Shraddha Srinath
-
సోషల్ మీడియాలో రిక్వెస్ట్లు వచ్చేవి
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ వడ్నికట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం 2020లో డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజైంది. కాగా ఈ సినిమాను ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ టైటిల్తో ఈ 14న థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశంలో రానా మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఎప్పుడూ రిక్వెస్ట్లు వచ్చేవి. ఒక రోజు సిద్ధు ఈ సినిమా గురించి చెప్పారు. ఈ సినిమా రిలీజ్కి వేలంటైన్స్ డే పర్ఫెక్ట్ టైమ్. నేను ఆడియన్స్కు డిఫరెంట్ కథలు చూపించేందుకు ఇష్టపడతాను. కథ ఎంత కొత్తగా ఉంది? ఆడియన్స్కు మనం ఏం చెబుతున్నాం? అనేది కూడా చూస్తాను’’ అని తెలిపారు. ‘‘థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇది. ఈ సినిమాను థియేటర్స్లో రిలీజ్ చేసి ఉంటే సిక్స్ టైమ్స్ ఎక్కువ వచ్చేది’’ అన్నారు సిద్ధు జొన్నలగడ్డ. ‘‘లాక్డౌన్ సమయంలో ఈ సినిమాను థియేటర్స్లో రిలీజ్ చేయడం కుదర్లేదు. ఈ సినిమాతో అందరూ రిలేట్ అవుతారు’’ అని పేర్కొన్నారు రవికాంత్. -
అనంతపురంలో ‘డాకు మహారాజ్’ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
‘డాకు మహారాజ్’ మూవీ సక్సెస్ ఈవెంట్ (ఫొటోలు)
-
సూపర్ స్టార్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టిన శ్రద్ధా శ్రీనాథ్
-
Daaku Maharaaj : ‘డాకు మహారాజ్’ ట్విటర్ రివ్యూ
వాల్తేరు వీరయ్యతో చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బాబీ దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్ . నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో నిర్మించారు. తమన్ సంగీతం అందించాడు. బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు( ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే షో పడిపోయింది. తెలంగాణలో మాత్రం ఉదయం 8 గంటలకు ఫస్ట్ షో పడనుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. డాకు మహారాజు కథ ఏంటి..? ఎలా ఉంది..? బాలయ్య ఖాతాలో హిట్ పడిందా లేదా..? తదితర అంశాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.ఎక్స్లో డాకు మహారాజుకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది కామెంట్ చేస్తే.. ఆశించన స్థాయిలో సినిమా లేదని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు.Good mass bomma delivered by #Bobby Good visualsVijay Kannan’s best DOPThaman’s powerful BGM💥Bobby Kolli’s good directorialBut Predictable & dragged climaxMay be a fourth hit for #BalayyaRating: 3.25/5 #DaakuMaharaaj #DaakuMaharaajOnJan12th #DaakuMaharaajReview pic.twitter.com/mFVZmjnKxg— IndianCinemaLover (@Vishwa0911) January 11, 2025‘డైరెక్టర్ బాబీ ఓ మంచి మాస్ బొమ్మను అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. తమన్ పవర్ఫుల్ బీజీఎం అందించాడు. బాబీ డైరెక్షన్ బాగుంది. కానీ క్లైమాక్స్ మాత్రం ఊహకందేలా,సాగదీతగా అనిపిస్తుంది. బాలయ్య ఖాతాలో హిట్ పడొచ్చు అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ 3.25 రేటింగ్ ఇచ్చాడు.#DaakuMaharaaj is a passable stylistic mass entertainer that works well till a point in the second half after which it feels dragged. The film is technically very strong and is filled with mass elevations blocks that work well. Balayya and Thaman combo deliver yet again in…— Venky Reviews (@venkyreviews) January 11, 2025డాకు మహారాజ్ మంచి మాస్ ఎంటర్టైనర్.కానీ సెకండాఫ్ మాత్రం సాగదీశారు. సాంకేతికంగా సినిమా బాగుంది. బాలయ్య, తమన్ కాంబో మరోసారి సాలిడ్ మాస్ మూమెంట్స్ని అందించారు. డైరెక్టర్ బాబీ బాలయ్యను సెట్ అయ్యే కథనే ఎంచుకున్నాడు. కానీ సెకండాఫ్కి వచ్చేసరికి కథనం సాగదీశారు. ఊహకందేలా కథనం సాగుతుంది. చివరి 30 నిమిషాలు మాత్రం సాగదీసినట్లుగా అనిపిస్తుంది’అంటూ మరో నెటిజన్ 2.75 రేటింగ్ ఇచ్చాడు.Blockbuster bomma 🏆🏆🔥🔥Excellent screen PlayQuality Picture @MusicThaman sava dengav ayya 🔥@dirbobby 🙏🤍@vamsi84 Production quality 👌#DaakuMaharaaj - A slick mass entertainer with stunning visuals and #Thaman's powerful score.#NBK is exceptional, delivering electrifying moments for fans.Director #Bobby ensures commercial highs, making it a festive treat despite a predictable climax.— CHITRAMBHALARE (@chitrambhalareI) January 12, 2025uMaharaaj?src=hash&ref_src=twsrc%5Etfw">#DaakuMaharaaj #BlockBusterDaakuMaharaaj — kalyan ᴹᵃʰᵃʳᵃᵃʲ 🦁 (@kalyan_1405) January 12, 2025 #DaakuMaharaj First Half Review #NBK #Balayya #Balakrishna #NandamuriBalakrishana #DaakuMahaaraaj #DaakuMaharaaj #BuzzbasketReviews pic.twitter.com/kOAR1cdHPQ— BuzZ Basket (@theBuzZBasket) January 12, 2025Hahahahhahh 😂😂 ! My First Review of #DaakuMaharaaj proved “ TRUE ” !! I’m the Most Honest Film Critic in India 🇮🇳 today! Go & Watch Mass Masala this #Sankranthi 😃💥 https://t.co/DTUMdx5AOS— Umair Sandhu (@UmairSandu) January 11, 2025Oora Mass BGM From Teddy 🔥🔥Balayya Screen Presence > Nandamuri #DaakuMaharaaj pic.twitter.com/X6sNmHL5ZM— విక్రమ్ (@imVicky____) January 11, 2025A film that strikes the perfect balance between class and mass, cherished by the Maharaj🦁మళ్లీ సంక్రాంత్రి బుల్లోడు మా బాలయ్య బాబు🔥❤️Finally Good Output @dirbobby and @MusicThaman 🌟💫#DaakuMaharaaj 🦁🎇 pic.twitter.com/5E8UWwtbFa— ShelbY ᴹᵃʰᵃʳᵃᵃʲ⚔️ (@manishini9) January 11, 2025Naaku first half ye nachindhi ..Second half dabbulu return cheyi ra chintu #DaakuMaharaaj— Blue (@blueStrip_) January 12, 2025Last 45 min sleep veyochuRest 🔥Routine story 😢Elevations 👍 Bgm 🔥🔥🔥#DaakuMaharaaj— Blue (@blueStrip_) January 12, 2025 -
చిరంజీవి, బాలకృష్ణ..ఇద్దరు పని రాక్షసులే: బాబీ
‘నేను చిరంజీవి(వాల్తేరు వీరయ్య), బాలకృష్ణ ఇద్దరితో కలిని పని చేశాను. ఇద్దరిలో ఎంతో క్రమశిక్షణ ఉంటుంది. ఇద్దరూ పని రాక్షసులే. సినిమా కోసం ఎంతైనా కష్టపడుతుంటారు. నిర్మాలతకు అసలు నష్టం రానివ్వకూడదనే ఉద్దేశంతో పని చేస్తుంటారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోలతో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అని అన్నారు యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి. ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటింరు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రేపు(జనవరి 12) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ బాబీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ బాలకృష్ణ గారి ఇమేజ్ ని, ప్రేక్షకుల్లో ఆయన సినిమాపై ఉండే అంచనాలను దృష్టిలో ఉంచుకొని 'డాకు మహారాజ్' (Daaku Maharaaj )సినిమా చేయడం జరిగింది. అయితే బాలకృష్ణ గారి గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా చూపించడానికి ప్రయత్నించాము. బాలయ్య గారు సెటిల్డ్ గా డైలాగ్ లు చెప్తే చాలా బాగుంటుంది. 'నరసింహానాయుడు', 'సమరసింహారెడ్డి' తర్వాత 'సింహా' ఎలా అయితే గుర్తుండే సినిమా అయిందో.. డాకు మహారాజ్ కూడా అలాంటి పేరు తెచ్చుకుంటుందనే నమ్మకం ఉంది. చాలా నిజాయితీగా కథను చెప్పాము.→ హీరోకి ఆయుధం అనేది కీలకం. ముఖ్యంగా బాలకృష్ణ(Nandamuri Balakrishna) గారి సినిమాల్లో గొడ్డలి వంటి పవర్ ఫుల్ ఆయుధం బాగా ఫేమస్. ఈ సినిమాలో ఆలాంటి శక్తివంతమైన ఆయుధం ఉండాలి, కానీ అది కొత్తగా ఉండాలి అనుకున్నాము. అందుకు తగ్గట్టుగానే ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారు అద్భుతమైన ఆయుధాలను డిజైన్ చేశారు.→ నా గత సినిమాలతో బాబీ కథాకథనాలు బాగా రాస్తాడు అనే పేరు తెచ్చుకోగలిగాను. అయితే హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని మాట్లాడుకునేలా చేయలేకపోయాను. ఇప్పుడు 'డాకు మహారాజ్'తో విజువల్స్ పరంగా గొప్ప పేరు వస్తుంది.→ ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ఇద్దరు హీరోయిన్లు మంచి ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. వారివి రెగ్యులర్ హీరోయిన్ తరహా పాత్రలు కావు. నటనకు ఆస్కారమున్న పాత్రలు. ఇద్దరూ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.→ రెగ్యులర్ విలన్ పాత్రలా కాకుండా బాబీ డియోల్ గారి పాత్ర కొత్తగా ఉంటుంది. ఆయన నిబద్ధతగల నటుడు. పాత్రకి న్యాయం చేయడం కోసం సెట్ లో ఎంత సమయాన్ని అయినా కేటాయిస్తారు. అలాగే బాబీ డియోల్ గారు ఎన్టీఆర్ గారిని, బాలకృష్ణ గారిని ఎంతో గౌరవిస్తారు.→ నిర్మాత నాగవంశీ, బాలకృష్ణ గారిని ఎంతో అభిమానిస్తారు. ఆ అభిమానంతోనే తమ బ్యానర్ లో వచ్చే సినిమా వైవిధ్యంగా ఉండాలి అనుకున్నారు. అలాగే ఒక దర్శకుడిగా నాకెంతో ఫ్రీడమ్ ఇచ్చారు. ఇద్దరం కలిసి ఈ సినిమాలో విజువల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడేలా చేయాలి అనుకున్నాము. డీఓపీ విజయ్ కన్నన్ తో నాకు ముందే పరిచయముంది. అప్పుడు ఆయన జైలర్ సినిమాకి పని చేస్తున్నారు. నాగవంశీ గారు కూడా విజయ్ పేరు చెబితే వెంటనే ఓకే అని, ఆయనతో మాట్లాడారు. అలా విజయ్ ఈ సినిమాలో భాగమయ్యారు. ఆయన ఎంతో అంకిత భావంతో పని చేస్తారు. కథను ఓన్ చేసుకుంటారు. అందుకే విజువల్స్ అంత అద్భుతంగా వచ్చాయి.→ బాలకృష్ణ గారి నుంచి ఎవరైనా క్రమశిక్షణ నేర్చుకోవచ్చు. దర్శకుడికి ఎంతో గౌరవం ఇస్తారు. సెట్స్ లో అందరితో సరదాగా ఉంటారు. మనం ఎంత నిజాయితీగా ఉంటే బాలకృష్ణ గారు గౌరవిస్తారు. అభిమానులు తనను చూడటానికి వస్తారు కదా అని, డూప్ లేకుండా నటించడానికి ఇష్టపడతారు. మొండి గుర్రాన్ని సైతం కంట్రోల్ చేస్తూ, స్వయంగా స్వారీ చేసి మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. -
స్క్రీన్ టైమ్ గురించి ఆలోచించను: శ్రద్ధా శ్రీనాథ్
‘‘ఏ సినిమాలోనైనా నా స్క్రీన్ టైమ్ గురించి నేను ఆలోచించను. మనసుకి నచ్చి చేసిన పాత్రకు ఓ నటిగా వంద శాతం న్యాయం చేశామా? లేదా అని మాత్రమే ఆలోచిస్తాను. ‘డాకు మహారాజ్’ మూవీలో ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా... ఇలా మిగతా పాత్రలు కూడా ముఖ్యంగానే ఉంటాయి’’ అన్నారు హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్(shraddha srinath). బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj) మూవీలో నందిని అనే ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్ చేశాను. చాలా ఓర్పు ఉన్న పాత్ర. అదే సమయంలో ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు స్పష్టంగా మాట్లాడుతుంది. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర ఇది.→ నా గత చిత్రాలతో పోల్చినప్పుడు ఈ చిత్రం నాకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా డబ్బింగ్ చెప్పాను. ఈ మూవీలో బాలకృష్ణ, బాబీ డియోల్గార్లతో నటించాను. నటిగా కొత్త విషయాలు నేర్చుకున్నాను.→ సెట్స్ లో బాలకృష్ణ అందరితో సరదాగా ఉంటారు. ఎన్నో ఏళ్ళ నుంచి సినీ పరిశ్రమలో ఉన్నాను, నేనొక బిగ్ స్టార్ ని అనే అహం బాలకృష్ణ గారిలో కొంచెం కూడా ఉండదు. తనకంటే చిన్నా పెద్దా అని చూడకుండా దర్శకుడికి ఆయన ఎంతో గౌరవం ఇస్తారు. సినిమా కోసం దర్శకుడు ఏం చెప్తే అది చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.→ నటిగా ఈ సినిమా నుంచి ఎంతో నేర్చుకున్నాను. ముఖ్యంగా ఇందులో డైలాగ్ లు కరెక్ట్ మెజర్ లో ఉంటాయి. డబ్బింగ్ చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకున్నాను. ప్రతి డైలాగ్ మీద ఎంతో కేర్ తీసుకొని డబ్బింగ్ చెప్పించారు.→ బాబీ గారు ప్రతిభగల దర్శకుడు. సినిమా పట్ల ఆయనకు ఎంతో పాషన్ ఉంది. అలాగే, బాబీ గారిలో మంచి నటుడు కూడా ఉన్నాడు. అద్భుతమైన సూచనలు ఇస్తూ, నటీనటుల నుంచి మంచి నటనను రాబట్టుకుంటారు.→ సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘జెర్సీ’ మూవీ చేశాను. ఇప్పుడు ‘డాకు మహారాజ్’ చేశాను. ‘జెర్సీ’లో నేను చేసిన సారా, ‘డాకు మహారాజ్’లోని నందిని... ఈ రెండు పాత్రలు వేటికవే ప్రత్యేకం.→ ఇక పదేళ్లుగా ఇండస్ట్రీలో స్థిరంగా రాణిస్తున్నాను. కేవలం ఇది లక్ మాత్రమే కాదు... నా పెర్ఫార్మెన్స్ కూడా ఉంది. ఓ నటిగా అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. నిజ జీవితానికి దగ్గరగా ఉన్న రోల్స్ చేయడానికి ఇష్టపడతాను. ఇంకా పొన్నియిన్ సెల్వన్’ లాంటి పీరియాడికల్ మూవీలో నటించాలని ఉంది. -
‘డాకు మహారాజ్’ మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
కలియుగమ్ 2064.. వచ్చే నెలలోనే రిలీజ్
శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “కలియుగమ్ 2064’’. ఆర్కే ఇంటర్నేషనల్ బ్యానర్పై కె.ఎస్. రామకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరిలో విడుదలకు సిద్ధం కానుంది. అసలే కలియుగమ్.. ఆపై 2064… ఆ ఫ్యూచర్లో మనుషులు ఎలా ఉండబోతున్నారు? ఎలా బతుకబోతున్నారు? ఎలా చావబోతున్నారు? అనే అంశాలతో ఈ సినిమా కథ, కథాంశం ఉంటుంది.తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ను ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం ఇటీవల విడుదల చేశారు. తెలుగులో హీరో నానితో జెర్సీ మూవీలో యాక్ట్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో విభిన్నమైన పాత్రలో నటించింది. అలాగే దక్షిణాది భాషల్లో అనేక చిత్రాల్లో అద్భుతమైన పాత్రల్లో యాక్ట్ చేసిన కిషోర్ ఈ మూవీలో కీలకమైన పాత్ర పోషించారు.ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ నార్వేలో చేశారు. ఈ సినిమా ఇప్పటి జెనరేషన్కు చాలా అవసరమని, ఇది యువత, ఫ్యామిలీ, పిల్లలు అందరూ కలిసి చూడదగ్గ మూవీ అని, త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని నిర్మాత కె.ఎస్.రామకృష్ణ తెలిపారు. -
ఆ టైమ్లో నేను భయపడ్డాను
‘‘నాకు క్వాలిటీ వర్క్ చేయడం ఇష్టం. అందుకే స్క్రిప్ట్స్ సెలక్షన్లో కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉంటాను. తెలుగులో ‘జెర్సీ’ సినిమా తర్వాత నాకు మదర్ క్యారెక్టర్ ఆఫర్స్ చాలా వచ్చాయి. కానీ ఒకే తరహా పాత్రలు చేయడం ఇష్టం లేక ఒప్పుకోలేదు. ఇక కోవిడ్ సమయంలో కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ పని చేసుకున్నారు. కానీ ఆర్టిస్టులకు ఇది కుదరదు. అందుకే నా కెరీర్ ఎలా ఉంటుందా? అని అందరిలానే నేనూ భయపడ్డాను’’ అని శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘మెకానిక్ రాకీ’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశంలో శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో మాయ అనే పాత్ర చేశాను. నాది మెకానిక్ రాకీ జీవితాన్ని మార్చే పాత్ర. ఈ సినిమా కథ విన్నప్పుడు ఎగ్జైటింగ్గా అనిపించడంతో ఒప్పుకున్నాను. ‘ఫలక్నుమా దాస్’ చిత్రంలో విశ్వక్ చెప్పిన స్టోరీ నాకు నచ్చలేదు. అందుకే ఆ సినిమా ఒప్పుకోలేదు. ఆ తర్వాత కూడా విశ్వక్ హీరోగా చేసిన రెండు చిత్రాల్లో నటించాల్సింది. కానీ కుదర్లేదు. ఫైనల్గా ‘మెకానిక్ రాకీ’ చేశాను. ‘బాహుబలి’, ‘కల్కి 2898 ఏడీ’లాంటి సినిమాలూ చేయాలని ఉంది. ప్రస్తుతం ‘డాకు మహారాజ్’ చేస్తున్నాను. తమిళంలో విష్ణు విశాల్తో ఓ సినిమా, ఓ తమిళ వెబ్ సిరీస్ చేస్తున్నాను’’ అని అన్నారు. -
విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
హన్మకొండలో విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ'మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ (ఫొటోలు)
-
“కలియుగమ్ 2064″ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మణిరత్నం
శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “కలియుగమ్ 2064″. అసలే కలియుగం.. ఆపై 2064… ఆ సమయంలో మనుషులు ఎలా ఉండబోతున్నారు? ఎలా బతుకుతారు? ఎలా చావబోతున్నారు అన్నదే కథ. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ను లెజండరీ డైరెక్టర్ మణిరత్నం శుక్రవారం విడుదల చేశారు. వినూత్న కథాంశంతో రాబోతున్న ''కలియుగమ్ 2064" మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నిర్మాత కె.ఎస్.రామకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా ఇప్పటి జెనరేషన్కు చాలా అవసరం. యువత, ఫ్యామిలీ, పిల్లలు అందరూ కలిసి చూడదగ్గ మూవీ. మా ఈ వినూత్న ప్రయత్నాన్ని అందరూ ఆదరించాలని కోరుతున్నాము. ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్ నార్వేలో చేశాం. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అన్నారు. తెలుగులో హీరో నానితో జెర్సీ మూవీ లో యాక్ట్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్ కలియుగమ్ 2064లో విభిన్నమైన పాత్రలో నటించింది. అలాగే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో అద్భుతమైన పాత్రల్లో యాక్ట్ చేసిన కిషోర్ ఈ మూవీలో కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. -
ఆ హీరోయిన్ నో చెప్పడంతో బాధపడ్డా: విశ్వక్సేన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాకీ సినిమాతో బిజీగా ఉన్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల ఓ కాలేజీ ఈవెంట్లో విశ్వక్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సినిమా విశేషాలు చెప్తూనే శ్రద్ధా శ్రీనాథ్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టాడు.ఫలక్నుమా దాస్ సినిమాకు శ్రద్ధా శ్రీనాథ్నే తీసుకోవాలనుకున్నాను. ఆమెకు కథ చెప్పడం కోసం బెంగళూరు దాకా వెళ్లాను. తీరా వెళ్లాక ఆమె నో చెప్పింది. డబ్బుల్లేకపోయినా ఖర్చుపెట్టుకుని మరీ బెంగళూరు వెళ్లా.. అనుకున్న పని జరగలేదని చాలా ఫీలయ్యాను. ఇప్పుడు ఆమె నా సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంటే భలే ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చాడు. కాగా మెకానిక్ రాకీ మూవీ నవంబర్ 22న విడుదల కానుంది.చదవండి: ‘లాస్ట్ లేడీస్’ కోసం మహిళలందరూ సపోర్ట్ చేయాలి: కిరణ్ రావు -
‘మెకానిక్ రాకీ’ఈవెంట్లో మెరిసిన శ్రద్ధా శ్రీనాథ్ (ఫొటోలు)
-
విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్.. టాలీవుడ్ హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్!
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్పై టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. బెంగళూరులో ఓ ఈవెంట్కు హాజరైన ముద్దుగుమ్మ మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదికపై స్పందించింది. చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. అయితే తనకు మాత్రం ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని వెల్లడించింది.శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ..' నా వరకు అయితే ఇండస్ట్రీలో సురక్షితంగా ఉన్నా. అయితే ఇది అందరికీ వర్తిస్తుందని నా ఉద్దేశం కాదు. నేను సేఫ్గానే ఉన్నప్పటికీ.. పనిచేసే చోట అభద్రతగానే ఉండొచ్చని నా అభిప్రాయం. గత ఎనిమిదేళ్లుగా నేను సినిమాల్లో ఉన్నా. ఇండస్ట్రీలో నాకు ఎలాంటి ఇబ్బంది కలగకపోవటం నా అదృష్టం. కానీ అందరి విషయాల్లో ఇలా ఉంటుందని మాత్రం చెప్పను. కొందరు ఇండస్ట్రీలో ఇబ్బందులు పడతూనే ఉన్నారని' చెప్పుకొచ్చింది. అయితే ఈ వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి..సెట్లో మహిళలకు భద్రత కల్పించాలని కోరారు.కాగా.. శ్రద్ధా శ్రీనాథ్ 2015లో మలయాళ చిత్రం కోహినూర్తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్లో నాని సరసన జెర్సీతో అరంగేట్రం చేసింది. అంతేకాకుండా యు-టర్న్, విక్రమ్ వేద చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన వెంకటేష్ నటించిన సైంధవ్ చిత్రంలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం తెలుగులో విశ్వక్ సేన్ సరసన మెకానిక్ రాకీలో కనిపించనుంది. అంతేకాకుండా హిందీలో లెటర్స్ టు మిస్టర్ ఖన్నా, కోలీవుడ్లో కలియుగం సినిమాల్లో నటిస్తోంది. -
గులాబీలు గుప్పే పిల్లడే...
‘‘గుల్లేడు గుల్లేడు గులాబీలు గుప్పే పిల్లడే ఇంక నాతో ఉంటడే...’ అంటూ మొదలవుతుంది ‘మెకానిక్ రాకీ’ సినిమాలోని ‘గుల్లేడు గుల్లేడు...’ పాట. విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం ఇది. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 31న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ‘గుల్లేడు గుల్లేడు..’ అంటూ సాగే ఫోక్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. జేక్స్ బిజోయ్ సంగీత సారథ్యంలో సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించిన ఈ పాటను మంగ్లీ పాడారు. ‘జాతి రత్నాలు’ దర్శకుడితో... మంగళవారం విశ్వక్ 13వ సినిమా ప్రకటన రాగా, బుధవారం ఆయన 14వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నారు. ఈ సినిమాకు సహ–నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
'మెకానిక్ రాకీ' కోసం సింగర్ మంగ్లీ సాంగ్
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘మెకానిక్ రాకీ’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ మంచి మార్కులే కొట్టేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను మేకర్స్ విడుదల చేశారు. 'నడుము గీరుతూ..' అంటూ సాగే ఈ సాంగ్ను సుద్దాల అశోక్ తేజ రచించగా సింగర్ మంగ్లీ ఆలపించారు. రవితేజ ముళ్లపూడి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఇది విడుదల కానుంది. -
'మెకానిక్ రాకీ' గ్లింప్స్.. ఎల్ అంటే సరికొత్త చెప్పిన శ్రద్ధా శ్రీనాథ్
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘మెకానిక్ రాకీ’. తాజాగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది. రవితేజ ముళ్లపూడి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.ముక్కోణపు ప్రేమకథగా రూపొందుతోన్న చిత్రం ‘మెకానిక్ రాకీ’. మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. -
రాకీ ప్రపంచంలోకి...
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. కాగా శ్రద్ధా శ్రీనాథ్ని స్వాగతిస్తూ, ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్.‘‘మెకానిక్ రాకీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నా’’ అని ఈ సందర్భంగా శ్రద్ధా శ్రీనాథ్ పేర్కొన్నారు. ‘‘ముక్కోణపు ప్రేమకథగా రూపొందుతోన్న చిత్రం ‘మెకానిక్ రాకీ’. మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న సినిమాని విడుదల చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: మనోజ్ కాటసాని. -
Shraddha Srinath: గెటప్ శ్రీను భార్య.. తర్వాత వెంకీతో లవ్.. సైంధవ్లో మెప్పించిన బ్యూటీ (ఫోటోలు)
-
‘సైంధవ్’ మూవీ రివ్యూ
టైటిల్: సైంధవ్ నటీనటులు: వెంకటేశ్,నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, ఆర్య, బేబీ సారా, జయప్రకాశ్ తదితరులు నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్టైన్మెంట్ దర్శకత్వం: శైలేష్ కొలను సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: ఎస్. మణికందన్ ఎడిటర్: గ్యార్రి బి.హెచ్ విడుదల తేది: జనవరి 13, 2024 సైంధవ్ కథేంటంటే... ఈ సినిమా కథ అంతా చంద్రప్రస్థ అనే ఫిక్షనల్ టౌన్ చుట్టూ తిరుగుతుంది. అక్కడ డ్రగ్ సరఫరా, గన్ బిజినెస్..లాంటి అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా జరుగుతుంటాయి. కార్టెల్ లీడర్ విశ్వామిత్ర (ముఖేష్ రిషి) ఆధ్వర్వంలో ఇదంతా జరుగుతుంది. ఓ సారి విశ్వామిత్రకు 20 వేలమంది యువతతో పాటు గన్స్, డ్రగ్స్ సరఫరా చేసే డీల్ వస్తుంది. ఆ పనిని తన వద్ద పని చేసే మాఫియా లీడర్ వికాస్ మాలిక్(నవాజుద్దీన్ సిద్ధిఖి)కి అప్పగిస్తాడు. అతను తన అనుచరురాలు జాస్మిన్(ఆండ్రియా)తో ఈ డీల్ సక్రమంగా జరిగేలా చూస్తుంటాడు. అదే సమయంలో ఐదేళ్ల క్రితం వెళ్లిపోయిన సైంధవ్ కోనేరు అలియాస్ సైకో(వెంకటేష్) తిరిగి చంద్రప్రస్థ టౌన్కి వస్తాడు. అతనికి కూతురు గాయత్రి(సారా పాలేకర్) అంటే ప్రాణం. చంద్రప్రస్థలో పోర్ట్లో పని చేస్తూ కూతురుతో కలిసి జీవిస్తుంటాడు. పక్కింట్లో నివాసం ఉంటున్న మనో(శ్రద్ధా శ్రీనాథ్)కి సైంధవ్ అంటే చాలా ఇష్టం. భర్త (గెటప్ శ్రీను) కొట్టడంతో అతనిపై కేసు పెట్టి, ఒంటరిగా ఉంటుంది. గాయత్రిని సొంత కూతురిలా చూసుకుంటుంది. ఓ సారి స్కూల్లో సడెన్గా పడిపోతుంది గాయత్రి. ఆస్పత్రికి తీసుకెళ్తే.. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే నరాల వ్యాధి సోకిందని, పాప బతకాలంటే రూ. 17 కోట్లు విలువ చేసే ఇంజెక్షన్ ఇవ్వాలని డాక్టర్లు చెబుతారు. డబ్బు కోసం విశ్వామిత్ర, వికాస్ మాలిక్ను చంపడానికి మైఖేల్ (జిషు సేన్ గుప్తా)తో డీల్ కుదుర్చుకుంటాడు సైంధవ్. అసలు సైంధవ్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఐదేళ్ల క్రితం ఏం జరిగింది? కలిసి బిజినెస్ చేస్తున్న విశ్వామిత్ర, వికాస్ మాలిక్లను చంపేందుకు మైఖేల్ ఎందుకు ప్రయత్నించాడు? కూతురు ప్రాణాలు కాపాడుకోవడం కోసం సైంధవ్ ఏం చేశాడు? చివరకు కూతుర్ని రక్షించుకున్నాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘గతాన్ని పక్కన పెట్టి సామాన్య జీవితం గడుపుతున్న హీరోకి సమస్య రావడం.. మళ్లీ పాత శత్రువులతో యుద్ధం చేయడం.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. భారీ యాక్షన్ సీన్తో కథను ముగించడం’ ఈ తరహా కాన్సెప్ట్తో భాషా మొదలు కొని మొన్నటి జైలర్ వరకు చాలా సినిమాలు వచ్చాయి. సైంధవ్ కథ కూడా ఇలానే ఉంటుంది. కథలో యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్ అన్నీ ఉన్నా.. ఏ ఒక్కటీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయాడు దర్శకుడు శైలేష్ కొలను. కథను బలంగా రాసుకున్నాడు కానీ.. స్క్రీన్ప్లేని సరిగా పట్టించుకోలేకపోయాడు. ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేలా ఒక్క సన్నివేశాన్ని కూడా తీర్చిదిద్దలేకపోయాడు. కొన్ని సన్నివేశాల మధ్య కనెక్షన్ కూడా సరిగా లేదు. ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా.. తెరపై చూస్తే కొంతవరకు అయినా నమ్మేలా ఉండాలి. చుట్టూ వందల మంది ఉండడం.. వారి చేతుల్లో పెద్ద పెద్ద గన్స్ ఉన్నా.. హీరో మాత్రం ఓ చిన్న గన్తో వాళ్లందరినీ మట్టుపెట్టడం ఏంటి? పైగా ఓ సీన్లో హీరోకి బుల్లెట్ తాకుతుంది.. అది స్పష్టంగా చూపిస్తారు కూడా.. కాసేపటికి హీరో ఒంటిపై ఆ గాయం కూడా కనిపించదు? ఇదెలా సాధ్యం? పది నిమిషాల్లో ఇంటికి వచ్చిన విలన్లను ‘లెక్క మారుతుందిరా నా కొడకల్లారా’ అంటూ కొట్టి చంపడమే కాదు ఎక్కడో దూరంలో ఉన్న పోర్ట్కి వెళ్లి వాళ్లను సముద్రంలో పడేసి వస్తాడు? ఎంత లెక్క మారినా.. అది ఎలా సాధ్యం అవుతుంది? ఇలాంటి లాజిక్ లెస్ సీన్స్ చాలానే ఉన్నాయి. ఏ దశలోనూ సినిమా రక్తి కట్టదు. డ్రగ్స్ డీల్.. 20 వేల మంది యువత సరఫరా అంటూ సినిమాను చాలా ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. హీరో ఎంట్రీ తర్వాత కథ ఫాదర్-డాటర్ సెంటిమెంట్ వైపు సాగుతుంది. అయితే సినిమా ప్రారంభంలోనే సైకో వచ్చాడని విలన్లు భయపడడం చూస్తే.. ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ఆ స్టోరీని పక్కకి పెట్లి ఫాదర్-డాటర్ సెంటిమెంట్తో ఫస్టాఫ్ని నడిపించాడు. డబ్బు కోసం హీరో ప్రయత్నించడం.. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలతో ఫస్టాఫ్ పర్వాలేదనిపిస్తుంది. కానీ సెకండాఫ్లో మాత్రం కేవలం యాక్షన్ ఎపిసోడ్లపైనే ఎక్కువగా ఫోకస్ చేశాడు. అందువల్ల భావోద్వేగాలు బలంగా పండలేదు. పోనీ యాక్షన్ ఎపిసోడ్స్ అయినా ఆసక్తికరంగా ఉంటాయా అంటే.. అదీ లేదు. కాల్పుల మోతే తప్ప ఏమీ ఉండదు. కొన్ని పాత్రలకు సరైన ముగింపు ఉండదు. ఇక క్లైమాక్స్ ఎలా ఉంటుందో సినిమా ప్రారంభంలోనే తెలిసిపోతుంది. తెరపై కూడా అంత ఆసక్తికరంగా చూపించలేకపోయాడు. కథ బాగుంది కానీ స్క్రీన్ప్లే విషయంలో దర్శకుడు ఇంకాస్త జాగ్రత్త పడుంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. సైంధవ్ పాత్రలో ఒదిగిపోయాడు వెంకటేశ్. యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్లో కూడా అద్భుతంగా నటించాడు. తెరపై స్టైలిష్గా కనిపించాడు. వెంకటేశ్ తర్వాత ఈ సినిమాలో బలంగా పండిన పాత్ర నవాజుద్దీన్ సిద్ధిఖిది. ఆయన పాత్రను తిర్చిదిద్దిన విధానం బాగుంది. తెలుగు,హిందీని మిక్స్ చేస్తూ ఆయన చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. మనోగా శ్రద్ధా శ్రీనాథ్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. జాస్మిన్గా ఆండ్రియా యాక్షన్ సీన్ అదరగొట్టేసింది. ఆర్యది కేవలం అతిథి పాత్రే. ముఖేష్ రుషి, జిష్షు సేన్ గుప్తా, రుహానీ శర్మ, జయప్రకాశ్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతిక పరంగా సినిమా పర్వాలేదు. సంతోష్ నారాయణన్ పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
ఎనర్జిటిక్ స్పీచ్ మాట్లాడిన శ్రద్ధ శ్రీనాథ్..!
-
Saindhav Pre-Release Event: వెంకటేశ్ ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
Saindhav: వెంకటేశ్ ‘సైంధవ్’ మూవీ స్టిల్స్
-
'జెర్సీ' హీరోయిన్ పచ్చబొట్టు కహానీ.. 18 ఏళ్లప్పుడు ప్రేమ.. అందుకే ఇప్పటికీ!
చాలామంది ఒంటిపై పచ్చబొట్టు చూస్తూనే ఉంటాం. దీన్ని ఇప్పటి జనరేషన్ స్టైల్గా టాటూ అంటున్నారు. అయితే ఒక్కో టాటూ వెనుక ఒక్కో స్టోరీ ఉంటుంది. దాన్ని సదరు వ్యక్తులు బయటపెడితే గానీ తెలియదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇందులో మినహాయింపు ఏం కాదు. ఇప్పుడు కూడా ఓ యంగ్ హీరోయిన్.. అలా తన ఎదపై ఉన్న పచ్చబొట్టు మీనింగ్, అసలు ఇది ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?) శ్రద్ధా శ్రీనాథ్.. స్వతహాగా కన్నడ బ్యూటీ. 2015లో ఓ మలయాళ మూవీతో నటిగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత కన్నడ, తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో తెలుగులో నాని 'జెర్సీ'లో హీరోయిన్గా చేసి మన ప్రేక్షకులకు కూడా దగ్గరైపోయింది. డిఫరెంట్ పాత్రలు చేస్తూ క్రేజ్ పెంచుకున్న ఈ భామ.. వెంకటేశ్ 'సైంధవ్'లో యాక్ట్ చేసింది. ఇది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. తాజాగా 'సైంధవ్' సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటున్న శ్రద్ధా శ్రీనాథ్.. మిగతా విషయాలతో పాటు తన ఎదపై ఉన్న టాటూ సీక్రెట్ కూడా చెప్పింది. 18 ఏళ్ల వయసులో ఓ అబ్బాయి అంటే తనకు క్రష్ ఉండేదని, అతడి ద్వారా తనకు బీటల్స్ బ్యాండ్ గురించి తెలిసిందని చెప్పుకొచ్చింది. లవ్ అని అర్థమొచ్చేలా ఉన్న ఈ టాటూని అప్పట్లోనే క్రష్ కోసం వేసుకున్నానని అసలు సంగతి చెప్పింది. అయితే ఆ అబ్బాయి ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. సో శ్రద్ధా శ్రీనాథ్ టాటూ సీక్రెట్ అదనమాట. (ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) -
‘జెర్సీ’భామ సినీ జర్నీ..ఎల్ఎల్బీ పట్టా పొంది సినిమాల్లోకి
శ్రద్ధా శ్రీనాథ్.. ‘జెర్సీ’తో తెలుగు తెర మీద మెరిసింది.. మెప్పించింది. తన నటనతోదక్షిణాదిన అన్ని భాషల్లో ఇటు వెండితెరనూ అటు వెబ్తెరనూ మెరిపిస్తోంది. ఆ తార గురించి కొన్ని విషయాలు.. ► శ్రద్ధా జన్మస్థలం.. జమ్మూ – కశ్మీర్లోని ఉధమ్పూర్. నాన్న.. ఆర్మీ ఆఫీసర్, అమ్మ టీచర్. బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్లో ఎల్ఎల్బీ పట్టా పుచ్చుకుంది. ► చదువు పూర్తయ్యాక కొద్ది రోజులు రియల్ ఎస్టేట్ రంగంలో లీగల్ అడ్వయిజర్గా పనిచేసింది. ► అనుకోకుండా నటించిన ఓ కమర్షియల్ యాడ్ అమెను ఒక కన్నడ చిత్రం ఆడిషన్స్కి వెళ్లేలా చేసింది. దానికి ఆమె సెలెక్ట్ కాలేదు కానీ ఆ ప్రయత్నం మాత్రం యాక్టింగ్ కెరీర్ను ఆమె సీరియస్గా తీసుకునేలా చేసింది. ► ‘కోహినూర్’ అనే మలయాళ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. తర్వాత కన్నడ ‘యూటర్న్’లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు ఫిల్మ్ఫేర్ అవార్డ్నూ అందుకుంది. ► తమిళ, కన్నడ సినిమాల్లో ఎక్కువగా నటించే శ్రద్ధా శ్రీనాథ్.. ‘జెర్సీ’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ లోనూ నటించింది. ► నటనావకాశాలు తప్ప దాని ప్లాట్ఫామ్స్ గురించి శ్రద్ధ పెద్దగా ఆలోచించడం లేదు. అందుకే వెబ్తెర చాన్స్లనూ అందిపుచ్చుకుంటోంది. అలా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ‘ఇరుగప్పట్రు’, సోనీ లివ్ ‘విట్నెస్’ లతో అలరిస్తోంది. తను నటించిన ‘సైంధవ్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. టూర్స్ చేయడం చాలా ఇష్టం. అలా వెళ్లినప్పుడల్లా అక్కడేదైనా కొత్త పని నేర్చుకుంటూంటా! ఈ మధ్య హాలిడే కోసం ఓ రిసార్ట్కు వెళ్లినప్పుడు.. అక్కడ కుండలు తయారు చేయడం నేర్చుకున్నా: శ్రద్ధా శ్రీనాథ్ -
వెంకటేశ్ ‘సైంధవ్’ మూవీ టీజర్ లాంచ్ వేడుక (ఫొటోలు)
-
వారివల్లే ఈ ప్రయాణం సాధ్యమైంది
‘‘నా మొదటి సినిమా(కలియుగ పాండవులు) నుంచి ఇప్పుడు 75వ సినిమా ‘సైంధవ్’ వరకూ నన్ను ఎంతగానో ప్రేమించి, ఆదరించి, అభిమానిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత వల్లే ఈ ప్రయాణం సాధ్యపడింది. ఇందుకు ప్రేక్షకులకు, నా అభిమానులకు, చిత్ర పరిశ్రమకు ధన్యవాదాలు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సైంధవ్’. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా కీలక పాత్రల్లో నటించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ‘సైంధవ్’ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 13న విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ వేడుకలో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘బలమైన భావోద్వేగాలు, యాక్షన్కి అవకాశం ఉన్న కథ ‘సైంధవ్’. కుటుంబ ప్రేక్షకులందరికీ సినిమా నచ్చుతుంది. ఇందులో నన్ను కొత్తగా చూస్తారు. గతంలో నా సినిమాలు ‘చంటి, కలిసుందాం రా, లక్ష్మి’ సంక్రాంతికి వచ్చి, హిట్ అయ్యాయి. ఇప్పుడు ‘సైంధవ్’ వస్తోంది. సంక్రాంతి రోజు ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూడబోతున్నారు’’ అన్నారు. ‘‘ఈ మూవీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ‘‘వెంకటేశ్గారి ప్రతిష్టాత్మక 75వ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అన్నారు శైలేష్ కొలను. ‘‘వెంకటేశ్గారితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. -
ఇంతకుముందు సరైన సినిమాలు చేయలేకపోయా.. ఆ బాధే..: హీరో
నటుడు విక్రమ్ ప్రభు, విదార్థ్, శ్రీ శ్రద్ధా శ్రీనాథ్, సానియా అయ్యప్పన్, అపర్నిధి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇరుగప్పట్రు. ఎస్సార్ ప్రభు తన పొటాన్షియల్ స్టూడియోస్ పతాకంపై నిర్మించాడు. యువరాజ్ దయాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం గోకుల్, సంగీతాన్ని జస్టిన్ ప్రభాకరన్ అందించారు. ఈనెల 6న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్లో థాంక్స్ గివింగ్ మీట్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న విక్రమ్ ప్రభు మాట్లాడుతూ.. ఏ ఊరికి వెళ్లినా అక్కడ ఇళ్లల్లో తాత శివాజీ గణేషన్ ఫోటో ఉంటుందన్నారు. ఈ ఇరుగప్పట్రు చిత్రం కూడా అలా ప్రతి ఇంటికి చేరడం సంతోషంగా ఉందన్నారు. ఇంతకుముందు కొన్ని సరైన చిత్రాలు ఇవ్వలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశానని.. ఆ విచారమే ఈ చిత్ర విజయానికి కారణమని పేర్కొన్నారు. దర్శకుడు యువరాజ్ దయాళన్ మాట్లాడుతూ ఈ చిత్రం విడుదలైన అక్టోబర్ 6న రాత్రి ప్రశాంతంగా నిద్రపోయానని చెప్పారు. నిర్మాత ఎస్సార్ ప్రభు మాట్లాడుతూ.. ఈ సినిమా విడుదలకు ముందు చిన్న సంఘటన జరిగిందన్నారు. సాధారణంగా భారీ చిత్రాలు నిర్మిస్తున్నప్పుడు బాగా ఆడతాయా, ఆడవా అని ఆలోచించకుండా చేస్తామన్నారు. అయితే ఎవరైనా కులచిత్రాలను నిర్మిస్తున్నట్లు తర్వాత చెబితే బాగా ఆలోచించి నిర్మించండి అని చెప్తానన్నారు. దాంతో చాలామంది తనపై ఆగ్రహించుకునేవారని చెప్పారు. అదేవిధంగా కరోనా కాలం తర్వాత చాలా మార్పులు చోటుచేసుకున్నాయని, ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపడం లేదని, మంచి కథా చిత్రాలను యువత చూడడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంచి కథ, కథనాలతో రూపొందిస్తే చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా సక్సెస్ అవుతాయని తమ ఇరుగప్పట్రు చిత్రం నిరూపించిందని పేర్కొన్నారు. చదవండి: 'లియో' బుకింగ్ స్టార్ట్.. వార్నింగ్ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం -
బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన తమిళ మూవీ!
హీరో విక్రమ్ ప్రభు, విదార్థ్, శ్రద్ధ శ్రీనాథ్, అపర్ణతి, సానియా అయ్యప్పన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇరుగప్పట్రు. యువరాజ్ దయాళ్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్సార్. ప్రభు తన పొటన్షియల్ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 6న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రభు శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈతరం యువకులు కుటుంబ జీవితాల్లో ఎదుర్కొనే సమస్యలను వాటికి పరిష్కారాన్ని చక్కగా తెరపై ఆవిష్కరించిన చిత్రం ఇరుగప్పట్రు అని తెలిపారు. ఈ చిత్రం రెండవ రోజు నుంచి థియేటర్లలో ప్రదర్శన ఆటలను పెంచారని చెప్పారు. ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించడం సంతోషంగా ఉందన్నారు. మంచి కథా చిత్రాలను ఎప్పు డూ ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి ఈ చిత్రం ద్వారా నిరూపించారన్నారు. ఇరుగచుట్రు చిత్రం బ్లాక్ బస్టర్ అయిందని ఆయన పేర్కొన్నారు. చదవండి: బిగ్బాస్ బ్యూటీ శుభశ్రీ.. ఐదు వారాల్లో ఎంత వెనకేసిందంటే? -
ఈగో సమస్యలపై సినిమా.. హీరోయిన్గా 'జెర్సీ' బ్యూటీ
శ్రద్ధ శ్రీనాథ్.. ఈ పేరు చెబితే తెలియకపోవచ్చు గానీ నాని 'జెర్సీ' హీరోయిన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. 'విక్రమ్ వేద' మూవీతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'నేర్కొండ పార్వై' చిత్రంతో సత్తాచాటింది. తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ కన్నడ భామ.. తమిళంలో చేసిన కొత్త సినిమా 'ఇరుగపట్రు'. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) యువరాజ్ దయాళన్ దర్శకత్వంలో పొటెన్షియల్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు, విధార్థ్, శ్రద్ధా శ్రీనాథ్, మహిమా నంబియార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నిర్మాణం పూర్తి చేసుకుని చిత్రం ఈ నెల 6వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రద్ధ శ్రీనాథ్.. సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుత జనరేషన్ ఈగో సమస్యల కాన్సెప్ట్తోనే 'ఇరుగపట్రు' తీశారని శ్రద్ధ శ్రీనాథ్ చెప్పింది. ఇందులో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న మంగ్లీ? స్పందించిన సింగర్!) -
ఏమవుతుంది?
ప్రపంచ మానవాళికి 2064 సంవత్సరంలో ఏం అవుతుంది? ఏం మార్పులు సంభవిస్తాయి? అనే అంశంతో రూపొందిన చిత్రం ‘కలియుగం’. శ్రద్ధా శ్రీనాథ్, కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రమోద్ సుందర్ దర్శకత్వంలో కేఎస్ రామకృష్ణ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో రిలీజ్ కానుంది. ‘‘హారర్ థ్రిల్లర్గా ‘కలియుగం’ రూపొందింది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డాన్ విన్సెంట్, కెమెరా: కె. రామ్చరణ్. -
Shraddha Srinath: హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కలియుగం మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
భార్యకు బహుమతిగా ఆ సినిమా.. స్టార్ హీరో కామెంట్స్!
మానగరం, మాన్స్టర్, టాణాకారన్ లాంటి డిఫరెంట్ హిట్ సినిమాలని నిర్మించిన పొటాన్షియల్ స్టూడియోస్ సంస్థ తీసిన కొత్త మూవీ 'ఇరుగప్పట్రు'. విక్రమ్ప్రభు, విధార్థ్, శ్రీ, శ్రద్ధాశ్రీనాథ్, సానియా అయప్పన్, అపర్నది ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి 'ఎలి' ఫేమ్ యువరాజ్ దయాళన్ దర్శకత్వం వహించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. అక్టోబర్ 6న థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: అనుకోకుండా కిస్.. వాంతి చేసుకున్న 'కేజీఎఫ్' బ్యూటీ) రిలీజ్ దగ్గరపడిన సందర్భంగా చైన్నెలోని తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ టైలర్మేడ్ పాత్ర పోషించారని, ఈ మూవీ కోసం బరువు కూడా పెరిగారని చెప్పుకొచ్చారు. నటుడు విధార్ధ్ పారితోషికం లేకుండానే ఈ చిత్రంలో నటిస్తానని చెప్పారని తెలిపారు. నటుడు విక్రమ్ ప్రభు మాట్లాడుతూ.. అక్టోబరు తనకు చాలా ప్రత్యేకమైందని అన్నాడు. అక్టోబరు 6 తన తాతగారు శివాజీగణేశన్ పుట్టినరోజు అని, అలానే తన భార్య పుట్టినరోజు కూడా అని చెప్పాడు. అందుకే ఆ చిత్రాన్ని తన భార్యకు బహమతిగా ఇస్తానని చెప్పానని పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: 'స్కంద' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!) -
వెంకటేశ్ 'సైంధవ్' కొత్త షెడ్యూల్.. అక్కడ షూటింగ్
వెంకటేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్గా నటిస్తున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ కర్ణాటకలోని బీదర్లో ప్రారంభమైంది. వెంకటేశ్ పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేశారట శైలేష్ కొలను. తాజాగా మొదలైన బీదర్ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకూ సాగుతుందట. సెప్టెంబరులో ప్లాన్ చేసిన ఓ విదేశీ షెడ్యూల్తో ‘సైంధవ్’ చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందని, వినాయక చవితి పండగ సందర్భంగా టీజర్ను విడుదల చేసే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నారని ఫిల్మ్నగర్ సమాచారం. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ‘సైంధవ్’ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. ఈ సినిమాకు సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు, సంగీతం: సంతోష్ నారాయణ్. -
త్వరలో ఫైనల్ మిషన్
మిషన్ను పూర్తి చేయడానికి వెంకటేశ్ రెడీ అవుతున్నారు. వెంకటేశ్ హీరోగా ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘సైంధవ్’. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్లుగా నటిస్తున్నారు, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్గా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తాజా కీలక షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్లో ముగిసింది. ప్రధానంగా వెంకటేశ్, రుహానీ శర్మ, శ్రద్ధా శ్రీనాథ్ ΄ాల్గొనగా ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. త్వరలోనే ఈ సినిమా ఫైనల్ మిషన్ (ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ) ఆరంభం కానుందని చిత్ర యూనిట్ పేర్కొంది. వెంకటేశ్ కెరీర్లో 75వ చిత్రంగా రూ΄÷ందుతున్న ఈ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు. -
దీర్ఘాలోచనలో శ్రద్ధా శ్రీనాథ్.. డిసెంబర్ 22న తెలుస్తుంది
క్యాబ్లో వెళుతోంది మనోజ్ఞ. కారులోనే లంచ్ ముగించాలనుకుంది. బాక్స్ ఓపెన్ చేసింది కానీ ఏదో దీర్ఘాలోచనలో పడింది. ఏ విషయం గురించి మనోజ్ఞ ఆలోచిస్తోందో ‘సైంధవ్’ చిత్రంలో తెలుస్తుంది. వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమె పాత్ర పేరు మనోజ్ఞ. ఈ పాత్రను పరిచయం చేస్తూ, శనివారం లుక్ని విడుదల చేశారు. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ వైజాగ్లో జరుగుతోంది. ‘‘ఇప్పటివరకూ శ్రద్ధా శ్రీనాథ్ చేసిన పాత్రల్లో మనోజ్ఞ బెస్ట్ అని చెప్పొచ్చు. నటనకు పూర్తిగా అవకాశం ఉన్న పాత్ర ఆమెది’’ అని చిత్రబృందం పేర్కొంది. హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలుగు తెరకు పరిచయంకానున్న ఈ చిత్రం దక్షిణాది భాషల్లోను, హిందీలోనూ డిసెంబర్ 22న విడుదల కానుంది. -
అందుకే గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తున్నా: ‘జెర్సీ’ మూవీ హీరోయిన్
తన అందాన్ని అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారని నాని జెర్సి మూవీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు. బ్యూటీ విక్రం వేదా చిత్రం ద్వారా హీరోయిన్గా కోలీవుడ్కు పరిచయమైందిఈ బెంగళూరు బ్యూటీ. ఆ మూవీ విజయంతో ఆమెకు ఇక్కడ అనేక అవకాశాలు వచ్చాయి. అలా ఆమె అజిత్ కథానాయకుడుగా నటించిన నేర్కొండ పార్వై చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. ఆ చిత్రం సక్సెస్ అయ్యింది. అదేవిధంగా మాధవన్కు జంటగా మారా అనే చిత్రంలో నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. జెర్సీ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ అందుకుంది. అదేవిధంగా బాలీవుడ్కు పరిచయం అయ్యింది. చదవండి: ‘గీత ఆర్ట్స్’ బ్యానర్లో గీత ఎవరో చెప్పిన అల్లు అరవింద్ అయితే 2015లో నటిగా పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ఇంకా స్టార్ ఇమేజ్ను మాత్రం పొందలేదనే చెప్పాలి. అదేవిధంగా చేతిలో ప్రస్తుతం పెద్దగా చిత్రాలు కూడా లేవు. తమిళంలో ఓ చిత్రంలో నటిస్తోంది. దీంతో శ్రద్ధా శ్రీనాథ్ అవకాశాల వేటలో పడింది. అందుకు గ్లామర్ మార్గాన్ని ఎంచుకుంది. అందులో భాగంగా ప్రత్యేకంగా ఫొటో షూట్ ఏర్పాటు చేసుకుని తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ దర్శక, నిర్మాతలను దృష్టిలో పడే ప్రయత్నం చేస్తోంది. అదేవిధంగా ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తరచూ అభిమానులతో ముచ్చటిస్తోంది. దీంతో వారు ఫిదా అయిపోతున్నారు. దీని గురించి ఆమె ఇటీవల మాట్లాడుతూ తన అందమైన ముఖాన్ని చూసి అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారని అందుకే గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. -
వార్నీ, అది కూడా రాదా? చెడుగుడు ఆడేసుకున్న హీరోయిన్
జెర్సీ సినిమా హీరోయిన్ ఎవరో తెలుసా? ఇంకెవరు శ్రద్ధా శ్రీనాథ్. ఇవేకాదు.. ఆరట్టు, కృష్ణ అండ్ హిస్ లీల, విక్రమ్ వేద.. ఇలా మరెన్నో సినిమాలు చేసింది. అయితే ఓ మీడియా శ్రద్దా శ్రీనాథ్ ఫొటో షేర్ చేస్తూ శ్రద్దా దాస్ అని ప్రచురించింది. అది కాస్తా ఈ హీరోయిన్ కంటపడటంతో అగ్గి మీద గుగ్గిలమైంది. 'వార్నీ, అన్ని లక్షల మంది ఫాలోవర్లు ఉన్న మీకు నా పేరు కూడా సరిగా రాయడానికి రావట్లేదా?' అని మండిపడింది. ఇక తన పేరును సరిగ్గా పలుకుతున్నవారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. 'నా పేరును సరిగా ఉచ్ఛరించేవారిని అభినందిస్తున్నాను. మీ కీబోర్డ్లో దాస్ లేదా కపూర్ అని చూపించినా శ్రద్దా శ్రీనాథ్ అని సరిగ్గా టైప్ చేస్తున్నారంటే అది మీరు నామీద చూపిస్తున్న ప్రేమకు నిదర్శనం. ఇన్స్టాగ్రామ్లో నా పేరును శ్రద్దా రామా శ్రీనాథ్ అని మార్చుకున్నాను. ట్విటర్లో కూడా ఇలాగే మార్చుకుంటే బెటరేమో.. రామా మా అమ్మ పేరు. కాబట్టి ఇకపై నన్ను శ్రద్దా రామా శ్రీనాథ్ అనే పరిచయం చేసుకుంటాను. మీరే చూస్తారుగా!' 'ఇక దీని గురించి మీరేం చింతించకండి. నన్ను శ్రద్దా దాస్ అనో శ్రద్దా కపూర్ అనో కాకుండా కేవలం శ్రద్దా శ్రీనాథ్ అని పిలవండి చాలు. పెద్ద పెద్ద మీడియా సంస్థలు నా పేరు కూడా సరిగా రాయడం లేదు. బహుశా మీరు జర్నలిజం స్కూలులో పెద్దగా క్లాసులు వినకపోయి ఉండొచ్చు, కానీ ఇకనైనా నా పేరు కరెక్ట్గా రాయండి. సరే మరి, మరో నాలుగు నెలల వరకు నేను ట్విటర్కు బ్రేక్ ఇస్తున్నాను' అంటూ వరుస ట్వీట్లు చేసింది శ్రద్దా శ్రీనాథ్. I appreciate people who get my name right. So much. Even though your keyboard suggests Das or Kapoor, every fibre of your body tells you that Srinath is the one to type. I appreciate you. I see you. You are loved. — Shraddha Srinath (@ShraddhaSrinath) August 3, 2022 Okay enough Twitter for the next 4 months thank you for your sassy replies byeeee — Shraddha Srinath (@ShraddhaSrinath) August 3, 2022 చదవండి: భర్తకు పాదపూజ చేసిన హీరోయిన్పై ట్రోలింగ్, ప్రణీత ఏమందంటే? ఎంత బిజీగా ఉన్నా నా ఇద్దరు మాజీ భార్యలను తప్పకుండా కలుస్తా.. -
Fashion: శ్రద్ధ శ్రీనాథ్ ధరించిన ఈ డ్రెస్ ధర 32 వేలకు పైనే! స్పెషాలిటీ?
పింక్ సల్వార్... ముత్యాల లోలాకులు.. గాజులతో మెరిసిపోతున్న ఈ హీరోయిన్ను గుర్తు పట్టే ఉంటారు. ‘మేమూ జెర్సీ సినిమా చూశాం లెండి’ అంటారా! అవునవును.. ఆ చిత్ర కథానాయికే ఈమె.. శ్రద్ధ శ్రీనాథ్. తెలుగుతోపాటు తన మాతృ భాష కన్నడ, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. వచ్చిన అవకాశాల్లో తాను మెచ్చిన పాత్రలకే ఓకే చెప్తుంది. వాసికే ఆమె ప్రాధాన్యం. సినిమాల్లోకి రాకముందు ఫ్యాషన్ గురించి పెద్దగా పట్టించుకునేది కాదుట. సినిమాల్లోకి వచ్చాకే ఫ్యాషన్ మీద శ్రద్ధ పెరిగింది అని చెప్పే శ్రద్ధ శ్రీనాథ్ ఫాలో అయ్యే బ్రాండ్స్ ఏంటో చూద్దాం... రా మ్యాంగో చేనేతకు ప్రాధాన్యమిచ్చే బ్రాండ్ ఇది. ఫ్యాషన్ ప్రపంచంలో దీని ప్రయాణం 2008లో మొదలైంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, వారణాసి మొదలైన ప్రాంతాల్లోని చేనేత కళతో అద్భుతాలు సృష్టిస్తోంది. అన్ని రకాల వేడుకలకు సరిపోయే దుస్తులను డిజైన్చేయడం రా మ్యాంగో ప్రత్యేకత. ఆన్లైన్లో లభ్యం. బ్రాండ్ వాల్యూ డ్రెస్ బ్రాండ్: రా మ్యాంగో ధర: రూ. 32,800 BCOS ఇట్స్ సిల్వర్ బి అంటే బ్రాస్.. సీఓ అంటే కాపర్.. ఎస్ అంటే సిల్వర్... మొత్తంగా బికాజ్ ఇట్స్ సిల్వర్ బ్రాండ్. 2010లో.. ఇంట్లో మొదలై ఈ రోజు బెంగళూరులోని అతి పెద్ద జ్యూయెలరీ షో రూమ్ స్థాయికి ఎదిగిందీ బ్రాండ్. ఫ్లారెన్స్ ఎస్తర్, ప్రిసిల్లా పాల్, సిండ్రెల్లా రెంజి.. ఈ ముగ్గురు దీని వ్యవస్థాపకులు. ఆధునిక మహిళల అవసరాలు.. ఆలోచనలు.. అభిరుచులకు నాణ్యత, కళను మేళవించి రూపుదిద్దుకునేవే ఆఇౖ ఇట్స్ సిల్వర్ డిజైన్స్. ఆన్లైన్లో దొరుకుతాయి. ధరలూ అందుబాటులోనే ఉంటాయి. జ్యూయెలరీ బ్రాండ్: BCOS ఇట్స్ సిల్వర్ ధర: రూ. 14,430 అందం, ఆరోగ్యం రెండూ వేర్వేరు కాదు. ఆరోగ్యంగా ఉంటే మొహంలో కళ ఉట్టిపడుతుంది. అందుకే నా దృష్టిలో ఆరోగ్యమే అందం! – శ్రద్ధ శ్రీనాథ్ చదవండి: Fashion: వేడుకల వేళ.. కాటన్ కళ.. జరీ అంచుతో అనువుగానూ, అందంగానూ! -
పాన్ ఇండియా సినిమాలో జెర్సీ హీరోయిన్.. ఫస్ట్లుక్ విడుదల
శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి మొల్లేటి ప్రధాన తారాగణంగా నటించిన బహుభాషా చిత్రం ‘విట్ నెస్’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ వెంకటేశ్ నిర్మించారు. ఈ సినిమాకు దీపక్ దర్శకత్వం వహించడంతో పాటు కెమెరామేన్ బాధ్యతలు నిర్వహించారు. మే డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘‘విట్ నెస్’ చిత్రంలో మంచి ఆశయం కోసం పోరాడే ఆర్కిటెక్ట్ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ కనిపిస్తారు. పారిశుద్ధ్య కార్మికుల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, సంగీతం: రమేష్ తమిళమణి. With the world of conservancy workers at its center, the movie WITNESS presents a never-seen-before view of metropolitan cities and the invisible corridors of power lying underneath them.#WITNESS First Look pic.twitter.com/JxyBweGxam — Shraddha Srinath (@ShraddhaSrinath) May 1, 2022 -
Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్ సూపర్ లుక్ (ఫొటోలు)
-
హీరోయిన్కు వింత అనుభవం.. అతన్ని ఫాలో అవ్వమని కోరాడట
Shraddha Srinath Different Experience With Cab Driver And Airport Security: నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది శ్రద్ధా శ్రీనాథ్. తర్వాత సిద్ధు జొన్నల గడ్డ కృష్ణ 'అండ్ హిజ్ లీల', 'మార' సినిమాలతో మరింత పాపులారిటీ దక్కించికుంది. దక్షిణాది భాషలన్నింటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది శ్రద్ధా. అయితే తాజాగా ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే క్రమంలో ఆమెకు జరిగిన వింత అనుభవాల గురించి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. సినిమా షూటింగ్ తర్వాత ఎయిర్పోర్ట్ వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్లో ప్రయాణించేప్పడు డ్రైవర్ ఏసీ ఆన్ చేయలేదు. ఏసీ గురించి అడిగితే అందుకు డ్రైవర్ నిరాకరించాడు. 'పెట్రోల్ ధరలు పెరగడం వల్ల క్యాబ్ డ్రైవర్ ఏసీ ఆన్ చేసేందుకు నిరాకరించాడు. ఎంతోకొంత డబ్బు పొదుపు చేసేందుకు అలా చేశాడని నాకు అర్థమైంది. అందుకే నేను కూడా ఏం అనలేదు. కానీ ఓలా క్యాబ్ సంస్థ వాళ్ల సంపాదనను దోచుకుంటోంది.' అని ఇన్స్టాలో తెలిపింది. అలాగే తనకు ఎయిర్పోర్టులో జరిగిన మరో అనుభవాన్ని శ్రద్ధా వెల్లడించింది. 'ఎయిర్పోర్ట్ ఎంట్రాన్స్ వద్ద సెక్యూరిటీ ఒకతను నన్ను గుర్తుపట్టి, నా దగ్గరికి వచ్చి నా ఇన్స్టా గ్రామ్లో తన అకౌంట్ వెతికి అతన్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరాడు. నేను సానుకూలంగా తిరస్కరించాను. దానికి అతను ఏ సమస్య లేదు. నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. మీకు సపోర్ట్ చేస్తాను.' అని చెప్పాడని శ్రద్ధా పేర్కొంది. -
శాండల్ వుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లు వీళ్లే!
తెలుగులో ఎప్పుడూ ముంబయ్ భామలదే హవా. ఆ తర్వాత మలయాళ బ్యూటీలది. బెంగళూరు భామలు ఇక్కడ తక్కువే. అప్పట్లో సౌందర్య ఓ వెలుగు వెలిగారు. తర్వాత అనుష్క కూడా పెద్ద రేంజ్కి వెళ్లారు. ఇలా అప్పుడప్పుడూ ఒకరిద్దరు వస్తుంటారు. అయితే ఇప్పుడు మాత్రం కన్నడ భామలు అరడజను పైనే తెలుగుకి వచ్చారు శాండల్వుడ్ నుంచి వచ్చిన చందన పరిమళాలు రష్మికా మందన్నా, నభా నటేశ్, కృతీ శెట్టి, శ్రీలీల, శ్రద్ధా శ్రీనాథ్, రచితా రామ్, కావ్యా శెట్టి చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు తెలుగు పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో రష్మికా మందన్నా ఒకరు. ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరపై మెరిసిన ఈ కన్నడ బ్యూటీ ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి హిట్స్తో అందర్నీ ఆకట్టుకున్నారు. మహేశ్బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి దక్కిన చాన్స్ రష్మిక కెరీర్ని నెక్ట్స్ లెవల్కి తీసుకుని వెళ్లింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్గా చేస్తున్నారు. అలాగే శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రంలో కూడా రష్మికాయే హీరోయిన్. తెలుగులో ఆమె సంపాదించుకున్న క్రేజ్ బాలీవుడ్ వరకు చేరింది. హిందీలో ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్స్ (అమితాబ్ బచ్చన్తో ‘గుడ్ బై’, సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’, మరో సినిమా ప్రకటన త్వరలో రానుంది) రష్మిక చేతిలో ఉన్నాయి. ఇక ఒక్క సినిమాతోనే సెన్సేషనల్ హీరోయిన్ అనిపించుకోవడం ఏ కొందరికో కుదురుతుంది. కృతీ శెట్టి ఈ కోవలోకే వస్తారు. ‘ఉప్పెన’ ద్వారా పరిచయమైన ఈ క్యూట్ బ్యూటీకి తెలుగులో మంచి ఆఫర్లు ఉన్నాయి. నిజానికి ‘ఉప్పెన’ సినిమా విడుదలకు ముందే నానీతో ‘శ్యామ్ సింగరాయ్’, సుధీర్బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రాల్లో హీరోయిన్గా చాన్స్ దక్కించుకున్న కృతి ఇటీవల రామ్ కొత్త సినిమాలో హీరోయిన్గా ఎంపిక అయ్యారు. మరో తెలుగు సినిమాకు కూడా కృతి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా తక్కువ సమయంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయారు కృతీ శెట్టి. మరోవైపు కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న శ్రీ లీల సైతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ను సొంతం చేసుకున్నారు. రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఒక హీరోయిన్గా నటిస్తున్నారు శ్రీ లీల. అలాVó హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న ‘పెళ్లిసందడి’ చిత్రంలో శ్రీ లీలయే కథానాయిక. సేమ్ కృతీ శెట్టి మాదిరిగానే తెలుగులో తనది ఒక్క సినిమా విడుదల కాకుండానే శ్రీ లీల రెండు సినిమాలకు సైన్ చేయడం విశేషం. ఇక హైదరాబాద్లో పుట్టి నప్పటికీ బెంగళూరులోనే పెరిగారు కథానాయిక నభా నటేష్. ఆమె మాతృభాష కన్నడ. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ నభా ఖాతాలో ఉంది. ప్రస్తుతం నితిన్ ‘మ్యాస్ట్రో’ (హిందీ చిత్రం ‘అంధాధున్’ తెలుగు రీమేక్)లో నభా నటేష్ హీరోయిన్. జాతీయ అవార్డు సాధించిన నాని ‘జెర్సీ’ చిత్రంతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మరో కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్. ప్రస్తుతం ‘యాత్ర’ ఫేమ్ మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు. ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా’ టైటిల్తో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగులో కొత్త అయినప్పటికీ రచితా రామ్ శాండల్వుడ్లో పాపులర్ హీరోయిన్. ‘సూపర్ మచ్చి’తో ఆమె తెలుగుకి పరిచయం అవుతున్నారు. ఇందులో చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరో. కన్నడంలో మంచి ఫామ్లో ఉన్న మరో బ్యూటీ కావ్యా శెట్టి కన్నడ హిట్ ‘లవ్ మాక్ౖటైల్’ తెలుగు రీమేక్ ‘గుర్తుందా.. శీతాకాలం’లో ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో సత్యదేవ్, తమన్నా హీరోహీరోయిన్. చూశారుగా.. ఇప్పుడు తెలుగులో చందన పరిమళం ఎక్కువగా వీస్తోంది. శాండల్వుడ్ నుంచి ఇంకెంతమంది కథానాయికలు వస్తారో చూడాలి. -
నటుడిగా మారిన రెహమాన్
సంగీతదర్శకుడిగా పలు మధురమైన పాటలను వినిపిస్తుంటారు ఏఆర్ రెహమాన్. ఆ పాటల్లో నటీనటులు అద్భుతంగా నటించారు. ఇప్పుడు రెహమాన్ నటుడిగా మారారు. మోహన్ లాల్ హీరోగా రూపొందుతున్న ‘ఆరట్టు’ అనే మలయాళ చిత్రంలో అతిథి పాత్ర చేశారు రెహమాన్. ఈ యాక్షన్ కామెడీ మూవీకి బి. ఉన్నికష్ణన్ డైరెక్టర్. ‘‘మ్యూజిక్ మ్యాస్ట్రో రెహమాన్ తో షూట్లో పాల్గొనడం సంతోషంగా ఉంది’’ అంటూ లొకేషన్ ఫోటోను షేర్ చేశారు మోహన్ లాల్. ఈ చిత్రం ద్వారా శ్రద్ధా శ్రీనాథ్ మలయాళ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ ఏడాది నవంబరులో సినిమా విడుదల కానుంది. చదవండి: ఏదో పెద్ద శక్తి ఉంది.. దానిపై నాకు చాలా నమ్మకం View this post on Instagram A post shared by Mohanlal (@mohanlal) -
లోకం ఎలా ఉంది నాయనా?
మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మహీ వి. రాఘవ్ ఇటీవల కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. ‘సిద్దా.. లోకం ఎలా ఉంది నాయనా’ టైటిల్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం లోకం తీరు ఎలా ఉంది? అనే అంశంపై సెటైర్గా ఈ చిత్రకథాంశం ఉంటుంది. లేడీ ఓరియంటెడ్ కథగా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్ చేస్తున్నారు. ‘జెర్సీ’, ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ సినిమాల్లో హీరోయిన్గా నటించారు శ్రద్ధ. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ముహూర్తం జరిగింది. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
వచ్చే ఉగాదికి స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తా
‘‘స్ట్రయిట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు అని చాలా మంది అడుగుతున్నారు.. తప్పకుండా వచ్చే ఏడాది ఉగాదికి నా స్ట్రయిట్ తెలుగు సినిమా విడుదలవుతుంది’’ అన్నారు హీరో విశాల్. ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘విశాల్ చక్ర’. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రెజీనా కసాండ్ర ముఖ్య పాత్రలో నటించారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదారాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో విశాల్ మాట్లాడుతూ– ‘‘డిజిటల్ క్రైమ్స్ నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఎంఎస్ ఆనందన్ ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా తీశారు. నా తమ్ముడు యువన్ శంకర్ రాజా మంచి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. నా తమ్ముడు వరంగల్ శ్రీను సహా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ‘విశాల్ చక్ర’ తో తప్పకుండా జాక్ పాట్ కొడతారు’’ అన్నారు. ఎంఎస్ ఆనందన్ మాట్లాడుతూ– ‘‘ఎక్కడో ఉన్న నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది విశాల్గారే. ఈ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ ప్రతి సీక్వెన్స్ చాలా ఎగ్జయిటింగ్గా ఉంటుంది. నాకు తెలుగు సినిమా అన్నా, తెలుగు భాష అన్నా చాలా ఇష్టం.. సినిమాలు చూసే తెలుగు నేర్చుకున్నాను. దర్శకుడు రాజమౌళిగారు అరంటే చాలా ఇష్టం ’’అన్నారు. ‘మిస్ ఇండియా’ దర్శకుడు నరేంద్రనాథ్, పవన్తేజ్ కొణిదెల, మేఘన, నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ శోభన్ తరుపున నరసింహసాయి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాలసుబ్రమనియం. -
పట్టరాని సంతోషంలో ఇద్దరు హీరోయిన్లు!
అందరికీ కొన్ని కలలు ఉంటాయి. ఆ కలలు నెరవేరితే ఆనందంతో ముఖం కళకళలాడిపోతుంది. ఇప్పుడు హీరోయిన్లు కృతీ సనన్, శ్రద్ధా శ్రీనాథ్ కూడా పట్టరాని సంతోషంలో ఉన్నారు. ఎందుకంటే వీళ్లిద్దరూ తమ కల నెరవేర్చుకున్నారు. నాజూకు సుందరి కృతీకి ఎప్పటినుంచో బైక్ నడపాలని కోరిక. బైక్ బరువైనా మోయగలుగుతావా? అని స్నేహితులు సరదాగా అంటే, ‘మీరే చూద్దురుగానీ’ అన్నారామె. అనడమే కాదు.. నేర్చేసుకుని రయ్ రయ్మంటూ ద్విచక్ర వాహనాన్ని నడిపేశారు కూడా. ప్రస్తుతం హిందీ చిత్రం ‘బచ్చన్ పాండే’లో నటిస్తున్నారు కృతీ సనన్. ఈ షూటింగ్ లొకేషన్లో కాస్త గ్యాప్ దొరకడంతో బైక్ నడిపారు. ‘ఇంతకీ బైక్ ఎప్పుడు నేర్చుకున్నావ్?’ అని ఓ ఫ్రెండ్ అడిగితే ‘ఇవాళే మొదలుపెట్టాను. నేర్చేసుకున్నాను’ అన్నారు కృతీ సనన్. దీన్నిబట్టి ఈ బ్యూటీ ఎంత త్వరగా నేర్చేసుకున్నారో ఊహించవచ్చు. ఇక శ్రద్ధా శ్రీనాథ్ విషయానికి వద్దాం. విహార యాత్రలకు వెళ్లినప్పుడు కేవలం ఎంజాయ్మెంట్ మాత్రమే కాదు... ఉపయోగపడేది ఏదైనా చేయాలనుకుంటారు శ్రద్ధా. హాలిడే కోసం ఇటీవల ఓ రిసార్ట్కి వెళ్లారామె. అక్కడ కుండలు తయారు చేయడం నేర్చుకున్నారు. ‘ఎప్పటినుంచో ఓ కుండ తయారు చేయాలనుకున్నా. ఇదిగో చేసేశా’ అంటూ ఫొటో షేర్ చేశారు శ్రద్ధా శ్రీనాథ్. బైక్ నడిపినందుకు కృతీకి, కుండ తయారు చేసినందుకు శ్రద్ధాకి బోలెడన్ని ప్రశంసలు లభించాయి. (చదవండి: కాలి నడకన తిరుపతి కొండెక్కిన యంగ్ హీరో) -
ముప్ఫై ఏళ్లు ముందుకు...
2020 నుంచి ఏకంగా ముప్ఫై ఏళ్లు ముందుకు వెళ్లి 2050లోకి అడుగుపెట్టబోతున్నారు శ్రద్ధా శ్రీనాథ్. ఎందుకు అంటే? ఆమె అంగీకరించిన తాజా చిత్రం ‘కలియుగం’ కథ 2050 నేపథ్యంలో సాగుతుంది. ‘జెర్సీ’లో మంచి నటన కనబరచిన శ్రద్ధా ఈ చిత్రకథ వినగానే అంగీకరించారట. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఆర్.కె. ఇంటర్నేషనల్ బ్యానర్పై కేఎస్ రామకృష్ణ నిర్మించనున్నారు. పలు వాణిజ్య ప్రకటనలకు దర్శకత్వం వహించిన ప్రమోద్ సుందర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ – ‘‘కథ విన్న వెంటనే ఈ సినిమా ఒప్పుకున్నాను. అంత గొప్పగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదు’’ అన్నారు. ‘‘అద్భుతమైన కథతో హారర్ థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా ఉంటుంది. 2021 జనవరిలో షూటింగ్ ప్రారంభిస్తాం. 2050 బ్యాక్డ్రాప్ కాబట్టి సెట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ అసిస్టెంట్ రామ్చరణ్ సినిమాటోగ్రాఫర్గా చేయనున్నారు. -
ఐఏఎస్ ఆఫీసర్గా..
‘జెర్సీ’ చిత్రంలో మిడిల్క్లాస్ హౌస్వైఫ్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శ్రద్ధా శ్రీనాథ్. తాజాగా మలయాళంలో ఓ సినిమా అంగీకరించారు. మోహన్లాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా ఐఏఎస్ ఆఫీసర్గా కీలక పాత్ర చేయబోతున్నారు. ఈ చిత్రానికి ‘పులిమురుగన్’ ఫేమ్ బి. ఉన్నికృష్ణన్ దర్శకుడు. శ్రద్ధాకు ఫోన్లో ఈ కథను చెప్పారట దర్శకుడు. మంచి కథ, నటనకు అవకాశం ఉన్న పాత్ర కావడంతో ఎక్కువ డేట్స్ను ఈ సినిమాకు కేటాయించారట శ్రద్ధా. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ నవంబర్లో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం విశాల్తో ‘చక్ర’, మాధవన్తో ‘మారా’ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలతో శ్రద్ధా శ్రీనాథ్ బిజీ బిజీగా ఉన్నారు. -
నరుడి బ్రతుకు నటన
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రం మంచి విజయం సాధించింది. మరోసారి వీరిద్దరూ జంటగా ‘నరుడి బ్రతుకు నటన’ అనే సినిమాలో నటించనున్నారు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన విమల్ కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమా దీపావళికి ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రచార చిత్రాన్ని శుక్రవారం విడుదల చేశారు. హెడ్ఫోన్స్, హార్ట్ సింబల్.. ఓ జంటతో ఈ ప్రచార చిత్రాన్ని డిజైన్ చేశారు. మామూలుగా హార్ట్ సింబల్ ఎరుపు రంగులో ఉంటుంది. కానీ నీలం రంగులో కనిపిస్తోంది. అదేంటో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సమర్పణ: పి.డి.వి. ప్రసాద్, సంగీతం: కాలభైరవ, కెమెరా: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలినేని. -
ఓటీటీలోనే మారా!
మాధవన్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘మారా’. నూతన దర్శకుడు దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘చార్లీ’ చిత్రానికి ఇది రీమేక్. దుల్కర్ సల్మాన్ చేసిన పాత్రను మాధవన్ చేశారు. హీరోయిన్ పార్వతి పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ నటించారు. లాక్డౌన్ ముందే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కూడా నేరుగా ఓటీటీలో విడుదల కానున్నట్టు సమాచారం. ఆల్రెడీ ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో ఈ చిత్రబృందం ఒప్పందం కుదుర్చుకుందట. ఈ వారంలో అధికారిక ప్రకటన రానుంది. -
టొరంటో చిత్రోత్సవంలో జెర్సీ
నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా గతేడాది విడుదలైన చిత్రం ‘జెర్సీ’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తెలుగులో పలు ప్రశంసలు దక్కించుకున్న ఈ చిత్రబృందం మరో తీపి కబురు అందుకుంది. ఈ ఏడాది ఆగస్టు 9 నుండి 15 వరకు జరిగే భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ‘జెర్సీ’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ‘‘మన దేశ స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న కెనడాలో మా చిత్రం ప్రదర్శితం కానుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత నాగవంశీ. ఇదిలా ఉంటే ‘జెర్సీ’ హిందీలో రీమేక్ అవుతోంది. షాహిద్ కపూర్ హీరోగా ఈ రీమేక్ని గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు. -
ఆ ప్రశ్న నటులను ఎందుకు అడగరో?
సాధారణంగా హీరోలు వివాహం తర్వాత కూడా కథకు అవసరమైతే శృంగార సన్నివేశాల్లో నటిస్తుంటారు. పెళ్లనేది వారి అవకాశాలకు అడ్డుకాదు. అలాగే పాత్రల ఎంపిక విషయంలోనూ ఎలాంటి మార్పూ అవసరంలేదు. కానీ హీరోయిన్ల పరిస్థితి వేరు. పెళ్లయిందంటే చాలు.. అవకాశాలు తగ్గుతాయి. ఇక రొమాంటిక్ సీన్స్లో నటిస్తే ‘పెళ్లయ్యాక కూడా ఇలాంటి సీన్లు చేయడం ఏంటి?’ అని విమర్శించడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. దీనిపై కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్ (‘జెర్సీ’ ఫేమ్) సోషల్ మీడియా వేదికగా ఓ చర్చకు తెరతీశారు. ‘పెళ్లయ్యాక హీరోయిన్కి నిజంగానే డిమాండ్ తగ్గుతుందా? మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది పది మార్కుల ప్రశ్న. దయచేసి చర్చించండి’ అంటూ పోస్ట్ చేశారు. అంతేకాదు.. ఆమె ఇంకా మాట్లాడుతూ –‘‘నా ఫ్రెండ్, నటి త్వరలో వివాహం చేసుకోబోతోంది. పెళ్లి తర్వాత కూడా తను నటిస్తుందా? అని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఓ వ్యక్తి అడిగారు. అది కూడా చాలా నిర్లక్ష్యంగా. ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయాను. తను అలా అడగడం నాకు కోపం తెప్పించడంతో పాటు నన్ను ఆలోచనలో పడేసింది. వివాహం అయిన నటులు రొమాంటిక్ సీన్స్లో నటిస్తున్నారు కదా? అలాంటి ప్రశ్నలు వారిని ఎందుకు అడగరో అర్థం కాదు. ఈ విషయం గురించి మీ స్పందన తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అన్నారు. ఆమె పోస్ట్కి పలువురు ఫాలోయర్స్ స్పందిస్తూ –‘‘మీరు చెప్పింది కరెక్ట్. హీరోలకి ఒక న్యాయం.. హీరోయిన్లకి ఒక న్యాయమా? ఒక నటిని అలాంటి ప్రశ్నలు అడగడం కరెక్ట్ కాదు. పెళ్లయితే యాక్టింగ్ మానేయాలనో, ఫలానా సీన్స్లో నటించకూడదనో అమ్మాయిలకు ఆంక్షలు పెట్టడం సరికాదు. వారి ఇష్టానికి తగ్గ పాత్రలు చేసుకోవచ్చు’ అని సమాధానమిచ్చారు. సమాధానం అవుదాం – హితా శ్రద్ధా శ్రీనాథ్ పోస్ట్కి కన్నడ నటి హితా కూడా సమాధానమిస్తూ –‘‘పెళ్లైన తర్వాత కూడా నటిస్తారా? అంటూ లెక్కలేనన్ని సార్లు నన్ను అడిగారు. నా వైవాహిక జీవితానికి, నా వృత్తికి ఎటువంటి సంబంధం లేదని నేను ఎప్పుడో చెప్పాను. నేను పెళ్లి చేసుకుంటున్నానని తెలిశాక దర్శకులు నాకు అవకాశాలు ఇవ్వడం మానేశారు. అయితే పెళ్లి అనేది నా పనిని మాత్రం కొనసాగించకుండా ఆపలేదు. ప్రతిభను కోరుకునే వ్యక్తులు ఎలాగైనా నాలోని ప్రతిభని గుర్తిస్తారని నమ్ముతున్నాను. ఇలాంటి మూస ధోరణిని విచ్ఛిన్నం చేసి, అలాంటి అర్థం లేని ప్రశ్నలకు మనం సమాధానంగా నిలబడాలి’’ అన్నారు. గత ఏడాది హితా వివాహం జరిగింది. -
‘జెర్సీ’ మూవీ హీరోయిన్ శ్రద్ధాశ్రీనాథ్ ఫోటోలు
-
'హిందూ దేవుళ్లను కించపరుస్తున్న నెట్ఫ్లిక్స్'
కృష్ణ అండ్ హిజ్ లీల.. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంపై హిందుత్వవాదులు మండిపడుతున్నారు. సినిమాలో దేవుడి పేరు పెట్టుకున్న కృష్ణ అనే వ్యక్తి అనేక మంది అమ్మాయిలతో శారీరక సంబంధాలు పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ దేవత పేరు పెట్టుకున్న రాధను కూడా బాధితురాలిగా చూపించారని ఆగ్రహిస్తున్నారు. ఇలాంటి అభ్యంతరకర సన్నివేశాలకు హిందూ దైవాల పేర్లు వినియోగించడమే కాక, హిందూ మతాన్ని కించపరిచే వాటిని ప్రోత్సహిస్తుందంటూ నెట్ఫ్లిక్స్పై ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. దీంతో ట్విటర్లో #BoycottNetflix ట్రెండ్ అవుతోంది. (‘క్రిష్ణ అండ్ హీస్ లీల’ ఫస్ట్లుక్ టీజర్) "ఇంతకుముందు వచ్చిన సాక్క్డ్ గేమ్స్, లైలా, ఘౌల్, ఢిల్లీ క్రైమ్ వంటి పలు వెబ్ సిరీస్లు హిందూ వ్యతిరేకతను ప్రోత్సహించింది. ఇప్పుడొచ్చిన కృష్ణ అండ్ హిస్ లీల కూడా హిందూ దేవుళ్లను కించపరుస్తోంది", "మా డబ్బుతో, మా విశ్వాసాలకు వ్యతిరేకంగా వెబ్ సిరీస్లు తీసేందుకు నెట్ఫ్లిక్స్కుఎంత ధైర్యం? ఒక మనిషిని చంపడం కన్నా వారి నమ్మకాన్ని చంపడమే పెద్ద నేరం. దీన్ని ఎట్టి పరిస్థితిలోనూ సహించం" అంటూ నెటిజన్లు కోపంతో రగిలిపోతున్నారు. మరికొందరు మాత్రం దీనిపై మీమ్స్ చేస్తూ సమస్యను శాంతింప చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన "కృష్ణ అండ్ హిజ్ లీల" చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించారు. శ్రద్దా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ వందికట్టి హీరోయిన్లుగా నటించారు. (మాజీ ప్రియుడి నెట్ఫ్లిక్స్ అకౌంట్ హ్యాక్!) -
ఫస్ట్ లవ్ సత్య.. క్రిష్ణలో సగభాగం రాధ
‘క్షణం’ సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు రవికాంత్ పేరపు ప్రస్తుతం ‘క్రిష్ణ అండ్ హీస్ లీల’ అనే ఓ యూత్ఫుల్ సబ్జెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వయకామ్ 18, సంజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘గుంటూరు టాకీస్’ ఫేం సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తుండగా.. శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ వందికట్టి హీరోయిన్లు. ఈ క్రమంలో హీరో రానా దగ్గుబాటి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ను విడుదల చేశారు. View this post on Instagram Krishna’s #FirstLove, Satya!! #KrishnaAndHisLeela @ranadaggubati |@siddu_boy | @raviperepu | @shraddhasrinath | @shalinivadnikatti | @iamseeratkapoor| @sureshproductions| @viacom18 |#KrishnaAndHisLeela | #basedontruerumours A post shared by Rana Daggubati (@ranadaggubati) on Jun 22, 2020 at 4:33am PDT చిత్రంలో ప్రధాన పాత్రలైన రాధ, సత్యలను పరిచయం చేశారు. ‘క్రిష్ణ ఫస్ట్ లవ్ సత్య’.. ‘రాధ ది అదర్ హఫ్ ఆఫ్ ద క్రిష్ణ’ క్యాప్షన్తో షేర్ చేసిన ఈ టీజర్ చిత్రంపై ఆసక్తిని పెంచుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ముందుగా ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేద్దాం అనుకున్నప్పటికి.. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవడంతో ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించనున్నారు. (‘హిరణ్యకశ్యప’ లేటెస్ట్ అప్డేట్) View this post on Instagram Radha the other half of Krishna! #HalfOfKrishna #KrishnaAndHisLeela @ranadaggubati |@siddu_boy | @raviperepu | @shraddhasrinath | @shalinivadnikatti | @iamseeratkapoor| @sureshproductions| @viacom18 |#KrishnaAndHisLeela | #basedontruerumours A post shared by Rana Daggubati (@ranadaggubati) on Jun 23, 2020 at 3:52am PDT -
ఆట మొదలైంది
విశాల్ హీరోగా ఎం.ఎస్. ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చక్ర’. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుండగా కీలక పాత్రలో రెజీనా నటిస్తున్నారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ పోస్టర్ని సోమవారం విడుదల చేశారు. పవర్ఫుల్ లుక్లో విశాల్ ఉన్న ఈ పోస్టర్కి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం తెలిపింది. ‘చక్ర’ గ్లింప్స్ ఆఫ్ ట్రైలర్ పేరుతో ‘ఆట మొదలైంది’ అని విశాల్ చెప్పే డైలాగ్తో వీడియోను కూడా విడుదల చేశారు. ‘‘బ్యాంక్ దోపిడీ, సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. అత్యుత్తమ సాంకేతిక విలువలతో కొత్త కథా కథనాలతో ఈ చిత్రం ఉంటుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. మనోబాలన్, రోబో శంకర్, కేఆర్ విజయ్, సృష్టి డాంగే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: బాలసుబ్రమణ్యం. -
అరచేతి సిందూరం
రక్తం ఆడపిల్లల్ని భయపెట్టదు. రక్తంతో సహజీవనం వాళ్లది!! మగపిల్లలే.. రక్తమంటే కళ్లు మూసుకుంటారు. పడి, దెబ్బలు తగిలినప్పుడే.. ఈ ధీశాలురు రక్తాన్ని చూడటం. ఇక పీరియడ్ బ్లడ్ అయితే.. అదొక ‘స్త్రీ గ్రూప్’ బ్లడ్ వీళ్లకు. ‘‘ఛుక్ చుక్ రైలు వస్తోంది.. దూరం దూరం జరగండి..’’ మెన్ కూడా బాయ్సే ఈ స్టేషన్లో! ఎలా వీళ్లతో కలిసి ప్రయాణించడం? ‘అరచేతి సిందూరం’తో గోప్యాల చీకట్లను పోగొట్టడమే. తెలియనివాళ్లకు తెలియజెప్పడం దేనికి? మొదట వచ్చే ప్రశ్న! నిజమే కదా.. పూర్తిగా వ్యక్తిగత విషయం అయినప్పుడు.. ‘నేను పీరియడ్స్లో ఉన్నాను’ అని అరిచేతిలో ఎర్రచుక్క పెట్టుకోవడం దేనికి.. గుసగుసల్ని రేపడానికి కాకపోతే?! అయితే గుసగుసలు లేకుండా చెయ్యడానికే ‘యూనిసెఫ్’.. రెడ్ డాట్ ఛాలెంజ్ని ‘మెన్స్ట్రువల్ హైజీన్ డే’ కి సరిగ్గా రెండు నెలల ముందు ఈ ఏడాది మార్చినెలలో మొదలుపెట్టింది. రెడ్ డాట్ చాలెంజ్ అంటే నెలసరి రోజుల్లో అరిచేతిలో ఎర్ర చుక్కపెట్టుకోవడం. మహిళలంతా దీన్నొక నియమంగా పాటిస్తే కొన్నాళ్లకు, లేదా కొన్నేళ్లకు అదొక మామూలు సంగతైపోయి, మెన్సెస్ చుట్టూ పురుషులలో, మగపిల్లల్లో, కొందరు మహిళల్లో కూడా ఉండే అపరిశుభ్రమనే భావనలు తొలగిపోతాయని! యూనిసెఫ్ ఇచ్చిన ఈ ఛాలెంజ్ని మొదట నేహా దుపియా, దియా మీర్జా స్వీకరించారు. తర్వాత డయానా పెంటీ, ఖుబ్రా సయాత్, మానుషీ చిల్లర్, అనితా ష్రాఫ్, అతిదీరావ్ హైద్రీ ఫాలో అయ్యారు. సెలబ్రిటీలు కాకుండా యూత్లో చాలామంది అమ్మాయిలు ఈ చాలెంజ్ని తీసుకుంటున్నారు. కొందరు ఆ చాలెంజ్ని నేరుగా తీసుకోనప్పటికీ తమ ‘తొలిసరి’ అనుభవాలను, ఇబ్బందులను షేర్ చేసుకుంటున్నారు. పెద్ద సెక్సెస్.. ఈ రెడ్ డాట్ చాలెంజ్! మే 28 న మెన్స్ట్రువల్ హైజీన్ డే రోజు సోషల్ మీడియాలోని అన్ని వేదికల మీదా అరచేతి సిందూరాలు గోరింటలా పూచాయి. మూడు రోజుల క్రితం శ్రద్ధా శ్రీనాథ్ తన రెడ్ డాట్ డే గురించి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నారు. శ్రద్ధ ఫెమినిస్టు. మగవాళ్లలో స్త్రీల సమస్యల పట్ల సహానుభూతిని (సానుభూతి కాదు) కలిగించే అనేక విషయాలను సోషల్ మీడియాలో ఆమె వివరంగా మాట్లాడుతుంటారు. శ్రద్ధ కశ్మీరీ అమ్మాయి. సినీ నటి. నాలుగు దక్షిణాది భాషా చిత్రాలలో నటించారు. తెలుగులో జెర్సీ, జోడీ íసినిమాల్లో ఉన్నారు. తను నటిస్తున్న మరో ఆరు సినిమాలు లాక్డౌన్ సడలింపులతో మళ్లీ షూటింగ్కి రెడీ అవుతున్నాయి. ఇన్ని సినిమాల్లో నటిస్తున్నా.. ఫెమినిస్టుగానే శ్రద్ధకు సోషల్ మీడియాలోనే గుర్తింపు. అసలు తనను తన ఫస్ట్ పీరియడే ఫెమినిస్టుగా మార్చిందని అంటారు శ్రద్ధ. ‘‘అప్పుడు నాకు 14 ఏళ్లు. ఇంట్లో పూజ జరుగుతోంది. పూజలో నేను కూడా కూర్చొని ఉన్నాను. అప్పుడు నా ఫస్ట్ పీరియడ్ వచ్చింది. పక్కన అమ్మ లేదు. శానిటరీ ప్యాడ్స్ లేవు. పూజలో ఉన్న పిన్నిని మోచేత్తో పొడిచి విషయం చెప్పాను. చెబుతున్నప్పుడు పిన్ని పక్కనే ఉన్న బంధువులావిడ విని, నా వైపు చూసి నవ్వింది. ‘పర్వాలేదు చిన్నా, దేవుడు క్షమిస్తాడు’ అని అభయం ఇచ్చింది! ఆమె ఉద్దేశం.. పూజలో ఉన్నప్పుడు పీరియడ్స్ వచ్చినందుకు దేవుడు కోపగించుకోడని, క్షమిస్తాడని. అప్పుడే నేను ఫెమినిస్టుగా మారాను. నాన్–బిలీవర్గా కూడా’’ అని తన ఇన్స్టాగ్రామ్లో రాశారు శ్రద్ధ. ఇంట్లో చేసి పెడుతుంటే.. బాగున్నాయి అనో, బాగోలేదనో అనడం మాత్రమే మనకు తెలిసింది. ఆ చేసిపెట్టేవాళ్లకు ఒంట్లో ఎలా ఉందోనన్న ఆలోచన మరో స్త్రీకి మాత్రమే వస్తుంది. ఆఫీస్లలో, ఇంకా కలిసి పని చేసే అనేక చోట్ల కూడా అంతే. ఏ రోజైనా పని సరిగా చేయలేక పోతుంటేనో, అసలే చెయ్యలేక పోతుంటేనో అంతవరకే కనిపిస్తుంది. అందుకు కారణం పైకి తెలిసేది కాదు, చెప్పుకునేదీ కాదు. అయితే ఈ గోప్యనీయత వల్ల ప్రయోజనం ఉండదు అంటుంది యూనిసెఫ్. ‘నేను పీరియడ్స్ లో ఉన్నాను’ అని సంకేత పరచకపోవడంవల్లే కావచ్చు.. మహిళల పని సామర్థ్యంపై అపోహలు, పీరియడ్స్ చుట్టూ ఇన్ని అస్పృశ్య ఆలోచనలు! వీటిని పోగొట్టడానికి రెడ్ డాట్ ఛాలెంజ్లు, శ్రద్ధ వంటì æవారి సొంత అనుభవాల పోస్టింగ్లు తప్పకుండా తోడ్పడతాయి. -
సుదీప్కు జోడీ
సౌత్లో జెట్ స్పీడ్లో దూసుకెళ్తున్నారు హీరోయిన్ శ్రద్ధాశ్రీనాథ్. తాజాగా కన్నడలో మరో సినిమాకు సై అన్నారీ బ్యూటీ. సుదీప్ హీరోగా ‘రంగితరంగ’ ఫేమ్ అనూప్ భండారి దర్శకత్వంలో ‘ఫాంటమ్’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఇందులో శ్రద్ధాను కథానాయికగా తీసుకున్నారని శాండల్వుడ్ టాక్. యాక్టింగ్కు మంచి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో శ్రద్ధా కూడా సై అన్నారట. కన్నడ ‘యు టర్న్’తో నటిగా మంచి ఫేమ్ సంపాదించుకున్న శ్రద్ధా శ్రీనాథ్ తెలుగులో నాని ‘జెర్సీ’ చిత్రంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. -
ఎలా ఉండేదాన్ని ఇలాగయ్యా!
చెన్నై : ఎలా ఉండే తాను ఇలాగయ్యానని అందం కోసం తను పడినపాట్లు గురించి నటి శ్రద్ధాశ్రీనాథ్ ఏకరువు పెట్టింది. ఈ కన్నడ భామ మాతృభాషలోనే కాకుండా తమిళం, తెలుగు, మలయాళం అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించేస్తోంది. కన్నడంలో యూటర్న్ చిత్రంతోనూ, టాలీవుడ్లో జెర్సీ చిత్రంలోనూ పేరు తెచ్చుకుంది. ఇక కోలీవుడ్లో విక్రమ్ వేదా చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధాశ్రీనా«థ్ ఆ తరువాత కే–13, నేర్కొండపార్వై చిత్రాల్లో నటించింది. విశాల్ సరసన ఇరుంబుతిరై–2 చిత్రంలో నటించడానికి సిద్ధంఅవుతోంది. ఈ అమ్మడు బాగా లావుగా ఉన్న తన ఒకప్పటి ఫొటోనూ, ఇప్పటి ఫొటోనూ తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసింది. ఆ కథేంటో చూద్దాం. అంతకుముందు... ఆ తర్వాత ’అది నేను అంతర్జాతీయ విహారయాత్ర చేసిన రోజులు. న్యాయశాఖలో పని చేశాను. ఆ వృత్తిలో ఏడాది గడిచింది. అప్పుడు ఇంతకు ముందెప్పుడూ చేయనంత ఖర్చు చేయడం ప్రారంభించాను. అంటే ఆహారం, దుస్తులు, సినిమాలు చూడడం వంటి అన్ని విషయాలకు ఎడాపెడా ఖర్చు చేసేదాన్ని. చేతినిండా ఆదాయం. సంతోషకరమైన జీవితాన్ని గడిపేశాను. నెలకొకసారి మాత్రమే శరీరవ్యాయామం చేసేదాన్ని. నచ్చింది తినేసేదాన్ని. దీంతో బరువు పెరిగిపోయాను. నచ్చిన దుస్తులు ధరించేదాన్ని. అంతే కాదు నన్ను నేనెప్పుడూ అందం తక్కువగా భావించేదాన్ని కాదు. అప్పట్లో పలు వ్యక్తిగత సంతోషాలు నాలో ఉండేవి. అయితే నా బద్ధకం కారణంగా అవేవీ అనుభవించలేకపోయాను. అప్పుడు తీసుకున్న ఫొటోను చూసినప్పుడు ఇంత పరువ వయసులోనే అంత బరువు ఉండకూడదన్నది గ్రహించాను. దీంతో అపార్టుమెంట్లోనే ఉన్న జిమ్కు వెళ్లడం మొదలెట్టాను. మొదట్లో ఐదు నిమిషాలు, ఆ తరువాత 15 నిమిషాలు. ఆపై గ్యాప్ లేకుండా 40 నిమిషాలు పరుగులు పెట్టాను. అలా ఐదేళ్లలో 18 కిలోల బరువు తగ్గాను. అందుకు చాలా శ్రమించాను. నిజానికి నేనంత ఫిట్నెస్ కాదు. అయినా అంతగా వర్కౌట్లు చేశాను. క్యాలరీల గురించి, కసరత్తుల గురించి తెలిసింది. అయితే దురదృష్టవశాత్తు అనారోగ్యానికి గురయ్యాను. దీంతో క్రమబద్ధమైన ఆహారనియమాలకు, వ్యాయామాలకు మధ్య సమతుల్యతను పాటించలేకపోయాను. అయినా శ్రమించాను. నన్నిలా చేయిండానికి కారణం చాలా సింపుల్. నేను చూడడానికి అందంగా ఉండాలని భావించడమే. మీరు అందంగా ఉండడానికి హద్దులు అంటూ ఉండవు. సామాజిక మాధ్యమాలు భయాన్ని పెంచుతూనే ఉంటాయి. వాటి ప్రలోభాలకు గురి కాకుండా ఆరోగ్యం కోసం ఎంత వరకూ సాధ్యమో అంత వరకే కసరత్తులు చేయండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించండి. సామాజిక మాధ్యమాల కోసం ఎలాంటి శ్రమ తీసుకోవద్దు‘ అని నటి శ్రద్ధాశ్రీనాథ్ పేర్కొంది. -
కేవలం మీకోసం చేయండి
‘‘నాలుగేళ్ల క్రితం నేను ఉండాల్సిన దానికంటే కొంచెం బరువు ఎక్కువే ఉన్నాను. అలా ఉండటానికి నేనేం ఇబ్బంది పడలేదు. మునుపటి కంటే లుక్స్ పరంగా బావుండాలనే ఉద్దేశంతో వర్కౌట్ మొదలుపెట్టాను. ‘గుడ్ లుక్స్’కి అంతం అనేది ఉండదు’’ అని శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు. ఈ ఏడాది ‘జెర్సీ’ సినిమాలో తన నటనకు మంచి ప్రసంశలు పొందారు ఈ కన్నడ బ్యూటీ. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్లో ప్రస్తుత ఫొటోను, నాలుగేళ్ల క్రితం ఫొటోను పోస్ట్ చేసి శారీరకంగా వచ్చిన మార్పుల గురించి మాట్లాడారు. ‘ ‘లాయర్గా ఉద్యోగం వచ్చి, 2014లో నా తొలి ఇంటర్నేషనల్ హాలిడేకు (బాలి) Ðð ళ్లినప్పుడు దిగిన ఫొటో అది. ఉద్యోగంతో నా లైఫ్ స్టయిల్ మారిపోయింది. నాకు నచ్చినంత తినేదాన్ని. నన్ను నేను బాగా కష్టపడి మోటివేట్ చేసుకొని నెలకోసారి జిమ్కి వెళ్లేదాన్ని. చేతులు బొద్దుగా ఉన్నాయి అని సంకోచించకుండా నాకు నచ్చిన దుస్తులు వేసుకునేదాన్ని. ఈ ఫొటో దిగిన కొన్నిరోజులకే మరీ చిన్న వయసులోనే ఇలా కనబడకూడదనే ఆలోచనతో జిమ్లో జాయిన్ అయ్యాను. ముందు ట్రెడ్మిల్ మీద 5 నిమిషాలు, ఆ తర్వాత 15 నిమిషాలు, ఆ తర్వాత బ్రేక్ లేకుండా 40 నిమిషాలు పరిగెత్తగలిగాను. రైట్లో ఉన్న ఫొటో 2019 డార్జిలింగ్లో దిగాను. ఐదేళ్ల తర్వాత 18 కిలోలు తగ్గా. పొట్ట ఇంకాస్త ఫ్లాట్గా ఉంటే బావుండూ, ఆ డ్రెస్లో అమ్మాయి ఇంకా బావుంది అనిపిస్తూనే ఉంటుంది. మరోవైపు సోషల్ మీడియా ఎప్పటికప్పుడు అభద్రతాభావానికి గురి చేస్తూనే ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. మీ కోసం తగ్గండి. ఇంకొంచెం ఎక్కువకాలం మీ గుండె పని చేయడానికి, చివరి వరకూ మీ మోకాళ్లు మిమ్మల్ని మోసేవరకూ, అనారోగ్యం లేని శరీరం కోసం, హాయిగా నిద్రించగలిగే రాత్రుల కోసం.. ముఖ్యంగా మీకోసం చేయండి’’ అన్నారు. -
మరోసారి విలన్గా..
ఇటీవల తెలుగులో విడుదలైన ‘ఎవరు’ సినిమాలో సమీర పాత్రలో రెచ్చిపోయారు రెజీనా. నెగటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలో రెజీనా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా మరోసారి అలాంటి పాత్రనే రెజీనా చేస్తున్నారని తెలిసింది. విశాల్ హీరోగా ఆనంద్ అనే కొత్త దర్శకుడు ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. మిలటరీ ఆఫీసర్ పాత్రలో విశాల్, పోలీసాఫీసర్ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కోయంబత్తూరులో జరుగుతోంది. ఈ షెడ్యూల్ దాదాపు ఇరవై రోజులు జరుగుతుంది. నెక్ట్స్ షెడ్యూల్ను చెన్నైలో ప్లాన్ చేశారు. -
‘జోడి’ మూవీ రివ్యూ
టైటిల్ : జోడి జానర్ : ఫ్యామిలీ డ్రామా నటీనటులు : ఆది సాయి కుమార్, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, వెన్నెల కిశోర్, సత్య సంగీతం : ‘నీవే’ ఫణి కల్యాణ్ నిర్మాత : పద్మజ, శ్రీ వెంకటేష్ గుర్రం దర్శకత్వం : విశ్వనాథ్ అరిగెల కెరీర్ స్టార్టింగ్లోనే హీరోగా ప్రూవ్ చేసుకోవటంతో పాటు, నటుడిగా మంచి మార్కులు సాధించిన ఆది సాయి కుమార్, తరువాత సక్సెస్ల వేటలో వెనుకపడ్డాడు. ఇటీవల ఆది హీరోగా తెరకెక్కిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. దీంతో తనకు సక్సెస్ ఇచ్చిన రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా ‘జోడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు విశ్వనాథ్ అరిగెల దర్శకుడు. మరి జోడితో అయినా ఆది సక్సెస్ ట్రాక్లోకి వచ్చాడా..? కథ : కమలాకర్ రావు (నరేష్) బెట్టింగ్లకు అలవాటు పడ్డ వ్యక్తి. కుటుంబాన్ని వదిలేసి ఎప్పుడు క్లబ్లో ఉంటూ క్రికెట్ బెట్టింగ్లు ఆడుతూ ఉంటాడు. క్రికెట్ మీద పిచ్చితో కొడుక్కి కపిల్ అని పేరు పెంటుకుంటాడు. తండ్రి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయటంతో ఆ బాధ్యతను తాను తీసుకుంటాడు కపిల్ (ఆది సాయి కుమార్). సాప్ట్వేర్ కంపెనీలో పనిచేసే కపిల్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఇన్సిస్టిట్యూట్లో పనిచేసే కాంచనమాల(శ్రద్ధా శ్రీనాథ్)తో ప్రేమలో పడతాడు. కపిల్ మంచితనం, బాధ్యతగా ఉండటం చూసి కాంచనమాల కూడా కపిల్ను ఇష్టపడుతుంది. కానీ కాంచన, బాబాయి రాజు (శిజ్జు) మాత్రం వారి పెళ్లికి అంగీకరించడు. తన అన్న కూతురిని ప్రాణంగా చూసుకునే రాజు.. కాంచన, కపిల్ల పెళ్లికి ఎందుకు నో చెప్పాడు..? ఈ రెండు కుటుంబాల మధ్య సంబంధం ఏంటి..? ఈ కథలోకి ఇండస్ట్రియలిస్ట్ అవినాష్ ఎలా వచ్చాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు: కెరీర్ స్టార్టింగ్లోనే లవర్ బాయ్గా ఆకట్టుకున్న ఆది సాయి కుమార్ కపిల్ పాత్రలో ఈజీగా నటించేశాడు. రొమాంటిక్ సీన్స్తో పాటు ఎమోషనల్ సీన్స్లోనూ మెప్పించాడు. తన కామెడీ టైమింగ్తోనూ అలరించాడు. కాంచనమాల పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఒదిగిపోయారు. జెర్సీ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఈ శ్రద్ధా ఈ సినిమాతో మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. తండ్రి పాత్రలో సీనియర్ నరేష్ మరోసారి సూపర్బ్ అనిపించాడు. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్లోనూ తన మార్క్ చూపించాడు. వెన్నెల కిశోర్ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయిన కడుపుబ్బా నవ్వించాడు. ఇతర పాత్రల్లో సత్య, శిజ్జు, గొల్లపూడి మారుతీరావు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ : సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆది, ఎలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఓ రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామాను ఎంచుకున్నాడు. దర్శకుడు విశ్వనాథ్ అరిగెల ప్రేమకథతో పాటు మంచి సందేశం, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండేలా కథను రెడీ చూసుకున్నాడు. అయితే ఆ కథను తెర మీదకు తీసుకురావటంలో మాత్రం తడబడ్డాడు. ముఖ్యంగా లవ్ స్టోరిలో కొత్తదనం లేకపోవటంతో ప్రథమార్థం బోరింగ్గా సాగుతుంది. సెకండ్ హాఫ్లో కథ ఆసక్తికర మలుపు తిరిగినా.. కథనం నెమ్మదిగా సాగటం నిరాశపరుస్తుంది. ఫణి కల్యాణ్ సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఒక్క పాట కూడా గుర్తుండిపోయేలా లేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్ : కథ కొన్ని ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : నెమ్మదిగా సాగే కథనం రొటీన్ టేకింగ్ సతీష్ రెడ్డి జడ్డా, సాక్షి వెబ్ డెస్క్. -
‘పిల్లలు కనొద్దని నిర్ణయించుకున్నా!’
అత్యాచారం మాత్రమే నేరం కాదు అంటోంది నటి శ్రద్ధా శ్రీనాథ్. కాలం మారుతున్నా, మహిళలపై సమాజం దృష్టి మాత్రం మారడం లేదు. చాలా మంది మహిళలను ఇంకా ఆటబొమ్మలుగానే చూస్తున్నారన్నది పచ్చి నిజం. ఇలా సంఘంలో జరుగుతున్న అత్యాచారాలను చూస్తున్న వారిలో పలువురు మహిళలు వివాహంపై వివిధ రకాల భావాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు పెళ్లే చేసుకోను అని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొందరు సినీ హీరోయిన్లు అయితే ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. అలాంటి వారిలో నటి శ్రద్ధాశ్రీనాథ్ ఒకరు. ఇవన్ తందిరన్, విక్రమ్వేదా, నేర్కొండ పార్వై వంటి తమిళ చిత్రాల్లో నటించిన ఈ శాండిల్వుడ్ భామ మాతృభాషలోనూ, తెలుగులోనూ నటిస్తోంది. ఇలా బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న శ్రద్ధాశ్రీనాథ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ అత్యాచారం మాత్రమే నేరమని చాలా మంది భావిస్తున్నారని, అయితే మహిళలను తప్పుడు దృష్టితో చూస్తూ మాట్లాడడం, అనుసరించడం కూడా నేరమేనని అంది. అయితే అత్యాచారాల వ్యహారంలో సమాజంలో త్వరలోనే మార్పు వస్తుందని భావిస్తున్నానంది. ఎందుకంటే కాలంతో పాటు మహిళలు మారుతున్నారని, అయితే మహిళలపై సమాజం దృష్టే ఇంకా మారలేదని పేర్కొంది. తన తాతయ్య, బామ్మలకు 15 మంది పిల్లలని, తన తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలకే జన్మనిచ్చారని చెప్పింది. ఇక తాను అసలు పిల్లలనే కనరాదని నిర్ణయించుకున్నానని తెలిపింది. కాగా తన ఈ నిర్ణయంతో తానెలాంటిదాన్నో తీర్మానం చేయకండని, తన చదువు, తెలివితేటలను బట్టే తీర్మానించాలని శ్రద్ధాశ్రీనాథ్ అంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో జోడి అనే చిత్రంలోనూ కన్నడంలో గోద్రా చిత్రంలోనూ నటిస్తోంది. ఇక తమిళంలో ఇరుంబుతిరై 2, మార చిత్రాల్లో నటించనుంది. -
ఇద్దరు భామలతో విశాల్
చెన్నై : విశాల్కు ఇద్దరు సెట్ అయ్యారు. నటుడు విశాల్ ఆయోగ్య చిత్రం తరువాత నటిస్తున్న చిత్రం ‘యాక్షన్’. టైటిల్ చూస్తేనే తెలిసి పోతుంది ఇది పుల్ యాక్షన్ చిత్రమని. ఎంటర్టైన్ చిత్రాలు చేయడంలో సిద్ధహస్తుడైన సుందర్.సీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో విశాల్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈయన ఇంతకు ముందు నటించిన హిట్ చిత్రం ఇరుంబుతిరై ద్వారా పీఎస్.మిత్రన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. నటి సమంత హీరోయిన్గా నటించింది. కాగా ఇప్పుడీ చిత్రం సీక్వెల్కు సన్నాహాలు జరుగుతున్నాయి. విశాల్కు జంటగా నటి రెజీనా, శ్రద్ధాశ్రీనాథ్ నటించనున్నారన్నది తాజా సమాచారం. చెన్నై చిన్నది రెజీనా ఇంతకు ముందు పలు తమిళ చిత్రాల్లో నటించి సక్సెస్లు అందుకున్నా, స్టార్ హీరోయిన్ ఇమేజ్ను సంపాదించలేకపోయ్యింది. కండనాళ్ ముదల్ చిత్రంతో పరిచయ్యమై గుర్తింపు పొందిన ఈ బ్యూటీ ఆ తర్వాత అళగియ అసుర, పంచామృతం చిత్రాల్లో నటించినా అవి తన కేరీర్కు ఉపయోగపడలేదు. అలాంటిది ఇన్నాళ్లకు నటుడు విశాల్తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం అయినా రెజీనాకు స్టార్డమ్ను తెచ్చిపెడుతుందేమో చూద్దాం. ఇక శ్రద్దాశ్రీనాథ్ విషయానికి వస్తే వేదా చిత్రంతోనే తమిళ సినీ ప్రరిశ్రమ తన వైపు తిరిగి చూసేలా చేసుకుంది. ఇటీవల అజిత్తో నటించిన నేర్కొండ పార్వై చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఈ భామలు ఇద్దరూ విశాల్తో నటించడానికి రెడీ అవుతున్నారన్నమాట. కాగా దర్శకుడు పీఎస్.మిత్రన్ ప్రస్తుతం శివకార్తీకేయన్తో హీరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసి విశాల్తో ఇరుంబుతిరై 2 చేయనున్నట్లు సమాచారం. -
అసలు సంగతి ఏంటి?
‘అస్సలు ఈ టైమ్లో ఇంత హైట్లో కూర్చుని బీరు కొడుతున్నానంటే అసలు మ్యాటర్ ఏమై ఉంటుంది’ అంటూ ఆది సాయికుమార్ డైలాగ్తో విడుదలైన ‘జోడి’ ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జోడి’. శ్రీనివాస్ గుర్రం సమర్పణలో భావన క్రియేషన్స్ పతాకంపై శాంతయ్య, పద్మజ, సాయి వెంకటేష్ గుర్రం నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ని విడుదల చేశారు. ‘‘అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ప్రేమ, భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఆది, శ్రద్ధల మధ్య అందమైన ప్రేమకథతో పాటు వీకే నరేష్ పాత్ర చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆది, శ్రద్ధ లుక్స్కి ప్రత్యేక ప్రశంసలు దక్కుతున్నాయి. అవుట్ డోర్ ప్రమోషన్స్లో కూడా చురుగ్గా ఉన్న మా చిత్రానికి ప్రీ రిలీజ్ బజ్ కూడా చాలా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షలకు ఆకట్టుకునే అంశాలతో వస్తోన్న మా సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. గొల్లపూడి మారుతీరావు, సత్య, ‘వెన్నెల’ కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: ‘నీవే’ ఫణికళ్యాణ్, కెమెరా: ఎస్.వి. విశ్వేశ్వర్. -
స్పెషల్ రోల్
టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఏర్పడే అనర్థాలను చూపిస్తూ విశాల్ ‘ఇరుంబు తిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) తీశారు. పీయస్ మిత్రన్ తీసిన ఈ సినిమా సూపర్ హిట్. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఎళిల్ దర్శకత్వం వహించనున్న ఈ సీక్వెల్లో విశాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు. ఈ సినిమాలో అతిథి పాత్రలో రెజీనా కనిపిస్తారని సమాచారం. కథలో చాలా కీలకమైన పాత్ర ఇదని తెలిసింది. విశాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఆకట్టుకునేలా ఆది, శ్రద్ధాల ‘జోడి’
ఆది సాయి కుమార్ హీరోగా, జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా తెరకెక్కిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోడి. విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భావన క్రియేషన్స్ బ్యానర్పై గుర్రం శ్రీనివాస్ సమర్పణలో పద్మజ, సాయి వెంకటేష్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సినిమాలో ఆది, శ్రద్ధాల కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. తండ్రి పాత్రలో సీనియర్ నరేస్ మరోసారి మంచి కామెడీతో పాటు బరువైన సెంటిమెంట్ను కూడా పండించారు. ఫణి కల్యాణ్ సంగీతమందించిన ఈ సినిమా వెన్నెల కిశోర్, సీనియర్ నటులు గొల్లపూడి మారుతీరావు, మిర్చి మాధవి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
కొత్తగా ఉన్నావు అంటున్నారు
‘‘నేను ఓ రియలిస్టిక్ ఫిల్మ్ చేయాలనుకుంటున్న టైమ్లో విశ్వనాథ్ ఈ కథ గురించి చెప్పాడు. చాలా బాగుంది. మిమ్మల్ని ఈ సినిమాతో ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తా అనే నమ్మకముంది’’ అన్నారు హీరో ఆది సాయికుమార్. శ్రీనివాస్ గుర్రం సమర్పణలో విజయలక్ష్మీ నిర్మించారు. విశ్వనాథ్ అరిగెల దర్శకుడు. ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న సినిమా విడుదల కానుంది. గురువారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆది మాట్లాడుతూ– ‘‘కన్నడంలో శ్రద్ధా నటించిన ‘యూటర్న్’ చిత్రం నాకు చాలా ఇష్టం. ఆమె చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. ఈ చిత్రం టీజర్ రిలీజయ్యాక అందరూ ఫోన్ చేసి ‘నువ్వు చాలా కొత్తగా ఉన్నావు’ అని అభినందించారు’’ అన్నారు. విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ముగ్గురి నమ్మకంతో మొదౖలై ఇప్పుడు రిలీజ్ వరకు వచ్చింది. నిర్మాత విజయలక్ష్మీ ఇప్పుడు చెప్పాల్సిన కథ ఇది అంటే, హీరో అది ఇలాంటి కథ కోసమే ఎదురు చూస్తున్నా అన్నారు. హీరోయిన్ శ్రద్ధా కథ వినగానే చేస్తున్నా అన్నారు. నరేశ్గారికి పాత్ర చాలా బాగా వచ్చింది. సంగీత దర్శకుడు ఫణికుమార్, నేను కొత్త ట్యూన్స్ కోసం ప్రయత్నించాం’ అన్నారు. శ్రద్ధా మాట్లాడుతూ– ‘‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులు అందించిన ప్రేమను మరచిపోలేను. ‘జోడి’ కథ వింటూ చాలాసార్లు నవ్వుకున్నాను’’ అన్నారు. నరేశ్ మాట్లాడుతూ– ‘‘కొన్ని సినిమాలు మోహమాటంతో, కొన్ని సినిమాలు ఆ సినిమా స్పాన్ చూసి చేస్తాం. కానీ ఈ సినిమాలో నా పాత్ర ఎంతో న చ్చి చేశాను’’ అన్నారు. ‘‘నేచురల్గా ఉండే సినిమా చేద్దాం అనుకున్నాను. విశ్వనాథ్ ఈ కథ చెప్పగానే ఆదిగారు కరెక్ట్ అనిపించి ఆయనకు చెప్పాం. కథ వినగానే ఆది ఓకే అన్నారు. శ్రద్ధా మా సినిమాకు ఎస్సెట్ అవుతుంది’’ అన్నారు విజయలక్షి. -
సెప్టెంబర్ 6న ‘జోడి’ విడుదల
బుర్రకథ సినిమాతో రీసెంట్గా ఆడియెన్స్ను పలకరించిన ఆది సాయికుమార్కి నిరాశే ఎదురైంది. అయితే చాలా గ్యాప్ తరువాత వచ్చిన ఈ చిత్రంపై హైప్క్రియేట్ అయినా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఆది జోడి అనే మరో చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ షూటింగ్ పూర్తైనట్లు యూనిట్ ప్రకటించింది. ఇటీవలె టీజర్ను విడుదల చేసిన చిత్రబృందం ఈ సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు తెలిపింది. గతంలో వాన, మస్కా, సినిమా చూపిస్త మామ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన విశ్వనాథ్ అరిగెల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్ వి.కే. నరేష్, సత్య, వెన్నెల కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి, గొల్లపూడి మారుతిరావు, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. -
అలా చేశాకే అవకాశమిచ్చారు!
సినిమా: అలా చేసిన తరువాతనే అవకాశం ఇచ్చారు అని చెప్పింది నటి శ్రద్ధాశ్రీనాథ్. శాండిల్వుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అంటూ చుట్టేస్తున్న ఈ కన్నడ భామ ఈ మూడు భాషల్లోనూ సక్సెస్లు అందుకుంది. నిజం చెప్పాలంటే ఈ బ్యూటీ నటజీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం యూటర్న్ కన్నడ చిత్రం. ఇక తమిళంలో విక్రమ్వేదా, తెలుగులో జెర్సీ చిత్రాలు మంచి విజయాలతో ప్రాచుర్యం పొందేలా చేశాయి. నటిగా ఇంత సక్సెస్ రేటింగ్ ఉన్నా ఆడిషన్స్ తప్పడం లేదట. అలా ఒక్క అవకాశం రావాలంటే ఎంత కష్టపడాల్లో నటి శ్రద్ధాశ్రీనా«థ్ను చూస్తే అర్థం అవుతుంది. ప్రస్తుతం అజిత్ కథానాయకుడిగా నటించిన నేర్కొండ పార్వై చిత్రంలో ప్రధాన పాత్రను పోషించింది. దీనికి హెచ్.వినోద్ దర్శకుడు. దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మించిన తొలి తమిళ చిత్రం నేర్కొండపార్వై. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 8న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్బంగా ఇందులో నటించిన అనుభవాన్ని నటి శ్రద్ధాశ్రీనాథ్ తెలుపుతూ అసలు ఈ చిత్రంలో నటించే అవకాశం వస్తుందా?రాదా? అన్న సందేహం తనకు కలిగిందని చెప్పింది. అందుకు కారణం నేర్కొండ పార్వై చిత్రంలో నటించడానికి తనను ఫోన్ చేసి పిలిపించారని చెప్పింది. అందుకోసం ఆడిషన్ నిర్వహించినట్లు తెలిపింది. అయితే ఆడిషన్ ముగిసిన తరువాత చాలా రోజుల వరకూ ఆ చిత్ర వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేదని అంది. అలాంటి పరిస్థితుల్లో మరో మూడు వారాల తరువాత పిలిచారని చెప్పింది. అప్పుడు తనతో మళ్లీ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలిపింది. అప్పుడు దర్శకుడు వినోద్ తన వద్దకు వచ్చి అభిమానులు మీమ్మల్ని అసహ్యంచుకునేంతగా నటించమని చెప్పారని అంది. దీంతో తనలోని ప్రతిభనంతా చూపుతూ ఆయన చెప్పినట్లు నటించానని, ఆ తరువాతనే నేర్కొండ పార్వై చిత్రంలో నటించడానికి అవకాశం ఇచ్చారని తెలిపింది. ఈ చిత్రంలో అజిత్తో కలిసి నటించడం తీయని అనుభవంగా పేర్కొంది. తనకు కథ నచ్చితేనే నటించడానికి అంగీకరిస్తున్నట్లు చెప్పిన శ్రద్ధాశ్రీనాథ్ నటుడు విశాల్ సరసన ఒక చిత్రం, మాధవన్తో మారన్ అనే చిత్రంలోనూ నటించనున్నట్లు చెప్పింది. అలా తానిప్పుడు చాలా బిజీ తెలుసా. అని దీర్ఘాలు తీస్తూ చెప్పింది -
ఎక్కువ టేక్లు తీసుకుంటేసారీ చెప్పేవారు
తమిళసినిమా: నేను అందగత్తెను కాను అంటోంది నటి శ్రద్ధాశ్రీనాథ్. ఈ కన్నడ నటి మాతృభాషలో నటించిన యూటర్న్ చిత్రంతో వెలుగులోకి వచ్చింది. కోలీవుడ్లో ఇవన్ తందిరన్ చిత్రంతో రంగప్రవేశం చేసి విక్రమ్ వేదా చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత జెర్సీ చిత్రంతో టాలీవుడ్లోనూ సక్సెస్ను అందుకున్న శ్రద్ధాశ్రీనాథ్ నటనకు అవకాశం ఉన్న మంచి పాత్రలే వస్తున్నాయని చెప్పవచ్చు. తాజాగా అజిత్ కథానాయకిగా నటించిన నేక్కొండ పార్వై చిత్రంలో ప్రధాన పాత్రను పోషించింది. ఇది బాలీవుడ్ హిట్ చిత్రం పింక్కు రీమేక్. హిందీలో నటి తాప్సీ నటించిన పాత్రను తమిళంలో శ్రద్ధాశ్రీనాథ్ పోషించింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ నెల ద్వితీయార్థంలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ప్రస్తుతం కన్నడంలో ఒక చిత్రం తెలుగులో జోడి అనే చిత్రంలో నటిస్తోంది. సాధారణంగా ఆమె స్థాయిలో ఉన్న ఏ నటి అయినా కథానాయకిగా మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిస్తుంది. అలాంటిది కథానాయకిగా నటిస్తున్న శ్రద్ధాశ్రీనాథ్ మాత్రం తాను కథానాయకిని కాదు నటినే అంటోంది. అదేంటని అడిగితే కథానాయకుడు, కథానాయకి అన్న పదాల్లో నటుడు, నటి అనే పేర్లు ప్రతిధ్యనించడం లేదని అంది. ఇకపోతే కథానాయకుడు అనగానే పలువురిని చితకబాదాలని అంది. ఇక కథానాయకి అంటే అందంగానూ, గ్లామర్ గానూ ఉండాలంది. తాను అలా లేనని చెప్పింది. తానిప్పుడు కథానయకి పేరుతో నటిస్తున్నానని, తాను నటినేనని శ్రద్ధాశ్రీనాథ్ పేర్కొంది. నేర్కొండ పార్వై చిత్రంలో అజిత్తో నటించిన అనుభవం గురించి తెలుపుతూ తాను తొలి రోజు షూటింగ్కు కారులో వెళ్లానని, కారు షూటింగ్ స్పాట్ దగ్గరకు వెళుతుండగా దూరంలో అజిత్ తొలిసారిగా చూశానని చెప్పింది. పెద్ద స్టార్. ఆయనతో ఎలా మాట్లాడాలి, నటించాలి అని సంకోచంతోనే కారు దిగానని చెప్పింది. అప్పుడు ఆయన షేక్హ్యాండ్ ఇచ్చి విక్రమ్ వేదా చిత్రంలో మిమ్మల్ని చూశాను అని అన్నారంది. ఆయన గురించి పెద్ద స్టార్, తల అని ఊహించుకున్న ఇమేజ్ అయన ప్రవర్తనతో పటాపంచలైందని చెప్పింది. అసలు ఆయన స్టార్ నటుడిగానే నడుచుకోలేదని, చాలా నిడారంబరంగా ఉన్నారంది. ఏదైన చెబితే స్వాగతించేవారని, సాయం చేయడానికి ఎప్పుడూ వెనుకాడలేదంది. కొన్ని పెద్ద సన్నివేశాల్లో నటించడానికి ఎక్కువ టేక్లు తీసుకుంటే సెట్లో ఉన్న వారందరికీ సారీ చెప్పేవారని, ఆయన ఉన్నతమైన నటుడని పేర్కొంది. -
‘విశాల్తో ఓకే’
విశాల్తో రొమాన్స్ చేసే అవకాశాన్ని నటి శ్రద్ధాశ్రీనాథ్ సొంతం చేసుకున్నారు. ఈ కన్నడ భామ కోలీవుడ్లో విక్రమ్వేదా చిత్రంతో ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ చిత్రం విజయంతో ఈ అమ్మడికి అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇటీవల అరుళ్నిధితో జతకట్టిన కే 13 చిత్రం కూడా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం అజిత్తో కలిసి నేర్కొండ పార్వై చిత్రంలో నటిస్తున్నారు. ఇది హిందీలో సూపర్హిట్ అయిన పింక్ చిత్రానికి రీమేక్ అన్న విషయం తెలిసిందే. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఆగస్ట్ 10న చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మధ్య టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చి నానీకి జంటగా జెర్సీ చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు.కాగా ఇప్పుడు నటుడు విశాల్తో నటించే అవకాశాన్ని అందుకుంది. విశాల్ నటించిన అయోగ్య చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చి సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ప్రస్తుతం ఆయన సుందర్.సీ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో తమన్నా నాయకిగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే మరో చిత్రానికి రెడీ అయిపోతున్నారు. విశాల్ ఇంతకు ముందు కథానాయకుడిగా నటించి, నిర్మించిన ఇరుంబుతిరై చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. పీఎస్.మిత్రన్ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో నటి సమంత కథానాయకిగా నటించారు. దానికి సీక్వెల్ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలోనే నటి శ్రద్ధాశ్రీనాథ్ విశాల్తో రొమాన్స్కుసై అన్నారు. ఈ విషయాన్ని తనే ట్విట్టర్లో వెల్లడించారు. ఈ చిత్రం ద్వారా ఆనంద్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు ఎళిల్ శిష్యుడు. ఇకపోతే నటుడు విశాల్ ఈ సినిమాలో పోలీస్అధికారిగా నటించబోతున్నట్లు, నటి శ్రద్ధాశ్రీనాథ్ కూడా పోలీస్అధికారిగా పవర్ఫుల్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇందులో ఈ అమ్మడు పలు యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించనుందని తెలిసింది. సుందర్.సీ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసి విశాల్ ఇరుంబుతిరై–2లో పాల్గొననున్నట్లు సమాచారం. ఆ తరువాత మిష్కిన్ దర్శకత్వంలో తుప్పరివాలన్–2 చిత్రం చేస్తారని టాక్. -
అభిమన్యుడుతో శ్రద్ధ
‘పందెంకోడి’ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కిన ‘పందెంకోడి 2’ తో మంచి హిట్ అందుకున్నారు విశాల్. ఇప్పుడాయన ‘అభిమన్యుడు’ కి సీక్వెల్గా రూపొందనున్న ‘అభిమన్యుడు 2’ లో నటించనున్నారు. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో విశాల్ నటించిన ‘అభిమన్యుడు’ గత ఏడాది విడుదలై సూపర్హిట్గా నిలిచింది. ఇందులో విశాల్కి జోడీగా సమంత నటించారు. అయితే సీక్వెల్లో మాత్రం విశాల్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ని తీసుకున్నారట చిత్రబృందం. నాని నటించిన ‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు శ్రద్ధాశ్రీనాథ్. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ‘అభిమన్యుడు’ సినిమాని తెరకెక్కించిన పి.ఎస్.మిత్రన్ ‘అభిమన్యుడు 2’ కి దర్శకత్వం వహించకపోవడం. ఈ సీక్వెల్కి కొత్త డైరెక్టర్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘పందెంకోడి 2’ కి మీరాజాస్మిన్ ప్లేస్లో కీర్తీసురేష్ని తీసుకున్నారు. ఇప్పుడు ‘అభిమన్యుడు 2’కి సమంత ప్లేస్లో శ్రద్ధాశ్రీనాథ్ని, మిత్రన్ స్థానంలో ఆనంద్ని తీసుకోవడం ఆసక్తికరం. త్వరలోనే ‘అభిమన్యుడు 2’ సినిమా పట్టాలెక్కనుందట. -
‘జెర్సీ’ థ్యాంక్యూ మీట్
-
మళ్లీ మళ్లీ చూసి మెసేజ్ చేస్తున్నారు
‘‘జెర్సీ’ సినిమా ఎప్పటికీ మా టీమ్కి స్పెషల్గా ఉంటుంది. ‘అందరూ పాతబడిపోవచ్చు కానీ, ‘జెర్సీ’ సినిమా ఎప్పటికీ పాతబడిపోదు. చాలా చాలా స్పెషల్, ప్రౌడ్ సినిమాగా మిగిలిపోతుంది’’ అని నాని అన్నారు. ఆయన హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా ‘మళ్ళీరావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల అయింది. హైదరాబాద్లో నిర్వహించిన ‘థ్యాంక్యూ మీట్’లో నాని మాట్లాడుతూ– ‘‘జెర్సీ’ రిలీజ్ తర్వాత నాకు వచ్చిన మెసేజెస్ కానీ, ఎక్కడికెళ్లినా ప్రేక్షకులు సినిమా గురించి, నటన, టెక్నీషియన్స్ గురించి మాట్లాడుతున్న విధానం కానీ.. నెనెప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయని ఒక ఫీలింగ్. ఏ సినిమాకైనా తొలి మూడు రోజులు బోల్డన్ని మెసేజ్లు, ఫీడ్బ్యాక్ వస్తుంటాయి. వారం తర్వాత ఆ ఫీడ్బ్యాక్ తగ్గుతూ ఉంటుంది. కానీ ‘జెర్సీ’ కి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఏ రోజుకారోజు మెసేజ్లతో మా ఫోన్లు నిండిపోతున్నాయి. రివర్స్లో మాకు థ్యాంక్యూ మెసేజ్లు వస్తున్నాయి. అందుకే టీమ్ అందరి తరఫున ఒక ఫైనల్ థ్యాంక్యూ చెప్పాలని ఈ మీట్ ఏర్పాటుచేశాం. చాలా ఎమోషన్ ఉన్న సినిమా కదా రిపీట్గా చూసేవాళ్లకి ఎలా ఉంటుందనుకున్నాం. కానీ, చాలా మంది మళ్లీ మళ్లీ చూసి మెసేజ్లు చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి వీటిని మెసేజ్లు అనలేను.. ఎందుకంటే ఓ చిన్న లవ్లెటర్స్లా ఉన్నాయి.. అందరికీ థ్యాంక్యూ సోమచ్. ‘జెర్సీ’ సినిమా చూసిన రానా కాల్ చేసినప్పుడు ఆ వాయిస్ నాకు గుర్తుంది.. వాడు(రానా) ఆల్మోస్ట్ ఏడిచినట్టున్నాడు.. కచ్చితంగా రానాను ఈ ఫంక్షనికి పిలుద్దామనుకున్నా. లాస్ట్ మినిట్లో ఫోన్ చేసినా వస్తాడులే అన్న నమ్మకం.. ఎందుకంటే వాడికి సినిమా ఎంత నచ్చిందో నాకు తెలుసు. మా కష్టానికి అంత రెస్పెక్ట్ చూపించిన ప్రేక్షకులందరికీ, మీడియాకి థ్యాంక్స్’’ అన్నారు. హీరో రానా మాట్లాడుతూ– ‘‘నేను సక్సెస్ మీట్కి వచ్చి చాలా రోజులు అయింది. కానీ, ‘జెర్సీ’ సినిమాకి రావాలనుకున్నా. ఎందుకంటే.. నాకు లైఫ్లో బేసిక్గా కొన్ని అర్థంకావు. క్రికెట్, పెళ్లి, అమ్మాయిలు, పిల్లలు. ఇవన్నీ అర్థం కాని నాకే ఈ సినిమా చూసి ఏడుపు వచ్చిందంటే ప్రేక్షకుల పరిస్థితి ఏమై ఉంటుందో నాకు తెలుసు. నాని నటన సూపర్. ప్రతిరోజు నాకు స్ఫూర్తినిస్తుంటాడు. వారంలో మూడు సార్లు తనని చూస్తాను. అయినా కానీ సినిమాపై అతనికి ఉన్న ప్రేమ చూస్తే ఎంతో కొత్తగా చేయాలని స్ఫూర్తినిస్తూ ఉంటుంది. ‘జెర్సీ’ కి పనిచేసిన వారందరికీ చెబుతున్నా. సినిమా అన్నది శాశ్వతం.. అందులో ‘జెర్సీ’ సినిమా కోసం ఎప్పుడూ ఒక పేజీ తప్పకుండా ఉంటుంది’’ అన్నారు. గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి వచ్చిన అభినందనలకు అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన చినబాబు, పీడీవీ ప్రసాద్, వంశీగార్లకు, నానీ సర్కి థ్యాంక్స్. సినిమా నేను డైరెక్షన్ చేసినా సరే నా బలం అంతా నా డైరెక్షన్ టీమ్. ఇంకా ఈ సినిమా చూడని వారెవరైనా ఉంటే చూడండి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రద్ధా శ్రీనాథ్, చిత్ర సమర్పకుడు పీడీవీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. -
వెండితెర మీద చూసుకోవడం పీడకలలా ఉంది!
‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ‘సారా’గా పరిచయమైన శ్రద్ధా శ్రీనాథ్ డాక్టర్ కాబోయి యాక్టర్ కాలేదు. లాయర్గా ప్రాక్టీస్ చేసి మరీ యాక్టర్ అయ్యారు. ‘‘భవిష్యత్లో చేయబోయే తెలుగు సినిమాలలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెబుతాను’’ అంటున్న శ్రద్ధా గురించి కొన్ని ముచ్చట్లు... లాయరమ్మ శ్రద్ధా తండ్రి ఆర్మీ ఆఫీసర్. తల్లి స్కూల్ టీచర్. నాన్నగారి ఉద్యోగరీత్యా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరఖాండ్, అస్సాం...రాష్ట్రాలలో చదువుకుంది. ఇక సికింద్రాబాద్లో 7 నుంచి 12వ తరగతి వరకు చదువుకుంది. ఆ తరువాత బెంగళూరులో ‘లా’ చదువుకుంది. నాటకాలు బెంగళూర్లో ‘లా’ పూర్తయిన తరువాత అదే నగరంలో రియల్ ఎస్టేట్ లాయర్గా పనిచేసింది. ఆ తరువాత ఒక ఫ్రెంచ్ రిటైల్ కంపెనీకి లీగల్ అడ్వైజర్గా పనిచేసింది. ఫుల్–టైమ్ కార్పొరేట్ ఉద్యోగం చేస్తూనే నాటకాల్లో నటించింది. ‘ఏ బాక్స్ ఆఫ్ షార్ట్స్’ ‘టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్’...మొదలైన నాటకాలు శ్రద్ధాకు మంచి పేరు తీసుకువచ్చాయి. వ్యాపార ప్రకటనలు చేస్తున్న రోజుల్లో ఒక కన్నడ సినిమాలో కథానాయికగా ఎంపికైంది. అయితే ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ తరువాత ‘కోహినూర్’ అనే మలయాళ సినిమాలో నటించింది. ఇదంతా ఒక ఎత్తయితే 2016లో పనన్ కుమార్ దర్శకత్వంలో నటించిన కన్నడ సినిమా ‘యూ టర్న్’ పదిమంది దృష్టిలో పడేలా చేసింది. ఊహించని ఛాన్సు! మొదటిసారి అడిషన్కు వెళ్లినప్పుడు... ‘‘మీ కన్నడ కన్విన్సింగ్గా లేదు’’ అన్నాడు డైరెక్టర్.‘‘అయ్యో!’’ అనుకుంది శ్రద్ధా.‘‘ఈ సినిమాల్లో నాకు ఛాన్సు రావడం కష్టమే’’ అనుకుంది నిరాశగా. అయితే, మూడో అడిషన్కు మాత్రం తనను తాను రుజువు చేసుకుని మంచి మార్కులు కొట్టేసింది. ‘యూ టర్న్’ (కన్నడ)లో జర్నలిస్ట్ రచన పాత్రకు ఎంపికైన తరువాత... ఆ పాత్ర కోసం రీసెర్చ్ కూడా చేసింది. బాలీవుడ్లో... ఈ సంవత్సరం ‘మిలన్ టాకీస్’ సినిమాతో బాలీవుడ్లోకి అడుగు పెట్టింది శ్రద్ధా. తిగ్మాంశు ధూలియా డైరెక్ట్ చేసిన ఈ సినిమా పెద్దగా ఆడనప్పటికీ శ్రద్ధా నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ‘మైథిలి పాత్రకు ప్రాణం పోసింది’ అని రాశారు సినీ విమర్శకులు. పీడకల! ‘నాటకాల్లో సరే...మిమ్మల్ని మీరు వెండి తెర మీద చూసుకోవడం ఎలా అనిపించింది?’ అని అడిగితే– ‘ప్రేక్షకుల సంగతేమిటోగానీ, నా వరకైతే నన్ను నేను వెండితెర మీద చూసుకోవడం పీడకలలా అనిపిస్తుంది’ అంటూ నవ్వేస్తుంది శ్రద్ధా శ్రీనాథ్! -
‘కథ కూడా వినకుండానే ఓకె చెప్పా’
మహిళలకు సంబంధించిన కథా చిత్రాలన్నీ తన దృష్టిలో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలే అంటోంది నటి శ్రద్ధా శ్రీనాధ్. శాండల్వుడ్కు చెందిన శ్రద్ధా అక్కడ యూటర్న్ చిత్రంతో వెలుగులోకి వచ్చింది. ఇక కోలీవుడ్ ఇవన్ తందిరన్ చిత్రంతో పరిచయం అయ్యి సక్సెస్ను అందుకున్నా, మాధవన్, విజయ్ సేతుపతిలతో కలిసి నటించిన విక్రమ్వేదా చిత్రంతో అనూహ్యంగా పాపులర్ అయ్యింది. ఇటీవల జెర్సీ అంటూ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి అక్కడ విజయాల ఖాతాను ఓపెన్ చేసుకుంది. ఇలా సెలెక్టెడ్ చిత్రాలలో నటిస్తూ విజయాల శాతాన్ని పెంచుకుంటూ పోతున్న శ్రద్ధా శ్రీనాధ్ తాజాగా అజిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న నేర్కొండిపార్వై చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కాగా ఆమె నటించిన మరో తమిళ చిత్రం కే–13. అరుళ్నిధి హీరోగా నటించిన ఈ చిత్రానికి భరత్ నీలకంఠన్ దర్శకత్వం వహించారు. ఎస్పీ సినిమాస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 3వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా నటి శ్రద్ధా శ్రీనాధ్తో సాక్షి చిట్ చాట్. కాలు పెట్టిన చోటల్లా సక్సెస్ అందుకుంటున్నారు. తాజాగా తెలుగులో నటించిన జెర్సీ విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఎలా ఫీలవులతున్నారు? చాలా సంతోషంగా ఉంది. జెర్సీ చిత్రంలో నటించడం మంచి అనుభవం. అది మానవ అనుబంధాలను ఆవిష్కరించే వైవిధ్య భరిత కథా చిత్రం. దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. నానితో నటించడం తీయని అనుభూతి. కే–13 చిత్రం గురించి? కే–13 అంటే ఒక అపార్ట్మెంట్ బ్లాక్ నెంబరు. ఇది సైకలాజికల్ మిస్టరీతో కూడిన థ్రిల్లర్ యాక్షన్ కథా చిత్రం. కే–13 చిత్రంలో నటించడానికి కారణం? అరుళ్నిధి హీరో అనగానే కథ కూడా వినకుండానే నటించడానికి సై అనేశాను. ఎందుకుంటే ఆయన గురించి నాకు తెలుసు. లక్కీగా కథ విన్నాక బాగా నచ్చేసింది. అరుళ్నిధికి జంటగా నటించిన అనుభవం? అరుళ్నిధి చాలా మంచి ఫెర్ఫార్మర్. ఆయనతో నటించడం చాలా కంఫర్టబుల్ అనిపించింది. ఇందులో మీ పాత్ర గురించి? ఇందులో మలర్వేది అనే రచయిత్రి పాత్రలో నటించాను. చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అరుళ్నిధి ఫిలిం మేకర్గా నటించారు. మేమిద్దరం అనుకోకుండా ఒక సారి కలుస్తాం. ఆ తరువాత ఏం జరిగిందన్నదే కే –13 చిత్రం. ఇది నా కేరీర్లో మంచి చిత్రంగా గుర్తుండిపోతుంది. దర్శకుడు భరత్ నీలకంఠన్ కొత్తవారైనా చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా చిత్రాన్ని తెరకెక్కించారు. నేను తమిళంలో నటించిన నాలుగవ చిత్రం ఇది. చిత్ర విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నేర్కొండ పార్వై చిత్రంలో అజిత్తో కలిసి నటించడం గురించి? అజిత్ లాంటి గొప్ప నటుడితో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో చాలా స్ట్రాంగ్ పాత్రలో నటిస్తున్నాను. కథలో కీలకమైన పాత్ర. సోషల్ ఎలిమెంట్స్తో కూడిన చిత్రం ఇది. హింది చిత్రం పింక్ను చూశారా? చూడలేదు. చూస్తే ఒరిజనాలిటి పోతుందనే చూడలేదు. నటి కాకపోతే ఏం చేసేవారు? కచ్చితంగా టీచర్ని అయ్యేదాన్ని. ఎందుకంటే మా అమ్మ కూడా ఉపాధ్యాయురాలిగా పని చేశారు. పిల్లలకు విద్య నేర్పించడం అంటే నాకు చాలా ఇష్టం. హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. మీకు అలాంటి చిత్రాల్లో నటించాలన్న ఆశ లేదా? నేను నటించిన విక్రమ్ వేదా, యుటర్న్ లాంటి చిత్రాలు హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలే. నా దృష్టిలో మహిళలకు సంబంధించిన కథా చిత్రాలన్నీ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలే. ఎలాంటి పాత్రలో నటించాలని కోరుకుంటున్నారు? కల్పనా చావ్లాగా నటించాలనుంది. నాసా శాస్త్రవేత్తగా ఆమె ఖ్యాతి అందరికీ తెలిసిందే. అయితే ఆమె ఆ స్థాయికి చేరుకోవడానికి ఎంతగా శ్రమించారో. ఆమె మరణం కూడా నామనసును కలచివేసింది. -
జెర్సీలాంటి చిత్రాలు జీవితాంతం గుర్తుండిపోతాయి
‘‘చాలా సినిమాలు వస్తుంటాయి.. కొన్ని సినిమాలు చాలా బావుంటాయి. ‘జెర్సీ’ చిత్రం చాలా బావుందని సాధారణ ప్రేక్షకులు, ఇండస్ట్రీ, మీడియా మిత్రులందరూ మెచ్చుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా నచ్చిన ‘దిల్’ రాజు హైదరాబాద్లో చిత్ర బృందానికి ‘అప్రిషియేషన్ మీట్’ను (అభినందన) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘డబుల్ పాజిటివ్ నేచర్ ఉన్న నానీతో కలిసి ‘జెర్సీ’ చూశా. సినిమా పూర్తవగానే ‘చాలా మంచి సినిమా చేశారు. ప్రేక్షకులు ఏ రేంజ్కి తీసుకెళ్తారనేది తెలియాలి’ అని మా నానీతో, వంశీతో చెప్పాను. రిలీజ్ రోజు సినిమా చాలా బాగా నచ్చింది. అదేరోజు మధ్యాహ్నం చినబాబుగారు, వంశీ వాళ్ల ఆఫీస్కి వెళ్లి ‘మీ టీమ్ని అభినందించాలి’ అని చెప్పా. గత ఏడాది ‘మహానటి’ సినిమా చూసి, నేరుగా అశ్వనీదత్గారి ఆఫీస్కి వెళ్లి అభినందించా. ‘జెర్సీ’ టీమ్ని అభినందించడానికి ప్రధాన కారణం గౌతమ్, నాని, వంశీ. జీవితంలో సక్సెస్లు, ఫెయిల్యూర్లు వస్తాయి. ఇలాంటి కొన్ని సినిమాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ‘మళ్ళీ రావా’ను చాలా బాగా హ్యాండిల్ చేసిన గౌతమ్ ‘జెర్సీ’ని తర్వాత స్థాయికి తీసుకెళ్లాడు. నాని అద్భుతమైన నటుడే. తను ఇవాళ గట్టిగా అడిగితే డబ్బు ఇవ్వడానికి ఏ నిర్మాత అయినా రెడీగా ఉంటారు. ఈ సినిమా అల్టిమేట్ సక్సెస్కి కారణం దర్శకుడు. ఏ సినిమాకైనా సక్సెస్ వచ్చిందంటే కారణం టీమ్ వర్క్. ‘జెర్సీ’ సినిమాను చూడని ప్రతి ఒక్కరూ చూడండి’’ అన్నారు. ‘‘జెర్సీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నానిగారు మాట్లాడుతున్నప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ బాగానే అనిపించింది కానీ, ఇంత అంచనాలు పెట్టుకున్నారా? అని టెన్షన్ అనిపించింది. సినిమా విడుదలైన రోజు సాయంత్రానికి ఆ టెన్షన్ తీరింది’’ అన్నారు గౌతమ్ తిన్ననూరి. నాని మాట్లాడుతూ– ‘‘ఉదయం ఆట చూసి రాజుగారు ఫోన్ చేశారంటేనే ఆ సినిమా హిట్ అయినట్టు. ఉదయం ఇంటి నుంచి బయలుదేరుతుంటే రాజుగారు ఫోన్ చేశారు.. అప్పుడే నాకు రిజల్ట్పై క్లారిటీ వచ్చింది. గౌతమ్ చాలా పెద్ద డైరక్టర్ అవుతాడని నమ్మా. ఇలాంటి సినిమాను నిర్మాతలు నమ్మాల్సిన అవసరం లేదు. అయినా వంశీ చాలా బాగా నమ్మాడు. నేను ప్రతి సినిమా చేసిన తర్వాత ‘ఐదేళ్ల తర్వాత నా సినిమా చూస్తే పాతబడిపోద్దా.. ఎంత పాతబడిపోద్ది’ అనుకునేవాడిని. కానీ నమ్మకంగా చెబుతున్నా. స్టేజ్మీద ఉన్న అందరూ పాతబడిపోవచ్చు కానీ ‘జెర్సీ’ ఎప్పటికీ పాతబడిపోదు’’ అన్నారు. శ్రద్ధా శ్రీనాథ్, నటులు బ్రహ్మాజీ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
నా పాత్రలో ఆమెను ఊహించుకోలేను: శ్రద్దా శ్రీనాథ్
తమిళసినిమా: మనసులో అనిపించింది అలానే బయటకు చెప్పేస్తే ఒక్కోసారి బెడిసి కొడుతుంది. అందుకే ఏ విషయాన్నైనా ఆచితూచి మాట్లాడాలంటారు పెద్దలు. నటి శ్రద్ధా శ్రీనాథ్ అలా నోరు జారే అభిమానుల ఆగ్రహానికి గురైంది. కథానాయకిగా ఎదుగుతున్న నటి శ్రద్ధాశ్రీనాథ్. కన్నడంలో ఈ బ్యూటీ నటించిన యూటర్న్ మంచి పేరును తెచ్చి పెట్టింది. ఇక తమిళంలోనూ శ్రద్ధాశ్రీనాథ్ నటించిన ఇవన్ తంద్రిరన్, విక్రమ్వేదా చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ముఖ్యంగా విక్రమ్వేదా కోలీవుడ్లో శ్రద్ధాశ్రీనాథ్కు ల్యాండ్మార్క్ చిత్రంగా నిలిచిపోయింది. తాజాగా ఈ అమ్మడు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి జెర్సీ చిత్రంతో సక్సెస్ను తన ఖాతాలో వేసేసుకుంది. ఇంత వరకూ బాగానే ఉంది. బహుభాషా నటిగా మార్కెట్ను పెంచుకుంటోంది. ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం అన్నది సహజం. అలా కన్నడంలో శ్రద్ధాశ్రీనాథ్ నాయకిగా నటించిన యూటర్న్ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషల్లో రీమేక్ చేశారు. ఇందులో శ్రద్ధాశ్రీనాథ్ పాత్రను నటి సమంత పోషించింది. ఇమె ఇష్టపడి చేసిన పాత్ర ఇది. ఆ పాత్రలో నటించి మంచి పేరే తెచ్చుకుంది. కాగా శ్రద్ధాశ్రీనాథ్ ఇటీవల ఒక భేటీలో సమంత నటించిన యూటర్న్ చిత్రం గురించి చేసిన కామెంట్ సమంత అభిమానుల్లో అసంతృప్తిని కలిగించింది. ఇంతకీ శ్రద్ధాశ్రీనాథ్ ఏమందంటే నేను నా గురించి ఎక్కువగానే ఊహించుకుంటాను. యూటర్న్ రీమేక్ చిత్రాన్ని పూర్తిగా చూడాలని భావించాను. అయితే 30 నిమిషాల కంటే ఎక్కువ చూడలేకపోయాను. ఎందుకంటే నేను నటించిన రక్షణ పాత్రలో వేరే నటి(సమంత)ని ఊహించలేకపోయాను అని అంది. ఇలా తన మనసుకు అనిపించింది బయటకు చెప్పడంతో సమంత నటన ఈ అమ్మడికి నచ్చలేదనే అర్థం స్పురించడంతో సమంత అభిమానులకు రుచించలేదు. దీంతో వారు నటి శ్రద్ధాశ్రీనాథ్పై కారాలు మిరియాలు నూరుతున్నారు. -
మస్త్ బిజీ
బ్రేక్ వేయకుండా రయ్రయ్ మంటూ కెరీర్ ఎక్సలేటర్ను తొక్కేస్తున్నారు నాగచైతన్య. ఈ ఏడాదిలో ఆల్రెడీ ‘మజిలీ’తో సక్సెస్ అందుకున్నారాయన. ప్రస్తుతం ‘వెంకీ మామ’ సినిమా షూటింగ్లో వెంకటేశ్తో కలిసి సందడి చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సెకండ్ హాఫ్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం పూర్తి కాగానే నూతన దర్శకుడు శశితో ఓ సినిమా స్టార్ట్ చేయనున్నారు. ‘దిల్’ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా ఫుల్ లవ్స్టోరీగా తెరకెక్కనుందని తెలిసింది. ఇందులో కథానాయికగా ‘జెర్సీ’ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ను ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉందని తెలిసింది. ఈ సినిమా తర్వాత ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేస్తారు. సో.. ఈ ఏడాదంతా ఆయన మస్త్ బిజీబిజీ అన్నమాట. -
‘జెర్సీ’ మూవీ రివ్యూ
టైటిల్ : జెర్సీ జానర్ : ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తారాగణం : నాని, శ్రద్దా శ్రీనాథ్, సత్యరాజ్ తదితరులు సంగీతం : అనిరుధ్ రవిచందర్ దర్శకత్వం : గౌతమ్ తిన్ననూరి నిర్మాత : సూర్యదేవర నాగవంశీ దేవదాస్, కృష్ణార్జున యుద్దం లాంటి కమర్షియల్ సినిమాలను చేసి భంగపడ్డ నాని.. అసలు విషయం తెలుసుకుని మళ్లీ తన పంథాలోకి వచ్చేశాడు. నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంపిక చేసుకుని మళ్లీ తన సత్తా చాటుకునేందుకు జెర్సీతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరీ ఈ సినిమా నాని ఆశించిన విజయాన్ని అందించిందా? సినిమా ప్రమోషన్స్లో భాగంగా చెప్పిన మ్యాజిక్ను ప్రేక్షకులు ఫీల్ అయ్యారా లేదో ఓ సారి చూద్దాం.. కథ అర్జున్ (నాని) ఇండియన్ క్రికెట్ జట్టులో ఆడాలని కలలు కంటూ ఉంటాడు. ఎన్ని సార్లు ప్రయత్నించినా చివరి క్షణాల్లో అవకాశం వచ్చి.. చేజారి పోతూ ఉంటుంది. అలా 26 ఏళ్ల వయసులో కెరీర్(క్రికెట్ లైఫ్) ను వదిలేస్తాడు. అప్పటికే తను ప్రేమించిన సారాను పెళ్లి చేసుకున్న అర్జున్.. ఓ ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయి నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. అర్జున్, సారాలకు నాని అనే కుమారుడు పుడతాడు. కొంత కాలానికి అర్జున్ ఉద్యోగం కూడా పోతుంది. క్రికెట్ను వదిలేసి, ప్రభుత్వ ఉద్యోగం పోయి పనిపాటా లేకుండా ఉంటాడు. ఇంట్లో ఖాళీగా ఉంటూ.. కనీసం కొడుకు పుట్టిన రోజున అడిగిన బహుమతి కూడా కొనివ్వలేకపోతాడు. ఇలా అన్నింటిని భరిస్తూ ఉన్న అర్జున్.. కొడుక్కి తనో హీరోలా కనబడడానికి ఆపేసిన క్రికెట్ను మళ్లీ మొదలుపెట్టాలనుకుంటాడు. అసలు అర్జున్ క్రికెట్ను ఎందుకు వదిలేయాల్సి వచ్చింది.. చివరకు అర్జున్ ఏమయ్యాడు? తాను అనుకున్నట్లు కొడుకు దృష్టిలో హీరోగా మిగిలిపోయాడా? లేదా అన్నదే జెర్సీ కథ. నటీనటులు అర్జున్ పాత్రలో నానిని తప్పా మరొకరిని ఊహించుకోడానికి అవకాశం లేకుండా.. ఆ పాత్రలో జీవించేశాడు. ప్రొఫెషనల్ క్రికెటర్గానూ, నార్మల్ ఫ్యామిలీ పర్సన్గానూ నటించి మెప్పించాడు. రియల్ లైఫ్లో నాన్నగా మారినా నాని.. రీల్ లైఫ్లోనూ ఆ ఫీలింగ్ను క్యారీ చేశాడు. కొడుకును అపురూపంగా చూసుకుంటూ.. తనే ప్రపంచంలా బతికే తండ్రి పాత్రలో జీవించాడు. ఇక సారా పాత్రలో శ్రద్దా శ్రీనాథ్ మంచి మార్కులు కొట్టేసింది. ప్రేయసిగానూ, భార్యగానూ రెండు పాత్రల్లో శ్రద్దా సహజంగా నటించింది. లుక్స్పరంగానూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక కోచ్గా, స్నేహితుడిగా నిత్యం అర్జున్ పక్కనే ఉండి నడిపించే సత్య రాజ్.. తన పాత్రకు న్యాయం చేశాడు. నాని స్నేహితులుగా నటించిన వారు తమ పరిధి మేరకు పర్వాలేదనిపించారు. విశ్లేషణ మనిషి కష్టాలు పడుతూ.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ.. చివరికి సక్సెస్ అవ్వడం.. ఈ కాన్సెప్ట్ వెండితెరకు మామూలే. అయితే స్క్రీన్పై ఆ కథలనే ఏవిధంగా ఆవిష్కరించామన్న దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. జెర్సీ లాంటి కథలు మనం ఈపాటికే ఎన్నింటినో చూసి ఉంటాము. కానీ ఈ కథకు క్రికెట్ నేపథ్యం ఎంచుకోవడం, ఆ పాత్రలో నాని విశ్వరూపం చూపించడం, గౌతమ్ తిన్ననూరి తన టాలెంట్తో కథను నడిపించిన తీరే ఈ సినిమాను నిలబెట్టాయి. డెబ్బై రోజుల నాని కష్టం.. తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ప్రొఫెషనల్ క్రికెటర్గా నాని తనను తాను మలచుకోవడంలో సక్సెస్ అయ్యాడు. గౌతమ్ తిన్ననూరి తనకు కలిసి వచ్చిన స్క్రీన్ ప్లేతో మరోసారి మ్యాజిక్ చేశాడు. కథలో భాగంగానే అక్కడక్కడా ఫ్లాష్ బ్యాక్ను రివీల్ చేస్తూ.. సినిమాను ముందుకు నడిపించాడు. అయితే ఈ క్రమంలో ఫస్టాఫ్ కాస్త లెంగ్తీ గానూ, స్లో గానూ నడిచినట్టు అనిపిస్తుంది. ఇక నాని తన కుమారుడితో ఉన్న సన్నివేశాలు కంటతడిపెట్టిస్తాయి. సెకండాఫ్లో వేగం పెంచినా.. పూర్తిగా క్రికెట్ నేపథ్యంలో సాగింది. అయితే ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు రుచించకపోవచ్చు. నాని నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఆశించే కామెడీ లేకపోవటం, కంటతడి పెట్టించే సన్నివేశాలు మరీ ఎక్కువగా ఉండటం లాంటివి సినిమాను కొన్ని వర్గాలకే పరమితం చేసే అవకాశం ఉంది. ప్రీ క్లైమాక్స్లో పూర్తిగా ఆట నేపథ్యంలో సాగగా.. చివర్లో వచ్చే ట్విస్ట్ షాకింగ్గా అనిపిస్తుంది. అనిరుధ్ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అవ్వగా.. నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. సినిమా మొత్తం 1986, 96 నేపథ్యంలోనే జరగ్గా.. అప్పటి వాతావరణాన్ని సినిమాటోగ్రఫర్ చక్కగా చూపించారు. పీరియాడిక్ నేపథ్యంలో సాగినా ఈ సినిమాకు ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం కూడా తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్కు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ నాని కథా కథనం సంగీతం మైనస్ పాయింట్స్ నిడివి హై ఎమోషన్స్ స్లో నెరేషన్ బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్. -
అవసరమైతే తాతగా మారతా!
‘‘స్టార్డమ్ని నమ్ముతాను. కానీ స్టార్డమ్కు ఇప్పుడున్న అర్థాన్ని మాత్రం నమ్మను. సినిమాలోని కంటెంట్ వల్లే స్టార్డమ్ వస్తుందన్నది నా నమ్మకం’’ అని నాని అన్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా పీడీవీ ప్రసాద్, నాగవంశీ నిర్మించిన చిత్రం ‘జెర్సీ’. ఇందులో శ్రద్ధాశ్రీనాథ్ కథానాయికగా నటించారు. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘జెర్సీ’ ప్రయాణం, ఇతర విశేషాలను నాని ఈ విధంగా చెప్పారు. ► ఇప్పటికి 22 సినిమాలు చేశారు. ‘జెర్సీ’ మీకు ఏ విధంగా స్పెషల్? ఎప్పటిలాగే సినిమా రిలీజ్ అంటే నెర్వస్గా ఫీల్ అవ్వడం, టెన్షన్ పడటంలాంటివి ఉంటాయనుకున్నాను. ‘జెర్సీ’ సినిమాకు మాత్రం ఏదో మ్యాజిక్ ఫీలవుతున్నాను. కొత్త ఎక్స్పీరియన్స్ను ఇస్తోంది. దీనికి ఏం పేరు పెట్టాలో అర్థం కావడం లేదు. సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాం. ఏదో గొప్ప పని చేశామనే ఫీలింగ్ ఉంది. ఇప్పుడు ‘జెర్సీ’ సినిమా గురించి నా హార్ట్లో ఉన్న ఫీలింగ్ ఎప్పటికీ ఇలానే ఉంటే బాగుండు అనిపిస్తోంది. జెన్యూన్గా మేం అందరం కలిసి క్రియేట్ చేసిన మ్యాజిక్కు ఆడియన్స్ ఎంత కనెక్ట్ అయ్యారన్నది రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ► ప్రస్తుతం ఐపీఎల్ సీజన్. క్రికెట్ బ్యాక్డ్రాప్లో వచ్చిన మీ సినిమా రిలీజ్కు ఇది సరైన సమయం అని భావిస్తున్నారా? ఐపీఎల్ సీజన్.. మన సినిమా వర్కౌట్ అవుతుందా? లేదా? ఓపెనింగ్ ఎంత ఉంటుంది? బ్లాక్బస్టరా? హిట్టా? అన్నవి ఆలోచించలేదు. సినిమాకు ఒక నంబర్, ఒక లెక్క కట్టి కంట్రోల్ చేయడం నాకు అంతగా ఇష్టం ఉండదు. ► ‘భీమిలి కబడ్డీ జట్టు’ చిత్రంలో కబడ్డీ ఆడారు. ఇప్పుడు ‘జెర్సీ’ కోసం క్రికెట్. ఏది కష్టంగా అనిపించింది? ఫిజికల్గా రెండూ ఒకటే. ‘భీమిలి కబడ్డీ జట్టు’కి అంతగా శిక్షణ తీసుకోకుండానే కబడ్డీ ఆడాం. కాబట్టి ఎక్కువ దెబ్బలు తగిలాయి. కానీ అప్పట్లో ఇంత మీడియా, సోషల్ మీడియా లేదు కాబట్టి బయటకు రాలేదు. ‘జెర్సీ’ సినిమాకు ఫుల్ ట్రైనింగ్ తీసుకుని ఆడాను. ట్రైనింగ్లో ఫిజికల్గా కష్టమనిపించింది. ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమాలో నేనెంత ప్రొఫెషనల్గా కబడ్డీ ఆడానో తెలియదు కానీ ‘జెర్సీ’లో మాత్రం చాలా ప్రొఫెషనల్గా క్రికెట్ ఆడాను. ► ‘భీమిలి కబడ్డీ జట్టు’ క్లైమాక్స్ విషాదకరంగా ఉంటుంది. ‘జెర్సీ’ సినిమాలో కూడా అలాంటి క్లైమాక్సే అని తెలిసింది? అది సినిమాలో తెలుస్తుంది. ఇంకా సినిమా రిలీజ్ కాకముందే ఎండింగ్ల గురించి మాట్లాడుకోవడం సరైన విషయం కాదు. ఒకవేళ నేను సాడ్ ఎండింగ్ కాదు అంటే హ్యాపీ ఎండింగ్ అని కన్ఫార్మ్ చేయడమే కదా. అసలు నేను ఎండింగ్ గురించి ఎందుకు మాట్లాడాలి. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ నవ్వుతూ, ఒక ఎనర్జిటిక్ ఫీలింగ్తో బయటకు వస్తారు. అలాగే ఇది ఏ క్రికెటర్ బయోపిక్ కాదు. ట్రైలర్, టీజర్ చూసి కొందరు అలా ఊహించుకుని ఉండొచ్చు. ► గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటించడం గురించి? గౌతమ్ తెరకెక్కించిన ‘మళ్ళీ రావా’ నేను చూడలేదు. కానీ మంచి సినిమా అని ఆడియన్స్ నిర్ణయించారని చెబితే విన్నాను. గౌతమ్తో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. సినిమాలో ఉన్న ప్రతి ఫ్రేమ్లో గౌతమ్ వర్క్ తెలుస్తుంది. అలాగే నిర్మాత వంశీ నా క్లాస్మేట్. సత్యరాజ్గారితో నటించడం గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సెట్లో చాలా సరదాగా గడిచింది. ► ‘జెర్సీ’ సినిమా సెట్లో గాయపడ్డట్లు ఉన్నారు? బాల్ తగిలిందా? గాయపడింది బాల్ తగలడం వల్ల కాదు. సినిమాలో రనౌట్ షాట్ను షూట్ చేసే ప్రాసెస్లో ఒకరికొకరం గుద్దుకున్నాం. ముక్కుకు బాగా దెబ్బ తగిలింది. అలా ఓ పక్కకి ఒరిగినట్లు అయింది. హాస్పిటల్కి వెళితే డాక్టర్ సెట్ చేశారు. ► సినిమా కోసం ఇంత కష్టం అవసరమా అని ఆ టైమ్లో అనిపించిందా? ఏం అనిపించలేదు. అయ్యో... రేపు షూటింగ్ ఎలా అనిపించింది. నెక్ట్స్ డే మార్నింగ్ 10కి షూటింగ్కి వెళ్లాను. ► కబడ్డీ... క్రికెట్ ఆడారు. నెక్ట్స్ ఏం ఆడాలనుకుంటున్నారు? స్పోర్ట్స్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇస్తాను. ఆ టైమ్లో కథను బట్టి ఏ ఆట ఆడాలో ఆ ఆట ఆడతాను. ► ఈ చిత్రంలో రెండు లుక్స్లో కనిపించారు. ముఖ్యంగా తండ్రి పాత్ర చేయడం కెరీర్కు ఏమైనా రిస్క్ అనుకున్నారా? పాత్రల మధ్య వ్యత్యాసం చూపించడానికి మంచి ఎఫర్ట్ పెట్టాను. ఈ ప్రాసెస్ను బాగా ఎంజాయ్ చేశాను. కథ పరంగా తండ్రిగానే కాదు... అవసరమైతే ప్రోస్థటిక్ మేకప్ వేసుకుని తాతలా మారడానికి కూడా ఇష్టమే. ► ‘జెర్సీ’ ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో వెంకటేశ్గారు మిమ్మల్ని ప్రశంసించడం ఎలా అనిపించింది? చిన్నతనం నుంచి నాకు వెంకటేశ్గారంటే చాలా ఇష్టం. నిజంగా ఆయనది మంచి మనసు. ఆయన ఎంత కూల్గా ఉంటారో పర్సనల్గా కలిస్తే అర్థం అవుతుంది. ఏ యాక్టర్తో అయినా ఇట్టే ఫ్రెండ్లా కలిసిపోతారు. మా సినిమా వేడుకకు వచ్చి టీమ్లో పాజిటివ్ ఎనర్జీ నింపారు. ► ‘కృష్ణార్జున యుద్ధం’ ఆడలేదు బాబాయ్ అని మీరు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దానివల్ల ఆ సినిమా దర్శక–నిర్మాతలు ఫీల్ అవుతారనిపించలేదా? ఇప్పుడు సినిమా ఆడిందన్నాననుకోండి.. నిజం అయిపోదుగా? దర్శక–నిర్మాతలు ఆడింది అంటే.. నిజమైపోదుగా. నిజాన్ని ఒప్పుకోవాలి. దాచాల్సిన అవసరం లేదనిపించింది. ‘కృష్ణార్జున యుద్ధం’ ఆశించిన ఫలితం ఇవ్వకపోతే ఏం? సాహు (నిర్మాత), గాంధీ (డైరెక్టర్), నేను ముగ్గురం కలిసి ఇంకో సినిమా చేస్తాం. బ్లాక్బస్టర్ కొడతాం. ► బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. మీకు ఏవైనా ఆఫర్లు వచ్చాయా? రెండు అవకాశాలు వచ్చాయి. కుదర్లేదు. అయితే.... బయోపిక్కా? కాదా? అని కాదు. నాకు చెప్పిన కథ ఎలా ఉందీ అని ఆలోచించి, నచ్చితే చేస్తాను. ఇప్పుడు ఈయన కథ చెబుతున్నాం సినిమా చేద్దాం అంటే.. అది కాదు. ఆయన కథ ఎలా చెబుతున్నారు? ఫస్ట్ సీన్ ఎంటీ? లాస్ట్ సీన్ ఎంటీ? అని తెలుసుకుని చేస్తాను. నాకు వచ్చిన అవకాశాల్లో నచ్చినవి చేసుకుంటూ వెళ్తాను. భవిష్యత్లో వాటిలో బయోపిక్స్ ఉంటాయో లేవో ఇప్పుడే చెప్పలేను. ► నిర్మాతగా మీ నెక్ట్స్ చిత్రం ఎప్పుడు? ఇటీవలే ఒక స్టోరీలైన్ను ఓకే చేశాం. త్వరలో చెబుతాను. ► వెబ్ సిరీస్ల్లో నటించడానికి ఆసక్తిగా ఉన్నారా? ఇప్పుడు నాన్స్టాప్గా సినిమాలు ఉన్నాయి. ఇవి పూర్తి అయ్యేసరికి దాదాపు రెండేళ్ల టైమ్ పట్టొచ్చు. రాబోయే కాలంలో వెబ్ సిరీస్లకు పెద్ద మార్కెట్ ఉంటుంది. పెద్ద పెద్ద డైరెక్టర్లు డైరెక్ట్ చేయవచ్చు కూడా. ఆ టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా సరైన నిర్ణయమే తీసుకుంటాను. ► ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ మీలో వచ్చిన మార్పు? యాక్టర్గా పరిణితి చెందాను. నేను ప్రయాణించాల్సిన దూరం, నేర్చుకోవాల్సినది చాలా ఉంది. ► న్యాచురల్స్టార్ అనే ట్యాగ్ ముందు ఎందుకు అనిపించింది. ఆ తర్వాత అది అభిమానుల ప్రేమగా తీసుకుంటున్నాను. సినిమాను బట్టి నా రెమ్యునరేషన్ మారుతుంటుంది. ∙‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ విషయంలో ఏ ఇష్యూ లేదు. ► ‘మజిలీ’ సినిమా నేను చూడలేదు. అందుకే ‘జెర్సీ’, ‘మజిలీ’ సినిమాల మధ్య పోలికల గురించి మాట్లాడలేను. ఎప్పటిలాగే ‘జెర్సీ’ కథ విన్నాను. కానీ సినిమా చేయాలని చాలా తక్కువ సమయంలో నిర్ణయం తీసుకున్నాను. ‘జెర్సీ’ సినిమా సీక్వెల్ లేదు. క్రికెట్లో నాకు డేనియల్ శిక్షణ ఇచ్చారు. ► థ్రిల్లింగ్గా థియేటర్స్కు వెళ్లి సినిమా చూసే ఎంజాయ్మెంట్ను ఈ తరం ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తున్నాయి. సెల్ఫోన్లు ఆఫ్ చేసి థియేటర్స్కు వెళితే మార్నింగ్ షో మ్యాజిక్ను ఎంజాయ్ చేయవచ్చు. -
నానిని అన్నా అనేసింది!
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జెర్సీ. ఈ సినిమాతో సాండల్వుడ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ టాలీవుడ్కు పరిచయం అవుతోంది. 19న రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రద్ధా ఇచ్చిన స్పీచ్ టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. తెలుగులో తొలి సినిమానే అయిన శ్రద్ధా తెలుగులో స్పీచ్ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అభిమానులను ఉత్సాహపరిచేందుకు ‘జై నాని అన్న’ అనడంతో అంతా అవాక్కయ్యారు. సాధారణంగా సినీరంగంలో హీరోయిన్లు హీరోలను అన్న అని పిలిచిన సందర్భాలు పెద్దగా కనిపించవు. అలాంటి శ్రద్ధ నానిని అన్న అనటంతో అభిమానులు అవాక్కయ్యారు. మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జెర్సీ సినిమాలో నాని 36 ఏళ్ల క్రికెటర్గా కనిపించనున్నాడు. ఎమోషనల్ పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళ సంగీత సంచలనం అనిరుధ్ స్వరాలందిస్తున్నాడు. -
నాని అభిమానులు గర్వంగా ఫీలవ్వాలి
‘‘జెర్సీ’ వంటి మంచి సినిమా చేసినందుకు నానికి అభినందనలు. తన తొలి చిత్రం ‘అష్టా చమ్మా’ నుంచి నాని అద్భుతంగా నటిస్తున్నాడు. తను వన్నాఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. నాని అభిమానులు చాలా గర్వంగా ఫీలవ్వాలి. మన తెలుగు ఇండస్ట్రీలో వన్నాఫ్ ది మోస్ట్ నేచురల్ యాక్టర్స్ తను.. నేను గర్వంగా ఫీలవుతున్నాను’’ అని వెంకటేశ్ అన్నారు. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ముఖ్య అతిథి వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘నాకు క్రికెట్ ఇష్టం కాబట్టి ఇక్కడికి వచ్చానని కాదు.. వాస్తవం ఏంటంటే ‘జెర్సీ’ కోసమే వచ్చాను. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూసినప్పటి నుంచే చాలా ఇంప్రెస్ అయ్యా. ఈ సినిమాలో నేనూ భాగస్వామ్యం అయితే బాగుంటుందనుకున్నా. డైరెక్టర్ గౌతమ్ చాలా క్లియర్గా ఉన్నాడు.. సినిమాలో ఏం చూపించాలనే అంశంపై. ట్రైలర్ చూశాక ఒకే ఒక్క మాట చెప్పాలనిపిస్తోంది.. మైండ్ బ్లోయింగ్. ఇలాంటి నిజాయతీ ఉన్న సినిమాలు అరుదుగా వస్తాయి. ఇటువంటి చిత్రాలు నాని ఎంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమాలు అయిన తర్వాత వదిలిపెట్టి వెళ్లలేం. ‘జెర్సీ’లాంటి సినిమాల్లోని పాత్రల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు చాలా ఎమోషన్ అయిపోతాం. ఇలాంటి సినిమాలు చాలా ఇన్స్పిరేషన్గా, మోటివేషన్గా నిలుస్తాయని ట్రైలర్ చూడగానే అర్థమైంది. ప్రతి ఒక్కరూ లైఫ్లో స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. కానీ, వెనక్కి రాకుండా నిలదొక్కుకుని విజయాలు సాధించినప్పుడే థ్రిల్ ఉంటుంది. అదే ఈ సినిమాలో నాని చూపించబోతున్నాడు. ఈ చిత్రం చూశాక ఇది సినిమా కాదు, మన జీవితం అని అందరూ భావిస్తారు. కొన్ని సినిమాలు అందరికీ పాఠాలు నేర్పిస్తాయి. మీరు కన్న కలలు, మీ లక్ష్యం గుర్తొస్తాయి. ఇది మైండ్లో పెట్టుకుని మీ లక్ష్యాన్ని చేరుకోండి. ఇదే విషయాన్ని నాని చూపించబోతున్నాడు.. ఈ సినిమా ఔట్ స్టాండింగ్గా ఉంటుందనే నాకు నమ్మకం ఉంది. టీమ్ అందరికీ అభినందనలు. ఈ చిత్రనిర్మాతలు నాకు మంచి మిత్రులు. మంచి సినిమా చేశారని గర్వంగా భావిస్తున్నా. మంచి సినిమా తీసిన గౌతమ్కి అభినందనలు. శ్రద్ధా శ్రీనాథ్ చాలా అందంగా కనిపిస్తున్నారు’’ అన్నారు. నాని మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్గారు ఆవకాయలాంటివారు. ఆయన నచ్చని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఆయన్ను చూస్తే ఏదో తెలియని ఓ పాజిటివిటీ. పెద్ద తెరపై చూసిన ఓ స్టార్ని పర్సనల్గా కలిసిన తర్వాత ఇంకా ఎక్కువ నచ్చేసిన ఒకే ఒక్క స్టార్ వెంకటేశ్గారు. ఆయన ఫంక్షన్కి వెళ్లాలనే కోరిక ‘బాబు బంగారం’ సినిమాతో తీరిపోయింది. ఎప్పుడో ఒకప్పుడు ఆయన నా సినిమా ఫంక్షన్కి వస్తే బాగుండేదనే కోరిక ‘జెర్సీ’తో తీరింది. ఎప్పుడో ఒకప్పుడు ఇద్దరం కలిసి ఓ సినిమా చేసి స్టేజ్ని షేర్ చేసుకోవాలనే కోరిక ఇంకా బలంగా ఉంది. మీతో స్క్రీన్ షేర్ చేసుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాను సార్. ఏదైనా మల్టీస్టారర్ సినిమా గురించి డిస్కషన్స్ వస్తే వెంకటేశ్గారు, నేను కలిసి చేస్తే బాగుంటుందని చాలా మంది నాతో అన్నారు. దాని కోసం వేచి చూస్తున్నా. ‘జెర్సీ’ ఆల్రెడీ నాకు చాలా చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ ఫంక్షన్కి ఆయన రావడంతో ఇంకా ఇంకా ప్రత్యేకం అయిపోయింది. ‘జెర్సీ’ టీమ్ తరఫున ధన్యవాదాలు సార్. ఇక ‘జెర్సీ’ విషయానికొస్తే.. నిజంగా మొదటిసారి ఏం చెప్పాలో తెలియడం లేదు. ఎందుకంటే ఏప్రిల్ 19న మీరంతా చాలా గర్వపడతారు. ఈ సినిమాకి పనిచేసిన టీమ్ అందర్నీ చూసి గర్వపడతారు. మీరందరూ గర్వించదగ్గ ఓ సినిమాలో నేనూ భాగం అయినందుకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. కన్ఫార్మ్.. ఫిక్స్ అయిపోండి. బ్లాక్ బస్టర్ అనే మాటలు అనటం లేదు. ఒక మంచి సినిమా పక్కన ఇలాంటి పదాలు పెట్టకూడదనిపిస్తోంది. అంత గొప్ప సినిమా చేశాననే పూర్తి సంతృప్తి ఉంది నాకు. ఎందుకింత సంతృప్తి అనేది 19న చూస్తారు. గౌతమ్ ఈ సినిమాకి ఎంత కష్టపడ్డాడో నాకు మాత్రమే తెలుసు. తను ఈరోజు ఇక్కడ లేడు.. మాట్లాడలేకపోవచ్చు. కానీ 19న తన సినిమా మాట్లాడుతుంది. ఈ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ కథ చెప్పడంలోనే ఒక భాగమయ్యారు. ఇంత అందమైన సినిమా చేశాననే భావనను ఏదైనా మాటల్లో చెప్పాలంటే ఏం చెప్పినాసరే నాకు తక్కువ అయిపోతుంది. గౌతమ్ కొడుక్కి చెబుతున్నా.. మీ నాన్న చాలా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. ‘జెర్సీ’ సినిమాని పూర్తిగా అర్థం చేసుకునే వయస్సు నీకుందో లేదో తెలియదు కానీ, నువ్వు పెద్దయ్యాక మీ నాన్నకి బిగ్గెస్ట్ ఫ్యాన్ అవుతావని కచ్చితంగా చెప్పగలను. ‘జెర్సీ’ ట్రైలర్ మీ అందరికీ (అభిమానులు) నచ్చిందా? ‘జెర్సీ’ ట్రైలర్ స్టైల్లో చెప్పాలంటే ‘ఇంత పెద్ద ప్రపంచంలో ఈరోజు దాకా నన్ను జడ్జ్ చేయంది తెలుగు ప్రేక్షకులు మాత్రమే.. మీ దృష్టిలో కొంచెం తగ్గినా తట్టుకోలేను’’ అన్నారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ– ‘‘నానిగారికి నేను బిగ్గెస్ట్ ఫ్యాన్. వంశీ పంపిన ‘జెర్సీ’ ట్రైలర్ చూసి షాక్ అయ్యా. గౌతమ్ ఎంతో ఎఫర్ట్ పెట్టి బాగా తీశారు. వేసవిలో రెగ్యులర్ క్రికెట్కి మించి ఈ సినిమాలో క్రికెట్ ఉంటుంది. ఇది చాలా మంచి సినిమా. ఎవరూ మిస్ అవ్వొద్దు.. తప్పకుండా చూడాలి. మా సితార ఎంటర్టైన్మెంట్స్కి మంచి హిట్ ఇవ్వాలి’’ అన్నారు. డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ– ‘‘ఏది ఏమైనా నాని నాకు ప్రత్యేకం.. కారణం మీ అందరికీ తెలుసు. ఆర్జేగా పనిచేస్తున్న ఓ కుర్రాడు(నాని) 2008లో మా ఆఫీసుకి వచ్చి ‘అష్టా చమ్మా’కి ఆడిషన్స్ ఇవ్వడం గుర్తుంది. నాని.. నువ్వు స్టార్ మెటీరియల్ అని మెయిల్ చేశా. దశాబ్దం తర్వాత ఇప్పుడు ఆ మాట గుర్తుకొస్తోంది. నా మాట నిజమైనందుకు గర్వపడుతున్నా. ‘జెర్సీ’ సినిమా నాకు క్లోజ్. క్రికెట్ నేపథ్యంలో ‘గోల్కొండ హైస్కూల్’ సినిమా చేశా. ‘జెర్సీ’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది.. అందులో ఎటువంటి డౌట్ లేదు. గౌతమ్ ‘మళ్ళీ రావా’ సినిమా చూసి ఎంజాయ్ చేశా. ఈ సినిమాతో తనకు మరో హిట్ రావాలి’’ అన్నారు. శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ– ‘‘కన్నడ, తమిళ్, హిందీ సినిమాలు చేశా. ‘జెర్సీ’ లాంటి మంచి సినిమాతో టాలీవుడ్కి పరిచయం అవుతుండటం నా అదృష్టం. నాలుగేళ్ల క్రితం నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు యాక్టింగ్ చేయడం తప్ప వేరే దేని గురించి తెలీదు. మంచి పాత్రలు చేయాలనుకునేదాన్ని.. ఇప్పుడు చాలా హ్యాపీ. ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చిన గౌతమ్గారు నా హీరో. నిర్మాతలకు థ్యాంక్స్. నానీకి బిగ్ థ్యాంక్స్. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఇంత పెద్ద సినిమాలో నేనూ ఓ చిన్న భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. నిర్మాతలు రాధాకృష్ణ, మోహన్, రామ్ ఆచంట, డైరెక్టర్స్ సుధీర్ వర్మ, విక్రమ్ కె.కుమార్, వెంకీ కుడుముల, నటులు సత్యరాజ్, ప్రవీణ్, జశ్వంత్, కెమెరామేన్ సాను జాన్ వర్గీస్, పాటల రచయిత కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
భాష ఒక్కటే తేడా
‘‘చిన్నప్పటి నుంచి సినిమాలంటే బాగా ఆసక్తి. కాలేజీలో ఉన్నప్పుడు థియేటర్ యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నటనతో ప్రేమలో పడిపోయాను. ఐదేళ్లు లా చేశాక యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అని అర్థం అయింది. రెండేళ్లు లాయర్గా పని చేసిన తర్వాత పూర్తిస్థాయిలో సినిమాల్లోకి వచ్చేశాను’’ అని శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. పీడీవీ ప్రసాద్, నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా ఈనెల 19న రిలీజ్ కానుంది. కన్నడ నుంచి తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అవుతున్న శ్రద్ధా పంచుకున్న విశేషాలు.. ► మా నాన్నగారు ఆర్మీ ఆఫీసర్. ఎక్కువ ట్రాన్స్ఫర్లు అవుతుండేవి. 9 స్కూల్స్ వరకు మారాను. సికింద్రాబాద్లో ఆరేళ్లు ఉన్నాం. 7వ క్లాస్ నుంచి +2 వరకూ కేవీ తిరుమలగిరిలో చదువుకున్నాను. ► 2017లోనే రెండు తెలుగు సినిమాలు అంగీకరించాను. సురేశ్ ప్రొడక్షన్స్లో ‘క్షణం’ దర్శకుడు రవికాంత్ పేరేపు సినిమా ఒకటి. ఆది సాయికుమార్తో ‘జోడీ’ సినిమా రెండోది. ‘జెర్సీ’ 2018 అక్టోబర్లో అంగీకరించాను. అనుకోకుండా ‘జెర్సీ’ ముందుగా రిలీజ్ అవుతోంది. ఇందులో ఎమోషన్స్ని చాలా నిజాయతీగా చూపించాం. ► ఈ సినిమాలో నటించేటప్పుడు భాష ఇబ్బంది పెడుతుందని టెన్షన్ పడ్డాను. ఆ విషయంలో నాని హెల్ప్ చేశారు. ‘నువ్వు చెయ్యగలవు’ అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నాని బెస్ట్ కో స్టార్. మన పెర్ఫార్మెన్స్ మన కో యాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ► చిన్నప్పటి నుంచి క్రికెట్ బాగానే చూస్తాను. వన్ డే, వరల్డ్కప్స్ తప్పకుండా ఫాలో అవుతుంటా. రాహుల్ ద్రావిడ్ నా ఫేవరెట్ క్రికెటర్. ► కన్నడ, తెలుగు, తమిళం.. ఇలా అన్ని ఇండస్ట్రీల్లో చేసే పని కామనే. భాష ఒక్కటే మారుతుంది. అందుకే వేరు వేరు ఇండస్ట్రీల్లో పని చేయడం డిఫరెంట్గా అనిపించదు. ► ‘జెర్సీ’లో పెళ్లి కాకముందు టీనేజ్ అమ్మాయిలా, పెళ్లి తర్వాత మెచ్యూర్డ్ రోల్లో కనిపిస్తా. ఏదైనా పాత్ర చేస్తే వెంటనే ఓ బ్రాండ్ మన మీద వేసే ఇండస్ట్రీ ఇది. ఫస్ట్ సినిమాలోనే తల్లి పాత్రలో నటిస్తే ఎలా? అలాంటి పాత్రలే వస్తాయా? అనే భయం ఉంది. కానీ ‘జెర్సీ’ లాంటి స్క్రిప్ట్లు ఎప్పుడూ రావు. బ్రాండింగ్ల గురించి భయపడకుండా చేశా. డబ్బింగ్ చెబుదాం అనుకున్నాను. టైమ్ కుదర్లేదు. ► మణిరత్నంగారి సినిమాలో కనిపించాలని ‘చెలియా’ లో చిన్న పాత్ర చేశాను. కన్నడలో నేను నటించిన ‘యూటర్న్’ తెలుగు రీమేక్లో సమంత చేశారు. అందులో రచన పాత్ర నాకు స్పెషల్. తెలుగులో ఈ సినిమా ఇంకా పూర్తిగా చూడలేదు. ► ‘పెళ్లి చూపులు, బాహుబలి’ సినిమాలు చూశాను. తెలుగులో రాజమౌళిగారు, త్రివిక్రమ్గారు, తరుణ్ భాస్కర్ సినిమాల్లో చేయాలనుంది. -
అద్భుతమైన భావోద్వేగాలతో ‘జెర్సీ’!
అందంలో అభినయంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలితో దూసుకొస్తోన్న ప్రతిభావంతురాలైన కన్నడ నటి శ్రద్ధ శ్రీనాథ్. జెర్సీ సినిమాలో నాని సరసన నటిస్తూ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అవుతోందీ కన్నడ బ్యూటీ. మళ్ళీ రావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న జెర్సీ ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రద్ధా శ్రీనాథ్... జెర్సీ సినిమాకు సంబంధించి తన వర్క్ పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. ఈ సినిమాలో తనకు అమోఘమైన భావోద్వేగాలను పండించగల సన్నివేశాల్లో నటించే అవకాశం రావడం చాలా ఆనందం కలిగించిందని చెప్పుకొచ్చింది. అలాగే సినిమాలో టీనేజర్ గా మరియు ఒక మదర్ గా ఇలా వేరు వేరు దశలలో కనిపిస్తానని తెలిపింది. ఇక నాని పక్కన నటించడం గురించి చెప్తూ.. నాని సహజ నటుడని, ఎలాంటి సన్నివేశాన్ని అయినా ఆయన చాలా సింపుల్ వే లో చక్కని హావబావాలతో నటిస్తారని.. ఆయన పక్కన నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిసింది. అదేవిధంగా ఈ సినిమా ఒప్పుకోవడానికి నానితో పాటుగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాత సూర్యదేవర నాగ వంశి, అనిరుధ్ లతో మొత్తం చిత్రబృందం కూడా కారణమని.. వారి పనితనం వల్లే జెర్సీ సినిమా అద్భుతంగా వచ్చిందని శ్రద్ధ శ్రీనాథ్ చెప్పుకొచ్చింది.కాగా కొన్ని సంవత్సరాలు పాటు హైదరాబాద్ లోనే పెరిగిన శ్రద్ధ.. ఇప్పటికే పలు కన్నడ మరియు తమిళ్ సినిమాల్లో కూడా నటించింది. -
‘జెర్సీ’ ట్రైలర్కు సూపర్బ్ రెస్పాన్స్
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జెర్సీ. మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని మిడిల్ ఏజ్ క్రికెటర్గా కనిపించనున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. నాని మార్క్ నేచురల్ పర్ఫామెన్స్, పిరియాడిక్ నేటివిటీ, ఎమోషనల్ సీన్స్ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న జెర్సీ సినిమాలో నానికి జోడిగా కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని 36 ఏళ్ల వ్యక్తిగా ఓ కుర్రాడికి తండ్రిగా నటిస్తుండటం విశేషం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నాడు. -
ఆయన మాటలు వేదవాక్కు
సినిమా: ఆయన మాటలు వేదవాక్కు అని పేర్కొంది నటి శ్రద్ధా శ్రీనాథ్. ఈమె తాజాగా నటించిన తమిళ చిత్రం నేర్కొండ పార్వై.అజిత్ ప్రధాన పాత్రలో నటించిన ఇది హిందీలో అమితాబ్బచ్చన్,తాప్సీ నటించిన పింక్ చిత్రానికి రీమేక్. బాలీవుడ్ నిర్మాత, నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న ఇందులో అజిత్ న్యాయవాదిగా నటించారు. హెచ్.వినోద్ దర్శకతక్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ఇందులో అజిత్ నటించిన కోర్టు సన్నివేశాలు పేలతాయంటున్నారు చిత్ర వర్గాలు. స్నేహంగా మెలిగే యువకుల వల్ల అత్యాచారాలకు బలైన యువతుల ఇదివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం నేర్కొండ పార్వై. హిందీలో ఈ చిత్రం విమర్శకులు, నెటిజన్ల ప్రశంసలను పొందింది. ఈ చిత్రం గురించి నటి శ్రద్ధాశ్రీనాథ్ తెలుపుతూ ఒక సంబంధానికి ఇరువురు సమ్మతం అవసరం అన్నది చాలా మందికి తెలియకపోవడం బాధాకరం అని పేర్కొంది. ఇందుకు కారణం చదువు లేనితనం, పురుషాధిక్యం, మనసు విప్పి మాట్లాడుకోకపోవడం వంటివి కావచ్చునని అంది. అలాంటి అంశాలతో కూడిన నేర్కొండ పార్వై చిత్రం హిందీ చిత్రం స్థాయిలో ఉండాలన్నది ఒక విషయం అయితే, తాను మాత్రం దీన్ని రీమేక్లా చూడలేదని చెప్పింది. ఒక అమ్మాయిగా తన పాత్రకు ఎంత నిజాయితీగా నటించగలనో అంతగా నటించానని చెప్పింది. ఇందులో ముఖ్య అంశం ఏమిటంటే అజిత్ ప్రధాన పాత్రలో నటించడం అని పేర్కొంది. చిత్రంలో ఆయన చెప్పే విషయాలను వినడానికి అభిమానులు రెడీగా ఉంటారని అంది. ఆయన మాటలు వేదవాక్కుగా ఉంటాయని చెప్పింది. సమాజంలోని చేదు విషయాలను ఒక స్టార్ నటుడు తెరపై చెబితే అవి చర్చనీయాంశంగా మారతాయని నటి శ్రద్ధా శ్రీనాథ్ పేర్కొంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. -
క్రికెటర్ల కష్టం తెలిసింది – నాని
‘‘గౌతమ్ ‘జెర్సీ’ కథ చెప్పగానే ఓకే అన్నాను. త్వరగా సెట్స్పైకి వెళ్లడం.. త్వరత్వరగా చిత్రీకరణ పూర్తవడం... ఈ సినిమా పోస్టర్లు, టీజర్ చూసి క్రికెట్ నేపథ్యంలో ఉంటుందనుకుంటున్నారు. కానీ, చాలా ఎమోషనల్గా ఉంటుంది’’ అన్నారు నాని. ఆయన హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘జెర్సీ’ ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ– ‘‘36 ఏళ్ల వయసులో తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే అర్జున్ అనే రంజీ క్రికెటర్ కథ ఇది. రంజీ మ్యాచ్లు ఆడుతున్న అతను అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనే ప్రయత్నంలో ఉంటాడు. నేను స్కూల్డేస్లో క్రికెట్ ఆడేవాణ్ణి. సినిమా పిచ్చి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఆడటం మానేశాను. ‘జెర్సీ’ కోసం ట్రైనింగ్ తీసుకుని ఆడాల్సి వచ్చింది. నేను, నిర్మాత నాగవంశీ స్కూల్డేస్లో క్లాస్మేట్స్. తను క్రికెట్ చాలా బాగా ఆడతాడు. తను మెయిన్, నేను ఎక్స్ట్రా ప్లేయర్. ఇన్నిరోజుల తర్వాత మమ్మల్ని విధిరాత కలిపిందనుకుంటున్నా. తను చాలా టెర్రిఫిక్, మాస్ ప్రొడ్యూసర్. ఈ సినిమా క్లైమాక్స్ మ్యాచ్ 14రోజులు రాత్రుళ్లు మంచి చలిలో చిత్రీకరించాం. ఈ సినిమా చేస్తున్నప్పుడు క్రికెటర్ల కష్టం తెలిసింది. ఈ సినిమా ప్రాక్టీస్, షూటింగ్ వల్ల బరువు తగ్గాను. ఈ చిత్రాన్ని 20 సార్లు చూశా. సినిమా చూస్తున్నంత సేపు నన్ను నేను మరచిపోయా. ఇందులో నన్ను కాదు.. అర్జున్ పాత్రని మాత్రమే ప్రేక్షకులు చూస్తారు. గౌతమ్ వల్ల ఇండస్ట్రీకి మరో మంచి డైరెక్టర్ దొరికాడు’’ అన్నారు. నాగవంశీ మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమాల్లో ఇదొక కొత్త జానర్ని క్రియేట్ చేస్తుంది. ఈ నెల 12న ట్రైలర్ రిలీజ్ చేసి, 15న ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తున్నాం. సినిమా ఈ నెల 19న విడుదల కాదని కొందరు మాట్లాడుతున్నారు. అనుకున్నట్లు 19నే కచ్చితంగా రిలీజ్ చేస్తున్నాం. ముందు తెలుగులో, ఆ తర్వాత చైనాలో విడుదల చేస్తాం’’ అన్నారు. -
జోడీ కుదిరింది
‘ప్రేమ కావాలి, లవ్లీ’ వంటి ప్రేమకథా చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆది సాయి కుమార్. లేటేస్ట్గా మరో లవ్స్టోరీతో ఆడియన్స్ను పలకరించనున్నారు. నూతన దర్శకుడు విశ్వనాథ్ అరిగెల తెరకెక్కించిన ‘జోడీ’లో ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించారు. పద్మజ, సాయి వెంకటేశ్ గుర్రం నిర్మాతలు. ఉగాది సందర్భంగా ‘జోడీ’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘‘హీరో, హీరోయిన్ జోడీ మధ్య జరిగే ప్రేమకథ, వాళ్ల కెమిస్ట్రీ ఈ చిత్రానికి హైలైట్. పక్కా ప్లానింగ్తో షూటింగ్ పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: ‘నీవే’ ఫణి కల్యాణ్, కెమెరా: విశ్వేశ్వర్. -
త్వరలోనే ‘జెర్సీ’ ట్రైలర్
గత రెండు సినిమాలతో కమర్షియల్ బాట పట్టిన నాని.. మళ్లీ తన ట్రాక్లోకి వచ్చేశాడు. కమర్షియల్ చిత్రాలు తనకు కలిసి రావని.. మళ్లీ ప్రయోగానికి ఓటేశాడు. నాని క్రికెటర్గా నటిస్తున్న జెర్సీ చిత్రం నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్స్ ఈ వారంలోనే ప్రకటిస్తామని నిర్మాతలు ప్రకటించారు. టీజర్తో ఆసక్తి పెంచేసిన ఈ చిత్రంలో.. ముప్పై ఆరు సంవత్సరాల వయసులో తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే అర్జున్ అనే క్రికెటర్ పాత్రను నాని పోషిస్తున్నారు. కన్నడ బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి.. ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందరికీ శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ⚡ #HappyUgadi Pad up for the Theatrical Trailer, Jukebox & Pre - Release updates coming this week. We are ready 🔥 #JERSEY @NameisNani @ShraddhaSrinath @gowtam19 @anirudhofficial @vamsi84 pic.twitter.com/jkaDoK41kp — Sithara Entertainments (@SitharaEnts) April 6, 2019 -
‘జెర్సీ’ వెనుక కష్టాలు
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జెర్సీ. మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని మిడిల్ ఏజ్ క్రికెటర్గా కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న జెర్సీ ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈటీజర్ అయిన టీజర్ సాంగ్స్కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. తాజాగా జెర్సీ సినిమాలో క్రికెటర్గా నటించేందుకు నాని పడిన కష్టం, సినిమాను తెరకెక్కించేందుకు సాంకేతిక నిపుణులు పడిన కష్టానికి సంబంధించిన వీడియోను జర్నీ ఆఫ్ జెర్సీ పేరుతో రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ వీడియోలో నాని 70 రోజుల పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేయటం, షూటింగ్ గాయపడటం లాంటి అంశాలు ఉన్నాయి. కేవలం క్లైమాక్స్లో వచ్చే క్రికెట్ ఎపిసోడ్ను మాత్రమే 24 రోజుల పాటు తెరకెక్కించినట్టుగా వెల్లడించారు. 2 అంతర్జాతీయ స్టేడియాలు, మరో 5 డొమాస్టిక్ స్టేడియాల్లో ఈ చిత్రకరణ జరిగినట్టుగా తెలిపారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో నానికి జోడిగా కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నాడు. -
‘వెళ్లి స్నానం చేసి వస్తాను...పెళ్లి చేసుకుందాం’
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జెర్సీ. మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ శ్రద్థా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఏప్రిల్ 19న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్తో పాటు లిరికల్ వీడియోలను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ హోలీ సందర్భంగా మరో ఇంట్రస్టింగ్ టీజర్ను రిలీజ్ చేశారు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ టీజర్ను నాని తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశాడు. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో నాని.. క్రికెటర్ అర్జున్ పాత్రలో కనిపించనున్నాడు. -
ఆటకి డేట్ షురూ
ముప్పై ఆరు సంవత్సరాల వయసులో తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే అర్జున్ అనే క్రికెటర్ కథతో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ– ‘‘జెర్సీ’ చిత్రం నా హృదయానికి బాగా నచ్చిన, దగ్గరైన కథ. మీ అందరి హృదయాలలో కూడా చోటు సంపాదించుకుంటుందనే నమ్మకం ఉంది. ‘జెర్సీ’ అని టైటిల్ ఎందుకు పెట్టామో ఈ చిత్రం చూసిన తర్వాత అందరికీ అర్థం అవుతుంది. అర్జున్ క్యారెక్టర్లో ఒదిగిపోయి ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా రావడానికి కారణమైన నానిగారికి, అన్నివిధాలుగా సహకరించిన నాగవంశీగారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘జెర్సీ’ సినిమా మా బేనర్లో చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది’’ అని నాగవంశీ అన్నారు. సత్యరాజ్, రోనిత్ కమ్ర, రావు రమేష్, బ్రహ్మాజీ, శిశిర్ శర్మ, సంపత్, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనిరుథ్ రవిచందర్, కెమెరా: సాను జాన్ వర్గీస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకట్ రత్నం (వెంకట్), సమర్పణ: పి.డి.వి.ప్రసాద్. -
‘జెర్సీ’ పోటీ నుంచి తప్పుకున్నట్టేనా!
నేచురల్ స్టార్గా మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో నాని ఇటీవల కాస్త తడబడుతున్నాడు. వరుస విజయాలకు బ్రేక్ పడటంతో సినిమా ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జెర్సీ. మళ్లీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టుగా తెలిపారు. అదే రోజు నాగచైతన్య, సమంతల మజిలి కూడా రిలీజ్ అవుతుండటంతో ఈ సారి రసవత్తర పోటి తప్పదని భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం జెర్సీ విడుదల వాయిదా పడినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 5న కాకుండా ఏప్రిల్ 25న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. నాగచైతన్య, నాని.. ఇద్దరి కెరీర్లకు హిట్ కీలకం కావటంతో అనవసరమై పోటి వద్దన్న ఉద్దేశంతో జెర్సీని కాస్త ఆలస్యంగా విడుదల చేసే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా జెర్సీ వాయిదా దాదాపు కన్ఫామ్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. నానికి జోడిగా శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. -
గేమ్ ఓవర్
‘జెర్సీ’ మూవీ కోసం క్రికెట్ బ్యాట్ పట్టిన నాని మ్యాచ్ని ముగించారు. గేమ్లో బంతులను ఎలా బౌండరీ దాటించారో తెలియాలంటే ఏప్రిల్ 5 వరకూ ఆగాల్సిందే మరి. నాని హీరోగా ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ‘జెర్సీ’. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై పీడీవి ప్రసాద్, నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాలో క్రికెట్ ప్లేయర్ ‘అర్జున్’ పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ బుధవారం పూర్తయింది. ‘‘ఇప్పుడే ‘జెర్సీ’ లాస్ట్ షాట్ పూర్తి చేశాం’’ అంటూ నాని ట్వీటర్లో పేర్కొన్నారు. అనిరుథ్ స్వరాలు అందించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు గ్యాంగ్లీడర్ అనే టైటిల్ను ఖరారు చేశారు. -
బాలీవుడ్కి టర్న్
‘యు–టర్న్’ సినిమాతో ఆడియన్స్తో పాటు దర్శక–నిర్మాతల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్. ఆ తర్వాత ఆమెకు తమిళ, తెలుగు భాషల్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో నాని హీరోగా రూపొందుతున్న ‘జెర్సీ’ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్నే కథానాయిక అన్న విషయం తెలిసిందే. అలాగే తమిళంలో అజిత్ నటిస్తున్న ‘పింక్’ రీమేక్లో లీడ్ రోల్ చేస్తున్నారామె. కన్నడంలో ‘కే–13’ అనే సినిమాలో కూడా శ్రద్ధానే హీరోయిన్. ఇలా సౌత్ సినిమాలతో బిజీగా ఉన్న ఆమె బాలీవుడ్కు ‘మిలాన్ టాకీస్’ అనే లవ్స్టోరీతో ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో అలీ ఫజల్ హీరోగా నటిస్తున్నారు. 2013లో వచ్చిన ‘పాన్ సింగ్ తోమర్’ సినిమాతో జాతీయ అవార్డు సాధించిన తిగ్మాంషు ధూలియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంజయ్ మిశ్రా, అశుతోష్ రానా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ను మంగళవారం విడుదల చేశారు. ఈ రోజు ట్రైలర్ విడుదల అవుతుంది.‘‘బాలీవుడ్కు హీరోయిన్గా పరిచయం కాబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మంగళవారం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాం. బుధవారం ట్రైలర్ విడుదలవుతోంది. చాలా ఎగై్జటింగ్గా ఉంది’’ అన్నారు శ్రద్ధా శ్రీనాథ్. ఈ చిత్రం మార్చి 15న విడుదల కానుంది. -
అదేంటో గానీ...
‘జెర్సీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసి నాని ప్రమోషన్కు రెడీ అయ్యారు. అందులో భాగంగా సినిమాలోని ఫస్ట్ సాంగ్ను వేలంటైన్స్ డే స్పెషల్గా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నారు. ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా రూపొందించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘జెర్సీ’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించింది. నాని ఈ చిత్రంలో క్రికెటర్ పాత్రలో కనిపించనున్నారు. ‘‘అదేంటోగానీ ఉన్న పాటుగా’ అంటూ సాగే సాంగ్ని రిలీజ్ చేస్తున్నాం. 14 నుంచి పాటలోని మ్యాజిక్ని ఫీల్ అవ్వండి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి అనిరు«ద్ సంగీత దర్శకుడు. -
ఆ వార్తలు నిజమే
‘‘అజిత్ కొత్త సినిమాలో నేను హీరోయిన్గా చేస్తున్నట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం అని చెప్పడానికి సంతోషిస్తున్నా’’ అని హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ అన్నారు. బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’ తమిళంలో అజిత్ హీరోగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపికైనట్టు పేర్కొన్నారు శ్రద్ధా. ‘‘ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం కోసం ఇన్ని రోజులు మౌనంగా ఉండటం కష్టంగా అనిపించింది. అజిత్ సార్తో నటించడం సంతోషంగా ఉంది. నా కెరీర్లో చాలెంజింగ్ రోల్ ఇది. హెచ్.వినోద్ దర్శకత్వంలో బోనీ కపూర్గారు నిర్మిస్తారు. ప్రస్తుత సమాజానికి చెప్పాల్సిన కథ ఇది. హిందీలో తాప్సీ పోషించిన పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు శ్రద్ధా. ఈ చిత్రం మే 1న రిలీజ్ కానుంది. -
ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు
‘నీ వయసు 36 ఏళ్లు. అది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుంచి రిటైరయ్యే ఏజ్. పిల్లల్ని ఆడించే వయసులో మనకు ఆటలెందుకు బావ?.. ఎంత ప్రయత్నించినా నువ్వు ఇప్పుడు ఏమీ చేయలేవు’.... 36 ఏళ్ల అర్జున్ క్రికెట్లో తన కలను నిజం చేసుకోవాలనుకున్నప్పుడు వినిపించిన మాటలు ఇవి. వీటన్నింటినీ తిప్పి కొట్టాడు అర్జున్. మాటలతో కాదు. బ్యాట్తో... గ్రౌండ్లో చేసిన రన్స్తో. నాని హీరోగా ‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘జెర్సీ’. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ఈ టీజర్ ఎండింగ్లో ‘ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు’ అని నాని చెప్పే డైలాగ్ ఇన్స్పైరింగ్గా ఉంది. ‘‘నో సింగిల్స్. నో డబుల్స్. స్ట్రయిట్ అవుట్ ఆఫ్ ది గ్రౌండ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’’ అంటూ టీజర్ను షేర్ చేశారు నాని. ‘‘తెలుగులో నేను సొంతంగా డబ్బింగ్ చెబుతున్న సినిమా ‘జెర్సీ’’ అన్నారు శ్రద్ధా శ్రీనాథ్. అనిరు«ద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్లో విడుదల కానుంది. -
‘ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు’
ప్రస్తుతం టాలీవుడ్తో పాటు అన్ని ఇండస్ట్రీలలో పిరియాడిక్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. అదే జానర్లో తెరకెక్కుతున్న మరో ఇంట్రస్టింగ్ మూవీ జెర్సీ. వరుస విజయాలతో సూపర్ ఫాంలో కనిపించిన యంగ్ హీరో నాని ఇటీవల కాస్త తడబడుతున్నాడు. తన రేంజ్ కు తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న నేచురల్ స్టార్ హీరోగా పిరియాడిక్ జానర్లో తెరకెక్కుతున్న సినిమా జెర్సీ. మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ నటి శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. నూతన సంవత్సర కానుకగా జనవరి 1న జెర్సీ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా టీజర్ను రిలీజ్ చేశారు. క్రికెట్ కావాలనుకునే ఓ వ్యక్తి కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని.. అర్జున్ పాత్రలో కనిపిస్తున్నాడు. టీజర్ చూస్తే తన కలను నేరవేర్చుకునేందుకు అర్జున్ పడిన కష్టాన్ని ఎమోషనల్గా తెరకెక్కించనట్టుగా అనిపిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. -
నాని ‘జెర్సీ’ ఫస్ట్లుక్!
కృష్ణార్జున యుద్దం,దేవదాస్ లాంటి రెగ్యులర్ ఫార్మాట్ చిత్రాల ఫలితాలతో నిరాశపడ్డ నాని.. విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. నాని ప్రస్తుతం క్రికెటర్గా మారి స్టేడియంలో బౌండరీలు కొట్టేస్తున్నాడు. ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ’జెర్సీ’ చిత్రంలో నాని క్రికెటర్గా నటిస్తున్న విషయం తెలిసిందే. నూతన సంవత్సరం కానుకగా జెర్సీ ఫస్ట్లుక్ను విడుదల చేసింది చిత్రయూనిట్. క్రికెటర్గా అర్జున్ పాత్రలో నాని నటిస్తుండగా తమిళ సంచలనం అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతమందించడం విశేషం. అర్జున్ సాధించిన విజయాలను ఏప్రిల్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. VINTAGE SPARKLES At 36 there is nothing left for him to prove in cricket. The dreams and heartburns have been left behind.. 1996-97 Ranji trophy season was just a display of his love for batting.#JERSEY #HappyNewYear2019 @gowtam19 @ShraddhaSrinath @anirudhofficial @vamsi84 pic.twitter.com/t7FNrWXDo8 — Nani (@NameisNani) 31 December 2018 -
‘జవనరి 1న అర్జున్ని కలవండి’
వరుస విజయాలతో సూపర్ ఫాంలో కనిపించిన యంగ్ హీరో నాని ఇటీవల కాస్త తడబడుతున్నాడు. తన రేంజ్ కు తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న నేచురల్ స్టార్ ప్రస్తుతం పిరియాడిక్ జానర్లో తెరకెక్కుతున్న జెర్సీ సినిమాలో నటిస్తున్నాడు. మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ నటి శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు చిత్రయూనిట్. నూతన సంవత్సర కానుకగా జనవరి 1న జెర్సీ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో నాని క్రికెటర్ అర్జున్ పాత్రలో కనిపించనున్నాడు. అందుకే జనవరి 1న అర్జున్ని కలవండి అంటూ ప్రీ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. Meet Arjun on January 1st 2019! @NameisNani #JERSEY@gowtam19 @ShraddhaSrinath @anirudhofficial @vamsi84 pic.twitter.com/qqivcRmK2h — Sithara Entertainments (@SitharaEnts) 29 December 2018 -
నాని స్క్రిప్ట్ రాస్తున్నాడా...?
నేచురల్ స్టార్ నాని హీరోగానే కాక ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. అ! సినిమాతో అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న నాని ప్రస్తుతానికి హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా నాని స్క్రిప్ట్ రైటర్ అవతారం ఎత్తినట్టుగా వార్తలు వినిపించాయి. త్వరలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు నాని. ఈ సినిమాకు విక్రమ్తో కలిసి నాని రచయితగా పనిచేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై దర్శకుడు విక్రమ్కుమార్ క్లారిటీ ఇచ్చారు. నాని స్క్రిప్ట్ వర్క్ లో ఇన్వాల్ కావటం లేదని చెప్పారు. ప్రస్తుతం నాని జెర్సీ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. నాని క్రికెటర్గా నటిస్తున్న ఈసినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతోంది. -
కౌంట్ డౌన్ మొదలైంది
నాని క్రికెట్ మ్యాచ్ వేసవిలో వెండితెరపైకి రానుంది. ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న చిత్రం ‘జెర్సీ’. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో క్రికెటర్ అర్జున్ పాత్రలో నటిస్తున్నారు నాని. ఇందులో రెండు విభిన్నమైన లుక్స్లో కనిపించనున్నారాయన. శుక్రవారం ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ‘‘జెర్సీ’ సినిమాను 2019 ఏప్రిల్ 19న విడుదల చేయబోతున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఆ రోజును ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుందని ప్రామిస్ చేస్తున్నాం. అందుకు ఇంకా 146 రోజులు ఉన్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. అంటే.. గ్రౌండ్లో రెచ్చిపోయి నాని కొట్టిన సిక్సర్లు, ఫోర్లను చూసి ఎంజాయ్ చేయడానికి కౌంట్డౌన్ మొదలైందన్నమాట. -
నాని ‘జెర్సీ’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా బెడిసికొట్టడంతో.. మళ్లీ రూట్ మార్చి కథాబలం ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు నాచురల్ స్టార్ నాని. ఇటీవలె ‘దేవదాస్’ సినిమాతో హిట్ కొట్టాడు నాని. ‘మళ్లీరావా’ ఫేమ్ డైరెక్టర్తో జెర్సీ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ను ప్రకటించారు మేకర్స్. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను డిఫరెంట్గా రిలీజ్ చేశారు. ఓ బ్యాట్పై జెర్సీ అనే టైటిల్తో పాటు రిలీజ్ డేట్ (ఏప్రిల్ 19)ను ఫిక్స్ చేశారు. ‘యూ టర్న్’ భామ శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో నాగవంశీ నిర్మిస్తుండగా.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. 19 April'19 It’s going to be a heartwarming summer. Promise :)#JERSEY @ShraddhaSrinath @gowtam19 @anirudhofficial @vamsi84 pic.twitter.com/33PC6PT6vr — Nani (@NameisNani) November 23, 2018 -
డబుల్ నాని
గ్రౌండ్లో నాని దూకుడు ఇంకా తగ్గలేదు. పైగా స్పీడ్ పెంచారు. నాని హీరోగా ‘మళ్ళీ రావా..’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘జెర్సీ’. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో క్రికెటర్ అర్జున్ పాత్రలో కనిపించనున్నారు నాని. ఆయన రెండు లుక్స్లో కనిపిస్తారు. ఒకటి యంగ్ లుక్లో ఉంటే... మరొకటి 36–40 వయసులో ఉన్న వ్యక్తి పాత్ర. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. నాని, శ్రద్ధా శ్రీనాథ్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ 35 శాతం పూర్తయింది. మరి.. క్రికెటర్ అర్జున్గా నాని ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే చేస్తారా? లేక బౌలింగ్, కీపింగ్ కూడా చేయగల సత్తా ఉన్న ఆల్ రౌండర్ అనిపించుకుంటారా? అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్. పీడీవీ ప్రసాద్ సమర్పణలో నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. -
నాన్స్టాప్
గ్రౌండ్లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నారు నాని. స్పిన్ బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్ అన్న తేడా లేకుండా బంతిని బాదుతూ ఫీల్డర్స్ను పరుగులు పెట్టిస్తున్నారట. మరి.. ఈ మ్యాచ్ను వెండితెరపై చూసేది ఎప్పుడు? అంటే అందుకు కాస్త టైమ్ ఉంది. ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా పీడీవీ ప్రసాద్, నాగవంశీ నిర్మిస్తున్న సినిమా ‘జెర్సీ’. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్నారు. క్రికెటర్ అర్జున్ పాత్రలో నాని కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శరవేగంగా జరుగుతోందని సమాచారం. పెద్ద బ్రేక్స్ తీసుకోకుండా వీలైనంత తొందరగా సినిమాను పూర్తి చేయాలని టీమ్ నిర్ణయించుకున్నారని వినికిడి. అంటే.. నాన్స్టాప్గా ఈ సినిమాను నాని కంప్లీట్ చేస్తారన్నమాట. ఈ సంగతి ఇలా ఉంచితే... దర్శకుడు విక్రమ్ కె. కుమార్ చెప్పిన కథ విన్న నాని సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారని తాజా ఫిల్మ్నగర్ టాక్. -
మీటూ : సూపర్ స్టార్లపై శ్రద్ధ కామెంట్స్
మీటూ కొద్ది రోజులుగా చిత్రపరిశ్రమలోని మహిళల అత్యాచారాల వేధింపులకు వేదికగా మారిన విషయం తెలిసిందే. ఎన్నాళ్లగానో మనసుల్లో గూడుకట్టుకున్న వారి వేదనలను ప్రముఖ కథానాయికల నుంచి కొత్తగా ఎన్నో ఆశలతో ఈ రంగంలోకి వస్తున్న నటీమణులు బహిరంగంగా వెల్లడించి భారం దించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న గాయని చిన్మయి, నిన్న నటి శ్రుతీహరిహరన్ ఇలా చాలా మంది తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బయట పెడుతున్నారు. అలాంటి వారికి ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. విమర్శిస్తున్న వారు లేకపోలేదనుకోండి. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కోర్టులను ఆశ్రయిస్తామంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి శ్రుతీహరిహరన్కు సహ నటి శ్రద్ధాశ్రీనాథ్ మద్దతు పలికింది. అంతే కాదు మీటూ వ్యవహారం నానాటికీ ప్రకంపనలు పుట్టిస్తుంటే కథానాయకులు స్పందించరేంటని ఈ బ్యూటీ ప్రశ్నించింది. కన్నడిగురాలైన ఈ అమ్మడు కోలీవుడ్లో విక్రమ్ వేదా చిత్రంలో హీరోయిన్గా నటించింది. మీటూ కలకలం సృష్టస్తున్న తరుణంలో ఈ జాణ హీరోలపై ధ్వజమెత్తింది. ఒక భేటీలో శ్రద్ధాశ్రీనాథ్ పేర్కొంటూ చిత్ర పరిశ్రమలో మహిళలు తాము ఎదుర్కొన్న అత్యాచారాల గురించి ధైర్యంగా బహిరంగ పరుస్తున్నారని, అయితే ఆ వ్యవహారంలో నటులు ఎక్కడున్నారు? ఏమైపోయారనేది తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందని అంది. 70 ఎంఎం తెరపై అక్కలను, చెల్లెళ్లను, తల్లులను కాపాడుకోవడానికి డజన్ల లెక్కలో రౌడీలను కొట్టే హీరోల ఆ మ్యాజిక్ను నిజ జీవితంలో చూపాలని పేర్కొంది. ఏదో ఒకటి చెప్పాలని, ప్రముఖ హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలన్నది తాను చూడాలనుకుంటున్నానంది. ఒక ట్రాక్ నుంచి మరో ట్రాక్కు చాలా సులభంగా జంప్ చేసే వారు మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి స్పందించడానికి నిరాకరిస్తున్నారని ఆరోపించారు. నటుడు రజనీకాంత్, కమలహాసన్, అమితాబ్బచ్చన్ లాంటి కొందరు మీటూ గురించి స్పందించినా, దాని గురించి వివరంగా మాట్లాడలేదని అంది. మీటూ గురించి ఎవరు ఎలా భావిస్తున్నారన్నది తెసుకోవాలని తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పింది. ఈ మీటూ వ్యవహారం ఎప్పుడు ముగింపునకు వస్తుందని నటులు వేచి చూస్తున్నాని తమకు అనిపిస్తోందని పేర్కొంది. అయితే వారు ఈ విషయం గురించి స్పందిస్తేనే చిత్రపరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని, మహిళలు ఈ రంగంలోకి రావడానికి సౌకర్యంగా ఉంటుందని నటి శ్రద్ధాశ్రీనాథ్ పేర్కొంది. -
సూపర్స్టార్లు.. ఇప్పుడు మాట్లాడరేం?
రీల్ లైఫ్లో ఆడవారిని వేధించే రౌడీల బెండు తీసే సూపర్స్టార్లు.. రియాలిటీలో మాత్రం మౌనంగా ఉన్నారెందుకంటూ దక్షిణాది నటి శ్రద్ధా శ్రీనాథ్ మండి పడ్డారు. ఆడవారి మీద వేధింపులకు వ్యతిరేకంగా ప్రారంభమయిన మీటూ ఉద్యమానికి దేశవ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తోంది.. కానీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు మాత్రం ఈ విషయంలో మౌనమే శరణ్యమన్నట్లు ఉన్నారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ లాంటి అగ్ర హీరోలు మీటూ గురించి స్పందించినా.. చాలా దౌత్యంగా మాట్లాడారు. తమిళ్, తెలుగు బడా హీరోలు మాత్రం ఇంత వరకూ ఈ విషయం గురించి నోరు మెదపలేదు. దాంతో స్టార్ హీరోల మౌనాన్ని ప్రశ్నిస్తూ నటి శ్రద్ధ వరుస ట్వీట్లు చేశారు. ‘తల్లిని, అక్కాచెల్లళ్లని వేధించే విలన్ల బెండు తీస్తారు.. అవసరమైతే భారీ ట్రక్కులను కూడా అవలీలగా గాల్లో ఎగిరిలే చేస్తారు. అయితే ఇవన్ని కేవలం 70 ఎమ్ఎమ్ స్ర్కీన్ మీద మాత్రమేనా. ఇప్పుడు కూడా ఆ మ్యాజిక్ చూపించండి. ప్లీజ్ సూపర్స్టార్స్ ఇప్పటికైనా మాట్లాడండి. నేను మీ స్పందన ఏంటో తెలుసుకోవాలని ఎదురు చూస్తున్న’ అంటూ శ్రద్ధ ట్వీట్ చేశారు. I'm mildly curious. Where are the men. :) The men who on 70 mm screens vow to protect their sisters and mothers and fight off a dozen bad men and make trucks fly. Please do your magic now. Say something. I just want to know what our superheroes think. That's all. — Shraddha Srinath (@ShraddhaSrinath) October 20, 2018 -
సెల్ఫీ తీసుకోవాల్సింది
నటుడు అర్జున్పై కన్నడ నటి శ్రుతీ హరిహరన్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. శ్రుతికి మద్దతు ఇస్తున్నట్లు ట్వీట్టర్ ద్వారా తెలిపారు మరో కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్. ‘‘2016 నవంబర్లో ఓ టాక్ షో టైమ్లో శ్రుతీ నాకు ఈ సంఘటన చెప్పింది. కాకపోతే అప్పుడు పేరు చెప్పలేదు. ఏం జరిగిందో ఇప్పుడు బయటకు చెప్పింది’’ అని పేర్కొన్నారు శ్రద్ధా. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని షేర్ చేశారు శ్రద్ధా. ‘‘ఓసారి బెంగళూరు నుంచి కొచ్చిన్కి బస్లో వెళుతున్నాను. ఓ వ్యక్తి చేయి నన్ను అసభ్యంగా తాకడంతో నిద్ర నుంచి మేల్కొన్నాను. అందుకు నా దగ్గర ఏటువంటి ఆధారం లేదు. ఆ చేదు అనుభవం మాత్రం మిగిలింది. ఈ సంఘటన జరిగినప్పుడు అతనితో పాటు, ఆ చేయితో కూడా ఓ సెల్ఫీ తీసుకొని ఉంటే అది సాక్ష్యంగా ఉండేదేమో?’’ అని పేర్కొన్నారామె. మరోవైపు శ్రుతీ హరిహరన్కు నటుడు ప్రకాష్రాజ్ మద్దతు తెలిపారు. ‘‘నా వృత్తిపరమైన కారణాల వల్ల నా పేరును చెప్పదలచుకోలేదు. శ్రుతీ పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది. అర్జున్తో ఓ సందర్భంలో ఇబ్బంది పడ్డాను. ముందు అతడిని ‘జెంటిల్మెన్’ అని పిలవడం ఆపండి’’అంటూ మరో మహిళ అర్జున్ను ఆరోపించినట్లుగా, ట్వీటర్లో పోస్ట్ చేశారు శ్రుతీ హరిహరన్. ఇదిలా ఉంటే అర్జున్ పరిపూర్ణమైన ‘జెంటిల్మెన్’ అంటూ ఆయనతో ‘కాంట్రాక్ట్’ సినిమాలో కలిసి యాక్ట్ చేసిన హీరోయిన్ సోనీ చరిష్టా పేర్కొన్నారు. -
ఆట ఆరంభం
గ్రౌండ్లో హీరో నాని ఆడబోయే క్రికెట్ మ్యాచ్ ఈ రోజు నుంచి మొదలవుతోంది. మరి... మ్యాచ్లో నాని ప్రత్యర్థులకు ఎలా ముచ్చెమటలు పట్టిస్తారనే విజువల్స్ను వెండితెరపై చూసేందుకు చాలా సమయం ఉంది. ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న ‘జెర్సీ’ చిత్రం ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్లో జరిగింది. కన్నడ ‘యూ–టర్న్’ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో క్రికెటర్ అర్జున్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచే ప్రారంభం అవుతుంది.‘‘స్పోర్ట్స్ అండ్ రిలేషన్షిప్స్ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం టీమ్ అందరూ చాలా కష్టపడుతున్నారు’’ అని పేర్కొన్నారు శ్రద్ధా శ్రీనాథ్. సత్యరాజ్, బ్రహ్మాజీ, రోనిత్ కామ్రా ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. ఈ చిత్రానికి సాను వర్గీస్ ఛాయాగ్రాహకుడు. -
నాని కొత్త సినిమా మొదలైంది
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జెర్సీ. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ యూటర్న్ ఫేం శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ రోజు(బుధవారం) ఉదయం ఫిలిం నగర్లోని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఈసినిమా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. రేపటి నుండి రెగ్యులర్గా షూటింగ్ జరుగుతుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్యరాజ్, బ్రహ్మాజీ, రోనిత్ కామ్రా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. -
‘జెర్సీ’లో ‘యూటర్న్’ భామ..!
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కనున్న తాజా చిత్రం జెర్సీ. ఇటీవల దేవదాసు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాని ప్రస్తుతం హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు. షార్ట్ గ్యాప్ తరువాత జెర్సీ సినిమా షూటింగ్కు హాజరు కానున్నాడు. ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామా తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. కన్నడలో యూటర్న్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రద్ధా శ్రీనాథ్.. జెర్సీలో నానికి జోడిగా నటించనున్నారు. ఈ సినిమాలో మలయాళ నటి రెబ్బా మోనికా జాన్ మరో హీరోయిన్గా నటించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్నన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభం కానుంది. -
నేను అలా చేయను!
తమిళసినిమా: సాధారణంగా అయితే నేనలా చేయను అంటోంది నటి శ్రద్ధా శ్రీనాథ్. పుట్టింది జమ్ముకశ్మీర్లో అయినా నటిగా మలయాళం, కన్నడం, తమిళం అంటూ చుట్టేస్తోందీ బ్యూటీ. కోహినూర్ అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన శ్రద్ధాశ్రీనాథ్కు కన్నడ చిత్రం యూటర్న్ బిగ్ టర్నింగ్నిచ్చింది. ఆ తరువాత తమిళంలో మాధవన్తో రొమాన్స్ చేసిన విక్రమ్ వేదా ఇంకాస్త గుర్తింపును తెచ్చిపెట్టింది. అంతే అక్కడ నుంచి ఈ అమ్మడికి అవకాశాలు వరుస కట్టేస్తున్నాయి. మణిరత్నం దర్శకత్వంలో కాట్రు వెలియిడై చిత్రంలోనూ అతిథి పాత్రలో మెరిసిన శ్రద్ధాశ్రీనాథ్కు తాజాగా అరుళ్నిధితో రొమాన్స్ చేసే అవకాశం వరించింది. భరత్ నీలకంఠన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటించే అవకాశం ఎలా వచ్చిందన్న ప్రశ్నకు ఈ జాణ బదులిస్తూ ఎస్సీ.సినిమాస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తనను ఎంపిక చేయాలన్న ఆలోచన చిత్ర దర్శక నిర్మాతలకు లేదంది. అనూహ్యంగానే అది జరిగిందని చెప్పింది. దర్శకుడు భరత్ నీలకంఠన్ కథా చర్చలకు బెంగళూర్ వచ్చారని చెప్పింది. అనుకోకుండా ఒక రోజు దర్శకుడి నుంచి తనకు ఫోన్ వచ్చిందని తెలిపింది. సాధారణంగా తాను రాత్రి వేళల్లో కథలను విననంది. అయితే దర్శకుడు బెంగళూర్ వచ్చిన కారణంగా ఒక రోజు రాత్రి ఆయన్ని కలిసి కథ విన్నానని చెప్పింది. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకూ దర్శకుడు కథను వినిపించారని ఆమె ఈ సందర్భంగా తెలిపిం ది. కథలోని ప్రతి సన్నివేశాన్ని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చెప్పడంతో అప్పుడే నాకు ఆ చిత్రంలో నటించాలన్న ఆసక్తి కలిగిం దని ఆమె అంది. దీన్ని థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పలేమని, ఇంటెలిజెన్సీ నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత డ్రామాతో కూడిన కథా చిత్రంగా ఉంటుందని ఆమె పేర్కొంది. ఈ చిత్ర టైటిల్ను, ఫస్ట్లుక్ పోస్టర్ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకుడు భరత్ నీలకంఠన్ ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. అరుళ్నిధి, శ్రద్ధాశ్రీనాథ్ వంటి పాపులర్ జంటతో ఈ చిత్రం చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
మాధవన్తో మరోసారి..
తమిళసినిమా: నటి శ్రద్ధా శ్రీనాథ్ నటుడు మాధవన్తో మరోసారి రొమాన్స్కు రెడీ అవుతోంది. కన్నడ చిత్రం యూ టర్న్తో పాపులర్ అయిన ఈ కన్నడ భామ కోలీవుడ్కు విక్రమ్ వేదా చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నటుడు మాధవన్కు జంటగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. చిత్రం కూడా సంచలన విజయాన్ని సాధించింది. ఆ తరువాత రిచ్చి అనే ఒక తమిళ చిత్రంలోనే నటించిన శ్రద్ధా శ్రీనాథ్ మాతృభాషలో చేతినిండా చిత్రాలతో బిజీగా ఉంది. అంతే కాదు ఒక హిందీ చిత్రంలోనూ నటిస్తోంది. కాగా తాజాగా కోలీవుడ్లో హిట్ పెయిర్గా పేరు తెచ్చుకున్న మాధవన్కు జంటగా మరోసారి నటించడానికి రెడీ అవుతోంది. ఈ చిత్రానికి మార అనే టైటిల్ను నిర్ణయించారు. ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు దిలీప్కుమార్ పరిచయం కానున్నారు. ఈయన ఇంతకు ముందు కల్కీ అనే లఘు చిత్రాన్ని రూపొందించారన్నది గమనార్హం. త్వరలో కథనాన్ని బిపిన్, మాటలను నీలం అందిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు అరిందుమ్ అరియామలుమ్, పట్టియల్ చిత్రాలకు దర్శకుడు విష్ణువర్ధన్ వద్ద పనిచేశారు. అదేవిధంగా తాజాగా సమంత నాయకిగా నటిస్తున్న సూపర్ డీలక్స్ చిత్రంలో ఆమె పాత్రకు మాటలను రాశారు. మాధవన్, శ్రద్ధాశ్రీనా«థ్ జంటగా నటించనున్న తాజా చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావలసి ఉంది. సాధారణంగా కథలో కొత్తదనం లేకుంటే నటుడు మాధవన్ నటించడానికి అంగీకరించరు. మాధవన్, శ్రద్ధా శ్రీనాథ్ల జంటతో మరోసారి హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారన్న మాట. -
బాలీవుడ్కాలింగ్
యాక్టింగ్లోకి ఎంట్రీ ఇచ్చిన మూడేళ్లకే బాలీవుడ్ గడప తొక్కారు కన్నడ కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్. కన్నడ ‘యూ టర్న్’ సినిమాతో ఫేమ్లోకి వచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలోనూ మంచి ఫామ్లో కొనసాగుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్కి వెళుతున్నారు. ‘సాహెబ్ బీబీ ఔర్ గ్యాంగ్స్టర్’ ఫ్రాంచైజ్ దర్శకుడు తిగ్మాంషు థులీయా దర్శకత్వంలో రూపొందనున్న ఓ సినిమాలో కథానాయికగా ఎంపికయ్యారు శ్రద్ధా. ఈ సినిమాలో అలీ ఫైజల్ హీరోగా నటించనున్నారు. ‘‘బాలీవుడ్ సినిమా చేయబోతున్నందుకు హ్యాపీగా ఉంది. తిగ్మాంషుగారు ‘పాన్సింగ్ తోమర్’, ‘సాహెబ్ బీబీ ఔర్ గ్యాంగ్స్టర్’ వంటి గుడ్ ఫిల్మ్స్ను రూపొందించారు. ఆయన దర్శకత్వంలో నటించనుండటం ఆనందంగా ఉంది. ఫన్ లవ్స్టోరీగా తెరకెక్కబోయే ఈ చిత్రంలో ఆలీ ఫైజల్ నా కో–స్టార్’’ అని పేర్కొన్నారు శ్రద్ధా. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో లక్నోలో స్టార్ట్ కానుంది. -
నాగ్-నాని సినిమాలో ఆమెకు గోల్డెన్ చాన్స్!
శ్రద్ధ శ్రీనాథ్.. యూటర్న్, ఆపరేషన్ అలమేలమ్మ, విక్రమ్ వేదా వంటి దక్షిణాది సినిమాలతో దుమ్మురేపిన ఈ అమ్మడికి ఇప్పుడు టాలీవుడ్లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ భామ హే కృష్ణ ముకుంద మురారీ, నిన్ను వదిలి నేను పోలేనులే సినిమాలతోపాటు.. ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. తాజాగా శ్రద్ధకు మరో జాక్పాట్ తగిలింది. అక్కినేని నాగార్జున-నాని హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమాలో ఈ అమ్మడికి చాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగ్ సరసన నటించే అవకాశం శ్రద్ధకు దక్కింది. ఇటీవలే దర్శకుడు శ్రద్ధకు కథ వినిపించాడని, తన పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చెప్పిందని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా ఆమె సంతకం చేయలేదని పేర్కొన్నాయి. ఈ నెల 24న ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కానుంది. మార్చి మొదటివారం నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరగనుంది. ఈ సినిమాలో నానికి జోడీగా నటించే హీరోయిన్ కోసం ప్రస్తుతం మేకర్లు గాలిస్తున్నారు. -
యూ టర్న్కు రెడీ
అదో ఫ్లై ఓవర్. అక్కడ ఎవరైతే డివైడర్స్ని తొలగించి మరీ యూ టర్న్ తీసుకుంటారో వాళ్లు అవుట్. గేమ్లో నుంచి కాదు లైఫ్లో నుంచి. కాపాడాలని చూసినా, తప్పించుకోవాలని ట్రై చేసినా ఆ ట్రయల్స్ అన్నీ వేస్ట్. డెత్ బెల్ మోగడం ఖాయం. ఎందుకలా? ఈ మిస్టరీ ఏంటీ? అన్న ప్రశ్నలకు.. రెండేళ్ల క్రితం కన్నడంలో వచ్చిన ‘యూ టర్న్’ చిత్రాన్ని చూసినవారికి సమాధానాలు తెలిసే ఉంటాయి. శ్రద్ధా శ్రీనాథ్, రాధిక చేతన్, దిలీప్ రాజ్ ముఖ్య తారలుగా పవన్ కుమార్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ఇది. ఈ సినిమాను ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయనున్నారు. సమంత లీడ్ రోల్లో నటిస్తారు. ‘‘పవన్కుమార్ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ తమిళ, తెలుగు భాషల్లో ‘యూ టర్న్’ సినిమాను నిర్మించనుంది. వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అని పేర్కొన్నారు సమంత. ఆమె తెలుగులో నటిస్తున్న ‘రంగస్థలం, మహానటి’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
మళ్లీ చర్చకు తెరలేపిన దర్శకుడు బాలా
తమిళసినిమా: దర్శకుడు బాలా మరోసారి కుట్రపరంపరై చిత్ర చర్చకు తెరలేపారు. ఈ సంచలన దర్శకుడి నుంచి సాదా సీదా చిత్రాలను ఎవరూ ఆశించరు. సేతు, పితామగన్, నందా,అవన్ ఇవన్, నాన్కడవుల్, పరదేశి ఇలా దేనికదే అసాధారణ కథాంశంతో రూపొందిన చిత్రమే. తాజాగా జ్యోతిక ప్రధాన పాత్రలో నాచ్చియార్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణం దశలోనే వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. చిత్ర టీచర్లో పోలీస్అధికారిగా నటిస్తున్న జ్యోతిక మహిళలను కించపరచే విధంగా మాట్లాడిన సన్నివేశాలపై పలు సంఘాల వారు తీవ్రంగా ఆరోపించడం, ఆ వ్యవహారం కేసు, కోర్టు వరకూ వెళ్లడం తెలిసిన విషయమే. బాలా నాచ్చియార్ చిత్రం తరువాత తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్రెడ్డి చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. ఇందులో నటుడు విక్రమ్ కొడుకు ధ్రువ కథానాయకుడిగా తెరంగేట్రం చేయనున్నారు. ఇదిలా ఉంటే చాలా కాలం క్రితం బాలా కట్రపరంపరై అనే యథార్థ సంఘటనల ఆధారంగా ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. వేల్ రామమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇందులో అరవిందస్వామి, విశాల్, ఆర్య,అధర్వ, రానా, అనుష్క నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ నవలను చిత్రపరంపరై పేరుతో చిత్రంగా రూపొందించడానికి తాను చాలా కాలంగా సన్నాహాలు చేస్తున్నానని సీనియర్ దర్శకుడు భారతీరాజా ప్రకటించడం, ఈ చిత్ర వ్యవహారంలో బాలాకు భారతీరాజా మధ్య చిన్న పాటి యుద్ధమే జరిగింది. భారతీరాజా కుట్రపరంపరై చిత్ర కథతో షూటింగ్ను కూడా ప్రారంభించారు.ఆ తరువాత అది ఆరంభ శూరత్వంగానే ఆగిపోయింది. దర్శకుడు బాలా కూడా అప్పుడు డ్రాప్ అయ్యారు. తాజాగా కుట్రపరంపరై చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు వెల్లడించి మరోసారి సంచలనానికి తెరలేపారు. ఈసారి ఇందులో శ్రద్ధాశ్రీనాథ్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ చిత్ర పూర్తి వివరాలు వెలువడే వరకూ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. -
జాతీయ అవార్డు విజేతతో రానా
బాహుబలి విజయం తరువాత భల్లాలదేవ రానా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు రావటంతో ఇతర భాషా దర్శకులు కూడా రానాతో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. సోలో హీరోగా ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి సినిమాల విజయం కూడా రానాకు కలిసొచ్చింది. ప్రస్తుతం 1945 అనే పీరియాడిక్ సినిమాలో నటిస్తున్న రానా, త్వరలో తమిళ దర్శకుడు ప్రభు సాల్మోన్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. హతీ మేరీ సాథీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా పీరియాడిక్ జానర్ లోనే తెరకెక్కనుంది. ఈ రెండు సినిమా ల తరువాత ఓ జాతీయ అవార్డ్ విజేత దర్శకత్వంలో నటించనున్నాడు రానా. దక్షిణాదిలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బాలా దర్శకత్వంలో రానా ఓ సినిమా చేయబోతున్నాడట. తన ప్రతీ సినిమాను రియలిస్టిక్ గా రూపొందించే బాల ప్రస్తుతం విక్రమ్ తనయుడు ధృవ్ ను హీరోగా పరిచయం చేస్తూ అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత 2018 ద్వితీయార్థంలో రానా హీరోగా సినిమాను ప్రారంభించనున్నాడట. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. -
నన్నలా కోరుకోవడం లేదు!
తమిళ సినిమా: ప్రేక్షకులు తననలా కోరుకోవడం లేదని నటి శ్రద్ధా శ్రీనాథ్ అంటోంది. మొదట న్యాయవాది వృత్తిని చేపట్టి ఆపై మోడల్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ కోహినూర్ అనే మలయాళ చిత్రంతో నాయకిగా రంగప్రవేశం చేసింది. అయితే మాతృభాషలో నటించిన యూటర్న్ చిత్రం శ్రద్ధా శ్రీనాథ్ కెరీర్ను ఒక్కసారిగా పెద్ద మలుపు తిప్పేసింది. అక్కడ సంచలన విజయం సాధించిన ఆ చిత్రం ఇప్పుడు నయనతార హీరోయిన్గా కోలీవుడ్లోనూ, సమంత నాయకిగా టాలీవుడ్లోనూ రీమేక్ కానుంది. ఆ మధ్య ఏస్ డైరెక్టర్ మణిరత్నం దృష్టిలో పడి కాట్రువెలియిడై చిత్రంలో నటించేసిన ఈ అమ్మడికిప్పుడు కోలీవుడ్లో మరో అవకాశం వచ్చింది. కన్నడంలో బిజీగా ఉన్న శ్రద్ధా శ్రీనాథ్ ఇప్పుడు తమిళంలో ఉదయనిధిస్టాలిన్కు జంటగా నటించడానికి రెడీ అవుతోంది. కాట్రువెలియిడై చిత్రం తరువాత కోలీవుడ్లో చాలా అవకాశాలు వస్తున్నా హీరోలతో నాలుగు రొమాన్స్ సీన్స్, నాలుగు డ్యూయెట్లు పాడే పాత్రల్లో నటించడం తనకిష్టం లేదంటోంది శ్రద్ధా. అభిమానులకు తనను అలా చూడటానికి ఇష్టపడరని తెలిపింది. అలాగని చిత్రంలో ప్రతి ఫేమ్లోనూ తాను కనిపించాలని ఆశించనని, నటనకు అవకాశం ఉన్న పాత్రలైతేనే అంగీకరిస్తానని అంది. ఇలాంటి పాత్రనే ఉదయనిధి స్టాలిన్తో కలిసి నటించనున్నట్లు చెప్పింది. దీనికి పీఎస్.మిత్రన్ దర్శకత్వం వహించనున్నారని తెలిపింది. ప్రస్తుతం ఈయన విశాల్, సమంత జంటగా నటిస్తున్న ఇరుంబు తెరై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. -
ఆయనతో చేస్తా!
తమిళసినిమా: ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తానంటోంది నటి శ్రద్ధా శ్రీకాంత్. శాండిల్వుడ్లో యూటర్న్ చిత్రం ద్వారా చాలా పేరు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ మణిరత్నం చిత్రం కాట్రువెలియిడై చిత్రంలో అతిథిరావుకు స్నేహితురాలుగా కొన్ని సీన్స్లో మెరిసింది. తాజాగా రెండు తమిళ చిత్రాల్లో కథానాయకిగా నటించే అవకాశాలను కొట్టేసింది. వాటిలో ఒకటి ఇవన్ తందిరన్. గౌతమ్కార్తీక్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం æఆడియో ఇటీవలే విడుదలైంది. చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా శ్రద్ధా శ్రీనాథ్ను పలకరించగా చాలా కబుర్లే చెప్పుకొచ్చింది. ఇవన్ తందిరన్ కోలీవుడ్లో హీరోయిన్గా తనకు తొలి చిత్రం అని పేర్కొంది. తనని చూసిన వారందరూ యూ టర్న్ చిత్రం నాయకిరా అంటున్నారని, ఇకపై అలాంటి ముద్ర పడకుండా కోలీవుడ్లో తనకుంటూ ఒక స్థానాన్ని అందిపుచ్చుకుంటానని చాలా నమ్మకంగా అంది. ఇవన్ తందిరన్ చిత్రంలో తన పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉంటుందని చెప్పింది. ముఖ్యంగా పెద్ద పెద్ద డైలాగ్స్ను ఎలాంటి తడబాటు లేకుండా చెప్పేశానని చెప్పింది. కఠినంగా శ్రమించి ఉన్నత స్థాయికి ఎదిగిన ఒక మిడిల్ క్లాస్ యువతిగా నటించానని తెలిపింది. అయితే ఇక్కడ విద్యావ్యవస్థలు, రాజకీయాల కారణంగా ఎలా బాధింపునకు గురైయానన్న ఇతివృత్తంతో కూడిన చిత్రం ఇవన్ తందిరన్ అని చెప్పింది. ఈ చిత్ర హీరో గౌతమ్కార్తీక్ చాలా మంచి కోస్టార్ అని కితాబిచ్చింది. తను చాలా నెమ్మదస్తుడని,మంచి వ్యక్తిత్వం కలిగిన వాడని చెప్పింది. సాధారణంగా ఎవరితోనూ సన్నిహితంగా ఉండడని, సన్నిహితంగా ఉంటే మాత్రం నిజమైన స్నేíßహితుడిగా మారిపోతాడని అంది.అంతే కాదు చాలా కేరింగ్ తీసుకుంటాడని చెప్పింది. చాలెంజింగ్ సన్నివేశాల్లో నటించిన తనను గౌతమ్కార్తీక్ అభినందిస్తూ ప్రోత్సహించాడని చెప్పింది. ఈ చిత్రంతో పాటు శ్రద్ధా శ్రీనా«థ్ విక్రమ్ వేదా అనే మరో తమిళ చిత్రంలోనూ నటిస్తోంది.వీటితో పాటు మాలీవుడ్, శాండిల్వుడ్ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉందట. -
స్వర్ణకమలం మీద ఇష్టంతో...
ఆది, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో ఉప్పలపాటి చరణ్తేజ్, గుర్రం విజయలక్ష్మి నిర్మిస్తున్న చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత చరణ్ తేజ్ తల్లిదండ్రులు ఉప్పలపాటి రామకృష్ణ, అనురాధ కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘విశ్వనాథ్గారి సినిమాల్లో ‘స్వర్ణకమలం’, అందులో భానుప్రియగారి పాత్ర నాకు బాగా ఇష్టం. ఆ తరహా సినిమా చేయాలనుకున్నా. ఈ సినిమా అలానే ఉంటుంది. ఆది ఏ పాత్రను అయినా బాగా చేయగలుగుతారు. అయితే హీరోయిన్కు శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం ఉండాలి. అందుకే శ్రద్ధా శ్రీనాథ్ను తీసుకున్నాం. ఈ నెల 19న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. రెండేళ్ల క్రితమే ఈ కథ వినిపించిన దర్శకుడు మూడున్నర నెలల క్రితం బౌండెడ్ స్రిప్ట్తో నా దగ్గరకు వచ్చాడు. కథ బాగా నచ్చడంతో నటించేందుకు ఒప్పుకున్నా’’ అన్నారు ఆది. ‘‘కన్నడలో రెండు, తమిళంలో ఓ సినిమా చేశా. తెలుగులో నా తొలి సినిమా ఇది’’ అన్నారు శ్రద్ధా శ్రీనాథ్. ఈ చిత్రానికి సంగీతం: ఫణి కళ్యాణ్, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రాఘవ చండ్ర, కొలిపెర్ల రోహిత్. -
అదో స్వీట్ షాక్ !
నేను కలలో కూడా ఊహించని అవకాశం ఇది అంటోంది నటి శ్రద్ధాశ్రీనాథ్. మలయాళంలో యూటర్న్ చిత్రంతో ప్రాచుర్యం పొందిన ఈ మాలీవుడ్ భామ ఇప్పుడు కోలీవుడ్లో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి మణిరత్నం చిత్రం కాట్రు వెలియిడై. కార్తీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అతిథిరావు. కాగా ఇందులో మరో ముఖ్యపాత్రలో శ్రద్ధాశ్రీనాథ్ నటించింది. ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది. ఇది ప్యూర్ లవ్స్టోరీ అని చిత్ర వర్గాలు చెబుతున్నారు.ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని శ్రద్ధాశ్రీనాథ్ తెలుపుతూ లెజెండ్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఇంత త్వరగా నటించే అవకావం వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదంది. ఆయన చిత్రాల్లో అవకాశాల కోసం ఎందరో ఆశగా ఎదురు చూస్తుంటారని అంది. మణిరత్నం చిత్రాలను, ఆయన వర్కింగ్ స్టైల్ను తాను గమనిస్తూ వచ్చానని చెప్పింది. అలాంటిది ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం రాగానే తాను షాక్కు గురయ్యానని, అది చాలా స్వీట్ షాక్ అని పేర్కొంది. అలాంటిది ఆయన దర్శకత్వంలో కాట్రు వెలయిడై చిత్రంలో నటించడం లెర్నింగ్ ఎక్స్పీరియెన్స్ అని చెప్పింది. చిత్రంలో తాను నటించిన ఒక సన్నివేశాన్ని మానిటర్లో చూసి మణిరత్నం చాలా హ్యాపీగా దరహాసం చేశారని అంది. ఆ సన్నివేశం ఏమిటన్నది చిత్రం చూస్తే మీకే తెలుస్తుందని పేర్కొంది. ఈ అమ్మడు ప్రస్తుతం ఇవన్ తందిరన్, విక్రమ్ వేదా చిత్రాల్లో నటిస్తోంది.