Saif Ali Khan
-
డైరెక్ట్గా ఓటీటీకి స్టార్ హీరో కుమారుడి సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా వస్తోన్న చిత్రం నదానియన్(Nadaaniyan). ఈ మూవీలో జాన్వీ కపూర్ సిస్టర్ ఖుషీ కపూర్(khushi kapoor) హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఈ నదానియన్ మూవీని డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ రివీల్ చేసింది. వచ్చేనెల మార్చి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సినిమాకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.కాగా.. ఈ సినిమాకు శౌనా గౌతమ్ దర్శకత్వం వహించారు. ఏ ధర్మాటిక్ ఎంటర్టైనర్ బ్యానర్పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో సునీల్ శెట్టి, దియా మీర్జా, మహిమా చౌదరి కీలక పాత్రలు పోషించారు. కాలేజీ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇటీవల ఖుషీ కపూర్ లవ్యాపా మూవీతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. Kuch Kuch Hota Hai aisi Nadaaniyan dekh kar 🥰💕Watch Nadaaniyan, out 7 March, only on Netflix!#NadaaniyanOnNetflix pic.twitter.com/piwn818AFx— Netflix India (@NetflixIndia) February 20, 2025 -
ఖరీదైన అపార్ట్మెంట్ కొన్న సైప్ అలీ ఖాన్ మాజీ భార్య.. ఎన్ని కోట్లంటే?
ప్రముఖ బాలీవుడ్ నటి అమృతా సింగ్ ఖరీదైన అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఈ లగ్జరీ ఫ్లాట్ను కొన్నట్లు తెలుస్తోంది. ఈ విలాసవంతమైన అపార్ట్మెంట్ విలువ దాదాపు రూ.18 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. కాగా.. అమృతా సింగ్ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ను పెళ్లాడారు. ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత వీరిద్దరు విడిపోయారు. వీరిద్దరికీ సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు.కాగా.. అమృతా సింగ్ బేతాబ్ (1983) చిత్రంతో అరంగేట్రం చేశారు. ఈ సినిమాతోనే బాలీవుడ్లో ఫేమ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత మార్డ్, నామ్, చమేలి కి షాదీ, రాజు బన్ గయా జెంటిల్మన్ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్నారు. కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె కలియుగ్, షూటౌట్ ఎట్ లోఖండ్వాలా వంటి చిత్రాలతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఐనా చిత్రంలో ఆమె నటనకు గానూ ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది, తరువాత ఆమె 2 స్టేట్స్ మూవీలో ఆమె పాత్రకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. -
కత్తితో దాడి.. నా కుమారుడి మాటలకు కన్నీళ్లు వచ్చాయి: సైఫ్ అలీఖాన్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) దుండగుడి చేతిలో తీవ్రంగా గాయపడిన రోజు ఏం జరిగిందో మొదటిసారి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. దొంగతనం కోసం వచ్చిన వ్యక్తితో తనను కత్తితో పొడిచిన సమయంలో తాను పెద్దగా కంగారుపడలేదని చెప్పారు. అయితే, కొంత సమయం తర్వాత ఎక్కువ నొప్పి రావడంతో ఆ గాయం తీవ్రత ఎంతో తెలిసింది. ఆ సమయంలో తన కుమారుడు తైమూర్ మాటలను సైఫ్ గుర్తు చేసుకున్నారు.'నాపై దాడి జరిగిన తర్వాత తీవ్రమైన నొప్పితో బాధపడ్డాను. నా వెన్నులో బలమైన కత్తితో దాడి చేశాడని తెలిసింది. ఆ సమయంలో కరీనా చాలా కంగారు పడింది. ఏం చేయాలో తనకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. మా కుటుంబ సభ్యలకు అందరికీ కాల్స్ చేస్తూ ఉంది. కానీ, అర్ధరాత్రి కావడంతో ఎవరూ రెస్పాన్స్ కావడం లేదు. అప్పుడు ఇద్దరం ఒకరినొకరం చూసుకున్నాం. వెంటనే ఆసుపత్రికి బయలుదేరాలని ఆమె పిచ్చిగా కాల్స్ చేస్తూ ఉంది. కరీనా పరిస్థితి గమనించే నేనే తనకు ధైర్యం చెప్పాను. నాకు ఏం కాదని తెలిపాను. ఆ సమయంలో తైమూర్ నా దగ్గరకు వచ్చి.. నాన్నా.. నువ్వు చనిపోతావా..? అని అడిగాడు. అప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అలాంటిది ఏమీ జరగదు అమ్మ ఉంది కదా అని చెప్పాను. చికిత్స కోసం వెళ్తుండగా నేనూ వస్తానంటూ తైమూర్ కూడా ఆసుపత్రికి వచ్చాడు. ఆ సమయంలో నేను కూడా వాడిని తీసుకొని వెళ్లాలని అనుకున్నాను. నాకు ఏమైనా జరిగితే నా కుమారుడు నా పక్కనే ఉండాలని ఆ సమయంలో అనిపించింది.' అని ఆయన అన్నారు.ముంబై బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ నివాసంలో జనవరి 16న తెల్లవారుజామున 2.30 గంటలకు ఆయనపై దాడి జరిగింది. దుండగుడు సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లడం గమనించిన కేర్టేకర్ కేకలు వేయగా సైఫ్ అక్కడికి చేరుకున్నాడు. ఆ సమయంలో పెనుగులాట జరిగింది. ఈక్రమంలోనే సైఫ్ గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
నెట్ఫ్లిక్స్తో సినిమాలు.. ఈవెంట్లో పాల్గొన్న ప్రముఖ నటీనటులు (ఫోటోలు)
-
సైఫ్ అలీఖాన్ కుమారుడి తొలి సినిమా.. నేరుగా ఓటీటీలో రిలీజ్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) తనయుడు ఇబ్రహీం అలీఖాన్ నటుడిగా బిగ్ స్క్రీన్కు పరిచయం కాబోతున్నాడు. ఎంతోమంది స్టార్ కిడ్స్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) బ్యానర్లో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి నడానియన్ (Nadaaniyan) అన్న టైటిల్ ఖరారు చేశారు. దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో సునీల్ శెట్టి, దియా మీర్జా, జుగల్ హన్సరాజ్, మహిమా చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఓటీటీలో రిలీజ్ కానున్న ఫస్ట్ మూవీఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే రిలీజ్ ఎప్పుడన్నది చెప్పకుండా త్వరలోనే అంటూ సస్పెన్స్లో ఉంచింది. ఈ సినిమాతో షావునా గౌతమ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈయన 'రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ' సినిమాకు కరణ్ జోహార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు.ఇబ్రహీం..సైఫ్ అలీఖాన్, అతడి మాజీ భార్య అమృతా సింగ్ తనయుడే ఇబ్రహీం. మొదటి భార్యకు విడాకులిచ్చిన అనంతరం సైఫ్.. హీరోయిన్ కరీనా కపూర్ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి తైమూర్, జెహంగీర్ అని ఇద్దరు కుమారులు సంతానం. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: అంకుల్ అనొద్దన్నాడు.. కావాలంటే అలా పిలవమన్నాడు: కీర్తి సురేశ్ -
‘సైఫ్’పై దాడి చేసింది ఒక్కడు కాదా..? రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు
ముంబయి:బాలీవుడ్ నటుడు సైఫ్అలీఖాన్పై దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సైఫ్పై దాడి కేసులో అరెస్టయిన బంగ్లాదేశ్ జాతీయుడు షరిఫుల్ ఇస్లామ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ దాడిలో ఇస్లామ్ ఒక్కడే కాకుండా మరికొందరి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇస్లామ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.ఈ కేసులో జనవరి 19న ఇస్లామ్ను పోలీసులు ముంబయిలోని థానెలో అరెస్టు చేశారు. ఇస్లామ్కు కోర్టు జనవరి 29దాకా కస్టడీ విధించింది. తమ విచారణలో ఇస్లామ్ నోరు విప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.దాడి జరిగిన రోజు సైఫ్ ఇంట్లో ఉన్న అందరు పనివాళ్లు వేసుకక్ను బట్టలను ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు. కేవలం సైఫ్ రక్తమే వాటిపై ఉందా ఇంకెవరిదైనా ఉందా అనే విషయం తెలుసుకోవడానికి పోలీసులు పనివాళ్ల దుస్తులను కోరినట్లు తెలుస్తోంది.ఇక ఇస్లామ్కు సిమ్కార్డు అందించిన జహంగీర్ షేక్ అనే వ్యక్తి కోసం ముంబయి పోలీసులు ఆదివారం(జనవరి26) కోల్కతా వెళ్లారు. బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన తర్వాత ఇస్లామ్ కొన్ని రోజులపాటు కోల్కతాలో ఉన్నట్లు పోలీసులు కనిపెట్టారు.కాగా, జనవరి 16వ తేదీ రాత్రి 2 గంటలకు సైఫ్అలీఖాన్పై ముంబై బాంద్రాలోని అతడి ఇంట్లోనే దుండగుడు దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్కు ఆరు కత్తిపోటు గాయాలయ్యాయి. ఈ గాయాలకు చికిత్స తీసుకున్న సైఫ్ ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తనపై దాడికి ముందు పనిమనిషిపై దాడి చేసిన దుండగుడు తనను కోటి రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్లు సైఫ్ ఇప్పటికే పోలీసులకు తెలిపారు. -
‘సైఫ్’ కేసులో అరెస్టుతో జీవితం నాశనమైంది: ఆకాశ్
ముంబయి: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై ఇటీవల కత్తితో దాడి చేసిన కేసులో తొలుత అరెస్టయిన అనుమానితుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసులో తొలుత ఆకాశ్ కనోజియా అనే అనుమానితుడిని ఛత్తీస్గఢ్లోని దుర్గ్ రైల్వేస్టేషన్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల తదుపరి విచారణలో అసలు నిందితుడు ఆకాశ్ కాదని తేలడంతో పోలీసులు అతడిని వదిలిపెట్టారు. సైఫ్ కేసులో అరెస్టు తర్వాత తన జీవితం సర్వనాశనమైందని ఆకాశ్ పేర్కొన్నాడు. డ్రైవర్గా పనిచేస్తున్న తాను ఉద్యోగం కోల్పోవడం, పెళ్లి సంబంధం చెడిపోవడంతో పాటు తన కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశాడు. సైఫ్ కేసులో ప్రధాన అనుమానితుడినని చెబుతూ మీడియాలో నా ఫొటోలు వేశారు. ఫొటోలు చూసిన మా కుటుంబం షాక్కు గురైంది.నాకు కాబోయే భార్యను కలిసేందుకు వెళ్తుండగా దుర్గ్లో నన్ను అదుపులోకి తీసుకొని రాయ్పూర్కు తరలించారు. అక్కడికి వచ్చిన ముంబయి పోలీసులు నాపై దాడి కూడా చేశారు’ అని ఆకాశ్ తెలిపాడు. పోలీసులు విడిచిపెట్టిన తర్వాత ఉద్యోగం కూడా పోయిందని, నాతో వివాహం వద్దని అమ్మాయి తరఫు కుటుంబీకులు నిర్ణయించుకున్నారని చెప్పాడు. అయితే తనపై ఇప్పటికే రెండు కేసులు ఉన్నమాట నిజమేనన్నాడు. ఇటీవల సైఫ్అలీఖాన్పై ముంబయి బాంద్రాలోని ఆయన నివాసంలోనే దాడి జరిగిన విషయం తెలిసిందే. దొంగతనానికి వచ్చిన దుండగున్ని అడ్డుకుంటుండగా అతడు సైఫ్పై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన సైఫ్ లీలావతి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. ఈ కేసులో నిందితుడితో దగ్గరి పోలికలు ఉండడంతో పోలీసులు ఆకాశ్ను ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో అరెస్టు చేసి తర్వాత నాలిక్కరచుకొని వదిలిపెట్టారు. -
సైఫ్ అలిఖాన్పై దాడి కేసులో ఊహించని ట్విస్ట్!
ముంబై: దుండగుడి దాడిలో గాయపడిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసు విచారిస్తున్న ముంబై పోలీసులు (mumbai police) దుండగుడు సైఫ్పై దాడి చేసిన ప్రదేశం నుంచి ఫింగర్ ప్రింట్స్ (fingerprints) సేకరించారు. ఆ వేలిముద్రలకు.. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్ఇస్లాం వేలిముద్రలతో మ్యాచ్ కావడం లేదని తేలింది.జాతీయ మీడియా కథనాల ప్రకారం.. దొంగతనం చేసే ప్రయత్నంలో నిందితుడు షరీఫుల్ఇస్లాం సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడికి యత్నించాడు. అయితే హైప్రొఫైల్ కేసు కావడంతో ముంబై పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా సైఫ్ ఇంటినుంచి 19 సెట్ల వేలిముద్రల్ని సేకరించారు. ఆ వేలి ముద్రలు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలతో సరిపోలడం లేదని నిర్ధారించారు.ముంబై పోలీసులు సైఫ్ ఇంట్లో దొరికిన వేలిముద్రలను సీఐడీ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి పంపారు. అక్కడ వేలిముద్రల్ని పరిశీలించగా..షరీఫుల్ ఫింగర్ ప్రింట్లతో సరిపోలడం లేదని సిస్టమ్ జనరేటేడ్ రిపోర్ట్లో తేలింది. దీంతో ఫింగర్ ప్రింట్ పరీక్షల్లో ఫలితం నెగిటీవ్గా వచ్చింది. ఫలితం నెగిటివ్ అని సీబీఐ అధికారులు ముంబై పోలీసులకు సమాచారం అందించారు. తదుపురి పరీక్షల కోసం సైఫ్ ఇంటినుంచి మరిన్ని వేలిముద్రల నమోనాల్ని సేకరించిన పోలీసులు మరోసారి సీఐడీ విభాగానికి పంపినట్లు సమాచారం.దాడి జరిగిందిలా.. సైఫ్ వాంగ్మూలం ప్రకారం.. ‘సైఫ్ అలీ ఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అందులో.. ‘నేను,నా భార్య కరీనా కపూర్ ఖాన్ 11వ అంతస్తులో బెడ్ రూమ్లో ఉన్నాం. ఆ సమయంలో మా ఇంట్లో సహాయకురాలు ఎలియామా ఫిలిప్ బిగ్గరగా కేకలు వేసింది. దుండగుడు (మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్) నా చిన్న కుమారుడు జహంగీర్ ( జెహ్) నిద్రిస్తున్న గదిలోకి చొరబడ్డాడు. కత్తితో అగంతకుడు జెహ్ను బెదిరించాడు. కోటి రూపాయిలు ఇవ్వాలని ఫిలిప్ను డిమాండ్ చేశాడు. దుండగుడు కత్తితో బెదిరించడంతో జెహ్ ఏడ్వడం మొదలపెట్టాడు. వెంటనే, దుండగుడి నుంచి జెహ్ను రక్షించేందుకు ఫిలిప్ ప్రయత్నించింది. ఈ క్రమంలో దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు.ఫిలిప్ కేకలు విన్న నేను జెహ్ రూంకు వెళ్లి చూడగా.. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతోంది. జెహ్ను రక్షించేందుకు నేనూ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశా. అప్పుడే దుండగుడు నా వీపు భాగం,మెడ, చేతులపై పలుమార్లు కత్తితో పొడిచాడు. నా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడి నుంచి జెహ్ను రక్షించిన సహాయకులు మరో రూంలోకి తీసుకెళ్లారు’ అని పోలీసులకు వివరించారు.ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు సైఫ్ అలీఖాన్ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ అలీఖాన్కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. కత్తి దాడి రెండు మిల్లీమీటర్ల మేర తృటిలో తప్పి వెన్నెముక పక్కన కత్తి పోట్లు దిగబడినట్లు వైద్యులు తెలిపారు. మెడ, చేతిపై గాయాలకు చికిత్స అనంతరం జనవరి 21న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సైఫ్పై దాడి ఘటనపై పోలీసులు విచారించారు. విచారణలో దొంగతనం చేయాలని ఉద్దేశ్యంతో దుండగుడు సైఫ్ ఇంట్లో చొరబడినట్లు పోలీసులు తెలిపారు. దండుగుడు బంగ్లాదేశ్కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్గా గుర్తించారు. సైఫ్పై దాడి అనంతరం దుండగుడు షెహజాద్ తప్పించుకున్నాడు. థానేలో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. -
సైఫ్పై దాడి కేసులో నా కుమారుడిని ఇరికించారు: నిందితుడి తండ్రి
'పొట్టకూటి కోసం వచ్చిన నా కొడుకు నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి చేయలేదు. కావాలనే అతడ్ని ఈ కేసులో ఇరికించారు' అంటున్నాడు నిందితుడి తండ్రి. సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడి దాడి చేసిన వ్యక్తిని పోలీసులు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్గా గుర్తించిన విషయం తెలిసిందే! నిందితుడిని బంగ్లాదేశ్ వాసిగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. జనవరి 29వరకు పోలీసుల కస్టడీకి ముంబై కోర్టు అనుమతిచ్చింది.తిరిగి వచ్చేయాలనుకున్నాడుఈ క్రమంలో నిందితుడి తండ్రి మహ్మద్ రుహుల్ అమీన్ ఫకీర్ సంచలన ఆరోపణలు చేశారు. ఓ మీడియాతో ఫోన్కాల్లో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్లో పరిస్థితులు బాగోలేనందున నా కుమారుడు మధ్యవర్తి సాయంతో ఇండియాకు వచ్చేశాడు. ఉద్యోగావకాశాల కోసం గతేడాది ఏప్రిల్లో భారత్లో ప్రవేశించాడు. కావాల్సినంత సంపాదించుకున్నాక తిరిగి బంగ్లాకు వచ్చేయాలనుకున్నాడు.ముంబైలో ఎందుకంటే?ముందుగా పశ్చిమ బెంగాల్లోని ఓ హోటల్లో పని చేశాడు. బెంగాల్ కంటే ముంబై రెస్టారెంట్లలో ఎక్కువ జీతం కావడంతో తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. తరచూ మాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. చివరిసారిగా శుక్రవారం నాతో ఫోన్లో మాట్లాడాడు. ప్రతి నెల పదో తారీఖున అతడికి జీతం పడుతుంది. అలా నాకు రూ.10 వేలు పంపాడు. తన ఖర్చుల కోసం రూ.3 వేలు ఉంచుకున్నాడు. మేము పేదవాళ్లమే కానీ నేరస్తులం కాదు. బంగ్లాదేశ్లో అతడు బైక్ టాక్సీ నడిపేవాడు.అన్యాయంగా ఇరికిస్తున్నారునా కొడుకును అరెస్ట్ చేశారని సోషల్ మీడియా ద్వారా తెలిసింది. సీసీటీవీ ఫుటేజీలో ఉన్నది నా కొడుకు కాదు. మీరంతా పొరబడుతున్నారు. అతడెప్పుడూ తన జుట్టు అంత పొడవుగా ఉంచుకునేవాడు కాదు. ఎవరో కావాలనే ఈ కేసులో నా కొడుకును ఇరికిస్తున్నారు. అధికారులు నా కొడుకే నిందితుడు అని పొరబడుతున్నారు. మాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఇండియాలో మాకు తెలిసినవారెవరూ లేరు. మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. నా కొడుకు నిర్దోషిగా వస్తాడని ఎదురుచూస్తున్నాం అని చెప్పుకొచ్చాడు.సైఫ్పై దాడికాగా జనవరి 16న ముంబైలోని ఇంట్లో సైఫ్ అలీఖాన్పై దాడి జరిగింది. దొంగతనం కోసం ఇంట్లోకి చొరబడిన నిందితుడు సైఫ్ చిన్న కుమారుడు జెహంగీర్ గదిలో చొరబడ్డాడు. అతడిని చూసిన పనిమనిషి గట్టిగా కేకలు వేయడంతో సైఫ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. నిందితుడిని అడ్డుకునే క్రమంలో అతడు సైఫ్ను ఆరుసార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు.సైఫ్ను కాపాడిన ఆటో డ్రైవర్తీవ్ర గాయాలతో ఉన్న సైఫ్.. కుమారుడు తైమూర్తో కలిసి ఆటోలో ఆస్పత్రికి వెళ్లాడు. ఆటో డ్రైవర్ సైతం రక్తంతో తడిసిన సైఫ్ను చూసి రూపాయి కూడా తీసుకోలేదు. తీవ్రగాయాలపాలైన సైఫ్ ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. వెన్నెముకలో విరిగిన 2.5 అంగుళాల కత్తి మొనను సర్జరీ చేసి తొలగించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్కు చెందిన షరీఫుల్.. బిజోయ్ దాస్గా పేరు మార్చుకుని భారత్లో అక్రమంగా చొరబడ్డాడని గుర్తించారు.చదవండి: విజయ్తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష -
సైఫ్ అంతత్వరగా ఎలా కోలుకున్నారంటే..
ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్(54)పై జరిగిన దాడి గురించి దేశమంతా చర్చించుకుంది. పదునైన ఆయుధంతో ఆయనపై దాడి జరగ్గా.. సర్జరీ తదనంతరం వారం తిరగకముందే ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే.. అంత త్వరగా ఆయన కోలుకుని డిశ్చార్జి కావడం, పైగా ఆయనే స్వయంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోవడంపై ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఈ క్రమంలో.. ఓ డాక్టర్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan)పై నిజంగానే దాడి జరిగిందా?.. నెట్టింట జోరుగా గిన చర్చ ఇది. ఇక మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే, సంజయ్ నిరుపమ్ లాంటి ప్రముఖ నేతలు సైతం సైఫ్ దాడి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆస్పత్రి నుంచి సైఫ్ బయటకు వచ్చేశారు. ఆయనకేం జరగనట్లు ఉంది. ఆయనపై నిజంగానే దాడి జరిగిందా? లేదంటే నటిస్తున్నారా?’’ అంటూ కామెంట్లు చేశారు. ఆఖరికి మీమ్స్ పేజీలు సైతం ఈ పరిణామాన్ని వదల్లేదు. అయితే ఆశ్చర్యకరరీతిలో వైద్యులు సైతం ఈ చర్చలో భాగమై తమవంతు అనుమానాలను బయటపెట్టారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి ఆ అనుమానాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.‘‘సుమారు 80 ఏళ్ల వయసున్న ఓ పెద్దావిడకు ఫ్రాక్చర్ కారణంగా వెన్నెముకకు సర్జరీ జరిగింది. పైగా ఆమె మడమకు కూడా ఫ్రాక్చర్ అయ్యింది. అయినా కూడా ఆమె వాకర్ సాయంతో నడవగలిగింది. ఆ వీడియోనే ఆయన నెట్లో షేర్ చేశారు. పైగా ఆవిడ ఎవరో కాదట.. స్వయానా ఆయన తల్లేనట!‘‘సైఫ్కు నిజంగానే సర్జరీ జరిగిందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. వాళ్లలో కొందరు డాక్టర్లు కూడా ఉన్నారు. అలాంటివాళ్లందరి కోసమే ఈ ఉదాహరణ. ఇది 2022 నాటి వీడియో. మా అమ్మకు ఉదయం సర్జరీ అయితే.. సాయంత్రానికే ఆమె నడిచారు. అలాంటప్పుడు ఆవిడ కంటే తక్కువ వయసున్న వ్యక్తి(సైఫ్ను ఉద్దేశించి..) నిలబడి నడవలేరంటారా?.. అని ఆయన ప్రశ్నించారు.For people doubting if Saif Ali Khan really had a spine surgery (funnily even some doctors!). This is a video of my mother from 2022 at the age of 78y, walking with a fractured foot in a cast and a spine surgery on the same evening when spine surgery was done. #MedTwitter. A… pic.twitter.com/VF2DoopTNL— Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) January 22, 2025సైఫ్కు అయిన గాయాలు.. ఆయనకు జరిగిన శస్త్రచికిత్సతో పోలిస్తే మా అమ్మ పరిస్థితి మరీ దారుణం. దాడిలో గాయపడ్డ సైఫ్కు వెన్నెముక వద్ద గాయం, ఫ్లూయెడ్ లీకేజీ జరిగాయి. అత్యవసర సర్జరీతో వెన్నెముక భాగంలో ఇరుక్కుపోయిన కత్తి భాగాన్ని తొలగించారు. ఆ ఫ్లూయెడ్ లీకేజీని సరిచేశారు. అలాగే మా అమ్మకు వెన్నెముకలోనే ఫ్రాక్చర్ అయ్యింది. అయినా కూడా మరుసటి రోజే డిశ్చార్జి చేశారు. ఈరోజుల్లో బైపాస్ సర్జరీ చేయించుకున్నవాళ్లే.. మూడో, నాలుగో రోజుకి చక్కగా నడుస్తూ మెట్లు ఎక్కేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాకు వచ్చే ముందు కాస్త విషయ పరిజ్ఞానం పెంచుకోండి’’ అంటూ చురకలటించారాయన.మెడికల్ రిపోర్ట్ ప్రకారం.. జనవరి 16వ తేదీ అర్ధరాత్రి సమయంలో సైఫ్పై దాడి జరిగింది. నిందితుడు ఆయన్ని ఆరుసార్లు కత్తితో పొడిచాడు. వీపులో, నడుం భాగంలో, మెడ, భుజం, మోచేతి భాగంలో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో ఆయనకు ఎమర్జెన్సీ సర్జరీలు చేశారు. ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచాక ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారు.‘‘సైఫ్ మాట్లాడగలుగుతున్నారు. నడవగలుగుతున్నారు. చేయి, మెడపై గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేశాం. శరీరం నుంచి పదునైన వస్తువును బయటకు తీశాం. వెన్నెముకకు ఎటువంటి ప్రమాదం లేదు. ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చాం. ప్రస్తుతం ఆహారం తీసుకుంటున్నారు. రెండుమూడు రోజుల తర్వాత డిశ్చార్జి చేస్తాం’’ అని జనవరి 18న ముంబై లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. చెప్పినట్లుగానే మూడు రోజుల అబ్జర్వేషన్ తర్వాత ఆయన్ని డిశ్చార్జి చేశారు. -
‘నాపై దుండగుడు కత్తితో ఇదిగో ఇలా దాడి చేశాడు’.. పోలీసులకు సైఫ్ వాంగ్మూలం!
ముంబై : తనపై దుండగుడు జరిపిన దాడి గురించి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు బాంద్రాలోని సైఫ్ నివాసానికి వెళ్లి దాడి వివరాల్ని సేకరించినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తనపై దుండగుడు ఏ విధంగా దాడి చేసింది. తాను ఎలా ప్రతిఘటించిన విధానాన్ని సైఫ్ వివరించినట్లు సమాచారం.జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ‘సైఫ్ అలీ ఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అందులో.. ‘నేను,నా భార్య కరీనా కపూర్ ఖాన్ 11వ అంతస్తులో బెడ్ రూమ్లో ఉన్నాం. ఆ సమయంలో మా ఇంట్లో సహాయకురాలు ఎలియామా ఫిలిప్ బిగ్గరగా కేకలు వేసింది. దుండగుడు (మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్) నా చిన్న కుమారుడు జహంగీర్ ( జెహ్) నిద్రిస్తున్న గదిలోకి చొరబడ్డాడు. కత్తితో అగంతకుడు జెహ్ను బెదిరించాడు. కోటి రూపాయిలు ఇవ్వాలని ఫిలిప్ను డిమాండ్ చేశాడు. దుండగుడు కత్తితో బెదిరించడంతో జెహ్ ఏడ్వడం మొదలపెట్టాడు. వెంటనే, దుండగుడి నుంచి జెహ్ను రక్షించేందుకు ఫిలిప్ ప్రయత్నించింది. ఈ క్రమంలో దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు.ఫిలిప్ కేకలు విన్న నేను జెహ్ రూంకు వెళ్లి చూడగా.. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతోంది. జెహ్ను రక్షించేందుకు నేనూ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశా. అప్పుడే దుండగుడు నా వీపు భాగం,మెడ, చేతులపై పలుమార్లు కత్తితో పొడిచాడు. నా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడి నుంచి జెహ్ను రక్షించిన సహాయకులు మరో రూంలోకి తీసుకెళ్లారు’ అని పోలీసులకు వివరించారు.ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు సైఫ్ అలీఖాన్ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ అలీఖాన్కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. కత్తి దాడి రెండు మిల్లీమీటర్ల మేర తృటిలో తప్పి వెన్నెముక పక్కన కత్తి పోట్లు దిగబడినట్లు వైద్యులు తెలిపారు. మెడ, చేతిపై గాయాలకు చికిత్స అనంతరం జనవరి 21న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సైఫ్పై దాడి ఘటనపై పోలీసులు విచారించారు. విచారణలో దొంగతనం చేయాలని ఉద్దేశ్యంతో దుండగుడు సైఫ్ ఇంట్లో చొరబడినట్లు పోలీసులు తెలిపారు. దండుగుడు బంగ్లాదేశ్కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్గా గుర్తించారు. సైఫ్పై దాడి అనంతరం దుండగుడు షెహజాద్ తప్పించుకున్నాడు. థానేలో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.ఇదిలా ఉంటే, సైఫ్ అలీ ఖాన్ బాంద్రా ఫ్లాట్ నుండి సేకరించిన వేలిముద్రలు షరీఫుల్తో సరిపోలినట్లు నిర్ధారించబడింది. నిందితుడు భవనంలోని పదకొండవ అంతస్తుకు ఎక్కేందుకు ఉపయోగించిన డక్ట్ పైపుపై,గది డోర్ హ్యాండిల్, బాత్రూమ్ డోర్పై వేలిముద్రల్ని గుర్తించారు. అయితే, సైఫ్ అలీఖాన్ ఇంటిలోని సీసీటీవీ ఫుటేజీలోని దుండగుడు, తన కుమారుడు షెహజాద్లు ఒకరు కాదని. ఇద్దరు వేర్వేరుగా ఉన్నారని షెహజాద్ తండ్రి రూహుల్ అమీన్ వాదిస్తున్నాడు. -
సైఫ్ పూర్వీకుల రూ.15 వేల కోట్ల ఆస్తుల పరిస్థితేంటి?
భోపాల్: బ్రిటిషర్లకాలంలో ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ ప్రాంతాల్లో పటౌడీ సంస్థానాన్ని పాలించిన హమీదుల్లాహ్ రాజకుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులు ఎవరి పరం కానున్నాయనే ప్రశ్న తలెత్తింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులకు చెందిన ఈ ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయనే అంశం మరోసారి తెరమీదకొచ్చింది. సైఫ్ వాళ్ల నానమ్మ.. పటౌడీ సంస్థానానికి అసలైన వారసురాలని సీనియర్ న్యాయవాది జగదీశ్ ఛవానీ వాదిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ వాదన దీనికి భిన్నంగా ఉంది. ‘‘ స్వాతంత్య్రం వచ్చేనాటికి భోపాల్ కేంద్రంగా పాలిస్తున్న పటౌడీ సంస్థానానికి ముహమ్మద్ హమీదుల్లాహ్ చివరి నవాబ్గా ఉన్నారు. ఆయన తదనంతరం ఆయన పెద్దకుమార్తె అబీదా సుల్తాన్ బేగమ్కు ఈ ఆస్తులు దక్కుతాయి. అయితే స్వాతంత్య్రం వచ్చాక విభజన సమయంలో ఆమె పాకిస్తాన్కు వలసవెళ్లారు. ఈ లెక్కన ఇప్పుడు వారసులు భారత్లో లేరు. అందుకే శత్రు ఆస్తుల చట్టం కింద ఆ ఆస్తులన్నీ ఇప్పుడు కేంద్ర హోం శాఖ పరిధిలోని భారత శత్రు ఆస్తుల సంరక్షణ సంస్థ(సీఈపీఐ) పర్యవేక్షణలోకి వస్తాయి’’ అని మోదీ సర్కార్ చెబుతోంది. ప్రభుత్వ వాదనను లాయర్ ఛవానీ కొట్టిపారేశారు. ‘‘ పెద్దకుమార్తె అబీదా పాకిస్తాన్కు వెళ్లిన తర్వాత 1960లో హమీదుల్లాహ్ మరణించారు. దాంతో ఆస్తి వారసత్వంగా తనకే వస్తుందని రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ బేగమ్ భారత ప్రభుత్వాన్ని కోరారు. అందుకు సమ్మతిస్తూ 1962 జనవరి 10న కేంద్రం ఒక ఉత్తర్వు జారీచేసింది. ఈ లెక్కన సాజిదా అసలైన వారసురాలు. ఆమె నుంచి వారసత్వంగా సాజిదా కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ(టైగర్ పటౌడీ) ఆయన తదనంతరం సైఫ్ అలీ ఖాన్ ఆ ఆస్తులకు హక్కుదారు అవు తారు’’ అని ఛవానీ వాదించారు. తమ ఆస్తులను శత్రు ఆస్తులుగా లెక్కకట్టొద్దని, మోదీ ప్రభుత్వం తెచ్చిన శత్రు ఆస్తుల(సవరణ, ధృవీకరణ) చట్టాన్ని సవాల్ చేస్తూ టైగర్ పటౌడీ భార్య, అలనాటి బాలీవుడ్ నటి షర్మిలా ఠాకూర్ 2015లో మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గత ఏడాది డిసెంబర్ 13న జస్టిస్ వివేక్ ఆగ్రావాల్ విచారణ చేపట్టారు. సైఫ్ తల్లి షర్మిలా వేసిన పిటిషన్ను ప్రభుత్వ న్యాయవాది తప్పుబట్టారు. ఇప్పుడు శత్రు ఆస్తుల చట్టం,1968 లేదు. దాని స్థానంలో 2017లో కొత్త చట్టమొచ్చింది. ఏమైనా ఫిర్యాదులుంటే సంబంధిత అప్పీలేట్ అథారిటీ ముందు గోడు వెళ్లబోసుకోండి’’ అని సూచించారు. దీనిపై జడ్జీ స్పందిస్తూ.. ‘‘ వాస్తవాలను పరిగణించాక సైఫ్ కుటుంబం ముంబైలోని సీఈపీఐ ఆఫీస్లో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇస్తున్నాం’’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ఆరోజు జడ్జి ఇచ్చిన గడువు ఇప్పడు ముగిసిపోయింది. గడువులోపు సైఫ్ కుటుంబం ముంబై సీఈపీఐ ఆఫీస్లో అప్పీల్ చేయలేదు. జనవరి 16వ తేదీన కత్తిపొట్లకు గురై ఆస్పత్రి పాలైన సైఫ్ బాగోగులు చూడటంలోనే వాళ్ల కుటుంబానికి ఉన్న పుణ్యకాలం గడిచిపోయింది. ఇప్పుడు వాళ్లకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందా? లేదా అనేదే అసలు ప్రశ్న. ‘‘ దాడి జరిగిందన్న కారణం చూపి హైకోర్టు గడువు పొడిగించాలని కోరతాం’’ అని న్యాయవాది చెప్పారు. -
సైఫ్పై దాడి.. విచారణలో మరికొన్ని కీలక విషయాలు
ముంబై : బాలీవుడ్ నటుడు సైఫ్ అలిఖాన్పై దాడి ఘటన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సైఫ్పై దాడి అనంతరం నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం, ముంబై కస్టడీలో ఉన్న నిందితుడికి సంబంధించి పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు.‘ సైఫ్ దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశీ అని పోలీసులు నిర్ధారించారు. షరీఫుల్ మేఘాలయ మీదుగా భారత్లోకి ప్రవేశించాడని పోలీసులు గతంలో చెప్పారు. తాజాగా, షరీఫుల్ బంగ్లాదేశీయుడేనని నిర్ధారించేలా గుర్తింపు కార్డులు లభ్యమయ్యాయని తెలిపారు. మొదటి గుర్తింపు కార్డులో షరీఫుల్ మార్చి 3, 1994న జన్మించాడని మహ్మద్ రూహుల్ ఇస్లాం కుమారుడని తెలిపే ఆధారాలు ఉన్నాయి. రెండవ గుర్తింపు కార్డు.. లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్. ఇది షరీఫుల్ దక్షిణ-మధ్య బంగ్లాదేశ్లోని బారిసాల్ ప్రాంత నివాసి అని సూచిస్తోంది. లైసెన్స్ నవంబర్ 2019లో జారీ చేయగా.. ఫిబ్రవరి 2020లో గడువు ముగియాల్సి ఉండగా.. డ్రైవింగ్ లైసెన్స్ ప్రాక్టికల్ పరీక్ష కోసం మార్చి 18, 2020కి హాజరయ్యాడు. ఇప్పటికే.. 12వ తరగతి వరకు చదివిన షరీఫుల్ ఏడు నెలల క్రితం మేఘాలయ మీదుగా భారత్లోకి ప్రవేశించాడని పోలీసులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో కొంతకాలం ఉన్నాడని, అనుమానం రాకుండా నిందితుడు తన పేరును బిజోయ్ దాస్గా మార్చుకుని స్థానిక నివాసి ఆధార్ కార్డును ఉపయోగించి మొబైల్ ఫోన్ సిమ్ కార్డును కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. -
ఏంటి సైఫ్? అర లక్ష ఏం సరిపోతుంది? కనీసం రూ.11 లక్షలైనా..: సింగర్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)ను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి అతడి ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్పై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఆదుకున్న నీకు ఏమిచ్చినా తక్కువే అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇప్పటికే సైఫ్ సదరు ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలిసి అతడికి కృతజ్ఞతలు తెలిపాడు. రూ.50 వేల నగదును బహుమానంగా ఇచ్చాడు. అలాగే ముంబైకి చెందిన ఓ సంస్థ కూడా రానాకు రూ.11 వేల రివార్డు అందించింది.రూ.1 లక్ష సాయం ప్రకటించిన సింగర్తాజాగా సింగర్ మికా సింగ్.. ఆటో డ్రైవర్కు రూ.1 లక్ష సాయం ప్రకటించాడు. ఈమేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇండియా ఫేవరెట్ సూపర్స్టార్ను కాపాడిన అతడికి కనీసం రూ.11 లక్షలైనా రివార్డుగా ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సమయానికి హీరోలా వచ్చి కాపాడాడు. దయచేసి అతడి వివరాలు ఎవరైనా నాకు తెలియజేస్తారా? అతడు చేసిన మంచి పనికి మెచ్చుకోలుగా రూ.1 లక్ష సాయం చేయాలనుకుంటున్నాను అని పేర్కొన్నాడు.అతడు రియల్ హీరోసైఫ్ అర లక్ష సాయం చేశాడని రాసున్న పోస్ట్ను షేర్ చేస్తూ.. సైఫ్ భాయ్, దయచేసి అతడికి రూ.11 లక్షలివ్వు. అతడు రియల్ హీరో. ముంబై ఆటోవాలా జిందాబాద్ అని రాసుకొచ్చాడు. కాగా జనవరి 16న సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఓ దుండగుడు చొరబడ్డాడు. సైఫ్ చిన్నకుమారుడి జెహ్ దగ్గర అతడిని చూసిన పనిమనిషి గట్టిగా కేకలు వేసింది. ఆ శబ్దం విని కిందకు వచ్చిన సైఫ్.. దుండగుడిని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో అతడు తన దగ్గరున్న కత్తితో నటుడిని పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు.(చదవండి: రామ్గోపాల్వర్మకు మూడు నెలల జైలు శిక్ష)ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న సైఫ్ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సమయానికి కారు కూడా అందుబాటులో లేదు. దీంతో అతడు నడుచుకుంటూ రోడ్డు మీదకు రాగా ఓ ఆటో డ్రైవర్ అతడిని చూసి హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో సైఫ్కు చికిత్స అందడంతో ప్రాణాపాయం తప్పింది. సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలవగా వెన్నెముక దగ్గర 2.5 అంగుళాల కత్తిమొనను వైద్యులు సర్జరీ చేసి తొలగించారు.నిందితుడి అరెస్ట్నటుడిపై దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. అతడిని బంగ్లాదేశ్కు చెందిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్గా గుర్తించారు. భారత్కు వచ్చాక బిజయ్ దాస్గా పేరు మార్చుకున్నాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు.చదవండి: ఐటీ దాడులపై స్పందించిన వెంకటేశ్, అనిల్ రావిపూడి -
సైఫ్పై నిజంగానే దాడి జరిగిందా? యాక్టింగా?
నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. చివరకు నిందితుడు పట్టుబడడంతో ప్రతిపక్షాల విమర్శలకు పుల్స్టాప్ పడింది. అయితే ఈ ఘటనపై తాజాగా మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు.ఘటన జరిగాక ఐదు రోజులకు నటుడు సైఫ్ ముంబై లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే ఈ పరిణామం ఆధారంగా నితేష్ రాణే తన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే దాడి జరిగిందా? లేక ఆయన నటించారా? అని ప్రశ్నించారాయన. పనిలో పనిగా ప్రతిపక్షాలను ఆయన తిట్టిపోశారు.పుణేలో జరిగిన ఓ ఈవెంట్లో రాణే మాట్లాడుతూ.. ఆస్పత్రి నుంచి ఆయన బయటకు వచ్చేటప్పుడు చూశా. ఆయన్ని నిజంగానే పొడిచారా? లేకుంటే నటిస్తున్నారా? అనే అనుమానం కలిగింది నాకు అని అన్నారు. అలాగే ఈ విషయంలో ప్రతిపక్షాలు చేసిన రాద్ధాంతం కూడా నాకు అలాగే అనిపించింది. కేవలం ఖాన్ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్లు స్పందిస్తారా?.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై స్పందించరా? అని ప్రశ్నించారాయన.సుప్రియా సూలే.. సైఫ్ అలీ ఖాన్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. షారూక్ కొడుకు గురించి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ గురించి బాధపడ్డారు. కానీ, ఓ హిందూ నటుడి కష్టాల గురించి ఆమె ఏనాడైనా ఆలోచించారా?. అన్నారు.గతంలో బంగ్లాదేశీయులు ముంబై ఎయిర్పోర్టు వరకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఏకంగా ఇళ్లలో చొరబడుతున్నారు. బహుశా వాళ్లు ఆయన్ని(సైఫ్)ను తీసుకెళ్లడానికే వచ్చి ఉంటారేమో! అని రాణే సెటైర్ వేశారు.మహా మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే తనయుడే ఈ నితీశ్ నారాయణ రాణే. శివసేనతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి.. కాంగ్రెస్, ఆపై బీజేపీలో చేరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కనకవల్లి నియోజకవర్గం నుంచి గెలుపొంది హ్యాటట్రిక్ ఎమ్మెల్యే ఘనత అందుకున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.నితీశ్ నారాయణ రాణేకు వివాదాలూ కొత్తేం కాదు. 2009లో మరాఠీ చిత్రం ‘జెండా’లో తన తండ్రి నారాయణ రాణే పాత్రను అభ్యంతరకంగా చూపించారంటూ నిరసనలకు దిగి తొలిసారి ఆయన మీడియాకు ఎక్కారు. ఆపై ఓ చిరువ్యాపారిపై హత్యాయత్నం చేశారనే కేసు నమోదు అయ్యింది. 2013లో ముంబైని గుజరాతీలు విడిచివెళ్లిపోవాలంటూ మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. అదే ఏడాదిలో గోవాలో ఓ టోల్బూత్ను ధ్వంసం చేసిన కేసులో అరెస్టయ్యారు. 2017లో ఓ ప్రభుత్వ అధికారిపైకి చేపను విసిరిన కేసులో, 2019లో ఓ అధికారిపై దాడి చేసిన కేసులో అరెస్టై జైలుకు కూడా వెళ్లారు. తాజాగా.. కిందటి నెలలో కశ్మీర్ను మినీ పాకిస్థాన్గా అభివర్ణించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆపై కేరళ అంటే అందరికీ ఇష్టమేనంటూ మాట మార్చారు. -
సైఫ్ అలీ ఖాన్ కు మరో షాక్?
-
ఆటో డ్రైవర్ను కలిసిన సైఫ్ అలీఖాన్.. ఎంత నగదు ఇచ్చారంటే?
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. సైఫ్పై దాడి జరిగిన తర్వాత ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానా తన ఆటోలోనే లీలావత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. సకాలంలో ఆస్పత్రికి చేరుకోవడంతో సైఫ్కు ప్రాణాపాయం తప్పింది. దీంతో ఆటో డ్రైవర్ను పలువురు అభినందించారు.ఈనెల 16న సైఫ్ ఇంట్లోకి చోరీకి యత్నించిన వ్యక్తి హీరోపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్కు తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వెంటనే సైఫ్ ఆస్పత్రికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ సమయంలో సైఫ్ను ఆటోలో ముంబయిలోని లీలావతికి తీసుకెళ్లారు భజన్ సింగ్. ఆ సమయంలో అతనెవరో తాను గుర్తు పట్టలేదన్నారు. సకాలంలో ఆస్పత్రికి చేర్చడమే తన లక్ష్యంగా ఆటో నడిపినట్లు భజన్ సింగ్ వెల్లడించారు. అయితే సైఫ్ ప్రాణాలు కాపాడిన భజన్ సింగ్కు ముంబయికి చెందిన ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ అందించింది. సైఫ్ ఆర్థిక సాయం..తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్కు సైఫ్ అలీ ఖాన్ ఆర్థిక సాయమందించారు. తనవంతుగా రూ.50 వేలను భజన్ సింగ్ రానాకు అంద జేశారు. ఈ సందర్భంగా ఆపద సమయంలో తనను రక్షించినందుకు అతనికి సైఫ్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే అంతకు ముందు తన ఆటోలో వచ్చింది సైఫ్ అలీఖాన్ అని తెలియదని.. వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని భజన్ సింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.నిందితుడి అరెస్ట్.. సైఫ్ అలీఖాన్పై దాడి చేసిన నిందిచతుడి ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్కు చెందిన మహమ్మద్ షరీఫుల్గా అతన్ని గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన కోర్టులో హాజరు పరచగా ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. దీంతో పోలీసులు అతనితో పాటు సైఫ్ ఇంటికి వెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. -
పటౌడీ ఆస్తుల కేసు.. సైఫ్ ఫ్యామిలీకి బిగ్ షాక్ తప్పదా?
ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ తన ఇంట్లోనే దాడికి గురై వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఆరు రోజుల చికిత్స తర్వాత కోలుకుని ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే తాజాగా ఆయన కుటుంబానికి మరో షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆయన కుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల ఆస్తులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది.2011లో సైఫ్ అలీఖాన్(Saif Ali khan) తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మృతి చెందారు. ఆ తర్వాత సైఫ్కు భోపాల్ నవాబ్గా బిరుదు లభించింది. ప్రస్తుతం పటౌడీ కుటుంబానికి సైఫ్ అలీ ఖాన్ వారసుడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో పటౌడీ కుటుంబానికి చెందిన ఆస్తులు ఉన్నాయి. అదే సమయంలో అక్కడి ఆస్తుల గురించి ఎప్పటి నుంచో వివాదాలు కోర్టులో నడుస్తూనే ఉన్నాయి. సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాగూర్తోపాటు ఇతర కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు అక్కడ ఉన్నాయి. కోహెఫిజా నుండి చిక్లోడ్ వరకు విస్తరించి ఉన్నాయి. ఆ కుటుంబానికి చెందిన సుమారు 100 ఎకరాల భూమిలో దాదాపు లక్షన్నర మంది నివసిస్తున్నారు. అయితే.. ఆ చారిత్రక భూమిపై ఎనిమీ ప్రాపర్టీ కేసులో గత 10 ఏళ్లుగా కొనసాగుతున్న స్టే ఇప్పుడు ముగిసింది. ఆస్తిపై దావా వేయడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు సైఫ్ కుటుంబానికి 30 రోజుల సమయం ఇచ్చింది. అయినా సైఫ్ అలీ ఖాన్ కుటుంబం ఎటువంటి దావా వేయలేదు. కానీ ఇప్పుడు ఆ గడువు ముగిసిపోవడంతో.. తర్వాత ఏం జరగనుందా? అనే ఉత్కంఠ మొదలైంది. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్(Enemy Property Act) 1968 ప్రకారం విభజన తర్వాత పాకిస్థాన్కు వెళ్లిన వ్యక్తులు భారత్లో వదిలిపెట్టిన ఆస్తులపై కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుంది.ఈ చట్టం ప్రకారం భోపాల్ చివరి నవాబు ఆస్తులను ప్రభుత్వం నియత్రించాలని ప్రయత్నించింది. అయితే.. సైఫ్ కుటుంబం ఈ నిర్ణయాన్ని 2015లో సవాల్ చేశారు. దీంతో.. కోర్టు స్టే విధించింది. అయితే తాజాగా ఆ స్టేను కోర్టు ఎత్తేసింది. దీంతో ప్రభుత్వం ఆ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. పటౌడీ చివరి నవాబు పెద్ద కుమార్తె యువరాణి అబిదా సుల్తాన్ ఎప్పుడో పాకిస్థాన్ వెళ్లారు. అందువల్ల నవాబు ఆస్తిని శత్రువు ఆస్తిగా(ఎనిమీ ప్రాపర్టీ) ప్రకటించారు. అయితే.. నవాబ్ మరణం తరువాత అతని రెండో కుమార్తె మెహర్ తాజ్ సాజిదా సుల్తాన్ బేగం భోపాల్ వారసత్వ చట్టం 1947 ప్రకారం ఎస్టేట్కు వారసురాలుగా ప్రకటించారు. ఇప్పుడు పిటిషన్ వేసిన పటౌడీ కుటుంబంలోని సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాకూర్వంటివారు సాజిదా(Sajida) వారసులు. ఈ నేపథ్యలో ఆస్తిపై తమకూ హక్కు ఉందని సైఫ్ ఫ్యామిలీ కోర్టులో దావా వేసింది. వారసత్వ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా డివిజెన్ బెంచ్లో ఉత్తర్వులను పటౌడీ కుటుంబం సవాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
సైఫ్ అలీఖాన్కు సెక్యూరిటీగా 'జై లవకుశ' నటుడి టీమ్
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ముంబైలోని ఆయన స్వగృహంలో ఈ నెల 16న సైఫ్పై దుండగుడు దాడి చేసి, కత్తితో గాయపరచిన సంగతి తెలిసిందే. అదే రోజు అక్కడి లీలావతి హాస్పిటల్లో చేరిన సైఫ్ కోలుకోవడంతో వైద్యులు మంగళవారం డిశ్చార్జ్ చేశారు. వారంరోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారు. ప్రస్తుతం జరిగిన సంఘటనల దృష్ట్యా సైఫ్ కుటుంబం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. సైఫ్పై దాడి చేసిన బంగ్లాదేశ్కి చెందిన దుండగుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు.(ఇదీ చదవండి: చిత్ర పరిశ్రమలో ఉండటం ఇష్టం లేదు.. కారణం ఇదే: నిత్య మేనన్)సైఫ్ అలీఖాన్ రక్షణ కోసం బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ (Ronit Roy) ఎంట్రీ ఇచ్చారు. కొన్నేళ్లుగా ముంబైలో ఆయన సెక్యూరిటీ ఏజెన్సీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సైఫ్ఫై దాడి జరిగిన తర్వాత వారు వెంటనే తమ కుటుంబానికి రక్షణగా వ్యక్తిగత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు సైఫ్ కుటుంబం పూర్తిగా రోనిత్ రాయ్ సెక్యూరిటీలో ఉంది. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మేం కొద్దిరోజులుగా సైఫ్తోనే ఉన్నాం.. ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఎలాంటి ఇబ్బంది లేదు' అని తెలిపారు.రోనిత్ రాయ్ నటుడు మాత్రమే కాదు వ్యాపారవేత్త కూడా.. బాలీవుడ్లో సుమారు 50కి పైగా చిత్రాల్లో నటించిన రోనిత్ తెలుగులో కూడా పలు సినిమాల్లో కీలకపాత్రలలో కనిపించాడు. ఎన్టీఆర్ ‘జై లవకుశ’, విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాల్లో ఆయన పాత్రలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్లో 2018 థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రంలో చివరగా ఆయన కనిపించాడు. డైరెక్టర్ పూరి కోరిక మేరకు 2022లో లైగర్ సినిమాలో ఆయన నటించాడు. జనవరి 16న సైఫ్ ఇంట్లోకి బంగ్లాదేశ్కు చెందిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ (30) చొరబడిన సంగతి తెలిసిందే. అతడిని అడ్డుకునేందుకు సైఫ్ ప్రయత్నించగా అతనికి ఆరు చోట్ల కత్తి గాయాలయ్యాయి. ఆయన చేతికి, మెడకు, వెన్నుకు తీవ్రమైన కత్తిపోటు గాయాలయ్యాయి. రక్తపు గాయాలను లెక్కచేయకుండా తన వెన్నులోకి దిగిన కత్తి ముక్కతోనే లీలావతి ఆసుపత్రిలో చేరాడు. డాక్టర్లు శస్త్రచికిత్స ద్వారా ఆ కత్తిని తొలగించారు. దొంగను సైఫ్ గట్టిగా బంధించడం వల్లే కత్తితో దాడి చేసినట్లు ఒక పోలీసు అధికారి వెళ్లడించారు. -
సైఫ్ అలీ ఖాన్పై దాడి.. ఆటో డ్రైవర్కు పారితోషికం ఎంత ఇచ్చారంటే? (ఫోటోలు)
-
Saif Ali Khan: ఆసుపత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్
-
ఆస్పత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్
ముంబయిలోని లీలావతి ఆస్పత్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్ అయ్యారు. ఈనెల 16 న ఆయనపై దొంగతనానికి వచ్చిన వ్యక్తి దాడి చేయడంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు ఐదు రోజులు పాటు ఆస్పత్రిలో చికిత్సపొందిన సైఫ్ ఇంటికి చేరుకున్నారు. కాగా.. ఈనెల 16న తెల్లవారు జామున సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగింది. ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. హీరోపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత తన కుమారుడితో కలిసి ఆటోలోనే ఆస్పత్రికి చేరుకున్నారు. సైఫ్ను పరిశీలించిన వైద్యులు ఆయన సకాలంలో చికిత్స అందించారు. దాదాపు ఐదు రోజుల పాటు సైఫ్ ఆస్పత్రిలోనే ఉన్నారు. నిందితుడి అరెస్ట్..ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్కు చెందిన మహ్మద్ షరీఫుల్గా పోలీసులు గుర్తించారు. ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించిన షరీఫుల్ తన పేరును విజయ్ దాస్గా మార్చుకుని తిరుగుతున్నారు. కేవలం దొంగతన కోసమే అతను సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించినట్లు నిందితుడు వెల్లడించారు. పోలీసు కస్టడీ.. నిందితుడిని అరెస్ట్ చేసిన కోర్టులో హాజరు పరచగా పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఐదు రోజుల పాటు పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. -
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న సైఫ్.. బిల్ ఎంతో తెలుసా..?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జ్ కానున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడని లీలావతి ఆసుపత్రి(Lilavati Hospital) వైద్యులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 తర్వాత ఆయన డిశ్చార్జ్ అవుతారని వారు తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని తెలిపారు. దాడిలో భాగంగా సైఫ్ వెన్నెముకకు తీవ్రగాయం అయింది. దీంతో సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు.సైఫ్పై దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ప్రధాన నిందితుడైన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ను విచారించిన పోలీసులు క్రైమ్సీన్ రీక్రియేషన్ కోసం నిందితుడిని సైఫ్ ఇంటి వద్దకు తీసుకెళ్లారు. నిందితుడి వేలిముద్రలను కూడా తీసుకున్నారు. ఫోరెన్సిక్ అధికారులు కూడా సైఫ్ ఇంటికి వెళ్లి దాడి జరిగిన ప్రదేశంలో నిందితుడి వేలిముద్రలు గుర్తించారు. ఇదే విషయాన్ని ఒక అధికారి కూడా ప్రకటించారు. ఇంట్లోని కిటికీలతో పాటు లోపలికి వచ్చేందుకు ఉపయోగించిన నిచ్చెనపై కూడా నిందితుడి వేలిముద్రలు ఉన్నాయన్నారు.(ఇదీ చదవండి: ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ప్రముఖ దర్శకుడు)ఈ నెల 16న సైఫ్ ఇంటికి చోరీకి వెళ్లిన నిందితుడు మహ్మద్ షరీఫుల్ బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తిగా పోలీసులు ప్రకటించారు. దాడి తర్వాత తమ దేశానికి పారిపోయే ప్లాన్లో ఉండగా పట్టుకున్నట్లు వారు తెలిపారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సైఫ్ పూర్తి ఆసుపత్రి బిల్ రూ. 40 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. అయితే, ఆయనకు ఇన్సూరెన్స్ ఉండటం వల్ల సదరు కంపెనీ వాళ్లు ఇప్పటి వరకు రూ.25 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.సైఫ్పై దాడి జరిగిన సమయంలో అతన్ని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ కూడా ఆ సమయంలో తండ్రితో పాటు ఉన్నాడు. అయితే, ఆటో డ్రైవర్ వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తెలిపారు. కానీ, సైఫ్ను రక్షించినందుకు అతనికి ముంబయిలోని ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ ప్రకటించింది. సైఫ్ నేడు డిశ్చార్జ్ అయిన తర్వాత తనకు ఏమైనా సాయం చేయవచ్చని తెలుస్తోంది. -
దయచేసి ఇలాంటివి ఆపండి.. కరీనా కపూర్ ఆవేదన
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి ఘటనలో ఆయన సతీమణి కరీనా కపూర్(Kareena Kapoor Khan) ఆవేదనతో ఒక పోస్ట్ చేశారు. ఈ ఘటనలో చాలామంది పూర్తి విషయాలు తెలుసుకోకుండానే అసత్యప్రచారాలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన గురించి ప్రధాన మీడియాతో పాటు సోషల్మీడియాలో క్రియేట్ చేసిన వీడియోను ఓ బాలీవుడ్ నటుడు షేర్ చేయడంతో కరీనా తాజాగా రియాక్ట్ అయ్యారు.బాలీవుడ్ మీడియాలో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) గురించి చాలా కథనాలతో పాటు పలు వీడియోలు ప్రసారం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా సైఫ్ ఇంటి చుట్టూ నిత్యం కెమెరాలతో తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఆయన కుటుంబం గురించి ఉన్నవీలేనివి కల్పించి ప్రచారాలు చేస్తున్నారు. తన కుమారులు తైమూర్, జెహ్ కోసం ఆయన కొత్త బొమ్మలు తెచ్చారని, చాలా సంతోషంగా పిల్లలతో సైఫ్ అలీఖాన్ ఆడుకుంటున్న ఫోటోలు ఇవిగో అంటూ షేర్ చేశారు. (ఇదీ చదవండి: త్రిష,టొవినో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెలుగులో విడుదల)ఈ వార్తలు చూసిన కరీనా కపూర్ ఆవేదనతో ఒక పోస్ట్ చేసింది. 'దయచేసి ఇలాంటివి ఆపండి. మమ్మల్ని వదిలేయండి' అంటూ వేడుకుంది. అయితే, కొన్ని క్షణాల్లోనే ఆమె దాన్ని డిలీట్ చేయడం గమనార్హం. ఇప్పటికే మీడియా వర్గాలు, ఫ్రీలాన్సర్లు సంయమనం పాటించాలని కరీనా కోరింది. తమ ప్రకటన లేకుండా ఊహాజనిత కథనాలకు దూరంగా ఉండాలని ఆమె కోరింది. ప్రస్తుతం తామె ఎంతో కఠినమైన రోజులను ఎదుర్కొంటున్నామని పరిస్థితిని అర్థం చేసుకుంటారని రిక్వెస్ట్ చేసింది. ఆ ఘటన నుంచి తేరుకునేందుకు వీలుగా తమ కుటుంబానికి కొంత సమయం ఇవ్వాలని ఆమె కోరింది.ఈ నెల 16న సైఫ్ ఇంటికి చోరీకి వెళ్లిన షరీఫుల్ ఇస్లాం షెహ్జాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫరీగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్కు చెందిన అతను తమ దేశానికి పారిపోయే ప్లాన్లో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. దాడిలో గాయపడిన సైఫ్ స్వల్ప శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న విషయం తెల్సిందే. -
సైఫ్ అలీఖాన్పై దాడి.. పారిపోవాలనుకున్నాడు
ముంబై: దొంగతనం కోసం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడి పెనుగులాటలో ఆయనను పొడిచి పారిపోయిన బంగ్లాదేశ్కు చెందిన నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహ్జాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫరీక్ దాడి తర్వాత తన స్వదేశానికి వెళ్లిపోవాలని భావించాడు. పోలీసులు విచారణలో ఇలాంటి పలు అంశాలు తాజాగా వెల్లడయ్యాయి. గత గురువారం దాడిలో గాయపడిన సైఫ్ స్వల్ప శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న విషయం తెల్సిందే. విదేశీయులు, పాస్పోర్ట్ చట్టాల కింద కేసు నమోదు తాను ఏడు నెలల క్రితం బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్లు షరీఫుల్ ఒప్పుకున్నాడు. అతని ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్నూ పోలీసులు సంపాదించారు. దాంతో అతని బంగ్లాదేశ్లోని ఘలోకతి జిల్లావాసిగా రూఢీఅయింది. అక్రమంగా భారత్లో చొరబడ్డ నేరానికి అతనిపై విదేశీయుల చట్టం, పాస్పోర్ట్ చట్టం కింద సైతం కేసు నమోదుచేశారు. భారతీయ పాస్పోర్ట్ సంపాదించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో ఎలాగైనా డబ్బు బాగా సంపాదించి స్వదేశం వెళ్లిపోవాలని ప్లాన్ వేశాడు. అందుకే ఐదునెలలు ముంబైలో హౌస్కీపింగ్ వంటి చిన్నాచితకా పనులు చేసిన అతను వాటిని పక్కనబెట్టి దొంగతనాలకు సిద్ధమయ్యాడు. ఇందులోభాగంగానే సైఫ్ ఇంట్లో చొరబడ్డాడు. అయితే తాను దాడి చేసింది బాలీవుడ్ నటుడిపై అనే విషయం తనకు టీవీల్లో వార్తల్లో చూసేదాకా తెలియదని పోలీసు విచారణలో ఫరీఫుల్ చెప్పాడు. సీసీటీవీ ఫుటేజీలోని తన ఫొటో న్యూస్ఛానెళ్లలో ప్రసారం కావడంతో భయపడిపోయాడు. సెలబ్రిటీపై దాడి నేపథ్యంలో పోలీసులు ఎలాగైనా తనను పట్టుకుంటారని భయపడి మళ్లీ బంగ్లాదేశ్కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈలోపే పోలీసులు పట్టుకోగలిగారు.ఎలా పట్టుకోగలిగారు? వర్లీలో గతంలో తాను పనిచేసిన పబ్ ప్రాంగణంలో జనవరి 16న నిద్రించిన నిందితుడు ఆరాత్రి హఠాత్తుగా మాయమై నేరుగా సైఫ్ ఇంట్లోకి వచ్చి దాడి చేసి తర్వాత బాంద్రా రైల్వేస్టేషన్కు వెళ్లాడు. తర్వాత దాదర్కు, ఆ తర్వాత వర్లీకి వెళ్లాడు. చివరకు థానే ప్రాంతంలో ఉన్నప్పుడు పోలీసులకు పట్టుబట్టాడు. సైఫ్ ఇంటి సమీప ప్రాంతాల్లోని అన్ని సీసీటీవీ కెమెరాలను చూసినా ఇతను ఏ దిశగా వెళ్లాడనే బలమైన క్లూ పోలీసులకు దొరకలేదు. దీంతో పాత సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా జనవరి 9వ తేదీన అంధేరీ వద్ద బైక్పై వెళ్తున్న వీడియోలో ఇతడిని గుర్తించారు. బైక్ యజమానిని ప్రశ్నించగా బైక్పై వెళ్లింది తనకు తెల్సిన ఒక నిర్మాణరంగ మేస్త్రీ దగ్గర పనిచేసిన కూలీ అని సమాధానమిచ్చాడు. దీంతో పోలీసులు ఆ మేస్త్రీని విచారించారు. గతంలో చిన్నాచితకా పనుల కోసం వర్లీ ప్రాంతంలోని మేస్త్రీ దగ్గరకు వచ్చి పని ఉంటే చెప్పాలని తన ఫోన్నంబర్ ఇచ్చి ఫరీఫుల్ తర్వాత థానె వెళ్లిపోయాడు. ఈ విషయం పోలీసులకు తెల్సి మేస్త్రీని విచారించగా షరీఫుల్ మొబైల్ నంబర్ను అందజేశాడు. తాజాగా శనివారం షరీఫుల్ వర్లీ సెంచురీ మిల్ వద్ద బుర్జీపావ్, వాటర్ బాటిల్ కొన్నప్పుడు ఈ నంబర్తో చేసిన గూగుల్పే లావాదేవీతో ఫోన్ లొకేషన్ను పోలీసులు పసిగట్టారు. అయితే అప్పటికే అతను థానెలోని దట్టమైన మడ అడవుల్లోకి పారిపోయాడని తెల్సి వేట మొదలెట్టారు. చిట్టచివరకు ఆదివారం తెల్లవారుజామున హీరానందానీ ఎస్టేట్ దగ్గరి లేబర్క్యాంప్ సమీప అడవిలో పట్టుకోగలిగారు. ఆరోజు ఘటన తర్వాత దొరక్కుండా తప్పించుకునేందుకు షరీఫుల్ వెంటనే దుస్తులు మార్చేశాడు. అయితే వెంట తెచ్చుకున్న బ్యాక్ప్యాక్ సైతం ఒకరకంగా ఇతడిని పట్టించింది. ఆ ప్రాంతంలో అదే బ్యాక్ప్యాక్ వేసుకున్న, అదే పోలికలున్న వ్యక్తులను విచారించి షరీఫుల్ను పోల్చుకోగలిగారు. దాడి రోజున ఏం జరిగిందో తెల్సుకునేందుకు నిందితుడిని సద్గురుశరణ్ బిల్డింగ్లోని సైఫ్ ఫ్లాట్కు తీసుకెళ్లి పోలీసులు అతనితో సీన్ రీక్రియేషన్ చేయించే వీలుంది. -
సైఫ్ అలీ ఖాన్ను గుర్తు పట్టలేదు.. డబ్బులు కూడా తీసుకోలేదు: ఆటో డ్రైవర్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సైఫ్ ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇంట్లో చోరికి యత్నించిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని 30 ఏళ్ల బంగ్లాదేశీయునిగా(Bangladesh) పోలీసులు గుర్తించారు. అతని అసలు పేరు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్. భారత్ వచ్చాక బిజయ్ దాస్గా పేరు మార్చుకున్నాడని అధికారులు తెలిపారు.అయితే దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ను ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తండ్రిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆటో డ్రైవర్ వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తెలిపారు. అయితే సైఫ్ను రక్షించినందుకు అతనికి ముంబయిలోని ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ఆ రోజు రాత్రి జరిగిన విషయాన్ని వెల్లడించారు. తాను ఆటోలో వెళ్తండగా ఓ మహిళ ఆగండి అంటూ గట్టిగా అరిచిందని.. దీంతో వెంటనే యూ టర్న్ తీసుకుని బిల్డింగ్ గేట్ దగ్గరికి వచ్చానని తెలిపాడు. అక్కడి రాగానే ఆ వ్యక్తి దుస్తులంతా ఎర్రగా రక్తంతో తడిసిపోయి ఉన్నాయి.. అప్పుడు సమయం దాదాపు 2 గంటల 45 నిమిషాలవుతోందని అతను వివరించాడు. రోడ్డు పూర్తిగా నిర్మానుష్యంగా ఉండడంతో.. బాంద్రా వెస్ట్ నుంచి టర్నర్ రోడ్, హిల్ రోడ్ ద్వారా లీలావతి హాస్పిటల్కు చేరుకున్నాం. వారివెంట వచ్చిన పిల్లవాడు మధ్యలో కూర్చున్నాడు.. అతని కుడి వైపున గాయపడిన వ్యక్తి (సైఫ్) కూర్చున్నాడు.. కానీ రాత్రి కావడంతో నేను అతన్ని గుర్తించలేకపోయాను.. వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేరుకోవడమే లక్ష్యంగా ఆటోను నడిపినట్లు వెల్లడించారు. -
సైఫ్ ఇంట్లోకి దొంగోడు ఎలా చేరాడో, ఎలా తప్పించుకున్నాడో తెలుసా?
-
సైఫ్ అలీఖాన్కు తెలీకుండా భార్యనే నిద్రమాత్రలిచ్చింది: చిత్రనిర్మాత
బాలీవుడ్ నటీనటుల వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ టాక్ ఆఫ్ ది కంట్రీగా మారుతూనే ఉంటాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ మీద జరిగిన హత్యాయత్నం తదనంతర పరిణామాలు సైఫ్ వ్యక్తిగత జీవితాన్ని మరోసారి వార్తల్లోకి ఎక్కించాయి. ప్రస్తుతం నటుడు సైఫ్ అలీఖాన్ భార్య కరీనాకపూర్ అయినప్పటికీ ఆయనకు ఇది తొలి వివాహం కాదు. ఆయన తొలుత సహ నటి అమృతా సింగ్ను వివాహం చేసుకుని 13 సంవత్సరాల పాటు దాంపత్య జీవితం గడిపారు. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా ఈ జంట చివరకు 2004లో విడాకులు తీసుకున్నారు.ఇదిలా ఉంటే గతంలో అమృతా సింగ్ తన భర్తకు నిద్రమాత్రలు ఇచ్చిందనే విషయం చాలా కాలం క్రితమే వెల్లడైనప్పటికీ మరోసారి ఇప్పుడు ఆ విషయం హల్చల్ చేస్తోంది. చిత్రనిర్మాత, సూరజ్ బర్జాత్యా ఒకసారి ఒక చిత్రం షూటింగ్లో ఉన్నప్పుడు సైఫ్ అలీఖాన్ గురించి పలు విషయాలను వెల్లడించారు. అందులో భాగంగానే సైఫ్ అలీఖాన్కి అమృతా సింగ్ నిద్రమాత్రలు ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన బయటపెట్టారు.దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... ఈ సంఘటన హమ్ సాథ్ సాథ్ హై చిత్రం షూటింగ్ సమయంలో జరిగింది ఈ చిత్రంలో సైఫ్తో పాటు కరిష్మా కపూర్, సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రే, మోహ్నీష్ బహ్ల్, టబు కీలక పాత్రల్లో నటించారు. హమ్ సాత్ సాథ్ హై సెట్స్లో మేకర్స్ ఆశించినట్టుగా ఖచ్చితమైన షాట్ను ఖచ్చితంగా చేయడానికి వీలుగా సైఫ్ అలీ ఖాన్ సరైన పరిస్థితిలో లేడు. అతనికి కారణాలేమో తెలీదు కానీ అంతకు ముందు రాత్రి నిద్ర సరిగా లేకపోవడంతో చాలా రీటేక్లు ఇవ్వాల్సి వచ్చింది.‘‘హమ్ సాథ్ సాథ్ హై’ షూటింగ్ సమయంలో సైఫ్ అలీఖాన్ వ్యక్తిగత జీవితం చాలా హెచ్చు తగ్గులు ఎదుర్కొంది. అందుకే ఎప్పుడూ టెన్షన్లో ఉండేవాడు. ఈ చిత్రంలోని ‘సునో జీ దుల్హన్’ పాట షూటింగ్ సమయంలో సైఫ్ అలీఖాన్ పలు మార్లు రీటేక్లు తీసుకుంటున్నాడు. ఆ పాత్రను ఎలా పండించాలా అని ఆలోచిస్తూ అతను రాత్రంతా నిద్రపోలేదు. నేను అతని మొదటి భార్యతో మాట్లాడినప్పుడు ఈ విషయం నాకు తెలిసింది’’ అంటూ సూరజ్ బర్జాత్యా గుర్తు చేసుకున్నారు.అప్పుడు ఆయన సైఫ్ అలీఖాన్ భార్య అమృతాసింగ్కు ఓ సలహా ఇచ్చాడు. ’’అతను రాత్రంతా నిద్రపోవడం లేదని తెలిసి నేను అమృతకు ఓ సలహా ఇచ్చాను. అదేంటంటే... సైఫ్కు తెలియకుండా నిద్రమాత్రలు ఇవ్వాలని. నా సలహా ను అనుసరించి అమృత అతనికి తెలియకుండా నిద్రమాత్రలు ఇచ్చింది’’ అంటూ ఆయన చెప్పారు. దాంతో అతని సన్నివేశాలు చాలా వరకూ ఆ మరుసటి రోజు ఏర్పాటు చేశారట. కేవలం ఒక్క టేక్లో పాట చాలా బాగా కంప్లీట్ చేశాడు. దాంతో షూటింగ్లో అందరూ షాక్ అయ్యారు’’ అన్నారాయన.హమ్ సాథ్ సాథ్ హై చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద భారీ వాణిజ్య విజయాన్ని సాధించింది భారతీయ చలనచిత్రంలో ఐకానిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. సైఫ్ అలీ ఖాన్ 2004లో అమృతాసింగ్తో విడాకులు తీసుకున్న తర్వాత, అతను 2012లో బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ను వివాహం చేసుకున్నాడు. -
సైఫ్ అలీఖాన్పై దాడి.. నిందితుడిని పట్టించిన హోటల్ బిల్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) నివాసంలో దూరి ఆయన్ను కత్తితో పొడిచింది 30 ఏళ్ల బంగ్లాదేశీ(Bangladesh) అని పోలీసులు ప్రకటించారు. అతని అసలు పేరు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ కాగా.. భారత్ వచ్చాక బిజయ్ దాస్గా పేరు మార్చుకున్నాడని అధికారులు తెలిపారు. అయితే, ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడిని పట్టుకునేందుకు సహాయపడిన మనీ ట్రాన్సెక్షన్ వివరాలు వైరల్ అవుతున్నాయి.సైఫ్ అలీఖాన్పై దాడి జరిగిన వెంటనే ముంబై పోలీసులు అలెర్ట్ అయ్యారు. థానే జిల్లా ఘోడ్బందర్ రోడ్డులోని హీరానందానీ ఎస్టేట్ వద్ద అతన్ని అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచిన వారు 24వ తేదీ దాకా కస్టడీకి తీసుకున్నారు. దీని వెనక అంతర్జాతీయ కుట్రను తోసిపుచ్చలేమని కోర్టు అభిప్రాయపడటంతో ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. అయితే, బిజయ్ దాస్ను పోలీసులు ఎలా పట్టుకున్నారు అనేది నెట్టింట వైరల్ అవుతుంది.పరోటా, వాటర్ బాటిల్ కొనుగోలు చేయడంతో..సైఫ్ అలీఖాన్పై దాడి చేసిన తర్వాత బిజయ్ దాస్ తన హోటల్ వద్దకు వచ్చినట్లు మహ్మద్ అనే వ్యక్తి పోలీసులుకు చేరవేశాడని తెలుస్తోంది. అతని తీరు కాస్త అనుమానంగా ఉన్నట్లు అతను పోలీసులకు చెప్పాడట. చాలా ఆందోళనగా తన హోటల్ వద్దకు వచ్చి పరోటా, వాటర్ బాటిల్ కొనుగోలు చేశాడని, అందుకుగాను యూపీఐ పేమెంట్ చేశాడని మహ్మద్ చెప్పినట్లు కథనాలు వచ్చాయి. యూపీఐ ద్వారా డబ్బు పంపడంతో నిందితుడి నంబర్ తెలుసుకున్న పోలీసులు లొకేషన్ ట్రేస్ చేయడం ఆపై అతను ఠానేలో ఉన్నట్లు తెలుసుకున్నట్లు సమాచారం. పోలీసులను చూసి అతడు అక్కడినుంచి పారిపోవాలని చూడగా.. ఒక్కసారిగా చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఈ గాలింపులో దాదాపు 600 పైగానే సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించినట్లు తెలుస్తోంది.ఐదు నెలలుగా ముంబైలో... బంగ్లాదేశ్లోని ఝలోకాటికి చెందిన నిందితుడు ఐదు నెలలుగా ముంబైలో హౌస్ కీపింగ్ ఏజెన్సీలో ఉద్యోగం, చిన్నాచితకా పనులు చేస్తున్నాడు. దొంగతనం చేయడమే అతని ఉద్దేశమని ప్రాథమికంగా తేలినట్టు పోలీసులు చెప్పారు. ‘‘తాను దొంగతనానికి వెళ్తున్నది ఓ బాలీవుడ్ స్టార్ ఇంట్లోనని అతనికి తెలియదు. ఏడో అంతస్తు దాకా మెట్ల ద్వారా వెళ్లాడు. తర్వాత పైప్ ద్వారా 12వ అంతస్తుకు పాకి కిటికీ గుండా సైఫ్ ఇంటి బాత్రూంలోకి దూరాడు. అందులోంచి బయటికి రాగానే బయట కనిపించిన సిబ్బందిపై దాడి చేసి రూ.కోటి డిమాండ్ చేశాడు. అతన్ని సైఫ్ ముందు నుంచి పట్టుకున్నాడు. దాంతో సైఫ్ వీపుపై పొడిచాడు. తర్వాత నిందితుడిని గది లోపలే ఉంచి తాళం వేశారు. అతను లోనికి వెళ్లిన దారిలోనే పరారయ్యాడు. ఉదయం దాకా బాంద్రా బస్టాప్లో పడుకున్నాడు. లోకల్ ట్రైన్లో వర్లీకి చేరుకున్నాడు. అతని బ్యాగు నుంచి సుత్తి, స్క్రూ డ్రైవర్, నైలాన్ తాడు స్వాదీనం చేసుకున్నాం’’ అని వివరించారు. నిందితున్ని కోర్టుకు హాజరుపరిచిన సమయంలో అతని తరఫున వాదించడానికి ఇద్దరు లాయర్లు పోటీ పడటం విశేషం. -
అది సైఫ్ అలీఖాన్ ఇల్లు అని తెలీదు: అజిత్ పవార్
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై జరిగిన దాడి ప్రత్యేకంగా టార్గెట్ చేసిన దాడి కాదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar). అతనొక దొంగ అని, కేవలం దొంగతనం కోసమే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆ దొంగ బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తి అని, అతను దొంగతనంలో భాగంగానే ఆ ఇంట్లో చొరబడినట్లు తెలిపారు. అసలు అది సైఫ్ ఇల్లు అనే విషయం ఆ దొంగకు తెలీదన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు తమ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని వ్యాఖ్యానించడం సరైంది కాదన్నారు. ముంబైలో లా అండ్ ఆర్డర్ విఫలమైందంటూ ప్రత్యర్థి పార్టీలు పదే పదే ఆరోపణలు చేయడం తగదన్నారు.‘అతను బంగ్లాదేశ్ నుంచి ముంబైకి వచ్చాడు. తొలుత కోల్కతాకు చేరుకుని ఆ తర్వాత ముంబై(Mumbai)కి వచ్చాడు. దొంగతనం కోసం ఒక ఇంటిని ఎంచుకున్నాడు. అది సైఫ్ అలీఖాన్ ఇల్లు అనే విషయం అతనికి తెలీదు. ఈ ఘటనను అడ్డుపెట్టుకుని మాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం’ అని అజిత్ పవార్ మండిపడ్డారు.కాగా, సైఫ్ అలీఖాన్పై దాడికి పాల్పడింది బంగ్లాదేశీయుడని ముంబై పోలీసులు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత అర్ధరాత్రి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితుడి పేరు విజయ్ దాస్ అని ముందుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన ముంబై డీసీపీ జోన్ 9 దీక్షిత్ గెడం పూర్తి వివరాలు వెల్లడించారు.నిందితుడి పేరు మహ్మద్ షరీఫుల్ షెహజాద్. విజయ్ దాస్గా అందరికీ తన పేరును చెప్పుకుంటున్నాడు. ఆరు నెలల కిందట నకిలీ పత్రాలతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి చొరబడ్డాడు. నగరంలో మారు పేర్లతో తిరుగుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు. కొన్నాళ్లుగా నగరంలోని ఓ బార్లో వెయిటర్గా పని చేస్తున్నాడు. దొంగతనం కోసమే నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నాం.కొన్ని రోజుల పాటు ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని చేశాడు. ఆ టైంలోనే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు అనుమానాలున్నాయి. ప్రస్తుతం ఖర్ పోలీస్ స్టేషన్లో అతని విచారణ జరుగుతోందని తెలిపారాయన. కాగా.. సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. థానే కాసర్వదవల్లి ఎస్టేట్లోని మెట్రో నిర్మాణ స్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.‘‘జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్పై దాడి జరిగ్గా, దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందతుడ్ని అరెస్ట్ చేశారు. -
సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్
-
సైఫ్పై దాడి.. నిందితుడు బంగ్లాదేశీ: ముంబై పోలీసులు
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడికి పాల్పడింది బంగ్లాదేశీయుడని ముంబై పోలీసులు అధికారికంగా ప్రకటించారు. గత అర్ధరాత్రి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నిందితుడి పేరు విజయ్ దాస్ అని ముందుగా ప్రచారం జరిగింది. దీంతో ఈ ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన ముంబై డీసీపీ జోన్ 9 దీక్షిత్ గెడం పూర్తి వివరాలు వెల్లడించారు. నిందితుడి పేరు మహ్మద్ షరీఫుల్ షెహజాద్. విజయ్ దాస్గా అందరికీ తన పేరును చెప్పుకుంటున్నాడు. ఆరు నెలల కిందట నకిలీ పత్రాలతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి చొరబడ్డాడు. నగరంలో మారు పేర్లతో తిరుగుతూ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు. కొన్నాళ్లుగా నగరంలోని ఓ బార్లో వెయిటర్గా పని చేస్తున్నాడు. దొంగతనం కోసమే నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను స్వాధీనం చేసుకున్నాం. కొన్ని రోజుల పాటు ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో పని చేశాడు. ఆ టైంలోనే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు అనుమానాలున్నాయి. ప్రస్తుతం ఖర్ పోలీస్ స్టేషన్లో అతని విచారణ జరుగుతోందని తెలిపారాయన. కాగా.. సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. థానే కాసర్వదవల్లి ఎస్టేట్లోని మెట్రో నిర్మాణ స్థలంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. ‘‘జనవరి 16వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ అలీఖాన్పై దాడి జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. 30 ఏళ్ల మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించాం. అతడిని నిన్న(శనివారం) అరెస్ట్ చేశాం. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అతడు సైఫ్ నివాసంలోకి వెళ్లాడు. అతడిని న్యాయస్థానం ఎదుట హాజరు పరిచి కస్టడీ కోరుతాం. దీనికి సంబంధించిన తదుపరి విచారణ చేపడతాం. ప్రాథమిక విచారణలో అతడిని బంగ్లాదేశీయుడిగా గుర్తించాం. నిందితుడు అక్రమంగా భారత్లోకి ప్రవేశించాడు. భారత్ వచ్చాక విజయ్ దాస్గా పేరు మార్చుకున్నాడు. ఆరు నెలల క్రితం ముంబయి వచ్చాడు. భారతీయుడని చెప్పడానికి అతడి వద్ద సరైన ఆధారాలు లేవు’’ అని తెలిపారు.#WATCH | Saif Ali Khan Attack case | Mumbai: DCP Zone 9 Dixit Gedam says, "There is primary evidence to anticipate that the accused is a Bangladeshi. He does not have valid Indian documents. There are some seizures that indicate that he is a Bangladeshi national...As of now, we… pic.twitter.com/aV22IhKF30— ANI (@ANI) January 19, 2025ఇదిలా ఉంటే.. బాంద్రాలోని సైఫ్ నివాసంలో గురువారం (జనవరి 16) తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. దుండగుడు సైఫ్ చిన్న కుమారుడు జేహ్ గదిలోకి వెళ్లాడు. దుండగుడిని చూసిన జేహ్ కేర్టేకర్ కేకలు వేయగా సైఫ్ అక్కడికి చేరుకొన్న సమయంలో పెనుగులాట జరిగింది. ఈక్రమంలో సైఫ్ గాయపడ్డారు. ఆరుచోట్ల కత్తి గాయాలయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన క్షేమంగా ఉన్నారని వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చారు. ప్రస్తుతం సైఫ్ లీలావతి ఆస్పత్రిలోనే ఉన్నారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న ముంబయి పోలీసులు దాదాపు 20 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపులు చేపట్టారు. దాదాపు మూడు రోజుల తర్వాత అతడిని అరెస్ట్ చేశారు. -
సైఫ్ అలీ ఖాన్పై దాడి.. అసలైన నిందితుడి అరెస్టు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడికి పాల్పడిన అసలైన నిందితుడిని ముంబై పోలీసులు(Mumbai Police) అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి మహారాష్ట్రలోని థానే జిల్లాలో అతన్ని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. సైఫ్పై దాడికి పాల్పడిన వ్యక్తి విజయ్ దాస్గా పోలీసులు గుర్తించారు. ఈ కేసు ఆపరేషన్లో భాగంగా పోలీసులు పలు బృందాలుగా విడిపోయి విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో థానే జిల్లాలోని హీరానందని వద్ద జరుగుతున్న మెట్రో నిర్మాణ సమీపంలో ఉన్న ఒక లేబర్ క్యాంప్లో దాస్ ఆశ్రయం పొందాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ నివాసి అయిన విజయ్ దాస్ గతంలో సైఫ్-కరీనా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక పబ్లో హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేశాడని వారు తెలిపారు. నిందితుడు మొదట అక్కడి పరిసర ప్రాంతాల్లో పని చేయడం వల్ల సులువుగా ఇంట్లోకి వెళ్లే మార్గాలను తెలుకున్నట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. అతని అరెస్టు తరువాత, తదుపరి విచారణ కోసం దాస్ను ముంబైకి తరలించారు.అంధేరీ వెస్ట్ స్టేషన్ వెలుపల దొరికిన అతని సీసీటీవీ ఫుటేజీ సహాయంతో నిందితుడిని చేరుకోగలిగామని క్రైమ్ బ్రాంచ్ వర్గాలు వెల్లడించాయి. అక్కడ అతని స్నేహితుడు తీసుకెళ్లారు. ఆ ఫుటేజీ సహాయంతో, పోలీసులకు మొదటి క్లూ లభించింది. అంటే దాస్ స్నేహితుడిని తీసుకెళ్లడానికి స్టేషన్ వెలుపలికి వచ్చిన అతని మోటారుసైకిల్ నంబర్ సాయంతో అతని వాహనాన్ని కనిపెట్టారు. అతన్ని విచారించిన తర్వాత దాస్ను పోలీసులు చేరుకోగలిగారు. దాస్ను పట్టుకునేందుకు కాసర్వదలి పోలీసులు ముంబై టీమ్కు సహకరించారు.ప్రాథమిక విచారణలో నిందితుడు తక్కువ వ్యవధిలో త్వరగా డబ్బు సంపాదించాలనుకుంటున్నట్లు పోలీసులకు వెల్లడించాడు. నిందితుడు పశ్చిమ బెంగాల్కు చెందినవాడు. అయితే, ముంబైలో వర్లీ కోలివాడ సమీపంలో ఉండేవాడు. సైఫ్పై దాడి వల్ల అరెస్టు భయంతో ఇటీవలే థానే హీరానందానీకి అతను మకాం మార్చాడు. వెస్ట్ రీజియన్ అదనపు పోలీసు కమిషనర్ పరంజిత్ దహియా, డీసీపీ జోన్ 09 దీక్షిత్ గెడం ఆధ్వర్యంలో దయా నాయక్ నేతృత్వంలోని క్రైమ్ బ్రాంచ్ టీమ్ యూనిట్ -9 నిందితుడిని కనిపెట్టింది. ఆదివారం ఉదయం 9 గంటలకు ముంబయి డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆపై ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. -
సైఫ్పై దాడి ఘటన.. అనుమానితుడి అరెస్ట్
దుర్గ్: నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించి ఆయనపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన దర్యాప్తులో కీలక పరిణామం సంభవించింది. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ రైల్వే స్టేషన్లోని ఓ రైలులో ఉన్న అనుమానితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని లోకమాన్య తిలక్ టెరి్మనస్(ఎలీ్టటీ)నుంచి కోల్కతా వెళ్లే జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న అతడిని ఆకాశ్ కైలాశ్ కనోజియా(31)గా గుర్తించారు. సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో అనుమానితుడొకరు జ్ఞానేశ్వరి ట్రెయిన్లో ఉన్నట్లు ముంబై పోలీసులు శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో దుర్గ్ రైల్వే పోలీసులను అలెర్ట్ చేశారు. అనుమానితుడి సెల్ ఫోన్ లొకేషన్తోపాటు అతడి ఫొటోను షేర్ చేశారు. వెంటనే స్పందించిన దుర్గ్ పోలీసులు ముందుగానే అతడిని పట్టుకునేందుకు రాజ్నంద్గావ్ స్టేషన్ పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే, రాజ్నంద్గావ్లో ఆగిన సమయంలో అక్కడి పోలీసులు అనుమానితుడిని గుర్తించలేకపోయారు. దీంతో, ఆ రైలు చేరుకునే సమయానికి దుర్గ్ రైల్వే స్టేషన్లో రెండు బృందాలను సిద్ధం చేశారు. మొదటి జనరల్ బోగీలో ఉన్న ఆకాశ్ను వెంటనే గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. అతడి ఫొటోను ముంబై పోలీసులకు పంపి నిర్థారణ చేసుకున్నారు. గురువారం తెల్లవారు జామున సైఫ్పై కత్తితో దాడి చేసిన అనంతరం భవనంమెట్ల మార్గం గుండా దిగుతున్న నిందితుడి ముఖం సీసీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డవడం తెలిసిందే. ముంబై పోలీసులు విమానంలో రాయ్పూర్ వెళ్లి ఆకాశ్ కైలాశ్ను కస్టడీకి తీసుకుంటారని అధికారులు తెలిపారు. -
సైఫ్ను ఆవేశంతో పొడిచాడు.. నా నగల జోలికి వెళ్లలేదు: కరీనా
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి (Saif Ali Khan Attack) ఘటనలో ఆయన సతీమణి, హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor) స్టేట్మెంట్ను బాంద్రా పోలీసులు రికార్డు చేశారు. ఈ ఘటన గురించి కరీనా పోలీసులతో మాట్లాడుతూ.. దొంగతనానికి వచ్చిన వ్యక్తి ఎంతో ఆవేశంగా ఉన్నాడంది. అతడిని సైఫ్ అడ్డుకోవడంతో కోపంతో పలుమార్లు కత్తితో పొడిచాడని పేర్కొంది. తన నగలు బయటే ఉన్నప్పటికీ వాటిని తీసుకునేందుకు ప్రయత్నించలేదని తెలిపింది. ఈ దాడి తర్వాత సోదరి కరిష్మా వచ్చి తన ఇంటికి తీసుకెళ్లిందని వివరించింది.ఏం జరిగిందంటే? ముంబైలోని బాంద్రాలో నివాసముంటున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గురువారం తెల్లవారుజామున ఓ దుండగుడు చోరీకి ప్రయత్నించాడు. సైఫ్ చిన్నకుమారుడు జెహ్ గదిలో నక్కిన అతడిని పనిమనిషి గుర్తించి కేకలు వేయడంతో సైఫ్ పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. దుండగుడిని అడ్డుకునే క్రమంలో అతడు విచక్షణారహితంగా సైఫ్ను కత్తితో పొడిచి మెట్లమార్గం గుండా పరారయ్యాడు.సమయానికి కారు కూడా అందుబాటులో లేకపోవడంతో ఓ ఆటోలో సైఫ్ అలీఖాన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడిని పరిశీలించిన వైద్యులు రెండు లోతైన కత్తిపోట్లు సహా మొత్తం ఆరు కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. వెన్నెముకలో 2.5 అంగుళాల కత్తి మొన విరిగినట్లు గుర్తించి ఆపరేషన్ ద్వారా తొలగించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది.నిందితుడి కోసం గాలింపుసైఫ్ అలీఖాన్పై జరిగిన దాడి ఘటనపై పోలీసులు 20 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నారు. మొదట నిందితుడు దొరికాడని, అతడు దొంగతనం కోసమే నటుడి ఇంట్లోకి చొరబడినట్లు వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని పోలీసులు స్పష్టతనిచ్చారు. దాడి జరగడానికి రెండు రోజుల క్రితం సైఫ్ ఇంట్లో పని చేసిన కార్పెంటర్ను విచారించి వదిలేశామని తెలిపారు. ఇక విచారణలో భాగంగా ఇప్పటికే 30 మంది స్టేట్మెంట్స్ను పోలీసులు రికార్డు చేశారు. శుక్రవారం ఒక్కరోజే 15 మందిని విచారించారు. శనివారం నాడు మధ్యప్రదేశ్లోని ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.సినిమాసైఫ్ అలీఖాన్ హిందీలో అనేక సినిమాలు చేశాడు. హీరోగా, విలన్గా మెప్పించాడు. పలు సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించాడు. తెలుగులోనూ రెండు సినిమాలు చేశాడు. ప్రభాస్ 'ఆదిపురుష్'లో లంకేశ్గా నటించాడు. గతేడాది వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ 'దేవర మూవీ'లో విలన్గా మెప్పించాడు.చదవండి: Saif Ali Khan: హైప్రొఫైల్ కేసులో ఇంత అలసత్వమా? -
Saif Ali Khan: హైప్రొఫైల్ కేసులో ఇంత అలసత్వమా?
ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో ముంబై పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగి రెండ్రోజులు గడిచినప్పటికీ.. ఇప్పటికీ నిందితుడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. మరోవైపు.. నిందితుడు మాత్రం పక్కాగా తప్పించుకుంటూ తిరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడి కేసులో ముంబై పోలీసుల(Mumbai Police)పై ఇటు సినీవర్గాల, అటు రాజకీయ వర్గాల నుంచి విపరీతమైన ఒత్తిడి నెలకొంది. ఘటన జరిగి 50 గంటలు దాటిపోయినా.. నిందితుడిని, అతనితో సంబంధం ఉన్నవాళ్లెవరినీ పోలీసులు ట్రేస్ చేయలేకపోయారు. సెలబ్రిటీల విషయంలోనే ఇలా ఉంటే.. మా పరిస్థితి ఏంటని? సాధారణ ప్రజలు సైతం ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు సోషల్మీడియాలో ముంబై పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు నిందితుడు తప్పించుకుంటున్న తీరూ పోలీసులను మరింత ఇబ్బందికి గురి చేస్తోంది.తాజాగా సైఫ్పై దాడి చేసిన దుండగుడి(Saif Attacker)కి సంబంధించిన మరో ఫొటో బయటకు వచ్చింది. దాడి జరిగిన రోజు.. తల కవర్ అయ్యేలా బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నట్లుగా ఫొటోలను తొలుత మీడియాకు పోలీసులు విడుదల చేశారు. ఆపై కొన్నిగంటల వ్యవధిలో విడుదల చేసిన ఫుటేజీలో బ్లూ షర్ట్ కనిపించింది. ఇప్పుడు తాజాగా రిలీజ్చేసిన ఫొటోల్లో పసుపు రంగు దుస్తుల్లో కనిపించాడు. బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలోని దొరికిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలుగా తెలుస్తోంది. దీంతో.. అక్కడ రైలెక్కి నగరంలోని మరో చోటుకి నిందితుడు పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఘటన జరిగిన కొన్ని గంటలకు ఓ దుకాణానికి వెళ్లి హెడ్ఫోన్స్ కొన్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.Mumbai, Maharashtra: Officers from the Crime Branch visited the Kabutarkhana area in Dadar and collected CCTV footage from a mobile shop named "Iqra" from where he purchased headphones after attacking actor Saif Ali Khan pic.twitter.com/ILxBjsD7eZ— IANS (@ians_india) January 18, 2025ఈ క్రమంలో ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్ల వెంట సీసీకెమెరాలను జల్లెడ పడుతున్నారు. ప్రస్తుతానికి నిందితుడి కోసం గాలింపు చేపడుతున్న బృందాల సంఖ్యను 35కి పెంచారు.ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. దుండగుడ్ని తొలిగా చూసింది సైఫ్ ఇంట పని చేసేవాళ్లు. దీంతో బాంద్రా పోలీసులు వాళ్ల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. నిందితుడి గురించి ఆనవాళ్లను వాళ్ల నుంచి సేకరించారు. సుమారు 35-40 ఏళ్ల మధ్య వయసు ఉండొచ్చని, ఐదున్నర అడుగుల ఎత్తు, ఛామనఛాయ రంగు ఉన్నట్లు వెల్లడించారు. ఇక.. దాడిపై సైఫ్ భార్య కరీనా కపూర్(Kareena Kapoor)తో పాటు ఇతర కుటుంబ సభ్యుల నుంచి కూడా పోలీసులు వాంగ్మూలం సేకరించారు. అది అరెస్ట్ కాదు!సైఫ్పై దాడి ఘటన కేసులో ముంబై పోలీసులు ఇప్పటికే వందకుపైగా మందిని విచారించారు. క్రిమినల్ రికార్డులు ఉన్న మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఓ కార్పెంటర్ను పోలీసులు విచారణ కోసం తీసుకొచ్చారు. అయితే సైఫ్ కేసులో నిందితుడు అరెస్ట్ అయ్యాడంటూ.. మీడియా హడావిడి చేసింది. అయితే అతను కేవలం అనుమానితుడు మాత్రమేనని, కేవలం విచారణ జరిపి వదిలేశామని, ఈ కేసులో ఇంతదాకా ఎలాంటి అరెస్ట్ చేయలేదని, అలాంటిది ఏమైనా ఉంటే తామే స్వయంగా ప్రకటిస్తామని ముంబై పోలీసులు స్పష్టత ఇచ్చారు. మరోవైపు ఈ కేసులో వస్తున్న విమర్శలను సీఎం దేవంద్ర ఫడ్నవీస్ ఖండించారు. పోలీసులు అన్నికోణాల్లో.. అన్నివిధాలుగా దర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.FIR ప్రకారం..ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్(54)పై బుధవారం అర్ధరాత్రి దాటాక 2గం.30ని. ప్రాంతంలో ఆయన నివాసంలోనే దాడి జరిగింది. ఈ ఘటనపై ఆయన కుటుంబం బాంద్రా పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఎఫ్ఆర్లో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.దుండగుడు ఆ రాత్రి సైఫ్ చిన్నకొడుకు జెహ్ గదిలోకి ప్రవేశించాడు. వెంటనే.. ఆ చిన్నారి సహాయకురాలు సాయం కోసం కేకలు వేసింది. ఆ అరుపులతో గదిలోకి వచ్చిన సైఫ్కి దుండగుడికి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న పదునైన కత్తితో సైఫ్ను ఆరుసార్లు పొడిచాడు. ఆ వెంటనే మరో ఇద్దరు సహాయకులపైనా దుండగుడు హాక్సా బ్లేడ్తో దాడి చేసి పారిపోయాడు.రక్తస్రావం అయిన సైఫ్ను తనయుడు ఇబ్రహీం, ఇతర కుటుంబ సభ్యులు ఓ ఆటోను పిలిపించి.. లీలావతి ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి 3గం. టైంలో సైఫ్ను ఆస్పత్రిలో చేర్పించారు. వెన్నెముకకు దగ్గరగా కత్తి ముక్క దిగడంతో సర్జరీ చేసి దానిని తొలగించారు. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ప్రకటించారు.ఇదీ చదవండి: ముంబైలో దాడులకు గురైన సెలబ్రిటీలు వీళ్లే! -
చాలా సిగ్గుపడుతున్నా.. సైఫ్కు క్షమాపణలు చెప్పిన ఊర్వశి రౌతేలా
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్కు నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) క్షమాపణలు చెప్పారు. సైఫ్పై జరిగిన దాడిని చాలామంది సినీ ప్రముఖులు తవ్రంగా ఖండించారు. కానీ, డాకు మహారాజ్ (Daaku Maharaaj) సక్సెస్లో ఉన్న ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సైఫ్పై జరిగిన దాడి గురించి కామెంట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని అంటూనే తన చేతికి ఉన్న వ్రజపు ఉంగరాన్ని చూపుతూ మాట్లాడటం విమర్శలకు దారి తీసింది. దీంతో ఆమె క్షమాపణలు చెబుతూ సోషల్మీడియాలో ఒక నోట్ విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో 'సింగం అగైన్' తెలుగు వర్షన్ స్ట్రీమింగ్)'డియర్ సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) సర్.. మీకు క్షమాపణలు చెబుతూ పంచుకుంటున్న ఈ పోస్ట్ చేరుతుందని ఆశిస్తున్నాను. ఒక ఇంటర్వ్యూలో మీ గురించి మాట్లాడుతున్న సమయంలో నేను వ్యవహరించిన తీరుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. ఆ ఇంటర్వ్యూలో నేను మాట్లాడుతున్న సమయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రత గురించి నాకు తెలియదు. డాకు మహారాజ్ విజయం వల్ల వచ్చిన సంతోషంలో నేను ఉన్నాను. ఆ సక్సెస్ వల్ల నాకు వచ్చిన బహుమతుల గురించి మాట్లాడాను. మీపై జరిగిన దాడి తీవ్రత గురించి తెలుసుకున్న తర్వాత సిగ్గు పడుతున్నాను. నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. కష్ట సమయంలో మీరు చూపిన తెగువ, ధైర్యం చాలా గొప్పది' అని పేర్కొన్నారు.సైఫ్పై ఊర్వశి చేసిన కామెంట్లు'డాకు మహారాజ్' విజయం వల్ల తనకు చాలామంది బహుమతులు పంపించారని ఊర్వశి ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. అదే సమయంలో తనకు వచ్చిన బహుమతులను సైఫ్ దాడికి ముడిపెట్టి మాట్లాడడటం వల్ల ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు. 'సైఫ్పై దాడి దురదృష్టకరం. నేను నటించిన డాకు మహారాజ్ రూ.105కోట్లు వసూళ్లతో మంచి విజయం సాధించింది. నాకు మా అమ్మ డైమండ్ ఉంగరం కానుకగా ఇచ్చింది. మా నాన్న ఖరీదైన రోలెక్స్ వాచ్ ఇచ్చారు. అయితే, వాటిని ధరించి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకుంటే ఎవరైనా మనపై అలా దాడి (సైఫ్) చేస్తారనే భయం ఉంటుంది' అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ట్రోల్స్ రావడంతో ఊర్వశీ తాజాగా క్షమాపణలు చెప్పారు. సైఫ్ అలీ ఖాన్ దాడి జరిగింది దొంగతనం కోసమే కావడంతో ఆమె వ్యాఖ్యలు కూడా ఆ సంఘటనను గుర్తు చేస్తూ మాట్లాడటం వల్ల విమర్శలు వచ్చాయి. -
సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు
-
దుండగుడి కోసం వేట
ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడికి పాల్పడిన దుండగుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు వేట ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా 35 పోలీసు బృందాలు ఆగంతకుడి కోసం గాలిస్తున్నాయి. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని ఉన్నతాధికారులు తెలిపారు. దర్యాప్తుపై హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. ‘పోలీసుల దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే చాలా ఆధారాలు లభించాయి. దుండగుడిని త్వరలో వారు పట్టుకుంటారు’అని తెలిపారు. ఇందుకు సంబంధించి వారిస్ అలీ సల్మానీ అనే ఓ కార్పెంటర్ను ప్రశ్నిస్తున్నట్లు అంతకుముందు ముంబై పోలీసులు ప్రకటించారు. ఘటనకు ముందు రెండు రోజులపాటు అతడు సైఫ్ ఫ్లాట్లోనే పనులు చేశాడన్నారు. విచారణ అనంతరం అతడికి దాడితో సంబంధం లేదని తేలడంతో వదిలేశామన్నారు. ఆగంతకుడికి ఎలాంటి నేర ముఠాలతోనూ సంబంధం లేదని అందిన ఆధారాలను బట్టి తెలుస్తోందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీని బట్టి అతడు 1.37 గంటల సమయంలో మెట్ల ద్వారా ఇంట్లోకి చేరుకున్నట్లు వెల్లడైందన్నారు. అతడుదొంగతనానికి వెళ్లింది సైఫ్ ఇంట్లోకి అనే విషయం కూడా అతడికి తెలిసుండకపోవచ్చని చెప్పారు. కాగా, సైఫ్పై దాడి ఘటనతో అండర్ వరల్డ్ గ్యాంగ్లకు సంబంధం లేదని మహారాష్ట్ర హోం శాఖ ఉప మంత్రి యోగేశ్ కదమ్ స్పష్టం చేశారు. బెదిరింపులు వచ్చినట్లుగా సైఫ్ అలీ ఖాన్ సైతం ఎన్నడూ పోలీసులకు చెప్పలేదని, భద్రత కల్పించాలని కోరలేదని కూడా మంత్రి తెలిపారు. ఆయన అడిగితే భద్రత నిబంధనల మేరకు కలి్పంచి ఉండేవారమన్నారు. దాడి ఘటనకు చోరీ యత్నం మాత్రమే కారణమని వివరించారు. ఇలా ఉండగా, సైఫ్ ఇంట్లో చోరీకి యతి్నంచిన దుండగుడే ఈ నెల 14వ తేదీన బాలీవుడ్ మరో స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ నివాసం వద్ద రెక్కీ కూడా నిర్వహించినట్లు ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. సైఫ్ కోలుకుంటున్నారు: ఆస్పత్రి వర్గాలు తీవ్ర కత్తి పోట్లకు గురైన సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటున్నారని లీలావతి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఆయన కొద్దిసేపు నడిచారని, వెన్నెముకకు తీవ్ర గాయమైనందున బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించామని పేర్కొంది. ఆయనకు ఎలాంటి సమస్యా లేకుంటే మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే చెప్పారు. ‘ఓ వైపు రక్తమోడుతూనే ఆయన ఆస్పత్రి లోపలికి సింహంలా నడుచుకుంటూ వచ్చారు. పక్కన కుమారుడు ఆరేడేళ్ల తైమూర్ మాత్రమే ఉన్నాడు’’ అంటూ గురువారం వేకువజామున సైఫ్ చూపిన గుండెనిబ్బరాన్ని మెచ్చుకున్నారు డాక్టర్ డాంగే. నేను, సైఫ్ అలీ ఖాన్.. గురువారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో రక్తంతో తడిచిన కుర్తాతో తాను తీసుకెళ్లిన వ్యక్తి నటుడు సైఫ్ అలీ ఖాన్ అనే విషయం లీలావతి ఆస్పత్రికి వెళ్లేదాకా తనకు తెలియదని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా చెప్పారు. ఆస్పత్రి గేటు వద్దకు వెళ్లాక అక్కడి గార్డుతో.. స్ట్రెచర్ తీసుకురా, నేను..సైఫ్ అలీ ఖాన్ను అని ఆయన చెప్పాకనే ఆ విషయం తెలిసిందని రాణా శుక్రవారం ముంబైలో మీడియాకు తెలిపారు. ‘సైఫ్ ఉంటున్న సద్గురు శరణ్ అపార్టుమెంట్ సమీపం నుంచి వెళ్తుండగా ఒక మహిళ, మరికొందరు తన ఆటోను ఆపారు. అనంతరం రక్తంతో తడిచిన కుర్తాతో ఓ వ్యక్తి ఆటోలో కూర్చున్నారు. ఆయనతోపాటు 8 ఏళ్ల బాలుడు, ఓ యువకుడు, మహిళ కూర్చున్నారు. మొదట వాళ్లు హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి వెళ్లాలనుకున్నారు. కానీ, సైఫ్ లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో, అక్కడికే ఆటోను పోనిచ్చాను. అక్కడికెళ్లాక సైఫ్ ఆస్పత్రి గేట్ వద్ద గార్డును పిలిచారు. దయచేసి స్ట్రెచర్ తీసుకురా..నేను, సైఫ్ అలీ ఖాన్ అని అన్నారు. అప్పుడు సమయం దాదాపు మూడైంది. ఏడెనిమిది నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాం’అని రాణా వివరించారు. అప్పటి దాకా ఆయన సైఫ్ అలీ ఖాన్ అనే సంగతి గమనించలేదని చెప్పారు. -
‘సైఫ్’పై దాడి ఘటన..మంత్రి కీలక ప్రకటన
ముంబయి:బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) మీద దుండగుడి దాడి ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి యోగేశ్ కదమ్(Yogesh Kadam) పుణెలో శుక్రవారం(జనవరి17) మీడియాతో మాట్లాడారు. సైఫ్ దాడి వెనుక చోరీ ఉద్దేశం మాత్రమే కనిపిస్తోందని కదమ్ పేర్కొన్నారు. ఈ దాడి అండర్వరల్డ్ గ్యాంగ్ల ప్రమేయం ఏమీ లేదన్నారు. సైఫ్పై దాడి చేసినట్లుగా భావించి ఓ అనుమానితుడి ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. సీసీటీవీలో కనిపించిన వ్యక్తి ముఖానికి దగ్గర పోలికలు ఉన్న ఈ యువకుడికి నేర చరిత్ర ఉందన్నారు.అయితే, సైఫ్పై దాడి ఘటనతో అతడికి సంబంధం లేదని గుర్తించినట్లు చెప్పారు.కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసులో మరో వ్యక్తిపై కూడా పోలీసులు నిఘా ఉంచారని చెప్పారు. దుండగుల నుంచి బెదిరింపు వచ్చినట్లు సైఫ్ నుంచి పోలీసులకు ఎటువంటి సమాచారం లేదని,సెక్యూరిటీ కూడా అడగలేదని చెప్పారు.ఒకవేళ భద్రత కోరితే నిబంధనల ప్రకారం కల్పిస్తామన్నారు. మరోవైపు సైఫ్ శరీరం నుంచి పదునైన వస్తువును బయటకు తీసినట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన వెన్నెముకకు తృటిలో ప్రమాదం తప్పిందన్నారు. ఆయన మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ముంబై బాంద్రా ప్రాంతంలోని సైఫ్ ఇంట్లోనే అతడిపై దాడి జరిగింది. అర్ధరాత్రి చోరీకి యత్నించిన దుండగుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా సైఫ్పై కత్తితో దాడి చేసి పారిపోయాడు. అనంతరం తీవ్ర గాయాలతో సైఫ్ లీలావతి ఆస్పత్రిలో చేరారు.ఇదీ చదండి: ఫస్ట్ టార్గెట్ సైఫ్ కాదట.. -
ఫైర్ ఎగ్జిట్ మెట్ల ద్వారా ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు
-
ఆ స్టార్ హీరో ఇంట్లో చోరీకి ప్లాన్.. వర్కవుట్ కాకపోవడంతో సైఫ్ ఫ్లాట్లో!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) దాడి ఘటనలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు తొలుత.. స్టార్ హీరో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్లాన్ వేసుకున్నాడట! షారూఖ్ నివాసమైన మన్నత్లో జనవరి 14న చోరీకి పథకం రచించాడట! కానీ అక్కడ భద్రత ఎక్కువగా ఉండటంతో ఇంట్లోకి ప్రవేశించలేకపోయాడని తెలుస్తోంది. దీంతో అతడు పటిష్ట భద్రత లేని సైఫ్ అలీఖాన్ ఇంటిని ఎంచుకున్నాడు.ఏం జరిగిందంటే?బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి ఘటనతో చిత్రపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎక్కువగా సంపన్నులు నివాసముండే బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి జనవరి 16న గుర్తు తెలియని దుండగుడు దూరాడు. సైఫ్ చిన్న కుమారుడు జెహ్ (Jehangir Ali Khan) గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను గమనించిన పనిమనిషి బిగ్గరగా కేకలు వేసింది. ఆ శబ్దాలు వినిపించి నిద్ర నుంచి మేల్కొన్న సైఫ్ పరుగెత్తుకుంటూ ఆ గదిలోకి వచ్చాడు. దుండగుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ పెనుగులాటలో దుండగుడు సైఫ్ను విచక్షణారహితంగా కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. ఆరు కత్తిపోట్లతో రక్తమోడుతున్న సైఫ్ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కారు కూడా సిద్ధంగా లేకపోవడం శోచనీయం. దీంతో నటుడి పెద్ద కుమారుడు ఇబ్రహీం ఆటోలో తండ్రిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించడంతో ప్రాణాపాయం తప్పింది. వెన్నెముకలో 2.5 అంగుళాల కత్తి మొన విరగ్గా ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. 36 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.చదవండి: సైఫ్ అలీ ఖాన్పై దాడి.. దుండగుడి డిమాండ్ ఏంటంటే.? -
సైఫ్ అలీ ఖాన్ కేసులో నిందితుడు అరెస్ట్
-
సైఫ్ అలీ ఖాన్పై దాడికి పాల్పడిన నిందితుడు అరెస్ట్
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్(54)పై(Saif Ali Khan) దాడిచేసిన వ్యక్తిని ముంబై పోలీసులు కొంతసమయం క్రితం అరెస్ట్ చేశారు. సైఫ్పై దాడి ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే బాంద్రా పోలీసులు(Bandra Police) రంగంలోకి దిగారు. సుమారు 36 గంటల్లో అతన్ని బాంద్రా ప్రాంతంలోనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందుతుడిని పోలీసులు విచారిస్తున్నారు. రాత్రిపూట ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో సెక్షన్ 331(4), సెక్షన్ 311 కింద అతనిపై పోలీసులు కేసు పెట్టారు. సైఫ్పై దాడి ఘటనలో మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో వారు విచారణ జరుపుతున్నారు. (ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' ప్రసారం చేసిన కేబుల్ ఆపరేటర్ ఆరెస్ట్)దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఫ్లాట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. అయితే, తాజాగా నిందితుడు పట్టుబడటంతో మరిన్ని వివరాలు వెళ్లడి అయ్యే ఛాన్స్ ఉంది. సైఫ్, కరీనా దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఫ్లాట్లో నిద్రిస్తున్న సమయంలో అలికిడి వినిపించింది. అప్పటికే సైఫ్ చిన్నకుమారుడు జహంగీర్ గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను పనిమనిషి గమనించి బిగ్గరగా కేకలు వేసింది. అలారం మోగించింది. దాంతో అతడు ఆమెపై కత్తి దూశాడు. ఈ శబ్దాలు వినిపించి నిద్ర నుంచి మేల్కొన్న సైఫ్ అలీ ఖాన్ ఆ గదిలోకి వచ్చి దుండగుడిని అడ్డుకొనేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలోనే సైఫ్పై కత్తితో విచక్షణారహితంగా నిందితుడు పొడిచాడు. -
ముంబైలో బాలీవుడ్ ప్రముఖులపై ఇన్ని దాడులు జరిగాయా!
బాలీవుడ్ (Bollywood) ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై జరగిన దాడితో చిత్ర పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎంతో సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఇంతటి ఘోరం జరగడంతో వారు ఆశ్చర్యపోతున్నారు. గ్యాంగ్స్టర్స్తో ఒకప్పుడు నిండిపోయిన ముంబైలో కొన్నేళ్ల తర్వాత ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అయితే, గతంలో కూడా ఇలాంటి దాడులో బాలీవుడ్ నటీనటులపై జరిగాయి.పంజాబ్ను ఓ ఊపు ఊపిన సింగర్ చమ్కీలాపై తూటాల వర్షంభారతీయ సంగీత చరిత్రలో చమ్కీలా కథకు ప్రత్యేకమైన అధ్యాయముంది. వివాహేతర సంబంధాలు, మత సంఘర్షణలు, మద్యపానం, వరకట్నాలు, మాదకద్రవ్యాలు.. ఇలా ప్రతి సమస్యపైనా పాట కట్టి.. ప్రజలను ఆలోచింపచేసేవాడు చమ్కీలా.. 1988 మార్చి 8న మధ్యాహ్నం 2 గంటలకు మెహసంపూర్ సమీపంలోని ప్రదర్శనకు వెళ్తుంటే.. ముసుగులేసుకున్న కొందరు దుండగులు బైక్స్ మీదొచ్చి చమ్కీలా కారుకు అడ్డుపడ్డారు. మరుక్షణమే తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. ఆ దాడిలో చమ్కీలా(27), అమర్జోత్ అక్కడికక్కడే కన్నుమూశారు. ఆ సమయంలో అమర్జోత్ గర్భవతి. సంఘటనా స్థలంలో ఉన్న కొందరు గ్రామస్థులు.. ఆ దుండగులను వెంబడించినా దొరకలేదు. దాంతో ఎవరు చంపారు? అనేది నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది. నిజానికి ఈ హత్యకేసుపై చాలా ఊహాగానాలున్నాయి. అప్పటి ఖలిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా పాటలు రాసినందుకే సిక్కు ఉగ్రవాదులు చమ్కీలాను చంపేశారని కొందరి అభిప్రాయం.క్యాసెట్ కింగ్పై కాల్పులు‘క్యాసెట్ కింగ్’ అని పిలిచే టీ-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ను 1997 ఆగస్టు 12న దుండగులు కాల్చి చంపారు. ఆ సమయంలో ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సబర్బన్ అంధేరీలోని శివాలయాన్ని ప్రతిరోజూ రెండుసార్లు (ఉదయం, సాయంత్రం) దర్శించుకునేవారు. ఈ హత్య కేసులో చాలా మందిని అరెస్ట్ చేసి విచారించారు. గుల్హన్ కుమార్ హత్య కేసులో ప్రముఖ సంగీత దర్శకుడు నదీంను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. గుల్హన్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఆయనను విచారించారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది.బుల్లెట్ల గాయాలతోనే ఆసుపత్రికి వెళ్లిన స్టార్ హీరో తండ్రి2000వ సంవత్సరం రోషన్ కుటుంబానికి చేదు గుర్తులనే మిగిల్చింది. హృతిక్ రోషన్ తొలి చిత్రం కహో నా.. ప్యార్ హై అతనికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. అయితే కొద్ది రోజులకే వారికి పెద్ద ప్రమాదమే ఎదురైంది. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్పై ముంబైలోని అతని కార్యాలయం వెలుపల అండర్ వరల్డ్తో సంబంధం ఉన్న కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో అతనికి రెండు బుల్లెట్లు తగిలినప్పటికీ ఎంతో వీరోచితంగా తన కారులోనే డ్రైవింగ్ చేసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లగలిగాడు. అలా ప్రాణాలతో ఆయన బటయపడ్డాడు.షారూఖ్ ఖాన్కు పలుమార్లు హెచ్చరికలుబాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ను చంపేస్తామంటూ ఇప్పటికే పలు బెదిరింపులు వచ్చాయి. 1990ల్లో షారుక్ను అండర్వరల్డ్ టార్గెట్ చేసింది. గ్యాంగ్స్టర్ అబూసలేం అనేకసార్లు షారుఖ్కు వార్నింగ్స్ ఇచ్చాడు. కానీ, ఖాన్ మాత్రం చాలా ధైర్యంగా వారికి వ్యతిరేకంగా పోరాడారు. సల్మాన్ ఖాన్కు ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో హెచ్చరికలు రావడం తెలిసిందే. అలాంటి హెచ్చరికే వారి నుంచి షారుఖ్ ఖాన్కు కూడా గతంలో వచ్చింది. రూ.50 లక్షలు ఇవ్వకుంటే షారుఖ్ను చంపేస్తామంటూ బాంద్రా పోలీసుల సెల్ఫోన్కు మెసేజీ వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్కు చెందిన ఫైజాన్ ఖాన్ అనే లాయర్ పేరుతో ఉన్న ఫోన్ నుంచి ఆ మెసేజీ వచ్చినట్లు గుర్తించారు.ప్రీతీజింటా ధైర్యం2001 సమయంలో అండర్వరల్డ్కు వ్యతిరేకంగా బాలీవుడ్ నటి ప్రీతీజింటా కోర్టులో సాక్ష్యం చెప్పింది. ఆ సమయంలో తను నటించిన 'చోరీచోరీ చుప్కే చుప్కే' సినిమాకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఆమె ఎదుర్కొంది. ఈ సినిమాకు పెట్టుబడులు పెట్టిన నిర్మాత నజీమ్ రిజ్వీతో పాటు ఫైనాన్షియర్ భరత్ షా అండర్వరల్డ్ గ్యాంగ్స్టర్ ఛోటా షకీల్ నుంచి వచ్చిన డబ్బుతో సినిమా తీసినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసు విచారణ సమయంలో రూ.50లక్షల కోసం తనను డిమాండు చేస్తూ బెదిరింపులు వచ్చాయని కోర్టులో ఆమె చెప్పారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, రాకేష్ రోషన్, మహేష్ మంజ్రేకర్ వంటి వారితో సహా ఇతర బాలీవుడ్ ప్రముఖులకు కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయి. కానీ, ప్రీతీ మాత్రమే కోర్టుకు తెలిపింది. అండర్వరల్డ్తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఆ సినిమా ప్రొడ్యూసర్ నసీం రిజ్వీ, ఫైనాన్సర్ భరత్ షాలు జైలుకెళ్లారు. -
సైఫ్ అలీ ఖాన్పై దాడి.. దుండగుడి డిమాండ్ ఏంటంటే.?
బాలీవుడ్ ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సైఫ్ అలీ ఖాన్(54)పై గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడికి దిగాడు. డబ్బు కోసమే ఇదంతా చేశాడని తెలియడంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముంబైలో ఎక్కువగా సంపన్నులు నివాసం ఉండే బాంద్రా వెస్ట్ (Bandra West) ప్రాంతంలో ఉన్న సద్గురు శరణ్ భవనం 12వ అంతస్తులో సైఫ్ సొంత ఫ్లాట్లోకి తెల్లవారుజామున 2 గంటలకు ఒక దుండగుడు దూరడం ఆపై సైఫ్ అలీ ఖాన్పై విచక్షణంగా దాడి చేయడంతో ఈ ఘటనలో నటుడికి తీవ్రగాయాలయ్యాయి.కోటి రూపాయలు డిమాండ్మహారాష్ట్ర రాజధాని ముంబైలో (Mumbai) గురువారం తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) ఇంట్లోకి చొరబడి దాడి చేసిన వ్యక్తి మొదట కోటి రూపాయలు డిమాండ్ చేశాడని అక్కడి పనివారు తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జీన్స్, టీ–షర్టు ధరించిన దుండుగుడు సైఫ్ చిన్నకుమారుడు జహంగీర్ గదిలోకి ప్రవేశించాడు. తొలుత తనను గమనించి కేకలు వేసిన పని మనిషి ఎలియామ ఫిలిప్స్పై కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో ఆమెను బంధించాడు. కోటి రూపాయలు ఇస్తేనే వదిలేస్తానంటూ బేరం పెట్టాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న సైఫ్ అదేమీ పట్టించుకోకుండా అతడిని ధైర్యంగా ఎదిరించాడు. ఈ క్రమంలో దుండగుడు కత్తితో విచక్షణారహితంగా సైఫ్ను పొడిచి తక్షణమే మెట్ల మార్గం గుండా పరారయ్యాడు.తీవ్రంగా గాయపడిన సైఫ్ను ఆసుత్రికి అతి కష్టం వీద తరలించారు. కారు అందుబాటులో లేకపోవడంతో సైఫ్ను ఆయన కుమారుడు, సహాయకులు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ లీనా జైన్, అనస్థీషియాలజిస్టు డాక్టర్ నిషా గాంధీ శస్త్రచికిత్స చేశారు. సైఫ్కు ఆరు చోట్ల గాయాలైనట్లు వారు తెలిపారు. మెడ, వెన్నుముక భాగంలో సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుని ఇంటికి చేరుకుంటారని వెల్లడించారు.దుండుగుడి ఆచూకీ కనిపెట్టడానికి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడి ఫోటోను విడుదల చేశారు. బాంద్రా పోలీసులు అతన్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో సెక్షన్ 331(4), సెక్షన్ 311 కింద కేసు పెట్టారు. సాక్ష్యాధారాల కోసం సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. సైఫ్పై దాడి తర్వాత దుండగుడు మెట్లు దిగి పారిపోయినట్లు గుర్తించారు. -
నిలకడగా సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం
ముంబై: బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సైఫ్ అలీ ఖాన్(54)పై గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో నటుడికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో సంపన్నులు నివాసం ఉండే బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ఉన్న సద్గురు శరణ్ భవనం 12వ అంతస్తులో సైఫ్ సొంత ఫ్లాట్లో గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో ఇంట్లో సైఫ్ భార్య కరీనాకపూర్ ఖాన్తో కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. దుండగుడి దాడిలో గాయపడి రక్తమోడుతున్న సైఫ్ను ఆయన పెద్ద కుమారుడు ఇబ్రహీం, పనిమనుషులు వెంటనే ఆటోలో సమీపంలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించడంతో ప్రాణాపాయం తప్పింది. రెండు బలమైన కత్తిపోట్లు సహా మొత్తం ఆరు చోట్ల గాయాలయ్యాయని డాక్టర్లు చెప్పారు. వెన్నుముక నుంచి 2.5 అంగుళాల కత్తి మొనను ఆపరేషన్ ద్వారా తొలగించారు. సైఫ్కు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. సైఫ్పై దాడిపట్ల బాలీవుడ్ నటులతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండాపోయిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రత్యేక బృందాలతో గాలింపు సైఫ్పై దాడి ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బాంద్రా పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రాత్రిపూట ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో సెక్షన్ 331(4), సెక్షన్ 311 కింద కేసు పెట్టారు. సాక్ష్యాధారాల కోసం సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. సైఫ్పై దాడి తర్వాత దుండగుడు మెట్లు దిగి పారిపోయినట్లు గుర్తించారు. వీపున తగిలించుకున్న ఓ బ్యాగ్తో అతడు పారిపోతున్న దృశ్యాలు ఆరో అంతస్తులో తెల్లవారుజామున 2.33 గంటల సమయంలో రికార్డయ్యాయి. స్థానికంగా మొబైల్ ఫోన్ల డేటాను పోలీసులు వడపోశారు. దుండుగుడి ఆచూకీ కనిపెట్టడానికి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడి ఫోటోను విడుదల చేశారు. దుండగుడి దాడిలో సైఫ్ పనిమనిషికి సైతం గాయాలయ్యాయి. దుండగుడితో జరిగిన పెనుగులాటలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. బాధితురాలి నుంచి పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. స్టేట్మెంట్ రికార్డు చేశారు. అసలేం జరిగింది? దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఫ్లాట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సైఫ్, కరీనా దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఫ్లాట్లో నిద్రిస్తున్న సమయంలో అలికిడి వినిపించింది. అప్పటికే సైఫ్ చిన్నకుమారుడు జహంగీర్ గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను పనిమనిషి గమనించి బిగ్గరగా కేకలు వేసింది. అలారం మోగించింది. దాంతో అతడు ఆమెపై కత్తి దూశాడు. ఈ శబ్దాలు వినిపించి నిద్రనుంచి మేల్కొన్న సైఫ్ అలీ ఖాన్ ఆ గదిలోకి వచ్చి దుండగుడిని అడ్డుకొనేందుకు ప్రయతి్నంచాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చాలాసేపు పెనుగులాట జరిగింది. వాగ్వాదం చోటుచేసుకుంది. సైఫ్ను దుండగుడు కత్తితో విచక్షణారహితంగా పొడిచి తక్షణమే మెట్ల మార్గం గుండా పరారయ్యాడు. ఫైర్ ఎగ్జిట్ ద్వారా అతడు సైఫ్ ఫ్లాట్లో ప్రవేశించినట్లు పోలీసులు చెప్పారు. సైఫ్ కుమారుడి గదిలో నాలుగు గంటలపాటు నిశ్శబ్దంగా నక్కి ఉండి, అవకాశం కోసం ఎదురు చూశాడని, అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగతనానికి ప్రయతి్నంచాడని తెలిపారు. కారు అందుబాటులో లేకపోవడంతో సైఫ్ను ఆయన కుమారుడు, సహాయకులు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడికి న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ లీనా జైన్, అనస్థీషియాలజిస్టు డాక్టర్ నిషా గాంధీ శస్త్రచికిత్స చేశారు. ఆరు చోట్ల గాయాలైనట్లు తెలిపారు. మెడ, వెన్నుముక భాగంలో సర్జరీ చేశారు. ఎడమ చెయ్యి, మెడ కుడి భాగంలో రెండు లోతైన గాయాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుంటారని వెల్లడించారు. నిప్పులు చెరిగిన ప్రతిపక్షాలు మహారాష్ట్రలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణిస్తున్నాయని ఎన్సీపీ(శరద్ పవార్ అధ్యక్షుడు శరద్ పవార్ ఆరోపించారు. బాంద్రాలో ఇటీవలే ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడని, ఇప్పుడు సైఫ్పై దాడి జరిగిందని చెప్పారు. ఇవన్నీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. హోంశాఖ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్దే ఉందని, శాంతిభద్రతల పరిరక్షణపై ఇకనైనా దృష్టి పెట్టాలని సూచించారు. ముంబైలో ఎవరికీ రక్షణ లేదని శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. -
సైఫ్అలీఖాన్కు కత్తిపోట్లు: కరీనా, సైఫ్ లగ్జరీ బంగ్లా ఇదే (ఫోటోలు)
-
Saif Ali Khan: రాజవంశం.. రూ.100 కోట్ల ఇల్లు.. రూ.800 కోట్ల ప్యాలెస్
-
సైఫ్ అలీ ఖాన్ కేసులో కీలక పరిణామం.. సీసీటీవీల్లో నిందితుడి దృశ్యాలు
సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోని సీసీ ఫుటేజ్ను పోలీసులు రిలీజ్ చేశారు. అందులో నిందితుడు మెట్లపై నుంచి దిగుతున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇవాళ తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్పై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే..బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై ఇవాళ తెల్లవారుజామున దాడి జరిగింది. ముంబయిలోని ఆయన నివాసంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సైఫ్.. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. ఆయనకు సర్జరీ చేయగా.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.ముంబై పోలీసుల కథనం ప్రకారం.. తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించగా.. ఆయన సిబ్బంది గట్టిగా అరవడంతో మేల్కొన్న సైఫ్.. ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆ దొంగ సైఫ్ అలీఖాన్ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాడపడ్డ సైఫ్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. -
సైఫ్పై దాడి.. ఘాటుగా స్పందించిన సీఎం ఫడ్నవిస్
నటుడు సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడి ఘటన గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అన్ని వివరాలను ఎప్పటికప్పుడు పోలీసులు వెల్లడిస్తున్నారని చెప్పారు. అయితే.. ఈ ఘటన ఆధారంగా ప్రతిపక్షాలు చేస్తున్న తీవ్ర విమర్శలకు ఆయన అంతే ఘాటుగా బదులిచ్చారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయని, వరుసగా ప్రముఖులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ప్రతిపక్షాలు ఫడ్నవిస్ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. మరోవైపు.. ఈ విమర్శలకు సినీ ప్రముఖుల గొంతు కూడా తోడైంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నాం ఎమర్జెన్సీ చిత్ర ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆ చిత్ర నటి కంగనా రనౌత్తో మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంలో ఆయన్ని సైఫ్పై దాడి గురించి మీడియా ప్రశ్నించింది. దేశంలో ఉన్న మెగాసిటీ(Megacities)ల్లో ముంబై అత్యంత సురక్షితమైన నగరం. నగరంలో ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు జరిగిన మాట వాస్తవం. వాటిని అంతే తీవ్రంగా మేం వాటిని భావించి దర్యాప్తు జరిపిస్తున్నాం. అలాగని.. ఏదో ఒక ఘటనను పట్టుకుని ముంబై ఏమాత్రం సురక్షితం కాదని అనడం సరికాదు. ఇది ముంబై ప్రతిష్టను దెబ్బ తీసే అంశం. ముంబైను మరింత సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది’’ అని అన్నారు. మహారాష్ట్ర హోం శాఖ ప్రస్తుతం ఫడ్నవిస్ వద్దే ఉంది.#WATCH | Mumbai: Maharashtra CM Devendra Fadnavis on the attack on actor Saif Ali Khan says, “Police have provided all the details. What kind of attack this was, the motive behind it, and the intention are all before you.”#SaifAliKhan #DevendraFadnavis #Mumbai pic.twitter.com/L7hGKE8XnE— Organiser Weekly (@eOrganiser) January 16, 2025ముంబై మహానగరంలో అత్యంత విలాసవంతమైన ఏరియాగా బాంద్రాకు ఓ పేరుంది. వీవీఐపీలు ఉండే ఈ ఏరియాలో కట్టుదిట్టమైన పోలీస్ పహారా కనిపిస్తుంటుంది కూడా. అలాంటి ప్రాంతంలో..గత అర్ధరాత్రి అలజడి రేగింది. ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించాడు ఓ దుండగుడు. ఈ క్రమంలో జరిగిన సైఫ్పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆయన్ని లీలావతి ఆస్పత్రికి తరలించారు. రెండు కత్తిపోట్లు లోతుగా దిగడం, వెన్నెముకకు దగ్గరగా కత్తికి దిగడంతో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. అయితే ఆయనకు ప్రమాదం తప్పిందని, రెండ్రోజుల తర్వాత డిశ్చార్జి చేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదంలో సైఫ్తో పాటు ఆయన ఇంట్లో పని చేసే మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఆమెకు చికిత్స అందించి వైద్యులు ఇంటింకి పంపించేశారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాంద్రా(Bandra Police) పోలీసులు.. నిందితుడిని దాదాపుగా గుర్తించినట్లు తెలుస్తోంది. అతన్ని పట్టుకునేందుకు ఏడు బృందాలను రంగంలోకి దింపాయి.ఊహాజనిత కథనాలొద్దుఈ ఘటనపై మీడియా, అభిమానులు సంయమనం పాటించాలని సైఫ్ టీం కోరుతోంది. ‘‘సైఫ్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగింది. సైఫ్ భార్య కరీనా కపూర్, ఇతర కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారు. ఆయనకు గాయాలయ్యాయి. శస్త్రచికిత్స జరిగి ఆయన కోలుకుంటున్నారు. కాబట్టి.. అంతా సంయమనం పాటించాలి. కల్పిత కథనాలు రాయొద్దు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు అందించే సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాం’’ అని ఆయన టీం తెలిపింది. -
సైఫ్ ఇంటికి ప్రముఖ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్.. ఇంతకీ ఆయనెవరో తెలుసా?
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్పై (Saif Ali Khan) గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబయలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.అయితే దర్యాప్తులో భాగంగా ప్రముఖ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ సైఫ్ ఇంటిని పరిశీలించారు. దాడి ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా.. ఇప్పటికే ఈ దాడిలో ఇద్దదు నిందితులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సైఫ్ ఇంటిని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ (Daya Nayak) కూడా ఉన్నారు. బాంద్రాలోని సైఫ్ ఉంటున్న అపార్ట్మెంట్కు వచ్చిన ఆయన ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. కాగా.. ముంబయి అండర్వరల్డ్ను గడగడలాడించిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా దయా నాయక్కు పేరుంది.అసలు ఎవరీ దయా నాయక్..కర్ణాటకలోని ఉడిపి దయా నాయక్ స్వస్థలం. 1979లో ఆయన ఫ్యామిలీ ముంబయి షిఫ్ట్ అయింది. అక్కడే అంధేరిలోని కాలేజ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత 1995లో పోలీస్ పరీక్షల్లో విజయం సాధించారు. మొదటిసారి ముంబయిలోని జుహు పోలీస్స్టేషన్లో ఎస్సైగా విధుల్లో చేరారు.దయా నాయక్ ఉద్యోగంలో చేరేసరికి అండర్వరల్డ్ పేరుతో ముంబయిలో హత్యలు, డ్రగ్స్, హవాలా సహా ఎన్నో నేరాలు ఎక్కువగా ఉండేవి. ఈ క్రమంలోనే చోటా రాజన్ గ్యాంగ్లోని ఇద్దరిని కాల్చి చంపడంతో దయా నాయక్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. డిపార్ట్మెంట్లోనూ ఆయన పేరు ఓ రేంజ్లో వినిపించింది. అండర్ వరల్డ్ నెట్వర్క్కు పనిచేస్తున్న దాదాపు 80 మందిని దయా నాయక్ ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం.सैफ अली खान पर हमले पर मुंबई पुलिस अधिकारी दया नायक ने कहा...#SaifAliKhan #KareenaKapoorKhan #SaraAliKhan #IbrahimAliKhan #MumbaiPolice #mumbaiattack #DayaNayak pic.twitter.com/RVCEl7qzxJ— CNBC-AWAAZ (@CNBC_Awaaz) January 16, 2025 -
సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్
-
Saif Ali Khan: వెన్నెముకలో విరిగిన కత్తి.. నటుడికి ప్లాస్టిక్ సర్జరీ
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)పై దాడి ఘటనలో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేసేందుకు వచ్చిన వ్యక్తి నిన్న రాత్రే ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రంతా ఇంట్లోనే దాక్కున్న దొంగ తెల్లవారుజామున దొంగతనానికి ప్రయత్నించాడు. సైఫ్ అలీ ఖాన్ పిల్లల బెడ్రూమ్ దగ్గరే దుండగుడు పనిమనిషితో ఘర్షణ పడినట్లు తెలుస్తోంది.ఆరుసార్లు పొడిచి..ఆ అలికిడి గమనించిన నటుడు దుండగుడిని అడ్డుకునే క్రమంలో తోపులాట జరిగింది. ఈ సమయంలో దొంగ సైఫ్ అలీఖాన్ను ఆరుసార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సమయానికి కారు రెడీగా లేకపోవడంతో రక్తమోడుతున్న తండ్రిని ఇబ్రహీం అలీ ఖాన్ (Ibrahim Ali Khan) ఆటోలో తీసుకెళ్లాడు. ఉదయం మూడున్నర గంటల ప్రాంతంలో లీలావతి ఆస్పత్రిలో చేర్పించారు.చదవండి: ఇంట్లో దోపిడీయత్నం.. హీరో సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి!వెన్నెముకకు సర్జరీఅతడిని పరీక్షించిన వైద్యులు సైఫ్ వెన్నెముకలో కత్తి మొన విరిగినట్లు గుర్తించారు. వెన్నెముక నుంచి 2.5 అంగుళాల పొడవైన కత్తి మొనను సర్జరీ ద్వారా తొలగించారు. మెడపై అయిన లోతైన గాయానికి ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.సీసీటీవీ ప్రకారం..సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. ఘటన జరగడానికి రెండు గంటల ముందు వరకు ఎవరూ ఇంట్లోకి ప్రవేశించలేదని పోలీసులు వెల్లడిస్తున్నారు. దీన్ని బట్టి దొంగ నిన్న రాత్రే ఇంట్లోకి చొరబడ్డాడని చెప్తున్నారు. దీంతో సైఫ్ శత్రువులు ప్లాన్ ప్రకారం అతడిపై దాడి చేయించారా? లేదా తెలిసినవాళ్లే ఈ పని చేయించారా? అని పలువురూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హీరోగా ఎన్నో సినిమాలు చేసిన సైఫ్ అలీ ఖాన్ ఇటీవల నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అలరిస్తున్నాడు. తెలుగులో దేవర సినిమాలో విలన్గా నటించాడు.సైఫ్ వ్యక్తిగత విషయానికి వస్తే..సైఫ్ అలీ ఖాన్ 1991లో అమృతా సింగ్ను వివాహం చేసుకున్నాడు. వీరికి సారా, ఇబ్రహీం అని ఇద్దరు సంతానం. సైఫ్- అమృత 2004లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సైఫ్.. కరీనాను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 10 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఈ జంటకు తైమూర్, జెహ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.చదవండి: బ్లాక్బస్టర్ పొంగల్.. కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే? -
‘సెలబ్రిటీలకే ఇలా జరిగితే సామాన్యుల గతేంటి?’
ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడి.. యావత్ దేశాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతి గురి చేసింది. అటు సినీ, ఇటు ఇతర రంగాల ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడి ఘటన మహారాష్ట్రలో రాజకీయ అలజడికి కారణమైంది.సైఫ్ అలీఖాన్ దాడి ఘటనను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాలయంటూ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఉద్దవ్ సేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘సెలబ్రిటీలకే భద్రత కరువైనప్పుడు ముంబైలో సామాన్యుల సంగతి ఏంటి?’’ అంటూ ట్వీట్ చేశారామె.ముంబైలో వరుసగా ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. మరో హై ప్రొఫైల్ వ్యక్తిపై దాడి జరగడం నిజంగా నగరానికి సిగ్గుచేటు. ముంబై పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ పని తీరును ఈ ఘటన కచ్చితంగా ప్రశ్నిస్తుంది అని అన్నారామె. ఈ క్రమంలో సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య ఉదంతంతో పాటు సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిగిన దాడి ఘటనను ఆమె ప్రస్తావించారు.My comment on the latest murderous attack in Mumbai. https://t.co/a2aD1ymRGr pic.twitter.com/MohkfAN01d— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) January 16, 2025బాబా సిద్ధిఖీ కుటుంబం న్యాయం కోసం ఎదురు చూస్తోంది. సల్మాన్ ఖాన్ ఇక లాభం లేదనుకుని ఇంటినే బుల్లెట్ఫ్రూఫ్గా మార్చేసుకున్నారు. ఇప్పుడు ప్రముఖులు ఉండే బాంద్రాలో సైఫ్పై దాడి జరిగింది. అలాంటప్పుడు ముంబైలో ఇంకెవరు సురక్షితంగా ఉంటారు?.. ఆయన త్వరగా కోలుకోవాలి అని ఆమె అన్నారు.మరోవైపు.. పవార్ ఎస్పీపీ సైతం ఈ పరిణామంపై స్పందించింది. సైఫ్ అలీ ఖాన్ లాంటి ప్రముఖ వ్యక్తిపై ఆయన ఇంట్లోనే దాడి చేసినప్పుడు.. సామాన్యుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతాయని ఆ పార్టీ ప్రతినిధి క్లైడ్ కాస్ట్రో ట్వీట్ చేశారు.Attack on Saif Ali Khan is a cause for concern because if such high profile people with levels of security can be attacked in their homes, then what could happen to common citizens?Fear of law seems to be at a low in Maharashtra due to leniencies in the past couple of years— Clyde Crasto - क्लाईड क्रास्टो 🇮🇳 (@Clyde_Crasto) January 16, 2025సైఫ్పై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. కాంగ్రెస్ ఎంపీ వర్షా గైక్వాడ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ ముంబైలో ఏం జరుగుతోంది?. ప్రముఖులుండే నివాసాల మధ్య.. అదీ అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఒక నటుడి ఇంట్లోనే దాడి జరగడం శోచనీయం. ఇలాంటప్పుడు సామాన్యుడు ఈ ప్రభుత్వం నుంచి ఇంకేం ఆశిస్తాడు? అని అన్నారామె. తుపాకీ మోతలు, దొంగతనాలు, కత్తిపోట్లు.. ముంబైలో నిత్యకృత్యం అయిపోయాయి. అసలు ముంబైలో ఏం జరుగుతోంది?. వీటికి ప్రభుత్వం నుంచి సమాధానాలు రావాలి అని అన్నారామె.एक पद्मश्री विजेता लोकप्रिय अभिनेता जो एक हाइ प्रोफाइल सोसायटी में बांद्रा जैसे सुरक्षित माने जाने वाले इलाके में रहते हैं, उनके घर में घुसकर कोई उनको चाकू मारकर चला जाता है, ये कितनी भयानक घटना है! महाराष्ट्र में कानून व्यवस्था की आए दिन धज्जियां उड़ रही है। बांद्रा में एक नेता… pic.twitter.com/EV13yNkQnq— Prof. Varsha Eknath Gaikwad (@VarshaEGaikwad) January 16, 2025అయితే.. తీవ్ర విమర్శల వేళ బీజేపీ స్పందించింది. ఘటనను రాజకీయం చేయొద్దని.. పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు పోలీసులే బాధ్యత వహించాలని అన్నారాయన. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులెవరైనా ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని, పోలీసులు ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారాయన.ఇక.. మీడియా, అభిమానులు సంయమనం పాటించాలని సైఫ్ టీం కోరుతోంది. ‘‘సైఫ్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ఈ క్రమంలో ఆయనపై దాడి జరిగింది. సైఫ్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నారు. ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరుగుతోంది. కాబట్టి.. అంతా సంయమనం పాటించాలి. కల్పిత కథనాలు రాయొద్దు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్లు అందించే సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాం’’ అని ఆయన టీం తెలిపింది.గురువారం తెల్లవారుజామున బాంద్రా(Bandra)లోని సైఫ్ నివాసంలో 2-2.30 గంటల మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్, ఆయన కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు. అది గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. దాడి చేసి పరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో పని చేసే మరో మహిళకూ గాయాలైనట్లు సమాచారం. వీరిద్దరినీ లీలావతి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలుస్తోంది. ఈ ఉదయం స్నిఫర్ డాగ్స్ సహకారంతో ఏడు బృందాలు దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇంట్లో పని మనిషి సహకారంతోనే దుండగుడు లోపలికి ప్రవేశించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతడ్ని విచారించే అవకాశం కనిపిస్తోంది.మరోవైపు.. సైఫ్కు ఆరు కత్తిపోట్లు అయ్యాయని, రెండు లోతుగా దిగాయని, వెన్నుపూస అతిసమీపంలో మరో గాయం కావడంతో సర్జరీ అవసరం పడిందని లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. 3గం. సమయంలో సైఫ్ను ఆస్పత్రికి తెచ్చారు. ఆయనకు తీవ్ర రక్త స్రావం జరిగింది. సర్జరీ జరిగాక ఎప్పటికప్పుడు ఆయన హెల్త్బులిటెన్ విడుదల చేస్తామని, ఊహాజనిత కథనాలు ఇవ్వొద్దని వైద్యులు మీడియాను కోరారు. 54 ఏళ్ల సాజిద్ అలీఖాన్ పటౌడీ అలియాస్ సైఫ్ అలీ ఖాన్.. బాలీవుడ్ యాక్టర్గా సుపరిచితుడే. ప్రముఖ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, నటి షర్మిలా ఠాగూర్ల తనయుడు ఈయన. 1993లో పరంపర చిత్రంతో ఆయన హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఇటీవల ఎన్టీఆర్ దేవర చిత్రంతో టాలీవుడ్లోకి డెబ్యూ ఇచ్చి అలరించారు. -
సైఫ్ అలీఖాన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా: మెగాస్టార్ చిరంజీవి
-
దేవర విలన్ కు ఎన్టీఆర్ పరామర్శ
-
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి
-
సైఫ్ అలీఖాన్పై దాడి.. షాకయ్యా: జూనియర్ ఎన్టీఆర్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడి జరగడం కలకలం రేపుతోంది. ముంబైలోని ఆయన ఇంట్లో గురువారం తెల్లవారుజామున ఓ వ్యక్తి సైఫ్ను కత్తితో పలుమార్లు పొడిచి పారిపోయాడు. ఈ దాడిలో ఆయనకు ఆరుచోట్ల గాయాలయ్యాయి. అందులో రెండు చోట్ల లోతైన గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆనయ్ను లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెన్నెముక పక్కనే తీవ్రగాయం కావడంతో వైద్యులు నటుడికి సర్జరీ చేస్తున్నారు. దొంగతనం చేసే క్రమంలోనే..ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుడు దొంగతనానికి వచ్చాడా? లేదా పక్కా మర్డర్ ప్లాన్తోనే సైఫ్పై దాడి చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనపై కరీనా కపూర్ (Kareena Kapoor) టీమ్ ఓ లేఖ విడుదల చేసింది. సైఫ్- కరీనా ఇంట్లో ఓ దుండగుడు చోరీకి ప్రయత్నించాడు. అతడిని అడ్డుకునే క్రమంలో సైఫ్ చేతికి గాయమైంది. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంట్లోని మిగతా సభ్యులు క్షేమంగానే ఉన్నారు. పోలీసుల విచారణ జరుగుతోంది అని లేఖలో పేర్కొన్నారు.షాక్కు గురయ్యాఇదిలా ఉంటే సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడిపై టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) స్పందించాడు. సైఫ్ సర్పై జరిగిన దాడి గురించి విని షాక్కు గురయ్యాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. చిరంజీవి (Chiranjeevi) సైతం సైఫ్ పరిస్థితిపై విచారం వ్యక్తం చేశాడు. సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడి నన్నెంతగానో కలిచివేసింది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేశాడు.హీరో నుంచి విలన్గా..సైఫ్ అలీఖాన్ ఒకప్పుడు హీరోగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. కానీ ఇటీవల మాత్రం ఎక్కువగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతోనే మెప్పిస్తున్నాడు. హీరోకి సమానంగా ఉండే విలన్ పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించిన దేవర చిత్రంలో విలన్గా నటించాడు. ఈ చిత్రంలో భైరవ పాత్రలో యాక్ట్ చేశాడు. వచ్చాయి. ప్రస్తుతం సైఫ్ ఓ భారీ ప్రాజెక్ట్కి సైన్ చేసినట్లు తెలుస్తోంది. Shocked and saddened to hear about the attack on Saif sir.Wishing and praying for his speedy recovery and good health.— Jr NTR (@tarak9999) January 16, 2025చదవండి: ఇంట్లో దోపిడీయత్నం.. హీరో సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి! -
ఇంట్లో దోపిడీయత్నం.. హీరో సైఫ్ అలీఖాన్పై కత్తితో దాడి!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan)పై దాడి జరిగింది. ముంబైలోని ఆయన నివాసంలో గురువారం తెల్లవారు జామున గుర్తు తెలియని ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సైఫ్.. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై ఆరు చోట్ల గాయాలైనట్లు తెలుస్తోంది. వైద్యులు సర్జరీ చేస్తున్నారని, ఆ తరువాతే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి బయటకు చెబుతారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. చోరీ కోసం వచ్చి దాడి!ముంబై పోలీసుల కథనం ప్రకారం.. సైఫ్ అలీకాన్ ఇంట్లో గురువారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించిన విషయంలో ఆయన సిబ్బంది గుర్తించింది. శబ్దం రావడంతో నిద్ర నుంచి మేల్కొన్న సైఫ్.. సిబ్బందితో కలిసి ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ దొంగ సైఫ్ అలీఖాన్ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాడపడ్డ సైఫ్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. సైఫ్ ఒంట్లో తీవ్రంగా గాయాలయ్యాయని.. సర్జరీ అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా, పిల్లలు ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. చోరీనా.. కుట్రనా?సైఫ్ అలీఖాన్పై దాడికి పాల్పడిన దుండగుడు..పరారీలో ఉన్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ‘దాడి జరిగిందనే సమాచారం తెలిసిన వెంటనే మేము సైఫ్ అలీఖాన్ నివాసానికి వెళ్లాం. అప్పటికే దుండగుడు పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన సైఫ్కి లీలావతి ఆస్పత్రికి తరలించారు. తన ఒంటిపై కత్తి పోట్లు పడ్డాయా లేదా అనేది అస్పష్టంగా ఉంది. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే అతని కోసం గాలింపు చర్యలు ప్రారంభించాం’ అని ముంబై పోలీసు అధికారి తెలిపారు. నిందితుడు దొంగతనం కోసమే వచ్చాడా లేదా దాడి వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ దిగ్భ్రాంతిసైఫ్ అలీఖాన్ దాడిపై హీరో ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. సైఫ్ అలీఖాన్పై దాడి జరిగిందనే విషయం తెలిసి షాక్కు గురయ్యయానని, ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా, ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ చిత్రంలో సైఫ్ విలన్గా నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి దేవర 2 చిత్రంలోనూ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. Shocked and saddened to hear about the attack on Saif sir.Wishing and praying for his speedy recovery and good health.— Jr NTR (@tarak9999) January 16, 2025 విలన్గా రాణిస్తున్న సైఫ్ అలీఖాన్ఒకప్పుడు హీరోగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన సైఫ్ అలీఖాన్..ఇటీవల నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో మెప్పిస్తున్నారు. హీరోకి సమానంగా ఉండే విలన్ పాత్రలు చేస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల దేవర చిత్రంలో విలన్గా నటించాడు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రంలో భైరవ పాత్రను సైఫ్ పోషించాడు. సినిమా రిలీజ్ తర్వాత సైఫ్ పాత్రకి మంచి ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం సైఫ్ ఓ భారీ ప్రాజెక్ట్కి సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక వ్యక్తిగత విషయానికొస్తే.. 1991లో, సైఫ్ అలీ ఖాన్ అమృతా సింగ్ను వివాహం చేసుకున్నాడు. సైఫ్, అమృతలకు ఇద్దరు పిల్లలు - సారా, ఇబ్రహీం. 2004లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సైఫ్ కరీనాను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 10 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఈ జంటకు తైమూర్, జెహ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. -
రాజ్ కపూర్ 100వ జన్మదినోత్సవం కార్యక్రమంలో బాలీవుడ్ తారలు సందడి (ఫొటోలు)
-
మా ఇంటిదేవతకు హ్యాపీ బర్త్డే : బాలీవుడ్ బ్యూటీ సంబరాలు (ఫొటోలు)
-
హైదరాబాద్ : సుదర్శన్ థియేటర్లో ‘దేవర’ మూవీ 50 రోజుల వేడుక (ఫొటోలు)
-
ప్యాలెస్ను అలా మార్చేద్దామనుకున్నా.. కానీ ఒప్పుకుంటేగా!
ది ఫేమస్ పటౌడీ ప్యాలెస్ను మ్యూజియంగా మార్చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ పుకారు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ చెవిలో పడింది. నాకు తెలియకుండా ప్యాలెస్ను ఎక్కడ అమ్మేస్తున్నారని సైఫ్ షాకయ్యాడు. తన ఇల్లుకు మనసులో ప్రత్యేక స్థానం ఉందన్నాడు.మా నాన్న నవాబుఆయన మాట్లాడుతూ.. చారిత్రాత్మకంగా చూసుకుంటే ఈ ప్యాలెస్ ఎంతోమందికి చెందినది. మా నాన్న (క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్) నవాబు. ఈ ప్యాలెస్లో తనకు నచ్చినట్లు బతికాడు. అయితే కాలం మారుతుండేకొద్దీ నాకు ఓ ఆలోచన వచ్చింది. ఈ ఇంటిని హోటల్కోసం అద్దెకు ఇస్తే ఎలా ఉంటుందనుకున్నాను. అందుకు ఒప్పుకోలేదుఅందుకు మా నానమ్మ అస్సలు ఒప్పుకోలేదు. ఇలాంటి పిచ్చి పనులు చేయకని మందలించింది. ఈ ఇంటికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. అది నేను గర్వంగా ఫీలవుతాను. మా నానమ్మ-తాతయ్య, నాన్న జ్ఞాపకాలతో హౌస్ను నింపేయాలనుకున్నాను. నేను అనుకుంది దాదాపు పూర్తి కావొచ్చింది అని పేర్కొన్నాడు.ప్యాలెస్ హైలైట్స్పటౌడీ ప్యాలెస్ విషయానికి వస్తే దీన్ని సైఫ్ తాతయ్య ఇఫ్తికర్ అలీ ఖాన్ పటౌడీ నిర్మించాడు. ఇందులోని ప్రతి గది, అలంకరణ వస్తువులు రాజదర్పాన్ని ప్రదర్శిస్తాయి. దాదాపు 10 ఎకరాల్లో విస్తీర్ణమై ఉన్న ఈ ప్యాలెస్లో 150 గదులున్నాయి. ప్రస్తుతం దీన్ని సైఫ్ కుటుంబం వెకేషన్ కోసం వాడుతోంది. ఎక్కువగా సినిమా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. బ్లాక్బస్టర్ మూవీ యానిమల్ కూడా ఈ రాజభవనంలోనే తెరకెక్కింది.చదవండి: దేవర.. నీ రాక కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు -
రాహుల్ ధైర్యవంతుడు, నిజాయితీ కలిగిన నేత: సైఫ్ ప్రశంసలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రశంసలు కురిపించారు. విమర్శలను ఎలా ఎదుర్కొవాలో తెలిసిన ధైర్యవంతమైన రాజకీయ నాయకుడని కొనియాడారు. అలాంటి ధైర్యవంతులైన, నిజాయితీ కలిగిన నేతలంటే తనకు ఇష్టమని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సైఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.. వీరిలో ఎవరూ ధైర్యవంతులని, ఎవరు భవిష్యత్తులో దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలరని మీరు భావిస్తున్నట్లు అడగ్గా.. ముగ్గురూ ధైర్యవంతులైన రాజకీయ నాయకులేనని అన్నారు. అయితే గతంలో రాహుల్పై వచ్చిన విమర్శలను ఆయన ఎంతో ధీటుగా ఎదుర్కొన్నారని తెలిపారు.చదవండి: మోదీని కాదు నన్ను ప్రధానిని చేస్తామన్నారు.. నితిన్ గడ్కరీ‘రాహుల్గాంధీ తీరు నన్ను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. గతంలో ఆయన చేసే పనులను, చెప్పే మాటలను కొంతమంది అగౌరవపర్చిన సందర్భాలున్నాయి. అలాంటి స్థితి నుంచి ఆయన తనను తాను ఎంతగానో మార్చుకున్నారు. చాలా కష్టపడి తన పనుల ద్వారా విమర్శలను తిప్పికొట్టాడు. మళ్లీ ప్రజల్లో ఆదరణ చూరగొన్నారు. ఆ ప్రయాణం చాలా ఆసక్తిగా అనిపిస్తోంది’ అని సైఫ్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.తాను రాజకీయ నాయకుడిని కాదని, భవిష్యత్తులోనూరాజకీయాల్లో చేరాలనుకోవడం లేదని పైఫ్ తెలిపారు. అలాగే ఎవరికి మద్దతిస్తానన్న నిర్దిష్ట ప్రశ్నకు సమాధానం చెప్పలేననని పేర్కొన్నారు.అయితే తనకు ఏదైనా విషయంలో బలమైన అభిప్రాయాలు ఉంటే కచ్చితంగా వాటిని అందరితో పంచుకుంటానని చెప్పారు. అలాగే భారతదేశంలో ప్రజాస్వామ్యం సజీవంగా ఉందని, అది ఇంకా అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు -
‘దేవర’ మూవీ రివ్యూ
టైటిల్: దేవరనటీనటులు: జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, శృతి మారాఠే, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, చైత్ర రాయ్ తదితరులునిర్మాణ సంస్థ: ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్నిర్మాతలు: నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని,కొసరాజు హరికృష్ణదర్శకత్వం- స్క్రీన్ప్లే: కొరటాల శివసంగీతం: అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలుఎడిటింగ్: అక్కినేని శ్రీకర్ ప్రసాద్విడుదల తేది: సెప్టెంబర్ 27, 2024ఎన్టీఆర్ అభిమానుల ఆరేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆయన సోలో హీరోగా నటించిన ‘దేవర’ మూవీ ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, ఆచార్య లాంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత డెరెక్టర్ కొరటాల శివ కలిసి చేసిన సినిమా ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘దేవర’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది? కొరటాల శివకు భారీ బ్రేక్ వచ్చిందా? ఎన్టీఆర్కు ఇండస్ట్రీ హిట్ పడిందా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరి లోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగే కథ ఇది. కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ( సైఫ్ అలీ ఖాన్), రాయప్ప( శ్రీకాంత్), కుంజర(షైన్ టామ్ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ(మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అవుతాడు. దేవర మాట కాదని భైరవతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం అవ్వగా... దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. దీంతో దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కి దొంగ సరకు తీసుకురాకుండా ఉండేందుకు దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం( జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి అనేదే మెయిన్ స్టోరీ.ఎలా ఉందంటేదాదాపు ఆరేళ్ల గ్యాప్ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం కావడంతో దేవర పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ ఓ మాదిరిగి ఉన్నా... సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుంది. లేకపోతే ఎన్టీఆర్ ఒప్పుకోరు కదా అని అంతా అనుకున్నారు. కానీ కొరటాల మరోసారి రొటీన్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ట్రెడింగ్లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాని అప్లై చేస్తూ కథనాన్ని నడిపించడం కొంతవరకు కలిసొచ్చే అంశం. యాక్షన్ సీన్లు కూడా బాగానే ప్లాన్ చేశారు. అయితే ఇవి మాత్రమే ప్రేక్షకుడికి సంతృప్తిని ఇవ్వలేవు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో స్థాయికి తగ్గట్టుగా కథను తీర్చిదిద్దడంతో కొరటాల సఫలం కాలేదు.గతంలో కొరటాల తీసిన సినిమాల్లో ఆచార్య మినహా ప్రతి దాంట్లో కొన్ని గూస్బంప్స్ వచ్చే సీన్లతో పాటు ఓ మంచి సందేశం ఇచ్చేవాడు. ఒకటి రెండు పవర్ఫుల్ డైలాగ్స్ ఉండేవి. కానీ దేవరలో అలాంటి సీన్లు, డైలాగ్స్ పెద్దగా లేవు. స్క్రీన్ప్లే కూడా కొత్తగా అనిపించదు.ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాతో కథను ప్రారంభించాడు. గ్యాంగ్స్టర్ని పట్టుకునేందుకు పోలీసు అధికారి(అజయ్) ఎర్రసముద్రం రావడం.. అక్కడ ఓ వ్యక్తి (ప్రకాశ్ రాజ్) దేవరకు భారీ ఎలివేషన్స్ ఇస్తూ పన్నెడేంళ్ల క్రితం ఆ ఊరిలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథంతా ఎర్రసముద్రం, దేవర చుట్టు తిరుగుతుంది. ప్రేక్షకుల్ని మెల్లిగా దేవర ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ఎర్ర సముద్రం నేపథ్యం, వారు దొంగలుగా మారడానికి గల కారణాలు, దేవర చూపించే భయం, ప్రతిది ఆకట్టుకుంటుంది. చెప్పే కథ కొత్తగా ఉన్నా తెరపై వచ్చే సీన్లు పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం బాగా ప్లాన్ చేశాడు. ఫస్టాఫ్ అంతా దేవర చుట్టు తిరిగితే.. సెకండాప్ వర చుట్టూ తిరుగుతుంది. రెండో ఎన్టీఆర్ ఎంట్రీ వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత కథ సాగదీతగా అనిపిస్తుంది. జాన్వీ కపూర్ ఎపిసోడ్స్ అతికినట్లుగా అనిపిస్తాయి. పాట మినహా ఆమెతో వచ్చే సీన్లన్ని బోరింగ్గానే సాగుతాయి. ప్రీ క్లైమాక్స్లో సముద్రం లోపల ఎన్టీఆర్తో వచ్చే యాక్షన్ సీన్లు అదిరిపోతాయి. పార్ట్ 2కి లీడ్ ఇస్తూ కథను ముగించారు. క్లైమాక్స్ కొంతవరకు ఆసక్తికరంగా సాగినా.. ట్విస్ట్ పాయింట్ బాహుబలి సినిమాను గుర్తు చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఎన్టీఆర్ నటనకు ఏం వంక పెట్టగలం. ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు. ఇక దేవర, వర(వరద) అనే రెండు విభిన్న పాత్రలో కనిపించిన ఎన్టీఆర్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్ తో మాస్ ఆడియన్స్ను అలరించటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక డ్యాన్స్ కూడా ఇరగదీశాడు.ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. పల్లెటూరి అమ్మాయి ‘తంగం’ పాత్రలో ఒదిగిపోయింది. తెరపై అచ్చం తెలుగమ్మాయిలాగే కనిపించింది. కాకపోతే ఈమె పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. ఇందులో సైఫ్ అలీఖాన్ భైరవ అనే ఓ డిఫరెంట్ పాత్రను పోషించాడు. నిడివి తక్కువే అయినా..ఉన్నంతలో చక్కగా నటించాడు. పార్ట్ 2 ఆయన పాత్ర పరిధి ఎక్కువగా ఉంటుంది. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, చైత్ర రాయ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. చుట్టంమల్లే పాటకు థియేటర్స్లో ఈలలు పడతాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్ని తెరపై చాలా రిచ్గా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
ఆరేళ్ల గ్యాప్.. రికార్డుల మోత.. ‘దేవర’ గురించి ఈ విషయాలు తెలుసా?
‘దేవర’..ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రమిది. జనతా గ్యారేజ్తో ఎన్టీఆర్కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించాడు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు నెట్టింట వైరల్ అతున్నాయి. గతంలో ఎన్టీఆర్ ఏ సినిమాకు రానంత బజ్ దేవరకు క్రియేట్ అయింది. దానికి గల కారణం ఏంటి? దేవర ప్రత్యేకతలు ఏంటి? ఒక్కసారి చూద్దాం.→ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చివరి చిత్రం ‘ఆరవింద సమేత వీరరాఘవ’. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆరేళ్ల క్రితం విడుదలైంది. ఆ తర్వాత రామ్ చరణ్తో కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు ‘దేవర’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడం.. ఆరేళ్ల గ్యాప్ తర్వాత సోలో హీరోగా వస్తుండడంతో ‘దేవర’పై భారీ అంచనాలు పెరిగాయి.→ ఈ చిత్రంలో అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని చాలా రోజుల క్రితమే పుకార్లు వచ్చాయి. విజయ్ దేవరకొండ సినిమాతో ఎంట్రీ ఇస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ సరసన నటించే చాన్స్ రావడంతో జాన్వీ వెంటనే ఓకే చెప్పిందట. ‘దేవరలో నటించాలని జాన్వీ కూడా అనుకుందట. మేకు కూడా అనుకోకుండా ఆమెనే అప్రోచ్ అయ్యాం. సెట్లో ఆమెను చూస్తే అచ్చం తెలుగమ్మాయిలాగే అనిపించేంది. ప్రతి సీన్, డైలాగ్ ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేసి సెట్పైకి వచ్చేది’అని ఓ ఇంటర్వ్యూలో కొరటాల శివ అన్నారు. ఇందులో ఆమె ‘తంగం’అనే పాత్ర పోషించారు.→ జాన్వీతో పాటు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మరో నటుడు సైఫ్ అలీఖాన్. ఇందులో ‘భైర’ అనే పాత్రలో నటించాడు. ఎన్టీఆర్ పాత్రకు ధీటుగా సైఫ్ అలీఖాన్ పాత్ర తీర్చిదిద్దారట కొరటాల. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని టాక్→ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా నెరేషన్ చేయడానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టిందట. మొదట్లో ఒకే పార్ట్గా సినిమా తీయాలని భావించారట. అయితే కొంత షూటింగ్ పూర్తయిన తర్వాత ఇంత పెద్ద కథను మూడు గంటల్లో చెప్పడం కష్టమని భావించి రెండు భాగాలు రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారట.→ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్న నాలుగో సినిమా ఇది. అంతకు ముందు ‘ఆంధ్రావాలా’, ‘అదుర్స్’, ‘శక్తి’ సినిమాల్లో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేశాడు. దేవరలో దేవర, వర అనే రెండు పాత్రల్లో ఎన్టీఆర్ నటించాడు.→ హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాను తీర్చిదిద్దాడట కొరటాల. ‘‘దేవర’ సినిమా చూస్తున్నప్పుడు మీకు ‘అవెంజర్స్’, ‘బ్యాట్మ్యాన్’ వంటి హాలీవుడ్ సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుంది’ అని సంగీత దర్శకుడు అనిరుధ్ చెబుతున్నాడు.→ చివరి 40 నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు గూస్బంప్స్ తెప్పిస్తాయట. అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అని మేకర్స్ చెబుతున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఎన్టీఆర్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారట.→ ఈ సినిమా కోసం 200చదరపు గజాల్లో సముద్రం సెట్ వేశారట. 35 రోజుల పాటు అక్కడే షూట్ చేశారట. ట్రైలర్లో చూపించిన షార్క్ షాట్ తీయడానికి ఒక రోజు సమయం పట్టిందని కొరటాల చెప్పారు.→ ఈ సినిమాలో వాడిన పడవలను ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అప్పటి కాలంనాటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ పడవలను తీర్చిదిద్దారు. నిజమైన సముద్రంలోనూ ఈ పడవలలో ప్రయాణం చెయ్యొచ్చట.→ ఈ సినిమాలో ఎన్టీఆర్ తన పాత్రకు నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్లో స్వంతంగా డబ్బింగ్ చెప్పారు.→ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను షూట్ చేయడం కోసం సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చాలా కష్టపడ్డారట. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ కోసం అతి తక్కువ వెలుతురులో షాట్స్ తీయడం చాలా కష్టమైందని రత్నవేలు చెప్పారు.→ ఇందులో దేవర భార్యగా మరాఠి నటి శ్రుతి మరాఠే నటించింది. అయితే ఆమె పాత్రను మాత్రం ప్రచార చిత్రాల్లో చూపించకుండా సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.→ ఇక విడుదలకు ముందే ఈ చిత్రం చాలా రికార్డులను క్రియేట్ చేసింది. ఓవర్సీస్లో ప్రీసేల్లో అత్యంత వేగంగా ఒక మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన చిత్రమిదే. లాస్ ఏంజిల్స్లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్లో ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రం దేవర. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్మాస్ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగానూ నిలిచింది. ఇక యూట్యూబ్లో అత్యంత వేగంగా 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్న పాటగా ‘చుట్టమల్లే..’ నిలిచింది.→ ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.400 కోట్లు. ఎన్టీఆర్ రూ.60 కోట్లు రెమ్యునరేషన్గా తీసుకున్నారట. ప్రీరిలీజ్ బిజినెస్, ఓటీటీ అమ్మకంతో దాదాపు రూ. 350 కోట్ల వరకు రికవరీ అయిందట. ఇంకా శాటిలైట్ అమ్మకాలు జరగనట్లు తెలుస్తోంది. -
జూనియర్ ఎన్టీఆర్కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా?
ఉత్తరాది, దక్షిణాది వంటలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. వారి ఆహార శైలి, జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ కూడా విభిన్నంగా ఉంటాయి. దివంగత నటి శ్రీదేవిది సౌత్ అయితే ఆమె భర్త బోనీకపూర్ది నార్త్. దీనివల్ల ఉదయం అల్పాహారం చేసేటప్పుడు అమ్మ ఎప్పుడూ నాన్నతో గొడవపడేదని చెప్తోంది హీరోయిన్ జాన్వీ కపూర్.టిఫిన్ దగ్గర గొడవదేవర ప్రమోషన్స్లో భాగంగా జాన్వీ కపూర్, జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ 'ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాన్వీ మాట్లాడుతూ.. ఉదయం ఆలూ పరాటా తినే నాన్న... అమ్మ వల్ల ఇడ్లీ సాంబార్ అలవాటు చేసుకున్నాడు. ఈ విషయంలో అమ్మ ఎప్పుడూ నార్త్ ఇండియన్లా గొడవపడేది అని పేర్కొంది. నార్త్లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరన్న ప్రశ్నకు తారక్.. శ్రీదేవి అని టక్కున సమాధానమిచ్చాడు. ఫేవరెట్ హీరోయిన్ ఆవిడే!అలాగే జాన్వీ గురించి ఓ చాడీ చెప్పాడు. ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటి భోజనం తినిపించాను. నేను ముంబై వచ్చినప్పుడు మాత్రం ఆమె ఒక్కసారి కూడా ఇంటి భోజనం లేదా హోటల్ ఫుడో పంపించలేదని తారక్ అనడంతో జాన్వీ పగలబడి నవ్వేసింది. అటు సైఫ్.. సౌత్లో ఫేవరెట్ హీరోయిన్ ఎవరన్న ప్రశ్నకు శ్రీదేవి అని బదులిద్దామని రెడీగా ఉన్నానన్నాడు. ఈ ఫన్ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్లో వైరల్గా మారింది. పూర్తి ఎపిసోడ్ నెట్ఫ్లిక్స్లో సెప్టెంబర్ 28న ప్రసారం కానుంది. -
దేవర యాక్షన్ సీక్వెన్స్.. ఆ సీన్కు ఏకంగా పది రోజులు: సైఫ్ అలీ ఖాన్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్- శివ కొరటాల కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్ను షేక్ చేస్తోంది. సముద్ర బ్యాక్డ్రాప్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో దేవర టీమ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ నిర్విహంచారు.ఈ సందర్భంగా దేవర నటుడు సైఫ్ అలీ ఖాన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దేవరలో ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయని అన్నారు. మైథలాజికల్ సెంటిమెంట్, దేవతలకు రక్త అర్పించడం లాంటి వయొలెన్స్ సీక్వెన్సెస్ ఉన్నాయని సైఫ్ అన్నారు. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ నాలుగు గ్రామాల మధ్య జరిగే యుద్ధమని తెలిపారు. దేవరలో ఒక ఫైట్ సీక్వెన్స్ కోసం ఏకంగా పది రోజులు షూటింగ్ చేశామని సైఫ్ అలీ ఖాన్ వెల్లడించారు.(ఇది చదవండి: దేవర మూవీ క్రేజ్.. రిలీజ్కు ముందే రికార్డులు!)కాగా.. ఇప్పటికే దేవర ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్ను షేక్ చేస్తోంది. ఓవర్సీస్లోనూ టికెట్ ప్రీ బుకింగ్స్లో దేవర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. A fight between the heads of 4 different villages.⁰Ancestral weapons.⁰So much blood. Sacrifices to the gods. Prayers.And so much more… #Devara 💥💥💥#DevaraOnSep27th pic.twitter.com/AZR03wYW8P— Devara (@DevaraMovie) September 15, 2024 -
దేవర రికార్డ్
ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దేవర:పార్ట్ 1’ అరుదైన ఘనతని సొంతం చేసుకుంది. లాస్ ఏంజెల్స్లోని ఈజిప్షియన్ థియేటర్లో ప్రీమియర్ కానున్న తొలి భారతీయ సినిమాగా అరుదైన ఘనత సాధించింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేవర’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. నందమూరి కల్యాణ్రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించారు. రెండు భాగాలుగా రానున్న ‘దేవర:పార్ట్ 1’ ఈ నెల 27న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.ఈ చిత్రం గ్రాండ్ ప్రీమియర్ షోను ఈ నెల 26న సాయంత్రం ఆరు గంటలకు హాలీవుడ్లో ప్రదర్శించనున్నారు. ‘‘హాలీవుడ్లో బియాండ్ ఫెస్ట్ అనేది ఘనమైన చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మకమైన సినిమా వేదిక. లాస్ ఏంజెల్స్లోని ఐకానిక్ ఈజిప్షియన్ థియేటర్లో ప్రీమియర్ కానున్న తొలి ఇండియన్ సినిమాగా ‘దేవర:పార్ట్ 1’ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ రెడ్ కార్పెట్ ఈవెంట్కు హాలీవుడ్కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. -
ఎన్టీఆర్ ‘దేవర’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ముంబై : ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం (ఫొటోలు)
-
'దేవర' విలన్ వచ్చేశాడు.. గ్లింప్స్ వీడియో రిలీజ్
ఎన్టీఆర్ 'దేవర' నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ కాగా.. ఇప్పుడు విలన్ ఎంట్రీ ఇచ్చేశాడు. భైర అనే పాత్ర చేసిన సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. బాలీవుడ్ స్టార్ అయిన ఇతడికి తెలుగులో ఇదే తొలి మూవీ. 52 సెకన్లు ఉన్న వీడియోలో యంగ్ లుక్ చూపించారు. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్లో మాత్రం ఓల్డ్ లుక్ చూపించారు.(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?)దీనిబట్టి చూస్తే ఎన్టీఆర్ మాత్రమే కాదు విలన్ భైర కూడా రెండు డిఫరెంట్ గెటప్స్లో కనిపిస్తాడని గ్లింప్స్ వీడియోతో క్లారిటీ వచ్చేసింది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా భలే అనిపించింది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' సిరీస్లో ఐరన్ థ్రోన్ని పోలినట్లు 'దేవర'లోనూ ఓ సింహాసనం చూపించారు.జాన్వీ కపూర్తోపాటు సైఫ్ అలీ ఖాన్.. తెలుగులోకి 'దేవర'తో అడుగుపెడుతున్నారు. సెప్టెంబరు 27న వీళ్ల జాతకం ఏంటో తెలియనుంది. 'ఆచార్య' లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల చేస్తున్న మూవీ ఇది. ఇతడికి ఇది హిట్ కావడం చాలా ముఖ్యం. త్వరలో పూర్తిస్థాయి ప్రమోషన్స్ షురూ చేసే అవకాశముంది.(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే) -
నా భర్త మొదటి భార్య అంటే అభిమానం: కరీనా కపూర్
బాలీవుడ్ మోస్ట్ పాపులర్ జంటల్లో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఒకరు. కొన్నేళ్ల డేటింగ్ తర్వాత 2012లో ముంబయిలో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే గతంలో కరీనా కపూర్.. తన భర్త మొదటి భార్యపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను అమృతా సింగ్కు అభిమానిని అని తెలిపింది. అంతేకాకుండా సైఫ్తో స్నేహం చేయాలని ఆమె కోరుకున్నట్లు వెల్లడించింది. సైఫ్ జీవితంలో అమృతకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకొచ్చింది.గతంలో కరీనా మాట్లాడుతూ..'సైఫ్కు ఇంతకు ముందే వివాహం అయిందని నాకు తెలుసు. అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతన్ని కుటుంబాన్ని నేను గౌరవిస్తా. నేను కూడా ఆయన మొదటి భార్య అమృతా సింగ్కి అభిమానినే. నేను ఆమెను ఎప్పుడూ కలవలేదు. కానీ నాకు ఆమె గురించి సినిమాల ద్వారా తెలుసు. ఆమెకు ఎప్పుడు సైఫ్ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఆమె కేవలం మొదటి భార్యనే కాదు.. అతని పిల్లలకు తల్లి కూడా. సైఫ్లాగే నేను ఆమెను గౌరవిస్తా. ఇది నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నా.' అని అన్నారు.కాగా.. సైఫ్ అలీ ఖాన్ మొదట నటి అమృతా సింగ్ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు 2004లో విడిపోయారు. వీరిద్దరి కూడా సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. కరీనా, సైఫ్ అక్టోబర్ 16, 2012న వివాహం చేసుకున్నారు. వీరికి తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ అకా జెహ్ అనే కుమారులు ఉన్నారు. -
నెలకు రూ.2.5 లక్షలా! మౌనం వీడిన సెలబ్రిటీ నానీ
ఇదిగో పులి అంటే.. అదిగో తోక అంటారు. ఇదీ ప్రస్తుతకాలంలో సోషల్ మీడియా మహిమ. బాలీవుడ్ స్టార్కపుల్ సైఫ్ అలీ ఖాన్-కరీనాకపూర్ల ముద్దుల తనయుడు తైమూర్ అలీ ఖాన్ ఆయా జీతం నెలకు రూ. 2.5 లక్షలు అంటూ ఆ మధ్య ఒక వార్త తెగ వైరల్ అయింది. అయితే తాజాగా ఈ వార్తలపై తైమూర్ నానీ, లలితా డిసిల్వా, తొలి సారి స్పందించారు.కరీనా కపూర్ పెద్ద కొడుకు తైమూర్ నానీగా లలితా డిసిల్వా ఇంటర్నెట్లో బాగా ప్రాచుర్యం పొందారు. టాప్ సీఈఓల కంటే లలిత ఎక్కువ సంపాదిస్తున్నారని పలు నివేదికలు తెలిపాయి. ఈ రూమర్స్పై ఎట్టకేలకు ఆమె మౌనం వీడారు. హిందీ రష్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నెలవారీ జీతం రూ. 2.5 లక్షలు ఉందా అని అడిగినప్పుడు, లలిత ‘రూమర్స్’కి నవ్వుతూ, ‘‘ మీ నోట్లో చక్కెర పొయ్య! నిజంగా నేను రూ. 2.5 లక్షలు కోరుకుంటున్నాను.’’ అంటూ సమాధానమిచ్చారు. తద్వారా అవన్నీ పుకార్లే అని తేల్చారు. అంతేకాదు కరీనా , ఆమె కుటుంబ సభ్యులు ‘సింపుల్ పీపుల్’ అని కూడా ప్రశంసించారు. సిబ్బందితో ప్రేమగా ఉంటారు. అందరమూ ఒకటే ఆహారం తింటాం. చాలా సార్లు అందరం కలిసి భోజనం చేస్తాం అని కూడా ఆమె తెలిపారు.లలితా డిసిల్వా లలితా డిసిల్వా ముంబైలో ఉన్న ప్రముఖ పీడియాట్రిక్ నర్సు, ఆమె సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ల ఇద్దరు కుమారులను పుట్టినప్పటి నుంచి దగ్గరుండి చూసుకుంది. అంతకుముందు డిసిల్వా ఆసియా అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ ఇంట్లో పనిచేశారు. యువ అనంత్ అంబానీని చూసుకున్నారు. ఇటీవల అనంత్అంబానీ, రాధిక మర్చంట్ వివాహానికి లలితను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. -
ఆ విషయంలోనే మాకు తరచూ గొడవలు: కరీనా
బాలీవుడ్ జంట కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు చిన్నారులు జన్మించారు. పెళ్లి తర్వాత తాను ఎంతగానో మారిపోయానంటోంది కరీనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'వివాహం నన్ను మార్చివేసింది. బాధ్యతగా ఉండటం తెలిసొచ్చింది. మేము ఒకరికొకరం తినిపించుకునేవాళ్లం. పోట్లాడుకునేవాళ్లం. కానీ మాకంటూ పెద్దగా సమయం కేటాయించుకోకపోయేవాళ్లం. ఒకే ఇంట్లో ఉన్నా..సైఫ్ ఒక్కోసారి ఉదయం 4.30 గంటలకు వచ్చి నిద్రపోయేవాడు. తను లేచేసరికి నేను షూట్కు వెళ్లిపోయేదాన్ని. నేనొచ్చేసరికి తను ఉండేవాడు కాదు. ఒకే ఇంట్లో ఉన్నా ఇద్దరం మాట్లాడుకునే పరిస్థితి లేకపోయేది. ఒక ఇంట్లో ఇద్దరు నటులు ఉంటే ఇలాగే ఉంటుంది. నేను తన సినిమాలన్నీ చూస్తాను. కానీ ఆయన మాత్రం నేను నటించిన క్రూ మూవీ కూడా ఇంతవరకు చూడలేదు. ఎప్పుడూ షూటింగ్స్ అంటూ తిరుగుతూనే ఉంటాడు.ఏసీ దగ్గరే గొడవమా ఇద్దరికీ ఏసీ గురించే గొడవలవుతుంటాయి. తనకేమో కూలింగ్ ఎక్కువ కావాలంటాడు. నేనేమో 20 డిగ్రీలు చాలంటాను. ఇద్దరి మాటా కాదని 19 డిగ్రీల టెంపరేచర్ సెట్ చేస్తాడు. నా సోదరి కరిష్మా వచ్చినప్పుడు ఏసీ 25 డిగ్రీల నెంబర్లో పెట్టేస్తాం. అప్పుడైతే.. తనకంటే నేనే నయమని ఫీలవుతాడు. అలాగే టైం విషయంలో గొడవడపతాం. డబ్బు, వస్తువుల కోసం మేము పోట్లాడుకోం. ఇద్దరం కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకుంటే చాలని భావిస్తాం. కాస్త సమయం దొరికితే కలిసుండాలని ఆరాటపడతాం' అని చెప్పుకొచ్చింది. సినిమా..కాగా సైఫ్ అలీ ఖాన్ గతంలో అమృత సింగ్ను పెళ్లాడగా వీరికి సారా అనే కూతురు, ఇబ్రహీం అనే కుమారుడు సంతానం. అమృతకు విడాకులిచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత 2012లో కరీనాను పెళ్లాడాడు. ఇకపోతే సైఫ్ ప్రస్తుతం 'దేవర' సినిమాలో నటిస్తుండగా కరీనా 'ద బకింగ్హామ్ మర్డర్స్' మూవీ చేస్తోంది.చదవండి: ఆ హీరోయిన్కు యాక్టింగ్ రాదు, తీసుకోవద్దన్నారు: డైరెక్టర్ -
‘ఆదిపురుష్’లో రావణుడిని వీధి రౌడీలా చూపించడం బాధేసింది: ‘రామాయణ్’సీత
రామాయణం ఇతిహాసం ఆధారంగా ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్’. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారణంగా బోల్తా పడింది.అంతేకాదు ఈ మూవీలోని ప్రధాన పాత్రలను తీర్చిదిద్దిన విధానంపై అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సైఫ్ అలీఖాన్ పోషించిన రావణాసూరుడు పాత్రపై ఎన్నో వివాదాలు వచ్చాయి. రామాయణ ఇతిహాసాన్ని అపహాస్యం చేసేలా చిత్రాన్ని తెరకెక్కించారని ఓ వర్గం మండిపడింది. తాజాగా ‘రామాయణ్’ సీరియల్లో సీతగా నటించిన దీపికా చిఖ్లియా కూడా ‘ఆదిపురుష్’సినిమాపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ సినిమాలో రావణుడిని వీధి రౌడీలా చూపించారని మండిపడ్డారు. ‘ఆదిపురుష్ సినిమా చూసి నేటి తరం పిల్లలు రామాయణం అంటే ఇలానే ఉంటుందని భావించే అవకాశం ఉంది. అది భవిష్యత్తుకే ప్రమాదకరం. ఇందులో చూపించినట్లుగా రావణుడు మరీ అంత చెడ్డవాడు కాదు. ఆయన గొప్ప శివ భక్తుడు. ఆయనలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. మాంసాహారం తినడు. సీతాదేవిని అపహరించడమే ఆయన చేసిన పెద్ద తప్పు. సీతాదేవి కూడా అలా ఉండదు. ఈ సినిమాలో చూపించినట్లుగా రావణుడు ఉండడని పిల్లలకు ఎవరూ వివరించడం లేదు. నేను ఈ సినిమాను థియేటర్లో చూడలేదు. టీవీలో కొంచెం చూడగానే నచ్చలేదు. సృజనాత్మకంగా ఏదో కొత్తగా చూపించాలనే తాపత్రయంలో రామాయణం గొప్పతనాన్ని తగ్గించేస్తున్నారు’ అని దీపికా చిఖ్లియా ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతీశెట్టి సీతగా నటించారు. -
నిద్రమాత్రలు వేసుకున్న హీరో.. భార్యే ఇచ్చింది.. ఎందుకంటే?
బాలీవుడ్లోని క్లాసిక్ చిత్రాల్లో 'హమ్ సాత్ సాత్ హై' ఒకటి. ఇప్పుడు చూసినా ఎంతో ఫ్రెష్గా అనిపిస్తుంది. ఈ మూవీలో సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, టబు, సోనాలి బింద్రె, మోనిశ్ బాల్ తదితరులు పటించారు. దర్శకుడు సూరజ్ బార్జాత్యాతో కలిసి పని చేసి ఈ మాస్టర్పీస్ను అందించారు. అయితే ఈ సినిమాలోని 'సునోజి దుల్హాన్..' పాట షూటింగ్ సమయంలో సైఫ్ అలీ ఖాన్ సరిగా యాక్ట్చేయలేదట.నిద్రమాత్రలు వేసుకుని..తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు సూరజ్ ఆనాటి విషయాలను పంచుకున్నారు. 'సైఫ్ అలీ ఖాన్ సహజ నటుడు. అలాంటి వ్యక్తి ఒకానొక సమయంలో రీటేకులు తీసుకుంటూనే ఉన్నాడు. అసలేమైంది? అని అతడి భార్య అమృత సింగ్ను(ప్రస్తుతం విడాకులు తీసుకున్నారు) అడిగాను. పగలూరాత్రీ తేడా లేకుండా మెళకువతో ఉంటే తను ఎలా పర్ఫెక్ట్గా నటించగలడు? అని చెప్పింది. తనకేదైనా మెడిసిన్ ఇవ్వమన్నాను. అలా అతడికి నిద్ర మాత్రలు ఇవ్వడంతో ఆ రోజు హాయిగా పడుకున్నాడు.నేచురల్ యాక్టర్తెల్లారి సెట్లో సింగిల్ టేక్లో తన షాట్ పూర్తి చేశాడు. ఒక్క టేక్లో ఎలా పూర్తయింది? అని ఆశ్చర్యంగా నన్నే తిరిగి అడిగాడు. నువ్వు కంటి నిండా నిద్రపోతేనే నేచురల్గా నటించగలవని బదులిచ్చాను. పెద్ద స్టార్స్తో కలిసి నటించడం సైఫ్కు అదే తొలిసారి కావడంతో కొంత బెరుకుగా కూడా ఉండేవాడు. తన డైలాగులను ఎప్పటికప్పుడు రిహార్సల్స్ చేసేవాడు' అని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ దేవర సినిమాలో నటిస్తున్నాడు.చదవండి: ‘సత్యభామ’ మూవీ రివ్యూ -
నాకు సపోర్ట్ చేసేందుకు ఆ హీరో భార్య ఒప్పుకోలేదు
దీపక్ తిరోజి.. ఆషిఖి, ఖిలాడీ, జో జీతా వోహి సిఖిందర్, ఘులామ్, బాద్షా వంటి హిందీ చిత్రాల్లో సహాయక పాత్రలతో గుర్తింపు పొందాడు. పెహ్లా నషా మూవీతో హీరోగానూ మారాడు. ఊప్స్ చిత్రంతో దర్శకనిర్మాతగా అవతారం ఎత్తాడు. ఆయన చివరగా 2018లో వచ్చిన టామ్, డిక్ అండ్ హ్యారీ 2 అనే సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించాడు.అతిథి పాత్రలోదాదాపు ఆరేళ్ల తర్వాత టిప్సీ చిత్రంతో మరోసారి దర్శకుడిగా మారాడు. ఈ మూవీ మే 10న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చిన దీపక్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. '1993లో జరిగిందీ సంఘటన.. అప్పుడు నేను పెహ్లా నషా సినిమా చేస్తున్నాను. ఆ మూవీలో అందరు సెలబ్రిటీలు అతిథి పాత్రలో కనిపించాల్సి ఉంది. షారుక్, సైఫ్ అలీ ఖాన్, ఆమిర్ ఖాన్.. అందరూ ఒప్పుకున్నారు. చిన్నపాటి సీన్షూటింగ్ కోసం సైఫ్ ఇంటి దగ్గర రెడీ అవుతున్నప్పుడు అతడి భార్య అమృత (ప్రస్తుతం విడాకులు తీసుకున్నారు) ఎక్కడికి వెళ్తున్నారని అడిగింది. అందుకాయన దీపక్ సినిమా కోసం వెళ్తున్నాను. చిన్నపాటి సీన్ చేసి వస్తానని చెప్పాడు. అందుకామె ఆశ్చర్యపోతూ నిజంగానే మీరందుకు ఒప్పుకున్నారా? మేమైతే అలాంటి పనులు ఎప్పుడూ చేయలేదు. నిజానికి ఆ సమయంలో..ఇలా ఒకరికి సపోర్ట్ చేసేందుకు ఎవరైనా వెళ్తారా? అని ఆగ్రహించింది. నిజానికి ఆ సమయంలో అందరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నారు. ఇప్పుడైతే అలాంటి పరిస్థితులు పెద్దగా కనిపించడమే లేదు' అని చెప్పుకొచ్చాడు. ఇక పెహ్లా నషా సినిమాలో షారుక్, సైఫ్తో పాటు రవీనా టండన్, పూజా భట్, పరేశ్ రావల్, జూహీ చావ్లా, సుదేశ్ బెర్రీ ఇలా తదితరులు నటించారు.చదవండి: ఓటీటీలో 100 సినిమాలు.. ఎంచక్కా ఇంట్లోనే చూసేయండి -
సెకనుకు రూ.7 లక్షలు.. తెలుగు హీరోలకంటే ఎక్కువే!
పైసా..పైసా.. మంచి స్క్రిప్ట్ ఉంటే సరిపోదు. దాన్ని క్వాలిటీగా తీయాలంటే పైసా కావాల్సిందే! అయితే సినిమా నిర్మించడం కంటే అందులో నటించినవారికి ఇవ్వాల్సిన పారితోషికాలే తడిసి మోపెడవుతున్నాయి. సినిమా బడ్జెట్ అంతా ఒకెత్తు.. స్టార్స్ రెమ్యునరేషన్స్ మరో ఎత్తు అన్నట్లు మారింది పరిస్థితి! ఈ మధ్య ప్రాంతీయ సినిమా పాన్ ఇండియా సినిమాగా మారడంతో ఇతర భాషా ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీలను తీసుకొస్తున్నారు. అలా బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. హిందీలో కంటే కూడా ఇతరత్రా భాషల్లోనే భారీగా అందుకుంటున్నారు. బీటౌన్ చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. దక్షిణాది సినిమాల కోసం బాలీవుడ్ తారలు అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో చూసేద్దాం.. జాన్వీ కపూర్ దివంగత తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు తీసుకుంటుంది. తెలుగులో ఈమె దేవర సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీ కోసం రూ.5 కోట్లు పుచ్చుకుంటోందట. రామ్చరణ్ సినిమా కోసం ఏకంగా రూ.6 కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ తెలుగు సినిమా అనగానే జాన్వీ తన రెమ్యునరేషన్ డబుల్ చేసింది. సైఫ్ అలీ ఖాన్ అయితే ఓ అడుగు ముందుకేసి ఏకంగా మూడు రెట్లు డిమాండ్ చేస్తున్నాడు. దేవరలో విలన్గా నటిస్తున్నందుకు ఏకంగా రూ.13 కోట్లు తీసుకుంటున్నాడట! బాబీ డియోల్ బ్లాక్బస్టర్ మూవీ యానిమల్లో విలన్గా నటించినందుకుగానూ నటుడు బాబీ డియోల్ రూ.4 కోట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు సూర్య 'కంగువా'లో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం డబల్ అంటే ఎనిమిది కోట్లు తీసుకుంటున్నాడు. ఇమ్రాన్ హష్మీ ఇమ్రాన్ హష్మీ ఈ మధ్యే బాలీవుడ్లో తన రేటు పెంచేశాడు. దీంతో తెలుగులో కూడా అదే రెమ్యునరేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ ఓజీ సినిమాకుగానూ ఇతడు రూ.7 కోట్లు డిమాండ్ చేశాడు. సంజయ్ దత్, రవీనా టండన్ సంజయ్, రవీనా.. ఇద్దరూ కేజీఎఫ్ సినిమాలో అద్భుత నటన కనబర్చారు. రవీనా పాత్ర చిన్నది కావడంతో ఆమె రూ.2 కోట్లతో సరిపెట్టుకుంది. కానీ కల్నాయక్(సంజయ్) తన పాత్రకు తగ్గట్లు రూ.10 కోట్లు అందుకున్నాడు. అజయ్ దేవ్గణ్, ఆలియా భట్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిన ఆలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో కనిపించింది. కాసేపు మాత్రమే ఉండే ఈ పాత్ర కోసం రూ.10 కోట్లు తీసుకుంది. అజయ్ దేవ్గణ్ స్వాతంత్య్ర సమరయోధుడిగా నటించాడు. సినిమా మొత్తంలో కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఇందుకుగానూ అతడు రూ.35 కోట్లు తీసుకున్నాడు. అంటే సెకనుకు రూ.7.2 లక్షలన్నమాట! ఈ లెక్కన పారితోషికం విషయంలో అందరికంటే అజయే ఎక్కువ అందుకున్నట్లు కనిపిస్తోంది. చదవండి: మహానటి స్థానంలో ప్రియమణి.. ఎందుకంటే? -
'మొదటి భార్యకు విడాకులు.. నన్ను ఇలాగే చావనివ్వండి'
బాలీవుడ్లోని ఫేమస్ జంటల్లో సైఫ్ అలీ ఖాన్- కరీనా కపూర్ జోడీ ఒకరు. అయితే కరీనాను పెళ్లాడటానికంటే ముందు సైఫ్కు నటి అమృతా సింగ్తో పెళ్లయింది, పిల్లలు పుట్టారు, తర్వాత విడాకులూ తీసుకున్నారు. తాజాగా అతడి పాత ఇంటర్వ్యూ ఒకటి వైరల్గా మారింది. 2005లో అతడు ఆ ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'విడాకులు తీసుకున్నప్పుడు నన్ను, నా తల్లిని, సోదరిని దుర్భాషలాడారు. అవమానించారు. మానసికంగా వేధించారు. అన్నింటినీ భరించాను. అందులో తప్పేముంది? నెమ్మదిగా దాని నుంచి బయటపడ్డాను. తర్వాత నేను మళ్లీ ప్రేమలో పడితే కూడా తప్పేనా? (విడాకుల అనంతరం సైఫ్ నటి రోసాను డేటింగ్ చేశాడు) దానివల్ల ఎవరికి హాని ఉంది? మేము విడిపోయిన తర్వాత కూడా పిల్లలను ఎప్పుడూ పట్టించుకోకుండా వదిలేయలేదు. అలా అని కస్టడీ కోసం కోర్టు చుట్టూ తిరుగుతూ తనతో పోరాడాలనీ అనుకోలేదు. కానీ ఎప్పుడూ వారికి అండగా ఉన్నాను. అమృతకు రూ.5 కోట్లు భరణం ఇచ్చేందుకు అంగీకరించాను. అందులో సగాన్ని ఆల్రెడీ చెల్లించేశాను. అంత ఆస్తి లేదు దానితోపాటు ఇబ్రహీంకు 18 ఏళ్ల వయసొచ్చేవరకు నెలకు రూ.1 లక్ష చొప్పున ఇస్తానని చెప్పాను. షారుక్ ఖాన్లా అంత పెద్ద సంపద నాకు లేదు. అయినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి వారికి ఇస్తానన్న డబ్బును సమయానికి ఇచ్చేసేవాడిని. యాడ్స్, స్టేజీ షోలు, సినిమాల ద్వారా వచ్చే ప్రతి పైసాను వారికే అంకితం చేశాను. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. నన్ను ఇలాగే చావనివ్వండి.. అంతేకానీ, ఒక బంధంలో నుంచి ఇంత ఈజీగా వచ్చేశావేంటంటూ పదేపదే ఎత్తిపొడుపు మాటలతో నన్ను పదే పదే పొడిచి చంపొద్దు ప్లీజ్..' అని చెప్పుకొచ్చాడు. రెండు పెళ్లిళ్లు కాగా సైఫ్- అమృత 1991లో పెళ్లి చేసుకున్నారు. వీరికి సారా అలీ ఖాన్, ఇబ్రహీమ్ అలీ ఖాన్ సంతానం. పెళ్లి తర్వాత నెమ్మదిగా సినిమాలకు దూరమైన అమృత విడాకుల తర్వాత వెండితెరపై మళ్లీ బిజీ నటిగా మారింది. 2004లో భార్యతో విడిపోయిన తర్వాత సైఫ్ నటి రోసాతో ప్రేమలో పడ్డాడు. కానీ కొంతకాలానికే బ్రేకప్ చెప్పుకున్నారు. అనంతరం హీరోయిన్ కరీనా కపూర్ను ప్రేమించాడు. 2012లో ఆమెను పెళ్లాడాడు. వీరికి తైమూర్, జే అని ఇద్దరు కుమారులు జన్మించారు. చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన స్టార్ హీరోల సినిమాలు.. సలార్ హిందీ వర్షన్ ఆరోజే రిలీజ్! -
అట్టర్ ఫ్లాప్గా ఆదిపురుష్.. ఎట్టకేలకు స్పందించిన బాలీవుడ్ స్టార్
సినిమా జయాపజయాలను ముందుగా ఊహించడం కష్టం. ఫలానా కథతో సినిమా తీస్తే ఆడుతుంది, ఫలానా కథతో సినిమా తీస్తే ఆడదు అని ముందే పసిగడితే ఇండస్ట్రీలో ఫ్లాపులెందుకు ఉంటాయి? అలా అని తీసుకున్న కథ ఒక్కటి బాగుంటే సరిపోదు.. దాన్ని తెరకెక్కించే విధానం, ప్రేక్షకులను ఆకర్షించేలా తీర్చిదిద్దగలిగే టాలెంట్ ఉండాలి. ఇది లేకపోవడం వల్లే భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఆదిపురుష్ అతి ఘోరమైన అపజయాన్ని మూటగట్టుకుంది. ఏడు నెలల తర్వాత పెదవి విప్పిన నటుడు గతేడాది జూన్ 16న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్లాప్ టాక్ రావడంతో ఎవరూ పెద్దగా మీడియా ముందుకు రాలేదు. దాదాపు ఏడు నెలల తర్వాత తొలిసారి ఈ సినిమా ఫెయిల్యూర్పై స్పందించాడు సైఫ్ అలీ ఖాన్. ఇతడు ఆదిపురుష్లో లంకేశ్ (రావణుడు)గా నటించాడు. ఇతడి లుక్పై విపరీతమైన ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే! సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. 'ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నదాన్ని నేను బలంగా నమ్ముతాను. నన్ను నేను స్టార్ అని ఎన్నడూ ఫీలవలేదు. నా పేరెంట్స్ పెద్ద స్టార్స్.. కానీ సింప్లిసిటీకే ఓటేసేవారు. వాస్తవంలో బతకాలి.. నేను కూడా వాస్తవంలోనే బతకాలనుకున్నాను. ఓటముల గురించి భయపడిపోను. ఆదిపురుష్నే ఉదాహరణగా తీసుకుందాం. కొన్నిసార్లు రిస్కు చేయాలి.. ఓటమిని తీసుకోగలగాలి. జీవితమన్నాక అన్నీ ఉండాలి. ఓటమితో బాధపడి ముడుచుకుపోకూడదు. మనం మనవంతు ప్రయత్నించాం, దురదృష్టం కొద్దీ వర్కవుట్ కాలేదు. నెక్స్ట్ సినిమాకు చూసుకుందాంలే అని ధైర్యంగా ముందుకు సాగిపోవాలి! నేను అదే చేశాను' అని సైఫ్ అలీ ఖాన్ చెప్పుకొచ్చాడు. చదవండి: ఓటీటీలో బేబి హీరో కొత్త సినిమా.. సైలెంట్గా స్ట్రీమింగ్.. -
ఆస్పత్రి పాలైన దేవర విలన్
-
'కరీనాతో డేటింగ్.. ఆ హీరోయిన్ అలా చేయమని సలహా ఇచ్చింది'
బాలీవుడ్ స్టార్ జంట సైఫ్ అలీ ఖాన్- కరీనా కపూర్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటికే సైఫ్ ఇద్దరు పిల్లల తండ్రి అయినప్పటికీ అతడిని మనసారా ప్రేమించింది కరీనా. 2004లో మొదటి భార్య అమృత సింగ్కు విడాకులిచ్చాడు సైఫ్. ఆ మరుసటి ఏడాది కరీనా కపూర్తో తొలిసారి ఫోటోషూట్లో పాల్గొన్నాడు. అప్పటినుంచి వీరి మధ్య చనువు పెరిగింది. ఎల్ఓసీ: కార్గిల్, ఓంకార, తషాన్, కుర్బాన్, ఏజెంట్ వినోద్.. తదితర చిత్రాల్లో వీరు జంటగా నటించడగా ఆ సమయంలో వీరి మధ్య స్నేహం ప్రేమగా మారి అది మరింత బలపడుతూ వచ్చింది. అలా వీరు 2012లో పెళ్లి చేసుకోగా తైమూర్, జెహంగీర్ అని ఇద్దరు కుమారులు జన్మించారు. షూటింగ్లో నాకో సలహా ఇచ్చింది అయితే కరీనాతో డేటింగ్లో ఉన్నప్పుడు బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ తనకో సలహా ఇచ్చిందట. అది తనకెంతో ఉపయోగపడిందంటున్నాడు హీరో. ఆ సలహా గురించి, దాన్ని సూచించిన వ్యక్తి గురించి సైఫ్ మాట్లాడుతూ.. 'రాణి చాలా అద్భుతమైన వ్యక్తి. సినిమాలు చేసేకొద్దీ మా మధ్య స్నేహబంధం మరింత పటిష్టంగా మారింది. ఓసారి రాణి షూటింగ్లో నాకో సలహా ఇచ్చింది. నువ్వు కరీనాను ప్రేమిస్తున్నావు.. అందుకు సంతోషం.. అయితే ఒక్కటి మాత్రం గుర్తుపట్టుకో.. మీ ఇంట్లో ఇద్దరు హీరోలు ఉంటారన్నది ఎన్నటికీ మర్చిపోకు అని చెప్పింది. ఇంట్లో సమానత్వం తన మాటలు ఇప్పటికీ నా మెదడులో తిరుగుతూనే ఉన్నాయి. ఇంతకీ తను చెప్పిన వాక్యానికి అర్థమేంటంటే.. ఇంటి కోసం ఇద్దరూ కష్టపడుతారు. ఒకరు పని చేసినప్పుడు మరొకరు పిల్లల బాధ్యతను చూసుకోవాలి అని! నువ్వు ఆడ, నేను మగ అన్న అహంకారం లేకుండా ఇద్దరూ అన్నిరకాల పనులు చేసుకోవాలని సలహా ఇచ్చింది. భార్య ఉద్యోగానికి వెళ్తే అప్పుడు భర్త ఇంటిని చూసుకోవాలని.. లింగబేధాలు లేకుండా సమానత్వం ఉండాలన్నదే ఆమె భావన. దాన్ని నేను ఇప్పటికీ ఆచరిస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ చిత్రీకరణలో ఇటీవలే సైఫ్కు గాయమవగా సర్జరీ చేయించుకున్నాడు. ఇప్పుడిప్పుడే ఆ గాయం నుంచి కోలుకుంటున్నాడు. చదవండి: గతేడాది థియేటర్లలో రిలీజ్.. ఇప్పుడు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ -
ఆస్పత్రి పాలైన 'దేవర' విలన్.. ఇంతకీ కారణం ఏంటంటే?
'దేవర' సినిమాలో విలన్గా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఆస్పత్రి పాలయ్యాడు. బాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. గతేడాది 'ఆదిపురుష్' విలన్గా నటించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే షూటింగ్లో భాగంగా ఈ మధ్య సైఫ్కి గాయాలయ్యాయని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఇతడు ఆస్పత్రిలో చేరడంతో అది నిజమని తేలింది. (ఇదీ చదవండి: సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్బాస్' శోభాశెట్టి) ప్రస్తుతం 'దేవర' షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే కొన్నాళ్ల ముందు యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నప్పుడు విలన్గా చేస్తున్న సైఫ్.. మోకాలి, భూజానికి గాయాలయ్యాయట. అయితే అప్పుడు పెద్దగా తెలియలేదు గానీ ఇప్పుడు ఆ గాయాలు సీరియస్ కావడంతో ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరాడు. అయితే గతంలో సైఫ్కి గాయమైందట. తాజాగా అది తిరగబెట్టడంతో ట్రైసప్(కండ) సర్జరీ కచ్చితంగా చేయాల్సి వచ్చిందట. అలా ఇప్పుడు ఆ శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో హీరోగా అప్పట్లో హిట్స్ కొట్టిన సైఫ్.. ఇప్పుడు సరైన సినిమాలు పడకపోయేసరికి రూట్ మార్చాడు. ప్రతినాయక పాత్రలైనా సరే ఒప్పుకొంటున్నాడు. అలా గతేడాది ప్రభాస్ 'ఆదిపురుష్'లో రావణుడిగా కనిపించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 'దేవర' చిత్రంలో భైరా అనే పాత్రలో నటిస్తున్నాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) -
Sharmila Tagore Celebrates 79th Birthday: హీరో సైఫ్ అలీ ఖాన్ తల్లి 79వ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
మీ సవతి కూతురితో నటిస్తారా?.. కరీనా సమాధానం ఇదే!
బాలీవుడ్ భామ కరీనాకపూర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవలే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో ఆమె పాల్గొంది. మరో స్టార్ హీరోయిన్ ఆలియా భట్తో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా కరణ్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ముఖ్యంగా తన కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. దక్షిణాది స్టార్ హీరోతో నటించాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటకు పెట్టేసింది ముద్దుగుమ్మ. సారా అలీఖాన్ (కరీనా భర్త, నటుడు సైఫ్ అలీఖాన్ మొదటి భార్య కుమార్తె)కు తల్లిగా నటించే అవకాశం వస్తే నటిస్తావా? అంటూ కరణ్ జోహార్ ప్రశ్నించారు. దీనికి కరీనా స్పందిస్తూ నేను ముందుగా నటిని.. అన్ని వయసుల వారితో నటించగలను. ఎప్పుడైనా సారాకు తల్లిగా నటించే అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తా' అని తెలిపింది. సారా అలీ ఖాన్.. సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య కుమార్తె. కరీనాతో పెళ్లికి ముందే సైఫ్ అమృతా సింగ్ను వివాహమాడారు. ఆమెతో 2004లో విడిపోయారు. సైఫ్, అమృతలకు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ జన్మించారు. ఆ తర్వాత మీరు సౌత్లో ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారు? అని కరణ్ మరో ప్రశ్న వేశారు. వీరిలో ప్రభాస్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, యశ్లో ఎవరితో ఎంచుకుంటారు? అని ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ దక్షిణాదికి చెందిన కేజీఎఫ్ హీరో యశ్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. ఆయన పక్కన నటించాలని ఉంది. కేజీయఫ్ సినిమా చూశా. చాలా బాగుంది.' అని చెప్పారు. అయితే గతంలో కరీనా తాను సినిమాలు చూడనని.. రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీని కూడా అందుకే చూడలేదని కరీనా చెప్పింది. కేజీఎఫ్ సినిమా చూశానని చెప్పడంతో కరణ్ షాక్ అయ్యాడు. కాగా.. అక్టోబర్ 2012లో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఏడాది కరీనా జానే జాన్తో ఓటీటీలో అరంగేట్రం చేసింది. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 21న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ప్రస్తుతం కరీనా ది క్రూని అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ మార్చి 22, 2024న రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) -
పిల్లలు కావాలని హీరోను పెళ్లి చేసుకున్నా: స్టార్ హీరోయిన్
స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఇద్దరు పిల్ల తల్లి.. ఓ పక్క కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూనే మరో పక్క సినిమాలు చేస్తోంది. అటు నిర్మాతగా, ఇటు హీరోయిన్గా రాణిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 'ఈ కాలంలో పిల్లల్ని కనడం కోసమే పెళ్లి చేసుకుంటున్నారు. అంతే కదా! పిల్లల గురించి ఆలోచించకపోతే వివాహ బంధంలో అడుగుపెట్టకుండా సహజీవనం చేయొచ్చు. నేను, సైఫ్ అలీ ఖాన్ చేసిందదే.. మేమిద్దరం ఐదేళ్లపాటు సహజీవనం చేశాం. పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి చేసుకున్నాం' అని చెప్పుకొచ్చింది. కొంతకాలం డేటింగ్.. తర్వాతే పెళ్లి కాగా సైఫ్ అలీ ఖాన్ గతంలో అమృత సింగ్ను పెళ్లాడాడు. వీరికి సారా అలీ ఖాన్, ఇబ్రహీమ్ అలీ ఖాన్ సంతానం. దంపతుల మధ్య పొరపచ్చాలు రావడంతో వీరు 2004లో విడిపోయారు. తర్వాత హీరోయిన్ కరీనాతో ప్రేమలో పడ్డాడు సైఫ్. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఈ లవ్ బర్డ్స్ 2012 అక్టోబర్లో పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా మారారు. వీరికి 2016లో తైమూర్, 2021లో జహంగీర్ జన్మించారు. ఓటీటీలోనూ ఎంట్రీ ఇక సినిమాల విషయానికి వస్తే కరీనా కపూర్ ఇటీవలే ఓటీటీలోనూ అడుగుపెట్టింది. సస్పెక్ట్ ఎక్స్ అనే జపనీస్ నవల ఆధారంగా తెరకెక్కిన జానే జాన్ సినిమాలో నటించింది. సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 21 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో విజయ్ వర్మ, జైదీప్ అహ్లావత్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో ద క్య్రూ, సింగం అగైన్ అనే సినిమాలున్నాయి. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) చదవండి: సినీ రచయిత కన్నుమూత.. పాఠశాల దశలోనే చదువు ఆగిపోయినా.. -
Saif Ali Khan Pataudi House: సైఫ్ అలీ ఖాన్ బంగ్లా అంటే అట్లుంటది (ఫొటోలు)
-
‘దేవర’ స్టార్ యాక్టర్ నెట్వర్త్, లగ్జరీ కార్లు: తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ప్యాన్ ఇండియాస్టార్ జూ.ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీ దేవర మూవీలో విలన్ అలరించబోతున్న బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్. బర్త్డే సందర్భంగా సైఫ్ ఫస్ట్ లుక్ బాగానే ఆకట్టుకుంది. దశాబ్దాలుగా పరిశ్రమలో కొనసాగుతున్న సైఫ్ భారీ బడ్జెట్ సినిమాలు, బాక్సాఫీసు వద్ద భారీ హిట్ల లిస్ట్ పెద్దదే. మంచి నటుడిగా, ఫిట్నెస్ ఫ్రీక్గా అంతకుమించి బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ భర్తగా మంచి మార్కులే కొట్టేశాడు.ఆ క్రమంలో సైల్ అలీ ఖాన్ ఆస్తిఎంత? సినిమాకు ఎంత తీసుకుంటాడు? అనేది చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) పర్సనల్ లైఫ్, రాయల్ ఫ్యామిలీ 1970, ఆగస్టు 16న నటుడు, ప్రముఖ క్రికెటర్ , భారత జట్టు మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, హిందీ నటి షర్మిలా టాగోర్ ల కుమారుడే సైఫ్ అలీ ఖాన్. సైఫ్ పూర్వీకులు పటౌడీ సంస్థానానికి చెందిన నవాబులు. ఇతని ముత్తాత ఇఫ్తికార్ అలీఖాన్ పటౌడీ, తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడిలు నవాబులుగా చలామణి అయ్యారు. సబా అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ అనే ఇద్దరు చెల్లెళ్లున్నారు. 1991లో ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్తో వివాహ జరిగింది. వీరికి సారా అలీ ఖాన్ ,ఇబ్రహీం అలీ ఖాన్ ఇద్దరు సంతానం.. అయితే 13 సంవత్సరాల వైవాహిక జీవితం తరువాత 2004 లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2012, అక్టోబర్ 16న బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు తైమూర్ అలీ ఖాన్ , జహంగీర్ అలీ ఖాన్ అనే ఇద్దరు కుమారులున్నారు. దశాబ్దాల సినీ కరియర్ 1993లో సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ అరంగేట్రం చేసిన దగ్గరనుంచీ ఐకానిక్ క్యారెక్టర్స్తో వెనుదిరిగి చూసింది లేదు. ఓంకార, లవ్ ఆజ్ కల్, కల్ హో నా హో, హమ్ తుమ్, దిల్ చాహ్తా హై, తన్హాజీ: ది అన్సంగ్ వారియర్, లాల్ కప్తాన్, మెయిన్ ఖిలాడి తూ అనారీ, పరిణీత, సలామ్ నమస్తే, రేస్ ఆదిపురుష్ , బంటీ ఔర్ బబ్లీ-2తదితర చిత్రాలలో సైఫ్ గుర్తుండిపోయే పాత్రలు చాలా ఉన్నాయి. సైఫ్ అలీఖాన్ కోట్ల విలువైన ఆస్తులు మీడియా నివేదిక ప్రకారం, సైఫ్ అలీ ఖాన్ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా పెట్టుబడి పెట్టాడు. ముంబైలోని ప్రసిద్ధ ఫార్చ్యూన్ హైట్స్ భవనంలో విలాసవంతమైన అపార్ట్మెంట్ ఉంది. దీని విలువ దాదాపు రూ. 4.2 కోట్లు. దీంతోపాటు సైఫ్ తమ అపార్ట్మెంట్కి ఎదురుగా ఉన్న విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది దీన్ని అద్దెకిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పాటు ముంబైలో 6 కోట్లు విలువ చేసే మరో లగ్జరీ బంగ్లా కూడా ఉంది. జిస్టాడ్లో సైఫ్ అలీ ఖాన్ చాలెట్ విలువ రూ. 33 కోట్లు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్కి ఫారిన్ లొకేషన్స్ అంటే చాలా ఇష్టం. ఫ్యామిలీతో కలిసి విదేశాలలో కొత్త ప్రదేశాల్లో చక్కర్లు కొట్టి వస్తుంటాడు. స్విట్జర్లాండ్లో జిస్టాడ్లో చాలెట్( ఫాంహౌస్ లాంటిది) ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీని రూ. రూ. 33 కోట్లు. భార్య కరీనా, పిల్లలు తైమూర్ , జహంగీర్ అలీ ఖాన్లతో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తారు. సైఫ్ అలీ ఖాన్ పూర్వీకుల ఇల్లు, పటౌడీ ప్యాలెస్ ముంబైలో సైఫ్ అలీ ఖాన్ కలిగి ఉన్న అన్ని అత్యంత ఖరీదైన ఆస్తులతో పాటు, హర్యానాలోని పటౌడీ ప్యాలెస్ చాలా ప్రత్యేకమైన ఆస్తిగా చెప్పుకోవచ్చు. సైఫ్ వారసత్వ సంపద విలువ రూ. 5000 కోట్లు. చివరి పాలక నవాబ్ ఇఫ్తికార్ ఖాన్, దివంగత మన్సూర్ అలీ ఖాన్ వారసత్వ ఆస్తిలో ముఖ్యమైంది. పటౌడీ ప్యాలెస్ 'ఇబ్రహీం కోఠి' పేరుతో కూడా పిలుస్తారు.150 గదులు, ఏడు బెడ్రూమ్లు, పలు డ్రాయింగ్ రూమ్లు, ఏడు బిలియర్డ్ రూమ్లులాంటి ఫీచర్లతో హర్యానాలో 10 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. బహుళ నివేదికల ప్రకారం, సైఫ్ అలీ ఖాన్కు చెందిన పటౌడీ ప్యాలెస్ విలువ రూ. 800 కోట్లు. అలాగే భోపాల్లోని పటౌడీ ప్యాలెస్ రూ. 4,200 కోట్లు. లగ్జరీ కార్లు రాయల్ ఇమేజ్, డాషింగ్ యాక్టర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సూపర్ కార్లు అతని గ్యారేజీలోఉన్నాయి. లగ్జరీ కార్ కలెక్షన్లో ఫోర్డ్ మస్టాంగ్ జిటి (రూ. 74 లక్షల నుండి రూ. 76 లక్షలు), రేంజ్ రోవర్ వోగ్ (రూ. 2.39 కోట్ల నుండి 4.17 కోట్లు), ల్యాండ్ రోవర్ డిఫెండర్ (రూ. 93 లక్షలు) , లెక్సస్ 470 (రూ. 35 లక్షల నుండి రూ. 38 లక్షలు), BMW 7 సిరీస్ (రూ. 1.70 కోట్లు), బెంజ్ ఎస్- క్లాస్ (రూ. 1.71 కోట్ల నుండి 1.80 కోట్లు), ఆడి R8 (రూ. 2.72 కోట్లు) . డైమండ్ రోలెక్స్ వాచ్ ఖరీదైన బంగ్లా, కార్లతోపాటు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, రాయల్ వాచీల కలెక్షన్ సైఫ్ సొంతం. బ్రూనై సుల్తాన్ కుమార్తె నుండి తనకు లభించిన బహుమతి అని సైఫ్ ఒక సందర్భంలో వెల్లడించాడు. అంతేకాదు కోటి రూపాయల విలువైన లగ్జరీ వాచ్ను ఒకానొక సందర్బంగా విక్రయించాలని చూశాననీ, ఆ తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకుని తన భార్య కరీనా కపూర్కి ఇచ్చినట్టు తెలిపాడు. రెమ్యూనరేషన్, నెట్వర్త్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్లో ‘రావణ్’ పాత్రకోసం 12 కోట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతని రెమ్యూనరేషన్ రూ. ఒక్కో సినిమాకు 10-15 కోట్లుగా అంచనా. దీంతోపాటు బ్రాండ్ ఎండార్స్మెంట్స్, ఓటీటా ప్రాజెక్ట్లలో కూడా చాలా యాక్టివ్. అలా వార్షిక ఆదాయంరూ. 28 కోట్ల నుంచి రూ. 30 కోట్లకు పైమాటే. సో సుదీర్ఘకాలంగా బాలీవుడ్లో కొనసాగుతున్న సైఫ్ అలీ ఖాన్ నికర విలువ సుమారు రూ. 1,180 కోట్లుగా ఉంటుందని అంచనా. -
'దేవర' విలన్ ఇతడే.. ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్
జూ.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవర. కొరటాల శివ దర్శకుడు. సముద్రం బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఫుల్ స్వింగ్లో జరుగుతోంది. అయితే కొన్నాళ్ల ముందు తారక్ లుక్, అతడి బర్త్ డేకి ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు విలన్ లుక్ బయటపెట్టారు. (ఇదీ చదవండి: సర్జరీ.. చిరంజీవి ఆరోగ్యపరిస్థితి ఇప్పుడెలా ఉందంటే?) 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది. దీంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అలానే 'ఆచార్య' లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల కసితో చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. అలానే సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం ఇలా చాలా అంశాలు దీనిపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. తాజాగా సైఫ్ అలీ పుట్టినరోజు సందర్భంగా అతడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ చూస్తే సైఫ్ అలీ ఖాన్.. 'భైరా' అనే పాత్రలో కనిపించబోతున్నాడు. లుక్ అది చూస్తుంటే పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలోకి ఈ సినిమాని తీసుకొస్తామని ప్రకటించారు. BHAIRA Happy Birthday Saif sir !#Devara pic.twitter.com/DovAh2Y781 — Jr NTR (@tarak9999) August 16, 2023 (ఇదీ చదవండి: 'జైలర్' కోడలు.. సినిమాలో పద్ధతిగా బయట మాత్రం!) -
స్టార్ట్ యాక్షన్
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కల్యాణ్రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో ‘దేవర’ లోని ఓ యాక్షన్ షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ ఆగస్టు తొలివారంలో ప్రారంభం అవుతుందనీ, ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తారని టాక్. ఈ ఫైట్ ఇంట్రవెల్ సమయంలో వస్తుందని ఫిల్మ్నగర్ భోగట్టా. స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ్స ఈ యాక్షన్ సీక్వెన్ ్సను డిజైన్ చేయనున్నట్లు టాక్. అలాగే ఈ సినిమాలోని ప్రధాన తారాగణం అయిన సైఫ్ అలీఖాన్ , జాన్వీకపూర్లతో పాటు, కొందరు కీలక పాత్రధారులపై ఈ షెడ్యూల్లోనే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారట కొరటాల. ‘దేవర’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. -
ఆదిపురుష్ విలన్కి కోట్ల విలువైన డైమండ్ వాచ్ గిఫ్ట్: ఎపుడు, ఎవరిచ్చారో తెలుసా?
రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ లైఫ్ స్టయిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఖరీదైన బంగ్లా, కార్లతోపాటు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, రాయల్ వాచీల కలెక్షన్ సైఫ్ సొంతం. అయితే ఇటీవల తన కోటి రూపాయల విలువైన లగ్జరీ గడియారాన్ని బ్రూనై సుల్తాన్ కుమార్తె గిఫ్ట్గా ఇచ్చిన సంగతులను మీడియాతో పంచుకున్నాడు. అంతేకాదు ఒకానొక సందర్బంలో ఆ వాచ్ని అమ్మాలని కూడా ప్రయత్నించాడట. (వైట్హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?) లేటెస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్లో విలన్ పాత్రలో కనిపించిన సైఫ్ కొన్నేళ్ల క్రితం మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇపుడు వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా సైఫ్ అలీఖాన్ బ్రూనై సుల్తాన్ కుమార్తె నుంచి వజ్రాలు పొదిగిన విలువైన గడియారాన్ని గిఫ్ట్ విషయంతో పాటు, ఒక ఫన్నీ విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. అతని మాటల్లో చెప్పాలంటే బ్రూనై సుల్తాన్ చాలా రిచ్. మైఖేల్ జాక్సన్ను పాడమని ఆహ్వానించేవారు. అలాగే అందులోనూ అతని కుమార్తెకు బాలీవుడ్ అంటే ఇష్టం. ఒకసారి అతను మమ్మల్ని ఆహ్వానించినట్టు గుర్తు.. లండన్లోని డోర్చెస్టర్ హోటల్లో నేను, మనీషా కొయిరాలా ఇంత కొంతమందిమి వెళ్లాం. అయితే పొరపాటున సుల్తాన్ కుమార్తె కోసం కేటాయించిన కుర్చీలో కూర్చున్నా. అక్కడ ఒక పెద్ద కుర్చీ, చిన్న కుర్చీ ఉన్నాయి, అయినా ఆలోచించకుండా కూర్చుండిపోయా. ఇంతలో సుల్తాన్ కుమార్తె ఒక పెట్టె ఇచ్చింది. అందులో వజ్రాలు పొదిగిన రోలెక్స్ వాచ్ని చూసి షాక్ అయ్యానని సైఫ్ చెప్పాడు. (టీసీఎస్లో రూ.100 కోట్ల స్కాం: ఇదిగో క్లారిటీ ) దీంతో పాటు మరో షాకింగ్ విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన భార్య కరీనా కపూర్ ఖాన్ దగ్గరున్న ఈ అమూల్యమైన లగ్జరీ వాచ్ని అమ్మాలనుకున్నాడట. రేస్ షూటింగ్ సమయంలో నిర్మాత రమేష్ తౌరానీకి విక్రయిద్దామనుకున్నా, చివరికి విరమించుకుని కరీనా కపూర్ ఖాన్కు ఇచ్చానని పేర్కొన్నాడు. పటౌడీ ప్యాలెస్ కాగా 2011లో తన తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మరణించిన తర్వాత సైఫ్ అలీఖాన్ తన పూర్వీకుల ఆస్తి పటౌడీ ప్యాలెస్ను తిరిగి కొనుగోలు చేశాడు. అది వారి హాలిడే హోమ్ కూడా. దీన్నే ఇబ్రహీం కోఠి అని కూడా పిలుస్తారు, పటౌడీ ప్యాలెస్ చివరి పాలక నవాబ్ ఇఫ్తికర్ అలీ ఖాన్ నుంచి అతని కుమారుడు మన్సూర్ అలీ ఖాన్కు ఇచ్చారు. 10 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ విలాసవంతమైన బంగ్లాలో ఏడు డ్రెస్సింగ్ రూమ్లు, ఏడు బెడ్రూమ్లు, ఏడు బిలియర్డ్ రూమ్లు, అలాగే రాజభవన డ్రాయింగ్ రూమ్లు , డైనింగ్ రూమ్లతో సహా 150 గదులు ఉన్నాయి. 2020 నాటికి పటౌడీ ప్యాలెస్ విలువ 800 కోట్లు. దీన్ని బట్టి ఈ ప్యాలెస్ ప్రస్తుత విలువను అంచనా వేసుకోవచ్చు. -
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు దేవర డబుల్ బొనాంజా
-
ఆదిపురుష్ సినిమా చూడలేదు, నా విజ్ఞప్తి మాత్రం ఇదే!: ‘రామాయణ్’ సీత
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. ఈ మూవీ టీజర్ నుంచి సినిమా రిలీజైన కూడా వివాదాలు వదలడం లేదు. మొదటి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ చిత్రంలోని హనుమంతుని డైలాగ్స్, పాత్రల వేషధారణను తప్పుబడుతున్నారు. అసలు రామాయణాన్ని వక్రీకరించారంటూ రోజు రోజుకు ఆదిపురుష్పై చిత్రబృందంపై మండిపడుతున్నారు. ఇప్పటికే శక్తిమాన్ నటుడు ముకేశ్ ఖన్నా దర్శకుడు ఔం రౌత్కు రామాయణం గురించి కొంచెం కూడా అవగాహన లేదని విమర్శించారు. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు!) తాజాగా రామాయణం సీరియల్లో సీత పాత్ర పోషించి నటి దీపికా చిక్లియా ఆదిపురుష్ నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై పురాణ, ఇతిహాసాలైన రామాయణంపై సినిమాలు తీయడం ఆపేయాలని దీపికా విజ్ఞప్తి చేశారు. ఆదిపురుష్పై మాట్లాడుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారమె. పాఠశాలల్లో విద్యార్థులకు పురాణాన్ని తప్పనిసరిగా బోధించాలని సూచించారు. రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణం సీరియల్లో దీపిక సీత పాత్ర పోషించింది. దీపికా మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమా గురించి నేను కామెంట్స్ చేయదలచుకోలేదు. నేను ఇంకా సినిమా చూడలేదు. కానీ నేను భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా. రామాయణం మన వారసత్వం. దీనిపై ఇక నుంచి సినిమాలు చేయకూడదనేది నా ఉద్దేశం. రామాయణంపై సినిమా చేసిన ప్రతిసారీ ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. రామాయణం మనకు చాలా పవిత్రమైనది. ఈ విషయంలో ఎవరినీ నొప్పించకూడదనుకుంటున్నా. మన విశ్వాసాన్ని మనం గౌరవించుకుందాం. రామాయణం అనేది వినోదానికి సంబంధించినది కాదు.' అని అన్నారామె. కాగా.. ఇప్పటికే దీపికా సహనటుడు అరుణ్ గోవిల్ కూడా ఆదిపురుష్ హాలీవుడ్ కార్టూన్ సినిమా అంటూ ఎద్దేవా చేశారు. కాగా.. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: చరణ్ కంటే ఉపాసన ఆస్తుల విలువే ఎక్కువా? ఎన్ని కోట్లో తెలిస్తే..) View this post on Instagram A post shared by Dipika (@dipikachikhliatopiwala) -
రావణుడు లుక్పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. అందుకే ఇలా!
ప్రభాస్ 'ఆదిపురుష్' థియేటర్లలో సంచలనాలు సృష్టిస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా మూడు రోజుల్లోనే రూ.340 కోట్లు కలెక్షన్స్ సాధించి, రికార్డులు తిరగరాస్తోంది. అదే టైంలో ఈ సినిమాలో పాత్రలు, వాటి గెటప్స్ పై ఇప్పటికే ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా రావణుడి లుక్ పై ఘోరంగా విమర్శలు వస్తున్నాయి. అసలు రావణుడి పాత్ర ఎందుకు అలా డిజైన్ చేయాల్సి వచ్చిందనేది నిర్మాత వివేక్ కూచిభొట్ల ఇప్పుడు కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. టీ సిరీస్ సంస్థ నిర్మించిన 'ఆదిపురుష్'ని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పంపిణీ చేసింది. దాదాపు రూ.185 కోట్లు పెట్టి హక్కుల్ని కొనుగోలు చేసింది. సరే అదంతా పక్కనబెడితే మూడురోజుల్లో అంటే ఆదివారం వరకు ఈ సినిమాను కోటి మందికి పైగా చూశారు. దీంతో 'రామకోటి ఉత్సవం' పేరిట హైదరాబాద్ లో సోమవారం ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులోనే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత వివేక్ కూచిభొట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి మాత్రం!) 'చిన్నపిల్లలకు అర్థమయ్యేలా ఓ సినిమా తీయాలి. రామాయణం అంటే పాతకాలంలాగా సంస్కృత పద్యాలు, డైలాగ్స్ తో సినిమా తీస్తే.. అప్డేట్ అవ్వండ్రా అని మీరే అంటారు. ఇప్పుడేమో అప్డేట్ అయి సినిమా తీస్తే.. మళ్లీ రావణాసురుడు ఏంటి ఇలా ఉన్నాడు? వాళ్లేంటి ఇలా ఉన్నారు? వీళ్లేంటి ఇలా ఉన్నారని అంటున్నారు. మీరు చూడలేదు, మేము చూడలేదు. మీ ఊహకు రావణాసురుడిని ఒకలా ఊహించుకున్నారు. మా ఊహకు రావణాసురుడిని ఒకలా ఊహించుకున్నాం.' 'కానీ ఈ సినిమాలో ఎక్కడా చరిత్రని తప్పుదోవ పట్టించలేదు. రాముడు ధీరోదాత్తుడు, సకలాగుణాభిరాముడు అనే చూపించారు. మంచి చెప్పడానికి.. ఈ రోజు పిల్లలకు అర్థమయ్యేటట్టు.. అంటే ఈ రోజు పిల్లలని తీసుకుంటే థార్, హల్క్, డిస్నీ క్యారెక్టర్స్ అన్నీ తెలుసు. కానీ వాళ్లకు జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు అంటే ఎవరో తెలుసా? తెలియదు. బ్యాట్ మ్యాన్ ఫొటో చూపిస్తే వెంటనే గుర్తుపడతారు. అంగదుడిని గుర్తుపట్టలేరు. ఈ రకంగా అయినా మన పిల్లలకు రామాయణంలోని పాత్రలు పిల్లలకు తెలిసే అవకాశముంటుంది' అని నిర్మాత వివేక్ కూచిబొట్ల చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ ఎఫెక్ట్.. అక్కడ భారత్ సినిమాలపై నిషేధం!) -
Adipurush Review: ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ
మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'ఆదిపురుష్' థియేటర్లలోకి వచ్చేసింది. డార్లింగ్ ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా 9000కి పైగా స్క్రీన్స్ లో రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడ చూసినా 'ఆదిపురుష్' హడావుడి కనిపిస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ఆదిపురుష్’ మూవీ ఎలా ఉంది? రాముడిగా ప్రభాస్ ఏ మేరకు మెప్పించాడు? తదితర విషయాలు ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ట్విటర్లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందల లభిస్తోంది. రాముడిగా ప్రభాస్ యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. అదే సమయంలో మిగతా క్యారెక్టర్స్కి కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండటంతో తెరపై ప్రభాస్ తక్కువ టైం కనిపించారనే ఫీలింగ్ కలుగుతోంది. అయితే రామాయణాన్ని నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో దర్శకుడు ఓం రౌత్ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదంటున్నారు. #Adipurush Overall a retelling of the Ramayanam that had a promising 1st half but falls flat in the 2nd half and ends up being tiresome towards the end! The first half focused on the drama which worked, but the 2nd half didn’t have much other than a prolonged climax fight with… — Venky Reviews (@venkyreviews) June 15, 2023 ఫస్టాఫ్ అద్భుతంగా ఉందని, సెకండాఫ్ బోరింగ్గా సాగుతుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అసలు కథ మొత్తం ప్రథమార్థంలోనే చెప్పడంతో ద్వితియార్థంలో చెప్పడానికి ఏం లేకపోవడంత సాగదీశాడని కామెంట్స్ వినిపిస్తోన్నాయి. #Adipurush movie Review Such a wonderful cinematography Mainly Bgm , visuals , Graphics 🔥 Fights scences Goosebumps 🔥 #Prabhas , #krithisanon , #SaifAliKhan awesome roles 🔥 🌟 🌟 🌟 🌟/5 #BlockbusterAdipurush #AdipurushTickets #AdipurushWithFamily #AdipurushReview #Adipursh pic.twitter.com/0OsJBaYGzJ — tejashwini_uppalpati (@teju_uppalpati) June 15, 2023 ఆదిపురుష్ మూవీ గుడ్ మూవీ. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం, విజువల్స్, గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఫైట్ సీన్స్ చూస్తే గూస్బంప్స్ వస్తాయి. ప్రభాస్, కృతీసనన్, సైఫ్అలీఖాన్ అద్భుతంగా నటించారని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. First Half 👏👏👏👏Ramayan conceived in totally different way… 😊😊 Except the lanka scenes the entire first half is pretty good… Too many goosebumps scenes … 🤩🤩🤩 Vaali Sugriva confrontation is 🙏🙏🙏 Interval is total 🔥 🔥…#Adipurush #Prabhas — Cric_movies3🏏🎥 (@Nikcricmovies3) June 16, 2023 #Adipurush is a disaster movie from start to finish. The VFX are terrible, the songs are cringe worthy, the fight sequences are laughable, and the making is amateurish. It is a waste of time and money, I would not recommend this movie to anyone. pic.twitter.com/XcZHmMtdu9 — Visiron 🚬 (@BoyVisiron) June 16, 2023 Some frames in climax is too good to watch. An epic story told in tremendous way. Main leads performance is too good. And BGM is top notch. Vfx partially OK. Hanuman scenes 😍😍 worth watching repeats. 3.5/5 purely my personal opinion#Adipurush https://t.co/5BrS5pWtpV pic.twitter.com/sMkfZqG2iU — Only Balayya 🌠 (@only_balayya) June 15, 2023 Promise Review : Pride of Indian Cinema Prabhad Anna Acting 👌👌👌. Bgm Ayite next Level. 🔥🔥 Visuals very good buy some 3d shots next Level. Hanuman Ayite movie Mottam ramp Adinchadu 🙏🔥🔥🔥 My Rating : 4.5/5#Adipurush #Prabhas pic.twitter.com/wsMGJCyor9 — AA.cult 😎 (@RajuRayi336009) June 16, 2023 Just saw #Adipurush ! It is a terrible movie. This should be released in Pogo channel 😭 Very bad VFX, #Prabhas can't even act 😭 Ultimate FLOP #AdipurushReview #AdipurushWithFamily #AdipurushTickets — Humble Wrestling (@HumbleWrestlng) June 16, 2023 #BlockbusterAdipurush #Prabhas #Adipurush #JaiShriRam Jai Shri Ram 🙏 Blockbuster Adipurush 🔥💥💥💥 https://t.co/R3O8KilCQr — The_OG_Rebel™ (@The_OG_Rebels) June 16, 2023 #AdipurushReview Vfx Are Too Bad….Due to this Emotional Connection is Lacking 🙏🏻 Should Have Avoided Religious Film With Cartoon Vfx Our History Will Look Funny For Others Due to these Kind of Films!!#Prabhas #KritiSanon #OmRaut #JaiShreeRam #AdipurushBookings #Adipursh pic.twitter.com/3zwenvEWw9 — 👑 (@Riyan_Tweets) June 15, 2023 #Adipurush is Awesome with 3D effects. movie has enough goosebumps moments bgm, action, Screenplay, Music, dialogue are very good 💯 Rating :-4/5 🌟🌟🌟🌟#AdipurushReview #AdipurushWithFamily #Prabhas #KritiSanon pic.twitter.com/VyOocJpigo — HRITHIK❤️🔥 (@MoonChaeWon_) June 16, 2023 -
Adipurush: ఓ రేంజులో 'ఆదిపురుష్' రెమ్యునరేషన్స్.. ఎవరికి ఎంత?
డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్'. చాలారోజుల నుంచి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సినిమా ఇది. టీజర్ వల్ల విపరీతంగా ట్రోల్స్ వచ్చినప్పటికీ, రిలీజ్ కి ముందు మాత్రం హైప్ బాగానే ఏర్పడింది. ఈ ఊపులోనే కోట్లు కొల్లగొట్టేందుకు రెడీ అయిపోయింది. ఇప్పటివరకు రామాయణం ఆధారంగా చాలా సినిమాలొచ్చాయి. వాటితో పోలిస్తే 'ఆదిపురుష్' చాలా డిఫరెంట్. ఎందుకంటే ఒకటి రెండు కాదు ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్ పెట్టి మరీ తీశారు. తొలుత రూ.400 కోట్లే అనుకున్నారు. కానీ టీజర్ దెబ్బకు అందరూ తిట్టిన తిట్టకుండా తెగ తిట్టారు. దీంతో గ్రాఫిక్స్ కోసం మరో రూ.100 కోట్లు ఖర్చు చేశారు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' కోసం ప్రభాస్ ఫస్ట్ టైమ్ అలా!) సినిమా బడ్జెటే అన్ని వందల కోట్లు అంటే రెమ్యునరేషన్స్ కూడా గట్టిగానే ఇచ్చి ఉంటారని మీకు డౌట్ రావొచ్చు. అవును మీరు ఊహించింది నిజమే. రాముడిగా నటించినందుకు డార్లింగ్ ప్రభాస్ కి ఏకంగా రూ.150 కోట్ల వరకు ఇచ్చారని టాక్. దీంతో ఆలోవర్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా మన డార్లింగ్ రికార్డ్ సృష్టించాడు! మిగతా నటీనటుల్లో రావణుడిగా చేసిన సైఫ్ అలీఖాన్ కి రూ.12 కోట్ల వరకు అందినట్లు తెలుస్తోంది. టీజర్ లో రావణ్ గెటప్ ని చూపించారు. విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఇప్పటివరకు రిలీజ్ చేసిన రెండు ట్రైలర్స్ లోనూ అతడిని దాచేశారు. రేపు సినిమాలోనైనా చూపిస్తారో లేదో? వీళ్లిద్దరి తర్వాత సీతగా యాక్ట్ చేసిన కృతిసనన్ కి రూ.3 కోట్లకు పైనే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లక్ష్మణుడిగా నటించిన సన్నీ సింగ్ కు అయితే రూ.1.5 కోట్లు ఇచ్చారని సమాచారం. ఇదే సినిమాలో నటించిన సోనాల్ చౌహాన్ కి రూ.50 లక్షలు ఇచ్చారట. బహుశా ఈమె సూర్ఫనఖ పాత్ర చేసి ఉండొచ్చని అనిపిస్తోంది. హనుమాన్ గా చేసిన దేవదత్త నాగే, డైరెక్టర్ ఓం రౌత్ కు ఎంత ఇచ్చారనేది బయటకు రాలేదు. ఓవరాల్ గా చూసుకుంటే.. కేవలం పారితోషికాలకే రూ.170-200 కోట్లకు పైగా వరకు ఖర్చు చేశారంటే పెద్ద విశేషమే. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్'తో ప్రభాస్ కచ్చితంగా హిట్ కొట్టాలి.. లేదంటే?) -
ఎక్కడైనా సరే.. ఆ విషయంలో మాత్రం తగ్గేదేలే.. ఎన్టీఆర్ ఫోటో వైరల్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీర్, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'దేవర'. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఎంత చెమడ్చుతున్నారో ఈ పిక్ చూస్తే అర్థమవుతోంది. ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనర్ షేర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. జిమ్లో ఎన్టీఆర్ కష్టపడుతున్న ఈ ఫోటోను చూస్తే పని పట్ల ఎంత చిత్తశుద్ధిగా ఉన్నాడో అర్థమవుతోంది. 'దేవర ఏట్ వర్క్.. ఎక్కడైనా సరే అంకితభావం ముందు ఏదీ అడ్డురాదు' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన అభిమానులు మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. షూటింగ్కు కొన్ని రోజులు గ్యాప్ రావడంతో ఫ్యామిలీతో కలిసి వేకేషన్ వెళ్లారు మన జూనియర్ టైగర్. వేకేషన్లో కూడా ఎన్టీఆర్ డెడికేషన్ అంటే ఇదీ అంటూ అభినందిస్తున్నారు. View this post on Instagram A post shared by Kumar Mannava (@kumarmannava) -
జూనియర్ ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్.. ఎన్టీఆర్ 30 క్రేజీ అప్డేట్ ఆరోజే!
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ 'ఎన్టీఆర్ 30'. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. (ఇది చదవండి: ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్.. 'ఎన్టీఆర్ 30' లాంఛ్కు ఊహించని గెస్ట్!) తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేను పురస్కరించుకుని ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్తో పాటు ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అభిమానులు సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు. అంతే కాకుండా అదే రోజు సింహాద్రి కూడా రీ రిలీజ్ చేయనున్నారు. దీంతో జూనియర్ బర్త్ డేకు ఫ్యాన్స్కు డబుల్ సర్ప్రైజ్ ఉండనుంది. కాగా.. ఇటీవలే హైదరాబాద్ జరిగిన షూటింగ్లో సైఫ్ అలీఖాన్ కూడా పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ మూవీ కోసం వెట్రిమారన్తో జతకట్టనున్నారు. (ఇది చదవండి: ఈ వారం ఓటీటీ/ థియేటర్స్లో సందడి చేసే చిత్రాలివే) #NTR30 Latest Update... pic.twitter.com/TftI6czdI4 — Fukkard (@Fukkard) May 10, 2023 #NTR30 First Look on May 19th and Blood tankers Glimpse on May 20th First Look Target's :- 70K RTs and 300K Likes Glimpse Target :- 500K Likes..( YouTube )#ManOfMassesNTR @tarak9999 pic.twitter.com/FkiKgFn8xg — Anil Tarakian™ ᵛᵃˢᵗᵘⁿⁿᵃ🖤 (@AnilTarakian1) May 15, 2023 -
ఆదిపురుష్ టీమ్ కి మరో స్వీట్ న్యూస్ అందనుందా..
-
ఆదిపురుష్ ట్రైలర్ సంచలనం 1000 కోట్లు పక్కా..!
-
సినిమానా? గర్ల్ఫ్రెండా? తేల్చుకోమన్నారు: స్టార్ హీరో
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్కు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో సినిమానా? ప్రియురాలా? అన్న పరిస్థితి ఎదురైందట. ఈ రెండింటిలో ఒకటి ఎంచుకుని మరొకరటి వదిలేయక తప్పలేదట. ఈ విషయాన్ని అతడు కచ్చే ధాగే(1999) సినిమా రిలీజ్ సమయంలో వెల్లడించాడు. అందుకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు బీటౌన్లో చక్కర్లు కొడుతోంది. సైఫ్ తను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్తూ.. 'చాలామంది ఎన్నో కష్టాలు పడ్డామని చెప్తుంటారు. నిజానికి కష్టం అంటే ఏంటి? ఒక్క ఛాన్స్ అంటూ పదేపదే ఆడిషన్స్ కోసం తిరగడమా? ఒక ఆఫీసులో మూడు గంటలపాటు ఎదురుచూడటమా? ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ఎంతో కష్టపడ్డామంటే అందులో ఇవే ఉంటాయి. కానీ నేను ఎదుర్కొన్న ఇబ్బందులు అదో రకమైనవి. నేను బేఖుడి సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ ఆ డైరెక్టర్ రాహుల్ రావల్ నన్ను ఏమని అడిగాడో తెలుసా? నీకు సినిమా కావాలా? నీ ప్రియురాలు కావాలా? అన్నాడు. ఏదో ఒకటి మాత్రమే సెలక్ట్ చేసుకోవాలని కండీషన్ పెట్టాడు. నా గర్ల్ఫ్రెండ్ను ఎందుకు వదిలేయాలో అర్థం కాలేదు. కుదరదని చెప్పడంతో నన్ను సినిమాలో నుంచి తీసేశారు' అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత పలు సందర్భాల్లోనూ దీని గురించి మాట్లాడుతూ.. 'డైరెక్టర్ నాపై వస్తున్న రూమర్స్ నమ్మాడు కానీ నన్ను నమ్మలేదు. నాకు సినిమాల్లో ఆసక్తి లేదని అతడు భావించాడు, అందుకే నాతో కలిసి పని చేయాలనుకోలేదు' అని పేర్కొన్నాడు. కాగా బాలీవుడ్లో హీరోగా నటించిన సైఫ్ ఈమధ్య విలన్ పాత్రలు పోషిస్తున్నాడు. ప్రస్తుతం అతడు పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్లో రావణుడిగా నటిస్తున్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలోనూ విలన్గా కనిపించనున్నాడు. చదవండి: ఝాన్సీతో విడాకులు, 8 ఏళ్లు కోలుకోలేకపోయా: జోగి నాయుడు -
ట్రైలర్ రెడీ
రామాయణం ఆధారంగా రూ΄÷ందిన తాజా చిత్రం ‘ఆది పురుష్’. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీసనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. భూషణ్ కుమార్, క్రిషణ్కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతారియా, రాజేష్ నాయర్, వంశీ, ప్రమోద్లు నిర్మించిన ఈ చిత్రం జూన్ 16న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 9న విడుదల కానుంది. 70 దేశాల్లో ‘ఆది పురుష్’ ట్రైలర్ను లాంచ్ చేసేలా చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: అజయ్–అతుల్, కెమెరా: కార్తీక్ పల్నాని. -
ఎన్టీఆర్ బర్త్ డేకి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్న కొరటాల తగ్గేదేలే అంటున్న తారక్ ఫ్యాన్స్
-
NTR 30 పై అదిరిపోయే లీక్ ఇచ్చిన సైఫ్ అలీ ఖాన్.. ఫాన్స్ కి పండగే
-
కొరటాల,ఎన్టీఆర్ దెబ్బ అదుర్స్ సెన్సేషన్ సృషిటిస్తున NTR30
-
ప్రభాస్ విలన్ తో ఎన్టీఆర్ బీ ఫైట్
-
NTR 30 : ఎన్టీఆర్ సినిమాలో విలన్గా బాలీవుడ్ స్టార్.. ఫోటోలు వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 30వ సినిమాలో విలన్ ఎవరనేదానిపై క్లారిటీ వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడే ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్లో సైఫ్ అలీఖాన్ అడుగుపెట్టాడు. దీనికి సంబధించిన ఫోటోలను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న జాన్వీ కపూర్ సైతం సెట్లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం #NTR30 హ్యాష్ట ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. Team #NTR30 welcomes #SaifAliKhan on board ❤🔥 The National Award winning actor joined the shoot of the high voltage action drama. @tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @YuvasudhaArts pic.twitter.com/RB6s2Xh45g — NTR Arts (@NTRArtsOfficial) April 18, 2023 -
ప్రభాస్ 'ఆదిపురుష్'.. ఆది నుంచి వివాదాలే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. ఆదిపురుష్ పేరేమో గానీ ఆది నుంచి వివాదాలే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై వివాదాలు ఇప్పుడే వీడేలా కనిపించడం లేదు. మొదట టీజర్ రిలీజ్ కాగా.. ఫ్యాన్స్ ఆగ్రాహానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే శ్రీరామనవమి సందర్భంగా సీతా సమేత శ్రీరాముడిగా ప్రభాస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సాధారణంగా ప్రతి ఇంట్లో కనిపించే శ్రీరాముడి ఫోటోకు ప్రతిరూపంగా ఈ తాజా పోస్టర్ని డిజైన్ చేశారు మేకర్స్. తాజాగా ఈ పోస్టర్పై సైతం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జానీ లేకుండా శ్రీరాముడిని వేషధారణలో చూపించినందుకు సినిమా నిర్మాతలపై ఫిర్యాదు చేశారు. చిక్కుల్లో ఆదిపురుష్ మార్చి 30న రామ నవమి సందర్భంగా రిలీజైన 'ఆదిపురుష్' పోస్టర్ తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ మేకర్స్పై పోలీసులకు ఓ వర్గం ఫిర్యాదు చేసింది. ముంబయికి చెందిన సంజయ్ దీనానాథ్ తివారీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రామాయణ సహజ స్ఫూర్తికి, స్వభావానికి భిన్నంగా శ్రీరాముడిని వేషధారణలో పోస్టర్లో చూపించడం తమ మనోభావాలను దెబ్బతీసిందని ఫిర్యాదులో సంజయ్ పేర్కొన్నారు. సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన 'జానేవు' అనే పవిత్రమైన దారాన్ని రాముడు, లక్ష్మణ్ ధరించకపోవడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఆది నుంచి వివాదాలు 'ఆదిపురుష్'ను మొదటి నుంచి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. గతంలో రిలీజైన టీజర్పై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. కాగా.. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రావణాసురుడు, హనుమాన్ పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూన్ 16న రిలీజ్ చేస్తామని ఓం రౌత్ ప్రకటించారు. -
ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్.. 'ఎన్టీఆర్ 30' లాంఛ్కు ఊహించని గెస్ట్!
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న మూవీ ఎన్టీఆర్ 3. ఈ చిత్రం ఓపెనింగ్ కోసం యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక కారణంతో ఈ మూవీ లాంచింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎన్టీఆర్ 30 మూవీ లాంఛింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ మూవీ ఓపెనింగ్ సమయంలో కొరటాల టీమ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. అలాగే ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ఎవరు ఊహించని గెస్ట్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ దక్కిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి ఆర్ఆర్ఆర్ టీమ్ కంటే ముందే ఎన్టీఆర్ ఇండియా తిరిగివచ్చేశాడు. దీంతో ఎన్టీఆర్-కొరటాల మూవీ ఓపెనింగ్ ఈనెలలో వుంటుందనే వార్తలపై నమ్మకం కుదిరింది. అసలు ఫిబ్రవరిలోనే ఈ సినిమాను లాంఛ్ చేయాలనుకున్నారు. అయితే తారకరత్న చనిపోవటం.. ఆతర్వాత ఎన్టీఆర్ అమెరికా వెళ్లటంతో ఎన్టీఆర్ 30 మూవీ వాయిదా పడింది. ఇక జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే. ఆచార్యతో కొరటాల భారీ ఫ్లాప్ను ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ 30తో బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ పాన్ వరల్డ్ హిట్ కావటంతో.. కొరటాల కూడా ముందు అనుకున్న స్టోరీ కాకుండా యూనివర్శల్ అప్పీల్ ఉన్న స్టోరీ రెడీ చేశాడు. సముద్రం బ్యాక డ్రాప్లో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం కొరటాల ఇప్పటికే తన టీమ్తో కలిసి హైదరాబాద్లో సముద్రం సెట్, ఓ దీవి సెట్ను ఇప్పటికే సిద్ధం చేశారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించబోయే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా కనిపించనుంది. అంతే కాదు ఈ సినిమాలో ఎన్టీఆర్తో తలపడేందుకు విలన్గా బాలీవుడ్ నటుడిని ఫిక్స్ చేశారు. ప్రభాస్ మూవీలో ఆదిపురుష్ లంకేశ్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్ను ఎన్టీఆర్ 30 లో విలన్గా నటించనున్నట్లు సమాచారం. భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి ఈ సినిమాకి ఒప్పించినట్లు తెలుస్తోంది. విలన్గా సైఫ్ అలీఖాన్! మార్చి 23న జరిగే ఎన్టీఆర్ 30 మూవీ లాంఛింగ్ ప్రోగ్రామ్ సైఫ్ అలీఖాన్ వస్తాడనే ప్రచారం ఫిల్మ్నగర్లో జోరుగా టాక్ నడుస్తోంది. ఇక విలన్గా సైఫ్ అలీఖాన్ అధికారిక ప్రకటన కూడా ఆరోజే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మార్చి 23న జరగబోయే ఎన్టీఆర్ 30 మూవీ ఓపెనింగ్ గ్రాండ్గా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మూవీ ఓపెనింగ్కి ఊహించని గెస్ట్ కూడా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. చిరంజీవికి ఆహ్వానం! ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందిందనేది ఫిల్మ్ నగర్ లేటెస్ట్ టాక్. ఆచార్య తర్వాత చిరు, కొరటాల మధ్య దూరం పెరిగిందనేది ఇండస్ట్రీ టాక్. ఆచార్య డిజాస్టర్ తర్వాత చిరంజీవి ఇన్ డైరెక్ట్గా కొరటాలపై కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్ 30 ఓపెనింగ్కి చిరంజీవిని ఆహ్వానిస్తే... కచ్చితంగా వస్తారనే మాట వినిపిస్తోంది. కొరటాల సంగతి పక్కన పెడితే... ఎన్టీఆర్ కోసమే కాకుండా జాన్వీకపూర్ ఎంట్రీ ఇవ్వనుండడంతో చిరంజీవి వస్తాడనే టాక్ నడుస్తోంది. అలాగే ఈ కార్యక్రమానికి రాజమౌళి, కీరవాణి,రామ్ చరణ్ రానున్నారట. ఈ సినిమా నిర్మాత కల్యాణ్ రామ్ కాబట్టి .. తారక్ తో పాటే సందడి చేస్తాడు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మార్చి 23 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
ఇంకెందుకు? మా బెడ్రూమ్లోకి వచ్చేయండి: బాలీవుడ్ హీరో
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు కెమెరాలు క్లిక్మనిపించకుండా ఉండలేరు. వారినే ఫాలో అవుతూ ప్రతి కదలికను క్యాప్చర్ చేయాలనుకుంటారు. కొన్నిసార్లు తారలకు ఇది విసుగు పుట్టిస్తుంది. స్వేచ్ఛగా ఉండనివ్వడం లేదని విసుక్కుంటారు కూడా! సహనం నశించినప్పుడైతే ఇక చాలు అని నిర్మొహమాటంగా హెచ్చరిస్తారు. వారి లుక్స్ను కెమెరాల్లో బంధించే పనిలో బిజీగా ఉండే కెమెరామన్లు వాళ్ల మాటను పెద్దగా పట్టించుకోరు. ఇది తరచూ జరిగే వ్యవహారమే! తాజాగా బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఓ పార్టీకి వెళ్లారు. మలైకా అరారో తల్లి జోయ్సీ 70వ పుట్టినరోజు వేడుకలకు వీరు జంటగా హాజరయ్యారు. అనంతరం పార్టీ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసిన వీళ్లను కెమెరామన్లు వెంబడిస్తూ ఫోటోలు తీశారు. దీంతో విసుగెత్తిన సైఫ్.. 'ఓ పని చేయండి, మా బెడ్రూమ్లోకి కూడా వచ్చేయండి' అని సరదాగా వ్యాఖ్యానించాడు. అది విని కరీనా చిన్నగా ఓ నవ్వు నవ్వింది. వెంటనే అక్కడున్న ఓ ఫోటోగ్రాఫర్ 'సైఫ్ సర్, మీరంటే మాకెంతో ఇష్టం' అని అరిచాడు. దీనికి సైఫ్ 'మాకూ మీరంటే ఎంతో ఇష్టం' అని రిప్లై ఇస్తూ హడావుడిగా లోనికి వెళ్లిపోయాడు. ఇక సైఫ్ సినిమాల విషయానికి వస్తే.. అతడు చివరగా విక్రమ్ వేద సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఆయన దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్లో రావణుడిగా నటిస్తున్నాడు. కరీనా కపూర్ విషయానికి వస్తే ఆమె చేతిలో ద డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్, ద క్య్రూ చిత్రాలున్నాయి. అలాగే హన్సల్ మెహతా డైరెక్షన్లో పని చేయనుంది. #saifalikhan #KareenaKapoorKhan Ek Kaam Kariyega Hamare Bedroom me Aaiye ❤️ @viralbhayani77 pic.twitter.com/XXJVhSz4kP — Viral Bhayani (@viralbhayani77) March 3, 2023 -
టాలీవుడ్ బాట పడుతున్న బాలీవుడ్ స్టార్స్!
కథ ఎవరినైనా ఎక్కడికైనా తీసుకెళ్లగలదు. అలా ఈ మధ్య కొన్ని కథలు కొందరు బాలీవుడ్ యాక్టర్స్ను సౌత్కు రమ్మన్నాయి. ఆల్రెడీ హిందీ హీరోయిన్లు కొన్నేళ్లుగా సౌత్లో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నటులు కూడా సౌత్లో స్టెప్ఇన్ అవుతున్నారు. మంచి కథలు పిలుస్తుండటంతో కాదనకుండా వచ్చేస్తున్నాం అంటూ కొందరు నార్త్ స్టార్స్ సౌత్ బాట పట్టారు. ఆ నటులు కమిట్ అయిన సౌత్ సినిమాల గురించి తెలుసుకుందాం. నాగార్జున ‘మనం’ సినిమాలో అతిథిగా కనిపించిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆ తర్వాత చిరంజీవి ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ‘ప్రాజెక్ట్ కె’ సినిమా చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ది కీలక పాత్ర. ఈ చిత్రంతోనే తెలుగుకు పరిచయం అవుతున్నారు దీపికా పదుకోనె.. ‘ప్రాజెక్ట్ కె’ వచ్చే ఏడాది జవనరి 12న థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఇక బాలీవుడ్ స్క్రీన్పై హీరోగా ఓ వెలుగు వెలిగారు సంజయ్ దత్.ఇప్పటి తరానికి తెలిసి ఉండకపోవచ్చు కానీ 1998లో వచ్చిన ‘చంద్రలేఖ’ సినిమాతో తెలుగు తెరపైనా కనిపించారు సంజయ్. నాగార్జున హీరోగా నటించిన ఆ చిత్రంలో సంజయ్ దత్ ఓ అతిథి పాత్ర చేశారు. అలా ఈ బాలీవుడ్ స్టార్ సౌత్ ఎంట్రీ 25 ఏళ్ల క్రితమే జరిగింది. మళ్లీ ఆయన 2022లో కన్నడ ‘కేజీఎఫ్: ఛాప్టర్ 2’ ద్వారా దక్షిణాది తెరపై కనిపించారు. కన్నడంలో సంజయ్ దత్ చేసిన తొలి చిత్రం ఇదే. తాజాగా తమిళ చిత్రం ‘లియో’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సంజయ్ దత్. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకుడు. సంజయ్కు తమిళంలో ‘లియో’ తొలి సినిమా కావడం విశేషం. అలాగే తెలుగులోనూ ఆయన ఓ ఫుల్ లెంగ్త్ రోల్ చేయనున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’ (అధికారిక ప్రకటన రావాల్సి ఉంది) అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సంజయ్ దత్ను ఓ కీ రోల్కు సంప్రదించారనే టాక్ గతంలో వినిపించింది. అదే నిజమైతే పాతికేళ్లకు సంజయ్ తెలుగులో సినిమా కమిట్ అయినట్లు అవుతుంది. మరో బీటౌన్ స్టార్ సైఫ్ అలీఖాన్ సైతం సౌత్పై ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆది పురుష్’లో నటించారు సైఫ్ అలీఖాన్. ప్రభాస్ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 16న రిలీజ్ కానుంది. కాగా ఎన్టీఆర్ హీరోగా నటించనున్న తాజా చిత్రంలో సైఫ్ అలీఖాన్ ఓ కీ రోల్ చేయనున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. మరోవైపు హిందీలో రెండు దశాబ్దాలుగా మంచి పాత్రలు చేస్తూ, నటుడిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇప్పుడు మళ్లీ ఓ సౌత్ సినిమాకి ‘సై’ అన్నారు. రజనీకాంత్ హీరోగా 2019లో విడుదలైన తమిళ చిత్రం ‘పేట్టా’ (తెలుగులో ‘పేట’)లో ప్రతినాయకుడి పాత్ర చేశారు నవాజుద్దీన్. ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత మరో సౌత్ సినిమా ‘సైంధవ్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంకటేశ్ హీరోగా ‘హిట్’ ఫ్రాంచైజీ ఫేమ్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమే ‘సైంధవ్’. విడుదలైన గ్లింప్స్ని బట్టి ఈ చిత్రం మెడికల్ మాఫియా నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. నవాజుద్దీన్కు తెలుగులో ఇది తొలి చిత్రం. వెంకటేశ్ కెరీర్లో 75వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఇక ఇంకో బాలీవుడ్ హీరో బాబీ డియోల్ సైతం తెలుగు డైలాగ్స్ చెబుతున్నారు. ఎందుకంటే ‘హరి హర వీర మల్లు’ చిత్రం కోసం. క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ఇది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు బాబీ డియోల్. ఈ చిత్రంలో ఔరంగజేబు పాత్రలో కనిపిస్తారాయన. ఈ సినిమాను ఈ ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓ పీరియాడికల్ క్రైమ్ థ్రిల్లర్ను తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రెండు ప్రధాన పాత్రలతో సాగే ఈ చిత్రంలో ఓ హీరోగా విజయ్ సేతుపతిని, మరో హీరోగా అభిషేక్ బచ్చన్ను అనుకున్నారట గౌతమ్ మీనన్. అభిషేక్ బచ్చన్కు ఆల్రెడీ కథ కూడా వినిపించారట. మరి.. అభిషేక్ ఓకే చెబుతారా? వేచి చూడాలి. ఇదే కోవలో మరి కొందరు హిందీ తారలు దక్షిణాది చిత్రాలకు డేట్స్ ఇచ్చారు. -
వాలెంటైన్స్ డే ఎంత పని చేసింది.. శుభ్మన్, సారా రిలేషన్ను బయటపెట్టింది..!
టీమిండియా యువ సంచలనం శుభ్మన్ గిల్ అడ్డంగా బుక్కయాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయ సారాతో రిలేషన్ విషయంలో ఆధారాలతో సహా దొరికిపోయాడు. ఇనాళ్లు తాను దాచిన నిజాన్ని తన వాలెంటైన్స్ డే-2023 పోస్ట్తో పొరపాటున బహిర్గతం చేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. టీమిండియా నయా స్టార్ శుభ్మన్ గిల్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారాతో డేటింగ్లో ఉన్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతుంది. View this post on Instagram A post shared by Ꮪhubman Gill (@shubmangill) అయితే, ఈ విషయంపై మీడియా శుభ్మన్,సారాలను ఎన్ని సార్లు ప్రశ్నించినా స్పందించలేదు. ఇంతలో శుభ్మన్ డేటింగ్ చేస్తోంది సచిన్ కుమార్తె సారాతో కాదని, బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీ ఖాన్ ప్రియ తనయ సారా అలీ ఖాన్తో అని ప్రచారం మొదలైంది. శుభ్మన్-సారా అలీ ఖాన్ రిలేషన్ను కనుక్కునేందుకు అభిమానులు, మీడియా విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఎలాంటి క్లారిటీ దొరకలేదు. View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar) దీంతో శుభ్మన్ ఏ సారాతో రిలేషన్లో ఉన్నాడని తెలుసుకోలేక సచిన్, సైఫ్, శుభ్మన్, ఇరువురు సారాల అభిమానులు జట్టు పీక్కున్నారు. తాజాగా శుభ్మన్ సోషల్మీడియాలో చేసిన ఓ పోస్ట్ ద్వారా అభిమానులకు ఓ విషయంపై క్లారిటీ వచ్చింది. శుభ్మన్ తన 2023 వాలంటైన్స్ డే పోస్ట్లో ఓ ఫోటో పోస్ట్ చేస్తూ.. What Day Is It Again? అని కామెంట్ జోడించాడు. ఈ పోస్ట్లో ఫోటోనే శుభ్మన్, సారా టెండూల్కర్ రిలేషన్ను బయటపెట్టింది. ఈ ఫోటోలో శుభ్మన్ ఓ రెస్టరెంట్లో కాఫీ తాగుతూ కనిపించాడు. గతంలో ఇదే ప్లేస్లో దిగిన ఫోటోను సారా టెండూల్కర్ సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. ఇరువురు పోస్ట్ చేసిన ఫోటోల్లో ఓ కామన్ పాయింట్ బట్టి చూస్తే.. గతంలో శుభ్మన్, సారా టెండూల్కర్ ఇద్దరు ఇదే ప్లేస్లో కలిసి కూర్చున్న విషయం స్పష్టమవుతుంది. దీని ఆధారంగా శుభ్మన్-సారా టెండూల్కర్తోనే రిలేషన్లో ఉన్నాడన్న విషయాన్ని అభిమానులు నిర్ధారించుకున్నారు. మరోపక్క ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది. శుభ్మన్.. సారా టెండూల్కర్తో డేటింగ్ చేసిన మాట వాస్తవమే. అయితే వారిద్దరు ఇప్పుడు విడిపోయారని, వీరి రిలేషన్ బ్రేక్ అయ్యాక శుభ్మన్ సారా అలీ ఖాన్తో ప్రేమాయణం సాగించాడని, ప్రస్తుతం సారా అలీ ఖాన్కు కూడా శుభ్మన్ బ్రేకప్ చెప్పాడని సోషల్మీడియా కోడై కూస్తుంది. శుభ్మన్ వాలంటైన్స్ డే పోస్ట్ తర్వాత నెటిజన్లు మరో కొత్త విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు. శుభ్మన్ ఇద్దరు సారాలతో డేటింగ్ చేసింది వాస్తవమే. అయితే గిల్ సారా టెండూల్కర్ను మర్చిపోలుకపోతున్నాడు అంటూ ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకుంటున్నారు. ఏదిఏమైనప్పటికీ.. అభిమానులకు.. శుభ్మన్ సారా టెండూల్కర్తో డేటింగ్ చేశాడన్న విషయంపై క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం గిల్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023తో బిజీగా ఉన్నాడు. -
టైటిల్తో సహా కాపీ, పేస్ట్.. ఆ రెండు చిత్రాలపై బోనీ కపూర్ సంచలన కామెంట్స్
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీలో రీమేక్గా వచ్చిన విక్రమ్ వేద, జెర్సీ సినిమాలు సక్సెస్ కాకపోవడంపై మాట్లాడారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ నటించిన ఈ సినిమాలు ఫెయిల్యూర్ కావడానికి గల కారణాలను వివరించారు. బాలీవుడ్లో తెరకెక్కుతున్న సౌత్ డబ్బింగ్ చిత్రాలు కొన్ని మాత్రమే ఎందుకు హిట్ అవుతున్నాయన్న విషయంపై ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. బోనీ కపూర్ మాట్లాడుతూ..'కొన్ని దక్షిణాది చిత్రాల హిందీ రీమేక్ సినిమాలు సక్సెస్ కాకపోవడానికి కారణం కాపీ-పేస్ట్ చేయడం. విక్రమ్ వేద, జెర్సీ మూవీలకు కనీసం టైటిల్స్ కూడా మార్చలేదు. అలాగే సౌత్ సినిమాలను రీమేక్ చేసేటప్పుడు హిందీ ప్రేక్షకులకు తగ్గట్లుగా నార్త్ ఇండియన్ సంస్కృతిని జోడించాలి. అప్పుడు పాన్ ఇండియా అంగీకరించే సినిమా తీయాలి.' అని అన్నారు. విక్రమ్ వేద భారతీయ జానపద కథ విక్రమ్ ఔర్ బేతాల్ ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా అదే పేరుతో తమిళంలో విడుదలైంది. ఈ చిత్రంలో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. జెర్సీ మూవీ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం. ఇది టాలీవుడ్లో నాని హీరోగా నటించిన చిత్రానికి రీమేక్. షాహిద్ కపూర్ తన కొడుకు కోరిక కోసం ఆటలోకి తిరిగి వచ్చే మాజీ క్రికెటర్ పాత్రను పోషించాడు. ప్రస్తుతం బోనీ కపూర్ మలయాళ చిత్రం హెలెన్కి బాలీవుడ్ రీమేక్తో వస్తున్నాడు. ఈ చిత్రానికి మిలీ అని పేరు పెట్టారు. అతని కుమార్తె జాన్వీ కపూర్ ఈ మూవీలో టైటిల్ రోల్లో నటించింది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ నవంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. -
అందుకే సోషల్మీడియాకు దూరంగా ఉన్నా : సైఫ్ అలీఖాన్
సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలె ఆయన నటించిన విక్రమ్ వేద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాధికా ఆప్టేతో కలిసి ఆయన నటించిన చిత్రం త్వరలోనే రిలీజ్కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్లో భాగంగా కపిల్శర్మ షోలో సందడి చేసిన సైఫ్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. సోషల్మీడియాకు ఎందుకు దూరంగా ఉన్నారన్నదానిపై సైఫ్ స్పందిస్తూ... 'ఇప్పటికే నా పేరు మీదు ఎన్నో ఐడీలు ఉన్నాయి. కానీ అందులో నా ఐడీ దొరకలేదు. ఇక సోషల్మీడియా అంటేనే చాలా టెన్షన్ ఉంటుంది. చాలా అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనవసరంగా అందరిని పొగడాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేను సంతోషంగా ఉన్నాను. అందుకే సోషల్ మీడియాకు దూరంగానే ఉండాలనుకుంటున్నా' అంటూ సైఫ్ చెప్పుకొచ్చారు. -
ఆ హీరోతో కలిసి పని చేస్తే ఖతమన్నారు: సైఫ్ అలీ ఖాన్
సుమారు 20 ఏళ్ల తర్వాత హృతిక్ రోషన్తో కలిసి నటించాడు సైఫ్ అలీ ఖాన్. వీరిద్దరూ కలిసి నటించిన విక్రమ్ వేద ఇటీవలే రిలీజైన విషయం తెలిసిందే! ఇందులో పోలీస్ విక్రమ్గా సైఫ్, గ్యాంగ్స్టర్ వేదగా హృతిక్ నటించారు. తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'హృతిక్తో కలిసి పని చేయడం మర్చిపోలేని అనుభూతి. అతడితో కలిసి బాగా నటించాలనుకున్నా. సాధారణంగా కెమెరా ముందుకు వచ్చినప్పుడు నేను ఎవ్వరినీ పట్టించుకోను. కానీ ఈ హీరో ఉన్నప్పుడు మాత్రం కచ్చితంగా అందరి దృష్టి అతడివైపే మళ్లేది. దీంతో అతడితో పని చేస్తే మీ పని ఖతమే, మీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. కాబట్టి అతడితో కలిసి నటించకపోతే మంచిదంటూ కొన్ని కథనాలు వెలువడ్డాయి. వాటిని నేను గౌరవిస్తాను. అతడితో కలిసి నటించడం గొప్ప విజయంగా భావిస్తాను' అని చెప్పుకొచ్చాడు. కాగా ఆర్ మాధవన్, విజయ్ సేతుపతి ముఖ్యపాత్రల్లో నటించిన తమిళ చిత్రం విక్రమ్ వేదకు రీమేక్గా ఇది తెరకెక్కింది. పుష్కర్ గాయత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న రిలీజైంది. చదవండి: ఆస్పత్రిలో ఖుష్బూ, ఏమైందంటే? ఆ హీరోయిన్తో ప్రేమాయణం నడిపి బిగ్బాస్ కంటెస్టెంట్ -
ఆదిపురుష్ టీజర్: రావణుడిగా సైఫ్ లుక్పై ట్రోల్స్, వివరణ ఇచ్చిన డైరెక్టర్
గత కొద్ది రోజులుగా ఆదిపురుష్ మూవీ వివాదం హాట్టాపిక్గా నిలుస్తోంది. మూవీ టీజర్ విడుదలైనప్పటి నుంచి ఆదిపురుష్పై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. టీజర్లో రావణుడి పాత్ర, హనుమంతుడి పాత్రను చూపించిన విధానంపై హిందు సంఘాలు, బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రామాయణం గురించి అధ్యయనం చేయకుండానే ఓంరౌత్ సినిమా తీశారంటూ, రావణుడు, హనుమంతుడి పాత్రలు ఎలా ఉంటాయో ఆయనకు తెలియదా.. ఆయా పాత్రలకు లేదర్ షూలు వేయడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. చదవండి: మరో నటితో భర్త వివాహేతర సంబంధం, పోలీసులను ఆశ్రయించిన నటి దివ్య అంతేకాదు ఈ సినిమాను బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్ బాగా లేదంటూ ప్రేక్షకులు, ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రావణాసురుడు పాత్రపై వస్తున్న నెగిటివిటిపై దర్శకుడు ఓంరౌత్ వివరణ ఇచ్చాడు. ‘రావణాసురుడు క్రూరత్వం కలిగిన వ్యక్తి. లుక్ తోనే ఆయన క్రూరత్వాన్ని చూపించాలి. గతంలో రావణుడు అంటే పొడవాటి జుట్టు, గంభీరమైన చూపులు, భారీ ఆకారంతో చూపించేవారు. ఆనాటి రోజుల్లో క్రూరత్వాన్ని ఆ విధంగా తెలిపారు. కానీ ఇప్పటితరం, భవిష్యత్తు తరాల వారికీ ఈ సినిమా చేరాలని భావిస్తున్నాను. చదవండి: ‘పెళ్లి సందD’ హీరోయిన్ శ్రీలీల తల్లిపై కేసు ఈ మూవీతో రాముడి గొప్పతనాన్ని రానున్న తరాలకు తెలియజేయాలనుకుంటున్నాను. అందుకే రావణుడి లుక్ అలా డిజైన్ చేశాం’ అని చెప్పుకొచ్చాడు. అలాగే ‘రావణుడు భయంకరమైన పక్షిపై కూర్చున్నట్లు చూపించాం. కేవలం 95 సెకన్ల వీడియో చూసి ఒక అభిప్రాయానికి రాకండి. థియేటర్లో సినిమా చూశాక మాట్లాడంది. సినిమాలో ఎలాంటి లెదర్ దుస్తులు ఉపయోగించలేదు. మమ్మల్ని నమ్మండి’ అంటూ వివరణ ఇచ్చాడు ఓంరౌత్. కాగా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలన జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
ఇద్దరి చెడ్డవారి కథే ‘విక్రమ్ వేద’.. ట్రైలర్ అదుర్స్
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘విక్రమ్ వేద’. మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన తమిళ సూపర్ హిట్ ‘విక్రమ్ వేద’ చిత్రానికి హిందీ రీమేక్ ఇది. పుస్కర్, గాయత్రి ధ్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాధికా ఆప్టే ఇతర కీలక పాత్రలో నటిస్తుంది. సెప్టెంబర్ 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్ని విడుదల చేశారు మేకర్స్. (చదవండి: వింత జీవులతో సైనికుల పోరాటం.. ‘కెప్టెన్’ ఎలా ఉందంటే?) ‘ప్రతి కథలో మంచీ, చెడూ ఉంటాయి. కానీ ఇది ఇద్దరి చెడ్డవారి కథ’అంటూ ప్రారంభమమయ్యే ఈ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది. ఇందులో హృతిక్ గ్యాంగ్స్టర్గా నటించగా.. సైఫ్ అలీఖాన్ పోలీసు అధికారి పాత్ర పోషించాడు. వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ రీమేక్ చిత్రాన్ని భారీ బడ్జెట్తో రిలయన్స్ ఎంటర్టైనమెంట్స్, టీ-సిరిస్ ఫిలింస్, ఫ్రైడే ఫిలిం వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. -
హీరోయిన్ కొడుకుగా నటించి చివరకు ఆమెనే పెళ్లాడిన నటుడు!
ఈ శీర్షిక కింద మీరు చదువుతున్నవి గాలి కబుర్లు కావు. గాసిప్స్లాంటి నిజాలు. కాలక్షేపానికి పనికొచ్చే సంగతులు! నమ్మాల్సిందే! ఆమె ముత్తాతే... పారిస్లోని ఈఫిల్ టవర్ నిర్మాణానికి బాలీవుడ్ నటి.. కల్కి కొచ్లిన్ ముత్తాత మోరిస్ కొచ్లిన్ చీఫ్ ఇంజినీర్ అట. న్యూయార్క్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సహా చాలా చారిత్రక కట్టడాలకు పనిచేశాడట ఆయన. గొంతు బాలేదని.. గబ్బర్ సింగ్ తెలుసు కదా.. పవన్ కళ్యాణ్ కాదు, ‘షోలే’ గబ్బర్ సింగ్.. అమ్జద్ ఖాన్! ఆ సినిమాలో ఆ పాత్రకు అమ్జద్ ఖాన్ను ఎంపిక చేసినా, స్క్రిప్ట్ రైటర్ జావేద్ అఖ్తర్కు నచ్చలేదుట. గబ్బర్ సింగ్ రోల్కు సరిపడా స్వరం అమ్జద్కు లేదని, గొంతు పీలగా ఉందని పెదవి విరిచాడట. అతని అసంతృప్తిని భరించలేక రమేశ్ సిప్పీ దాదాపుగా అమ్జద్ను ఆ సినిమా నుంచి తొలగించే నిర్ణయం తీసేసుకున్నాడు. నిజానికి ఆ పాత్రకు ముందు డానీ డెన్జోంగ్పాను అనుకున్నారట. అతను సరిపోడని.. అమ్జద్ను తీసుకున్నారు. అమ్జద్ మీదా అసంతృప్తి రావడంతో.. రమేశ్ సిప్పీ ఇరకాటంలో పడ్డారట. ఏమైతేనేం ఫైనల్గా అమ్జదే ఖరారయ్యాడు. న భూతో న భవిష్యతి అన్నంతగా గబ్బర్ సింగ్ పాత్రను రక్తి కట్టించాడు. గ్యారేజ్లో కాపురం.. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తెలుసు కదా. సినిమా అవకాశాలు కాస్త పెరగడం మొదలయ్యాక అతని కుటుంబాన్ని ముంబైకి తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్లెక్కడ ఉన్నారో తెలుసా? రాజ్ కపూర్ వాళ్లింటి కారు గ్యారేజ్లో. తర్వాత ఆర్థికంగా కాస్త కుదుటపడ్డాక ముంబైలోని మధ్యతరగతి వాళ్లుండే ప్రాంతంలోని ఒక గది అద్దెకు తీసుకుని అందులోకి మారారుట. నోట్లోంచి మాట రాలేదు.. రాజ్ కపూర్, నర్గిస్ ప్రేమ ఎంత ప్రాచుర్యం పొందిందో నర్గిస్ మీద సునీల్ దత్కున్న ప్రేమా అంతే ఆరాధ్యనీయమైంది. సినిమాల్లోకి రాకముందు సునీల్ దత్ సిలోన్ రేడియోలో ఆర్జేగా పనిచేశాడు. ఆ సమయంలో నర్గిస్ దత్ టాప్ మోస్ట్ హీరోయిన్. ఆమెను ఇంటర్వ్యూ చేయాలని తహతహలాడాడు సునీల్ దత్. తీరా ఆ అవకాశం వచ్చి.. నర్గిస్ అతని ముందు కూర్చునేటప్పటికి నోట్లోంచి మాట పెగలక తత్తరపడ్డాడట. దాంతో ఆ ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిపోయింది. ఆ పాజ్ను చాలా ఏళ్ల తర్వాత కనెక్ట్ చేస్తే సునీల్ దత్ సినిమాల్లోకి వచ్చాడు. ‘మదర్ ఇండియా’లో నర్గిస్కు కొడుకుగా నటించాడు. తర్వాత ఆమె జీవిత భాగస్వామి కూడా అయ్యాడు. సైఫ్ అలీ ఖాన్కు రావాల్సింది.. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే.. సినిమా ఎంత హిట్టో చెప్పడానికి ఇక్కడ ప్రత్యేకంగా విశేషణాలు పేర్చాల్సిన పనిలేదు. అయితే అందులోని రాజ్ మల్హోత్రా (హీరో) పాత్రకు ముందుగా సైఫ్ అలీ ఖాన్ను ఎంపిక చేశారట. ఒకానొక దశలో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ను కూడా అడిగారని వార్త. ఏమైందో తెలియదు స్క్రీన్ మీద మాత్రం షారుఖ్ ఖాన్ కనబడ్డాడు. చదవండి: అలాంటి పాత్రను నేనెందుకు చేయలేకపోయానా అని అసూయపడ్డా సండే ఫ్లాష్బ్యాక్: పాత సినిమాకెళ్తాం నాన్నా! -
కరీనా కపూర్ మళ్లీ ప్రెగ్నెంట్ !.. అతను ఇప్పటికే చాలా చేశాడని పోస్ట్
Kareena Kapoor Denies Pregnancy Rumours: బాలీవుడ్ దివా కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం, అభినయంతో బీటౌన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన బ్యూటీ కరీనా. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్తో కరీనా కపూర్కు 2012 అక్టోబర్ 16న ముంబైలోని బాంద్రాలో వివాహమైన విషయం తెలిసిందే. కరీనా-సైఫ్ దంపతులకు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ (జేహ్) ఇద్దరు కుమారులు. అయితే తాజాగా కరీనా కపూర్ మరోసారి ప్రెగ్నెంట్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై స్పందించిన కరీనా ఆసక్తికరమైన పోస్ట్తో సమాధానమిచ్చింది. ప్రస్తుతం సైఫ్, ఇద్దరి పిల్లలతో వెకేషన్లో ఉంది కరీనా. ఈ వెకెషన్కు సంబంధించిన ఒక ఫొటోను ఇటీవల పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ చేసిన అతికొద్ది సమయంలోనే ఆ ఫొటో నెట్టింట తెగ వైరల్ అయింది. అందుకు కారణం ఆ ఫొటోలో కరీనా పొట్ట కొంచెం ఉబ్బుగా కనిపించడమే. దీంతో కరీనా మళ్లీ గర్భవతి అయిందని పుకార్లు చెలరేగాయి. ఈ వార్తలపై కరీనా స్పందిస్తూ 'ఇది కేవలం పాస్తా, వైన్ వల్లే. ప్రశాంతంగా ఉండండి అబ్బాయిలు. నేను గర్భవతిని కాదు. మన దేశ జనాభా కోసం అతను ఇప్పటికే చాలా ఎక్కువ చేశాను అని సైఫ్ చెప్పాడు' అని ఇన్స్టాలో రాసుకొచ్చింది. దీంతో కరీనా ప్రెగ్నెంట్ రూమర్స్కు చెక్ పడినట్లయింది. కాగా కరీనా కపూర్ తాజాగా అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' సినిమాలో 'రూప'గా నటించిన విషయం తెలిసిందే. చదవండి: చిక్కుల్లో సింగర్ శ్రావణ భార్గవి.. కోర్టుకు వెళతానని అన్నమయ్య వంశస్తుల హెచ్చరిక సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి.. అతని ప్రేయసి గురించి చెప్పేసిన చిరంజీవి.. Kareena and Saif spotted in London with friends pic.twitter.com/HBhGOQvKtm — Kareena Kapoor Khan (@KareenaK_FC) July 15, 2022 చదవండి: ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు -
Ind Vs Eng: విండీస్ దిగ్గజంతో ధోని, సైఫ్ అలీఖాన్.. ఫొటో వైరల్
India Vs England ODI Series 2022: ఇంగ్లండ్తో వన్డే మ్యాచ్లో టీమిండియా భారీ విజయం అభిమానులకు ఆనందాన్ని పంచింది. భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ విశ్వరూపంతో ఇంగ్లండ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ విజృంభించడంతో దాదాపుగా ఆరేళ్ల తర్వాత భారత జట్టు.. ఏకంగా పది వికెట్ల తేడాతో గెలుపొందింది. బట్లర్ బృందానికి సొంతగడ్డపై చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇక ఈ ఆసక్తికర మ్యాచ్ను వీక్షించేందుకు సాధారణ ప్రేక్షకులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం ఓవల్ మైదానానికి రావడం విశేషం. వీరిలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో పాటు వెస్టిండీస్ దిగ్గజ ఓపెనర్ గోర్డాన్ గ్రీనిడ్జ్ కూడా ఉన్నారు. అదే విధంగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ సైతం తన సతీమణి కరీనా కపూర్, పెద్ద కుమారుడు తైమూర్ అలీతో స్టేడియానికి విచ్చేశాడు. ఈ క్రమంలో మిస్టర్ కూల్ ధోని, గ్రీనిడ్జ్తో కలిసి ఫొటోలు దిగాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరీనా సైతం గ్రీనిడ్జ్తో తన భర్త సైఫ్ దిగిన ఫొటోను ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. కాగా మొదటి వన్డేలో సంచలన విజయం సాధించిన టీమిండియా ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ 2022 వన్డే సిరీస్- మొదటి మ్యాచ్: ► వేదిక: ది ఓవల్, లండన్ ►టాస్: ఇండియా- బౌలింగ్ ►ఇంగ్లండ్ స్కోరు: 110 (25.2) ►ఇండియా స్కోరు: 114/0 (18.4) ►విజేత: ఇండియా- 10 వికెట్ల తేడాతో గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జస్ప్రీత్ బుమ్రా(7.2 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు) చదవండి: ICC world Cup Super League: వన్డే సిరీస్ రద్దు.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్! ప్రపంచకప్ రేసు నుంచి తప్పుకొన్నట్లేనా? MS Dhoni with Gordon Greenidge and Saif Ali Khan in Oval for the first ODI. pic.twitter.com/7mQtjtZU9d — Johns. (@CricCrazyJohns) July 13, 2022 -
బాత్రూమ్లో లైబ్రరీ ఏర్పాటు చేయించుకున్న హీరో
సెలబ్రిటీల జీవన శైలి అంటే ఆసక్తి చూపనిదెవరు? అందునా పాపులర్ పర్సన్స్ అలవాట్లు, అభిరుచుల పట్ల చెవి రిక్కించని వారెవరు? ఆ గుంపులో మేమూ ఉన్నాం. అందుకే ఈ వివరాలు పోగేసుకొచ్చాం..! శారీ సుందరి.. తెలుసు మీకర్థమైందని! విద్యా బాలనే. ఇక్కడ చెప్పబోయేది కూడా ఆమెకున్న చీరల పిచ్చి గురించే. ఎక్కడ ఏ కొత్త రంగు.. డిజైన్.. నేతలో చీర కనిపించినా అది తన క్లాజెట్లో క్లోజ్ చేసుకునేదాకా నిద్రపోదట విద్యాబాలన్. నిద్రంటే గుర్తొచ్చింది.. రాత్రి కలలో కూడా తను చీరలోనే కనిపించాలని నిద్రపోయేప్పుడూ చీర కట్టుకునే నిద్రకుపక్రమిస్తుందని ఆమె సన్నిహితుల ఉవాచ. అన్నట్టు విద్యాబాలన్ లీస్ట్ బాదర్డ్ థింగ్ ఈజ్ సెల్ ఫోన్. అభిమానులూ.. ఆమె నంబర్ సంపాదించి ఆమెకు మెసేజ్ పెట్టేరూ..! ఆర్నెల్లయినా చూసుకోదట. ఫ్యాన్స్ సందేశాలే కాదు.. ఆమెకు పనిచ్చేవాళ్ల సమాచారాలను కూడా. అలా విద్యా చాలా ముఖ్యమైన భూమికలను, అత్యంత ప్రధానమైన ఈవెంట్లనూ మిస్ అయిన సందర్భాలు బోలెడట. అయినా సెల్ ఫోన్ను అక్కున చేర్చుకోదట. అదేమంటే ఫోన్లో తల దూర్చడం కంటే మనుషులతో మాటలు కలపడమే నాకిష్టం అంటుంది. వాటే టైమింగ్.. కూలీ సినిమా షూటింగ్ సమయంలో అమితాబ్ బచ్చన్కు యాక్సిడెంట్ అయిన విషయం తెలుసు కదా! ఆ ప్రమాదంలో అతని కుడిచేతిక్కూడా గాయమై కొన్నాళ్లపాటు అది కదలకుండా ఉందట. అప్పుడు అన్ని పనులను ఎడమ చేత్తో చేయడం అలవాటు చేసుకున్నాడు అమితాబ్.. రాయడం సహా. ఇప్పుడు కుడిచేత్తో ఎంత స్పీడ్గా .. సౌకర్యంగా రాయగలడో ఎడమచేత్తోనూ అంతే స్పీడ్గా సౌకర్యంగా రాయగలడు ఆ హీరో. సో వాట్.. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారా? అవును ఆ ప్రాక్టీస్ ఆ మ్యాన్ని ఎంత ఎక్స్పర్ట్ను చేసిందంటే రెండు వేర్వేరు విషయాలను ఏకకాలంలో రెండు చేతులతో రాసేంతగా! దటీజ్ బిగ్ బి.. అంటూ అభిమానులంతా ఆయనకు బిగ్ హ్యాండ్ ఇవ్వడం మొదలెట్టేశారా! గోర్లు బలి ఆందోళన, కంగారు, ఒత్తిడి వగైరాను ఎదుర్కోవడంలో ఒక్కొక్కరిదీ ఒక్కోతరహా. కానీ చాలామందిది ఒకే తరహా. ఏ కాస్త టెన్షన్.. స్ట్రెస్ ఫీలైనా వేలి గోళ్లను కరచుకుని కొరికేస్తుంటారు. ఆ లిస్ట్లో కరీనా కపూర్ కూడా ఉంది. అవును.. పాపం.. ఏ కాస్త కంగారు కలిగినా వేలి గోళ్లను దానికి బలిచ్చేస్తూంటుందట. హమ్మయ్య.. సెలబ్రిటీలూ సామాన్యులే ఈ విషయంలో అని సారూప్యత వెదుక్కోవచ్చు. ఇట్స్ నాటే లై వాష్రూమ్లో వార్తా పత్రికలు చదవడం చాలామందికి అనుభవం. కానీ పుస్తకాలు చదవడం చాలా మందికి కొత్తే! కానీ సైఫ్ అలీఖాన్కు చాలా చాలా పాత అలవాటు. అతను చిన్నప్పటి నుంచీ బాత్రూమ్లోనే పుస్తకాలు చదివేవాడట. సో పెద్దయ్యాకా.. అంటే నటుడిగా స్థిరపడ్డాక.. ఏకంగా బాత్రూమ్లోనే లైబ్రరీని ఏర్పాటు చేయించుకున్నాడు. చదవాలనిపించినప్పుడల్లా వాష్రూమ్లోకి దూరుతున్నాడని కరీనా కపూర్ కంప్లయింట్ చేస్తుందేమో! స్టాంప్సా? కాదు.. .. మరేంటి? సోప్స్! ఊప్స్..! ఎస్.. సల్మాన్ ఖాన్ ఏ కొత్త చోటుకి వెళ్లినా అక్కడ కనిపించిన సోప్స్ను తీసి బ్యాగ్లో వేసుకుంటాడట. ఏంటయ్యా అది? అని అంటే.. సోప్స్ కలెక్షన్ అని ఆన్సర్ చేస్తాడట. అలా తెచ్చుకున్న సోప్స్తో షవర్ ఎక్స్పరిమెంట్స్ చేస్తాడని బాలీవుడ్లో బ్యాడ్ టాక్. చదవండి: చిరు ఇంట్లో విక్రమ్ టీంకు గ్రాండ్ పార్టీ, సల్మాన్ ఖాన్ సందడి 16 ఏళ్ల తర్వాత వెబ్సిరీస్తో నటి రీ ఎంట్రీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే? -
షాకింగ్: కెమెరామెన్పై తైమూర్ ఎలా అరిచాడో చూడండి
Kareena Kapoor Son Taimur Ali Khan Fire On paparazzi: బాలీవుడ్ జంట కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ పెద్ద కుమారుడు తైమూర్ అలీఖాన్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుట్టిన నాటి నుంచి స్టార్కిడ్ గుర్తింపు పొందిన తైమూర్ ఎంతో మందికి ఫేవరెట్ కిడ్గా మారిపోయాడు. ఇక ఈ బుడ్డోడు బయట కనిపిస్తే చాలు పాపరాజీలకు(కెమెరామెన్) పండుగే. తమ కెమెరాలకు పని చెబుతూ వెంటవెంటనే తైమూర్ ఫొటోలను క్లిక్ మనిపిస్తారు. ఇక చిన్నతనంలో దీనిపై పెద్దగా అవగాహన లేని తైమూర్ పాపరాజీలను చూస్తూ క్యూట్గా స్మైల్ ఇచ్చేవాడు. అలా తైమూర్ ఫొటోలు నిత్యం వార్తల్లో నిలిచేవి. చదవండి: Vishwak Sen: అంతా ఓకే అనుకునేసరికి ఆమె నన్ను వదిలేసిన విషయం తెలిసింది ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి తైమూర్ వారి కంటపడ్డాడు. తల్లి కరీనాతో పాటు సోదరుడు జైహ్తో ఇంటీ బయట కనిపించాడు. వారి వెంట కేర్ టేకర్స్ కూడా ఉన్నారు. బయటకు వచ్చిన తైమూర్ను పాపరాలజీలు గ్యాప్ లేకుండా ఫొటోలు తీస్తున్నారు. ఇది చూసి నీ బుడ్డోడు రియాక్ట్ అయిన తీరు అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఎప్పుడు నవ్వుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చే ఈ బుల్లి పటౌడి ఈసారి మాత్రం ఫైర్ అయ్యాడు. కెమెరామెన్ను చూస్తూ ‘ఇక ఆపండి’ అంటూ గట్టిగా అరిచాడు. పక్కనే తల్లి కరీనా కూడా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. చదవండి: ఓటీటీకి ఆచార్య మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే! మరోవైపు కరీనా రెండో కుమార్ జెహ్ మాత్రం కారుతో ఆడుతూ కనిపించాడు. ఇక తైమూర్ రియాక్షన్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏంటీ ఈ బుడ్డోడు అంత మాట అనేశాడంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అలాగే ‘తల్లిదండ్రులు ఎలా మాట్లాడితే పిల్లలు అలా మాట్లాడుతారు. అతడి అమ్మనాన్న మాట్లాడటం చూసి తైమూర్ నేర్చుకున్నాడు’, ‘అతడి తల్లిదండ్రులు(కరీనా-సైఫ్) నేర్పించే సంస్కారం ఇదేనా?’ అంటూ కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరూ పాపరాజీలకు చురకులు అట్టిస్తున్నారు. ఓ చిన్న పిల్లాడి చేత కూడా చెప్పించుకుంటున్నారు.. మీకంటూ ఓ సెల్ఫ్ రెస్పాక్ట్ లేదా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
బుక్ లాంచ్ ఈవెంట్లో సందడి చేసిన సైఫ్ అలీఖాన్ దంపతులు
-
వెబ్ సిరీస్లతో ఆకట్టుకున్న స్టార్ హీరోలు వీరే..
ఇటీవల కాలంలో ఓటీటీ ప్లాట్ఫామ్లు వినోదాన్ని అందించే ప్రధాన వేదికలుగా మారాయి. ఈ ఓటీటీల ద్వారా వినోదమే కాకుండా మంచి మార్కెటింగ్, బిజినెస్ కూడా ఏర్పడుతోంది. దీంతో చిన్న హీరోలు, నటులే కాకుండా పెద్ద హీరోలు సైతం ఓటీటీ బాట పడుతున్నారు. సూర్య, నాని వంటి తదితర హీరోల సినిమాలను నేరుగా ఓటీటీల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లతో కూడా అలరించారు కొందరు స్టార్ హీరోలు. విభిన్నమైన కథలను వెబ్ సిరీస్ల ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచే అవకాశం ఓటీటీలకు ఉండటంతో సై అంటున్నారు కథానాయకులు. మనోజ్ భాయ్పాయ్, కెకె మీనన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పంకజ్ త్రిపాఠి వంటి పాపులర్ యాక్టర్స్కు పోటీ ఇస్తున్నారు ఈ పెద్ద హీరోలు. 1. అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ వారసుడిగా వెండితెరకు పరిచయమైన అభిషేక్ బచ్చన్ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గత రెండేళ్లలో అభిషేక్ సినిమాలన్నీ నేరుగా ఓటీటీలోనే విడుదలయ్యాయి. 2020లో వచ్చిన 'బ్రీత్: ఇన్టు ది షాడోస్' వెబ్ సిరీస్తో ఓటీటీలోకి అడుగు పెట్టాడు అభిషేక్ బచ్చన్. 2. సైఫ్ అలీఖాన్ వెబ్ సిరీస్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అతిపెద్ద బాలీవుడ్ స్టార్లలో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. తన హ్యాండ్సమ్ లుక్, కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను, అభిమానులను ఎంతో అలరించాడు. 2018లో రిలీజైన 'సేక్రేడ్ గేమ్స్' వెబ్ సిరీస్ ఘన విజయం సాధించింది. ఈ సిరీస్లో నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, కోల్కీ కొచ్చి వంటి భారీ తారాగణం నటించింది. తర్వాత 2020లో ఈ వెబ్ సిరీస్కు సీక్వెల్ కూడా వచ్చింది. 3. అజయ్ దేవగణ్ 'ఆర్ఆర్ఆర్'లో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించిన బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే అజయ్ దేవగణ్ తాజాగా వెబ్ సిరీస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సైకాలాజికల్, క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్' అనే వెబ్ సిరీస్లో అజయ్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా అలరించాడు. మార్చి 4, 2022న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదలైన ఈ వెబ్ సిరీస్లో టాలీవుడ్ బొద్దుగుమ్మ రాశీ ఖన్నా హీరోయిన్గా నటించడం విశేషం. 4. వివేక్ ఒబెరాయ్ బాలీవుడ్ 'ప్రిన్స్'గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు వివేక్ ఒబెరాయ్. బాలీవుడ్ చాక్లెట్ బాయ్గా పేరొందిన ఈ హీరో రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన 'రక్త చరిత్ర' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నెగెటివ్ పాత్రలు పోషిస్తున్న వివేక్ 2017లో 'ఇన్సైడ్ ఎడ్జ్' అనే వెబ్ సిరీస్తో ఓటీటీ ప్లాట్ఫామ్ ఎక్కాడు. క్రికెట్ నేపథ్యంతో వచ్చిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇప్పటికీ 3 సీజన్లు రిలీజ్ చేసింది. 5. మాధవన్ విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మాధవన్ ఒకరు. తెలుగు, తమిళం, హిందీ సినిమాలలో నటించి ఆకట్టుకున్న మాధవన్ను చాక్లెట్ బాయ్ అని పిలిచేవారు. ఈ 51 ఏళ్ల హీరో ఇటీవల 'డీకపుల్డ్' వెబ్ సిరీస్తో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. 2018లో విడుదలైన 'బ్రీత్' వెబ్ సిరీస్తో ఓటీటీలోకు ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: సూపర్ థ్రిల్ ఇచ్చే 'జీ5' థ్రిల్లర్ మూవీస్ ఇవే.. చదవండి: ఓటీటీల్లో మిస్ అవ్వకూడని టాప్ 6 సినిమాలు.. -
కరీనా కొడుకు పూర్తి పేరేంటి? విద్యార్థులను అడిగే ప్రశ్నలు ఇవా?
సైఫ్ అలీఖాన్- కరీనా కపూర్ దంపతుల కొడుకు పూర్తి పేరు ఏమిటి? ఇంతకీ ఫస్టా? సెకండా? అని అడగకండి. ఎందుకంటే ఈ ప్రశ్న అడిగింది మేము కాదు మధ్యప్రదేశ్లోని ఓ స్కూల్. ఆరవ తరగతి విద్యార్థులకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో పై ప్రశ్న ఉంది. దాన్ని కొందరు స్క్రీన్షాట్లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. ఆ పిల్లల తల్లిదండ్రులు మాత్రం ఇవేం పిచ్చిప్రశ్నలని స్కూల్ యాజమాన్యంపై ఫైర్ అవుతున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే కరీనా కొడుకు పేరేంటి? అన్న పాఠశాల యాజమాన్యం ఆమెకు ఇద్దరు సంతానం అన్న సంగతి కూడా మరిచింది. కాగా బాలీవుడ్ జంట సైఫ్ - కరీనా దంపతులకు తైమూర్ అలీ ఖాన్, జెహ్లు సంతానం. జెహ్ పూర్తి పేరు జెహంగీర్ అలీ ఖాన్. A private school in Khandwa asked the name of film actor Kareena Kapoor Khan and Saif Ali Khan's son in the examination paper of class 6th. The DEO said a show cause notice will be issued to the school @ndtv @ndtvindia @GargiRawat @manishndtv pic.twitter.com/YkERwGYeMB — Anurag Dwary (@Anurag_Dwary) December 24, 2021 -
కరీనా కుటుంబంపై బీఎంసీ అధికారులు ఆగ్రహం
BMC Alleged Kareena Kapoor Family Not Cooperating Contact Tracing: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కుటుంబ కాంటాక్ట్ ట్రెసింగ్కు సహకరించడం లేదని బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు ఆరోపిస్తున్నారు. కరీనా ఇటీవల మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. నిర్మాత కరణ్ జోహార్ ఇంట్లో ఏర్పాటు చేసిన విందు పార్టీకి కరీనాతో పాటు హజరైన పలువురికి సైతం పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన బీఎంసీ కరోనా పరీక్షలు చేయిస్తుంది. ఈ నేపథ్యంలో కరీనా ఇంటిని సీజ్ చేసి శానిటైజ్ చేయించారు. చదవండి: Corona Virus: బాలీవుడ్లో కరోనా కలకలం, కరోనా బారిన వరసగా సెలబ్రెటీలు ఇక కాంటాక్ట్ ట్రెసింగ్తో ఎవరెవరూ పార్టీకి వచ్చారు వారంత ఎక్కడ ఉన్నారో తెలుసుకునే పనిలో పడ్డారు బీఎంసీ అధికారులు. అయితే దీనికి కరీనా కుటుంబం సహకరించడం లేదని బీఎంసీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీనా భర్త సైఫ్ అలీఖాన్ ఎక్కడున్నారన్న విషయాన్ని చెప్పడం లేదని, ఎన్నిసార్లు అడిగినా ముంబైలో లేరనే చెబుతున్నారని, ఎక్కడున్నారన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదని అన్నారు. ప్రస్తుతం కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతోందని, సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిస్తామని చెప్పారు. చదవండి: నుదిటిన సింధూరం.. తాలిబొట్టుతో చూడ ముచ్చటగా కత్రినా, ఫొటోలు వైరల్ కరీనా కపూర్ నిబంధనలు ఉల్లంఘించారని వస్తున్న వార్తలపై ఆమె అధికార ప్రతినిధి స్పందించారు. ఆమె చాలా బాధ్యతాయుతమైన పౌరురాలని, లాక్డౌన్ సమయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించారని పేర్కొన్నారు. కరణ్ జోహార్ ఈ నెల 8న తన ఇంట్లో ఇచ్చిన పార్టీలో ఓ వ్యక్తి దగ్గుతూ కనిపించాడని, అతడు రాకుండా ఉండాల్సిందని అన్నారు. తనకు కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే కరీనా క్వారంటైన్కు వెళ్లిపోయినట్టు చెప్పారు. -
ఆ స్కామ్ వల్ల సంపాదించిన డబ్బంతా పోగొట్టుకున్నా: స్టార్ హీరో
Saif Ali Khan Has Revealed That He Got Scammed in Property Deal: ఓ ప్రాపర్టీ డీల్లో తాను తీవ్రంగా మోసపోయానని బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ అన్నారు. దీని వల్ల తన సంపాదనలో దాదాపు 70శాతం మేరకు కోల్పోయినట్లు చెప్పి షాకిచ్చాడు. తాజాగా ఆయన నటించిన ‘బంటీ ఔర్ బబ్లీ-2’చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో భాగంగా స్టార్ హీరోయిన్ రాణీముఖర్జీ చేసిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వెల్లడించాడు. 'ముంబైలో ఓ స్థలం కొనుగోలు కోసం ఓ రియట్ ఎస్టేట్ సంస్థలో పెట్టుబడి పెట్టాను. ఆ డబ్బు మూడేళ్లలో రెట్టింపు అవుతుందని నన్మ నమ్మబలికి ఆ కంపెనీ వాళ్లు మోసం చేశారు. ఆ స్కామ్లో నేను సంపాదించిందంతా పోగొట్టుకున్నా. ఆ డీల్ కోసం దాదాపు 70 శాతం పెట్టుబడి పెట్టాను. తర్వాత నేను మోసపోయానని అర్థమైంది. అయినా అధైర్యపడకుండా కెరీర్పై దృష్టి పెట్టి తిరిగి సంపాదించుకున్నా. ఆ స్కామ్ నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టింది' అని సైఫ్ అలీఖాన్ తెలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్రాజ్ ఫిల్మ్స్ యూట్యూబ్లో షేర్చేసిన ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
ఇంట్లో ఉంటే పిల్లలు పుడతారేమోనని భయంగా ఉంది: సైఫ్
Saif Ali Khan: ఇంట్లో ఉండటం కన్నా పనులతో బిజీగా ఉండటమే మేలంటున్నాడు బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్. తను ప్రధాన పాత్రలో నటించిన 'బంటీ ఔర్ బబ్లీ 2' సినిమా ప్రమోషన్స్లో భాగంగా కపిల్ శర్మ షోకు హాజరయ్యాడు సైఫ్. అతడితో పాటు చిత్రయూనిట్ సభ్యులు రాణీ ముఖర్జీ, సిద్ధాంత్ చతుర్వేది, శర్వానీ సైతం షోలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా కపిల్ శర్మ.. సైఫ్ తాండవ్, భూత్ పోలీస్, ఇప్పుడు బంటీ ఔర్ బబ్లూ 2.. ఇలా వరుస సినిమాలు చేయడంపై సందేహం వ్యక్తం చేశాడు. 'మీకు పని అంటే ప్రేమా? లేదంటే రెండో కొడుకు పుట్టాక కుటుంబం కోసం ఎక్కువ పని చేయాల్సి వస్తుందా? అని ప్రశ్నించాడు. దీనికి సైఫ్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువమమంది పిల్లలు పుట్టేలా ఉన్నారని, ఆ భయంతోనే ఇలా సినిమాలతో బిజీగా ఉన్నానన్నాడు. ఆయన సమాధానం విని కపిల్ సహా అక్కడున్నవాళ్లంతా ఘొల్లున నవ్వారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వీడియో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
‘ఆదిపురుష్’ సెట్లో సెలబ్రెషన్స్, రావణ్ షూటింగ్ పూర్తి
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతీసనన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపిస్తారు. సైఫ్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. దీంతో ‘బై బై రావణా’ అంటూ కేక్ కట్ చేసి, సెలబ్రేట్ చేసింది చిత్రబృందం. ఈ సెలబ్రేషన్ ఫోటోలను సామాజిక మాధ్యమాల వేదికగా షేర్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 85 రోజులుగా జరుగుతోంది. ఇంకొన్ని రోజులు జరిపితే సినిమా పూర్తవుతుంది. అయితే గ్రాఫిక్స్ వర్క్స్కు ఎక్కువ సమయం పట్టేలా ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. It’s a film wrap for Lankesh!!! Had so much fun shooting with you SAK!!!#SaifAliKhan #Adipurush #AboutLastNight pic.twitter.com/WLE8n0Ycu7 — Om Raut (@omraut) October 9, 2021 -
ఏసీ రిపేర్, లీకేజీ ఉందని ఫోన్ చేసేవారు: సైఫ్ అలీఖాన్
బాలీవుడ్లో మంచి పాపులారిటీ ఉన్న నటుల్లో సైఫ్ అలీఖాన్ ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన తాజాగా ది కపిల్ శర్మ షోకి గెస్ట్గా వచ్చాడు. తన తాజా చిత్రం ప్రమోషన్లో భాగంగా ఆ సినిమా హీరోయిన్లు యామీ గౌతమ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్తో కలిసి ఈ షోలో పాల్గొన్నాడు. ఈ తరుణంలో ఫ్లాట్ల యజమానిగా ఉండే బాధలను తెలిపాడు. కపిల్ శర్మ షోలో ఫ్లాట్లు రెంట్కి ఇస్తే ఉండే ఇబ్బందుల గురించి హోస్ట్ కపిల్ మాట్లాడాడు. ఈ విషయాన్ని ఓన్ చేసుకున్న సైఫ్ తను చిన్నపాటి లాండ్లార్డ్నని, ఆ టార్చర్ ఎలా ఉంటుందో తనకు తెలుసన్నాడు. ‘ఇంకా పాత మనస్తత్వం ఉండడం వల్ల, వచ్చే ఆదాయాన్ని ఫ్లాట్లలో పెట్టుబడులు పెట్టి.. అద్దెకు ఇస్తుంటా. చాలా సార్లు అద్దెకున్నవారు ఏసీ రిపేర్, లీకేజీలు ఉన్నాయంటూ ఫోన్ చేసేవారు. కొన్నిసార్లు ఈ పని కోసం ఎవరినైనా నియమించుకోవాలనిపించేదని’ తెలిపాడు. ‘ఆ బాధ తట్టుకోలేక ఇప్పుడైతే ఓ మేనేజర్ని నియమించుకున్నాను. కానీ అంతకుముందు మాత్రం అన్నీ తానే చూసుకునేవాడినని’ అంటూ సైఫ్ చెప్పుకొచ్చాడు. అయితే సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఇటీవలే రెండో సంతానంగా జెమ్ పుట్టిన విషయం తెలిసిందే. అతను పుట్టడానికి ముందే ఉన్న ఇంటిని రూ.3.5లక్షలకు అద్దెకు ఇచ్చి, వేరే ఇంటికి మారారు. కాగా సైఫ్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘ఆదిపురుష్’, ‘బంటీ ఔర్ బబ్లీ 2’ నటిస్తున్నాడు. చదవండి: కరీనాకు ఏ విషయంలోనూ సలహాలు ఇవ్వను: సైఫ్ అలీ ఖాన్ -
కరీనాకు ఏ విషయంలోనూ సలహాలు ఇవ్వను: సైఫ్
బాలీవుడ్లోని సెటబ్రిటీ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్లు ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకి ఇద్దరు కుమారులు తైమూర్, జెహ్. సినిమాలతో ఇద్దరూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితానికి సమయాన్ని కేటాయిస్తుంటారు. అయితే వ్యక్తిగత విషయాన్ని, ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేస్తూ కరీనా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుండగా, సైఫ్ మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. ఇటీవల సైఫ్ ఓ ఇంటర్వూలో కరీనా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండటం, పోస్టుల పెట్టడంపై హోస్ట్ అడగ్గా.. సైఫ్ దానికి ఇలా సమాధానం ఇచ్చాడు. ‘స్వచ్చమైన పెళ్లి బంధంలో ఒకరిని ఒకరు కంట్రోల్ చేసుకోవడం ఉండదు. ఇద్దరూ ఎవరికి నచ్చింది వారు చేయొచ్చు. కరీనా మల్టీ టాస్కర్. అందుకే తన ఏం చేయాలకుంటుందో అది చేస్తుంది. అందుకే నేను తనకు అంతగా సలహాలు ఇవ్వను. చదవండి: బిగ్బాస్లోకి సుశాంత్ ప్రేయసి?.. వామ్మో! వారానికి అన్ని లక్షలా.. ఒక్క సోషల్ మీడియా విషయంలోనే కాదు.. మామూలుగా విషయాల్లోనైనా బెబోకు సలహాలు ఇవ్వను. ఏం చేయాలో తనకి బాగా తెలుసు’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా కరీనా చివరిగా అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’లో నటించింది. ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరపుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సైఫ్ ప్రసుత్తం ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘ఆదిపురుష్’లో రావణ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఆ గాట్లు పెట్టినవి కాదు.. ఆ సినిమా సమయంలో నిజంగా అయ్యాయి: యంగ్ హీరో -
ప్రభాస్ ‘ఆదిపురుష్’ విడుదలయ్యేది ఎప్పుడంటే..?
బాహుబలితో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఆయన చేస్తున్నవన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఇప్పటికే రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న మూవీ ‘రాధేశ్యామ్’ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధమయ్యింది. ఈ స్టార్ ప్రస్తుతం ‘సలార్’, ‘ఆదిపురుష్’లో నటిస్తున్నాడు. కాగా ఆయన ‘ఆదిపురుష్’ సినిమాని వచ్చే ఏడాది ఆగస్ట్ 22న రిలీజ్ తాజాగా మేకర్స్ ప్రకటించారు. రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ నిర్మిస్తోంది. ఇందులో కృతి సనన్ ‘సీత’గా చేస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ‘రావణుడి’ పాత్రలో నటిస్తున్నాడు. అయితే గతేడాది ప్రకటించిన ఈ సినిమా చిత్రీకరణ కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోంది. దీంతో మూవీ రిలీజ్పై ఎన్నో పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో విడుదల తేదిని ప్రకటించిన మేకర్స్ వాటికి బ్రేక్ వేసినట్టైంది. కాగా ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. PRABHAS: 'ADIPURUSH' LOCKS 11 AUG 2022... #Adipurush [#3D] #Prabhas #SaifAliKhan #KritiSanon #SunnySingh #IndependenceDay weekend #Hindi #Telugu #Tamil #Kannada #Malayalam pic.twitter.com/bz6hSms6N7 — taran adarsh (@taran_adarsh) September 27, 2021 -
బెస్ట్ బిర్యానీ పంపినందుకు థ్యాంక్యూ ప్రభాస్.. వైరలవుతున్న కరీనా పోస్ట్
రెబల్ స్టార్ ప్రభాస్ తన కో యాక్టర్స్కి ఫుడ్ పార్టీ ఇస్తుంటాడనే విషయం తెలిసిందే. తాజాగా ‘ఆదిపురుష్’ సినిమాలో రావణ్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీఖాన్కు ఈ పాన్ ఇండియా స్టార్ బిర్యానీ పంపించాడు. ఈ విషయమై బాలీవుడ్ బ్యూటీ, సైఫ్ భార్య కరీనా కపూర్ ఆదివారం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఫొటో షేర్ చేసింది. దానికి.. ‘బాహుబలి బిర్యానీ పంపించాడంటే అది కచ్చితంగా బెస్ట్ అయ్యి ఉంటుంది. థ్యాంక్యూ ప్రభాస్, ఇలాంటి అద్భుతమైన భోజనం పంపినందుకు’ అని బ్యూటీ కామెంట్ రాసింది. ఫిట్నెస్ ఫ్రీక్ అయిన కరీనా ఫుడ్ లవర్ కూడా. తన సోదరి కరిష్మా కపూర్, బెస్ట్ ఫ్రెండ్స్తో కలిసి పుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నా వీడియోలను ఎన్నో సార్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ప్రభాస్ పంపించిన బిర్యానీ ఆకలి పెంచింది అంటూ లొట్టలేస్తూ తినేసి ఆ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతానికి అమీర్ఖాన్తో కలిసి ‘లాల్ సింగ్ చద్దా’ నటించింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. -
ముంబై ఎయిర్పోర్టులో కరీనాకు చేదు అనుభవం
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్కు చేదు అనుభవం ఎదురైంది. కటుంబంతో కలిసి పర్యాటనకు వెళ్తున్న ఆమెను ముంబై ఎయిర్పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారులు అడ్డుకుని వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతొంది. ఇటీవల బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ను సైతం సీఐఎస్ఎఫ్ సెక్యూరిటి అధికారి అడ్డుకుని పాస్పోర్ట్ అడిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా బుధవారం కరీనా కటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో భర్త సైఫ్ అలీ ఖాన్, కుమారులు తైమూర్, జహంగీర్తో కలిసి ఆమె ముంబై ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. చదవండి: అమ్మతో ఉన్న ఫొటో షేర్ చేసిన హృతిక్... తడి గోడను పట్టేసిన నెటిజన్ అక్కడ సైఫ్, తైమూర్లు ఎటువంటి ఇబ్బందీ లేకుండా నేరుగా విమానాశ్రయంలోకి వెళ్లిపోయారు. అయితే జహంగీర్ కేర్ టేకర్, కరీనాలు వారి వెనకాలే ఉన్నారు. అక్కడ ఉన్న సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ఆఫిసర్లు కేర్ టేకర్ను అడ్డుకుని పాస్పార్ట్ అడిగారు. వారితో మాట్లాడేందుకు ముందుకు వచ్చిన కరీనాను సైతం వారు పాస్పోర్ట్ అడగడంతో ఆమె చూపించింది. వారు చెక్ చేస్తుండగా తన వెనకాలే ఉన్న వారి మేనేజర్కు పాస్పోర్ట్ ఇచ్చి ఆమె లోపలికి వెళ్లిపోయింది. ఈ సమయంలో అప్పటికే విమానాశ్రయంలోకి వెళ్లిన సైఫ్ వెనక్కు వచ్చి కరీనా కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. ఇది చూసి నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సెలబ్రెటీ అని కూడా చూడకుండా తమ బాధ్యతను నిర్వర్తించిన సదరు సెక్యూరిటీ ఆఫీసర్లపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చదవండి: ట్రోలింగ్పై కరీనా మండిపాటు View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
ట్రోలింగ్పై కరీనా మండిపాటు
బాలీవుడ్ జంట కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ ఎక్కువగా కాంట్రవర్సీస్కి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్న విషయం తెలిసిందే. వివాహం నుంచి సంతానం వరకూ వ్యక్తిగత జీవితంలో ‘సైఫీనా’గా గుర్తింపు పొందిన ఈ దంపతులు తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాలకు కేంద్రబిందువుగా మారాయి. తాజాగా ఈ కపుల్కి పుట్టిన రెండో సంతానానికి సంబంధించి కూడా నెట్టిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో పిల్లలకు పేర్లు పెట్టే హక్కు తల్లిదండ్రులకి మాత్రమే ఉంటుందని కరీనా సోషల్ మీడియా వేదికగా మండిపడింది కరీనా. ఈ జంటకు 2016లో ఓ కుమారుడు జన్మించగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో కుమారుడు పుట్టాడు. అయితే మొదటి సంతానాకి ‘తైమూర్ అలీఖాన్’ అని పెట్టగా వివాదాలకు కారణమయినా విషయం తెలిసిందే. అది 1398లో భారతదేశంపై దండెత్తిన పర్షియన్ చక్రవర్తి తైమూర్ని గుర్తు చేస్తోందని నెటిజన్లు అప్పట్లో విమర్శలు చేశారు. కాగా రెండో కుమారుడికి ‘జహంగీర్ అలీఖాన్’ అని పెట్టారు. అదీసైతం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. దీంతో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో కాంట్రవర్సీ ఎందుకని ‘సైఫీనా’ జంట బాబు పేరు ‘జెహ్’గా మార్చారు. దీనిపై స్పందిస్తూ కరీనా ఇన్స్టాలో రెండో కుమారుడితో ఉన్న ఫోటోని తాజాగా పోస్ట్ చేసింది. ‘పిల్లలను కనిపెంచే తల్లిదండ్రులకి మాత్రమే వారి జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. మరెవరీకి ఉండదు. ఇతర కుటుంబ సభ్యులకి కూడా లేదు. అందరూ దీన్ని గుర్తుంచుకోవాలని’ అందులో రాసుకొచ్చింది. అంతేకాకుండా ఇటీవల ఓ ఇంటర్వూలో ట్రోల్పై స్పందించిన కరీనా మాకు నచ్చిన పేర్లను, బావుంటాయని పిల్లలకి పెట్టామని వెల్లడించింది. అంతేకానీ మరేంకాదని తెలిపింది. పిల్లలని భయంకరంగా ఇలా ఎలా ట్రోల్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో సైఫ్ అలీఖాన్ సోదరి సభా పటౌడి కరీనాకు మద్దతుగా నిలిచింది. View this post on Instagram A post shared by Saba (@sabapataudi) -
జెహ్ ఫొటో షేర్ చేసిన సారా, కరీనా షాక్
బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ల రెండవ కుమారుడు జెహ్ ఫొటో బయటకు వచ్చింది. ఫిబ్రవరిలో జెహ్కు జన్మనించిన కరీనా ఇప్పటి వరకు అతడిని ప్రపంచానికి పూర్తిగా పరిచయం చేయలేదు. జెహ్ ఫొటోలు షేర్ చేసినప్పటికీ అందులో అతడి మొహం కనిపించకుండా జగ్రత్త పడింది. అయితే నిన్న(సోమవారం) సైఫ్ బర్త్డే సందర్భంగా ఈ కపుల్స్ మాల్దీవులు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ బర్త్డే వేడుక సంబరాల్లో మునిగి తెలుతున్న కరీనా ఫ్యామిలీకి సారా అలీ ఖాన్ షాక్ ఇచ్చింది. తండ్రికి బర్త్డే శుభాకాంక్షలు తెలిపే క్రమంలో సారా కరీనా రెండవ కుమారుడు జెహ్ ఫొటోను రివీల్ చేసింది. సైఫ్, కరీనాలతో తన పుట్టిన రోజు సందర్భంగా దిగిన ఫొటోలను షేర్ చేస్తూ తండ్రికి బర్త్డే విషెష్ తెలిపింది. ఇందులో జెహ్ను కరీనా ఎత్తుకుని ఉండగా.. సారా అతడితో ఆడుతూ కనిపించింది. వారి వెనకాలే సైఫ్ నిలబడి ఉన్నాడు. అయితే జెహ్ మొహం ఈ ఫొటోలు స్పష్టంగా కనిపిస్తుంది. అది చూసిన నెటిజన్లు ‘జెహ్ అచ్చం తైమూర్లాగే ఉన్నాడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సారా తన ఇన్స్టాగ్రామ్లో ‘హ్యాపీ బర్త్డే అబ్బా.. మీరు నా సూపర్ హీరో, మంచి స్నేహితుడు కూడా. ఎల్లప్పుడు నాకు సపోర్టుగా ఉంటున్నందుకు ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ షేర్ చేసింది. కరీనా కపూర్ కూడా సైఫ్కు ప్రత్యేకంగా బర్త్డే విషెస్ తెలిపింది. 2012లో ప్రేమ వివాహం చేసుకున్న సైఫ్-కరీనా జంటకు ప్రస్తుతం 4 ఏళ్ల కుమారుడు తైమూర్ కాగా ఇటీవల రెండవ కుమారుడు జన్మించాడు. అయితే సారా సైఫ్ అలీఖాన్కు మొదటి భార్య అమృత సింగ్ల సంతానం. అలాగే వీరికి కుమారుడు ఇబ్రహ్మీం అలీ ఖాన్ కూడా ఉన్నాడు. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) -
ఇక నేను వెళ్లొచ్చా; ఏంటో నన్ను ఎవరూ పట్టించుకోరు కానీ..
ముంబై: బాలీవుడ్ జంట కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్ పెద్ద కుమారుడు తైమూర్ అలీఖాన్కు అభిమానుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుట్టిన నాటి నుంచే ఎంతో మందికి ఫేవరెట్ కిడ్గా మారిపోయాడు ఈ బుల్లి పటౌడీ. ఆ బుడ్డోడు బయట కనిపిస్తే చాలు పాపరాజీలకు పండుగే. కెమెరా కన్నును క్లిక్కుమనిపిస్తూ సందడి చేస్తారు. తాజాగా మరోసారి తైమూర్ వారి కంటపడ్డాడు. తండ్రి సైఫ్, కజిన్ ఇనాయా నౌమీతో కలిసి తమ నివాసం వద్ద తైమూర్.. ఫొటోలకు ఫోజులిస్తూ క్యూట్ లుక్స్తో ఆకట్టుకున్నాడు. అంతేకాదు తన ఆయాతో కలిసి కారు ఎక్కే సమయంలో.. ‘‘నేను ఇక వెళ్లొచ్చా’’అంటూ పాపరాజీల వద్ద సెలవు తీసుకుంటూ తన ముద్దు ముద్దు మాటలతో నవ్వులు పూయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ‘‘ఏంటో నేను ఇంటి నుంచి బయటకు వస్తే ఒక్కరు కూడా పట్టించుకోరు. మరి తైమూర్ కనబడితే మాత్రం వామ్మో.. ఇంత హంగామా! ఏదేమైనా బుడ్డోడికి ఇప్పటి నుంచే సెలబ్రిటీ లక్షణాలు ఒంటబట్టాయి’’ అంటూ నెటిజన్లు సరాదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా అమృతాసింగ్తో విడాకుల అనంతరం... సైఫ్ అలీఖాన్ 2012లో కరీనాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు 2016 డిసెంబర్లో తైమూర్ జన్మించగా, సుమారు ఐదేళ్ల వ్యత్యాసం తర్వాత ఇటీవలే చిన్న కుమారుడు జెహ్ పుట్టాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
వైరల్: కరీనా కపూర్ రెండో కుమారుడి ఫోటో లీక్!
బాలీవుడ్ స్టార్స్ కరీనా కపూర్-సైఫ్ అలీఖాన్ జంట ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తొలి సంతానం తైమూర్ కాగా, రెండో బిడ్డకు ‘జెహ్’ అని నామకరణం చేశారు. అయితే ఇప్పటివరకు జెహ్కు సంబంధించి ఫోటోను చూపించలేదు. తైమూర్ అడపాదపడా మీడియా కంటికి చిక్కినా.. రెండో కుమారుడు ‘జెహ్’ను మీడియా కంటికి చిక్కకుండా కరీనా జంట జాగ్రత్త పడుతూ వచ్చారు. తాజాగా జెహ్ ఫోటో ఒకటి బయటికొచ్చింది. ఇటీవలీ కరీనా తన ప్రగ్నెన్సీ అనుభవాన్ని పుస్తకం రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ బుక్కు ఆమె ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రగ్నెన్సీ బైబిల్’ అనే టైటిల్తో విడుదల చేసింది. ఈ పుస్తకంలోని ఒక పేజీలో కరీనా చిన్నారిని ముద్దుచేస్తున్నట్లు ఒక ఫోటో ఉంది. అయితే ఇందులో కనిపిస్తుంది కరీనా రెండో కుమారుడు 'జెహ్' అని ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీనిపై పటౌడీ ఫ్యామిలీ మాత్రం ఇంకా స్పందించలేదు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఇది జెహ్ ఫోటోనే అని ఫిక్సయిపోయి ఈ ఫోటోను తెగ షేర్ చేసేస్తున్నారు. ఇదిలా ఉండగా నటుడు సైఫ్ అలీఖాన్ గతంలో అమృత సింగ్ను పెళ్లి చేసుకున్నాడు. వీరి సంతానమే సారా అలీఖాన్, ఇబ్రహీమ్ అలీఖాన్. అయితే ఆమెతో విడిపోయిన తర్వాత సైఫ్ 2012లో కరీనాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2016 డిసెంబర్లో తైమూర్ జన్మించగా, సుమారు ఐదేళ్ల గ్యాప్ తర్వాత జెహ్ పుట్టాడు. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) -
అసిస్టెంట్ డైరెక్టర్తో ప్రేమలో స్టార్ హీరో కూతురు!
'కేదార్నాథ్' సినిమాతో వెండితెరపై కెరీర్ను ఆరంభించింది బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ సరసన హీరోయిన్గా నటించింది. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో సుశాంత్, సారా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి, కానీ అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. తర్వాత ఆమె యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్తో ప్రేమాయణం జరుపుతున్నట్లు టాక్ నడిచింది. వీళ్లిద్దరిదీ విడదీయరాని అనుబంధం అంటూ కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. అయితే తాజాగా సారా మరో వ్యక్తితో క్లోజ్గా మూవ్ అవుతున్నట్లు తెలుస్తోంది. 'కేదార్నాథ్' అసిస్టెంట్ డైరెక్టర్ జెహన్ హండాతో ఆమె ప్రేమలో పడిందని బీటౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు మరింత బలన్నా చేకూరుస్తూ.. సముద్ర తీరాన జెహన్ హండాతో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సారా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా "లవ్ యూ.. నన్ను మళ్లీ అక్కడకు తీసుకెళ్లిపో" అని రాసుకొచ్చింది. ఈ ఫొటోలో వీళ్లిద్దరూ నారింజ రంగు దుస్తులను ధరించగా సారా అతడిపై వాలిపోవడం చూడొచ్చు. ఇదిలా వుంటే గతేడాది జెహన్.. సారా పుట్టినరోజు చేసిన పోస్ట్ కూడా అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. 'మన స్నేహం, ప్రేమ, జ్ఞాపకాలను మార్చడం ఎవరి తరమూ కాదు, నేనెప్పటికీ నీతో ఉంటానని మాటిస్తున్నా'నని చెప్పుకొచ్చాడు. చదవండి: ఈ స్టార్ కిడ్ ఎవరో గుర్తు పట్టారా? -
ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?
లాక్డౌన్లో సెలబ్రెటీలు తమకు సంబంధించిన జ్ఞాపకాలను, వారి చిన్ననాటి ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లకు ఎంటర్టైన్మెంట్ అందించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ స్టార్ హీరోహీరోయిన్ల చిన్న ఫొటోలు బయటకు రావడంతో అవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్హీరో సైఫ్ అలీ ఖాన్ సోదరి సబా అలీ ఖాన్ గత కొద్ది రోజులు తన కుటుంబ సభ్యులకు సంబంధించిన పాత ఫొటోలను షేర్ చేస్తూ వారితో తనకున్న అనుభూతిని పంచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తన మేనకోడలు, సైఫ్ ముద్దుల తనయ, నటి సారా అలీ ఖాన్ చిన్ననాటి ఫొటోను కూడా షేర్ చేశారు. క్యూట్ నవ్వుతూ ఫొటోకు ఫోజ్ ఇచ్చిన సారా చిన్ననాటి ఫొటో ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ హల్ చల్ చేస్తుంది. దీనికి సబా ‘నేను సారాతో నవ్వమని చెప్పాను. కానీ తను ఇది బెటర్ అని నిర్ణయించుకుంది’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను జత చేశారు. అంతేగాక సారా ఇలా తన అల్లరితో ఎప్పుడు నవ్విస్తుందంటూ మనకోడలిపై ప్రేమను కురిపించారు ఆమె. అలాగే ఇదే ఫొటోను సారా కూడా తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో షేర్ చేశారు. కాగా సారా చిన్ననాటి ఫొటీ చూసి ఆమె అభిమానులు, ఫాలోవర్స్ మురిసిపోతున్నారు. సారా ఫొటో షేర్ చేసినందుకు సబాకు నెటిజన్లు ధన్యవాదాలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Saba (@sabapataudi) చదవండి: ఓటీటీ: ఈ వారం కొత్త సరుకు, ఓ లుక్కేయండి -
విద్యాబాలన్ వల్ల కరీనా, షాహిద్ విడిపోయారా?
కరీనా కపూర్, షాహిద్ కపూర్లకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. నటీనటులుగా ఎంత ఫేమసో ప్రేమికులుగానూ అంతే పాపులర్.. కిస్మత్ కనెక్షన్ ఫెయిలయ్యి ఈ ‘మొహబ్బతే’కు నాయికా, నాయకులుగా మారారు... కరీనా, షాహిద్.. ఇద్దరివీ పరస్పర విరుద్ధ మనస్తత్వాలు. ఆమె కొంచెం అహంభావి.. అతను కాస్త ఆకతాయి. ఆమెలోని ఆ అహం ఆత్మవిశ్వాసంగా అతణ్ణి ఆకర్శించింది. అతనిలోని ఆకతాయి తనం హీరోయిజమ్గా ఆమె మనసును దోచుకుంది. అలా ఆ ప్రేమ కథ మొదలైంది. సినిమాల్లో కరీనా.. షాహిద్ కన్నా సీనియర్. షాహిద్ తొలి సినిమా ‘ఇష్క్ విష్క్’చూసి అతనికి ఫ్యాన్ అయింది. ఎలాగైనా ఆ అబ్బాయిని కలవాలని ఉవ్విళ్లూరింది. కలిసింది. తొలి పరిచయంలోనే ఒకరినొకరు ఆకట్టుకున్నారు. వారం తర్వాత వాళ్ల డేటింగ్ మొదలైంది. ‘నువ్వంటే ఇష్టం’ అని తొలుత కరీనానే చెప్పింది షాహిద్తో. ‘నాకూ ఇష్టమే’ అని చెప్పాడు. షూటింగ్ ప్యాకప్ చెప్పగానే చట్టాపట్టాల్తోనే సాయంకాలాలు గడిచిపోయేవి. బాలీవుడ్లో ఈ ముచ్చట భలే సందడి చేసింది. అది కరీనా వాళ్లమ్మ బబిత, అక్కయ్య కరిష్మానూ చేరింది. కెరీర్ పట్ల కరీనా సీరియస్గా లేదని అర్థమైంది వాళ్లకు. ఆమె మెదడులోంచి షాహిద్ను తప్పించే ఆలోచనలు చేయసాగారు. అతనే హీరో.. తన ప్రేమను స్క్రీన్ మీదకూ తెచ్చింది కరీనా... తను చేసే సినిమాల్లో హీరోగా షాహిద్ను తీసుకొమ్మని నిర్మాతలను కోరుతూ. ఆమెకున్న డిమాండ్ దృష్ట్యా కాదనలేకపోయారు నిర్మాతలు. అలా వాళ్లిద్దరూ కలిసి నటించిన ఫస్ట్ మూవీ ‘ఫిదా’ విడుదలైంది. ఫ్లాప్ అయింది. అయినా కరీనా పట్టు వీడలేదు. ‘36 చైనా టౌన్’, ‘మిలేంగే మిలేంగే’, ‘చుప్ చుప్ కే’ చిత్రాలూ వచ్చాయి ఈ ఇద్దరి కాంబినేషన్లోనే. తెర మీద ఆ జంట ప్రేక్షకులను మెప్పించలేకపోతోందని గ్రహించారు దర్శకనిర్మాతలు. కరీనా తీరు బబిత, కరిష్మాకూ నచ్చలేదు. వ్యక్తిగతాన్ని కెరీర్తో ఎందుకు ముడిపెడుతున్నావ్? అది అన్ప్రొఫెషనల్’ అని బబిత కూతురిని హెచ్చరించింది కూడా. షాహిద్తో ప్రేమ బంధం తెంచుకొమ్మని అక్క కరిష్మా సలహా ఇచ్చింది చెల్లెలికి. జబ్ వి మెట్ నిజ జీవితంలోని వాళ్ల ప్రేమను తెర మీద ఎలా ప్రెజెంట్ చేయాలో.. ఆ జంటను ప్రేక్షకులు ప్రేమించేలా ఎలా చూపించాలో దర్శకుడు ఇమ్తియాజ్ అలీ స్క్రిప్ట్ రాసుకున్నాడు. చక్కటి స్క్రీన్ ప్లేనూ అల్లుకున్నాడు. ‘జబ్ వి మెట్’ సినిమా రిలీజ్ అయింది. సూపర్ హిట్ అయింది. తెర మీద ఆ జంటకు క్రేజ్ పెరిగింది. దాన్ని క్యాచ్ చేసుకుంది మీడియా.. ఆ రియల్ లవ్ స్టోరీని మళ్లీ ఒకసారి ప్రచురించి.. ప్రసారం చేసి. కానీ.. జబ్ వి మెట్ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడే షాహిద్, కరీనాల ప్రేమ బంధం బలహీనపడసాగింది. ఇంట్లో కరీనాకు షాహిద్తో తెగతెంపులు చేసుకొమ్మనే పోరు ఎక్కువైంది. అదే సమయంలో షాహిద్ .. విద్యాబాలన్తో చనువుగా మెదులుతున్నాడనే వార్తలూ కరీనా చెవిన పడ్డాయి. షాహిద్ను నిలదీసింది. సమాధానం చెప్పలేదు. ఆమె మనసు ముక్కలైంది. ‘జబ్ వి మెట్’ సినిమా టైమ్లోనే కరీనా తషన్ సినిమా కూడా చేస్తోంది. ఆ సెట్స్లో సైఫ్ అలీఖాన్తో తన బాధను పంచుకుంది. షాహిద్తో దూరం పెరిగింది. జబ్ వి మెట్ సెట్స్లో ఆ ఇద్దరూ ముభావంగానే ఉన్నారు. ఆ సినిమా క్రూ కూడా పసిగట్టింది ‘ఏదో జరిగింది’ అని. అయినా ఆ జంట సినిమా షూటింగ్కు అంతరాయం కలిగించకుండా చాలా ప్రొఫెషనల్గా వ్యవహరించి సినిమానూ పూర్తి చేశారని జబ్ వి మెట్ టెక్నీషియన్స్ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. విధి భలే విచిత్రమైంది.. కరీనా, షాహిద్ మనస్ఫూర్తిగా ఒకరినొకరు ఇష్టపడ్డన్నాళ్లు తెర మీద వాళ్ల జంట ఫెయిల్ అయింది. తెర మీద యాక్సెప్టెన్స్ వచ్చేప్పటికి నిజ జీవితంలో వాళ్ల మధ్య ప్రేమ లేకుండా పోయింది. ఆ బ్రేకప్ వాళ్లిద్దరినీ చాన్నాళ్లపాటు వేధించింది. ఆ బాధను చూసి కాలానికీ జాలేసిందేమో.. ఆ జ్ఞాపకాల్లోంచి ఇద్దరినీ బయటపడేసింది. మావి డిఫరెంట్ పర్సనాలిలిటీస్. ఆ డిఫరెన్సే మా ఇద్దరిలో ఉన్న ఖాళీని పూరించింది. – షాహిద్ షాహిద్, నేను ఇంచుమించు ఒకే వయసువాళ్లవడం వల్ల త్వరగా కనెక్ట్ అయ్యాం. ఆ సేమ్ టెంపర్మెంటే బ్రేకప్కి కారణమై ఉండొచ్చు. – కరీనా కపూర్ - ఎస్సార్ చదవండి: పోలీసులను ఆశ్రయించిన సింగర్ మధు ప్రియ -
‘క్యా కెహ్నా’ షూటింగ్లో ప్రమాదం, సైఫ్ అలీఖాన్ గాయానికి 100 కుట్లు
సైఫ్ అలీ ఖాన్, ప్రీతి జింటా జంటగా నటించిన తొలి చిత్రం ‘క్యా కెహ్నా’. 2000 సంవత్సరం మే 19న విడుదలైన ఈ మూవీలో సైఫ్ ప్లేబాయ్గా కనిపించగా, ప్రీతి జింటా పెళ్లి కాకుండా టీనేజీలోనే తల్లి అవుతుంది. డైరెక్టర్ కుందన్ షా తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలై నేటికి 21 ఏళ్లు. ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే విడుదలకు ముందే ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్గా నిలిచింది. కాగా ఈ మూవీ షూటింగ్ సమయంలో హీరో సైఫ్ ప్రమాదానికి గురై కొన్ని రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చిందట. ఈ ప్రమాదంలో సైఫ్ తలకు గాయమవడంతో దాదాపు 100 కుట్లు పడినట్లు కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో ప్రీతి జింటా వెల్లడించింది. 2004లోని కాఫీ విత్ కరణ్ జోహార్ మొదటి సీజన్కు సైఫ్, ప్రీతిలు అతిథిలుగా హాజరయ్యారు. ఈ షోలో ‘క్యా కెహ్నా’ షూటింగ్లో జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సైఫ్ మాట్లాడుతూ.. ‘జూహులోని ఓ పార్కు సమీపంలో సీన్ రీహార్సల్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పాడు .‘ ప్రీతిని ఫ్లట్ చేసే సన్నివేశం అది. నా మోటరు సైకిల్తో స్టంట్స్ చేస్తూ ఆమెను ఇంప్రెస్ చేయాలి. అలా ఫస్ట్ టైం బాగానే వచ్చింది. ఇక రెండవ సారి ఫుల్ జోష్లో బైక్ను ర్యాంప్ చేస్తుండగా బైక్ స్కిడ్ అయ్యింది. అయితే ఆ రోజు ఫుల్ వర్షం, నేలంతా బురదగా ఉండేసరికి ఈ ప్రమాదం జరిగింది. బైక్ స్కిడ్ కాగానే నేను గాల్లోకి ఎగిరి నేరుగా ఓ రాతిపై పడ్డాను. అలా బౌన్స్ అవుతూ పలుమార్లు కింద పడ్డాను. ఈ క్రమంలో నా తలకు పెద్ద గాయమై రక్తస్రావం అవ్వడం చూశాను. ఆ తర్వాత కళ్లు తిరిగి పడిపోయాను’ అని చెప్పుకొచ్చాడు. ఇక తర్వాత ప్రీతి జింటా మాట్లాడుతూ.. ‘ఆ రోజు డైరెక్టర్కు జ్వరంగా ఉండటంతో సెట్కి రాలేదు. సైఫ్ భార్య అమృత సింగ్ కూడా ఆ సమయంలో ముంబైలో లేరు. ఇక ప్రమాదం జరగానే ఆయన స్నేహితుడికి ఫోన్ చేశాను కానీ అతడు నమ్మలేదు, మేము జోక్ చేశామనుకుని ఫోన్ పెట్టేశాడు. నేను మాత్రమే అక్కడ ఉండటంతో వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లాను. హాస్పిటల్లో గార్డియన్గా నేను సంతకం చేశాను’ అని తెలిపింది. ఆ తర్వాత ఒకవేళ సైఫ్ మరణిస్తే ఏంటి పరిస్థితి అని తను పిచ్చిగా ఆలోచించానంటూ ఆమె చెప్పింది. -
కరీనా రెండో కొడుకు ఫోటో షేర్ చేసిన రణ్ధీర్
బాలీవుడ్ స్టార్స్ కరీనా కపూర్-సైఫ్ అలీఖాన్ జంట ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మహిళా దినోత్సవం సందర్భంగా కొడుకుని భుజంపై ఎత్తుకొని ముఖం కనిపించకుండా ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేగానీ ఇప్పటి వరకు తమ చిన్న కుమారుడి ఫోటోను పూర్తిగా చూపించలేదు. ఇప్పటికే తైమూర్కు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. తైమూర్ తమ్ముడి కోసం కూడా ఎంతోమంది అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా తన రెండో కుమారుడిని ప్రపంచానికి నెమ్మదిగా పరిచయం చేయాలన్న ఆలోచనలో సైఫ్ కపూల్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కరీనా తండ్రి, నటుడు రణ్దీ కపూర్ రెండో మనువడి పిక్ను షేర్ చేసేశాడు. సోమవారం రోజు ఇద్దరు పక్క పక్కనే ఉన్న ఇద్దరు శిశువుల క్లోజప్ ఫోటోను షేర్ చేశారు. వారిలో ఒకరు పెద్ద మనువడు తైమూర్ కాగా, మరొకరు చిన్న మనువడిగా తెలుస్తోంది. ఈ ఫోటోలో ఇద్దరు చిన్నారులు ఒకేలా కనిపిస్తున్నప్పటికీ ఆయన మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే కాసేపటికే రణధీర్ ఆ పోస్టును డిలీట్ చేశారు. కానీ అప్పటికే ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొట్టేసింది. కొంతమంది స్క్రీన్షాట్ తీసుకొని రీపోస్టు చేస్తున్నారు. రణధీర్ పోస్టు ఎందుకు తొలగించారో తెలియదు కానీ పిక్లో ఉన్నది కరీనా రెండో కొడుకేనని నెటిజన్లు ఊహించుకుంటున్నారు. ఇదిలా ఉండగా నటుడు సైఫ్ అలీఖాన్ గతంలో అమృత సింగ్ను పెళ్లి చేసుకున్నాడు. వీరి సంతానమే సారా అలీఖాన్, ఇబ్రహీమ్ అలీఖాన్. అయితే ఆమెతో విడిపోయిన తర్వాత సైఫ్ 2012లో కరీనాను పెళ్లి చేసుకున్నాడు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా 2016 డిసెంబర్లో తైమూర్ మొదటి సంతానంగా జన్మించాడు. సుమారు ఐదేళ్ల గ్యాప్ తర్వాత అతడికి తమ్ముడు పుట్టాడు. సెకండ్ బేబీకి పేరును ఇంకా వెల్లడించలేదు. చదవండి: జస్ట్ నెల రోజులకే.. కరీనా రెడీ! తైమూర్కు తమ్ముడొచ్చాడు -
ప్యాన్ ఇండియా రేంజ్లో ఎన్టీఆర్ మూవీ..?!
‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి హిట్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటల్ పరిశీలనలో ఉందనే వార్తలు కొన్నాళ్లుగా వస్తున్నాయి. తాజాగా మరో కొత్త టైటిల్ తెరపైకి వచ్చింది. ‘చౌడప్ప నాయుడు’ అనే పేరును టైటిల్గా అనుకుంటున్నారనే వార్తలు ఫిల్మ్నగర్లో వినిపిస్తున్నాయి. మరి.. ‘అయినను...’, ‘చౌడప్ప...’ ఈ రెంటిలో ఏ టైటిల్ని ఫిక్స్ చేస్తారు? ఈ రెండూ కాకుండా వేరే టైటిల్ పెడతారా చూడాలి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్ సినిమా షూటింగ్లో పాల్గొంటారు. ఈ సినిమాని ప్యాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కించనున్నారట త్రివిక్రమ్. ఈ సినిమాలో ఎన్టీఆర్కి విలన్గా విజయ్ సేతుపతి నటించబోతున్నట్టు గతంలో వార్తలొచ్చాయి.. తాజాగా సైఫ్ అలీఖాన్ పేరు వినిపిస్తోంది. -
తమిళ రీమేక్ చిత్రంలో గ్యాంగ్స్టర్గా హృతిక్
పోలీసు ఆఫీసర్గా సైఫ్ అలీఖాన్ అరెస్ట్ చేయాలనుకుంటున్న గ్యాంగ్స్టర్ దొరికాడు. హృతిక్ రోషనే ఆ గ్యాంగ్స్టర్. తమిళ హిట్ ‘విక్రమ్ వేదా’ హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ మూవీని డైరెక్ట్ చేసిన పుష్కర్-గాయత్రి ద్వయమే హిందీ రీమేక్ను కూడా తెరకెక్కించనున్నారు. ఓ పోలీసు ఆఫీసర్, గ్యాంగ్స్టర్ మధ్య సాగే కథే ‘విక్రమ్ వేదా’. తమిళంలో మాధవన్ చేసిన పోలీస్ విక్రమ్ పాత్రను హిందీలో సైఫ్ అలీఖాన్ చేయనున్నారు. గ్యాంగ్స్టర్ వేదా పాత్రకు హృతిక్ రోషన్ ఓకే చెప్పినట్లు సమాచారం. -
కరోనా: వాయిదాపడ్డ బాలీవుడ్ చిత్రం
రానా నటించిన ‘హాథీ మేరే సాథీ’ (తెలుగులో ‘అరణ్య’గా ఈ చిత్రం నేడు విడుదలవుతోంది) సినిమా తర్వాత మరో బాలీవుడ్ మూవీ ‘బంటీ ఔర్ బబ్లీ 2’ విడుదల వాయిదా పడింది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్స్కు ఆడియన్స్ రారని, ఆ ప్రభావం కలెక్షన్స్పై పడుతుందని భావించిన యశ్ రాజ్ నిర్మాణసంస్థ ఏప్రిల్ 23న విడుదల కావాల్సిన ‘బంటి ఔర్ బబ్లీ 2’ సినిమా విడుదలను వాయిదా వేసింది. #BreakingNews: #BuntyAurBabli2 - which was scheduled to release in *cinemas* on 23 April 2021 - has been postponed... #YRF will announce the new release date later. #SaifAliKhan, #RaniMukerji, #SiddhantChaturvedi #Sharvari pic.twitter.com/nBsSw5swch — taran adarsh (@taran_adarsh) March 25, 2021 2005లో వచ్చిన ‘బంటీ ఔర్ బబ్లీ’ సినిమాకు సీక్వెల్గా ‘బంటీ ఔర్ బబ్లీ 2’ తెరకెక్కింది. వరుణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, రాణీ ముఖర్జీ, సిద్ధార్థ్ చతుర్వేదీ, షార్వారీ ప్రధాన పాత్రలు పోషించారు. చదవండి: బిగ్బాస్ కంటెస్టెంట్కు సల్మాన్ కానుక భర్త నగ్న ఫొటోను షేర్ చేసిన సన్నీ లియోన్ -
ప్రభాస్ ‘ఆదిపురుష్’: కేవలం ఈ ఒక్క పార్ట్కే రూ.300 కోట్లు ఖర్చు!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావసణుడిగా నటిస్తున్నాడు. సీతగా కృతి సనన్ నటిస్తోంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రంలోని మోషన్ క్యాప్చర్ షూట్ మొదలైంది. ఇది ఈ విజువల్ వండర్ లో అతి కీలకంగా తెరకెక్కిస్తున్నారు. కేవలం ఈ పార్ట్ కోసమే రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్నారట మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ విజువల్ ట్రీట్ గా ఉంటుంది అని మేకర్స్ ప్రకటించారు. ఇక ఓవైపు గ్రాఫిక్స్ సంబంధించి పనులు చేస్తూనే మరోవైపు రియల్ క్యారెక్టర్స్తో షూటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయ్లో జరుగుతోంది. హైదరాబాద్లో ‘సలార్’ షెడ్యూల్ పూర్తి చేసిన ప్రభాస్, ‘ఆదిపురుష్’ కోసం ముంబయ్ వెళ్లారు. అక్కడ ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఇక రాముడి పాత్ర కోసం ప్రభాస్ భారీ కసరత్తు చేస్తున్నాడట. పాత్రకు తగ్గట్టుగా కొంచెం స్లిమ్ లుక్లో కనబడనున్నారు. అందుకోసం ముంబయ్లో రోజుకి ఉదయం, సాయంత్రం జిమ్లో కసరత్తులు చేస్తున్నారని తెలిసింది. కొన్ని కిలోల బరువు తగ్గించే పని మీద ఉన్నారట. టీ-సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, ఓం రౌత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి షూట్ చేసి తమిళ, మలయాళ, కన్నడ భాషలలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. చదవండి: రాముడిగా కనిపించేందుకు బరువు తగ్గుతున్న ప్రభాస్ తమన్నా ఇల్లు చూశారా..?, దాని కోసం ఎన్ని కోట్లు వెచ్చించిందో! ‘జాతిరత్నాల’మధ్య చిచ్చు... నవీన్, దర్శిలకు రాహుల్ వార్నింగ్ -
ఆదిపురుష్కి స్వాగతం
‘ఆదిపురుష్’ కుటుంబంలోకి స్వాగతం’ అంటూ కృతీ సనన్, సన్నీ సింగ్లను ఆహ్వానించారు ప్రభాస్. ఓం రౌత్ దర్శకత్వంలో రాముడి పాత్రలో ప్రభాస్, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఇందులో సీత పాత్ర ఎవరు చేస్తారు? లక్ష్మణుడిగా ఎవరు నటిస్తారు? అనే ప్రశ్నకు శుక్రవారం ఫుల్స్టాప్ పడింది. సీతగా కృతీ సనన్, లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్ చేస్తారని చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ పాత్రల్లో ఈ ఇద్దరూ కన్ఫర్మ్ అని ఊహించవచ్చు. ‘‘ఈ సినిమా నాకు చాలా చాలా ప్రత్యేకమైనది. ఈ మ్యాజికల్ వరల్డ్లో భాగమైనందుకు గర్వంగా, గౌరవంగా ఉంది’’ అన్నారు కృతీ సనన్. కానీ తాను ఏ పాత్ర చేయనున్నారో మాత్రం స్పష్టం చేయలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయ్లో జరుగుతోంది. ఏప్రిల్లో ఈ సినిమా సెట్స్లో జాయిన్ అవుతారు కృతీ సనన్ . ముందుగా ఆమె సోలో సీన్స్ను చిత్రీకరించి, ఆ తర్వాత ప్రభాస్, సైఫ్ అలీఖాన్ కాంబినేషన్ సీన్స్ను తెరకెక్కించే ఆలోచనలో ఉందట చిత్రబృందం. వచ్చే ఏడాది ఆగస్టు 11న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.