Stock Market
-
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లూ.. వీళ్లతో జాగ్రత్త!
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై గ్యారంటీ రాబడిని అందిస్తామంటూ కొంతమంది వ్యక్తులు ఇన్వెస్టర్లను మోసగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సాక్ట్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ (NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్) తెలిపింది. కొన్ని సంస్థల పేరుతో మదుపర్లను బురిడీ కొట్టించి వారి నుంచి ట్రేడింగ్ అకౌంట్ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ వంటి వివరాలను తీసుకుంటున్నారని, ఇటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరించింది.మోసగాళ్లు.. వారి ఫోన్నంబర్లు ఇవే..ఇటీవల తమ దృష్టికి వచ్చిన కొంత మంది మోసపూరిత వ్యక్తులు.. వారి ఫోన్ నంబర్లు, వారు పేర్కొన్న సంస్థల వివరాలను ఎస్ఎస్ఈ వెల్లడించింది.“టీజీ లెవెల్” (TG Level) అనే సంస్థ పేరుతో మొబైల్ నంబర్ 8420583592 ద్వారా మోసగిస్తున్నారు.“వీవీఎల్” (VVL) అనే సంస్థ పేరుతో జైరామ్ భట్ బోధిస్తారని లీలా తలస్సా అనే వ్యక్తి9662890247 నంబర్ ద్వారా మోసగిస్తున్నారు.సుజల్ పటేల్, నవదీప్ బజ్వా అనే వ్యక్తులు “డ్యామ్ ట్రేడ్ క్యాపిటల్” (DAM Trade Capital) అనే సంస్థతో అనుబంధం ఉన్నట్లు 7054874084, 9967603975 నంబర్ల ద్వారా మోసగిస్తున్నారు.“సుప్రీమస్ ఏంజెల్” (Supremus Angel) అనే సంస్థకు సంబంధించిన వాళ్లమంటూ జిగ్నేష్ , “ఎక్స్నెస్ బ్రోకర్” (Exnes Broker) అనే సంస్థ చెందిన వ్యక్తలమంటూ తేజస్ పటేల్, జగదీష్ అనే వ్యక్తులు 8780321223, 9375033033 నంబర్ల ద్వారా ఇన్వెస్టర్లను సంప్రదిస్తున్నారు.పైన పేర్కొన్న వ్యక్తులు, సంస్థలు, మొబైల్ నంబర్ల నుంచి ఫోన్ చేసి స్టాక్ మార్కెట్లో ఖచ్చితమైన రాబడులు అందిస్తామని వాగ్దానం చేసి తమ ఇన్వెస్ట్మెంట్ పథకాలకు సభ్యత్వాన్ని పొందాలని కోరితే స్పందించవద్దని ఎన్ఎస్ఈ సూచించింది. ఇటువంటి వాగ్దానాలు చేయటం చట్ట ప్రకారం నిషేధమని స్టాక్ ఎక్స్ఛేంజీ స్పష్టం చేసింది. తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్ వంటి ట్రేడింగ్ ఖాతా వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించింది. ఇలా ఎవరైనా వ్యక్తులు, సంస్థలు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ రిజిస్టర్డ్ మెంబర్గా పేర్కొంటే తమ వెబ్సైట్లో https://www.nseindia.com/invest/find-a-stock-broker లింక్ ద్వారా ధ్రువీకరించుకోవచ్చని తెలిపింది. -
నష్టాల్లో మార్కెట్లు.. మళ్లీ ముంచిన ‘ఇండస్ఇండ్ బ్యాంక్’
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. లాంగ్ వీకెండ్ కు ముందు ఇన్వెస్టర్లు కొత్త పొజిషన్లకు దూరంగా ఉండటంతో బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలపై అనిశ్చితి నెలకొనడంతో ఇన్వెస్టర్లు పక్కకు తప్పుకోవడానికే మొగ్గుచూపారు. కాగా హోలీ పండుగ కారణంగా శుక్రవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ట్రేడింగ్కు క్లోజ్ కానున్నాయి.బీఎస్ఈ సెన్సెక్స్ గురువారం ప్రారంభ ట్రేడింగ్ లో 74,401 వద్ద గరిష్టానికి చేరుకున్నప్పటికీ, కొద్దిసేపటికే లాభాలను ఆర్జించింది. ఆటో, ఐటీ, ఎంపిక చేసిన బ్యాంకింగ్ షేర్లలో కొనసాగిన అమ్మకాల ఒత్తిడితో బీఎస్ఈ బెంచ్ మార్క్ రెడ్లోకి జారి 630 పాయింట్ల నష్టంతో 73,771 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 201 పాయింట్ల నష్టంతో 73,829 వద్ద ముగిసింది. ఈ క్రమంలో సెన్సెక్స్ 504 పాయింట్ల నష్టంతో వారాన్ని ముగించింది.ఇక నిఫ్టీ 22,558 వద్ద గరిష్ట స్థాయి నుంచి 22,377 వద్ద కనిష్టానికి పడిపోయి, చివరకు 73 పాయింట్ల నష్టంతో 22,397 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఈ వారంలో 156 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ 30 షేర్లలో టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ దాదాపు 2 శాతం చొప్పున నష్టపోయాయి. జొమాటో, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు కూడా నష్టపోయాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు 0.5 శాతానికి పైగా లాభాలను చూశాయి.మరోవైపు విస్తృత సూచీలు కూడా ఈరోజు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం క్షీణించాయి. బీఎస్ఈలో ట్రేడైన 4,105 షేర్లలో 60 శాతం లేదా 2,449 షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ రియాల్టీ సూచీ 1.8 శాతం నష్టపోయింది. గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ రియల్టీ, లోధా, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, ఫీనిక్స్ షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. -
స్థిరంగా స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నిన్నటి ముగింపుతో పోలిస్తే గురువారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 10 పాయింట్ పెరిగి 22,484కు చేరింది. సెన్సెక్స్(Sensex) 83 పాయింట్లు పెరిగి 74,124 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.59 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 70.94 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.49 శాతం పెరిగింది. నాస్డాక్ 1.22 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: మూడేళ్లలో రూ.52 లక్షల కోట్ల పెట్టుబడులు..అమెరికా ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు రేకెత్తడంతో నిన్నటి మార్కెట్ సెషన్లో ఐటీ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ వాణిజ్య సుంకాల అనిశ్చితి కూడా సెంటిమెంట్ను దెబ్బతీసింది. కూరగాయలు, గుడ్లు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే ఇతరత్రా పదార్ధాల రేట్లు నెమ్మదించడంతో ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడు నెలల కనిష్టమైన 3.61 శాతానికి దిగి వచ్చింది. ఇది గతేడాది జులై తర్వాత కనిష్ట స్థాయి. తాజా పరిణామం నేపథ్యంలో వచ్చే నెలలో రిజర్వ్ బ్యాంక్ మరోసారి కీలక వడ్డీ రేట్ల కోతపై దృష్టి పెట్టడానికి కాస్త అవకాశం లభించినట్లవుతుందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు.ఈ నెల 14వ తేదీన హోలీ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నిఫ్టీ మరో కొత్త ఇండెక్స్..
స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా కెమికల్ రంగానికి ఇండెక్స్ను ప్రవేశపెట్టింది. నిఫ్టీ కెమికల్స్ పేరుతో ఆవిష్కరించింది. నిఫ్టీ 500 నుంచి కెమికల్ రంగ షేర్ల పనితీరును ఇండెక్స్ ప్రతిఫలించనుంది. అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ ఇండైసెస్ ద్వారా కొత్త ఇండెక్సునకు తెరతీసింది.తాజా ఇండెక్స్ అసెట్ మేనేజర్లకు ప్రామాణికంగా నిలిచే వీలున్నట్లు ఎన్ఎస్ఈ అంచనా వేస్తోంది. ఈటీఎఫ్ల రూపంలో ప్యాసివ్ ఫండ్స్ ట్రాక్ చేసే రిఫరెన్స్ ఇండెక్స్గా ఉపయోగపడనున్నట్లు అభిప్రాయపడింది. ఆరు నెలల సగటు ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా 20 స్టాక్స్ను ఎంపిక చేసినట్లు పేర్కొంది.ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్కు అందుబాటులో ఉన్న షేర్లను పరిగణించింది. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ విలువ ఆధారంగా ఒక్కో షేరుకి వెయిట్ ఉంటుందని, 33 శాతానికి మించదని ఎక్స్చేంజీ వెల్లడించింది. కెమికల్స్ రంగంపై ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతుండటంతో పరిశ్రమ ధోరణులు, పెట్టుబడుల అవకాశాలను ట్రాక్ చేయడానికి ఈ ఇండెక్స్ కీలక సాధనంగా ఉపయోగపడుతుంది. -
ఐటీ షేర్ల దెబ్బ.. నష్టాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఐటీ షేర్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడితో దేశీయ బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు బుధవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. అయితే ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో స్మార్ట్ లాభాలు బెంచ్మార్క్ సూచీల నష్టాలను అదుపులో ఉంచడానికి దోహదపడ్డాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 170 పాయింట్ల లాభంతో 74,270 వద్ద ప్రారంభమై, కొద్దిసేపటికే 74,392 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత బీఎస్ఈ సూచీ లాభాల్లో పయనించి 794 పాయింట్లు క్షీణించి 73,598 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. చివరకు సెన్సెక్స్ 73 పాయింట్లు లేదా 0.1 శాతం స్వల్ప నష్టంతో 74,030 వద్ద ముగిసింది.ఇక నిఫ్టీ 22,577 పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి 22,330 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. ఇంట్రాడేలో 247 పాయింట్లు నష్టపోయి 22,470 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 షేర్లలో ఇండస్ ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్గా ఉంది. బ్యాంక్ సీఈవో, గ్రూప్ చైర్మన్ ఇన్వెస్టర్ల భయాలను తగ్గించడానికి ప్రయత్నించడంతో నిన్నటి పతనం నుంచి కోలుకుని నేడు 5 శాతం లాభపడింది. అదే సమయంలో టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా షేర్లు 1-3 శాతం చొప్పున లాభపడ్డాయి.మరోవైపు ఇన్ఫోసిస్ 4 శాతానికి పైగా పడిపోయింది. టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, జొమాటో, ఎస్బీఐ 1-3 శాతం మధ్య నష్టాల్లో ముగిశాయి. విస్తృత మార్కెట్ లో బీఎస్ఈ మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ సూచీలు 0.5 శాతం చొప్పున నష్టాల్లో ముగిశాయి.మొత్తంగా మార్కెట్ ప్రతికూలతను చూసింది. బీఎస్ఈలోని 1,500 షేర్లు పురోగమించగా దాదాపు 2,500 స్టాక్స్ క్షీణించాయి. రంగాలవారీగా చూస్తే అమెరికా మాంద్యం ముప్పు, మోర్గాన్ స్టాన్లీ, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డౌన్ గ్రేడ్ల నేపథ్యంలో బీఎస్ఈ ఐటీ సూచీ 3 శాతానికి పైగా పతనమైంది. రియాల్టీ ఇండెక్స్ 1.7 శాతం, మెటల్ ఇండెక్స్ 0.5 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 0.7 శాతం లాభపడింది. -
భయపడుతున్న‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత.. ఎందుకంటే..
ప్రముఖ ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ టి కియోసాకి ప్రస్తుత మార్కెట్ అనిశ్చితులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 18 నుంచి వరుసగా పతనమవుతున్న అమెరికా మార్కెట్లను ఉద్దేశించి ‘చరిత్రలోనే భారీ పతనం రాబోతోందని భయంగా ఉంది. ఇది 1929 స్టాక్ మార్కెట్ పతనాన్ని కూడా అధిగమించగలదు’ అని తెలిపారు. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో కీలక వివరాలు పోస్ట్ చేశారు.‘మార్కెట్ బుడగలా ఎగిసిపడుతోంది. రాబోయే మార్కెట్ క్రాష్ చరిత్రలోనే అతిపెద్దది కావచ్చని భయమేస్తుంది. జర్మనీ, జపాన్, అమెరికా మార్కెట్లు ఇప్పటివరకు కీలకంగా వ్యవహరించాయి. దురదృష్టవశాత్తు అసమర్థ నాయకులు పెట్టుబడిదారులను ఉచ్చులోకి నెట్టారు. ఈ క్రాష్ గురించి నేను నా పుస్తకం ‘రిచ్డాడ్స్ ఫ్రొఫెసీ’లో రాశాను. ఇది 1929 గ్రేట్ డిప్రెషన్కు దారితీసిన పతనం కంటే పెద్దదిగా ఉండబోతుంది. ఈ సందర్భంలో కలవరపడటం, భయపడటం సాధారణం. కానీ అలా చేయకండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. 2008 మార్కెట్ పతనం సమయంలో భయాందోళనకు గురికాకుండా అమ్మకానికి ఉన్న ఆస్తుల వివరాలు సేకరించి అందులో పెట్టుబడి పెట్టాను. డీప్ డిస్కౌంట్ల్లో వాటిని పొందాను. ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ మార్కెట్ భయాలు మీ జీవితకాలంలో అవకాశంగా మారొచ్చు. మార్కెట్ అంశాలు ఎంత తీవ్ర రూపం దాల్చినా మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అందుకు అనుగుణంగా మెరుగైన అవకాశాలు ఎంచుకొని పెట్టుబడి పెట్టండి. నేను రియల్ ఎస్టేట్, బంగారం, వెండి, బిట్కాయిన్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తాను’ అన్నారు.THE EVERYTHING BUBBLE is bursting. I am afraid this crash may be the biggest in history.Germany, Japan, and America have been the engines up to now. Unfortunately our incompetent leaders led us into a trap….giant crash.I wrote about this crash in my book RICH DAD’s…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 11, 2025ఇదీ చదవండి: ఒకే కుటుంబానికి రెండు రోజుల్లో రూ.6,875 కోట్ల నష్టంనాస్డాక్ కాంపోజిట్ ఇటీవల 4 శాతానికి పైగా పడిపోగా, ఎస్ అండ్ పీ 500 దాదాపు 2.7 శాతం దిగజారింది. ఇది ఫిబ్రవరిలో దాని ఆల్ టైమ్ హై నుంచి 8.5 శాతం తగ్గింది. అమెరికా వాణిజ్య విధానాలతో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. సుంకాల ప్రభావంపై అమెరికా, కెనడా, మెక్సికోలోని ఆర్థికవేత్తల్లో ఆందోళన పెరుగుతోందని రాయిటర్స్ నివేదికలు చెబుతున్నాయి. కెనడా, అమెరికా, మెక్సికో దేశాల్లో నిర్వహించిన సర్వేలో భాగంగా 74 మంది ఆర్థికవేత్తల్లో 70 మంది ఆర్థిక మాంద్యం ముప్పు పెరిగిందని, ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణానికి అవకాశం ఉందని చెబుతున్నారు. గోల్డ్ మన్ శాక్స్ తన 2025 అమెరికా వృద్ధి అంచనాను దిగువకు సవరించింది. -
ఒకే కుటుంబానికి రెండు రోజుల్లో రూ.6,875 కోట్ల నష్టం
ఇన్ఫోసిస్ లిమిటెడ్ షేర్ ధర వరుసగా రెండు రోజుల నుంచి భారీగా పతనమవుతోంది. దాంతో కంపెనీ షేర్ హోల్డర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అందులో మేజర్ వాటాదారులుగా ఉన్న కంపెనీ ప్రమోటర్ నారాయణమూర్తి, ఆయన కుటుంబ సభ్యులకు గణనీయంగా నష్టాలు నమోదయ్యాయి. బుధవారం ఇన్ఫోసిస్ 5.49 శాతం క్షీణించి 1,569.35 వద్ద కనిష్టాన్ని తాకింది. 2024 డిసెంబర్లో 52 వారాల గరిష్ట స్థాయి రూ.2,006.80తో పోలిస్తే ఈ షేరు దాదాపు 22 శాతం క్షీణించింది. దాంతో మూర్తి కుబుంబానికి ఏకంగా రెండు రోజుల్లో రూ.6,875 కోట్లు నష్టం వాటిల్లింది.అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా టారిఫ్ వార్ కారణంగా ఐటీ కంపెనీల క్లయింట్లు పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేందుకు ఆలోచిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. దాంతో కొన్ని బ్రోకరేజీ సంస్థలు ఇన్ఫోసిస్ స్టాక్ను డౌన్గ్రేడ్ చేయడంతో తాజా పతనం సంభవించిందని చెబుతున్నారు. కేవలం ఐటీ స్టాక్లే కాకుండా దాదాపు చాలా స్టాక్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.ఇదీ చదవండి: టెస్లా కారు కొనుగోలు చేసిన ట్రంప్!ఎవరి వాటా ఎంత..కార్పొరేట్ డేటాబేస్ ఏసీఈక్విటీతో సేకరించిన డేటా ప్రకారం ఎన్ఆర్ నారాయణమూర్తి కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఇన్ఫోసిస్లో రూ.26,287.19 కోట్ల విలువైన 4.02 శాతం వాటాను కలిగి ఉన్నారు. 2024 డిసెంబర్ 13న రూ.33,162.89 కోట్లతో పోలిస్తే ఇది ఇటీవల రూ.6,875.70 కోట్లు తగ్గింది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ మూర్తి ఇన్ఫోసిస్లో 0.40 శాతం వాటాను కలిగి ఉండగా, ఆయన భార్య సుధా మూర్తి డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి 0.92 శాతం వాటాను కలిగి ఉన్నారు. దేశంలోని రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్గా పేరున్న ఇన్ఫోసిస్లో వారి కుమారుడు రోహన్ మూర్తి, బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ భార్య, నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తికి వరుసగా 1.62 శాతం, 1.04 శాతం వాటాలు ఉన్నాయి. మూర్తి మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి ఇన్ఫోసిస్లో స్వల్పంగా 0.04 శాతం వాటా ఉంది. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ(Nifty) 10 పాయింట్లు ఎగబాకి 22,5001కు చేరింది. సెన్సెక్స్(Sensex) 82 పాయింట్లు పెరిగి 74,183 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.55 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 70.04 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.27 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.75 శాతం దిగజారింది. నాస్డాక్ 0.18 శాతం నష్టపోయింది.ఇదీ చదవండి: ఎస్బీఐ యూపీఐ సేవల్లో అంతరాయంయూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల విధింపు చర్యలపై వివిధ దేశాలు ప్రతికార సుంకాలు అమలు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. దాంతో యూఎస్ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం, అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియడం సహా ప్రపంచ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు కీలకంగా మారుతున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) అమ్మకాలు కొనసాగుతుండటం భారతీయ ఈక్విటీలపై ఒత్తిడి పెంచుతోంది. ఫిబ్రవరి నెలకు భారత వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణ డేటాను ఇన్వెస్టర్లు పరిశీలించనున్నారు. ఈ నెల 14వ తేదీన హోలీ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాటుగా ముగిసిన స్టాక్ సూచీలు
ముంబై: ఆరంభ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే 452 పాయింట్లు పతనమై సెన్సెక్స్ చివరికి 13 పాయింట్ల స్వల్ప నష్టంతో 74,102 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 38 పాయింట్లు పెరిగి 22,498 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 145 పాయింట్లు క్షీణించి 22,315 వద్ద కనిష్టాన్ని తాకింది. అమెరికా మాంద్యం భయాలతో సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి.ఇండస్ ఇండ్ బ్యాంక్ షేరు భారీ క్షీణత(27%), ప్రైవేటు బ్యాంకులు, ఐటీ షేర్లలో తలెత్తిన అమ్మకాలతో నష్టాలు మరింత అధికమయ్యాయి. అయితే అఖరిగంటలో అధిక వెయిటేజీ ఐసీఐసీఐ బ్యాంకు(2.50%), రిలయన్స్ (1%), ఎయిర్టెల్ (2%) షేర్లు రాణించడంతో సూచీలు నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. ట్రంప్ వాణిజ్య యుద్ధం ఆర్థిక మందగమనానికి దారితీయోచ్చనే ఆందోళనలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. -
ఒకేరోజు 27 శాతం కుప్పకూలిన బ్యాంకు స్టాక్.. కారణం..
దేశీయ ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేరు ధర మంగళవారం ఒక్కరోజే సుమారు 27 శాతం కుప్పుకూలింది. నిన్నటి సెషన్లో షేరు ధర రూ.900.5 ముగింపు నుంచి ఈ రోజు ముగింపు సమయానికి రూ.655 వద్దకు చేరింది. బ్యాంకు ఎదుర్కొంటున్న సవాళ్లపై సీఈఓ సుమంత్ కత్పాలియా మాట్లాడుతూ ప్రస్తుతం బ్యాంకుకు ఇది ‘లిట్మస్ టెస్ట్’గా అభివర్ణించారు. బ్యాంకు పాలన, నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తిన కీలక పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కత్పాలియా పదవీకాలాన్ని మూడేళ్ల పాటు పొడిగించాలని బోర్డు సిఫారసు చేసినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒక సంవత్సరం వరకు మాత్రమే తన పదవీకాలం పొడిగింపును ఆమోదించింది. తన నాయకత్వ నైపుణ్యాల గురించి ఆర్బీఐకి ఆందోళనలు ఉండవచ్చునని కత్పాలియా అన్నారు. ఏదేమైనా ఆర్బీఐ నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పారు. ఈ వ్యాఖ్యలు బ్యాంకు షేర్ ధర పడిపోవడానికి కారణమైనట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సీఈఓ స్థాయి వ్యక్తే ఇలా తన సామర్థ్యాలను అంగీకరించడంపట్ల ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తం అయినట్లు తెలిపారు.ఇదీ చదవండి: ఆన్లైన్ మోసాల కట్టడికి వినూత్న విధానంఅంతర్గత ఆడిట్లో బ్యాంక్ డెరివేటివ్స్ పోర్ట్ఫోలియోలో వ్యత్యాసాలున్నట్లు గుర్తించారు. ఇది డిసెంబర్ 2024 నాటికి ఉన్న లెక్కల ప్రకారం బ్యాంకు నికర విలువలో సుమారు 2.35% అంటే సుమారు రూ.1530 కోట్లుగా ఉన్నట్లు తేల్చారు. ఈ వ్యత్యాసాలపై స్వతంత్ర సమీక్ష నిర్వహించడానికి ఇండస్ ఇండ్ బ్యాంక్ బాహ్య ఆడిటర్ను నియమించింది. బ్యాంక్ వృద్ధి ఎజెండా చెక్కుచెదరకుండా ఉందని, ఈ సవాళ్లను పారదర్శకంగా పరిష్కరించడానికి నాయకత్వ బృందం కట్టుబడి ఉందని కత్పాలియా వాటాదారులకు హామీ ఇచ్చారు. -
తీవ్ర ఒడిదొడుకులు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడిదొడుకుల మధ్య లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 37 పాయింట్లు లాభపడి 22,497 వద్దకు చేరింది. సెన్సెక్స్ 12 పాయింట్లు దిగజారి 74,102 వద్దకు చేరింది. ఇటీవల భారీగా పడి క్రమంగా పంజుకుంటున్న మార్కెట్లు సోమవారం తీవ్ర ఒడిదొడుకులకు గురయ్యాయి. ప్రధానంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు పతనమయ్యాయి.సెన్సెక్స్ 30 సూచీలో సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మారుతీ సుజుకీ, టైటాన్, ఎల్ అండ్ టీ, రిలయన్స్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, నెస్లే, ఎస్బీఐ, టాటా మోటార్స్ స్టాక్లు లాభాల్లో ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్సర్వ్, ఎం అండ్ ఎం, జొమాటో, హెచ్యూఎల్, పవర్గ్రిడ్ స్టాక్లు భారీగా నష్టపోయాయి.ఇదీ చదవండి: ఆన్లైన్ మోసాల కట్టడికి వినూత్న విధానంమార్కెట్ ఒడిదొడుకులకు కారణాలు..ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ) విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతుండడంతో భారత మార్కెట్ల నుంచి ఇతర ప్రాంతాలకు నిధులు తరలిపోతున్నాయి. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ స్టాక్ల వాల్యుయేషన్ ఆందోళనల వల్ల ఆయా సెగ్మెంట్లు తీవ్ర దిద్దుబాట్లకు లోనయ్యాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
-
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 423.38 పాయింట్లు లేదా 0.57 శాతం నష్టంతో 73,691.79 వద్ద, నిఫ్టీ 112.85 పాయింట్లు లేదా 0.50 శాతం నష్టంతో 22,347.45 వద్ద కొనసాగుతున్నాయి.టాప్ గెయినర్స్ జాబితాలో.. నీతిరాజ్ ఇంజనీర్స్, హెడ్స్ అప్ వెంచర్స్, ఎల్సీసీ ఇన్ఫోటెక్, ఆస్ట్రాన్ పేపర్ బోర్డ్ మిల్ లిమిటెడ్ వంటి కంపెనీలు చేరాగా.. ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఆకాష్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్, సద్భావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ వంటివి నష్టాలలో కొనసాగుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్ళీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాలబాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 217.41 పాయింట్లు లేదా 0.29 శాతం నష్టంతో 74,115.17 వద్ద, నిఫ్టీ 92.20 పాయింట్లు లేదా 0.41 శాతం నష్టంతో 22,460.30 వద్ద నిలిచాయి.వెల్స్పన్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కమర్షియల్స్, బంకా బయోలూ, బోడల్ కెమికల్స్, లిప్సా జెమ్స్ అండ్ జ్యువెలరీ, ICE మేక్ రిఫ్రిజిరేషన్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. కేసోరామ్ ఇండస్ట్రీస్, SBC ఎక్స్పోర్ట్స్, నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, హిందుస్తాన్ మీడియా వెంచర్స్, నియోజెన్ కెమికల్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
క్రమంగా పెరుగుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఇటీవల కాలంలో భారీగా పడిన మార్కెట్ సూచీలు గడిచిన నాలుగు సెషన్ల నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 39 పాయింట్లు ఎగబాకి 22,594కు చేరింది. సెన్సెక్స్(Sensex) 112 పాయింట్లు పెరిగి 74,441 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.8 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 70.02 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.56 శాతం లాభపడింది. నాస్డాక్ 0.71 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: నేటి నుంచి యూఎస్పై చైనా సుంకాలు.. వ్యూహాత్మక ప్రతీకారంఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు ప్రపంచ పరిస్థితులు, స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టనున్నాయి. వీటికితోడు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ల విధింపు చర్యలకూ ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. టారిఫ్ల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ నీరసించవచ్చన్న అంచనాలు తెరమీదకు వస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో గత వారం యూఎస్ టెక్నాలజీ దిగ్గజాలు డీలాపడటంతో నాస్డాక్ ఇండెక్స్ పతనమైన సంగతి తెలిసిందే. గ్లోబల్ ట్రెండ్ సైతం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా..ఈ వారం మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి. వారాంతాన(14న) హోలీ పండుగ సందర్భంగా మార్కెట్లకు సెలవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇల్లే బంగారమాయె..
బంగారం, గృహం, స్టాక్ మార్కెట్.. ఈ మూడింట్లో ఎందులో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారని మహిళలను అడిగితే.. ఠక్కున చెప్పే సమాధానం బంగారమే! కానీ, నేటి మహిళల పెట్టుబడి ఆలోచనల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. మొదట సొంతిల్లు.. ఆ తర్వాతే బంగారం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు. 69 శాతం మంది మహిళలు సొంత ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా.. 31 శాతం మంది పెట్టుబడి కోసం ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారని అనరాక్ కన్జ్యూమర్ సెంటిమెంట్ సర్వే వెల్లడించింది. – సాక్షి, సిటీబ్యూరో మన దేశంలో గృహ కొనుగోలు ప్రక్రియలో మహిళలు ఎల్లప్పుడూ కీలక నిర్ణయాధికారులే. మహిళలు స్వతంత్ర, వ్యక్తిగత ఆస్తుల కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాపర్టీ కొనుగోళ్లలో మెజారిటీ మహిళలు తుది వినియోగదారులే. పెట్టుబడి రీత్యా ఆస్తుల కొనుగోళ్లూ ఆశించిన స్థాయిలోనే ఉండటం గమనార్హం. పెరుగుతున్న స్వాతంత్య్రం, వ్యక్తిగత స్వేచ్ఛ, నిర్ణయాధికారం, మెరుగైన ఆదాయ వనరులు కారణంగా గృహ విభాగంలో మహిళా పెట్టుబడిదారులు ఎక్కువగా వస్తున్నారు. 2022 హెచ్2 (జులై–డిసెంబర్)లో మహిళా గృహ కొనుగోలుదారుల్లో తుది వినియోగం: పెట్టుబడి నిష్పత్తి 79:21గా ఉండగా.. 2024 హెచ్2 నాటికి 69:31గా ఉందని తెలిపింది.లాంచింగ్ ప్రాజెక్టుల్లోనే.. సర్వేలో పాల్గొన్న 69 శాతం మహిళలకు రియల్ ఎస్టేట్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆస్తి తరగతిగా భావిస్తున్నారు. 2022 హెచ్2లో ఇది 65 శాతంగా ఉండగా.. కోవిడ్ కంటే ముందు 2019 హెచ్2లో 57 శాతంగా ఉంది. గతంలో కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్ట్లలో కొనుగోళ్లకు 10 శాతం మంది మహిళలు మొగ్గుచూపగా.. ఇప్పుడది 18 శాతానికి పెరిగింది. నిర్మాణం పూర్తయి, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు (రెడీ టు మూవ్) కొనుగోళ్ల ప్రాధాన్యత 29 శాతం మేర తగ్గింది.లగ్జరీకే మొగ్గు.. లగ్జరీ ప్రాపర్టీలకు మహిళలూ ఆసక్తి చూపిస్తున్నారు. రూ.90 లక్షల కంటే ఎక్కువ ధర ఉండే ప్రీమియం ఇళ్ల కొనుగోళ్లకు 52 శాతం ఉమెన్స్ మొగ్గు చూపిస్తున్నారు. వీటిలో 33 శాతం మంది రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల ధర ఉండే ప్రాపర్టీలను ఇష్టపడుతుండగా.. 11 శాతం మంది రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల ధర ఉండే గృహాలను, 8 శాతం మంది రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే అల్ట్రా లగ్జరీ ప్రాపర్టీల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలో మహిళా హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ) పెరుగుదలకు ఇదే నిదర్శనం.గోల్డ్, స్టాక్ మార్కెట్.. ప్రాపర్టీ తర్వాత మగువలకు అమితాసక్తి బంగారమే. అందుకే రియల్ ఎస్టేట్ తర్వాత గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్కే మహిళలు జై కొడుతున్నారు. 2022 హెచ్2లో బంగారంలో పెట్టుబడులకు 8 శాతం మంది మహిళలు ఆసక్తి చూపించగా.. 2024 హెచ్2 నాటికి 12 శాతానికి పెరిగింది. ఇక, ఏటేటా స్టాక్ మార్కెట్ ఆకర్షణ కోల్పోతుంది. రెండేళ్ల క్రితం మార్కెట్లో పెట్టుబడులకు 20 శాతం మంది మహిళలు ఆసక్తి చూపిస్తే.. ఇప్పుడది ఏకంగా 2 శాతానికి పడిపోయింది. -
మహిళలు.. ‘ఫండ్’ రాణులు!
అన్ని రంగాల్లోనూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న మగువలు... స్టాక్ మార్కెట్లోనూ తగ్గేదేలే అంటూ ‘బుల్’ రైడ్ చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల విలువైన మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో ఇన్వెస్టర్ల నిధులను పక్కాగా నిర్వహిస్తూ ఫండ్ మేనేజర్లుగా సత్తా చాటుతున్నారు. తాము ఇంటినే కాదు.. అవకాశమిస్తే, ఫండ్ హౌస్లను కూడా మగాళ్లకు దీటుగా చక్కబెట్టగలమని నిరూపించుకుంటున్నారు. మహిళల నిర్వహణలో ఉన్న ఫండ్ ఆస్తులు ‘ఇంతింతై.. అన్నట్లుగా ఏడాది వ్యవధిలో రెట్టింపై రూ.13.45 లక్షల కోట్లకు ఎగబాకడం విశేషం!! అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంఎఫ్ రంగంలో రాణిస్తున్న అతివలపై స్పెషల్ ఫోకస్... దేశంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ దూకుడు లాగే.. మహిళా ఫండ్ మేనేజర్లు కూడా జోరు పెంచారు. ఈ ఏడాది జనవరి నాటికి వారి సంఖ్య 49కి పెరిగింది. ఏడాది క్రితం ఉన్న 42 మందితో పోలిస్తే కొత్తగా ఏడుగురు జతయ్యారు. ఇదే కాలంలో మగ ఫండ్ మేనేజర్లు ఇద్దరు మాత్రమే పెరగడం గమనార్హం. ఇక మగువల నిర్వహణలో ఉన్న ఫండ్ ఆస్తులు కూడా రూ.13,45 లక్షల కోట్లకు ఎగిశాయి. గతేడాది జనవరితో పోలిస్తే రెట్టింపైంది. దేశంలో ఎంఎఫ్ సంస్థల నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు (ఏయూఎం) రూ.67.25 లక్షల కోట్లు కాగా, ఇందులో మహిళా ఫండ్ మేనేజర్లు/కో–ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తున్న అసెట్స్ విలువ 20 శాతానికి జంప్ చేసింది. అయితే, మొత్తం ఎంఎఫ్ ఫండ్ మేనేజర్లు 482 మందిలో మహిళల వాటా ఇంకా తక్కువగానే ఉన్నప్పటికీ, గత ఏడాది కాలంలో మగాళ్లతో పోలిస్తే మగువల సంఖ్య ఎక్కువగా పెరగడం ఈ రంగంలో వారి భవిష్యత్తుపై మరింత ఆశలు రేకెత్తిస్తోంది.25 ఎంఎఫ్లు... 339 స్కీమ్లు దేశవ్యాప్తంగా 25 మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో అతి వలు ఫండ్ మేనేజర్లుగా రాణిస్తున్నారు. మొత్తం 339 ఫండ్ స్కీమ్లను మేనేజ్ చేస్తున్నారు. కాగా, 6 ఫండ్ సంస్థల్లో ముగ్గురు కంటే ఎక్కువ మహిళా ఫండ్ మేనేజర్లు ఉండగా, 6 ఫండ్ హౌస్లలో ఇద్దరు చొప్పున, 13 సంస్థల్లో కనీసం ఒకరు ఉన్నారు. అన్నింటికంటే ఎక్కువగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్లో ఏడుగురు మహిళా ఫండ్ మేనేజర్లు రూ.2.27 లక్షల కోట్ల విలువైన 66 స్కీమ్లను నిర్వహిస్తున్నారు. భారత్లో అతిపెద్ద ఫండ్ హౌస్గా నిలుస్తున్న ఎస్బీఐ ఎంఎఫ్లోలో ఐదుగురు మగువలు రూ.1.88 లక్షల కోట్ల ఆస్తులను (14 స్కీమ్లు) మేనేజ్ చేస్తున్నారు. ఇక నిప్పన్ ఇండియా ఎంఎఫ్లో ఇద్దరు అతివలు రూ.1.53 లక్షల కోట్ల అసెట్లను (26 స్కీమ్లు) నిర్వహిస్తున్నారు.రూ.6.13 లక్షల కోట్లు ...తాజా గణాంకాల ప్రకారం దేశంలోని 49 మహిళా ఫండ్ మేనేజర్లలో టాప్–5 మగువలు మేనేజ్ చేస్తున్న ఫండ్ అసెట్స్ రూ.6.13 లక్షల కోట్లు (45.55 శాతం)గా ఉంది. ఇందులో ఎస్బీఐ ఎంఎఫ్కు చెందిన మాన్సి సజేజా రూ.1.41 లక్షల కోట్ల అసెట్లను నిర్వహిస్తూ.. భారత్లో నంబర్ వన్ మహిళా ఫండ్ మేనేజర్గా నిలిచారు. నిప్పన్ ఇండియా ఎంఎఫ్ కింజల్ దేశాయ్ (రూ.1.37 లక్షల కోట్ల అసెట్స్), యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కృష్ణా ఎన్ (రూ.1.34 లక్షల కోట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఫ్ అశ్విని షిండే 47 స్కీమ్లతో అత్యధిక స్కీమ్లను మేనేజ్ చేస్తున్న వారిలో టాప్లో ఉన్నారు. తర్వాత స్థానాల్లో మిరే అసెట్ ఇండియా ఎంఎఫ్ ఏక్తా గాలా (30 స్కీమ్లు), నిప్పన్ ఇండియా ఎంఎఫ్ కింజల్ దేశాయ్ (24 స్కీమ్లు) నిలిచారు. పురుషుల విషయానికొస్తే.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్కు చెందిన మనీష్ బాంతియా రూ.3.49 లక్షల కోట్ల అసెట్లను మేనేజ్ చేస్తూ.. దేశంలో టాప్ ఫండ్ మేనేజర్గా కొనసాగుతున్నారు.ఇన్వెస్టర్లుగానూ... ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు ట్రేడింగ్ చేస్తున్న అతివల సంఖ్య కూడా భారీగా పెరుగుతూ వస్తోంది. 2021 నుంచి చూస్తే ఏటా కొత్తగా 3 కోట్ల డీమ్యాట్ ఖాతాలు జతవగా.. ప్రతి నలుగురు ఇన్వెస్టర్లలో ఇప్పుడు 1 మహిళా ఇన్వెస్టర్ ఉండటం వారి జోరుకు నిదర్శనం. జనవరి నాటికి దేశంలో మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 18.8 కోట్లకు చేరుకుంది. ఇందులో దాదాపు 23.9 శాతం మహిళలవే కావడం గమనార్హం. కాగా, మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోల (ఖాతాల) సంఖ్య 22.92 కోట్లకు చేరింది. 2021 మే నెలలో తొలిసారి 10 కోట్ల మైలురాయిని చేరగా.. నాలుగేళ్లలోనే దాదాపు 13 కోట్ల ఫోలియోలు కొత్తగా జతవ్వడం ఫండ్స్లోకి పెట్టుబడులు ఏ రేంజ్లో వచ్చి పడుతున్నాయనేందుకు నిదర్శనం. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. సెన్సెక్స్ 7.52 పాయింట్లు లేదా 0.010 శాతం నష్టంతో.. 74,332.58 వద్ద, నిఫ్టీ 7.80 పాయింట్లు లేదా 0.035 శాతం లాభంతో 22,552.50 వద్ద నిలిచాయి.బంకా బయోలూ, సోమి కన్వేయర్ బెల్టింగ్స్, బాలాక్సీ ఫార్మాస్యూటికల్స్, లక్ష్మీ డెంటల్, కంప్యూకామ్ సాఫ్ట్వేర్ వంటి కంపెనీలు లాభాల జాబితాలో చేరాయి. నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, MRO-TEK రియాలిటీ, ఎస్ పీ అప్పారల్స్, గార్వేర్ హై-టెక్ ఫిల్మ్స్, దావణగిరి షుగర్ ఫ్యాక్టరీ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్మార్కెట్లోకి ‘చాయ్ పాయింట్’
న్యూఢిల్లీ: టీ, కాఫీ చైన్.. చాయ్ పాయింట్ 2026 మే నెలకల్లా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యే ప్రణాళికల్లో ఉంది. ఈ అంశాన్ని ప్రతిరోజు సుమారు 9 లక్షల కప్పుల టీ, కాఫీ విక్రయిస్తున్న సంస్థ సహవ్యవస్థాపకుడు తరుణ్ ఖన్నా తెలియజేశారు. అయితే కుంభమేళాలో రోజుకి 10 లక్షలకంటే అధికంగా విక్రయించినట్లు తెలియజేశారు.ముంబైలో తమ విద్యార్ధి అములీక్ సింగ్ బిజ్రాల్తో కలసి ఒక కేఫ్లో టీ తాగే సమయంలో 2009లో చాయ్ పాయింట్ ప్రారంభించే ఆలోచన వచ్చినట్లు హార్వార్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఖన్నా వెల్లడించారు. ప్లాస్టిక్ కప్పులలో అంత శుభ్రతలేని విధంగా అందిస్తున్న చాయ్ స్థానే అత్యున్నత నాణ్యతతో, పరిశుభ్రంగా అందుబాటు ధరలో సువాసనలతో కూడిన చాయ్ అందించాలనే ఆలోచనతో చాయ్ పాయింట్కు తెరతీసినట్లు వివరించారు.దీంతో టీ అందించే వ్యక్తు(చోటూ)లకు ఉపాధిని సైతం కల్పించవచ్చని భావించినట్లు తెలియజేశారు. దీంతో 2010లో బెంగళూరులోని కోరమంగళలో తొలి ఔట్లెట్ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అములీక్తో కలిసి ఐదుగురు ఉద్యోగులతో బిజినెస్ను మొదలుపెట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుతం రోజుకి 90 లక్షల కప్పుల టీ, కాఫీలను విక్రయిస్తున్నట్లు తెలియజేశారు. -
నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. బలహీనంగా ఐటీ, బ్యాంక్ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాల మధ్య బెంచ్ మార్క్ ఈక్విటీ ఇండెక్స్ బీఎస్ఈ సెన్సెక్స్ 176.47 పాయింట్లు లేదా 0.24 శాతం క్షీణించి 74,163.62 వద్ద మొదలైంది. ఇక నిఫ్టీ 50 ప్రారంభ సమయానికి 40.85 పాయింట్లు లేదా 0.18 శాతం క్షీణించి 22,503 వద్ద ఉంది.బలహీన అంతర్జాతీయ సంకేతాల మధ్య నిఫ్టీ ఐటీ, ఎఫ్ ఎంసీజీ, బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు ఎన్ఎస్ఈలో ప్రారంభ ట్రేడింగ్ లో ఒత్తిడికి లోనయ్యాయి. ఐటీ ఇండెక్స్ 0.97 శాతం, ఎఫ్ఎంసీజీ 0.12 శాతం, బ్యాంక్ 0.12 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.06 శాతం నష్టపోయాయి.విస్తృత మార్కెట్ సూచీలు ప్రారంభ ట్రేడింగ్ లో మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 0.34 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.09 శాతం నష్టపోయాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తాయన్న భయాలే ఈ రోజు స్టాక్ మార్కెట్లలో అమ్మకాలకు కారణం కావచ్చు. యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందం కిందకు వచ్చే కొన్ని కెనడా, మెక్సికో వస్తువులపై సుంకాలను ఏప్రిల్ 2 వరకు వాయిదా వేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం కూడా ఇన్వెస్టర్లను శాంతపరచడంలో విఫలమైంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..
స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 609.87 పాయింట్లు లేదా 0.83 శాతం లాభంతో.. 74,340.09 వద్ద, నిఫ్టీ 207.40 పాయింట్లు లేదా 0.93 శాతం లాభంతో 22,544.70 వద్ద నిలిచాయి.క్యాపిటల్ ట్రస్ట్, కోహినూర్ ఫుడ్స్, సోమి కన్వేయర్ బెల్టింగ్స్, కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ కో, లాంకోర్ హోల్డింగ్స్ వంటి కంపెనీలు లాభాల జాబితాలో చేరాయి. లాంకోర్ హోల్డింగ్స్, బీబీ ట్రిపుల్వాల్ కంటైనర్స్, ఫుడ్ అండ్ ఇన్స్, శ్రీరామ న్యూస్ ప్రింట్, ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బుల్ జోష్.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 48 పాయింట్లు ఎగబాకి 22,378కు చేరింది. సెన్సెక్స్(Sensex) 124 పాయింట్లు పెరిగి 73,856 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 104.3 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 69.72 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.32 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 1.12 శాతం లాభపడింది. నాస్డాక్ 1.46 శాతం ఎగబాకింది.బుల్.. బౌన్స్బ్యాక్!దేశీ స్టాక్ మార్కెట్లలో ఇటీవల నెలకొన్న ట్రెండ్కు పూర్తి విరుద్ధంగా ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్లకు తెరతీశారు. దీంతో మార్కెట్ సూచీలు పెరుగుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం టారిఫ్లపై వెనక్కి తగ్గవచ్చన్న అంచనాలు సెంటిమెంటుకు జోష్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. సానుకూల ప్రపంచ మార్కెట్లు, ఫిబ్రవరిలో పుంజుకున్న సేవల రంగం, షార్ట్ కవరింగ్ లావాదేవీలు ఇందుకు సహకరించినట్లు విశ్లేషకులు తెలియజేశారు.ఇదీ చదవండి: భారత్లో టెస్లా తొలి షోరూమ్.. ఎక్కడంటే..రూపాయి.. జోరు!మార్కెట్ల దన్నుతో దేశీ కరెన్సీ సైతం బలపడింది. డాలరుతో మారకంలో రూపాయి 13 పైసలు పుంజుకుంది. 87.06 వద్ద నిలిచింది. డాలరుతోపాటు ముడిచమురు ధరలు బలహీనపడటం రూపాయికి దన్నునిచ్చినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్లకు వ్యతిరేకంగా చైనా తదితర దేశాలు సైతం సుంకాల విధింపునకు తెరతీయడంతో డాలరు వెనకడుగు వేసినట్లు తెలిపారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నిఫ్టీ వరుస నష్టాలకు బ్రేక్..
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 1 శాతానికి పైగా లాభపడి స్థిరపడ్డాయి. 30 షేర్ల సెన్సెక్స్ 740.30 పాయింట్లు లేదా 1.01 శాతం పెరిగి 73,730.23 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 50 254.65 పాయింట్లు లేదా 1.15 శాతం పెరిగి 22,337.30 వద్ద స్థిరపడింది, తద్వారా 10 రోజుల నష్టాల పరంపరకు ముగింపు పలికింది. బుధవారం సూచీ 22,394.90 నుంచి 22,067.80 రేంజ్లో ట్రేడ్ అయింది. మంగళవారం వరకు వరుసగా 10 ట్రేడింగ్ సెషన్లలో నిఫ్టీ 50 ఇండెక్స్ 3.8 శాతం లేదా 877 పాయింట్లు నష్టపోయింది.నిఫ్టీ 50లోని 50 షేర్లలో 46 లాభాల్లో స్థిరపడగా, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 5.15 శాతం వరకు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, ఇండియన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు 3.37 శాతం వరకు నష్టపోయాయి.నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ 2.96 శాతం లాభంతో ముగియడంతో స్మాల్ క్యాప్ షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ కూడా 2.42 శాతం లాభంతో సానుకూలంగా ముగిసింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 4.04 శాతం లాభపడటంతో ఎన్ఎస్ఈలోని అన్ని సెక్టోరల్ ఇండెక్స్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, మీడియా సూచీలు 3 శాతానికి పైగా లాభపడ్డాయి. నిఫ్టీ ఐటీ, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి. -
స్టాక్ మార్కెట్ వరుస నష్టాలకు బ్రేక్
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ(Nifty) 89 పాయింట్లు ఎగబాకి 22,170కు చేరింది. సెన్సెక్స్(Sensex) 296 పాయింట్లు పెరిగి 73,273 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 105.71 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 70.74 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.25 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 1.22 శాతం తగ్గింది. నాస్డాక్ 0.35 శాతం దిగజారింది.ఇదీ చదవండి: వేతనం కాదు.. ఉద్యోగుల మనోభావాలివి..ట్రంప్ టారిఫ్ భయాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ప్రభావంతో మార్కెట్లు పతనమవుతున్నాయి. నిఫ్టీ ఇండెక్స్ డెరివేటివ్స్ వీక్లీ కాంట్రాక్టుల ఎక్స్పైరీని గురువారం నుంచి సోమవారానికి మారుస్తున్నట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. అలాగే, నిఫ్టీ నెల, మూడు నెలలు, ఆరు నెలల ఎఫ్అండ్వో కాంట్రాక్టులు కూడా ఎక్స్పైరీ నెలలోని ఆఖరు గురువారం కాకుండా ఆఖరు సోమవారం నాడు ఎక్స్పైర్ అవుతాయి. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ మొదలైన వాటికి కూడా ఇది వర్తిస్తుంది. ఇది ఏప్రిల్ 4 నుంచి అమల్లోకి వస్తుంది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. ఆటో, ఐటీ నేలచూపు
దేశీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 మంగళవారం నష్టాల్లో ముగిశాయి. 30 షేర్ల సెన్సెక్స్ 96.01 పాయింట్లు లేదా 0.13 శాతం క్షీణించి 72,989.93 వద్ద స్థిరపడింది. ఈరోజు సూచీ 73,033.18-72,633.54 రేంజ్లో ట్రేడ్ అయింది.అలాగే నిఫ్టీ 50 36.65 పాయింట్లు (0.17 శాతం) క్షీణించి 22,082.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 22,105.05 వద్ద, ఇంట్రాడేలో 21,964.60 వద్ద కనిష్టాన్ని తాకింది.నిఫ్టీ 50లోని 50 షేర్లలో 28 షేర్లు నష్టాల్లో ముగియగా, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్సీఎల్ టెక్, ఐషర్ మోటార్స్ షేర్లు 4.95 శాతం వరకు నష్టపోయాయి. ఎస్బీఐ, బీపీసీఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 3.03 శాతం వరకు లాభపడ్డాయి.విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 0.69 శాతం, 0.05 శాతం పెరిగాయి. ఎన్ఎస్ఈలో సెక్టోరల్ ఇండెక్స్లు మిశ్రమంగా ముగియగా, పీఎస్యూ బ్యాంక్, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మీడియా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ సూచీలు 2.37 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు నిఫ్టీ ఆటో, ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల సూచీలు 1.31 శాతం వరకు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ స్వల్పంగా 0.08 శాతం నష్టపోయింది. -
భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ఉదయం.. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 291.61 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టంతో.. 72,794.33 వద్ద, నిఫ్టీ 126.10 పాయింట్లు లేదా 0.57 శాతం నష్టంతో.. 21,993.20 వద్ద సాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, ట్రంప్ విధించిన సుంకాలు ఈ రోజు నుంచి అమలులోకి రావడం వంటివి.. స్టాక్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి.బోహ్రా ఇండస్ట్రీస్, కాఫీ డే ఎంటర్ప్రైజెస్, ఇండోకో రెమెడీస్, రూబీ మిల్స్, అనుపమ రసాయన్ ఇండియా వంటి కంపెనీలు లాభాల్లో సాగుతున్నాయి. యూనిఇన్ఫో టెలికాం సర్వీసెస్ లిమిటెడ్, మనోరమ ఇండస్ట్రీస్, మంగళం డ్రగ్స్, లాంకోర్ హోల్డింగ్స్, NR అగర్వాల్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు నష్టాల్లో సాగుతున్నాయి.ట్రంప్ సుంకాల ఎఫెక్ట్చైనా ఉత్పత్తులపైన ఇప్పటికే ఉన్న 10 శాతం సుంకాన్ని, 20 శాతానికి పెంచుతూ.. దీనికి సంబంధించిన సంబంధించిన ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. మెక్సికో, కెనడా దిగుమతులపై విదించనున్న 25 శాతం సుంకాల విషయంలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇవి మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సోమవారం సెషన్ను నష్టాలతో ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 112.16 పాయింట్లు (0.15 శాతం) క్షీణించి 73,085.94 వద్ద స్థిరపడింది. ఈరోజు సూచీ 73,649.72 - 72,784.54 రేంజ్లో ట్రేడ్ అయింది.నిఫ్టీ 50 కేవలం 5.40 పాయింట్లు లేదా 0.02 శాతం క్షీణించి 22,119.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 రోజు గరిష్ట స్థాయి 22,261 వద్ద, రోజు కనిష్ట స్థాయి 22,004 వద్ద నమోదయ్యాయి. విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ 0.14 శాతం లాభపడగా, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 సూచీ సోమవారం 0.27 శాతం నష్టపోయింది. భారత్ ఎలక్ట్రానిక్స్, గ్రాసిమ్, ఐషర్ మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు 4.65 శాతం వరకు లాభపడటంతో నిఫ్టీ 50లోని 50 షేర్లలో 33 షేర్లు లాభాల్లో ముగిశాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం భారతదేశపు అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.17 శాతం క్షీణించింది.నిఫ్టీ 50లో కోల్ ఇండియా, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 2.44 శాతం వరకు నష్టపోయాయి. సెక్టోరల్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ ఐటీ, మెటల్, ఆటో, ఫార్మా, రియల్టీ, హెల్త్కేర్ సూచీలు 1.26 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు ఎన్ఎస్ఈలో బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా సూచీలు 1.10 శాతం వరకు నష్టాల్లో ముగిశాయి. -
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
-
లాభాల నుంచి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు
ఉదయ 9:20 గంటలకు లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 10:10 గంటలకు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 368.28 పాయింట్ల నష్టంతో 72,829.82 పాయింట్ల వద్ద, నిఫ్టీ 94.75 పాయింట్ల నష్టంతో.. 22,029.95 వద్ద సాగుతున్నాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం శుభారంభం పలికాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 418.78 పాయింట్లు లేదా 0.52 శాతం లాభంతో.. 73580.80 వద్ద, నిఫ్టీ 132.00 పాయింట్లు లేదా 0.60 శాతం లాభంతో.. 22,256.70 వద్ద సాగుతున్నాయి.బోహ్రా ఇండస్ట్రీస్, కాఫీ డే ఎంటర్ప్రైజ్, రూబీ మిల్స్, రానా షుగర్స్, ఇమామి పేపర్ మిల్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఇంటర్నేషనల్ జెమ్మాలజీ ఇన్స్టిట్యూట్ ఇండియా, కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మనోరమ ఇండస్ట్రీస్, కర్మ ఎనర్జీ, హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్, సువెన్ ఫార్మాస్యూటికల్స్ వంటివి నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
మార్చిలో 12 రోజులు స్టాక్ మార్కెట్ క్లోజ్!
ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చిలో ముగియనుంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ నెలలో ట్రేడింగ్కు సిద్ధమవుతున్నారు. అయితే ట్రేడింగ్ను బాగా ప్లాన్ చేయడానికి మార్చి నెలలో స్టాక్ మార్కెట్ ఏయే రోజుల్లో పనిచేస్తుంది.. ఎప్పుడు మూసివేత ఉంటుంది అన్నది తెలుసుకోవడం మంచిది. ఈ హాలిడే క్యాలెండర్ ను స్టాక్ ఎక్స్ఛేంజీలు జారీ చేస్తాయి. తమ అధికారిక వెబ్ సైట్లలో ఇవి అందుబాటులో ఉంటాయి.బీఎస్ఈ ప్రతి సంవత్సరం పూర్తి ట్రేడింగ్ హాలిడేస్ జాబితాను ప్రచురిస్తుంది. సాధారణంగా ఈ జాబితాలో పండుగలు, జాతీయ సెలవులు, వారాంతపు సెలవులు ఉంటాయి. బడ్జెట్ సమర్పణ వంటి ప్రత్యేక సందర్భాలు మినహా అన్ని వారాంతాల్లో స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్కు అందుబాటులో ఉండవు. అందువల్ల మార్కెట్ షెడ్యూల్ను తెలుసుకుని తదనుగుణంగా ట్రేడింగ్ను ప్లాన్ చేయడానికి ఇన్వెస్టర్లు సెలవుల జాబితాపై ఆధారపడాలి.మార్చిలో స్టాక్ మార్కెట్ కు 12 రోజులు సెలవులు ఉంటాయి. ఇన్వెస్టర్లు ఈ రోజుల్లో మార్కెట్లో ఎలాంటి ట్రేడింగ్ లు చేయలేరు. వారాంతపు సెలవులతో పాటు ఈ నెలలో హోలీ, రంజాన్ పండుగకు కూడా మార్కెట్లు మూతపడతాయి. అందువల్ల మార్చిలో చివరి ట్రేడింగ్ రోజు 28వ తేదీ. ఎందుకంటే 29, 30 తేదీలు వారాంతపు సెలవులు. ఆ రోజుల్లో మార్కెట్లు పనిచేయవు.మార్చిలో స్టాక్ మార్కెట్ సెలవులు ఇవే» మార్చి 1 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 2 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 8 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 9 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 14 శుక్రవారం హోలీ» మార్చి 15 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 16 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 22 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 23 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 29 శనివారం వీకెండ్ హాలిడే» మార్చి 30 ఆదివారం వీకెండ్ హాలిడే» మార్చి 31 సోమవారం ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) -
భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
-
ట్రంప్ ఎఫెక్ట్.. స్టాక్మార్కెట్లు అల్లకల్లోలం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటన శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లో కల్లోలం సృష్టించింది. మార్చి 4నుంచి కెనడా, మెక్సికోలపై సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆ ప్రకటన దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దీంతో మదుపర్లు ఇవాళ ఒక్కరోజే రూ.10లక్షల కోట్లు నష్టపోయారు.అంతర్జాతీయ ప్రతికూల అంశాలతో ఈ వారం ప్రారంభం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలతో కొనసాగాయి. మార్కెట్లో చివరి రోజున శుక్రవారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ మొత్తంలో సంపద ఆవిరైంది. ఫలితంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. మదుపరుల సంపదను లక్షల కోట్ల రూపాయల్లో కరిగించేశాయి. ఈ వారంలో మదుపర్లు సుమారు రూ.30లక్షల కోట్లకు పైగా నష్టపోయినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక ట్రంప్ సుంకాల ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. 10 శాతం అధిక సుంకాలు విధిస్తామని చైనాను ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ సుంకాల ప్రకటన అనంతరం బలహీనమైన ప్రపంచ సంకేతాల మధ్య ఈక్విటీ బెంచ్ మార్క్ సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. 400 పాయింట్ల ప్రతికూల గ్యాప్తో ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ 73,141 వద్ద కనిష్టానికి పడిపోయి, చివరకు 1,414 పాయింట్లు లేదా 1.9 శాతం నష్టంతో 73,198 వద్ద ముగిసింది. ఈ క్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ 2,113 పాయింట్లు (2.8 శాతం) నష్టంతో వారాన్ని ముగించింది. అలాగే ఫిబ్రవరి నెలలో 4,303 పాయింట్లు లేదా 5.6 శాతం క్షీణించింది. సెన్సెక్స్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 85,978 నుంచి దాదాపు 15 శాతం నష్టపోయింది.ఇక నిఫ్టీ 1.9 శాతం లేదా 420 పాయింట్ల నష్టంతో 22,125 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫిబ్రవరిలో 5.9 శాతం క్షీణించి, జీవితకాల గరిష్ట స్థాయి 26,277 నుంచి 16 శాతానికి చేరువైంది. నిఫ్టీ గరిష్ట స్థాయి నుంచి 20 శాతం వరకు పడిపోతే బేర్ మార్కెట్ పరిధిలోకి ప్రవేశిస్తుంది.ఐటీ, ఆటో షేర్లు తీవ్రంగా దెబ్బతినడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 7 శాతం నష్టపోయింది. టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్, టైటాన్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా 4- 6 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ 30 షేర్లలో 27 షేర్లు 1 శాతానికి పైగా క్షీణించాయి. సెన్సెక్స్ 30 షేర్లలో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాత్రమే 2 శాతం లాభంతో మెరిసింది.విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ గత 5 సంవత్సరాలలో అతిపెద్ద నెలవారీ పతనాన్ని నమోదు చేసింది. అన్ని రంగాల సూచీలు 1 శాతానికి పైగా నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ ఐటీ, ఆటో సూచీలు 4 శాతం చొప్పున నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
‘బేర్’మంటున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9:50 సమయానికి నిఫ్టీ(Nifty) 273 పాయింట్లు దిగజారి 22,273కు చేరింది. సెన్సెక్స్(Sensex) 908 పాయింట్లు తగ్గి 73,704 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.35 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 73.23 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.22 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 1.59 శాతం తగ్గింది. నాస్డాక్ 2.78 శాతం దిగజారింది.ఇదీ చదవండి: సెబీ కొత్త చీఫ్గా తుహిన్ కాంత పాండేమూడేళ్లుగా అలుపెరుగని లాభాల పరుగు తీసిన నిఫ్టీ, సెన్సెక్స్ ప్రభావంతో లార్జ్ క్యాప్స్తోపాటు.. పలు మధ్య, చిన్నతరహా స్టాక్స్ సైతం భారీగా ఎగశాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఖరీదుగా మారినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో తలెత్తిన ప్రపంచ రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు సెంటిమెంటును బలహీనపరిచాయి. యూఎస్ ప్రెసిడెంట్గా రిపబ్లికన్ ట్రంప్ ఎన్నికవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు అధికమయ్యాయి. ట్రంప్ విధానాలపై అంచనాలతో డాలరు బలపడటం, ట్రెజరీ ఈల్డ్స్ మెరుగుపడటం రూపాయినీ దెబ్బతీసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్థిరంగా కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం అంతకుముందు సెషన్తో పోలిస్తే స్థిరంగా కదలాడుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 8 పాయింట్లు పెరిగి 22,556కు చేరింది. సెన్సెక్స్(Sensex) 15 పాయింట్లు పుంజుకొని 74,626 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 106.6 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.75 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.28 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.01 శాతం పెరిగింది. నాస్డాక్ 0.26 శాతం లాభపడింది.మూడేళ్లుగా అలుపెరుగని లాభాల పరుగు తీసిన నిఫ్టీ, సెన్సెక్స్ ప్రభావంతో లార్జ్ క్యాప్స్తోపాటు.. పలు మధ్య, చిన్నతరహా స్టాక్స్ సైతం భారీగా ఎగశాయి. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఖరీదుగా మారినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో తలెత్తిన ప్రపంచ రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు సెంటిమెంటును బలహీనపరిచాయి. యూఎస్ ప్రెసిడెంట్గా రిపబ్లికన్ ట్రంప్ ఎన్నికవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు అధికమయ్యాయి. ట్రంప్ విధానాలపై అంచనాలతో డాలరు బలపడటం, ట్రెజరీ ఈల్డ్స్ మెరుగుపడటం రూపాయినీ దెబ్బతీసింది.ఇదీ చదవండి: పెట్రోల్లో కలిపే ఇథనాల్ 20 శాతానికి పెంపుఅధికారం చేపట్టాక భారత్సహా పలు దేశాలపై ట్రంప్ ప్రతీకార టారిఫ్లకు దిగడం ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. మరోపక్క జీడీపీ వృద్ధికి దన్నుగా చైనా సహాయక ప్యాకేజీలకు ప్రకటించింది. భారత్తో పోలిస్తే చౌకగా ట్రేడవుతున్న చైనా స్టాక్స్ విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇవి చాలదన్నట్లు దేశ జీడీపీ వృద్ధి కొంత నెమ్మదించడం, అంచనాలు అందుకోని దేశీ కార్పొరేట్ల క్యూ3 ఫలితాలు తదితర అంశాలు ఎఫ్పీఐలను నిరాశపరచినట్లు వివరించారు. దీంతో ప్రధాన ఇండెక్సులను మించి మిడ్, స్మాల్ క్యాప్ కౌంటర్లు పతనమవుతున్నట్లు తెలియజేశారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. సెన్సెక్స్ 147.71 పాయింట్లు లేదా 0.20 శాతం లాభంతో.. 74,602.12 వద్ద, నిఫ్టీ 5.80 పాయింట్లు లేదా 0.026 శాతం నష్టంతో.. 22,547.55 వద్ద నిలిచాయి.మహీంద్రా అండ్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, నెస్ట్లే ఇండియా, మారుతి సుజుకి ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. హిందాల్కో ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, ట్రెంట్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాలకు బ్రేక్.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:54 సమయానికి నిఫ్టీ(Nifty) 58 పాయింట్లు పెరిగి 22,610కు చేరింది. సెన్సెక్స్(Sensex) 281 పాయింట్లు పుంజుకొని 74,743 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 106.62 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.22 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.37 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.5 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.21 శాతం పడిపోయింది.వ్యయ ఒత్తిళ్లు, వాణిజ్య సుంకాల ఆందోళనలతో అమెరికా ఫిబ్రవరి సర్వీసెస్ యాక్టివిటీ 15 నెలల కనిష్టానికి చేరుకుంది. భారత్ ఐటీ రంగానికి అతిపెద్ద మార్కెట్ అమెరికాలో వృద్ధి మందగమనం, ద్రవ్యోల్బణ పెరుగుదల ఆందోళనలు నెలకొన్నాయి. అమెరికా ద్రవ్యోల్బణం, భారత క్యూ3 జీడీపీ వృద్ధి గణాంకాల వెల్లడి ముందు ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తూ అప్రమత్తత వహిస్తున్నారు. ట్రంప్ అధిక టారిఫ్ల అమలుతో ద్రవ్యోల్బణం ఎక్కువ కావచ్చనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.1.01 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి.బుధవారం (26న) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్మార్కెట్లు బేర్.. ఐటీ షేర్లు విలవిల
దేశీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఈ వారం తొలి ట్రేడింగ్ సెషన్ను 1 శాతానికి పైగా నష్టంతో ముగించాయి. సెన్సెక్స్ 856.65 పాయింట్లు (1.14 శాతం) క్షీణించి 74,454.41 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ సూచీ 74,907.04-74,387.44 శ్రేణిలో ట్రేడ్ అయింది.నిఫ్టీ 50 కూడా 242.55 పాయింట్లు (1.06 శాతం) క్షీణించి 22,553.35 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సోమవారం రోజు గరిష్టాన్ని 22,668.05 వద్ద, రోజు కనిష్టాన్ని 22,518.80 వద్ద నమోదు చేసింది.నిఫ్టీ 50లోని 50 షేర్లలో 38 షేర్లు నష్టాల్లో ముగియగా విప్రో, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్ 3.70 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్గా నిలిచాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐషర్ మోటార్స్, హీరో మోటోకార్ప్, నెస్లే ఇండియా వంటి 12 షేర్లు 1.54 శాతం వరకు లాభాల్లో ముగిశాయి.ఇక నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.02 శాతం, 0.94 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో, ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి. బుధవారం (26న) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
రెడ్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ(Nifty) 217 పాయింట్లు నష్టపోయి 22,578కు చేరింది. సెన్సెక్స్(Sensex) 696 పాయింట్లు దిగజారి 74,634 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 106.17 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 74.35 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.43 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 1.71 శాతం నష్టపోయింది. నాస్డాక్ 2.2 శాతం పడిపోయింది.ఇదీ చదవండి: ఆదాయపన్నులో మార్పులు.. తరచూ అడిగే ప్రశ్నలుదేశీ స్టాక్ మార్కెట్లో కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) అమ్మకాలకే ఆసక్తి చూపుతున్నారు. ఈ నెలలోనూ ఇదే బాటలో కొనసాగుతున్నారు. దీంతో ఫిబ్రవరి 3–21 మధ్య నికరంగా రూ.23,710 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య ఆందోళనల మధ్య దేశీ స్టాక్స్లో విక్రయాలకు తెరతీస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా ప్రపంచ పరిణామాలు దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నాయి. బుధవారం (26న) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈవారం మార్కెట్లు ఎలా ఉండబోతాయంటే..
గతవారం సైతం మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్లలో ఓ రకమైన భయాందోళనలు నెలకొన్నాయి. ఏమాత్రం కొనుగోళ్ల మద్దతు లభిస్తున్నా వెంటనే విదేశీ మదుపర్లు విక్రయాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే మదుపర్లు ఇప్పట్లో తేరుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అమెరికా వాణిజ్య విధానాల్లో స్పష్టత కొరవడటం, ముఖ్యంగా టారిఫ్ల విషయంలో ట్రంప్ ధోరణి అంతుచిక్కకపోవడం మార్కెట్లకు ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండటమూ ప్రతికూలంగా మారింది. రూపాయి బలహీనతలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. గతవారం మొత్తానికి సెన్సెక్స్ 0.56%, నిఫ్టీ 0.51% శాతం క్షీణించాయి. సెన్సెక్స్ 425 పాయింట్లు నష్టపోయి పెరిగి 75311 వద్ద, నిఫ్టీ 117 పాయింట్లు కోల్పోయి 22795 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకు నిఫ్టీ సైతం ఇందుకు మినహాయింపు కాదు. మరోపక్క నిఫ్టీ మిడ్క్యాప్ సూచీ 1.7 శాతం, స్మాల్క్యాప్ సూచీ 1.5 శాతం పెరిగాయి.ఈవారంఇప్పటికే మార్కెట్లు భారీ స్థాయిలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సాంకేతిక స్థాయులను పరిశీలిస్తే కచ్చితంగా ఈవారం సాంకేతిక మద్దతు లభించొచ్చు. ఇదే జరిగితే ఉపశమన ర్యాలీ ఖాయం. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఈనెల 28 న గణాంకాలు వెలువడతాయి. అలాగే ఈనెల 27 న అమెరికా జీడీపీ తాలూకు గణాంకాలు వెలువడనున్నాయి. ఇవి మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. నిరుద్యోగ డేటా కూడా ఈవారాంతంలో రానుంది. అమెరికా ఎకనామిక్ డేటా గతవారం అక్కడి మార్కెట్లను బాగా పడేసింది. దీని ప్రభావం సోమవారం వివిధ ఆసియా మార్కెట్లపై పడింది. చైనా, హాంకాంగ్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మన మార్కెట్లు కూడా ఈవారాన్ని నష్టాలతోనే ప్రారంభించొచ్చు. సాధారణంగా మధ్యాహ్నం ఒంటిగంటన్నర తర్వాత రంగంలోకి దిగి విస్తృత స్థాయిలో అమ్మకాలు జరిపే విదేశీ మదుపర్లు ఇప్పుడు రూటు మార్చారు. పొద్దున్న ట్రేడింగ్ ప్రారంభమైన అరగంటలోనే తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఒకసారి మార్కెట్లు పడిపోయాక రోజు మొత్తంలో మళ్లీ తేరుకోవడం చాలా కష్టమవుతోంది. షేర్లలో కదలికలు చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నాయి. అదే సమయంలో సూచీల్లో మాత్రం విపరీతమైన ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. దీనివల్ల ట్రేడర్లకు భారీ నష్టాలే మిగులుతున్నాయి. ఈ ట్రెండ్ను గమనించి ముందుకెళ్లడం అవసరం.విదేశీ మదుపర్లువిదేశీ మదుపర్లు ఎటువంటి సానుకూల ప్రకటనలనూ పెద్దగా పట్టించుకోవడం లేదు. నిరంతర అమ్మకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. చైనా మార్కెట్ వారికిప్పుడు ప్రోత్సాహకరంగా కనిపిస్తోంది. దీంతో వీరు మన మార్కెట్లో అమ్మకాలకు పాల్పడుతూ పెట్టుబడులను అటువైపు తరలిస్తున్నారు. గత జనవరి నెల మొత్తానికి వీరు రూ.87,000 కోట్ల విక్రయాలు జరిపిన విషయం తెల్సిందే. ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకు రూ.36,976 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు మాత్రం యథావిధిగా మార్కెట్కు మద్దతుగా నిలిచారు. వీరు ఈ నెలలో ఇప్పటివరకు రూ.42,601 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్ను ఆదుకునే ప్రయత్నాలు చేశారు.సాంకేతిక స్థాయిలుఅడపాదడపా కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ నిఫ్టీ ఇప్పటికీ బేర్ ఆపరేటర్ల గుప్పిట్లోనే ఉందని చెప్పొచ్చు. సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఈవారం కొంత కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశాలు లేకపోలేదు. నిఫ్టీకి 23000-200 స్థాయి చాలా కీలకం. దీన్ని దాటి ముందుకెళ్తే మాత్రం తొలుత 23,400, ఆ తర్వాత 23,600 స్థాయి ని చేరే అవకాశం ఉంటుంది. అలాకాక అమ్మకాల ఒత్తిడి కొనసాగితే మాత్రం 22,600 అనేది ప్రధాన స్థాయిగా భావించొచ్చు. దీన్ని బ్రేక్ చేసి కిందకెళ్లిపోతే మాత్రం 22,500 వద్ద తొలి మద్దతు లభించొచ్చు. దీన్ని కూడా ఛేదించి పడిపోతే 22,350, ఆతర్వాత 22,000 స్థాయులను పరీక్షించే అవకాశం ఉంటుంది.రంగాలవారీగాఆయా సెక్టార్లకు సంబంధించి వెలువడే ప్రకటనలు సంబంధిత రంగాల షేర్లను ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో ఒడుదొడుకులు కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈమధ్య కాలంలో మార్కెట్లకు పెనుశాపంగా మారిన విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు ఈవారమూ కొనసాగవచ్చు. రంగాలవారీగా చూస్తే ఫార్మా, వాహన రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చు. ట్రంప్ నిర్ణయాల ప్రభావంతో ఐటీ షేర్లు సైతం నష్టాల బాటలో కొనసాగొచ్చు. యంత్ర పరికరాలు, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు ఓ పరిమితికి లోబడి కదలాడొచ్చు. బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవచ్చు. లోహ, సిమెంట్ రంగాల్లో కొనుగోళ్లకు అవకాశం ఉండగా, చమురు, టెలికాం రంగాల్లో పరిమిత స్థాయిలో కదలికలు ఉండొచ్చు. వచ్చే నెల 28వ తేదీ నుంచి బ్రిటానియా, భారత్ పెట్రోలియం స్థానంలో జొమాటో, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు నిఫ్టీ-50లో అడుగుపెట్టబోతున్నాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, హ్యుందాయ్ మోటార్, ఇండియన్ హోటల్స్, బెల్, ఐఆర్సీటీసీ, స్విగ్గీ, అదానీ టోటల్ గ్యాస్, ఎన్హెచ్పీసీ షేర్లపైనా దృష్టి సారించొచ్చు. ఇక మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారాంతానికి 3.23 శాతం క్షీణించి 14.53 దగ్గర ఉంది. 14 శాతం దిగువకు వచ్చేవరకు బుల్స్ ఆచితూచి వ్యవహరించాల్సిందే.మహా శివరాత్రి సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
నష్టాలతో ముగిసిన మార్కెట్లు.. టాప్ లూజర్స్ ఇవే..
దేశీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్ను ప్రతికూలంగా ముగించాయి. 30-షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 424.90 పాయింట్లు లేదా 0.56 శాతం నష్టంతో 75,311.06 వద్ద స్థిరపడింది. ఈరోజు ఇండెక్స్ 75,748.72 నుండి 75,112.41 పరిధిలో ట్రేడైంది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 127.25 పాయింట్లు లేదా 0.51 శాతం తగ్గి 22,795.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 22,921ను నమోదు చేయగా, కనిష్ట స్థాయి 22,720 గా ఉంది. నిఫ్టీ 50లోని 50 కాంపోనెంట్ స్టాక్లలో 35 నష్టాల్లో ముగిశాయి. మహీంద్రా & మహీంద్రా, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, టాటా మోటార్స్, విప్రో షేర్లు 6.20 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్గా నిలిచాయి.శుక్రవారం నిఫ్టీ మిడ్క్యాప్100, నిఫ్టీ స్మాల్క్యాప్100 సూచీలు వరుసగా 1.32 శాతం, 0.70 శాతం నష్టాలతో స్థిరపడటంతో విస్తృత మార్కెట్లు కూడా బెంచ్మార్క్లను ప్రతిబింబించాయి. నిఫ్టీ మెటల్ తప్ప మిగతా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆటో అత్యధికంగా నష్టపోయింది. ఇది 2.58 శాతం తగ్గింది. నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, హెల్త్కేర్, రియాల్టీ, ఫార్మా, ఓఎంసీ సూచీలు ఒక్కొక్కటి 1 శాతానికి పైగా నష్టంతో స్థిరపడ్డాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇక్కడి లాభాలు అక్కడికి.. ఎఫ్ఐఐల తీరుపై ఉదయ్కోటక్ స్పందన
భారత స్టాక్ మార్కెట్లో ఇటీవల పెద్దమొత్తంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) తమ పెట్టుబడులను ఉపసంహరిస్తున్నారు. రోజూ సుమారు రూ.3,000 కోట్లకు పైగా విక్రయాలు చేస్తున్నారు. ఈ ప్రభావం పెరుగుతుండటంపై కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్కోటక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ‘ఛేజింగ్ గ్రోత్ 2025 ఇన్వెస్టర్ ఈవెంట్’లో ఆయన మాట్లాడారు. స్టాక్ మార్కెట్లో నిరంతరం పెట్టుబడి పెడుతున్న దేశీయ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఎఫ్ఐఐలు ఎలా ప్రయోజనం పొందుతున్నారో వివరించారు.‘భారత్లో స్టాక్ వాల్యుయేషన్లు పెరగడం వల్ల విదేశీ ఇన్వెస్టర్లు తమ నిధులను ఉపసంహరించడం అధికమైంది. దేశం అంతటా రిటైలర్లు రోజూ ఈక్విటీల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఇది దేశీయ సంస్థాగత ప్రవాహాలకు సాయపడుతుంది. అయితే, ఎఫ్ఐఐలు లాభాలు సంపాదించడానికి కూడా ఇదే కారణమవుతుంది. భారత మార్కెట్లో వారు లాభాలు గడించి ఇతర ప్రపంచ మార్కెట్లకు వాటిని తరలిస్తున్నారు. యూఎస్ డాలర్ బలపడుతుండడంతో ఎఫ్ఐఐలు భారతదేశం సహా వర్ధమాన మార్కెట్ల నుంచి మూలధనాన్ని ఉపసంహరించుకుంటున్నారు. ప్రస్తుతం 4.5 శాతానికి పైగా ఉన్న అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం కూడా భారత మార్కెట్లు కుప్పకూలడానికి కారణం’ అని చెప్పారు.ఇదీ చదవండి: తేమ నుంచి తాగునీటి ఉత్పత్తికి ఏర్పాట్లు చేసిన ఐసీఐసీఐ బ్యాంక్ఇప్పటికే ఎఫ్ఐఐలు, ఎఫ్డీఐలు భారత్లోని చాలా కంపెనీల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకున్నాయని కోటక్ తెలిపారు. అధిక వాల్యుయేషన్ల కారణంగా వర్ల్పూల్, హ్యుందాయ్ వంటి కంపెనీలు భారత్లో తమ హోల్డింగ్స్ను తగ్గించుకున్నాయని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఈ ఉపసంహరణ తంతు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయని చెప్పారు. ఇది మరింతగా పెరిగితే ఆర్బీఐ తన రిజర్వ్లను అధికంగా ఉపయోగించాల్సి ఉంటుందని తెలిపారు. లేదా రూపాయి బలహీనపడే ప్రమాదం ఉందని అంచనా వేశారు. -
స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ(Nifty) 23 పాయింట్లు నష్టపోయి 22,891కు చేరింది. సెన్సెక్స్(Sensex) 75 పాయింట్లు దిగజారి 75,658 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 106.4 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76.45 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.49 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.43 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.47 శాతం పడిపోయింది.డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలతో నెలకొన్న అనిశ్చితుల మధ్య చోటుచేసుకునే అంతర్జాతీయ పరిణామాలపైకి ఇన్వెస్టర్ల దృష్టి మళ్లొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికి అదనంగా డాలర్తో రూపాయి తీరు, బ్రెండ్ క్రూడ్ ధరలు సైతం ప్రభావం చూపించొచ్చని భావిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, కరెన్సీ మారకంపై మార్కెట్ దృష్టి సారించొచ్చని అభిప్రాయపడ్డారు. దేశీయంగా ఎలాంటి ముఖ్యమైన సంకేతాలు లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్ తీరును నిర్ణయించొచ్చని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 203.22 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టంతో 75,735.96 వద్ద, నిఫ్టీ 19.75 పాయింట్లు లేదా 0.086 శాతం నష్టంతో 22,913.15 వద్ద నిలిచాయి.శ్రీరామ్ ఫైనాన్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ పోర్ట్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలోకి చేరాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా, టెక్ మహీంద్రా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లోనే స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ(Nifty) 72 పాయింట్లు నష్టపోయి 22,864కు చేరింది. సెన్సెక్స్(Sensex) 290 పాయింట్లు దిగజారి 75,639 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.05 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.51 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.24 శాతం లాభపడింది. నాస్డాక్ 0.07 శాతం పెరిగింది.ఇదీ చదవండి: పాలసీ జారీ తర్వాతే ప్రీమియం వసూలుడొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలతో నెలకొన్న అనిశ్చితుల మధ్య చోటుచేసుకునే అంతర్జాతీయ పరిణామాలపైకి ఇన్వెస్టర్ల దృష్టి మళ్లొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికి అదనంగా డాలర్తో రూపాయి తీరు, బ్రెండ్ క్రూడ్ ధరలు సైతం ప్రభావం చూపించొచ్చని భావిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, కరెన్సీ మారకంపై మార్కెట్ దృష్టి సారించొచ్చని అభిప్రాయపడ్డారు. దేశీయంగా ఎలాంటి ముఖ్యమైన సంకేతాలు లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్ తీరును నిర్ణయించొచ్చని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్ళీ నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు
బుధవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలనే చవిచూశాయి. సెన్సెక్స్ 94.24 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టంతో 75,873.15 వద్ద, నిఫ్టీ 28.15 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టంతో 22,917.15 పాయింట్ల వద్ద నిలిచాయి.భారత్ ఎలక్ట్రానిక్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, లార్సెన్ అండ్ టుబ్రో వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనీలీవర్, అదానీ ఎంటర్ప్రైజెస్ వంటివి నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ నష్టాలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:26 సమయానికి నిఫ్టీ(Nifty) 96 పాయింట్లు నష్టపోయి 22,852కు చేరింది. సెన్సెక్స్(Sensex) 322 పాయింట్లు దిగజారి 75,653 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.02 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.54 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.24 శాతం లాభపడింది. నాస్డాక్ 0.07 శాతం పెరిగింది.ఇదీ చదవండి: పీఎన్బీలో రూ.271 కోట్ల ఫ్రాడ్రూ.400 లక్షల కోట్ల దిగువకు సంపద స్టాక్ మార్కెట్ పతనం నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.400 లక్షల కోట్ల దిగువకు చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే రూ.2.10 లక్షల కోట్లు హరించుకుపోయాయి. గతేడాది ఏప్రిల్ 8న బీఎస్ఈ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ.400 లక్షల కోట్ల మార్క్ను అందుకుంది. గత సెప్టెంబర్ 27న జీవితకాల గరిష్టం రూ.479 లక్షల కోట్లకు చేరుకుంది. నాటి నుంచి నాటి నుంచి ఏకంగా రూ.81 లక్షల కోట్లు హరించుకుపోయింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: ఆరంభ నష్టాల నుంచి తేరుకొన్న స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఇంట్రాడేలో 466 పాయింట్ల పతనం నుంచి కోలుకున్న సెన్సెక్స్ చివరికి 29 పాయింట్ల నష్టంతో 75,967 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 14 పాయింట్లు నష్టపోయి 22,945 వద్ద నిలిచింది. దీంతో సూచీల లాభాలు ఒకరోజుకు పరిమితమయ్యాయి. ఉదయం సానుకూలంగా మొదలైన సూచీలు రోజంతా కాసేపు లాభాల్లో ట్రేడయ్యాయి.ఇండస్ట్రియల్, కన్జూమర్ డ్యూరబుల్స్, టెలికం, క్యాపిటల్ గూడ్స్, ఆటో, కన్జూమర్ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో మిడ్ సెషన్ కల్లా సెన్సెక్స్ 466 పాయింట్లు క్షీణించి 75,531 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 22,801 వద్ద కనిష్టాన్ని నమోదు చేశాయి. అయితే మిడ్సెషన్ నుంచి ఐటీ, వినిమయ, ఆయిల్అండ్గ్యాస్, ఇంధన షేర్లు రాణించడంతో స్వల్ప నష్టాలతో ముగిశాయి.డాలర్ ఇండెక్స్, క్రూడాయిల్ ధరలు పుంజుకోవడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 10 పైసలు బలహీనపడి 86.98 వద్ద స్థిరపడింది. ⇒ అధిక వాల్యుయేషన్ల ఆందోళనలతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో అమ్మకాలు కొనసాగాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2% క్షీణించింది. మిడ్ క్యాప్ సూచీ 0.19 శాతం నష్టపోయింది. రూ.400 లక్షల కోట్ల దిగువకు సంపద స్టాక్ మార్కెట్ పతనం నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.400 లక్షల కోట్ల దిగువకు చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే రూ.2.10 లక్షల కోట్లు హరించుకుపోయాయి. గతేడాది ఏప్రిల్ 8న బీఎస్ఈ మార్కెట్ క్యాప్ తొలిసారి రూ.400 లక్షల కోట్ల మార్క్ను అందుకుంది. గత సెప్టెంబర్ 27న జీవితకాల గరిష్టం రూ.479 లక్షల కోట్లకు చేరుకుంది. నాటి నుంచి నాటి నుంచి ఏకంగా రూ.81 లక్షల కోట్లు హరించుకుపోయింది. -
నష్టాల్లో కదలాడుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 42 పాయింట్లు నష్టపోయి 22,918కు చేరింది. సెన్సెక్స్(Sensex) 83 పాయింట్లు దిగజారి 75,919 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 106.92 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.45 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.51 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.01 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.41 శాతం పెరిగింది.ఇదీ చదవండి: అడ్వైజర్లు, అనలిస్టులు అన్ని వివరాలు ఇవ్వాల్సిందేఎడాపెడా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) అమ్మకాలతో ఆందోళన చెందుతున్న మదుపరులకు కాస్త ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పెట్టుబడులపై మంచి రాబడులను అందించే పటిష్ట స్థితిలో భారత ఎకానమీ ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నారని ఆమె చెప్పారు. ‘ఎఫ్ఐఐలు తమకు అనువైనప్పుడు లేదా లాభాలను స్వీకరించే అవకాశం ఉన్నప్పుడు వైదొలుగుతూ ఉంటారు. భారత ఎకానమీలో నేడు పెట్టుబడులపై మంచి రాబడులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దానికి తగ్గట్లే లాభాల స్వీకరణ కూడా జరుగుతోంది’ అని తెలిపారు. ఎఫ్ఐఐలు గతేడాది అక్టోబర్ నుంచి రూ.1.56 లక్షల కోట్ల మేర స్టాక్స్ అమ్మగా.. ఇందులో ఏకంగా రూ.లక్ష కోట్ల స్టాక్స్ విక్రయాలు ఈ ఏడాది స్వల్ప కాలంలోనే నమోదవడం తెలిసిందే.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
తొమ్మిది సెషన్ల నుంచి నష్టాలే..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దాంతో సూచీలు వరుసగా తొమ్మిది సెషన్లుగా నష్టాల్లో ట్రేడవుతున్నట్లు తెలుస్తుంది. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 103 పాయింట్లు నష్టపోయి 22,835కు చేరింది. సెన్సెక్స్(Sensex) 309 పాయింట్లు దిగజారి 75,621 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 106.67 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 74.81 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.47 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.01 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.41 శాతం పెరిగింది.ఇదీ చదవండి: బుల్స్ అప్రమత్తంగా ఉండాల్సిందే..డిసెంబర్ త్రైమాసికం ఫలితాలు ముగిసిపోయాయి. డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలతో నెలకొన్న అనిశ్చితుల మధ్య చోటుచేసుకునే అంతర్జాతీయ పరిణామాలపైకి ఇన్వెస్టర్ల దృష్టి మళ్లొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికి అదనంగా డాలర్తో రూపాయి తీరు, బ్రెండ్ క్రూడ్ ధరలు సైతం ప్రభావం చూపించొచ్చని భావిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, కరెన్సీ మారకంపై మార్కెట్ దృష్టి సారించొచ్చని అభిప్రాయపడ్డారు. దేశీయంగా ఎలాంటి ముఖ్యమైన సంకేతాలు లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్ తీరును నిర్ణయించొచ్చని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బుల్స్ అప్రమత్తంగా ఉండాల్సిందే..
భారీ ఆటుపోట్లు చవిచూసిన మార్కెట్లు గతవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లను ఓ రకమైన నిస్తేజం ఆవరించింది. పెరగడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారీ అమ్మకాల ఒత్తిడి ఎదురవుతూనే ఉంది. ముఖ్యంగా మార్కెట్లలో కొనుగోళ్లు పెరుగుతున్న తరుణంలో వెంటనే విదేశీ మదుపర్లు రంగంలోకి దిగి విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. ఈ ధోరణి మదుపరులకు చుక్కలు చూపిస్తోంది. మరోపక్క యథావిధిగానే కార్పొరేట్ ఫలితాలు ఉసూరుమనిపించాయి. అమెరికా వాణిజ్య విధానాల్లో స్పష్టత లేకపోవడం, ముఖ్యంగా టారిఫ్ల విషయంలో ట్రంప్ ధోరణి అంతుచిక్కకపోవడం మార్కెట్లకు ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. అదే సమయంలో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడంతో రాబోయే రోజుల్లో వడ్డీ రేట్ల కొత్త విషయంలో సందేహం నెలకొంది.పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరుత్సాహకారంగా ఉండటమూ ప్రతికూలంగా మారింది. గత వారాంతాన వడ్డీరేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్ననిర్ణయం సంతృప్తికరంగానే ఉన్నా మార్కెట్కు అది పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. రూపాయి బలహీనతలు పుండు మీద కారంలా మారాయి. చమురు ధరలు కాస్త ఫర్వాలేదనిపిస్తున్నాయి. గతవారం మొత్తానికి సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 2.5 శాతం క్షీణించాయి. సెన్సెక్స్ 1921 పాయింట్లు నష్టపోయి పెరిగి 75,939 వద్ద, నిఫ్టీ 631 పాయింట్లు కోల్పోయి 22929 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 7.4 శాతం, స్మాల్ క్యాప్ 9.4 శాతం పడిపోయాయి. బ్యాంకు నిఫ్టీ సైతం ఇందుకు మినహాయింపు కాదు.ఈవారం మార్కెట్లు..ఇప్పటికే మార్కెట్లు భారీ స్థాయిలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈతరుణంలో ఈవారం కొంత ఉపశమన ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. అయితే అధిక స్థాయిల వద్ద లాభాల స్వీకరణ రూపంలో విక్రయాలను తోసిపుచ్చలేం. కార్పొరేట్ సంస్థల ఆర్థిక ఫలితాలు ముగిశాయి. దీంతో ట్రెండ్నుబట్టే మార్కెట్లో కదలికలు ఉండొచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ తాలూకు మినిట్స్, అలాగే మన ఆర్బీఐ వెలువరించిన క్రెడిట్ పాలసీ మినిట్స్పై మార్కెట్లు దృష్టి సారిస్తాయి. మరోపక్క రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. అమెరికా ఆధ్వర్యంలో జరిగే ఈ చర్చలు సానుకూలంగా ముగిస్తే మార్కెట్లకు కొండంత బలాన్ని ఇస్తాయి.అమెరికా జాబ్ డేటా, బ్రిటన్, జపాన్, జర్మనీ తదితర దేశాల పీఎమ్ఐ గణాంకాలపైనా ఓ కన్నేసి ఉంచొచ్చు. ఇంతకు మించి పెద్దగా ప్రభావిత అంశాలేవీ ఈవారం లేవు. రంగాలవారీగా ఆయా సెక్టార్లకు సంబంధించి వెలువడే ప్రకటనలు సంబంధిత రంగాల షేర్లను ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో ఒడుదొడుకులు కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈమధ్య కాలంలో మార్కెట్లకు పెనుశాపంగా మారిన విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు ఈవారమూ కొనసాగవచ్చు.రూపాయి కదలికలుఅమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి నానాటికీ బలహీనపడుతూనే ఉంది. గతవారం స్థాయికి చేరుకున్న రూపాయి మార్కెట్లకు చుక్కలు చూపిస్తోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రూ.88 చేరడం రిజర్వు బ్యాంకు చేపట్టిన కొన్ని చర్యల కారణంగా గత వారం చివర్లో తేరుకోగలిగింది. దాదాపు 1.15 రూపాయలు పెరిగి 86.58 వద్ద స్థిరపడింది. ఈవారం కూడా రిజర్వ్ బ్యాంకు రంగంలోకి దిగుతుందా... డాలర్లను భారీ స్థాయిలో విక్రయిస్తుండగా... రూపాయిని మరింత పడిపోనివ్వకుండా ఆదుకుంటుందా అనే విషయాలను నిశితంగా పరిశీలించాలి.విదేశీ మదుపర్లుమార్కెట్ వర్గాలకు సంబంధించి కీలక ప్రకటనలేవీ లేకపోయినప్పటికీ సమాజంలోని అన్ని వర్గాలను సంతృప్తి పరిచే స్థాయిలోనే బడ్జెట్ ఉంది. కానీ దీన్ని విదేశీ మదుపర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాగే వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్నీ వీరు పట్టించుకోలేదు. నిరంతర అమ్మకాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో ఓ స్పష్టత రావడం, కార్పొరేట్ సంస్థల ఫలితాలు మెరుగుపడటం జరిగే వరకూ వీరి అమ్మకాల ధోరణిలో మార్పు రాకపోవచ్చని నిపుణులు చెబుతున్నప్పటికీ కొంత ఉపశమనాన్ని కలిగించే విధంగా వీరు వ్యవహరించవచ్చనే చెప్పొచ్చు. గత జనవరి నెల మొత్తానికి వీరు రూ.87,000 కోట్ల విక్రయాలు జరిపిన విషయం తెల్సిందే. ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకు రూ.29,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు మాత్రం యధావిధిగా మార్కెట్ కు మద్దతుగా నిలిచారు. వీరు ఈ నెలలో ఇప్పటివరకు రూ.26,000 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్ ను ఆదుకునే ప్రయత్నాలు చేశారు.ఇదీ చదవండి: అంకెలు మారాయి కానీ.. ప్రశ్న మారలేదు..సాంకేతిక స్థాయులుఅడపాదడపా కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ నిఫ్టీ ఇప్పటికీ బేర్ ఆపరేటర్ల గుప్పిట్లోనే ఉందని చెప్పొచ్చు. సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఈవారం కొంత కొనుగోళ్ల మద్దతు లభించే అవకాశాలు లేకపోలేదు. నిఫ్టీకి 23250-300 స్థాయి చాలా కీలకం. దీన్ని దాటి ముందుకెళ్తే మాత్రం తొలుత 23,500, ఆ తర్వాత 23,750 స్థాయి ని చేరే అవకాశం ఉంటుంది. అలాకాక అమ్మకాల ఒత్తిడి కొనసాగితే మాత్రం 22,900 అనేది ప్రధాన స్థాయిగా భావించొచ్చు. దీన్ని బ్రేక్ చేసి కిందకెళ్ళిపోతే మాత్రం 22,750 వద్ద తొలి మద్దతు లభించొచ్చు. దీన్ని కూడా ఛేదించి పడిపోతే 22,500, ఆతర్వాత 22,300 స్థాయిలను పరీక్షించే అవకాశం ఉంటుంది. రంగాలవారీగా చూస్తే ఫార్మా షేర్లకు మద్దతు లభించవచ్చు. లోహ, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు ఓ పరిమితికి లోబడి కదలాడొచ్చు. బ్యాంకింగ్ షేర్లు అమ్మక ఒత్తిడి ఎదుర్కోవచ్చు. సిమెంట్ రంగంలో కొనుగోళ్ళకు అవకాశం ఉండగా, కేపిటల్ గూడ్స్, ఆటోమొబైల్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చు. ఇక మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారాంతానికి 9.72 శాతం పెరిగి 15.02 దగ్గర ఉంది. బుల్స్ అప్రమత్తంగా ఉండాలి అనేందుకు ఇది సంకేతం.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 50 102.15 పాయింట్లు లేదా 0.44 శాతం తగ్గి 22,929.25 వద్ద ముగిసింది. ఈ రోజు ఈ ఇండెక్స్ గరిష్టంగా 23,133.7 వద్ద, కనిష్టంగా 22,774.85 వద్ద నమోదైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 199.76 పాయింట్లు లేదా 0.26 శాతం తగ్గి 75,939.21 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ గరిష్టం 76,138.97, కనిష్టం 75,439.64 వద్ద నమోదైంది.బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే, ఇన్ఫోసిస్, టీసీఎస్ స్టాక్స్ టాప్ గెయినర్స్గా లాభాలను అందుకోగా, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ట్రెంట్, సన్ ఫార్మా షేర్లు టాప్ లూజర్స్గా నష్టాలను చవిచూశాయి. భారత్ సహా ఇతర దేశాలపై రెసీప్రోకల్ టారిఫ్లను విధిస్తాననే నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకోవడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. మధ్యాహ్న సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడయ్యాయి.నిఫ్టీ స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ శుక్రవారం అధికారికంగా 'బేర్' దశలోకి ప్రవేశించింది. ఇండెక్స్ దాని గరిష్ట స్థాయి 19,716.20 నుండి దాదాపు 22 శాతం పడిపోయింది. శుక్రవారం ఇండెక్స్ దాదాపు 4 శాతం నష్టపోయి 15,373.70 స్థాయిల వద్ద ముగిసింది. శుక్రవారం నాటి పతనం విస్తృత మార్కెట్లలో అంతటా అమ్మకాల ఒత్తిడితో జరిగింది. దీంతో మిడ్క్యాప్లు కూడా బలహీనంగా ముగిశాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 150 ఇండెక్స్ శుక్రవారం ట్రేడింగ్లో దాదాపు 2.5 శాతం నష్టపోయి 18,325.40 స్థాయిల వద్ద ముగిసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్థిరంగా కదలాడుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:33 సమయానికి నిఫ్టీ(Nifty) 2 పాయింట్లు పెరిగి 23,034కు చేరింది. సెన్సెక్స్(Sensex) 54 పాయింట్లు ఎగబాకి 76,174 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.05 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.17 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.53 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 1.04 శాతం పుంజుకుంది. నాస్డాక్ 1.5 శాతం పెరిగింది.ఇదీ చదవండి: వాహన జోరుకు యూవీల తోడునిన్నటి ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ నేపథ్యంలో తీవ్ర ఒడిదుడులకు లోనయ్యాయి. ట్రేడింగ్లో అధిక సమయం లాభాల్లో కదలాడాయి. ఫార్మా, మెటల్, ఫైనాన్స్, విద్యుత్, టెలికం షేర్లుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అమెరికా జనవరి ద్రవ్యోల్బణం అంచనాలకు మించడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలు రేకెత్తాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్ళీ నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల బాటపట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 32.11 పాయింట్లు లేదా 0.042 శాతం నష్టంతో 76,138.97 వద్ద, నిఫ్టీ 13.85 పాయింట్లు లేదా 0.060 శాతం నష్టంతో 23,031.40 వద్ద నిలిచాయి.బజాజ్ ఫిన్సర్వ్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ప్, ఇన్ఫోసిస్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:39 సమయానికి నిఫ్టీ(Nifty) 53 పాయింట్లు పెరిగి 23,101కు చేరింది. సెన్సెక్స్(Sensex) 188 పాయింట్లు ఎగబాకి 76,368 వద్ద ట్రేడవుతోంది. గత నాలుగు సెషన్లలో నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ట్రేడవుతున్నాయి.అమెరికా డాలర్ ఇండెక్స్ 107.83 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 74.4 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.6 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.27 శాతం పడిపోయింది. నాస్డాక్ 0.03 శాతం పెరిగింది.విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలతో కొన్ని నెలలుగా ఈక్విటీలు బేలచూపులు చూస్తుంటే.. దేశీ రిటైల్ ఇన్వెస్టర్లు ‘తగ్గేదేలే’ అంటూ కొత్త పెట్టుబడులతో పరిణతి చూపుతున్నారు. ఇన్వెస్టర్ల క్రమశిక్షణకు నిదర్శనంగా ‘సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్’ (సిప్) రూపంలో జనవరిలోనూ ఈక్విటీ పథకాల్లోకి రూ.26,400 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు డిసెంబర్ నెలలో వచ్చిన రూ.26,459 కోట్లతో పోలిస్తే కేవలం రూ.59 కోట్లే తగ్గాయి. ఇక జనవరి నెలలో అన్ని రకాల ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన నికర పెట్టుబడులు రూ.39,688 కోట్లుగా ఉన్నాయి.ఇదీ చదవండి: హార్వర్డ్ యూనివర్సిటీలో నీతా అంబానీ ప్రసంగం2024 డిసెంబర్ నెలలో వచ్చిన రూ.41,156 కోట్లతో పోల్చి చూస్తే 3.56% తగ్గినట్టు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) జనవరి నెల గణాంకాలను తాజాగా విడుదల చేసింది. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఈక్విటీ పెట్టుబడుల విలువ డిసెంబర్తో చూస్తే 4% తగ్గి రూ.30.57 లక్షల కోట్లకు పరిమితమైంది. ఈక్విటీ, డెట్ ఇలా అన్ని రకాల నిర్వహణ ఆస్తుల విలువ జనవరి చివ రికి రూ.67.25 లక్షల కోట్లకు చేరింది. డిసెంబర్ చివరికి ఈ విలువ రూ.66.93 లక్షల కోట్లుగా ఉంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
23,000 మార్కు పైనే ముగిసిన నిఫ్టీ
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ(Nifty) 26 పాయింట్లు నష్టపోయి 23,045 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 122 పాయింట్లు దిగజారి 76,171 వద్దకు చేరింది. ఇటీవల భారీగా మార్కెట్లు పడిపోతున్నాయి. గతవారం ట్రెండ్ ఈవారం కొనసాగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు భారీగా పతనమయ్యాయి.సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్, జొమాటో, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, హెచ్యూఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ స్టాక్లు లాభాల్లో ముగిశాయి. ఎం అండ్ ఎం, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటాన్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, సన్ ఫార్మా స్టాక్లు భారీగా నష్టపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock Market: కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు
-
మళ్ళీ నష్టాల్లోనే ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మళ్ళీ నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటలకు సెన్సెక్స్ 223.97 పాయింట్లు లేదా 0.29 శాతం నష్టంతో.. 76,069.63 వద్ద, నిఫ్టీ 105.85 పాయింట్లు లేదా 0.46 శాతం నష్టంతో 22,965.95 వద్ద సాగుతున్నాయి.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటోకార్ప్, భారత్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్ మొదలైనవి నష్టాల్లో సాగుతున్నాయి.అమెరికా వాణిజ్య యుద్ధ భయాలు వెంటాడటంతో దేశీ స్టాక్ సూచీలు వసరుసగా నష్టాలనే చవి చూస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, నిరుత్సా హపరుస్తున్న కార్పొరేట్ ఫలితాలు మార్కెట్లపై మరింత ఒత్తిడి పెంచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 1,018 పాయింట్లు పతనమై 76,294 వద్ద ముగిసింది. నిఫ్టీ 310 పాయింట్లు నష్టపోయి 23,072 వద్ద నిలిచింది. స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా అదే బాటలో నడిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,281 పాయింట్లు కోల్పోయి 76,031 వద్ద, నిఫ్టీ 395 పాయింట్లు నష్టపోయి 22,986 వద్ద కనిష్టాలు తాకాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
5 రోజుల్లో రూ.17,00,000 కోట్లు ఆవిరి
ముంబై: అమెరికా వాణిజ్య యుద్ధ భయాలు వెంటాడటంతో దేశీ స్టాక్ సూచీలు అయిదో రోజూ నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, నిరుత్సా హపరుస్తున్న కార్పొరేట్ ఫలితాలు మార్కెట్లపై మరింత ఒత్తిడి పెంచాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 1,018 పాయింట్లు పతనమై 76,294 వద్ద ముగిసింది. నిఫ్టీ 310 పాయింట్లు నష్టపోయి 23,072 వద్ద నిలిచింది. స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా అదే బాటలో నడిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,281 పాయింట్లు కోల్పోయి 76,031 వద్ద, నిఫ్టీ 395 పాయింట్లు నష్టపోయి 22,986 వద్ద కనిష్టాలు తాకాయి.⇒ మార్కెట్ వరుస పతనంతో 5 రోజుల్లో రూ.17 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. మంగళవారం రూ.9.29 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.408.52 లక్షల కోట్ల(4.70 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది. ⇒ సెన్సెక్స్ మొత్తం 30 షేర్లలో ఒక్క ఎయిర్టెల్ (0.19%) మాత్రమే స్వల్ప లాభంతో గట్టెక్కింది. అత్యధికంగా జొమాటో 5%, టాటా స్టీల్ 3%, బజాజ్ ఫిన్సర్వ్ 2.70%, పవర్ గ్రిడ్ 2.65%, ఎల్అండ్టీ 2.60% నష్టపోయాయి. ఈ సూచీ గత రోజుల్లో 2,290 పాయింట్లు(3%) కోల్పోయింది. నిఫ్టీ ఇండెక్స్ 668 పాయింట్లు(2.81%) నష్టపోయింది. ⇒ రంగాల వారీగా రియల్టీ ఇండెక్స్ 3.14% క్షీణించింది. ఇండ్రస్టియల్ 3%, కన్జూమర్ డి్రస్కేషరీ 2.73%, క్యాపిటల్ గూడ్స్ 2.60%, ఆటో 2.50%, మెటల్ 2.23 శాతం చొప్పున పతనమయ్యాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 3.40%, 2.88 శాతం క్షీణించాయి. నష్టాలకు కారణాలు⇒ అమెరికా ఇండ్రస్టియల్ రంగాన్ని గాడిన పెట్టేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్లు విధించారు. ఎలాంటి మినహాయింపులు, కోటాలు లేకుండా అన్ని దేశాలపై టారిఫ్లు ఫ్లాట్గా 25% ఉంటాయన్నారు. దీంతో గతంలో టారిఫ్లు అధికంగా లేని కెనడా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణ కొరియా సహా ఇతర దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ట్రంప్ నిర్ణయం దేశాల మధ్య వాణిజ్య యుద్ధాన్ని తీవ్రతరం చేసేలా ఉందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. ⇒ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అమెరికా వాణిజ్య సుంకాల విధింపు, ద్రవ్యోల్బణం అంశాలపై సెనేట్ బ్యాకింగ్, హౌసింగ్ అర్బన్ అఫైర్స్ కమిటీ ముందు మాట్లాడనున్నారు. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. ⇒ విదేశీ ఇన్వెస్టర్లు 2025లోనే 9.94 బిలియన్ డాలర్లు విలువ చేసే ఈక్విటీలను విక్రయించారు. -
చిన్న షేర్లు విలవిల సిప్ పెట్టుబడులు డిప్
నాలుగేళ్లుగా దేశీ స్టాక్ మార్కెట్ల(Stock markets)లో బుల్ ట్రెండ్ కొనసాగడంతో ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను చేరాయి. అయితే ఉన్నట్టుండి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) అమ్మకాల బాట పట్టడం, రాజకీయ భౌగోళిక అనిశ్చితులు వంటి అంశాలు సెంటిమెంటును దెబ్బకొట్టాయి. దీంతో గతేడాది అక్టోబర్ మొదలు స్టాక్ మార్కెట్లు(Stock markets) తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా మిడ్, స్మాల్ క్యాప్స్లో కొద్ది రోజులుగా అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా ఇప్పటికే బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సెప్టెంబర్లో నమోదైన గరిష్టాల నుంచి 17 శాతానికిపైగా పతనమయ్యాయి. వెరసి గత ఆరు నెలల్లో పలు స్మాల్ క్యాప్ ఫండ్స్లో చేసిన పెట్టుబడులకు నష్టాలు వాటిల్లుతున్నాయి. మరోపక్క మార్కెట్ ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ సైతం 12 శాతం క్షీణించాయి. సిప్ బేజారు...నిజానికి గత కేలండర్ ఏడాది(2024)లో క్రమానుగత పెట్టుబడి పథకాలు(సిప్) భారీస్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. సిప్ మార్గంలో మ్యూచువల్ ఫండ్స్లోకి రూ. 2.89 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. యాక్టివ్ స్మాల్ క్యాప్ ఫండ్స్కు గతేడాది రూ. 35,000 కోట్ల పెట్టుబడులు లభించాయి. ఇదే కాలంలో లార్జ్ క్యాప్ ఫండ్స్ పెట్టుబడులతో పోలిస్తే ఇవి రెట్టింపు..! అయితే గత 6 నెలలుగా పలు స్మాల్ క్యాప్ ఫండ్స్కు చెందిన సిప్ పథకాలపై రిటర్నులు ప్రతికూలంగా నమోదవుతున్నా యి. 2024 డిసెంబర్లో ఇన్వెస్టర్లు 4.5 మిలియన్ సిప్ ఖాతాలను మూసివేశారు. ఇంతక్రితం 2024 మే నెలలో మాత్రమే 4.4 మిలియన్ సిప్ ఖాతాలు నిలిచిపోయాయి. నేలచూపులో వివిధ మిడ్క్యాప్ ఫండ్స్లో సిప్ పెట్టుబడుల తీరును గమనిస్తే.. మూడేళ్ల కాలంలో మంచి పనితీరునే చూపినప్పటికీ ఏడాది కాలాన్ని పరిగణిస్తే ప్రతికూల ప్రతిఫలాలు నమోదవుతున్నాయి. వివిధ మిడ్ క్యాప్ ఫండ్స్ జాబితాలో క్వాంట్ను తీసుకుంటే గత మూడేళ్లలో 19 శాతం రిటర్నులు అందించగా.. గత 12 నెలల్లో 15.6 శాతం క్షీణతను చవిచూసింది. ఈబాటలో టారస్ మూడేళ్లలో 15 శాతం లాభపడగా.. ఏడాది కాలంలో 12 శాతంపైగా నీరసించింది. మిరే అసెట్ మూడేళ్లలో 18 శాతం పుంజుకోగా.. ఏడాదిలో 6 శాతంపైగా నష్టపోయింది. ఇదేవిధంగా టాటా గ్రోత్, యూటీఐ, ఏబీఎస్ఎల్, మహీంద్రా మాన్యులైఫ్ మూడేళ్లలో 20–24 శాతం రిటర్నులు అందించినప్పటికీ ఏడాది కాలాన్ని పరిగణిస్తే 5–4 శాతం మధ్య తగ్గాయి. ఎఫ్పీఐల అమ్మకాలు2024 అక్టోబర్ నుంచి ఎఫ్పీఐలు దేశీ స్టాక్స్లో విక్రయాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫలితంగా అక్టోబర్ మొదలు ఇప్పటి(ఫిబ్రవరి7)వరకూ ఎఫ్పీఐలు రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. కొత్త ఏడాది(2025) జనవరి నుంచి చూస్తే రూ. లక్ష కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ ఏడాది కనిష్టాలకు..బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో 131 షేర్లు తాజాగా 52 వారాల కనిష్టాలను తాకాయి. ఈ జాబితాలో డెల్టా కార్ప్ హోనసా కన్జూమర్, జేకే టైర్, మిశ్రధాతు నిగమ్, టాటా కెమికల్స్, ఎన్సీసీ, రైట్స్, మదర్సన్ సుమీ, ఎస్కేఎఫ్ ఇండియా చేరాయి. గత రెండు నెలల్లో 433 చిన్న షేర్ల మార్కెట్ విలువలో 20%ఆవిరైంది. వీటిలో 100 షేర్ల విలువ 30–40% మధ్య పతనమైంది. గత నెల రోజుల్లో రెండేళ్లుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకున్న పలు కౌంటర్లు 40–30 శాతం మధ్య పతనమయ్యాయి. జాబితాలో న్యూజెన్ సాఫ్ట్వేర్, కేన్స్ టెక్నాలజీ ఇండియా, అపార్ ఇండస్ట్రీస్, నెట్వెబ్ టెక్నాలజీస్, జూపిటర్ వేగన్స్, స్టెర్లింగ్ అండ్ విల్సన్, అనంత్రాజ్, రామకృష్ణ ఫోర్జింగ్స్ చేరాయి. -
ట్రంప్ ఎఫెక్ట్!.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం కూడా నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 1031.25 పాయింట్లు లేదా 1.31 పాయింట్ల నష్టంతో 76,296.55 వద్ద, నిఫ్టీ 309.80 పాయింట్లు లేదా 1.32 శాతం నష్టంతో.. 23,071.80 వద్ద నిలిచాయి. ఈ వారంలో రెండూ రోజు కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాను.అదానీ ఎంటర్ప్రైజెస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ట్రెంట్, భారతి ఎయిర్టెల్, హిందాల్కో ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్, శ్రీరామ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన, ఉక్కు దిగుమతులపై కొత్త సుంకాలకు సంబంధించి ఇన్వెస్టర్లలో ఆందోళనలు మొదలయ్యాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో స్టీల్ కంపెనీల షేర్లు గణనీయంగా తగ్గాయి. అంతే కాకుండా అమెరికా వస్తువులపై చైనా అదనపు సుంకాలు విధించడం వంటి ఇతర దేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక సమస్యలు కూడా భారతీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్
-
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజే రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి!
ముంబై: స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాలు చవిచూశాయి. 1,000పైగా పాయింట్ల నష్టంతో 76,356 వద్ద సెన్సెక్స్ ట్రేడవుతుండగా, నిఫ్టీ 305 పాయింట్లు కోల్పోయింది. మొత్తంగా.. ఇవాళ ఒక్కరోజే రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరైనట్లు తెలుస్తోంది. మార్కెట్లు భారీగా క్షీణించడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.స్టీల్ టారిఫ్ ఆందోళనలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఉక్కు దిగుమతులపై కొత్త సుంకాలకు సంబంధించి ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో స్టీల్ కంపెనీల షేర్లు గణనీయంగా క్షీణించాయి.పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్: పది సంవత్సరాల కాలపరిమితికి సంబంధించి ఇండియా, అమెరికా గవర్నమెంట్ బాండ్లపై రాబడులు పెరిగాయి. ఈక్విటీల కంటే బాండ్లు సురక్షితం కాబట్టి, మదుపర్లు వీటిపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దాంతో మార్కెట్లోని తమ పెట్టుబడులను ఉపసంహరించి బాండ్లలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నారు.ఇదీ చదవండి: రూ.6,000 కోట్లతో ‘అదానీ హెల్త్ సిటీస్’రంగాలవారీ ప్రభావం: లోహాలు, రియల్టీ, మీడియా, హెల్త్ కేర్ సహా వివిధ రంగాల షేర్లు భారీగా క్షీణించాయి. ఇది మొత్తం మార్కెట్ తిరోగమనానికి దోహదం చేసింది.అంతర్జాతీయ ఆర్థిక అంశాలు: అమెరికా వస్తువులపై చైనా అదనపు సుంకాలు విధించడం వంటి ఇతర దేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక సమస్యలు కూడా భారతీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి. -
స్టాక్మార్కెట్లో కొనసాగుతున్న నష్టాలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:51 సమయానికి నిఫ్టీ(Nifty) 82 పాయింట్లు నష్టపోయి 23,303కు చేరింది. సెన్సెక్స్(Sensex) 243 పాయింట్లు దిగజారి 77,065 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.4 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76.13 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.67 శాతం లాభపడింది. నాస్డాక్ 0.98 శాతం ఎగబాకింది.అమెరికాకు వచ్చే స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్లు విధిస్తామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో స్టాక్ సూచీలు నిన్నటి మార్కెట్లో భారీగానే పైగా నష్టపోయాయి. అలాగే తమపై పన్నులు విధించే దేశాలపై తిరిగి పన్నులు విధిస్తామని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం, రూపాయి కొత్త కనిష్టానికి చేరుకోవడమూ మరింత ఒత్తిడి పెంచాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమాయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 548.39 పాయింట్లు లేదా 0.70 శాతం నష్టంతో.. 77,311.80 వద్ద, నిఫ్టీ 182.85 పాయింట్లు లేదా 0.78 శాతం నష్టంతో.. 23,377.10 వద్ద నిలిచాయి.కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతి ఎయిర్టెల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. ట్రెంట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, టైటాన్ కంపెనీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:42 సమయానికి నిఫ్టీ(Nifty) 137 పాయింట్లు నష్టపోయి 23,419కు చేరింది. సెన్సెక్స్(Sensex) 402 పాయింట్లు దిగజారి 77,442 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.41 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.06 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.48 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.95 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.36 శాతం దిగజారింది.ఈ ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టిన రిజర్వ్ బ్యాంక్ విధాన నిర్ణయాలను శుక్రవారం ప్రకటించింది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది. గత 11 సమావేశాల్లో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం నుంచి 6.25కు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం బ్యాంకింగ్ రంగ స్థాక్లకు కొంత ఊరట కలిగించే అంశంగా నిపుణులు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఈవారం మార్కెట్లు ఇలా..
భారీ హెచ్చుతగ్గుల మధ్య గతవారం మార్కెట్లు ముందుకే సాగాయి. ఓపక్క కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో మార్కెట్ వర్గాలకు పెద్దగా ప్రయోజనం కలక్కపోయినా... ఆదాయపు పన్ను పరంగా తీసుకున్న ప్రోత్సాహక చర్యలు సూచీలను ముందుకు నడిపించాయి. మరోపక్క కార్పొరేట్ ఫలితాలు ఇబ్బంది పెట్టినప్పటికీ... చివరకు ఇండెక్స్ లు కొంత తేరుకున్నట్లే కనిపించాయి. అదీగాక కెనడా, మెక్సికోలపై విధించిన సుంకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన ప్రకటన సానుకూల ప్రభావాన్ని చూపించింది. వారం మధ్యలో ఆర్బీఐ పాలసీకి ముందు మార్కెట్లు కొంత ఒత్తిడికి గురయ్యాయి. అందరూ ఊహించినట్లే... వారాంతాన వడ్డీరేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం సంతృప్తికరంగానే ఉన్నా... భవిష్యత్ విధానాల విషయంలో "తటస్థ" ధోరణి (అంటే రాబోయే రోజుల్లోనూ ఇలా కోతలు ఉండొచ్చన్న అంచనాలకు విరుద్ధంగా) కొనసాగించడం మార్కెట్ వర్గాలకు రుచించలేదు. దీంతో అమ్మకాల ఒత్తిడి ఎక్కువైంది. ఇంకోపక్క విదేశీ సంస్థాగత మదుపర్లు యధావిధిగా తమ అమ్మకాలను కొనసాగించారు. అదే సమయంలో రూపాయి బలహీనతలూ మార్కెట్లను వేధించాయి. చమురు ధరలు కాస్త చల్లబడటం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. మొత్తానికి గతవారం సెన్సెక్స్, నిఫ్టీ లు దాదాపు 0.33 శాతం దాకా పెరిగాయి. వారం మొత్తానికి సెన్సెక్స్ 354 పాయింట్లు పెరిగి 77860 వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు లాభపడి 23560 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ మిడ్క్యాప్, స్మాల్ క్యాప్, బ్యాంకు నిఫ్టీలు కూడా లాభాల్లోనే సాగాయి.ఈవారంఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం మార్కెట్లపై కొంత సానుకూల ప్రభావం చూపించొచ్చు. సోమవారం మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావొచ్చు. అయితే ఈ ధోరణి పూర్తిగా కొనసాగుతుందా... అన్నది సందేహమే. మార్కెట్లు మరీ తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసే సంఘటనలేవీ ఈవారం లేనప్పటికీ... మనతో పాటు అమెరికా వెలువరించే ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కామెంట్లు, సుంకాల విషయంలో ఎప్పుడు ఏ రీతిన వ్యవహరిస్తాడో తెలియని ట్రంప్ ధోరణి... కొంతమేర శాసించొచ్చు. పెద్ద ప్రభావిత అంశాలు లేకపోవడంతో... మార్కెట్లు ఈవారమంతా స్వల్ప స్థాయుల్లోనే కదలాడుతూ.. కన్సాలిడేట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కార్పొరేట్ ఫలితాలు చివరి దశకు వచ్చేశాయి. ఈవారంతో మిగిలిన ప్రధాన కంపెనీలు కూడా తమ మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించడం ద్వారా ఈ అంకం కూడా పూర్తవుతుంది. ఇక రంగాలవారీగా ఆయా సెక్టార్లకు సంబంధించి వెలువడే ప్రకటనలు సంబంధిత రంగాల షేర్లను ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో ఒడుదొడుకులు కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈమధ్య కాలంలో విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు మార్కెట్లకు పెనుశాపంగా మారాయి. ఈ ధోరణి ఈవారం కూడా కొనసాగవచ్చు.ఆర్ధిక ఫలితాల కంపెనీలుదాదాపు 2000 కు పైగా కంపెనీలు ఈవారం ఆర్ధిక ఫలితాలను ప్రకటించబోతున్నాయి. దీంతో ఫలితాల ఘట్టం పూర్తవుతుంది. ఫలితాల ద్వారా ఈవారం మార్కెట్లపై అధిక స్థాయిలో ప్రభావితం చూపగల కంపెనీల్లో అపోలో హాస్పిటల్స్, హిందాల్కొ ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, లుపిన్, సీమెన్స్, ఎస్కార్ట్స్, నేషనల్ అల్యూమినియం, ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్, ఆదిత్య బిర్లా ఫ్యూచర్ రిటైల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నాయి. తర్వాతి స్థానంలో పతంజలి ఫుడ్స్, వరుణ్ బెవరేజెస్, బాటా ఇండియా, ఇంజనీర్స్ ఇండియా, జూబిలెంట్ ఫుడ్స్, దిలీప్ బిల్డకాన్, నారాయణ హృదయాలయ వంటి కంపెనీలు ఉన్నాయి.విదేశీ మదుపర్లు మన మార్కెట్లలో నిరంతర అమ్మకాలు కొనసాగిస్తున్న విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) గత జనవరి నెల మొత్తానికి రూ. 87,000 కోట్ల విక్రయాలు జరిపిన విషయం తెల్సిందే. వీరు ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకు రూ. 10,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ మదుపర్లు మాత్రం యధావిధిగా మార్కెట్ కు మద్దతుగా నిలిచారు. వీరు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 7,200 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్ ను ఆదుకునే ప్రయత్నాలు చేశారు. సాంకేతిక స్థాయిలునిఫ్టీ 23700-800 ని బ్రేక్ చేయనంతవరకు పెద్ద మార్పులేవీ ఉండకపోవచ్చు. ముందుకెళ్లాలన్నా, మరింత పడిపోవాలన్నా ఇది కీలక స్థాయి. ఇదే స్థాయిల్లో చలిస్తున్నంత కాలం.. సూచీలు కన్సాలిడేషన్ లో కొనసాగుతాయి. మార్కెట్లలో ప్రస్తుతానికి సానుకూల సంకేతాలు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. 24000 పాయింట్ల వద్ద పెద్ద నిరోధం ఉంది. దీన్ని దాటుకుని ముందుకు వెళ్తేనే... 24200 స్థాయిని టెస్ట్ చేయవచ్చు. అలాకాకుండా నిఫ్టీ 23500 పైన ఉన్నంతవరకు ఫర్వాలేదు కానీ దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం అప్రమత్తమవ్వాల్సిందే. అప్పుడు 23200 వద్ద మార్కెట్ కు సపోర్ట్ లభిస్తుంది. దాన్ని కూడా ఛేదించి పడిపోతే 23000, 22800 వద్ద మార్కెట్ కు మద్దతు లభించొచ్చు. రంగాలవారీగా చూస్తే... బ్యాంకింగ్ షేర్లు బలహీనంగా ట్రేడయ్యే అవకాశముంది. సిమెంట్, ఫార్మా, ఎఫెమ్సీజీ రంగాల్లో కొనుగోళ్ళకు అవకాశం ఉండగా, టెలికాం, కేపిటల్ గూడ్స్, ఆటోమొబైల్, మెటల్స్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చు. ఇక మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారాంతానికి 2.91 శాతం క్షీణించి 13.69 దగ్గర ఉంది. ప్రస్తుతానికి మార్కెట్ బుల్స్ కు అనుకూలంగా ఉందనేందుకు ఇది నిదర్శనం.-బెహరా శ్రీనివాస రావు,స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
మళ్ళీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్వల్ప లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మళ్ళీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 211.41 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టంతో 77,846.74 వద్ద, నిఫ్టీ 43.40 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టంతో 23,559.95 పాయింట్ల వద్ద నిలిచాయి.టాటా స్టీల్, భారతి ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యు స్టీల్, ట్రెంట్, హిందాల్స్కో ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), ఐటీసీ కంపెనీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.రెపో రేటు తగ్గించిన ఆర్బీఐరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది 6.25 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఈ రేటు తగ్గింపు నిర్ణయం కూడా రావడం గమనార్హం.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మళ్ళీ నష్టాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్థిరంగా మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 213.12 పాయింట్లు లేదా 0.27 శాతం నష్టపోయి 78,058.16 వద్ద, నిఫ్టీ 92.95 పాయింట్లు లేదా 0.39 శాతం నష్టపోయి 23,603.35 వద్ద నిలిచాయి.సిప్లా, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ వంటి కంపెనీలు లాభాలను చవి చూశాయి. ట్రెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్, భారతి ఎయిర్టెల్, టైటాన్ కంపెనీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) వంటి సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్థిరంగా స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం గత సెషన్తో పోలిస్తే స్థిరంగా కదలాడుతున్నాయి. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 4 పాయింట్లు నష్టపోయి 23,696కు చేరింది. సెన్సెక్స్(Sensex) 30 పాయింట్లు పెరిగి 78,303 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.66 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 74.75 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.39 శాతం లాభపడింది. నాస్డాక్ 0.19 శాతం ఎగబాకింది.ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీ బుధవారం ప్రారంభమైంది. కొత్త ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ వడ్డీ రేట్లు, పరపతి విధానంపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్బీఐ కీలకంగా చూసేది ద్రవ్యోల్బణాన్నే. వినియోగ ధరల ఆధారిత సూచీ (రిటైల్ ద్రవ్యోల్బణం) డిసెంబర్ త్రైమాసికానికి 4.5 శాతానికి తగ్గుముఖం పడుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి 4.8 శాతంగా ఉంటుందన్నది ఎస్బీఐ రీసెర్చ్ అంచనా. జనవరి నెల ద్రవ్యోల్బణం 4.5 సమీపంలో ఉండొచ్చని పేర్కొంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్వల్ప లాభాల్లో స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:31 సమయానికి నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 23,253కు చేరింది. సెన్సెక్స్ 682 పాయింట్లు దిగజారి 76,802 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107.9 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.51 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.72 శాతం లాభపడింది. నాస్డాక్ 1.35 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: అక్రమ జామర్స్తోనే కాల్ డ్రాప్స్అమెరికా సుంకాల విషయంలో మెక్సికో, కెనడాకు తాత్కాలిక ఊరట లభించడంతో అంతర్జాతీయ మార్కెట్లలోనూ సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు నిన్నటి సెషన్లో అరశాతం పెరిగాయి. కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 11 సమావేశాలలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి కాలంలో రెపో రేటులో 2.5 శాతం కోతను అమలు చేసింది. రిటైల్ ధరల ఇండెక్స్(సీపీఐ) డిసెంబర్లో 4 నెలల కనిష్టం 5.22 శాతానికి దిగివచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పరిమితంకానున్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
మార్కెట్లకు ‘టారిఫ్’ రిలీఫ్
ముంబై: మెక్సికో, కెనడాపై సుంకాల విధింపును నెల రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రకటనతో ఈక్విటీ మార్కెట్లు మంగళవారం బలంగా పుంజుకున్నాయి. ఆర్బీఐ కీలక వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలూ, అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీ అంశాలూ కలిసొచ్చాయి. సెన్సెక్స్ 1,397 పాయింట్లు పెరిగి 78,584 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 378 పాయింట్లు బలపడి 23,739 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది నెలరోజుల గరిష్టం కావడం విశేషం.ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,472 పాయింట్లు పెరిగి 78,659 వద్ద, నిఫ్టీ 402 పాయింట్లు ఎగసి 23,763 వద్ద ఇంట్రాడే గరిష్టాలు తాకాయి. అమెరికా సుంకాల విషయంలో మెక్సికో, కెనడాకు తాత్కాలిక ఊరట లభించడంతో అంతర్జాతీయ మార్కెట్లలోనూ సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు అరశాతం పెరిగాయి. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. ⇒ ఇటీవల మార్కెట్ పతనంలో భాగంగా పలు రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లకు పెద్ద ఎత్తున డిమాండ్ లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.35%, 1.25 శాతం పెరిగాయి. ఒక్క ఎఫ్ఎంసీజీ షేర్లలో మాత్రం లాభాల స్వీకరణ జరిగింది. ⇒ రంగాల వారీగా అత్యధికంగా క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 3.50% పెరిగింది. ఇండస్ట్రియల్స్ 2.50%, ఆయిల్అండ్గ్యాస్ 2.40%, విద్యుత్, ఫైనాన్షియల్ సర్విసెస్ సూచీలు రెండు శాతం లాభపడ్డాయి. ⇒ స్టాక్ మార్కెట్( stock market) దాదాపు రెండు శాతం ర్యాలీతో మంగళవారం రూ.5.96 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.425 లక్షల కోట్ల(4.88 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకుంది. ⇒ రూపాయి విలువ జీవితకాల కనిష్టం(87.11) నుంచి స్వల్పంగా రికవరీ అయ్యింది. డాలర్ మారకంలో నాలుగు పైసలు బలపడి 87.07 వద్ద స్థిరపడింది. ట్రంప్ వాణిజ్య యుద్దానికి తాత్కాలిక తెరవేయడంతో అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ 108 స్థాయికి దిగివచ్చింది. ఈ అంశం దేశీయ కరెన్సీకి కలిసొచ్చిందని నిపుణులు తెలిపారు. -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు భారీ లాభాలను చవి చూశాయి. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,203.43 పాయింట్లు లేదా 1.56 శాతం లాభంతో 78,390.17 వద్ద, నిఫ్టీ 373.80 పాయింట్లు లేదా 1.60 శాతం లాభంతో.. 23,734.85 వద్ద నిలిచాయి.శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్ & టూబ్రో, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ట్రెంట్, బ్రిటానియా ఇండస్ట్రీస్, హీరో మోటోకార్ప్, నెస్లే ఇండియా, ఐచర్ మోటార్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.గత కొన్ని రోజులుగా వరుస నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు (ఫిబ్రవరి 4)న శుభారంభం పలికాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. ఇకపోతే.. కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 231 పాయింట్లు నష్టపోయి 23,253కు చేరింది. సెన్సెక్స్(Sensex) 682 పాయింట్లు దిగజారి 76,802 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.71 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.76 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.2 శాతం దిగజారింది.7న పాలసీ నిర్ణయాలు కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 11 సమావేశాలలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి కాలంలో రెపో రేటులో 2.5 శాతం కోతను అమలు చేసింది. రిటైల్ ధరల ఇండెక్స్(సీపీఐ) డిసెంబర్లో 4 నెలల కనిష్టం 5.22 శాతానికి దిగివచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పరిమితంకానున్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
టారిఫ్ వార్.. బొమ్మాబొరుసు!
సాక్షి, బిజినెస్ డెస్క్: ట్రంప్ దూకుడు చూస్తుంటే.. ఇతర దేశాలను కాళ్లబేరానికి తెచ్చుకునే వ్యూహంతో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. రేపోమాపో మనకూ సుంక‘దండన’తప్పకపోవచ్చు. ఇప్పటికే పలుమార్లు భారత్ను ‘అమెరికాకు అతిపెద్ద టారిఫ్ ముప్పు’గా అభివర్ణించారు కూడా. డీ–డాలరైజేషన్ చర్యల నుంచి వెనక్కతగ్గకపోతే బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానని కూడా హెచ్చరించారు. అయితే, అమెరికా టారిఫ్లు రెండు వైపులా పదునున్న కత్తిలాంటివని స్వయంగా ఆ దేశ ఆర్థిక వేత్తలు, నిపుణులే హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు కకావికలం అవుతాయని, దీంతో ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి.. ద్రవ్యోల్బణం ఎగబాకేందుకు దారితీస్తుందని చెబుతున్నారు. సుంకాల విధింపుతో ఎగుమతిదారులు ఆమేరకు రేట్లు పెంచుతారు. అమెరికా ప్రజలు కూడా ఆయా దేశాల ఉత్పత్తులను అధిక ధరలకు కొనుక్కోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.మన ఎగుమతులకు లాభమేనా?ట్రంప్ టారిప్ వార్తో ప్రస్తుతానికి కొన్ని రంగాల్లో ఎగుమతిదారులకు కొంత లాభమేనని పరిశ్రమవర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. ప్రస్తుతానికి మనపై సుంకాలు విధించకపోవడంతో చైనా ఉత్పత్తులతో పోలిస్తే మన ఎగుమతులకు పోటీతత్వం పెరుగుతుందని భారతీయ ఎగుమతిదారుల సంఘం (ఫియో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ పేర్కొన్నారు. అయితే, భారత్లోకి చైనా సహా పలు దేశాల నుంచి చౌక దిగుమతులు పోటెత్తే అవకాశం ఉందని, ఇది మన పరిశ్రమలకు ముప్పుగా మారొచ్చని మరికొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుంకాల విషయంలో తీవ్ర విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ప్రొఫెసర్ బిశ్వజిత్ ధార్ సూచించారు.ఆటోమొబైల్: భారత వాహన విడిభాగాల సంస్థలకు అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్గా ఉంది. పరిశ్రమ అసోసియేషన్ (ఏసీఎంఏ) ప్రకారం 2024–25లో భారత్ 11.1 బిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసింది. ఇందులో 3.67 బిలియన్ డాలర్లు, అంటే 28 శాతం అమెరికాకే వెళ్లాయి. తాజాగా ఇతర దేశాలపై టారిఫ్ల పెంపుతో యూఎస్లో మన వాటా పెంచుకోవడానికి సదవకాశమని కొంతమంది పరిశ్రమవర్గాలు చెబుతున్నారు. ‘ఆహార, వ్యవసాయ రంగాలతో పాటు వాహన విడిభాగాల రంగాలు తక్షణం ప్రయోజనం పొందుతాయి. దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయి’అని వాణిజ్య విధాన విశ్లేషకుడు ఎస్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు.టెక్స్టైల్స్: ట్రంప్ తాజా టారిఫ్లు భారత టెక్స్టైల్ రంగానికి బూస్ట్ ఇస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘భారతీయ కంపెనీలకు సమీప భవిష్యత్తులో ఆర్డర్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది’అని తిరుపూర్ ఎగుమతిదారుల సంఘం (టీఈఏ) అధ్యక్షుడు కె.ఎం. చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.ఫార్మా: భారత ఫార్మా రంగం అప్రమత్తతతో పాటు ఆశావహ ధోరణితో వేచిచూస్తోంది. ‘జెనరిక్స్లో చైనా చాలా పటిష్టంగానే ఉన్నప్పటికీ, అమెరికాకు పెద్దగా ఎగుమతి చేయడం లేదు. ప్రధానంగా యాక్టివ్ ఫార్మా ఇన్గ్రీడియెంట్స్ (ఏపీఐ), కెమికల్స్ వంటివి ఎగుమతి చేస్తోంది. ఇప్పుడు మనకు వీటిని కూడా అమెరికాకు ఎగుమతి చేసే అవకాశం లభిస్తుంది. అయితే, మనం వాటి కోసం చైనాపైనే ఆధారపడాల్సిన పరిస్థితి’అని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మెక్సిల్) మాజీ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ అభిప్రాయపడ్డారు.స్టీల్: ట్రేడ్ వార్ మరింత ముదిరితే సరఫరా వ్యవస్థల్లో తీవ్ర కుదుపులకు ఆస్కారం ఉంది. వివిధ దేశాల నుంచి భారత్కు దిగుమతులు పోటెత్తే అవకాశం ఉందని, పరిస్థితులను నిశితంగా గమనించి చర్యలు చేపట్టాలని జేఎస్డబ్ల్యూ స్టీల్ సీఈఓ జయంత్ ఆచార్య పేర్కొన్నారు. చైనా స్టీల్ ఉత్పత్తి భారీగానే కొనసాగనున్న నేపథ్యంలో యూఎస్ దెబ్బకు ఇతరత్రా అందుబాటులో ఉన్న దేశాలకు ఎగుమతులను మళ్లించవచ్చని ఆర్సెలర్ మిట్టల్ వైస్–ప్రెసిడెంట్ రంజన్ ధార్ తెలిపారు.ఎలక్ట్రానిక్స్: చైనా ఉత్పత్తులపై అదనపు సుంకాలతో తక్షణం ప్రయోజనం పొందే రంగాల్లో ఇదొకటి. అయితే, తక్షణం దీని ప్రయోజనం పొందేలా పాలసీ రూపకర్తలు, పరిశ్రమ వర్గాలు చర్యలు తీసుకోవాలని భారతీయ సెల్యులర్, ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ వ్యాఖ్యానించారు. భారత్ను ఎగుమతి హబ్గా చేసుకుంటున్న యాపిల్తో పాటు మోటరోలా వంటి చైనా బ్రాండ్లు మన దగ్గరున్న టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్కాన్, డిక్సన్ వంటి తయారీదారుల నుంచి అమెరికాకు ఎగుమతులను మరింత పెంచే అవకాశం ఉంది. యాపిల్, శాంసంగ్ దన్నుతో 2024లో భారత్ నుంచి మొబైల్ ఫోన్ ఎగుమతులు రికార్డు స్థాయిలో 20.4 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లాయి. ఇందులో యాపిల్ వాటా 65 శాతం కాగా (12.8 బిలియన్ డాలర్లు), శాంసంగ్ వాటా 20 శాతంగా (4 బిలియన్ డాలర్లు) ఉంది.దిగుమతులు, రూపాయి, స్టాక్ మార్కెట్కు దెబ్బ...ట్రేడ్ వార్ 2.0... ప్రపంచ దేశాల కరెన్సీ మార్కెట్లను సైతం కుదిపేస్తోంది. అనేక దేశాల కరెన్సీలతో డాలర్ విలువ మరింత బలపడుతోంది. డాలర్ ఇండెక్స్ ఇప్పటికే 110 స్థాయికి చేరింది. దీంతో మన రూపాయి విలువ కూడా అంతకంతకూ బక్కచిక్కిపోతోంది. తాజాగా డాలరు మారకంలో 87 కిందికి పడిపోయింది. ఒకపక్క, ఎగుమతిదారులకు కాస్త ఊరట లభించినప్పటికీ.. మన వాణిజ్యం ఇప్పటికీ లోటులోనే ఉన్న నేపథ్యంలో దిగుమతులు గుదిబండగా మారుతున్నాయి. ఇక అమెరికా టారిఫ్ల ప్రభావంతో ద్రవ్యోల్బణం పెంపు భయాలు పెరిగాయి.యూఎస్లోని సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల కోతకు బ్రేక్ ఇవ్వడంతో డాలర్ జోరుకు ఆజ్యం పోసినట్లయింది. ఈ ప్రభావంతో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) మన స్టాక్ మార్కెట్ నుండి పొలోమంటూ నిధులను వెనక్కి తీసేసుకుంటున్నారు. అక్టోబర్ నుంచి రివర్స్ గేర్లో ఉన్న ఎఫ్పీఐలు ట్రంప్ విజయం తర్వాత ఇంకాస్త జోరు పెంచారు. ఈ ఏడాది జనవరిలోనే రూ.87,000 కోట్ల విలువైన షేర్లను భారత్ మార్కెట్లలో విక్రయించడం విశేషం. దీంతో స్టాక్ సూచీలు ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి 10 శాతం పైగానే కుప్పకూలాయి. వెరసి టారిఫ్ వార్ దేశీ స్టాక్ మార్కెట్లకూ అతిపెద్ద ముప్పుగా మారుతోంది.భారత్–అమెరికా వాణిజ్య బంధం ఇలా...2023–24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గతేడాది అమెరికాకు భారత ఎగుమతులు 77.51 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 42.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 35.31 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) ఏప్రిల్–అక్టోబర్ కాలంలో అమెరికాకు మన ఎగుమతులు 6.31 శాతం పెరిగి 47.24 బిలియన్ డాలర్లకు చేరుకోగా, దిగుమతులు 2.46 శాతం పెరిగి 26 బిలియన్ డాలర్లకు ఎగశాయి.అనుకూలం⇒ ఫార్మా – చైనాపై టారిఫ్ల నేపథ్యంలో మన జెనరిక్ కంపెనీలకు అవకాశాలు పెరుగుతాయి.⇒ టెలికం పరికరాలు – ఇతర దేశాలతో పోలిస్తే మన ఎగుమతులు జోరందుకుంటాయి.⇒ ఎలక్ట్రానిక్స్ – దేశీ తయారీ కంపెనీలకు అమెరికా మార్కెట్ మరింత అందుబాటులోకి వస్తుంది.⇒ టెక్స్టైల్స్ – భారతీయ కంపెనీలకు సమీప భవిష్యత్తులో ఆర్డర్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.⇒ ఫుడ్–అగ్రి ప్రోడక్టŠస్ – ఆహార, వ్యవసాయ రంగాలకు తక్షణ ప్రయోజనం.⇒ ఆటోమొబైల్ విడిభాగాలు – యూఎస్లో మన కంపెనీల ఎగుమతుల వాటా పెంచుకోవడానికి సదవకాశం.⇒ పెట్రోలియం ఉత్పత్తులు – ఎగుమతులు పుంజుకోవడానికి చాన్స్.⇒ ఐటీ సేవలు – రూపాయి పతనంతో మరింత ఆదాయం సమకూరుతుంది.ప్రతికూలం⇒ రూపాయి – డాలర్ భారీగా బలపడటంతో దేశీ కరెన్సీ విలువ మరింత పడిపోవచ్చు.⇒ స్టాక్ మార్కెట్ – విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో పెట్టబడులు తరలిపోయి.. మార్కెట్ ఇంకా పడిపోవచ్చు.⇒ ముడిచమురు – దిగుమతులు మరింత భారమై.. విదేశీ మారక నిల్వలు తగ్గిపోతాయి. ⇒ బంగారం – రూపాయి పతనంతో విదేశీ మార్కెట్తో పోలిస్తే ధరలు కొండెక్కవచ్చు.⇒ యంత్రపరికరాలు – దేశీ కంపెనీలు దిగుమతి చేసుకునే పరికరాలు, సామగ్రి ధరలు మరింత పెరుగుతాయి.⇒ వంటనూనెలు – భారత్ ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం వల్ల నూనె ధర మరింత హీటెక్కవచ్చు.⇒ ఎరువులు – వ్యవసాయానికి అవసరమైన ఎరువుల దిగుమతి భారమవుతుంది. -
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 319.22 పాయింట్లు లేదా 0.41 శాతం నష్టంతో.. 77,186.74 వద్ద, నిఫ్టీ 122.85 పాయింట్లు లేదా 0.52 శాతం నష్టంతో 23,359.30 వద్ద ఉన్నాయి.బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. లార్సెన్ & టూబ్రో, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, కోల్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 231 పాయింట్లు నష్టపోయి 23,253కు చేరింది. సెన్సెక్స్(Sensex) 682 పాయింట్లు దిగజారి 76,802 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(US Index) 109.7 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76.12 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.51 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.5 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.28 శాతం దిగజారింది.7న పాలసీ నిర్ణయాలు కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 11 సమావేశాలలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి కాలంలో రెపో రేటులో 2.5 శాతం కోతను అమలు చేసింది. రిటైల్ ధరల ఇండెక్స్(సీపీఐ) డిసెంబర్లో 4 నెలల కనిష్టం 5.22 శాతానికి దిగివచి్చంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పరిమితంకానున్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ట్రంప్, ఆర్బీఐ నిర్ణయాలు కీలకం
కేంద్ర ఆర్థికమంత్రి గత శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓ రకంగా మార్కెట్కు రుచించలేదు. మధ్య తరగతి, వేతన జీవులకు ప్రాధాన్యమిస్తూ సాగిన బడ్జెట్లో మార్కెట్ డిమాండ్లేవీ నెరవేరకపోవడంతో బడ్జెట్కు ముందు వచ్చిన ర్యాలీ కొనసాగలేదు. పన్ను స్లాబులు, రేట్లలో చేసిన మార్పుల వల్ల సామాన్యుల ఆదాయం పెరుగుతుందని, తద్వారా కొనుగోలు శక్తి ఇనుమడిస్తుందన్న ఉద్దేశంతో ఆటో మొబైల్, ఎఫ్ఎంసీజీ షేర్లలో మాత్రం హడావుడి కనిపించింది. గతవారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీ లు దాదాపు 1.5 శాతం దాకా పెరిగాయి. ప్రముఖ కంపెనీలు ప్రకటించిన ఆర్ధిక ఫలితాలు యధావిధిగానే నిరాశపరిచాయి. కేవలం బడ్జెట్ మీద దృష్టితోనే గత వారమంతా మార్కెట్ నడిచింది. అందువల్లే ప్రీ-బడ్జెట్ ర్యాలీ వచ్చింది. వారం మొత్తానికి సెన్సెక్స్ 1316 పాయింట్లు పెరిగి 77506 వద్ద, నిఫ్టీ 390 పాయింట్లు లాభపడి 23482 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ మిడ్క్యాప్, స్మాల్ క్యాప్, బ్యాంకు నిఫ్టీలు కూడా లాభాల్లోనే సాగాయి.ఈవారంబడ్జెట్ ప్రభావం సోమవారం మార్కెట్లపై స్పష్టంగా కనిపించవచ్చు. మార్కెట్ వర్గాలను మెప్పించే చర్యలు బడ్జెట్లో లేకపోయినప్పటికీ సామాన్యులకు కలిగే ప్రయోజనం వల్ల పెట్టుబడులు పెరగవచ్చని అంచనా. దీని ఫలితాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి. అదే సమయంలో వారం చివర్లో... అంటే శుక్రవారం రిజర్వు బ్యాంకు ప్రకటించబోయే పాలసీలో వడ్డీ రేట్లు పావు శాతం తగ్గించవచ్చనే అంచనాలున్నాయి. ఇది కొంత సానుకూల అంశం.ట్రంప్ చర్యలుకెనడా, మెక్సికో, చైనాలపై టారిఫ్ లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విరుచుకుపడటం ప్రపంచ మార్కెట్లను మళ్లీ వణికిస్తోంది. మన స్టాక్ మార్కెట్లు సైతం ఇందుకు మినహాయింపు కాకపోవచ్చు. ఈవారం మార్కెట్లు భారీ ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి కొన్ని బడా కంపెనీలు ఈవారం ఆర్ధిక ఫలితాలు ప్రకటించబోతున్నాయి. వీటి ప్రభావం ఎటూ ఉండనే ఉంటుంది. ఇక రూపాయి కదలికలు, చమురు ధరల్లో మార్పులపైనా దృష్టి పెట్టాలి. ఏది ఏమైనప్పటికీ ఆర్ధిక ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోతే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినడం సహజం. అదేసమయంలో విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు మార్కెట్లను పడదోస్తూనే ఉంటాయి.ఆర్థిక ఫలితాల కంపెనీలుఈవారం మార్కెట్లపై అధిక స్థాయిలో ప్రభావితం చూపగల వాటిలో పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, భారతి ఎయిర్టెల్, బ్రిటానియా, హీరో మోటో, ఐటీసీ, ఎస్బీఐ, మహీంద్రా & మహీంద్రా ఫలితాలు ఉంటాయి. తర్వాతి స్థానంలో ఎల్ఐసీ, టాటా పవర్పె, ఆరోబిందో ఫార్మా, దివీస్, జైడస్ లైఫ్, టాటా కెమికల్, గోద్రెజ్ ప్రాపర్టీస్, థర్మాక్స్, టొరెంట్ పవర్, కమిన్స్, గుజరాత్ గ్యాస్, అపోలో టైర్స్, ఎన్ఎండీసీల ఫలితాలపైనా ఓ కన్నేసిఉంచాల్సిందే.ఎఫ్ఐఐలుమార్కెట్లో భారీ స్థాయిలో పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్న విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) గత జనవరి నెల మొత్తానికి రూ.87,000 కోట్ల విక్రయాలు జరిపారు. పెట్టుబడులను తరలిస్తున్నారు. గత అక్టోబర్లో రూ.1.14 లక్షల కోట్ల షేర్లు విక్రయించిన వీరు మళ్లీ అధిక స్థాయిలో అమ్మకాలకు పాల్పడింది జనవరి నెలలోనే కావడం గమనార్హం. దీని ప్రభావం రూపాయిపై పడుతోంది. అదే సమయంలో దేశీయ మదుపర్లు మార్కెట్కు మద్దతుగా నిలిచారు. వీరు నెల మొత్తానికి దాదాపు రూ.76,600 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. తద్వారా మార్కెట్లు భారీ స్థాయిలో పడిపోకుండా వీరు అడ్డుకోగలుగుతున్నారు. గత వారం మొత్తం మీద విదేశీ మదుపర్లు రూ.20,000 కోట్ల నికర అమ్మకాలు జరపగా అదే వారంలో దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.19,000 కోట్ల నికర కొనుగోళ్లు జరిపి మార్కెట్లను నిలబెట్టారు.సాంకేతిక స్థాయిలుమార్కెట్లలో ప్రస్తుతానికి సానుకూల సంకేతాలు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ నిఫ్టీ 23500 పైన ఉన్నంతవరకు ఫర్వాలేదు. ఈ ధోరణి కొనసాగితే మాత్రం సూచీలు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 23650 ని ప్రధాన నిరోధంగా భావించాలి. ఇది దాటితే 23800, 23920 వద్ద నిరోధాలున్నాయి. మొత్తం మీద 24000 పాయింట్లు అనేది ప్రస్తుతానికి పెద్ద అవరోధంగా భావించొచ్చు. దానికంటే ముందు 23200, 23050, 22850, స్థాయిల వద్ద నిఫ్టీ కి మద్దతు లభించొచ్చు. ఒకవేళ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి విస్తృతమైతే 22500 దాకా పడిపోయినా ఆశర్యపోనక్కర్లేదు. ఆర్ధిక ఫలితాల నేపథ్యంలో షేర్ల వారీ ప్రధాన కదలికలు చోటుచేసుకోవడం సహజమే అయినప్పటికీ ఇవి ఇండెక్స్ లను కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. ప్రముఖ కంపెనీల ఆర్ధిక ఫలితాలమెప్పించకపోయినా, ట్రంప్ నిర్ణయాలు మరింత ఇబ్బందికరంగా మారినా సూచీలు ఇంకా ఇంకా పడిపోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ సోమవారం నాటికి 15.1 శాతం క్షీణించి 14.1 దగ్గర ఉంది. ప్రస్తుతానికి మార్కెట్ బుల్స్ కు అనుకూలంగా ఉందనేందుకు ఇది నిదర్శనం.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
బడ్జెట్ 2025-26.. నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-26ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది ఆమెకు ఎనిమిదో బడ్జెట్, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడవ పర్యాయం ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వానికి రెండవ పూర్తి స్థాయి బడ్జెట్.బడ్జెట్ ప్రకటన కారణంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఫిబ్రవరి 1వ తేదీ శనివారం అయినప్పటికీ ఉదయం 9:15 గంటల నుండి ప్రారంభమయ్యాయి. సానుకూల అంచనాలతో ఉదయం లాభాల్లోకి వెళ్లిన సూచీలు మధ్యాహ్నం 12 ప్రాంతంలో నష్టాల్లోకి జారుకున్నాయి.మధ్యాహ్నం 12 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 455 పాయింట్లు, నిఫ్టీ 115 పాయింట్లు పతనమయ్యాయి. మరోవైపు హెల్త్కేర్ ఇండెక్స్ మాత్రం లాభాల్లో చలిస్తోంది. -
బడ్జెట్ రోజున స్వల్ప లాభాల్లో స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:47 సమయానికి నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 23,576కు చేరింది. సెన్సెక్స్ 267 పాయింట్లు ఎగబాకి 77,755 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.5 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76.75 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.54 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.5 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.28 శాతం దిగజారింది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలుపార్లమెంట్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-26ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో శనివారం మార్కెట్లో పూర్తిస్థాయిలో ఓపెన్లో ఉంటాయి. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బడ్జెట్ తర్వాత మార్కెట్లు ఎలా రియాక్ట్ అయ్యాయంటే
2020: కొత్త ట్యాక్స్ స్లాబులతో పన్ను రేట్లలో మార్పులు జరిగినా, పరిశ్రమ వర్గాలకు అనువైన నిర్ణయాలేవీ బడ్జెట్ లో లేకపోవడం సెంటిమెంట్ ను దెబ్బతీసి సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు పడిపోయింది.2021: ఇది పూర్తిగా విభిన్న బడ్జెట్. కోవిడ్ తొలిదశ ప్రభావంతో కుదేలైన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. భారీస్థాయిలో మౌలిక రంగ కేటాయింపులు జరిగాయి. స్టార్ట్ అప్ లకు ట్యాక్స్ హాలిడేలు వంటి వృద్ధి ప్రేరక చర్యలతో మార్కెట్ ఆనందానికి అవధులు లేవు. దీంతో సెన్సెక్స్ బడ్జెట్ రోజున ఏకంగా 2314 పాయింట్లు పెరిగింది. గత రెండు దశాబ్దాల స్టాక్ మార్కెట్ బడ్జెట్ డే చరిత్రలో ఇది అత్యుత్తమంగా నిలిచిపోయింది.2022: ఇది కూడా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంది. దీంతో సెన్సెక్స్ 849 పాయింట్లు పెరిగింది. 2023: ఈ బడ్జెట్ కు మిశ్రమ స్పందన వచ్చింది. ఫలితంగా ఆరోజు సెన్సెక్స్ ఒకదశలో 1100 పాయింట్లు పెరిగినా చివరకు 158 పాయింట్ల లాభంతో సరిపెట్టుకుంది.2024: మూలధన లాభాలపై అధిక పన్ను విధించడం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్ 1 శాతం పడిపోయింది.బడ్జెట్ రోజున ఇన్వెస్టర్లు/ట్రేడర్లు ఇలా చేయండి⇒ బడ్జెట్ రోజున మార్కెట్లో హెచ్చుతగ్గులు భారీ స్థాయిలో ఉంటాయి. కాబట్టి పెట్టుబడి నిర్ణయాల్లో తొందరపాటుతో వ్యవహరించకండి.⇒ట్రేడింగ్ విషయంలో ఆచితూచి అడుగేయండి. సాధ్యమైనంత వరకు ఒకట్రెండు రోజులు ట్రేడింగ్ కు దూరంగా ఉండటమే మంచిది.⇒బడ్జెట్ అనంతరం నిపుణుల/విశ్లేషకుల అభిప్రాయాలకు అనుగుణంగా మార్కెట్లో కదలికలు సాగుతూ ఉంటాయి. కాబట్టి వారు ఏం చెబుతున్నారో ఆలకించండి.⇒ బడ్జెట్ రోజు ట్రెండ్ ను అంచనా వేయడం చాలా కష్టం. పెరుగుతున్నాయి అనుకునే లోపే సూచీలు పడిపోతాయి. పడిపోతున్నాయి అనుకునే లోపే పైకి ఎగసిపోతాయి. మీకు మార్కెట్లో అనుభవం లేకపోతే బడ్జెట్ రోజు ట్రేడింగ్ చేయకండి. లాభాల మాట అటుంచి భారీ నష్టాలు కళ్లచూడాల్సి వస్తుంది.⇒ బడ్జెట్ లో ఏయే రంగాలకు ఏమేరకు కేటాయింపులు జరిగాయో సమగ్రంగా గ్రహించండి. తదనుగుణంగా సంబంధిత రంగాలకు చెందిన షేర్లపై దృష్టి పెట్టండి.⇒అనాలోచిత నిర్ణయాలతో, గుడ్డిగా షేర్లు కొనేయకండి.-బెహరా శ్రీనివాస రావు మార్కెట్, ఆర్ధిక విశ్లేషకులు -
బడ్జెట్: మార్కెట్లకు జోష్ ఇస్తేనే...!
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టే మరో బడ్జెట్ వెలుగు చూసేది రేపే. ఈ బడ్జెట్ పై ఇప్పటికే గణనీయమైన అంచనాలున్నాయి. ఇదొక విప్లవాత్మకమైన బడ్జెట్ అవుతుందనే మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత 13 నెలలుగా ఎడతెరిపి లేకుండా షేర్లను అమ్ముకుంటూ మన మార్కెట్ కు చుక్కలు చూపిస్తున్న విదేశీ మదుపర్లు.. ఈసారి బడ్జెట్ ప్రత్యేక దృష్టి పెడతారనడంలో సందేహం లేదు. గత జనవరి నుంచి చూస్తే ఈ జనవరి చివరికి వీళ్ళు దాదాపు రూ. 3.80 లక్షల కోట్ల షేర్లను విక్రయించి మన మార్కెట్ కు గట్టి నష్టాన్నే కలిగించారు.వీళ్ళ పయనం ఇదేమాదిరి కొనసాగకూడదంటే ఆర్ధిక మంత్రి మార్కెట్ ఫోకస్ తో కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలను వెలువరించాల్సి ఉంటుంది. 2024 -25 ఆర్ధిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు నాలుగేళ్ల కనిష్ట స్థాయి అయిన 6.3-6.8% నమోదుకావొచ్చని అంచనా. ప్రపంచ అస్థిర, అనిశ్చిత వాతావరణంతో మన ఆర్ధిక వ్యవస్థ సైతం ఇబ్బందులు పడుతోంది. వినియోగదారుల విశ్వాసం సన్నగిల్లింది. ప్రభుత్వం ఒత్తిడిలో ఉందన్న విషయం ఇది చెప్పకనే చెబుతోంది.ఈనేపథ్యలో స్టాక్ మార్కెట్ విశ్వాసాన్ని పెంచే, ఇన్వెస్టర్ల మనసు చూరగొనే అంశాలపై ఈసారి బడ్జెట్ లో దృష్టి సారించాల్సిందే. గత నాలుగు రోజులుగా మార్కెట్లో ప్రీ-బడ్జెట్ ర్యాలీ నడుస్తోంది. దానికి తోడు శుక్రవారం వెలువడ్డ ఆర్ధిక సర్వే మార్కెట్ కు ఉత్సాహాన్నే ఇచ్చింది. దీన్ని నిజం చేస్తూ బడ్జెట్ సాగాల్సిన అవసరం ఉంది. మరి మార్కెట్ సెంటిమెంట్ ను ఈ బడ్జెట్ మెరుగుపరుస్తుందా... నివ్వెరపరుస్తుందా? అన్నది రేపు ఎటూ తేలిపోతుంది.⇒ పన్నుల విధానంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని మార్కెట్ వర్గాలు గట్టిగానే పట్టుబడుతున్నాయి.⇒ దీర్ఘ కాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లో సమూల మార్పులు తీసుకు రావాలని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. ప్రస్తుతం దీర్ఘకాలిక లాభాలు అనేవి మూడేళ్లకు పైబడితేనే పన్నురహితంగా ఉంటున్నాయి. అలాగే డివిడెండ్లను కూడా మామూలు ఆదాయంగానే పరిగణించి పన్ను విధిస్తున్నారు. ఇలా చేయడం రెండుసార్లు పన్ను విధించడమే అవుతుందని, డివిడెండ్ ఆదాయాన్ని పన్నులనుంచి మినహాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.⇒ షేర్ల లావాదేవీలపై విధించే పన్నును తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ లావాదేవీల పన్నును ప్రస్తుతమున్న 0.625% నుంచి తగ్గిస్తే డెరివేటివ్స్ లావాదేవీలు ఊపందుకుంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి. కాకపోతే ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూరే మార్గాల్లో ఇదొకటి. కాబట్టి ప్రభుత్వం దీనిపై ఎంతవరకు పాజిటివ్ గా స్పందిస్తుంది అన్నది సందేహమే.⇒ ఈ రెండూ జరిగితే మార్కెట్ సెంటిమెంట్ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మార్కెట్లో లిక్విడిటీ పెరిగి రిటైల్, సంస్థాగత ఇన్వెస్టర్లు మరిన్ని పెట్టుబడులతో ముందుకొస్తారు.⇒ మరోపక్క మౌలిక రంగానికి కేటాయించే నిధులు మార్కెట్ కు ఉత్సాహాన్ని ఇస్తాయి. రోడ్లు, రైల్వేలు , రక్షణ రంగాలకు కేటాయింపులు పెంచితే సదరు నిధులు వినియోగాన్ని విస్తృతం చేస్తుంది. ముఖ్యంగా సిమెంట్, నిర్మాణ రంగాల్లో వినియోగం పెరగడం ద్వారా ఆయా రంగాలకు చెందిన షేర్లకు డిమాండ్ పెరుగుతుంది.⇒ ఇక తయారీ, వ్యవసాయం, విద్యుత్ వాహనాలు వంటి రంగాలకు తగిన ప్రోత్సాహకాలను ప్రకటించడం, పాలసీ పరంగా సంస్కరణలు తీసుకురావడం ప్రధానం. విధానపరమైన నిర్ణయాలు సంబంధిత రంగాల షేర్లపై మదుపరులకు మక్కువ పెంచుతాయి. తద్వారా తయారీ రంగంలో సెంటిమెంట్ పెరుగుతుంది.⇒ సబ్సిడీలు లేదా సంస్కరణలు వ్యవసాయ, అగ్రి బిజినెస్ రంగంలో కొత్త మార్పులను తీసుకొచ్చి ఆ రంగాల్లో డిమాండ్ పెంచుతాయి. దీర్ఘ కాలిక వృద్ధికి ప్రోత్సాహమిచ్చే ఇటువంటి చర్యలకు మార్కెట్లు ఆటోమేటిక్ గానే పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి.భారత ఆర్ధిక రంగానికి సంబంధించినంతవరకు బడ్జెట్ అనేది ఒక ప్రధాన సంఘటన. పన్ను సంస్కరణలు, రాబడులు, వ్యయాలు, ఆయా రంగాలకు కేటాయింపులు, విధానపరమైన నిర్ణయాలు, అనుకూల/ప్రతికూల అంశాలు.. ఇత్యాది అంశాల సమాహారమే బడ్జెట్. మార్కెట్ వర్గాలకు బడ్జెట్ రుచించకపోతే భారీగా పడగొట్టేస్తారు. నచ్చిందా నెత్తిన పెట్టుకుంటారు. ప్రస్తుతం గత రెండు, మూడు రోజులుగా మార్కెట్లో ప్రీ-బడ్జెట్ ర్యాలీ కనిపిస్తోంది. తాజా బడ్జెట్ అంచనాలను చేరుకోకపోతే మాత్రం దాని పరిణామాలు మామూలుగా ఉండవు.ఇప్పటికే నిక్కు నీలుగుతున్న మార్కెట్ మరింత పడిపోవడం ఖాయం. దూరమవుతున్న విదేశీ ఇన్వెస్టర్లు ఇంకా ఎంత చేటు చేయాలో అంతా చేసేస్తారు. అదే సమయంలో చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్లోకి రాలేని పరిస్థితి ఎదురవుతుంది. ఫలితంగా పడిపోయే మార్కెట్లు దేశ ఆర్ధిక వ్యవస్థపై పెనుప్రభావం చూపిస్తాయి. ఆర్ధిక మంత్రికి ఈవిషయాలన్నీ తెలియనివి ఏమీ కావు. అందరినీ మెప్పించే నిర్ణయాలతోనే ముందుకెళ్తారని ఆశిద్దాం. కొద్ది గంటలు ఓపిక పట్టి చూద్దాం... ఏం జరుగుతుందో... -
స్టాక్ మార్కెట్కు ఆర్థిక సర్వే ఊతం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఆర్థిక సర్వే 2024-25ను సమర్పించిన అనంతరం దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు వరుసగా నాల్గవ సెషన్లో లాభాలను కొనసాగించాయి. ఇంట్రా-డే గరిష్ఠ స్థాయి 77,549.92 పాయింట్లకు చేరుకున్న తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్ దాని మునుపటి ముగింపుతో పోలిస్తే 740.76 పాయింట్లు లేదా 0.97 శాతం పెరిగి 77,500.57 వద్ద స్థిరపడింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 258.90 పాయింట్లు లేదా 1.11 శాతం పెరిగి 23,508.40 స్థాయిల వద్ద ముగిసింది. ఈరోజు ఇండెక్స్ 23,530.70-23,277.40 రేంజ్లో ట్రేడయింది. నిఫ్టీ50లో టాటా కన్స్యూమర్, భారత్ ఎలక్ట్రానిక్స్, ట్రెంట్, లార్సెన్ & టూబ్రో, కోల్ ఇండియా నేతృత్వంలోని 47 స్టాక్లు 6.24 శాతం వరకు లాభాలను చూశాయి. మరోవైపు భారతీ ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ హోటల్స్, ఐసీఐసీఐ బ్యాంక్ 0.82 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్గా నిలిచాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 100, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 సూచీలు వరుసగా 1.89 శాతం, 2.11 శాతంతో బెంచ్మార్క్లను అధిగమించాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ నేతృత్వంలోని అన్ని రంగాల సూచీలు వరుసగా 2.04 శాతం, 2.44 శాతం లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఆటో, పీఎస్యూ బ్యాంక్, రియల్టీ, మెటల్, ఓఎంసీలు, ఎంపిక చేసిన ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు శుక్రవారం 1 శాతంపైగా లాభాలతో ముగిశాయి.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (ఫిబ్రవరి 1) పార్లమెంట్లో సమర్పించనున్న కేంద్ర బడ్జెట్ 2024-25 కోసం డి-స్ట్రీట్ ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ కారణంగా భారతీయ ఈక్విటీ మార్కెట్ శనివారం ట్రేడింగ్కు తెరిచి ఉంటుంది. -
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 134.73 పాయింట్లు లేదా 0.18 శాతం లాభంతో 76,894.55 వద్ద, నిఫ్టీ 46.20 పాయింట్లు లేదా 0.20 శాతం లాభంతో 23,295.70 వద్ద కొనసాగుతున్నాయి. యూనియన్ బడ్జెట్ సమావేశాల వేళ నేడు స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగానే ముందుకు సాగుతున్నాయి.లార్సెన్ & టూబ్రో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్, టైటాన్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ట్రెంట్ మొదలైన కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. భారతి ఎయిర్టెల్, కోల్ ఇండియా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస లాభాలు.. సెన్సెక్స్ హ్యాట్రిక్
దేశీయ స్టాక్మార్కెట్లు (Stock Market ) గురువారం లాభాల్లో ముగిశాయి. బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు వరుసగా మూడో సెషన్లోనూ పైకి కదిలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex) 226.85 పాయింట్లు లేదా 0.30 శాతం పెరిగి 76,759.81 వద్ద స్థిరపడింది. ఈ ఇండెక్స్ ఈరోజు గరిష్టంగా 76,898.63 వద్ద ట్రేడవగా, కనిష్ట స్థాయి 76,401.13 వద్ద నమోదైంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ (Nifty) 86.40 పాయింట్లు లేదా 0.37 శాతం పెరిగి 23,249.50 వద్ద ముగిసింది. గురువారం ఈ ఇండెక్స్ 23,311.15 నుంచి 23,139.20 రేంజ్లో ట్రేడ్ అయింది.భారత్ ఎలక్ట్రానిక్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సిప్లా, హీరో మోటోకార్ప్, భారతీ ఎయిర్టెల్ నేతృత్వంలోని టాప్ గెయినర్ స్టాక్లు 4.87 శాతం వరకు లాభాలను అందుకున్నాయి. నిఫ్టీ50లోని 35 సానుకూలంగా ముగిశాయి. మరోవైపు టాటా మోటార్స్, ఐటీసీ హోటల్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ 6.98 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్గా నిలిచాయి. ఈ ఇండెక్స్లోని 17 స్టాక్లు నష్టాలను చవిచూశాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ 0.12 శాతం లాభపడగా, నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ స్వల్పంగా 0.01 శాతం తగ్గింది.అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం రాత్రి వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించింది. ఈ ధఫా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు. ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్ శనివారం రోజున వెలువడుతుండడంతో ఆరోజు మార్కెట్లు పూర్తి స్థాయిలో పని చేస్తాయని సెబీ తెలిపింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫెడ్ వడ్డీరేట్లు యథాతథం.. స్వల్ప లాభాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు లాభపడి 23,204కు చేరింది. సెన్సెక్స్(Sensex) 49 పాయింట్లు ఎగబాకి 76,581 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.85 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76.56 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.53 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.47 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.51 శాతం దిగజారింది.అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం రాత్రి వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించింది. ఈ ధఫా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు. ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్ శనివారం రోజున వెలువడుతుండడంతో ఆరోజు మార్కెట్లు పూర్తి స్థాయిలో పని చేస్తాయని సెబీ తెలిపింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. భారతీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 వరుసగా రెండవ సెషన్లోనూ లాభాలను నమోదు చేశాయి. 30-షేర్ల సెన్సెక్స్ 631.55 పాయింట్లు లేదా 0.83 శాతం పురోగమించి రోజు గరిష్ట స్థాయి 76,589.93కి చేరిన తర్వాత 76,532.96 వద్ద స్థిరపడింది.సెన్సెక్స్ను ప్రతిబింబిస్తూ ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 కూడా 205.85 పాయింట్లు లేదా 0.90 శాతం లాభపడి 23,163.10 వద్ద ముగిసింది. ఈ సూచీ బుధవారం 23,181.35 నుంచి 22,976.50 రేంజ్లో ట్రేడయింది.విస్తృత మార్కెట్లు బెంచ్మార్క్లను అధిగమించాయి. నిఫ్టీ స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ 3.32 శాతం పెరగడంతో స్మాల్క్యాప్ షేర్లు ఛార్జ్లో ముందంజలో ఉన్నాయి. కాగా నిఫ్టీ మిడ్క్యాప్ 100 2.31 శాతం లాభంతో ముగిసింది.శనివారం పనిచేయనున్న మార్కెట్లుకేంద్ర బడ్జెట్ 2025-26ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నందున వచ్చే శనివారం (ఫిబ్రవరి 1) దేశీయ స్టాక్ మార్కెట్లు పనిచేయనున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) రెండూ శనివారం పూర్తి ట్రేడింగ్ సెషన్లను నిర్వహించనున్నట్లు ధ్రువీకరించాయి .తాజాగా జారీ చేసిన సర్క్యులర్లో ఈక్విటీ మార్కెట్లు ఉదయం 9:15 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు తెరిచి ఉంటాయని, కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్ సాయంత్రం 5:00 గంటల వరకు ట్రేడింగ్ ఉంటుందని ఎక్స్ఛేంజీలు వివరించాయి. అయితే, సెటిల్మెంట్ సెలవు కారణంగా "T0" సెషన్ షెడ్యూల్ మాత్రం ఉండదు. ప్రీ-మార్కెట్ ట్రేడింగ్ ఉదయం 9:00 నుండి 9:08 వరకు జరుగుతుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
త్వరలో ఫెడ్ వడ్డీరేట్లపై నిర్ణయం.. లాభాల్లో స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ(Nifty) 70 పాయింట్లు లాభపడి 23,021కు చేరింది. సెన్సెక్స్(Sensex) 219 పాయింట్లు ఎగబాకి 76,124 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.88 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 77.28 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.52 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.92 శాతం లాభపడింది. నాస్డాక్ 2.03 శాతం ఎగబాకింది.అమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపే చర్యల్లో భాగంగా ట్రంప్ తాజాగా కొలంబియాపై 25% సుంకాలు విధించారు. ఇప్పటికే మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుంచి 25% వాణిజ్య సుంకాల విధింపును ప్రకటించారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాలకు దారితీయొచ్చనే భయాలు పెరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం రాత్రి వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించనుంది. ఈ ధఫా వడ్డీరేట్ల తగ్గింపు ఉండదని అంచనాలున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బ్యాంకులు, ఫైనాన్స్ షేర్ల జోరు
ముంబై: ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంచేందుకు ఆర్బీఐ చర్యలు చేపట్టడంతో బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు రాణించాయి. వచ్చే నెల ద్రవ్య పరపతి సమావేశంలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే అంచనాలూ మరింత ఉత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 535 పాయింట్లు పెరిగి 75,901 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 128 పాయింట్లు బలపడి 22,957 వద్ద నిలిచింది. దీంతో సూచీలు రెండు రోజుల వరుస నష్టాల నుంచి గట్టెక్కినట్లైంది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు రోజంతా అదే ట్రెండ్ కొనసాగించాయి.బ్యాంకులు, ఫైనాన్స్తో పాటు వడ్డీరేట్ల సంబంధిత షేర్లైన ఆటో, రియల్టీ, కన్జూమర్ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో సెన్సెక్స్ 1,145 పాయింట్లు బలపడి 76,513 వద్ద, నిఫ్టీ 308 పాయింట్లు ఎగసి 23,138 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే ట్రేడింగ్ చివర్లో ఫార్మా, ఇండస్ట్రీయల్, యుటిలిటీస్, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, ఆయిల్అండ్గ్యాస్, ఇంధన, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు కొంత లాభాలు కోల్పోయాయి. ట్రంప్ వాణిజ్య విధానాలపై అనిశ్చితులు, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు, చైనా ఏఐ స్టార్టప్ డీప్సీక్ ప్రకంపనల ప్రభావంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ ట్రంప్ వాణిజ్య సుంకాల పెంపు భయాలతో డాలర్తో రూపాయి మారకం విలువ 26 పైసలు క్షీణించి 86.57 వద్ద ముగిసింది.⇒ ఆర్థిక వ్యవస్థలోకి రూ.1.50 లక్షల కోట్లు జొప్పించేందుకు ఆర్బీఐ పలు చర్యలు ప్రకటించడంతో బ్యాంకింగ్ రంగ షేర్లు మెరిశాయి. యాక్సిస్ బ్యాంకు 3.20%, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 3%, ఐసీఐసీఐ బ్యాంకు 2.15%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2% లాభపడ్డాయి. బ్యాంకు ఆఫ్ బరోడా, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకు షేర్లు 1–0.50% పెరిగాయి. మరోవైపు ఫెడరల్ బ్యాంక్ 5%, యస్ బ్యాంక్ 1.5%, కెనరా బ్యాంకు 1% మేర నష్టపోయాయి. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల బాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 535.23 పాయింట్లు లేదా 0.71 శాతం లాభంతో 75,901.41 వద్ద, నిఫ్టీ 128.10 పాయింట్లు లేదా 0.56 శాతం లాభంతో.. 22,957.25 వద్ద నిలిచాయి.బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, HDFC బ్యాంక్ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ 76 పాయింట్లు లాభపడి 22,904కు చేరింది. సెన్సెక్స్ 326 పాయింట్లు ఎగబాకి 75,692 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107.85 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 77.14 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.55 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో భారీ నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 1.46 శాతం నష్టపోయింది. నాస్డాక్ 3.07 శాతం దిగజారింది.ఇదీ చదవండి: హైదరాబాద్ అమెజాన్లో రూ.102 కోట్ల మోసంఅమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపే చర్యల్లో భాగంగా ట్రంప్ తాజాగా కొలంబియాపై 25% సుంకాలు విధించారు. ఇప్పటికే మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుండి 25% వాణిజ్య సుంకాల విధింపును ప్రకటించారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య యు ద్దాలకు దారితీయొచ్చనే భయాలు పెరిగాయి. చైనా ఏఐ స్టార్టప్ డీప్సీక్ ఆర్1 ప్రపంచవ్యాప్తంగా టెక్ పరిశ్రమను కుదిపేస్తుంది. అమెరికా దిగ్గజ టెక్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ ప్రభావం మన స్టాక్ మార్కెట్పై పడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించనుంది. ఈ ధఫా వడ్డీరేట్ల తగ్గింపు ఉండదని అంచనాలున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
డీప్సీక్.. మార్కెట్ షేక్!
ముంబై: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల విధింపు భయాలు, చైనా ఏఐ స్టార్టప్ డీప్సీక్ ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు సోమవారం ఒక శాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 824 పాయింట్లు క్షీణించి 76వేల స్థాయి దిగువన 75,366 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 23,000 స్థాయిని కోల్పోయింది. మార్కెట్ ముగిసే సమయానికి 263 పాయింట్లు పతనమై 22,829 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే నష్టాలతో మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒక దశలో సెన్సెక్స్ 923 పాయింట్లు క్షీణించి 75,267 వద్ద, నిఫ్టీ 306 పాయింట్లు పతనమై 22,786 వద్ద కనిష్టాలు తాకాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 9 పైసలు క్షీణించి 86.31 స్థాయి స్థిరపడింది. → ప్రధాన సూచీలు ఒకశాతమే పడినా.. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు భారీగా క్షీణించాయి. అధిక వాల్యుయేషన్ల భయాలతో విక్రయాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.5%, మిడ్ క్యాప్ సూచీ 2.7% పడింది. → స్టాక్ మార్కెట్ భారీ పతనంతో రూ.9.28 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.410.23 లక్షల కోట్ల(4.75 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచి్చంది. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. → ఐటీసీ లిమిటెడ్ నుంచి విడదీసిన ఐటీసీ హోటల్స్ షేర్లు జనవరి 29న స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 1న ఐటీసీ నుంచి ఐటీసీ హోటల్స్ ప్రత్యేక సంస్థగా విడిపోయింది. ప్రతి పది ఐటీసీ షేర్లకు ఒక ఐటీసీ హోటల్ షేరు ధరను కేటాయించారు.ఎందుకీ పతనం...→ అమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపే చర్యల్లో భాగంగా ట్రంప్ తాజాగా కొలంబియాపై 25% సుంకాలు విధించారు. ఇప్పటికే మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుండి 25% వాణిజ్య సుంకాల విధింపును ప్రకటించారు. ఇది అంతర్జాతీయ వాణిజ్య యు ద్దాలకు దారితీయొచ్చనే భయాలు పెరిగాయి. → చైనా ఏఐ స్టార్టప్ డీప్సీక్ ఆర్1 ప్రపంచవ్యాప్తంగా టెక్ పరిశ్రమను కుదిపేస్తుంది. అమెరికా దిగ్గజ టెక్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ ప్రభావం మన స్టాక్ మార్కెట్పై పడింది. → అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించనుంది. ఈ ధఫా వడ్డీరేట్ల తగ్గింపు ఉండదని అంచనాలున్నాయి. → ఇప్పటి వరకు వెల్లడైన కార్పొరేట్ డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచాయి. యూఎస్ టెక్ దిగ్గజాలలో కలవరం యూఎస్ ఏఐకు పోటీగా చైనీస్ ఆర్1 టెక్నాలజీ షేర్లలో భారీ అమ్మకాలు 3 శాతం పతనమైన నాస్డాక్ చాట్జీపీటీకి పోటీగా చైనీస్ డీప్సీక్ మైక్రోసాఫ్ట్, మెటా, ఒరాకిల్, గూగుల్ తదితర యూఎస్ టెక్నాలజీ దిగ్గజాలు వందల కోట్ల డాలర్లు వెచ్చించి రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్స్, చాట్జీపీటీకి పోటీగా చైనా రంగంలోకి దిగింది. స్టార్టప్ డీప్సీక్.. అమెరికా ఏఐలకు దీటుగా ఆర్1ను విడుదల చేస్తోంది. దీంతో టెక్నాలజీ వర్గాల్లో ఆందోళనలకు తెరలేచింది. చైనా కారుచౌకగా ఏఐ సేవలు అందించనున్న అంచనాలు యూఎస్ ఇన్వెస్టర్లలో భయాలను కల్పించింది. దీంతో టెక్ కంపెనీలు లిస్టయిన నాస్డాక్ ఇండెక్స్ ప్రారంభంలోనే 3 శాతం పతనమైంది. మ్యాగ్నిఫిషియంట్ 7గా పేర్కొనే ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, ఏఎండీ తదితరాలు అమ్మకాలతో డీలా పడ్డాయి. ప్రధానంగా ఏఐ అవకాశాలపై అంచనాలతో ఇటీవల భారీ ర్యాలీ చేస్తున్న ఎన్విడియా షేరు 17 శాతంపతనంకాగా.. మైక్రోసాఫ్ట్ 3 శాతంపైగా క్షీణించింది. ఫలితంగా ఒక్కరోజులోనే ఎన్విడియా మార్కెట్ విలువలో సుమారు 500 బిలియన్ డాలర్లు ఆవిరైంది. ఆర్1 ఎఫెక్ట్..: చైనా ఏఐ స్టార్టప్ డీప్సీక్ అభివృద్ధి చేసిన ఆర్1.. అమెరికా టెక్ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న చాట్జీపీటీ, ఓపెన్ ఏఐ తదితరాలకు తీవ్ర పోటీతో చెక్ పెట్టనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఏఐలో చైనా వేగాన్ని నిలువరించేందుకు వీలుగా ఇప్పటికే అమెరికా ఆధునిక సెమీ కండక్టర్ టెక్నాలజీలను ఎగుమతి చేయకుండా నిషేధించింది. ఎన్విడియా రూపొందిస్తున్న ఏఐ చిప్స్ తదితరాలపై ఆంక్షలు విధించింది. డీప్సీక్ అభివృద్ధి చేసిన తాజా ఏఐ మోడల్ను గత వారమే మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఓపెన్ఏఐ, మెటా ప్లాట్ఫామ్స్కు దీటైన పోటీని ఇవ్వనున్నట్లు టెక్నాలజీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా అమెరికా టెక్ దిగ్గజాలు వందల కోట్ల డాలర్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఏఐ సేవలకు దీటుగా చైనీస్ ఏఐ చౌకగా సేవలు అందించే వీలుందని విశ్లేషకులు అంటున్నారు. ఇది తీవ్ర పోటీకి తెరతీయడంతో యూఎస్ టెక్ దిగ్గజాల పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో రిటర్నులకు తెరపడవచ్చని ఆందోళన నెలకొంది. ఫలితంగా ఉన్నట్టుండి టెక్ కౌంటర్లలో అమ్మకాలు నమోదవుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఆందోళనలు.. ‘డీప్’గత వారమే విడుదలైన డీప్సీక్ తాజా ఏఐ మోడల్.. అమెరికా ఐఫోన్ల టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ యాప్ స్టోర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరినట్లు తెలుస్తోంది. దీంతో క్వాంట్ ఫండ్ చీఫ్ లియాంగ్ వెన్ఫెంగ్ ఏర్పాటు చేసిన ఈ ఓపెన్ సోర్స్డ్ ప్రొడక్ట్.. ఓపెన్ ఏఐ, మెటా ప్లాట్ఫామ్స్ కు పోటీగా నిలుస్తుందన్న అంచనాలు పెరిగాయి. వెరసి అడ్వాన్స్డ్ చిప్స్, అత్యున్నత కంప్యూటింగ్ పవర్లపై ఆధారపడిన ప్రస్తుత యూఎస్ ఏఐ బిజినెస్ మోడల్ను ఆర్1 దెబ్బతీయవచ్చన్న ఆందోళనలు వ్యాప్తిస్తున్నాయి. ఏఐ విస్తృతిలో ప్రధానంగా ఎన్విడియాకు భారీ అవకాశాలు లభించాయి. అయితే ఆర్1 సెగ ఎన్విడియాకు అధికంగా తగులుతుందనేది నిపుణులు మాట. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
చరిత్రలోనే అతిపెద్ద స్టాక్మార్కెట్ క్రాష్ రాబోతోందా?
ప్రఖ్యాత రచయిత, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తకాన్ని రచించిన రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) స్టాక్ మార్కెట్కు (stock market) సంబంధించి సంచలన జోస్యం చెప్పారు. "చరిత్రలో అతిపెద్ద స్టాక్ మార్కెట్ క్రాష్" వచ్చే ఫిబ్రవరిలో సంభవిస్తుందని ఆయన అంచనా వేశారు. ఈ మేరకు ఆయన అందర్నీ అప్రమత్తం చేస్తూ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. రాబోతున్న ఈ మహా పతనం సాంప్రదాయ పెట్టుబడి మార్కెట్లను అతలాకుతలం చేస్తుందని, అయితే వెంటనే మేల్కొని అప్రమత్తమయ్యేవారికి ఇది ఒక పెద్ద అవకాశంగా తాను చూస్తున్నట్లు కియోసాకి పేర్కొన్నారు. తన 2013 నాటి రిచ్ డాడ్ పుస్తకంలోనూ కియోసాకి రాబోయే స్టాక్ మార్కెట్ క్రాష్ గురించి హెచ్చరించారు. గతంలో వచ్చిన అన్ని పతనాలు దీని ముందు దిగదుడుపే అని కూడా అందులో చెప్పారు.2025 ఫిబ్రవరిలో స్టాక్ మార్కెట్ భారీ క్రాష్ సంభవించే అవకాశం ఉందని కియోసాకి తాజాగా చేసిన ట్వీట్.. ఆ పుస్తకంలోని జోస్యం నిజమవుతోందని సూచిస్తోంది. అయినప్పటికీ, దీని ద్వారా వినాశనం జరుగుతుందని కియోసాకి ఏమీ భావించడం లేదు. ఈ క్రాష్ గొప్ప కొనుగోలు అవకాశాన్ని అందిస్తుందని నమ్ముతున్నారు. "ఈ క్రాష్లో అన్నీ విక్రయానికి వస్తాయి" అని వివరించారు. మార్కెట్ పతనం సమయంలో కార్లు, ఇళ్లు వంటివి తక్కువ ధరకు వస్తాయంటున్నారు.ఇది మంచి వార్తే..కియోసాకి ప్రకారం ఇది మంచి వార్త. స్టాక్, బాండ్ మార్కెట్ల నుండి మూలధనం ప్రత్యామ్నాయ పెట్టుబడులలోకి, ముఖ్యంగా బిట్కాయిన్లోకి ప్రవహిస్తుంది. పెట్టుబడిదారులు సురక్షితమైన, మరింత లాభదాయకమైన ఎంపికలను వెతుకుతున్నందున, క్రిప్టోకరెన్సీ భారీ వృద్ధిని అందుకుంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. బిట్కాయిన్, బంగారం, వెండి వాటిలో పెట్టుబడులు పెట్టాలని కియోసాకి చాలా కాలంగా తన ఫాలోవర్లకు సూచిస్తున్నారు.భవిష్యత్తు క్రిప్టోకరెన్సీదే..సంస్థాగత, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి క్రిప్టోకరెన్సీ ఆదరణ పొందుతున్న నేపథ్యంలో బిట్కాయిన్ను సురక్షిత స్వర్గంగా కియోసాకి అభివర్ణిస్తున్నారు. మార్కెట్ అస్థిరత సమయంలో బిట్కాయిన్ వృద్ధికి ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుందని, ముఖ్యంగా స్టాక్లు, బాండ్లు వంటి సాంప్రదాయ ఆస్తులు తమ ఆకర్షణను కోల్పోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. బిట్కాయిన్లో అతి చిన్న యూనిట్ అయిన సతోషి ఉన్నా కూడా గణనీయమైన సంపదకు దారితీస్తుందని కియోసాకి నొక్కిచెబుతున్నారు. 100 మిలియన్ల సతోషిలు కలిపితే ఒక బిట్కాయిన్. కియోసాకి అంచనా వేసిన మార్కెట్ క్రాష్ సమయం సమీపిస్తున్న కొద్దీ ఇన్వెస్టర్లలో గుబులు పుడుతుంటే ఆయన జోస్యం నిజమవుతుందా లేదా అని ప్రపంచం నిశితంగా గమనిస్తోంది.In RICH DADs PROPHECY-2013 I warned the buggiest stock market crash in history was coming. That crash will be in February 2025.Good news because in a crash everything goes on sale. Cars and houses on sale now.Better news billions will leave the stock and bond markets and…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 27, 2025 -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 838.43 పాయింట్లు లేదా 1.10 శాతం నష్టంతో 75,352.03 వద్ద.. నిఫ్టీ 274.90 పాయింట్లు లేదా 1.19 శాతం నష్టంతో 22,817.30 వద్ద నిలిచాయి.ఐసీఐసీఐ బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందూస్తాన్ యూనీలీవర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. HCL టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, విప్రో, హిందాల్కో ఇండస్ట్రీస్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు. -
23 వేల మార్కు కిందకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:39 సమయానికి నిఫ్టీ(Nifty) 93 పాయింట్లు నష్టపోయి 22,993కు చేరింది. సెన్సెక్స్(Sensex) 305 పాయింట్లు దిగజారి 75,905 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107.74 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 78.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.59 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.29 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.5 శాతం దిగజారింది.డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి కొత్త ఏడాదిలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పరపతి సమావేశాన్ని నిర్వహిస్తోంది. దీంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్ల నడకను పలు దేశ, విదేశీ అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.శనివారం ట్రేడింగ్కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో శనివారం(ఫిబ్రవరి 1) స్టాక్ మార్కెట్లు పనిచేయనున్నాయి. పూర్తిస్థాయిలో ట్రేడింగ్ను నిర్వహించనుండటంతో ఈ వారం స్టాక్ ఎక్స్ఛేంజీలు ఆరు రోజులపాటు లావాదేవీలకు వేదిక కానున్నాయి. అయితే బడ్జెట్ సెంటిమెంటుపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వెరసి మార్కెట్ల ట్రెండ్కు దిక్సూచిగా నిలవనున్నట్లు పేర్కొంటున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఆర్ధిక మంత్రి హల్వా.. రుచులే వేరయా!
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గారి హల్వా (halwa) వంటకం పూర్తయింది. జనాలకి రుచి చూపించడమే తరువాయి. హల్వా అంటేనే తీపి పదార్ధం. కానీ ఆర్ధిక మంత్రి గారి హల్వాకి మాత్రం రకరకాల రుచులుంటాయి. ఒకరికి తీపి, ఇంకొకరికి చేదు, మరొకరికి చప్పగా... మొత్తమ్మీద అందరూ రుచి చూడాల్సిందే... వంటకం మొన్నే పూర్తయినా... రుచి చూపించేది మాత్రం ఫిబ్రవరి 1నే.2025-26 ఆర్ధిక సంవత్సరానికి నరేంద్రం మోదీ నేతృత్వంలో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీయే ప్రభుత్వం తొలి బడ్జెట్ (budget 2025) ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 న ప్రారంభమవుతాయి. ఆరోజు మొదట ఎకనామిక్ సర్వే ను ప్రభుత్వం విడుదల చేస్తుంది. గత ఆర్ధిక సంవత్సరం తాలూకు వివిధ రంగాల్లో ప్రభుత్వం సాధించిన పురోగతి, లక్ష్యాలు, ఆర్ధిక వనరులు, భవిష్యత్ అవకాశాలతో సమ్మిళితమైన ఈ సర్వే బడ్జెట్ కు ఒక దిక్సూచిగా నిలుస్తుంది.ఆమర్నాడు అంటే ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 8 వ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. వాస్తవానికి మనం బడ్జెట్ అని వ్యవహరిస్తున్నప్పటికీ... దీన్ని ఫైనాన్స్ బిల్ గా భావించాలి. సాధారణ పన్ను చెల్లింపుదారులు మొదలుకొని... ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, ఇన్సూరెన్సు, ఫైనాన్స్, ఆటోమొబైల్, బ్యాంకింగ్... ఇలా వివిధ రంగాలు ఈ బడ్జెట్ కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉంటాయి.ఆర్ధిక మంత్రి ఎలాంటి ప్రకటనలు చేస్తారు? అవి కలగజేసే ప్రయోజనం, చోటుచేసుకోబేయే మార్పులు... ఇత్యాది అంశాలను విశ్లేషిస్తూ భవిష్యత్ మార్పులకు ఆయా రంగాలు సిద్ధమవుతాయి. వాస్తవానికి బడ్జెట్ కసరత్తు ప్రారంభం కావడానికి ముందే ఆర్ధిక మంత్రి ఆయా రంగాల వారితో సమావేశమై వారి విజ్ఞప్తులు, ఆకాంక్షలు, డిమాండ్లను లుసుకున్నారు. కోరికలు, డిమాండ్లు ఎక్కువగానే ఉండటం సహజం, అయితే ఈ బడ్జెట్ లో వాటిలో ఎన్ని నెరవారుతాయో నాన్న ఆసక్తితో పరిశ్రమ వర్గాలు ఎదురుచూస్తూ ఉంటాయి.జనవరి 31 న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల తొలివిడత ఫిబ్రవరి 13 న ముగుస్తుంది. రెండో విడత సమావేశాలు మార్చి 10 న ప్రారంభమై ఏప్రిల్ 4 న ముగుస్తాయి. ఈ రెండు విడతల సమావేశాల్లోనూ పార్లమెంట్లో విస్తృత స్థాయిలో వాదోపవాదాలు జరుగుతాయి. విపక్షాల ఎదురుదాడిని తట్టుకుంటూనే ప్రభుత్వం తన వాదనలు సమర్ధించుకునే యత్నాలు చేస్తుంది. ఒక్కోసారి సాధారణ, కార్పొరేట్, వాణిజ్య, పారిశ్రామిక రంగాల అసంతృప్తుల్ని పరిగణనలోకి తీసుకుంటూ తగిన మార్పులు చేస్తుంది. ఇలా చేసిన బడ్జెట్ (ఫైనాన్స్ బిల్లు) కు లోక్ సభ, రాజ్య సభ ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తుంది. అక్కడ కూడా లాంఛనం పూర్తయ్యాక కొత్త ఆర్ధిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.ఈ బడ్జెట్ పై ఎన్నో వర్గాలు రకరకాల ఆశలు పెట్టుకుంటాయి. ముఖ్యంగా బడ్జెట్ వస్తున్న ప్రతిసారీ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తూ... చివరకు నిట్టూర్పులు విడిచే వర్గం ఒకటి ఉంది. వారే పన్ను చెల్లింపుదారులు.ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు చేయాలని, ట్యాక్ రిబేటులు పెంచాలని వీరు ఎదురుచూస్తూ ఉంటారు. అలాగే కార్పొరేట్ వర్గాలు తమ తమ రంగాలకు దక్కే ప్రయోజనాలకోసం డిమాండ్ చేస్తూ ఉంటాయి.స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యే వేళ.. అంటే 2047 నాటికి వికసిత భారత్ (అభివృద్ధి చెందిన భారత దేశం) నినాదంతో నరేంద్ర మోదీ సర్కారు లక్ష్యాలు నిర్దేశించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పుడు భారత్.. యువరక్తంతో ఉరకలేస్తోందని, రాబోయే 30 - 40 ఏళ్ళు మనవేనని, ప్రపంచమంతా మనవైపే ఆతృతగా ఎదురుచూస్తోంది ప్రధాన మంత్రి మోదీ చెబుతూ వస్తున్నారు. మరి ప్రధాని మాటలు కార్యరూపం దాల్చాలంటే అందుకు అనుగుణమైన కసరత్తు ఇప్పటినుంచీ జరగాలి. మోదీ 3.O లో వెలుగు చూడబోయే బడ్జెట్ ఇందుకు వేదికగా నిలవాలి. 2023 - 24 లో 8.2 శాతం వృద్ధి సాధించిన భారత ఆర్ధిక వ్యవస్థ... 2024 -25 లో 6 .5 శాతం వృద్ధికే పరిమితం కావచ్చనే అంచనాలున్నాయి. ఈనేపథ్యంలో జీడీపీ వృద్ధిని పెంచే దిశగా బడ్జెట్లో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం అవసరం. జాతీయ రహదారుల విస్తరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, తాగు నీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్య, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలి.మోదీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి ప్రవేశపెడుతున్న తొలి పూర్తి బడ్జెట్ ఇదే. ఇప్పుడిప్పుడే ఎన్నికలు ఏమీ లేవు, కాబట్టి ఎన్నికల అనుకూల బడ్జెట్ గా ఉదారంగా వ్యవహరించే అవకాశం లేదు కాబట్టి తాజా బడ్జెట్ లో కొంత కరమైన నిర్ణయాలే వెలువడే అవకాశం ఉంది. రాబోయే బడ్జెట్ నుంచి ఏయే వర్గాలు ఏమేమి ఆశిస్తున్నాయో.. రాబోయే కథనాల్లో వివరంగా చర్చిద్దాం.స్టాక్ మార్కెట్ ఈసారి బడ్జెట్ వచ్చేది శనివారం. వాస్తవానికి ఆరోజు స్టాక్ మార్కెట్లు పనిచేయవు. కానీ బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహించాలని స్టాక్ ఎక్స్చేంజిలు నిర్ణయించాయి. ఆరోజు యధావిధిగా స్టాక్ మార్కెట్లు ఉదయం 9.15 కి ప్రారంభమై మధ్యాహ్నం మూడున్నర వరకు కొనసాగుతాయి. బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతాయి. బడ్జెట్ వెలువడే సమయంలోనూ... ముఖ్యంగా ఆర్ధిక మంత్రి రెండో పార్ట్ (ట్యాక్స్లకు సంబంధించి) చదివే వేళ మార్కెట్లో ఈ హెచ్చుతగ్గులు తారాస్థాయికి చేరతాయి.ఆ తర్వాత విశ్లేషకులు, ఆర్ధిక నిపుణులు వెలువరించే అభిప్రాయాలను బట్టి మార్పులకు లోనవుతూ ఉంటాయి. కాబట్టి సగటు మదుపర్లు ప్రధానంగా ట్రేడర్లు ఆరోజు ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. సాధ్యమైనంతవరకు ఆరోజు ట్రేడింగ్ కు దూరంగా ఉండటమే మేలు. అధిక స్థాయిలో లాభాలు రావడానికి ఎంత అవకాశం ఉందో భారీ నష్టాలు కళ్లజూసేందుకు కూడా అంతే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త.-బెహరా శ్రీనివాస రావుస్టాక్ మార్కెట్, ఆర్ధిక విశ్లేషకులు -
Stock Market: చివరికి నష్టాలే..
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ (BSE) సెన్సెక్స్, ఎన్ఎస్ఈ ( NSE) నిఫ్టీ50 వారాంతపు ట్రేడింగ్ సెషన్ను లోయర్ నోట్తో ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 329.92 పాయింట్లు లేదా 0.43 శాతం క్షీణించి 76,190.46 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ ఇండెక్స్ 76,985.95 - 76,091.75 రేంజ్లో ట్రేడయింది.సెన్సెక్స్ను ప్రతిబింబిస్తూ నిఫ్టీ 50 కూడా 113.15 పాయింట్లు లేదా 0.49 శాతం తగ్గి 23,092.20 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 23,347.30 వద్ద నమోదు చేయగా, కనిష్ట స్థాయి 23,050 వద్ద కనిపించింది. నిఫ్టీ50లోని 50 స్టాక్లలో 31 స్టాక్లు నష్టాలతో ముగిశాయి. ట్రెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బీపీసీఎల్, అదానీ ఎంటర్ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా 4.90 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్గా నిలిచాయి. ఇదిలా ఉండగా హిందుస్థాన్ యూనిలీవర్, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ 2.52 శాతం వరకు లాభాలతో గ్రీన్లో ముగిసిన 19 స్టాక్లలో ఉన్నాయి.స్మాల్-క్యాప్ షేర్లు విస్తృత మార్కెట్లలో అత్యంత ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ స్మాల్క్యాప్ 100 2.35 శాతం దిగువన, నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ 1.55 శాతం దిగువన ముగిసింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి.దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన లిస్టెడ్ కంపెనీల సగటు నికరలాభ వృద్ధి కేవలం 4%గా మాత్రమే నమోదైంది. వార్షిక ప్రాతిపదిక డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ50 కంపెనీల ఈపీఎస్(ఎర్నింగ్స్ పర్ షేర్) 3% మాత్రమే ఉంటుందని బ్లూమ్బర్గ్ ఇటీవల అంచనా వేసింది. రానున్న బడ్జెట్లో ప్రభుత్వం మూలధన పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో కదలాడుతున్న స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 33 పాయింట్లు లాభపడి 23,241కు చేరింది. సెన్సెక్స్(Sensex) 129 పాయింట్లు ఎగబాకి 76,655 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.8 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 78.17 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.62 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.53 శాతం లాభపడింది. నాస్డాక్ 0.22 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: రోల్స్రాయిస్కు రూ.90,200 కోట్ల కాంట్రాక్ట్దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన లిస్టెడ్ కంపెనీల సగటు నికరలాభ వృద్ధి కేవలం 4%గా మాత్రమే నమోదైంది. వార్షిక ప్రాతిపదిక డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ50 కంపెనీల ఈపీఎస్(ఎర్నింగ్స్ పర్ షేర్) 3% మాత్రమే ఉంటుందని బ్లూమ్బర్గ్ ఇటీవల అంచనా వేసింది. రానున్న బడ్జెట్లో ప్రభుత్వం మూలధన పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) గురువారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. కొన్ని ప్రారంభ ఒడిదుడుకుల తర్వాత, బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు సానుకూల ధోరణిని ప్రదర్శించాయి. ఆటో, ఐటీ, సిమెంట్తోపాటు కొన్ని హెల్త్కేర్ షేర్లపై ఆసక్తిని పెంచాయి.బీఎస్ఈ బెంచ్మార్క్ సూచీ అయిన సెన్సెక్స్ (Sensex) ప్రారంభ డీల్స్లో 76,202 కనిష్ట స్థాయిని తాకింది. ఆపై స్థిరంగా కనిష్ట స్థాయి నుండి 543 పాయింట్లు పెరిగి 76,743 గరిష్ట స్థాయికి ర్యాలీ చేసింది. చివరకు 115 పాయింట్ల లాభంతో 76,520 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 (Nifty) వరుసగా 23,271, 23,091 వద్ద గరిష్ట, కనిష్ట స్థాయిలను తాకింది. 50 పాయింట్లు లేదా 0.22 శాతం పెరిగి 23,205 వద్ద ముగిసింది.సెన్సెక్స్ 30లో అల్ట్రాటెక్ సిమెంట్ దాదాపు 7 శాతం ఎగబాకి రూ. 11,400 స్థాయిలకు చేరుకుంది. ఇక జోమాటో 2.5 శాతం లాభపడగా, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, టాటా స్టీల్, టైటాన్ ప్రధాన లాభపడిన షేర్లలో ఉన్నాయి. మరోవైపు హెచ్సీఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోటక్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ 1 శాతంపైగా క్షీణించాయి.విస్తృత మార్కెట్లో, బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.8 శాతం జంప్ చేయగా, స్మాల్క్యాప్ 0.7 శాతం పెరిగింది. మిడ్క్యాప్ ఐటీ వంటి కోఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ వంటివి ఒక్కొక్కటి 10 శాతానికి పైగా పెరిగాయి. రంగాల వారీగా ఆటో, ఐటీ, హెల్త్కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు 1 - 2 శాతం శ్రేణిలో లాభపడ్డాయి. కాగా బ్యాంకింగ్ సంబంధిత సూచీలు తగ్గుముఖం పట్టాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
23,100 మార్కు వద్ద నిఫ్టీ సూచీ
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 46 పాయింట్లు నష్టపోయి 23,106కు చేరింది. సెన్సెక్స్(Sensex) 121 పాయింట్లు పడిపోయి 76,294 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.31 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 78.71 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.6 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.61 శాతం లాభపడింది. నాస్డాక్ 1.28 శాతం ఎగబాకింది.‘అమెరికా ఫస్ట్’ నినాదంతోట్రంప్ మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుంచి 25% వాణిజ్య సుంకాల విధింపునకు సిద్ధమయ్యారు. భారత్తో సహా ఇతర దేశాలపై సుంకాల విధింపు తప్పదని గతంలో వ్యాఖ్యానించారు. ట్రంప్ టారిఫ్ ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన లిస్టెడ్ కంపెనీల సగటు నికరలాభ వృద్ధి కేవలం 4%గా మాత్రమే నమోదైంది. వార్షిక ప్రాతిపదిక డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ50 కంపెనీల ఈపీఎస్(ఎర్నింగ్స్ పర్ షేర్) 3% మాత్రమే ఉంటుందని బ్లూమ్బర్గ్ ఇటీవల అంచనా వేసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇన్వెస్టర్లు ఇంతింతై.. నేడు 11 కోట్ల మంది!
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE)లో నమోదిత ఇన్వెస్టర్ (investors) బేస్ (ఒకే ఖాతా) 2025 జనవరి 20న 11-కోట్ల (110 మిలియన్లు) మార్కును దాటింది. ఈ ఎక్స్ఛేంజ్లో రిజిస్టర్ అయిన క్లయింట్ కోడ్ల (ఖాతాలు) మొత్తం 21 కోట్ల (210 మిలియన్లు) కంటే ఎక్కువగా ఉన్నాయి (ఇప్పటి వరకు నమోదైన అన్ని క్లయింట్ రిజిస్ట్రేషన్లు కలిపి). సాధారణంగా క్లయింట్లు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను నమోదు చేసుకోవచ్చు.ఎన్ఎస్ఈ (NSE)లో ఇన్వెస్టర్ రిజిస్ట్రేషన్లు ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ పెరుగుదలను చూశాయి. ఇవి గత ఐదేళ్లలో 3.6 రెట్లు పెరిగాయి. 1994లో ఎన్ఎస్ఈ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి 1 కోటి పెట్టుబడిదారులను చేరుకోవడానికి 14 సంవత్సరాలు పట్టింది. తర్వాత వేగం పుంజుకుంది. తదుపరి 1 కోటి రిజిస్ట్రేషన్లకు ఏడు సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత కోటి కోసం మరో 3.5 సంవత్సరాలు పట్టింది. ఇక నాలుగో కోటి మైలురాయికి కేవలం ఒక ఏడాదే పట్టింది. పెట్టుబడిదారుల ఉత్సాహం, స్టాక్ మార్కెట్లో భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తూ కేవలం ఐదు నెలల్లోనే చివరి 1 కోటి మంది పెట్టుబడిదారులు నమోదయ్యారు.గత ఐదు నెలల్లో రోజువారీ కొత్త విశిష్ట (ఒక ఖాతా) పెట్టుబడిదారుల నమోదులు స్థిరంగా 47,000 నుంచి 73,000 మధ్య ఉన్నాయి. వేగవంతమైన డిజిటలైజేషన్ పురోగతి, పెట్టుబడిదారుల అవగాహనను పెంచడం, ఆర్థిక చేరిక ప్రయత్నాలు, బలమైన మార్కెట్ పనితీరుతో సహా అనేక కీలక కారకాలు ఈ వృద్ధికి దారితీశాయి. 2024లో నిఫ్టీ 50 ఇండెక్స్ 8.8% రాబడిని అందించగా, నిఫ్టీ 500 ఇండెక్స్ 15.2% లాభాన్ని సాధించింది. గత తొమ్మిదేళ్లుగా భారతీయ మార్కెట్లు సానుకూల రాబడులను కలిగి ఉన్నాయి. 2024 డిసెంబర్తో ముగిసిన ఐదేళ్ల కాలంలో నిఫ్టీ 50, నిఫ్టీ 500 సూచీలు వరుసగా 14.2%, 17.8% వార్షిక రాబడిని అందించాయి. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంచాయి.మార్కెట్లో 20 శాతం కుటుంబాలు 2014 మే 1నాటికి 1.65 కోట్ల మంది ఉన్న ఇన్వెస్టర్లు నేడు 11 కోట్లకు చేరుకున్నారు. అంటే గత 10 సంవత్సరాలలో పెట్టుబడిదారుల భాగస్వామ్యంలో దాదాపు ఏడు రెట్లు పెరిగింది. దేశంలోని 20 శాతం కుటుంబాలు ఇప్పుడు నేరుగా మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నాయి. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 2014 మే 1 నాటికి రూ. 73.5 లక్షల కోట్లు ఉండగా ఇప్పుడిది దాదాపు 6 రెట్లు పెరిగి రూ.425 లక్షల కోట్లకు చేరింది.యువ ఇన్వెస్టర్లుమార్కెట్లోకి వస్తున్న కొత్త పెట్టుబడిదారుల గణనీయమైన సంఖ్య మార్పును ప్రతిబింబిస్తోంది. నేడు ఈ పెట్టుబడిదారుల మధ్యస్థ వయస్సు ఇప్పుడు దాదాపు 32 సంవత్సరాలు. వీరిలో 40% మంది 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వారే ఉన్నారు. కేవలం ఐదేళ్ల క్రితం కొత్త ఇన్వెస్టర్ల మధ్యస్థ వయస్సు 38 సంవత్సరాలు ఉండేది. యువ పెట్టుబడిదారులలో స్టాక్ మార్కెట్పై పెరుగుతున్న ఆసక్తిని ఇది తెలియజేస్తోంది. -
Stock Market: ఒడిదుడుకులు.. ఎట్టకేలకు లాభాలు
ఈక్విటీ బెంచ్మార్క్ సూచీలు బుధవారం ఇంట్రా-డే డీల్స్లో రోలర్-కోస్టర్ రైడ్ను తలపించాయి. స్థిరంగా ప్రారంభమైన బెంచ్మార్క్ సూచీలు క్రమంగా లాభాలను తగస్తూ నష్టాల్లోకి జారిపోయాయి. తర్వాత ఐటీ, ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లలో లాభాల కారణంగా తిరిగి బలంగా పుంజుకున్నాయి.బీఎస్ఈ (BSE) సెన్సెక్స్ 76,114 వద్ద ప్రారంభమైన తర్వాత, లాభాలను తగ్గించి 75,817 వద్ద కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరికి 76,461 వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది. 567 పాయింట్ల లాభంతో 76,405 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఇంట్రా-డేలో వరుసగా రెండో రోజు 23,000 మార్క్ దిగువకు పడిపోయింది. సూచీ 22,981 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. అయితే చివరకు 131 పాయింట్ల లాభంతో 23,155 వద్ద ముగిసింది.ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మధ్యాహ్న డీల్స్తో పుంజుకుంది .ఇతర సెన్సెక్స్ 30 షేర్లలో ఇన్ఫోసిస్క, టీసీఎస్ ఒక్కొక్కటి 3 శాతం పెరిగాయి. టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డిఎఫ్సి టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, జొమాటో 1-2 శాతం మధ్య ఎగిశాయి. మరోవైపు టాటా మోటార్స్ 2 శాతానికి పైగా పడిపోయింది. నష్టాలను చవిచూసిన ఇతర ముఖ్యమైన స్టాక్స్లో పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ ఉన్నాయి. విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.2 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ 1.6 శాతం పడిపోయింది. రెండు సూచీలు రోజు ద్వితీయార్ధంలో నష్టాల్లో కొంత భాగాన్ని తిరిగి పొందాయి. సెక్టోరియల్ ఇండెక్స్లలో - బీఎస్ఈ రియాల్టీ ఇండెక్స్ 10 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ కూడా దాదాపు 2 శాతం క్షీణించింది. మిగతా వాటిలో బుధవారం ఐటీ ఇండెక్స్ 2 శాతానికి పైగా ర్యాలీ చేసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ట్రంప్ ఎఫెక్ట్.. 20 రోజుల్లో రూ.50,000 కోట్ల అమ్మకాలు
భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (Foreign Institutional Investors) 2025 జనవరిలో ఇప్పటివరకు దాదాపు రూ.50,000 కోట్లకుపైగా పెట్టుబడిని ఉపసంహరించుకున్నారు. ఈ భారీ అవుట్ ఫ్లో సెన్సెక్స్, నిఫ్టీలపై గణనీయంగా ప్రభావం చూపుతోంది. ఎఫ్ఐఐల అమ్మకాల దోరణి కొనసాగుతుండడంతో సూచీలు పతనమవుతున్నాయి. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు వెలువరిస్తున్న త్రైమాసిక ఫలితాలు పెద్ద ఇన్వెస్టర్లకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. వార్షిక ప్రాతిపదికన చాలా కంపెనీల లాభాల వృద్ధి స్థిరంగానే ఉంది.ట్రంప్ ప్రభావం..అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టడంతో భారత్ మార్కెట్లో ఎఫ్ఐఐ(FII)ల అమ్మకాల్లో వేగం పెరుగుతోంది. అందుకుతోడు ట్రంప్ ‘కంట్రీఫస్ట్’ దోరణితో తీసుకుంటున్న నిర్ణయాలు మరింత భయాందోళనలు రేకిత్తిస్తున్నాయి. ట్రంప్ అమెరికా అనుకూల విధానాల వల్ల చాలామంది ఇన్వెస్టర్లు యూఎస్లోనే పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే భారత్లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు వాటిని విత్డ్రా చేసి అమెరికా మార్కెట్లో ఇన్వెస్ట్(Invest) చేయాలని భావిస్తున్నారు. దాంతో భారత మార్కెట్లు భారీగా కుదేలవుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతను ఇప్పటికే ప్రారంభించింది. అమెరికా బాండ్ ఈల్ట్లు పెరుగుతున్నాయి.ఇదీ చదవండి: అమెరికా చమురు ఎగుమతులు పెంపుడాలర్ బలపడటం, విదేశీ నిధుల ఉపసంహరణతో అమెరికా డాలర్(US Dollar)తో పోలిస్తే ఇటీవల భారత రూపాయి 3 శాతం క్షీణించి రికార్డు స్థాయిలో రూ.86.70 వద్ద ముగిసింది. ఈ క్షీణత భారత స్టాక్ మార్కెట్పై ఒత్తిడి పెంచింది. ఈక్విటీ మార్కెట్లు స్థిరపడాలంటే బాండ్ ఈల్డ్స్, యూఎస్ డాలర్ నిలకడగా ఉండడం చాలా అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
23,100 మార్కు వద్ద కదలాడుతున్న నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ(Nifty) 60 పాయింట్లు లాభపడి 23,085కు చేరింది. సెన్సెక్స్(Sensex) 297 పాయింట్లు ఎగబాకి 76,139 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.11 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 79.37 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.59 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.88 శాతం లాభపడింది. నాస్డాక్ 0.64 శాతం ఎగబాకింది.‘అమెరికా ఫస్ట్’ నినాదంతోట్రంప్ మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుంచి 25% వాణిజ్య సుంకాల విధింపునకు సిద్ధమయ్యారు. భారత్తో సహా ఇతర దేశాలపై సుంకాల విధింపు తప్పదని గతంలో వ్యాఖ్యానించారు. ట్రంప్ టారిఫ్ ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ నిన్నటి మార్కెట్లో అమ్మకాలకు పాల్పడ్డారు. దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన లిస్టెడ్ కంపెనీల సగటు నికరలాభ వృద్ధి కేవలం 4%గా మాత్రమే నమోదైంది. వార్షిక ప్రాతిపదిక డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ50 కంపెనీల ఈపీఎస్(ఎర్నింగ్స్ పర్ షేర్) 3% మాత్రమే ఉంటుందని బ్లూమ్బర్గ్ అంచనా వేసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
స్టాక్ మార్కెట్కు ట్రంప్ భయం
-
ట్రంప్ టారిఫ్ టెర్రర్
ముంబై: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య టారిఫ్ పెంపు భయాలకు తోడు అధిక వెయిటేజీ షేర్ల పతనంతో స్టాక్ సూచీలు మంగళవారం ఒకటిన్నరశాతానికి పైగా కుప్పకూలాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మరింత ఒత్తిడి పెంచాయి. సెన్సెక్స్ 1,235 పాయింట్లు పతనమై 75,838 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 320 పాయింట్లు నష్టపోయి 23,025 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది ఏడు నెలల కనిష్టం. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా అదే బాటలో నడిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,432 పాయింట్లు క్షీణించి 75,642 వద్ద, నిఫ్టీ 369 పాయింట్లు పతనమై 22,976 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. డాలర్తో రూపాయి విలువ 13 పైసలు బలహీనపడి 86.58 వద్ద స్థిరపడింది.⇒ అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. రియల్టీ ఇండెక్స్ 4.2% క్షీణించింది. కన్జూమర్ డ్యూరబుల్స్ 4%, సర్విసెస్, విద్యుత్, టెలికం, యుటిలిటీ ఇండెక్సులు 2.5% పడ్డాయి.నష్టాలకు 4 కారణాలు⇒ ‘అమెరికా ఫస్ట్’ నినాదంతోట్రంప్ మెక్సికో, కెనడాలపై ఫిబ్రవరి 1 నుండి 25% వాణిజ్య సుంకాల విధింపునకు సిద్ధమయ్యారు. భారత్తో సహా ఇతర దేశాలపై సుంకాల విధింపు తప్పదని గతంలో వ్యాఖ్యానించారు. ట్రంప్ టారిఫ్ ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు.⇒ దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన లిస్టెడ్ కంపెనీల సగటు నికరలాభ వృద్ధి కేవలం 4%గా మాత్రమే నమోదైంది. వార్షిక ప్రాతిపదిక డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ50 కంపెనీల ఈపీఎస్ (ఎర్కింగ్స్ పర్ షేర్) 3% మాత్రమే ఉంటుందని బ్లూమ్బర్గ్ అంచనా వేసింది.⇒ జొమాటో (–11%)తో సహా అధిక వెయిటేజీ షేర్లు ఐసీఐసీఐ బ్యాంకు (–3%), ఎస్బీఐ (–2.57%), రిలయన్స్ (–2.50%), ఎంఅండ్ఎం (–2.25%) షేర్లు భారీగా క్షీణించి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. సెన్సెక్స్ మొత్తం పతనంలో ఈ షేర్ల వాటాయే 640 పాయింట్లు. కాగా ఒక్క జొమాటో షేరు వాటా 150 పాయింట్లు కావడం గమనార్హం.⇒ విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు దలాల్ స్ట్రీట్పై మరింత ఒత్తిడి పెంచాయి. ఈ కొత్త ఏడాది జనవరి 20 నాటికి ఎఫ్ఐఐలు మొత్తం రూ.48,023 కోట్ల విలువైన భారత ఈక్విటీలు అమ్మేశారు. 7.5 లక్షల కోట్లు ఆవిరిమార్కెట్ భారీ పతనంతో సోమవారం ఒక్కరోజే రూ.7.52 లక్షల కోట్లు హరించుకుపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.424 లక్షల కోట్లకు దిగివచ్చింది. సెన్సెక్స్లోని మొత్తం 30 షేర్లలో అల్ట్రాటెక్(0.39%), హెచ్సీఎల్ టెక్(0.33%) మాత్రమే స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. -
లాభాలకు బ్రేక్.. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,071.98 పాయింట్లు లేదా 1.39 శాతం నష్టంతో 76,001.46 వద్ద, నిఫ్టీ 299.45 పాయింట్లు లేదా 1.28 శాతం నష్టంతో.. 23,045.30 వద్ద నిలిచాయి.ట్రెంట్, అదానీ పోర్ట్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అపోలో హాస్పిటల్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), JSW స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 72 పాయింట్లు లాభపడి 23,416కు చేరింది. సెన్సెక్స్(Sensex) 92 పాయింట్లు ఎగబాకి 77,164 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.29 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 80.07 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.54 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే ఎలాంటి మార్పు చెందలేదు. నాస్డాక్ 1 శాతం ఎగబాకింది.క్యూ3 ఫలితాలతోపాటు వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆదాయపన్నుసహా పలు రంగాల నుంచి సంస్కరణలకోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు వినతులు అందుతున్న విషయం విదితమే. ద్రవ్య విధానాలు, ఆర్థిక వృద్ధి చర్యలు, పెట్టుబడుల కేటాయింపు, కీలక రంగాలలో సంస్కరణలు వంటి పలు అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు చెబుతున్నారు. ఇదేవిధంగా దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు సైతం మార్కెట్లలో సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు వివరించారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ట్రంప్ చర్యలు.. ఆర్థిక ఫలితాలే కీలకం!
గతవారం స్టాక్ మార్కెట్లలో ఒడుదొడుకులు కొనసాగాయి. ప్రధాన సూచీలు దాదాపు 1 శాతం పడిపోయాయి. ఇందుకు వివిధ కారణాలు దోహదం చేశాయి. వాటిలో ప్రధానమైనది విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం. వెంటాడుతున్న చమురు ధరల భయం, ఈరోజు అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయబోయే డొనాల్డ్ ట్రంప్ విధానాలపై స్పష్టత కొరవడటం. ఈ మూడు అంశాలు ప్రధానంగా మార్కెట్లను పడగొట్టాయి. మరోపక్క రిలయన్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు ప్రకటించిన ఆర్థిక ఫలితాలూ మార్కెట్ల క్షీణతలో తమవంతు పాత్ర పోషించాయి. వాస్తవానికి ఫలితాలు ఫర్వాలేదు అనిపించినప్పటికీ మార్కెట్లను బలహీనత ఆవరించింది. ముఖ్యంగా ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంకు ఫలితాలు మదుపర్లను మెప్పించలేకపోయాయి. ఇన్ఫోసిస్ రూ.113, యాక్సిస్ బ్యాంకు రూ.45 దాకా క్షీణించాయి. దాదాపు రూ.35 దాకా పెరిగిన రిలయన్స్ మార్కెట్లని కాస్త ఆదుకోబట్టి సరిపోయింది కానీ, ఈ పతనం మరింత ఎక్కువగా ఉండేది. ఫార్మా, ప్రైవేట్ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, వాహన, ఐటీ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోగా.. ప్రభుత్వ రంగ బ్యాంకులు, చమురు రంగానికి చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. వారం మొత్తానికి సెన్సెక్స్ 760 పాయింట్లు కోల్పోయి 77619 వద్ద, నిఫ్టీ 228 పాయింట్లు నష్టపోయి 23203 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు సానుకూలంగా ట్రేడ్ అయినప్పటికీ... చివరకు ప్రతికూలంగానే ముగిశాయి. ఈవారం ఇలా..గత వారం మాదిరిగానే ఈవారం కూడా మార్కెట్లు కన్సాలిడేషన్ దిశగానే సాగే అవకాశం ఉంది. మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధాన సంఘటనలు తక్కువగా ఉండటం ఇందుకు ఒక కారణం. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్ధిక ఫలితాల ప్రభావం ఎటూ ఉండనే ఉంటుంది. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ట్రంప్ చేయబోయే ప్రకటనలపై కూడా మార్కెట్ ఓ కన్నేసి ఉంచుతుంది. ముఖ్యంగా టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు చేయబోయే ప్రకటనలు రాబోయే రోజుల్లో మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయి. గతంలో మాదిరి దేశీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ, అంతర్జాతీయ సంస్థలను ఏమైనా ఇరకాటంలో పెడతారా? లేదంటే విధానాలు మార్చుకుని కొంత సరళంగా వ్యవహరిస్తారా? అన్న విషయాన్ని మార్కెట్ సునిశితంగా గమనిస్తుంది. ఇక రూపాయి కదలికలు, చమురు ధరల్లో మార్పులపైనా దృష్టి పెట్టాలి. ఏది ఏమైనప్పటికీ ఆర్ధిక ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోతే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినడం సహజం. అదే సమయంలో విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు అగ్గికి ఆజ్యం పోస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.ఆర్థిక ఫలితాలు కీలకంఈవారం హిందుస్థాన్ లీవర్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్, హిందూస్థాన్ పెట్రోలియంలు ఫలితాలు ప్రకటించబోయే ప్రధాన కంపెనీలు. డీఎల్ఎఫ్, జొమాటో, ఎల్ & టీ ఫైనాన్స్, డిక్సాన్ టెక్నాలజీస్, పీఎన్బీ హౌసింగ్, ఇండియా మార్ట్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, జేకే సిమెంట్, టొరెంట్ ఫార్మా, జేఎస్ డబ్ల్యు స్టీల్, లారస్ లాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియా, జిందాల్ సా, గోద్రెజ్ సీపీ, ఎంఫసిస్, సియెంట్, అదానీ గ్రీన్, పాలీక్యాబ్, హడ్కో, పెర్సిస్టెంట్, పెడిలైట్, హెరిటేజ్ ఫుడ్స్, కోఫర్జ్లు మరికొన్ని ప్రధాన కంపెనీలు.ఎఫ్ఐఐల సరళిఅమెరికాలో బాండ్ల రాబడి ప్రోత్సాహకారంగా ఉండటం రూపాయి సెంటిమెంటును దెబ్బతీస్తోంది. ఫలితంగా రూపాయి క్షీణిస్తూ డాలర్ బలపడుతూ వస్తోంది. ఇది విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్ఐఐలు) పెట్టుబడులను ప్రభావితం చేస్తోంది. గత ఏడాది మొత్తం మీద భారీ స్థాయిలో విక్రయాలకు ప్రాధాన్యం ఇచ్చిన విదేశీ మదుపర్లు ఈ ఏడాది మొదటి నెలలోనూ అదే ధోరణిలో సాగుతున్నారు. గత వారం వీరు దాదాపు రూ.25,000 కోట్ల దాకా షేర్లను విక్రయించారు. నెల మొత్తానికి వీరి నికర అమ్మకాలు రూ.46,576 కోట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో దేశీయ మదుపర్లు మార్కెట్ కు మద్దతుగా నిలిచారు. వీరు దాదాపు రూ.49367 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.సాంకేతిక స్థాయులుమార్కెట్లు ప్రస్తుతం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆర్ధిక ఫలితాల నేపథ్యంలో స్టాక్ ప్రధాన కదలికలు చోటుచేసుకోవడం సహజమే అయినప్పటికీ ఇవి ఇండెక్స్లను ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సెన్సెక్స్, నిఫ్టీల్లో ఒడుదొడుకులు కొంత మేర తగ్గే అవకాశం ఉన్నా ముఖ్యంగా బుల్స్ చేస్తున్న ప్రయత్నాలకు బేర్స్ అడ్డుగానే నిలుస్తున్నారు. మార్కెట్ కు కొనుగోళ్ల మద్దతు లభిస్తే మాత్రం మొదట దృష్టి పెట్టాల్సింది 23350 స్థాయి. దీన్ని అధిగమించనంతవరకు మార్కెట్ కొద్దిగా పెరిగినట్లు కనిపించినా మళ్లీ క్షీణత వైపే అడుగులేయవచ్చు. ఒకవేళ 23350 దాటితే తదుపరి నిరోధ స్థాయి 23500. దీన్ని కూడా దాటి ముందుకెళ్తే 23700, 23900 స్థాయిలను అందుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రముఖ కంపెనీల ఆర్ధిక ఫలితాల మెప్పించకపోయినా, ట్రంప్ నిర్ణయాలు ప్రతికూలంగా ఉన్నా సూచీలు పడిపోవడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రస్తుత స్థాయి నుంచి దిగజారితే మాత్రం మొదటి మద్దతు 23050 వద్ద లభిస్తుంది. దీన్ని కూడా బ్రేక్ చేసుకుని కిందకు పడిపోతే 22850 స్థాయిని టెస్ట్ చేయొచ్చు. ఆ తర్వాతి దశలు 22600, 22400 గా భావించాలి. ఫ్యూచర్స్ & ఆప్షన్స్ డేటాను పరిశీలిస్తే నిఫ్టీ 23000-24000 స్థాయిలోనే చలించవచ్చని తెలుస్తోంది. కాల్స్ డేటా ప్రకారం 24000 వద్ద అత్యధిక స్థాయిలో ఓపెన్ ఇంటరెస్ట్ ఉంది. పుట్స్ వైపు 22200 వద్ద అత్యధిక ఓపెన్ ఇంటరెస్ట్ కేంద్రీకృతమై ఉంది. మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారం 5.58 శాతం పెరిగి 15.75 దగ్గర ఉంది.రంగాలవారీగా...బ్యాంకింగ్ షేర్లు తమ బలహీనతలను కొనసాగించే అవకాశం ఉంది. టెలికాం సంస్థలు ప్రోత్సాహక ఫలితాలు ప్రకటించవచ్చన్న అంచనాలతో ఈ రంగంలోని షేర్లు సానుకూలంగా కదలాడొచ్చు. వాహన రంగంలోని షేర్లు స్తబ్దుగానే చలించే అవకాశం ఉంది. క్షీణిస్తున్న రూపాయి ఫార్మా షేర్లకు మంచి బూస్ట్ అనే చెప్పాలి. మార్కెట్ ఒడుదొడుకుల్లో మదుపరులకు ఇది ఎప్పటికీ సురక్షిత రంగమే. ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ ఫలితాలు నిరుత్సాహపరచడం ఐటీ రంగ షేర్లలో ఒత్తిడిని పెంచుతోంది. సిమెంట్ ధరలు పెరగవచ్చన్న వార్త నేపథ్యంలో ఈ రంగంలోని షేర్లకు మద్దతు లభించే అవకాశం ఉండగా, లోహ షేర్లు ఒత్తిళ్లు ఎదుర్కోవచ్చు. చమురు, ఎఫ్ఎంసీజీ షేర్లలో పెద్దగా దూకుడు ఉండకపోవచ్చు.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం సానుకూలంగా ముగిశాయి. 30-షేర్ల సెన్సెక్స్ 454 పాయింట్లు లేదా 0.59 శాతం లాభపడి 77,073.44 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ ఇండెక్స్ 76,584.84- 77,318.94 రేంజ్లో ట్రేడ్ అయింది. ఎన్ఎస్ఈ (Nifty) నిఫ్టీ 50 కూడా 141 పాయింట్లు లేదా 0.61 శాతం లాభంతో 23,344.75 వద్ద గ్రీన్ జోన్లో స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 23,391.10 వద్ద కనిపించగా, కనిష్ట స్థాయి 23,170.65 వద్ద ఉంది.కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టిపిసి, ఎస్బిఐ, అదానీ ఎంటర్ప్రైజెస్, భారత్ ఎలక్ట్రానిక్స్, బిపిసిఎల్ నేతృత్వంలోని లాభాలతో నిఫ్టీ50లోని 50 స్టాక్లలో 29 సానుకూలంగా ముగిశాయి. దీనికి విరుద్ధంగా ఎస్బీఐ లైఫ్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ నష్టాల్లో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 8 పాయింట్లు నష్టపోయి 23,194కు చేరింది. సెన్సెక్స్(Sensex) 16 పాయింట్లు ఎగబాకి 76,663 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 109.19 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్(Crude Oil) ధర 80.77 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.62 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1 శాతం లాభపడింది. నాస్డాక్ 1.51 శాతం ఎగబాకింది.క్యూ3 ఫలితాలతోపాటు వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆదాయపన్నుసహా పలు రంగాల నుంచి సంస్కరణలకోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు వినతులు అందుతున్న విషయం విదితమే. ద్రవ్య విధానాలు, ఆర్థిక వృద్ధి చర్యలు, పెట్టుబడుల కేటాయింపు, కీలక రంగాలలో సంస్కరణలు వంటి పలు అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు చెబుతున్నారు. ఇదేవిధంగా దేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు సైతం మార్కెట్లలో సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు వివరించారు.ప్రపంచ దేశాలన్నీ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి నేడు(20న) తెరలేవనుంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి యూఎస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించనుండటంతో కొంతకాలంగా వాణిజ్య వర్గాలు అధికంగా ప్రభావితం కానున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. వాణిజ్యంతోపాటు ఫైనాన్షియల్ మార్కెట్లపైనా ట్రంప్ ఎఫెక్ట్ ఉండబోతున్నట్లు మరోపక్క ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అంబానీని మించిన దానగుణం: ఒక్క రోజులో రూ. 46వేలకోట్ల నష్టం
భారతదేశంలో ధనవంతుల సంఖ్య పెరుగుతూ ఉంది. వీరిలో చాలా మంది లెక్కకు మించిన డబ్బు సంపాదించడమే కాకుండా.. ఉదారంగా దాతృత్వ కార్యక్రమాలకు మద్దతిస్తూ.. వేలకోట్లు దానం చేస్తుంటారు. ఇందులో చెప్పుకోదగ్గ వ్యక్తి బిలియనీర్ 'శివ్ నాడార్' (Shiv Nadar). అయితే ఈయన హెచ్సీఎల్ టెక్ కంపెనీ షేర్స్ మంగళవారం 9 శాతం క్షీణించాయి. దీంతో ఒక్క రోజులోనే రూ. 46,485 కోట్లు నష్టం వాటిల్లింది.హెచ్సీఎల్ టెక్ మార్కెట్ విలువభారతదేశంలోని అగ్రశ్రేణి ఐటీ కంపెనీలలో ఒకటైన హెచ్సీఎల్.. డిసెంబర్ త్రైమాసిక ఆదాయాలు మార్కెట్ అంచనాలను అందుకోవడంలో విఫమయ్యాయి. దీంతో సంస్థ స్టాక్ ధరలో కూడా భారీ క్షీణత కనిపించింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో కంపెనీ షేర్లు 8.63% పతనమై, ఒక్కో షేరుకు రూ.1,813.95 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సెషన్లో, స్టాక్ మొత్తం 9.41% క్షీణతను ప్రతిబింబిస్తూ రూ. 1,798.40 కనిష్ట స్థాయిని తాకింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో షేరు 8.51 శాతం క్షీణించి రూ.1,819.95 వద్ద ముగిసింది. ఫలితంగా జనవరి 14 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గింది.శివ్ నాడార్ నికర విలువఒక్క రోజులో వేలకోట్ల నష్టం వాటిల్లినప్పటికీ.. శివ్ నాడార్ నికర విలువ ఫోర్బ్స్ ప్రకారం 39.4 బిలియన్ డాలర్లు లేదా రూ. 3,40,793 కోట్లుగా ఉంది. ఇది ఆయన బలమైన పునాదిని & ఐటీ రంగంలో కంపెనీ బలానికి నిదర్శనం అని తెలుస్తోంది.అత్యంత ఉదార దాతశివ్ నాడార్ కేవలం భారతదేశంలోని సంపన్నుల జాబితాలో ఒకరుగా మాత్రమే కాకుండా.. అత్యంత ఉదారమైన పరోపకారిగా కూడా గుర్తింపు పొందారు.శివ్ నాడార్ దాతృత్వంలో అంబానీ, అదానీని కూడా మించిపోయారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 2,153 కోట్లు విరాళమిచ్చారు. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఇది 5 శాతం ఎక్కువ. దీంతో ఎడెల్గివ్ హురున్ వితరణశీలుర లిస్టులో శివ్ నాడార్ అగ్రస్థానంలో నిలిచారు.ఇదీ చదవండి: ఐటీ కంపెనీల్లో ఇదీ పరిస్థితి: ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్ప్రస్తుతం స్టాక్ మార్కెట్ అస్థిరత ఫలితంగా హెచ్సీఎల్ టెక్ వాల్యుయేషన్లో తాత్కాలిక తగ్గుదల ఏర్పడినప్పటికీ, భారతదేశ ఐటీ రంగానికి శివ్ నాడార్ చేసిన కృషి, అతని దాతృత్వ ప్రయత్నాల కారణంగా అతనిని నిజమైన మార్గదర్శకుడిగా మాత్రమే కాకుండా.. భవిష్యత్ తరాలకు రోల్ మోడల్గా నిలిపింది. -
కంపెనీకి భారీ నష్టం.. షేరు ధర మాత్రం పైకి... ఎందుకిలా?
ఆర్ధిక ఫలితాల సీజన్ (Q3 Results) మొదలైంది. స్టాక్ మార్కెట్ (Stock market) మదుపర్లు, ట్రేడర్ల కళ్లన్నీ ఇప్పుడు వాటిమీదే ఫోకస్ అయి ఉన్నాయి. గత గురువారం రిలయన్స్, ఇన్ఫోసిస్ (Infosys), యాక్సిస్ బ్యాంకులు ఆర్ధిక ఫలితాలు ప్రకటించాయి. ఈ మూడు కంపెనీలు ప్రకటించిన ఫలితాలు ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. అయితే... శుక్రవారం రిలయన్స్ షేరు ధర రూ.35 పెరిగితే యాక్సిస్ బ్యాంకు షేర్ ధర రూ. 47, ఇన్ఫోసిస్ రూ.113 పడిపోయాయి. ఫలితాలు బానే ఉన్నా షేర్ ధర ఎందుకు పడిపోతుందో చాలామందికి తెలియదు. కేవలం ఫలితాలను నమ్ముకుని షేర్ కొంటే చివరకు నష్టపోతారు. ఎందుకిలా జరుగుతుంది?ఈ ప్రశ్నకు అనేకానేక సమాధానాలు. వాటిని విశ్లేషించి చూద్దాం.సాధారణంగా కంపెనీలు ఒక ఏడాది/త్రైమాసికానికి సదరు కాలంలో ఆర్జించిన ఆదాయాలు, లాభాలు/నష్టాలను ప్రకటిస్తూ ఉంటాయి.ఆ మూడు నెలలు, ఏడాది కాలంలో కంపెనీ పనితీరు బావుందా, క్షీణించిందా, కొత్త ప్రాజెక్టులు ఏమి వచ్చాయి, ఉద్యోగులు పెరిగారా/తగ్గారా, ఎంత డివిడెండ్ ప్రకటించాయి, భవిష్యత్ గురించి కంపెనీ ఏం చెబుతోంది? ఇత్యాది ప్రశ్నలు అన్నిటికీ ఈ ఫలితాలు సమాధానం చెబుతాయి.ఒక కంపెనీ ప్రకటించే లాభాలు, డివిడెండ్ లే ఆ కంపెనీ ఎంత ఆరోగ్యకరంగా పనిచేస్తోందో తెలియచెబుతాయి.ఆ కంపెనీ ఏ రంగానికి చెందిందో.. ఆ రంగానికి ప్రస్తుతం, భవిష్యత్ ఎలా ఉండొచ్చు అన్న అంశాన్ని కూడా విశ్లేషకులు అంచనా వేసి ఒక నిర్ణయానికి వస్తారు.కంపెనీ ఆదాయం స్థిరంగా పెరుగుతూ వస్తోందా... రాబోయే రోజుల్లో వేరే కంపెనీలను కొనుగోలు చేసే స్థాయిలో పుష్కలంగా నిధులను సంపాదించగలుగుతోందా అని కూడా చూస్తారు.అలాగే ఈపీఎస్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్ అని అర్ధం. సింపుల్ గా చెప్పాలంటే ఒక్కో షేర్ పై గిట్టుబాటు అయ్యేది ఎంత అన్నది తెలుస్తుంది. ఈ పై అంశాలన్నీ స్టాక్ మార్కెట్లో ఒక షేర్ ధరను నిర్ధారిస్తాయి. ఒక కంపెనీ మంచి ఆదాయాలు, లాభాలు ఆర్జించినంత మాత్రాన ఆ కంపెనీ షేర్ ధర పెరిగిపోదు. ఒక్కోసారి పడిపోతుంది కూడా. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం.ఇన్ఫోసిస్ నే ఉదాహరణగా తీసుకుందాం. ఈ కంపెనీ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి రూ.41,764 కోట్ల ఆదాయంపై రూ. 6,806 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఆదాయం 8 శాతం, లాభం 11 శాతం పెరిగాయి. పైగా భవిష్యత్లో ఆర్జించబోయే ఆదాయాల అంచనాలను కూడా పెంచింది. ఫలితాలు ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. అయినా శుక్రవారం ఈ కంపెనీ షేర్ ధర రూ.113 పడిపోయింది. దీనికి అనేక కారణాలు...ఫలితాలు ప్రకటించడానికి ముందే మార్కెట్ కు కొంత సమాచారం ఉంటుంది. దాన్నిబట్టి ప్రస్తుత ఫలితాలు ఉన్నాయా, లేదా అని మార్కెట్ వర్గాలు చూస్తాయి. కంపెనీ మంచి ఫలితాలు ప్రకటించినా, వాళ్ళ అంచనాలు అందుకోలేకపోతే షేర్ ధరను పడగొడతారు. ఈ విషయంపై ఓ కన్నేయాలి.ఫలితాలకు ముందే ఆ షేర్ ధర పెరిగి ఉంటుంది. "వదంతులు వ్యాపించినప్పుడు కొనాలి. అవి నిజమైనప్పుడు అమ్మేయాలి..." అన్నది మార్కెట్లో ఉన్న సామెత. సాధారణంగా మార్కెట్లో బడా వర్గాలకు ముందే కాస్త ఉప్పు అందుతుంది కాబట్టి వాళ్ళు రూమర్ల సమయంలోనే కొనేస్తారు. కొద్ది రోజుల తర్వాత ఆ షేర్ అమ్మేసి మంచి లాభాలు సంపాదిస్తారు. ఇలా ఎందుకు జరుగుతోందో చాలామంది చిన్న ఇన్వెస్టర్లకు తెలియదు. ఈలోపు సదరు కంపెనీ ఆ రూమర్లను నిజం చేస్తూ ప్రకటన చేస్తుంది. అది చూసి రిటైల్ ఇన్వెస్టర్లు కొనడం మొదలెడతారు. సరిగ్గా ఈ సమయంలోనే అంతకుముందే కొనుగోలు చేసిన పెద్ద ఇన్వెస్టర్లు మెల్లగా బయటకు వచ్చేయడం మొదలెడతారు. దీంతో షేర్ ధర పడటం మొదలవుతుంది. అలా ఎందుకు జరుగుతోందో వీళ్లకు అర్ధం కాదు. మంచి పాజిటివ్ న్యూస్ కదా.. ఇప్పుడు పడినా కానీ మళ్ళీ పెరుగుతుందిలే అని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఆ షేర్ ఇంకా పడుతూనే ఉంటుంది. చివరకు నష్టాన్ని బుక్ చేసి బయటకు రావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలా జరక్కూడదంటే మార్కెట్ తో పాటు నడవడం నేర్చుకోవాలి.ఒక్కోసారి కంపెనీ చాలా చెత్త ఫలితాలు ప్రకటిస్తుంది. అయినా షేర్ ధర భారీగా పెరుగుతుంది. నష్టాలు వచ్చాయి కదా.. షేర్ ధర పడుతుంది అని షార్ట్ సెల్ చేసిన చిన్న ఇన్వెస్టర్లు లాస్ భరించాల్సి వస్తుంది. దీనికి కారణం ఏమిటంటే.. కంపెనీ పరిస్థితి బాలేదని, నష్టాలు ప్రకటించబోతోందని ముందే పసిగట్టిన మార్కెట్... అవే మాదిరి ఫలితాలు రాగానే పెద్దగా ఆందోళన చెందదు. అంచేత షేర్ ధర పెరుగుతుంది. ఇదే సమయంలో ఈ విషయం ఊహించని చిన్న ఇన్వెస్టర్ మాత్రం నష్టపోతాడు. ఇలా ప్రతిసారీ జరక్కపోవచ్చు కానీ, ఈ ప్రమాదాన్ని పసిగట్టగలగాలి.కొన్ని కంపెనీలు ఆర్ధిక ఫలితాల విషయంలో తిమ్మిని బమ్మి చేసి చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. సెబీ నిబంధనలకు ఇది విరుద్ధం. ఇలా మదుపర్లను మోసం చేయాలని చూసే ఆయా కంపెనీలపై సెబీ తగిన చర్యలు తీసుకుంటుంది. సత్యం రామలింగరాజు జైలు పాలవడం, ఆ కంపెనీని మహీంద్రా గ్రూప్ హస్తగతం చేసుకోవడం గుర్తుండే ఉంటుంది. వాస్తవానికి లాభాలు తగిన స్థాయిలో రాకపోయినా, అధిక లాభాలు వచ్చినట్లు చూపిస్తూ మభ్యపెట్టడం ద్వారా మదుపర్లను నిట్టనిలువునా ముంచేయడమే రామలింగరాజు చేసిన పని. అంచేత కంపెనీ పనితీరు, ఫండమెంటల్స్ పై అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్లు షేర్లు కొనేయకూడదు.కంపెనీ పనితీరు అద్భుతంగా ఉన్నా షేర్ ధర పడటం అనేది తాత్కాలికమే కావచ్చు. పైగా అదే రంగంలోని మరో కంపెనీ అంతకుముందే ప్రకటించిన ఆర్ధిక ఫలితాలతో బేరీజు వేసుకుని చూడటం వల్ల కూడా ఒక్కోసారి షేర్ ధర పడుతుంది. కాబట్టి ఈ విషయంపైనా కూడా మదుపర్లు అవగాహన కలిగి ఉండటం అవసరం.మార్కెట్లో ట్రేడ్/ఇన్వెస్ట్ చేసే వ్యక్తులు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానాంశం... ఆ ఫలితాలను విశ్లేషించే కొన్ని ప్రాథమిక విషయాలు తెలిసి ఉండటం. లేదంటే నిండా మునిగిపోతారు. ఫలితాల సందర్భంగా కంపెనీ ఎలాంటి ప్రకటన చేసింది? విశ్లేషకులు ఏం చెబుతున్నారు? ఆరోజు మార్కెట్లో షేర్ కదలికలు ఎలా ఉన్నాయి? వంటి విషయాలు తెలుసుకోకుండా గుడ్డిగా షేర్లు కొనేస్తే... తగిన ఫలితం అనుభవించక తప్పదు. తస్మాత్ జాగ్రత్త.-బెహరా శ్రీనివాస రావుస్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. మూడు రోజుల విజయ పరంపరకు బ్రేక్ వేస్తూ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు వారంలో చివరి ట్రేడింగ్ సెషన్ను ప్రతికూలంగా ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 403.24 పాయింట్లు లేదా 0.52 శాతం క్షీణించి 76,639.58 వద్ద స్థిరపడింది. ఈ ఇండెక్స్ ఈరోజు 77,069.19-76,263.29 రేంజ్లో ట్రేడయింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ 50 108.60 పాయింట్లు లేదా 0.47 శాతం క్షీణించి 23,203.20 వద్ద ముగిసింది. నిఫ్టీ50 23,292.10 వద్ద గరిష్ట స్థాయికి చేరుకోగా, రోజు కనిష్ట స్థాయి 23,100.35 వద్ద నమోదైంది. నిఫ్టీ50లోని 50 స్టాక్స్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, బిపిసిఎల్, హిందాల్కో, హిందాల్కో, కోల్ ఇండియా నేతృత్వంలోని 29 లాభాలతో గ్రీన్లో ముగిశాయి. మరోవైపు ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో వంటి 21 షేర్లు నష్టాల్లో ముగిసి 5.75 శాతం వరకు నష్టపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 66 పాయింట్లు నష్టపోయి 23,249కు చేరింది. సెన్సెక్స్(Sensex) 279 పాయింట్లు దిగజారి 76,761 వద్ద ట్రేడవుతోంది. దాంతో గత రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడినట్లయింది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.98 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 81.64 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.61 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.21 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.89 శాతం దిగజారింది.ఇదీ చదవండి: భారత్లో టాప్ 5 బ్రాండ్ లిస్ట్లోకి యాపిల్రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గి, 5 శాతం లోపునకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ ద్రవ్యోల్బణం నుంచి వృద్ధి వైపు దృష్టి సారిస్తుందని నమ్ముతున్నారు. కరెన్సీ అస్థిరత కొంత అనిశ్చితిని సృష్టిస్తున్నప్పటికీ, ఆర్బీఐ సరళతర ఆర్థిక విధానంవైపు అడుగులు వేయవచ్చని భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి పాలసీ సమీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్లోని పలు అంశాలు ప్రస్తుత ఆర్బీఐ పాలసీని ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలతో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్ హ్యాట్రిక్
దేశీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ (BSE) సెన్సెక్స్, ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ 50 గురువారం వరుసగా మూడవ సెషన్లో సానుకూలంగా ముగిశాయి. 30 షేర్ల సెన్సెక్స్ 318.74 పాయింట్లు లేదా 0.42 శాతం పెరిగి 77,042.82 వద్ద స్థిరపడింది. ఈ రోజు ఈ ఇండెక్స్ 77,319.50 నుండి 76,895.51 రేంజ్లో ట్రేడ్ అయింది.ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 98.60 పాయింట్లు లేదా 0.42 శాతం లాభంతో 23,311.80 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 23,391.65కి చేరుకోగా, కనిష్ట స్థాయి 23,272.05 వద్ద నమోదైంది. హెచ్డీఎఫ్సీ లైఫ్, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ , అదానీ పోర్ట్స్ ఈరోజు టాప్ గెయినర్స్గా ఉన్నాయి. వీటి లాభాలు 7.99 శాతం వరకు పెరగడంతో నిఫ్టీ50లోని 50 స్టాక్లలో 33 గ్రీన్లో ముగిశాయి.మరోవైపు ట్రెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్ నేతృత్వంలోని 17 భాగస్వామ్య స్టాక్లు 2.90 శాతం వరకు క్షీణించి నష్టాల్లో ముగిశాయి.నిఫ్టీ మిడ్క్యాప్ 100, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 సూచీలు 1 శాతంపైగా పెరగడంతో విస్తృత మార్కెట్లు బెంచ్మార్క్లను అధిగమించాయి. ఇదిలా ఉండగా, మార్కెట్ అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్ 1.35 శాతం పెరిగి 15.17 పాయింట్ల వద్ద ముగిసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పుంజుకుంటున్న మార్కెట్లు.. లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:47 సమయానికి నిఫ్టీ(Nifty) 107 పాయింట్లు లాభపడి 23,320కు చేరింది. సెన్సెక్స్(Sensex) 285 పాయింట్లు ఎగబాకి 77,006 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.అమెరికా డాలర్ ఇండెక్స్ 109.04 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 82.34 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.65 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.83 శాతం లాభపడింది. నాస్డాక్ 2.45 శాతం ఎగబాకింది.రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గి, 5 శాతం లోపునకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ ద్రవ్యోల్బణం నుంచి వృద్ధి వైపు దృష్టి సారిస్తుందని నమ్ముతున్నారు. కరెన్సీ అస్థిరత కొంత అనిశ్చితిని సృష్టిస్తున్నప్పటికీ, ఆర్బీఐ సరళతర ఆర్థిక విధానంవైపు అడుగులు వేయవచ్చని భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి పాలసీ సమీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్లోని పలు అంశాలు ప్రస్తుత ఆర్బీఐ పాలసీని ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని (డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం డేటా రేటు తగ్గింపునకు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ) రేటు తగ్గింపునకు మరొక పాలసీ వరకూ ఆర్బీఐ వేచిచూసే వీలుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 273.66 పాయిట్లు లేదా 0.36 శాతం లాభంతో.. 76,773.30 వద్ద, నిఫ్టీ 51.75 పాయింట్లు లేదా 0.22 శాతం లాభంతో 23,227.80 వద్ద నిలిచాయి.ట్రెంట్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 సమయానికి నిఫ్టీ(Nifty) 52 పాయింట్లు లాభపడి 23,229కు చేరింది. సెన్సెక్స్(Sensex) 252 పాయింట్లు ఎగబాకి 76,767 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ స్థాయిల్లో మార్కెట్ స్థిరపడాలంటే కొంత సమయం వేచి ఉండాలని సూచిస్తున్నారు.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 109.23 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 80 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.79 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.1 శాతం లాభపడింది. నాస్డాక్ 0.2 శాతం దిగజారింది.ఇదీ చదవండి: ‘మీ లాభాల కోసం మేం చావలేం’రూపాయి భారీగా పతనమవుతుంది. అమెరికా 10 ఏళ్లకు సంబంధించి బాండ్ ఈల్డ్లు పెరుగుతున్నాయి. యూఎస్ డాలర్ ఇండెక్స్ అధికమవుతుంది. ఈరోజు రిలీఫ్ ర్యాలీ ట్రాప్లోపడి ట్రేడర్లు ఎలాంటి పొజిషన్లు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకొంత కాలం వేచి చూసి సూచీలు ముఖ్యమైన లెవల్స్ దాటి స్థిరపడితేనే పొజిషన్ తీసుకోవాలని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 169.62 పాయింట్లు లేదా 0.22 శాతం లాభంతో 76,499.63 వద్ద, నిఫ్టీ 121.65 పాయింట్లు లేదా 0.53 శాతం లాభంతో 23,207.60 వద్ద నిలిచాయి.అదానీ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. HCL టెక్నాలజీస్, హిందూస్తాన్ యూనీలీవర్ కంపెనీ, అపోలో హాస్పిటల్, టైటాన్ కంపెనీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో నిలిచాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ(Nifty) 135 పాయింట్లు లాభపడి 23,221కు చేరింది. సెన్సెక్స్(Sensex) 418 పాయింట్లు ఎగబాకి 76,741 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ స్థాయిల్లో మార్కెట్ స్థిరపడాలంటే కొంత సమయం వేచి ఉండాలని సూచిస్తున్నారు.అమెరికా డాలర్ ఇండెక్స్ 109.65 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 80.72 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.76 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో మిశ్రమంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం లాభపడింది. నాస్డాక్ 0.38 శాతం దిగజారింది.ఇదీ చదవండి: హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ ఖాళీరూపాయి భారీగా పతనమవుతుంది. అమెరికా 10 ఏళ్లకు సంబంధించి బాండ్ ఈల్డ్లు పెరుగుతున్నాయి. యూఎస్ డాలర్ ఇండెక్స్ అధికమవుతుంది. ఈరోజు రిలీఫ్ ర్యాలీ ట్రాప్లోపడి ట్రేడర్లు ఎలాంటి పొజిషన్లు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకొంత కాలం వేచి చూసి సూచీలు ముఖ్యమైన లెవల్స్ దాటి స్థిరపడితేనే పొజిషన్ తీసుకోవాలని చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బేర్.. ఎటాక్! మార్కెట్ నేల చూపులు ఎందుకంటే..
ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్ సూచీలు సోమవారం ఒకశాతానికిపైగా నష్టపోయాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడమూ, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలూ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 1,049 పాయింట్లు క్షీణించి 76,330 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 346 పాయింట్లు కోల్పోయి 23,086 వద్ద ముగిసింది. సూచీలకిది నాలుగోరోజూ నష్టాల ముగింపు. ఉదయం స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు రోజంతా అదే బాటలో నడిచాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,129 పాయింట్లు క్షీణించి 76,250, నిఫ్టీ 384 పాయింట్లు పతనమై 23,047 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు, ద్రవ్యల్బోణం పెరగొచ్చనే ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.మార్కెట్లో మరిన్ని సంగతులుఅధిక వాల్యుయేషన్లు, వృద్ధిపై ఆందోళనలతో ఇన్వెస్టర్లు భారీ ఎత్తున చిన్న, మధ్య తరహా షేర్లను భారీగా విక్రయించారు. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 4.17%, మిడ్క్యాప్ ఇండెక్స్ 4.14 శాతం నష్టపోయాయి. బీఎస్ఈ ఎక్సే్చంజీలో మొత్తం 3,562 కంపెనీల షేర్లలో 2,876 షేర్లు నష్టపోగా, 508 షేర్లు ఏడాది కనిష్టాన్ని తాకింది. సూచీల వారీగా బీఎస్ఈ రియల్టీ ఇండెక్స్ 6.50% అత్యధికంగా పతనమైంది. యుటిలిటీ 4.50%, సర్వీసెస్ 4.35% చొప్పున పడ్డాయి.4 రోజుల్లో 24.7 లక్షల కోట్లు ఆవిరిస్టాక్ మార్కెట్ వరుస పతనంలో భాగంగా నాలుగు రోజుల్లో రూ.24.69 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. సోమవారం ఒక్కరోజే రూ.12.61 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.417.05 లక్షల కోట్ల(4.82 ట్రిలియన్ డాలర్లు)కు దిగివచ్చింది. అమెరికా డిసెంబర్ వ్యవసాయేతర ఉద్యోగాలు (2.56 లక్షలు) అంచనాలను మించాయి. నిరుద్యోగ రేటు 4.2% నుంచి 4.1 శాతానికి దిగివచ్చింది. అధిక ఉద్యోగాల నియామకంతో ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాదిలో వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు తలెత్తాయి. ద్రవ్యోల్బణం పెరగొచ్చనే ఆందోళనలు మెదలయ్యాయి. బాండ్లపై రాబడులు 14 ఏళ్ల గరిష్టం 4.79% భారీగా పెరిగాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు ఈక్విటీల్లోంచి బాండ్లలోకి మళ్లిస్తున్నారు.భారత్, చైనాకు చౌకగా చమురును అందిస్తున్న రష్యా క్రూడాయిల్ ఉత్పత్తి సంస్థలపై అమెరికా కఠిన ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు మూడు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. భారత్ దిగుమతి చేసుకొనే బ్రెంట్ క్రూడాయిల్ ధర 1.5% పెరిగి 81.67 స్థాయికి చేరింది. తన చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకొనే భారత్కు అధిక ధరలు నష్టదాయకం. పెరిగిన దిగుమతుల బిల్లు చెల్లించేందుకు ప్రభుత్వం వద్దనున్న విదేశీ మారక నిల్వలు కరిగించాల్సి వస్తుంది.ఇదీ చదవండి: మరింత క్షీణిస్తున్న రూపాయి!ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.4 శాతానికి పరిమితమవుతుందని కేంద్రం ముందస్తు అంచనా వేసింది. పలు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు 2024–25 ఏడాది కార్పొరేట్ ఆదాయాలు ఒక అంకె వృద్ధికే పరిమితం కావచ్చని చెబుతున్నాయి. కార్పొరేటు ఆదాయాలు, జీడీపీ వృద్ధి అంచనాలు మార్కెట్ వర్గాలను నిరాశపరిచాయి. -
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
-
అంతర్జాతీయ పరిణామాలు.. భారీ నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 165 పాయింట్లు లాభపడి 23,735 వద్దకు చేరింది. సెన్సెక్స్ 498 పాయింట్లు పుంజుకుని 78,540 వద్దకు చేరింది. ఇటీవల భారీగా మార్కెట్లు పడిపోతున్నాయి. గతవారం ట్రెండ్ ఈవారం కొనసాగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం వరకు ఈ ఒడిదొడుకులు తప్పవని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. బాండ్ ఈల్డ్లు భారీగా పెరుగుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల గరిష్టాలను చేరుతోంది.ఇదీ చదవండి: ఏడాదిలో రికార్డు స్థాయిలో ఐఫోన్ ఎగుమతులుసెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, ఇండ్స్ ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్ స్టాక్లు లాభాల్లో ముగిశాయి. జొమాటో, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, పవర్గ్రిడ్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, ఏషియన్ పెయింట్స్, సన్ఫార్మా, ఎస్బీఐ, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, టైటాన్ స్టాక్లు భారీగా నష్టపోయాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లో సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 631.88 పాయింట్లు లేదా 0.82 శాతం నష్టంతో 76,747.02 వద్ద, నిఫ్టీ 206.50 పాయింట్లు లేదా 0.88 శాతం నష్టంతో 23,225.00 వద్ద కొనసాగుతున్నాయి.ఇండస్ ఇండ్ బ్యాంక్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS), బ్రిటానియా ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. అపోలో హాస్పిటల్, SBI లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ, ట్రెంట్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వంటివి నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సంకేతాలు ప్రతికూలం.. కన్సాలిడేషన్కే అవకాశం!
గతవారం స్టాక్ మార్కెట్లు బాగా కుదేలయ్యాయి. ప్రధాన సూచీలు దాదాపు 2 శాతం పడిపోయాయి. ఇందుకు మూడు ప్రధాన కారణాలను చెప్పుకోవచ్చు. విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర అమ్మకాలు, పెరిగిన చమురు ధరలు, పూర్తి ఆర్ధిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించడం.. ఈ మూడూ మార్కెట్లను కిందకు నడిపించాయి. టీసీఎస్ ఆర్ధిక ఫలితాలు మార్కెట్లను మెప్పించి ఐటీ కంపెనీలపై కాస్త భరోసా ఇచ్చినప్పటికీ.. ఈ డోస్ సరిపోలేదు. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా ప్రెసిడెంట్గా వచ్చే వారం బాధ్యతలు స్వీకరించబోతున్న 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) అనుసరించబోయే విధానాలపై పూర్తి క్లారిటీ లేకపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. ఇక వారం మొత్తానికి సెన్సెక్స్ 1845 పాయింట్లు కోల్పోయి 77378 వద్ద, నిఫ్టీ 573 పాయింట్లు నష్టపోయి 23432 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి.ఈవారంఅక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్ధిక ఫలితాల సందడి మొదలయ్యింది. ఈవారం మార్కెట్లను పెద్దగా ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడం వళ్ళ ఆయా కంపెనీలు ప్రకటించబోయే త్రైమాసిక ఫలితాలే రాబోయే రోజుల్లో మార్కెట్లకు దిశానిర్దేశం చేయబోతున్నాయి.రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఎల్టీటీఈఎస్, ఎల్టీఐఎమ్, ఇండియన్ హోటల్స్, సియట్, ఐసీఐసీఐ లొంబార్డ్ తదితర ప్రముఖ సంస్థలు ఈవారం ఆర్ధిక ఫలితాలను ప్రకటించబోయే జాబితాలో ఉన్నాయి.ఇక క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల తర్వాత మళ్ళీ మార్కెట్లో విదేశీ మదుపర్ల సందడి మొదలైందని గతవారం మార్కెట్ ట్రెండ్ను బట్టే తెలుస్తోంది. గతవారం క్షీణత తర్వాత ఈవారం మార్కెట్లు కొంత మేర కన్సాలిడేషన్ దిశగా సాగే అవకాశం ఉంది. అదే సమయంలో కాస్త ప్రతికూల వార్తలొచ్చినా.. అది మరింత కిందకు లాగేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ద్రవ్యోల్బణ గణాంకాలు, రూపాయి కదలికలు, చమురు ధరల్లో మార్పులపైనా మదుపర్లు ఓ కన్నేసి ఉంచాలి.ఎఫ్ఐఐలువిదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) గత డిసెంబర్ నెల మొత్తం మీద రూ.16982 కోట్ల నికర విక్రయాలు జరపగా.. దేశీయ మదుపర్లు రూ. 34194 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. ఇక ఈ ఏడాది ఇప్పటిదాకా విదేశీ మదుపర్లు రూ.21,357 కోట్ల నికర అమ్మకాలు చేశారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు మాత్రం రూ. 24,215 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్కు అండగా నిలిచారు.సాంకేతిక స్థాయిలుమార్కెట్లో ప్రస్తుతం బేరిష్ సెంటిమెంట్ ఉంది. గత ఏడాది జూన్ తర్వాత నిఫ్టీ మళ్ళీ ప్రస్తుతం ఆ స్థాయిలకు వచ్చింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో ఒడుదొడుకులు కొంత మేర తగ్గి మార్కెట్లు కన్సాలిడేషన్ దిశగా సాగుతాయని భావించవచ్చు. ముఖ్యంగా బుల్స్ చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికప్పుడు బేర్స్ అడ్డుకుంటూ మార్కెట్లను కిందకు లాగడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.కొనుగోళ్ల సహకారం లభిస్తే మాత్రం 23700 పాయింట్ల వద్ద నిరోధం ఎదురుకావొచ్చు. అదికూడా అధిగమిస్తే తదుపరి నిరోధక స్థాయి 23830 దగ్గర ఉంది. ప్రముఖ కంపెనీల ఆర్ధిక ఫలితాల మెప్పించకపోయినా, ద్రవ్యోల్బణ గణాంకాలు మరింత నీరసంగా ఉన్నా, సూచీలు పడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదే జరిగితే మొదట 23270 వద్ద మద్దతు దొరుకుతుంది. దీన్ని కూడా ఛేదించి కిందకు జారితే మాత్రం తదుపరి నిరోధం 23000 వద్ద, ఆపైన 22800 స్థాయి వద్ద సహకారం లభించవచ్చు.ఫ్యూచర్స్ & ఆప్షన్స్ డేటాను పరిశీలిస్తే నిఫ్టీ 23000 - 24000 స్థాయిలోనే చలించవచ్చని తెలుస్తోంది. కాల్స్ డేటా ప్రకారం 24500 వద్ద అత్యధిక స్థాయిలో ఓపెన్ ఇంటరెస్ట్ ఉంది. పుట్స్ వైపు 22500 వద్ద అత్యధిక ఓపెన్ ఇంటరెస్ట్ కేంద్రీకృతమై ఉంది. మార్కెట్లో హెచ్చుతగ్గులకు దిక్సూచిగా నిలిచే ఇండియా విక్స్ గత వారం 10 శాతం పెరిగి 14.9 దగ్గర ఉంది.రంగాలవారీగా..గత వారమంతా చాలా బలహీనంగా సాగిన బ్యాంకింగ్ షేర్లు.. ఈవారం కొద్దిగా పుంజుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా షార్ట్ కవరింగ్ లావాదేవీలు ఈ రంగం సెంటిమెంట్ ను పెంచుతాయి. టెలికాం రంగంలోని సంస్థలు ప్రోత్సాహక ఫలితాలు ప్రకటించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ రంగంలోని షేర్లు సానుకూలంగా కదలాడొచ్చు.వాహన రంగంలోని షేర్లు స్తబ్దుగా చలించే అవకాశం ఉంది. ముఖ్యంగా మారుతీ, అశోక్ లేలాండ్, బజాజ్ ఆటో షేర్లు ప్రతికూలతలను చూడొచ్చు. అదే సమయంలో హీరో, టీవీఎస్ కొంతమేర ప్రోత్సాహకరంగా ఉండొచ్చు. క్షీణిస్తున్న రూపాయి.. ఫార్మా షేర్లకు మంచి బూస్ట్ అనే చెప్పాలి. గత త్రైమాసికానికి సంబంధించి రూపాయి క్షీణత వాటి ఆర్ధిక ఫలితాలను ప్రభావితం చేస్తుంది. ఇది ఒకింత ప్రోత్ససహకమే.మార్కెట్ ఒడుదొడుకుల్లో మదుపరులకు ఇది ఎప్పటికీ సురక్షిత రంగమే. ఇక టీసీఎస్ ప్రకటించిన ఆర్ధిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. ఈవారం ఫలితాల ప్రకటించబోయే ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ వంటివి ఉన్నాయి. వీటి ఫలితాల మార్కెట్లకు.. ముఖ్యంగా ఐటీ రంగానికి దిశానిర్దేశం చేస్తాయి. సిమెంట్ షేర్లకు మద్దతు లభించే అవకాశం ఉండగా, లోహ షేర్లు ఒత్తిళ్లు ఎదుర్కోవచ్చు. చమురు, ఎఫ్ఎంసీజీ షేర్లలో పెద్దగా దూకుడుvఉండకపోవచ్చు.- బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు. -
ఏది కొంటే ఎంత లాభం..?
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్(Trading) అనేది ఇప్పుడు సర్వ సాధారణమైపోయింది. గత సెప్టెంబర్ నాటికి దేశంలో 17.5 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. ఇక 2023-24 గణాంకాల ప్రకారం 96 లక్షల మంది ట్రేడింగ్ పైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. దానికి ముందు ఆర్థిక సంవత్సరంలో ట్రేడర్లు 51 లక్షల మందే. 96 లక్షల మందిలో 86 లక్షల మంది కేవలం ఆప్షన్స్(Options)లోనే ట్రేడింగ్ చేస్తున్నారు. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఆప్షన్స్ ట్రేడర్ల సంఖ్య 42 లక్షలు ఉంది. అంటే ఏడాది వ్యవధిలోనే ఆప్షన్స్ ట్రేడింగ్లోకి అడుగుపెట్టిన వారి సంఖ్య రెట్టింపుపైనే పెరిగిందన్న మాట.తొందరగా లాభాలు సంపాదించాలని..స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడం, టెక్నాలజీ విస్తృతం కావడం, ఆన్లైన్లో వివిధ మార్కెట్ సమాచారం అందుబాటులో ఉండటం, తొందరగా లాభాలు సంపాదించేయవచ్చన్న అభిప్రాయం జనాల్లో పెరిగిపోవడం, ఆర్థిక సంబంధమైన అంశాల్లో గతంతో పోలిస్తే ప్రజల్లో అవగాహన పెరగడం వంటివి స్టాక్ మార్కెట్ వైపు అడుగులు వేయడానికి కారణాలుగా ఉన్నాయి. గత ఆర్టికల్లో మనం ఆప్షన్స్కు సంబంధించి ప్రాథమిక అంశాలను తెలుసుకున్నాం. ఇప్పుడు ట్రేడింగ్లో వాటికి ఎంత ప్రాధాన్యం ఉంది.. అవి ఎలాంటి పాత్ర పోషిస్తాయో తెలుసుకుందాం.కాల్, పుట్ తీసుకోవడం తెలియాలి..తాజా నిబంధనల ప్రకారం ఇకపై సెన్సెక్స్, నిఫ్టీ(Nifty)లకు మాత్రమే వారాంతపు ఎక్సపైరీలు ఉంటాయి. బ్యాంకు నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ నిఫ్టీలకు నెలవారీ ఎక్సపైరీలు ఉంటాయి. ఈ ఎక్సపైరీల్లో ఆప్షన్స్ గ్రీక్స్ (డెల్టా, గామా, తీటా, వెగాలు) కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని బట్టే ఒక ఆప్షన్ ధర ఏ స్థాయిలో పెరుగుతుంది.. ఏ స్థాయిలో పడిపోతుంది అన్న విషయం తెలుస్తుంది. వీటి కంటే ముందు అసలు ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే ఏ కాల్ కొనాలి, ఏ పుట్ తీసుకోవాలో తెలిసి ఉండాలి. ఆప్షన్స్లో మనం నేరుగా షేర్లు కొనం. ఆ షేర్ల తాలూకు కాల్స్, పుట్స్(Puts) మాత్రమే తీసుకుంటాం. వాటిని సెలెక్ట్ చేసుకోవడానికి మూడు మార్గాలు ఉంటాయి.ఎట్ ది మనీ (ఏటీఎం)ఇన్ ది మనీ (ఐటీఎమ్)అవుట్ ఆఫ్ ది మనీ (ఓటీఎం)ఎస్బీఐ షేరును ఉదాహరణగా తీసుకొని ఈ మూడింటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఎస్బీఐ షేరు ధర రూ.744 వద్ద ఉంది. దీని స్ట్రైక్ ప్రైస్లు రూ 700, 710, 720, 730, 740, 750, 760, 770, 780, 790, 800.. ఇలా ఉంటాయి. ఎస్బీఐ షేర్ ధర ప్రస్తుతం ఎంత ఉందో దానికి దరిదాపుల్లో ఉండే స్ట్రైక్ ప్రైస్(Strike Price)ను తీసుకుంటే అది ఏటీఎం అవుతుంది. అంటే రూ.740 అన్న మాట. ఆ షేరు భవిష్యత్లో పెరుగుతుందనుకుంటే 740 రూపాయల కాల్, పడుతుంది అనుకుంటే 740 రూపాయల పుట్ కొనుగోలు చేయాలి. ఇవి ఏటీఎం కాంట్రాక్టులు అవుతాయి.షేర్లలో నెలవారీ కాంట్రాక్టులు మాత్రమే ఉంటాయి. దీని లాట్ సైజు 750. రూ.740 కాల్ ధర ప్రస్తుతం రూ.21గా ఉంది. పుట్ ధర రూ.14 ఉంది. షేర్ పెరుగుతుంది అని భావించిన A అనే వ్యక్తి జనవరి నెలకు సంబంధించి 740 కాల్ను రూ.21 పెట్టి కొన్నాడు. అంటే అతని పెట్టుబడి (21X750 లాట్) = రూ.15,750 అన్నమాట.B అనే వ్యక్తి షేరు పడిపోవచ్చు అన్న ఉద్దేశంతో జనవరి నెల 740 పుట్ కొన్నాడు. దీని ధర రూ.14గా ఉంది. అంటే అతను పెట్టిన పెట్టుబడి (14X750) = రూ.10,500.షేరు ధర నెల మధ్యలో ఎప్పుడైనా అటూ ఇటూ ఊగిసలాడుతూ మొత్తం మీద జనవరి నెలాఖరుకు రూ.780 దరిదాపుల్లోకి వెళ్లింది అనుకుందాం. అప్పుడు 740 కాల్ సుమారు 45-50 దాకా పెరగొచ్చు. అంటే 15,750 పెట్టుబడి రెట్టింపు అవుతుంది. లాట్ పెరిగి సుమారు రూ.18,000 నుంచి రూ.22,000 దాకా ప్రాఫిట్ వస్తుంది. అదే సమయంలో పుట్ కొన్న వ్యక్తి మొత్తం పోగొట్టుకుంటాడు. అతను కొన్న స్ట్రైక్ ప్రైస్ తాలూకు పుట్ నెలాఖరుకు సున్నా అయిపోతుంది.ఇదీ చదవండి: సందర్శకులను ఆకర్శించేలా మహా ‘బ్రాండ్’ మేళా!పైన తెలిపిన దానికి రివర్స్లో జరిగితే.. పుట్ పెరుగుతుంది. కాల్ పడిపోతుంది. పుట్ కొన్న వ్యక్తి మంచి లాభం సంపాదిస్తే, కాల్ కొన్న వ్యక్తి మొత్తం పోగొట్టుకుంటాడు. అలాకాకుండా వచ్చిన ప్రాఫిట్ చాలు అనుకునే వ్యక్తి నెలాఖరు దాకానే వేచి ఉండక్కర్లేదు. మధ్యలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసి బయటకు రావొచ్చు. సగటు ట్రేడర్ ఈ మార్గాన్ని అనుసరిస్తూ, ఎప్పటికప్పుడు లాభాలు బుక్ చేసుకుంటూ ఉంటే అతని ప్రయాణం సవ్యంగా సాగుతుంది. లేదంటే నష్టాలు తప్పవు.పైన తెలిపిన ఉదాహరణ బేసిక్ వివరాలు తెలిపేందుకే. టెక్నికల్గా ఒక షేరుకు ఎక్కడ సపోర్ట్ దొరుకుతోంది.. ఎక్కడ రెసిస్టన్స్ ఎదురవుతోంది.. ఆప్షన్ గ్రీక్స్ వల్ల ఏం తెలుసుకోవచ్చు.. టైం డికే ప్రాధాన్యం ఏమిటో.. ఐటీఎమ్, ఓటీఎంల గురించి తదుపరి ఆర్టికల్లో తెలుసుకుందాం.- బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. దూసుకెళ్లిన ఐటీ షేర్లు
భారతీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) వరుసగా రెండో రోజూ క్షీణించాయి. శుక్రవారం వారాన్ని ప్రతికూల నోట్తో ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ (Sensex) 241.30 పాయింట్లు లేదా 0.31 శాతం క్షీణించి 77,378.91 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ ఇండెక్స్ 77,099.55 - 77,919.70 రేంజ్లో ట్రేడయింది.ఇక ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ50 (Nifty) 95 పాయింట్లు లేదా 0.40 శాతం నష్టంతో 23,431.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 23,596.60 వద్ద కనిపించగా, కనిష్ట స్థాయి 23,426.55 వద్ద ఉంది.శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టిపిసి, భారత్ ఎలక్ట్రానిక్స్, అల్ట్రాటెక్ సిమెంట్ నేతృత్వంలోని నిఫ్టీ50లోని 50 స్టాక్లలో 36 నష్టాలతో ముగిశాయి. మరోవైపు టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్ 6 శాతం వరకు లాభాలతో గ్రీన్లో ముగిసిన 14 స్టాక్లలో ఉన్నాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్క్యాప్ 100 2.08 శాతం నష్టంతో 54,585.75 వద్ద ముగియగా, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 2.61 శాతం నష్టాలతో 17,645.55 వద్ద ముగిసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస నష్టాలు.. నిఫ్టీ@23,440
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ(Nifty) 79 పాయింట్లు నష్టపోయి 23,448కు చేరింది. సెన్సెక్స్(Sensex) 229 పాయింట్లు దిగజారి 77,395 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 109.2 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 77.22 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.69 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం లాభపడింది. నాస్డాక్ 0.06 శాతం దిగజారింది.ఇదీ చదవండి: రేడియో వ్యాపారం మూసివేతమార్కెట్ రేటింగ్కు హెచ్ఎస్బీసీ కోత..అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ(HSBC).. భారత ఈక్విటీ మార్కెట్ రేటింగ్ను ‘ఓవర్వెయిట్’ నుంచి ‘న్యూట్రల్’కి తగ్గించింది. కార్పొరేట్ ఆదాయాలు నెమ్మదించడం, అధిక వాల్యుయేషన్లు ఇందుకు కారణాలుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2025)గానూ నిఫ్టీ 50 కంపెనీల ఆదాయ వృద్ధి అంచనాలను గణనీయంగా 15% నుంచి 5%కి తగ్గించింది. ఈ ఏడాది చివరి నాటికి సెన్సెక్స్ 85,990 స్థాయికి చేరొచ్చని అంచనా వేసింది. గురువారం సెన్సెక్స్ ముగింపు (77,620)తో పోలిస్తే 10% మాత్రమే అధికం.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 528.28 పాయింట్లు లేదా 0.68 శాతం నష్టంతో.. 77,620.21 వద్ద, నిఫ్టీ 162.45 పాయింట్లు లేదా 0.69 శాతం నష్టంతో 23,526.50వద్ద నిలిచాయి.బజాజ్ ఆటో, నెస్లే ఇండియా (Nestle India), హిందూస్తాన్ యూనీలీవర్ కంపెనీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), కోల్ ఇండియా, టాటా స్టీల్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:48 సమయానికి నిఫ్టీ(Nifty) 88 పాయింట్లు నష్టపోయి 23,602కు చేరింది. సెన్సెక్స్(Sensex) 267 పాయింట్లు దిగజారి 77,890 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 109 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 76.2 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.69 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.16 శాతం లాభపడింది. నాస్డాక్ 0.06 శాతం దిగజారింది.ఇదీ చదవండి: వడ్డీరేట్ల కోత పక్కా..?అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆర్థిక విధానాలపై అనిశ్చితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు నెలకొన్నాయి. యూఎస్ బాండ్లపై రాబడులు 4.68 శాతానికి చేరుకోవడంతో ఎఫ్ఐఐల పెట్టుబడులు తరలిపోతున్నాయి. మరోవైపు డాలర్ ర్యాలీ ఆగడం లేదు. ఈ పరిణామాలు భారత్ లాంటి వర్థమాన దేశాలకు ప్రతికూలంగా మారాయి. వీటికి తోడు భారత్లో హెచ్ఎంపీవీ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశీయ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
‘ఆప్షన్స్’తో గేమ్లొద్దు!
కరోనా ఎంతోమంది జీవితాల్ని తలకిందులు చేసేసింది. బయటకు వెళ్లలేని పరిస్థితి. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయాయి. ఆదాయ మార్గాలు అడుగంటాయి. ఈ తరుణంలో ఉన్నకొద్ది డబ్బులతో ఇంట్లో కూర్చుని ఎలాగోలా నాలుగు రూపాయలు సంపాదించడానికి చాలామంది ఎంచుకున్న ఆదాయ మార్గం స్టాక్ మార్కెట్. అది కూడా ఆప్షన్స్ ట్రేడింగ్(Option Trading). మార్కెట్పై సరైన నాలెడ్జ్ లేకపోవడం, అరాకొరా పరిజ్ఞానంతో అడుగుపెట్టడం వంటి కారణాలతో ఎంతోమంది ట్రేడర్లు మునిగిపోయారు. ముఖ్యంగా తక్కువ డబ్బులతోనే ఎక్కువ సంపాదించవచ్చనే దురాశ, చేసిన తప్పులే చేస్తూండడం, డబ్బు పోగొట్టుకున్నా మళ్లీ సంపాదించవచ్చులే అనే ఉద్దేశంతో అప్పు చేసి మరిన్ని డబ్బులు పెట్టడం.. అవి కూడా పోగొట్టుకోవడం..జీవితంలో కోలుకోలేని దెబ్బ తినడం.. చాలామంది ఎదుర్కొన్న, ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. ఇలా డబ్బులు పోగొట్టుకున్న వాళ్లలో అధిక శాతం ఆప్షన్స్ ట్రేడర్లే.నిజంగా అంత ప్రమాదమా..?నిజంగా ఆప్షన్స్ అంత ప్రమాదకరమా..? పెట్టే డబ్బులన్నీ పోవాల్సిందేనా..? ఈ ప్రశ్నలకు ఒకటే సమాధానం. ఆప్షన్స్ తో గేమ్ లాడొద్దు. ఆదమరిస్తే మునిగిపోతారు. మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి అనుకుంటే కనీస పరిజ్ఞానం ఉండి తీరాలి. ఈక్విటీ(Equity)ల్లో అయితే లాట్ కొనుగోలు చేసి లాభం వచ్చేంత వరకు కొన్ని రోజులపాటు హోల్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఆప్షన్స్ అలా కాదు. ఏమాత్ర ఏమరపాటుగా ఉన్నా క్యాపిటల్ అంతా పోగొట్టుకోవాల్సిందే. అసలు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలి అనుకునే ముందు ఏయే అంశాలు తెలిసి ఉండాలో చూద్దాం.అండర్ లయింగ్ అసెట్కాల్స్పుట్స్స్ట్రైక్ ప్రైస్ఆప్షన్స్ చైన్ఓపెన్ ఇంటరెస్ట్చేంజ్ ఇన్ ఓపెన్ ఇంటరెస్ట్వాల్యూమ్ఇంటరెన్సిక్ వేల్యూడెల్టా, గామా, తీటా, వెగా, ఆర్హెచ్ఓఅండర్ లయింగ్ అసెట్ అంటే మనం కొనాలనుకుంటున్న షేర్ విలువ. దీన్ని ఆధారం చేసుకునే ఆప్షన్స్ ట్రేడింగ్కు ప్రీమియంలు నిర్ధారితమవుతాయి. ఎఫ్ అండ్ ఓలో ఏది కొన్నా లాట్ల్లోనూ కొనుగోలు చేయాలి. ఫ్యూచర్స్(Futures)లో కూడా ఇంచుమించు షేర్ ధర అదే స్థాయిలో ఉంటుంది. ఉదాహరణకు మీరు రిలయన్స్ షేర్ కొనాలి అనుకున్నారు. ప్రస్తుత షేర్ ధర రూ.1240 దగ్గర ఉంది. ఇది అండర్ లయింగ్ అసెట్ అవుతుంది. ఫ్యూచర్స్ & ఆప్షన్స్లో మనం లాట్స్ రూపంలోనే షేర్లు కొనాలి అని చెప్పుకున్నాం కదా. ఒక లాట్ కొనాలి అంటే కనీసం 500 షేర్లు తీసుకోవాలి. ఈక్విటీల్లో కొనాలి అంటే దాదాపు రూ.6,20,000 పెట్టుబడి పెట్టాలి. ఇదే ఫ్యూచర్స్లో అయితే రూ.1,10,000 ఉంటే సరిపోతుంది. అదే ఆప్షన్స్లో అయితే రూ.1240 కాల్ కొనాలి. ఇది రూ.27 లో ఉంది. అంటే రూ.13,500 (రూ.27X500)ఉంటే చాలు కొనేయగలం. పెట్టుబడి తక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ ఈ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు.అసలు సమస్య ఇదే..తక్కువకు వస్తుందని పరిస్థితులు తెలుసుకోకుండా ఆప్షన్స్ ఎంచుకుంటే షేర్ ధర రూ.1240 దాటి పెరుగుతున్నంత సేపూ ఈ కాల్ కూడా పెరుగుతూ ఉంటుంది. తద్వారా లాభాలు సంపాదించొచ్చు. అదే షేర్ ధర పడిపోతూ ఉంటే కాల్ కూడా పడిపోతూ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆప్షన్స్ కాల పరిమితి కేవలం నెల రోజులే. ఈ నెల రోజుల్లో షేర్ ధర పెరగకపోయినా, అక్కడక్కడే కదలాడుతూ ఉన్నా నెలాఖరుకి మన పెట్టుబడి సున్నా అయిపోతుంది. అంటే మొత్తం రూ.13,500 పోతాయి. షేర్ ధర కంటిన్యూగా పెరుగుతూ ఉంటే వచ్చే లాభం మాత్రం అపరిమితంగా ఉంటుంది. ఇక్కడ టైం డికే (కాల వ్యవధి తగ్గిపోతూ ఉండటం) చాలా కీలకం.ఇప్పుడేం చేయాలి..షేర్ ధర పడిపోతుంది అనుకున్నప్పుడు పుట్స్ కొనాలి. పైన తెలిపిన ఉదాహరణనే తీసుకుంటే.. రిలయన్స్ షేర్ ధర రూ.1240 కంటే పడిపోతుంది అని భావిస్తే రూ.1240 ఫుట్ కొనాలి. ఇది రూ.22 లో ఉంది. (500X22 = 11000) షేర్ ధర పడిపోతున్న కొద్దీ మనకొచ్చే లాభం పెరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా షేర్ రూ.1240 దాటి పెరుగుతూ వెళ్లినా, అక్కడక్కడే కదలాడిన నెలాఖరుకి మన ప్రీమియం హరించుకుపోయి చివరికు జీరో అవుతుంది. నెల రోజులకు మించి ఈ ఆప్షన్స్ను కొనసాగించే అవకాశం ఉండదు. కాబట్టి సాధ్యమైనంత తొందరగా తగిన లాభాల్ని ఎప్పటికప్పుడు బుక్ చేసుకుంటూ బయటకు వచ్చేయడం ఉత్తమం.ఇదీ చదవండి: ఆర్థిక మోసాలకు చెక్ పెట్టేలా పరిష్కారాలుగుర్తు పెట్టుకోవాల్సినవి..షేర్ ధర పెరిగేటప్పుడు పెరిగేవి కాల్స్షేర్ ధర పడిపోయేటప్పుడు పెరిగేవి పుట్స్ఒక కంపెనీ షేర్ ధర మనం కొనాలనుకునే ఆప్షన్స్కు అండర్ లయింగ్ అసెట్ అవుతుంది.షేర్ ధరకు అనుగుణంగా మనం తీసుకునే కాల్/పుట్ (ఉదా: రూ.1230, 1240, 1250, 1260... ఇలా)నే స్ట్రైక్ ప్రైస్ అంటారు.వీటికి తోడు ఆప్షన్స్ చైన్, అందులో ఓపెన్ ఇంటరెస్ట్, ఓపెన్ ఇంటరెస్ట్లో చోటు చేసుకునే మార్పులు, వాల్యూమ్, ఇంటరెన్సిక్ వ్యాల్యూ వంటివి ఆప్షన్స్ ట్రేడింగ్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవేగాక ఇన్ ది మనీ (ఐటీఎమ్), ఎట్ ది మనీ (ATM), అవుట్ అఫ్ ది మనీ (ఓటీఎం) ఆప్షన్స్ ట్రేడింగ్లో ఈ మూడింటి గురించి తదుపరి ఆర్టికల్లో వివరంగా తెలుసుకుందాం.- బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బుధవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 50.62 పాయింట్లు లేదా 0.065 శాతం నష్టంతో 78,148.49 వద్ద, నిఫ్టీ 18.95 పాయింట్లు లేదా 0.080 శాతం నష్టంతో 23,688.95 వద్ద నిలిచాయి.ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఐటీసీ, ఏషియన్ పెయింట్స్ వంటివి టాప్ గెయిన్ర్స్ జాబితాలో చేరాయి. అపోలో హాస్పిటల్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ(Nifty) 73 పాయింట్లు నష్టపోయి 23,628కు చేరింది. సెన్సెక్స్(Sensex) 289 పాయింట్లు దిగజారి 77,910 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.55 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 77 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.69 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు(stock market) గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.1 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.9 శాతం దిగజారింది.ఇదీ చదవండి: అమెజాన్ తొలి రాకెట్ ప్రయోగం.. స్పేస్ఎక్స్కు ముప్పు?అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆర్థిక విధానాలపై అనిశ్చితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు నెలకొన్నాయి. యూఎస్ బాండ్లపై రాబడులు 4.69 శాతానికి చేరుకోవడంతో ఎఫ్ఐఐల పెట్టుబడులు తరలిపోతున్నాయి. మరోవైపు డాలర్ ర్యాలీ ఆగడం లేదు. ఈ పరిణామాలు భారత్ లాంటి వర్థమాన దేశాలకు ప్రతికూలంగా మారాయి. వీటికి తోడు భారత్లో హెచ్ఎంపీవీ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశీయ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బ్యాంకింగ్, రిలయన్స్ ర్యాలీ
ముంబై: బ్యాంకులు, రిలయన్స్ ఇండస్ట్రీస్(2%) షేర్ల ర్యాలీతో స్టాక్సూచీలు రెండు రోజుల నష్టాల నుంచి గట్టెక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సెన్సెక్స్ 234 పాయింట్లు పెరిగి 78,199 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92 పాయింట్లు బలపడి 23,708 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ప్రారంభంలో కాస్త అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. వెంటనే తేరుకొని రోజంతా పరిమిత శ్రేణిలో లాభాల్లో కదలాడాయి. సెన్సెక్స్ ఒక దశలో 488 పాయింట్లు ఎగసి 78,453 వద్ద, నిఫ్టీ 179 పాయింట్లు పెరిగి 23,795 వద్ద గరిష్టాన్ని తాకాయి. బ్యాంకింగ్ షేర్లతో పాటు ఇంధన, ఆయిల్అండ్గ్యాస్, ఇండ్రస్టియల్, కమోడిటీ, సర్విసెస్ షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఒకశాతం, స్మాల్ క్యాప్ సూచీ 2% రాణించాయి. ఇండోఫార్మ్ ఎక్విప్మెంట్ హిట్ఇండోఫార్మ్ ఎక్విప్మెంట్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.215)తో పోలిస్తే 20% ప్రీమియంతో రూ.258 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 33% ర్యాలీ రూ.287 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 27% లాభంతో రూ.273 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,310.37 కోట్లుగా నమోదైంది. -
పుంజుకున్న మార్కెట్లు.. లాభాల్లో సూచీలు
మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 177.70 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 78,142.69 పాయిట్ల వద్ద, నిఫ్టీ 81.20 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 23,697.25 వద్ద నిలిచాయి.ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), SBI లైఫ్ ఇన్సూరెన్స్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. HCL టెక్నాలజీస్, ట్రెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఐషర్ మోటర్స్, హీరో మోటోకార్ప్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:34 సమయానికి నిఫ్టీ(Nifty) 157 పాయింట్లు లాభపడి 23,775కు చేరింది. సెన్సెక్స్(Sensex) 435 పాయింట్లు ఎగబాకి 78,414 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 108.2 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.62 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.55 శాతం లాభపడింది. నాస్డాక్ 1.2 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: చాట్జీపీటీకి ‘గ్రోక్’ స్ట్రోక్!అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆర్థిక విధానాలపై అనిశ్చితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు నెలకొన్నాయి. యూఎస్ బాండ్లపై రాబడులు 4.62 శాతానికి చేరుకోవడంతో ఎఫ్ఐఐల పెట్టుబడులు తరలిపోతున్నాయి. మరోవైపు డాలర్ ర్యాలీ ఆగడం లేదు. ఈ పరిణామాలు భారత్ లాంటి వర్థమాన దేశాలకు ప్రతికూలంగా మారాయి. వీటికి తోడు తాజాగా భారత్లో హెచ్ఎంపీవీ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశీయ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
దలాల్ స్ట్రీట్లో వైరస్ సైరన్!
ముంబై: చైనాలో కలకలం సృష్టిస్తున్న హ్యూమన్ మెటా న్యూమో వైరస్(HMPV) కేసులు భారత్లో నమోదవడంతో దలాల్ స్ట్రీట్లో అమ్మకాల అలజడి రేగింది. ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ విక్రయాలకు పాల్పడటంతో సోమవారం స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతానికి పైగా కుప్పకూలాయి. డిసెంబర్ క్వార్టర్ కార్పొరేట్ ఆర్థిక ఫలితాలపై ఆందోళనలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస పెట్టుబడుల ఉపసంహరణ మరింత ఒత్తిడి పెంచాయి.సెన్సెక్స్(Sensex) 1,258 పాయింట్లు పతనమై 78వేల స్థాయి దిగువన 77,965 వద్ద స్థిరపడింది. నిఫ్టీ(NIFTY) 24 వేల స్థాయిని కోల్పోయి 389 పాయింట్ల నష్టంతో 23,616 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. మెటల్, బ్యాంకులు, రియల్ ఎస్టేట్, ఆయిల్అండ్గ్యాస్, ఫైనాన్స్ షేర్లు భారీగా నస్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,441 పాయింట్లు క్షీణించి 77,782 వద్ద, నిఫ్టీ 453 పాయింట్లు పతనమై 23,552 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3%, మిడ్ క్యాప్ సూచీ 2.50 శాతం పతనాన్ని చవిచూశాయి. హెచ్ఎంపీవీ వ్యాప్తి భయాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.ఇదీ చదవండి: తాళి కట్టు శుభవేళ..బహుమతులపై పన్ను భారం ఉండదా?నష్టాలు ఎందుకంటే... అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఆర్థిక విధానాలపై అనిశ్చితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు నెలకొన్నాయి. యూఎస్ బాండ్లపై రాబడులు 4.62 శాతానికి చేరుకోవడంతో ఎఫ్ఐఐల పెట్టుబడులు తరలిపోతున్నాయి. మరోవైపు డాలర్ ర్యాలీ ఆగడం లేదు. ఈ పరిణామాలు భారత్ లాంటి వర్థమాన దేశాలకు ప్రతికూలంగా మారాయి. వీటికి తోడు తాజాగా భారత్లో హెచ్ఎంపీవీ కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశీయ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగా ఉండొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి. సాంకేతికంగా నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ 200 రోజుల మూవింగ్ యావరేజీ(డీఎంఏ) స్థాయిని కోల్పోవడంతో దలాల్ స్ట్రీట్లో అమ్మకాల సునామీ నెలకొంది. -
ఎఫ్ అండ్ ఓ తగ్గింది..
అన్నీ కలిసొస్తే ఒక్కరోజులోనే సొమ్ము రెట్టింపయిపోవచ్చు. ఇంకా ఎక్కువే కావచ్చు కూడా. మరి ఇంత లాభం ఇంకెక్కడైనా ఉంటుందా? ఇదిగో... ఇలాంటి ఆలోచనే చాలామంది చిన్న ఇన్వెస్టర్లను స్టాక్ మార్కెట్లలో డెరివేటివ్స్గా పేర్కొనే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్వైపు మళ్లిస్తోంది. ఇక ఇన్వెస్ట్మెంట్ సాధనమైన స్టాక్ మార్కెట్లను గ్యాంబ్లింగ్ డెన్గా మారుస్తోంది. నిజానికి ఇలాంటి ఆలోచనలతో డెరివేటివ్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టిన వారెవరూ లాభాలు ఆర్జించిన దాఖలాల్లేవు. 2023–24లో దాదాపు కోటి మంది ఇన్వెస్టర్లు సగటున రూ.2 లక్షల చొప్పున పోగొట్టుకున్నారన్నది సెబీ నివేదిక. అంటే దాదాపు 2 లక్షల కోట్లు. ఇవి స్టాక్ మార్కెట్లలో పోగొట్టుకున్నవే అయినా... వీళ్లేమీ షేర్లలో ఇన్వెస్ట్ చేసి నష్టపోలేదన్నది గమనార్హం. ఎప్పటికప్పుడు విపరీతమైన ఊగిసలాటతో ఉండే డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ ఓ)లో ట్రేడింగ్ చేసి నష్టపోయారన్నది నిజం. సత్వర లాభాలపై అత్యాశతో డెరివేటివ్స్లో ట్రేడింగ్ చేసేవారిలో 95 శాతం మంది భారీగా నష్టపోతున్నారని, నిరంతరం నష్టాలొస్తూ... అప్పుల్లో కూరుకుపోతున్నప్పటికీ ఆశ వదలక ఏళ్ల తరబడి ట్రేడింగ్ను కొనసాగిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే చిన్న ఇన్వెస్టర్లు ఇందులోకి రాకుండా కట్టడి చేసేందుకు వారి ప్రయోజనాలను కాపాడేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. ఎప్పటికప్పుడు పలు చర్యలు తీసుకుంటోంది. ఇటీవలి అధ్యయనాల్లో దారుణమైన వాస్తవాలు వెలుగు చూడటంతో... ఇటీవల మరీ తీవ్రమైన చర్యలు తీసుకుంది. ఎక్సే్ఛంజీలు పలు ఇండెక్సుల్లో వీక్లీ డెరివేటివ్స్ను ఆరంభించటంతో రిటైలర్లు వాటిని ఆశ్రయిస్తున్నారని గ్రహించి... వాటిని రద్దు చేసింది. ఒక ఎక్సే్ఛంజీ నుంచి ఒక ఇండెక్స్కే వీక్లీ డెరివేటివ్స్కు అనుమతినిచ్చింది. దీంతో బీఎస్ఈ నుంచి సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నుంచి నిఫ్టీ మాత్రమే వీక్లీ డెరివేటివ్స్ నిర్వహిస్తున్నాయి. గతంలో మాదిరి బ్యాంక్నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ వంటి ఇండెక్సుల్లో వీక్లీ డెరివేటివ్స్ రద్దయ్యాయి. ఇవే కాదు. ఇటీవల కాంట్రాక్టుల సైజులు, మార్జిన్లను కూడా భారీగా పెంచింది. ఇవన్నీ నవంబర్ నుంచి అమల్లోకి రావటంతో ట్రేడింగ్కు కావాల్సిన పెట్టుబడి అమాంతంగా పెరిగింది. చాలామంది రిటైలర్లు వెనక్కి తగ్గారు. అందుకే డిసెంబర్లో డెరివేటివ్స్ వాల్యూమ్స్ గణనీయంగా తగ్గిపోయాయి. నెలవారీగా చూస్తే ట్రేడింగ్ పరిమాణం 37% పడిపోయింది. ప్రధాన ఎక్సే్చంజీలైన బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో డిసెంబర్లో డెరివేటివ్స్ సెగ్మెంట్కి సంబంధించి సగటు రోజువారీ టర్నోవరు (ఏడీటీవీ) సుమారు రూ.280 లక్షల కోట్లకు తగ్గింది. ఇది నవంబర్లో రూ.442 లక్షలు. సెన్సెక్స్, నిఫ్టీ కొత్త రికార్డు గరిష్టాలను తాకిన సెపె్టంబర్లో అయితే ఏడీటీవీ ఏకంగా రూ. 537 లక్షల కోట్లుగా నమోదైంది. దానితో పోలిస్తే డిసెంబర్లో పరిమాణం సగానికి పడిపోయింది. ఇది 16 నెలల కనిష్ట స్థాయి కూడా. దీన్ని బట్టి.. సెబీ చర్యలు ఫలితమిచి్చనట్టేనని, రిటైలర్ల నష్టాలు తగ్గుతాయనేది మార్కెట్ వర్గాల మాటా! మరింతగా పడిపోయే అవకాశం... ఇంట్రాడేలో కూడా పొజిషన్లను నిశితంగా పర్యవేక్షించడంలాంటి మరిన్ని కఠిన నిబంధనలు వచ్చే కొద్ది నెలల్లో అమల్లోకి రాబోతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో డెరివేటివ్స్ వాల్యూమ్స్ ఇంకా పడిపోయే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎంతవరకూ పడిపోతాయన్నది ఇపుడే అంచనా వేయలేమని బీఎస్ఈ వర్గాలు చెబుతున్నాయి. కాంట్రాక్టుల సంఖ్య తగ్గినా ప్రీమియం మెరుగుపడితే, ఆదాయం కూడా పెరుగుతుందని, వ్యయాలూ తగ్గుతాయని... అలా జరిగితే ప్రయోజనకరమేనని వివరించాయి.క్యాష్ విభాగం అప్..డెరివేటివ్స్ ట్రేడింగ్ నిబంధనలను కఠినతరం చేస్తూనే మదుపరులు దీర్ఘకాలిక ఇన్వెస్టింగ్ వైపు మళ్లేలా కూడా సెబీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే టాప్– 500 స్టాక్స్కి ట్రేడింగ్ రోజునే (సేమ్ డే) సెటిల్మెంట్ నిబంధనను కూడా అమల్లోకి తేనుంది. అంటే కొన్న రోజునే షేర్లు ఖాతాలోకి రావటం... అమ్మిన రోజునే నగదు ఖాతాలోకి రావటం వంటివన్న మాట. నిబంధనలు కఠినం చేయటం వల్ల డెరివేటివ్స్ వాల్యూమ్స్ క్షీణించినా.. ఇలాంటి సానుకూల పరిణామాలతో క్యాష్ సెగ్మెంట్ మాత్రం పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. క్యాష్ మార్కెట్ టర్నోవరు వరుసగా అయిదు నెలల పాటు తగ్గినా.. డిసెంబర్లో మాత్రం 4.4 శాతం పెరగడం (నెలవారీగా చూస్తే) ఇందుకు నిదర్శనమని వివరించాయి. ఇటీవల ఐపీవోలతో మార్కెట్ సందడిగా ఉండటం, స్విగ్గీ.. హ్యుందాయ్లాంటి భారీ లిస్టింగ్లు మొదలైన వాటితో ఈ సెగ్మెంట్పై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరగడం దీనికి కారణమని పేర్కొన్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
స్టాక్ మార్కెట్కు వైరస్ అటాక్.. కుప్పకూలిన సూచీలు
చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) భారత్లోకి అడుగుపెట్టింది. ఈ వైరస్కు సంబంధించిన రెండు కేసులను ఒకటి కర్ణాటకలో, మరొకటి గుజరాత్లో భారత ప్రభుత్వం నిర్ధారించిన తర్వాత స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు అప్రమత్తం అయ్యారు. జాగ్రత్త విధానాన్ని ఎంచుకున్నారు. దీంతో అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దేశీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ (BSE) సెన్సెక్స్, ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ 50 వారంలో మొదటి ట్రేడింగ్ సెషన్ను భారీ నష్టాలతో ముగించాయి. కౌంటర్లలో అమ్మకాల ఒత్తిడితో ఒక్కో సూచీ 1 శాతానికి పైగా పడిపోయింది. 30 షేర్ల సెన్సెక్స్ 1,258.12 పాయింట్లు లేదా 1.59 శాతం పతనమై 77,964.99 వద్ద స్థిరపడింది. ఈ రోజు ఈ ఇండెక్స్ 79,532.67 నుంచి 77,781.62 రేంజ్లో ట్రేడవుతోంది.సెన్సెక్స్ను ప్రతిబింబిస్తూ నిఫ్టీ 50 కూడా 388.70 పాయింట్లు లేదా 1.62 శాతం తగ్గి 23,616.05 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సోమవారం నాడు 24,089.95 గరిష్ట స్థాయిని నమోదు చేయగా, రోజు కనిష్ట స్థాయి 23,551.90గా ఉంది.నిఫ్టీ50లోని 50 స్టాక్లలో 43 స్టాక్లు నష్టాలను చవిచూశాయి. ట్రెంట్, టాటా స్టీల్, బీపీసీఎల్, ఎన్టిపిసి, అదానీ ఎంటర్ప్రైజెస్ 4.60 శాతం వరకు నష్టపోయిన టాప్ లూజర్స్. మరోవైపు అపోలో హాస్పిటల్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్ కంపెనీ, హెచ్సిఎల్ టెక్, ఐసిఐసిఐ బ్యాంక్ 1.94 శాతం వరకు లాభాలతో గ్రీన్లో ముగిసిన 7 షేర్లలో ఉన్నాయి.మార్కెట్లలో అస్థిరతను అంచనా వేసే ఫియర్ ఇండెక్స్, ఇండియా VIX, 15.58 శాతం క్షీణించి 15.65 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ స్మాల్క్యాప్ 100, నిఫ్టీ మిడ్క్యాప్ 100 సూచీలు వరుసగా 2.70 శాతం, 3.20 శాతం చొప్పున క్షీణించడంతో విస్తృత మార్కెట్లు కూడా బెంచ్మార్క్లను ప్రతిబింబించాయి.అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి, నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ అత్యంత దారుణంగా దెబ్బతింది. 4 శాతం నష్టపోయింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ నష్టాలను చవిచూశాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.12 లక్షల కోట్ల మేర క్షీణించి రూ.439 లక్షల కోట్లకు పడిపోయింది.ఉదయం ఇలా..దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) సోమవారం ఉదయం ప్రారంభంలో లాభాల్లో ట్రేడయ్యాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 74 పాయింట్లు లాభపడి 24,082కు చేరింది. సెన్సెక్స్(Sensex) 286 పాయింట్లు ఎగబాకి 79,523 వద్ద ట్రేడయింది. అమెరికా డాలర్ ఇండెక్స్ 108.91 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 76.3 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.6 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.26 శాతం లాభపడింది. నాస్డాక్ 1.77 శాతం ఎగబాకింది.దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ ఫలితాలు నడిపించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. దీనికితోడు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాలు, ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇవికాకుండా ప్రపంచ రాజకీయ, భౌగోళిక అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు.ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమావారాంతాన(డిసెంబర్ 10న) ప్రభుత్వం నవంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి ఇండెక్స్(ఐఐపీ) గణాంకాలు వెల్లడించనుంది. అక్టోబర్లో ఐఐపీ వార్షికంగా 3.5 శాతం పుంజుకుంది. అంతేకాకుండా డిసెంబర్ నెలకు హెచ్ఎస్బీసీ సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. వచ్చే నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్ను ప్రకటించనుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
-
ఆర్థిక ఫలితాలతో దిశా నిర్దేశం!
గత వారం మార్కెట్లో బుల్స్(Market Bulls) హడావుడి కనిపించింది. వాస్తవానికి అంతక్రితం వారం రావాల్సిన షార్ట్ కవరింగ్ కిందటి వారం రావడం ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా గత గురువారం సెన్సెక్స్ 1400 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 400 పాయింట్ల దాకా పెరిగాయి. మళ్లీ శుక్రవారం కొంతమేర నష్టాల్లో నడిచినప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేదు. డిసెంబర్ నెలకు సంబంధించి వాహన విక్రయాలు సానుకూలంగా ఉండటం... మరీ ముఖ్యంగా మారుతీ షేర్ల దూకుడు, ఐటీరంగం(IT Sector)లో మళ్లీ కొనుగోళ్లు పుంజుకోవడం, జీఎస్టీ వసూళ్లు బావుండటం..వంటి కారణాలు మార్కెట్ను ముందుకు నడిపాయి. వారం మొత్తానికి సెన్సెక్స్ 79223, నిఫ్టీ 24004 పాయింట్ల వద్ద ముగిశాయి. అంత క్రితం వారంతో పోలిస్తే గత వారం మొత్తం మీద సెన్సెక్స్ దాదాపు 525 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ సుమారు 191 పాయింట్లు పెరిగింది.ఈవారం ఇలా..తెలుగు వాళ్లకు సంక్రాంతి ఎంత పెద్ద పండుగో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. స్టాక్ మార్కెట్కు సంబంధించి అలాంటి పండగే రాబోతోంది. అదే ఆర్థిక ఫలితాలు. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలు ఈవారం నుంచే మొదలు కాబోతున్నాయి. ఈ నెల 9న టీసీఎస్ ఫలితాలతో సందడి మొదలవుతుంది. ఇక ఈ ఫలితాలు మార్కెట్లకు రాబోయే రోజుల్లో దిశానిర్దేశం చేయబోతున్నాయి. ఈసారి ఫలితాలు కొంత ప్రొత్సాహకారంగా ఉండొచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది సానుకూల సంకేతం. మరోపక్క క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో పలచబడ్డ విదేశీ మదుపర్ల లావాదేవీలు మళ్లీ జోరు అందుకుంటాయి. అయితే గత వారం చివర్లో కనిపించిన కొనుగోళ్ల ఉద్ధృతి కొనసాగడం అనేది ఆర్థిక ఫలితాలు, విదేశీ మదుపర్ల చర్య పైనే పూర్తిగా ఆధారపడి ఉంది. ఎఫ్ఐఐల తీరువిదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) గత డిసెంబర్ నెల మొత్తం మీద రూ.16,982 కోట్ల నికర విక్రయాలు జరపగా, దేశీయ మదుపర్లు రూ.34,194 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. ఇక ఈ ఏడాది తొలి మూడు రోజుల్లోనూ విదేశీ మదుపర్లు రూ.4500 కోట్ల నికర విక్రయాలు చేశారు. అదే సమయంలో దేశీయ మదుపర్లు మాత్రం రూ.2500 కోట్ల నికర కొనుగోళ్లతో మార్కెట్కు అండగా నిలిచారు. సాంకేతిక స్థాయులుసెన్సెక్స్, నిఫ్టీల్లో ఒడుదొడుకులు కొంత మేర తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా బుల్స్ పుంజుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఇందుకు కారణం. కొనుగోళ్ల జోరు కొనసాగితే నిఫ్టీ 24250 పాయింట్ల వరకు పరుగులు తీయొచ్చు. ఈ స్థాయిని కూడా అధిగమిస్తే 24600 వరకు పెద్దగా ఇబ్బంది ఎదురుకాకపోవచ్చు. ఒకవేళ అమ్మకాలు పెరిగితే 23800 కీలక స్థాయిని మార్కెట్ చూసే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా బ్రేక్ చేస్తే పతనం మరింత పెరిగి గతంలోని కనిష్టస్థాయులను టచ్ చేసే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే గత మద్దతు స్థాయి అయిన 23300 మార్కెకు పడిపోవచ్చు. ఆ స్థాయికి క్షీణించడానికి ముందు కొద్దిపాటి రికవరీకి ఆస్కారం ఉంటుంది.ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమారంగాలవారీగా...ఆటోమొబైల్ రంగంలో జోరు కొనసాగే అవకాశం ఉంది. డిసెంబర్ నెలకు ఈ కంపెనీలు ప్రకటించిన విక్రయ గణాంకాలు చాలావరకు మదుపర్లను మెప్పించాయి. మారుతీ షేర్లలో దూకుడు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ప్రాఫిట్ బుకింగ్కు అవకాశం ఉంటుంది. గత కొద్దివారాలుగా లాభాల్లో సాగుతున్న ఫార్మా రంగం ర్యాలీ ఈవారం కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా మార్కెట్లో ఒడుదొడుకులు ఎదురవుతున్నప్పుడు మదుపర్లు ముందుగా సురక్షితంగా భావించి కొనుగోళ్లు జరిపేది ఈ రంగంలోని షేర్లనే. ఇక టీసీఎస్ ఆర్థిక ఫలితాలు రాబోయే రోజుల్లో ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ వంటి ఐటీ కంపెనీల షేర్లను ప్రభావితం చేస్తాయి. అల్ట్రాటెక్, అంబుజా షేర్లకు మద్దతు దొరికే అవకాశం ఉన్నప్పటికీ సిమెంట్ షేర్లలో పెద్దగా దూకుడు ఉండకపోవచ్చు. అలాగే ఎఫ్ఎంసిజీ, యంత్ర పరికరాల రంగానికి చెందిన షేర్లు సైతం ఒత్తిళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. టెలికం, ఆయిల్ రంగాల షేర్లలో స్థిరీకరణ జరగొచ్చు.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
ఐటీ స్టాక్ల ర్యాలీ.. లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) సోమవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ(Nifty) 74 పాయింట్లు లాభపడి 24,082కు చేరింది. సెన్సెక్స్(Sensex) 286 పాయింట్లు ఎగబాకి 79,523 వద్ద ట్రేడవుతోంది. ఈరోజు ఈ సమయం వరకు ఐటీ స్టాక్లు ఎక్కువగా ర్యాలీ అవుతున్నట్లు తెలుస్తుంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.91 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 76.3 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.6 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.26 శాతం లాభపడింది. నాస్డాక్ 1.77 శాతం ఎగబాకింది.దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ ఫలితాలు నడిపించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర(2024–25) మూడో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. దీనికితోడు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాలు, ఆర్థిక గణాంకాలపై దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇవికాకుండా ప్రపంచ రాజకీయ, భౌగోళిక అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు.ఇదీ చదవండి: మానసిక ఆరోగ్యానికీ బీమా ధీమావారాంతాన(10న) ప్రభుత్వం నవంబర్ నెలకు పారిశ్రామికోత్పత్తి ఇండెక్స్(ఐఐపీ) గణాంకాలు వెల్లడించనుంది. అక్టోబర్లో ఐఐపీ వార్షికంగా 3.5 శాతం పుంజుకుంది. అంతేకాకుండా డిసెంబర్ నెలకు హెచ్ఎస్బీసీ సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. వచ్చే నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక బడ్జెట్ను ప్రకటించనుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
బుల్ స్వారీలో ‘ఆమె’ ఫస్ట్
సాక్షి, అమరావతి: స్టాక్ మార్కెట్లో బుల్ స్వారీ చేయడానికి మహిళా ఇన్వెస్టర్లు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం 2022 తర్వాత ప్రారంభమవుతున్న ప్రతి నాలుగు డిమ్యాట్ అకౌంట్లలో ఒకటి మహిళా ఖాతాగా ఉన్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2021 నుంచి సగటున ఏటా మూడు కోట్ల ఖాతాలు ప్రారంభమవ్వగా, ఈ ఏడాది ఇప్పటికే నాలుగు కోట్లకు పైగా డిమ్యాట్ ఖాతాలు ప్రారంభం కావడం గమనార్హం. 2014లో దేశం మొత్తం మీద 2.2 కోట్ల ఖాతాలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 17 కోట్లు దాటింది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య క్రమేపి పెరుగుతూ వస్తోంది. 2014 ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.12,068 కోట్ల నిధులు సేకరిస్తే, 2024లో రూ.1.60 లక్షల కోట్లు స్టాక్ మార్కెట్ ద్వారా సేకరించడం గమనార్హం. ఇదే సమయంలో సిప్ విధానం ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఏటా రూ.రెండు లక్షల కోట్లకుపైగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. కొత్త ఇన్వెస్టర్లలో హైదరాబాదీలు అధికంమహిళా ఇన్వెస్టర్ల విషయంలో పెద్ద రాష్ట్రాల్లో ఢిల్లీ 29.8%, మహారాష్ట్ర 27.7%, తమిళనాడు 27.5%తో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. చిన్న రాష్ట్రాలు కూడా కలుపుకుంటే గోవా 32%తో మొదటి స్థానంలో ఉంది. మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా ఉన్నాయి. 2022లో ఏపీలో మొత్తం ఇన్వెస్టర్లలో మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య 19.5% ఉండగా, అది ఇప్పుడు 22.7 శాతానికి పెరిగింది. మహిళా ఇన్వెస్టర్లు వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో ఏపీ రెండవ స్థానంలో నిలిచింది. హిమాచల్ ప్రదేశ్ 3.7% వృద్ధితో మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 3.2% వృద్ధితో రెండవ స్థానంలో నిలిచింది. కోవిడ్ తర్వాత నుంచి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే 30 ఏళ్లలోపు వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 2018లో మొత్తం ఇన్వెస్టర్లలో 22.9 శాతంగా ఉన్న 30 ఏళ్లలోపు ఇన్వెస్టర్ల సంఖ్య ఇప్పుడు 40 శాతానికి చేరుకుంది. కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్న వారిలో అత్యధికంగా హైదరాబాద్, బెంగళూరు, కాన్పూర్ వంటి పట్టణ ఇన్వెస్టర్లు ఉంటున్నట్లు ఎస్బీఐ నివేదిక వెల్లడించింది. -
బుల్ స్వారీలో ‘ఆమె’ జోరు
సాక్షి, అమరావతి: స్టాక్ మార్కెట్లో బుల్ స్వారీ చేయడానికి మహిళా ఇన్వెస్టర్లు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం 2022 తర్వాత ప్రారంభమవుతున్న ప్రతి నాలుగు డిమ్యాట్ అకౌంట్లలో ఒకటి మహిళా ఖాతాగా ఉన్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2021 నుంచి సగటున ఏటా మూడు కోట్ల ఖాతాలు ప్రారంభమవ్వగా, ఈ ఏడాది ఇప్పటికే నాలుగు కోట్లకు పైగా డిమ్యాట్ ఖాతాలు ప్రారంభం కావడం గమనార్హం. 2014లో దేశం మొత్తం మీద 2.2 కోట్ల ఖాతాలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 17 కోట్లు దాటింది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య క్రమేపి పెరుగుతూ వస్తోంది. 2014 ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.12,068 కోట్ల నిధులు సేకరిస్తే, 2024లో రూ.1.60 లక్షల కోట్లు స్టాక్ మార్కెట్ ద్వారా సేకరించడం గమనార్హం. సిప్ విధానం ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఏటా రూ.రెండు లక్షల కోట్లకుపైగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. రాష్ట్రంలో 22.7% మహిళా ఇన్వెస్టర్లు మహిళా ఇన్వెస్టర్లు వేగంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. గత మూడేళ్లలో హిమాచల్ ప్రదేశ్ 3.7% వృద్ధితో మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 3.2% వృద్ధితో రెండవ స్థానంలో నిలిచింది. 2022లో మొత్తం ఇన్వెస్టర్లలో మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య 19.5% ఉండగా, అది ఇప్పుడు 22.7 శాతానికి పెరిగింది. జాతీయ సగటు 23.9% పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ, గత మూడేళ్లుగా రాష్ట్రంలో మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతున్నట్టు ఎస్బీఐ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది. పెద్ద రాష్ట్రాల్లో ఢిల్లీ 29.8%, మహారాష్ట్ర 27.7%, తమిళనాడు 27.5%తో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. చిన్న రాష్ట్రాలు కూడా కలుపుకుంటే గోవా 32%తో మొదటి స్థానంలో ఉంది. మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా ఉన్నాయి. కోవిడ్ తర్వాత నుంచి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే 30 ఏళ్లలోపు వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. 2018లో మొత్తం ఇన్వెస్టర్లలో 22.9 శాతంగా ఉన్న 30 ఏళ్లలోపు ఇన్వెస్టర్ల సంఖ్య ఇప్పుడు 40 శాతానికి చేరుకుంది. కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్న వారిలో అత్యధికంగా హైదరాబాద్, బెంగళూరు, కాన్పూర్ వంటి పట్టణ ఇన్వెస్టర్లు ఉంటున్నట్లు ఎస్బీఐ నివేదిక వెల్లడించింది. -
Stock Market Trading: ఇండెక్స్ల్లో ట్రేడ్ చేస్తున్నారా...!
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి ఈక్విటీలు, ఫ్యూచర్స్ & ఆప్షన్స్ అనే మార్గాలు ఉంటాయని గత ఆర్టికల్ లో చెప్పుకున్నాం కదా...ఇందులో ఫ్యూచర్స్ & ఆప్షన్స్... దానిలో ఇండెక్స్ ట్రేడ్ ల గురించి ఇప్పుడు చూద్దాం.వాస్తవానికి ఫ్యూచర్స్ కి, ఈక్విటీల్లో ట్రేడింగ్ కి పెద్దగా తేడా ఉండదు. ఈక్విటీ ల్లో షేర్లు గా వ్యవహరిస్తే... ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (ఎఫ్ & ఓ ) లో కాంట్రాక్టులు గా పేర్కొంటారు. ఈక్విటీల్లో మనం కొనే షేర్లు ఎన్ని సంవత్సరాలైనా అట్టేపెట్టుకోవచ్చు. షేర్లు అనేవి మన ఆస్తిగా భావించవచ్చు. కాంట్రాక్టులను మాత్రం ఆవిధంగా పరిగణించలేం. ఎఫ్ & ఓ లో కాంట్రాక్టులు కొన్నప్పుడు కేవలం ఒక నెల రోజుల వ్యవధికే పరిమితమవుతాయి.ఒకవేళ మనం కొన్న కాంట్రాక్టు మంచి లాభాల్లో ఉంటే ఆ నెల రోజుల్లో ఎప్పుడైనా ఆ లాభాన్ని బుక్ చేసుకుని బయటకు వచ్చేయొచ్చు. అదే నష్టాల్లో ఉంటే నెల రోజుల వరకు ఆగొచ్చు. అప్పటికీ నష్టాల్లోంచి బయట పడకపోతే కచ్చితంగా నెలాఖరున బయటకు వచ్చేయాల్సి ఉంటుంది. ఆ కాట్రాక్టు రాబోయే రోజుల్లో పెరుగుతుందనే నమ్మకం ఉంటే... ప్రస్తుతం చేతిలో ఉన్న కాంట్రాక్టు ను నెలాఖరున అమ్మేసి తదుపరి నెల కాంట్రాక్టు ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.ఈక్విటీల్లో ఒక్క షేర్ మొదలుకొని మన చేతిలో ఉన్న డబ్బుల్ని బట్టి ఎన్ని షేర్లు అయినా కొనుక్కోవచ్చు. ఎఫ్ & ఓ లో తప్పనిసరిగా లాట్స్ లో మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. షేరును బట్టి, ఇండెక్స్ ను బట్టి లాట్ సైజు ను నిర్ణయిస్తారు.ఉదా: రిలయన్స్ షేర్ ధర రూ. 1250 ఉంది. దీన్ని ఎఫ్ & ఓ లో కొనుగోలు చేయాలంటే 500 షేర్లు (1 లాట్) తీసుకోవాలి. అదే జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ 5625 (ఒక లాట్) షేర్లు కొనాలి. ఐటీసీ అయితే.. 1600 (ఒక లాట్) తీసుకోవాలి.ఎఫ్ & ఓ లో ట్రేడ్ చేయాలంటే కేవలం లాట్స్ లో అది కూడా పరిమిత కాలానికి మాత్రమే కొనగలం అన్న విషయం అర్ధం అయింది కదా... ఇప్పుడు ఇండెక్స్ ల గురించి మాట్లాడుకుందాం. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి కి సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి కి నిఫ్టీ ప్రాతినిధ్యం వహిస్తాయి అన్న విషయం మనకు తెలుసు కదా...ఈ సెన్సెక్స్, నిఫ్టీ లతో పాటు నిఫ్టీ నెక్స్ట్ 50, బీఎస్ఈ బ్యాంకెక్స్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, ఫిన్ నిఫ్టీ. బ్యాంకు నిఫ్టీ ల్లో కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇవి కాక ఆటో, ఫార్మా, ఐటీ.... ఇలా వివిధ రంగాలకు కూడా ఆయా ఇండెక్స్ లు ఉంటాయి. కానీ వీటిలో ట్రేడింగ్ చేయలేం.గత నవంబర్ 20 వ తేదీ వరకు మిడ్ నిఫ్టీ కి సోమవారం, ఫిన్ నిఫ్టీ కి మంగళవారం, బ్యాంకు నిఫ్టీ కి బుధవారం, నిఫ్టీ కి గురువారం, సెన్సెక్స్ కు శుక్రవారం... ఇలా వీక్లీ కాంట్రాక్టు లు ఉండేవి. అంటే ఆ వారాంతానికి ముగిసిపోయే కాంట్రాక్టు లన్న మాట. ఇలా ట్రేడింగ్ జరిగే ప్రతి రోజూ ఏదో ఒక ఎక్సపైరీ ఉండటం వల్ల రిటైల్ ట్రేడర్లు భారీగా నష్టపోతున్నారన్న ఉద్దేశంతో సెబీ... సెన్సెక్స్, నిఫ్టీ లకు తప్ప మిగతా ఇండెక్స్ లకు వీక్లీ కాంట్రాక్టు లు తీసేసింది.బీ ఎస్ ఈ కి సెన్సెక్స్, ఎన్ ఎస్ ఈ కి నిఫ్టీ లు ప్రామాణిక సూచీలు కాబట్టి వీటిలో మాత్రం వీక్లీ, మంత్లీ కాంట్రాక్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా సెన్సెక్స్ వీక్లీ, మంత్లీ ఎక్సపైరీ శుక్రవారం ఉండగా వచ్చే వారం నుంచి మంగళవారం (జనవరి 7,14, 21, 28... ఇలా ) కి మారబోతోంది. నిఫ్టీ కి మాత్రం గురువారమే కొనసాగుతుంది. అలాగే లాట్ సైజు లను కూడా సెబీ మార్చింది. వాటి వివరాలు.ఇండెక్స్లాట్ సైజు ప్రస్తుతంమార్చాకఅమల్లోకి వచ్చే/వచ్చిన తేదీ నిఫ్టీ2575జనవరి 2, 2025బ్యాంకు నిఫ్టీ1530ఫిబ్రవరి 2025ఫిన్ నిఫ్టీ2565 ఫిబ్రవరి 2025మిడ్ నిఫ్టీ50120 ఫిబ్రవరి 2025సెన్సెక్స్ 10 20 జనవరి 7, 2025 నిఫ్టీ నెక్స్ట్ 50 10 25 నవంబర్ 20, 2024 బీఎస్ఈ బ్యాంకెక్స్ 15 30 నవంబర్ 20, 2024మిడ్, ఫిన్, బ్యాంకు నిఫ్టీ ల్లో ట్రేడ్ చేయాలంటే తప్పనిసరిగా నెలవారీ కాంట్రాక్టులు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవి చాల ఖరీదు ఉంటాయి. అదే సమయంలో లాట్ సైజు లను కూడా పెంచడం వల్ల రిటైల్ ట్రేడర్లు గతంతో పోలిస్తే ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వారి ప్రమేయం తగ్గుతుందని, తద్వారా వారి నష్టాల స్థాయిని తగ్గించవచ్చనేది సెబీ ఉద్దేశం.ఉదా: గతంలో ఒక ట్రేడర్ రూ. 100 ఖరీదు చేసే నిఫ్టీ 50 ఆప్షన్ ఒక లాట్ కొనడానికి రూ. 100 X 25 (లాట్ సైజు) = రూ.2,500 వెచ్చిస్తే సరిపోయేది. మారిన నిబంధనల ప్రకారం ఇప్పుడు అదే లాట్ కొనాలంటే రూ. 7,500 పెట్టాలి. అంటే చేతిలో రూ.25,000 ఉన్న వ్యక్తి 10 లాట్లు కొనగలిగేవాడు కాస్తా తాజాగా రూ.75,000 పెట్టాల్సి ఉంటుంది కాబట్టి... ట్రేడింగ్ లో రిటైలర్ల ప్రమేయం తగ్గిపోతుంది. తద్వారా వారికొచ్చే నష్టాలు కూడా పరిమితం గానే ఉంట్టాయన్న ఉద్దేశంతో సెబీ ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇండెక్స్ ల్లో ట్రేడ్ చేసేవారు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.-బెహరా శ్రీనివాస రావుస్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
ట్రేడింగ్లో ఫ్యూచర్స్ & ఆప్షన్స్: ఏది బెస్ట్ అంటే..
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఈమధ్య ఎక్కువ మంది అనుసరిస్తున్న మార్గం ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (ఎఫ్ & ఓ). వీటినే డెరివేటివ్స్ అంటారు. ఈక్విటీలకు మరో ప్రత్యామ్నాయ రూపమే ఈ డెరివేటివ్స్ అన్నమాట. ఈ రెండిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఫ్యూచర్స్ ట్రేడింగ్▸ఈక్విటీల్లో షేర్లు ఎలా కొంటామో ఫ్యూచర్స్లోనూ అదే మాదిరి కొనుక్కోవచ్చు. ▸ఈక్విటీల్లో ఒక్క షేర్ సైతం కొనుక్కునే వెసులుబాటు ఉంటే ఫ్యూచర్స్లో మాత్రం తప్పనిసరిగా ఒక లాట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ▸ఆయా కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే ధరలను బట్టి లాట్ పరిమాణం నిర్ణయమవుతుంది.▸గతంలో ఫ్యూచర్స్లో షేర్లు కొనేటప్పుడు అతి తక్కువ పెట్టుబడి అవసరమయ్యేది. కానీ నిబంధనలు మారిన తర్వాత కొంచెం ఎక్కువ పెట్టుబడి అవసరమవుతోంది.ఉదా: రిలయన్స్ షేర్లు ఫ్యూచర్స్లో కొనాలని అనుకున్నాం. లాట్ సైజు 500. ఇంతే మొత్తం షేర్లను ఈక్విటీల్లో కొనాలంటే రూ. 6,25,000 కావాలి. అదే ఫ్యూచర్స్లో అయితే రూ.1,10,836 సరిపోతుంది.▸ఈక్విటీలు, ఫ్యూచర్స్కి తేడా ఏమిటంటే.. ఈక్విటీల రూపంలో కొన్న షేర్లు మనం ఎన్నాళ్లయినా మన దగ్గర ఉంచుకోవచ్చు. ▸అవి ఒక రకంగా పెట్టుబడి. షేర్ ధర పడిపోయినా ఆందోళన చెందనక్కర్లేదు.▸డబ్బులు అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు, డబ్బులు ఉన్నప్పుడు ధర పడినా/పెరిగినా మరిన్ని షేర్లు కొనుక్కుంటూ మన పోర్ట్ఫోలియోను పెంచుకోవచ్చు. మంచి లాభాలు వచ్చేవరకూ ఎన్నాళ్లయినా ఎదురుచూడొచ్చు.▸ఫ్యూచర్స్లో ఈ వెసులుబాటు ఉండదు. ఫ్యూచర్స్లో కొనే షేర్లను కాంట్రాక్టులుగా పరిగణిస్తారు. ఆ కాంట్రాక్టు నెల రోజుల వ్యవధికే పరిమితమవుతుంది. ▸దీన్ని పెట్టుబడిగా కాక స్వల్పకాలిక ట్రేడింగ్ వనరుగా మాత్రమే పరిగణించాలి.▸నెల రోజుల వ్యవధిలో కాంట్రాక్టు ధర ఎప్పుడు పెరిగినా తగిన ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయాలి.▸కాంట్రాక్టు ధర పడిపోతే మళ్ళీ పెరిగే వరకు అంటే ఆ నెల చివరిదాకా కూడా ఆగొచ్చు. అప్పటికీ పెరక్కపోతే అమ్ముకుని నష్టాన్ని బుక్ చేయాల్సిందే.▸ప్రస్తుతానికి పడినా.. మళ్ళీ పెరుగుతుందనే నమ్మకం ఉంటే నెలాఖరులో ప్రస్తుత కాంట్రాక్టు వదిలించుకుని తరువాతి నెల కాంట్రాక్టు తీసుకోవచ్చు. ఆ నెలలో కూడా కొన్న రేటు రాక ఇంకా పడిపోతే.. మరింత నష్టాన్ని భరించక తప్పదు. లేదంటే ఆ తరవాతి నెలకు షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది.▸ఇది కాంట్రాక్టు కాబట్టి మొత్తం డబ్బులు పెట్టక్కర్లేకుండా నాలుగో వంతు ధరకే కొనుక్కునే అవకాశం ఉంటుంది. పైన చెప్పుకున్న రిలయన్స్ ఉదాహరణ చూడండి. ఎక్కువమంది స్వల్పకాలిక అవసరాలు, తక్కువ పెట్టుబడిని దృష్టిలో ఉంచుకుని ఈ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు.ఆప్షన్స్ ట్రేడింగ్ఈక్విటీలకు మరో డెరివేటివ్ రూపమే ఆప్షన్స్. ఫ్యూచర్స్తో పోలిస్తే చాలా చాలా తక్కువ పెట్టుబడికి ట్రేడింగ్ చేసుకునే సౌలభ్యం ఇందులో ఉంది. అందుకే ట్రేడర్లలో నూటికి 90 మంది ఈ మార్గాన్ని అనుసరిస్తారు. ఈ 90లో 85 మంది నష్టపోయేవాళ్లే. డబ్బుల సంపాదనకు చాలా సులువైన మార్గంగా కనిపించే ఈ ఆప్షన్స్ అనేవి రిటైల్ ట్రేడర్ల కోట్ల సొమ్ము మింగేస్తున్నాయి. అదెలాగో తర్వాత తెలుసుకుందాం.➜ఆప్షన్స్లోనూ ఫ్యూచర్స్ మాదిరిగానే, అదే పరిమాణంలో లాట్లలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అది కూడా నెలవారీ కాంట్రాక్టుల్లోనే చేయాలి. ఆప్షన్స్లో కొనేవాటికి ప్రీమియం ఉంటుంది. ఆ రేటు పెట్టి కొనుక్కోవచ్చు.దీనికి కూడా పై ఉదాహరణనే పరిశీలిద్దాం.రిలయన్స్ షేర్లు (500) ఈక్విటీల్లో కొంటే.. రూ. 6,25,000 అవసరమవుతాయి. ఫ్యూచర్స్లో కొంటే రూ. 1,10,000 కావాలి. ఆప్షన్స్లో రూ.1250 కాల్ రూ. 27 ఉంది. పెట్టుబడి 27X500 = 13,500 ఉంటే చాలు.అందరూ ఎగబడేది ఇందుకోసమే. ఇంత తక్కువ పెట్టుబడితో కూడా ట్రేడ్ చేసుకునే సదుపాయం ఆప్షన్స్లో ఉంటుంది. షేర్ ధర మారే దాన్ని బట్టి ఈ ప్రీమియం లోనూ మార్పులు జరుగుతాయి.రిలయన్స్ షేర్ ధర ప్రస్తుతం రూ.1,250 వద్ద ఉంది. కాబట్టి రూ.1,250 కాంట్రాక్టు కొన్నాం అనుకుందాం. షేర్ ధర కేవలం 2,3 రోజుల వ్యవధిలోనే రూ. 1,300 కి వెళ్తే ప్రీమియం కూడా దాదాపు రూ. 40 దాకా పెరుగుతుంది. అంటే అదంతా మీకొచ్చే లాభమేనన్న మాట. రూ.40X500 = రూ.20,000. కేవలం రూ. 13,500 పెట్టుబడితో రెండే రెండు రోజుల్లో రూ.20,000 సంపాదించినట్లు అవుతుంది. ఈ షేర్ ధర ఎంత పెరుగుతూ ఉంటే ప్రీమియం కూడా అంత పెరుగుతూ ఆమేరకు లాభాలను అందిస్తూ ఉంటుంది. అదే షేర్ ధర 50 రూపాయలు పెరిగినప్పటికీ... అలా పెరగడానికి పట్టే కాలం ఎక్కువగా ఉంటే... వచ్చే లాభం తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుంటాం.➜ట్రేడర్లలో అత్యధికులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాల్ని.. అది కూడా కేవలం స్వల్ప వ్యవధిలోనే సంపాదించేయాలనే ఉద్దేశంతో ఈ ఆప్షన్స్ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు.➜మార్కెట్ పడుతున్నా.. షేర్ ధర క్షీణిస్తున్నా కూడా ఆప్షన్స్లో లాభాలు సంపాదించవచ్చు. ➜ఆప్షన్స్లో మనకొచ్చే లాభాలు అపరిమితం. ఒక్కోసారి కేవలం రూ. 5,000 పెట్టుబడి కూడా ఒక్క నెల రోజుల వ్యవధిలోనే రూ.5 లక్షలు అయిపోవచ్చు. నష్టం వస్తే మాత్రం పోయేది ఆ రూ. 5,000 మాత్రమే. ఇదేదో బానే ఉంది.. బాగా సంపాదించేయవచ్చు అనుకుంటున్నారు కదూ. లక్షలు లక్షలు ఊరికే వచ్చేయవు. ఇందులో వచ్చే దానికంటే పోయేదే ఎక్కువ ఉంటుంది.ఎందుకలా జరుగుతుంది.. షేర్ ధర పెరిగినా ఆప్షన్స్ ఎందుకు పడిపోతాయి. మన పెట్టుబడి ఎందుకు సున్నా అయిపోతుంది... ఆప్షన్స్లో కాల్స్, పుట్స్ పాత్ర ఏమిటి.. ఆప్షన్స్లో ఉండే 'ఆప్షన్స్' ఏమిటి.. వంటి విషయాలను కూలంకషంగా తదుపరి కథనంలో తెలుసుకుందాం. -బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు. -
Stock Market: ఎన్నాళ్లు ఆగితే.. అన్ని లాభాలు!
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి విభిన్న మార్గాలున్నాయి. అందులో ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడం ఒకటి. పరోక్షంగా పెట్టుబడి పెట్టడం రెండోది. అంటే ఈక్విటీ మార్కెట్లో రిస్క్ చేయలేని వ్యక్తులు మ్యూచువల్ ఫండ్స్ మార్గాన్ని ఎంచుకోవడమన్న మాట.అదే ట్రేడింగ్ విషయానికొస్తే... మూడు రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. 1. ఈక్విటీలు 2. ఫ్యూచర్స్ ట్రేడింగ్3. ఆప్షన్స్ ట్రేడింగ్ ఇందులో మొదటిదాని గురించి వివరంగా మాట్లాడుకుందాం.సాధారణంగా మన దగ్గర డబ్బులున్నపుడు వాటిని బ్యాంకుల్లోనో, పోస్ట్ ఆఫీసుల్లోనో దాచుకుంటాం. ఈమధ్య స్టాక్ మార్కెట్ కల్చర్ బాగా పెరిగింది. అయితే చాలామంది ఇన్స్టంట్ లాభాల కోసం ఎగబడుతున్నారు. దీంతో వాళ్ళు ట్రేడింగ్ వైపు చూస్తున్నారే తప్ప భవిష్యత్ భరోసా గురించి ఆలోచించడం లేదు. ట్రేడింగ్ వైపు వెళ్లే వ్యక్తుల్లో నూటికి 95 మంది నష్టాల్లో కూరుకుపోయి లబోదిబో మంటున్నారు. అలాకాకుండా దీర్ఘకాలిక దృక్పథం మార్కెట్లోకి అడుగుపెడితే కచ్చితంగా మంచి ప్రయోజనాలే దక్కుతాయి.ఇందులో కూడా మూడు రకాల మార్గాలు అనుసరించవచ్చు. 1. స్వల్ప కాలిక పెట్టుబడి2. మధ్య కాలిక పెట్టుబడి 3. దీర్ఘకాలిక పెట్టుబడిపెట్టుబడులు పెట్టడానికి బాండ్లు, డిబెంచర్లు, రుణ పత్రాలు వంటి వివిధ మార్గాలు ఉన్నప్పటికీ మనం కేవలం స్టాక్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే పై మూడింటి గురించి వివరంగా చర్చించుకుందాం.స్వల్ప కాలిక పెట్టుబడిసాధారణంగా మూడు నెలల వ్యవధి నుంచి 12 నెలల వ్యవధితో చేసే పెట్టుబడుల్ని స్వల్ప కాలిక పెట్టుబడులుగా పరిగణించవచ్చు. అంటే మన దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ వెంటనే వాటి అవసరం ఉండకపోవచ్చు. వాటిని మార్కెట్లోకి తరలిస్తే... మన అవసరానికి అనుగుణంగా మంచి ఫండమెంటల్స్ ఉన్న షేర్లను ఎంచుకుని స్వల్ప కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు.ఇలాంటి సందర్భాల్లో మూడు పరిణామాలు చోటు చేసుకోవచ్చు. 1. మన పెట్టుబడి అమాంతం పెరిగిపోయి (మనం ఎంచుకునే షేర్లను బట్టి) మంచి లాభాలు కళ్ళచూడొచ్చు. మనం పెట్టుబడి పెట్టిన కంపెనీలకు సంబంధించి వచ్చే సానుకూల వార్తలు ఇందుకు కారణమవుతాయి. ఉదా: సదరు కంపెనీ రేటింగ్ ను అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు పెంచడం, ప్రభుత్వపరంగా సంబంధిత రంగానికి అనుకూలంగా ప్రకటనలు రావడం, ఆర్ధిక ఫలితాలు అద్భుతంగా ఉండటం.... వంటివి ఇందుకు దోహదం చేస్తాయి.2. మన పెట్టుబడి నష్టాల్లోకి జారిపోవడం. ఒక ఆరు నెలల పాటు మనకు డబ్బులతో పని లేదని వాటిని తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేస్తాం. ఆలోపు వివిధ ప్రతికూల అంశాలు మన పెట్టుబడిని హరించి వేస్తాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ప్రభుత్వాలు పడిపోవడం, ఆర్ధిక అనిశ్చిత పరిణామాలు, సంస్కరణలు పక్కదారి పట్టడం... వంటి అంశాలు మార్కెట్లను పడదోస్తాయి. ఇలాంటి సందర్భాల్లో సదరు షేర్లు కూడా ఎప్పటికప్పుడు పడిపోతూ ఉంటాయి.మీరు పెట్టుకున్న కాల వ్యవధి దగ్గర పడుతూ ఉంటుంది. షేర్లు మాత్రం కోలుకోవు.అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బతుకు జీవుడా... అనుకుంటూ ఆ కాస్త సొమ్ముతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు మన అవసరాలు తీరడానికి అప్పు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఆర్జించడం మాట పక్కన పెట్టి అదనపు భారాన్ని మోయాల్సి ఉంటుందన్న మాట.3. పెట్టిన పెట్టుబడి లో పెద్దగా మార్పులు లేకపోవడం. ఆరు నెలలు గడిచినా మనం కొన్న షేర్లు అనుకున్నట్లుగా పెరగకపోవడమో, లేదంటే స్వల్ప నష్టాల్లో ఉండటమే జరుగుతుంది. దీనివల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు.మధ్య కాలిక పెట్టుబడి ఇది సాధారణంగా ఏడాది వ్యవధి మొదలుకొని 5 ఏళ్ల వరకు కాలవ్యవధి తో చేసే పెట్టుబడులు ఈ విభాగంలోకి వస్తాయి. స్వల్ప కాలిక పెట్టుబడులతో పోలిస్తే ఇవి ఒకింత మెరుగైన ప్రతిఫలాన్నే ఇస్తాయి. వ్యవధి ఎక్కువ ఉంటుంది కాబట్టి... ఒక ఏడాది రెండేళ్లపాటు మార్కెట్లో ఒడుదొడుకులు ఎదురైనా.. ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఆ తర్వాత షేర్లు కోలుకోవడానికి అవకాశం ఉంటుంది.అదే సమయంలో మన దగ్గర సొమ్ములున్నప్పుడల్లా మనం కొన్న షేర్లనో, వేరే షేర్లనో కొనుగోలు చేయడానికి అవకాశం ఉన్నందువల్ల రాబడి పెరగడానికి కూడా కచ్చితంగా వీలుంటుంది. మనమంతా మిడిల్ క్లాస్ మనుషులం అవడం వల్ల మన అవసరాలు ఎక్కువగానే ఉంటాయి. అందువాళ్ళ మధ్య కాలిక పెట్టుబడి మార్గాన్ని ఎంచుకుంటే తక్కువ రిస్క్ తోనే గణనీయ ప్రయోజనాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది.దీర్ఘ కాలిక పెట్టుబడి ఇది అన్ని విధాలా శ్రేయోదాయకం. అదెలాగంటే...1. మార్కెట్లు ఏళ్ల తరబడి పడిపోతూ ఉండవు. పడ్డ మార్కెట్ పెరగాల్సిందే. 2. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా పెట్టుబడి పెట్టుకుంటూ పోతాం. 3. వివిధ కంపెనీల షేర్లు కొనుగోలు చేయడం వల్ల ఒకట్రెండు నష్టాల్లో ఉన్నా... మిగతావి లాభాల్లో ఉండటం వల్ల మన పెట్టుబడి దెబ్బతినదు.4 . ఒకేసారి లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టేయాల్సిన అవసరం ఉండదు. 5. మన షేర్లపై సదరు కంపెనీలు డివిడెండ్లు ఇస్తాయి. ఇదో అదనపు ప్రయోజనం. 6. ఆయా కంపెనీలు షేర్లను విభజించడం, బోనస్ షేర్లు ఇవ్వడం వల్ల మన పోర్ట్ ఫోలియో లో షేర్ల సంఖ్యా పెరుగుతుంది. 7. మన అవసరాలు దీర్ఘకాలానికి ఉంటాయి కాబట్టి... భవిష్యత్లో అవసరమైనప్పుడో, లేదంటే ఆ షేరు బాగా పెరిగిందని భావించినప్పుడో మనం కొన్ని ప్రాఫిట్స్ ను వెనక్కి తీసుకోవచ్చు లేదా వేరే పెట్టుబడుల్లోకి మళ్లించవచ్చు. 8. పిల్లల చదువులు, పెళ్లిళ్లు... ఇత్యాది సందర్భాల్లో అప్పులు చేయాల్సిన దుస్థితి రాకుండా ఉపయోగపడతాయి.సంప్రదాయ డిపాజిట్లు పొదుపులతో పోలిస్తే... స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అనేవి అధిక రాబడి ఇవ్వడానికి ఆస్కారం ఉందన్న విషయం అర్ధమయింది కదూ...అయితే మీరు తీసుకునే నిర్ణయమే... మీ భవిష్యత్ కు దిక్సూచిగా నిలుస్తుంది. మీ అవసరాలు స్వల్ప కాలికమా... మధ్య కాలికమా... దీర్ఘ కాలికమా... అన్నది మీరే నిర్ణయించుకోండి. తదనుగుణమా నిర్ణయాలు తీసుకుంటూ ముందడుగు వేయండి. ఒక్క మాట మాత్రం స్పష్టంగా చెప్పగలను.ఎప్పటికప్పుడు మీ పోర్టు ఫోలియో మీద కన్నేసి.. తగిన లాభాలు రాగానే బయటపడటం అనేదే స్వల్ప, మధ్య కాలాలకు ఉపయుక్తంగా ఉంటుంది. దీర్ఘ కాలిక దృక్పథం తో కొంటారు కాబట్టి... లాంగ్ టర్మ్ పెట్టుబడులు ఎప్పటికీ మంచి ఫలితాలే ఇస్తాయి. అయితే దీర్ఘ కాలానికి కొంటున్నాం కదా అని ఎవరో చెప్పారనో... తక్కువకు దొరుకుతున్నాయనో.. వ్యవధి ఎక్కువ ఉంటుంది కదా.. కచ్చితంగా పెరక్కపోవులే అనో... పనికిమాలిన పెన్నీ స్టాక్స్ జోలికి మాత్రం పోకండి.-బెహరా శ్రీనివాస రావుస్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు
దేశీయ బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ (BSE) సెన్సెక్స్, ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ50 వారం చివరి ట్రేడింగ్ సెషన్ను ప్రతికూలంగా ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ 720.60 పాయింట్లు లేదా 0.90 శాతం క్షీణించి 79,223.11 వద్ద స్థిరపడింది. ఈరోజు ఈ ఇండెక్స్ 80,072.99 నుండి 79,147.32 రేంజ్లో ట్రేడ్ అయింది.ఇక నిఫ్టీ50 183.90 పాయింట్లు లేదా 0.76 శాతం నష్టంతో 24,004.75 వద్ద రెడ్లో స్థిరపడింది. నిఫ్టీ 50 ఈరోజు గరిష్ట స్థాయి 24,196.45 వద్ద, కనిష్ట స్థాయి 23,978.15 వద్ద నమోదైంది.నిఫ్టీ50లోని 50 స్టాక్స్లో 32 రెడ్లో ముగిశాయి. విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, సిప్లా టాప్ లూజర్స్గా నిలిచాయి. మరోవైపు ఓఎన్జీసీ, టాటా మోటార్స్, టైటాన్, నెస్లే ఇండియా, ఎస్బీఐ లైఫ్ లాభాలతో ముగిసిన 18 స్టాక్లలో ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:57 సమయానికి నిఫ్టీ 125 పాయింట్లు నష్టపోయి 24,064కు చేరింది. సెన్సెక్స్ 501 పాయింట్లు దిగజారి 79,454 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 109.22 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75.88 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.56 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.2 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.16 శాతం దిగజారింది.బలహీన డిమాండ్కు భిన్నంగా డిసెంబర్లో అంచనాలకు మించి వాహన విక్రయాలు జరడంతో ఆటో రంగ షేర్లు నిన్నటి మార్కెట్ సెషన్లో దూసుకెళ్లాయి. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలైన సీఎల్ఎస్ఏ, సిటీ డిసెంబర్ క్వార్టర్తో పాటు 2025 ఏడాది మొత్తంగా ఐటీ కంపెనీల ఆదాయాల్లో వృద్ధి బలంగా ఉండొచ్చనే తాజాగా అంచనా వేశాయి. ఫలితంగా ఈ రంగంలోని షేర్లు రాణించాయి. ఈరోజు మార్కెట్ ప్రారంభం నుంచి కొంత ఒడిదొడుకుల్లో ఉంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు: 1000 పాయింట్లు దాటిన సెన్సెక్స్
గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex) ఏకంగా 1,436.30 పాయింట్లు లేదా 1.83 శాతం లాభంతో 79,943.71 వద్ద, నిఫ్టీ (Nifty) 445.75 పాయింట్లు లేదా 1.88 శాతం లాభంతో 24,188.65 వద్ద నిలిచాయి.ఐషర్ మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి ఇండియా, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:55 సమయానికి నిఫ్టీ(Nifty) 109 పాయింట్లు లాభపడి 23,855కు చేరింది. సెన్సెక్స్(Sensex) 373 పాయింట్లు ఎగబాకి 78,873 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.29 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్(Barrel Crude) ధర 74.92 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.03 శాతం నష్టపోయింది. నాస్డాక్(Nasdaq) 0.9 శాతం దిగజారింది.కొత్త సంవత్సరానికి స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో స్వాగతం పలికింది. మెటల్, రియల్టీ(Realty) మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బుధవారం ఇండెక్సులు అరశాతం మేర లాభపడ్డాయి. కొత్త సంవత్సరం రోజున ఆసియా, యూరప్ మార్కెట్లు పనిచేయలేదు. వినియోగ ధోరణులు, సేవల వృద్ధి, ఎగుమతుల్లో తయారీ రంగం వాటా పెరగడం, పెట్టుబడులకు సంబంధించి మూలధన మార్కెట్ల స్థిరత్వం వంటి కొన్ని ముఖ్య అంశాల్లో భారత్ ఇప్పటికీ పటిష్టంగా ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
తొలిరోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బెంచ్మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ (BSE) సెన్సెక్స్, ఎన్ఎస్ఈ (NSE) నిఫ్టీ50 కొత్త సంవత్సరం మొదటి ట్రేడింగ్ సెషన్ను లాభాలతో ముగించాయి. 30 షేర్ల సెన్సెక్స్ బుధవారం 368.40 పాయింట్లు లేదా 0.47 శాతం పెరిగి 78,507.41 వద్ద స్థిరపడింది. ఈ ఇండెక్స్ ఈరోజు 78,756.49 - 77,898.30 రేంజ్లో ట్రేడ్ అయింది.అదేవిధంగా నిఫ్టీ 50 దాని మునుపటి ముగింపుతో పోలిస్తే 98.10 పాయింట్లు లేదా 0.41 శాతం పెరిగి 23,742.90 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 రోజు గరిష్ట స్థాయి 23,822.80 వద్ద కనిపించగా, రోజు కనిష్ట స్థాయి 23,562.80 వద్ద ఉంది.మారుతీ సుజుకీ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ & టూబ్రో, టాటా మోటార్స్ 3.01 శాతం వరకు లాభపడటంతో నిఫ్టీ50లోని 50 స్టాక్స్లో 37 గ్రీన్లో ముగిశాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, టాటా స్టీల్ నష్టాలతో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు 2025 మొదటి ట్రేడింగ్ రోజు బుధవారం ఉదయం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 26 పాయింట్లు నష్టపోయి 23,617కు చేరింది. సెన్సెక్స్(Sensex) 82 పాయింట్లు దిగజారి 78,067 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.48 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్(Crude Oil) బ్యారెల్ ధర 74.64 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.43 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.9 శాతం దిగజారింది.ఈవారం మార్కెట్లు స్తబ్దుగానే సాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లను ఉత్తేజపరిచే సంఘటనలు ఏవీ లేకపోవడం, విదేశీ మదుపర్ల నిరాసక్తత ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరోపక్క రూపాయి(Rupee) బలహీనపడటం, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి త్వరలో వెలువడబోయే త్రైమాసిక ఫలితాలపై అంచనాలు అంతంతమాత్రంగా ఉండటం కూడా సెంటిమెంట్ను ప్రభావితం చేయవచ్చు. అలాగే ఒకటో తేదీన వెలువడే, జీఎస్టీ వసూళ్ల గణాంకాలు, వాహన విక్రయాల వివరాలు మార్కెట్ ను ప్రభావితం చేస్తాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)