారణ రోజుల్లో ఇంకెలా ఉంటుందో తెలుస్తోందన్నారు. దీంతో ప్రధానోపాధ్యాయుడు సంతోష్ స్పందిస్తూ.. విద్యార్థులకు మంచిగా ఆహారం మళ్లీ వండిపెట్టాలని నిర్వాహకులను ఆదేశించారు. తమకిచ్చే గుడ్లు కూడా బాగోలేవని విద్యార్థులు చెప్పగా, ప్రభుత్వం అలాంటి గుడ్లనే సరఫరా చేస్తున్నపుడు, తామేం చేయగలమని తల్లిదండ్రులతో హెచ్ఎం చెప్పారు. ఇక పాఠశాలలో వసతులూ బాగోలేవని, మైదానం దారుణంగా తయారైందని, ఇలా ఉంటే పిల్లల పరిస్థితి ఏంటని ప్రశి్నంచారు. చివరికి.. నిర్వాహకులు మళ్లీ భోజనం వండి పెట్టడంతో ఆందోళన ముగిసింది. -
తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. మహిళా కాంగ్రెస్ నేతల నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ మహిళా శ్రేణులు తెలంగాణ భవన్ వద్దకు భారీగా చేరుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలతో ఆందోళన చేపట్టారు. కౌశిక్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీపీసీసీ మహిళా నేతలు డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే ఫోటోలు దగ్దం చేశారు. మహిళలపై కౌశిక్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడాడడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ లాంటి వల్లనే వదల్లేదని, కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ వద్ద భారీ పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.కాగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీని కాంగ్రెస్ ప్రభుత్వం పీఏసీ చైర్మన్గా ప్రకటించినప్పటి నుంచి విమర్శల పర్వం మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి తన అనుచరులతో కలిసి వెళ్లారు.అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకోగా.. గాంధీ అనుచరులు పోలీసులను తోసుకుంటూ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో గేటు దూకి కౌశిక్ రెడ్డి ఇంట్లోకి చొచ్చుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు.. అక్కడే ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. కోడిగుడ్లు, టమాటాలు విసిరేశారు. ఇంటి అద్దాలను కుర్చీలతో ఇంటి అద్దాలను పగులగొట్టారు.చదవండి: పక్కా ప్రణాళికతోనే కౌశిక్రెడ్డిపై దాడి: హరీష్రావు -
సిక్కులపై వ్యాఖ్యలు.. రాహుల్ నివాసం ఎదుట భారీ నిరసనలు
ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం ఎదుట సిక్కులు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. జనపథ్ రోడ్డులోని ఆయన నివాసం వద్ద పోలీసుల బారికేడ్లు ఏర్పాటు చేయగా.. వాటిని బద్దలు కొట్టేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు.ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. భారత్ లో సిక్కులు తలపాగా, కడియాలు ధరించేందుకు అనుమతి ఉందా అంటూ ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గురుద్వారాలను సందర్శించడానికి అనుమతిస్తారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో ఇదే పోరాటం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే దేశంలో సిక్కుల భద్రత గురించి మాట్లాడిన మాటలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.#WATCH | Delhi: Sikh Prakoshth of BJP Delhi holds protest against Lok Sabha LoP & Congress MP Rahul Gandhi outside his residence over his statement on the Sikh community. pic.twitter.com/JWateZ1J9B— ANI (@ANI) September 11, 2024ఈ క్రమంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పలు సిక్కు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం ఎదుట బీజేపీ మద్దతు కలిగిన పలు సిక్కు గ్రూపులు నిరసనలు చేపట్టారు. సిక్కుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రాహుల్ శిక్కులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.Sikhs protest outside Rahul Gandhi's house over his statement regarding Sikhs.Rahul Gandhi murdabad slogans were raised! 👏🏻👏🏻 pic.twitter.com/hx0ILP89YK— Mr Sinha (@MrSinha_) September 11, 2024 ఈ వ్యాఖ్యలను ఇప్పటికే బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. విదేశాల వేదికగా రాహుల్ ఎల్లప్పుడూ భారత్ను అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడుతోంది. -
Doctors Protest: సుప్రీంకోర్టు చెప్పినా వినరా?
కోల్కతాలోని ఆర్జీకర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై డాక్లర్లు తమ నిరసనలు రోజురోజుకీ ఉధృతం చేస్తున్నారు. ఓ వైపు వైద్యులు వెంటనే విధుల్లోకి చేరాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు ఆందోళనలు విరమించి, విధుల్లో చేరి రోగులకు సేవలు అందించాలని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. విధుల్లో చేరని వారిపై చర్యలు తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని కూడా స్పష్టం చేసింది.అయినప్పటికీ వైద్యులు తమ ఆందోళనలపై వెనక్కి తగ్గడం లేదు. ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు విధుల్లో చేరే ప్రసక్తేలేదంటూ వైద్యులు చెబుతున్నారు.మరోవైపు సుప్రీం ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత బెంగాల్ ప్రభుత్వం ముందు కొత్తగా డెడ్లైన్ పెట్టారు. నేటి సాయంత్రం 5లోగా తమ అయిదు డిమాండ్లు నెరవేర్చాలని అల్టిమేటం ఇచ్చారు. లేని పక్షంలో ఆరోగ్య సచివాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.#WATCH | West Bengal: Doctors hold protest near Swasthya Bhavan in Kolkata, demanding justice for RG Kar medical college and hospital rape and murder incident. pic.twitter.com/PkINPyHmEI— ANI (@ANI) September 10, 2024ఈ క్రమంలో వందలాది మంది జూనియర్ వైద్యులు కోల్కతా శివార్లలోని సాల్ట్ లేక్లో ఉన్న స్వస్థ భవన్ వైపు ర్యాలీగా కదులుతున్నారు. స్వస్థ భవన్ ప్రవేశద్వారం వద్ద ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తాము విధించిన షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన తర్వాతే తిరిగి విధుల్లో చేరుతామని ప్రకటించారు.అయితే వైద్యుల అయిదు డిమాండ్లలో కోల్కతా సిటీ పోలీస్ చీఫ్ వినీత్ గోయల్తో సహా, ఆరోగ్య కార్యదర్శి, హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్, వైద్య విద్య డైరెక్టర్లను తొలగించాలని కోరుతున్నారు. న్యాయస్థానం విధించిన డెడ్లైన్ పూర్తి అయినా.. వైద్యులు మాత్రం ఇంకా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. -
అభయ ఘటనపై ప్రపంచ దేశాల్లో వెల్లువెత్తిన ఆందోళనలు
కోల్కతా ఆర్జీకార్ ఆస్పత్రి అభయ ఘటనలో న్యాయం చేయాలనే డిమాండ్లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అభయకు మద్దతుగా భారత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాల్లో 130 నగరాల్లో ప్రవాస భారతీయులు ఆందోళన చేపట్టారు.జపాన్,ఆస్ట్రేలియా,తైవాన్,సింగపూర్,యూరప్ దేశాలతో పాటు అమెరికాలోని 60 ప్రాంతాల్లో అభయ కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో జరిగిన నిరసన కార్యక్రమంలో నేరాలకు జవాబుదారీతనం, భారతీయ మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రవాస భారతీయులు నల్ల దుస్తులు ధరించిన మహిళలు ఆందోళన తెలిపారు.ఈ సందర్భంగా డ్యూటీలో ఉన్న అభయపై జరిగిన దారుణం ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. మానవ జీవితం పట్ల నిర్దాక్షిణ్యం,క్రూరత్వం,నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం అని ఆందోళన కారులు మండిపడుతున్నారు. -
ఆందోళనలతో అట్టుడుకుతున్న పశ్చిమ బెంగాల్
పశ్చిమ బెంగాల్ ఆందోళనతో అట్టుడికిపోతుంది. అభయ ఘటనపై త్వరగా న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ రాజధాని కోల్కతాలో ‘ది బెంగాల్ జూనియర్ డాక్టర్ ఫ్రంట్’ ఆందోళనకు పిలుపునిచ్చింది. సంఘం పిలుపు మేరకు బుధవారం రాత్రి వైద్యులు రోడ్డెక్కారు. ఆమెకు సంఘీభావం తెలిపేందుకు లైట్లన్ని ఆర్పేసి కొవ్వొత్తులు, కాగడాలు, సెల్ఫోన్ లైట్లు వెలిగించారు. దీంతో కోల్కతా మొత్తం చీకటిమయమైంది.రాత్రి 9 గంటలకు నగరంలోని ప్రముఖ ప్రాంతాలైన విక్టోరియా మెమోరియల్, రాజ్ భవన్తో పాటు ఇతర ప్రాంతాల్లోని ప్రజలు వైద్యురాలికి అండగా నిలిచారు. లైట్లు ఆఫ్ చేసి సంఘీభావం తెలిపారు. వీరితో పాటు గవర్నర్ సీవీ ఆనంద బోస్ సంఘీభావం తెలిపేందుకు రాజ్భవన్లో లైట్లు ఆఫ్ చేశారు. కొవ్వొత్తులతో వీధుల్లోకి వచ్చారు.కోల్కతాలో శ్యాంబాజార్, మౌలాలి, న్యూ టౌన్ బిస్వా బంగ్లా గేట్, రాష్బెహారీ క్రాసింగ్, బెహలా, గరియా, బల్లిగంజ్, హజ్రా క్రాసింగ్, జాదవ్పూర్ 8బీ బస్ స్టాండ్తో పాటు బస్టాండ్తో సహా ప్రముఖ కూడళ్ల వద్ద నిరసనలు జరిగాయి. వాతావారణ కేంద్రం వద్ద జరిగిన ఆందోళనలో అభయ తల్లిదండ్రులు పాల్గొన్నారు.మరోవైపు బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ లైట్ దేర్ బి జస్టిస్..లెట్ దేర్ బీ జస్టిస్ పేరుతో పిలుపునిచ్చిన ఆందోళనతో ఢిల్లీలోనూ నిరసనలు జరిగాయి. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి, ఎయిమ్స్ వైద్యులు క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహించారు. న్యాయం ఆలస్యం కాకుండా కేసును త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.సందీప్ ఘోష్ అరెస్ట్అభయ కేసులో విమర్శలు ఎదుర్కొంటున్న సందీప్ ఘోష్ను సీబీఐ అరెస్ట్ చేసింది. దాదాపు 15 రోజులుగా ఘోష్ను విచారించిన సీబీఐ అధికారులు సోమవారం(సెప్టెంబర్ 02) అరెస్ట్ చేశారు. సందీప్ ఘోష్ ఫిబ్రవరి 2021 -సెప్టెంబర్ 2023 మధ్య ఆర్జీ కార్ ప్రిన్సిపల్గా పనిచేసే సమయంలో మృతదేహాలను అక్రమంగా విక్రయించడం, బయోమెడికల్ వ్యర్థాల అక్రమ రవాణా, పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం విద్యార్థులను లంచాల కోసం ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు అతనిపై ఉన్నాయి. -
ఆస్తులు, అంతస్తులు ఏం అడగలేదు..
-
Kolkata: పోలీస్ కమిషనర్ రాజీనామా కోరుతూ రెండో రోజూ ర్యాలీ
కోల్కతా: కోల్కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో యవ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన దేశమంతటినీ కుదిపేసింది. ఈ ఘటనను నిరసిస్తూ పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కోల్కతాలోని వివిధ వైద్య కళాశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. మంగళవారం రెండవ రోజున కూడా నిరసన చేపట్టిన వైద్య విద్యార్థులు లాల్బజార్లోని కోల్కతా పోలీస్ హెడ్క్వార్టర్స్కు ర్యాలీగా తరలివెళ్లే ప్రయత్నం చేశారు. దీనిలో వివిధ విద్యాసంస్థల విద్యార్థులు కూడా పాల్గొన్నారు. సోమవారం రాత్రంతా విద్యార్థులు బీబీ గంగూలీ వీధిలో నిరసన చేపట్టారు. ఈ నేపధ్యంలో బీబీ గంగూలీ స్ట్రీట్లో పోలీసులు భారీ సంఖ్యలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.జూనియర్ డాక్టర్లు వెన్నెముక అస్థిపంజరం, ఎర్ర గులాబీలను చూపుతూ ర్యాలీలో నిరసన చేపట్టారు. నిరసన చేపట్టిన వైద్యులు మీడియాతో మాట్లాడుతూ ‘కోల్కతా పోలీసులు మమ్మల్ని చూసి భయపడిపోయారు. వారు మమ్మల్ని ఆపడానికి తొమ్మిది అడుగుల ఎత్తయిన అడ్డంకులు పెట్టారు. లాల్బజార్కు వెళ్లి పోలీసు కమిషనర్ను కలిసేందుకు అనుమతించే వరకు మా నిరసన కొనసాగుతుంది. అప్పటి వరకు మేం ఇక్కడే ధర్నా చేస్తూనే ఉంటాం’ అని తెలిపారు. -
అభయ ఘటన: నిరసనలో మహిళకు లైంగిక వేధింపులు
కోల్కతా అభయ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటన జరిగిన రోజులు గడుస్తున్నా ఆందోళనలతో దేశం అట్టుడికిపోతుంది. బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.ఈ తరుణంలో అభయకు మద్దతుగా కోల్కతాలో ‘అమ్ర తిలోత్తోమా’ పేరుతో పలువురు నిరసన చేపట్టారు. అయితే ఈ నిరసనల్లో ఓ మానవ మృగం బరి తెగించాడు. మానవత్వం మరిచి పోయి రద్దీగా ఉండే ఎస్ప్లానేడ్ క్రాసింగ్ సమీపంలో నిరసనలో పాల్గొన్న ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.చదవండి : ఆర్జీకార్ ఆస్పత్రికి సీబీఐ అధికారులు.. ఏం చేశారంటేబాధితురాలు కేకలు వేయడంతో నిరసన కారులు అప్రమత్తయ్యారు. నిందితుణ్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. అయితే నిరసన ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులు మాత్రం నిందితుడు స్థానికుడేనని, మతిస్థిమితం లేదని విడిచిపెట్టగా.. పోలీసులు తీరుపై నిరసన కారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.వేధింపులకు పాల్పడిన నిందితుణ్ని ఎలా వదిలేస్తారని ప్రశ్నిస్తూ ఆందోళన చేపట్టారు. నిందితులు, సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 79 కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఘటన జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. -
మీ బిడ్డగా అండగా ఉంటా: వినేశ్ ఫొగట్
ఢిల్లీ: మీ బిడ్డగా రైతులందరికీ అండగా ఉంటానని, తాను రైతు కుటుంబంలో జన్మించినందుకు గర్వపడుతున్నట్లు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ తెలిపారు. శనివారం రైతుల నిరసనల్లో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఢిల్లీ శివారులోని శంభు సరిహద్దులో రైతులు చేపట్టిన నిరసన నేటికి 200ల రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా వినేశ్ రైతుల నిరసన కార్యక్రమంలో పాల్గొని తన సంఘీభావాన్ని తెలియజేశారు. రైతు ఉద్యమ మద్దతుదారులు ఆమెను పూలమాలలతో సత్కరించారు. అనంతరం ఆమె రైతులు చేపట్టిన నిరసనను ఉద్దేశించి మాట్లడారు.‘‘ నేను ఓ రైతు కుటుంబంలో జన్మించినందుకు చాలా అదృష్టవంతురాలిని. మీ బిడ్డగా నేను రైతులకు చివరిదాకా అండగా ఉంటాను.మన హక్కులను పట్టించుకోవడానికి ఎవరూ ముందుకు రావటం లేదు.అందుకే మన హక్కులు కోసం పోరాడుదాం. మీరంతా మీ హక్కల విషయంలో హామీ పొందిన తర్వాతే ఇళ్ల చేరాలని దేవుడుని కోరుకుంటాన్నా. ప్రభుత్వం రైతుల డిమాండ్లను నెరవేర్చాలి. రైతులు చాలా కాలంగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం ఆందోళనకరం.200 రోజుల నుంచి రైతులు నిరసనలు తెలుపుతున్నారు. రైతులు కొనసాగిస్తున్న నిరసనలు హక్కలు సాధించుకోవాలనే వారికి చాలా స్ఫూర్తిదాయకం. నా ప్రధాన లక్ష్యం హక్కుల కోసం పోరాడుతున్న రైతులకు మద్దతుగా నిలవటం’ అని అన్నారు.పంటలకు మద్దతు ధర డిమాండ్ చేస్తూ రైతుల చేపట్టిన ఢిల్లీ మార్చ్ను పోలీసులు, అధికారులు శంభు సరిహద్దులో అడ్డుకోవటంతో ఫిబ్రవరి 13 నుంచి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నుంచి మద్దతు ధర కల్పిస్తామనే చట్టపరమైన గ్యారంటీని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్లో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ నిర్ణీత 50 కిలోలకుగాను 100 గ్రాములు అదనంగా బరువు ఉండటంతో పతకం చేజారిన విషయం తెలిసిందే. ఈ సమయంలో సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు. -
గుడ్లవల్లేరులో ఉద్రిక్తత..వైస్సార్సీపీ మహిళా నేతల అడ్డగింత
సాక్షి,కృష్ణాజిల్లా: కృష్ణాజిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలేజీలోపలికి వెళ్లకుండా వైఎస్సార్సీపీ నేతలను శుక్రవారం(ఆగస్టు30) సాయంత్రం పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణాజిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక,ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి,వైఎస్సార్సీపీ మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు.కాలేజీ వద్ద ఆంక్షలు విధించిన పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ మహిళా నేతలు ఫైర్ అయ్యారు. బాధిత విద్యార్థులతో మాట్లాడటంతో పాటు వారి ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వైఎస్సార్సీపీ నేతల బృందం కాలేజీవద్దకు వెళ్లింది. కాలేజీ హాస్టల్లో రహస్య కెమెరాలతో అమ్మాయిల వీడియోలు చిత్రీకరిస్తున్నారన్న ఆరోపణలపై విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. -
వాళ్లనెప్పుడూ బెదిరించలేదు: మమతా బెనర్జీ
కోల్కతా: తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా సంస్థలు తప్పుగా వక్రీకరించాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. బుధవారం పార్టీ విద్యార్థి విభాగం కార్యక్రమంలో చేసిన ప్రసంగంపై కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశాయని ‘ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చారామె. తాను డాక్టర్లను బెందిరించలేదని బీజేపీ ఆరోపణలకు సీఎం మమత కౌంటర్ ఇచ్చారు. ‘నేను వైద్య విద్యార్థులు, ప్రజా సంఘాల ఉద్యమాలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇదే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. వారి ఉద్యమానికి నేను సంపూర్ణ మద్దతు ఇస్తున్నా. నాపై ఆరోపణలు చేసినవారిని నేను ఎప్పుడూ బెదిరించలేదు. నేను బెదింరించినట్లు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యం. నేను బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ మద్దతుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బెదిరిస్తున్నారు. అరాచకం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే నేను బీజేపీ వాళ్లకు వ్యతిరేకంగా నా గళాన్ని వినిపించాను. నా ప్రసంగంలో ఉపయోగించిన పదాలు శ్రీ రామకృష్ణ పరమహంసకు సంబంధించినవి అని స్పష్టం చేశాను. సాధువు సైతం కొన్ని సమయాల్లో స్వరం పెంచాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. నేరాలు, నేరాలు జరిగినప్పుడు నిరసన గళం వినిపించాలని శ్రీరామకృష్ణ ప్రస్తావన తీసుకొని మాట్లాడాను’ అని మమత స్పష్టం చేశారు.I detect a malicious disinformation campaign in some print, electronic and digital media which has been unleashed with reference to a speech that I made in our students' programme yesterday. Let me most emphatically clarify that I have not uttered a single word against the…— Mamata Banerjee (@MamataOfficial) August 29, 2024 అయితే బుధవారం సీఎం మమత బెనర్జీ తన ప్రసంగం డాక్టర్లను బెదిస్తున్నట్లు ఉందని బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపణలు చేశారు. రాబోయే రోజుల్లో టీఎంసీ విద్యార్థి విభాగంలోని విద్యార్థుల పని కుట్రదారుల ముసుగు విప్పడం, వారిని భయపెట్టడమని సీఎం మమత అన్నారని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యతో ఆమె నిరసన తెలిపే డాక్టర్లను బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. -
నిందితులను శిక్షించేందుకు 10 రోజుల్లో చట్టం: సీఎం మమత
Updates బెంగాల్లో బీజీపీ బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ‘‘వచ్చే వారం అసెంబ్లీ సమావేశాన్ని జరిపించి నిందితులకు ఉరిశిక్షను నిర్ధారించడానికి 10 రోజుల్లో బిల్లును ఆమోదిస్తాం. ఆ బిల్లును గవర్నర్కు పంపుతాము. ఆయన ఆమోదించకపోతే మేము రాజ్భవన్ ముందు కూర్చొని నిరసన తెలుపుతాం. ఈ బిల్లు తప్పక ఆమోదించబడుతుంది. గవర్నర్ ఈసారి తన జవాబుదారీతనం నుంచి తప్పించులేరు’అని మమత స్పష్టం చేశారు.Kolkata | West Bengal CM Mamata Banerjee says, "Next week, we will call an Assembly session and pass a Bill within 10 days to ensure capital punishment for rapists. We will send this Bill to the Governor. If he doesn't pass, we will sit outside Raj Bhavan. This Bill must be… pic.twitter.com/GQFPvTStZX— ANI (@ANI) August 28, 2024 బీజేపీ బంద్లో భాగంగా బీజేపీ కార్యకర్తలు అసన్సోల్ రైల్వే స్టేషన్ పట్టాలపై కూర్చొని నిరసన తెలిపారు.#WATCH | Asansol, West Bengal: BJP workers stage a protest demanding justice for woman doctor who was raped and murdered at RG Kar Medical College and Hospital pic.twitter.com/ZBKJzdOYuG— ANI (@ANI) August 28, 2024 బెంగాల్ బీజేపీ బంద్ నిరసనలో కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. ‘‘ఏడు రోజుల పాటుచేసే ధర్నాకు కోల్కతా హైకోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి ధర్నా ప్రారంభిస్తాం. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. పోలీసులు కాల్పులు ఆపలేరు. బీజేపీ నిరసనను అడ్డుకుంటారు. హత్యాచార ఘటన నిందితును అరెస్ట్ చేయరు. కానీ బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తారు’’ అని అన్నారు. #WATCH | Union Minister and West Bengal BJP President Sukanta Majumdar says, "Kolkata HC has given us the permission for seven-day Dharna. We will start it from tomorrow...We welcome their verdict...There is no democracy here, police cannot stop firing but only stop BJP's… https://t.co/5ASm6Tg990 pic.twitter.com/zfzKuGmIK1— ANI (@ANI) August 28, 2024 కోల్కతాలో 12 గంటల బీజేపీ బంద్లో బీజేపీ నేత కారుపై జరిగిన కాల్పుల్లో డ్రైవర్ మృతి చెందాడు.#WATCH | West Bengal: Arjun Singh, BJP leader says, "Priyangu Pandey is our party leader. Today his car was attacked...and firing was done...The driver has been shot...7 round firing was done...This was done in the presence of the ACP...Planning was done to kill Priyangu… https://t.co/WRreN8Hfiu pic.twitter.com/ZA7laPZDi3— ANI (@ANI) August 28, 2024 కోల్కతాలో 12 గంటల బీజేపీ బంద్ కొనసాగుతోంది. బంద్ సందర్భంగా పోలీసుల తీరు నిరసిస్తూ.. బీజేపీ చేపట్టిన ర్యాలీలో బెంగాల్ బీజేపీ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ పాల్గొన్నారు.#WATCH | Kolkata: Union Minister and West Bengal BJP President Sukanta Majumdar joins the protest. BJP has called for a 12-hour 'Bengal Bandh'. (Visuals from Baguiati Mor) pic.twitter.com/n4uXjilIQE— ANI (@ANI) August 28, 2024 బెంగాల్ ఉత్తర 24 పరగణాలులో భాట్పరా ప్రాంతంలో బీజేపీ నేత ప్రియాంగు పాండే కారుపై కాల్పులు, దాడి ఘటనలో ఇద్దరు గాయపడ్డారు.West Bengal | Two people got injured in the attack and firing incident on the BJP leader Priyangu Pandey's car, earlier today, in Bhatpara of North 24 Parganas pic.twitter.com/MO2x3vxabB— ANI (@ANI) August 28, 2024 బీజేపీ బంద్ హింసాత్మకంగా మారింది. తమ పార్టీ నేత ప్రియాంగు పాండే కారుపై కాల్పులు జరిగాయని బీజేపీ నేత అర్జున్ సింగ్ తెలిపారు. ‘ప్రియాంగు కారుపై ఏడు రౌండ్ల కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు ఏసీపీ సమక్షంలోనే జరిగాయి. ప్రియాంగు పాండేని చంపేందుకు ప్లాన్ చేశారు. టీఎంసీ ఇలాంటి పనులు చేస్తోంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా, ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి’అని అన్నారు.#WATCH | West Bengal: Arjun Singh, BJP leader says, "Priyangu Pandey is our party leader. Today his car was attacked...and firing was done...The driver has been shot...7 round firing was done...This was done in the presence of the ACP...Planning was done to kill Priyangu… https://t.co/WRreN8Hfiu pic.twitter.com/ZA7laPZDi3— ANI (@ANI) August 28, 2024 "Bombs thrown, vehicle fired on": BJP's Priyangu Pandey claims TMC workers attacked him during Bengal BandhRead @ANI Story | https://t.co/GUPWv28WrO#BJP #TMC #BengalBandh #PriyanguPandey pic.twitter.com/TGlNUNugOg— ANI Digital (@ani_digital) August 28, 2024 పశ్చిమ బెంగాల్లో బీజేపీ పిలుపునిచ్చిన బంద్లో భాగంగా నందిగ్రామ్లో పార్టీ కార్యకర్తలతో సువేందు అధికారి నిరసనలో పాల్గొన్నారు. #WATCH | Nandigram | West Bengal LoP Suvendu Adhikari joins BJP's protest, call for 12-hour 'Bengal Bandh'.12-hour 'Bengal Bandh' has been called by the BJP to protest against the state government after the police used lathi charge and tear gas on protestors during Nabanna… pic.twitter.com/iLDff6ra2H— ANI (@ANI) August 28, 2024 కోల్కతా బాటా చౌక్లో బంద్ చేపట్టిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. బంద్లో పాల్గొన్న బీజేపీ నేత లాకెట్ ఛటర్జీని పోలీసులు అరెస్ట్ చేశారు.#WATCH | West Bengal | Police detains protesting BJP party workers at Kolkata's Bata Chowk12-hour 'Bengal Bandh' has been called by the BJP to protest against the state government after the police used lathi charge and tear gas on protestors during Nabanna Abhiyan, yesterday pic.twitter.com/vt7MaQjZCv— ANI (@ANI) August 28, 2024 #WATCH | West Bengal | Police detains BJP leader Locket Chatterjee who joined protest after BJP's call for 12-hour 'Bharat Bandh' at Kolkata's Bata Chowk pic.twitter.com/Zd8eAiH0mF— ANI (@ANI) August 28, 2024 బంద్ కొనసాగుతోందని పోలీసులు ఏమీ చేయలేకపోయారని బీజేపీ ఎమ్మెల్యే అశోక్ కీర్తానియా అన్నారు. ‘టీఎంసీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు.వారిని సీఎం మమత ఇక్కడి పంపారు. కానీ, మేం ఇక్కడి నుంచి ఎక్కడికీ వెళ్లము. మేము చేపట్టిన బెంగాల్ బంద్ను కొనసాగిస్తాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం’ అని ఆయన అన్నారు.#WATCH | West Bengal: BJP MLA Ashok Kirtania says, "Bandh is going on...Police were not able to do anything, therefore, the workers of TMC are here, Mamata sent them...We will not move from here, we will continue the fight..." pic.twitter.com/z4YubShK3h— ANI (@ANI) August 28, 2024సిలిగురిలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పిలుపునిచ్చిన 12 గంటల 'బెంగాల్ బంద్’ కొనసాగుతోంది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు మోహరించారు.#WATCH | Siliguri, West Bengal: 12-hour 'Bengal Bandh' called by the BJP to protest against the state government; security deployed in the area The bandh has been called after the police used lathi charge and tear gas on protestors during Nabanna Abhiyan, yesterday pic.twitter.com/K8oIGYs5tx— ANI (@ANI) August 28, 2024 బీజేపీ చేపట్టిన బంద్ను వ్యతిరేకిస్తూ అధికార టీఎంసీ కార్యకర్తలు ఉత్తర పరగణాల రైల్వే స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. రైలు పట్టాల మీద పెద్దఎత్తున నిరసన తెలపటంతో బంగాన్-సీల్దా మధ్య రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. తర్వాత మళ్లీ రైలు సేవలను అధికారులు పునరుద్దరించారు.#WATCH | North 24 Parganas | TMC Party workers protest against BJP's 12-hour 'Bengal Bandh' call for today.Train services were disrupted between Bangaon-Sealdah which is now being reinstated pic.twitter.com/ISyiQqBlv6— ANI (@ANI) August 28, 2024 బీజేపీ బంద్ నేపథ్యంలో ప్రభుత్వ బస్సు డ్రైవర్లు హెల్మెట్స్ ధరించారు. ‘‘ఈ రోజు బంద్ ఉంది. కావున తాను హెల్మెట్ ధరించాను’’ అని బస్ డ్రైవర్ తెలిపారు.#WATCH | BJP's 12-hour 'Bengal Bandh': Drivers of Government bus in Howrah seen wearing helmetsA bus driver says, "Today is bandh, so we are wearing helmets..." pic.twitter.com/b5GHHD4Ocq— ANI (@ANI) August 28, 2024 కోల్కతాలో బీజేపీ బంద్ను పోలీసులు అడ్డుకుంటున్నారు. అలీపుర్దువార్ ప్రాంతంలో బంద్ నిర్వహిస్తున్న పలువురు బీజేపీ కార్యకర్తలను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది#WATCH | West Bengal | Police detains protesting BJP workers at Alipurduar.12-hour 'Bengal Bandh' has been called by the BJP to protest against the state government after the police used lathi charge and tear gas on protestors during Nabanna Abhiyan, yesterday pic.twitter.com/tJuKKgMGum— ANI (@ANI) August 28, 2024పోలీసు తీరుపై బీజేపీ పిలుపునిచ్చిన 12 గంటల బంద్ బెంగాల్లో కొనసాగుతోంది.పోలీసులు అణచివేయాలనే వైఖరితో తిరుగుతున్నారని బీజేపీ నేత అగ్నిమిత్ర పాల్ మాట్లాడారు. కార్యకర్తలతో కలిసి రోడ్డు మీద వచ్చిన ఆమె బీజేపీ బంద్కు సహరించాలని కోరుతున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పోలీసులు రద్దు చేశారు.ఆందోళనకారులపై రసాయనాలు కలిపిన వాటర్ కెనాన్లను ప్రయోగించారు. పోలీసులు రాష్ట్రంలోని మహిళలకు భద్రత కల్పించలేకపోతున్నారు’ అని అన్నారు. బంద్ను విజయవంతంగా కొనసాగిస్తామని అన్నారు.#WATCH | Kolkata, West Bengal: BJP leader Agnimitra Paul says, "They are going around with a disgusting attitude. They have all become spineless. Police have invalidated the orders of the Supreme Court... They used water canons mixed with chemicals on the protestors... They are… https://t.co/MP0SU69Wwc pic.twitter.com/Dkhj7g5e2Y— ANI (@ANI) August 28, 2024 పశ్చిమ బెంగాల్ల్లో ఇవాళ(బుధవారం) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీజేపీ పిలుపుచ్చిన బంద్ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. సుమారు 5 వేల మంది పోలీసులను పలు కీలకమైన చోట్ల మోహరించారు. 15 మంది సీడీపీ ర్యాంక్ పోలీసు అధికారులను పలు కీలకమైన ప్రాంతాల్లో పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.#WATCH | Kolkata: BJP leader Agnimitra Paul reviews the 12-hour 'Bengal Bandh' called by BJP to protest against the state government. pic.twitter.com/AAvoFWrjuj— ANI (@ANI) August 28, 2024ఈ బంద్లో ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఏసీపీ ఎప్పటికప్పుడు లా అండ్ ఆర్డర్ను పర్యవేక్షిస్తారని పోలీసులు పేర్కొన్నారు. బంద్ను పరిశీలించడానికి పలు ప్రాంతాలో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.बंगाल कल बंद है#KolkataDoctorDeathCase #bengal_band_haipic.twitter.com/IIUK0rMY0Q— Rastra Janmat (@Rastrajanmat360) August 27, 2024 కోల్కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జానియర్ డాక్టర్పై హత్యాచార ఘటనకు బాధ్యత వహిస్తూ పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్తో మంగళవారం విద్యార్థులు చేపట్టిన ‘నబన్నా అభియాన్ (చలో సచివాలయ ర్యాలీ)’ హింసాత్మకంగా మారింది. నగరవ్యాప్తంగానే గాక సమీపంలోని హౌరాలో కూడా విద్యార్థులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్ల దాడి, లాఠీచార్జి ఇరువైపులా చాలామంది గాయపడ్డారు. ఇక.. శాంతియుత ర్యాలీపై ఇదెక్కడి అమానుషత్వమంటూ పోలీసులు, సీఎం మమతా ప్రభుత్వంపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. బంధవారం 12 గంటల పాటు బెంగాల్ బంద్కు పిలుపునిచ్చింది. దీన్ని అధికార తృణ మూల్ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. బంద్ జరగనిచ్చే ప్రసక్తే లేదని మమత ముఖ్య సలహాదారు ఆలాపన్ బంధోపాధ్యాయ్ అనటం గమనార్హం. -
కోల్కతాలో తీవ్ర ఉద్రిక్తత.. ఆందోళనకారులపై విరుచుకుపడిన పోలీసులు
పశ్చిమబెంగాల్ రాజధాని కోలకత్తాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన ప్రకంపనలు మరింత ఉధృతమవుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పలు ప్రజా, విద్యార్థి సంఘాలు ‘పశ్చిమబంగాఛాత్రో సమాజ్’మంగళవారం చేపట్టిన నిరసన ప్రదర్శనపై పోలీసులు విరుచుకు పడ్డారు. దీంతో కోల్కతా వీధుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.‘నభన్నా అభిజాన్’ పేరుతో హావ్డా నుంచి మొదలైన విద్యార్థుల ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. బాష్పవాయువు వాటర్ ఫిరంగులతో విరుచుకుపడ్డారు. దీంతో కొందరు ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. మరికొందరు బారికేడ్లను తోసుకొని దూసుకొచ్చారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు. మరోవైపుఈ ర్యాలీ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ర్యాలీ నిర్వహించేందుకు ఎలాంటి అనుమతి లేదని రాష్ట్ర పోలీసులు చెప్పారు. హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ నలుగురు విద్యార్థులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఇది బీజేపీ ప్రేరేపిత కుట్ర అని హింసాకాండతో అల్లకల్లోలం సృష్టించేందుకు పన్నిన పన్నాగమని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ర్యాలీ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 6 వేలమంది పోలీసులను మోహరించారు. నిరసనకారులపై నిఘా నిమిత్తం డ్రోన్లను ఉపయోగించారు. బారికేడ్లను తొలగించే అవకాశం లేకుండా, వెల్డింగ్ చేసి గ్రీజు పూయడం గమనార్హం. -
కంగనా రనౌత్ నోటి దురుసు వ్యాఖ్యలు.. సొంత ఎంపీపై బీజేపీ ఆగ్రహం
ధర్మశాల : రైతుల నిరసనలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగన రౌనత్పై సొంత పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది.2020 మోదీ ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది. రైతులు మాత్రం కేంద్రం తెచ్చిన చట్టాల్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో కేంద్రం రైతు చట్టాల్ని వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ దేశంలో ఈ సాగు చట్టాలపై నిరసనలు కొనసాగేలా కుట్ర జరిగే అవకాశం ఉందని, రైతుల నిరసనలను మోదీ ప్రభుత్వం కట్టడి చేయాలని, లేదంటే భారత్ మరో బంగ్లాదేశ్ తరహా అశాంతి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పైగా అల్లర్లు సృష్టించే వారికి దేశం కుక్కలపాలైనా వారికేం పట్టదని విమర్శించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని, లైంగిక దాడులు చోటుచేసుకున్నాయని ఎక్స్ వేదికగా షేర్ చేసిన వీడియోలో ఆరోపించారు. బాలీవుడ్ క్వీన్ వ్యాఖ్యలు సొంత పార్టీలోనే దుమారం రేపాయి.కంగనా రౌనత్కు ఆ అధికారం లేదురైతుల నిరసన గురించి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ అధికారికంగా స్పందించింది. భవిష్యత్తులో అలాంటి ప్రకటనలు ఇవ్వకూడదని హెచ్చరించింది. రైతుల నిరసనపై కంగనా రౌనత్ వ్యాఖ్యల్ని మేం ఖండిస్తున్నాం.‘కంగనా రనౌత్కు పార్టీ తరపున విధానపరమైన విషయాలపై మాట్లాడే అధికారం లేదు. ఆమెకు అనుమతి కూడా ఇవ్వలేదు. భవిష్యత్తులో అలాంటి ప్రకటనలు చేయొద్దని బీజేపీ ట్వీట్ చేసింది. తప్పు.. ఇలా మాట్లాడకూడదుమరోవైపు కంగనా రనౌత్ వ్యాఖ్యలపై బీజేపీ పంజాబ్ యూనిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి ఉద్రేకపూరిత ప్రకటనలు చేయడం మానుకోవాలని సూచించింది. ‘రైతులపై మాట్లాడటం కంగనా వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదు. ఆ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం. ప్రధాని మోదీ, బీజేపీ రైతు పక్షపాతి. ఆమె సున్నిత, మతపరమైన వ్యాఖ్యలు చేయకూడదు’ అని పంజాబ్ బీజేపీ నేత నాయకుడు హర్జిత్ గరేవాల్ అన్నారు. BJP expressed disagreement with its MP Kangna Ranaut's comments on farmers agitation, says she is not authorised to speak on policy issues. pic.twitter.com/xJ878F5pWK— Press Trust of India (@PTI_News) August 26, 2024 -
ఫ్రీ పార్కింగ్ కోసం ధర్నా
-
కోల్కతా ఉదంతం: ప్రభుత్వ అనుబంధ స్కూల్స్కు నోటీసులు
కోల్కతా: కోల్కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా కుదిపేసింది. ఈ ఘటనను దేశం నలుమూలల నుంచి ప్రజలు, మెడికల్ కాలేజీ విద్యార్థులు, డాక్టర్లు తీవ్రంగా ఖండించి పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఘటన జరిగిన పశ్చిమ బెంగాల్లో మరింత అధికంగా చిన్నాపెద్ద తేడా లేకుండా నిరసనల్లో పాల్గొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే తాజాగా బెంగాల్ ప్రభుత్వం పలు ప్రభుత్వ అనుబంధ స్కూల్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా పలు స్కూల్స్ టీచర్లు, విద్యార్థులతో నిరసనలు చేపట్టాయని పేర్కొంది. పాఠశాలలో విద్యార్థులకు క్లాసులు జరగాల్సిన సమయంలో ఇలా నిరసనల్లో వారిని పాల్గొనేలా చేయటంపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.హౌరా, బంకురా, తూర్పు మిడ్నాపూర్, పశ్చిమ మిడ్నాపూర్లోని పలు ప్రభుత్వ అనుబంధ స్కూల్స్కు నోటీసులు ఇచ్చింది. అందులో హౌరాలోని బలుహతి ఉన్నత పాఠశాల, బలుహతి బాలికల ఉన్నత పాఠశాల, బంట్ర రాజలక్ష్మి బాలికల పాఠశాలు ఉన్నాయి. ‘‘ 23.08.2024న స్కూల్స్లో క్లాసులు జరగాల్సిన సమయంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో.. నిరసన ర్యాలీ నిర్వహించినట్లు మా దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇలా చేయటం సరికాదు.. బాలల హక్కుల ఉల్లంఘన’’ అని నోటీసుల్లో తెలిపింది.ఇదిలా ఉండగా.. ఈ కేసులో సీబీఐ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు నిందితులకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేసిన సీబీఐ.. ఇవాళ ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. -
ఏపీ ప్రభుత్వంపై వాలంటీర్ల ఆగ్రహం