Telangana High Court
-
Cases against KTR : తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కు ఊరట
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr), ఎమ్మెల్యే ముఠా గోపాల్కు హైకోర్టు ఊరట దక్కింది. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో దాఖలైన కేసును హైకోర్టు కొట్టివేసింది.అసెంబ్లీ ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగంగా బాణసంచా కాల్చి ప్రజలకు ఇబ్బంది కలిగించారంటూ ఫిర్యాదులందాయి. ఆ ఫిర్యాదులపై కేటీఆర్,ముఠా గోపాల్పై ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు పిటిషన్లు దాఖలు చేశారు. వాదనలు విన్న జస్టిస్ కె.లక్ష్మణ్ కేసును కొట్టివేశారు. -
ఎంపీ రఘునందన్ రావుకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. నాగార్జున సాగర్ లో రఘునందన్ రావుపై నమోదైన కేసును హైకోర్టు కొట్టి వేసింది. 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావుపై ఎప్ఐఆర్ నమోదైంది. మోడల్ కోడ్ అమల్లో ఉండగా అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని ఫిర్యాదు చేశారు ఎంపీడీవో దుబ్బ సత్యం. రఘునందన్ రావు ఉట్లపల్లి, పులిచెర్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదు చేశారు ఎంపీడీవో దుబ్బ సత్యం. ఆ కేసును హైకోర్టు కొట్టివేసింది. -
‘కనీస వేతనాల’ తీర్పును 4 వారాల్లో అమలుచేయండి
సాక్షి, హైదరాబాద్: కనీస వేతనాలకు సంబంధించి గెజిట్ ప్రింట్ చేయాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను 4 వారాల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో సంబంధిత అధికారులంతా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. ఐదేళ్లకోసారి కనీస వేతనాలను సవరిస్తూ గెజిట్ విడుదల చేయాల్సి ఉండగా, 2007 తర్వాత ఇప్పటివరకు మళ్లీ ఇవ్వలేదని పేర్కొంటూ తెలంగాణ రీజినల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ 2023లో పిల్ దాఖలు చేసింది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాల పెంపుపై వివిధ ప్రభుత్వ శాఖలు జీవోలు చేసి చేతులు దులుపుకున్నాయని పిటిషన్ తరఫు న్యా యవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. కోటి మందికిపైగా కార్మికులు ప్రభుత్వ చర్యలతో నష్టపోతున్నారని చెప్పారు.వాదనలు విన్న సీజే ధర్మాసనం.. వెంటనే గెజిట్ ప్రింట్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ను ఆదేశిస్తూ 2023లోనే ఉత్తర్వులు జారీచేసింది. 6 వారాలు సమయం ఇచ్చినా అమలు చేయలేదంటూ పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించి.. ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. -
మార్గదర్శి, రామోజీది 45 ఏళ్ల నయవంచన
సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) కర్త రామోజీరావుల అక్రమ డిపాజిట్ల వసూళ్ల వ్యవహారం 45 ఏళ్ల నయవంచన అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. ఏపీలోని గత ప్రభుత్వం మార్గదర్శి అక్రమాలపై విచారణ కోసం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం మార్గదర్శి ఫైనాన్షియర్స్ను కాపాడేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ సర్కారు కూడా దీనికి తానతందాన అంటోందని తెలి పారు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను (ఆర్బీఐ) ప్రతివాదిగా చేర్చాలని, డిపాజిట్ల వసూళ్లు అక్రమమా? సక్రమమా? తేల్చాల్సింది చట్టబద్ధ సంస్థేనని సుప్రీంకోర్టే నేరుగా చెప్పిందని ధర్మా సనం దృష్టికి తీసుకొచ్చారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల వసూళ్లు అక్రమమేనని ఆర్బీఐ చాలా స్పష్టంగా ఈ కోర్టుకు చెప్పిందన్నారు. ఇప్పుడు కూడా మార్గదర్శిపై కఠిన చర్యలు చేపట్టకుంటే భవిష్యత్కు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందన్నారు.రామోజీ అక్రమాలకు హెచ్యూఎఫ్ సభ్యులు కూడా బాధ్యులేనని చెప్పారు. హెచ్యూఎఫ్ కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ కార్యకలాపాలు చేపట్టినందున కర్త రామోజీరావు మాత్రమే బాధ్యడవుతారని, ఇతర కుటుంబసభ్యులకు ఎలాంటి సంబంధం ఉండదంటూ ఆ సంస్థ జనవరి 29న దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై అన్ని పక్షాల వాదనలు విన్న జస్టిస్ పి.శ్యాం కోషి, జస్టిస్ కలాసికం సుజనలతో కూడిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది. అంతకుముందు ఉండవల్లి తన వాదనలను కొనసాగించారు.ఇష్టారాజ్యంగా వసూళ్లు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇలా వేటి అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ను నడిపించారని, ఇదేమని అడిగేవారు లేకుండా తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారని ఉండవల్లి పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి రామోజీ కావడం, వెంట ఆయన మీడియా మాఫియా ఉండడంతో బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనుకాడారు. ఫిర్యాదు చేసినా రామోజీపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. 2004 తర్వాత బోగస్ బ్యాంక్ల బండారం బయటపడుతుండడంతో మార్గదర్శి అక్రమాలపై కూడా విచారణ జరపాలని నాటి సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి నిర్ణయించారు. ఎప్పుడైతే మార్గదర్శిపై విచారణ ప్రారంభమైందో నాటి నుంచి వైఎస్సార్పై రామోజీరావు తన మీడియాలో అనుచిత వార్తలు ప్రచురించడం, ప్రసారం చేయడం మొదలుపెట్టారు. కథనాలు అల్లి రాసేవారు. ఈ క్రమంలోనే నా తల్లికి మార్గదర్శి నుంచి వచ్చిన చెక్, దానిపై ఉన్న సంతకాలను పరిశీలించగా అవకతవకలన్నీ బయటపడ్డాయి. దీంతో నేను ఫిర్యాదు చేసి, నిజం తేల్చేందుకు 18 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నా’’అని ఉండవల్లి కోర్టుకు నివేదించారు. ఐటీ శాఖ కనీసం పట్టించుకోలేదు.. ‘‘కర్త మరణించి, వ్యాపారం ఆగిపోతే ఎలా చర్యలు చేపట్టాలనేది ఆలోచించవచ్చు. రామోజీ చనిపోయినా హెచ్యూఎఫ్ వ్యాపారాన్ని వారసులు కొనసాగిస్తూ లబ్ధి పొందుతున్నారు. ఇదో హత్య కేసు లాంటిది. నిందితుడు చనిపోతే ఇక కేసు ఉండదని మార్గదర్శి న్యాయవాదులు చెప్పడం విడ్డూరం. దేశంలోని అన్ని హెచ్యూఎఫ్ల నుంచి ఆదాయపు పన్ను శాఖ పన్ను వసూలు చేస్తోంది. వాటి సిబిల్ స్కోరు, ఆదాయ వ్యయాలపై పరిశీలన చేస్తుంది. ఈనాడు, ఈటీవీ, ఫిలిం సిటీ.. ఇలా అన్నీ కలిపి దాదాపు రూ.1,359 నష్టాల్లో ఉన్నాయి. ఇవన్నీ సాంకేతిక నష్టాలని మార్గదర్శి చెబుతోంది. ఇంత జరిగినా ఆదాయ పన్ను శాఖ కనీసం హెచ్యూఎఫ్ వ్యాపారంపై స్టే కూడా కోరడం లేదు. టీడీఎస్ ప్రస్తావనే లేదు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో ఉన్న ప్రభుత్వాలకు మీడియా మాటున అక్రమాలు చెలాయిస్తున్న మార్గదర్శిపై ప్రత్యేక అభిమానం ఉంది’’అని ఉండవల్లి వాదించారు. ఈ కేసులో ఆర్బీఐని తాను ప్రతివాదిగా తొలుత చేర్చలేదని.. సుప్రీంకోర్టు ఎస్ఎల్పీ విచారణ చేస్తూ.. ఇది ఓ కుంభకోణంలా కనిపిస్తోందని, ఆర్బీఐని ప్రతివాదిగా చేర్చాలని స్పష్టం చేసిందని వివరించారు.‘‘అక్రమాలు, అవకతవకలు జరిగాయా? లేదా? చట్టప్రకారమే జరిగిందా? తేల్చాల్సింది ఆర్బీఐ కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి డిపాజిట్ల వసూలు అక్రమమేనని ఆర్బీఐ తేల్చింది’’అని ఉండవల్లి పేర్కొన్నారు. లూథ్రాను మందలించిన ధర్మాసనం ఉండవల్లి వాదనలు వినిపిస్తుండగా, మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పదేపదే అడ్డుపడ్డారు. సీనియర్ న్యాయవాది అయి ఉండి ఇలా కలుగజేసుకోవడం సరికాదని ఆయనను ధర్మాసనం మందలించింది. ఉండవల్లి వాదనలు ముగిసేవరకు ఆగాలని ఆదేశించింది. తర్వాత ఏపీ ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది రాజేశ్వర్రెడ్డి వాదిస్తూ ఉండవల్లి వాదనలను తోసిపుచ్చారు. విచారణ చేశామని, ఫిర్యాదు చేసేందుకు ఎవరూ రాలేదని చెప్పారు. హెచ్యూఎఫ్ వ్యక్తి కాదని, విచారణ సాధ్యం కాదని మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది నాగముత్తు చెప్పారు. కర్త అక్రమాలకు హెచ్యూఎఫ్ సభ్యులు బాధ్యత వహించరని పేర్కొన్నారు. రామోజీ మరణం నేపథ్యంలో కేసు విచారణను ముగించాలని కోరుతూ తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను అనుమతించాలని కోరారు. నాకు డబ్బులు చెల్లించలేదు... అందరి వాదనలు పూర్తయిన తరువాత లక్ష్మీనరసింహారావు అనే న్యాయవాది జోక్యం చేసుకున్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ తన డబ్బు తిరిగివ్వలేదని ఆర్బీఐకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనను కూడా ఈ పిటిషన్లలో ప్రతివాదిగా చేర్చుకుని, వాదనలు వినాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ, అప్పటికే తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించామని, వాదనలను లిఖితపూర్వకంగా అందజేయాలని ఆదేశించింది.బాధ్యత నుంచి పారిపోలేరు రామోజీరావు మరణించినా.. అక్రమాల కారణంగా లబ్ధి పొందినవారు ఉన్నారు. ఆ లబ్ధిని అనుభవిస్తూ మాకేం సంబంధం లేదని వారు తప్పించుకోలేరు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ను ఉల్లంఘించారని ఆర్బీఐ స్పష్టంగా చెబుతోంది. తన కుటుంబ సభ్యుల కోసమే సేకరిస్తున్నా అన్నట్లు రామోజీరావు 22 మంది కుటుంబసభ్యుల పేర్లను కూడా హెచ్యూఎఫ్లో చేర్చారు. అలాంటప్పుడు వారు బాధ్యత నుంచి పారిపోలేరు.తండ్రి లోన్ తీసుకుని చనిపోతే కుటుంబం బాధ్యులు కారా? తండ్రి బ్యాంక్ లోన్ తీసుకుని మరణిస్తే.. కుటుంబసభ్యులను బాధ్యులను చేయరా? రామోజీ అక్రమాలకు కుటుంబసభ్యులు కచ్చితంగా బాధ్యులే. వారు శిక్ష అనుభవించాల్సిందే. కాదని.. ఇలానే ప్రోత్సహిస్తే.. దీన్ని అసరాగా తీసుకుని ఇలాంటి ఫైనాన్షియర్లు ఎన్నో పుట్టుకొస్తాయి. అప్పుడు ఈ దేశమే తీవ్ర ప్రమాదంలో పడిపోతుంది. భవిష్యత్లో ప్రజల డిపాజిట్లకు గ్యారెంటీ లేకుండా పోతుంది. – మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ -
మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాల కేసులో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్ : మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, ఆర్థిక అవకతవకల సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మార్గదర్శి ఫైనాన్షియర్ డబ్బులు ఎగ్గొట్టిందని తన వాదనలు వినాలంటూ కోర్టుకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. న్యాయం స్థానం తీర్పును రిజ్వర్ చేసింది. విచారణలో మాజీ ఎంపీ, న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు వినిపించారు. ‘45ఏళ్ల నయ వంచన. మార్గదర్శిపై క్రిమినల్ చర్యలు పెట్టాల్సిందే. ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలు ఫైనాన్సియర్కు వత్తాసు. సుప్రీం కోర్టు సూచన మేరకే ప్రతివాదిగా ఆర్బీఐ. మార్గదర్శి అక్రమాలకు పాల్పడిందని ఆర్బీఐ తేల్చింది.క్రిమినల్ చర్యలకు హెచ్యూఎఫ్ సభ్యులే బాధ్యులు. కఠినశిక్ష విధించకుంటే ఇలాగే ఫైనాన్షియర్లు పుట్టుకొస్తారు. దేశమే ప్రమాదంలో పడి పోయే ప్రమాదం ఉంది’అని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. -
రూ.1,500 కోట్ల పెనాల్టీ వసూలు చేయాల్సిందే
సాక్షి, అమరావతి: రిజర్వ్బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్సియర్స్కు విధించిన రూ.1,500 కోట్ల పెనాల్టీని వసూలు చేసేలా చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కేంద్ర ఆదాయ పన్ను శాఖను కోరారు. ఇప్పటికే 16 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న ఈ విషయాన్ని సత్వరం పరిష్కరించి పెనాల్టీని వసూలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థను నిర్వహించిన హిందూ అవిభాజ్య కుటుంబ (హెచ్యూఎఫ్) కర్త చెరుకూరి రామోజీరావు మరణించినందున దీనికి సంబంధించి గతంలో ఉమ్మడి హైకోర్టు విధించిన స్టే కూడా తొలగిపోయినట్లేనని స్పష్టం చేశారు. ఈమేరకు ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్కు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల రెండు వేర్వేరు లేఖలు రాశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థ ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన అక్రమ డిపాజిట్ల ఉదంతాన్ని అందులో సవివరంగా ప్రస్తావించారు. అక్రమంగా డిపాజిట్లు వసూలు నిర్ధారించిన ఆర్బీఐమార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థ పేరిట రామోజీరావు ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు వసూలు చేసిన విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ తొలిసారి 2006లో ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. రిజర్వ్ బ్యాంకు చట్టం ప్రకారం బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్ రెండు లక్షల మందికిపైగా డిపాజిటర్ల నుంచి అక్రమంగా రూ.2,600 కోట్లకుపైగా డిపాజిట్లు వసూలు చేసింది. ఇదే విషయాన్ని ఉండవల్లి అరుణ్కుమార్ అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, ఆర్బీఐలకు లేఖల ద్వారా తెలియచేశారు. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్పై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ కేసు నమోదు చేసింది. ఆర్బీఐ సెక్షన్ 45 ఎస్ నుంచి తమకు మినహాయింపు ఉందని రామోజీ అప్పట్లో అడ్డగోలుగా వాదించారు. అయితే ఆ వాదనను ఆర్బీఐ కొట్టిపారేసింది. 45 ఎస్ కింద రామోజీరావుకు మినహాయింపు వర్తించదని.. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట వసూలు చేసినవి ముమ్మాటికీ అక్రమ డిపాజిట్లేనని స్పష్టం చేసింది. దాంతో విధి లేని పరిస్థితుల్లో రామోజీరావు తన మార్గదర్శి ఫైనాన్సియర్స్ సంస్థను మూసివేస్తున్నామని.. సేకరించిన అక్రమ డిపాజిట్లను తిరిగి చెల్లించేస్తామని ఆర్బీఐ, న్యాయస్థానాలకు విన్నవించారు.రూ.1,500 కోట్లు పెనాల్టీ విధించిన ఐటీ శాఖస్టే తెచ్చుకున్న రామోజీనిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల ద్వారా రామోజీ సముపార్జించిన అక్రమ ఆదాయంపై ఆదాయపన్ను శాఖ 2008లో రూ.1,500 కోట్ల పెనాల్టీ విధించింది. ఈ మేరకు ఆదాయపన్ను చట్టం సెక్షన్ 271 డి ప్రకారం మార్గదర్శి ఫైనాన్సియర్స్కు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులపై రామోజీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. స్టే విధించి 16 ఏళ్లు దాటినప్పటికీ దాన్ని తొలగించేందుకు ఇప్పటికీ ఆదాయపన్ను శాఖ సరైన చర్యలు తీసుకోలేదు. దాంతో రూ.1,500 కోట్ల పెనాల్టీ చెల్లింపు అంశం దీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది. ‘మార్గదర్శి’పై చర్యలు తీసుకోవాల్సిందేనన్న ‘సుప్రీం’మార్గదర్శి ఫైనాన్సియర్స్ తమ డిపాజిటర్లకు డిపాజిట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించేసినందున ఇక ఎలాంటి చర్యలు అవసరం లేదని ఏపీ – తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజనకు ముందు రోజు అంటే 2018 డిసెంబర్ 31న తీర్పునిచ్చింది. ఆ తీర్పును అప్పటి టీడీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయకుండా రామోజీరావుకు సహకరించింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమ డిపాజిట్లు ఎవరెవరికి తిరిగి చెల్లించారో వివరాలు వెల్లడించాలని.. అక్రమాలకు పాల్పడిన మార్గదర్శి ఫైనాన్సియర్స్పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అనంతరం 2019 మేలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు.. గతంలో ఉమ్మడి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్పై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కేసును తిరిగి విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టుకు సహకరించాలని ఉండవల్లి అరుణ్కుమార్కు సూచించింది. ప్రస్తుతం ఈ కేసు తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉంది. హెచ్యూఎఫ్ కర్త రామోజీరావు మరణించినా సరే... అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్సియర్స్పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.పెనాల్టీ వసూలుకు చర్యలు చేపట్టండిఈ పరిణామాల నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కేంద్ర ఆదాయపన్ను శాఖకు లేఖ రాశారు. హెచ్యూఎఫ్ కర్త చెరుకూరి రామోజీరావు మరణించినందున ఆ సంస్థపై ఐటీ శాఖ విధించిన పెనాల్టీకి సంబంధించి గతంలో న్యాయస్థానం ఇచ్చిన స్టే ఉత్తర్వులు తొలగిపోయినట్లేనని వివరించారు. రామోజీరావు మరణించిన తరువాత ఆయన కుటుంబ సభ్యులను ఈ కేసు రికార్డుల్లో నమోదు చేయనందున గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులు మనుగడలో లేనట్లుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. రామోజీ స్థానంలో తనను హెచ్యూఎఫ్ కర్తగా పరిగణించాలని ఆయన కుమారుడు సీహెచ్.కిరణ్ మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసును విచారిస్తున్న తెలంగాణ హైకోర్టును కోరారు. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్పై ఆదాయపు పన్ను శాఖ విధించిన పెనాల్టీకి సంబంధించిన కేసులో మాత్రం రామోజీరావు వారసుల పేర్లు రికార్డుల్లో నమోదు కాలేదు. కాబట్టి గతంలో ఆదాయ పన్ను శాఖ విధించిన రూ.1,500 కోట్ల పెనాల్టీపై న్యాయస్థానం ఇచ్చిన స్టే తొలగిపోయినట్లుగానే పరిగణించాలని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ నివేదించారు. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్కు విధించిన రూ.1,500 కోట్ల పెనాల్టీని వసూలు చేసేందుకు ఆదాయపన్ను శాఖ న్యాయపరంగా అన్ని చర్యలూ చేపట్టాలని కోరారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలపై తానే ఫిర్యాదుదారుడిని కాబట్టి పెనాల్టీ అంశంపై ప్రస్తుత పరిస్థితిని తనకు వివరిస్తే అవసరమైతే తాను కూడా తగిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు.తొక్కిపెడుతున్న బాబు సర్కారుమార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని కర్త రామోజీరావు భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆర్బీఐ ఆధారాలతో సహా న్యాయస్థానానికి నివేదించినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తొక్కిపెడుతూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే.. మార్గదర్శి ఫైనాన్సియర్స్ కర్త రామోజీరావు మరణించినందున ఈ వ్యాజ్యాలపై విచారణే అవసరం లేదంటూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు ఇటీవల తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. అనవసరమైన విచారణ జరిపి సమయాన్ని వృథా చేసుకోవద్దని ఏకంగా న్యాయస్థానానికే సూచించింది. చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా?‘డిపాజిట్లు వెనక్కి ఇచ్చే శారు సరే..! అసలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని ఆర్బీఐ చెబుతోంది కదా? వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడం వేరు.. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడం వేరు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా? అలా వసూలు చేయడం నేరమా? కాదా? అన్నదే ముఖ్యం. తుది విచారణలో ఈ విషయాన్ని కూడా తేలుస్తాం...’ – మార్గదర్శినుద్దేశించి గతంలో తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యడిపాజిట్ల సేకరణచట్ట విరుద్ధమే:ఆర్బీఐమార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని కర్త రామోజీరావు ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 (ఎస్)కి విరుద్ధంగా ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే పలు దఫాలు న్యాయస్థానానికి నివేదించింది. ఇది సెక్షన్ 58 బీ (5ఏ) ప్రకారం అత్యంత శిక్షార్హమైన నేరమని స్పష్టం చేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని కర్త రామోజీరావుల చట్ట ఉల్లంఘనలకు సంబంధించి ఆర్బీఐ తన కౌంటర్లో పలు కీలక విషయాలను తెలంగాణ హైకోర్టు ముందుంచింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ చట్ట విరుద్ధంగా వసూలు చేసిన డిపాజిట్లపై తమకు ప్రజల నుంచి, డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. డిపాజిట్ల వసూలు విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న మార్గదర్శి, రామోజీ వాదన శుద్ధ అబద్ధమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో... చట్ట విరుద్ధంగా ప్రజల నుంచి రూ.వేల కోట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్సియర్స్ హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) కర్త చెరుకూరి రామోజీరావు మరణించిన నేపథ్యంలో, తమపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొనసాగించడం నిష్ప్రయోజనమంటూ మార్గ దర్శి ఫైనాన్సియర్స్ చేసిన వాదనను ఆర్బీఐ నిర్ధ్వందంగా తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్, రామోజీరావు ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో వసూలు చేశారని, ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 45ఎస్కి విరుద్ధమని పునరుద్ఘాటించింది. అంతేకాక ఇలా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడం ఆర్బీఐ చట్టం సెక్షన్ 58 బీ (5ఏ) ప్రకారం శిక్షార్హమని హైకోర్టు దృష్టికి తెచ్చింది. రామోజీరావు మరణించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్సియర్స్పై ప్రొసీడింగ్స్ను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. -
తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ.. భూసేకరణపై స్టే
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. హకీంపేట భూసేకరణ నోటిఫికేషన్పై స్టే విధిస్తూ.. తక్షణమే భూసేకరణ ఆపేయాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది.వికారాబాద్ జిల్లా దుండిగల్ మండలం హకీంపేట పరిధిలో 8 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే చట్ట ప్రకారం పరిహారం చెల్లించకుండా.. బలవంతంగా భూసేకరణ చేపడుతున్నారంటూ బాధితులు న్యాయ పోరాటానికి దిగారు. హకీంపేటకు చెందిన శివకుమార్ బాధితుల తరఫున పిటిషన్ వేయగా.. అడ్వొకేట్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం.. భూసేకరణపై స్టే విధిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది ధర్మాసనం. -
నిర్ణయం ఇంకెప్పుడు?
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ప్రతిసారీ ‘‘స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారు’’ అంటున్నారు. తగినంత సమయం అంటే ఎంత? ఐదేళ్ల పదవీ కాలం పూర్తయ్యే వరకా?. తగినంత సమయాన్ని కోర్టు ఫిక్స్ చేయాలా? వద్దా?. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. చట్ట సభల గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకపోతే ఎలా? ప్రజాస్వామ్యానికి అర్థం ఏం ఉంటుంది? ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అనే విధంగా వ్యవహరించడం ఎంతమాత్రం సరికాదు..’ అంటూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో కొనసాగుతున్న ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ కార్యాలయం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా అందజేయాలని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల ధర్మాసనం ఆదేశించింది. ఈ నోటీసులపై వీరంతా ఈనెల 22లోపు వివరణ ఇవ్వాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఓ ఎస్ఎల్పీ, మరో రిట్ పిటిషన్పై విచారణ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్లపై ఎస్ఎల్పీ, మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎం.సంజయ్కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్గౌడ్, గూడెం మహీపాల్ రెడ్డి, అరెకపూడి గాందీలపై రిట్ పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. కాగా ఈ రెండు పిటిషన్లపై తాజాగా మంగళవారం సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్రావు, స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, ముకుల్ రోహత్గీ తదితరులు వాదనలు వినిపించారు. ఏడాది కావొస్తున్నా చర్యలు లేవు ‘గతేడాది మార్చి, ఏప్రిల్లో పార్టీ ఫిరాయింపులపై తొలిసారి కోర్టును ఆశ్రయించాం. అనంతరం జూన్లో రిట్ పిటిషన్ దాఖలు చేశాం. ఏడాది అవుతున్నా ఇప్పటివరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఆర్టికల్ 32, 226 ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి సమయం అవసరం లేదు. ప్రధానంగా పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ బీ ఫాంపై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. మరో ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ పార్టీ కోసం లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేశారు. మిగిలిన ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు వాళ్లు పార్టీ ఫిరాయించినట్టే. దీనిపై తొలుత రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా..విచారణకు సమయాన్ని ఖరారు చేయాలంటూ సింగిల్ బెంచ్ నాలుగు వారాలు గడువు ఇచ్చింది. దీనిపై స్పీకర్ కార్యాలయం అప్పీల్కు వెళ్లింది. అయితే స్పీకర్కు తగినంత సమయం ఇవ్వాలన్న భావనతో ఈ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంను ఆశ్రయించాం. కానీ స్పీకర్ కార్యాలయం ఇప్పటివరకు ఆ తగినంత సమయం అంటే ఎంతో చెప్పనేలేదు. స్పీకర్ సమయం తీసుకునే విషయంలో సుభాష్ దేశాయ్, కేశం మేఘాచంద్, రాజేంద్ర సింగ్ రాణా కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ తీర్పుల ఆధారంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది..’ అని అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అయితే సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ నిర్ణయంపై ఎలాంటి గడువు ఫిక్స్ చేయలేదని జస్టిస్ బీఆర్ గవాయి అన్నారు. రాణా కేసులో మూడు నెలల సమయం ఇవ్వాలని చెప్పిందని తెలిపారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ అధికారం ఉన్నచోట ఒకలా... లేనిచోట మరోలా వ్యవహరిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది అర్యమ సుందరం వాదించారు.స్పీకర్కు కోర్టు ఆదేశాలివ్వడానికి అవకాశం లేదుస్పీకర్ కార్యదర్శి తరఫు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదిస్తూ.. ‘ఫిరాయింపులపై గతేడాది జూలై మొదటి వారంలో స్పీకర్కు ఫిర్యాదు చేస్తే 9వ తేదీ నాటికే కోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు ఫిరాయింపులపై ఫిర్యాదు అందగానే స్పీకర్ స్పందించారు.. నోటీసులు ఇచ్చారు. వారి నుంచి రిప్లై రాగానే నిర్ణయం తీసుకుంటారు. అసలు స్పీకర్ నిర్దిష్ట సమయంలో నిర్ణయం తీసుకోవాలని లేదు. రాజ్యాంగబద్ధంగా అత్యంత ఉన్నతమైన పదవుల్లో స్పీకర్ పదవి ఒకటి. ఈ పదవిలో ఉన్న స్పీకర్కు కోర్టు ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం లేదు..’ అని చెప్పారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘స్పీకర్కు కోర్టు ఆదేశాలు జారీ చేయడానికి అవకాశం లేదూ అంటే.. న్యాయమే డిసైడ్ చేస్తుంది ఆగండి..’ అంటూ వ్యాఖ్యానించింది. నోటీసుల జారీకి ఆదేశాలిచ్చింది. ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కూడా వీరికి నేరుగా నోటీసులు ఇవ్వొచ్చని తెలిపింది. ఈనెల 25న ఐటెం నంబర్–1గా కేసును విచారిస్తామని స్పష్టం చేసింది. -
SLBC టన్నెల్ ఘటనపై హైకోర్టులో పిల్ దాఖలు
-
టన్నెల్ లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురండి..!
హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్. టన్నెల్ ఘటన జరిగి 10 రోజులైనా కార్మికుల ఆచూకీ లేకపోవడం ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. దీనిపై ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. టన్నెల్ సహాయక చర్యలో ఆర్మీ, సింగరేణ రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ లు పాల్గొన్నాయన్నారు ఏజీ. ఘటన జరిగిన నాటి నుంచి 24 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నామని హైకోర్టు తెలిపారు సుదర్శన్ రెడ్డి. సహాయక చర్యలను ప్రభుత్వం సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఏజీ వివరాలను నమోదు చేసిన హైకోర్టు.. ఈ పిల్ పై విచారణ ముగించింది. కాగా, ఎస్ఎల్బీసీ టన్నెల్లో పదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో టీబీఎం మిషన్ కటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అలాగే, నేడు కన్వేయర్ బెల్టు పునరుద్దరణ చర్యలను అధికారులు చేపట్టారు. పిల్లర్ వేసి కన్వేయర్ బెల్టును విస్తరించనున్నారు. ఇక, టన్నెల్లో ఊరుతున్న నీటితో పనులకు ఆటంకం కలుగుతోంది.మరోవైపు.. టన్నెల్లో ఏడు మీటర్ల లోతు తవ్వినా కూడా కార్మికుల ఆచూకీ లభ్యం కావడం లేదు. జీపీఆర్ టెక్నాలజీ విఫలం కావడంతో గందరగోళం ఏర్పడుతోంది. పది రోజులుగా టన్నెల్లో ఉన్న వారి కోసం కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.గత నెల 22వ తేదీన శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) తొలి సొరంగం పైకప్పు కుప్పకూలడంతో గల్లంతైన 8 మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదు. కార్మీకులను బయటికి తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఆర్మీ సహాయక బృందాలు 10 రోజులుగా చేస్తున్నప్రయ త్నాలు ఇంకా ఫలించలేదు. -
తెలంగాణలో మల్టీప్లెక్స్ లకు ఊరట
-
సినిమా ప్రదర్శనలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సినిమా ప్రదర్శనలకు సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమాలకు బెనిఫిట్ షో, ప్రిమియర్ షో, స్పెషల్ షోలకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఈ మేరకు జనవరి 21వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు సవరించింది. ఇదే సమయంలో 16 సంవత్సరాల లోపు పిల్లల్ని అన్నీ షోలకు అనుమతించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతరం, తదుపరి విచారణ మార్చి 17వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ నటించిన పుష్ఫ-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన పరిణామాలతో ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. కానీ, రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా పిటిషనర్ మూవీ టికెట్ రేట్ల పెంపు విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ప్రభుత్వ న్యాయవాది.. సినిమాకి టికెట్ల ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్లు కోర్టుకు తెలిపారు.ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం 8.40 గంటల మధ్య సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఎలాంటి షోలకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బెనిఫిట్, ప్రత్యేక షోలకు అనుమతించొద్దని హైకోర్టు సూచించింది. నిర్మాత భారీ బడ్జెట్తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. ఈ విషయంపై తదుపరి విచారణను వాయిదా వేసింది. -
రామోజీ లేరు.. విచారణా అక్కర్లేదు!
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు.. యావద్భారతం ఒక కేస్ స్టడీగా గమనిస్తున్న వ్యవహారం.. ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ 45 (ఎస్) ఉల్లంఘన జరిగిందా? లేదా? అన్నది ఆరు నెలల్లో తేలా్చలంటూ స్వయంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించిన నేరం.. సెక్షన్ 45 (ఎస్)ను ఉల్లంఘిస్తూ, అక్రమ డిపాజిట్ల సేకరణ జరిగిందంటూ స్వయంగా ఆర్బీఐ అఫిడవిట్ దాఖలు చేసిన పరిస్థితి.. నిబంధనలకు విరుద్ధంగా లక్షలాది మంది డిపాజిటర్లపై తీవ్ర ప్రభావం చూపే ఆర్థిక లావాదేవీలు.. ప్రజల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు.. ఇందుకు భిన్నంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు చూసి విశ్లేషకులు, నిపుణులు నివ్వెర పోతున్న పరిస్థితి.. డిపాజిటర్ల వైపు నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలు రామోజీ వైపు నిలబడుతున్న వైనం.. ఆర్బీఐ మాటలూ బేఖాతర్.. మరోవైపు చనిపోయిన రామోజీపై నేరం నెట్టేసి.. చేతులు దులుపేసుకునే మార్గదర్శి ఫైనాన్షియర్స్ ప్రయత్నం.. ఇప్పుడు ఈ అంశంపైనే సర్వత్రా ఆసక్తి...సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు వేల కోట్ల రూపా యల ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ) ఆధారాలతో సహా ఒకవైపు నిరూపిస్తుంటే, మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఊసే ఎత్తడం లేదు. పైపెచ్చు మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని ప్రస్తుత కర్త కిరణ్ను చట్ట ఉల్లంఘనల నుంచి కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను చాలా సూటిగా తెలంగాణ హైకోర్టుకు నివేదించింది.మార్గదర్శి ఫైనాన్షియర్స్ కర్త రామోజీరావు మరణించిన నేపథ్యంలో, ఈ వ్యాజ్యాలపై విచారణే అవసరం లేదని చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు తేల్చి చెప్పింది. అనవసరమైన విచారణ జరిపి సమయాన్ని వృథా చేసుకోవద్దని ఏకంగా హైకోర్టుకే సూచించింది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఆర్బీఐ చూసుకుంటుంది.!: ఏపీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ఫిర్యాదులు ఏవీ లేవని, పత్రికా ప్రకటనలు ఇచ్చిన తరువాత కూడా ఎవరూ ముందుకు రాలేదని, అందువల్ల విచారణ జరిపి ప్రయోజనం లేదని ఏపీ ప్రభుత్వం వివరించింది.ఒకవేళ తర్వాత ఎవరైనా ఫిర్యాదు చేస్తే, వారి సంగతి రిజర్వు బ్యాంక్ చూసుకుంటుందని ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే రీతిన వాదనలు వినిపించింది. అయితే కోర్టు తీర్పు మేరకు చర్యలు చేపడతామంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. ఏ వాదన వినిపిస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్కు లబ్ది చేకూరుతుందో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలాంటి వాదనలే వినిపించాయి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదనల్లో ఎక్కడా మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావుల అక్రమాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విశేషం. మార్గదర్శి అక్రమాలకు ఆధారాలున్నా, కనీస స్థాయిలో కూడా వాటి గురించి ప్రస్తావించలేదు. డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమే: ఆర్బీఐ మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన వైఖరిని పునరుద్ఘాటించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 (ఎస్)కి విరుద్ధంగా ప్రజల నుంచి వేల కోట్ల రూపాయల మేర డిపాజిట్లు వసూలు చేశారని మరోసారి తేల్చి చెప్పింది. ఇలా చేయడం సెక్షన్ 58బీ(5ఏ) ప్రకారం అత్యంత శిక్షార్హమైన నేరమని స్పష్టం చేసింది. రామోజీ లేరు కాబట్టి, పిటిషన్ను మూసివేయాలంటూ మార్గదర్శి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను కొట్టేయాలని హైకోర్టును అభ్యరి్థంచింది.రిజర్వ్ బ్యాంక్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ, రామోజీ చేసిన నేరానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్యూఎఫ్ బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసినందుకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదురోవాల్సిందేనని స్పష్టం చేశారు. కేసును మూసేయాలంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థన సమర్థనీయం కాదన్నారు. చట్టవిరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించిందని, ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)ను ఉల్లంఘించిందని ఆయన మరోసారి ధర్మాసనానికి గుర్తు చేశారు. హెచ్యూఎఫ్ కర్త రామోజీరావు మరణించినా కూడా విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. అప్పుడు అలా చెప్పి.. ఇప్పుడు ఇలా..: ఉండవల్లి మరోవైపు ఈ కేసులో కోర్టు సహాయకారిగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, గతంలో అసలు ఎలాంటి అక్రమాలు జరగలేదని మార్గదర్శి ఫైనాన్షియర్స్ బల్లగుద్ది మరీ చెప్పిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఒకవేళ అక్రమాలు ఏవైనా జరిగి ఉంటే అందుకు రామోజీరావే బాధ్యత వహించాల్సి ఉందని ఇప్పుడు చెబుతోందన్నారు. మనిషి మరణించినా కూడా ప్రాసిక్యూషన్ ఆగదన్నారు. కుటుంబ సభ్యులు బాధ్యులు కారు: మార్గదర్శి కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను మార్చి 7కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ కె.సుజనలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ఆ రోజున ఉండవల్లి వాదనలు పూర్తిస్థాయిలో వింటామంది. అంతక్రితం మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, రామోజీ మృతి చెందినందున ఆయన నేర చర్యలకు కుటుంబ సభ్యులు బాధ్యులు కారని తెలిపారు. సివిల్ చర్యల విషయంలో వాదనలు వినిపిస్తామన్నారు. రామోజీరావు ఓ కంపెనీ యజమాని అని, ఆ కంపెనీ చర్యలకు యజమానే వహించాల్సి ఉంటుందన్నారు. యజమాని చనిపోయారు కాబట్టి మిగిలిన కుటుంబ సభ్యులు బాధ్యత వహించాల్సిన అవసరం లేదన్నారు. నేపథ్యం ఇదీ.. చట్ట నిబంధలను ఉల్లంఘించి ప్రజల నుంచి వేల కోట్ల రూపాయల మేర డిపాజిట్లు వసూలు చేసినందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ అ«దీకృత అధికారి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును కొట్టేయాలంటూ మార్గదర్శి, రామోజీరావు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రజనీ, నాంపల్లి కోర్టులో అధికారి దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ 2018, డిసెంబర్ 31న తీర్పునిచ్చారు.ఈ తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. అలాగే హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అన్నీ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, అ«దీకృత అధికారి ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు ఇచి్చన తీర్పును తప్పుపట్టింది. ఆ తీర్పును రద్దు చేసింది. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. దీంతో తెలంగాణ హైకోర్టు 2024, జూన్ నుంచి తన విచారణను ప్రారంభించింది. అంతా ఆయన చేశారు..: మార్గదర్శి ఫైనాన్షియర్స్ విచారణ కొనసాగుతుండగానే మార్గదర్శి ఫైనాన్షియర్స్ తన బాధ్యతలను తప్పించుకుని, వివాదాన్ని మరణించిన రామోజీ మీదకు తోసేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది. ఈ మేరకు హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ కార్యకలాపాలు చేపట్టినందున దాని కర్త రామోజీరావు మాత్రమే బాధ్యడవుతారని, ఇతర కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని ఆ పిటిషన్లో పేర్కొంది. దీంతో న్యాయస్థానం తొలుత ఈ అనుబంధ పిటిషన్లపై వాదనలు వినేందుకు సిద్ధమైంది. కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రిజర్వ్ బ్యాంక్ను సైతం ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు వారు కూడా కౌంటర్లు దాఖలు చేశారు. తాజాగా శుక్రవారం ఈ వ్యాజ్యాలపై జస్టిస్ శ్యామ్ కోషి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. -
‘మెట్రో’ విస్తరణపై మీ వైఖరి చెప్పండి
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి శంషాబాద్ వరకు ప్రభుత్వం చేపడుతున్న మెట్రో రైలు విస్తరణ పనులను ఆపేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై వైఖరి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మూడు వారాలు సమయం కావాలని ప్రతివాదుల తరఫు న్యాయవాది కోరడంతో సమ్మతిస్తూ విచారణ ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. సర్కార్ దాఖలు చేసే కౌంటర్పై ఆలోగా పిటిషనర్ రిజాయిండర్ కూడా వేయాలని స్పష్టం చేసింది.ఎంజీబీఎస్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో రైలు విస్తరణ పనులను ఆపేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మహమ్మద్ రహీంఖాన్ ఈ పిల్ దాఖలు చేశారు. మెట్రో విస్తరణతో పరిసర ప్రాంతాల్లోని చరిత్రాత్మక కట్టడాలపై ప్రభావం పడుతుందని, చార్మినార్, ఫలక్నుమా, దారుల్షిఫా లాంటి కట్టడాలకు ప్రమాదం వాటిల్లనుందన్నారు.చరిత్రాత్మక కట్టడాల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీనిపై పురావస్తు శాఖ, పర్యావరణ, ఆయారంగ నిపుణులతో అధ్యయనం చేయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్పై ఏసీజే జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని సర్కార్ తరఫు న్యాయవాది కోరడంతో అనుమతించిన ధర్మాసనం విచారణ వాయిదా వేసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నాయకుడు చక్రధర్గౌడ్ ఫిర్యాదు మేరకు నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టివేయాలని మాజీ మంత్రి హరీశ్రావు వాదనలు వినిపించగా.. విచారణ నిలుపుదల ఆదేశాలను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఇరుపక్షాల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హాజరై వాదనలు వినిపించారు. వాదనలు పూర్తికావడంతో న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ తీర్పు రిజర్వు చేశారు. రాజకీయ కక్షతో చక్రధర్గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీస్స్టేషన్లో తనపై నమోదు చేసిన ‘ట్యాపింగ్’ కేసును కొట్టివేయాలంటూ హరీశ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అలాగే ఇదే కేసులో మరో నిందితుడైన రాధాకిషన్రావు కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. హరీశ్ పిటిషన్పై జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం విచారణ చేపట్టారు. పోలీసుల తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా గత విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనకు, హరీశ్ తరఫు న్యాయవాది దామ శేషాద్రినాయుడి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. ఈ అంశాన్ని వదిలేయాలని, మెరిట్పై వాదనలు కొనసాగించాలని సూచించారు. ఫిర్యాదుపై దర్యాప్తు విచారణ చేపట్టే అధికారం పోలీసులకు ఉంటుందని లూథ్రా చెప్పారు. దర్యాప్తు పారదర్శకంగా సాగడం లేదని, ఇతర నిందితులను హింసించి హరీశ్కు వ్యతిరేకంగా వాంగ్మూలం చెప్పాలని పోలీసులు వేధిస్తున్నారని శేషాద్రి నాయుడు వాదించారు. రాజకీయ కక్షలో భాగంగా హరీశ్ను అరెస్టు చేయాలని సర్కార్ భావిస్తోందని.. అందుకే, ఫిర్యాదుదారు (చక్రధర్గౌడ్)కు వత్తాసు పలుకుతోందన్నారు. అలాగే రాధాకిషన్రావు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో వాదనలను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. -
KCR: హైకోర్టులో కేసీఆర్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
సాక్షి,హైదరాబాద్: మేడిగడ్డ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత.. మాజీ సీఎం కేసీఆర్(KCR), మాజీ మంత్రి హరీష్ రావులు వేసిన పిటిషన్ను విచారించిన కోర్టు.. తీర్పు రిజర్వు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. మేడిగడ్డ కుంగిన వ్యవహరంపై భూపాలపల్లి కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఇవాళ (ఫిబ్రవరి24) హైకోర్టు విచారణ జరపింది. విచారణ సందర్భంగా.. లోయర్ కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తి(Raja Lingamurthy) చనిపోయాడని కేసీఆర్, హరీష్ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే.. కేసు వేసిన పిటిషనర్ చనిపోయినా లీగల్ హైర్(Legal Heir)ను ఇంప్లీడ్ చేస్తే.. పిటిషన్ మెయింటేనబుల్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. కాబట్టి, మళ్లీ లోయర్ కోర్టుకు రిఫర్ చేయాలని బెంచ్కు విజ్ఞప్తి చేశారు. అయితే.. ఇది క్రిమినల్ పిటిషన్ కాబట్టి లీగల్ హైర్కు ఆస్కారం ఉండబోదని కేసీఆర్ అడ్వకేట్ వాదించారు. లీగల్ హైర్ ను ఇంప్లీడ్ చేయడం సమన్స్ కేసుకు మాత్రమే వర్తిస్తుందని కోర్టుకు నివేదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. -
సీఐడీలో C అంటే చంద్రబాబేనా?
వ్యవస్థలను మ్యానేజ్ చేయడం.. అందులోని వాళ్ళను వివిధమార్గాల ద్వారా తన దారికి తెచ్చుకోవడం.. అవసరాన్ని బట్టి అవతలివారి అవసరాలు తీర్చడం,. వారిని తన గుప్పెట్లోకి తెచ్చుకోవడం.. ఇలాంటి జయప్రదంగా చేసిన రికార్డ్ చంద్రబాబుకు ఉంది. ఇందుకోసం అయన ఎన్ని మెట్లు కిందికి దిగిపోవడానికైనా వెనుకాడరు. తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఏ వ్యవస్థను అయినా భ్రష్టుపట్టించగలరు.. తన తన కాళ్లకిందకు తెచ్చుకోగలరు. తన చర్యలతో సదరు వ్యవస్థల గౌరవం.. ఔన్నత్యం ఎలా మంటగలిసిపోయినా చంద్రబాబు ఫర్వాలేదనుకుంటారు. తన ప్రయోజనాలే తనకు ముఖ్యం అనేది ఆయన పాలసీ. కేసులు దర్యాప్తు చేసే పోలీసు వ్యవస్థను సైతం నేరుగా వాడుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది.చంద్రబాబు(Chandrababu) గతంలో వ్యవస్థలను, ప్రభుత్వ పెద్దలను తనకు అనుకూలంగా మార్చుకుని వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఎంతలా ఇబ్బందులు పెట్టింది తెలిసిందే. జగన్ సీఎంగా ఉన్నప్పుడూ కూడా అది నడిచింది. మరోవైపు.. చంద్రబాబు 2014-19 మధ్య స్కిల్ డెవలప్మెంట్ ద్వారా డబ్బును ఏ విధంగా పక్కదారి పట్టించింది.. వేర్వేరు సంస్థలకు ఇవ్వాల్సిన డబ్బులను సొంత సంస్థలకు మళ్లించుకుని... ఆ డబ్బును తాను కాజేసిన అంశం గురించి తెలిసిందే. ఈ వ్యవహారంపై వైయస్ జగన్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. స్కిల్ స్కాంకు సంబంధించిన అన్ని ఆధారాలూ అప్పటి ఏపీ సీఐడీ(AP CID) విభాగం చీఫ్ సునీల్ కుమార్ సారథ్యంలోనే దర్యాప్తు బృందాలు సేకరించి కోర్టుకు అందజేశాయి. దీంతో చంద్రబాబు అరెస్టై.. జైలు జీవితం గడిపారు. ఆపై బెయిల్ మీద కూడా వచ్చారు. ఐతే ప్రభుత్వం మారగానే చంద్రబాబు దర్యాప్తు సంస్థ మీద మీద కన్నేశారు. తనను ముప్పుతిప్పలు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపిన సీఐడీనీ.. దాని అధికారులను టార్గెట్ చేసారు. ఐజీ సంజయ్, సునీల్ కుమార్ తదితరులకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కనబెట్టారు. అంతేకాకుండా ఇప్పుడు ఆ స్కిల్ స్కామ్ కేసు సైతం లేకుండా చేసేందుకు సీఐడీలోని తన విధేయులైన అధికారులద్వారా కథ నడిపిస్తున్నారు.ఇదీ చదవండి: చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు విప్పని సీఐడీరాజగురు రుణం తీర్చుకుంటూ..ఇన్నాళ్లూ రాజకీయంగా తాను చేస్తూ వస్తున్నా అవినీతి.. అక్రమాలను కాపాడుతూ వస్తున్నా రాజగురు రామోజీరావు(Ramoji Rao)కు ఋణం తీర్చుకునేందుకు చంద్రబాబు నడుం బిగించారు. రామోజీకి చెందిన మార్గదర్శిపై రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా వేలాదికోట్ల డిపాజిట్లను సేకరించిన అభియోగం మీద కేసులు నమోదయ్యాయి. ఈమేరకు రూ. 1,050 కోట్ల మేరకు డిపాజిట్లు సేకరించినట్లు సీఐడీ సైతం తెలంగాణ హైకోర్టుకు గతంలోనే ఆధారాలు అందించింది. ఈలోపు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు మళ్ళీ సీఐడీ ప్లేటు ఫిరాయించింది. ఇదీ చదవండి: మార్గదర్శిపై కేసు.. మా పొరపాటే!మార్గదర్శి అక్రమంగా డిపాజిట్లు(Margadasi Illegal Deposits) సేకరించినట్లు తాము ఆధారాలు సంపాదించలేకపోయామని, కొద్దోగొప్పో వివరాలు ఉన్నా.. వాటితో మార్గదర్శిని విచారించలేమని కోర్టుకు వాంగ్మూలం ఇచ్చింది. తాము ఇక కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని, కేసు కొట్టేసినా ఫర్వాలేదని సీఐడీ కోర్టుకు నివేదించింది. చంద్రబాబు పవర్లో ఉంటే కేసులు కూడా మాఫీ అయిపోతాయి. తమ అనుయాయులంతా పత్తిగింజలు అయిపోతారు.. తనకు రాజకీయంగా ఎదుగుదలకు ఎంతో వెన్నుదన్నుగా మారినవాళ్లను కాపాడేందుకు చంద్రబాబు మరోమారు సీఐడీని ఇలా దిగజార్చుతున్నారు.:::సిమ్మాదిరప్పన్న -
చట్టాన్ని ధిక్కరిస్తే హైడ్రాను రద్దు చేస్తాం: హైకోర్టు
-
చట్టాన్ని ధిక్కరిస్తే.. హైడ్రాను రద్దు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: ఎన్నిసార్లు చెప్పినా.. చట్టాన్ని ధిక్కరించి మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాల్సివస్తుందని హైకోర్టు తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ‘ఎందుకంత తొందర.. రాత్రికి రాత్రే హైదరాబాద్ నగరాన్ని మార్చలేరు. ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్లు కాదు’అని హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు పాటించకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని పేర్కొంది. హైడ్రా ఏకపక్ష చర్యలను తప్పుబట్టింది. ‘సరైన విచారణ నిర్వహించకుండా వారాంతాల్లో కూల్చివేతలకు పాల్పడుతున్నారు. ఓసారి తెల్లవారుజామున 4 గంటలకు ప్రహరీ కూల్చివేశారు. దోపిడీ దొంగలు మాత్రమే అలా వ్యవహరిస్తారు.. అధికారులు అలా చేయరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆక్రమణల స్వాధీనానికి, అనుమతి లేని భవనాల కూల్చివేతకు మేం ఏ మాత్రం వ్యతిరేకం కాదు. కానీ, ప్రతి దానికీ ఓ చట్టం అంటూ ఉంటుంది. దాన్ని ప్రతీ వ్యక్తి పాటించి తీరాల్సిందే’అని తేల్చిచెప్పింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి సర్వే నంబర్ 296/ఇ/2 మూడు గుంటల భూమిలోని షెడ్ను ఎలాంటి సమాచారం లేకుండా (ఆదివారం) కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ ప్రవీణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ కోర్టు ఎదుట హాజరుకావాలన్న ఆదేశాల మేరకు ఆయన న్యాయస్థానం ముందు హాజరయ్యారు.ఇకపై జరగదంటూనే.. మళ్లీ అదే తప్పుపిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ‘పార్కు స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఇచ్చిన వినతిపత్రంపై హైడ్రా నోటీసులు జారీ చేసింది. నాలా, సేల్ డీడ్, పంచాయతీ అనుమతులు ఇలా అన్ని డ్యాక్యుమెంట్లను ప్రవీణ్ సమర్పించారు. అయినా పట్టించుకోకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సెలవు రోజున కూల్చివేశారు’అని చెప్పారు. హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ రవీందర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘పంచాయతీ కార్యదర్శి బలవంతంగా అనుమతులు మంజూరు చేశారు. ఆ తర్వాత వాటిని రద్దు చేశారు. సెలవు రోజు కూల్చివేతలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం’అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘ప్రతీసారి ఇలా జరగకుండా చూసుకుంటామంటూనే మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. గతంలో హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలనూ లెక్కచేయకుండా, చట్టాన్ని పాటించకుండా వ్యవహరిస్తే హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 99ను రద్దు చేస్తాం. హైడ్రా తప్పులకు ఓ రిజిస్ట్రర్ నిర్వహించాల్సిన పరిస్థితి కూడా రావొచ్చు. నిర్మాణ అనుమతి రద్దు ఉత్తర్వులను కోర్టు ముందు ఎందుకు ఉంచలేదు? సదరు పంచాయతీ అధికారిపై చర్యలు తీసుకున్నారా? హైడ్రా తీరు ఆక్షేపణీయం. నీటి వనరులు, రహదారులు, ప్రభుత్వ భూముల రక్షణకు మేం వ్యతిరేకం కాదు. కానీ, చర్యలు చట్టబద్ధమై ఉండాలన్నదే మా ఉద్దేశం’అని వ్యాఖ్యానించారు. గతంలో ఇచ్చిన స్టేటస్కో ఆదేశాలను పొడిగిస్తూ, తదుపరి విచారణ వరకు ఎటువంటి నిర్మాణ కార్యకలాపాలు కొనసాగించకూడదని ఆదేశించారు. ప్రతివాదులకు వ్యక్తిగత నోటీసులతో సహా నోటీసులు జారీ చేయాలంటూ తదుపరి విచారణను మార్చి 5కు వాయిదా వేశారు. -
TG: మీ ఇష్టానుసారం ప్రవర్తిస్తామంటే కుదరదు
హైదరాబాద్, సాక్షి: మహానగరంలో విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్(హైడ్రా)పై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. ఇష్టానుసారం కూల్చివేతలు చేపడతారా? అంటూ మండిపడింది. ఈ క్రమంలో తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.హైడ్రా కూల్చివేతల వ్యవహారంపై (HYDRAA Demolitions)పై దాఖలైన పిటిషన్పై గురువారం విచారణ సందర్భంగా జస్టిస్ కే.లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. ‘‘మీ ఇష్టం వచ్చినట్లు కూల్చివేతలు చేపడతారా? సెలవు దినాల్లో కూల్చివేతలు చట్టవిరుద్ధమని చెప్పినా నిబంధనలు పాటించరా? న్యాయస్థానం ఆదేశాలంటే లెక్కలేకుండా వ్యవహరిస్తే.. అది తెలిసేలా చేస్తాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాలతో హై కోర్టుకు హాజరైన హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్(HYDRAA Inspector Rajasekar) పైనా ధర్మాసనం మండిపడింది. పోలీస్ శాఖను నుంచి డిప్యూటేషన్పై వచ్చినంత మాత్రాన అక్కడ వ్యవహరించినట్లు ఇక్కడ ఉంటామంటే కుదరదు అని మందలించారు. మరోసారి ఇలాగే జరిగితే మీపై చర్యలకు డీజీపీకి ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు.ఆక్రమణల స్వాధీనానికి, అక్రమ భవనాల కూల్చివేతకు మేం వ్యతిరేకం కాదన్న జస్టిస్ కే లక్ష్మణ్.. ఏది చేసిన చట్టపరంగా ఉండాలని సూచించారు. అలాగని ఇష్టం వచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అనంతరం విచారణను వాయిదా వేశారు. -
బ్యాంకులో కుప్పకూలిన న్యాయవాది
కంటోన్మెంట్(హైదరాబాద్): కోర్టు చలాన్ డబ్బులు జమ చేసే నిమిత్తం బ్యాంకుకు వచ్చిన ఓ న్యాయవాది బ్యాంకులోనే కుప్పకూలి మరణించిన ఘటన మారేడుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకలో ఉంటున్న న్యాయవాది వెంకటరమణ (58) సికింద్రాబాద్ కోర్టులో కేసులు వాదిస్తుంటారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మారేడుపల్లి కొండారెడ్డి స్ట్రీట్లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు ఆయన వెళ్లారు. బ్యాంకు చలాన్ రిసీట్ తీసుకుంటూనే ఫ్లోర్పై కుప్పకూలడంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు వెంకటరమణకు సీపీఆర్ చేసేందుకు యతి్నంచినా ఫలితం లేకపోయింది. వెంకటరమణ మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద కుమార్తె అమెరికాలో ఉండగా, చిన్న కుమార్తె తల్లిదండ్రులతోనే ఉంటోంది. ఇటీవలే చిన్న కూతురు పెళ్లి నిశ్చయమైనట్లు సమాచారం. తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే బ్యాంకుకు చేరుకున్న వెంకటరమణ కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడి వారిని కదిలించింది. మారేడుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్రావుకు ఊరట
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్రావు ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్లో నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలిచ్చేవరుకూ అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది.తన ఫోన్ ట్యాప్ చేశారంటూ రియల్టర్ చక్రధర్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. తదుపరి విచారణను హైకోర్టు మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధా కిషన్ రావుకు కూడా ఊరట లభించింది. -
హైకోర్టు సాక్షిగా బయటపడ్డ మార్గదర్శి అబద్దాల చిట్టా
-
మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉండాలని హైకోర్టుకు తెలిపిన ఆర్బీఐ
-
మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందే... రామోజీరావు మరణించినంత మాత్రాన బాధ్యతల నుంచి మార్గదర్శి తప్పించుకోజాలదు.. తెలంగాణ హైకోర్టుకు నివేదించిన ఆర్బీఐ
-
రామోజీ నేరాలకు కుమారుడిని జైలుకు పంపుతారా?
సాక్షి, అమరావతి: చట్టవిరుద్ధంగా డిపాజిట్ల స్వీకరణ విషయంలో గత 18 సంవత్సరాలుగా న్యాయస్థానాల సాక్షిగా అడ్డగోలుగా అబద్ధాలు వల్లెవేస్తూ వచ్చిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్యూఎఫ్ ఎట్టకేలకు న్యాయస్థానం ఎదుట నిజం అంగీకరించక తప్పలేదు. ఈ కేసు నుంచి బయటపడేందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ వాస్తవాన్ని తెలంగాణ హైకోర్టు ముందుంచింది. తమ హెచ్యూఎఫ్ కర్త అయిన రామోజీరావు చేసిన డిపాజిట్ల స్వీకరణకు ఆయన కుమారుడిని (ప్రస్తుత కర్త) బాధ్యుడిని చేయరాదంటూ వాదిస్తోంది. తండ్రి చేసిన నేరానికి కుమారుడిని శిక్షిస్తారా? అంటూ ప్రశ్నిస్తోంది. ఒకవేళ తండ్రి నేరం చేసినా కుమారుడిని జైలుకు పంపించడం ఎంత వరకు సమంజసమని నిలదీస్తోంది. తద్వారా రామోజీరావు చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేశారన్న నిజాన్ని హైకోర్టు ముందు పరోక్షంగా అంగీకరించినట్లయింది. రామోజీరావు మరణాన్ని అడ్డుపెట్టుకుని ఈ కేసు నుంచి బయటపడేందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్తో పాటు రామోజీ స్థానంలో హెచ్యూఎఫ్ కర్తగా వ్యవహరిస్తున్న ఆయన కుమారుడు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే డిపాజిట్ల స్వీకరణ విషయంలో రామోజీ చేసిన నేరానికి తమను బాధ్యులుగా చేయడం తగదంటూ గట్టిగా వాదిస్తున్నారు. తండ్రి చేసిన నేరానికి కుమారుడిని బాధ్యుడిగా చేయరాదంటూ ‘వైకేరియస్ లయబిలిటీ’ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ పాల్పడిన అక్రమాలు, అవకతవకలకు దాని కర్త అయిన రామోజీరావు మాత్రమే బాధ్యుడవుతారని చెప్పడం ద్వారా కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాక కొత్త కర్త (కిరణ్) నియామకంతో మార్గదర్శి హెచ్యూఎఫ్ పునరుద్ధరించినట్లయిందని, అందువల్ల తమను ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదంటూ కొత్త వాదనను కూడా తెరపైకి తెచ్చింది. అయితే హైకోర్టు మాత్రం మార్గదర్శి వాదనకు భిన్నంగా స్పందించింది. చట్టవిరుద్ధ పనులకు బాధ్యత వహించాల్సిందే కదా..! (సివిల్ లయబిలిటీ) అని మార్గదర్శి ఫైనాన్షియర్స్కి తేల్చి చెప్పడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇదే సమయంలో రామోజీ చేసిన నేరానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్యూఎఫ్ బాధ్యత వహించాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసినందుకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదురోవాల్సిందేనంటూ రాతపూర్వకంగా హైకోర్టుకు నివేదించింది. రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఇన్నేళ్లుగా కోర్టుల ముందు చెబుతూ వస్తున్నవన్నీ అసత్యాలు, అవాస్తవాలేనని కూడా హైకోర్టుకు వివరించింది.విచారణ 28కి వాయిదా...సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై జస్టిస్ పి.శ్యామ్కోషి, జస్టిస్ కె.సుజన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. మార్గదర్శి హెచ్యూఎఫ్ కర్త రామోజీరావు మరణించినందున ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ చెల్లవని నివేదించారు. ఆర్బీఐ చట్ట నిబంధనలను రామోజీరావు ఉల్లంఘించారంటూ మార్గదర్శి హెచ్యూఎఫ్ ప్రస్తుత కర్త అయిన రామోజీరావు కుమారుడు కిరణ్ను ఎలా శిక్షిస్తారని ప్రశ్నించారు. తండ్రి నేరం చేసినా కుమారుడిని జైలుకు పంపించడం సమంజసం కాదని పదేపదే ధర్మాసనానికి నివేదించారు. చట్టప్రకారం కిరణ్, ఇతర కుటుంబ సభ్యులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ సాధ్యం కాదని పేర్కొన్నారు. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ కార్యకలాపాలు చేపట్టినందున కర్త రామోజీరావు మాత్రమే అవకతవకలకు బాధ్యుడవుతాడని, ఇతర కుటుంబ సభ్యులకు వాటితో సంబంధం ఉండదంటూ గంటకు పైగా సాగిన వాదనల్లో ఆయన హైకోర్టుకు నివేదించారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ తన కార్యకలాపాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో అది చేసిన తప్పులకు బాధ్యత వహించాలి కదా? అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు సమయం పూర్తి కావడంతో తదుపరి విచారణ తొలుత 21కి వాయిదా పడింది. తర్వాత మార్గదర్శి తరఫు మరో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వ్యక్తిగత కారణాలతో 21న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని, మరో తేదీని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. -
మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందే
సాక్షి, అమరావతి: మార్గదర్శి(Margadarshi) ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు(Ramoji Rao)ల చట్ట ఉల్లంఘనలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) (ఆర్బీఐ) పలు కీలక విషయాలను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ముందుంచింది. తాము వసూలు చేసిన డిపాజిట్ల విషయంలో ఏ ఒక్క డిపాజిటర్ కూడా తమపై ఫిర్యాదు చేయలేదంటూ ఇన్నేళ్లుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావు చెబుతూ వచ్చిన దాంట్లో వాస్తవం లేదని ఆర్బీఐ హైకోర్టుకు నివేదించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట విరుద్ధంగా వసూలు చేసిన డిపాజిట్లపై తమకు ప్రజల నుంచి, డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు అందాయని వెల్లడించింది.డిపాజిట్ల వసూలు విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న మార్గదర్శి, రామోజీ వాదన శుద్ధ అబద్ధమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో... చట్ట విరుద్ధంగా ప్రజల నుంచి రూ.వేల కోట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) కర్త చెరుకూరి రామోజీరావు మరణించిన నేపథ్యంలో, తమపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొనసాగించడం నిష్ప్రయోజనమంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన వాదనను ఆర్బీఐ నిర్ధ్వందంగా తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావు ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో వసూలు చేశారని, ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 45ఎస్కి విరుద్ధమని పునరుద్ఘాటించింది.అంతేకాక ఇలా ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడం ఆర్బీఐ చట్టం సెక్షన్ 58 బీ (5ఏ) ప్రకారం శిక్షార్హమని హైకోర్టు దృష్టికి తెచ్చింది. కాబట్టి రామోజీరావు మరణించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్షియర్స్పై ప్రొసీడింగ్స్ను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది. పలు చట్టాల కింద హెచ్యూఎఫ్ను ప్రత్యేక న్యాయపరమైన సంస్థగా, చట్టపరమైన వ్యక్తిగా గుర్తించడం జరిగిందని వెల్లడించింది. హెచ్యూఎఫ్ అనేది చట్టం సృష్టించిన ఓ జీవి అని పేర్కొంది. హెచ్యూఎఫ్ కర్త అనేది.. దాని సభ్యుల నుంచి భిన్నమైన, చట్టపర ప్రత్యేక సంస్థ అని తేల్చి చెప్పింది. అందువల్ల మార్గదర్శి ఫైనాన్షియర్స్పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందేనని ఖరాకండిగా చెప్పింది.⇒ డిపాజిట్ల వసూలుకు ఎన్నడూ అనుమతించలేదు..కర్త రామోజీరావు మరణించినంత మాత్రాన మార్గదర్శి ఫైనాన్షియర్స్ తన బాధ్యత నుంచి తప్పించుకోజాలదని ఆర్బీఐ స్పష్టం చేసింది. తనపై మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన ఆరోపణలన్నింటినీ ఖండిస్తున్నట్లు తెలిపింది. ఆ ఆరోపణలన్నీ తప్పుడు, అసత్య, తప్పుదోవ పట్టించేవేనని స్పష్టం చేసింది. మార్గదర్శి హెచ్యూఎఫ్ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45ఎస్ పరిధిలోకి వస్తుందని మొదటి నుంచీ తాము చెబుతూ వస్తున్నామంది. చట్ట ఉల్లంఘనల గురించి, సెక్షన్ 45 ఎస్ వర్తిస్తుందన్న వాస్తవాన్ని ఎప్పటికప్పుడు మార్గదర్శి దృష్టికి తెస్తూనే ఉన్నామని తెలిపింది.డిపాజిట్ల స్వీకరణకు అనుమతినిస్తూ తాము సర్టిఫికెట్ జారీ చేశామన్న మార్గదర్శి వాదన శుద్ధ అబద్ధమని తేల్చి చెప్పింది. డిపాజిట్ల వసూలుకు తాము ఎన్నడూ మార్గదర్శికి అనుమతినివ్వలేదని స్పష్టం చేసింది. రామోజీ మరణించిన నేపథ్యంలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొనసాగించడం నిష్ప్రయోజనమంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను కొట్టేయాలని హైకోర్టును ఆర్బీఐ అభ్యర్థించింది. అంతేకాక నాంపల్లి కోర్టులో దాఖలైన ఫిర్యాదును కొట్టేయాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను సైతం కొట్టేయాలని హైకోర్టును కోరింది. ఈ మేరకు ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసింది. -
ముగ్గురు అదనపు జడ్జీల శాశ్వత హోదాకు కేంద్రం ఓకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న ముగ్గురు అదనపు న్యాయమూర్తు లకు శాశ్వత న్యాయమూర్తి హోదా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 5న కేంద్ర ప్రభుత్వానికి వీరి హోదా గురించి సిఫారసు చేసింది.జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారా యణ, జస్టిస్ జూకంటి అనిల్కుమార్, జస్టిస్ కె.సుజనలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలన్న ప్రతిపాదనలకు కొలీజియం ఈ నెల 5వ తేదీనే ఆమోదం తెలిపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయగా, రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.ఈ ముగ్గురు న్యాయ మూర్తులు 2023, జూలై 31న హైకోర్టు అద నపు న్యాయమూర్తులుగా నియమితులైన విష యం తెలిసిందే. కాగా, శాశ్వత న్యాయ మూర్తు లుగా జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్కుమార్, జస్టిస్ కె.సుజన శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు. -
దస్తగిరిని ‘సాక్షి’గా పేర్కొనడంపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(YS Vivekananda Reddy murder case)లో తొలి నుంచి నిందితుడి (ఏ–4)గా పేర్కొన్న దస్తగిరిని ‘సాక్షి’గా పేర్కొనడంపై వివరణ ఇవ్వాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. విచారణా సంస్థతోపాటు దస్తగిరికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27లోగా కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ.. విచారణను వాయిదా వేసింది. తాను అప్రూవర్గా మారినందున తనను సాక్షిగా పరిగణించాలంటూ గత ఏడాది సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్ వేశారు.సీబీఐ కూడా దీనికి అనుకూలంగా వాదనలు వినిపించడంతో న్యాయస్థానం దస్తగిరిని సాక్షిగా పేర్కొనాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ డి.శివశంకర్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, వైఎస్ అవినాశ్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. కేసులో సీబీఐ తరఫున స్పెషల్ పీపీ శ్రీనివాస్ కపాడియా హాజరై సమయం కోరారు. దీంతో న్యాయమూర్తి విచారణ ఈ నెల 27కు వాయిదా వేస్తూ.. సీబీఐ, దస్తగిరికి నోటీసులు జారీ చేశారు. పిటిషనర్ల వాదన ఇదీ... ‘సాక్షుల వాంగ్మూలాలు, నిందితుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దస్తగిరిని సాక్షిగా పేర్కొనడం సరికాదు. 2021, అక్టోబర్ 26న సీబీఐ దాఖలు చేసిన చార్జ్షిట్ దస్తగిరిని నిందితుడిగా పేర్కొంది. ఆ తర్వాత వేసిన రెండు మధ్యంతర చార్జ్షీట్లలోనూ దస్తగిరి పేరును తొలగించలేదు. 2022, ఫిబ్రవరి 21న సెక్షన్ 306(4)(ఏ) కింద అతని స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత కూడా చార్జ్షిట్లో అతని పేరు తీసివేయలేదు. ఒకసారి నిందితులుగా అనుమతించిన (కాగ్నిజెన్స్) తర్వాత.. ఇదే కోర్టు పునః సమీక్షించజాలదు.క్రిమినల్ ప్రొసిజర్ కోడ్లో అలాంటి నిబంధన ఎక్కడా లేదు. చట్ట ప్రకారం అలాంటి నిర్ణయం చెల్లదు. ఒకసారి ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను తిరిగి సమీక్షించే అధికారాలు లేవని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేర్కొంది. దస్తగిరిని సాక్షుల జాబితాలో 110వ సాక్షిగా పేర్కొన్నామని చెప్పడం కూడా సరికాదు. నిందితుడిగా పలుమార్లు ఇదే కోర్టుకు దస్తగిరి హాజరయ్యారు. హాజరుకానప్పుడు న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. దస్తగిరిని సాక్షిగా పేర్కొంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలి’ అని పేర్కొంటూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. -
హైడ్రాపై తెలంగాణ హైకోర్టు సీరియస్
-
మార్గదర్శి అవకతవకలపై కౌంటర్లు దాఖలు చేయడంలో కాలయాపన సరికాదన్న హైకోర్టు
-
మార్గదర్శి కేసులో కాలయాపన సరికాదు, కౌంటర్లు వేయడానికి ప్రతీసారి వాయిదాలు కోరడం సమంజసం కాదు... ఆర్బీఐ తీరుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి
-
కాలయాపన సరికాదు
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి ఫైనాన్సియర్స్ భారీ ఆర్థిక అవకతవకలపై కౌంటర్లు దాఖలు చేయడంలో కాలయాపన సరికాదని తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అందరి వాదనలు విని వీలైనంత త్వరగా తీర్పు వెల్లడించాలని సుప్రీంకోర్టు(Supreme Court) సూచించిన విషయాన్ని గుర్తు చేసింది. అదనపు కౌంటర్ అఫిడవిట్(Counter Affidavit) దాఖలుకు రెండు వారాలు గడువు కావాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కోరడం సరికాదంది. అంత సమయం ఇవ్వలేమని, వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇకపై ప్రతి శుక్రవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తను పేరును కాజ్ లిస్టులో చేర్చాలని అక్టోబర్లో రిజిస్ట్రీని ఆదేశించినా అది అమలు కావడం లేదని కోర్టు సహాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్(Undavalli Arunkumar) ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీంతో మరోసారి ధర్మాసనం రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధీకృత నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి. అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2024 ఏప్రిల్ 9న హైకోర్టు తీర్పును కొట్టివేసింది. ఆ తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది. ఈ పిటిషన్పై జస్టిస్ శ్యామ్ కోషి, జస్టిస్ కె.సుజన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థలూథ్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్కుమార్, ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వర్చువల్గా.. ఏపీ స్పెషల్ జీపీ రాజేశ్వర్రెడ్డి, తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వర్రావు నేరుగా విచారణకు హాజరయ్యారు. కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాలు గడువు కావాలని ఆర్బీఐ కోరిందని ఎల్.రవిచందర్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అంత గడువు ఇవ్వలేమని, వారంలో దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణ 14కు వాయిదా వేసింది. విచారణ 18 సార్లు వాయిదా సుప్రీంకోర్టు ఆదేశాలతో గత జూన్ 25న తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభించింది. తొలుత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వీలైనంత త్వరగా వాదనలు వినిపించాలని, వాయిదాలు కోరవద్దని పలుమార్లు ధర్మాసనం న్యాయవాదులకు సూచించింది. అయినా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయడంతో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయి. ఎట్టకేలకు గత నెలలో కౌంటర్లు దాఖలు చేశాయి. ఇదే క్రమంలో తీరా వాదనలు ప్రారంభమయ్యే సమయంలో రామోజీరావు మరణించినందున కేసు కొట్టివేయాలంటూ మార్గదర్శి అఫిడవిట్ వేసింది. దీనిపై కూడా వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ సుజోయ్పాల్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల్లో ఉండటంతో విచారణ జస్టిస్ శ్యామ్కోషి ధర్మాసనానికి బదిలీ అయ్యింది. జనవరి 31న కేసు లిస్టయినా.. విచారణ నుంచి జస్టిస్ నందికొండ నర్సింగ్రావు తప్పుకుంటున్నారు. శుక్రవారం జస్టిస్ శ్యామ్ కోషి నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఆర్బీఐ అదనపు కౌంటర్ దాఖలుకు సమయం కోరడంతో వాయిదా పడింది. ఇలా దాదాపు ఏడున్నర నెలల్లో ఇప్పటి వరకు 18 సార్లు విచారణ వాయిదా పడింది. -
12 వరకు కేటీఆర్ అరెస్టు వద్దు
సాక్షి, హైదరాబాద్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్పూర్ పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో ఈ నెల 12 వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావును అరెస్టు చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ట్రయల్ కోర్టులో హాజరు నుంచి కూడా మినహాయింపు ఇచి్చంది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ కేటీఆర్తోపాటు గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్లకు ఊరటనిచి్చంది. కేసులో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.గతేడాది జూలై 26న మేడిగడ్డ బరాజ్ను సందర్శించిన కేటీఆర్, వెంకటరమణారెడ్డి, సుమన్.. ఎటువంటి సమా చారం, అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరించారంటూ మేడిగడ్డ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తప్పు చేయకున్నా తప్పుడు కేసు పెట్టారని.. విచారణ సహా తదుపరి చర్యలు నిలిపివేయడంతోపాటు ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ కేటీఆర్, వెంకటరమణారెడ్డి, సుమన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టి ఈ మేరకు ఆదేశాలిచ్చారు. -
పిక్కలు పీకేస్తున్నాయ్
పటాన్చెరులోని ఇస్నాపూర్లో 2024, జూన్ 28న వీధికుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడు విశాల్ మృతిచెందాడు. బిహార్కుచెందిన బాలుడి కుటుంబం పొట్టకూటి కోసం రాష్ట్రానికివచ్చిoది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన బాలుడిపై కుక్కలు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.హైదరాబాద్ మణికొండలో 2024, జూన్ 22నఓ మహిళపై ఏకంగా 15 వీధికుక్కలు దాడి చేశాయి. సుమారు అరగంటసేపు తీవ్రంగా దాడి చేశాయి.చివరకు ఎలాగోలా బాధితురాలు వాటి బారి నుంచిప్రాణాలతో బయటపడింది.సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఏటా కుక్కకాట్లు పెరిగిపోతున్నాయి. రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కుక్కల దాడుల ఘటనలు వందలు, వేలల్లో చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కుక్క కాట్లు తగ్గడం లేదు.. ప్రభుత్వ గణాంకాలే దీన్ని ధ్రువీకరిస్తున్నాయి. 2024లో 1,21,997 కేసులు నమోదవగా జీహెచ్ఎంసీ, చుట్టుపక్క జిల్లాల్లోనే 42,067 కేసులు నమోదయ్యాయి. ఆయా ఘటనల్లో 13 మంది మరణించారు. 2023 గణాంకాలతో పోలిస్తే ఇది చాలా అధికం. స్పందించిన హైకోర్టు వీధికుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడు మృతిచెందిన ఉదంతంపై వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. గతంలో ఇదేఅంశంపై పెండింగ్లో ఉన్న పిటిషన్లకు దీన్ని జత చేసింది. ఈ పిటిషన్లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిజస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కౌంటర్ దాఖలు చేసింది. దీనిపైరిప్లై కౌంటర్ వేయడానికి సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరడంతో విచారణ 25కు వాయిదా వేసింది.జీహెచ్ఎంసీ చేస్తున్న కసరత్తు ఇలా..» మున్సిపల్ కార్పొరేషన్ బయట కుక్కల కోసం పునరావాస కేంద్రాల ఏర్పాటు కుక్కకాట్లు, ఇతరఫిర్యాదుల కోసం హెల్ప్లైన్ నంబర్ 040–2111111 అందుబాటులోకి.. » 898 కుక్కల సంరక్షణ కేంద్రాలతోపాటు 92 బోన్లు, కుక్కల తరలింపునకు 49 వ్యాన్ల ఏర్పాటు » యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ)కి సంబంధించిన6 ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు. స్టెరిలైజేషన్,వ్యాక్సినేషన్కు చర్యలు » 18 మంది వెటర్నరీలు,ఆరుగురు షెల్టర్ మేనేజర్లు, 22 పారా వెటర్నరీలు, 362 మంది డ్రైవర్లు, అవుట్ సోర్సింగ్ వర్కర్ల నియామకంకుట్లు వేస్తే వైరస్ వ్యాప్తి... కుక్క కరిచిన వెంటనే ట్యాప్ వాటర్, సబ్బుతో గాయాన్ని కడగాలి. చర్మంపై గాయాలకు టీటీ, యాంటీ రేబిస్ నాలుగు డోసులు సరిపోతుంది. కుక్క కరిచిన 1వ రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు టీకా వేయించుకోవాలి. కండ లోపలికి గాయమైనా కుట్లు వేయకూడదు. వేస్తే శరీరంలో వైరస్ మరింత వ్యాప్తి చెందుతుంది. ఒకవేళ చేతులు, ముఖంపై తీవ్ర గాయాలైతే ముందుగా అక్కడ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ వేయాలి. 2 గంటలు ఆగాక కుట్లు వేయవచ్చు. ఎంత ఆలస్యమైనా యాంటీ రేబిస్ టీకా తీసుకోవాలి. – డాక్టర్ జి.రాజమనోహర్రెడ్డి, ల్యాప్రోస్కోపిక్ సర్జన్మెదడు అదుపులో ఉండదు... రేబిస్ సోకిన కుక్కలమెదడు అదుపులోఉండదు. ఎదురుగా ఏ జీవివచ్చినా కరుస్తాయి. కరిచినప్పుడు లాలాజలంలోఉండే వైరస్ శరీరంలోకి వెళ్తుంది. రేబిస్ సోకినజంతువు, వ్యక్తి కూడా కుక్కల మాదిరేప్రవర్తిస్తారు.– చిట్యాల బాబు,వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, కనగల్సంవత్సరాల వారీగా రాష్ట్రంలో కుక్క కాటు కేసులు, అనుమానాస్పద మరణాలు.. 2022 2023 2024 మొత్తం కుక్క కాటు కేసులు 92,924 1,19,014 1,21,997 3,33,935 అనుమానాస్పద మరణాలు 8 15 13 36 -
హరీష్ను అరెస్ట్ చేయొద్దు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నెల 12వరకు బీఆర్ఎస్ నేత హరీష్ రావును అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫోన్ ట్యాంపింగ్ ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్రావుపై మంగళవారం(డిసెంబర్3) కేసు నమోదైంది. తన ఫోన్ ట్యాప్ చేశారని బాచుపల్లికి చెందిన చక్రధర్గౌడ్ హరీశ్రావుపై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పంజాగుట్ట పోలీసులు హరీశ్రావుపై 120బి,386,409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో హరీష్రావుతో పాటు టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావును కూడా పోలీసులు చేర్చడం గమనార్హం. ఆ ఎఫ్ఐఆర్పై హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని కోరారు. హరీష్ రావు పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు తదుపరి తీర్పు వచ్చే వరకు అరెస్ట్ చేయొద్దని పోలీసులు సూచించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును పొడిగించింది. -
రామోజీపై ‘రాజ’భక్తి!
సాక్షి, అమరావతి: తన రాజగురువు రామోజీరావు పట్ల టీడీపీ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) మరోసారి భక్తిని చాటుకున్నారు. సాక్షాత్తూ సుప్రీం కోర్టు స్వయంగా జోక్యం చేసుకుని.. మార్గదర్శి, రామోజీ ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్కు విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారా? లేదా? అనే అంశాన్ని తేల్చాలని హైకోర్టును ఆదేశించగా.. చంద్రబాబు సర్కార్ దాన్ని పూర్తిగా విస్మరిస్తూ అక్రమాలకు పాల్పడ్డ రామోజీ కుటుంబాన్ని రక్షించడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరించింది. తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమాని రామోజీరావు ప్రజల నుంచి చట్ట విరుద్ధంగా వసూలు చేసిన రూ.2,610 కోట్ల డిపాజిట్లు గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. ఆ అక్రమ డిపాజిట్ల గురించి వాస్తవాలను కోర్టుకు వెల్లడిస్తే మార్గదర్శి(Margadarsi), రామోజీ కుటుంబానికి ఇబ్బందులు తప్పవని గుర్తించడంతో చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయం జోలికే వెళ్లలేదు. పైగా ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో అక్రమంగా వసూలు చేసిన రూ.వేల కోట్లను తిరిగి వారికి చెల్లించేశామని, అందువల్ల తమను వదిలేయాలంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమాని రామోజీరావు(Ramoji Rao) ఇన్నేళ్లుగా కోర్టుల్లో చేస్తూ వస్తున్న వాదననే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సైతం అందుకుంది. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్ల మొత్తంలో రూ.5.15 కోట్లు మినహా అత్యధిక భాగాన్ని తిరిగి చెల్లించేసిందని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. రూ.5.15 కోట్ల డబ్బు 1,270 మంది డిపాజిటర్లకు సంబంధించిందని, అయితే వారెవరూ ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయడం లేదని ఏపీ ప్రభుత్వం తన కౌంటర్ ద్వారా హైకోర్టుకు తెలిపింది. ఎస్క్రో ఖాతాలో ఉన్న ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు గానీ ఆర్బీఐకి గానీ బదలాయించాలంటూ వింత అభ్యర్థనను హైకోర్టు ముందుంచింది. ఎవరైనా డిపాజిటర్లు వస్తే వారికి ఆ మొత్తాలను తామే చెల్లిస్తామని ప్రతిపాదించింది. తద్వారా అక్రమ డిపాజిట్ల వ్యవహారం నుంచి రామోజీ కుటుంబాన్ని బయటపడేసేందుకు మార్గాన్ని సుగమం చేసేందుకు యత్నించింది. రామోజీరావు గత ఏడాది జూన్ 8న చనిపోయారంటూ ఆయన మరణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. అసలు మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొనసాగించాల్సిన అవసరం ఉందా? అన్న దానిపై కూడా విచారణ జరపాలని కౌంటర్లో హైకోర్టుని కోరింది. దాటవేత ధోరణే... రామోజీరావు భారీ ఆర్థిక అవకతవకలపై చంద్రబాబు ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో పూర్తి దాటవేత ధోరణిని ప్రదర్శించింది. ఈ కౌంటర్లో ఎక్కడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని సెక్షన్ 45ఎస్ను మార్గదర్శి, రామోజీరావు ఉల్లంఘించిన విషయం గురించి ప్రస్తావించనే లేదు. చట్ట విరుద్ధంగా రూ.వేల కోట్లను ప్రజల నుంచి డిపాజిట్లు రూపంలో మార్గదర్శి వసూలు చేసిందని స్వయంగా రిజర్వ్ బ్యాంకే చెప్పినా చంద్రబాబు సర్కారు ఆ అంశం జోలికి వెళ్లలేదు. డిపాజిట్లను వెనక్కి ఇచ్చేసిందని మాత్రమే చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. రామోజీరావు చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. మార్గదర్శిపై నాంపల్లి కోర్టులో ఎవరు ఫిర్యాదు చేశారు? ఆ తరువాత కోర్టుల్లో ఏమైంది? తిరిగి తెలంగాణ హైకోర్టు ఎందుకు విచారణ జరుపుతోంది? లాంటి అందరికీ తెలిసిన విషయాలనే కౌంటర్లో పొందుపరిచింది. అంతేకాక రామోజీ, మార్గదర్శి ఆర్థిక అవకతకవలపై అ«దీకృత అధికారిగా వ్యవహరిస్తున్న కృష్ణరాజు విచారణ జరపవచ్చో లేదో తేల్చాలని హైకోర్టును కోరింది. మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొనసాగించాల్సిన అవసరంపై కూడా విచారణ జరపాలని కౌంటర్లో కోరింది. చనిపోయారు కాబట్టి కేసు కొట్టేయండి... ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్కి విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసినట్లు రుజువులు కూడా ఉండటం, విచారణ జరిగితే శిక్ష, భారీ జరిమానా ఖాయం కావడంతో రామోజీ మరణాన్ని అడ్డం పెట్టుకుని ఈ గండం నుంచి బయటపడాలని మార్గదర్శి ప్రస్తుత యాజమాన్యం భావిస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం చేత తమకు కావాల్సిన విధంగా కౌంటర్ దాఖలు చేయించింది. రామోజీ మరణించారని ఏపీ ప్రభుత్వం చేత ప్రత్యేకంగా చెప్పించడమే కాకుండా ఇక ఈ కేసు విచారణను కొనసాగించాల్సిన అవసరం లేదన్న రీతిలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ పెద్దలు కౌంటర్లో రాయించారు. మరోవైపు మార్గదర్శి ఫైనానియర్స్ యాజమాన్యం కూడా ఇదే వాదనతో హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. రామోజీ మరణంతో ఇక ఈ కేసులో విచారించడానికి ఏమీ లేదని అందులో పేర్కొంది. ఈ కేసుపై విచారణ జరపడం నిష్ప్రయోజనమని పేర్కొంది. పూర్తిస్థాయి వాదనలకు ముందే ఈ విషయాన్ని తేల్చాలని తెలంగాణ హైకోర్టును కోరింది. హెచ్యూఎఫ్ కర్తగా ఉన్న రామోజీ మరణించడంతో ఆ హెచ్యూఎఫ్లో సభ్యులుగా ఉన్న వారికి నేరాన్ని ఆపాదించడాన్ని వీల్లేదని నివేదించింది. వసూలు చేశాం... వెనక్కి ఇచ్చేశాం ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా తాము ప్రజల నుంచి రూ.2,596.98 కోట్లు అక్రమంగా వసూలు చేసిన మాట వాస్తవమేనని మార్గదర్శి ఫైనాన్షియర్స్ హైకోర్టు ముందు అంగీకరించింది. వసూలు చేసిన డిపాజిట్లలో అత్యధిక మొత్తాన్ని తిరిగి చెల్లించేశామని, మిగిలి ఉన్న మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో ఉంచామంది. ఈమేరకు ఆర్బీఐ కౌంటర్కు మార్గదర్శి ఫైనాన్షియర్స్ తిరుగు సమాధానం ఇచి్చంది. విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ నర్సింగ్రావు మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక అవకతవకలకు సంబంధించి జరుగుతున్న విచారణ నుంచి న్యాయమూర్తి జస్టిస్ నర్సింగ్రావు తప్పుకున్నారు. గతంలో తాను మార్గదర్శి తరఫున దాఖలైన కేసుల్లో న్యాయవాదిగా ఉన్నానని, అందువల్ల ఈ వ్యాజ్యంపై విచారణ జరపలేనని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యాజ్యాలను తగిన ధర్మాసనం ముందుంచేందుకు వీలుగా ప్రధాన న్యాయమూర్తి (సీజే) ముందుంచాలని జస్టిస్ శ్యాంకోషి, జస్టిస్ నర్సింగరావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ తేదీని, విచారణ ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్గదర్శి అక్రమ డిపాజిట్ల సేకరణపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు శుక్రవారం జస్టిస్ శ్యామ్ కోషి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. మార్గదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ లూద్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్కుమార్, ఏపీ స్పెషల్ జీపీ రాజేశ్వర్రెడ్డి, తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వర్రావు విచారణకు హాజరయ్యారు. రామోజీ మరణించిన నేపథ్యంలో ఈ కేసును కొట్టేయాలని, దీనిపై అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని రోహత్గీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ముకుల్ రోహత్గీ చేసిన ఈ అభ్యర్థన పెద్ద చర్చనీయాంశంగా మారింది. భారీ ఆరి్థక నేరానికి పాల్పడిన వ్యక్తి చనిపోయినంత మాత్రాన అతను నేరం చేయనట్లుగా భావించాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ కౌంటర్ దాఖలు చేయగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఐడీ, ఆర్థిక నేరాల విభాగం ఎస్పీ కొల్లి వెంకట లక్ష్మీ కౌంటర్ దాఖలు చేశారు. బాబు బాటలోనే రేవంత్...ప్రజల నుంచి మార్గదర్శి చట్టవిరుద్ధంగా రూ.2,610 కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో రేవంత్రెడ్డి సర్కార్ సైతం చంద్రబాబు బాటనే ఎంచుకుంది. రామోజీరావు, మార్గదర్శి అక్రమ డిపాజిట్ల గురించి తెలంగాణ ప్రభుత్వం కూడా నోరు మెదప లేదు. రూ.2610 కోట్లను మార్గదర్శి వసూలు చేయడం చట్ట విరుద్ధమా? కాదా? అన్న విషయం గురించి కనీస స్థాయిలో కూడా మాట్లాడలేదు. చట్టవిరుద్ధ డిపాజిట్ల గురించి మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమానికి ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు కలగకుండా అటు చంద్రబాబు ప్రభుత్వం, ఇటు రేవంత్రెడ్డి ప్రభుత్వం చాలా లౌక్యంగా, వాస్తవాల జోలికి వెళ్లకుండా కౌంటర్లు దాఖలు చేశాయి. అందరికీ తెలిసిన, కోర్టుల్లో ఇప్పటి వరకు జరిగిన విషయాలనే తెలంగాణ ప్రభుత్వం తన కౌంటర్లో వివరించింది. వాస్తవానికి మార్గదర్శిపై నాంపల్లి కోర్టులో అ«దీకృత అధికారి కృష్ణరాజు ఫిర్యాదు ఎందుకు దాఖలు చేశారు? మార్గదర్శి, రామోజీపై ఉన్న ఆరోపణలు ఏంటి? ఆర్బీఐ ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది? తదితర వివరాలను తమ కౌంటర్లలో పూర్తిస్థాయిలో పొందుపరిచే అవకాశం ఉన్నప్పటికీ గురుశిష్యుల ప్రభుత్వాలు రామోజీపై తమ భక్తిని చాటుకుంటూ కౌంటర్లు దాఖలు చేశాయి. ‘‘45 ఎస్’’ ఏం చెబుతోందంటే..?నిర్దిష్ట వ్యక్తులు, సంస్థలు, ఇన్కార్పొరేటెడ్ సంఘాలు తమ వ్యాపార కార్యకలాపాల నిమిత్తం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని సెక్షన్ 45 ఎస్ నిషేధిస్తుంది. -
భుజంగరావు, రాధాకిషన్రావుకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితులు మాజీ అడిషనల్ ఎస్పీ నాయిని భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్రావులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో తాజాగా సుప్రీంకోర్టు మరో నిందితుడికి ఇచ్చిన బెయిల్ను, నిందితులు సుదీర్ఘ కాలం జైలులో ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులిస్తున్నట్లు పేర్కొంది. అయితే, కోర్టు నిందితులకు పలు షరతులు విధించింది. రూ.లక్ష చొప్పున సొంత పూచీకత్తు, 2 ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. 8 వారాలపాటు ప్రతీ సోమవారం ఉదయం 11 గంటలకు ఎస్హెచ్ఓ ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత కూడా అవసరమై విచారణాధికారి కోరితే హాజరుకావాలని తెలిపింది. నిందితులు తమ పాస్పోర్టులను వెంటనే ట్రయల్కోర్టుకు సమర్పించాలని చెప్పింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని, సాకు‡్ష్యలను బెదిరించడం, కలవడం, దర్యాప్తును ప్రభావితం చేయడం లాంటివి చేయవద్దని, మీడియాతో కేసు గురించి మాట్లాడవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ షరతులు ఉల్లంఘిస్తే తదుపరి చర్యలు తీసుకునే స్వేచ్ఛను పోలీసులకు ఇచ్చింది. ఫోన్ట్యాపింగ్ కేసుకు సంబంధించి 2024, మార్చిలో భుజంగరావు, రాధాకిషన్రావులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సల నిమిత్తం భుజంగరావుకు నాంపల్లి కోర్టు గత ఆగస్టులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి న్యాయస్థానాలు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఉండటంతో ఆయన బయటే ఉన్నారు.ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, చంచల్గూడ జైలులో ఉన్న రాధాకిషన్రావు కూడా బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇద్దరి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కె.సుజన గురువారం తీర్పు వెలువరించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు పరిగణనలోకి.. ఇదే కేసులో మరో నిందితుడు తిరుపతన్నకు సుప్రీంకోర్టు తాజాగా బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వుల కాపీని పిటిషనర్ల న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలను, నిందితులు సుదీర్ఘకాలం జైలులో ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని షరతులతో బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. మరో నిందితుడు ఎ.శ్రవణ్కుమార్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. -
రహస్య కెమెరాల విక్రయాలు.. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం
సాక్షి, హైదరాబాద్: రహస్య కెమెరాల విక్రయంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రహస్య కెమెరాల విక్రయాన్ని సవాలు చేస్తూ హెవెన్ హోమ్స్ సొసైటీ పిటిషన్ వేసింది. రహస్య కెమెరాలను మార్కెట్, ఆన్లైన్లో నేరుగా విక్రయిస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు.హోటళ్లు, షాపింగ్ మాల్స్లో రహస్య కెమెరాలు పెడుతున్నారన్న పిటిషనర్.. వాష్రూమ్లు, ఎక్స్రే గదుల్లో కూడా రహస్య కెమెరాలు పెడుతున్నారని పిటిషనర్ తెలిపారు. రహస్య కెమెరాల విక్రయాలపై నియంత్రణ ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు.ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పిటిషనర్ చేర్చారు. కౌంటర్ దాఖలుకు కేంద్రం తరఫు న్యాయవాది సమయం కోరారు. వచ్చే నెల 28వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025.. మురిపించేనా.. మొండిచెయ్యేనా? -
స్పెషల్ షోలపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో స్పెషల్ షోల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 11గం. తర్వాత వేసే షోలకు ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను అనుమతించొద్దని ఆంక్షలు విధించింది.సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతిపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ ఈ పిటిషన్ను విచారించింది. ఈ సందర్భంగా.. థియేటర్లలో పదహారేళ్లలోపు పిల్లల అనుమతిపై హైకోర్టు ఆంక్షలు విధించింది. రాత్రి 11 నుంచి ఉదయం 11 వరకు చిన్నారులను థియేటర్లలోకి అనుమతించవద్దని పేర్కొంది.వేళాపాళా లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పై ప్రభావం పడుతుందని పిటిషన్ తరపు న్యాయవాది ాదించగా.. ఆ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక తల్లి మరణించడంతో పాటు ఒక చిన్నారి తీవ్ర గాయాల పాలైన నేపథ్యంలో ఇక చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేసింది. ఈ పిటిషన్పై విచారణ పూర్తయ్యే దాకా పిల్లలను స్పెషల్ షోలకు అనుమతించొద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 22వ తేదీకి వాయిదా వేసింది. -
వైఎస్ జగన్పై కేసుల విచారణ.. మరో రాష్ట్రానికి బదిలీ అవసరం లేదు
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్న మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు గట్టి షాక్నిచ్చింది. వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులపై సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. అలాగే వైఎస్ జగన్ బెయిల్ను రద్దు చేసేందుకు సైతం సుప్రీంకోర్టు నిరాకరించింది. జగన్పై రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి దాఖలైన కేసులపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ జరుపుతోందని, దీన్ని తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోందని ధర్మాసనం పేర్కొంది. రోజూ వారీ విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు సైతం జారీ చేసిందని గుర్తు చేసింది. ఓ దశలో రఘురామకృష్ణరాజుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కింది కోర్టులో జరిగే విచారణను మమ్మల్ని పర్యవేక్షించమంటారా? అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సీబీఐ కోర్టు విచారణను తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోంది. రోజూవారీ విధానంలో విచారణ జరపాలని సీబీఐ ప్రత్యేక కోర్టుకి ఆదేశాలు కూడా జారీ చేసింది. హైకోర్టు స్పష్టమైన ఆదేశాల తరువాత కూడా పిటిషనర్ (రఘురామకృష్ణరాజు) సీబీఐ కోర్టు విచారణలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతున్నారు. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం ఏమీ మాకు కనిపించడం లేదు’ ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది.సీబీఐ కోర్టు, హైకోర్టుల్లో రఘురామకు ఎదురుదెబ్బ..వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ, ఈడీ పలువురిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో జగన్కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై నమోదైన కేసుల్లో సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా జగన్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు కొట్టివేసింది. అటు తరువాత ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో సైతం రఘురామకృష్ణరాజుకు చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైఎస్ జగన్ బెయిల్ను రద్దు చేయడంతో పాటు ఆయనపై నమోదైన కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ 2023లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. ఈ నెల 20న విచారణ సందర్భంగా అసలు జగన్ కేసులతో మీకేం సంబంధమని రఘురామకృష్ణరాజుని జస్టిస్ నాగరత్న ధర్మాసనం నిలదీసిన సంగతి తెలిసిందే.జగన్ బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు...వాదన సందర్భంగా వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ స్పందిస్తూ.. సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న కేసుల విచారణను తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తోందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. జగన్ బెయిల్ను రద్దు చేయాల్సిన అవసరం ఏదీ కనిపించడం లేదంది. అలాగే సీబీఐ కోర్టు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది. హైకోర్టు పరిధిలోకి జోక్యం చేసుకోవడం దాని పనితీరును ప్రభావితం చేయడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. అందువల్ల పిటిషన్ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు జగన్పై తాము దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకుంటామని, అందుకు అనుమతినివ్వాలని అభ్యర్థించడంతో అందుకు ధర్మాసనం అంగీకరిస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
పదహారేళ్లలోపు పిల్లలను అనుమతించొద్దు
సాక్షి, హైదరాబాద్: పదహారేళ్లలోపు పిల్లలను ఉదయం 11 గంటల్లోపు, రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లలో సినిమాల ప్రత్యేక ప్రదర్శనకు అనుమతించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వేళాపాళా లేని రాత్రి ప్రదర్శనలు పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని స్పష్టం చేసింది. దీనిపై అన్ని వర్గాలతో చర్చించి చట్ట ప్రకారం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.ప్రభుత్వ నిర్ణయం తీసుకునే వరకు థియేటర్ల యజమానులు 16 ఏళ్లలోపు పిల్లలను ఆయా వేళల్లో సినిమా ప్రదర్శలనకు అనుమతించొద్దని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ‘గేమ్ చేంజర్’ సినిమా ప్రత్యేక షోలకు వేకువజామున 4 గంటల నుంచి మొదలుకుని 6 షోలకు అనుమతివ్వడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన కూరగాయల వ్యాపారి గొర్ల భరత్రాజ్ లంచ్ మోషన్ రూపంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి సోమవారం మరోసారి విచారణ చేపట్టి.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 22కు వాయిదా వేశారు. -
రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహిస్తామని హైకోర్టు కొత్త జడ్జీలు రేణుక యార, నర్సింగ్రావు నందికొండ, తిరుమలాదేవి ఈద, మధుసూదన్రావు బొబ్బిలి రామయ్య ప్రమాణం చేశారు. హైకోర్టు ఆవరణలోని ఫస్ట్ కోర్టు హాల్లో శనివారం ఉదయం 10.45 గంటలకు నలుగురితో న్యాయమూర్తులుగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ సుజోయ్పాల్ ప్రమాణస్వీకారం చేయించారు. తొలుత వీరిని న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను రిజి్రస్టార్ జనరల్ ఎస్.గోవర్ధన్రెడ్డి చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అదనపు సొలిసిటర్ జనరల్ బి.నరసింహశర్మ, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి, పీపీ పల్లె నాగేశ్వర్రావు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్కుమార్, హెచ్సీఏఏ అధ్యక్షుడు ఎ.రవీందర్రెడ్డి, రిజి్రస్టార్లు, ఏఏజీలు, కోర్టు సిబ్బందితోపాటు కొత్త న్యాయమూర్తుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. ఇంకా 12 ఖాళీలున్నాయి. తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా ఈ నలుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం ఈనెల 11న సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. వీరంతా 2012లో జిల్లా జడ్జిగా ఎంపికైన వారే కావడం గమనార్హం. న్యాయాధికారుల కోటాలో వీరిని ఎంపిక చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు ఈ నెల 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. కాగా, జస్టిస్ తిరుమలాదేవి 2026, జూన్ 1 వరకు అదనపు న్యాయమూర్తిగా కొనసాగనుండగా, మిగతా ముగ్గురు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లు అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహించనున్నారు. -
కేపీహెచ్బీలో ప్లాట్ల వేలంపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్బీలో ప్లాట్ల వేలంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. లేఅవుట్లో 54.29 ఎకరాల స్థలంలో ఉందన్న న్యాయమూర్తి.. అందులో 10 శాతం గ్రీనరీ కోసం వదిలేయాలి కదా అని ప్రశ్నించారు. గ్రీనరీ కోసం కేటాయించిన స్థలాన్ని ప్లాట్లుగా విక్రయిస్తున్నారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా, 10 శాతం ఖాళీ స్థలాన్ని ఇప్పటికే జీహెచ్ఎంసీకి అప్పగించామని ఏజీ సమాధానమిచ్చారు.ఆసియాలోనే అతిపెద్ద, పాతదైన లేఅవుట్ కేపీహెచ్బీ కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. వేలం పాటలో ప్లాట్లు దక్కించుకున్న వాళ్లకు కేటాయింపులు చేయొద్దన్న హైకోర్టు.. లేఅవుట్కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది. -
ఏ న్యాయమూర్తికి..ఏయే కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు(Telangana High Court)కు సంబంధించి యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్పాల్ విధుల నిర్వహణ ప్రారంభించారు. ఇందులో భాగంగా న్యాయమూర్తులకు రోస్టర్ (ఏయే కేసులు ఎవరికి) కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైడ్రా(Hydra)కు పిటిషన్లు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో.. మున్సిపాలిటీస్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం.. గతంలో జస్టిస్ కె.లక్ష్మణ్ వద్ద ఉండగా, దాన్ని మళ్లీ ఆయన వద్దే ఉంచారు. హోం శాఖ పిటిషన్లను జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డికి, రెవెన్యూ విచారణను జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డికి అప్పగించారు. ఎప్పటిలాగే ప్రజాప్రయోజన వ్యాజ్యాల (పిల్) విచారణను.. సీజే ధర్మాసనం వద్దే ఉంచారు. బుధవారం నుంచి ఈ నూతన రోస్టర్ అమల్లోకి వచ్చింది.యాక్టింగ్ సీజే జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ జి.రాధారాణి ధర్మాసనం (డివిజన్ బెంచ్–1)2025 నుంచి ఆల్ రిట్ అప్పీళ్లు (సర్వీస్ అండ్ నాన్ సర్వీస్), మెడికల్ అడ్మిషన్ రిట్ పిటిషన్లు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్), సుమోటో రిట్ పిటిషన్లు, ధిక్కరణ అప్పీళ్లు, క్రిమినల్ ధిక్కరణ కేసులు, ఆదాయపు పన్ను, వాణిజ్య పన్ను, జీఎస్టీ, రుణాల రికవరీ ట్రిబ్యునల్, సెక్యూరిటైజేషన్ చట్టాలు, సర్వీస్ నిబంధనలకు సంబంధించిన చట్టాలు, నియమాలు, చట్టబద్ధమైన నిబంధనలను సవాలు చేసే అన్ని రిట్ పిటిషన్లు, పర్యావరణ, కాలుష్య నియంత్రణ చట్టం మ్యాటర్స్, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించినవి, వాటినుంచి ఉత్పన్నమయ్యే రిట్ పిటిషన్లు, ఇరు రాష్ట్రాలకు ప్రాజెక్టుల కేసులు, ఇతర బెంచ్ల్లో పేర్కొనని రిట్ పిటిషన్లు, తెలంగాణ లోకాయుక్త, ఉప లోకాయుక్త చట్టం కింద రిట్ పిటిషన్లు, పేటెంట్ అప్పీళ్లకు లేఖలు. అడ్మిషన్లు, మధ్యంతర, తుది విచారణ సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంభం. శుక్రవారం మధ్యాహ్నం 1:30 వరకు..యాక్టింగ్ సీజే జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ ఎన్వీ శ్రావణ్కుమార్ ధర్మాసనం (స్పెషల్ బెంచ్)సీఎస్ 13/1958, సీఎస్ 14/1958.. అడ్మిషన్లు, మధ్యంతర, తుది విచారణ శుక్రవారం మధ్యాహ్నం 2.15 గంటల నుంచి...యాక్టింగ్ సీజే జస్టిస్ సుజోయ్పాల్ఆర్బిట్రేషన్, రాజీ చట్టం, 1996లోని సెక్షన్ 11 కింద దాఖలు చేసే దరఖాస్తులు జస్టిస్ పి.శామ్ కోషి, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు (డివిజన్ బెంచ్–2)2024 సంవత్సరం వరకు రిట్ అప్పీళ్లు (నాన్–సర్వీస్) (ఏదైనా ఉంటే.. తుది విచారణ, వదిలివేసిన అడ్మిషన్లు, ఇంటర్లోక్యుటరీ)ఆదాయపు పన్ను ట్రిబ్యునల్ అప్పీళ్లు, ఆదాయపు పన్ను కేసులు, గిఫ్ట్ ట్యాక్స్ కేసులు, సెంట్రల్ ఎక్సైజ్ అప్పీళ్లు, వెల్త్ ట్యాక్స్ కేసులు, వెల్త్ ట్యాక్స్ అప్పీళ్లు, అర్బిట్రేషన్ అండ్ కాన్సిలేషన్ చట్టం 1996 రిట్ పిటిషన్లు, వాణిజ్య అప్పీలేట్ విభాగ కేసులు, కమర్షియల్ కోర్ట్సు యాక్ట్–2015కు సంబంధించిన సివిల్ మిసిలేనియస్ అప్పీళ్లు, సివిల్ రివిజన్ పిటిషన్లు, డెట్ రికవరీ ట్రిబ్యునల్ అండ్ సెక్యూరిటైజేషన్ కింద దాఖలు చేసే దరఖాస్తులు, పిటిషన్లు, సీఆర్పీలు, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ అండ్ జీఎస్టీ రిట్ పిటిషన్లు, రిఫర్ చేసిన కేసులు, పన్ను సవరణ కేసులు (టీఆర్సీలు అండ్ టీఆర్ఈవీసీలు), సుప్రీంకోర్టు లీవ్ పిటిషన్లు, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరీ్వస్, నాన్–సర్వీస్ అంశాలు, హైకోర్టు, జ్యుడిïÙయల్ సర్వీస్, జిల్లా కోర్టుల రిట్ పిటిషన్లు, మనీలాండరింగ్ నిరోధక చట్టం–2002 కింద ఉత్పన్నమయ్యే సివిల్ మిసిలేనియస్ సెకండ్ అప్పీళ్లు, వినియోగదారుల రక్షణ చట్టం–1986 రిట్ పిటిషన్లు, మోటార్ ప్రమాద సివిల్ ఇతర అప్పీళ్లుఅడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ జస్టిస్ అభినంద్కుమార్ షావిలి, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి (డివిజన్ బెంచ్–3)2024 సంవత్సరం వరకు రిట్ అప్పీళ్లు (సర్వీస్), తుది విచారణ, వదిలేసిన అడ్మిషన్లు, ఇంటర్లోక్యుటరీ.. రిట్ పిటిషన్లు (సర్వీస్, క్యాట్, శ్యాట్), ల్యాండ్ గ్రాబింగ్ (ప్రొహిబిషన్) చట్టం–1982 రిట్ పిటిషన్లు, సిటీ సివిల్ కోర్టు అప్పీళ్లు, సివిల్ రివిజన్ పిటిషన్లు, భూ సేకరణ అప్పీల్ సూట్లు, భూ కబ్జా అప్పీళ్లు, స్పెషల్ అప్పీళ్లు, ఒరిజినల్ సైడ్ అప్పీళ్లు అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణజస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ పి.శ్రీసుధ (డివిజన్ బెంచ్–4)2019 సంవత్సరం నుంచి క్రిమినల్ అప్పీళ్లు, హెబియస్ కార్పస్ మ్యాటర్స్, ఫ్యామిలీ కోర్టు అప్పీళ్లు, ఫస్ట్ అప్పీళ్లు, లీగల్ సరీ్వసెస్ అథారిటీ చట్టం–1987 రిట్ పిటిషన్లు, ఆల్ సీఎంఏలు (కమర్షియల్ కోర్టుల యాక్ట్ కాకుండా..) అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణజస్టిస్ టి.వినోద్కుమార్కంపెనీ అప్లికేషన్లు, కంపెనీ పిటిషన్లు, కంపెనీ అప్పీళ్లు, రిఫర్డ్ కంపెనీ కేసులు, కమర్షియల్ డివిజన్ కేసులు, ఎగ్జిక్యూటివ్ పిటిషన్లు.. రిట్ పిటిషన్లు (నాన్ సర్వీస్): సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండర్ టేకింగ్స్, సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్స్, మైన్స్, ఇండస్ట్రీస్, కామర్స్, విద్య, భూ సేకరణ, హౌసింగ్ శాఖ, జనరల్ అడ్మిని్రస్టేషన్ డిపార్ట్మెంట్ అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణజస్టిస్ కె.లక్ష్మణ్రిట్ పిటిషన్లు (నాన్ సర్వీస్): మున్సిపాలిటీస్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, యూనివర్సిటీలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు, 2023, జనవరి 1 నుంచి 2024, జూలై 30 వరకు ఎఫ్ఐఆర్/చార్జిïÙట్ల రద్దు రిట్ పిటిషన్లు (నాన్ సర్వీస్), క్రిమినల్ పిటిషన్లు అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణజస్టిస్ బి.విజయ్సేన్రెడ్డిరిట్ పిటిషన్లు (నాన్ సర్వీస్): హోం, ఎక్సైజ్, లా అండ్ లెజిస్లేషన్ డిపార్ట్మెంట్, వక్ఫ్ బోర్డు, ల్యాండ్ రిఫామ్స్ కేసులు, తిరుమల తిరుపతి దేవస్థానం, ఎక్కడా పేర్కొనని రిట్ పిటిషన్లు, 2022 వరకు ఎఫ్ఐఆర్/చార్జిషీట్ల రద్దు రిట్ పిటిషన్లు (నాన్ సర్వీస్), క్రిమినల్ పిటిషన్లు అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణజస్టిస్ పి.శ్రీసుధ2014 మోటార్ యాక్సిడెంట్ సీఎంఏలు అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ (సింగిల్గా ఉన్నప్పుడు విచారణ)జస్టిస్ జి.రాధారాణి 2009 వరకు రిట్ పిటిషన్లు (సర్వీస్) అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ (సింగిల్గా ఉన్నప్పుడు విచారణ)జస్టిస్ తుకారాంజీసెకండ్ అప్పీళ్లు: అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ 2013 వరకు మెటార్ యాక్సిడెంట్ సీఎంఏలు అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణజస్టిస్ టి.మాధవీదేవిరిట్ పిటిషన్లు (నాన్ సర్వీస్): పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, సివిల్ సప్లై అండ్ ఎసెన్షియల్ కమొడిటీస్, కో–ఆపరేటివ్ సొసైటీలు, ఫుడ్, అగ్రికల్చర్, మార్కెట్ కమిటీలు అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ అడ్మిని్రస్టేటివ్ ట్రిబ్యునల్ నుంచి బదిలీ చేసిన రిట్ పిటిషన్లు అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణజస్టిస్ కె.సురేందర్క్రిమినల్ అప్పీళ్లు: అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ (సోమ, బుధ, శుక్రవారం.. ఉదయం 10.30 గంటల నుంచి)జస్టిస్ కె.సురేందర్, జస్టిస్ జె.అనిల్కుమార్ (స్పెషల్ డివిజన్ బెంచ్)∙2018 వరకు క్రి మినల్ అప్పీళ్లు, క్రి మినల్ కన్ఫర్మేషన్ అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణజస్టిస్ సూరేపల్లి నందారిట్ పిటిషన్లు (నాన్ సర్వీస్): సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ సంక్షేమం, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం, స్టేట్ కార్పొరేషన్లు, అండర్ టేకింగ్స్ అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణజస్టిస్ జువ్వాడి శ్రీదేవి2024, జూలై 1 నుంచి ఎఫ్ఐఆర్/చార్జిషీట్ల రద్దు రిట్ పిటిషన్లు(నాన్ సర్వీస్), క్రిమినల్ పిటిషన్లు అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణజస్టిస్ ఎన్వీ శ్రావణ్కుమార్రిట్ పిటిషన్లు (నాన్ సర్వీస్): స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్, ఎనర్జీ, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మత్స్య పరిశ్రమ, పశు సంవర్థకం, ఎండోమెంట్ అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 10.30 గంటల నుంచి.. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల వరకు.. ఆ తర్వాత స్పెషల్ బెంచ్ విధులు జస్టిస్ ఎంజీ ప్రియదర్శిని2016 నుంచి మెటార్ యాక్సిడెంట్ సీఎంఏలు అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణజస్టిస్ సీవీ భాస్కర్రెడ్డిరిట్ పిటిషన్లు (నాన్ సర్వీస్): 2019 నుంచి రెవెన్యూ పిటిషన్లు, అర్బన్ ల్యాండ్ సీలింగ్, ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్.. అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణజస్టిస్ ఈవీ వేణుగోపాల్క్రిమినల్ రివిజన్ కేసులు అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణజస్టిస్ నగేశ్ భీమపాక2018 నుంచి 2021 వరకు రిట్ పిటిషన్లు (సర్వీస్) అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ రిట్ పిటిషన్లు (నాన్ సర్వీస్): ట్రాన్స్పోర్టు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఫ్యాక్టరీలు, లేబర్ మ్యాటర్స్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ట్రైనింగ్, యూత్ సరీ్వస్, స్పోర్ట్స్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ సంక్షేమం, సమాచార హక్కు చట్టం 2005, ఆర్థికం, ప్రణాళిక అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ సివిల్ మిసిలేనియస్ అప్పీళ్లు, సివిల్ మిసిలేనియస్ సెకండ్ అప్పీళ్లు అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణజస్టిస్ పుల్ల కార్తీక్2022 నుంచి రిట్ పిటిషన్లు (సర్వీస్) అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణజస్టిస్ కె.శరత్2018 వరకు రెవెన్యూ రిట్ పిటిషన్లు (నాన్ సర్వీస్) అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణజస్టిస్ జె.శ్రీనివాస్రావుఫస్ట్ అప్పీళ్లు, సిటీ సివిల్ కోర్టు అప్పీళ్లు అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణజస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు2010 నుంచి 2012 వరకు రిట్ పిటిషన్లు (సర్వీస్) అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ (సింగిల్గా ఉన్నప్పుడు విచారణ)జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి2015.. మోటార్ యాక్సిడెంట్ సీఎంఏలు అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ (సింగిల్గా ఉన్నప్పుడు విచారణ)జస్టిస్ జె.అనిల్కుమార్2013 నుంచి 2017 వరకు రిట్ పిటిషన్లు (సర్వీస్) అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ (సోమవారం, బుధవారం, శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి..)జస్టిస్ కె.సుజనబెయిల్స్, ట్రాన్స్ఫర్ క్రిమినల్ పిటిషన్లు అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ సివిల్ అడ్మిషన్లు: 2024, సెపె్టంబర్ 21 నుంచి సివిల్ రివిజన్ పిటిషన్లు, ఒరిజినల్ సివిల్ సూట్స్, ఒరిజినల్ పిటిషన్లు, ట్రాన్స్ఫర్ సివిల్ మిసిలేనియస్ పిటిషన్లు అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ -
హైకోర్టుకు కొత్తగా.. నలుగురు జడ్జీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రేణుక యార, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి నర్సింగ్రావు నందికొండ, హైకోర్టు రిజి్రస్టార్ జనరల్ తిరుమలాదేవి ఈద, హైకోర్టు రిజి్రస్టార్ (అడ్మినిస్ట్రేషన్) మధుసూదన్రావు బొబ్బిలి రామయ్య పేర్లను ఈ నెల 11న ఢిల్లీలో భేటీ అయిన సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. వీరంతా 2012లో జిల్లా జడ్జిలుగా ఎంపికైనవారు కావడం గమనార్హం. కాగా న్యాయాధికారుల కోటాలో వీరి ఎంపిక జరిగింది. తిరుమలాదేవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 2026 జూన్ 1 వరకు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది. మిగతా ముగ్గురు రెండేళ్లు అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహిస్తారని.. ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపడతారని స్పష్టం చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్ ఈ నెల 25న కొత్త న్యాయమూర్తులతో ప్రమాణం చేయించనున్నారు. హైకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 42 కాగా, ప్రస్తుతం 26 మంది ఉన్నారు. ఈ నలుగురితో కలిపి జడ్జిల సంఖ్య 30కి చేరింది. ఇంకా 12 ఖాళీలు ఉండగా, వీటి భర్తీ కోసం న్యాయవాదులు ఎదురుచూస్తున్నారు. -
పారదర్శక విచారణ జరగాలి
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో 2017లో దళితులపై దాడి జరిగిన ఘటనపై విచారణ పారదర్శకంగా సాగాలని బాధితుల్లో ఒకరైన కోలా హరీశ్ పేర్కొన్నారు. ఈ మేరకు హైకోర్టులో విచారణ సాగుతున్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో తనను ఇంప్లీడ్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నాటి కేసులో వాస్తవాలు తెలియాలంటే తన వాదనలు కూడా వినాలని కోరారు. అలాగే, న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. సిరిసిల్ల జిల్లా చీర్లవంచ, కొదురుపాక ప్రాంతాల నుంచి వందలాది ఇసుక లారీలు టిప్పర్లు నడిచేవి. ఈ క్రమంలోనే 2017, జూలై 2న నేరెళ్లకు చెందిన ఎరుకల భూమయ్యను ఇసుక లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు ఐదు ఇసుక లారీలను తగలబెట్టారు. దీంతో పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ జరగ్గా.. 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల తర్వాత రాత్రి 11:30 గంటలకు నేరెళ్లకు చెందిన పెంట బానయ్య, కోలా హరీశ్, చెప్పాల బాలరాజు, పసుల ఈశ్వర్ కుమార్, గంధం గోపాల్, రామచంద్రాపూర్కు చెందిన భక్తుల మహేశ్, జిల్లెలకు చెందిన కోరుకొండ గణేశ్, చీకోటి శ్రీనివాస్లను పోలీసులు అనుమానితులుగా అదుపులోకి తీసుకొని, జూలై 7న అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. ఎస్ఐ తప్పు లేదని విచారణలో తేలింది ఈ ఘటనలో బాధితులను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని, బాధ్యులైన ఎస్పీ విశ్వనాథ్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవీందర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉప్పల్కు చెందిన గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన పిల్తో పాటు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ రాసిన లేఖతో మరో పిల్ దాఖలైంది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ రాధారాణి ధర్మాసనం బుధవారం వి చారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది డి.సురేశ్కుమార్ వాదనలు వినిపిస్తూ.. పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ మంగళవారం అందిందన్నారు. దీనిపై వివరాలు తెలుసుకుని, బదులివ్వడానికి 15 రోజుల సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే నెల 27కు వాయిదా వేసింది. అయితే, సదరు ఎస్ఐ ఎలాంటి తప్పు చేయలేదని విచారణాధికారి నివేదిక ఇచ్చారని, దీంతో సస్పెన్షన్ను ఉపసంహరించుకున్నామని అఫిడవిట్లో ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. -
బీఆర్ఎస్ నల్లగొండ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నల్లగొండ రైతు దీక్షకు హైకోర్టు(Telangana High Court) అనుమతినిచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్షకు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది. ఈ నెల 21న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్(BRS Party) భావించిన సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టుకు వెళ్లారు. విచారణ చేపట్టిన కోర్టు షరతులతో అనుమతి మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నల్లగొండ పట్టణంలో మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. రైతు భరోసాను రూ.15 వేల నుంచి రూ.12 వేలకు కుదించడం, రూ.4 వేల పింఛన్, మహిళలకు రూ.2500, విద్యార్థినులకు స్కూటీలు వంటి పథకాలను అమలు చేయడం లేదని, వాటిపై ప్రభుత్వ తీరును ఎండగడతామంటూ బీఆర్ఎస్ ఈ మహాధర్నాను తలపెట్టింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొనేలా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా మహాధర్నాకు అనుమతి కోసం ఈ నెల 17వ తేదీన బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దేవేందర్ పోలీసులకు దరఖాస్తు చేశారు. దాని విషయంలో పోలీసులు వెంటనే నిర్ణయం ప్రకటించలేదు. ధర్నాకు ముందు రోజైన సోమవారం ఉదయం అనుమతి ఇవ్వడం లేదని లేఖ ఇచ్చారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ధర్నాకు ఒకరోజు ముందు అనుమతి నిరాకరించడం ఏంటని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి.బీఆర్ఎస్ తలపెట్టిన రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరణకు పోలీసులు పలు కారణాలను వెల్లడించారు. నల్లగొండ డీఎస్పీ పేరుతో లేఖను అందజేశారు. గడియారం సెంటర్లో తలపెట్టిన మహా ధర్నాకు ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తారన్న సమాచారం తమకు ఉందని అందులో పేర్కొన్నారు. అయితే గడియారం సెంటర్లో అందుకు సరిపడా స్థలం లేదని, అన్ని రోడ్లకు జంక్షన్ అయిన గడియారం సెంటర్లో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పైగా అటునుంచి రాకపోకలు సాగించే వాహనాలను మళ్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేవని, పార్కింగ్ సమస్య ఉంటుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: చింతల్ బస్తీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్మరోవైపు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక, ఇతర పథకాలకు లబ్ధిదారులు గుర్తింపు కోసం ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయని, పోలీస్ యంత్రాంగం అంతా ఆ బందోబస్తులో ఉంటుందని వివరించారు. మరోవైపు సంక్రాంతికి వెళ్లిన ఆంధ్రా ప్రాంతానికి వెళ్లిన వారంతా హైదరాబాద్ వస్తున్నందున జాతీయ రహదారిపై కూడా రద్దీగా ఉంటోందని, ఈ పరిస్థితిలో మహాధర్నాకు వచ్చే జనాలతో ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉన్నందున అనుమతి ఇవ్వలేకపోతున్నట్లు లేఖలో వివరించారు.ధర్నాకు అనుమతి నిరాకరణ అంశంపై బీఆర్ఎస్ పార్టీ పెద్దలతో చర్చించారు. అనుమతి నిరాకరణపై బీఆర్ఎస్ నేతలు సోమవారం(20వ తేదీ) మధ్యాహ్నం సమయంలో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ధర్మాసనం ఇవాళ.. ఈ నెల 28న ధర్నాకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. -
ఆ నలుగురు రైతులను విడుదల చేయండి
సాక్షి, హైదరాబాద్: లగచర్ల ఘటనలో సంబంధం ఉందంటూ అరెస్టు చేసిన నలుగురు రైతులను విడుదల చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. వారి వద్ద రూ.25 వేల వ్యక్తిగత బాండ్ తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా జైలు సూపరింటెండెంట్కు సూచించింది. ఒకే అంశంపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని తప్పుబట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాది (పీపీ)కి స్పష్టం చేస్తూ, తదుపరి విచారణ వచ్చే నెల 12కు వాయిదా వేసింది.వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనకు సంబంధించి బొంరాస్పేట్ పోలీస్ స్టేషన్లో రైతులు ముదావత్ రమేశ్, గోపాల్ నాయక్, మదారయ్య, మంగ్యా నాయక్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. తొలి ఎఫ్ఐఆర్ 153లో వీరిని అరెస్టు చేయగా బెయిల్పై విడుదలయ్యారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ 154, 155లోనూ వీరు నిందితులని పేర్కొంటూ పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. దీనిపై రైతులు కోర్టును ఆశ్రయించారు. ఒకే అంశంపై పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, కావాలని పోలీసులు మరో రెండు కేసులు పెట్టారని పేర్కొన్నారు. 154, 155లను రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ మంగళవారం విచారణ చేపట్టారు. పేర్లు తప్ప వారి పాత్రపై వివరాలు ఏవీ? ప్రభుత్వం తరఫున పీపీ పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపిస్తూ.. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా 154, 155 ఎఫ్ఐఆర్లలో పిటిషనర్లను పోలీసులు నిందితులుగా చేర్చారని చెప్పారు. అయితే పిటిషనర్ల పేర్లు ప్రస్తావించడం తప్ప వారికి వ్యతిరేకంగా ఏమీ పేర్కొనలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పిటిషనర్ల పాత్ర ఏంటో వివరించలేదన్నారు. పిటిషనర్లు వ్యవసాయదారులని, దాదాపు మూడు నెలలుగా జైల్లో ఉంటున్నారని గుర్తు చేశారు. వారి వద్ద వ్యక్తిగత బాండ్ తీసుకుని విడుదల చేయాలని ఆదేశించారు. -
హైకోర్టు ఆదేశాలు.. కేటీఆర్ నల్గొండ టూర్ రద్దు
సాక్షి, హైదరాబాద్ : రేపటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండ టూర్ రద్దయ్యింది. నల్గొండలో బీఆర్ఎస్ చేపట్టబోయే రైతు మహా ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరించారు. క్లాక్ టవర్ సెంటర్లో పార్కింగ్, ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో పోలీసులు అనుమతివ్వలేదు.అయితే పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు.. పోలీసుల అనుమతి విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభల నేపథ్యంలో బందోబస్తుపై హైకోర్ట్లో వాదనలు నడిచాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఈ నెల 26 తర్వాత రద్దీ ప్రాంతంలో కాకుండా అనువైన ప్రాంతంలో బీఆర్ఎస్ సభ నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదని తెలిపింది. అనంతరం.. బీఆర్ఎస్ నేతల లంచ్ మోషన్ పిటీషన్ను 27కు వాయిదా వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా తలపెట్టిన సంగతి తెలిసిందే. పట్టణ కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద జరుగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి జిల్లా నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. కానీ పోలీసులు.. ధర్నాకు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ నాయకులు అనుమతి కోసం హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు పోలీసులు తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హైకోర్టు నిర్ణయంతో నల్గొండ పర్యటనపై కేటీఆర్ వెనక్కి తగ్గారు. -
‘కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదు’
సాక్షి, న్యూఢిల్లీ: ఫార్ములా-ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సుప్రీం కోర్టులోనూ చుక్కెదురైంది. ప్రభుత్వ వాదనలతో అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఆయన వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారణకు అనుమతించలేదు. దీంతో.. ఆయన తన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు.ఈ కేసులో తెలంగాణ హైకోర్టులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. దీంతో.. ఆయన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జనవరి 8వ తేదీన సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ వేశారు. అయితే అంతకు ముందే.. కేటీఆర్ గనుక సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలూ వినాలని తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ తరఫున కేవియట్ పిటిషన్ వేసింది. దీంతో.. ఆ పిటిషన్పై ఇవాళ జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం ఇరువైపులా వాదనలు వింది. కేటీఆర్ తరుఫున లాయర్ సుందరం వాదనలు ఇది కక్ష సాధింపుతో ప్రభుత్వం పెట్టిన కేసు. తెలంగాణలో ప్రభుత్వం మారిన వెంటనే ఈ కేసు పెట్టారు. ఇది ప్రభుత్వ ప్రాజెక్ట్ అని చెప్పారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదు. డబ్బు తీసుకున్నవారిని, హెచ్ఎండీఏను నిందితులుగా చేర్చలేదు అంటూ వాదనలు వినిపించారు.ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో దర్యాప్తు జరగాలి. 24 గంటల్లో కేసు కొట్టేయాలని పిటిషన్ వేశారు. ఈ కేసు దర్యాప్తునకు గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారు అని అన్నారు.ఇరువైపులా వాదనల అనంతరం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. ఈ స్టేజ్లో క్వాష్ పిటిషన్ను అనుమతించలేమని తెలిపింది. దీంతో, తమ పిటిషన్ను ఉపసంహరించుకుంటామని లాయర్ సుందరం కోర్టుకు తెలిపారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదుతమ లీగల్ ఒపీనియన్ ప్రకారం కేసును విత్ డ్రా చేసుకున్నామని.. కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కాలేదని కేటీఆర్ తరఫు అడ్వకేట్ మోహిత్ రావు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఏ కోర్టులోనైనా అప్పిల్ చేసుకునేందుకు మాకు అవకాశం ఉంది. ఫార్ములా ఈ కార్ కేసులో సుప్రీం కోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపింది. కేటీఆర్ క్యాష్ పిటిషన్పై ఆర్యమా సుందరం, సిద్ధార్థ దవేలు వాదనలు వినిపించారు. ఈ కేసులో సెక్షన్ 13.1A పీసీ యాక్ట్ వర్తించదని వాదనలు వినిపించాం. ఏసీబీ FIRలో పేర్కొన్న అంశాలు ప్రొసీజర్లో ఉన్న ఇరెగ్యులారిటీకి సంబంధించిన అంశాలు అని మోహిత్ రావు పేర్కొన్నారు. -
నిషేధాన్ని కఠినంగా అమలు చేయండి
సాక్షి, హైదరాబాద్: పక్షులు, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన చైనా మాంజాపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సంక్రాంతి నేపథ్యంలో వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. 2017లో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలని చెప్పింది. అంతేకాదు, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) ఆదేశాలను కూడా అమలు చేయాలని పేర్కొంది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి విచారణ ఈ నెల 31కి వాయిదా వేసింది. చైనా మాంజా వినియోగంపై 2017లో ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులు పాటించేలా పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్ కాచిగూడకు చెందిన సంజయ్ నారాయణ్ పంజరి హైకోర్టులో లంచ్మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. సింథటిక్ నైలాన్ దారానికి గ్లాస్ పౌడర్ లేదా మెటల్ వంటి రాపిడి పదార్థాలతో కోటింగ్ వేసి మాంజా తయారు చేస్తున్నారు.. ఇది వన్యప్రాణుల, ప్రజాభద్రతతో పాటు పర్యావరణానికి పెనుముప్పుగా మారిందని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయని చెప్పారు. ఎన్జీటీ నిషేధం విధించినా సంక్రాంతి పండుగ సందర్భంగా విరివిగా మార్కెట్లో విక్రయం చేస్తున్నారని వెల్లడించారు. విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ న్యాయవాది శ్రీరమ్య వాదనలు వినిపిస్తూ.. ‘సంక్రాంతిని దేశవ్యాప్తంగా విస్తృతంగా జరుపుకుంటారు. గాలిపటాలను ఎగురవేయడం పండుగలో అంతర్భాగంగా వస్తోంది. కాటన్ దారాలతో గాలిపటాలను ఎగురవేసే సంప్రదాయం ఉండేది. పోటీ పెరగడంతో కాలక్రమేణా సింథటిక్, గాజు పూతతో కూడిన మాంజాలు విస్తృతంగా వినియోగిస్తున్నారు. స్తంభాలు, చెట్లతోపాటు పలుచోట్ల చిక్కుకున్న మాంజా గాలిలో వేలాడుతూ ఉండటం పక్షులు, మనుషుల మరణాలకు దారితీస్తోంది. మాంజాతో మనుషులు తీవ్రంగా గాయపడిన, చనిపోయిన సంఘటనలున్నాయి. బీఎన్ఎస్ సెక్షన్ 223 ప్రకారం చైనీస్ మాంజా వాడితే రూ.5 వేల జరిమానా కూడా విధించవచ్చు’అని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎన్జీటీ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు.మాంజాపై 2017లోనే నిషేధం సాక్షి ఫ్లస్ (ఈ– పేపర్)లో -
ప్రత్యేక ‘షో’లూ వద్దు
సాక్షి, హైదరాబాద్: గేమ్ఛేంజర్ సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతివ్వడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకపక్క బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ, మరోపక్క ప్రత్యేక షోలకు అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించింది. ప్రత్యేక షో కూడా ఒకరకంగా బెనిఫిట్ షో లాంటిదే అని వ్యాఖ్యానించింది. వేకువజాము షోలకు అనుమతి, టికెట్ ధరల పెంపును పునఃసమీక్షించాలని స్పష్టం చేసింది. భవిష్యత్లో కూడా వేకువజాము షోలకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని చెబుతూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. భారీ బడ్జెట్తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి డబ్బు వసూలు చేయాలనుకోవడం సరికాదని హితవు పలికింది. గేమ్ఛేంజర్ సినిమాకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని చెబుతూ తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. దిల్రాజు నిర్మాతగా శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ నటించిన గేమ్ఛేంజర్ సినిమా ప్రత్యేక షోలకు, టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అర్ధరాత్రి 1 గంట బెనిఫిట్ షోకు మాత్రం ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 10న వేకువజామున 4 గంటల నుంచి 6 షోలకు అనుమతించింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన కూరగాయల వ్యాపారి గొర్ల భరత్రాజ్తోపాటు సతీశ్కమాల్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం, టికెట్ ధరల పెంపు సినిమాటోగ్రఫీ నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. 2021లో జారీ చేసిన జీఓ ప్రకారమే టికెట్ల ధరలు ఉండాలని, కానీ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన మెమో ఆధారంగా అధిక ధరలు వసూలు చేస్తున్నట్టు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గేమ్ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను నిలుపుదల చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. పెంచిన టికెట్ ధరలు పూర్తికాలం కొనసాగవని, ఈ నెల 19వ తేదీ వరకే ఉంటాయని హోంశాఖ జీపీ కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకొని.. అర్ధరాత్రి వేళ షోలకు అనుమతిస్తే ఇంటికి వెళ్లే సరికి ఎంత సమయం అవుతుందని జీపీని ప్రశ్నించారు. అభివృద్ధి అంటే అర్ధరాత్రి తర్వాత బయట తిరగడం కాదని, సమయానికి నిద్రపోవడం కూడా ముఖ్యమే కదా అని మరోసారి చెప్పారు. ప్రేక్షకుల భద్రతనూ దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. తదుపరి విచారణను వాయిదా వేసింది -
హరీష్ను అరెస్ట్ చేయొద్దు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ టాపింగ్ కేసులో హైకోర్టు విచారణ జరిపింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దీంతో పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ హరీష్రావు హైకోర్టును ఆశ్రయించారు.పోలీసులు దర్యాప్తు, అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హరీష్రావు కోరారు. గత విచారణ సందర్భంగా హరీష్ రావును అరెస్ట్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిన హైకోర్టు.. ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. చక్రధర్ గౌడ్ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 28వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు.. అప్పటి వరకు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది.ఇదీ చదవండి: Telangana: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ -
ప్రత్యేక షోలకు పర్మిషన్లు ఎందుకు?: తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్, సాక్షి : తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు, ప్రత్యేక ప్రదర్శనలపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ప్రత్యేక ప్రదర్శనలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమాకు టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలపై శుక్రవారం తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో విచారణ జరిగింది. తాజా పరిణామాల దృష్ట్యా బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ, పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే.. అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునఃసమీక్షించాలని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ‘‘ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బెనిఫిట్(Benefit Shows), ప్రత్యేక షోలకు అనుమతించొద్దు. నిర్మాత భారీ బడ్జెట్తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరైంది కాదు’’ అని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఈ విషయంపై తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.ఇదీ చదవండి: టికెట్ల రేటు పెంపు ఎవరి కోసం రేవంత్? -
బెనిఫిట్ షో అవసరమేముందో చెప్పండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడంలో సర్కార్ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రముఖ చిత్రాలకు బెని ఫిట్ షోలకు, ఇష్టం వచ్చిన సమయాల్లో ప్రదర్శనకు ఎందుకు అనుమతి ఇస్తున్నారని, వాటి అవసరం ఏముందని ప్రశ్నించింది. ప్రజల భద్రత గురించి కనీసం అలోచించాల్సిన అవస రం లేదా అని నిలదీసింది. 16 ఏళ్లలోపు పిల్ల లను అర్ధరాత్రి, తెల్లవారుజాము ప్రదర్శనలకు అను మతించకూడదని సూచించింది. ఇలాంటి అంశాల్లో ఒక్క చిత్రంపై ఇలా పిటిషన్ దాఖలు చేయడం కాకుండా.. ప్రజా ప్రయో జన వ్యాజ్యంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. దిల్ రాజు నిర్మాతగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 10న మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్పై అదనంగా రూ. 150, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికె ట్పై అదనంగా రూ. 100 చొప్పున పెంచుకునేందుకు వెసులు బాటు కల్పించింది. జనవరి 11 నుంచి రోజూ 5 షోల నిర్వహణకు అనుమతిస్తు న్నట్లు పేర్కొన్నారు. 11 నుంచి 19 వరకూ మల్టీ ప్లెక్సులలో టికెట్పై అదనంగా రూ. 100, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికె ట్పై అదనంగా రూ. 50 రూపాయల చొప్పున ధరలు పెంచు కోడానికి సర్కార్ అనుమతిచ్చింది. అర్ధరాత్రి బెనిఫిట్ షోలకు మాత్రం సర్కార్ నిరాకరించింది. ఇదిలా ఉండగా, ఈనెల 8న ఇచ్చిన టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైద రాబాద్కు చెందిన కూరగాయల వ్యాపారి గొర్ల భరత్రాజ్ లంచ్ మోషన్ రూపంలో హైకోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. జనవరి 10న ఉదయం 4.30 గంటల నుంచి సిని మా ప్రదర్శనకు అనుమతివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.పిల్గా విచారణ చేయాల్సిన అంశం...: ఈ పిటిషన్పై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. టికెట్ ధరల పెంపు నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. గేమ్ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను నిలుపుదల చేసే లా ఆదేశాలివ్వాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయం సినిమా రెగ్యులేషన్స్ రూల్స్ 1970, సినిమాస్ లైసెన్సింగ్ షరతులకు విరుద్ధమని తెలిపారు. పుష్ప–2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి తర్వాత.. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదని డిసెంబర్ 21న అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారన్నారు. కనీసం పక్షం రోజులైనా కాకముందే వేకువజామున 4 గంటలకే షో నిర్వహించుకునేలా అనుమతులు ఇచ్చారన్నారు. ప్రజలకు చెప్పేదొకటి.. చేసేదొకటి అన్న తీరుగా సర్కార్ వ్యవహారం ఉందని వెల్లడించారు. వాదనలు విన్న న్యాయ మూర్తి.. ఈ అంశంపై పిల్ వేస్తే మరింత అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. పిటిషనర్ న్యాయవాది కోర డంతో విచారణ నేటికి వాయిదా వేశారు. కాగా, తగినంత పార్కింగ్ లేకపోవడం, స్క్రీనింగ్ల మధ్య తక్కువ సమయం వంటి ఇబ్బందులపైనా న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజల తొక్కిసలాటకు దారితీస్తుందని పేర్కొన్నారు.హక్కులు హరించడమే..: హైకోర్టు‘సినిమా ప్రదర్శనకు సమయపాలన ఉండాలి. అర్ధరాత్రి, వేకువజామున అనుమతులు ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘన లాంటిదే. ఇది ప్రజల నిద్రపోయే హక్కును హరించడమే అవుతుంది. ఇలా ఎప్పటికప్పుడు చిత్రాలకు వెళ్లే వాడి ఆరోగ్యం ఏమవుతుంది?’ ‘పిటిషనర్లు కూడా చిత్రం విడుదలకు ముందు పిటిషన్ వేసి ఇక తర్వాత పట్టించుకోవడం లేదు. వేళాపాళా లేని షోలకు 16 ఏళ్లలోపు చిన్నారులను కూడా రద్దీ ఉండే చిత్రాలకు తీసుకొస్తున్నారు.. సర్కార్ కూడా అనుమతిస్తోంది. ఇది సమంజసం కాదు. ప్రజలు బయటకు వెళ్లడానికి, లోనికి రావడానికి స్క్రీనింగ్ల మధ్య సమయం ఉండాలి’ -
ఏసీబీ విచారణకు వెళ్లండి: కేటీఆర్కు హైకోర్టు సూచన
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ కేసు(Formula-e race)లో ఏసీబీ విచారణకు న్యాయవాదిని అనుమతించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr) వేసిన లంచ్మోషన్ పిటిషన్ పిటిషన్పై హైకోర్టు బుధవారం(జనవరి 8) మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం నాలుగు గంటలకు మరోసారి విచారించింది. కేటీఆర్తో పాటు న్యాయవాది ఏసీబీ విచారణకు రావొచ్చు అని హైకోర్టు తెలిపింది. అయితే ఈ విషయంలో కోర్టు కొన్ని షరతులు విధించింది.కేటీఆర్తో పాటు రాంచందర్ అనే న్యాయవాది ఏసీబీ విచారణకు వచ్చేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. అయితే విచారణ గదిలోకి న్యాయవాది వెళ్లకూడదని ఆదేశించింది. విచారణ గదిలో మాత్రం కేటీఆర్తో పాటు ఏసీబీ అధికారులు మాత్రమే ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. విచారణ గది పక్కనే లైబ్రరీ గదిలో న్యాయవాది కూర్చోవచ్చని ఏసీబీ హైకోర్టు తెలిపింది. గురువారం(జనవరి 9) ఏసీబీ విచారణకు వెళ్లాలని కోర్టు కేటీఆర్కు సూచించింది. స్టేట్మెంట్ రికార్డులో ఏమైనా అనుమానాలుంటే తమను సంప్రదించవచ్చని కోర్టు తెలిపింది. విచారణను ఆడియో వీడియో రికార్డింగ్ చేయడానికి హైకోర్టు నో చెప్పింది. ఇప్పటికే ఒకసారి కేటీఆర్ తన లాయర్తో పాటు ఏసీబీ విచారణకు వెళితే ఏసీబీ అనుమతించని విషయం తెలిసిందే. దీంతో గురువారం(జనవరి 9) ఏసీబీ ఆఫీసులో జరగనున్న విచారణ కీలకంగా మారింది. ఫార్ములా ఈ కార్ రేసులో తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు ఇప్పటికే కొట్టేసిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: కేటీఆర్పై ఏసీబీకి మరో ఫిర్యాదు -
న్యాయవాదుల సమక్షంలోనే విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించనున్న కేటీఆర్
-
సుప్రీంలో న్యాయపోరాటం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని అడ్డు పెట్టుకుని తనపై బురదచల్లేందుకు పెట్టిన అక్రమ కేసులపై పోరాడేందుకు రాజ్యాంగం, చట్టపరంగా ఉన్న హక్కు లను ఉపయోగించుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ తాను దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అక్కడ న్యాయపోరాటం కొనసాగుతుందన్నారు.మరోవైపు 9న జరిగే ఏసీబీ విచారణకు తన న్యాయవాదులతో పాటు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బుధవారం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. హైకోర్టు నుంచి ఉపశమనం దొరికితే ఏసీబీతో పాటు ఈ నెల 16న ఈడీ విచారణకు కూడా హాజరవుతానని ప్రకటించారు. మంగళవారం రాత్రి కేటీఆర్ బంజారాహిల్స్లోని నందినగర్ నివాసంలో పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. లొట్టపీసు కేసులో శునకానందం ‘చట్టంపై గౌరవంతో ఏసీబీ విచారణకు సోమవారం న్యాయవాదితో కలిసి వెళ్లి 45 నిమిషాలు ఎదురుచూశా. లగచర్ల కేసులో పట్నం నరేందర్రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్ను కూడా ఇచ్చినట్లుగా మీడియాకు లీకులు ఇచ్చారు. దీనిని దృష్టిలో పెట్టుకుని న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని కోరుకుంటే నా హక్కులకు భంగం వాటిల్లేలా చేశారు. న్యాయవాదుల సమక్షంలోనే ఏసీబీ విచారణ జరగాలని కోరుతూ హైకోర్టుకు వెళ్తున్నా. ఏసీబీ తప్పుడు ఎఫ్ఐఆర్ను రద్దు చేయమంటూ నేను వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేస్తే నాకు ఉరిశిక్ష వేసినట్లుగా కాంగ్రెస్ నాయకులు చంకలు గుద్దుకుంటున్నారు. బ్రోకర్లు, దొంగలకు అవినీతే కన్పిస్తుంది ఫార్ములా–ఈ వ్యవహారంలో అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టకుండా సీఎం పారిపోయాడు. రేవంత్.. మొగోడైతే తన జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ప్రత్యక్ష చర్చ పెట్టాలి. అవినీతిపరులు, రూ.50 లక్షల సంచులతో దొరికిన బ్రోకర్లు, దొంగలకు ప్రతి పనిలో అవినీతి కనిపిస్తుంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నా మీద లొట్టపీసు కేసు పెట్టి చిట్టినాయుడు పైశాచిక, శునకానందం పొందుతున్నాడు. సీఎం నోట వచ్చేది వేదవాక్కులు, సీఎం ఆఫీసు నుంచి వచ్చే లీకులు సూక్తులు కాదు. దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కోరితే కాంగ్రెస్ నేతలు ఆగమవుతున్నారు. కొందరు మంత్రులు న్యాయమూర్తుల తరహాలో శిక్షలు వేస్తున్నారు..’అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను అణాపైసా అవినీతికి పాల్పడలేదు ‘ఫార్ములా –ఈ రేస్లో అణాపైసా అవినీతి జరగలేదు. నేను అణాపైసా అవినీతికి పాల్పడలేదు. హైకోర్టు విచారణకు మాత్రమే అనుమతించింది, కుంభకోణం అని ఎక్కడా చెప్పలేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్, మేఘా ఇంజనీరింగ్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట రూ.4,600 కోట్లు పనులు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మేఘా సంస్థ ఎలక్టొరల్ బాండ్లు ఇవ్వడం క్విడ్ ప్రోకో కిందకు వస్తుందా లేదా మంత్రి పొంగులేటి చెప్పాలి.మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్కు నీటి తరలింపు, మూసీ సుందరీకరణ పనులు కూడా మేఘా సంస్థకు ఇస్తున్నట్లు సమాచారం వ చ్చిoది. ఓ కాంట్రాక్టర్ మంత్రి, ఓ బ్రోకర్ ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి..’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రక్షణ కవచంగా నిలుస్తోందని విమర్శించారు. కేటీఆర్ నివాసానికి పార్టీ నేతలు కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా అక్కడికి చేరుకుని పార్టీ నేతలతో మాట్లాడారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గుప్తా నేతృత్వంలోని బీఆర్ఎస్ లీగల్ టీమ్తో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 35 పేజీల కోర్టు తీర్పును లీగల్టీమ్ అధ్యయనం చేయడంతో పాటు హైకోర్టులో కేటీఆర్ తరఫున వాదించిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ దవేతో ఫోన్లో చర్చించారు. ఏసీబీ, ఈడీ తాజా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని న్యాయవాదులు సూచించినట్లు సమాచారం. ఇంతకంటే బలంగా తిరిగి వస్తా: కేటీఆర్ ‘నా మాటలు గుర్తు పెట్టుకోండి.. ఈ ఎదురుదెబ్బ నుంచి ఇంతకంటే బలంగా తిరిగి వస్తా. మీ అబద్ధాలు నన్ను పడగొట్టలేవు. మీ విమర్శలు నా స్థాయిని తగ్గించలేవు. నా లక్ష్యాన్ని మీ చర్యలు అడ్డుకోలేవు. మీ అరుపులు, పెడ»ొబ్బలు నా గొంతు నొక్కలేవు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి బాటలు వేస్తాయి. నిజం ఎప్పటికైనా గెలిచి తీరుతుంది. ప్రపంచమంతా త్వరలో దీనిని చూసి తీరుతుంది. మన న్యాయ వ్యవస్థపై నాకు అచంచల విశ్వాసం ఉంది. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది..’అని కేటీఆర్ ‘ఎక్స్’వేదికగా పేర్కొన్నారు. -
దర్యాప్తు అడ్డుకోలేం.. ఏసీబీ కేసుపై హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావుకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. దర్యాప్తును అడ్డుకునేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. అప్పీల్ చేసుకునేందుకు వీలుగా 10 రోజుల వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలిచ్చేందుకు నిరాకరించింది. కేసు దర్యాప్తునకు ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది. కేటీఆర్ను అరెస్టు చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చింది. ఫార్ములా ఈ రేసును హైదరాబాద్లో నిర్వహించే నిమిత్తం హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకోవడం వెనుక నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాకు ఆర్థిక నష్టం వాటిల్లిందంటూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 20న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ గత నెల 20న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపి డిసెంబర్ 31న తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం..మంగళవారం ఉదయం 35 పేజీల తీర్పు వెలువరించింది. సాక్ష్యాల సేకరణకు అవకాశం ఇవ్వాలి ‘ఆర్థిక శాఖ అనుమతి లేకుండా రూ.54,88,87,043 నగదు రెండు దఫాలుగా విదేశీ కంపెనీకి చెల్లించాల్సిందిగా హెచ్ఎండీఏను నాటి మంత్రి కేటీఆర్ ఆదేశించారనేది ఆరోపణ. దురుద్దేశంతో నిధులు బదిలీ చేయమని ఆదేశించారా? తన లబ్ధి కోసం చెల్లించమన్నారా? మూడో పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారా? అనేది దర్యాప్తులో తేలుతుంది. హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, అనుమతి లేకుండా బదిలీ జరిగినట్టుగా ప్రాథమిక ఆధారాలు తెలియజేస్తున్నాయి. విచారణ జరిపేందుకు ఇవి సరిపోతాయి. ఆరోపణలపై నిజానిజాలు నిగ్గుతేలాలంటే దర్యాప్తు చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మరుసటి రోజే దాన్ని కొట్టివేయాలంటూ దాఖలైన ఇలాంటి పిటిషన్పై గతంలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దర్యాప్తు చేయడానికి అధికారులకు అవకాశం ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ రద్దు చేసిన హైకోర్టు తీరును తప్పుబట్టింది. ఈ కేసులో కూడా డిసెంబర్ 18న ఫిర్యాదు, 19న ఎఫ్ఐఆర్ దాఖలు చేయగా, 20న కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దర్యాప్తు సంస్థలు విచారణ చేయడానికి, సాక్ష్యాలను సేకరించడానికి సహేతుకమైన అవకాశం ఇవ్వాలి. అందుకే ఈ కేసు దర్యాప్తును తొందపడి అడ్డుకోవాలని ఈ కోర్టు అనుకోవడం లేదు. దురుద్దేశం, ఆరోపణలు, నిజాయితీ లేకుండా వ్యవహరించారా? లేదా? అనేది విచారణలో తేలుతుంది. ఇప్పుడు దర్యాప్తును అడ్డుకోవడం తొందరపాటు చర్యే అవుతుంది. ఈ దశలో కోర్టుల మినీ ట్రయల్ సరికాదు నేరం జరిగినట్లు ఎఫ్ఐఆర్లో వెల్లడించాల్సిన అవసరం లేదు. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగా కోర్టులు మినీ ట్రయల్ నిర్వహించడం సరికాదు. పిటిషనర్పై ఐపీసీ సెక్షన్ 409, అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(ఎ), 13(2) వంటి సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. బీఎన్ఎస్ సెక్షన్ 528 మేరకు ఎఫ్ఐఆర్ను రద్దు చేసేందుకు కోర్టుకున్న అధికారం పరిమితం. కేసు విచారణ ప్రక్రియ దుర్వినియోగం అవుతున్నప్పుడు, చట్ట దుర్వినియోగానికి దారితీసే సందర్భాల్లోనే చాలా అరుదుగా కోర్టుల జోక్యానికి వీలుంది. దర్యాప్తు అధికారాలను కోర్టులు తమ చేతుల్లోకి తీసుకోబోవు. ఈ కేసులో సెక్షన్ 528 కింద కోర్టు తన స్వాభావిక అధికారాన్ని వినియోగించి ఆరోపణలపై విచారణ చేపట్టబోదు. ఆలస్యం జరిగిందనే కారణంతో కొట్టివేత కుదరదు భజన్లాల్, నీహారిక ఇ¯న్ఫ్రాస్ట్రక్చర్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇక్కడి కేసుకు వర్తించవు. 14 నెలలు ఆలస్యంగా కేసు నమోదు అయ్యిందని చెప్పి ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరడానికి వీల్లేదు. మంత్రిగా చేసిన వాళ్లపై కేసు నమోదుకు వీల్లేదన్న పిటిషనర్ వాదన ఆమోదయోగ్యంగా లేదు. ఏసీబీ కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు పూర్తి కాకుండానే ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరడం చట్ట వ్యతిరేకం. ఎఫ్ఐఆర్ రద్దు చేయడానికి అర్హమైనదా, కాదా అనే అంశంలోకి వెళ్లే ముందు పిటిషనర్పై ఉన్న అభియోగాలపై దర్యాప్తు జరగాల్సి ఉంది. హెచ్ఎండీఏ అనేది ప్రత్యేక సంస్థ. ఆస్తులు ఉండటమే కాకుండా అభివృద్ధిలో భాగంగా పలు ఒప్పందాలు చేసుకోవడానికి అధికారమున్న సంస్థ. పురపాలక శాఖ పరిధిలోనే ఇది పని చేస్తుంది. ఆ శాఖ అప్పటి మంత్రిగా పిటిషనర్ అదీనంలోనే హెచ్ఎండీఏ విధులు నిర్వహించింది.. ఆదేశాలు పాటించింది. ఈ కేసులో ఫార్ములా ఈ రేసు నిర్వహించిన సంస్థ ఆర్థికంగా లబ్ధి పొందినా, ఆ సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదని పిటిషనర్ వాదించారు. అయితే ఇది ఏసీబీ దర్యాప్తులో తేలే అంశం. మొత్తంగా చూస్తే ఏసీబీ ఎఫ్ఐఆర్ను ప్రాథమిక దశలోనే కొట్టివేయలేం..’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. కేటీఆర్ను అరెస్టు చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పది రోజులపాటు పొడిగించాలన్న కేటీఆర్ న్యాయవాది గండ్ర మోహన్రావు అభ్యర్థనను తోసిపుచ్చింది. క్రిమినల్ కేసుల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును నేరుగా సుప్రీంకోర్టులోనే సవాల్ చేయాల్సి ఉంటుంది. విచారణ జరిపే అధికారం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనానికి ఉండదు. -
తెలంగాణ ‘సీజే’ బదిలీ..కొలీజియం సిఫారసు
సాక్షి,ఢిల్లీ:సుప్రీంకోర్టు కొలీజియం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండు రాష్ట్రాల చీఫ్ జస్టిస్లను మంగళవారం(జనవరి7) బదిలీ చేసింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే ముంబై హైకోర్టుకు,ముంబై హైకోర్టు చీఫ్జస్టిస్ దేవేంద్ర ఉపాధ్యయ ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా బదిలీ చేస్తూ కొలీజియం రాష్ట్రపతి సిఫారసుచేసింది.ప్రస్తుతం పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్న వినోద్ చంద్రన్ను సుప్రీంకోర్టుజడ్జిగా నియమించింది. కేరళ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు బెంచ్లో ఎవరూ లేకపోవడంతో జస్టిస్ వినోద్ చంద్రన్ కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. -
కేటీఆర్దే బాధ్యత.. ఎఫ్ఐఆర్ క్వాష్ అరుదైన నిర్ణయం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ (KTR) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలో ఆర్డర్ కాపీలో కీలక విషయాలను వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకు మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బాధ్యుడిగా ఉండాలి. హెచ్ఎండీఏ నిధులు సంబంధిత మంత్రి పర్యవేక్షణలోనే ఉంటాయని ప్రాధమికంగా తేలింది. అవి దుర్వినియోగం అయ్యాయా? లేదా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని వ్యాఖ్యలు చేసింది.కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత అనంతరం హైకోర్టు ఆర్డర్ కాపీ విడుదల చేసింది. 45అంశాలతో 35పేజీల ఆర్డర్ కాపీని విడుదల చేసింది. ఈ సందర్బంగా.. ఉన్నత న్యాయస్థానం (Telangana High Court) పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు సంస్థల అధికారాలను కోర్టులు అడ్డుకోలేవు. ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. హెచ్ఎండీఏ ఖాతాలోని డబ్బును నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చి ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలకు లబ్ధి చేకూర్చారని అభియోగాలున్నాయి. ఆరోపణల మేరకు ఏసీబీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అప్పటి ప్రభుత్వంలో పురపాలక మంత్రిగా ఉన్న కేటీఆర్ హెచ్ఎండీఏ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. ఎఫ్ఐఆర్ను కొట్టివేసే అధికారాన్ని కోర్టు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.పోలీసుల దర్యాప్తు అన్యాయంగా ఉంటేనే కోర్టు తన అధికారాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. పోలీసులకు ఉన్న అధికారాలను కోర్టు ఎప్పుడూ అన్యాయంగా తీసుకోదు. ఏసీబీ చేసిన ఆరోపణల్లోకి వెళ్లి దర్యాప్తు చేయాలని కోర్టు భావించడం లేదు. ఈ కేసులో నేరపూరిత కుట్ర జరిగిందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి బాధ్యత గల హోదాలో ఉన్నారు. మరో నిందితుడితో కలిసి కేటీఆర్ హెచ్ఎండీఏ(HMDA) నిధులను అక్రమంగా వినియోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి మండలి, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే పిటిషనర్ హెచ్ఎండీఏ నుంచి భారీ మొత్తంలో నగదు బదిలీ చేయించినట్లు ఆరోపణలున్నాయి. సొంత లబ్ధి కోసమా.. లేక మూడో వ్యక్తి ప్రయోజనం కోసం నగదు బదిలీ జరిగిందా.. అనేదానిపై దర్యాప్తు జరగాల్సి ఉంది.అయితే, నిధుల దుర్వినియోగం జరగలేదని పిటిషనర్ వాదించడాన్ని కోర్టు నమ్మడం లేదు. దర్యాప్తులో ఈ విషయాలన్నీ తేలాల్సి ఉంది. నేరం జరిగిందని చెప్పడానికి ప్రాథమిక ఆరోపణలు మాత్రమే ఎఫ్ఐఆర్(FIR)లో ఉంటాయి. పూర్తిస్థాయి వివరాలన్నీ ఎఫ్ఐఆర్లో పొందుపర్చాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 18న ఫిర్యాదు అందితే, 19న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 20న పిటిషనర్ క్వాష్ పిటిషన్ వేశారు. ఆధారాలు సేకరించాల్సిన సమయం దర్యాప్తు సంస్థలకు కావాలి. దర్యాప్తు విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోదల్చుకోలేదు’ అని ధర్మాసనం కామెంట్స్ చేసింది. ఇది కూడా చదవండి: ఏసీబీ దూకుడు.. ‘సుప్రీం’కు చేరిన ఈ-కార్ రేసు పంచాయితీ! -
కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకొస్తారు: హరీష్రావు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేస్ కేసులో తనపై ఏసీబీ(ACB) దాఖలు చేసిన కేసును కొట్టేయాలన్న ఆయన అభ్యర్థనను ఉన్నతన్యాయస్థానం కొట్టేసింది. ఈ పరిణామంపై తెలంగాణ రాజకీయ వర్గాలు స్పందిస్తున్నాయి.హైకోర్టు తీర్పు అనంతరం నందినగర్లోని కేటీఆర్ నివాసం వద్ద బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్రావు మీడియాతో మాట్లాడారు. ‘‘రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్(Diversion Politics), కక్ష సాధింపు చర్యలు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ తరహా రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్పై అక్రమ కేసు పెట్టారు. ఫార్ములా ఈ రేస్ కేసు వల్ల తెలంగాణకు మంచే జరిగింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం కేటీఆర్ కష్టపడ్డారు. ఈ వ్యవహారంలో అవినీతికి ఆస్కారమే లేదు. న్యాయ స్థానాలు, చట్టంపై గౌరవం ఉంది. కేటీఆర్ ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే కేటీఆర్ విచారణకు సహకరిస్తానన్నారు. ఏసీబీ విచారణకు వెళ్తే.. 40 నిమిషాలు బయట నిల్చొబెట్టారు. అయినా ఆయన ఓపికగా వ్యవహరించారు. తిరిగి 9వ తేదీన విచారణకు రమ్మన్నారు. ఆ రోజు కూడా ఆయన విచారణకు హాజరవుతారు. ఇది కుట్రపూరితమైన కేసు. మేం సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం. ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకు వస్తారు. మా పార్టీ వాళ్లపై రేవంత్ రెడ్డి ఇంకా కేసులు పెట్టొచ్చు. కానీ, మేం అధైర్య పడం. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరఫున పోరాడతాం. రేవంత్ అక్రమాలకు ప్రశ్నిస్తూనే ఉంటాం.హైకోర్టు తీర్పు కాపీ ఇంకా అందలేదు. అది వచ్చాక ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటాం. సోషల్ మీడియాలో హైకోర్టు తీర్పుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్ను విచారణ జరపమని మాత్రమే హైకోర్టు చెప్పింది. అసలు విచారణే ప్రారంభం కానప్పుడు.. ఇది తప్పుడు కేసు ఎలా అవుతుంది. కేటీఆర్కు శిక్ష పడుతుందంటూ బోగస్ వార్తలు ప్రచురిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు అవి మానుకుంటే మంచిది’’ అని హరీష్ అన్నారు.👉కేటీఆర్ యాక్టింగ్ చూసి సినిమా వాల్లే ఆశ్చర్యపోతున్నారు. జైలు కు పోవడానికి సిద్దం అని..ఇప్పుడు ఈ దొంగ నాటకాలు ఎందుకు.ఈ ఫార్ములా కేసు ను లొట్టపీసు కేసు అన్నది కేటీఆర్ కాదా?. జైలు కు పోయి యోగా చేస్తా అన్నది కేటీఆర్ కాదా?. తప్పే చేయలేదు , సుద్దపూస అని ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ కు చట్టం తెలియదా? అడ్వకేట్ లతో ఏసీబీ ఆఫీస్ కు ఎలా వెళ్తారు?. కోర్టు పర్మిషన్ లేకుండా అడ్వకేట్ లను ఏసీబీ అనుమతించదని తెలియదా?:::బల్మూరి వెంకట్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ👉కేటీఆర్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఫార్ములా ఈ రేసు.. మనీ లాండరింగ్ కేసులాగా అనిపిస్తోంది. ప్రభుత్వంలో ఉంటే ఏ తప్పైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటే.:::వీహెచ్, మాజీ ఎంపీ -
కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు చుక్కెదురైంది. ఏసీబీ కేసును కొట్టేయాలని వేసిన క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ దర్యాప్తులో మేం జోక్యం చేసుకోం అని తీర్పు సందర్భంగా పేర్కొంది. అయితే ఆ సమయంలో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరగా.. ఆ విజ్ఞప్తిని ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ పిటిషన్పై ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం(Bench).. డిసెంబర్ 31న వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దని.. కావాలంటే విచారణ జరుపుకోవచ్చని దర్యాప్తు సంస్థలకు సూచించింది. మరోవైపు.. కోర్టు తీర్పు నేపథ్యంతోనే ఆయన ఇవాళ్టి ఈడీ విచారణ వాయిదా పడింది కూడా.ప్రభుత్వ వాదనలు ఇలా..ఏసీబీ తరఫున ఏజీ సుదర్శన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘ఎఫ్ఐఆర్ నమోదు ప్రాథమిక అంశం మాత్రమే. అందులో పేర్కొన్న అంశాలే అంతిమం కాదు. దర్యాప్తులో తేలే విషయాల ఆధారంగా సెక్షన్లు చేరుస్తారు. రెండు నెలల క్రితమే కేసు నమోదుకు నిర్ణయించారు. కేసు నమోదు కోసం గవర్నర్ నిర్ణయానికి పంపారు. గవర్నర్ ఆమోదించాకే కేసు నమోదు చేశారు. ఫార్ములా సంస్థకు డబ్బు విదేశీ కరెన్సీలో చెల్లించారు. దీంతో హెచ్ఎండీఏపై అధిక భారం పడింది. విదేశీ కరెన్సీలో చెల్లింపు కోసం ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు. ఆర్థికశాఖ అనుమతి కూడా లేదు.(గవర్నర్ అనుమతి కాపీని కోర్టు అడగడంతో ఏజీ అందజేశారు.)చెల్లింపుల్లో కేటీఆర్ పాత్ర ఏంటని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. కేటీఆర్ పాత్ర ఏంటో దర్యాప్తులో తేలుతుందని ఏజీ తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు అనేది దర్యాప్తు కోసమేనని వివరించారు. కేసు పూర్తి వివరాలు అభియోగపత్రంలో ఉంటాయని, రూ.56 కోట్లకు పైగా చెల్లింపుల్లో నిబంధన ఉల్లంఘన జరిగిందని ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు.దానకిశోర్ తరఫున సీనియర్ న్యాయవాది సీపీ మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పురపాలక శాఖ మంత్రి పర్యవేక్షణలోనే ఆ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తారన్నారు. రేసింగ్కు సంబంధించిన చెల్లింపుల దస్త్రాన్ని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదించారని కోర్టుకు తెలిపారు. రేసింగ్ వ్యవహారంలో అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.బీఆర్ఎస్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్లు నమోదు చేసినట్లు చెప్పారు. కేటీఆర్ తరఫు వాదనలు..‘‘అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవు. ముఖ్యంగా 13(1)(a) సెక్షన్ ఈ కేసుకు వర్తించదు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని అనేందుకు ఆధారాలు లేవు. ప్రొసీజర్ పాటించలేదనడం సరైంది కాదు. 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రాథమిక విచారణ కూడా లేకుండా కేసు పెట్టారు. కేవలం రాజకీయ కక్షసాధింపు కోసమే కేటీఆర్పై కేసు పెట్టారు. ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయి. కార్ రేస్ నిర్వహణకు 2022 అక్టోబరు 25న ఒప్పందం జరిగింది. సీజన్ 10 నిర్వహణకు స్పాన్సర్ వెనక్కి తగ్గారు. రేస్ నిర్వహణలో ఇబ్బందుల నివారణకే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇబ్బందులు రాకూడదనే హెచ్ఎండీఏ చెల్లింపులు చేసింది.సీజన్-9 వల్ల దాదాపు రూ.700 కోట్ల లాభం వచ్చింది. ఆర్థికశాఖ అనుమతి లేదని ఏసీబీ అధికారులు అంటున్నారు. కార్ రేసింగ్ ఒప్పందాన్ని కొత్త ప్రభుత్వం ఉల్లంఘించింది. కొత్త ప్రభుత్వం డబ్బు చెల్లించకపోవడంతో ఒప్పందం రద్దయింది. ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యానికి కారణాలు చెప్పలేదు. సుప్రీం తీర్పుల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యం తగదు. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ప్రాథమిక విచారణ అవసరమని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పులను ఏసీబీ అధికారులు పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధిపై కేసుకు ముందు ప్రాథమిక విచారణ చేయాలి. 18న ఫిర్యాదు అందగానే.. 19న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేటీఆర్ స్పెక్యులేషన్ చేసినట్టు ఎక్కడా పేర్కొనలేదు. అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పలేదు. కానీ, అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టారు’’ అని కేటీఆర్ తరఫు న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు.ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. ఏసీబీ వాదనలనే పరిగణనలోకి తీసుకుని కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. -
ఫార్ములా-ఈ రేసు కేసు..హైకోర్టులో కేటీఆర్కు ఊరట దక్కేనా?
సాక్షి,హైదరాబాద్ : ఫార్ములా ఈ-కార్ రేసు (formula e car race case) నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ తనపై ఏసీబీ (acb) నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై నేడు హైకోర్టు తీర్పును వెలువరించనుంది. ఉదయం 10.30 గంటలకు తీర్పు వెల్లడించనుంది. ఈ తరుణంలో ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ (ktr)కు ఊరట లభిస్తుందా అనే అంశంపై బీఆర్ఎస్ (brs) శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కోర్టులో కేసు విచారణ నేపథ్యంలో నల్గొండలో బీఆర్ఎస్ చేపట్టిన రైతు మహాధర్నాను సైతం వాయిదా వేసింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ .. డిసెంబర్ 20న ఫార్ములా–ఈ వ్యవహారంలో కేటీఆర్, ఇద్దరు అధికారులను నిందితులుగా చేరుస్తూ.. ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసు ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు కేటీఆర్కు ఊరట కల్పించింది. డిసెంబర్ 30వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించించింది. అయితే కేసు దర్యాప్తును కొనసాగించవచ్చని పేర్కొంది. అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, వివరాలు అందజేసి దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్ (కేటీఆర్)కు సూచించింది. ఈ పిటిషన్పై పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్కు నోటీసులు జారీ చేసింది. ఇక కేటీఆర్ క్వాష్ పిటిషన్పై ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఫార్ములా ఈ- కార్ రేసులో కేసులు నమోదు‘ఫార్ములా–ఈ’కార్ల రేసు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఏసీబీ పెట్టిన కేసు ఆధారంగా ‘ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)’ను నమోదు చేసింది. హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నుంచి విదేశీ కంపెనీకి నిధుల చెల్లింపు అంశంలో రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) కేసులు నమోదు చేశాయి. ‘ఫార్ములా–ఈ’కారు రేస్ నిర్వహణకు సంబంధించి హెచ్ఎండీఏ నుంచి పలు దఫాల్లో రూ.45,71,60,625 సొమ్మును యూకేకు చెందిన ‘ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ)’కు బదిలీ చేశారని పేర్కొంటూ.. మాజీ మంత్రి కేటీఆర్, మరో ఇద్దరు అధికారులను అందులో నిందితులుగా చేర్చారు.ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా.. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో విచారణ కోసం ఈడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఈడీ హైదరాబాద్ జోనల్ జాయింట్ డైరెక్టర్ ఏసీబీ డీజీ విజయ్కుమార్కు లేఖ రాశారు. విదేశీ కంపెనీతో జరిగిన నగదు లావాదేవీలు, ఇతర వివరాలన్నీ తమకు ఇవ్వాలని కోరారు. ఏసీబీ నుంచి అందిన వివరాల ఆధారంగా.. మాజీ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈసీఐఆర్ నమోదు చేశారు. -
కేటీఆర్ ఆరోపణలపై స్పందించిన ఏసీబీ
హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో తనను తన అడ్వొకేట్ల సమక్షంలోనే విచారించాలని పట్టుబట్టి.. చివరకు విచారణకు హాజరు కాకుండానే కేటీఆర్ వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే.. వెళ్లే క్రమంలో ఆయన తన లిఖితపూర్వక స్టేట్మెంట్ను ఏసీబీ డీఎస్పీకి అందజేసి వెనుదిరిగారు. అందులో ఏముందంటే..ఏసీబీ(ACB) తనపై నమోదు చేసిన కేసులో తాను తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అలాగే.. తనకు పంపిన నోటీసులు కేసుకు సంబంధించిన తన నుంచి సమాచారంతో పాటు సంబంధిత పత్రాలను ఏసీబీ కోరిందని పేర్కొన్నారాయన. అయితే.. అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇవ్వలేదన్నారు... అవి ఎలాంటి పత్రాలో స్పష్టత ఇచ్చి.. తనకు కొంత సమయం ఇవ్వాలని కేటీఆర్(KTR) ఆ స్టేట్మెంట్ ద్వారా కోరారు. రాజ్యాంగం, చట్టం తనకు కల్పించిన హక్కులను వినియోగించుకుంటూనే.. కేసు దర్యాప్తునకు హాజరై సహకరిస్తానని తెలిపారారయన. అయితే హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్లో ఉందని, తీర్పు వచ్చేదాకా తనకు గడువు ఇచ్చే అంశం పరిశీలించాలని ఏసీబీ డీఎస్పీని కేటీఆర్ కోరారు. ఏసీబీ.. నెక్ట్స్ ఏంటి?విచారణకు హాజరు కాకపోవడంతో పాటు తీవ్ర ఆరోపణలు చేసిన కేటీఆర్పై చర్యలకు ఏసీబీ ఉపక్రమించబోతోంది. ఆయనకు మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వనుందని సమాచారం. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని కేటీఆర్ ప్రధానంగా ప్రస్తావిస్తూ.. తనను కుట్రపూరితంగానే విచారణకు పిలిచారంటూ మండిపడ్డారు. అయితే తాము తీర్పు ఇచ్చేంత వరకు విచారణ చేసుకోవచ్చని హైకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఏసీబీ ప్రస్తావించింది. అలాగే.. కేటీఆర్ చేసిన ఆరోపణలపైనా కోర్టులో మెమో వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక అడ్వొకేట్ను ఎందుకు అనుమతించలేదన్న విషయంపై ఏసీబీ అధికారులు స్పందించారు. కోర్టు ఆదేశాలు లేనందునే తాము కేటీఆర్ వెంట వచ్చిన లాయర్ను అనుమతించలేదని స్పష్టత ఇచ్చారు. -
నాపై కేసును కొట్టేయండి..
-
అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసా?
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని అల్లుడిపై ఇక్కడ కేసు ఎలా పెడతారని ఓ అత్తను ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు.. పోలీసులకు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ నివాసి 84 ఏళ్ల పదవీ విరమణ పొందిన ప్రభుత్వోద్యోగి.. న్యూజెర్సీలో ఉంటున్న తన అల్లుడిపై కేసు నమోదుకు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ విజయ్సేన్రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న పిటిషనర్ కుమార్తెను అల్లుడు వేధిస్తున్నాడు. గతంలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె నివాసంలోకి చొరబడి తీవ్ర బెదిరింపులకు గురిచేస్తున్నాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు అతనిపై కేసు నమోదు చేయకపోవడం చట్టవిరుద్ధం. రాజ్యాంగంలోని నిబంధనలకు విరుద్ధం’ అని పేర్కొన్నారు. దీంతో అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, ఇతర అధికారులకు ఫిర్యాదు చేయాలని పిటిషనర్కు న్యాయమూర్తి సూచించారు. ‘ఆమె అమెరికాలో అధికారులతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖనూ సంప్రదించారు. భారత పౌరురాలిగా జాతీయ మహిళా కమిషన్తో పాటు ఇతర మార్గాల్లో రక్షణ పొందే హక్కును ఆమె వినియోగించుకుంటున్నారు’ అని బదులిచ్చారు. ఈ పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదని ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. పిటిషన్ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పోలీసులకు ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పారు.చదవండి: అమెరికాలో భారతీయులకు సరికొత్త ‘అతిథి’ మర్యాదలు -
మార్గదర్శి కేసులో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
-
మార్గదర్శి కేసులో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
-
‘సుప్రీం’ కేసులో ఇంత నిర్లక్ష్యమా..? ‘మార్గదర్శి’పై మరెన్నాళ్లు?
మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక అవకతవకలపై ఇంకా ఎన్నాళ్లకు కౌంటర్ దాఖలు చేస్తారు? స్వయంగా సుప్రీం కోర్టు విచారణకు పంపిన కేసులో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత మాత్రం సహించరానిది. గత జూన్లో విచారణ ప్రారంభించి ఇప్పటి వరకు 13 సార్లు వాయిదాలు వేశాం. కౌంటర్లు దాఖలు చేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారు. అయినా కౌంటర్ దాఖలు చేయపోవడానికి కారణాలేంటో చెప్పండి. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాల్సిందే. ఇదే చివరి అవకాశం. లేకపోతే తదుపరి విచారణకు ఇరు రాష్ట్రాల సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులు కోర్టు ముందు హాజరవ్వాల్సి ఉంటుంది.– ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం⇒ రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ను ఏర్పాటు చేశారు. ⇒ 1997లో కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారం హెచ్యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషేధం. ⇒ అయినా మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు రూ.2,610.38 కోట్లు వసూలు చేసింది. ⇒ ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)ను మార్గదర్శి యథేచ్ఛగా ఉల్లంఘించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటికే కోర్టుకు తెలిపింది. ⇒ మార్గదర్శి డిపాజిట్ల వ్యవహారం నిగ్గు తేలాల్సిందేనని సుప్రీంకోర్టు సైతం తేల్చి చెప్పింది. సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి: మార్గదర్శి ఫైనాన్షియర్స్ భారీ ఆర్ధిక అవకతవకలపై కౌంటర్లు దాఖలు చేయాలన్న తమ ఆదేశాలను పట్టించుకోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇంకా ఎన్నాళ్లకు కౌంటర్ దాఖలు చేస్తారని ఇరు ప్రభుత్వాలను నిలదీసింది. స్వయంగా సుప్రీంకోర్టు విచారణకు పంపిన కేసులో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంత మాత్రం సహించరానిదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత జూన్లో విచారణ ప్రారంభించి ఇప్పటి వరకు 13 సార్లు వాయిదాలు వేశామని గుర్తు చేసింది. కౌంటర్లు దాఖలు చేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారని, అయినప్పటికీ కౌంటర్ దాఖలు చేయపోవడానికి కారణాలేంటో చెప్పాలని నిలదీసింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది. లేని పక్షంలో తదుపరి విచారణకు తమ ముందు హాజరు కావాలని ఇరు రాష్ట్రాల సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. అదనపు కౌంటర్ దాఖలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి మూడు వారాల గడువునిచ్చింది. అంతేకాక రిప్లై కాపీని మాజీ ఎంపీ, కోర్టు సహాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్కి అందచేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త చెరుకూరి కిరణ్లను హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘సుప్రీం’ ఆదేశాలతో హైకోర్టు విచారణ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం సెక్షన్ 45 ఎస్కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హెచ్యూఎఫ్ కర్త రామోజీరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అ«దీకృత అధికారి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును కొట్టేస్తూ 2018 డిసెంబర్ 31న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజనీ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశాయి. అదే విధంగా హైకోర్టు తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామోజీ, మార్గదర్శి వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశాయి. ఈ అప్పీళ్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ దాన్ని రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై తిరిగి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, రిజర్వ్ బ్యాంక్, ఏపీ సర్కార్తో సహా అందరి వాదనలు వినాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. గతేడాది నవంబర్ 7న విచారణ సందర్భంగా మార్గదర్శి ఆర్థిక అవకతవకలపై పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేస్తామని ఇరు రాష్ట్ర ప్రభుత్వాల న్యాయవాదులు హైకోర్టుకు నివేదించిన విషయం తెలిసిందే. అయితే ఇరు ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయలేదు. తాజాగా ఈ వ్యాజ్యాలపై జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్కుమార్, ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ్ రవిచందర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది (ఎస్జీపీ) బి.రాజేశ్వర్రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపించారు. 6వ తేదీ కల్లా ఉండవల్లికి ఆ కాపీలు ఇవ్వండి.. ఆర్బీఐ తరఫున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణన్ రవిచందర్ స్పందిస్తూ 200కిపైగా పేజీలతో మార్గదర్శి ఫైనాన్సియర్స్, చెరుకూరి కిరణ్ గత నెల 19న రిప్లై దాఖలు చేశారని, దీనిపై తాము పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేస్తామని నివేదించారు. ఇందుకు మూడు వారాల గడువునివ్వాలని కోరారు. అయితే కోర్టు ఆదేశాలు జారీ చేసినా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయలేదని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందిస్తూ.. కోర్టు ఆదేశించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన రిప్లై కాపీని తనకు ఇవ్వలేదని ధర్మాసనానికి నివేదించారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ ఈ నెల 6వ తేదీలోపు ఆ రిప్లై కాపీని ఉండవల్లి అరుణ్ కుమార్కి అందజేయాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఇలాగేనా అమలు చేసేది? విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ధర్మాసనం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకెన్నాళ్లకు కౌంటర్లు దాఖలు చేస్తారని నిలదీసింది. సుప్రీంకోర్టు పంపిన వ్యాజ్యాల్లోనూ ఇలా చేస్తే ఎలా? అంటూ మండిపడింది. కోర్టు ఆదేశాలను అమలు చేసేది ఇలాగేనా? అని నిలదీసింది. మూడు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు ప్రభుత్వాలను ఆదేశించింది. అదనపు కౌంటర్ దాఖలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్కి మూడు వారాల గడువునిచ్చేందుకు ఇరుపక్షాలు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో ధర్మాసనం ఉత్తర్వుల జారీకి సిద్ధమైంది. ఈ సమయంలో మార్గదర్శి తరపు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా అడ్డుకుని మాట్లాడటంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. అనంతరం విచారణను ఈ నెల 31కి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ల దాఖలు విషయంలో తమ ఆదేశాల అమలు నిమిత్తం ఉత్తర్వుల కాపీని అడ్వొకేట్ జనరల్ కార్యాలయానికి సోమవారంలోగా పంపాలని హైకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.రూ.వేల కోట్లు కొల్లగొట్టిన మార్గదర్శి ఫైనాన్షియర్స్రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ను ఏర్పాటు చేశారు. 1997లో కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తెచ్చింది. హెచ్యూఎఫ్ లాంటి అన్ ఇన్ కార్పొరేటెడ్ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడాన్ని అది నిషేధించింది. అయినప్పటికీ రామోజీరావు నేతృత్వంలోని మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి దాదాపు 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి 2006 మార్చి నాటికి దాదాపు రూ.2,610.38 కోట్లు వసూలు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా రామోజీరావు ప్రజల నుంచి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. చట్ట విరుద్ధంగా మార్గదర్శి సేకరించిన డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్బీఐ చేతులెత్తేయడంతో డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులపై అప్పటి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.అక్రమాలను నిర్ధారించిన రంగాచారిమార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలు, అవకతవకలను నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్) ఎన్.రంగాచారిని నియమిస్తూ 2006 డిసెంబర్ 19న జీవో 800 జీవో జారీ అయింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్పై చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్ అధికారి టి.కృష్ణరాజును అదీకృత అధికారిగా నియమిస్తూ అదే రోజు జీవో 800 వెలువడింది. దీంతో తమ అక్రమాలు బయటపడటం ఖాయమని పసిగట్టిన మార్గదర్శి, రామోజీరావులు.. రంగాచారి, కృష్ణరాజు నియామకాలను సవాలు చేస్తూ సుదీర్ఘ కాలం న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే రామోజీరావుకు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఈ క్రమంలో తాము కోరిన వివరాలు మార్గదర్శి ఇవ్వకపోవడంతో రంగాచారి ఆదాయ పన్ను శాఖ నుంచి అవసరమైన డాక్యుమెంట్లను సేకరించి పరిశీలించారు. 2007 ఫిబ్రవరి 19న తన నివేదికను ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని తేల్చారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన అందులో స్పష్టంగా పేర్కొన్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీరావు తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణ ద్వారా తేల్చారు.అధీకృత అధికారి ఫిర్యాదు కొట్టేసిన హైకోర్టుచట్ట ఉల్లంఘనలకు పాల్పడిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని హెచ్యూఎఫ్ కర్త రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అధీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్ 540) చేశారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధమని, అయితే మార్గదర్శి ఫైనాన్షియర్స్ అందుకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించి నేరం చేసిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఆర్బీఐ చట్టం సెక్షన్ 58 ప్రకారం శిక్షార్హమని తెలిపారు. దీంతో రామోజీరావు ఈ ఫిర్యాదు విషయంలో మళ్లీ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించారు. చివరకు హైకోర్టు 2018 డిసెంబర్ 31న రామోజీరావుపై అ«దీకృత అధికారి చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టుఈ తీర్పుపై అటు ఉండవల్లి అరుణ్ కుమార్, అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అలాగే హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వీటన్నింటిపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చింది. అటు తరువాత ఈ వ్యాజ్యాల్లో ఆర్బీఐని కూడా ప్రతివాదిగా చేర్చింది. విచారణ సందర్భంగా ఆర్బీఐ తరఫు న్యాయవాది కూడా మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారని మౌఖికంగా కోర్టుకు తెలిపారు. చివరగా గతేడాది ఏప్రిల్ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఇదే సమయంలో డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ చేసిన అభ్యర్థలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని తేల్చి చెప్పింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహిస్తోంది. -
మార్గదర్శి కేసు: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: మార్గదర్శి కేసు(Margadarsi Case) విచారణలో భాగంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకూ ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని నిలదీసింది. ఇంత నిర్లక్ష్యం దేనికంటూ హైకోర్టు ప్రశ్నించింది. అదే సమయంలో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ కూడా మూడు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 31వ తేదీకి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు(Telangana High Court).. మార్గదర్శి అఫిడవిట్ కాపీని సోమవారంలోగా ఉండవల్లికి ఇవ్వాలని ఫైనాన్షియర్ న్యాయవాదిని ఆదేశించింది. ఇక ప్రిన్సిపల్ సెక్రటరీలకు సమాచారం అందించేలా ఈ ఆర్డర్ కాపీని ఏజీలకు పంపాలని రిజస్ట్రీకి స్పష్టం చేసింది.కాగా, చందాదారుల వివరాలను అందించే విషయంలో నిజాయితీగా ఉండాలని మార్గదర్శి ఫైనాన్సియర్స్ను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇలాంటి విషయాల్లో పారదర్శకంగా ఉంటే అందరికీ మంచిదని మార్గదర్శికి స్పష్టం చేసింది.కాలం వెళ్లదీస్తూ.. కాలయాపన చేస్తూ..మార్గదర్శి కేసుకు సంబంధించి పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ, స్టేల మీద స్టేలు పొందుతూ మార్గదర్శి, రామోజీరావు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దాని ఫలితంగానే గత 18 ఏళ్లుగా కేసు కొనసాగుతూ వస్తోంది. ప్రజల నుంచి ఏకంగా రూ.2,610 కోట్ల మేర డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు బండారం 2006 నవంబర్ 6న బట్టబయలైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టం సెక్షన్ 45 ఎస్కు విరుద్ధంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ప్రజల ముందు నిలబెట్టిన రోజు అది. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయిన మార్గదర్శి, రామోజీరావు చట్టం నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు.అయితేసుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో తిరిగి విచారణ చేపట్టింది తెలంగాణ హైకోర్టు. దీనిలో భాగంగా ఈరోజు(శుక్రవారం) మరోసారి మార్గదర్శి కేసు విచారణకు రాగా, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికీ కౌంటర్ దాఖలు చేయకపోడాన్ని ప్రశ్నించింది హైకోర్టు,. -
నేరెళ్ల ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో 2017లో దళితులపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులపై నమోదు చేసిన కేసు పురోగతి వివరాలను నెల రోజుల్లోగా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బాధితులకు పరిహారం ఇచ్చారా? పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? లాంటి వివరాలను అందులో పొందుపరచాలని స్పష్టం చేసింది. తొలుత విచారణకు హాజరైన ప్రభుత్వ న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు వివరాలు తెలియకుండా, గడువు కోరడం కోసం ఎందుకు హాజరయ్యారంటూ మందలించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఇదీ కేసు నేపథ్యం.. చీర్లవంచ, కొదురుపాక ప్రాంతాల నుంచి వందలాది ఇసుక లారీలు, టిప్పర్లు నడిచేవి. ఇసుకను తరలించే క్రమంలో జరిగిన 42 ప్రమాదాల్లో మొత్తం నలుగురు చనిపోయారు. ముఖ్యంగా 2017 జూలై 2న నేరెళ్లకు చెందిన ఎరుకల భూమయ్య అనే వ్యక్తిని ఇసుక లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు ఐదు ఇసుక లారీలను తగలబెట్టారు. దీంతో పోలీసులకు, స్థానికుల మధ్య ఉద్రిక్తత నెలకొనగా 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల తర్వాత రాత్రి 11:30 గంటలకు నేరెళ్లకు చెందిన పెంట బానయ్య, కోలా హరీశ్, చెప్పాల బాలరాజు, పసుల ఈశ్వర్ కుమార్, గంధం గోపాల్, రామచంద్రాపూర్కు చెందిన భక్తుల మహేశ్, జిల్లెళకు చెందిన కోరుకొండ గణేశ్, చీకోటి శ్రీనివాస్లను పోలీసులు అనుమానితులుగా అదుపులోకి తీసుకొని జూలై 7న అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.బాధితులకు పరిహారం ఇచ్చారా? ఈ ఘటనలో దళితులు, బీసీ యువకులను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని.. బాధ్యులైన ఎస్పీ విశ్వనాథ్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రవీందర్పై చర్యలు తీసుకోవడంతోపాటు బాధితులకు రూ. 10 లక్షలు పరిహారం ఇవ్వాలంటూ హైకోర్టులో రెండు పిల్లు దాఖలయ్యాయి. వాటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్రావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అక్రమాలకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకున్నారా? ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? చార్జిషీట్ దాఖలు చేశారా? బాధితులకు పరిహారం ఇచ్చారా? అని అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ను ధర్మాసనం ప్రశ్నించింది. ఏజీపీ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆగ్రహంవ్యక్తం చేసింది. అదనపు అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరడం కోసమే హాజరుకావడాన్ని తప్పుబట్టింది. దీంతో వెంటనే ఏఏజీ ఇమ్రాన్ఖాన్ విచారణకు హాజరయ్యారు. పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని కోర్టుకు తెలిపారు. విచారణ ఏ దశలో ఉందని ధర్మాసనం ప్రశ్నించగా పూర్తి వివరాలతో స్థాయీ నివేదిక దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ధర్మాసనం జనవరి 20కి వాయిదా వేసింది. -
‘గేటెడ్’ నేరాల నిరోధానికి యాప్
సాక్షి, హైదరాబాద్: గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో నేరాల నిరోధానికి ఒక యాప్ను రూపొందించాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను హైకోర్టు ఆదేశించింది. ఇతర నివాసితులకు ఇబ్బందులు కలిగించేలా చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. హద్దు మీరితే హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి ఫేజ్–13లోని ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ విల్లాస్ క్లబ్ హౌస్ అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారిందని.. దీనిపై ఫిర్యాదు చేసినా యాజమాన్య సంఘం చర్యలు తీసుకోవడంలేదంటూ హరిగోవింద్ ఖురానారెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి విచారణ చేపట్టి.. తీర్పు వెలువరించారు. కమిషనర్లకు అధికారం.. హైదరాబాద్ పోలీస్ చట్టంలోని సెక్షన్ 22 కింద ఊరేగింపుల నియంత్రణ, వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో క్రమశిక్షణ పాటించటం, ఏదైనా వీధి లేదా బహిరంగ ప్రదేశాల్లో సంగీతం, పాటల నియంత్రణ, హైదరాబాద్ సిటీ లౌడ్ స్పీకర్ నియమాలు–1963, హైదరాబాద్, సికింద్రాబాద్ (పబ్లిక్ ప్లేస్ ఆఫ్ హాల్ట్/పీస్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్/ అమ్యూజ్మెంట్) నియమాలు–2005, శబ్ద కాలుష్య (నియంత్రణ) నియమాలు–2000, జీవో 172లోని పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ (ఈఎన్వీ) నిబంధనల ప్రకారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసే అధికారం కమిషనర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులకు ఉంది అని హైకోర్టు స్పష్టంచేసింది.తీర్పులో పేర్కొన్నసూచనలు, ఆదేశాలు..1) ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ విల్లా ఓనర్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ సభ్యుల నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన ఉప కమిటీని ఏర్పాటు చేయాలి. వీరు ప్రధానంగా సీనియర్ సిటిజన్లు/మహిళలు/రిటైర్డ్ ఉద్యోగులై ఉండాలి. వీరు క్లబ్హౌస్ వంటి ప్రదేశాల్లో నిఘా ఉంచవచ్చు. 2) అసోసియేషన్ ఓ యాప్ లాంటి ప్లాట్ఫామ్/అప్లికేషన్ను రూపొందించాలి. దీని ద్వారా సభ్యులు ఫిర్యాదులు/సందేశాలను పంపవచ్చు. దీని నిర్వహణకు ప్రత్యేక టీమ్ ఉండాలి. సబ్–కమిటీ సభ్యులు మాత్రమే యాక్సె స్ కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలి. ఫిర్యాదులు/సందేశాలను ఆ సభ్యులకు పంపాలి. సబ్–కమిటీ సభ్యులు ఫిర్యాదుదారుడి గుర్తింపును గోప్యంగా ఉంచాలి. 3) వచి్చన ఫిర్యాదులపై వెంటనే చర్య తీసుకొని కార్యనిర్వాహక కమిటీకి నివేదించాలి. ఏదైనా చట్టవిరుద్ధమైన చర్యలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. 4) గేటెడ్ కమ్యూనిటీ క్లబ్హౌస్ వినియోగానికి అసోసియేషన్ నిర్దిష్టంగా చేయవలసినవి, చేయకూడని పనుల జా బితాను రూపొందించాలి. క్లబ్హౌస్ను దుర్వినియోగం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించాలి. 5) నగర పోలీసు చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధానికి, నేరాల నియంత్రణకు, ఇతర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గేటెడ్ కమ్యూనిటీలు/అసోసియేషన్లు/ఫ్లాట్ అసోసియేషన్లకు అవసరమైన సలహాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ జారీ చేయాలి. 6) వేధింపులు, నేరాలు జరిగినప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు/అసోసియేషన్లు/ఫ్లాట్ అసోసియేషన్లలో తగిన చర్యలు తీసుకోవడానికి సంబంధిత పోలీస్ స్టేషన్/టాస్క్ఫోర్స్కు అవసరమైన సూచనలను కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ జారీ చేయాలి. 7) వీలైతే గేటెడ్ కమ్యూనిటీలు/అసోసియేషన్లు/ఫ్లాట్ అసోసియేషన్లలోని నేరాలపై ఫిర్యాదు చేయడానికి, సమాచారం ఇచ్చే వ్యక్తి/ఫిర్యాదుదారుడి గుర్తింపును గోప్యంగా ఉంచేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్లకు ప్రత్యేక సాఫ్ట్వేర్ అప్లికేషన్ (యాప్)ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అందించాలి. -
‘ఫార్ములా-ఈ కార్ కేసు లొట్టపీసు కేసు’
సాక్షి,తెలంగాణ భవన్ : ఫార్ములా ఈ-కారు రేసు (Formula E race case)కేసులో విచారణకు రావాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ తరుణంలో ఫార్ములా ఈ-కారు కేసు లొట్టపీసు కేసంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా కారు కేసుపై బుధవారం కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుడూ.. ఫార్ములా ఈకేసులో హైకోర్టు (high court) లో ఏం తీర్పు వస్తుందో చూద్దాం. అవినీతే లేనప్పుడు.. కేసు ఎక్కడది. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు. జనవరి 7న ఈడీ విచారణకు హాజరుపై మా లాయర్లు నిర్ణయిస్తారు. ఏసీబీ కేసులో అస్సలు పస లేదు. నాకు న్యాయస్థానాల మీద నమ్మకం. ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు.పాపం.. నన్ను ఏదో రకంగా జైలుకు పంపాలని ప్రభుత్వం చూస్తోంది. నాపై ఇది ఆరో ప్రయత్నం.. రేవంత్కు ఏమి దొరకడం లేదు. 600కోట్లు సంగతి అటుంచితే.. ఒక్క పైసా కూడా అవినీతి లేదు. హైకోర్టు న్యాయమూర్తి అడిగే ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానం లేదు.రేసు కావాలనేది నా నిర్ణయం.. వద్దనేది రేవంత్ నిర్ణయం. ఇద్దరి నిర్ణయాలపై క్యాబినెట్లో చర్చ జరగలేదు. నాపై కేసు పెడితే.. రేవంత్పై కూడా కేసు పెట్టాలి. రేవంత్ రెడ్డి.. ఒక ముఖ్యమంత్రినా? అని ప్రశ్నించారు.భవిష్యత్ కార్యచరణ ఇదేబీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. ఏడాది మెదటి ఆరునెలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం. తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కమిటీలు పూర్తి చేస్తాం. పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు వచ్చే అక్టోబర్ వరకు సమయముంది. పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిస్తాం.బ్యాంకులను ముంచేటోళ్ళకే సెల్ఫ్ డిక్లరేషన్ లేదు..రైతుబ రోసాతో రేవంత్ సర్కార్పై ప్రజల్లో తిరుగుబాటు రాబోతుంది. రైతుబరోసా కొందరకికే ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకు?. బ్యాంకులను ముంచేటోళ్ళకే సెల్ఫ్ డిక్లరేషన్ లేదు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజిస్ట్రేషన్లు ఇవ్వాలని రేవంత్కు లేదు. 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వమే కోర్టులో కేసులు వేయిస్తోంది.ఆర్ఆర్ఆర్లో రూ.12 వేల కోట్ల కుంభకోణంఉద్యోగస్తులు, పాన్ కార్డ్ ఉన్నవాళ్ళకు రైతుబరోసా ఎగ్గొట్టే ప్రయత్నం. ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై సుప్రీకోర్టు కు వెళ్తున్నాం .. ఈ సంవత్సరం ఉప ఎన్నికల రావొచ్చు. ఆర్ఆర్ఆర్లో రూ.12 వేల కోట్ల కుంభకోణం జరుగబోతుంది. ఖాజా గూడలో ఉన్న పేదోళ్లను రోడ్డుపైకి నెట్టారు. రూ. లక్ష 38 వేల కోట్ల అప్పులో వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి పోతున్నవి. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారు. -
తుది తీర్పు వరకు కేటీఆర్ అరెస్టు వద్దు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంపై నమోదైన కేసులో ఎఫ్ఐఆర్ను రద్దుచేయాలని కోరుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తుది తీర్పు ప్రకటించేవరకు ఆయనను అరెస్టు చేయవద్దని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 31 వరకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఫార్ములా–ఈ కార్ రేసింగ్ కోసం విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేటీఆర్పై ఏసీబీ డిసెంబర్ 19న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ–1గా కేటీఆర్, ఏ–2గా నాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్కుమార్, ఏ–3గా హెచ్ఎండీఏ నాటి చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి పేరును చేర్చారు. ఈ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె.లక్ష్మణ్ మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్రెడ్డి, దానకిశోర్ తరఫున సీవీ మోహన్రెడ్డి, కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ దవే వాదనలు వినిపించారు. వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. తుది తీర్పు వెల్లడించేవరకు కేటీఆర్ను అరెస్టు చేయరాదని ఆదేశించారు. అవినీతి లేనప్పుడు సెక్షన్లు ఎలా పెడతారు? అవినీతే లేనప్పుడు కేసు ఎలా నమోదుచేస్తారని కేటీఆర్ తరఫు న్యాయవాది సిద్దార్థ దవే వాదించారు. ‘ఫార్ములా –ఈ రేసు నిర్వహణ ఒప్పందంలో ముందుగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేశారు. అనంతరం కేటీఆర్ నోట్ ఫైల్పై సంతకం చేశారు. ఆ శాఖ మంత్రిగా ఉన్నంత మాత్రాన కేటీఆర్ను నిందితుడిగా చేర్చడం సరికాదు. ఈ చెల్లింపుల్లో అవినీతి జరిగినట్లు గానీ, వ్యక్తిగతంగా కేటీఆర్ లబ్ధి పొందినట్లుగానీ ఏసీబీ పేర్కొనలేదు. అందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అలాంటప్పుడు అవినీతి నిరోధక (పీసీ) చట్టంలోని సెక్షన్ 13(1)(్చ), 13(2) కింద కేసు పెట్టడం చెల్లదు. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. లబ్ధి చేకూర్చినట్లు చెబుతున్న సంస్థపై కేసు పెట్టలేదు. నగదు చెల్లింపు బ్యాంక్ ద్వారానే జరిగింది. బిజినెస్ రూల్స్ ఉల్లంఘించారని చెబుతున్నా.. చట్టప్రకారం ప్రతి ఉల్లంఘన క్రిమినల్ నేరం కిందకు రాదు. ఎన్నికల కోడ్ సమయంలో పాలసీ నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ, ముందే ఉన్న ఒప్పందాన్ని అమలు చేయవచ్చు. డిసెంబర్ 18 ఫిర్యాదు చేస్తే 19న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలి’అని విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రతినిధులకూ సెక్షన్ 405 వర్తిస్తుంది.. సిద్దార్థ దవే వాదనను ఏజీ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘2023, అక్టోబర్ 30న సీజన్ 10కు సంబంధించి రెండో ఒప్పందం జరిగింది. కానీ, అక్టోబర్ 3న రూ.22,69,63,125 (పన్నులు అదనం), 11న రూ.23,01,97,500 (పన్నులు అదనం) చెల్లించారు. అంటే ఒప్పందానికి ముందే మొత్తం రూ.54,88,87,043 చెల్లింపులు చేశారు. ఫార్ములా ఈ రేసు ఆపరేషన్స్ (ఎఫ్ఈవో), మున్సిపల్ శాఖ మధ్య 2023, అక్టోబర్లో ఒప్పందం కుదిరింది. విదేశీ మారక ద్రవ్యం (పౌండ్) రూపంలో చెల్లింపులకు ఆర్బీఐ నిబంధనలు, బిజినెస్ రూల్స్ను తప్పకుండా పాటించాలి. కానీ పాటించలేదు. హెచ్ఎండీఏ నుంచి రూ.10 కోట్లకు మించి ఎలాంటి చెల్లింపులు జరిపినా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ నోట్ ఫైల్కు ఆమోదం తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఫార్ములా –ఈ రేసు ఒప్పందం చేసుకున్నారు. ఎఫ్ఈవోకు డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత రేసు ప్రమోటర్ ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ది. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కోర్టులను ఆశ్రయించవచ్చు. కానీ, ప్రమోటర్ను రక్షించడం కోసమే చెల్లింపులు జరిపినట్లుగా ఉంది. నిబంధనలు విరుద్ధంగా చెల్లింపులు జరిగినందునే ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లు 405, 409 ప్రజా ప్రతినిధులకు కూడా వర్తిస్తాయి. చంద్రబాబునాయుడు వర్సెస్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని చెప్పింది. అందువల్ల ఈ పిటిషన్ను కొట్టివేయండి’ అని ధర్మాసనాన్ని కోరారు. సీవీ మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘ఈ లావాదేవీల్లో అవినీతి జరిగిందా? డబ్బులు ఎలా వెళ్లాయి? మళ్లీ వచ్చాయా.. లేదా? అనేది విచారణలో తేలుతుంది. నిబంధనలు ఉల్లంఘన జరిగినప్పుడు దర్యాప్తు చేపట్టే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వ నగదు చెల్లింపులో ఉల్లంఘన జరిగితే సెక్షన్ 405 వర్తిస్తుంది. మంత్రి ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయి’ అని వాదించారు. ఏజీకి న్యాయమూర్తి సూటి ప్రశ్నలు.. నిందితుడిపై ఉన్న ఆరోపణలు ఏంటి? గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా నగదు చెల్లింపులకు పాల్పడ్డారు. అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ‘ఫార్ములా– ఈ’ ప్రమోటర్ సంస్థను నిందితుల జాబితాలో చేర్చారా? లేదు. దర్యాప్తులో భాగంగా నిందితులను చేర్చడం, తొలగించడం జరుగుతుంది. దర్యాప్తు ఏ దశలో ఉంది? ఎంత మంది స్టేట్మెంట్ రికార్డు చేశారు? దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. వీలైనంత త్వరగా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఫిర్యాదుదారు దానకిశోర్ స్టేట్మెంట్ రికార్డు చేశాం. నిందితుల స్టేట్మెంట్ రికార్టు చేయాల్సి ఉంది. ఇతర నిందితులు ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా? ఇప్పటివరకు ఎలాంటి పిటిషన్లు వేయలేదు. ఎవరినీ అరెస్టు చేయలేదు. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ప్రమోటర్ గ్యారంటీ సమర్పించారా? దాన్ని క్యాష్ చేసుకున్నారా? దర్యాప్తులో ఆ వివరాలు సేకరించాల్సి ఉంది. -
'అలా ఎలా కూల్చేస్తారు?'.. హైడ్రాపై హైకోర్టు సీరియస్
సాక్షి,హైదరాబాద్ : హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు జారీ చేసి 24 గంటల సమయమే ఎలా ఇస్తారని ప్రశ్నించింది.హైదరాబాద్ ఖాజాగూడలో నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది. ఈ కూల్చి వేతల్ని వ్యతిరేకిస్తూ బాధితులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై హైకోర్టు జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.విచారణ సందర్భంగా నోటీసులు జారీ చేసి బాధితుల వివరణ తీసుకోకుండా ఎలా కూల్చివేస్తారు. మీరు కూల్చేసిన నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు ఎలా చెబుతున్నారు? సంబంధిత ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. ఆధారాలన్నీ పిటిషనర్ వద్ద ఉన్నాయంటూ హైడ్రా తరుఫు న్యాయవాది బదులు ఇచ్చారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధి తేల్చకుండా అలా ఎలా కూల్చివేస్తారు. ఇలాంటివి పునరావృతమైతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మరోసారి హైడ్రా కమిషనర్ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను కోర్టుకు పిలిపించాల్సి వస్తుందని తెలంగాణ హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. -
ఫార్ములా-ఈ కేసు ఉత్కంఠ.. సిద్ధార్థ దవే వాదనలు ఇవే
-
అప్పటి వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు : హైకోర్టు
సాక్షి,హైదరాబాద్ : ఫార్ములా-ఈ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ఉదయం కేటీఆర్ తరుఫు న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు విన్న కోర్టు మధ్యాహ్నం నుంచి ఏసీబీ తరుఫు వాదనల్ని వింటోంది.ఏసీబీ తరుఫున ఏజీ సుదర్శన్రెడ్డి వాదనలు ప్రారంభించారుఈ కార్ రేసు కేసు విచారణ పురోగతి ఏంటని.. ఏజీ సుదర్శన్రెడ్డిని ప్రశ్నించిన జస్టిస్ లక్ష్మణ్ఫిర్యాదుదారు స్టేట్మెంట్ రికార్డ్ పూర్తైందన్న ఏజీఏసీబీ విచారణ కొనసాగుతోందని తెలిపిన ఏజీనగదు బదిలీ పై ప్రోజీర్ ఫాల్ కాలేదన్న ఏసీబీ తరుపు వాదనలుబిజినెస్ రూల్స్ కాపీ అడిగిన న్యాయమూర్తిరూల్స్ కాపీని అందించిన ఏసీబీ న్యాయవాదిఈడీ సైతం నోటీసులు జారీ చేసిందని తెలిపిన ఏసీబీ న్యాయవాది FEO తో అగ్రిమెంట్ చేసుకున్నారు .. కానీ దాని ద్వారా ఎలా లాభాలు వస్తాయో చెప్పలేదు .. AG సుదర్శన్ రెడ్డిమూడు దఫాలుగా నగదు బదిలీ చేశారు55 కోట్లు ఎలాంటి అనుమతులు లేకుండా FEO కి బదిలీ చేశారుఏసీబీ దర్యాప్తు ఎక్కడ వరకు వచ్చింది - హైకోర్టుఈ కేసులో ఎంత మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారు - హైకోర్టుఇప్పటి వరకు ఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామన్న ప్రభుత్వ తరుఫు న్యాయ వాదిఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఎలాంటి ఆధారాలు సేకరించారని ప్రశ్నించిన న్యాయస్థానంకేసు విచారణ కొనసాగుతుంది .. విచారణ దశలో అన్ని ఆధారాలు బయట పడుతాయన్న ప్రభుత్వ తరుఫు న్యాయ వాదికేటీఆర్ తరుపున న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు ప్రారంభంఅవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు సెక్షన్లు పెట్టారు ఎక్కడ, ఎలా జరిగిందో మాత్రం పేర్కొనలేదులబ్ధి చేకూర్చినట్లు చెబుతున్న సంస్థపై కేసు పెట్టలేదుబిజినెస్ రూల్స్ ఉల్లంఘన అని చెబుతున్నారు..ప్రతి ఉల్లంఘన క్రిమినల్ నేరం కిందకు రాదన్న దవేదర్యాప్తు ప్రారంభ దశలోనే ఉందన్న ఏజీఫిర్యాదుదారు స్టేట్మెంట్ రికార్డు చేశాంవిచారణలో నిందితులను చేరవచ్చు.. తొలగించవచ్చుఆ అధికారం దర్యాప్తు సంస్థలకు ఉంటుందిబిజినెస్ రూల్స్ను ఉల్లంఘించి నగదు బదిలీ చేశారుపారెన్ కరెన్సీలో చెల్లింపులు నిబంధనలకు విరుద్ధమన్న ఏజీ3 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిన వాదనలుకేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు పూర్తి..తీర్పు రీజర్వ్ చేసిన హైకోర్టు.తీర్పు ప్రకటించే వరకు కేటీఆర్ అరెస్ట్ చెయ్యొద్దన్న హైకోర్టుఏసీబీ దర్యాప్తు చేయోచ్చు తీర్పు వెలువరించే వరకు... కేటీఆర్ అరెస్టు వద్దుమధ్యంతర ఉత్తర్వులను పొడిగించిన హైకోర్టుఫార్పులా ఈ కార్ రేసింగ్ కేసుపై ముగిసిన వాదనలుతీర్పు రిజర్వు చేసిన జస్టిస్ కె.లక్ష్మణ్క్వాష్ పిటిషన్పై ముగిసిన కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు..మధ్యాహ్నం లంచ్ బబ్రేక్ తర్వాత ఏసీబీ న్యాయవాది వాదనలు కేటీఆర్ న్యాయవాది దవే వాదనలుకేటీఆర్ ఈ కేసులో లబ్ధి పొందినట్లు ఎఫ్ఐఆర్లో ఎక్కడా లేదుఈ కేసులో అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు వర్తించవుఫార్ములా- ఈ రేసుల సీజన్ 10 నిర్వహణ కోసం మంత్రిగా కేటీఆర్ అనుమతులిచ్చారుకొత్తగా వచ్చిన బీఎన్ఎస్ చట్టం కాకుండా ఐపీసీ సెక్షన్లు ఎందుకున్నాయని ప్రశ్నించిన హైకోర్టు14 నెలల క్రితం నేరం జరిగింది కాబట్టి పాత చట్టం ప్రకారం కేసు నమోదు చేశారని తెలిపిన కేటీఆర్ తరఫున న్యాయవాది దవేఐపీసీ 409పై కొనసాగుతున్న వాదనలుకేటీఆర్ ఎఫ్ఈవోతో జరిగిన ఒప్పందం ఎలాంటి లాభం పొందలేదుఅసలు ఈ కేసులో ఐపీసీ 409 సెక్షన్ వర్తించదు.. ఆధారాలు కూడా లేవుఫార్ములా ఈ రేసుల ఆపరేషన్స్ ఎఫ్ఈఓ చేసినందున వాళ్లను ఎందుకు ఎఫ్ఐఆర్లో చేర్చలేదుఈ కేసులో నిందితుడు కేటీఆర్ చేర్చినప్పుడు ఎఫ్ఈఓను కూడా చేర్చాలి కదాఎఫ్ఈఓతో అగ్రీమెంట్ పై సంతకం చేసింది అరవింద్ కుమార్ కేటీఆర్ కాదుఫార్ములా-ఈ కేసు: కేటీఆర్ క్వాష్ పిటిషన్పై విచారణ ప్రారంభంహైకోర్టులో ప్రారంభమైన కేటీఆర్ పిటిషన్పై విచారణ కేటీఆర్ తరపున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ దవేనేటితో ముగియనున్న కేటీఆర్ నాట్ టు అరెస్టు గడువు ఫార్ములా-ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు హైకోర్టు ఇచ్చిన ఊరట ‘నాట్ టు అరెస్ట్’ గడువు మంగళవారం(డిసెంబర్31)తో ముగియనుంది. కేసును హైకోర్టు నేడు తిరిగి విచారించనుంది. ఎఫ్ఐఆర్ కొట్టేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై ఏసీబీ ఇప్పటికే కౌంటర్ దాఖలుచేసింది. కేటీఆర్ పిటిషన్కు విచారణార్హత లేదని ఏసీబీ కౌంటర్లో పేర్కొంది.కేటీఆర్ ఆదేశాలతోనే ఎఫ్ఈఓ కంపెనీకి నిధుల బదిలీ జరిగిందని తెలిపింది. అన్ని అనుమతులు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదుచేశామని పేర్కొంది. విచారణ ప్రాధమిక దశలో ఉన్నందున బెయిల్, క్వాష్ ఊరట ఇవ్వొద్దని ఏసీబీ కోర్టును కోరింది. ఏసీబీ కౌంటర్పై హైకోర్టులో కేటీఆర్ కౌంటర్ అఫిడవిట్ దాఖలుచేశారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని తెలిపారు.మంత్రిగా నిధుల బదిలీ మంత్రిగా తనకు సంబంధం లేని వ్యవహారమని పేర్కొన్నారు. విదేశీ సంస్థలకు నిధుల బదిలీ అనుమతి బ్యాంక్కు చెందిన అంశమని తెలిపారు. రాజకీయ కక్ష సాదింపుతో తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. కాగా, ఈడీ సైతం ఈ కేసులో కేటీఆర్కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. జనవరి 7న కేటీఆర్ విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో కోరింది. -
రూ.24 కోట్ల ఆస్తిపై రూ.91 కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: ‘‘సుజనా ఇండస్ట్రీస్, వోల్టాస్, వర్మ రియల్టర్స్ కంపెనీలు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా లీజు ఆస్తిని తాకట్టుపెట్టారు. అదికూడా రూ.24 కోట్ల విలువైన ఆస్తిని తనఖా చూపి బ్యాంకు నుంచి రూ.91 కోట్లు రుణాన్ని పొందారు. ప్రజా ఆస్తులను దురి్వనియోగం చేశారు. చట్టవిరుద్ధంగా జరిగిన ఈ లావాదేవీపై విచారణ జరిపించాలి..’’ అని కోరుతూ హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త హబీబ్ అల్లాద్దీన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఫిబ్రవరి 1న పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు విచారణ ప్రారంభించలేదని కోర్టుకు వివరించారు.బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 193 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 90 రోజుల్లో చార్జిషిట్ దాఖలు చేయాలని.. కానీ 11 నెలలు అవుతున్నా దర్యాప్తు ప్రారంభించలేదని, దీని వెనుక సుజానా చౌదరి ఒత్తిడి ఉందని ఆరోపించారు. ప్రతివాదుల బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయాల్సిందిగా, సమన్లు జారీ చేసిన విచారణ జరపాల్సిందిగా సీసీఎస్ పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్పై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున ఎస్.ప్రభాకర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పోలీస్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని చెప్పాలని హోంశాఖ జీపీ (ప్రభుత్వ న్యాయవాది)ని ఆదేశిస్తూ, విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేశారు.చట్టవిరుద్ధంగా తనఖా పెట్టారు.. ‘‘హైదరాబాద్ అమీర్పేట్ మండలం బహ్లూఖాన్గూడ సర్వే నంబర్ 129/3లోని 26,436.36 చదరపు గజాలు మాకు (హబీబ్ అల్లాద్దీన్కు) చెందిన భూమిని వర్మ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన పీవీ రమణారెడ్డి 2013లో ఎక్స్పోర్టు–ఇంపోర్టు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చట్టవిరుద్ధంగా తాకట్టు పెట్టారు. నిజానికి ఆ భూమిని మేం 1963లో వోల్టాస్ లిమిటెడ్కు లీజుకు ఇచ్చాం. లీజుకు ఇచి్చన వారిలో నేను భాగస్వామిని. ఈ భూమిని పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వినియోగించాలనేది ఒప్పందం. లీజు ఒప్పందాన్ని ఉల్లంఘించిన వోల్టాస్ 26,436 చదరపు గజాల భూమిని వర్మ రియల్టర్స్కు కేటాయించింది.సుజనాచౌదరి చైర్మన్గా ఉన్న సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తీసుకున్న రుణానికి వర్మ రియల్టర్స్ ఈ భూమిని తనఖాగా చూపి గ్యారంటీర్గా వ్యవహరించింది. లీజు భూమిని తనఖా పెట్టకూడదని తెలిసినా బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందారు. సుజనా చౌదరి గతంలో టీడీపీ ఎంపీగా, ప్రస్తుతం బీజేపీ తరఫున విజయవాడ పశి్చమ ఎమ్మెల్యేగా ఉన్నారు. సుజనా ఇండస్ట్రీస్ రుణాల చెల్లింపులో విఫలం కావడంతో.. బకాయిలు రాబట్టడం కోసం రూ.400 కోట్ల విలువైన నా ఆస్తి మొత్తాన్ని అటాచ్ చేసి.. వేలానికి పెట్టేలా ఉన్నారు’’ అని కోర్టుకు పిటిషనర్ వివరించారు. కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా.. ‘‘ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరించడంతో.. లీజ్ డీడ్ రద్దు కోరుతూ 2013లో మేం రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాం. మా భూమిని ఇతరుల పేరుపైకి మార్చకుండా, తనఖా పెట్టకుండా ఆదేశాలివ్వాలని కోరగా.. మాకు అనుకూలంగా తీర్పు వచి్చంది. జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ వర్మ రియల్టర్ సంస్థ హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఆ పిటిషన్లను కొట్టివేశాయి. నిజానికి ఆ రుణం మంజూరు చేసే నాటికే సుజనా చౌదరి రుణ ఎగవేతదారుగా ఉన్నారు. అయినా బ్యాంకు నుంచి సుజనా ఇండస్ట్రీస్కు రుణం మంజూరైంది. వర్మ రియల్టర్స్కు చెందిన 96.64 శాతం షేర్లను సుజనా హోల్డింగ్స్ నిర్వహించడం ఆశ్చర్యకరం. ఈ రెండు సంస్థల్లోనూ గొట్టుముక్కల శ్రీనివాసరాజు డైరెక్టర్గా ఉన్నారు. ఇది గమనిస్తే సుజనా హోల్డింగ్స్కు వర్మ రియల్టర్స్ బినామీ లాంటి (ప్రాక్సీ) కంపెనీ అని తెలుస్తోంది’’ అని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.సుజనా ఒత్తిడితోనే ప్రారంభంకాని విచారణ..‘‘మా ఆస్తిని తనఖా పెట్టి సుజనా ఇండస్ట్రీస్ రుణం పొందేలా చేయడంలో వర్మ రియల్టర్స్కు అనుకూలంగా వోల్టాస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ ఎల్. కర్కరే వ్యవహరించారు. వర్మ రియల్టర్స్కు గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఈ మొత్తం లావాదేవీ మోసపూరితంగా, నేరపూరితంగా జరిగింది. అసలు వర్మ రియల్టర్స్ ఆస్తిని లీజుకు మాత్రమే తీసుకుంది. దాని విలువ రూ.24 కోట్లే అయినా.. రూ.91 కోట్లను ఎక్స్పోర్ట్–ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఇచ్చిందో అర్థంకావడం లేదు. ఆ సమయంలో రాజ్యసభ సభ్యుడైన సుజనా చౌదరి బ్యాంకు అధికారులను ఏమార్చి ఉండవచ్చు. రుణ లావాదేవీ అనుమానాస్పదంగా, అస్పష్టంగా, అపారదర్శకంగా ఉంది. దీనిపై ఫిర్యాదు చేసినా సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఏదో లెక్కకోసం మాత్రమే ఎఫ్ఐఆర్ చేసినట్లున్నారు. ఇప్పటివరకు ఎలాంటి విచారణ చేపట్టలేదు. సుజనా చౌదరి ఒత్తిడి కారణంగానే దర్యాప్తు ముందుకు సాగడం లేదు.సుజనా ఆస్తులను, వర్మ రియల్టర్స్ ఆస్తులను అటాచ్ చేయకుండా బ్యాంకు నా ఆస్తిని అటాచ్ చేయడం చట్టప్రకారం చెల్లదు. సుజనా చౌదరిపై, సుజనా ఇండస్ట్రీస్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదు చేసినా.. ఇప్పటివరకు వారిని టచ్ కూడా చేయలేదు. అక్రమార్కులతో కుమ్మక్కైన రిజిస్ట్రేషన్ అధికారులు కూడా.. నేను ఆ భూమి ఈసీ సరి్టఫికెట్కోసం దరఖాస్తు చేస్తే మార్టిగేజ్ వివరాలు లేకుండా ఇచ్చారు. ప్రతివాదుల బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయాల్సిందిగా సీసీఎస్ ఇన్స్పెక్టర్ను ఆదేశించండి. ప్రతివాదులకు సమన్లు జారీ చేసి, విచారణ జరపాలి. చట్టవిరుద్ధంగా ప్రజా నిధుల నుంచి రూ.91 కోట్లు పొంది దురి్వనియోగం చేశారు. మా పిటిషన్ను అనుమతించండి’’ అని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పోలీసుల నుంచి వివరాలు తెలుసుకుని చెప్పాలని హోంశాఖ న్యాయవాదిని ఆదేశించారు.పిటిషన్లో పేర్కొన్న ప్రతివాదులు వీరే.. పిటిషన్లో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్ సీపీ, బషీర్బాగ్ సీసీఎస్ ఇన్స్పెక్టర్తోపాటు ప్రతివాదులుగా సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సుజనాచౌదరి, ‘సుజన’ డైరెక్టర్లు గొట్టుముక్కల శ్రీనివాస్రాజు, నటరాజన్ సుబ్బరత్నం, కిరణ్ కుమార్ వీరమాచినేని, ఓల్టాస్ లిమిటెడ్ ఎండీ, డైరెక్టర్లు బహ్రం నవ్రోజ్ వాకిల్, జుబిన్ సోలి దుబాష్, వినాయక్ కాశీనాథ్ దేశ్పాండే, ప్రదీప్కుమార్, దేబేంద్రనాథ్ సారంగి, వర్మ రియల్టర్స్ అండ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ‘వర్మ’ డైరెక్టర్లు రమణారెడ్డి, నాగేశ్వర్రెడ్డి దేవిరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి కంచర్ల, శ్రీరామ్ కంబంపాటి, ఎక్స్పోర్టు–ఇంపోర్టు బ్యాంక్ ఆఫ్ ఇండియాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. -
ఇందిరమ్మ కమిటీలను నిలిపివేయలేం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం నియమించిన ఇందిరమ్మ కమిటీలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపైనా స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 24కు వాయిదా వేసింది. జీవో 33ని సవాల్ చేస్తూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందజేయాలని, తొలిదశలో 4.5 లక్షల ఇళ్లను నిర్మించాలని సంకలి్పంచిన ప్రభుత్వం.. ఇందుకోసం గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తూ అక్టోబర్ 11న జీవో 33 జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎ. నితీశ్కుమార్తోపాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ వేయగా విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి పిటిషన్ను నవంబర్ 14న కొట్టేశారు. పథకాల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ, విచక్షణ ఉంటుందని.. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే తప్ప ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేశారు. సభ్యుల ఎంపిక చట్టవిరుద్ధమంటూ అప్పీల్.. ఈ తీర్పును సవాల్ చేస్తూ నితీశ్కుమార్ దాఖలు చేసిన అప్పీల్పై జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ కె.శరత్ శుక్రవారం విచారణ చేపట్టారు. అర్హతలను ప్రకటించకుండానే ఇందిరమ్మ కమిటీల్లోని సభ్యుల ఎంపిక చట్టవిరుద్ధమని.. ఇష్టం వచ్చిన వారిని, రాజకీయ పార్టీల కార్యకర్తలను ప్రభుత్వం సభ్యులుగా నియమించే ప్రమాదం ఉందని పిటిషనర్ వాదించారు. అందువల్ల కేసు విచారణ ముగిసే వరకు ఇందిరమ్మ కమిటీలను నిలుపుదల చేయాలని కోరారు. ఈ వాదనను ఏఏజీ తేరా రజనీకాంత్రెడ్డి తోసిపుచ్చారు. పారదర్శకంగా పథకం అమలు ప్రక్రియ కొనసాగుతోందని.. పథకాలను ఎలా అమలు చేయాలనే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ దశలో కమిటీలను నిలుపుదల చేయొద్దని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. కమిటీల ఏర్పాటుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. -
31 వరకు కేటీఆర్ అరెస్టు వద్దు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను ఈ నెల 31 వరకు అరెస్టు చేయవద్దని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. కేటీఆర్ను అరెస్టు చేయవద్దంటూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఎత్తివేయాలన్న ఏసీబీ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. వాదనలు వినకుండా ఉత్తర్వులను మార్చలేమని స్పష్టం చేసింది. గత విచారణ సందర్భంగా 30వ తేదీ వరకు అరెస్టు వద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చిన కోర్టు.. శుక్రవారం దానిని 31వ తేదీ వరకు పొడిగించింది. ఆలోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.ఫార్ములా–ఈ కార్ రేసు వ్యవహారంపై రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం (ఏ సీబీ) ఈ నెల 19న కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి కేటీఆర్, ఇద్దరు అధికారులను నిందితులుగా చేర్చింది. ఆ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ కేటీఆర్ ఈ నెల 20న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేశారు. కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్రావు, ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్రెడ్డి, ఏఏజీ తేరా రజనీకాంత్రెడ్డి కోర్టులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్ను అరెస్టు చేయవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎత్తివేయాలంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నగదు బదిలీ.. కోర్టులో ఏసీబీ తరఫున కేసు విచారణాధికారి, డీఎస్పీ మాజీద్ అలీఖాన్ కౌంటర్ దాఖలు చేశారు. ‘‘కేటీఆర్ మంత్రిగా ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. తన పరిధిలోని ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేయడానికి సహకరించి విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు. దీనిపై ఈ నెల 18న మున్సిపల్ అడ్మినిస్టేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందిన తర్వాత దర్యాప్తు ప్రారంభించడం కోసం ప్రభుత్వంలోని అ«దీకృత అధికారులకు ఏసీబీ డీజీ లేఖ రాశారు.వారి ఆమోదంతో ఈ నెల 19న ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ప్రాథమిక దశలోనే దర్యాప్తును తప్పుబడుతూ పిటిషనర్ (కేటీఆర్) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రారంభ దశలోనే దర్యాప్తులో జోక్యం చేసుకుని నిందితులకు ఊరట కలిగేలా ఉత్తర్వులు జారీచేసే అధికారం కోర్టులకు కూడా స్పల్పమే. ప్రాథమిక దశలోనే విచారణను అడ్డుకునేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. దర్యాప్తును అడ్డుకునేందుకు, ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హం కాదు. దాన్ని కొట్టివేయాలి. అలాగే ఈ నెల 20న ఇచ్చిన ‘అరెస్టు వద్దు’అనే ఆదేశాలను ఎత్తివేయాలి’’అని ఏసీబీ కౌంటర్లో పేర్కొన్నారు.రాజకీయ పగతోనే కేసు పెట్టారు...ఏసీబీ కౌంటర్పై న్యాయవాది ద్వారా కేటీఆర్ కోర్టుకు సమాధానమిచ్చారు. ‘‘ఏసీబీ కౌంటర్లోని అన్ని అంశాలను పరిశీలించాను. ఆ ఆరోపణలు అవాస్తవాలు. నాపై ఎఫ్ఐఆర్కు ప్రాథమిక ఆధారమేమిటో పేర్కొనలేదు. ఎలాంటి అవినీతి జరగకున్నా ప్రభుత్వం రాజకీయ పగతోనే నేర పరిశోధన సంస్థలను రంగంలోకి దించింది. ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్లు ఏవీ దీనికి వర్తించవు. కేసు నమోదులో తీవ్ర జాప్యానికి కారణాలు పేర్కొనలేదు. కేసును కొట్టివేసే అధికారం కోర్టుకు ఉంది. ఆర్థికపరమైన చిక్కులేమిటో చెప్పకుండా ప్రైవేట్ స్పాన్సర్ పాత్రను ప్రభుత్వంపై మోపారనే ఆరోపణ సరికాదు.రెగ్యులేటరీ అధికారుల నుంచి అవసరమైన అనుమతులు పొందకుండానే విదేశాలకు నగదు బది లీ చేశారని ఆరోపిస్తున్నారు. ఎవరి ఆమోదమో స్పష్టంగా చెప్పలేదు. బ్యాంక్ అ«దీకృత డీలర్లు, ఏదైనా ముందస్తు అనుమతి అవసరమైతే సంబంధిత అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. ఎంఏయూడీ మంత్రిగా విధులు నిర్వహించిన నాపై నిందలు మోపారు. ఆ నిర్ణయంలో లోపాలుంటే ప్రభుత్వమే తన నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలి.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంత్రిగా నన్ను బాధ్యుడ్ని చేయడం చట్ట వ్యతిరేకం. అవినీతి నిరోధక చట్టం–1988లోని సెక్షన్ 13(1) (ఎ), సెక్షన్ 13(2) ఈ కేసులో వర్తించవు. ఐపీసీలోని 120–బీ, 409 సెక్షన్ల కింద కేసు నమోదు వెనుక కుట్ర ఉంది. ఇలాంటి తీవ్ర నేరాభియోగాలతో కేసు నమోదు చేస్తే.. నోటీసులిచ్చి విచారణ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుందనే కుట్ర దాగి ఉంది. వ్యక్తిగతంగా నన్ను సర్కార్ టార్గెట్ చేసింది’’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు. -
ఫార్ములా-ఈ రేస్ కేసుపై హైకోర్టులో విచారణ
-
కేటీఆర్కు ఊరట వద్దు: ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కౌంటర్
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా-ఈ కార్ రేసుల(formula-e race) కేసులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) హైకోర్టులో శుక్రవారం(డిసెంబర్27) కౌంటర్ ధాఖలు చేసింది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr)కు ఇచ్చిన ఊరట (నాట్ టు అరెస్ట్) ఆదేశాలను ఎత్తివేయాలని ఏసీబీ తన కౌంటర్లో కోర్టును కోరింది.ఏసీబీ(Acb) వేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్ తరపు న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మంగళవారం(డిసెంబర్31)కి కోర్టు వాయిదా వేసింది.కాగా ఫార్ములా-ఈ కార్ రేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేయగాకే కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ పిటిషన్ను విచారించిన కోర్టు కేటీఆర్ను ఈ కేసులో 31 దాకా అరెస్టు చేయవద్దని ఏసీబీకి ఆదేశాలిచ్చింది. 31న జరిగే విచారణలో ఏం జరగనుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఇదీ చదవండి: చంద్రబాబుకు ఒక రూల్.. కేటీఆర్కు మరొకటా -
ఇన్సర్విస్ డాక్టర్ల ‘పీజీ’ ఆశలు అడియాసలేనా?
సాక్షి, హైదరాబాద్: నీట్– పీజీ వైద్య ప్రవేశాలకు సంబంధించిన గందరగోళానికి తెరపడడం లేదు. స్టేట్పూల్ కోటాలోని పీజీ సీట్లు పూర్తిస్థాయిలో తెలంగాణ వాళ్లకే చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తెచ్చిన జీవోలు 148, 149పై మొదలైన అలజడి ఆగడం లేదు. జీవో 148(అల్లోపతి), 149 (ఆయుర్వేదం, హోమియోపతి) ద్వారా మెడికల్ పీజీలో అడ్మిషన్లు పొందేందుకు నిర్ణయించిన స్థానికత అంశంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ‘తెలంగాణలో ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ చదివిన వారంతా ప్రెసిడెన్షియల్ ఆర్డర్–1974 ప్రకారం ‘లోకల్ ఏరియా’ పరిధిలోకి వస్తారని, వారు పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు అర్హులేనని హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, జనవరి 7న విచారణకు రానుంది.ఈ వివాదం కొనసాగుతుండగానే... తెలంగాణ స్థానికులుగా ఉండి ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదివి... ఇన్సర్వీస్ డాక్టర్లుగా రాష్ట్రంలో సేవలందిస్తున్న డాక్టర్ల అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణలో పుట్టి పెరిగి ఇంటర్మీడియెట్ వరకు సొంత ప్రాంతంలో చదివినప్పటికీ... ఎంసెట్ ర్యాంకు ద్వారా ఇతర రాష్ట్రాల్లోనో, వేరే దేశంలోనో వైద్యవిద్య అభ్యసించి, సొంత రాష్ట్రంలో పనిచేస్తున్న డాక్టర్లు పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు అనర్హులుగా మారడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్లు చదివి, అనంతరం రాష్ట్రంలోనే ఎంబీబీఎస్/ బీఏఎంఎస్/ బీహెచ్ఎంఎస్ చదివిన వారే పీజీ అడ్మిషన్లలో స్టేట్ పూల్లో రాష్ట్రంలో చదివేందుకు అర్హులని ప్రభుత్వం 148, 149 జీవోల్లో స్పష్టం చేసింది. ఈ అంశంపై హైకోర్టు తన తీర్పులో ప్రస్తావించలేదు.దీంతో ఇంటర్ వరకు ఏపీ లేదా ఇతర రాష్ట్రాల్లో చదివి తెలంగాణలో ఎంబీబీఎస్ చేసిన వారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్–1974 ప్రకారం ‘లోకల్ ఏరియా’ కిందికి వచ్చి పీజీ కోర్సులకు అర్హులవుతుండగా... ఇంటర్ వరకు తెలంగాణలో చదివినప్పటికీ... వైద్య విద్యను ఇతర రాష్ట్రాల్లో అభ్యసించి సొంత రాష్ట్రంలో పనిచేస్తున్న వారు అనర్హులుగా మారారు. ప్రభుత్వం ఎంబీబీఎస్ తెలంగాణలో చదివిన వారంతా స్థానికులే అన్న హైకోర్టు తీర్పును మాత్రమే సవాల్ చేసిన నేపథ్యంలో.. ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదివి ఇన్సర్విస్ డాక్టర్లుగా ఉన్న వారి పరిస్థితి ఎటూ తేలకుండా పోతోంది. దీంతో వారు తమ స్థానికత అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బలయ్యేది ఇన్సర్విస్ డాక్టర్లే.. తెలంగాణ ఏర్పాటయ్యేంత వరకు ఎంసెట్లో వచ్చిన ర్యాంకును బట్టి నాన్లోకల్ కేటగిరీలో మెరిట్ ఆధారంగా ఆంధ్ర, రాయలసీమలోని కళాశాలల్లో ఎంబీబీఎస్ విద్యనభ్యసించిన రాష్ట్రానికి చెందిన వారు వందలాది మంది ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణేతర ప్రాంతాల్లో వైద్యవిద్య పూర్తి చేసినప్పటికీ... ప్రభుత్వ సర్విసులో చేరి గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం చేసి, స్టేట్ పూల్ కింద 15 శాతం నాన్లోకల్ కోటాలో పీజీ అడ్మిషన్లు పొందేవారు.148, 149 జీవోల ప్రకారం తెలంగాణలో వైద్యవిద్య అభ్యసించిన స్థానికులకే స్టేట్పూల్లో పీజీలో అడ్మిషన్లకు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేయడంతో... ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, ఇతర కోర్సులు చదివి ఇన్సర్విస్లో ఉన్న వైద్యులకు పీజీకి అర్హత లేకుండా పోయింది. ఈ సంవత్సరం కాళోజీ యూనివర్సిటీ విడుదల చేసిన నోటిఫికేషన్లోనూ వీరికి దరఖాస్తు చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వలేదు. పట్టించుకోని ప్రభుత్వం ఇన్సర్విస్ కోటాలో తెలంగాణలో ఉద్యోగం చేస్తున్న వైద్యులు తమకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ హైకోర్టు ఇచ్చిన 106 పేజీల తీర్పులో ఇన్సర్విస్ డాక్టర్ల అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో తమకు సర్వీస్ మొత్తం ఎంబీబీఎస్ అర్హతతోనే పదవీ విరమణ వరకు ఉద్యోగం చేసే పరిస్థితి తలెత్తిందని వైద్యులు వాపోతున్నారు. ఇన్సర్విస్ డాక్టర్లకు న్యాయం జరిగేలా పీజీ అడ్మిషన్లలో అవకాశం లభించేలా కృషి చేయాలని, న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కత్తి జనార్ధన్, డాక్టర్ పూర్ణచందర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గ్రూప్–1 మెయిన్స్ ఫలితాలకు లైన్క్లియర్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ ఫలితాల వెల్లడికి లైన్క్లియర్ అయ్యింది. రాష్ట్రంలో కీలక పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చేపట్టిన పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. రిజర్వేషన్ల అంశం తేలేవరకు మెయిన్స్ పరీక్షల ఫలితాలు ప్రకటించవద్దని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీజీఎస్పీఎస్సీ)ను ఆదేశించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. పిటిషన్ల దాఖలులో ఆలస్యాన్ని ప్రస్తావించిన ధర్మాసనం.. ఫిబ్రవరిలో తాజా నోటిఫికేషన్ ఇస్తే ఇందుకు సంబంధించిన జీవో 29 ప్రతి అప్లోడ్ కాలేదన్న కారణంతో ఆలస్యంగా పిటిషన్లు దాఖలు చేయడాన్ని తప్పుబట్టింది.ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించిన తర్వాత జీవో ను సవాల్ చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. ఆర్టీకల్ 226 ప్రకారం తమకున్న విస్తృతాధికారాల మేరకు ఉత్తర్వులు వెలువరుస్తామని స్పష్టం చేసింది. రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ జి.రాధారాణి ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. వివరాలిలా ఉన్నాయి.గ్రూప్–1 పోస్టుల భర్తీ కోసం 2022లో ప్రభుత్వం జీవో 55 జారీ చేసింది. రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చిది. అయితే పేపర్ లీకేజీ కారణంగా ప్రిలిమ్స్ పరీక్ష రద్దు కాగా, ఆ తర్వాత ప్రభుత్వం పోస్టుల సంఖ్య పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి నోటిఫికేషన్ ఇస్తూ జీవో 29 జారీ చేసింది. ఫిబ్రవరిలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం టీజీఎస్పీఎస్సీ రూల్ ఆఫ్ లాను పాటించేలా, ప్రిలిమ్స్, మెయిన్స్.. అన్నింటా రిజర్వేషన్లు అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నల్లగొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన పోగుల రాంబాబు సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2019లో జారీ చేసిన జీఓ 96ను కూడా సవాల్ చేశారు. ఇలా మొత్తం ఏడు పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు సాగాయిలా... పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘మెయిన్స్కు ఎంపిక చేసిన 1ః50లో కూడా సమాంతర రిజర్వేషన్లు పాటించేలా ఆదేశాలు జారీ చేయాలి. ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదు. 1ః50 మేరకు రిజర్వేషన్లు పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా, అంతకు మించి మెయిన్స్కు ఎంపిక చేశారు. రీ నోటిఫికేషన్ ఇస్తూ జారీ చేసిన జీవో 29 కూడా చట్టవిరుద్ధం. రిజర్వేషన్ల అంశం తేలేదాకా మెయిన్స్ ఫలితాలు వెల్లడించకుండా టీజీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేయాలి..’అని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమ్స్ పరీక్షలు రద్దయ్యాయి. ఈ సారి ప్రిలిమ్స్, మెయిన్స్ ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాం. పిటిషన్లను అనుమతించవద్దు. మెయిన్స్ ఫలితాల వెల్లడిని అడ్డుకోవద్దు..’అని కోరారు. ఈ నెల 17న తుది వాదనలు విన్న ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. జీవో 55.. గ్రూప్–1 పోస్టుల భర్తీ కోసం 2022, ఏప్రిల్ 25న గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 503 పోస్టులు భర్తీ చేసేందుకు జీవో 55ను జారీ చేసింది. పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1ః50 నిష్పత్తిలో మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేయాలని తెలిపింది. తెలంగాణ సబార్డినేట్ సర్విస్ రూల్స్ 22, 22 ఏ నిబంధనల ప్రకారం రిజర్వుడు కేటగిరీ, జెండర్, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, స్పోర్ట్స్ రిజర్వేషన్లు పాటించాలని స్పష్టం చేసింది. ఓపెన్ మెరిట్లో చోటు సంపాదించిన రిజర్వ్డ్ అభ్యర్థులు ఓపెన్ మెరిట్తో పాటు సంబంధిత రిజర్వుడు కేటరిగీ పోస్టులకు కూడా పోటీ పడవచ్చని తెలిపింది. జీవో 29... ప్రస్తుత ప్రభుత్వం 2024, ఫిబ్రవరి 19న మరో నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల సంఖ్యను 503 నుంచి 563కు పెంచుతూ సుప్రీంకోర్టు తీర్పు మేరకు జీవో 29ని జారీ చేసింది. రిజర్వుడు కేటగిరీతో సంబంధం లేకుండా పోస్టుల సంఖ్య మేరకు 1ః50 నిష్పత్తిలో మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఇందులో ఒకవేళ రిజర్వుడు కేటగిరీకి అనుగుణంగా ఆ వర్గాల అభ్యర్థులు లేకుంటే.. ఆ కేటగిరీలోని తదుపరి మెరిట్ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. 1ః50 మేరకు రిజర్వుడ్ అభ్యర్థుల సంఖ్య ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మెయిన్స్కు ఎంపికైన రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులంతా ఓపెన్ కేటగిరీ పోస్టులకు పోటీ పడవచ్చు. -
గ్రూప్-1 అభ్యర్ధుల పిటిషన్ కొట్టేసిన తెలంగాణ హైకోర్టు
-
నీట్ పీజీ అడ్మిషన్లలో జాప్యం..ఆందోళనలో విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే ఆలస్యమైన నీట్–పీజీ ప్రవేశాల అంశం సుప్రీంకోర్టు ముందుకెళ్లడంతో తెలంగాణ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ స్థానికత అంశంపై జీవోలు 148, 149ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టుకు వెళ్లడంతో నవంబర్లో మొదలు కావాల్సిన పీజీ కౌన్సెలింగ్ ఆల స్యమైంది. ఇటీవల హైకోర్టు ఆ జీవోలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించడంతో సర్కా ర్ సుప్రీంకోర్టు తలుపుతట్టింది.తెలంగాణలోని పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కాలని, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని కోరింది. ఇది సుప్రీంకోర్టులో జనవరి 7న విచారణకు రానుంది. సుప్రీం విచారణ ముగిస్తే గానీ తెలంగాణ విద్యార్థుల కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలయ్యేలా లేదు. ఇప్పటికే అఖిల భారత కోటా (ఏఐక్యూ) కింద మొదటి రౌండ్ ప్రవేశాల ప్రక్రియ పూర్తికాగా, రెండో రౌండ్ రిజిగ్నేషన్ పీరియడ్ ఈనెల 26తో ముగియనుంది. ఆ తరువాత మూడో రౌండ్ ఓపెన్ అవుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి పీజీ ప్రవేశ పరీక్ష రాసిన సుమారు 8 వేల మంది విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది. ఫిబ్రవరి 5లోగా పూర్తికావాల్సిన ప్రక్రియ నీట్–పీజీ ప్రవేశాలకు సంబంధించి అన్ని రకాల ప్రవేశాలను ఫిబ్రవరి 5లోగా పూర్తి చేయాలనేది నిబంధన. సుప్రీంకోర్టు గతంలో ఇచి్చన మార్గదర్శకాల మేరకు ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఒకవేళ జనవరి 7న సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే... అప్పటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించినా ఫిబ్రవరి 5లోగా పూర్తి చేయడం సాధ్యంకాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రవేశాలకు సంబంధించి మొత్తం నాలుగు రౌండ్స్ ఉంటాయి. కన్వినర్ కోటా, యాజమాన్య కోటా, ఎన్ఆర్ఐ (సీ కేటగిరి) కోటాతోపాటు స్ట్రే వెకెన్సీ ఉంటుంది. ఒక్కో విడతకు కనీసం వారం రోజుల సమయమివ్వాలి.ఎందుకంటే విద్యారి్థకి సీటు కేటాయించిన తర్వాత వారు జాయిన్ అయ్యేవరకు ఆగాలి. అనంతరం మరోవిడత కౌన్సెలింగ్ చేపట్టాలి. ఇలా తక్కువ సమయంలోనే అన్ని రకాల కౌన్సెలింగ్లను ఎలా చేపడతారని మెడికోలు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పటివరకు వరంగల్లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పీజీ విద్యార్థులకు సంబంధించిన ర్యాంకు కార్డులను గానీ, జాతీయస్థాయి మెరిట్ కార్డులను గానీ విడుదల చేయలేదు. దీంతో ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ సీటు కోసం ఎదురు చూస్తున్న మెడికల్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అఖిల భారత కోటాలో సగం సీట్లు భర్తీ రాష్ట్రంలో 2,886 మెడికల్ పీజీ సీట్లున్నాయి. వీటిలో 1,300 సీట్లు ప్రభుత్వ కళాశాలల్లో ఉన్నాయి. వీటిల్లోని 50 శాతం సీట్లు ఆలిండియా కోటాకు వెళ్తాయి. మన రాష్ట్ర విద్యార్థులకు మిగిలేవి 650 సీట్లే. వీటిలో రెండు రౌండ్ల కౌన్సెలింగ్లో దాదాపుగా అన్ని సీట్లు నిండిపోయాయని విద్యార్థులు చెబుతున్నారు. మిగతా 650 సీట్ల విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడేదాకా వేచి చూడాలని అంటున్నారు. కాగా, ప్రైవేటులో 1,500కు పైగా సీట్లలో 50 శాతం కన్వినర్ కోటా కిందకు వస్తాయి. 35 శాతం మేనేజ్మెంట్ కోటా, 15 శాతం ఎన్నారై కోటాకు వెళ్తాయి. స్టేట్ రౌండ్ 1ను ప్రకటించాలి: టీ–జుడా అఖిలభారత కోటా మూడో రౌండ్ నిర్వహణ ప్రారంభమయ్యేలోగా తెలంగాణలో స్టేట్ కౌన్సెలింగ్ ద్వారా రెండు రౌండ్లలో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొమ్ము రాహుల్, ఇసాక్ న్యూటన్, చైర్పర్సన్ డి. శ్రీనాథ్ ప్రభుత్వాన్ని కోరారు. ఏఐక్యూ రెండో రౌండ్ రిజిగ్నేషన్ డెడ్లైన్ పూర్తయ్యేలోపు స్టేట్ మొదటి కౌన్సెలింగ్ పూర్తి చేయాలన్నారు. మెడికో డి.వెంకటేష్ కుమార్ విద్యార్థుల తరపున మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెంటనే రాష్ట్రంలో కౌన్సెలింగ్ ప్రారంభించాలని కోరారు. -
కేసీఆర్, హరీశ్రావులకు హైకోర్టులో ఊరట
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్(kcr), మాజీ మంత్రి హరీశ్రావు(HarishRao)కు తెలంగాణ హైకోర్టులో మంగళవారం(డిసెంబర్24) ఊరట లభించింది. మేడిగడ్డ ప్రాజెక్టు పై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ అంశంలో తదుపరి విచారణను జనవరి ఏడో తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. కాగా, మేడిగడ్డ(Medigadda) బ్యారేజీలో పగుళ్లకు కేసీఆర్,హరీశ్రావే కారణమని భూపాలపల్లి కోర్టు(Bhupalapalli Court)లో స్థానిక న్యాయవాది ఒకరు గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన భూపాలపల్లి సివిల్ కోర్టు కేసీఆర్,హరీశ్రావులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులను క్వాష్ చేయాల్సిందిగా కేసీఆర్,హరీశ్రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు భూపాలపల్లి కోర్టు నోటీసులపై కేసీఆర్,హరీశ్రావులకు ఊరటనిచ్చింది. ఈ కేసులో ఫిర్యాదుదారునికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
ప్రముఖ నటుడు మోహన్ బాబుకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ని న్యాయస్థానం కొట్టేసింది. అనారోగ్యంతో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు కానీ అది నెరవేరలేదు. దీంతో మోహన్ బాబుని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.ఇకపోతే మోహన్ బాబు ఇండియాలోనే ఉన్నట్టు ఆయన న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు. తన మనవరాలును చూసేందుకు దుబాయ్ వెళ్లి తిరుపతి వచ్చినట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని న్యాయవాది రవిచందర్ చెప్పారు. మోహన్ బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని హైకోర్టు కోరడంతో.. కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో మెడికేషన్లో ఉన్నారని తెలిపారు. దీంతో పాటు జర్నలిస్ట్ స్టేట్మెంట్ కాపీని కూడా హైకోర్టు పరిశీలించింది.(ఇదీ చదవండి: కూటమి పార్టీల్లో ‘బెనిఫిట్ షో’ వివాదం)ఇంతకీ ఏం జరిగింది?మోహన్ బాబు ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నాయి. దీంతో మనోజ్-మోహన్ బాబు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని తొలుత రూమర్స్ వచ్చాయి. అది నిజమో కాదో పక్కనబెడితే పరస్పరం పోలీసు కేసులు అయితే పెట్టుకున్నారు. కొన్నిరోజుల క్రితం ఓ మూడు నాలుగు రోజుల పాటు ఈ గొడవ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఈ క్రమంలోనే మోహన్ బాబు ఇంటి దగ్గరకు మీడియా ప్రతినిధులు వెళ్లగా.. జర్నలిస్టుపై మైకుతో మోహన్ బాబు దాడి చేశారు. దీంతో తలకు గాయలయ్యాయి.ఆ తర్వతా సదరు జర్నలిస్టుకు క్షమాపణ చెప్పడంతో పాటు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి కూడా మోహన్ బాబు పరామర్శించారు. అదలా ఉంచితే దాడి జరిగిన తర్వాత రోజే అనారోగ్య సమస్యలతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరారు. కొన్నిరోజుల పాటు తనని అరెస్ట్ చేయకుండా కోర్టు అనుమతి తెచ్చుకున్నారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయగా.. దాన్ని తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఒకవేళ కావాలంటే దిగువ కోర్టుకు వెళ్లాలని సూచించింది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన) -
పరీక్షలకు ఫాతిమాను అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక పరిస్థితుల కారణంగా ఫీజు కట్టలేక గత పరీక్షలకు హాజరుకాలేకపోయిన వైద్య విద్యారి్థని అర్షియా ఫాతిమా (పిటిషనర్)ను.. 2025, జనవరిలో జరిగే బీడీఎస్ చివరి సంవత్సరం పరీక్షలకు అనుమతించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. మాజీ సైనికుడి కూతురైన ఫాతిమా 2016లో నిజామాబాద్లోని మేఘన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో బీడీఎస్లో చేరారు. 2017, 2018లో పరీక్షలకు హాజరయ్యారు. 2020లో మూడో ఏడాది పూర్తి చేశారు. 2021 నుంచి ఆర్థిక పరిస్థితుల కారణంగా నాలుగో ఏడాది ఫీజు కట్టలేక పరీక్షలకు హాజరుకాలేదు. 2024లో బీడీఎస్ చివరి సంవత్సరం పరీక్షలు రాసేందుకు అనుమతించాలని ఫాతిమా వర్సిటీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే అక్టోబర్ 28న వర్సిటీ దీన్ని తిరస్కరించింది. తనను బీడీఎస్ చివరి సంవత్సరం పరీక్షలకు అనుమతించకపోవడాన్ని, ఇంటర్న్íÙప్ పూర్తి చేయకుండా అడ్డుకోవడాన్ని సవాల్ చేస్తూ ఫాతిమా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. 2025, జనవరిలో జరిగే పరీక్షలకు అనుమతి ఇచ్చేలా వర్సిటీకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. ఈ ఒక్కసారికి అనుమతించాలని వర్సిటీని ఆదేశిస్తూ, విచారణ ముగించింది. -
హైకోర్టులో కేటీఆర్ పిటిషన్
-
ఫార్ములా-ఈ కార్ కేసు..హైకోర్టులో కేటీఆర్కు ఊరట
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కేటీఆర్ను డిసెంబర్ 30 దాకా అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. అయితే ఈ కేసులో ఏసీబీ తన విచారణ కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణకు ఎవరినైనా పిలవచ్చని తెలిపింది. కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. కాగా, ఏసీబీ కేసుపై కేటీఆర్.. హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ వేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్లో కేటీఆర్ కోరారు. పిటిషన్పై జస్టిస్ శ్రవణ్ బెంచ్ ముందు రెండు గంటలపాటు హోరాహోరీ వాదనలు జరిగాయి. అనంతరం జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కేటీఆర్ తరపున వాదించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం ఏసీబీ తరపున వాదించిన ఏజీ సుదర్శన్రెడ్డి కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం వాదనలు..ఎన్నికల కోడ్ ఉల్లంఘనతో ఏసీబీకి ఏం సంబంధం కోడ్ ఉల్లంఘన జరిగితే ఈసీ చూసుకుంటుందినిధుల చెల్లింపునకు పీసీ యాక్ట్ వర్తించదు కేటీఆర్కు లబ్ధి జరిగిందని ఎఫ్ఐఆర్లో ఎక్కడా లేదురాజకీయ దురుద్దేశంతోనే తప్పుడు కేసులు పెట్టారు సీజన్ 9లోనే అగ్రిమెంట్ జరిగిందిసీజన్ 10కి అగ్రిమెంట్ అవసరం లేదురేస్ కోసం నిధులు చెల్లిస్తే కేటీఆర్పై కేసు ఎందుకు పెట్టారు కేటీఆర్పై ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టారో తెలియదు ప్రాథమికంగా ఎలాంటి దర్యాప్తు చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చట్ట విరుద్ధంనేరం జరిగిందని తెలిసిన మూడు నెలల్లోనే కేసు రిజిస్టర్ చేయాలి 11 నెలల తర్వాత కేసు నమోదు చేశారు లలిత్ కుమార్ వర్సెస్ యూపీ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ప్రస్తావించిన న్యాయవాది అగ్రిమెంట్ జరిగిన 14 నెలలకు కేసు పెట్టారు ఎలాంటి ఆలస్యం జరగలేదని ఎఫ్ఐఆర్లో రాశారు18న ఎంఏయూడీ సెక్రటరీ దాన కిషోర్ ఫిర్యాదు చేస్తే 19న కేసు పెట్టారుమూడో విడత నిధులు చెల్లించాలని గత ఏడాది డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి రేసులు నిర్వహించే ఎఫ్ఈవో సంస్థ లేఖ రాసిందిప్రభుత్వం నిధులు చెల్లించేందుకు నిరాకరించడంతో ఫార్ములా ఈ ఒప్పందం రద్దైందిప్రభుత్వానికి ఇష్టం లేకపోతే అవినీతి ఉన్నట్టా ఫార్ములా ఈ రేసుల వల్ల తెలంగాణకు రూ.700 కోట్ల లాభం జరిగింది పీసీ యాక్ట్లో డబ్బులు ఎవరికి వెళ్లాయో వాళ్లని నిందితులుగా చేర్చాలి కానీ ఇక్కడ డబ్బులు చేరింది ఎఫ్ఈవో సంస్థకుఎఫ్ఈవో సంస్థను ముందు నిందితుడిగా చేర్చాలి ఇది కరప్షన్ కేసు ఎలా అవుతుంది..పీసీ యాక్ట్ ఎందుకు వర్తిస్తుంది ఏసీబీ తరపున ఏజీ సుదర్శన్రెడ్డి వాదనలివే..ప్రాథమిక విచారణ జరిగాకే కేసు నమోదైందిరెండు నెలల క్రితం ఎంఏయూడీ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ ఫిర్యాదు చేశారువిచారణకు గవర్నర్ కూడా అనుమతించారుఎఫ్ఐఆర్ ద్వారానే దర్యాప్తు జరుగుతుందిప్రతి విషయం ఎఫ్ఐఆర్లో ఉండదుదర్యాప్తులో అనేక విషయాలు బహిర్గత మవుతాయికేసులో భాగస్వాములైన వారి పేర్లు దర్యాప్తులో బయటికి వస్తాయి రెండో అగ్రిమెంట్ను 2023 అక్టోబర్లోనే కుదుర్చుకున్నారుప్రభుత్వానికి అంత లాభం వస్తే స్పాన్పర్ ఎందుకు వెనక్కి వెళ్లాడుఅగ్రిమెంట్ లేకుండానే థర్డ్ పార్టీకి నిధులు పంపారు కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు పంపారుప్రజాధనం విదేశీ కంపెనీకి పంపారు రేసులో ఆర్బిట్రేషన్ను ఎఫ్ఈవో వెనక్కి తీసుకుంది ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అనేది పూర్తి దర్యాప్తు జరిగితేనే తెలుస్తుందిపిటిషనర్ సమర్పించిన సుప్రీం కోర్టు తీర్పు కాపీలు అన్నీ ట్రయల్ ముగిసిన తర్వాత ఇచ్చిన తీర్పులుఇక్కడ ఎఫ్ఐఆర్ అయ్యిందే ఇప్పుడుడబ్బులు పంపడంలో కేటీఆర్ సూత్రధారుడుగత ప్రభుత్వo లో మున్సిపల్ శాఖ కు ఆయన మంత్రిగా ఉన్నారు , పూర్తి బాధ్యత ఆయనదేప్రజా ప్రతినిధిగా ఆయన ఉన్నాడుడబ్బులు పంపాలని ఫైల్ పై సంతకం చేసింది కేటీఆర్409 సెక్షన్ వర్తిస్తుందిఅగ్రిమెంట్కు ముందే చెల్లింపులు జరిపారుఎన్నికల కోడ్ అమలులో ఉన్న టైం లో ఈ అగ్రిమెంట్ చేసుకున్నారుప్రాథమిక దర్యాప్తును గవర్నర్ దృష్టికి తీసుకెళ్తే అనుమతి ఇచ్ఛాకే ఎఫ్ఐఆర్ నమోదు చేశాండబ్బులు పంపే సమయానికి అసలు అగ్రిమెంట్ లేదు56 కోట్ల రూపాయలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు సమాచారం లేకుండానే ఎఫ్ఈవో కంపెనీకి పంపారుక్వాష్ పిటిషన్ లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి వీలు లేదు - ఏజీపలు తీర్పు లు ప్రస్తావించిన అడ్వకేట్ జనరల్ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత రోజే క్వాష్ పిటిషన్ వేశారు..ఈ పిటిషన్ కు అర్హత లేదుకేటీఆర్ తరపు న్యాయవాది రెండోవిడత వాదనలు ఎఫ్ఐఆర్ నమోదు కు ముందే ప్రాథమిక దర్యాప్తు చేశాము అని చెబుతున్నారు, ఆల్రెడీ దర్యాప్తు చేశాక మళ్ళీ దర్యాప్తు చేయడానికి ఏం ఉంటుందిలలిత కుమారి కేస్ లో ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ఫిర్యాదు అందిన తరువాత దర్యాప్తు చేసి మూడు నెలల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలికానీ ఇక్కడ ప్రభుత్వం ఆల్రెడీ ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసిందివిచారణ సందర్భంగా హైకోర్టు కీలక ప్రశ్నలుగవర్నర్ అనుమతి కాపీని అడిగిన హైకోర్టు కాపీని హైకోర్టుకు సమర్పించిన ఏజీ సుదర్శన్రెడ్డి గవర్నర్ అనుమతి కాపీని పరిశీలిస్తున్న హైకోర్టు కేటీఆర్పై ఉన్న అభియోగం ఏంటని ప్రశ్నించిన హైకోర్టు అంతకుముందు తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ మెన్షన్ చేశారు. జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండటంతో మరో బెంచ్లో మెన్షన్ చేశారు కేటీఆర్ న్యాయవాది. దీనిలో భాగంగా ముందుగా సింగిల్ బెంఛ్ జస్టిస్ శ్రవణ్ దగ్గరకు కేటీఆర్ న్యాయవాది వెళ్లగా, ఈ బెంచ్లో క్వాష్ పిటిషన్ విచారించడానికి అనుమతి లేదని ఏసీబీ కౌన్సిల్ తెలిపారు. దీంతో కేటీఆర్ న్యాయవాదులు.. సీజే కోర్టులో లoచ్ మోషన్ మెన్షన్ చేశారు. పిటిషన్పై విచారణను హైకోర్టు స్వీకరించింది. కాసేపట్లో విచారణ జరగనుంది. ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కార్ రేసింగ్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. కేబినెట్ అనుమతి, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండానే విదేశీ కంపెనీకి రూ. 55 కోట్ల నిధులు చెల్లించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి, విచారణకు పిలిచే అవకాశం ఉంది. మరొకవైపు తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారుల లేఖ రాశారు. కేటీఆర్పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ లేఖలో కోరింది. ఎఫ్ఐఆర్ కాపీతోపాటు హెచ్ఎండీఏ అకౌంట్ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వివరాలను ఈడీ ఇవ్వాలని పేర్కొంది. అలాగే, దాన కిషోర్ ఫిర్యాదు కాపీ కూడా పంపించాలని కోరింది. ఇదే సమయంలో డబ్బు బదిలీలకు సంబంధించి ట్రాన్సాక్షన్లు జరిగిన తేదీల వివరాలను సైతం ఇవ్వాలని ఈడీ లేఖలో పేర్కొంది మరోవైపు.. తాజాగా కేటీఆర్ మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ.. ఈ కేసు విషయంలో నేనేమీ భయపడటం లేదు. అవినీతి జరగలేదని నిన్న మంత్రి పొన్నం చెప్పారు. ప్రొసీజర్ కరెక్ట్గా లేదని మాత్రమే పొన్నం అన్నారు. ముఖ్యమంత్రే అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారా?. మేము లీగల్గానే ముందుకు వెళ్తాం. ఔటర్ రింగ్ రోడ్ గురించి కూడా చెప్పాలి. ఓఆర్ఆర్పై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలి. సిటిలో ఉండే అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు వింటారు అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం కేసులు పెట్టాలని ముందుకుపోతే అది వాళ్ల ఇష్టం.. మేము లీగల్గా ఎదుర్కొంటామన్నారు. -
కోర్టులు ఆదేశిస్తే తప్ప పని చేయరా?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులు ఆదేశిస్తే తప్ప అధికారులు పని చేయడం లేదని, మీ విధులు కూడా న్యాయస్థానాలే నిర్వహించాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేసింది. అధికారుల వద్దకు వచ్చే ప్రజల ఫిర్యాదులను పరిష్కరించకపోవడంతో వారు విధిలేక కోర్టులను ఆశ్రయిస్తున్నారని వ్యాఖ్యానించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించడంలోనూ అదే నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడింది. ఈ ఒక్క కోర్టు(15వ కోర్టు)లోనే ధిక్కరణ కేసులు 110 ఉన్నాయని చెప్పింది. కోర్టుల ఆదేశాలు, రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు చదువుతూ.. ఆ మేరకు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సూచించింది. ఇతర ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్లు పెడుతూ వారికి తగిన సూచనలు అందించాలని కమిషనర్ను ఆదేశించింది. హైదరాబాద్ టోలిచౌకిలోని కాశీష్ దుకాణం ముందు అక్రమ నిర్మాణం చేపడుతున్నారంటూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా తమ ముందు హాజరైన జీహెచ్ఎంసీ కమిషనర్ను పలు ప్రశ్నలు అడగడంతోపాటు అక్రమ నిర్మాణాలపై అనుసరించాల్సిన విధానంపై సూచనలు చేశారు. ఆస్తి పన్ను వసూలుకే పరిమితమా? ‘కేవలం ఆస్తి పన్ను వసూలుకే జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారనే భావన ప్రజల్లో రానివ్వొద్దు. రోజురోజుకు మీపై వారిలో విశ్వాసం లేకుండాపోతోంది. కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వస్తోంది. చాలాచోట్ల స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి ఆ తర్వాత విధానాన్ని పాటించకుండా నిద్రపోతున్నారు. సీజ్ చేసినా చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. కూల్చివేత అంటూ రెండు రంధ్రాలు చేస్తే సరిపోతుందా? దానికి ఓ నిర్దిష్ట ప్రక్రియను అనుసరించకుంటే ఎలా? మీరు పెట్టిన రంధ్రాలను పూడ్చివేసి మళ్లీ నివాసం ఉంటున్నారు. అలా అని బుల్డోజర్ సిద్ధాంతాన్ని సమర్థించం. కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా అర్ధరాత్రి పూటనో లేదా వేకువజామున నాలుగు గంటలకో నిర్మాణం చేస్తున్నారు. నేను నివాసం ఉంటున్న కుందన్బాగ్ ప్రాంతంలో కూడా నిద్ర లేకుండా చేస్తున్నారు. న్యాయమూర్తి పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుడి పరిస్థితి ఏంటి? విద్యా సంవత్సరం కొనసాగుతున్నందున ఒక్క విద్యా సంస్థలకు తప్ప ఇతర అక్రమ నిర్మాణాలపై చట్టప్రకారం అధికారులు చర్యలు చేపట్టవచ్చు’అని పేర్కొన్నారు.సివిల్ కోర్టుల నోటీసులపై స్పందనేది?‘సివిల్ కోర్టుల్లో దాఖలైన పిటిషన్లలో నోటీసులు జారీ చేసినప్పుడు స్పందించకుంటే ఎలా? కొన్నిసార్లు స్టాండింగ్ కౌన్సిల్స్ కూడా హాజరుకావడం లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో సివిల్ కోర్టు ఎక్స్పార్టీ అని పేర్కొంటూ, ఇతర పార్టీ లకు అనుకూలంగా ఆదేశాలు ఇవ్వాల్సివస్తోంది. మీ నిర్లక్ష్యం కారణంగా అక్రమ నిర్మాణదారులు లబ్దిపొందుతున్నారు. కొందరు అధికారులు, కౌన్సిల్స్ చట్టం, సెక్షన్లు తెలియకుండా కౌంటర్లు వేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారుల నుంచి స్పందన లేక కోర్టులకు వస్తున్న కేసులు 70 నుంచి 80 శాతమున్నాయి. మీరే అన్ని నిర్ణయాలు తీసుకోలేరు. ఆ మేరకు చట్టంలో మార్పులు చేసేలా ప్రిన్సిపల్ సెక్రెటరీని కోరండి. సిటీ ప్లానర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, డిప్యూటీ కమిషనర్లు.. అంతా కూర్చొని మాట్లాడండి. అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు ఏ చర్యలు తీసుకోవాలో ప్రణాళిక రూపొందించుకోండి. అలాగే వివాదాస్పదమైన టోలీచౌకి నిర్మాణంపై జనవరి 22లోగా నివేదిక ఇవ్వండి’అని కమిషనర్ను న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, రాజీ కుదిరిందని పిటిషన్ను ఉపసంహరించుకుంటామని పిటిషనర్ కోరగా, న్యాయమూర్తి నిరాకరించారు. అక్రమ నిర్మాణంపై రాజీనా అని ప్రశ్నిస్తూ.. విచారణ వాయిదా వేశారు. -
మోహన్బాబుకు దక్కని ఊరట
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్ట్పై దాడి కేసులో ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్బాబుకు హైకోర్టులో ఎలాంటి ఊరట దక్కలేదు. అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్బాబు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘మైక్తో దాడి చేసి గాయపరిచారన్నది ఆరోపణ. అనుమతి లేకుండా మోహన్బాబు ఇంట్లోకి వెళ్లిన కారణంగానే ఘటన జరిగింది. తొలుత బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద కేసు పెట్టిన పోలీసులు జర్నలిస్ట్ రంజిత్ వాంగ్మూలం తీసుకుని సెక్షన్ 109గా మార్చారు. మోహన్బాబు, రంజిత్ మధ్య ఎలాంటి వివాదం లేదు. హత్యకు ప్రయత్నించారనడానికి ఎలాంటి కారణాలు లేవు. సుప్రీంకోర్టు తీర్పుల మేరకు పిటిషనర్ బెయిల్కు అర్హుడు’అని పేర్కొన్నారు. మనోజ్ జిమ్ ట్రైనర్తోపాటు మరొకరి స్టేట్మెంట్ రికార్డు చేశామని ఏపీపీ జితేందర్రావు చెప్పారు. కౌంటర్ కూడా దాఖలు చేశామన్నారు. మోహన్బాబు కావాలని చేయకున్నా.. తెలిసి దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు.‘రంజిత్కు తగిలిన గాయంపై ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా సెక్షన్ను మార్చాల్సి వచ్చింది. వారంపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. 20 రోజుల వరకు ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలని చెప్పారు. పిటిషనర్ కుమారుడి ఆహ్వనం మేరకు మీడియా ప్రతినిధులు వెళ్లారు. మోహన్బాబు దుబాయ్ వెళ్లే అవకాశం ఉంది. ఆయనకు జీవితకాల శిక్ష పడే అవకాశం కూడా ఉంది’అని చెప్పారు. అయితే మోహన్బాబు దుబాయ్ వెళ్లడం లేదని రవిచందర్ పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇరు పార్టీలను అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణ సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రవిచందర్ కోరగా, నిరాకరించారు. -
మోహన్ బాబుకు దక్కని ఊరట.. ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చిన హైకోర్టు!
తెలంగాణ హైకోర్టులో సినీనటుడు మోహన్ బాబుకు మరోసారి చుక్కెదురైంది. ముందస్తు బెయిల్పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన వేసిన పిటిషన్ను తిరస్కరించింది. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.మోహన్బాబు పిటిషన్పై ఉన్నత న్యాయస్థానంలో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు దుబాయ్ వెళ్తున్నారని ప్రతివాదుల తరఫున న్యాయవాది ఆరోపించారు. అయితే అలాంటిదేం లేదంటూ మోహన్ బాబు లాయర్ కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఇరు వర్గాలను ఆదేశించింది.అసలేం జరిగిందంటే..మోహన్ బాబు, ఆయన తనయుడు మనోజ్కు మధ్య వివాదం తలెత్తింది. జల్పల్లిలోని ఇంట్లోకి తనను రానివ్వలేదంటూ మంచు మనోజ్ మీడియా తీసుకుని ఆ ఇంటివద్దకు వెళ్లారు. అదే సమయంలో సెక్యూరిటీ మనోజ్ దంపతులను లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలోనే మనోజ్ గేటు బద్దలుకొట్టి ఇంట్లోకి వెళ్లారు. అక్కడే ఉన్న మోహన్బాబును ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఆయన ఆగ్రహాని గురయ్యారు. అతని మైక్తోనే మీడియా ప్రతినిధిని కొట్టారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే తనపై నమోదైన కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు. ఇవాళ విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. -
తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తే.. పీజీలో ‘స్థానికులే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంబీబీఎస్ కోర్సు చదివిన వారిని మెడికల్ పీజీ సీట్ల భర్తీలో స్థానికులుగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. అలాగే, తెలంగాణ వెలుపల ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులకు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ‘స్థానికత’ వర్తింపజేయాలని ఆదేశించింది. తెలంగాణ మెడికల్ కాలేజీల (పీజీ), పీజీ (ఆయుష్) కోర్సుల నిబంధనలు 2021ను సవరిస్తూ అక్టోబర్ 28న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓలు 148, 149లను చట్ట వ్యతిరేకమని కోర్టు కొట్టివేసింది. తెలంగాణ మెడికల్ కాలేజీల (పీజీ మెడికల్ కోర్సులలో ప్రవేశం) నిబంధనలు 2021లోని రూల్ Vఐఐఐ ( జీజీ)లో ప్రభుత్వం చేసిన సవరణను సవాల్ చేస్తూ మంచిర్యాలకు చెందిన డాక్టర్ ఎస్ సత్యనారాయణ, హైదరాబాద్కు చెందిన డాక్టర్ వీ రజిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థానికత అంశంపైనే మరో 96 పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం సుదీర్ఘంగా విచారించి ఈ నెల 4న తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం తుదితీర్పును ప్రకటించింది. ఈ తీర్పు 2024–25 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని ప్రకటించింది. ప్రభుత్వం తీసుకొచి్చన జీవో 148, 149 చట్ట వ్యతిరేకమని పిటిషనన్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ జీవోల ప్రకారం 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదవడంతో పాటు ఇక్కడ బ్యాచిలర్ మెడికల్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులను మాత్రమే పీజీ మెడికల్ అడ్మిషన్లలో స్థానికులుగా పరిగణిస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినా, తామంతా తెలంగాణకు చెందినవారమే అయినందున స్థానిక అభ్యర్థులుగా గుర్తించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫలితాలు వచ్చాక మార్పులు సరికాదుఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95 నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వులు తెలంగాణకు వర్తించవని, రాష్ట్రపతి ఉత్తర్వులను అన్వయించుకోలేదన్న ప్రభుత్వ వాదనను ధర్మాసనం తప్పుబట్టింది. విద్యకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రకటించింది. ఈ సందర్భంగా 2023లో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటుచేసిన మెడికల్ కాలేజీల్లో జాతీయ కోటా (15 శాతం) పోను.. మిగిలిన కన్వీనర్ కోటా సీట్లు (85 శాతం) స్థానిక విద్యార్థులకే కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 72ను సమర్థిస్తూ గత సెప్టెంబర్లో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్ధించింది. ఆ తీర్పు రాష్ట్రపతి ఉత్తర్వులు 1974ను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. 148, 149 జీఓలు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయని, రాష్ట్ర విద్యా సంస్థల నియంత్రణ చట్టంలోని సెక్షన్ 3(2)కు విరుద్ధమని ప్రకటించింది. పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 11న పరీక్ష నిర్వహించి, 23న ఫలితాలు ప్రకటించిన తర్వాత అడ్మిషన్ నిబంధనలు మార్చడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ఒకసారి నియామక ప్రక్రియ ప్రారంభమయ్యాక మధ్యలో మార్పులు సరికాదని తేల్చి చెప్పింది. ఎంబీబీఎస్తో పాటు బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ పూర్తి చేసిన పిటిషనర్లకు కూడా స్థానికత వర్తిస్తుందని తుది తీర్పులో ప్రకటించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికత, రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీ, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95తో పాటు పలు తీర్పులను తీర్పులో ప్రస్తావించింది. -
మీ సొంత ఖర్చులతో షెడ్ నిర్మించండి
సాక్షి, హైదరాబాద్: చట్టవిరుద్ధంగా, స్టే ఆదేశాలను బేఖాతర్ చేస్తూ చిన్నషెడ్ కూల్చివేసినందుకు బాధ్యత వహిస్తూ సొంత ఖర్చుతో పున:నిర్మించాలని నాగర్కర్నూల్ జిల్లా పంచాయతీ అధికారిని హైకోర్టు ఆదేశించింది. నిలిపివేత ఉత్తర్వులున్నా పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరుపేద దంపతులు కట్టుకున్న చిన్నషెడ్ను బుల్డోజర్తో కూల్చివేసి అధికారులు తమ ఆధిపత్యాన్ని చూపే ప్రయత్నం చేశారని మండిపడింది.ఇదే తీరులో పలుకుబడి వర్గానికి చెందిన వారి నిర్మాణాలకు కూల్చగలరా అని ప్రశ్నించింది. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంటలో చాలా ఏళ్ల క్రితం ఇల్లు (చిన్నషెడ్) నిర్మించుకున్నామని, సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించినా కూల్చివేతకు నోటీసులు జారీ చేశారంటూ కటకం మహేశ్, నాగలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చిన్న బడ్డీషాపు నిర్వహణకు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడంతోపాటు ఆస్తి పన్ను చెల్లిస్తున్న విషయాన్ని కూడా కనీసం పరిగణనలోకి తీసుకోలేదన్నారు.ఎలాంటి కారణం లేకుండానే నిర్మాణాల తొలగింపునకు పంచాయతీరాజ్ అధికారులు నోటీసులు జారీ చేశారన్నారు. ఈ నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర స్టే ఉత్తర్వులను కోర్టు మంజూరు చేసింది. మరోవైపు తమ వాదనలను దాఖలు చేయాలని పంచాయతీరాజ్ శాఖను కోర్టు ఆదేశించింది.కౌంటర్ దాఖలు చేయకుండా, మధ్యంతర స్టే ఉత్తర్వులు కొనసాగుతుండగానే మహేష్, నాగలక్ష్మిల ఇంటిని అధికారులు కూల్చివేశారు. పిటిషన్పై జస్టిస్ టి.మాధవీదేవి విచారణ చేపట్టారు. సోమవారం విచారణ సందర్భంగా డీపీఓను నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో మంగళవారం ఆయన కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు సొంత ఖర్చుతో నిర్మాణం చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
TG:పీజీ మెడికల్ విద్యార్థులకు హైకోర్టులో ఊరట
సాక్షి,హైదరాబాద్:మెడికల్ పీజీ అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ స్థానికత ఉండి ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ చదవినా, తెలంగాణ స్థానికత లేకుండా ఇక్కడ ఎంబీబీఎస్, బీడీఎస్ చదవిన వారిని కూడా స్థానికులుగా పరిగణించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ జీఓను హైకోర్టు నిలిపివేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 140ని సవరణ చేయాలని గతంలోనే ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ మెడికల్ పీజీ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. జీవో 140 ప్రకారం 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదవడంతోపాటు ఎంబీబీఎస్ కూడా ఇక్కడే పూర్తి చేసినవారికి తెలంగాణ స్థానికత కల్పిస్తారు. ఈ జీవో అమలును ప్రస్తుతం హైకోర్టు నిలిపివేసింది. -
హైకోర్టు ఆదేశాలు.. పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు సాహిల్
సాక్షి,హైదరాబాద్: బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ఇవాళ (సోమవారం) పంజాగుట్ట పోలీసుల విచారణకు హాజరుకానున్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సాహెల్ దుబాయ్ నుంచి హైదరాబాద్కు రానున్నారు. పంజాగుట్ట పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. 2023 డిసెబర్ 23న (శనివారం) హైదరాబాద్లోని బేగంపేట ప్రజాభవన్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రధాన నిందితుడు సాహిల్. శనివారం అర్ధరాత్రి దాటాక మితిమీరిన వేగంతో కారు నడిపిన సాహిల్ ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టారు.కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో ప్రజాభవన్ ఘటన అనంతరం కేసు నుంచి తప్పించుకునేందుకు సాహిల్ తొలుత ముంబైకి, అక్కడి నుంచి దుబాయ్కి వెళ్లిపోయినట్లు గుర్తించారు.దీంతో అతడిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేశారు. దుబాయి నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఈ తరుణంలో ఈ ఏడాది డిసెంబర్ 4న కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 న పంజాగుట్ట పోలీసుల ఎదుట సాహిల్ హాజరు కావాలని సూచించింది. దుబాయ్లో ఉన్న విచారణలో భాగంగా సాహిల్ దుబాయ్ నుండి హైదరాబాద్ రావాల్సిందేనని.. పోలీసుల విచారణకు సహకరించాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో సాహిల్ ఇవాళ పంజాగుట్ట పోలీసుల విచారణను ఎదుర్కొనున్నారు. -
పీఎఫ్సీఎస్, డీఎఫ్సీఎస్లకు ఎన్నికలు నిర్వహించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక మత్స్యకారుల సహకార సంఘాలు (పీఎఫ్సీఎస్), జిల్లా స్థాయి మత్స్యకారుల సహకార సంఘాలకు (డీఎఫ్సీఎస్) ఎన్నికలు నిర్వహించాలని సహకార శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. గతంలో పిటిషనర్లు ఇచ్చిన వినతి పత్రంపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. పిటిషన్ను అనుమతిస్తూ, విచారణ ముగించింది. గ్రామస్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో మత్స్యకారుల సహకార సంఘాలకు అధికారులు ఎన్నికలు నిర్వహించడం లేదంటూ హైకోర్టులో హనుమకొండకు చెందిన డీఎఫ్సీఎస్ చీఫ్ ప్రమోటర్ బుస్సా మల్లేశంతో పాటు మరో ఏడుగురు చీఫ్ ప్రమోటర్లు పిటిషన్ దాఖలు చేశారు.12 జిల్లాల పరిధిలో ఎన్నికలు నిర్వహించారని, మిగిలిన 21 జిల్లాల పరిధిలో కూడా వెంటనే నిర్వహించాలని కోరుతూ రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ రాష్ట్ర ఎన్నికల అథారిటీకి సెప్టెంబర్ 23న వినతిపత్రం సమర్పించినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అందుకే మరో మార్గంలేక హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. పిటిషనర్లు వినతిపత్రం సమర్పించినా అధికారులు ఎన్నికలు నిర్వహించడం లేదని వారి తరఫున న్యాయవాది డీఎల్ పాండు వాదనలు వినిపించారు.ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉందన్నారు. సెప్టెంబర్ 9న సహకార మంత్రి సమావేశం నిర్వహించి సమస్యను వివరిస్తూ, ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులను తొలగించాలని చెప్పారని పేర్కొన్నారు. అయినా అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేయడం లేదని వెల్లడించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని సహకార శాఖ అధికారులను ఆదేశిస్తూ, విచారణ ముగించారు. -
ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులివ్వలేం
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుపై సినీ నటుడు మంచు మోహన్బాబు దాడి చేసిన కేసులో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మోహన్బాబు దాఖలు చేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఆ కౌంటర్ను పరిశీలించిన తర్వాతే ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి (19వ తేదీ)వాయిదా వేసింది. తన కుటుంబ వివాదం నేపథ్యంలో జల్పల్లిలోని ఇంటి ఆవరణలో మీడియా ప్రతినిధిపై మోహన్బాబు దాడి చేశారంటూ పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారమే కేసు నమోదైనప్పటికీ న్యాయ సలహాలు తీసుకున్న పోలీసులు, గురువారం బీఎన్ఎస్ 109 (హత్యాయత్నం) సెక్షన్ జోడించారు.కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్బాబు హైకోర్టులో లంచ్మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. జర్నలిస్ట్లమంటూ చాలామంది ఇంట్లోకి తోసుకొచ్చారని, ఈ క్రమంలో అనుకోకుండా దాడి జరిగింది తప్ప కావాలని చేసింది కాదని చెప్పారు. ఏపీపీ జితేందర్రావు వాదనలు వినిపిస్తూ..మోహన్బాబు కుమారుడు మనోజ్ ఆహ్వానం మేరకే వారు వచ్చారని చెప్పారు. చానల్ లోగోతో కొట్టడంతో జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడ్డారని.. ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. -
అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్
హైదరాబాద్, సాక్షి: సంధ్య ధియేటర్ వద్ద తొక్కిసలాట కేసుకు సంబంధించి నటుడు అల్లు అర్జున్కు భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్కు వర్తించవని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో చంచల్గూడ జైలు నుంచి ఆయన విడుదల కానున్నారు. ఈ కేసులో శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ను ఆయన నివాసంలో చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై వైద్యపరీక్షల అనంతరం ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇటు నాంపల్లి కోర్టులో.. అటు తెలంగాణ హైకోర్టులో కాసేపు వ్యవధిలో అల్లు అర్జున్ కేసులో వాదనలు జరిగాయి. అయితే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. ఈలోపే.. హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్లో అల్లు అర్జున్కు ఊరట లభించింది.నాంపల్లి కోర్టులో వాదనలు ఇలా.. ‘‘ఇది అక్రమ అరెస్ట్. బీఎన్ఎస్ 105 సెక్షన్ అల్లు అర్జున్కు వర్తించదు. సినిమా చూసేందుకు ఒక నటుడికి ఎవరి అనుమతి అవసరం లేదు. సాధారణ ప్రేక్షకుడిగానే వెళ్లారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారు. అరెస్టును తిరస్కరించండి’’ అని మేజిస్ట్రేట్కు అల్లు అర్జున్ తరఫు లాయర్ కోరారు.ఈ సందర్భంగా.. 2017 నటుడు షారూఖ్ ఖాన్ గుజరాత్ పర్యటనలో చోటుచేసుకున్న అపశ్రుతి ఘటనను ప్రస్తావించారు. ‘2017లో షారూఖ్ పర్యటన సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ కేసులో షారూఖ్కు ఊరట లభించింది’ మేజిస్ట్రేట్ దృష్టికి అల్లు అర్జున్ లాయర్ తీసుకెళ్లారు. ఇది చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్.. ఇది మరీ టూమచ్!అయితే.. భద్రత కోరుతూ సంధ్య థియేటర్ యాజమాన్యం చేసిన విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారని, అయినా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వచ్చారని, అలా ర్యాలీగా వెళ్లడం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు వాదించారు. ఈ క్రమంలో.. రెండుగంటలపాటు వాదనలు విన్న నాంపల్లి కోర్టు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్(ఈ నెల 27వ తేదీ దాకా) విధించారు. అయితే పైకోర్టులో(హైకోర్టులో) తన క్లయింట్ వేసిన క్వాష్ పిటిషన్ విచారణ జరుగుతుందని అల్లు అర్జున్ లాయర్.. మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ రిమాండ్కు ఆదేశించడంతో పోలీసులు అల్లు అర్జున్ను చంచల్గూడ జైలుకు తరలించారు.మరోవైపు.. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై అల్లు అర్జున్ తరఫున నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. ఇదీ చదవండి: ‘అల్లు అర్జున్ అరెస్ట్తో నాకేం సంబంధం లేదు’హైకోర్టులో వాదనలు ఇలా.. ‘‘సంచలనం కోసమే అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్, రిమాండ్ రెండూ అక్రమమే. అల్లు అర్జున్ థియేటర్కు వస్తున్నారనే సమాచారం పోలీసుల దగ్గర ఉంది. కానీ, అక్కడ తగినంత పోలీసులు లేరు. థియేటర్ వద్ద ఉన్న జనాల్ని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. ఉన్న పోలీసులు కూడా అల్లు అర్జున్ను చూస్తూ ఉండిపోయారు. ఈ కేసు విచారణకు అల్లు అర్జున్ సహకరిస్తున్నారు. ఆయన ఎక్కడికి పారిపోవడం లేదు. మధ్యంతర బెయిల్ మంజూర చేయాలని అల్లు అర్జున్ తరఫు లాయర్ కోరారు. వాదనల సందర్భంగా.. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్కు వర్తించవని, గతంలో బండి సంజయ్ అరెస్ట్పై హైకోర్టు స్టే విధించిన విషయాన్ని లాయర్ నిరంజన్రెడ్డి ప్రస్తావించారు. ఆ సమయంలో పీపీని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నిస్తూ.. రేవతి మృతికి అల్లు అర్జున్ ఎలా కారణం అవుతారు?.సెక్షన్ 105, 118(1)లు అల్లు అర్జున్కు వర్తిస్తాయా? అని అడిగారు. 👉పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తూ.. అల్లు అర్జున్ ఓ సెలబ్రిటీ. జనాలు వస్తారని ఆయనకు తెలుసు. తొక్కిసలాటతో ఓ మహిళ ప్రాణం పోయింది. అల్లు అర్జున్ వల్లే తొక్కిసలాట జరిగింది. నేర తీవ్రతను బట్టే పోలీసులు ఈ కేసు పెట్టారు. మధ్యంతర బెయిల్ ఇవ్వదగిన కేసు ఇది కాదు. ఇది క్వాష్ పిటిషన్ మాత్రమే. ఇప్పటికే కింది కోర్టులో అల్లు అర్జున్కు రిమాండ్ విధించారు. ఆయన్ని ఈపాటికే చంచల్గూడ జైలుకు తరలించారు. కాబట్టి.. వాళ్లు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు అన్నారు.ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్👉ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై తీర్పు వెల్లడించింది. ‘‘ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్కు వర్తించవు. యాక్టర్ అయినంత మాత్రానా సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేం. కేవలం నటుడు కాబట్టే ఆ సెక్షన్లు ఆపాదించాలా?. మృతురాలు రేవతి కుటుంబంపై సానుభూతి ఉంది. అంతమాత్రాన నేరాన్ని ఒకరిపై రుద్దలేం. అల్లు అర్జున్కు కూడా జీవించే హక్కు ఉంది’’ అని పేర్కొంటూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఇక తీర్పు సందర్భంగా.. అర్ణబ్గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీం కోర్టు తీర్పును జడ్జి ప్రస్తావించారు. వ్యక్తిగత పూచీకత్తు(రూ.50 వేలు)కింద బెయిల్ మంజూరు చేయాలంటూ చంచల్గూడ జైలు సూపరిండెంట్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
విద్యార్థులకు తగ్గట్టు టాయిలెట్లు ఉండాలి
సాక్షి, హైదరాబాద్: సర్కార్ వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న వారంతా పేద కుటుంబాలకు చెందిన చిన్నారులని, వారి కోసం మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. వసతి గృహాల్లో పరుపులు, బెడ్షీట్లు, టవల్స్ అందించాలని, పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్యకు తగినట్లు టాయిలెట్లు, బాత్రూమ్లు నిర్మించాలని సూచించింది. వీటన్నింటిపై జనవరి 22లోగా స్థాయీనివేదిక అందజేయాలంటూ విచారణను వాయిదా వేసింది.ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతాప్రమాణాలు పాటించడం లేదని, ప్రైవేట్ బడుల్లో ఫీజు నియంత్రణకు కమిటీని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కీతినీడి అఖిల్ శ్రీ గురు తేజ 2023లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్రావు ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులు ఖైదీలుగా ఉంటున్నారన్నారు. వారికి అందించే సౌకర్యాల విషయంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని చెప్పారు. విద్యార్థులకు కల్పించాల్సిన వసతులపై ఆయన ఓ చార్ట్ను ధర్మాసనానికి సమర్పించారు. దీనికి ధర్మాసనం న్యాయవాదిని అభినందిస్తూ, వీటిని వీలైనంత త్వరగా కల్పించేలా చూడాలని అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్ఖాన్కు సూచించింది. ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పిల్లలకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏఏజీ చెప్పారు. ధర్మాసనం పేర్కొన్న అంశాలివీ... » ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులకు పరుపులు, దుప్పట్లు, బెడ్షీట్లు, దిండు, దోమతెర, కాటన్ టవల్స్ అందించాలి. » విద్యార్థులకు శుద్ధి చేసిన తాగునీటిని మాత్రమే సరఫరా చేయాలి. » నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ గైడ్లైన్స్ ప్రకారం మెనూ ఇవ్వాలి. » విద్యార్థులకు సైకియాట్రిస్ట్/కౌన్సిలర్ అందుబాటులో ఉండాలి. -
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హీరో అల్లు అర్జున్
-
మంచు ఫ్యామిలీ వివాదం.. హైకోర్టు కీలక ఆదేశాలు
-
మీ ఆస్తులు జప్తు చేస్తే తెలిసొస్తుంది
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలకు ముందుగా అనుమతులిచ్చి, ఆ తర్వాత కొన్నేళ్లకు కూల్చివేత నోటీసులిచ్చే అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేస్తే గానీ సరిగా విధులు నిర్వహించరని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. నష్టపరిహారం కూడా సదరు అధికారుల నుంచే వసూలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాల్సిన స్థితి వస్తుందని హెచ్చరించింది. అధికారుల ఆస్తులు జప్తు చేస్తే అప్పుడు తెలిసొస్తుందని పేర్కొంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత సమయంలో సర్కార్ పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని, అధికారుల తప్పులకు ప్రజాధనం వెచ్చిoచడం సరికాదని అభిప్రాయపడింది. నిర్మాణం అక్రమమైనప్పుడు ఆ నిర్మాణం చేపట్టడానికి ఎలా అనుమతులు ఇస్తున్నారని ప్రశ్నించింది. అవకతవకలకు పాల్పడి అనుమతులిచ్చి.. నిర్మాణం పూర్తయిన తర్వాత చెరువులు, బఫర్జోన్, ఎఫ్టీఎల్ అంటూ కూల్చివేతలకు పాల్పడుతున్నారని మండిపడింది.అయితే, నీటివనరుల సంరక్షణకు తాము వ్యతిరేకం కాదని, అధికారుల తీరునే తప్పుబడుతున్నామని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని నర్కూడ గ్రామం మంగరాశి కుంట ఎఫ్టీఎల్, బఫర్జోన్లో ఇళ్లను నిర్మించారంటూ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ సచిన్తోపాటు మరో ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. 15 రోజులు సమయమివ్వండి.. అనుమతులు తీసుకుని నిర్మించిన ఇళ్లను కూడా కూలుస్తామని అధికారులు ఈ నెల 4న నోటీసులు అతికించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఏడు రోజుల్లో నిర్మాణాలను తొలగించాలని అందులో హెచ్చరించారన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా.. పిటిషనర్ల వాదన వినకుండా.. కూల్చివేతపై ముందుకెళ్లడం చట్టవిరుద్ధమని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ముందుగా చెరువులు, బఫర్జోన్, ఎఫ్టీఎల్ నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణం అక్రమమని తేలితే.. చట్ట ప్రకారం ముందస్తు నోటీసులు జారీ చేయాలని, 15 రోజుల సమయం ఇచ్చి పిటిషనర్ల వాదన కూడా వినాలన్నారు. పిటిషనర్లు వారి వద్ద ఉన్న డాక్యుమెంట్లు, రసీదులను జతచేస్తూ వివరాలు అందజేయాలంటూ జడ్జి విచారణ ముగించారు. -
పోలీసులు అతిగా జోక్యం చేసుకోవద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్బాబు కుటుంబ వివాదాల్లో అతిగా జోక్యం వద్దని పోలీసులకు హైకోర్టు సూచించింది. మొదట సమస్యను పరిష్కరించుకునే అవకాశం వారికి ఇవ్వాలని... అది సాధ్యం కాకుంటే చట్టప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించింది.మోహన్బాబు ఇంటి వద్ద పోలీస్ పికెట్ సాధ్యం కాకుంటే.. ప్రతి రెండు గంటలకోసారి భద్రత పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని స్పష్టం చేసింది. అలాగే మోహన్బాబు, విష్ణులకు రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులను నిలిపివేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. మోహన్బాబు పిటిషన్తో..: తనపై దాడి చేశారంటూ మోహన్బాబు కుమారుడు, నటుడు మంచు మనోజ్ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పహాడీ షరీఫ్ పోలీసులు.. బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని మోహన్బాబు, విష్ణు, మనోజ్లకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులను సవాల్ చేస్తూ మోహన్బాబు బుధవారం హైకోర్టులో లంచ్మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఆస్పత్రిలో ఉన్నానని.. ఈ పరిస్థితుల్లో పోలీసుల విచారణకు హాజరుకాలేనని కోర్టుకు వివరించారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున హోంశాఖ జీపీ మహేశ్రాజే వాదనలు వినిపిస్తూ.. పరస్పర ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసులు నమోదయ్యాయని వివరించారు. అలాగే జర్నలిస్టుపై దాడి చేసినందుకు మోహన్బాబుపై మరో క్రిమినల్ కేసు నమోదైందని తెలిపారు. ఇక మనోజ్ బౌన్సర్లను తీసుకొచ్చి మోహన్బాబు ఇంట్లో తగాదా సృష్టిస్తున్నారని మోహన్బాబు తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. బీఎన్ఎస్ఎస్, సెక్షన్ 126 ప్రకారం రాచకొండ పోలీస్ కమిషనర్ జారీ చేసిన నోటీసులను కొట్టివేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రాచకొండ పోలీసుల ఎదుట మోహన్బాబు, విష్ణు హాజరుకావాలన్న నోటీసులను నిలిపివేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా మోహన్బాబు ఇంటి చుట్టూ నిఘా ఉంచాలని పోలీసులను ఆదేశించారు. ఇక కుటుంబ వివాదంలో మీడియా ఎందుకింత హంగామా సృష్టిస్తోందని న్యాయమూర్తి ప్రశ్నించారు. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలతో పరువుకు నష్టం కలిగించొద్దని సూచించారు. -
హైకోర్టులో మోహన్ బాబుకు భారీ ఊరట!
హైకోర్టులో మంచు మోహన్బాబు భారీ ఊరట లభించింది. రాచకొండ పోలీసుల నోటీసులపై స్టే ఇవ్వాలని మోహన్బాబు ఈరోజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ ప్రారంభించిన ధర్మాసనం.. మోహన్ బాబుకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. నిన్న జరిగిన గొడవ మోహన్ బాబు కుటుంబం వ్యవహారం అని ధర్మాసనం అభిప్రాయపడింది. మోహన్ బాబు ఇంటిని సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని పోలీసులు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 24కు వాయిదా వేసింది. అప్పటి వరకు పోలీసుల ముందు హాజరుకు కోర్టు మినహాయింపు ఇచ్చింది. కాగా, మోహన్ బాబు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలోల కోర్టు పోలీసుల ముందు హాజరు నుంచి తాత్కాలికంగా మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.కాలి నొప్పితో బాధపడుతున్న మోహన్ బాబుఅనారోగ్య సమస్యలతో మోహన్ బాబు.. మంగళవారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు వైద్యం అందిస్తున్నారు. ఆయన మెడ, కాలి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్న డాక్టర్ గురునాథ్ కూడా తాజాగా మీడియాతో మాట్లాడుతు ఇదే విషయాన్ని చెప్పారు. 'మెడ, కాలిలో నొప్పితో పాటు బీపీ ఎక్కువయ్యేసరికి మోహన్ బాబు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రంతా ఆయనకు నిద్రలేదు. బీపీలో ఇప్పటికే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం' అని చెప్పుకొచ్చారు. -
భర్తపై తప్పుడు కేసు.. సుప్రీం కోర్టు సీరియస్
భార్య పెట్టిన వేధింపులు భరించలేక అతుల్ సుభాష్ అనే బెంగళూరు టెక్కీ బలవనర్మణానికి పాల్పడడం.. నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. తాను రాసిన సూసైడ్ నోట్ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరాలన్నది అతని కోరిక. అయితే ఈ ఘటన జరిగి 48 గంటలు గడవకముందే.. వైవాహిక చట్టాల దుర్వినియోగంపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.న్యూఢిల్లీ: వ్యక్తిగత పగలతో భర్త, అతని కుటుంబంపై ఓ మహిళ ‘‘వరకట్న వ్యతిరేక చట్టం’’ ప్రయోగించడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఇది అవసరంగా భర్తలను వేధించడం కిందకే వస్తుందని, ఇలాంటి కేసుల విషయంలో ఇకపై తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించింది. ‘‘498ఏ సెక్షన్(వరకట్న వ్యతిరేక చట్టం).. గృహ హింస, వరకట్న వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడానికే. కానీ, ఈ మధ్యకాలంలో మార్పు కనిపిస్తోంది. చాలామంది మహిళలు తమ గొంతెమ్మ కోర్కెలు నెరవేర్చుకోవడానికి దీనొక్క ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి ధోరణిని ఎంతమాత్రం సహించబోం’’ అని జస్టిస్ బీవీ నాగరత్న, ఎన్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం పేర్కొంది.ఇదీ చదవండి: పేజీల కొద్దీ సూసైడ్ నోట్.. కదిలించిన ఓ భర్త గాథతెలంగాణకు చెందిన ఓ వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. అయితే ఆ తర్వాత ఆ భార్య.. భర్త, అతని కుటుంబం తనను వేధిస్తోందంటూ 498ఏ కింద వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఆ భర్త హైకోర్టును ఆశ్రయించినా.. ఊరట దక్కలేదు. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే తమ పరిశీలనలో ఈ విషయం గుర్తించిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.‘‘ఇక్కడ వ్యక్తిగత కక్షతో భర్తపై ఆమె చట్టాన్ని ఆయుధంగా ప్రయోగించాలనుకుంది. ఈ కేసులో భర్తపై నిరాధార ఆరోపణలు చేసిందామె. భర్తను, అతని కుటుంబాన్ని వేధించాలనే ఆమె ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి కేసుల్లో విచారణ సజావుగా జరగాలి. లేకుంటే.. చట్టప్రక్రియల దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు విఫలమైంది. ఈ కేసును కొట్టివేయకపోవడం ఆ ఉన్నత న్యాయస్థానం చేసిన తీవ్ర తప్పిదం.’’ అని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే.. అలాగని.. అన్ని కేసులపై తాము ఈ వ్యాఖ్య చేయడం లేదని, ఇలాంటి వైవాహిక చట్టాల్ని దుర్వినియోగం చేయడంపై మా ఆందోళన’’ అని న్యాయమూర్తులిద్దరూ స్పష్టం చేశారు.ఐపీసీ సెక్షన్ 498ఏ.. జులై 1వ తేదీ నుంచి కాలం చెల్లింది. ఆ స్థానంలో భారతీయ న్యాయ సంహిత(BNS) సెక్షన్ 86 అందుబాటులోకి వచ్చింది. ఈ సెక్షన్ ప్రకారం గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఘటన జరిగిన మూడేళ్లలోపు ఎప్పుడైనా ఫిర్యాదు నమోదు చేయొచ్చు. -
యథావిధిగా గ్రూప్–2
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయలేమ ని హైకోర్టు తేల్చిం చెప్పింది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినందున స్టే ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. యథావిధిగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్కు స్ప ష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. ఈ నెల 16, 18 తేదీల్లో జరగనున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ ఆర్బీ) పరీక్షల దృష్ట్యా 16న జరగనున్న గ్రూప్–2 పేపర్–3, పేపర్–4 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా దంపిల్లపల్లికి చెందిన రావుల జ్యోతితోపాటు మరో 21 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ అంశంపై కమిషన్కు నవంబర్ 25నే వినతిపత్రం సమ ర్పించినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కోర్టుకెక్కారు. ఈ పిటిషన్పై జస్టిస్ పుల్ల కార్తీ క్ సోమవారం విచారణ చేపట్టారు. టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాది స్తూ 15, 16న జరగనున్న గ్రూప్–2 పరీక్షలకు దాదాపు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని.. ఇప్పటికే పరీక్షల నిర్వ హణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పారు. స్టే కోరుతున్న వారి కోసం పరీక్షలను వాయిదా వేస్తే లక్షల మంది ఇబ్బందిపడతారని నివేదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ దశలో గ్రూప్–2 పరీక్షను నిలిపేయలేమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ జీఏడీ ముఖ్య కార్యదర్శి, టీజీపీఎస్సీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు నోటీసులు జారీ చేశారు.గ్రూప్–2 హాల్టికెట్లు విడుదల గ్రూప్–2 పరీక్షల కోసం తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ సోమవారం హాల్టికెట్లను విడుదల చేసింది. కమిషన్ వెబ్సైట్లో వాటిని అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ సూచించారు. హాల్టికెట్ల డౌన్లోడ్లో ఏవైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించేందుకు జిల్లాలవారీగా హెల్ప్లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ హెల్ప్లైన్ నంబర్లు 040–22445566/ 23542185/23542187కు కాల్ చేసి లేదా helpdesk@tspsc.gov.in కు ఈ–మెయిల్ చేయాలని సూచించారు. తొలిరోజే లక్ష మందికిపైగా అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. -
చెన్నమనేని జర్మనీ పౌరుడే
సాక్షి, హైదరాబాద్: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చె న్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది. భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ 2019లో జారీ చేసిన నోటిఫికేషన్ను సమర్థించింది. తప్పుడు పత్రాలతో గత 15 ఏళ్లుగా న్యాయస్థానాన్ని, అధికారులను తప్పుదోవ పట్టించారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరుడినని తెలిసినా పలు పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేశారని మండిపడింది.ఇందుకుగాను ఆయనకు హైకోర్టు చరిత్రలోనే తొలి సారిగా ఏకంగా రూ. 30 లక్షల భారీ జరిమానా విధించింది. ఇందులో ఆది శ్రీనివాస్ (ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో రమేశ్ ప్రత్యర్థి)కు రూ. 25 లక్షలు, హైకోర్టు లీగల్ సర్విసెస్ కమిటీకి రూ. 5 లక్షలు చెల్లించాలని రమేశ్ను ఆదేశించింది. చెల్లింపునకు నెల రోజులు గడువు విధించింది. 2009లో తొలిసారి వేములవాడ నుంచి ఎ మ్మెల్యేగా విజయం సాధించింది మొదలు చెన్నమ నేని భారతీయ పౌరుడా కాదా అనే వివాదం కొన సాగుతోంది.ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ దీనిపై తొలి నుంచీ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జర్మనీ పౌరసత్వం కారణంగా రమేశ్ భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ 2019 నవంబర్లో నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ అదే సంవత్సరం ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ఐదేళ్లపాటు సాగిన విచారణ అనంతరం న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి అక్టోబర్లో తీర్పు రిజర్వు చేసి సోమవారం తీర్పు వెలువరించారు. ఆయన ఎన్నిక కూడా చెల్లదన్న ఆది శ్రీనివాస్ చెన్నమనేని ఇరుదేశాల పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్కుమార్ వాదించారు. ‘రెండుచోట్ల వివిధ కేటగిరీల కింద పౌరసత్వం కలిగి ఉండటాన్ని మన చట్టాలు అనుమతించవు. విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయుడు ఎన్నటికీ ఇక్కడ ఎమ్మెల్యే కాలేరు. తన పౌరసత్వ సమస్య 2009 నుంచి పెండింగ్లో ఉన్నా చెన్నమనేని రమేశ్ రెండు పౌరసత్వాలలో ఒకదాన్ని వదులుకోలేదు’అని వారు గుర్తుచేశారు.చెన్నమనేని రమేశ్ క్లెయిమ్ చేస్తున్న రెండు విభిన్న రకాల పౌరసత్వాలకు సంబంధించిన ఆధారాలు, పత్రాలను న్యాయమూర్తికి సమరి్పంచారు. రమేశ్ పౌరసత్వాన్ని కొనసాగించడం ‘ప్రజాప్రయోజనాలకు అనుకూలం కాదు’అని కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరించారు. మరోవైపు ఆది శ్రీనివాస్ తరఫు న్యాయవాది రవికిరణ్రావు వాదిస్తూ ‘ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డుతో చెన్నమనేని రమేశ్ జర్మనీకి అనేకసార్లు వెళ్లారు. జర్మనీ పౌరసత్వంతోనే ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నిక కూడా చెల్లదు’అని పేర్కొన్నారు. ఆ అధికారం కేంద్రానికి లేదని వాదించిన రమేశ్ మరోవైపు చెన్నమనేని రమేశ్ తరఫున న్యాయవాది రామారావు వాదిస్తూ ‘చెన్నమనేని జర్మనీ పౌరసత్వాన్ని వదులుకున్నారు. జర్మనీ పాస్పోర్టుతో ప్రయాణించినంత మాత్రాన ఆ దేశ పౌరసత్వం ఉన్నట్లు కాదు. దేశ సార్వ¿ౌమత్వానికి విఘాతం కలిగించిన వారి పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉంది. కానీ రమేశ్ అలాంటి చర్యలకు పాల్పడలేదు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకోవాలి. చెన్నమనేని రమేశ్ పౌరసత్వ రద్దు నోటిఫికేషన్ను కొట్టేయాలి’అని కోరారు.అప్పీల్కు వెళ్లడాన్ని పరిశీలిస్తా: చెన్నమనేనిహైకోర్టు తీర్పు తీవ్ర నిరాశపరిచిందని చెన్నమనే ని రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సో మవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రా జకీయ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మిత్రులు, శ్రేయోభిలాషుల సహకారంతో ముందుకు నడిచానని.. నాలుగుసార్లు ఎన్నికల్లో గెలిచానని గుర్తుచేశారు. వరుస ఓటములను జీర్ణించుకోలేక రాజకీయ ప్రత్యర్థులు తన పౌరసత్వంపై కేసులు వేశారని చెన్నమనేని ఆరోపించారు. ఇలాంటి కేసులను గతంలోనే హైకోర్టు, సుప్రీంకోర్టులో విజయవంతంగా ఎదుర్కొన్నానని.. తాజా తీర్పుపై అప్పీల్ చేసే అంశాన్ని పరిశీలిస్తానన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ వేములవాడ అభివృద్ధికి సహకరిస్తూనే ఉంటానని పేర్కొన్నారు -
చెన్నమనేని రమేష్ కు చుక్కెదురు
-
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనికి బిగ్ షాక్.. హైకోర్టు ఝలక్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వంపై ఆయన వేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా రమేష్పై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఆయనకు 30 లక్షలు జరిమానా విధించింది.బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు హైకోర్టులో చుక్కెదురైంది. పౌరసత్వం విషయంలో రమేష్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. పదిన్నర సంవత్సరాల పాటు ఈ పిటిషన్పై సుదీర్ఘ విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెన్నమనేనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాదనల సందర్బంగా కోర్టును తప్పుదోవ పట్టించినందుకు హైకోర్టు సీరియస్ అయ్యింది. ఆయన పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నట్టు తెలిపింది. రమేష్ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు.. ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించారు. కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.జర్మనీ పౌరసత్వంతోనే ఆయన అక్కడికి వెళ్లారని కోర్టు తెలిపింది. దీంతో, చెన్నమనేనికి రూ.30 లక్షలు జరిమానా విధించింది. జరిమానాలో రూ.25 లక్షలు కాంగ్రెస్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ఇవ్వాలని తెలిపింది. మిగిలిన రూ.5లక్షలను హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశం. నెల రోజుల్లో చెల్లింపులు పూర్తిచేయాలని చెన్నమనేనికి సూచించింది. -
కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా?
సాక్షి, హైదరాబాద్: కోర్టు ఆదేశాలను ధిక్కరించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, గండిపేట మండల తహసీల్దార్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. గండిపేట మండలం నార్సింగిలోని సర్వే నంబర్ 340/4/1లో ఉన్న రెండెకరాల వివాదాస్పద భూమిపై స్టేటస్ కో ఆదేశాలున్నా.. అధికారులు ఆ భూమిపై ఓ సంస్థకు పట్టాదారు పాస్బుక్ జారీచేయటంపై మండిపడింది. ఈ భూమిపై చాలాకాలంగా వివాదం నడుస్తున్నది. సదరు భూమిపై 2014లోనే హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలిచ్చింది. కానీ, 2023 అక్టోబర్లో ధరణి పోర్టల్లో ఆ భూమి ఇండ్రస్టియల్ ఆయిల్ ప్యూరిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందినదిగా గుర్తిస్తూ అధికారులు పట్టాదార్ పాస్బుక్ జారీచేశారు. ఈ చర్యపై పిటిషనర్ సంస్థ ఏషియన్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మళ్లీ కోర్టుకు వెళ్లింది.1998లో చట్టపరంగా సదరు రెండెకరాల భూమిని కొనుగోలు చేశామని ఆ కంపెనీ వాదిస్తున్నది. ఈ అంశంపై తాజాగా విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం పిటిషనర్కు నోటీసులైనా ఇవ్వకుండా ఇండ్రస్టియల్ ఆయిల్ ప్యూరిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట పాస్బుక్ ఎలా జారీ చేశారని ప్రశ్నించారు. స్టేటస్కో ఆదేశాలను పాటించకపోవడం చిన్నం పాండురంగం కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని స్పష్టంచేశారు. ‘కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా? గతంలో స్టేటస్ కో ఆదేశాలిచి్చనా మీ ఇష్టం వచి్చన వారిని ధరణి పోర్టల్లో చేర్చి పాస్బుక్ జారీ చేస్తారా? ఈ విషయంలో కలెక్టర్తోపాటు ఆర్డీవో, తహసీల్దార్ అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది.ఇది ఇలాగే కొనసాగితే న్యాయవ్యవస్థపై కూడా ప్రజలకు నమ్మకం పోతుంది. రెవెన్యూ అధికారుల సహకారం లేకుండా ఈ పనులు జరగవు. ఇండ్రస్టియల్ ఆయిల్ ప్యూరిఫికేషన్ పేరున రెండెకరాల భూమిని ధరణి పోర్టల్లో చేర్చి పాస్బుక్ జారీ చేయడం చట్టవిరుద్ధం. 2014లో ఈ కోర్టు ఇచి్చన ఆదేశాల మేరకు రెవెన్యూ రికార్డులన్నీ నాలుగు వారాల్లో పిటిషనర్ పేరిట మార్చాలి. ఈ అక్రమాల్లో పాలు పంచుకున్న అధికారులపై విచారణ జరిపి క్షమశిక్షణా చర్యలు తీసుకోవాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తున్నాం. భూమిని పొందేందుకు ఇండ్రస్టియల్ ఆయిల్ ప్యూరిఫికేషన్ సంస్థ మోసపూరిత చర్యలకు పాల్పడింది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆ సంస్థకు రూ.5 లక్షలు జరిమానా విధిస్తున్నాం. ఆ సొమ్మును నాలుగు వారాల్లో హైకోర్టు లీగల్ సరీ్వసెస్ కమిటీలో జమ చేసి.. రిసీట్ను కోర్టు రిజిస్ట్రీకి సమరి్పంచాలి’ అని ఆదేశించారు. -
ముదురుతున్న వివాదం.. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహ వివాదం ముదురుతోంది. విగ్రహ ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన నిలిపివేయాలని జూలూరి గౌరీశంకర్ పిటిషన్ వేశారు. విగ్రహంలో మార్పులను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలైంది. విగ్రహంలో మార్పులంటే తెలంగాణ అస్తిత్త్వంపై జరుగుతున్న దాడిగా పిటిషన్లో పేర్కొన్నారు.కాగా, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘రేవంత్ ప్రతిష్టిస్తోంది.. తెలంగాణ తల్లినా? కాంగ్రెస్ తల్లి విగ్రహాన్నా? విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం మాకు మ్యాటర్ కాదు.. తెలంగాణ తల్లి మాకు మ్యాటర్. తెలంగాణ తల్లి విగ్రహం అంటే రేవంత్ రెడ్డి ఇంట్లో కార్యక్రమం కాదంటూ మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? ప్రభుత్వాలు మారినపుడల్లా గత ప్రభుత్వం నిర్ణయాలు మారాలా?’’ అంటూ ప్రశ్నించారు.ఇదీ చదవండి: విగ్రహావిష్కరణకు రండి.. కేసీఆర్కు రేవంత్ సర్కార్ ఆహ్వానంమరోవైపు, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ తొమ్మిదో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వద్ద విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక ఫొటో బయటకు వచ్చింది. ఈ ఫొటోలో ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. మెడలో కంటె, బంగారు ఆభరణాలు ఉన్నాయి. అలాగే, ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న కంకులు, జొన్నలు ఉన్నాయి. చెవులకు కమ్మలతో నిండుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. -
ములుగు ఎన్కౌంటర్: మధు మృతదేహం అప్పగింతకు ఆదేశం
హైదరాబాద్, సాక్షి: ములుగు జిల్లా ఏటూరు నాగారం మావోయిస్టుల ఎన్కౌంటర్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. మల్లయ్య అలియాస్ మధు మృతదేహాన్ని కూడా భార్య ఐలమ్మకు అప్పగించాలని ఆదేశించింది. శుక్రవారం(నవంబర్ 6) మధ్యాహ్నాంలోగా అప్పగింత పూర్తి చేయాలని.. మృతదేహంపై గాయాలుంటే గనుక ఫొటోలు, వీడియోలు తీయాలని స్పష్టం చేసింది. ఏటూరునాగారం మావోయిస్టుల ఎన్కౌంటర్పై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. గత విచారణలో.. ఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు మావోయిస్టుల్లో ఈగోలాపు మల్లయ్య అలియాస్ మధు తప్ప మిగిలిన ఆరుగురి మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో.. మల్లయ్య మృతదేహం అప్పగించకపోవడంతో.. భార్య ఐలమ్మ అలియాస్ మీనా హైకోర్టును ఆశ్రయించారు.గత విచారణలో.. ‘‘ఈ ఎన్కౌంటర్ బూటకమని, మావోయిస్టులు తినే ఆహారంలో మత్తుపదార్థాలు కలిపి చిత్రహింసలు పెట్టి చంపారు’’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది సురేష్ కుమార్. అలాగే.. శవ పంచనామాలో కుటుంబసభ్యులను అనుమతించలేదని, పోస్ట్మార్టం ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో జరగలేదని పేర్కొన్నారు. మల్లయ్య మృతదేహాన్ని చూడటానికి ఐలమ్మను కేవలం 10 నిమిషాలే అనుమతించారని, ఈ కొద్ది సమయంలోనే ఆమె తన భర్త మృతదేహంపై దాదాపు 11 గాయాలను గుర్తించారని తెలిపారు. శవ పంచనామాకు పిటిషనర్ను అనుమతించలేదన్నారు. ఎన్హెచ్చార్సీ మార్గదర్శకాల ప్రకారం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో శవ పంచనామా జరిపించేలా ఆదేశించాలని కోరారు. ఇది ఎన్కౌంటర్ కాదని.. కస్టోడియల్ డెత్ అని ఆరోపించారు. వాదనలు నమోదు చేసుకున్న విజయ్సేన్రెడ్డి ధర్మాసనం.. పిటిషనర్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆమె భర్త మల్లయ్య మృతదేహం తప్ప మిగితావాళ్లవి వారి బంధువులు అడిగితే అప్పగించాలని స్పష్టం చేసింది. పోస్ట్మార్టం ఎగ్జామినేషన్, శవపంచనామా నిర్వహణలో అనుసరించిన విధానంపై సంక్షిప్త వివరాలు సమర్పించాలని పేర్కొంది. ఇవాళ.. మృతదేహం అప్పగింతపై ఆదేశాలిచ్చింది.చల్పాక-ఐలాపూర్ అటవీ ప్రాంతంలో ఈ నెల 1న జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు మరణించిన ఘటనపై కలెక్టర్ దివాకర ఇదివరకే విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా ములుగు ఆర్డీవో వెంకటేశ్ను నియమించారు. -
TG: మధ్యాహ్న భోజనంపై పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం వడ్డించాలని కోర్టు ఆదేశించింది. భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థతకు గురైన ఘటనల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది.భోజనం వికటించిన ఘటనల్లో రెండు కమిటీలు ఏర్పాటు చేసినట్లు ఏఏజీ కోర్టుకు తెలిపారు. బాధ్యులను వాళ్లను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. నాణ్యమైన భోజనాన్ని అందించడానికి ఏజెన్సీలకు చెల్లించే డబ్బులను 40 శాతం పెంచామని ఏఏజీ తెలిపారు.పీఎం పోషణ్ పథకంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలుండాలన్న పిటిషనర్ తరఫు న్యాయవాది.. కమిటీల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. కమిటీలు సరిగ్గా పనిచేసేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. అన్ని కమిటీలు పనిచేస్తున్నాయని ఏఏజీ చెప్పారు. ఏఏజీ చెప్పిన వివరాలను హైకోర్టు నమోదు చేసుకుంది. -
హైకోర్టులో హరీష్ రావుకు ఊరట
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు ఊరట లభించింది. పంజాగుట్ట పోలీసు స్టేషన్లో హరీష్పై నమోదైన కేసులో ఆయనను అరెస్ట్ చేయవద్దంటూ కోర్టు ఆదేశించింది.వివరాల ప్రకరారం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పంజాగుట్ట పీఎస్లో నమోదైన కేసుపై ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్బంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హరీష్ను పోలీసులు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశించింది. నోటీసులు ఇచ్చి విచారించుకోవచ్చు అని తెలిపింది. -
‘రిమాండ్’ను కొట్టివేయలేం
సాక్షి, హైదరాబాద్: లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికి జిల్లాకోర్టు విధించిన రిమాండ్ను కొట్టివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పట్నం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని.. తామిచ్చిన ఉత్తర్వుల ప్రభావం ఉండబోదని ఆదేశించింది. మెరిట్స్ ఆధారంగా తీర్పు వెలువరించాలని ట్రయల్ కోర్టుకు సూచించింది. పిటిషన్ను కొట్టివేసింది. లగచర్ల ఘటనలో తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు డాకెట్(రిమాండ్) ఆర్డర్ను క్వాష్ చేయాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గత నెల తీర్పు రిజర్వు చేశారు. పిటిషన్ను కొట్టివేస్తూ బుధవారం తీర్పునిచ్చారు. అయితే, బెయిల్ పిటిషన్పై వికారాబాద్ కోర్టు చేసిన వ్యాఖ్యలను నరేందర్రెడ్డి న్యాయవాది జస్టిస్ కె.లక్ష్మణ్ దృష్టికి తీసుకొచ్చారు. బెయిల్ పిటిషన్లు తమ పరిధిలోకి రావని స్పెషల్ కోర్టు చూస్తుందని వెల్లడించిందన్నారు. దీంతో స్పెషల్ కోర్టు వివరాలు తెలపాలని న్యాయమూర్తి నరేందర్రెడ్డి న్యాయవాదిని ఆదేశించారు. గత నెల 13న నరేందర్రెడ్డిని అరెస్టు చేయగా, ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న విషయం తెలిసిందే. -
హైకోర్టు ఆదేశాలు : షకీల్ కుమారుడు విచారణకు సహకరించాల్సిందే
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ పోలీసుల విచారణకు హాజరు కావాల్సిందే తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16 న పంజాగుట్ట పోలీసుల ఎదుట సాహిల్ హాజరు కావాలని సూచించింది. గతంలో, ప్రజా భవన్ గేట్లను తన కారుతో ఢీకొట్టాడంటూ సాహిల్పై పంజాగుట్ట పోలీసులకు కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో సాహిల్ దుబాయ్ వెళ్లాడు. అక్కడే ఉంటున్నాడు. అయితే, ఈ కేసుపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా సాహిల్ దుబాయ్ నుండి హైదరాబాద్ రావాల్సిందేనని.. పోలీసుల విచారణకు సహకరించాలని సాహిల్కు ఆదేజాలు జారీ చేసింది. అసలేం జరిగిందంటే గత డిసెంబర్ నెల 23వ తేదీన వేకువజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ ప్రజా భవన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రజా భవన్ ఎదుట ఉన్న ట్రాఫిక్ బారికేడ్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం కాగా వాహనం మితిమీరిన వేగానికి కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు ఆగగానే అందులో నుంచి ఒకరు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వాహనంలో ఉన్న మిగిలినవారిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం నిందితులను పంజాగుట్ట పీఎస్కు తరలించారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు సాహిల్ ఈ విధ్వంసం సృష్టించినట్లు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు పై విధంగా స్పందించింది. దీంతో, కోర్టు ఆదేశాలతో సాహిల్ దుబాయ్ నుంచి హైదరాబాద్ రానున్నాడు. -
‘కుట్ర’ కేసు కొట్టేయండి.. హైకోర్టులో హరీష్రావు పిటిషన్
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్స్టేషన్లో తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ వేశారు. సిద్ధిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిసెంబర్ 1న హరీష్రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారంటూ హరీష్రావు తన పిటిషన్లో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసి సంబంధం లేని కేసు పెట్టారంటూ పేర్కొన్న హరీష్ రావు.. కేసు కొట్టివేయడంతో పాటు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు.తన, కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారని, తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి కుట్రతో అక్రమ కేసులు పెట్టారని... రియల్ ఎస్టేట్ వ్యాపారి జి.చక్రధర్గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో హరీష్రావుపై ఈ కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి, రిమాండ్లో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్రావును సైతం నిందితుడిగా చేర్చారు. వివిధ సెక్షన్ల కింద ఆదివారమే ఎఫ్ఐఆర్ నమోదవగా.. ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది.పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. ‘‘సిద్దిపేటకు చెందిన చక్రధర్గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. 2022 సెప్టెంబర్ 25న సిద్దిపేటలోని కొండ భూదేవి గార్డెన్స్లో చక్రధర్.. ఆత్మహత్యలకు పాల్పడ్డ వంద మంది కౌలురైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఆ తర్వాత మరో 150 మందికి రూ.లక్ష నగదు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో భవిష్యత్తులో చక్రధర్గౌడ్ తనకు పోటీ అవుతారని హరీశ్రావు భావించారు.అనంతరం సిద్దిపేట జిల్లాలో ‘అగ్గిపెట్టె మచ్చా‘ పేరిట మ్యాచ్బాక్స్ కంపెనీని ప్రారంభించనున్నట్టు చక్రధర్గౌడ్ ప్రకటించారు. దీనితో హరీశ్రావు చక్రధర్పై శామీర్పేట పోలీసుస్టేషన్లో తప్పుడు కేసు నమోదు చేయించి, అరెస్టు చేయించారు. అయితే 2023 మార్చి 15న చక్రధర్ బీజేపీలో చేరారు. అదే ఏడాది ఏప్రిల్ 28న హైదరాబాద్లోని పంజగుట్ట నాగార్జున సర్కిల్లో చక్రధర్కు చెందిన ‘ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్’ ఆఫీసుకు మఫ్టీలో వచ్చిన పోలీసులు ఆయనను టాస్క్ఫోర్స్ ఓఎస్డీగా ఉన్న పి.రాధాకిషన్రావు ముందు హాజరుపర్చారు.ఆయన చక్రధర్ను తీవ్రస్థాయిలో బెదిరించి, హరీశ్రావు అనుమతి లేకుండా సిద్దిపేట నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని హెచ్చరించారు. ఒకసారి పోలీసులు చక్రధర్ ఐఫోన్ తీసుకుని, తర్వాత తిరిగిచ్చారు. ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా వివరాలన్నీ తెలుసుకుని చక్రధర్ను, అనుచరులను బెదిరించారు. గతంలో మంత్రిగా పనిచేసిన హరీశ్రావు అధికార దురి్వనియోగానికి పాల్పడి ఈ చర్యలకు పాల్పడ్డారు’’ అని పోలీసులు ఎఫ్ఆర్లో పేర్కొన్నారు. -
పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
-
హైకోర్టు ఝలక్.. పట్నం నరేందర్ రెడ్డికి ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. లగచర్ల ఘటన తన రిమాండ్ను సవాల్ చేస్తూ నరేందర్ రెడ్డి.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన రిమాండ్ను క్వాష్ చేయాలని ఆయన పిటిషన్ కోరారు. ఈ నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ను తాజాగా తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇక, లగచర్ల ఘటనకు సంబంధించిన కేసులో నరేందర్ రెడ్డి ఏ1గా ఉన్న విషయం తెలిసిందే. నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. ఇదే సమయంలో పట్నం బెయిల్పై మెరిట్ ఆధారంగా వికారాబాద్ కోర్టు నిర్ణయం తీసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. -
ములుగు ఎన్కౌంటర్పై హైకోర్టులో విచారణ.. రేపటికి వాయిదా
సాక్షి,హైదరాబాద్ : ఆదివారం (డిసెంబర్ 1) ఉదయం 6.15 గంటల సమయంలో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక సమీప పొలకమ్మ వాగు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు–గ్రేహౌండ్స్ బలగాల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ప్రకటించారు. మృతుల్లో తెలంగాణకు చెందిన ఒక మావోయిస్టు ఉండగా మిగతా ఆరుగురు ఛత్తీస్గఢ్కు చెందిన వారని ఆయన తెలిపారు.అయితే, చెల్పాక ఎన్కౌంటర్పై పోలీసులు, రేవంత్ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర పౌరహక్కుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెల్పాక ఎన్కౌంటర్ బూటకమని ఆరోపిస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. పౌరహక్కుల సంఘం పిటిషన్పై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ విచారణ సందర్భంగా పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది వాదించారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకున్నారని, ఆ తర్వాత చిత్ర హింసలకు గురిచేసి ప్రాణలు తీసినట్లు తెలిపారు. మృతదేహాలను కనీసం కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్టుమార్టం కోసం తరలించారన్న న్యాయవాది..ఎన్హెచ్ఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని కోర్టు ఎదుట తమ వాదనలు వినిపించారు. అయితే, అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా మృతదేహాలను వెంటనే ములుగు ఆస్పత్రికి తరలించామని ప్రభుత్వ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాకతీయ మెడికల్ కళాశాలకు చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరిగిందని,ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీశామని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మృతదేహాలను రేపటి వరకు భద్ర పర్చాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆ భద్రపరిచిన మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. -
అనర్హులను ఎలా నియమిస్తారు?
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులతో తొలగింపునకు గురైన 1,200 మందిని కాంట్రాక్టు పద్ధతిలో బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తలుగా విధుల్లోకి తీసుకోవడం చట్టవిరుద్ధమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013లో జారీ చేసిన జీవో 1207ను కొట్టివేసింది. బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తల నియామకంపై 2002లో అర్హతల వివాదం నెలకొనగా, నిబంధనలకు విరుద్ధంగా సర్కార్ జీవోలు జారీ చేసి, నియామకాలు చేపట్టడం సరికాదని పేర్కొంది. ఈ అంశాన్ని ఉన్నత, అత్యున్నత న్యాయస్థానాలు తప్పుబట్టిన విషయాన్ని గుర్తు చేసింది. అర్హతలకు సంబంధించి న్యాయస్థానాలు తీర్పులు వెలువరించిన తర్వాత వాటికి విరుద్ధంగా మళ్లీ జీవో తీసుకురావడాన్ని తప్పుబట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించలేమని, వారి తప్పును కొనసాగించలేమని వ్యాఖ్యానిస్తూ.. ఈ ఉత్తర్వులు వెలువడిన 90 రోజుల్లోగా అర్హులతో జాబితా రూపొందించి చర్యలు చేపట్టాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు తేల్చిచెప్పింది. అర్హులైన వారిని కొనసాగించవచ్చని పేర్కొంది. బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తల నియామకానికి సంబంధించి 2002లో ఇచి్చన నోటిఫికేషన్ వివాదాస్పదమైంది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. గుర్తింపు పొందిన సంస్థ నుంచి హెల్త్ అసిస్టెంట్లుగా డిప్లొమా చేసిన వారినే అర్హులుగా పరిగణించాలని స్పష్టం చేసింది. ఆ మేరకే మెరిట్ జాబితా రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు కూడా ఇదే తీర్పును సమర్థించింది. దీంతో ప్రభుత్వం సరైన అర్హతలు లేని 1,200 మందిని తొలగిస్తూ జీవో జారీ చేసింది. అయితే ఇంత మందిని ఒకేసారి తొలగించాల్సి రావడంతో ప్రభుత్వం వీరందరినీ కాంట్రాక్టు విధానంలో తీసుకుంటూ జీవో 1207 జారీ చేసింది. దీనిపై కొందరు నాడు ఏపీ పరిపాలన ట్రిబ్యునల్లో పిటిషన్లు దాఖలు చేయగా, సర్కార్ నిర్ణయం సబబేనని చెప్పింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఖాళీలుంటే నిబంధనల మేరకు భర్తీ.. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ‘కేవలం 9 ఏళ్లు (2002 నుంచి) సర్వీస్ చేశారన్న కారణంగా సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ధారించిన అర్హతలు లేని వారిని కాంట్రాక్టు విధానంలో తీసుకోవడం సరికాదు. రెగ్యులర్, కాంట్రాక్టు విధానం.. ఏ నియామకమైనా అర్హతలు పాటించాల్సిందే. ఒకసారి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడం చెల్లదు.ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే.. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ఉత్తర్వులిచ్చినట్లే అవుతుంది. 1,200 మందిని కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవడం తప్పుబట్టాల్సిందే. 90 రోజుల్లో అర్హులతో జాబితా రూపొందించాలని తెలంగాణ, ఏపీ సర్కార్లను ఆదేశిస్తున్నాం. అర్హులను కొనసాగింపుపై చర్యలు తీసుకోవచ్చు. ఒకవేళ ఇంకా ఖాళీలు ఉంటే చట్టప్రకారం నిబంధనలు పాటిస్తూ నియామకాలు చేపట్టవచ్చు’అని తీర్పులో స్పష్టం చేసింది. -
ఒకే ఎఫ్ఐఆర్పై విచారణ చేపట్టండి
సాక్షి, హైదరాబాద్: లగచర్ల ఘటనకు సంబంధించి బొంరాస్పేట్ పోలీస్స్టేషన్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిపై ఒకే ఎఫ్ఐఆర్(153/2024)తో దర్యాప్తు జరపాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అయితే ఫిర్యాదు చేసిన దుద్యాల తహసీల్దార్ కర్ర కిషన్, వికారాబాద్ డీఎస్పీ బి.జానయ్యల స్టేట్మెంట్ రికార్డు చేయొచ్చని దర్యాప్తు అధికారికి స్వేచ్ఛనిచి్చంది. ఒకవేళ ఇప్పటికే రికార్డు చేస్తే వాటిని కూడా 153 ఎఫ్ఐఆర్ కింద తీసుకున్నట్టే పరిగణించాలని స్పష్టం చేసింది. నరేందర్రెడ్డి పిటిషన్ను అనుమతించింది.ఈ నెల 11న లగచర్లలో కలెక్టర్ సహా పలువురు అధికారులపై జరిగిన దాడి వెనుక నరేందర్రెడ్డి ఉన్నారని ఎఫ్ఐఆర్ 153 నమోదు చేసిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత తహసీల్దార్ ఫిర్యాదు మేరకు 154, డీఎస్పీ ఫిర్యాదు మేరకు 155 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వేర్వేరు వ్యక్తుల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద 3 వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇది టీటీ ఆంటోని వర్సెస్ కేరళ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పునకు విరుద్ధమంటూ నరేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి కె.లక్ష్మణ్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ‘మూడు ఎఫ్ఐఆర్లలో పిటిషనర్ పేరు లేదు. అతనిపై వచి్చన ఏకైక ఆరోపణ కుట్ర.మూడు ఘటనల్లోనూ భౌతికంగా ఉన్నాడని, దాడిలో పాల్గొన్నాడని అతనిపై ఎలాంటి ఆరోపణ లేదు. వాస్తవాలను పరిశీలిస్తే.. 3 నేరాల్లో పిటిషనర్ను ఇరికించడానికి ప్రతివాదులు ప్రయతి్నస్తున్నట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఒకే ఘటనలో బహుళ ఎఫ్ఐఆర్ల నమోదు అనుమతించబడదు. మూడింటిలో కారణాలు, నేరాలు, వాహనాలకు నష్ట, ఫిర్యాదుదారుల మధ్య సారూప్యత ఉంది. అందువల్ల, పిటిషనర్పై ఒకే ఘటనకు సంబంధించి బొంరాస్పేట్ పోలీస్స్టేషన్లోని 154, 155 ఎఫ్ఐఆర్లు అనుమతించలేం. రద్దు చేస్తున్నాం’అని న్యాయమూర్తి పేర్కొన్నారు. లంచ్మోషన్ రూపంలో మరో పిటిషన్ ఇదే కేసులో తనపై ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ నిందితుడు(ఏ–33) కావలి శేఖర్ పిటిషన్ దాఖలు చేశారు.సెక్షన్ 307 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తగదన్నారు. లంచ్మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ పిటిషన్పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పిటిషనర్ నేరుగా దాడిలో పాల్గొన్న ఫొటోలను పీపీ పల్లె నాగేశ్వర్రావు న్యాయమూర్తికి అందజేశారు. దీంతో పిటిషనర్ అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు. -
లగచర్ల దాడి ఘటనలో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి ఊరట
-
రాజ్యాంగం ప్రకారమే ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాలు రాజ్యాంగం, చట్టప్రకారం మాత్రమే ఉత్తర్వులు ఇవ్వగలవని హైకోర్టు స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ఉత్త ర్వులు ఇవ్వలేమని చెప్పింది. ఈ మేరకు దాఖలైన మధ్యంతర పిటిషన్ను కొట్టివేసింది. ఒక పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన శాసనసభ్యులు వెంటనే మరో పార్టీలోకి ఫిరాయి స్తున్నారని.. ఇలాంటి వారి శాస నసభ సభ్యత్వాన్ని రద్దు చేసేలా ఎన్నికల కమిషన్కు ఆదే శాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరుకాకుండా ఆదేశాలి వ్వాలని పాల్ మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీని వాస్రావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మె ల్యేలు కాంగ్రెస్లో చేరారని, వారు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా నిషేధం విధించాలని కేఏ పాల్ కోరారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మహిపాల్ రెడ్డి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. స్పీకర్ అధికారాల్లో జోక్యం కోరుతూ వేసిన ఈ పిటిషన్ చెల్లదని, మధ్యంతర ఉత్తర్వులు కోరలేరని అన్నారు. పలువురి అనర్హత పిటిషన్లు స్పీకర్ వద్ద పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. మధ్యంతర పిటిషన్ను కొట్టివేసింది. -
విద్యార్థుల ప్రాణాలు పోయినా పట్టించుకోరా?. ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
-
పట్టింపు లేదా?.. ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఫుడ్ పాయిజన్ అంశం చాలా తీవ్రమైనదని వ్యాఖ్యలు చేసింది.నారాయణపేట జిల్లాలో మాగనూర్లోని పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. విద్యార్థులు కుర్ కురేలు తినడం వల్లే అస్వస్థతకు గురైనట్టు కోర్టుకు తెలిపారు. ఈ ఘటన విషయంలో బాధులైన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు ఏఏజీ చెప్పారు. ఈ సందర్భంగా.. సదరు అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అలాగే, ఫుడ్ పాయిజన్ అయిన పాఠశాలల్లో శాంపుల్స్ సేకరించి ల్యాబ్ కు పంపాలని కోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో మాగనూరు, కరీంనగర్, బురుగుపల్లి ఘటనలపై కూడా నివేదిక ఇవ్వాలని న్యాయ స్థానం కోరింది. ఈ ఘటనలపై సోమవారంలోపు రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.ఇదిలా ఉండగా.. మాగనూరు పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఇటీవలే 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, అధికారులు రంగంలోకి హెచ్ఎం సహా మరొకరిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన మరువకముందే నిన్న(బుధవారం) మళ్లీ ఫుడ్ పాయిజన్ కారణంగా మరో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ వరుస ఘటనలపైనే నేడు హైకోర్టులో విచారణ జరిగింది. -
మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్
-
మూసీ కబ్జాదారులపై క్రిమినల్ చర్యలు
సాక్షి, హైదరాబాద్: మూసీ నది పరీవాహకంతోపాటు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లో కబ్జాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై పూర్తి సర్వే నిర్వహించాలని సూచించింది. ఇందుకు పిటిషనర్లు, ఆక్రమణదారులు సహకరించాలని చెప్పింది. అవసరమైతే అధికారులకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. హైదరాబాద్ కొత్తపేట్లోని న్యూ మారుతీనగర్వాసులు దాఖలు చేసిన పిటిషన్లో ఈ మేరకు విచారణను ముగించింది. అధికారులు తమ ఇళ్లను కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ న్యూ మారుతీనగర్కు చెందిన చింతపల్లి సుబ్రమణ్యం సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాకే లేఅవుట్ వేసి ఇళ్లు కట్టుకున్నామని.. ఆస్తిపన్ను, నల్లా పన్ను, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నామని పిటిషనర్లు పేర్కొన్నారు. అందువల్ల తమ ఇళ్లను కూల్చకుండా అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి.. అధికారులకు, పిటిషనర్లకు పలు సూచనలు చేస్తూ తీర్పు వెలువరించారు. హైకోర్టు సూచనలివీ... – ఎఫ్టీఎల్, బఫర్ జోన్, రివర్ బెడ్ జోన్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆక్రమణదారులకు చట్టప్రకారం నోటీసులు ఇచ్చి ఆక్రమించినట్లు తేలితే వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలి. – మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టు వల్ల ప్రభావితమైన వ్యక్తులకు సమగ్ర సామాజిక–ఆర్థిక సర్వే నిర్వహించి ప్రభుత్వం నిర్దేశించిన విధానాల ప్రకారం అనువైన ప్రదేశాల్లో అధికారులు వసతి కల్పించాలి. – పట్టణాభివృద్ధి శాఖ 2012లో జారీ చేసిన జీవో 168 ప్రకారం ఇచ్చిన బిల్డింగ్ రూల్స్ను కచ్చితంగా పాటించాలి. – మూసీలోని ఎఫ్టీఎల్, రివర్ బెడ్ జోన్లోని కేసుల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ వర్సెస్ ఫిలోమినా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కేసులో హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం జారీ చేసిన మార్గదర్శకాలతోపాటు 2023 నవంబర్ 8న ఆక్రమణలపై జారీ చేసిన సర్క్యులర్లోని సూచనలను మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే సమయంలో ట్రయల్ కోర్టులు పాటించాలి. – మూసీ బఫర్ జోన్, రివర్ బెడ్ జోన్ సరిహద్దుల స్థిరీకరణ కోసం అధికారులు చేపట్టే సర్వేలను పిటిషనర్లు, ఆక్రమణదారులు అడ్డుకోవద్దు. – సర్వే కోసం వెళ్లే నీటిపారుదల, రెవెన్యూ, హైడ్రా, మున్సిపల్ శాఖల అధికారులకు పోలీసులు అవసరమైన భద్రతను కల్పించాలి. – తెలంగాణ నీటిపారుదల చట్టం–1357 ఫస్లీ, వాల్టా చట్టం 2002లోని నిబంధనల ప్రకారం నదులు, నీటివనరులు, చెరువులు, సరస్సుల విధ్వంసానికి పాల్పడిన ఆక్రమణదారులు, భూ కబ్జాదారులపై అధికారులు తగిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. -
ఇందిరమ్మ కమిటీలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గూడు లేని నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబి్ధదారుల ఎంపిక కోసం నియమించిన ఇందిరమ్మ కమిటీలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. విధాన నిర్ణయం ప్రకారం ప్రయోజనకరమైన పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి విచక్షణాధికారం ఉంటుందని చెప్పింది. అలాంటి అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది. ఇందిరమ్మ కమిటీలను సవాల్ చేస్తూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేందర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. అయితే, ఏ ఉద్దేశం మేరకు పథకం ప్రారంభించారో.. దానికి విరుద్ధంగా అమలు జరిగితే కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్కు స్వేచ్ఛనిచి్చంది. ఇందిరమ్మ ఇంటి పథకం కింద తొలిదశలో 4,50,000 గృహాలను నిర్మించాలని, లబి్ధదారులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేయాలని సంకల్పించింది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటుచేస్తూ గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి 2024, అక్టోబర్ 11న జీవో 33 జారీచేశారు. స్థానికులతో ఈ కమిటీలను కలెక్టర్ ఎంపిక చేస్తారు. పంచాయతీల్లో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారి కమిటీ చైర్మన్గా ఇద్దరు స్వయం సహాయక సంఘాల మహిళలు, మరో ముగ్గురు (ఒక బీసీ, ఒక ఎస్సీ లేదా ఎస్టీ తప్పనిసరి) సభ్యులుగా ఉంటారు. మున్సిపల్ వార్డుల్లో కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈ జీవోను సవాల్ చేస్తూ ఏలేటితోపాటు మరొకరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టి తీర్పు ఇటీవల వెలువరించారు. పారదర్శకంగానే అమలు: ఏఏజీ పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘ఎలాంటి అర్హతలు పేర్కొనకుండా సభ్యుల ఎంపిక చట్టవిరుద్ధం. ఇష్టం వచ్చిన వారిని, పార్టీలకు చెందిన కార్యకర్తలను సభ్యులుగా నియమించే ప్రమాదం ఉంటుంది. గ్రామ సభలు, వార్డు కమిటీల ప్రస్తావన లేకుండా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయడం సరికాదు. ఈ కమిటీలను రద్దు చేయాలి’అని కోరారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ తేరా రజనీకాంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘రాష్ట్రంలో ఇళ్లు లేని వారి కోసం ఇందిరమ్మ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమిటీలున్నా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షణ చేస్తారు. ఆవాస్ ప్లస్ 2024 యాప్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాకే ఎంపిక జరుగుతుంది. అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా పథకం అమలు ప్రక్రియ సాగుతోంది. ఈ పిటిషన్లను కొట్టివేయాలి’అని చెప్పారు.గ్రామసభ అనుమతి తప్పనిసరి కాదు.. ‘పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 6(8) ప్రకారం లబ్దిదారుల ఎంపికకు గ్రామసభ అనుమతి తప్పనిసరి కాదు. ఈ కేసులో పంచాయతీలో కార్యదర్శి, మున్సిపల్ వార్డులో వార్డుస్థాయి అధికారి ప్రజాపాలన కింద వచ్చిన దరఖాస్తులపై సర్వే నిర్వహిస్తారు. యాప్లో కుటుంబంతోపాటు ఆదాయ వివరాలను నమోదు చేస్తారు. అర్హత ప్రమాణాల ప్రకారం లబ్దిదారులను నిర్ధారిస్తారు. పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వానికి స్వేచ్ఛ, విచక్షణ ఉంటుంది. యాప్, కమిటీలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ.. ఇలా పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. నచి్చన వారిని కమిటీలు ఎంపిక చేసుకుంటాయని, పిటిషనర్లు భయపడటం అర్థంలేనిది’అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. -
జానీ మాస్టర్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత
ఢిల్లీ: ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. లైంగిక వేధింపుల కేసులో అతని బెయిల్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.తన అసిస్టెంట్పై జానీ లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది అతనిపై నమోదైన ప్రధాన అభియోగం. ఈ కేసులో అరెస్టై జైల్లో ఉన్న జానీకి తెలంగాణహైకోర్టు అక్టోబర్ 24వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. అయితే..ఆ బెయిల్ను రద్దు చేయాలంటూ ఫిర్యాదుదారు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని పరిశీలించిన జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ సతీష్చంద్ర మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణకు నో చెప్పింది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ఫిర్యాదుదారు లాయర్కు చెబుతూ.. పిటిషన్ను డిస్మిస్ చేసింది. -
నిర్ణయం స్పీకర్దే
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరేనని హైకోర్టు స్పష్టం చేసింది. ‘రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ చైర్మన్గా ఇచ్చిన అధికారాల మేరకు విధులు నిర్వహించాలి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని అనర్హత పిటిషన్లపై తగిన సమయంలో (రీజనబుల్ టైమ్) తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి..’ అని స్పష్టం చేసింది. ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది.పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసింది. తద్వారా స్పీకర్ ముందు పిటిషన్లు పెండింగ్లో ఉండగా కోర్టులు జోక్యం చేసుకోలేవని తేలి్చచెప్పింది. స్టేషన్ఘన్పూర్ నుంచి కడియం శ్రీహరి, కొత్తగూడెం నుంచి తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఖైరతాబాద్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పిటిషన్లు దాఖలు వేశారు.అలాగే దానంను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. అనర్హత పిటిషన్ల విచారణకు నాలుగు వారాల్లో షెడ్యూల్ ఖరారు చేయాలని సెపె్టంబర్ 9న తీర్పునిచ్చారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్రావు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఇరుపక్షాల వాదనలు ఇలా.. ‘స్పీకర్ తన ముందున్న పిటిషన్లపై నిర్ణయం వెలువరించిన తర్వాత కోర్టులు న్యాయ సమీక్ష జరపొచ్చు. అయితే అది కూడా చాలా స్వల్పమే. కానీ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోక ముందు కోర్టులు ఆయనపై ఒత్తిడి తేలేవు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రాజ్యాంగ అధిపతి అయిన స్పీకర్ విధుల్లో కోర్టుల జోక్యం అతి స్వల్పం. తన ముందున్న అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం, స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది.స్పీకర్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని గతంలో ఎర్రబెల్లి దయాకర్ పిటిషన్లో ఇదే హైకోర్టు స్పష్టం చేసింది..’అని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి, న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శి తరఫున రవీంద్ర శ్రీవాస్తవ, ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్రెడ్డి, జంధ్యాల రవిశంకర్ వాదించారు. అయితే ‘పదవ షెడ్యూల్ను ఉల్లంఘించిన వ్యక్తులను అనర్హులుగా ప్రకటించాలనే రాజ్యాంగ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటే, ఫిర్యాదు చేసిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో స్పీకర్ ముందున్న అనర్హత పిటిషన్లపై తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి.సాధారణంగా లోక్సభ, శాసనసభల జీవితకాలం ఐదేళ్లు మాత్రమే. కాబట్టి ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచకుండా నిరీ్ణత సమయంలో తీర్పు వెలువరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇక్కడ 8 నెలలైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సింగిల్ జడ్జి ఇచి్చన తీర్పుపై అప్పీళ్లు దాఖలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదు..’అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది గండ్ర మోహన్రావు, బీజేపీ Ôనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి తరఫు న్యాయవాది జె.ప్రభాకర్ వాదనలు వినిపించారు.పలు తీర్పులు ప్రస్తావించిన ధర్మాసనం సెపె్టంబర్ 30న అప్పీళ్లు దాఖలైన నాటి నుంచి ఇరుపక్షాల తరఫున సుదీర్ఘ వాదనలు విన్న సీజే ధర్మాసనం ఈ నెల 12న తీర్పు రిజర్వు చేసింది. ఎర్రబెల్లి దయాకర్రావు వర్సెస్ తలసాని శ్రీనివాస్యాదవ్, ఎస్ఏ సంపత్కుమార్ వర్సెస్ కాలే యాదయ్య, కీష మ్ మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్, మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, రాజేంద్రసింగ్ రాణా, కిహోటో హో లోహన్ సహా పలు కేసుల్లో తీర్పులను శుక్రవారం తీర్పు వెల్లడి సందర్భంగా సీజే ధర్మాసనం ప్రస్తావించింది. సుప్రీంకోర్టు పలు కేసుల విచారణ సందర్భంగా స్పీకర్ తగిన(రీజనబుల్) సమయంలో నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్న విషయాన్ని నొక్కి చెప్పింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి తగిన అధికారం స్పీకర్కు రాజ్యాంగం కల్పించిందని పేర్కొంది. -
ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు సంచలన తీర్పు
-
హైకోర్టులో పట్నం మహేందర్ రెడ్డి పిటిషన్..
-
తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ నేతల పిటిషన్
-
ఆయనేమన్నా టెర్రరిస్టా?
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అరెస్టు విధానాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆయన ఏమైనా టెర్రరిస్టా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేబీఆర్ పార్కు వద్ద ఉదయం వాకింగ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యేను బహిరంగ ప్రదేశంలో అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసింది. ఆయన పరారీలో లేరు కదా.. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి చట్టప్రకారం అరెస్టు చేయొచ్చు కదా అని పేర్కొంది. గాయపడ్డ వారి వివరాల పక్కన ప్రశ్నార్థకం పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అంటే వైద్యుడికే స్పష్టత లేదా అని అడిగింది. నరేందర్రెడ్డి మరో నిందితుడికి రెండు నెలల కాలంలో 84 సార్లు ఫోన్ చేశారన్న పోలీసుల వాదనపై ఆక్షేపించింది. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారైనప్పుడు నేరపూరిత కుట్రపైనే మాట్లాడుకున్నారని ఎలా చెప్పగలరని ప్రశ్నించింది.నరేందర్రెడ్డికి ప్రమేయం ఉందంటూ నిందితులు చెప్పిన వాంగ్మూలాల కాపీలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేందర్రెడ్డి హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్రావు, ప్రభుత్వం తరఫున పీపీ పల్లె నాగేశ్వర్రావు వాదనలు వినిపించారు. పిటిషన్ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం: పీపీ ‘నరేందర్రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేశారు. నవంబర్ 11న రిమాండ్ డైరీలో ఆయన పేరు లేదు. నవంబర్ 13 నాటి డైరీలో చేర్చారు. ఆయనపై పెట్టిన సెక్షన్లలో ఒకటి తప్ప అన్నీ ఐదేళ్లలోపు శిక్ష పడే కేసులే. ఇతర నిందితులు నరేందర్రెడ్డి పేరు చెప్పారంటూ చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారు. ఘటన జరిగిన రోజున ఆయన నుంచి మరో నిందితుడి (ఏ–4)కి ఒకే ఒక్క కాల్ వెళ్లింది. అలాంటప్పుడు ఘటన వెనుక ఆయన ఉన్నట్లు ఎలా చెబుతారు? రాజకీయ కోణంలోనే మాజీ ఎమ్మెల్యేను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏమీ చెప్పకున్నా.. కేటీఆర్ పేరు చెప్పినట్లు, నేరాన్ని అంగీకరించినట్లు తప్పుడు నివేదికను ట్రయల్కోర్టుకు అందజేశారు. తోపులాటలో జరిగిన చిన్న గాయాలను రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు’అని గండ్ర మోహన్రావు వాదనలు వినిపించారు. ‘ప్రజలను రెచ్చగొట్టేలా నరేందర్రెడ్డి మాట్లాడారు. దీని కోసమే మరో నిందితుడికి రెండు నెలల్లో 84 సార్లు కాల్ చేశారు. నరేందర్రెడ్డిని ఇంటి వద్దే అరెస్టు చేశాం. విచారణ సాగుతోంది. ఈ దశలో పిటిషన్ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుంది. ఆయన పిటిషన్ను కొట్టివేయాలి. నరేందర్రెడ్డిని పోలీసుల కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్పై వికారాబాద్ కోర్టు విచారిస్తోంది’అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు.ప్రాథమిక విచారణ చేశారా?వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘ఇంటి వద్దే అరెస్టు చేస్తే, విచారణ సమయంలో సలీమ్ అనే వ్యక్తి సమాచారం ఎందుకు ఇచ్చారు? సొంత పార్టీ వ్యక్తితో మాట్లాడినంత మాత్రాన అరెస్టు చేస్తారా? ఇతర నిందితుల స్టేట్మెంట్లు కాకుండా నరేందర్రెడ్డి పాత్రపై ప్రాథమిక విచారణ చేశారా? మీరు చెబుతున్నట్లు కుట్ర కోణం ఉంటే ఘటన జరిగిన రోజున ఇద్దరి మధ్య ఒకే కాల్ ఎందుకు ఉంటుంది? లగచర్ల ఘటనలో అధికారులకు పెద్దగా గాయాలు కాలేదని నిమ్స్ వైద్యుల నివేదిక చెబుతోంది. లక్ష్మయ్య, దేవేందర్, హన్మంత్ వాంగ్మూలాలను అందజేయండి’అంటూ తీర్పు రిజర్వు చేశారు. అయితే తమ వాదనలకు కొంత సమయం కావాలని పీపీ విజ్ఞప్తి చేయడంతో గురువారానికి వాయిదా వేశారు. -
పట్నం నరేందర్రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్:లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటనలో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణను వికారాబాద్ కోర్టు వాయిదా వేసింది. కొడంగల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ను క్వాష్ చేయాలని నరేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.ఈ క్వాష్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉండడంతో బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్లు వికారాబాద్ కోర్టు తెలిపింది.తదుపరి విచారణను వికారాబాద్ కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.నరేందర్రెడ్డిని 7 రోజుల పాటు తమ కస్టడీ కి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్పై మధ్యాహ్నం విచారణ జరగనుంది.ఈ పిటిషన్పై కోర్టు వాదనలు విననుంది.మరోవైపు కొడంగల్ కోర్టు ఇచ్చిన రిమాండ్ను క్వాష్ చేయాలని నరేందర్రెడ్డి వేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్పై నేడు విచారణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలను పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది.తెలంగాణ జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, రాధాకిషన్ రావు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో ఇటీవలే నాంపల్లిలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, వీరికి మధ్యంతర బెయిల్ పొడిగించలేమని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. దీంతో, భుజంగరావు.. హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్పై పిటిషన్లు దాఖలు చేయడంతో నేడు విచారణ జరుగనుంది. -
పట్నం కోసం బీఆర్ఎస్ లీగల్ టీమ్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు
-
పట్నం కోసం రంగంలోకి బీఆర్ఎస్ లీగల్ టీమ్.. పిటిషన్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: లగచర్ల ఘటన కేసులో రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు.. నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్లో ఉంచాలని కోరుతూ బీఆర్ఎస్ లీగల్ టీమ్ కోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.తెలంగాణ హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు రిమాండ్ విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ను క్వాష్ చేయాలని ఆయన కోరారు. నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పట్నం నరేందర్ రెడ్డి. అయితే, ఈరోజు హైకోర్టుకు సెలవు కావటంతో సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.మరోవైపు.. నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్లో ఉంచాలని కోరుతూ బీఆర్ఎస్ లీగల్ టీమ్ నేడు హౌజ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు. నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. జైలులో ఐదుగురు నేరస్థులతో కలిపి మాజీ ఎమ్మెల్యేను ఉంచారని బీఆర్ఎస్ లీగల్ టీమ్ చెబుతోంది. ఈ క్రమంలోనే ఆయనను స్పెషల్ బ్యారక్లో ఉంచాలని కోర్టును కోరనుంది. ఇదిలా ఉండగా.. లగచర్ల ఘటనలో మరో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్యంగా ఓ ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు పోలీసులు. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. మరో కొంత మంది నిందితుల కోసం గాలిస్తున్నారు. -
కలెక్టర్ నిజాంను మించిపోయారు!
సాక్షి, హైదరాబాద్: భూములను కట్టబెట్టడంలో రంగారెడ్డి జిల్లా గత కలెక్టర్ నిజాం నవాబ్ను కూడా మించిపోయారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పేదలకు పంచడం కోసం రామచంద్రారెడ్డి దాదాపు 300 ఎకరాలు ఇచ్చారని, అందినకాడికి నొక్కిన అధికారులు వాటి స్వాహాకు సహకరించారని చెప్పింది. భూదాన్ భూములంటూ అప్పిలేట్ ట్రిబ్యునల్ అథారిటీగా ధ్రువీకరించిన వ్యక్తి.. జిల్లా కలెక్టర్గా వారసత్వ ధ్రువీకరణ పత్రం ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ఆరోపణలున్న అధికారులు కోర్టుకు సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేసింది. పీవీ నరసింహారావు లాంటి ఎందరో మహానుభావులు సీలింగ్ చట్టం వచ్చినప్పుడు వందల ఎకరాలు ఇచ్చేశారంది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నం.182లో 10.29 ఎకరాలకు ఖాదర్ ఉన్నీసాకు వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాలు చేస్తూ నవాబ్ ఫారూక్ అలీఖాన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. గతంలో భూదాన్ భూములపై ఆర్డీవో ఆదేశాలివ్వగా స్పెషల్ ట్రిబ్యునల్ సమరి్థంచిందని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా ఖాదర్ ఉన్నీసా ఇచ్చిన దరఖాస్తును కలెక్టర్ ఆమోదించి పాస్బుక్ కూడా జారీ చేశారని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. భూదాన్ భూముల రక్షణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందరో మహానుభావులు ఇచ్చిన వందల ఎకరాలను అమ్ముకుని తినేశారని, భూదాన్ భూముల రక్షణలో గత బోర్డుతోపాటు అధికారులూ విఫలమయ్యారని చెప్పారు. భూదాన్ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థానంలో పెండింగ్లో ఉండగా పట్టా పాస్బుక్ జారీ చేశారన్నారు. వారసత్వ ధ్రువీకరణ పత్రం ఎలా జారీ చేశారో కౌంటరు దాఖలు చేయాలని భూదాన్ యజ్ఞబోర్డు, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి, నాటి కలెక్టర్ అమోయ్కుమార్కు నోటీసులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ భూములపై యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
కొత్తచెరువు ఆక్రమణలు తొలగించండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామం పరిధిలోని కొత్తచెరువుకు సంబంధించిన సర్వే నంబర్ 5లోని 5.25 ఎకరాల భూమిలో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆక్రమణలపై పిటిషనర్ల ఫిర్యాదులను స్వీకరించి విచారణ జరపాలని, నీటి వనరులను పరిరక్షించాలని జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పర్యవేక్షణ, రక్షణ (హైడ్రా) విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ముందస్తు అనుమతి లేకుండా కూల్చివేతలు చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించింది. రోడ్లు, వీధులు, ఫుట్పాత్లు, నీటి వనరులు వంటి పబ్లిక్ స్థలాలను ఆక్రమించి చేపట్టే అనధికార నిర్మాణాలకు అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు వర్తించవని తేల్చి చెప్పింది. ఫిర్యాదులు పరిశీలించాల్సిందే కొత్తచెరువు శిఖం ఆక్రమణపై తాము సెప్టెంబర్ 6వ తేదీన, అదే నెల 10న అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఖాజాగూడకు చెందిన ఆర్.రామకృష్ణతోపాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తప్పుడు పత్రాలతో అత్యంత విలువైన భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారని, వాటిని కూల్చేలా అధికారులను ఆదేశించాలని కోరారు. బిల్డర్స్, బెవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీతో పాటు భరతేందర్రెడ్డి, ఘనేశ్వర్, రాఘవరావు ఈ ఆక్రమణలో కుట్రదారులని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి బుధవారం విచారణ చేపట్టగా.. కొత్తచెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) సుమారు 5.5 ఎకరాల్లో విస్తరించి ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. అక్రమ నిర్మాణాలు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడంతో ముంపు సమస్య తలెత్తుతోందని, నీటి వనరుల మనుగడకు కూడా ముప్పు వాటిల్లుతోందని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లు సమర్పించిన ఫిర్యాదులను అధికారులు తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించారు. ప్రైవేట్ ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేయాలని సూచించారు. శిఖం భూమి లేదా ట్యాంక్ బండ్పై ఆక్రమణలు గుర్తిస్తే వాటిని తొలగించాలని, నీటి వనరులను పరిరక్షణతోపాటు పర్యావరణ వ్యవస్థకు మరింత నష్టం జరగకుండా వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి విచారణను నవంబర్ 26వ తేదీకి వాయిదా వేశారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు
సాక్షి,హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో తీర్పును తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం(నవంబర్ 12) రిజర్వు చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు. ఈ పిటిషన్పై వాద, ప్రతివాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు బెంచ్ వెల్లడించింది. కాగా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హైకోర్టులోపిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ బెంచ్ అనర్హతపై నెల రోజుల్లో చర్యలు తీసుకోవాలని, ఏం చర్యలు తీసుకున్నారో తమకు తెలపాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలపై అసెంబ్లీ సెక్రటరీ డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు.ఇదీ చదవండి: మరో నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సిట్ నోటీసులు -
కరీంనగర్ రాయితో నూతన హైకోర్టు నిర్మాణం
కరీంనగర్ క్రైం: రాష్ట్ర నూతన హైకోర్టు నిర్మాణంలో కరీంనగర్ నుంచి తెప్పించిన బండను వాడుతున్నామని.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొప్ప చరిత్ర కలదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే తెలిపారు. కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో నిర్మించనున్న 12 నూతన కోర్టు భవనాల సముదాయానికి ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. అలాగే సీతారాంపూర్ రోడ్డు లో జడ్జీల నూతన నివాస భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ జిల్లాలోని వివిధ కో ర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించాలన్నారు. అందుకు న్యాయవాదులు సహకరించాలని సూచించారు. కేసుల విచారణలో అనవసర వాయిదాల ను నివారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కోర్టు పరిపాలనా జడ్జిగా వ్యవహరిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్తోపాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.వినోద్కుమార్, జస్టిస్ విజయసేన్రెడ్డి, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్, జస్టిస్ ఈవీ వేణుగోపాల్, జస్టిస్ పుల్ల కార్తీక్, జస్టిస్ శ్రీనివాసరావు, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు కాసుగంటి లక్ష్మణకుమార్ మాట్లాడారు. అనంతరం కరీంనగర్ జిల్లాకు చెందిన హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ పి.నవీన్రావుతోపాటు వృత్తిలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ న్యాయవాదులు పి.గోపాలకృష్ణ, కె.మాధవరావు, జి.నారాయణరెడ్డి, వి.వెంకటేశ్వరరావు, జి.హనుమంతరావును చీఫ్ జస్టిస్ సన్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ రాజ్కుమార్, ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్రెడ్డి, న్యాయమూర్తులు, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ ఆర్డీవో మహేశ్వర్, బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్కు తిరుగుపయనమయ్యే ముందు చీఫ్ జస్టిస్ సహా ఇతర న్యాయమూర్తులంతా మంకమ్మతోటలోని జస్టిస్ ఈవీ వేణుగోపాల్ నివాసంలో తేనీటి విందుకు హాజరయ్యారు. -
పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ హైకోర్టులో వాదనలు
-
3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపుల అంశంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీళ్లకు విచారణార్హత లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు వాదించారు. ‘పదవ షెడ్యూల్ను ఉల్లంఘించిన వ్యక్తులను అనర్హులుగా ప్రకటించాలనే రాజ్యాంగ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటే, ఫిర్యాదు చేసిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో స్పీకర్ ముందు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా లోక్సభ, శాసనసభల జీవితకాలం ఐదేళ్లు మాత్రమే. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచకుండా నిర్ణీత సమయంలో తీర్పు వెలువరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.ఇక్కడ 8 నెలలైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..’అని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి (స్టేషన్ఘన్పూర్), తెల్లం వెంకట్రావు (కొత్తగూడెం) దానం నాగేందర్ (ఖైరతాబాద్)లను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, పాడి కౌశిక్రెడ్డి పిటిషన్లు దాఖలు వేశారు. అలాగే దానంను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యా దు చేసేందుకు ప్రయత్నించినా స్పీకర్ సమ యం ఇవ్వడం లేదంటూ బీజేపీ పక్ష నేత మహేశ్వర్రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై విచారణ షెడ్యూల్ను నాలుగు వారాల్లోగా ఖరారు చేయాలని సెప్టెంబర్ 9న సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి గత నెల హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్ రావు ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్రావు వాదనలు విన్పించారు. గడువులోగా నిర్ణయం తీసుకోవాలి.. ‘ఎమ్మెల్యేగా గెలిచిన ఓ నేత పార్టీ మారడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఆయనను ప్రజలు ఓడించారు. మహారాష్ట్ర, మణిపూర్ కేసులలో సుప్రీంకోర్టు వెలువరించిన రెండు తీర్పులను పరిశీలిస్తే.. తమ ముందు పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లపై నిరీ్ణత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రూల్ 6, 7 ప్రకారం స్పీకర్ నడుచుకోవడం లేదు. వెంటనే నిర్ణయం తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలి..’అని మోహన్రావు కోర్టును కోరారు. కాగా ఏలేటి తరఫున న్యాయవాది జె.ప్రభాకర్ వాదనల కోసం తదుపరి విచారణను ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది.