tadipatri
-
నటి మాధవీలతపై కేసు నమోదు
-
మాధవీలతపై కేసు.. ‘జేసీ’ ఆదేశాలతోనే..?
సాక్షి,అనంతపురం: సినీ నటి మాధవీలతపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవీలత తనపై కించపరిచే వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెక్షన్ 353 కింద మాధవీలతపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ఆదేశాలతోనే మాధవీలతపై కేసు నమోదు చేశారని తాడిపత్రి లో చర్చ జరుగుతోంది.గతంలో తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను జేసీ ప్రభాకర్రెడ్డిపై మాధవీలత హైదరాబాద్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో పాటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోనూ మాధవీలత జేసీపై కంప్లైంట్ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలకుగాను మాధవీలతకు జేసీ ఒక దశలో క్షమాపణలు కూడా చెప్పారు. అయినా వీరి మధ్య వివాదం కొనసాగుతోంది. -
జేసీ ప్రభాకర్ రెడ్డి అత్యుత్సాహం
-
అప్పేచర్లలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి
-
తాడిపత్రిలో ఇంత దారుణమా..
-
జేసీ కక్ష.. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నేత ఇల్లు కూల్చివేత
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రి వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ సీపీ నేత రమేష్ రెడ్డి ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. అన్ని అనుమతులు ఉన్నా కానీ రమేష్ రెడ్డి ఇంటిని కూల్చేశారు. మునిసిపల్ అధికారుల తీరుపై వైఎస్సార్సీపీ నేత రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని రమేష్ రెడ్డి మండిపడ్డారు.వైఎస్సార్సీపీ కార్యకర్త పొలానికి మళ్లీ నిప్పు మరో ఘటనలో రాప్తాడు మండలంలోని పుల్లలరేవు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఓబులేష్, వసంత్కు చెందిన పొలానికి మళ్లీ నిప్పు పెట్టారు. మండలంలోని గొందిరెడ్డిపల్లి రెవెన్యూ పరిధి (పులల్లరేవు) పరిధిలోని సర్వే నంబర్ 103–2 (88–3)లో 4.90, 103–3 (88–3)లో పెద్ద ఓబులేష్, వసంత్ తమకున్న 7.76 ఎకరాల వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ పొలంలో రెండేళ్ల క్రితం దాదాపుగా 400 అల్ల నేరేడు మొక్కలను నాటారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద ఓబులేష్కు చెందిన మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. ఈ ఏడాది జనవరి 17న 15 చెట్లు, అలాగే జనవరి 21న 40 చెట్లను టీడీపీ నాయకులు నరికి వేశారు. మళ్లీ ఈ నెల 3న గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద ఓబులేష్ తోటకు నిప్పు పెట్టడంతో కొన్ని చెట్లు కాలిపోయాయి.వారం రోజులు కూడా గడవక ముందే మళ్లీ ఈ నెల 10న మరో సారి నిప్పు పెట్టడంతో తోటలోని డ్రిప్ పరికరాలు, మోటర్ సెల్ పూర్తిగా కాలిపోయాయి. 10 రోజులు కూడా గడవక ముందే మూడోసారి పొలానికి నిప్పు పెట్టడంతో దాదాపుగా 4 ఎకరాల్లో పొలం చుట్టూ ఉన్న ముళ్ల కంప కాలిపోయింది. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
VRO బాగోతం బయటపెట్టిన మహిళ
-
తాడిపత్రిలో వీఆర్వో కీచకపర్వం
సాక్షి, అనంతపురం జిల్లా: కులం, మతం, ప్రాంతం చూడకుండా సంక్షేమ పథకాలను ఇంటింటికి అందించిన రామరాజ్యం నాడు. రేషన్ కార్డు కావాలంటే నీ కూతుర్ని నా దగ్గరికి పంపు అని వీఆర్వో అడిగిన రావణ పాలన నేడు. రేషన్ కార్డు అడిగిన పాపానికి పేద వృద్ధురాలికి వచ్చిన బెదిరింపు ఇది. ‘రేషన్కార్డు కావాలంటే నీ కూతురిని నా దగ్గరకు పంపించు’ అన్న ఓ వీఆర్వో కీచకపర్వం ఆలస్యంగా వెలుగుచూసింది. తీవ్ర మనోవేదనకు గురైన ఆ వృద్ధురాలు తన వేదనను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్గా మారింది. దీంతో అధికారులు ఆ కీచక వీఆర్వోపై విచారణ చేపట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం 35వ వార్డుకు చెందిన లక్ష్మీని రెండేళ్ల కిందట భర్త వదిలేయడంతో తల్లి నాగమునెమ్మ దగ్గర ఉంటోంది. రేషన్కార్డు లేనందున కుమార్తెకు ఒంటరి మహిళ పింఛన్ రావడం లేదని.. తన కుమార్తెకు కార్డు మంజూరు చేయాలంటూ నాగమునెమ్మ ఏడాదిగా వీఆర్వో చంద్రశేఖర్ను బతిమాలుతూ వస్తోంది.తాడిపత్రి మునిసిపల్ అధికారులకూ విన్నవించుకుంది. అయినా ఫలితం లేకపోయింది. పదే పదే వీఆర్వోను బతిమాలుతుండటంతో ఇదే అదునుగా భావించిన వీఆర్వో చంద్రశేఖర్ ‘నీ కూతురిని నా దగ్గరకు పంపించు. అప్పుడు రేషన్కార్డు ఇప్పిస్తా’ అని చెప్పడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. వీఆర్వో దుర్మార్గాన్ని వీడియోలో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై అనంతపురం ఆర్డీవో కేశవనాయుడు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు తాడిపత్రి తహసీల్దార్ రజాక్వలి శుక్రవారం నాగమునెమ్మను తన కార్యాలయానికి పిలిచి విచారించి.. నివేదికను ఆర్డీవోకు అందించారు.ఇదీ చదవండి: మీర్పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం -
నువ్వు ఎన్ని అడ్డంకులు పెట్టినా తాడిపత్రి కి వెళ్లి తీరుతా...
-
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
-
తాడిపత్రిలో టెన్షన్.. కేతిరెడ్డి హౌస్ అరెస్ట్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పెద్దారెడ్డికి పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. అనంతరం, తాడిపత్రి నియోజకవర్గంలోకి కేతిరెడ్డి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించారు. తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.తాడిపత్రిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు తాడిపత్రి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సోమవారం ఉదమయే కేతిరెడ్డి ఇంటికి పోలీసులు చేరుకుని ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో పెద్దారెడ్డిని గృహ నిర్బంధంలోనే ఉంచారు. అనంతరం, కేతిరెడ్డికి 41ఏ నోటీసులు జారీ చేశారు.ఇదిలా ఉండగా.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ వర్గీయులు రెచ్చిపోతున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు ఏడు నెలలుగా అడ్డంకులు సృష్టిస్తూన ఉన్నారు. జేసీ కనుసన్నల్లోనే పోలీసులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో జేసీ, పోలీసుల తీరుపై కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం తాడిపత్రిలోకి ఎందుకు వెళ్లనివ్వడం లేదంటూ ప్రశ్నించారు. దీంతో, తిమ్మంపల్లి గ్రామంలో పోలీసులు భారీ సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
తాడిపత్రిలో దారుణం.. భార్యను నరికి చంపిన భర్త
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త వెంకటేశ్వరరెడ్డి వేట కొడవలితో నరికి చంపాడు. భార్య పుష్పావతి అక్కడికక్కడే మృతి చెందింది. తాడిపత్రి పట్టణంలోని హేమాద్రి లాడ్జిలో ఘటన జరిగింది. దంపతుల సమస్యలను పరిష్కరించేందుకు ఇరు వర్గాల పెద్దలు లాడ్జిలో సమావేశమయ్యారు. ఒంటరిగా మాట్లాడాలని చెప్పిన భర్త.. భార్యను హత్య చేశాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.అనుమానాస్పదంగా మహిళ మృతికోనసీమ జిల్లా: రామచంద్రపురం మండలం తోటపేట గ్రామంలో ఈ నెల 12న దామిశెట్టి మహాలక్ష్మి (54) అనుమానాస్పదంగా మృతి చెందింది. సహజ మరణంగా భావించిన బంధువులు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆమె ఒంటిపై బంగారం లేదని, బంగారం కోసమే హత్య చేసి ఉంటారని ద్రాక్షారామ పోలీసులకు బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో పాతిపెట్టిన మహాలక్ష్మి మృతదేహాన్ని బయటకు తీశారు. స్మశానవాటిక వద్దనే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనుమానాస్పద మృతి కింద కేసుగా నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: జంట హత్యల కేసులో వీడిన మిస్టరీ -
‘‘రేయ్.. నీ కథ చూస్తా!’’ జేసీ బెదిరింపులు వెలుగులోకి
అనంతపురం, సాక్షి: కూటమి సర్కార్ అండతో తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) రెచ్చిపోతూనే ఉన్నారు. అధికారులు, రాజకీయ నేతలు ఎవరనేది చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తూ నిత్యం వార్తల్లోక్కి ఎక్కుతున్నారు. తాజాగా మరోసారి ఆయన వివాదంలో నిలిచారు. ఓ దళిత నేతను ఫోన్లో బెదిరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పైగా ఇది ఇక్కడితోనే ఆగలేదు. దళిత సంఘం నేత రాంపుల్లయ్య మున్సిపల్ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఈ విషయంపై ఆయన్ని ఫోన్లో బెదిరించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పిలిచినా మీటింగ్కు రాకపోవం ఏంటని జేసీ ప్రశ్నించగా.. ఆ ఆహ్వానం గౌరవంగా ఉండాలని రాంపుల్లయ్య అన్నారు. ఆ సమాధానం తట్టుకోలేని జేసీ ‘‘నేను పిలిస్తే రావా.. రేయ్.. నీ కథ చూస్తా’’ అంటూ చిందులు తొక్కాతూ ఫోన్ పెట్టారు. అయితే.. ఈ బెదిరింపుల వ్యవహారాన్ని తాడిపత్రి(Tadipatri) సీఐ సాయి ప్రసాద్ దృష్టికి ఫోన్ ద్వారా రాంపుల్లయ్య తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. సీఐ కూడా జేసీకి మద్దతుగా రాం పులయ్యనే దూర్భాషలాడారు. పరస్పర దూషణలతో కూడిన ఆ ఆడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: ఏపీ రాజకీయాలకు సరిగ్గా సరిపోయే సామెత! -
తాడిపత్రిలో సీఐ, దళిత నేత మధ్య చిచ్చుపెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి
-
గాంధీనగర్ లో కాశీ మనోజ్ ను కిడ్నాప్ చేసిన దుండగులు
-
కూటమి సర్కార్ కక్ష సాధింపు.. మున్సిపల్ అధికారుల ఓవరాక్షన్!
సాక్షి, అనంతపురం: ఏపీలో కూటమి పాలనలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలను కూటమి నేతలు, అధికారులు టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా తాడిపత్రిలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు.వివరాల ప్రకారం.. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా వైఎస్సార్సీపీ నేత రమేష్ రెడ్డి ఇంటి నిర్మాణాన్ని మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. అన్ని అనుమతులు ఉన్నా ఎందుకు అడ్డుకుంటున్నారని రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు వేధిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదేశాలతోనే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
కూటమి నేతల కమీషన్ దందా.. జేసీ ప్రభాకర్పై ఫిర్యాదు!
సాక్షి, అనంతపురం: కూటమి సర్కార్ పాలనలో లిక్కర్ మాఫియా హవా కొనసాగుతోంది. పలుచోట్ల కూటమి నేతలకు మద్యం షాపులు దక్కకపోవడంతో కమీషన్ల కోసం టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. ఈ కారణంగా తాడిపత్రిలో నేటికీ నాలుగు మద్యం షాపులు ప్రారంభం కాలేదు.వివరాల ప్రకారం.. తాడిపత్రి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మద్యం వ్యాపారులు ఫిర్యాదు చేశారు. అయితే, తాడిపత్రిలో నాలుగు మద్యం షాపులను విజయవాడకు చెందిన వ్యాపారులు గోపీనాథ్, గురునాథం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో తన అనుమతి లేనిదే మద్యం షాపులు ప్రారంభించవద్దని జేసీ ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. వ్యాపారులను బెదిరించే ప్రయత్నం చేశారు.దీంతో, నాలుగు మద్యం షాపులు దక్కించుకున్నప్పటికీ తాడిపత్రిలో మాత్రం అవి ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఈ క్రమంలో విజయవాడ మద్యం వ్యాపారులు గోపీనాథ్, గురునాథం.. తమకు భద్రత కల్పించాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, తాడిపత్రిలో మద్యం షాపులు తమ వారికి దక్కకపోవడంతో టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. తమకు 15 శాతం కమీషన్ ఇచ్చాకే మద్యం షాపులు నిర్వహించాలని వార్నింగ్ ఇచ్చారు. -
తాడిపత్రిలో టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, అనంతపురం జిల్లా: వైఎస్సార్సీపీ నేత జావేద్ ఇంటి వద్ద ఎమ్మెల్యే జేసీ అస్మిత్రెడ్డి అనుచరుడు వీరంగం సృష్టించాడు. డబ్బులు బాకీ ఉన్నారంటూ వైఎస్సార్సీపీ నేత ఇంటి వద్ద అనుచరులతో దౌర్జన్యానికి దిగాడు. కుటుంబ సభ్యులను నిర్బంధించారని పోలీసులకు వైఎస్సార్సీపీ నేత జావేద్ ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్రెడ్డి పేరుతో బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత గోరాకు ఎలాంటి బాకీ లేనని జావెద్ స్పష్టం చేశారు.హోంగార్డుపై టీడీపీ నేత దౌర్జన్యం శింగనమల మండలంలోని ఉల్లికల్లు గ్రామానికి చెందిన టీడీపీ నేత రంగారెడ్డి తనపై దాడికి ప్రయత్నించాడంటూ శింగనమల పీఎస్లో పనిచేస్తున్న హోంగార్డు నాగేంద్ర మంగళవారం సీఐ కౌలుట్లయ్యకు ఫిర్యాదు చేశారు. వివరాలు... సెప్టెంబరులో ఒక రోజు రాత్రి నాయనపల్లి క్రాస్ నుంచి మరువకొమ్మ వరకూ హెడ్ కానిస్టేబుల్ గిరి మహేష్తో కలసి, హోంగార్డు నాగేంద్ర గస్తీ విధులు నిర్వర్తించాడు.ఆ సమయంలో టీడీపీ నేత ఉల్లికల్లు రంగారెడ్డికి చెందిన టిప్పరులో అక్రమంగా ఇసుక తరలిస్తుండడం గుర్తించి పోతురాజుకాలువ సమీపంలో అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. దీంతో అప్పటి నుంచి హోంగార్డు నాగేంద్ర ఎక్కడ కనిపించిన రంగారెడ్డి కోపంతో దుర్భాషలాడేవాడు. ఈ క్రమంలో మంగళవారం నాయనవారిపల్లిలో జరిగిన శుభకార్యానికి ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, ఎంఎస్ రాజు హాజరుకానుండడంతో ఎస్ఐ, ఎఎస్ఐ, హెడ్ కానిస్టేబులు, సిబ్బందితో ఎస్కార్ట్ విధుల్లో నాగేంద్ర కూడా పాల్గొన్నాడు. అక్కడ సిబ్బంది భోజనం చేస్తున్న సమయంలో నాగేంద్రపై రంగారెడ్డి దాడికి ప్రయతి్నంచాడు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది అడ్డుకోవడంతో నీ కథ చూస్తా అంటూ బెదిరిస్తూ వెళ్లిపోయాడు. టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐకి బాధితుడు ఫిర్యాదు చేశాడు. -
మాటలకందని విషాదం.. కొన్ని గంటల్లో నిశ్చితార్థం.. అంతలోనే..
తాడిపత్రి రూరల్: నిశ్చితార్థం కోసం గోరింటాకు పెట్టించుకుని సోదరునితో కలిసి ద్విచక్రవాహనంపై వస్తున్న యువతిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. తాడిపత్రి అప్గ్రేడ్ రూరల్ సీఐ శివగంగాధర్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెంకటరెడ్డిపల్లికి చెందిన వీణాదేవి(24)కి ఆదివారం వివాహ నిశితార్థం జరగాల్సి ఉంది.ఇందు కోసం శనివారం సోదరుడు నారాయణరెడ్డితో కలిసి బైక్పై తాడిపత్రికి వెళ్లి చేతికి గోరింటాకు పెట్టించుకుంది. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా వీరి బైక్ను బుగ్గ నుంచి తాడిపత్రి వైపు వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో వీణాదేవి అక్కడికక్కడే చనిపోయింది.తీవ్రంగా గాయపడిన తమ్ముడు నారాయణరెడ్డికి తాడిపత్రిలో ప్రథమ చికిత్స చేసి, అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరి కొన్ని గంటల్లో నిశితార్థం జరుగుతుందన్న అనందంలో ఉన్న వీణాదేవి ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను, గ్రామస్తులను కలచివేసింది. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్పై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
తాడిపత్రిలో వెలుగులోకి జేసీ ప్రభాకర్ రెడ్డి మద్యం దందా
-
ఎస్పీని కలిసిన కేతిరెడ్డి
-
రావణ కాష్టం.. రాక్షసానందం!
‘మీరేంటో.. మీ విధానాలేంటో..’ అంటూ ఓ సినిమాలో రావు రమేష్ చెప్పిన డైలాగ్ వారికి బాగా సరిపోతుంది. నిత్యం వివాదాలకు వారే ఆజ్యం పోస్తూ చలికాచుకోవడం రివాజుగా మారింది. గత ఐదేళ్లూ ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించిన తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు ప్రస్తుతం జేసీ ఆగడాల కారణంగా బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలు ఒకరకం.. తాడిపత్రి ఒక్కటీ మరో రకంగా మారింది. ‘మేమే రాజులం, మేమే మంత్రులం.. మేము రాసిందే రాజ్యాంగం’ అనే రీతిలో జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్రెడ్డి వ్యవహరిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపైనా, ప్రత్యర్థి పారీ్టలోని నాయకులపైనా దాడులు చేయడమే కాకుండా తిరిగి వారిపైనే కేసులు పెట్టిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఇసుక అక్రమాలపై కావాలనే రాద్ధాంతం.. అధికారం చేతిలో ఉందికదా అని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ‘25 మంది ఇసుక తోలేది మా వాళ్లే.. మీరందరూ ఇసుక తోలడం మానుకోండి. లేదా నాకు దూరమవుతారు’ అంటూ ఇటీవల ప్రభాకర్రెడ్డి వీడియో సందేశాలు విడుదల చేశారు. అయితే, జేసీ వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే అందులో మరో కోణం అవగతమవుతుంది. తన వర్గం నాయకులు సాగిస్తున్న ఇసుక దందాను నిలిపివేయించి తానే సొంత వాహనాలతో ఇసుక అక్రమ రవాణా సాగించాలన్న మర్మం బయటపడుతుంది. జిల్లాల వారీగా చంద్రబాబు ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్టులు తయారు చేయిస్తోందన్న సమాచారం అందడంతోనే డ్రామాలు ఆడుతున్నారన్న విమర్శలు మరోవైపు వినిపిస్తున్నాయి. పోలీసుల్లో అసంతృప్తి.. తాడిపత్రి మండలంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను ఇటీవల పోలీసులు పట్టుకోగా.. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వెంటనే సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ చేసి కేసులు కట్టాలంటూ దురుసుగా వ్యవహరించారు. ఎప్పుడు కేసులు కట్టాలో తనకు తెలుసునని సీఐ చెప్పగా.. ఆయనను ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఈ క్రమంలో సీఐను వెనకేసుకు రావాల్సిన పోలీసు ఉన్నతాధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించి, సీఐతో ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పించారు. నిజాయితీగా పనిచేసే ఓ సీఐ పట్ల ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరుపై పోలీసు వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎస్పీ స్థాయి వ్యక్తి క్షమాపణలు చెప్పించడమేంటని కిందిస్థాయి పోలీసు అధికారులు వాపోతున్నారు. ఇదే క్రమంలో.. తాను ఏ తప్పూ చేయలేదని, శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే క్షమాపణలు చెప్పానని సీఐ పేర్కొనడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే రాకుండా అడ్డంకులు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగుపెట్టకుండా దాడులు చేయిస్తున్నారంటే జేసీ ప్రభాకర్రెడ్డి గూండాగిరీ ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇటీవల ఎన్నికల పోలింగ్ రోజు రాళ్లు రువ్వుకున్న ఘటనలో ప్రభాకర్రెడ్డి, పెద్దారెడ్డిలు ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇద్దరికీ బెయిలొచ్చింది. కానీ పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వకుండా జేసీ ప్రభాకర్రెడ్డి అడ్డుకుంటున్నారు. ఇటీవల పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లగా తన అనుచరులతో దాడులు చేయించారు. కందిగోపుల మురళి అనే వైఎస్సార్ సీపీ నాయకుడి ఇంటిని ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా జిల్లా పోలీసులు చేష్టలుడిగి చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది. పనిచేయడానికి అధికారులే రావడం లేదు.. జేసీ కుటుంబం దెబ్బకు నియోజకవర్గంలో పనిచేసేందుకు అధికారులే రావడం లేదంటే అతిశయోక్తి కాదు. తాడిపత్రి తహసీల్దార్గా వెళ్లిన ఈశ్వరమ్మ కొన్ని రోజులకే తానక్కడ పనిచేయలేనంటూ తిరిగి వచ్చేశారు. తాడిపత్రి టౌన్కు ఎస్ఐ ఉన్నా అటాచ్డ్ కింద పెదపప్పూరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రూరల్ పోలీసుస్టేషన్లో ఎస్ఐ లేరు. తమకు ఎప్పుడు బదిలీ వస్తే వెళ్లిపోదామా అన్న ఆలోచనలో రవాణా శాఖ సిబ్బంది ఉన్నారు. మైనింగ్, రెవెన్యూ, ఆరోగ్య.. ఇలా ఏ శాఖ అధికారులైనా తాడిపత్రిలో పనిచేసేందుకు జంకుతున్నారు. పోలీసులన్నా, అధికారులన్నా తన కింద గుమస్తాలే అన్న రీతిలో జేసీ వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు. -
జేసీ అస్మిత్తో నేను దురుసుగా ప్రవర్తించలేదు: సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి
సాక్షి, అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి క్షమాపణల విషయంపై అనంతపురం జిల్లా తాడిపత్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ స్పందించారు. మంగళవారం తాడిపత్రిలో జరిగిన ఘటనలో తన తప్పేమీ లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్నే తాను జిల్లా ఎస్పీకి కూడా వ్యక్తిగతంగా కలిసి వివరించానని సి.ఐ. క్ష్మీకాంత్ రెడ్డి బుధవారం తెలిపారు. ఎస్పీ జగదీష్ను కలిసిన తరువాత సి.ఐ. విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం నాటి ఘటన వివరాలను తెలిపారు. ‘తాడిపత్రి ఘటనలో నా తప్పు ఏమీ లేదు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్తో నేను దురుసుగా ప్రవర్తించలేదు. ఎస్సీ, ఎస్టీ కేసు నా పరిధిలోని అంశం కాదు. డీఎస్పీ విచారణ చేస్తారని ఆయనతో చెప్పాను. నేను తాడిపత్రిలో 14 నెలల నుంచి పనిచేస్తున్నాను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నాపై ఎలాంటి చర్యలు తీసుకున్నా నాకు ఓకే’ అని కామెంట్స్ చేశారు. తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీకి ఇదేం రాక్షసానందం? సీఐ లక్ష్మీకాంత రెడ్డితో క్షమాపణలు చెప్పించుకున్న @JaiTDP ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అధికారమదంతో పోలీసుల మనోభావాల్ని దెబ్బతీస్తూ అందరి ముందు సీఐ నుంచి క్షమాపణలు చెప్పించుకున్న జేసీ అస్మిత్ రెడ్డి pic.twitter.com/UNSgk2TEMt— YSR Congress Party (@YSRCParty) August 27, 2024 -
జేసీ అరాచకాలు సహించం: వైఎస్సార్సీపీ వార్నింగ్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ దాడులపై ఎస్పీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. జేసీ ప్రభాకర్రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేతలు వినతి పత్రం అందజేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఆంక్షలు తొలగించాలని మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, శంకర్ నారాయణ, మాజీ ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.కూటమి అధికారంలోకి వచ్చాక దాడులకు తెగబడుతోందని వైఎస్సార్సీపీ మండిపడింది. ‘‘మా పాలనలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాం. చంద్రబాబు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేయడం హేయమైన చర్య. దాడులను ఆపడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఆస్తులను ధ్వంసం చేస్తుంటే రక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. దాడులు ఇలాగే కొనసాగితే సహించేది లేదు’’ అని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు.ప్రతిపక్షం ఉండకూడదన్నదే జేసీ కుట్రలు: అనంత వెంకటరామిరెడ్డితాడిపత్రి లో జేసీ హింసా రాజకీయాలు ఖండిస్తున్నాం. టీడీపీ దౌర్జన్యాలు, దాడులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోలేదు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గానికి వెళ్తే తప్పేంటి?. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎస్పీ అనుమతితో తాడిపత్రి వెళ్లినా దాడులు చేశారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు. హామీలు అమలు చేయకుండా టీడీపీ నేతలతో దాడులు చేయిస్తున్నారు. టీడీపీ గూండాగిరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాంపోలీసులు బాధ్యతగా వ్యవహరించాలి: మాజీ ఎంపీ తలారి రంగయ్యశాంతి భద్రతలు పరిరక్షించడం లో చంద్రబాబు విఫలమయ్యారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కక్షసాధింపు రాజకీయాలు లేవు. పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలోకి అనుమతించాలి.జేసీ రౌడీయిజాన్ని పోలీసులు అడ్డుకోలేరా?: మాజీ మంత్రి శంకర్ నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటవిక పాలన ప్రోత్సహిస్తున్నారు. హామీలు అమలు చేయకుండా హింసను ప్రేరేపిస్తున్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజాన్ని పోలీసులు అడ్డుకోలేరా?. పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదు. -
చంద్రబాబూ.. జేసీ కుటుంబాన్ని అదుపులో పెట్టు: వైఎస్సార్సీపీ నేత మురళి
సాక్షి, తాడేపల్లి: జేసీ కుటుంబం అరాచకాలపై తాడిపత్రి వైఎస్సార్సీపీ నేత కందిగోపుల మురళి మండిపడ్డారు. మూడు రోజుల క్రితం జేసీ వర్గీయులు తమ ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారని ధ్వజమ్తెతారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాయలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వీడియో తీస్తుంటే మావాళ్ల ఫోన్లను లాక్కున్నారంటూ.. దాడి ఘటనను ఆయన వివరించారు.‘‘మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాల్ చేస్తే ఆయన ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాను. కారులో వెళ్తుంటే నాపై దాడి చేసేందుకు జేసీ మనుషులు వచ్చారు. నేను భయపడి వెనక్కి వచ్చేశాను. కాసేపటికే వారంతా మా ఇంటి మీదకు వచ్చారు. వందల మంది వచ్చి దాడులు చేశారు. ఇనుప తలుపులను సైతం పగులకొట్టి లోపలకు వచ్చారు. మారణాయుధాలు చేతపట్టుకుని వచ్చి దాడి చేశారు. తలుపులు, కిటికీలు ధ్వంసం చేశారు. ఫోన్లు చేసిన పోలీసులు రాలేదు. పదేపదే ఫోన్లు చేస్తే 45 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చారు’’ అని మురళి చెప్పారు.‘‘నాకు గన్ లైసెన్స్ ఉన్నా ఫైరింగ్ చేయలేదు. గతంలో కూడా ఒకసారి మా ఇంటిపై దాడి చేసి లూఠీ చేశారు. బంగారం దోచుకుపోయారు. ఇరవై ఏళ్ల తర్వాత జేసీ కుటుంబాన్ని ఓడించాం. మళ్లీ ఓడిస్తాం. ఏం ఉన్నా రాజకీయంగా పోరాడతాం. జేసీ కుటుంబం ఇలా ఇళ్లపై దాడులకు దిగటం మంచిది కాదు. రాయలసీమలో ఐదేళ్లుగా శాంతిభద్రతలు బాగున్నాయి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.’’ అని మురళి పేర్కొన్నారు.15 ఏళ్లుగా నాకు గన్ లైసెన్స్ ఉంది. గొడవ అంతా అయిపోయిన తర్వాతే గన్ తీసుకుని బయటకు వచ్చాను. అయితే నేనే టీడీపీ వారిపై దాడి చేసినట్లుగా కేసులు పెట్టారు. చిన్నపిల్లలు, ఆడవారిపై జేసీ కుటుంబం దాడులు చేయడమేంటి?. జేసీ ప్రభాకరరెడ్డి చేసే రాజకీయాలు ఇవేనా?. చంద్రబాబూ.. జేసీ కుటుంబాన్ని అదుపులో పెట్టండి. ఒక విలేకరిని నేను బెదిరించినట్టుగా అక్రమ కేసులు పెట్టారు. తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధింపులకు దిగొద్దు’’ అని మురళి అన్నారు. -
తాడిపత్రిలో టీడీపీ నేతల అరాచకం బట్టబయలు
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో టీడీపీ నేతల అరాచకం బట్టబయలైంది. వైఎస్సార్సీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై టీడీపీ నేతల దాడి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. మురళి ఇంటిపై దాడి, వాహనాల విధ్వంసాన్ని స్థానికులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. జేసీ వర్గీయుల బీభత్సం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కాగా, ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు మూడు నెలలకు 20వ తేదీన (మంగళవారం) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లారు. వ్యక్తిగత పని ముగించుకుని అరగంటలో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారాయన.ఆయన అలా వెళ్లిన వెంటనే.. జేసీ తన వర్గీయుల్ని రెచ్చగొట్టారు. దీంతో.. టీడీపీ గుండాలు వైఎస్సార్ సీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి చేశారు. మురళి ఇంట ఫర్నీచర్ను ధ్వంసం చేయడంతో పాటు ఇంటికి నిప్పు పెట్టారు. అదృష్టవశాత్తూ.. జేసీ వర్గీయుల దాడి నుంచి తృటిలో మురళి తప్పించుకున్నారు. -
అధికార జులుం.. తాడిపత్రిలో కొనసాగుతున్న ఉద్రిక్తత
అనంతపురం, సాక్షి: అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్రెడ్డి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతుండడంతో.. నియోజకవర్గంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా.. కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్యటన అనంతరం చెలరేగిన హింస నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారక్కడ. ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు మూడు నెలలకు నిన్న(మంగళవారం) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లారు. వ్యక్తిగత పని ముగించుకుని అరగంటలో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిపోయారాయన. ఆయన అలా వెళ్లిన వెంటనే.. జేసీ తన వర్గీయుల్ని రెచ్చగొట్టారు. దీంతో.. టీడీపీ గుండాలు వైఎస్సార్ సీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై దాడి చేశారు. మురళి ఇంట ఫర్నీచర్ను ధ్వంసం చేయడంతో పాటు ఇంటికి నిప్పు పెట్టారు. అదృష్టవశాత్తూ.. జేసీ వర్గీయుల దాడి నుంచి తృటిలో మురళి తప్పించుకున్నారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో తాడిపత్రి అంతటా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు.. జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జాతీయ మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలతో పాటు రాష్ట్ర డీజీపీ, కేంద్ర హోం శాఖలకు సైతం ఫిర్యాదులు పంపారు. ఈ సందర్భంగా జేసీపై కే. పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు గుప్పించారు. ‘‘నా హత్యకు జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్ర పన్నారు, నన్ను చంపి తాడిపత్రి లో రాజకీయ ప్రత్యర్థి లేకుండా చేయాలని జేసీ భావిస్తున్నారు. 2006లో మా అన్న కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని జేసీ ప్రభాకర్ రెడ్డి హత్య చేయించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలపై ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడుతా. త్వరలో తాడిపత్రి కి వెళ్లి వైఎస్సార్ సీపీ శ్రేణులకు అండగా ఉంటా అని అన్నారాయన. వంద మంది టీడీపీ గుండాలొచ్చారుదాడి ఘటనపై తాడిపత్రి వైఎస్సార్ సీపీ నేత కందిగోపుల మురళి సాక్షితో మాట్లాడారు. ‘‘జేసీ ప్రభాకర్ రెడ్డి నన్ను చంపేందుకు స్కెచ్ వేశారు. నా ఇంటిపై వంద మంది టీడీపీ గూండాలు దాడి చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేసి, నా ఇంటికి నిప్పు పెట్టారు. తలుపులు పగులగొట్టి నన్ను చంపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. నాకు లైసెన్స్ తుపాకీ ఉంది.. అయినప్పటికీ కాల్పులు జరపలేదు. ప్రాణ రక్షణ కోసమే తుపాకీ చేతిలో పట్టుకున్నాను. టీడీపీ అధికారంలోకి వచ్చాక నాకు గన్ మెన్ తొలగించారు అని అన్నారాయన. మురళి భార్య రమా మాట్లాడుతూ.. ఇలా దాడి జరగడం రెండోసారి అని చెప్పారామె.‘‘టీడీపీ గూండాలు మా ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. గంటసేపు బెడ్ రూం లో దాక్కుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాక్కున్నాం. మా ఇంటిపై దాడి టీడీపీ నేతలు దాడి చేస్తే... నా భర్త కందిగోపుల మురళి పై అక్రమ కేసులా?. ఇదెక్కడి న్యాయం?’’:::మురళి భార్య రమాదేవి -
చట్టం.. జేసీ చుట్టం!
తాడిపత్రిటౌన్: చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అయితే తాడిపత్రిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. చట్టం.. జేసీకి చుట్టం అన్న రీతిలో వ్యవహరిస్తోంది. కళ్లెదుటే నిందితులు కనిపిస్తున్నా పోలీసులు అరెస్టు చేయకుండా వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. అసలు విషయానికి వస్తే... సార్వత్రిక ఎన్నికల అనంతరం తాడిపత్రిలో రెండు రోజుల పాటు ఇరువర్గాల గొడవలు, అల్లర్ల ఘటనలకు సంబంధించి పోలీసులు ఏడు కేసుల్లో దాదాపు 520 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో 163 మందిని (టీడీపీకి చెందిన వారు 81 మంది, వైఎస్సార్సీపీకి చెందిన వారు 82 మంది) అరెస్టు చేశారు. ఆ సమయంలో మిగిలిన నిందితుల కోసం పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు జల్లెడ పట్టడంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు గ్రామాలు వదిలి బయటప్రాంతాల్లో తలదాచుకున్నారు. గ్రామాలకు గ్రామాలు ఖాళీ అయి బిక్కుబిక్కు మంటూ గడిపాయి. పట్టణంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల నాయకుల ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి పట్టణ వాసులు సైతం ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వీలు లేకుండా రహదారులనే దిగ్బంధించిన సంఘటనను ఎవ్వరూ మరచిపోలేరు.పోలీసుల తీరు వివాదాస్పదంఅల్లర్లు, గొడవల కేసుల్లో నిందితులగా ఉండి కనిపించకుండా పోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొంతమంది ఎన్నికల ఫలితాల అనంతరం కళ్లెదుటే తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తమ మాట వినని పోలీసులను బదిలీలు చేయిస్తారని, వీఆర్కు పంపుతారేమోనని పోలీసులే టీడీపీ నాయకులను చూసి జంకుతున్నారు. నిందితులను చూసి కూడా చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇదే విషయమై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియా సాక్షిగా చెబుతున్నా పోలీసులు ఏమాత్రమూ స్పందించడం లేదు. గత బుధవారం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి అనంతపురం వన్టౌన్ పోలీస్స్టేషన్ ఎదుట తలపెట్టిన ధర్నాకు అల్లర్ల కేసుల్లో ఉన్న నిందితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారన్న విషయం తాడిపత్రిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. -
తాడిపత్రిలో హై టెన్షన్
సాక్షి, అనంతపురం: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై చంద్రబాబు సర్కార్ కుట్రలకు తెరలేపుతోంది. అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేస్తోంది. శనివారం ఉదయం తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బెయిల్ షూరిటీలు సమర్పించేందుకు తాడిపత్రికి కేతిరెడ్ఢి పెద్దారెడ్డి వెళ్లారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అంతుచూస్తానంటూ జేసీ ప్రభాకర్రెడ్డి బెదిరించిన సంగతి తెలిసిందే. నేడు ఉదయం నేరుగా తాడిపత్రి పీఎస్కు వెళ్లిన పెద్దారెడ్డి.. తాడిపత్రి పోలీసులతో మాట్లాడారు. బెయిల్ మంజూరై ఐదు రోజులు గడిచినా షూరిటీలు ఎందుకు తీసుకోలేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించటం సరికాదని మండిపడ్డారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఐదు రోజులైనా పోలీసులు ఎందుకు షూరిటీలు స్వీకరించలేదని ప్రశ్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, మరో 10 మందిపై ఆంక్షలు ఉన్నా తాడిపత్రిలో విచ్చలవిడిగా సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీరు కాదని పెద్దారెడ్డి ధ్వజమెత్తారు.‘‘నన్ను, నా కొడుకులను జిల్లా బహిష్కరణ చేయటానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరు?. తాడిపత్రి ప్రజలకు అండగా ఉంటా. నా ఊపిరి ఉన్నంతవరకూ తాడిపత్రిలోనే ఉంటా. జేసీ దౌర్జన్యాలను ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొంటాను’’ అని కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై టీడీపీ కక్ష సాధింపు
సాక్షి, అనంతపురం: రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై టీడీపీ కక్ష సాధింపు చర్యలకు దిగింది. మునిసిపల్ అధికారులు.. పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేశారు. నోటీసులు ఇవ్వకుండానే కొలతలు వేయటం వైఎస్సార్ సీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ఆదేశాలతో మునిసిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్ సీపీ శ్రేణులు మండిపడుతున్నారు.కాగా, తిరుపతి నగరంలో నాలుగంతస్తుల భవనాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా ఒక టీడీపీ నేత దౌర్జన్యానికి దిగారు. తన స్థలాన్ని కాపాడుకునేందుకు వేరొకరి భవనాన్ని కూల్చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు భవన యజమానిపై దాడికి దిగారు. ఈ వ్యవహారం నగరంలో హాట్టాపిక్గా మారింది.తిరుపతిలో తిరుమల బైపాస్ మున్సిపల్ పార్క్ ఎదురుగా ఉన్న విరజా మార్గంలోని టీడీపీ నేత అన్నా రామచంద్రయ్య స్థలంలో మాస్టర్ ప్లాన్ రోడ్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. అతడి ఇద్దరు కుమార్తెలు కార్పొరేటర్లుగా ఉన్నారు. దీంతో ఆయన అధికారబలంతో తన స్థలాన్ని కాపాడుకునేందుకు వేరొకరి ఇంటి (నాలుగు అంతస్తుల భవనం) పైకి ఆ రోడ్డుని మళ్లించారు. నూతనంగా నిర్మించిన నాలుగంతస్తుల భవనంపై తన మనుషులతో మంగళవారం 15 అడుగుల పబ్లిక్ రోడ్డు అని రాయించారు.ఈ విషయమై భవన యజమాని మాస్టర్ ప్లాన్ మ్యాప్ని, అందుకు సంబంధించిన ఆధారాలను చూపించారు. ఈ విషయాన్ని స్పష్టం చేయాల్సిన టౌన్ప్లానింగ్ అధికారులు.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగి నోరెత్తడంలేదు. బాధితుడు అధికారులను ప్రాధేయపడుతున్నా పట్టించుకోలేదు. ఇదే సమయంలో టీడీపీ నేత అన్నా రామచంద్రయ్య తన మనుషులతో భవనం వద్ద పనులు చేసుకుంటున్న యజమానిపై దాడి చేశారు. ఈ దాడి సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోలు బయటకు వచ్చాయి. -
తాడిపత్రిలో సిట్.. అల్లర్లపై కొనసాగుతున్న దర్యాప్తు
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం తాడిపత్రి అల్లర్ల ఘటనలపై సిట్ బృందం దర్యాప్తు చేపట్టింది. కేసుల వివరాలు, నిందితుల గుర్తింపు లాంటి అంశాలపై సిట్ ఆరా తీస్తోంది. మరోవైపు.. అరెస్టులు కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయిలో విచారణ చేసిన తర్వాతే నివేదికను సిద్ధం చేయాలని సిట్ భావిస్తోంది.పల్నాడు జిల్లాలో పోలింగ్ డే ఘటనల్లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని పోలీసులు గుర్తిస్తున్నారు. నిన్న(గురువారం) పల్నాడులో 60 మందికిపైగా అరెస్టులు జరిగాయి. 33 మంది పెట్రోల్ బాంబులతో దాడులకు తెగబడినట్లు నిర్ధారణ అయ్యింది. నిందితుల్ని నరసరావుపేట కోర్టులో హాజరుపరిచి.. నెల్లూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.పల్నాడుపై సిట్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. పల్నాడు జిల్లా పోలింగ్ నాటి హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు.. ఈవీఎం ధ్వంసం ఘటనపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోనే విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతోంది.ఈవీఎం ధ్వంసం వెనుక కారణాలపై సిట్ ఆరా తీస్తోంది. పిన్నెల్లి వీడియోతో సంబంధం లేదని ఈసీ ప్రకటించగా, వీడియో బయటకు ఎలా వచ్చిందనేదానిపై సిట్ విచారణ చేపట్టనుంది. కుట్ర కోణాలు ఉన్నాయా? అనే అంశంపై సిట్ పరిశీలించనుంది. మాచర్ల, పల్నాడు ఈవీఎం ఘటనలపై సిట్ సమగ్ర నివేదిక సిద్ధం చేయనుంది. -
ఎస్పీ కి వైఎస్ఆర్సీపీ నేతల విజ్ఞప్తి
-
కడుపు మంటతోనే టీడీపీ దాడులు
-
చివరి అంకానికి సిట్ దర్యాప్తు
-
తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం
-
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తర్వాత జరిగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిన తీరు చూస్తే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది. ఢిల్లీలో కూర్చున్న ఈసీ పెద్దలు తమ ఇష్టానుసారం తీసుకున్న నిర్ణయాల ఫలితమే రెండు, మూడు రోజుల పాటు జరిగిన హింస అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలులోకి వచ్చిన తర్వాత పోలీసు, పరిపాలన వ్యవస్థను తన చేతిలోకి తీసుకున్న ఎన్నికల సంఘం వారు స్వతంత్రంగా కాకుండా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు కోరిన రీతిలో పక్షపాతంగా వ్యవహరించారు. కూటమి కోరిన అధికారులను కోరిన చోట అప్పాయింట్ చేసింది. వారు కూటమికి విధేయతతో వ్యవహరించి అభాసు పాలయ్యారు. అంతిమంగా సస్పెన్షన్లు, బదిలీలకు గురి కావల్సి వచ్చింది.దీపక్ మిశ్ర అనే రిటైర్డ్ అధికారిని అబ్జర్వర్గా నియమిస్తే, ఆయన టీడీపీకి సంబంధించినవారు ఇచ్చిన విందులో పాల్గొన్నారట. ఆ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు బహిరంగంగానే చెప్పారు. ఇది ఎన్నికల సంఘానికి ఎంత సిగ్గుచేటైన విషయం. దీపక్ మిశ్ర ఎక్కడా గొడవలు జరగకుండా చూడాల్సింది పోయి తెలుగుదేశంకు అనుకూలంగా పనిచేయాలని పోలీసులపై ఒత్తిడి చేశారట. అలాగే సస్పెండైన ఒక పోలీసు ఉన్నతాదికారి టీడీపీ ఆఫీస్లో కూర్చుని ఆయా నియోజకవర్గాలలో పోలీసులను ప్రభావితం చేయడానికి కృషి చేశారట.ఇవన్ని వింటుంటే పెత్తందార్లుగా ముద్రపడ్డ చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్ కల్యాణ్లు ఎన్నికలలో గెలుపుకోసం ఎన్ని కుట్రలు చేయడానికైనా వెనుకాడలేదని అర్ధం అవుతుంది. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలో విద్వంసం సృష్టించడం, అది కనిపించకుండా ఉండాలని సీసీ కెమెరాలు పగులకొట్టడం వంటి సన్నివేశాలు చూసిన తర్వాత పోలీసు వ్యవస్థపై ప్రజలలో నమ్మకం ఎలా ఉంటుంది? మంత్రులు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పోన్ చేస్తేనే కనీసం సమాధానం ఇవ్వని పోలీసు అధికారులను విశ్వసించడం ఎలా? దీని ఫలితంగానే పల్నాడు ప్రాంతంలో బలహీనవర్గాల ఇళ్లపై దాడులు, అనేక మంది గుడులలో, ఇతరత్రా తలదాచుకకోవలసి వచ్చింది. ఆ మహిళలు రోదించిన తీరుచూస్తే ఎవరికైనా బాద కలుగుతుంది.గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, దానిని బూతద్దంలో చూపుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఎల్లో మీడియా ప్రయత్నించింది. ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా యజమానులు ఫ్యాక్షనిస్టులుగా మారి ప్రతి ఘటనకు రాజకీయ రంగు పులిమి, వైఎస్సార్సీపీకి అంటగడుతూ నీచమైన కధనాలు ఇస్తూ వచ్చారు. వారి అండ చూసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు నోటికి వచ్చినట్లు మాట్లాడేవారు. పోలీసులను బెదిరించేవారు. అంగళ్లు, పుంగనూరుల వద్ద చంద్రబాబు రెచ్చగొట్టడంతో టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం, పోలీసు వాహనాన్ని కూడా వారు దగ్దం చేయడం, ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అంత చేసిన తర్వాత కూడా చంద్రబాబు, లోకేష్లు అప్పటి చిత్తూరు ఎస్పి మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆయన పేరు రెడ్ బుక్లో రాసుకున్నామని, తాము అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత నీ సంగతి చూస్తామంటూ బెదిరించేవారు.ఇలా అనేక మంది అధికారులను తరచూ భయపెట్టే యత్నం చేసినా, దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా ఈ అంశంపై తగు నిర్ణయాలు చేయలేదు. దాంతో టీడీపీ, జనసేన నేతలు చెలరేగిపోతూ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జనంలోకి వెళ్లడంతో వాటికి పోటీగా ఏమి చెప్పినా, తమకు మద్దతు లబించదని భావించిన చంద్రబాబు, పవన్లు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యకు ఏదో ప్రమాదం వాటిల్లిందన్న ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. ష్ట్రంలో సైకో పాలన సాగుతోందని పిచ్చి-పిచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలని యత్నించారు. పవన్ అయితే ఏకంగా ముప్పైవేల మంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని, వలంటీర్లే దానికి బాధ్యులంటూ నీచమైన విమర్శలు కూడా చేశారు. నిప్పుకు వాయువు తోడైనట్లు, రామోజీరావు, రాధాకృష్ణలు ఉన్నవి, లేనివి కల్పించి గాలివార్తలు రాసి ప్రజలలో భయాందోళనలు సృష్టించడానికి యత్నించారు.ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు గొడవపడితే దానికి రాజకీయం పులిమి వీరు రాష్ట్రం అంతటా ప్రచారం చేసేవారు. వెంటనే చంద్రబాబో, లేక ఇతర టీడీపీ నేతలు అక్కడకు వెళ్లి హడావుడి చేసే యత్నం చేసేవారు. ఈ రకంగా గత ఐదేళ్లుగా ఏపీ ఇమేజీని దెబ్బతీయడానికి వీరు గట్టి కృషి చేశారు. ఏదైనా ఘటన జరిగితే రెండువైపులా ఉన్న వాదనలు, వాస్తవ పరిస్థితిని వివరిస్తూ వార్తలు ఇస్తే తప్పుకాదు. అలా కాకుండా టీడీపీ వారిని భుజాన వేసుకుని దారుణ కధనాలు ఇవ్వడం ద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రజల దృష్టిలో పరువు కోల్పోయాయి. అయినా ఎన్నికల సమయం వచ్చేసరికి వీరు మరింత రెచ్చిపోయారు. ప్రభుత్వపరంగా, లేదా వైఎస్సార్సీపీ పరంగా ఏవైనా తప్పులు ఉంటే చెప్పవచ్చు. కాని.. వైఎస్సార్సీపీని ఓడించకపోతే తమకు పుట్టగతులు ఉండవన్నట్లుగా వీరు ప్రవర్తించారు.టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే గెలుపు అవకాశాలు లేవన్న స్పష్టమైన అభిప్రాయానికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ను తమ ట్రాప్లోకి తెచ్చుకుని తదుపరి బీజేపీని కాళ్లావేళ్లపడి పొత్తు పెట్టుకున్నారు. ఏపీలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీతో పొత్తుకు ఎందుకు తహతహలాడుతున్నదన్నదానిపై అప్పుడే అంతా ఊహించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం అండతో జగన్ ప్రబుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, ఎన్నికల సమయంలో అధికార యంత్రాంగాన్ని భయపెట్టి తమదారిలోకి తెచ్చుకోవడానికి, వీరు పన్నాగం పన్నారు. అందుకు తగ్గట్లుగానే బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి ఈ పని పురమాయించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే కోడ్ అమలుకు వస్తుంది కనుక సహజంగానే ఈసీకే విశేషాధికారాలు ఉంటాయి. దానిని తమకు అడ్వాంటేజ్గా మార్చుకున్నారు.ఎన్నికల సంఘం అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు కావల్సిన అదికారులను నియమించుకునే ప్రక్రియ ఆరంబించారు. పురందేశ్వరి ఏకంగా 22 మంది అధికారుల జాబితాను ఇచ్చి వారందరిని తొలగించి, తాము సూచించినవారిని నియమించాలని కోరడం సంచలనం అయింది. బహుశా దేశ చరిత్రలో ఇంతత ఘోరమైన లేఖ ఎవరూ రాసి ఉండరు. అలా ఉత్తరం రాసినందుకు సంబంధిత రాజకీయ నేతను మందలించవలసిన ఎన్నికల సంఘం ఆమె కోరిన చందంగానే అధికారులను బదిలీ చేయడం ఆరంభించింది. పలువురు జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను, ఇతర చిన్న అధికారులను కూడా బదిలీ చేయించారు. చివరికి డీజీపీని కూడా వదలిపెట్టలేదు. సిఎస్ ను కూడా బదిలీ చేయాలని గట్టిగానే కోరారు కాని ఎందుకో ఆ ఒక్క బదిలీ ఆగింది.ఈ బదిలీ అయిన వారిలో ఎవరికి ఫలానా తప్పు చేస్తున్నట్లు ఎక్కడా ఈసీ తెలపలేదు. కనీసం నోటీసు ఇవ్వలేదు. నేరుగా బీజేపీ నేతలు ఏమి చెబితే అదే చేశారన్న భావన ఏర్పడింది. ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి గట్టిగా ఉండే అధికారులపై చెడరాశాయి. వారందరిని బదిలీ చేయాలని ఒకసారి, బదిలీ చేస్తున్నారని మరోసారి రాసేవారు. వారు రాయడం, టీడీపీ, బీజేపీలు వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, మరుక్షణమే ఈసీ స్పందించడం మామూలు అయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ముఖ్యమంత్రి జగన్ దీనిపై ఎక్కడా పెద్దగా విమర్ధలు చేయలేదు. 2019లో కేంద్ర ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా ఐటీ, సీబీఐ వంటి సంస్థలు తమ పార్టీ నేతల ఇళ్లలో సోదాలు జరిపితేనే చంద్రబాబు రెచ్చిపోయి కేంద్రంపై తీవ్ర విమర్శలు చేసేవారు. ఎన్నికల ముఖ్య అధికారి ద్వివేది కార్యాలయానికి వెళ్లి తగాదా ఆడారు.. ధర్నా చేశారు.. కాని జగన్ చాలా హుందాగా వ్యవహరించారు. రాజకీయ విమర్శలు చేశారే తప్ప ఎక్కడా స్థాయిని తగ్గించుకోలేదు.టీడీపీ, బీజేపీలు తాము కోరినట్లుగానే అధికారులను నియమించుకుని పెత్తనం చేశారు. అయినా జగన్ ఎక్కడా అదికారులను ఎవరిని తప్పుపట్టలేదు. జనాన్ని నమ్ముకుని తన ప్రచారం తాను చేసుకున్నారు. పోలింగ్ నాడు బలహీనవర్గాలు, పేద వర్గాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో టీడీపీ వర్గాలు ఆందోళన చెందాయి. కొంత ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న పల్నాడు వంటి ప్రాంతాలలో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి టీడీపీ కూటమి నేతలు ప్రయత్నించారు. అందువల్లే వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. లేదా బాగా ఆలస్యంగా స్పందించారు. అయినా ఆ రోజు అంతా చాలావరకు ప్రశాంతంగా ముగిసింది. తదుపరి పరిస్థితిని సమీక్షించుకున్న టీడీపీ క్యాడర్ ఓటమి భయమో మరేదో కారణం కాని, ఒక్కసారిగా వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారనుకున్నవారిపై దాడులు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రిచంద్రగిరి మొదలైన చోట్ల వీరు నానా రభస చేశారు.ఎన్నికల సంఘం పనికట్టుకుని ఎక్కడైతే అధికారులను మార్చిందో అక్కడే ఈ గొడవలు జరగడంతో కుట్ర ఏమిటో బోధపడింది. ప్రత్యేకించి కొన్ని గ్రామాలలో దాడులు అమానుషంగా ఉన్నాయి. ఆ గ్రామాలలో మహిళలు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సన్నివేశాలు కనిపించాయి. వీటిని మాత్రం ఈనాడు, ఆంద్రజ్యోతి మీడియా కప్పిపుచ్చి వైఎస్సార్సీపీనే దాడులు చేసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. ఒకవేళ వైఎస్సార్సీపీ వారిది కూడా ఏదైనా తప్పు ఉంటే రిపోర్టు చేయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా వీరు వార్తలు కవర్ చేస్తూ తామూ ఫ్యాక్షనిస్టులమేనని రామోజీ, రాధాకృష్ణలు రుజువు చేసుకుంటున్నారు. ఎన్నికలు వారం రోజులు ఉండగా, ఇక రెండు రోజులలో జరుగుతాయనగా కూడా కొందరు పోలీస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. పలు చోట్ల తమకు కావల్సినవారిని కూటమి నియమింప చేసుకోగలిగింది. కొత్తగా వచ్చిన అధికారులకు అన్ని విషయాలపై అవగాహన తక్కువగా ఉంటటుంది. దానికి తోడు తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించడానికి సిద్దమై వచ్చినందున ఆయా ఘటనలపై సరిగా స్పందించలేదు. అందువల్లే పల్నాడు ప్రాంతంలో గొడవలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. బూత్ స్వాధీనం వంటివి జరిగినా చూసి, చూడనట్లు పోయారట.నిజానికి ఇంత తక్కువ వ్యవధిలో కొత్త అధికారులను నియమించినా ఉపయోగం ఉండదు. ఆ విషయం తెలిసి కూడా ఇలా వ్యవహరించడం అంటే కచ్చితంగా కూటమి పెత్తందార్లు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరిల ఒత్తిడికి ఈసీ లొంగిందని అర్దం. తాడిపత్రిలో పోలీసులే ఎమ్మెల్యే ఇంటిలో రచ్చ సృష్టించారు. అది మరీ ఘోరంగా ఉంది. అలాగే జెసి ప్రభాకరరెడ్డి ఇంటిలో కొందరు పోలీసులు గొడవ చేశారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. ఎక్కడ ఎవరు చేసినా ఖండించవలసిందే. చర్య తీసుకోవల్సిందే. తాడిపత్రిలో ఏ స్థాయికి గొడవలు వెళ్లాయంటే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ జెండా ఎగురవేసే యత్నం వరకు. ఇది మంచిది కాదు. నిజంగానే ఈనాడు మీడియా రాసినట్లు టీడీపీ నేతలే ఘర్షణలలో దెబ్బతిని ఉన్నా, వైఎస్సార్సీపీవారు దాడులు చేశారన్న నిర్దిష్ట సమాచారం ఉన్నా చంద్రబాబు నాయుడు ఈ పాటికి అక్కడకు వెళ్లి మరింత అగ్గి రాజేసేవారు. ఆయన ఎక్కడకు వెళ్లలేదు.పెత్తందార్ల కొమ్ము కాస్తున్న కూటమి నేతలు గాయపడ్డ పేదలను పలకరించడానికి ఎందుకు వెళతారు! ఇప్పుడు ఈసీ ఏపీ ఛీఫ్ సెక్రటరీని, డీజీపీని పిలిచి వివరణ కోరినా ఏమి ప్రయోజనం ఉంటుంది. చేసిందంతా చేసి, తనపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి ఈసీ ఇలా వ్యవహరిస్తున్నదన్న అనుమానం వస్తోంది. కేవలం ఎన్నికల సంఘం కొత్త అధికారులను నియమించిన చోటే ఈ ఘర్షణలు జరిగాయని, దీనికి ఈసీనే బాధ్యత వహించాలని ఈ అధికారులు వివరణ ఇచ్చి ఉండాలి. లేదా ఎన్నికల కమిషన్ తో ఎందుకు తలనొప్పిలే అనుకుంటే వారి వాదన ఏదో చెప్పి వచ్చి ఉండాలి. అందుకే పలువురు అధికారులపై కమిషన్ చర్చ తీసుకోక తప్పలేదు. ఏది ఏమైనా స్వతంత్రంగా ఉండవలసిన ఎన్నికల సంఘం కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడికి లొంగడం, శాంతి భద్రతలకు వారి చర్యలే విఘాతం కల్గించడం వంటివి ఏ మాత్రం సమర్దనీయం కాదు. దీనివల్ల ఈసీ విశ్వసనీయతపై మచ్చ పడిందని చెప్పక తప్పదు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
తాడిపత్రి ఘటనలకు పోలీసులు బాధ్యత వహించాలి- YSRCP నేతలు
-
బదిలీల తర్వాతే హింస!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ హరీశ్కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందచేశారు. పోలింగ్ రోజు, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరగడానికి కారణాలను నివేదించారు. ఈసీ ఆదేశాల మేరకు ఢిల్లీ వచ్చిన వారిద్దరూ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) రాజీవ్కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధూలతో సమావేశమయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో అల్లర్లకు కారణాలను విశ్లేషించారు.అధికారుల బదిలీ తర్వాతే అల్లర్లు..సమస్యాత్మక ప్రాంతాలైన పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీఎస్ జవహర్రెడ్డి ఈసీకి తెలిపారు. హఠాత్తుగా పోలీసు అధికారులను బదిలీ చేయడం, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారికి క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల అల్లర్లకు దారి తీసిందని తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ రోజు, మరుసటి రోజు పల్నాడు, కారంపూడి, మాచవరం, తాడిపత్రి, తిరుపతి, చంద్రగిరి, అనంతపురం, కృష్ణా జిల్లా, నర్సీపట్నం తదితర చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్లు చెప్పారు. ఎస్పీ స్థాయి అధికారి నుంచి ఎస్ఐ వరకు హఠాత్తుగా బదిలీలు చేయడంతో ఇదే అదునుగా అల్లర్లకు పాల్పడినట్లు వివరించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలన్నింటిలోనూ పోలీసు అధికారుల ఆకస్మిక బదిలీలే హింసకు కారణమని పేర్కొన్నట్లు తెలిసింది.కౌంటింగ్ రోజు జాగ్రత్త..రాష్ట్రంలో ఇకపై ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అల్లర్లకు కారకులపై కఠినంగా వ్యవహరించాలని సూచించింది. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట బందోబస్తు కల్పించాలని పేర్కొంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీసు అధికారులు, సిబ్బందిపై వేటు తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. ఎస్పీ స్థాయి అధికారి నుంచి హోంగార్డు వరకు ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఉందని, దీనిపై నిశితంగా పర్యవేక్షించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ సూచించినట్లు తెలిసింది. -
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచకం.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్
సాక్షి, అనంతపురం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల అరాచక దృశ్యాలు వైరల్గా మారాయి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల దాష్టీకానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే ఇంట్లో సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ను పోలీసులు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు తలుపులు బద్ధలు కొట్టారు. వైఎస్సార్సీపీ, కార్యకర్తలను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారు.పోలీసుల దాష్టీకంపై ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. తాడిపత్రిలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఎస్పీ అమిత్ బర్దర్పై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, సీఐ మురళీకృష్ణలపై బదిలీ వేటు వేసింది. పోలీసుల ఏకపక్ష వైఖరిని వైఎస్సార్సీపీ లీగల్ తప్పుబట్టింది. తాడిపత్రిలో పోలీసులఅరాచకంపై ఎన్నికల సంఘానికి ఆధారాలు సమర్పించారు. -
తాడిపత్రి పల్లెల్లో భయం.. భయం
తాడిపత్రి టౌన్: ‘ఏమ్మా.. నీకొడుకు ఇంట్లో లేడా వస్తే ఓ సారి స్టేషన్కు రమ్మను...ఏరా ఎక్కడున్నావ్..సార్ పిలుస్తున్నాడు స్టేషన్కు వచ్చి కనపడు’ అని పోలీసులు చెబుతుండడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు భయపడుతున్నారు. పోలింగ్ తర్వాత తాడిపత్రిలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం గ్రామాల్లో జల్లెడపడుతున్నారు. దీంతో పోలీస్ బూటు చప్పుళ్ల మధ్య పల్లెల్లో భయం భయంగా బ్రతకాల్సిన పరిస్థితి నెలకొంది.ఎన్నికల అనంతరం తాడిపత్రి పట్టణంలో నెలకొన్న అల్లర్ల కేసులతో పల్లెల్లో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నియోజకవర్గంలోని తాడిపత్రి, యాడికి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు మండలాల్లోని గ్రామాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. యువకులు కనిపిస్తే చాలు పోలీస్ స్టేషన్కు తీసుకు వెళుతుండడంతో గ్రామాల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు యువకులు గ్రామాలు వదిలి పారిపోతున్నారు. దీంతో గ్రామాల్లో మహిళలు, వృద్ధులు, పిల్లలు మాత్రమే కనిపిస్తూ గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి.తమ పిల్లలు ఎక్కడున్నారో..ఏం చేస్తున్నారో..ఎప్పుడు ఏం జరుగుతుందోనని వృద్ధ తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాడిపత్రి పట్టణంలో జరిగిన అల్లర్లకు తమ పిల్లలకు ఏం సంబంధమని కొంతమంది యువకుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం, ఏకపక్ష ధోరణి, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే తాడిపత్రిలో అల్లర్లు జరిగాయని జనం చెబుతున్నారు. ఎప్పుడు ఈ సమస్య సద్దుమణుగుతుందో..తమ పిల్లలు ఎప్పుడు ఇంటికి వస్తారోనని పల్లెల్లో వృద్ధులు ఎదురు చూస్తున్నారు. -
తాడిపత్రి ఘటనలో 91 మందికి రిమాండ్
విడపనకల్లు: పోలింగ్ అనంతరం తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు సంబంధించి టీడీపీ, వైఎస్సార్సీపీలకు చెందిన 91 మందిని పోలీసులు గురువారం అరెస్టు చేసి ఉరవకొండ సివిల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజి్రస్టేట్ దుర్గా కళ్యాణి ఎదుట హాజరు పరిచారు. జడ్జి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. వారిని రెడ్డిపల్లిలోని అనంతపురం జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు. అయితే అక్కడ సౌకర్యాలు సరిగా లేవని, శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ జడ్జికి తెలిపారు. అందువల్ల నిందితులను కడప కేంద్ర కారాగానికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు జడ్జి నిరాకరించారు. జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించారు. కోర్టు వద్ద భారీ భద్రత అల్లర్ల ఘటనలో నిందితులను ఉరవకొండకు తీసుకువస్తున్నారన్న సమాచారంతో ఉదయం నుంచి కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నిందితుల బంధువులు భారీగా కోర్టు వద్దకు తరలివచ్చారు. పోలీసులు ఉదయమే ఉరవకొండ కోర్టు ఆవరణను ఆ«దీనంలోకి తీసుకున్నారు. గుంతకల్లు డీఎస్పీ శివభాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాను కూడా లోనికి అనుమతించలేదు. సాయంత్రం 4 గంటలకు వైఎస్సార్సీపీకి చెందిన 37 మందిని, టీడీపీకి చెందిన 54 మందిని పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. అల్లర్లకు పాల్పడిన వారిపై ఐపీసీ 143, 147, 324, 307, 363 ఆర్డబ్యూ149 కింద కేసులు నమోదు చేశారు. -
ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల విధ్వంసం
తాడిపత్రి అర్బన్: చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం జరిగిన అల్లర్ల అనంతరం పోలీసుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఇంట్లోని గదులకు తాళం వేసుకుని వెళ్లిపోయారు. అయితే మంగళవారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో ఎవరూ ఊహించని రీతిలో పోలీసులు ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ నిద్రిస్తున్న పని మనుషులను నిద్రలేపి ఇంటి తలుపులు తీయాలని బలవంతం చేశారు. తమ వద్ద తాళాలు లేవని చెప్పడంతో పోలీసులు అక్కడే ఉన్న వంట చేసే కబ్గిరి(పెద్ద పొడవైన గరిటె)తో ఇంటి తలుపులను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోని సీసీ కెమెరాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కంప్యూటర్లను పగులగొట్టి హార్డ్ డిస్క్లను మాయం చేశారు. కాన్ఫరెన్స్ హాలు తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి అక్కడున్న ఫ్యాన్, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులుపోలింగ్ రోజు నుంచి తాడిపత్రి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అదనపు ఎస్పీ రామకృష్ణ టీడీపీ గూండాలను రెచ్చగొడుతూ వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియా ఎదుట మండిపడ్డారు. పోలింగ్ రోజున కూడా టీడీపీ నేతల వైపు వారు కన్నెత్తి చూడకుండా వైఎస్సార్సీపీ శ్రేణులను టార్గెట్ చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్రెడ్డి వందలాది మంది అనుచరులను వెంటేసుకుని రోడ్లపై హల్చల్ చేసినా వారించలేదు. ప్రభాకర్రెడ్డి అల్లుడు దీపక్రెడ్డి తన వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించుకుని తిరిగినా పోలీసులు ప్రశ్నించలేదు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి లక్ష్యంగా టీడీపీ అల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్నా ఆయన ఇంటి ముందు బందోబస్తు ఏర్పాటు చేయలేదు. మంగళవారం ఘర్షణల అనంతరం డీఐజీతో సహా రాయలసీమ జిల్లాల నుంచి పోలీసు బలగాలు పెద్ద ఎత్తున తాడిపత్రికి చేరుకున్నాయి. కానీ ఎమ్మెల్యే ఇంటి ముందు మాత్రం నామమాత్రపు బందోబస్తు ఏర్పాటు చేసి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి నివాసం వద్ద మాత్రం పెద్ద ఎత్తున బలగాలను మోహరింపజేశారు. అంతేగాకుండా సోమ, మంగళవారాల్లో జరిగిన దాడులతో ఎటువంటి సంబంధం లేని వైఎస్సార్సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు. వారిని మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండానే పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. మరికొందరిని కౌన్సెలింగ్ పేరిట ఇష్టారాజ్యంగా కొడుతున్నట్లు సమాచారం. తాడిపత్రి పోలీసుల ఏకపక్ష వైఖరి, తన ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించడంపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.మీడియాపై ఎస్పీ ఆంక్షలుతాడిపత్రిలో వరుసగా జరుగుతున్న సంఘటనలకు సంబంధించి న్యూస్ కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిథులపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. గొడవలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చిత్రీకరించకూడదని సాక్షాత్తు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆంక్షలు విధించడం గమనార్హం. ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాస సమీపంలో అదనపు ఎస్పీ రామకృష్ణతో బందోబస్తుపై ఆయన సమీక్షిస్తుండగా ఫొటోలు తీస్తున్న ఓ విలేకరిపై ఆయన చిందులు తొక్కారు. సెల్ ఫోన్ తీసుకోండంటూ అక్కడే ఉన్న తన గన్మన్లను ఆదేశించారు. -
ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడి.. తాడిపత్రిలో పోలీసుల ఓవరాక్షన్
అనంతపురం, సాక్షి: జిల్లాలో పోలింగ్ వేళ నుంచి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. తాజాగా.. తాడిపత్రి నియోజకవర్గంలో పోలీసులు ఓవరాక్షన్కు దిగారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి చొరబడిన పోలీసులు వీరంగం సృష్టించారు.కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు.. పని మనుషుల్ని బెదిరించారు. అంతేకాదు.. సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు హార్డ్ డిస్క్, సీపీయూలను పోలీసులు మాయం చేశారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇంతటితో ఆగలేదు.తాడిపత్రివ్యాప్తంగా 30 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదంటూ హెచ్చరించారాయన.ఏఎస్పీ రామకృష్ణ సహకారంతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి రౌడీయిజం చేస్తున్నారని, పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెబుతున్నారు. శాంతి భద్రతలకు సహకరించాలనే ఉద్దేశంతోనే తాము తాడిపత్రిని వీడి బయటకు వచ్చామని, అయితే పోలీసులు మాత్రం మరోలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడుతున్నారు. -
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్ఆర్సీపీ నేతలపై రాళ్ల దాడి
తాడిపత్రి,సాక్షి: ఏపీలో సాధారణ ఎన్నికల పోలింగ్ ముగిసినా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. మంగళవారం(మే14) తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ నేతలు రాళ్లదాడికి ప్రయత్నించారు. దీంతో వైఎస్ఆర్సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరు పార్టీల నేతలు పరస్పరం రాళ్లదాడికి దిగగా ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. రాళ్ల దాడిలో సీఐ మురళీకృష్ణకు తీవ్ర గాయలవగా ఆస్పత్రికి తరలించారు. -
తాడిపత్రిలో పెద్దారెడ్డిపై రాళ్లదాడి
తాడిపత్రి/ తాడిపత్రి అర్బన్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ సందర్భంగా సోమవారం టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి లక్ష్యంగా రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పెద్దారెడ్డితో పాటు పలువురి వాహనాలు ధ్వంసమయ్యాయి. తాడిపత్రిలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి అల్లర్లు, ఘర్షణలకు పాల్పడి పోలింగ్ సరళిని అడ్డుకునేందుకు జేసీ ప్రభాకర్రెడ్డి వర్గీయులు కుట్ర పన్నారు. పట్టణంలో స్వైర విహారం చేస్తూ ఎక్కడికక్కడ దాడులకు దిగారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి స్థానిక గాంధీకట్ట వద్దనున్న బూత్లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడే ఉన్న పచ్చ మూకలు కవ్వింపు చర్యలకు దిగాయి. అదే సమయంలో పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో సెబ్ అదనపు ఎస్పీ రామకృష్ణ, తాడిపత్రి డీఎస్పీ గంగయ్య తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. కవ్వింపు చర్యలకు దిగిన టీడీపీ వారిని విడిచి పెట్టి వైఎస్సార్సీపీ వర్గీయులపై పోలీసులు ప్రతాపం చూపించడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి జోక్యం చేసుకున్నారు. శాంతియుతంగా పోలింగ్ జరిగేందుకు సహకరిస్తున్న తమపై పోలీసుల ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. సెబ్ అదనపు ఎస్పీ రామకృష్ణ ఏకపక్షంగా వ్యవహరిస్తూ జేసీ సోదరులకు తొత్తుగా మారారని, ఇలా వ్యవహరించడం తగదని కేతిరెడ్డి పెద్దారెడ్డి హితవు చెప్పారు. దీంతో పోలీసులు ఇరువర్గాల వారికి సర్దిచెప్పి పంపించేశారు. అక్కడి నుంచి పెద్దారెడ్డి ఓంశాంతి నగర్లోని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి తిరిగొస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఈ దశలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముందస్తు ప్రణాళికతో జేసీ అనుచరులు రాళ్లు సిద్ధం చేసుకుని ఒక్కసారిగా పెద్దారెడ్డితో పాటు అనుచరులపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో పెద్దారెడ్డి వాహనంతో పాటు మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ హుటాహుటిన తాడిపత్రికి చేరుకున్నారు. జేసీ అనుచరులు ఎస్పీ సమక్షంలోనే రాళ్ల దాడి కొనసాగించారు. పరిస్థితి అదుపు తప్పడంతో బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు రంగప్రవేశం చేసి.. ఇరువర్గాల వారిని చెదరగొట్టాయి. డీఐజీ ఇమాన్షు బాబ్జి తాడిపత్రికి చేరుకుని శాంతిభద్రతలను సమీక్షించి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. -
వేడెక్కిన రాజకీయం
-
తాడిపత్రిలో జనసంద్రమైన సీఎం జగన్ ప్రచారసభ (ఫోటోలు)
-
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
సాక్షి, అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ మలివిడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైఎస్సార్ సర్కిల్లో ఆదివారం ఉ.10 గంటలకు నిర్వహించే బహిరంగసభతో ఈ ప్రచార భేరి మోగించనున్నారు. అనంతరం.. మ.12.30కు తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్లో నిర్వహించే బహిరంగసభలోనూ.. అలాగే, మ.3 గంటలకు నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్లో జరిగే సభలోనూ సీఎం జగన్ పాల్గొంటారు. సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్వహించిన సిద్ధం సభలకు జనం సునామీలా పోటెత్తారు. రాప్తాడు, మేదరమెట్ల సభలు ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతిపెద్ద ప్రజాసభలుగా నిలిచాయి. రేపటి ప్రచారం ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 29న (సోమవారం) అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన షెడ్యూల్ విడుదల చేశారు. 29 ఉ.10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలో.. అదేరోజు మ.12.30కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో.. సా.3.00 గంటలకు గుంటూరు జిల్లా పొన్నూరు సభల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారన్నారు. కూటమి కకావికలు...మరోవైపు.. టీడీపీ–జనసేన–బీజేపీ మూడు పార్టీలు కూటమిగా జట్టుకట్టాక తాడేపల్లిగూడెం, చిలకలూరిపేటలో నిర్వహించిన సభలతోపాటు చంద్రబాబు, పవన్ ఎన్నికల ప్రచారానికి జనస్పందన కన్పించకపోవడంతో కూటమి శ్రేణులు డీలాపడ్డాయి. 2014 ఇదే కూటమి ఎడాపెడా హామీలిచ్చేసి, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసిన మోసంపై ఇప్పటికీ ప్రజలు రగిలిపోతున్నారు. 2019 ఎన్నికల్లో విడిపోయి మళ్లీ ఇప్పుడు మరోసారి జనసేన, బీజేపీతో టీడీపీ జట్టుకట్టడాన్ని పచ్చి అవకాశవాదంగా ప్రజలు పరిగణిస్తున్నారని.. అందుకే కూటమి సభలకు జనం మొహం చాటేస్తున్నారని రాజకీయ పరిశీలకులు స్పష్టంచేస్తున్నారు. ఇది కూటమి శ్రేణులను కకావికలం చేస్తోంది. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నయాజోష్.. ఇక సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడం.. బస్సుయాత్ర చరిత్ర సృష్టించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, సానుభూతిపరులు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం జగన్ ఎన్నికల మలివిడత ప్రచారానికి శ్రీకారం చుడుతుండటంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నయాజోష్ నెలకొంది. ఉప్పొంగుతున్న అభిమాన సంద్రం.. ఎన్నికల తొలివిడత ప్రచారంలో భాగంగా గతనెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నుంచి సీఎం జగన్ ప్రారంభించిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర 23 జిల్లాల్లో 86 నియోజకవర్గాల్లో 2,188 కిలోమీటర్ల దూరం సాగి, ఈనెల 24న శ్రీకాకుళం జిల్లా అక్కవరం వద్ద ముగిసింది. ఈ యాత్రకు జనం తండోపతండాలుగా పోటెత్తడంతో నైతిక స్థైర్యం దెబ్బతిన్న కూటమి శ్రేణులు కుదేలయ్యాయి. బస్సుయాత్రలో మండుటెండైనా.. అర్థరాత్రయినా అభిమాన సంద్రం ఉప్పొంగింది. ఇక ఇచ్చిన హామీలన్నీ అమలుచేయడం.. సుపరిపాలన అందించడం ద్వారా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపిన సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలమైన నమ్మకాన్ని బస్సుయాత్ర ప్రతిబింబించిదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో పాదయాత్ర తరహాలో ఇప్పుడు బస్సుయాత్ర ద్వారా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా సీఎం జగన్ మార్చేశారని తేల్చిచెబుతున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని జాతీయ, ప్రతిష్టాత్మక పొలిటికల్ కన్సల్టెన్సీలు నిర్వహించిన 20కి పైగా సర్వేలు తేల్చిచెప్పడమే అందుకు తార్కాణం. -
లగాన్ పేరున గ్రానైట్ మాఫియా.. ఆర్జాస్ మాటున అక్రమార్జన
కాదేదీ అక్రమాలకు అనర్హం అన్నట్లు ఆ సోదరులు రెచ్చిపోయారు. అధికారమే అండగా చెలరేగారు. అడ్డగోలుగా వ్యాపారాలు సాగించారు. ప్రకృతి వనరులను కొల్లగొట్టారు. దేవుని మాన్యాన్నీ చెరబట్టేశారు. పేదల కడుపు గొట్టారు. చివరికి అసాంఘిక కార్యకలాపాలకూ తెరలేపారు. తమకు అడ్డు చెప్పిన అధికారులపై దాడులకూ వెనుకాడలేదు. అలాంటి వారు నేడు ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ప్రజల ముందుకు వెళ్తూ నీతి మాటలు మాట్లాడుతుండడంపై జనం నవ్వుకుంటున్నారు. తాడిపత్రి అర్బన్: గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. నాలుగు దశాబ్దాల పాటు అక్రమంగా ట్రావెల్స్ వ్యాపారం సాగించి రూ.కోట్లు దండుకున్నారు. ఒక బస్సుతో ప్రారంభమైన వారి ట్రావెల్స్ వ్యాపారం నుంచి వందల సంఖ్యలో బస్సులు పుట్టుకొచ్చాయి. ఒక పర్మిట్ నంబర్తో ఏకంగా నాలులైదు బస్సులు తిప్పుతూ ఆర్టీఏ అధికారులనే బురిడీ కొట్టించేవారు. దివాకర్ ట్రావెల్స్కు చెందిన స్లీపర్ కోచ్ బస్సులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు ఓ ప్రయాణికురాలు ఇచ్చిన సమాచారం మేరకు 2012లో అప్పటి రవాణాశాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య స్వయంగా అధికారులతో కలిసి దాడులు చేశారు. కర్నూలు–హైదరాబాద్ జాతీయ రహదారిలో తనిఖీలు నిర్వహించి మొబైల్ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు. బస్సు సీజ్ చేశారు. ఈ విషయం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, ఘటన జరిగిన కొన్నాళ్ల పాటు నిబంధనలు పాటించిన జేసీ సోదరులు... ఆ తర్వాత మంగళం పాడారు. అంతేనా.. కండీషన్ లేని బస్సులను నడుపుతూ అనేక ప్రమాదాలకు కారణమయ్యారు. ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు. అయితే, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక వీరి అక్రమాలను బట్టబయలు చేయడంతో ట్రావెల్స్ మూసేశారు. లగాన్ పేరున గ్రానైట్ మాఫియా.. తాడిపత్రి ప్రాంతంలో 800కు పైగా గ్రానైట్ పరిశ్రమలున్నాయి. మామూలుగా వీటికి గ్రానైట్ రాళ్లను చిత్తూరు, మడకశిర, కర్నూలు ప్రాంతాల నుంచి తీసుకువస్తుంటారు. క్వారీ నుంచి ఒక లోడు గ్రానైట్ తాడిపత్రికి చేరాలంటే రూ.45 వేల నుంచి రూ.50 వేల మేర రాయల్టీ చెల్లించాలి. అయితే టీడీపీ హయాంలో రాయల్టీ లేకుండా క్వారీ నుంచి తాడిపత్రికి గ్రానైట్ చేర్చేలా క్వారీ యాజమాన్యాలు, తాడిపత్రి పాలిష్ మిషన్ వ్యాపారుల మధ్య అక్రమ ఒప్పందం కుదిరింది. దీనికితోడు లారీలో ఉన్న గ్రానైట్ పరిమాణాన్ని బిల్లులో తగ్గించి ఒకే బిల్లుతో ఐదారు లోడ్లు రవాణా చేసేవారు. అలా కొల్లగొట్టిన డబ్బు లగాన్ పేరుతో మాఫియాను నడిపే ఓ పెద్దమనిషి ఇంటికి చేరేది. ఈ క్రమంలోనే 2015 ఆగస్టు 21న మైనింగ్ విజిలెన్స్ ఏడీగా బాధ్యతలు స్వీకరించిన ప్రతాప్రెడ్డి ఈ అక్రమ దందాపై ఉక్కుపాదం మోపారు. 2015కు ముందు ఏటా రూ.కోటి కూడా పెనాల్టీ రూపంలో ప్రభుత్వానికి అందేది కాదు. కానీ 2015–16లో రూ.5.40 కోట్లు, 2016–17లో రూ.5.55 కోట్లు రాబట్టారంటే లగాన్ దందా ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ప్రతాప్ రెడ్డి ఇక్కడ ఉంటే తమ ఆటలు సాగవని గుర్తించిన జేసీ సోదరులు ఎలాగైనా బదిలీ చేయించాలని చూశారు.చంపుతామంటూ బెదిరింపులకు కూడా దిగారు. దీనిపై అప్పట్లో ఆయన మైనింగ్ విజిలెన్స్ డైరెక్టర్కు ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్రెడ్డి ప్రధాన అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి (పొట్టి రవి), అప్పట్లోగ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న నాగేశ్వరరెడ్డి, బిల్లుల బాబు నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, కొన్నాళ్లకే ప్రతాప్రెడ్డిని బదిలీ చేయించిన ఈ ముఠా..మళ్లీ అక్రమాలు యథేచ్ఛగా సాగించింది. ఈ మాఫియా ద్వారా రూ.200 కోట్లకు పైగా జేసీ సోదరులు వెనకేశారన్న ఆరోపణలున్నాయి. ఆర్జాస్ మాటున అక్రమార్జన.. తాడిపత్రి సమీపంలో ఆర్జాస్ స్టీల్ప్లాంట్ ఏర్పాటు కోసం హుసేనాపురం, జంబులపాడు, చల్లవారిపల్లి, వీరాపురం గ్రామాల ప్రజలు దాదాపు 2 వేల ఎకరాల తమ భూములను అప్పగించారు. వీరు లారీలు, ఇతర మార్గాల ద్వారా ప్లాంటుపై ఆధారపడి జీవించేవారు. అయితే దివాకర్ రోడ్లైన్స్, ట్రాన్స్ ఇండియా పేరుతో జేసీ బ్రదర్స్ సొంతంగా ట్రాన్స్పోర్టు ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జేసీ బ్రదర్స్ ట్రాన్స్పోర్టును కాదనే ధైర్యం ఫ్యాక్టరీల యాజమాన్యానికి ఉండేది కాదు. దీంతో తొలి ప్రాధాన్యత వారికే ఇచ్చేవారు. అయితే, ఇందుకు సంబంధించిన బిల్లులను జేసీ బ్రదర్స్ ట్రాన్స్పోర్టు పేరు మీద కాకుండా తాడిపత్రి లారీ అసోసియేషన్ పేరుపై చేయిస్తూ ప్రభుత్వానికి పన్ను కూడా ఎగ్గొట్టేవారు. లారీలపై జేసీపీఆర్ అని ఉంటుంది. బిల్లులు మాత్రం ఆయన పేరుతో ఉండవు. మొత్తం అక్రమ లెక్కలే. వీరి లారీలు మినహా ఇతర లారీలు స్టీల్ప్లాంట్లోకి వెళ్లేందుకు వీల్లేదు. ఇలా ఐదేళ్లలో రూ.300 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. యథేచ్ఛగా డ్రై స్లాగ్ దందా.. అప్పట్లో ఆర్జాస్ స్టీల్ ప్లాంట్లో డ్రైస్లాగ్ను టన్ను రూ.1తో తమ బినామీల ద్వారా జేసీ సోదరులు కొనుగోలు చేయించేవారు. అల్ట్రాటెక్ సిమెంట్, సాగర్ సిమెంట్ పరిశ్రమలకు టన్ను రూ.850 చొప్పున విక్రయించేవారు. ట్రాన్స్పోర్టు, ఇతర ఖర్చులు కింద రూ. 250 పోగా రూ.600 మేర మిగిలేది. ఇలా ప్రతి నెలా 25 వేల టన్నులకు పైగా డ్రై స్లాగ్ తరలించేవారు. ఈ లెక్కన నెలకు రూ.1.5 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.100 కోట్లు కొల్లగొట్టారు. దేవుని మాన్యాన్నీ వదల్లేదు.. పెద్దపప్పూరు మండలం చిన్నపప్పూరులో వెలసిన పప్పూరమ్మ ఆలయానికి దాదాపు 19 ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి. తాడిపత్రి–పెద్దపప్పూరు ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ భూములను మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి కబ్జా చేశారు. ఫారం ఫాండ్లు ఏర్పాటు చేయించి బోరు బావుల నీటితో నింపి ఆ భూముల్లో కరివేపాకు, అరటి సాగు చేశారు. పంట దిగుబడుల ద్వారా రూ.లక్షలు ఆర్జిస్తున్నా ఆలయంలో పూజలకు కనీసం ఒక్క పైసా చెల్లించలేదు. ఏడాది క్రితం విచారణకు వచ్చిన దేవదాయ శాఖ అధికారులు భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. -
ప్రేమ పెరుతో దారుణం తాడిపత్రిలో పచ్చ నేత పైశాచికం
-
తాడిపత్రికి జేసీ బ్రదర్స్ అరాచకాలు
-
ప్రజలను వంచనజేసి
తాడిపత్రి, రూరల్: మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి నవరసాలు పండించారు. అవకాశం ఇస్తే అలా చేస్తా, ఇలా చేస్తా అంటూ అరచేతిలో వైకుంఠం చూపారు. బొటాబొటి ఆధిక్యతతో ఎలాగోలా చైర్మన్గా ఎన్నికయ్యారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను మాత్రం గాలికొదిలేశారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతూ ఉంటే, ఎక్కడ అధికార పార్టీకి పేరు వస్తుందనే అక్కసుతో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై చర్చించడానికి, పరిష్కార మార్గం చూపడానికి వేదికై న కౌన్సిల్ సమావేశాన్ని కూడా 6 నెలలుగా నిర్వహించకుండా అడ్డు పడుతున్నారు. కమిషనర్ సహకరించడం లేదంటూ ప్రజల చెవిలో పూలు పెట్టే యత్నం చేస్తున్నారు. ప్రజా సమస్యలు గాలికొదిలేసి.. తాను మాత్రం గాలి తిరుగుళ్లు తిరుగుతున్నారు. ఒక్క మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి చేతకాని ఆయన.. నియోజకవర్గాన్ని ఉద్ధరిస్తానంటూ కుచ్చుటోపీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ మాటున పల్లెల్లో కక్షలు రాజేస్తున్నారు. రచ్చ చేయడమే పని.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు సైతం జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డు తగులుతున్నారు. ‘నేను చేయను.. మీరు చేయొద్దు..’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. గతంలో మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగిన సమయంలో పట్టణంలో పేరుకుపోయిన చెత్తను ఎమ్మెల్యే తన సొంత నిధులతో తొలగించే ప్రయత్నం చేస్తే అడ్డుకుని నానా యాగీ చేశారు. వేసవిలో పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా బోర్ల మరమ్మతులు చేయిస్తుంటే టీడీపీ శ్రేణులతో కలిసి అడ్డుకుని రచ్చ చేశారు. నాలుగున్నరేళ్లుగా ఎమ్మెల్యే ఏ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా అడ్డు తగలడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదంటూ మళ్లీ తనే ఎల్లో మీడియాతో కలిసి దుష్ప్రచారం చేస్తున్నారు. ఆది నుంచి అంతే.. చైర్మన్గా ఎన్నికై నప్పటి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాలకు కేరాఫ్గా నిలిచారు. గత టీడీపీ హయాంలో చేసిన అరాచకాన్ని కొనసాగించారు. మున్సిపాలిటీ ప్రతిష్టను బజారు కీడ్చారు. కొన్నాళ్ల పాటు చైర్మన్ చాంబర్ కోసం కౌన్సిలర్లతో కలిసి నానా రభస చేశారు. తనకు కేటాయించిన చాంబర్ కాదని కమిషనర్ కార్యాలయాన్ని కేటాయించాలని పట్టుబట్టారు. కొన్ని రోజుల పాటు కమిషనర్ చాంబర్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు చాంబర్ కేటాయించే విషయంపైనా రచ్చ చేశారు. తన మాట వినడం లేదంటూ గతంలో ఉద్యోగులపై రెచ్చిపోయారు. దీంతో కొందరు ఉద్యోగులు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లడానికి ప్రయత్నించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయ్యాక ఏ కమిషనర్ కూడా ఎక్కువ రోజులు పనిచేయలేదు. అసలు మున్సిపాలిటీ అభివృద్ధినే ఆయన ఎన్నడూ పట్టించుకోలేదు. కౌన్సిల్ మీట్ జరుగుతున్న సమయంలో తాను చాంబర్లోనే ఉన్నా, వైస్ చైర్మన్లతో సమావేశాలను జరిపించారంటేనే ఆయనకు ప్రజలపై ఏ మాత్రం గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలను జేసీ సోదరులు పిచ్చోళ్లనుకుంటున్నారు మున్సిపాలిటీ చైర్మన్ పదవికి జేసీ ప్రభాకర్రెడ్డి అనర్హుడు. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదు. అలాంటి వ్యక్తి బస్సుయాత్రల పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తుండడం హాస్యాస్పదం. నమ్మి ఓట్లేసిని ప్రజలను జేసీ సోదరులు పిచ్చివారు అనుకుంటున్నారు. ఇలాంటి వారికి జనమే గుణపాఠం చెప్పాలి. – పెద్దారెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే -
జేసీ ప్రభాకర్, చంద్రబాబుకు భారీ షాక్
-
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి గూండాగిరి
-
'రేయ్.. నేను రెడీగున్నా! అరెస్ట్ చెయ్రా.. చెయ్!'
తాడిపత్రి అర్బన్, సాక్షి: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్లీ రెచ్చిపోయారు. 'రేయ్.. అరెస్టు చెయ్.. నీయమ్మా.. ఖాకీ డ్రెస్సులేసుకుని సిగ్గులేదు.. రేయ్ నేను రెడీగున్నా.. అరెస్ట్ చెయ్.. చెయ్ రా చెయ్' అంటూ పోలీసులను దుర్భాషలాడారు. రోడ్డుపై పడుకుని హంగామా సృష్టించారు. రెండు రోజుల కిందట జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టణ సుందరీకరణ పేరుతో సీబీ రోడ్డులోని విద్యుత్ స్తంభాలకు డెకరేషన్ బల్బులను ఏర్పాటు చేసేందుకు మునిసిపల్ కమిషనర్ జి.రవిని అనుమతి కోరారు. తర్వాత మునిసిపల్ సిబ్బందితో కలసి దగ్గరుండి డెకరేషన్ లైట్లు వేయించడానికి బయలుదేరారు. అయితే స్తంభాలకు ఉన్న వైఎస్సార్సీపీ జెండాలను పనిగట్టుకుని తొలగిస్తుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని జేసీ ప్రభాకర్.. తన అనుచరులతో కలిసి నడిరోడ్డుపై బైఠాయించి నానా హంగామా సృష్టించాడు. ట్రైనీ డీఎస్సీ హేమంత్ కుమార్, ఎస్ఐలు రామకృష్ణ, గౌస్మహ్మద్లు అక్కడికి చేరుకుని మునిసిపల్ కమిషనర్తో మాట్లాడి జెండాలను తొలగింపజేస్తామంటూ హామీ ఇవ్వడంతో జేసీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ బుధవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆర్డీవో వెంకటేష్ను టీడీపీ కౌన్సిలర్లు కలసి సీబీ రోడ్డులోని విద్యుత్ స్తంభాలకు ఉన్న వైఎస్సార్సీపీ జెండాలు తొలగించాలంటూ వినతిపత్రం ఇవ్వడమే కాకుండా.. అక్కడే బైఠాయించారు. ఇది తన పరిధిలోని అంశం కాదని, అనవసరంగా రాద్దాంతం చేయకుండా మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని ఆర్జీవో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. బుధవారం సాయంత్రం జేసీ జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలసి అర్బన్ పోలీస్ స్టేషన్ వద్దకొచ్చారు. వచ్చీ రాగానే గట్టిగా కేకలు వేస్తూ నానా హంగామా సృష్టించాడు. ఎస్పీ ధరణీబాబు, రామకృష్ణ, గురుప్రసాద్రెడ్డి వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. వారిపై తిట్ల దండకాన్ని అందుకున్నారు. పోలీసులు సంయమనం పాటిస్తూ నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా వినలేదు. చివరకు ఆయనను అరెస్ట్ చేసేందుకు జీపును తీసుకొచ్చేందుకు పోలీసులు సిద్ధమవగా నడిరోడ్డుపై పడుకుండిపోయాడు. పోలీసులు అతన్ని జీవులోకి ఎక్కించుకుని స్థానిక పుట్లూరు రోడ్డులో వదిలేయడంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. జేసీపై కేసు నమోదు పోలీసులతో అనుచిత ప్రవర్తకు గానూ జేసీ ప్రభాకర్రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం.. విధులకు ఆటంకం కలిగించడం, దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించడంపై జేసీతో పాటు ఆయన ముగ్గురి అనుచరులపై కేసు నమోదు చేశారు. -
జేసీ ప్రభాకర్కు ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓపెన్ సవాల్..
సాక్షి, అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. తాడిపత్రి అభివృద్ధి కి ఎవరు కృషి చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. అభివృద్ధిని నిరూపించలేకపోతే నీవు.. నీ కుటుంబ సభ్యులు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. కాగా, కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నేను ఎమ్మెల్యే అయిన తర్వాతే తాడిపత్రి నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది. నా హయాంలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ ఉనికి కోసం పాకులాడుతున్నారు. తాడిపత్రి అభివృద్ధికి జేసీ ప్రభాకర్ రెడ్డి అడుగడుగునా అడ్డు పడుతున్నారు. అమృత్ స్కీం కింద తాడిపత్రి మునిసిపాలిటీకి రూ.52 కోట్లు రాకుండా అడ్డుకుంటున్నారు. సొంత పొలాలకు మాత్రమే నీరు విడుదల చేసుకునే నైజం టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిదే. టీడీపీ పాలనలో సాగునీరు అడిగితే రైతుల మోటార్లు లాక్కెళ్లిన చరిత్ర జేసీ కుటుంబానిదే. సాగునీటి కోసం మిడుతూరు హైవేపై జేసీ ప్రభాకర్ ఆందోళన చేయడం హాస్యాస్పదం. ప్రజలను పక్కదారి పట్టించేందుకే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక, టిక్కెట్ల కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే తుది నిర్ణయం. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నా మద్దతు ఉంటుంది. కుప్పం నుంచి పోటీ చేయాలని ఆదేశించినా నేను సిద్ధంగా ఉన్నాను’ అని వెల్లడించారు. -
తాడిపత్రిలో జనహోరు
అనంతపురం ఎడ్యుకేషన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన చేయూతతో సాధికారత సాధించిన బడుగు, బలహీన వర్గాలు సోమవారం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’ చేశాయి. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో తాడిపత్రి జనపత్రిగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధాన రోడ్డు వేలాది ప్రజలతో కిక్కిరిసింది. ముందుగా పట్టణంలోని కూరగాయల కొత్త మార్కెట్ ఎదురుగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావుపూలే విగ్రహాన్ని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం భగత్సింగ్ నగర్ నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర సీబీ రోడ్డు మీదుగా వైఎస్సార్ సర్కిల్ వరకు సాగింది. మధ్యలో సిద్దిబాషా దర్గాలో ప్రార్థనలు చేశారు. దారిపొడవునా బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో వేలాదిమంది పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలను ప్రజాప్రతినిధులు, నేతలు వివరించినప్పుడు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ‘మళ్లీ రావాలి జగన్ – కావాలి జగన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు మాకే ఉంది : మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నాలుగున్నరేళ్లలో సామాజిక న్యాయం చేసి నిరూపించిన సీఎం వైఎస్ జగన్ అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్సార్సీపీ నేతలకే ఉందన్నారు. సామాజిక న్యాయం జరగాలని, పేదవాడు పేదవాడిగానే ఉండిపోకూడదని, పేదల కుటుంబాల్లోనూ డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని సీఎం వైఎస్ జగన్ పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పల్లకీ మోసిన జగన్ను మళ్లీ గెలిపిద్దాం: మంత్రి ఉషశ్రీచరణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పల్లకీ మోశారని, మరోసారి ఆయన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని మంత్రి ఉషశ్రీ చరణ్ పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాలను గుర్తించి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ అని చెప్పారు. 139 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు, బీసీల్లో పుట్టాం అని గర్వంగా చెప్పుకునేలా చేశారని తెలిపారు. సీఎం జగన్ అగ్రకులంలో పుట్టినా బీసీ కుల గణనకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. సీఎం జగన్ను గుండెల్లో పెట్టుకుంటాం: ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం పని చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను గుండెల్లో పెట్టుకుంటామని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ చెప్పారు. ఈ వర్గాలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా నిలబెట్టేందుకు సీఎం జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. సామాజిక న్యాయం చేసిన సీఎం జగన్ : ఎంపీ తలారి రంగయ్య రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యం కల్పించి, సామాజిక న్యాయం చేసిన సీఎం జగన్ అని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య చెప్పారు. రాయలసీమలో మొత్తం 8 ఎంపీ స్థానాలు ఉంటే 5 స్థానాలు బీసీ, ఎస్సీలకు ఇచ్చారన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున బీసీ, ఎస్సీలకు ఏ పార్టీ టికెట్లు ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి జగన్ అవసరం చాలా ఉంది: ఎంపీ నందిగం సురేష్ పేదలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఉందని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. సీఎం జగన్ అతి సామాన్యమైన వ్యక్తులను పైసా ఖర్చు లేకుండా ఎంపీలుగా చేశారని, వారిలో తాను ఒకడినని అన్నారు. -
బినామీ పేరుతో జె సి ప్రభాకర్ రెడ్డి చేసిన అరాచకాలు
-
అసహనంతో అరాచకం.. పేట్రేగిపోతున్న జేసీ సోదరులు
రాజకీయాల్లో వివాదాలకు కేంద్రబిందువైన జేసీ బ్రదర్స్ (మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి – మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి) టీడీపీ అధికారం లేకపోయే సరికి సహనం కోల్పోతున్నారు. ప్రతిపక్షంలో హుందాతనం కనబరచాల్సిన వీరు తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దిగజారుడు రాజకీయాలతో విమర్శలు మూటగట్టుకుంటున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో అరాచకాలకు పాల్పడుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: తాడిపత్రిలో 30 ఏళ్లకు పైగా అధికారంలో ఉండి దొరతనాన్ని వెలగబెట్టిన జేసీ సోదరులు ప్రతిపక్షంలోకి వచ్చాక ఉనికి కోసం పడరానిపాట్లు పడుతున్నారు. వీరు నిత్యం ఏదో ఒక వివాదంతో నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం సృష్టిస్తున్నట్టు విమర్శలొస్తున్నాయి. గత కొన్ని రోజులుగా జేసీ ప్రభాకర్రెడ్డి చేష్టలకు సామాన్యులకే కాదు పోలీసులకు సైతం కంటిమీద కునుకులేకుండా ఉంది. ఇప్పటికే పలు అవినీతి కేసుల్లో ఉన్న ప్రభాకర్రెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మరింతగా పేట్రేగిపోతున్నట్టు సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. అభివృద్ధి పనులను అడ్డుకుంటూ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక తాడిపత్రి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వీటినెలాగైనా అడ్డుకోవాలనేది జేసీ ప్రభాకర్రెడ్డి ఆలోచన. ఇందులో భాగంగా ఆస్పత్రి నిర్మాణాలను అడ్డుకోవాలని కాంట్రాక్టర్ను బెదిరించారు. దీంతో ఈ నెల 23వ తేదీ వివాదం రాజుకుంది. జేసీ బెదిరింపులకు భయపడి కాంట్రాక్టర్ పనులు ఆపేసి వెళ్లినట్టు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు ర్యాలీగా వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇది తొలిసారి కాదు... జేసీ ప్రభాకర్రెడ్డి ప్రభుత్వాస్పత్రి పనులను అడ్డుకోవడం మొదటి సారేమీ కాదు. మొన్నటికి మొన్న డ్రెయినేజీ పనులను అడ్డుకున్నారు. ఏకంగా మురికి కాలువలో కుర్చీ వేసుకుని కూర్చుని వివాదం రేపారు. అంతకుముందు ‘నాడు–నేడు’ పనుల కింద జూనియర్ కాలేజీకి ప్రహరీ నిర్మిస్తుంటే అడ్డుకున్నారు. అనుచరులతో కలిసి గొడవకు దిగారు. చివరకు పోలీసుల రక్షణలో ప్రహరీ పనులు చేపట్టాల్సి వచ్చింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసినా అడ్డుకుని రాద్ధాంతం చేశారు. చావుతప్పి కన్ను లొట్ట పోయిన చందంగా మున్సిపల్ చైర్మన్గా ఎన్నికై... వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు మున్సిపాలిటీలో అన్ని పనులకూ అడ్డు తగులుతున్నారు. అనుచరులను ఉసిగొలుపుతూ... గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవలేకపోయేసరికి జేసీ ప్రభాకర్రెడ్డి తీవ్ర అక్కసుతో ఉన్నారు. తన అనుచరులతో కలిసి ఏదో ఒక వివాదాన్ని సృష్టించడం, ధర్నాలు, నిరసనలు చేపట్టడం, సామాన్యులను భయభ్రాంతులకు గురి చేయడం.. ఇదీ తాడిపత్రిలో రోజువారీ తీరు. గత నాలుగేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో మళ్లీ పల్లెలకు వెళ్లి వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. ఇదిలా ఉండగా జేసీ ప్రభాకర్ చేష్టలతో విసిగిపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు ఎవ్వరూ ఈయనకు అండగా నిలవని పరిస్థితి. జేసీ సోదరులు టీడీపీకి గుదిబండగా మారారని అనంతపురానికి చెందిన ఆ పార్టీ నాయకుడొకరు చెప్పారు. వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తప్ప తాడిపత్రిలో టీడీపీకి మనుగడ లేదంటున్నారు. జేసీ తీరుపై పోలీసుల మౌనం జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరురాలు కమలమ్మ ఫిర్యాదుపై స్పందించి కేసు నమోదు చేసిన పోలీసులు.. జేసీ అనుచరుల ఆగడాలపై మాత్రం కనీస స్పందన లేదు. ఇన్ని వివాదాలు సృష్టిస్తున్నా సుమోటోగా కేసు నమోదు చేయలేదు. జేసీ బెదిరింపులను, వివాదాలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పోలీసులు ఎందుకు భయపడుతున్నారని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదుకు ఆదేశం కాంట్రాక్టర్లను బెదిరించిన తీరుపై బాధితులనుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేయాలని తాడిపత్రి పోలీసులను ఆదేశించాం. ఎవరినైనా బెదిరించినా, ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డు తగిలినా తీవ్రంగా పరిగణిస్తాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారినైనా వదిలే ప్రసక్తే లేదు. – అన్బురాజన్, ఎస్పీ -
చోటా డాన్ రజాక్, ఖాజాలకు జేసీ సోదరుల అండ !
తాడిపత్రిలో చీకటి మాటున మట్కా మాఫియా రాజ్యమేలుతోంది. ఒకప్పటి జూదరులు ఇప్పుడు బుకీలుగా అవతారమెత్తి చోటా మట్కా డాన్తో కలిసి అమాయక ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపెడుతున్నారు. డబ్బు ఆశ చూపి వారిని రొంపిలోకి లాగుతున్నారు. అత్యాశకు పోయిన సామాన్యులు జేబులకు చిల్లు వేసుకుంటున్నారు. తాడిపత్రి అర్బన్: మట్కా మహమ్మారి అంకెల గారడీతో అమాయకులను బురిడీ కొట్టిస్తోంది. మట్కా తగిలితే రూపాయికి రూ.80 ఇస్తామని ఆశ చూపిస్తోంది. దీంతో ఎంతోమంది కూలీనాలీచేసుకునే వారు, వ్యాపారులు, చిరుద్యోగులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు, సులభంగా డబ్బు సంపాదించుకునేందుకు మట్కాను ఎంచుకుంటున్నారు. పోలీసులు మట్కాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నా టీడీపీ నేతల అండదండలున్న నిర్వాహకులు తమ పంథాను మాత్రం మార్చుకోవడం లేదు. కేరళ నుంచి వలస వచ్చి స్థిరపడిన వ్యక్తి ఈ ప్రాంతానికి మట్కాను పరిచయం చేశాడు. ఆ వ్యక్తి కుమారుడైన రషీద్ మట్కా పగ్గాలు చేపట్టాక అనతికాలంలోనే డాన్గా ఎదిగాడు. టీడీపీకి చెందిన జేసీ సోదరుల (మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి – మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి)ఆశీస్సులుండడమే ఇందుకు కారణమన్న విమర్శలు ఉన్నాయి. తెరపైకి చోటా డాన్ రజాక్ మట్కా డాన్ రషీద్ కరోనాతో మృత్యువాతపడ్డాక పట్టణంలో మట్కా కొన్నాళ్లు మరుగున పడింది. తన అన్న (ఎల్లో డాన్) వారసత్వాన్ని అబ్దుల్ రజాక్ కొనసాగించడంతో మట్కా తిరిగి పుంజుకుంది. గతంలో బళ్లారికి చెందిన రిజ్వాన్ను శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. రిజ్వాన్ ఇచ్చిన సమాచారంతో ఎస్పీ టీం అప్పట్లో అబ్దుల్ రజాక్ను అదుపులోకి తీసుకుంది. కర్ణాటకలోని హుబ్లీకి చెందిన వినాయక్ మేత్రాని అనే మట్కా నిర్వాహకుడిని కూడా పోలీసులు అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు. అయితే రిజ్వాన్, వినాయక్ మేత్రాని అనే వీరిరువురు సౌత్ ఇండియాలోనే మట్కా కంపెనీల్లో నంబర్ వన్ షేర్హోల్డర్స్. వీరిలో రిజ్వాన్కు తాడిపత్రికి చెందిన అబ్దుల్ రజాక్ మట్కా పట్టీలు ఇచ్చేవాడని అప్పట్లో పోలీసులు గుర్తించారు. టీడీపీకి చెందిన మరో మట్కా డాన్ మకందర్ ఖాజా అలియాస్ లప్ప ఖాజా కుటుంబం మొత్తం తాడిపత్రిలో మట్కా పురుడు పోసుకున్నప్పటి నుంచి మట్కా నిర్వహిస్తుండడం విశేషం. వీరి కుటుంబంలో మహిళలే మట్కా నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు కూడా గుర్తించారు. ఇటీవల మకందర్ ఖాజా తండ్రి మునీర్బాషాతో పాటు ఖాజా సతీమణి షేక్ నూరీని అరెస్టు చేశారు. పోలీసులనే టార్గెట్ చేసి.. తాడిపత్రి పచ్చ మట్కా మాఫియాలో కీలక సూత్రధారి రషీద్ సోదరుడు అబ్దుల్ రజాక్ను కొద్ది రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మట్కాను పూర్తిస్థాయిలో ఆపాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అబ్దుల్ రజాక్ కుటుంబం ఏకంగా పోలీసులనే టార్గెట్ చేసింది. సీఐ హమీద్ఖాన్ తమను వేధిస్తున్నాడంటూ మొసలి కన్నీరు కార్చింది. తెరవెనుక ‘పచ్చ’ కుట్ర మట్కా మాఫియాను ఇన్నాళ్లూ పెంచి పోషించిన ‘పచ్చ’ నేతలకు అర్బన్ సీఐ హమీద్ఖాన్ చర్యలు మింగుడుపడడం లేదు. ఈయన ఉంటే తమ ఆటలు సాగవని భావించిన ‘పచ్చ’ నేతలు బురదజల్లేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల చోటా డాన్ అబ్దుల్ రజాక్ భార్యతో పోలీసు శాఖలోని కీలక అధికారులపై ఆరోపణలు చేయిస్తున్నారు. మానవ హక్కుల సంఘం, ప్రైవేటు కేసుల పేరుతో పోలీసులను బ్లాక్మెయిల్ చేసి మట్కాను సాగించాలని పథకం రచిస్తున్నారు. మట్కారాయుళ్లపై కొరడా ఎన్నడూ లేని విధంగా తాడిపత్రి పోలీసులు మట్కా రాయుళ్లపై కొరఢా ఝళిపిస్తున్నారు. అర్బన్ సీఐగా పి.హమీద్ఖాన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మట్కాపై ఉక్కుపాదం మోపారు. పట్టణంలో మట్కా ఎవరు నిర్వహిస్తున్నారన్న దానిపై ఆరా తీసి వారికి ముందుగా హెచ్చరికలు జారీ చేశారు. తీరు మార్చుకోని వారిని జిల్లా నుంచి బహిష్కరించేందుకు కలెక్టర్కు ప్రతిపాదనలు పంపించారు. కలెక్టర్ గౌతమి ఉత్తర్వుల మేరకు మట్కా నిర్వాహకులు బుక్కపట్నం శివకుమార్, చుక్కలూరు చాంద్బాషా, మక్తుం పాల మాబు, దూదేకుల కుళ్లాయప్ప, ఉదయగిరి మాబున్నీ, దిగువపల్లి పుల్లయ్య, తుంగ రామాంజులరెడ్డిలపై ఆరు నెలల పాటు జిల్లా బహిష్కరణ వేటు వేశారు. ఆన్లైన్లో మట్కా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి నిర్వాహకులు మట్కాను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కొందరు మట్కా నిర్వాహకులు స్వయంగా యాప్ డెవలపర్స్.. మిలాన్డే, మిలాన్ నైట్ పేర్లతో ప్రత్యేక వెబ్సైట్లు రూపొందించి యాప్ల ద్వారా అండ్రాయిడ్ ఫోన్లకు లింక్లను పంపి గుట్టుగా మట్కా నిర్వహిస్తున్నారు. ఇందుకు గాను సదరు ఆండ్రాయిడ్ యూజర్ రూ.10 వేలు నగదు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్దారుకు ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. ఆ పాస్వర్డ్ ఉపయోగించి మట్కా నిర్వహించుకోవాలి. రూ.100కు రూ.8వేలు చెల్లిస్తామంటూ అమాయకుల బతుకులను నాశనం చేస్తున్నారు. ఉపేక్షించేది లేదు మట్కా విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. ఎక్కడైనా, ఎప్పుడైనా మట్కా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. నేను బాధ్యతలు తీసుకున్నాక ఇప్పటి వరకు మట్కా స్థావరాలపై దాడులు జరిపి, 33 కేసులు నమోదు చేశాం. మట్కా, గ్యాంబ్లింగ్ను కూకటివేళ్లతో పెకలించాలని సీఐ, ఎస్ఐలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ఆన్లైన్ మట్కాను కూడా నిర్మూలిస్తాం. – సీఎం.గంగయ్య, డీఎస్పీ, తాడిపత్రి -
జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యకాండ
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యకాండకు దిగారు. నాడు నేడు పనులను అడ్డుకున్న ఆయన.. అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సంజీవనగర్ హైస్కూల్ లో నాడు - నేడు పనులకు అధికారులు ఉపక్రమించారు. అయితే.. ఆ ఎదురుగానే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇల్లు ఉంది. కొంతకాలంగా ఆ ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్లోనే జేసీ తన పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. అయితే.. అధికారులు హైస్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మిస్తే తన పార్టీ కార్యక్రమాలకు ఇబ్బందులు కలుగుతాయని జేసీ అడ్డుకుంటున్నారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం తవ్విన గుంతలు పూడ్చివేయడంతో పాటు అధికారులు, పోలీసులతో జేసీ వాగ్వాదానికి దిగారు. దుర్మార్గం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నాడు నేడు పనుల్ని అడ్డుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాన్ని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఖండించారు. ‘‘ప్రభుత్వ పాఠశాలలో నాడు -నేడు పనులను జేసీ అడ్డుకోవడం దుర్మార్గం, తాడిపత్రి అభివృద్ధి కి జేసీ అడ్డుపడుతున్నారని మండిపడ్డారాయన. -
తాడిపత్రిలో వైఎస్సార్సీపీ హవా.. జేసీ బ్రదర్స్కు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో జేసీ బ్రదర్స్కు ఎదురుదెబ్బ తగిలింది. జేసీ సొంత మండలం పెద్దపప్పూరులో టీడీపీ ఓటమి చెందింది. దేవునుప్పలపాడు పంచాయతీలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు కాటమయ్య గెలుపొందారు.తాడిపత్రి నియోజకవర్గంలో ఐదు వార్డుల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో జరిగిన పంచాయితీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. మెజార్టీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు.. బలపర్చిన అభ్యర్థులే జయకేతనం ఎగరేస్తున్నారు. మొత్తం 35 సర్పంచ్, 245 వార్డు మెంబర్ల స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. -
రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్రెడ్డి.. పోలీసులను అరేయ్.. ఓరేయ్ అంటూ..
సాక్షి, అనంతపురం: తరచూ తన వ్యవహారశైలితో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే తాడిపత్రి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. తాడిపత్రి మున్సిపల్ అధికారులు, పోలీసులపై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అరుపులు, కేకలతో దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. అరేయ్.. ఓరేయ్ అంటూ మీడియా సమావేశంలో ఊగిపోయారు. ఒక్కొక్కరి అంతుచూస్తానంటూ జేసీ బెదిరింపులకు దిగారు. ఇటు నియోజకవర్గంలోను, అటు టీడీపీ క్యాడర్లోను ఉనికి కోల్పోయిన జేసీ ప్రభాకర్రెడ్డి.. ఎలాగైనా ఉనికిని చాటుకునేందుకు చవకబారు రాజకీయాలు చేస్తున్నారు. గత నెల ఇసుక రవాణా వాహనాలను తగలబెడతానంటూ జేసీ తన వర్గీయులతో వీరంగం సృష్టించేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. గత ఏడాది జేసీ ప్రభాకర్రెడ్డి ఏకంగా కలెక్టర్పైనే దౌర్జన్యం చేసిన సంగతి తెలిసిందే. కనీస మర్యాద కూడా లేకుండా కలెక్టర్ను ఏకవచనంతో సంబోధించడంతో పాటు ఆమె ముందే పేపర్లు విసిరేశారు. అడ్డుకోబోయిన కలెక్టర్ గన్మెన్ను తోసేసి నానా రభస సృష్టించారు. చదవండి: టీడీపీ అంటే తెలుగు ద్రోహుల పార్టీ: ఎంపీ విజయసాయిరెడ్డి -
సీఐ ఆత్మహత్య.. జేసీ శవరాజకీయం.. ముందునుంచీ పోలీసులంటే చిన్నచూపే
అనంతపురం: ఇటు నియోజకవర్గంలోను, అటు టీడీపీ క్యాడర్లోను మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ఉనికి కోల్పోయారు. ఎలాగైనా ఉనికిని చాటుకునేందుకు, తాడిపత్రిలో పైచేయి సాధించాలనే కుట్రపూరిత ఆలోచనతో సీఐ ఆనందరావు ఆత్మహత్యను రాజకీయాస్త్రంగా వాడుకుంటున్నారు. ఈయన చవకబారు, శవరాజకీయాలపై ప్రజలు చీదరించుకుంటున్నారు. కుటుంబ కలహాలతో అర్బన్ సీఐ ఆనందరావు మూడు రోజుల క్రితం ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సాక్షాత్తు ఎస్పీ శ్రీనివాసరావే తాడిపత్రికి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. సీఐ ఆత్మహత్యకు రాజకీయ, ఉన్నతాధికారుల ఒత్తిళ్లు కారణం కాదని, కుటుంబ సమస్యల వల్లే ప్రాణం తీసుకున్నాడని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు గురించి మీడియాకు వెల్లడించారు. అయితే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి మాత్రం సీఐ ఆత్మహత్యకు రాజకీయ రంగు పులిమి, హంగామా చేయడం విస్మయం కలిగిస్తోంది. టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయులు ఘర్షణ పడిన సమయంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారన్న చిన్నచూపుతో సీఐ ఆనందరావును దుర్భాషలాడారు. ‘వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై తన వర్గీయులు దాడులు చేస్తారు చూస్తావా.. అడ్డుకోవడం నీవల్ల అవుతుందా’ అంటూ హేళన చేస్తూ బెదిరించారు. ఈ విషయమై సీఐ అప్పట్లోనే స్థానిక డీఎస్పీతో పాటు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులంటే జేసీ బ్రదర్స్కు ఎప్పుడూ చిన్నచూపే.. జేసీ సోదరులు అధికారంలో ఉన్నపుడు మాట వినని పోలీసులను దుర్భాషలాడడమే కాకుండా, వారి వాహనాలను దహనం చేయడంతో పాటు ఏకంగా పోలీస్ స్టేషన్కే తాళాలు వేయించారు. అలాంటి జేసీ సోదరులు ఇప్పుడు పోలీసులంటే ఎనలేని గౌరవం ఉన్నట్లు మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రాజకీయ ప్రయోజ నాల కోసం సీఐ ఆత్మహత్యను వాడుకుంటున్నారు. సీఐ చావుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒత్తిళ్లు కారణమంటూ ఆరోపణలు చేస్తూ ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో అలజడులు రేపేందుకు కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులు.. తాడిపత్రి పట్టణంలోని ఆంజనేయస్వామి మాన్యంలో నివసిస్తున్న పేదలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ప్రజలకు మేలు చేయడం గిట్టని జేసీ ప్రభాకర్రెడ్డి తన అనుయాయులచే హైకోర్టులో కేసులు వేయించి ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డుపడ్డారు. ► అంబేడ్కర్ నగర్లోని మున్సిపల్ స్థలంలో ఆరోగ్య ఉప కేంద్రం భవనం నిర్మించడాన్ని జేసీ ప్రభాకర్రెడ్డి జీర్ణించుకోలేక తన అనుచరుడైన టీడీపీ కౌన్సిలర్తో హైకోర్టులో పిటిషన్ వేయించి పనులు అడ్డుకున్నారు. ► తాడిపత్రిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఏర్పాటుకు ఒప్పించారు. ఎస్పీ కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే తన సొంత డబ్బుతో స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టడం జీర్ణించుకోలేక టీడీపీ కౌన్సిలర్తో జేసీ ప్రభాకర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయించి స్టే తెప్పించారు. దీంతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. మున్సిపల్ అధికారులపైనా కక్ష సాధింపు.. ► మున్సిపల్ అధికారులు, సిబ్బందిని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి కక్షసాధింపులకు దిగారు. ప్రొటోకాల్ పేరుతో దూషణలు, బెదిరింపులతో భయకంపితులను చేస్తున్నారు. ►మున్సిపాలిటీలోని వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని, అధికారులందరూ తాను చెప్పినట్లే వినాలని హుకుం జారీ చేస్తున్నారు. ► మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరెడ్డి అహంకారపూరిత ధోరణితో కమిషనర్ మొదలు కిందిస్థాయి సిబ్బంది వరకు వృత్తిపరంగా అనేక రకాలుగా తీవ్ర ఒత్తిళ్లకు లోనవుతున్నారు. ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత తాడిపత్రి పట్టణ ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నారు. శాంతిభద్రతల విషయంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మూడు దశాబ్దాల తమ ఏక ఛత్రాధిపత్యానికి చెక్ పడటం జేసీ ప్రభాకర్రెడ్డికి మింగుడు పడలేదు. ఎలాగైనా తమ ప్రాభవం తిరిగి సంపాదించుకునేందుకు ఏదో ఒక అలజడి సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారు. ► ఇప్పుడు ఏకంగా ఓ సీఐ ఆత్మహత్యను అస్త్రంగా తెరపైకి తీసుకువచ్చి, అందుకు రాజకీయ రంగును పులుముతూ, పబ్బం గడుపుకోవాలని చూస్తున్న జేసీ ప్రభాకర్రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరసన తెలిపేందుకు చిహ్నంగా వాడే నల్లదుస్తులు, నల్ల రిబ్బన్లు ధరించి సీఐ ఆనందరావుకు నివాళులర్పించడం పట్ల కొన్ని దళిత సంఘాలతో పాటు తాడిపత్రి ప్రజలు తప్పుపడుతున్నారు. మరణించిన వ్యక్తి చిత్రపటానికి పూలు చల్లడం, పూల మాల వేయడం, లేదా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టడం, వాటితో మానవహారం నిర్వహించడం వంటి చర్యలతో మృతి చెందిన వ్యక్తికి శ్రద్ధాంజలి, నివాళులర్పిస్తారు. అయితే సీఐ ఆనందరావు దళితుడైనందునే జేసీ ప్రభాకర్రెడ్డి నల్ల దుస్తులు ధరించి అగౌరవపరిచారని దళితులు కొందరు జేసీ తీరును తప్పుబట్టారు.జే అనుచరుల కోసం చాంబర్.. మున్సిపల్ చైర్మన్ హోదాను అడ్డుపెట్టుకున్న జేసీ ప్రభాకర్రెడ్డి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏ మున్సిపాలిటీలో లేని విధంగా రెండు చాంబర్లను ఆక్రమించుకున్నారు. అధికారుల వద్ద ఉండాల్సిన చాంబర్ల తాళాలను కూడా తనవద్దే ఉంచుకుంటున్నారు. బయటి వ్యక్తులు, అనుచరులు చైర్మన్ చాంబర్లలోకి వచ్చి వెళుతూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అనుచరులు కొందరు కార్యాలయంలోనే తిష్ట వేసి కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నట్లు సిబ్బంది వాపోతున్నారు. జేసీ విపరీత పోకడలను తాళలేని సిబ్బంది మూకుమ్మడిగా సెలవుపై వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. -
మంచి అధికారిని కోల్పోయాం
తాడిపత్రి/చంద్రగిరి : తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు (51) కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకోవడం పోలీసు వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన సోమవారం తెల్లవారుజామున తాడిపత్రి పట్టణంలోని నంద్యాల రోడ్డులో ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకున్నారు. పోలీసు శాఖలో మంచి అధికారిగా పేరున్న ఆయన ఇలా తనువు చాలించడాన్ని పోలీసులు, ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పనిచేసిన ప్రతిచోట సమర్థుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సౌమ్యుడిగాను, సేవభావం కల్గిన అధికారిగానూ పేరొందారు. 1998 బ్యాచ్ అధికారి ఆనందరావు స్వగ్రామం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కల్రోడ్పల్లి. భార్య అనురాధ, కుమార్తెలు కావ్య (బీటెక్), భవ్య (ఇంటర్) ఉన్నారు. ఆయన 1998 సంవత్సరంలో పోలీసు శాఖలో ఎస్ఐగా విధుల్లో చేరారు. హిందూపుం ఎంపీ గోరంట్ల మాధవ్కు ఈయన ఎస్ఐగా బ్యాచ్మేట్. ఎస్ఐగా, ఆ తర్వాత పదోన్నతిపై సీఐగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పనిచేశారు. ప్రతిచోట మంచి పేరు తెచ్చుకున్నారు. పోలీసు విధులతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ శభాష్ అనిపించుకున్నారు. తాడిపత్రి పట్టణ సీఐగా గత ఏడాది సెప్టెంబరులో బాధ్యతలు చేపట్టారు. కుల మతాలకు అతీతంగా, రాజకీయ సిఫారసులకు దూరంగా ప్రజలకు సేవలందించి మన్ననలు పొందారు. తాడిపత్రి పట్టణ పోలీసు స్టేషన్లో నమోదైన పలు కేసులకు సంబంధించి లోక్ అదాలత్లో రాజీమార్గంలో పరిష్కారం చూపినందుకు గాను కొన్ని నెలల క్రితం జిల్లా ఎస్పీ చేతుల మీదుగా రివార్డు అందుకున్నారు. అంతకు ముందు కరోనా విపత్తు సమయంలో రైల్వే కోడూరులో విధులు నిర్వర్తించినప్పుడు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. యాచకులకు, కూలీలకు అండగా నిలిచారు. విద్యార్థులకు తనవంతు సహాయ సహకారాలు అందించారు. కల్రోడ్డుపల్లిలో విషాదం సీఐ ఆనందరావు ఆత్మహత్యతో ఆయన స్వగ్రామం కల్రోడ్పల్లిలో విషాదఛాయలు నెలకొన్నాయి. సోమవారం సాయంత్రం ఆనందరావు భౌతికకాయం కల్రోడ్పల్లికి చేరుకుంది. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బంధువులు, గ్రామస్తులు బోరున విలపించారు. వారం క్రితమే గ్రామానికి వచ్చి వెళ్లాడని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి అండగా ఉంటూ, కష్టాలలో ఉన్న వారికి ఆర్థిక సాయం చేసేవారని వారు వెల్లడించారు. ఆయన లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నామని చిన్నాన్న గంగాధరం కన్నీటి పర్యంతమయ్యారు. గతంలో కళ్యాణి డ్యామ్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్, తిరుమలలో ఏవీఎస్వోగా పనిచేశారని గుర్తు చేశారు. ఆనందరావు మృతి పట్ల చంద్రగిరి పీటీసీలో నివాళులర్పించారు. పలువురి నివాళి సీఐ ఆనందరావు మృతదేహానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో పాటు అదనపు ఎస్పీ విజయభాస్కర్రెడ్డి, డీఎస్పీ గంగయ్య, సీఐలు చిన్న పెద్దయ్య, శంకర్రెడ్డి, ఎస్ఐలు ధరణీబాబు, మహమ్మద్ గౌస్, గురుప్రసాద్, ఖాజా హుస్సేన్, శ్రీనివాసులు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్నాథ్, సుధాకర్రెడ్డి, తేజ్పాల్, వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి రమేష్రెడ్డి నివాళులర్పించారు. తాడిపత్రి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్న సీఐ ఆనందరావు ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని డీఎస్పీ గంగయ్య కొనియాడారు. -
తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య
సాక్షి, అనంతపురం: తాడిపత్రి టౌన్ సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం రాత్రి డ్యూటీ నుంచి ఇంటికి వెళ్లాక తలుపులు బిగించుకొని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు.. సీఐ భార్యా, ఇద్దరు కూతుళ్ల నుంచి వివరాలు సేకరించిన తర్వాత మీడియాకు వివరాలు వెల్లడించారు. తాడిపత్రి సీఐ ఆనందరావు మృతికి కుటుంబ కలహాలే కారణమని పేర్కొన్నారు. కొంత కాలం గా భార్యా భర్తల మధ్య విబేధాలు ఉన్నాయని.. నిన్న రాత్రి కూడా సీఐ ఆనందరావు దంపతుల మధ్య గొడవ జరిగిందని.. ఈ మనస్తాపం తోనే సీఐ ఆనందరావు బలవన్మరణానికి పాల్పడినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్పీ శ్రీనివాసరావు వివరించారు. ఎమ్మెల్యే పరామర్శ తాడిపత్రి సీఐ ఆనందరావు మృతి పట్ల ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విచారం వ్యక్తం చేశారు. సీఐ కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. ఆనందరావు మృతదేహానికి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నివాళులు అర్పించారు. సీఐ ఆనందరావు మృతదేహం వద్ద ఎస్పీ శ్రీనివాసరావు పోలీసు లాంఛనాలతో నివాళులు అర్పించారు. (చదవండి: పిడుగు పడి 11 మందికి గాయాలు) -
అనంతలో టీడీపీ మూకల దాష్టీకం
సాక్షి, అనంతపురం: తాడిపత్రి లో తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. గంగాదేవి పల్లిలో జగనన్న కాలనీ కోసం భూమిని చదును చేస్తుండగా.. అక్కడివారిపై దాడికి దిగారు. జగనన్న కాలనీ భూమిని వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తల చదును చేస్తుండగా.. అడ్డుకుని టీడీపీ వర్గం కర్రలతో దాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ దాడికి సంబంధించి.. 24 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎమ్మెల్యే పరామర్శ టీడీపీ వర్గం దాడిలో గాయపడ్డ వారిని ఆసుపత్రిలో పరామర్శించారు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇదీ చదవండి: ఓటర్ల సవరణ జాబితాపై ఫోకస్ పెట్టండి -
తాడిపత్రిలో దారుణం.. నిద్రిస్తున్న వారిపై పెట్రోలు పోసి..
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న వారిపై పెట్రోలు పోసి నిప్పుపెట్టారు.. ఈ ఘటనలో దంపతులతో పాటు మరో యువతి తీవ్రంగా గాయపడింది. మద్యం, వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పారిశ్రామిక వాడలోని శ్రీనిధి నల్ల బండల పాలిష్ పరిశ్రమలో నల్లపురెడ్డి, సరస్వతి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి పరిశ్రమ ఆవరణలో మంచంపై నిద్రిస్తున్నారు. అదే ఫ్యాక్టరీలో పని చేసే మల్లికార్జున కుమార్తె పూజిత కూడా వీరి పక్కనే మంచం వేసుకుని నిద్రిస్తోంది. రాత్రి 11.30 గంటల సమయంలో సరస్వతి మరిది రామేశ్వర్రెడ్డి నిద్రిస్తున్న నల్లపురెడ్డి, సరస్వతిపై పెట్రోల్ పోశాడు. మెలకువ వచ్చిన సరస్వతి ఏం చేస్తున్నావురా అని అరిచేలోగానే నిప్పంటించాడు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. పక్కనే నిద్రిస్తున్న పూజితకు కూడా మంటలు అంటుకుని చేతులు కాలాయి. తాగుడుకు బానిసైన రామేశ్వర్రెడ్డిని రెండు రోజుల క్రితం తాము పద్ధతి మార్చుకోవాలని దండించామని, అది మనసులో ఉంచుకుని ఇలా చేశాడని నల్లపురెడ్డి, సరస్వతి దంపతులు రూరల్ ఎస్ఐ గౌస్ మహ్మద్కు వివరించారు. వారి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ కేసు నమోదు చేసుకున్నారు. సరస్వతి, నల్లపురెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. పూజితకు తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చదవండి: బంజారాహిల్స్: మసాజ్ చేస్తూ గొలుసు కొట్టేశారు.. -
తాడిపత్రిలో వివాహిత దారుణ హత్య.. వారిపైనే అనుమానం?
తాడిపత్రి అర్బన్(అనంతపురం జిల్లా): మంచంపై నిద్రిస్తున్న వివాహితను తలపై కత్తితో నరికి చంపి.. పెట్రోల్ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించిన ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలోని నందలపాడులో చోటుచేసుకుంది. ఆ మహిళను భర్త లేదా కుమారుడు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు.. నందలపాడుకు చెందిన రంగనాథ్రెడ్డి, శివమ్మ (48) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. కుమార్తెలందరికీ వివాహమైంది. కుమారుడు రవీంద్రనాథ్రెడ్డి ఇటీవల ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. మతాంతర వివాహం కావడంతో కొడుకును ఇంటికి రావొద్దని తల్లి శివమ్మ వ్యతిరేకించింది. దీంతో రవీంద్రనాథ్రెడ్డి తాడిపత్రిలోనే వేరు కాపురం పెట్టాడు. చదవండి: అప్పు తీరుస్తామని పిలిపించి.. రాధను చంపేశారు కాగా.. భర్త రంగనాథ్రెడ్డి, భార్య శివమ్మ ఇద్దరే నందలపాడులో నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి శివమ్మ తన ఇంటి వసారాలో మంచంపై నిద్రపోగా.. భర్త రంగనాథ్రెడ్డి ఇంటి మిద్దెపైకి ఎక్కి పడుకున్నాడు. గురువారం ఉదయం కిందకు దిగొచ్చిన రంగనాథ్రెడ్డి తన భార్య పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందిందని చుట్టుపక్కల వారికి చెప్పాడు. ముమ్మాటికీ హత్యే కానీ.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 70 శాతానికి పైగా కాలిపోయిన శివమ్మ మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటే.. కాలిపోతున్నప్పుడు కేకలు వేసేదని పోలీసులు చెబుతున్నారు. మంటల్లో కాలిపోతున్న సమయంలో ఆ ప్రాంతంలో అటూఇటూ తిరిగిన ఆనవాళ్లు ఏమీ లేవని గుర్తించిన పోలీసులు ఘటన స్థలంలో లభించిన ఆధారాలను బట్టి శివమ్మ హత్యకు గురైందనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చి క్లూస్ టీమ్ను రప్పించారు. శివమ్మ తలపై కత్తిలాంటి పదునైన ఆయుధంతో నరికిన ఆనవాళ్లను క్లూస్ టీమ్ కనుగొంది. శివమ్మ తలపై రెండుచోట్ల బలమైన లోతు గాయాలు ఉన్నట్టు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ముందుగా శివమ్మను తలపైకొట్టి హత్య చేసి.. ఆ తర్వాత పెట్రోల్ పోసి దహనం చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. చంపిందెవరో! కాగా, శివమ్మను చంపింది ఎవరనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. తన భార్య హత్యకు గురైనా.. ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె భర్త రంగనాథరెడ్డి ఫిర్యాదు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ఇంకా వెల్లడి కాలేదు. మరోవైపు ఇటీవలే మతాంతర వివాహం చేసుకున్న కుమారుడు రవీంద్రనాథ్రెడ్డిని శివమ్మ ఇంట్లోకి రానివ్వకపోవడంతో అతడేమైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా అనే అనుమానం కూడా ఉంది. కుమారుడు రవీంద్రనాథ్రెడ్డిపై పట్టణ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉంది. శివమ్మ అంత్యక్రియలు ముగిసిన అనంతరం తండ్రీ కొడుకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణ పూర్తయిన అనంతరం గానీ.. వారిద్దరిలో ఎవరు హంతకులో చెప్పలేమని పోలీసులు పేర్కొంటున్నారు. -
ఆ షాక్ నుంచి జేసీ బ్రదర్స్ ఇంకా తేరుకోలేదా?
అనంతపురం జిల్లాలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ కుటుంబం ఒకటుంది. ఆ కుటుంబ పెద్ద ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆయనకో తమ్ముడున్నాడు. అన్నదమ్ములు ఇద్దరికీ నోటి తీట, దుడుకుతనం కూడా ఎక్కువే. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్నదమ్ముల రాజకీయ ప్రభ మసకబారింది. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తుండటంతో ఉనికి కోసం నానా తంటాలు పడుతున్నారు. జేసీ దివాకరరెడ్డి, జేసీ ప్రభాకరరెడ్డి పేర్లు అనంతపురం జిల్లాలో అందరికీ పరిచయమైనవే. 1985 నుంచి వరుసగా ఆరుసార్లు తాడిపత్రి అసెంబ్లీ సీటు నుంచి విజయం సాధించిన దివాకరరెడ్డి నలుగురు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేశారు. 2014లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని ముందుగానే ఊహించి హస్తానికి హ్యాండిచ్చి కుటుంబం అంతా సైకిల్ సవారీ స్టార్ట్ చేసింది. తాడిపత్రి అసెంబ్లీ సీటు తమ్ముడు ప్రభాకరరెడ్డికి ఇచ్చి.. తాను అనంతపురం ఎంపీగా పోటీ చేశారు దివాకరరెడ్డి. ఇద్దరూ విజయం సాధించారు. ఇక 2019లో తాను తప్పుకుని కొడుకు పవన్రెడ్డిని అనంతపురం నుంచీ ఎంపీ సీటుకు పోటీ చేయించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనంతో జేసీ బ్రదర్స్ రాజకీయాలు ముగిసిపోయాయి. నాలుగు దశాబ్దాల రాజకీయానుభవం వైఎస్ జగన్ జైత్రయాత్ర ముందు తుడిచిపెట్టుకుపోయింది. ఆ షాక్ నుంచి జేసీ కుటుంబం ఇంకా తేరుకోలేదు. ఓటమి తర్వాత పవన్రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరో ఏడాదిలో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు జేసీ దివాకరరెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో జేసీ కుటుంబానికి ఒక టిక్కెట్ మాత్రమే ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్ జేసీ ప్రభాకర్రెడ్డి లేదా ఆయన కుమారుడికి ఇస్తే తమ పరిస్థితి ఏంటని జేసీ దివాకర్రెడ్డి డైలమాలో పడ్డారు చదవండి: చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపై మంత్రి అంబటి ట్వీట్ అందుకే రాయల తెలంగాణా పేరుతో మరోసారి వార్తల్లోకి ఎక్కి.. రాజకీయంగా గందరగోళం సృష్టించి..లబ్ది పొందాలని జేసీ దివాకర్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే పలువురు రాజకీయ నిరుద్యోగులను జేసీ దివాకర్ రెడ్డి కలుస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ను ఇటీవలే జేసీ దివాకర్ రెడ్డి కలిసి చర్చించారు. రాయల తెలంగాణ అంశంతో పాటు శింగనమల అసెంబ్లీ స్థానంపై జేసీతో శైలజానాథ్ చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు తాడిపత్రి నియోజకవర్గంలో రోజు రోజుకూ బలహీన పడుతున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం.. రెచ్చగొట్టే కార్యక్రమాలతో రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. చదవండి: రజినీకాంత్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన లక్ష్మీపార్వతి పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవడం కాదు. నోటి దురుసుతో అధికారులు, ప్రత్యర్థులపై తిట్లు లంకించుకోవడం, దాడులకు దిగడం ద్వారానే ఎప్పుడూ వార్తల్లో వ్యక్తులుగా ఉండే జేసీ బ్రదర్స్ ఇప్పుడు రాజకీయంగా ఉనికి నిలబెట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రజల్ని రెచ్చగొట్టే రాజకీయాలకు కూడా దిగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. -
జేసీ ప్రభాకర్ వ్యాఖ్యలు.. తాడిపత్రిలో హైటెన్షన్
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో సోమవారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇసుక రవాణా వాహనాలను తగలబెడతానంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హింసాత్మక వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణం. ఈ వ్యాఖ్యల అనంతరం జేసీ తన వర్గీయులతో వీరంగం సృష్టించేందుకు యత్నించారు. ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉండడంతో.. పోలీసులు జేసీ ప్రభాకర్ను తొలుత హౌస్ అరెస్టు చేశారు. ఈలోపు జేసీ నివాసం వద్దకు భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో డీఎస్పీ చైతన్య జోక్యం చేసుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇంతలో జేసీ ప్రభాకర్ పోలీసుల కళ్లుగప్పి బయటకు రావాలని యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది. (చదవండి: యువతితో వీడియో కాల్: మీ ఇంటికొచ్చి మీ భార్యకు అన్నీ చెబుతా.. ) -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలు..రూ. 5.30 లక్షలు స్వాధీనం
సాక్షి, అనంతపురం: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ధన ప్రవాహం భారీగా సాగుతోంది. అనంతపురంలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలకు తెరతీసింది. ఈ మేరకు తాడిపత్రి టీడీపీ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ. 5.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఓటర్లకు డబ్బు పంచుతున్న టీడీపీ నేత వెంకట రమణను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నగదును సమీపంలోని పోలీస్టేషన్కి తరలించారు. (చదవండి: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి) -
జేసీ బ్రదర్స్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
-
విధివంచితులు
వారిదో వింతలోకం.. ఉలుకూ పలుకూ లేని వారు కొందరైతే.. నిస్తేజంగా కనిపించేవారు మరికొందరు.. ఆకలేసినా అన్నం అడగలేనివారు ఇంకొందరు.. వయసు పెరుగుతున్నా అందుకు తగ్గట్టు బుద్ధి పెరగడం లేదు. ఎదుగూబొదుగూ లేని బుద్ధిమాంద్యం పిల్లలను తల్లిదండ్రులు మాత్రం కంటికి రెప్పలా చూసుకుంటూనే ఉన్నారు. సరైన వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు పిల్లలను భవిష్యత్తును తలచుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. తాడిపత్రి టౌన్: తాడిపత్రి పట్టణంలో దాదాపు 150 మంది బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నారు. వీరిలో చెవిటి, మూగ, అంధులు, శారీరక, మానసిక వైకల్యం కల్గిన చిన్నారులు దుర్భర జీవితం గడుపుతున్నారు. విధివంచితులైన వారిని తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడుతూనే ప్రేమతో చూసుకుంటున్నారు. అవ్వ సంక్షరణలో అక్కాతమ్ముడు వడ్లపాలెంకు చెందిన కూలీలు హజీరాని, దస్తగిరి దంపతులు. వీరికి నసృన్ (14), మహమ్మద్ సందానీ ( 15) సంతానం. వీరు పుట్టుకతోనే బుద్ధిమాంద్యులు. రెక్కాడితే గానీ డొక్కాడని దయనీయ జీవితం. ఈ నేపథ్యంలో పిల్లల సంరక్షణ బాధ్యతను అవ్వ దస్తగిరమ్మ తీసుకుంది. దస్తగిరమ్మ అద్దె ఇంట్లో ఇద్దరు పిల్లలలో కలసి ఉంటోంది. నసృన్, మహమ్మద్ సందానీలకు మతిస్థిమితం లేదు. అన్నం కూడా తినలేని పరిస్థితి. ఆమె ఇంటి వద్దనే చిరువ్యాపారం చేసుకుంటూ.. వచ్చే పింఛన్ డబ్బుతో బతుకు బండి లాగుతోంది. నడవలేస్థితిలో ధరణి, సృజన.. గన్నెవారిపల్లి కాలనీకి చెందిన లలితమ్మ, శివశంకర్ భార్యాభర్తలు. వీరికి ధరణి (15), సృజన (7) పిల్లలు. వీరు పుట్టుకతోనే బుద్ధిమాంద్యులు. శివశంకర్ ఆటోడ్రైవర్. లలితమ్మ పిల్లలను చూసుకుంటూ ఇంటి వద్దనే ఉంటోంది. పిల్లలు నడవలేరు. రోజూ భవిత సాధన ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు. ఆటో సంపాదనతో అతి కష్టం మీద శివశంకర్ కుటుంబం నడుపుతున్నాడు. అధికారులు స్పందించి తమవంతు సాయం చేయాలని వారు కోరుతున్నారు.. తల్లిచాటు బిడ్డ ఫకృద్దీన్ శ్రీనివాసపురానికి చెందిన లారీ డ్రైవర్ వలిబాషా, బీబీ దంపతులు. వీరి కుమారుడు బాబా ఫకృద్ధీన్ (29)కు రెండు, కాళ్లు, చేతులు పని చేయవు. మానసిక స్థితి సరిగా లేదు. దీంతో ఆలనా పాలన తల్లి బీబీ చూసుకుంటోంది. వయసు పెరిగినప్పటికీ ఫకృద్ధీన్ చిన్న పిల్లవాడిగానే ప్రవర్తిస్తుంటాడు. తమ్ముడికి అక్క అండ నందలపాడుకు చెందిన అంకాలమ్మ, గంగయ్య దంపతులకు నలుగురు పిల్లలు. వీరిలో లోకేష్ (24) మానసిక బుద్ధి మాంద్యంతో పుట్టారు. కొన్ని సంవత్సరాల క్రితం లోకేష్ తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి లోకేష్ను అక్క జ్యోతినే సంరక్షిస్తోంది. చివరకు తాను వివాహం కూడా చేసుకోలేదు. తమ్ముడికి వచ్చే పింఛన్ డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తుంది. లోకేష్ స్వయంగా నడవలేడు. ఎవరైనా పట్టుకుని నడిపించాల్సిందే. కదల్లేని దీనస్థితిలో ఎందరో.. శ్రీనివాసపురానికి చెందిన హుస్సేన్బీ, దస్తగిరి దంపతుల కుమార్తె నూర్జహాన్ (14). నూర్జహాన్ కదలని బొమ్మగా ఉంటుంది. చంటి పిల్లను చూసుకున్నట్టుగా ఆమెను తల్లి చూసుకుంటోంది. పుట్లూరు రోడ్డులోని ఆర్టీటీ కాలనీకి చెందిన ప్రమీణ, రాము భార్యభర్తలు. వీరి కుమారుడు నరసింహులు (13) బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. వీల్చైర్కే పరిమితం. గన్నెవారిపల్లి కాలనీకి చెందిన ఆంజనేయులు (18) బుద్ధిమాంద్యం బారినపడ్డాడు. తండ్రి చనిపోవడంతో తల్లి అచ్చమ్మే ఆంజనేయులుకు అన్ని సపర్యలూ చేస్తోంది. బాగా చూసుకుంటున్నాం తాడిపత్రి మండల విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో బుద్ధిమాంద్య పిల్లల కోసం రాçÙ్ట్ర ప్రభుత్వం భవిత సాధన కేంద్రం ఏర్పాటు చేసింది. ఇక్కడ బుద్ధిమాంద్యం పిల్లల కోసం ట్రైసైకిల్, మరికొన్ని ఆట వస్తువులు అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల బొమ్మలతో పిల్లలు గడిపే విధంగా చూస్తున్నాం. రోజూ 10 నుంచి 20 మంది పిల్లలు భవిత కేంద్రానికి వస్తారు. ఫిజియోథెరపీ వంటి సేవలు కూడా అందిస్తున్నాం. దివ్యాంగుల సర్టిఫికెట్లు ఇప్పించేందుకు సదరం పరీక్షా కేంద్రాలకు పంపుతున్నాం. – నాగరాజు, భవిత కేంద్ర అధికారి, ఎంఈఓ, తాడిపత్రి -
జేసీ బ్రదర్స్ కు ఈడీ షాక్
-
జేసీ దివాకర్ రెడ్డికి దేవాదాయ శాఖ నోటీసులు
-
జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్లపై హత్యాయత్నం కేసు
తాడిపత్రి అర్బన్(అనంతపురం జిల్లా): తాడిపత్రిలో వైఎస్సార్సీపీ కార్యకర్త గండికోట హాజీబాషా అలియాస్ ఘోరా హాజీపై దాడి చేసి గాయపరిచిన ఘటనకు సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, అతని కుమారుడు, జేసీ అస్మిత్రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపారు. ఈ నెల 23న తాడిపత్రిలోని మూడో వార్డు పర్యటనకు వెళ్లిన అస్మిత్రెడ్డి, ఆయన అనుచరుడు ఖాదర్బాషా మరికొందరు.. అదే వార్డుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు దిగారు. అంతటితో ఆగకుండా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో హాజీబాషా తీవ్రంగా గాయపడ్డాడు. అతని ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్రెడ్డి, జేసీ అస్మిత్రెడ్డి, అనుచరులు ఖాదర్బాషా, ఫిల్టర్ బీడీ యజమాని అయూబ్తో పాటు మరో పది మంది టీడీపీ నేతలపై 147, 148, 307, 506 రెడ్విత్ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చదవండి: హైకోర్టు జడ్జీల బదిలీపై టీడీపీ యాగీ -
రెచ్చిపోయిన జేసీ వర్గీయులు.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్ల దాడి
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో జేసీ వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి జేసీ వర్గీయులు రాళ్ల దాడి చేశారు. కాగా, తాడిపత్రిలోని మూడో వార్డులో జేసీ వర్గీయులు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. రాళ్ల దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఇక, గాయపడిన కార్యకర్తలను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు. -
అలజడులు సృష్టించేందుకు జేసీ బ్రదర్స్ యత్నం..
తాడిపత్రి అర్బన్: తాడిపత్రి... ఈ పేరు వింటే ఒకప్పుడు ఫ్యాక్షన్ హత్యలు.. ముఠా పోరు.. విధ్వంసాలు.. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా దాడులు.. ప్రతీకార జ్వాలల్లో దహనమయ్యే గడ్డి వాములు, గుడిసెలు, గృహాలు కళ్ల ముందు మెదలాడుతాయి. ఆధిపత్య పోరులో ఓ వర్గం సాగించిన దౌర్జన్యానికి మూడు దశాబ్దాలుగా తాడిపత్రి పోలీస్ సబ్ డివిజన్ అతలాకుతలమైంది. తాడిపత్రి నియోజకవర్గంలో ఏ ఎన్నికల చరిత్ర చూసినా పచ్చని పల్లెల్లో అల్లకల్లోలమే ఆవిష్కృతమవుతుందనేది బహిరంగ రహస్యం. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తాడిపత్రిలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్ద పీట వేశారు. పోలీసు యంత్రాంగానికి పూర్తీ స్వేచ్ఛనిచ్చారు. దీంతో తాడిపత్రిపై ఇప్పటి వరకూ పడిన ఫ్యాక్షన్ ముద్ర కాస్త చెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో నెలకొన్న స్వేచ్ఛాయుత వాతావరణాన్ని చెడగొట్టి తమ ఆధిపత్యాన్ని కొనసాగించేలా జేసీ సోదరులు గ్రామాల్లో అలజడులు సృష్టించేందుకు తెరలేపారు. ఇందుకు ఇటీవల జేసీ సోదరుల సొంతూరు జూటూరులో జరిగిన దాడులే నిదర్శనం. జేసీ బ్రదర్స్ అడ్డాగా.. తాడిపత్రి పేరు వినగానే స్ఫురణకు వచ్చే పేరు జేసీ బ్రదర్స్ . 1982లో సమితి ప్రెసిడెంట్గా జేసీ దివాకర్రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి మండలాల్లోని పలు గ్రామాల్లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఫ్యాక్షన్కు బీజం వేశారు. తాడిపత్రి మండలం హుసేనాపురంలో గృహ దహనాలు, పెద్దపప్పూరు మండలం తురకపల్లి, తాడిపత్రి మండలం వెలమకూరు గ్రామాల్లో హత్యోదంతాలు, ఇతర గ్రామాల్లో జరిగిన ఫ్యాక్షన్ గొడవల్లో జేసీ సోదరుల ప్రమేయం ఉందన్న ఆరోపణలే ఇందుకు నిదర్శనం. 1985లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పెద్దపప్పూరు మండలంలోని పసులూరు గ్రామంలో మహిళల పోలింగ్ కేంద్రంలోకి జేసీ వర్గీయులు చొరబడి రిగ్గింగ్కు పాల్పడ్డారు. దీనిపై అప్పటి పోలింగ్ విధుల్లో ఉన్న విశ్రాంత సైనికోద్యోగి ఫిర్యాదు మేరకు అప్పటి ఎన్నికల ఇన్చార్జ్ దోతాంగే (ఐపియస్ అధికారి).. జేసీ దివాకర్రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత దీనిపై ఎలాంటి చర్యలూ లేవు. పోలీసు యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛ కలి్పంచక పోవడంతోనే అప్పట్లో జేసీ సోదరుల ఆగడాలు పెచ్చరిల్లిపోయాయన్న విమర్శలు వినిపించాయి. 2004 నుంచి హ్యాట్రిక్ విజయాలతో తాడిపత్రి అడ్డాగా కొనసాగుతున్న జేసీ సోదరుల ఆధిపత్యానికి 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయంతో చుక్కెదురైంది. సేవ్ తాడిపత్రి పేరుతో హైడ్రామా.. మూడు దశాబ్దాలుగా జేసీ సోదరుల ఆగడాలతో తాడిపత్రి వాసులు విలవిల్లాడారు. గ్రానైట్, ట్రాన్స్పోర్టు, మట్కా, పేకాట, కాంట్రాక్టులు, సిమెంటు ఫ్యాక్టరీలు... ఒకటేమిటీ తాడిపత్రిలో ప్రతిదీ ఆదాయ వనరుగా మార్చుకుని, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. ప్రతి ఒక్కరూ వీరికి కప్పం చెల్లించారు. కాదని ఎదురు మాట్లాడిన వారి ఇంటికి కరెంటు, నీటి సరఫరా నిలిపి వేశారు. మున్సిపాలిటీ వాహనంలో చెత్త తీసుకొచ్చి వారి ఇంటి ముందు పోసి కక్షసాధింపులకు దిగేవారు. అద్దె ఇంట నివాసమున్న వారిని తక్షణమే ఖాళీ చేయించేవారు. అధికారం కోల్పోయిన తర్వాత జేసీ సోదరుల నోటి నుంచి వెలువడుతున్న మాటలు, వారు ఉపయోగించిన భాషను చూసి ప్రతి ఒక్కరూ ఛీదరించుకున్నారు. ఈ క్రమంలోనే తిరిగి తమ పట్టు నిలుపుకునేందుకు తాజాగా ‘సేవ్ తాడిపత్రి’ పేరుతో జేసీ ప్రభాకరరెడ్డి కొత్త డ్రామాకు తెరలేపారు. పేరుకు సేవ్ తాడిపత్రి అయినా.. దీని వెనుక ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు జేసీ ప్రభాకరరెడ్డి సాగిస్తున్న ప్రయత్నాలను తాడిపత్రి వాసులు పసిగట్టారు. జేసీ సోదరుల ఆగడాలపై పెద్దారెడ్డి పోరు.. తాడిపత్రి వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా కేతిరెడ్డి పెద్దారెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జేసీ సోదరుల ఆగడాలపైనే పోరుబాట సాగిస్తూ వచ్చారు. దీంతో పెద్దారెడ్డిని అప్పట్లో ఇబ్బందులు పెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అక్రమంగా కేసులు మోపి, జైలుకు పంపించేందుకు ప్రయత్నించారు. అయినా పెద్దారెడ్డి వెనుకడుగు వేయక అలుపెరుగని పోరాటం చేశారు. ఇదే క్రమంలో గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు జేసీ సోదరులకు తగిన గుణపాఠం చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎమ్మెల్యేగా పట్టం కట్టారు. -
YSRCP నేతలపై కత్తులతో దాడిచేసిన జేసీ వర్గీయులు
-
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఈడీ ప్రశ్నల వర్షం
-
ఈడీ ఎదుట హాజరైన జేసీ ప్రభాకర్ రెడ్డి
-
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కీలక పురోగతి
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. జేసీ ట్రావెల్స్పై నమోదైన 33 కేసుల్లో ఛార్జిషీట్ సిద్ధం చేశారు. తాడిపత్రి, అనంతపురం కోర్టుల్లో ఛార్జిషీట్ను పోలీసులు దాఖలు చేయనున్నారు. టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య జేసీ ఉమారెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి, ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి సహా మొత్తం 23 మందిపై ఫోర్జరీ కేసు నమోదయిన సంగతి తెలిసిందే. చదవండి: వైఎస్సార్సీపీ నేత వేణుబాబుపై హత్యాయత్నం సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను స్క్రాప్ కింద జేసీ ట్రావెల్స్ కొనుగోలు చేసింది. నిషేధిత 154 బస్సులు, లారీలను ఫోర్జరీ డాక్యూమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారు. నకిలీ ఇన్వాయిస్, ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లతో బీఎస్-4 వాహనాలుగా చూపి అక్రమ రిజిస్ట్రేషన్కు జేసీ ప్రభాకర్రెడ్డి పాల్పడ్డారు. నాగాలాండ్ రాష్ట్రం కోహిమా ఆర్టోవో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆధారాలతో సహా కోర్టులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు. -
పొలిటికల్ కారిడార్ : వివాదాల మధ్యనే జీవిస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి
-
‘ప్రభ’ తొలగి.. పన్నాగాలు.. ఉనికి కాపాడుకునేందుకు జేసీ ప్రభాకర్రెడ్డి పాట్లు
♦టీడీపీ హయాంలో జిల్లాలో పనిచేసిన మైనింగ్ ఏడీ నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తుండేవారు. తమ గ్రానైట్ దోపిడీకి ఏడీ అడ్డు తగులుతున్నారని జేసీ సోదరుల (దివాకర్రెడ్డి – ప్రభాకర్రెడ్డి) ప్రధాన అనుచరుడు ఎస్.వి.రవీంద్రారెడ్డితో ఏడీని తీవ్రస్థాయిలో బెదిరించారు. లారీలతో గుద్ది చంపుతామని బెదిరించడమే కాకుండా అవినీతి మరకలంటించారు. చదవండి: సైకోలా అయ్యన్న తీరు ♦ఇటీవల బదిలీపై వెళ్లిన తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డిని కూడా ప్రభాకర్రెడ్డి టార్గెట్ చేశారు. చీటికిమాటికి.. అయినదానికి కానిదానికి బ్లాక్మెయిల్ చేశారు. మున్సిపల్ కార్యాలయ పరిపాలనా విభాగాల సిబ్బందిపైనా నోరు పారేసుకున్నారు. ♦తాజాగా డీఎస్పీ వీఎన్కే చైతన్య శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండడంతో జేసీ ప్రభాకర్రెడ్డికి మింగుడు పడటం లేదు. సోషల్ మీడియా వేదికగా డీఎస్పీపై విమర్శలు గుప్పిస్తూ అవినీతి మరక అంటించేందుకు సిద్ధమయ్యారు. ♦అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా తన పనులు సజావుగా, సాఫీగా చేసుకునేందుకు జేసీ ప్రభాకర్రెడ్డి కుట్రలకు తెరలేపుతున్నారు. మాట వినని అధికారులను, పోలీసులను బెదిరించడం, వారి బంధువులకు వార్నింగ్ ఇవ్వడం చేస్తున్నారు. తాడిపత్రి అర్బన్: కళ్లు పెద్దవి చేస్తూ.. ఆవేశంతో ఊగిపోతూ.. నోటి దురుసుతో రాజకీయ నాయకులను రెచ్చగొట్టడం.. అధికారులు, ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతీయడం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి నైజం. ఆయన వ్యవహార శైలి నచ్చక అనుచరులు ఒక్కొక్కరుగా టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. దీంతో నిరాశానిస్పృహలకు లోనైన ప్రభాకర్రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. తాడిపత్రిలో తన ప్రాభవం కనుమరుగైపోతుండటంతో తిరిగి పట్టు సాధించుకునేందుకు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. తాను చైర్మన్ అని, మున్సిపల్ పరిధిలోని వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని, అధికారులందరూ తాను చెప్పినట్లే వినాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఈయన అహంకార ధోరణితో అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కుదిరితే బేరం.. లేకుంటే బ్లాక్మెయిల్ జేసీ ప్రభాకర్రెడ్డి తాను చెప్పిన పనులు చేయించుకోవడం కోసం అధికారులతో మొదట బేరానికి వెళ్లడం.. కుదరకపోతే బ్లాక్మెయిల్ చేయడం సర్వసాధారణం. ముందుగా తన అనుచరులతో అధికారులకు ఫోన్ చేయించి, వారి ద్వారా నజరానాలు పంపి బేరం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. అధికారులు వాటిని తిరస్కరిస్తే ఇక తనదైన శైలిలో బెదిరింపులకు దిగుతారు. దీంతో నిక్కచ్చిగా పనిచేసే అధికారులు జేసీ తీరుతో ఇబ్బంది పడుతున్నారు. అధికారుల బంధువులకు బెదిరింపులు! అధికారుల వద్ద తన ఆటలు సాగవని తెలుసుకున్న ప్రభాకర్రెడ్డి.. అధికారుల బంధువులు ఎవరున్నారు.. వారు ఎక్కడ ఉంటున్నారన్న సమాచారం సేకరించి వారిని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. తాడిపత్రి సబ్డివిజన్లో పని చేస్తున్న ఓ ఎస్ఐ సమీప బంధువు వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం నక్కలపల్లిలో ఉంటున్నారు. మూడ్రోజుల క్రితం ఆ ఎస్ఐ బంధువుకు జేసీ అనుచరుడు మల్లికార్జునరెడ్డి ఫోన్ చేసి ‘మీవాడు హద్దు మీరి ప్రవర్తిస్తున్నాడు.. జాగ్రత్తగా ఉండమ’ని హెచ్చరించినట్లు సమాచారం. ఇందుకు ఆ ఎస్ఐ బంధువు భయపడకుండా దీటుగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. •సబ్ డివిజన్లో పనిచేస్తున్న ఎస్ఐలు, వారి బంధువుల వివరాలను సేకరిస్తున్నారు. ఆ తర్వాత వారు సివిల్ పంచాయితీలు చేసి లంచాలు తీసుకుంటున్నారని సోషల్ మీడియా వేదికగా నిరాధార ఆరోపణలు చేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. •ఇటీవల ఓ సీఐని బెదిరించినట్లు తెలిసింది. ‘నా అనుచరులపై దాడి చేస్తే మేం కూడా వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై దాడి చేస్తాం...మీరేమి చేస్తారో చూస్తాం’ అని ఆ సీఐని ఫోన్లో బెదిరించినట్లు సమాచారం. •గన్నెవారిపల్లి కాలనీలో ఇటీవల ప్రభుత్వ అనుమతులు లేకుండానే జేసీ అనుచరులు భూగర్భ డ్రెయినేజీ మరమ్మతు పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి అడ్డుకోవడంతో జేసీ ప్రభాకర్రెడ్డి ఆగ్రహించారు. వారికి ఫోన్ చేసి ‘నా మనుషులు చేసే కాంట్రాక్టు పనులను అడ్డుకుంటారా!’ అంటూ బూతులు తిట్టినట్లు తెలిసింది. దీంతో అధికారులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. •మున్సిపల్ ఎన్నికల్లో మొసలి కన్నీరు కార్చిన జేసీ ప్రభాకర్రెడ్డికి అధికారం కట్టబెడితే ఇలా అధికారులపై బెదిరింపులకు దిగడమేంటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
కుట్రలు 'జేసీ'.. డీఎస్పీని టార్గెట్ చేసిన జేసీ ప్రభాకర్రెడ్డి
పోలీసులపై పెత్తనం చేసేందుకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి కుట్రలకు తెరలేపారు. ముఖ్యంగా డీఎస్పీ వీఎన్కే చైతన్యను టార్గెట్ చేశారు. నజరానాలకు లొంగకుండా, పొగడ్తలకు పొంగిపోకుండా నక్కచ్చిగా విధులు నిర్వర్తిస్తున్న డీఎస్పీని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అనుచరులతో ప్రైవేటు కేసులు పెట్టిస్తున్నారు. డీఎస్పీ లక్ష్యంగా జేసీ ప్రభాకర్రెడ్డి సాగిస్తున్న కుయుక్తులను నియోజకవర్గ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. సాక్షి, తాడిపత్రి: అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా పోలీసులను గుప్పిట్లో పెట్టుకునేందుకు జేసీ సోదరులు ప్రయత్నిస్తున్నారు. చెప్పినట్టు నడుచుకునే వారుంటే తమ రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కవచ్చనేది వారి ఆలోచన. ఇందు కోసం శాంతిభద్రతలకు సైతం విఘాతం కలిగిస్తున్నారు. తాజాగా డీఎస్పీ వీఎన్కే చైతన్యను తమ వైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి కుట్రలకు తెర లేపారు. సోషల్ మీడియా వేదికగా ప్రభాకర్రెడ్డి చేసిన ఆరోపణలు, దూషణలను చూస్తే డీఎస్పీని బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా జేసీ సోదరులు తమ మాట వినని పోలీసు అధికారులను దారిలోకి తెచ్చుకునేందుకు అనుచరులతో ప్రైవేటు కేసులు వేయించారు. ప్రబోధాశ్రమ ఘటనలో మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ఏకంగా పోలీస్ స్టేషన్కు తాళం వేసి.. పోలీసులు చేతకాని వాళ్లంటూ అప్పటి డీఎస్పీ విజయ్కుమార్పై నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. 2010–11లో జేసీ సోదరుల ప్రధాన అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి అలియాస్ పొట్టి రవికి అప్పటి ఎస్పీ ఎంకే సిన్హా కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన జేసీ సోదరులు పొట్టి రవితో ఎస్పీపై ప్రైవేటు కేసు వేయించారు. అదే పంథానే ఇప్పుడూ జేసీ సోదరులు కొనసాగిస్తున్నారు. తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామంలో 2018 సెప్టెంబర్ 15న వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘర్షణలకు సంబంధించి మాజీ ఎంపీ జేసీపై పోలీసులు మొదట్లో కేసు నమోదు చేయలేదు. కానీ ఎస్సీ, ఎస్టీ సెల్ అధికారి ఆంథోనప్ప అప్పటి వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించి, నిందితుల వాంగ్మూలం మేరకు మాజీ ఎంపీపైనా కేసు నమోదు చేసి, చార్జ్షీట్లో పేరు పొందుపరిచారు. ఈ కేసుకు సంబంధించి తన అన్నను ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో ప్రస్తుత డీఎస్పీ చైతన్యపై జేసీ ప్రభాకర్రెడ్డి ఆరోపణలకు దిగారు. అంతేకాకుండా జఠాధర ఇండస్ట్రీస్కు సంబంధించిన వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై దర్యాప్తు కోసం డీఎస్పీ చైతన్య ఈ ఏడాది జూలైలో నాగాలాండ్ వెళ్లారు. అక్కడ వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్కు సంబంధించిన డాక్యుమెంట్లను సేకరించారు. ఈ కేసులో చార్జ్షీట్ వేయడంతో పాటు ఈడీ విచారణకు సహకరిస్తే తన కుమారుడు జేసీ అస్మిత్రెడ్డి జైలుకు వెళతారన్న భయంతో డీఎస్పీపై తన అనుచరులతో ప్రైవేట్ కేసులు వేయిస్తూ బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు శాంతిభద్రతల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించారని, పార్టీలకతీతంగా విధులు నిర్వర్తించారని డీఎస్పీని ప్రశంసించిన ప్రభాకర్రెడ్డి ఇప్పుడు ఆయనపైనే ప్రైవేటు కేసులు పెట్టిస్తుండడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. జేసీ ప్రభాకర్ ఆగడాలకు నిదర్శనాలివిగో... ట 2020 డిసెంబర్ 12న టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన కేసులో జేసీ ప్రభాకర్రెడ్డి తనయుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ జేసీ అస్మిత్రెడ్డి ప్రధాన నిందితుడు. ఈ కేసులో ఎక్కడ తన కుమారుడిని అరెస్టు చేస్తారోనన్న భయంతో ప్రభాకర్రెడ్డి ఎలాగైనా పోలీసులను తన దారికి తెచ్చుకోవాలని బ్లాక్మెయిల్, కుట్రలకు దిగినట్లు తెలుస్తోంది. ►తాడిపత్రి పట్టణంలోకి పోలీసులు అనుమతించలేదని జేసీ సోదరుల ప్రధాన అనుచరుడు పొట్టి రవితో గత ఏడాది జూన్ 22న డీఎస్పీపై హైకోర్టులో ప్రైవేటు కేసు వేయించారు. ►ఈ ఏడాది జూన్ 11న గన్నెవారిపల్లి కాలనీలోని ఎస్టీపీ వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య ఘర్షణకు సంబంధించి డీఎస్పీ చైతన్య తనను స్టేషన్కు పిలిపించి కొట్టి, కులం పేరుతో దూషించాడని తాడిపత్రి పట్టణంలోని 30వ వార్డు టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జునతో ఈ నెల 23న కోర్టులో ప్రైవేట్ కేసు వేయించారు. ఏకంగా కోర్టు ప్రాంగణంలోనే ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. డీఎస్పీపై ఆరోపణలు చేయడం గమనార్హం. ►ఇటీవల యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామంలో యానిమేటర్ పోస్టు విషయంలో వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై జఠాధర ఇండస్ట్రీస్ యజమాని చవ్వా గోపాల్రెడ్డి అనుచరులు గొజ్జుల రాజు, గొజ్జుల సింహాద్రి, మరికెల రాజు తదితరులు దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు యాడికి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను స్టేషన్కు పిలిపించి నోటీసులు జారీ చేసి ఇంటికి పంపించారు. అయితే దీన్ని ప్రభాకర్రెడ్డి వక్రీకరించారు. సదరు నిందితులను తన ఇంటికి పిలిపించుకుని మీడియా ఎదుట తప్పుడు ఆరోపణలు చేయించారు. విచారణ పేరుతో పోలీసులు తమను కొట్టారంటూ వారితో చెప్పించారు. అంతేకాకుండా ఈ ఏడాది సెప్టెంబర్ 6న వారితో స్థానిక కోర్టులో ప్రైవేటు కేసు వేయించారు. నాగాలాండ్లో వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో చార్జ్షీట్ వేయకుండా పక్కదారి పట్టించేందుకు ఇలా చేసినట్లు విమర్శలు ఉన్నాయి. ►ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా పెన్నా నది సమీపాన పార్కులో వినాయక మండపం ఏర్పాటుకు అనుమతివ్వాలని జేసీ ప్రభాకర్రెడ్డి కోరగా.. మున్సిపల్ స్థలంలో ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదని డీఎస్పీ నిరాకరించారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా ప్రభాకర్రెడ్డి డీఎస్పీపై నోరుపారేసుకున్నారు. ►శింగనమల నియోజకవర్గం పుట్లూరులో కొందరు టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ వర్గీయులకు చెందిన వ్యవసాయ పొలంలోకి వెళ్లి మద్యం తాగారు. అభ్యంతరం తెలిపిన వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడికి పాల్పడిన టీడీపీ వర్గీయులపై పుట్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనలో వైఎస్సార్సీపీ వర్గీయులపైనా కేసులు నమోదు చేయాలంటూ ఎ.కొండాపురానికి చెందిన చంద్ర దండు నాయకుడు ప్రకాష్నాయుడు ఈ నెల 23న పుట్లూరు ఎస్ఐకి వ్యతిరేకంగా పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ వ్యవహారాన్ని కూడా జేసీ ప్రభాకర్రెడ్డి తనకు అనుకూలంగా మలచుకుని ప్రకాష్నాయుడును పోలీసులపై ఉసిగొల్పినట్లు తెలిసింది. మాట వినలేదని వైరం మున్సిపల్ ఎన్నికల అనంతరం పోలీసుల తీరును, ప్రత్యేకంగా డీఎస్పీ వీఎన్కే చైతన్య కృషిని ప్రశంసించే నెపంతో జేసీ ప్రభాకర్రెడ్డి రాయబారం నెరిపారు. తన ప్రధాన అనుచరునితో బంగారు బిస్కెట్లను నజరానాగా పంపగా.. డీఎస్పీ సున్నితంగా తిరస్కరించడమే కాక తనదైన శైలిలో ‘వార్నింగ్’ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం తనకు ఫేవర్ చేయాలని మాంసాహార వంటకాల క్యారేజీలతో నెరిపిన రాయబారమూ ఫలించలేదు. రాయబేరాలు, పైరవీల కోసం మరోసారి తన కార్యాలయానికి వస్తే కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించడాన్ని ప్రభాకర్రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి వైరం మొదలైంది. చైతన్య ఇక్కడ ఉంటే తమ ఆటలు సాగవని.. ఎలాగైనా పంపించేయాలని కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు. డీఎస్పీకి వ్యతిరేకంగా ప్రెస్మీట్లు పెట్టాలని ఒత్తిడి ‘మా నాన్న నారాయణ 2021 ఆగస్టు రెండో తేదీన ఆస్పత్రిలో గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే నాన్న మృతికి కుళ్లాయప్ప, నారాయణ, నాగరాజులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మూడో తేదీ పెద్దపప్పూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరుగుతుండగానే.. సోమవారం ఓ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. ‘మీ నాన్న విషయంలో నీకు న్యాయం జరగలేదు.. డీఎస్పీకి వ్యతిరేకంగా ప్రెస్మీట్ పెట్టాల’ని ఒత్తిడి తెచ్చి బెదిరించాడు. ఇదే విషయాన్ని డీఎస్పీ దృష్టికి తీసుకొచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను’. – నాగేంద్ర, సోమనపల్లి, పెద్దపప్పూరు మండలం కౌన్సిలర్ మల్లికార్జున ఫోన్ నుంచి కాల్ పెద్దపప్పూరు మండలం సోమనపల్లికి చెందిన నాగేంద్ర తనకు వచ్చిన ఫోన్ కాల్ బెదిరింపుపై డీఎస్పీ చైతన్యకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆదేశాల మేరకు నాగేంద్రకు వచ్చిన ఫోన్ కాల్ను ట్రేస్అవుట్ చేయగా అది జేసీ ప్రభాకర్రెడ్డి అనుచరుడైన తాడిపత్రి 30వ వార్డు టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జునకు చెందిన ఫోన్ నంబర్గా తేలింది. ఇటీవల కౌన్సిలర్ మల్లికార్జున.. డీఎస్పీపై ప్రైవేటు కేసు వేశారు. సంబంధం లేని వారిని బెదిరించి ప్రెస్మీట్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్న కౌన్సిలర్ మల్లికార్జునపై కేసు నమోదు చేశాం. – ఖాజాహుసేన్, ఎస్ఐ తప్పుడు కేసులకు భయపడం బెదిరింపులు, కోర్టుల్లో తప్పుడు కేసులకు పోలీసులు భయపడరు. జేసీ ప్రభాకర్రెడ్డి విమర్శించినా, పొగడ్తలతో ముంచెత్తినా చట్ట ప్రకారమే మేం విధులు నిర్వర్తిస్తాం. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే సంయమనంతో ఉన్నాం. ప్రజల ప్రశాంత జీవనానికి ఎవరు భంగం కల్గించినా కఠిన చర్యలు తీసుకుంటాం. తప్పుడు కేసులకు భయపడితే పోలీసులు ఉద్యోగం చేయలేరు. – వీఎన్కే చైతన్య, డీఎస్పీ -
త్రిశూల్ పేరుతో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బాగోతం
-
తాడిపత్రి పెన్నా నదిలో చిక్కుకున్నవ్యక్తి సేఫ్
-
టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో వాహనాల రిజిస్ట్రేషన్లపై ఆరా తీశారు. స్క్రాప్ కింద వాహనాలు కొనుగోలు చేసి నకిలీ ఇన్వాయిస్తో జేసీ ట్రావెల్స్ నాగాలాండ్లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసింది. సుమారు వందకు పైగా వాహనాలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు. జేసీ ముఖ్య అనుచరడు చవ్వా గోపాల్రెడ్డి ఇంట్లోనూ ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. చదవండి: (కర్నాటకలో ఏసీబీ అధికారుల సంచలనం) -
పచ్చనేతల బరితెగింపు
తాడిపత్రి అర్బన్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో పచ్చ నేతలు మరోసారి బరితెగించారు. అభివృద్ధి పనులు చేసేందుకు వెళ్లిన వారిపై తెలుగుదేశం పార్టీకి చెందిన జేసీ బ్రదర్స్ వర్గీయులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఓ కౌన్సిలర్కు, వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గత పాలకులు, కాంట్రాక్టర్ల నిర్వాకం వల్ల ఎస్టీపీ – 1కు వెళ్లే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులైన్లు పాడయ్యాయి. తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. వీటిని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రత్యేక చొరవతో మరమ్మతులు చేయిస్తున్నారు. శనివారం ఎస్టీపీ–1 వద్ద మరమ్మతు పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. 31వ వార్డు కౌన్సిలర్ కేతిరెడ్డి హర్షవర్ధన్రెడ్డి, 35వ వార్డు కౌన్సిలర్ రాఘవేంద్రతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, మరమ్మతులు చేసే సిబ్బంది పనులు ప్రారంభించేందుకు ఉదయం అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఎస్టీపీ – 1 వద్దకు కొందరు టీడీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు చేరుకున్నారు. వారి వద్ద సరైన సామగ్రి లేకుండానే పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ఫొటోలకు పోజులిచ్చారు. అంతటితో ఆగకుండా టీడీపీ కౌన్సిలర్లు మల్లికార్జున, విజయ్, జింకా లక్ష్మిదేవితో పాటు ఆ పార్టీ నేతలు పప్పూరు రఘునాథరెడ్డి, మల్లికార్జునరెడ్డి కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ వర్గీయుల దాడిలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ రాఘవేంద్ర, కార్యకర్త సునీల్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఉన్న రూరల్ సీఐ చిన్నపెద్దయ్య, పోలీసు సిబ్బంది ఇరువర్గాలను చెదరగొట్టారు. కాగా ఈ దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ దళిత నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. జేసీ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఓటమిని జీర్ణించుకోలేక కక్ష సాధింపు చర్యలు గత సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో ఓడిపోయిన జేసీ కుటుంబీకులు ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న తపనతో ఇప్పటి నుంచే కక్షలు, గొడవలకు ఆజ్యం పోస్తున్నారని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా జేసీ ప్రభాకర్రెడ్డి తన వర్గీయులను రెచ్చగొడుతూ వైఎస్సార్సీపీ మద్దతుదారులపై దాడులకు పాల్పడుతున్నారు. -
రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు.. పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని..
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్సీపీ నాయకుడికి చెందిన ట్రాన్స్పోర్టు కార్యాలయం, ఇంటిపై దాడికి తెగబడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం పట్టణంలోని పెన్నా బ్రిడ్జి వంతెన సమీపంలోని మామిడి తోటలో వేణుగోపాల్, వలి, దస్తగిరి అనే ముగ్గురు వ్యక్తులు మద్యం సేవిస్తున్నారు. అదే తోటలో వారికి సమీపంలోనే టీడీపీ కార్యకర్తలు దుబ్బ జాఫర్, హాజీవలితో పాటు మరికొంత మంది కూడా మద్యం తాగుతున్నారు. ఈ సందర్భంగా హాజీవలి మామిడి కొమ్మలు విరుస్తుండగా వలి అడ్డుపడ్డాడు. వీరిద్దరి మధ్య వాగ్వాదం మొదలై గొడవకు దారి తీసింది. ముగ్గురు వ్యక్తులను టీడీపీ కార్యకర్తలు చితకబాదారు. అంతటితో ఆగకుండా పలు సందర్భాల్లో వారికి మద్దతుగా ఉంటాడనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ నాయకుడు షబ్బీర్ అలియాస్ గోరాతో గొడవ పడేందుకు ఆయన ట్రాన్స్పోర్టు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ షబ్బీర్ లేకపోవడంతో గుమాస్తాగా పనిచేస్తున్న ఖాజాపై దాడి చేశారు. ఫర్నీచర్, టీవీ, కంప్యూటర్లు, అద్దాలను పగులగొట్టారు. అంతేగాక సంజీవనగర్లోని షబ్బీర్ ఇంటిపైనా రాళ్ల దాడికి తెగబడ్డారు. అక్కడా ఆయన లేకపోవడంతో టాటా సఫారీ వాహనాన్ని ధ్వంసం చేశారు. అలాగే కాల్వగడ్డలోని సుల్తాన్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్త ఇంటిపైనా దాడికి దిగారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ చైతన్య, సీఐ కృష్ణారెడ్డి, ఎస్ఐ ధరణీబాబు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దాడికి పాల్పడిన దుబ్బ జాఫర్తో పాటు ఫరీద్, దాదు, రహంతుల్లా, ఇలియాస్, హాజీవలితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. బాధితుల్ని పరామర్శిస్తున్న వైఎస్సార్సీపీ నాయకుడు కేతిరెడ్డి హర్షవర్ధన్రెడ్డి బాధితులకు పరామర్శ పార్టీ నాయకుడు షబ్బీర్కు చెందిన ట్రాన్స్పోర్టు కార్యాలయం, నివాసంపై దాడి విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు కేతిరెడ్డి హర్షవర్ధన్రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రమేష్రెడ్డి, కౌన్సిలర్ ఫయాజ్బాషా తదితరులు వెళ్లి బాధితుల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. -
దేవుడా...జేసీకి మంచి బుద్ధి ప్రసాదించు!
సాక్షి, తాడిపత్రి అర్బన్: దేవుడా..జేసీ ప్రభాకర్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని మీడియా సాక్షిగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దేవుడిని వేడుకున్నాడు. మంగళవారం స్థానిక బండా మసీద్ దగ్గర ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జేసీ ప్రభాకర్రెడ్డి తరచూ విలేకర్లు, పోలీసులు, అధికార పార్టీ నాయకులపై ఆరోపణలు చేస్తూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏడుపులు, పెడబొబ్బలు, అలవిగాని హామీలు ఇచ్చి చైర్మన్ పీఠం దక్కించుకున్నాడన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దయ, పోలీసుల చొరవతో చైర్మన్ అయ్యాను అని చెప్పిన జేసీకి ఇప్పుడు పోలీ సులు దుర్మార్గుల్లా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. మున్సిపల్ పార్కుకు మాత్రమే చైర్మనా... జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఉన్నారా...లేక పెన్నానది ఒడ్డున ఉన్న మున్సిపల్ పార్కుకు మాత్రమే చైర్మన్గా ఉన్నారా? అని ఎమ్మెల్యే నిలదీశారు. మున్సిపల్ పార్కులో ఆదివారం శ్రీరామనవమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించడాన్ని జీర్ణించుకోలేని జేసీ ప్రభాకర్రెడ్డి.. సోమవారం సాయంత్రం పార్కులో చెత్తసేకరణ కార్యక్రమం ద్వారా ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశాడన్నారు. గతంలో ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇచ్చిన పట్టాలను తన అనుచరుల వద్ద ఉంచుకొని, ఇప్పుడు పంపిణీ చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. స్వార్థ రాజకీయాలకోసం మాయమాటలు చెప్తున్న జేసీ ప్రభాకర్రెడ్డిని నమ్మొద్దని ప్రజలకు పెద్దారెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలను గుర్తించి పట్టాలు ఇవ్వడంతో పాటు ఇళ్లు కూడా నిర్మిస్తోందన్నారు. చదవండి: (నాగసులోచనా నన్ను క్షమించు..!.. నేను బాధపడుతూ నిన్ను మరింత బాధపెట్టలేను) స్టేషన్లకు తాళాలు వేసే సంస్కృతి మాది కాదు జేసీ సోదరులు అధికారంలో ఉన్నప్పుడు తాడిపత్రి ప్రాంతంలో చేయని దాష్టీకాలు లేవని ఎమ్మెల్యే విమర్శించారు. తాడిపత్రి ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లకు వెళ్లి అధికారులను అసభ్యంగా మాట్లాడుతూ స్టేషన్లకు తాళాలు వేసిన సంస్కృతి జేసీ సోదరులదేనన్నారు. దౌర్జన్యంగా షాపులను మూసి వేయించడం, మట్కా కేంద్రాలు నిర్వహించడం లాంటివీ చేసిన జేసీ ప్రభాకర్రెడ్డి.. మీడియా ముందుకొచ్చి అన్యాయాలు, అక్రమాలపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అన్యాయాలు, అక్రమాలపైన పోలీసు స్టేషన్సర్కిల్లో బహిరంగ చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. -
ఆ రోజు ఊరంతా ఖాళీ!... దశాబ్దాలుగా సాగుతున్న ఆచారం
అనంతపురం(తాడిపత్రి రూరల్): శతాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్న ఆచారాన్ని పాటిస్తూ బుధవారం సూర్యుడు ఉదయించక ముందే తాడిపత్రి మండలం తలారి చెరువు మొత్తం ఖాళీ అయింది. ‘అగ్గి పాడు’ ఆచారం పేరుతో ఇంటిలోని విద్యుత్ దీపాలను పూర్తిగా ఆర్పి, నిప్పు సైతం వెలిగించలేదు. పశువుల పాక ల్లోని పేడకళ్లతో పాటు ఇళ్లలోని కసువూ శుభ్రం చేయలేదు. కట్టెలు, వంట సామగ్రి, పాత్రలను మూటగట్టుకుని ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, ఎద్దుల బండ్లపై వేసుకుని, ఇళ్లకు తాళం వేసి దర్గా వద్దకు చేరుకున్నారు. రాత్రి వరకూ అక్కడే ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. చీకటి పడిన తర్వాత ఇళ్లకు చేరుకుని ఆరుబయటనే భోజనాలు ముగించారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్రతి ఇంటి గడపకూ టెంకాయ కొట్టి లోపలకు ప్రవేశించారు. దాదాపు 400 సంవత్సరాలుగా ఈ ఆనవాయితీని పాటిస్తూ వస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇలా చేయడం వల్ల కరువు కాటకాలు తొలగిపోతాయని గ్రామస్తుల నమ్మకం. -
రూపాయికే దోసె.. ఎర్రకారం, బొంబాయి చట్నీ.. ఎక్కడో తెలుసా..?
హోటల్లో దోసె తినాలంటే రూ.20 నుంచి రూ.50లోపు వెచ్చించాలి. అయితే ఓ వృద్ధురాలు రూపాయికే దోసె విక్రయిస్తూ సామాన్యుల కడుపు నింపుతోంది. ఎర్రకారం, బొంబాయి చట్నీతో దోసె తింటుంటే ఎంతో రుచికరంగా ఉంటోందని స్థానికులు అంటున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నా రూపాయికే దోసె విక్రయిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది తాడిపత్రికి చెందిన సావిత్రమ్మ అనే వృద్ధురాలు. తనకు కూలి గిట్టుబాటు అయితే చాలు పెద్దగా లాభాపేక్ష ఏమీ లేదని చెబుతోంది. తాడిపత్రి టౌన్(అనంతపురం జిల్లా): తాడిపత్రి పట్టణం కాల్వగడ్డ వీధికి చెందిన వెంకట్రామిరెడ్డి, సావిత్రమ్మ దంపతులు. వీరికి చంద్రశేఖర్రెడ్డి, లక్ష్మీదేవి, సరళ సంతానం. 40 ఏళ్ల కిందట వెంకట్రామిరెడ్డి టీ బంకు పెట్టుకుని జీవనం సాగించేవాడు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటుందని వెంకట్రామిరెడ్డి భార్య సావిత్రమ్మ ఇంటి వద్ద బంకు ఏర్పాటు చేసుకుని దోసెలు వేయడం మొదలు పెట్టింది. ప్రారంభంలో దోసె ధర పావలా. అలా దోసెలు వేసి అమ్మగా వచ్చిన సంపాదనను కుటుంబానికి, పిల్లల చదువులకు ఖర్చు చేసింది. వీధిలోని వారు, చుట్టుపక్కల పేదలు, విద్యార్థులు, పిల్లలు అధిక సంఖ్యలో ఈ దోసెలు తినేవారు. చదవండి: నెట్ సెంటర్లో వెబ్ వాట్సాప్ లాగౌట్ చేయని మహిళ.. చివరికి.. 15 ఏళ్ల తరువాత బియ్యం, వంట నూనె ధరలు పెరగడంతో దోసె ధరను 50 పైసలకు పెంచి వ్యాపారం కొనసాగించింది. తరువాత కొన్నాళ్లకు భర్త అనారోగ్యం బారిన పడి మృతి చెందాడు. కుటుంబ పోషణ భారం మొత్తం సావిత్రమ్మపైనే పడింది. తన సంపాదనతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ఇటీవల కాలంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడంతో దోసె ధరను రూపాయికి పెంచింది. ఎర్రకారం, బొంబాయి చట్నీ కాంబినేషన్లో దోసె ఎంతో రుచికరంగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం సావిత్రమ్మ వయసు 70 సంవత్సరాలు. కొడుకు, కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి సంతోషంగా జీవనం గడుపుతోంది. పేదలు, సామాన్యులకు అతి తక్కువ ధరలో దోసె విక్రయిస్తూ కడుపు నింపుతున్నానన్న ఆనందం చాలని అంటోంది. చాలా రుచిగా ఉంటాయి నేను ఆరో తరగతి చదువుతున్నప్పటి నుంచి సావిత్రమ్మ అవ్వ దగ్గర దోసెలు తింటున్నాను. నూనె, బియ్యం ధరలు పెరిగినప్పటికీ పేదలకు అందుబాటులో రుచిరకంగా ఆతీ్మయంగా దోసెలు అమ్ముతోంది. కాలనీలో దోసెల అవ్వ అంటే తెలియని వాళ్లు ఉండరు. – జబ్బార్ బాషా, కాల్వగడ్డ, తాడిపత్రి -
ఫంక్షన్హాల్లో శుభకార్యం.. పోలీసులొస్తున్నారని మేడపై నుంచి దూకి...
తాడిపత్రి(అనంతపురం జిల్లా): పేకాటరాయుడు సాహసం చేశాడు. పోలీసులు వస్తున్నారంటూ మేడపై నుంచి కిందకు దూకేశాడు. పోలీసులు తెలిపిన మేరకు.. తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డు పద్మావతి ఫంక్షన్ హాల్లో ఆదివారం ఓ శుభకార్యానికి హాజరైన వారిలో సుమారు 70 మంది పేకాటలో నిమగ్నమయ్యారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. చదవండి: పోర్న్ భూతం: అరచేతిలో ‘అశ్లీలం’.. పోలీసుల రాకను గమనించిన రైల్వే కొండాపురం మండలం కోనవారిపల్లికి చెందిన శేఖరరెడ్డి.. వెంటనే చేతిలోని పేకముక్కలు పక్కన పడేసి ఫంక్షన్ హాల్ పైగది నుంచి కిందకు దూకాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిని శేఖరరెడ్డిని స్థానికులు చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. దిక్కుకొకరు చొప్పున పరారైన మిగిలిన వారిలో ఐదుగురిని గుర్తించి గ్యాంబ్లింగ్ యాక్ట్ మేరకు కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ చైతన్య తెలిపారు. -
వంద ఎల్లో చానళ్లు వచ్చినా ఆ కుటుంబంతో బంధాన్ని విడదీయలేవు
సాక్షి, యల్లనూరు: ‘పచ్చ కామెర్లు వచ్చిన వాళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట! అలా ఉంది ఏబీఎన్ చానల్ తీరు. తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి మోసాల గురించి నేను మాట్లాడిన మాటలను సీఎం జగన్ మోహన్రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినట్లు ఆపాదించడం ఎంత వరకు సమంజసం’ అని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. సోమవారం ఏబీఎస్ చానల్లో ప్రసారమైన కథనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. యల్లనూరు మండలం తిమ్మంపల్లిలోని స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఆదివారం తాడిపత్రి ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ఆసరా సంబరాల్లో డ్వాక్రా మహిళలకు జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించానన్నారు. అదే సమయంలో జేసీ ప్రభాకర్రెడ్డి ప్రజలకు చేసిన మోసాల గురించి కూడా చెప్పానన్నారు. అయితే.. జేసీ ప్రభాకర్రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన మాటలను సీఎం గురించి మాట్లాడినట్లు ఆపాదించి.. తల, తోక లేని వీడియో క్లిప్పింగులను జత చేసి ఏబీఎన్ చానల్లో ప్రసారం చేయడం శోచనీయమన్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వీడియోను ప్రసారం చేయాలని, అందులో తమ నాయకుడు వైఎస్ జగన్ పై తాను విమర్శలు చేసినట్లు ఉంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని, లేకపోతే ఏబీఎన్ చానల్ను మూసేసుకోవడానికి సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఏబీఎన్లో ప్రసారమైన అసత్య కథనంపై చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. చదవండి: (పోలీసులపై నక్కా ఆనందబాబు జులం) వంద చానళ్లు వచ్చినా వేరు చేయలేవు.. ‘వైఎస్ కుటుంబం పట్ల కేతిరెడ్డి కుటుంబాలు ఏళ్లుగా విధేయత చూపుతున్నాయి. సాధారణ ఎన్నికల సమయంలో నా ఆరోగ్య పరిస్థితి బాగో లేకపోయినా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాపై నమ్మకంతో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. నాపై అంతటి నమ్మకం పెట్టుకున్న వ్యక్తిపై నేను విమర్శలు చేసినట్లు అసత్య కథనాన్ని ప్రసారం చేయడం చాలా బాధ కలిగించింది. ఏబీఎన్ లాంటి వంద ఎల్లో చానళ్లు కలసి కట్టుగా పని చేసినా మా కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని వేరు చేయలేవు’ అని ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కంచం రామ్మోహన్ రెడ్డి, నాయకులు శివారెడ్డి, ఆర్సీ ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు. -
జీవితం నాశనం.. ఆన్లైన్ గేమ్స్ రీచార్జ్ కోసం..
సాక్షి,తాడిపత్రి: ఆన్లైన్ గేమ్స్ ఓ చిన్నారి భవితను నాశనం చేశాయి. గేమ్స్ ముందుకు సాగేందుకు అవసరమైన రీచార్జ్ డబ్బుకోసం ఏకంగా దొంగను చేశాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వీఎస్కే చైతన్య తెలిపారు. ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడిన నార్పలకు చెందిన ఓ బాలుడు 8వ తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పాడు. నిరంతరం ఆన్లైన్ గేమ్స్ ఆడేవాడు. అయితే ముందుకు వెళ్లాలంటే రీచార్జ్ చేయాల్సి రావడంతో... సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీల బాట పట్టాడు. ఈ క్రమంలో నార్పలలోనే మూడు ఇళ్లలో చోరీ చేశాడు. ఆ తర్వాత ఈనెల 1వ తేదీన తాడిపత్రిలో, 4వ తేదీన రూరల్ పరిధిలో వరుస చోరీలు చేసి రూ.3.79 లక్షల నగదు, రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ, రూరల్ పోలీసులు కేసులు నమోదు చేసుకుని గాలింపు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో బుధవారం ఆటోనగర్లో వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు..ఆ దారి గుండా వెళుతున్న బాలుడిని ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల విషయం వెలుగు చూసింది. దీంతో బాలుడి వద్ద ఉన్న రూ.3.79 లక్షల నగదుతో పాటు రూ.3 లక్షల విలువైన బంగారు నగలను స్వాదీనం చేసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపారు. నార్పలలో జరిగిన చోరీ ఘటనల్లోనూ మూడు కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. చదవండి: మచ్చా అన్నందుకు డబుల్ మర్డర్ -
కీచకుడిగా మారిన ప్రజాప్రతినిధి
-
24 గంటలూ కిక్కు
తాడిపత్రి అర్బన్: తాడిపత్రిలో పొద్దు పొద్దున్నే పాల ప్యాకెట్లయినా సరిగా దొరుకుతాయో లేదో కానీ మద్యం మాత్రం అన్ని వేళలా దొరుకుతోంది. సమయం ఏదైనా సరే తలుపు తట్టడమే ఆలస్యం అడిగిన మొత్తం చెల్లిస్తే ఏ బ్రాండ్ మద్యం కావాలన్నా చేతికందిస్తారు. సామాన్యుల వ్యసనాలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ నిబంధనలను బేఖాతారు చేస్తూ తాడిపత్రి పట్టణంలోని బార్ల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. అందిన కాడికి దోచుకోవడమే ధ్యేయంగా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. నిబంధనలకు తూట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెప్పినట్లుగానే మద్యపాన నిషేధం దిశగా ఒక్కో అడుగు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రైవేటు మద్యం దుకాణాలకు పూర్తి ఎత్తివేశారు. ప్రభుత్వ ఆధీనంలోనే అది కూడా ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల మధ్యలోనే మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నారు. బార్ల సమయాలను కూడా కుదించేశారు. నిబంధనల ప్రకారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యాన్ని విక్రయించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మద్యం బాటిళ్లను పార్శిల్ విధానం ద్వారా బయటకు ఇవ్వకూడదు. అయితే తాడిపత్రి పట్టణంలోని బార్ల నిర్వాహకులు నిబంధనలకు నీళ్లొదిలారు. అడిగినంత ఇస్తే చాలు మద్యం ఎప్పుడు కావాలన్నా సరే ఇచ్చేస్తున్నారు. కార్మికులే లక్ష్యంగా.... తాడిపత్రి చుట్టూ అనేక పరిశ్రమలు ఉన్న సంగతి తెలిసిందే. ఆయా సంస్థల్లో పనిచేసే కారి్మకులు కూడా అధికంగానే ఉంటారు. ముఖ్యంగా కారి్మకులనే లక్ష్యంగా చేసుకొని బార్ల నిర్వాహకులు తమ దందాను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరవని సమయాల్లో ఒక్కో క్వాటర్ బాటిల్ పై రూ.50 నుంచి రూ.70 దాకా అధికంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మామూళ్ల మత్తుల్లో ఎక్సైజ్ అధికారులు తాడిపత్రిలోని అన్ని బార్లలో ఎప్పుడు కావాలన్నా మద్యం సిద్ధంగా ఉంటుంది. ఉదయం, రాత్రి అన్న తేడా లేకుండా మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నా ఎక్సైజ్ పోలీసులతో పాటు పట్టణ పోలీసులు కూడా చూసీచూడనట్లే వ్యవహరిస్తున్నారు. పత్రికల్లోనో, జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు మాత్రం హడావుడి చేసి తర్వాత మిన్నకుండిపోతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బార్ల నిర్వాహకుల నుంచి భారీగా మామూళ్లు వసూలు చేస్తుండటంతోనే పోలీసులు అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న ఆరోపణలున్నాయి. కొత్తగా వచ్చా... బార్ నిర్వాహకుల దందాపై ఎక్సైజ్ ఎస్ఐ స్వామినాథన్ను ‘సాక్షి’ వివరణ కోరగా... ‘ ఈ సర్కిల్కి కొత్తగా వచ్చా... మీకు వివరణ కావాలంటే సీఐని అడగండి’ అని సమాధానమిచ్చారు. తాడిపత్రి సర్కిల్ ఎక్సైజ్ సీఐని ఫోన్ ద్వారా సంప్రదించాలని ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
త్వరలోనే పెళ్లి.. అత్తింటికి వచ్చి కాబోయే అల్లుడు మృతి
కొలిమిగుండ్ల/ తాడిపత్రి రూరల్: త్వరలో పెళ్లి కావాల్సిన యువకుడు.. సరదాగా ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన ఆదివారం కర్నూలు జిల్లాలోని లొక్కి గుండం జలపాతం వద్ద చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం భగత్సింగ్నగర్కు చెందిన అఖిల్సాయి (21)కి కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తుమ్మలపెంటకు చెందిన అమ్మాయితో మూడు రోజుల కిందట నిశ్చితార్థం జరిగింది. నాగుల చవితి ముహూర్తాలకు వివాహం చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అఖిల్సాయి అత్తగారి ఊరుకు వచ్చి యువతితో పాటు మరో ఇద్దరితో కలసి లొక్కిగుండంలో ఈతకు వెళ్లారు. అక్కడ ఈత కొడుతూ అఖిల్సాయి గుండంలో చిక్కుకుపోయి గల్లంతయ్యాడు. ఎంత సేపటికీ బయటకు రాక పోవడంతో అమ్మాయి.. కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చింది. వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. చీకటి కావడంతో లైట్లు, తాళ్ల సాయంతో వెతికి తొమ్మిది గంటల సమయంలో మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
నిరుద్యోగులకు బాసటగా నేడు షర్మిల ఉద్యోగ దీక్ష
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు బాసటగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు షర్మిల మంగళవారం వనపర్తి జిల్లా తాడిపత్రిలో ఉద్యోగ దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ అడ్హక్ కమిటీ సభ్యురాలు ఇందిరాశోభన్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకులు బాగుపడతాయనుకుంటే నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఇక్కడి లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆపార్టీ నేతలు సత్యవతి, విజయ్రెడ్డి, గౌతమ్ప్రసాద్లతో కలసి ఆమె మాట్లాడారు. పీఆర్సీ నివేదిక ప్రకారం 1.91 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉందన్నారు. ఉద్యోగం కోసం వనపర్తి జిల్లాకు చెందిన నిరుద్యోగి కొండల్ మంత్రి నిరంజన్రెడ్డి చుట్టూ పదే పదే తిరిగి విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. మంత్రి మొసలికన్నీరు కారుస్తూ కొండల్ కు టుంబాన్ని పరామర్శించడాన్ని ఆక్షేపించారు. షర్మిల మంగళవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి ఉద్యోగదీక్ష చేపట్టనుండటంతో మంత్రి కి కొండల్ కుటుంబం గుర్తుకువచ్చిందన్నారు. -
తాడిపత్రిలో విషాదం: తల్లీకూతుళ్ల ఆత్మహత్య
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏడాది కిందట తండ్రి రామకృష్ణారెడ్డి కరోనా బారినపడి మృతి చెందగా, సోమవారం సచివాలయ కార్యదర్శి అపర్ణ, తల్లి వెంకటరమణమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ పెద్ద లేడన్న బాధతోనే తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చదవండి: రాజులమ్మతల్లి కలలో చెప్పిందని.. సాక్షి ఎఫెక్ట్: పల్లా ఆక్రమణలకు చెక్ -
తాడిపత్రిలో 500 పడకల ఆస్పత్రి ప్రారంభించిన సీఎం జగన్
-
తాడిపత్రిలో కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి/అనంతపురం: తాడిపత్రిలో 500 పడకల కోవిడ్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ఆర్జాస్ స్టీల్ వద్ద ఏర్పాటు 500 ఆక్సిజన్ పడకల జర్మన్ హ్యాంగర్ల ఆస్పత్రిని నిర్మించారు. సీఎం జగన్ ఆదేశాలతో 15 రోజుల్లో 13.56 ఎకరాల్లో రూ.5.50 కోట్లతో కోవిడ్ ఆస్పత్రిని నిర్మించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే... ‘‘ కోవిడ్ టైంలో, ఆక్సిజన్ కెపాసిటీలు కొంచెం కష్టంగా ఉన్న సమయంలో అర్జాస్ స్టీల్కు ఎయిర్ సపరేషన్ ప్లాంట్ ఉండటం, అక్కడి నుంచి వారి ప్లాంట్ కెపాసిటీ మేరకు దాదాపు రోజుకు 100 టన్నుల లిక్విడ్ ఆక్సీజన్ కెపాసిటీ ఉండడం, వారిని ఉపయోగించుకుని జర్మన్ హ్యంగర్లతో ఈ ఆసుపత్రిని ఏర్పాటుచేయడం నిజంగా గర్వించదగినది. అందరూ బాగా పనిచేశారు. పేరుపేరునా అందరికీ అభినందనలు. అర్జాస్ స్టీల్స్ ఎండీ శ్రీధర్ కృష్ణమూర్తికి ప్రత్యేక అభినందనలు. ఈ కష్టకాలంలో మీరు చేసిన సాయం మరువలేనిది’’ అని అన్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు ఇతర ఉన్నతాధికారులు హాజరుకాగా తాడిపత్రి నుంచి రోడ్లు, భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్ధానిక ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: పశ్చిమ గోదావరిలో ‘జగనన్న పాల వెల్లువ’కు సీఎం జగన్ శ్రీకారం సుస్థిర ఆర్థికాభివృద్ధి: టాప్-5 రాష్ట్రాల జాబితాలో ఏపీ -
నేడు తాడిపత్రిలో జర్మన్ హ్యాంగర్ల ఆస్పత్రి ప్రారంభం
తాడిపత్రి రూరల్: రాష్ట్రంలోనే తొలిసారిగా 500 ఆక్సిజన్ పడకల జర్మన్ హ్యాంగర్ల ఆస్పత్రిని అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ఆర్జాస్ స్టీల్ వద్ద ఏర్పాటు చేశారు. దీనిని సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం వర్చువల్గా ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఆస్పత్రి నిర్మాణ టెండర్ గడువు రెండు నెలలు అయినా కూడా.. ప్రత్యేక చొరవ తీసుకొని 14 రోజుల్లోనే పూర్తి చేయించినట్లు చెప్పారు. ఇక్కడ ప్రతి బెడ్కు ఆక్సిజన్ సరఫరా సదుపాయముందని వివరించారు. చదవండి: వ్యాక్సినేషన్ పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకోవాలి: సీఎం జగన్ ప్రైవేటు ఆస్పత్రుల నుంచి డబ్బు రిఫండ్కు చర్యలు -
ఆక్సిజన్ వచ్చేసింది.. తాడిపత్రికి చేరిన స్పెషల్ రైలు
సాక్షి, తాడిపత్రి: ఆక్సిజన్ స్పెషల్ రైలు డివిజన్ పరిధిలోని తాడిపత్రి రైల్వేస్టేషన్ చేరినట్లు డీఆర్ఎం అలోక్తీవారి తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన స్థానిక డీఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా విలయతాండవం నేపథ్యంలో జార్ఖండ్ రాష్ట్రం టాటానగర్ నుంచి వెస్ట్ బెంగాల్, ఒడిశా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఆక్సిజన్ అత్యవసరమైందన్నారు. దీంతో 32 స్పెషల్ ఆక్సిజన్ రైళ్లను ఆయా రాష్ట్రాలకు తరలించారన్నారు. టాటానగర్ నుంచి బయలుదేరిన ఆక్సిజన్ స్పెషల్ రైలు మంగళవారం గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని తాడిపత్రి రైల్వేస్టేషన్కు చేరిందన్నారు. మొత్తం 10 గూడ్స్ వ్యాగన్లలో(బూస్ట్ వ్యాగన్)లో 100 టన్నుల ఆక్సిజన్ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తాడిపత్రి రైల్వేస్టేషన్ నుంచి ప్రత్యేక ఆక్సిజన్ కంటైనర్ల ద్వారా అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలకు ఆక్సిజన్ తరలించామన్నారు. చదవండి: గుంతకల్లు రైల్వేలో బయటపడ్డ నకిలీ నియామకాలు గుంతకల్లు : వ్యాగిన్ల నుంచి ఆక్సిజన్ను ట్యాంకర్లలోకి నింపుతున్న దృశ్యం -
‘పచ్చ’పేకలో ఖాకీ: ఎస్పీ జోక్యంతో బట్టబయలు
తాడిపత్రి రూరల్(అనంతపురం జిల్లా): తాడిపత్రి పోలీసులు మరో వివాదానికి తెరలేపారు. టీడీపీ నేతలతో కలిసి ఓ కానిస్టేబుల్ సాగిస్తున్న గ్యాంబ్లింగ్ దందాను దాచి ఉంచే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా ‘మీ ఇష్టం.. ఏమన్నా రాసుకోండి’ అంటూ విలేకరులపైనే ఖాకీ నైజాన్ని ప్రదర్శించారు. ఫ్రెండ్లీ పోలీస్ అనే పదానికి అర్థం మార్చేసేలా సాక్షాత్తూ డీఎస్పీ ఎదుటే ఓ సీఐ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ఏం జరిగింది? ఈ నెల 20న తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డులో రైస్ మిల్లు వద్ద గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో పట్టుబడిన వారిలో మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి తనయుడు జేసీ పవన్కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు శరత్కుమార్తో పాటు మరో పది మంది ఉన్నారు. వీరిలో తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ వెంకటేష్ నాయుడు కూడా ఉండటం విశేషం. అయితే తాడిపత్రి పోలీసులు ఈ విషయం బయటకు పొక్కకుండా తొక్కిపెట్టారు. నిందితులను అరెస్ట్ చేసిన రోజు పత్రికలకు విడుదల చేసిన ప్రెస్నోట్లోనూ 11 మంది నిందితులను అదుపులోకి తీసుకుని రూ.50 వేలు స్వా«దీనం చేసుకున్నట్లుగా పేర్కొన్నా...పేర్లు మాత్రం వెల్లడించలేదు. కానీ విషయం తెలుసుకున్న ఎస్పీ సత్యయేసుబాబు కానిస్టేబుల్ వెంకటేష్ నాయుడిపై చర్యలు తీసుకున్నారు. వీఆర్కు పంపుతూ ఉత్తర్వులిచ్చారు. మీ ఇష్టం ఏమన్నా అనుకోండి.. ఆదివారం తాడిపత్రి పోలీసులు తెలంగాణ మద్యం స్వాదీనం చేసుకోగా, డీఎస్పీ చైతన్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పేకాటలో దొరికిన కానిస్టేబుల్ అంశాన్ని విలేకరులు లేవనెత్తడంతో సీఐ ప్రసాదరావు జోక్యం చేసుకున్నారు. విషయాన్ని దాటవేసేందుకు విశ్వప్రయత్నం చేశారు. పట్టుబడిన వారిలో కానిస్టేబుల్ ఉన్నందునే పేర్లు బహిర్గతం చేయలేదా? అని విలేకరులు ప్రశ్నించగా... సీఐ సహనం కోల్పోయారు. అది ఒక చిన్న పెట్టీ కేసు అంటూ అసహనం వ్యక్తం చేశారు. దాని గురించి లోతుగా వెళ్లకండి. కాదంటే మీ ఇష్టం మీరు ఏమైనా అనుకోండని సమాధానమిచ్చారు. చదవండి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్రెడ్డి అరెస్ట్ ఈ–పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి -
అనంతపురం: తాడిపత్రిలో 500 పడకల తాత్కాలిక ఆసుపత్రి
అనంతపురం: కోవిడ్ రోగుల కోసం జిల్లాలోని తాడిపత్రిలో 500 పడకల తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ గంధం చుంద్రుడు తెలిపారు. కోవిడ్కు సంబంధించి జిల్లాలో తీసుకుంటున్న చర్యలపై ఆయన మాట్లాడారు. అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. అత్యవసర వినియోగానికి ఆక్సిజన్ ట్యాంకర్ను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్లు పేర్కొన్నారు. కోవిడ్ బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. రెమిడెసివిర్ ఇంజక్షన్లు పక్కదారి పట్టించే ఉద్యోగులను సస్పెండ్ చేయడానికి వెనుకాడబోమని తెలిపారు. -
అవినీతి ఖాకీ ‘సెల్ఫీ బాణం’
తాడిపత్రి రూరల్: కరోనా సోకినా లీవు ఇవ్వడం లేదంటూ తాడిపత్రి రూరల్ కానిస్టేబుల్ గణేష్ బాబు చేసిన హడావుడి అందరికీ తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో గణేష్ సెల్ఫీ వీడియో వైరల్ కావడంతో స్వయంగా ఎస్పీ సత్యయేసుబాబు రంగంలోకి దిగి ప్రకటన చేయాల్సి వచ్చింది. తాజాగా గణేష్ బాబు సెల్ఫీ వీడియో వెనుక ఎవరి హస్తమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నానంటూనే ఓ సీఐ, ఎస్ఐ పేర్లను గణేష్ టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. వీఆర్లో ఉన్న ఓ ఖాకీ కనుసన్నల్లోనే సెల్ఫీ వీడియో వ్యవహారం జరిగినట్లు పోలీసులు ఓ అభిప్రాయానికి వచ్చారు. గతంలో తాడిపత్రి పట్టణ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహించిన సమయంలో అతనిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆ హెడ్ కానిస్టేబుల్ను మూడుసార్లు వీఆర్కు పంపగా.. తిరిగి పైరవీలు చేసుకొని ఇదే ప్రాంతానికే బదిలీపై వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం వీఆర్లో ఉన్న ఆ హెడ్కానిస్టేబుల్ సిక్ లీవుపై వచ్చి ఇక్కడ గ్యాంబ్లింగ్ నిర్వాహకులకు పరోక్షంగా సహకరిస్తున్నట్లు సమాచారం. వసూళ్ల పర్వం బయట పడిందనే... గణేష్ సెల్ఫీ వీడియో వెనుక ప్రస్తుతం వీఆర్లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ హస్తం ఉన్నట్లు స్పష్టమైంది. గతంలో తాడిపత్రి రూరల్ పోలీస్స్టేషన్లో ఆ కానిస్టేబుల్ విధులు నిర్వహించేవాడు. ఆ సమయంలో గ్యాంబ్లింగ్ ఆర్గనైజర్స్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటూ అక్రమ వసూళ్లకు తెరలేపిన అంశాన్ని ఉన్నతాధికారులకు ఆ స్టేషన్ ఎస్ఐ తెలియజేశారు. ఈ విషయంలో ఉన్నతాధికారుల విచారణకు భయపడిన సదరు హెడ్కానిస్టేబుల్ తన తప్పు కప్పిపుచ్చుకునేందుకు తన సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులను రెచ్చగొట్టి వారి చేత ఆ ఎస్ఐకి వ్యతిరేకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు పంపడమే కాక, మూకుమ్మడి సెలవుల పేరుతో బెదిరింపులకు దిగాడు. ఆ సమయంలో విచారణకు వచ్చిన డీఎస్పీతో ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కానిస్టేబుల్ గణేష్ కూడా గట్టిగా వాదించినట్లు తెలిసింది. పావుగా మారిన గణేష్.. ప్రస్తుతం వీఆర్లో ఉన్న హెడ్కానిస్టేబుల్ ఓ ఎస్ఐపై కక్షగట్టి తగిన సమయం కోసం వేచి చూస్తున్న తరుణంలో గణేష్ రూపంలో అవకాశం దక్కింది. ఈ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. గత నెల 25న కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన గణేష్ను ఉన్నతాధికారులు ప్రత్యేక అంబులెన్స్లో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో గణేష్తో వీడియో చేయించి సోషల్ మీడియాలో వైరల్ చేయించాడు. తనను ఉద్యోగపరంగా ఎస్ఐ వేధిస్తున్నాడని, సెలవు అడిగినా ఇవ్వలేదని, కరోనా అని చెప్పినా డ్యూటీ చేయించాడని, సీఐ కూడా తనను మందలించాడని వీడియోలో పేర్కొన్నాడు. మూడు రోజుల చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో కానిస్టేబుల్ గణేష్ డిశ్చార్జి అయ్యాడు. అయితే ఈ మొత్తం అడ్డగోలు వ్యవహారంతో పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసిన అవినీతి ఖాకీపై చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. చదవండి: జెడ్పీ సీఈఓ కుటుంబంలో విషాదం.. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల కన్నుమూత -
రేయ్...రూ.2 వేలు తీసుకుని ఓటేశారు: జేసీ
తాడిపత్రి: ‘‘రేయ్...ఎలక్షన్లో ఓటుకు రూ.2 వేలు తీసుకుని నాకు ఓటేశారు.. ఇప్పుడు పనులు చేయమని అడుగుతారా! నా... డకల్లారా.. పనులు చేయమని నన్ను అడిగే హక్కు మీకు లేదు’’ అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ప్రజలపై చిందులు తొక్కారు. తాడిపత్రి పట్టణంలోని 35వ వార్డు ఆంజనేయస్వామి మాన్యంలో ఆదివారం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి తన అనుచరులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు తమకు రోడ్లు లేవని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన అక్కడున్న వారిపై ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘మీరు డబ్బు తీసుకోకుండా ఓట్లేసి ఉంటే.... నేను మీకు పనులు చేసిపెట్టాలి. డబ్బు తీసుకుని ఓట్లేశారు.. మీకు నన్ను అడిగే హక్కులేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మహిళల ఎదుటే అక్కడున్న పురుషులను బూతులు తిడుతూ దుర్భాషలాడారు. దీంతో అక్కడున్న వారంతా బిత్తరపోయారు. ఎన్నికల ముందు ‘సేవ్ తాడిపత్రి’ పేరుతో మొసలి కన్నీరు కార్చిన జేసీ ప్రభాకర్రెడ్డి అధికారం దక్కగానే ఇలా నోటికి పనిచెప్పడంపై ప్రజలు మండిపడుతున్నారు. -
జేసీ ప్రభాకర్రెడ్డిపై కేసు నమోదు
అనంతపురం: వాలంటీర్పై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి దౌర్జన్యానికి దిగారు. ఎన్నికల్లో వాలంటీర్ హరికుమార్ తనకు సహకరించలేదనే కారణంతో జేసీ కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. ఇంటిని కూల్చేస్తానంటూ వాలంటీర్ను జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించారు. జేసీ ఆదేశాలతో వాలంటీర్ ఇంట్లోని మోటార్ను ఆయన అనుచరులు లాక్కెళ్లారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, విచారణ చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటుకు నోటు తీసుకున్నవారు తనను ప్రశ్నించొద్దంటూ జేసీ హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ హరికుమార్ ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్రెడ్డిపై కేసు నమోదైంది. జేసీ ప్రభాకర్రెడ్డిపై 384, 506,34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. చదవండి: కుప్పం టీడీపీలో ముసలం.. ‘పాచిపోయిన లడ్డూను తింటున్నారా..’ -
జేసీ బ్రదర్స్ అనుచరులపై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: మద్యం మత్తులో వీరంగం సృష్టించిన జేసీ బ్రదర్స్ అనుచరులపై కేసు నమోదయ్యింది. నిన్న మద్యం మత్తులో ట్రాన్స్కో సబ్స్టేషన్ వద్ద హంగామా సృష్టించిన జేసీ బ్రదర్స్ అనుచరులు.. ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేశారు. జేసీ అనుచరులు 26 మందిపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాన్స్కో కార్యాలయంలో విందు పార్టీ ఏర్పాటు చేసి గొడవకు కారణమైన ఇద్దరు ఉద్యోగులను కూడా ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. నిన్న అసలేం జరిగిందంటే.. తన మేనత్త సరస్వతి టీడీపీ తరఫున వైస్ చైర్ పర్సన్గా ఎన్నికైన సందర్భంగా కొట్టే విజయ్కుమార్ అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం విందు ఇచ్చాడు. ఈ విందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి కూడా హాజరయ్యారు. సాయంత్రం వైస్చైర్పర్సన్ సరస్వతి మేనల్లుడు కొట్టే విజయ్కుమార్ శివాలయం సమీపంలో ఉన్న హిందూ శ్మశాన వాటిక వద్ద గ్రానైట్ ఫ్యాక్టరీలో తన మిత్రులకు విందు ఏర్పాటు చేశాడు. ట్రాన్స్కో ఉద్యోగులు శివనాగేశ్వర్రెడ్డి, శ్రీనివాసులు హాజరయ్యారు. వీరు విద్యుత్ సబ్స్టేషన్లోకి వెళ్లి మద్యం తాగారు. వీరితోపాటు టీడీపీ కార్యకర్తలు జనార్దన్, కిరణ్కుమార్రెడ్డి, రామసుబ్బయ్య, భాస్కర్రెడ్డి కూడా మద్యం తాగి, విద్యుత్ సబ్ స్టేషన్లోకి వెళ్లారు. పాతకక్షలుండడంతో విషయం తెలుసుకున్న టీడీపీ మరో వర్గానికి చెందిన పరమేష్, అతని అనుచరులు సుమారు 25 మంది కలిసి విద్యుత్ సబ్స్టేషన్కు చేరుకొని మద్యం సేవిస్తున్న కొట్టే విజయ్కుమార్ వర్గీయులు ఐదుగురిపై కొడవళ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. విద్యుత్ సబ్స్టేషన్లోని ఫర్నిచర్, పరికరాలను ధ్వంసం చేశారు. చదవండి: పాపం చిన్నారి.. ఊయలే ఉరితాడై .. భార్యపై అనుమానం.. తెల్లవారు జామునే నిద్రలేచి.. -
మద్యం మత్తులో తెలుగు తమ్ముళ్ల వీరంగం
తాడిపత్రి: పట్టణంలోని విద్యుత్ సబ్స్టేషన్లో శుక్రవారం సాయంత్రం మద్యం మత్తులో తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టించారు. పాత కక్షల నేపథ్యంలో టీడీపీలోని ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోగా ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మత్తులో విద్యుత్ సబ్స్టేషన్ను ధ్వంసం చేశారు. అసలేం జరిగిందంటే... తన మేనత్త సరస్వతి టీడీపీ తరఫున వైస్ చైర్ పర్సన్గా ఎన్నికైన సందర్భంగా కొట్టే విజయ్కుమార్ అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం విందు ఇచ్చాడు. ఈ విందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి కూడా హాజరయ్యారు. సాయంత్రం వైస్చైర్పర్సన్ సరస్వతి మేనల్లుడు కొట్టే విజయ్కుమార్ శివాలయం సమీపంలో ఉన్న హిందూ శ్మశాన వాటిక వద్ద గ్రానైట్ ఫ్యాక్టరీలో తన మిత్రులకు విందు ఏర్పాటు చేశాడు. ట్రాన్స్కో ఉద్యోగులు శివనాగేశ్వర్రెడ్డి, శ్రీనివాసులు హాజరయ్యారు. వీరు విద్యుత్ సబ్స్టేషన్లోకి వెళ్లి మద్యం తాగారు. వీరితోపాటు టీడీపీ కార్యకర్తలు జనార్దన్, కిరణ్కుమార్రెడ్డి, రామసుబ్బయ్య, భాస్కర్రెడ్డి కూడా మద్యం తాగి, విద్యుత్ సబ్ స్టేషన్లోకి వెళ్లారు. పాతకక్షలుండడంతో విషయం తెలుసుకున్న టీడీపీ మరో వర్గానికి చెందిన పరమేష్, అతని అనుచరులు సుమారు 25 మంది కలిసి విద్యుత్ సబ్స్టేషన్కు చేరుకొని మద్యం సేవిస్తున్న కొట్టే విజయ్కుమార్ వర్గీయులు ఐదుగురిపై కొడవళ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. విద్యుత్ సబ్స్టేషన్లోని ఫర్నిచర్, పరికరాలను ధ్వంసం చేశారు. గాయపడిన వారు డయల్ 100కు ఫోన్ చేసినా పోలీసులు ఘటనా స్థలానికి రాలేదని ట్రాన్స్కో ఉద్యోగులు శివనాగేశ్వర్రెడ్డి, శ్రీనివాసులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో వైస్ చైర్ పర్సన్ సరస్వతి వర్గానికి చెందిన జనార్ధన్, కిరణ్కుమార్రెడ్డి, రామసుబ్బయ్య, భాస్కర్రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రూ.6.86 కోట్ల బంగారం స్వాధీనం
కర్నూలు: ఎస్ఈబీ తనిఖీల్లో పన్ను రశీదుల్లేని రూ.6.86 కోట్ల బంగారం పట్టుబడింది. కర్నూలు శివారు పంచలింగాల చెక్పోస్టు వద్ద ఎస్ఈబీ సిబ్బంది గురువారం రాత్రి జరిపిన వాహన తనిఖీల్లో 14.8 కిలోల బంగారాన్ని స్వాదీనం చేసుకున్నారు. శుక్రవారం కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్ వెల్లడించిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా తాళ్లప్రొద్దుటూరుకు చెందిన రాతి మిద్దెరాజు.. తాడిపత్రి పట్టణం అంబటి పుల్లారెడ్డి జ్యువెలర్స్లో గుమాస్తా. ఆయన హైదరాబాద్ అబిడ్స్లోని ఓ గోల్డ్ షాప్లో 163 బంగారు బిస్కెట్లను తీసుకున్నాడు. వాటిలో 15 బిస్కెట్లను హైదరాబాద్లోని వేర్వేరు చోట్ల అప్పగించాడు. మిగిలిన 148 బిస్కెట్లను బ్యాగ్లో ఉంచుకుని హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో తాడిపత్రికి వెళుతున్నాడు. పన్ను చెల్లింపు బిల్లులు చూపకపోవడంతో చెక్పోస్టు వద్ద ఎస్ఈబీ సిబ్బంది వాటిని స్వాదీనం చేసుకున్నారు. -
సీఎం జగన్పై జేసీ ప్రభాకర్రెడ్డి ప్రశంసలు
-
సీఎం జగన్పై జేసీ ప్రభాకర్రెడ్డి ప్రశంసలు
తాడిపత్రి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నైతిక విలువలున్న వ్యక్తి అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. గురువారం ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్గా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం కార్యాలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ సహకారం లేకుంటే..తాను ఈరోజు మునిసిపల్ చైర్మన్ అయ్యుండే వాడిని కాదన్నారు. ఆయన తల్చుకుంటే ఏమైనా చేసి ఉండొచ్చని.. కానీ ఆయనలోని నైతిక విలువలను ఈరోజు స్పష్టంగా గమనించానని తెలిపారు. హ్యాట్సాఫ్ టు సీఎం అని ప్రశంసించారు. తాడిపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్యతో కలిసి పనిచేస్తానన్నారు. పట్టణాభివృద్ధికి నిధులను కోరేందుకు త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ను కలుస్తానని, ఆయన తప్పకుండా న్యాయం చేస్తారన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు పోలీసులు తీసుకున్న చర్యలు భేష్ అని జేసీ కితాబిచ్చారు. చదవండి: బడుగు వర్గాలకే పెద్దపీట: 86 స్థానాల్లో ఎవరెవరు? నాడు కట్టెలు కొట్టిన మహిళ.. నేడు చిత్తూరు మేయర్ -
తాడిపత్రి: వైఎస్సార్సీపీ కార్యకర్తపై వేట కొడవలితో దాడి
తాడిపత్రి రూరల్(అనంతపురం జిల్లా): అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొన్ని రోజులుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ వర్గీయులపై వరుస దాడులకు తెగబడుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే మూడు వేర్వేరు ఘటనలు చోటు చేసుకోవడం తాడిపత్రి ప్రజల్లో భయాందో ళనలు సృష్టిస్తోంది. తాడిపత్రి మండలంలోని గంగాదేవిపల్లి గ్రామ పంచాయతీలో టీడీపీ వర్గీయుడు రామాంజనేయులు అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రత్నమయ్యపై గురువారం వేటకొడవలితో దాడి చేశాడు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థి గెలుపునకు రత్నమయ్య తనవంతు కృషి చేశాడు. దీన్ని జీర్ణించుకోలేని రామాంజనేయులు, మరికొందరు గ్రామంలోని బస్టాప్ సమీపంలో రచ్చకట్ట వద్దనున్న రత్నమయ్యపై వేట కొడవలితో దాడి చేశారు. ఘటనలో రత్నమయ్య ఎడమ చేయి తెగడంతో పాటు తొడకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం తీసుకెళ్లారు. ఘటన సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్రెడ్డి ప్రభుత్వాస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. రామాంజనేయులుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
సెల్ఫోన్ వాడొద్దన్నందుకు టెన్త్ క్లాస్ విద్యార్థి దారుణం
సాక్షి, తాడిపత్రి: సెల్ఫోన్ ఎక్కువగా వినియోగిస్తుండటంతో తల్లి మందలించిందని ఓ విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తాడిపత్రిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలివీ.. తాడిపత్రిలోని ఆర్ఆర్ నగర్కు చెందిన తలారి సుబ్బరాయుడు, లక్ష్మి దంపతుల కుమారుడు తలారి శ్రీనివాసులు(17) పుట్లూరు మండలంలోని ఆదర్శ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు. కుమారుడు ఇటీవల ఎక్కువుగా సెల్ఫోన్ చూస్తూ సమయాన్ని వృథా చేస్తుండడంతో తల్లి మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన శ్రీనివాసులు సోమవారం ఉదయం పుట్లూరు రోడ్డు రైల్వే లెవల్ క్రాసింగ్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే జీఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చదవండి: అరచేతిలో స్వర్గం చూపించింది: ప్రియుడు ఫోన్కు ఓటీపీలు వస్తాయి చెప్పమ్మా అంటూ.. -
తాడిపత్రి ఎక్స్అఫిషియో ఓట్ల కేటాయింపులో ట్విస్ట్
అనంతపురం: తాడిపత్రి ఎక్స్అఫిషియో ఓట్ల కేటాయింపులో ట్విస్ట్ చోటుచేసుకుంది. నలుగురు ఎమ్మెల్సీలకు ఎక్స్అఫిషియో ఓటును ఈసీ తిరస్కరించింది. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఇక్బాల్, గోపాల్రెడ్డి, శమంతకమణి దరఖాస్తులను ఈసీ తిరస్కరించింది. తాడిపత్రిలో ఓటు హక్కు లేనందున ఎమ్మెల్సీలకు ఎక్స్అఫిషియో తిరస్కరించారని.. ఓటు హక్కు ఉన్న చోటే సభ్యత్వం ఉంటుందని కమిషనర్ తెలిపారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అనంతపురం ఎంపీ రంగయ్యకు ఎక్స్అఫిషియో ఓట్లు జారీ అయ్యాయి. 18న తాడిపత్రి మున్సిపల్ సమావేశానికి హాజరుకావాలని అధికారులు లేఖ రాశారు. చదవండి: ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు.. కానీ ఏం చంద్రబాబు ఇప్పుడేమంటారు..? -
తాడిపత్రి, మైదుకూరు ఎవరి వైపు?
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా తాడిపత్రి, వైఎస్సార్ జిల్లా మైదుకూరు మున్సిపాలిటీల్లో ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. దీంతో ఈ రెండుచోట్లా ఏ పార్టీకి చైర్పర్సన్ పీఠం దక్కుతుందో అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయగా.. ఈ 2 మున్సిపాలిటీల్లో మాత్రం వైఎస్సార్సీపీతో టీడీపీ పోటాపోటీగా నిలిచింది. కానీ, సొంతంగా చైర్పర్సన్ పదవిని దక్కించుకునే మ్యాజిక్ ఫిగర్ను ఏ పార్టీ సాధించలేకపోయాయి. దీంతో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరిగే 18వ తేదీపైనే అందరి కళ్లూ ఉన్నాయి. ఆ రోజు అనూహ్య పరిణామాలు జరిగే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ రెండుచోట్లా ఎక్స్అఫిషియో సభ్యుల ఓట్లూ కీలకంగా మారనున్నాయి. మైదుకూరులో ఎక్స్ ఆఫిషియో ఓట్లు వైఎస్సార్సీపీకే ఎక్కువ మైదుకూరు మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి మొత్తం 26 ఓట్లు ఉన్నట్లు లెక్క. ఇందులో 14 ఓట్లు ఏ పార్టీకి వస్తే వారికి చైర్పర్సన్ పదవి దక్కుతుంది. ఇక్కడ మొత్తం 24 వార్డుల్లో వైఎస్సార్సీపీ 11 చోట్ల, తెలుగుదేశం 12 చోట్ల, జనసేన ఒక స్థానంలో గెలుపొందాయి. వైఎస్సార్సీపీకి చెందిన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప లోకసభ సభ్యుడు అవినాష్రెడ్డి మైదుకూరు మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యులుగా తమ పేర్లు నమోదు చేసుకోవడంతో ఇక్కడ వైఎస్సార్సీపీ బలం 13కు పెరిగింది. జనసేన టీడీపీకి మద్దతు పలకని పక్షంలో వైఎస్సార్సీపీ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకుంటుంది. ఒకవేళ టీడీపీకి జనసేన మద్దతు ఇచ్చినా కూడా టీడీపీకి చైర్పర్సన్ పదవి దక్కదు. ఎందుకంటే.. జనసేనతో కలిపి టీడీపీ బలం 13కు పెరిగి వైఎస్సార్సీపీతో సమానమవుతుంది. ఇదే పరిస్థితి ఉత్పన్నమైతే టాస్ వేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ అధికారులు చెప్పారు. తాడిపత్రిలోనూ అదే గందరగోళం.. మైదుకూరు మాదిరిగానే తాడిపత్రిలో మున్సిపాల్టీలోనూ సస్పెన్స్ వాతావరణం నెలకొంది. ఇక్కడ మొత్తం 36 వార్డులుండగా టీడీపీ 18చోట్ల.. వైఎస్సార్సీపీ 16 చోట్ల విజయం సాధించాయి. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి చెరొకచోట గెలుపొందారు. ఇక్కడ స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన ఎక్స్అఫిషియో ఓటును ఇప్పటికే నమోదు చేసుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీ బలం 17కి పెరిగింది. అనంతపురం ఎంపీ రంగయ్య ఇప్పటి దాకా తన ఎక్స్ అఫిషియో ఓటు ఇంకా ఎక్కడా నమోదు చేసుకోలేదని మున్సిపల్ శాఖ అధికారులు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల చట్టం సెక్షన్–5 క్లాజ్ (3) ప్రకారం.. పొలింగ్ తేదీ తర్వాత 30 రోజుల్లోపు ఆయన ఎక్కడో ఒకచోట తన పేరును ఎక్స్ అఫిషియో సభ్యునిగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో తలారి రంగయ్య తన ఓటును తాడిపత్రి మున్సిపాలిటీలో నమోదు చేసుకునే పక్షంలో అక్కడ వైఎస్సార్సీపీ బలం కూడా 18కు పెరిగి టీడీపీతో సమానంగా ఉంటుంది. అప్పుడు సీపీఐ, స్వతంత్ర సభ్యుల ఓట్లు కీలకంగా మారతాయి. వారు ఎవ్వరికీ మద్దతివ్వని పక్షంలో.. లేదా చేరొక పార్టీకి మద్దతిచ్చినా ఇక్కడా టాస్ తప్పకపోవచ్చని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఇద్దరూ కలిసి ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ చైర్పర్సన్ పీఠం దక్కించుకుంటుంది. మొత్తంగా ఇక్కడా చైర్పర్సన్ ఎన్నిక రసవత్తరంగా మారనుంది. మైదుకూరులో క్యాంపు రాజకీయాలకు తెరలేపిన టీడీపీ సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా మైదుకూరు మునిసిపాలిటీ ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. మునిసిపాలిటీలో మొత్తం 24 వార్డులున్నాయి. వైఎస్సార్సీపీ 11 వార్డుల్ని, టీడీపీ 12 వార్డులు, జనసేన ఒక వార్డు గెలుచుకున్నాయి. మునిసిపాలిటీలో స్పష్టమైన ఆధిక్యత రావాలంటే 13 వార్డులు గెలవాల్సి ఉంది. ఈ మునిసిపాలిటీలో ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్అఫిషియో సభ్యులు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీకి 13 మంది ఉన్నట్లవుతుంది. దీంతో ఈ మునిసిపాలిటీ వైఎస్సార్సీపీకే దక్కే అవకాశాలున్నాయి. మరోవైపు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్యాదవ్ తమ 12 మంది వార్డు సభ్యులను ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయానికి తరలించారు. సభ్యులపై నమ్మకంలేక వారిని నిర్బంధించినట్లు సమాచారం. మరోవైపు జనసేన సభ్యుడితోనూ టీడీపీ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. రహస్య ప్రాంతానికి టీడీపీ విజేతలు తాడిపత్రి : అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపాలిటీలో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. ఇక్కడ హంగ్ ఏర్పడడంతో తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. వారు ఎక్కడ జారిపోతారోనని ఆదివారం ఉదయం కౌంటింగ్ ప్రారంభం కాగానే ఆయన వారందరినీ తన నివాసంలోనే నిర్బంధించారు. అభ్యర్థుల తరఫున కేవలం ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి పంపించారు. ఆ తర్వాత మధ్యాహ్నం టీడీపీ విజేతలందరినీ రహస్య ప్రాంతానికి తరలించినట్లు తెలిసింది. -
కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన జేసీ
సాక్షి, తాడిపత్రి (అనంతపురం): అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి సోమవారం ఓ కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. జేసీ ప్రభాకరరెడ్డి అనుచరులతో కలిసి మెయిన్ బజార్లో ఎన్నికల ప్రచారానికి బయలుదేరగా.. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రచారానికి గుంపుగా వెళ్లకూడదని పోలీసులు ఆయనకు చెప్పారు. అయినా వినకుండా ప్రచారం చేపట్టడంతో మార్గమధ్యంలో డీఎస్పీ వీఎన్కే చైతన్య మరోసారి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పైగా అరెస్ట్ చేస్తారా.. చేయండి అంటూ ఆవేశంతో ఊగిపోయారు. నడుచుకుంటూ కాకుండా ప్రచార వాహనంలో వెళ్లాలని పోలీసులు సూచించినా వినిపించుకోలేదు. ఇంతలో టీడీపీ కార్యకర్త రఘునాథ్రెడ్డి కల్పించుకుని పోలీసులు చెప్పినట్టు చేద్దాం అనడంతో జేసీ ప్రభాకర్రెడ్డి బండబూతులు తిడుతూ ఆయనపై పలుమార్లు చేయి చేసుకున్నారు. -
ఓటమి భయంతో జేసీ కంటతడి..!
సాక్షి, అనంతపురం: మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ఎదురీతున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీ 24వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న జేసీ.. ఓట్ల కోసం పాట్లు పడుతున్నారు. ఓటమి భయంతో ఆయన కంటతడి పెట్టారు. తాడిపత్రిలో ఏదో జరిగిపోతుందంటూ అసహనం వ్యక్తం చేశారు. అనుమతి లేని వాహనాల్లో వెళ్తూ పోలీసులతో జేసీ ప్రభాకర్రెడ్డి వాగ్వాదానికి దిగారు. సర్ది చెప్పేందుకు యత్నించిన టీడీపీ నేత రఘుపై దాడికి పాల్పడ్డారు. బూతులతో మరోసారి రెచ్చిపోయారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తాడిపత్రిలో జేసీ దౌర్జన్యంపై ప్రజలు చర్చించుకుంటున్నారు. జేసీ పవన్పై కేసు తాడిపత్రి: ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి కుమారుడు జేసీ పవన్రెడ్డిపై సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపారు. గత ఆదివారం అర్ధరాతి టీడీపీ నేత జేసీ పవన్రెడ్డి ఆ పార్టీ తరఫున తాడిపత్రిలోని హరిజనవాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా భారీ కాన్వాయ్తో హరిజనవాడకు చేరుకున్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించడం పట్ల షాడో టీం ఫిర్యాదు మేరకు జేసీ పవన్పై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. చదవండి: అయోమయంలో టీడీపీ.. చంద్రబాబు మాటలతో చేటే! మహిళను మెడవంచి కొట్టిన అశోక్గజపతిరాజు -
తమ్ముడి గెలుపుపై జేసీ బెంగ..
సాక్షి, అనంతపురం: జేసీ బ్రదర్స్కు మున్సిపల్ ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. తాడిపత్రి మున్సిపాలిటీలో జేసీ ప్రభాకర్రెడ్డి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. తాడిపత్రిలో 24వ వార్డు నుంచి ఆయన బరిలో దిగారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జేసీ ప్రభాకర్రెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటించిన సంగతి విదితమే. జేసీ ప్రభాకర్రెడ్డిపై వైఎస్సార్ సీపీ నేత జగదీశ్వర్రెడ్డి పోటీ చేస్తుండగా, ప్రభాకర్రెడ్డి గెలుపుపై జేసీ దివాకర్రెడ్డి టెన్షన్ పడుతున్నారు. గత ఎన్నికల్లో 24వ వార్డు నుంచి జగదీశ్వర్ సోదరుడు జయచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని కౌన్సిలర్గా గెలిపించేందుకు జేసీ ఫ్యామిలీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఎమ్మెల్యేగా పోటీ చేసిన జేసీ ప్రభాకర్రెడ్డి.. తాను పనిచేసిన పదవి కంటే తక్కువ పోస్టుకు నామినేషన్ వేసి పోటీ చేయడం గమనార్హం. తాడిపత్రిలో ఓటర్లకు జేసీ బ్రదర్స్ ప్రలోభాలు తాడిపత్రిలో ఓటర్లను జేసీ బ్రదర్స్ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న 10 మంది జేసీ బ్రదర్స్ అనుచరులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. రూ.82 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బు పంచుతూ పట్టుబడ 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. చదవండి: కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు టీడీపీ అడ్డదారులు: పైకి కత్తులు.. లోన పొత్తులు -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీపై కేసు నమోదు
తాడిపత్రి (అనంతపురం): ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే కాకుండా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం పట్ల 188, 171–ఇ–హెచ్, సెక్షన్ల కింద టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డిపై శుక్రవారం రాత్రి పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. గత గురువారం రాత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని బృందావనం అపార్ట్మెంట్లో జేసీ సమీప బంధువు, టౌన్బ్యాంకు ఉద్యోగి గౌరీనాథ్రెడ్డి పెంట్హౌలో పెద్ద ఎత్తున క్రికెట్ కిట్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే కాకుండా క్రికెట్ కిట్లను పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుండటంపై పలు సెక్షన్ల కింద మాజీ ఎమ్మెల్యే జేసీ, అతని సమీప బంధువు గౌరీనాథ్రెడ్డిపై పట్టణ పోలీసులు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. చదవండి: టీడీపీ ఆగడాలు: పంచాయతీ భవనాలకు ‘పచ్చ’ రంగు తాడిపత్రిలో బయటపడ్డ ‘జేసీ’ ప్రలోభాలు -
పూటకో రకం మాట్లాడితే ఊరుకోం.. జేసీకి హెచ్చరిక
అమరావతి: జేసీ దివాకర్రెడ్డి కుటుంబం చేసే అరాచకాలు తాడిపత్రి ప్రజలకు తెలుసని, అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి దివాకర్రెడ్డి కేసుల్లో ఇరుక్కున్నారని మంత్రి శంకర్నారాయణ తెలిపారు. అక్రమ మైనింగ్ విషయంలో కోర్టులే జేసీ దివాకర్రెడ్డికి అక్షింతలు వేశాయని గుర్తుచేశారు. జేసీ దివాకర్రెడ్డి అక్రమ సంపాదన, దౌర్జన్యాలు, హత్యలు అందరికీ తెలుసని చెప్పారు. అమరావతిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జేసీ దివాకర్రెడ్డి పూటకో రకంగా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి శంకర్నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ దివాకర్రెడ్డి అసత్య ఆరోపణలు ఆపకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఏపీలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ఏడాదిన్నరలో రూ.70 వేల కోట్ల సంక్షేమ పథకాలు అందించినట్లు మంత్రి శంకర్నారాయణ వివరించారు. -
అట్రాసిటీ కేసు: జేసీ బ్రదర్స్ హైడ్రామా
సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హైడ్రామా మొదలు పెట్టారు. సోదరుడు ప్రభాకర్ రెడ్డితో కలిసి ఈనెల నాలుగో తేదిన తాడిపత్రిలో ఆమరణ దీక్ష చేస్తానంటూ ప్రకటించారు. తాడిపత్రిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే తాడిపత్రిలో 144 సెక్షన్ విధించడంతో పోలీస్ యాక్ట్ 30 అములులోకి వచ్చింది. దీంతో ఏ కార్యక్రమానికైనా పోలీసుల అనుమతి తప్పనిసరి. అయితే పోలీసులను రెచ్చగొట్టేందుకు జేసీ బ్రదర్స్ దీక్షకు సిద్ధమయ్యారు. తమపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడం సరికాదంటూ జేసీ బ్రదర్స్ దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఇద్దరు దళితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, ఆస్మిత్ రెడ్డిలపై ట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసుల నుంచి తప్పించుకునేందుకే జేసీ బ్రదర్స్ దీక్ష పేరుతో డ్రామాలు చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. చదవండి: తాడిపత్రిలో 144 సెక్షన్ : ఎస్పీ -
తాడిపత్రి ఎమ్మెల్యేపై కేసు నమోదు, ట్విస్టు
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఘర్షణలకు సంబంధించి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పోలీసులు ఆదివారం అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దాంతోపాటు ఆయన కుమారులు హర్షవర్ధన్, సాయిప్రతాప్పైనా హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి సహా మొత్తం 15 మందిపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. జేసీ తరపు లాయర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే, ఆయన తనయులు, అనుచరులపై కేసు నమోదు చేసినట్టు తాడిపత్రి డీఎస్పీ చైతన్య మీడియాకు తెలిపారు. ఇక తాడిపత్రి అల్లర్లకు కారణమైన మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి సహా 27 మందిపై పోలీసులు ఇప్పటికే మూడు కేసులు నమోదు చేశారు. ఇరువర్గాలపై మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి. ట్విస్టు ఇచ్చిన జేసీ తరపు లాయర్ అయితే, ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కేసు నమోదు విషయంలో ట్విస్టు నెలకొంది. జేసీ లాయర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్తుండగా ఆయన యూటర్న్ తీసుకున్నారు. ఓ అర్జీ, సీసీ ఫుటేజీ, పెన్ డ్రైవ్ మాత్రమే పోలీసులకు ఇచ్చానని శ్రీనివాస్ తెలిపారు. తనను ఫిర్యాదుదారుడిగా పరిగణించొద్దని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు లాయర్ శ్రీనివాస్ మీడియాకు ఓ నోట్ విడుదల చేశారు. అయితే, ఇదంతా జేసీ ఆడుతున్న డ్రామాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గం విమర్శలు గుప్పించింది.(చదవండి: తాడిపత్రి అల్లర్ల కేసులో కొత్త ట్విస్టు) శాంతి నెలకొల్పేందుకే జేసీ ఇంటికి: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాష్ట్రంలో తాడిపత్రిపై నెలకొన్న దురభిప్రాయాన్ని పారదోలి, శాంతియుత వాతావరణం నెలకొల్పాలనే సదుద్దేశంతో చర్చించేందుకు జేసీ ప్రభాకరరెడ్డి ఇంటికి వెళ్లినట్లు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. గ్రామాల్లో ఫాక్షన్ గొడవలు సృష్టించడం, దాడులు చేయించి, ఆస్తులు నాశనం చేసే సంస్కృతి తమకు లేదన్నారు. పెద్దవడుగూరు మండలం దిమ్మగుడి, చిన్నవడుగూరు, పెద్దవడుగూరు గ్రామాల్లో ల బ్ధిదారులకు శనివారం ఆయన ఇంటి పట్టాలు పంపిణీ చేసిన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాధ్యతగా గుర్తించా గ్రామాల్లో సమస్యలు తలెత్తితే వాటికి పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా తనపై ఉందన్నారు. తమ కుటుంబ సభ్యులపై జేసీ సోదరులు సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు సాగిస్తున్నారని, ఇది మితిమీరిపోవడంతో పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డిని నేరుగా కలిసి చర్చించేందుకే వారి ఇంటికి వెళ్లానన్నారు. ఫ్యాక్షన్ గొడవలు సృష్టించడం, దాడులు చేయించి ఆస్తులను నాశనం చేయడం తనకు తెలియదన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయ లబ్ధి కోసం టీడీపీ నాయకులు ఈ సమస్యను మరింత తీవ్రం చేసేందుకు ప్రయత్నిస్తుండడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దు ఏనాడూ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అపోహలతో వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దంటూ హితవు పలికారు. టీడీపీ వారి దాడిలో ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారని, వీరి ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. వారిలో ఎవరికైనా దెబ్బలు తగిలి ఉంటే నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. పోలీసులు విచక్షణతో వ్యవహరిస్తున్నారు జేసీ ఇంటిపై తామేదో దాడి చేసినట్లుగా అపోహలు సృష్టించి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నాలకు స్వస్తి చెప్పాలని టీడీపీ నేతలకు ఎమ్మెల్యే సూచించారు. వైఎస్సార్సీపీ నాయకులు దాడులు చేశారంటూ, దీనిపై సుమోటోగా కేసులు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేయడం సిగ్గుచేటన్నారు. పోలీసులు విచక్షణతోనే వ్యవహరిస్తున్నారని, వారికి అన్ని విషయాలు తెలుసునన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ పంతం నెగ్గించుకునేందుకు పోలీస్ స్టేషన్ల ఎదుట జేసీ సోదరులు ధర్నా చేసినప్పుడు ఈ సుమోటో నినాదం ఏమైందని ప్రశ్నించారు. ప్రభోదానంద ఆశ్రమం వద్ద గొడవలు తలెత్తితే నివారించేందుకు ప్రయత్నించకుండా పోలీసులతో నేరుగా ఘర్షణ పడి ‘మీ చేతుల్లో లాఠీలు ఉంటే.. మా చేతుల్లో కర్రలు ఉన్నాయి’ అంటూ జేసీ సోదరులు బెదిరింపులకు దిగినప్పుడు సుమోటో నినాదం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. గతంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలను ప్రజలు మౌనంగా భరిస్తూ వచ్చారని, ఇప్పుడు నిర్భయంగా సామాన్యులు సైతం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారన్నారు. -
తాడిపత్రి అల్లర్ల కేసులో కొత్త ట్విస్టు
సాక్షి, అనంతపురం: తాడిపత్రి అల్లర్ల కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేయలేదు. మొదటి నుంచి ఊకదంపుడు ముచ్చట్లు, కవ్వింపు చర్యలతో ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గాన్ని రెచ్చగొడుతున్న జేసీ వర్గం తోకముడిచింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలపై ఆరోపణలకే పరిమితమైంది జేసీ వర్గం. ఇక జేసీ వర్గీయుల దాడిలో గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తలు మనోజ్, బ్రహ్మేంద్ర జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమను కులం పేరుతో దూషించారని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మనోజ్, బ్రహ్మేంద్ర ఫిర్యాదు చేయడంతో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డిపై పోలీసులు అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. (చదవండి: తాడిపత్రిలో 144 సెక్షన్ : ఎస్పీ) ఐపీసీ 307, 306 సెక్షన్ల కింద జేసీ వర్గానికి చెందిన 27 మందిపై పోలీసులు కేసులు బుక్ చేశారు. దీంతోపాటు గొడవలకు కారణమైన యూట్యూబ్ ఛానల్ విలేకరి వలిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా తాడిపత్రి డీఎస్పీ చైతన్య మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ... తాడిపత్రిలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. మాకు ఏ రాజకీయ పార్టీ తో సంబంధం ఉండదు. తప్పు చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. తాడిపత్రిలో అల్లర్ల పై ఇప్పటిదాకా 3 కేసులు నమోదు చేశాం. ఫిర్యాదుల ఆధారంగానే కేసులు నమోదు చేస్తాం. వారం రోజుల పాటు తాడిపత్రి లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. -
తాడిపత్రిలో జేసీ అలజడి
సాక్షి, తాడిపత్రి అర్బన్/అనంతపురం క్రైం: ప్రశాంతంగా ఉంటున్న అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం గురువారం ఒక్కసారిగా అట్టుడికింది. టీడీపీకి చెందిన జేసీ సోదరుల వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఉద్దేశపూర్వకంగా కవ్వింపు చర్యలకు పాల్పడి దాడికి దిగి బీభత్సం సృష్టించారు. అంతేకాక.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై రాళ్ల దాడికి పాల్పడి వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. స్థానికులను భయభ్రాంతులకు గురిచేసి.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన ఈ ఘటన పూర్వాపరాలు.. స్థానికులు తెలిపిన వివరాలు ఇవీ.. కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం నెలకొంది. పార్టీలు, వర్గాలకు అతీతంగా ఎమ్మెల్యే సేవలు అందిస్తుండటాన్ని జేసీ కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. జేసీ ఇంటి పైనుంచి పోలీసులపై రాళ్ల వర్షం కురిపిస్తున్న జేసీ అనుచరులు ఎలాగైనా ఎమ్మెల్యేను రెచ్చగొట్టి ప్రజలలో భయాందోళనలు సృష్టించాలని భావించారు. ఇందులో భాగంగానే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై జేసీ వర్గీయులు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారు. వీటికి స్పందించకుండా తన పని తాను చూసుకుంటున్న ఎమ్మెల్యేను రెచ్చగొట్టడానికి ఆయన కుటుంబీకులపై కుట్రపూరిత పోస్టింగ్లను, అసత్య ఆరోపణలతో సోషల్ మీడియాలో హోరెత్తించారు. పెద్దారెడ్డి కుటుంబీకులు ఇసుక బండ్ల నిర్వాహకుల నుంచి వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో.. రాజకీయం చేయమంటే ఇంట్లో మహిళలపై దుష్ప్రచారం చేయడమేమిటని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అసహనానికి లోనయ్యారు. ఆ పోస్టింగులను ఖండించడంతో పాటు, ఆ విషయం మాట్లాడేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి గురువారం జేసీ ప్రభాకర్రెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే, అక్కడ జేసీ సోదరులెవరూ లేకపోవడంతో తిరిగి తన ఇంటికి వచ్చేశారు. రెచ్చగొట్టే ధోరణి జేసీ సోదరులదే : ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రజలను, గ్రామాల్లోని నాయకులను రెచ్చగొట్టి, గొడవలను సృష్టించి పబ్బం గడుపుకునే నీచ చరిత్ర జేసీ సోదరులదేనని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. తాడిపత్రిలోని తన నివాసంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. జేసీ సోదరులు ఓటమిని జీర్ణించుకోలేక తమపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు ఎక్కడి నుంచో మనుషులను పిలిపించి వారికి జీతభత్యాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు. వారి పోస్టింగులు మితిమీరిపోతుండటంతో.. వారితో చర్చించి వారి ఇబ్బంది తెలుసుకోవడం కోసమే గురువారం తాను జేసీ సోదరుల ఇంటికి వెళ్లానన్నారు. ఆ సమయంలో వారెవరూ ఇంట్లో లేకపోవడంతో తిరిగి వచ్చేశానన్నారు. మాట్లాడటానికి వెళ్తే దాడిచేయడానికి వచ్చానని తిరిగి మాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా జేసీ సోదరులు దుష్ప్రచారాలు మానుకోవాలని కేతిరెడ్డి హితవు పలికారు. టీడీపీ కార్యకర్తలతో కలసి దాడిచేయడానికి వస్తున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి పథకం ప్రకారం రెచ్చగొట్టి.. అనంతరం గంట తర్వాత ఇంటికి వచ్చిన జేసీ ప్రభాకర్రెడ్డి, తనయుడు అస్మిత్రెడ్డి.. పెద్దారెడ్డి ఇంటికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పెద్దారెడ్డి అనుచరులు ఎదురెళ్లేందుకు యత్నించగా.. తండ్రీకొడుకులు ఇద్దరూ దగ్గరుండి పోలీసులను సైతం లెక్కచేయకుండా వారిపై రాళ్లు రువ్వించారు. ఈ ఘటనలో పెద్దారెడ్డి అనుచరులు పలువురు గాయపడగా.. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. అలాగే, అంతకుముందు... పథకం ప్రకారం జేసీ ప్రభాకర్రెడ్డి గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలను పిలిపించి ఈ హంగామా సృష్టించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తాడిపత్రిలో 144 సెక్షన్ : ఎస్పీ శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా తాడిపత్రిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ బి. సత్యయేసు బాబు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమికూడరాదన్నారు. తాడిపత్రిలో ఇప్పటికే ప్రత్యేక భద్రతా బలగాలను మోహరించామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి అనవసరంగా తాడిపత్రికి వచ్చి గ్రూపుల్లో చేరడం చేయరాదన్నారు. తాడిపత్రి పట్టణం, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఉంచామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. -
రాళ్లదాడి: రెచ్చిపోయిన జేసీ వర్గీయులు
సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. ఎమ్మెల్యేపై దాడికి దిగి.. బీభత్సం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై రాళ్లదాడికి పాల్పడి వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై గతకొంత కాలంగా జేసీ వర్గీయులు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసి.. తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి వివరణ ఇచ్చినా తీరు మార్చుకోలేదు. అదేపనిగా దుష్ప్రచారం చేస్తూ ఎమ్మెల్యేను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారు. దీనిపై వివరణ కోరేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డి గురువారం నేరుగా జేసీ దివాకర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సమయంలో జేసీ సోదరులు ఇద్దరూ అందుబాటులో లేకపోవడంతో తిరిగి ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలోనే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న జేసీ వర్గీయులు ఎమ్మెల్యేపై దాడికి యత్నించారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలు వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజా ఘటనతో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. -
25 కేజీల గంజాయి పట్టివేత
అనంతపురం : జిల్లాలోని తాడిపత్రి సర్కిల్ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. వాహనాల తనిఖీలో భాగంగా మారుతి ఏర్టిగా వాహనంలో తరలిస్తున్న 25 కేజీల గంజాయి,ఒక లీటర్ గంజాయి ఆయల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి కారు, ఐదు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద మనసు
సాక్షి, తాడిపత్రి రూరల్: రాజకీయ నేపథ్యం లేదు. గ్రామంలో ఇతరులతో ఎలాంటి కక్షలూ లేవు. అయినా కుల పిచ్చి నెత్తికెక్కిన ఉన్మాదులు సాగించిన దాడిలో ఓ దళిత చిరుద్యోగి హతమయ్యాడు. అడ్డుకోబోయిన మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దురాగతంపై అప్పటి టీడీపీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. బాధిత కుటుంబాన్ని మరింత కష్టాల్లోకి నెట్టేసింది. ఆమె కష్టాన్ని తెలుసుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చలించిపోయారు. ఆమెకు అండగా నిలిచారు. ప్రభుత్వ ఉద్యోగ కల్పనతో పాటు ఇతర పరిహారాలు అందేలా చేశారు. ఎమ్మెల్యే చొరవపై హర్షం వ్యక్తం చేస్తూ బాధిత మహిళ కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళితే... దళితుడి కింద పనిచేయడం ఇష్టం లేక.. తాడిపత్రి మండలం ఊరుచింతల గ్రామంలోని దళిత వెంకటరమణ, పద్మావతి దంపతులు. ఉపాధి హామీ పథకంలో ఫీల్ట్ అసిస్టెంట్గా వెంకటరమణ పనిచేసేవారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ రావడం.. కొందరికి ఇబ్బందిగా మారింది. అదే సమయంలో ఓ దళితుడు చెప్పినట్లుగా తాము నడుచుకోవడమేమిటనే దురహంకారం వారిలో ప్రబలింది. ఫలితంగా 2018, సెప్టెంబర్ 21న పథకం ప్రకారం వెంకటరమణపై దాడి చేసి హతమార్చారు. అదే సమయంలో ఈ దారుణాన్ని అడ్డుకోబోయిన నాగరంగయ్య సైతం దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించాడు. ఆదుకోని గత టీడీపీ ప్రభుత్వం వెంకటరమణ హత్యకు గురి కావడంతో పద్మావతి దిక్కులేనిదైంది. ఘటనలో నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. నామమాత్రపు ఆర్థికసాయం అందించి చంద్రబాబు ప్రభుత్వం చేతులేత్తిసింది. బాధిత కుటుంబానికి ఊరట కలిగించేలా పొలం కూడా ఇవ్వలేకపోయింది. ఉద్యోగ కల్పన ఊసే లేకుండాపోయింది. చదవండి: (ప్రసాద్ కుటుంబానికి 5 లక్షల సాయం) అండగా నిలిచిన పెద్దారెడ్డి పద్మావతి పరిస్థితి ఇటీవల తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దృష్టికి వచ్చింది. నేరుగా ఎమ్మెల్యేని కలిసిన ఆమె తన దుర్భర స్థితిని ఏకరవు పెట్టింది. స్పందించిన ఎమ్మెల్యే ఆమెకు అండగా నిలిచారు. తాను ఇచ్చిన మాట మేరకు పెద్దవడుగూరు మండల ఎస్సీ బాలుర వసతి గృహంలో వంట మనిషి ఉద్యోగం దక్కేలా చేశారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం అనంతపురానికి బయలుదేరిన ఎమ్మెల్యేను పుట్లూరు మండలం ఎ.కొండాపురం వద్ద పద్మావతి, మరికొందరు దళిత నాయకులు కలిసి మాట్లాడారు. ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వం అందజేసిన ఉత్తర్వులను ఎమ్మెల్యేకు చూపి కృతజ్ఞతలు తెలిపారు. -
జేసీ ఆరోగ్యం కాపాడుకో..
సాక్షి, తాడిపత్రి : వ్యక్తిగత స్వార్థంతో పచ్చటి గ్రామాల్లో చిచ్చు రగిల్చే విధానాలను మానుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డికి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హితవు పలికారు. రైతులు ఒక్కప్పుడు అమ్మిన భూములను తిరిగి ఇప్పిస్తానంటూ మోసపూరిత రాజకీయాలకు తెరతీయడం సమంజసం కాదని అన్నారు. ఇది గ్రామాల్లో వర్గ కక్షలను ప్రేరేపించేలా ఉందని అన్నారు. మంగళవారం తాడిపత్రిలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎకరానికి రూ.20 వేలు ఎక్కువ ఇప్పిస్తా కేవలం తన చుట్టూ జనం తిరిగేలా చేసుకునేందుకే భూముల వ్యవహారంలో జేసీ ప్రభాకర్రెడ్డి తలదూర్చారని అన్నారు. ఒకసారి ఇతరులకు విక్రయించిన భూములను తిరిగి ఇప్పించడం ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. జేసీ సోదరులు వారి స్వగ్రామమైన జూటూరులో రైతుల పొలాల గట్లను డోజర్లతో చదును చేయించి ఎకరాకు రూ.30 వేలు ఇచ్చి దౌర్జన్యంగా భూములను లాక్కొన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆ భూములకు ఎకరాకు రూ.20 వేలు ఎక్కువగా తానిప్పిస్తానని, వాటిని అదే రైతులకు ఇచ్చే త్యాగబుద్ధి ఉందా అంటూ సవాల్ విసిరారు. (మూడు అంశాలే ప్రామాణికం!) స్వచ్ఛందంగా అమ్ముకున్నారు గతంలో వంగనూరు, బొందెలదిన్నె గ్రామాల సమీపంలోని భూములను రైతులు స్వచ్ఛందంగా అమ్ముకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం కడప జిల్లా ఆర్ఎస్ కొండాపురం మండలం గండికోట ముంపు గ్రామాల ప్రజలు తాడిపత్రిలో గృహాలు నిర్మించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని, ఫలితంగా తాడిపత్రి ప్రాంతంలో భూములకు డిమాండ్ పెరిగిందన్నారు. ఈ డిమాండ్ను ఆసరాగా చేసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి రైతులను మభ్య పెడుతూ గతంలో అమ్ముకున్న భూములను తిరిగి ఇప్పిస్తానంటూ గ్రామాల్లో చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. డబ్బు ఉంటే ఎవరైనా భూములను కొనుగోలు చేయవచ్చునని, అయితే ముందు అమ్మిన ధర కంటే ఎకరానికి రూ.20 వేలు, రూ.30 వేలు ఎక్కువ ఇస్తామనడం సరైన సంస్కృతి కాదని అన్నారు. మాయమాటలతో గ్రామాల్లో గొడవలు సృష్టించేందుకు ప్రయత్నిస్తే సహించబోమని మాజీ ఎమ్మెల్యేని హెచ్చరించారు. ఆరోగ్యం కాపాడుకో.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా పనులు చేసి ఉంటే వారిపై మాత్రమే కేసులు నమోదవుతాయని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబం«ధించి కర్ణాటకలోని అధికారులు లేఖలు రాయడం జరిగిందని, వారు స్పందించకపోవడంతో లోకాయుక్తలో ఫిర్యా దు చేసినట్లు గుర్తు చేశారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి దివాకర్ ట్రావెల్స్, జఠాధర ఇండస్ట్రీస్ యజమానులుగా ఎవరైతే ఉంటారో వారిపైన మాత్రమే కేసులు నమోదు అవుతాయన్నారు. ఈ విషయంగా ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలని జేసీ ప్రభాకర్రెడ్డికి సూచించారు. -
జేసీ అనుచరుల సెప‘రేటు’ మార్గం..
సాక్షి, తాడిపత్రి : ప్రభుత్వం మారింది..అధికారం పోయింది..అయినా జేసీ సోదరుల అనుచరులు సెప‘రేటు’ మార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో తాడిపత్రి పట్టణం అక్రమ మద్యం విక్రయాలకు కేరాఫ్గా మారింది. ఉదయం 6 గంటల నుంచి మద్యం అందుబాటులో ఉంచుతున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసివేసిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జోరుగా కొనసాగిస్తున్నారు. తద్వారా రూ.లక్షల్లో టర్నోవర్ చేస్తున్నారు. అయినా అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జేసీసోదరుల అనుచరులే అక్రమ వ్యాపారులు : జేసీ సోదరుల అనుచరులు కొందరు బస్టాండు కేంద్రంగా, మరికొన్ని ప్రాంతాల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారు. ఉదయం 6 గంటల నుంచి అక్రమ మద్యం వ్యాపారులు రోడ్లపై నిలబడి మద్యం జోరుగా విక్రయిస్తున్నారు. డబ్బులు ఉంటే చాలు తాడిపత్రి పట్టణంలో ఏ ప్రాంతంలోనైనా, దుకాణాలు తెరవని సమయంలోనూ మద్యం దొరుకుతోంది. ప్రభుత్వ దుకాణాల్లో కంటే క్వాటర్పై రూ.50 నుంచి రూ.100 అధికంగా ఇవ్వాల్సి వస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యం బ్రాండ్లకు ఫుల్ బాటిల్పై రూ.400 నుంచి రూ.600 వరకు అదనపు ధరకు అమ్ముతున్నారు. బస్టాండు వద్ద తోపుడు బండిపై విక్రయించడానికి ఉంచిన అక్రమ మద్యం బాటిళ్లు నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు ... తాడిపత్రి పట్టణ పరిధిలో మొత్తం 8 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు సుమారుగా రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు అధికార లెక్కలు చెప్తున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే కొందరితో టీడీపీ నాయకులు కుమ్మక్కయ్యారు. వారి నుంచి మద్యం తెచ్చుకొని నిల్వ ఉంచుకుంటున్నారు. అదేవిధంగా పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లను తెచ్చుకుంటున్నారు. మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలను తెరవక ముందు ఉదయం, మద్యం దుకాణాలను మూసి వేసిన తర్వాత రాత్రివేళలో అదును చూసి విచ్చలవిడిగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు: తాడిపత్రి ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్రమంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. తాడిపత్రి ప్రాంతంలో అక్రమ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని ఏదైనా పత్రికల్లో ప్రచురితమైనప్పుడు, జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు అందితేనే ఇక్కడి అధికారులు దాడులు చేసి, కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ మద్యం వ్యాపారుల నుంచి మమూళ్లు ముడుతుండడంతోనే అధికారులు ఏమీ ఎరుగనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దాడులు నిర్వహిస్తున్నాం అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాం. అక్రమ మద్యం స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నాం. అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందిస్తే వెంటనే దాడులు చేస్తున్నాం. ఇప్పటికే పట్టణ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నవారిని పిలిపించి, కౌన్సెలింగ్ నిర్వహించాం. ఎవరైనా అక్రమ మద్యం అమ్ముతూ రెండు సార్లకు పైబడి పట్టుబడితే వారిని బైండోవర్ చేస్తున్నాం. – గోపాల్నాయక్, ఎక్సైజ్ ఎస్ఐ, తాడిపత్రి -
జేసీ కుటుంబానికి మైనింగ్ శాఖ నోటీసులు
తాడిపత్రి అర్బన్, రూరల్: అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి కుటుంబీకులు నిర్వహిస్తున్న సుమన, భ్రమరాంబ మైనింగ్ సంస్థల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్టు గుర్తించామని మైనింగ్శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణారావు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జేసీ దివాకర్రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన రెండు డోలమైట్ మైనింగ్ క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా పనులు నిర్వహించడంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. విధుల్లో భాగంగానే మైన్స్ను తనిఖీ చేశామని, ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని డీడీ పేర్కొన్నారు. పోలీసులను అవహేళన చేయడంపై జేసీపై కేసు మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డిపై తాడిపత్రి పట్టణ పోలీస్స్టేషన్లో శనివారం కేసు నమోదైంది. విధి నిర్వహణలోని పోలీసులను అవహేళనగా మాట్లాడటంతో పాటు సమాజంలో వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా.. వివిధ రకాల వ్యవస్థలను కించపరిచేలా వ్యాఖ్యానించడంపై ఆయనపై కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం పట్టణంలోని మైన్స్ కార్యాలయం వద్ద విధుల్లో వున్న ఓ పోలీసు అధికారిని జేసీ అవహేళనగా మాట్లాడారు. అంతేకాక ప్రభుత్వంలోని పలు వ్యవస్థలపై బెదిరింపు ధోరణితో వ్యవహరించారు. దీంతో పోలీసు అధికారి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్స్టేషన్లో జేసీపై కేసు నమోదు చేశారు. -
మా అనుచరులు రాక్షసులు: జేసీ వార్నింగ్
సాక్షి, అనంతపురం : మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మరోసారి అనుచితంగా ప్రవర్తించారు. తాడిపత్రి పోలీసులను హేళనగా మాట్లాడుతూ నోరు పారేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... ముచ్చుకోటలో జేసీ దివాకర్ రెడ్డికి చెందిన క్వారీల్లో మైనింగ్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమ మైనింగ్పై అధికారులు వివరాలు సేకరించారు. దీంతో జేసీ దివాకర్ రెడ్డి మైనింగ్ శాఖ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసనకు దిగారు. అక్కడకు వచ్చిన పోలీసులను హేళన చేస్తూ మాట్లాడారు. (దురుసు ప్రవర్తన, జేసీ ప్రభాకర్రెడ్డి అరెస్ట్) సీఐ తేజోమూర్తిని పరోక్షంగా జేసీ దివాకర్ రెడ్డి బెదిరించారు. మీ భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారంటూ వార్నింగ్ ఇచ్చారు. ‘మా అనుచరులు రాక్షసులు. టీడీపీ అధికారంలోకి వస్తే రెచ్చిపోతారు. పచ్చి రక్తం తాగేవాళ్లు నా చుట్టూ ఉంటారు. పోలీసులు మీ భవిష్యత్ పాడు చేసుకోవద్దు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా గతంలోనూ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా విధుల్లో ఉన్న సీఐ పట్ల దురుసుగా ప్రవర్తించడంతో ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. (మరో వివాదంలో జేసీ దివాకర్ రెడ్డి) -
జేసీ ప్రభాకర్, ఆస్మిత్ రెడ్డిపై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డితో పాటు మరో 31 మంది పై 188 ఏపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి పట్టణ పోలీసులు తెలిపారు. 144 సెక్షన్తో పాటు 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంగిస్తూ తాడిపత్రికి ఊరేగింపుగా వచ్చినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి : జేసీ బెయిలు పిటిషన్ కొట్టేసిన కోర్టు -
ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఔదార్యం
సాక్షి, తాడిపత్రి రూరల్: ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన మనసు కూడా చాలా పెద్దదేనని మరోసారి చాటుకున్నారు. తల్లి మృతి చెంది.. తండ్రి మద్యానికి బానిసై ఆలనాపాలనకు నోచుకోని చిన్నారిని అక్కున చేర్చుకున్నారు. సంరక్షణ బాధ్యతలు తీసుకుని ఆదర్శంగా నిలిచారు. తాడిపత్రి మండలంలోని పెద్దపొలమడకు చెందిన నాగలక్ష్మీ, అర్జున్రెడ్డి దంపతులకు అజయ్కుమార్రెడ్డి సంతానం. 15 రోజుల క్రితం నాగలక్ష్మి అనారోగ్యంతో మరణించింది. అప్పటికే మద్యానికి బానిసైన అర్జున్రెడ్డి కుమారుడి బాగోగులు విస్మరించాడు. దీంతో గ్రామస్తుల సహాయంతో ఇన్నాళ్లూ అజయ్ కుమార్రెడ్డి గడిపాడు. (టీడీపీ నేతల నిర్వాకం..) ఈ క్రమంలోనే కొందరు గ్రామస్తులు అజయ్ పరిస్థితిని ఎమ్మెల్యే పెద్దారెడ్డి దృష్టికి తీసుకురాగా, వెంటనే స్పందించిన ఆయన మంగళవారం తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. అండగా ఉంటానని, బాగా చదువుకోవాలని సూచించారు. అంతేకాక ఇక నుంచి అజయ్కుమార్ రెడ్డి సంరక్షణ భాధ్యతను తానే తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చిన్నారి చదువులు, జీవనానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానన్నారు. ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయంపై పెద్దపొలమడ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం
-
అనంతపురం తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,అనంతపురం : జిల్లాలోని తాడిపత్రి శివారు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుచానూరు నుంచి తాడిపత్రికి వస్తున్న తుఫాన్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందినవారు తాడిపత్రి వాసులేనని తేలింది. కాగా ప్రమాదంలో మృతి చెందిన వారు హేమలత, సుబ్రమణ్యం, వెంకట రంగయ్యగా గుర్తించారు. -
జేసీ ప్రధాన అనుచరుడు రషీద్ మృతి
సాక్షి, తాడిపత్రి: ఎల్లో డాన్ కేవీ రషీద్ ఆదివారం అనారోగ్యంతో చనిపోయాడు. రషీద్.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ప్రధాన అనుచరునిగా ఉంటూ పట్టణంతో పాటు వైఎస్సార్ కడప జిల్లాలోనూ పెద్ద ఎత్తున మట్కా నిర్వహిస్తుండేవాడు. 2018 డిసెంబర్ 30వ తేదీన రషీద్ను అరెస్టు చేసేందుకు వైఎస్సార్ జిల్లాకు చెందిన అప్పటి సీఐ హమీద్ఖాన్ తన సిబ్బందితో కలిసి తాడిపత్రికి చేరుకున్నారు. అయితే అతనితో పాటు అనుచరులు సీఐ హమీద్ఖాన్, ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్లపై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రషీద్ను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బెయిల్పై విడుదలైన రషీద్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పలు కేసుల్లో నిందితునిగా ఉన్న రషీద్ ఆదివారం అనారోగ్యంతో చనిపోయాడు. (జేసీ పవన్ను ముందుగానే హెచ్చరించాం) -
జేసీకి తాడిపత్రి డీఎస్పీ వార్నింగ్!
సాక్షి, అనంతపూర్: విధుల్లో ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్ పట్ల టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి దురుసుగా ప్రవర్తించడంపై తాడిపత్రి డీఎస్పీ ఎ.శ్రీనివాసులు స్పందించారు. నిజాయతీగా పనిచేస్తున్న పోలీసులపై దాడి చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. పోలీసుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదని, చట్టపరంగా తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. అందరూ చట్టప్రకారం నడుచుకోవాల్సిందేనని హితవు పలికారు. జైలు నుంచి విడుదలయ్యాక ర్యాలీ చేయొవద్దని జేసీ ఫ్యామిలీకి నిన్ననే చెప్పామని డీఎస్పీ గుర్తు చేశారు. అయినా, జేసీ వర్గీయులు అవేమీ పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ దేవేంద్రపై జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారని, సీఐ ఫిర్యాదు మేరకు జేసీపై అట్రాసిటీ కేసు నమోదు చేశామని తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా లాక్డౌన్ నిబంధనల్ని కూడా ఉల్లంఘించారని అన్నారు. (చదవండి: ఏపీలో కొత్తగా 10,171 పాజిటివ్, 89 మంది మృతి) ‘500 మందితో జేసీ ఊరేగింపు జరిపారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా కాల్చారు. వీడియో క్లిప్పింగ్స్, ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఐదు కేసులు నమోదు చేశాం’అని డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. కాగా, వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి కొద్ది రోజుల కిందట అరెస్టయిన సంగతి తెలిసిందే. కండీషన్ బెయిల్పై వారిద్దరూ గురువారం కడప సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈక్రమంలో జేసీ ప్రభాకర్రెడ్డి తాడిపత్రి వరకు అనుచరగణంతో ర్యాలీగా వచ్చారు. సీఐ దేవేంద్రను పబ్లిక్గా బెదిరించారు. దీంతో సీఐ పట్ల దురుసుగా ప్రవర్తించిన జేసీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. దీంతోపాటు కడప నుంచి తాడిపత్రి వరకు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా జేసీపై పోలీసులు కేసులు నమోదు చేశారు. (దురుసు ప్రవర్తన, జేసీ ప్రభాకర్రెడ్డి అరెస్ట్) -
'పోలీసులంటే జేసీ బ్రదర్స్ కు ఎందుకంత చులకన'
సాక్షి, తాడిపత్రి : మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాన్ని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం తీవ్రంగా ఖండించారు. జేసీ ప్రభాకర్రెడ్డి ఓ గూండాలాగా ప్రవర్తించారు. పోలీసులపై జేసీ అనుచిత ప్రవర్తన సరికాదు.. పోలీసులంటే జేసీ బ్రదర్స్ కు ఎందుకంత చులకన అంటూ ప్రశ్నించారు. ఒక ప్రజాపతినిధిగా పనిచేసిన వ్యక్తి పోలీసులను హిజ్రాలతో పోల్చడం దారుణమన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బహింరంగంగానే పోలీసులకు వార్నింగ్ ఇచ్చారన్నారు. జేసీ బ్రదర్స్ ఆగడాలపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించాలని కోరారు. దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీలపై లోతుగా విచారించి జేసీ బ్రదర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దారెడ్డి వెల్లడించారు.(జేసీ వర్గీయుల హంగామా.. నిలిచిన 108 అంబులెన్సు) -
వాహనదారులకు గుంజీలు
-
జేసీ ట్రావెల్స్ అక్రమాల చిట్టా
-
అమరావతి భూ అక్రమాలపై సీఐడీ విచారణ
-
అమరావతిలో పరిటాల బంధువుల పాగా
సాక్షి, కనగానపల్లి: రాజధాని ప్రాంతంగా గుర్తించిన అమరావతి సీఆర్డీఏ పరిధిలోని భూముల కొనుగోలుపై సీఐడీ కన్నేసింది. రూ.కోట్ల విలువైన భూములను తెల్లరేషన్కార్డు కలిగిన వారు కొనుగోలు చేసినట్లు తెలుసుకున్న అధికారులు తీగ లాగుతున్నారు. కనగానపల్లికి చెందిన నిర్మలాదేవి, బద్దలాపురం గ్రామానికి చెందిన జయరాంచౌదరిలు అమరావతి పరిధిలోని తాడికొండ వద్ద ఒక్కొక్కరు అర ఎకరం చొప్పున భూమి కొనుగోలు చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్న వీరు రాజధాని ప్రాంతంలో భూములు కొనే పరిస్థితి లేదని, ఈ ప్రాంతంలోని ప్రజాప్రతినిధికి బినామీలుగా వీరు ఉన్నట్లు సీఐడీ అధికారులు భావిస్తున్నారు. చదవండి: పరిటాల కుటుంబ దోపిడీకి అడ్డుకట్ట.. ఇద్దరూ తెల్లరేషన్కార్డుదారులే... సీఐడీ సీఐ ఎస్ఎం గౌస్, ఎస్ఐ సుధాకర్ మంగళవారం కనగానపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి నిర్మలాదేవి, జయరాంచౌదరిల వివరాలను సేకరించారు. నిర్మలాదేవి(రేషన్ కార్డు నంబర్: డబ్ల్యూఏపీ1233001200252) స్థానికంగానే ఉండటంతో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను కార్యాలయానికి పిలిపించి విచారణ చేశారు. చిల్లర దుకాణం నడుపుకొంటూ జీవిస్తూ రూ.కోట్ల విలువ చేసే భూమి ఎలా కొన్నారు..? అని సీఐడీ అధికారులు వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నిర్మలాదేవి మాత్రం తమ సమీప బంధువులు, వ్యక్తుల సహకారంతో భూమి కొన్నట్లు చెప్పారు. వీరు మాజీ మంత్రి పరిటాల సునీతకు దూరపు బంధువులుగా తెలుస్తోంది. తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేస్తున్న సీఐడీ అధికారులు ఇక బద్దలాపురం గ్రామానికి చెందిన జయరాం చౌదరి(రేషన్ కార్డు నంబర్: ఆర్ఏపీ123300300110) అమరాపురంలోని సొసైటీ బ్యాంకులో సీఈఓగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. దీంతో సీఐడీ అధికారులు ఆయన్ను నేరుగా విచారించలేకపోయారు. అయితే ఆయన వ్యక్తిగత ఆదాయ వివరాలు, కుటుంబ వివరాలను తహసీల్దార్ కార్యాలయ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. జయరాంచౌదరి కూడా పరిటాల కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాలతోనే భూమి కొనుగోలు చేశాడా? లేక అతని సమీప బంధువుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు బినామీగా భూములు కొన్నాడా? అనే దానిపై సీఐడీ అధికారులు విచారణ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా అమరావతి ప్రాంతంలోని భూముల కొనుగోలు వ్యవహారంలో బినామీల బాగోతం ఒక్కొక్కటిగా వెలికితీసేందుకు అధికారులు విచారణ వేగవంతం చేశారు. తాడిపత్రిలోనూ విచారణ... తాడిపత్రి రూరల్: సీఐడీ అధికారులు తాడిపత్రి విజయలక్ష్మి థియేటర్ ఎదురుగా ఉన్న శ్రీ చైతన్యపాఠశాల నిర్వాహకుడు కె.చంద్రశేఖర్రెడ్డిని కూడా విచారించారు. 2014లో ఆయన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని ఘని ఆత్మకూరులో కొనుగోలు చేసిన 4 ఎకరాలపై ఆరా తీశారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన సీఐడీ సీఐ ఎస్సీ గౌస్ తహసీల్దార్ నయాజ్అహ్మద్తో మాట్లాడారు. చంద్రశేఖర్రెడ్డి పేరున ఉన్న తెల్లరేషన్ కార్డుపై ఆరా తీశారు. అనంతరం ఈ నెల 20న కర్నూలులోని తమ కార్యాలయంలో విచారణ నిమిత్తం హాజరు కావాల్సిందిగా చంద్రశేఖర్రెడ్డికి నోటీస్ అందజేశారు. చదవండి: పరిటాల హత్య కేసులో సంచలన విషయాలు -
జేసీ.. మీదీ బతుకేనా?
సాక్షి, తాడిపత్రి: ‘‘జేసీ బ్రదర్స్...మీదీ ఓ బతుకేనా...ఊరుమీద పడి దోచుకోవడం తప్ప... అభివృద్ధి, ప్రజల సంక్షేమంపై ఏనాడైనా పట్టించుకున్నారా..? ఆలయాలను అడ్డుపెట్టుకుని దోచుకున్నారు. ట్రాన్స్పోర్టు వ్యవహారంలో నకిలీ పత్రాలను సృష్టించి డ్రైవర్లకు అందాల్సిన బీమా సొమ్మును కూడా స్వాహా చేస్తున్నారు. చివరకు చికెన్ సెంటర్ల వ్యాపారులతో కూడా కమీషన్లు తీసుకున్న సంస్కృతి మీ చరిత్ర జిల్లా ప్రజలందరికీ తెలుసు...మీరా నాపై ఆరోపణలు చేసేది. నిజంగా దమ్ముంటే జేసీ ప్రభాకర్రెడ్డి నాపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు నేను సిద్ధం...మీరు సిద్ధమా..?’’ అని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ సోదరులకు సవాల్ విసిరారు. ఆదివారం ఆయన తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని...నాడు చేసిన పాపాలే నేడు జేసీ సోదరులను వెంటాడుతున్నాయని, వారికి కేసుల భయం పట్టుకుందన్నారు. జేసీ సోదరుల 40 ఏళ్ల దుర్మార్గపు పాలనకు ప్రజలు ముగింపు పలికారని, అందుకే వారికి మతి భ్రమించి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పినా జేసీ సోదరుల తీరులో ఇంకా మార్పురాలేదని ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు. మీ ఆరాచకాలు అప్పుడే మరిచారా..? జేసీ సోదరులు అధికారంలో ఉన్నపుడు పోలీసులను అడ్డుపెట్టుకొని పబ్బం గడుపుకున్న విషయాన్ని జిల్లా ప్రజలు ఇంకా మరచిపోలేదని ఎమ్మెల్యే పెద్దారెడ్డి అన్నారు. అధికారాన్ని ఉపయోగించి ప్రతిపక్షపార్టీ నేతలపై దొమ్మీ కేసులు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. అయితే అప్పట్లో పోలీసులు వాస్తవాలను తెలుసుకుని అసలైన నిందితులను అరెస్టు చేసిన విషయాన్ని ఎమ్మెల్యే పెద్దారెడ్డి గుర్తు చేశారు. నియోజకవర్గంలోని తన అనుచరులను వెంటబెట్టుకొని ప్రబోధానంద ఆశ్రమంపై మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి దాడి చేశాడని, దాడిలో పాల్గొన్న వారి పేర్లను మాజీ ఎంపీ జేసీనే స్వయంగా పోలీసులకు అందజేసి విచారణకు సహకరిస్తే చార్జీ షీటు వేస్తారన్నారు. అంతేగానీ పోలీసులను బ్లాక్మెయిల్ చేసి పబ్బం గడుపుకోవాలని చూడటం దుర్మార్గమన్నారు. ప్రబోధానంద ఆశ్రమం ఘటనలో అరెస్టులు ఆపకుంటే తాను నిరాహార దీక్ష చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి వ్యాఖ్యనించడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. సామాన్యునికి ఓ న్యాయం... జేసీ కుటుంబానికి మరో న్యాయమా అని పెద్దారెడ్డి ప్రశ్నించారు. ఉనికి కోల్పోతున్నామనే భయంతోనే ఇలా బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ఇలాగే పోలీసులను బ్లాక్మెయిల్ చేస్తే తాను కూడా మాజీ ఎమ్మెల్యే జేసీ ఇంటి వద్ద నిరాహార దీక్షకు పూనుకుంటానని ఎమ్మెల్యే పెద్దారెడ్డి హెచ్చరించారు. బహిరంగ చర్చకు సిద్ధమా..? తనపై జేసీ ప్రభాకర్రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్పష్టం చేశారు. తాను అవినీతికి పాల్పడి ఉంటే నిరూపించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే జేసీ నివాసం వద్దకే చర్చకు వస్తానని ఎమ్మెల్యే పెద్దారెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల్లో పోటీ చేసిన తమ కుమారులను ఎక్కడో ఉంచి ఇక్కడ అమాయకపు ప్రజలతో జేసీ సోదరులు చెలగాటమాడుతున్నారన్నారు. వారి కుమారులైతే క్షేమంగా ఉండాలి గానీ... నియోజకవర్గ ప్రజలు మాత్రం కక్షలు కార్పణ్యాలతో కొట్టుకు చావాలా..? అని ప్రశ్నించారు. తాడిపత్రిలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొందని, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు స్వేచ్ఛగా నిద్రపోతున్నారన్నారు. ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో గ్రామాల్లోని ప్రశాంత వాతావరణానికి భంగం కల్గించేందుకు జేసీ సోదరులు కుట్రపన్నుతున్నారని, ఎవరూ కుట్రలకు బలికావద్దని పిలుపునిచ్చారు. -
ఏఆర్లో ఖతర్నాక్ ఖాకీ
క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు శాఖలో కొంతమంది అధికారులు దారితప్పారు. దొరికిన చోట దొరికినంత తీసుకుని జేబులు నింపుకుంటున్నారు. ఏఆర్ విభాగంలోని ఓ అధికారి అయితే మరీ దిగజారిపోయాడు. కిందిస్థాయి సిబ్బందితో మామూళ్లు తీసుకుంటున్నారు. తాజాగా సదరు ఆర్ఐ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం సదరు అధికారి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. – అనంతపురం సెంట్రల్ సాక్షి, అనంతపురం: పోలీసుశాఖలో ఏఆర్(ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్సు) విభాగం కీలకమైంది. ఎక్కడ ఏం జరిగినా.. వీరి సేవలనే వినియోగించుకుంటారు. బందోబస్తు బాధ్యతలే కాకుండా వీవీఐపీల భద్రత కూడా వీరే చూసుకుంటున్నారు. అయితే ఆ శాఖలోని ఓ ఆర్ఐ(రిజర్వ్ ఇన్స్పెక్టర్) అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యేలు, ముఖ్యులకు పీఎస్ఓ(పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు)గా పనిచేస్తున్న సిబ్బంది నుంచి ఆర్ఐ నెలనెలా మామూళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇలా కొన్నేళ్లుగా ఏఆర్లో తన దందా నడిపించాడు. పీఎస్ఓలుగా వెళ్లాలన్నా, అక్కడ కొనసాగాలన్నా సదరు ఆర్ఐకి నెలనెలా మామూళ్లు ఇవ్వాల్సిందే. ముడుపులు ముడితే అంతా ఆయనే చూసుకుంటారు. ఇటీవల అత్యాశకు పోయి విధుల్లో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిన ఇద్దరు పీఎస్ఓలతో భారీగా డబ్బు దండుకోవడంతో ఆయన అక్రమాల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఎస్పీ గన్మెన్లను తొలగించినా... తాడిపత్రిలో కొన్నేళ్లుగా రౌడీరాజ్యానికి నాయకత్వం వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి అలియాస్ పొట్టి రవిపై ఇటీవల ఎస్పీ సత్యయేసుబాబు పీడీ యాక్టు ప్రయోగించారు. ఎలాంటి పదవి లేకపోయినా అప్పటికే తన గురువుల పలుకుబడితో పొట్టి రవి ప్రత్యేకంగా గన్మెన్ సౌకర్యం పొందాడు. అయితే అతను అనేక దాడులు, హత్యాయత్నాలు, మారణాయుధాలు కలిగిన కేసుల్లో నిందితుడు కావడంతో ఇటీవల ఎస్పీ సత్యయేసుబాబు కఠిన చర్యలు తీసుకున్నారు. గన్మెన్ సౌకర్యాన్ని తొలగించారు. ఏఆర్ ఆర్ఐ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. నాలుగు నెలలుగా అజ్ఞాతంలో... ఎస్వీ రవీంద్రారెడ్డికి గన్మెన్లుగా ఉన్న ఇద్దరు ఏఆర్ సిబ్బంది నాలుగు నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రవీంద్రారెడ్డిపై పీడీ యాక్టు ప్రయోగించిన వెంటనే అతనికున్న గన్మెన్ సౌకర్యాన్ని ఎస్పీ ఉపసంహరించారు. ఈ క్రమంలో వెంటనే వారిని ఏఆర్కు పిలిపించుకొని రిపోర్టు చేయించుకోవాల్సిన బాధ్యత సంబంధిత ఆర్ఐపై ఉన్నప్పటికీ ఆయన ఆ పనిచేయలేదు. ఎస్వీ రవీంద్రారెడ్డి వ్యవహారంపై గన్మెన్లుగా ఉన్న తమను కూడా విచారిస్తారన్న భయంతోనే.. మరే ఇతర కారణమో తెలియదు గానీ వారిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నాలుగు నెలలుగా విధులకు కూడా హాజరుకావడం లేదు. వీరిని పర్యవేక్షించాల్సి ఆర్ఐ కూడా మిన్నకుండిపోయారు. దీని వెనుక తీవ్రమైన ఒత్తిళ్లతో పాటు భారీగా ముడుపులు ముట్టినట్లు తెలుస్తోంది. ఇద్దరు పీఎస్ఓలు దాదాపు నాలుగు నెలలుగా కనిపించకపోవడం.. అయినా ఆర్ఐ పట్టించుకోకపోవడం ఏఆర్లో దుమారం రేపుతోంది. దీని వెనుక ఏదైనా మంత్రాంగం నడిచిందా? అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. -
తోడబుట్టిన అన్నే తల నరికాడు!
సాక్షి, పుట్లూరు : పొలాన్ని ఇతరులకు కౌలుకు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని ఓ అన్న సొంత తమ్ముడి తలను తెగనరికి పొలాల్లోకి విసిరేసిన ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. శనగలగూడూరు గ్రామానికి చెందిన రాజ్కుమార్ తన పొలాన్ని అన్న రామాంజినేయులుకు 10 సంవత్సరాలుగా కౌలుకు ఇస్తున్నాడు. అయితే అతను పంట పండించుకుంటున్నా కౌలు డబ్బు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది రాజ్కుమార్ తన భూమిని అన్నకు కాకుండా గ్రామానికి చెందిన ఇతరులకు కౌలుకు ఇవ్వడంతో రామాంజినేయులు జీర్ణించుకోలేకపోయాడు. రాజ్కుమార్ భూమిని కౌలుకు తీసుకున్న వ్యక్తులు ఆ పొలంలో పప్పుశనగను సాగు చేశారు. అయితే వర్షాభావం వల్ల పప్పుశనగకు పొలం పక్కనే ఉన్న నీటికుంట ద్వారా తడులు అందించడానికి కౌలుదారులు ప్రయత్నించగా రామాంజినేయులు అడ్డుకున్నాడు. ఇదే విషయాన్ని కౌలుదారులు చెప్పడంతో శనివారం పొలం వద్దకు వెళ్లిన రాజ్కుమార్తో పాటు కౌలుదారులైన వెంకటరెడ్డి, శ్రీనివాసులరెడ్డి కళ్లలో కారం కొట్టిన రామాంజినేయులు అతని కుమారుడు మధుతో కలిసి అత్యంత దారుణంగా రాజ్కుమార్ తలను వేరు చేసి పొలాల్లోకి విసిరేశాడు. హత్య జరిగిన ప్రదేశాన్ని తాడిపత్రి రూరల్ సీఐ దేవేంద్రకుమార్, ఎస్ఐ వెంకటప్రసాద్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. సొమ్మసిల్లిన భార్య.. రాజ్కుమార్ హత్య విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. తల లేని భర్త మొండేన్ని చూసి భార్య లక్ష్మిదేవి సొమ్మసిల్లి పడిపోయింది. మృతుడి ఇద్దరు కుమార్తెలు తిరుపతిలో చదువుకుంటున్నారు.