satires
-
రాహుల్ గాంధీ ధారావి పర్యటపై సెటైర్లు
ముంబై: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత తాజాగా ముంబైలోని ధారావి ప్రాంతంలో పర్యటించారు(Dharavi Visit). అయితే ఈ పర్యటనలో కాంగ్రెస్ నేతలెవరూ కనిపించకపోవడంపై శివసేన నేత, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్(Sanjay Nirupam) వ్యంగ్యాస్త్రాలు సంధించారు.గురువారం ధారావిలోని ఛామర్ స్టూడియోను సందర్శించిన రాహుల్ గాంధీ(Rahul Gandhi).. డిజైనర్ సుధీర్ రాజ్బర్ & టీంను కలిశారు. ఆపై సోషల్ మీడియాలో రాజ్బర్ బృందాన్ని అభినందనలతో ముంచెత్తారు కూడా.Sudheer Rajbhar of Chamar Studio encapsulates the life and journey of lakhs of Dalit youth in India. Extremely talented, brimming with ideas and hungry to succeed but lacking the access and opportunity to connect with the elite in his field. However, unlike many others from his… pic.twitter.com/VOtnA9yqSD— Rahul Gandhi (@RahulGandhi) March 6, 2025 అయితే ఒక కాంగ్రెస్ నేతగా కాకుండా.. యూట్యూబర్లాగా రాహుల్ ధారావిలో పర్యటించారంటూ సంజయ్ నిరుపమ్ ఎద్దేవా చేశారు. అంతేకాదు.. ముంబై కాంగ్రెస్ యూనిట్ డబ్బుల్లేక దివాళా తీసిందని సెటైర్లు కూడా వేశారు. ముంబైలో కాంగ్రెస్కు ఓట్లు మాత్రమే కాదు.. డబ్బులు కూడా లేకుండా పోయాయి. చాలాకాలంగా ముంబై కాంగ్రెస్ కార్యాలయం కరెంట్ బిల్లులు చెల్లించడం లేదు. ఆ బకాయిలు రూ. 5 లక్షల దాకా పేరుకుపోయాయి. అందుకే.. కావాలనే రాహుల్ కాంగ్రెస్ నేతలను కలవకుండా వెళ్లిపోయారు. ఒక కాంగ్రెస్ నేతలా కాకుండా.. యూట్యూబర్లాగా ఆయన పర్యటన సాగింది. గతంలో నేను ముంబై కాంగ్రెస్ యూనిట్ చీఫ్గా నాలుగేళ్లపాటు పని చేశా. కానీ, ఏనాడూ ఇంత ఘోరమైన పరిస్థితులు మాత్రం లేవు’’ అని సంజయ్ నిరుపమ్ అన్నారు.బాల్థాక్రే పిలుపుతో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంజయ్ నిరుపమ్.. ఆ తర్వాత కాంగ్రెస్తోనూ అనుబంధం కొనసాగించారు. ఒకసారి శివసేన నుంచి, ఒకసారి కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. 2009-14 మధ్య కాంగ్రెస్ నుంచి లోక్సభ ఎంపీగా పని చేశారు. అయితే కిందటి ఏడాది ఏప్రిల్లో క్రమశిక్షణ చర్యల కింద కాంగ్రెస్ ఆయనపై ఆరేళ్లపాటు సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఆయన కాంగ్రెస్కు రాజీనామా చేసి.. షిండే శివసేన వర్గంలో చేరారు. -
ఎన్నికలకు ముందు బాబు షూరిటీ.. ఎన్నికల తరువాత మోసం గ్యారెంటీ
-
ఏపీ బడ్జెట్ పై కేఏ పాల్ అదిరిపోయే సెటైర్లు
-
Ding Dong 2.O: కోతల రాయుళ్ళకి వాతలు మాయ చేసే నాయకులకు చురకలు
-
చంద్రబాబు ప్రభుత్వంపై మేకపాటి విక్రమ్ రెడ్డి సెటైర్లు
-
‘బ్రిక్స్’ దేశాలపై ట్రంప్ సెటైర్లు
వాషింగ్టన్:‘బ్రిక్స్’ కూటమి దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 150 శాతం సుంకాల దెబ్బకు ‘బ్రిక్స్’ ముక్కలయ్యాయని సెటైర్లు వేశారు. డాలర్ను ఆధిక్యతను దెబ్బతీయాలని ప్రయత్నించినందుకు ఆ దేశాలకు ఇది జరగాల్సిందేనన్నారు.‘డాలర్ను నాశనం చేయాలని బ్రిక్స్ దేశాలు ప్రయత్నించాయి. ఆ దేశాలన్నీ కలిసి కొత్త కరెన్సీని తీసుకురావాలన్న ఆలోచన చేశాయి. నేను గెలవగానే ఆ దేశాలకు ఒకటే స్పష్టం చేశాను. డాలర్ ఆధిక్యతను దెబ్బతీయాలని చూస్తే మీ వస్తువులపై 150 శాతం సుంకం విధిస్తానని చెప్పాను.మీ వస్తువులు మాకు అవసరం లేదు. నా దెబ్బకు బ్రిక్స్ దేశాలు ముక్కలయ్యాయి’అని ట్రంప్ అన్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచ దేశాలపై దిగుమతి సుంకాల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో భారత్కు కూడా మినహాయింపు ఇవ్వలేదు.బ్రిక్స్ కూటమిలో భారత్,రష్యా,చైనా సహా మొత్తం పది దేశాలున్నాయి. -
ప్రెసిడెంట్ ఎలాన్ మస్క్!
వాషింగ్టన్: చరిత్రాత్మక కవర్ పేజీలకు పెట్టింది పేరైన టైమ్ మేగజైన్ ‘ప్రెసిడెంట్ ఎలాన్ మస్క్’ అంటూ తాజాగా వ్యంగాత్మక కవర్ పేజీ కథనం ప్రచురించింది. అందులో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ వైట్హౌస్లోని ఓవల్ కార్యాలయంలోని ప్రెసిడెంట్ స్థానంలో కూర్చుని కని్పస్తున్నారు. ఎరుపు బ్యాక్గ్రౌండ్ ముఖచిత్రంలో చేతిలో కాఫీ కప్పు పట్టుకొని ఉన్నారు. జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఫెడరల్ ప్రభుత్వాన్ని సమూలంగా మార్చేందుకు మస్క్ ప్రయతి్నస్తుండటం తెలిసిందే. ఆ క్రమంలో ఆయనే అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్నానే అర్థంలో టైమ్ ఇలా కవర్ పేజీని డిజైన్ చేసింది. అధ్యక్ష సింహాసనం వెనుక ఉన్న అసలైన శక్తి మస్కేనని పరోక్షంగా చెప్పుకొచ్చింది. కవర్ స్టోరీలోనూ ఈ అంశాన్ని గట్టిగానే ఎండగట్టింది. లక్షలాది మంది ప్రభుత్వోద్యోగులు మస్క్ దయపై ఆధారపడి బతకాల్సి వస్తోందని పేర్కొంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న స్పృహ ఆయనలో కన్పించడం లేదని ఆక్షేపించింది. ‘డోజ్ పనితీరుపై మా పత్రిక వైట్హౌస్కు కొన్ని ప్రశ్నలు పంపింది. కానీ వాటికి బదులివ్వడానికి వైట్హౌస్ నిరాకరిచింది’’ అని కథనంలోనే పేర్కొంది. మస్క్ టైమ్ మేగజైన్పై కనిపించడం ఇది రెండోసారి. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయనను ‘కింగ్ మేకర్’గా అభిర్ణిణస్తూ ఇటీవలే మేగజైన్ ఓ ఫీచర్ రాసింది. టైమ్ తాజా కవర్ పేజీ ఉదంతంపై ట్రంప్ను ప్రశ్నించగా, ‘ఆ మేగజైన్ ఇంకా నడుస్తోందా? నాకు తెలియదు’ అంటూ అంతే వ్యంగ్యంగా స్పందించారు. -
చీటింగ్ లో బాబు Phd
-
8నెలలకే అసలు రంగు బయటపడింది బాబుపై కన్నబాబు సెటైర్లు
-
100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీలిచ్చింది
-
చంద్రబాబు దావోస్ టూర్ పై నాగార్జున యాదవ్ కామెంట్స్
-
పవన్ కళ్యాణ్ పై పుత్తా శివశంకర్ ఫైర్
-
మీది విజన్.. మాది యాక్షన్.. కూటమిపై బుగ్గన కామెంట్స్
-
‘రేవంత్ ధర్నా చూసి జనం నవ్వుకున్నారు’
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన మంత్రి వర్గ సహచరులతో.. అనుచరులతో రాజ్ భవన్ ముందు ధర్నా చెయ్యడం విడ్డూరంగా ఉందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన మంత్రివర్గ సహచరులతో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఇవాళ హైదరాబాద్ రాజ్ భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా అనిపించింది. ఏడాదిగా పాలనలతో.. సరైన పాలన లేదు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి మీద గాని ముందుడుగు పడటం లేదు.👉ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా అన్నిరకాల వైఫల్యంతో.. 12 ఏళ్లలో రావాల్సిన ప్రజావ్యతిరేకతను 12 నెలల్లోనే కూడగట్టుకున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద మోదీ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. రేవంత్ రెడ్డి ధర్నా చేయడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. అసలు అదానీ విషయం మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. వందకోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటీకి ఖర్చు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నప్పుడు గుర్తులేదా?.. వందకోట్ల సహాయం ఎందుకు అడిగారు? ఎందుకు ఇస్తామన్నారు? ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.👉కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తున్నా.. రేవంత్ అయినా రాహుల్ గాంధీ అయినా.. ఏ ప్రాతిపదికన అదానీ మీద చర్యలు తీసుకోవాలి. ఒక సాక్ష్యం చూపిస్తారా?. మన మీడియా ముందు, న్యాయస్థానాల ముందు, ప్రజలముందు ఆధారాలు చూపించకుండా.. విమర్శలు చేయడం సరికాదు.👉గత పార్లమెంటు ఎన్నికల్లో ఇటీవల వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న పార్టీ.. ఇవాళ ఫ్రస్టేషన్ లో అదానీ మాట మాట్లాడుతోంది. కేంద్ర ప్రభుత్వం పొరపాటు చేసిందని, కేంద్రం అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరూపించగలరా?.👉మాటమీద నిలబడే సత్తాలేక.. ఇవాళ విమర్శలు చేస్తున్నారు. ప్రపంచదేశాల ముందు భారతదేశాన్ని నవ్వలుపాలు చేస్తున్నది, భారత దేశ గౌరవ వ్యవస్థలపైన.. విదేశాల్లో మన సైనికుల మీద పరువు తీసే విధంగా మాట్లాడే అలవాటు మీ నాయకుడైన రాహుల్ గాంధీకి ఉంది.👉రేవంత్ రెడ్డి, కేసీఆర్ వైపే ఉన్నడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్తులే. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే.. మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే రావాలని కాంగ్రెస్ అధిష్టానం.. రేవంత్ రెడ్డికి హెచ్చరించిందా?. అందుకే రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పాట పాడుతున్నాడా?. రేవంత్ రెడ్డి, కేసీఆర్ బొమ్మ బొరుసు లాంటి వ్యక్తులు.. దొందూ దొందే. ఈ రెండు పార్టీల పాలనకు తేడా లేదు. ప్రజలను వంచించడంలో తెలంగాణ సంపదను దోచుకోవడంలో, కుటుంబ పరిపాలన తీసుకురావడంలో, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు అని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. -
మీటింగ్లకు వచ్చేదంతా వాళ్లే.. దీపాదాస్ వివాదాస్పద కామెంట్స్
సాక్షి,హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీ మీటింగ్లపై ఏకంగా ఆ పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ ఇన్చార్జి దీపదాస్ మున్షీ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నేతలు పార్టీ మీటింగులు పెడితే దానికి కార్యకర్తలు రావాలి కానీ 200 రూపాయల కూలీలు రాకూడదని నేతలకు మున్షీ చురకంటించారు. సోమవారం(డిసెంబర్16) హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ రివ్యూ మీటింగ్లో మున్షీ చేసిన ఈ వ్యాఖ్యలు కార్యకర్తల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి. తమను కూలీలతో పోలుస్తారా అని కార్యకర్తలు ఫైర్ అయ్యారు.మరోవైపు సీనియర్ నేత హనుమంతరావు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రసంగాలపై మైనార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీలు పొద్దంతా కాంగ్రెస్తో ఉండి సాయంత్రానికి ఎమ్ఐఎమ్కు ఓట్లు వేస్తారన్న హనుమంతరావు ,అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలపై మైనారిటీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. -
ఎనుముల కాదు.. ‘ఎగవేతల’ రేవంత్రెడ్డి: హరీష్రావు సెటైర్లు
సాక్షి, ఖమ్మం జిల్లా: చింతకాని మండలంలోని మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్ పర్యటించారు. భూ వివాదంలో ఆత్మహత్యకు పాల్పడిన బోజెడ్ల ప్రభాకర్రావు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం సభలో హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మార్పు వచ్చిందని.. అన్ని సంక్షేమ పథకాలు ఆగిపోయాయన్నారు.‘‘కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసింది. ఆరు లక్షల తులాల బంగారం కళ్యాణలక్ష్మీకి బాకీ పడింది. భద్రాద్రి రాములోరి సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు. పాలకుడే మాట తప్పితే.. ప్రజలకు అన్యాయం జరుగుతుంది. యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకుని ఈ ముఖ్యమంత్రికి మంచి బుద్ధి ప్రసాదించమని కోరుకున్నా.. కాంగ్రెస్లో పనిచేసేది తక్కువ.. లొల్లి మాత్రం ఎక్కువ’’ అంటూ హరీష్రావు ఎద్దేవా చేశారు.‘‘ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఇంటింటికి బాండ్ పేపర్ ఇచ్చారు.. అమలు చేశారా?. ఏడాది పాలనలో ఆత్మ విమర్శలు చేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కరోనా కష్టకాలంలో కూడా రైతులకు కేసీఆర్ రైతుబంధు ఇచ్చారు. ఏ ఒక్క హామీ అమలు చేయని మోసపూరిత పార్టీ కాంగ్రెస్. ముఖ్యమంత్రి పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి.’’ అంటూ హరీష్రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.‘‘లచ్చగూడెంలో విద్యుత్ షాక్తో మరణించిన ప్రసాద్ అనే రైతుకు ఎక్స్గ్రేషియా అడిగినందుకు అక్రమ కేసులు బనాయించారు. అక్రమంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసు పెడితే.. వడ్డీతో సహా చెల్లిస్తాం. ఆరు గ్యారంటీలు అమలు చేసేలా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా పనిచేపిస్తాం. అధికారం చేపట్టిన దగ్గర నుంచి అవ్వతాతలకు 4 వేల పెన్షన్ ఇవ్వాల్సిందే’’ అని హరీష్రావు డిమాండ్ చేశారు. -
సీఎం రేవంత్ పాలనపై కేటీఆర్ సెటైర్లు
సాక్షి,హైదరాబాద్:వంద రోజుల్లో ప్రతి గ్యారెంటీ నెరవేరుస్తామన్న మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ మేరకు సోమవారం(నవంబర్ 4) ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు.‘మూడు వందల ముప్పై రోజులు ముగిసింది. ఏడాది నిండడానికి 35 రోజులే మిగిలింది. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అంటున్నారు నిరుద్యోగులు. ఎకరాకు రూ.15000 రైతు భరోసా ఏమైంది అంటున్నారు రైతన్నలు.పెంచిన రూ.4 వేల పెన్షన్ ఎక్కడంటున్నారు అవ్వ తాతలు.నెల నెల ఇస్తామన్న రూ.2500 ఎక్కడబోయాయంటున్నారు అడబిడ్డలు. ఉద్యోగులు మా పీఆర్సీ ఎక్కడ, మా డీఏలు ఎక్కడని సమ్మెలకు సై అంటున్నారు.కౌలు రైతులు రూ.15000 ఎక్కడ, రైతు కూలీలు రూ. 12000 ఎక్కడ అంటున్నారు.తులం బంగారం ఎక్కడా అంటున్నారు మా బంగారు తల్లులు.చెప్పిన హామీలన్నీ బూడిదలో పన్నీరయ్యే.. చెప్పని మూసీలో లక్షల కోట్ల మూటలాయే. ఏడాది కాలమంతా అటెన్షన్ డైవర్షన్ తో పబ్బం గడిపిన మూసీ సర్కార్. ఏముంది ఈ ప్రజా పాలనలో గర్వకారణం ధర్నాలు,రాస్తారోకోలు తప్ప’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇదీ చదవండి: 8న యాదాద్రికి సీఎం రేవంత్ -
బాబుకు మాటలెక్కువ, చేతలు తక్కువ.. విజయసాయి చురకలు
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకు మాటలెక్కువ, చేతలు తక్కువని మరోసారి చాటుకున్నారంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎక్స్ వేదిగా సీఎం చంద్రబాబు తీరును ఎండగట్టారు. ఏ ప్రభుత్వానికైనా రోడ్ల మరమ్మత్తులు అన్నది ఓ నిరంతర కార్యక్రమం.. దాని ప్రచారానికి, ఆర్భాటాలకి ప్రభుత్వ ధనం వృధా చేయడం చంద్రబాబు నైజం అంటూ మండిపడ్డారు.‘‘రాష్ట్రానికే తలమానికంగా ఉన్న వైజాగ్ స్టీల్ గురించి మాత్రం ముఖ్యమంత్రి నోరు మెదపడు. ఉత్తరాంధ్ర వాసుల ఆశలపై నీళ్లు జల్లేలా కార్మికులను, సంఘాలను చంద్రబాబు తప్పుబడుతున్నారు. మీ తుప్పు బట్టిన ఆలోచనలకి ఉచిత గ్యాస్ లబ్ధిదారుల్లో అరకోటి మందికి ఎగనామం పెట్టడం తెలుసు. మరి వైజాగ్ను అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచన ఎక్కడ చంద్రబాబూ?’’ అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.చంద్రబాబుకు మాటలెక్కువ, చేతల తక్కువని మరోసారి చాటుకున్నారు..ఏ ప్రభుత్వానికైనా రోడ్ల మరమ్మత్తులు అన్నది ఓ నిరంతర కార్యక్రమం/ప్రక్రియ. దాని ప్రచారానికి, ఆర్భాటాలకి ప్రభుత్వ ధనం వృధా చేయడం చంద్రబాబు నైజం. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న వైజాగ్ స్టీల్ గురించి మాత్రం ముఖ్యమంత్రి నోరు…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 2, 2024 -
బాబు వచ్చాడు.. కరువు తెచ్చాడు
-
తులం బంగారం అన్నడు.. ఇనుము కూడా ఇవ్వలేదు
-
అడుసు తొక్కనేల.. చంద్రబాబు లిక్కర్ పాలసీపై సీపీఐ నారాయణ సెటైర్లు
సాక్షి, విజయవాడ: సరసమైన ధరలు.. నాణ్యమైన సారాయి.. సారాయే పనికిమాలినది. అందులో నాణ్యత ఏముంటుంది? అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్లు విసిరారు. విజయవాడ దుర్గాపురంలోని వైన్ షాపును పరిశీలించిన నారాయణ.. మద్యాన్ని ఆదాయ వనరుగా గుర్తించి సీఎం చంద్రబాబు చాలా సంతోషపడిపోతున్నారంటూ వ్యాఖ్యానించారు.అప్లికేషన్లలోనే మూడు వేల కోట్లు వచ్చాయి.. డిపాజిట్లలో మరో మూడు వేలు కోట్లు వస్తాయంటున్నారు. మద్యం ద్వారా ఆదాయ వనరులను చూపించడం ప్రజల శ్రేయస్సు కాదు మద్యంపై సెస్సు వస్తుంది.. ఆ సెస్సుతో వచ్చిన డబ్బును రిహాబిటేషన్ సెంటర్కు ఖర్చుచేస్తామంటున్నారు. బాగా తాగించి.. తాగేవారికి మందు ఇచ్చి తాగనివ్వకుండా ఉండేందుకు మరొక ఖర్చు. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల. తాగించడం ఎందుకు.. వారిని రీహాబిటేషన్కు తరలించడం ఎందుకు? ఇదంతా తలతిక్క పనులు’’ అంటూ సీపీఐ నారాయణ చురకలు అంటించారు.ఇదీ చదవండి: అవే బ్రాండ్లు... అవే రేట్లు -
ట్విట్టర్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ పై ప్రకాశ్ రాజ్ సటైర్లు
-
చంద్రబాబు మాటలకు అర్ధాలే వేరులే... జగ్గిరెడ్డి అదిరిపోయే సెటైర్లు
-
KSR Live Show: అచ్యుతాపురం ఘటనపై పవన్ కామెంట్స్.. చింతా రాజశేఖర్ కౌంటర్..
-
చంద్రబాబు అబద్దాలపై వైఎస్ జగన్ పంచులు
-
కేంద్ర బడ్జెట్పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ఏం ఆశించవచ్చని ఓ జర్నలిస్ట్ ఈ ఉదయం నన్ను అడిగారు. గత 10 సంవత్సరాలుగా మనకు వచ్చేదే రావొచ్చని నేను బదులిచ్చాను. అదేంటంటే.. పెద్ద సున్న మాత్రమే’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.A journalist asked me this morning about my expectations for Telangana from Union Budget Told him that we will get the same thing that we got for last 10 yearsA Big Zero— KTR (@KTRBRS) July 23, 2024 మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలపై కాంగ్రెస్ తన వైఖరి వెల్లడించాలని, నూతన చట్టాలపై విస్తృత చర్చ జరగాలని డిమాండ్ చేశారు. వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని.. ఈ చట్టాలలో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా, వ్యక్తి స్వేచ్చను హరించేలా ఉన్నాయని తెలిపారు. నూతన చట్టాల్లో పేర్కొన్న అనేక సెక్షన్ల వల్ల రాష్ట్రంలో పోలీస్ రాజ్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్నాటక ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారని, నూతన చట్టాలపైన విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వీటిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు,ఇక్కడి కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని వెల్లడించాలని అన్నారు. -
పవన్ పై అంబటి రాంబాబు సెటైర్లు
-
చంద్రబాబుకు మాజీ మంత్రి అంబటి చురకలు
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు చురకలు అంటించారు. పోలవరం కాఫర్ డ్యాంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు గురించి ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు పెట్టిన అంబటి.. కాఫర్ డ్యాంలు లేకుండానే ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అనుకున్న బాబు గారికి ప్రాజెక్టు ఇంకా అర్ధం కాలేదన్నమాట?.. అందుకే చెప్పా పోలవరం క్లిష్టమైన ప్రాజెక్ట్ అని, అర్ధం కావటం కష్టం అని!’’ అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.కాఫర్ డ్యాంలు లేకుండానే ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అనుకున్న బాబు గారికి ప్రాజెక్టు ఇంకా అర్ధం కాలేదన్నమాట ?అందుకే చెప్పా పోలవరం క్లిష్టమైన ప్రాజెక్ట్ అని అర్ధం కావటం కష్టం అని ! pic.twitter.com/4FuIVXwoGF— Ambati Rambabu (@AmbatiRambabu) June 30, 2024 -
మోదీ వల్లే గెలిచాం: పవార్ సెటైర్లు
ముంబై: ప్రధాని మోదీకి ఎన్సీపీ(శరద్చంద్రపవార్) నేత శరద్పవార్ కృతజ్ఞతలు తెలిపారు. మహావికాస్అఘాడీ(ఎమ్వీఏ) నేతలు ఉద్థవ్ థాక్రే, పృథ్విరాజ్ చవాన్లతో కలిసి పవార్ శనివారం(జూన్15) ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో మోదీ మహారాష్ట్రలో చేసిన ప్రచారంపై పవార్ సెటైర్లు వేశారు. మోదీ మహారాష్ట్రలో ప్రచార ర్యాలీల్లో పాల్గొన్న ప్రతి చోట ఎంవీఏ ఘన విజయం సాధించిందని ఎద్దేవా చేశారు. ‘ఎక్కడైతే ప్రధాని రోడ్షోలు చేశారో అక్కడ మేం గెలిచాం. ఇందుకే ప్రధానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇది నా బాధ్యత. ఎన్డీఏను గట్టి దెబ్బ కొట్టిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి’ అని పవార్ అన్నారు.తిరిగి తన మేనల్లుడు, ఎన్సీపీ అధినేత అజిత్పవార్తో కలిసే అవకాశం లేదని శరద్పవార్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మధ్య సీట్ల పంపకంపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని ఉద్ధవ్, చవాన్ తెలిపారు.కాగా, ఇటీవల లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కంటే కాంగ్రెస్,ఎన్సీపీ(శరద్పవార్), శివసేన(ఉద్ధవ్) పార్టీల కూటమే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచిన విషయం తెలిసిందే. -
Lok sabha elections 2024: మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో
బక్తియార్పూర్/పాలీగంజ్/జగదీశ్పూర్(బిహార్): తాను సామాన్య వ్యక్తినికాదని, దేవుడు పంపించాడని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సోమవారం బిహార్లో బక్తియార్పూర్, పాలీగంజ్, జగదీశ్పూర్ల్లో ఆయన ప్రచార ర్యాలీల్లో మాట్లాడారు. ‘‘ఎన్నికల ఫలితాలొచ్చాక బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై మోదీని ఈడీ ప్రశ్నించొచ్చు. అప్పుడాయన ‘నాకేమీ తెలీదు. దేవుడు పంపిస్తే వచ్చా. ఆయన చెప్పినట్లే చేశా’’ అని చెబుతారేమో’’ అంటూ ఎద్దేవా చేశారు. బిలియనీర్లకు సేవ చేయడానికే దేవుడు ఆయన్ను పంపాడా అంటూ మండిపడ్డారు. పాలీగంజ్లో రాహుల్, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె, పాటలీపుత్ర అభ్యర్థి మీసా భారతి సహా డజనుకు పైగా నేతలు కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కుంగింది. దాంతో రాహుల్ కాస్త పక్కకు నడవగా అక్కడా కుంగింది. వారంతా కింద పడబోయి తమాయించుకున్నారు.మోదీవి కూలదోసే కుట్రలు: ప్రియాంకసిమ్లా: హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ప్రియాంకా గాంధీ వద్రా ఆరోపించారు. కాంగ్రా సమీపంలోని చంబాలో ఆమె కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. -
టీడీపీపై బొత్స సెటైర్లు
-
ABN రిపోర్టర్ పై బొత్స పంచులే పంచులు
-
నాగబాబుపై ట్విట్టర్ వేదికగా పోతిన మహేష్ విమర్శలు
-
చంద్రబాబు ఏమైనా హీరోనా ?..అంబటి మురళి మాస్ ర్యాగింగ్
-
ఆ మాంత్రికుడు ఎక్కడున్నాడు: ప్రధాని మోదీ
భోపాల్: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై ప్రధాని మోదీ సెటైర్లు వేశారు. ఇన్నాళ్లూ ఈ రాయల్ మాంత్రికుడు ఎక్కడ దాక్కున్నాడని రాహుల్ను ఉద్దేశించి ప్రధాని ప్రశ్నించారు. దేశంలో పేదరికాన్ని ఒకే ఒక్క దెబ్బకు లేకుండా చేస్తానన్న రాహుల్ వ్యాఖ్యలను ప్రధాని ఎద్దేవా చేశారు. ఆదివారం(ఏప్రిల్14) మధ్యప్రదేశ్లోని హొషాంగాబాద్లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ఇండియా కూటమి మేనిఫెస్టోలోని ప్రతీ హామీ దేశాన్ని దివాతా తీయిస్తుందని హెచ్చరించారు. కాగా, గత వారం రాజస్థాన్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్గాంధీ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఒకే ఒక దెబ్బతో దేశంలో పేదరికాన్ని లేకుండా చేస్తామన్నారు.‘మీరు గనుక దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే మీ ఖాతాల్లోకి లక్ష రూపాయాలు వచ్చి పడతాయి. డబ్బులు వస్తూనే ఉంటాయి మీ ఖాకతాల్లోకి. ఒకే ఒక్క దెబ్బకు పేదరికం లేకుండా పోవాలి’అని రాహుల్ ప్రజలకు హామీ ఇచ్చారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుంటుంబాల్లోని మహిళలకు ఒక్కొక్కరికి ఖాతాల్లో లక్ష రూపాయల చొప్పున జమ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల -
‘శీష్మహల్ టు తీహార్’.. కేజ్రీవాల్పై బీజేపీ సెటైర్లు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో 14రోజుల జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లిన కొద్ది గంటల్లోనే ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ సోషల్ మీడియాలో సెటైర్లు మొదలు పెట్టింది. ఢిల్లీలోని కేజ్రీవాల్ అధికారిక నివాసం శీష్మహల్ నుంచి జైలుకు వెళుతున్నట్లుగా ఉన్న ఫొటోతో ఢిల్లీ బీజేపీ శాఖ తన అధికారిక ఎక్స్(ట్విటర్) ఖాతాలో ఒక పోస్టు పెట్టింది. शराब घोटाले के सरगना - Sheesh Mahal To Tihar pic.twitter.com/MbLH0pn1JA — BJP Delhi (@BJP4Delhi) April 1, 2024 ‘గిల్టీ ఆఫ్ లిక్కర్ స్కామ్.. శీష్ మహల్ టు తీహార్’ అనే క్యాప్షన్ను పోస్టుకు జత చేశారు. అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసానికి బీజేపీ నేతలు శీష్మహల్ అనే పేరు పెట్టి పిలుస్తారు. రూ.45 కోట్లతో ఈ నివాసాన్ని కేజ్రవాల్ సుందరీకరించుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. కాగా, లిక్కర్ కేసులో అరెస్టయి 6 రోజులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీలో ఉన్న తర్వాత కోర్టు సోమవారం( ఏప్రిల్ 1) జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదీ చదవండి.. మీరు వారితో పోల్చుకోవద్దు.. ఉదయనిధికి సుప్రీం చురక -
తమిళనాడులో ప్రచార వేడి.. ప్రధానిపై ఉదయనిధి సెటైర్లు
చెన్నై: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీపై మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామనాథపురం, తేనిలలో జరిగిన ప్రచార సభల్లో మాట్లాడుతూ మోదీ 28 పైసల ప్రధాని అని సెటైర్లు వేశారు. కేంద్ర పన్నుల వాటాలో తమిళనాడు నుంచి వెళ్లే ప్రతి రూపాయిలో తిరిగి 28 పైసలు మాత్రమే కేంద్రం ఇస్తోందని, ఇందుకే ప్రధాని 28 పైసల పీఎం అని విమర్శించారు. ఎన్నికలున్నప్పుడే తమిళనాడుకు ప్రధాని వస్తారని మండిపడ్డారు. మధురైలో ఎయిమ్స్ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు తయారైందన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ) తీసుకువచ్చి తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును కేంద్రం నాశనం చేస్తోందన్నారు. నీట్పై నిషేధంతో పాటు ప్రతి అంశంలోనూ తమిళనాడుపై ప్రధాని వివక్ష చూపుతున్నారని ఉదయనిధి మండిపడ్డారు. కాగా, తమిళనాడులోని 39 ఎంపీ సీట్లకు గాను ఏప్రిల్ 19న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇదీ చదవండి.. కేజ్రీకి దక్కని ఊరట -
చన్నీటితో స్నానం చేస్తే పాత పార్టీ, వేడి నీళ్లైతే కొత్త పార్టీ..! ఇంతకీ ఎవరాయన?
ఆయన నిన్న రాత్రి డిన్నర్ చేసి పడుకొనే సమయానికి ఒక పార్టీలో ఉన్నాడు. పొద్దున్న లేచి బ్రష్ చేసుకొని... మరో పార్టీ లో చేరేందుకు సిద్ధం అయ్యాడు . టిఫిన్ చేస్తుంటే .. పాత పార్టీ వారు వచ్చి నచ్చ చెప్పారు . సాయంకాలం టీ తాగే సమయానికి తిరిగీ పార్టీ మారే ప్రయత్నం చేసారు . రేపు లేచి స్నానం చేసి , ఏ పార్టీ లో చేరుతారో తెలియదు . అయన రేపు చన్నీటితో స్నానం చేస్తే పాత పార్టీలోనే కొనసాగవచ్చని .. వేడి నీటితో స్నానం చేస్తే మాత్రం పార్టీ మారడం ఖాయం అని ప్రముఖ రాజకీయ జ్యోతిష్యుడు పేను స్వామి విశ్లేషించారు. గవ్వల శాస్త్రం ప్రకారం అయన పాత పార్టీ లో కొనసాగే అవకాశం ఉందని యూట్యూబ్ ఛానల్ కిచ్చిన ఇంట్వ్యూ లో గవ్వల గన్నా రావు గారు సెలవిచ్చారు . చిలుక జ్యోతిష్యం ప్రకారం ఆయన కొత్త పార్టీ లోకి పోతాడు అని ఒక యూట్యూబ్ ఛానల్ తీసిన వీడియోకు ఒక్క రోజులో వెయ్యి కోట్ల వ్యూస్ వచ్చాయి . ఒక రోజులో వెయ్యి కోట్ల వ్యూస్ బోగస్ అని యూట్యూబ్ చానెల్స్ వ్యూస్ ను డబ్బులిచ్చి కొనుక్కొంటారని..... గిట్టని.. గిట్టుబాటు లేని కొన్ని యూట్యూబ్ చానెల్స్ వారు సణుక్కొంటున్నారు. అయన ఏ పార్టీలో ఉంటాడు అనే దాని పై ఇప్పుడు జోరుగా బెట్టింగ్ సాగుతోంది. దుబాయ్ కేంద్రంగా వున్న ప్రముఖ బెట్టింగ్ సంస్థ వారు ఆయన కొత్త పార్టీ లో చేరే అవకాశముందని చెప్పారు. ఇదిలా ఉండగా ఆయన పాత పార్టీ లోనే కొనసాగాలని కోరుతూ... ఆ పార్టీ కి చెందిన నలుగురు కార్యకర్తలు ఒంటి పై పెట్రోల్ పోసుకొని ఆత్మ హత్య ప్రయత్నం చేసారు . వారు ఒంటికి నిప్పంటించుకొంటారేమో కెమెరా లు ఆన్ చేసి ఆశగా ఎదురు చూసిన ముప్పై అయిదు యూట్యూబ్ చానెల్స్ వారికి నిరాశ ఎదురయ్యింది . కాల్ షీట్స్ అయిపోవడంతో మరో షూటింగ్ కోసం ఆ కార్యకర్తలు బండెక్కి వెళ్లిపోయారు. షూటింగ్ పూర్తి కాకుండానే వారి వెళ్లిపోవడం అన్యాయమని ఇలా అయితే తాము జూనియర్ ఆర్టిస్ట్ల కోసం మరో కంపెనీని చూసుకొంటామని ఆ పార్టీ కీలకనాయకుడు వ్యాఖ్యానించినట్టు తెలిసింది . ఆయన కొత్త పార్టీలో చేరాలని కోరుతూ ఆ నాయకులు నగర బంద్కు పిలుపునిచ్చారు. మద్యం దుకాణాలు లాంటి వాటి జోలికి తాము పోమని విద్యా సంస్థలు తెరిస్తే మాత్రం ఫర్నిచర్ ధ్వసం చేస్తామని వారు హెచ్చరించారు . ఢిల్లీకి చెందిన ప్రముఖ సర్వే సంస్థ జరిపిన సర్వేలో ఆయన కొత్త పార్టీలో చేరడం ఖాయం అని అరవై శాతం ప్రజలు తెలిపారు. ఆయన పాత పార్టీలోనే కొనసాగాలని కోరుతూ సర్వ మత ప్రార్ధనలు నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ నాయకుడు ఒకరు చెప్పారు . ఆయన పార్టీ మారుతారు లేదా అనే విషయంపై ఇప్పుడు ప్రజానీకం ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఊపిరి ఆడక ఇప్పటికే యాభై మంది గుండెపోటుకు , ఇరవై మంది మెదడు పోటుకు గురయ్యారు . మీ పిల్లాపాపల ఆలనా పాలన గాలికి వదిలి .. మీ శ్రీమతి గారిని టీవీ సీరియళ్లకు వదిలేసి .. మీరు మాత్రం మా ఛానల్ చూస్తూనే ఉండండి. ప్రతి క్షణం మారుతున్న పరిస్థితిని మీకు అర్ధ రాత్రి అయినా అప రాత్రి అయినా అందిస్తూనే ఉంటాము. గమనిక: ఇవన్నీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కమెంట్లు. వీటిని చదువుతోంటే.... గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాకుండా చతికిలపడిన నేత, కేకలు, కూకలు తప్ప, ప్రసంగాల్లో మేటర్ లేని , వేల బుక్స్ చదివిన అపర మేధావి (అంతా ఉత్తిదే) గుర్తొస్తే మాత్రం మా బాధ్యత కాదు. -
చంద్రబాబు రాత్రి లోకేష్ ని రూమ్ లోకి పిలిచి
-
ఉత్తమ్ పవర్ ప్రజెంటేషన్పై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్పై పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఆ శాఖ మంత్రి ఉత్తమ్పై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. సోమవారం ఆయన తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ నిర్వహించారు. ఉత్తమ్ మాటలు మాకే అర్థం కాలేదని.. ప్రజలకు ఏం అర్థమవుతుందన్నారు. ఉత్తమ్ పవర్ ప్రజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది. ఉత్తమ్ తెలుగులో మాట్లాడకుండా.. ఇంగ్లీష్లో మాట్లాడారని కేటీఆర్ అన్నారు. -
పవన్ కళ్యాణ్ పొలిటికల్ శల్యుడు
-
టీడీపీ-జనసేన కూటమిపై అబ్బయ్య చౌదరి సెటైర్లు
-
చంద్రబాబుపై కేశినేని నాని సెటైర్లు
ఎన్టీఆర్, సాక్షి: ధనికులు పిల్లలతో చదువులో పోటీ పడేలా నాడు నేడు ద్వారా సీఎం జగన్మోహన్రెడ్డి గణనీయమైన అభివృద్ధి చేశారని కితాబిచ్చారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. మంగళవారం విజయవాడ పార్లమెంటరీ వైఎస్సార్సీపీ సమన్వయకర్త హోదాలో తనపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారాయన. చంద్రబాబు తన దగ్గర కొన్ని ఊర కుక్కల్ని పెట్టుకున్నారు. పార్టీ నుంచి వెళ్లేవాళ్లను విమర్శించడమే వాళ్ల పని. ఎవరిని ఎక్కువగా తిడితే వాళ్లకు పదవులు ఇస్తారు. అలాంటి వాళ్లే నన్ను చెప్పుతో కొడతా అన్నారు. ఆ మాటలు ప్రజలందరికీ తెలుసు. ఇలాంటివాళ్లు సమాజానికి మంచి చేస్తున్నారా? లేదా? అనేది చంద్రబాబు, నారా లోకేష్లనే అడగాలి. అందుకే అలాంటి వాళ్ల మాటల్ని పట్టించుకోను. ‘‘నారా లోకేష్ ఒక పనికి మాలినోడు. నారావారిపల్లెలో వాళ్ల తాతది తప్ప చంద్రబాబుకు సొంతిల్లు లేదు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. ఓడాక.. తన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు’’ అని నాని సెటైర్లు వేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 5వేల కోట్లతో ఎలక్షన్ ముందు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అందులో కమిషన్లు బాగా మిగులుతాయని హడావిడిగా చేశారు. ఏ.కొండూరు ప్రాంతంలో కిడ్నీ రోగుల గురించి చంద్రబాబు ఏ రోజు పట్టించుకోలేదు అని ఆరోపించారు ఎంపీ నాని. -
జనసేన నాగబాబు, పవన్ కళ్యాణ్ పై కొమ్మినేని సెటైర్లు
-
అమ్మ మహానటి..భువనేశ్వరిని ఇమిటేట్ చేసిన మంత్రి
-
పవన్ కళ్యాణ్ నీ అత్తారింటికి దారేది..మంత్రి గుడివాడ సెటైర్లు
-
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం వేస్ట్..
-
ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన చోటే జెండా పీకేసిన చంద్రబాబు
-
పవన్, భువనేశ్వరిపై ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సెటైర్లు
-
కాంగ్రెస్లో అందరూ సీఎంలే.. కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్కు ఓటేస్తే దుష్ట పాలన వస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే కష్టాలు తప్పవని, కాంగ్రెస్కు ఓటేసి కర్ణాటక ప్రజలు బాధపడుతున్నారన్నారు. ఎల్బీనగర్లో ఆదివారం ఆయన బీఆర్ఎస్ బూత్ కమిటీల విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కర్ణాటక రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశాం అని మొత్తుకుంటున్నారన్నారు. కేసీఆర్ పాలన చూసి ఓటేయాలని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్లో అందరూ సీఎంలేనంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. జగ్గారెడ్డి కూడా సీఎం అంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్లో 6,7 మంది సీఎం కాండిడెట్లున్నారు పోటీలో లేకపోయినా జానారెడ్డి సీఎం పదవిపై ఆశ పడుతున్నారు. జగ్గారెడ్డి, రేవంత్రెడ్డి, భట్టి, ఉత్తమ్ అందరూ సీఎంలే. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేసి తప్పు చేయొద్దు. 2014కు ముందు నీళ్లు, కరెంట్ లేక ఇబ్బందులు పడ్డారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. చదవండి: తెలంగాణలో జెండా పీకేసిన టీడీపీ.. -
నేను చెప్పినట్టు చేస్తే చంద్రబాబుకి బెయిల్ వస్తుంది
-
పవన్ తప్ప చంద్రబాబును చూసేందుకు ఎవరైనా వచ్చారా ?
-
సొల్లు మాటల సోదిగాళ్లు..
-
పవన్, లోకేష్ పై గ్రంధి శ్రీనివాస్ సెటైర్లు
-
మీరే సింబాలిక్గా చెప్పడం ఎదైతో ఉందో.. టీడీపీపై విజయసాయిరెడ్డి సెటైర్లు..
సాక్షి, అమరావతి: టీడీపీపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలను సంధించారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ‘‘మీరు చెప్పినట్టుగానే లైట్లు ఆపేసిన ఇళ్లు లెక్కవేస్తే 2019లో వచ్చిన ఆ 23 కూడా 2024లో రావటగా!. రాష్ట్రాన్ని ఆర్పేసిన బాబు కోసం మేమెందుకు మా ఇళ్ళల్లో లైట్లను ఆపాలంటున్నారట తెలుగు తమ్ముళ్లు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంకొంతమంది నేతలు టపాసులు కాల్చారట. వాళ్ళ ఆనందమే వేరులే. మొత్తానికి టీడీపీ ఆరిపోయే దీపం అని మీరే సింబాలిక్గా చెప్పడం ఎదైతో ఉందో.. నభూతో నభవిష్యత్’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మీరు చెప్పినట్టుగానే లైట్లు ఆపేసిన ఇళ్లు లెక్కవేస్తే 2019లో వచ్చిన ఆ 23 కూడా 2024లో రావటగా! రాష్ట్రాన్ని ఆర్పేసిన బాబు కోసం మేమెందుకు మా ఇళ్ళల్లో లైట్లను ఆపాలంటున్నారట తెలుగు తమ్ముళ్లు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంకొంతమంది నేతలు టపాసులు కాల్చారట! వాళ్ళ ఆనందమే వేరులే! మొత్తానికి టీడీపీ… — Vijayasai Reddy V (@VSReddy_MP) October 8, 2023 కాగా, చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో ఏమాత్రం స్పందన కనిపించడంలేదు. తమ నాయకుడిని అరెస్టు చేసిన తర్వాత ప్రజల నుంచి సానుభూతి వెల్లువెత్తుతోందని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నా, అది ఎక్కడా మచ్చుకైనా కనిపించడంలేదు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ పలు కార్యక్రమాలు ప్రకటించి, వాటిలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిస్తున్నా, స్పందన ఉండటంలేదు. ప్రజలే కాదు.. ఆ పార్టీ శ్రేణుల్లోనూ స్పందన కరవైంది. శనివారం రాత్రి కూడా కాంతితో క్రాంతి అంటూ టీడీపీ చేపట్టిన కార్యక్రమమూ విఫలమైంది. చదవండి: బ్రెయిన్ డెడ్ పార్టీకి సానుభూతి వైద్యం -
పాల్ మళ్లీ ఏసేసాడు
-
నీ కొడుకును సీఎం చేస్తానన్నది నిజం కాదా?: బండి సంజయ్
-
కేటీఆర్ పెట్ట కథ..!
-
నారా ఫ్యామిలీ ఓవరాక్షన్..!
-
బ్రాహ్మణి, కోటంరెడ్డిపై అనిల్ కుమార్ పంచులు
-
నిను వీడని నీడను నేనే
-
లోకేష్ కనిపిస్తే కొట్టేందుకు చంద్రబాబు రెడీగా ఉన్నాడు.. బాలకృష్ణ, పురందేశ్వరిపై బైరెడ్డి సెటైర్లు
-
అమ్మ, కొడుకుపై రోజా నాన్ స్టాప్ పంచులు
-
చంద్రబాబు ఏమైనా ప్రియా పచ్చళ్ళు కంపెనీలో ముక్కులు కోయడానికి వెళ్లాడా..?
-
అసెంబ్లీలో చర్చకు రాకుండా టీడీపీ పారిపోతోంది
-
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు
-
బావ జనతా పార్టీగా మార్చారు..
-
పవన్ కళ్యాణ్ గాలి తీసిన పేర్నినాని..!
-
చంద్రబాబు తప్పులు...ఎల్లో మీడియా తిప్పలు
-
కరప్షన్ కింగ్..దత్తపుత్రుడి నోటికి హెరిటేజ్ ప్లాస్టర్
-
ఏమి భాషరా బాబు.. ఒక్కసారి వినండి ఈ కామెడీ
-
లోకేష్ పాదయాత్ర ఈవినింగ్ వాక్ లా ఉంది..!
-
అది ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యం పవన్ వల్ల కాదు..!
-
పవన్పై కక్ష గట్టారట.. హ..హ..హ!
ప్చ్.. వారాహి యాత్రలో భాగంగా బుధవారం తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు పొలిటికల్గా పడుతున్న కొన్ని కౌంటర్లు.. నాకు చె గువేరా స్ఫూర్తి: గుండెల్లో మాత్రం చంద్రబాబే! నాపై కక్ష గట్టారు: అవును మరి నమ్ముకున్న వాళ్లను ముంచుతున్నావ్ కదా! అందుకేనేమో నన్ను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు: ఓటేసేది జనాలు.. పార్టీలు కావు ఈసారి కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతా: ప్రజలు మనస్ఫూర్తిగా ఓట్లేసి గెల్పించినప్పుడు చూద్దాం లే! నేను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఎవరు ఆపుతారో చూస్తా: విజిటర్స్ పాస్ తీసుకొనా? నా కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు: అవునా.. నిజమా.. మరి ప్యాకేజీ కోసం వచ్చావా? పార్టీని నడపడానికే నేను సినిమాలు చేస్తున్నా: ముసుగులో బాబుతో దోస్తీ.. బోనస్గా ప్యాకేజీ! సీఎం జగన్కు నా ఛాలెంజ్: ఆ అర్హత నిజంగానే ఉందా? దేశంలో అత్యధిక పారితోషకం అందుకునే హీరోని నేను: పొలిటికల్ ప్యాకేజీ కూడానా? నేను విడిగా వస్తానో.. ఉమ్మడిగా వస్తానో నిర్ణయించలేదు!: ఆ నిర్ణయం నీ చేతుల్లో ఉంటేనే కదా! సీఎం పదవి ఇస్తే స్వీకరిస్తా!: అప్పల్రాజూ.. మరి చంద్రబాబు ఊరుకుంటాడంటావా? అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ఎన్ని వ్యూహాలైన రచిస్తా: స్క్రిప్ట్ మాత్రం బాబుగారిదే ఏపీ నుంచే జనసేన రాజకీయం: అయిపాయే! జనసేనకు మైనార్టీలు ఓటేయ్యరు: మీ సంగతి తెలిసిన ఏ వర్గమూ ఆదరించదు సహృదయంగా మాట్లాడాను: లోగుట్టు నారావారికెరుక -
రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతోంది: సీఎం వైఎస్ జగన్
-
‘2 వేల నోటు తీసుకురావడమే తప్పు’
క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రెండు వేల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది బ్యాంకుల పెద్దన్న ఆర్బీఐ. అయితే.. నోట్లను మార్చుకునేందుకు గడువు ఇచ్చి కాస్త ఊరట ఇచ్చింది. ఈ క్రమంలో మోదీ సర్కార్పై రాజకీయంగానే కాకుండా నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. 2 వేల నోటు తీసుకురావడమే తప్పు. ఇప్పుడు ఉపసంహరణ తుగ్లక్ నిర్ణయమంటూ సెటైర్లు పేల్చింది కాంగ్రెస్ పార్టీ. మన విలక్షణమైన స్వీయ-శైలి విశ్వగురువు(ప్రధాని మోదీని ఉద్దేశించి..).. మొదటి చట్టం తేవడం.. రెండోది అంతేవేగంగా ఆలోచన చేయడం. నవంబర్ 8, 2016 నాటి తుగ్లక్ ఫర్మాన్ ప్రకారం.. ఆర్భాటంగా ప్రవేశపెట్టిన 2,000 రూపాయల నోట్లు ఇప్పుడు ఉపసంహరించబడుతున్నాయి అని కాంగ్రెస్ సీనియర్ జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు. Typical of our self-styled Vishwaguru. First Act, Second Think (FAST). 2000 rupee notes introduced with such fanfare after that singularly disastrous Tughlaqi firman of Nov 8 2016 are now being withdrawn.https://t.co/gPjY07iKID — Jairam Ramesh (@Jairam_Ramesh) May 19, 2023 2016 నవంబర్ 8వ తేదీనాటి దెయ్యం.. మరోసారి దేశాన్ని వెంటాడేందుకు వచ్చింది. పెద్దఎత్తున ప్రచారంలో ఉన్న పెద్దనోట్ల రద్దు చర్య ఈ దేశానికి స్మారక విపత్తుగా కొనసాగుతోంది. కొత్త 2000 నోట్ల వల్ల కలిగే ప్రయోజనాలపై దేశ ప్రజలకు ప్రసంగించిన ప్రధాని, ఈరోజు ముద్రణ నిలిపివేసినప్పుడు ఆ హామీలన్నీ ఏమయ్యాయి?. అటువంటి చర్యకు ఉద్దేశించిన ఉద్దేశాన్ని ప్రభుత్వం వివరించాలి. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, పేదల వ్యతిరేక ఎజెండాను కొనసాగిస్తోంది. ఇంత తీవ్రమైన చర్యపై మీడియా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని.. ప్రపంచంలోని 'చిప్ కొరత' దీనికి కారణం కాదని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా వెటకారంగా ట్వీట్ చేశారు. The ghost of 8th nov 2016 has come back to haunt the nation once again. The greatly propagated move of demonetisation continues to be a monumental disaster for this nation. The PM sermoned the nation on the benefits of the new 2000 notes, today when the printing is stopped what… https://t.co/sfvTyLlDie — Pawan Khera 🇮🇳 (@Pawankhera) May 19, 2023 మరోవైపు పెద్ద నోటు ఉపసంహరణ నిర్ణయంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో అంటే నవంబర్ 2016లో 2000 నోటు చెలామణిలోకి వచ్చింది. కానీ, 2018 నుంచే 2 వేల నోట్ల ముద్రణ నిలిపివేసినట్లు ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది. అయితే చెలామణిలో మాత్రం 3.52 లక్షల నోట్ల విలువైన 2 వేల నోట్లు చెబుతోంది. ఈ క్రమంలో ఈ కీలక నిర్ణయం రెండు వేల నోటును చూసి చాలాకాలం అవుతున్న సామాన్యులకు ఎలా ఊరట అవుతుందని ప్రశ్నిస్తున్నారు. Modiji is in Japan when withdrawal of Rs. 2,000 notes has been announced. Coincidentally, the last time he was in Japan just after demonetization and gave this speech. pic.twitter.com/NDes0aAmst — PuNsTeR™ (@Pun_Starr) May 19, 2023 Good bye 2000 (RBI) has announced to withdraw Rs 2,000 pic.twitter.com/MeAgni204g — 𝑺𝒉𝒘𝒆𝒕𝒂𝒂♥️𝑻𝒆𝒋𝒂𝑻𝒓𝒐𝒐𝒑𝒔~♡ (@shwetak012) May 19, 2023 "RBI to withdraw Rs 2,000 currency notes from circulation" Me reading this news who doesn't even have a 500₹ note : pic.twitter.com/h8PZgr7yKE — Sanskar (@SaanskarJain) May 19, 2023 Those People who doesn't have any Rs 2000 notes#Demonetisation #2000note #2000rs #earthquake #NTR30 pic.twitter.com/0RSPgo9OBY — Lalji Patel (@LaljiPatel34) May 19, 2023 RBI on 2000 Rupee note: RBI to withdraw Rs 2,000 notes from circulation; notes will continue to be legal tender people reaction on it run run for exchange pic.twitter.com/qm2AVa64eL — Mahesh Bhavsar (@imaheshbhavsar) May 19, 2023 RBI withdraws ₹2000 note from circulation, to remain legal tender Why you should not panic? 1) The banks will no longer issue Rs 2,000 currency notes. 2) There is no need to panic as Rs 2,000 will continue to remain legal tender after September 30, 2023 #2000notes #rbi pic.twitter.com/y6KMVqmRTi — Saurav Mishra 🇮🇳 (@SauravmishraTV9) May 19, 2023 RBI 2000 To Withdraw Rs 2,000 Currency Notes From Circulation with immediate effect. It, however, stated that the banknote will continue to be legal tender#BreakingNews #Demonetisation #RBI #2000note #2000note #TejRan #KaranKundrra #TejasswiPrakash happy But HAWALA BE LIKE pic.twitter.com/9A1f9eNLjO — Sandy vats (@Sandip124113) May 19, 2023 Mere pas sirf 1798 rupay hain#Demonetisation Rs 2000 notepic.twitter.com/JVZnKAxQyM — human (@humanbeing1857) May 19, 2023 -
సెల్ఫీలు తీసుకుని బాబు, అశోక్ గజపతిరాజు సెల్ఫిష్ లుగా మారారు : రోజా
-
బాబు నయవంచక మాటల్ని నమ్మెద్దు
-
ఆ పెద్దమనిషి ఇంటర్వ్యూ చూస్తే ముసలి పులి కథే గుర్తొచ్చింది
సాక్షి, అనంతపురం: ఒక ముసలాయన.. ఈ మధ్య జాతీయ మీడియాకు వచ్చి రాని భాషలో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన మాటలు వినేప్పుడు.. నాకొక కథ గుర్తుకొచ్చింది. అది మన అందరికీ ఇష్టమైన, నీతిని పంచే పంచ తంత్రంలోని కథ.. అనగనగా ఓ పులి ఉండేదట. ఆ పులి మనిషి మాంసం ఒక పద్థతి ప్రకారం రెగ్యులర్గా తినేది. సంవత్సరాలుగా నరమాంసం తినేందుకు అలవాటుపడ్డ పులి.. ఏళ్లు గడిచాక ముసలిదైపోయింది. వేటాడే శక్తి, పరిగెత్తే ఓపిక పోయింది. ఉన్నచోటే కూర్చుని.. నాలుగు నక్కలను తోడేసుకుంది. మనుషుల్ని ఎలా తినాలనే ప్లాన్ వేసుకుంది. దారిలో ఓ ముడగు పక్క కూర్చుని.. వచ్చీపోయే మనుషులకు నగల్ని ఆశ చూపెట్టేది.. ‘‘తమ్ముళ్లూ.. కడియం కావాలంటే నీటిలో మునగాలి’’ అంటూ ఊరించేది. ‘‘ఈ పులిని నమ్మాం అంటే.. తినేస్తుంది కదా’’ అని అందరూ నమ్మకుండా పోయారు. కానీ, ఆ పులి మాత్రం నేను సీనియర్ మోస్ట్ పులిని. అడవిలో నలభై ఏళ్ల ఇండస్ట్రీ ఉంది. గతంలో బాగా తినేవాడని.. ఇప్పుడు మంచోడినైపోయి తినదల్చుకోలేదు. పైగా వయసు పెరిగింది. రామా.. కృష్ణా.. అంటూ మంచి కార్యక్రమాల కోసమే ఉన్నాను. పులి ముసలిది అయిపోయింది కదా.. అని కాస్తో కూస్తో నమ్మిన వాళ్లూ మడుగులో వెళ్లి నీట మునిగి ఆ నగలు తీసుకునే ప్రయత్నం చేసేవాళ్లు. ఆ మడుగులో బురదతో ఇరుక్కుంటే.. పులి చంపేసి తినేసేది. ఈ కథ చెప్పే నీతి.. వెన్నుపోటు పొడిచేవాళ్లను, అబద్ధాలు ఆడేవారిని, వంచకుల్ని, మాయమాటలు చెప్పేవాళ్లని ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదు. ఈ కథ వింటే గుర్తొచ్చేది.. అబద్ధాలు కళ్లారప్పకుండా చెప్పే ఓ ముసలాయాన గుర్తొస్తాడు. ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు.. వేటాడే శక్తి కోల్పోయిన పులి, గుంట నక్కల్నివెంటేసుకుని తిరిగినట్లు ఉంది చంద్రబాబు తీరు. బంగారు కడియం ఇస్తానంటాడు. జాబు రావాలంటే బాబు రావాలంట.. బాబుకు ఎప్పటికీ బుద్ధిరాదని అనిపిస్తోంది. నేను సీనియర్ని, ఇప్పుడు మంచోడ్ని అయ్యాను అంటూ నమ్మించే యత్నం చేస్తాడు. కానీ, చంద్రబాబు లాంటి వంచకుడిని ప్రజలు ఎప్పటికీ నమ్మకూడదు అని సీఎం జగన్ పిలుపు ఇచ్చారు. పంచతంత్రం కథల్లోని ముసలి పులి లాంటి వాడు మన సీనియర్ మోస్ట్ పోలిటీషియన్. మనిషి మాంసం రుచి మరిగిన పులి మారిందంటే ఎలా నమ్ముతారు?. బాంగారు కడియం ఆశచూపి మనుషుల్ని మింగేసే ఆ పులి బాపతే ఈ వెన్నుపోటు బాబు. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగలిగే ఘటికుడు చంద్రబాబు. మాయమాటలు చెప్పే బాబు లాంటి వారిని నమ్మకూడదు. బాబు వచ్చాడు.. రైతుల్ని నట్టేట ముంచాడు పంచతంత్ర కథల్లో నీతి నేర్చుకుంటాం. రోజూ రాజకీయాల మధ్య మనం బతుకున్నాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రైతుల్ని నండా ముంచారు. అక్కాచెల్లెమ్మల పొదుపు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని బ్యాంకులు వేలం వేశాయప్పుడు. సున్నా వడ్డ పథకాన్ని రద్దు చేశాడు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి.. మొండి చేయి చూపాడు. ఇప్పుడు మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు ప్రజల్లోకి వస్తున్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు మరిన్ని అబద్ధాలు చెబుతాడు. దోచుకో, పంచుకో.. ఇదే చంద్రబాబు సిద్ధాంతం. చంద్రబాబుకు తోడుగా ఓ గజదొంగల ముఠా ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీరికి తోడుగా దత్తపుత్రుడు.. ఇది గజదొంగల ముఠా. బాబు అబద్ధాలను, మోసాలను నమ్మకండి. జగనన్న వల్ల మంచి జరిగిందా? లేదా? అనేది కొలమానంగా తీసుకోండి.. ఆలోచించండి. మీ జగనన్న నమ్ముకున్నది దేవుడి దయను, ప్రజలను. నా నమ్మకం, నా ఆత్మ విశ్వాసం ప్రజలే అని సీఎం జగన్ ఉద్ఘాటించారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో మీ దీవెనలు నాకు కావాలి అని ఆయన ప్రజలను కోరారు. -
కర్నూలు జిల్లాలో లోకేష్ ను నిలదీసిన మహిళలు
-
కేసీఆర్ మీదికి బాణం ఎక్కుపెట్టిన మోదీ
-
బీజేపీలో మున్నాబాయ్ MBBSలు ఎందరో.. : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేజ్రీవాల్ పిటిషన్పై కోర్టు తీర్పు తర్వాత ప్రధాని మోదీ విద్యార్హత అంశం మరోసారి తెర మీదకు రాగా.. బీజేపీ నేతల విద్యార్హత అంశాన్ని లేవనెత్తుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. బీజేపీలో మున్నాబాయ్ ఎంబీబీఎస్ టైప్ వ్యక్తులు ఎందరో ఉన్నారంటూ ఓ ట్వీట్ చేశారాయన. బీజేపీలో మున్నాబాయ్ ఎంబీబీఎస్ తరహా వ్యక్తులు ఎంతోమంది ఉన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలు ఫేక్ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాజస్తాన్, తమిళనాడు యూనివర్సిటీల సర్టిఫికెట్లను ఫోర్జింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు విషయం(ఫేక్ విద్యార్హత ప్రస్తావిస్తూ..) పేర్కొనడం క్రిమినల్ నేరం కాదా? ఒకవేళ దోషులుగా వాళ్లపై లోక్సభ స్పీకర్ అనర్హులుగా వాళ్లను ప్రకటించరాదా? అని కేటీఆర్ ట్వీట్ చేశారు. Looks like we have too many MunnaBhai, MBBS types in BJP 2 BJP MPs from Telangana are also allegedly Fake Certificate holders 😄 Have forged certificates from Rajasthan & TN Universities Isn’t it a criminal offence to lie in your election affidavit on whose basis MP gets… — KTR (@KTRBRS) April 4, 2023 ఇదీ చదవండి: మన ప్రధానులు అసలు ఏం చదివారో తెలుసా? -
...అంతా కిల్‘బిల్’పాండేలే!
కాళిదాసు కవిత్వం కొంత, మన పైత్యం కొంత అన్న సామెత ఉంది. మనం చెప్పిన దానికి కాసింత కాళిదాసు లాంటి పెద్దవాళ్ల పేరు జోడించి వారి అకౌంట్లో వేయడం జరుగుతుంటుంది. తద్వారా చెప్పిన దానికి మరింత ప్రాచుర్యం వస్తుందని.. అలాంటిదే ఒకటి చూద్దాం.. అనగనగా ఆ కాలంలో ఓ ఆకతాయి యువకుడు ఉండేవాడు. ఆ ఆకతాయి వీధిలో వెళ్తున్న ఓ అమ్మాయిని చూసి రావే.. రావే అని కామెంట్ చేశాడు.. ఆ అమ్మాయికి ఒళ్లుమండి న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది. ఇప్పటిలా ఎంపీ లకైనా సమన్లు జారీ చేసి ‘ముద్దు ముచ్చట్ల’కు జవాబు చెప్పండి అని ఆదేశించే మహిళా కమిషన్లు అప్పట్లో లేవు. ఎమ్మెల్యేలు వేధిస్తున్నారని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడానికి మీడియా కూడా లేదు. పైగా ధైర్యం ఉన్న ఇప్పటి ‘నవ్య’ తరం కూడా కాదు. ఆడియో, వీడియోలు షేర్ చెయ్యడానికి సోషల్ మీడియా కూడా లేదు. అప్పట్లో న్యాయాధికారి, ఆపై మహారాజు గారే యాక్షన్ తీసుకోవాలి. న్యాయాధికారి విషయాన్ని సీరియస్గానే తీసుకుని విచారణకు రమ్మని ఆకతాయిని ఆదేశించాడు. ఇది తెలిసిన ఆకతాయి తండ్రి కంగారు పడిపోయాడు. ఇంట్లోనే ఆకతాయికి దేహశుద్ధి చేశాడు. కానీ, రాజదండన నుంచి ఎలా తప్పించడమో పాలు పోలేదు. ఆయనకు తెలిసిన కవి ఒకరు రాజు గారి ఆస్థానంలో ఉన్నారు. కవి గారి దగ్గరికి వెళ్లి గోడు వెళ్లబోసుకున్నాడు. కవి సాంతం విని, కొడుకును దార్లో పెట్టుకుంటానని తండ్రి వద్ద గట్టిగా మాట తీసుకుని ఓ ఐడియా చెప్పాడు. ‘‘నేను ఓ శ్లోకం చెబుతా, న్యాయవిచారణ సమయంలో మీ కొడుకును చెప్పమను..’’ అంటూ, దానితో పాటు ముందుగా బాధితురాలైన అమ్మాయి ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పండి అని సలహా ఇచ్చాడు. తండ్రి ఆయన చెప్పినట్టుగా చేసి ఆకతాయితో శ్లోకం బట్టీ పట్టించాడు. న్యాయవిచారణ జరుగుతున్నపుడు.. ‘నేను రావే రావే అని ఊరికే అనలేదు, నేను అప్పుడు చదివిన శ్లోకంలో భాగమే అది..’ అని కవి చెప్పిన శ్లోకం చదివాడు. గేహే గేహే జంగమా హేమవల్లీ వల్లా్యం వల్లా్యం పారణశ్చంద్రబింబః బింబే బింబే కోకిలా మంజురావః రావే రావే జాయతే పంచబాణః (ప్రతి ఇంట్లోనూ ఒక కదిలే బంగారు తీగ ఉంది. ప్రతి తీగలోనూ ఒక పూర్ణ చంద్రబింబం ఉంది. ప్రతీ చంద్ర బింబంలోనూ ఒక కోకిల స్వరం ఉంది. ఆ ప్రతీ ధ్వనిలోనూ మన్మథుడు ఉన్నాడు.) ఈ శ్లోకం చదువుతుండగా ఆమెకు రావే రావే అని మాత్రమే వినిపించిందని వివరణ ఇచ్చాడు. అంతకు ముందే ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పిన కారణంగా ఆ అమ్మాయి కూడా మరింత రెట్టించ లేదు. ఇప్పటి ‘నవ్య ’తరంలాగా.. ‘‘మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తాట తీస్తా, కిరోసిన్ పోసి నిప్పంటిస్తా...’’ అని ఘాటుగా హె చ్చరించలేదు గానీ బుద్ధిగా ఉండమని సూచించింది. కథ కంచికి వెళ్లింది. అందరూ ఇంటికి వెళ్లారు. ఈ శ్లోకం రాసిచ్చిన కవి ‘కాళిదాసే’ అని ప్రచారం. ఇది కాళిదాసు కవిత్వమా, ఎవరిదైనా పైత్యమా అన్న విషయం వదిలేస్తే.. ఆ కాలం నుంచీ అమ్మాయిలంటే చులకనగా చూసే ఆకతాయిలున్నారు, విచారణలున్నాయి, క్షమాపణలున్నాయి. ఇప్పటికీ పరిస్థితేం పెద్దగా మారలేదు. మెడికోలైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా.. ఎవరయినా అంతే. పైన చెప్పుకున్న దానికి.. కింద మనం మాట్లాడుకోబోయే విషయానికి క్లోజ్ రిలేషన్ ఉందా.. బాదరాయణ సంబంధమేనా..? మీరే తేల్చుకోండి. ఈ నెలలోనే మహిళా దినోత్సవం వచ్చింది. మళ్లీ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రస్తావనా వచ్చింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో మహిళా సాధికారత కోసం ఢిల్లీలో దీక్ష...దీని వెనుక వేరే కారణాలున్నాయని విమర్శలున్నాయనుకోండి. కాసింత చర్చయితే అయ్యింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆశలు సాకారమైతే, వారి సాధికారతవైపు సమాజం అడుగులు వేస్తే... మహిళలపై వివక్ష తగ్గితే.. గౌరవం పెరిగితే పైన చెప్పుకున్న సంఘటనలు లాంటివి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్న ఆశలు కనిపించాయి. కానీ, ప్రతి మహిళా దినోత్సవం రోజు అన్ని పార్టీలు, సంఘాలు, ప్రముఖులు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రస్తావించడం. కుదిరితే కాసిన్ని దీక్షలు.. ఆ తర్వాత మరిచి పోవడం.. అంతే, ఒకటి కాదు రెండు కాదు 26 ఏళ్లుగా ఇదే తంతు. ..ఎందుకంటే పైన మనం చెప్పుకున్న కామెంట్లూ, కథలూ కంచికిపోలే.. మన మధ్యే ఉన్నాయి. ఇవి ఆకతాయిల మాటలు కాదు.. మీరే చూడండి. – ఓ రోజు మహిళా బిల్లుపై సీరియస్ చర్చ జరుగుతోంది. సమర్థించే వారు గొంతు చించుకుంటున్నారు. ఇంతలో పార్లమెంట్ బయట తిరుగుతున్న ఎంపీని ‘మహిళా రిజర్వేషన్ బిల్లుపై మీ అభిప్రాయం ఏమిటి..’ అని మీడియా అడిగితే ఆయన సమాధానం... ‘మా ఆవిడ చేస్తున్న షాపింగ్ బిల్లు మీద తప్ప నాకే బిల్లుపై ఆసక్తి, ధ్యాసా లేవు..’ అని ఆ తర్వాత ఓ రోజు..‘మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్కు ఏం తెస్తుంది..? బ్యూటీపార్లర్లకు వెళ్లే బాబ్డ్ హెయిర్ మహిళలనా...’ మహిళా బిల్లుపై లాలూప్రసాద్ రియాక్షన్. చట్టసభల్లో కూర్చుని మన రాత రాసే నేతల ధోరణి ఇలా ఉంటే.. బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఓ టీవీ చానల్ కామన్ పీపుల్తో పిచ్చాపాటిగా మాట్లాడింది.. వినండి. – పార్లమెంట్లో అంత చర్చ జరుగుతోందిగా, ఈ బిల్లుపై మీ అభిప్రాయం ఏమిటని అడిగితే.. వారిలో కొందరి సమాధానాలు ఇవీ. – ‘అవునవును నేను కూడా విన్నాను. మా ఆవిడ కూడా అడిగింది. మరీ రచ్చ బాగా చేస్తున్నారు.. బిల్లు ఎక్కువ అయ్యిందా అని..’ (జోక్ ?) – ‘నాకు బిల్ క్లింటన్ మాత్రమే తెలుసు ఈ బిల్ గురించి ఐడియా లేదు..’ (లైట్?) – ఉమెన్ ఎంపవర్మెంట్ ఎప్పుడొస్తుంది..? ‘వారికి అధికారం వచ్చేసిందిగా.. క్రెడిట్ కార్డ్ల రాకతో’ (వెటకారం?) – ఉమెన్ రిజర్వేషన్ వస్తుందా..? ‘లాలూ రైల్వే కోచ్లలో మహిళలకు కొన్ని కేటాయించా డుగా..’(సరదా?) – చట్టసభల్లో మహిళల కోటా గురించి చెప్పండి. ‘ఇప్పుడు ఇంట్లో అంతా వారి పెత్తనం.. ఇక రెండు సభల్లో వారిదే పెత్తనం అవుతుంది. దేశాన్ని వారే నడుపుతారు..’ (తేలిక భావం?) బిల్లు తేవాల్సిన చట్టసభల్లో నాయకులకూ, బయట సాధారణ ప్రజలకూ ఒకే రకమైన భావజాలం ఉన్నాక, 26 ఏళ్లే కాదు ఎన్నేళ్లయినా అలాగే ఉంటుంది. మహిళా దినోత్సవం రోజో, ఎన్నికల మేనిఫెస్టోల్లోనో, ఖాళీ దొరికినప్పుడు మాట్లాడుకోవడానికో ఓ సబ్జెక్ట్ అవుతుంది. ‘రాజ్యసభ నుంచి లోక్ సభకు నడిచి వెళ్లడానికి ఐదు నిమిషాలు పడుతుంది. కానీ, రిజర్వేషన్ బిల్లుకు మాత్రం ఇన్నేళ్లయినా (రాజ్యసభ ఆమోదించిన 2010 నుంచి) లోక్ సభకు చేరనే లేదు..’ – ఇది బృందా కారత్ ఆవేదన. పైన చెప్పుకున్నట్టుగా మన పరిస్థితి ఇలాగే ఉంటే, ఎన్నాళ్లయినా బిల్లు లోక్సభ వైపు నడుస్తూనే ఉంటుంది. మనమే కాదు.. అంతటా అంతే ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం తాజా నివేదిక చూడండి ప్రపంచవ్యాప్తంగా మంత్రి పదవుల్లో ఉన్న మహిళలు 22.8 శాతమే. కేవలం 13 దేశాల్లోని కేబినెట్లలో మాత్రమే 50%, ఆపైన మహిళా మంత్రులు ఉన్నారు. మహిళలు మంత్రులుగా ఉన్నా వారికి కేటాయిస్తున్న శాఖల ప్రాధాన్యత తక్కువే. ప్రజలు నేరుగా ఎన్నుకునే దిగువ సభల్లో (లోక్సభ తరహాలో) మహిళా పార్లమెంటేరియన్లు 26.5 శాతమే. అయితే ఇది 1995లో 11%గానే ఉండగా ప్రస్తుతం కొంత మెరుగుపడింది. దిగువ సభలో 50%, అంతకన్నా ఎక్కువ మంది ఎంపీలున్న దేశాలు ఆరు మాత్రమే. రువాండాలో 61%, క్యూబాలో 53%, నికరాగ్వాలో 52%, మెక్సికో, న్యూజిలాండ్, యూఏఈలలో 50% మహిళా ఎంపీలున్నారు. ఈ ఆరింటితోపాటు మరో 17 దేశాల్లో 40% పైన మహిళా ఎంపీలు ఉన్నారు. 22 దేశాల్లో మహిళా ఎంపీలు 10% కన్నా తక్కువే -సరికొండ చలపతి -
Union Budget 2023: సీతమ్మ వాకిట్లో... మధ్యతరగతి
బడ్జెట్ ఏమి తెస్తుందో లేదో తెలియదు కానీ, ప్రతిసారీ కావల్సినన్ని చెణుకులు, మీమ్స్ మాత్రం తెస్తోంది. .... మధ్యతరగతి ఇళ్లలో తండ్రి, కొడుకుల మధ్య తరచూ వినబడే సంభాషణట ఇది వినండి... ‘కొనడం ఎన్ని రోజులు పోస్టుపోన్ చేస్తావ్ నాన్నా, ఈ ఫోన్ చూడు.’ – ... దీనికి ఏమైందిరా? ‘నాన్నా... ఎన్ని సార్లు అడుగుతావ్? రోజుకు 50 సార్లు హ్యాంగ్ అవుతోంది, మాట్లాడుతూంటేనే కట్ అవుతోంది.’ – ...అవును, కానీ మంచి ఫోనురా... ‘మంచిదే కానీ, పాతదయిపోయింది. కొత్తది కొనాల్సిందే...’ – .. సరే, చూద్దాం... ఆ తర్వాత రోజు.. ‘ఫోన్ సంగతి ఏమైంది నాన్నా...’ – సరే ఫస్ట్కు చూద్దాం... ఓ నెల తర్వాత.. ‘..ఫొటోస్, ఫైల్స్ మిస్సవుతున్నాయి నాన్నా..’ – ..ఏదీ చూద్దాం.. ‘..చూడడానికి ఏముంది.. అన్నీ పోయాయి.. కొత్తఫోన్ కొను నాన్నా. – ..అలాగే చూద్దాం.. మధ్యతరగతి జీవితాల్లో చూద్దాం... అంటే వారాలు నెలలు సంవత్సరాలు.. అన్నమాట! కొడుకు తండ్రిౖ వైపు ఆశగా చూస్తూనే ఉంటాడు.. ఏదో ఒకరోజు కొనివ్వకపోతాడా...అని. విచిత్రం ఏమిటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా అంతే.. ఈసారైనా బడ్టెట్లో ఏదైనా ఉండకపోతుందా అని ఇలా.. కొడుకుకు దొరికిన సమాధానమే కనిపిస్తుంది.. నెక్స్ట్ బడ్జెట్లో చూద్దాం.. అని. అందుకే ప్రతి బడ్జెట్లో శాలరీ శ్లాబ్లు.. తాయిలాలు ఏముంటాయో చూద్దాం అని ఆశపడడం, ఊసూరుమనడం.. నెక్స్ట్ బడ్జెట్ మీద ఆశలు పెట్టుకోవడం.. ఇదీ వరుస సరే చూద్దాం.. ఈ బడ్జెట్లో ఎలా ఉంటదో. వంటింట్లో కూడా జీఎస్టీతో తిరగమోత పెట్టి, రేట్ల ఘాటు నషాళానికి అంటించిన ఆర్థిక మంత్రి సీతారామన్ మొన్నీమధ్య మాట్లాడుతూ– ..‘ నేను కూడా మధ్యతరగతి నుంచే వచ్చాను, వారి ఒత్తిళ్లు, బాధలు నాకు తెలుసు .. ’ అని చెప్పడంతో ఇప్పటిదాకా పడ్డ వాతలు, పెరిగిన గ్యాస్, పెట్రోల్, నిత్యావసరాలు..అన్నీ మరచిపోయి మధ్యతరగతి బడ్జెట్వైపు ఆశగా చూస్తోంది. ‘గాలి పీల్చుకోనిస్తున్నాం, నీళ్లు తాగనిస్తున్నాం, తిండి తిననిస్తున్నాం.. ఇది చాలదా, ఇంకేం కావాలి..’ –పోయిన బడ్జెట్ మధ్యతరగతికి ఏమిచ్చింది.. అంటే ఓ నెటిజన్ సరదా కామెంట్. కానీ, ఓ నెటిజన్ సీరియస్ కామెంట్ చూడండి.. ‘‘సమాజాన్ని స్టేబుల్గా ఉంచేదే మధ్యతరగతి. బిజినెస్ క్లాస్కు సేవలతో, కింది తరగతికి తన పన్నులతో సపోర్ట్ చేసేదే.. మిడిల్క్లాస్. గత న లభై ఏళ్లుగా మిడిల్ క్లాస్ పెరుగుతోంది. పన్నులు చెల్లించేవారు పెరుగుతున్నారు. కాగా, పెట్రోల్, కరెంట్, కూరగాయలు, నిత్యావసరాలు.. ఇలా పెరిగిన ప్రతి రేటు మధ్యతరగతి జీవితాన్ని ఎక్కడ ఉన్నవాడిని అక్కడేవుండేట్లు చేస్తోంది. బడ్జెట్లో సరైన సపోర్ట్ లేకుంటే సమాజం, ప్రభుత్వం కూడా నష్టపోతుంది...’ దీనికి సపోర్ట్గా మరో నెటిజన్ పొలిటికల్ అనాలసిస్ ఇదీ.. ‘‘సాధారణంగా పాలిటిక్స్కు, ఓటింగ్కు దూరంగా ఉండే మిడిల్ క్లాస్ మోదీకి దగ్గరవుతున్నారు. వీరు మోదీ ర్యాలీలకు, సభలకు హాజరవడం చూస్తున్నాం. అలా కాకపోయినా, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, మోదీ చెబుతున్న నేషనలిజాన్ని నెత్తికెత్తుకుంటూ ఆయనకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. చాలా మంది మధ్యతరగతి ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక చింతన మోదీ టీమ్ నడిపిస్తోన్న హిందుత్వాన్ని బలోపేతంచేస్తున్నాయి... దీనికితోడు మోదీ తరచుగా చెప్పే ఆధునికత్వాన్ని కూడా మధ్యతరగతే ముందుకు తీసుకెళ్తోంది... వీరి సపోర్ట్ లేకుండా మోదీ విజన్ సాధ్యం కాదు.. గతంలో కంటే మిడిల్ క్లాస్ పాపులేషన్ బాగా పెరుగుతోంది. ఇది మోదీకి అనుకూలమైన విషయమే. ఈ సెక్షన్ను విస్మరించడం మోదీ గవర్నమెంట్కు అంత మంచిది కాదు.. ఈ విషయం ఆర్థిక మంత్రికీ తెలిసే ఉండాలి..’’ విద్య, వైద్యం, దైనందిన జీవితంలో పెరిగిన రేట్లు.. ప్రతిదీ మధ్యతరగతి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తదో.. ఆర్థికంగా ఎలా ఎదగకుండా చేస్తదో చెబుతూ వీటన్నింటినీ బడ్జెట్ పరిశీలించాలంటూ తన సొంత అనుభవాన్ని ఓ నెటిజన్ ఇలా పంచుకున్నారు.. ‘‘మా నాన్న ఫ్రెండ్ ఓ స్టాక్ బ్రోకర్. ఇరవై ఏళ్ల క్రితం ఆయనిచ్చిన సలహాతో మంచి షేర్లలో పెట్టుబడి పెట్టాడు. ఇప్పటికి వాటి ధర 200 రెట్లు పెరిగింది.. మేం నిజానికి లక్షాధికారులం కావాలి.. కానీ కాలేదు. కారణం చూడండి.. కొన్న రెండు సంవత్సరాలకు రెసిషన్ వచ్చింది.. నాన్న ఉద్యోగం పోయింది. 20 శాతం షేర్లు అమ్మితే ఇల్లు గడిచింది. ఆ తర్వాత ఏదో చిన్న ఉద్యోగం సంపాదించాడనుకోండి. కానీ, మరో 20 శాతం మా తాత హార్ట్ సర్జరీ కోసం అమ్ముకున్నాం. మరికొన్ని షేర్లు నాకు, తమ్ముడి చదువులకు హరించుకుపోయాయి. కొద్ది రోజులకు మరికొన్ని అక్క పెళ్లికి హారతి.. ఇలా ఒక్కో సమస్య షేర్లను తినేసింది. నాకేం అర్థమయ్యిందంటే సమాజంలో ఏం తేడా చేసినా.. అంటే మాంద్యం వచ్చినా, ఉద్యోగాలు పోయినా, ట్యాక్సులు పెరిగినా, మెడికల్ బిల్లులు పెరిగినా, చదువుల ఖర్చు పెరిగినా, రెగ్యులర్గా ఉండే కరెంట్, పాలు, నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్.. ఇవన్నీ నిరంతర మధ్యతరగతిని ఎదగకుండా జాగ్రత్త కాపలా కాస్తుంటాయి.. పై చదువులు బాగా చదివినట్లే ఉంటుంది, శాలరీ పెరిగినట్లే ఉంటుంది.. లైఫ్లో రిస్క్, సమస్యలు మాత్రం అలాగే ఉంటాయి.. వీటన్నింటినీ బడ్జెట్ పరిగణనలోకి తీసుకోవాలి...’ ఇదీ ఉద్యోగుల పరిస్థితి బడ్జెట్ ప్రసంగంలో ఆదాయ పన్ను మినహాయింపు ప్రకటనపై ఉద్యోగులు ఇలా ఎదురు చూస్తున్నారంటూ చెణుకులు సరే చూద్దాం.. ఈసారి బడ్జెట్ ఎప్పటిలాగే మీమ్స్, జోక్స్ మిగులుస్తుందా.. కాసిన్ని ఆశలు మిగులుస్తుందా.. -
లోకేష్ పాదయాత్ర పై మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు
-
నోబెల్ బహుమతికి మోదీ అర్హులే!: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నోబెల్ బహుమతికి అర్హులే.. మరి ఏ కేటగిరీలో దక్కొచ్చునని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ను కనుగొన్నందుకు మెడిసిన్ విభాగంలో ఇవ్వాలా..? నోట్ల రద్దు, స్విస్ బ్యాంకుల్లో నల్లధనం తీసుకొచ్చినందుకు ఆర్థికశాస్త్రంలో ఇవ్వాలా..? రష్యా–ఉక్రె యిన్ యుద్ధాన్ని ఆరు గంటలు ఆపినందుకు శాంతి విభాగంలో ఇవ్వాలా..? రాడార్ థియరీకి ఫిజిక్స్లో ఇవ్వాలా? అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి తన ప్రసంగంలో కోవిడ్ వ్యాక్సిన్ను మొట్టమొదట ప్రధాని మోదీ కను గొన్నారని చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ ‘సైన్స్/మెడిసిన్లో నోబెల్ బహుమతిని ప్రధానికి ఇవ్వాలని డిమాండ్ చేద్దామని’.. ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ‘కేంద్ర కేబినెట్లో అందరూ తెలివిమంతులేనని.. ముఖ్యంగా కిషన్ రెడ్డి’.. అంటూ వ్యాఖ్యానించారు. ఆస్కార్ కాకపోయినా భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి మరో వెటకారపు ట్వీట్ చేశారాయన. Modi Ji deserves Nobel prize but in which category? ❇️ Nobel for Medicine - discovering Covid Vaccine ❇️ Nobel for Economics - Demonetisation & Swiss Black Money Returns ❇️ Nobel for Peace - Stopping the Russia-Ukraine war for 6 hours ❇️ Nobel for Physics - Radar Theory — KTR (@KTRTRS) October 17, 2022 To all those BJP folks who feel that Vish Guru deserves more than a Nobel👇 I would also like to nominate Modi Ji of 2013 for his amazing histrionics & theatrical skills in criticising the then Union Govt on Rupee devaluation ఆస్కార్ కాకపోయినా భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే 👍 pic.twitter.com/QceFay8eVS — KTR (@KTRTRS) October 17, 2022 ఇదీ చదవండి: తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు! -
గొంతు పిసికి చంపేశాడు! అతన్ని విలన్ అంటారా? హీరో అంటారా ?: మంత్రి అంబటి
-
గొంతు పిసికి చంపేశాడు! అతన్ని విలన్ అంటారా? హీరో అంటారా ?’
సాక్షి, అమరావతి: ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాడు. తన మాట వినమని! వినల! గొంతు పిసికి చంపేశాడు!! అతన్ని విలన్ అంటారా? హీరో అంటారా ?’’ అంటూ ఎన్టీఆర్కు వెన్నుపోటు ఎపిసోడ్లో చంద్రబాబు పాత్రను ఉటంకిస్తూ అంబటి రాంబాబు సెటరికల్గా కామెంట్లు చేశారు. చదవండి: ‘టీడీపీ, ఎల్లో మీడియా చెప్పినట్టు మేం ఆడాలా?’ కాగా, అన్ స్ఠాపబుల్గా చంద్రబాబు అబద్దాలు చాలా బాగా చెప్పారని మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. ఆమె శుక్రవారం ఉదయం.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ మరణానికి కారణమైన చంద్రబాబు, ఆయన్ని ఆరాధ్య దైవం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబునాయుడు సీఎం కావడానికి కారణం కుప్పం ప్రజలు, కానీ కుప్పానికి ఏమి చెయ్యలేదని రోజా అన్నారు. కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాడు తన మాట వినమని! వినల ! గొంతు పిసికి చంపేశాడు!! అతన్ని విలన్ అంటారా? హీరో అంటారా ? — Ambati Rambabu (@AmbatiRambabu) October 14, 2022 -
బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నేత టీజీ వెంకటేష్ సెటైర్లు
-
TRS టు BRS: దారుణమైన సెటైర్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) కాస్త.. భారత్ రాష్ట్ర సమితి(BRS)గా మారిపోయింది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇవాళ జరిగిన టీఆర్ఎస్ సర్వ సభ్య సమావేశంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. దీంతో దేశమంతటా కేసీఆర్ ప్రకటనను ఆసక్తికరంగా వీక్షించింది. అయితే.. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు మాత్రం బీఆర్ఎస్పై వ్యంగ్యాస్త్రలు సంధిస్తున్నాయి. ఈ క్రమంలో.. తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ ట్విటర్ వేదికగా స్పందించారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారడం అనేది పందికి లిప్స్టిక్ పూసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ట్విటర్ టిల్లు ఏమో గేమ్ చేంజర్స్ అని ప్రకటించుకున్నాడు. కానీ, అయ్య ఏమో నేమ్ చేంజర్ అయ్యాడు. అంతిమంగా ఫేట్ ఛేంజర్స్ మాత్రం ప్రజలే అంటూ బీఆర్ఎస్ పరిణామంపై వ్యంగ్యంగా స్పందించారు బండి సంజయ్ కుమార్. TRS to BRS is like "Putting lipstick on a pig".#TwitterTillu Claimed to be Game Changers... But father became a Name Changer. People are the ultimate Fate Changers !! — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 5, 2022 ఇక బీఆర్ఎస్ పరిణామం ఆశ్చర్యం కలిగించిందని అంటున్నారు బీజేపీ అధికార ప్రతినిధి కే కృష్ణ సాగర్ రావు. పేరు మార్చినంత మాత్రానా జాతీయ పార్టీ ఎలా అవుతుంది?. ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తించబడాలంటే.. చాలా రాష్ట్రాల్లో గణించదగిన ఓటర్ల మద్దతు పొందాలి అని పేర్కొన్నారు. తెలంగాణ మోడల్ దేశమంతటా ఉండాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపైనా బీజేపీ సెటైర్లు పేల్చింది. తెలంగాణ మోడల్ అనేది కేవలం కేసీఆర్ ఊహ మాత్రమేనని అంటోంది. ‘‘పార్టీలు రావడం, మసకబారడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. ప్రళయం రాబోతోందని ఒకప్పుడు కేసీఆర్ చెప్పారు. అదే ఇదే(బీఆర్ఎస్ ప్రకటన) అంటూ సెటైర్ పేల్చారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. -
‘మునుగోడు’లో పోటీ ఎవరి మధ్య ?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ ఎవరి నడుమ అంటూ టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కె.తారకరామారావు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ‘ఫ్లోరోసిస్ భూతాన్ని నల్లగొండ బిడ్డలకు శాపంలా ఇచ్చిన కాంగ్రెస్, ఫ్లోరోసిస్ నిర్మూలనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథకు పైసా ఇవ్వని మానవత్వం లేని బీజేపీ, ఫ్లోరోసిస్ నుంచి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శాపవిముక్తి చేసిన టీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీనా?’అని ట్వీట్ చేశారు. ప్రధాని మోదీని విశ్వగురుగా పేర్కొంటూ మహాత్మాగాంధీని కించపరిచేలా జరుగుతున్న ప్రచారంపైనా కేటీఆర్ మండిపడ్డారు. ‘ప్రపంచమంతా ముక్తకంఠంతో విశ్వగురుగా గుర్తించిన ఏకైక భారతీయుడు మహాత్మా గాంధీ. లక్షల సంవత్సరాల పాటు స్వయం ప్రకటిత విశ్వగురు, గాడ్సేను ఆరాధించే ఆయన శిష్యులు మహాత్ముడిని ఎంతగా అవమానించినా, ఆయన భావజాలాన్ని కించపరిచేందుకు ప్రయత్నించినా విజయం సాధించలేరు’అని పేర్కొన్నారు. కాగా, యూ ట్యూబ్స్టార్ గంగవ్వను కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంటూ త్వరలో ‘మై విలేజ్ షో’లో గెస్ట్గా పాల్గొంటానని కేటీఆర్ మరో ట్వీట్లో ఆమెను కలిసిన ఫొటోను ట్యాగ్ చేస్తూ హామీ ఇచ్చారు. -
చంద్రబాబు ధరించిన ఉంగరం పై సీఎం జగన్ పంచులు
-
చంద్రబాబు ఇంగ్లీష్ పై మంత్రి పెద్దిరెడ్డి సెటైర్లు
-
అయినా మోదీని నమ్మడం చాలా కష్టం: కేటీఆర్
హైదరాబాద్: రాబోయే 18 నెలల్లో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మోదీ సర్కార్ ప్రకటనపై సానుకూలంగా స్పందించినట్లే స్పందించి.. తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఈ మేరకు వరుసగా ట్విటర్లో ట్వీట్లు చేశారాయన. తెలంగాణలో ప్రైవేట్ రంగంలో 16 లక్షల ఉద్యోగాలు కల్పించాం. ఈ ఎనిమిదేళ్లలో పెట్టుబడుల ద్వారా ఎన్ని ఉద్యోగాలు సృష్టించారో, దేశంలోని యువతకు తాము వాగ్దానం చేసిన 16 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు లభిస్తాయో ప్రధాని మోదీ తెలియజేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ.. సాపేక్షంగా చిన్న రాష్ట్రం. గత ఎనిమిదేళ్లలో 1,35,000 ఉద్యోగాలను భర్తీ చేశాం. మరో 1 లక్ష ఉద్యోగాల నియామకం మొదలైంది. అదే నిష్పత్తిలో.. 2014 నుండి 140 కోట్ల భారత జనాభా కోసం మోదీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలను సృష్టించింది? నిరుద్యోగ సమస్య మీద ప్రతిపక్ష పార్టీలు, దేశంలోని నిరుద్యోగ యువత తెస్తున్న భారీ ఒత్తిడికి ధన్యవాదాలు. ప్రధాని మోదీ రాబోయే 18 నెలల్లో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. అది స్వాగతించాల్సిన నిర్ణయమే! అదే సమయంలో, అనేక హామీలు నెరవేర్చని కారణంగా ఆయన్ని నమ్మడం కష్టం అని కేటీఆర్ వరుస ట్వీట్లు చేశారు. Thanks to the huge pressure exerted by the opposition parties and the unemployed youth of the country, PM Modi announced to fill 10 lakh govt jobs in the next 18 months. Welcome the decision! At the same time, it's difficult to trust him as there were many unfulfilled promises — KTR (@KTRTRS) June 15, 2022 -
మీది ఎన్డీఏనా.. ఎన్పీఏనా?.. కేంద్రంపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు మంగళవారం ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి దేశంలో నిరుద్యోగం పెరిగింది. 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయికి ద్రవ్యోల్బణం చేరింది. ఇంధన ధరలు పెరగడంతోపాటు ఎల్పీజీ సిలిండర్ ధర ప్రపంచంలోనే అతిఎక్కువ ధరకు చేరుకుంది. వినియోగదారుల నమ్మకం అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు చెప్తోంది. దీనిని ఎన్డీఏ ప్రభుత్వం అనాలా లేక ఎన్పీఏ ప్రభుత్వం అనాలా? భక్తులారా.. ఎన్పీఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ (నిరర్ధక ఆస్తులు) అని అర్థం’అంటూ ఎద్దేవా చేశారు. తమ కార్యకర్తలకు వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకుంటే యుద్ధం చేస్తామంటూ వీహెచ్పీ వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలపైనా కేటీఆర్ స్పందించారు. ‘కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారూ.. వీళ్లందరూ ఈ దేశ రాజ్యాంగం, పీనల్ కోడ్ నిబంధనలకు అతీతులా? మీ అధికార పరిధిలో ఉన్న ఢిల్లీ పోలీసులకు ఇలాంటి దారుణ పరిస్థితులను మీరు సహిస్తారా?’అని ప్రశ్నించారు. (చదవండి: కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేయాలి) బెంగళూరులో పెట్టుబడులివిగో! కర్ణాటకలో నెలకొన్న పరిస్థితుల్లో పెట్టుబడిదారులు హైదరాబాద్కు రావాలంటూ మంత్రి కేటీఆర్ గతంలో చేసిన ట్వీట్పై కర్ణాటక డెవలప్మెంట్ ఇండెక్స్ గ్రూప్ స్పందించింది. ‘కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు పరిసరాల్లో సుమారు రూ. 11,500 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 46,984 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వం ఆమోదించిన పరిశ్రమల జాబితాలో రెండు లిథియం అయాన్ సెల్ యూనిట్లు, ఎక్సైడ్ ప్లాంటు ఉన్నాయి’ అని పరిశ్రమల జాబితాను కేటీఆర్ ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేసింది. (చదవండి: రాహుల్ రాకతో ’సీన్’ మారాల్సిందే) -
ప్రధాని మోదీపై మరోసారి కేటీఆర్ వ్యంగ్యం
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి.. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా మరోసారి వ్యంగ్యం ప్రదర్శించారు. గత రెండు వారాల్లో.. దేశవ్యాప్తంగా దాదాపు 10రూ. పెరిగిన పెట్రో ధరలను ప్రస్తావిస్తూ కేటీఆర్ మంగళవారం ఉదయం ఓ ట్వీట్ చేశారు. దేశంలో జీడీపీ దూసుకెళ్లడం లేదని ఎవరన్నారు?. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు రోజూ పెంచుతూ.. జనాలకు దానిని ఒక అలవాటుగా మార్చినందుకు ప్రధాని మోదీగారికి ధన్యావాదాలు. బీజేపీలో మేధావులైన కొందరు నేతలు.. ఇప్పుడు ఇదంతా ఈవీ(ఎలక్ట్రిక్ వాహనాలను)లను ప్రమోట్ చేసేందుకు మోదీగారు చేస్తున్న మాస్టర్ స్ట్రాటజీ అని చెప్పుకుంటారు కూడా అని ట్వీట్ చేశారు కేటీఆర్. Who says GDP is not going up? Thank You dear Modi Ji for the making this Gas Diesel & Petrol hike as a daily habit for all Indians👏 Am sure there will be some bright BJP folks who will tell us now that this is Modi Ji’s master strategy to promote EVs 👍 https://t.co/6Ah3dmzhSO — KTR (@KTRTRS) April 5, 2022 ఇదిలా ఉండగా.. ఒకవైపు ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం వర్సెస్ తెలంగాణ మధ్య వాడీవేడిగా విమర్శలు కొనసాగుతుండగా.. మరోవైపు ధరల పెంపుదలపై టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీస్తోంది. సంబంధిత వార్త: మోదీజీ.. మీ మాటలు గుర్తున్నాయా? -
UP Election 2022: అయోధ్య కాదు గోరఖ్పూర్
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ఇన్చార్జి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం మధ్యాహ్నం ఒక లిస్ట్ను ప్రకటించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.. ఈ ఎన్నికల్లో గోరఖ్పూర్ నుంచి బరిలోకి దిగుతుండడం విశేషం. ఈ నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బీజేపీ, యోగిపై సెటైర్లు పేల్చాడు. ఇంతకు ముందు ఆయన అయోధ్య, మథుర, ప్రయాగ్రాజ్ నుంచి యోగి పోటీ చేయొచ్చని బీజేపీ బహిరంగంగా ప్రకటించుకుంది. ఇప్పుడేమో ఆయన్ని.. బీజేపీ ఆయన సొంత స్థానానికే పంపించింది. యోగిగారు మీరు అక్కడే ఉండిపోండి. మీరు మళ్లీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అంటూ సెటైర్లు పేల్చాడు అఖిలేష్. ఇదిలా ఉంటే.. పార్టీ ప్రకటన తర్వాత ‘పార్టీ ఎక్కడి నుంచి ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాన’ని సీఎం యోగి ప్రకటించడం తెలిసిందే. అయితే గోరఖ్పూర్ ఎంపికపై యోగి అసంతృప్తితో ఉన్నారంటూ వస్తున్న మీడియా కథనాలను రాష్ట్ర ఇన్చార్జి ధర్మేంద్ర ప్రధాన్ కొట్టిపారేశారు. గతంలో యోగి గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ మఠ్లోమహంత్(ప్రధాన అర్చకుడిగా) పని చేశారు. ఆపై రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం ప్రారంభించాక.. గోరఖ్పూర్ పార్లమెంట్ స్థానంలో 1998 నుంచి ఐదుసార్లు వరుసగా ఐదు సార్లు ఎంపీగా గెలుపొందారు. 2017 నుంచి ఎమ్మెల్సీ హోదాలో యూపీ సీఎంగా ఆయన కొనసాగుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నుంచి మొట్టమొదటిసారి పోటీ చేయనున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గోరఖ్పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక మొదటి, రెండో దశ పోలింగ్కు సంబంధించి.. మొత్తం 105 మంది అభ్యర్థులతో కూడిన లిస్ట్ను రిలీజ్ చేసింది బీజేపీ. ఇందులో 63 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపేర్లు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 10 నుంచి మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. రెయిన్బో కూటమి ద్వారా ప్రాంతీయ పార్టీలతో జతకట్టిన మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.. రూలింగ్ పార్టీకి గట్టి పోటీనే ఇవ్వబోతున్నారు. కొన్నిసర్వేలు యోగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుండడంతో ఎస్పీకి జంప్ అవుతున్న బీజేపీ నేతల సంఖ్య పెరుగుతూ వస్తోంది. -
ఏలియన్ల అన్వేషణ! ప్చ్.. ఇలాంటివన్నీ చైనాకే కనిపిస్తాయా?
Cube Shaped House On Moon, Viral Photos: ఛాన్స్ దొరికిందంటే చాలు.. చైనావాళ్లను సోషల్మీడియాలో ఒక రేంజ్లోనే ఆడేసుకోవడం మనవాళ్లకు బాగా అలవాటైంది. అంతెందుకు కరోనా వైరస్ విషయంలో చైనా పాత్రను ధృవీకరించేసుకుని మరీ ఆడుకున్నంత ఆట అంతా ఇంతా కాదు. ఈ తరుణంలో ఇప్పుడు మరో సెటైర్ పేలుతోంది. చైనాకు చెందిన రోవర్ ‘యుటు-2’ 2019లో చంద్రుడి మీదకు చేరి, పరిశోధనలు మొదలుపెట్టింది. అయితే తాజాగా ఇది చంద్రుడి మీద క్యూబ్ ఆకారంలో ఒక వస్తువును గుర్తించింది. ఆ ఫొటోల్ని చైనా స్పేస్ ఏజెన్సీ సీఎన్ఎస్ఏ (China National Space Administration) రిలీజ్ చేసింది. వోన్ కర్మన్ ప్రాంతానికి 80 మీటర్ల దూరంలో గుర్తించినట్లు వెల్లడించారు. ఇక్కడి నుంచే అసలు విషయం మొదలైంది. ఇదొక మిస్టరీ హౌజ్ కావొచ్చని, బహుశా ఏలియన్ల నివాసం కావొచ్చని చైనా స్పేస్ రీసెర్చర్లు ముందస్తు ప్రకటనలు ఇచ్చుకున్నారు. మరొకొన్ని రోజుల్లో ఏలియన్ల మిస్టరీ గుట్టు తేలుస్తామంటూ తొందరపడి అధికారిక మీడియా ద్వారా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అంతే.. రాళ్లు, రప్పాలపై చైనా చేస్తున్న అతివ్యహారంపై సెటైర్లు పడుతున్నాయి. ఇక ఇలాంటి వన్నీ చైనా వాళ్లకే కనబడతాయంటూ ఇంటర్నెట్లో మనవాళ్లు జోకులు, దొరికితే సూప్ చేసుకుని తాగుతారా? అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. సాధారణంగా యూఎఫ్వో-అమెరికా మీద ఎక్కువ ఇంటర్నెట్లో వెటకారం కనిపిస్తుంటుంది. pic.twitter.com/OrhWdHroDt — Joseph VR777 (@JosephRuggiero4) December 5, 2021 కానీ, చైనా మీద మాత్రం ఏలియన్ల వ్యవహారంలో జోకులు పేలుతుంటాయి. అందుకు కారణం లేకపోలేదు. చైనా ఏకంగా ఏలియన్ల ఉనికి కోసమే అడ్డగోలుగా ఖర్చు పెడుతోంది. ఇదివరకే ఏలియన్ల ఉనికిని పసిగట్టడం కోసం భారీ టెలిస్కోప్ రాడార్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేసిన డ్రాగన్ కంట్రీ.. ప్రత్యేకమైన స్పేస్ సెంటర్ టియాన్గోంగ్ను కూడా అందుకే నిర్మిస్తోందంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే చంద్రుడిపై కనిపించిన ఆ ఆకారం.. ఏ స్థూపమో లేదంటే ఏలియన్లకు సంబంధించిందో కాదని, కానీ, ఆసక్తిని రేకెత్తించేదిగా ఉందంటూ స్పేస్ డాట్ కామ్ జర్నలిస్ట్ ఆండ్రూ జోన్స్ తెలిపారు. రోవర్ నుంచి ఆ నిర్మాణానికి కేవలం 80మీటర్ల దూరమే ఉంది. కానీ, చేరుకోవడానికి 3 నెలల టైం పడుతుందట!. అప్పుడుగానీ అదెంటో మిస్టరీ వీడుతుందన్నమాట. It's an Amazon delivery. — Sandra Sarff (@SandySarff) December 5, 2021 pic.twitter.com/c9alRuvUtQ — ConnorJC (@ConnorJConroy) December 6, 2021 It's a Chinese photo shop — Ross Probert (@probiesr) December 4, 2021 చదవండి: ప్రపంచానిది ఓ దారి.. చైనాది మరో దారి! ఏలియన్ల కోసం ఆరునెలలు.. -
సెటైర్: మా ఎన్నికల కోసం చైనా అధ్యక్షుడు!!
మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల వేడి రోజురోజుకీ రాజుకుంటోంది. ఈ తరుణంలో చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ మా ఎన్నికల కోసం రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది? ఎవరికీ అందని ఈ ఊహను తన కామెడీ టైమింగ్తో తెర మీదకు తెచ్చాడు సీనియర్ నటుడు బ్రహ్మాజీ. చైనా అధ్యక్షుడు జింగ్పిన్ నటుడు బ్రహ్మాజీకి ఏకంగా షేక్హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ, కరోనా జాగ్రత్తతో మన నటుడు మర్యాదపూర్వకంగా ఆ షేక్హ్యాండ్ను తిరస్కరించి.. నమస్తే పెట్టాడు. పైగా ఆ ఫొటోలో జింగ్ పిన్ కనీసం మాస్క్ లేకుండా ఉన్నాడు. అఫ్కోర్స్.. అది జింగ్ పిన్ పాత ఫొటోనే అయినా ఎడిటింగ్ గమ్మత్తుతో భలేగా దానిని ప్రజెంట్ చేశాడు బ్రహ్మాజీ. ‘‘క్యాజువల్ మీట్.. ఎలాంటి రాజకీయాలు లేవు. కాకపోతే మా ఎన్నికల గురించి చర్చించాం. జింగ్ పిన్ కొన్ని సలహాలు ఇచ్చాడు. అలాగే..’’ అంటూ ఫన్నీ ఎమోజీతో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు బ్రహ్మాజీ. ఇక తన తోటి నటులతో పాటు సమకాలీన విషయాలపై సెటైర్లు వేసే బ్రహ్మాజీ.. ఈమధ్యే తనకు భారీగా బంఫర్లాటరీ తగిలిందంటూ ‘ఫేక్ స్కాంకు సంబంధించిన ఒక అలర్ట్ మెసేజ్ను నెటిజన్స్ దృష్టికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Actor Brahmaji (@brahms25) చదవండి: మా ఎన్నికల్లో మరో ట్విస్ట్.. బరిలో ఆయన! -
ఆనందయ్య మందు: జగపతి బాబుపై బాబు గోగినేని సెటైర్లు
ఒకపక్క కరోనాకు విరుగుడుగా, సంజీవనిగా ఆనందయ్య మందును లక్షలమంది భావిస్తుంటే.. మరోవైపు హేతువాది బాబు గోగినేని మొదటి నుంచి మందు శాస్త్రీయతపై వెటకారం ప్రదర్శిస్తూ వస్తున్నాడు. అయితే ఆనందయ్య మందుకు టాలీవుడ్ నటుడు జగపతి బాబు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగపతి బాబును టార్గెట్ చేస్తూ బాబు గోగినేని వ్యంగ్యంగా ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశాడు. ‘అమ్మ నాటీ! తమరు దుకాణం తెరవబోతున్నట్టు చెప్పకుండా.. ఆనందయ్య చట్నీ గుణగణాలు మెచ్చుకుంటూ మాట్లాడటం భలే బిజినెస్ టాక్టిక్ యాక్టర్ గారూ.. కానీ తెలివైనవాడు ఎవడైనా కొంచెం ఆగి చెప్పేవాడు. ఈ ఆత్రం మనకే చేటు’ అంటూ జగపతిబాబుపై పోస్ట్ పెట్టారు బాబు గోగినేని. జగపతిబాబు ఆయుర్వేదం బిజినెస్లోకి అడుగుపెట్టబోతున్నారంటూ, జూబ్లిహిల్స్లో ఆస్పత్రి తెరవబోతున్నారంటూ ఓ లోకల్ ఇంగ్లీష్ వెబ్ సైట్లో వార్త వచ్చింది. ఆ వార్తను ఆధారంగా చేసుకుని ఇలా జగపతిబాబుపై సెటైర్లు వేశారు బాబు గోగినేని. మరి దీనిపై జగపతి బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే ఎవడు నమ్మినా.. నమ్మకపోయినా.. నేను నమ్ముతున్నా అంటూ గతంలో జగపతి బాబు ఆనందయ్య మందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. ‘ఆయుర్వేదం అనేది తప్పు చేయదు.. శరీరానికి హానిచేయదు. ప్రకృతి, భూదేవి తప్పు చేయవు. ప్రజల్ని కాపాడటానికి ప్రకృతి ఆనందయ్య మందు రూపంలో మన ముందుకు వచ్చింది. ఈ ప్రపంచాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నా.. ఆనందయ్యని దేవుడు ఆశీర్వదించాలి అంటూ ఈ సీనియర్ నటుడు వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ఆనందయ్య గారి మందు శాస్త్రీయంగా అనుమతి పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. చదవండి: గుర్తుపెట్టుకోండి ఇది వార్నింగ్ మాత్రమే! Looks like mother nature has come to our rescue. Praying that #Anandayya garu's therapy is authentically approved and will save the world. God bless him pic.twitter.com/fvF1ydYqzS — Jaggu Bhai (@IamJagguBhai) May 25, 2021 -
ఉపేంద్రపై యంగ్ హీరో సెటైర్లు.. ఫ్యాన్స్ ఆగ్రహం
బెంగళూరు: కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రను టార్గెట్ చేసి యంగ్ హీరో చేతన్ చేసిన వ్యాఖ్యలు శాండల్వుడ్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ మధ్యే ‘నన్ను సీఎంను చేస్తారా?’ అని ప్రజలకు ట్విట్టర్ ద్వారా ఓ బహిరంగ లేఖ రిలీజ్ చేసిన ఉప్పీ.. కులరాజకీయలపై ప్రజాకీయ పార్టీ అభిప్రాయం వెల్లడిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అయితే ఉపేంద్ర స్టాండ్పై సెటైర్లు వేస్తూ యువ నటుడు చేతన్ అహింసా ఓ వీడియోను రిలీజ్ చేయడం దుమారం రేపుతోంది. ‘‘మా సెలబ్రిటీలలో కొంతమంది కులం, వివక్ష గురించి చర్చించకుండా ఉండడం వల్ల సమస్యలు శాశ్వత్వంగా పరిష్కారం అవుతాయని అనుకుంటున్నారు. ఇది నవ్వులాట కాదా? ఒక రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే పరిష్కారించడమే. అలాగే కుల వివక్ష ఈ సొసైటీలో ఒక జబ్బులాంటిది. తన వ్యాఖ్యల ద్వారా ఆ వ్యక్తి ఎంత గొప్పవాడో, ఎంతగా పరిణితి చెందాడో అర్థం చేసుకోవచ్చు’’ అంటూ చేతన్ వీడియోలో పరోక్షంగా ఉపేంద్రపై సెటైర్లు వేశాడు. దీంతో ఉప్పీ ఫ్యాన్స్ చేతన్పై మండిపడుతున్నారు. చేతన్కు అంత అర్హత లేదని విమర్శిస్తున్నారు. అయితే ఈ విషయంలో చేతన్, అంబేద్కర్ ప్రస్తావన తీసుకురావడాన్ని మరో స్టార్ హీరో దర్శన్ తప్పుబడుతూ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, కులరాజకీయాల గురించి మాట్లాడుతూ.. చివర్లో వాటికి తన పార్టీ దూరమని ఉప్పీ ఆ వీడియోలో తెలిపాడు. ಜಾತಿ / caste (1/2) pic.twitter.com/nHnTnF3Qyc — Chetan Kumar / ಚೇತನ್ (@ChetanAhimsa) May 27, 2021 కాగా, విదేశాల్లో చదువుకుని వచ్చిన 38 ఏళ్ల చేతన్.. డజన్కి పైగా సినిమాల్లో నటించాడు. నటుడిగానే కాకుండా తన సహాయక కార్యక్రమాలతో కన్నడనాట మంచి పేరు సంపాదించుకున్నాడు. 2010లో మేఘ అనే అమ్మాయిని పెండ్లి చేసుకున్న చేతన్.. తన వివాహానికి వచ్చిన అతిథులకు రాజ్యాంగ ప్రతులను రిటర్న్ గిఫ్ట్గా అందించి వార్తల్లో నిలిచాడు. -
‘మోదీజీ రంగు కళ్లద్దాలు తీసి చూస్తే అన్నీ కనిపిస్తాయి’
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19తో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మోదీ ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. రంగుల కళ్లద్దాలు తీసేసి ప్రజల కష్టాలు చూడాలని ప్రధాని మోదీకి సలహా ఇచ్చారు. ఆ కళ్లద్దాలు పెట్టుకుంటే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు తప్ప మరేదీ కనిపించదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్కు కొత్త భవనం, ప్రధానమంత్రికి కొత్త నివాసం నిర్మాణం వంటి వాటికి వెచ్చించే డబ్బును దేశంలో వైద్య సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనకు వెచ్చించాలని డిమాండ్ చేశారు. ‘లెక్కలేనన్ని మృతదేహాలు నదుల్లో కొట్టుకు వస్తున్నాయి. ఆస్పత్రుల వద్ద మైళ్ల పాడవున క్యూలు ఉంటున్నాయి. ప్రజల జీవించే హక్కును లాగేసుకున్నారు. ప్రధాని మోదీ, తన లేత రంగు కళ్లద్దాలను తీసి చూడాలి. వాటిని ధరిస్తే ఆయనకు సెంట్రల్ విస్టా తప్ప మరేదీ కనిపించదు’అని మంగళవారం రాహుల్ ట్విట్టర్లో సెటైర్లు వేశారు. ఈ కష్ట సమయంలో అవసరాల్లో ఉన్న వారిని ఆదుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్లు, టీకాల కొరత, ప్రజలు వాటికోసం పడుతున్న ఇబ్బందులతో కూడిన వీడియోను పోస్ట్ చేశారు. కోవిడ్ బాధితులకు సాయ పడేందుకు కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసింది. చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ చదవండి: ఆవు పేడతో కరోనా అస్సలు తగ్గదు.. వేరే సమస్యలు వస్తాయి नदियों में बहते अनगिनत शव अस्पतालों में लाइनें मीलों तक जीवन सुरक्षा का छीना हक़! PM, वो गुलाबी चश्में उतारो जिससे सेंट्रल विस्टा के सिवा कुछ दिखता ही नहीं। — Rahul Gandhi (@RahulGandhi) May 11, 2021 -
గెలిచిన వాళ్లే దాడి చేస్తున్నారా? వర్మ సెటైర్లు
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్ హింసాకాండ ఘటనపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. సాధారణంగా ఓడిపోయిన వారు హింసకు పాల్పడతారు. కానీ చరిత్రలో మొదటిసారి విజేతలు ఓడిపోయిన వారిపై దాడిచేస్తున్నారని వింటున్నాను.. పాత కక్షల ప్రభావం అనుకుంటా అంటూ తనదైన శైలిలో ట్విటర్లో సెటైర్లు వేశారు. ఈ విధ్వంసానికి టీఎంసీ నాయకత్వం మద్దతు ఇస్తుందంటే నమ్మశక్యంగా లేదు. ఇంత ఘన విజయం సాధించిన తరువాత హింసకు పాల్పడాల్సిన అవసరం ఏముందబ్బా... అయినా ఉన్మాదంతో చెలరేగిపోతూ తోడేళ్లుగా వ్యవహరిస్తున్న వారికి మనం ఎంత చెప్పినా అర్థంకాదు అంటూ ట్వీట్ చేశారు. కాగా ఫలితాల తరువాత టీఎంసీ కార్యకర్తలు రెచ్చిపోయారని, తీవ్ర హింసకు తెగబడ్డారని బీజేపీ ఆరోపిచింది. ఈ దాడిలో బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని వేలాదిమంది కార్యకర్తల ఇళ్లను ధ్వంసం చేశారని మండిపడింది. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం హుటాహుటిన కోల్కతా చేరుకున్నారు. బాధిత కుటుంబాను పరామర్శించారు. టీఎంసీ గూండాలు బీజేపీ కార్యకర్త హరన్ అధికారి ఇంటిని ధ్వంసం చేశారు, అతడిని తీవ్రంగా కొట్టడంతో మరణించారని మండిపడ్డారు. మహిళలు, పిల్లలపై కూడా దాడి చేశారంటూ టీఎంసీపై ఆరోపణలు గుప్పించారు. మరోవైపు బీజేపీ ఆరోపణలను టీఎంసీ ఇప్పటికే తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. I find it hard to believe the W B violence is backed by TMC leadership because after such a resounding victory why would they need to do this ? Hooligans indulging in mind less violence are nearest to mad wolves and hence can never be really made to understand — Ram Gopal Varma (@RGVzoomin) May 4, 2021 Always in history,sore losers indulge in violence ..First time I am hearing winners going after losers ..Have a feeling there could be PURANI DUSHMANI — Ram Gopal Varma (@RGVzoomin) May 4, 2021 చదవండి: బెంగాల్లో హింస, సుప్రీంకోర్టుకు బీజేపీ -
ప్రెస్మీట్కి ముందస్తు కసరత్తా?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పదవీ ప్రమాణ స్వీకారం చేశాక గురువారం నిర్వహించిన తొలి మీడియా సమావేశం తీవ్ర విమర్శలకు దారి తీసింది. విలేకరుల అడిగిన ప్రశ్నలకు ఆయన నోట్స్ చూసుకుంటూ సమాధానాలు ఇవ్వడంతో అందరూ విస్తుపోయారు. 78 ఏళ్ల వయసున్న బైడెన్ ఎన్నో ప్రశ్నలకు రాసుకొని వచ్చిన సమాధానాల్ని చూసి చదివారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై సెటైర్లు వేస్తూ కామెంట్లతో హోరెత్తించారు. బైడెన్ సమావేశంలోని ఒక ఫొటోలో ఆయన చేతిలో ఉన్న పేపర్లో కొందరి విలేకరుల ఫొటోలు రౌండ్ ఆఫ్ చేసి ఉండడంతో, కొంత మంది ఎంపిక చేసుకున్న జర్నలిస్టులకే ప్రశ్నలు వేయడానికి ఆయన అవకాశం ఇచ్చినట్టుగా ట్విట్టర్ వేదికగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ పేపర్లో మార్క్ చేసి ఉన్న విలేకరుల పేర్లనే ఆయన పిలిచారని, వారేం ప్రశ్నలు అడుగుతారో ఆయనకు ముందే తెలుసునని పలువురు నిందించారు. ‘‘ఇది మీడియా సమావేశం కాదు. సూడో ప్రజాస్వామ్యంలో జరిగిన ఒక నాటకం’’అని న్యూయార్క్ టైమ్స్ కాలమిస్టు కాండెస్ ఓన్స్ విరుచుకుపడ్డారు. బైడెన్ ఈ సమావేశంలో కరోనా వ్యాక్సినేషన్, సరిహద్దు సమస్యలు, వలస విధానంపై అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. బైడెన్ పదవీ ప్రమాణం చేసి రెండు నెలలు గడిచిపోయినా మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదన్న విమర్శలు వచ్చాయి. -
ప్రధాని మోదీకి చిదంబరం గట్టి కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ : బడ్జెట్ సెషన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘ఆందోళన జీవి’ అని చెప్పుకునేందుకు తాను గర్విస్తానంటూ ప్రకటించారు. అలాగే మహాత్మాగాంధీ అత్యుత్తమ ఆందోళన జీవి అని పేర్కొన్నారు. ప్రతి నిరసనలోనూ, దేశానికి పరాన్నజీవులుగా ఉంటున్న ఆందోళన జీవులు వాలిపోతారంటూ విమర్శలు గుప్పించిన మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చిదంబరం బుధవారం ఈ మేరకు ట్వీట్ చేశారు. కాగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ఉద్యమకారులకు మద్దతిస్తున్న వారిపై సెటైర్లు వేశారు. మనుషుల్లో రకరకాల జీవులు ఉన్నట్లే, మన దేశంలో కొత్త రకమైన జీవులు ‘ఆందోళన జీవులు’ తయారయ్యారంటూ వ్యంగ్యోక్తులు విసారు. లాయర్లు, విద్యార్థులు, కార్మికులు, దేశంలో ఎవరు,ఎక్కడ, నిరసన చేపట్టినా, ఈ ఆందోళన జీవులు అక్కడ ప్రత్యక్షం అవుతుంటారు. వాళ్లు పరాన్న జీవులు, ఆందోళన లేకుండా ఉండలేరన్నారు. ఇలాంటి ఆందోళన జీవులు, విదేశీ విధ్వంసక సిద్ధాంతకారులు (ఎఫ్డీఐ)ల గుర్తించి, వారినుంచి దేశాన్ని రక్షించుకోవాలంటూ ప్రధాని ఉద్యమకారులపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. I am a proud andolan jeevi. The quintessential andolan jeevi was Mahatma Gandhi.#iamanandolanjeevi — P. Chidambaram (@PChidambaram_IN) February 10, 2021 -
వ్యాగన్ఆర్ అంత ఘోరమా : టాటా మోటార్స్ సెటైర్లు
సాక్షి, ముంబై: భద్రతా ప్రమాణాల విషయంలో మెరుగైన రేటింగ్ సాధించిన ప్రముఖ కార్ల సంస్థ టాటా మోటార్స్ ప్రత్యర్థులను టార్గెట్ చేస్తోంది. తాజాగా మారుతి సుజుకిని లక్ష్యంగా చేసుకుంది. మారుతి సుజుకి వాహనం వ్యాగన్ఆర్పై సెటైర్లు వేసింది. ఇటీవలికాలంలో సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్న టాటా మెటార్స్ భద్రతా క్రాష్ పరీక్షలలో విఫలమైన పోటీ సంస్థల కార్లపై వరుసగా వ్యంగ్యంగా ట్వీట్ చేస్తోంది. ఇప్పటికే హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్, మారుతి ఎస్-ప్రెస్సోపై విమర్శలు చేసింది. (ఎస్బీఐతో బెంజ్ జట్టు: ప్రత్యేక ఆఫర్లు) చక్రం ఊడిపోయిన ఇమేజ్ను ట్వీట్ చేస్తూ, భద్రత ముఖ్యం స్మార్ట్గా ఉండాలంటూ సూచించింది. అంతేకాదు కారు స్పెల్లింగ్లో కావాలనే ‘R’చేర్చడం గమనార్హం. మారుతి వాగన్ఆర్ గ్లోబల్ ఎన్సీఏపీ భద్రతా క్రాష్ పరీక్షలలో పేలవమైన రేటింగ్ను పొందిన సంగతి తెలిసిందే. ఇటీవల గ్లోబల్ కార్ సేఫ్టీ రేటింగ్ ఏజెన్సీ గ్లోబల్ ఎన్సీఏపీ 2014-2019 మధ్య వచ్చిన కార్లలో సురక్షితమైన భారతీయ కార్ల జాబితాను ప్రకటించింది. ఇందులో మారుతి ఎస్-ప్రెస్సో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, కియా మోటార్స్ సెల్టోస్ ఎస్యూవీ రేటింగ్ దారుణంగా ఉండగా, టాటా మోటార్స్ కార్లు నెక్సాన్, ఆల్ట్రోజ్ ఫైవ్ స్టార్ క్రాష్ రేటింగ్ను పొందాయి. ఇంకా టిగోర్, టియాగో కూడా సురక్షితమైన కార్లుగా పేర్కొంటూ ఫోర్-స్టార్ రేటింగ్ ఇచ్చింది. Safety is 'two' important to be ignored. Be smart before someone overturns your caRt. Choose Tiago, the safest car in the segment, rated 4 stars by GNCAP. Click on https://t.co/x9nKgE745s to book now.#Tiago #NewForever #SaferCarsForIndia pic.twitter.com/3k8Ughat0C — Tata Motors Cars (@TataMotors_Cars) November 22, 2020 -
ఆపిల్పై శాంసంగ్ సెటైర్లు
సాక్షి, ముంబై: పర్యావరణం, ఖర్జుల తగ్గింపు పేరుతో 2021లో చార్జర్ లేని మొబైల్ ఫోన్లు విక్రయించాలని పలు కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. ముఖ్యంగా మొబైల్ తయారీ దిగ్గజాలు ఆపిల్, శాంసంగ్ కంపెనీలు ఈ దశగా అడుగులు వేస్తున్నాయనీ ఇప్పటికే పలు అంచనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే ఆపిల్ తాజా ఐఫోన్ 12 లో ఇయర్ ఫోన్స్ తో పాటు, చార్జర్ ను కూడా ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. దీనిపై ఇప్పటికే పలువురు యూజర్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరోవైపు ప్రత్యర్థి కంపెనీ శాంసంగ్ ఆపిల్ ను ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఇది వైరల్ గా మారింది. (యూజర్లకు షాక్ : ఐఫోన్ 12లో అవి మిస్) శాంసంగ్ మీకు ఏం కావాలో అది ఇస్తుంది.. ముఖ్యంగా చార్జర్, ఉత్తమమైన కెమెరా, మంచి బ్యాటరీ, పనితీరు, మెమరీ, 120 హెర్ట్జ్ స్క్రీన్ వరకు అన్ని ఇస్తున్నామంటూ ఫేస్బుక్లో ఎగతాళిగా ఒక పోస్ట్ పెట్టింది. దీంతో పాటు గెలాక్సీ ఫోన్ల బ్లాక్ ఛార్జర్ ఫోటోను కూడా షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ ఆన్లైన్లోభారీగా వైరల్ అయ్యింది, 70వేల లైక్స్, 10వేల కంటే ఎక్కువ ఫన్నీ కమెంట్స్ సొంతం చేసుకుంది. మరికొంతమంది భిన్నంగా స్పందించారు. మీరు రెండు సంవత్సరాల తరువాత ఇదే పని చేయబోతున్నారుగా. దానికోసం ఈ పిక్ సేవ్ చేసుకుంటానంటూ మరొకరు వ్యాఖ్యానించారు. -
ఐపీఎల్ : ఒమర్ అబ్దుల్లా సెటైర్లు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2020)నిర్వహణకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై స్పందించారు. చైనా కంపెనీలు ఐపీఎల్ క్రికెట్ టోర్నీ టైటిల్ స్పాన్సర్లుగా ఉండటంపై అబ్దుల్లా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (10న ‘ఫైనల్’ చేశారు) వివో సహా ఇతర చైనా కంపెనీలను కొనసాగించాలన్న బీసీసీఐ కౌన్సిల్ నిర్ణయంపై ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. ఒకవైపు చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలకు చెబుతారు మరోవైపు చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీలను స్పాన్సర్ కంపెనీలుగా కొనసాగిస్తారంటూ విమర్శలు గుప్పించారు. లడాఖ్ సరిహద్దుల్లో చైనా దళాలు మన భూభాగాల్లోకి చొరబడుతుంటే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్లుగా వీవోను కొనసాగించడంలో అర్థం లేదన్నారు. చైనీస్ మనీ, ఇన్వెస్ట్ మెంట్, స్పాన్సర్ షిప్, అడ్వర్టైజింగ్ విషయాల నిర్వహణలో ఈ గందరగోళ వైఖరిపై చైనా ముక్కున వేలేసుకోవడంలో ఆశ్చర్యం లేదంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ పరిణామం తరువాత చైనా టీవీలను బాల్కనీల నుంచి విసిరి పారేసిన వారి మానసిక పరిస్థితిపై ఆయన విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. పాపం ఇడియట్స్ అంటూ అబ్దుల్లా సెటైర్లు వేశారు. ఇండియాలో కరోనా మహమ్మారి నేపధ్యంలో యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ తేదీలను బీసీసీఐ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వరకూ ఐపీఎల్ పోటీలు జరగనున్నాయి. అబుదాబి, దుబాయ్, షార్జాలలో 51 రోజుల పాటు జరగనున్న క్రికెట్ మ్యాచ్ లకు స్పాన్సర్ కంపెనీలుగా చైనా కంపెనీల్ని కూడా ఆమోదించడం విమర్శలకు తావిస్తోంది. BCCI/IPL governing council has decided to retain all sponsors including the big Chinese ones. I feel bad for those idiots who threw their Chinese made TVs off their balconies only to see this happen. — Omar Abdullah (@OmarAbdullah) August 2, 2020 BCCI/IPL governing council has decided to retain all sponsors including the big Chinese ones. I feel bad for those idiots who threw their Chinese made TVs off their balconies only to see this happen. — Omar Abdullah (@OmarAbdullah) August 2, 2020 -
‘ధోని మాత్రమే రక్షించగలడు’
మాంచెస్టర్: వన్డే ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న సెమీఫైనల్లో టీమిండియా టాపార్డర్ పేక మేకడలా కుప్పకూలంతో ట్విటర్లో జోకులు పేలుతున్నాయి. కామెంట్లు, ఫొటోలు, వీడియోలతో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కివీస్ బౌలర్ల ధాటికి కెప్టెన్ విరాట్ కోహ్లి(1), వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ(1), కేఎల్ రాహుల్(1), దినేశ్ కార్తీక్(6) వెంట వెంటనే పెవిలియన్ దారిపట్టారు. భారత్ టాపార్డర్ వైఫల్యంపై ట్విటర్లో పెద్ద ఎత్తున వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. నంబర్వన్, నంబర్టూ ఆటగాలిద్దరూ కలిపి రెండే పరుగులు చేశారని కోహ్లి, రోహిత్ ఉద్దేశించి కామెంట్ చేశారు. ఈరోజు టీమిండియాను రక్షించేవాడు మహేంద్ర సింగ్ ధోని మాత్రమేనని మహి ఫ్యాన్స్ దీమా వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ అభిమానుల ప్రస్తుత పరిస్థితి ఇలా ఉండదంటూ ఫన్నీ ఫొటోలు షేర్ చేసి కామెంట్లు పెట్టారు. -
‘రఫేల్’ ఫైళ్లను ఎవరు దొంగిలించారు?
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద ‘రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం’కు సంబంధించిన ఫైళ్లు ఎవరు ఎత్తుకు పోయి ఉండవచ్చనే విషయమై సోషల్ మీడియాలో వ్యంగ్యోక్తులు వెల్లువెత్తుతున్నాయి. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ సరిగ్గా అర్ధరాత్రి తన రక్షణ శాఖా కార్యాలయం నుంచి రఫేల్ ఫైళ్లు తీసుకెళ్లడం అక్కడి సీసీటీవీ కెమేరాల్లో చిక్కిందంటూ ఒకరు, రోజుకు 23 గంటలపాటు పనిచేసి, చేసి అలసిపోయిన ప్రధాని నరేంద్ర మోదీ పది సెకండ్లపాటు కునుకుతీయగానే రఫేల్ ఫైళ్లను నెహ్రూ తస్కరించారని మరొకరు, ఫైళ్ల తస్కరణకు నెహ్రూ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ మరొకరు సంబంధిత ఫొటోలతో ట్వీట్లపై ట్వీట్లు చేశారు. (రఫేల్ పత్రాలు చోరీ) నేటి భారత దేశంలోని పరిస్థితులకు, ప్రతి సమస్యకు నాటి జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం కారణమంటూ ఇటు ప్రధాని మోదీ అటు ఆరెస్సెస్ నాయకులు నిందిస్తుండడం వల్లన నెటిజెన్లు ఈ తీరుగా స్పందించి ఉండవచ్చు. నేటి కశ్మీర్ కల్లోలానికి నెహ్రూయే కారణమని, తొలి ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే పరిస్థితి వేరుగా ఉండేదని, అసలు ఆయన ప్రధాన మంత్రి కాకుండా అడ్డుకున్నదే నెహ్రూ అని, నాడు భారత్, పాకిస్థాన్లుగా దేశం రెండుగా చీలిపోవడంలో నెహ్రూ ప్రధాన పాత్ర వహించారని నరేంద్ర మోదీ పదే పదే విమర్శించడం తెల్సిందే. ఆరెస్సెస్ అయితే మరో మెట్టు ముందుకు వెళ్లి ‘జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు బాధ్యుడు నాథూరామ్ గాడ్సే కాదు. జవహర్ లాల్ నెహ్రూ బాధ్యుడు’ అని 2005లో అప్పటి చీఫ్ కేఎస్ సుదర్శన్ ఆరోపించారు. (ఫ్రాన్సు మాజీ అధ్యక్షుడు కూడా అదే అన్నారు) -
‘తుపాన్లను ఒంటిచేత్తో ఆపేసిన చంద్రబాబు’
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్భాటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఎప్పుడూ తానేదో సాధించానంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు శైలిపై ఆయన ట్విటర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘రెయిన్ గన్ పట్టుకుని సీమలో కరువు కంటికి కనిపించకుండా తరిమికొట్టాడు. దండయాత్రతో దోమలపై సంహారం చేసి దోమ కనిపించకుండా చేశాడు. టెక్నాలజీతో సముద్రాలను కంట్రోల్ చేశాడు. తుపాన్లను ఒంటిచేత్తో ఆపేశాడు. ఆదరణ పనిముట్లతో పేదరికాన్ని తరిమికొట్టి పేపర్లకు ఎక్కాడు నాయుడుబాబు’అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. రెయిన్ గన్ పట్టుకుని సీమలో కరువు కంటికి కనిపించకుండా తరిమికొట్టాడు. దండయాత్రతో దోమలపై సంహారం చేసి దోమ కనిపించకుండా చేశాడు. టెక్నాలజీతో సముద్రాలను కంట్రోల్ చేశాడు. తుపానులను ఒంటి చేత్తో ఆపేశాడు. ఆదరణ పనిముట్లతో పేదరికాన్ని తరిమికొట్టి పేపర్లకు ఎక్కాడు నాయుడుబాబు. — Vijayasai Reddy V (@VSReddy_MP) 13 November 2018 ప్రలోభాలకు ఆదిగురువు చంద్రబాబు ప్రలోభాలకు ఆదిగురువు చంద్రబాబు నాయుడని విజయసాయిరెడ్డి విమర్శించారు. కుల వృత్తులలో మెజారిటీ ప్రజలు బీసీలేనని పేర్కొన్నారు. వారి కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్య పథకాన్ని చంద్రబాబు అటకెక్కించడంపై మండిపడ్డారు. గతంలో పచ్చ చొక్కాల జేబులు నింపిన ఆదరణ పథకానికి బూజు దులిపి.. కుల వృత్తుల వారికి పనిముట్లు పంపిణీతో పేదరికంపై గెలిచేశామంటూ ప్రచారం మొదలుపెట్టారని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుల వృత్తులలో మెజారిటీ బీసీలే. వారి కోసం వైఎస్ ప్రారంభించిన ఉచిత విద్య పథకాన్ని అటకెక్కించి. గతంలో పచ్చచొక్కాల జేబులు నింపిన ఆదరణ పథకానికి బూజు దులిపి కుల వృత్తుల వారికి పనిముట్ల పంపిణీతో పేదరికంపై గెలిచేశామంటూ ప్రచారం మొదలెట్టాడు... ప్రలోభాలకు ఆదిగురువైన చంద్రబాబు. — Vijayasai Reddy V (@VSReddy_MP) 13 November 2018 -
ఇంట్లో పులి.. వీధిలో పిల్లి అంటే ఇదేనా..!
సాక్షి, న్యూఢిల్లీ : నీతిఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంతో యుద్ధ వైఖరి అనుసరించారంటూ టీడీపీ చేసిన ప్రచారంపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా వేశారు. ‘నీతి ఆయోగ్ సమావేశం గురించి మీడియాలో టీడీపీ అసత్యాలు ప్రచారం చేసింది. సమావేశంలో ప్రతి ముఖ్యమంత్రి కోసం కేటాయించిన సమయం 7 నిమిషాలు. చంద్రబాబు 12 నిమిషాలు మాట్లాడారు. అయితే సీఎం ఘర్షణ విధానాన్ని అనుసరించలేదు. టీడీపీ తప్పుడు ప్రచారం పూర్తిగా ఈచిత్రాల ద్వార బహిర్గతం. ఇంట్లో పులి వీధిలో పిల్లి అంటే ఇదేనా..!’ అంటూ ప్రధాన మంత్రితో చంద్రబాబు నాయుడు నవ్వుతూ మాట్లాడుతున్న చిత్రాలను ట్వీట్ చేశారు. ప్యాకేజీతోనే ఎక్కువ నిధులని మీరే అన్నారు.. ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీతోనే ఎక్కువ నిధులు రాష్ట్రానికి వచ్చాయని చంద్రబాబే పత్రికల్లో రాయించారని, ఇప్పుడు ఆయన తీసుకున్న యూటర్న్లను ప్రజలు గమనిస్తున్నారని జీవీఎల్ పేర్కొన్నారు. ‘నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు రాష్ట్ర సమస్యలను విస్తృతంగా ప్రస్తావించారని టీడీపీ నేతలు బాగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారు ప్రచారాలకు పరిమితమై ప్రజల అభివృద్ధికి పనిచేయడం లేదు. ప్రజా సంక్షేమానికి చొరవ తీసుకోవడం లేదు. కేంద్రం సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నా ఏమీ పట్టనట్టు ఉన్నారు. స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేయమంటే ఇంతవరకు ఎందుకు చేయలేదు?. పోలవరానికి రావాలిసిన నిధులన్నీ త్వరలోనే రాబోతున్నాయి. నాబార్డు ద్వారా వెంటనే విడుదల అవుతాయని మాకు సమాచారం ఉంది. వెనకబడిన జిల్లాలకు రూ. 300 కోట్ల చొప్పున కేంద్రం ఇచ్చింది. రాష్ట్రానికి రావాల్సిన ప్రతి ఒక్క రూపాయి కేంద్రం ఇస్తూనే ఉంటుంది’ అని పేర్కొన్నారు. నితి ఆయోగ్ సమావేశం గురించి మీడియాలో TDP అసత్యాల ప్రచారం. ప్రతి CM కోసం కేటాయించిన సమయం 7 నిమిషాలు. ముఖ్యమంత్రి నాయుడు 12 నిమిషాలు మాట్లాడారు. CM ఘర్షణ విధానాన్ని అనుసరించలేదు. టిడిపి తప్పుడు ప్రచారం పూర్తిగా ఈ చిత్రాల ద్వారా బహిర్గతం. ఇంట్లో పిల్లి వీధిలో పులి అంటే ఇదేనా! pic.twitter.com/lgCfTCoK8L — GVL Narasimha Rao (@GVLNRAO) June 17, 2018 -
త్వరపడండి.. ట్యాంకు ఫుల్ చేయించండి..!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు ఒక పైసా తగ్గిస్తున్నట్టు బుధవారం చమురు సంస్థలు ప్రకటించడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. ‘పైసా’చికంపై సోషల్ మీడియాలో జోకులు, వంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఫొటోలు, వీడియోలతో ప్రభుత్వ చమురు సంస్థల తీరును ఎండగట్టారు. ఒక్క పైసాను ఏం చేసుకోవాలబ్బా... ఆ...గుర్తొచ్చింది. జన్ధన్ యోజన అకౌంట్లలో జమచేసేస్తాను. అసలు దీనంతటికీ కారణం మన తొలి ప్రధాని నెహ్రూయే. ఆయన హయాంలోనే పైసాను చలామణిలోకి తెచ్చారు. అందుకే ఇప్పుడు పైసా తగ్గింది ఒక్క పైసా ఆదా అయింది. ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కావట్లేదు. ఏమేం కొనాలో ఒక జాబితా రూపొందించుకోవాలి. అబ్బా! ఎంత ఉపశమనమో. ఒక్క పైసా తగ్గిందోచ్.. నిజంగా ఇవాళ నేను కోటీశ్వరుడినన్న భావన కలుగుతోంది. సేల్ సేల్.. మెగా సేల్.. పెట్రోల్పై ఒక్క పైసా డిస్కౌంట్. త్వరపడండి.. ట్యాంకు ఫుల్ చేయించండి.. మంచి తరుణం మించినా దొరకదు. అబ్బో.. ఊహించలేకపోతున్నాం. ఏకంగా ఒక్క పైసా తగ్గించారు కదా.. ప్రజలపై మోదీకి ఉన్న సానుభూతిని వెలకట్టలేం... నిజంగా మీ రుణం తీర్చుకోలేనిది. పట్టలేనంత సంతోషంగా ఉంది. నా అందమైన భవిష్యత్ని నిర్మించుకోవడానికి ఒక్క పైసా ఆదా చేసుకోగలిగాను. ఇంతకంటే జీవితానికి కావల్సినదేముంది. పెట్రోల్, డీజిల్పై ఆదా చేసిన ఒక్క పైసాతో ఇల్లు, కారు, హెలికాప్టర్ కొనాలనుకుంటున్నాను. -
సల్మాన్ కొత్త సినిమాపై పేలుతున్న జోకులు!
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా రేస్3 ట్రైలర్ మంగళవారం విడుదలై మంచి ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సైన్స్ను ఎగతాళి చేయడానికే ఈ సినిమా తీశారని కొందరు, థమ్సప్ యాడ్ కోసం ఓ సినిమానే చేశారని మరికొందరు సినిమాపై జోకులు పేల్చుతున్నారు. సల్మాన్ను బెయిల్పై విడుదల చేసిన న్యాయమూర్తి ఈ సినిమా చూస్తే కచ్చితంగా సల్మాన్ ఖాన్ను ఆయనతో పాటు బాబీ డియోల్ను కూడా ఐదు సంవత్సరాలు జైలులో పెడతారని ఓ నెటిజన్ వ్యంగ్యంగా స్పందించాడు. ఇలా నెటిజన్లు తమకు నచ్చిన రీతిలో రేస్3 ట్రైలర్పై స్పందిస్తూనే ఉన్నారు. రెమో డిసౌజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సల్మాన్తో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్, జాక్వలిన్లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అయితే పెద్దమనిషివే!
మద్రాస్ అసెంబ్లీలో ఏదో చర్చ నడుస్తోంది. జస్టిస్ పార్టీకి చెందిన పానుగంటి రామరాయనింగార్ మాట్లాడుతున్నారు. ఆయన గతంలో తీసుకున్న వైఖరికి పూర్తి విరుద్ధంగా చెబుతున్నారు. ఇది కట్టమంచి రామలింగారెడ్డి గ్రహించారు. సాహితీవేత్త, రాజనీతిజ్ఞుడిగా పేరొందిన కట్టమంచి అప్పటికి జస్టిస్ పార్టీ వీడి స్వతంత్ర సభ్యుడిగా ఉన్నారు. ‘ఆర్యా, గతంలో రామరాయనింగార్ గారు ఈ అంశానికి అనుకూలంగా మాట్లాడారు, ఇప్పుడు ప్రతికూలంగా మాట్లాడుతున్నారు. గతంలో ఆయన వైఖరిని తెలియజేసే ఉత్తరాలు నా దగ్గర ఉన్నాయి’ అని తన జేబులో చేయి పెట్టబోయారు కట్టమంచి. ‘ప్రేమికులిద్దరూ ప్రేమించుకున్నప్పుడు ఏవో లేఖలు రాసుకుంటారు. ఏదైనా కారణం వల్ల ఆ బంధం విడిపోతే, ఎవరి లేఖలు వాళ్లకు ఇచ్చుకోవడం, పాతవాటిని స్మరించకుండా ఉండటం పెద్ద మనుషుల మర్యాద’ అని పెద్ద మనిషి అన్నమాటను నొక్కారు రామరాయనింగార్. ఇంక దాని మీద కొనసాగించకుండా కూర్చుండిపోయారు కట్టమంచి, పెద్దమనిషిలా! (మీకు ఇలాంటి మరమరాలు తెలిస్తే మాకు రాయండి.) -
మధుసూదనాచారిపై సోషల్ మీడియాలో సెటైర్లు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిపై సోషల్మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తాజాగా ఆయన పాలాభిషేకం వీడియో ఒకటి నెట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రజాప్రతినిధి అయివుండి ఇలాంటి పనులను ప్రొత్సహించటమేంటని విమర్శలు గుప్పిస్తున్నారు. ‘పాలను వృధా చేశారు. తెలంగాణలో కనీసం వాటిని కొనలేని ప్రజలు ఉన్నారని గుర్తించండి’ అని కొందరు.. ‘సాధారణంగా సినిమా వాళ్లకు కటౌట్లకు ఇలాంటి పాలాభిషేకం చూస్తుంటాం. కానీ, ఇప్పుడది వేరే మలుపు తీసుకున్నట్లుంది’ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే ఓ మెట్టుదిగి ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో కొత్తగా గ్రామపంచాయతీలు ఏర్పాటుచేసినందుకు కృతజ్ఞతగా తన నియోజకవర్గం భూపాలపల్లిలోని పెద్దపల్లి గ్రామంలో అనుచరులు మధుసూదనాచారికి పాలాభిషేకం చేసిన విషయం తెలిసిందే. Damn.... is it this hard to see the wastage.... Ironic making a fool out of themselves on April Fool's day... — Manisha Palai (@manishapalai) 1 April 2018 What a wastage of milk! You do realize Telangana has a lot of people who actually don't have money to afford it. — Dr. Sugandha (@sugandhakohli) 1 April 2018 -
‘రేణుకా జీ.. మీరు బరువు తగ్గితే మంచిది’
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభలో బుధవారం ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఎంపీ రేణుకా చౌదరిలు ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకున్నారు. ఈ క్రమంలో రేణుకను కాస్త తగ్గాలంటూ వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విషయం ఏంటంటే... రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యత్వం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో జరిగిన వీడ్కోలు ప్రసంగం సందర్భంగా రేణుక మాట్లాడుతూ... ‘అప్పట్లో నేను చాలా బరువుగా ఉండేదాన్ని. అప్పటి నుంచే ఆయనకు(వెంకయ్యను ఉద్దేశించి) నేను తెలుసు. చాలా మంది నా బరువు గురించి బాధపడుతుంటారు. కానీ సార్, మీరు చైర్మన్ పదవిలో ఉన్నారు. కాబట్టి.. మీ బరువును అందరి మీద రుద్దండి(సక్రమంగా అధికారాన్ని వినియోగించండి అన్న అర్థం వచ్చేలా) అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. దీనికి వెంటనే స్పందించిన వెంకయ్య రేణుకకు కౌంటర్ ఇచ్చారు. ‘మీకు నాదో చిన్న సలహా. ముందు మీ బరువు తగ్గించుకోండి. ఆపై మీ పార్టీ బరువు పెరిగేలా కృషి చెయ్యండి’ అంటూ పేర్కొన్నారు. దానికి బదులుగా రేణుకా... ‘కాంగ్రెస్ పరిస్థితి బాగానే ఉంది’ అని అన్నారు. అయితే ఇద్దరి మధ్య జరిగిన ఈ వాదన సరదాగానే ఉండటంతో సభలో నవ్వులు వెల్లివిరిశాయి. గత నెల ప్రధాని నరేంద్ర మోదీ రేణుక చౌదరి నవ్వును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇక వీడ్కోలు ఉపన్యాసంలో ఆమె.. పెద్దల సభతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆ అంశాన్ని కూడా గుర్తు చేశారు. ఇది కూడా చదవండి... అన్నంత పని చేసిన ఫైర్ బ్రాండ్ -
కౌగిలింతా? రాద్ధాంతమా?
న్యూఢిల్లీ/సాక్షి,బెంగళూరు: దక్షిణ డోక్లాం చేరుకోవడానికి చైనా కొత్త మార్గం తెరుస్తోందన్న వార్తల నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యా స్త్రాలు సంధించారు. ఈ పరిణామాన్ని ప్రధాని ఎలా ఎదుర్కొంటారు?కౌగిలింత దౌత్యం తోనా? లేక రక్షణ మంత్రిని బాధ్యురాలిని చేస్తారా? అంటూ ట్వీట్ చేశారు. ‘డోక్లాంలో మళ్లీ చైనా జోరు పెరిగింది. ఈసారి మోదీ ఎలా స్పందిస్తారు? 1.కౌగిలింత దౌత్యం 2.రక్షణ మంత్రిని బాధ్యురాల్ని చేయడం 3. బహిరంగ విమర్శలు 4. పైవన్నీ’ అని పేర్కొన్నారు. గతంలో నానమ్మ ఇందిరా గాంధీని ఆదరించినట్లుగానే తననూ ఆశీర్వదించాలని రాహుల్ గాంధీ ప్రజలను కోరారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన చిక్కమగళూరులో పర్యటించారు. -
‘మాణిక్.. వెళ్లి ఎక్కడైనా తలదాచుకో!’
సాక్షి, న్యూఢిల్లీ : త్రిపురలో బీజేపీ కూటమి ఘన విజయం దిశగా అడుగులు వేస్తుండటంతో.. ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్పై బీజేపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు పేల్చటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మాణిక్ రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోవటం ఉత్తమమంటూ బీజేపీ నేత హిమంత బిస్వా ఎద్దేవా చేశారు. శనివారం అగర్తలలో బీజేపీ విజయోత్సవ ర్యాలీలో బిస్వా పాల్గొన్నారు. ‘ మాణిక్ సర్కార్ కావాలంటే ఆశ్రయం కోసం పశ్చిమ బెంగాల్, కేరళ, చివరకు పొరుగున ఉన్న బంగ్లాదేశ్ కైనా వెళ్లొచ్చు. ప్రస్తుతం ఆయన ముందు ఈ మూడు ఆఫ్షన్లు మాత్రమే ఉన్నాయి. ఎంచుకునే అవకాశం కూడా ఆయనకే ఇస్తున్నాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. గతంలోనే ఆయన ఎన్నికల తర్వాత మాణిక్ను బంగ్లాదేశ్కు సాగనంపుతానంటూ ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. సుమారు పాతికేళ్ల అధికారంలో కొనసాగిన వామపక్ష ప్రభుత్వాన్ని పక్కన పెట్టి.. త్రిపుర ప్రజలు బీజేపీ-ఐపీఎఫ్టీకి పట్టం కట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
ప్రజారాజ్యం కంటే పరమ చెత్తగా...
సాక్షి, సినిమా : సమకాలీన అంశాలపై స్పందించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సందేశంతో వార్తలో నిలిచాడు. గత రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి వ్యంగ్యంగా ఫేస్బుక్లో ఓ పోస్టు చేశాడు. ‘హైదరాబాద్ నోవాటెల్లో జనసేన పార్టీని స్థాపించిన సమయంలో పవన్ కళ్యాణ్ సింహంలా గర్జించాడనిపించింది. కానీ, ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. అతనూ(పవన్) చిరంజీవిలా మారిపోతున్నాడేమో అనిపిస్తుంది ’ అంటూ వెటకారంగా ఓ పోస్టు చేశాడు. ఇక ట్విటర్లో స్పందిస్తూ... నెమ్మదిగా చిరులా మారిపోతున్న పవన్.. తన జనసేన పార్టీని ప్రజారాజ్యం కంటే చెత్తగా తయారుచేసుకుంటున్నాడని.. ఈ విషయంలో ఏపీ ప్రజల తరపున తాను ప్రార్థిస్తున్నానంటూ వర్మ ఓ ట్వీట్ కూడా చేశాడు. ఇక గతంలో కూడా పవన్ రాజకీయ విధానాలపై కూడా ఆర్జీవీ ఇలాగే సెటైర్లు పేల్చిన విషయం తెలిసిందే. I pray for the people of AP that @PawanKalyan realises before it’s too late that he’s slowly becoming a Chiranjeevi and he’s making janasena into becoming worse than prajarajyam 🙏 — Ram Gopal Varma (@RGVzoomin) 16 February 2018 -
‘ఈ జోకర్లు పరువు తీస్తున్నారే!’
సాక్షి, సినిమా : పార్లమెంట్ సాక్షిగా టీడీపీ ఆడుతున్న డ్రామాలు బహుశా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బాగా చికాకు పుట్టించాయేమో. వారిపై వెటకారంగా ఆయన చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. ‘ఇలాంటి జోకర్లు ఏపీ ప్రజలకు ప్రతినిధులుగా ఎన్నిక కావటం చూస్తున్న నరేంద్ర మోదీ బహుశా ఏపీని ఓ జోక్గా భావిస్తున్నాడేమో. వీరు జోకర్లకు తక్కువ’ అంటూ... అర్థం కానీ రీతిలో ఏదో తూటానే వర్మ పేల్చాడు. ఇక మరో ట్వీట్లో ‘టీడీపీ చెందిన వీళ్లు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం ఉన్న తెలుగు దేశం పార్టీ పరువును జాతీయ స్థాయిలో అవమానానికి గురి చేస్తున్నారు’ అంటూ వెటకారంగా మరో ట్వీట్ చేశాడు’ అధికార పక్షంలో ఉండి కూడా హోదాను సాధించలేకపోతున్న టీడీపీ.. మరో వైపు కూటమి నుంచి బయటకు వచ్చి పోరాటం చేయకుండా వేషాలు వేస్తోంది. ఈ క్రమంలో కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నామనే డ్రామాలు వర్మకు నచ్చక ఇలా ట్వీట్లు చేశాడన్న మాట. కాగా, గతంలో కూడా వర్మ ఏపీ హోదాపై పలు ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. No wonder @narendramodi thinks Andhra Pradesh is a joke if jokers like this are elected as representatives of the great A P people ..I think they are far lesser than jokers and much more than c________’s pic.twitter.com/JFmw5QgQoc — Ram Gopal Varma (@RGVzoomin) 11 February 2018 These guys of TDP are a national embarrassment to the international reputation of TDP pic.twitter.com/UxoIJVaI4H — Ram Gopal Varma (@RGVzoomin) 11 February 2018 -
గౌరీలంకేష్లా చావాలని లేదు
సాక్షి, బెంగళూర్ : గత 8 నెలలుగా, మితవాదులు, హిందూ అతివాద సంస్థలపై వ్యంగ్య పోస్టులతో విరుచుకుపడుతున్న ఫేస్బుక్ పేజీ ఆగిపోయింది. ‘హ్యుమన్స్ ఆఫ్ హిందుత్వ’ ను నిలుపుదల చేసి, డిలేట్ చేస్తున్నట్లు ఆ పేజీ అడ్మిన్ గురువారం ప్రకటించారు. సత్యనాశ్ అనే సైట్లో ఈ మేరకు ఓ సందేశం ఉంచారు. ‘‘నా పేజీ గురించి ఇప్పటిదాకా వ్యతిరేకత, అభ్యంతరాలు రాలేదు. కానీ, గత కొన్ని రోజులుగా నన్ను చంపుతామని కొందరు బెదిరిస్తున్నారు. వాటిని నేను తేలికగా తీసుకోదల్చుకోలేదు. నేనో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చా. ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవ్. బీజేపీ పాలనలో నేను ఉన్నా. గౌరీ లంకేష్, అఫ్రజుల్ ఖాన్(రాజస్థాన్ లవ్ జిహాద్ బాధితుడు)లా చావాలని నాకు లేదు. నా కుటంబమే నాకు ముఖ్యం’’ అని అడ్మిన్ ఆ సందేశంలో పేర్కొన్నాడు. కాగా, అజ్ఞాతంలో ఉంటూనే ఆ పేజీ నిర్వాహకుడు మెసేంజర్ల ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చేవాడు. పేజీ ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ప్రభావవంతమైన ఫోటోలు, పోస్టులతో చర్చనీయాంశమైంది. కాగా, ప్రస్తుతం కన్నడనాట మీడియా స్వేచ్ఛ అంశంపై హాట్ హాట్గా చర్చ కొనసాగుతోంది. -
రాహుల్ గాంధీ రాజకీయ సెటైర్లు
సాక్షి, న్యూఢిల్లీ : 2004లో జరిగిన పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల ద్వారా ప్రత్యక్షంగా రాజకీయ రంగంలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ ఇటీవల తన భాషకు చాలా పదును పెట్టారు. రాజకీయ ప్రత్యర్థులపై సెటైర్లు కూడా వేస్తూ వస్తున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మొన్నటి వరకు ‘సూటు బూటు ప్రభుత్వం’ అని సంబోధించారు. ‘అచ్చే దిన్ ప్రభుత్వం’ అంటూ కూడా హేళన చేస్తూ వచ్చారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయంటూ నరేంద్ర మోదీ స్వయంగా వ్యాఖ్యానించినప్పుడు, పాకిస్థాన్తో పెరుగుతున్న అమెరికా సంబంధాల గురించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ను ప్రస్తావిస్తూ.. ‘ట్రంప్కు మరో హగ్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఉన్నారు. తొందరగా వెళ్లండి మోదీజీ!’ అంటూ వ్యాఖ్యానించారు. అవినీతి కుంభకోణం నుంచి తన కుమారుడు జై షాను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రక్షిస్తున్నారంటూ వార్తలు వచ్చినప్పుడు ‘బేటీ బచావోను ఎంచక్కా బేటా బచావో’గా మార్చారంటూ విమర్శించారు. ‘బేటీ బచావో, బేటీ పాడావో’ అన్నది ప్రధాని మోదీ నినాదమన్నది తెల్సిందే. 2004లో ఉత్తరప్రదేశ్లోని అమేథి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి రాహుల్ గాంధీ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటి వరకు ఆ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహించిన సోనియా గాంధీ ఆ పక్కనున్న రాయ్బరేలి నియోజక వర్గానికి మారారు. రాహుల్ జాతీయ యువజన కాంగ్రెస్ నాయకుడిగా 2007లో, పార్టీ ఉపాధ్యక్షుడిగా 2013లో నియమితులయ్యారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలతో మమేకం అయ్యేందుకు ఆయన దేశవ్యాప్తంగా పాదయాత్రను నిర్వహించారు. భారీ ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి స్వాధీనం చేసుకున్న భూములకు భారీ నష్టపరిహారం చెల్లించాలంటూ రైతుల పక్షాన ఆందోళన చేయడంతో 2011లో యూపీలో రాహుల్ అరెస్ట్ అయ్యారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే బిల్లును గట్టిగా సమర్థించిన రాహుల్, రాజకీయ నాయకుల్లో అవినీతి నిర్మూలనకు ఉద్దేశించిన లోక్పాల్ బిల్లు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. అలాంటి బిల్లులను తీసుకరావడం పెద్ద ప్రయోజనం ఉండదని విమర్శించారు. అందుకు సామాజిక కార్యకర్త అన్నా హజారే నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ‘దారిద్య్రం అంటే ఓ మానసిక స్థితి. తినడానికి తిండి లేకపోవడమో, మరేంటో లేకపోవడము కాదు. ఆత్వ విశ్వాసం ఉంటే దారిద్య్రాన్ని ఎవరైనా జయంచవచ్చు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాజకీయ పార్టీలకు దొరికిపోయారు. ‘దారిద్య్రం ఓ మానసిక స్థితి’ అనడం పట్ల పలు పార్టీలు ఆయనపై అప్పుడు ధ్వజమెత్తాయి. 2013లో ముజఫర్నగర్లో జరిగిన అల్లర్ల అనంతరం ఓ ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ‘దేశంలో అల్లర్లు సృష్టించేందుకు నిరాశ, నిస్పృహ, అసంతృప్తిలతో రగిలిపోతున్న భారత యువతను పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ నియమిస్తోందంటూ నాకో పోలీసు అధికారి చెప్పారు’ అని వ్యాఖ్యానించడంతో బీజేపీ, ప్రధాన రాజకీయ పార్టీలు విరుచుకుపడ్డాయి. కేంద్ర హోం శాఖ, రా, ఐబీలకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఆ వ్యాఖ్యలను ఖండించారు. హిమాచల్, గుజరాత్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న వాదనను రాహుల్ నమ్మడం లేదు. ఈ నెల 18వ తేదీన ఫలితాలు వస్తాయి కదా, ఆ రోజు తేల్చుకుందామంటూ చెబుతున్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారం ద్వారా ఆయన నాయకత్వం కొంత పరిణితి చెందినట్లు కనిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా వచ్చే ఏడాది మొదట్లో కర్ణాటక అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల ద్వారా ఆయన తొలి సవాల్ను ఎదుర్కోనున్నారు. -
ఏపీ సర్కార్కు రివర్స్ పంచ్ పడింది...
నిబంధనలకు విరుద్ధంగా అరెస్టుపై తెలంగాణా పోలీసుల అభ్యంతరం న్యాయ నిపుణులు, సామాజిక మాధ్యమాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రవికిరణ్ను మీడియా ముందు ప్రవేశపెట్టని పోలీసులు హెబియస్కార్పస్ పిటిషన్ వేసేందుకు సిద్ధమై రవికిరణ్ భార్య ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలో తేల్చుకోలేక పోలీసుల తర్జనభర్జనలు ఎట్టకేలకు మళ్లీ అతని ఇంటి దగ్గరే వదిలిపెట్టిన పోలీసులు అమరావతి: సామాజిక మాధ్యమ కార్యకర్త, ‘పొలిటికల్ పంచ్’ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్ అక్రమ నిర్బంధం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి రివర్స్ పంచ్ పడింది. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి అడ్డగోలుగా అరెస్టు చేసిన పోలీసుల చర్యపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆత్మరక్షణలో పడిపోయింది. అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదు మేరకే అరెస్టు చేశామని సాకులు చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతోనే అరెస్టు చేసిందన్న విషయం స్పష్టమైంది. ప్రభుత్వ వైఫల్యాలపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలను సహించలేని చంద్రబాబు ఆదేశాల మేరకు గుంటూరు పోలీసులు రవికిరణ్ను శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తెలంగాణ పోలీసులు, న్యాయ నిపుణులు, సామాజిక మాధ్యమాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో కంగుతింది. మరోవైపు రవికిరణ్ భార్య న్యాయపోరాటానికి సిద్ధపడటంతో ప్రభుత్వంలో కలవరం మొదలైంది. రవికిరణ్ను అరెస్టు చేశామని విధిలేని పరిస్థితుల్లో అంగీకరించిన పోలీసులు ఆయన్ను మీడియా ముందు ప్రవేశపెట్టలేకపోయారు. సరికదా ఏ సెక్షన్ల కింద కేసు పెట్టాలనే దానిపై కూడా స్పష్టత లేక మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రవికిరణ్ మీద ఉన్న పాత కేసును తెరపైకి తెచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రవికిరణ్ను తిరిగి అతని ఇంటి వద్దే పోలీసులు వదిలిపెట్టారు. కాగా అరకు ఎంపీ కొత్తపల్లి గీత పార్టీ ఫిరాయించినప్పుడు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై రవికిరణ్ మీద గతంలో విశాఖపట్నంలో కేసు నమోదయింది. ఐటీ చట్టం కింద నమోదైన ఆ కేసు విచారణ కోసమే అదుపులోకి తీసుకున్నట్లు చూపించాలని పోలీసులు భావిస్తున్నారని సమాచారం. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు మేరకు విశాఖపట్నం పోలీసు స్టేషన్లో 19 తేదీన ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు అరెస్టు చేశామని చెబుతున్న పోలీసులు ఆ మేరకు అరెస్టును చూపకపోవడం, పలు కొత్త కేసులను పైకి తీసుకురావడం చూస్తుంటే వారు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే వ్యవహరిస్తున్నారని అర్థమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు ఇతర రాష్ట్రానికి వెళ్లి అరెస్టు చేసేటప్పుడు పాటించాల్సిన నిబంధనలను గుంటూరు పోలీసులు ఉల్లంఘించారు. తెలంగాణ పోలీసులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా రవికిరణ్ను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఆరు గంటల తర్వాతే అరెస్టు చేయాలనే నిబంధనను పాటించకుండా అర్ధరాత్రి ఒంటిగంటకు అదుపులోకి తీసుకున్నారు. తన భర్తను అపహరించారని, ఆయన ఆచూకీ తెలపాలంటూ రవికిరణ్ భార్య సుజన శంషాబాద్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో తెలంగాణా పోలీసులు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు సమాచారం లేకుండా తమ పరిధిలోని వ్యక్తిని ఏపీ పోలీసులు ఎలా అదుపులోకి తీసుకుంటారని తెలంగాణా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు తన భర్త భద్రతపై సందేహాలు ఉన్నాయని, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని రవికిరణ్ భార్య సుజన ప్రకటించారు. ఈమేరకు హెబియస్కార్పస్ పిటిషన్ వేసేందుకు సిద్ధపడటంతో పోలీసుల్లో కలవరం మొదలైంది. అప్పటివరకూ రవికిరణ్ ఆచూకీపై నోరుమెదపని పోలీసులు స్పందించారు. ఆయన్ను తాము అరెస్టు చేశామని గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ్ నాయక్ వెల్లడించాల్సి వచ్చింది. అయితే ఆయనను ఎక్కడ ఉంచారో వెల్లడించలేదు. సచివాలయానికి కూతవేటు దూరంలో మందడం ఏఎస్పీ కార్యాలయంలో రవికిరణ్ను ఉంచి పోలీసులు పలు దఫాలుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆయన్ని గుట్టుచప్పుడు కాకుండా తిరిగి హైదరాబాద్ తీసుకువెళ్లాలన్న యత్నాలు కూడా ఫలించలేదు. దాంతో అసలు ఆయన్ని ఇంకా రాజధాని ప్రాంతానికి తీసుకురాలేదని... హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నామని...అమరావతి చేరుకోగానే మీడియా ముందు ప్రవేశపెడతామని ...ఇలా గడియకోమాట చెబుతూ వచ్చారు. అయితే మందడం గ్రామంలో ఉన్న ఏఎస్పీ కార్యాలయంలో రవికిరణ్ ఉన్నాడన్న సమాచారంతో మీడియా అక్కడకు చేరుకుంది. కానీ పోలీసు అధికారులు మీడియాను అనుమతించలేదు. రవికిరణ్ ఎక్కడున్నారో చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు పోలీసులను ఎంతగా అడిగినప్పటికీ ఫలితం లేకపోయింది. రాత్రి తొమ్మిది గంటలవరకు కూడా ఆయన్ను మీడియా ముందు ప్రవేశపెట్టనేలేదు. రహస్య ప్రాంతానికి తరలింపు! రవికిరణ్ను శుక్రవారం రాత్రి 10గంటల ప్రాంతంలో పోలీసులు ఓ రహస్య ప్రదేశానికి తరలించినట్లు సమాచారం. మందడంలోని ఏఎస్పీ కార్యాలయం ఉన్న వీధిలో రాత్రి 10గంటల సమయంలో అరగంటపాటు కరెంటు సరఫరా నిలిపివేశారు. ఆ సమయంలోనే ఏఎస్పీ కార్యాలయం ఎదుట వాహనాలు వచ్చాయి. ఆ పరిసరాలకు పోలీసులు ఎవర్నీ అనుమతించలేదు. ఆ తరువాత ఆ వాహనాలు అతి వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఆ వాహనాల్లోనే రవికిరణ్ను ఓ రహస్య ప్రాంతానికి తరలించారు. చివరకు హైడ్రామా నడుమ రవికిరణ్ తిరిగి శంషాబాద్లోని అతని నివాసం వద్ద వదిలిపెట్టారు. -
రవికిరణ్ను అరెస్ట్ చేశాం: ఎస్పీ నాయక్
-
రవికిరణ్ను అరెస్ట్ చేశాం: ఎస్పీ నాయక్
గుంటూరు : సోషల్ మీడియాలో ఏపీ శాసనమండలిపై అసత్య ప్రచారం చేస్తున్న పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ను అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్ తెలిపారు. ఆయన శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘శాసనమండలి పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర ప్రచారం జరుగుతోందని అసెంబ్లీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దల సభను అసభ్యకరంగా చిత్రించిన ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న పొలిటికల్ పంచ్ వెబ్సైట్ ఓనర్ రవిని హైదరాబాద్లో అరెస్ట్ చేశాం. అక్కడి నుంచి తీసుకొస్తున్నాం. విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. అసెంబ్లీని మార్ఫింగ్ చేస్తూ అడల్ట్ పిక్చర్ ఫోటోలను పోస్ట్ చేసినందుకు గాను అతని పై సెక్షన్ 67 ఐటీ యాక్ట్, ఐపీసీ 299 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశా’ మన్నారు. చదవండి...(సోషల్ మీడియాపై ఏపీ సర్కార్ ఆగ్రహం.. ) మరోవైపు రవికిరణ్ భార్య సుజన తన భర్త అరెస్ట్పై శంషాబాద్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసులమని చెప్పి కొంతమంది తన భర్తను ఇంటి నుంచి తీసుకు వెళ్లారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా సుజన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని డీసీపీ పద్మజ తెలిపారు. -
చంద్రబాబు, లోకేశ్పై సెటైర్లు, అరెస్ట్
-
సోషల్ మీడియాపై ఏపీ సర్కార్ ఆగ్రహం..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిందే చేసింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ర్పచారంపై కొరడా ఝుళిపిస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం అన్నంత పనీ చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్పై సోషల్ మీడియాలో సెటైర్లు వేసినందుకు ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పొలిటిక్ పంచ్ పేరుతో పొలిటికల్ సెటైర్లు వేస్తున్న సోషల్ మీడియా వాలెంటీర్ ఇంటూరి రవికిరణ్ను తుళ్లూరు పోలీసులు శంషాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. కాగా అరెస్ట్పై పోలీసులు రవికిరణ్ కుటుంబసభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు. దీంతో అతని భార్య సుజన ఆందోళన చెందుతున్నారు. తన భర్తను ఈ రోజు తెల్లవారుజామున 3.30గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారని, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సోషల్ మీడియతో పాటు వెబ్ సైట్లలో టీడీపీ పార్టీ, ఏపీ సర్కార్పై జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయటానికి చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటి నుంచో పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సోషల్ నెట్వర్క్లో నెగిటివ్ క్యాంపెయిన్పై చట్టప్రకారం యాక్షన్ తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం అయ్యింది. సోషల్మీడియాపై కట్టడి తెచ్చేందుకు ప్రత్యేకంగా ఓ చట్టాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అంశాల్ని పరిశీలిస్తోంది. ఫేస్బుక్లోని కొన్ని పేజీలు, వెబ్సైట్లపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు ఆదేశాల మేరకు ఓ బృందం సోషల్ మీడియాపై ఓ కన్నేసి ఉంచినట్లు తెలుస్తోంది. -
మాట - తూట