Ramya Krishna
-
హీరోయిన్ రమ్యకృష్ణ ఫిట్నెస్ రహస్యం.. ఇప్పటికీ అదే ఫాలో అవుతూ!
టాలీవుడ్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కథనాయికిగానూ, విలన్గానూ మెప్పించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న గొప్ప నటి. ఒక హీరోయిన్ విలన్ పాత్రలో నటిస్తే తన విలువ పడిపోతుందేమోనని చేసేందుకు ముందుకు రాని ఆ కాలంలో అలవోకగా చేసి ఆ అపోహను పారద్రోలింది. ఇలా రెండు పాత్రల ద్వారా ఎక్కువ ఆఫర్లు అందుకుని విలక్షణమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హీరో తల్లిపాత్రల్లోనూ కూడా అంతే గ్లామర్గా అదే ఫిట్నెస్తో అలరిస్తోంది. కుర్ర హీరోయిన్లకు తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. ఈ అందాల భామ వన్నెతరగని అందం వెనుకున్న రహస్యాన్ని ఆమె కుటుంబ సభ్యుడు, డాక్టర్ గుగనాథ్ శివకదక్షమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అదెంటో తెలుసుకుందామా..!.ఐదు పదుల వయసు దాటిన తర్వాత లీన్ కండరం అనేది బంగారం కంటే విలువైనదని చెబుతున్నారు కార్డియాలజిస్ట్ వైద్యుడు శివకదక్షమ్(Guganath Sivakadaksham). మెడిటేరియన్ డైట్(అడపాదడపా ఉపవాసం)తో బాడీని ఫిట్గా ఉంచుతుందని చెప్పారు. అందాల బామ రమ్యకృష్ణ(Ramya Krishnan) కూడా ఈ డైట్ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. అలాగే నటి రమ్య యోగా, తేలికపాటి కార్డియో వెయిట్ ట్రైనింగ్లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పారు. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. జిహ్వ చాపల్యాన్ని అదుపులో ఉంచుకుంటుందట. అలాగే వర్కౌట్లలో తప్పనిసరిగా బరువులు ఎత్తే వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తుందని అన్నారు. ఇవి ఆమె కండరాలను బలోపేతం చేసి మజిల్స్(muscle) స్ట్రాంగ్గా ఉండేలా చేస్తాయట. అందువల్ల ఆమె బాడీ షేప్అవుట్ అవ్వకుండా ఉందని చెప్పారు. అలాగే యాభై ఏళ్లు దాటక బాడీలో లీన్ కండర ద్రవ్యరాశి తగ్గి ఎముకలు పటుత్వం కోల్పోయి శరీరం ఆకృతి మారిపోతుందట. అందువల్ల ఇలాంటి శక్తిమంతమైన వ్యాయమాలతో కండరాలను బలోపేతం చేసుకుంటే ఎముకలకు సంబంధించిన గాయాలను నివారించగలుగుతామని అన్నారు. ముఖ్యంగా మహిళలకు మెనోపాజ్ దశ(menopause)లో ఎముకలు, కీళ్లకు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. అందువల్ల ఇవి తప్పనరిగా చేయాల్సిన పవర్ఫుల్ వ్యాయామాలు. అంతేగాదు ప్రతి సెషన్లో ఈవ్యాయామాలు కనీసం 6-12 సార్లు రిపీట్ చేయాలన్నారు. తద్వారా కండరాల క్షీణతను నివారించగలమని తెలిపారు. దీంతోపాటు అందుకు తగ్గా డైట్ కూడా ఉండాలన్నారుడైట్(diet)..పోషకాహారం పరంగా కండరాల మరమత్తు, పెరుగుదలకు తోడ్పడేలా అధిక ప్రోటీన్ ఆహారాన్ని తీసుకోవాలి. కోళ్లు, చేపలు, పాల ఉత్పత్తులు వంటి ఆహారాలను తప్పనిసరిగా డైట్లో భాగమయ్యేలా చూడాలి. ఈ వ్యాయామాలను శిక్షగా కాకుండా శరీరాన్ని పిట్గా ఉంచేలా ఎంజాయ్ చేస్తూ చేయాలని చెబుతున్నారు. ఎక్కువ కండరాల ద్రవ్యరాశి అనేది కీళ్ల పనితీరు, కదలిక సామర్థ్యాలను పెంచుతుంది. అలాగే ఇది బరువు నిర్వహణలో కూడా సహాయపడుతుందట. అంతేగాదు ఇది మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలను దూరం చేస్తుందని చెబుతున్నారు వైద్యుడు శివకదక్షమ్ . కాబట్టి యాభైలలో కూడా ఫిట్గా, గ్లామర్గా ఉండేలా అందాల భామ రమ్య కృష్ణలా వర్కౌట్లే చేసేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. View this post on Instagram A post shared by Guganath Sivakadaksham (@idoctorg)s (చదవండి: మూడు పూటలా భోజనం, నడకతో ఏకంగా 124 ఏళ్లు..!) -
ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ 15వ వార్షికోత్సవం నటి రమ్యకృష్ణ (ఫొటోలు)
-
మాతృత్వం.. ఓ మధురానుభూతి!
సాక్షి, హైదరాబాద్: మాతృత్వం.. ఓ మధురానుభూతి అని ప్రముఖ నటి రమ్యకృష్ణ పేర్కొన్నారు. పిల్లలు వద్దనుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోందని, పిల్లల్ని కనడం, పెంచడం భారంగా భావిస్తున్నారని చెప్పారు. అలా అనుకోవద్దని తాము కూడా వృత్తితో పాటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకున్నామని తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ 15వ వార్షికోత్సవం బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ నటి రమ్యకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ వ్యవస్థాపకురాలు డాక్టర్ దుర్గారావును ఫరి్టలిటీ, ఐవీఎఫ్కు సంబంధించి ఆమె పలు ప్రశ్నలను అడిగి నివృత్తి చేసుకున్నారు. జపాన్లో కొన్నేళ్లుగా యువ జనాభా విపరీతంగా తగ్గిపోతోందని, పూర్తిగా వృద్ధుల జనాభా పెరుగుతోందని, ఈ నేపథ్యంలో అక్కడి ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటోందని డాక్టర్ దుర్గారావు పేర్కొన్నారు. మన దేశంలో కూడా సంతానోత్పత్తి రేటు 1.8 ఉందని, అది 2కు పైగా ఉండాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా జని్మంచిన పలువురు పిల్లలకు స్కాలర్షిప్లు అందజేశారు. వీరంతా రేపటి చాలెంజర్లని, రేపటి రోజును తీర్చిదిద్దే వారిని సమాజానికి అందించినందుకు గర్వంగా ఉందని వివరించారు. -
రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1990ల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాల్లో నటిస్తోంది. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు సినిమాల్లో రాణించిన రమ్యకృష్ణ నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, మూడు నంది అవార్డులు అందుకున్నారు.అయితే తాజాగా రమ్యకృష్ణ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. క్యాస్టింగ్ కౌచ్ సమస్య సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ఇతర రంగాల్లోనూ ఉందన్నారు. అయితే సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలే ఎక్కువగా తెరపైకి రావడంతో అందరిదృష్టి సినిమావారిపైనే ఉందని తెలిపారు. కొంతమంది తప్పుడు వార్తలను ప్రచారం చేయడం కూడా నిజమేనని అన్నారు. సినిమాల్లో స్టార్గా ఎదగాలంటే హీరోయిన్స్ కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందేనని షాకింగ్ కామెంట్స్ చేసింది. కానీ నా విషయంలో మాత్రం అలా జరగలేదని రమ్యకృష్ణ వెల్లడించింది. కాగా.. రమ్యకృష్ణ 14 ఏళ్ల వయసులో 1948లో వైజీ మహేంద్రతో కలిసి 'వెళ్లి మిందాన' అనే తమిళ చిత్రంలో నటించింది. 1986లో విడుదలైన 'భలే మిత్రులు' ఆమె తొలి తెలుగు చిత్రం. 1990లో సౌందర్య, మీనా, రోజా, నగ్మా లాంటి హీరోయిన్లలో గుర్తింపు సాధించింది. ఎన్టీ రామారావు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు, జగపతి బాబు, రాజశేఖర్, రజనీకాంత్ లాంటి స్టార్స్తో సినిమాలు చేసింది. కన్నడలో రవిచంద్రన్, పునీత్ రాజ్కుమార్, ఉపేంద్ర సరసన నటించారు. -
Guntur Kaaram Review: ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ
టైటిల్: గుంటూరు కారం నటీనటులు: మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరీ, జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తదితరులు నిర్మాణ సంస్థ: హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాత: ఎస్ రాధాకృష్ణ(చినబాబు) రచన, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస, పీఎస్ వినోద్ సంగీతం:తమన్ ఎడిటింగ్: నవీన్ నూలి విడుదల తేది: జనవరి 12, 2024 కథేంటంటే.. జనదళం పార్టీ అధినేత వైరా వెంకట సూర్య నారాయణ(ప్రకాశ్ రాజ్) కూతురు వైరా వసుంధర(రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. కూతుర్ని మంత్రి చేయాలని సూర్య నారాయణ భావిస్తాడు. అదే సమయంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాటా మధు(రవి శంకర్) కూడా మంత్రి పదవి ఆశిస్తాడు. తనను కాదని కూతురికి మంత్రి పదవి ఇస్తే.. ఆమెకు రెండో పెళ్లి అయిన విషయాన్ని.. అలాగే మొదటి భర్తతో కలిగిన సంతానం గురించి బయటపెడతా అని బెదిరిస్తాడు. అయినా కూడా కుతూరినే మంత్రి చేస్తాడు సూర్యనారాయణ. ముందుచూపుగా వసుంధర మొదటి కొడుకు వీర వెంకట రమణ అలియాస్ రమణ(మహేశ్ బాబు)ను పిలిపించి తల్లితో తనకు ఎలాంటి సంబంధం లేదని రాసిన బాండ్ పేపర్స్ మీద సంతకం పెట్టించాలని ప్రయత్నిస్తాడు. అయితే రమణ మాత్రం సంతకం చేయడానికి అంగీకరించడు. తండ్రి రాయల్ సత్యం(జయరామ్) చెప్పినా వినకుండా.. గుంటూరులోనే ఉంటూ మిర్చి యార్డ్ని నడిపిస్తుంటాడు. అసలు వసుంధర మొదటి భర్త రాయల్ సత్యంకు ఎందుకు విడాకులు ఇచ్చింది? పదేళ్ల కొడుకును వదిలేసి రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది? పాతికేళ్ల కొడుకు ఇంటి ముందుకు వచ్చినా.. చూడడానికి ఎందుకు నిరాకరించింది? అముక్త మాల్యద అలియాస్ అమ్ము(శ్రీలీల)తో రమణ ఎలా లవ్లో పడ్డాడు? మరదలు మరదలు రాజి (మీనాక్షి చౌదరి) పాత్ర ఏమిటి? చివరకు రమణ తల్లి ప్రేమను ఎలా పొందాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. త్రివిక్రమ్ సినిమాల్లో బంధాలు, భావోద్వేగాలది ప్రధాన పాత్ర ఉంటుంది. కథంతా ఓ ప్యామిలీ చుట్టూ తిరుగుతుంది. గుంటూరు కారం సినిమా కూడా అదే పంథాలో సాగుతుంది. అనుకోకుండా జరిగిన ఓ ప్రమాదం కారణంగా చెల్ల చెదురైన ఓ మంచి కుటుంబం.. మళ్లీ ఎలా కలిసింది? దూరమైన తల్లి, కొడుకు చివరకు ఎలా దగ్గరయ్యారు అనేది ఈ సినిమా కథ. ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు... ఇంకా చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాసే ఈ తరహా కాన్సెప్ట్లో సినిమాలను తెరకెక్కించాడు. అల.. వైకుంఠపురములో, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాల తాలుకు ఛాయలు ఇందులో కనిపిస్తాయి. అంతేకాదు త్రివిక్రమ్ సంభాషణల్లోనూ కొత్తదనం కొరవడింది. అయితే కామెడీ విషయంలో మాత్రం ఎక్కడ తగ్గలేదు. పంచ్ డైలాగ్స్, పరుగులు పెట్టించే స్క్రీన్ప్లేతో బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు. సినిమా ప్రారంభంలోనే అసలు కథ ఏంటి? కథనం ఎలా సాగబోతుందనేది రివీల్ చేసేశాడు. మహేశ్ బాబు ఎంట్రీ అదిరిపోతుంది.తనదైన కామెడీ టైమింగ్తో ఇరగదీశాడు. ఇక ‘నాది నెక్లెస్ గొలుసు’ పాటకు మహేశ్, శ్రీలీల వేసే స్టెప్పులు ఫ్యాన్స్ని అలరిస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్, ఎమోషనల్ సీన్ ఆకట్టుకుంటుంది. హీరోకి తల్లి ఎందుకు దూరమైందనే విషయాన్ని మాత్రం ఫస్టాఫ్లో రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ.. సెకండాఫ్పై ఆసక్తి పెంచేలా చేశాడు. ఫస్టాఫ్లో కథేమి ఉండడు. ‘కిటికిలో నుంచి చూసే నాన్న.. తలుపులు మూసుకునే అమ్మ.. రోడ్డు మీద తిరిగే కొడుకు’ సింపుల్గా చెప్పాలంటే ఇదే ఫస్టాఫ్ కథ. ఇక సెకండాఫ్ కాస్త హిలేరియస్గా సాగుతుంది. లేడిస్తో హీరో చేసే యాక్షన్ ఎపిసోడ్, అజయ్ క్యారెక్టర్తో పండించే కామెడీ బాగానే వర్కౌట్ అయింది. అయితే సినిమాకు ముగింపు ఎలా ఉంటుందో ముందే ఊహించొచ్చు. చెప్పుకోవడానికి పెద్ద ట్విస్టులు కూడా లేవు. తల్లి కొడుకులు విడిపోయేలా పన్నాగం పన్నిన వ్యక్తి, దానికి గల కారణం ఏంటనేది చివరి వరకు పసిగట్టకుండా జాగ్రత్త పడ్డాడు. చివర్లో తల్లి-కొడుకు( రమ్యకృష్ణ- మహేశ్బాబు) మధ్య జరిగే సంభాషణలు హృదయాలను హత్తుకుంటాయి. కొడుకుని ఎందుకు దూరం పెట్టారనేది కూడా కన్విన్సింగ్గానే అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. రమణ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు మహేశ్ బాబు. యాక్షన్తో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. డైలాగ్ డెలివరీలోనూ కొత్తదనం చూపించాడు. తెరపై స్టైలీష్గా కనిపించాడు. అమ్ము పాత్రలో శ్రీలీల ఒదిగిపోయింది. ఎప్పటి మాదిరే డ్యాన్స్ ఇరగదీసింది. చీరకట్టులో తెరపై చాలా అందంగా కనిపించింది. ఇక వైరా వసుంధరగా రమ్యకృష్ణ మరోసారి గుర్తిండిపోయే పాత్రలో నటించింది. ఫస్టాఫ్లో ఆమె పాత్ర సాదాసీదాగా ఉన్నప్పటికీ.. సెకండాఫ్లో మాత్రం తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో మరదలుగా మీనాక్షి చౌదరి నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీరావు, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఏదేమైనా గుంటూరు కారం ఘాటు మాత్రం కాస్త తగ్గిందనే చెప్పాలి. -
మహేశ్ బాబు ‘గుంటూరు కారం, HD మూవీ స్టిల్స్
-
రమ్యకృష్ణ నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా..?
-
దేవి పాత్రలలో జేజేలు అందుకున్న హీరోయిన్స్
విజయ దశమి అంటే...కొత్త బట్టలు, పిండివంటలు, బంధు మిత్రుల కోలాహలం గుర్తుకు వస్తుంది. చిన్నా పెద్ద దసరాను సంబరంగా జరుపుకుంటారు. నవరాత్రులలో దుర్గామాత 9 అవతారాలను పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోటానికి పూజాలు చేస్తారు. ఇక ఈ దేవి రూపంలో టాలీవుడ్ వెండితెర మీద కొందరు హీరోయిన్స్ కనిపించడమే కాకుండా ప్రేక్షకులతో నీరాజనాలు అందుకున్నారు. వారెవరో ఈ కథనంలో చూసేద్దాం.. మొదట గుర్తొచ్చేది ఆవిడే.. అప్పట్లో వెండితెర మీద దేవత పాత్రలు వేసిన నటీమణులలో కె.ఆర్ విజయ పేరు మొదటి వరసలో ఉంటుంది.ఎన్టీఆర్ పేరు చెబితే కృష్ణుడు, రాముడు లాంటి వారు గుర్తుకు వస్తారు. ఇక దేవతల క్యారెక్టర్ల గురించి మాట్లాడితే.. కె ఆర్ విజయ పేరు మనసులో మెదలుతుంది. అమ్మ వారి పాత్ర వేసినప్పుడు ఎంతో నిష్టగా ఉండేవారట. శాఖాహారం మాత్రమే తీసుకునేవారట. శభాష్ అనిపించుకున్న విజయశాంతి లేడి సూపర్ స్టార్గా విజయ శాంతి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు నేషనల్ అవార్డు సైతం కొల్లగొట్టింది. ఈ సీనియర్ తార కూడా మహా చండి అవతారంలో విశ్వరూపం చూపించింది. దేవత పాత్రలో కనిపించి శభాష్ అనిపించుకుంది. రోమాలు నిక్కబొడుచుకునే అమ్మోరు సీన్.. శరదృతువు ఆరంభంలో వచ్చే పండగ కనక నవరాత్రి, శరన్నవరాత్రి అనే పేరు వచ్చింది. పండగ మొదటి మూడు రోజులు పార్వతి దేవికి, ఆ తరువాత మూడు రోజులు లక్ష్మీ దేవికి.. ఆ తరువాత మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఇక అమ్మోరు తల్లి గ్రామంలో వెలిసి.. దుష్ట శక్తులను పారదోలుతుంది. ఈమె విశ్వరూపం చూసే భాగ్యం అందరికీ దక్కదు. అలాంటి అవకాశం దక్కే సీన్ అమ్మోరు సినిమాలో చూపించారు. వెండితెర మీద ఈ సన్నివేశాన్ని చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మహా కనక దుర్గగా రమ్యకృష్ణ రమ్య కృష్ణ అమ్మోరు సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో దేవతగా కనిపించి వెండితెర మీద కనికట్టు చేసింది. దేవుళ్లు సినిమాలో భక్తితో వేడుకుంటే ఆ మహా కనక దుర్గ కూడా కదిలి వస్తుంది అనే సన్నివేశాలలో మానవరూపం దాల్చిన దేవతగా కనిపించింది. నిండు మనసుతో అమ్మ ఉందని నమ్మిన వారికి కళ్లముందు కనిపించే దైవం అవుతుంది.లేదనుకునే అల్పులకీ కళ్లు తెరిపిస్తుంది. అమ్మోరు తల్లిగా, భక్తురాలిగా రోజా అమ్మోరు తల్లిగా కనిపించిన వారి లిస్ట్లో మరో సీనియర్ తార రోజా కూడా ఉంది. భక్తురాలిగా, అమ్మోరు తల్లిగా రెండు పాత్రలలో అమ్మోరు తల్లి సినిమాలో మెప్పించింది. శ్రీవెంకటేశునికి చెల్లెలివమ్మా, చిట్టి చెల్లిలి వయ్యా అని ఈ దేవతను పొగుడుతూ భక్తు రాలిగా పాట పాడి మెప్పించింది. భక్తురాలిగా సావిత్రి జననీ శివ కామిని దరి చేరితే భయాలు తొలుగిపోతాయి. అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మ దయ దొరికితే జయాలు కలుగుతాయి. ఎన్టీఆర్, సావిత్రి నటించిన నర్తన శాల మూవీలో అమ్మ దయ కోసం...సావిత్రి జననీ శివ కామినీ అనే పాట పాడి ఆకట్టుకుంది. ‘‘ఇక్కడ క్లిక్ చేసి సాక్షి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా?: రమ్యకృష్ణ
ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై సినీనటి రమ్యకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మంత్రి రోజాకు పలువురు ప్రముఖులు అండగా నిలవగా, తాజాగా రమ్యకృష్ణ సైతం స్పందించారు. ‘మంత్రి రోజాని మాజీ మంత్రి బండారు అసభ్యంగా దూషించడం దారుణం.మన దేశంలో మాత్రమే భారత మాతాకి జై అని గర్వంగా చెప్తాం. అలాంటి దేశంలో ఓ మహిళ పై ఇంత నీచంగా మాట్లాడతారా?, బండారు సత్యనారాయణని క్షమించకూడదు. pic.twitter.com/fsuJ7aa9Wk — Ramya Krishnan (@meramyakrishnan) October 7, 2023 మనదేశం ప్రపంచంలోనే ఐదవ అత్యుత్తమ ఆర్థిక దేశంగా అవతరిస్తోంది. అలాంటి దేశంలో ఓ మహిళ మంత్రిని ఇంత దారుణంగా మాట్లాడతారా?, కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్తో సంబంధం లేకుండా బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు ఖండించాలి. నేను ఓ మహిళ గా, నటిగా , స్నేహితురాలిగా మంత్రి రోజాకి అండగా ఉంటా. ఈ దేశంలో మహిళలపై రేప్ లు, దాడులు, గృహ హింస, బహిరంగ దూషణ ఇప్పటికీ కొనసాగడం బాధాకరం. మంత్రి రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్ కఠినమైన చర్యలు తీసుకోవాలి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బండారు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు రమ్యకృష్ణ. బండారు.. మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా?: నటి, ఎంపీ నవనీత్ కౌర్ -
రమ్యే ఆర్డర్ ఇస్తే నేను చేయాల్సిందే : దర్శకుడు కృష్ణ వంశీ
-
జీవితంలో అదొక్కటే పర్మినెంట్: రమ్యకృష్ణ
‘నిన్ను రోడ్డు మీద చూసినది..’ అంటూ కుర్రాళ్లు ఫ్లాట్ అయ్యేంత గ్లామర్...మితి మీరిన ఆత్మవిశ్వాసానికి.. అహంభావానికి చిరునామా... ఓ నీలాంబరి. భక్తులను రక్షించే తల్లి... ఓ అమ్మోరు. నా మాటే శాసనం.. ఓ శివగామి... ఇలా ఏ పాత్ర చేస్తే అందులో ఒదిగిపోయారు రమ్యకృష్ణ. గ్లామరస్ రోల్స్ చేస్తున్నప్పుడే ‘నరసింహ’లో నెగటివ్ షేడ్ ఉన్న నీలాంబరి, ‘అమ్మోరు’లో అమ్మవారిగా మెప్పించారామె. ఇక ‘బాహుబలి’లో శివగామిగా కనబర్చిన నటన అద్భుతం. ఇటీవల రిలీజైన ‘జైలర్’లో రజనీకాంత్ భార్యగా నటించారు. అలాగే భర్త కృష్ణవంశీ డైరెక్షన్లో ‘రంగ మార్తాండ’ చేశారు. ఇక ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ చెప్పిన విశేషాలు తెలుసుకుందాం. ► ‘పడయప్ప’ (‘నరసింహ’)లో నీలాంబరిగా నరసింహ (రజనీకాంత్ పాత్ర)ని ఎదిరించారు. చాలా ఏళ్ల తర్వాత ‘జైలర్’లో రజనీ కాంబినేషన్లో సాఫ్ట్ క్యారెక్టర్ చేయడం గురించి.. ఇన్నేళ్ల తర్వాత రజనీగారి కాంబినేషన్లో ‘జైలర్’ చేయడం, అది సూపర్ హిట్ కావడం నా జీవితంలో మరచిపోలేను. ‘జైలర్’లో ఎందుకంత సున్నితమైన పాత్ర చేశారని అందరూ అనుకోవచ్చు. అయితే మళ్లీ రజనీగారితో నీలాంబరిలాంటి పాత్ర వస్తేనే చేయాలనుకుని ‘జైలర్’లో విజయలాంటి మంచి పాత్రని వదులుకోలేను కదా. ► ఈ 24 ఏళ్లలో రజనీగారు, మీరు ఆర్టిస్టులుగా ఎదిగారు.. వ్యక్తులుగా మారారు. ఆయనలో మీరు గమనించిన మార్పు? ‘జైలర్’ షూటింగ్ మొదటి రోజే ‘పడయప్ప’ చేసి అప్పుడే 24 ఏళ్లు అయిపోయిందా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తే.. అవునన్నాను. అప్పటికీ, ఇప్పటికీ ఆయనలో అదే ఉత్సాహం, అదే నిరాడంబరత, అంతే నిశ్శబ్దం. ► ‘జైలర్’ తెలుగు–తమిళంలో చాలా పెద్ద హిట్ అయింది. ఈ హిట్ మీ కెరీర్కి ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుంది? యాక్టర్స్ కెరీర్కి హిట్ అనేది వంద శాతం అవసరం, తప్పనిసరి. అయితే హిట్ మాత్రమే కెరీర్ కాదు. మంచి పాత్రలు కూడా కావాలి. కొన్నిసార్లు మంచి పాత్రలుంటాయి. అభినందనలు వస్తాయి కానీ వసూళ్లు ఉండవు. అలాగే ఓ కాంబినేషన్ మన కెరీర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? అన్నది ముఖ్యం. వంద శాతం నా కెరీర్కి రజనీకాంత్గారి కాంబినేషన్, ‘జైలర్’ హిట్ ఉపయోగపడతాయి. ► ‘రంగ మార్తాండ’, ‘జైలర్’ సినిమాల్లో పాత్ర పరంగా మీకు సంతృప్తి ఇచ్చిన మూవీ ఏది? ‘రంగ మార్తాండ’ లాంటి నటనకు ఆస్కారం ఉన్న సినిమా హిట్ అయినా, అవకపోయినా మనసుకు సంతృప్తి ఉంటుంది. అయితే ‘జైలర్’లాంటి హిట్స్ వస్తే ‘రంగ మార్తాండ’ లాంటి సినిమాలు చేసే అవకాశాలు మరిన్ని వస్తాయి.. నా కెరీర్ కూడా మరింత విస్తరిస్తుంది. అయితే ‘రంగమార్తాండ’ లాంటి సినిమాలు కూడా హిట్ కావాలి. కొన్నిసార్లు అలాంటి సినిమాలకు ఎక్కువ అభినందనలు వస్తాయి.. వసూళ్లు రాకపోవచ్చు. ఆర్టిస్ట్లకు అభినందనలూ కావాలి.. కలెక్షన్స్ కూడా కావాలి (నవ్వుతూ). ► ఓటీటీ ΄్లాట్ఫామ్లో ‘క్వీన్’ వెబ్ సిరీస్ తర్వాత కొత్త సిరీస్లు చేయడం లేదు. ఎందుకు? ‘క్వీన్’ తర్వాత ‘క్వీన్ 2’ షూటింగ్ 70 శాతం పూర్తి చేశాం. మిగిలిన 30 శాతం షూటింగ్ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతోంది. ‘క్వీన్’ కంటే ‘క్వీన్ 2’ అద్భుతంగా వచ్చింది. ఇక సినిమాలతో బిజీగా ఉండటంవల్ల వేరేవి ఒప్పుకోలేకపోతున్నాను. ► అప్పట్లో మీ తరం వాళ్లకి సినిమాలు తప్ప వేరే ఏమీ లేవు. కానీ, ఈ తరం వాళ్లకి సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్, టీవీ షోలు.. ఇలా చాలా ఉన్నాయి. ఈ మార్పు మీకు ఎలా అనిపిస్తోంది? సోషల్ మీడియాలోని చాలామంది ఇన్ఫ్లుయర్స్లో నటీనటులకంటే ఎక్కువ పాపులర్ అవుతున్నవాళ్లు ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రపంచం ఎంతలా మారింది? అనిపిస్తోంది. మనం కూడా మారుతున్న ప్రపంచంతో ΄ోటీ పడుతూ ముందుకు సాగాలి. ► అయితే ఇప్పుడొస్తున్న కథానాయికలకు మీలా 20, 25 ఏళ్లు లాంగ్విటీ ఉండటంలేదు కూడా... మాకు తప్పులు చేయడానికి, దిద్దుకోవడానికి టైమ్ ఉండేది. ఇప్పుడు ఆ టైమ్ లేదు. వస్తున్నారు.. వెళుతున్నారు.. కానీ మేం అన్ని సంవత్సరాలకు సంపాదించుకున్నది ఇప్పుడు సక్సెస్ అయితే తక్కువ టైమ్కే సంపాదించుకుని వెళ్లిపోతున్నారు. టైమ్ ఎలా మారుతుందో దాన్నిబట్టి అన్నీ మారుతున్నాయి. దాంతో పాటు మనం మారాలి. జీవితంలో స్థిరమైనది ఏది అంటే.. అది మార్పు మాత్రమే. ఆ మార్పుకి మనం అడ్జస్ట్ అవ్వాలి. దాంతో పాటు కొనసాగాలి. మనం హ్యాపీగా ఉన్నామనుకోండి అది మారుతుంది. ఒకవేళ దుఃఖంలో ఉన్నాం అనుకోండి అది కూడా మారుతుంది. సో.. ఏదీ నిరంతరంగా ఉండదు.. మార్పు సహజం. ► మీ అబ్బాయి రుత్విక్ ఏం చేస్తున్నాడు... హీరో అవుతాడా? తన నాన్న (కృష్ణవంశీ)లా డైరెక్టర్ అవుతాడా? రుత్విక్కి ఇప్పుడు 18 ఏళ్లు. ప్రస్తుతానికి ఫోకస్ అంతా చదువు మీదే. వాడికేం అవ్వాలో వాడికే తెలియదు.. నాకేం తెలుస్తుంది (నవ్వుతూ). తనేం కావాలో రుత్విక్ తెలుసుకుని, మాతో చెబితే మేం స΄ోర్ట్ చేస్తాం. ► ఈ మధ్య రోజాగారు, మీరు కలుసుకున్నారు.. మీ ఇద్దరి అనుబంధం గురించి? రోజా నాకు ఎప్పట్నుంచో తెలుసు. అప్పట్లో ఎలా ఉండేవాళ్లమో ఇప్పుడూ అలానే ఉన్నాం. చాలా సంవత్సరాల తర్వాత నేను తిరుపతి వెళ్లాను. తనే నాకు దర్శనం ఏర్పాటు చేసింది. అద్భుతమైన దర్శనం దక్కింది. సో.. తనకి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్లాను. ► ఇద్దరూ సినిమాలు, రాజకీయాల గురించి మాట్లాడుకున్నారా? రెండింటి గురించి మాట్లాడుకోలేదు. లైఫ్ గురించి మాట్లాడుకున్నాం. నా అబ్బాయి ఏం చేస్తున్నాడు.. తన పిల్లలు ఏం చేస్తున్నారు? అనే విషయాలు మాట్లాడుకున్నాం. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి ఇంత బిజీగా ఎలా ఉండ గలుగుతున్నావ్ అని అడిగాను. ఇలాంటివే... ► రోజాగారితో మాట్లాడాక మీక్కూడా పాలిటిక్స్ పై ఏమైనా ఆసక్తి కలిగిందా? మీరూ పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం ఉందా? పాలిటిక్స్ పై ఇంట్రస్ట్ అనేది ఒకర్ని చూసి వచ్చేది కాదు. ఎవరికి వాళ్లకి ఉండాలి. కొందరికి ఇంట్రస్ట్ ఉంటుంది.. కొందరికి ఉండదు. బట్.. రోజా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. నేను కళ్లారా చూశాను. ► భవిష్యత్తులో ఏదైనా పార్టీ నుంచి మీకు ఆఫర్ వస్తే పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతారా? ఏమో.. నాకు తెలియదు. వచ్చినప్పుడు చూద్దాం. -
ఆ ఆపజయాల వల్లే తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ: రమ్యకృష్ణ
రమ్యమైన నటి రమ్యకృష్ణ. తొలి రోజుల్లో గ్లామరస్ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈమె ఆ తర్వాత నటనకు ప్రాముఖ్యత కలిగిన పాత్రలో మెప్పించారు. రజినీకాంత్తో కలిసి నటించిన 'నరసింహ' చిత్రానికి ముందు వరకు కథానాయకిగా నటించిన రమ్యకృష్ణ ఆ చిత్రంలో ప్రతినాయకి పాత్రలో రజనీకాంత్కు దీటుగా నటించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికీ ఆ చిత్రంలోని నీలాంబరిగా రమ్యకృష్ణ నటనను ఎవరు మర్చిపోలేరు. ఆ తర్వాత బాహుబలి చిత్రంలో రాజమాత శివగామిగా జీవించారు. (ఇదీ చదవండి: శ్రీహరి కట్టిన తాళి మాత్రమే మిగిలింది.. ప్రస్తుతం మా పరిస్థితి ఇదే: డిస్కో శాంతి) తాజాగా జైలర్ చిత్రంలో రజనీకాంత్కు భార్యగా అత్యంత సహజంగా నటించారు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ సినీ రంగ ప్రవేశం చేసిన తొలి రోజుల్లో తనకు సరిగ్గా నటించడం తెలియలేదు అన్నారు. నటిగా తన తొలి చిత్రం తమిళంలో 'వైళ్లె మనసు' అని చెప్పారు.1988లో తమిళ్లో నటించిన ముదల్ వసంతం చిత్రాన్ని ఇటీవల చూసిన తన తల్లి నువ్వు ఇలాంటి నటనతో ఎంతకాలం ఎలా నిలబడగలిగావు అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారన్నారు. దీంతో అప్పట్లో తన నటన ఎలా ఉండేది అన్నది అర్థం చేసుకోండి అని అన్నారు. అలా తాను తమిళంలో నటించిన పలు చిత్రాలు అపజయాన్ని చూడడంతో తెలుగు చిత్రంపై దృష్టి సారించానని అన్నారు. అయితే తెలుగులో లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నటిగా కొంచెం కొంచెం ఎదుగుతూ వచ్చానని రమ్యకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈమె ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న విషయం తెలిసిందే. -
రజినీకాంత్ 'జైలర్'.. సగం బడ్జెట్ ఆయనకే ఇచ్చేశారుగా!
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ నటించిన చిత్రం జైలర్. ఆగస్టు 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి దాదాపు 225 కోట్ల రూపాయలతో రూపొందించిట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో నటీనటుల రెమ్యునరేషన్పై కూడా అంతేస్థాయిలో చర్చ నడుస్తోంది. రజినీకాంత్తో పాటు మోహన్ లాల్, శివరాజ్కుమార్, జాకీ ష్రాఫ్, తమన్నా పారితోషికంపై ఎంతన్న విషయమైన పెద్దఎత్తున కోలీవుడ్లో చర్చ మొదలైంది. భారీ తారాగణం ఉండడంతో అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: 'ఆలియా భట్ తండ్రి అసభ్య ప్రవర్తన'.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏమందంటే?) ఓ ప్రముఖ సంస్థ నివేదికల ప్రకారం.. రజనీకాంత్ తన పాత్ర కోసం రూ.110 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. సినిమా మొత్తం బడ్జెట్లో 48 శాతం పారితోషికమే ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఇకపోతే మోహన్లాల్, శివరాజ్కుమార్ కూడా పెద్దమొత్తంలోనే తీసుకున్నట్లు తెలుస్తోంది. మోహన్లాల్కు రూ.8 కోట్లు, శివరాజ్కుమార్కు రూ.4 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంతే కాకుండా బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్కు రూ.4 కోట్లు, హీరోయిన్ తమన్నా భాటియాకు రూ.4 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ చిత్రంలో రజినీకాంత్ భార్యగా నటించిన రమ్య కృష్ణ రూ. కోటి రూపాయలు చెల్లించినట్లు కోలీవుడ్ టాక్. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో కనిపించారు. కాగా.. ఇప్పటికే బాక్సాఫీస్ను షేక్ చేస్తోన్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: జైలర్ మరో రికార్డ్.. సూపర్ హిట్ చిత్రాన్ని వెనక్కినెట్టి!) -
చెమటతో తడిసిపోయిన పాయల్.. బీచ్ ఒడ్డున అతుల్య
కెనడా ట్రిప్లో హీరోయిన్ రీతూవర్మ వర్కౌట్ దెబ్బకు పాయల్కు చెమటలు పలుచటి చీరలో మీనాక్షి మెరుపులు బీచ్ ఒడ్డున హీరోయిన్ అతుల్య పోజులు పొట్టి స్కర్ట్లో అరియానా హాట్ స్టిల్స్ తమన్నా పాటకు రమ్యకృష్ణ స్టెప్పులు ఐశ్వర్యా రాజేశ్ హీటెక్కించే ఫొటోలు కేజీఎఫ్ బ్యూటీ కనువిందు చేసే పోజుల్లో View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) #payalrajput pic.twitter.com/DimV0vWESL — 🎭 (@MrXholic69) July 29, 2023 View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by ✨Prakruthi Ananth 💄🎨✨ (@prakatwork) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) -
హీరోలా ఉన్న రమ్యకృష్ణ కొడుకు...!
-
రమ్యకృష్ణ అందరి ముందు నా మీద అరవడం కరెక్ట్ కాదు..
-
మూడు పెళ్లిళ్లు.. అందుకే విడాకులు నయనతార రమ్యక్రిష్ణ తో విబేదాలు
-
‘రంగమార్తాండ’ క్లైమాక్స్ అలా ఉండి ఉంటే మరింత బాగుండేది
పరుచూరి గోపాలకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన రివ్యూలను అభిమానులతో పంచుకుంటారు. ఇటీవలే విడుదలైన సూపర్ హిట్ టాక్ అందుకున్న 'రంగమార్తాండ' చిత్రంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, అనసూయ ప్రధానపాత్రల్లో నటించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..'సినిమా గురించి నేను ఎక్కువ చెప్పడం లేదు. ఈ సినిమాలో జీవితం గురించి ఉంది కాబట్టి చెబుతున్నా. ప్రస్తుత సమాజంలో ఎక్కడైనా ఏదైనా జరుగుతూ ఉంటే చూసి కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఒక అమ్మాయిని చంపుతుంటే ఎవరు పట్టించుకోకుండా వీడియోలు తీసే సీన్తోనే సినిమా ప్రారంభమైంది. ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ, రాహుల్, అనసూయ, శివాత్మిక, ఆదర్శ్ అద్భుతంగా నటించారు. శివాత్మిక పాత్ర అద్దం పట్టేలా ఉంటుంది. ఒక కూతురు తన తండ్రిని సెల్లార్లో పడుకోమని చెప్పినప్పుడు ప్రేక్షకులకు తప్పకుండా కన్నీళ్లు వచ్చేస్తాయి. ఈ సినిమాలో బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బ్రహ్మానందం అంటే నవ్విస్తాడనుకుంటాం. కానీ ఆయన ఏడిపించగలడని ఈ సినిమాలో నిరూపించారు. మన అమ్మా, నాన్నలను మించినది ఏది లేదు. మనకు ఏది రాదు కూడా. అందుకే వారిని పదిలంగా చూసుకుందాం. ఈ సినిమా చూశాక ఎవరైనా తమ అమ్మా, నాన్న దగ్గరకు వెళ్లి ఉంటే కృష్ణవంశీ జన్మ ధన్యమైనట్లే. కళాభారతిని చూసి రాఘవరావు అంటే ప్రకాశ్ రాజ్ కన్న మూయడం. పిల్లలందరూ వచ్చి చూడడంతో క్లైమాక్స్ చూపించారు. కళాభారతిని పునర్ నిర్మాణం చేయించి.. రాఘవరావు సౌజన్యంతో అని పెట్టి క్లైమాక్స్ సీన్ తీసి ఉంటే ఇంకా బాగుండేది. ఈ విషయాన్ని కృష్ణవంశీతో చెప్పా. కానీ ఒరిజినల్ కథలో అలా లేదు. అందుకే పెట్టలేదన్నారు. ప్రకాశ్రాజ్కు, బ్రహ్మనందానికి మధ్య ఉండే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. అంతే కాకుండా ప్రకాశ్రాజ్, బ్రహ్మానందం నటనా ప్రావీణ్యాన్ని తెలిసేలా ఇంకొన్ని షాట్స్ పెట్టి ఉంటే మరిన్ని వసూళ్లు రాబట్టేది. కన్నీళ్లు రావు అనుకున్న వాళ్లకు కూడా కన్నీళ్లు తెప్పించే సినిమా ఇది.' అని పరుచూరి వివరించారు. -
ఆ సినిమాలో చేస్తే అవకాశాలు రావన్నారు: శివాత్మిక రాజశేఖర్
జీవిత రాజశేఖర్ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి శివాత్మిక. 'దొరసాని' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు శివాత్మిక. ఆ తరువాత కూడా తనకి తగిన పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన 'రంగమార్తాండ'లో శివాత్మిక చేసిన పాత్రతో మరింత ఫేమ్ వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ చూసిన సినీ ప్రేక్షకులు శివాత్మిక పాత్రను ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూతురిగా నటించి కొన్ని సన్నివేశాల్లో కన్నీళ్లు తెప్పించింది. తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారామె. శివాత్మిక మాట్లాడుతూ.. ‘రంగమార్తాండలో నాది మెయిన్ రోల్ కాదు. అందుకే సినిమాకు అంగీకరించినప్పుడే నాకు చాలా మంది వద్దని చెప్పారు. ఆ సినిమా చేస్తే నీకు అవకాశాలు రావన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చెయ్యొద్దని సలహా ఇచ్చారు. అలాంటి సినిమాలు ఎవరూ చూడరని చెప్పారు. చాలా భయపడతారు. కానీ ఇప్పుడు ఆ సినిమానే మంచి హిట్ అయి పేరు తీసుకొచ్చింది. కానీ దొరసాని సినిమా సమయంలో నేను చాలానే ఊహించుకున్నా. ఇక వరుసగా ఒక్కో సినిమా చేసుకుంటూ వెళ్లిపోవడమే అనుకున్నా. కానీ ఆ తరువాత గ్యాప్ వచ్చింది. దీంతో నేను అనుకున్నంత ఈజీ కాదన్న విషయం అప్పుడర్థమైంది.' అంటూ చెప్పుకొచ్చింది. -
'నీ బంగారు నిన్ను దొంగ అంటోంది'.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్
ప్రకాశ్రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రంగమార్తాండ'. దర్శకుడు కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఉగాది కానుకగా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను హౌల్ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ చూస్తే కుటుంబంలో జరిగే సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించినట్లు కనిపిస్తోంది. కుటుంబ నేపథ్యంలో సాగే ఎమోషన్స్, డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ముఖ్యంగా రమ్యకృష్ణ-ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం-ప్రకాశ్ రాజ్ మధ్య సాగే ఎమోషన్స్ ఈ చిత్రంలో హైలెట్గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్లో బ్రహ్మనందం సీరియస్ లుక్ సినిమాకే హైలెట్గా మారనుంది. జీవితంలో నటనను ప్రాణంగా భావించే ఒక రంగస్థల కళాకారుడి జీవిత అనుభవాలను సినిమాగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు కూడా ఈ చిత్రంలో నటించారు. ఇప్పటికే సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ షోను ప్రదర్శించగా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. -
'రేయ్.. నువ్వొక చెత్త నటుడివిరా'.. ఆసక్తిగా టీజర్
ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. రంగమార్తాండ టీజర్ ఫుల్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నేను ఒక నటుడిని అనే చిరంజీవి వాయిస్తో టీజర్ మొదలైంది. 'రేయ్.. నువ్వు ఒక చెత్త నటుడివిరా.. మనిషిగా అంతకంటే నీచుడివిరా' అనే బ్రహ్మనందం డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. 'నేను సహస్త్ర రూపాల్లో సాక్షాత్కారించిన నటరాజు విరాట స్వరూపాన్ని.. రంగమార్తాండ రాఘవరావుని' అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పె డైలాగ్తో టీజర్ అదిరిపోయింది. ఈ నెల 22న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రం రంగమార్తాండుడి జీవన నాటకమని దర్శకుడు కృష్ణవంశీ పేర్కొన్నారు . ఈ చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషించగా.. ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు తెలుగు రీమేక్గా ‘రంగమార్తాండ’ చిత్రాన్ని తెరకెక్కించారు. -
ఆమాత్రం దానికి మేమెందుకు?: రమ్యకృష్ణ ఫైర్
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ప్రసారం అవుతున్న డాన్స్ ఐకాన్ షో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తూ దూసుకుపోతుంది. ఈ షో లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ వచ్చీ రావడంతోనే మాటల యుద్ధం మొదలయ్యింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకి అసిఫ్ అండ్ రాజు కలిసి చేసిన డ్యాన్స్కు సోహైల్ రెడ్ బోర్డు చూపించాడు. దాంతో హర్ట్ అయిన శ్రీముఖి.. అది మోనాల్ కూర్చున్న సీట్ ప్రభావం అంటూ గొడవ మొదలుపెట్టింది. దానికి సోహైల్ వాళ్ళిద్దరి మధ్య కో ఆర్డినేషన్ లేదని చెప్పాడు. తర్వాత గోవింద్, సౌమ్య డ్యాన్స్ చేసినప్పుడు యష్ మాస్టర్, శ్రీముఖి పెదవి విరిచారు. దీంతో సోహైల్ డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించడంతో శ్రీముఖి వెటకారం స్టార్ట్ చేసింది. ఈ లోగా రమ్యకృష్ణ కూడా మీరు చెప్పినట్టు చెప్పడానికి ఈ సీట్లో మేము కూర్చోవడం ఎందుకు అంటూ సీరియస్ అయ్యింది. మరి ఈ డాన్స్ రియాలిటీ షోలో ఇంకా ఎన్ని ట్విస్టులు, టర్నులు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ వారం డాన్స్ ఐకాన్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే. చదవండి: కృష్ణ సినిమాల్లోకి రావడానికి కారణమెవరో తెలుసా? అదే సూపర్స్టార్ కృష్ణ చివరి సినిమా! -
బహు భాషా కోవిదురాలు రమ్యకృష్ణ గోవర్ధన్పై ప్రశంసలు
హైదరాబాద్ బాలిక రమ్యకృష్ణ గోవర్ధన్పై తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ప్రశంసల వర్షం కురిపించారు. దశాబ్దకాలంగా తెలంగాణ, దక్షిణ కొరియా భాష, సంస్కృతి, సంగీత, చలనచిత్రాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ నుంచి మొట్ట మొదటి విద్యార్థిగా ‘తూర్పు ఆసియా - కొరియన్ భాష, సాహిత్య, చరిత్ర అధ్యయనం’ చేసేందుకు అమెరికాకు చెందిన ఆరు యూనివర్సిటీలు రమ్యకు స్కాలర్షిప్లు అందించేందుకు ముందుకు వచ్చాయి. రమ్యకష్ణ ప్రతిభాపాటవాలపై మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. ఆమె 11 సంవత్సరాల వయస్సు నుండి కొరియన్ భాషను అనర్గళంగా మాట్లాడే నైపుణ్యాన్ని సంపాదించారని చెప్పారు. 13 సంవత్సరాల వయస్సులో హైదరాబాద్లో ‘హైదరాబాద్ కెపాపర్స్’ పేరుతో భారత- తెలంగాణ- కొరియా సాంస్కృతిక సంస్థను స్దాపించడం గొప్ప విషయమని తెలిపారు. తెలంగాణ - భారత- కొరియా సంస్కృతిని ప్రోత్సహించడానికి ఎనలేని కృషి చేసిన ఆమె బహు భాష కోవిదురాలని అన్నారు. చైనీస్, జాపనీస్, ఫ్రెంచ్ భాషలలో ప్రావీణ్యం సంపాదించారని కొనియాడారు. ప్రభుత్వ ప్రోత్సాహం మరువ లేనిది తెలంగాణలో కొరియన్ భాష, సంస్కృతి, కళల ప్రోత్సాహానికి మామిడి హరికృష్ణ అండగా నిలిచారని రమ్యకృష్ణ చెప్పారు. తనకు తోడ్పాటు అందించిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. -
ఓటీటీలోకి రమ్యకృష్ణ అరంగేట్రం, ఆ డాన్స్ షోలో ‘శివగామి’ సందడే సందడి..
ప్రేక్షకులకు వందశాతం వినోదం అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ ప్లాట్ఫాం ఆహా. ప్రేక్షకులు వందశాతం వినోదం అందించేందుకు ఆహా సరికొత్త కథలు, షోలతో ముందుకు వస్తోంది. అన్స్టాపబుల్ టాక్ షో విత్ ఎన్బీకే, తెలుగు ఇండియన్ ఐడల్ వంటి రియాలిటీ షోలతో ప్రేక్షకులను అలరించిన ఆహా తాజాగా డాన్స్ ఐకాన్ షోతో సిద్ధమైంది. ఆహా ప్లాట్ఫాంపై తాజాగా గ్రాండ్గా లాంచ్ అయిన ఈ షోతో లేడీ సూపర్ స్టార్, ‘శివగామి’ రమ్యకృష్ణ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టింది. చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా? ప్రముఖ యాంకర్ ఓంకార్ హొస్ట్గా చేయనున్న ఈ షోకి ఆమె జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు కింగ్ ఆఫ్ హుక్ స్టెప్స్ శేఖర్ మాస్టర్ కూడా న్యాయనిర్ణేతగా ఉండబోతున్నాడు. ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ.. ‘డ్యాన్స్ ఐకాన్ వంటి షోతో ఆహాలో జడ్జిగా అరంగేట్రం చేస్తుండడం సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక ఫార్మాట్ ఈ మధ్య కాలంలో ఎవ్వరూ చేయనిది. ఈ షో ద్వారా ఎవరూ చూడని ఒక కొత్త రమ్యని చూడబోతున్నారు. అందరూ ఈ షో ని ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చారు. చదవండి: ఓటీటీ రిలీజ్కు రెడీ అవుతున్న కార్తికేయ 2! ఎప్పుడు, ఎక్కడంటే.. అదే విధంగా ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘డ్యాన్స్ ఐకాన్తో ఆహా ఫ్యామిలీకి రమ్యకృష్ణని మేము స్వాగతిస్తున్నాము. రమ్య ఎంతో మందికి ఒక రోల్ మోడల్. డ్యాన్స్పై ఆమెకున్న అవగాహన అసమానమైనది. డాన్స్ ఐకాన్కు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. అనంతరం యాంకర్, ఈ షో ప్రొడ్యూసర్ ఓంకార్ “రమ్యకృష్ణ గారు ఈ షో కి జడ్జి గా వ్యవహరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. రమ్య గారితో పనిచేయాలి అనే నా కల, ఆహ టీం ద్వారా సాకరమైంది. డాన్స్ ఐకాన్ షో ద్వారా అందరికీ నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ దొరకనుంది’ అని తెలిపారు. ఈ షో సెప్టెంబర్ 17 నుండి ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ఆహాలో అందుబాటులో ఉండనుంది. -
రమ్యకృష్ణ చెన్నైలో ఉంటుంది, నేనేమో హైదరాబాద్లో..: కృష్ణవంశీ
టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్గా కృష్ణవంశీకి పేరుంది. గులాబీ, సింధూరం, ఖడ్గం, అంతఃపురం వంటి సినిమాలతో ఇండస్ట్రీకి హిట్స్ ఇచ్చిన కృష్ణవంశీ తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా 'రంగమర్తాండ'. నక్షత్రం సినమా తర్వాత దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత డిఫరెంట్ కాన్సెఫ్ట్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు కృష్ణవంశీ. ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆయన సినిమాకు సంబంధించిన విశేషాలతో పర్సనల్ లైఫ్కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'రమ్యకృష్ణ రేంజ్ని మ్యాచ్ చేయాలనే టెన్షన్ నాకు ఉంటుంది. నాకు ఆమెతో కాంపిటిషన్ ఉంటుంది. కొడుకుతో కలిసి రమ్యకృష్ణ చెన్నైలో ఉంటోంది. నేనేమో హైదరాబాద్లో ఉంటున్నా. ఎప్పుడూ ఖాళీ దొరికినా నేను అక్కడికి వెళ్తుంటా. లేదా వాళ్లే నా దగ్గరికి వస్తుంటారు. ఇక మా అబ్బాయి రిత్విక్ చాలా యాక్టివ్. ఎంతైనా క్రాస్బ్రీడ్ కదా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రమ్యకృష్ణ, మీరు వేరేవేరుగా ఉంటే పుకార్లు వస్తుంటాయి కదా అని అడగ్గా.. అలాంటివి తాము పట్టించుకోమని, ఇండస్ట్రీలో ఇలాంటి గాసిప్స్ కామన్' అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అందరికీ గాసిప్స్ అంటేనే ఇంట్రెస్ట్ కదా అంటూ సమాధానమిచ్చారు. -
‘లైగర్’ మూవీకి రమ్యకృష్ణ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య నిన్న(ఆగస్టు 25న) ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ను తెచ్చుకుంది. రిలీజ్కు ముందు చేసిన ప్రచార కార్యక్రమాలు, పాటలు, ట్రైలర్తో సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. అయితే అదేక్కడ సినిమాలో కనిపించలేదని అంటున్నారు ప్రేక్షకులు. చదవండి: అనసూయ, విజయ్ ఫ్యాన్స్ మధ్య ట్విటర్ వార్, తగ్గేదే లే అంటున్న యాంకరమ్మ ఇక ఏదేమైన పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్ టాక్ను తెచ్చుకుంది. ఈ క్రమంలో మూవీ బడ్జెట్, హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ హాట్టాపిక్గా మారింది. అయితే ఈ లైగర్ను భారీ తారాగణంతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. లీడ్ రోల్స్తో పాటు లైగర్లో ప్రధాన పాత్రలు పోషించిన సీనియర్ నటి రమ్యకృష్ణ, మైక్ టైసన్ల పారితోషికంపై కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాకు విజయ్ రూ. 35 కోట్లు తీసుకున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. చదవండి: ఒక్క సినిమాకే భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన ‘సీత’? అవాక్కవుతున్న నిర్మాతలు! ఈ రూమర్స్ ప్రకారం విజయ్ ఈ మూవీకి రూ. 35 కోట్ల పారితోషికం తీసుకున్నాడట. ఇక విజయ్ తల్లిగా.. పవర్ఫుల్ మదర్గా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన రమ్యకృష్ణ కోటీ రూపాయలు తీసుకోగా.. కోచ్గా కనిపించిన రోనిత్ రాయ్ రూ. 1.5 కోట్లు తీసుకున్నాడట. ఇక హీరోయిన్గా ఈ సినిమాలో అందాలు ఆరబోసిన అనన్య పాండే కూడా బాగానే చార్జ్ చేసిందట. ఈ సినిమాకు ఆమె రూ. 3 కోట్లు అందుకుందని సమాచారం. ఇక సినిమాకు హైలెట్ రోల్గా మొదటి నుంచి పేరు తెచ్చుకు మైక్ టైసన్ విజయ్ కంటే ఎక్కువగా రూ. 40 కోట్లు అందుకున్నాడని తెలుస్తోంది. -
చీరకట్టులో రమ్యకృష్ణ ఇబ్బందులు.. అయినా ఫొటోలకు పోజులు
Ramya Krishnan Gets Irritated With Saree Video Goes Viral: ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ అందం, నటన, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నీలాంబరిగా.. శివగామిగా.. ఇలా ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్కే కొత్త అర్థం తీసుకొస్తుంది. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో నటించి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న రమ్యకృష్ణ ప్రస్తుతం ప్రాధాన్యత గల పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. బాహుబలిలో శివగామిగా అలరించిన రమ్య కృష్ణ 'బంగార్రాజు', 'రొమాంటిక్' సినిమాల్లో కీలక పాత్రల్లో సందడి చేసింది. తాజాగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగ్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లైగర్' మూవీలో మరో పవర్ఫుల్ పాత్రతో ముందుకు రానుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే జోడీగా నటించిన ఈ మూవీ ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ను భారీగా నిర్వహిస్తోంది చిత్రబృందం. ఇందులో భాగంగానే ముంబైలో పలు ఇంటర్వ్యూలూ నిర్వహిస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ ప్రమోషన్స్లో రమ్యకృష్ణ పాల్గొంది. ఉల్లిపొర లాంటి చీరలో రమ్యకృష్ణ కనువిందు చేసింది. స్టూడియో బయట ఫొటోగ్రాఫర్లకు పోజులిస్తూ సందడి చేసింది. సన్నని గాలి తాకుతుంటే పలుచని చీరలో రమ్యకృష్ణ అందం మతిపోగెట్టాల ఉంది. గాలికి చీర సర్దుకుంటూ, జుట్టు సవరించికుంటూ కొంచెం ఘాటుగానే దర్శనమిచ్చింది శివగామి. అయితే అలా గాలికి చీర జరగడంతో రమ్యకృష్ణ కాస్త ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. చదవండి: నా సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్ ఎక్కువ ఫ్లాప్స్ ఇచ్చిన స్టార్స్ ఎవరని గూగుల్ చేసేవాడిని: నితిన్ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు నీలాంబరికి ఇంకా వయసు అవ్వలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 'లైగర్'లో విజయ్ దేవరకొండకు తల్లిగా రమ్యకృష్ణ నటిస్తున్న విషయం తెలిసిందే. మరీ ఈ పాత్రతో రమ్యకృష్ణ ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో చూడాలి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
రమ్యకృష్ణతో విడాకులు? స్పందించిన కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రంగమర్తాండ'. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు కృష్ణవంశీ. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న ఆయన సినిమాకు సంబందించిన విశేషాలతో పాటు మ్యారేజ్ లైఫ్పై వస్తోన్న రూమర్స్పైనా స్పందించారు. గత కొన్నాళ్లుగా కృష్ణవంశీ- నటి రమ్యకృష్ణ విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ ఈ వార్తలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. 'బాధ్యతలంటే భయంతో అసలు పెళ్లే వద్దునుకున్నా. కానీ చివరకు రమ్యకృష్ణతో వివాహం జరిగింది. ఇదంతా లైఫ్ డిజైన్ అని భావిస్తాను. పెళ్లి తర్వాత నా జీవితంలో పెద్దగా మార్పులు రాలేదు. రమ్యకృష్ణ నన్ను నన్నులా ఉండనిచ్చింది. ఇక ఆమెతో విడాకులు అంటారా? ఇందులో నిజం లేదు. పబ్లిక్ ఫిగర్స్గా ఉన్నప్పుడు ఇలాంటి పుకార్లు వస్తుంటాయి. కానీ మేం పెద్దగా పట్టించుకోం. అందుకే ఖండించాలని కూడా అనుకోము. జస్ట్ నవ్వి ఊరుకుంటాం' అంతే అంటూ చెప్పుకొచ్చారు. -
బంగార్రాజు: ఏకంగా 8మంది హీరోయిన్లు!.. గ్లామర్తో మెస్మరైజ్
Krithi Shetty And Other 8 Heroines Adds Bangarraju Glamour : 'సోగ్గాడే చిన్నినాయనా' వంటి హిట్ తర్వాత నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’.‘సోగ్గాడు మళ్ళీ వచ్చాడు’ అన్నది క్యాప్షన్. ఈ మూవీలో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగ చైతన్యకి జోడీగా కృతీశెట్టి నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ఒకరు కాదు.. ఏకంగా 8మంది హీరోయిన్లు సందడి చేయనున్నారట. ఇందులో రమ్యకృష్ణ, కృతిశెట్టి మెయిన్ లీడ్స్ కాగా ఫరియా అబ్దుల్లా స్పెషల్ సాంగ్లో కనిపించింది. వీళ్లతో పాటు మీనాక్షి దీక్షిత్, దర్శన బానిక్, వేదిక, దక్ష నాగార్కర్, సిమ్రత్ కౌర్ వంటి హీరోయిన్లు కూడా కనిపించనున్నట్లు తెలుస్తుంది. గతంలో నాగార్జున నటించిన కింగ్ సినిమాలోని ఒక పాటలో ఏకంగా ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్స్ సందడి చేసిన సంగతి తెలిసిందే. -
ఆసక్తికర అప్డేట్: మెగాస్టార్ వాయిస్తో కృష్ణవంశీ ‘రంగమార్తాండ’
ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠిలో సూపర్ హిట్గా నిలిచిన ‘నటసామ్రాట్’ చిత్రానికి రీమేక్గా ‘రంగమార్తాండ’ తెరకెక్కింది. ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి తాజాగా ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ మూవీకి ‘గాడ్ఫాదర్’ మెగాస్టార్ చిరంజీవి గొంతు ఇచ్చినట్లు తాజాగా డైరెక్టర్ కృష్ణవంశీ వెల్లడించారు. చదవండి: 'సర్కారు వారి పాట' సెట్లో నమ్రత సందడి ఈ మేరకు ఆయన ట్విట్ చేస్తూ.. ‘అడగ్గానే ఒప్పుకుని.. మరేమీ అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా మా చిత్రానికి వాయిస్ ఓవర్ చెప్పినందుకు థాంక్యూ అన్నయ్యా’ అంటూ చిరుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులోని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా మెగా వాయిస్ ‘రంగమార్తాండ’ వినీలాకాశంలో మరో వెలుగు దివ్వె అని అభివర్ణించారు ఆయన 'రంగమార్తాండ' చిత్రంలో ప్రకాశ్ రాజ్తో పాటు రమ్యకృష్ణ కీ రోల్ పోషిస్తుండగా.. అనసూయ భరద్వాజ్, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ThQ annyya for ur generocity n unconditional kindness ...one more crowned lightening on #rangamarthandas sky ... THE MEGA VOICE........ @prakashraaj @meramyakrishnan @ShivathmikaR @anusuyakhasba @Rahulsipligunj @AadarshBKrishna @kalipu_madhu pic.twitter.com/mApNqcGvxV — Krishna Vamsi (@director_kv) October 26, 2021 -
రమ్యకృష్ణ బర్త్డే సెలబ్రేషన్స్లో త్రిష, ఖుష్భూ..
Ramya Krishna Celebrates 51st Birthday: ప్రియురాలు, భార్య, తల్లి, అమ్మోరు, భక్తురాలు.. ఇలా కథానాయికగా గ్లామరస్, ట్రెడిషనల్ క్యారెక్టర్లు చేశారు రమ్యకృష్ణ. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫుల్ బిజీగా ఉన్నారామె. ఈ బ్యూటీ తన 51వ పుట్టినరోజు (సెప్టెంబర్ 15)ను కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో చేసుకున్నారు. రాధిక, ఖుష్బూ, లిజీ, మధుబాల, త్రిష, రెజీనాలతో పాటు కొందరు నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రమ్యకృష్ణ ప్రస్తుతం తెలుగులో ‘బంగార్రాజు’, ‘రంగ మార్తాండ’, ‘రిపబ్లిక్, లైగర్’ వంటి చిత్రాలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) చదవండి: రమ్యకృష్ణ బర్త్డే: రిపబ్లిక్ మూవీ నుంచి విశాఖ వాణి లుక్ సప్తగిరి హీరో స్థాయికి ఎదగడం గర్వకారణం: తలసాని -
రమ్యకృష్ణ బర్త్డే: రిపబ్లిక్ మూవీ నుంచి విశాఖ వాణి లుక్
ప్రముఖ నటి రమ్యకృష్ణ బర్త్డే 51 వసంతంలోకి అడుగు పెడుతున్నారు. బుధవారం(సెప్టెంబర్ 15) ఆమె బర్త్డే సందర్భంగా పలువరు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేగాక శివగామి పుట్టిన రోజున ఆమె ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చారు రిప్లబిక్ మూవీ టీం. సాయి ధరమ్ తేజ్హీరోగా తెరకెక్కుతున్న రిపబ్లిక్ మూవీలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. బర్త్డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆమె పాత్ర లుక్, పేరును ప్రకటించారు. ఇందులోని ఆమె విశాఖ వాణి అనే సీరియస్గా పవర్ ఫుల్ మహిళ రాజకియ నాయకురాలిగా కనిపించారు. దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. దీనిని జీ స్టూడియోస్ సహకారంతో జెబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై జె భగవాన్, జె పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు నటించారు. Wishing #VishakhaVani a.k.a @meramyakrishnan A very Happy & Joyous Birthday #REPUBLIC #RepublicFromOct1st@IamSaiDharamTej @aishu_dil @devakatta @IamJagguBhai #ManiSharma @mynnasukumar @bkrsatish @JBEnt_Offl @ZeeStudios_ @ZeeMusicCompany @JBhagavan1 @j_pullarao pic.twitter.com/xgZJrMO4Q5 — BA Raju's Team (@baraju_SuperHit) September 15, 2021 -
హ్యాపీ బర్త్డే చెప్పిన ఖుష్భు, నవ్విన బిగ్బాస్ బ్యూటీ
ఆమె నమ్మిందే చేస్తుందంటూ చీర ఫొటో షేర్ చేసిన జెనిలియా ‘శివగామి’కి హ్యాపీ బర్త్డే చెప్పిన ఖుష్భు బ్లాక్ అండ్ వైట్లో ఇలియానా, ఆ సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇలా.. ఇంకా ఎటిఎమ్కు వెళుతున్నారా అంటూ వీడియో షేర్ చేసిన శ్రీముఖి View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Sushma kiron🧿 (@sushmakiron) View this post on Instagram A post shared by Meera Chopra (@meerachopra) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
Ramya krishna: రమ్యకృష్ణకు హ్యాపీ బర్త్డే
సాక్షి, హైదరాబాద్: నీలాంబరి.. అలియాస్.. శివగామి.. అలియాస్ రమ్యకృష్ణ. సినీ అభిమానులకు పరిచయం అక్కరలేని అందాల నటి రమ్యకృష్ట. రమ్యకృష్ణ ఉంటే ఆ సినిమా ఫ్లాప్ ఖాయం అన్న స్థాయినుంచి ఆమె నటిస్తే చాలు విజయం అదే వస్తుందన్న భరోసా కల్పించిన లెవల్ ఆమెది. నీలాంబరిగా సవాల్ విసిరినా, రాజమాత శివగామిగా రాజ్యాన్ని పాలించినా ఆమెకే చెల్లు. టాలీవుడ్ అగ్ర కథానాయకులు అందరితోనూ సూపర్ డూపర్ మూవీల్లో నటించిన ఘనత రమ్యకృష్ణ సొంతం. పాత్ర ఏదైనా దాంట్లో ఇమిడిపోవడం ఆమె ప్రత్యేకత. కన్నులలో సరసపు వెన్నెల కురిపించే రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే అంటోంది సాక్షి.కామ్ -
నటి ఆరోపణలు.. డీసెంట్గా స్పందించిన రమ్యకృష్ణ
వనితా విజయ్కుమార్.. సీనియర్ యాక్టర్స్ విజయ్-మంజుల కూతురు. వ్యక్తిగత కారణాలతో నటనకు చాలాకాలం దూరంగా ఉన్న ఈమె.. బిగ్ బాస్ ద్వారా మళ్లీ తెర మీదకు వచ్చింది. ఆ తర్వాత తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తాజాగా స్టార్ విజయ్ టీవీతో ఆమె ప్రయాణం కొనసాగుతూ వస్తోంది. తాజాగా ‘బిగ్బాస్ జోడిగల్’ రియాలిటీ షోలో పాల్గొంటున్న ఆమె.. ఆ షో నుంచి అర్థాంతరంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలో కాస్టింగ్ కౌచ్, వేధింపులు, అవమానాలు అంటూ ట్వీట్లు చేసిన వనితా.. ఓ సీనియర్ నటి వల్లే తాను షోను వీడాల్సి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఆ షోకి హోస్ట్ వ్యవహరిస్తోంది నటి రమ్యకృష్ణన్(రమ్యకృష్ణ). పైగా ఈ షో మొత్తంలో ఆమె సీనియర్ కూడా. దీంతో ఆమెను ఉద్దేశించే వనితా ఈ కామెంట్లు చేసిందని అంతా అనుకుంటున్నారు. Thank you @vijaytelevision for giving me the best opportunities of my life beginning from #biggbosstamil3 ..#cookuwithkomali season 1..and #kalakkapovadhuyaaru season 9.. and #bbjodigal. I want to make it clear I WALKED OUT OF THE SHOW @bbsureshthatha sorry I had to do this..❤️🙏 pic.twitter.com/E0c95POaoD — Vanitha Vijaykumar (@vanithavijayku1) July 2, 2021 అయితే ఈ వివాదాన్ని ఓ కోలీవుడ్ న్యూస్ ఛానెల్ రమ్యకృష్ణ వద్ద ప్రస్తావించింది. దానికి రమ్యకృష్ణ బదులిస్తూ.. ‘‘షోలో ఏం జరిగిందో కూడా మీరు ఆమెను అడిగి ఉంటే బాగుండేది’’ అని బదులిచ్చింది. ‘నాకు సంబంధించినంత వరకు ఇదేం పెద్ద విషయం కాదు. నో కామెంట్స్ అని తేల్చేసింది ఆమె. కాగా, చివరి ఎపిసోడ్లో వనిత పర్ఫార్మెన్స్కు పదికి 1 మార్క్ ఇచ్చింది రమ్యకృష్ణ. చదవండి: ఆ కామెంట్ నచ్చకే విడిపోయా- హీరోయిన్ -
సలార్: ప్రభాస్కు అక్కగా తెరపైకి మరో హీరోయిన్ పేరు!
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ ఒకటి. ఈ మూవీని డైరెక్టర్ ప్రకటించినప్పటి నుంచి దీనికి సంబంధించి రూమర్స్ సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ పాత్రపై ఇంతకాలం రకారకాల వార్తలు వినిపించగా.. తాజాగా ప్రభాస్కు సోదరి పాత్ర గురించిన రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇందులో ప్రభాస్కు అక్కగా ప్రముఖ నటి రమ్మకృష్ణ నటించనున్నట్లు నిన్నటి వరకు వార్తలు వినిపించాయి. ఈ తరుణంలో తాజాగా అక్క పాత్రకు మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఇందులో ప్రభాస్ సోదరి పాత్రకు జ్యోతికను అనుకున్నంటున్నట్లుగా ఫిలిం ధూనియాలో టాక్. అంతేగాక ఇప్పటికే మూవీ మేకర్స్ జ్యోతికను కలిసి కథ వివరించినట్లు కూడా తెలుస్తోంది. అయితే దీనికి జ్యోతిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనే దానిపై క్లారిటి రావాల్సి ఉంది. అంత ఒకే అయితే ఆమెను తెలుగు, తమిళం వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కన్నడ వెర్షన్లో మాత్రం నటి ప్రియాంక త్రివేదిని సంప్రదించినట్లు సమాచారం. కాగా, జ్యోతిక తెలుగులో చిరంజీవితో ‘ఠాగూర్’, నాగార్జునతో ‘మాస్’ సినిమాలో హీరోయిన్గా నటించారు. అలాగే చంద్రముఖిలో తన నటనకు ప్రశంసలు దక్కాయి. కాగా ‘కేజీఎఫ్’ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. శృతీ హాసన్ ఈ మూవీతో మొదటి సారిగా డార్లింగ్తో జతకడుతోంది. భారీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పక్కా యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దీనితో పాటు ప్రభాస్ మరో రెండు పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ చేస్తుండగా... రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో ‘రాధే శ్యామ్’ చిత్రంలో నటిస్తున్నాడు. చదవండి: అప్పుడు అమ్మ... ఇప్పుడు అక్క! -
అప్పుడు అమ్మ... ఇప్పుడు అక్క!
‘బాహుబలి’ వంటి బ్రహ్మాండమైన హిట్ తర్వాత హీరో ప్రభాస్, పవర్ఫుల్ యాక్టర్ రమ్యకృష్ణ మరోసారి కలిసి నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘సలార్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్కు అక్క పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. మరి.. ‘బాహుబలి’ చిత్రంలో ప్రభాస్కు అమ్మ (పవర్ఫుల్ శివగామి పాత్ర)గా నటించిన రమ్యకృష్ణ...‘సలార్’లో అక్క పాత్రలో కనిపిస్తారా? వేచి చూడాల్సిందే. మరోవైపు ‘బాహుబలి’ తర్వాత ‘సలార్’ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారట. అది కూడా తండ్రీకొడుకుల పాత్రల్లో కనిపిస్తారట ప్రభాస్. ‘సలార్’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదలకు షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. -
అధికారం మాత్రమే శాశ్వతం అంటున్న రమ్యకృష్ణ
సాయితేజ్, ఐశ్వర్యా రాజేశ్ జంటగా, జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రిపబ్లిక్’. దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నారు. జె. భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఇందులో శక్తిమంతమైన రాజకీయ నాయకురాలు విశాఖ వాణి పాత్ర చేస్తున్నారు రమ్యకృష్ణ. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ను శనివారం విడుదల చేశారు. ‘తప్పూ ఒప్పులు లేవు, అధికారం మాత్రమే శాశ్వతం’ అని రాసిన వాక్యాలతో ఆమె లుక్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రశ్నిస్తూ ప్రజల సమస్యలపై పోరాటం చేసే పాత్రను సాయితేజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ తనదైన నటనతో మెప్పించనున్నారు’’ అన్నారు. -
విజయ్ దేవరకొండ సినిమా డేట్ ఫిక్స్
‘లైగర్’ విడుదల తేదీ ఖరారైంది. ఈ ఏడాది సెప్టెంబరు 9న ఈ చిత్రం విడుదల కానుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘లైగర్’. ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనేది ట్యాగ్లైన్ . ఈ చిత్రంలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ బాక్సర్గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వా మెహతా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ముంబయ్లో గురువారం మొదలైంది. ‘‘ఈ సినిమా కోసం విజయ్ మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. విజయ్ క్యారెక్టర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని చిత్రబృందం తెలియజేసింది. -
చిరంజీవి సోదరిగా?
మలయాళ సూపర్హిట్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్లో చిరంజీవి నటించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. వీవీ వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. మలయాళ సినిమాలో మోహన్లాల్ హీరోగా నటించారు. ఆయన పాత్రను చిరంజీవి చేస్తారు. స్క్రిప్ట్ పరంగా ఈ సినిమాలో చిరంజీవి పాత్రకు ఓ సోదరి ఉంటుంది. ఈ పాత్రకు రమ్యకృష్ణ పేరుని పరిశీలిస్తున్నారట చిత్రబృందం. ‘లూసిఫర్’లో మోహన్లాల్ సోదరిగా మలయాళ నటి మంజూ వారియర్ నటించారు. గతంలో ‘ఇద్దరు మిత్రులు, అల్లుడా మజాకా’ వంటి సినిమాల్లో హీరోహీరోయిన్గా నటించారు చిరు, రమ్యకృష్ణ. మరి.. ‘లూసిఫర్’ లో అన్నా చెల్లెళ్లుగా నటిస్తే అది కచ్చితంగా విశేషమే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఫ్యాబులెస్ 50 అంటున్న శివగామి
ప్రముఖ నటి రమ్యకృష్ణ 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. కుటుంబసభ్యుల మధ్య మంగళవారం పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు శివగామి. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఫ్యాబులస్ 50 వేడుకను సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉందంటూ రమ్యకృష్ణ ట్వీట్ చేశారు. తెలుగు, హిందీ, తమిళం భాషల్లో నటించిన రమ్యకృష్ణ తన నటనా చాతుర్యంతో ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి'లోని శివగామి పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇటీవలే జయలలిత బయోపిక్ క్వీన్ అనే వెబ్ సిరీస్లోనూ నటించారు. బాలీవుడ్లోనూ 'ఖల్ నాయక్', 'క్రిమినల్', 'షాపాత్', 'బడే మియాన్ చోటే మియాన్' వంటి సూపర్ హిట్ చిత్రాల్లోనూ నటించారు. అయితే ఆ తర్వాత ఆఫర్లు వచ్చినా పెద్దగా కథలు నచ్చలేదని, అందుకే బాలీవుడ్లో సినిమాలు చేయలేదు అని తెలిపారు. ప్రస్తుతం తన దృష్టి అంతా దక్షిణాది సినిమాల వైపే ఉందని చెప్పుకొచ్చారు. (మా పిల్లలు ప్రతిభావంతులు) Fifty and fabulous n what better than a FAMJAM to bring it on!!!! #Familylove #birthday #thankyougod pic.twitter.com/aaMalghhp6 — Ramya Krishnan (@meramyakrishnan) September 14, 2020 -
ఐఏఎస్ ఆఫీసర్
త్వరలో ఐఏఎస్ ఆఫీసర్గా చార్జ్ తీసుకోబోతున్నారు హీరో సాయిధరమ్ తేజ్. దేవ కట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారట సాయిధరమ్ తేజ్. ప్రస్తుతం ఐఏఎస్ ఆఫీసర్ల విధివిధానాలు, వారి బాడీ లాంగ్వేజ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారట సాయిధరమ్. ఫిట్గా కనిపించేందుకు బరువు తగ్గేలా వర్కౌట్స్ కూడా చేస్తున్నారని తెలిసింది. నార్త్ ఇండియా బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథనం ఉంటుందని సమాచారం. కరోనా పరిస్థితులు కాస్త కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్ను ఆరంభించాలని అనుకుంటున్నారట. ఇందులో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం విడుదలకు సిద్ధమౌతోంది. -
రమ్యకృష్ణ కారు డ్రైవర్ అరెస్ట్
చెన్నై: సీనియర్ నటి రమ్యకృష్ణ కారు డ్రైవర్ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. పుదుచ్చేరి నుంచి చెన్నైకు అక్రమంగా మద్యం తరలిస్తున్న రమ్యకృష్ణ కారు డ్రైవర్ సెల్వకుమార్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భారీగా మద్యాన్ని, కారును సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాబలిపురం నుంచి చెంగల్పట్టుకు వస్తున్న రమ్యకృష్ణకు చెందిన టయోటా ఇన్నోవా క్రిస్టా( టీఎన్07క్యూ 0099) కారును పోలీసులు తనిఖీ చేశారు. అయితే ఈ కారులో అక్రమంగా తరలిస్తున్న 96 బీర్ బాటిళ్లు, 8 మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు. దీంతో కారును, మద్యం బాటిళ్లు సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే వ్యక్తిగత పూచీకత్తుపై డ్రైవర్ సెల్వకుమార్ను పోలీసులు విడుదల చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై రమ్యకృష్ణ ఇప్పటివరకు స్పందించలేదు. ఇక లాక్డౌన్ నిబంధనల్లో భాగంగా తమిళనాడులో మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సివుంది. -
చిరంజీవి కూడా వెబ్సిరీస్లో..
‘పరుగులు లేవు. మేకప్ లూ.. పేకప్లూ లేవు. అరుపులూ.. హడావుడీ లేదు. పొల్యూషన్ లేదు. చుట్టూ నిశ్శబ్ధమే.. కుటుంబంతో మమేకమే’ అంటున్నారు సినీ నటి ఎవర్ గ్రీన్ గ్లామర్ హీరోయిన్ రమ్యకృష్ణ. టాలీవుడ్ అగ్రగామి హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా కూడారాణించి.. బాహుబలి సినిమా తర్వాత మరిన్ని ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ స్టార్ యాక్ట్రెస్ గతేడాదే వెబ్సిరీస్లో కూడా నటించారు. క్వీన్ పేరుతో రూపొందిన ఆ వెబ్సిరీస్ తెలుగులో డబ్ అయి జీ తెలుగు చానెల్లో ప్రసారం కానుంది. ఒక వెబ్సిరీస్ తెలుగు టీవీ చానెల్లో ప్రసారం అవుతుండటం కూడా ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రమ్యకృష్ణ ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. సినిమాల్లో బిజీ బిజీ.. ప్రస్తుతం కృష్ణవంశీ తీస్తున్న రంగమార్తాండ, పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న చిత్రం, సాయిధరమ్ తేజ్ సినిమా.. ఇలా పలు చిత్రాల్లో నటిస్తున్నా. క్వీన్ సీజన్–2 కూడా చేయాలి. ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్, రెండు హిందీ ప్రాజెక్టŠస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూడాలి లాక్డౌన్ తర్వాత ఏమవుతుందో..? నాకు డ్రీమ్ రోల్ అంటూ ఏవీ ఉండవు. నాకొచ్చిన, వస్తున్నవన్నీ నేను కోరుకున్నవే అన్నట్టు ఉంటాయి. కాబట్టి అవే నా డ్రీమ్ రోల్స్ అనుకోవచ్చు(నవ్వుతూ)..లాక్డౌన్ నా జీవితంలో ముందెన్నడూ ఎరుగని అనుభవాన్ని ఇచ్చింది. హాయిగా ఉంది. ఇలాంటి టైమ్ లైఫ్లో దొరకలేదు. ఇలాంటి టైమ్ మళ్లీ దొరకదేమో కూడా.. దాదాపు రెండు నెలలైందేమో గుమ్మం దాటి. ఓ వైపు టైమంతా మన చేతుల్లోకి రావడం, ఫ్యామిలీతో మరింత టైమ్ స్పెండ్ చేయడం చాలా బాగున్నా.. మరోవైపు ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతుండటం, మన దేశంలో వలస కూలీలు, ఆహారం లేని నిరుపేదల దుస్థితి చూస్తుంటే మాత్రం చాలా బాధ అనిపిస్తోంది. వాళ్లంతా తమ తమ ఊర్లకు వెళ్లి.. బాగుండాలని కోరుకుంటున్నాను. ‘క్వీన్’ను ఆమెతో పోలుస్తున్నారు.. నేను నటించిన తొలి వెబ్సిరీస్ క్వీన్. దీని డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ చాలా ప్రజ్ఞావంతులు. ఆయన స్ట్రాంగ్ స్క్రిప్తో వస్తారు. చాలా బాగా తీస్తారని తెలుసు. ఈ అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? అందుకే చేశా. ఇక ఇందులో నా పాత్ర జయలలితను పోలినట్టు ఉందని అంటున్నారు. అది ఎవరికి తోచినట్టు వారు పోల్చుకోవచ్చు.. దానికి నేనేం చేయలేను. అనితా శివకుమారన్ రాసిన క్వీన్ నవల ఆధారంగా తీసిన చిత్రమిది. ఇది తెలుగు ప్రేక్షకులకు కూడా జీ తెలుగు చానెల్లో వచ్చే సోమవారం నుంచి సీరియల్గా అందిస్తుండటం నాకు మరింత ఆనందంగా అనిపిస్తోంది. క్వీన్ సినిమా చేయడం ద్వారా రాజకీయ ఆకాంక్షలు, ఆలోచనలు ఏమీ రాలేదు. వస్తాయా? అంటే భవిష్యత్లో ఏమవుతుందీ చెప్పలేం కదా.. ఒత్తిడి వద్దు.. జాగ్రత్తలు వీడొద్దు.. రేపేమవుతుంది? రేపేం కాదు? అనేది తెలియడం లేదు. కంటికి కనపడని శత్రువుతో చేసే యుద్ధం కాబట్టి మానసిక ప్రశాంతతను కొంత కోల్పోతాం. ఇది మనల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. కరోనాతో మనం కలిసి బతకాల్సిందే అంటున్నారు. కాబట్టి బీ స్ట్రాంగ్, భయం, ఒత్తిడి మనల్ని తమ ఆధీనంలోకి తీసుకోకుండా పాజిటివ్ థింకింగ్ పెంచుకోవాలి.. జాగ్రత్తలు పాటించండి. ఒకసారి ఈ లాక్డౌన్ పూర్తయిన తర్వాత ఈ టైమ్ తప్పకుండా మెమొరబుల్ అవుతుంది. ఇలాంటి ఫ్రీ టైమ్ మళ్లీ వస్తుందా? అనిపిస్తుంది. కానీ మళ్లీ వచ్చినా ఇలాంటి కరోనా లాంటి కారణంతో కాకుండా రావాలని మాత్రం కోరుకుంటున్నా. ప్రేక్షకుల హృదయాల్లో వెబ్.. డబ్ ప్రస్తుతం వెబ్సిరీస్ కోసం చాలా వైవిధ్యభరితమైన ఆసక్తికరమైన కథాంశాలు ఎంచుకుంటున్నారు. దీని వల్ల నటులకు వెరైటీ రోల్స్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ కరోనా దెబ్బకు వెబ్సిరీస్కి మరీ డిమాండ్ బాగా పెరిగింది. అయితే సినిమాలు చూడటం కోసం థియేటర్స్కి జనం వెళ్లడం మానేస్తారు అనను గానీ వెబ్సిరీస్ కూడా అదేస్థాయిలో ఆదరణ వస్తుందని చెప్పగలను. ఇకపై కూడా వెబ్సిరీస్లో నటిస్తాను. తెలుగులో చిరంజీవిలాంటి అగ్రనటులు కూడా వెబ్సిరీస్లో నటిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారితో కాంబినేషన్గా నాకు ఏదైనా మంచి ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తాను. ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ ఆఫర్లున్నాయి. వెబ్సిరీస్లో సాంగ్స్ ఉండవు నిజమే.. అయినా నేనిప్పుడేం సాంగ్స్ చేస్తాను చెప్పండి?(నవ్వుతూ).. సాంగ్స్కంటే వెబ్సిరీస్లో కంటెంటే పెద్ద ఆకర్షణ. -
హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ లో ఫండ్ రైసింగ్ కార్యక్రమం
-
వేసవిలో రొమాంటిక్
‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మించిన చిత్రం ‘రొమాంటిక్’. ఆకాష్ పూరి, కేతికా శర్మ జంటగా, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు. అనిల్ పాడూరి దర్శకుడు. ఈ చిత్రాన్ని మే 29న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. అనిల్ పాడూరి మాట్లాడుతూ– ‘‘ఇంటెన్స్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. వేసవి సెలవుల్లో కాలక్షేపాన్ని ఆశించేవాళ్లు మా సినిమాను చూడొచ్చు. ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. మా సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: లావణ్య -
టబు పాత్రలో రమ్యకృష్ణ
హిందీలో ‘అంధాధూన్’ ఘనవిజయం సాధించింది. జాతీయ ఉత్తమ హిందీ చిత్రంగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు. ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. అలాగే సినిమాకి కీలకంగా నిలిచిన టబు పాత్రకు, ఆమె నటనకు కూడా విపరీతమైన ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆ పాత్రను తమిళంలో రమ్యకృష్ణ పోషించనున్నారని తెలిసింది. ‘అంధాధూన్’ తమిళ రీమేక్ హక్కులను నటుడు, దర్శకనిర్మాత త్యాగరాజన్ తీసుకున్నారు. ఇందులో ఆయన కుమారుడు, ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ హీరోగా నటించనున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు. హిందీలో టబు చేసిన పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయి. ఆ పాత్రకు రమ్యకృష్ణ అయితే బావుంటారని చిత్రబృందం భావించారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘అంధాధూన్’ తెలుగు రీమేక్లో నితిన్ నటిస్తారు. -
వైరల్ : పునర్నవితో రాహుల్ సందడి
బిగ్బాస్ తెలుగు సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్.. పునర్నవి భూపాలంతో కలిసి సందడి చేశారు. బిగ్బాస్ సీజన్ 3లో ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నవారిలో రాహుల్, పునర్నవిలు మొదటి వరుసలో ఉంటారు. అయితే రాహుల్, పునర్నవి లవ్లో ఉన్నారనే ప్రచారం జరగగా.. వారిద్దరు ఆ వార్తలను ఖండించారు. తాము ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ షో తర్వాత వీరిద్దరు కలిసి పలు వేదికలపై సందడి చేశారు. తాజాగా సీనియర్ నటుడు ప్రకాశ్రాజ్ ఇచ్చిన ఓ పార్టీలో రాహుల్, పునర్నవితో కలిసి డ్యాన్స్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో ‘రంగమార్తాండ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాహుల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ప్రకాశ్రాజ్.. రంగమార్తాండ చిత్ర బృందానికి ఓ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి కృష్ణవంశీ, రమ్యకృష్ణ, రాహుల్, పునర్నవి, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా రాహుల్.. ‘ఏమై పోయావే నీవెంటే నేనుంటే.. ’ పాటు పాడుతూ పునర్నవితో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను, ఫొటోలను రాహుల్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అని పేర్కొన్నాడు. ఈ వీడియోకు నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు. పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
వైరల్ : పునర్నవితో రాహుల్ డ్యాన్స్
-
రొమాంటిక్కి గెస్ట్
రామ్ ఇప్పటివరకు అతిథి పాత్రల్లో కనిపించలేదు. వచ్చే ఏడాది ‘రొమాంటిక్’ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. పూరి జగన్నాథ్ అందించిన కథతో నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పూరి, చార్మి నిర్మిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కేతికా శర్మ కథానాయిక. ఇందులో మందిరా బేడీ, దివ్య దర్షినీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రమ్యకృష్ణ అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడు రామ్ గెస్ట్గా నటించారనే వార్త బయటికొచ్చింది. సినిమాలో ఓ సర్ప్రైజ్గా రామ్ పాత్ర ఉంటుందని సమాచారం. ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేశారట రామ్. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. -
పవర్ఫుల్ పాత్రలో
‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్బస్టర్హిట్ని అందుకున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం విజయ్ దేవరకొండను ‘ఫైటర్’గా మార్చే పనిలో పడ్డారు పూరి. ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు రమ్యకృష్ణను సంప్రదించినట్టు తెలిసింది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో విజయ్ హీరోగా ‘ఫైటర్’ చిత్రం తెరకెక్కనుంది. పూరి, చార్మి నిర్మించనున్నారు. ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారని సమాచారం. జనవరి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. -
మళ్లీ శాకాహారం
వృత్తిని దైవంగా భావిస్తామని చాలామంది నటీనటులు చెబుతుంటారు. మరి.. దేవత, దేవుడు పాత్రలు చేసే అవకాశం వస్తే.. ఎంతో నిష్టగా ఉంటారు. అందుకు చాలా ఉదాహరణలున్నాయి. జయప్రద, రమ్యకృష్ణ, రోజా వంటివారు భక్తిరసాత్మక చిత్రాల్లో నటించేటప్పుడు చాలా నియమాలు పాటించేవారు. ‘అన్నమయ్య, నమో వెంకటేశాయ’ వంటి చిత్రాల్లో నటించేటప్పుడు నాగార్జునతో సహా ఆ చిత్రబృందం షూటింగ్ పరిసరాల్లో పాదరక్షలు వాడలేదు. ఇప్పుడు నయనతార గురించి చెప్పాలి. ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో సీత పాత్ర చేసినప్పుడు నయనతార శాకాహారం మాత్రమే తీసుకునేవారు. ఇప్పుడు ‘మూక్కుత్తి అమ్మన్’ అనే తమిళ చిత్రం పూర్తయ్యేవరకూ ఈ బ్యూటీ మాంసాహారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందులో నయన మామూలు అమ్మాయిగా కనిపించడంతో పాటు అమ్మవారిలా కూడా కనిపిస్తారట. అమ్మవారి పాత్ర చేసేటప్పుడు ఒకపూట ఉపవాసం కూడా ఉండాలని నిర్ణయించుకున్నారని చిత్రబృందం పేర్కొంది. ఆర్జేగా మంచి గుర్తింపు తెచ్చుకుని, నటుడిగా మారిన బాలాజీ ఈ చిత్రంలో కీలక పాత్ర చేయడంతో పాటు దర్శకత్వం వహించనున్నారు. అయితే ఇందులో బాలాజీ సరసన నయనతార నటించడం లేదు. ఆమెది సినిమాకి కీలకంగా నిలిచే పాత్ర. కన్యాకుమారి అమ్మవారిని ‘మూక్కుత్తి అమ్మన్’ అని పిలుస్తారు. అందుకని కన్యాకుమారి వెళ్లి సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను అమ్మవారి గుడిలో జరపాలనుకుంటున్నారట. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. -
డైరీ ఫుల్
శక్తిమంతమైన పాత్రలకు, సున్నితమైన పాత్రలకు సూట్ అయ్యే నటి రమ్యకృష్ణ. ఎంత హాట్గా కనిపించగలరో అంతే ట్రెడిషనల్గా కూడా కనిపించగలరు. ప్రస్తుతం క్యారెక్టర్ నటిగా రమ్యకృష్ణ డైరీ ఫుల్. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి నటిస్తున్న ‘రొమాంటిక్’లో నటిస్తోన్న రమ్యకృష్ణ భర్త కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగ మార్తాండ’ అనే సినిమాలో మెయిల్ లీడ్ చేయబోతున్నారు. చేతిలో ఈ రెండు సినిమాలు ఉండగానే తాజాగా వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న సినిమాలో అతని తల్లిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో ఉంటుంది. -
గోవాలో...
గోవా మంచి హాలిడే స్పాట్. అది మాత్రమే కాదు.. షూటింగ్స్కి కూడా మంచి స్పాట్. అందుకే ‘రొమాంటిక్’ టీమ్ గోవా వెళ్లింది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లావణ్య సమర్పణలో రూపొందుతోన్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ఆకాశ్ పూరి, కేతికా శర్మ జంటగా నటిస్తున్నారు. అనిల్ పాడూరి ఈ చిత్రానికి దర్శకుడు. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ గోవాలో 30 రోజులపాటు జరగనుంది. ఈ లాంగ్ షెడ్యూల్లో కీలక సన్నివేశాలతో పాటు, యాక్షన్ సీన్స్, సాంగ్స్ చిత్రీకరించనున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నరేశ్ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. -
అక్కడ జాగ్రత్త పడుంటే బిగ్బాస్ హిట్ అయ్యేదే..!
ప్రేక్షకులను వంద రోజులకు పైగా అలరించిన బిగ్బాస్ తెలుగు సీజన్ 3 నిన్న(ఆదివారం) ఘనంగా ముగిసింది. అయితే, కంటెస్టెంట్లకు ఎన్నో మధురానుభూతులను మిగిల్చిన బిగ్బాస్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించలేకపోయిందని తెలుస్తోంది. గత సీజన్లను బీట్ చేస్తుందనుకున్న బిగ్బాస్ సీజన్ 3 ఓ మోస్తరుగా మాత్రమే ఆకట్టుకుంది. విన్నర్ ఎంపికలో ఈసారి బిగ్బాస్ న్యాయం చేయలేకపోయాడని కొందరు వాదిస్తున్నారు. ఏ ప్రాతిపదికన రాహుల్ సిప్లిగంజ్ను విజేతగా ప్రకటించారో చెప్పాలని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి కూడా కెప్టెన్గా ఎంపికవ్వని రాహుల్కి టైటిల్ కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమన్న కొత్త వాదనను తెరమీదికి తెస్తున్నారు. ఈక్రమంలో బిగ్బాస్ తెలుగు సీజన్-3 హైలైట్స్ ఓసారి పరిశీలిస్తే.. బిగ్బాస్ 3 కొనసాగిందిలా.. 1. హోస్ట్గా కింగ్ నాగార్జున 2. పదిహేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు 3. దంపతుల జంట వరుణ్, వితికలు రావడం 4. ఆరోవారంలో రమ్యకృష్ణ హోస్ట్గా వ్యవహరించడం స్పెషల్ అట్రాక్షన్ 5. ఆరోవారం నో ఎలిమినేషన్ 6. ఎనిమిదో వారంలో స్పెషల్ గెస్ట్గా బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్ రావడం 7. తొమ్మిదో వారం రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ అండ్ రీఎంట్రీ 8. పన్నెండోవారం హౌస్లో బిగ్బాస్ బర్త్డే వేడుకలు 9. బిగ్బాస్ హౌస్లో పలువురు సెలబ్రిటీల సందడి ‘గ్యాంగ్ లీడర్’ తారాగణం నాని, వెన్నెల కిశోర్ ‘గద్దలకొండ గణేష్’ చిత్ర యూనిట్, వరుణ్ తేజ్ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్ర యూనిట్ రామ్, నిధి అగర్వాల్ ‘మీకు మాత్రమే చెప్తా’ ప్రమోషన్స్లో భాగంగా విజయ్ దేవరకొండ దీపావళికి యాంకర్ సుమ బిగ్బాస్ హౌస్లో సందడి 10. పదమూడోవారం కంటెస్టెంట్ల ఇంటి సభ్యులను బిగ్బాస్ హౌస్లోకి పంపించడం 11. బిగ్బాస్ 105 రోజుల పాటు కొనసాగింది.(జూలై 21న ప్రారంభమై నవంబర్ 3న ముగిసింది) 11. గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా రావడం 12. టైటిల్ విజేతగా రాహుల్, రన్నరప్గా శ్రీముఖి నిలవటడం మైనస్గా మారినవి.. 1. మెప్పించని వైల్డ్ కార్డ్ ఎంట్రీలు 2. టాస్క్లు పదేపదే రద్దు చేయడం 3. ఎమోషన్స్ను ఎలివేట్ చేస్తూ సాగదీయడం 4. గత సీజన్ల టాస్క్లు కాపీ కొట్టడం 5. కంటెస్టెంట్ల ఎంపిక సరిగా లేకపోవడం 6. లీకులు అరికట్టలేకపోవడం 7. చుట్టుముట్టిన వివాదాలు -
రాజకీయ రాణి
రాజకీయ నాయకురాలిగా మారారు రమ్యకృష్ణ. నాయకురాలిగా ఆమె ఆడిన రాజకీయ చదరంగం ఎలా ఉంటుందో చూడటానికి సమయం ఆసన్నమైంది. నటి, తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘క్వీన్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రసాద్ మురుగేశన్ దర్శకత్వం వహించారు. జయలలిత చిన్ననాటి సన్నివేశాలకు ప్రసాద్, రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి సాగిన పరిస్థితుల సన్నివేశాలను గౌతమ్ మీనన్ తెరకెక్కించారు. జయలలిత పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ఇందులో రమ్యకృష్ణ పాత్ర పేరు శక్తి అని టాక్. ఈ చిత్రంలో ఎమ్జీఆర్గా నటుడు ఇంద్రజిత్ కనిపిస్తారట. అలాగే యంగ్ జయలలిత పాత్రలో ‘విశ్వాసం’ ఫేమ్ అనిఖ నటించారని కోలీవుడ్ టాక్. తెలుగు, తమిళం, హిందీలో ప్రసారం కానుంది. ఈ వెబ్ సిరీసే కాకుండా జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’, ‘ఐరన్లేడీ’ అనే రెండు బయోపిక్స్ వెండితెరపైకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తలైవి’ (హిందీలో ‘జయ’)లో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తారు. ఇక దర్శకురాలు ప్రియదర్శిని ‘ఐరన్ లేడీ’లో జయలిలిత పాత్రలో నిత్యా మీనన్ కనిపిస్తారు. -
జయలలిత బయోపిక్ టైటిల్ ఇదే!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత జీవిత కథను సినిమాగా తెరకెక్కించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జయ జీవితంలో ఓ కమర్షియల్ సినిమాలకు కావాల్సిన అన్ని ఎమోషన్స్ ఉండటంతో చాలా మంది దర్శకనిర్మాతలు ఆమె కథను వెండితెరకెక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కేవలం సినిమాగానే కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్స్లోనూ జయ కథ విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఎమ్ఎక్స్ ప్లేయర్ జయ బయోగ్రఫిని వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురుగేశన్లు సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ టైటిల్తో పాటు ఫస్ట్లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. క్వీన్ పేరుతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్లో జయ పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. ప్రస్తుతానికి టైటిల్ను మాత్రమే రివీల్ చేసిన చిత్రయూనిట్, జయ వేలాది మంది అభిమానులను పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్నట్టుగా ఉన్న పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో రమ్యకృష్ణ ముఖం రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. -
హౌస్మేట్స్కు బిగ్బాస్ ఇచ్చిన క్యాప్షన్స్ ఏంటంటే..?
ఆదివారం ఎపిసోడ్ సందడిగా సాగింది. వచ్చే వారం మన కింగ్ మళ్లీ వస్తాడు.. అందర్నీ ఎంటర్టైన్ చేస్తాడంటూ రమ్యకృష్ణ తెలిపింది. ఈ వీకెండ్ను రమ్యకృష్ణ తన భుజాలపై మోసింది. ఇక ఆదివారం నాటి కార్యక్రమంలో.. సీన్ చేయండి టాస్క్లో హౌస్మేట్స్ అందరూ రెచ్చిపోయి నటించారు. ఇంటి సభ్యులందరూ తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. అలీ-రవి.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల్లోంచి పూలకుండి సన్నివేశాన్ని స్పూఫ్ చేశారు. అనంతరం బాబా భాస్కర్-శ్రీముఖి.. చంద్రముఖి పాటకు డ్యాన్స్కు చేశారు. వరుణ్-వితికా ఎఫ్2 సినిమాల్లోంచి వెంకటేష్-తమన్నా గొడవపడే సన్నివేశాలను నటించి చూపించారు. మహేష్-శివజ్యోతి-హిమజ.. రంగస్థలంలోని సన్నివేశాన్ని స్పూఫ్ చేశారు. రంగమ్మత్తగా శివజ్యోతి, సమంతగా హిమజ, రామ్చరణ్ పాత్రలో మహేష్ నటించారు. నామినేషన్లో ఉన్న ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ కావాలని అనుకుంటున్నారో.. వాళ్లకి ఓ గులాబీ పువ్వు ఇచ్చి కారణం చెప్పాలని తెలిపింది. దీంతో మహేష్కు నాలుగు, పునర్నవి, హిమజకు రెండేసి గులాబీ పూలు వచ్చాయి. అయితే మహేష్ సేవ్ అయినట్లు రమ్యకృష్ణ ప్రకటించింది. అనంతరం హౌస్లోకి రమ్యకృష్ణ వచ్చింది. హౌస్మేట్స్ అందరికీ బిగ్బాస్ టీ షర్ట్స్ను పంపించారు. వాటిపై వారందరికీ సరిపోయే ఓ క్యాప్షన్ను కూడా ఇచ్చాడు. దీంట్లో భాగంగా.. అలీ-హ్యూమన్ బుల్డోజర్, వరుణ్- మేడమ్ వాళ్ల ఆయన, రాహుల్- పట్టుపట్టని విక్రమార్కుడు, బాబా భాస్కర్- మాస్క్ మ్యాన్, రవికృష్ణ- ఉదయించని సూర్యుడు, శ్రీముఖి-పంచాయితీ స్పెషలిస్ట్, పునర్నవి-లేడీ మోనార్క్, మహేష్-బాబా గారి బంటు, హిమజ- మిస్ ఆరాటం, వితికా- సర్ వాళ్ల ఆయన, శివజ్యోతి- సిల్లీ సిస్టర్.. అంటూ క్యాప్షన్స్ ఇవ్వగా.. వాటిపై బాబా భాస్కర్ కామెంట్లు చేస్తూ ఉన్నాడు. అనంతరం వినాయక చవితి సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలి కాబట్టి.. ఈ వారం నో ఎలిమినేషన్ అంటూ రమ్యకృష్ణ ప్రకటించింది. అయితే.. కన్ఫెషన్ రూమ్కు వెళ్లిన అలీ, రవిలకు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించిన క్లూ ఇవ్వడానికే పిలిచినట్లు అనిపిస్తోంది. శిల్పా చక్రవర్తి హౌస్లోకి స్పెషల్ ఎంట్రీ ఇవ్వబోతోందని ఈపాటికే అందరికీ తెలిసిపోయింది. సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్లోనే ఎంట్రీ ఇస్తుందా? లేదా అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. (బిగ్బాస్.. వైల్డ్కార్డ్ ఎంట్రీ ఎవరంటే?) -
బిగ్బాస్ హౌస్లోకి రమ్యకృష్ణ..
-
బిగ్బాస్.. రెచ్చిపోయిన హౌస్మేట్స్
-
బిగ్బాస్.. రెచ్చిపోయిన హౌస్మేట్స్
బిగ్బాస్ హోస్ట్గా రమ్యకృష్ణ అదరగొట్టింది. ఆరో వారాంతానికి నాగార్జున అందుబాటులో లేనందున స్పెషల్ గెస్ట్తో షోను నడిపించారు. ఇక ఫస్ట్ టైమ్ తన హోస్టింగ్తో హౌస్మేట్స్తో పాటు ఆడియెన్స్ను రమ్యకృష్ణ ఆకట్టుకుంది. హౌస్లో అన్యాయానికి గురైన మహిళలకు, న్యాయం చేసింది. తన రాజ్యంలో మహిళల పట్ల చిన్న చూపు తగదన్నట్లు తీర్పునిచ్చింది. వరుణ్ సందేశ్ మొహంపై కాఫీ పోయడం, రాహుల్ బట్టలను కత్తిరించడం, రవికి సంబంధించిన బెడ్ను నీటితో తడపటంలాంటి ఆదేశాలను జారీ చేసింది. ఇక నేటి ఎపిసోడ్లో మరో ఆట ఆడించినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదల చేసిన ప్రోమో వైరల్ అవుతోంది. సీన్ చేయండి అనే ఈ గేమ్లో శ్రీముఖి కాస్తా.. చంద్రముఖిగా మారిపోయింది. ఇదే వరుసలో రాహుల్-పునర్నవి లవ్ ట్రాక్ కూడా బయటపడనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రోమోలో వీరిద్దరే హైలెట్గా నిలిచారు. ఇక వితికా తన బాధను వ్యక్తపరిచేలా నటిస్తుంటే.. వరుణ్ ఆ సీన్ను కామెడీ చేయడంతో హౌస్మేట్స్ అంతా పగలబడి నవ్వుకుంటున్నారు. హోస్ట్గా ఉన్న రమ్యకృష్ణ.. హౌస్మేట్స్ను కలిసేందుకు బిగ్బాస్ హౌస్లోకి ఎంటర్ అయింది. అక్కడా కూడా పంచ్లు వేస్తూ.. బాబా భాస్కర్ను బెదిరిస్తూ..ఆటపట్టిస్తూ.. ఎంటర్టైన్ చేసినట్లు కనిపిస్తోంది. ఆరోవారంలో ఎలిమినేషన్ లేదనే విషయం దాదాపుగా ఖరారైపోయింది. అయితే మరో వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గతంలో యాంకరింగ్ చేసి క్రేజ్ను సొంతం చేసుకున్న శిల్పా చక్రవర్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. గత వారంలో కూడా ఇలాగే ఈషా రెబ్బా హౌస్లోకి ఎంటర్ అవుతుందనే వార్తలు వచ్చాయి. కానీ తీరా చూస్తే అవన్నీ వట్టి రూమర్స్గానే మిగిలాయి. మరి ప్రస్తుతం వస్తున్న వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచిచూడాలి. -
గోవా బీచ్లో సెల్ఫీ తీసుకుంటుం వైద్యురాలు మృతి
-
గోవా బీచ్లో జగ్గయ్యపేట వైద్యురాలు మృతి
జగ్గయ్యపేట: గోవా బీచ్కి వెళ్లిన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఓ వైద్యురాలు మంగళవారం మృత్యువాత పడింది. అలల తాకిడికి యువతి సముద్రంలోకి కొట్టుకుపోయింది. జగ్గయ్యపేటలోని మార్కండేయ బజార్కు చెందిన ఊటుకూరి ఆంజనేయులు స్థానిక కోర్టులో గుమాస్తాగా పనిచేస్తూ కొంత కాలం క్రితం మృతి చెందారు. అతనికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. చిన్న కుమార్తె రమ్యకృష్ణ (25) ఎంబీబీఎస్ పూర్తి చేసి జగ్గయ్యపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొంత కాలం పని చేసింది. మూడేళ్ల క్రితం గోవాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యురాలిగా చేరింది. మంగళవారం ఆరుగురు స్నేహితులతో కలసి ఆమె గోవా బీచ్కు వెళ్లింది. బీచ్లో సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదం చోటుచేసుకుంది. అయితే సముద్రంలో ఒక్కసారిగా వచ్చిన అలలకు రమ్యకృష్ణతోపాటు మరో స్నేహితురాలు కూడా గల్లంతయ్యారు. గమనించిన చుట్టుపక్కల వారు ఆమె స్నేహితురాలిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకురాగా రమ్యకృష్ణ మాత్రం దొరకలేదు. కొద్దిసేపటికి ఆమె మృతదేహం సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : గోవా బీచ్లో సెల్ఫీ తీసుకుంటుం వైద్యురాలు మృతి -
మళ్లీ డ్యూయెట్
డ్యూయెట్ అంటే కలిసి పాడక్కర్లేదు. స్టెప్పులు వేయక్కర్లేదు.. ఆడక్కర్లేదు.మళ్లీ ఈ కాంబినేషన్ తెర మీద కనపడితే చాలు.. మన హార్ట్ బీట్ స్టెప్పులేస్తుంది. వెల్కమ్ బ్యాక్. జనం ఒకసారి ఒక హిట్ పెయిర్ను కన్ఫర్మ్ చేశారంటే వాళ్లమాట వాళ్లే వినరు. హిందీలో అలా రాజ్ కపూర్– నర్గీస్ జంటను కన్ఫర్మ్ చేశారు. తెలుగులో అక్కినేని– సావిత్రి జంటను కన్ఫర్మ్ చేశారు. తమిళంలో ఎం.జి.ఆర్–జయలలిత జంటను కన్ఫర్మ్ చేశారు. ఆ మధ్య చిరంజీవి– రాధిక, బాలకృష్ణ–విజయశాంతి, నాగార్జున–అమల, వెంకటేశ్– సౌందర్య హిట్ పెయిర్గా నిలిచారు. ఇటీవల నాగ చైతన్య– సమంత, నితిన్–నిత్యామీనన్, రాజ్తరుణ్–అవికా గోర్ వంటి పెయిర్స్ కూడా జనానికి నచ్చాయి. ఇలా ఒకసారి హిట్ అయితే ఎన్నాళ్ల గ్యాప్ వచ్చినా మళ్లీ ఒకసారి వారు తెర మీదకు వస్తే చూడాలనుకుంటారు. ఈ విషయం కనిపెట్టే చాలా గ్యాప్ తర్వాత తిరిగి శోభన్బాబు–వాణిశ్రీ–శారదల కాంబినేషన్తో ‘ఏమండీ... ఆవిడ వచ్చింది’ సినిమా తీసి పెద్ద హిట్ కొట్టారు ఈ.వి.వి. సత్యనారాయణ. సినిమా వారికి కాసులు కావాలి. కనుక పాత మేజిక్ను రిపీట్ చేయడానికి వాళ్లూ ఉత్సాహం చూపుతుంటారు. అలాంటి ‘రీ– యూనియన్లు’ ఈ ఏడాది చాలానే చూడబోతున్నాం. ప్రభు–మధుబాల ‘రోజా’, ‘అల్లరి ప్రియుడు’, ‘జెంటిల్మేన్’ సినిమాలతో ఆడియన్స్ను ఎంటర్టైన్ చేశారు మధుబాల. ఆ తర్వాత కుటుంబం కోసం టైమ్ కేటాయిస్తూ ఇండస్ట్రీకి కొంచెం గ్యాప్ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్లో తన పాత కో–స్టార్ ప్రభుతో కలిసి తిరిగి యాక్ట్ చేయనున్నారు. 1996లో వచ్చిన ‘పాంచాలకురుచ్చి’ అనే సినిమాలో తొలిసారిగా వీరిద్దరూ కలిసి నటించారు. మళ్లీ 23 ఏళ్ల తర్వాత ఓ రీమేక్ కోసం నటిస్తున్నారు. కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘కాలేజ్ కుమార్’ సినిమా తమిళ రీమేక్లో వీరిద్దరూ జోడీ కడుతున్నారు. అరుణ్ విజయ్, ప్రియా వడ్లమాని హీరో హీరోయిన్లు. ప్రియదర్శన్ దర్శకుడు. అమితాబ్–రమ్యకృష్ణ కెరీర్ పీక్లో ఉండగా దక్షిణాది భాషల సినిమాలను తన గ్లామర్తో నింపిన రమ్యకృష్ణ హిందీసినిమా రంగాన్ని కూడా ఆకర్షించారు. అంతేనా? ఏకంగా అమితాబ్ పక్కన నటించే చాన్స్ కొట్టేశారు. వీరిద్దరూ కలిసి ‘బడే మియా ఛోటే మియా’లో నటించారు. ఆ సమయంలో ఫ్లాపుల్లో ఉన్న హీరో మోహన్బాబుకు రమ్యకృష్ణ నట భాగస్వామ్యంతో వచ్చిన ‘అల్లుడుగారు’ హిట్ అయినట్టు డౌన్లో ఉన్న అమితాబ్కు ‘బడే మియా చోటే మియా’ కూడా బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయిన 20 ఏళ్ల గ్యాప్ తర్వాత బిగ్ బి, రమ్యకృష్ణ ఒక తమిళ సినిమాలో కలసి నటిస్తున్నారు. 50 ఏళ్ల సినీ కెరీర్లో అమితాబ్ తొలిసారిగా ఓకే చేసిన తమిళ చిత్రం ‘ఉయంవర మణిదన్’లో ఆయన పక్కన నటించే అవకాశం రమ్యకు దక్కింది. తమిళవానన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో యస్.జె. సూర్య ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. శోభన–సురేశ్ గోపి మలయాళ ఇండస్ట్రీలో శోభన–సురేష్ గోపీది హిట్ కాంబినేషన్. ‘మణిచిత్రతాళే’, ‘ఇన్నలే’, ‘కమిషనర్’ వంటి బ్లాక్బస్టర్ సినిమాలను ఆడియన్స్కు ఈ జంట అందించింది. ‘కమిషనర్’ 2005లో రిలీజ్ అయింది. మళ్లీ పద్నాలుగేళ్ల గ్యాప్ తర్వాత శోభన–సురేశ్ గోపీ ఒక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్గా రూపొందుతున్న సినిమాలో కలిసి కనిపిస్తారు. జూలైలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. రాధిక–శరత్ కుమార్ రాధిక– శరత్ కుమార్ ఆఫ్స్క్రీన్ కపుల్. ఆన్స్క్రీన్ కూడా హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ‘నమ్మ అన్నాచ్చి’, ‘సూర్యవంశం’ సినిమాల్లో జోడీగా నటించారు ఈ ఇద్దరూ. 2013లో వచ్చిన ‘చెన్నైయిల్ ఒరు నాళ్’ సినిమాలో శరత్కుమార్, రాధిక నటించినప్పటికీ జంటగా యాక్ట్ చేయలేదు. 20 ఏళ్ల తర్వాత ‘వానమ్ కొట్టటుమ్’లో జోడీగా కనిపించనున్నారు. విక్రమ్ ప్రభు హీరోగా తెరకెక్కే ఈ చిత్రానికి ధన దర్శకుడు. కథను ధనతోపాటు మణిరత్నం అందిస్తున్నారు. సెట్స్ మీద ఉన్నవే కాదు. ఆల్రెడీ మూడు భారీ రీ యూనియన్లు ఈ ఏడాది జరిగిపోయాయి. ‘కళంక్’ చిత్రం కోసం సంజయ్ దత్–మాధురీ దీక్షిత్ 25 ఏళ్ల తర్వాత కలిశారు. ఈ నెల 17న ఈ చిత్రం విడుదలైంది. ‘సాజన్’, ‘ఖల్నాయక్’ వంటి హిట్ సినిమాలు వీరిద్దరి జాయింట్ అకౌంట్లో ఉన్నాయి. మరో జంట అనిల్ కపూర్, జూహీ చావ్లాది కూడా హిట్ పెయిర్. ‘సలామ్ ఏ ఇష్క్’ (2007) వీరి లాస్ట్ చిత్రం. పదకొండేళ్ల తర్వాత ‘ఏక్ లడ్కీకో దేఖాతో ఏసా లగా’ కోసం మళ్లీ çకలిశారు. ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజైంది. అలాగే అనిల్ కపూర్– మాధురి దీక్షిత్లది కూడా మంచి జోడి. ‘ధక్ ధక్ కర్నే లగా’.. పాటలో అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ల కెమిస్ట్రీని అంత సులువుగా మరచిపోలేం. ఈ ఇద్దరూ సుమారు 18 సినిమాల్లో కలసి నటించారు. పద్ధెనిమిదేళ్ల తర్వాత ‘టోటల్ ధమాల్’లో అనిల్ కపూర్– మాధురీ దీక్షిత్ కలసి యాక్ట్ చేశారు. స్వీట్ కపుల్–గులాబ్ జామూన్ ఈ ఏడాది మరో రీ–యూనియన్ని సిల్వర్ స్క్రీన్ చూడబోతోంది. ఈ జోడీ కలిసి స్క్రీన్ మీద కనిపించి ఎనిమిదేళ్లు అయింది. ఈ రియల్ లైఫ్ స్వీట్కపుల్ అభిషేక్ బచ్చన్–ఐశ్వర్యారాయ్ ఇన్నేళ్ల తర్వాత ‘గులాబ్ జామూన్’ అనే సినిమా కోసం జతకట్టారు. 2010లో నటించిన ‘రావణ్’ ఈ జంట కలిసి నటించిన చివరి చిత్రం. నువ్వు నేను – మరో సినిమా కోలీవుడ్లో సూర్య–జ్యోతికలది సూపర్హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరూ జోడీగా సుమారు 5 సినిమాల్లో కనిపించారు. వాటిలో దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘కాక్క కాక్క’ బ్లాక్బస్టర్. సూర్య కెరీర్ యూటర్న్ తిప్పిన సినిమా. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనల్లో దర్శక–నిర్మాతలు ఉన్నారని వినిపించింది. ఇందులో సూర్య, జ్యోతికలనే యాక్ట్ చేయించాలని అనుకుంటున్నారట. పదమూడేళ్లయింది వీరిద్దరూ స్క్రీన్ మీద కనిపించి. ‘సిల్లును ఒరు కాదల్’ (తెలుగులో ‘నువ్వు నేను ప్రేమ’) జంటగా వీరిద్దరి చివరి చిత్రం. – ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది -
రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో మరోచిత్రం
తమిళసినిమా: నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ఆకాశగంగ–2 చిత్రం తెరకెక్కుతోంది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి మలయాళ దర్శకుడు వినయన్ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో ప్రముఖ దర్శకుడిగా పేరొందిన ఈయన కోలీవుడ్లో ఇంతకు ముందు విక్రమ్ హీరోగా కాశీ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడీయన. అదే విధంగా ఆ తరువాత ఈయన తెరకెక్కించిన ఎన్.మన వానిల్, అర్పుత దీవు వంటి తమిళ చిత్రాలు మంచి సక్సెస్ అయ్యాయి. కాగా మలయాళంలో వినయన్ ఇటీవల దివంగత నటుడు కళాభవన్మణి జీవిత ఇతివృత్తంతో తెరకెక్కించిన సాలక్కుడిక్కారన్ సంగాది చిత్రం సంచలన విజయం సాధించింది. తాజాగా ఆకాశగంగ–2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయన ఇంతకుముందు రూపొందించిన ఆకాశగంగ చిత్రానికి సీక్వెల్. హర్రర్ కామెడీ చిత్రాలకు పేరు గాంచిన వినయన్ ఈ ఆకాశగంగ–2 చిత్రాన్ని ఆదే బాణీలో రూపొందిస్తున్నారు. ఇందులో ఆసీప్ అలీ, సిద్ధిక్, సలీమ్కుమార్, శ్రీనాథ్బాషీ, విష్ణు గోవింద్, హరీశ్కన్నన్, ధర్మరాజన్, ఆరతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు నటి రమ్యకృష్ణ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. చిత్రాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞనంతో భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. బీజీపాల్ సంగీతం, ప్రకాశ్కుట్టి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమై, పాలక్కాడు, కొ చ్చి, పొల్లాచ్చి ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుంటోందని చిత్ర వర్గాలు తెలిపారు. ఓనం పండగ నాటికి విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. -
21 ఏళ్ల తర్వాత...
50 ఏళ్ల సినీ కెరీర్లో తొలిసారి ఓ తమిళ చిత్రంలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే.. 21 ఏళ్ల తర్వాత రమ్యకృష్ణతో కలసి నటించనున్నారు. అమితాబ్ బచ్చన్, యస్.జె.సూర్య ముఖ్య పాత్రల్లో తమిళవానన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఉయంర్ద మణిదన్’. తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్కు జోడీగా రమ్యకృష్ణ కనిపిస్తారు. 1998లో రిలీజైన ‘బడే మియా చోటే మియా’ సినిమాలో అమితాబ్– రమ్యకృష్ణ జోడీగా కనిపించారు. 21 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
బిగ్బీతో రమ్యకృష్ణ
సినిమా: బాలీవుడ్ బిగ్బీ అమితాబచ్చన్ సరసన దక్షిణాది సంచలన నటి రమ్యకృష్ణ జత కట్టబోతోందన్నది తాజా సమాచారం. ఇంతకు ముందు కథానాయకిగా నటించిన గ్లామరస్ పాత్రలను ఇరగదీసిన ఈమె, ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి మరోసారి తన సత్తా చూపిస్తోంది. బాహుబలి రాజమాతగా నటించి ఆ పాత్రకు హోదాను తీసుకొచ్చిన రమ్యకృష్ణ ఆ తరువాత పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రల్లో నటిస్తోంది. కాగా ఇటీవల కోలీవుడ్లో సూపర్ డీలక్స్ చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన పాత్ర పలు విమర్శలకు దారి తీస్తోంది. తాజాగా అమితాబ్బచ్చన్తో జత కట్టడానికి రమ్యకృష్ణ సిద్ధం అవుతోందని సమాచారం. నటుడు ఎస్జే సూర్య హీరోగా నటించనున్న చిత్రం ఉయర్నద మనిదన్. ఇంతకు ముందు ఈయన హీరోగా కల్వనిన్ కాదలి చిత్రాన్ని తెరకెక్కించిన తమిళ్వానన్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న ఇది ఉయర్నద మనిదన్. తమిళం, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. కాగా ఆయనకు జంటగా రమ్యకృష్ణ నటించనున్నట్టు సమాచారం. అమితాబ్ బచ్చన్ కోలీవుడ్లో నేరుగా నటిస్తున్న చిత్రం ఇదే అవుతోంది. ఈ చిత్రం ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను నటుడు రజనీకాంత్ విడుదల చేయడం మరో విశేషం కాగా ఆయన నటుడు అమితాబ్ బచ్చన్ను కోలీవుడ్కు ఆహ్మానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నటుడు ఎస్జే సూర్య మాట్లాడుతూ అమితాబ్ బచ్చన్తో నటించడానికి సహకరించిన రజనీకాంత్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్లకు కృతజ్ఞతలు తెలిపారు. -
37 టేకులు తీసుకున్నా!
నటిగా రమ్యకృష్ణ ప్రూవ్డ్. విభిన్నమైన పాత్రలు చేశారు. పాజిటివ్, నెగటివ్.. ఏ షేడ్స్ అయినా స్క్రీన్ని షేక్ చేశారు. అయితే నటిగా నిరూపించేసుకున్నాం కదా అని రిలాక్స్డ్గా ఉండటం ఆమెకు నచ్చదు. కొత్త కొత్త చాలెంజ్లను స్వీకరిస్తూ తనని తాను మెరుగుపరుచుకోవడానికి ఇష్టపడుతున్నారు. లేటెస్ట్గా తమిళంలో ‘సూపర్ డీలక్స్’ అనే చిత్రంలో నటించారు రమ్యకృష్ణ. ప్రస్తుతం తమిళంలో భారీ అంచనాలు చుట్టుముట్టిన సినిమా అది. విజయ్ సేతుపతి, రమ్యకృష్ణ, సమంత, ఫాహద్ పాజిల్ ముఖ్యపాత్రల్లో నటించారు. త్యాగరాజన్ కుమారరాజ దర్శకుడు. ఇందులో రమ్యకృష్ణ శృంగార తార పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో పోషించిన పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘నా కెరీర్లో నేను చేసిన చాలెంజింగ్ పాత్ర ఇది. కొన్ని పాత్రలు డబ్బు కోసం, మరికొన్ని పాపులారిటీ కోసం , పేరుకోసం చేస్తాం. ఈ సినిమా ప్యాషన్ కోసం చేశాను. ఓ సన్నివేశాన్ని ఏకంగా 37 సార్లు షూట్ చేయాల్సి వచ్చింది. రెండు రోజుల పాటు ఒకే షాట్ కోసం 37 టేకులు చేశాం. నా కంటే నా అసిస్టెంట్స్ చాలా షాక్ అయ్యారు’’ అని పేర్కొన్నారామె. ‘‘37 టేకులే ఎక్కువనుకుంటే ఈ సినిమా కోసం 100, అంతకుమించి టేకులు తీసుకొని షూట్ చేసిన సీన్స్ కూడా ఉన్నాయి. రమ్యకృష్ణ ఈ పాత్ర చేస్తారా? చేయరా? అనుకున్నాం. కానీ ఆమె చాలా కూల్. తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు పుష్ చేస్తున్నట్టు కష్టపడ్డారామె’’ అని దర్శకుడు త్యాగరాజ కుమారరాజన్ తెలిపారు. -
స్క్రీన్ టెస్ట్
ప్రతిభకు కొలమానం ఏంటి? అంటే చెప్పలేం. అయితే ప్రతిభను గుర్తించి ప్రేక్షకులు కొట్టే చప్పట్లు, అభినందనలు, ప్రతిష్టాత్మక పురస్కారాలు ఏ కళాకారుడిలో అయినా ఉత్సాహాన్ని నింపుతాయి. భారతదేశ ప్రతిష్టాత్మక పురస్కారం అయిన ‘పద్మ’ అవార్డు వరిస్తే ఆ గౌరవమే వేరు. జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించిన సందర్భంగా ఇప్పటివరకూ ఈ అవార్డు అందుకున్న స్టార్స్లో కొందరి గురించి ఈ వారం స్పెషల్ క్విజ్. 1. ‘పడమటి సంధ్యారాగం’ చిత్రంలో సహాయ నటునిగా నటించారు ఈ నటుడు. 2019వ సంవత్సరంలో ఈయనను పద్మశ్రీ వరించింది. సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఎవరాయన? ఎ) మణిశర్మ బి) యం.యం. కీరవాణి సి) శివమణి డి) కోటి 2. 2011వ సంవత్సరానికి పద్మశ్రీ అవార్డుగ్రహీత ఈ నటి. వెంకటేశ్ నటించిన ఓ సూపర్హిట్ సినిమా ద్వారా తెరంగేట్రం చేశారీమె. ఎవరా నటి? ఎ) టబు బి) రమ్యకృష్ణ సి) మీనా డి) కత్రినా కైఫ్ 3. 1968లో పద్మశ్రీ, 1988లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్లను దక్కించుకున్న ఏకైక నటుడెవరు? ఎ) యస్వీ రంగారావు బి) శోభన్బాబు సి) కాంతారావు డి) అక్కినేని నాగేశ్వరరావు 4. అద్భుతమైన నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, సింగర్గా చాలా ఫేమస్ ఈ నటి. 1966లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ అవార్డులను తన ఖాతాలో వేసుకున్న ఆ నటి ఎవరు? ఎ) భానుమతి బి) జమున సి) సావిత్రి డి) అంజలీదేవి 5. కామెడీ యాక్టర్గా ఎన్నో సంవత్సరాలు చిత్రపరిశ్రమను ఏలారు. 1990లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ ప్రకటించింది. ఆ నటుని పేరేంటి? ఎ) అల్లు రామలింగయ్య బి) పద్మనాభం సి) సుత్తివేలు డి) నగేశ్ 6. 2019వ సంవత్సరానికి గాను ప్రభుదేవాని పద్మశ్రీ వరించింది. తన నృత్యంతో అలరించిన ఆయన్ను ఏ ప్రభుత్వం పద్మశ్రీకి నామినేట్ చేసిందో తెలుసా? ఎ) తమిళనాడు బి) తెలంగాణ సి) కర్ణాటక డి) కేరళ 7. ‘సిరివెన్నెల’ చిత్రం తర్వాత చెంబోలు సీతారామశాస్త్రి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా మారిపోయారు. ఆయన్ను చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడెవరు? (సీతారామ శాస్త్రికి ‘సిరివెన్నెల’ మొదటి చిత్రం కాదు) ఎ) కె.రాఘవేంద్రరావు బి) కె.విశ్వనాథ్ సి)ఆదుర్తి సుబ్బారావు డి) దాసరి నారాయణరావు 8. తన గళంతో ఎన్నో భాషల్లోని పాటలను అలవోకగా ఆలపించే గాయకుడు కె.జె. ఏసుదాస్. భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ (1977), పద్మభూషణ్ (2002), పద్మవిభూషణ్లతో సత్కరించింది. ఆయన ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్ అందుకున్నారో తెలుసా? (సి) ఎ) 2011 బి) 2013 సి) 2017 డి) 2009 10 1968లో పద్మశ్రీ అవార్డు పొందిన నటుడెవరో కనుక్కుందామా? ఎ) యన్టీఆర్ బి) చిత్తూరు నాగయ్య సి) గుమ్మడి డి) కాంతారావు 9. 2006లో ఆయన్ను కేంద్రప్రభుత్వం పద్మభూషణ్తో గౌరవించింది. అదే సంవత్సరం ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ను కూడా పొందారు. ఎవరా హీరో? ఎ) కృష్ణంరాజు బి) చిరంజీవి సి) బాలకృష్ణ డి) నాగార్జున 11. 2009లో పద్మశ్రీ అవార్డు పొందిన ఈ నటుడు అప్పటికే ఒకే భాషలో దాదాపు 700 చిత్రాలు పైగా నటించారు. ఎవరతను? ఎ) కైకాల సత్యనారాయణ బి) అలీ సి) బ్రహ్మానందం డి) ధర్మవరపు çసుబ్రహ్మణ్యం 12. కమల్హాసన్ నటించిన ‘శుభసంకల్పం’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు ఈయన. 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. ఎవరితను? ఎ) దాసరి నారాయణరావు బి) టి. సుబ్బరామిరెడ్డి సి) ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డి) డి. రామానాయుడు 13. అనేక భాషల్లో తన సంగీతం ద్వారా చాలా సుపరిచుతులు ఈయన. 2010లో పద్మభూషణ్, 2018లో పద్మవిభూషణ్ ఆయన్ను వరించాయి. ఎవరా సంగీత దర్శకుడు? ఎ) కె.వి. మహదేవన్ బి) ఇళయరాజా సి) మంగళంపల్లి బాలమురళీ కృష్ణ డి) పి.బి. శ్రీనివాస్ 14. 2013వ సంవత్సరంలో కేంద్రప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మభూషణ్ అవార్డ్ను తిరస్కరించిన ప్రముఖ సింగర్ ఎవరో తెలుసా? (అవార్డును నిరాకరించటానికి ఆ సింగర్ చెప్పిన కారణం ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని) ఎ) ఎస్. జానకి బి) పి. సుశీల సి) వాణీ జయరాం డి) జిక్కీ 15. కర్ణాటక ప్రభుత్వ సిఫార్సుతో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పద్మశ్రీ అవార్డును దక్కించుకున్నారు. ఆయన ఏ సంవత్సరంలో ఈ అవార్డును పొందారో తెలుసా? ఎ) 2014 బి) 2016 సి) 2018 డి) 2019 16. 340 తెలుగు చిత్రాలకు పైగా నటించారు ఈ ప్రముఖ నటుడు. 2009లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మభూషణ్ ప్రకటించింది. ఎవరా హీరో? ఎ) కృష్ణ బి) కృష్ణంరాజు సి) శోభన్బాబు డి) శరత్బాబు 17. కళలు, విద్యా రంగాలకు సంబంధించి 2007లో పద్మశ్రీ అవార్డును పొందిన ప్రముఖ తెలుగు నటుడెవరో తెలుసా? ఎ) మోహన్బాబు బి) మురళీమోహన్ సి) శ్రీధర్ డి) రంగనాథ్ 18. 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ అవార్డులను సొంతం చేసుకున్న ప్రముఖ హీరో ఎవరు? ఎ) కమల్హాసన్ బి) రజనీకాంత్ సి) విక్రమ్ డి) శరత్కుమార్ 19. నాటకరంగం నుండి సినిమా రంగానికి వచ్చి ఎన్నో సినిమాల్లో నటించారు ఈ ప్రముఖ క్యారెక్టర్ నటుడు. 2015లో ఆయన్ను పద్మశ్రీ వరించింది. ఎవరా నటుడు కనుక్కోండి? ఎ) జయప్రకాశ్ రెడ్డి బి) తనికెళ్ల భరణి సి) బెనర్జీ డి) కోట శ్రీనివాసరావు 20 .1992లో పద్మశ్రీ అవార్డు పొందారు ఈ ప్రముఖ దర్శకుడు. 2017లో భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. ఆ దర్శకుని పేరేంటి? ఎ) కె. భాగ్యరాజా బి) భారతీరాజా సి) కె. విశ్వనాథ్ డి) కె. బాలచందర్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (సి) 2) (ఎ) 3) (డి) 4) (ఎ) 5) (ఎ) 6) (సి) 7) (బి) 8) (సి) 9) (బి) 10) (ఎ) 11) (సి) 12) (సి) 13) (బి) 14) (ఎ) 15) (బి) 16) (ఎ) 17) (ఎ) 18) (బి) 19) (డి) 20) (సి) నిర్వహణ: శివ మల్లాల -
పోర్న్ స్టార్గా రమ్యకృష్ణ..!
బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ఆకట్టుకున్న సీనియర్ నటి రమ్యకృష్ణ మరో సాహసం చేస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫుల్ బిజీగా ఉన్న రమ్య, ఓ తమిళ సినిమా కోసం పోర్న్స్టార్ పాత్రలో కనిపించనున్నారు. విజయ్ సేతుపతి, సమంత జంటగా త్యాగరాజన్ కుమారరాజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సూపర్ డీలక్స్. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి లేడీ గెటప్లో కనిపించనున్నాడు. ఇదే సినిమాలో రమ్యకృష్ణ.. లీలా అనే శృంగార తారగా కనిపించనుంది. ఈ విషయాన్ని దర్శకనిర్మాతలు వెల్లడించారు. ముందుగా ఈ పాత్రకు నదియాను సంప్రదించగా ఆమె తిరస్కరించడంతో రమ్యకృష్ణను తీసుకున్నామని తెలిపారు. ఈ సినిమాలో సమంత కూడా రెండు డిఫరెంట్ గెటప్స్లో కనిపించనుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో రిలీజ్కు రెడీ అవుతోంది. -
స్క్రీన్ టెస్ట్
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎలా ఏ స్థాయికి వెళతారో ఎవరూ ఊహించలేరు. అందుకే సినిమా అనేది చాలా మందికి డ్రీమ్. ఆ కలకి నాయకుడు దర్శకుడు. అందుకే దర్శకుణ్ణి ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్’ అంటారు. సినిమా ఇండస్ట్రీలోని అనేక శాఖల్లో పని చేసిన అనుభవంతో మెగాఫోన్ పట్టిన దర్శకుల గురించి ఈ వారం క్విజ్ స్పెషల్... 1. ఈయన మొదట దర్శకుడు కాదు. ఎడిటింగ్ శాఖలో ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. తర్వాత చాలా పెద్ద దర్శకుడయ్యారు. ఎవరా డైరెక్టర్? ఎ) శ్రీను వైట్ల బి) వీవీ వినాయక్ సి) వంశీ పైడిపల్లి డి) ఎస్.ఎస్ రాజమౌళి 2. నటిగా ఉన్నత శిఖరాలను అధిరోహించారామె. ‘చిన్నారి పాపలు’ అనే చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు. ఎవరా హీరోయిన్? ఎ) ‘షావుకారు’ జానకి బి) జమున సి) సావిత్రి డి) వాణిశ్రీ 3. ఈ ప్రముఖ హీరోల్లో ఓ హీరో మెగాఫోన్ పట్టుకోలేదు. ఆయనెవరో కనుక్కోండి? ఎ) అక్కినేని బి) కృష్ణ సి) యన్టీఆర్ డి) చిత్తూరు వి. నాగయ్య 4. దర్శకత్వం చేయకముందు నంబర్ ప్లేట్లకు స్టిక్కర్ డిజైనింగ్ చేయడంలో అందెవేసిన చెయ్యి ఈ దర్శకునిది. ఎవరా దర్శకుడు? ఎ) సుధీర్వర్మ బి) మారుతి సి) చిన్నికృష్ణ డి) విరించివర్మ 5. ప్రభాస్ నటించిన ‘మిర్చి’ చిత్రంతో దర్శకునిగా మారారు. అంతకుముందు ఎన్నో చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఇంతకీ ఎవరా దర్శకుడు? ఎ) బోయపాటి శ్రీను బి) వక్కంతం వంశీ సి) కొరటాల శివ డి) దశరథ్ 6 నటి విజయశాంతి మేకప్మేన్గా ఈయన సుపరిచితుడు. ‘పెద్దరికం’ చిత్రానికి దర్శకత్వం వహించి విజయం సాధించారు. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతగానూ పేరుంది. ఎవరతను? ఎ) బండ్ల గణేష్ బి) ‘దిల్’ రాజు సి) ఏ.యం.రత్నం డి) కాస్ట్యూమ్స్ కృష్ణ 7. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా 400 చిత్రాలకు పైగా పని చేశారీయన. తన దర్శకత్వ ప్రతిభతో కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎవరా నటుడు? ఎ) చలం బి) పద్మనాభం సి) రాజబాబు డి) రేలంగి 8. పవన్ కల్యాణ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘జానీ’. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించారు. ఆ చిత్రంలో పవన్ సరసన నటించిన కథానాయిక ఎవరో కనుక్కోండి? ఎ) కీర్తి రెడ్డి బి) రేణూ దేశాయ్ సి) సుప్రియ డి) అమీషా పటేల్ 9. 1957లో ‘పాండురంగ మహత్యం’ సినిమాలో బాలకృష్ణుని పాత్రలో నటించారీమె. 1971లో ‘మీనా’ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఎవరా ప్రముఖ నటి? ఎ) బి.సరోజాదేవి బి) కృష్ణకుమారి సి) కాంచన డి) విజయనిర్మల 10. తమిళ నటుడు జీవా, కార్తీక కాంబినేషన్లో తమిళ్, తెలుగులో విడుదలైన చిత్రం ‘రంగం’. ఆ చిత్రానికి దర్శకత్వం వహించింది ప్రముఖ కెమెరామేన్. ఆ కెమెరామేన్ పేరేంటో కనుక్కోండి? ఎ) పీసీ శ్రీరామ్ బి) రాజీవన్ సి) కేవీ ఆనంద్ డి) రసూల్ ఎల్లోర్ 11. నటునిగా 150 చిత్రాలను పూర్తి చేసుకున్నారు యాక్షన్ కింగ్ అర్జున్. ఆయన దర్శకునిగా మారి ఎన్ని చిత్రాలు తెరకెక్కించారో తెలుసా? ఎ) 5 బి) 8 సి) 7 డి) 11 12. 1949లో యన్టీఆర్ నటించిన మొదటి చిత్రం ‘మన దేశం’ రిలీజైంది. 1961లో ఆయన తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఆ చిత్రం పేరేంటి? ఎ) తల్లా? పెళ్లామా? బి) వరకట్నం సి) సీతారామ కల్యాణం డి) శ్రీకృష్ణ పాండవీయం 13. దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్ మొదట దర్శకత్వ శాఖలో పనిచేయలేదు. సినీ పరి శ్రమలో మొదట ఆయన ఏ శాఖలో పనిచేశారో తెలుసా? ఎ) ఎడిటింగ్ బి) కెమెరా సి) ఆడియోగ్రాఫర్ డి) కొరియోగ్రాఫర్ 14 కమల్హాసన్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘చాచీ 420’. ఆ చిత్రంలో హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) టబు బి) గౌతమి సి) అమలా డి) రమ్యకృష్ణ 15. ‘మణికర్ణిక’ చిత్రానికి మొదట దర్శకునిగా చాలా బాగాన్ని చిత్రీకరించారు క్రిష్. ఆ తర్వాత ఆయన ‘యన్టీఆర్’ బయోపిక్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం వల్ల మిగతా చిత్రాన్ని కంప్లీట్ చేసిన నాయిక ఎవరో చెప్పుకోండి? ఎ) ఆలియా భట్ బి) దీపికా పదుకోన్ సి) కంగనా రనౌత్ డి) ప్రియాంకా చోప్రా 16 హీరో కృష్ణ దాదాపు 230 సినిమాల్లో నటించిన తర్వాత ‘సింహాసనం’ చిత్రం ద్వారా దర్శకునిగా మారారు. ఆ సినిమాలో విషకన్య పాత్ర ద్వారా తెలుగులో నటించిన బాలీవుడ్ నటి ఎవరో తెలుసుకుందామా? ఎ) దివ్యభారతి బి) రేఖ సి) హేమమాలిని డి) మందాకిని 17. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన చిత్రం ‘చండీరాణి’. ఆ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమైన ఫేమస్ హీరోయిన్ ఎవరు? ఎ) భానుమతి బి) లక్ష్మీ సి) యస్.వరలక్ష్మీ డి) అంజలీదేవి 18. ఆయనో ప్రముఖ నిర్మాత. అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సాహంతో దర్శకుడయ్యారు. తను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘దసరాబుల్లోడు’తో సంచలన విజయం నమోదు చేశారు. ఆ దర్శక–నిర్మాత ఎవరో తెలుసా? ఎ) వీబీ రాజేంద్రప్రసాద్ బి) కేయస్ ప్రకాశరావు సి) క్రాంతికుమార్ డి) మురారి 19. సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు తేజ. ఆయన దర్శకుడు కాకముందు ఫేమస్ సినిమాటోగ్రాఫర్. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ఏంటో గుర్తుందా? ఎ) జయం బి) చిత్రం సి) నిజం డి) ధైర్యం 20. తరుణ్, రాజా, సలోనిలు ముఖ్య పాత్రలుగా నటించిన చిత్రం ‘ఒక ఊరిలో’. ఆ చిత్రంతో దర్శకునిగా మారారు రమేశ్వర్మ. దర్శకుడు కాకముందు ఆయన ఏం చేసేవారో తెలుసా? ఎ) స్టిల్ ఫొటోగ్రఫీ బి) ఆర్ట్ డైరెక్టర్ సి) పోస్టర్ డిజైనర్ డి) మ్యూజిక్ డైరెక్టర్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) సి 3) ఎ 4) బి 5) సి 6) సి 7) బి 8) బి 9) డి 10) సి 11) డి 12) సి 13) సి 14) ఎ 15) సి 16) డి 17) ఎ 18) ఎ 19) బి 20) సి నిర్వహణ: శివ మల్లాల -
నవ్వుల పార్టీ
జై, రెజీనా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, సంచితశెట్టి, చంద్రన్, సంపత్రాజ్, శివ, చంద్రన్ ముఖ్య తారలుగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పార్టీ’. అమ్మ క్రియేషన్స్ పతాకంపై టి. శివ నిర్మించారు. ప్రేమ్జీ అమరన్ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. రమ్యకృష్ణ మాట్లాడుతూ– ‘‘సత్యరాజ్సార్ లాగా చాలా రోజుల తర్వాత డ్యూయెట్లు పాడాను. సినిమా మొత్తం నవ్వుతూ చేశాం. ప్రేక్షకులు కూడా నవ్వుకునేలా ఈ సినిమా సరదాగా ఉంటుంది’’ అన్నారు. ‘‘పార్టీ’ లాంటి ఒక మంచి చిత్రాన్ని తీశానని ఆనందపడుతున్నాను. ఈ డైరెక్టర్తో మరిన్ని సినిమాలు చెయ్యడానికి రెడీ’’ అన్నారు టి. శివ. ‘‘పెద్ద నోట్ల రద్దు జరిగినప్పుడు ప్రజలు పడిన ఇబ్బందులతో ‘పార్టీ’ చిత్రం తెరకెక్కింది. ప్రధానమంత్రి మోదీగారి స్పీచ్తో మొదలవుతుంది. ఇదే బ్యానర్లో మరో చిత్రం చేస్తున్నా’’ అని వెంకట్ ప్రభు అన్నారు. ‘‘రమ్యకృష్ణగారిని రియల్గా చూడటం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఆమె పక్కన కూర్చున్నా కూడా నేను చూడలేకపోతున్నా.. భయం కాదు కానీ బిడియంగా ఉంది’’ అన్నారు ‘ఆర్ఎక్స్ 100’ చిత్రదర్శకుడు అజయ్ భూపతి. ‘‘పార్టీ’ చిత్రం ద్వారా మా మనవడిని పరిచయం చేస్తున్నారు. తప్పక ఆదరించాలి. కట్టప్ప క్యారెక్టర్ కేవలం సినిమాల వరకే. ఒరిజినల్గా అలా ఉండను’’ అన్నారు సత్యరాజ్. మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమ్జీ, నటి సంచిత తదితరులు పాల్గొన్నారు. -
శివగామి పాత్రలో బాలీవుడ్ మోడల్
బాహుబలి దేశ విదేశాల్లో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అందుకే బాహుబలి ప్రపంచాన్ని ఇక ముందు కూడా కొనసాగించే ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో భాగంగా బాహుబలికి ప్రీక్వెల్గా ఓ వెబ్ సీరీస్ను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు నిర్మాతలు. బాహుబలి కథకు ముందు శివగామి బాల్యం, ఆమె ఎదుగుదల ప్రధానాంశంగా ఈ వెబ్ సీరీస్ తెరకెక్కనుంది. ఈ వెబ్సీరీస్లో ప్రధాన పాత్ర శివగామిగా ఉత్తరాది నటి మృణాల్ థాకూర్ కనిపించనున్నారట. సిల్వర్ స్క్రీన్పై రమ్యకృష్ణ నట విశ్వరూపం చూపించిన పాత్రలో ఉత్తరాది అందాల నటి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన రాకపోయినా.. శివగామి పాత్రలో మృణాల్ కనిపించటం ఖరారయ్యిందన్న ప్రచారం జరుగుతుంది. కుంకుమ్ భాగ్య సీరియల్లో బుల్ బుల్ పాత్రలో ఆకట్టుకున్న మృణాల్.. ప్రస్తుతం హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న సూపర్ 30లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ వెబ్ సీరీస్ను ముగ్గురు దర్శకులు డైరెక్ట్ చేయనున్నారు. -
‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ రివ్యూ
టైటిల్ : శైలజా రెడ్డి అల్లుడు జానర్ : రొమాంటిక్ యాక్షన్ కామెడీ తారాగణం : నాగచైతన్య, రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యూల్, మురళీ శర్మ, నరేష్, వెన్నెల కిశోర్ సంగీతం : గోపి సుందర్ దర్శకత్వం : మారుతి దాసరి నిర్మాత : ఎస్ రాధకృష్ణ, నాగవంశీ ఎస్, పీడీవీ ప్రసాద్ వరుస విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న యువ దర్శకుడు మారుతి, అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా శైలజా రెడ్డి అల్లుడు. తెలుగు తెర ఒకప్పుడు సూపర్ హిట్ అయిన అత్త సెంటిమెంట్ను మరోసారి రిపీట్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో అత్త పాత్రలో రమ్యకృష్ణ నటించారు. మరి హిట్ ఫార్ములా నాగచైతన్య కెరీర్లో మరో హిట్గా నిలిచిందా..? రమ్యకృష్ణ అత్త పాత్రలో ఏమేరకు ఆకట్టుకున్నారు..? మారుతి తన సక్సెస్ ట్రాక్ను కంటిన్యూ చేశారా..? కథ : చైతన్య (నాగ చైతన్య ) భయంకరమైన ఈగో ఉన్న సక్సెస్ఫుల్ బిజినెస్మెన్ రావు(మురళీ శర్మ) కొడుకు. తన ఈగో కోసం కూతురు పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకునేంత ఈగో రావుది. తన కాలనీ లోకి కొత్తగా వచ్చిన అను(అను ఇమ్మాన్యూల్) అనే అమ్మాయి తొలిచూపులోనే ఇష్టపడతాడు చైతూ.. అనుకి కూడా తన తండ్రిలాగే భరించలేనంత ఈగో ఉందని తెలిసి పని మనిషిని ప్రేమిస్తున్నట్లుగా నాటకమాడి అనుని ప్రేమలోకి దించుతాడు. అనుకి కూడా తనలాగే ఈగో ఎక్కువ అని తెలుసుకున్న రావు.. చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఫ్యామిలీ ఫంక్షన్లో అను పర్మిషన్ లేకుండా ఎంగేజ్మెంట్ కూడా చేసేస్తాడు. (సాక్షి రివ్యూస్) కానీ అదే సమయంలో అను.. వరంగల్ జిల్లాను శాసించే శైలజా రెడ్డి(రమ్యకృష్ణ) కూతురు అని తెలుస్తోంది. తనకి తెలియకుండా ఏది జరగడానికి ఇష్టపడని శైలజా రెడ్డి... చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకుందా..? ఈగోని పక్కన పెట్టి శైలజా రెడ్డి, రావు.. చైతన్య, అనుల పెళ్లికి ఒప్పుకున్నారా? అన్నదే మిగతా కథ. నటీనటులు సినిమాలో తెర నిండా నటులు ఉన్నా సినిమా అంతా ముఖ్యంగా నాగచైతన్య, రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యూల్ల చుట్టూనే తిరుగుతుంది. కాబోయే అత్త, ప్రియురాలి మధ్య నలిగిపోయే పాత్రలో నాగ చైతన్య మంచి నటన కనబరిచాడు. గత చిత్రాలతో పోలిస్తే నటుడిగా మంచి పరిణతి కనబరిచాడు. కామెడీ టైమింగ్తోనూ ఆకట్టుకున్నాడు. కమర్షియల్ ఫార్మాట్ సినిమా కావటంతో డ్యాన్సులు, ఫైట్స్కు కూడా మంచి అవకాశం దక్కింది. ఇక కీలకమైన అత్త పాత్రలో రమ్యకృష్ణ మరోసారి విశ్వరూపం చూపించారు. భరించలేనంత ఈగోతో అందరినీ ఇబ్బంది పెట్టే పాత్రలో రమ్యకృష్ణ నటన అందరిని అలరిస్తుంది. (సాక్షి రివ్యూస్) సెకండాఫ్లో ఎంట్రీ ఇచ్చినా అందరినీ డామినేట్ చేసేశారు. ఎమోషనల్ సీన్స్లోనూ తన ఎక్స్పీరియన్స్ను చూపించారు. ఈగో విషయంలో అమ్మతో తలపడే పాత్రలో అను ఇమ్మాన్యూల్ ఆకట్టుకున్నారు. రమ్యకృష్ణతో పోటి పడి నటించే సీన్స్లో కాస్త తేలిపోయినట్టుగా అనిపించినా.. గ్లామర్ తో ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్లో మురళీ శర్మ కూడా రమ్యకృష్ణ రేంజ్లో ఈగో చూపించారు. హీరోయిన్ తండ్రిగా నరేష్ మరోసారి తనదైన నటనతో మెప్పించారు. వెన్నెల కిశోర్, 30 ఇయర్స్ పృథ్వీ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. విశ్లేషణ గత చిత్రాల్లో హీరోలకు డిఫెక్ట్ చూపించిన దర్శకుడు మారుతి ఈ సినిమాలో లేడి క్యారెక్టర్స్ కు కూడా డిఫెక్ట్ ను యాడ్ చేశాడు. విపరీతమైన ఈగోతో అందరిని ఇబ్బందులు పెట్టే అత్త పాత్రను అద్భుతంగా డిజైన్ చేశాడు. గత చిత్రాల విషయంలో కామెడీ మీదే ఎక్కువగా దృష్టి పెట్టిన మారుతి ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా మలిచాడు. తొలి భాగం హీరో హీరోయిన్ల లవ్ స్టోరి, రొమాటింక్ సీన్స్తో సాగదీసిన దర్శకుడు.. కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. (సాక్షి రివ్యూస్) ద్వితీయార్థంలోనూ కామెడీ కంటిన్యూ చేస్తూ యాక్షన్, ఎమోషనల్ సీన్స్తో ఫ్యామిలీ ఆడియన్స్ను మెప్పించే ప్రయత్నం చేశాడు. అయితే సినిమా అంతా 90లలో వచ్చిన కమర్షియల్ ఫార్ములా సినిమాలను గుర్తు చేస్తుంది. సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ కామెడీ. మారుతి తన మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. క్లైమాక్స్లో శైలజ రెడ్డి, రావు మనసు మార్చుకొని పెళ్లికి ఒప్పుకునే సన్నివేశం అంత కన్విన్సింగ్గా అనిపించదు. గోపిసుందర్ తన ట్యూన్స్తో మరోసారి మ్యాజిక్ చేశాడు. టైటిల్ సాంగ్ తో పాటు అనుబేబి, ఎగిరే పాటలు విజువల్గా కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : నాగచైతన్య, రమ్యకృష్ణ నటన కామెడీ మైనస్ పాయింట్స్ : పాత కథ రొటీన్ టేకింగ్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
‘నా కెరీర్లో అవే చెత్త సినిమాలు’
వినాయక చవితి సందర్భంగా శైలజా రెడ్డి అల్లుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ హీరో నాగ చైతన్య. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సినిమా ప్రమోషన్లో పాలు పంచుకుంటున్నాడు చైతూ. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తన కెరీర్లో తనకు బాగా నచ్చిన నచ్చని సినిమాలు వెల్లడించాడు చైతూ. ప్రేమమ్ తన కెరీర్లోనే బెస్ట్ సినిమా అన్న నాగచైతన్య.. దడ, బెజవాడ సినిమాలు చెత్త సినిమాలన్నాడు. ఆ సినిమాలు చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నానని తెలిపారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన శైలజా రెడ్డి అల్లుడు రేపు (13-09-2018) రిలీజ్ అవుతోంది. రమ్యకృష్ణ అత్తగా నటించిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటించారు. -
వినుమా వినాయక సినిమా కోరిక
కోరిన కోరికలు తీర్చేవాడు సిద్ధి వినాయకుడు.ఆ కోరికలు విఘ్నాలు రాకుండా చూసే వాడు విఘ్న నాయకుడు.దేవుడి ఎదుట కోరినా, తెర మీద కోరినా కోరికలు కోరికలే.కొన్ని సినిమా కోరికలు చిత్రంగా ఉంటాయి.చూసేవాళ్లలో చోద్యం కలిగిస్తాయి. విజయానికి ‘కీ’గా మారిన సినీ కోరికలు ఇవి. చదువులు కావాలంటే ఇస్తావు. స్కూటర్ కొనిపెట్టమంటే పెడతావు. ఫలానా పొరుగమ్మ మెడలో ఉన్నట్టున్న మామిడి పిందెల గొలుసు కావాలంటే పోనీలే పాపం అని ప్రసాదిస్తావు. కొడుకును అమెరికా పంపించమంటే ఫస్ట్ అటెంప్ట్లోనే వీసా శాంక్షన్ చేసి శాన్ప్రాన్సిస్కో ఫ్లయిట్ ఎక్కిస్తావు. చిన్న చాక్లెట్ కావాలన్నా పెద్ద మినిస్టర్ పోస్ట్ కొట్టాలన్నా ఆ కోరికలన్నీ తీర్చల్సిన దేవుడివి తీర్చే దేవుడివి నీవే.వినాయకునివే. సిద్ధి వినాయకునివే.ప్రతి మనిషిలో కోరికలు కామన్. సినిమాల్లో కోరికలు కోరుకునే క్యారెక్టర్లూ కామన్. కాని అన్ని సినిమాలు ఒక్కలా ఉండవన్నట్టే అన్ని కోరికలూ వొక్కలా ఉండవు. ఈ సినీ వింత కోరికలు నీకు గుర్తున్నాయా స్వామీ. ఈ కోరికలే కాసులు కురిపించాయి కదా స్వామీ. అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడని తెలిస్తే ‘చేసుకో అనో.. చేసుకోవద్దు’ అనో తండ్రి అంటాడు. ‘బొమ్మరిల్లు’ సినిమాలో కూడా తండ్రి ప్రకాష్రాజ్ తన కొడుకు సిద్ధార్థ ప్రేమ సంగతి విని ఆ మాటే అంటాడు.దానికి సదరు పుత్రరత్నం తిరగబడాలి. లేదంటే ఇంట్లో నుంచి వెళ్లిపోయి కోరిన ఆర్యసమాజ్లో ఆర్భాటం లేకుండా మూడుముళ్లు వేసి ఆటో ఎక్కి అద్దె పోర్షన్కు చేరుకోవాలి.కాని కొడుకు ఒక వింత కోరిక కోరుతాడు.‘ఆ అమ్మాయిని తెచ్చి వారం రోజులు ఇంట్లో పెడతాను. నీకు నచ్చేలా చేస్తాను. ఛాన్స్ ఇవ్వు నాన్నా’ అంటాడు.ఇలాంటి కోరిక ఇంతకు ముందు నిజ జీవితంలో ఎవరూ కోరలేదు.సినిమాలోనూ కోరలేదు.అందుకనే ఈ కోరిక పండింది. బాక్సాఫీస్ బొజ్జ కలెక్షన్లతో నిండింది. అదేం చిత్రమో ప్రేమ అనేసరికి వింత వింత కోరికలే వస్తాయి. ‘మరో చరిత్ర’లో అరవ బాలు కమలహాసన్, తెలుగు స్వప్న సరిత ప్రేమించుకోలేదూ? వాళ్లు మరో మాట లేనట్టుగా పెళ్లి చేసుకుంటాము మొర్రో అంటే పెద్దలు కోరిన వింత కోరిక ఇంతకు మునుపు విన్నామా కన్నామా? ‘మీరిద్దరు సంవత్సరం పాటు ఒకరినొకరు చూసుకోకూడదు. మాట్లాడుకోకూడదు. లవ్ లెటర్స్ రాసుకోకూడదు. ఇలా చేసిన తదుపరి కూడా మీలో ప్రేమ ఉన్నచో అప్పుడు పెళ్లి’ అంటారు. ఈ కోరిక విని అంత పెద్ద దేవుడుని నీవు కూడా కలవర పడి ఉంటావు కదూ. ఏవో పూజలు చేస్తే వ్రతాలు చేస్తే ఫలితంగా సిరిసంపదలు కోరుకుంటే వాటిని నువ్వు నెరవేరుస్తే అర్థముంది. స్ట్రయిట్ కోరికలకు స్ట్రయిట్ రిజల్ట్సు. కాని ‘లేడిస్ టైలర్’లో బట్టలు కొట్టే సుందరం కోరుకునే కోరిక ఏమిటి? ‘తొడ మీద రూపాయి కాసంత పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని చేసుకోవాలని’ కదూ. అదేం కోరిక. అట్లాంటి అమ్మాయిని ఎలాగని వెతికేదిక. సెర్చ్ వారెంట్ తీసుకొని బయలుదేరితే అరెస్టు వారెంటు వస్తుందే. చివరకి అతడికి అలాంటి అమ్మాయిని ఇవ్వకనే నువ్వు బుద్ధొచ్చేలా చేస్తావు. దారిలో పెడతావు. అంతేనా? మరుజన్మలో అతడే ‘ఆ ఒక్కటి అడక్కు’లో హస్తరేఖను నమ్ముకొని సంవత్సరం తర్వాత నేనే కింగ్ని అని విర్రవీగితే అలాంటి వెర్రి కోరికతో కలలు గంటూ కూర్చుంటే నష్టమేనని శ్రమ కంటే మించిన వరం లేదని తెలిసొచ్చేలా చేసి ట్రాక్ ఎక్కిస్తావు. సరే. ‘ఏప్రిల్ ఒకటి విడుదల’లో ఇతని గర్ల్ఫ్రెండ్ కోరిన కోరిక చాలా తమాషా. నోరు తెరిస్తే అడ్డమైన అబద్ధాలు కూసే ఇతణ్ణి దారిలో పెట్టడానికి స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసి సైన్ చేయించి ‘నెల రోజులు పాటు ఒక్క అబద్ధం చెప్పకూడదని’ కోరితే ఆ కోరికలోంచి కోటి నవ్వులు పుట్టడం ఈ సందర్భంగా గుర్తు చేసుకుని నవ్వుకోవాలిలే. అసలు ఈ వింత కోరికలు కోరే జాడ్యం మన హీరోలకు ముందు నుంచీ ఉంది. రాజ్యాభిషేకం చేస్తూ నీ కోరిక ఏమిటి నాయనా అని ‘జగదేక వీరుని కథ’లో ఎన్టీఆర్ను ముక్కామల అడిగితే ‘మీ పాద సేవ చేసుకోవడలై తండ్రీ’ అని అనకుండా అతడు గొప్పలు పోతూ ‘వెన్నెల రాత్రిలో కలువపూల పాన్పు మీద తాంబూలం సేవిస్తూ ఉంటే ఒక చెంత ఇంద్ర కుమార్తె, మరో చెంత వరుణ కన్య, కనుల ముందు నాగకన్య, ఎదుట నాట్యం చేస్తూ అగ్నికూమారి’ఇలా నలుగురు సావాసకత్తెలు కావాలనే వింత కోరిక కోరి నీ దయ వల్ల క్లయిమాక్స్ సమయానికి ‘శివశంకరీ’ పాడి సాధిస్తాడనుకో. అక్కినేని మాత్రం తక్కువ తిన్నాడా. ‘తెనాలి రామకృష్ణ’లో మీ అమ్మ కాళికాదేవి దయతలిచి ఒక గిన్నెలో పాల రూపంలో ‘జ్ఞానం’, మరో గిన్నెలో పెరుగు రూపంలో ‘ధనం’ ఇచ్చి ఏది కావాలో కోరుకో అంటే చిటికెలో రెండూ మిక్స్ కొట్టి తాగి ‘నాకు రెండూ కావాలి ఇవ్వు’ అని రెటమతం కోరిక కోరితే ఆమెకు తిక్కరేగి ‘వికటకవిగా మిగులుతావు పో’ అని శపిస్తే ఆ వికటత్వంలో నీకెంతో ఇష్టమైన హాస్యాన్ని ఆ మహా కవి పుట్టించాడు కదా స్వామీ. ఆ నవ్వులు నేటికీ తలుచుకుంటున్నాము. అందుకు నీకు ఎన్ని అహ్హహ్హలూ ఓహ్హొహ్హోలు చదివించాలో. సరే పోనీ... నిన్న మొన్న ‘బాహుబలి’లో ఏమైంది. ‘నేను ప్రేమించిన దేవసేనను నాకే ఇవ్వు రాజమాతా’ అని శివగామి విఎఫ్ఎక్స్ ఎలివేటెడ్ కళ్లలోకి బాహుబలి సూటిగా చూస్తూ కోరితే ఆమె ఏమి కోరింది.‘నీకు రాచపదవి కావాలా? ఆ దేవసేన కావాలా తేల్చుకో’ అని ఎదురు కోరింది. కోరికకు కోరికే సమాధానం అయినప్పుడు బాహుబలి దేవసేన చిటికెన వేలినే చటుక్కున పట్టుకున్నాడు రాజ్యం పోతుందన్న చీకూ చింత చీమంతైనా లేకుండా. అందుకే సాహోరే బాహుబలి అనిపించుకున్నాడు. ఇలాంటి సీరియస్ కోరికలే కాకుండా గిలిగింతలు పెట్టే సిల్లీ కోరికలు కూడా ఉంటాయనుకో. ‘పడమటి సంధ్యారాగం’ సినిమా గుర్తుందిగా. అందులో ఐస్క్రీమ్ పార్లర్ ఆసామికి పుట్టిన బకాసురుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో దొరికే అన్ని ఆహార పదార్థాల మీదా దాడి చేసి గుటకాయ స్వాహా చేస్తుంటే ఆ తండ్రి కోరే కోరిక ఏమిటో తెలుసా? ‘కులాసా అని ఎవరైనా అడిగితే కులాసే. అంటే కుమారుడి వల్ల లాసు’ అని జవాబు చెప్పే పరిస్థితి కల్పించవద్దని. ‘చంటబ్బాయ్’లో శ్రీలక్ష్మి కోరిక కూడా చిన్నదే. ‘నేను కవిని కానన్న వాణ్ణి కత్తితో పొడుస్తా’ అని వ్రాసే ఆమె యొక్క కవితా ఖండికల్ని అచ్చులో చూసుకోవాలనేగా.‘రాజేంద్రుడు గజేంద్రుడు’లో అలీ కోరిక కూడా చిన్నది. ‘ఎంద పరంద ఇన్న చేటా’ అంటూ అతడు బ్యాంకు మేనేజర్ బ్రహ్మానందం చుట్టూ తిరిగి అర్థం కాని భాషలో కోరే కోరిక ఒక్కటే –‘చేటల వ్యాపారం చేసుకుంటాను. లోను ఇమ్మని’.స్వామీ. సినిమాల్లో ఎన్నో కోరికలు చూశాము.ఆ కోరికలు తీరుతుంటే సంతోషపడ్డాము.కాని కొన్ని కోరికలు మాత్రం నువ్వు తీర్చనందుకు కొంచెం నిష్టూరం కూడా ఉంది. ‘అంతులేని కథ’లో పెళ్లి చేసుకుని స్థిరపడదామనుకున్న జయప్రద కోరిక నువ్వు తీర్చలేదు. నేషనల్ డాన్స్ ఫెస్టివల్లో ఢిల్లీలో డాన్స్ చేయాలన్న కమలహాసన్ కోరికను ‘సాగర సంగమం’లో నువ్వు తీర్చలేదు. భర్త చనిపోయాక పిల్లలను తానుగా చూసుకుందామనుకున్న మాధవి కోరికను ‘మాతృదేవోభవ’లో నువ్వు తీర్చలేదు. అన్న ఆది పినిశెట్టిని నాయకుడిగా చూసుకోవాలనుకున్న తమ్ముడు రామ్చరణ్ కోరికను ‘రంగస్థలం’లో నువ్వు తీర్చలేదు. లేటెస్టుగా ‘కేరాఫ్ కంచరపాలెం’లో ముప్పై అడుగుల నీ బొమ్మను తయారు చేసి మార్కులు కొట్టేయాలనుకున్న నత్తి రామ్మూర్తి కోరికను నువ్వు తీర్చలేదు. ఇక మీదట సినిమాల్లో ఏ కోరికకూ విఘ్నం కలిగించవద్దు. అవిఘ్నంగా సినిమా కోరికలన్నీ తీరే వరం ప్రసాదించు స్వామీ. -
‘అల్లరి అల్లుడు’ అంత హిట్ అవ్వాలి
‘‘చైతన్యని అందరూ శైలజారెడ్డిగారి అల్లుడు అంటున్నారు.. కాదు.. అక్కినేని నాగేశ్వరరావుగారి మనవడు.. నాగార్జున పెద్దకొడుకు. ప్రేమకథా చిత్రాలైనా, ఎంటర్టైన్మెంట్ చిత్రాలైనా, ఒక స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ ఉన్న సినిమాల్లో అయినా నాన్నగారికి నాన్నగారే సాటి. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని చైతన్య తీసుకున్నాడు’’ అని హీరో నాగార్జున అన్నారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఎస్.రాధాకృష్ణ(చినబాబు) సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎస్.నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 13న విడుదలవుతోంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘చైతన్య చాలా సాఫ్ట్.. చక్కగా నవ్వుతూ ఉంటాడు.. బంగారం.. అని మీరందరూ అంటూ ఉంటారు. కాదు.. తనలో చిలిపితనం కూడా ఉంది. నేను కొంచెం సినిమా చూశా. మారుతీగారు ఆ చిలిపితనాన్ని చక్కగా వాడుకున్నారు. నేను, రమ్యకృష్ణ కలసి ఎన్నో సినిమాలు చేశాం, చాలా పెద్ద హిట్స్ అయ్యాయి.‘బాహుబలి’ తర్వాత రమ్య అంటే భారతదేశంలో తెలియనివారు ఎవరూ లేరు. నాతోపాటు ‘అల్లరి అల్లుడు’ చిత్రంలో చిన్న గెస్ట్రోల్ చేసింది. ఇప్పుడు చైతన్యతో ‘శైలజారెడ్డి అల్లుడు’ చేసింది. ఈ సినిమా ‘అల్లరి అల్లుడు’ అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మారుతీగారికి మాస్ పల్స్ బాగా తెలుసు. మా ఫ్యాన్స్కి ఏం కావాలో ఈ సినిమాలో మీరు ఇస్తున్నందుకు థ్యాంక్స్. గత నెలలో నాకు బాగా దగ్గరైన ఇద్దరు మనల్ని వదిలి వెళ్లిపోయారు. హరి అన్నయ్య(హరికృష్ణ). ఎవర్నైనా ఇక్కడ నేను ‘అన్న’ అని పిలుస్తానంటే అది ఆయనొక్కర్నే. ఆయన వెళ్లిపోయిన రోజు నా పుట్టినరోజు. పొద్దున్నే వార్త వినగానే ఎలా కనెక్ట్ చేసుకోవాలో కూడా తెలియలేదు. నా స్నేహితుడు, ఆత్మీయుడు రవీందర్ రెడ్డి మరణం కూడా నన్ను బాధించింది. చైతన్య కెరీర్లో ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. హీరో నాని మాట్లాడుతూ– ‘‘ఇంతకుముందు జనరేషన్లో మంచి సాంగ్స్ అన్నీ నాగార్జునగారికి పడితే.. మా జనరేషన్లో మంచి సాంగ్స్ నాగచైతన్యకు పడ్డాయి. ఆ ఫ్యామిలీకి మంచి పాటలన్నీ అలా రాసిపెట్టినట్లు ఉన్నాయి. ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం కొంచెం ‘అల్లరి అల్లుడు’ లాంటి సినిమా అని నాగార్జునగారు నాతో అన్నారు. ఆ మాట చాలు ఈ సినిమాలో ఏ స్థాయి ఎంటర్టైన్మెంట్ ఉంటుందో’’ అన్నారు. ‘‘ఇంత స్పీడ్గా షూటింగ్ పూర్తి చేసి, ఇంతే త్వరగా సినిమా రిలీజ్ చేస్తుండటం ఇన్నేళ్లలో ఫస్ట్టైమ్ చూస్తున్నా. వేడివేడిగా మీ ముందుకు రాబోతోంది’’ అన్నారు రమ్యకృష్ణ. మారుతి మాట్లాడుతూ– ‘‘నాగచైతన్యగారిని మీరు(అభిమానులు) ఎలా చూడాలనుకుంటున్నారో వందశాతం అలాగే ఉంటారని గ్యారంటీ ఇస్తున్నా. ఈ సినిమా నుంచి ఆయన యువసామ్రాట్.. ఫిక్స్ అవ్వండి. ఈ సినిమాలో ట్యాగ్ వేస్తున్నా. ‘శైలజారెడ్డి అల్లుడు’ ఓ మంచి లవ్స్టోరీ. రమ్యమేడమ్తో ఫొటో దిగడం, పనిచేయడం అందరికీ ఓ కలలా ఉంటుంది. అలాంటిది ఆమెను డైరెక్ట్ చేయడం నా కల నెరవేరినట్టే. ఓ యాక్టర్గా, హీరోగా పరిచయమైన నా హీరో(నాగచైతన్య).. ఇప్పుడు నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు’’ అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మా అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. బయటికి అభిమానులు అంటున్నాం కానీ మీరందరూ నా ఫ్యామిలీయే. ప్రతి సినిమా ఈవెంట్కి వచ్చి ఇలాగే ఎంకరేజ్ చేసి ఇదే ఎనర్జీ ఇచ్చి ప్రోత్సహిస్తారు. మీరే నా బలం, బలహీనత.. మీరిచ్చే ప్రేమకి మీరు కోరుకునేది ఓ హిట్ సినిమా. ఇకనుంచి ప్రతి సినిమా మిమ్మల్ని మైండ్లో పెట్టుకుని మీరు గర్వపడే సినిమాలు చేస్తానని మాట ఇస్తున్నా. మారుతిగారు మనకి ఓ సూపర్ సినిమా ఇచ్చారు. చినబాబుగారు, వంశీ, పీడీవీ ప్రసాద్గారు రెండేళ్లకిందట ఎప్పటికీ మరచిపోలేని ‘ప్రేమమ్’ అనే సినిమా ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమా ఇచ్చారు. రమ్య మేడమ్ ఈ సినిమాకి పెద్ద సపోర్ట్. పండుగకి ఇది పండుగలాంటి సినిమా. మీరు ఎంజాయ్ చేసి, మీ మొహంలో ఓ నవ్వుంటే నేనూ ఆరోజు పండుగ చేసుకుంటా’’ అన్నారు. ‘‘ఇటీవల స్టేజ్ ఎక్కిన ప్రతిసారి నాకు మాటలు సరిగ్గా వచ్చేవి కాదు. అన్నయ్య(నాగచైతన్య) గురించి మాట్లాడాలన్నప్పుడు మాత్రం తన్నుకుంటూ వస్తున్నాయి. మారుతీగారు మీరు కరెక్ట్ టైమ్లో కరెక్ట్ హీరోని పట్టారు. సినిమాలో అల్లుణ్ని చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత అన్నయ్య ఫేస్లో సడెన్గా మంచి గ్లో వచ్చింది’’ అని హీరో అఖిల్ అన్నారు. చిత్ర సమర్పకులు రాధాకృష్ణ, నిర్మాతలు పీడీవీ ప్రసాద్, నాగవంశీ, అనూ ఇమ్మాన్యుయేల్, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రవిశంకర్, నటులు కాశీ విశ్వనాథ్, నరేశ్, సంగీత దర్శకుడు గోపీసుందర్, కెమెరామెన్ నిజ ర్ పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అమ్మాయి కోపం... అబ్బాయి శాంతి జపం!
అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి బోలెడు మ్యాజిక్కులు, జిమ్మిక్కులు చేస్తుంటారు అబ్బాయిలు. మామూలు అమ్మాయిల ప్రేమను గెలుచుకోవడానికే ఇంత కష్టపడితే... కొంచెం ఈగో ఉన్న అమ్మాయి మనసులో ప్లేస్ సంపాదించాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిందే. అదే చేశారు నాగచైతన్య. కాస్త శాంతించమని అనూ ఇమ్మాన్యుయేల్ కోసం పాట అందుకున్నారు. ఆ పాట వీడియో శాంపిల్ను శుక్రవారం విడుదల చేశారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలోని ‘అనుబేబీ’ సాంగ్ వీడియో టీజర్ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో నాగచైతన్య స్టెప్స్ కొత్తగా ఉన్నాయి. ‘‘అను బేబీ’ సాంగ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా యూ ట్యూబ్లో విడుదల చేశాం. కృష్ణకాంత్ రాశారు. అనుదీప్ దేవ్ పాడారు. శేఖర్ వీజే కొరియోగ్రఫీ చేశారు. ఆడియో విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం’’అని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఐదు భాషల్లో శివగామి
రమ్యకృష్ణ కెరీర్లో ‘నరసింహ’ చిత్రంలోని నీలాంబరి, ‘బాహుబలి’ సినిమాలో చేసిన శివగామి పాత్రలు ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఆ పాత్రల్లో ఆమె నటనను ప్రేక్షకులు అంత సులువుగా మరచిపోలేరు. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రాణి శివగామి’. మధు మిణకన్ గుర్కి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ పిక్చర్స్ పతాకంపై మురళీకృష్ణ దబ్బుగుడి నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ను బోనాల పండగ సందర్భంగా విడుదల చేశారు. చిత్రనిర్మాత మాట్లాడుతూ– ‘‘పీరియాడిక్ డ్రామాతో సోషియో ఫాంటసీగా రూపొందిన చిత్రమిది. గ్రాఫిక్స్కి ప్రాధాన్యత ఇచ్చాం. రమ్యకృష్ణను కొత్త కోణం లో ఆవిష్కరించే చిత్రం ఇది. నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘9వ శతాబ్దంలో ప్రారంభమయ్యే ఈ కథ 21వ శతాబ్దం వరకు ఉంటుంది. ఈ కాలంలో జరిగే సంఘటనలు ఆసక్తిగా ఉంటాయి’’ అన్నారు మధు మిణకన్ గుర్కి. ఈ చిత్రానికి సంగీతం: వీర్ సమ్రత్, కెమెరా: బాల్రెడ్డి, సహ నిర్మాతలు: దబ్బుగుంట వెంకటశేషయ్య యాదవ్, దబ్బుగుంట మహేష్కుమార్ యాదవ్. -
‘శైలజా రెడ్డి అల్లుడు’ మూవీ స్టిల్స్
-
‘పిల్ల పిట్టలా ఇంతే ఉన్నా.. పొట్టంతా ఈగోనే’
రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తరువాత మంచి ఫామ్లోకి వచ్చాడు నాగ చైతన్య. ఆ స్పీడులోనే చకచకా ప్రాజెక్ట్లను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో ‘శైలజా రెడ్డి అల్లుడు’, చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తరవాత శివ నిర్వాణ డైరెక్షన్లో మరో సినిమాను ఓకే చేసి వరుసగా సినిమాలు చేస్తూ బిజిబిజీగా ఉన్నాడు. తాజాగా శైలజా రెడ్డి అల్లుడు టీజర్ను విడుదల చేశారు. ఈ కాన్సెప్ట్తో ఇది వరకే తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఇలాంటి కథకు మారుతి తనదైన టేకింగ్ను జోడించి తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ‘పిల్ల పిట్టలా ఇంతే ఉన్నా.. పొట్టంతా ఈగోనే’ అనే డైలాగ్తో సినిమా థీమ్ ఏంటో ఇట్టే తెలిసిపోతోంది. గోపి సుందర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. లుక్స్ పరంగా నాగ చైతన్య , అను ఇమ్మాన్యుయేల్ ఆకట్టుకున్నారు. కీలకపాత్రలో నటిస్తున్న రమ్యకృష్ణ పాత్రను ఎక్కువగా రివీల్ చేయకుండా టీజర్ను కట్ చేశారు. ఈ మూవీని ఆగస్టు 31న విడుదల చేయనున్నారు. -
ఆగస్టు 31న ‘శైలజా రెడ్డి అల్లుడు’
యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం శైలజా రెడ్డి అల్లుడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అత్త పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్లుక్ పోస్టర్కు మంచి రెస్పాన్స్రావటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకంటించారు. ఆగస్టు 31న శైలజా రెడ్డి అల్లుడు సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ విషయాన్ని హీరో నాగచైతన్య తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. చైతూ సరసన అనూ ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తుండగా గోపీసుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. And yes #SailajaReddyAlludu will be releasing on august 31st .. An emotional journey of love packaged with @DirectorMaruthi entertainment in its peak ! pic.twitter.com/65k9tFrBxB — chaitanya akkineni (@chay_akkineni) 30 July 2018 -
ఫారిన్లో ఆటాపాటా
‘ఖాకి, చినబాబు’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత తమిళ హీరో కార్తీ నటిస్తోన్న తాజా చిత్రం ‘దేవ్’. ఇందులో రకుల్ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూరప్లోని ఉక్రెయిన్లో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్లో మొదలైన ఈ షెడ్యూల్లో ముందు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ శుక్రవారం ‘దేవ్’ టీమ్తో రకుల్ జాయిన్ అవ్వగానే పాట అందుకున్నారు టీమ్. అదే సాంగ్ షూట్ స్టార్ట్ చేశారని చెప్తున్నాం. పాట పూర్తయిన తర్వాత అక్కడి లొకేషన్స్లోనే హీరో, హీరోయిన్లలపై కొన్ని సీన్స్ను చిత్రీకరిస్తారట. ఇందులో కార్తీక్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు చేస్తున్నారు. మరో రెండు నెలల్లో షూటింగ్కు గుమ్మడికాయ కొట్టి ఈ ఏడాది డిసెంబర్లో ‘దేవ్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని కోలీవుడ్ సమాచారం. -
అల్లుడి సందడి
ఒక్క సాంగ్ మినహాయించి పని మొత్తాన్ని పూర్తి చేశారు శైలజారెడ్డి అల్లుడు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటించారు. రీసెంట్గా గుడికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సన్నివేశాల్లో రమ్యకృష్ణ, నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్, ‘వెన్నెల’ కిశోర్ పాల్గొన్నారు. ‘‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా ఒక్క పాట తప్ప మిగతా షూటింగ్ మొత్తం పూర్తయింది. అనుకున్న టైమ్కి షూటింగ్ కంప్లీట్ చేయడానికి హెల్ప్ చేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించారు. ఇంతకీ అల్లుడు థియేటర్లో సందడి చేసేది ఎప్పుడు అంటే.. వచ్చే ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్పై ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. -
అల్లుడి జాగారం
అల్లుడు అండ్ టీమ్ నైట్ అంతా నిద్రపోలేదట. ఎవరీ అల్లుడు అంటే.. కేరాఫ్ శైలజారెడ్డి అన్నమాట. మరి... నిద్రపోకుండా ఏం చేశారు? అది మాత్రం సిల్వర్ స్క్రీన్పై చూడాల్సిందే. నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్ర చేస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమా ఫస్ట్లుక్ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ నైట్ టైమ్ జరుగుతోంది. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. -
అత్త.. అల్లుడొచ్చారు
కుర్చీలో ఠీవీగా కూర్చుని ఓర కంటితో కాసింత కోపంగా అల్లుడు, కూతుర్ని (నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్) చూస్తున్నారు శైలజారెడ్డి (రమ్యకృష్ణ). అల్లుడేమో అత్తని ఆటపట్టిస్తున్నట్లు చిరునవ్వులు చిందిస్తుంటే.. కూతురేమో భర్తవైపు ఆప్యాయంగా చూస్తున్నారు. నాగచైతన్య, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఎస్. నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ని సోమవారం రిలీజ్ చేశారు. ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ ఫస్ట్ లుక్పై నాగచైతన్య స్పందిస్తూ – ‘‘డైరెక్టర్ మారుతిగారు ఆఫ్ స్క్రీన్ నన్ను ఎంటర్టైన్ చేస్తున్నట్లే ఆన్ స్క్రీన్ మిమ్మల్ని (ప్రేక్షకులు) ఎంటర్టైన్ చేయబోతున్నారు. సితార బ్యానర్లో పనిచేయడం నాకు ఎప్పుడూ సౌకర్యంగానే ఉంటుంది. రమ్యకృష్ణగారి పాత్ర చాలా స్పెషల్గా ఉంటుంది’’ అన్నారు. -
ఫస్ట్ లుక్: అల్లుడు-కూతురితో శైలజారెడ్డి
అక్కినేని నట వారసుడు నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అత్త పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. పోస్టర్లో నాగచైతన్య డిఫరెంట్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. చైతూ సరసన అనూ ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తుండగా గోపీసుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న శైలజారెడ్డి అల్లుడుని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు డైరెక్టర్ మారుతి యత్నిస్తున్నాడు. మరోవైపు చైతూ నటిస్తున్న సవ్యసాచి చిత్ర షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. The first look of #ShailajaReddyAlludu as promised by @DirectorMaruthi who entertains me off screen as much as he is going to entertain you all onscreen .. always a pleasure working with @SitharaEnts , Anu Emmanuel .. Ramya Garu’s role is going to be something to watch out for! pic.twitter.com/r36FttKx9Z — chaitanya akkineni (@chay_akkineni) 9 July 2018 -
అల్లుడు వస్తున్నాడు
అల్లుడు రాక కోసం సర్వం సిద్ధం చేశారు. మరి.. అల్లుడికి అత్తయ శైలజారెడ్డి ఎలాంటి సౌకర్యాలు, ఏ స్థాయి స్వాగత మర్వాదలు చేశారనేది సిల్వర్ స్క్రీన్పై చూడాల్సిందే. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్నారు. అత్తయ్య శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. గోపీసుందర్ స్వరాలు అందిస్తున్నారు. రీసెంట్గా నాగచైతన్య, అను, రమ్యకృష్ణలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ నెల 9న ఈ సినిమా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘శైలజా రెడ్డి అల్లుడు వస్తున్నాడు’’ అని పేర్కొన్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. -
గాయకులుగా...
మన టాలీవుడ్కి మోస్ట్ ఫేవరెట్ బ్రదర్స్ సూర్య, కార్తీ. ఈ ఇద్దరికీ తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడు కలిసి యాక్ట్ చేస్తారు? అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి టైమ్ ఉంది. కానీ త్వరలో కలిసి వినిపించనున్నారు. వెంకట్ప్రభు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పార్టీ’. జై, రెజీనా, రమ్యకృష్ట ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ను సూర్య, కార్తీ ఇద్దరూ కలిసి పాడారు. నటుడు ప్రేమ్జీ అమరన్ ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా మారారు. ఈ సాంగ్ను రేపు విడుదల చేయనున్నారు. -
ఇండియన్ కంటే ముందే..
ఫస్ట్ టైమ్ ఆన్ స్క్రీన్ తండ్రీ కూతుళ్లుగా కమల్హాసన్, శ్రుతీహాసన్ యాక్ట్ చేస్తోన్న చిత్రం ‘శభాష్ నాయుడు’. ఈ చిత్రం గత ఏడాదే ప్రారంభం అయినప్పటికీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. కానీ ఈ సినిమాను ‘ఇండియన్ 2’ (భారతీయుడు సీక్వెల్) స్టార్ట్ అయ్యేలోపే కంప్లీట్ చేస్తామని కమల్ హాసన్ పేర్కొన్నారు. ‘దశావతారం’ సినిమాలోని బలరామ్ నాయుడు క్యారెక్టర్కి కొన సాగింపుగా స్వీయ దర్శకత్వంలో ‘శభాష్ నాయుడు’ సినిమాని రూపొందిస్తున్నారు కమల్ హాసన్. రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ గురించి కమల్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం తమిళ ‘బిగ్ బాస్2’తో బిజీగా ఉన్నాను. అది అయిపోగానే ‘శభాష్ నాయుడు’ పనులు మొదలుపెడతాం. ‘ఇండియన్ 2’ షూటింVŠ స్టార్ట్ చేయడానికి కంటే ముందే ఈ సినిమాను కంప్లీట్ చేసి, వచ్చే ఏడాదిలో రిలీజ్ చేస్తాం’’ అని పేర్కొన్నారు. కమల్ హాసన్ నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొం దించిన ‘విశ్వరూపం 2’ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఆగస్ట్ 10న రిలీజ్ కానుంది. -
సూపరో సూపరు!
రంగమ్మా, మంగమ్మా ... అక్కినేని కోడలు సమంత ఎక్కడమ్మా! మామ నాగార్జున సిల్వర్జూబ్లి వెడ్డింగ్ యానివర్శరీ సెలబ్రేషన్స్లో కనిపించలేదమ్మా! ఇదిగో ఇలాగే ఫ్యాన్స్ అందరూ ఫన్నీగా పాడుకుంటున్నారు. కానీ సమంత మాత్రం చెన్నైలో కేక్ను ముక్కలు ముక్కలు చేసి పక్కనున్న వాళ్ల నోరు తీపి చేశారు. ఏంటీ? మామయ్య వెడ్డింగ్ యానివర్శరీలో పాల్గొనకుండా చెన్నైలో బర్త్డే పార్టీకి వెళ్లారా సమంత! అని ఆశ్చర్యపోకండి. ఆమె కేక్ కట్ చేసింది తమిళ చిత్రం ‘సూపర్ డీలక్స్’ సినిమా షూటింగ్ను కంప్లీట్ చేసినందుకు. బిజీ బిజీ షెడ్యూల్ వల్ల మామయ్య పెళ్లి రోజు పార్టీకి సమంత హాజరు కాలేకపోయారని ఇప్పుడు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘అరణ్యకాండం’ ఫేమ్ త్యాగరాజన్ కుమార్రాజా దర్శకత్వంలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సమంత ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘సూపర్ డీలక్స్’. ఇందులో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేస్తున్నారని కోలీవుడ్ టాక్. ఈ సినిమా షూటింగ్ను కంప్లీట్ చేశారు సమంత. ఆ సందర్భంలో సెట్స్లో సరదాగా కేక్ కట్ చేసి, చిత్రబృందంతో సందడి చేశారామె. తమిళ, తెలుగు భాషల్లో ఈ ఏడాది ఆల్రెడీ మూడు సార్లు సిల్వర్స్క్రీన్పై మెరిసిన సమంత ఈ ఏడాది మరో రెండో సినిమాల్లో కనిపించే అవకాశంఉంది. ఇది తెలిసిన ఫ్యాన్స్ మా సమంత... సూపరో సూపరు అంటున్నారు. -
కీచకుడి బెదిరింపు.. రమ్య ఆత్మహత్యాయత్నం
సాక్షి, నిజామాబాద్ : గతంలో సన్నిహితంగా ఉన్న ఫొటోలు నెట్లో పెడతానంటూ బెదిరింపులు రావడంతో యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకున్న సంఘటన మాక్లూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మాక్లూరుకు చెందిన రమ్యకృష్ణ బీటెక్ చదువుతోంది. ప్రసాద్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఉంది. ప్రసాద్ వృత్తి రీత్యా కువైట్లో స్థిరపడ్డాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, చదువు పూర్తి కావొస్తున్న రమ్యకృష్ణకు ఇంట్లో వివాహా సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రసాద్ పెళ్లికి ఒప్పుకుంటే గతంలో దిగిన ఫొటోలు నెట్లో పెడతానంటూ రమ్యను బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమ్యకృష్ణ ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటిచుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమె శరీరం పూర్తిగా కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, రమ్యకృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలి వద్ద స్టేట్మెంట్ నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అల్లుడు లెట్స్ డు కుమ్ముడు
మర్యాదల్లో ఏదైనా తేడా వచ్చిందో లేక ఫ్యామిలీని ఎవరైనా ఏమైనా కామెంట్ చేశారో.. కరెక్ట్ రీజన్ తెలీదు కానీ, విలన్స్ను కుమ్మేస్తున్నాడు అల్లుడు. ఈ అల్లుడు ఎవరి తాలుకానో తెలుసు కదా! పవర్ఫుల్ శైలజారెడ్డి తాలుకా అండీ బాబు. నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘శైలజారెడ్డిగారి అల్లుడు’ అనే టైటిల్ను అనుకుంటున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారని సమాచారం. ప్రస్తుతం హీరో నాగచైతన్యపై ఫైట్ సీన్స్ను తెరకెక్కిస్తున్నారు. అంటే అల్లుడు లెట్స్ డు కుమ్ముడు అన్నమాట. ఆఫ్టర్ ఫైట్ అనూతో సరసాలడతారట నాగచైతన్య. అదేనండి.. ఈ సినిమాలో హీరో హీరోయిన్లపై రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని చెబుతున్నాం. -
కమల్, రమ్యకృష్ణలకు నోటీసులివ్వండి
తమిళ సినిమా: మక్కల్ నీది మయ్యం నేత కమల్హాసన్, నటి రమ్యకృష్ణలకు నోటీసులు జారీ చేయాలని సీఎండీఏకు చెన్నై హైకోర్టు మంగళవారం ఆదేశించింది. వివరాలు.. చెన్నై శివారు ప్రాంతం ఈసీఆర్ రోడ్డులోని సముద్ర తీర గ్రామమైన ఉత్తండిలో కమల్ హాసన్, రమ్యకృష్ణతో పాటు 138 మంది అక్రమంగా నివాసాలు నిర్మించుకున్నట్లు తెలిసింది చెన్నైకు చెందిన రంగనాథన్ దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో.. సముద్రతీర ప్రాంతమైన ఉత్తండిలో తనకు సొంతమైన స్థలంలో గెస్ట్ హౌస్ నిర్మించుకోడానికి సీఎండీఏ అనుమతి ఇవ్వలేదన్నారు. తన స్థలం చుట్టూ కమల్ హాసన్, రమ్యకృష్ణ సహా పలువురు ఇల్లు నిర్మించుకున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. కేసు విచారించిన న్యాయమూర్తులు ఉత్తండిలో నివాసాలను ఏర్పరచుకున్న వారి నుంచి వివరణ కోరుతూ సీఎండీఏ నోటీసులు పంపాలని ఆదేశించారు. అదే సమయంలో ఈ విషయంగా సీఎండీఏ, చెన్నై నగర కార్పొరేషన్ కూడా తమకు సమాచారం అందించాలని ఆదేశిస్తూ ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈ సమాచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. -
సొగసరి అత్త.. గడసరి అల్లుడు
అత్తారింటికెళ్లాడు అల్లుడు. ఆతిథ్యంలో తేడా వస్తే అమ్మాయిపై ఉన్న ప్రేమతోనో, అత్తింటిపై ఉన్న గౌరవంతోనో.. సర్లే అని సర్దుకుంటాడు. కానీ అత్త తనపై పెత్తనం చేయాలంటే ఊరుకుంటాడా? అబ్బే... అస్సలు కాంప్రమైజ్ అవ్వడు. సొగసరి అత్తకి ఘాటైన రిప్లై ఇచ్చాడు గడసరి అల్లుడు. ఎలా అంటే.. స్క్రీన్పై చూడాల్సిందే. నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘శైలజారెడ్డిగారి అల్లుడు’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారని టాక్. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. రమ్యకృష్ణ అత్త క్యారెక్టర్ చేస్తున్నారని టాక్. రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన ఫస్ట్ షెడ్యూల్లో కథానాయిక ఇంట్లోని సీన్స్ను తెరకెక్కించారు. సినిమా స్టార్టింగ్లో హీరో, హీరోయిన్లలపై కాలేజీ అండ్ పార్క్ సీన్స్ను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈ నెల 19న స్టార్ట్ కానుందని సమాచారం. -
వీరప్పన్కు తొలి వెండితెర జవాబు
అడవిలోని బందిపోట్లు ఆలివ్ గ్రీన్ డ్రస్లో మెడకు తూటాల పట్టీ వేలాడ దీసుకుని బుర్ర మీసాలతో ఉంటారని వీరప్పన్ కథ వల్ల మనకు తెలిసింది. కాని అడవి బయట ఉండే బందిపోట్లు తెల్ల చొక్కా తెల్ల పంచె కట్టుకుని భుజాన కండువాతో వేదికలెక్కి ఉపన్యాసాలిస్తుంటారని కూడా వీరప్పన్ కథ మనకు చెప్పింది. వీరప్పన్ దోచుకుంది కొంత. బయట అతని వల్ల దోచుకోబడింది కొండంత. ప్రభుత్వానికి ప్రభుత్వమే విలన్ అయితే ఎటువంటి విలన్స్ ఉబికి వస్తారనడానికి కూడా వీరప్పన్ కథ ఒక ఉదాహరణే. వీరప్పన్ తన పదిహేడవ ఏట మొదటి హత్య చేశాడు. దంతాల కోసం ఏనుగులను చంపుతున్నప్పుడు వాటిని అంకుశంతో బెదిరించవచ్చని అతడు గ్రహించాడు. కాని ‘భయం’ అనే అంకుశం ధరిస్తే ఏ మనిషి అయినా బెదిరిపోక తప్పదని కూడా గ్రహించాడు. డబ్బు సులభంగా రాదని డబ్బుకు వాటాదారులు ఎక్కువని కూడా అతడికి తెలుసు. వ్యవస్థకు ఎదురెళ్లాలంటే వ్యవస్థను లొంగదీసుకోవాలని కూడా తెలుసు. రెండు రాష్ట్రాలు... కర్నాటక, తమిళనాడు... వాటి సరిహద్దుల్లో ఉన్న అడవుల్లో రెండు రాష్ట్రాల వ్యవస్థలను లొంగదీసుకుని సామ్రాజ్యాన్ని స్థాపించినవాడు వీరప్పన్. నిజాయితీ ఉన్న అధికారి తన ప్రథమ శత్రువు అని తలచినవాడు. తెలుగు ప్రజలకు ఏ మాత్రం సంబంధం లేని ఈ కథకు ఒక ఉత్తమ ఆఫీసర్ బలి కావడం వల్ల కూడా తెలుగువారికి వీరప్పన్ విలన్ అయ్యాడు. వీరప్పన్ను మొదటగా అరెస్ట్ చేసిన ఒకే ఒక ఆఫీసర్– తెలుగువాడు– పందిళ్లపల్లి శ్రీనివాస్– వీరప్పన్కు పీడకలగా అవతరించాడు. అతణ్ణి 1986లో ఫారెస్ట్ ఆఫీసులో బంధించి విచారణ జరుపుతుండగా వీరప్పన్ తప్పించుకున్నాడు. అయినా శ్రీనివాస్ అతణ్ణి వదల్లేదు. ఉక్కిరిబిక్కిరి అయిన వీరప్పన్ 1991లో లొంగిపోతున్నానని కబురు పంపాడు. నిరాయుధంగా వస్తే లొంగిపోతానని చెప్పాడు. శ్రీనివాస్ అది నమ్మి వెళ్లి వీరప్పన్ చేతిలో హతమయ్యాడు. బొమ్మ ఒక్కటే ఉండదు. బొరుసు కూడా ఒక్కలాగే ఉండవు. వీరప్పన్కు క్రూరమైన వ్యక్తిత్వం ఉన్నట్టే మానవీయమైన వ్యక్తిత్వం కూడా వెతికే వారు ఉన్నారు. అది కనిపించవచ్చు కూడా. అయినప్పటికీ అతడు సంఘవ్యతిరేక శక్తి. సంఘానికి బెడదగా మారిన వ్యక్తి. అలాంటి వారు చట్టాన్నే కాదు కళలను కూడా ఆకర్షిస్తారు. వీరప్పన్ను అలా మొదటిసారి ఒక కమర్షియల్ సినిమాలోకి పట్టుకొచ్చిన సినిమా ‘కెప్టెన్ ప్రభాకర్’. దర్శకుడు మణివణ్ణన్కు శిష్యుడైన ఆర్.కె. సెల్వమణి సమకాలీన ఘటనల నుంచి కథలను రాసుకోవడంలో సిద్ధహస్తుడు. అతడి తొలి సినిమా ‘పోలీస్ విచారణ’ మద్రాసులో సీరియల్ కిల్లర్గా ఖ్యాతి చెందిన ‘ఆటో శంకర్’ జీవితం ఆధారంగా రాసుకున్న కథ. పెద్ద హిట్ అయిన ఈ సినిమాకు హీరో విజయ్కాంత్. ఈ సినిమా హిట్ కావడంతో దానిని నిర్మించిన ఇబ్రాహీమ్ రౌతర్ తదుపరి సినిమా కూడా సెల్వమణికే ఇచ్చాడు. హీరోగా మళ్లీ విజయ్కాంత్నే తీసుకున్నాడు. ఈసారి సెల్వమణి అప్పుడు విస్తృతంగా వార్తల్లో ఉన్న వీరప్పన్ పాత్రను తీసుకుని ‘కెప్టెన్ ప్రభాకర్’ కథ రాసుకున్నాడు. సినిమాలో వీరప్పన్ పట్టుబడతాడు. కాని వీరప్పన్ కథ ముగియడానికి ఈ సినిమా రిలీజైన 13 ఏళ్లు పట్టింది. గంధపు చెట్లు నరకడం, ఏనుగు దంతాలు సేకరించడం అడవిలో కష్టం కాదు. వాటిని రవాణా చేయడమే కష్టం. లారీలు చీమలు కావు చాటుగా వెళ్లడానికి. భారీ లారీల్లో గంధపు చెక్కలు రవాణా కావాలంటే దారుల వెంట ఉన్న చెక్పోస్ట్లు ‘ధారాళంగా’ ఉండాలి. ఆఫీసర్లు ఉదారంగా ఉండాలి. వారిపై అజమాయిషీ చేసే ఆఫీసర్లు, వారిని పోస్ట్ చేసే మంత్రులు కూడా ఉదారంగా ఉండాలి. తద్వారా లాభాన్ని పంచుకోవాలి. ఈ వ్యవస్థ ఇలా స్థిరపడి ఉండటం ఈ సినిమాలో చూపిస్తాడు. వీరప్పన్కు మద్దతుగా సినిమాలో స్థానిక ఎం.ఎల్.ఏ, కలెక్టర్, పోలీస్ కమిషనర్ పని చేస్తుంటారు. విజయ్కాంత్ ఫారెస్ట్ ఆఫీసర్గా వచ్చేంతవరకు వీరప్పన్ ఊపుకు అడ్డే ఉండదు. విజయ్కాంత్ అతణ్ణి నిరోధించగలుగుతాడు. అయితే అడవిలో ఎక్కువ సేపు కథను నడపలేమని దర్శకునికి తెలుసు. అందుకే ఫస్టాఫ్లో సిటీలోనే కొంత కథను నడుపుతాడు. విజయ్కాంత్ పాత్రను గొప్పగా ఇంట్రడ్యూస్ చేస్తాడు. అలాగే వీరప్పన్ పాత్రను కూడా. అడవిలోని వాతావరణం, గ్రామాల ప్రజలు, వీరప్పన్ బంధువర్గంలో అతడికి ఉండే విరోధులు, వాళ్ల పాత పగలు... ఇవన్నీ సినిమాలో అంతర్భాగం అవుతాయి. విజయ్కాంత్ను కేవలం ఒక ఆఫీసర్గా మాత్రమే చూపకుండా గృహస్తునిగా, భార్యా బిడ్డలతో, తల్లితో అనుబంధం ఉన్నవాడిగా కూడా చూపడం వల్ల స్త్రీల ప్రమేయం ఉన్న కథగా కూడా మారి మహిళా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సాధారణంగా సినిమాల్లో విలన్ల జోలికి పోలీసాఫీసరైన హీరో వెళితే అతడి కుటుంబం కష్టాల్లో పడుతుంటుంది. అది జోకనుకుంటాం. కాని ఇక్కడ నిజంగానే వీరప్పన్తో పెట్టుకుంటే అందరికీ ప్రమాదం వస్తుంది. కిడ్నాప్లకు మారుపేరైన వీరప్పన్ ఈ సినిమాలో కూడా విజయ్కాంత్ భార్యాబిడ్డల్ని కిడ్నాప్ చేస్తాడు. వాళ్లను విడిపించుకోవడమే క్లయిమాక్స్. తీరా వీరప్పన్ను పట్టుకుని ప్రభుత్వానికి అప్పజెప్తున్న సమయంలో అతడి ద్వారా తమ రహస్యాలు బయటపడతాయనుకున్న పెద్దలు అతణ్ణి షూట్ చేసి చంపేస్తారు. విజయ్కాంత్ ఆ పెద్దలను కూడా చంపి కోర్టులో సుదీర్ఘ వాదన చేసి బయటపడతాడు. ఇది కొంత వాస్తవ దూరంగా ఉన్నా సినిమాగా చూస్తున్నప్పుడు సరే అని అనిపిస్తుంది. కెప్టెన్ ప్రభాకర్ పెద్ద తెర మీద చూడాల్సిన, జనం చూసి మెచ్చిన సినిమా. కథ వల్ల, నేప«థ్యం వల్ల, దర్శకుడి ప్రతిభ వల్ల కూడా ఈ సినిమా రక్తి కట్టింది. అన్నింటికీ మించి వీరప్పన్ అనే పాత్ర వల్ల ఇది ఆకర్షవంతమైంది.ఈ సినిమా తర్వాత వీరప్పన్ మీద అనేక సినిమాలు వచ్చాయి. కాని కెప్టెన్ ప్రభాకర్ మాత్రం ఆ సినిమాలన్నింటిలో కెప్టెన్లాంటిది. నిజాయితీ నిండిన పోలీసాఫీసర్లకు సెల్యూట్లాంటిది. సెల్యూట్. కెప్టెన్ ప్రభాకరన్ సెల్వమణి దర్శకత్వంలో 1991లో తమిళంలో విడుదలైన ‘కెప్టెన్ ప్రభాకరన్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తెలుగులో ‘కెప్టెన్ ప్రభాకర్’గా విడుదలై అంతే విజయం సాధించింది. ముఖ్యంగా బి, సి సెంటర్లలో హౌస్ఫుల్ కలెక్షన్లతో నడిచింది. అప్పట్లో తమిళపులి ‘ప్రభాకర్’కు తమిళనాట ఉన్న ఆదరణ కారణంగా హీరోకు ప్రభాకర్ అనే పేరు పెట్టారు. సాధారణంగా నూరో సినిమాలు అచ్చిరావనే అపప్రద తమిళంలో ఉంది. కానీ విజయ్కాంత్ నూరవ సినిమా అయిన ‘కెప్టెన్ ప్రభాకరన్’ బ్రహ్మాండమైన హిట్ అయ్యి విజయ్కాంత్కు ‘కెప్టెన్’ అనే ముద్దుపేరును సంపాదించి పెట్టింది. కేరళలోని ‘చాలకుడి’ ప్రాంతంలో అడవుల వెంట తీసిన ఈ సినిమా నిజంగానే గాఢమైన అడవుల్లో వీరప్పన్ కోసం వేట సాగిస్తున్నట్టుగా ఉంటుంది. ఈ సినిమాతో ‘మన్సూర్ అలీఖాన్’ విలన్గా తమిళంలో పెద్ద గుర్తింపు పొందాడు. రాజీవ్గాంధీ హత్య కేసు మీద ‘కుట్రపత్రికై’ తీసి సెన్సార్ కోరల్లో 14 ఏళ్ల పాటు చిక్కుకున్న సెల్వమణి కాలక్రమంలో ‘చామంతి’, ‘సమరం’ వంటి సినిమాలు తీసి నటి రోజా భర్తగా తెలుగువారి అల్లుడయ్యాడు. ఇక నటుడుగా, రాజకీయ నాయకునిగా విజయ్కాంత్ ప్రస్తుత పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. అతడికి మరో కెప్టెన్ ప్రభాకర్ అవసరం అయితే ఉంది. – కె -
కోఠిలో ‘శైలజారెడ్డి అల్లుడు’ సందడి..
సాక్షి, హైదరాబాద్: రారండోయ్ వేడుకచేద్దాం సినిమా విజయంతో దూసుకెళ్తున్న యంగ్ హీరో నాగచైతన్య, మహానుభావుడు సినిమా లాంటి సక్సెస్ తరువాత డైరెక్టర్ మారుతి కలయికలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ మూవీ షూటింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. గతంలో ‘కింగ్’ నాగార్జున హీరోగా వచ్చిన అల్లరి అల్లుడు సినిమాలా ఈ లేటెస్ట్ మూవీ ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఆ సినిమాలో నాగ్కు అత్తగా వాణీశ్రీ నటించగా, ‘శైలజారెడ్డి అల్లుడు’లో చైతూకి అత్తగా రమ్యకృష్ణ కనిపించనున్నారని సమాచారం. చైతుకు జోడిగా అను ఇమాన్యుయేల్ నటిస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కొన్ని కోఠి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. డైరెక్టర్ మారుతి నుంచి ఆశించే కామెడీ ఈ సినిమాలో ఉంటుందని చిత్రయూనిట్ తెలిపింది. తమిళ హీరో మాధవన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ (హిందీ మూవీ మున్నా మైఖేల్ ఫేం) టాలీవుడ్కు పరిచయం కాబోతోంది. ‘ప్రేమమ్’ ప్రొడ్యుసర్ నాగవంశీ నిర్మిస్తుండగా.. నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమాలో నటిస్తున్నాడు చైతూ. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. -
సెట్స్ మీదకు ‘శైలజా రెడ్డి అల్లుడు’
యంగ్ హీరో నాగచైతన్య, కామెడీ ఎంటర్టైనర్ల స్పెషలిస్ట్ మారుతి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. చాలా రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం దర్శకుడు మారుతి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫుల్ స్క్రిప్ట్తో రెడీ అయ్యాడు. ఈ నెల 19 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నామని తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సవ్యసాచి సినిమాలో నటిస్తున్నాడు చైతూ. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో మారుతి సినిమాను లైన్ లో పెట్టాడు. ఈ సినిమాకు శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. శైలజా రెడ్డిగా సీనియర్ నటి రమ్యకృష్ణ కనిపించనున్నారు. pic.twitter.com/Xddgx4rH1M — Maruthi Dasari (@DirectorMaruthi) 17 January 2018 pic.twitter.com/Vs1viqZQsJ — Maruthi Dasari (@DirectorMaruthi) 17 January 2018 -
నెల్లూరుది ప్రత్యేక స్థానం : హీరో సూర్య
సాక్షి, నెల్లూరు: చిత్ర పరిశ్రమలో నెల్లూరుది ప్రత్యేక స్థానమని సినీ నటుడు సూర్య పేర్కొన్నారు. నెల్లూరులోని ఎంజీబీమాల్కు గ్యాంగ్ చిత్ర బృందం విజయయాత్రలో భాగంగా మంగళవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా చిత్రం ప్రదర్శిమవుతున్న థియేటర్లోకి హీరో సూర్య, చిత్రం బృందం వెళ్లి ప్రేక్షకులతో మాట్లాడారు. ఈ క్రమంలో గ్యాంగ్ చిత్రాన్ని విజయవంతం చేసిందనందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరంటే తనకు ఎంతో ఇష్టమని, ఎంజీబీ మేనేజింగ్ డైరెక్టర్ గంగాధర్ ఇచ్చిన ఆహ్వానం సంతోషం కల్పించిందన్నారు. అనంతరం సూర్య విలేకరులతో మాట్లాడుతూ ఏడాది క్రితం నెల్లూరుకు వచ్చానన్నారు. గ్యాంగ్ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ ప్రాంతాల్లో ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు వస్తున్నాయని, నెల్లూరులో కూడా హౌస్ఫుల్ కలెక్షన్తో ప్రదర్శితమవుతోందని తెలిపారు. గ్యాంగ్ సినిమా తన జీవితంలో అత్యంత ముఖ్యమైందని, సంక్రాంతి బరిలో భారీ పోటి ఉన్నప్పటికీ ఈ చిత్రం విజయవంతమవడం సంతృప్తికరంగా ఉందన్నారు. మరో 10 రోజుల్లో రకుల్ప్రీత్సింగ్, సాయిపల్లవి కథానాయికలుగా కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. నెల్లూరు ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరణ మరువలేనిదన్నారు. సమావేశంలో ఎంజీబీ మేనేజింగ్ డైరెక్టర్ గంగాధర్, ఎస్2 నిర్వాహకుడు మాగుంట ఆదిత్యబాబు పాల్గొన్నారు. ఎంజీబీమాల్లో కోలాహలం హీరో సూర్య వస్తున్నారని తెలియడంతో ప్రేక్షకులు భారీగా ఎంజీబీమాల్కు చేరుకున్నారు. ఒంటి గంటకు రావాల్సిన సూర్య గంటన్నర ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రేక్షకులు వేచిచూశారు. దీంతో ఆ ప్రాంతంలో అరుపులు, ఈలలతో కోలాహలం నెలకొంది. అనంతరం సూర్య రాగానే నాలుగో అంతస్తుకు చేరుకుని ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఓ అభిమాని సూర్యతో సెల్ఫీ దిగేందుకు యత్నించగా బౌన్సర్లు అతడిని తోసేసే ప్రయత్నం చేశారు. అయితే దీన్ని గమనించిన సూర్య ఆ వ్యక్తితో సెల్ఫీ దిగడం గమనార్హం. -
ఆంధ్రా మీల్స్ చాలా కారం కానీ..
‘‘సూర్యతో నాకు ‘గజిని’ సినిమా నుంచి అనుబంధం కొనసాగుతోంది. మా కాంబినేషన్లో సినిమా చేయాలని ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నాం కానీ కుదరడంలేదు. త్వరలో అవుతుందనుకుంటున్నాను. కీర్తీ సురేష్ నా స్నేహితుడి కూతురు. రమ్యకృష్ణ నా హీరోయిన్. నేను నిర్మించిన సినిమాల్లో యాక్ట్ చేశారు. తమిళంలో జ్ఞానవేల్ రాజాగారిది పెద్ద బ్యానర్. వంశీకు సినిమా అంటే పిచ్చి. సినిమా తీసి, అమ్ముకొని డబ్బులు చేసుకొని వెళ్లిపోయేవాళ్లు చాలామంది ఉన్నారు కానీ నిలబడి తీసి, దమ్ముతో ఆడించే తక్కువమందిలో వంశీ ఒకడు. అందుకే తనంటే నాకు ఇష్టం. సినిమాకు వర్క్ చేసిన అందరికీ నా అభినందనలు’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. సూర్య, కీర్తీ సురేష్ జంటగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ‘తానా సేంద కూట్టమ్’ చిత్రాన్ని తెలుగులో యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్లు ‘గ్యాంగ్’ పేరుతో రిలీజ చేస్తున్నారు. అనిరుద్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ప్రీ–రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్లో జరిగింది. సూర్య మాట్లాడుతూ– ‘‘మన స్కూల్లో, కాలేజ్లో, ఆఫీస్లో ఇలా ప్రతి చోటా మనకు ఒక గ్యాంగ్ ఉంటుంది. గ్యాంగ్ మన లైఫ్లో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాతో యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ మా గ్యాంగ్లో మెంబర్స్ అయ్యారు. అల్లు అరవింద్గారు ‘గజిని’ సినిమా నుంచి మా గ్యాంగ్లో ఉన్నారు. ఈ సినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. తమిళ ఫ్లేవర్ కనిపిస్తే క్షమించండి. కుటుంబం అంతా చూసే చిత్రం అవుతుంది’’ అన్నారు. ‘‘ఆంధ్రా మీల్స్ చాలా కారం, కానీ.. సినిమాపై మీ (ప్రేక్షకులు) ప్రేమ అపారం. అందరూ గ్యాంగ్గా వచ్చి ఈ సినిమాను చూడండి’’ అన్నారు దర్శకుడు. ఈ వేడుకలో దర్శకుడు మారుతి, నటి రమ్యకృష్ణ, కథానాయిక కీర్తీ సురేష్ పాల్గొన్నారు. -
‘గ్యాంగ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్
-
మరోసారి శివగామిగా...
కథానాయికగా రమ్యకృష్ణ ఎన్ని సినిమాలు చేసినా.. ఆమె పేరు చెప్పగానే ‘నరసింహ’ సినిమాలోని నీలాంబరి పాత్ర గుర్తుకురాక మానదు. ‘బాహుబలి’ సినిమా విడుదల తర్వాత అందరూ ఆమెను ‘శివగామి’ అంటున్నారు. మరోసారి శివగామిగా ఆమె వెండితెరపై సందడి చేయనున్నారు. అంటే.. ‘బాహుబలి 3’ ఏమైనా తీయనున్నారా? అనే అనుమానం రాకమానదు. రమ్య మరోసారి శివగామిగా అలరించనున్నది తెలుగువారిని కాదు. కన్నడ ప్రేక్షకులను. అసలు విషయానికొస్తే... రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో 9వ శతాబ్దానికి చెందిన రాణి శివగామి కథాంశంతో కన్నడంలో ఓ సినిమా రూపొందనుందట. దర్శకుడు మధు ఈ చారిత్రాత్మక సినిమాని తెరకెక్కించనున్నారట. ఇప్పటికే కథ–స్క్రీన్ప్లే పూర్తి చేసుకున్న ఆయన రమ్యకృష్ణకు వినిపించారట. పవర్ఫుల్ రాణి పాత్ర కావడంతో ఆమె నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కొత్త సంవత్సరంలో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుందని టాక్. -
మరో పవర్ఫుల్ పాత్రలో శివగామి
బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిన రమ్యకృష్ణ, మరో ఆసక్తికరమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నారా రోహిత్, రెజినా జంటగా పవన్ మల్లెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రమ్యకృష్ణ రాజకీయనాయకురాలి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి సినిమాలో శివగామి పాత్ర ఎంత కీలకమో ఈ సినిమాకు రమ్యకృష్ణ పాత్ర అంతేకీలకమంటున్నారు చిత్రయూనిట్. ముఖ్యంగా నారా రోహిత్, రమ్యకృష్ణల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్న నమ్మకంతో ఉన్నారు. నారా రోహిత్ పుట్టిన రోజైన జూలై 25న ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
అది నా తప్పే.. చింతిస్తున్నాను: రాజమౌళి
ముంబై: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో అందరికి తెలిసిన విషయమే. చిత్రంలోని ఒక్కొక్క పాత్రకు ఊపిరిపోసిన నటీనటులపై కూడా ప్రశంసల జల్లు కురిశాయి. అలాంటి పాత్రల్లో ముఖ్యమైనది శివగామి. అయితే ఈ పాత్రకు తొలుత శ్రీదేవిని తీసుకోవాలని రాజమౌళి భావించిన సంగతి తెలిసిందే. ఆమె పలు డిమాండ్లు చేయడంతో రమ్యకృష్ణను తీసుకున్నామని ఓ సందర్భంలో రాజమౌళి వ్యాఖ్యానించారు. దీనిపై తన తాజా చిత్రం ‘మామ్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి స్పందించారు. తానేమీ ప్రత్యేకమైన డిమాండ్లు చేయలేదంటూ చెప్పుకొచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై ఓ ఇంటర్వూలో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. జరిగిన దానికి చింతిస్తున్నట్లు చెప్పారని ఆంగ్ల వెబ్సైట్ ఒకటి పేర్కొంది. అయితే ఇంటర్వూలో ఏ మీడియా సంస్ధ తీసుకుందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. ఆ అంశాన్ని బహిరంగ వేదికపై బయటపెట్టకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అది తప్పేనని.. దానికి తాను చింతిస్తున్నానని పేర్కొన్నారు. నటి శ్రీదేవి అంటే తనకు అపారమైన గౌరవముందని చెప్పారు. ‘మామ్’ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి మాట్లాడుతూ.. రాజమౌళి అలా అన్నారంటే తాను నమ్మలేకపోతున్నానని.. వాస్తవానికి తాను బాహుబలి చిత్రానికి ఎలాంటి డిమాండ్లు చేయలేదని చెప్పారు. ‘బాహుబలి’ గతమని.. దానిపై ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని.. తాను గతంలోనూ ఎన్నో పాత్రలు వద్దనుకున్నానని ఆమె పేర్కొన్న విషయం తెలిసిందే. -
మాహిష్మతిని వీడిన శివగామి ఇలా..
చిన్నారి మహేంద్ర బాహుబలిని కాపాడే క్రమంలో మాహిష్మతిని వీడిన శివగామి.. నదిలోనే ప్రాణాలు విడిచినట్లు సినిమాలో చూస్తాం. అయితే, నిజంగానే శివగామి చనిపోతుందా? లేక తిరిగొస్తుందా? ట్విస్టులతో కూడిన రాజమౌళి సినిమాలు చూశాక ప్రేక్షకులకు ఇలాంటి సందేహాలురాక మానవు! సాక్ష్యం కావాలంటే రమ్యకృష్ణ కొత్త సినిమా ‘మాతంగి’ ట్రైలర్పై నెటిజన్ల కామెంట్లు చూడొచ్చు! ‘మాహిష్మతి నుంచి వెళ్లిపోయిన శివగామి.. మళ్లీ మాతంగిగా వచ్చింది..’ అని కొందరు, ‘ఆవిడ(రమ్య) ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలర’ని ఇంకొందరు వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ప్రేక్షకుల్లో బాహుబలి ఫీవర్ చల్లారకముందే.. రమ్యకృష్ణ నటించిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కూతురి సెంటిమెంట్తోపాటు క్షుద్రశక్తులతో పోరాటాన్ని ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన ‘మాతంగి’లో రమ్య లీడ్రోల్ పోశించింది. సీనియర్ నటుడు జయరాం హీరోగా, కన్నం తమరక్కుళం దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన ఈ సినిమాలో మిర్చి సంపత్, అక్షర కిషోర్, ఏంజిలీనా అబ్రహామ్లతోపాటు దివంగత ఓమ్పురిలు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. తెలుగు డబ్బింగ్కు వెన్నలకంటి మాటలు రాశారు. జూన్లో విడుదలకానున్న ‘మాతంగి’ ట్రైలర్ శనివారం విడుదలైంది.. -
మాహిష్మతిని వీడిన శివగామి ఇలా..
-
మొన్న శివగామి... ఇప్పుడు మాతంగి
‘బాహుబలి–2’లో రాజమాత శివగామిగా రమ్యకృష్ణ తప్ప మరో నటి సాటి రాలేరనే స్థాయిలో ఆమె నటనపరంగా విజృంభించారు. ఇప్పుడు మరో సినిమాలో రమ్యకృష్ణ నట విశ్వరూపాన్ని చూడబోతున్నాం. మలయాళంలో ఆమె నటించిన ఓ చిత్రం ‘మాతంగి’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. కన్నన్ తమరక్కులమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీని రమ్యకృష్ణ సోదరి వినయ్కృష్ణన్ తెలుగులోకి అనువదించారు. సోదరితో వెయ్యి ఎపిసోడ్స్ ‘వంశం’ సీరియల్ నిర్మించిన వినయ్కృష్ణన్ ఆ అనుభవంతో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. జూన్లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘మాతంగిగా రమ్యకృష్ణ అద్భుతంగా నటించారు. మదర్ సెంటిమెంట్తో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో ఘన విజయం సాధించింది. రితేష్ అందించిన నేపథ్య సంగీతం హైలైట్ అవుతుంది’’ అని వినయ్కృష్ణన్ తెలిపారు. -
నీలాంబరి టు... శివగామి
రమ్యకృష్ణ సినిమా కెరీర్లో మొదటి ఏడేళ్లు అన్నీ ఫట్లే! కుంగిపోలా... లోయలో పడిపోలా... సముద్రంలో మునిగిపోలా తనలో తను లీనమైపోయింది... తనకి తాను చెప్పుకుంది... తన కోసం తను నిలబడింది తన చెయ్యి తనే పట్టుకుని పర్వతం ఎక్కింది ఒక శిఖరం నీలాంబరి... ఒక శిఖరం శివగామి ఈ మధ్యలో అన్నీ శిఖరాగ్రాలే అయినా తలెగరేసినవి ఈ రెండే. 20 ఏళ్ల క్రితం నీలాంబరి అన్నా.. ఇప్పుడు శివగామి అన్నా మీరే చేయాలన్నంత గొప్ప నటి అనిపించుకున్నారు.. (నవ్వుతూ). ఇన్నేళ్ల కెరీర్లో ఏ పాత్ర వచ్చినా అన్నీ బాగా కుదిరాయి. అప్పట్లో నీలాంబరి.. ఇప్పుడు శివగామి రెండూ మంచి పాత్రలే. నాకు వచ్చిన ఏ పాత్రని అయినా నేను హండ్రెడ్ పర్సంట్ డెడికేషన్తో చేస్తాను. ‘బాహుబలి’కి మీరే హీరో అని సోషల్ మీడియా ద్వారా మీకు చాలా మెసేజ్లు వచ్చినప్పుడు ఏమనిపించింది? నాకైతే మాటల్లో ఎలా చెప్పాలో తెలియడంలేదు. నా ప్లేస్లో ఎవరు ఉన్నా హ్యాపీ ఫీలవుతారు. యాక్చువల్లీ నాకు ఏ క్యారెక్టర్ వస్తే అది చేసుకుంటూ వచ్చాను. నాకు సూట్ అయ్యే రోల్స్తోనే డైరెక్టర్స్ ఎప్రోచ్ అవుతారని నా నమ్మకం. అందుకే దాదాపు ఏ పాత్రకీ ‘నో’ చెప్పను. ‘బాహుబలి’కి అవకాశం రావడం నా లక్. లక్ని, దేవుణ్నీ నమ్ముతారా? లక్ని, దేవుణ్ణీ నమ్ముతా. నా టైమ్ ఆర్టిస్ట్లకి ఇలాంటి అవకాశాలు రావడం అరుదు. నాకు వచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. నేను సాయిబాబా భక్తురాల్ని. సాయిబాబా అంటే ఎప్పటి నుంచీ నమ్మకం.. ఆ నమ్మకం పెరగడానికి ఏదైనా సంఘటనలున్నాయా? కొన్ని అద్భుతాలు జరిగాయి. అవి పూర్తిగా పర్సనల్. ఎప్పటినుంచి నమ్మడం మొదలుపెట్టానో అప్పటి నుంచి నా కెరీర్ బాగుంటోంది. మీకు తెలిసే ఉంటుంది.. హీరోయిన్గా నాకో మంచి హిట్ రావడానికి ఏడేళ్లు పట్టిందని. ఆ ఏడేళ్లల్లో మిమ్మల్ని ‘ఐరన్ లెగ్’ అన్నవాళ్లూ ఉన్నారు. ఆ ట్యాగ్ని ఎలా తట్టుకోగలిగారు? అప్పట్లో ఏ సినిమా వచ్చినా కాదనకుండా చేశా. ఏడేళ్లు సక్సెస్లు లేవు. విమర్శలు ఎదుర్కొన్నా. అప్పుడప్పుడూ కాన్ఫిడెన్స్ తగ్గేది. ఆ సమయంలో ‘మనకు మనమే ధైర్యం చెప్పుకోకపోతే ఎలా?’ అనుకునేదాన్ని. కాన్ఫిడెన్స్ తెచ్చుకునేదాన్ని. చివరికి రాఘవేంద్రరావుగారి వల్ల నాకో హిట్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి ‘శివగామి’ దాకా నా కెరీర్ సక్సెస్ఫుల్గా సాగిందంటే ఆయనే కారణం. లైఫ్లో చిన్నపాటి ఫెయిల్యూర్స్కే డిప్రెషన్లోకి వెళ్లిపోతున్న వాళ్లకు మీరు కచ్చితంగా రోల్ మోడల్ అనాలి... రోల్ మోడల్గా తీసుకోమని అనను కానీ లైఫ్లో ఎవరైనా సరే డౌన్ఫాల్లో ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మనకు మనం అది చేసుకోలేకపోతే ఎవరు చేస్తారు? నా విషయాన్ని తీసుకుందాం. నేను విధిని నమ్ముతా. ఏ ఛాన్స్ వచ్చినా కాదనుకుండా చేశా. కంటిన్యూస్గా ఫెయిల్యూర్స్ వచ్చినా డెడికేషన్ తగ్గలేదు. ఒక పాత్రకు న్యాయం చేయడానికి ఎంత కష్టపడాలో అంతా పడ్డాను. ఫైనల్లీ నాకు మంచే జరిగింది. కాకపోతే కొంచెం లేట్ అయింది. అంతవరకూ ఓపిక పట్టాలి. గ్లామరస్ క్యారెక్టర్స్ చేసి మెప్పించారు.. అమ్మవారి పాత్రలూ చేయడం గొప్ప విషయం.. ‘ఒక పక్క గ్లామరస్ క్యారెక్టర్స్ చేస్తూ మరోపక్క అమ్మవారి పాత్రలా?’ అని కొంతమంది అన్నారు. కానీ, నేను పట్టించుకోలేదు. ఏ పాత్రని అయినా నేను డెడికేషన్తో చేయగలనని నాకు తెలుసు. అదే నాకు అడ్వాంటేజ్ అయింది. ఏ పాత్ర చేసినా నమ్మకంతో చేస్తాను. అది కమర్షియల్ రోల్స్ అయినా ట్రెడిషనల్ క్యారెక్టర్స్ అయినా.. దేవుడి సినిమాలైనా. ఇలా అన్నీ చేయడం నాకు అడ్వాంటేజ్ అయింది. సమాజ ధోరణి చూస్తుంటే.. మీ ‘కంటే కూతుర్నే కను’ గురించి మాట్లాడాలనిపిస్తోంది.. ఇప్పుడు కొంతమంది ఆడపి ల్లను భూమ్మీదకు రాకముందే అంతం చేయడమో లేకపోతే వచ్చాక చెత్తకుండీలో పడేయడమో చేస్తున్నారు... ‘కంటే కూతుర్నే కను’ మంచి సినిమా. ప్రేరణగా తీసుకోవాల్సిన మూవీ. మీరన్నట్లు ఆడపిల్లకు ఆదరణ లేకుండా పోతోంది. నాకు తెలిసినంతవరకూ అమ్మాయిలే కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. అమ్మానాన్నలను, అక్కచెల్లెళ్లను, భర్తను.. మొత్తం కుటుంబాన్ని చూసుకుంటారు. బాధ్యతగా ఉంటారు. అబ్బాయిలు అంత బాధ్యతగా ఉండరని నా ఫీలింగ్. మరి.. కొంతమంది తల్లిదండ్రులు అమ్మాయిలు వద్దని ఎందుకనుకుంటున్నారో? సమాజంలో ఆడవాళ్లు నెగ్గుకు రావడం అంత ఈజీ కాదేమో.. ఉదాహరణకు సినిమా పరిశ్రమలో కెరీర్ స్మూత్గా సాగాలంటే ‘అడ్జస్ట్మెంట్’ అనే మెలిక పెడతారని ఈ మధ్య కొంతమంది హీరోయిన్లు బహిరంగంగానే అన్నారు... అన్నవాళ్లే దీనికి సమాధానం చెప్పగలుగుతారు. ఆడవాళ్లకు ఇబ్బందులు లేనిదెక్కడ? ఒక్కో చోట ఎక్కువ సమస్యలు.. ఒక్కోచోట తక్కువ. వేరే ఫీల్డ్లో కూడా ‘అడ్జస్ట్మెంట్’ అనేది ఉంటుందేమో. కానీ, అడ్జస్ట్ అవ్వాలా? వద్దా? అనే నిర్ణయం ఎవరికి వాళ్లు తీసుకోవాలి. తప్పదు.. కెరీర్లో ముందుకెళ్లాలనుకున్నవాళ్లు అడ్జస్ట్ అవుతారు. వద్దనుకున్నవాళ్లు ‘నేనిలాగే ఉంటాను’ అని అడ్జస్ట్ అవ్వ రు. వాళ్ల వాళ్ల మైండ్సెట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ‘రైట్ రాయల్’గా బతికే పరిస్థితి ‘ఉమెన్’కి ఉండదా? సొసైటీ మేల్ డామినేటెడ్ అండి. ఎక్కడైనా ఒక మగాణ్ణి.. స్త్రీ రేప్ చేసిందనే వార్త వింటామా? వినం కదా. మేల్ డామినేటెడ్ ప్రపంచంలో ఎలా నెగ్గుకు రావాలనేది మన తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ‘మీరిలా తెలివిగా ఉండాలి. ఇలా చేస్తే నెగ్గుకు రావచ్చు’ అని సలహాలివ్వలేను. ఎందుకంటే, ఫేస్ చేసే సిట్యుయేషన్ బట్టి నిర్ణయాలు ఉండాలి. ఏది రైట్ అనిపిస్తే అది చేయాలి. అది కొందరికి తప్పు అనిపించవచ్చు. కానీ, మన నిర్ణయాలు తీసుకునే హక్కు మనకుంటుంది కదా. లైంగిక వేధింపుల గురించి విన్నప్పుడు మీకేమనిపిస్తుంది.. నిర్భయలాంటివి? జరగకూడనివి జరుగుతున్నాయి. అవి విన్నప్పుడు, టీవీల్లో చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది. శిక్ష కఠినంగా ఉండాలి. ఆ శిక్ష చూసి, తప్పు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలి. నేరానికి తగ్గట్టుగా అప్పటికప్పుడు చట్టంలో మార్పు చేసి, శిక్ష అమలు చేయాలి. ఇలా చేయడం వల్ల దాడులు ఆగుతాయనడంలేదు. కాకపోతే సగం అయినా తగ్గుతాయని నా బలమైన నమ్మకం. నిర్భయ ఘటన తీర్పు నేరగాళ్లకు మంచి హెచ్చరిక. అనుకోకుండా మంచి పాత్రలు కుదిరాయన్నారు. విచిత్రంగా మీ భర్త పేరు, మీ పేరు (‘రమ్యకృష్ణవంశీ’) కూడా భలే కుదిరింది.. లవ్ని ఎవరు ప్రపోజ్ చేశారండి.. (నవ్వుతూ).. నిజమే.. పేరు భలే కుదిరింది. పర్టిక్యులర్గా ప్రపోజల్ అంటూ ఏమీ చేయలేదు. పెళ్లికి ఏడెనిమిదేళ్ల ముందు నుంచీ పరిచయం. ఆ ట్రావెల్లో ఒకర్నొకరు అర్థం చేసుకున్నాం. పెళ్లి చేసుకుంటే బాగుందనుకున్నాం. కంఫర్టబుల్గా సెటిలయ్యాం. ∙ కృష్ణవంశీగారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ‘ఆవిడ ఏంజిల్’ అని మీ గురించి అన్నారు. ఆయన గురించి మీరేమంటారు? ఐయామ్ లక్కీ. కృష్ణవంశీగారిని పెళ్లి చేసుకున్నందుకు బాధపడిన సందర్భం ఒక్కటీ లేదు. నా కెరీర్ కోసం నేను చెన్నైలో ఉంటున్నాను. ఆయన హైదరాబాద్లో ఉంటారు. ‘నువ్వు అక్కడ ఉండటానికి వీల్లేదు’ అని ఉంటే, నేనేం చేయలేను. కానీ, ఆయన ‘వర్క్ ఓరియంటెడ్’. వర్క్ విలువ తెలుసు కాబట్టి, నేను హ్యాపీగా కెరీర్ కంటిన్యూ చేయగలుగుతున్నాను. ఇంత ఫ్రీడమ్ ఎవరిస్తారు చెప్పండి? ఆడవాళ్లంటే ఆయనకు గౌరవం ఎక్కువ. ఎంకరేజ్ చేస్తారు. ‘హీ ఈజ్ సో ప్రౌడ్ ఆఫ్ మి’. భర్త రూపంలో ఉన్న మంచి స్నేహితుడు ఆయన. చెన్నైలో మీరు.. హైదరాబాద్లో కృష్ణవంశీగారు... మిస్ అవుతున్నట్లుగా అనిపించదా? అలాంటిదేం లేదు. మేం చెట్లు చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకునే ఏజ్లో లేం. మెచ్యుర్డ్ పీపుల్. దూరంగా ఉన్నంత మాత్రాన దూరమైపోతామని కాదు. ఫోన్లో మాట్లాడుకుంటాం. కష్టసుఖాలు చెప్పుకుంటాం. వీలునప్పుడు ఆయన చెన్నై, నేను హైదరాబాద్ వస్తుంటాం. అప్పుడు కూడా ఎవరో ఒకరం వర్క్తో బిజీగా ఉంటాం. దాంతో దగ్గరగా ఉన్నా కూడా లేనట్లే ఉంటుంది. అందుకే వెకేషన్ ప్లాన్ చేసుకుని, ‘మా కోసమే మేం’ అన్నంతగా టైమ్ స్పెండ్ చేస్తాం. వంట చేసే టైమ్ మీకుంటుందా? మీరు వండిన వంటల్లో కృష్ణవంశీగారికి ఏవి ఇష్టం? రెండు రోజులకు మించి నేను బయట ఫుడ్ తినలేను. ఇంట్లో వండినది కావాల్సిందే. కొన్ని కూరలు వచ్చు. ఆయనెప్పుడూ వంక పెట్టలేదు. వేరే దారి లేక తింటారో... నచ్చే తింటారో కానీ తినేస్తారు (నవ్వేస్తూ). హిట్టూ ఫ్లాప్స్ గురించి చర్చిస్తారా? డిస్కస్ చేసుకుంటాం. కానీ, ఏం చేయాలనేది ఆయన డెసిషనే. డైరెక్టర్గా తనకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అది చేయాలి. వేరేవాళ్ల నిర్ణయాల మీద ఆధారపడకూడదు. ఫైనల్లీ... టీనేజ్లో స్టార్ట్ అయిన మీ కెరీర్ వయసు 30 ఏళ్ల పైనే. ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలనిపించలేదా? అప్పుడప్పుడూ అనిపిస్తుంది. సరిగ్గా ఆ టైమ్కి ఎవరో ఒకరు వచ్చి అడగడం, సినిమా ఒప్పుకోవడం జరిగిపోతోంది. అందుకని రిలాక్స్కి ఛాన్స్ లేదు. అయినా ఫర్వాలేదు. ‘ఐయామ్ ఎంజాయింగ్ మై వర్క్’. శివగామి పాత్ర గురించి రాజమౌళి గారు చెప్పినప్పుడు... గొప్ప క్యారెక్టర్ అనిపించింది. అయితే ఇంత పెద్ద పేరు వస్తుందని మాత్రం ఊహించలేదు. ‘బాహుబలి’ ఇంత పెద్ద సినిమా అవుతుందని కూడా అనుకోలేదు. సౌత్, నార్త్.. ఇలా అన్ని చోట్లా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇలాంటి సినిమాల్లో చేసే అవకాశం లైఫ్లో ఒక్కసారే వస్తుంది. ఆ ఛాన్స్ అందరికీ రాదు. మీ అందం కొంచెం కూడా తగ్గలేదు.. ఏం చేస్తుంటారేంటి? మా అమ్మా నాన్న అందంగా ఉంటారు. వాళ్ల జీన్స్ నాకొచ్చింది. జనరల్గా నేనెక్కువ స్ట్రెస్ అవను. ఆల్మోస్ట్ సంతోషంగా ఉంటాను. పీస్ఫుల్గా ఉంటాను. మనసు బాగుంటే పైకి కూడా బాగుంటాం. ఎక్సర్సైజులు చేయను. వాకింగ్ చేస్తాను. అంతే. ఇప్పుడు ఒక్క సినిమా చేస్తే బోల్డంత పాపులార్టీ.. పారితోషికం. సో ఇప్పటి తరం హీరోయిన్ అయ్యుంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా? ఒకట్రెండు సినిమాలకే చాలా పాపులార్టీ వస్తోందన్నది నిజమే. కానీ, ఈ తరం హీరోయిన్ అయ్యుంటే బాగుండేదనుకోవడంలేదు. ఎందుకంటే, మాకు వచ్చినన్ని.. ముఖ్యంగా నాకు వచ్చినన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు బహుశా ఇప్పుడు రావేమో. కెరీర్ వైజ్గా నాకెలాంటి అసంతృప్తీ లేదు. మంచి మంచి పాత్రలు చేశాను. అప్పుడు ఎలా కుదిరాయో ఇప్పుడూ అలానే మంచి పాత్రలు కుదురుతున్నాయి. పాలిటిక్స్ వైపు ఎప్పుడైనా దృష్టి మళ్లిందా? ఏది జరగాలని ఉంటే అది జరుగుతుందన్నది నా ఒపీనియన్. ఒకవేళ రాజకీయాల్లోకి రావాలని రాసి పెట్టి ఉంటే వచ్చేస్తానేమో. ఒకటి మాత్రం చెప్పగలను. రాజకీయాల్లోకి రాకుండా కూడా మంచి పనులు చేయొచ్చు. ఒకవేళ నేను రావడం ద్వారా ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుందని రాసి పెట్టి ఉంటే.. వస్తానేమో. డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? లేదండి. నీలాంబరి కానీ, శివగామి కానీ నేను ఊహించలేదు. ఆ మాటకొస్తే ఇప్పటివరకూ నాకు ఫలానా రోల్ వస్తే బాగుంటుందని ఎప్పుడూ ఆలోచించలేదు. ఏది కుదిరితే అది చేశా. ‘బాహుబలి’కి ఛాన్స్ రావడం నా లక్. మీకు ఒకే ఒక్క కొడుకు.. ఆడపిల్ల లేదని ఫీలయ్యారా? ఆడపిల్ల పుడితే బాగుంటుందనుకున్నాను. కానీ, కొడుకు పుట్టాడు. ‘ఐయామ్ ఓకే విత్ హిమ్’. మీ అబ్బాయి రుత్విక్ని హీరోని చేస్తారా? లేక డైరెక్టరా? ఇప్పుడు వాడు సిక్త్స్ క్లాస్ చదువుతున్నాడు. కెరీర్ని డిసైడ్ చేయడానికి ఇది టూ ఎర్లీ అవుతుంది. పెద్దయ్యాక రుత్విక్ ఏమవ్వాలనుకుంటే అదే. 150 సినిమాలకు పైగా చేశారు కదా.. ఆ అనుభవంతో డైరెక్షన్ చేస్తారా? డైరెక్షన్కి చాలా ఓపిక కావాలి. బేసిక్గా నేను బద్ధకస్తురాల్ని. అందుకని దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. – డి.జి. భవాని భర్త కృష్ణవంశీ, తండ్రి బీవీ కృష్ణయ్య, చెల్లెలు వినయ, కొడుకు రుత్విక్తో... -
శివగామితో కట్టప్ప రొమాన్స్.. ఫ్యాన్స్ షాక్!
-
శివగామితో కట్టప్ప రొమాన్స్.. ఫ్యాన్స్ షాక్!
చెన్నై: రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి-2 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. మాహిష్మతి సామ్రాజ్యం రాజమాత శివగామి పాత్రల్లో నటించిన రమ్యకృష్ణకు హీరోల స్థాయిలో పేరు వచ్చింది. ఇక రాణికి విశ్వాసపాత్రుడిగా, బానిసగా కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్కు కూడా మంచి మార్కులు పడ్డాయి. కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాడని ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రేక్షకులకు సమాధానం దొరికింది. అయితే థియేటర్లలో ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మరో కొత్త ట్విస్ట్ ఎదురైంది..! సినిమా విరామంలో స్నాక్స్, డ్రింక్స్ తీసుకుని థియేటర్లలోకి వచ్చిన ప్రేక్షకులు తెరపై కనిపిస్తున్న దృశ్యం చూసి షాకయ్యారు. శివగామి (రమ్యకృష్ణ) పక్కన కట్టప్ప (సత్యరాజ్) కూర్చుని రొమాన్స్ చేస్తూ కనిపించాడు. ఇదేంటి రాజమాతతో బానిస ఇంత చనువుగా ఉండటం ఏంటి? అంటూ ప్రేక్షకులు అయోమయానికి గురయ్యారు. కాసేపు ఏమీ అర్థం కాలేదు. కట్టప్ప ఓ చీరను శివగామికి కానుకగా ఇవ్వగా ఆమె తీసుకుని మురిసిపోతోంది. ప్రేక్షకులు అయోమయంలో ఉండగానే ఇది పోతిస్ యాడ్ అంటూ తెరపై కనిపిస్తుంది. ఇది వ్యాపార ప్రకటన అని తెలిశాక ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. దేశ వ్యాప్తంగా బాహుబలికి ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి పాపులర్ టెక్స్టైల్ బ్రాండ్ కోసం రమ్యకృష్ణ, సత్యరాజ్లతో యాడ్ రూపొందించారు. ఇందులో వీరిద్దరూ రాజు, రాణిగా కనిపిస్తారు. రమకృష్ణ బాహుబలి సినిమాలో మాదిరిగా అదే వేషధారణతో కనిపించగా, సత్యరాజ్ మాత్రం ఈ సినిమాలో పాత్రకు భిన్నంగా బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు ధరించి రాచఠీవిలో కనిపిస్తాడు. మొత్తానికి ఈ యాడ్ చూసిన ప్రేక్షకులు అయోమయానికి గురికావడంతో పాటు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
ఉద్వేగానికి గురైన శివగామి
హైదరాబాద్: జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న బాహుబలి 2 సినిమాలో శివగామి దేవి పాత్రలో రమ్యకృష్ణ సత్తాచాటింది. ఈ సినిమాలో ప్రభాస్, రానా, సత్యరాజ్లతో పాటు రమ్యకృష్ణ నటనకు ప్రశంసలు వస్తున్నాయి. రమ్యకృష్ణకు ఫోన్ కాల్స్, మెసేజ్, సోషల్ మీడియా ద్వారా అభినందనలు వెల్లువెత్తున్నాయి. బాహుబలి 2లో తన పాత్రకు వస్తున్న స్పందన, ప్రశంసలు చూసి ఆమె ఉద్వేగానికి గురైంది. తనకు అభినందనలు తెలిపినవారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. 'అభిమానులకు ధన్యవాదాలు. ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా మెసేజ్లు, ఫోన్ కాల్స్ చేసి అభినందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీరు నాపై చూపుతున్న ప్రేమాభిమానాలు, మద్దతు వల్లే ఈ రోజు ఈ స్థానంలో ఉన్నా. లేకుంటే ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. నాకు చాలా సంతోషంగా, ఉద్వేగంగా ఉంది. జై మహిష్మతి' అంటూ రమ్యకృష్ణ ట్వీట్ చేసింది. ఆమె కెరీర్లో పేరు తెచ్చిన పాత్రల్లో బాహుబలిలోని 'శివగామి' ఒకటి. ఈ సినిమాలో రమ్య నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. -
ఫ్యాన్స్కు శివగామి థ్యాంక్స్
శుక్రవారం రిలీజ్ అయిన బాహుబలి 2 సక్సెస్లో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటి రమ్యకృష్ణ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. సినిమాలో రాజమాత శివగామి దేవిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న రమ్యకృష్ణ, తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది. ' ట్విట్టర్, ఫేస్ బుక్ పేజ్లతో పాటు ఫోన్ చేసి, మేసేజ్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ నా కృతజ్ఞతలు. ఈ రోజు నేను ఉన్న ఈ పొజిషన్కు మీ ప్రేమ, ఆదరణే కారణం. జై మాహిష్మతి' అంటూ ట్వీట్ చేసింది రమ్యకృష్ణ. ఈ శుక్రవారం రిలీజ్ అయిన బాహుబలి 2 సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్ లను చెరిపేస్తూ ఇప్పటికే 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఓవర్ సీస్ లోనూ సత్తా చాటుతున్న బాహుబలి ఫుల్ రన్ లో 1000 కోట్ల వసూళ్ల సాధించటం కాయంగా కనిపిస్తోంది. I thank each and everyone who have taken the effort to call me, message me and wish me through my FB page and twitter a BIG THANK YOU.... — Ramya Krishnan (@meramyakrishnan) 29 April 2017 Love you all...without your love, affection and support I wouldn't be where I am today, I am so overwhelmed....Jai Mahishmathi.. — Ramya Krishnan (@meramyakrishnan) 29 April 2017 -
ఫుల్ యాక్షన్
రజనీకాంత్ ‘నరసింహ’ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ ఏ రేంజ్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారో తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి ఆ తరహా పాత్రలో కనిపించనున్నారట. నారా రోహిత్, రెజీనా జంటగా పవన్ మల్లెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఎస్.వి.ఎం.పి. పతాకంపై బి. మహేంద్రబాబు, ముసునూరు వంశీకృష్ణ, నందమూరి శ్రీవినోద్ నిర్మిస్తున్న కొత్త చిత్రం ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కేయస్ రామారావు కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. మరో నిర్మాత బెల్లంకొండ సురేశ్ దర్శకునికి స్క్రిప్ట్ అందించారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న చిత్రమిది. సీనియర్ నటి రమ్యకృష్ణ మా చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ‘నరసింహ‘ చిత్రంలోని నీలాంబరి రేంజ్ క్యారెక్టర్ ఆమెది’’ అన్నారు. అజయ్, పృధ్వీ, ‘వెన్నెల’ కిషోర్, రఘుబాబు, సత్యకృష్ణ, తేజస్విని, శ్రావ్యా రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: యోగానంద్, కెమెరా: విజయ్ సి.కుమార్, సంగీతం: మణిశర్మ. -
ఆ ఊహ నిజం అవుతుందా!
ఊహకు బలం అధికం. దానికి సరిగా పదును పెడితే అంతరాల్లోకి దిగుతుంది. అలా ఊహాజనిత కథలతో తెరకెక్కిన కథలెన్నో చిత్రాలుగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి. ఒక మహానటిగా, మహోన్నత రాజకీయనాయకురాలిగా తమిళ ప్రజల గుండె అనే ఆలయంలో ఒక దేవతగా, అమ్మగా కొలువైన దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం సముద్రపు అలల ఆటుపోటుల వంటిదని చెప్పవచ్చు. అయితే జయలలిత సాధన మాత్రం అనితర సాధ్యం. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం, దృఢమైన ఆత్మవిశ్వాసం, అలుపెరగని పోరాటం అమ్మ నైజాల్లో ప్రధానమైనవి. మరణించినా జీవించి ఉండే అతి కొద్ది మందిలో జయలలిత ఒకరు. అలాంటి అమ్మ రూపంలో మేటి నటి రమ్యకృష్ణ దర్శనం ఇవ్వడం విశేషం. ఇదేమిటీ జయలలిత రూపంలో రమ్యకృష్ణ దర్శనం ఇవ్వడం ఏమిటీ? అని ఆశ్చర్యపోతున్నారా? ప్రస్తుతానికి అది ఒక చిత్ర కారుడి ఊహా చిత్రమే. మదర్ ది స్టోరీ ఆఫ్ ఏ క్వీన్ టాగ్తో రూపొందించిన అమ్మగా రమ్యకృష్ణ ఊహాజనిత చిత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నిజానికి అమ్మ జయలలిత జీవిత చరిత్రను వెండి తెరకెక్కించాలన్న ఆసక్తి, ఆలోచన పరిశ్రమ వర్గాల్లో చాలా మందికి ఉంది. అలాగే అమ్మగా నటించాలన్న ఆకాంక్ష అగ్రనాయికలైన పలువురిలో ఉంది. అయితే అమ్మ పాత్ర పోషించడం సాధ్యమా?అన్న భయం కొందరిలో లేకపోలేదు. ఇక జయలలిత రూపంలో నటి రమ్యకృష్ణ ఊహా చిత్రం సోషల్ మీడియాల్లో హల్చల్ చేస్తున్న విషయం గురించి ఆ గ్రేట్ నటి ముందుంచగా చాలా ఎమోషనల్గా స్పందించారు. ఆ ఊహా చిత్రం తన దృష్టికీ వచ్చిందన్నారు. తన స్నేహితులు ఆ ఫొటోను వాట్సాప్ ద్వారా తనకు పంపించారన్నారు. అది పూర్తిగా అభిమానుల ఆకాంక్షా చిత్రంగా పేర్కొన్నారు. అయితే ఒక విషయాన్ని మాత్రం ప్రస్తావించదలచుకున్నానన్నారు. తనను చాలా సార్లు, చాలామంది పత్రికా విలేకరులు మీ డ్రీమ్ రోల్ ఏమిటని అడిగినా అందుకు సమాధానం ఇవ్వలేదన్నారు. అయితే ఇప్పుడు ఆ ఊహా చిత్రం చూసిన తరువాత జయలలితగా నటించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఇదే తన డ్రీమ్ రోల్ అని పేర్కొన్నారు. అలాంటి అవకాశం రావాలని కోరుకుంటున్నానని, అయితే ఆ పాత్రలో జీవించడం చాలా చాలెంజ్తో కూ డుకుందని అన్నారు. అందువల్ల అలాంటి పాత్రను అంత సులభంగా అంగీకరించలేనన్నారు. స్క్రిప్ట్ పక్కాగా ఉండి, సమర్థులైన దర్శక నిర్మాతలు చిత్ర నిర్మాణానికి పూనుకుని తనను సంప్రదిస్తే తాను అమ్మగా నటించడానికి సిద్ధం అని రమ్యకృష్ణ పేర్కొన్నట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం. తనతో పాటు కోట్లాది మంది మహిళామణులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన బోల్డ్ అండ్ హైలీ ఇంటెలిజెంట్ లేడీ అమ్మ అని రమ్యకృష్ణ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అభిమాని ఊహాచిత్రం వెండితెరపై నిజం అవుతుందా? అన్నది వేచి చూడాల్సిందే. అయితే ఇప్పటికే సంచలన దర్శకుడు రామ్గోపాల్వర్మ శశికళ పేరుతో చిత్రాన్ని రూపొందించడానికి సన్నద్ధం అవుతున్నారు. అందులో అమ్మ పాత్ర ప్రధానంగా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి నిజ వ్యక్తుల రూపాలను వెండితెరపై అచ్చు గుద్దినట్లు చూపించగల వర్మ శశికళ చిత్రంలో ఎవరిని ఆ విధంగా మార్చనున్నారో వెయిట్ అండ్ సీ. -
'శివగామి' రమ్యకృష్ణకు మరో బంపర్ ఆఫర్
-
సూర్య చిత్రంలో నీలాంబరి
పడయప్పా చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రను మరవలేం. ఇక చాలా కాలం తరువాత బాహుబలి చిత్రంలో శివగామి పాత్రలో జీవించారు. తాజాగా నటుడు సూర్య చిత్రంలో మరో ప్రధాన పాత్రల్లో నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. ఎస్-3 చిత్రాన్ని పూర్తి చేసిన సూర్య ప్రస్తుతం విఘ్నేశ్శివ దర్శకత్వంలో తానా సేర్న్ద కూటం చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్నారు. చాలా కాలం తరువాత సీనియర్ కమేడియన్ సెంథిల్ నటిస్తున్న ఈ చిత్రంలో నటి రేవతి మాజీ ప్రియుడు సురేశ్మీనన్, ఆర్జే.బాలాజీ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో మరో కీలక పాత్రకు రమ్యకృష్ణను ఎంచుకున్నారు. ఈ విషయాన్ని రమ్యకృష్ణ ధ్రువీకరించారు. తానా సేర్న్దకూటం చిత్రంలో నటించడానికి చాలా ఎగ్జైటింగ్తో ఉన్నానంటున్నారీ నీలాంబరి. ఆమె మాట్లాడుతూ దర్శకుడు విఘ్నేశ్శివ కథ వినిపించగానూ చాలా నచ్చేసిందన్నారు. తన పాత్ర గురించి ఏమిటన్నది చెబితే కథ ప్రధానాంశం తెలిసిపోతుంది. ఇప్పటికీ తానా విషయాన్ని చెప్పలేనన్నారు. అరుుతే ఇందులో సూర్యతో తనకు డెరైక్ట్ కనెక్షన్ మాత్రం ఉండదన్నారు.అలాగే తానాసేర్న్ద కూటం చిత్రంలోని ప్రధాన పాత్రల్లో తనది ఒకటన్నారు. ఈ చిత్రం కోసం రమ్యకృష్ణ 35 రోజులు కాల్షీట్స్ కేటారుుంచినట్లు సమాచారం. ప్రస్తుతం రమ్యకృష్ణ విశ్వనటుడు కమలహాసన్కు జంటగా శభాష్నాయుడు చిత్రంలోనూ, బాహుబలి-2 చిత్రంలోనూ నటిస్తున్నారు. పంచతంత్రం చిత్రం తరువాత కమలహాసన్తో నటిస్తున్న శభాష్నాయుడులో వినోదభరిత పాత్రను పోషిస్తున్నట్లు రమ్యకృష్ణ తెలిపారు. -
రజనీ సినిమాలో మళ్లీ నీలాంబరి
రజనీకాంత్, రమ్యకృష్ణలది సూపర్ హిట్ జోడి. నరసింహ సినిమాలో కలిసి నటించిన ఈ జంట, అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. నరసింహాగా రజనీ, నీలాంబరిగా రమ్యకృష్ణ పోటి పడి నటించారు. అయితే ఇంత భారీ సక్సెస్ అందించిన ఈ కాంబినేషన్ తరువాత రిపీట్ కాలేదు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత మరోసారి ఈ ఇద్దరు టాప్ స్టార్స్ తెరను పంచుకోబోతున్నారు. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి రిలీజ్కు రెడీ అవుతుండగా, మరో సినిమా రోబో 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్లో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించనుంది. దాదాపు 17 ఏళ్ల తరువాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే బాహుబలి సినిమాలోని శివగామి పాత్రతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ, ప్రస్తుతం కమల్ హాసన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న శభాష్ నాయుడు సినిమాలో నటిస్తోంది. ఒకే సమయంలో రజనీ, కమల్ లాంటి టాప్ స్టార్స్తో సినిమాలు చేస్తూ తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకుంటోంది ఈ సీనియర్ హీరోయిన్. -
అమెరికాలో బ్రహ్మానందం, రమ్యకృష్ణ షూటింగ్
కమల్ హాసన్ హీరోగా ఒకేసారి తెలుగు, తమిళం, హిందీలలో రూపొందుతున్న ‘శభాష్ నాయుడు’ సినిమా షూటింగు జోరుగా సాగుతోంది. దీనికోసం బ్రహ్మానందం, రమ్యకృష్ణ కూడా షూటింగ్ మొదలుపెట్టారట. వీళ్లిద్దరివీ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలని, అమెరికాలో కొనసాగుతున్న షూటింగులో వీళ్లిద్దరూ పాల్గొంటున్నారని సినిమా వర్గాలు తెలిపాయి. వాళ్ల పాత్రల చిత్రీకరణతో ఇప్పటికే రెండు రోజుల షూటింగ్ పూర్తయిందని, వాళ్ల పాత్రల షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత భారతదేశానికి తిరిగి వెళ్తారని చెప్పారు. దశావతారం సినిమాలో సీబీఐ ఆఫీసర్ బలరాం నాయుడిగా ఒక పాత్ర పోషించిన కమల్.. అదే పాత్రను ప్రధాన పాత్రగా తీసుకుని దానికి సీక్వెల్లా ఈ సినిమా తీస్తున్నారు. ప్రస్తుతం బాహుబలి-2 సినిమా షూటింగుతో కూడా బిజీగా ఉన్న రమ్యకృష్ణ.. ఈ సినిమాలో కమల్ భార్య పాత్ర పోషిస్తున్నారు. వీళ్ల కుమార్తెగా కమల్ కూతురు శ్రుతి హాసన్ నటిస్తున్నారు. సినిమాకు కమల్ హాసన్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. అంతా అనుకున్నట్లే జరిగితే, డిసెంబర్ 1న సినిమా విడుదలవుతుంది. -
‘2.0’లో రమ్యకృష్ణ?
రజనీకాంత్-రమ్యకృష్ణ కాంబినేషన్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చే సినిమా ‘నరసింహ’. ఆ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ కనబర్చిన అభినయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘మీకెలాంటి పాత్రలు చేయాలని ఉంది?’ అని నేటి తరం నాయికలను అడిగితే, వాళ్లు చెప్పే పేర్లలో నీలాంబరి పాత్ర తప్పకుండా ఉంటుంది. ఈ పాత్రను రమ్యకృష్ణ అద్భుతంగా చేశారని రజనీ సైతం పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ సినిమా వచ్చి దాదాపు పదిహేడేళ్లవుతోంది. ఇన్నేళ్లల్లో మళ్లీ రజనీ-రమ్యకృష్ణ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఇప్పుడా అవకాశం ఉందని సమాచారం. ‘రోబో’కి సీక్వెల్గా శంకర్ దర్శకత్వంలో ‘2.0’ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అమీ జాక్సన్ కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్రకు రమ్యకృష్ణను తీసుకున్నారని బోగట్టా. త్వరలో రజనీ-రమ్యకృష్ణ పాల్గొనగా సన్నివేశాలను చిత్రీరించనున్నారని చెన్నై కోడంబాక్కం వర్గాల సమాచారం. నీలాంబరి తరహాలోనే ఈ చిత్రంలో రమ్యకృష్ణ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందట. -
సోగ్గాడే చిన్నినాయనా మరో సంచలనం
ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్ హీరోల సినిమాలు కూడా పది రోజులకు మించి థియేటర్లలో కనిపించే పరిస్థితి లేదు. సినిమా సక్సెస్ను కూడా ఎన్ని రోజులు ఆడింది అన్న దాంతో కాకుండా ఎంత కలెక్ట్ చేసిందీ అనే లెక్కలేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓ సినిమా 50 రోజులు ఆడటం సాధ్యమేనా..? ఈ ప్రశ్నకు సమాధానం చూపించాడు నాగార్జున. సరైన కథా కథనాలతో ఆడియన్స్ ముందుకు వస్తే ఇప్పటికీ రికార్డ్ సెంటర్స్లో 50 రోజుల సినిమాలు సాధ్యమే అని ప్రూవ్ చేశాడు. సంక్రాంతి బరిలో భారీ కాంపిటీషన్ మధ్య రిలీజ్ అయిన సినిమా సోగ్గాడే చిన్నినాయనా. మూడు సినిమాలతో పోటి పడి రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించటమే కాదు భారీ వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఇప్పటికే చాలా సెంటర్స్లో ప్రదర్శితమవుతున్న ఈ సినిమా 50 రోజులు రికార్డ్ నమోదు చేసింది. ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతున్న సోగ్గాడే చిన్నినాయనా 110 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కేవలం 10 కోట్ల లోపు బడ్జెట్తో రూపొంది 53 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పటికీ మంచి కలెక్షన్లు సాధిస్తున్న సోగ్గాడే చిన్నినాయనా ముందు ముందు ఇంకెన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి. -
సోగ్గాడు హాఫ్ సెంచరీ కొట్టేశాడు
సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు రిలీజ్ అయినా.. అన్నింటికంటే పెద్ద హిట్గా నిలిచిన సినిమా 'సోగ్గాడే చిన్నినాయనా'. కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్ ఎన్టీఆర్, బాలయ్య లాంటి స్టార్ హీరోల సినిమాలు పోటీలో ఉన్నా.. భారీ వసూళ్లను సాధించింది. ముఖ్యంగా సీనియర్ హీరోలకు ఇంతవరకు సాధ్యం కాని కలెక్షన్ల రికార్డ్లను సాధించి సత్తా చాటాడు నాగ్. ఇప్పటివరకు పవన్, మహేష్, అర్జున్, చరణ్, ఎన్టీఆర్లకు మాత్రమే సాధ్యమైన 50 కోట్ల మార్క్ ను 4 వారాల్లో రీచ్ అయ్యాడు నాగార్జున. యంగ్ హీరోలు చాలామంది ఈ రికార్డ్ సాధించినా.., ఇంత పోటీలో లో నాగార్జున లాంటి సీనియర్ హీరో 50 కోట్ల కలెక్షన్లు సాధించటం అరుదైన ఘనతగానే భావిస్తున్నారు విశ్లేషకులు. కేవలం 15 కోట్ల బడ్జెట్తో రూపొందిన సోగ్గాడే చిన్ని నాయనా ఇప్పటికే 50 కోట్లకు పైగా వసూలు చేసి ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు. కళ్యాణ్ కృష్ణ, ఈ సినిమాతో దర్శకుడి పరిచయం కావటమే కాదు తొలి సినిమాతోనే భారీ హిట్ సాధించి స్టార్ హీరోల దృష్టిలో పడ్డాడు. నాగ్ తన సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించిన ఈ సినిమాతో బిగ్ హిట్తో పాటు భారీ కలెక్షన్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. -
'అమ్మా నాన్న ఆట' ఆగిపోయింది
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న 'అమ్మా నాన్న ఆట' సినిమా ఆగిపోయింది. ఉత్తమ విలన్, చీకటి రాజ్యం లాంటి సినిమాల తరువాత సూపర్ ఫాంలో కనిపించిన కమల్, అదే స్పీడులో మరో రెండు సినిమాలను ప్రకటించాడు. అమల హీరోయిన్గా అమ్మా నాన్న ఆట అనే సినిమాను ప్రారంభించిన కమల్, తాజాగా ఆ సినిమా ఆగిపోయినట్టుగా ప్రకటించాడు. అయితే ఎందుకు ఆగిపోయింది అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. టికె రాజీవ్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ సినిమా ఆగిపోవటంతో ఇప్పుడు అదే దర్శకుడితో మరో సినిమాను స్టార్ చేస్తున్నాడు. కొత్త సినిమాలో రమ్యకృష్ణ, కమల్కు జోడిగా నటిస్తుండగా కమల్ కూతురు శృతిహాసన్ సినిమాలో కూడా కమల్ కూతురి పాత్రలో కనిపించనుంది. ఓ టీవి ఛానల్ ఇంటర్వూలో ఈ విషయాన్ని వెల్లడించిన కమల్ హాసన్ త్వరలోనే నెక్ట్స్ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నాడు. -
సమంతో రమ్య కృష్ణవంశీయమ్
క్రియేటివ్ డెరైక్టర్ కృష్ణవంశీ నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి? పదహారు నెలల క్రితం రామ్చరణ్తో వచ్చిన ‘గోవిందుడు అందరివాడేలే’ తరువాత ఆయన వార్తల్లో కనిపించడం లేదేంటి? వీటి గురించి రకరకాల వార్తలు వినిపించాయి. అయితే, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు జవాబు దొరికింది. ఒక విభిన్నమైన ప్రాజెక్ట్ రూపకల్పనకు కృష్ణవంశీ సర్వం సిద్ధం చేసినట్లు కృష్ణానగర్ కబురు. ఆయన శక్తియుక్తులన్నిటినీ ఉపయోగించి, ‘రుద్రాక్ష’ పేరుతో స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసుకున్నారట! కాంబినేషన్ థండర్... విభిన్నమైన ఈ స్క్రిప్ట్లో సస్పెన్స్, సెంటిమెంట్, థ్రిల్లింగ్ అంశాలు - అన్నీ ఉన్నాయని సమాచారం. ఇలా అన్ని అంశాలూ రంగరించిన ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఒక అరుదైన కాంబినేషన్ను కూడా సిద్ధమవుతోంది. చిత్రంలో ప్రధాన పాత్ర కోసం తమన్నాతో మొదలుపెట్టి అనుష్క దాకా రకరకాల పేర్లు వినిపించాయి. కాగా ఆ పాత్ర హీరోయిన్ సమంతను వరించింది. ఇంకా స్క్రిప్ట్ పూర్తిగా వినాల్సిన సమంత తొలిసారిగా కృష్ణవంశీ చిత్ర నాయిక అవుతున్నారు. మరో విశేషం ఏమిటంటే, ఇటీవలే ‘బాహుబలి’లో శివగామిగా, ‘సోగ్గాడే చిన్ని నాయనా’లో సత్యభామగా అందరినీ ఆకట్టుకున్న రమ్యకృష్ణ ఓ కీలకపాత్ర ధరిస్తుండడం! గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘చంద్రలేఖ’ లాంటి సినిమాల్లో నటించిన ఆమె, పెళ్ళయ్యాక తన భర్త దర్శకత్వంలో పూర్తి స్థాయి పాత్ర చేయడం ఇదే తొలిసారి. ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించనున్నారట. కృష్ణవంశీ కెరీర్లోకెల్లా భారీ బడ్జెట్తో రూపొందే ఈ చిత్రానికి అలా క్రేజీ కాంబినేషన్ కూడా సెట్ అయింది. విజువల్ వండర్... ఇంత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే గ్రౌండ్వర్క్ అంతా పూర్తి అయిందని ఆంతరంగిక వర్గాల సమాచారం. ఈ స్క్రిప్ట్ మీద కృష్ణవంశీ చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే, ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజుతో పాటు ఆయన కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అవుతున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ ప్రకారం ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్కు చాలా ప్రాధాన్యం ఉంది. అందుకే, వాటికి సంబంధించిన నిపుణులతో ఇప్పటికే సంప్రతింపులు జరుగుతున్నాయి. ఇలాంటి హై-టెక్నికల్ సినిమాకు సమర్థుడైన కెమేరా నిపుణుడు అవసరం కాబట్టి, ఆ బాధ్యతను సీనియర్ కెమేరామన్ ఛోటా కె. నాయుడుకు అప్పగిస్తున్నట్లు భోగట్టా. కృష్ణవంశీ - ఛోటా కె.నాయుడుల కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా కూడా ఇదే కావడం విశేషం! ఈ భారీ చిత్రాన్ని కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా, తమిళంలోనూ ఏకకాలంలో నిర్మించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ‘రుద్రాక్ష’ అనే వర్కింగ్ టైటిల్తో సద్దు చేయకుండా తెర వెనుక పనులన్నీ సాగుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్ళనుంది. మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే! ఆ మాటెలా ఉన్నా, ఇప్పటికైతే - కృష్ణవంశీ, రమ్యకృష్ణ, సమంత - ఇంతటి అరుదైన క్రేజీ కాంబినేషన్ ఈ మధ్య కాలంలో వినలేదని కృష్ణానగర్ జనం చెప్పుకొంటున్నారు. ఇంకేం... ఈ ‘సమంతో రమ్య కృష్ణవంశీయమ్’తో ఈ క్రియేటివ్ డెరైక్టర్ మళ్ళీ వార్తల్లో వ్యక్తి అయిపోయినట్లే! ఆల్ ది బెస్ట్ టు ది క్రేజీ ప్రాజెక్ట్ అండ్ డెరైక్టర్!! -
కమల్ తో నీలాంబరి
బాహుబలి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రమ్యకృష్ణ జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. ఇప్పటికే ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్న ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్లో నటించడానికి రెడీ అవుతోంది. కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ ఏడాదికి మూడు సినిమాలు చేస్తున్న కమల్ హాసన్ సరసన నటించేందుకు అంగీకరించింది రమ్యకృష్ణ. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కమల్ ప్రస్తుతం 'అమ్మా నాన్న ఆట' సినిమాలో నటిస్తున్నాడు. టికె రాజీవ్ దర్శకత్వంలో, అమల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తరువాత రాజీవ్ దర్శకత్వంలోనే మరో సినిమాకు ఓకె చెప్పాడు కమల్ హాసన్. ఈ సినిమాలో కమల్కు జోడిగా రమ్యకృష్ణను ఎంపిక చేశారు. కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ సినిమాలో కూడా కూతురు పాత్రలో నటిస్తుండగా, శృతి తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాకు సంబందించి త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. -
జోరు చూపిస్తున్న సోగ్గాడు
సంక్రాంతి పండుగకు విడుదలైన నాలుగు సినిమాల్లో ఎలాంటి నెగిటివ్ టాక్ లేకుండా ఆకట్టుకున్న సినిమా సోగ్గాడే చిన్నినాయనా. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, బాలయ్య డిక్టేటర్ లాంటి సినిమాలు పోటి ఉన్నా, సోగ్గాడిగా వచ్చిన నాగ్ సత్తా చాటాడు. ముఖ్యంగా ఎ, బి సెంటర్స్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథా కథనాలు కావటం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. సోగ్గాడే చిన్ని నాయనా రిలీజై ఇప్పటికే రెండు వారాలు దాటిన కలెక్షన్ల జోరు మాత్రం తగ్గటంలేదు. రివ్యూలతో పాటు, మౌత్ టాక్ కూడా బాగా వస్తుండటంతో నాగ్ కెరీర్లోనే హయ్యస్ట్ వసూళ్లతో దూసుకుపోతోంది ఈ సినిమా. లిమిటెడ్ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే 40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇంక చాలా చోట్ల హౌస్ఫుల్ అవుతుండటంతో పాటు శాటిలైట్ రైట్స్ లాంటి వాటితో 50 కోట్ల మార్క్ను ఈజీగా రీచ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. థియేటర్లలో మరికొద్ది రోజుల పాటు సోగ్గాడి సందడి ఉంటుందంటున్నారు అక్కినేని అభిమానులు. నాగ్ సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అనూప్ అందించిన సంగీతం సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది. -
సంక్రాంతి సోగ్గాడు
చిత్రం: ‘సోగ్గాడే చిన్ని నాయనా’ తారాగణం: నాగార్జున, లావణ్యా త్రిపాఠీ, రమ్యకృష్ణ మూలకథ: పి. రామ్మోహన్ స్క్రీన్ప్లే: సత్యానంద్ కళ: ఎస్. రవీందర్ కెమేరా: పి.ఎస్. వినోద్, ఆర్. సిద్ధార్థ్ ఎడిటింగ్: ప్రవీణ్ పూడి సంగీతం: అనూప్ రూబెన్స్ నిర్మాత: అక్కినేని నాగార్జున రచన - దర్శకత్వం: కల్యాణ్కృష్ణ కురసాల కొత్త సినిమా గురూ! సాంఘికం, పౌరాణికం, జానపదం, సోషియో ఫ్యాంటసీ- ఇలా సిన్మాలు పలు కోవలు. ఒక్కో కోవలో - రొమాంటిక్ లవ్, రివెంజ్ ఫార్ములా, ఘోస్ట్, యాక్షన్ లాంటి సవాలక్ష ఫార్ములాలు. ఇవన్నీ పాత చింతకాయలే కావచ్చు. కానీ ఆ రకరకాల జానర్స్ సినిమాలకూ, ఈ పలు రకాల ఫార్ములాలకూ అంటు కడితేనో? పువ్వులు, పండ్లు కొత్తగా ఉంటాయి. రొమాంటిక్ కథ, సోషియో- ఫ్యాంటసీ లైన్, రివెంజ్ యాంగిల్- ఇలా అన్నిటికీ అంటుకట్టడంతో వచ్చిన వెరైటీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’. గోదావరి జిల్లాల్లోని శివపురం గ్రామంలో బంగార్రాజు (నాగార్జున) పిల్ల జమీం దార్. ఆ సరసాల సోగ్గాడి భార్య సత్యభామ (రమ్యకృష్ణ). ఆమె కడుపుతో ఉన్నప్పుడు యాక్సిడెంట్లో చనిపోతాడు. ‘ఎక్కని గడప, దూకని గోడ లేని’ భర్త లానే పుట్టిన కొడుకు రాము (నాగార్జునే)ను అమ్మాయిలకు దూరంగా, అతి జాగ్రత్తగా పెంచుతుంది. రాము భార్య సీత (లావణ్యా త్రిపాఠీ). అమెరికాలోని టాప్ ఫైవ్ డాక్టర్స్లో ఒకడిగా స్థిరపడ్డ రాముకి పనే లోకం. భార్య మీద ప్రేమను కూడా పైకి వ్యక్తం చేయని అమాయకుడు. దాంతో, విడాకులకు సిద్ధమై, సత్యభామకు చెప్పడం కోసం ఇండియాలోని ఊరికొస్తారు. వీటన్నిటికీ మొగుడు బంగార్రాజు కారణమని తల్లి నిందిస్తుంది. అప్పుడు యముడి అనుమతితో తండ్రి ఆత్మ భూలోకానికి వస్తుంది. ఈ ఫ్రెండ్లీ ఘోస్ట్ ఇక్కడ భార్యకు మాత్రమే కనపడుతూ, వినపడుతూ కొడుకు కాపురం చక్కదిద్దడానికి ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే కథ చాలా మలుపులు తిరుగుతుంది. ఒకదానికొకటి సంబంధం లేని బంగార్రాజు, రాము పాత్రల్ని గెటప్, మనిషి, మాట తీరుతో సహా నాగ్ చాలా సహజంగా చేశారు. బంగార్రాజు లాంటి నవ మన్మథ పాత్రలు ఆయనకు స్వభావసిద్ధం. అమాయ కుడైన కొడుకుగా కూడా అంతే డిగ్నిఫైడ్ లుక్తో, యాక్షన్తో మెప్పించారు. ఇక, వయసు మీద పడుతున్నా అందాన్నీ, దర్పాన్నీ వదులుకోని ఈ సత్యభామ పాత్రకు రమ్యకృష్ణ సరిగ్గా సరిపోయారు. పెళ్ళయి మూడేళ్ళయినా, మూడుసార్లకు మించి కలవని కెరీరిస్ట్ డాక్టర్ భర్తతో విడాకులు కావాలని కోరుకొనే భార్య సీత పాత్ర వేదన ఆధునిక సమాజంలో కనిపించేదే. అందులో లావణ్యా త్రిపాఠీ ఒదిగారు. ఆత్మలతో మాట్లాడతాననే ‘ఆత్మానంద’ స్వామిగా బ్రహ్మానందం నవ్విస్తారు. కుర్ర నాగార్జున పక్కన వరసయ్యే మరదళ్ళుగా అనసూయ, హంసానందిని కనువిందు కోసం కనిపిస్తారు. బంగార్రాజు ఆత్మ కిందకు రావడమేమిటి, భార్యకే కనపడడం, వినపడడమేమిటి, మళ్ళీ ఆత్మానందా నికీ కన్వీనియంట్గా తెలియడమేమిటి లాంటి లాజిక్లు అడ్డం పడినప్పుడల్లా యముడి పాత్రలో నాగబాబు వచ్చి, కన్వీనియంట్గా వివరణలిస్తారు. స్వర్గీయ ఏయన్నార్ హిట్ పాట ‘సోగ్గాడే చిన్ని నాయనా...’ రీమిక్స్ ఫ్యాన్స్కు పండగ. ప్రధానంగా చెప్పు కోవాల్సింది - కెమేరా వర్క్. గ్రామీణ వాతావరణాల సొగసును ప్రతిఫలిం చింది. ఒకరికి నలుగురు అమ్మాయిలతో తిరిగే పిల్ల జమీందార్లు పల్లెటూళ్ళలో సాధారణం. కానీ, హీరోకు అలాంటి క్యారెక్టరైజేషన్ పెట్టి, అదే సమయంలో అతడు మంచివాడనిపించేలా చేయడం ఒక సవాలు. దానికి తోడు చిలిపి చేష్టల్ని చెబుతూ, చూపెడుతూనే, హద్దులు దాటకుండా ఫ్యామిలీ ఆడియన్స్ను ఒప్పించడం మరొక సవాలు. దర్శక, రచయితలు ఆ పరీక్ష పాసయ్యారు. మగవాళ్ళే కాదు... ఆడవాళ్ళు కూడా ముసిముసి నవ్వులతో మురిసి పోతూ కథకు కనెక్టయ్యేలా ఆ సెన్సుయల్ రొమాన్స్ను ఎంటర్టైనింగ్గానే తెరపైకి తేగలిగారు. ఒకప్పుడు ఇలాంటివన్నీ ‘అశ్లీలం’ అనుకొన్న ప్రేక్షకులు కాలంతో పాటు ఎంతగా మారారనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. అలాగే, తండ్రి, కొడుకుకు సరసాన్ని నేర్పించడమనేది నిజానికి వినడానికీ, ఏ మాత్రం తేడా వచ్చినా తెర మీద చూపించడానికీ తప్పుగా ధ్వనించే ప్రమాదం ఉంది. కానీ, అంగీకారయోగ్యంగా చూపించడం రచన చేసిన అనుభవజ్ఞుల నేర్పుకు నిదర్శనం. ‘చిత్రిక పట్టిన టేకు చెక్కలాగా వట్రంగా ఉన్నావే’, ‘తొక్కి నార తీయడం’ లాంటి సహజమైన తెలుగు పలుకుబడులు చాలా రోజులకి తెరపై వినిపించాయి. కథలో ‘మూడు పుష్కరాల (36 ఏళ్ళ) క్రితం... శివరాత్రి ముందు రాత్రి’ విలన్ ముఠాకు తాచుపాము కాటు, బంగార్రాజు చనిపోవడం లాంటివి జరుగుతాయి. కానీ, సినిమాలో 30 ఏళ్ళ క్రితం బంగార్రాజు పోయాడని ఒకటి, రెండుసార్లు అనిపి స్తారు. పాటలో అలా మెరిసి, ముగిసే కృష్ణకుమారి పాత్రలో హాట్ హీరోయిన్ అనూష్క కనిపించడం ప్రేక్షకులకు సర్ప్రైజ్ గిఫ్ట్. అయితే, బంగార్రాజు అమితంగా ఇష్టపడ్డ ఆ కృష్ణకుమారి పాత్రకు క్లారిటీ, కన్క్లూజన్ వెతక్కూడదు. ఎంత ఆత్మ వచ్చి దూరినా, కొడుకు పాత్రొచ్చి ఆమెతో అప్పటి సరసాలు సరదాలు గుర్తు చేసినప్పుడు అసహనం సహజం. బంగార్రాజు ఆత్మను మళ్ళీ భూలోకానికి యముడు పంపడానికి కారణం లాంటివి వెతక్కూడదు. సినిమా చూసి బయటకొచ్చాక దీర్ఘంగా ఆలోచిస్తే, ఇలాంటివన్నీ బుర్రకు తడతాయి. కానీ, గమ్మత్తేమిటంటే చూస్తున్నంత సేపూ అసలీ ఆలోచనలేవీ రానివ్వకుండా సినిమాను నడిపించడం! అది ఈ సినిమాకు పెద్ద ప్లస్. తొలిచిత్ర దర్శకుడైన కల్యాణ్కృష్ణకు సమష్టి కృషి తోడుగా, సుదీర్ఘమైన ఇన్నింగ్స్కు ఇది ముందడుగు. వెరసి, మన పల్లెటూళ్ళు, మన వాతావరణం, మన తెలుగువారి పంచెకట్టు, మన బంధుత్వాలు, సరదాలను తెరపైకి తేవడంతో ఇది అచ్చమైన సంక్రాంతి ఫెస్టివల్ ఫిల్మ్. కుటుంబమంతా హ్యాపీగా చూసే అవకాశాలతో సంక్రాంతి రిలీజుల బాక్సాఫీస్ పందెంలో గెలుపుకోడి. - రెంటాల జయదేవ -
'సోగ్గాడే చిన్ని నాయనా' మూవీ రివ్యూ
టైటిల్ : సోగ్గాడే చిన్ని నాయనా జానర్ : ఫాంటసీ ఫ్యామిలీ డ్రామా తారాగణం : నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, సంపత్, నాజర్, బ్రహ్మనందం సంగీతం : అనూప్ రుబెన్స్ దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ నిర్మాత : నాగార్జున టాలీవుడ్ మన్మథుడు నాగార్జున 'మనం' తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మనం సినిమాలో ఏఎన్నార్తో కలిసి నటించిన నాగ్, ఈ సినిమాలో ఏఎన్నార్ను గుర్తు చేసే పాత్రతో సినిమా మీద అంచనాలను పెంచాడు. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణను పరిచయం చేస్తూ నాగ్ చేసిన ఫాంటసీ ప్రయోగం సోగ్గాడే చిన్నినాయనా. చాలా కాలం క్రితం టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములాగా ఉన్న ఆత్మలు తిరిగి రావటం అనే కాన్సెప్ట్కు కామెడీ జోడించి నాగార్జున చేసిన ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అయ్యింది..? సంక్రాంతి బరిలో సోగ్గాడి స్టామినా ఎంత..? కథ : రాము (నాగార్జున) అమాయకుడైన డాక్టర్. తన పని లోకం తప్ప భార్య సీత(లావణ్య త్రిపాఠి) గురించి అస్సలు పట్టించుకోడు. దీంతో రాము నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంటుంది సీత . ఆ విషయం చెప్పడానికి అత్తగారు సత్తమ్మ (రమ్యకృష్ణ) దగ్గరికి వస్తుంది. కళ్ల ముందే కొడుకు కాపురం పాడవటం చూడలేని సత్తమ్మ ముప్పై ఏళ్ల క్రితం చనిపోయిన భర్త బంగార్రాజు ( నాగార్జున)ను గుర్తు చేసుకుంటుంది. నరకంలో అమ్మాయిలతో సరదాగా గడుపుతున్న బంగార్రాజు భార్యకు సాయం చేయడానికి యముడి అనుమతితో భూలోకానికి వస్తాడు. కొడుకు కాపురం సరిద్దిదే సమయంలో తన చావు యాక్సిండెంట్ కాదని, హత్య అని తెలుసుకుంటాడు. అంతేకాదు అదే సమయంలో తన కొడుకుతో సహా తన కుటుంబం అంతా ప్రమాదంలో ఉందని తెలిసి వారిని కాపాడే ప్రయత్నం చేస్తాడు. అసలు బంగార్రాజును ఎవరు ఎందుకు చంపారు..? వారి బారి నుంచి బంగార్రాజు తన కుంటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నదే మిగతా కథ..? నటీనటులు : అమాయకుడైన రాముగా, సరదాగా కనిపించే బంగార్రాజుగా రెండు విభిన్న పాత్రల్లో నాగార్జున ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బంగార్రాజు లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్న నాగ్, ఆ పాత్రతో ఏఎన్నార్ను గుర్తు చేశాడు. చాలా కాలం తరువాత నాగ్తో కలిసి నటించిన రమ్యకృష్ణ, గ్లామర్ విషయంలో ఈ జనరేషన్ హీరోయిన్లకు పోటీ ఇచ్చింది. లావణ్యత్రిపాఠి క్యూట్ లుక్స్తో ఆకట్టుకుంది. కొద్ది రోజులుగా కామెడీ పండించలేక ఇబ్బంది పడుతున్న బ్రహ్మనందం, ఈ సినిమాలో ఆత్మలతో మాట్లాడే బాబాగా బాగానే నవ్వించాడు. నాజర్, సంపత్, పోసాని కృష్ణ మురళిలు తమ పరిధి మేరకు పాత్రకు న్యాయం చేశారు. హంసనందిని, అనసూయల గ్లామర్ సినిమాకు మరింత హెల్ప్ అవ్వగా, అనుష్క గెస్ట్ అప్పీయరెన్స్ ఆడియన్స్కు షాక్ ఇచ్చింది. సాంకేతిక నిపుణులు : చాలా కాలం క్రితమే తెలుగు తెర మీద సందడి చేసిన ఆత్మలు తిరిగి రావటం అనే కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్న కళ్యాణ్ కృష్ణ మంచి విజయాన్నే సాధించాడు. ముఖ్యంగా నాగార్జున ఎంతో నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతకు పూర్తి న్యాయం చేశాడు. పల్లెటూరి యాసలో నాగార్జున చెప్పిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా నాగ్ గెటప్ విషయంలో తీసుకున్న కేర్ ప్రతీ ఫ్రేమ్లో కనిపిస్తుంది. సినిమాటోగ్రఫి చాలా బాగుంది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద పల్లె అందాలను బాగా చూపించారు. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన మరో అంశం బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఆడియోతో సినిమా రిలీజ్కు ముందే మంచి విజయం సాధించిన అనూప్ నేపధ్య సంగీతంతో సినిమా స్థాయిని మరో మెట్టెక్కించాడు. ప్లస్ పాయింట్స్ : నాగార్జున, రమ్యకృష్ణ సెకండాఫ్ కామెడీ నేపధ్య సంగీతం మైనస్ పాయింట్స్ : స్ట్రాంగ్ విలనిజం లేకపోవటం స్లో నారేషన్ రొటీన్ టేకింగ్ ఓవరాల్గా సోగ్గాడే చిన్నినాయనా, ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించే మంచి ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ - సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్ -
నాగ్ గెటప్ కోసం నటసామ్రాట్ కాస్ట్యూమ్స్
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ సోగ్గాడే చిన్నినాయనా.. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్న నాగ్.. ఒక పాత్ర కోసం పల్లెటూరి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. మనం సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నాగ్ త్వరలో సోగ్గాడిగా అభిమానులను పలకరించనున్నాడు. ఈ సినిమా కోసం నాగ్ ఎంచుకున్న గెటప్లో ఓ ప్రత్యేకత ఉందంటున్నారు చిత్రయూనిట్. ఎన్నో చిత్రాల్లో పల్లెటూరి పాత్రలు చేసిన తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావే తన పాత్రకు స్ఫూర్తి అంటున్నాడు నాగ్. అంతేకాదు ఈ సినిమాలో తన గెటప్ కోసం నాగ్ వాడిన కాస్ట్యూమ్స్ గతంలో అక్కినేని నాగేశ్వరరావు వాడినవే.. ఈ సినిమాలో నాగ్ వాడిన వాచీ కూడా 1959లో అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా కొన్నది కావటం మరో విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సోగ్గాడే చిన్నినాయనా సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తుండగా, హంసానందిని, అనసూయ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకుడు. -
అటు చామంతి... ఇటు పూబంతి
‘ముద్దిమ్మంది ఓ చామంతీ... మనసిమ్మంది ఓ పూబంతి...’ అంటూ రమ్యకృష్ణ, మీనాతో ‘అల్లరి మొగుడు’లో మోహన్బాబు చేసిన రొమాన్స్ అప్పట్లో ప్రేక్షకులకు కనువిందు. ఆ పాటలో ముగ్గురూ చూడముచ్చటగా అనిపిస్తారు. ఆ హిట్ కాంబినేషన్ రిపీట్ అయితే ఆ ప్రాజెక్ట్కి భారీ ఎత్తున క్రేజ్ నెలకొనడం ఖాయం. ఈ ముగ్గురికీ ‘అల్లరి’ నరేశ్ కూడా తోడైతే ఇక చెప్పడానికి ఏముంటుంది...! రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్... ఇలా అన్ని అంశాలతో ఫుల్మీల్స్ లాంటి సినిమా తయారై ఉంటుందని ఊహించవచ్చు. ‘మామ మంచు - అల్లుడు కంచు’ టైటిల్తో రూపొందిన ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న విడుదల కానుంది. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ పతాకంపై మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రం పాటలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. చిత్రవిశేషాలను నిర్మాత చెబుతూ - ‘‘సినిమా టైటిల్ ప్రకటించినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ విడుదల చేసిన తర్వాత చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. కోటి, అచ్చు, రఘు కుంచె అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రం అన్ని వర్గాల వారికీ నచ్చుతుంది’’ అన్నారు. నరేశ్తో పూర్ణ జత కట్టిన ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, అలీ, కృష్ణభగవాన్, జీవా, రాజా రవీంద్ర తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కెమెరా: బాల మురుగన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్ కుమార్, సమర్పణ: అరియానా, వివియానా, విద్యా నిర్వాణ. -
రిలీజ్కు రెడీ అవుతున్న సోగ్గాడు
చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న కింగ్ నాగార్జున లేటెస్ట్ సినిమా 'సోగ్గాడు చిన్నినాయనా' ఫైనల్గా షూటింగ్ పూర్తి చేసుకుంది. కథా కథనాల్లో మార్పులతో రెండు మూడు సార్లు రీషూట్లకు వెళ్లిన ఈ సినిమా మైసూర్ జరిగిన భారీ షెడ్యూల్తో ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో నాగ్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.. పల్లెటూరి వాతావరణంలో సాగే ఈ కథలో సొగ్గాడిగా, అమాయకుడిగా రెండు వేరు వేరు పాత్రల్లో కనిపిస్తున్నాడు నాగ్. కామెడీ ప్రధానంగా సాగే ఈ కథలో తన కొడుకుకు మాత్రమే కనిపించే ఆత్మగా అలరించనున్నాడు. నాగ్ సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తుండగా, యాంకర్ అనసూయ, హంసానందినిలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ఉయ్యాల జంపాల ఫేం పి. రామ్మోహన్ కథ అందించగా, కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. త్వరలోనే సినిమా ఆడియో రిలీజ్ చేసి మూవీ రిలీజ్ డేట్ను ప్రకటించడానికి చిత్రయూనిట్ రెడీ అవుతున్నారు. -
సోగ్గాడి ఎంట్రీ మరింత ఆలస్యం
'మనం' సినిమా తరువాత ఇంతవరకు వెండితెర మీద కనిపించని కింగ్ నాగార్జున తదుపరి సినిమా మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. ప్రస్తుతం నాగ్ రెండు సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్నా, అభిమానులు ఆ సినిమాల కోసం కొత్త ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే అని తెలుస్తోంది. నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న 'సొగ్గాడే చిన్నినాయన' ఈ ఏడాది చివర్లో రిలీజ్ అవుతుందని భావించారు. అయితే ఈ సినిమాలో కొన్ని సీన్లను రీషూట్ చేయాల్సి రావటంతో సినిమా మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా, మొదలైన దగ్గర నుంచి ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా రషెస్ చూసిన రచయిత సాయి మాధవ్ బుర్రా కొన్ని సన్నివేశాలను తిరిగి చిత్రీకరించాలని సూచించడంతో రీషూట్ ఆలోచనలో ఉన్నారు యూనిట్. దీంతో ఈ డిసెంబర్ లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా, ఇప్పుడు మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున తాత, మనవడిగా రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడు. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నాగ్ ఆత్మ రూపంలో కూడా కనిపించనున్నాడట. నాగార్జున ఈ సినిమాతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమా ఊపిరి షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. -
శ్రీశాంత్కు అమ్మగా రమ్యక్రిష్ణ
పడయప్పా (తెలుగులో నరసింహా) చిత్రానికి ముందు రమ్యక్రిష్ణ వేరు ఆ తరువాత రమ్యక్రిష్ణ వేరు. ఇంకా చెప్పాలంటే అంతకు ముందు రమ్యక్రిష్ణ ఒక గ్లామర్ డాల్. పడయప్పా చిత్రంతో రమ్యక్రిష్ణ అభినేత్రిగానే కొనియాడబడ్డారని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రస్తుతం సెలక్టీవ్ చిత్రాలనే చేస్తున్న రమ్యక్రిష్ణ బాహుబలి చిత్రంలో శివకామి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి. అలాంటి ఆ నట శిఖామణి తాజాగా అమ్మగా మరోసారి జీవించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. అదీ సంచలన క్రికెట్ క్రీడాకారుడు శ్రీశాంత్కు స్ఫూర్తిదాయకమైన అమ్మగా నటించనున్నారట. ఆ మధ్య వివాదాలకు గురై జైలు జీవితాన్ని కూడా అనుభవించి ఇటీవల నిర్దోషిగా బయట కొచ్చిన క్రికెట్ క్రీడాకారుడు శ్రీశాంత్ సినీ రంగప్రవేశం గురించి కొద్దికాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఆయన దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ రూపొందనున్న చిత్రంలో కథానాయకుడిగా నటించనున్నారట. దీనికి సానాయాది రెడ్డి దర్శకత్వం వహించనున్నారట. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి స్క్రీన్ప్లే రైటర్ పని చేస్తున్న ప్రకాశ్ వివరాలను తెలుపుతూ ఇది క్రికెట్ క్రీడా నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కనున్నట్లు చెప్పారు. ఇందులో శ్రీశాంత్కు అమ్మగా రమ్యక్రిష్ణ పాత్ర చాలా వైవిధ్యభరితంగా ఉంటుందన్నారు. -
సెప్టెంబర్ 15న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు రమ్యకృష్ణ (నటి), పి. వాసు (దర్శకుడు) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 5. ఇది బుధసంఖ్య. పుట్టిన తేదీ 15. ఇది శుక్ర సంఖ్య. బుధ శుక్రుల కలయిక వల్ల లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడి, విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులై, కోరుకున్న విద్యాసంస్థలలో సీటు వస్తుంది. వ్యాపారులకు అభివృద్ధికరంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వీరు పుట్టిన తేదీ శుక్రసంఖ్య అయినందువల్ల జీవితం ఉత్సాహంగా, సౌఖ్యవంతంగా గడిచిపోతుంది. వివాహ యత్నాలలో ఉన్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. మీడియా, సినీ రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు, గుర్తింపు వస్తాయి. కోపం తగ్గించుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 5,6,9; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, గోల్డెన్, గ్రీన్, శాండల్; లక్కీ డేస్: ఆది, బుధ, శుక్రవారాలు. సూచనలు: తోబుట్టువులను ఆదుకోవడం, నవగ్రహాభిషేకం చేయించుకోవడం, బీదవిద్యార్థులకు పుస్తకాలు, ఆహారం పంపిణీ చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
శివగామిపై అతిలోకసుందరి ఆశపడ్డారా?
చిత్రపరిశ్రమలో అతిలోకసుందరి అనగానే కళ్ల ముందు ప్రత్యక్షం అయ్యేది నటి శ్రీదేవినే. ఒకప్పుడు భారతీయ సినీపరిశ్రమ చేతనే బ్రహ్మాండ నటి అనిపించుకున్న శ్రీదేవి కథానాయికగా మంచి హైప్లో ఉండగానే పెళ్లి చేసుకుని నటనకు కామా పెట్టారు. కాగా సుదీర్ఘ విరామం తరువాత ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలో నటించి విజయం సాధించారు.మళ్లీ చిన్న గ్యాప్ తరువాత తాజాగా తమిళంలో విజయ్ కథానాయకుడుగా నటిస్తున్న పులి చిత్రంలో రాణిగా వెండితెరపైకి రానున్నారు. కాగా ఇటీవల విడుదలై అద్భుతాలు సృష్టించిన బాహుబలి చిత్రంలో రమ్యక్రిష్ణ పోషించిన శివగామి పాత్రను శ్రీదేవి చేయాల్సింది. ముందుగా ఆమెనే ఈ పాత్రకు ఎంపిక చెయ్యాలనుకున్నారు.అయితే శ్రీదేవి అధిక పారితోషికం డిమాండ్ చేయడంతో శివకామి పాత్ర రమ్యక్రిష్ణను వరించింది. బాహుబలి చిత్రంలో శివగామి పాత్ర పండడంతో ఇప్పుడు బాహుబలి-2 లో శ్రీదేవి నటించాలని ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయాన ఆ చిత్ర దర్శకుడు రాజమౌళినే వెల్లడించినట్లు చిత్ర వర్గాల సమాచారం. అయితే బాహుబలి-2లో అతిలోకసుందరి నటించే అవకాశం లేదని తెలుస్తోంది.అయితే రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్న చందాన ఏమో రాజమౌళి తలచుకుంటే శ్రీదేవిని నటింపజేయనూ వచ్చు అంటోంది ఒక వర్గం. -
విశ్వరూపం చూపిన రమ్యకృష్ణ
'బాహుబలి' సినిమా మొదటి సీన్ లో రమ్యకృష్ణ అద్భుతమైన ఎంట్రీ ఇచ్చారు. తర్వాత వాటర్ ఫాల్స్ నేపథ్యంలో ఆరడుగుల, ఆరు ప్యాక్ ల హీరో ప్రభాస్ శివుడిగా ఎంట్రీ ఘనంగా కనపడుతుంది. ఎవ్వడంట ఎవ్వడంట పాట. ఆ తర్వాత పాల జలపాతాల నేపథ్యంలో మిల్కీబ్యూటీ తమన్నా.. అవంతికగా దర్శనం ఇస్తుంది. కట్టప్పగా సత్యరాజ్, అస్లాంఖాన్ పాత్రలో సుదీప్ ఎంట్రీలు కూడా స్క్రీన్ నిండుగా ఉంటాయి.. మాహిష్మతి రాజ్య వైభవం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. విలన్ పాత్రధారి రానాకు కూడా దర్శకుడు రాజమౌళి బుల్ ఫైట్ తో మంచి ఎంట్రీ ఇచ్చారు. ఇక దేవసేన పాత్రలో అనుష్క గురించి ఎంత చెప్పినా తక్కువే. సంకెళ్లు, చింపిరి జుట్టుతో ఆమె మేకప్ గుండెలను పిండేసేలా ఉంటుంది. శివుడు, అవంతికల మధ్య రొమాన్స్ బాగా పండింది. అంతలోనే తన కార్యాన్ని పూర్తి చేస్తానని శివుడు అవంతికకు మాట ఇవ్వడం, అతడి జుట్టు ఎగురుతుండగా ఇంటర్వెల్ పడుతుంది. సెకండాఫ్ లో శివగామిగా రమ్యకృష్ణ తన నటనా వైదుష్యాన్ని ప్రదర్శిస్తుంది. మమతల తల్లి పాట ఇక్కడే వస్తుంది. మనోహరి పాటలో నోరా ఫతేహి, స్కార్లెట్ విల్సన్ హొయలొలికించారు. కాలకేయ యుద్ధానికి దారితీసే పరిస్థితులు, కుర్చీ కోసం కొట్లాటలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ ఆ తర్వాత వస్తాయి. కాలకేయ యుద్ధం సినిమా మొత్తానికి హైలైట్. వీఎఫ్ఎక్స్ వాళ్ల పనితనానికి ఇది మచ్చుతునక. అనుకున్న సమయం కంటే ఎందుకు ఎక్కువ పట్టిందనేది ఈ యుద్ధం చూస్తే అర్థమవుతుంది. సుదీర్ఘంగా సాగే ఈ యుద్ధంలో అనేక మలుపులు, ట్విస్టులు ఉంటాయి. యుద్ధం చివర్లో బిజ్జలదేవగా నాజర్, శివగామిగా రమ్యకృష్ణ నటనలో విశ్వరూపం చూపిస్తారు. -
రాజసం చూపిస్తున్న సౌమ్యాదేవి,శివగామి
-
1500 ఏళ్ల నాటి ఆలయంలో...
మైసూర్కు 40 కిలో మీటర్ల దూరంలో గల తొన్నూరు గ్రామంలోని ఓ పురాతన దేవాలయం అది. అక్కడ వేణుగోపాల స్వామి, నంబి నారాయణ స్వామి కొలువై యున్నారు. కర్ణాటకలో ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయాన్ని 1500 ఏళ్ల క్రితం నిర్మించారట. నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠీ, నాజర్, సంపత్, చలపతిరావు, బ్రహ్మాజీ తదితరులంతా సంప్రదాయ దుస్తుల్లో ఈ గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం కోసం వీరందరిపై ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. తేజ, పోసాని కృష్ణ మురళి తదితరుల దగ్గర పనిచేసిన కల్యాణ్ కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘అష్టాచమ్మా’ ఫేమ్ రామ్మోహన్తో కలిసి నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మనం’ తర్వాత కొంత విరామం తీసుకుని బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంపై ఫోకస్ చేసిన నాగార్జున, ఈ కథ నచ్చడంతో వెంటనే రంగంలోకి దిగిపోయారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠీ కథానాయికలు. ఒకప్పుడు నాగ్-రమ్యకృష్ణలది హిట్ పెయిర్. ‘హలో బ్రదర్’ లాంటి హిట్ సినిమాల్లో నటించిన ఈ జంట 15 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి చేస్తున్నారు. గత మూడు రోజులుగా ‘సోగ్గాడే చిన్ని నాయన’ షూటింగ్ మైసూర్ పరిసరాల్లో జరుగుతోంది. ఈ నెల 15 వరకు అక్కడే షెడ్యూలు జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకూ అధికారిక సమాచారం లేదు. అయితే నాగార్జున మాత్రం చాలా ఉత్సాహంగా సోషల్ మీడియాలో షూటింగ్ లొకేషన్లోని పలు ఫొటోలను పోస్ట్ చేస్తూ, సినిమా గురించి పలు వాఖ్యలు చేస్తున్నారు. పైన ఉన్న ఫొటో కూడా ఆయనే పోస్ట్ చేశారు. -
సోగ్గాడు బిజీ బిజీ
హీరో నాగార్జున పేరు చెబితే, ఇప్పుడు అందరికీ బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు?’ కార్యక్రమం గుర్తొస్తోంది. అతి కొద్దిరోజుల్లోనే అందరినీ ఆయనకు అభిమానుల్ని చేసిన టీవీ షో అది. ఒకపక్క ఆ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్న నాగార్జున కొద్దికాలం విరామం తరువాత ఇప్పుడు సినిమా షూటింగ్లోనూ బిజీగా పాల్గొంటున్నారు. అందరినీ ఆకట్టుకున్న నిరుటి ‘మనం’ తరువాత ఇప్పుడు ఆయన ఏకంగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అనే పేరు ప్రచారంలో ఉంది. ప్రతిభావంతులైన కొత్తవాళ్ళను పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందుండే నాగార్జున అదే పద్ధతి కొనసాగిస్తూ, ఈ చిత్రంతో కల్యాణ్కృష్ణ అనే కొత్త దర్శకుణ్ణి పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, పరిసరాల్లో దాదాపు 20 రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంది. వచ్చేవారం నుంచి దాదాపు నెల నుంచి నెలన్నర దాకా హైదరాబాద్ పరిసరాల్లోనే తదుపరి షెడ్యూల్ జరపడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు భోగట్టా. ఈ ప్రధానమైన షెడ్యూల్లో చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొననున్నారని సమాచారం. ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠీ కథానాయికలు. బ్రహ్మానందం, ఝాన్సీ, హంసానందిని తదితరులు ఇతర తారాగణం. గత ఏడాది కాలంగా మంచి జోరు మీదున్న సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. అన్నట్లు, ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక భాగాలను ఇతర రాష్ట్రాలలో చిత్రీకరించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయట! అందుకోసం తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల్లో కూడా లొకేషన్ల అన్వేషణ జరుగుతోంది. ఒకప్పటి అక్కినేని హిట్ గీతం పల్లవిలోని మాటలనే పేరుగా పెట్టుకొన్న ఈ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వివరాలు అధికారికంగా త్వరలో తెలుస్తాయి. -
రమ్యకృష్ణ పారితోషికం ఎంతో తెలుసా?
కోటికి 10 లక్షలు మాత్రమే తక్కువగా పారితోషికం తీసుకుంటున్న పడయప్పా నటి ఈ తరం కథానాయికలకు పోటీగా నిలుస్తున్నారనేది కోడంబాక్కం టాక్. నటి రమ్యకృష్ణ కథానాయికిగా ఎన్ని చిత్రాలు చేసినా ఎన్ని విజయాలు సొంతం చేసుకున్నా పడయప్పా చిత్రంలో నీలాంబరి పాత్ర ఆమె కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయింది. అలాంటి నటి ఇప్పుడు ఆంటీ పాత్రలు పోషిస్తున్నారు. అదీ అడపా దడపా మాత్రమే. అయితే పారితోషికంలో మాత్రం ఈ తరం హీరోయిన్లతో పోటీ పడుతున్నారట. తాజాగా ఆంబళ చిత్రంలో రమ్యకృష్ణ అత్తగా నటిస్తున్నారు. విశాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఆంబళ. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్. ఈ చిత్రంలో విశాల్ అత్తలుగా రమ్యకృష్ణ, కిరణ్ రాథోడ్, ఐశ్వర్య నటిస్తున్నారు. కిరణ్రాథోడ్ ఇంతకుముందు సుందర్సి దర్శకత్వంలో కమలహాసన్ సరసన అన్భే శివం చిత్రంలో నటించారు. ప్రస్తుతం అంతగా అవకాశాలు లేవు. దీంతో సుందర్ సి ఆంభళ చిత్రంలో అవకాశం కల్పించారు. ఈ అమ్మడి పారితోషికం 10 లక్షలట. ఇక మరో అత్తగా నటిస్తున్న ఐశ్వర్య పారితోషికం ఐదు లక్షలని సమాచారం. రమ్యకృష్ణ పారితోషికం ఎంతో తెలుసా? 90లక్షలట. ఈమె ఈ చిత్రం కోసం రోజుకు మూడు లక్షలు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. ఆ విధంగా ఈ చిత్రానికి 30 రోజులు కాల్షీట్స్ కేటాయించారట. ఆ విధంగా గణాంకాలు వేస్తే రమ్యకృష్ణ పారితోషికం 90 లక్షలకు చేరింది. ఇదే గనుక నిజం అయితే ఆమె హీరోయిన్గా నటిస్తున్న సమయంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుని వుండరు. అత్తగా 90 లక్షలు తీసుకుంటూ దటీజ్ రమ్యకృష్ణ అని నిరూపించుకుంటున్నారన్నమాట. -
కన్యక మహిమలు
కన్యకాపరమేశ్వరి అమ్మవారి జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర’. ‘విశ్వమాత’ అనేది ఉపశీర్షిక. వాసవిగా సందీప్తి, పరాశక్తిగా రమ్యకృష్ణ నటించారు. శ్రీపాద రామచంద్రరావు దర్శకుడు. జె.ఆర్.పద్మిని, కోంపల్లి చంద్రశేఖర్, కాసనగొట్టు రాజశేఖర్గుప్త నిర్మాతలు. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ -‘‘వాసవి చరిత్రతో పాటు, అమ్మవారి మహిమలను కూడా ఇందులో చూపిస్తున్నాం. భక్తి ప్రధానమైన ఈ చిత్రం నేటి తరాన్ని కూడా ఆకట్టుకుంటుందని మా నమ్మకం’’ అని తెలిపారు. నేటి తరం ప్రేక్షకులకు కూడా నచ్చే విధంగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడనీ, ఇలాంటి చిత్రంలో తానూ భాగమైనందుకు ఆనందంగా ఉందని రంగనాథ్ అన్నారు. యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: వాసూరావు, సాహిత్యం: సి.నారాయణరెడ్డి, వెనిగళ్ల రాంబాబు, ఆర్.కె.రాము. -
రమ్యకృష్ణ విషయంలో అస్సలు వంక పెట్టడానికి లేదు!
పరికిణీలూ పూలజడలూ... పట్టుచీరలూ ఏడువారాల నగలూ... ముంగిట్లో ముత్యాల ముగ్గులూ... పెరట్లో ధాన్యాల రాశులూ... అరిసెలూ సున్నుండలూ కజ్జికాయలూ... ఓర చూపులూ దోర నవ్వులూ చిలిపి ముద్దులూ.. ఆక్రోశాలూ.. ఉక్రోషాలూ.. తగాదాలూ తప్పిదాలూ... కృష్ణవంశీ సినిమా అంటే ఇవన్నీ ఉండాల్సిందే! పండగకు అమ్మమ్మగారి ఊరెళ్లినట్టుగా... ఇంట్లో ఐదు రోజుల పెళ్లి జరిగినట్టుగా... కృష్ణవంశీ సినిమా చూస్తుంటే ఏదో సంబరం..! ఇక్కడ సక్సెస్లూ, ఫెయిల్యూర్లూ పక్కన పెట్టండి. మన మూలాల్ని మనకు గుర్తు చేయడమే కృష్ణవంశీ చేసే పని. గుడ్ డెరైక్టర్ అనిపించుకున్న కృష్ణవంశీ... తను మాత్రం బ్యాడ్ హజ్బెండ్ని, బ్యాడ్ ఫాదర్ని అని చెబుతున్నారు. ఆయన తాజా సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’ కబుర్లతో పాటు కెరీర్ అచ్చట్లు... ఫ్యామిలీ ముచ్చట్లు మనసు విప్పి ‘సాక్షి’ ముందు ఆవిష్కరించారు. ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రాన్నే అటూ ఇటూ మార్చి ‘గోవిందుడు ఆందరివాడేలే’గా తీశారని కామెంట్... కృష్ణవంశీ: ఆ సినిమాను ఆదర్శంగా తీసుకుంటే తప్పేంటి? ఇవాళ్టి రోజుల్లో మన కుటుంబ వ్యవస్థలో ఎవరూ ఎవర్నీ కలుపుకొని పోవడానికి పెద్దగా ఆసక్తి కనబర్చడంలేదు. అందుకే ఇలాంటి సినిమాల అవసరం ఉంది. నరుక్కోవడాలు, చంపుకోవడాలు, బాంబులు విసరడాలు.. ఇంకెంత కాలం చెప్పండి? మన సెన్సిబిల్టీకి తగ్గ సినిమా తీయాలని ఇది తీశాను. అది నచ్చింది కాబట్టే, ఈ సినిమాకి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఫ్యామిలీ సినిమాలంటే ఒక మనవడో, మనవరాలో కుటుంబాన్ని కలపడానికి ట్రై చేయడం.. ఇదేనా.. వేరే కథలు రావా? వాస్తవానికి అప్పటి ‘దేవుడు చేసిన మనుషులు’, ఆత్మబంధువు’, ‘సంబరాల రాంబాబు’, ‘వారసుడొచ్చాడు’... ఇవన్నీ కూడా ఎవరో ఒకరు కుటుంబాన్ని కలిపే కథలే కదా. అన్ని కథలనూ అందరూ ఇష్టపడి చూశారుగా. ఇన్ని సినిమాలున్నప్పుడు మళ్లీ అవే చేయడం ఎందుకు? మన కథలన్నీ రామాయణ, భారతాల నుంచే పుడుతున్నాయి. ఎవరేం చేసినా, వాటి చుట్టూనే తిరగాలి. తప్పదు. అయినా నేనేం ఇది కొత్త కథ అనడం లేదు. కాకపోతే.. ‘గోవిందుడు..’ సినిమా కథ వేరు.. ఆ కథలు వేరు. అచ్చ తెలుగు సంప్రదాయాలతో సినిమా తీశారు సరే.. మరి హీరోయిన్ కాజల్ అగర్వాల్తో మందు కొట్టించే సన్నివేశం చేయడం అవసరమా? సమాజంలో ఎవరూ చేయడంలేదా. ఉన్నదే చూపించా. ఏం మగవాళ్లు మందు తాగొచ్చు కానీ, ఆడవాళ్లు తాగకూడదా? మగ, ఆడ సమానం అని హక్కులు మాట్లాడుతుంటారు కదా. మగవాళ్లు పెట్టిన ఆంక్షల ప్రకారం స్త్రీ బతకాలా? సినిమా గురించి పక్కనపెడితే.. వ్యక్తిగతంగా ఆడవాళ్లు మందు తాగడాన్ని మీరు హర్షిస్తారా? తప్పకుండా.. ఎందుకంటే అలవాట్లనేవి వారి వ్యక్తిగతం. పురుషాధిక్య ప్రపంచంలో ఆలోచనలన్నీ పురుషుడి పక్షానే ఉంటున్నాయి. నా దృష్టిలో స్త్రీ అంటే ఏంటో చెప్పనా.. ‘స్త్రీలు నాకన్నా తక్కువ అని నేననుకోను.. నాకన్నా పై మెట్టు మీద ఉన్న జాతికి చెందినవారు’ అనుకుంటాను. పదిమందికి నష్టం కలిగించని దేన్నయినా నేను ఆమోదిస్తాను. ‘‘కృష్ణవంశీతో ఇప్పుడు సినిమా అంటే నటన నేర్పిస్తాడు.. నేను అందుకు రెడీగా లేను’’ అని చిరంజీవిగారు బహిరంగంగా పేర్కొనడం పట్ల మీ ఫీలింగ్? అది ఆయన గొప్పతనం. ఆయనకు తెలియని యాక్టింగా? ది బెస్ట్ నుంచి ది వరస్ట్ అనదగ్గ దర్శకులందరితోనూ ఆయన చేశారు. ఆయన డైనమిజమ్, లైవ్లీనెస్, ఎమోషన్ అన్నీ ఇష్టం. గత తరానికి మహానటుడు ఎన్టీఆర్ ఓ నిఘంటువు అయితే.. ఈ తరానికి చిరంజీవి టెక్ట్స్బుక్. ఆయన నా గురించి అలా అన్నారంటే అదంతా ఆయన అభిమానం. ఈ చిత్ర ఆడియో వేడుకలో మీరు ఎమోషనల్ అయ్యారేం? మూడేళ్లుగా ఎదురైన అనుభవాలు, చూసిన పరిస్థితులు, నాతో కొందరు ప్రవర్తించిన విధానం, సినిమాలను సరిగ్గా తీయలేకపోయినందుకు పడిన బాధ.. ఇలా కొన్ని కారణాలున్నాయి. ఈ పరిస్థితుల్లో సడన్గా అన్నయ్య (చిరంజీవి)లాంటి పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, చరణ్ లాంటి హీరో... నన్ను నమ్మి కథ పూర్తిగా వినకుండానే ‘సినిమా చేసేస్తాం’ అన్నారు. అప్పుడు భావోద్వేగానికి గురవడం సహజం కదా! ఇన్నేళ్ల కెరీర్లో జయాపజయాలకు అతీతంగా స్పందించడం మీకు అలవాటై ఉంటుంది. అలాంటిది ఏవో కొన్ని సినిమాలు ఆడకపోతే ఎమోషనల్ కావడమా? ‘సిందూరం’ చిత్రాన్ని తీసుకుందాం. ఆ సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ గురించి పక్కనపెడదాం. వంద శాతం క్రియేటివ్ శాటిస్ఫేక్షన్ ఉన్న చిత్రం అది. కానీ, గత రెండు, మూడేళ్లల్లో నేను తీసిన సినిమాల్లో నేననుకున్నది తెరపై పూర్తిగా తీయలేకపోయాను. నేననుకున్నది స్క్రీన్ మీద పెట్టలేకపోయాను. దానికి రకరకాల కారణాలున్నాయి. ‘పైసా’ని తీసుకుందాం. మూడు నెలల్లో పూర్తి చేసిన ఆ చిత్రం విడుదలకు రెండేళ్లు ఆగాల్సి వచ్చింది. నేననుకున్నది తీయలేకపోవడానికి కారణం.. నేను ఎదుర్కొన్న పరిస్థితులు అలాంటివి. జనరల్గా ‘మేం అనుకున్నది తీయలేకపోయాం’ అని అప్కమింగ్ డెరైక్టర్లు అంటుంటారు. మీలాంటి దర్శకులు ఇలా అనడమా? నాలాంటి దర్శకులకే ఆ పరిస్థితి వస్తుంది. ఎందుకంటే, నేను రెగ్యులర్ సక్సెస్ఫుల్ ఫార్ములాలో సినిమాలు తీసే డెరైక్టర్ని కాదు. ఓ కొత్త జానర్లో తీస్తాను. సో.. నిర్మాతను, ఆరిస్టులను కన్విన్స్ చేయడం కష్టం. ఇప్పుడు ‘గోవిందుడు..’ సక్సెస్ అయ్యింది కాబట్టి, తర్వాత కూడా మళ్లీ అలాంటి సినిమానే చేద్దాం అంటారు. కానీ, నేనందుకు విరుద్ధం. వాళ్ల మైండ్సెట్ని దీన్నుంచి నా జానర్లోకి తీసుకెళ్లడానికి కష్టం అవుతుంది. కొత్త జానర్లో సినిమాలు చేసే హీరోలు లేరంటారా? ఇండియాలో ఆమిర్ఖాన్ తప్ప ఎవరున్నారు. ఒక్క ఆమిర్ఖాన్ ఎంతమందిని శాటిస్ఫై చేస్తాడు. అయినా హీరోలను తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే, వాళ్లు కనెక్ట్ కాని కథలో ఎలా ఇమిడిపోగలుగుతారు? ఆమిర్ఖాన్నే తీసుకుందాం. ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన ‘లగాన్’ చిత్రం తీసిన దర్శకుడు ఆశుతోష్ గోవారీకర్ ‘స్వదేశ్’ కథతో ఆమిర్ఖాన్ని కలిస్తే, ‘నాకు కనెక్ట్ కావడం లేదు’ అని సింపుల్గా చెప్పేశాడు. ‘రోబో’ కథను షారుక్ ఖాన్కి శంకర్ చెబితే, ‘నా వల్ల కాదు’ అన్నాడు. డెరైక్టర్లను హీరోలు నమ్మకపోవడం ఎక్కువయ్యిందంటారా? అంత ఆలోచించలేదు నేను. ఏ హీరో అయినా కథకు కనెక్ట్ కాకపోతే, పాత్రకు ఎలా న్యాయం చేయగలుగుతాడు? కనెక్ట్ కాకపోతే కాన్ఫిడెన్స్ ఉండదు. పోనీ.. డెరైక్టర్ చెప్పిందల్లా చేసుకుపోవడానికి ఆ హీరో ‘రోబో’ ఏం కాదు కదా! గత ఐదేళ్లనే తీసుకుందాం.. హీరో పేరు మీదే 50, 60 కోట్లూ బిజినెస్ అవుతోంది. అన్నీ హీరో పేరు మీదే ఆధారపడుతున్నప్పుడు అతను జాగ్రత్తపడటంలో తప్పేంటి? గుళ్లో రాముడి విగ్రహం ఉందనుకోండి.. రాముడి గురించి ఆలోచిస్తారు తప్ప, దాన్ని చెక్కినవాడి గురించి మీరు ఆలోచిస్తారా? అంటే.. హీరో వర్షిప్ అనేది కరెక్టేనంటారా? ప్రపంచంలో ఏ భాషకు చెందిన పరిశ్రమను తీసుకున్నా.. హీరో వర్షిప్ కచ్చితంగా ఉంది. హాలీవుడ్ సినిమా ‘రాంబో’ని తీసుకుందాం. ఆ చిత్రదర్శకుడు ఎవరు అంటే ఎవరూ చెప్పలేరు? హీరో ఎవరు అంటే.. టకీమని చెప్పేస్తారు. సో.. ఎంత ప్రతిభ ఉన్న దర్శకుడైనా హీరోను అప్రోచ్ కావాల్సిందేనా.. హీరోలు తమంతట తాము రారా? అలా ఎందుకు ఎదురుచూడాలి? ఇప్పుడు నేనెవర్నీ నాకు అవకాశం ఇవ్వండని అడగను. కానీ, నా దగ్గరున్న కథకు ఏ హీరో యాప్ట్ అనిపిస్తే.. వాళ్లను అడుగుతాను. నేను అడగకుండా వాళ్లంతట వాళ్లు ఎందుకు వచ్చి అడగాలి? అసలు ఎవరైనా ఎందుకు అడుగుతారు? మీ సినిమాకీ సినిమాకీ మధ్య గ్యాప్ వస్తోంది? అనుకోకుండా వచ్చిన గ్యాప్ అది. ఇక ఆ దశ అయిపోయింది. గ్యాప్ లేకుండా చేస్తా. ఆ దశ పోయిందని బలంగా నమ్ముతున్నారా? ‘మురారి’ తీశాను. సంకల్పం అనేది ఆ చిత్రంలోని ప్రధానాంశం. నిజంగా కూడా నాది అదే మైండ్ సెట్. నేను అయిపోయానని ప్రపంచం ముద్ర వేసినప్పుడు నేనే తిరిగొచ్చాను. నేనే చిరంజీవిగారిని, చరణ్ని కలిసి, కన్విన్స్ చేశాను. ‘మన ఇంటిని మనమే శుభ్రం చేసుకోవాలి.. మన కుటుంబాన్ని మనమే కలుపుకోవాలి’ అని ‘గోవిందుడు..’లో చెప్పాను. నిజజీవితానికి కూడా అదే వర్తిస్తుంది. నేను ఇంట్లో కూచుంటే ఎవరు పిలుస్తారు. మన ప్రయత్నం ఉంటేనే ఎదుటివాళ్లకి ‘ఇతని దగ్గర ఏదో ఉంది’ అనిపిస్తుంది. మీరెప్పుడూ ఎవరి దగ్గరా అవకాశాలు అడిగినట్లు లేరే? అడగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అడగాలి. అందుకే అన్నయ్యను కలిశాను. ‘నిన్నే పెళ్లాడతా’ అప్పట్నుంచి అన్నయ్య ఇంటి తలుపులు నా కోసం తెరిచి ఉన్నాయి. అందుకే వెళ్లి కలిశాను. ఎక్కాల్సిన గడపే ఎక్కా! ప్రొడక్షన్ ఎందుకు ఆపేశారు? నిర్మాణం నా వల్ల కాదు. నేను డబ్బు మనిషిని కాదు కాబట్టి, నిర్మాణం నాకు సూట్ కాదు. కొంతమంది దర్శకులతో పోల్చితే దర్శకుడిగా కూడా మీ సంపాదన తక్కువేనేమో? నాకు సరిపోయేంత డబ్బు ఉంది. ఒకవేళ అది సరిపోదు.. ఇంకా ఎక్కువ కావాలంటే మా ఆవిడ దగ్గర బోల్డంత డబ్బు ఉంది (నవ్వుతూ). మనిషికి సరిపోయేంత డబ్బు అంటే... ఎంత? ఒక మంచి ఇల్లు, ఏసీ రూము, తిరగడానికి కారు, అందులో పుష్కలంగా పెట్రోల్ పోయించగలిగే కెపాసిటీ, ఏడాదిలో రెండు సార్లు విహార యాత్రకు వెళ్లడానికి కావాల్సిన డబ్బు, రెండు పూటలా తిండి, తాగడానికి మందు, పీల్చడానికి సిగరెట్లు, వేసుకోవడానికి మంచి బట్టలు, కట్టుకోవడానికి సెల్ఫోన్ బిల్లు, మన మీద ఆధారపడే మన కుటుంబ సభ్యులను సౌకర్యంగా ఉంచగలిగే స్తోమత... ఇంతకు మించి ఏం ఉన్నా... వాడు ఆ ఇంటికి వాచ్మేన్ కిందే లెక్క. పెద్ద ఇల్లు కట్టుకున్న తర్వాత, దాన్ని మెయిన్టైన్ చేయడానికి పనిమనుషులను పెట్టుకోవాలి. వాళ్లు పనులు చేసుకుని బయటికెళుతుంటే.. ఇంట్లోంచి ఏమైనా తీసుకెళ్లిపోతారేమో అని టెన్షన్.. లోపలి నుంచి ఎవరైనా బయటికొస్తే టెన్షన్.. ఇక సుఖం ఏం ఉంటుంది. భక్తి బాటలో వెళుతున్నట్లున్నారు. వయసు తెచ్చిన మార్పా? వయసా? నాకు వయసు పైబడిందని అనుకోవడం లేదు. అయినా మనకు పదేళ్ల వయసులో కరెక్ట్ అనిపించినది తర్వాత కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇరవయ్యేళ్ల వయసులో చేసినది ముప్ఫయ్ ఏళ్లల్లో తప్పనిపించొచ్చు. అనుభవం నేర్పే పాఠాల దారిలోనే మనసు వెళుతుంది. ఇలాంటి మార్పుని ‘మాట మార్చడం’ అంటారేమో? నేను మాట మార్చలేదు. నా విధానం మారిందని చెబుతున్నా. ఇప్పుడు మనం ఒక చొక్కా కొనుక్కుంటాం. ఓ ఏడాది తర్వాత అది పాతదైపోతుంది. దాన్ని మార్చేసి, కొత్త చొక్కా కొనుక్కుంటాం కదా. ఇదే బాగుంది కదా అని వేసుకోం కదా. ఇప్పుడు మా అబ్బాయిని తీసుకుందాం. వాటికి ఒకటి, రెండేళ్లప్పుడు నిద్రపోవడాన్ని ‘తాచ్’ అనేవాడు. ఇప్పుడా మాటను మేం సరదాగా అంటే, నవ్వేస్తాడు. ఇప్పుడు నిద్ర అంటాడు. ఇంకొన్నాళ్ల తర్వాత స్లీప్ అంటాడేమో. అంటే.. మాట మార్చాడని అనలేం కదా! ఎప్పుడూ ఒకే మాట మాట్లాడం కదా. జ్ఞానం పెరిగేకొద్దీమాట తీరు మారుతుంది. కానీ, ఎదుటి వ్యక్తిని మోసం చేయాలని ఉద్దేశపూర్వకంగా మాట మార్చితే అది తప్పు. మీ సినిమాల్లో మన అరిసెలు, సున్నుండలు అన్నీ చూపిస్తారు. పర్సనల్గా మీకెలాంటి ఫుడ్ ఇష్టం? నాకు సున్నుండలు ఇష్టం. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారింట్లో పులిహోర ఇష్టం. రమ్యకృష్ణ చైనీస్ వంటకాలు తిందామంటుంది. సో.. దాన్నీ ఇష్టపడతాను. నాకు పప్పుచారు, ఆవకాయ ఇష్టం. అవి ఉంటే ఇష్టంగా తింటాను. అవి లేకపోతే నాకేదైనా ఒకటే! మన సంస్కృతి, సంప్రదాయాలపై మీరు విపరీతమైన అభిమానం చూపిస్తారు.. ఎందుకని? మన నేటివిటీ మీద మనకే ప్రేమ లేకపోతే వేరేవాళ్లకి ఎందుకుంటుంది? మన మూలాలను వెతుక్కోవాల్సి వస్తోంది. అవి గుర్తు చేయడం కోసమే సినిమాల్లో మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తాను. తెలుగు భాష చచ్చిపోతోందని కొంతమంది ఆంగ్లంలో బాధపడిపోతుంటారు. దానివల్ల లాభమేంటి? ఆరోగ్యం విషయంలో మీరెంత శ్రద్ధగా ఉంటారు? నాకు శ్రద్ధ లేదు. మా ఇద్దరికీ కలిపి రమ్యకు ఉంది. ఆరు నెలలకోసారి జనరల్ చెకప్స్ అంటూ చంపేస్తుంది. ఏం టెస్టులు అని విసుక్కుంటే గొడవ చేసేస్తుంది. నాకు సంబంధించి చాలా విషయాలు తనే చూసుకుంటుంది. అంత జాగ్రత్తగా ఉండే రమ్యగారు మిమ్మల్ని సిగరెట్లు మానేయమని ఎప్పుడూ అనలేదా? ఎందుకు చెప్పదు. ఆవిడ బాధ్యత ఆవిడ చేస్తుంది. నా బాధ్యత నేను చేయాలి కదా... (నవ్వు) మీరు తీసే సినిమాల్లో అందమైన కుటుంబాలు ఉంటాయి.. మరి.. మీ తోడబుట్టినవాళ్ల గురించి? ఓ తమ్ముడు చనిపోయాడు. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. అందరూ హైదరాబాద్లోనే ఉన్నారు. అందరూ హ్యాపీ. నేను ఫ్యామిలీ సినిమాలు తీస్తాను కానీ.. యాక్చువల్గా చాలా బ్యాడ్ ఫ్యామిలీ మేన్ని. ఉన్నమాట చెప్పాలంటే.. నాకు సినిమాలు తప్ప వేరే దేని మీదా ఆసక్తి ఉండదు. అదేంటి.. మీరు కానిది మీరు తెరపై ఎలా ఆవిష్కరించగలుగుతున్నారు? హ్యుమన్ ఎమోషన్స్ అనేది బయటికి చెప్పలేను కానీ.. లోపల ఉందేమో.. నేను కానిది తీస్తున్నానని ఎందుకు అనుకుంటున్నారు. నేనేం రాక్షసుణ్ణి కాదు. పక్కా ఎమోషనల్ పర్సన్ను. ఫైనల్గా.. మీ తదుపరి చిత్రం గురించి? ఏమీ నిర్ణయించుకోలేదు. ఓ రెండు నెలలు పూర్తిగా రిలాక్స్ అయ్యి, తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తా. - డి.జి. భవాని మీరు చాలా సింపుల్గా కనిపిస్తారు.. బ్రాండెడ్ దుస్తులు వాడరా? నా డ్రెస్సులన్నీ మా ఆవిడే కొంటుంది. నన్ను ఆవిడెలా చూడాలనుకుంటుందో అలాంటి బట్టలు కొంటుంది. వాటిలో నాకు సౌకర్యవంతంగా ఉన్నవాటిని తొడుక్కుంటా. రమ్యకృష్ణగారి కోసం మీరేమీ షాపింగ్ చేయరా? లేదు. రమ్యకు నేను ఇచ్చిన అతి విలువైన బహుమతులు రెండున్నాయి. అవి ‘కృష్ణవంశీ, బేబో’. మా అబ్బాయి పేరు ఋత్విక్. మేం ముద్దుగా బేబో అని పిలుస్తాం. అసలు మొగుడుగా నువ్వు నాకేమీ ఇవ్వవా? అని రమ్య అడిగితే, ‘కృష్ణవంశీ’ని ఇచ్చాను కదా అంటుంటాను. రమ్య చాలా గ్రేట్. సింపుల్ పర్సన్. బేబో ఏం చదువుతున్నాడు? నాలుగో తరగతి. ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రాన్ని చూశాడా? వాడికి రామ్చరణ్ అంటే ఇష్టం. ‘మగధీర’ను లెక్కలేనన్ని సార్లు చూశాడు. ఆ డీవీడీ అరిగిపోయింది కూడా. ‘గోవిందుడు..’ చూశాడు. వాడికి బాగా నచ్చింది. భర్తగా, తండ్రిగా మీరెంతవరకు బెస్ట్? నేను చాలా బ్యాడ్ హజ్బండ్ని.. బ్యాడ్ ఫాదర్ని. మరి.. మిమ్మల్నెంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న రమ్యకృష్ణగారు మీరు ‘బ్యాడ్’ అంటే భరిస్తారా? ఒకవేళ అందుకే ఇష్టపడిందేమో (నవ్వుతూ). నేను బ్యాడ్ కాబట్టే, తను బెస్ట్ మదర్, బెస్ట్ వైఫ్గా ఉంటుందేమో. కుటుంబాన్ని చూసుకునే విషయంలో రమ్య చాలా చాలా బెస్ట్. అస్సలు వంక పెట్టడానికి లేదు. రమ్యకృష్ణ, బేబో చెన్నయ్లో ఉంటున్నట్లున్నారు? నేను కూడా చెన్నయ్లోనే ఉంటున్నాను. షూటింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడికొస్తున్నాను. ఫ్యామిలీతో హాలీడే ట్రిప్ వెళుతుంటారా? తప్పనిసరిగా వెళతాం. అది కూడా రమ్యే ప్లాన్ చేస్తుంది. ఫలానా చోటకి వెళతాం అని చెబుతుంది. ఇక, టికెట్లు బుక్ చేయడానికి, సూట్కేసులు మోయడానికి నేను రెడీ అయిపోతా (నవ్వుతూ). -
సోగ్గాడే.. చిన్ని నాయనా...
అక్కినేని ‘ఆస్తిపరులు’ చిత్రంలో ఆల్టైమ్ హిట్ సాంగ్... ‘సోగ్గాడే... చిన్ని నాయనా. ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు...’. పి.సుశీల పాడిన ఆ పాట ఆ రోజుల్లో యువతను ఓ ఊపు ఊపేసింది. అయితే ఆ పాటలో నటించింది అక్కినేని కాదు - జగ్గయ్య, వాణిశ్రీ. ఇప్పటికీ ఆ పాటకు అభిమానులున్నారంటే అది అతిశయోక్తి కాదు. అందుకేనేమో.. నాగార్జున నటించనున్న చిత్రానికి ఈ పాట పల్లవిలోని ‘సోగ్గాడే... చిన్ని నాయన’ అనే పదాన్ని టైటిల్గా ఖరారు చేసినట్టుగా సమాచారం. అష్టాచమ్మా, ఉయ్యాల-జంపాల చిత్రాల నిర్మాత రామ్మోహన్తో కలిసి నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. కల్యాణ్కృష్ణ ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నారు. కొత్త దర్శకుల్ని పరిచయం చేయడంలో నాగ్ ఎప్పుడూ ముందుంటారు. రామ్గోపాల్వర్మ, వైవీఎస్ చౌదరి, వీఆర్ ప్రతాప్, దశరథ్ తదితరులు నాగార్జున ద్వారానే దర్శకులైన విషయం తెలిసిందే. త్వరలో ఈ జాబితాలోకి కల్యాణ్కృష్ణ కూడా చేరతారని సినీ వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి. నిర్మాత రామ్మోహనే స్వయంగా కథ అందించిన ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఆయన సరసన రమ్యకృష్ణ ఓ కథానాయికగా నటించనుండగా, మరో కథానాయికను ఎంపిక చేయాల్సి ఉంది. అక్టోబర్లో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి కెమెరా: పీఎస్ వినోద్, ఆర్ట్: రవీందర్. -
ప్రభాస్ ను రక్షించిన రమ్యకృష్ణ!
హీరో ప్రభాస్ ను సీనియర్ నటి రమ్యకృష్ణ రక్షించింది. నిజజీవితంలో కాదు తెరపై. బాహుబలి సినిమాలో ప్రభాస్ కు తల్లిగా రాజమాత పాత్రలో ఆమె నటిస్తోంది. చిన్నప్పుడు శివుడు(ప్రభాస్)ను శత్రువుల బారి నుంచి కాపాడుతుంది. తమ రాజ్యంపై దాడి చేసిన శత్రువుల బారి నుంచి శివుడు(ప్రభాస్)ను రక్షించేందుకు రాజమాత అతడిని తీసుకుని పారిపోతోంది. ఈ క్రమంలో ఒకచోట నది దాటాల్సిరాగా, తన ప్రాణాలన్ని ఫణంగా పెట్టి కొడుకుని కాపాడుతుంది. తర్వాత పెరిగి పెద్దవాడైన శివుడు ఏవిధంగా శత్రువులపై పగ తీర్చుకున్నాడనేది బాహుబలి 2వ భాగంలో చూడొచ్చు. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నా, దగ్గుబాటి రానా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. -
కొడుకుతో తిరుమలకు రమ్య'కృష్ణ'
తిరుమల : ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ కుటుంబ సమేతంగా తిరుమల విచ్చేశారు. గురువారం వీఐపీ బ్రేక్ దర్శనంలో కృష్ణవంశీ, రమ్యకృష్ణ దంపతులు కుమారుడు రిత్విక్తో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం కృష్ణవంశీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకునేందుకు వస్తామన్నారు. 'రమ్యకు వెంకటేశ్వరస్వామి అంటే చాలా ఇష్టం. గోవిందుడు అందరివాడేలే సినిమా షూటింగ్ జరుగుతుంది...దసరాకి విడుదల అవుతుంది' అని కృష్ణవంశీ తెలిపారు. ప్రస్తుతం బాహుబలి షూటింగ్ జరుగుతుందని, ఆ సినిమా తర్వాత ఇంకా ఏమీ అనుకోలేదని రమ్యకృష్ణ విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ రాజమాతగా నటిస్తున్నారు. కాగా ఆలయం బయటకు వచ్చిన రమ్యకృష్ణను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. కాగా కుమారుడితో కలిసి కృష్ణవంశీ, రమ్యకృష్ణలు తొలిసారి కెమెరాకు చిక్కారు. -
ఇదొక సాహసం
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి పౌరాణిక, చారిత్రక చిత్రం చేయడం ఓ సాహసం. ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని తమిళనాడు గవర్నర్ రోశయ్య అన్నారు. సుమన్, రమ్యకృష్ణ ముఖ్యతారలుగా శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వంలో జె.ఆర్.పద్మిని, కొంపల్లి చంద్రశేఖర్, కాసనగొట్టు రాజశేఖర్ గుప్త నిర్మించిన ‘శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి చరిత్ర’ పాటల సీడీని హైదరాబాద్లో రోశయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ -‘‘కథాపరంగానే కాకుండా, సాంకేతికంగా కూడా ఈ సినిమా ఉన్నత స్థాయిలో ఉంటుంది’’ అని చెప్పారు. ఇందులోని ఏడు పాటలూ అన్ని వర్గాలనూ అలరిస్తాయని సంగీత దర్శకుడు సాలూరు వాసూరావు తెలిపారు. ఈ వేడుకలో డి.రామానాయుడు, మంత్రి టి.జి.వెంకటేష్, గంజి రాజమౌళి గుప్తా, అంజన్కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
టీవీక్షణం : అందమైన ‘కుటుంబం’
ఒకప్పుడు సీరియల్ తారలు సినిమాల్లోకి వెళ్లాలని ఉవ్విళ్లూరేవారు. కానీ ఇప్పుడు సినిమా తారలే సీరియళ్లవైపు వచ్చేస్తున్నారు. తాజాగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో ‘కుటుంబం’ అనే సీరియల్ జెమినీ చానల్లో ప్రారంభమయ్యింది. గతంలో కూడా ఆమె నటించిన సీరియల్స్ కొన్ని ప్రసారమయ్యాయి. అయితే ఈ సీరియల్లో విజయ్కుమార్, కె.ఆర్.వత్సల లాంటి ప్రముఖ నటీనటులంతా ఉండటంతో ఈ సీరియల్పై మరింత ఆసక్తి ఏర్పడింది ప్రేక్షకులకి. అయితే ఎంతమంది ఉన్నా... రమ్యకృష్ణే సెంటరాఫ్ అట్రాక్షన్. తల్లిదండ్రులకు ముద్దుల కూతురిగా... ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం మెండుగా ఉన్న అమ్మాయిగా ఆమె నటన ఆకట్టుకుంటోంది. టీఆర్పీతో పాటు ప్రేక్షకుల ఉత్కంఠను కూడా పెంచుతోంది. సినిమాల్లో టాప్ స్టార్గా వెలిగిన రమ్యకృష్ణ, ఈ సీరియల్తో టెలివిజన్ రారాణిగా కూడా వెలిగిపోతుందేమో చూడాలి మరి! తీరని వ్యథ బానీ, ఆమె సోదరి రజ్జీ జీవితాలు పెళ్లి కారణంగా చిన్నాభిన్నమవుతాయి. బానీని పెళ్లాడినవాడు విదేశాలకు వెళ్లినట్టు నటించి ఆమెను వదిలేస్తే, రజ్జీని పెళ్లాడినవాడు తాను బానీని ప్రేమిస్తే నిన్నిచ్చి పెళ్లి చేశారంటూ వేధిస్తుంటాడు. బానీ పుట్టింట్లో చెప్పకుండా భర్తను వెతుక్కుంటూ బయలుదేరుతుంది. రజ్జీయేమో... పక్కనే ఉన్న భర్తను ఆకట్టుకోలేక అల్లాడుతుంటుంది. కలర్స చానెల్లో ప్రసారమయ్యే ‘బానీ’ సీరియల్... పెళ్లి పేరుతో మోసపోయే ఆడపిల్లల జీవితాలను, వారి ఆవేదనను కళ్లముందు నిల్పుతోంది. మరి బానీ, రజ్జీల జీవితాలు ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతాయో... వారి కష్టాలు ఎప్పటికి గట్టెక్కుతాయో! -
గీత స్మరణం
పల్లవి : అతడు: ఆహాహాహా... హా... హా... ఆహ హాహా హా... ఆమె: అ హహహహ హా హ హా హహా... అ: అహ హా హా... హ హా... హా... ఆ... అ: రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా రోజాపువ్వా... పువ్వా పువ్వా... రోజు రోజు రోజు రోజు పూస్తువున్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా ఆ: రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండ ఘల్లుమన్న మువ్వే నున్నా అ: పడుచుతనపు గడుసువలపు పాటవు నువ్వా... వావ్వా... ॥రోజ్॥ బృందం: గులాబి ఘుం... ఘుం ఘుం... (2) చరణం : 1 అ: చక్కదనానికి చక్కిలిగింతవు నువ్వా నువ్వా కందే పువ్వా... కన్నె పువ్వా... వెన్నెల వాకిట ఎర్రగ పండిన దివ్వే నువ్వా చిందే రవ్వా... పొద్దే నువ్వా... ఆ: గుండె చాటు ప్రేమలెన్నొ కోటు మీద చాటుతున్న రోజాపువ్వా అందమైన ఆడపిల్ల బుగ్గపండు గిల్లుతున్న సిగ్గే నువ్వా అ: చిగురు ఎరుపు తెలుపు పొగడమాలిక నువ్వా... ఆ... ॥రోజ్॥ చరణం : 2 ఆ: ప్రేమ సువాసన పెదవుల వంతెన వేసే నువ్వే పూసే పువ్వా... బాసే నువ్వా కౌగిలి చాటున కాముడు మీటిన వీణే నువ్వా జాణే నువ్వా జాజే నువ్వా అ: గుప్పుమన్న ఆశలెన్నొ కొప్పులోన దాచుకున్న రోజా పువ్వా సందెపొద్దు సంతకాల ప్రేమలేఖ పంపుకున్న గువ్వే నువ్వా ఆ: మధుర కవిత చదివి పెదవి పండిన పువ్వా... ఆ... ॥రోజ్॥ చిత్రం : అల్లరి ప్రియుడు (1993) రచన : వేటూరి, సంగీతం : ఎం.ఎం.కీరవాణి గానం : ఎస్.పి.బాలు, చిత్ర, బృందం నిర్వహణ: నాగేష్