US Elections 2024
-
ట్రంప్ కేబినెట్లో కీలక పదవులు దక్కించుకుంది వీరే.. (ఫొటోలు)
-
ట్రంప్కి విషెస్ చెప్పి విమర్శల పాలైన పాక్ ప్రధాని
ట్రంప్కి విషెస్ చెప్పి విమర్శల పాలైన పాక్ ప్రధాని -
డెమొక్రాట్లను ఆదుకోండి
వాషింగ్టన్: ఎన్నికల తర్వాత అప్పుల్లో కూరుకుపోయిన డెమొక్రాట్లను ఆదుకోవాలని ట్రంప్ వ్యంగ్య వ్యాఖ్యలుచేశారు. ఈ మేరకు సొంతమీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని రిపబ్లికన్లను కోరారు. ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నిధులు సమీకరించిన డెమొకట్రిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ప్రచార బృందం... ఎన్నికల అనంతరం 2 కోట్ల∙డాలర్ల అప్పుల్లో కూరుకుపోయిందని వార్తలొచ్చాయి. సంపన్న దాతలు, హాలీవుడ్ నుంచి డెమొక్రాట్లు మద్దతు కూడగట్టినప్పటికీ, కీలక ఓటరు గ్రూపుల మద్దతును కోల్పోయారని హారిస్ క్యాంపెయిన్ ప్రధాన ఫండ్రైజర్ అజయ్ జైన్ భూటోరియా చెప్పారు. BREAKING: DONALD TRUMP TAKES JAB AT DEMOCRATS’ FINANCES, OFFERS TO BAIL THEM OUT.“Whatever we can do to help them during this difficult period, I would strongly recommend we, as a Party and for the sake of desperately needed UNITY, do. We have a lot of money left over in that… pic.twitter.com/vWQdZp0Mnz— Jacob King (@JacobKinge) November 9, 2024ట్రంప్కు బైడెన్ ఆతిథ్యం ట్రంప్తో దేశాధ్యక్షుడు బైడెన్ సమావేశమవుతారని వైట్హౌస్ ప్రకటించింది. బైడెన్ ఆహా్వనం మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు ఓవల్ కార్యాలయంలో వీరిద్దరూ సమావేశమవుతారని తెలిపింది. సమావేశానికి సంబంధించిన అదనపు వివరాలను వెల్లడిస్తామని వైట్హౌస్ ప్రెస్సెక్రటరీ కరీన్ జీన్ పియరీ ఒక ప్రకటనలో తెలిపారు. కాబోయే ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ను ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ కూడా వైట్హౌస్కు ఆహా్వనించినట్లు అధికారి ఒకరు తెలిపారు. ట్రంప్ కొత్త స్టాఫ్ చీఫ్ సూజీ వైల్స్తో బైడెన్ స్టాఫ్ చీఫ్ జెఫ్ జియెంట్స్ బుధవారం నాటి సమావేశాన్ని సమన్వయం చేశారని ఇరువర్గాలు వెల్లడించాయి. శాంతియుత అధికార బదిలీలో భాగంగా ఎన్నికల తర్వాత కాబోయే అధ్యక్షుడికి, మాజీ అధ్యక్షుడు ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీ. అయితే 2020లో బైడెన్కు ట్రంప్ ఆతిథ్యం ఇవ్వలేదు. అంతేకాదు 2021లో బైడెన్ ప్రమాణ స్వీకారానికి కూడా ట్రంప్ హాజరు కాలేదు. ప్రథమ మహిళకు ఆతిథ్యం ఇవ్వడం కూడా వైట్హౌస్ ఆనవాయితీగా వస్తోంది. చదవండి: ట్రంప్ రాజకీయం.. ఇండియన్ అమెరికన్ నేత నిక్కీ హేలీకి బిగ్ షాక్ -
అరిజోనాలోనూ ట్రంప్ గెలుపు.. ఖాతాలో 312 ఎలక్టోరల్ ఓట్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో మిగిలిపోయిన అరిజోనా స్టేట్ రిజలల్ట్స్ కూడా అధికారికంగా వెల్లడయ్యాయి. అరిజోనానూ ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇక్కడున్న 11 ఎలక్టోరల్ ఓట్లను ట్రంప్ గెలుచుకున్నారు. దీంతో ట్రంప్ ఈ ఎన్నికల్లో మొత్తం 312 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్నారు. ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్కు 226 ఎలక్టోరల్ ఓట్లే వచ్చాయి. అరిజోనా విజయంతో అమెరికాలో ఉన్న ఏడు స్వింగ్ స్టేట్స్ను ట్రంప్ గెలుచుకున్నట్లయింది. అరిజోనాను 2016లో గెలుకున్న ట్రంప్ 2020లో బైడెన్ చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి అక్కడ ఈ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. అరిజోనా గెలుపుతో ఈ అధ్యక్ష ఎన్నికల్లో ఏడు స్వింగ్ స్టేట్స్ను ట్రంప్ గెలుచుకుని రికార్డు సృష్టించారు. కాగా, అధ్యక్ష ఎన్నికల ఫలితాలు పోలింగ్ జరిగిన నవంబర్ 5న వెలువడడం ప్రారంభమవగా అరిజోనాలో మాత్రం కౌంటింగ్ పూర్తవడానికి నాలుగు రోజులు పట్టడం గమనార్హం. ఈ ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.ఇదీ చదవండి: ట్రంప్ మార్కు కనిపించేనా.. -
ట్రంప్ పాలనలో మస్క్కు కీలక పాత్ర..!
వాషింగ్టన్:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘనవిజయంలో బిలియనీర్, టెస్లా అధినేత ఇలాన్ మస్క్ ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రచారానికి ఆర్థికంగా అండదండలందించడమే కాకుండా ట్రంప్ తరపున మస్క్ నేరుగా ప్రచారంలో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ పాలనా వ్యవహారాల్లో మస్క్కు కీలక బాధ్యతలు దక్కే అవకాశాలున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని మరింత బలపర్చేలా తాజాగా మరో పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడుతుండగా వారిద్దరి సంభాషణలో మస్క్ కూడా చేరినట్లు తెలుస్తోంది.అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో మస్క్ ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసంలోనే ఉన్నారు. ఈ ఫొటోలు వైరల్గా కూడా మారాయి. సరిగ్గా ఈ సమయంలోనే ట్రంప్ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫోన్ చేసి అభినందించారు. వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా మధ్యలో ట్రంప్ ఫోన్ను మస్క్కు ఇచ్చినట్లు తెలుస్తోంది.జెలెన్స్కీతో మాట్లాడాల్సిందిగా మస్క్ను ట్రంప్ కోరినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడితో మస్క్ కొద్దిసేపు మాట్లాడారని కథనాలు తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ అధ్యక్ష పేషీలో మస్క్ కీలక పాత్ర పోషించనున్నట్లు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: ట్రంప్నకు కేసుల నుంచి భారీ ఊరట.. అధ్యక్షుడిగా ఎన్నికైనందునే -
ట్రంప్నకు కేసుల నుంచి భారీ ఊరట..! అధ్యక్షుడిగా ఎన్నికైనందునే..
వాషింగ్టన్:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్నకు అన్ని క్రిమినల్ కేసుల నుంచి ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్ ప్రయత్నించిన కేసు ముందుకు వెళ్లేలా కనిపించడం లేదు. వాషింగ్టన్ కోర్టులో ప్రస్తుతం నడుస్తున్న ఈ కేసులో విచారణ డెడ్లైన్లన్నింటినీ పక్కన పెడుతున్నట్లు జడ్జి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్ల విజ్ఞప్తి మేరకే ఈ ఆదేశాలిచ్చినట్లు జడ్జి తెలిపారు.ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందున.. అధ్యక్షుడిని క్రిమినల్ కేసుల్లో ప్రాసిక్యూట్ చేయడం కుదరనందునే విచారణను వాయిదా వేయాలని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు కోర్టును కోరారు. దీంతో ట్రంప్పై కేసు విచారణ డెడ్లైన్లను పక్కన పెడుతున్నట్లు జడ్జి ఆదేశాలిచ్చారు. కాగా శృంగార తార స్టార్మీ డేనియల్కు సంబంధించి హష్ మనీ కేసులో ట్రంప్కు ఇప్పటికే దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: అమెరికా నుంచి వెళ్లిపోతా.. మస్క్ కుమార్తె -
ట్రంప్ విజయానికి ఐదు మెట్లు
ట్రంప్ విజయానికి ఐదు మెట్లు -
ట్రంప్ గెలుపుపై పుతిన్ రియాక్షన్ ఇదే
మాస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు పుతిన్ అవునని సమాధానం ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదల తర్వాత గురువారం రష్యాలోని సోచిలో ఓ అంతర్జాతీయ సదస్సు జరిగింది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన ట్రంప్కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్తో చర్చలు జరపడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు.. అందుకు తాను సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.అదే సమయంలో ఏడాది జులైలో ట్రంప్పై జరిగిన హత్యాయత్నంపై స్పందించారు. హత్యాయత్నం జరిగిన అనంతరం ట్రంప్ చూపించిన తెగువ, ధైర్యం తనను ఆకట్టుకుందన్నారు. పుతిన్తో మాట్లాడలేదుఅధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తాను 70 మంది దేశాది నేతలతో మాట్లాడానని ట్రంప్ తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమెక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ను గెలిపించాలని పిలుపున్చిన పుతిన్తో తాను మాట్లాడలేదని ట్రంప్ వెల్లడించారు. -
వైట్హౌస్ స్టాఫ్ చీఫ్గా సూజీ వైల్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ వైట్హౌస్కు తొలి అధికారి నియామకాన్ని ప్రకటించారు. తన ప్రచార మేనేజర్ సూజీ వైల్స్ను వైట్హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా నియమిస్తున్నట్లు గురువారం వెల్లడించారు. 67 ఏళ్ల వైల్స్ అమెరికా చరిత్రలో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించనున్నారు. ‘అమెరికా చరిత్రలో గొప్ప రాజకీయ విజయాన్ని సాధించడానికి సూజీ వైల్స్ నాకు సాయపడ్డారు. 2016లో, 2020లో, ఇప్పుడు నా ప్రచారంలో అంతర్భాగంగా ఉన్నారు. ఆమె కఠినమైన, తెలివైన, సృజనాత్మకమైన వ్యక్తి. అమెరికా చరిత్రలో తొలి మహిళా చీఫ్ ఆఫ్ స్టాఫ్గా సూజీని నియమించడం గౌరవంగా భావిస్తున్న’ అని ట్రంప్ వెల్లడించారు. ఇది గొప్ప వార్తని ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ హర్షం వ్యక్తం చేశారు. ప్రచారంలో కీలక పాత్ర పోషించిన సూజీ వైట్హౌస్లోనూ అంతే కీలకంగా పనిచేస్తారని తెలిపారు. ఎవరీ సూజీ వైల్స్?సూజీ వైల్స్.. నేషనల్ ఫుట్బాల్ లీగ్ (ఎన్ఎ ఫ్ఎల్) ఆటగాడు, స్పోర్ట్స్ బ్రాడ్కాస్టర్ పాట్ సమ్మరల్ కుమార్తె. 1957 మే 14న జన్మించిన ఆమె.. న్యూయార్క్ రిపబ్లికన్ జాక్ కెంప్ అధ్యక్షుడిగా ఉన్నసమయంలో వైట్హౌస్లో తన కెరీర్ను ప్రారంభించారు. 1980లలో రోనాల్డ్ రీగన్ అధ్యక్ష ప్రచార బృందంలో చేరారు. ఇది జాతీయ రాజకీయాల్లో ప్రత్యక్ష ప్రమేయానికి నాంది పలికింది. రీగన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం తరువాత పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఆమె ఫ్లోరిడాకు వెళ్లారు. అక్కడ ఆమె ఇద్దరు జాక్సన్విల్లే మేయర్లకు సలహాదారుగా పనిచేశారు. వ్యాపారవేత్త అయిన రిక్ స్కాట్ గవర్నర్గా గెలిచేందుకు తోడ్పడ్డారు. 2012లో ఉటా గవర్నర్ జాన్ హంట్స్మన్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అదే ఆమెకు మరోమారి వైట్హౌస్కు బాటలు వేసింది. 2016లో డోనాల్డ్ ట్రంప్ ప్రచార బృందానికి నాయకత్వం వహించారు. ఆ తరువాత 2018లో ఫ్లోరిడా గవర్నర్గా రాన్ డిశాంటిస్ గెలుపులోనూ సూజీ కీలక పాత్ర పోషించారు. ఇదీ చదవండి: ముంచింది బైడెనే.. -
‘కొత్త’ ట్రంప్ ఎలా పాలిస్తారు?
ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా వైట్హౌస్లో కొలువుదీరినప్పటికీ ఇప్పటికీ ప్రపంచం మారిపోయింది. అదే సమయంలో గతం హయాంలోని చాలామంది సహచరులను ఆయన వదిలేశారు, చాలామంది ఆయనను వదిలి వెళ్లారు. కాబట్టి ట్రంప్ 2.0 పాలన, ట్రంప్ 1.0 పాలన కంటే భిన్నంగా ఉంటుందని ఆశించాలి. అయితే, ట్రంప్ పదవిలో ఉన్న మొదటి సంవత్సరం బైడెన్ చివరి సంవత్సరం కంటే నిశ్శబ్దంగా ఉంటుందనైతే చెప్పవచ్చు. ట్రంప్ మునుపటి లాగే చైనాతో కఠినంగా ఉండవచ్చు, భారతదేశం పట్ల స్నేహపూర్వకంగా ఉండవచ్చు. కానీ అది ఆయన తక్షణ ప్రాధాన్యం కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లలో చేసినట్లుగా, అమెరికా రాజకీయాల చిక్కుల్లో పడకుండా మోదీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయడం మంచిది.అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు ఆకర్షించి నంత ఎక్కువగా మరే దేశ ఎన్నికా ప్రపంచ దృష్టిని ఆకర్షించలేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రధానమైన దేశంగా అమెరికా కొనసాగుతోంది. దీని అధ్యక్షుడు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అతిపెద్ద సాంకేతిక, శాస్త్రీయ కేంద్రం, అతిపెద్ద సాయుధ దళాలను అమెరికా అధ్యక్షుడు నడుపుతారు. అయినప్పటికీ దేశాధ్యక్షురాలిగా ఒక మహిళను ఎన్ను కునేందుకు అమెరికా ఇంకా సిద్ధంగా లేదు. డోనాల్డ్ ట్రంప్కు స్త్రీలను ద్వేషించే వ్యక్తిత్వం ఉన్నప్పటికీ హిల్లరీ క్లింటన్, కమలా హ్యారిస్లను ఓడించగలిగారు. జాతి, వర్గ ఆధిపత్య రాజకీయాలలో, లింగానికి వెనుక సీటు దక్కింది. ఎన్నికల ఒపీనియన్ పోల్స్ మరోసారి తలకిందులైపోయాయి.కొత్త ముఖాల ప్రభుత్వంబెర్లిన్ నుండి టోక్యో వరకు, మాస్కో నుండి బీజింగ్ వరకు, టెల్ అవీవ్ నుండి తెహ్రాన్, నిజానికి, న్యూఢిల్లీ వరకు, ప్రతి ప్రభుత్వం ట్రంప్ ఎన్నుకునే జట్టును నిశితంగా గమనిస్తుంది. ఇది ట్రంప్ రెండవ టర్మ్ అయినప్పటికీ, గతంలోని చాలామంది సహచరులను ఆయన వదిలేశారు. చాలామంది ఆయనను వదిలి వెళ్లారు. అధ్యక్షుడి చుట్టూ ఇప్పుడు కొత్త ముఖాలు ఉంటాయి. వైట్హౌస్లో ఆయన గతంలో కొలువు దీరినప్పటితో పోల్చితే ఇప్పటి పరిస్థితులు మారినందున ట్రంప్ను ప్రపంచం కొత్తగా అంచనా వేయడం జరుగుతుంది.స్వదేశంలో, ట్రంప్ మొదటి బాధ్యత స్థిరత్వాన్ని సాధించడం; పెద్దగా ప్రాధాన్యత లేని తన మద్దతుదారులకు, ముఖ్యంగా శ్రామిక వర్గానికి ఆశను కల్పించడం. అమెరికా ఆర్థిక వ్యవస్థ పెద్ద వృద్ధి లేక పోయినా స్థిరంగానే ముందుకు సాగుతోంది. వృద్ధి 2 శాతానికి పైగా ఉంది. అయినప్పటికీ, నిరుద్యోగం పెద్ద ఆందోళనగా ఉంది. ఒక వైపు తన సొంత తరగతి మిలియనీర్లు, బిలియనీర్ల దురాశనూ, మరో వైపు తక్కువ ఆదాయం కలిగిన, సామాజికంగా, ఆర్థికంగా అణగారిన తన మద్దతుదారుల అవసరాన్నీ ట్రంప్ ఎలా సమతుల్యం చేస్తారో చూడాలి.విదేశాలతో ఎలా వ్యవహరిస్తారు?విదేశాల్లో, ముఖ్యంగా యూరప్, పశ్చిమాసియాలో విభేదాలను పూర్తిగా పరిష్కరించడంలో ట్రంప్పై పెను భారం ఉంటుంది. ఆర్థిక, విదేశాంగ విధానంపై ‘వాషింగ్టన్ ఏకాభిప్రాయం’ నుండి బయట పడతానని ఆయన హామీ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను చేరుకోవాలని భావిస్తున్నారు. అదే సమయంలో చైనాతో కఠినంగా ఉండవచ్చు, అధిక సుంకాలను విధించవచ్చు. కానీ వైరు ధ్యాలతోనే స్నేహాన్ని కోరుకోవచ్చు. పశ్చిమాసియాలో, ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుంటారనీ, బహుశా పాలన మార్పు కోసం ఒత్తిడి తెస్తారనీ భావిస్తున్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కూడా అదుపులో ఉంచవచ్చు.రాబోయే నాలుగేళ్లలో ’మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అని ట్రంప్ వాగ్దానం చేసినందున, ఆయన ప్రతి ఒక్క చర్య కూడా అమెరికాకు, ప్రపంచానికి దీర్ఘకాలిక పరిణామాలను కలిగిస్తుంది. ట్రంప్ మూడో సారీ అధికారంలోకి వచ్చేందుకు వీలుగా రాజ్యాంగంలో మార్పు కోసం ప్రయత్నిస్తారా అనేది ట్రిలియన్ డాలర్ల ప్రశ్న. ఏమైనప్పటికీ, వయస్సు, సమయం ఆయన పక్షాన లేనందున ట్రంప్ 2.0 పాలన ట్రంప్ 1.0 పాలన నుండి భిన్నంగా ఉంటుందని ఆశించాలి.అమెరికా ఎలా పరిపాలించబడుతుందనే దానిపై ట్రంప్ శాశ్వత ప్రభావాన్ని కలిగిస్తారు. కానీ అమెరికాకు ప్రపంచాన్ని రూపొందించే సామర్థ్యం పరిమితంగా ఉంది. అమెరికా తన మిత్రదేశాలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది. ట్రంప్ అధ్యక్ష పదవిపై యూరప్, జపాన్ రెండూ ఆందోళనగా ఉన్నాయి. ట్రంప్ గత హయాంలో యూరప్లో ఏంజెలా మెర్కెల్, జపాన్ లో షింజో అబే ఉన్నారు. ప్రస్తుతం,ట్రంప్ను ఎదిరించే లేదా ఆయన్ని నిలువరించగల సామర్థ్యం ఉన్న యూరోపియన్ లేదా తూర్పు ఆసియా నాయకులు ఎవరూ లేరు. వారు బహుశా ట్రంప్కు అనుగుణంగా నడుచుకోవచ్చు.పుతిన్ను ఊపిరి పిల్చుకోనిస్తారా, జెలెన్స్కీని కాస్త తగ్గమని అడుగుతారా అనేది ట్రంప్, ఆయన సలహాదారులు... యూఎస్ ‘డీప్ స్టేట్’పై, మిలిటరీ–ఇండస్ట్రియల్ కాంప్లెక్స్పై, జో బైడెన్ రష్యా విధానం వెనుక ఉన్న ప్రభావశీల వ్యక్తులపై ఎంత నియంత్రణను కలిగి ఉంటారు అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఏమైనప్పటికీ, పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఇద్దరూ కనీసం మొదట్లోనైనా ట్రంప్ యంత్రాంగంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలని కోరుకుంటారు. విరోధాబాస ఏమిటంటే, ట్రంప్ పదవిలో ఉన్న మొదటి సంవత్సరం బైడెన్ చివరి సంవత్సరం కంటే నిశ్శబ్దంగా ఉండవచ్చు.ఇండియాతో వైఖరి?అదృష్టవశాత్తూ, అధ్యక్షుడు ట్రంప్తో భారతదేశం మంచి సమీక రణాన్ని కలిగి ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇద్దరూ ట్రంప్ చుట్టూ ఉన్న వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నారు. అయినప్పటికీ ట్రంప్ 2.0 అన్ని సంభావ్యతలలోనూ,ట్రంప్ 1.0 లాగా ఉండదనే ఎరుకతో భారత నాయకత్వం ముందుకు సాగాలి. ట్రంప్ వాస్తవికతా విధానం, ‘అమెరికా ఫస్ట్’ విధానం... వాణిజ్యం, వలసలు, వాతావరణ మార్పు వంటి భారత్కు ఆసక్తి ఉన్న రంగాలపై సవాళ్లు విసురుతాయి. నేను ఉదారమైన అమెరికా వీసా విధానం పట్ల గొప్ప ఔత్సాహికుడిని కాదు. ఇది భారతదేశం నుండి ప్రతిభను హరించడానికి దోహదపడింది. అయితే ట్రంప్ పాత సలహా దారులలో కొందరు, ముఖ్యంగా అమెరికా మాజీ వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్థైజర్ వంటి వ్యక్తులు తిరిగి కార్యాలయంలోకి వస్తే ఇరు దేశాల మధ్య వాణిజ్యం సవాలుగా మారవచ్చు.అమెరికా నుంచి రక్షణ పరికరాలను కొనుగోలు చేయడం, సరఫరా గొలుసులతో అనుసంధానం కావడాన్ని భారతదేశం కొన సాగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, గత నాలుగేళ్లలో చేసినట్లుగా, అమెరికా రాజకీయాల చిక్కుల్లో పడకుండా జాగ్రత్తగా అడుగులు వేయాలని మోదీ ప్రభుత్వానికి సూచించడం మంచిది. గురుపత్వంత్ సింగ్ పన్నూన్ కేసు ఇప్పటికే కోర్టులో ఉన్నందున అది వీడి పోకపోవచ్చు. దాని అలలు భారత తీరాలను తాకుతూనే ఉంటాయి. ట్రంప్ 1.0 సమయంలో షింజో అబే మొదట వైట్ హౌస్ తలుపులు తట్టారు, స్నేహపూర్వక హస్తాన్ని చాచారు, అహంభావిని పొగిడారు, భారత దేశానికి ప్రయోజనం కలిగించే క్వాడ్ వంటి ఆలోచనలను చేశారు. అబే రాజనీతిజ్ఞుడు, భారతదేశానికి స్నేహి తుడు. ఆయన వారసులు కేవలం రాజకీయ నాయకులు, పైగా భారత్కు అనుకూలమైనవారు కాదు. చదవండి: ముంచింది జో బైడెనే.. కమలా హారిస్ తీరుపైనా విమర్శలుట్రంప్ భారత్ పట్ల స్నేహ పూర్వకంగా ఉండవచ్చు, కానీ మన దేశానికి ఆయన తక్షణ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మోదీ వంటి మిత్రులు కాసేపు వేచివుండి, అమెరికా మిత్రదేశాలు, ముఖ్యంగా యూరోపి యన్లు వైట్హౌస్లో తమ ఆందోళనతో కూడిన సంభాషణలను ముగించేందుకు అనుమతించడం ఉత్తమం.దేవుడు తనను కాపాడాడు కాబట్టే వైట్హౌస్కు తిరిగి వస్తున్నట్లు ట్రంప్ చెప్పుకొన్నారు. తమను తాము ‘దేవుడు, విధిచే ఎన్ను కోబడిన’ వారిగా భావించే రాజకీయ నాయకులు తరచుగా మంచి కంటే ఎక్కువ హాని చేస్తారు. అలాంటివారితో ఉన్న స్నేహాన్ని ప్రద ర్శించుకోవడం కంటే, ముందు వాళ్లను తమ పనిలో తలమునకలు కానివ్వడం మంచిది.సంజయ బారు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, విధాన విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘ట్రంప్ కృష్ణ’ : తెలంగాణాలో ట్రంప్ ఆలయంలో పూజలు, సంబరాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయ ఢంకా మోగించారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు అనేక దేశాధినేతలు ట్రంప్కు అభినందనలు తెలియజేశారు. అయితే తెలంగాణాలోని ఒక పల్లె ప్రజలు మాత్రం ఇంకో అడుగు ముందుకేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కొంతమంది ట్రంప్ అభిమానులు ట్రంప్ గుడిలో ఏకంగా పూజలు చేశారు. ట్రంప్కు గుడి ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా. అదే మరి విశేషం. 2020లోనే ట్రంప్ కోసం గుడి కట్టి విగ్రహం నెలకొల్పాడో వీరాభిమాని. ఆయనే కొన్నె గ్రామానికి బుస్స కృష్ణ. రాములు, సావిత్రి దంపతుల కుమారుడు కృష్ణ. ట్రంప్ను మరోసారి అధ్యక్షుడిగా చూడాలని కలలు గనేవాడట. ట్రంప్ కోసం ఏకంగా ఉపవాస దీక్షలు చేసేవాడట. అయితే గత ఎన్నికల్లో ఓడిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన కృష్ణ, 2020 అక్టోబరు 11న కన్నుమూశాడు.అంతేకాదు 2019లో కృష్ణ పెట్టిన ట్వీట్కు ట్రంప్ స్పందించడం మరో విశేషం.‘‘మీరంటే ఇష్టం.. మిమ్మల్ని కలవాలని ఉంది.. అని కృష్ణ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టుకు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. దీంతో కృష్ణ చాలా సంబరపడి పోయాడట. ట్రంప్ టీ షర్టులనే ధరించేవాడట. అలాగే తన ఇంటి నిండా అమెరికా అధ్యక్షుడి పోస్టర్లు, స్టిక్కర్లు అతికించి పెట్టుకునేవాడు. అందుకు కృష్ణ గ్రామస్తుల హృదయాల్లో ‘ట్రంప్ కృష్ణ’గా ముద్ర వేసుకున్నాడు.Villagers in Telangana Celebrate Trump’s Re-Election by Worshipping His Statue in a Temple built for himIn a unique celebration, villagers in Konne, Jangaon district in Telangana, marked Donald Trump’s re-election as U.S. president by honoring Bussa Krishna’s devotion to the… pic.twitter.com/k1sS5bOPAQ— Sudhakar Udumula (@sudhakarudumula) November 7, 2024 తాజా ఎన్నికల్లో ట్రంప్ అధ్యక్షుడుగా విజయం సాధించడంతో గ్రామస్తులు తమ ‘ట్రంప్ కృష్ణ’ను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. అంతటితో ఆగిపోలేదు. కృష్ణ బతికి ఉంటే ఎంతో సంతోషించేవాడు కదా అని భావించారు. ఆయన లేని లోటు తీర్చేందుకా అన్నట్టుగా కృష్ణ మిత్రులు కొంతమంది బుధవారం ట్రంప్ విగ్రహం వద్ద పూలమాల వేసి సంబరాలు నిర్వహించారు. కొబ్బరికాయలు, ధూప దీప నైవేద్యాలు, సమర్పించి వేడుక నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
‘ట్రంప్ వ్యక్తిగత దౌత్య విధానం.. భారత్కు అనుకూలం’
ఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవటం దౌత్యపరంగా భారత్కు అనుకూలమని అమెరికాలో భారత మాజీ రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ వ్యక్తిగత దౌత్య విధానం భారత్కు అనుకూలంగా పని చేస్తుందని తెలిపారు. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘భారత ప్రధాన నరేంద్ర మోదీపై తనకు అభిమానం ఉందని చెప్పడానికి డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. మోదీని ట్రంప్ స్నేహితుడిగా, బలమైన నాయకుడిగా భావిస్తారు. ఈ క్రమంలో ట్రంప్ వ్యక్తిగత దౌత్యం భారత్కు అనుకూలంగా పని చేస్తుంది. పరిపాలన మార్పులు గతంలో విజయవంతంగా జరిగాయి. ప్రతీ ప్రభుత్వ పరిపాలన ద్వారా ఇరుదేశాల మధ్య మెరుగైన లౌకిక బంధాల్లో అభివృద్ధి చెందాయి....ఇరు దేశాల మధ్య దౌత్య వ్యవహారాల విషయంలో ఎవరు (ట్రంప్ లేదా కమలా హారిస్) అధ్యక్ష పదవి చేపడతారనే ఆందోళన భారత్కు ఉందని భావించటం లేదు. అయితే.. అధ్యక్షుడిగా జో బిడెన్ పరిపాలన కంటే ట్రంప్ పరిపాలనపై భారత్ ప్రాధాన్యతనిచ్చే కొన్ని అంశాలు ఉన్నాయని భావిస్తున్నా. ఇక.. పరిపాలనలో మార్పు వచ్చిన ప్రతిసారీ కొన్ని అడ్డంకులు సాధారణంగానే ఉంటాయి. ...అమెరికా ఒక ప్రపంచ శక్తి.. ఇది ప్రపంచస్థాయి నిర్ణయాలతో పాలన కొనసాగింస్తుంది. కొన్నిసార్లు అమెరికా తీసుకునే నిర్ణయాలు.. ప్రపంచ స్థాయిలో పరోక్షంగా ప్రభావం చూపుతాయి. అయితే.. ట్రంప్ భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుంకాలు, వాణిజ్యం వంటి కొన్ని అంశాల్లో మార్పులను ప్రవేశపెడితే.. అది మనపై కూడా ప్రభావం చూపుతుంది’’ అని తెలిపారు.చదవండి: Donald Trump: మళ్లీ హౌడీ.. అంటారా? -
ట్రంప్ గెలుపు.. స్పందించిన ఇరాన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్.. కమలా హారిస్పై ఘన విజయం సాధించారు. ఆయన రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంపై ఇరాన్ స్పందించింది. అమెరికా గతంలో పాటించిన తప్పుడు విధానాలను సమీక్షించే ఒక అవకాశంగా డొనాల్డ్ ట్రంప్ గెలుపును చూస్తామని పేర్కొంది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘై మీడియాతో మాట్లాడారు. ‘‘ డొనాల్డ్ ట్రంప్ తన మొదటి అమెరికా అధ్యక్ష పదవీకాలంలో ఇరాన్పై గరిష్ట ఒత్తిడి వ్యూహాన్ని అనుసరించారు. గతంలో అమెరికా ప్రభుత్వాల విధానాలు మాకు చాలా చేదు అనుభవాలు మిగిల్చాయి. అయితే.. తాజాగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం.. గత ప్రభుత్వాల తప్పుడు విధానాలను సమీక్షించడానికి ఒక అవకాశంగా భావిస్తున్నాం. ఆ విధానాలను సరిదిద్దే అవకాశం ఇప్పడు రావొచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం’’ అని తెలిపారు.మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్ను బుధవారం అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేతగా ప్రకటించేందుకు ముందు ఇరాన్.. అమెరికా ఎన్నికలను అసంబద్ధమైనవని కొట్టిపారేసింది. ‘‘యునైటెడ్ స్టేట్స్ , ఇరాన్ విధానాలు స్థిరంగా ఉన్నాయి.ఎవరు అమెరికాకు అధ్యక్షుడు అవుతారన్నది ముఖ్యం కాదు. ప్రజల జీవనోపాధిలో ఎలాంటి మార్పు రాకుండా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాం’’ అని ప్రభుత్వ ప్రతినిధి ఫతేమెహ్ మొహజెరానీ అన్నారు.ఇక.. ఇరాన్, అమెరికా 1979 ఇస్లామిక్ విప్లవం నుంచి ప్రత్యర్థులుగా మారాయి. ఇరుదేశాల మధ్య 2017 నుంచి 2021 వరకు ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.ట్రంప్ ఏకపక్షంగా 2015 ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలిగారు. అంతేకాకుండా ఇరాన్పై కఠినమైన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. 2020లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా.. బాగ్దాద్ విమానాశ్రయంపై వైమానిక దాడి చేసి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ జనరల్ ఖాసేమ్ సులేమానిని హతమార్చింది. చదవండి: అమెరికా ఉపాధ్యక్షుడు ‘వాన్స్ భయ్యా, ఉషా భాభీ’ పెళ్లి ఫోటోలు వైరల్ -
ట్రంప్ ఇష్టపడే భారతీయ వంటకాలివే..!
అగ్రరాజ్యాధిపతిగా మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు డొనాల్డ్ ట్రంప్. తన ప్రత్యర్థి, డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఓడించి ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ గెలుపుతో యావత్ ప్రపంచదృష్టిని ఆకర్షించారు ట్రంప్. ఈ నేపథ్యంలో ఆయన గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న హయాంలో భారత్లోని కొన్ని ప్రముఖ నగరాల్లో పర్యటించారు. ఎక్కువగా మాంసాహారమే ఇష్టపడే ట్రంప్ మన దేశంలోని ప్రధాన నగరాల్లోని శాకాహార రెసిపీలను చాలా ఇష్టంగా ఆస్వాదించారు. ఆయన ఇష్టంగా తిన్న వంటకాలేంటో చూద్దామా..!.ట్రంప్ తన భారత పర్యటనలో గుజరాత్, ఢిల్లీ, ఆగ్రాతో సహా మూడు ముఖ్యమైన నగరాలను సందర్శించారు. కూరగాయలంటేనే ఇష్టపడని ట్రంప్ కాశ్మీరీ కెహ్వా, నారింజతో చేసే పన్నాకోటా, బ్రోకలి, మొక్కజొన్న సమోసా, ఖామన్, నిమ్మ కొత్తిమీరతో చేసిన షోర్బా, పాలక్ చాట్, సాల్మన్ టిక్కా, ఆలూ టిక్కీ, అంజీర్ మలై కోఫ్తా, మష్రూమ్ కర్రీ తదితరాలను ఆస్వాదించారు. అలాగే మేతి కుల్చా, నాన్, తందూరీ రోటీలను ట్రై చేశారు. ఇక నాన్వెజ్లో మటన్ బిర్యానీ అంటే మహా ఇష్టంగా ఆరగించినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అలాగే మన భారతీయ ఆతిథ్య సంప్రదాయానికి అనుగుణంగా భోజనం చివర్లో అందించే కాజు బర్ఫీ, హాజెల్నట్ యాపిల్, రబ్దీతో కూడిన మాల్పువా, ఫ్రూట్ సలాడ్స్ని కూడా ఇష్టంగా తిన్నారు ట్రంప్. ముఖ్యంగా మన దేశంలో యూఎస్ ప్రతినిధులకు తప్పనిసరిగా అందించే డార్జిలింగ్ టీ, ఇంగ్లీష్ టీ, లెమన్ టీ అస్సాం టీ వంటి వాటిని కూడా ఆస్వాదించినట్లు అధికారులు వెల్లడించారు. ఎలాగైన మనదేశంలోని వంటకాలు ఎప్పుడు కూరగాయల వైపు చూడని వాళ్లని కూడా ఓ సారి తిని చూద్దాం అనేలా నోరూరిస్తాయి కదూ..!(చదవండి: కమలా హారిస్ పాటించే ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే..!) -
అమెరికా ఉపాధ్యక్షుడు ‘వాన్స్ భయ్యా, ఉషా భాభీ’ పెళ్లి ఫోటోలు వైరల్
2024 వైట్ హౌస్ రేసులో డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్పై రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించి చరిత్రకెక్కాడు. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన భార్య ఉషా చిలుకూరి భర్త, ఉపాధ్యక్షుడిగా జెడి వాన్స్ కూడా విజయం సాధించారు. ఈ సందర్భంలో ఉష. వాన్స్ పెళ్లి ఫోటోలు ట్విటర్లో సందడి చేస్తున్నాయిఅధ్యక్ష ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయం సాధించిన తర్వాత తన భార్యకు ఒక నోట్ను ఎక్స్లో షేర్ చేశారు జేడీ వాన్స్. ముందుగా డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి, "ఈ స్థాయిలో మన దేశానికి సేవ చేయడానికి నాకు అలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమెరికన్ ప్రజలకోసం తన పోరాటం ఎప్పటికీ కొనసాగుతుంది అంటూ వారికీ కృతజ్ఞతలు ప్రకటించారు. ‘‘ఇంతటి ఘనవిజయాన్ని మద్దతిచ్చిన నా అందమైన భార్యకు థ్యాంక్స్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. తన సతీమణి ఉషి చిలుకూరికి మరో తీపి కబురు కూడా అందించారు. త్వరలోనే ఆమె అమెరికా రెండో పౌరురాలిగా కాబోతుతున్న తొలిభారతీయ మహిళ కాబోతోందని ప్రకటించారు.జెడి వాన్స్ భార్య ఉషా చిలుకూరి న్యాయవాది. ఆంధ్ర ప్రదేశ్కు చెందిన ఆమె కుటుంబం 50 సంవత్సరాల క్రితం విదేశాలకు వలస వచ్చింది. ఉష శాన్ డియాగోలో పెరిగింది. యేల్ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 2014లో వాన్స్ను పెళ్లాడారు ఉష. వాన్స్ తాజా విజయంతో శ్వేతజాతీయేతర రెండో మహిళగా ఉష అవతరించనుంది.Vice President JD Vance bhaiyya and Usha bhabhi ☺️ pic.twitter.com/L2HPTVuJfu— The Hawk Eye (@thehawkeyex) November 6, 2024 -
ట్రంప్ మా నాన్న.. తెరపైకి పాక్ యువతి
ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించిన దరిమిలా పాకిస్తాన్ నుంచి ఓ ఆసక్తికర వార్త వైరల్గా మారింది. ఒక పాకిస్తానీ యువతి తాను ట్రంప్ కుమార్తెనంటూ మీడియాకు తెలిపింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.ఆ వీడియోలో ఆ యువతి తాను ముస్లింనని చెబుతూ, తానే డొనాల్డ్ ట్రంప్ నిజమైన కుమార్తెనని పేర్కొంది. అయితే ఈ వీడియో ప్రామాణికతో పాటు ఆ యువతి మానసిక స్థితి గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం వెలుగులోకి రాలేదు. కాగా మీడియాతో మాట్లాడిన ఆ యువతి ఇంగ్లీషువాళ్లు ఇక్కడికి వచ్చినప్పుడు తనను చూసి ఆశ్చర్యపోతుంటారని తెలిపింది. తన కూతురిని బాగా చూసుకోలేకపోతున్నానని ట్రంప్ తన తల్లితో ఎప్పుడూ అంటుంటారని ఆమె పేర్కొంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో @pakistan_untold ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 75 వేలకు పైగా వీక్షణలు దక్కాయి. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ను ఓడించి, డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. Does @realDonaldTrump know he has children in Pakistan who speak Urdu & English in Punjabi? pic.twitter.com/anhRKbiLGo— Pakistan Untold (@pakistan_untold) November 6, 2024ఇది కూడా చదవండి: ‘డాన్ తిరిగొచ్చాడు’.. ప్రపంచ వార్తా పత్రికల్లో.. -
అమెరికా ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్స్ హవా
-
‘డాన్ తిరిగొచ్చాడు’.. ప్రపంచ వార్తా పత్రికల్లో..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అమోఘ విజయం సాధించారు. యావత్ ప్రపంచం దృష్టి అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే కేంద్రీకృతమైన నేపధ్యంలో.. ట్రంప్ విజయం తరువాత అన్ని దేశాలు ఆయనను అభినందనలతో ముంచెత్తుతున్నాయి. అలాగే ప్రపంచంలోని పలు వార్తా పత్రికలు ట్రంప్ విజయాన్ని పతాక శీర్షికన ప్రచురించాయి. ‘డాన్ తిరిగొచ్చాడు’ అంటూ ఒక వార్తా పత్రిక పతాక శీర్షికన ట్రంప్ పునరాగమనాన్ని స్వాగతించింది. డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత ప్రపంచమంతా ఆయన పునరాగమనానికి శుభాకాంక్షలు చెబుతోంది.అన్ని దేశాల్లోని వార్తాపత్రికల మొదటి పేజీల్లోనూ డొనాల్డ్ ట్రంప్ విజయం పతాక శీర్షికన నిలిచింది.అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి విజయం సాధించారు.హనోయిలో వియత్నామీస్ వార్తాపత్రికలోనూ డొనాల్డ్ ట్రంప్ విజయంపై స్పందనలను ప్రచురించారు.మెల్బోర్న్ వార్తాపత్రికల మొదటి పేజీలోనూ నూతనంగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయంపై వార్త ప్రచురించారు.డొనాల్డ్ ట్రంప్ భారతీయ వార్తాపత్రికల మొదటి పేజీలలో చోటు దక్కించుకున్నారు.డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక విజయానికి ప్రతిస్పందనలు వార్తాపత్రికలలో ప్రచురితమయ్యాయి.కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్కు గట్టి పోటీ ఇవ్వాలనుకున్నా, అమెరికా ప్రజలు మరోసారి ట్రంప్కు పట్టంకట్టారు.అమెరికాలో మరోసారి డొనాల్డ్ ట్రంప్ మాయాజాలం ఫలించింది.ట్రంప్ చారిత్రాత్మక పునరాగమనాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా వీక్షించారు. ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికలు.. రోదించిన కమలా హారిస్ మద్దతుదారులు -
అమెరికా ఉపాధ్యక్షుడిగా ఆంధ్రా అల్లుడు! (ఫొటోలు)
-
US Vice President: వాన్స్ తెలుగువారి అల్లుడే!
నిడదవోలు/ఉయ్యూరు: అమెరికా ఉపాధ్యక్ష పదవిని అధిరోహించబోతున్న రిపబ్లికన్ నేత జేడీ వాన్స్ తెలుగు వారి అల్లుడే. ఆయన భార్య చిలుకూరి ఉషాబాల తెలుగు సంతతికి చెందిన వారే కావడం విశేషం. 38 ఏళ్ల ఉషా అమెరికాలో జన్మంచినప్పటికీ ఆమె తాత, ముత్తాలది మాత్రం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామమని ఆ గ్రామపెద్దలు చెబుతున్నారు. చిలుకూరి ఉషాబాల ముత్తాత రామశాస్త్రి కొంత భూమిని గ్రామంలో ఆలయం కోసం దానంగా ఇచ్చారు. ఆ స్థలంలోనే గ్రామస్తుల సహకారంతో సాయిబాబా ఆలయం, మండపాన్ని నిర్మించారు. వాన్స్ ఉపాధ్యక్షుడిగా ఎన్నివడంపై వడ్లూరు వాస్తవ్యులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయ విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు శాంతమ్మ మరిది రామశాస్త్రి కుమారుడు రాధాకృష్ణ. ఆ రాధాకృష్ణ కూతురే ఉష. ఉషా తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1980లలోనే అమెరికాలో స్థిరపడ్డారు. వీళ్ల సంతానం ముగ్గురిలో ఉషా ఒకరు. కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలోనూ ఉష పూరీ్వకులున్నారు. ఆమెకు తాత వరసైన రామ్మోహనరావు కుటుంబం ప్రస్తుతం ఈ గ్రామంలోనే నివసిస్తోంది. ఉష పూర్వీకులు దశాబ్దాల కిందటే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా సాయిపురంలో 18వ శతాబ్దంలో చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్త్రి నివసించారు. ఆయన వంశవృక్షమే శాఖోపశాఖలుగా, కుటుంబాలుగా విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై నగరాలుసహా అమెరికా, ఇతర దేశాల్లో స్థిరపడ్డారు. ఉషా ముత్తాత వీరావధాన్లుకు ఐదుగురు సంతానం. రామశాస్త్రి, సూర్యనారాయణ శాస్త్రి, సుబ్రహ్మణ్యశాస్త్రి, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణమూర్తి. వీరందరూ ఉన్నత విద్యావంతులే. ఉష కారణంగా వడ్లూరు గ్రామం పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోందని గ్రామ మాజీ సర్పంచ్ పి.శ్రీనివాసరాజు ఆనందం వ్యక్తంచేశారు. తొలి భారత సంతతి ‘సెకండ్ లేడీ’ అమెరికా అధ్యక్షుడి భార్యను ప్రథమ మహిళగా, ఉపాధ్యక్షుడి భార్యను సెకండ్ లేడీగా సంబోధించడం అమెరికాలో పరిపాటి. భర్త వాన్స్ వైస్ప్రెసిడెంట్గా ఎన్నికైన నేపథ్యంలో ఉషా తొలి భారతసంతతి ‘సెకండ్ లేడీ’గా చరిత్ర సృష్టించనున్నారు. కాలిఫోరి్నయాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా జన్మించారు. యేల్ విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో డిగ్రీ పట్టా సాధించారు. కేంబ్రిడ్జ్ వర్సిటీ నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. సహాయకురాలిగా న్యాయ సంబంధమైన విభాగాల్లో చాలా సంవత్సరాలు విధులు నిర్వర్తించారు. సుప్రీంకోర్టు ఇద్దరు మాజీ న్యాయమూర్తుల వద్ద పనిచేశారు. గతంలో యేల్ లా జర్నల్కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్గా పనిచేశారు. యేల్ వర్సిటీలో లా అండ్ టెక్ జర్నల్కు మేనేజింగ్ ఎడిటర్గా ఉన్నారు. చివరిసారిగా ముంగర్, టోల్స్,ఓల్సన్ సంస్థలో పనిచేశారు. యేల్ విశ్వవిద్యాలయంలో ఆమె అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. విద్యావంతులైన తల్లిదండ్రులు ఉషా తల్లిదండ్రులు ఇద్దరూ విద్యావంతులే. తల్లి లక్ష్మి అణుజీవశాస్త్రంలో, జీవరసాయన శాస్త్రంలో పట్టబధ్రులు. ప్రస్తుతం ఆమె అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. శాన్డియాగోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయాలో కార్యనిర్వాహక పదవిలోనూ కొనసాగుతున్నారు. ఉషా తండ్రి రాధాకృష్ణ వృత్తిరీత్యా ఏరోస్పేస్ ఇంజినీర్. ఆయన గతంలో ఐఐటీ మద్రాస్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆయన ప్రస్తుతం యునైటెడ్ టెక్నాలజీస్ ఏరోస్పేస్ సిస్టమ్స్లో ఏరోడైనమిక్స్ స్పెషలిస్ట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. దాంతోపాటే కాలిన్స్ ఏరోస్పేస్లో అసోసియేట్ డైరెక్టర్గా సేవలందిస్తున్నారు. వాన్స్తో ఉష పరిచయం యేల్ లా స్కూల్లో ఉషా, వాన్స్ తొలిసారి కలిశారు. 2013లో ఇద్దరూ కలిసి వర్సిటీలో ఒక చర్చాకార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాతే ఇద్దరి పరిచయం ప్రేమకు దారితీసింది. 2014 ఏడాదిలో వీరు పెళ్లాడారు. హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లిచేసుకోవడం విశేషం. వీరికి కూతురు మీరాబెల్, కుమారులు ఎవాన్, వివేక్ ఉన్నారు. భర్త వాన్స్కు చేదోడువాదోడుగా ఉంటూ విజయంలో ఉషా కీలకపాత్ర పోషించారు. ‘భార్యే నా ధైర్యం. చెబితే నమ్మరుగానీ ఆమె నాకంటే చాలా తెలివైన వ్యక్తి’అని ఉషను పొగడటం తెల్సిందే. రిపబ్లికన్ నేతకు భార్యగా ఉన్న ఉషా దశాబ్దకాలం క్రితం 2014లో డెమొక్రటిక్ పార్టీకి మద్దతు తెలపడం విశేషం. సాయిపురం వాసుల్లో ఆనందం వాన్స్ విజయం సాధించటంతో తెలుగు ప్రజల్లో సంబరం వెల్లివిరిసింది. ప్రత్యేకించి ఉషా పూరీ్వకుల మరో గ్రామమైన సాయిపురం వాసుల్లో ఆనందం వెల్లివిరిసింది. మంగళవారం స్థానికులు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.ఆయన భార్య ఉషకు ఏపీలోని వడ్లూరు గ్రామంతో అనుబంధం -
US Election2024: ఆరుగురు భారతీయుల విజయకేతనం
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో ఆరుగురు భారతీయ అమెరికన్లు విజయం సాధించారు. ప్రస్తుత కాంగ్రెస్లో ఐదుగురు ప్రతినిధులు ఉండగా.. ఈ ఎన్నికలతో అమెరికా ప్రతినిధుల సభలో భారతీయ అమెరికన్ల సంఖ్య ఆరుకు పెరిగింది. వర్జీనియా నుంచి ఎన్నికైన తొలి భారతీయుడిగా న్యాయవాది సుహాస్ సుబ్రమణ్యం చరిత్ర సృష్టించారు.అమీ బెరా.. డెమొక్రాట్ అభ్యర్థిగా కాలిఫోరి్నయాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమీ బెరా విజయం సాధించారు. రిపబ్లికన్ ప్రత్యర్థి క్రిస్టీన్ బిష్ను ఆయన ఓడించారు. యూఎస్ ప్రతినిధుల సభలో ఆయన సీనియర్ భారతీయ అమెరికన్. 2012లో రిపబ్లికన్ అభ్యర్థిని ఓడించిన బెరా 6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ కు ప్రాతినిధ్యం వహించారు. యూఎస్ ప్రతినిధుల సభకు చేరిన మూడో భారతీయ వ్యక్తిగా నిలిచారు. 1957లో కాలిఫోరి్నయా 29వ కాంగ్రెషనల్ డి్రస్టిక్ట్ నుంచి గెలిచి కాంగ్రెస్లో కాలు పెట్టిన తొలి భారతీయ అమెరికన్గా దలీప్ సింగ్ సౌంద్ చరిత్ర సృష్టించిన 50 ఏళ్ల తరువాత అమీ బెరా కాంగ్రెస్కు ఎన్నికయ్యారు. మొదట స్వల్ప ఓట్ల తేడాతో గెలిచినా.. తరువాత పర్యాయాల్లో ఆధిక్యాన్ని కొనసాగించారు. థానేదార్ రెండోసారి.. మిషిగన్లోని పదమూడో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు థానేదార్ రెండోసారి ఎన్నికయ్యారు. రిపబ్లికన్ ప్రత్యర్థి మార్టెల్ బివింగ్స్ను 35 శాతానికి పైగా ఓట్ల తేడాతో ఓడించారు. తాను అందించిన సేవలు, శ్రామికులు, యూనియన్ల పక్షాన నిలబడటం, అబార్షన్ హక్కుల కోసం పోరాటం తన విజయానికి కారణమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తనకు మద్దతు తెలిపిన యూనియన్లు, గ్రూపులకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా రాజ్యాంగ హక్కులకోసం తాను పోరాడతానని హామీ ఇచ్చారు. రోఖన్నా.. 2016 నుంచికాలిఫోరి్నయాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రటిక్ ప్రతినిధి రో ఖన్నా మూడోసారి ఎన్నికయ్యారు. డెమొక్రాట్లకు బలమైన పట్టున్న 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్లో రిపబ్లికన్ అనితా చెన్ను సునాయాసంగా ఓడించారు. 2016లో మైక్ హోండాను ఓడించి ఖన్నా తొలిసారి అమెరికా సభకు ఎన్నికయ్యారు. ఖన్నా హౌస్ ఆర్మ్డ్ సరీ్వసెస్ కమిటీలో, పర్యవేక్షణ, జవాబుదారీ కమిటీల్లో పనిచేస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోకు దక్షిణాన సిలికాన్ వ్యాలీలోని కొన్ని భాగాలను కలిగి ఉన్న డిస్ట్రిక్ట్.. 1990 నుంచి డెమొక్రాట్లకు కంచుకోటగా ఉంది. ఇల్లినాయిస్ నుంచి రాజా కృష్ణమూర్తి.. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్ 8వ కాంగ్రెషనల్ డి్రస్టిక్ట్ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యా రు. రిపబ్లికన్ అభ్యర్థి మార్క్ రిక్పై దాదా పు 30 వేలకు పైగా ఓట్ల తేడాతో కృష్ణమూర్తి విజయం సాధించారు. 2016లో తొలిసారి కాంగ్రెస్కు ఎన్నికైన ఆయన.. చైనీస్ కమ్యూనిస్టు పార్టీలో అనుమానిత కార్యకలాపాలపై దృష్టి సారించిన సెలక్ట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న న్యాయవాది అయిన కృష్ణమూర్తి.. మాజీ డిప్యూటీ స్టేట్ కోశాధికారితో సహా రాష్ట్రం తరఫున అనేక పదవులు నిర్వహించారు. ప్రమీలా జయపాల్వాషింగ్టన్ 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రమీలా జయపాల్ మరోసారి గెలుపొందారు. మలయాళీ అయిన జయపాల్ నాయర్ రిపబ్లికన్ అభ్యర్థి డాన్ అలెగ్జాండర్ను భారీ ఓట్ల తేడాతో ఓడించారు. జయపాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న స్లామ్–డంక్ లిబరల్ సీటు. ఇది డెమొక్రాట్లకు బలమైన జిల్లా. గెలుపు అనంత రం ఎక్స్ వేదికగా మద్దతు దారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ‘వాషింగ్టన్ 7వ జిల్లా కు ప్రాతినిధ్యం వహించడం నాకు గర్వంగా ఉంది. అందరితో కలిసి పురోగతి కోసం పనిచేయడానికి, అవకాశాల కోసం పోరాటం కొనసాగించడానికి నేను ఎదురుచూస్తున్నాను. నాకు మద్దతు పలికిన ప్రతి ఒక్కరూ హృదయపూర్వక కృతజ్ఞతలు’అని ఆమె పేర్కొన్నారు. సుహాస్ సుబ్రమణ్యం రికార్డు.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎన్నికై చరిత్ర సృష్టించిన భారతీయ అమెరికన్ సుహాస్ సుబ్రమణ్యం. ఇప్పటివరకు వర్జీనియా స్టేట్ సెనేటర్గా ఉన్న సుబ్రమణ్యం.. వర్జీనియానుంచి ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్గా రికార్డు సృష్టించారు. డెమొక్రటిక్లకు కంచుకోట అయిన వర్జీనియాలోని 10వ కాంగ్రెషనల్ డి్రస్టిక్ట్ నుంచి అమెరికా ప్రతినిధుల సభకు పోటీ చేసి రిపబ్లికన్ పారీ్టకి చెందిన మైక్ క్లాన్సీని ఓడించారు. ప్రస్తుతం ఐదుగురు భారతీయ అమెరికన్లతో కూడిన కాంగ్రెస్లో ఆయన సమోసా కాకస్లో చేరారు. సుబ్రమణ్యం తండ్రిది బెంగళూరు. తండ్రిది చెన్నై. తాత మిలటరీలో పనిచేయడంతో తండ్రి ఎక్కువకాలం సికింద్రాబాద్లో గడిపారు. బెంగళూరులోని మెడికల్ కాలేజీలో చదువుకున్న ఇద్దరూ పెళ్లి చేసుకుని 70వ దశకంలో అమెరికాకు వలస వచ్చారు. తమ కొడుకు యూఎస్ కాంగ్రెస్లో ఉంటారని ఊహించి ఉండదు. సుహాస్ భార్య మిరాండాది వర్జీనియా. ఇద్దరు కుమార్తెలు. ‘ఈ జిల్లాకు సేవలందించడం గౌరవంగా భావిస్తున్నా’ అని సుబ్రమణ్యం పేర్కొన్నారు. అలాగే ‘నా పేరెంట్స్ కొన్ని విలువలు నేర్పారు. నా భారతీయ మూలాలు కోల్పోకూడదన్నది అందులో ఒకటి. అందుకే వేసవిలో ఇండియాకు వెళ్తుంటా. ఇప్పటికీ అక్కడ నాకు కుటుంబం ఉంది. ఆ వారసత్వాన్ని కొనసాగించడం నాకు చాలా ముఖ్యం. నా నేపథ్యం, నా వారసత్వం గురించి గర్వంగా చెప్పుకుంటా’అని చెప్పే సుబ్రమణ్యం.. భారత్–అమెరికా మధ్య బలమైన బంధం ఉండాలని కోరుకుంటున్నారు. -
అమెరికా ఎన్నికలు.. రోదించిన కమలా హారిస్ మద్దతుదారులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ఓటమి తర్వాత, ఆమె మద్దతుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆమె అభిమానులు కొందరు వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించారు.ఎన్నికల్లో కమలా హారిస్ను గెలిపించేందుకు ఆమె మద్దతుదారులు ఎంతో కృషి చేశారు.కొన్ని సందర్భాలలో కమలా మద్దతుదారులు ఎంతో దూకుడుగా కనిపించారు. అయితే ఫలితాలు వెలువడ్డాక సీన్ మారిపోయింది.కమలా హారిస్ కోసం సోషల్ మీడియా మొదలుకొని వీధులలో ప్రచారం సాగించిన ఆమె అభిమానులు ఫలితాలు వెలువడ్డాక తమ భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయారు.అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన కమలా హారిస్ వాషింగ్టన్లో ప్రసంగించారు. మీరు నాపై చూపిన నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఆమె పేర్కొన్నారు.ఎన్నికల్లో ఓడిపోయినా మన లక్ష్య సాధన కోసం పోరాటం కొనసాగుతుందని కూడా కమలా హారిస్ అన్నారు.ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ను ఓడించారు. నాలుగేళ్ల క్రితం డెమొక్రాట్ల చేతిలో తన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు.వాషింగ్టన్లో కమలా హారిస్ ప్రసంగిస్తున్నప్పుడు, ఆమె మద్దతుదారులు విచార వదనాలతో కనిపించారు.తమ నేత దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టిస్తారని కమలా హారిస్ మద్దతుదారులు భావించారు. అయితే వారి ఆశలు అడియాసలుగా మిగిలాయి. ఇది కూడా చదవండి: రాఘవేంద్ర స్వామి మఠంలో రిషి సునాక్ దంపతుల పూజ -
‘హిట్లర్’ చేతే శెభాష్ అనిపించుకుని..
అత్యంత స్వల్పకాలంలో రాజకీయ పదవీ నిచ్చెనను చకచకా ఎక్కేసి ఉపాధ్యక్షుడిగా అవతరించిన జేడీ వాన్స్ ప్రస్థానం ఆసక్తికరం. ఒకప్పుడు ట్రంప్ను హిట్లర్ అంటూ బహిరంగంగా విమర్శించిన వాన్స్ను ఇప్పుడు అదే ట్రంప్ పిలిచి మరీ తనకు సహసారథిగా ఎంపికచేయడం విశేషం. ఓహియో నుంచి సెనేటర్గా ఉన్న వాన్స్ ఉపాధ్యక్ష పీఠంపై కూర్చుంటున్న అతిపిన్నవయసు్కల్లో ఒకరిగా, అత్యల్ప పాలనాఅనుభవం ఉన్న నేతగా రికార్డ్ సృష్టించారు. గతంలో తన జీవితంలో చూసిన సంఘటనల సమాహారంగా 2016లో రాసిన ‘హిల్బెల్లీ ఎలిగే’పుస్తకం విశేష ఆదరణ పొందటంతో వాన్స్ పేరు ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ రచనను తర్వాత సినిమాగా తీశారు. ⇒ జేడీ వాన్స్ పూర్తిపేరు జేమ్స్ డొనాల్డ్ బౌమాన్ ⇒ స్కాచ్–ఐరిష్ మూలాలున్న వాన్స్ 1984 ఆగస్ట్ రెండో తేదీన ఓహియోలోని మిడిల్టౌన్లో జన్మించారు. ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో అమ్మమ్మ, తాతయ్య పెంచి పెద్దచేశారు. అందుకే తండ్రి వారసత్వంగా వచి్చన బౌమాన్ పేరును తీసేసుకుని అమ్మమ్మ వాన్స్ పేరును తగిలించుకున్నారు. ⇒ పేదరికం కారణంగా 17 ఏళ్ల వయసులో ఒక సరకుల దుకాణంలో క్యాషియర్గా పనిచేశాడు. 2003లో అమెరికా మెరైన్ కార్ప్స్లో చేరి మిలటరీ జర్నలిస్ట్గా పనిచేశాడు. 2005లో ఇరాక్లో అమెరికా సైన్యం సహాయక విభాగంలో పనిచేశారు. ⇒ ఓహియో వర్సిటీలో చదువుకున్నారు. యేల్ వర్సిటీలో లా పూర్తిచేసి కొంతకాలం న్యాయవాదిగా న్యాయసేవల సంస్థలో పనిచేశారు. తర్వాత ఒక జడ్జి వద్ద లా క్లర్క్గా కొనసాగారు. తర్వాత టెక్నాలజీ రంగంలో వెంచర్ క్యాపిటలిస్ట్ అవతారమెత్తారు. తర్వాత న్యాయసేవల సంస్థనూ స్థాపించారు. ⇒ తొలిసారిగా షెరాడ్ బ్రౌన్పై సెనేట్ ఎన్నికల్లో పోటీకి ప్రయతి్నంచినా కుదర్లేదు. 2016లో ట్రంప్ను ‘అమెరికా హిట్లర్’అని సంబోధించి పలు విమర్శలు చేశారు. తర్వాత ట్రంప్కు సారీ కూడా చెప్పారు. తర్వాత 2021లో రాజకీయాల్లోకి వచ్చారు. ⇒ 2022లో సెనేట్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి టిమ్ రేయాన్ను ఓడించి తొలిసారిగా ఓహియో సెనేటర్ అయ్యారు. తర్వాత ట్రంప్కు విధేయునిగా మారారు. దీంతో తన రన్నింగ్మేట్గా వాన్స్ను ట్రంప్ ఎన్నుకున్నారు. ⇒ మొదట్లో ట్రంప్ కంటే ముందు వాన్స్కే అధ్యక్ష అభ్యరి్థత్వం విషయంలో మద్దతు పలకాలని వ్యాపారవేత్తలు ఎలాన్ మస్్క, డేవిడ్ ఓ సాక్స్లు భావించారని గతంలో వార్తలొచ్చాయి. యేల్ వర్సిటీలో చదువుకునే రోజుల్లో ప్రేమించిన ఉషను పెళ్లాడారు. ⇒ శ్వేతజాతి కార్మికుల సంక్షేమం గురించి ఎక్కువగా మాట్లాడే వాన్స్ విదేశాంగ విధానంలో చైనాకు బద్ద వ్యతిరేకిగా పేరుంది. ట్రంప్ పేరులోనూ వాన్స్ పేరులోనూ డొనాల్డ్ అనే పేరు ఉండటం గమనార్హం. – వాషింగ్టన్ -
వలసలకు ఇక బ్రేకే!
అగ్రరాజ్యాధిపతిగా డొనాల్డ్ ట్రంప్ మరోసారి పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈసారి ఆయన ఎలాంటి విధానాలు అమలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అమెరికా అధ్యక్షుడు తీసుకొనే నిర్ణయాలు, చేపట్టే చర్యలు ప్రపంచమంతటా ప్రభావం చూపిస్తాయనడంలో సందేహం లేదు. ట్రంప్ రెండో దఫా పాలనపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. గత ఏడాది కాలంగా ట్రంప్ చేసిన ప్రసంగాలు, వచ్చిన ప్రకటనలను బట్టి కొన్ని కీలకమైన అంశాల్లో ఆయన వైఖరి ఎలా ఉండబోతోందో కొంతవరకు అంచనా వేయొచ్చు. అదేమిటో చూద్దాం.. వలసలపై కఠిన వైఖరే అమెరికాలోకి వలసల పట్ల ట్రంప్ మొదటి నుంచీ వ్యతిరేకమే. 2016లో ఆయన ‘గోడ కట్టండి’అని పిలుపునిచ్చారు. అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించారు. అమెరికా అక్రమంగా నివసిస్తున్న వారిని బయటకు తరిమేయడానికి నేషనల్ గార్డు, పోలీసు దళాలను బలోపేతంపై దృష్టి పెట్టారు. అక్రమంగా వలస వచ్చిన వారికి, చట్టవిరుద్ధంగా నివసిస్తున్నవారికి ఇకపై ట్రంప్ రూపంలో కష్టాలు తప్పకపోవచ్చు. అమెరికా గడ్డపై జన్మిస్తే అమెరికా పౌరసత్వం ఇచ్చే విధానాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని మార్చాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. కొన్ని ఇస్లామిక్ దేశాల నుంచి వలసలకు ట్రంప్ వ్యతిరేకమే. మొత్తంమీద ఇకపైన చట్టబద్ధంగా కూడా ఎక్కువ మందిని అమెరికాలోకి అనుమతించకపోవచ్చు. విదేశీయులు అమెరికా కలను వాయిదా వేసుకోవాల్సి రావొచ్చు. గర్భస్రావాలపై మహిళలకు హక్కులు తొలి దఫాలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మహిళల పునరుత్పత్తి హక్కులను ట్రంప్ వ్యతిరేంచారు. గర్భాన్ని తొలగించుకొనేందుకు మహిళలకు ఉన్న హక్కును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పు తమ వల్లే సాధ్యమైందని ట్రంప్ చెప్పారు. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ పునరుత్పత్తి హక్కుల కోసం మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ వారికి మద్దతు పలికారు. అయితే, ఈసారి ట్రంప్ మహిళల గర్భస్రావ హక్కుల విషయంలో జోక్యం చేసుకోకపోవచ్చు. అంటే మహిళలకు స్వేచ్ఛనిచ్చే అవకాశం ఉంది. ట్రాన్స్జెండర్లకు రక్షణ లింగమారి్పడి చేయించుకున్నవారిపై ట్రంప్కు సానుభూతి ఉంది. లెస్పియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, ఇంటర్సెక్స్ వర్గాలకు చట్టపరమైన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారి పట్ల సమాజం దృక్పథం మారాలని ఎన్నోసార్లు చెప్పారు. ట్రంప్ పాలనలపై వృద్ధులు సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారికి సామాజిక భద్రత, వైద్య సంరక్షణ కల్పిస్తామంటూ ట్రంప్ హామీ ఇచ్చారు. -
ట్రంప్ విజయంపై కమలా హారిస్, జోబైడెన్ తొలి స్పందన..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి, డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఓడించారు.డొనాల్డ్ ట్రంప్ గెలుపుపై వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, ప్రెసిడెంట్ జో బైడెన్ల తొలి ప్రకటనలు మీడియాకు అందాయి. దానిలో కమలా హారిస్.. ఓటర్లు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితం మనం కోరుకున్నది కాదని అమె అన్నారు. మనం నిరంతరం పోరాడుతూనే ఉందాం. ఈ ఎన్నికల ఫలితాలను మనం అంగీకరించాల్సిందేనన్నారు. అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ను తాను కలుసుకుని, అభినందనలు తెలిపానని కమలా హారిస్ పేర్కొన్నారు.అధికార మార్పిడిలో ట్రంప్కు, ఆయన బృందానికి సహకరిస్తామని, ఇదంతా శాంతియుతంగా జరిగేలా చూస్తామని కమలా హారిస్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఒక ప్రకటనలో కమలా హారిస్ చిత్తశుద్ధి మెచ్చుకోదగినదని అన్నారు. ఆమె అమెరికన్లకు ఛాంపియన్గా కొనసాగుతారన్నారు. జో బైడెన్.. డొనాల్డ్ ట్రంప్కు ఫోన్ చేసి, అభినందనలు తెలిపారు. కాగా ట్రంప్ ప్రచార ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్.. బైడెన్ అభినందనలను అందుకున్నారని, త్వరలోనే బైడెన్ను కలుసుకోవాలని అనుకుంటున్నారని తెలిపారు.ఇది కూడా చదవండి: USA Presidential Election Results 2024: మహిళలకు మళ్లీ మొండిచెయ్యే -
ట్రంప్తో చర్చలకు సిద్ధం: పుతిన్
మాస్కో: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్తో చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఎన్నికల్లో విజయానికి ట్రంప్ను అభినందించారు. ట్రంప్ను ధైర్యశాలిగా అభివర్ణించారు. సోచిలో శుక్రవారం ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. వైట్హౌస్లో తొలి విడతలో ట్రంప్ అన్నివైపుల నుంచీ ఒత్తిళ్లు ఎదుర్కొన్నారని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్తో యుద్ధానికి ముగింపు పలకగలనని ట్రంప్ అనడంపై స్పందిస్తూ.. కనీసం దృష్టి పెట్టాల్సిన అంశమిదని రష్యా అధ్యక్షుడు అన్నారు. జూలైలో ట్రంప్పై జరిగిన హత్యాయత్నంపై మాట్లాడుతూ.. ఆయనపై ఒక అభిప్రాయానికి రావడానికి ఇది దోహదపడిందని పేర్కొన్నారు. కాల్పులు జరిగి చెవి నుంచి రక్తమోడుతున్నా.. ట్రంప్ వెంటనే తేరుకొని పిడికిలి బిగించి.. ఫైట్, ఫైట్, ఫైట్.. అని నినదించిన విషయం తెలిసిందే. దీనిపై పుతిన్ మాట్లాడుతూ.. ‘ట్రంప్ చక్కగా స్పందించారు. ధైర్యంగా పరిస్థి తులను ఎదుర్కొ న్నారు. ధీశాలి’ అని కితాబి చ్చారు. గురువారం ట్రంప్ ఎన్బీసీ ఛానల్తో మాట్లాడు తూ.. పుతిన్తో మాట్లాడాలని భావిస్తున్నా నన్నారు. దీనిపై పుతిన్ స్పందిస్తూ ట్రంప్తో చర్చలకు సిద్ధమని విలేకరులతో అన్నారు. సూపర్ పవర్ దేశాల జాబితాలో భారత్ను చేర్చాలిప్రపంచంలోని అత్యంత బలీయమైన దేశాల జాబితాలో భారత్ను చేర్చాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ప్రపంచదేశాలన్నింటిలోకి భారత ఆర్థికవ్యవస్థే అతి వేగంగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. శుక్రవారం పుతిన్ సోచిలో ఒక కార్యక్రమంలో మాట్లాడారు. -
US Election 2024: స్వర్ణయుగం తెస్తా
వాషింగ్టన్: రెండోసారి పరిపాలన మొదలెట్టాక అమెరికాకు స్వర్ణయుగాన్ని తీసుకొస్తానని కాబోయే నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యత కనబరిచాక బుధవారం ఫ్లోరిడా రాష్ట్రంలోని వెస్ట్ పామ్ బీచ్ ప్రాంతంలోని పామ్ బీచ్ కన్వెన్షన్ సెంటర్లో కుటుంబసమేతంగా ‘ఎలక్షన్ నైట్ వాచ్ పార్టీ ’వేదిక మీదకు వచ్చిన ట్రంప్ సుదీర్ఘంగా మాట్లాడారు. ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా సైతం పోడియం మీదకు వచ్చారు. ట్రంప్ సతీమణి మెలానియా, కుమారులు, కోడళ్లు, మనవరాళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు సైతం వేదిక మీదకొచ్చారు. చిరస్మరణీయ విజయం తర్వాత జాతినుద్దేశిస్తూ వందలాది మంది మద్దతుదారుల సమక్షంలో ట్రంప్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. దేశం మునుపెన్నడూ చూడని విజయం ‘‘అమెరికాలో ఇలాంటి విజయాన్ని మునుపెన్నడూ ఎవరూ చూడలేదు. అత్యంత శక్తివంతమైన ప్రజాతీర్పు ఇది. అమెరికా చరిత్రలో అతిగొప్ప రాజకీయ ఉద్యమం ఇది. మా పార్టీ గెలుపుతో అమెరికాకు మళ్లీ స్వర్ణయుగం రాబోతోంది. అమెరికాను మళ్లీ అత్యంత గొప్ప దేశంగా మలిచేందుకు ఈ గెలుపు మాకు సదవకాశం ఇచి్చంది. పాత గాయాలను మాన్పి దేశాన్ని మళ్లీ సరికొత్త శిఖరాలకు చేరుస్తాం. మళ్లీ మేం పార్లమెంట్పై పట్టుసాధించాం. హోరాహోరీ పోరు జరిగిన కీలక జార్జియా, పెన్సిల్వేనియా, విస్కాన్సిస్ లాంటి రాష్ట్రాల్లోనూ విజయం సాధించాం. అన్ని వర్గాల సమూహశక్తిగా అతిపెద్ద విస్తృతమైన ఏకీకృత కూటమిగా నిలబడ్డాం. ఇలా అమెరికా చరిత్రలో మునుపెన్నడూ జరగలేదు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా యువత, వృద్ధులు, మహిళలు, పురుషులు అంతా రిపబ్లికన్ పారీ్టకే పట్టం కట్టారు. కార్మిక, కార్మికేతర సంఘాలు, ఆఫ్రికన్–అమెరికన్, హిస్పానియన్–అమెరికన్, ఆసియన్–అమెరికన్, అర్బన్–అమెరికన్, ముస్లిం అమెరికన్ ఇలా అందరూ మనకే మద్దతు పలికారు. ఇది నిజంగా ఎంతో సుందరమైన ఘటన. భిన్న నేపథ్యాలున్న వర్గాలు మనతో కలిసి నడిచాయి. అందరి ఆశ ఒక్కటే. పటిష్ట సరిహద్దులు కావాలి. దేశం మరింత సురక్షితంగా, భద్రంగా ఉండాలి. చక్కటి విద్య అందాలి. ఎవరి మీదకు దండెత్తకపోయినా మనకు అజేయ సైన్యం కావాలి. గత నాలుగేళ్లలో మనం ఎలాంటి యుద్ధాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేదు. అయినాసరే ఐసిస్ను ఓడించాం. నేనొస్తే యుద్ధమేఘాలు కమ్ముకుంటాయని డెమొక్రాట్లు ఆరోపించారు. నిజానికి నేనొస్తే యుద్ధాలు ఆగిపోతాయి. ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛకు దక్కిన అద్భుత విజయమిది. మరోమారు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకుని నాకు అసాధారణ గౌరవం ఇచ్చిన నా అమెరికన్ ప్రజలకు మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నా ’’అని అన్నారు. సరిహద్దులను పటిష్టం చేస్తా ‘‘ప్రస్తుతం దేశం చాలా కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. తక్షణ సాయం అవసరం. దేశ గాయాలను మేం మాన్పుతాం. దేశ సరిహద్దుల వద్ద కాపలాను మరింత పటిష్టం చేస్తాం. అదొక్కటేకాదు దేశం ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చూపుతాం. ప్రతి ఒక్క పౌరుడికి నేనొక్కటే చెబుతున్నా. మీ కోసం, మీ కుటుంబం కోసం, మీ భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా పనిచేస్తా. ప్రతి రోజూ పోరాడతా. మనం, మన పిల్లలు కోరుకునే స్వేచ్ఛాయుత, అత్యంత సురక్షితమైన, సుసంపన్నమైన అమెరికా కోసం నా తుదిశ్వాసదాకా కృషిచేస్తా. అమెరికాకు మళ్లీ స్వర్ణయుగాన్ని తెస్తా. ఈ మహాయజ్ఞంతో నాతోపాటు పాలుపంచుకోవాలనుకునే ప్రతి ఒక్క పౌరుడికీ ఇదే నా స్వాగతం’’అని అన్నారు. బంగరు భవితకు బాటలు వేద్దాం ‘‘మనందరం కలిసి సమష్టిగా అమెరికా ఉజ్జల భవితను లిఖిద్దాం. కలిసి కష్టపడి మన తర్వాత తరాలకు చక్కటి భవిష్యత్తును అందిద్దాం. ఎన్నికల వేళ 900 ర్యాలీలు నిర్వహించుకున్నాం. విస్తృతంగా పర్యటించి ప్రజలకు చేరువకావడం వల్లే ఇప్పుడు విజయ తీరాలకు చేరగలిగాం. ఇప్పుడు దేశం కోసం అత్యంత ముఖ్యమైన పనులను మొదలెడదాం. అత్యంత మెరుగైన అమెరికాను నిర్మిద్దాం’’అని అన్నారు. ఎన్నికల బహిరంగసభలో భవనం పైనుంచి ఒక ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో స్వల్ప గాయంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం, గోల్ఫ్ క్లబ్ వద్ద మరో సాయుధుడి అరెస్ట్ ఘటనలను ట్రంప్గుర్తుచేసుకున్నారు. ‘‘గొప్ప కార్యం మీతో చేయించాలనే మిమ్మల్ని దేవు డు కాపాడాడు అని చాలా మంది నాతో చెప్పారు’’అని ట్రంప్ అన్నారు. ‘‘దేశాన్ని కాపాడి మళ్లీ గ్రేట్గా మార్చేందుకే దేవుడు నాకీ అవకాశం ఇచ్చాడనుకుంటా. ఈ మిషన్ను మనం పూర్తిచేద్దాం. ఈ పని పూర్తి చేయడం అంత సులభమేం కాదు. శక్తినంతా కూడదీసుకుని దేశభక్తి, పోరాటపటిమ, స్ఫూర్తితో ఈ ఘనకార్యాన్ని సంపూర్ణం చేద్దాం. ఇది ఉత్కృష్టమైన బా ధ్యత. ఇంతటి ఉదాత్తమైన పని ప్రపంచంలోనే లేదు. తొలిసారి అధ్యక్షుడిగా పాలించినప్పుడూ ఒక్కటే ల క్ష్యంగా పెట్టుకున్నా. ఇచి్చన హామీలను నెరవేర్చాల ని. ఇప్పుడు కూడా ఇచ్చిన వాగ్దానాలను తూ.చా. తప్పకుండా అమలుచేస్తా. ‘మేక్ అమెరికా.. గ్రేట్ ఎగేన్’ను సాకారం చేసేందుకు దేశం నలుమూలల నుంచి నడుంబిగించి కదలండి. ఐక్యంగా నిలబడాల్సిన తరుణమిది. మనందరం ప్రయతి్నంచబోతున్నాం. సాధించబోతున్నాం’’అని ట్రంప్ అన్నారు. ఎలాన్ మస్క్ పై ప్రశంసలు ప్రసంగిస్తూ ట్రంప్ ప్రపంచ కుబేరుడు, ఎన్నికల్లో తన కోసం కోట్లు ఖర్చుచేసిన వ్యాపారదిగ్గజం ఎలాన్ మస్్కను ప్రశంసల్లో ముంచెత్తారు. ‘‘ఇక్కడో తార(స్టార్) ఉద్భవించింది. అదెవరంటే మన ఎలాన్ మస్్క. ఆయనో అద్భుతమైన వ్యక్తి. ప్రజలు ప్రకృతి వైపరీతాల్లో చిక్కుకుపోయినప్పుడు మస్్కకు చెందిన స్టార్లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ వ్యవస్థ ప్రజలకు ఎంతో సాయపడింది. నార్త్కరోలినాలో హెలెన్ హరికేన్ వేళ స్టార్లింక్ ఎంతో సాయపడింది. అందుకే ఆయన్ను నేను ఇష్టపడతా. అసాధ్యాలను సుసాధ్యం చేశారు. స్పేస్ఎక్స్ వారి స్టార్íÙప్ కార్యక్రమంలో భాగంగా అత్యంత భారీ రాకెట్ బూస్టర్ను పునరి్వనియోగ నిమిత్తం మళ్లీ పసిపాపలాగా లాంచ్ప్యాడ్పై అద్భుతంగా ఒడిసిపట్టారు. మస్్కకు మాత్రమే ఇది సాధ్యం. ఆ ఘటన చూసి నేను భవిష్యత్తరం సినిమా అనుకున్నా. ఇంతటి ఘనత సాధించిన మస్క్ లాంటి మేధావులను మనం కాపాడుకుందాం. ఎందుకంటే ఇలాంటి వాళ్లు ప్రపంచంలో కొందరే ఉన్నారు’’అని ట్రంప్ అన్నారు. జేడీ వాన్స్ను పొగిడిన ట్రంప్ కాబోయే ఉపాధ్యక్షుడు ఇతనే అంటూ జేడీ వాన్స్ను ట్రంప్ సభకు పరిచయం చేశారు. ‘‘ఉపాధ్యక్ష పదవికి జేడీ వాన్స్ సరైన వ్యక్తి. ఆయన భార్య ఉషా సైతం అద్భుతమైన మహిళ. పార్టీ పట్ల నిబద్ధత, అంకితభావం చూపడంలో జేడీ వాన్స్కు ఎవరూ సాటిరారు. రిపబ్లికన్ పార్టీని విమర్శించే, ఆగర్భ శత్రువులుగా తయారైన కొన్ని మీడియా కార్యాలయాలకు చర్చకు వెళ్తారా? అని నేను అడిగితే వెంటనే ఓకే అనేస్తారు. సీఎన్ఎన్కు వెళ్లాలా?, ఎంఎస్ఎన్బీసీకి వెళ్లాలా? అని నన్నే ఎదురుప్రశ్నిస్తారు. ముక్కుసూటిగా దూసుకుపోయే, వైరివర్గాన్ని చిత్తుచేసే నేత’’ అంటూ వాన్స్ను ట్రంప్ ఆకాశానికెత్తేశారు. శక్తివంతంగా తిరిగొచ్చారు: వాన్స్ ‘‘మళ్లీ గెలిచి అత్యంత శక్తివంతంగా తిరిగొచి్చన అతికొద్ది మంది నేతల్లో ఒకరిగా ట్రంప్ నిలిచారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ పునరాగమనం ద్వారా ట్రంప్ సారథ్యంలో మేం దేశ ఆర్థిక ప్రగతి రథాన్ని ఉరకలు పెట్టిస్తాం. నాపై నమ్మకం ఉంచి ఉపాధ్యక్ష పదవికి నన్ను ఎంపిక చేసిన ట్రంప్కు కృతజ్ఞతలు’’అని జేడీ వాన్స్ అన్నారు. -
ట్రంప్తో ఫోన్లో సంభాషించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక విజయం సాధించారు. ఈ నేపధ్యంలో డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో సంభాషించారు. దీనిని ప్రధాని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పంచుకున్నారు.తన స్నేహితుడు, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో తాను సంభాషించానని ప్రధాని మోదీ దానిలో రాశారు. అద్భుత విజయం సాధించినందుకు ట్రంప్కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. సాంకేతికత, రక్షణ, ఇంధనం, అంతరిక్షం తదితర రంగాలలో భారతదేశం-యూఎస్ఏ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మరోసారి కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. Had a great conversation with my friend, President @realDonaldTrump, congratulating him on his spectacular victory. Looking forward to working closely together once again to further strengthen India-US relations across technology, defence, energy, space and several other sectors.— Narendra Modi (@narendramodi) November 6, 2024దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా వేదికగా ట్రంప్ సాధించిన చారిత్రాత్మక విజయానికి అభినందనలు తెలుపుతూ ఒక పోస్ట్ చేశారు. ట్రంప్ను విజేతగా ప్రకటించిన వెంటనే ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’లో ‘ చారిత్రాత్మక విజయం సాధించిన స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్కు హృదయపూర్వక అభినందనలు. మీరు మీ మునుపటి పదవీకాల విజయాలను ముందుకు తీసుకెళ్లబోతున్నారు. భారత్- యూఎస్ఏల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, పరస్పర సహకార పునరుద్ధరణకు ఎదురుచూస్తున్నాను. ఇరు దేశాల ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ, ప్రపంచ శాంతి, స్థిరత్వం, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కలసి పని చేద్దాం’ అని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: రాఘవేంద్ర స్వామి మఠంలో రిషి సునాక్ దంపతుల పూజ -
ట్రంప్ గెలిచారు?.. మరి మనకేంటి?
-
US Elections 2024: సంతకం రాక.. ఓట్లు చెల్లక
వాషింగ్టన్: మనకు ఒక కచ్చి తమైన సంతకం అంటూ లేకపోతే ఎంత నష్టమో అమెరికా ఎన్నికలను చూసి తెలుసుకోవచ్చు. పోస్టు ద్వారా వచ్చి న చాలా ఓట్లు సంతకంలో తేడాల వల్ల చెల్లకుండాపోయా యి. సంతకం చేయడం రాకపోవడంతో ఓటు వేసి నా అవి చెల్లలేదు. ప్రధానంగా యువ ఓటర్ల విషయంలో ఈ సమస్య ఎదురైంది. ఓటు–బై–మెయిల్ బ్యాలెట్లోని సంతకం, ఓటర్ రికార్డులోని సంత కం ఒకేలా ఉండాలి. ఎన్నికల అధికారులు రెండింటినీ సరిపోల్చుతారు. ధ్రువీకరణ తర్వాతే ఆ ఓటు ను లెక్కిస్తారు. ఒకవేళ ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లు గుర్తిస్తే సదరు ఓటరుకు సమాచారం ఇస్తారు. సంతకాన్ని సరిచేసుకొనే అవకాశం కల్పిస్తారు. ఓటర్లు స్పందించపోవడంతో ఈసారి పెద్ద సంఖ్యలో ఓట్లు చెల్లలేదు. నెవడా రాష్ట్రంలోని క్లార్క్ కౌంటీలో 11,300, వాషో కౌంటీలో 1,800 ఓట్ల విషయంలో సంతకాలను మళ్లీ సరిదిద్దాల్సి వచ్చిందని ఎన్నికల అధికారి ఫ్రాన్సిస్కో అగిలార్ చెప్పారు. నేటి టెక్నా లజీ యుగంలో చేతితో రాయడం పెద్దగా అవసరం పడట్లేదు. అన్నీ కంప్యూటర్, ఫోన్లోనే టైప్ చేస్తున్నారు. సాధారణంగా సంతకాలను వంపు తిరిగిన అక్షరాల్లో(కర్సివ్) చేస్తారు. అమెరికా పాఠశాలల్లో ఇటీవలి కాలంలో కర్సివ్ చేతిరాత నేరి్పంచడం లేదు. దాంతో పిల్లలకు సంతకాలు చేయడం రావడం లేదని నిపుణులు అంటున్నారు. -
7 రాష్ట్రాల్లో అబార్షన్ హక్కుల విజయం
వాషింగ్టన్: అబార్షన్ హక్కులు ఏడు రాష్ట్రాల్లో విజయం సాధించారు. అత్యంత నిర్బంధ గర్భస్రావం నిషేధాన్ని రద్దు చేయడానికి మిస్సోరి ఓటర్లు మార్గం సుగమం చేశారు. అరిజోనా, కొలరాడో, మేరీల్యాండ్, మోంటానాలో అబార్షన్ హక్కుల సవరణలు కూడా ఆమోదం పొందాయి. నెవాడా ఓటర్లు ఒక సవరణను ఆమోదించారు. అది అమల్లోకి రావాలంటే వారు దానిని 2026లో మళ్లీ ఆమోదించాల్సి ఉంటుంది. ఫ్లోరిడా, నెబ్రాస్కా, సౌత్ డకోటా రాష్ట్రాల ఓటర్లు మాత్రం రాజ్యాంగ సవరణపై విముఖత వ్యక్తం చేశారు. అబార్షన్ నిషేధాన్ని రద్దు చేసిన రో వర్సెస్ వేడ్ తీర్పును అమెరికా సుప్రీంకోర్టు 2022లో కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో రిపబ్లికన్ల నియంత్రణలో ఉన్న చాలా రాష్ట్రాల్లో నిషేధాలు అమల్లోకి రావడానికి మార్గం సుగమం అయ్యింది. ప్రస్తుతం 13 రాష్ట్రాలు కొన్ని మినహాయింపులతో గర్భధారణ అన్ని దశలలో నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఆరు వారాలు, మరికొన్ని నాలుగు వారాల తరువాత గర్భస్రావాన్ని నిషేధించాయి. అబార్షన్ రాష్ట్రాలకు వదిలేయాల్సిన అంశమని రిపబ్లికన్ అభ్యరి్థగా పదేపదే చెప్పిన ట్రంప్... ఇప్పుడు అధ్యక్షుడిగా కార్యనిర్వాహక చర్య ద్వారా అబార్షన్ హక్కులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిషేధాన్ని ఎత్తేసిన మిస్సోరీ.. ఏ దశలోనైనా గర్భస్రావానికి హక్కును కలి్పస్తూ, అబార్షన్పై నిషేధాన్ని ఎత్తివేసే మొదటి రాష్ట్రంగా మిస్సోరి నిలిచింది. గర్భస్రావం, జనన నియంత్రణ, గర్భధారణ చుట్టూ నిర్ణయాలు వ్యక్తిగతమైనవని, వాటిని రాజకీయాలు కాకుండా వ్యక్తులకే వదిలేయాలనే హక్కులకు ఓటేసి మిస్సోరియన్లు చరిత్రను సృష్టించారు. మూడు రాష్ట్రాల్లో ఆంక్షలుఫ్లోరిడా, నెబ్రాస్కా, సౌత్ డకోటా రాష్ట్రాలు అబార్షన్పై నిషేధాన్ని సమరి్ధంచాయి. అబార్షన్ వ్యతిరేకులు బ్యాలెట్ పద్ధతిలో విజయం సాధించారు. ఫలితంగా రిపబ్లికన్ గవర్నర్ రాన్ డిశాంటిస్కు రాజకీయ విజయం లభించింది. ఈ ఫలితం ఫ్లోరిడాలో, మొత్తం దేశానికి ఒక ముఖ్యమైన విజయమని జాతీయ గర్భస్రావ వ్యతిరేక గ్రూపు ఎస్బీఏ ప్రో–లైఫ్ అమెరికా అధ్యక్షుడు మార్జోరీ డాన్నెన్ఫెల్సెర్ ప్రకటించారు. కొన్ని మినహాయింపులు మినహా గర్భస్రావంపై నిషేధం ఉన్న మరో రాష్ట్రమైన సౌత్ డకోటా సైతం అబార్షన్ హక్కులకు వ్యతిరేకంగా ఓటేసింది. అబార్షన్ హక్కులను కల్పించే రాజ్యాంగ సవరణను నెబ్రాస్కా ఓటర్లు తిరస్కరించారు. ఆమోదం తెలిపిన ఏడు రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాలు అబార్షన్ హక్కుల చట్ట సవరణకు ఆమోదం తెలిపాయి. గర్భం దాలి్చన మొదటి 15 వారాల తర్వాత అబార్షన్ను నిషేధించే ప్రస్తుత చట్టాన్ని సవరణకు అరిజోనా ఆమోదం తెలిపింది. గర్భస్రావ హక్కులను ఇప్పటికే అనుమతించిన మేరీలాండ్లో ఈ ఫలితాలు పెద్ద తేడాను చూపవు. మిస్సోరిలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడ గర్భస్రావం ఇప్పటికే చట్టబద్ధమైనది. కొలరాడోలో 55% ఓటర్లు అబార్షన్ హక్కులకు మద్దతును ప్రకటించారు. గర్భస్రావం కోసం రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ నిధులను ఉపయోగించడాన్ని నిషేధించిన గత సవరణను కూడా ఇది రద్దు చేయనుంది. స్టేట్ మెడికేడ్, ప్రభుత్వ ఉద్యోగుల భీమా పథకాలు గర్భస్రావాన్ని కవర్ చేసే అవకాశాన్ని కూడా ఇది కలి్పంచనుంది. న్యూయార్క్ సమాన హక్కుల చట్టం కూడా ఆమోదం పొందింది. ఇందులో ‘గర్భస్రావం’అనే పదం లేకపోయినా.. గర్భధారణ ఫలితాలు, పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ, స్వయంప్రతిపత్తి ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. ఇది న్యూయార్క్ వాసులందరికీ గొప్ప విజయమని ఈక్వల్ రైట్స్ క్యాంపెయిన్ డైరెక్టర్ సాషా అహుజా ప్రకటించారు. -
మహిళలకు మళ్లీ మొండిచెయ్యే
అమెరికా అధ్యక్ష పదవిని అధిష్టించిన తొలి మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టిస్తారన్న అంచనాలు తారుమారయ్యాయి. 2016 తర్వాత మరోసారి ఓ మహిళకు అత్యున్నత పీఠం త్రుటిలో చేజారింది. హారిస్ మాదిరిగానే 2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కూడా హోరీహోరీ తలపడ్డారు. అమెరికా చరిత్రలో ఒక ప్రధాన పార్టీ తరఫున అధ్యక్ష బరిలో దిగిన తొలి మహిళగా నిలిచారు. హిల్లరీ కూడా డెమొక్రటిక్ పార్టీ తరఫునే పోటీ చేయడం విశేషం. అప్పుడు కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంపే. ఆయనతో డిబేట్లలో హిల్లరీ తడబడ్డా ఆద్యంతం గట్టి పోటీ ఇచ్చి చెమటలు పట్టించారు. అంతేగాక ఆ ఎన్నికల్లో పాపులర్ ఓట్ కూడా సాధించారు. అంటే దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో ఆమెకే ఎక్కువ పడ్డాయి. ట్రంప్ కంటే హిల్లరీ ఏకంగా 28 లక్షల పై చిలుకు అధిక ఓట్లు సాధించారు. కానీ ఎలక్టోరల్ కాలేజీ విధానం వల్ల ట్రంప్ చేతిలో 76 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పట్లో డెమొక్రాట్ల రాష్ట్రాలుగా పేరుబడ్డ విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ఓటమి కూడా హిల్లరీ కొంప ముంచింది. హిల్లరీ 2008లో కూడా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం విఫలయత్నం చేశారు. భర్త బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షునిగా ఉన్న 1993–2001 మధ్య కాలంలో ఆమె ఫస్ట్ లేడీగా వ్యవహరించారు. ఆమెకు ముందు 1968లోనే చార్లెన్ మిషెల్ అనే మహిళ కమ్యూనిస్టు పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. పెద్దగా పోటీ ఇవ్వలేకపోయినా ఈ ఘనత సాధించిన తొలి నల్లజాతి మహిళగా నిలిచిపోయారు. మిషెల్ పేరు కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే బ్యాలెట్ పత్రాలపై చోటుచేసుకుంది. 150 ఏళ్ల క్రితమే తొలి పోటీ అమెరికా చరిత్రలో అధికారికంగా ఒక మహిళ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన ఉదంతం 150 ఏళ్ల క్రితమే చోటుచేసుకుంది. ఆమె పేరు విక్టోరియా వుడ్హల్. 1872లో ఈక్వల్ రైట్స్ పార్టీ తరఫున ఆమె అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. మహిళలకు పురుషులతో సమాన హక్కుల కోసం ఉద్యమించిన నేతగా వుడ్హల్కు పేరుంది. అమెరికాలో మహిళలకు ఓటు హక్కే ఉండని రోజుల్లో ఆమె ఏకంగా అధ్యక్ష పదవికే పోటీపడటం సంచలనంగా నిలిచింది. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే కనీసం 35 ఏళ్లు నిండి ఉండాలి. కానీ పోటీ చేసేనాటికి వుడ్హల్కు 33 ఏళ్లు మాత్రమే. ఎన్నికల్లో ఆమె ఒక్క ఎలక్టోరల్ ఓటు కూడా సాధించలేకపోయారు. తర్వాత 1884, 1888ల్లో బెల్వా ఆన్ లాక్వుడ్ అనే మహిళను ఈక్వల్ రైట్స్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో దింపింది. తర్వాత చాలాకాలానికి 1964లో మార్గరెట్ చేజ్ స్మిత్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం పోటీ పడ్డారు. తద్వారా ఒక ప్రధాన పార్టీ అభ్యరి్థత్వ రేసులో దిగిన తొలి మహిళగా నిలిచారు. 1972లో షిర్లీ చిషోమ్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం ప్రయత్నించారు. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో నిలిచిన తొలి మహిళగా, తొలి నల్లజాతీయురాలిగా గుర్తింపు పొందారు. ఇక ఒక ప్రధాన పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీపడ్డ తొలి మహిళగా గెరాల్డిన్ ఫెరారో. ఆమె 1984లో డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మాల్టర్ మాండలేకు రన్నింగ్మేట్గా వ్యవహరించారు. 2004లో సారా పాలిన్ రిపబ్లికన్ పార్టీ తరఫున ఆ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచారు. ఆమె జాన్ మెక్కెయిన్కు రన్నింగ్మేట్గా వ్యవహరించారు. గత 30 ఏళ్లుగా పలు చిన్న పార్టీల తరఫున కూడా ఎందరో మహిళలు అధ్యక్ష రేసులో నిలిచారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మళ్లీ హౌడీ.. అంటారా?
న్యూఢిల్లీ: చరిత్రాత్మక విజయంతో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో విడత శ్వేతసౌధంలోకి కాలు మోపుతున్న నేపథ్యంలో వ్యూహాత్మక భాగస్వామి భారత్తో వాణిజ్య, దౌత్య సంబంధాలు ఇకపై ఎలా ఉంటాయి? ‘‘హౌడీ.. మోదీ!’’ ‘‘నమస్తే ట్రంప్..!’’ స్నేహ బంధం కొనసాగుతుందా? మరి మనకు అనుకూలతలు – ప్రతికూలతలు ఏమిటన్నవి ఆసక్తికరంగా మారాయి. ‘అమెరికా ఫస్ట్’ అనే సూత్రాన్ని అనుసరిస్తూ విదేశాంగ విధానాన్ని సంస్కరించనున్నట్లు ట్రంప్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. అందువల్ల సహజంగానే ఆయన విధానాలు అందుకు అనుగుణంగానే ఉంటాయి. భారత్–రష్యా సంబంధాల విషయంలో చూసీ చూడనట్లు ఉన్నా వాణిజ్యం, ఇమిగ్రేషన్ నిబంధనలు, సుంకాల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించవచ్చని భావిస్తున్నారు. మిత్రుడంటూనే..2017 నుంచి 2021 వరకు ట్రంప్ తొలిసారి అధ్యక్షు డిగా ఉన్నప్పుడు అమెరికా పరిశ్రమల కోసం రక్షణాత్మక విధానాన్ని అనుసరించారు. భారత్, చైనా సహా పలు దేశాల ఎగుమతులపై భారీ సుంకాలను విధించారు. అమెరికా ఉత్పత్తులు, సేవలపై అత్యధిక సుంకాలు విధించే దేశాలపై కఠిన వైఖరి అనుసరించారు. ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ పలు సందర్భాల్లో తన స్నేహితుడిగా అభివర్ణించినా అదే సమయంలో భారత విధానాలను గట్టిగా వ్యతిరేకించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీ సుంకాలను విధించటాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. వాణిజ్య నిబంధనలను భారత్ ఉల్లంఘిస్తోందని, అత్యధికంగా సుంకాలను విధిస్తోందని.. టారిఫ్ కింగ్ అంటూ ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ కోరిన విధంగా సుంకాల తగ్గింపు నిబంధనలను అమలు చేస్తే భారత జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) 2028 నాటికి 0.1 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ సంబంధాలు..గతంలో ట్రంప్ హయాంలో అమెరికా – చైనా మధ్య సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. చైనాను ఆయన గట్టి ప్రత్యర్థిగా పరిగణిస్తారు. ఇది కొంతవరకు భారత్ – అమెరికా మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం కావటానికి దోహదం చేసింది. చైనాకు దీటుగా ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా, ఆస్ట్రేలియా, భారత్, జపాన్ కూటమి బలంగా ఎదగాలని ట్రంప్ భావించారు. ఇప్పుడు ఆయన రెండోసారి అధ్యక్షుడు అవుతున్నందున అమెరికా – భారత్ మధ్య ఆయుధ సంపత్తి, సంయుక్త సైనిక విన్యాసాలు, సాంకేతిక మార్పిడి విషయంలో మెరుగైన సమన్వయం ఉండవచ్చు.వీసా విధానం..ట్రంప్ విధానాలు వలసదారులకు ఇబ్బందికరమే! స్థానికుల ఉద్యోగాలను వారు లాక్కుంటున్నారని గుర్రుగా ఉన్నారు. వీసా నిబంధనలను కఠినతరం చేస్తే ఐటీ సంస్థలకు, నిపుణులకు కష్టకాలమే!! -
Donald Trump: ట్రంప్ రికార్డులు.. చరిత్రలో అతిపెద్ద పునరాగమనం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జయకేతనం ఎగురవేశారు. 132 ఏళ్ల అనంతరం మధ్యలో ఒక విరామం తర్వాత రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి అభ్యర్థిగా ఆయన చరిత్ర సృష్టించారు. సంచలనాలు, వివాదాలకు మారుపేరైన ట్రంప్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. వ్యాపారం, స్థిరాస్తి, మీడియా రంగాల్లో తన ప్రతిభాపాటవాలతో రాణించారు. వ్యాపార కుటుంబంలో జన్మించిన ట్రంప్ విలక్షణ నాయకుడిగా పేరుపొందారు. రాజకీయ రంగంలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాదు, అమెరికా రాజకీయాలపై తనదైన ముద్ర వేయడం విశేషం. 1982లోనే ఫోర్బ్స్ జాబితాలోకి.. ట్రంప్ అసలు పేరు డొనాల్డ్ జాన్ ట్రంప్. 1946 జూన్ 14న న్యూయార్క్లోని క్వీన్స్లో జన్మించారు. ఆయన తల్లిదండ్రు లు ఫ్రెడ్ ట్రంప్, మేరీ అన్నే మెక్లి యోడ్ ట్రంప్. మొత్తం ఐదుగురు సంతానంలో ట్రంప్ నాలుగో సంతానం. ఫ్రెడ్ ట్రంప్ అమెరికాలో విజయవంతమైన రియల్ ఎస్టేట్ డెవలపర్గా పేరు ప్రఖ్యాతులు గడించారు. డొనాల్డ్ ట్రంప్ బాల్యం న్యూయార్క్లోనే గడిచింది. న్యూయార్క్ మిలటరీ అకాడమీలో చదువు కున్నారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్లో ఉన్నత విద్య అభ్యసించారు. 1968లో కామర్స్లో గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. కాలేజీలో చదువు పూర్తయ్యాక ట్రంప్ 1971లో తన తండ్రి వ్యాపార సంస్థలోకి అడుగుపెట్టారు. తమ సంస్థను ‘ట్రంప్ ఆర్గనైజేషన్’గా పేరుమార్చారు. ట్రంప్ గ్రూప్నకు సంబంధించిన హోటళ్లు, క్యాసినోలు, గోల్ఫ్ కోర్సులను మరింత విస్తరింపజేశారు. తన పేరిట కొన్ని ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చారు. అనతికాలంలోనే ట్రంప్ బ్రాండ్కు మంచి పేరొచ్చింది. విజయవంతమైన వ్యాపారవేత్తగా డొనాల్డ్ ట్రంప్ పేరు మార్మోగిపోయింది. 200 మిలియన్ డాలర్ల సంపదతో 1982లో తొలిసారి ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో చేరారు. 2023లో ఆ సంపద విలువ 631 మిలియన్ డాలర్లతో సమానం. 2004లో ప్రారంభమైన అప్రెంటీస్ అనే టీవీ రియాలిటీ షోను ట్రంప్ స్వయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువయ్యారు. ఇంటింటా అందరికీ అభిమాన పాత్రుడయ్యారు. ఆయనలో మంచి రచయిత కూడా ఉన్నారు. 14కుపైగా పుస్తకాలు రాశారు. 1987లో విడుదలైన ‘ద ఆర్ట్ ఆఫ్ ద డీల్’ అనే పుస్తకం విపరీతమైన పాఠకాదరణ పొందింది. నెరవేరిన స్వప్నం డొనాల్డ్ ట్రంప్కు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఆసక్తి ఉండేది. 1980వ దశకంలో రాజకీయ రంగంలో ప్రవేశించారు. రిపబ్లిన్ పార్టీలో చేరారు. అధ్యక్షుడు కావాలన్నది ట్రంప్ కల. అందుకోసం ఎంతగానో శ్రమించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగించారు. మొదట్లో ఆ ప్రయత్నాలు ఫలించకపోయినా నిరాశ చెందలేదు. మరింత పట్టుదలతో కృషిచేశారు. 2015 జూన్ 16న రిపబ్లిన్ అభ్యర్థిగా ఆయన పేరు బలంగా తెరపైకి వచ్చింది. ప్రైమరీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులను వెనక్కి నెట్టి, ఎట్టకేలకు 2016 జూలైలో అధ్యక్ష ఎన్నికల బరిలో ట్రంప్ నిలిచారు. రిపబ్లికన్ అభ్యర్థిగా ఆయన పేరు అధికారికంగా ఖరారైంది. 2016 నవంబర్ 8న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ సంచలన విజయం సాధించారు. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ను ఓడించారు. రష్యా ప్రభుత్వం ఆయన విజయానికి సహకరించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ట్రంప్ 2017 జనవరి 20 నుంచి 2021 జనవరి 20వ తేదీ దాకా అగ్రరాజ్యానికి 45వ అధ్యక్షుడిగా సేవలందించారు. పన్ను సంస్కరణలు, వలస విధానం, విదేశీ వ్యవహారాలపై ట్రంప్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. కొన్ని కీలకమైన పన్నులను తగ్గించారు. విదేశాలతో వాణిజ్య ఒప్పందాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నాలుగేళ్ల పాలనలో యుద్ధాలకు దూరంగా ఉన్నారు. కానీ, చైనాతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. శత్రుదేశంగా భావించే ఉత్తర కొరియాలో కాలుమోపిన తొలి అమెరికా అధ్యక్షుడిగా(పదవిలో ఉండగానే) ట్రంప్ చరిత్రకెక్కారు. వలసలపై కొంత కఠినంగానే వ్యవహరించారు. కొన్ని ఇస్లామిక్ దేశాల నుంచి ప్రజలు అమెరికాకు రాకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా–మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మించేందుకు సైనిక నిధులను మళ్లించారు. తన పదవీ కాలంలో ముగ్గురిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా నియమించారు. ట్రంప్ పాలనలోనే కోవిడ్–19 మహమ్మారి వచ్చిపడింది. ఈ విపత్తును ఎదుర్కోవడంలో ట్రంప్ తీవ్ర అలసత్వం వహించారన్న ఆరోపణలు వచ్చాయి. వాతావరణ మార్పులకు సంబంధించిన పారిస్ ఒప్పందం, ఇరాన్తో అణు ఒప్పందం నుంచి వైదొలిగారు. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్తో మూడుసార్లు సమావేశమయ్యారు. కానీ, అణ్వాయుధాల నియంత్రణ దిశగా ఆయనను ఓప్పించలేకపోయారు. ట్రంప్ వేగంగా, స్థిరంగా నిర్ణయాలు తీసుకుంటారన్న పేరుంది. అదే ఆయనను బలమైన నాయకుడిగా మార్చింది. రెండు సార్లు అభిశంసన అధ్యక్షుడిగా ట్రంప్ పాలనాకాలం పలు వివాదాలతో గడిచింది. శృంగార తార స్మార్మీ డేనియల్స్కు చెల్లించిన సొమ్మును రికార్డుల్లో చూపించకుండా వాటిని తారుమారు చేసిన ‘హష్ మనీ’ కేసులో న్యూయార్క్ కోర్టు ఈ ఏడాది మే నెలలో ట్రంప్ను దోషిగా తేల్చింది. ఒక నేరంలో అమెరికా అధ్యక్షుడు దోషిగా తేలడం ఇదే మొదటిసారి. ఈ కేసులో ట్రంప్కు ఇంకా శిక్ష విధించలేదు. మరికొన్ని కేసుల్లోనూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అమెరికా కాంగ్రెస్లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో ట్రంప్ రెండుసార్లు అభిశంసనకు(ఇంపీచ్మెంట్) గురయ్యారు. ఉక్రెయిన్ విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో 2019 డిసెంబర్లో అభిశంసనను ఎదుర్కొన్నారు. తన మద్దతుదారులతో క్యాపిటల్ భవనం వద్ద ఘర్షణను ప్రేరేపించినట్లు విమర్శలు వెల్లువెత్తడంతో 2021 జనవరిలో మరోసారి అభిశంసనకు గురయ్యారు. రెండుసార్లు అభిశంసనకు గురైన తొలి అధ్యక్షుడిగా అపకీర్తి పొందారు. అయితే, కాంగ్రెస్లో ఎగువ సభ అయిన సెనేట్ మాత్రం ఈ రెండు సందర్భాల్లో ట్రంప్ను నిర్దోషిగా తేల్చింది. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ప్రభావం చెక్కుచెదరలేదు. అందుకే అదే పార్టీ నుంచి మరోసారి పోటీ చేయగలిగారు. ఈ ఏడాది ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనపై రెండుసార్లు హత్యాయత్నం జరిగింది. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. మాజీ అధ్యక్షుడిగానూ ట్రంప్ నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలవడం కావడం విశేషం. కేసులు, విచారణలతో ట్రంప్ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రజల నోట్లో నానింది. 3 వివాహాలు.. ఐదుగురు సంతానం 78 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ కుటుంబం పెద్దదే. మూడు వివాహాలు చేసుకున్నారు. తొలుత చెక్ రిపబ్లిక్కు చెందిన మోడల్ ఇవానాను పెళ్లాడారు. 1977 నుంచి 1990 దాకా ఆమెతో కలిసున్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు. అనంతరం సినీ నటి మార్లా మాపిల్స్ను వివాహం చేసుకున్నారు. 1993 నుంచి 1999 దాకా వారి బంధం కొనసాగింది. విడాకులతో వేరయ్యారు. 2005లో స్లొవేనియా మోడల్ మెలాని యాతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఇరువురూ కలిసే ఉంటున్నారు. ట్రంప్కు ముగ్గురు భార్యలతో మొత్తం ఐదుగురు సంతానం ఉన్నారు. మొదటి భార్య ఇవానాతో డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంక, ఎరిక్, రెండో భార్య మార్లాతో టిఫానీ జన్మించారు. మూడో భార్య మెలానియాతో బారోన్ ట్రంప్ జన్మించాడు. మద్యం, సిగరెట్, డ్రగ్స్ తీసుకోవడం తనకు అలవాటు లేదని ట్రంప్ పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన రోజుకు నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే నిద్రిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇస్తారు. గోల్ఫ్ ఆయనకు ఇష్టమైన క్రీడ. అదే ఆయన వ్యాయామం కూడా. ఇతర వ్యాయామాలేవీ చేయరు. నడక(వాకింగ్) కూడా పెద్దగా ఇష్టపడరు. మానవ శరీరం ఒక బ్యాటరీ లాంటిదని, అందులో సహజంగానే మనిషికి కావాల్సిన శక్తి ఉంటుందని, వ్యాయామాలతో ఆ శక్తి హరించుకుపోతుందని ట్రంప్ నమ్ముతారు. ట్రంప్ రికార్డులు→ ట్రంప్ ఖాతాలో అరుదైన ఘనత చేరింది. ఒక విరామం తర్వాత మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇలా జరగడం గత 132 ఏళ్లలో ఇదే తొలిసారి. గ్రోవర్ క్లీవ్లాండ్ తర్వాత ఈ రికార్డు ట్రంప్ సొంతమైంది. క్లీవ్లాండ్ 1885 నుంచి 1889 దాకా 22వ అధ్యక్షుడిగా, 1893 నుంచి 1897 దాకా 24వ అధ్యక్షుడిగా పనిచేశారు. ట్రంప్ 2017 నుంచి 2021 వరకు ఒకసారి అధ్యక్షుడిగా వ్యవహరించారు. మధ్యలో ఒక విరామంతో 2025 నుంచి 2029 దాకా మరో సారి అధ్యక్షుడిగా పని చేయబోతున్నారు. → 78 ఏళ్ల వయసులో ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నిక ల్లో గెలిచారు. అమెరికా చరిత్రలో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన అత్యంత వృద్ధుడు ట్రంప్. → గత 20 సంవత్సరాల్లో పాపులర్ ఓటుతో గెలిచిన మొదటి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్చరిత్రలో అతిపెద్ద పునరాగమనం నాలుగేళ్ల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేక ఆయన అభిమానులు రాజధాని వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనం వద్ద వీరంగం సృష్టించారు. వారి నిరసన హింసాత్మకంగా మారింది. ఈ వ్యవహారం చివరకు ట్రంప్ మెడకు చుట్టుకుంది. 2020 నాటి ఎన్నికల్లో పరాజయంతో ట్రంప్ రాజకీయ జీవితం ముగిసినట్లేనని అప్పట్లో రాజకీయ పరిశీలకులు తేల్చిచెప్పారు. పలు వివాదాల్లో ఇరుక్కుపోవడంతోపాటు హష్ మనీ కేసులో దోషిగా తేలిన ట్రంప్ ఇక ఎప్పటికీ రాజకీయ రంగంలో కనిపించే అవకాశం లేదని వాదించారు. వారి అభిప్రాయాలను ఫటాపంచలు చేస్తూ ట్రంప్ మరోసారి సమరోత్సాహంతో దూసుకొచ్చారు. 78 ఏళ్ల వయసులో అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మరోసారి వైట్హౌస్లో కాలు పెట్టబోతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
హారిస్.. ఐదు వైఫల్యాలు
1. ప్రభుత్వ వ్యతిరేకత–బైడెన్ అసమర్థతజో బైడెన్ నాలుగేళ్ల పాలనలో డెమొక్రాట్లపై అమెరికా అంతటా తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత నెలకొంది. ఆర్థిక వ్యవస్థను అదుపు పెట్టడంలో ఆయన తీవ్రంగా విఫలమయ్యారన్న అపప్రథను మూటగట్టుకున్నారు. అన్ని అంశాలపైనా ఆయన విధానాలపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ఇక బైడెన్ విదేశీ విధానం కూడా విమర్శలపాలైంది. ముఖ్యంగా ఉక్రెయిన్, గాజా యుద్ధాలను నివారించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఆ పార్టీ అభ్యర్థిగా ఇవన్నీ హారిస్కు ప్రతికూలంగానే మారాయి. విదేశీ విధానంపై ఆమె వాదన అమెరికన్లను పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ విషయంలో ట్రంప్తో పోలిస్తే బాగా మెతక అన్న అభిప్రాయం ఆమెకు బాగా చేటు చేసింది. పలు కీలకాంశాలపై తన వైఖరి చెప్పకుండా దాటవేయడం కూడా ప్రతికూలంగా మారింది. నిజానికి హారిస్ ఆలస్యంగా బరిలో దిగినా శాయశక్తులా పోరాడి ట్రంప్కు గట్టి పోటీ ఇచ్చారు. కానీ అడుగడుగునా బైడెన్ వైఫల్యాల తాలూకు భారాన్ని మోయాల్సి రావడం హారిస్కు అతి పెద్ద ప్రతికూలాంశంగా పరిణమించింది. మెజారిటీ అమెరికన్లకు జీవన్మరణ సమస్యగా మారిన ఆర్థిక అవ్యవస్థను గాడిన పెట్టడానికి ఏం చేస్తానన్నది ఆమె సమర్థంగా వివరించలేకపోయారు. ఈ విషయంలో ఆమెకు మొదటినుంచీ పెద్దగా మార్కులు పడలేదు. దీనిపై ప్రతి సర్వేలోనూ ట్రంప్దే పైచేయిగా నిలిచింది. ఏకంగా మూడొంతుల మందికి పైగా ప్రభుత్వ విధానాలన్నీ అట్టర్ ఫ్లాప్ అని అభిప్రాయపడ్డారు. ఉపాధ్యక్షురాలిగా ప్రభుత్వ విధానాల్లో నాలుగేళ్లుగా భాగస్వామి అయిన హారిస్ వాటితో గట్టిగా విభేదించలేకపోయారు. ఇది అంతిమంగా ఆమె కొంప ముంచింది.2. దన్నుగా నిలవని లాటిన్లు, ఇండియన్లులాటిన్, ఇండియన్ అమెరికన్లు సాంప్రదాయికంగా డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులుగా పేరుబడ్డారు. వారిపై హారిస్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వారిలో ఎక్కువమంది ఈసారి ట్రంప్కే ఓటేసినట్టు ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోంది. 2020లో ట్రంప్తో పోలిస్తే బైడెన్కు ఓటేసిన లాటిన్ అమెరికన్ల సంఖ్య 23 శాతం ఎక్కువని తేలింది. ఈసారి సీన్ రివర్సయింది. లాటిన్ అమెరికన్ల ఓట్లు హారిస్ కంటే ట్రంప్కు కనీసం 8 శాతం ఎక్కువగా పడ్డట్టు పోల్ పండితులు అంచనా వేస్తున్నారు! ఇండియన్ అమెరికన్లలో కూడా హారిస్కు నిరాశే ఎదురైంది. వారు కొన్నాళ్లుగా రిపబ్లికన్ పార్టీవైపు మొగ్గుతున్నారు. ముఖ్యంగా యువతలో ట్రంప్ను సమర్థించే వారి సంఖ్య బాగా పెరిగింది. పురుషుల్లోనూ ఈ ధోరణి పెరిగినట్టు పలు సర్వేల్లో తేలింది. భారతీయ అమెరికన్ పురుషుల్లో 53 శాతం హారిస్ను సమర్థించగా 47 శాతం ట్రంప్వైపు మొగ్గారు. కానీ మిగతా అమెరికన్ల మాదిరిగా ధరాభారం, ఉపాధి తదితరాలు భారత సంతతి వారిని కూడా ప్రభావితం చేసినట్టు కన్పిస్తోంది.3. యువ, స్వతంత్ర, తటస్థ ఓటర్ల మొండిచేయి2020లో బైడెన్కు ఓటేసిన వారితో పోలిస్తే అన్ని రకాల ఓటర్లలోనూ హారిస్కు మద్దతు తగ్గింది. కేవలం విద్యాధికులైన యువతుల్లో మాత్రమే ఆమె బైడెన్ కంటే ఎక్కువ ఓట్లు సాధించగలిగారు. యువకులు మాత్రం ట్రంప్కే జైకొట్టారు. దాంతో మొత్తంగా 2020లో బైడెన్తో పోలిస్తే హారిస్కు యువత ఓట్లు తగ్గాయి. తటస్థులు, ఉదారవాదుల ఓట్లను కూడా ఆమె అనుకున్నంతగా సాధించలేకపోయారు. హారిస్ ఎంతగానో ఆశలు పెట్టుకున్న అబార్షన్ హక్కుల అంశం కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. ట్రంప్ నియంతృత్వ ధోరణులపై ఆందోళన వెలిబుచ్చడంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణను ప్రధానాంశంగా పేర్కొన్న ఓటర్లు హారిస్కే భారీగా మద్దతిచ్చారు. కానీ అడ్వాంటేజీని పూర్వపక్షం చేస్తూ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై ఆందోళనగా ఉన్నవారంతా ట్రంప్కే గుండుగుత్తగా ఓటేశారు.4. ఆదుకోని పట్టణ ప్రాంతాలుడెమొక్రాట్లకు దన్నుగా నిలుస్తూ వస్తున్న పట్టణ, శివారు ప్రాంతాల్లో కూడా ఈసారి ట్రెండ్ రివర్సయింది. వాటిలోనూ ట్రంప్ గణనీయమైన సంఖ్యలో ఓట్లు సాధించినట్టు స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా స్పష్టత వచ్చిన పట్టణ ప్రాంతాల్లో మెజారిటీ చోట్ల 2020లో బైడెన్ సాధించిన ఓట్లతో పోలిస్తే హారిస్ వెనకబడ్డారు. పైగా ఆ తేడా కనీసం ఒకట్రెండు పాయింట్లు, అంతకుమించి నమోదైంది. మిషిగన్ వంటి కీలక స్వింగ్ రాష్ట్రాల్లోనైతే పట్టణ ప్రాంతాల్లో బైడెన్ సాధించిన 14 శాతం ఆధిక్యాన్ని హారిస్ నిలుపుకోలేకపోయారు. ఇది కూడా అంతిమ ఫలితాలపై గట్టి ప్రభావమే చూపింది.5. సోషల్ మీడియాఈసారి అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తేల్చడంలో సోషల్ మీడియా కూడా కీలకంగా వ్యవహరించింది. అమెరికా మెయిన్స్ట్రీమ్ మీడియా దాదాపుగా హారిస్కే దన్నుగా నిలిచింది. కానీ దానికి అమెరికా ప్రజల్లో విశ్వసనీయత అడుగంటి చాలాకాలమైంది. వారు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియాకు మళ్లుతున్నారు. ఈ మార్పును ఒడిసిపట్టుకున్న ట్రంప్ సోషల్ మీడియా ప్రచారంలో దూకుడు కనబరిచారు. ముఖ్యంగా ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ బాహాట మద్దతు ఆయనకు బాగా కలిసొచ్చింది. జో రోగన్ వంటి పాడ్కాస్టర్లు కూడా ట్రంప్కు విస్తృతమైన ప్రచారం కల్పించారు.అమెరికా జనాభాలో ఎవరెంత మంది?అమెరికా జనాభా 33 కోట్ల పైచిలుకుశ్వేతజాతీయులు 58.9 శాతంహిస్పానియన్లు 19.1 శాతంఆఫ్రో అమెరికన్లు 12.6 శాతంఆసియన్లు 6.1 శాతంమిగతా వారు 2.4 శాతంమూలవాసులు 0.7 శాతంఇతరులు 0.2 శాతంఓటేసేవారిలోశ్వేత జాతీయులు 73 శాతంఆఫ్రో 11 శాతంహిస్పానియన్లు 9 శాతంఆసియన్లు 2 శాతం -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 'ట్రంప్ 2.0'
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దుమ్ము రేపారు. హోరాహోరీ పోరు తదితర విశ్లేషణలన్నింటినీ తోసిరాజంటూ డెమొక్రాట్ల అభ్యర్ధి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్పై ఘనవిజయం సాధించారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి వెల్లడైన ఫలితాల్లో విజయానికి కావాల్సిన 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల మార్కును ట్రంప్ అలవోకగా దాటేశారు. తద్వారా నాలుగేళ్ల విరామం తర్వాత రెండోసారి అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నారు. గ్రోవర్ క్లీవ్లాండ్ తర్వాత అమెరికా చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక నేతగా నిలిచారు. ఆ క్రమంలో పలు ఇతర రికార్డులూ సొంతం చేసుకున్నారు. అత్యంత ఎక్కువ వయసులో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన వ్యక్తిగా కూడా 78 ఏళ్ల ట్రంప్ నిలిచారు. క్రిమినల్ అభియోగాల్లో దోషిగా తేలిన ఏకైక మాజీ అధ్యక్షునిగా ట్రంప్ ఇప్పటికే చెత్త రికార్డును మూటగట్టుకోవడం తెలిసిందే. తాజా విజయంతో అలాంటి చరిత్రతో అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన తొలి నేతగా కూడా నిలిచారు. పైగా పాపులర్ ఓటు కూడా గెలుచుకోవడంతో ట్రంప్ విజయానికి పరిపూర్ణత చేకూరినట్టయింది. 2016లో ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా నెగ్గినప్పుడు ఆయన కంటే ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్కు 28 లక్షల ఓట్లు ఎక్కువగా రావడం తెలిసిందే. ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో ట్రంప్ ఇప్పటికే హారిస్ కంటే ఏకంగా 50 లక్షలకు పై చిలుకు ఓట్ల మెజారిటీ సాధించారు. 20 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన రిపబ్లికన్ అధ్యక్షునిగా నిలిచారు. అంతేగాక తనకు మాయని మచ్చగా మిగిలిన 2020 అధ్యక్ష ఎన్నికల ఓటమి తాలూకు చేదు గుర్తులను కూడా ఈ గెలుపుతో చెరిపేసుకున్నారు. బైడెన్ విజయాన్ని తిరస్కరిస్తూ తన మద్దతుదారులను క్యాపిటల్ హిల్పై దాడికి ఉసిగొల్పి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడంతో ట్రంప్ రాజకీయ భవితవ్యం ముగిసినట్టేనని అంతా భావించారు. అలాంటి స్థితి నుంచి పుంజుకుని నాలుగేళ్ల తర్వాత ఆయన సాధించిన ఘనవిజయం రిపబ్లికన్ పార్టీలో ఆనందోత్సాహాలు నింపగా 60 ఏళ్ల హారిస్ ఓటమితో డెమొక్రాట్లు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. విజయం ఖాయం కాగానే ట్రంప్ తన భార్య మెలానియాను ఆప్యాయంగా అక్కుని చేర్చుకుని ముద్దాడారు. ఫ్లోరిడాలోని తన వెస్ట్పామ్ బీచ్ నివాసం వెలుపల భారీగా గుమిగూడిన అభిమానులకు అభివాదం చేశారు. రన్నింగ్మేట్ జేడీ వాన్స్తో తన ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం కుటుంబంతో కలిసి అమెరికా ప్రజలనుద్దేశించి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. మరోసారి తనపై విశ్వాసముంచినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘అపూర్వమైన, అత్యంత శక్తిమంతమైన ఫలితమిది. అమెరికా చరిత్రలో స్వర్ణయుగానికి నా విజయం నాంది’’ అని ప్రకటించారు. ‘‘భగవంతుడు ఏదో పెద్ద కారణంతోనే నాకు ప్రాణదానం చేశాడని చాలామంది చెప్పింది నిజమేనని ఈ ఫలితాలు రుజువు చేశాయి’’ అని ప్రచార పర్వంలో తనపై జరిగిన హత్యా ప్రయత్నాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘ఇది అమెరికా ప్రజల విజయం. అంతేగాక దేశ చరిత్రలోనే అతి గొప్పదైన, కనీవిని ఎరగని రాజకీయ ఉద్యమమిది’’ అని చెప్పుకొచ్చారు. ‘‘నా చివరి శ్వాస దాకా ప్రతి రోజూ మీ కోసం, మీ కుటుంబాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పోరాడతా. మీ జీవితాల్లో వెలుగులు పంచుతా. ద్రవ్యోల్బణం, అక్రమ వలసలతో సహా అన్ని సమస్యలకూ సమర్థ పరిష్కారం చూపుతా’’ అని వాగ్దానం చేశారు. ఫలితాల వెల్లడి ప్రక్రియ పూర్తయి ట్రంప్ను అధ్యక్షునిగా లాంఛనంగా ప్రకటించేందుకు మరో రెండు నెలలు పట్టనుంది. అనంతరం జనవరి 20న ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు. రెండోసారి శ్వేతసౌధంలో అడుగు పెట్టనున్న ట్రంప్కు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశాధినేతల నుంచి అభినందనలు, శుభాకాంక్ష సందేశాలు వెల్లువెత్తాయి. ముందునుంచీ... అమెరికావ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఆ వెంటనే రాష్ట్రాలవారీగా ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదటినుంచీ ట్రంప్ ఆధిపత్యమే సాగుతూ వచ్చింది. చూస్తుండగానే ఏడు స్వింగ్ రాష్ట్రాల్లోనూ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. వాటిలో ఒకటైన విస్కాన్సిన్లో గెలుపుతో ఆయన 270 ఓట్ల మెజారిటీ మార్కును దాటగానే రిపబ్లికన్ నేతలు, అభిమానులు, మద్దతుదారులు దేశవ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయారు. బుధవారం రాత్రి తుది ఫలితాలు వెల్లడయ్యే సమయానికి 538 ఎలక్టోరల్ ఓట్లలో ట్రంప్ 294 సొంతం చేసుకున్నారు. మరోవైపు హారిస్ 223 ఎలక్టోరల్ ఓట్లకే పరిమితమయేలా కన్పిస్తున్నారు. ట్రంప్కు 7.1 కోట్ల పై చిలుకు ఓట్లు రాగా ఆమెకు 6.6 కోట్లే వచ్చాయి. 50 రాష్ట్రాలకు గాను అరిజోనా, నెవడా, మెయిన్ ఫలితమే తేలాల్సి ఉంది. అరిజోనాల్లో ట్రంప్ గెలుపు లాంఛనమే కాగా మెయిన్, నెవడాల్లోనూ ఆయన ఇప్పటికే 50 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆ మూడు రాష్ట్రాల్లోని 21 స్థానాలనూ గెలుచుకుని మరోసారి 300 మార్కు అలవోకగా దాటేలా కన్పిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఆయనకు 304 ఓట్లు దక్కడం తెలిసిందే. తన ఓటమి ఖాయం కావడంతో హార్వర్డ్ వర్సిటీలో బుధవారం రాత్రి తలపెట్టిన ప్రసంగ కార్యక్రమాన్ని హారిస్ రద్దు చేసుకున్నారు. అధ్యక్షుడు బైడెన్ అభ్యర్థిత్వం పట్ల డెమొక్రాట్ల నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయనకు బదులుగా అనూహ్యంగా బరిలో దిగిన హారిస్కు ఈ ఫలితాలు నిరాశ కలిగించేవే. గెలిచి ఉంటే అధ్యక్ష పదవిని అధిష్టించిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించేవారు. ట్రంప్, హారిస్ మధ్య పోటాపోటీ నెలకొన్నట్టు కొద్ది నెలలుగా ఎన్నికల సర్వేలన్నీ పేర్కొంటూ రావడం తెలిసందే. స్వింగ్ స్టేట్లలోనూ అదే పరిస్థితి ఉందని చెప్పడంతో ఫలితాలపై సర్వత్రా నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. -
విజయానికి ఐదు మెట్లు
పోరు హోరాహోరీ అంటూ విశ్లేషణలు. హారిస్దే పైచేయి అంటూ అమెరికా మీడియాలో కథనాల వెల్లువ. అందుకు తగ్గట్టు ట్రంప్తో ఏౖకైక డిబేట్లోనూ హారిస్ స్పష్టమైన ఆధిపత్యం. వీటికి తోడు ఆమె ఆఫ్రికన్, భారత మూలాలు. మహిళల దన్నుపై ధీమా. అబార్షన్ వంటి కీలకాంశాలు కలిసొస్తా యన్న అంచనాలు. సెలబ్రిటీల బహిరంగ మద్దతు. రిపబ్లికన్లతో పోలిస్తే ప్రచారానికి వరదలా వచ్చి పడ్డ నిధులు. కానీ తీరా చూస్తే ట్రంప్ హవా ముందు అన్నీ కొట్టుకుపో యాయి. హోరాహోరీ అనుకున్న పోటీ కాస్తా ఫలితాలొచ్చే సరికి ఏకపక్షంగా మారిపోయింది. ట్రంప్ విజయానికి, హారిస్ పరాజయానికి దారితీసిన కారణాలను పరిశీలిస్తే...1. అమెరికా ఫస్ట్2016లో ట్రంప్ను విజయతీరాలకు చేర్చిన ఈ నినాదం ఈసారి కూడా గట్టిగా పని చేసింది. ఉక్రెయిన్కు మద్దుతుగా బైడెన్ సర్కారు వందలాది కోట్ల డాలర్లను గుమ్మరించడం సగటు అమెరికన్లకు మింగుడు పడలేదు. దానికి తోడు చైనా తదితర దేశాల నుంచి కారుచౌకగా వచ్చిపడుతున్న వస్తూత్పత్తులు వారి పొట్టకొట్టడమే గాక ఉపాధికి కూడా ఎసరు పెడుతున్నాయి. అసలే ధరాభారంతో కుంగిపోతున్న అమెరికన్లకు ఈ పరిణామం కొన్నేళ్లుగా రోకటిపోటుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాను ప్రాభవం కొడిగడుతున్న దేశంగా ట్రంప్ అభివర్ణించడాన్ని వారు సమర్థించారు. సుంకాలను భారీగా పెంచడం ద్వారా కారుచౌక దిగుమతులకు అడ్డుకట్ట వేస్తానన్న ప్రకటన అమెరికన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఆర్థిక అవ్యవస్థ సహా అన్ని సమస్యలనూ చక్కదిద్దడానికి హారిస్తో పోలిస్తే ట్రంపే సరైన నేత అని మెజారిటీ ప్రజలు భావించారు. ‘అమెరికా ఫస్ట్’ నినాదానికి విపరీతమైన స్పందన దక్కింది. అంతర్జాతీయంగా అన్ని రంగాల్లోనూ అమెరికా ప్రాధాన్యాన్ని పునరుద్ధరిస్తానన్న వాగ్దానం శ్వేతజాతీయుల మనసు గెలుచుకుంది.2. అక్రమ వలసలువలసదారులు తమ అవకాశాలను తన్నుకుపోతున్నారన్న ఆక్రోశం స్థానికుల్లో చాలా ఏళ్లుగా నెలకొని ఉంది. వారిలోని ఈ వ్యతిరేకతను ట్రంప్ పూర్తిస్థాయిలో సొమ్ముచేసుకోగలిగారు. బైడెన్ నాలుగేళ్ల పాలనలో అమెరికాలోకి రికార్డు స్థాయిలో అక్రమ వలసలు జరిగాయి. వలసదారులు అమెరికన్ల పొట్టకొడుతు న్నారన్న ట్రంప్ వాదనతో వారు ఏకీభవించారు. వాటికి అడ్డుకట్ట వేయడమే గాక అక్రమంగా వచ్చిన 10 లక్షల పై చిలుకు మందిని స్వదేశాలకు పంపేస్తానని ప్రకటించడం ట్రంప్కు భారీగా లాభించింది.3.ఎకానమీఈసారి ట్రంప్ను గద్దెనెక్కించిన అంశాల్లో అత్యంత ముఖ్యమైనది. బైడెన్ పాలనలో గత నాలుగేళ్లలో ద్రవ్యోల్బణం చుక్కలను తాకింది. నిత్యావసరాల ధరలు అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రెండు రెట్లకు పైగా పెరిగిపోయాయి. కరోనా తదితర సమస్యలూ దానికి కారణమైనా ఓటర్లు మాత్రం బైడెన్ను, ఆయన డెమొక్రటిక్ పార్టీనే దోషులుగా చూశారు. ట్రంప్ హయాంలోనే ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండేదన్నది అమెరికన్లలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. ఆర్థిక అవ్యవస్థను చక్కదిద్దే సామర్థ్యం విషయంలో ట్రంప్తో పోలిస్తే హారిస్ తేలిపోయారని అన్ని సర్వేల్లోనూ తేలింది.4. గ్రామీణ ఓటర్ల బ్రహ్మరథంతొలినుంచీ ట్రంప్కు గట్టి ఓటు బ్యాంకుగా నిలిచిన గ్రామీణ ఓటర్లు ఆయనకు ఈసారి మరింత దన్నుగా నిలిచారు. గత కొన్ని ఎన్నికలతో పోలిస్తే ఈసారి వారి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగినట్టు ఫలితాల సరళి చెబుతోంది. ఈ ట్రెండు దేశవ్యాప్తంగా కొనసాగడం ట్రంప్కు బాగా కలిసొచ్చింది. ఎందుకంటే గ్రామీణ ఓట్లను ఆయన దాదాపుగా స్వీప్ చేశారు.మైనారిటీ ఓటర్లలోనూ పాగామెక్సికో తదితర లాటిన్ అమెరికా దేశాల నుంచి తరాల కిందట వలస వచ్చి స్థిరపడ్డ స్పానిష్ మాట్లాడే వారిని హిస్పానియన్లుగా పిలుస్తారు. ఫలితాల్లో వీరి ఓట్లూ కీలకమే. డెమొక్రాటిక్ పార్టీ ఓటర్లలో 12 శాతం దాకా ఉండే హిస్పానియన్లు కొన్నేళ్లుగా రిపబ్లికన్ పార్టీవైపు మొగ్గుతున్నారు. ఆ ట్రెండ్ కూడా ఈసారి కూడా కొనసాగినట్టు కన్పిస్తోంది. దీనికి తోడు హిస్పానియన్లకు, ఇండియన్ అమెరికన్లకు దగ్గరయ్యేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పోలింగ్ సమీపించిన తరుణంలో బంగ్లాదేశ్లో హిందువులు, మైనారిటీలపై దాడులను ఖండిస్తూ చేసిన ప్రకటన ఇండియన్ అమెరికన్లపై ప్రభావం చూపింది. 2020తో పోలిస్తే ట్రంప్కు ఈసారి లాటిన్, ఇండియన్ అమెరికన్ ఓట్లు గణనీయంగా పెరిగినట్టు దేశవ్యాప్తంగా 1.15 లక్షల ఓటర్లతో జరిపిన ఏపీ వోట్కాస్ట్ ప్రాథమిక సర్వే తేల్చింది. 2020లో బైడెన్కు ప్రతి 10 మంది లాటిన్ ఓటర్లలో 9 మంది ఓటేయగా ఈసారి హారిస్కు 8 మందే వేసినట్టు పేర్కొంది. 2020లో 60 శాతం పడ్డ హిస్పానియన్ ఓట్లు ఈసారి 50 శాతానికి తగ్గాయి. 30 ఏళ్ల లోపు ఓటర్లలో 2020లో బైడెన్కు 60 శాతం మంది ఓటేయగా ఈసారి అది 50 శాతానికి పరిమితమైంది. వారిలో 2020లో ట్రంప్కు మూడో వంతే ఓటేయగా ఈసారి అది 40 శాతానికి పెరిగింది. ఈ చిన్న మార్జిన్లే తుది ఫలితాలను గట్టిగా ప్రభావితం చేశాయి.5. భావజాలాలుపైకి కన్పించకపోయినా అమెరికా సమాజంలో జాత్యహంకారం, పురుషాధిక్య భావజాలం బలంగా వేళ్లూనుకుని ఉన్నాయి. ట్రంప్కు శ్వేతజాతీయులు మొదటినుంచీ గట్టి మద్దతుదారులుగా ఉండటానికి ఇది కూడా కారణమేనని చెబుతారు. అందుకే ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ వంటి ట్రంప్ నినాదాల్లో అంతర్లీనంగా దాగున్న ఆ భావనలు ఓటర్లపై గట్టి ప్రభావమే చూపాయని భావిస్తున్నారు. వీటికి తోడు ట్రంప్పై కోర్టు కేసులు, క్రిమినల్ అభియోగాలను ప్రజలు పట్టించుకోకపోవడం కూడా ఆయనకు కలిసొచ్చింది. పైగా ప్రస్తుతం దేశానికి కావాల్సింది ఆ దూకుడేనని వారు భావించారు. దీన్ని ట్రంప్ కూడా అంగీకరించడం విశేషం. తనపై ఉన్న కేసులు, అభియోగాలు జనాదరణను మరింతగా పెంచాయని చెప్పుకొచ్చారాయన. -
ట్రంప్ అధ్యక్షుడైతే.. మరి కేసుల సంగతి!
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసిన డొనాల్డ్ ట్రంప్.. రెండోసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ఈ నాలుగేళ్ల కాలంలో ఆయనపై అనేక ఆరోపణలు, అభియోగాలు నమోదయ్యాయి. ఓ కేసులో కోర్టు బయటే అరెస్ట్ కాగా.. మరో కేసులో కోర్టు దోషిగా తేల్చేసింది కూడా. మరి ఇప్పుడు ఆయన మరోసారి ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా మరోసారి వైట్హౌజ్లో అడుగుపెట్టబోతున్న ఆయనకు.. ఈ కేసులు తలనొప్పి తెచ్చి పెట్టే అవకాశం లేకపోలేదా?.ఓ మాజీ శృంగార తారతో అనైతిక ఒప్పందం కుదుర్చుకున్న హష్ మనీ కేసులో ట్రంప్ దోషిగా తేలారు. ఈ కేసుకు సంబంధించి న్యూయార్క్లోని న్యాయస్థానం నవంబర్ 26న శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తరుణంలో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.అయితే, ఈ కేసును వాయిదా వేయాలని ట్రంప్ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తిని కోరే అవకాశం లేకపోలేదు. ఇక.. వాషింగ్టన్ డీసీ, ఫ్లోరిడాల్లో నమోదైన రెండు క్రిమినల్ కేసులు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే, వీటిని కూడా విచారణ వాయిదా వేయించాలని ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఎందుకంటే.. స్పెషల్ కౌన్సిల్ జాక్ స్మిత్ ట్రంప్కు ఏమాత్రం అనుకూలంగా లేరు. దీంతో విచారణ వాయిదా గ్యాప్ దొరికితే.. ఆయనపై వేటు వేసేందుకు అవకాశం దొరుకుతుంది. ఈ విషయాలు ఎవరో నిపుణులు చెప్పినవి కావు.. స్వయానా డొనాల్డ్ ట్రంప్ పలుఇంటర్వ్యూల్లో బహిరంగంగానే చెప్పడం గమనార్హం. అంటే.. అధ్యక్ష పదవి చేపట్టాక ట్రంప్ తన సొంత ‘న్యాయ’ వ్యవస్థతో తనను తాను నిర్దోషిగా మార్చుకునే అవకాశం ఉందన్నమాట!. -
కమల యోధురాలు
తిరువరూర్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓటమిపాలైనప్పటికీ కమలా హారిస్ను పోరాట యోధురాలంటూ ఆకాశానికెత్తేస్తున్నారు తమిళనాడులోని ఆమె పూర్వికుల గ్రామ ప్రజలు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి, విజయం సాధిస్తారంటూ తులసేంద్రపురం గ్రామస్తులు ధీమాగా చెబుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడవుతుండటంతో గ్రామస్తులు టీవీలకు అతుక్కుపోయారు. స్థానిక శ్రీ ధర్మ శాస్త పెరుమాల్ ఆలయంలో పూజలు చేసి, కమల గెలవాలని మొక్కుకున్నారు. మధ్యాహ్నానికల్లా ట్రంప్దే విజయమని, కమల ఓడిపోతున్నారని తేలడంతో నిరుత్సాహానికి గురయ్యారు. మంగళవారం గ్రామానికి అమెరికా, బ్రిటన్ల నుంచి వచి్చన కమల అభిమానులు ముగ్గురు బుధవారం తిరిగి వెళ్లిపోయారు. ‘కమల గెలిస్తే దీపావళికి మించి ఘనంగా ఉత్సవం నిర్వహించాలని అనుకున్నాం. ఇందుకోసం, టపాసులు సిద్దంగా ఉంచాం. ఆలయంలో పూజలయ్యాక అన్నదానం, స్వీట్లు పంపిణీ చేయాలనుకున్నాం’అని డీఎంకే తిరువరూర్ జిల్లా ప్రతినిధి, తులసేంద్రపురం గ్రామ నేత జె.సుధాకర్ చెప్పారు. ‘గెలుపోటములు జీవితంలో భాగం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమల గట్టిపోటీని ఎదుర్కొన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని చూస్తే మెచ్చుకోవాల్సిందే. ఆమె యోధురాలు, మళ్లీ పోటీ చేసి విజయం సాధిస్తారు’అని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడామె అధ్యక్షురాలు కాకపోవచ్చు, భవిష్యత్తు ఏదో ఒకనాడు కమల అమెరికా అధ్యక్షపీఠం ఎక్కడం ఖాయమంటూ మరికొందరు విశ్వాసం వ్యక్తం చేశారు. ‘కమల ఓటమిని తట్టుకోలేకపోతున్నాం. కానీ, ఆమెకిప్పుడు 60 ఏళ్లే. ఈ ఓటమితో నిరాశ చెందక ఇంతకుమించి పట్టుదలతో పోరాడి వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధిస్తారనుకుంటున్నాం’అని గ్రామానికి చెందిన టీఎస్ అన్బసరసు చెప్పారు. తమ గ్రామంలోని కుటుంబానికి చెందిన ఓ మహిళ అమెరికా మొట్టమొదటి అధ్యక్షురాలవుతారని గ్రామస్తులంతా ఆశతో ఉన్నారని ఆయన అన్నారు. అధ్యక్షురాలైతే కమల తమ గ్రామానికి వస్తారని ఎదురుచూస్తామని చెప్పారు. చదవండి: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. స్పీకర్ మైక్ జాన్సన్ ప్రకటన -
ఎడిట్ చేసిన ఫొటోను షేర్ చేసిన మస్క్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం ఖరారైంది. ట్రంప్నకు మద్దతుగా టెస్లా సీఈఓ ఇలాన్మస్క్ ప్రచారం చేశారు. ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తుండడంతో ఆయన తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. 2022లో ట్విటర్ను కొనుగోలు చేసిన సమయంలో పోస్ట్ చేసిన వీడియోను ఎడిట్ చేసి తిరిగి తాజాగా అమెరికా అధ్యక్ష ఫలితాల నేపథ్యంలో ఎక్స్ వేదికగా పంచుకున్నారు.ఇలాన్మస్క్ 2022లో ట్విటర్ను కొనుగోలు చేసి కార్యాలయంలో ప్రవేశించే సమయంలో వినూత్నంగా సింక్ను చేతిలో పట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ను అప్పటి ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘లెట్ దట్ సింక్ ఇన్(దాన్ని మునిగిపోనివ్వండి)’ అంటూ కామెంట్ను జోడించారు. అప్పటివరకు ప్రత్యర్థుల యాజమాన్యంలోని సంస్థను మస్క్ కొనుగోలు చేసిన నేపథ్యంలో తాను అలా కామెంట్ చేస్తూ సింక్తో ట్విటర్ కార్యాలయంలోకి అడుగుపెట్టారు.ఇదీ చదవండి: ట్రంప్-బైడెన్.. ఎవరి హయాంలో భారత్ వృద్ధి ఎంత?అమెరికా ఎన్నికలు పూర్తయి ట్రంప్ విజయం ఖారారైంది. ట్రంప్నకు మద్దతుగా నిలిచి దాదాపు 118 మిలియన్ డాలర్లు(రూ.984 కోట్లు) రిపబ్లికన్ పార్టీకి విరాళంగా ఇచ్చారు. ట్రంప్ మరోసారి అధ్యక్షుడి పీఠంపై కూర్చోబోతుండడంతో ఇప్పటివరకు పాలించిన ప్రత్యర్థులను ఉద్దేశించి తిరిగి మస్క్ వైట్హౌజ్ను తలిపించేలా సింక్తో ప్రవేశించిన ఫోటోను షేర్ చేస్తూ ‘లెట్ దట్ సింక్ ఇన్’ అని కామెంట్ రాశారు. మస్క్ 2022లో ట్విటర్(ప్రస్తుతం ఎక్స్)ను 44 బిలియన్ డాలర్ల(రూ.3.67 లక్షల కోట్లు)కు కొనుగోలు చేశారు. -
అమ్మా.. నీకు మాటిస్తున్నా..!
-
30 రాష్ట్రాల్లో ట్రంప్ ప్రభంజనం..
-
డొనాల్డ్ ట్రంప్ గెలుపు వెనుక ఎలాన్ మస్క్!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో అపరకుబేరుడు ఎలాన్ మస్క్ పాత్రను తీసిపారేయలేం. మొదటి నుంచి ట్రంప్కు మద్ధతు పలుకుతూ వచ్చిన మస్క్.. బైడెన్ ప్రభుత్వంపైనా, పోటీదారు కమలా హారిస్పైనా అదే స్థాయిలో విమర్శలతో చెలరేగిపోయాడు. అదే టైంలో.. సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’కి బాస్గా ఎలాన్ మస్క్ నడిపించిన ఉద్యమం కూడా ట్రంప్ గెలుపులో కీలకభూమిక పోషించింది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో ఎలాన్ మస్క్కు ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ పరోక్షంగా ఉపయోగపడింది. మస్క్ తన సోషల్ మీడియా వేదికలపై ప్రముఖులతో కలిసి ట్రంప్కు అనుకూలంగా ప్రచారం చేశారు. అభిప్రాయాల్ని వ్యక్తం చేయడం, ట్రంప్ గెలుపుతో అమెరికన్లకు కలిగే ప్రయోజనాలతో పాటు వివిధ సున్నిమైన అంశాల గురించి చర్చించారు. ఆ చర్చలే ఓటర్లకు దగ్గరయ్యేలా చేసింది. పలు సందర్భాల్లో ప్రజల్లో ట్రంప్పై ఉన్న వ్యతిరేకతను సైతం అనుకూలంగా మార్చేలా మస్క్ తన వ్యూహ, ప్రతివ్యూహాలతో ఆకట్టుకున్నారు. అన్నింటికంటే ముందు.. ట్రంప్పై గతంలో విధించిన సోషల్ మీడియా బ్యాన్ను ఎత్తిపారేశారాయన.ఇదీ చదవండి: కమలా హారిస్పై డొనాల్డ్ ట్రంప్ ఘన విజయంట్రంప్కు బహిరంగ మద్దతు వ్యాపార వ్యవహరాల్లోనే కాదు రాజకీయంగా మస్క్.. ట్రంప్కు ప్రత్యక్షంగా మద్దతు పలికారు. వాస్తవానికి 2016, 2020 ఎన్నికలలో ట్రంప్కు మస్క్ పరోక్ష మద్దతిచ్చారు. అలాగే ఈ ఎన్నికల్లో మస్క్ ఓ అడుగు ముందుకు వేసి ట్రంప్కు మద్దతు పలికారు. అలాగే.. ట్రంప్ హామీలు, గత పాలనలో నిర్ణయాలను విపరీతంగా ప్రమోట్ చేశారు. కుటుంబ నియంత్రణ, అంతరిక్ష పరిశోధనలు, ఆర్థిక జాతీయవాదం వంటి అంశాలపై మద్దతు పలకడంతో కోట్లాది మంది మస్క్ అభిమానులు సైతం ట్రంప్కు ఓటు వేసేందుకు ఉపయోగపడింది. మస్క్ను నమ్మారు!ట్రంప్కు మస్క్ మద్దతు ఇవ్వడంతో.. ఆయన కంపెనీలైన టెస్లా, స్పేస్ఎక్స్ ఆవిష్కరణలతో పాటు పెట్టుబడిదారులు, వినియోగదారులు లబ్ధి చేకూరొచ్చని భావించారు. పన్నులు, ఇంధనం, రాయితీ వంటి హామీలపై మస్క్ ఎక్కువ ఫోకస్ చేశారు. పెట్టుబడిదారుల నుంచి వినియోగదారుల వరకు మస్క్ మాటల్ని నమ్మారని, కాబట్టే మస్క్ అభిమానుల ఓట్లు ట్రంప్కు పడేలా చేశాయని విశ్లేషకుల అభిప్రాయం. ఎలాన్ మస్క్ చేసిన పోస్టులే..సోషల్ మీడియాలో ఎలాన్ మస్క్ క్రేజ్ అంతా ఇంతా కాదు. స్వేచ్ఛ పేరుతో.. ఎలాంటి అంశంపైన అయినా స్పందిస్తుంటారు. మీడియా, టెక్నాలజీలతో పాటు ఉన్నత రంగాల ప్రముఖుల పట్ల జోబైడెన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పలుమార్లు ఎలాన్ మస్క్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఈ అంశం ట్రంప్కు బాగా కలిసొచ్చింది. ప్రపంచకుబేరుల జాబితాలో మస్క్ ముందు వరుసలో ఉండడం, ఆకట్టుకునేలా మాటలు ట్రంప్కు అనుకూలంగా పనిచేశాయి.ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో మస్క్ మరింత చురుకైన పాత్ర పోషిస్తే, ట్రంప్కు ప్రయోజనం చేకూర్చేలా అమెరికన్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని ఆయా సోషల్ మీడియా వేదికలపై ప్రస్తావించారు. టెక్నాలజీ, ఆర్థిక సమస్యలు, సంస్కృతి వంటి అంశాల ట్రంప్కు అనుకూలంగా మారాయి.వాక్ స్వాతంత్య్రం, ప్రభుత్వ జోక్యం, వ్యక్తిగత స్వేచ్ఛపై మస్క్ వ్యక్తిగత విశ్వాసాలు ట్రంప్కు మద్దతు పలికేలా చేశాయి. వాక్ స్వాతంత్య్రం, సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడంపై మస్క్.. ట్రంప్తో జతకట్టేలా చేశాయి. ట్రంప్ గెలుపులు ఈ అంశాలు కలిసొచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్కు మద్దతుగా ఎలాన్ మస్క్ చేసిన ప్రచారం ఓటర్ల శైలిని మార్చేసిందనే చెప్పొచ్చు. -
డియర్ మస్క్ ఐ లవ్ యూ..!
-
ట్రంప్-బైడెన్.. ఎవరి హయాంలో భారత్ వృద్ధి ఎంత?
అమెరికా ఎన్నికలు ముగిశాయి. అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారైంది. దీంతో ఆయన రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. గతంలో పాలించిన జోబైడన్, అంతకుముందు పాలించిన డొనాల్డ్ ట్రంప్ హయాంలో భారత్తో వాణిజ్య సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. అయితే ఎవరి హయాంలో ఎంత వృద్ధి చెందిందో తెలుసుకుందాం.92 శాతం పెరిగిన వాణిజ్యంయునైటెడ్ స్టేట్స్కు సరుకులు ఎగుమతి చేస్తున్న దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. గత దశాబ్ద కాలంలో భారత్-అమెరికా ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య సంబంధాలు గణనీయంగా పెరిగాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం పదేళ్లలో యూఎస్తో భారత వాణిజ్యం 92 శాతం పెరిగింది. 2014లో ఇది 61.5 బిలియన్ డాలర్లు(రూ.5.13 లక్షల కోట్లు)గా ఉండేది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఏకంగా 118.3 బిలియన్ల(రూ.9.87 లక్షల కోట్లు)కు చేరుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ను ఎన్నుకోనుండడంతో రానున్న రోజుల్లో ద్వైపాక్షిక వాణిజ్యం ఆసక్తికరంగా మారనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.గరిష్ఠ ఎగుమతులుండే విభాగాలు..యూఎస్కు 2023-24లో భారత ఎగుమతులు 77.53 బిలియన్లుగా(రూ.6.47 లక్షల కోట్లు) ఉన్నాయి. ఇది అంతకుముందు సంవత్సరం గరిష్టంగా ఉన్న 78.40 బిలియన్లుగా(రూ.6.54 లక్షల కోట్లు) నమోదయ్యాయి. గత పదేళ్లలో భారత్ ఎగుమతులు 2014లో 39.1 బిలియన్ల(రూ.3.26 లక్షల కోట్లు) నుంచి 2024 వరకు 98 శాతం పెరిగి 77.5 బిలియన్ల(రూ.6.48 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. ఇంజినీరింగ్ ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రానిక్స్తో సహా భారతీయ వస్తువులకు అమెరికాలో భారీ గిరాకీ ఉంది.డొనాల్డ్ ట్రంప్-జోబైడెన్ హయాంలో ఇలా..డొనాల్డ్ ట్రంప్ హయాంలో జనవరి 2017 నుంచి జనవరి 2021 వరకు అమెరికాకు భారతదేశ ఎగుమతులు నాలుగేళ్లలో 22 శాతం పెరిగాయి. జోబైడెన్ హయాంలో అమెరికాకు దేశ ఎగుమతులు కేవలం మూడు సంవత్సరాల్లో(2025 ఆర్థిక సంవత్సరం డేటా ఇంకా అందుబాటులో లేదు) 51 శాతం అధికమయ్యాయి. ట్రంప్ హయాంలో నాలుగేళ్ల(2018-21)లో అమెరికా నుంచి భారత్ దిగుమతులు 29% పెరిగాయి. మరోవైపు జోబైడెన్ హయాంలో మూడేళ్లలో భారత్ దిగుమతులు 42% అధికమయ్యాయి.ఇదీ చదవండి: ఆఫీస్కు రండి.. లేదా కంపెనీ మారండి!విభాగాల వారీగా ఎగుమతుల విలువఇంజినీరింగ్ వస్తువులు 16.3 బిలియన్ డాలర్లు(రూ.1.36 లక్షల కోట్లు)రసాయనాలు, సంబంధిత ఉత్పత్తులు 12.8 బిలియన్ డాలర్లు(రూ.1.07 లక్షల కోట్లు)ఎలక్ట్రానిక్ వస్తువులు 10.5 బిలియన్ డాలర్లు(రూ.88000 కోట్లు)రత్నాలు, ఆభరణాలు 9.9 బిలియన్ డాలర్లు (రూ.83 వేలకోట్లు)పెట్రోలియం ఉత్పత్తులు 5.8 బిలియన్ డాలర్లు (రూ.48,760 కోట్లు)ఇతర ఉత్పత్తులు సంయుక్తంగా 22.2 బిలియన్ డాలర్లు(రూ.1.86 లక్షల కోట్లు) -
ట్రంప్ గెలుపుపై చైనా రియాక్షన్
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అమెరికా ప్రజలు రిపబ్లిక్ పార్టీ వైపు మొగ్గు చూపటంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్కు నిరాశ ఎదురైంది. ఇక.. ట్రంప్ సాధించిన భారీ విజయంపై భారత ప్రధాని మోదీతో సహా పలు దేశాధినేతలు, దేశాలు స్పందిస్తూ.. ఆయన అభినందనలు తెలియజేస్తున్నాయి. తాజాగా చైనా సైతం డొనాల్డ్ ట్రంప్ విజయంపై స్పందించింది. అయితే.. ట్రంప్ పేరు నేరుగా ప్రస్తావించకుండా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై డ్రాగన్ దేశం స్పందించింది.‘‘అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజల ఎంపిక నిర్ణయాన్ని గౌరవిస్తాం. అధ్యక్ష ఎన్నికలు అమెరికా అంతర్గత వ్యవహారం. అయితే.. అమెరికా పట్ల చైనా విధానం స్థిరంగా ఉంది. పరస్పర గౌరవం, శాంతియుత జీవనం, సహకారం వంటి సూత్రాలకు అనుగుణంగా చైనా-యూఎస్ సంబంధాలను కొనసాగిస్తాం’’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. మరోవైపు.. చైనాపై కఠినంగా వ్యహరిస్తారనే ముద్ర ఉన్న డొనాల్డ్ ట్రంప్.. రానున్ను రోజుల్లో డ్రాగన్ దేశంతో సంబంధాలు ఎలా కొనసాగిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది.చదవండి: ట్రంప్ విజయంపై మోదీ సహా ప్రపంచ నేతల స్పందన -
US Election Results: డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అమెరికా ప్రజలు ట్రంప్ వైపు మొగ్గు చూపటంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్కు నిరాశ ఎదురైంది. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 270 ఎలక్టోరల్ మార్క్ను దాటారు.విస్కాన్సిన్లో గెలుపుతో ఆయన ఈ మ్యాజిక్ ఫిగర్ దాటారు. ఇక.. ఇప్పటి వరకు అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 277 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. దీంతో ఆయన అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ట్రంప్-280కమలా హారిస్-224ఇంకా నెవడా 6, మిషిగన్ 15, మైన్ 2, ఆరిజోనా 11, అలస్కా 3 చొప్పున ఎలక్టోరల్ ఓట్లు ఉండగా.. ఫలితాలు ప్రకటించాల్సి ఉంది.ట్రంప్ నెగ్గిన రాష్ట్రాలుఅలబామా 9, ఆర్కాన్సాస్ 6, ఫ్లోరిడా 30, జార్జియా 16, అయోవా 6, ఐడహో 4, ఇండియానా 11, కాన్సస్ 6, కెంటకీ 8, లూసియానా 8, మైన్ 1, మిస్సోరి 10, మిసిసిపి 6, మోంటానా 4, నార్త్ కరోలినా 16, నార్త్ డకోటా 3, నెబ్రాస్కా 4, ఒహాయో 17, ఓక్లహోమా 7, పెన్సిల్వేనియా 19, సౌత్ కరోలినా 9, సౌత్ డకోటా 3, టెన్నెసీ 11, టెక్సాస్ 40, యుటా 6, వెస్ట్ వర్జీనియా 4,వయోమింగ్ 3, విస్కాన్సిన్ 10కమలా హారిస్ గెలిచిన రాష్ట్రాలివే..కాలిఫోర్నియా 54, కొలరాడో 10, కనెక్టికట్ 7, డీసీ 3, డెలవేర్ 3, హవాయి 4, ఇల్లినోయీ 19, మసాచుసెట్స్ 11, మేరీల్యాండ్ 10, మైన్ 1, మిన్నెసోటా 10, నెబ్రస్కా 1, న్యూహ్యాంప్షైర్ 4, న్యూజెర్సీ 14, న్యూమెక్సికో 5, న్యూయార్క్ 28, ఓరెగాన్ 8, రోడ్ ఐల్యాండ్ 4, వర్జినియా 13, వెర్మాంట్ 3, వాషింగ్టన్ 12ట్రంప్ ఖతాలో రెండు రికార్డులురెండు దశాబ్దాల తర్వాత పాపులర్ ఓటింగ్తో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ విజయం సాధించడం గమనార్హం. 2004 ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి జార్జ్ బుష్ 62,040,610 ఓట్లతో 286 ఎలక్టోరల్ దక్కించుకోగా.. డెమోక్రటిక్ అభ్యర్థి జాన్ కెర్రీకి 59,028,444 ఓట్లతో 251 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ట్రంప్ మళ్లీ ఆ ఘనత సాధించారు.ఇక.. 132 ఏళ్ల తర్వాత ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అరుదైన ఫీట్ సాధించారు. 1885 అమెరికా ఎన్నికల్లో గ్రోవర్ క్లీవ్లాండ్ అధ్యక్షుడిగా నెగ్గారు. అయితే మళ్లీ ఒక టర్మ్ ముగిశాక.. అంటే 1893 ఎన్నికల్లోనూ గ్రోవర్ ప్రెసిడెంట్గా విజయం సాధించారు. అమెరికాకు 45వ అధ్యక్షుడిగా పని చేసిన ట్రంప్.. ఒక టర్మ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ మేజిక్ ఫిగర్ దాటేసి వైట్హౌజ్ వైపు అడుగులేశారు.చదవండి: Usha Chilukuri: ‘సెకండ్ లేడీ ఆఫ్ అమెరికా’గా తెలుగమ్మాయి ఉషా చిలుకూరి.. -
ట్రంప్ కే పట్టం కట్టిన అమెరికన్లు
-
అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం
-
ఒకే రోజు రూ.5 లక్షల కోట్ల కొనుగోళ్లు!
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 271 పాయింట్లు పెరిగి 24,484 వద్దకు చేరింది. సెన్సెక్స్ 901 పాయింట్లు ఎగబాకి 80,378 వద్ద ముగిసింది. దాంతో ఈక్విటీ మార్కెట్లో ఒక్కరోజే దాదాపు రూ.5 లక్షల కోట్ల మేరకు కొనుగోళ్లు జరిగినట్లయింది.ఇటీవల వరుస నష్టాలతో ముగిసిన మార్కెట్లు బుధవారం లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్ ఈరోజు దేశీయ స్టాక్మార్కెట్ను నడిపించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అమెరికా ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయో ఒక అంచనాకు వస్తుండడంతో మార్కెట్లు పుంజుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా, యూఎన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా దేశీయ సంబంధాలు మెరుగ్గానే ఉంటాయని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. దాంతో మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికలపై కొంత స్పష్టత వస్తుండడంతో మదుపర్లు కొనుగోళ్లకు పూనుకున్నారు.ఇదీ చదవండి: ఆఫీస్కు రండి.. లేదా కంపెనీ మారండి!సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, ఇన్ఫీసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ, రిలయన్స్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీ స్టాక్లు లాభాల్లోకి చేరుకున్నాయి. టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్యూఎల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ట్రంప్ కి మోదీ విషెస్
-
అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు
-
ట్రంప్ విక్టరీ.. చైనాకు బిగ్ షాక్..
-
అద్భుతమైన జంట.. జేడీ వాన్స్, ఉషా వాన్స్కు అభినందనలు: ట్రంప్
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, వైఎస్ ప్రెసిడెంట్గా జేడీ వాన్స్ విజయం దాదాపు ఖాయమైపోయింది. ఈ క్రమంలో ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్లో రిపబ్లిక్ పార్టీ మద్దతుదారుల సభలో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. అమెరికా తమకు అపూర్వమైన, శక్తివంతమైన ఆదేశాన్ని ఇచ్చిందని అన్నారు. తన సహచరుడు జేడీ వాన్స్, భారతీయ అమెరికన్ అయిన జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్పై ప్రశంసలు కురిపించారు.‘‘మొదటగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్, ఆయన అద్భుతమైన, అందమైన భార్య ఉషా వాన్స్ను అభినందిస్తున్నా. ఇక నుంచి మిమ్మల్ని ఉపాధ్యక్షుడు అని గర్వంగా పిలువచ్చు. ఈ ఎన్నికల్లో మనం చరిత్ర సృష్టించాం. ఎవరూ సాధ్యం కాదనుకున్న అడ్డంకులను అధిగమించాం. అమెరికా దేశం ఎన్నడూ చూడని రాజకీయ విజయం. నాకు మద్దతు ఇచ్చిన టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్కి కృతజ్ఞతలు’’ అని అన్నారు.ఇక.. ట్రంప్ రన్నింగ్మేట్గా గెలుపు ఖరారు చేసుకున్న జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్.. ఆంధ్రప్రదేశ్లోని వడ్లూరు గ్రామంలో జన్మించిన ఇండో అమెరికన్. జేడీ వాన్స్ గెలుపుతో ఆమె అమెరికాకు రెండవ మహిళ(Second Lady) హోదా దక్కించుకోకున్నారు. ఆమె యేల్ లా స్కూల్లో జేడీ వాన్స్ను మొదటగా కలుసుకున్నారు. ఈ జంట 2014లో వివాహం చేసుకున్నారు. కాగా.. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉష పేరెంట్స్ రాధాకృష్ణ, లక్ష్మి దంపతులు 1970వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు. శాన్ డియాగోలో ఇంజనీరింగ్, మాలిక్యులర్ బయాలజీ ప్రొఫెసర్లుగా పని చేశారు. గత ఎన్నికల్లో భారతీయ మూలాలున్న కమలా హారిస్ ఉపాధ్యక్షురాలు కాగా.. ఈసారి తెలుగుమూలాలున్న వ్యక్తి భర్త(జేడీ వాన్స్) ఆ పదవిని చేపట్టబోతున్నారు.'Now I Can Say Vice President': Trump hails JD Vance, His wife after 'Political Victory'Watch: https://t.co/Fj7vonSlLl | #USElection2024 #Trump2024 #JDVance #VicePresident #IndianAmerican #UshaVance pic.twitter.com/9DiDFHh1J9— Business Today (@business_today) November 6, 2024Video Credits: Business Todayచదవండి: US Election 2024 నాన్సీ పెలోసీ వరుసగా 20వ సారి గెలుపు, ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ -
రెండోసారి అధ్యక్ష పీఠంపై డొనాల్డ్ ట్రంప్ : ఇష్టమైన డ్రింక్ ఇదే, క్యాన్ల కొద్దీ!
హోరా హోరీగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చరిత్రాత్మక గెలుపు సాధించారు. రెండోసారి అధ్యక్ష పీఠాన్ని దక్కించు కోవాలనుకున్న తన కలను సాకారం చేసుకున్నారు. 47వ అమెరికా అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక లాంఛనమే. దీంతో భారత్ సహా ప్రపంచదేశాలు ట్రంప్ను అభినందిస్తున్నాయి. మరోవైపు 78ఏళ్ల వయసులో అమెరికా అద్యక్షుడు కాబోతున్న ట్రంప్కిష్టమైన పదార్థాలేంటి, మద్యం తాగతాడా? టీ కాఫీలుతాగుతాడా అనేది నెట్టించ చర్చ మొదలంది. ఈ నేపథ్యంలో ట్రంప్కు ఇష్టమైన ఫుడ్, వంటకాలేంటో ఒకసారి చూద్దాం.ఫాస్ట్ ఫుడ్ అంటే ప్రాణం ట్రంప్కు ఫాస్ట్ ఫుడ్ అభిమాని. అలాగే మీట్ లోఫ్ చాలా ఇష్టం. డైట్ కోక్, మెక్ డొనాల్డ్స్ ఫుడ్ అంటే మరీ ఇష్టం. ఇంకా బర్గర్ కింగ్, కెఎఫ్సీ సహా తో సహా ఫాస్ట్ ఫుడ్కి విపరీతమైన అభిమాని. ఈ విషయాన్ని దేశ విదేశాల పర్యటనల్లో ఆయన ఫాస్ట్ఫుడ్కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే పంది మాంసాన్ని గుడ్లతో కలిపి తినడానికి ఇష్టపడతాడు. అంతేకాదు ఆయన రోజువారీ ఆహారంలోసాధారణంగా బ్రేక్ఫాస్ట్, లంచ్ కంటే కూడా డిన్నర్కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.బ్రేక్ఫాస్ట్, లంచ్ , డిన్నర్ బేకన్ , గుడ్లు, తృణధాన్యాలు లేదా మెక్డొనాల్డ్స్ మెక్మఫిన్ తింటాడు. కాఫీ లేదా టీ అస్సలు తాగడు. గతంలో మాజీ ప్రచార నిర్వాహకుడు కోరీ లెవాండోస్కీ రాసిన లెట్ ట్రంప్ బి ట్రంప్ అనే పుస్తకం ప్రకారం ట్రంప్ పగటిపూట ఎక్కువగా తినడానికి ఇష్టపడడు. సాధారణంగా 14 నుండి 16 గంటలు తినకుండానే ఉంటాడు. ఎగ్ మెఫిన్స్ ఫిష్ శాండ్విచ్ చాక్లెట్ షాక్ అన్నా కూడా ఇష్టం.వ నిల్లా-ఫ్లేవర్ ఉన్న కీబ్లర్ వియన్నా ఫింగర్స్ను తింటారు.డైట్ కోక్ అంటే పిచ్చిమద్యానికి దూరంగాఉండే ట్రంప్ కి అత్యంత ఇష్టమైన పానీయం ఏదన్నా ఉందంటే అది డైట్ కోక్. రోజుకు సుమారు 12 క్యాన్ల డైట్ కోక్ తాగుతాడని చెబుతారు.. ఇక వెజ్ విషయానికి వస్తే ఆటూ చిప స్, లేస్ పొటాటో చిప్స్ ని ఆయన అధికంగా తింటారు. చెర్రీ తో పాటుగా వెనిల్లా ఐస్ క్రీం , చాక్లెట్ కేక్ ఆయనకు నచ్చిన ఆహారాల్లో భాగమే. -
ట్రంప్కే పట్టం: ఎదురుదెబ్బలను తట్టుకుని పైకిలేచి రెండోసారి వైట్హౌజ్కు..
కొందరు ఆయన్ను ప్రేమిస్తారు.. మరికొందరు ఆయన్ను ద్వేషిస్తారు.. కానీ ఆయన్ను విస్మరించడం మాత్రం ఎవరి వల్లా కాదు.. ఆయనే డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు సార్లు అభిశంసనకు గురైన మిస్టర్ ట్రంప్..రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ వైట్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ గతంలో ట్విట్టర్ ఆయన్ను వెలివేసింది.. 2020 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన తర్వాత ఆయన పడిన పాట్లు అన్నీఇన్నీ కావు.. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు.. తలదించలేదు.. వెన్నుచూపని వీరుడిలా మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ఎదురుగా బలమైన ప్రత్యర్థి కమల హారీస్ ఉన్నా ఏ మాత్రం బెదరలేదు... వణకలేదు..! డొంక తిరుగుడు మాటలు ఏ మాత్రం తెలియని ట్రంప్.. తన ముక్కుసూటితనంతోనే ఓటర్ల మనసును గెలిచి 47వ ప్రెసిడెంట్గా 2025 జనవరి 20న రెండోసారి ప్రమాణస్వీకారానికి సిద్ధమయ్యారు. పడి చోటే లేచిన ట్రంప్ తన జీవిత ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. రెండోసారి వైట్ హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు బిలియనీర్ ట్రంప్నేపథ్యం..డోనాల్డ్ ట్రంప్ జూన్ 14, 1946న న్యూయార్క్లోని ఓ సంపన్న కుటుంబంలో పుట్టారు.ట్రంప్ తండ్రి ఫ్రెడ్ విజయవంతమైన రియల్ ఎస్టేట్ వ్యాపారి. న్యూయార్క్తో పాటు అమెరికాలోని వివిధ నగరాల్లో ట్రంప్ కుటుంబానికి చాలా అపార్ట్మెంట్లు, ఆస్తులు ఉన్నా...ట్రంప్ జీవితం ఏమాత్రం సాఫీగా సాగలేదు. ఆయన కుటుంబానికి ఉన్న డబ్బే ట్రంప్కు స్కూల్లో శాపంగా మారింది. ట్రంప్ను చాలా మంది వేరుగా చూసేవారు. అందరిలో ఒకడిలా ట్రంప్ని ఉండనివ్వలేదు. ఇదే ఆయన్ను స్కూల్లో క్రమశిక్షణ తప్పేలా చేసింది. పదేపదే స్కూల్ టీచర్ల నుంచి కంప్లైంట్ వస్తుండడంతో ట్రంప్ను మిలటరీ స్కూల్కు పంపారు తల్లిదండ్రులు. అక్కడే ట్రంప్కు డిసిప్లెన్ అలవాటైంది. అయితే అదే స్కూల్ ఆయన్ను తల్లిదండ్రుల నుంచి దూరంగా పెరిగేలా చేసింది. అటు తండ్రి ఫ్రెడ్ కూడా చాలా స్ట్రిక్ట్. దీంతో ట్రంప్ బాల్యం ఆంక్షలు మధ్య ఏ మాత్రం స్వేచ్ఛ లేనట్టే గడిచింది.వ్యాపారవేత్తగా..చదువులు పూర్తి చేసిన తర్వాత ట్రంప్ తన తండ్రి లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వెళ్లారు. తండ్రిలా కాకుండా వ్యాపారంలో రిస్క్ చేయాలన్నది ట్రంప్ ఆలోచన. బోల్డ్గా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లిన ట్రంప్ చాలాసార్లు వ్యాపారంలో ఘోరంగా దెబ్బతిన్నారు. 1980లలో విలాసవంతమైన భవనాలు, హోటళ్ళు, కాసినోలలో భారీగా పెట్టుబడి పెట్టారు. అయితే 1990ల ప్రారంభంలో అమెరికాను చుట్టేసిన మాంద్యం ట్రంప్ కు నష్టాలను తెచ్చిపెట్టింది. భారీ అప్పులు ఆయన నెత్తిమీద వచ్చి పడ్డాయి. కొన్నాళ్లపాటు దివాలా అంచు వరకు ఉన్న ట్రంప్ 2000వ సంవత్సరం తర్వాత కోలుకున్నారు. నాడు రియాలిటీ టీవీ షోలలో కనిపించి మెరిశారు. ది అప్రెంటిస్ అనే బిజినెస్ పోటీ షోతో ప్రజలకు దగ్గరయ్యారు . ఈ ప్రొగ్రామ్లో 'యు ఆర్ ఫైర్' అని ట్రంప్ చెప్పే డైలాగ్ నాడు అమెరికాలో మారుమోగింది. ఇలా తనకంటూ ఓ సపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ట్రంప్ మరోసారి విజయవంతమైన వ్యాపారవేత్తగా మారారు. రాజకీయాల్లోనూ..ఇలా 2015 వరకు వివిధ వ్యాపారాల్లో బిజీగా ఉన్న ట్రంప్ అదే సంవత్సరం నుండి ఎవరూ ఊహించని విధంగా రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు.రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని ట్రంప్ చెప్పినప్పుడు అంతా నవ్వారు. పిచ్చోడు ఏదో మాట్లాడుతున్నాడని ఎగతాళి చేసినవారు కూడా ఉన్నారు. అయితే ట్రంప్ ఎవరి మాటలు పట్టించుకోలేదు.. చేయాల్సింది చేశారు.. నామినేషన్ వేయడమే కాదు.. 2016ఎన్నికల్లో గెలిచి అమెరికా 45వ అధ్యక్షుడిగా వైట్ హౌస్ మెట్లెక్కారు. అధ్యక్షుడిగా ఎన్నికయ్యారే కానీ ఎన్నో సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. ఎన్నో వివాదాల్లో ఆయన చిక్కుకున్నారు. వివిధ అంశాల్లో ఆయన విధానాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ విధానాలను మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముస్లిం వ్యతిరేకి అంటూ దుయ్యబట్టాయి. అంతేకాదు అనేకసార్లు నల్లజాతీయులకు వ్యతిరేకంగా విద్వేష వ్యాఖ్యలు చేసిన ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు.ఆయన హయంలోనే ప్రపంచాన్ని కుదిపేసిన జార్జ్ ఫ్లాయిడ్ హత్య జరిగింది.ట్రంప్ పాలనలో పోలీసులు కర్కశంగా వ్యవహరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.అటు NATO మిత్రదేశాలతోనూ అమెరికా సంబంధాలు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే దెబ్బతిన్నాయి. ఓటమి తర్వాత..2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ ఆ తర్వాత మరిన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనంపై ఆయన మద్దతుదారులు దాడి చేయడం, అక్కడి పరిసరాలకు నిప్పు పెట్టడం అమెరికాను ఉలిక్కిపడేలా చేసింది. నాడు ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ట్రంప్ తన సపోర్టర్స్ను ప్రసంగాలతో రెచ్చగొట్టడం కారణంగానే వారంతా విధ్వంసానికి దిగారని నాటి సైనికాధికారులే ప్రకటించారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటెటివ్స్ నుంచి ట్రంప్ అభిశసంనలకు గురవడంతో ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టేనని అంతా భావించారు. అయితే అందరి ఆలోచనలకు తగ్గట్టుగా నడుచుకుంటే ఆయన ట్రంప్ ఎందుకవుతారు.. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేందుకు రెడీ అయ్యారు. పడిలేచిన కెరటంలా..భారీ సంపద, హోదా ఉన్నప్పటికీ ఆయన ఎదుర్కొన్న ఎదురుదెబ్బలు, కిందపడి మళ్లీ లేచి గెలిచిన నైజం ఆయనలోని పోరాటయోధుడిని కళ్లకు కడుతోంది. ఎన్నో కష్టమైన ఆర్థిక, రాజకీయ క్షణాలను ఒంటరిగానే ఎదుర్కొన్న ట్రంప్ వ్యక్తిగతంగానూ ఎన్నో బాధలు పడ్డారు. ట్రంప్ని ఎన్నో అంశాల్లో తిట్టేవారు ఉండొచ్చు కానీ ఆయన్ను మెచ్చుకోకుండా ఉండలేని విషయం ఒకటుంది. ఆయన మందు తాగరు.. అల్కహాల్కు చాలా దూరంగా ఉంటారు. 1981లో తన సోదరుడు అల్కహాల్ అలవాటు కారణంగానే అనారోగ్యంతో చనిపోయాడు. ఇది ట్రంప్ను ఎంతగానో కుంగదీసింది. అందుకే మద్యాన్ని పుచ్చుకోని ట్రంప్ తన తోటివారికి కూడా మందు తాగవద్దని చెబుతుంటారు. అటు ట్రంప్ వైవాహిక జీవితం కూడా ఎన్నో వివాదాలతో ముడిపడి ఉంది. 1990లో మొదటి భార్య ఇవానాతో విడాకులు ట్రంప్ను మానసికంగా కుమిలిపోయేలా చేసింది. అటు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇలా వ్యక్తిగతంగా, రాజకీయపరంగా ఎన్నో కష్టనష్టాలను అనుభవించిన ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా గెలవడాన్ని ఒక ఏడాది ముందు వరకు ఎవరు ఊహించి ఉండరు కూడా. అత్యంత శక్తివంతమైన వ్యక్తులు కూడా తమతో తామే మూసివేసిన తలుపుల లోపల సొంత యుద్ధాలను ఎదుర్కొంటారని చెప్పేందుకే ట్రంప్ జీవితమే ప్రత్యక్ష సాక్ష్యం.. మరి అగ్రరాజ్యపు అధ్యక్షునిగా మున్ముందు ప్రపంచానికి ఎటువంటి దక్షత ప్రదర్శిస్తాడో ఈ మొక్కవోని వ్యాపారి ట్రంప్. తన టెంపరితనంతో ప్రత్యర్ధులకు టెంపరేచర్ పెంచి ఎదురులేని విక్టరీ సాధించిన ట్రంప్ వచ్చే నాలుగేళ్లు ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి:::నాగ త్రినాథ్ బండారు , సాక్షి డిజిటల్ -
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. స్పీకర్ మైక్ జాన్సన్ ప్రకటన
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయమైపోయింది. దీంతో ఆయన రెండోసారిఅ అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కేందుకు సిద్ధమయ్యారు. అమెరికన్ ఓటర్లు.. రిపబ్లికన్ పార్టీ వైపే మొగ్గు చూపారు. దీంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్కు నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో అమెరికా నూతన అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారని యూఎస్ హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించి.. డొనాల్డ్ ట్రంప్, రన్నింగ్మేట్( ఉపాధ్యక్షుడు) జేడీ వాన్స్కి అభినందనలు తెలిపారు.‘‘ మేం అమెరికాను రక్షించాం. రిపబ్లిక్ పార్టీ ఘన విజయంతో..యూఎస్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడిగా సెనేటర్ జేడీ వాన్స్ వైట్ హౌస్కు వెళ్తున్నారు. వారితో కలిసి అమెరికన్ ప్రజల కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని అన్నారు.We have saved America. 🇺🇸The American people have spoken, and President Trump and Senator JD Vance are going to the White House. We are ready to get to work for the American people.— Speaker Mike Johnson (@SpeakerJohnson) November 6, 2024చదవండి: రెండోసారి అధ్యక్ష పీఠంపై డొనాల్డ్ ట్రంప్ : ఇష్టమైన డ్రింక్ ఇదే, క్యాన్ల కొద్దీ! -
కీలక ‘స్వింగ్’లో ట్రంప్ హవా
-
ట్రంప్ విజయంపై మోదీ సహా ప్రపంచ నేతల స్పందన
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయమైపోయింది. దీంతో రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కేందుకు ఆయన సిద్ధమయ్యారు.అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో విజయం సాధించి, మరోసారి బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. చారిత్రాత్మక ఎన్నికల్లో విజయం సాధించిన నా మిత్రుడు ట్రంప్కు హృదయపూర్వక అభినందనలు అని ట్విటర్లో పేర్కొన్నారు.‘మీ గత పదవీకాలంలో సాధించిన విజయాల మాదిరి.. ఈసారి కూడా భారత్, అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మా సహకారాన్ని పునరుద్దరించడానికి ఎదురుచూస్తున్నాను. ఇద్దరం కలిసి ఇరు దేశాల ప్రజల అభివృద్ధికి, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడానికి కృషి చేద్దాం’ అని పేర్కొన్నారు.Heartiest congratulations my friend @realDonaldTrump on your historic election victory. As you build on the successes of your previous term, I look forward to renewing our collaboration to further strengthen the India-US Comprehensive Global and Strategic Partnership. Together,… pic.twitter.com/u5hKPeJ3SY— Narendra Modi (@narendramodi) November 6, 2024అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్కు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు శుభాకాంక్షలు తెలిపారు.‘ గొప్ప పునరాగమనంతో చరిత్ర సృష్టించినందుకు ప్రియమైన డోనాల్డ్, మెలానియా ట్రంప్కు అభినందనలు. యూఎస్ వైట్ హౌస్కు మీరు తిరిగి రావడం అమెరికాకు కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. ఇజ్రాయెల్-యూఎస్ మధ్య శాశ్వతమైన మైత్రిని పునరుద్ఘాటిస్తుంది. ఇది నిజమైన స్నేహానికి అందిన భారీ విజయం’ అని కొనియాడారు.ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్లో డోనాల్డ్ ట్రంప్కు తన అభినందనలు చెప్పారు. యూఎస్తో కలిసి పనిచేసేందుకు, తమ సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ‘ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు శుభాకాంక్షలు. రాబోయే నాలుగు సంవత్సరాలు కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పరస్పర గౌరవం, ఆశయంతో ఇరు దేశాల శాంతి, శ్రేయస్సు కోసం కృషి చేసేందుకు ఎదురు చూస్తున్నా’ అని తెలిపారు.A nome mio e del Governo italiano, le più sincere congratulazioni al Presidente eletto degli Stati Uniti, Donald #Trump.Italia e Stati Uniti sono Nazioni “sorelle”, legate da un’alleanza incrollabile, valori comuni e una storica amicizia.È un legame strategico, che sono certa…— Giorgia Meloni (@GiorgiaMeloni) November 6, 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ను టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ అభినందించారు. తన స్నేహితుడి గెలుపుతో టర్కీ-యూఎస్ సంబంధాలు బలపడతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాంతీయ, ప్రపంచ సంక్షోభాలు, యుద్దాలు, ముఖ్యంగా పాలస్తీనా సమస్య, రాష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.Amerika Birleşik Devletleri’nde yapılan başkanlık seçimini büyük bir mücadelenin ardından kazanarak yeniden ABD Başkanı seçilen dostum Donald Trump’ı tebrik ediyorum.Amerikan halkının seçimiyle başlayacak olan bu yeni dönemde, Türkiye-ABD ilişkilerinin güçlenmesini, Filistin…— Recep Tayyip Erdoğan (@RTErdogan) November 6, 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్కు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అభినందించారు. గత సెప్టెంబర్లో ట్రంప్ను కలుసుకున్న సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఉక్రెయిన్-యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యం, విజయ ప్రణాళిక,ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు ముగింపు పలికే మార్గాల గురించి ఇద్దరూ చర్చించినట్లు తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ను వ్యక్తిగతంగా అభినందించడానికి, యూఎస్తో ఉక్రెయిన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మార్గాలను చర్చించడానికి తాను ఎదురు చూస్తున్నానని తెలిపారు.Congratulations to @realDonaldTrump on his impressive election victory! I recall our great meeting with President Trump back in September, when we discussed in detail the Ukraine-U.S. strategic partnership, the Victory Plan, and ways to put an end to Russian aggression against…— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) November 6, 2024 కాగా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో మెజార్టీ మార్కు 270. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం అధికారాన్ని చేపట్టడానికి కావల్సిన మ్యాజిక్ ఫిగర్కు 266 ట్రంప్ అతి చేరువలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 224 ఎలక్టోరల్ సీట్లను కైవసం చేసుకున్నారు. ట్రంప్ విజయంతో ఓ వైపు రిపబ్లికన్లు సంబరాలు మొదలు పెట్టగా.. కమలాహారిస్ మాత్రం నేటి తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. -
తెలుగింటి అల్లుడిపై ట్రంప్ ప్రశంసలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవిని దాదాపు ఖరారు చేసుకున్న రిపబ్లికన్ పార్టీ అభ్ఘర్థి డొనాల్డ్ ట్రంప్ తమ పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సేన్ జేడీ వాన్స్పై ప్రసంశలు కురిపించారు. ఈయన భార్య ఉషా చిలుకూరి తెలుగు సంతతికి చెందినవారు.ఇప్పటివరకూ వచ్చిన ఫలితాల ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయ పథాన దూసుకుపోతున్నారు. ఫలితాలు వెలువడుతున్న సమయంలో ట్రంప్ ఫ్లోరిడాలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి సేన్ జేడీ వాన్స్ తనకు అనుక్షణం అండగా నిలిచారంటూ ప్రసంశలు కురిపించారు. అలాగే అతని భార్య, తెలుగింటి ఆడపడుచు ఉషా చిలుకురి వాన్స్ను కూడా ట్రంప్ అభినందించారు.జేడీ వాన్స్ భార్య ఉష చిలుకూరి తెలుగు సంతతికి చెందినవారు. గత ఏడాది వరకూ విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేసిన శాంతమ్మ మనుమరాలు ఉషా చిలుకూరి. అమెరికా ఉపాధ్యక్షునిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జేడీ వాన్స్ పేరు ఖరారైన దరిమిలా ఆయన భార్య ఉషా చిలుకూరి పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది.ఉషకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో బంధువులు ఉన్నారు. 90 ఏళ్ల వయస్సులోనూ విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు పలు పరిశోధనలు సాగిస్తున్న ప్రొఫెసర్ శాంతమ్మకు ఉష మనవరాలు అవుతారు. తెలుగు ప్రొఫెసర్గా సేవలు అందించిన శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి కొన్నేళ్ల క్రతమే మృతి చెందారు. సుబ్రహ్మణ్యశాస్త్రి తమ్ముడు రామశాస్త్రి కుమారుడైన రాధాకృష్ణ కుమార్తెనే ఉషా చిలుకూరి. ఇది కూడా చదవండి: మస్క్పై ట్రంప్ ప్రశంసల జల్లు -
కమలా హారిస్ పాటించే ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే..!
యూఎస్ అధ్యక్ష రేసులో నిలిచిన.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఆహార నియామాలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఆమె అనుసరించే డైట్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించేది. ఆమె పాక్షిక శాకాహారి లేదా రోజులో కొద్దిసేపు శాకాహారిగా ఉంటారు అని చెప్పొచ్చు. ఇదేం విచిత్రం అనుకోకండి. ఈ ప్రక్రియను 'ఫ్లెక్సిటేరియన్ డైట్' అని అంటారట. అసలేంటి ఈ డైట్..? ఇది ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో సవివరంగా చూద్దామా..!.కమలా హారిస్ ఫ్లెక్సిటేరియన్ డైట్ను అనుసరిస్తారు. ఈ డైట్ శాకాహారం తినడం వల్ల కలిగే ప్రయోజనాల తోపాటు మితంగా నాన్వెజ్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలను అందించడంలో సహాయపడుతుంది. అందువల్లే ఈ డైట్ని "ఫ్లెక్సిబుల్" "వెజిటేరియన్" అనే పదాల కలయికతో ఫ్లెక్సిటేరియన్ డైట్గా పిలుస్తున్నారు.ఈ డైట్ విధానం..కమలా హారిస్ తరుచుగా శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెబుతుంటారు. అయితే కమలా సాయంత్రం ఆరుగంటలోపు మొక్కల ఆధారిత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఆ తర్వాత నాన్వెజ్ సంబంధిత పదార్థాలను తీసుకుంటారు. ఫ్లెక్సిటేరియన్ డైట్ అంటే..?డైటీషియన్ డాన్ జాక్సన్ బ్లాట్నర్ ఈ ఫ్లెక్సిటేరియన్ డైట్ని రూపొందించారు. దీనిలో స్పష్టమైన నియమాలు లేదా సిఫార్సు చేసిన కేలరీలు, స్థూల పోషకాల సంఖ్యను కలిగి ఉండదు. ఇది కేవలం ఆహారం కంటే ఎక్కువ మన జీవనశైలినే ప్రతిబింబిస్తుంది. అంటే ఈ డైట్లో ఏం తీసుకుంటారంటే..నిపుణల అభిప్రాయం ప్రకారం..పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, తృణధాన్యాలు తీసుకోవడంనాన్వెజ్ కంటే మితమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను చేర్చడంసౌకర్యవంతమైన పద్ధతిలో మితంగా నాన్వెజ్ తీసుకోవడంప్రాసెస్ చేసిన మాంసాలకు దూరంగా ఉండటంస్వీట్లను పరిమితం చేయడం తదితరాలు ఉంటాయి.ఆమె ఈ డైట్లో ఏం తీసుకుంటారంటే..ఉదయం టీలో తేనెను తీసుకుంటారు. బ్రేక్ఫాస్ట్గా బాదం పాలు, ఎండు ద్రాక్ష మాత్రమే తీసుకుంటారు. అంతేగాదు పలు ఇంటర్వ్యూలో బ్రేక్ఫాస్ట్ అస్సలు తీసుకోనని కేవలం బాదంపాల తోపాటు ఏదో ఒక డ్రైఫ్రూట్ తీసుకుంటానని చెప్పారు కూడా. అలా సాయంత్రంలోపు మొక్కల ఆధారిత ఆహారమే తీసుకోగా, రాత్రిపూట మితంగా నాన్వెజ్కి ప్రాధాన్యత ఇస్తారు.ఈ డైట్లో ఉండే ఆహారాలు..ప్రోటీన్లు - సోయాబీన్స్, టోఫు, టెంపే, కాయధాన్యాలుకార్బోహైడ్రేట్స్ లేని కూరగాయలు - బెల్ పెప్పర్స్, బ్రస్సెల్స్ మొలకలు, ఆకుపచ్చ బీన్స్, క్యారెట్లు, కాలీఫ్లవర్కార్బోహైడ్రేట్స్ ఉండే కూరగాయలు - వింటర్ స్క్వాష్, బఠానీలు, మొక్కజొన్న, చిలగడదుంపపండ్లు - యాపిల్స్, నారింజ, బెర్రీలు, ద్రాక్ష, చెర్రీస్తృణధాన్యాలు - క్వినోవా, టెఫ్, బుక్వీట్, ఫార్రోనట్స్: బాదం, అవిసె గింజలు, చియా గింజలు, వాల్నట్లు, జీడిపప్పు, పిస్తాపప్పులు, వేరుశెనగ వెన్న, అవకాడోలు, ఆలివ్లు, కొబ్బరిమొక్కల ఆధారిత పాలు - తియ్యని బాదం, కొబ్బరి, జనపనార, సోయా పాలుపానీయాలు - తగినన్ని నీళ్లు, టీ, కాఫీప్రయోజనాలు:ఫైబర్ తోపాటు ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయిగుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందిమధుమేహం నియంత్రణలో ఉంటుంది.కేన్సర్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గమనికి: ఇది కేవలం అవగాహన కోసమే ఇచ్చిన కథనం. పూర్తి వివరాలకు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించి అనుసరించడం మంచిది.(చదవండి: ఓటర్లతో కనెక్ట్ అవ్వడానికి ఫ్యాషన్ ఉపకరిస్తుందా?) -
ఎలాన్ మస్క్పై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల జల్లు
యూఎస్ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ వీడింది. రిపబ్లికన్ పార్టీ భారీ మెజారిటీతో దూసుకుపోతోంది. దీంతో అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఫ్లోరిడాలో ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తూ.. అధ్యక్ష ఎన్నికలలో టెస్లా అధినేత 'ఎలాన్ మస్క్' ముఖ్యమైన వ్యక్తి అని కొనియాడారు.ఒక స్టార్ ఉంది.. అని మస్క్ గురించి మాట్లాడుతూ.. అతను ఒక మేధావి. మన మేధావులను మనం రక్షించుకోవాలి. అంతే కాకుండా తన సంస్థ స్పేస్ ఎక్స్ ప్రయత్నాలతో అమెరికా అంతరిక్ష రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మస్క్ చేసిన కృషిని కూడా ఈ సందర్భంగా కొనియాడారు.ట్రంప్ ప్రసంగం సమయంలో మస్క్ స్వయంగా ఈవెంట్కు హాజరు కానప్పటికీ.. ఓటింగ్ రోజు వరకు రిపబ్లిక్ అభ్యర్థి ట్రంప్కు మద్దతుగా నిలిచారు. మొత్తానికి ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ ఆశించిన విధంగానే.. ట్రంప్ మరో మారు అమెరికా అధ్యక్ష పదవిని అలంకరించబోతున్నారు.'ట్రంప్'కు మద్దతుగా మస్క్ ఫిలడెల్ఫియా ప్రాంతంలో అక్టోబర్ 17న తొలి వ్యక్తిగత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంతకు ముందు ట్రంప్ పాలనలో చోటు చేసుకున్న ముఖ్యమైన అంశాలను గురించి వెల్లడించారు. అప్పటి నుంచి కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం.. మస్క్ గట్టిగా కృషి చేస్తూనే ఉన్నారు.చదవండి: తెలుగింటి అల్లుడిపై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలుట్రంక్ విజయం కోసం మస్క్ ప్రచారం చేయడం మాత్రమే కాకుండా.. భారీ మొత్తంలో ఎలక్షన్ ఫండ్స్ కూడా సమకూర్చారు. స్వింగ్ రాష్ట్రాల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రైజ్ మనీరూపంలో 100 డాలర్లు ఇస్తామని కూడా ప్రకటించారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికే ఈ ప్రైజ్ మనీ అని డెమోక్రట్లు ఆరోపించారు.జోష్లో ఎలాన్ మస్క్డొనాల్డ్ ట్రంప్ ఘన విజయంతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఫుల్ జోష్లో ఉన్నారు. అమెరికా భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని పేర్కొంటూ.. అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న రాకెట్ ఫొటోను ఎక్స్లో షేర్ చేశారు. అమెరికా ప్రజలు మార్పు కోసం ఓటు వేశారని, డొనాల్డ్ ట్రంప్ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ స్పష్టమైన తీర్పు ఇచ్చారని మస్క్ వ్యాఖ్యానించారు. The future is gonna be fantastic pic.twitter.com/I46tFsHxs3— Elon Musk (@elonmusk) November 6, 2024 -
చరిత్రలో లేని గెలుపు: ఫలితాలపై స్పందించిన ట్రంప్
ఫ్లోరిడా: అమెరికా ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించలేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ దూసుకుపోతున్న సందర్భంగా ఫ్లోరిడాలో బుధవారం(నవంబర్ 6) ట్రంప్ తన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ట్రంప్ మాట్లాడుతుండగా ఆయన అభిమానులు ట్రంప్..ట్రంప్ నినాదాలతో హోరెత్తించారు. తన గెలుపు అమెరికాకు ఉపయోగమని ఈ సందర్భంగా ట్రంప్ చెప్పారు. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికన్లకు సువర్ణయుగం రాబోతోందన్నారు. రిపబ్లికన్లకు 300కుపైగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. పాపులర్ ఓట్లు కూడా మాకే ఎక్కువ వచ్చాయి. ఇక అమెరికాలోకి అక్రమ వలసలు ఉండవు. అందరూ చట్టబద్ధంగానే రావాల్సి ఉంటుంది. సరిహద్దులు మూసివేస్తా. అక్రమ వలసలు అడ్డుకుంటాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తా.‘నా విజయంలో నా వెన్నంటి ఉన్న నా కుటుంబానికి కృతజ్ఞతలు. ఇది మొత్తం అమెరికన్లు గర్వించే విజయం. వైఎస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా చిలుకూరి బాగా పనిచేశారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా వాన్స్ ఎంపిక సరైనదేనని తేలింది. తొలుత వాన్స్ ఎంపికపై వ్యతిరేకత వచ్చింది.’అని ట్రంప్ గుర్తు చేశారు. ట్రంప్ ప్రసంగించిన వేదికపైనే ట్రంప్ కుటుంబ సభ్యులతో పాటు ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ కూడా ఉన్నారు.#WATCH | West Palm Beach, Florida | Republican presidential candidate #DonaldTrump says, "...This is a movement that nobody has ever seen before. Frankly, this was, I believe, the greatest political movement of all time. There has never been anything like this in this country and… pic.twitter.com/MEcRDSAI72— ANI (@ANI) November 6, 2024 ఇదీ చదవండి: అమెరికా ఎన్నికల ఫలితాల అప్డేట్స్ -
Watch Live: ట్రంప్ విక్టరీ స్పీచ్
-
అమెరికా ‘ఫలితాలు’ ఎలా ఉన్నా భారత్తో వీడని బంధం
కాన్బెర్రా: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అమెరికా అధ్యక్షపీఠం అధిరోహించిన ఐదుగురు అధ్యక్షుల పాలనాకాలంలో భారత్.. అమెరికాతో సంబంధాల విషయంలో స్థిరమైన పురోగతిని చూసిందని అన్నారు.ప్రస్తుత అమెరికా ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ యుఎస్ఏతో భారత్ సంబంధాలు బలంగా ఉంటాయని జైశంకర్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో భారత విదేశాంగ మంత్రి, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీవాంగ్లో సంయుక్త విలేకరుల సమావేశంలో జైశంకర్ ఒక ప్రశ్నకు ప్రతిస్పందనగా యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్తో సహా క్వాడ్ దేశాలతో భారత్ సంబంధాలు బలంగా ఉంటాయన్నారు.రిపబ్లికన్ నేత, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో గెలవడంపై ఏమైనా ఆందోళన ఉందా? దీనికారణంగా క్వాడ్పై ఏ మేరకు ప్రభావం ఉండబోతుందని విలేకరులు అడగగా జైశంకర్ సమాధానమిస్తూ గత ఐదుగురు అధ్యక్షుల పదవీకాలంలో యూఎస్తో భారత్ సంబంధాలలో స్థిరమైన పురోగతిని చూశాం. దీనిలో డోనల్ట్ ట్రంప్ అధ్యక్షుని పదవీకాలం కూడా ఉన్నదన్నారు. అందుకే అమెరికా ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా భారత్తో సంబంధాలు బలంగా ఉంటాయని నమ్ముతున్నామన్నారు.ఇక క్వాడ్ విషయానికొస్తే 2017లో ట్రంప్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు క్వాడ్ పునరుద్ధరణ జరిగిందన్నారు. అప్పుడు అది శాశ్వత కార్యదర్శి స్థాయి నుండి మంత్రి స్థాయికి బదిలీ అయ్యిందన్నారు. యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఇండియా, ఆస్ట్రేలియాలు 2017లో ఇండో-పసిఫిక్ భూ భాగంలో చైనా దూకుడును ఎదుర్కొనేందుకు ప్రణాళికను రూపొందించాయన్నారు. ఇది కూడా చదవండి: డెమోక్రాట్లలో నిరాశ.. కమల ప్రసంగం రద్దు..! -
యూఎస్ కాంగ్రెస్లోనూ రిపబ్లికన్ల హవా..సెనేట్పై పట్టు..!
వాషింగ్టన్:అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ల గాలి వీచింది. అధ్యక్ష ఎన్నికలతో పాటు అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లోనూ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ సత్తా చాటింది. ఈసారి ఎన్నికల్లో సెనేట్లో మెజార్టీకి అవసరమైన సీట్లు రిపబ్లికన్ పార్టీకి లభించాయి.మరోవైపు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో కూడా రిపబ్లికన్ పార్టీ ముందంజలో ఉంది. మొత్తం 100 సీట్లు ఉన్న సెనెట్లో 34 స్థానాలకు మంగళవారం(నవంబర్ 5) ఎన్నికలు జరిగాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ఆధారంగా సెనేట్లో డెమోక్రట్లకు ఉన్న ఒక సీటు మెజార్టీ కూడా పోయింది. తాజాగా సెనేట్లో రిపబ్లికన్లకు 51 మంది డెమోక్రట్లకు 42 మంది సభ్యులున్నారు.మరో 7 స్థానాలకు ఫలితాలు వెలువడాల్సి ఉంది.సెనేట్లో మెజారిటీతో కొత్త ప్రభుత్వంలో కీలక అధికారుల నియామకాలు, సుప్రీంకోర్టు జడ్జిల నియామకంలో రిపబ్లికన్లకు పట్టు లభించనుంది.ఇక 435 స్థానాలున్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో రిపబ్లికన్లకు 183 సీట్లు లభించాయి. దీంతో ఈసారి ట్రంప్ అధ్యక్ష పదవి గనుక చేపడితే ఆయనకు కాంగ్రెస్ నుంచి పెద్ద అడ్డంకులేవీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: డెమోక్రాట్లలో నిరాశ.. కమల ప్రసంగం రద్దు -
డెమోక్రాట్లలో నిరాశ.. కమల ప్రసంగం రద్దు..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు ట్రంప్ తొలినుంచి హావా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రెండు కీలక స్వింగ్ స్టేట్స్ నార్త్ కరోలినా, జార్జియాలో విజయం సాధించి మరో నాలుగింటిలో లీడ్లో ఉన్నారు. దీంతో ట్రంప్ గెలుపు ఖాయమన్న భావన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఇటు రిపబ్లికన్లలో జోష్ నెలకొనగా అటు డెమోక్రాట్లు నిరాశలో మునిగిపోయారు. ట్రంప్ బుధవారం ఫ్లోరిడాలో తన అభిమానులనుద్దేశించి ప్రసంగించనుండగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ మాత్రం బుధవారం తన షెడ్యూల్ను రద్దు చేసుకున్నారు. నిజానికి బుధవారం ఉదయం ఆమె హవర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించాల్సి ఉంది. ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోవడంతో ఆమె తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కీలక ‘స్వింగ్’లో ట్రంప్ హవా.. -
రికార్డు: తొలిసారి అమెరికా సెనేట్కు ట్రాన్స్జెండర్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలతో పాటు అమెరికాలో కాంగ్రెస్ ఎన్నికల రిజల్ట్స్ కూడా బుధవారం(నవంబర్ 6) వెలువడుతున్నాయి. డెలవేర్లోని ఎట్ లార్జ్హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి సెనేట్కు డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసిన ట్రాన్స్జెండర్ సారా మెక్బ్రైడ్ విజయం సాధించారు.దీంతో సారా అమెరికా కాంగ్రెస్కు ఎన్నికైన తొలి ట్రాన్స్జెండర్గా రికార్డులకెక్కారు.రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ వేలెన్ 3తో,సారా మెక్బ్రైడ్ పోటీపడ్డారు.ఈ ఎన్నికలో సారాకు 95శాతం ఓట్లు పోలవగా వేలెన్కు 57.9 శాతం ఓట్లు పోలయ్యాయి.తాను ట్రాన్స్జెండర్గా చరిత్ర సృష్టించడానికి పోటీ పడలేదని డెలవేర్లో మార్పు కోసమే పోటీ చేసినట్లు సారా పేర్కొన్నారు.కాగా,సారా మెక్ బ్రైడ్ ఎల్జీబీటీక్యూ జాతీయ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు.ఎన్నికల సమయంలో దాదాపు 3 మిలియన్ల డాలర్లకుపైగా ప్రచార విరాళాలు సేకరించారు. 2010 నుంచి డెలవేర్ డెమోక్రాట్లకు కంచుకోటగా ఉంది.ఇదీ చదవండి: అమెరికా ఎన్నికలు.. సుహాస్ సుబ్రమణ్యం సరికొత్త రికార్డు -
ఓటర్లతో కనెక్ట్ అవ్వడానికి ఫ్యాషన్ ఉపకరిస్తుందా?
యూఎస్లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. డెమొక్రాటిక్ పార్టీ నేత కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరిలో ఎవరిది పైచేయి అనేది కొద్ది క్షణాల్లో తెలుస్తుంది. ఈ సందర్భంగా ఇరువురి అభ్యర్థుల ప్రచార వ్యూహం ఎలా ఉన్నా..వారి ఐకానిక్ ఫ్యాషన్ స్టైల్ ఎంతవరకు ఓటర్లను ఆకర్షించింది?. ప్రజలకు కనెక్ట్ అయ్యేలా ఈ ఇరువురు ఎలాంటి స్టైల్ని ఎంచుకున్నారు తదితరాల గురించి తెలుసుకుందామా..!ఫ్యాషన్ రాజకీయాలు వేర్వేరు అనుకుంటే పొరబాటే. ఈ రోజుల్లో నాయకుల ఫ్యాషన్ శైలి కూడా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న అంశంగా మారింది. అమెరికాలో ఉత్కంఠభరితమైన అధ్యక్ష పోలింగ్ వేళ..ఇరువురు తమ ఐకానిక్ ఫ్యాషన్ స్టైల్తో ఓటర్లను తమదైన పంథాలో ప్రభావితం చేసేలా యత్నించారు. ఆ నాయకులిద్దరూ తాము ధరించే దుస్తులతో తాము ప్రజల మనిషి అని పరోక్షంగా తెలియజేశారు. వారి భావజాలంతో కంటే తమ ఫ్యాషన్శైలితోనే ఓటర్లకు కనెక్ట్ అయ్యారు. అదెలాగో సవివరంగా చూద్దామా..!.కమలా హారిస్ క్లాసిక్ అండ్ టైలర్డ్ స్టైల్..డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ చాలా కాలంగా సిగ్నేచర్ సిల్హౌట్ ఫ్యాషన్కి కట్టుబడి ఉన్నారు. తన వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తెలియజేసేలా శక్తిమంతమైన సూట్లు, ఫ్యాంట్లు ఎంపిక చేసుకుంది. టైలర్డ్ ప్యాంట్సూట్లతో ప్రజలకు మరింత చేరవయ్యింది. అంతేగాదు ఆమె ధరించి షోల్డర్ ప్యాడ్లు ఓటర్లకు భరోసా ఇచ్చేలా ఉంటుంది. స్థిరత్వమైన నిర్ణయాలకు ప్రతీక అని చాటి చెప్పేలా కమలా ఆహార్యం ఉంటుంది. అలాగే కమలా ధరించే సూట్కి పిన్ చేసి ఉన్న ఫ్లాగ్ ఆమె దేశభక్తిని చాటి చెబుతోంది. ముఖ్యంగా ఆమె ధరించే ముత్యాలకు సంబంధించిన టూ-స్ట్రాండ్ ఐరీన్ న్యూవిర్త్ నెక్లెస్ ప్రశాంతతకు పెద్దపీట వేసే మనిషి అని చెప్పకనే చెబుతోంది. View this post on Instagram A post shared by Kamala Harris (@kamalaharris)డొనాల్డ్ ట్రంప్ బోల్డ్ అండ్ బ్రష్ ఎంపికలు..డొనాల్డ్ ట్రంప్ ధైర్యసాహసాలను చూపించేలా డార్క్ కలర్ బ్లూ సూట్లను, ఎరుపు టైని ధరిస్తారు. ఆ ఆహార్యంతో డొనాల్డ్ తరుచుగా నెట్టింట వైరల్ అవుతుంటారు కూడా. పెన్సిల్వేనియా ప్రచార ర్యాలీలో బూడిదరంగు మెక్డొనాల్డ్ ఆప్రాన్తో ఆకట్టుకున్నారు. విస్కాన్సిన్లో అతని ఫ్లోరోసెంట్-నారింజ ట్రాష్ ప్రజల సమస్యకు సత్వరమే స్పందించే వ్యక్తిగా ప్రతిబింబించింది. View this post on Instagram A post shared by President Donald J. Trump (@realdonaldtrump)ఈ ఇద్దరు నాయకుల వార్డ్రోబ్లు మాటలతో పనిలేకుండా వారేంటి అనేది ప్రజలకు పరోక్షంగా తెలియజేశాయి. తమదైన భావజాలం, ఆహార్యంతో ఓటర్లకు కనెక్ట్ అయ్యేలా ప్రయత్నం చేశారు ఇరువురు. మరి ఇద్దరిలో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే..!(చదవండి: భారతీయ వంటకాలపై రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి పొగడ్తల జల్లు..!) -
‘ఉత్తరప్రదేశ్’లో గెలిస్తేనే అమెరికా అధ్యక్ష పదవి?
న్యూఢిల్లీ: భారతదేశంలో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడల్లా అందరి దృష్టి ఉత్తరప్రదేశ్వైపు మళ్లుతుంది. దీనికి కారణం మన దేశంలో అత్యధికంగా లోక్సభ సీట్లు(80) ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. దీంతో ఈ రాష్ట్రంలో మెరుగైన పరితీరు కనబరిస్తే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సులభమవుతుంది.మన ఉత్తరప్రదేశ్ మాదిరిగానే అమెరికాలోనూ అలాంటి ఒక రాష్ట్రం ఉంది. అక్కడున్న సీట్ల సంఖ్య ఆధారంగా దీనిని మన ఉత్తర ప్రదేశ్తో పోల్చవచ్చు. అదే కాలిఫోర్నియా రాష్ట్రం. ఇక్కడ గరిష్టంగా 54 ఎలక్ట్రోరల్ కాలేజీలున్నాయి. ఇక్కడే ట్రంప్ పార్టీ గెలుస్తుందా? లేదా కమలా హారిస్ గెలుస్తారా అనేది తేలిపోతుంది. అమెరికాలోని ఈ ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీ సత్తా చాటుతుందో ఆ పార్టీకి చెందిన అభ్యర్థి అధ్యక్షుడయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి.అమెరికాలో ఏడు స్వింగ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడి ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతారనేది స్పష్టంగా ఎవరూ అంచనా వేయలేరు. ఈ జాబితాలో పెన్సెల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్, జార్జియా, నెవాడా, అరిజోనా, నార్త్ కరోలినా ఉన్నాయి. ఎన్నికల ఫలితాల్లో తాజా సమాచారం ప్రకారం రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉన్నారు. ఇది కూడా చదవండి: కీలక ‘స్వింగ్’లో ట్రంప్ లీడ్..నార్త్ కరోలినాలో గెలుపు -
అమెరికా ఎన్నికలు.. సుహాస్ సుబ్రమణ్యం సరికొత్త రికార్డు
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల ఫలితాల్లో భారతీయ అమెరికన్లు సత్తా చాటుతున్నారు. భారత సంతతికి చెందిన సుహాస్ సుబ్రమణ్యం ప్రతినిధుల సభకు గెలుపొందారు. వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ తరఫున గెలుపొందారు. వర్టీజినియా నుంచి ప్రతినిధుల సభకు గెలిచిన తొలి ఇండియన్ అమెరికన్గా సుహాస్ సుబ్రమణ్యం సరికొత్త రికార్డు సృష్టించారు.గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో సాంకేతిక విధాన సలహాదారుగా సుబ్రహ్మణ్యం పనిచేశారు. 2020లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ ఎన్నికల్లో వర్జీనియా సెనేట్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వర్జీనియా నుంచే గెలుపొంది ప్రతినిధుల సభకు వెళుతున్నారు. ఇదీ చదవండి: ఇల్లినోయిస్ నుంచి రాజాకృష్ణమూర్తి గెలుపు -
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై పబ్లిక్ టాక్
-
కీలక ‘స్వింగ్’లో ట్రంప్ హవా.. రెండు స్టేట్స్లో గెలుపు
వాషింగ్టన్:అమెరికా ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ లీడ్లో ఉన్నారు. అయితే తుది ఫలితాన్ని డిసైడ్ చేసే స్వింగ్ స్టేట్లలో మాత్రం ట్రంప్,కమల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఇప్పటివరకు ఈ స్టేట్లలో కీలకమైన నార్త్ కరోలినాతో పాటు జార్జియాలను ట్రంప్ కైవసం చేసుకున్నారు. ఇది కాకుండా విస్కాన్సిన్, అరిజోనా, పెన్సిల్వేనియా, మిచిగాన్లలో ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. కీలక పెన్సిల్వేనియాలో మాత్రం కమల లీడ్లో ఉన్నట్లు ట్రెండ్స్ చెబుతున్నాయి. స్వింగ్ స్టేట్స్ కాకుండా ఎలక్టోరల్ ఓట్లు అధికంగా ఉన్న కాలిఫోర్నియా(54)ను కమల తన ఖాతాలో వేసుకోగా టెక్సాస్(40) ఓట్లను ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు.ఇదీ చదవండి: హారిస్, ట్రంప్ హోరాహోరీ -
పెన్సిలేనియాలో గెలిస్తేనే అసలైన విజయం
-
అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై లిచ్ట్మన్ జోస్యం వైరల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, కమలా హారిస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. గెలిచిన అభ్యర్థి తదుపరి నాలుగేళ్ల పాటు అమెరికాను పరిపాలించనున్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్రంప్, హారిస్ మధ్య ఉత్కంఠభరితమైన పోటీ కనిపిస్తోంది. ఇదే సందర్భంలో ఎన్నికల ఫలితాలపై అమెరికాకు చెందిన నోస్ట్రాడమస్ అలాన్ లిచ్ట్మన్ జోస్యం ఇప్పుడు వైరల్గా మారింది.లిచ్ట్మన్ అమెరికన్ రచయిత. అలాగే భవిష్యత్ రాజకీయాలు గురించి కూడా ఊహించి చెబుతుంటారు. ఇప్పడు ఆయన అమెరికాకు కాబోయే అధ్యక్షులెవరనే దానిపై తన అంచనాలు చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ను కమలా హారిస్ ఓడిస్తారని అలాన్ లిచ్ట్మన్ జోస్యం చెప్పారు. ఒక మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ ఈ జోస్యం చెప్పారు. అలాగే ఒపీనియన్ పోల్ డేటాను తప్పుబట్టారు.కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలు కానున్నారని లిచ్ట్మన్ అన్నారు. ఆఫ్రికన్-ఆసియన్ సంతతికి చెందిన మహిళ అధ్యక్షురాలు కాబోతున్నదని ఆయన తెలిపారు. గత 40 సంవత్సరాలుగా అమెరికా అధ్యక్షుల ఎన్నికపై లిచ్ట్మన్ చెప్పిన అంచనాలు నిజమవుతూ వచ్చాయని పలువురు అంటారు. 2016లో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని తాను ముందే అంచనా వేశానని, అలాగే హిల్లరీ క్లింటన్ విజయాన్ని కూడా అంచనా వేయగలిగానని లిచ్ట్మన్ తెలిపారు. అయితే ఒక్కోసారి తన అంచనాలు తప్పు కావచ్చని, తాను కూడా మనిషినేని, అందుకే తప్పులు జరగవచ్చని అన్నారు. అయితే ఇప్పుటి వరకూ తన అంచనాలు ఏనాడూ తప్పలేదన్నారు. ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికల ఫలితాలు విడుదల : ఆధిక్యంలో ట్రంప్ -
లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:18 గంటలకు సెన్సెక్స్ 97.18 పాయింట్లు లేదా 0.12 శాతం లాభంతో 79,573.81 వద్ద, నిఫ్టీ 34.85 పాయింట్లు లేదా 0.14 శాతం లాభంతో 24,279.70 వద్ద ముందుకు సాగుతున్నాయి.టాప్ గెయినర్స్ జాబితాలో అపోలో హాస్పిటల్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్, డీఎల్ఎఫ్ లిమిటెడ్ వంటి కంపెనీలు చేరాయి. టైటాన్ కంపెనీ, హిందాల్కో, టాటా స్టీల్, టాటా మోటార్స్, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, నేషనల్ అల్యూమినియం కంపెనీ, మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ మొదలైన కంపెనీలు నష్టాల బాట పట్టాయి.యూఎస్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో డోజోన్స్, నాస్డాక్ సూచీలు లాభాల్లో సాగుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న 'ట్రంప్' షేర్స్ ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. జపాన్, సౌత్ కొరియా మార్కెట్లు సైతం లాభాల్లోనే సాగుతున్నాయి. అమెరికా ఎన్నికల ఫలితాలు త్వరలోనే వెల్లడికానున్న సమయంలో స్టాక్ మార్కెట్ జోరందుకుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఇల్లినోయిస్ నుంచి రాజాకృష్ణమూర్తి గెలుపు
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో విజయం సాధించారు. ఇల్లినోయిస్ 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఆయన డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రత్యర్థి మార్క్ రిక్ను దాదాపు 30 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. 2016లో తొలిసారి ఆయన అక్కడినుంచి ప్రతినిధుల సభకు వెళ్లారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న కృష్ణమూర్తి ఇల్లినోయిస్లో పలు పదవులు నిర్వహించారు. కాగా, ఇల్లినోయిస్లో డెమోక్రటిక్ పార్టీ హవా కొనసాగింది. మొదటినుంచి కమలకు బలమైన అండగా రాష్ట్రం నిలబడింది. దీనిలో ఆమె విజయం సాధించినట్లు సమాచారం. ఇదీ చదవండి: కమలాహారిస్ గ్రామంలో ఉత్సవ వాతావరణం -
కమలా హారిస్ స్వగ్రామంలో ఉత్సవ వాతావరణం
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. హారిస్ స్వగ్రామమైన తమిళనాడులోని తులసేంద్రపురంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ఓడించి కమలా హారిస్ విజయం సాధించాలని గ్రామస్తులు శ్రీ ధర్మ సంస్థ ఆలయంలో ప్రార్థనలు చేశారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ విజయం సాధించాలని కమలా హారిస్ స్వగ్రామ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.తిరువారూరు జిల్లా తులసేంద్రపురం గ్రామంలో ఎక్కడ చూసినా జనంలో ఉత్సాహం కనిపిస్తోంది.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విజయం సాధించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.గ్రామస్తులు కమలా మారిస్ చిత్రంతో కూడిన భారీ బ్యానర్ను ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్పై కమలకు అభినందనలు తెలియజేశారు.తులసేంద్రపురం కమల తాత, భారత మాజీ దౌత్యవేత్త పివి గోపాలన్ పూర్వీకుల గ్రామంకమల తల్లి శ్యామల మాజీ భారత దౌత్యవేత్త గోపాలన్ కుమార్తె.ఆగస్టు 2020లో కమల డెమోక్రటిక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా నామినేట్ అయినప్పుడు ఈ గ్రామం వెలుగులోకి వచ్చింది.ఆ ఏడాది ఆమె సాధించిన విజయానికి గ్రామంలో సంబరాలు జరుపుకున్నారుశ్రీ ధర్మ సంస్థ ఆలయంలోని మూలదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ ఆలయంలోని మూల దేవతలు కమల పూర్వీకుల కుల దేవతలు.మదురైలోనూ కమల విజయం కోరుతూ ప్రార్థనలు జరిగాయి. ఆధ్యాత్మిక సంస్థ అనుషానతిన్ నవంబర్ 4న ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది.కమల ఎన్నికల్లో గెలిస్తే జిల్లాలోని పంగనాడు గ్రామ నేతు పేదలకు ‘అన్నదానం’ ఏర్పాటు చేయనున్నారు.కమల తాత గోపాలన్ ఈ గ్రామంలోనే జన్మించారు. ఆయన శ్రీ ధర్మ సంస్థ మందిరానికి సుమారు లక్ష రూపాయల విరాళం ఇచ్చారు.అమెరికా వ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్లు ప్రీ-పోల్ ఓటింగ్ కింద ఇప్పటికే ఓటు వేశారు.యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా ఎలక్షన్స్ ల్యాబ్ డేటా ప్రకారం, సోమవారం రాత్రి నాటికి 82 మిలియన్లకు పైగా ఓటర్లు ఓట్లు వేశారు.2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు బుధవారం తెల్లవారుజామున (స్థానిక కాలమానం ప్రకారం), మంగళవారం పోలింగ్ ముగిసిన కొద్ది గంటలకే రావచ్చు లేదా దీనికి రోజులు, వారాలు లేదా నెల రోజులు పట్టే అవకాశాలున్నాయి.2000లో జరిగిన అమెరికా ఎన్నికల్లో ఫలితాలు చాలా ఆలస్యంగా వచ్చాయి. తదుపరి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు బుష్ ఎన్నిక కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. నవంబర్ 7న ఓటింగ్ ముగిసి, డిసెంబర్ 12న ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి.2020లో ఫలితాలు రావడానికి చాలా సమయం పట్టింది. ఓటింగ్ నవంబర్ 3 సాయంత్రం ముగిసింది, అయితే పెన్సిల్వేనియాలోని 19 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కించేందుకు నవంబర్ 7 వరకు వేచి ఉండాల్సి వచ్చింది.ఇది కూడా చదవండి: అమెరికా ఎన్నికల ఫలితాలు విడుదల : ఆధిక్యంలో ట్రంప్ -
భారీ లాభాల్లో అమెరికా స్టాక్ మార్కెట్లు
-
ఆసియా స్టాక్ మార్కెట్లలో జోష్: ఒక్కసారిగా పెరిగిన ట్రంప్ షేర్స్
అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా దూసుకెళ్తున్నాయి. డోజోన్స్, నాస్డాక్ సూచీలు లాభాల్లో సాగుతున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న 'ట్రంప్' షేర్స్ ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. జపాన్, సౌత్ కొరియా మార్కెట్లు సైతం లాభాల్లోనే సాగుతున్నాయి.ప్రారంభ ట్రేడ్లో జపాన్ నిక్కీ 263.50 పాయింట్లు లేదా 0.68 శాతం పెరిగి 38,843.50 వద్ద ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియా ఎస్&పీ/ఏఎస్ఎక్స్200.. 67.90 పాయింట్లు లేదా 0.83 శాతం పెరిగి 8,200.90 వద్ద ఉంది. దక్షిణ కొరియా కోస్పి 4.05 పాయింట్లు లేదా 0.16 శాతం పురోగమించి 2,581.57 వద్దకు చేరుకుంది.అమెరికా ఎన్నికలు ముగియడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్లు లాభపడ్డాయి. ఓవర్నైట్ ట్రేడ్లో.. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 427.28 పాయింట్లు లేదా 1.02 శాతం పెరిగి 42,221.88 వద్ద ఉంది. ఎస్&పీ 500 ఇండెక్స్ కూడా 70.07 పాయింట్లు లేదా 1.23 శాతం పెరిగి 5,782.76 వద్దకు చేరుకుంది. గిఫ్ట్ నిఫ్టీ.. ఒక రోజు స్మార్ట్ రికవరీ తర్వాత దేశీయ స్టాక్ సూచీలు ఎలా రాణిస్తాయనే దానిపై అందరి దృష్టి ఉంది.ఎన్నికల ఫలితాలు అమెరికాకు ఎగుమతి చేసే ఐటీ అండ్ ఫార్మా వంటి అనేక దేశీయ రంగాల దృక్పథాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా యూఎస్ ప్రభుత్వ విధానాలు ఆటో, బ్యాంకింగ్, రక్షణ, చమురు & గ్యాస్తో సహా అనేక ఇతర రంగాలను ప్రభావితం చేయవచ్చని తెలుస్తోంది. -
ఎన్నికల్లో మస్క్ దుష్ప్రచారం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తప్పుడు సమాచారాన్ని, తప్పుదోవ పట్టించే కథనాలను ఎక్స్, సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ వ్యాప్తి చేసినట్టు ఓ అధ్యయనం తెలిపింది. కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో అవి బాగా ప్రభావం చూపినట్టు వెల్లడించింది. అమెరికా ఎన్నికలకు సంబంధించి తప్పుడు సమాచారంపై అధ్యయన ఫలితాలను సెంటర్ ఫర్ కౌంటరింగ్ డిజిటల్ హేట్ వెల్లడించింది. ‘‘తప్పుడు సమాచార వ్యాప్తికి మస్క్, ఎక్స్ ముఖ్య కేంద్రాలుగా మారినట్టు గుర్తించాం. ఎన్నికలపై మస్క్ తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఏడాది పొడవునా ఎక్స్లో ఏకంగా 200 కోట్ల వ్యూస్ సాధించడం ఆశ్చర్యకరం. స్వింగ్ రాష్ట్రాల్లో వీటి వ్యాప్తిలో ఎక్స్ పాత్ర ఎక్కువగా ఉంది’’అని పేర్కొంది. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మస్క్ బాహాటంగా మద్దతు ప్రకటించడం తెలిసిందే. మస్్కకు ఎక్స్లో ఏకంగా 20.3 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. తాజా అధ్యయనం ప్రకారం ఈ ఏడాది మస్క్ పెట్టిన 87 పోస్టులు అమెరికా ఎన్నికల కంటెంట్ను ప్రచారం చేశాయి. ఇవి 200 కోట్ల వ్యూస్ సాధించాయి. వీటిని తప్పుదోవ పట్టించేవిగా ఫ్యాక్ట్ చెకర్స్ గుర్తించారు. స్వింగ్ రాష్ట్రాల్లో కీలకమైన పెన్సిల్వేనియాలో ఈ కథనాలు బాగా ప్రభావం చూపాయి. -
అమెరికా పోలింగ్.. మస్క్కు గూగుల్ క్లారిటీ
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల పోలింగ్ సందర్భంగా విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ రోజు టెక్ దిగ్గజం గూగుల్పై టెస్లా అధినేత, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ గట్టి మద్దతుదారు ఇలాన్ మస్క్ ఎక్స్(ట్విటర్)లో ఫిర్యాదు చేశారు. ట్రంప్కు ఎక్కడ ఓటేయ్యాలి(వేర్ టు ఓట్ ట్రంప్) అని గూగుల్ సెర్చ్ ఇంజిన్లో టైప్ చేస్తే హారిస్ అని చూపిస్తోందని రిపబ్లికన్ మద్దతుదారులు చేసిన పోస్టును మస్క్ రీపోస్టు చేశారు.Are others seeing this too? https://t.co/mlwRY08hgo— Elon Musk (@elonmusk) November 5, 2024గూగుల్ కమలాహారిస్కు కావాలనే మద్దతిస్తోందని రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు ఆరోపించారు. ఈ విషయమై సోషల్మీడియాలో పోస్టులతో హోరెత్తించారు. గూగుల్పై దుమ్మెత్తిపోశారు. దీంతో గూగుల్ కంపెనీ స్పందించింది.టెక్సాస్లో ఒక కౌంటీ పేరు హారిస్ అవడం వల్లే సెర్చ్ ఇంజిన్ అలా చూపిస్తోందని,హారిస్ కౌంటీలోనూ ఒక పోలింగ్ కేంద్రం ఉందని క్లారిటీ ఇచ్చింది.ఈ లొకేషన్లో ఓటు వేయాలని సెర్చ్ ఇంజిన్ చూపిస్తోందని గూగుల్ తెలిపింది. క్లారిటీ ఇచ్చినందుకుగాను గూగుల్కు మస్క్ థ్యాంక్స్ చెప్పారు.Thanks for the clarification https://t.co/JReZUGiWF8— Elon Musk (@elonmusk) November 5, 2024 ఇదీ చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఎగ్జిట్పోల్స్లో ట్విస్ట్ -
Watch Live: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు.. ప్రత్యక్ష ప్రసారం
-
కమల పూర్వీకుల గ్రామంలో సందడి
కమలా హారిస్ పూర్వీకుల గ్రామం తమిళనాడులోని మన్నార్గుడి జిల్లా తులసేంద్రపురంలో సందడి నెలకొంది. మంగళవారం స్థానిక ధర్మ శాస్త శ్రీ కేశవ పెరుమాళ్ ఆలయంలో జరిగిన అభిషేకం, అర్చన కార్యక్రమాల్లో అమెరికా, యూకేల నుంచి వచి్చన ముగ్గురు మహిళా అభిమానులు పాల్గొనడం విశేషం. వీరిని చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీరిలో ఒకరు అమెరికాలోని లాస్వెగాస్ నుంచి వచ్చినట్లు తెలిపారు. కమలా హారిస్ గెలవాలని కోరుకుంటున్నామన్నారు. ఈ ఆలయ దేవత కమల తాత గోపాలన్ కుటుంబం కుల దైవమని ఆలయ పూజారి సెంథిల్ కుమార్ తెలిపారు. గోపాలన్ కుటుంబ సభ్యులు గతంలో ఆలయానికి రూ.లక్ష విరాళమిచ్చారంటూ అక్కడి శిలా ఫలకంపైన పేర్లను చూపించారు. 2014లో కమలా హారిస్ పేరిట జరిగిన కుంభాభిషేకం కోసం రూ.5 వేలు ఇచ్చారన్నారు. గోపాలన్ కుటుంబ సభ్యులెవరూ ప్రస్తుతం గ్రామంలో ఉండటం లేదన్నారు. గోపాలన్ బ్రిటిష్ ప్రభుత్వంలో అధికారిగా పనిచేశారు. ఆయన కుమార్తె శ్యామలే కమల తల్లి. 2021లో కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలయ్యారు. ఆ సమయంలో కమల కోసం ఆమె పిన్ని, శ్యామల చెల్లెలు చిట్టి ఇదే ఆలయంలో పూజలు చేశారని పూజారి సెంథిల్ కుమార్ చెప్పారు. అమెరికా అధ్యక్షురాలిగా కమల గెలిస్తే ఊళ్లో అన్నదానం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక కౌన్సిలర్ అరుల్ మోళి తెలిపారు. -
అమెరికాలో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు (ఫొటోలు)
-
అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఎగ్జిట్పోల్స్లో ట్విస్ట్!
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా ఉన్నాయి. ఇద్దరు అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారీస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇక, ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్పోల్స్ ఇంకా ఆసక్తికరంగా మారాయి.👉కాగా, అమెరికా దేశ పరిస్థితులపై 70 శాతం మంది ఓటర్లు తాము నిరాశాజనకంగా ఉన్నామని చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో ఇద్దరు అభ్యర్థులకు స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడం విశేషం. దీంతో, గెలుపు ఎవరిది అనే అంశంపై ఎగ్జిట్ పోల్స్ స్పష్టమైన వివరాలను వెల్లడించలేదు.👉ఇక, ఎన్నికలపై ఫస్ట్ వేవ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. అమెరికన్ ప్రజలు దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు సర్వే సంస్థలు వెల్లడించాయి.👉ఎన్నికలపై సీబీఎస్ న్యూస్ విడుదల చేసిన పోల్స్ ప్రకారం అమెరికాలో 10 మందిలో దాదాపు ఆరుగురు ప్రజాస్వామ్య స్థితిని తమ మొదటి సమస్యగా పేర్కొన్నారు. అలాగే, ఐదు శాతం మంది ఓటర్లు అబార్షన్ చట్టంపై ఫోకస్ ఉన్నట్టు చెప్పుకొచ్చారు. 10 మందిలో ఒకరు ఆర్థిక వ్యవస్థను ప్రాధాన్యతా అంశంగా ఎంచుకున్నారు.👉అలాగే, సీఎన్ఎన్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. దాదాపు మూడు వంతుల ఓటర్లు ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థకు కట్టుబడి ఓటు వేసినట్టు చెప్పారు. ఇద్దరు అభ్యర్థులపై ప్రతికూల అభిప్రాయాన్ని చూపించారు. ఇదిలా ఉండగా..ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పనితీరుపై పది మందిలో నలుగురు ఓటర్లు మెచ్చుకున్నారు. మిగిలిన ఆరుగురు అసంతృప్తిని వ్యక్తం చేశారు. 👉ఇక, ఇప్పటి వరకు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ ఆరు రాష్ట్రాల్లో విజయం సాధించారు. మరో తొమ్మిదో రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. మరోవైపు.. కమలా హారీస్ ఒక్క చోట విజయం సాధించగా, మరో ఐదు రాష్ట్రాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. -
అమెరికా పబ్లిక్ వాయిస్.. గెలిచేది వారే..
-
US Election Results : మిస్టర్ ప్రెసిడెంట్.. డొనాల్డ్ ట్రంప్
US Election Results 2024 LIVE Updates : వాషింగ్టన్ డీసీ: దేశ ప్రజలకు సువర్ణయుగం రాబోతుందంటూ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ఉద్దేశిస్తూ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రసంగంగించారు. స్వింగ్ స్టేట్స్లో విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. 05: 30 PMఅమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ 280 ఎలక్టోరల్ ఓట్లు గెలుపుకమలా హారిస్ 224 ఓట్లు విజయం ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోందిట్రాంప్ మ్యాజిక్ ఫిగర్ ( 270) ఎలక్టోరల్ ఓట్లు దాటారు05: 10 PMట్రంప్ ఖతాలో రెండు రికార్డులురెండు దశాబ్దాల తర్వాత పాపులర్ ఓటింగ్తో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ విజయం సాధించడం గమనార్హం. 2004 ఎన్నికల్లో జార్జ్ బుష్ 62,040,610 ఓట్లతో 286 ఎలక్టోరల్ దక్కించుకోగా.. డెమోక్రటిక్ అభ్యర్థి జాన్ కెర్రీకి 59,028,444 ఓట్లతో 251 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ట్రంప్ మళ్లీ ఆ ఘనత సాధించారు.ఇక.. 132 ఏళ్ల తర్వాత ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి అరుదైన ఫీట్ సాధించారు. 1885 అమెరికా ఎన్నికల్లో గ్రోవర్ క్లీవ్లాండ్ అధ్యక్షుడిగా నెగ్గారు. అయితే మళ్లీ ఒక టర్మ్ ముగిశాక.. అంటే 1893 ఎన్నికల్లోనూ గ్రోవర్ ప్రెసిడెంట్గా విజయం సాధించారు. అమెరికాకు 45వ అధ్యక్షుడిగా పని చేసిన ట్రంప్.. ఒక టర్మ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ మేజిక్ ఫిగర్ దాటేసి వైట్హౌజ్ వైపు అడుగులేశారు. 04: 19 PMట్రంప్ బిగ్ విక్టరీఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయంవిస్కాన్సిన్లో విజయంతో మేజిక్ ఫిగర్ దాటిన ట్రంప్రెండు దశాబ్దాల తర్వాత పాపులర్ ఓటింగ్లో నెగ్గిన రిపబ్లికన్ కేండిడేట్గా ట్రంప్ రికార్డు277కి చేరిన ట్రంప్ బలం.. ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్.. మరో 30 స్థానాలు ట్రంప్ ఖాతాలోకే! 04: 10 PMడొనాల్డ్ ట్రంప్ విజయంపై స్పందించిన చైనాట్రంప్ పేరు నేరుగా ప్రస్తావించకుండా.. ఎన్నికల ఫలితాలపై స్పందించిన చైనాఅధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తాం: చైనాఅమెరికాతో శాంతియుత సంబంధాలు కొనసాగిస్తాంపరస్పర గౌరవం, సహకారంతో ముందుకెళ్తామని చైనా ప్రకటన04: 05 PMట్రంప్ గెలుపు ఇక లాంఛనమేదాదాపు ఖరారైన డొనాల్ట్ ట్రంప్ విజయంమేజిక్ ఫిగర్కు అతిచేరువలో ట్రంప్ఇప్పటికే 267 సీట్లు.. మరో మూడు ఎలక్టోరల్ సాధిస్తే విజయంఇంకా ఐదు రాష్ట్రాల్లో ఆధిక్యంలో ట్రంప్మరో 44 ఎలక్టోరల్లు దక్కే అవకాశంమరో నాలుగు స్వింగ్ స్టేట్స్లోనూ ట్రంప్ ఆధిక్యంస్వింగ్ రాష్ట్రాలు జార్జియా, నార్త్ కరోలీనా, పెన్సిల్వేనియాలో రిపబ్లిక్ పార్టీ గెలుపుఓటమి దిశగా కమలా హారిస్డెమోక్రటిక్ శ్రేణుల్లో తీవ్ర నిరాశ03: 30 PMరన్నింగ్మేట్ జేడీ వాన్స్ జంటపై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలుఅద్భుతమైన, అందమైన జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ జంటకు అభినందనలుఇక నుంచి మిమ్మల్ని( జేడీ వాన్స్) ఉపాధ్యక్షుడు అని గర్వంగా పిలవచ్చు: ట్రంప్ 2: 34 PMఅమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికనూతన అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారని పేర్కొన్న అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న డొనాల్డ్ ట్రంప్డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్కు నిరాశWe have saved America. 🇺🇸The American people have spoken, and President Trump and Senator JD Vance are going to the White House. We are ready to get to work for the American people.— Speaker Mike Johnson (@SpeakerJohnson) November 6, 2024 2:17pmడొనాల్ట్ ట్రంప్కు శుభాకాంక్షలు తెలియజేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ చరిత్రాత్మక ఎన్నికల విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు భారత్, అమెరికా ప్రజల కోసం కలిసి పనిచేద్దాం ప్రపంచ శాంతి, సుస్థిరత్వం, శ్రేయస్సు కోసం పాటుపడదామని పిలుపునిచ్చిన భారత ప్రధాని Heartiest congratulations my friend @realDonaldTrump on your historic election victory. As you build on the successes of your previous term, I look forward to renewing our collaboration to further strengthen the India-US Comprehensive Global and Strategic Partnership. Together,… pic.twitter.com/u5hKPeJ3SY— Narendra Modi (@narendramodi) November 6, 2024 02:02pmట్రంప్నకు శుభాకాంక్షలు తెలిపిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూప్రియమైన డొనాల్డ్ ట్రంప్, మెలానియాకు శుభాకాంక్షలు మీరు వైట్హౌస్లోకి తిరిగిరావడం అమెరికాలో ఓ కొత్త అధ్యాయానికి నాంది అమెరికా, ఇజ్రాయెల్ల బంధం మరింత బలోపేతమవుతుంది Dear Donald and Melania Trump,Congratulations on history’s greatest comeback!Your historic return to the White House offers a new beginning for America and a powerful recommitment to the great alliance between Israel and America.This is a huge victory!In true friendship,… pic.twitter.com/B54NSo2BMA— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 6, 20241:20pm రిపబ్లికన్లకు 315 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది - ట్రంప్సరిహద్దు మూసివేతల్ని పరిశీలించాలిఎవరైనా చట్టబద్ధంగా దేశంలోకి రావాల్సిందేసరిహద్దులు నిర్ణయిస్తాంఅమెరికన్లు పవర్ఫుల్ తీర్పు ఇచ్చారు1:00pmఅమెరికా ప్రజలు గొప్ప విజయాన్ని అందించారు. వారి కోసం పని చేస్తాను.అమెరికన్లకు సువర్ణయుగం రాబోతుందినా గెలుపు అమెరికాకు ఉపయోగంఈ ఫలితాలను ఎవరూ ఊహించలేదుఅమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదు 11:50amఆ రాష్ట్రంలో 19 ఎలక్టోరల్ ఓట్లు267కి పెరిగిన రిపబ్లికన్ల బలంమూడు సీట్ల దూరంలో అధ్యక్ష పీఠం11:43amడొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడేందుకు పామ్ బీచ్కు వెళుతున్నట్లు రాయిటర్స్ నివేదించింది. కాగా, అమెరికా అధ్యక్షుడిని ఖరారు చేసే ఏడు స్వింగ్ స్టేట్స్లలో ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉండగా.. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో గెలుపొందారు.11:35am అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలు విడుదల అనంతరం.. మద్దతు దారుల గురించి చేసే ప్రసంగానికి హారిస్ గైర్హాజరు కానున్నారు. 11:20amఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజేతను నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజీ సంఖ్యల విషయానికొస్తే ట్రంప్ 230 ఓట్లతో, హారిస్ 209 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ట్రంప్ 23 రాష్ట్రాల్లో కమలా హారిస్ 11 రాష్ట్రాల్లో గెలుపొందినట్లు అంచనా. 270 ఎలక్టోరల్ సీట్లు వచ్చిన అభ్యర్థే అమెరికా అధ్యక్షుడిగా బాద్యతలు చేపడతారు 11:10amఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం దిశగా ట్రంప్230 ఎలక్టోరల్ సీట్లు సాధించిన ట్రంప్210 ఎలక్టోరల్ సీట్లతో వెనుక బడ్డ కమలా హారిస్ మార్ ఆ లాగో రిసార్ట్కు బయలు దేరిన ట్రంప్.ముఖ్య నేతలు,ట్రంప్తో కలిసి ఎన్నికల ఫలితాలను వీక్షించనున్న ట్రంప్ తన మద్దతు దారుల గురించి ప్రసంగం 3 స్వింగ్స్ స్టేట్స్లో విజయం సాధిస్తే ట్రంపే అధ్యక్షుడు 10:50amనాలుగు గంటలుగా కొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఫలితాల్లో డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ కంటే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ఎవరనేది తేల్చే స్వింగ్ స్టేట్స్లో సైతం ట్రంప్ హవా కొనసాగుతుంది. ఏడు స్వింగ్ స్టేట్లలో ట్రంప్ ఆరుచోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పెన్సిల్వేనియా, జార్జియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్ కరోలినా(విజయం), ఆరిజోనా రిపబ్లికన్ పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉంది. 10:10amఎన్నికల ఫలితాల విడుదల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెన్సిల్వేనియాలో గెలిస్తే తన విజయం ఖాయమైనట్లేనని అన్నారు. కానీ కౌంటింగ్లో తన విజయాన్ని అడ్డుకునేలా కుట్ర జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు.9:55amకొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల ఉత్కంఠ పోరులో తొలుత ట్రంప్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ హారిస్ క్రమంగా పుంజుకుంటున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్కు 230 ఎలక్టోరల్ సీట్లు సొంతం చేసుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 179 ఎలక్టోరల్ సీట్లను కైవసం చేసుకున్నారు.9:40am2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్ స్టేట్ పెన్సిల్వేనియాలో నిరాశజనకమైన ఫలితాలు రాబట్టిన ట్రంప్.. ఈ సారి మాత్రం ఊహించని ఫలితాల్ని సాధిస్తున్నారు. ముఖ్యంగా గత అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ ఓటమిపాలయ్యారు. ఫలితాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైట్ హౌస్పై దాడి చేసి అప్రతిష్టను మూటగట్టుకున్నారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో ట్రంప్ పెన్సిల్వేనియా ఓటర్ల తిరస్కరణకు గురి కావాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకుల అంచనా వేశారు. ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ట్రంప్ లీడింగ్లో కొనసాగుతున్నారు.9:20amబ్యాలెట్ పేపర్లోని అభ్యర్థుల్లో తమకు నచ్చిన వారికి ఎదురుగా టిక్ చేస్తారు. ఎన్నికల అధికారులు వాటిని చేతితో కాకుండా డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్ (డీఆర్ఈ) సిస్టమ్తో కౌంట్ చేస్తారు. పెన్సిల్వేనియాలో ఈ డీఆర్ఈ డివైజ్లలో సాఫ్ట్వేర్లో లోపాలు తలెత్తాయి. దీంతో డీఆర్ఈ డివైజ్లు మొరాయించడంతో అధికారులు ఓట్లను చేతితో కౌంట్ చేస్తున్నారు9:10amఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిని గెలుపును ఖాయం చేసే పెన్సిల్వేనియాలో సైతం డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. స్వింగ్ స్టేట్స్ పెన్సిల్వేనియాలో 55 శాతం ఓట్లు లెక్కించగా, కమలా హారిస్ కంటే డోనాల్డ్ ట్రంప్ 3 శాతం ఓట్లు ఎక్కువ సాధించారు. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లలో ట్రంప్కు 51.1 శాతం ఓట్లు రాగా, హారిస్కు 48 శాతం ఓట్లు వచ్చాయి.9:05amఅమెరికాలోని అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే పెన్సిల్వేనియాలో గెలవాల్సిన పరిస్థితి తప్పనిసరి. స్వింగ్ స్టేట్స్లో ఒకటైన ఈ పెన్సిల్వేనియాలో మొత్తం 20 ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి. ఈ ఓట్లే అమెరికా అధ్యక్షుడు ఎవరనేది తేల్చేస్తాయిని అంచనా. అంతటి ముఖ్యమైన పెన్సిల్వేనియాలో భారీ మోసం జరిగిందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. దీనిని ఎన్నికల అధికారులు ఖండించారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సజావుగా జరుగుతున్నట్లు చెప్పారు. 8:27am9 రాష్ట్రాల్లో కమలా హారిస్.. 17 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. టెక్సాస్లో ట్రంప్ విజయం సాధించారు. రిపబ్లిక్ పార్టీ ఖాతాలో 41 ఎలక్టోరల్ ఓట్లు సాధించింది. ఇప్పటి వరకు 17 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించగా.. కమలా హారిస్ 9 రాష్ట్రాల్లో గెలిచారు. 8:15amఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ చివరి అంకానికి చేరినట్లు తెలుస్తోంది. అయితే పోలింగ్ పూర్తయిన కౌంటింగ్ ప్రారంభమైన అన్నీ ప్రాంతాల్లో ట్రంప్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ అనుకూల ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ సాధించారు. అధ్యక్ష పదవిలో ఉన్న అభ్యర్థి గెలవాలంటే 270 ఎలక్టోర్లో ఓట్లను గెలుచుకోవాల్సి ఉంది. ఈ ఎలక్టోరల్ ఓట్లలో సైతం ట్రంప్ ముందంజలో ఉన్నారు. ట్రంప్ 154 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా.. హారిస్ 81 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు.7:41amబాంబు బెదిరింపు తర్వాత పెన్సిల్వేనియా కౌంటీలో ఓటింగ్ సమయాన్ని మరింత పొడిగిస్తూ అధికారులు ప్రకటించారు 7:36amటెక్సాస్, వ్యోమింగ్లో ట్రంప్ విజయం సాధిస్తారని అంచనా ట్రంప్ దక్షిణ, ఉత్తర డకోటాలలో విజయం సాధించారు7:33amట్రంప్, కమల ఒక్కొక్కరు 2 రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు7:24 amట్రంప్ 10 రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉన్నారు7:20amచెస్టర్ కౌంటీ ప్రభుత్వ సేవల కేంద్రానికి బాంబు బెదిరింపులు.. రంగంలోకి దిగిన అధికారులు 7:13amబాంబు బెదిరింపుల కలకలంఅమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల విడుదలలో ఓ వైపు ఉత్కంఠత కొనసాగుతుండగా.. మరోవైపు బాంబుల బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. పెన్సిల్వేనియాలోని ఓటింగ్ సర్వీస్ బిల్డింగ్కు బాంబు బెదిరింపులొచ్చాయి. బాంబు బెదిరింపులపై సమాచారం అందుకున్న ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అధికారులు డాగ్ స్క్వాడ్తో రంగంలోకి దిగారు. తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. 7:10amస్వింగ్ స్టేట్స్లో హారిస్ వెనుకంజఅమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించే ఏడు స్వింగ్ స్టేట్స్లో ట్రంప్, కమలా హారిస్లలో ఎవరిది పైచేయి అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్వింగ్ స్టేట్స్లో ఆధిక్యం సాధించే అభ్యర్థికి అమెరికా అధ్యక్ష పీఠం దక్కనుండటమే అందుకు కారణం. అయితే పెన్సిల్వేనియా, అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ ఈ ఏడు స్వింగ్ స్టేట్స్లో సైతం హారిస్ వెనుకంజలో ఉన్నారు. స్వింగ్స్ స్టేట్స్లో ట్రంప్కు 58.2 శాతం ఓట్లు పోలవగా, హారిస్కు 41.3 శాతం ఓట్లు పోలయ్యాయి. 6:50amఅమెరికా అధ్యక్ష ఎంపికలో ప్రముఖ పాత్ర పోషించే ఎలక్టోరల్ ఓట్ల ఫలితాల్లో ట్రంప్ దూసుకెళ్తున్నారు. ట్రంప్ 101 ఎలక్టోరల్లో ఓట్లు సాధించగా.. హారిస్ 49 మాత్రమే సాధించారు. అమెరికా ప్రతినిధుల సభ ఎన్నికల బరిలో 9మంది భారతీయులు అమెరికా ప్రతినిధుల సభ ఎన్నికల బరిలో 9 మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. సుహాస్ సుబ్రమణియన్ (వర్జీనియా), అమీ బెరా (కాలిఫోర్నియా), ప్రమీలా జయపాల్ (వాషింగ్టన్), రాజా కృష్ణమూర్తి (ఇల్లినోయీ), రో ఖన్నా (కాలిఫోర్నియా), శ్రీ థనేదార్ (మిషిగన్), అమీశ్ షా (ఆరిజోనా), ప్రశాంత్ రెడ్డి (కాన్సాస్), రాకేశ్ మోహన్ (న్యూజెర్సీ) పోటీ చేశారు. వీరితోపాటు మొత్తం 36 మంది భారతీయ అమెరికన్లు రాష్ట్ర సెనెట్లు, స్థానిక సంస్థల బరిలో ఉన్నారు.6:40amఅమెరికాలో ఆరు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఇండియా, కెంటికీ,వెస్ట్ వర్జీనియా రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించగా.. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్కమలా హారిస్ వెర్మాట్లో మాత్రమే గెలుపొందారు. 👉: అమెరికాలో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు (ఫొటోలు) -
US election 2024: ఫలితం తేలేదెప్పుడు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఈసారి ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పష్టమైన చిత్రం ఆవిష్కృతమవ్వడానికి రెండు, మూడు రోజులు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మనదేశంలో లాగా అమెరికాలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఉండదు. ఓట్ల లెక్కింపు బాధ్యత రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలదే. 50 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఒకేలా ఉండదు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోరు సాగిన నేపథ్యంలో ఫలితాల వెల్లడికి సమయం పట్టే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పోలింగ్ ముగిసిన కొద్ది గంటల్లో అమెరికా మీడియా సంస్థలు ఎవరు ఆధిక్యంలో ఉన్నారనే విషయాన్ని వెల్లడిస్తాయి.అమెరికన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఫలితాల కోసం వీటిపైనే ఆధారపడతారు. అమెరికాలో ఆరు కాలమానాలున్నాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం 11:30 గంటలకు అమెరికావ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. అంటే బుధవారం రాత్రికల్లా ఫలితాల ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది తెలిసే అవకాశం ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో అవి ఎటువైపు మొగ్గుతాయనేది ముందు నుంచే తెలిసి ఉంటుంది. సులభంగా అంచనా వేయవచ్చు. ఈ రాష్ట్రాల్లో ఫలితాలు తొందరగానే వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది ఏడు స్వింగ్ రాష్ట్రాలు.వీటిలో ఫలితాలు వెల్లడైతే గాని ఉత్కంఠకు తెరపడదు. హోరాహోరీ పోరు దృష్ట్యా స్వింగ్ రాష్ట్రాలు.. ముఖ్యంగా పెన్సిల్వేనియా తదుపరి అధ్యక్షుడు ఎవరనేది నిర్ణయించనున్నాయి. ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో కలిపి 93 ఎలక్టోరల్ కాలేజీలు ఉన్నాయి. ఈ స్వింగ్ రాష్ట్రాలు స్వల్ప ఆధిక్యంతో ఏదైనా పార్టీ ఖాతాలో పడొచ్చు. అప్పుడు రీకౌంటింగ్ అవసరమవుతుంది. అప్పుడు ఫలితాల వెల్లడి మరింత ఆలస్యమవుతుంది. ఒక రాష్ట్రంలో ఏ పార్టీకి ఆధిక్యం లభిస్తే.. అక్కడున్న ఎలక్టోరల్ ఓట్లన్నీ సదరు పార్టీ ఖాతాలో పడతాయి. ప్రతి రాష్ట్రానికి జనాభాను బట్టి నిర్దిష్ట సంఖ్యలో ఎలక్టోరల్ కాలేజి ఓట్లుంటాయి. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లుంటాయి. అధ్యక్ష పదవిని చేపట్టడానికి 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించాలి. దేశవ్యాప్తంగా మెజారిటీ ఓట్లు సాధించినా అధ్యక్షపదవి వరిస్తుందనే గ్యారంటీ ఏమీ లేదు. ఎలక్టోరల్ ఓట్లే అధ్యక్షుడెవరనేది నిర్ణయిస్తాయి. 2020లో నవంబరు 3న ఎన్నికలు జరగగ్గా... ఫలితం తేలడానికి నాలుగు రోజులు పట్టింది. పెన్సిల్వేనియాలో ఫలితం స్పష్టమయ్యాక.. జో బైడెన్ నెగ్గారని మీడియా ప్రకటించింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యాక ట్రంప్ తొలుత 11 శాతం ఓట్ల ఆధిక్యం కనబర్చారు. తర్వాత రెండురోజుల్లో పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపు ప్రారంభమయ్యాక.. బైడెన్ ఆధిక్యంలోకి వచ్చారు. వార్త సంస్థ ‘అసోసియేటెడ్ ప్రెస్’ తొలుత విజేతను ప్రకటిస్తూ వస్తోంది. 1848 నుంచి కచ్చితంగా విజేత ఎవరో తొలుత చెబుతోంది. 2016 ఎన్నికలు జరిగిన రోజు రాత్రే డొనాల్డ్ ట్రంప్ను అసోసియేటెడ్ ప్రెస్ విజేతగా ప్రకటించింది. అధికారిక ప్రక్రియ మాత్రం కొనసాగుతూ ఉంటుంది. డిసెంబరు 11 కల్లా రాష్ట్రాలు ఫలితాలను ప్రకటించాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
US Elections 2024: అంతులేని ఉత్కంఠ
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే అత్యంత హోరాహోరీగా సాగిన ప్రచార ఘట్టానికి తెర పడింది. అధ్యక్ష ఎన్నికల్లో అతి కీలకమైన పోలింగ్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సులు, ఈవీఎంల్లో నిక్షిప్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30) నుంచే పోలింగ్ బూత్ల ముందు జనం భారీగా బారులు తీరారు. అమెరికాలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సమయానికి పోలింగ్ మొదలవుతుంది.కనెక్టికట్, వ్యోమింగ్, ఇండియానా, కెంటకీ, మైన్ వంటి రాష్ట్రాల్లో ఉదయం ఆరింటికి; అరిజోనా, అయోవా, లూసియానా, విస్కాన్సిన్ తదితర రాష్ట్రాల్లో 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్, ఆమె రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నట్టు ఓటింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. దాంతో ఎవరు గెలుస్తార్నది రాజకీయ పండితుల అంచనాలకు కూడా అందడం లేదు. ఈసారి స్వింగ్ స్టేట్స్తో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో కూడా గెలుపోటముల మధ్య తేడా అతి స్వల్పంగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అభ్యర్థులిద్దరిలో ఎవరు గెలిచినా రికార్డే కానుండటం విశేషం. హారిస్ నెగ్గితే అమెరికాలో అత్యున్నత పీఠాన్ని అధిష్టించిన తొలి మహిళగా నూతన చరిత్ర సృష్టిస్తారు. నల్లజాతి, ఆసియా, భారత మూలాలున్న తొలి అధ్యక్షురాలు కూడా అవుతారు. అదే ట్రంప్ గెలిస్తే గత 132 ఏళ్లలో ఒకసారి అధ్యక్షునిగా చేశాక కొన్నేళ్ల విరామం తర్వాత మళ్లీ ఆ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా రికార్డులకెక్కుతారు. ప్రచారం పొడవునా వారి మధ్య తీవ్ర విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వాదనలు సాగడం తెలిసిందే. 16 కోట్ల పై చిలుకు ఓటర్లలో సగానికి సగం, అంటే దాదాపు 8 కోట్ల మంది ఈసారి ముందస్తు, పోస్టల్ తదితర పద్ధతుల్లో ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. మంగళవారం సాయంత్రం ఆరింటికి (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11.30కు) పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.ఆ వెంటనే రాష్ట్రాలవారీగా ఎక్కడికక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టినా తుది ఫలితం తేలడానికి కొద్ది రోజులు పట్టవచ్చు. అయితే విజేత ఎవరన్న దానిపై ఓటింగ్ ముగిసిన కొద్ది గంటల్లోనే స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు. దాంతో ఇక అందరి కళ్లూ ఫలితాలను తేల్చడంలో కీలకమైన స్వింగ్ రాష్ట్రాలపైనే ఉన్నాయి. మహిళల ఓటు కూడా ఈసారి కీలకంగా మారుతుందని భావిస్తున్నారు.అమెరికా చరిత్రలోనే కీలకమైన రోజు: ట్రంప్ మంగళవారాన్ని అమెరికా చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన రోజుగా ట్రంప్ అభివరి్ణంచారు. ‘‘పోలింగ్ రోజు వచ్చేసింది! భారీ సంఖ్యలో వచ్చి ఓటేయండి’’ అంటూ లక్షలాది మంది అభిమానులు, మద్దతుదారులకు మంగళవారం ఆయన ఈ మెయిళ్లు పంపారు. అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మలచుకుందాం. మీరు ఓటేయకుండానే వెనుదిరగాలని రాడికల్ కమ్యూనిస్టు డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. మనమంతా కలిసి వారి ఆశలను వమ్ము చేద్దాం’’ అంటూ పిలుపునిచ్చారు. జీవనవ్యయం తగ్గిస్తా: హారిస్ ప్రెసిడెంట్గా తన విజయం ఇప్పటికే ఖాయమైపోయిందని హారిస్ పేర్కొన్నారు. ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించడం, వెన్ను విరిగిన వలసల విధానాన్ని సరిచేయడం తన తొలి ప్రాథమ్యాలని ప్రకటించారు. మంగళవారం ఆమె పిట్స్బర్గ్లో న్యూస్రేడియో మారి్నంగ్ షోలో పాల్గొన్నారు. ధరాభారానికి ముకుతాడు వేసేందుకు తనవద్ద ఇప్పటికే ప్రణాళిక సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.ఫ్లోరిడాలో ఓటేసిన ట్రంప్ ట్రంప్ ఫ్లోరిడాలో ఓటేశారు. మంగళవారం ఉదయం భార్య మెలానియాతో కలిసి తన నివాసం సమీపంలోని పామ్బీచ్లోని పోలింగ్ బూత్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హారిస్ ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయడం తెలిసిందే. అధ్యక్షుడు జో బైడెన్ కూడా తన స్వస్థలం డెలావెర్లో కొద్ది రోజుల ముందే ఓటేశారు. డిక్స్విల్ నాచ్లో తొలి ఫలితంఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ బుల్లి కౌంటీలో ‘తొలి ఫలితం’ వచ్చేసింది. పోలింగ్ మొదలైన కొద్ది గంటల్లోనే అక్కడ కౌంటింగ్ కూడా పూర్తవమే ఇందుకు కారణం. న్యూహాంప్షైర్ రాష్ట్రంలోని డిక్స్విల్ నాచ్లో కేవలం ఆరుగురు ఓటర్లే ఉన్నారు. అక్కడ 60 ఏళ్లుగా అర్ధరాత్రి ఓటు హక్కు వినియోగించుకునే సంప్రదాయముంది. దాని ప్రకారం మంగళవారం మొదలవుతూనే (సోమవారం అర్ధరాత్రి దాటగానే) పోలింగ్ మొదలైంది. ఆరుగురు ఓటర్లే ఉండటంతో కాసేపటికే పోలింగ్, ఆ వెంటనే కౌంటింగ్ కూడా ముగిశాయి. హోరాహోరీ పోరుకు అద్దం పట్టేలా హారిస్, ట్రంప్కు చెరో మూడు ఓట్లు పడటం విశేషం. కెనడా సరిహద్దు సమీపంలో ఉండే డిక్స్విల్కు అమెరికా ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చే ప్రదేశంగా పేరుంది. అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ఉదయం ఆరింటికి, మరికొన్నింట్లో 7, 8, 9 గంటలకు పోలింగ్ మొదలవుతుంది. -
కమలా.. విజయాన్ని కాంక్షిస్తూ పూజలు
సాక్షి, చైన్నె: అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా గతంలో ఎన్నికై , ప్రస్తుతం అధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిస్ గెలుపు కోసం ఆమె పూర్వీకుల గ్రామంలో మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. బ్రిటన్, అమెరికాల నుంచి ఆమె మద్దతుదారులు పలువురు ఇక్కడకు వచ్చి పూజలలో లీనమయ్యారు. అమెరికా అధ్యక్షురాలుగా ఆమె తన పూర్వీకుల గ్రామానికి వస్తారన్న ఆశాభావాన్ని ఆ గ్రామస్తులు వ్యక్తం చేశారు. వివరాలు.. కమలా హారిస్ పూర్వీకులది తమిళనాడు అన్న విషయం తెలిసిందే. ఆమె తల్లి తరపు తాత, ముత్తాతలు తిరువారూర్ జిల్లా మన్నార్ కుడి సమీపంలోని తులసేంద్రపురం గ్రామానికి చెందిన వారు.దీంతో తమ ఇంటి బిడ్డగా కమలా హ్యారిస్ను ఆ గ్రామస్తులు భావిస్తూ వస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఆమె పేరును గతంలో ప్రకటించిన రోజు నుంచి ఈ గ్రామంలో ఎదురు చూపులు పెరిగాయి. గ్రామంలోని ధర్మశాస్త ఆలయంలో రోజూ పూజలు నిర్వహించారు. అమెరికా ఎన్నికల్లో తొలి మహిళా ఉపాధ్యక్షురాలుగా కమలా హ్యారిస్ విజయకేతనం ఎగుర వేయడంతో ఆ గ్రామంలో ఆనందోత్సాహాలు అప్పట్లో మిన్నంటాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా ఎన్నికలలో అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవడంతో ఆ స్థానంలో అధ్యక్ష బరిలో కమల హరిస్ నిలబడ్డారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఢీకొట్టే విధంగా కమలా దూసుకెళ్లారు. హోరాహోరీగా ఈ ఇద్దరి మధ్య సమరం నెలకొంది. మంగళవారం పోలింగ్ పూర్తి కావడంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అమెరికా 47వ ప్రిసిడెంట్ కమల హరిస్ లేదా ట్రంప్..? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితులలో గతంలో వలే కమలా గెలుపు కోసం పూర్వీక గ్రామస్తులు పూజలపై దృష్టి పెట్టారు. తమ గ్రామానికే కాకుండా, కమలా హారీస్ పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు కుల దైవంగా ఉన్న ధర్మ శాస్త ఆలయంలో కమలా గెలుపు కాంక్షిస్తూ నిత్యం ప్రత్యేక పూజలు చేస్తూ వస్తున్నారు. మంగళవారం అయితే, ఉదయం నుంచి పూజలు జరుగుతూనే ఉన్నాయి. బుధవారం పూర్తి ఫలితాలు వెలువడనున్నడంతో కమలా హరిస్పేరిట ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. అమెరికా, బ్రిటన్ల నుంచి వచ్చిన కమలా మద్దతుదారులు ఆమె పేరు కలిగిన టీ షర్టులను ధరించి ఆలయంలో పూజలు చేస్తున్నారు. కమలా తప్పకుండా ఈ ఎన్నికలలో గెలుస్తారన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షురాలుగా తమ గ్రామానికి కమల వస్తారన్న నమ్మకం ఉందని, ఆమె తప్పకుండా గెలుస్తారని తులసేంద్ర పురం వాసులు పేర్కొంటున్నారు. కులదైవం ఆలయం ధర్మ శాస్తలో అందరం మొక్కుకున్నామని, తమ కులదైవం ఆమెను ఆశీర్వదిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తంచేశారు. గతంలో కూడా ఇక్కడ పూజలు జరిగాయని, ఆమె గెలిచారని గుర్తుచేశారు. కమలా హారీస్ అధ్యక్ష ఎన్నికలలో గెలిచినానంతరం భారత్ , అమెరికా మధ్య బంధం మరింత బలోపేతం కావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. ఆలయ పరిసరాలు గ్రామంలో కమలా హరిస్ గెలుపును కాంక్షిస్తూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. -
US Elections 2024: మరి ఓట్ల లెక్కింపు ఎలా?
యూఎస్ స్టేట్స్లో పోలింగ్ నడుస్తోంది. మొదటి దశ, చివరి దశల పోలింగ్ ముగిసిన వెంటనే.. ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అమెరికాలో పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయని తెలిసిందే. ఓటింగ్ మెషీన్లపై అక్కడి ఓటర్లలో నమ్మకం లేకపోవడం అందుకు ప్రధాన కారణం. అయితే అక్కడి ఎన్నిక విధానం తరహాలో కౌంటింగ్ కూడా కాస్త భిన్నంగానే ఉంటుంది. మన దగ్గర పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది కదా. కానీ, అమెరికాలో సాధారణంగా ఎన్నికలు జరిగిన రోజే పోలైన ఓట్లను మొదట లెక్కిస్తారు. తర్వాత మెయిల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. దేశాల నుంచి వచ్చిన ఓట్లను, మిలటరీ బ్యాలెట్లను ఆ తర్వాత లెక్కిస్తారు. ఇందుకోసం..కాన్వాసింగ్(canvassing) ప్రక్రియ ద్వారా ఎన్నికైన స్థానిక ఎన్నికల అధికారులు ఓట్లను పరిశీలించి లెక్కిస్తారు. ఎన్ని ఓట్లు పోలయ్యాయి? ఓటర్ల జాబితాలో ఎన్ని పేర్లున్నాయి? అనేది పోలుస్తూ.. అర్హత గల ప్రతిఓటూను లెక్కించేలా చూడటమే వీరి పని.బ్యాలెట్పై ఏమైనా మరకలు ఉన్నాయా?.. బ్యాలెట్ పాడైపోయిందా?.. ఇలా కక్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒకవేళ అభ్యంతరంగా అనిపిస్తే.. డాక్యుమెంటేషన్ చేసి దర్యాప్తు చేస్తారు. అలాగే.. కౌంటింగ్ బ్యాలెట్లను ఎలక్ట్రానిక్ స్కానర్లతో జతచేస్తారు. దీనివల్ల ఫలితాల పట్టిక కనిపిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ స్కానర్లతో కాకుండా మాన్యువల్గానూ లెక్కిస్తారు. మరికొన్ని సమయాల్లో రెండుసార్లు కౌంటింగ్ జరుపుతారు. అయితే.. కాన్వాస్లో ఎవరు పాల్గొనాలనేదానిపై కఠిన నిబంధనలుంటాయి. -
సుందర్ పిచాయ్ వ్యాఖ్యలు: ఎన్నికల్లో ఎవరు గెలిచినా..
టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ.. ఫలితాలు వెలువడక ముందే ఓ విషయాన్ని వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. కంపెనీ మాత్రం విశ్వసనీయమైన సమాచారాన్ని అందించే వనరుగా ఉండాలని, తన ఉద్యోగులను కోరినట్లు సమాచారం. ఎన్నికల వేళ రాజకీయ విభేదాలలో చిక్కుకోకుండా ఉండేందుకు పిచాయ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.గూగుల్పై ట్రంప్ ఆరోపణలుఈ ఏడాది సెప్టెంబర్లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్.. సెర్చ్ ఇంజిన్ దిగ్గజంపై విచారణ జరుపుతామని వెల్లడించారు. గూగుల్ తన గురించి చెడు కథనాలను, డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ గురించి మంచి కథనాలను మాత్రమే వెల్లడిస్తోంది ఆరోపించారు.అధ్యక్ష పీఠమెవరికో..ఇప్పటికే ఒక సారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన.. ట్రంప్ మళ్ళీ అధ్యక్ష పదివి చేపడతారా?.. లేక 'కమలా హారిస్'ను ఆ పదవి వరిస్తుందా? అని ప్రపంచ దేశాలు ఉత్కఠతో ఎదురు చూస్తున్నాయి. కాగా ఇప్పటికే అమెరికాలో పోలింగ్ మొదలైపోయింది. ఫలితాలు త్వరలోనే వెల్లడవుతాయి. అమెరికా అధ్యక్ష పీఠమెవరిదనేది తెలిసిపోతుంది. -
హారిస్-ట్రంప్ హోరాహోరీ.. అదే జరిగితే..
న్యూయార్క్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పలు సర్వే నివేదికలు.. ఈసారి ట్రంప్, హారిస్ మధ్య హోరాహోరీ పోటీ తప్పదని వెల్లడించిన విషయం తెలిసిందే. ఓటింగ్ సరళి పరిశీలిస్తే కూడా ట్రంప్-హారిస్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ట్రంప్, హారిస్ ఇద్దరిలో ఎవరికీ మెజారిటీ వస్తుంది? గెలుపెవరిదో చెప్పటం కష్టంగా ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. కనీసం 270 ఎలక్టోరల్ ఓట్లు రాని పక్షంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరికీ చెరో 269 ఓట్లు వచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే అధ్యక్షున్ని ఎన్నుకునే బాధ్యత అమెరికా కాంగ్రెస్పై పడుతుంది. దిగువ సభ అయిన ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. ఇందుకోసం జనవరి 6న సమావేశమవుతుంది. ఒక్కో రాష్ట్రానికి ఒకటి చొప్పున 50 ఓట్లు కేటాయిస్తారు. 26, అంతకంటే ఎక్కువ ఓట్లు సాధించే వారే అధ్యక్షుడవుతారు.అయితే.. చివరిసారిగా రెండు శతాబ్దాల కింద, అంటే 1800లో ఇటువంటి పరిస్థితి తలెత్తింది. అధ్యక్ష బరిలోకి దిగిన థామస్ జెఫర్సన్, ఆరన్ బ్లర్ ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. దాంతో ప్రతినిధుల సభ ఓటింగ్ జరపగా.. జెఫర్సన్ విజేతగా నిలిచారు. 2020లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్లో 66 శాతమే మాత్రమే పోలింగ్ నమోదైంది. అయితే.. అమెరికాలో 24 కోట్ల పై చిలుకు అర్హులైన ఓటర్లున్నారు. కానీ ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు మాత్రం 16.14 కోట్ల మందే. ఇది 2020 కంటే కూడా తక్కువ. 2020లో 16.8 కోట్ల మంది నమోదైన ఓటర్లుండగా వారిలో ఆ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసింది 15.9 కోట్ల మంది మాత్రమే. ఈసారి ప్రచార సరళి ఆధారంగా పోటీ హోరాహోరీగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఓవైపు పోలింగ్.. మరోవైపు కంచెలేసి హైఅలర్ట్ పరిస్థితులు
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ.. మునుపెన్నడూ లేని రీతిలో హైఅలర్ట్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంతో.. పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. వాష్టింగన్ సహా మొత్తం 18 రాష్ట్రాలు భారీ స్థాయిలో నేషనల్ గార్డ్స్ను మోహరించాయి.గత ఎన్నికల టైంలో ఫలితాల తర్వాత క్యాపిటల్ భవనం వద్ద జరిగిన దాడి ఘటన అమెరికా చరిత్రకు మాయని మచ్చగా మిగిలిపోయింది. ట్రంప్ అనుకూల వర్గమే ఈ దాడికి పాల్పడిందనే అభియోగాలు నమోదయ్యాయి. అగ్రరాజ్యంలో అంతర్యుద్ధం తలెత్తిందా? అనే స్థాయిలో చర్చ జరిగింది అంతటా. ఈ నేపథ్యంలో ట్రంప్ మూడోసారి అధ్యక్ష పదవికి పోటీపడుతుండడం, ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న పరిణామాల నడుమ మరోసారి ఆ తరహా ఘటనలు జరగకుండా భద్రతా వర్గాలు అప్రమత్తం అయ్యాయి.బుల్లెట్ప్రూఫ్ గ్లాసులు, గ్రిల్తో కూడిన భారీ గేట్లు, ఆయుధాలతో ప్రత్యేక దళాలు(స్వాట్), భారీగా మోహరించిన నేషనల్ గార్డ్స్, ఎన్నికల సిబ్బంది చేతికి అందుబాటులో పానిక్ బటన్స్(ఎమర్జెన్సీ).. సుమారు లక్ష పోలింగ్ స్టేషన్ల వద్ద కనిపిస్తున్న దృశ్యాలివి. ఏఐ టెక్నాలజీ సాయంతో నిఘాను పటిష్టంగా అమలు చేస్తున్నారు. పోలింగ్ ముగిసే సమయం నుంచే ఫలితాలు వెలువడే అవకాశం ఉండడంతో.. ఆ భద్రతను మరింత పటిష్ట పరిచే అవకాశాలే కనిపిస్తున్నాయి. వీటికి తోడు కౌంటింగ్ సమయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని నిఘా సంస్థలు అంచనాల నడుమ.. నేషనల్ గార్డ్స్లోని సివిల్ సర్వీస్ ట్రూప్స్తోపాటు సైబర్ నిపుణులు కూడా రంగంలోకి దిగారు. -
అమెరికా ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో నిల్చున్నారు. ఇక.. పోలింగ్ పాల్గొని ఓటు వేయాలని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా పౌరులకు విజ్ఞప్తి చేశారు. బ్యాలెట్ పేపర్ విధానంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. హ్యాండ్మార్క్డ్ పేపర్ బ్యాలెట్స్ ద్వారా కొందరు, బ్యాలెట్ మార్కింగ్ డివైజ్(BMD)లతో కూడిన పేపర్బ్యాలెట్తో మరికొందరు ఓటేసే ఛాన్స్ ఇచ్చారు. బీఎండీ డిజిటల్ బ్యాలెట్.. ఓటేసి అప్పటికప్పుడే ప్రింట్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈవీఎంల తరహా డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్(DRE) ద్వారా కేవలం ఐదు శాతం ఓటేసే ఛాన్స్ ఉంది. హ్యాకింగ్ ఆరోపణలు, ట్యాంపరింగ్ అనుమానాల నేపథ్యంలోనే డీఆర్ఈలకు అమెరికా ఓటర్లు దూరంగా ఉన్నారు.ఇక.. గత ఎన్నికల్లో కేవలం 66 శాతమే పోలింగ్ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు నిలబడ్డారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరి మధ్యే పోటీ నెలకొంది. ట్రంప్-హారిస్ మధ్య పోటీతో అమెరికన్ల తీర్పు ఎలా ఉండనుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. కనెక్టికట్, ఇండియానా, కెంటకీ, న్యూజెర్సీ, మెయినే, న్యూహాంప్సైర్, న్యూయార్క్ వర్జీనీయాలో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ అయిన వెంటనే కౌంటింగ్ ప్రారంభం కానుంది.ఇక.. రేపు సాయంత్రం లేదంటే ఎల్లుండి కల్లా ఫలితంపై స్పష్టత రానుంది. -
అమెరికా ఎన్నికలు.. తొలి ఫలితం వచ్చేసింది!
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాకముందే తొలి ఫలితం వచ్చేసింది!. తాజాగా న్యూహ్యాంప్షైర్ రాష్ట్రంలోని డిక్స్విల్లే నాచ్లో తొలి ఫలితం వెల్లడైంది. డిక్స్విల్లే నాచ్లో ఆరుగురు ఓటర్లు ఉన్నారు. అందులో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకు మూడు చొప్పున ఓట్లు వచ్చాయి. న్యూహ్యాంప్షైర్ ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఇక్కడ అర్థరాత్రి నుంచే పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఇద్దరు అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటాపోటీ నెలకొంది. న్యూ హాంప్షైర్లోని డిక్స్విల్లే నాచ్లో ఇద్దరూ మూడు బ్యాలెట్లను పొందారు. ఇది దశాబ్దాలుగా దేశంలోని మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఇక్కడ ప్రారంభం కావటం గమనార్హం.ఇక.. 2020లో డిక్స్విల్లే నాచ్ ఓటర్లు జో బైడెన్ వైపు మొగ్గుచూపారు.This village in New Hampshire was the first to vote at 12 am on November 5th. There are only 6 voters here. All the 6 cast their votes and the votes were immediately counted. The results - Kamala Harris got 3 votes, and Donald Trump got 3 votes. So, it was a tie. pic.twitter.com/QlzBv8oaKd— Sam (@suddensam55) November 5, 2024 -
మళ్లీ ట్రంప్ గెలుస్తాడా?
-
US Elections: కొనసాగుతున్న పోలింగ్.. రిజల్ట్ ఎప్పుడంటే?
అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అగ్రరాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ చరిత్ర సృష్టించేందుకు సర్వశక్తులొడ్డుతుండగా.. దేశాన్ని మరోసారి గొప్పగా మార్చుదామన్న నినాదంతో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ రెండోసారి దేశాధ్యక్షుడిగా నిలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది?.. చాట్జీపీటీ ఏం చెప్పిందంటే?
వాషింగ్టన్ డీసీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఇప్పుడే ఇదే అంశం తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తుండగా.. ఈ ఎన్నికల్లో గెలిచేది వారేనని కృత్రిమ మేథ(ఏఐ) చాట్జీపీటీ తేల్చి చెప్పింది. ఇంతకీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుస్తారా? లేదంటే కమలా హారిస్ గెలుస్తారా?మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఔత్సాహికులు అమెరికా ఫలితాల అంచానాల్ని తెలుసుకునేందుకు ఏఐ టెక్నాలజీ చాట్జీపీటీకి ప్రశ్నలు సంధిస్తున్నారు.అంచనాలకు భిన్నంగా చాట్జీపీటీ సైతం ఎన్నికల ఫలితాల గురించి ఆసక్తికర సమాధానాలు ఇస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ గెలుస్తారా? అని అడిగితే.. ఆ ఇద్దరి పేర్లు చెప్పలేదు. బదులుగా ట్రంప్, హారిస్లు ఇద్దరూ విజయం సాధించలేరని చాట్జీపీటీ తెలిపింది. వీరిద్దరికి బదులు ప్రత్యమ్నాయంగా, అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థులే విజయం సాధిస్తారని చెప్పడం ఆసక్తికరంగా మారింది. పలు అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ‘‘ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు చివరి గంటలో ఊహించని మలుపు తిరగనున్నాయి. ఏ మాత్రం అంచనాలు లేని అభ్యర్థులే గెలుస్తారు. ట్రంప్, హారిస్లు పోటా పోటీగా గెలుపుకోసం ప్రయత్నం చేసినప్పటికీ మూడో వ్యక్తి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రోజే స్పష్టమైన ఫలితాలు వెల్లడవుతాయి’’ అని చాట్జీపీటీ చెప్పినట్లు పేర్కొన్నాయి. .కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసొటా గవర్నర్ టిమ్వాల్ట్స్, రిపబ్లికన్ పార్టీ తరుఫున ఉపాధ్యక్షుడు రామస్వామిలు పోటీ పడుతున్నారు. మరి వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు గెలిచి అమెరికా అధ్యక్షులవుతారా? లేదంటే ట్రంప్,హారిస్లలో ఎవరిని అదృష్టం వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటల వరకు ఎదురు చూడాల్సి ఉంది.చదవండి : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ‘హిప్పో’ జోస్యం నిజమయ్యేనా? -
అమెరికా ఎన్నికల వేళ.. ఉత్తర కొరియా వరుస క్షిపణి ప్రయోగాలు
సియోల్ : అమెరికాలో ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఉత్తర కొరియా ఒకదాని తర్వాత ఒకటిగా పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. తూర్పు సముద్రం వైపు పలు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించించినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.అయితే ఉత్తర కొరియా ఎన్ని క్షిపణులను ప్రయోగించిందనేది దక్షిణ కొరియా సైన్యం తెలియజేయలేదు. కాగా క్షిపణులు ఇప్పటికే సముద్రంలో పడిపోయాయని భావిస్తున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.కొద్ది రోజుల క్రితం కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షణలో ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ఆ దేశం ఇప్పటివరకు పరీక్షించిన క్షిపణుల కంటే బాలిస్టిక్ క్షిపణి ఎంతో శక్తివంతమైనది. ఈ క్షిపణి ద్వారా అమెరికా ప్రధాన భూభాగాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చని ఉత్తర కొరియా గతంలో పేర్కొంది. దీనికి ప్రతిస్పందనగా యూఎస్ఏ తాజాగా దక్షిణ కొరియా, జపాన్లతో కలసి దీర్ఘ శ్రేణి బీ-వన్ బీ బాంబర్లను ప్రయోగించింది.ఉత్తర కొరియాకు చెందిన కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ)ఈ క్షిపణిని 'హ్వాసాంగ్-19' ఐసీబీఎంగా పేర్కొంది. దీనిని ప్రపంచంలోని బలమైన వ్యూహాత్మక క్షిపణి అని పేర్కొంది. ఈ క్షిపణి పరీక్షను ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ వీక్షించారని, ఉత్తర కొరియాకు చెందిన విశిష్ట వ్యూహాత్మక అణు దాడి సామర్థ్యాన్ని ప్రదర్శించినందుకు శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపారని కేసీఎన్ఏ పేర్కొంది. ఎన్నికలకు ముందు ఉత్తర కొరియా జరిగిపిన క్షిపణుల ప్రయోగాలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఆయన ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచే లక్ష్యంతో కిమ్తో భేటీ అయ్యారు. ఇది కూడా చదవండి: అన్ని ప్రైవేటు ఆస్తులు ప్రభుత్వానివి కావు: సుప్రీం కీలక తీర్పు -
హోరాహోరీగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు
-
నష్టాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:51 సమయానికి నిఫ్టీ 52 పాయింట్లు తగ్గి 23,942కు చేరింది. సెన్సెక్స్ 186 పాయింట్లు నష్టపోయి 78,607 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 103.92 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.28 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.33 శాతం దిగజారింది.ఇదీ చదవండి: ఆర్బీఐలో ఉద్యోగానికి దరఖాస్తులు.. అర్హతలివే..సోమవారం మార్కెట్లో ఇంట్రాడేలో అన్ని రంగాల షేర్లలోనూ విక్రయాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా రియల్టీ ఇండెక్స్ 3% క్షీణించింది. ఆయిల్అండ్గ్యాస్, ఇంధన సూచీలు 2.50% పడ్డాయి. టెలికమ్యూనికేషన్, విద్యుత్, కమోడిటీ షేర్లు 1.50% నష్టపోయాయి. వాస్తవానికి చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్ సూచీ ఏకంగా 2% పతనమైంది. మిడ్క్యాప్ ఇండెక్స్ 1.50% నష్టపోయింది. ఈరోజు రాత్రి(అమెరికా కాలమానం ప్రకారం) యూఎస్ అధ్యక్ష ఎన్నికలు ఉండడంతో మార్కెట్లో కొంత ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అగ్రరాజ్యంలో ఎన్నికలపై మనోళ్ల ఉత్కంఠ
ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాకు మనదేశం నుంచి ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం వేలాది మంది వెళ్తుంటారు. ఇప్పటికే చాలామంది అక్కడి వెళ్లి స్థిరపడ్డారు.ఆ దేశంలో ఈనెల 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలాహారిస్ బరిలో నిలిచారు. వీరిలో ఎవరు గెలుస్తారోనని యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అమెరికాలో ఓటుహక్కు వినియోగించుకోనున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురి అభిప్రాయాలు వారి మాటల్లో..కమలా హారిస్కే విజయావకాశాలు ఎక్కువ కోదాడ: మాది కోదాడ. మేము ఉద్యోగ రీత్యా అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉంటున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్కే ఎక్కువ విజయావకాలున్నాయి. ఇతర దేశాల నుంచి ఇక్కడ స్థిరపడిన వారిలో 80 శాతం మంది కమలకే మద్దతుగా నిలుస్తున్నారు. భారతీయులు దాదాపు కమలాహారిస్ విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఇక్కడ వారి అంచనాల ప్రకారం 2శాతం మెజార్టీతో కమల గెలుపొంది అమెరికా అధ్యక్షురాలు అవుతుంది. – కందిబండ ప్రియాంక, నార్త్ కరోలినాట్రంప్ గెలవకూడదని కోరుకుంటున్నారుకోదాడ: మా స్వస్థలం కోదాడ పట్టణం. అమెరికాలోని నార్త్ కరోలినాలో స్థిరపడ్డాం. ప్రస్తుత పరిస్థితుల్లో డోనాల్డ్ ట్రంప్ గెలిస్తే ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారికి ఇబ్బందులు తప్పవనే ప్రచారం జరుగుతుంది. అమెరికన్లకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడంతో ట్రంప్కు మద్దతిచ్చేవారు తగ్గిపోయారు. ట్రంప్ గెలవకూడదని ఎక్కువ శాతం ప్రజలు కోరుతున్నారు. నార్త్ కరోలినాలో భారతీయులు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ కమలా హారిస్కే మద్దతు ఎక్కువగా ఉంది. – శరాబు కృష్ణకాంత్, నార్త్ కరోలినాడెమోక్రటిక్ పార్టీ వైపే మొగ్గుకోదాడ: మాది కోదాడ పట్టణం. అమెరికాలోని చికాగో నగరంలో స్థిరపడ్డాం. అధ్యక్ష్య ఎన్నికల్లో ఈ సారి ఇండియన్స్ డెమోక్రాట్స్ అభ్యర్థి కమలాహారిస్ వైపే మొగ్గు చూపుతున్నారు. స్వల్ప మెజార్టీతోనైనా కమల గెలుస్తుందనే చర్చ జరుగుతుంది. వలస చట్టాలపై ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని ఇతర దేశాల నుంచి అమెరికా వచ్చిన వారు భయపడుతున్నారు. ట్రంప్ కూడా తన ప్రసంగాలలో ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికన్ల అవకాశాలను దెబ్బతీస్తున్నారని ప్రచారం చేసూ్తన్నారు. – బొగ్గారపు మణిదీప్, గుడుగుంట్ల నాగలక్ష్మి, చికాగోబలమైన నాయకత్వం అవసరంఆత్మకూర్ (ఎస్): మాది ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామం. అమెరికాలోని నార్త్ కేరోలినాలో కెమికల్ ఎనావిుస్ట్గా స్థిరపడ్డాను. అమెరికా దేశం ముందు ఎన్నడూ చూడని సవాళ్లు ఎదుర్కొంటోంది. ధరలు పెరగడం, పెరుగుతున్న నేరాలు, సరిహద్దు భద్రత సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి బలమైన నాయకత్వం అవసరం. వైఫల్యంతో నిండిన బైడెన్ ఆర్థిక, వలస, విదేశీ విధానాల నుంచి పునరుద్ధరించడానికి ట్రంప్ గెలుపు చాలా అవసరం. – దండ నీరజ, కెమికల్ ఎనావిుస్ట్, నార్త్ కేరోలినాడోనాల్డ్ ట్రంపే గెలుస్తారు సూర్యాపేట: మాది సూర్యాపేట పట్టణం. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ సిన్సినాటి, ఒహాయో రాష్ట్రంలో ఉంటున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్కే విజయావకాశాలు ఉన్నాయి. నేను కూడా అదే పార్టీకి ఓటేయాలనుకుంటున్నా. ఈ సారి ట్రంప్ గెలిస్తే ఉక్రెయిన్, ఇజ్రాయిల్ యుద్ధాలు ఆగిపోతాయని భావిస్తున్నాం. ట్రంప్ గెలిస్తే వ్యాపార వర్గాలకు పన్నుల్లో రాయితీ ఇస్తారని, దీంతో ద్రవ్యోల్భణం నియంత్రణ అవుతుంది. – విజయశంకర్ కోణం, సిన్సినాటి, ఒహాయోట్రంప్ గెలిస్తేనే బాగుంటుందిఆత్మకూర్(ఎం) : మాది ఆత్మకూర్(ఎం) మండలం సిద్ధాపురం. మేము 27 సంవత్సరాల నుంచి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నివాసం ఉంటున్నాం. మంగళవారం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఉంది. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్, డెమోక్రటికన్ పార్టీ నుంచి కమల హారిష్ పోటీ పడుతున్నారు. హోరాహోరీ పోటీలో ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి ఉంది. ట్రంప్ ముక్కుసూటి మనిషి అయినా ఆయన గెలిస్తేనే భద్రత అనే ఉంటుందని నా అభిప్రాయం. కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షులుగా ఉన్నా పాలన పరంగా పెద్దగా అనుభవం లేదు. ఆమె విధి విధానాలు ట్రంప్కు లాభం కలిగేలా ఉన్నాయి. – ఏనుగు లక్ష్మణ్రెడ్డి, న్యూయార్క్హోరాహోరీగా ఎన్నికల ప్రచారంఅర్వపల్లి: మాస్వగ్రామం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం. అమెరికాలోని టెన్నెసి రాష్ట్రంలో ఉంటున్నాం. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఈసారి అక్కడి ఎన్నికల్లో మొదటిసారిగా ఓటు వేయబోతున్నాను. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. కమలాహారిస్, ట్రంప్ మధ్య పోటీ నువ్వా...నేనా అన్నట్లుగా ఉంది. భారతదేశ అభివృద్ధికి కృషిచేసే వారికే ఓటేయాలి. మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. – జన్నపు శ్రీదేవి, టెన్నెసిట్రంప్ గెలిస్తేనే భారతీయులకు భద్రతతిరుమలగిరి(నాగార్జునసాగర్): మాది నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం కొంపల్లి గ్రామం. నేను, నా భర్త బొలిగోర్ల శ్రీనివాస్, ఆలియాస్ కొంపల్లి శ్రీనివాస్ 2010లోనే ఆమెరికాలోని కొలంబస్కు వచ్చాం. అప్పటి నుంచి కొలంబస్లో ఉంటున్నాం. భారతీయుల భద్రత విషయంలో ట్రంప్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ట్రంప్ గెలుస్తేనే భారతదేశానికి గానీ, అమెరికాలో ఉంటున్న భారతీయులకు గానీ లాభం చేకూరుతుంది. కమలాహారిస్భారత సంతతికి చెందినప్పటికీ ఎక్కువ మంది భారతీయులు ట్రంప్ వైపే మొగ్గు చూపుతున్నారు. – దివ్య, కొలంబస్ట్రంప్ గెలిచే అవకాశం ఉందిభువనగిరి: మాది భువనగిరి పట్టణం. అమెరికాలోని కాలిఫోరి్నయాలో స్థిరపడ్డాం. ఈ నెల 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్షుడిగా బరిలో ఉన్న అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశం ఉంది. గతంలో దేశానికి అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉన్న ట్రంప్ మంచి ఆర్థిక సంస్కరణలు తీసుకురాగలరు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటే అమెరికా–ఇండియా మధ్య సత్సంబంధా లు మెరుగుపడతాయి. రిపబ్లిక్ పార్టీకి చెందిన అభ్యర్థి కమలాహ్యారీస్ భారత సంతితికి చెందిన వారు అయినప్పుటికీ ఇండియాకు చెందిన వారు ఆమెకు మద్దతు తెలపడం లేదు. – జి.సంతోష్, కాలిఫోరి్నయాప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ గెలవాలి భువనగిరి: మాది వలిగొండ మండలం టేకులసోమారం గ్రామం. అమెరికాలోని నార్త్ కరోలినాలో 23 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. ఆరు నుంచి 7 వరకు స్వింగ్ స్టేట్స్ వీరి గెలుపును నిర్థారిస్తాయి. ఎవరు గెలిచిన స్వల్ప మెజార్టీతో గెలుస్తారు. ఇండియన్స్ ఎక్కువ శాతం ట్రంప్ వైపు మొగ్గు చూపుతున్నారు. నేడు మాత్రం ట్రంప్కే ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను. – పడమటి శ్యాంసుందర్రెడ్డి, నార్త్ కరోలినాభారతదేశ అభివృద్ధికి సహకరించే వారికే ఓటేయాలిఅర్వపల్లి: మాది సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామం. అమెరికాలోని అట్లాంటా ఉంటున్నాం. ఇప్పటికే రెండు సార్లు అమెరికా ఎన్నికల్లో ఓటు వేశాను. భారతదేశ అభివృద్ధికి సహకరించే వారికి అమెరికా ఎన్నికల్లో భారతీయులు ఓటేయాలి. సాఫ్ట్వేర్ పరిశ్రమకు, భారత విదేశాంగ విధానం, ఎగుమతి, దిగుమతికి మద్దతు తెలిపే వాళ్లకే మా ఓటు. కులాలను చూసి ఓటు వేయవద్దు. – జూలకంటి లక్ష్మారెడ్డి, అట్లాంటాభారతీయులు ట్రంప్ వైపే.. అర్వపల్లి: మాది సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రం. అమెరికాలోని హూస్టన్లో స్థిరపడ్డాం. 30 ఏళ్ల పైనుంచి అక్కడే ఉంటున్నాం. ఇప్పటికే 20 సార్లు అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నాను. అమెరికాలో ఎక్కువ మంది భారతీయులు ట్రంప్వైపే ఉన్నారు. నాది రిపబ్లికన్ పార్టీ. నేను ఎన్నికల్లో ట్రంప్కే ఓటేస్తాను. – ఆలూరి బంగార్రెడ్డి, హూస్టన్ట్రంప్ గెలవాలనుకుంటున్నారునల్లగొండ: మాది నల్లగొండ. అమెరికాలోని లాస్ఏంజెల్స్లో స్థిరపడ్డాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా కమలా హ్యారిస్కు అంతగా అనుభవం లేదని ప్రజల్లో ప్రచారం సాగుతోంది. గతంలో అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ట్రంప్ వైపే అమెరికన్ ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ట్రంప్, కమలాహారిస్ మధ్య హోరాహోరీగా పోటీ ఉన్నా అమెరికా ప్రజలు ట్రంప్ గెలవాలనుకుంటున్నారు. – కంచరకుంట్ల వెంకటరాంరెడ్డి, లాస్ ఏంజెల్స్ట్రంప్తోనే ఉద్యోగావకాశాలునేరేడుచర్ల: మాది సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల. నేడు అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాను. ఈ ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ట్రంఫ్ గెలిస్తే భారతీయులకు ఉద్యోగ అవకాశాలు సురక్షితంగా ఉంటాయి. మేము ఉన్న ప్రాంతంలో మాతో పాటుగా చాలా మంది ట్రంప్కు ఓటు వేసే అవకాశాలున్నాయి. – దొంతిరెడ్డి విజయభాస్కర్రెడ్డి, బేబికాన్ నా మద్దతు కమలాహారిస్కే..శాలిగౌరారం: మాది శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామం. అమెరికాలోని మిజోరి స్టేట్లో స్థిరపడ్డాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్ల మధ్య తీవ్రపోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో తమ కుటుంబంలో ముగ్గురం ఓటు హక్కును వినియోగించుకోనున్నాం. నేను ఓటు వేయడం ఇది మూడవసారి. నా మద్ధతు కమలాహారిస్కే. – పాదూరి రామమోహన్రెడ్డి, మిజోరి స్టేట్ -
అమెరికా ఎన్నికలు: తులసేంద్రపురంలో పూజలు
చెన్నై:అమెరికా ఎన్నికల పోలింగ్ వేళ తమిళనాడు తులసేంద్రపురం గ్రామంలో సందడి నెలకొంది. అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కమలాహారిస్ పూర్వీకులది ఇదే గ్రామం. తమ ఊరి బిడ్డ ఎన్నికల్లో విజయం సాధించి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోవాలని తులసేంద్రపురం వాసులు గ్రామంలోని ఆలయంలో మంగళవారం(నవంబర్ 5) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటికే కమలాహారిస్ విజయాన్ని కాంక్షిస్తూ తులసేంద్రపురంలో పెద్ద బ్యానర్నే ఏర్పాటు చేశారు. గతంలో కమలాహారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా విజయం సాధించినపుడు కూడా తులసేంద్రపురం వాసులు టపాసులు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు.ప్రస్తుతం కమల ఏకంగా అధ్యక్ష పోరులోనే బరిలో ఉండడంతో ఆమె గెలుపుపై గ్రామ వాసుల్లో ఉత్కంఠ నెలకొంది. కమల ఉపాధ్యక్షురాలిగా పదవి చేపట్టక ముందు కాలిఫోర్నియా అటార్నీగా పనిచేస్తున్నపుడు తులసేంద్రపురంలోని గ్రామ ఆలయానికి 60 డాలర్లు విరాళమివ్వడం గమనార్హం.ఇదీ చదవండి: అమెరికా ఎన్నికలపై హిప్పో జోస్యం వీడియో వైరల్ -
ఎన్నికల వేళ ట్రంప్ కీలక ట్వీట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ సమయం వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఉద్దేశించి దేశ అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సోషల్మీడియాలో ప్రజలకు చివరిసారిగా విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.ముస్లిం ఓటర్లకు ట్రంప్ గాలంఅమెరికాను మళ్లీ గొప్పగా తీర్చుదిద్దుకుందామని,దేశ రాజకీయ చరిత్రలో అతిపెద్ద, విస్తృతమైన సంకీర్ణాన్ని నిర్మిద్దామని ట్రంప్ ఓటర్లకు పిలుపునిచ్చారు. కమలా హారిస్ అధికారంలోకి వస్తే పశ్చిమాసియా ఆక్రమణకు గురవుతుందని శాంతిని కోరుకునే మిచిగాన్లోని అనేక మంది అరబ్,ముస్లిం ఓటర్లుఓటర్లకు తెలుసన్నారు. అందుకే తనకు ఓటేసి శాంతిని పునరుద్ధరించాలని ట్రంప్ కోరారు.కమల చేతిలో ట్రంప్ ఓటమి ఖాయం:బైడెన్మరి కొన్ని గంటల్లో ఎన్నికలు జరగనున్నాయని, కమలా హారిస్ ట్రంప్ను ఓడిస్తుందని తనకు తెలుసని అధ్యకక్షుడు జో బైడెన్ పోస్టు చేశారు. ఇందుకు మీరంతా ఓటింగ్లో పాల్గొనాలని బైడెన్ కోరారు.ముందస్తు ఓటింగ్ను వినియోగించుకోని వారంతా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. Tomorrow is our last chance to defeat the corrupt establishment. GET OUT AND VOTE! #FightForAmerica https://t.co/czQRkZmr59 pic.twitter.com/vKF0bXhBnb— Donald J. Trump (@realDonaldTrump) November 5, 2024ఇదీ చదవండి: అమెరికా ఎన్నికలపై హిప్పో జోస్యం.. వీడియో వైరల్ -
అమెరికా ఎన్నికలపై ‘హిప్పో’ జోస్యం.. వీడియో వైరల్
బ్యాంకాక్:ప్రపంచమంతా అమెరికా ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. ట్రంప్, కమలాహారిస్లలో ఎవరు అధ్యక్ష పీఠం ఎక్కుతారనే చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికపై థాయ్లాండ్లోని మూ డెంగ్ అనే పొట్టి నీటిగుర్రం(హిప్పో) ఆసక్తికర జోస్యం చెప్పింది.కాబోయే అమెరికా అధ్యక్షుడెవరన్నదానిపై పొట్టి నీటి గుర్రం జోస్యం చెప్పిన వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్గా మారింది. థాయ్లాండ్లోని కావోక్యూ ఓపెన్ జూలో ఉన్న పొట్టి హిప్పోకు రెండు పుచ్చకాయ కేకులను ఆఫర్ చేశారు. వీటిలో ఒకదానిపై థాయ్భాషలో ట్రంప్ అని మరొకదానిపై కమల అని పేర్లు రాశారు. పొట్టిహిప్పో ట్రంప్ పుచ్చకాయ కేకును తినేసింది. అంటే ట్రంప్ గెలవనున్నారని జోస్యం చెప్పింది. అదే నీటి కొలనులో ఉన్న పెద్ద హిప్పో మాత్రం కమల పేరు ఉన్న పుచ్చకాయను తీసుకుంది. దీంతో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండబోతోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. Im not saying this is good omen but i would take anything... 😆 Moo Deng, the famous baby hippo, predicts Donald Trump will win the #Election2024 . The hippo must be a true #patriot pic.twitter.com/nrw4Q28G7v— motivate 4 life 🇺🇲 (@imotivate4life) November 4, 2024 ఇదీ చదవండి: రిపబ్లికన్లకు ఉడత సాయం -
USA Presidential Elections 2024: అత్యంత అవినీతిపరురాలు
వాషింగ్టన్: 2020 ఎన్నికల్లో ఓటమి తర్వాత తాను వైట్హౌస్ను వీడకుండా ఉండాల్సిందని మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. డెమొక్రాట్లు తనను మోసగించి గెలిచారని ఆరోపించారు. హోరాహోరీ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా ఆది, సోమవారాల్లో ఆయన కీలక స్వింగ్ రాష్ట్రాల్లో పర్యటించారు. పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియాల్లో పలు ర్యాలీల్లో మాట్లాడారు. ‘2020 ఎన్నికల్లో మనమేంటో చూపించాం. విజయం అంచుకు చేరాం. ఆ తర్వాతి పరిణామాలను ఎదుర్కోవాల్సింది. వైట్హౌస్ను వీడి ఉండాల్సింది కాదు’’ అన్నారు. ‘‘డెమొక్రాటిక్ పార్టీ ఓ రాక్షస పార్టీ. అతి పెద్ద అవినీతి యంత్రం. ఇక హారిస్ అత్యంత అవినీతిపరురాలు’’ అంటూ దుయ్యబట్టారు. -
USA Presidential Elections 2024: స్వేచ్ఛకే అమెరికన్ల ఓటు
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ నమ్ముకున్న విద్వేషాన్ని, విభజనవాదాన్ని అమెరికన్లు ఓడించడం ఖాయమని కమలా హారిస్ ధీమా వెలిబుచ్చారు. ‘‘స్వేచ్ఛా స్వాతంత్య్రాల పరిరక్షణకే ఓటేయాలని దేశమంతా పట్టుదలగా ఉంది. నెలల తరబడి దేశవ్యాప్తంగా జరిపిన ప్రచారం భాగంగా నాకిది కొట్టొచ్చినట్టు కన్పించింది’’ అని చెప్పారు. కీలక స్వింగ్ రాష్ట్రాల్లో ఒకటైన మిషిగన్లోని డెట్రాయిట్లో ఎన్నికల ర్యాలీలో ఆమె ఈ మేరకు పేర్కొన్నారు. ‘‘ఈసారి రెడ్ (రిపబ్లికన్లకు ఓటేసేవి) స్టేట్స్, బ్లూ (డెమొక్రాట్లకు ఓటేసేవి) స్టేట్స్ అంటూ విడిగా లేవు. అన్ని రాష్ట్రాలూ కలిసి చరిత్రాత్మక తీర్పు ఇవ్వనున్నాయి. మార్పు కోసం అమెరికా యువత ఈసారి భారీ సంఖ్యలో కదం తొక్కుతున్నారు. దేశ మౌలిక విలువల పరిరక్షణకు ముందుకొస్తున్నారు’’ అని స్పష్టం చేశారు. -
ట్రంప్ వైపే కీలక స్వింగ్!
వాషింగ్టన్: ఫలితాలను తేల్చే కీలక స్వింగ్ స్టేట్స్ అయిన పెన్సిల్వేనియా, మిషిగన్, జార్జియా, నార్త్ కరోలినా, నెవడా, అరిజోనా, విస్కాన్సిన్ అనూహ్యంగా ట్రంప్ వైపు మొగ్గుతున్నాయి. మొత్తం ఏడు రాష్ట్రాల్లోనూ ఆయనే ఆధిక్యంలోకి వచ్చినట్టు అట్లాస్ ఇంటెల్ తాజా పోల్లో తేలడం విశేషం. నవంబర్ 1, 2 తేదీల్లో జరిగిన ఈ పోల్లో ట్రంప్కు ఓటేస్తామని 49 శాతం చెప్పారు. హారిస్కు జైకొట్టిన వాళ్లకంటే ఇది ఏకంగా 1.8 శాతం అధికం! అరిజోనాలోనైతే ట్రంప్ ఏకంగా 6.5 శాతం ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఆయనకు 52.3, హారిస్ 45.8 శాతం మంది జైకొట్టారు. నెవడాలో కూడా ట్రంప్ 5.2 శాతం ఆధిక్యంలో ఉన్నారు. ఆయన నార్త్ కరోలినాలో 3.2, జార్జియాలో 2.5, పెన్సిల్వేనియాలో 1.9, మిషిగన్లో 1.5, విస్కాన్సిన్లో 1.1 శాతం ఆధిక్యంలో ఉన్నట్టు సర్వే తేల్చింది. మరో సర్వే సైతం ఏడు స్వింగ్ స్టేట్స్లోనూ ట్రంపే గెలిచే అవకాశముందని తెలిపింది.అక్టోబర్ 24– నవంబర్ 2 మధ్య జరిగిన న్యూయార్క్ టైమ్స్/ సియానా కాలేజ్ పోల్ సర్వే స్వింగ్ స్టేట్స్లో హోరాహోరీయే సాగుతోందని పేర్కొంది. అయితే వాటిలో ఇప్పటిదాకా న్యూయార్క్ టైమ్స్ జరిపిన అన్ని పోల్స్లోనూ హారిస్ కనీసం 4 శాతం, అంతకుమించి స్పష్టమైన ఆధిక్యంలో ఉండగా తాజా సర్వేలో ట్రంప్ మెరుగవడం విశేషం. హారిస్ 49 శాతం ఓట్లతో ట్రంప్ కంటే కేవలం ఒక పాయింట్ ఆధిక్యంలో ఉన్నట్టు సర్వే తేల్చింది. నార్త్ కరోలినా, విస్కాన్సిన్, నెవడాల్లో హారిస్కు ఆధిక్యం కనబడగా అరిజోనాలో ట్రంప్ స్పష్టంగా ముందంజలో ఉన్నారు. హారిస్ నెవడాలో 3 శాతం, విస్కాన్సిన్, నార్త్ కరోలినాల్లో 2 శాతం, జార్జియాలో ఒక శాతం ఆధిక్యంలో ఉన్నారు. ఇద్దరికీ పెన్సిల్వేనియాలో 48 శాతం, మిషిగాన్లో 47 శాతం చొప్పున వచ్చాయి. అరిజోనాలో మాత్రం ట్రంప్ ఏకంగా 4 శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎన్బీసీ న్యూస్ తాజా సర్వేలో ట్రంప్, హారిస్ ఇద్దరూ చెరో 49 శాతం ఓట్లు సాధించారు. ఎవరికి ఓటేయాలో ఇంకా తేల్చుకోలేదని సర్వేలో పాల్గొన్న వారిలో 2 శాతం మంది చెప్పారు. పోల్ ఆఫ్ పోల్స్లో ట్రంప్ 0.1 శాతం అతి స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.ఓటేసిన వారిలో హారిస్కు 8 శాతం ఆధిక్యంఏడు స్వింగ్ స్టేట్లలో ఇప్పటికే 40 శాతం మంది ఓటేశారు. వారిలో హారిస్ 8 శాతం ఆధిక్యంలో ఉన్నట్టు న్యూయార్క్ టైమ్స్ సర్వే తెలిపింది. కాకపోతే ఓటేయాల్సి ఉన్న వారిలో మాత్రం ట్రంప్ ముందంజలో ఉన్నట్టు వెల్లడించింది. పెన్సిల్వేనియాలో గట్టి పోటీ నెలకొంది. అమెరికాలో ఏడు స్వింగ్ స్టేట్స్ను మినహాయిస్తే మిగతావన్నీ సేఫ్ స్టేట్లే. వాటిలో ఏదో ఒక పార్టీయే నిలకడగా గెలుస్తూ వస్తోంది. వాటిని రెడ్ (రిపబ్లికన్), బ్లూ (డెమొక్రటిక్) రాష్ట్రాలుగా పేర్కొంటారు. రెడ్ స్టేట్స్ 1980 నుంచి రిపబ్లికన్లకు, బ్లూ స్టేట్స్ 1992 నుంచి డెమొక్రాట్లకు జై కొడుతూ వస్తున్నాయి. దాంతో ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో పై చేయి సాధించే వారే గద్దెనెక్కడం పరిపాటి. వాటిలో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు హోరాహోరీగా తలపడుతుంటారు. ఈ రాష్ట్రాల్లో సాధారణంగా గెలుపోటముల మధ్య తేడా స్వల్పంగానే ఉంటుంది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ అరిజోనాలో కేవలం 10,000 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు.హారిస్వైపు అయోవా!పోలింగ్ తేదీ ముంచుకొచ్చిన వేళ రిపబ్లికన్లకు అనూహ్య షాక్ తగిలింది. వారికి అత్యంత సేఫ్ స్టేట్స్లో ఒకటైన అయోవా అనూహ్యంగా హారిస్వైపు మొగ్గుతున్నట్టు తాజా సర్వే ఒకటి తేల్చింది. అందులో హారిస్కు 47 శాతం ఓట్లు రాగా ట్రంప్కు 44 శాతమే దక్కాయి. మహిళలతో పాటు తటస్థ ఓటర్లు భారీగా ఆమె వైపు మొగ్గడమే ఇందుకు కారణమని దెస్ మొయినెస్ రిజిస్టర్ వార్తా పత్రిక కోసం ఈ సర్వేను నిర్వహించిన సెల్జర్ పోల్ సంస్థ వివరించింది. అమెరికాలో పోల్స్ నిర్వహణలో అత్యధిక రేటింగులున్నది ఈ సంస్థకే కావడం విశేషం. అమెరికావ్యాప్తంగా మహిళల్లో ఇదే ధోరణి ప్రతిఫలిస్తే హారిస్ భారీ మెజారిటీతో నెగ్గినా ఆశ్చర్యం లేదంటున్నారు. సెప్టెంబర్ పోల్లో అయోవాలో ట్రంప్ 4 శాతం ఆధిక్యంలో ఉన్నారు. జూన్లో బైడెన్పై 18 పాయింట్ల ఆధిక్యం కనబరిచారు. అయోవా పోల్ తాజా ఫలితాలను తప్పుడువంటూ ట్రంప్ కొట్టిపారేశారు. -
రిపబ్లికన్లకు ‘ఉడుత సాయం’!
న్యూయార్క్: నేడు మొదలవుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటిదాకా ట్యాక్స్లు, అబార్షన్ హక్కులు, అక్రమ వలసలు ప్రధాన అంశాలుకాగా చిట్టచివర్లో ఒక ఉడుత చొరబడింది! రేబిస్ అనుమానంతో దాన్ని అధికారులు చంపేయడం చర్చనీయంగా మారింది. రిపబ్లికన్లు దీన్ని తమ ప్రచారాంశంగా మార్చుకున్నారు. బుల్లి టోపీలు, గమ్మతైన ట్రిక్కులతో మిఠాయిలపై గెంతుతూ ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిన ఈ ఉడుతకు ‘పీనట్’ అని పేరు. న్యూయార్క్లో మార్క్ లాంగో అనే వ్యక్తి ఏడేళ్లుగా పెంచుతున్నాడు. దీంతోపాటు నక్కలా చిన్నగా ఉండే రఖూన్ అనే జీవినీ పెంచుతున్నాడు. ఈ వన్య ప్రాణుల పెంపకానికి అనుమతి, లైసెన్స్ తప్పనిసరి. అవి లేకపోవడంతో అధికారులు వాటిని స్వాదీనం చేసుకున్నారు. ఉడుత ఇటీవల ఒకరిని కరిచిందట. దాంతో ప్రాణాంతకర రేబిస్ వ్యాధి ప్రబలే ఆస్కారముందంటూ పీనట్, రఖూన్ రెండింటినీ గత వారం విషమిచ్చి చంపేశారు. దీన్ని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ రన్నింగ్ మేట్ వాన్స్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘బైడెన్ సర్కారు నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం. ప్రభుత్వం మతిలేని, దయలేని యంత్రంగా మారింది. అనాథ ఉడుతను నిర్దయగా చంపేసింది. ఇలాంటి ఉడుతలను సైతం ట్రంప్ కాపాడగలరు’’ అంటూ మస్క్ పోస్ట్ చేశారు. ‘‘6 లక్షల మంది నేరస్తులు, 13 వేల మంది హంతకులు, 16 వేల మంది రేపిస్టులు స్వేచ్ఛగా అమెరికాలోకి అడుగు పెట్టేలా చేసిన డెమొక్రటిక్ ప్రభుత్వం ఒక పెంపుడు ఉడుతను మాత్రం బతకనీయలేదు’’ అంటూ వాన్స్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అమెరికాలో పోలింగ్ నేడే.. కమల వికాసమా! ట్రంప్కే పట్టమా!
భారత మూలాలున్న కమలా హారిస్ కొత్త చరిత్ర లిఖిస్తారా? అమెరికా అధ్యక్ష పీఠమెక్కిన తొలి మహిళగా రికార్డు సృష్టిస్తారా? లేక ఆమెతో హోరాహోరి పోరులో పైచేయి సాధించి డొనాల్డ్ ట్రంపే రెండోసారి గద్దెనెక్కుతారా? ఈ ప్రశ్నలకు మరికొద్ది గంటల్లో సమాధానం లభించనుంది. అగ్ర రాజ్యంలో అధ్యక్ష ఎన్నికల పోరు అతి కీలక ఘట్టానికి చేరింది. మంగళవారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. అమెరికాకు 47వ ప్రెసిడెంట్ ఎవరన్నది రాత్రికల్లా తేలిపోయే అవకాశముంది. 60 ఏళ్ల హారిస్, 78 ఏళ్ల ట్రంప్ కొద్ది నెలలుగా నువ్వా, నేనా అన్నట్టుగా పోటీపడ్డారు. దాంతో ఇవి గత కొన్ని దశాబ్దాల్లో అత్యంత పోటాపోటీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరుగా ఇప్పటికే చరిత్ర సృష్టించాయి. ఇప్పటిదాకా వెలువడ్డ అన్ని ముందస్తు పోల్స్లోనూ వారిద్దరూ సమవుజ్జీలుగా ఉంటూ వచ్చారు. అయితే పోలింగ్కు ఒక్క రోజు ముందు సోమవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫలితాలను నిర్దేశించే కీలకమైన ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో ఇప్పటిదాకా అభ్యర్థులిద్దరి మధ్యా హోరాహోరీ ఉండగా తాజాగా వాటన్నింట్లోనూ ట్రంపే ముందంజ వేసినట్టు పలు పోల్స్ తేల్చాయి. అదే సమయంలో రిపబ్లికన్ల కంచుకోటైన అయోవాలో హారిస్ పైచేయి సాధించినట్టు మరో పోల్లో వెల్లడవడం విశేషం. అంశాలవారీగా చూస్తే అమెరికన్లను ప్రధాన సమస్యలుగా భావిస్తున్న ఎనాకమీతో పాటు అక్రమ వలసలు తదితరాల్లో తొలినుంచీ ట్రంప్కే స్పష్టమైన మొగ్గు కనిపిస్తోంది. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా కల్లోల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయనైతేనే దేశానికి గట్టి నాయ కత్వం అందించగలరన్న అభిప్రాయమూ అమెరికన్లలో నెలకొంది. మరోవైపు హారిస్కేమో భార త, నల్లజాతి మూలాలు బాగా కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యమున్న ఓటర్లంతా ఆమెకే ఓటేయడం ఖాయ మంటున్నారు. దీనికి తోడు ఈసారి స్వింగ్ స్టేట్లను తోసిరాజని అధ్యక్షున్ని తేల్చడంలో నిర్ణాయకంగా మారగలదని భావిస్తున్న మహిళా ఓటర్ల మద్దతూ హారిస్కే ఉండటం అతి పెద్ద సానుకూలాంశం. అబార్షన్ల వంటి పలు కీలకాంశాల్లో కూడా హారిస్దే పైచేయిగా ఉంది. ఈ నేపథ్యంలో ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. తటస్థ ఓటర్లే ఫలితాన్ని నిర్దేశించేలా ఉన్నారు...ఓటేసిన కమల అధ్యక్షుడు జో బైడెన్ బాటలో హారిస్ కూడా ఈసారి ముందస్తుగా ఓటేశారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం డెట్రాయిట్లో ఈ మేరకు విలేకరులకు వెల్లడించారు. ‘‘నేనిప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశాను. అది త్వరలో కాలిఫోరి్నయా చేరనుంది. పోస్టల్ బ్యాలెట్ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకముంది’’ అని తెలిపారు. మెయిల్ ఓటింగ్ వ్యవస్థను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బైడెన్ ఇటీవలే తన స్వస్థలం డెలావెర్లో ముందస్తు ఓటు వేయడం తెలిసిందే. స్వింగ్ స్టేట్లలో చివరి ప్రయత్నాలు హారిస్, ట్రంప్ ఇద్దరూ కొద్ది రోజులుగా స్వింగ్ స్టేట్లపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ఆది, సోమవారాల్లో ట్రంప్ పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియాల్లో వరుస ర్యాలీల్లో పాల్గొన్నారు. ఆదివారం మిషిగన్లో కలియదిరిగిన హారిస్ సోమవారం పెన్సిల్వేనియాలో ర్యాలీల్లో ప్రసంగించారు.2020లో పోలింగ్ 66 శాతమే అమెరికాలో 24 కోట్ల పై చిలుకు అర్హులైన ఓటర్లున్నారు. కానీ ఓటర్లుగా నమోదు చేసుకున్న వారు మాత్రం 16.14 కోట్ల మందే. ఇది 2020 కంటే కూడా తక్కువ. 2020లో 16.8 కోట్ల మంది నమోదైన ఓటర్లుండగా వారిలో ఆ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసింది 15.9 కోట్ల మంది మాత్రమే. అంటే కేవలం 66 శాతం ఓటింగ్ నమోదైంది.అమెరికా జనాభా - 34.6 కోట్లు అర్హులైన ఓటర్లు - 23.5 కోట్ల పై చిలుకు నమోదైన ఓటర్లు - 16,14,22,000 ఇప్పటికే ఓటేసింది - 7.7 కోట్ల పై చిలుకు తొలిసారి ఓటేస్తున్నది - 1.9 కోట్ల పై చిలుకు ప్రచార నినాదాలు హారిస్ → అమెరికన్ల స్వేచ్చా స్వాతంత్య్రాల పరిరక్షణ → రాజ్యాంగ విలువలు, మహిళల హక్కులకు రక్షణ ట్రంప్ → దేశ ఆర్థిక పునరి్నర్మాణం → అక్రమ వలసలకు పూర్తి అడ్డుకట్ట పోలింగ్ వేళలు స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7–9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా (భారత కాలమానం ప్రకారం రాష్ట్రాలవారీగా మంగళవారం సాయంత్రం 4.30 నుంచి 9.30 మధ్య పోలింగ్ మొదలవుతుంది. బుధవారం ఉదయం దాకాకొనసాగుతుంది) అసలు ఎన్నిక డిసెంబర్ 16న!విజేతను తేల్చేది ఎలక్టోరల్ ఓట్లేఅమెరికాలో అధ్యక్షున్ని ఎన్నుకునేది ఆ దేశ ఓట ర్లు కాదు. ఎలక్టోరల్ కాలేజీ. అందులో 538 ఓట్లుంటాయి. వాటిలో కనీసం 270 సాధించిన వారే అధ్యక్షుడవుతారు. ఓటర్లు మంగళవారం నేరుగా ఎన్నుకునేది ఈ ఎలక్టోరల్ కాలేజీ సభ్యులనే. వారిని ఎలక్టర్లుగా పిలుస్తారు. పోలింగ్ ముగిశాక నెల పాటు వారి ఎన్నిక ప్రక్రియ సాగుతుంది. వారంతా డిసెంబర్ 16న సమావేశమై అధ్యక్షునికి, ఉపాధ్యక్షునికి ఓటేస్తారు. జనవరి 6న ఫలితంజనవరి 6న అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమా వేశం జరుగుతుంది. ఎలక్టోరల్ ఓట్లను లెక్కించి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎవరో తేలేస్తారు. సెనేట్ అధ్యక్షుని హోదాలో ఉపాధ్యక్షుడు వారి పేర్లను ప్రకటిస్తారు. జనవరి 20న (ఆ రోజు ఆదివారమైతే మర్నాడు) ప్రమాణస్వీకారం జరుగుతుంది. ఇలా ఓటింగ్ తర్వాతా ఎన్నిక ప్రక్రియ మరో రెండు నెలలు సాగుతుంది!టై అయితే?ట్రంప్, హారిస్ ఇద్దరిలో ఎవరికీ మెజారిటీ, అంటే కనీసం 270 ఎలక్టోరల్ ఓట్లు రాని పక్షంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరం. అందుకు ఆస్కారం అతి తక్కువగా కనిపిస్తున్నా, ఇద్దరికీ చెరో 269 ఓట్లు వచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే అధ్యక్షున్ని ఎన్నుకునే బాధ్యత అమెరికా కాంగ్రెస్పై పడుతుంది. దిగువ సభ అయిన ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. ఇందుకోసం జనవరి 6న సమావేశమవుతుంది. ఒక్కో రాష్ట్రానికి ఒకటి చొప్పున 50 ఓట్లు కేటాయిస్తారు. 26, అంతకంటే ఎక్కువ ఓట్లు సాధించే వారే అధ్యక్షుడవుతారు. ఉపాధ్యక్ష ఎన్నికలో ఫలితం తేలని పక్షంలో ఎగువ సభ అయిన సెనేట్ ఉపాధ్యక్షున్ని ఎన్నుకుంటుంది. 100 సెనేట్ ఓట్లలో కనీసం 51 లేదా అంతకంటే ఎక్కువ సాధించేవారు విజేత అవుతారు. చివరిసారిగా రెండు శతాబ్దాల కింద, అంటే 1800లో ఇలాంటి పరిస్థితి తలెత్తింది. థామస్ జెఫర్సన్, ఆరన్ బ్లర్ ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. దాంతో ప్రతినిధుల సభ ఓటింగ్లో జెఫర్సన్ విజేతగా నిలిచారు.అత్యధిక ఓట్లొచ్చినా గ్యారెంటీ లేదుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అత్యధిక ఓట్లు (పాపులర్ ఓట్) సాధించే అభ్యర్థి గెలుస్తారన్న గ్యారెంటీ లేదు. 2016లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు ప్రత్యర్థి ట్రంప్ కంటే 28 లక్షల పై చిలుకు ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అయినా ఆమె 74 ఎలక్టోరల్ ఓట్ల తేడాతో ఓడారు. 2000లో అల్ గోర్ (డెమొక్రాట్) కూడా జార్జి డబ్లు్య.బుష్ కంటే 5.5 లక్షల ఎక్కువ ఓట్లు సాధించినా ఓడారు. మెయిన్, నెబ్రాస్కా మినహా 48 రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విన్నర్ టేక్స్ ఆల్ విధానమే ఇందుకు కారణం. దాని ప్రకారం మెజారిటీ ఓట్లు వచ్చిన పార్టీకే ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ ఓట్లన్నీ దక్కుతాయి.న్యూయార్క్లో బెంగాలీ బ్యాలెట్లుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో న్యూయార్క్లో బ్యాలెట్ పేపర్లపై బెంగాలీ భాష చోటుచేసుకోవడం విశేషం. అధికారక భాషగా ఇంగ్లిష్ కాకుండా బెంగాలీతో పాటు చైనీస్, స్పానిష్, కొరియన్ భాషలకు బ్యాలెట్ పేపర్లపై చోటుదక్కింది. న్యూయార్క్లో బెంగాలీలతో పాటు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారి సంఖ్య అధికం. న్యూయార్క్లో ఏకంగా 200కు పైగా భాషలు మాట్లాడేవాళ్లు నివసిస్తుండటం విశేషం. హారిస్ సానుకూలతలు1. ట్రంప్ పట్ల భయాందోళనలుఅమెరికన్లలో జాతి తదితర ప్రాతిపదికలపై విభజన తెచ్చిన అధ్యక్షునిగా ట్రంప్ అప్రతిష్టపాలయ్యారు. అందరినీ కలుపుకుపోయే నేతగా పేరుండటం హారిస్కు కలిసొచ్చే అంశం. అందుకే ట్రంప్ను ఫాసిస్టుగా, ప్రజస్వామ్యానికే ప్రమాదకారిగా హారిస్ తన ప్రచారంలో పదేపదే అభివర్ణించారు. ఆయన గెలిస్తే అమెరికన్లను మరోసారి విడదీస్తారని హెచ్చరించారు.2. బైడెన్కు సమర్థ ప్రత్యామ్నాయండెమొక్రాట్ల అభ్యర్థిగా ఒక దశలో అధ్యక్షుడు బైడెన్ పేరు దాదాపుగా ఖరారైంది. వయోభారం, మతి మరుపు తదితర సమస్యలతో సతమతమవుతున్న ఆయన పట్ల ఓటర్లంతా పెదవి విరుస్తున్నట్టు అన్ని పోల్స్లోనూ స్పష్టమైంది. దాంతో ఒక దశలో డెమొక్రాట్లు గెలుపుపైనే ఆశలు వదిలేసుకున్నారు. అయితే సమయం మించిపోకుండా ఆయన్ను తప్పించి హారిస్ను తెరపైకి తీసుకురావడంతో పోరు ఒక్కసారిగా రసవత్తరంగా మారింది.3. మహిళల హక్కుల యోధురాలుమహిళల హక్కుల పరిరక్షణ విషయంలో ట్రంప్తో పోలిస్తే హారిస్ ఎంతో ఎత్తున నిలిచారు. ముఖ్యంగా కీలకమైన అబార్షన్ అంశంపై హారిస్కు మహిళల్లో ఆదరణ నానాటికీ విపరీతంగా పెరుగుతోంది. దాంతో ట్రంప్ కూడా అబార్షన్ల హక్కును వ్యతిరేకించే విషయంలో వెనక్కు తగ్గాల్సి వచ్చింది. 10 రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికతో పాటే అబార్షన్ హక్కులపైనా ఓటింగ్ జరుగుతోంది. ఇది హారిస్కు మరింత కలిసొస్తుందని చెబుతున్నారు.4. ఓటింగ్ శాతంట్రంప్ అభిమానులు ఎక్కువగా గ్రామీణులు, పట్టణ శివారు ప్రాంతాల ప్రజలే. హారిస్ మద్దతుదారుల్లో జాబితాలో వృద్ధులు, విద్యాధికుల సంఖ్య ఎక్కువ. గ్రామీణులు, శివారు ప్రజలతో పోలిస్తే ప్రతి ఎన్నికలోనూ వారే అధిక సంఖ్యలో ఓటేస్తూ వస్తున్నారు. ఈ ట్రెండు హారిస్కు బాగా సానుకూలంగా మారేలా కనిపిస్తోంది.5. ముమ్మర ప్రచారం, వ్యయంఅమెరికా ఎన్నికలు అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారం. ట్రంప్తో పోలిస్తే హారిస్ భారీగా ఎన్నికల విరాళాలు సేకరించడమే గాక ప్రచారంపై ఎక్కువ వ్యయం చేశారు. ఆలస్యంగా జూలైలో రేసులోకి వచ్చిన ఆమె, జనవరి నుంచి 11 నెలల వ్యవధిలో ట్రంప్ సేకరించిన దానికన్నా ఎక్కువ మొత్తం సేకరించడం విశేషం. ముఖ్యంగా కీలకమైన ఏడు స్వింగ్ రాష్ట్రాల్లో విరాళాల సేకరణలో హారిసే ముందున్నారు. ట్రంప్ సానుకూలతలు1. ప్రభుత్వ వ్యతిరేకతఅమెరికా ఓటర్లలో అత్యధికులకు ఈసారి ఎకానమీయే అతి పెద్ద సమస్యగా మారింది. నిరుద్యోగం కూడా వారిని బాగా కలవరపెడుతున్న మరో అంశం. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాంతో బైడెన్ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొని ఉన్న తీవ్ర వ్యతిరేకత ట్రంప్కు బాగా కలిసి రానుంది. ఉపాధ్యక్షురాలు హారిస్కు ఇది బాగా ప్రతికూలంగా మారవచ్చు. తమ ఆర్థిక స్థితిగతులు అధ్వానంగా మారాయని ఏకంగా 62 శాతం మంది అమెరికన్లు చెబుతుండటం విశేషం. 79 శాతం మంది దేశం తిరోగమన బాటలో ఉందని భావిస్తున్నారు.2. తగ్గని ప్రజాదరణ2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరించకుండా క్యాపిటల్ హిల్పైకి దాడులకు మద్దతుదారులను ఉసిగొల్పినా, క్రిమినల్ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షుడన్న చెత్త రికార్డును మూటగట్టుకున్నా ట్రంప్కు జనాదరణ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది పొడవునా కనీసం 40 శాతం, అంతకంటే ఎక్కువ మంది అమెరికన్లు ఆయనకు మద్దతు పలకడం విశేషం.3. అక్రమ వలసలురెండోసారి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానన్న ట్రంప్ ప్రకటన అమెరికన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఏకంగా 10 లక్షల మందిని స్వదేశాలకు పంపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అబార్షన్లపై హారిస్ వైఖరిపైనే డెమొక్రాట్లు ఆశలు పెట్టుకోగా ట్రంప్ ప్రధానంగా అక్రమ వలసల అంశమే తనను గట్టెక్కిస్తుందని నమ్మకం పెట్టుకున్నారు.4. సామాన్యుల దన్నుగ్రామీణులు, డిగ్రీ కంటే తక్కువ విద్యార్హతలున్న వారు ట్రంప్ను మొదట్నుంచీ అభిమానిస్తూ వస్తున్నారు. వారిలో ఆయనకు ఆదరణ ఈసారి మరింత పెరిగింది. దీనికి తోడు డెమొక్రాట్ల మద్దతిచ్చే కార్మిక సంఘాలు కూడా ఈసారి ట్రంప్కు జై కొడుతున్నాయి. గ్రామీణ ఓటర్లు, స్వింగ్ స్టేట్లలోని పట్టణ శివారు ప్రాంత ఓటర్లు భారీగా ఓటేసేలా చూడగలిగితే ట్రంప్ విజయావకాశాలు భారీగా పెరుగుతాయి.5. గట్టి నేతగా పేరుఅంతర్జాతీయంగా నెలకొన్న కల్లోల పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ పెద్దన్నగా అమెరికా ఆధిప త్యాన్ని పరిరక్షించగల సామర్థ్యం ట్రంప్కే ఉందని మెజా రిటీ ప్రజలు భావిస్తున్నారు. ఆయన అధ్యక్షు నిగా ఉండగా ప్రపంచంలో ఎక్కడా యుద్ధాలు జర గని విషయాన్ని అభిమానులు గుర్తు చేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
USA Presidential Elections 2024: ఎవరిపైన అనుగ్రహం
ఎన్నికలంటే ఉపన్యాసాలు, వాదనలు, పందేలు, ప్రగల్భాలు... ఇవి కాకుండా సర్వేలు, జోస్యాలు కూడా ఉంటాయి. మన దేశంలో ఇవి షరా మామూలే అయినా అమెరికాలో కూడా ఉన్నాయంటే కాసింత ఆశ్చర్యమే. చరిత్రలో ఇంతకు మునుపు లేని విధంగా ఒక స్త్రీగా కమలా హ్యారిస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతుంటే గ్రహాలన్నీ ఆమెను చల్లగా చూడనున్నాయని అక్కడి జ్యోతిష్యులు అంటున్నారు. అలాగని ట్రంప్ కోసం తారాతీరాన్ని చూస్తున్నవారు తక్కువగా లేరు. ఇంతకీ అక్కడ ఏం చెబుతున్నారు?ఎన్నికల కాలంలో జ్యోతిషులకు గిరాకీ మన ‘సనాతన’ దేశంలోనే కాదు, అగ్రరాజ్యమైన అమెరికాలోనూ ఉంది. త్వరలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి జ్యోతిషులు రకరకాలుగా జోస్యాలు చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ల మధ్య హోరాహోరీగా పోటీ సాగుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ఇదివరకు ఒకసారి అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు. అయినా ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్కే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అమెరికన్ జ్యోతిషురాలు ‘లారీ రివర్స్’ గత ఏడాది జూన్లోనే జోస్యం చెప్పారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ పోటీకి దిగుతారని లారీ 2020 ఆగస్టులో చెప్పిన జోస్యం ఫలించడంతో ఈ ఎన్నికల్లో ఆమె జోస్యంపై జనాలు నమ్మకం పెంచుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో కమలా హ్యారిస్ విజయం తథ్యమని మరో జ్యోతిషురాలు ‘అమీ ట్రిప్’ జోస్యం ప్రకటించారు. ‘స్టార్హీల్’ అనే యూజర్ పేరుతో ‘టిక్టాక్’లో నిత్యం జోస్యాలు చెప్పే అమీ ట్రిప్కు 7.40 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఏడాది జూలైలో కొత్తగా ‘టిక్ టాక్’లోకి ప్రవేశించిన జ్యోతిషుడు జో థియోడర్ కూడా కమలా హ్యారిస్కు అనుకూలంగా జోస్యాన్ని ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై జోస్యాలు చెబుతున్న వారిలో ఎక్కువ మంది కమలా హ్యారిస్కు అనుకూలంగా జోస్యాలు చెబుతున్నారు.డొనాల్డ్ ట్రంప్ 1946 జూన్ 14న పుట్టారు. కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న పుట్టారు. వీరిద్దరూ నిండు పున్నమి తిథిలోనే పుట్టారు. అయితే ట్రంప్ పుట్టిన రోజున సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ఏర్పడింది. ‘చాలామంది జ్యోతిషులు ఈ ఎన్నికల్లో కమలా హ్యారిస్ గెలవాలని భావిస్తున్నారు. అందుకే ఆమెకు అనుకూలంగా జోస్యాలు చెబుతున్నారు. అయితే, సంపూర్ణ చంద్రగ్రహణం రోజున పుట్టిన వారి శక్తిని తక్కువగా అంచనా వేయలేం. ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి’ అని బ్రిటన్కు చెందిన జ్యోతిషురాలు ఫ్రాన్సెస్కా ఆడీ చెబుతుండటం విశేషం.మరోవైపు భారతీయ జ్యోతిష్యులలో ఒకడైన కార్తిక్ గోర్ ట్రంప్కు వ్యతిరేకంగా ఉన్న రాహువు కమలా హ్యారిస్కు మాత్రం వరాలు కురిపించనున్నాడని చెప్పారు. మరో జ్యోతిష్యుడు విజయేంద్ర ట్రంప్ జాతకం ప్రకారం ఆయన విషయంలో చంద్రుడు వేదనలో ఉన్నాడని అందువల్ల అతనికి ప్రతికూలత ఎదురుకానుందని అన్నారు. అయితే చాట్జిపిటి ద్వారా కొందరు 16 శతాబ్దపు మహా జ్యోతిష్యుడైన నోస్ట్రాడామస్ ఇప్పుడు ఉంటే అతను అమెరికా ఎన్నికల విషయంలో ఏం జోస్యం చెబుతాడని ఏ.ఐ.ని అడిగితే అది అనూహ్యమైన జవాబు చెప్పింది. ‘కమలా హ్యారిస్గానీ ట్రంప్గానీ ఊహించే అంచనాకు చేరలేకపోవచ్చు’ అంది. ‘చివరి నిమిషంలో మలుపు తిరిగి రంగంలో లేని వారు పదవిని ఆశించవచ్చు’ కూడా అన్యాపదేశంగా సూచించింది. దాంతో ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ బరిలో ఉన్న టిమ్ వాల్జ్, జెడి వాన్స్ వైపు కొంతమంది చూస్తున్నారు. అలాగే ఏ.ఐ ఈ ఎలక్షన్ల తర్వాత అమెరికాలో అల్లర్లు రేగుతాయని, వీధులు మండుతాయని కూడా జోస్యం చెప్పింది.గతంలో బైడన్ అధ్యక్షుడు అయ్యే ముందు అలాగే జరిగింది కదా.ఏమైనా ఈ ఎన్నికలు అందరినీ ఉత్కంఠగా ఎదురు చూసేలా చేస్తున్నాయి. గ్రహాలు ఇదంతా లైవ్లో చూస్తూ ఫలితాలను ఏమని టెలికాస్ట్ చేస్తాయో త్వరలో తెలియనుంది. -
ఈ ఐదు అంశాలే.. అధ్యక్ష పీఠానికి ఆయుధాలు
-
కుదేలైన స్టాక్ మార్కెట్
-
కొన్ని గంటల్లో అమెరికా ఎన్నికలు.. విశేషాలివే..
అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల పోలింగ్కు సమయం ఆసన్నమైంది. నవంబర్ 5 (మంగళవారం)పోలింగ్ జరగనుంది. బరిలో ఇతర అభ్యర్థులు కూడా ఉన్నా ప్రధాన పోరు మాత్రం రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్యే జరగనుంది. పోలింగ్కు మరికొద్ది గంటలే ఉండడంతో ట్రంప్,హారిస్లు తమ ప్రచారాన్ని స్వింగ్ స్టేట్స్లో హోరెత్తించి ముగించారు. అమెరికాలో మొత్తం 17 కోట్ల మంది ఓటర్లుండగా ఎర్లీ ఓటింగ్లో భాగంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇప్పటికే 6.8 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్, ఫలితాలు, ఎలక్టోరల్ కాలేజీ తతంగం, కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారం తదితర విషయాలను ఒకసారి చూద్దాం. పోలింగ్ నవంబర్లోనే ఎందుకు..?ప్రతిసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నవంబర్ నెలలోని తొలి మంగళవారమే నిర్వహిస్తారు. ఈ మేరకు 1845లో చట్టం చేశారు. ఈసారి నవంబర్ తొలి మంగళవారం అయిదో తేదీ వచ్చినందున అధ్యక్ష ఎన్నికలు 5వ తేదీన జరుగుతున్నాయి. అప్పట్లో వ్యవసాయం ప్రధానంగా ఉన్న అమెరికాలో పంటల కోత పూర్తవడంతో పాటు ప్రయాణాలకు అనుకూల వాతావరణం ఉండడంతో నవంబర్ను ఎన్నికల కోసం ఎంచుకున్నారు. కాగా,1845కు ముందు అధ్యక్ష ఎన్నికలు అమెరికాలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సారి జరిగేవి.పోలింగ్ సమయాలు..అమెరికాలోని ఒక్కో రాష్ట్రంలో అక్కడి కాలమానం ప్రకారం మంగళవారం(నవంబర్ 5)వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జరుగుతుంది. ఇదే ఇండియా టైమింగ్స్ ప్రకారం చూస్తే మనకు మంగళవారం సాయంత్రం 4.30 నుంచి రాత్రి 9.30 గంటల మధ్య అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమవుతుంది.ఫలితాలు ఎప్పుడు..?అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ప్రాథమిక ఫలితాలు వెలువడతాయి. ట్రంప్,హారిస్ మధ్య పోరు హోరాహోరీగా ఉంటే మాత్రం తుది ఫలితాలు వెలువడేసరికి ఒకటి రెండు రోజులు పడుతుంది. ఇక ఎలక్టోరల్ కాలేజీ ఎన్నిక తతంగం పూర్తై అధ్యక్షుడి ప్రమాణస్వీకారం జరగాలంటే 2025 జనవరి 20 దాకా ఆగాల్సిందే. ఒకవేళ జనవరి 20 ఆదివారం అయితే జనవరి 21న ప్రమాణస్వీకారం ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న ఒపీనియన్ పోల్స్ అంచనాల ప్రకారమైతే ట్రంప్ కంటే కమలా హారిస్ కొద్దిగా ముందంజలో ఉన్నారు.ప్రజల ఓటు నేరుగా అధ్యక్షుడికి వెళుతుందా..?అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నిక కావాలంటే ముందుగా 50 రాష్ట్రాల్లో పాపులర్ ఎన్నికలు జరగాలి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఓట్లేస్తారు. ఇవి కాకుండా ప్రతీ రాష్ట్రంలో జనాభా ఆధారంగా ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయి దీనినే ఎలక్టోరల్ కాలేజీ అంటారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లుంటాయి. అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు ఆయా రాష్ట్రాల్లో తమ ఎలక్టర్లను ముందే నిర్ణయిస్తాయి. అయితే ఓటింగ్ సమయంలో మాత్రం ప్రజలు బ్యాలెట్ పేపర్పై అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకున్నట్లుగానే ఓటు వేస్తారు. ఈ ఓట్లన్నీ ఎలక్టర్లకు వెళతాయి. ఎన్నికల్లో పాపులర్ ఓట్లు ఎక్కువగా వస్తే విజయం సాధించలేరు. ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు వస్తేనే అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారు. మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో 270 వచ్చిన వారు విజయం సాధించినట్లు. కాలిఫోర్నియాలో అత్యధికంగా 54,టెక్సాస్లో 40 ఎలక్టోరల్ ఓట్లుండగా తక్కువ జనాభాగల వ్యోమింగ్కు మూడు ఎలక్టోరల్ ఓట్లున్నాయి. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకుగాను 270 ఓట్లు లభించినవారు అధ్యక్షులవుతారు.స్వింగ్ రాష్ట్రాలు ఏంటి.. ఎందుకు కీలకం..?అమెరికా ఎన్నికల్లో చాలా రాష్ట్రాలు ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం తటస్థంగా ఉంటాయి. వీటిని స్వింగ్ స్టేట్స్ అని అంటారు. వీటికి అధ్యక్ష ఎన్నిక ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉంటుంది. పార్టీలు ఈ స్వింగ్ రాష్ట్రాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి ప్రచారం ఎక్కువగా నిర్వహిస్తాయి. 2024 ఎన్నికల్లో స్వింగ్ రాష్ట్రాలుగా భావిస్తున్న పెన్సిల్వేనియా, ఆరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్- రాష్ట్రాల్లో కలిపి 93 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్నాయి. ఇవే అధ్యక్ష పీఠాన్ని మలుపుతిప్పుతాయన్నది సుస్పష్టం. అందుకే వీటిపై పట్టుకోసం హారిస్, ట్రంప్ హోరాహోరీగా ప్రయత్నించారు. ఎలక్టోరల్ కాలేజీకి ఎంపికైన ప్రతినిధులు (ఎలక్టర్లు ) డిసెంబరు 17న సమావేశమై అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ కాలేజీ రిజల్ట్ టై అయితే అధ్యక్ష ఎన్నిక ఎలా..ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో ఏ అధ్యక్ష అభ్యర్థికి 270 రాకుండా ఇద్దరూ 269 ఓట్ల దగ్గరే ఆగిపోతే ఫలితం టై అవుతుంది. ఈ పరిస్థితుల్లో కంటింజెంట్ ఎన్నిక నిర్వహిస్తారు. ఇలాంటి సందర్భంలో హౌజ్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ ప్రతినిధులు తమ ఓటు హక్కు ద్వారా ఇద్దరిలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఇదే వైస్ ప్రెసిడెంట్ విషయంలో అయితే సెనేట్ సభ్యులకు ఓటు హక్కు కల్పించి ఉపాధ్యక్షుడిని నిర్ణయిస్తారు.ఇందుకోసం 1800 అధ్యక్ష ఎన్నిక తర్వాత రాజ్యాంగానికి 12వ సవరణ తీసుకువచ్చారు.ఇండియన్ అమెరికన్ ఓటర్ల ప్రభావం ఎంత..?అమెరికా ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓటర్ల ప్రభావం చాలా వరకు ఉంటుందని ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్మెన్ రాజాకృష్ణమూర్తి చెప్పారు. స్వింగ్ స్టేట్స్తో పాటు దేశవ్యాప్తంగా భారతీయ అమెరికన్ల ఓట్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. తమ సమస్యలను పరిష్కరించే అధ్యక్షుడి కోసం భారతీయ అమెరికన్లు చూస్తున్నారని చెప్పారు. -- సాక్షి వెబ్డెస్క్ -
నిజమే సార్! మీరొస్తే మీ కంపెనీలన్నీ ఆర్థికంగా అద్భుతాలు సృష్టిస్తాయ్!
-
ట్రంప్ విజయం కోసం మహామండలేశ్వర స్వామి పూజలు
న్యూఢిల్లీ: అమెరికా తదుపరి ప్రెసిడెంట్ ఎవరు? మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికారంలోకి వస్తారా? లేక కమలా హారిస్కు అవకాశం దక్కుతుందా? అనేది త్వరలో తేలిపోనుంది. నవంబర్ 5న అమెరికాకు నూతన అధ్యక్షుడు ఎన్నిక కానున్నారు. ఈ నేపధ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాలని కోరుకుంటూ ఆధ్యాత్మిక వేత్త, మహామండలేశ్వర స్వామి వేదముతినంద సరస్వతి పూజలు చేసి, హోమాలు నిర్వహించారు.ఈ పూజలకు హాజరైనవారు తమ చేతుల్లో డొనాల్డ్ ట్రంప్ ఫోటోను పట్టుకున్నారు. వేదమంత్రోచ్ఛారణలు, శంఖునాదాల మధ్య పూజలు జరిగాయి. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పక్కన డోనాల్డ్ ట్రంప్ ఉన్న ఫోటోను ఒక పండితుడు పట్టుకున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ భారతీయ సంతతికి చెందినవారు. ఆమెకు భారత్లో మద్దతుదారులు ఉన్నారు. WATCH | Delhi: Spiritual leader Mahamandelshwar Swami Vedmutinand Saraswati performs hawan and rituals for the victory of former US President #DonaldTrump in the US presidential elections.#USElections2024 pic.twitter.com/KwxvXEaSAn— TIMES NOW (@TimesNow) November 4, 2024అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అలాగే అంతర్జాతీయ వ్యూహాత్మక పొత్తులకు కేంద్ర బిందువుగా ఉంది. ఇప్పుడు అమెరికాలో జరుగున్న ఎన్నికలు పలు అంతర్జాతీయ అంశాలలో వ్యతిరేక అభిప్రాయాలు కలిగిన ఇద్దరు అభ్యర్థుల మధ్య జరుగుతున్నాయి. అంతర్జాతీయ సమాజం వ్యవహారాల్లో అమెరికా పాత్ర ముగిసిపోవాలని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటుండగా, ఈ అంశంలో అమెరికా జోక్యం పెరగాలని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: 2025.. ప్రపంచం అంతానికి ఆరంభం: బాబా వంగా కాలజ్ఞానం -
యూఎస్ ఎన్నికలు.. నష్టాల్లో స్టాక్మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:23 సమయానికి నిఫ్టీ 198 పాయింట్లు తగ్గి 24,107కు చేరింది. సెన్సెక్స్ 671 పాయింట్లు నష్టపోయి 79,022 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 104.28 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 73.13 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.38 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.41 శాతం లాభపడింది. నాస్డాక్ 0.8 శాతం పుంజుకుంది.ఇదీ చదవండి: ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్!రేపు (మంగళవారం 5వ తేదీ) యూఎస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ప్రెసిడెంట్గా పనిచేసిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్ధిని కమలా హారిస్ హోరాహోరీగా తలపడుతున్నారు. అభ్యర్ధులు విభిన్న పాలసీలకు ప్రాధాన్యత ఇవ్వనున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తాజా ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. మరోపక్క ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను ప్రధానంగా విదేశీ అంశాలే నిర్ధేశించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మొదలైన కౌంట్ డౌన్
-
అది ఫేక్ సర్వే: తాజా పోల్పై మండిపడ్డ ట్రంప్
వాషింగ్టన్:అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్కు ఒకే రోజు సమయముందనగా తనకు వ్యతిరేకంగా వెల్లడైన ఒక పోల్ సర్వేను రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. అయోవా డెమోక్రాట్ అభ్యర్థి కమలాహారిస్ తనకంటే లీడింగ్లో ఉందని తెలిపిన సర్వేను ట్రంప్ మండిపడ్డారు. ఆ సర్వే ఫేక్ అని కొట్టిపారేశారు.అయోవా రాష్ట్రంలో కమలాహారిస్కు 47 శాతం, ట్రంప్నకు 44 శాతం మంది మద్దతిస్తున్నారంటూ తాజా పోల్ ఒకటి వెల్లడైంది. దీనిపై ట్రంప్ స్పందించారు. ప్రత్యర్థులు కావాలనే ఇలాంటి ఫేక్ సర్వేను సృష్టించారని మండిపడ్డారు.‘ఐయామ్ నాట్ డౌన్’ అని ధీమా వ్యక్తం చేశారు. అయితే సెప్టెంబర్లో అయోవాలో ట్రంప్ లీడింగ్లో ఉన్నట్లు అదే సర్వే సంస్థ అంచనాలు వెల్లడించింది. ఇప్పుడు పరిస్థితి మారిపోయి కమల లీడ్లోకి వచ్చినట్లు తెలిపింది. కాగా, 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్నకు అయోవాలో 9 పాయింట్ల ఆధిక్యం లభించడం గమనార్హం.మంగళవారం(నవంబర్ 5) అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి: అబార్షన్ మా హక్కు -
అబార్షన్ మా హక్కు
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అబార్షన్ హక్కుల కోసం డిమాండ్ పెరుగుతోంది. వేలాది మంది మహిళలు రాజధాని వాషింగ్టన్తో పాటు ఇతర ప్రాంతాల్లో శనివారం ర్యాలీలతో హోరెత్తించారు. వాషింగ్టన్ వీధుల్లో నిరసనకారులు పోస్టర్లు, ప్లకార్డులు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. పురుషులు కూడా నిరసనల్లో పాలుపంచుకున్నారు. అధ్యక్షుడి ఎన్నిక కోసమే కాకుండా అబార్షన్ హక్కుల సవరణల బ్యాలెట్పైనా ఓటేయాలని ప్రజలను కోరారు. వాషింగ్టన్లో జరిగిన విమెన్స్ మార్చ్లో స్త్రీవాద ఉద్యమకారిణి ఫన్నీ గోమెజ్ లూగో అబార్షన్ బ్యాలెట్ ఉన్న 10 రాష్ట్రాల జాబితాను చదివి వినిపించారు. మిస్సోరీలోని కాన్సాస్ సిటీలో జరిగిన ర్యాలీలో అబార్షన్ హక్కుల చట్టం కోసం ప్రజలు సంతకాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. డెమొక్రటిక్ అభ్యరి్థగా హారిస్ బరిలోకి దిగినప్పటి నుంచి అధ్యక్ష ఎన్నికల్లో 30 ఏళ్ల లోపు మహిళల అబార్షన్ హక్కులు ప్రధానాంశంగా మారాయి. అబార్షన్ హక్కును రద్దు చేసి, దానిపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకు వదిలేస్తూ 2022లో అమెరికా సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పుకు నిరసనగా కార్యక్రమాలు పెరిగాయి. -
USA Presidential Elections 2024: పోలింగ్ డే ఉచితాలు
మన లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ను పెంచేందుకు.. కొన్ని కంపెనీలు ఇచ్చిన ఆఫర్లు గుర్తున్నాయా? ఓటేస్తే ఉచితంగా బీర్, రెస్టారెంట్లో బిల్లుపై డిస్కౌంట్, పోలింగ్ కేంద్రానికి ఉచిత ప్రయాణం..! ఆ... అలాంటి ఆఫర్లే ఇప్పుడు అమెరికా ఎన్నికల్లోనూ ఓటర్లకు పలు కంపెనీలు ఇస్తున్నాయి. 2,000 కంటే ఎక్కువ కంపెనీలు ‘టైమ్ టు ఓట్’ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నాయి. ఉద్యోగులు ఓటు వేసేందుకు అనుగుణంగా పని షెడ్యూల్ను అందుబాటులోకి తెచ్చాయి. ఓటేయడానికి వెళ్లేందుకు ఉచిత ప్రయాణాల నుంచి.. ఓటేసిన వారికి ఉచిత డోనట్స్వరకు కొన్ని సంస్థలో ఉచితాలు ప్రకటించాయి. → పోలింగ్ రోజు ఉబర్ యాప్లోని ‘గో ఓట్’ ఆప్షన్పై క్లిక్ చేస్తే యూజర్లకు రకరకాల ఆఫర్లు వస్తాయి. పోలింగ్ కేంద్రానికి ప్రయాణాలపై 50 శాతం డిస్కౌంట్ (10 డాలర్ల వరకు) పొందవచ్చు. సమీపంలోని పోలింగ్ కేంద్రాన్ని కూడా యాప్లో తెలుసుకోవచ్చు. ఉబర్ ఈట్స్ కూడా 25 శాతం డిస్కౌంట్పై ఆర్డర్లను అందిస్తోంది. → పోలింగ్ రోజున 50 శాతం డిస్కౌంట్ (10 డాలర్ల దాకా) ఇస్తున్నట్లు ‘లిఫ్ట్’ యాప్ తెలిపింది. యూజర్లు నవంబర్ 5లోగా రైడ్ కోడ్ ఓటీటీ24ను ప్రీలోడ్ చేసుకోవచ్చు. దీనివ్లల కనీసం 30 లక్షల మంది ఓటేసేందుకు వస్తారని లిఫ్ట్ అంటోంది. → కారు రెంటల్ కంపెనీ హెరŠట్జ్ ‘డ్రైవ్ ది ఓట్’ డీల్లో భాగంగా అక్టోబర్ 21 నుంచి నవంబర్ 5 దాకా రెండు, అంతకంటే ఎక్కువ రోజులు రెంట్కు తీసుకునే వారికి ఒక రోజు రెంట్ డిస్కౌంట్ ఇస్తోంది. → సెలవు దినాల్లో ఆఫర్లు ప్రకటించే క్రిస్పీ క్రీమ్.. ఉచితంగా డోనట్స్ ఆఫర్ చేస్తోంది. యూఎస్లోని అన్ని క్రిస్పీ క్రీమ్ దుకాణాలు ఓటేసిన వారికి ఉచిత ఒరిజినల్ గ్లేజ్డ్ డోనట్ అందిస్తున్నాయి. → ఓటేసినట్టు రుజువు చూపించి తమ స్టోర్లో ఏదైనా కొనుగోలు చేస్తే ఉచిత షేక్ ఇస్తామని డైనర్ స్టైల్ చైన్ జానీ రాకెట్స్ ప్రకటించింది. → 400 కంటే ఎక్కువ స్టోర్లున్న రౌండ్ టేబుల్ పిజ్జా పలు ఆఫర్లు ప్రకటించింది. తమ అతి పెద్ద పిజ్జాపై ఆరు డాలర్ల డిస్కౌంట్ ఇస్తోంది. → ఫర్నిచర్ స్టోర్ ఐకియా కూడా ఓటింగ్ డే నాడు ఓటర్లకు ఫ్రోజెన్ యోగర్ట్ ఉచితంగా ఇస్తోంది. → ఎనిమిది రాష్ట్రాల్లో 50 రెస్టారెంట్లున్న లేజీ డాగ్ కూడా ‘ఐ ఓట్’ స్టిక్కర్ ఉన్నవారికి ఎంట్రీ కొనుగోలుపై నాన్ ఆల్కహాలిక్ డ్రింక్ ఉచితంగా అందిస్తోంది. → ఓటింగ్ రోజు ఉచిత ప్రయాణాన్ని ‘లైమ్’ అందుబాటులోకి తెచ్చింది. ఓటర్లు చెకౌట్ ఆప్షన్ దగ్గర కోడ్ Vౖఖీఉ2024 నమోదు చేస్తే లైమ్ స్కూటర్, బైక్ రైడ్తో పోలింగ్ కేంద్రానికి ఉచితంగా వెళ్లొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తండ్రి నుంచి అప్పు తీసుకున్న ట్రంప్!! కారణం ఏంటంటే..
ప్రపంచ దేశాలు ఇప్పుడు అమెరికావైపు చూస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలో ఎవరు గెలుస్తారు?. అగ్రరాజ్య ముఖచిత్రాన్ని మార్చేది ఎవరు? అనే దాని కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మరోసారి వైట్హౌజ్ నుంచి పాలించాలని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే.. రాజకీయాల్లోకి రాకముందు.. ట్రంప్ రియల్ ఎస్టేట్ రంగంలో మకుటం లేని మహారాజు అనే విషయం మీకు తెలుసా?.. డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫ్రెడ్ ట్రంప్కు నాలుగో సంతానం. 13 ఏళ్ల వయసులో ట్రంప్ సైనిక్ అకాడమీలో చేరాడు. ఆ తరువాత యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా.. వార్టన్ స్కూల్ నుంచి డిగ్రీ పొందిన తరువాత కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టడాని ముందే ట్రంప్ తన తండ్రి నుంచి కొంత మొత్తం అప్పుగా తీసుకుని రియల్ ఎస్టేట్లోకి ప్రవేశించినట్లు సమాచారం. ఆ తరువాత తండ్రి రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్ట్లను నిర్వహించడంలో కీలక పాత్రం పోషించాడు. 1971లో కంపెనీని నియంత్రణలోకి తీసుకున్న తరువాత.. దానిని ట్రంప్ ఆర్గనైజేషన్గా మార్చేశారు. ఆ తరువాత వివిధ వ్యాపారాలలోకి ప్రవేశించారు.1973 నాటికి ట్రంప్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా ట్రంప్ బ్రూక్లిన్, క్వీన్స్ & స్టాటెన్ ఐలాండ్లో 14,000 అపార్ట్మెంట్లను పర్యవేక్షించారు. 1978లో గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ పక్కనే గ్రాండ్ హయత్ హోటల్ను అభివృద్ధి చేయడం కూడా ఈయన సారథ్యంలోనే జరిగింది. 1983లో మిడ్టౌన్ మాన్హట్టన్లోని 58 అంతస్తుల 'ట్రంప్ టవర్'ను ట్రంప్ పూర్తి చేశారు. ఈయన కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు కూడా ఈ భవనంలోనే నివసిస్తున్నట్లు తెలుస్తోంది.వ్యాపార రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్న ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తరువాత.. ట్రంప్ సంస్థలోని అన్ని నిర్వహణ బాధ్యతలకు రాజీనామా చేసి, కంపెనీ నిర్వహణను తన కుమారులు డోనాల్డ్ జూనియర్, ఎరిక్లకు అప్పగించారు. కాగా ఇప్పుడు మరోసారి అమెరికా అధ్యక్ష పదవి కోసం కమలా హరిస్తో పోటీ పడుతున్నారు. -
నేను!.. విద్యేషానికి ప్రతినిధినా!!
-
ఆమే నాకు స్ఫూర్తి.. తల్లిపై కమలాహారిస్ భావోద్వేగ ట్వీట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ ఎక్స్(ట్విటర్)లో ఆసక్తికర పోస్టు చేశారు. ఆదివారం(నవంబర్ 3) చేసిన ఈ పోస్టులో కమల తన తల్లి శ్యామలా గోపాలన్ను గుర్తు చేసుకున్నారు. తన తల్లి ధైర్యం, ధృడ నిశ్చయాలే తనను ఇక్కడిదాకా తీసుకువచ్చాయని, ఆమె స్ఫూర్తితోనే తాను జీవితంలో చాలా సాధించగలిగానని తెలిపారు.తన తల్లి శ్యామలా గోపాలన్ 19 ఏళ్ల వయసులో ఒంటరిగా భారత్ నుంచి అమెరికా వచ్చారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హారిస్ చేసిన చాలా ప్రసంగాల్లో తన తల్లి గురించి ప్రస్తావించడం గమనార్హం. 19 ఏళ్ల వయసులో అమెరికా వచ్చిన కమల తల్లి శ్యామలా గోపాలన్ రొమ్ము క్యాన్సర్పై పరిశోధనలు చేశారు. My mother, Dr. Shyamala Gopalan Harris, came to the United States from India alone at the age of 19. Her courage and determination made me who I am today. pic.twitter.com/nGZtvz2Php— Vice President Kamala Harris (@VP) November 2, 2024కాలిఫోర్నియాలోని బర్కిలీ యూనివర్సిటీలో చదువుకుంటుండగా జమైకా నుంచి వలస వచ్చిన డొనాల్డ్ హారిస్తో శ్యామలకు పరిచయమైంది. అనంతరం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 1960లో వీరికి కమల జన్మించారు. కమల ఐదో ఏట తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కమల, ఆమె చెల్లి మాయలు తల్లి శ్యామల సంరక్షణలోనే పెరిగారు.ఇదీ చదవండి: అమెరికాను హారిస్ నాశనం చేశారు..నేనొస్తే ఆర్థికంగా అద్భుతాలే -
అమెరికన్ల ఉద్యోగాల్ని భారతీయులు దొంగిలిస్తున్నారు’.. ఎన్నికల ప్రచారంలో ట్రంప్
వాషింగ్టన్ : రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారతీయులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భారతీయులు.. అమెరికన్ల ఉద్యోగాల్ని దోచేసుకుంటున్నారంటూ ప్రచారం చేశారు.మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ (నవంబర్5) ప్రారంభం కానుంది. అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్లు ఎన్నికల ప్రచారంలో పోటీ పోటీగా ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.అయితే ట్రంప్ అందుకు భిన్నంగా తన ఎన్నికల ప్రచారంలో భారతీయులపై విద్వేషపూరిత వ్యాఖ్యలతో హీటెక్కిస్తున్నారు. అందుకు తన ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్కు చెందిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా)మీడియాను వినియోగిస్తున్నారు.తాజాగా మాగా మీడియా, ట్రంప్కు మద్దతు పలికిన పలు ఆర్థిక వేత్తలతో ట్రంప్ తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో గతేడాది అమెరికన్లు 8లక్షల ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అదే సమయంలో విదేశీయులు 10లక్షల ఉద్యోగాలు పొందారు. అమెరికా లేబర్ మార్కెట్ విదేశీ కార్మికులు, ప్రభుత్వ బ్యూరోక్రాట్లకు తాత్కాలిక ఏజెన్సీగా మారుతుందని మాగా మీడియా ఈవెంట్లో ట్రంప్ మద్దతు దారుడు, ఆర్ధిక వేత్త ఈజే ఆంటోనీ ఆరోపించారు. మరోవైపు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులపై అమెరికన్లో విద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో ఫిన్టెక్ ఎగ్జిక్యూటివ్ షీల్ మొహ్నోట్ మాట్లాడుతూ.. టెక్సాస్లో భారతీయులు సేవలందిస్తున్న ఓ బ్యాంక్పై విమర్శలు గుప్పించారు. వారందరూ వచ్చే ఏడాది భారతదేశానికి తిరిగి వెళతారు. అందరినీ తిరిగి ఇంటికి పంపాలి. మేము వారి ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుని, వారందరినీ తిరిగి గుజరాత్కు పంపుతాము అంటూ విమర్శిస్తూ షేర్ చేసిన పలు స్క్రీన్ షాట్లు వెలుగులోకి వచ్చాయి. -
అమెరికాను హారిస్ నాశనం చేశారు.. నేనొస్తే ఆర్థికంగా అద్భుతాలే: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ అనుసరించిన ఆర్థిక విధానాలు అత్యంత అసమర్థమైనవంటూ రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దుయ్యబట్టారు. ‘‘నేను గెలిస్తే వాటికి ముగింపు పలుకుతా. ‘బిల్డ్ అమెరికన్, బై అమెరికన్, హైర్ అమెరికన్’వంటి సరికొత్త విధానాలతో ఆర్థిక రంగంలో అద్భుతాలు చేసి చూపిస్తా’’అన్నారు. స్వింగ్ రాష్ట్రమైన మిషిగన్లోని డెట్రాయిట్లో శుక్రవారం ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. ‘‘అమెరికాను హారిస్ సర్వనాశనం చేశారు. ఆమె ఆర్థిక విధానాల వల్ల గత కొద్ది రోజుల్లోనే ప్రైవేట్ రంగంలో ఏకంగా 30 వేలు, నిర్మాణ రంగంలో ఏకంగా 50 వేల ఉద్యోగాలకు కోత పడింది. కార్మిక లోకాన్ని ఆమె నిండా ముంచుతున్నారు’’అని ఆరోపించారు. ‘‘ఉక్రెయిన్ యుద్ధానికి, పశి్చమాసియాలో అనిశి్చతికి నేను ముగింపు పలుకుతా. మూడో ప్రపంచ యుద్ధాన్ని నివారిస్తా. సైన్యాన్ని ఆధునీకరిస్తా. మత స్వేచ్ఛను, ఆయుధాలు కలిగి ఉండే హక్కును పరిరక్షిస్తా. అక్రమ వలసలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తా’’అని పేర్కొన్నారు. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించేది వీరే
అమెరికా నుంచి సాక్షి టీవీ ప్రతినిధి ఇస్మాయిల్అమెరికా అధ్యక్ష ఎన్నికలపై అటు డెమొక్రాట్లు ఇటు రిపబ్లికన్లు పూర్తిగా విడిపోయిన నేపథ్యంలో ఒక వర్గం మాత్రం మౌనం వహిస్తోంది. అటు హారిస్కు కానీ ఇటు ట్రంప్కు గానీ మద్దతు ఇవ్వడంపై వీరు ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించడం లేదు. వారే స్వతంత్ర ఓటర్లు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించేది వీరే. నువ్వా నేనా అన్నట్టు జరుగుతున్న అమెరికా ఎన్నికల్లో ఏడు బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్లో విస్తరించి ఉన్న స్వతంత్ర ఓటర్లే నిర్ణాయకం కాబోతున్నారు. పెరుగుతున్న స్వతంత్ర ఓటర్ల సంఖ్యప్రముఖ శాంపిల్ సర్వే గాలప్ పోల్ డేటా ప్రకారం 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఓటు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిలో 43 శాతం తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా చెప్పుకుంటున్నారు. 27% మంది రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులుగా, మరో 27 శాతం మంది డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులుగా ప్రకటించుకున్నారు. 1990లో కేవలం 32 శాతం మంది ఓటర్లు మాత్రమే తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా ప్రకటించుకున్నారు. కాలంతో పాటు ఇండిపెండెంట్ ఓటర్ల సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.7 రాష్ట్రాల్లో కీలకం⇒ అమెరికాలో పార్టీతో అనుబంధం అనేది చాలా సాధారణ మైన అంశం. ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రైమ రీస్లో ఓటు వేసేందుకు చాలామంది పార్టీ ఓటర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ప్రైమరీస్ అంటే ఒక పార్టీ నుంచి ఎవరు అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయాలనే విషయంపై జరిగే పోలింగ్. సాధారణ ఓటర్లు ఈ పోలింగ్లో పాల్గొంటారు. వీరు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలంటే చాలా రాష్ట్రాల్లో కచ్చితంగా ఏదో ఒక పార్టీ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఈ డేటా ప్రకారమే చాలామందిని అమెరి కాలో డెమొక్రాట్ ఓటర్లు, రిపబ్లికన్ ఓటర్లుగా పిలుస్తారు.అమెరికాలో సర్వే సంస్థలు తాము చేసే సర్వేల ఆధారంగా పార్టీ ఓటర్ల సంఖ్యను లెక్కగడుతోంది. దీని ఆధారంగానే ఏ పార్టీకి ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనే విషయం తేలుతుంది. ఈ గణాంకాల ఆధారంగానే చాలా రాష్ట్రాలను బ్లూస్టేట్స్, రెడ్ స్టేట్స్గా తేలుస్తారు. డెమొక్రాట్ ఓటర్లు ఎక్కువగా ఉంటే అది బ్లూ స్టేట్ అని రిపబ్లికన్ ఓటర్లు ఎక్కువగా ఉంటే రెడ్ స్టేట్ అని తేలిపోతుంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు దాదాపు ఊహించిన దానికి అనుకూలంగానే ఉంటాయి. ఎక్కడైతే రెండుపార్టీల మద్దతు దారుల మధ్య తేడా మూడు శాతం కంటే తక్కువగా ఉంటుందో దానిని బ్యాటిల్ స్టేట్ లేదా పర్పుల్ స్టేట్గా పిలుస్తారు. ఇప్పుడు ఏడు బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ ఉన్నాయని భావిస్తుండగా..వీటిల్లో ఈ ఇండిపెండెంట్ ఓటర్లే నిర్ణాయక శక్తిగా మారారు.కొత్త తరం ఓటర్లే ఎక్కువ..అమెరికాలోని కొత్త తరం ఎక్కువగా స్వతంత్ర భావాలు కలిగి ఉంది. ముఖ్యంగా మిలేనియల్స్ లేదా జనరేషన్ వై ఎక్కువగా ఇండిపెండెంట్ ఓటర్లుగా ఉన్నారని పరిశోధనలో తేలింది. స్వతంత్ర ఓటర్లలో 1981–96 మధ్యలో జన్మించిన జనరేషన్ వైకి చెందిన వారే 36% మంది ఉన్నారు. ఇక తరువాతి తరం అంటే 1997– 2012 మధ్య జన్మించిన జెన్జీ స్వతంత్ర ఓటర్లలో 26% ఉన్నారు. అంటే స్వతంత్ర ఓటర్లలో 52% మంది వై, జీ తరంవారే.ఇక ఓటర్ల మూలాలను పరిశీలిస్తే 31% మంది నల్ల జాతీయులు, 52% మంది లాటినోస్, 43% మంది ఏషియన్ అమెరికన్లు తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా ప్రకటించు కున్నారు. మాజీ సైనికులు సైతం పెద్ద ఎత్తున తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా చెప్పుకుంటున్నారు. 18–49 సంవత్సరాల మద్య ఉన్న దాదాపు 59% మంది మాజీ సైనికులు తమను తాము స్వతంత్ర ఓటర్లుగా చెప్పుకుంటున్నారు.పేరుకే స్వతంత్ర ఓటర్లు⇒ అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేసే ఈ స్వతంత్ర ఓటర్లపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సర్వేల్లో తమను తాము స్వతంత్ర ఓట ర్లుగా చెప్పుకునే వీరంతా నిజంగానే స్వతంత్ర ఓటర్లా? అన్న విషయంపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా మీరు ఏ పార్టీ భావ జాలాన్నినమ్ముతున్నారన్నప్పుడు వీరిలో చాలామంది రిపబ్లికన్ లేదా డెమొక్రాట్ పార్టీకి మద్దుతుదారు లుగా తేలిందని కీత్ అనే అమెరికన్ పొలిటికల్ అనలిస్ట్ ‘ది మిత్ ఆఫ్ ఇండిపెండెంట్ ఓటర్’పుస్తకంలో వివరించడం గమనార్హం. చాలామంది తమను తాము ఇండిపెండెంట్ ఓటర్గా చెప్పుకున్నప్పటికీ ఏదో ఒక స్థాయిలో రాజకీయ పార్టీలతో అనుబంధం కలిగి ఉన్నారని పరిశోధనల్లో బయటపడింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో 10 శాతానికి మించి నిజమైన స్వతంత్ర ఓటర్లు లేరని అక్కడి రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.కొత్త అభ్యర్థుల వైపే వీరి మొగ్గుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త అభ్యర్థుల వైపే ఇండిపెండెంట్ ఓటర్లు ఎక్కు వగా మక్కువ చూపుతున్నా రని గణాంకాలు చెబుతు న్నాయి. 2008లో బరాక్ ఒబామా పోటీ చేసిన సందర్భంగా దాదాపు 54% స్వతంత్ర ఓటర్లు ఆయనకు ఓటువేశారు. 2016లో ట్రంప్కు 52% మంది ఇండిపెండెంట్ ఓటర్లు మద్దతు పలికారు. ఇక 2020లో జో బైడెన్కు అత్యధికంగా 56.5 శాతం మంది మద్దతు తెలిపారు.⇒ ఇండిపెండెంట్ ఓటర్లలో 75శాతం మంది ఓటర్లు తమ వ్యక్తిగతమైన ఆర్థిక స్థితిని ప్రభావితం చేయగల అంశాలే తమ ప్రాధాన్యత అని చెబుతున్నారు. ⇒ 73 శాతం మంది నేరాలను అదుపు చేసేవారికే తమ ఓటు అని చెబుతున్నారు. ⇒ 63 శాతం మంది అమెరికా తన మిత్రదేశాల కోసం అత్యధికంగా ఖర్చు చేయడం సరికాదంటున్నారు. ⇒ 57 శాతం అబార్షన్ హక్కులే తమ ప్రాధాన్యత అంటున్నారు⇒ 56 శాతం జాత్యహంకారం తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నారు. -
USA Presidential Elections 2024: వైషమ్యాలను పెంచుతారు
వాషింగ్టన్: రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ వ్యక్తులను పరస్పరం ఎగదోసి వారిమధ్య వైషమ్యాలు పెంచే రకమంటూ డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ దుయ్యబట్టారు. ట్రంప్ కంటే చాలా మెరుగైన వ్యక్తి మాత్రమే అమెరికాకు నాయకత్వం వహించాలని అభిప్రాయపడ్డారు. స్వింగ్ రాష్ట్రమైన విస్కాన్సిన్లో ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.రాజకీయ ప్రత్యర్థులను, తనకు ఓట్లేయని వారని శత్రువులుగా భావించే ప్రమాదకరమైన మనస్తత్వం ట్రంప్ సొంతమని ఆక్షేపించారు. ఆయన జేబులో రాసిపెట్టుకున్న శత్రువుల జాబితా నానాటికీ పెరిగిపోతూనే ఉందన్నారు. ‘‘మరోవైపు రిపబ్లికన్ల నుంచి కూడా ఒకరికి నా మంత్రివర్గంలో చోటివ్వాలన్న మనస్తత్వం నాది. మా ఇద్దరి మధ్య ఇదే తేడా’’అని చెప్పుకొచ్చారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం రాణిస్తుందన్నారు. -
USA Presidential Elections 2024: వైట్హౌస్కు దారేది?..7 స్వింగ్ స్టేట్లే కీలకం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తుది అంకానికి చేరింది. అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పోలింగ్ ప్రక్రియ మంగళవారం జరగనుంది. డెమొక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అత్యంత హోరాహోరీగా తలపడుతున్నారు. దాంతో వారిలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి! అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల్లో ఏదో ఒకదానికి స్పష్టంగా మద్దతిచ్చేవే. వీటిని సేఫ్ స్టేట్స్గా పిలుస్తారు. ప్రతి అధ్యక్ష ఎన్నికల్లోనూ సదరు రాష్ట్రాలను ఆయా పార్టీలే గెలుచుకుంటాయి. కనుక ఎటూ తేల్చుకోని ఓటర్లు ఎక్కువగా ఉండే కొన్ని రాష్ట్రాల్లోనే పోటీ ప్రధానంగా కేంద్రీకృతం అవుతుంటుంది. వాటిని స్వింగ్ స్టేట్స్గా పిలుస్తుంటారు. ఈసారి అలాంటి రాష్ట్రాలు ఏడున్నాయి. అవే పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్ కరోలినా, జార్జియా, నెవడా, అరిజోనా. 93 ఎలక్టోరల్ ఓట్లు వీటి సొంతం. వాటిలో మెజారిటీ ఓట్లను ఒడిసిపట్టే వారే అధ్యక్ష పీఠమెక్కుతారు. ట్రంప్కు 51, హారిస్కు 44 అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. విజయా నికి కనీసం 270 ఓట్లు రావాలి. 48 రాష్ట్రాల్లో మెజారిటీ ఓ ట్లు సాధించిన అభ్యర్థి తాలూకు పార్టీకే ఆ రాష్ట్రంలోని మొ త్తం ఎలక్టోరల్ ఓట్లు దఖలు పడే (విన్నర్ టేక్స్ ఆల్) విధా నం అమల్లో ఉంది. ఆ లెక్కన సేఫ్ స్టేట్లన్నీ ఈసారి ఆయా పార్టీల ఖాతాలోనే పడే పక్షంలో హారిస్ 226 ఓట్లు సాధిస్తారు. ట్రంప్కు మాత్రం 219 ఓట్లే వస్తాయి. స్వింగ్ స్టేట్లలో ని 93 ఓట్లు అత్యంత కీలకంగా మారడానికి కారణమిదే. ట్రంప్ గెలవాలంటే వాటిలో కనీసం 51 ఓట్లు సాధించాలి. హారిస్కు మాత్రం 44 ఓట్లు చాలు. గత కొద్ది ఎన్నికలుగా ఈ ఏడు స్వింగ్ స్టేట్ల ఓటింగ్ ధోరణి, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా వాటిలో ఈసారి ఫలితాలు ఎలా ఉండవచ్చన్న దానిపై జోరుగా అంచనాలు, విశ్లేషణలు సాగుతున్నాయి.పెన్సిల్వేనియా కీలకం 19 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియా ఈసారి మొత్తం అమెరికా దృష్టినీ ఆకర్షిస్తోంది. అక్కడ నెగ్గిన అభ్యర్థే అధ్యక్షుడయ్యే అవకాశాలు ఏకంగా 90 శాతమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. జనాభా వైవిధ్యం విషయంలో కూడా ఆ రాష్ట్రం అచ్చం అమెరికాకు నకలులా ఉంటుంది. డెమొక్రాట్ల ఆధిపత్యం సాగే పెద్ద నగరాలు, రిపబ్లికన్ కంచుకోటలైన గ్రామీణ ప్రాంతాలు పెన్సిల్వేనియా సొంతం. దాంతో హారిస్, ట్రంప్ మధ్య హోరాహోరీ నెలకొంది.రస్ట్ బెల్ట్–సన్ బెల్ట్ అమెరికా నిర్మాణ రంగంలో ప్రముఖ పాత్ర పోషించే విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాలను రస్ట్ బెల్ట్ రాష్ట్రాలుగా పిలుస్తారు. ఈ మూడింట్లో కలిపి 44 ఓట్లున్నాయి. మిగతా దేశంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే నెవడా, అరిజోనా, నార్త్ కరోలినా, జార్జియాలను సన్ బెల్ట్ రాష్ట్రాలంటారు. వీటిలో మొత్తం 49 ఓట్లున్నాయి. → రస్ట్ బెల్ట్ నిర్మాణ రంగానికి నిలయం. దాంతో విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ఓటర్లపై కారి్మక సంఘాల ప్రభావం ఎక్కువే. → ఈ రాష్ట్రాలపై దశాబ్దాలుగా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగుతూ వస్తోంది. ఎంతగా అంటే, గత ఎనిమిది అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఏడుసార్లు ఈ మూడు రాష్ట్రాలూ ఆ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. ఒక్క 2016లో మాత్రం వాటిలో పూర్తిగా ట్రంప్ హవా నడిచింది. → ఈసారి కూడా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగితే 44 ఓట్లూ కమల ఖాతాలోనే పడతాయి. అదే జరిగితే తొలి మహిళా ప్రెసిడెంట్గా ఆమె చరిత్ర సృష్టిస్తారు. → అలాగాక 2016లో మాదిరిగా ట్రంప్ మరోసారి ఈ మూ డు రాష్ట్రాలనూ నెగ్గినా విజయానికి ఏడు ఓట్ల దూరంలో నిలుస్తారు. అప్పుడాయన విజయం కోసం కనీసం మరో స్వింగ్ స్టేట్ను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. → ఒకవేళ హారిస్ రస్ట్ బెల్ట్ రాష్ట్రాల్లో కీలకమైన పెన్సిల్వేనియాతో పాటు మరోదాన్ని దక్కించుకున్నా ఆమె విజయావకాశాలు మెరుగ్గానే ఉంటాయి. మిగతా నాలుగు స్వింగ్ స్టేట్లలో ఏ ఒక్కదాన్ని నెగ్గినా ఆమె గెలిచినట్టే. ట్రంప్ గెలవాలంటే ఆ నాలుగింటినీ స్వీప్ చేయాల్సి ఉంటుంది. → హారిస్ రస్ట్ బెల్ట్లో సున్నా చుట్టినా నాలుగు సన్ బెల్ట్ రాష్ట్రాలను స్వీప్ చేస్తే విజయం ఆమెదే. → అయితే ఇందుకు అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే 1948 తర్వాత డెమొక్రాట్లు సన్ బెల్ట్ను క్లీన్స్వీప్ చేయలేదు. → రిపబ్లికన్లకు మాత్రం సన్ బెల్ట్ను పలుమార్లు క్లీన్స్వీప్ చేసిన చరిత్ర ఉంది. ఈసారీ అలా జరిగినా ట్రంప్ విజయానికి అది చాలదు. రస్ట్ బెల్ట్ నుంచి కనీసం ఒక్క రాష్ట్రాన్నైనా ఆయన చేజిక్కించుకోవాలి. లేదంటే 269 ఓట్లకు పరిమితమై ఓటమి పాలవుతారు.రస్ట్ బెల్ట్లో విజయావకాశాలు → రస్ట్ బెల్ట్లో హారిస్ గెలవాలంటే పట్టణ ఓటర్లు భారీగా ఓటేయాల్సి ఉంటుంది. నల్లజాతీయులు, మైనారిటీలు, విద్యాధికులు, మధ్య తరగతి ఓట్లు, ముఖ్యంగా మహిళలు పోలింగ్ బూత్లకు తరలడం తప్పనిసరి. → అలాగాక గ్రామీణ ఓటర్లు భారీగా ఓటేస్తే 2016లో మాదిరిగా మరోసారి రస్ట్ బెల్ట్ ట్రంప్దే అవుతుంది. → ఈసారి గ్రామీణులతో పాటు యువ ఓటర్లు కూడా తనకే జైకొడతారని ఆయన ధీమాగా ఉన్నారు. సన్ బెల్ట్లో విజయావకాశాలు → ఇక్కడ విజయావకాశాలను అమితంగా ప్రభావితం చేసేది నల్లజాతీయులు, లాటిన్ అమెరికన్ ఓటర్లే. → జార్జియా, నార్త్ కరోలినాల్లో నల్లజాతి ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. అరిజోనా, నెవడాల్లో లాటిన్ అమెరికన్ జనాభా నానాటికీ పెరుగుతోంది. → హారిస్ జమైకన్ మూలాల దృష్ట్యా నల్లజాతీయులు ఆమెవైపే మొగ్గుతారని భావిస్తున్నారు. ఇక ట్రంప్ ర్యాలీలో ప్యూర్టోరీకన్లు, లాటిన్ అమెరికన్లపై వెలువడ్డ వ్యంగ్య వ్యాఖ్యలపై ఆగ్రహంతో వారు కూడా హారిస్కే ఓటేస్తారని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈవీఎంలతో గెలుస్తామంటే కుదరదు అక్కడ!
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అలియాస్ EVMలు. ప్రతీ ఐదేళ్లకొకసారి ఇవి మనల్ని పలకరిస్తుంటాయి. అయితే వాటి ద్వారా పడిన ప్రతీ ఓటుకు నిజంగా భద్రత ఉంటుందా?. ఈవీఎంలను హ్యక్ చేసి మెజారిటీ ప్రజలిచ్చిన తీర్పును మార్చే అవకాశాలు ఏమాత్రం లేవా? అనే అనుమానాలు కలగడం సహజమే. మొన్నీమధ్య ఏపీ ఎన్నికల టైంలో.. అంతకు ముందు.. మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల టైంలో ఈ తరహా ప్రశ్నలెన్నో తలెత్తాయి. అందుకేనేమో.. అమెరికాలాంటి అగ్రదేశం గత రెండు దశాబ్దాల ప్రయత్నాలతో ఎన్నికల విధానాన్ని ఈవీఎంల నుంచి మళ్లీ బ్యాలెట్కు తెచ్చుకుంది. నవంబర్ 5వ తేదీన జరగబోయే పోలింగ్ బ్యాలెట్ పేపర్ల ద్వారానే జరగబోతోంది. 95 శాతం రిజిస్టర్డ్ ఓటర్లు అక్కడ పేపర్పై టిక్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 69.9 శాతం ఓటర్లు హ్యాండ్మార్క్డ్ పేపర్ బ్యాలెట్స్ విధానంలో ఓటేయొచ్చని, అలాగే బ్యాలెట్ మార్కింగ్ డివైజ్లతో(డిజిటల్ బ్యాలెట్.. ఓటేసి అప్పటికప్పుడే ఆ ప్రింట్ బయటకు తీయొచ్చు కూడా) కూడిన పేపర్బ్యాలెట్ ఓటింగ్ వైపు మరో 25.1 శాతం మంది మొగ్గుచూపిస్తారని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కన.. కేవలం ఐదు శాతం ఓటర్లు మాత్రం మన దగ్గర ఈవీఎంల తరహా డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్(DRE) ద్వారా ఓటేసే ఛాన్స్ ఉంది.అక్కడ ఏరకంగా ప్రయత్నించినా ప్రజా తీర్పును మార్చడానికి వీలుండదన్నమాట. ఈవీఎంల మేనిపులేషన్తో గెలవడం అక్కడ ఎంతమాత్రం కుదరదన్నమాట. సాంకేతికతను ముందుగా పుణికిపుచ్చుకునే అమెరికాలో.. ఈ తరహా ఓటింగ్ ఇంకా జరుగుతుండడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే.. అమెరికాలో 2000 సంవత్సరం దాకా పేపర్ బ్యాలెట్స్ ఓటింగ్ జరిగేది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ వైపు అడుగులేసింది. ఓటర్లు డీఆర్ఈ లేదంటే పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటేసే వీలు కల్పించారు. 2006 మధ్యంతర ఎన్నికల టైంలో 41.9 శాతం ఓటింగ్ డీఆర్ఈ వ్యవస్థ ద్వారానే జరిగింది. అయితే విదేశీ కుట్రలకు అవకాశం, హ్యాకింగ్ ఆరోపణల నేపథ్యంలో డీఆర్ఈపై అక్కడి ఓటర్లలోనూ నమ్మకం సన్నగిల్లింది. 2008 ఎన్నికల నుంచి డీఆర్ఈను ఓటర్లు తిరస్కరిస్తూ వచ్చారు. 2016 అమెరికా ఎన్నికల టైంలో రష్యా జోక్యం ఆరోపణలతో పూర్తిగా వాటిని పక్కన పడేశారు అక్కడి ఓటర్లు.అందుకే అనుమానాలుఈవీఎం 'అన్లాకింగ్'పై రాజకీయ దుమారం కొత్తేం కాదు. మన దేశంలో ఈసీ అందుకు అవకాశమే లేదని చెబుతున్నా.. కొన్ని ఎన్నికల ఫలితాలతో ప్రజల్లోనూ వాటి వాడకంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాల టైంలో నడిచిన చర్చే ఇందుకు ఉదాహరణ. ఈ తరుణంలో ఆధునిక ఈవీఎంల వాడకం బదులు సంప్రదాయ రీతిలో పేపర్ బ్యాలెట్ను ఉపయోగించాలనే అంశాన్ని కొందరు తెరపై తెచ్చారు. ఈ క్రమంలో..ఇదీ చదవండి: ఈవీఎంలపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల మీద సమారు అరవై ఏళ్ల పాటు నేను పనిచేశాను. ఈవీఎం యంత్రాల వ్యవస్థనూ క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమే. దీని వల్ల ఫలితాలు తామరుమారవుతాయి. ఈవీఎంల కంటే పాత బ్యాలెట్ పేపర్ విధానమే చాలా ఉత్తమమైంది. ఇందులో అయితే ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగవు. బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి.:::కాంగ్రెస్ నేత శ్యామ్పిట్రోడాభారత్లో వాడే ఈవీఎంలు అమెరికాలో వాడే తరహావి కావు. ఇక్కడి ఈవీఎంలు కంప్యూటర్ ప్లాట్ఫాం మీద తయారు చేయలేదు. వాటికి బయటి నుంచి ఎలాంటి నెట్వర్క్తో అనుసంధానించే అవకాశమే లేదు. రీ ప్రోగ్రామింగ్ కూడా వీలు లేదు. ఇలాంటి పరికరాలను హహ్యాక్ చేయడం కుదరదు. కావాలంటే ప్రపంచ దేశాలు భారత ఈవీఎంలను వారి ఎన్నికల్లో వాడుకోవచ్చు.:: కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్భారత్లో వాడుతున్న ఈవీఎంలకు సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి రక్షణ ఉందనేది మనకెవరికీ తెలియదు. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్కు సంబంధించి ఈవీఎంలు ISO 27001 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది నిపుణులు తేల్చాలి. ఈవీఎంల భద్రతకు ఎలాంటి సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్ను వాడుతున్నారనేది ఇప్పటివరకు బహిర్గతమవలేదు. ఎవరికీ తెలియదు.::: సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ఈవీఎంలను మనం తొలగించాలి. వీటిని వ్యక్తులు లేదంటే ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం. ఇది ఏ దేశానికైనా నష్టమే కలిగిస్తుంది.:: ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్ఇదీ చదవండి: మీకు తెలుసా? ఈ దేశాల్లో పేపర్ బ్యాలెటే ముద్దునిపుణుల నుంచి సామాన్యుల దాకా ఈవీఎంల వాడకంపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతుంటారు. కానీ, ఈ మధ్యకాలంలో పాపులర్ టెక్నాలజీ నిపుణులు కూడా వాటి పని తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తుండడం చూస్తున్నాం. దీంతో ఈవీఎంలపై అనుమానాలకు శాస్త్రీయ నివృత్తి అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఈవీఎంలపై ఇంతమంది ఇన్ని అభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నపుడు ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడితేనే బెటరని సామాన్యులతో పాటు పార్టీల అధినేతలు సూచిస్తున్నారు. ఈవీఎంలు వాడకంలో అయ్యే ఖర్చుతో పోలిస్తే బ్యాలెట్ విధానంలో ఖర్చు కొద్దిగా పెరిగినప్పటికీ, ఎన్నికల ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ ఓటర్లకు ప్రజాస్వామ్యంపై పూర్తి నమ్మకం కలగాలంటే బ్యాలెట్ పేపరే బెస్ట్ అనే వాదన వినిపిస్తోంది. ‘‘పేపర్ బ్యాలెట్తో ఓటర్ల విశ్వాసాన్ని పెంచవచ్చు. మనలాంటి ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలి. రెండింటినీ నిర్ధారించడానికి ఏకైక మార్గం, పేపర్ బ్యాలెట్కి తిరిగి వెళ్లడం. USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, నార్వే మరియు డెన్మార్క్లతో సహా చాలా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్ను ఉపయోగిస్తున్నప్పుడు, మనం ప్రపంచంలోని ఇతర దేశాలతో మార్పులు చేసి పేపర్ వైపు వెళ్లే సమయం ఇది. బ్యాలెట్, ఇది ఓటర్ల విశ్వాసాన్ని పెంచుతుంది. విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలి’’:::హర్యానా ఎన్నికలపై.. ఎగ్జిట్పోల్స్కు విరుద్ధంగా వెలువడిన ఫలితాలపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ట్వీట్ -
వచ్చే వారం ఏమౌతుందో.. పసిడి ప్రియుల్లో టెన్షన్!
దేశంలో బంగారం ధరలు గత సంవత్ సంవత్సరంలో విశేషమైన వృద్ధిని సాధించాయి. గత దీపావళి నుండి దాదాపు 32 శాతం పెరిగాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేటు తగ్గింపుల అంచనా, స్థిరమైన డాలర్ ఇండెక్స్, ప్రపంచ ఆర్థిక మందగమన సంకేతాలు, సెంట్రల్ బ్యాంకుల నుండి బలమైన డిమాండ్ వంటి అనేక కారణాల వల్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి.వచ్చే వారం బంగారం ధర అంచనావచ్చే వారం మార్కెట్ను ప్రభావితం చేసే రెండు కీలక పరిణామాలు ఉన్నాయి. నవంబర్ 5న అమెరికా ఎన్నికలు జరగనుండగా నవంబర్ 6న ఫెడ్ పాలసీ నిర్ణయం వెలువడనుంది. వీటి ప్రభావంతో బంగారం ధరలు వచ్చే వారం అధిక అస్థిరతను చూపవచ్చని మార్కెట్ పరిశీలకులు, నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ ఆఫర్.. ఉచితంగా క్రెడిట్ కార్డులుప్రస్తుతం ఇలా..అంతే లేకుండా పెరుగుతున్న బంగారం ధరలు పండుగ తర్వాత కాస్త శాంతించాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం (నవంబర్ 2) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 73,800 వద్ద ఉండగా, 24 క్యారెట్ల పసిడి రూ. 80,550 వద్ద ఉంది. వచ్చే వారం బంగారం ధరల్లో భారీ అస్థిరతలు ఉంటాయన్న అంచనాలు కొనుగోలుదారులను మరింత భయపెడుతున్నాయి. -
USA Presidential Elections 2024: చపలచిత్తుడు
ఫిలడెల్ఫియా: రిపబ్లికన్ల అధ్య ర్థి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై ఆయన డెమొక్రాటిక్ పార్టీ ప్రత్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఘాటైన విమ ర్శలు చేశారు. ‘‘ట్రంప్ అ త్యంత చపలచిత్తుడు. ఆపాద మస్తకమూ ప్రతీకారేచ్ఛతో నిండిపోయిన బాపతు. దానికోసమే అపరిమితమైన అధికారానికై అర్రులు చాస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ అతి సమీపంలోకి నేపథ్యంలో ఆమె శుక్రవారం లాస్వెగాస్లో ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అంటేనే విద్వేషానికి ప్రతినిధి అంటూ తూర్పారబట్టారు. ‘‘పొరపాటున ట్రంప్ను గెలిపిస్తే ‘శత్రువుల జాబితా’ను జేబులో పెట్టుకుని మరీ శ్వేతసౌధంలోకి అడుగు పెడతారు. నేనైతే అమెరికన్ల జీవితాలను మరింత మెరుగుపరిచేందుకు ఏమేం చేయాలన్న జాబితాతో కాలు పెడతా. అందులో మొదటిది మీ జీవనవ్యయాన్ని తగ్గించడమే’’ అని ప్రకటించారు. హారిస్కు మద్దతుగా ప్రఖ్యాత గాయని జెన్నిఫర్ లోపెజ్ కూడా ర్యాలీలో పాల్గొన్నారు. అమెరికన్లంతా, ప్రత్యేకించి లాటినో అమెరికన్లు హారిస్కు మద్దతివ్వాలని పిలుపు నిచ్చారు. ట్రంప్ మాదిరిగా కొందరినే కాకుండా అమెరికన్లందరి సంక్షేమాన్నీ హారిస్ పట్టించుకుంటారని లోపెజ్ అభిప్రా యపడ్డారు. అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ కూడా గురువారం హారిస్కు తన మద్దతు ప్రక టించారు. ఆమెకు ఓటేస్తేనే తన పిల్లల భవిష్యత్తు క్షే మంగా ఉంటుందన్నారు. ‘కమలా హారి స్కే ఓటే యండి’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. -
USA Presidential Elections 2024: తేల్చేది అబార్షనే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అబార్షన్ హక్కులు కీలకంగా మారాయి. అధ్యక్షుడు ఎవరనేది అవే నిర్ణయించినా ఆశ్చర్యం లేదని పరిశీలకులూ అభిప్రాయపడుతున్నారు. అబార్షన్ హక్కులను 2022లో అమెరికా సుప్రీంకోర్టు కొట్టేయడం తెలిసిందే. వాటిపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఆ తర్వాత జరుగుతున్న తొలి అధ్యక్ష ఎన్నికలివి. ఈ నేపథ్యంలో 10 కీలక రాష్ట్రాల్లోని ఓటర్లు అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్తో పాటు అబార్షన్ హక్కులపైనా తమ అభిప్రాయాన్ని తెలపనున్నారు. అధ్యక్ష అభ్యర్థులతో పాటు అబార్షన్ హక్కుల సవరణ (4) అంశాన్ని కూడా ఆ రాష్ట్రాలు బ్యాలెట్లో పొందుపరిచాయి.గర్భస్రావాన్ని నిషేధిస్తూ అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రం 1821లో తొలిసారిగా చట్టం చేసింది. దాంతో అప్పటిదాకా సాధారణ చికిత్సగా ఉన్న గర్భస్రావం నేరంగా మారిపోయింది. 1880వ దశకం చివర్లలో పలు ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టాలే చేశాయి. జేన్ రో అనే మహిళ దీన్ని వ్యతిరేస్తూ 1971లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గర్భస్రావం అందుబాటులో ఉండేలా చూడాలని, పునరుత్పత్తి సంబంధిత విషయాల్లో నిర్ణయాధికారం మహిళలకే ఉండాలని వాదించారు. దాంతో గర్భస్రావాన్ని చట్టబద్ధం చేస్తూ రెండేళ్ల తర్వాత కోర్టు తీర్పునిచ్చింది. ‘రోవర్సెస్ వేడ్’ కేసుగా ఇది చరిత్రకెక్కింది. తర్వాత చాలా రాష్ట్రాలు మహిళలకు అబార్షన్ సదుపాయాన్ని కల్పించినా కొన్ని మాత్రం నిషేధం కొనసాగించాయి. పోప్ వ్యాఖ్యలతో.. అబార్షన్ హక్కులను 1951లో పోప్ గట్టిగా విమర్శించారు. ‘‘గర్భంలోని బిడ్డకు కూడా జీవించే హక్కుంది. ఆ బిడ్డనిచ్చింది దేవుడు. అంతే తప్ప తల్లిదండ్రులు, ఈ సమాజమో లేదా మనిషో సృష్టించిన ప్రభుత్వాలు కాదు’’ అంటూ సందేశమిచ్చారు. ఆ తర్వాత గర్భస్రావంపై ఆంక్షలను సుప్రీంకోర్టే తొలగించడం మత సమూహాలకు సమస్యగా మారింది. దాన్ని అడ్డుకోడానికి రిపబ్లికన్ పార్టీని మాధ్యమంగా అవి ఎంచుకున్నాయి. ఫలితంగా 1970వ దశకంలో అంతంతమాత్రంగా ఉన్న పార్టీ ఈ మత సమూహాలతో కలిసి ప్రభావశీలంగా మారింది. 1968–88 మధ్య ఆరు అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఐదింటిలో విజయం సాధించింది. జడ్జీల ద్వారా ఎత్తులు 1983లో పార్లమెంటులో గర్భస్రావ చట్ట సవరణకు ప్రతిపాదనలు ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు. గర్భస్రావాన్ని నిషేధించడం పార్లమెంటు ద్వారా సాధ్యం కాదని, కోర్టు ద్వారానే ముందుకెళ్లాలని భావించారు. కానీ దానికోసం సంప్రదాయవాద జడ్జిలు అవసరమయ్యారు. అమెరికాలో జడ్జీలను అధ్యక్షుడే నియమిస్తారు. సుప్రీంకోర్టు జడ్జీల నియామకంపై పార్టీలు దశాబ్దాలుగా రెండుగా చీలుతున్నాయి. అధికారం రిపబ్లికన్ల చేతుల్లో ఉంటే గర్భస్రావాన్ని వ్యతిరేకించే జడ్జీలు, డెమొక్రాట్ల చేతిలో ఉంటే సమర్థించే వాళ్లు వచ్చేవారు. ట్రంప్ హయాంలో గర్భస్రావ వ్యతిరేక ధోరణి ఉన్న జడ్జీల నియామకం ఎక్కువగా జరిగింది. దాంతో అబార్షన్ను చట్టబద్ధం చేసిన 50 ఏళ్ల నాటి తీర్పును సుప్రీంకోర్టు 2022లో కొట్టివేసింది. అమెరికాలో అబార్షన్ హక్కులను ఈ తీర్పు పూర్తిగా మార్చేసింది. రాష్ట్రాలు తమ పరిధిలో అబార్షన్ అనుమతులను మార్చుకోవచ్చని పేర్కొంది. దీని ఆధారంగానే టెక్సాస్ రిపబ్లికన్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఒక కొత్త గర్భస్రావం చట్టాన్ని అమలు చేశారు. ఈ బాటలో మరిన్ని రాష్ట్రాలు నడిచాయి.మెజారిటీ అమెరికన్ల వ్యతిరేకత 2022 నాటి సుప్రీంకోర్టు తీర్పుతో మెజారిటీ అమెరికన్లు విభేదించారు. ఇది ఆ ఏడాది జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయానికి కారణమైంది. ఇప్పుడు మాత్రం పునరుత్పత్తి హక్కుల కంటే ఆర్థిక వ్యవస్థ గురించి ఓటర్లలో ఎక్కువ ఆందోళన ఉందని సర్వే లు చెబుతున్నాయి. కానీ డెమొక్రాట్ల అభ్యర్థి, కమలా హారిస్ మాత్రం తన ప్రచా రంలో అబార్షన్ హక్కులనే ప్రస్తావిస్తున్నారు. అబార్షన్ల అనుకూల తీర్పును రద్దు చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో తన పాత్రను ట్రంప్ ప్రచారం మొదట్లో పదేపదే పేర్కొంటున్నారు. ఇటీవల మాత్రం అబార్షన్ హక్కులపై నిర్ణయాధికారం రాష్ట్రాలదేనంటున్నారు.డెమొక్రాట్లకే సానుకూలం ఫ్లోరిడా, అరిజోనా, నెవడా, కొలరాడో, మోంటానా, సౌత్ డకోటా, మిస్సోరి, న్యూయార్క్, మేరీలాండ్, నెబ్రాస్కాల్లో అధ్యక్ష ఎన్నికలతో పాటు అబార్షన్ హక్కులపై కూడా ఒకేసారి ఓటింగ్ జరుగుతోంది. అబార్షన్ హక్కులుండాలా, పూర్తిగా రద్దు చేయాలా అనే విషయమై ఓటర్లు నిర్ణయం వెలువరించనున్నారు. ఈ విషయాలను అధ్యక్ష బ్యాలెట్తో పాటుగా జోడించడం అరిజోనా, నెవడా వంటి రాష్ట్రాల్లో డెమొక్రాట్లకు కలిసి రానుందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఓటేసిన ఫ్లోరిడా కూడా ఈసారి డెమొక్రాట్లకు మద్దతుగా నిలుస్తుందని అంచనా. ఫ్లోరిడా ఓటర్లలో 46 శాతం మంది చట్ట సవరణకు అనుకూలంగా, 38 శాతం వ్యతిరేకంగా, 16 మంది తటస్థంగా ఉన్నారని అక్టోబర్లో న్యూయార్క్ టైమ్స్/సియానా కాలేజ్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. కాకపోతే వచ్చే మంగళవారం జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్లో అబార్షన్ అంశం ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. ఎందుకంటే ఎకానమీనే ఈ ఎన్నికల్లో అతి పెద్ద సమస్యగా ఏకంగా 28 శాతం మంది ఓటర్లు చూస్తున్నట్టు సియానా కాలేజ్ పోల్ సర్వే పేర్కొంది. అబార్షన్ హక్కులను పెద్ద సమస్యగా భావిస్తున్నది 14 శాతమే. ఇక ట్రంప్ అత్యంత ప్రాధాన్యమిస్తున్న అక్రమ వలసల అంశానికి 12 శాతం మంది మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కమలా హారిస్ కోసం పాల్వంచలో 11 రోజుల పాటు మహాయజ్ఞం
పాల్వంచ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ విజయాన్ని కాంక్షిస్తూ శ్రీరాజ శ్యామలాంబ సుదర్శన మహాయజ్ఞం నిర్వహించారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ పేరుతో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ మహాయజ్ఞం నిర్వహించారు. 11 రోజుల కిందట ప్రారంభమైన ఈ యజ్ఞం బుధవారం పూర్ణాహుతితో ముగిసింది.అమెరికా అధ్యక్ష ఎన్నికలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఎలాగైనా కమలా హారిస్ గెలవాలనే ఆకాంక్షతో ఈ యజ్ఞం నిర్వహించినట్లు సొసైటీ చైర్మన్ నల్లా సురేశ్రెడ్డి తెలిపారు. తాను కొంతకాలం అమెరికాలో పని చేశానని, ఆ సమయంలో సెనేటర్గా ఉన్న కమలా హారిస్ను కలిశానని చెప్పారు. భారతీయ మూలాలు కలిగిన ఆమె తల్లి శ్యామలా గోపాలన్ గురించి తెలుసుకుని ఆమె పేరుతో పాల్వంచలో ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించామని ఆయన వెల్లడించారు.కాగా, యజ్ఞం ముగింపు సందర్భంగా 40 మంది వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ పూర్ణాహుతి వేడుకను ఘనంగా నిర్వహించామని, భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. త్వరలో కమలా హారిస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని, ఈ కార్యక్రమానికి అమెరికా నుంచి ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.తిరునక్షత్ర మహోత్సవానికి రండి: సీఎం, డిప్యూటీ సీఎంలకు ఆహ్వానం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ శివారులో సమతాస్ఫూర్తి కేంద్రంలో నవంబర్ 1 నుంచి జరగనున్న శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి తిరునక్షత్ర మహోత్సవానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను నిర్వాహకులు ఆహ్వానించారు. హైదరాబాద్లోని శ్రీ అహోబిల జీయర్ స్వామి బుధవారం వీరద్దరిని కలిసి ఈ మేరకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.చదవండి: ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు చదివిస్తా.. పేద విద్యార్థినికి మంత్రి కోమటిరెడ్డి అండ -
హిందువులను విస్మరించారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్పై రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను వారిద్దరూ పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. బంగ్లాదేశ్లో హిందువులు, మైనారిటీలపై హింసను తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత అనాగరికమైన చర్యగా పేర్కొన్నారు. ట్రంప్ తన దీపావళి సందేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. హిందూ అమెరికన్లకు రక్షణ కలి్పస్తామని ప్రతిజ్ఞ చేశారు. బంగ్లాదేశ్లో హిందువులు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీలపై అరాచక మూకల దాడులను, వారి ఆస్తులను దోచుకుంటున్న అనాగరిక హింసను తీవ్రంగా ఖండించారు. ఎక్స్లో ఈ మేరకు ఆయన పోస్ట్ చేశారు. తాను అధ్యక్షునిగా ఉంటే ఇలా ఎప్పటికీ జరిగేది కాదన్నారు. ఇజ్రాయెల్ మొదలుకుని ఉక్రెయిన్ మీదుగా అమెరికా దక్షిణ సరిహద్దు దాకా బైడెన్, హారిస్ విధానాలు ఘోరంగా విఫలమయ్యాయంటూ ధ్వజమెత్తారు. మునుపటి కంటే మెరుగైన అమెరికాను తీర్చిదిద్దుతా’’ అని ట్రంప్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇజ్రాయెల్కు ట్రంప్ మాస్ వార్నింగ్ -
‘చెత్త ట్రక్’ నడిపిన ట్రంప్.. బైడెన్, కమలకు కౌంటర్
న్యూయార్క్: ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ‘చెత్త’ చూట్టూ రాజకీయం నడుస్తోంది!. తాజాగా.. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు కౌంటర్ ఇస్తూ బుధవారం ఓ చెత్త ట్రక్ను నడిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.‘నా చెత్త ట్రక్ మీకు నచ్చిందా?. కమలా, జో బిడెన్ల గౌరవార్థంతో ట్రక్ నడుపుతున్నా’ అని ట్రంప్ మీడియాతో అన్నారు. ‘‘హాస్యనటుడు టోనీ హించ్క్లిఫ్ ప్యూర్టోరీకోపై చేసిన వ్యాఖ్యలపై ప్రస్తావించాల్సిన అవసరం లేదు. నాకు ఆ హాస్యనటుడి గురించి ఏమీ తెలియదు. నేను ఆయన్ను ఎప్పుడూ చూడలేదు. ఆయన ఒక హాస్యనటుడు.. ఆయన గురించి చెప్పడానికి ఏం ఉంటుంది’ అని మీడియా ప్రశ్నలను ట్రంప్ దాటవేశారు.TRUMP ARRIVES FOR CAMPAIGN RALLY IN A GARBAGE TRUCK!“How do you like my garbage truck? This truck is in honor of Kamala and Joe Biden.”“For Joe Biden to make that statement — it’s really a disgrace” pic.twitter.com/jA9nEQKvCg— J Stewart (@triffic_stuff_) October 30, 2024ఇటీవల రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న స్టాండప్ కమేడియన్ టోనీ హించ్క్లిఫ్ మాట్లాడుతూ ప్యూర్టోరీకోను నీటిపై తేలుతున్న చెత్తకుప్పగా అభివర్ణించారు. దానిపై అమెరికావ్యాప్తంగా ఇప్పటికీ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే.. ప్యూర్టోరీకోపై టోనీ వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో అధ్యక్షుడు జోబైడెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిస్పానిక్ గ్రూప్ వోటో లాటినో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ.. ‘నాకు తెలిసిన అసలైన చెత్త ఆయన (ట్రంప్) మద్దతుదారులు మాత్రమే. వారి రూపంలోనే అసలైన చెత్తాచెదారం కనిపిస్తోంది’’ అని అన్నారు. తాను చెత్త అన్నది ప్యూర్టోరీకోపై అసహ్యకర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ మద్దతుదారును ఉద్దేశించి మాత్రమేనంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. కానీ బైడెన్ వ్యాఖ్యలపై దుమారం చల్లారడం లేదు. -
అధ్యక్షుడిగా పనికిరారు.. ట్రంప్ను ఓడించండి..
-
USA Presidential Elections 2024: పరిధులు దాటుతున్న మస్క్
అమెరికా అధ్యక్ష ఎన్నికలు అతి సమీపానికి వచ్చిన నేపథ్యంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు మద్దతిచ్చే క్రమంలో స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పరిధులు దాటుతున్నారు. డెమొక్రటిక్ అభ్యరి్థ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్పై హింసాత్మక, అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారు. ట్రంప్, హారిస్ పోటీని గ్లాడియేటర్ నేపథ్య పోరాటంగా అభివర్ణిస్తూ మస్క్కు చెందిన అమెరికా సూపర్ పీఏసీ ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియో దుమారం రేపుతోంది. రెచ్చగొట్టే, హింసాత్మక చిత్రాలతో రూపొందించిన ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ను చేతిలో కత్తులతో గ్లాడియేటర్లా చూపారు. మైదానంలో హారిస్ తలపడుతున్నట్టు, ఆమె ముఖంపై తన్నుతున్నట్టు రూపొందించారు. ట్రంప్పై హత్యాయత్నం జరిగిన పెన్సిల్వేనియా ర్యాలీని చూపుతూ మస్క్ వాయిస్ ఓవర్తో వీడియో మొదలవుతుంది. ఈ ఎన్నికలు అమెరికాతో పాటు పాశ్చాత్య నాగరికత భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని భావిస్తున్నట్టు మస్క్ చెబుతారు. రాకెట్లు, జెట్లు, హల్క్ చొక్కా విప్పడం, ట్రంప్ ప్రసంగాలు, పలు సినీ క్లిప్పింగులు వీడియలో చోటుచేసుకున్నాయి. దీని సృష్టికర్తలు నియో–నాజీలంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ పీఏసీ ఎక్స్ గతంలోనూ హారిస్ లక్ష్యంగా ఇలాంటి వీడియోలు చేసింది. ఆమెను ‘సి–వర్డ్’(కమ్యూనిస్టు)గా అభివరి్ణస్తూ పోస్ట్ చేసిన ఆ వీడియోను వెంటనే తొలగించింది. ట్రంప్కు మద్దతుగా, డెమొక్రాట్లను విమర్శిస్తూ ప్రకటనల కోసం సూపర్ పీఏసీ ఇప్పటికే భారీగా ఖర్చు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్థిరత్వం లేని ట్రంప్ను ఓడించండి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారం వేడెక్కుతోంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తన ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై మరోసారి విరుచుకుపడ్డారు. ట్రంప్ ఏమాత్రం స్థిరత్వం లేని మనిషి, ప్రతీకారమే అతడి విధానమని మండిపడ్డారు. విభజనవాది, గందరగోళానికి మారుపేరైన ట్రంప్ను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాజాగా డెమొక్రటిక్ ఎన్నికల ప్రచార సభలో కమలా హారిస్ మాట్లాడారు. అమెరికా పౌరులపైకి అమెరికా సైన్యాన్ని ప్రయోగించాలనుకుంటున్న ట్రంప్కు బుద్ధి చెప్పాలని సూచించారు. వ్యతిరేకులను బల ప్రయోగంతో అణచివేయాలన్నదే ఆయన ఆలోచన అని ఆరోపించారు. ప్రజలను శత్రువులుగా భావిస్తున్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎంతమాత్రం పనికిరారని తేల్చిచెప్పారు. ప్రజలు కోరుకుంటున్న కొత్త తరం నాయకత్వాన్ని పరిచయం చేస్తానని, అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లకు కమలా హారిస్ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మేలు చేయడమే తన లక్ష్యమని, అందుకోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టంచేశారు. దుష్ట స్వభావం కలిగిన వ్యక్తులపై, స్వప్రయోజనాల కోసం పాకులాడే శక్తులపై కఠినమైన పోరాటానికి భయపడబోనని చెప్పారు. తన తల్లి తనకు ధైర్యసాహసాలు నూరిపోశారని వ్యాఖ్యానించారు. కష్టపడి పనిచేసే నిజాయతీపరులైన ప్రజలను స్వార్థ శక్తుల నుంచి కాపాడుతానని హామీ ఇచ్చారు. అధికారికంలోకి వచ్చాక రాజకీయాలకు అతీతంగా అందరి బాగు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. అన్ని పార్టీలతో కలిసి పని చేస్తానన్నారు. అమెరికా అధ్యక్షురాలిగా తాను భిన్నమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని కమలా హారిస్ ఉద్ఘాటించారు. ఆకాశాన్నంటున్న ధరలే తన ముందున్న అతిపెద్ద సవాలు అని చెప్పారు. ధరలు తగ్గించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించారు. నాకు ఓటేయని వారికీ ప్రతినిధినే: హారిస్బైడెన్ వివాదం నేపథ్యంలో వ్యాఖ్యలువాషింగ్టన్: ‘‘నేను అమెరికన్లందరికీ ప్రాతినిధ్యం వహిస్తా. అధ్యక్ష ఎన్నికల్లో నాకు ఓటేయని వారు కూడా అందులో భాగమే’’ అని హారిస్ స్పష్టం చేశారు. ట్రంప్ మద్దతుదారులను ‘చెత్త’గా అభివర్ణిస్తూ అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడం తెలిసిందే. వాటిపై హారిస్ ఇలా స్పందించారు. ఎవరికి ఓటేస్తారన్న దాని ఆధారంగా వ్యక్తులపై విమర్శలు చేయడాన్ని తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. -
USA Presidential Elections 2024: హారిస్కు మొగ్గు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సర్వేల్లో డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ మరోసారి స్వల్ప ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో పోలిస్తే ఆమెకు ఒక శాతం మొగ్గున్నట్టు మంగళవారం వెలువడ్డ రాయిటర్స్/ఇప్సోస్ తాజా సర్వేలో తేలింది. శుక్రవారం నుంచి ఆదివారం దాకా జరిపిన ఈ మూడు రోజులు హారిస్కు 44 శాతం, ట్రంప్కు 43 శాతం మంది మద్దతిచ్చారు. 975 మంది నమోదైన ఓటర్లతో కలిపి మొత్తం 1,150 మంది అమెరికా పౌరులు ఈ సర్వేలో పాల్గొన్నారు. అయితే ఎకానమీ, నిరుద్యోగం, ఉపాధి వంటి అతి కీలకమైన అంశాల్లో ఏకంగా 47 శాతం మంది ట్రంప్కే ఓటేశారు. హారిస్కు మద్దతిచ్చిన వారు కేవలం 37 శాతం మాత్రమే. మరో కీలకాంశమైన వలసల విషయంలో కూడా ట్రంప్ 48 శాతం మంది వైఖరిని సమర్థిస్తే హారిస్ను 33 శాతం మందే సమర్థించారు. కచ్చితంగా ఓటేస్తామన్న వారిలో 47 శాతం హారిస్ను, 46 శాతం ట్రంప్ను బలపరిచారు. హారిస్ అధ్యక్ష రేసులోకి వచ్చినప్పటి నుంచి సర్వేలన్నీ ఆమెకే మొగ్గున్నట్టు తేల్చడం విశేషం. -
US Elections 2024: చెత్త చుట్టూ అమెరికా ఎన్నికల సమరం
హోరాహోరీగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం చివరి ఘట్టంలో ‘చెత్త’ చుట్టూ తిరుగుతోంది. గత ఆదివారం రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ బహిరంగ సభలో స్టాండప్ కమేడియన్ టోనీ హించ్క్లిఫ్ మాట్లాడుతూ ప్యూర్టోరీకోను నీటిపై తేలుతున్న చెత్తకుప్పగా అభివరి్ణంచడం తెలిసిందే. దానిపై అమెరికావ్యాప్తంగా ఇప్పటికీ నిరసనలు పెల్లుబుకుతున్నాయి. దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా ఉన్న ప్యూర్టోరీకో ఓటర్లలో ఆ వ్యాఖ్యలు ఆగ్రహం రగిల్చాయి. వారంతా నవంబర్ 5 నాటి పోలింగ్లో ట్రంప్కు వ్యతిరేకంగా ఓటేయవచ్చని, ఫలితంగా డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ విజయాన్ని నల్లేరుపై నడకగా మారనుందని విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే ట్రంప్ అభిమానులనే ‘అసలైన చెత్త’గా అభివరి్ణస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దాంతో పరిస్థితి తారుమారైందన్న అభిప్రాయం వినిపిస్తోంది. తన ఉద్దేశం అది కాదంటూ సోషల్ మీడియా సాక్షిగా బైడెన్ వివరణ ఇచ్చినా అప్పటికే హారిస్కు భారీ నష్టం జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అనుకోని అవకాశాన్ని గట్టి ఆయుధంగా వాడుకునేందుకు ట్రంప్తో పాటు ఆయన ప్రచార శిబిరం కూడా శాయశక్తులా ప్రయతి్నస్తోంది. అమెరికన్లను అవమానించడం డెమొక్రాట్లకు కొత్తేమీ కాదంటూ ఊరూవాడా హోరెత్తిస్తోంది...! ఎన్నికల ఘట్టం చివరి అంకంలో సొంత పార్టీ అభ్యర్థి హారిస్ను అమెరికా అధ్యక్షుడు బైడెన్ గట్టి చిక్కుల్లోనే పడేశారు. ప్యూర్టోరీకోపై టోనీ వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిస్పానిక్ గ్రూప్ వోటో లాటినో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు. ప్యూర్టోరీకాపై ట్రంప్ సమక్షంలోనే టోనీ చేసిన దిగజారుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్యూర్టోరీకన్ల పట్ల పూర్తి సంఘీభావం ప్రకటించారు. ‘‘వారు చాలా మంచివాళ్లు. ఆత్మగౌరవమున్న వ్యక్తులు. అమెరికా అభివృద్ధిలో వారికి కీలక పాత్ర’’ అంటూ కొనియాడారు. ‘‘లాటిన్ అమెరికన్లను రాక్షసులుగా చిత్రించేందుకు ట్రంప్, ఆయన శిబిరం చేస్తున్న ప్రయత్నాలు దారుణం. ఇతర దేశాలను కించపరచడం అమరికా విధానమే కాదు. అమెరికా పాటించే విలువలకు అవి పూర్తిగా విరుద్ధం’’ అంటూ విమర్శించారు. అక్కడిదాకా బాగానే ఉన్నా, ‘‘నాకు తెలిసిన అసలైన చెత్త ఆయన (ట్రంప్) మద్దతుదారులు మాత్రమే. వారి రూపంలోనే అసలైన చెత్తాచెదారం కనిపిస్తోంది’’ అంటూ నోరుజారారు. వాటిపై అమెరికా అంతటా విమర్శలు చెలరేగుతున్నాయి. బైడెన్ అంగీకారయోగ్యం కాని వ్యాఖ్యలు చేశారని విమర్శకులు కూడా భావిస్తున్నారు. ప్యూర్టోరీకాపై టోనీ తలతిక్క వ్యాఖ్యలతో తలపట్టుకున్న రిపబ్లికన్ పార్టీ నెత్తిన బైడెన్ పాలు పోశారంటున్నారు. ఆయన వ్యాఖ్యలను రిపబ్లికన్లు రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ చేసిన వ్యాఖ్యలతో ముడిపెట్టి మరీ, ‘అమెరికన్లను దారుణంగా అవమానించడం డెమొక్రాట్లకు అలవాటే’నంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ట్రంప్ మద్దతుదారులైన కోట్లాది మంది అమెరికన్లను బైడెన్, హారిస్ దారుణంగా అవమానించారంటూ ట్రంప్ ప్రచార బృందం జాతీయ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ దుయ్యబట్టారు. వివరణ ఇచి్చనా... వ్యవహారం చేయి దాటుతోందని గ్రహించిన బైడెన్ వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగారు. తాను చెత్త అన్నది ప్యూర్టోరీకోపై అసహ్యకర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ మద్దతుదారును ఉద్దేశించి మాత్రమేనంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అలాంటి వారిని దిగజారుడుతనాన్ని వర్ణించేందుకు అదే సరైన పదమని చెప్పుకొచ్చారు. కానీ బైడెన్ వ్యాఖ్యలపై దుమారం చల్లారడం లేదు. వాటిపై డెమొక్రాట్ నేతలను అమెరికా అంతటా ప్రజలు నిలదీస్తున్నారు. హారిస మద్దతుదారైన పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరోకు కూడా మంగళవారం సాయంత్రం ఒక ఇంటర్వ్యూలో దీనిపై వరుసబెట్టి ప్రశ్నలు ఎదురయ్యాయి. దాంతో, ‘ప్రత్యర్థి నేతలకు మద్దతిచి్చనా నేనైతే అమెరికన్లెవరినీ ఎప్పటికీ అవమానించబోను’’ అంటూ ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచి్చంది. నాడు హిల్లరీ ఏమన్నారంటే... 2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కూడా ట్రంప్ మద్దతుదారులపై ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘ట్రంప్ మద్దతుదారుల్లో సగానికి సగం మంది ఎందుకూ పనికిమాలినవాళ్లే. వాళ్లంతా జాత్యహంకారులు. స్త్రీలు, ముస్లింలు, విదేశీయులతో పాటు స్వలింగ సంపర్కుల పట్ల విద్వేషం వెలిగక్కేవాళ్లు’’ అంటూ దుయ్యబట్టారు. ఆ వ్యాఖ్యల ద్వారా అమెరికన్లందరినీ హిల్లరీ తీవ్రంగా అవమానించారంటూ రిపబ్లికన్లు అప్పట్లో జోరుగా ప్రచారం చేశారు.డెమొక్రాట్లకు అలవాటేబైడెన్ తాజా వ్యాఖ్యలపై ట్రంప్ కూడా స్పందించారు. పెన్సిల్వేనియాలో ర్యాలీలో ఉండగా బైడెన్ వ్యాఖ్యలను ట్రంప్ ప్రచార బృందం ఆయన చెవిన వేసింది. దాంతో, ‘‘వావ్! ఇది దారుణం. కానీ వాళ్లకు (డెమొక్రాట్లకు) ఇది అలవాటే’’ అంటూ ట్రంప్ స్పందించారు. ‘‘2016లో నాతో తలపడ్డ హిల్లరీ కూడా నా మద్దతుదారులపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలే చేశారు. కానీ అవి ఫలించలేదు. ‘చెత్త’ వ్యాఖ్యలు వాటికంటే దారుణమైనవి. కాదంటారా?’’ అంటూ వివాదాన్ని మరింత పెద్దది చేసే ప్రయత్నం చేశారు. అమెరికన్లపై ఎవరూ క్రూర పరిహాసం చేయొద్దన్నదే తన అభిప్రాయమని చెప్పుకొచ్చారు. అమెరికన్లపై ప్రేమాభిమానాలు లేని డెమొక్రాట్లకు దేశానికి నాయకత్వం వహించే హక్కే లేదన్నారు. పనిలో పనిగా అంతేగాక టోనీ ‘ప్యూర్టోరీకో’ వ్యాఖ్యలకు దూరం జరిగేందుకు కూడా ట్రంప్ ప్రయతి్నంచారు. వాటితో తనకు ఏ సంబంధమూ లేదని చెప్పుకొచ్చారు. ‘‘ఎవరో కమేడియన్ ప్యూర్టోరీకోపై ఏదో అభ్యంతరకరమైన జోకు పేలి్చనట్టు నాకెవరో చెప్పారు. అతనెవరో నాకస్సలు తెలియదు. అతన్ని నేనెన్నడూ కనీసం చూడను కూడా లేదు’’ అని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి ట్రంప్ ర్యాలీ వేదికపై ఎందుకున్నట్టన్న ప్రశ్నకు మాత్రం బదులివ్వలేదు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా ఎన్నికల్లో భారతీయత
అమెరికా తపాలా శాఖ వారి నుంచి దీపావళి స్టాంపు విడుదలను కోరుతూ భారతీయ అమెరికన్లు కొన్ని సంవత్సరాలు వరుసగా పిటిషన్ల మీద పిటిషన్లు వేశారు. 2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్హౌస్లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో ఉప్పొంగింది. అమెరికన్ల గుర్తింపు కోసం ఈ తహతహ అంతా! ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఇప్పటికీ ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఒక అధ్యయనం చెబుతోంది. కమలా హ్యారిస్ తల్లి, జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారు కావడం వల్ల 2024 ఎన్నికలను భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు.అమెరికా ప్రభుత్వం తమను గుర్తించాలని తహతహలాడని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దీపావళి స్టాంపు కోసం పిటిషన్ల మీద పిటిషన్లు వేయడం ఇందుకు ఒక ఉదాహరణ. హనుక్కా(యూదుల పండుగ), ఈద్లకు స్టాంపులు ఉండగా... తమకెందుకు లేదని ఏటా భారతీయ అమెరికన్లు అక్కడి పోస్ట్ మాస్టర్ జనరల్కు మెయిళ్లు పెట్టేవారు.సంతకాల సేకరణ జరిగేది. కానీ ప్రతిసారీ నిరాశే ఎదురయ్యేది. 2013లో భారతీయ అమెరికన్ పార్లమెంటు సభ్యుడు అమి బేరా స్టాంపు ఎప్పుడో విడుదల కావాల్సిందని అన్నారు. మూడేళ్ల తరువాత 2016లో ‘ఫరెవర్’ స్టాంపు విడుదలైంది. అంటే ఎప్పటికీ తొలగించ నిది. కొద్ది రోజుల్లోనే లక్ష స్టాంపులు అమ్ముడయ్యాయి. స్టాంపులు అమ్ముడు కాకపోతే పంపిణీలోంచి తొలగిస్తారేమోనని విపరీతంగా కొనాలన్న ప్రచారం జరిగింది. పోస్ట్మాస్టర్ జనరల్ రంగంలోకి దిగి దీపావళి స్టాంపును తొలగించే ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేయాల్సి వచ్చింది. స్టాంపు ద్వారా అక్కడి సమాజంలో గుర్తింపు పొందేందుకు పడ్డ శ్రమ, ఆందోళన ఇదంతా.2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిసారి వైట్ హౌస్లో దీపావళి దివ్వెను వెలిగించినప్పుడు భారతీయ అమెరికన్ల ఛాతీ గర్వంతో పొంగిపోయింది. దీపావళి రోజును సెలవుగా ప్రకటించాలన్న డిమాండ్ బయలుదేరింది. స్పెల్లింగ్–బీ పోటీల్లో గెలవడం ఒకటైతే, అమెరికన్ కులీనుల నుంచి గుర్తింపు పొందడం మరొకటి.ఆ రకంగా 2024 ఎన్నికలు భారతీయ అమెరికన్లకు దీపావళి కానుక అనుకోవచ్చు. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ తల్లి, రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జేడీ వాన్స్ భార్య... ఇద్దరూ భారతీయ మూలాలు ఉన్నవారే. అమెరికా ఎన్నికల్లో ఈసారి భారతీయత భావన రకరకాలుగా వ్యక్తమవుతోంది.ఉదాహరణకు డోనాల్డ్ ట్రంప్ ఓ ఆఫ్రికన్ –అమెరికన్ జర్నలిస్టుతో మాట్లాడుతూ... కమల సగం ఆఫ్రికన్ అన్న విషయం తనకు నిన్నమొన్నటి వరకూ తెలియదనీ... ఆమె ఎల్లప్పుడూ తన భారతీయ మూలాలను మాత్రమే ప్రస్తావిస్తూంటుందని అన్నారు. అదొక విచిత్రమైన వ్యాఖ్య. కమల ఎప్పుడూ తన ఆఫ్రికన్ మూలాలనే ప్రస్తావిస్తుంటుందని భారతీయ అమెరికన్లు చాలామంది వాదిస్తూంటారు. కేవలం దీపావళి వేడుకల్లో, లేదంటే ఇండియన్ అమెరికన్ లతో నిధుల సేకరణ కార్యక్రమాల్లో మాత్రమే భారతీయ మహిళగా ఉంటుందని చెబుతుంటారు. భారతీయ అమెరికన్ల కంటే ఆఫ్రికన్ అమె రికన్ల ఓటు బ్యాంకు పెద్దదన్న అంచనాతో కమల హ్యారిస్ను ఒక అవకాశవాదిగా చిత్రీకరించేందుకు ట్రంప్ ప్రయత్నించారు. ఇది దీర్ఘకాలంలోనూ ట్రంప్కు పనికొచ్చే ఎత్తుగడ.ఒక రకంగా చూస్తే అమెరికా రాజకీయాల్లో భారతీయ అమెరికన్లు అంతగా అక్కరకొచ్చే అంశంగా కనపడటం లేదు. స్టాంపుల్లాంటి చిన్న విషయాలను పక్కనబెడితే... మిషిగన్ యూనివర్సిటీకి చెందిన జోయ్ జీత్ పాల్ ‘న్యూస్లాండ్రీ’ కోసం నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఓట్ల శాతం (2020లో 74 శాతం) ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ విరాళాలు ఇస్తున్నప్పటికీ భారతీయ అమెరికన్లు ఒక నిర్ణాయక శక్తిగా అవతరించలేదని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే గతంలో ఒకసారి ఫ్లోరిడా కేంద్రంగా ఉన్న భారతీయ వైద్యులు కొందరు ఇండియన్ రిపబ్లికన్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటయ్యేందుకు సహకరించడం... జార్జి బుష్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన ప్పుడు అక్కడి 2,000 ఓట్లే కీలకం కావడం గమనార్హం. అయితే 2005లో భారతీయ హోటలియర్లు తమ వార్షిక కార్యక్రమానికి నరేంద్ర మోదీని ఆహ్వానించడం... అది కాస్తా ఆయన వీసా రద్దుకు కారణమవడం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. తమ జనాభా కంటే ఎక్కువ పలుకుబడి కలిగివున్న ఇజ్రాయెలీల మాదిరిగానే భారతీయ అమెరికన్లు కూడా ‘యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటు చేశారు. 1956లో దలీప్ సింగ్ సాండ్ తరువాత బాబీ జిందాల్ కాంగ్రెస్కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ గా రికార్డు సృష్టించిన అనంతరం, కాలిఫోర్నియా నుంచి అమి బేరా కూడా కాంగ్రెస్కు ఎన్నికైన తరువాత మాత్రమే భారతీయ అమెరికన్ల భాగస్వామ్యం పెరిగిందని జోయ్జీత్ పాల్ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు ఇండియన్ అమెరికన్ ఇంప్యాక్ట్ ఫండ్ భారతీయ అమెరికన్ల ఎన్నికలకు ప్రాయోజకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయినా కూడా ఇప్పటికీ భారతీయ అమెరికన్లను విదేశీయుల్లాగే భావించడం ఎక్కువ. భారతీయులకు తాను దగ్గరివాడినని చెప్పుకునే డోనాల్డ్ ట్రంప్ కూడా తన ప్రత్యర్థి నిక్కీ హేలీని ‘నిమ్రదా’ హేలీ అని సంబోధిస్తూండటం గుర్తు చేసుకోవాలి. భారతీయ మూలాలను గుర్తు చేసే ప్రయత్నం అన్నమాట! దీనికి తగ్గట్టుగానే నిక్కీ హేలీ తన వెబ్సైట్లో అసలు పేరు నమ్రతా రణ్ధవాను అసలు ప్రస్తావించనే లేదు. 2010 అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల పోటీని నేను దగ్గరుండి గమనించాను. ఎక్కువమంది దక్షిణాసియా ప్రాంత వాసులు పెద్దగా లేని చోట్లే పోటీ చేశారు. కాన్సస్లో రాజ్ గోయెల్ పోటీ చేసినప్పుడు, పరిసర ప్రాంతాల్లో ఎంతమంది భారతీయు లున్నారని వచ్చిన ప్రశ్నకు, ‘‘పది’’ అని సమాధానం చెప్పారు; పది శాతమంటే మేలే అని వచ్చిన స్పందనకు, ‘‘శాతం కాదు, అక్షరాలా పది మంది మాత్రమే’’ అని ఈయన జవాబిచ్చిన ఘట్టాన్ని నాతో పంచుకున్నారు. ఇండో అమెరికన్ కౌన్సిల్కు చెందిన డెమోక్రటిక్ నేషనల్ కమిటీ అధ్యక్షుడు శేఖర్ నరసింహన్ మాటల్లో చెప్పాలంటే... భారతీయులు అటు నలుపు కాదు, ఇటు తెలుపు కాదు; కాబట్టి వెంటనే ఎందులోనూ చేర్చలేరు.ఈ ఎన్నికల్లో అమెరికన్ కలల కోసం కష్టపడ్డ తల్లిదండ్రులకు మొక్కుబడిగా ఓ దండం పెట్టేసిన తరువాత అభ్యర్థులంతా తాము అమెరికాలో సాధించిన ఘనతలకే పెద్దపీట వేశారు. కమల హ్యారిస్ తాను ఒకప్పుడు ‘మెక్ డొనాల్డ్స్’లో పని చేశానని చెప్పుకున్నట్లు. అమి బేరా తన ప్రచారంలో భారతీయ సంప్రదాయ విలువలను, అమెరికా వృత్తిగత శైలి... రెండింటిని కలగలిపి ‘బోత్ ఆఫ్ టూ వరల్డ్స్’ అని చెప్పుకొన్నారు. అప్పటికి ఓటమి పాలైనా తరువాతి ఎన్నికల్లో గెలుపొందారు. మార్పునకు కొంత సమయం పడుతుందనేందుకు ఇదో నిదర్శనం.అయినా సరే... పాత అలవాట్లు అంత తొందరగా పోవు అంటారు. శేఖర్ నరసింహన్కు ఇది 2006లోనే అనుభవమైంది. అప్పట్లో రిపబ్లికన్ సెనేటర్ పోటీదారు జార్జ్ అలెన్ ఓ యువ భారతీ యుడిని ఉద్దేశించి ‘మకాకా’(కోతి) అని గేలి చేస్తూ మాట్లాడారు. ఆ యువకుడు శేఖర్ కుమారుడు. ఈ ఘటనతో శేఖర్కు తత్వం బోధ పడింది. నువ్వు ఎంత తాపత్రాయ పడినా, వీళ్లకు (అమెరికన్లు) మనం (భారతీయులు) భిన్నంగానే కనిపిస్తూంటామని అర్థమైంది. ఈ ఎన్ని కల్లో కూడా ట్రంప్ మద్దతుదారు లారా బూమర్ చేసిన ‘‘హ్యారిస్ గెలుపొందితే వైట్హౌజ్లో కర్రీ వాసనొస్తుంది’’ అన్న వ్యాఖ్య రభసకు దారితీసింది. అయినప్పటికీ అమెరికా మారడం లేదని చెప్పలేం. ఈ ఎన్నికల్లో కమల... క్యాథీ పేరుతో పోటీ చేయడం లేదు. పైగా తాను దోశ వేస్తూండగా వీడియో తీయడానికి ఓకే అంటున్నారు. హ్యారిస్ గెలుపు ఓటములను పక్కనబెట్టినా... అమెరికాలో వచ్చిన సాంస్కృతిక మార్పు మాత్రం మళ్లీ వెనక్కు మళ్లలేనిది.సందీప్ రాయ్ వ్యాసకర్త రచయిత, రేడియో హోస్ట్(‘మింట్’ సౌజన్యంతో) -
ఘనంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్లో దీపావళి వేడుకలు (ఫొటోలు)
-
అమెరికాలో బ్యాలెట్ డ్రాప్బాక్స్లకు నిప్పు
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అమెరికాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు బ్యాలెట్ డ్రాప్ బాక్స్లకు నిప్పు పెట్టారు. సోమవారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఒరెగాన్లోని పోర్ట్లాండ్లో మూడు బ్యాలెట్ డ్రాప్బాక్స్లు కాలిపోగా, వాషింగ్టన్, వాంకోవర్లో పెద్దసంఖ్యలో దగ్ధమైనట్లు వార్తలొచ్చాయి. అక్టోబర్ 8వ తేదీన వాంకోవర్లో జరిగిన ఘటనలో బ్యాలెట్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా బ్యాలెట్ డ్రాప్ బాక్సులకు నిప్పు పెట్టారని పోర్ట్లాండ్ పోలీస్ అసిస్టెంట్ ఛీఫ్ అమాండా మెక్మిల్లన్ తెలిపారు. వాషింగ్టన్, ఒరెగాన్ రాష్ట్రాల్లో జరిగిన ఈ చర్యలపై గుర్తుతెలియని నిందితులపై విధ్వంసక పరికరాన్ని కలిగి ఉండటం, ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. వాంకోవర్లో సోమవారం బ్యాలెట్ డ్రాప్ బాక్సుల నుంచి పొగలు వస్తుండటంతో పోలీసులు బ్యాలెట్ బాక్స్ పక్కన ఉన్న అనుమానాస్పద పరికరాన్ని తొలగించారు. ఒరెగాన్లోని పోర్ట్లాండ్లో బ్యాలెట్ బాక్స్లో సోమవారం ఉదయం ఇలాంటి మరో ఘటనే జరిగింది. ఈ ఘటనలో మూడు బ్యాలెట్లు మాత్రమే దెబ్బతిన్నాయని, మరోసారి ఓటు వేసేలా ఆ ఓటర్లను సంప్రదిస్తామని కౌంటీ ఎన్నికల డైరెక్టర్ తెలిపారు. తమ బ్యాలెట్ లెక్కలోకి వచ్చిందో లేదో స్టేటస్ను ఆన్లైన్లో చెక్చేసుకుని, పరిగణనలోకి రాకపోతే ప్రత్యామ్నాయం కోసం అభ్యర్థించాలని వాషింగ్టన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కార్యాలయం ఓటర్లకు సూచించింది. వాంకోవర్లో డెమొక్రటిక్ ప్రతినిధి మేరీ గ్లూసెన్కాంప్ పెరెజ్, రిపబ్లికన్ ప్రత్యర్థి జోకెంట్ బరిలో ఉన్నారు. బ్యాలెట్ డ్రాప్ బాక్సులకు పోలీసులు రాత్రిపూట రక్షణగా ఉండాలని గ్లూసెన్కాంప్ పెరెజ్ డిమాండ్ చేశారు. ఫీనిక్స్లో గురువారం మెయిల్బాక్స్ను తగలబెట్టిన ఘటనలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో దాదాపు 20 బ్యాలెట్లు ధ్వంసమైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వాషింగ్టన్ రాష్ట్రంలో చట్టబద్ధమైన, నిష్పాక్షిక ఎన్నికలకు విఘాతం కలిగించే అతివాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అమెరి కా విదేశాంగ మంత్రి స్టీవ్ హాబ్స్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్లందరూ సురక్షితంగా ఎన్నికల్లో పాల్గొనేలా చూసే అధికారుల సామర్థ్యంపై తనకు నమ్మకం ఉందన్నారు. -
US Presidential Election 2024: వాషింగ్టన్ పోస్ట్కు హారిస్ దెబ్బ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్కు మద్దతు పలకాలని గత వారం ‘వాషింగ్టన్ పోస్ట్’వార్తాసంస్థ తీసుకున్న నిర్ణయం తాజాగా ఆ సంస్థ సర్కులేషన్కు ఎసరుపెట్టింది. హారిస్కు మద్దతు పలుకుతున్నట్లు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ‘తటస్థ’వైఖరిని అవలంభించాలని సంస్థను ఇటీవల కొనుగోలుచేసిన ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ తాజాగా ఆదేశించడమే ఇందుకు అసలు కారణం. అసలేం జరిగింది? కమలా హారిస్కు మద్దతు ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పత్రిక ఎడిటోరియల్ సిబ్బంది గత వారం ప్రకటించారు. ఇది నచ్చని యజమాని, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వెంటనే రంగంలోకి దిగారు. ‘అధ్యక్ష అభ్యర్థికి మద్దతు పలకడం అనేది పక్షపాత భావనను సృష్టిస్తుంది. ఇది పాఠకుల ఆలోచనా స్వాతంత్య్రాన్ని పోగొట్టడమే అవుతుంది. అందుకే అధ్యక్ష అభ్యర్థులకు మద్దతు పలికే సంప్రదాయాన్ని అంతం చేయాలని కోరుకుంటున్నా. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, నాకు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ సీఈఓ డేవ్ లింప్ మధ్య అక్టోబర్ 25న భేటీ జరిగింది. అయితే ఈ భేటీకి వాషింగ్టన్పోస్ట్ హారిస్కు మద్దతు ఇవ్వకూడదన్న నిర్ణయానికి సంబంధం లేదు. ఇది ఉద్దేశపూర్వక వ్యూహం కాదు. ఇక్కడ ఏ విధమైన క్విడ్ ప్రోకో జరగలేదని స్పష్టం చేయదల్చుకున్నా’’అని వ్యాఖ్యానించారు. దీంతో బెజోస్ ఆదేశాలను శిరసావహిస్తూ వాషింగ్టన్ పోస్ట్ ప్రచురణకర్త విల్ లూయిస్ తాజాగా ఒక ప్రకటన విడుదలచేశారు. ‘ఏ అభ్యర్థికి ఓటేయాలనే విచక్షణా సామర్థ్యం అమెరికా ఓటర్లయిన మా పాఠకులకు ఉంది’ అని అందులో పేర్కొన్నారు. దీంతో సోమవారం 2 లక్షల మంది చందాదారులు వాషింగ్టన్పోస్ట్ సభ్యత్వాన్నిరద్దుచేసుకున్నారు. ఇది సంస్థ ప్రింట్, డిజిటల్ సర్కులేషన్ల 8 శాతానికి సమానం. ఈ సంఖ్య మరింతపెరిగే వీలుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కమలా హారిస్కు మద్దతుపలికే చందాదారులే తమ సబ్స్క్రిప్షన్ను వదులుకున్నట్లు వార్తలొచ్చాయి. కొద్ది రోజుల క్రితం లాస్ ఏంజిల్స్ టైమ్స్ సైతం ఏ అభ్యర్థికీ మద్దతు ప్రకటించకూడదని నిర్ణయించింది. అభ్యర్థికి పత్రిక ఆమోదం ఎందుకు? అధ్యక్ష అభ్యర్థులను సమర్థించే వార్తాపత్రిక ఎడిటోరియల్ పేజీల సంప్రదాయం అమెరికాలో శతాబ్దానికి పైగా ఉంది. వార్తా పత్రికలు తాము విశ్వసించే అభ్యర్థిని సమర్థించడం ద్వారా సమాచారంతో కూడిన ఓటింగ్ను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తాయి. మద్దతు పలకడం అనగానే ఆ వార్తాసంస్థ ఆ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తోందని కాదు. పత్రిక పాత్రికేయ విలువలకు కట్టుబడి పనిచేస్తూనే నిష్పాక్షిక కవరేజీని అందిస్తాయి.ఆ అభ్యర్థి ఏరకంగా అధ్యక్ష పదవికి అర్హుడో వాస్తవకోణంలో తెలియజేయస్తాయి. ఓటేసేటపుడు ఏది ఉత్తమ నిర్ణయమో పాఠకులకు తెలియజేయడం ఈ మద్దతు అంతిమ లక్ష్యం. అనేక వార్తాపత్రికలకు అభిప్రాయాలు, మద్దతును ప్రకటించేందుకు ప్రత్యేకంగా ఎడిటోరియల్ బోర్డ్లు ఉన్నాయి. భారత్లో ఇలాంటి సంప్రదాయం లేదు. కానీ అనధికారికంగా కొన్ని వార్తాపత్రికలు, టీవీ చానళ్లు తాము మెచ్చిన అభ్యర్థి/రాజకీయ పార్టీకి అనుకూలంగా అత్యధిక కవరేజీ ఇచ్చే ధోరణి మాత్రం భారత్లో బాగా పెరిగింది. ఏ ప్రాతిపదికన సమరి్థస్తారు? అభ్యర్థి గెలిచి అధ్యక్షుడయ్యాక పరిపాలన ఎలా ఉండొచ్చు? హామీలను నెరవేర్చడానికి అమలుకు పక్కా ప్రణాళిక ఉందా?. మన వార్తాసంస్థ విలువలకు అనుగుణంగా ఏ అభ్యర్థి ఉన్నారు? అసలు అధ్యక్షుడయ్యే అర్హత ఆ అభ్యర్థికి ఉందా? అంతర్జాతీయ పరిణామాలను అవపోశన పట్టి అగ్రరాజ్య అధిపతిగా నెగ్గుకురాగలడా? వంటివి పరిగణనలోకి తీసుకుని వేర్వేరు వార్తాసంస్థలు తమకు నచ్చిన అభ్యర్థికేే మద్దతు ప్రకటిస్తాయి. అయితే అమెరికాలో వార్తాపత్రికలు బలపరిచిన అభ్యర్థులు ప్రతిసారీ గెలవలేదనే వాదన కూడా ఉంది. 1897లో దాదాపు అన్ని న్యూయార్క్ వార్తాపత్రికలు మద్దతు పలికిన అభ్యర్థులు ఓటమిని చవిచూడటం గమనార్హం. కానీ న్యూయార్క్ టైమ్స్ అధ్యయనం ప్రకారం 1940 నుంచి 2016 వరకు జరిగిన దాదాపు అన్ని అధ్యక్ష ఎన్నికల్లోనూ అత్యధిక వార్తాపత్రికల మద్దతు అందుకున్న అభ్యర్థే అధికారాన్ని కైవసం చేసుకుని శ్వేతసౌధంలో అడుగుపెట్టగలిగారు. ఈసారి ఎందుకు వివాదాస్పదమైంది?అనుకూల, ప్రతికూల అనే అంశాలను పక్కనబెడితే అమెరికా రాజకీయ చరిత్రలో అత్యంత చర్చనీయాంశమైన అభ్యర్థుల్లో ట్రంప్ ఒకరు. అతని అభిప్రాయాలు, తీసుకున్న నిర్ణయాలు అమెరికన్లను తీవ్రంగా విభజించాయి. డెమొక్రటిక్ అభ్యర్థి గెలిస్తే అమెరికా నాశనమవుతుందని ట్రంప్ బలంగా ప్రచారంచేశారు. 2016లో తొలిసారి గెలిచినప్పటి నుంచి మీడియాలో వస్తున్న విమర్శలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటి వార్తా పత్రికలను ఫేక్ న్యూస్ అని పదేపదే ఖండించారు. ఈ నేపథ్యంలో ఎండార్స్మెంట్ విషయమై వాషింగ్టన్ పోస్ట్, లాస్ఏంజిల్స్ టైమ్స్ వెనుకంజ వేయడానికి వ్యాపారపరమైన ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తోంది. జెఫ్ బెజోస్ కంపెనీ అమెజాన్కు అమెరికా ప్రభుత్వంతో బిలియన్ డాలర్ల క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాలు ఉన్నాయి. ఆయన రాకెట్ కంపెనీ బ్లూ ఆరిజిన్కు స్పేస్ ఫోర్స్, నాసాతో ఒప్పందాలున్నాయి. 2023లో డెమొక్రాట్ల బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ ట్రస్ట్ దావాను కూడా అమెజాన్ ఎదుర్కొంటోంది. బయోఫార్మా ఇన్నోవేటర్గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సూన్–షియోంగ్ ప్రస్తుతం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) అనుమతి అవసరమయ్యే కొత్త మందులపై పనిచేస్తున్నారు. విజయావకాశాలు 50–50 ఉన్నాయని సర్వేలు చెబుతుండటంతో ట్రంప్ను గెలిపిస్తే తమ వ్యాపార ఒప్పందాలకు ఢోకా ఉండబోదని వ్యాపార దిగ్గజాలు భావించి ఉంటారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. -
ట్రంప్ పుట్టిని ప్యూర్టోరీకో ముంచుతుందా?
విశాలమైన రహదారిపై ప్రయాణం సాఫీగా సాగుతున్న వేళ జరిగే ఓ చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చిట్టచివరి భారీ బహిరంగ సభ అనూహ్యంగా పెద్ద వివాదానికి, జాత్యహంకార వ్యాఖ్యలు వేదికగా మారింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరిగిన ప్రచార కార్యక్రమం చివరకు లాటిన్ అమెరికన్లు, యూదులు, ఆఫ్రో అమెరికన్లపై జాత్యహంకార వ్యాఖ్యలతో వివాదాస్పదంగా ముగిసింది.దీంతో రిపబ్లికన్ పార్టీ పట్ల ఆయా వర్గాల ఓటర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుందని కథనాలు వెలువడుతున్నాయి. వివాదం చిలికిచిలికి గాలివానగా వ్యతిరేక ఓట్ల దుమారంగా మారితే ట్రంప్ విజయావకాశాలు సన్నగిల్లే ప్రమాదముంది. కరేబియన్ దీవుల్లో ఒకటైన ప్యూర్టోరీకో అమెరికా అ«దీనంలో ఉంది. ఇక్కడి ద్వీపవాసులకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేయకపోయినా పెద్దసంఖ్యలో ప్యూర్టోరికో వారసులు అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఓటర్లుగా నివసిస్తున్నారు. తమ ద్వీపాన్ని అవహేళన చేయడంతో వాళ్లంతా ట్రంప్కు వ్యతిరేకంగా ఓటేసే అవకాశముంది.అసలేం జరిగింది?ఆదివారం జరిగిన ఈ సభలో ట్రంప్, భార్య మెలానియా ప్రసంగించారు. వీరితోపాటు ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ సైతం పాల్గొన్నారు. కార్యక్రమానికి ఊపు తెచ్చేందుకు ప్రచారానికి మరింత పాపులారిటీ వచ్చేందుకు స్టాండప్ కమేడియన్ టోనీ హించ్క్లిఫ్తో మాట్లాడించారు. నవ్వించాల్సిన ఆయన పలు వర్గాల ఓటర్లలో ఆగ్రహజ్వాలలు రగిల్చారు. ‘‘సముద్రం మధ్యలో కదిలే చెత్త కుప్ప ఒకటుంది. అదేంటో తెలుసా?. అదే ప్యూర్టోరీకో’’ అని హించ్క్లిఫ్ చేసిన వ్యాఖ్యలతో అమెరికాలోని ప్యూర్టోరికన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.లక్షలాది మంది ప్యూర్టోరీకన్లకు అమెరికా పౌరసత్వం ఉంది. దశాబ్దాలుగా పోలింగ్లో క్రియాశీలకంగా ఉన్నారు. 2022 గణాంకాల ప్రకారం ప్యూర్టోరికో మూలాలున్న అమెరికా ఓటర్లు ఏకంగా 60 లక్షల మంది ఉన్నారని తెలుస్తోంది. 1898లో స్పానిష్–అమెరికా యుద్ధం తర్వాత స్పెయిన్ వలసరాజ్యమైన ఫ్యూర్టోరీకోను అమెరికా తన వశం చేసుకుంది. 1917లో తొలిసారిగా అక్కడి వారికి అమెరికా పౌరసత్వం ఇచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్యూర్టోరికన్లు అమెరికాకు లక్షలాదిగా వలసవచ్చారు. అమెరికా ఓటర్లలో మెక్సికన్ల తర్వాత హిస్పానియన్ మూలాలున్న ఓటర్లలో రెండో అతిపెద్ద వర్గంగా ప్యూర్టోరికన్లు నిలిచారు. సొంత ద్వీపం కంటే అమెరికా గడ్డపై నివసించే వాళ్లే ఎక్కువ. కీలక రాష్ట్రాల్లో వీరి ప్రభావమెంత?ఏ పార్టీ కీ మద్దతు తెలపని తటస్థ ఓటర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలనే స్వింగ్ స్టేట్స్ అంటారు. మద్దతు పలికే రాష్ట్రాలను ఆయా పార్టీ లు ఎలాగూ గెల్చుకుంటాయి. కానీ స్వింగ్ రాష్ట్రాల ఓటర్లు ఎవరికి ఓటేస్తారో తెలీదుకాబట్టి వీళ్లను ప్రసన్నం చేసుకోవడమే ట్రంప్, హారిస్కు ముఖ్యం. పెన్సిల్వేనియా స్వింగ్ రాష్ట్రంలో 3.7 శాతం రాష్ట్రజనాభాకు సమానమైన 4.86 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. 19 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రాన్ని గెల్చుకోవడం తప్పనిసరి. ఇక్కడ హారిస్పై ట్రంప్ కేవలం 0.2 శాతం ఆధిక్యతతో కొనసాగుతున్నారు. తాజా ఉదంతంలో ఈ ఆధిక్యత మటుమాయమై ట్రంప్ వెనుకంజ వేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. జార్జియాలోనూ 1.31 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. ఇక్కడ కూడా హారిస్పై ట్రంప్ ఆధిక్యత స్వల్పంగా ఉంది. వీళ్ల కోపంతో ఆ ఆధిక్యత పోవచ్చని విశ్లేషణలు వస్తున్నాయి. నార్త్ కరోలినా రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. స్వింగ్యేతర రాష్ట్రాల పరిస్థితి ఏంటి ? ఏదో ఒక పార్టీ కే మద్దతు పలికే రాష్ట్రాల్లోనూ ప్యూర్టోరికన్ల ప్రభావం ఉండొచ్చని తెలుస్తోంది. ఫ్లోరిడా రాష్ట్రంలో వీళ్లు ఏకంగా 12 లక్షల మంది ఉన్నారు. కనెక్టికల్ రాష్ట్ర జనాభాలో 8 శాతానికి సమానంగా 3 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. మసాచుసెట్స్లోనూ 3.26 లక్షల మంది వీళ్లే ఉన్నారు. న్యూయార్క్ రాష్ట్రంలో ఏకంగా పది లక్షల మంది వీళ్లే ఉన్నారు. ఇన్నేసి లక్షల మంది ట్రంప్కు వ్యతిరేకంగా ఓటేస్తే హారిస్ విజయం నల్లేరుపై నడకేనని కథనాలు వెలువడుతున్నాయి. గతంలో జాత్యహంకార వ్యాఖ్యలుట్రంప్ జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. 2018లో ఎల్సాల్విడార్, హైతీ, ఆఫ్రికా ఖండ దేశాలను దారుణంగా కించపరుస్తూ ట్రంప్ మాట్లాడారు. గత వారం సైతం వలసలపై ప్రసంగంలో ‘‘అమెరికా చెత్తకుప్పనా ఏంటి?. వ్యర్థాలు(వలసలు) అన్నీ అమెరికాకే వస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించడం తెల్సిందే. తాను అధికారంలోకి వచ్చాక దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో అనధికార వలసదారుల బహిష్కరణ కార్యక్రమం చేపడతానని ట్రంప్ అన్నారు. దీనికితోడు ఆదివారం హించ్క్లిఫ్ చేసిన వ్యాఖ్యలు ప్యూర్టోరీకో మూలాలున్న ప్రముఖుల్లో ఆగ్రహజ్వాలలను ఎగసేలా చేసింది. జెన్నీఫర్ లోపేజ్, రికీ మార్టిన్, బ్యాడ్ బన్నీ ఇలా పలువురు ప్యూర్టోరికో సంగీత దిగ్గజాలూ తమ నిరసన వ్యక్తంచేశారు. ‘‘ ట్రంప్ సంగతి తెల్సిందే. గెలిస్తే తానెంత ప్రమాదకరమో, దేశ ప్రజల మధ్య ఎంతగా విభజన తీసుకురాగలరో మరో సారి నిరూపించుకున్నారు’’ అని కమలా హారిస్ విమర్శించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అక్రమ వలసలపై ఉక్కుపాదమే: ట్రంప్
న్యూయార్క్: అమెరికాలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపి తీరతానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. తాను అధ్యక్షుడిని అయితే దేశ చర్రితలోనే అతి పెద్ద ఆపరేషన్ చేపట్టి కనీసం 10 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులదరినీ వెనక్కు పంపించడం ఖాయమని ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శరవేగంగా సమీపిస్తున్న వేళ ఆదివారం న్యూయార్క్లోని ప్రసిద్ధ మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో భారీ ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. ఆయనతో పాటు రిపబ్లికన్ పార్టీ నేతలంతా డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్పై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత దాడికి పాల్పడ్డారు. ఆమెను అవమానిస్తూ హేళనగా మాట్లాడారు. హారిస్ను దెయ్యంగా, ‘రాడికల్ లెఫ్ట్ మార్క్సిస్టు’గా అభివరి్ణంచారు. ‘‘ఆమెకు తెలివి లేదు. దేశ సమస్యలను పరిష్కరించలేరు’’ అంటూ విమర్శించారు. ట్రంప్ అయితే ఉపాధ్యక్షురాలిగా హారిస్ తన అసమర్థ పాలనతో అమెరికాను నాశనం చేశారని ఆరోపించారు. ట్రంప్కు మద్దతుగా మాట్లాడిన కమెడియన్ టోనీ హిచ్క్లిఫ్ చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. లాటిన్ అమెరికా వాసులు పిల్లల్ని కనేందుకే ఇష్టపడతారన్న వ్యాఖ్యలపై రిపబ్లికన్లే అసహనం వ్యక్తం చేశారు. పోర్టోరికోను తేలాడే చెత్తదిబ్బగా టోనీ పేర్కొనడాన్నీ రిపబ్లికన్లు ఖండించారు. -
భారతీయ అమెరికన్లలో హారిస్కు తగ్గిన ఆదరణ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ డెమొక్రాట్లకు చేదు కబురు. ఆ పార్టీకి మద్దతిస్తున్న ఇండియన్ అమెరికన్ ఓటర్ల సంఖ్యలో గత ఎన్నికలతో పోలిస్తే ఏకంగా ఏడు శాతం తగ్గుదల నమోదైంది! భారత మూలాలున్న కమలా హారిస్కు మద్దతిస్తున్న వారి సంఖ్య 61 శాతానికి తగ్గింది. అంతేగాక తాము డెమొక్రాట్లమని చెప్పుకున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా 56 నుంచి 47 శాతానికి తగ్గింది. సోమవారం వెలువడ్డ ‘ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్స్’ సర్వేలో ఈ మేరకు తేలింది. ట్రంప్కు ఓటేస్తామని వారిలో 32 శాతం మంది పేర్కొన్నారు. 2020లో డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్కు 68 శాతం మద్దతు దక్కగా ట్రంప్కు 22 శాతం మాత్రమే జైకొట్టారు!→ ఇండియన్ అమెరికన్ మహిళా ఓటర్లలో 67 శాతం మంది హారిస్కు జైకొట్టారు. ట్రంప్కు మద్దతిచ్చిన వారు కేవలం 22 శాతమే.→ 40 ఏళ్ల పైచిలుకు వయసు వారిలో ఏకంగా 70 శాతం మహిళలు, 60 శాతం పురుషులు హారిస్కు జైకొట్టారు.→ 40 ఏళ్ల లోపువారిలో మాత్రం 60 శాతం మహిళలే హారిస్కు మద్దతిచ్చారు.→ ఇండియన్ అమెరికన్ పురుషుల్లో 53 శాతం హారిస్కు, 39 శాతం మంది ట్రంప్కు ఓటేస్తామని చెప్పారు.→ 40 ఏళ్లలోపు పురుషుల్లో మాత్రం ట్రంప్దే పైచేయి కావడం విశేషం. ఆయనకు 48 శాతం, హారిస్కు 44 శాతం జైకొట్టారు.→ యువ ఇండియన్ అమెరికన్లలో మాత్రం ట్రంప్కు మద్దతిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్టు సర్వే తేల్చింది.→ అమెరికాలో 52 లక్షలకు పైగా భారత సంతతి వారున్నారు. వారిలో ఓటర్ల సంఖ్య 26 లక్షల పై చిలుకు.→ హిందూయేతరులతో పోలిస్తే హిందువుల్లో ట్రంప్ మద్దతుదారులు అధికంగా ఉండటం విశేషం. ఆయనకు ఓటేస్తామని 58 శాతం మంది హిందువులు తెలిపారు. 35 శాతం హిందువులు హారిస్కు మద్దతిస్తామన్నారు.→ హిందూయేతర భారతీయ అమెరికన్లలో 62 శాతం హారిస్కు, 27 శాతం ట్రంప్కు మద్దతిచ్చారు.→ 17 శాతం మంది ద్రవ్యోల్బణాన్ని ప్రధాన సమస్యగా పేర్కొన్నారు.→ ఉపాధి, ఆర్థిక అవ్యస్థ, అబార్షన్ ప్రధానాంశాలని 13 శాతం చెప్పారు.→ భారత్–అమెరికా సంబంధాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పిన వారు కేవలం 4 శాతమే.