USA President
-
గాజా అమ్మకానికి లేదు
ఎడిన్బర్గ్: గాజా స్ట్రిప్ను ఖాళీ చేయించి అందమైన పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పాలస్తీనియన్లు ప్రతీకార చర్యలకు దిగారు. స్కాట్లాండ్లో ట్రంప్కు చెందిన టర్న్బెర్రీ గోల్ఫ్ రిసార్ట్ను ధ్వంసం చేశారు. శనివారం తెల్లవారుజామున నిరసనకారులు రిసార్ట్లోకి చొరబడ్డారు. గోల్ఫ్ హోల్స్ను నాశనం చేశారు. ఓపెన్ చాంపియ్íÙప్స్లో ఉపయోగించే వస్తువులు, ప్రదేశాలను పాడు చేశారు. అక్కడి పచ్చికబయళ్లపై ‘గాజా అమ్మకానికి లేదు’ అని తెల్లని పెయింట్తో రాశారు. రిసార్ట్ క్లబ్హౌస్ భవన గోడలపై ఎరుపు రంగు చల్లారు. ఇది తమ పనేనని ‘పాలస్తీనా యాక్షన్’ అనే సంస్థ ప్రకటించుకుంది. ‘‘గాజాపై ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ పని చేశాం. గాజాను తన సొంత ఆస్తిలా పరిగణిస్తామంటే ఒప్పుకోం. ఇది తెలియజేప్పేందుకు, ట్రంప్ ఆస్తికి భద్రత లేదని నిరూపించేందుకు రిసార్ట్పై దాడి చేశాం. గాజా స్ట్రిప్ను ఇజ్రాయెల్కు, అమెరికాకు వలసరాజ్యంగా మార్చే యత్నాలను అడ్డుకుంటాం’’ అని ప్రకటించింది. దాడిని పిల్లచేష్టగా రిసార్ట్ వర్గాలు కొట్టిపారేశాయి. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక గోల్ఫ్కోర్సుల్లో టర్న్బెర్రీ ఒకటి. ఇక్కడ నాలుగుసార్లు ఓపెన్ ఛాంపియన్íÙప్ జరిగింది. 2014లో ట్రంప్ కొనుగోలు చేసినప్పటి నుంచీ ఇక్కడ ఓపెన్ రొటేషన్ను అమలు చేయడం లేదు. -
రష్యాకు ట్రంప్ షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు ఊహించని షాక్ ఇచ్చారు. ఉక్రెయిన్–రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, శాంతి ఒప్పందం కుదిరేదాకా రష్యాపై భారీ స్థాయిలో ఆంక్షలు, టారిఫ్లు విధించాలని తీవ్రంగా యోచిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రష్యా, ఉక్రెయిన్ వెంటనే శాంతి చర్చలకు శ్రీకారం చుట్టాలని స్పష్టంచేశారు. ఆలస్యం కాకముందే ఆ పని ప్రారంభిస్తే బాగుంటుందని హితవు పలికారు. నిన్నటిదాకా రష్యా పట్ల సానుకూలంగా మాట్లాడిన ట్రంప్ హఠాత్తుగా స్వరం మార్చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, రష్యాకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం కొత్తేమీ కాదు. ఈ ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రష్యాను ఉద్దేశించి కఠిన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని నిలిపివేయకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తామని, రష్యా ఉత్పత్తులపై అధికంగా టారిఫ్లు వసూలు చేస్తామని తేల్చిచెప్పారు. ఆయన తన వైఖరికి కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచడానికి ఆంక్షలు, టారిఫ్లను మరోసారి తెరపైకి తెచి్చనట్లు సమాచారం. ఉక్రెయిన్కు సైనిక సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ట్రంప్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. యూరప్ దేశాలు వ్యతిరేకిస్తున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు. ఒకవైపు ఉక్రెయిన్ను, మరోవైపు రష్యాను ఏకకాలంలో దారికి తీసుకురావాలన్నదే ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. రష్యాపై కొత్తగా ఎలాంటి ఆంక్షలు విధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పుతిన్ ప్రభుత్వం వాటికి తలొగ్గుతుందా? అనేది చూడాలి. -
టారిఫ్ వార్.. ఎవరికి లాభం?
అన్నట్టుగానే భారత్పైనా సుంకాల మోతకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెర తీశారు. ఏప్రిల్ 2 నుంచి పరస్పర సుంకాలు తప్పవని పునరుద్ఘాటించారు. దీని ప్రభావం మనపై ఏ మేరకు ఉండనుందంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే అమెరికా మనకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. అందుకే అగ్ర రాజ్యంతో టారిఫ్ల రగడకు తెర దించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఇప్పటికే అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన ద్వైపాక్షిక వర్తక ఒప్పందం (బీటీఏ)పై చర్చలు జరుపుతున్నారు. ఈలోగా పలు అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లను వీలైనంతగా తగ్గిస్తూ భారత్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ తదితర ఉత్పత్తులపైనా టారిఫ్ కోతలు ప్రకటించే అవకాశం కన్పిస్తోంది. ఏ మేరకు సుంకాలు? సుంకమంటే ఒక దేశం మరో దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే పన్ను. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు సగటున 4 నుంచి 5 శాతం మించడం లేదు. భారత్ మాత్రం అమెరికా ఉత్పత్తులపై సగటున 18 శాతం పై చిలుకు దిగుమతి సుంకాలు విధిస్తోంది. లగ్జరీ కార్లు, కెమికల్స్, ఎల్రక్టానిక్స్పై 125 శాతం, మద్యం మీదైతే ఏకంగా 150 శాతం దాకా వసూలు చేస్తోంది! ఈ తేడాలను సరిచేయకుంటే ఏప్రిల్ 2 నుంచి తామూ అంతే మొత్తం బాదుతామని ట్రంప్ బెదిరిస్తున్నారు. అమెరికాపై ప్రధానంగా ఆధారపడ్డ భారత ఎగుమతిదారులపై ఇది గట్టి ప్రభావమే చూపనుంది. ముఖ్యంగా మన ఇనుము, ఉక్కు, జౌళి ఎగుమతులపై ప్రభావం తీవ్రంగా ఉండనుంది. దిద్దుబాటు చర్యలేవీ తీసుకోని పక్షంలో 25 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులపై ప్రభావం పడవచ్చని అంచనా. అయితే మన జీడీపీలో అమెరికా ఎగుమతుల వాటా కేవలం 2.2 శాతమే. కనుక భారత్ మరీ అంతగా బెంబేలెత్తిపోవాల్సిన పని లేదన్నది ఆర్థికవేత్తల మాట. ‘‘భారత్ వంటి అతిపెద్ద మార్కెట్ను అమెరికా విస్మరించలేదు. అక్కడి ఈ కామర్స్ కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక సేవలు, టెక్నాలజీ సంస్థలకు భారత మార్కెట్ అంటే భారీ ఆసక్తి. సోషల్ నెట్వర్కింగ్ కంపెనీలకూ భారత్ ప్రధానమే’’ అని వారంటున్నారు. అమెరికాతో భారత్ వాణిజ్యమెంత? అమెరికాకు అతి పెద్ద ఎగుమతిదారుల్లో భారత్ ఒకటి. 2024లో ఆ దేశానికి 87.4 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అమెరికా నుంచి 41.8 బిలియన్ డాలర్ల దిగుమతులు మాత్రమే చేసుకుంది. ఈ వాణిజ్య లోటునూ ట్రంప్ ప్రశి్నస్తున్నారు. దీన్ని పూడ్చాల్సిందేనని పట్టుబడుతున్నారు. మనకు మేలే! ట్రంప్ తెర తీసిన టారిఫ్ వార్ అంతిమంగా భారత్కే లబ్ధి చేకూరుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా, కెనడా, మెక్సికో తదితర దేశాలపై అమెరికా ఇప్పటికే సుంకాలను పెంచడం తెలిసిందే. బదులుగా అమెరికాపై ప్రతీకార సుంకాలు తప్పవని ఆ దేశాలు కూడా స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి అమెరికాకు ఎగుమతులు బాగా తగ్గేలా కని్పస్తున్నాయి. ఇది భారత్కు సానుకూలంగా మారుతుందని, మనం మరిన్ని ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. ట్రంప్ తొలి హయాంలో కూడా చైనాపై సుంకాలు పెంచడంతో భారత్ బాగా లాభపడింది. ఈసారి కూడా అమెరికాకు మన మిర్చి, జౌళి తదితర ఉత్పత్తుల ఎగుమతులు బాగా పెరిగే అవకాశముంది. ఇప్పటికే చర్యలు అమెరికాపై విధిస్తున్న సుంకాల తగ్గింపుకు భారత్ ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది... → ఇటీవలి బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ దిగుమతులపై ప్రకటించిన 15–16 శాతం సుంకాల నుంచి అమెరికాను మినహాయించాలని కేంద్రం భావిస్తోంది.→ వైద్య పరికరాలు, లగ్జరీ మోటార్ సైకిళ్ల వంటి పలు అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లను తగ్గించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.→ వాణిజ్య లోటును తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా నుంచి రక్షణ, చమురు తదితర ఉత్పత్తుల దిగుమతులను ఇతోధికంగా పెంచేందుకు ట్రంప్–మోదీ భేటీలో అంగీకారం కూడా కుదిరింది. → ఏఐజీ వంటి అమెరికా బీమా దిగ్గజాలకు లబ్ధి చేకూర్చేలా ఆ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 100 శాతానికి పెంచుతూ తాజా బడ్జెట్లో కేంద్రం నిర్ణయం తీసుకుంది.→ భారత ఔషధాలపై అమెరికా ఎలాంటి సుంకాలూ వసూలు చేయడం లేదు. కనుక అమెరికా ఔషధ దిగుమతులపై భారత్ విధిస్తున్న 10 శాతం సుంకాన్ని కూడా ఎత్తేయాలని ఫార్మా సంస్థలు సూచిస్తున్నాయి. → అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న పలు వ్యవసాయోత్పత్తులపై ఏకంగా 42 నుంచి 120 శాతం దాకా సుంకాలున్నాయి. వీటిని కూడా బాగా తగ్గించే అవకాశముంది. త్వరలో ఒప్పందం: భారత్ న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుని తాజా ప్రకటనపై భారత్ ఆచితూచి స్పందించింది. అగ్ర రాజ్యంతో వాణిజ్య బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడమే తమ లక్ష్యమని పేర్కొంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) ద్వారా టారిఫ్, టారిఫేతర అడ్డంకులను తగ్గించుకునేందుకు కృషి చేస్తున్నట్టు వివరించింది. దీన్ని ఇరు దేశాలకూ ఆమోదనీయ రీతిలో పరిష్కరించుకుంటామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైస్వాల్ శుక్రవారం ఒక ప్రకటనలో విశ్వాసం వెలిబుచ్చారు.సుంకాల తగ్గింపుకు భారత్ ఒప్పుకుంది: ట్రంప్ అమెరికాపై సుంకాలను భారీగా తగ్గించేందుకు భారత్ అంగీకరించినట్టు ట్రంప్ వెల్లడించారు. శుక్రవారం ఉదయం వైట్హౌస్ ఓవల్ కార్యాలయంలో ఈ మేరకు ప్రకటించారు. అమెరికాపై ఇన్నాళ్లుగా భారత్ విధిస్తున్న హెచ్చు సుంకాలను తాను బయట పెట్టడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా 13 ఏళ్ల బాలుడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెక్సాస్కు చెందిన 13 ఏళ్ల బాలుడు, క్యాన్సర్ విజేత డీజే డేనియల్ను సీక్రెట్ సర్వీస్ గౌరవ ఏజెంట్గా నియమించారు. కాంగ్రెస్ తొలి సంయుక్త సమావేశంలో డీజే విజయగాథను ట్రంప్ పంచుకున్నారు. ‘2018లో డీజేకు అరుదైన కేన్సర్ నిర్ధారణ అయ్యింది. ఐదు నెలలే బతు కుతాడని డాక్టర్లు చెప్పారు. కానీ.. పోలీసు ఆఫీసర్ కావాలన్న లక్ష్యం ఆయనకు పోరాడే స్థైర్యాన్నిచ్చింది. కేన్స ర్ను ఓడించిన డీజే తన కలను నిజం చేసుకోబోతున్నాడు. అతనికి పెద్ద గౌరవాన్ని ఇస్తున్నా. డీజేను యూఎస్ సీక్రెట్ సర్వీస్ గౌరవ ఏజెంట్గా చేయాలని డైరెక్టర్ సీన్ కరన్ను అడుగుతున్నా’ అని ప్రకటించారు. దీంతో సభంతా చప్పట్లతో హోరెత్తింది. సభ మొత్తం ‘డీజే... డీజే’ అని హోరెత్తగా గ్యాలరీలో అతని తండ్రి డీజేను గాల్లోకి ఎత్తాడు. సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కరన్ ఆ బాలుడి దగ్గరకు వెళ్లి అధికారిక బ్యాడ్జీని అందజేశారు. -
ట్రంప్పై అదే వ్యతిరేకత
వాషింగ్టన్: అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ దేశాన్ని ముందుకు నడిపించే విధానంపై ప్రజల్లో ఇప్పటికీ అనుకూల వైఖరి కంటే వ్యతిరేక వైఖరే ఎక్కువగా కనిపి స్తోంది. ట్రంప్పై ప్రజామోదం, పని తీరు, నిర్ణయాలు, దేశాన్ని ఆయన సరైన దిశగా నడిపిస్తున్నారా అంటే లేదనే ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తమ్మీద ట్రంప్ పని తీరుపై 52 శాతం మంది పెదవి విరిచారు. 48 శాతం మంది మాత్రమే ట్రంప్ పాలన బాగుందన్నారు. ఫిబ్రవరి మధ్యలో సర్వే చేపట్టినప్పుడు సైతం దాదాపు ఇదే ఫలితం రావడం గమనార్హం. ఉద్యో గులపై వేటు సహా ఆయన విధానాలకు సొంత రిపబ్లికన్లు 90 శాతం మంది సానుకూలత చూపగా, ప్రతిపక్ష డెమో క్రాట్లు 90 శాతం మంది వ్యతిరేకత తెలిపారు. స్వతంత్రుల్లో 59 మంది కూడా ట్రంప్ తీరు నచ్చలేదన్నారు. ట్రంప్ విధానాలు దేశాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తు న్నాయని 45 శాతం మంది చెప్పగా సరైన దిశగానే దేశం సాగుతోందని 39 శాతం మంది బదులిచ్చారు. 15 శాతం మంది ఏ సమాధానమూ చెప్పలేదు. దేశం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్ర సమస్యల పై ట్రంప్ దృష్టి పెట్టడం లేదని 52 శాతం మంది, ప్రాధాన్యతలు బాగానే ఉన్నాయని 40 శాతం మంది అభిప్రాయం వెలిబుచ్చారు. మొత్త మ్మీద 18–34 ఏళ్ల గ్రూపులో 51 శాతం మంది ట్రంప్ పాలన సరిగా లేదని కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో మహిళలు కూడా 57 శాతం మంది ట్రంప్ ప్రభుత్వంపై అసంతృప్తి వెలిబుచ్చారు. ఎస్ఎస్ఆర్ సంస్థ ఫిబ్రవరి 24–28వ తేదీల మధ్య దేశవ్యాప్తంగా ర్యాండమ్గా ఎంపిక చేసిన 2,212 మందితో సర్వే చేపట్టింది. ఆన్లైన్లో, టెలిఫోన్ ద్వారా లేదా లైవ్ ఇంటర్వ్యూ ద్వారా చేపట్టిన ఈ సర్వే కచ్చితత్వం మైనస్ 2.4 శాతం పాయింట్లు అటూఇటుగా ఉండొచ్చని సీఎన్ఎన్ పేర్కొంది. కాగా, శుక్రవారం వైట్హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో తీవ్ర వాదోపవాదం జరిగిన ముందు రోజే ఈ పోల్ ముగియడంతో, ఆ ప్రభావం దీనిపై కనిపించదు.అక్రమ వలసలు రికార్డు స్థాయిలో తగ్గాయి: ట్రంప్అమెరికాపై అక్రమ వలసల ఆక్రమణ ముగిసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘‘మెక్సికో సరిహద్దులో అక్రమ వలసలు ఫిబ్రవరిలో చరిత్రాత్మక స్థాయిలో తగ్గాయి. నా కఠిన నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. ‘‘నా పాలనలో మొదటి పూర్తి నెల అయిన ఫిబ్రవరిలో అతి తక్కువ సంఖ్యలో అక్రమ వలసదారులు అమెరికాలో ప్రవేశించడానికి ప్రయత్నించారు. మెక్సికో సరిహద్దులో కేవలం 8,326 మంది అరెస్టయ్యారు. వారందరినీ వెంటనే బహిష్కరించాం’’ అని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. బైడెన్ హయాంలో నెలకు 3ల క్షల మంది పై చిలుకు చొప్పున అక్రమంగా ప్రవేశించారని ఆరోపించారు. వలసలు గణనీయంగా తగ్గాయన్న ప్రకటనను వార్తా నివేదికలు తిప్పికొట్టాయి. ‘‘బైడెన్ అధికారంలో ఉన్న చివరి వారంలో రోజుకు సగటున 2,869 సరిహ ద్దు అరెస్టులు జరిగాయి. ట్రంప్ అధికారం చేపట్టాక తొలి వారంలో 7,287 అరెస్టులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 1,041. అంటే తగ్గుదల కేవలం 60 శాతమే. వైట్హౌస్ చెబుతున్నట్టు 95 శాతం కాదు’’ అని ఫాక్స్ న్యూస్ తెలిపింది. -
అమెరికా.. ఉక్రెయిన్ మధ్య సయోధ్య ఎలా?
లండన్: అధినేతలు డొనాల్డ్ ట్రంప్, జెలెన్స్కీ వాగ్యుద్ధంతో అమెరికా, ఉక్రెయిన్ సంబంధాలు అకస్మాత్తుగా దెబ్బతిన్న వైనం యూరప్ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. వాటిని తిరిగి చక్కదిద్దే మార్గాల కోసం అవి మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు యూరప్ దేశాధినేతలు ఆదివారం లండన్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందుకు బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ చొరవ తీసుకున్నారు. ‘సురక్షిత యూరప్ కోసం’ పేరిట జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చంతా అమెరికా, ఉక్రెయిన్ సంబంధాల చుట్టే తిరిగినట్టు సమాచారం. ఉక్రెయిన్కు మరిన్ని నిధులు అందించాలని నేతలు నిర్ణయానికి వచ్చారు. అవసరమైతే యూరప్ దేశాలన్నీ తమ సైన్యాన్ని కూడా ఉక్రెయిన్కు పంపేందుకు సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ కీలక భేటీలో జెలెన్స్కీతో పాటు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా పాల్గొన్నారు. తరానికోసారే! యూరప్ భద్రత కోసం ఖండంలోని దేశాలన్నీ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరముందని స్టార్మర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇలాంటి అవసరం, అవకాశం తరానికి ఒక్కసారి మాత్రమే వస్తాయని అన్నారు. ‘‘రష్యా బారి నుంచి ఉక్రెయిన్కు శాశ్వత రక్షణ కల్పించాలి. యూరప్లోని ప్రతి దేశం భద్రతకూ ఇది చాలా కీలకం’’ అని చెప్పారు. ‘‘ఇందుకు మూడంచెల మార్గముంది. ఉక్రెయిన్ను సాయుధంగా పటిష్టపరచాలి. దాని భద్రతకు యూరప్ మొత్తం పూచీగా ఉండాలి. ఇక ఉక్రెయిన్తో కుదిరే ఒప్పందాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ మళ్లీ తుంగలో తొక్కకుండా చూసే బాధ్యతను అమెరికా తీసుకోవాలి’’ అని ప్రతిపాదించారు. అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో స్టార్మర్ విడిగా భేటీ అయ్యారు. అందులో జెలెన్స్కీ కూడా పాల్గొన్నారు. రష్యా, ఉక్రెయిన్ కాల్పుల విరమణకు నిర్దిష్ట కార్యారణ ప్రణాళిక రూపొందించి అమెరికా ముందుంచాలని వారు నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రయత్నంలో మిగతా యూరప్ దేశాలన్నింటినీ కలుపుకుని వెళ్తామని చెప్పారు. అంతకుముందు ఉక్రెయిన్కు 3.1 బిలియన్ డాలర్ల రుణం అందించేందుకు బ్రిటన్ అంగీకరించింది.ట్రంప్తోనూ మాట్లాడా: స్టార్మర్ శిఖరాగ్రం అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. వీలైనంత త్వర లో మరోసారి సమావేశమై అన్ని అంశాలపైనా లోతుగా చర్చించుకోవాలని నిర్ణయించినట్టు స్టార్మర్ వెల్లడించారు. అమెరికా నమ్మదగ్గ భాగస్వామి కాదన్న విమర్శలను తోసిపుచ్చారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం యూరప్ భద్రతకు చాలా కీలకమని పునరుద్ఘాటించారు. ఈ విషయమై ట్రంప్తో శనివారం రాత్రి ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడినట్టు వివరించారు. ‘‘యూరప్ ఒకరకంగా నాలుగు రోడ్ల కూడలిలో నిలిచింది. కనుక ప్రతి అడుగూ ఆచితూచి వేయాల్సిన సమయమిది. పరిస్థితులన్నీ పూర్తిగా అదుపు తప్పేందుకు ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం చాలు’’ అని హెచ్చరించారు. -
అమెరికా టారిఫ్లు..ప్రపంచ పరిణామాలే దిక్సూచి!
న్యూఢిల్లీ: భారీ పతన బాటలో కొనసాగుతున్న దేశీ మార్కెట్లలో ఒడిదుడుకులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల మోతకు తోడు కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) అమ్మకాల పరంపర... ఇన్వెస్టర్లలో బలహీన సెంటి‘మంట’కు ఆజ్యం పోస్తోంది. ఈ వారంలో కూడా యూఎస్ టారిఫ్ సంబంధిత పరిణామాలు, ప్రపంచ మార్కెట్ల ట్రెండ్, ఎఫ్పీఐల ట్రేడింగ్ కార్యకలాపాలే మార్కెట్ల గమనాన్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. బలహీనంగానే... ‘ట్రంప్ టారిఫ్ పాలసీతో పాటు గత వారంలో విడుదలైన నిరుద్యోగ గణాంకాలు (అయిదు నెలల గరిష్టం) మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయి. సమీప కాలంలో మార్కెట్లో బలహీన ధోరణి కొనసాగవచ్చు. ప్రపంచ వాణిజ్య విధానాల్లో అస్థిరతలు సద్దుమణిగి, వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీల లాభాల్లో రికవరీ కనిపిస్తేనే మార్కెట్ మళ్లీ గాడిలో పడతాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా బలహీన సెంటిమెంట్కు తోడు దేశీయంగా కీలక అంశాలు (ట్రిగ్గర్లు) ఏవీ లేనందున మన మార్కెట్లలో నష్టాలు కొనసాగే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ (వెల్త్ మేనేజ్మెంట్) సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. వాణిజ్య యుద్ధ భయాలతో మార్కెట్లు వణుకుతున్నాయని, ఎఫ్పీల అమ్మకాల జోరు దీనికి మరింత ఆజ్యం పోస్తోందని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. గణాంకాల ఎఫెక్ట్... గత వారాంతంలో విడుదలైన జీడీపీ గణాంకాల ప్రభావం సోమవారం మార్కెట్పై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (క్యూ3)లో జీడీపీ వృద్ధి రేటు 6.2 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. గతేడాది క్యూ3తో పోలిస్తే భారీగా తగ్గినప్పటికీ.. క్యూ2తో పోలిస్తే (5.6 శాతం) సీక్వెన్షియల్గా కాస్త పుంజుకోవడం విశేషం. అమెరికా టారిఫ్ వార్ ఆందోళనల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లు 9.1 శాతం ఎగబాకి రూ.1.84 లక్షల కోట్లకు చేరడం ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశలు రేకెత్తిస్తోంది. ఈ వారంలో విడుదల కానున్న హెచ్ఎస్బీసీ తయారీ, సేవల రంగ పీఎంఐ డేటాపై కూడా ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు.ఫిబ్ర‘వర్రీ’...గత కొన్ని నెలలుగా నేల చూపులు చూస్తున్న మన మార్కెట్లకు ఫిబ్రవరిలో మరింత షాక్ తగిలింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 1,384 పాయింట్లు (5.88 శాతం) పతనం కాగా, బీఎస్ఈ సెన్సెక్స్ 4,302 (5.55%) పాయింట్లు కోల్పోయింది. సెపె్టంబర్ 27న సెన్సెక్స్ రికార్డ్ గరిష్టాన్ని (85,978) తాకి, అక్కడి నుంచి రివర్స్ గేర్లోనే వెళ్తోంది. ఇప్పటిదాకా 12,780 పాయింట్లు (14.86 శాతం) కుప్పకూలింది. ఇక నిఫ్టీ కూడా అప్పటి గరిష్టం (26,277) నుంచి 4,153 పాయింట్లు (15.8 శాతం) దిగజారింది. కాగా, ఒక్క గత వారంలోనే సెన్సెక్స్ 2.8 శాతం, నిఫ్టీ 2.94 శాతం క్షీణించడం గమనార్హం.రూ. 34,574 కోట్లు వెనక్కి...విదేశీ ఇన్వెస్టర్ల తిరోగమనం మరింత జోరందుకుంది. ఫిబ్రవరి నెలలో దేశీ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్పీఐలు రూ.34,574 కోట్లు వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది తొలి రెండు నెలల్లో మొత్తం అమ్మకాలు రూ.1.12 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ప్రధానంగా ట్రేడ్ వార్ ఆందోళనలతో పాటు కంపెనీల లాభాలపై ఆందోళనలు దీనికి కారణంగా నిలుస్తున్నాయి. ‘భారత్ మార్కెట్లో ఈక్విటీ వేల్యుయేషన్లు చాలా అధికంగా ఉండటం, కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలపై ఆందోళనల ప్రభావంతో ఎఫ్పీఐల తిరోగమనం కొనసాగుతోంది’ అని వాటర్ఫీల్డ్ అడ్వయిజర్స్ సీనియర్ డైరెక్టర్ విపుల్ భోవర్ పేర్కొన్నారు.టాప్–10 కంపెనీల్లో రూ.3 లక్షల కోట్లు హుష్గత వారంలో ప్రధాన సూచీలు దాదాపు 3 శాతం కుప్పకూలడంతో దేశీ స్టాక్ మార్కెట్లో టాప్–10 కంపెనీల మార్కెట్ విలువ రూ.3,09,245 కోట్లు ఆవిరైంది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ అత్యధికంగా రూ.1,09,211 కోట్లు క్షీణించి రూ.12,60,505 కోట్లకు పడిపోయింది. దీంతో టాప్–10లో 2వ స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండో ర్యాంకును అందుకుంది. దీని మార్కెట్ క్యాప్ రూ.30,258 కోట్లు జంప్ చేసి, 13,24,411 కోట్లకు ఎగబాకింది. ఇక ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.52,697 కోట్లు తగ్గి, రూ.7,01,002 కోట్లకు చేరింది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ కూడా 39,230 కోట్లు నష్టపోయి రూ.8,94,993 కోట్లకు దిగొచ్చింది. -
ట్రంప్ వర్సెస్ జెలెన్స్కీ.. అధ్యక్షుల వాగ్వాదం జరిగిందిలా!
వాషింగ్టన్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా అధ్యక్షుల వాగ్వాదానికి, పరస్పర ఆక్షేపణలకు, వాగ్బాణాలకు వైట్హౌస్ శుక్రవారం వేదికగా నిలిచింది. మీడియా సాక్షిగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షంగా ప్రసారమైన భేటీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధినేత వొలొదిమిర్ జెలెన్స్కీ మధ్య సాగిన విమర్శలపర్వం సర్వత్రా చర్చనీయంగా మారింది. నిజానికి ఈ రగడకు అగ్గి రాజేసింది వారితో పాటు చర్చల్లో పాల్గొన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. అలా ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితి కాస్తా చూస్తుండగానే అదుపు తప్పిపోయింది. చివరికి జెలెన్స్కీని ట్రంప్ వైట్హౌస్ వదిలి పొమ్మనడం, చర్చలకు అర్ధాంతరంగా ఫుల్స్టాప్ పెట్టి ఆయన వెనుదిరగడం దాకా వెళ్లింది! జెలెన్స్కీ వైట్హౌస్ సందర్శన రద్దవడమే గాక రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు అమెరికా దన్ను కొనసాగడం కూడా అనుమానంలో పడింది. వారి మధ్య వాగ్యుద్ధం ఎలా జరిగిందంటే... వాన్స్: (బైడెన్ను ఉద్దేశించి) నాలుగేళ్లుగా అమెరికా (తాజా మాజీ) అధ్యక్షుడు (బైడెన్) రష్యా అధినేత పుతిన్ను ఉద్దేశించి గట్టి మాటలు మాట్లాడుతూ వచ్చారు. అయినా పట్టించుకోకుండా ఉక్రెయిన్ౖపె దండెత్తిన పుతిన్ ఆ దేశాన్ని చాలావరకు నేలమట్టం చేశారు. ఇప్పుడిక దౌత్యమే శాంతికి మార్గం. నామమాత్రపు బెదిరింపులకు దిగుతూ, ఛాతీ చరుచుకుంటూ బైడెన్ చూపిన దారి పనికొచ్చేది కాదని తేలిపోయింది. దౌత్యానికి బాటలు వేసినప్పుడే అమెరికా మంచి దేశమని అనిపించుకోగలదు. ట్రంప్ సరిగ్గా అదే చేస్తున్నారు. జెలెన్స్కీ: నేనొకటి అడగొచ్చా? వాన్స్: తప్పకుండా. జెలెన్స్కీ: పుతిన్ మా దేశాన్ని ఆక్రమించాడు. నిజమే. 2014లోనూ అతనదే చేశాడు. క్రిమియాను ఆక్రమించాడు. మా ప్రజలను భారీగా పొట్టన పెట్టుకున్నాడు. అప్పుడెవరూ అతన్ని ఆపలేదు. ఇన్నేళ్లుగా కూడా ఆపడం లేదు. 2014లో ఒబామా, తర్వాత ట్రంప్, ఆ తర్వాత బైడెన్... ఏ అధ్యక్షుడూ పట్టించుకోలేదు. దేవుని దయవల్ల పుతిన్ను ఇప్పుడు బహుశా ట్రంప్ ఆపుతారేమో. ట్రంప్: 2015లోనా? జెలెన్స్కీ: 2014లో ట్రంప్: అవునా? అప్పుడు అధ్యక్షున్ని నేను కాదుగా. వాన్స్: అదే కదా! జెలెన్స్కీ: కావచ్చు. కానీ 2014 నుంచి 2022 దాకా కూడా మా దుస్థితి అలాగే కొనసాగుతూ వచ్చింది. సరిహద్దుల వెంబడి మా ప్రజలు నిస్సహాయంగా చనిపోతూనే వచ్చారు. ఈ దారుణాన్ని ఆపేవారే లేకపోయారు. పుతిన్తో చర్చలు జరిపాం. ఒక్కసారి కాదు. ఎన్నోసార్లు. అతనితో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాం. (ట్రంప్నుద్దేశించి) మీరు కూడా 2019లో పుతిన్తో ఒప్పందం చేసుకున్నారు. (ఫ్రాన్స్ అధ్యక్షుడు) మాక్రాన్, (నాటి జర్మనీ చాన్సలర్) మెర్కెల్ కూడా. కాల్పుల విరమణ ఒప్పందాలూ కుదిరాయి. పుతిన్ వాటిని ఉల్లంఘించబోడనే మీరంతా మాకు హామీ ఇచ్చారు. కానీ ఏం జరిగింది? దానికతను తూట్లు పొడిచాడు. మావాళ్లను మరింతగా పొట్టన పెట్టుకున్నాడు. ఖైదీల మార్పిడి ఒప్పందాన్నీ తుంగలో తొక్కాడు. ఇదెక్కడి దౌత్యం? జేడీ! మీరేం మాట్లాడుతున్నారో, వాటికి అర్థమేమిటో మీకైనా తెలుస్తోందా?వాన్స్: మీ దేశంలో సాగుతున్న వినాశనానికి తెర దించగలిగే దౌత్యం గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. కానీ ఒక్కటి మాత్రం మీకు స్పష్టంగా చెప్పదలచుకున్నా. ఇలా ఓవల్ ఆఫీసులో కూర్చుని అమెరికా మీడియా సమక్షంలో మీరిలా వాదనకు దిగడం చాలా అమర్యాదకరం. మీకిప్పుడు రష్యాతో పోరాడేందుకు సరిపడా సైన్యమే లేదు. మరో దారిలేక పౌరులకు ఆయుధాలిచ్చి బలవంతంగా యుద్ధక్షేత్రంలోకి నెడుతున్నారు. అలాంటి ఘర్షణకు తెర దించేందుకు కృషి చేస్తున్నందుకు అధ్యక్షుడు ట్రంప్కు మీరు నిజానికి కృతజ్ఞతలు తెలపాలి. జెలెన్స్కీ: మాకెలాంటి సమస్యలున్నాయో కళ్లతో చూసినట్టే చెబుతున్నారు! మీరెప్పుడైనా ఉక్రెయిన్లో పర్యటించారా? వాన్స్: అవును. జెలెన్స్కీ: ఓసారి ఇప్పుడొచ్చి చూడండి. వాన్స్: ఉక్రెయిన్లో ఏం జరుగుతోందో చూశాను. కథలు కథలుగా విన్నాను. నిజానికి మీరు తరచూ దేశాధినేతలు తదితరులను మీ దేశానికి రప్పించుకుంటూ ఉంటారు. అవన్నీ ఫక్తు ప్రచార టూర్లు. మీకు సమస్యలున్నది నిజం కాదంటారా? సైన్యంలో చేరేందుకు జనమే లేకపోవడం నిజం కదా? జెలెన్స్కీ: అవును. మాకు సమస్యలున్నాయి. వాన్స్: అలాంటప్పుడు అమెరికాలో పర్యటిస్తూ, వైట్హౌస్లో ఓవల్ ఆఫీసులో కూర్చుని మరీ, అదీ అధ్యక్షుని సమక్షంలోనే మా యంత్రాంగంపై దాడికి దిగడం మర్యాదా? మీ దేశ వినాశనానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయతి్నస్తున్న మా ప్రభుత్వంపై నోరు పారేసుకోవడం సబబా?జెలెన్స్కీ: వరుసబెట్టి చాలా ప్రశ్నలే అడిగేశారు. అన్నింటినీ ఒక్కొక్కటిగా చర్చిద్దాం. వాన్స్: అలాగే కానిద్దాం. జెలెన్స్కీ: ముందుగా మీరొకటి అర్థం చేసుకోవాలి. యుద్ధ సమయంలో ఎవరికైనా సమస్యలే ఉంటాయి. రేపు మీకైనా అంతే. కాకపోతే ఇప్పుడు మీకది తెలియకపోవచ్చు. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి వస్తే మీకూ తెలిసొస్తుంది. ట్రంప్: మున్ముందు మాకెలా అనిపిస్తుందో మీరేమీ మాకు చెప్పాల్సిన అవసరం. మేం కేవలం మీ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. మీ పరిస్థితే మాకొస్తే ఎలా ఉంటుందో మాకు చెప్పే సాహసం చేయకండి. జెలెన్స్కీ: నేను మీకేమీ చెప్పడం లేదు. నాకు సంధించిన ప్రశ్నలకు బదులిస్తున్నానంతే. ట్రంప్: అలా కాదు. ఏం జరగాలో, ఎలా జరగాలో నిర్దేశించే పరిస్థితిలో మీరు ఎంతమాత్రమూ లేరు. వాన్స్: కానీ మీరు ఎంతసేపూ కేవలం మీకేం కావాలో మాకు నిర్దేశించే ప్రయత్నమే చేస్తూ వస్తున్నారు. ట్రంప్: మాకూ మీలాంటి పరిస్థితే వస్తే మాకెలా ఉంటుందో చెప్పే పరిస్థితిలో మీరు లేరు. ముందు అది తెలుసుకోండి. మేం బాగుంటాం. జెలెన్స్కీ: (మాలాంటి పరిస్థితే గనక వస్తే) ఎంతోమంది ప్రభావితం చేసేందుకు ప్రయతి్నంచడం మీకూ అనుభవంలోకి వస్తుంది. ట్రంప్: మేమెప్పుడూ శక్తిమంతంగా ఉంటాం.జెలెన్స్కీ: మళ్లీ చెబుతున్నా. అలాంటి పరిస్థితే వస్తే ఎలా ఉంటుందో అప్పుడు మీకూ అనుభవంలోకి వస్తుంది. ట్రంప్: ప్రస్తుతం మీ పరిస్థితి అస్సలు బాగా లేదు. ఇదంతా స్వయంకృతం. మీరు స్వయంగా కొనితెచ్చుకున్నదే. జెలెన్స్కీ: యుద్ధం మొదలైనప్పటి నుంచీ... ట్రంప్: (మధ్యలోనే అడ్డుకుంటూ) చెప్తున్నాగా. మీరు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. మీ దగ్గర ప్రస్తుతం వాడేందుకు ఎలాంటి కార్డులూ లేవు. మేం దన్నుగా ఉన్నప్పుడే మీరు ఏమైనా చేయగలిగేది! జెలెన్స్కీ: నేనేమీ కార్డులు ప్లే చేయడం లేదు. సమస్య పరిష్కారానికి చాలా చిత్తశుద్ధితో ఉన్నా. మిస్టర్ ప్రెసిడెంట్! మీరది అర్థం చేసుకోవాలి. ట్రంప్: లేదు లేదు. ఎంతసేపూ మీరు కార్డులే ప్లే చేస్తున్నారు. లక్షలాది జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అందరినీ మూడో ప్రపంచ యుద్ధ భయంలోకి నెడుతున్నారు. జెలెన్స్కీ: మీరేం మాట్లాడుతున్నారు! ట్రంప్: అవును. మీరు అందరినీ మూడో ప్రపంచయుద్ధం దిశగా నెట్టే జూదానికి దిగారు. అంతేకాదు! మీ ప్రవర్తన అమెరికా పట్ల అత్యంత అమర్యాదకరంగా ఉంది. కేవలం మాటలు చెప్పే ఎన్నో దేశాల కంటే మీకు అన్నివిధాలా దన్నుగా నిలిచింది మేమే. వాన్స్: అందుకు మీరు కనీసం ఒక్కసారన్నా కృతజ్ఞతలు తెలిపారా? జెలెన్స్కీ: ఒక్కసారి కాదు. ఎన్నోసార్లు చెప్పా! ఇప్పుడూ చెబుతున్నా. వాన్స్: నేననేది ఈ భేటీలో. ఇప్పటిదాకా మాపై, మా దేశంపై విమర్శలే తప్ప కృతజ్ఞతాపూర్వకమైన మాటలు ఒక్కటైనా మాట్లాడారా? గత అక్టోబర్లో పెన్సిల్వేనియాలో మా ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసిన చరిత్ర మీది! జెలెన్స్కీ: నేనలా చేయలేదు.వాన్స్: ఇప్పటికైనా అమెరికాకు, మీ దేశాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్న మా అధ్యక్షునికి కృతజ్ఞతగా కనీసం మంచి మాటలైనా చెప్పండి. జెలెన్స్కీ: మీరేమనుకుంటున్నారు? గొంతు చించుకు అరిస్తే సరిపోతుందా... ట్రంప్: (ఆగ్రహంగా మధ్యలోనే కలగజేసుకుంటూ) ఆయన (వాన్స్) గొంతు చించుకోవడం లేదు. అంత గట్టిగా మాట్లాడటం లేదు. వాస్తవమేమిటంటే, మీ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.జెలెన్స్కీ: ఆయన అన్నదానికి నన్ను కనీసం సమాధానమైనా చెప్పనిస్తారా? ట్రంప్: చెప్పనిచ్చే సమస్యే లేదు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశారు. ఓవైపు మీ దేశమే చాలా సమస్యల్లో ఉంది. జెలెన్స్కీ: అవును. నాకు తెలుసు. ట్రంప్: మీరు (యుద్ధం) గెలవబోవడం లేదు. ఈ ఆపద నుంచి బయట పడేందుకు మీకున్న ఏకైక అవకాశం మా దన్ను మాత్రమే. జెలెన్స్కీ: మిస్టర్ ప్రెసిడెంట్! మేమెవరినీ ఆక్రమించలేదు. మా దేశంలో మేం బతుకుతున్నాం. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచీ మేం ఒంటరిగానే పోరాడుతున్నాం. అయినా సరే, మీ దేశం పట్ల మొదటినుంచీ కృతజ్ఞతగానే ఉన్నాం. ఇప్పుడు కూడా చెబుతున్నా. కృతజ్ఞతలు. ట్రంప్: కాల్పుల విమరణకు మీరు అంగీకరించి తీరాల్సిందే. మా సాయుధ సాయం లేకపోతే ఈ యుద్ధం రెండే రెండు వారాల్లో ముగిసిపోయేది. జెలెన్స్కీ: కాదు. మూడే రోజుల్లో. అలాగని పుతిన్ కూడా అన్నారు. ట్రంప్: ఏమో! అంతకంటే కూడా ముందే ముగిసేదేమో! ఇలాగైతే మీతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా చాలా కష్టం. వాన్స్: ఇప్పటికైనా కనీసం కృతజ్ఞతలు తెలపండి. జెలెన్స్కీ: ఒక్కసారి కాదు. ఎన్నోసార్లు చెప్పా. అమెరికా పౌరులకు కృతజ్ఞతలు. వాన్స్: మన మధ్య అభిప్రాయ భేదాలున్నాయని అంగీకరించండి. మీరు చేస్తున్నదే తప్పు. అలాంటప్పుడు వాటిని చర్చించుకుని పరిష్కరించుకోవాలి. అంతే తప్ప ఇలా అమెరికా మీడియా సాక్షిగా మాతో గొడవకు దిగడం చాలా తప్పు. ట్రంప్: కానీ నా ఉద్దేశంలో ఇదీ మంచిదే. ఏం జరుగుతోందో ఇప్పుడు అమెరికా ప్రజలంతా చూస్తున్నారు. వారికీ తెలియనీయండి. ఇది చాలా ముఖ్యం. అందుకే ఈ సంవాదాన్ని ఇంతసేపు కొనసాగించా. జెలెన్స్కీ అమెరికాకు కృతజు్ఞడై ఉండాల్సిందే. జెలెన్స్కీ: అవును. నేను కృతజు్ఞన్ని. ట్రంప్: మీ దగ్గర వాడటానికి ఇంకే కార్డులూ లేవు. మీరు నిండా మునిగారు. మీ జనం చనిపోతున్నారు. పోరాడేందుకు మీకు సైనికుల్లేరు. ఎలా చూసుకున్నా యుద్ధానికి తెర దించడమే మీకు మంచిది. కానీ మీరు చూస్తే కాల్పు విరమణే వద్దంటున్నారు! అది కావాలి, ఇది కావాలని పేచీకి దిగుతున్నారు! మీకొక్కటే చెప్పదలచుకున్నా. కాల్పుల విరమణకు ఇప్పుడే, ఇక్కడే ఒప్పుకుంటారా సరేసరి. మీ దేశంపై తూటాల వర్షం ఆగుతుంది. జన నష్టానికి తెర పడుతుంది. జెలెన్స్కీ: యుద్ధం ఆగాలనే మేమూ కోరుతున్నాం. కానీ అందుకోసం మేం కోరుతున్న హామీలు కావాలి. ఆ విషయం మీకిప్పటికే స్పష్టంగా చెప్పా. ట్రంప్: అంటే ఏమిటి మీరనేది? కాల్పుల విరమణ వద్దా? నాకైతే అదే కావాలి. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మీరు కోరుతున్న ఒప్పందాల కంటే మీకు త్వరగా దక్కేది కాల్పుల విరమణే! జెలెన్స్కీ: కాల్పుల విరమణపై మీవాళ్లనే అడిగి చూడండి. మీకే తెలుస్తుంది!ట్రంప్: దానితో నాకు సంబంధం లేదు. అదంతా బైడెన్ అనే వ్యక్తి ఉండగా జరిగిన వ్యవహారం. కానీ అతనంత సమర్థుడు కాదు. జెలెన్స్కీ: అప్పుడాయన మీ దేశాధ్యక్షుడు. ట్రంప్: ఏం మాట్లాడుతున్నారు? బైడెన్ అనే కాదు. అంతకుముందు ఒబామా మాత్రం మీకేం సాయం చేశాడు? కేవలం కాగితాలిచ్చి సరిపెట్టాడు. నేనేమో మీకు శత్రువులపైకి ప్రయోగించేందుకు ఆయుధాలు సమకూర్చా. అందుకే చెప్తున్నా. మీరు నిజానికి మరింతగా కృతజు్ఞలై ఉండాలి. మీరిప్పుడు నిస్సహాయులు. మా దన్నే మీకు బలం. మేమే లేకపోతే మీకేమీ లేదు. పుతిన్ నన్ను గౌరవిస్తున్నాడంటే కారణం అధ్యక్షునిగా తొలి టర్ములో నా శైలిని దగ్గర్నుంచి గమనించాడు గనుకే.(రష్యా గనుక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఏమిటన్న ఒక రిపోర్టర్ ప్రశ్నను ట్రంప్కు వాన్స్ వినిపించారు)ట్రంప్: ఎందుకీ ఊహాజనిత ప్రశ్నలు? ఇప్పటికిప్పుడు మీ నెత్తిపై బాంబు పడితే? రష్యా ఒకవేళ ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. బైడెన్తో చేసుకున్న ఒప్పందాన్ని రష్యా నిజంగానే ఉల్లంఘించింది. ఎందుకంటే అతనంటే వారికి గౌరవం లేదు. ఒబామా అన్నా అంతే. కానీ నా విషయం అలా కాదు. నేనంటే రష్యాకు, పుతిన్కు ఎంతో గౌరవం. ఒక్కటి చెప్తా వినండి. పుతిన్కు నేను చుక్కలు చూపించా! నేను చెప్పేదల్లా ఒక్కటే. ఒబామాతోనో, బుష్తోనో, చివరికి బైడెన్తో కూడా ఒప్పందాలను పుతిన్ ఉల్లంఘించి ఉండొచ్చు. నాకు తెలియదు. కానీ నాతో మాత్రం ఆయన అలా చేయలేదు. ఇప్పుడు కూడా ఒప్పందం చేసుకోవాలనే పుతిన్ అనుకుంటున్నాడు. (జెలెన్స్కీని ఉద్దేశించి) కానీ కాల్పుల విమరణకు ఒప్పుకునే ఉద్దేశం మీకేమాత్రం ఉందో లేదో నాకైతే తెలియదు. మిమ్మల్ని నేను బలశాలిగా, శక్తిమంతునిగా తీర్చిదిద్దా. అమెరికా దన్నే లేకపోతే మీకెన్నటికీ అంతటి శక్తి ఉండేదే కాదు. మీ ప్రజలు చాలా ధైర్యశాలులు. చివరిగా ఒక్కటే మాట. మాతో (ఖనిజ వనరుల) ఒప్పందం చేసుకుంటారా, సరేసరి! లేదంటే రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి యత్నాల నుంచి అమెరికా వైదొలగుతుంది. అప్పుడిక మీ పోరాటం మీదే. అదంత సులువని నేనైతే అనుకోను. ఎందుకంటే పోరాడేందుకు మీ దగ్గర ఏమీ లేదు. మాతో ఒప్పందం కుదుర్చుకుంటే మీరు చాలా మెరుగైన స్థితిలో ఉంటారు. కానీ ఏ దశలోనూ మీరు కాస్త కూడా కృతజ్ఞతపూర్వకంగా వ్యవహరించడం లేదు. ఇది ఎంతమాత్రమూ సరైన పద్ధతి కాదు. నిజంగా చెప్తున్నా. మీ తీరు అస్సలు సరికాదు. చూడాల్సిందంతా చూసేశాం. కదా! టీవీలకైతే ఇదంతా నిజంగా పండుగే! -
జెలెన్స్కీకి యూరప్ బాసట
న్యూయార్క్: అధ్యక్షుల రగడలో యూరప్తో సహా పలు ప్రపంచ దేశాలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి బాసటగా నిలిచాయి. దేశాధినేతలంతా శనివారం ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. వారందరికీ జెలెన్స్కీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు అమెరికా, యూరప్ దేశాల మధ్య పెరుగుతున్న అంతరానికి కూడా ఈ ఉదంతం అద్దం పట్టింది. రష్యా మాత్రం జెలెన్స్కీకి తగిన శాస్తే జరిగిందంటూ ఎద్దేవా చేసింది. ‘‘అంతటి వాగ్యుద్ధంలోనూ ట్రంప్, ఉపాధ్యక్షుడు వాన్స్ చూపిన సంయమనం అభినందనీయం. జెలెన్స్కీని వాళ్లు కొట్టకపోవడం నిజంగా అద్భుతమే’’ అని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జకరోవా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ట్రంప్, వాన్స్ వైఖరిని అమెరికా మంత్రులు పూర్తిగా సమర్థించుకున్నారు. ఈ మేరకు వారంతా పోటాపోటీగా ప్రకటనలు విడుదల చేశారు. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, సెనేటర్ జాక్ రీడ్ తదితరులు మాత్రం ట్రంప్, వాన్స్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. జెలెన్స్కీని కించపరిచేలా వారు వ్యవహరించిన తీరు అమెరికాకే అవమానకరమని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. ట్రంప్ ఎంతగా రష్యా వైపు, పుతిన్ వైపు మొగ్గినా అమెరికా ప్రజలు మాత్రం ఎప్పటికీ ఉక్రెయిన్కే దన్నుగా నిలుస్తారన్నారు. జెలెన్స్కీతో ట్రంప్, వాన్స్ వ్యవహరించిన తీరు నిజంగా సిగ్గుచేటని రీడ్ మండిపడ్డారు. తమ ప్రవర్తనతో అంతర్జాతీయంగా అమెరికా విశ్వసనీయతనే దెబ్బతీశారని ఆవేదన వెలిబుచ్చారు. దీన్ని ప్రపంచమంతా గమనిస్తోందన్నారు. ఆత్మగౌరవం ప్రదర్శించారు: ఉర్సులా ఉక్రెయిన్ ప్రజల ధైర్యాన్ని నిలబెట్టేలా జెలెన్స్కీ ఆత్మగౌరవం ప్రదర్శించారంటూ యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లియన్ కొనియాడారు. ‘‘నిర్భయంగా, ధైర్యంగా, బలంగా ఉండండి. మీరు ఒంటరి కారు. శాశ్వత శాంతి కోసం మేమంతా మీతో కలిసి పని చేస్తాం’’ అని పేర్కొన్నారు. ‘‘రష్యా ఒక దురాక్రమణదారు. ఉక్రెయిన్ బాధితురాలు. మేం ఆ దేశానికి సాయం చేయడం, రష్యాపై ఆంక్షలు విధించడం అస్సలు తప్పు కాదు. అమెరికా, యూరప్ దేశాలు, కెనడా, జపాన్ తదితరాలన్నీ ఇకముందూ ఇదే వైఖరి కొనసాగిస్తాయి’’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించే దౌత్య యత్నాలను తిరిగి పట్టాలెక్కించేందుకు తక్షణం ఈయూ–అమెరికా శిఖరాగ్ర భేటీ జరగాలని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్కు, జెలెన్స్కీకి మీకు తామంతా అన్నివేళలా వెన్నుదన్నుగా నిలుస్తామని జర్మనీ కాబోయే చాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్ ప్రకటించారు. ఉక్రెయిన్పై రష్యా అక్రమంగా దండెత్తిందన్నది కాదనలేని వాస్తవమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. లాతి్వయా, ఎస్తోనియా, ఫిన్లండ్, లగ్జెంబర్గ్, పోలండ్, హాలండ్ తదితర దేశాధినేతలు కూడా జెలెన్స్కీకి మద్దతుగా పోస్టులు చేశారు.మూడో ప్రపంచయుద్ధానికి బాటలు... ‘‘అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఖనిజాల ఒప్పందం ముందుకు సాగలేదు. అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నిరంతరం అమెరికా ప్రజల ప్రయోజనాల పరిరక్షణకే పాటుపడతారు. ప్రపంచంలో అమెరికా స్థానాన్ని గౌరవించని వాళ్లు మానుంచి అనుచిత లబ్ధి పొందేందుకు వారెన్నటికీ అనుమతించబోరు. జెలెన్స్కీతో భేటీలో ట్రంప్ మాటతీరే ఇందుకు తాజా నిదర్శనం. యుద్ధానికి తక్షణం ముగింపు పలకాలని ఉక్రేనియన్లలో ఏకంగా 52 శాతం మంది కోరుతున్నట్టు గత నవంబర్లో జరిగిన సర్వే తేల్చింది. రష్యాకు భూభాగాన్ని కోల్పోవడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉండాలి. లేదంటే ట్రంప్ హెచ్చరించినట్టు మూడో ప్రపంచ యుద్ధం తప్పదు. అది ఉక్రెయిన్లో మొదలవుతుంది. ఇజ్రాయెల్ మీదుగా ఆసియా దాకా పాకుతుంది. తర్వాత అంతటా విస్తరిస్తుంది’’ – వైట్హౌస్ ప్రకటన -
శరణమా.. రణమేనా?
వాషింగ్టన్: ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. అటు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. దేశాధినేతలం అన్న విషయం కూడా మర్చిపోయి మీడియా సాక్షిగా వాగ్వాదానికి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఒకరినొకరు దుయ్యబట్టుకున్నారు. అచ్చం వీధి బాగోతాన్ని తలపించేలా పాత విషయాలన్నీ తిరగదోడుతూ, పరస్పరం దెప్పిపొడుచుకుంటూ రెచ్చిపోయారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నడూ కనీవినీ ఎరగని ఈ దృశ్యాలకు వైట్హౌస్లోని ఓవల్ ఆఫీసు వేదికైంది. ఉక్రెయిన్లోని అపార ఖనిజ నిక్షేపాల్లో అమెరికాకు 50 శాతం వాటా ఇవ్వాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేయడం, బదులుగా రష్యా నుంచి తమ దేశానికి కచి్చతమైన రక్షణ హామీలు కావాలని జెలెన్స్కీ కోరడం తెలిసిందే. వాటిపై స్పష్టమైన ఒప్పందాల నిమిత్తం అగ్ర రాజ్యం చేరిన ఆయన శుక్రవారం వైట్హౌస్లో ట్రంప్తో 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితరులు పాల్గొన్న ఈ భేటీకి మీడియాను అనుమతించడమే గాక ప్రత్యక్ష ప్రసారం కూడా చేయడం విశేషం. భేటీ చాలాసేపటిదాకా ప్రశాంతంగానే సాగినా చివర్లో పూర్తిగా అదుపు తప్పింది. నేతలిద్దరి మాటల యుద్ధంతో రచ్చ రచ్చగా మారింది. చివరికి ఎటూ తేలకుండానే ముగిసింది. భేటీ అనంతరం జరగాల్సిన ట్రంప్, జెలెన్స్కీ సంయుక్త మీడియా భేటీ కూడా రద్దయింది! అంతేగాక, ‘జెలెన్స్కీ వైట్హౌస్ వీడి వెళ్లిపోవచ్చు’ అంటూ మీడియా సమక్షంలో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. శాంతి ఒప్పందానికి సిద్ధపడితేనే తిరిగి తమతో చర్చలకు రావాలని సూచించారు. దాంతో ఎన్నో ఆశల నడుమ జెలెన్స్కీ చేపట్టిన అమెరికా యాత్ర ఆశించిన ఫలితం రాబట్టకపోగా వికటించిన్నట్టు కనిపిస్తోంది. అలా మొదలైంది... రష్యా–ఉక్రెయిన్ వివాదం విషయమై దశాబ్ద కాలంగా అమెరికా వ్యవహరిస్తున్న తీరును ఆక్షేపిస్తున్నట్టుగా జెలెన్స్కీ మాట్లాడటంతో పరిస్థితి వేడెక్కింది. అమెరికా మీడియా అంతా చూస్తుండగా అంత అమర్యాదకరంగా మాట్లాడటం సరికాదంటూ వాన్స్ జోక్యం చేసుకున్నా ఆయన వెనక్కు తగ్గలేదు. తమతో కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ రష్యా 2014 నుంచీ తుంగలో తొక్కుతూ వస్తున్నా అమెరికా సరైన రీతిలో జోక్యం చేసుకోలేదంటూ ఆక్షేపించారు. అధ్యక్షులు బరాక్ ఒబామా, ట్రంప్, బైడెన్ ఎవరూ తమకు చేయాల్సినంతగా సాయం చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఖనిజ ఒప్పందానికి ప్రతిగా ఉక్రెయిన్ రక్షణకు అమెరికా స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ క్రమంలో, ‘‘యుద్ధంలో అంతులేని నష్టాన్ని చవిచూడాల్సి వస్తే ఎలా ఉంటుందో అమెరికాకు తెలియదు. బహుశా మున్ముందు తెలిసొస్తుందేమో!’’ అన్న జెలెన్స్కీ వ్యాఖ్యలతో పరిస్థితి మరింత అదుపు తప్పింది. ట్రంప్ ఒక్కసారిగా తీవ్ర అసహనానికి లోనయ్యారు. జెలెన్స్కీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘అలాంటి పరిస్థితి మాకెప్పుడూ రాదు. ఎప్పటికీ తిరుగులేని శక్తిగానే ఉంటాం’’ అంటూ ఆగ్రహంగా బదులిచ్చారు. ‘‘ఉక్రెయిన్కు ఇన్నేళ్లుగా అన్నివిధాలా ఆదుకుంటూ వస్తున్నాం. ఈ యుద్ధంలో ఇప్పటికే 350 బిలియన్ డాలర్ల మేర సాయుధ, ఆర్థిక సాయం అందించాం. లేదంటే రష్యాతో యుద్ధం కొనసాగించడం మీ తరమయ్యేదే కాదు. పోరు రెండే వారాల్లో ముగిసిపోయేది’’ అంటూ దుయ్యబట్టారు. అయినా జెలెన్స్కీకి మాత్రం కనీస కృతజ్ఞత కూడా లేదంటూ విరుచుకుపడ్డారు. మీడియా ముందే తనతో గొడవకు దిగుతూ అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శించారు. ‘‘అమెరికా దన్ను లేనిదే మీరెందుకూ కొరగారు! మాకు షరతులు విధించే, మమ్మల్ని డిమాండ్ చేసే పరిస్థితిలో అసలే లేరు. అది గుర్తుంచుకోండి’’ అంటూ వేలు చూపిస్తూ మరీ జెలెన్స్కీని కటువుగా హెచ్చరించారు. ‘‘మీరు లక్షలాది ప్రాణాలను పణంగా పెడుతున్నారు. మూడో ప్రపంచ యుద్ధాన్ని తెచ్చిపెట్టేలా ప్రమాదకర జూదం ఆడుతున్నారు’’ అంటూ జెలెన్స్కీని ఆక్షేపించారు. మధ్యలో పదేపదే ఆయన భుజంపై కొట్టి మరీ ఆగ్రహం వెలిగక్కారు. రష్యాతో ఏ విషయంలోనూ రాజీ పడేదే లేదన్న జెలెన్స్కీ వ్యాఖ్యలను కూడా ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ‘‘పుతిన్ ఒక ఉగ్రవాది. యుద్ధాల్లోనూ నిబంధనలుంటాయి. వాటన్నింటినీ కాలరాసిన పుతిన్ వంటి హంతకునితో ఎలాంటి రాజీ ఉండబోదు’’ అని జెలెన్స్కీ అన్నారు. అలా కుదరదని, యుద్ధానికి తెర దించాలంటే రష్యాతో చాలా విషయాల్లో రాజీ పడాల్సిందేనని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ‘‘ఇలాగైతే మాతో వ్యాపారం కష్టమే. అమెరికాతో ఖనిజ వనరుల ఒప్పందానికి అంగీకరిస్తారా, సరేసరి. లేదంటే మీకూ మాకూ రాంరాం’’ అంటూ తేల్చిపడేశారు. వాగ్వాదం పొడవునా నేతలిరువురూ పదేపదే వాగ్బాణాలు విసురుకున్నారు. కనీసం ఇప్పటికైనా అమెరికా చేస్తున్న దానికి కృతజ్ఞతలు చెప్పండంటూ వాన్స్ కల్పించుకోగా ట్రంప్ వారించారు. ‘‘పర్లేదు. ఈ డ్రామా నాకూ సరదాగానే ఉంది. జరుగుతున్నదేమిటో అమెరికా ప్రజలందరూ చూడాలి’’ అన్నారు.సాయానికి హామీ ఇవ్వలేం: ట్రంప్ జెలెన్స్కీతో భేటీకి ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్తో సహజ వనరుల ఒప్పందంపై ఆయన, తాను కాసేపట్లో సంతకాలు చేస్తామని ప్రకటించారు. యుద్ధం వీలైనంత త్వరగా ముగియాలన్నదే తన ఉద్దేశమన్నారు. అయితే, ‘‘ఉక్రెయిన్కు అమెరికా సైనిక సాయం కొనసాగుతుంది. కాకపోతే ఈ విషయంలో మానుంచి మరీ ఎక్కువగా ఆశించకూడదు’’ అని స్పష్టం చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కృతనిశ్చయంతో ఉన్నారంటూ మరోసారి ప్రశంసించారు. -
ట్రేడ్ వార్ టెర్రర్
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై అదనంగా 10%, యూరోపియన్ యూనియన్ ఉత్పత్తులపై 25% తాజా సుంకాల ప్రకటనతో ఈక్విటీ మార్కెట్లలో మరోసారి అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్ 1,414 పాయింట్లు నష్టపోయి 74వేల స్థాయి దిగువన 73,198 వద్ద నిలిచింది. నిఫ్టీ 420 పాయింట్లు కోల్పోయి 22,125 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,471 పాయింట్లు క్షీణించి 73,141 వద్ద, నిఫ్టీ 440 పాయింట్లు కుప్పకూలి 22,105 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. → అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఇండెక్సుల వారీగా.. ఐటీ సూచీ 4.20% పతనమైంది. టెలి కమ్యూనికేషన్, ఆటో ఇండెక్సు 4%, కన్జూమర్ డి్రస్కేషనరీ 3%, ఆయిల్అండ్గ్యాస్ 2.50%, విద్యుత్ ఇండెక్స్ 2% నష్టపోయాయి. చిన్న, మధ్య తరహా షేర్లలోనూ అమ్మకాలు కొనసాగాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 2.33%, మిడ్ క్యాప్ ఇండెక్సు 2.16 క్షీణించాయి. → స్టాక్ మార్కెట్ 2% పతనంతో శుక్రవారం ఒక్కరోజే రూ.9.08 లక్షల కోట్లు హరించుకుపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.384.01 లక్షల కోట్లకు దిగివచ్చింది. → సెన్సెక్స్ సూచీలో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2%) తప్ప మిగిలిన అన్ని షేర్లూ పతనమయ్యాయి. అత్యధికంగా టెక్ మహీంద్రా 6%, ఇండస్ఇండ్ బ్యాంక్ 5.5%, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎయిర్టెల్ 5%, టైటాన్ 4.5% పడ్డాయి.→ గతేడాది సెపె్టంబర్ 27 నాటి సెన్సెక్స్ రికార్డు గరిష్టం(85,978) నుంచి 12,780 పాయింట్లు(15%), నిఫ్టీ జీవితకాల గరిష్టం(26,277) నుంచి 4,153 పాయింట్లు(16%) క్షీణించాయి. ఆర్థిక వృద్ధి మందగమనం ఆందోళనలు, ట్రంప్ వాణిజ్య విధానాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు దీనికి కారణయ్యాయి. పతనానికి కారణాలుతారస్థాయికి వాణిజ్య యుద్ధ భయాలు: చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 10% సుంకాలు విధించిన ట్రంప్.. అదనంగా మరో 10% విధిస్తున్నట్లు ప్రకటించారు. యూరోపియన్ యూనియన్ దిగుమతులపై 25% సుంకాల విధింపు ఉంటుందన్నారు. వీటికి తోడు భారత్తో సహా అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు ఏప్రిల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మెక్సికో, కెనడాల దిగుమతులపై ప్రతిపాదించిన 25% సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి రానున్నాయి.టెక్ షేర్లు క్రాష్: టెక్ దిగ్గజం ఎన్విడియా త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చనే అంచనాలతో వాల్ స్ట్రీట్లో అధిక మార్కెట్ విలువ కలిగిన టెక్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఈ ప్రభావం దేశీయ ఐటీ రంగ షేర్లపైనా పడింది. నెలరోజుల కనిష్టానికి ప్రపంచ మార్కెట్లు: వాణిజ్య యుద్ధ భయాలకు తోడు టెక్ రంగ షేర్ల పతనంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నెలరోజుల కనిష్టానికి దిగివచ్చాయి. ఆసియాలో దక్షిణ కొరియా, ఇండోనేషియా, హాంగ్కాంగ్, జపాన్ సూచీలు 3.50% నుంచి 3% కుప్పకూలాయి. చైనా, సింగపూర్ తైవాన్ ఇండెక్సులు 2–1% నష్టపోయాయి. యూరప్లో ఫ్రాన్స్, జర్మనీ దేశాల సూచీలు అరశాతం నష్టపోయాయి.బలపడుతున్న డాలర్ ఇండెక్స్: వాణిజ్య యుద్ధ భయాలతో అమెరికా కరెన్సీ డాలర్ ఇండెక్స్ 10 వారాల గరిష్టానికి (108) చేరుకుంది. దీంతో భారత్తో సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ప్రతికూలాంశంగా మారింది. ఆగని ఎఫ్ఐఐల అమ్మకాలు: దేశీయ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండడం దలాల్ స్ట్రీట్ పతనానికి మరో ప్రధాన కారణం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.1.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. ఈ ఫిబ్రవరిలోనే రూ.58,988 కోట్ల ఈక్విటీలు అమ్మేశారు.రూపాయి 19 పైసలు పతనం డాలర్ మారకంలో రూపాయి విలువ 19 పైసలు క్షీణించి 87.37 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ రెండు నెలల గరిష్టానికి చేరుకోవడం, వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఇంట్రాడేలో 35 పైసలు బలహీనపడి 87.53 వద్ద కనిష్టాన్ని తాకింది. కాగా, ఫిబ్రవరి 10న రూపాయి 87.94 వద్ద జీవితకాల కనిష్ట స్థాయిని తాకింది. -
మోదీ తన మిత్రుడు ట్రంప్ వ్యాఖ్యలను పట్టించుకోవాలి
న్యూఢిల్లీ: ఓటింగ్ కోసం ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లకు బదులుగా బ్యాలెట్ పేపర్లను వాడాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారులకు చేసిన సూచనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రధాని మోదీ తన మిత్రుడు ట్రంప్ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. మనదేశ ఎలక్టోరల్ విధానం సమగ్రతపై వ్యక్తమవుతున్న ఆందోళనలకు బ్యాలెట్ విధానమే సరైన సమాధానమని పేర్కొంది. అమెరికాలో ఇటీవల జరిగిన రాష్ట్రాల గవర్నర్ల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ..‘ఈవీఎంల విధానం చాలా ఖరీదైన వ్యవహారం. దీనికి బదులుగా బ్యాలెట్ విధానాన్ని, ఒకే రోజు ఓటింగ్ చేపట్టడం వంటివి తీసుకురావడం మంచిది’అని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ‘ఎక్స్’లో పలు పోస్టులు చేశారు. ‘ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా లక్షల సంఖ్యలో ఓటర్లు పెరిగారు. అదేసమయంలో, ప్రతిపక్షాలకు చెందిన వారి ఓట్లను పెద్ద సంఖ్యలో తొలగించారు. ఇవన్నీ తెలిస్తే మోదీ మిత్రుడు ట్రంప్ సైతం షాకవుతారు’అని పేర్కొన్నారు. ‘ఈవీఎంలతో ఎన్నికల విధానాన్ని తారుమారు చేయవచ్చని ప్రపంచానికంతటికీ తెలిసినా బీజేపీ మాత్రం అమాయకత్వం ప్రదర్శించటం విషాదకరం. పారదర్శకతకు దూరంగా పారిపోయే బీజేపీ వైఖరి చూస్తే వాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది’అని తెలిపారు. -
అమెరికాలో ముగ్గురు సైనికాధికారులపై వేటు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముగ్గురు కీలక సైనాధికారులకు ఉద్వాసన పలికారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ చార్లెస్ సీక్యూ బ్రౌన్(ఛార్లెస్ క్వింటన్ బ్రౌన్) జూనియర్పై హఠాత్తుగా వేటువేశారు. ఎయిర్ఫోర్స్ జనరల్ అయిన బ్రౌన్ గత 16 నెలలుగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. అత్యంత కీలకమైన జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ పదవిని అధిరోహించిన రెండో నల్లజాతి అధికారిని ఉన్నట్టుండి పదవి నుంచి తొలగించడం అమెరికా సైనిక వర్గాల్లో సంచలనాత్మకంగా మారింది. ‘‘అమెరికాకు 40 ఏళ్లకుపైగా సేవలందిస్తున్న జనరల్ చార్లెస్ సీక్యూ బ్రౌన్ జూనియర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆయన ఒక గొప్ప అధికారి. సైన్యాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించిన నాయకుడు. బ్రౌన్తోపాటు ఆయన కుటుంబం భవిష్యత్తు ఉజ్వలంగా వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’అని సోషల్ మీడియాలో డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం పోస్టు చేశారు. జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ నూతన చైర్మన్గా రిటైర్డ్ ఎయిర్ఫోర్స్ లెఫ్టినెంట్ జనరల్ డాన్ రజిన్ కెయిన్ను నామినేట్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతి వ్యక్తిని పోలీసులు హత్య చేసినప్పుడు ప్రజలు వీధుల్లోకి వచ్చి ఉద్యమించారు. వర్ణవివక్ష పూర్తిగా అంతం కావాలని డిమాండ్ చేశారు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’పేరిట జరిగిన ఉద్యమానికి చార్లెస్ సీక్యూ బ్రౌన్ జూనియర్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. నల్లజాతి ప్రజల పట్ల ఆయన సానుభూతి చూపుతుంటారు. అమెరికా సైన్యంలో బ్రౌన్ వ్యతిరేకులు చాలామందే తయారయ్యారు. సైనిక వ్యయాన్ని గణనీయంగా తగ్గించాలని, అవసరం లేదని సిబ్బందిని ఇంటికి సాగనంపాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే బ్రౌన్కు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మరో ఇద్దరు సీనియర్ సైనిధికారులను పదవి నుంచి తొలగిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి హెగ్సెత్ వెల్లడించారు. నావల్ ఆపరేషన్స్ చీఫ్ అడ్మిరల్ లీసా ఫ్రాంచెట్టీ, స్టాఫ్ ఆఫ్ ద ఎయిర్ఫోర్స్ వైస్ చీఫ్ జనరల్ జిమ్ స్లైఫ్ను పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.5,400 మంది ప్రొబేషనరీ సిబ్బందికి ఉద్వాసనే సైన్యంలో పనిచేస్తున్న 5,400 మంది ప్రొబేషనరీ వర్కర్స్కు ఉద్వాసన పలకబోతున్నట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. వచ్చేవారం నుంచే వారిని తొలగించే ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టంచేసింది. నూతన నియామకాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. ఏడాది కంటే తక్కువ కాలం పని చేసినవారిని తొలగించాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. ఇలాంటి వారికి సివిల్ సర్వీసు ప్రొటెక్షన్ ఉండదు. సైన్యంలో యూనిఫామ్ సర్వీసు మినహా ఇతర విభాగాల్లో 5 నుంచి 8 శాతం సిబ్బందిని తగ్గించుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు యూఎస్ ఫారెస్టు సర్వీసు నుంచి దాదాపు 2 వేల మంది ఉద్యోగులను ఇప్పటికే తొలగించింది. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసులో పనిచేస్తున్న 7 వేల మందిపై త్వరలో వేటు వేయబోతున్నట్లు తెలిసింది. ఉద్యోగుల తొలగింపుపై రక్షణ మంత్రి హెగ్సెత్ గతవారం సోషల్ మీడియాలో నర్మగర్భమైన పోస్టు చేశారు. ‘‘శరీరం నుంచి అనవసరమైన కొవ్వును తొలగించుకుంటే కండరాలు బలపతాయి’’అని పేర్కొన్నారు. సైన్యంలో కొన్ని కార్యక్రమాలకు కత్తెర వేసి 50 బిలియన్ డాలర్లు ఆదా చేయాలని ఆదేశించారు. ఈ సొమ్మును అధ్యక్షుడు ట్రంప్ ప్రాధాన్యతల జాబితాలో ఉన్న కార్యక్రమాలకు మళ్లించాలని పేర్కొన్నారు. 50 బిలియన్ డాలర్లు అంటే అమెరికా సైనిక బడ్జెట్లో 8 శాతం. -
Russia-Ukraine war: యుద్ధం @ మూడేళ్లు
ఉక్రెయిన్. రష్యా దురాక్రమణ జెండా ఎగరేసి దూసుకురావడంతో అస్థిత్వమే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్న పొరుగుదేశం. అణ్వస్త్ర సామర్థ్యం, అమేయ సైన్యంతో కొద్దికొద్దిగా ఆక్రమించుకుంటూ వస్తున్న రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్ యుద్ధంచేస్తూ శతథా ప్రయత్నాలు చేయబట్టి రేపటికి సరిగ్గా మూడేళ్లు. ఈ మూడేళ్లలో రష్యా కన్నెర్రజేసి వేలాది సైన్యంతో చేస్తున్న భీకర గగనతల, భూతల దాడుల్లో ఉక్రెయిన్లో సాధారణ ప్రజల వేలాది కలల సౌధాలు పేకమేడల్లా కూలి నేలమట్టమయ్యాయి. వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. శివారు గ్రామాలు, పట్టణాలన్నీ మరుభూములుగా మారిపోయాయి. ఎక్కడ చూసినా మరణమృదంగం నిరాటంకంగా వినిపిస్తోంది. సైనికులు పిట్టల్లా రాలిపోయారు. మార్షల్ లా ప్రయోగించి జెలెన్స్కీ ప్రభుత్వం యువత మొదలు నడివయసు వారిదాకా దమ్మున్న వారందరినీ రణక్షేత్రంలోకి దింపి పోరాటం చేయిస్తోంది. దశాబ్దాల నాటి దౌత్య ఒప్పందాలను ఉల్లంఘించిందని, నాటోలో చేరాలనుకుంటోందని పలు సాకులు చూపి రష్యా సమరశంఖం పూరించింది. దీంతో హఠాత్తుగా యుద్ధంలో కూరుకుపోయినా ఉక్రెయిన్ తన మిత్రబృందం నుంచి అందుతున్న అధునాతన ఆయుధాలతో రష్యాను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ లక్షలాది మంది రష్యన్ సైనికులను నేలకూల్చింది. దీంతో అణ్వస్త్ర బూచి చూపించి భయపెడుతున్న పుతిన్కు యుద్ధాన్ని ఆపడమే ఉత్తమమని అగ్రరాజ్య నయా నాయకుడు డొనాల్డ్ ట్రంప్ టెలీఫోన్ మంతనాలు చేయడంతో యుద్ధం మొదలైన మూడేళ్ల తర్వాత తొలిసారిగా కీలక మలుపు తీసుకుంది. వాస్తవానికి ఈ మలుపు తుది మలుపు అని, ట్రంప్ పట్టుదలతో యుద్ధాన్ని ఆపబోతున్నారని అంతర్జాతీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. 36 నెలల తర్వాత అయినా ఉక్రెయిన్ ఊపిరి పీల్చుకుంటుందో లేదోనని, యుద్ధప్రభావిత విపరిణామాలతో తిప్పలుపడుతున్న ఎన్నో ప్రపంచదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.అత్యంత భీకర ఘర్షణరెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్లో వెలుగుచూసిన అతిపెద్ద వైరం ఇదే. వాస్తవానికి తాజా యుద్ధానికి పునాదులు పదేళ్ల క్రితమే పడ్డాయి. 2014లో ఉక్రెయిన్లోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఉన్నపళంగా ఆక్రమించుకుంది. ఆనాటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్ పైకి రష్యా దండయాత్ర మొదలెట్టింది. వందల కొద్దీ చిన్నపాటి క్షిపణులు ప్రయోగిస్తూ వేలాది సైనికులను కదనరంగంలోకి దింపింది. తొలిరోజుల్లో రాజధాని కీవ్దాకా దూసుకొచ్చి భీకర దాడులు చేసిన రష్యా ఆ తర్వాత ఆక్రమణ వేగాన్ని అనూహ్యంగా తగ్గించింది. ఉక్రెయిన్ వైపు నుంచి ప్రతిఘటన కూడా దీనికి ఒక కారణం. ఉక్రెయిన్ తొలినాళ్లలో యుద్ధంలో తడబడినా ఆ తర్వాత అగ్రరాజ్యం, యూరప్ దేశాల ఆర్థిక, ఆయుధ, నిఘా బలంతో చెలరేగిపోయింది. ధాటిగా దాడులు చేస్తూ పుతిన్ పటాలానికి ముచ్చెమటలు పట్టించింది. దీంతో మరింత శక్తివంతమైన ఆయుధాలను రష్యా బయటకుతీయక తప్పలేదు. దీంతో డ్రోన్లకు ఉక్రెయిన్ పనిచెప్పింది. దృఢత్వానికి చిరునామా అయిన అత్యంత ఖరీదైన వేలాది రష్యన్ యుద్ధట్యాంక్లను సైతం సులువుగా చవకైన డ్రోన్లతో పేల్చేసి జెలెన్స్కీ సేన పలు యుద్ధక్షేత్రాల్లో పైచేయి సాధించింది. 18 శాతం ఆక్రమణఅంతర్జాతీయ మీడియా కథనాలు, రష్యా, ఉక్రెయిన్ ఉన్నతాధికారులు పలు సందర్భాల్లో వెల్లడించిన గణాంకాలను బట్టి చూస్తే ఇప్పటిదాకా రష్యా ఉక్రెయిన్లోని కేవలం 18 శాతం భూభాగాన్ని మాత్రమే ఆక్రమించుకోగలిగింది. కీవ్, లివివ్, డినిప్రో, ఒడెసా వంటి ప్రధాన నగరాలపై దాడి ప్రభావం లేదు. అమెరికా, ఇతర మిత్ర దేశాల నుంచి ఉక్రెయిన్కు అందుతున్న భారీ ఆయుధాలే ఇందుకు ప్రధాన కారణం. ఎప్పటికప్పుడు ఆయుధాలు, మందుగుండు, సైనిక ఉపకరణాలు, ఆర్థిక సాయం అందడంతోపాటు అంతర్జాతీయంగా లభిస్తున్న నైతిక మద్దతుతో రెట్టించిన ఉత్సాహంతో ఉక్రెయిన్ సైనికులు కదనరంగంలో ధైర్యంగా ముందడుగు వేయగల్గుతున్నారు. యుద్ధంలో రష్యా దాదాపు ఏకాకిగా మారింది. రహస్యంగా ఉత్తరకొరియా, చైనా, ఇరాన్ వంటి దేశాల నుంచి ఆయుధాలు, డ్రోన్లు తదితర ఆయుధాలు, కిరాయి సైనికులు తప్పితే రష్యాకు బయటి దేశాల నుంచి ఎలాంటి సాయం అందట్లేదు. అమెరికా తదితర దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షల కత్తి గుచ్చాయి. సొంత దేశంలోనూ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న రష్యన్లు కోట్లలో ఉన్నారు. యుద్ధం కారణంగా విదేశీ వస్తువుల లభ్యత తగ్గి, డిమాండ్ పెరిగింది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి రష్యన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయుధం చేతికిచ్చి యుద్ధానికి పుతిన్ పంపిస్తాడన్న ముందస్తు అంచనాతో తొలినాళ్లలోనే వేలాది మంది యువ రష్యన్లు దేశం నుంచి పారిపోయారు. చివరకు ఖైదీలు, నిందితులను సైతం పుతిన్ సైన్యంలో చేరి్పంచుకుని ఉక్రెయిన్తో పోరాటం చేయిస్తున్నారు.అన్ని రంగాలు తిరోగమనం నష్టాలు చెప్పకపోయినా అంతర్జాతీయంగా తగ్గిన వాణిజ్యంతో ఉక్రెయిన్ నష్టాలు చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయికి చేరుకున్నాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. బాంబు దాడుల్లో ఆనకట్టలు, రహదారులు, భవనాలు, వ్యవసాయ క్షేత్రాలు, పాఠశాలలు, కర్మాగారాలు ఇలా మౌలికవసతుల వ్యవస్థ బాగా దెబ్బతింది. వ్యవసాయం తగ్గిపోయింది. నిరుద్యోగం పెరిగింది. ఇలా ఎన్నో రంగాలు తిరోగమన పథంలో పయనిస్తున్నాయి. దేశ జీడీపీకి వందల బిలియన్ డాలర్ల నష్టం చేకూరింది. వాణిజ్య, పరిశ్రమ రంగానికి సంబంధించి దాదాపు రూ.15 లక్షల కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.5.8 లక్షల కోట్ల నష్టాలు వాటిల్లాయి. రవాణా, వాణిజ్యం, ఎగుమతులు, వ్యవసాయం, విద్యుత్, పరిశ్రమల రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి వందల బిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయని ఓ అంచనా. ఉక్రెయిన్కు మిత్ర దేశాల నుంచి భారీ స్థాయిలో సాయం అందుతున్నా అది ఎక్కువగా సైనిక, రక్షణపర సాయమే తప్పితే సాధారణ ప్రజల జీవితాలను బాగుచేసేది కాదు. దీంతో యుద్ధంలో ఉక్రెయిన్ తన భూభాగాలను మాత్రమే కాదు భవిష్యత్తును కొంత కోల్పోతోందనేది వాస్తవం. ఉక్రెయిన్కు అపార ఆస్తినష్టం రష్యా వైపు సైనికులు, ఆయుధాల రూపంలో నష్టం కనిపిస్తుంటే ఉక్రెయిన్ వైపు అంతకుమించి ఆస్తినష్టం సంభవించింది. లక్షల కోట్ల రూపాయల విలువైన భవనాలు నేలమట్టమయ్యాయి. పెద్ద సంఖ్యలో జనావాసాలపై దాడులతో పెద్దసంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇక దాదాపు లక్షకుపైగా ఉక్రెయిన్ సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 4 లక్షల మంది సైనికులు గాయాలపాలయ్యారు. ఇక స్వస్థలాలు సమరక్షేత్రాలుగా మారడంతో లక్షలాది మంది స్వదేశంలోనే యుద్ధంజాడలేని సుదూర ప్రాంతాలకు తరలిపోయారు. పక్కనే ఉన్న పోలండ్, రొమేనియా దేశాలుసహా అరడజనుకుపైగా దేశాలకు దాదాపు 60 లక్షల మంది శరణార్థులుగా వలసవెళ్లారు. దాదాపు ఉక్రెయిన్ వైపు యుద్ధంలో ఎంత నష్టం జరిగిందనేది స్పష్టంగా తెలీడం లేదు. అమెరికా సహా యూరప్ దేశాల ప్రభుత్వాలు, ఆయా దేశాల్లోని ప్రధాన మీడియా సంస్థలు సైతం ఉక్రెయిన్కు అండగా నిలుస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ సైన్యం, పౌరుల్లో నైతిక స్థైర్యం సడలకూడదనే ఉద్దేశంతో యుద్ధ నష్టాలను తక్కువ చేసి చూపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.యుద్ధంలో రక్తమోడుతున్న రష్యాఅణ్వ్రస్తాలు లేకున్నా ఉక్రెయిన్తో యుద్ధం అంత తేలిక కాదని పుతిన్కు రానురాను అర్థమైంది. రష్యాకు తగ్గట్లు ఉక్రెయిన్ సైతం అధునాతన యుద్ధవ్యూహాలను అమలుచేస్తుండటంతో రష్యా వైపు నష్టం భారీగానే ఉంది. అంతర్జాతీయ యుద్ధ పరిశీలనా బృందాలు, సంస్థలు, వార్తాసంస్థల నివేదికలు, అంచనాల ప్రకారం యుద్ధంలో ఏకంగా 8,66,000 మంది రష్యా సైనికులు చనిపోయారు. ఉక్రెయిన్ విషయంలో చూస్తే కేవలం లక్షకుపైగా సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఏకంగా 10,161 రష్యన్ యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ ధ్వంసంచేసింది. ఉక్రెయిన్లో ఎన్నికలొచ్చేనా?రష్యా దాడులు మొదలెట్టగానే జెలెన్స్కీ తమ దేశంలో మార్షల్ లా ప్రయోగించారు. సైనికపాలన వంటి అత్యయిక స్థితి అమల్లో ఉన్న కారణంగా ఉక్రెయిన్లో ఇప్పట్లో ఎన్నికలు సాధ్యంకాదు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాలంటే పార్లమెంట్లో ఏకాభిప్రాయ నిర్ణయం ద్వారా మార్షల్ లాను తొలగించాలి. యుద్ధం జరుగుతుండగా మార్షల్ లాను చట్టప్రకారం తొలగించడం అసాధ్యం. దీంతో ఇప్పట్లో ఎన్నికలు కష్టమని భావిస్తున్నారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించినా జెలెన్స్కీ జాతీయభావం, యుద్ధంలో రష్యాను దీటుగా ఎదుర్కొంటున్నానని చెప్పి మళ్లీ అధికారం కైవసం చేసుకుంటారని విపక్ష పారీ్టలు విమర్శిస్తున్నాయి. యుద్ధంలో ట్రంప్కార్డ్ జెలెన్స్కీ మొండిపట్టుదలతో యుద్ధాన్ని ఇక్కడిదాకా తెచ్చారని సంచలన ఆరోపణలు చేసిన అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ వడివడిగా తీసుకుంటున్న నిర్ణయాలు యుద్ధమేఘాలను శాశ్వతంగా తరిమేస్తాయన్న ఆశలు ఒక్కసారిగా చిగురించాయి. తొలిసారిగా రష్యా విదేశాంగ మంత్రి స్థాయి కీలక నేతలతో ఇటీవల మొదలైన చర్చల ప్రక్రియను ఇప్పుడు యుద్ధంలో కీలకదశగా చెప్పొచ్చు. మంతనాలు మరింత విస్తృతస్థాయిలో జరిగితే మూడేళ్ల యుద్ధానికి ముగింపు ఖాయమనే విశ్లేషణలు పెరిగాయి. ఇప్పటిదాకా ఆక్రమించిన ప్రాంతం రష్యాకే చెందుతుందని, ఇప్పటి ‘వాస్తవాదీన రేఖ’నే అంగీకరిస్తూ జెలెన్స్కీని ఒప్పించాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్కు ఒప్పకోకపోతే మిత్రదేశాల నుంచి ఎలాంటి సాయం అందకుండా అడ్డుకుంటానని ట్రంప్ హెచ్చరించి జెలెన్స్కీని దారికి తెస్తారని భావిస్తున్నారు. అధునాతన ఆయుధాలతో దూసుకొస్తున్న రష్యా సేనలను అడ్డుకోవాలంటే ఉక్రెయిన్కు విదేశీ ఆయుధసాయం తప్పనిసరి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జెలెన్స్కీ అమెరికా పెట్టే షరతులకు ఒప్పకోక తప్పదని, యుద్ధం ఒక రకంగా ముగింపు దిశలో పయనిస్తోందని వార్తలొచ్చాయి. యుద్ధం అంకెల్లో.. చనిపోయిన రష్యా సైనికులు 8,66,000కుపైగా చనిపోయిన ఉక్రెయిన్ సైనికులు 1,00,000కుపైగా ఇప్పటిదాకా రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ ప్రాంతం 18 శాతం సగటున రోజుకు రష్యా ఆక్రమణ రేటు 16.1 చదరపు కిలోమీటర్లు ఉక్రెయిన్కు యూరప్ దేశాల నుంచి అందిన ఆర్థిక సాయం రూ. 14 లక్షల కోట్లు యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్కు ఇచ్చిన రుణాలు రూ. 2 లక్షల కోట్లు– సాక్షి, నేషనల్ డెస్క్ -
మస్క్ ప్రతిపాదన నచ్చింది: ట్రంప్
వాషింగ్టన్: ఫెడరల్ వ్యవస్థ తగ్గింపుతో పొదుపు చేసిన డబ్బు ఖర్చుపై డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమర్థించారు. వ్యయ తగ్గింపుతో మిగిల్చిన మొత్తంలోని కొంత డబ్బును అమెరికా పౌరులకు డివిడెండ్ రూపంలో తిరిగి ఇచ్చే ఆలోచన తనకు నచ్చిందన్నారు. మయామీలో జరిగిన ఇన్వెస్టర్స్ మీట్లో ఆయన మాట్లాడారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. మస్క్ ప్రతిపాదనకు మద్దతిచ్చారు. వ్యయ తగ్గింపులతో మిగిలే మొత్తంలో 20 శాతాన్ని అమెరికా పౌరులకు డివిడెండ్గా ఇవ్వాలని, మరో 20 శాతాన్ని జాతీయ రుణాలను చెల్లించడానికి ఉపయోగించాలని డోజ్ ప్రతిపాదించింది. ఈ సొమ్ము ప్రజల ఖాతాల్లోకి వెళ్లడం ద్వారా.. వృధాను అరికట్టేందుకు వారే ముందుకొస్తారన్నారు. -
ఎయిర్ ఫోర్స్ వన్ కోసం పాత విమానాలకు మార్పులు చేయిస్తాం
వాషింగ్టన్: కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం బోయింగ్ కంపెనీ ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలను అందజేయడంలో ఆలస్యం చేస్తుండటంపై అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా బోయింగ్ పాత విమానాలను కొనుగోలు చేసి, వాటిని అవసరాలకు అనుగుణంగా మార్చనున్నామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడి పర్యటనల కోసం ప్రత్యేకంగా వాడే ‘ఎయిర్ ఫోర్స్ వన్’విమానాలను బోయింగ్ కంపెనీ రూపొందిస్తుంది. రెండు విమానాలను కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఖరీదు చాలా ఎక్కువైందంటూ ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలో కాంట్రాక్టును మార్చారు. మారిన నిబంధనల ప్రకారం 2024లోనే బోయింగ్ మొదటి విమానాన్ని అందజేయాల్సి ఉంది. కానీ, ఉద్యోగుల సమ్మె, కరోనా మహమ్మారి వంటి కారణాలతో ఆ కంపెనీ నష్టాల్లో కూరుకుపోయి పనులు నిలిచిపోయాయి. తాజా అంచనాల ప్రకారం, మొదటిది 2027లో, 2028లో ట్రంప్ పదవి నుంచి దిగిపోయే సమయానికి రెండో విమానం అందుతుంది. 35 ఏళ్లనాటి బోయింగ్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’విమానంలో బుధవారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..బోయింగ్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ కాంట్రాక్టుకు ప్రత్యామ్నాయం చూస్తున్నామన్నారు. యూరప్ కంపెనీ ఎయిర్ బస్ నుంచి కొంటారా అన్న ప్రశ్నకు ఆయన.. అలాంటిదేమీ లేదన్నారు. విదేశీ కంపెనీ కంటే స్వదేశీ కంపెనీకి ప్రాధాన్యం ఇస్తామన్నారు. బోయింగ్ కంపెనీకే చెందిన వాడిన విమానాన్ని కొని, దానిలో మార్పులు చేయిస్తామని చెప్పారు. ఖరీదు ఎక్కువనే కారణంతో ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో డిజైన్ చేసిన కొత్తతరం వీసీ–25బీ రకం విమానాలను సైతం ట్రంప్ తిరస్కరించారు. గాలిలో ఉండగానే ఇంధనం నింపుకునే సౌకర్యంతోపాటు అధ్యక్షుడికి అవసరమైన మరెన్నో ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఇలా ఉండగా, అధ్యక్షుడు ట్రంప్ శనివారం బోయింగ్ 747–800 రకం కొత్త విమానాన్ని పరిశీలించారని వైట్ హౌస్ తెలిపింది. ఇందులో అత్యాధునిక హార్డ్వేర్, ఇతర సాంకేతిక ప్రత్యేకతలను ఆయన తెలుసుకున్నారు. అదేవిధంగా, పామ్బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కు చేసిన ఉన్న ఖతార్ రాజకుటుంబానికి చెందిన 15 ఏళ్లనాటి ప్రైవేట్ విమానం లోపల కూడా ఆయన తిరిగి చూశారని తెలిపింది. -
భారత్కు సాయం అనవసరం
వాషింగ్టన్: భారత్లో ఓటింగ్ను పెంచడానికంటూ అందిస్తూ వస్తున్న 2.1 కోట్ల డాలర్ల నిధిని రద్దు చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. భారత్కు అసలు ఇంతకాలంగా ఆ మొత్తం ఎందుకు ఇస్తూ వచ్చినట్టని ప్రశ్నించారు. విదేశాలకు సహాయ నిధులకు కోత పెడుతూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన అనంతరం మంగళవారం తన నివాసం మార్–ఎ–లాగోలో అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు. ‘‘భారత్ దగ్గర చాలా డబ్బుంది. అమెరికా నుంచి ప్రపంచంలోనే అత్యధికంగా పన్నులు విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. మాపై వాళ్ల టారిఫ్లు చాలా ఎక్కువ. అలాంటి దేశానికి 2.1 కోట్ల డాలర్లు ఎందుకిస్తున్నామో అర్థం కావడం లేదు!’’ అన్నారు. అయితే భారత్ పట్ల, ఆ దేశ ప్రధానిపై నాకెంతో గౌరవముందని చెప్పుకొచ్చారు. భారత్తో పాటు పలు దేశాలకు అందిస్తున్న మొత్తం 72.3 కోట్ల డాలర్ల సహాయ నిధులకు డోజ్ ఆదివారం మంగళం పాడటం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు, ఆర్థికవేత్త సంజీవ్ సన్యాల్ స్పందించారు. భారత్లో ఓటింగ్ శాతం మెరుగు పరిచేందుకు అమెరికా నుంచి 2.1 కోట్ల డాలర్లను ఇన్నేళ్లుగా ఎవరు అందుకుంటూ వచ్చారో తెలుసుకోవాలనుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. భారత్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అమెరికా నిధులు సమకూరుస్తోందన్న వార్తలను కేంద్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి ఎస్వై ఖురేషీ ఇప్పటికే ఖండించడం తెలిసిందే. 2012లో తాను సీఈసీగా ఉండగా ఈ మేరకు అమెరికా ఏజెన్సీ నుంచి ఎన్నికల సంఘం ఒప్పందం కుదుర్చుకున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు.‘స్పేస్’లో మస్క్ జోక్యముండదుఅంతరిక్ష సంబంధిత ప్రభుత్వ నిర్ణయాల్లో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ జోక్యం ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు. మస్క్ ప్రధానంగా డోజ్ ద్వారా ప్రభుత్వానికి ఖర్చులను తగ్గించే పనిమీద ఉంటారన్నారు. ‘‘ఆయనను మీరు ఉద్యోగి అని పిలవవచ్చు. కన్సల్టెంట్ అనొచ్చు. మీకు నచ్చినట్లుగా పిలవవచ్చు, కానీ ఆయన దేశభక్తుడు’’ అని చెప్పుకొచ్చారు. మస్క్ ప్రభుత్వోద్యోగి కాదని, ఆయనకు ఎలాంటి నిర్ణయాధికారాలూ లేవని వైట్హౌస్ సోమవారం పేర్కొనడం తెలిసిందే.టారిఫ్లపై తగ్గేదే లేదుపరస్పర టారిఫ్ల విషయంలో తగ్గేదే లేదని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ఈ విషయంలో తనతో ఎవరూ వాదించలేరని స్పష్టం చేశారు. ‘భారత్కు మినహాయింపు లేదు. మీరెంత విధిస్తే మేమూ అంతే విధిస్తా’మని ప్రధాని మోదీకి స్పష్టం చేశానని చెప్పారు. ప్రతి దేశానికీ ఇదే వర్తిస్తుందన్నారు. ఎలాన్ మస్క్తో కలిసి ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఆటోమొబైల్ వంటి రంగాల్లో అమెరికాపై భారత్ ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తోందని ట్రంప్ చెప్పగా అవునంటూ మస్క్ శ్రుతి కలిపారు.‘బైడెన్ అటార్నీ’లకు ఉద్వాసనమాజీ అధ్యక్షుడు జో బైడెన్ నియమించిన అటార్నీలందరినీ తొలగించాలని ట్రంప్ ఆదేశించారు. న్యాయశాఖను గత నాలుగేళ్లలో మునుపెన్నడూ లేనంతగా రాజకీయమయం చేశారంటూ ఆక్షేపించారు. అందుకే ఆ శాఖలో ‘బైడెన్ శకం’ ఆనవాళ్లను తొలగించాలని ఆదేశించినట్టు తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ‘‘నమ్మకాన్ని పునరుద్ధరించాలంటే ఇంటిని ప్రక్షాళన చేయాల్సిందే. స్వర్ణయుగపు అమెరికాలో నిష్పాక్షిక న్యాయ వ్యవస్థ ఉండాలి. ఈ రోజు నుంచే అది మొదలవుతుంది’’ అన్నారు. యూఎస్ అటార్నీలుగా పిలిచే ఫెడరల్ ప్రాసిక్యూటర్లను నామినేట్ చేయడం అధ్యక్షుడి బాధ్యత. అమెరికాలో ప్రస్తుతం 93 మంది అటార్నీలున్నారు. ప్రభుత్వ చట్టాల అమలు వీరి బాధ్యత. రిపబ్లికన్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి న్యాయ శాఖ తీవ్ర ప్రకంపనలకు గురవుతోంది. పలువురు ఉన్నతాధికారులను తొలగిస్తున్నారు.ఉక్రెయిన్లో సైనిక పాలనజెలెన్స్కీకి స్వదేశంలో ఆదరణ పూర్తిగా అడుగంటిందని ట్రంప్ అన్నారు. ‘‘జెలెన్స్కీ రేటింగ్స్ 4 శాతానికి పడిపోయాయి. ఆయ నకు ధైర్యముంటే తక్షణం ఎన్నికలకు వెళ్లాలి’’ అని సవాలు కూడా చేశారు. రష్యా కోరిక మేరకే ఇలా ఉక్రెయిన్లో ఎన్నికలకు డిమాండ్ చేస్తున్నానన్న ఆరోపణలను తోసిపుచ్చారు. ‘‘నాతో పాటు చాలా దేశాలు ఈ మేరకు డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఉక్రెయిన్ లో ఏళ్లుగా సైనిక పాలన నడుస్తోంది’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖర్లోగా పుతిన్తో తాను భేటీ అయ్యే అవకాశముందని ఈ సందర్భంగా ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్పై ట్రంప్ తాజా వ్యాఖ్యలను డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ పూర్తిగా సమర్థించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో స్పందించారు. ‘‘జెలెన్స్కీకి శాంతి ఇష్టం లేదు. ఆయనకు కావాల్సిందల్లా మరింత డబ్బు, అధికారం మాత్రమే’’ అంటూ ఆక్షేపించారు. -
నేడు యూరప్ అధినేతల అత్యవసర భేటీ!
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు ఇప్పటికే సంకేతాలిచ్చారు. చెప్పిన మాట వినకపోతే ఉక్రెయిన్కు ఆయుధ, ఆర్థిక సాయం నిలిపివేస్తామని హెచ్చరించారు. గతవారం రష్యా అధినేత పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. గంటకుపైగా సుదీర్ఘంగా చర్చించారు. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతిని నెలకొనాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్రంప్ స్పష్టంచేశారు. ట్రంప్ పోద్బలంతో ఉక్రెయిన్–రష్యా మధ్య జరిగే శాంతి చర్చల్లో యూరప్ భాగస్వామ్యం ఉండబోదని అమెరికా ప్రతినిధి కీథ్ కెల్లాగ్ తేలి్చచెప్పారు. ఈ పరిణామాలన్నీ యూరప్ దేశాలకు మింగుడుపడడం లేదు. విజేత ఎవరో తేలకుండానే యుద్ధం ముగించాలన్న ప్రతిపాదనను కొన్ని ఐరోపా దేశాలు పరోక్షంగా వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ తమను లెక్కచేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అంశంలో చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణపై చర్చించడానికి అత్యవసరంగా భేటీ కావాలని నిర్ణయించుకున్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో సోమవారం ఈ సమావేశం జరగబోతున్నట్లు తెలుస్తోంది. యూరప్ జాతీయ భద్రతకు ఈ భేటీ చాలా ముఖ్యమని యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ చెప్పారు. అమెరికా, యూరప్ మధ్య సంబంధాలు ఎప్పటిలాగే బలంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ దిశగా తమవంతు కృషి చేస్తున్నామని వెల్లడించారు. తమ కూటమిలో విభజనలను అంగీకరించబోమని పేర్కొన్నారు. ఉక్రెయిన్–రష్యా వ్యవహారంలో ఐరోపా దేశాలు ఒంటరవుతున్నాయని, అమెరికాకు దూరంగా జరుగుతున్నాయన్న వాదనను ఆయన ఖండించారు. మరోవైపు ఉక్రెయిన్కు మద్దతుగా నూతన చర్యలతో ముందుకు రాబోతున్నట్లు యూరోపియన్ యూనియన్(ఈయూ) ఫారిన్ పాలసీ చీఫ్ కాజా కెల్లాస్ ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. యూరప్ భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. అయితే, యూరప్ ఆదేశాల అధినేతల అత్యవసర భేటీని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ ఇంకా ధ్రువీకరించారు. ఆయన ప్రతినిధుల సైతం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, భేటీ కచ్చితంగా జరుగుతుందని యూరోపియన్ అధికారులు అంటున్నారు. -
కట్టుబడినందుకు కట్టడి చేశారు
అమెరికాలో దాదాపు వందకు పైగా సంచలనాత్మక కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీచేసిన డొనాల్డ్ ట్రంప్ అక్కడి అసోసియేటెడ్ ప్రెస్ వార్తాసంస్థపై కత్తిగట్టారు. అమెరికా తీరప్రాంతమైన ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మారుస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయినాసరే పాత పేరునే తమ రోజువారీ వార్తల్లో, కథనాల్లో వినియోగిస్తామని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) కరాఖండీగా చెప్పింది. దీంతో అధ్యక్షుడి నిర్ణయాన్నే బేఖాతరు చేస్తారా అన్న ఆగ్రహంతో ట్రంప్ పాలనాయంత్రాంగం శుక్రవారం నుంచి ఏపీ పాత్రికేయులకు అధ్యక్షభవనం, ఎయిర్ఫోర్స్ వన్ అధ్యక్ష విమానంలో రిపోర్టింగ్ కోసం అనుమతి నిరాకరించింది. అన్ని దేశాల్లో దినపత్రికలు, మేగజైన్లు, ఇతర వార్తాసంస్థలకు రోజువారీ వార్తలు, కథనాలు అందించే ప్రపంచంలో అతిపెద్ద న్యూస్ఏజెన్సీల్లో ఏపీ కూడా ఒకటి. ఇంతటి కీలకమైన బాధ్యతలు నిర్వర్తించే తమ ప్రతినిధులను అధ్యక్షభవనం వంటి ముఖ్యమైన చోటుకు రానివ్వకపోవడంపై ‘ఏపీ’తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇది వార్తాస్వేచ్ఛను అడ్డుకోవడమేనని వ్యాఖ్యానించింది. దీనిపై ట్రంప్ ప్రభుత్వం స్పందించింది. ‘‘అధ్యక్షుని నిర్ణయాన్ని బేఖాతరు చేయడమంటే వార్తల్లో విభజన తెచ్చే సాహసం చేయడమే. పైగా తప్పుడు విషయాన్ని అందరికీ చేరవేయడమే. అధ్యక్షుని నిర్ణయానికి గౌరవం ఇవ్వని వ్యక్తులకు వైట్హౌస్లో, ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో తగు స్థానం లేదు. ఆ స్థానాన్ని ఇన్నాళ్లూ వైట్హౌస్లోకి రాలేక రిపోర్టింగ్ చేయలేకపోయినా ఇతర మీడియా ప్రతినిధులకు కల్పిస్తాం’’అని వైట్హౌస్ డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ టేలర్ బుడోవిచ్ వాదించారు. దీనిపై ఏపీ మళ్లీ స్పందించింది. ‘‘అమెరికన్ వినియోగదారులను మినహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా వినియోగదారులకు ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’అనే పేరు వాస్తవం. ఆ దృక్కోణంలో పాత పేరుకే కట్టుబడి ఉన్నాం. ఈ విషయంలో అధ్యక్షుడు కార్యనిర్వాహక ఉత్తర్వును ధిక్కరించినట్లుగా భావించకూడదు’’అని ఏపీ స్పష్టంచేసింది. దశాబ్దాలుగా పూల్ రిపోర్టర్గా.. ప్రముఖ మీడియా సంస్థల కొద్దిపాటి మీడియా ప్రతినిధులు, కెమెరామెన్లకు మాత్రమే వైట్హౌస్, ఎయిర్ఫోర్స్ వన్ వంటి కీలక ప్రదేశాల్లోకి అనుమతిస్తారు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతోంది. నాటి అమెరికా అధ్యక్షుడు జేమ్స్ ఏ గార్ఫీల్డ్ హత్యోదంతం తర్వాత కొద్దిమంది మీడియా వాళ్లనే అనుమతించడం మొదలెట్టారు. ఇది 1881 ఏడాదినుంచి మొదలైంది. ఈ మీడియా బృంద సభ్యులను పూల్ రిపోర్టర్ అంటారు. ‘ఏపీ’ప్రతినిధి చాన్నాళ్లుగా ఇలా పూల్ రిపోర్టర్గా కొనసాగుతున్నారు. తమను లోపలికి అనుమతించకపోవడం పూర్తి వివక్షాపూరిత నిర్ణయం అని ఏపీ ప్రతినిధి ఒకరు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయాలని ‘ఏపీ’భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క ఏపీనే బయటకు గెంటేయడంపై వైట్హౌస్లోని ‘ది వైట్హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్(డబ్ల్యూహెచ్సీఏ)’తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘‘ప్రస్తుతానికైతే ఏపీకి బదులు రొటేషన్లో భాగంగా వేరే ప్రతినిధికి అవకాశం కల్పిస్తాం. సాధారణంగా ప్రతి రోజూ రొటేషన్లో ఏపీకి అవకాశం ఉంటుంది. కానీ ఇలా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. భావప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లజేస్తూ ప్రభుత్వం సెన్సార్షిప్కు తెరలేపుతోంది’’అని డబ్ల్యూహెచ్సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డాలర్తో గేమ్స్ ఆడితే 100% సుంకాలు!
వాషింగ్టన్: భారత్తో పాటు బ్రిక్స్ కూటమిలోని ఇతర సభ్య దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటు హెచ్చరికలు చేశారు. డాలర్తో ఆటలాడాలని చూస్తే వాటిపై వంద శాతం టారిఫ్ విధిస్తామని పునరుద్ఘాటించారు. డాలర్ను వేరే కరెన్సీతో భర్తీ చేయాలని చూస్తే బ్రిక్స్ దేశాలతో అమెరికా ఇకపై ఎలాంటి వర్తక లావాదేవీలూ జరపబోదని స్పష్టం చేశారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకి రెండు గంటల ముందే ట్రంప్ ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. తాను తొలిసారి 100 శాతం టారిఫ్ల హెచ్చరికలు చేసినప్పుడే బ్రిక్స్ మృతప్రాయ కూటమిగా మిగిలిపోయిందని చెప్పుకొచ్చారు! దాని ఏర్పాటులోనే దురుద్దేశం దాగుందని ట్రంప్ ఆరోపించారు. ‘‘బ్రిక్స్ కూటమి కొనసాగాలని దాని సభ్య దేశాలే కోరుకోవడం లేదు. బ్రిక్స్ గురించి మాట్లాడేందుకు కూడా భయపడుతున్నాయి’’అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే, ‘‘డాలర్తో గేమ్స్ ఆడొద్దు. అలా చేస్తే మీపై 100 శాతం టారిఫ్లు తప్పవు. అప్పుడు మీరే అలా చేయొద్దంటూ వేడుకుంటారు’’అని హెచ్చరించానన్నారు. బ్రిక్స్ కూటమిని రూపుమాపాలనుకుంటున్నారా, లేక అందులో భాగం కావాలని భావిస్తున్నారా అన్న విలేకరుల ప్రశ్నకు బదులుగా ట్రంప్ ఈ మేరకు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాని విషయంలో గత అధ్యక్షులు జో బైడెన్, బరాక్ ఒబామా ఇలా కఠినంగా వ్యవహరించలేకపోయారని ఆక్షేపించారు. బ్రిక్స్ కూటమిలో భారత్తో పాటు రష్యా, చైనా, బ్రెజిల్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండొనేసియా, ఇరాన్ సభ్య దేశాలు. బ్రిక్స్పై 100 శాతం టారిఫ్లు తప్పవని ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాకముందు నుంచీ హెచ్చరిస్తూ వస్తున్నారు. బ్రిక్స్ దేశాలు డాలర్కు బదులుగా తమ సొంత కరెన్సీల్లోనే లావాదేవీలు నెరపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2023లో బ్రిక్స్ శిఖరాగ్రంలో ప్రతిపాదించారు. మరుసటేడాది బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల భేటీ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చింది. -
మోదీకి స్పెషల్ గిఫ్ట్
ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అపూర్వ కానుకతో ఆశ్చర్యపరిచారు. ‘అవర్ జర్నీ టుగెదర్’ పేరుతో సంతకం చేసిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని గురువారం వైట్హౌస్లో భేటీ సందర్భంగా ఆయనకు అందజేశారు. దాని కవర్ ఫొటోలో ట్రంప్ ఎయిర్ఫోర్స్ వన్ నుంచి దిగుతూ అభివాదం చేస్తూ కన్పిస్తున్నారు. కానుకను మోదీకి అందిస్తూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్! మీరు గ్రేట్’ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. 320 పేజీల ఈ పుస్తకంలో ట్రంప్ తొలి పదవీకాలంలో 2016–2020 మధ్య ఇరు నేతలు పాల్గొన్న కీలక ఘట్టాలకు సంబంధించిన ఫొటోలున్నాయి. 2020లో ట్రంప్ భారత పర్యటన ‘హలో ట్రంప్’తో పాటు అంతకుముందు అమెరికాలో జరిగిన ‘హౌడీ మోదీ’ తదితర కార్యక్రమాల ఫొటోలను పొందుపరిచారు. భార్య మెలానియాతో కలిసి తాజ్మహల్ దగ్గర తీసుకున్న ట్రంప్ ఫొటో కూడా ఉంది. ఆయన పదవీకాలపు మధుర ఘట్టాలన్నింటినీ పొందుపరిచారు. సరిహద్దు గోడ నిర్మాణంలో ట్రంప్ చొరవ, స్పేస్ ఫోర్స్ ఏర్పాటు, జిన్పింగ్, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ వంటి దేశాధినేతలతో ఉన్నత స్థాయి భేటీల వంటి ఘటనలకు సంబంధించి ఎంపిక చేసిన ఫొటోలను పుస్తకాన్ని తయారు చేశారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన తనకు గొప్ప గౌరవ మని ట్రంప్ మీడియాతో అన్నారు. ‘‘చిరకాలంగా ఆయన నాకు మంచి మిత్రుడు. మా మధ్య అద్భుతమైన బంధముంది. నా నాలుగేళ్ల తొలి పదవీకాలంలో ఆ బంధాన్ని చక్కగా కొనసాగించాం’’ అన్నారు. మోదీ కూడా ట్రంప్ నాయ కత్వాన్ని ప్రశంసించారు. ‘‘నేనెంతో ఇష్టపడే నాయకుడు ట్రంప్. జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్య మివ్వడం ఆయన నుంచి నేర్చుకున్న ప్రధాన విషయం’’ అని చెప్పారు. -
ఆ విషయంలో మోదీనే గ్రేట్.. నేను పోటీ పడలేను: ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం, దేశాధినేతలిద్దరూ సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోదీ తన కంటే కఠినమైన సంధానకర్త అని ట్రంప్ చెప్పుకొచ్చారు.భారత ప్రధాని మోదీతో ట్రంప్ భేటీ అనంతరం విలేకరులు పలు ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో మీ ఇద్దరిలో ఎవరు మంచి సంధానకర్త అని ఓ విలేకరి ప్రశ్నించగా.. దీనికి ట్రంప్ సమాధానం ఇచ్చారు. ట్రంప్ స్పందిస్తూ.. మోదీ నా కంటే కఠినమైన సంధానకర్త. చర్చల్లో కఠినంగా వ్యవహరిస్తారు. ఆ విషయంలో మోదీతో నేను పోటీ పడలేను. మోదీనే గ్రేట్ అంటూ బదిలిచ్చారు. ట్రంప్ సమాధానంతో మోదీ సైతం ఆనందం వ్యక్తం చేశారు.మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇద్దరి మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు సాగాయి. ఇరు దేశాల పరస్పర వాణిజ్య, రక్షణబంధం బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు దేశాధినేతలు తెలిపారు. అమెరికా పర్యటనను ముగించుకొని ప్రధాని మోదీ కొన్ని గంటల క్రితమే భారత్కు తిరుగు పయనం అయ్యారు.#WATCH | Washington, DC: US President Donald Trump says, "He (PM Narendra Modi) is a much tougher negotiator than me and he is a much better negotiator than me. There is not even a contest."(Video: ANI/DD) pic.twitter.com/V8EzU0FfE9— ANI (@ANI) February 13, 2025మోదీకి ట్రంప్ బహుమతి..మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయనకు ట్రంప్ ఓ బహుమతి అందజేశారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చోటుచేసుకున్న కీలక సందర్భాలు, ప్రధాన ఈవెంట్లతో కూడిన ఫొటోబుక్ను ఇచ్చారు. ఇందులో ప్రధాని మోదీ 2019 నాటి అమెరికా పర్యటనలో నిర్వహించిన ‘హౌడీ మోదీ’, ఆ తర్వాత 2020లో ట్రంప్ భారత్కు విచ్చేసినప్పుడు ఏర్పాటుచేసిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకంపై ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, యూ ఆర్ గ్రేట్’ అని రాసి ట్రంప్ సంతకం చేశారు. అనంతరం పుస్తకంలోని పేజీలను తిప్పుతూ వీరిద్దరూ ఉన్న ఫొటోలను మోదీకి ఆయన చూపించారు. BIG NEWS 🚨 World's most powerful leader Donald Trump pulls chair for Indian PM Narendra Modi. Extraordinary Moment.US President Donald Trump gifts a signed copy of his book 'Our Journey Together' to PM Narendra Modi.The book features pictures from 'Howdy Modi', 'Namaste… pic.twitter.com/tMA3fHWFZ5— Times Algebra (@TimesAlgebraIND) February 14, 2025 President Trump gifts Prime Minister Modi his book, Our Journey Together, and shows the photo of his 2020 visit to the Taj Mahal 🇺🇸🇮🇳 pic.twitter.com/MYhPyX0LZD— Margo Martin (@MargoMartin47) February 13, 2025 US President Donald Trump gifted PM Narendra Modi the book ‘Our Journey Together’ when they met at the White House in Washington DC, on 13th February. Showed him several photos from 'Howdy Modi' and 'Namaste Trump' events, which are a part of the book pic.twitter.com/GgRy6C85NH— ANI (@ANI) February 14, 2025 Trump pulled a chair for PM Modi; it's a not an ordinary thing!!That's the Power of Bharat 🔥 pic.twitter.com/u4cG0SUdD7— BALA (@erbmjha) February 14, 2025 -
ట్రంప్ బృందంలో పాల్ కపూర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార బృందంలో మరో భారత సంతతి వ్యక్తికి చోటు లభించింది. అమెరికా దక్షిణాసియా వ్యవహారాల సహాయ కార్యదర్శిగా ఎస్.పాల్ కపూర్ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా సెనేట్ పరిశీలించి ధ్రువీకరిస్తే ప్రస్తుత సహాయ కార్యదర్శి అయిన డొనాల్డ్ లూ స్థానంలో పాల్కపూర్ బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత భారత్ సహా దక్షిణాసియా ప్రాంతంలో అమెరికా దౌత్య సంబంధాల్లో కపూర్ కీలక పాత్ర పోషించనున్నారు. కపూర్ ప్రస్తుతం నేవల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కూల్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. 2020 నుంచి 2021 వరకు స్టేట్ డిపార్ట్మెంట్ పాలసీ ప్లానింగ్ సిబ్బందిగా పనిచేశారు. దక్షిణ, మధ్య ఆసియా, ఇండో–పసిఫిక్ , అమెరికా–ఇండియా సంబంధాలకు సంబంధించిన సమస్యలపై పనిచేశారు. అంతకుముందు కపూర్ క్లేర్మోంట్ మెకెనా కళాశాలలో బోధించారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్గా సేవలందించారు. ఆయన ‘జిహాద్ యాజ్ గ్రాండ్ స్ట్రాటజీ: ఇస్లామిక్ మిలిటెన్సీ’, ‘నేషనల్ సెక్యూరిటీ అండ్ ది పాకిస్తానీ స్టేట్’, ‘దక్షిణాసియాలో సంఘర్షణ’తదితర పుస్తకాలు రచించారు. ‘ఇండియా, పాకిస్తాన్ అండ్ ది బాంబ్: డిబేటింగ్ న్యూక్లియర్ స్టెబిలిటీ ఇన్ సౌత్ ఏషియా’అనే పుస్తకానికి సహ రచయితగా వ్యవహరించారు. ‘ది ఛాలెంజెస్ ఆఫ్ న్యూక్లియర్ సెక్యూరిటీ: యూఎస్ అండ్ ఇండియన్ పర్సె్పక్టివ్స్’కు సహ సంపాదకత్వం వహించారు. -
సమానంగా వడ్డిస్తాం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం కీలక నిర్ణయం తీసుకొన్నారు. దిగుమతి సుంకాలకు సంబంధించి.. ఆయా దేశాలపై వారితో సమానంగా టారిఫ్లు విధించే ఉత్తర్వులపై సంతకం చేశారు. అమెరికా ఉత్పత్తులపై వివిధ దేశాలు ఎంతమొత్తంలో దిగుమతి సుంకాలు విధిస్తున్నాయో.. అంతే మొత్తంలో ఆయా దేశాల ఎగుమతులపై తాము దిగుమతి సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ నిర్ణయం.. అమెరికాతో అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్నే చూపనుంది. భారత్పైనా దీని ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశాలున్నాయి. ‘ఈ రోజు ఎంతో ముఖ్యమైనది. వారితో సమానంగా వడ్డించే సమయం వచ్చింది’ అని ట్రంప్ అంతకుముందు తన సొంత సోషల్మీడియా సంస్థ ‘ట్రూత్ సోషల్’లో గురువారం పేర్కొన్నారు. అమెరికాకు ఎగుమతులు చేసే దేశాలకు ట్రంప్ తాజా నిర్ణయం మింగుడుపడనిదే. భారీగా సుంకాలు విధిస్తే.. మార్కెట్లో ధరలు పెంచాల్సి ఉంటుంది. అప్పుడు ఇతర దేశాల ఉత్పత్తులతో పోటీపడే విషయంలో కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి. -
మస్క్... ట్రంప్కు కోటి డాలర్లు ఎందుకు ఇస్తానన్నాడు?
వాషింగ్టన్: అమెరికాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో ఎక్స్(ట్విట్టర్)పై ట్రంప్ దావా వేసిన కారణంగా తాజాగా ఎలాన్ మస్క్ ఆయనకు దాదాపు 10 మిలియన్ డాలర్లు చెల్లించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. 2021లో యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడి అనంతరం ట్రంప్ ఈ దావా వేశారు.వివరాల ప్రకారం.. 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ (Donald Trump) పరాజయం పాలయ్యారు. తర్వాత 2021 జనవరి 6న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ (Joe Biden) విజయాన్ని ధ్రువీకరించేందుకు వాషింగ్టన్ క్యాపిటల్ భవనంలో కాంగ్రెస్ సమావేశమైంది. అయితే ఆ సమావేశం జరగడానికి కొన్ని గంటల ముందు ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. అనంతరం ట్రంప్ మద్దతుదారులు వేలాదిగా క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, బైడెన్ విజయాన్ని ధ్రువీకరించకుండా కాంగ్రెస్ను ఆపేందుకే క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారని వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఆ ఛార్జ్షీట్లో ట్రంప్ పేరు కూడా ఉంది.ఈ నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్స్ను ఎక్స్(ట్విట్టర్), ఫేస్బుక్.. ట్రంప్ అకౌంట్స్ను సస్పెండ్ చేసింది. దీంతో, వారి చర్యలను ఆయా సంస్థలపై ట్రంప్ దావా వేశారు. ఈ దావాను పరిష్కరించుకునేందుకు 25 మిలియన్ డాలర్లు చెల్లిస్తామని గత నెలలో మెటా ప్రకటించింది. ఇక, తాజాగా మస్క్(Elon Musk) కూడా ట్రంప్కు 10 మిలియన్ డాలర్లు చెల్లించడానికి సిద్ధమైనట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్పుకొచ్చింది.*Elon Musk’s company X settles Trump lawsuit over account suspension*• Social media company X has agreed to pay about $10 million to settle a lawsuit by President Donald Trump, The Wall Street Journal reported.• Elon Musk, X’s billionaire owner, is overseeing DOGE, pic.twitter.com/nw7n2HbUwF— AS ♠️🍌✡︎🪬חי🎗️🤟🫶🧡👑❰̶̶͟͞🍓꙰꙰❱̶𖠧̙̞͢▹͍►͍👑 (@AdelBadel7) February 13, 2025ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. యూఎస్ క్యాపిటల్పై దాడి చేసిన తన మద్దతుదారులకు ఉపశమనం కల్పించారు. ఈమేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. ఈ ఘటనలో దాదాపు 1500 మందికి ట్రంప్ క్షమాభిక్ష కల్పించారు. వారిపై పెండింగ్లో ఉన్న కేసులు కొట్టివేయాలని అటార్నీ జర్నల్కు ఆదేశాలు జారీ చేశారు. -
పాలస్తీనియన్లకు ఆశ్రయం కోసం జోర్డాన్పై ట్రంప్ ఒత్తిడి
వాషింగ్టన్: గాజా స్ట్రిప్ స్వాదీనం ప్రణాళికలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరింత వేగవంతం చేశారు. గాజా స్ట్రిప్ నుంచి పంపేయడంతో శాశ్వతంగా నిర్వాసితులయ్యే పాలస్తీనియన్లకు మీ దేశంలో ఆశ్రయం కల్పించాలని జోర్డాన్ రాజు అబ్దుల్లాపై ట్రంప్ ఒత్తిడి పెంచారు. మంగళవారం శ్వేతసౌధంలో అబ్దుల్లాతో ట్రంప్ సమావేశమై ఈ అంశంపై చర్చించారు. నివాసితు లను తరలించడంతోపాటు యుద్ధంతో దెబ్బతిన్న గాజాను పశ్చిమాసియాలో అత్యద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మార్చాలన్న తన ఆలోచనను వదలుకోబోనని ట్రంప్ సంకేతం ఇచ్చారు. గాజాను కొనడం లేదని, ఏకంగా స్వా«దీనం చేసుకుంటున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. ‘‘గాజా స్ట్రిప్ను తీసుకుంటాం. పశి్చమాసియాలో ప్రజలకు చాలా ఉద్యోగాలు కల్పించబోతున్నాం’’అని ట్రంప్ పేర్కొన్నారు. గాజా నిర్వాసితులకు ఆశ్రయం కల్పించడానికి జోర్డాన్, ఈజిప్ట్ లు అంగీకరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘జోర్డాన్లో మాకు కొంత భూమి ఉంటుందని నేను నమ్ముతున్నాను. చర్చలు పూర్తయిన అనంతరం పాలస్తీనియన్లు సంతోషంగా, సురక్షితంగా జీవించడానికి చోటు లభిస్తుందని అనుకుంటున్నా’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆర్థిక, సైనిక సహాయం కోసం అమెరికాపై జోర్డాన్, ఈజిప్ట్ ఆధారపడటమే ట్రంప్ అంత బలంగా చెప్పడానికి కారణం. అయితే... జోర్డాన్కు సహాయాన్ని నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామన్న ట్రంప్ అన్నారు. మద్దతు ఇస్తున్నామన్న వంకతో ఈ దేశాలను బెదిరించాలని భావించట్లేమని చెప్పారు. ‘‘మేము జోర్డాన్కు, ఈజిప్టుకు సహాయాన్ని అందిస్తాం. ఆ సాకుతో బెదిరించాల్సిన అవసరం లేదు. మేం అలాంటి భావజాలానికి అతీతులం అనే అనుకుంటున్నాం’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే పాలస్తీనియన్లను తమ భూభాగంలోకి తరలించే ప్రక్రియకు రాజు అబ్దుల్లా సుముఖంగా ఉన్నట్లు కనిపించలేదు. ట్రంప్ ప్రణాళికను సమరి్థంచకుండా, వ్యతిరేకించకుండా అసౌకర్యంగా కనిపించారు. తన దేశానికి ఏది మంచిదో అది చేస్తానని అబ్దుల్లా అన్నారు. గాజాలో అనారోగ్యంతో బాధపడుతున్న 2,000 మంది చిన్నారులను మాత్రం చికిత్సచేయించేందుకు జోర్డాన్కు తీసుకెళ్తామని రాజు చెప్పారు. రాజు నిర్ణయంపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. పాలస్తీనియన్లను నిర్వాసితులను చేసే ప్రయత్నాలను తాను వ్యతిరేకినని రాజు అబ్దుల్లా గతంలోనూ వ్యాఖ్యానించారు. ‘‘ఇది ఏకీకృత అరబ్ వైఖరి’’అని తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ‘‘పాలస్తీనియన్లను ఇంకెక్కడికీ పంపేయకుండానే గాజా స్ట్రిప్ను పునర్ నిర్మించాలి. అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలి’’అని ఆయన అన్నారు. గాజా అంశంలో అమెరికా కొత్త అధ్యక్షుడు తన ప్రణాళికలను వెల్లడించాక అగ్రరాజ్య అధ్యక్షుడితో భేటీ అయిన తొలి అరబ్ నేత అబ్దుల్లా కావడం గమనార్హం. ఇరువురు నాయకులు ఇతరత్రా అంశాల్లో ఒకరికొకరు స్నేహపూర్వకంగా మెలిగారు. అయితే గాజా గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజు అబ్దుల్లాను ఇబ్బందికర స్థితిలోకి నెట్టాయి. డోలాయమానంలో కాల్పుల విరమణ ట్రంప్ గాజా ప్రతిపాదన ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపులో కొత్త సమస్యను తీసుకొచ్చింది. గాజాపై దాడులను నిలిపివేసే ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందని, తదుపరి నోటీసు వచ్చే వరకు బందీలను విడుదల చేయడం నిలిపివేస్తున్నట్లు హమాస్ సోమవారం తెలిపింది. బందీలందరినీ శనివారం మధ్యాహ్నంలోగా విడుదల చేయకపోతే మీ అంతు చూస్తానని ఇప్పటికే ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హమాస్ ఏ విధంగా స్పందిస్తుంది, దానికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన ఎలా ఉంటుంది?. అప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం భవిష్యత్తు ఏమిటనే అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి. సర్వత్రా వ్యతిరేకత గాజా స్వా«దీనం, పాలస్తీనియన్లను తిరిగి గాజాకు అనుమతించబోమంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై అరబ్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గాజాను స్వా«దీనం చేసుకుంటామన్న ట్రంప్ వ్యాఖ్యలపై స్పందన కోరుతూ ఫిబ్రవరి 7 నుంచి 9 తేదీలలో రాయిటర్స్/ఇప్సోస్ అమెరికాలో ఒక సర్వే నిర్వహించింది. గాజాను అమెరికా స్వా«దీనం చేసుకుని అక్కడ నివసిస్తున్న పాలస్తీనియన్లను తరలించే ఆలోచనను తాము వ్యతిరేకిస్తున్నామని ప్రతి నలుగురు అమెరికన్లలో ముగ్గురు చెప్పారు. అంటే.. 74 శాతం మంది అమెరికన్ల అభిప్రాయం ఇదే. ఈ అంశంపై రిపబ్లికన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. గాజా స్వా«దీన ప్రకటనను 55 శాతం మంది రిపబ్లికన్లు వ్యతిరేకించారు. 43 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. -
ట్రంప్ ‘ఉక్కు’ పాదం..!
న్యూఢిల్లీ: అన్ని రకాల ఉక్కు, అల్యుమినియం దిగుమతులపై పాతిక శాతం టారిఫ్లు వడ్డించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచన భారత పరిశ్రమలను కలవరపరుస్తోంది. దీనితో బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం భారత్ ఉక్కు ఎగుమతుల్లో అమెరికా వాటా సుమారు అయిదు శాతం లోపు ఉంటోంది. అయినప్పటికీ భారతీయ ఉక్కు ఎగుమతిదార్లు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో కొంత సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని మూడీస్ రేటింగ్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ హుయ్ తింగ్ సిమ్ తెలిపారు. అమెరికా టారిఫ్ల దెబ్బతో మిగతా దేశాల్లో సరఫరా పెరిగిపోయి, భారత్ ఎగుమతులకు ప్రతికూలం కావచ్చని పేర్కొన్నారు. గత పన్నెండు నెలలుగా భారీ స్థాయిలో ఉక్కు దిగుమతులతో ధరలు, ఆదాయాలు పడిపోయి దేశీ ఉత్పత్తి సంస్థలు ఇప్పటికే సతమతమవుతున్నట్లు వివరించారు. ఇదే సమయంలో టారిఫ్ల వల్ల అమెరికాలోని ఉక్కు ఉత్పత్తి సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని సిమ్ చెప్పారు. అక్కడ దేశీయంగా ఉక్కుకు డిమాండ్ పెరిగి, ధరలూ పెంచుకునే అవకాశం లభిస్తుందన్నారు. సుంకాల విధింపుతో అమెరికాకు ఉక్కు ఎగుమతులు 85 శాతం మేర తగ్గిపోవచ్చని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ (ఐఎస్ఏ) ప్రెసిడెంట్ నవీన్ జిందాల్ తెలిపారు. ఇలా మిగిలిపోయేదంతా, ప్రస్తుతం వాణిజ్యపరమైన ఆంక్షలు లేని అతి పెద్ద మార్కెట్లలో ఒకటైన భారత మార్కెట్లోకి వెల్లువెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, అల్యూమినియం పరిశ్రమపై ప్రభావం గట్టిగా పడొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే భారత అల్యుమినియం ఎగుమతుల్లో అమెరికా వాటా దాదాపు 12 శాతం ఉంటుంది. గతేడాది నవంబర్ నాటికి 777 మిలియన్ డాలర్ల అల్యూమినియం ఎగుమతులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఉక్కు పరిశ్రమతో పోలిస్తే అల్యుమినియం రంగంపై టారిఫ్ల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్తో నిర్వహించబోయే సమావేశంలో టారిఫ్ల అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2018 వ్యూహం.. ట్రంప్ 2018 వ్యూహాన్నే మళ్లీ అమలు చేస్తే వాణిజ్యానికి సంబంధించి బేరసారాలు ఆడేందుకు దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ చెప్పారు. 2018లోనూ ట్రంప్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నా, అప్పట్లో మిగతా దేశాలతో పోలిస్తే భారత్పై పెద్దగా ప్రభావం పడలేదు. ప్రతిగా 2019లో 28 అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై భారత్ కూడా అదనపు సుంకాలు విధించింది. 2023లో భారత్ నుంచి ఉక్కు, అల్యుమినియం దిగుమతులపై అమెరికా టారిఫ్లు తొలగించింది. తాజాగా టారిఫ్ల పెంపు అనేది అమెరికాకు అత్యధికంగా ఎగుమతి చేసే జపాన్, యూరప్ దేశాలు, కెనడా, మెక్సికోపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ సరఫరా పెరిగిపోయి, ధరలు పడిపోవడం వల్ల భారత్కి కూడా కాస్త ప్రతికూలంగానే ఉండొచ్చని విశ్లేషకులు తెలిపారు. ఆందోళన చెందనక్కర్లేదు: ఉక్కు శాఖఅమెరికాకు భారత్ ఉక్కు ఎగుమతులు అంతగా లేవు కాబట్టి టారిఫ్ల గురించి దేశీ పరిశ్రమ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ తెలిపారు. ‘గతేడాది మనం 14.5 కోట్ల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తే అందులో అమెరికాకు ఎగుమతి చేసింది చాలా తక్కువే. కాబట్టి, టారిఫ్ల పెంపు పెద్ద సమస్య కాబోదు‘ అని ఆయన చెప్పారు. దేశీయంగా ఉక్కు వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో డిమాండ్కి తగ్గట్లుగా పరిశ్రమ సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చని వివరించారు. -
వేధిస్తాడు.. మొరటోడు
వాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా విధానాలను ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె తీవ్రంగా తప్పుబట్టారు. ఇటీవల స్పెయిన్లో ‘గోయా’అవార్డ్ల ప్రదానోత్సవంలో రిచర్డ్కు జీవితకాల సాఫల్యత పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా రిచర్డ్ మాట్లాడుతూ ట్రంప్ విధాన నిర్ణయాలు, ట్రంప్ చుట్టూ ఉన్న నేతాగణాన్ని ప్రస్తావించారు. గిరిజనులు అడవుల్లో గిరిజనేతరుల ఆధిపత్యాన్ని కోరుకోరు అనే అర్థంలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడో అనాలోచిత ట్రైబలిజం అమెరికాలో మొదలవుతోంది. ఇతరులతో పోలిస్తే మేం ప్రత్యేకం అన్న ధోరణి పెరుగుతోంది. అలాంటి ఆలోచనలను తుంచేయాల్సిన ప్రజాప్రతినిధులే ఈ ఆలోచనలకు అంటుకట్టడం విషాదకరం. ఇప్పుడు అమెరికాలో చీకటిరోజులు మొదలయ్యాయి. అందర్నీ అవహేళన చేస్తూ వేధించే మొరటు మనిషి ట్రంప్ ఏలుబడిలో ఉన్నాం. ఈయన విషయంలో ఒక్క అమెరికాలో మాత్రమే కాదు యావత్ ప్రపంచదేశాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన తరుణమిది. అధికారం, పెట్టుబడిదారుల సంకర వివాహమిది. బాధ్యతారాహిత్యంతో ప్రభుత్వ ఖజానానే దోచేసే బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నులు కొలువైన ప్రభుత్వమిది. ఇది మానవళికే ప్రమాదకరం. ఇతరుల పట్ల దయ లేని పరిణతి సాధించని సంపన్న మూకలు ట్రంప్ చుట్టూ చేరారు. ఇలాంటి వ్యక్తుల కలయిక ఎంతో వినాశకరం’’అని రిచర్డ్ ఆందోళన వ్యక్తంచేశారు. అమెరికాలో ఉండే రిచర్డ్ ఇటీవలే తన భార్య అలెజాండ్రా సిల్వాతో కలిసి స్పెయిన్కు మకాం మార్చారు. -
ప్రెసిడెంట్ ఎలాన్ మస్క్!
వాషింగ్టన్: చరిత్రాత్మక కవర్ పేజీలకు పెట్టింది పేరైన టైమ్ మేగజైన్ ‘ప్రెసిడెంట్ ఎలాన్ మస్క్’ అంటూ తాజాగా వ్యంగాత్మక కవర్ పేజీ కథనం ప్రచురించింది. అందులో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ వైట్హౌస్లోని ఓవల్ కార్యాలయంలోని ప్రెసిడెంట్ స్థానంలో కూర్చుని కని్పస్తున్నారు. ఎరుపు బ్యాక్గ్రౌండ్ ముఖచిత్రంలో చేతిలో కాఫీ కప్పు పట్టుకొని ఉన్నారు. జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఫెడరల్ ప్రభుత్వాన్ని సమూలంగా మార్చేందుకు మస్క్ ప్రయతి్నస్తుండటం తెలిసిందే. ఆ క్రమంలో ఆయనే అధ్యక్షుడిలా వ్యవహరిస్తున్నానే అర్థంలో టైమ్ ఇలా కవర్ పేజీని డిజైన్ చేసింది. అధ్యక్ష సింహాసనం వెనుక ఉన్న అసలైన శక్తి మస్కేనని పరోక్షంగా చెప్పుకొచ్చింది. కవర్ స్టోరీలోనూ ఈ అంశాన్ని గట్టిగానే ఎండగట్టింది. లక్షలాది మంది ప్రభుత్వోద్యోగులు మస్క్ దయపై ఆధారపడి బతకాల్సి వస్తోందని పేర్కొంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న స్పృహ ఆయనలో కన్పించడం లేదని ఆక్షేపించింది. ‘డోజ్ పనితీరుపై మా పత్రిక వైట్హౌస్కు కొన్ని ప్రశ్నలు పంపింది. కానీ వాటికి బదులివ్వడానికి వైట్హౌస్ నిరాకరిచింది’’ అని కథనంలోనే పేర్కొంది. మస్క్ టైమ్ మేగజైన్పై కనిపించడం ఇది రెండోసారి. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయనను ‘కింగ్ మేకర్’గా అభిర్ణిణస్తూ ఇటీవలే మేగజైన్ ఓ ఫీచర్ రాసింది. టైమ్ తాజా కవర్ పేజీ ఉదంతంపై ట్రంప్ను ప్రశ్నించగా, ‘ఆ మేగజైన్ ఇంకా నడుస్తోందా? నాకు తెలియదు’ అంటూ అంతే వ్యంగ్యంగా స్పందించారు. -
మరో ట్రంప్ ఉత్తర్వుకు చుక్కెదురు
వాషింగ్టన్: అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ డజన్లకొద్దీ కార్యనిర్వాహక ఉత్తర్వులిస్తూ అన్ని దేశాలను కలవరపరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మరో న్యాయస్థానం మొట్టికాయ వేసింది. వలస వచ్చిన వాళ్లకు పిల్లలు పుడితే వారికి దక్కే జన్మతః పౌరసత్వ హోదాను రద్దుచేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇచ్చిన ట్రంప్ను ఇప్పుడు అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్ఎయిడ్) ఉద్యోగుల విషయంలోనూ మరో కోర్టు కట్టడిచేసింది. వేలాది మంది యూఎస్ఎయిడ్ ఉద్యోగులను ఉద్యోగాలు మానేసి 30 రోజుల్లోపు స్వదేశానికి తిరిగొచ్చేయాలని ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను వారం రోజులపాటు నిలుపుదల చేస్తున్నట్లు యూఎస్ డిస్ట్రిక్ కోర్ట్ జడ్జి కార్ల్ నిఖోల్స్ శుక్రవారం రాత్రి మధ్యంతర తీర్పు వెలువరిచారు. యూఎస్ఎయిడ్ను శాశ్వతంగా మూసేస్తానంటూ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ పెట్టిన కొన్ని గంటలకే ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా తాత్కాలిక తీర్పు వెలువడటం విశేషం. విదేశాల్లో యూఎస్ఎయిడ్ ఉద్యోగులు, వారి జీవితభాగస్వాములు, చదువుకుంటున్న వారి పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైన వేళ కోర్టు ఉత్తర్వులతో తాజాగా వారికి భారీ ఊరట లభించింది. అయితే ఈ విభాగానికి నిధులు ఆపేయాలంటూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేయాలంటూ ది అమెరికన్ ఫారెన్ సర్విస్ అసోసియేషన్, ది అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంస్థలు చేసిన విజ్ఞప్తిని జడ్జి తిరస్కరించారు. ట్రంప్ ప్రభుత్వం ఆదేశించడంతో యూఎస్ఎయిడ్లో ఇప్పటికే 500 మంది ఉద్యోగులు సెలవులపై వెళ్లగా మరో 2,200 మంది శనివారమే సెలవుపై వెళ్లాల్సి ఉంది. యూఎస్ఎయిడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో సహాయక, అభివృద్ధి, దాతృత్వకార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రతి ఏటా వందల కోట్ల బడ్జెట్ను కేటాయిస్తున్నారు. 2016 గణాంకాల ప్రకారం యూఎస్ఎయిడ్ ప్రభుత్వ విభాగంలో 10,235 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో మూడింట రెండొంతుల మంది విదేశాల్లో పనిచేస్తున్నారు. విదేశాలకు అపరిమిత సాయం అమెరికాకు గుదిబండగా మారిందని, ఉద్యోగుల్లో 90 శాతం మంది తీసేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగానే దశలవారీగా చాలా మంది సెలవుల మీదకు స్వదేశానికి తిరిగొచ్చేయాలని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది. శాశ్వతంగా తిరిగొస్తున్నందున ప్రయాణఖర్చులు కూడా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే విధులు నిర్వర్తిస్తున్న దేశంలోనే ఈ సిబ్బంది పిల్లలు చదువుకుంటున్నారు. -
గాజాపై ట్రంప్ కన్ను
వాషింగ్టన్: సంచలనాల ట్రంప్ మరో అంతర్జాతీయ సమాజంపై మరో బాంబు విసిరారు. గాజాను అమెరికా పూర్తిగా స్వా«దీనం చేసుకుంటుందని ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్తో యుద్ధంలో శ్మశానసదృశంగా మారిన గాజాను అత్యంత సుందర పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. ఆర్థికాభివృద్ధి కార్యకలాపాలు చేపడతాం. భారీగా ఆవాస, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’’ అని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. గాజాలో ఉంటున్న దాదాపు 20 లక్షల మంది పాలస్తీనావాసులు ఆ ప్రాంతాన్ని వీడాల్సిందేనని స్పష్టం చేశారు. వారిని గాజా నుంచి శాశ్వతంగా తరలించి పునరావాసం కల్పిస్తామన్నారు. అయితే, పశ్చిమాసియాలోని పొరుగు దేశాలే వారిని అక్కున చేర్చుకోవాలని తేల్చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సమక్షంలోనే ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేయడం విశేషం. పాలస్తీనావాసులను గాజా నుంచి తరలించేందుకు, ఆ ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకునేందుకు అమెరికాకు ఏం అధికారముందని ప్రశ్నించగా తన చర్య గాజా, ఇజ్రాయెల్తో పాటు పశ్చిమాసియా అంతటికీ గొప్ప స్థిరత్వాన్ని తెస్తుందని ఆయన బదులిచ్చారు. గాజా స్వా«దీనానికి సైన్యాన్ని రంగంలోకి దించుతారా అని ప్రశ్నించగా, అన్ని అవకాశాలనూ పరిశీలిస్తామని బదులిచ్చారు. ఈ సందర్భంగా నెతన్యాహూ పదేపదే చిరునవ్వులు చిందిస్తూ కన్పించారు. ట్రంప్ ప్రకటనకు పూర్తి మద్దతు తెలిపారు. ‘‘ఈ నిర్ణయం చరిత్రను మార్చేస్తుంది. గాజాకు అద్భుతమైన భవిష్యత్తు అందిస్తుంది. ఇజ్రాయెల్కు ముప్పును శాశ్వతంగా తొలగిస్తుంది’’ అని ప్రకటించారు. ట్రంప్ ప్రకటన అంతర్జాతీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. పశ్చిమాసియా భౌగోళిక, రాజకీయ పరిస్థితులను అల్లకల్లోలం చేసేలా కనిపిస్తున్న ఈ ప్రతిపాదనను అక్కడి దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. పాలస్తీనా, సౌదీ అరేబియా, ఈజిప్్ట, తుర్కియేతో పాటు చైనా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ కూడా దీన్ని ఖండించాయి. అమెరికాలో విపక్ష నేతలు కూడా ట్రంప్ ప్రకటనను దుయ్యబడుతున్నారు. గాజావాసులకు తమ దేశంలో ఆశ్రయం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదనను ఈజిప్్ట, జోర్డాన్, తుర్కియే తదితర అమెరికా మిత్ర దేశాలన్నీ ఇప్పటికే ముక్త కంఠంతో తిరస్కరించడం తెలిసిందే. గ్రీన్లాండ్ను, పనామా కాల్వను స్వా«దీనం చేసుకుంటానని, కెనడాను అమెరికాలో కలిపేస్తానని ట్రంప్ ఇప్పటికే పలు వివాదాస్పద ప్రకటనలు చేశారు. అంతర్జాతీయ ప్రాంతంగా గాజా అమెరికా పర్యటనలో ఉన్న నెతన్యాహూతో ట్రంప్ మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ఆకస్మికంగా గాజా స్వా«దీన ప్రకటన చేశారు. దీన్ని పశ్చిమాసియా గర్వించదగ్గ విషయంగా అభివరి్ణంచారు. ‘‘పశ్చిమాసియా నమ్మశక్యం కానంత గొప్ప ప్రదేశం. అద్భుతమైన తీర ప్రాంతం. గొప్ప వ్యక్తులతో నిండిన అందమైన ప్రదేశాల్లో ఒకటి. గాజాలో త్వరలో పర్యటిస్తా. ఇజ్రాయెల్ అంటే నాకిష్టం. అక్కడ, సౌదీ అరేబియాలో, పశ్చిమాసియా అంతటా పర్యటిస్తా. గాజాలో ఇప్పుడేమీ మిగల్లేదు. ఆ ప్రాంతమంతా మృత్యువుకు, విధ్వంసానికి చిరునామాగా, నరకకూపంగా మారింది. ప్రతి భవనమూ నేలమట్టమైంది. చిరకాలంగా శప్తభూమిగా ఉన్న గాజాను పూర్తిగా పునరి్నరి్మస్తాం. పేలని బాంబులు, ఆయుధాలను తొలగిస్తాం. ధ్వంసమైన భవనాలను తొలగించి ఆ ప్రాంతాన్నంతా చదును చేస్తాం. అక్కడ అపరిమితమైన ఉద్యోగాలందించేలా అద్భుతమైన ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తాం. గాజావాసుల జీవన స్థితిగతులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. ఏ ఒక్క సమూహానికో కాకుండా అందరికీ అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పాలస్తీనావాసులతో పాటు ప్రపంచం నలుమూలలకు చెందిన ప్రజలు అక్కడ నివసిస్తారు. లేదంటే ఆ ప్రాంతం వందల ఏళ్లుగా ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఏదైనా డిఫరెంట్గా చేయాలి. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అది పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఏదైనా అద్భుతం చేయడానికి మాకు అవకాశముంది’’ అని చెప్పుకొచ్చారు. ‘‘ఇదేమీ అల్లాటప్పగా తీసుకున్న నిర్ణయం కాదు. దీనిపై చాలా ప్రముఖులు, ముఖ్యులతో లోతుగా చర్చించా. వారంతా నా ప్రతిపాదనను అమితంగా ఇష్టపడ్డారు. గాజాను సొంతం చేసుకుని అభివృద్ధి చేసి అపారమైన ఉపాధి అవకాశాలు సృష్టించాలన్న అమెరికా ఆలోచనలను ఇష్టపడుతున్నారు’’ అని చెప్పారు. ‘‘గాజాలో దశాబ్దాలుగా మరణమృదంగం కొనసాగుతోంది. చంపుకోవడాలు లేకుండా ఆనందంగా ఉండగలిగే అందమైన ప్రదేశంలో వారికి శాశ్వతంగా పునరావాసం కల్పించగలిగితే చాలు. మరో దారి లేకే వారు గాజాకు తిరిగి వెళ్తున్నారు. ఎప్పుడు కూలతాయో తెలియని పై కప్పుల కింద బతుకీడుస్తున్నారు. దానికి బదులుగా అందమైన ఇళ్లలో సురక్షితంగా, స్వేచ్ఛగా, శాంతియుతంగా జీవించే అవకాశం వారి ముందుంది. ఆ మేరకు చక్కని పునరావాసం పొందగలరని, ఇప్పుడు వద్దంటున్న దేశాల్లోనే వారికి ఆ సదుపాయం ఏర్పాటు చేయగలనని నమ్ముతున్నా’’ అని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనుసరించదగ్గ మార్గం ఇదేనని నెతన్యాహూ అభిప్రాయపడ్డారు. ‘‘హమాస్ను నిర్మూలించాలన్న మా లక్ష్యాలను సాధించడానికి ట్రంప్ కొత్త ఆలోచనలతో ముందుకొచ్చారు. ఇది యూదు జాతికి సాయపడుతుంది’’ అని చెప్పారు. ‘‘ఉగ్రవాదానికి కేంద్రబిందువుగా ఉన్న గాజాకు భిన్నమైన భవిష్యత్తును ట్రంప్ కాంక్షిస్తున్నారు. హంతక సంస్థ (హమాస్)ను నిర్మూలిస్తే అక్కడ శాంతి సాధ్యమే’’ అన్నారు. హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందో లేదో చెప్పలేనన్నారు. బైడెన్ ప్రభుత్వం తమకు పెద్దగా సాయం చేయలేదని నెతన్యాహూ ఆక్షేపించారు. గాజాను వీడబోం: స్థానికులు ట్రంప్ ప్రతిపాదనపై గాజా పౌరులు మండిపడుతున్నారు. ‘‘ఇన్నాళ్లకు కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత సొంత గూటికి తిరిగి వెళ్తున్నాం. మా ఇళ్లను విడిచిపెట్టబోం. గౌరవప్రదమైన జీవితం కోరుకుంటున్నాం. మా నేతలను వీడాలనుకోవడం లేదు’’ అని చెబుతున్నారు. ట్రంప్ ప్రతిపాదన గాజాతో పాటు పరిసర దేశాల్లో మరింత విధ్వంసానికి, ఘర్షణకు కారణమవుతుందని వారంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయకుండా ఇజ్రాయెల్తో ఎలాంటి సంబంధాలను కొనసాగించబోమని స్పష్టం చేసింది. గాజన్లు తమ ఇళ్లకు తిరిగి వచ్చి పునరి్నరి్మంచాలని కోరుకుంటున్నారని ఐరాసలో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ అన్నారు. వారి ఆకాంక్షలను గౌరవించాలన్నారు. ట్రంప్ది హాస్యాస్పద, అసంబద్ధ ప్రకటన అని హమాస్ దుయ్యబట్టింది. ‘‘ఈ తరహా ఆలోచనలు పశ్చిమాసియాలో మరిన్ని ఘర్షణలకు దారితీస్తాయి. గాజావాసులకు సమీప దేశాల్లో పునరావాసం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదన మరింత గందరగోళం, ఉద్రిక్తతలకు కారణమవుతుంది. గాజావాసులు దీనికి ఒప్పుకోరు’’ అని హమాస్ అధికారి సమీ అబు స్పష్టం చేశారు.అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగాట్రంప్ గాజా ప్రణాళిక గాజాను పునరి్నర్మించాలంటూ పది రోజుల క్రితమే పిలుపునిచ్చిన ట్రంప్ ఆ విషయమై ఎంత సీరియస్గా ఉన్నారో తాజా ప్రకటనతో ప్రపంచానికి తెలిసొచి్చంది. కానీ అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా విరుద్ధమైన ఆయన గాజా ప్రణాళిక పశ్చిమాసియాను అతలాకుతలం చేయడమే గాక ప్రపంచ శాంతికి గొడ్డలిపెట్టుగా మారేలా కనిపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం, ఇజ్రాయెల్–హమాస్ పరస్పర బందీల విడుదల ప్రక్రియపైనా ప్రభావం చూపేలా ఉంది. ఒక దేశ జనాభాను బలవంతంగా నిరాశ్రయులను చేయడం అంతర్జాతీయ చట్టం ప్రకారం నిషేధం. ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనియన్లను తరిమేసి గాజాను యూదు స్థావరంగా మార్చుకోవాలని ఆశపడుతోంది. ట్రంప్ ప్రకటన కార్యరూపం దాలిస్తే 20 లక్షల మంది పాలస్తీనావాసులు శాశ్వత శరణార్థులుగా మారిపోతారు. -
మార్కెట్కు ట్రంప్ సుంకాల పోటు
ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో, చైనాలపై దిగుమతి సుంకాలు పెంచుతూ ఆదేశాలు జారీ చేయడంతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ అరశాతం నష్టపోయింది. దేశీయ కరెన్సీ రూపాయి భారీ కోత, అధిక వెయిటేజీ రిలయన్స్ (–1.50%), ఎల్అండ్టీ (–4.50%) క్షీణతలూ ప్రతికూల ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 319 పాయింట్లు నష్టపోయి 77,186 వద్ద నిలిచింది. దీంతో ఈ సూచీ 5 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడినట్లైంది. నిఫ్టీ 121 పాయింట్లు క్షీణించి 23,361 వద్ద నిలిచింది. వాణిజ్య యుద్ధ భయాలతో ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే నష్టాల్లో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 750 పాయింట్లు క్షీణించి 76,756 వద్ద, నిఫ్టీ 260 పాయింట్లు కుప్పకూలి 23,222 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. అయితే మిడ్ సెషన్ నుంచి కన్జూమర్ డ్యూరబుల్, ఐటీ, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సూచీలు కొంతమేర నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. → క్యాపిటల్ గూడ్స్, ఇండ్రస్టియల్స్, విద్యుత్, యుటిలిటీస్, ఆయిల్అండ్గ్యాస్, మెటల్ షేర్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్ సూచీ 2%, మిడ్క్యాప్ ఇండెక్స్ ఒకశాతం చొప్పున నష్టపోయాయి. → మార్కెట్ పతనంతో రూ.4.29 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.419 లక్షల కోట్లకు తగ్గింది. ప్రపంచ మార్కెట్లూ డీలా ట్రంప్ టారిఫ్ దాడికి ప్రతిగా తాము కూడా టారిఫ్లు పెంచుతామని కెనడా, మెక్సికో ప్రకటించడంతో వాణిజ్య యుద్ధ భయాలు మరింత తీవ్రమయ్యాయి. ఆసియాలో జపాన్, తైవాన్, కొరియా సూచీలు 3.50% క్షీణించాయి. ఇండోనేషియా, సింగపూర్, హాంగ్కాంగ్ దేశాలు 2–0.5% పతనమయ్యాయి. యూరప్ మార్కెట్లు 1% నష్టపోయాయి. అమెరికా సూచీలు నాస్డాక్ 1%, ఎస్అండ్పీ అరశాతం, డోజోన్ పావుశాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. -
యూఎస్ఎయిడ్ మూసివేత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ చర్యలు ప్రభుత్వాలతోపాటు సొంత దేశస్తులను సైతం కలవర పెట్టిస్తున్నాయి. యూఎస్ ఎయిడ్(యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్) ఇక మూతబడక తప్పదని బిలియనీర్ ఎలన్ మస్క్ వ్యాఖ్యానించారు. రహస్య పత్రాలను పరిశీలించేందుకు నిరాకరించారన్న ఆగ్రహంతో యూఎస్ఎయిడ్కు చెందిన ఇద్దరు ఉన్నత భద్రతాధికారులను సెలవుపై పంపారన్న వార్తల నేపథ్యంలో ఈ ప్రకటన చేయడం గమనార్హం. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్)కు సారథిగా మస్క్ను ట్రంప్ నియమించడం తెలిసిందే. ప్రభుత్వ వ్యయంపై కోతలు విధించే విధుల్లో భాగంగా వాషింగ్టన్లోని యూఎస్ఎయిడ్ ప్రధాన కార్యాలయంలోని రహస్య సమాచారం చూపేందుకు సోమవారం డోజ్ బృందానికి అధికారులు అనుమతించకపోవడంపై మస్క్ తీవ్రంగా స్పందించారు. యూఎస్ఎయిడ్ను నేరగాళ్ల సంస్థగా అభివరి్ణస్తూ..దాని మూసివేసే సమయం వచ్చిందంటూ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. డోజ్కు అనుమతివ్వని యూఎస్ఎయిడ్ సెక్యూరిటీ డైరెక్టర్ జాన్ వూర్హీస్, ఆయన సహాయక డైరెక్టర్ బ్రియాన్ మెక్గిల్లను ట్రంప్ ప్రభుత్వం సెలవుపై పంపించిందని మీడియా అంటోంది. సుమారు 600 మందికి తమ హెడాఫీసులోని కంప్యూటర్లకు యాక్సెస్ లేకుండా చేశారని ఉద్యోగులు అంటున్నారు. కంప్యూటర్లతో యాక్సెస్ ఉన్న వారికి కూడా ‘సంస్థ నాయకత్వం సలహా మేరకు ప్రధాన కార్యాలయాన్ని 3న మూసివేస్తున్నాం’అంటూ సమాచారం వచ్చిందన్నారు. అయితే, ఇవన్నీ అసత్యాలని వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చ్యుంగ్ కొట్టిపారేశారు. మీడియాను సైతం ఆయన తిట్టిపోశారు. దక్షిణాఫ్రికాకు సాయం నిలిపేస్తాం: ట్రంప్ఇలా ఉండగా, దక్షిణాఫ్రికాకు ఇకపై అన్ని రకాల సాయం నిలిపివేస్తామని ట్రంప్ చెప్పారు. ఒక వర్గానికి చెందిన ప్రజల భూములను దక్షిణాఫ్రికా ప్రభుత్వం బలవంతంగా ఆక్రమించుకుంటోందని ఆరోపించారు. శ్వేత జాతికి చెందిన కొందరు రైతుల భూములను ఎలాంటి పరిహారం లేకుండా ఆక్రమించుకునేందుకు ఉద్దేశించిన వివాదాస్పద బిల్లుపై గతం వారం దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా సంతకం చేశారు. 2023లో దక్షిణాఫ్రికాకు అమెరికా సుమారు 440 మిలియన్ డాలర్ల సాయాన్ని అందజేసింది. 2023లో 180 దేశాలకు 72 బిలియన్ డాలర్ల మేర అమెరికా సాయం అందించింది. ఇందులో సగం వరకు యూఎస్ఎయిడ్ ద్వారానే పంపింది. -
ట్రంప్ చర్యలపై నిరసనలు
వాషింగ్టన్: అక్రమ వలసదారులను తిప్పి పంపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపడుతున్న చర్యలను వేలాది మంది వ్యతిరేకించారు. అక్రమ వలసదారులను నిర్బంధించి మూకుమ్మడిగా సామూహిక బహిష్కరణలు చేపడతానన్న ట్రంప్ నిర్ణయాన్ని నిరసిస్తూ వేలాది మంది ప్రజలు ఆదివారం దక్షిణ కాలిఫోర్నియాలో ర్యాలీ చేపట్టారు. లాస్ ఏంజెలెస్లోని డౌన్టౌన్తో సహా నిరసనకారులు ప్రధాన జాతీయ రహదారిని కొన్ని గంటల పాటు దిగ్బంధించారు. ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘ఎవ్వరూ చట్టవిరుద్ధం కాదు’, ‘ఇమ్మిగ్రెంట్స్ అమెరికాను గొప్పగా మార్చారు’వంటి నినాదాలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. మధ్యాహ్నానికల్లా యూఎస్ 101లోని అన్ని మార్గాలను దిగ్బంధించడంతో ట్రాఫిక్ స్తంభించింది. కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్ అధికారుల బందోబస్తు నిలవగా నిరసనకారులు వీధుల్లో బైఠాయించారు. ఫ్రీవే పూర్తిగా తెరవడానికి ఐదు గంటలకు పైగా సమయం పట్టింది. తూర్పున రివర్సైడ్ నగరంలో వందలాది మంది నిరసన తెలిపారు. ఓ కూడలి వద్ద జెండాలు ఎగురవేస్తున్న నిరసనకారులకు మద్దతుగా వాహనదారులు ఆపకుండా అంతా ఒకేసారి హారన్ మోగించి తమ మద్దతు తెలిపారు. శాన్డియాగో నగరంలోని కన్వెన్షన్ సెంటర్ వద్ద వందలాది మంది ఆదివారం ర్యాలీ నిర్వహించారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అరెస్టులకు నిరసనగా డల్లాస్లో నిరసనకారులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఐసీఈ దాడులను నిరసిస్తూ ఆర్లింగ్టన్ నగరంలో వందలాది మంది ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిటీ హాల్ వెలుపల జెండాలతో నిరసన తెలిపారు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా టారెంట్ కౌంటీలో నిరసనకారులు ఆందోళనకు దిగారు. -
ఐరోపా సమాఖ్యపైనా టారిఫ్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వాణిజ్య యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనాలపై అదనపు టారిఫ్లు విధించిన ట్రంప్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ (ఈయూ)పై సుంకాలు విధిస్తానని సంకేతాలు ఇస్తున్నారు. ట్రంప్ సుంకాలు విధిస్తే తాము దీటుగా బదులిస్తామని ఐరోపా సమాఖ్య సైతం కుండబద్దలు కొట్టింది. చర్చల ద్వారా వాణిజ్య సంఘర్షణను నివారించవచ్చని వ్యాఖ్యానించింది. 27 దేశాల కూటమిపై సుంకాల విధింపు అంశాన్ని పరిశీలిస్తున్నారా? అని వైట్హౌజ్లో ట్రంప్ను మీడియా ప్రశ్నించింది.‘‘ దీనికి నిజమైన సమాధానం కావాలా లేక రాజకీయ సమాధానం కావాలా?. ఖచ్చితంగా విధిస్తా’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. యూరోపియన్ యూనియన్ అమెరికా పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈయూకు వ్యతిరేకంగా ట్రంప్ గళమెత్తడం ఇది మొదటిసారి కాదు. వాణిజ్యం విషయంలో అమెరికా పట్ల చాలా అన్యాయంగా వ్యవహరిస్తోందని గతంలోనూ ఆయన ఆరోపించారు. ట్రంప్ తొలిసారిగా అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చున్నప్పుడూ స్టీల్, అల్యూమినియం ఎగుమతులకు సంబంధించి ఈయూపై సుంకాలు విధించారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన ఈయూ కూటమి వెంటనే తగిన రీతిలో స్పందించింది. విస్కీ, మోటార్ సైకిళ్లతో సహా పలు అమెరికా వస్తువులపై టారిఫ్లు విధించి ప్రతీకారం తీర్చుకుంది.ప్రతీకారం తప్పదన్న ఈయూకెనడా, మెక్సికో, చైనాలపై అమెరికా టారిఫ్లు విధించడాన్ని ఈయూ వ్యతిరేకించింది. ‘‘సుంకాలు అనవసరమైన ఆర్థిక అంతరాయాలను సృష్టిస్తాయి. ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయి. అవి రెండు వైపులా ఇబ్బందులను కలగచేస్తాయి. అలాంటిది ఈయూ వస్తువులపైనే అన్యాయంగా లేదా ఏకపక్షంగా సుంకాలు విధించే ఏ వాణిజ్య భాగస్వామికైనా మేం గట్టిగా బదులిస్తాం’’ అని ఈయూ వ్యాఖ్యానించింది.మెక్సికోపై టారిఫ్ అమలుకు బ్రేక్మెక్సికో నుంచి దిగుమతి అయ్యే వస్తూత్ప త్తులపై 25 శాతం టారిఫ్ విధిస్తానని ప్రకటించిన అమెరికా అధ్యక్షడు ట్రంప్ ఆఖరి నిమిషంలో తన ఆదేశాల అమలును నిలుపుదల చేశారు. నేటి నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి రావాల్సి ఉండగా తన ఉత్తర్వుల అమలును నెల రోజులపాటు వాయిదా వేస్తున్నట్లు సోమ వారం ట్రంప్ ప్రక టించారు. టారిఫ్ల అమలు నిలుపుదలపై అమె రికా సర్కార్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ వెల్ల డించారు. సోమవారం ఆమె ట్రంప్తో దాదాపు 45 నిమిషాలు ఫోన్లో మంతనాలు జరిపారు. -
కెనడా, మెక్సికోలపై టారిఫ్లు నేటి నుంచే
వాషింగ్టన్: పొరుగుదేశాలైన కెనడా, మెక్సికోలపై ప్రకటించిన 25 శాతం టారిఫ్ పెంపు శనివారం నుంచే అమలవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించారు. వైట్హౌస్లోని ఓవల్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. టారిఫ్లు విధించే కెనడా, మెక్సికో వస్తువుల జాబితాలో చమురును చేర్చాలా వద్దా అనేది కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ రెండు దేశాల నుంచి దిగుమతయ్యే ఆయిల్ ధర సరిగ్గా ఉందని భావిస్తే టారిఫ్ ఉండదని చెప్పారు. కెనడా, మెక్సికోలపై టారిఫ్ విధింపునకు ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు. ఈ రెండు దేశాల నుంచి అక్రమ వలసలు, డ్రగ్స్ స్మగ్లింగ్ ఎక్కువన్నారు. ఈ రెండు దేశాలతో అమెరికా వాణిజ్యం భారీ లోటు ఉందని చెప్పారు. వాణిజ్యం విషయంలో ఈ రెండూ అమెరికాతో చాలా అన్యాయంగా వ్యవహరించాయన్నారు. ఇవి ఎగుమతి చేసే వస్తువులు ఆయిల్, కలప వంటి వాటి అవసరం తమకు లేదన్నారు. ప్రస్తుతం ఏడాదికి కెనడాకు 175 బిలియన్ డాలర్లు, మెక్సికోకు 300 బిలియన్ డాలర్ల వరకు అమెరికా సబ్సిడీల రూపంలో అందిస్తోందని ట్రంప్ వివరించారు. చైనా పైనా టారిఫ్ఫెంటానిల్ వంటి ప్రమాదకరమైన డ్రగ్ను తమ దేశంలోకి దొంగచాటుగా పంపుతున్న చైనా వస్తువులపైనా టారిఫ్లు విధించే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ‘ఫెంటానిల్ కారణంగా వేలాదిగా అమెరికన్లు చనిపోతున్నారు. ఇందుకు బదులుగా చైనా టారిఫ్తో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంది. ఈ విషయంలో స్పష్టతతో ఉన్నాం’అని ఆయన అన్నారు.బ్రిక్స్కు ట్రంప్ మళ్లీ వార్నింగ్అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్కు బదులుగా ప్రత్యామ్నాయం తీసుకురావాలనుకుంటే తీవ్ర చర్యలు తప్పవని బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అలాంటి పరిస్థితే వస్తే సభ్యదేశాలపై వంద శాతం టారిఫ్ తప్పదన్నారు. అమెరికాకు బదులు మరో దేశాన్ని చూసుకోవాలని సలహా ఇచ్చారు. ‘ఇప్పటి వరకు చూస్తూ ఊరుకున్నాం, ఇకపై సహించేది లేద’అంటూ సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. ‘కొత్తగా బ్రిక్స్ కరెన్సీని తేవడం లేదా డాలర్కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీకి మద్దతివ్వడం వంటివి మానుకోవాలి. అలా చేస్తే 100 శాతం టారిఫ్లు తప్పవు. అమెరికాలో ఉత్పత్తుల విక్రయానికి గుడ్ బై చెప్పుకోవాల్సిందే’అన్నారు. గత డిసెంబర్లోనూ బ్రిక్స్కు ట్రంప్ ఇటువంటి హెచ్చరికే చేశారు. అయితే, డాలర్ రహిత బ్రిక్స్ దేశాల వాణిజ్యానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనా లేదని విదేశాంగ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. బ్రిక్స్లో రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేసియా, ఇరాన్ దేశాలకు సభ్యత్వముంది. -
సునీతా విలియమ్స్ను తీసుకురండి: ట్రంప్
వాషింగ్టన్: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి తీసుకురావాలంటూ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఆ యన తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పంచుకున్నారు. ‘బైడెన్ ప్రభుత్వం అంతరిక్ష కేంద్రంలో వదిలేసిన ఇద్దరు ధైర్యవంతులైన వ్యోమగాములను తీసుకురావాలని మస్క్ ను కోరుతున్నా. సునీత, విల్మోర్ కొన్ని నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఎదురు చూస్తున్నారు. వీలైనంత త్వరగా వ్యోమగాములను తీసుకురావాలి. గుడ్ల క్ ఎలాన్’అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. దీనికి మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘మేం తీసుకొస్తాం. బైడెన్ ప్రభుత్వం ఇంతకాలం వారిన లా వదిలేయడం దారుణం’’అని మస్క్ వ్యాఖ్యానించారు. పది రోజుల మిషన్ కోసం సునీత, విల్మోర్ 2024 జూన్ 5న బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లాక వ్యోమనౌకలోని థ్రస్టర్ పనిచేయకపోవడం, హీలియం లీక్ కావడంతో వ్యోమగాములను అక్కడే వదిలేసి స్టార్లైనర్ క్యాప్సుల్ మాత్రం సెపె్టంబర్ 7న తిరిగి భూ మి మీదకొచి్చంది. అంతరిక్షంలో ఎక్కువకాలం ఉండటంతో ఆమె చాలా బరువు తగ్గినట్లు ఇటీవల బహిర్గతమైన ఫొటోల ద్వారా వెల్లడైంది. తన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలను గతేడాది నవంబర్లో సునీత తోసిపుచ్చారు. తన శరీరం కొద్దిగా మారిందని, అదే బరువుతో ఉన్నానని చెప్పారు. ఒకవేళ మార్చి నెలాఖరులో వీళ్లిద్దరూ భూమికి తిరిగొస్తే అనుకోకుండా అక్కడే ఉండిపోయి 300 రోజులపాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములుగా మరో రికార్డ్ నెలకొల్పుతారు. ఎలా నడవాలో గుర్తుంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా: సునీత ఇప్పటికే 7 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన సునీత తాను చదివిన పాఠశాల విద్యార్థులతో సోమవారం మాట్లాడారు. వర్చువల్గా జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్లో సునీతను విద్యార్థులు అత్యల్ప గురుత్వాకర్షణ స్థితిపై ప్రశ్నలు సంధించారు. ‘‘ఈత కొట్టడం, ఎగరడం వంటి అనుభూతిని మాత్రమే ఆస్వాదిస్తున్నా. ఎక్కువకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల తన శరీరం అనేక సర్దుబాట్లకు లోనైంది. చాలాకాలంగా నేను నడవలేదు. కూర్చోలేదు. పడుకోలేదు. నడవడం ఎలా ఉంటుందో గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తున్నా’’అని తెలిపారు. ‘‘ఎలాగోలా తిరిగి రావడానికి మరో నెలరోజుల సమయం పడుతుందనుకున్నా. కానీ ఇన్ని రోజులైనా ఇంకా ఉండాల్సి రావడం కాస్త ఇబ్బందిపెడుతోంది. వృద్ధాప్యంలో ఉన్న నా తల్లితో వీలైనంతసేపు మాట్లాడుతున్నా. అంతరిక్ష కేంద్రంలో బిజీ షెడ్యూల్, కుటుంబంతో క్రమం తప్పకుండా మాట్లాడటం వల్ల తాను ఒంటరిగా ఉన్నట్లు భావించట్లేను’’అని సునీత చెప్పారు. -
ట్రంప్ పనామా జపం వెనక..
పనామా కాలువ. వందేళ్ల క్రితం నిర్మించిన ఇంజనీరింగ్ అద్బుతం. చిన్నపాటి భూభాగం కారణంగా కలవకుండా ఉండిపోయిన అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను వందల కోట్లు వెచ్చించి అక్కడి వారి కలను సాకారం చేసింది అగ్రరాజ్యం. పాతికేళ్ల తర్వాత దానిపై అజమాయిషీ కోసం పట్టుబడుతుండటం విచిత్రం. ఆ కాల్వపై అజమాయిషిని నాటి అమెరికా అధ్యక్షుడు స్థానిక దేశానికి ధారాదత్తం చేస్తే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అదేమీ చెల్లవంటూ కొత్త రాగం ఆలపిస్తున్నారు. ట్రంప్ బెదిరింపులకు బెదిరేదిలేదని పనామా ప్రభుత్వం చెబుతుండటంతో ఏమౌతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అవసరమైతే సైనిక శక్తితో బెదిరించో, బలవంతపు దౌత్యంతోనో మాట నెగ్గించుకోవడం దశాబ్దాలుగా అమెరికాకు అలవాటు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి వారమైనా తిరక్కుండానే ఏకంగా వందకు పైగా కార్యనిర్వాహక ఉత్తర్వులిచ్చిన తెంపరి ట్రంప్ పనామాపై ఎలాంటి దూకుడు నిర్ణయాలు తీసుకుంటారోనని ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా వేచిచూస్తున్నాయి... భారీ రాకపోకలు, అనూహ్య రాబడి అమెరికా నౌకలు ఆసియా ఖండానికి వెళ్లాలంటే గతంలో దక్షిణ అమెరికా ఖండం చుట్టూతా వేల మైళ్లు సముద్రయానం చేయాల్సి వచ్చేది. ప్రయాణఖర్చలు విపరీతంగా ఉండేవి. వీటిని చాలా వరకు తగ్గించేందుకు, ప్రత్నామ్నాయ సముద్రమార్గంగా పనామా కాలువను తెరమీదకు తెచ్చారు. అనుకున్నదే తడవుగా వందల కోట్లు ఖర్చుపెట్టి కాలువను తవ్వి 1914 ఆగస్ట్ 15న కాలువను వినియోగంలోకి తెచ్చారు. కొత్తలో ఈ మార్గం గుండా రోజుకు మూడు నాలుగు నౌకలే రాకపోకలు సాగించేవి. అయితే అత్యంత దగ్గరి దారికావడంతో రానురాను దీని గుండా అంతర్జాతీయ సరకు రవాణా నౌకల రాకపోకలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు ఏటా లక్షలాది నౌకలు వెళ్తున్నాయి. దీంతో కాల్వపై యాజమాన్య హక్కులున్న పనామా దేశానికి ఏటా నికర లాభం ఏకంగా రూ.43,000 కోట్లకు పెరిగిందని ఒక అంచనా. ఏటా ఇంతటి లాభాల పంట పండించే బంగారు కోడిని నాటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అప్పనంగా పనామాకు అప్పజెప్పారని నేటి అధ్యక్షుడు ట్రంప్ తెగ బాధపడిపోతున్నారు. పనామా దేశ వార్షిక ఆదాయంలో 23.6 శాతం ఒక్క ఈ కాలువ నుంచే వస్తుండటం గమనార్హం. పనామా వాదనేంటి? నాటి కాలువకు నేటి కాలువకు ఎంతో తేడా ఉంది. బాధ్యతలు తమ చేతుల్లోకి వచ్చాక పనామా దేశం ఈ కాలువను మరింతగా తవ్వి పెద్దగా విస్తరించింది. ఏకంగా 5 బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టింది. సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. దీంతో 2016 ఏడాది తర్వాత భారీ నౌకలు సైతం సులభంగా వెళ్లడం మొదలవడంతో యాజమాన్యం అధిక లాభాలను కళ్లజూస్తోంది. ‘‘ మేం సొంతంగా ఎంతో ఖర్చుపెట్టాం. గతంలో పోలిస్తే ఆదాయం 55 శాతం పెరగడానికి గతంలో మేం పెట్టిన పెట్టుబడులే కారణం’’ అని కాలువ మాజీ అడ్మిని్రస్టేటర్ జార్జ్ లూయిస్ క్విజానో తేల్చి చెప్పారు. ‘‘ కాలువ మా దేశంలో, దేశభక్తిలో అంతర్భాగం. దీనిపై యాజమాన్య హక్కులు మాకే దక్కుతాయి’’ అని పనామా దేశస్తులు తెగేసి చెబుతున్నారు. అధ్యక్ష ఎన్నికలప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన స్థానికులు పనామా సిటీలోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద పెద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అమెరికా ఈ కాలువను దక్కించుకోవాలంటే పెద్ద ఘర్షణ చెలరేగి అది అంతర్జాతీయ నౌకాయానంపైనా పెను ప్రభావం పడే ప్రమా దముంది. అమెరికా నౌకలపై అధిక చార్జీలు ఈ కాలువను వాణిజ్య అవసరాలకు అత్యధికంగా వాడుతున్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత చైనా, చిలీ, జపాన్, దక్షిణకొరియాలు అతిగా వాడుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా సరకు రవాణా నౌకలతోపాటు చాలా ప్రపంచదేశాలపై నిఘా కోసం, తమ మిత్రదేశాల్లో తమ స్థావరాలకు సైన్యాన్ని తరలించేందుకు యుద్ధనౌకలనూ ఇదే మార్గం గుండా పంపుతోంది. వినియోగం ఎక్కువగా ఉండటంతో అమెరికాకు రాకపోకలు చార్జీలు ఎక్కువ అవుతున్నాయి. అయితే మాపైనే అధిక చార్జీలు మోపుతున్నారని ట్రంప్ వాదిస్తున్నారు. అయితే తన వాదనలకు బలం చేకూర్చే ఆధారాలను ఆయన బయటపెట్టలేదు. పైగా చైనా రహస్యంగా ఈ కాలువ నిర్వాహణ యాజమాన్య హక్కులు పొందిందని ట్రంప్ ప్రధాన ఆరోపణ. కాలువను పనామా దేశం శాశ్వతంగా సొంతంగా మాత్రమే నిర్వహించుకోవాలన్న ‘ టోరిజోస్–కార్టర్’ ఒడంబడికను పనామా కాలదన్నిందని, తటస్థ వైఖరికి తిలోదకాలు ఇచ్చిందని అమెరికా ఆరోపిస్తోంది. కష్టపడి తవ్విన తమకే అధిక చార్జీల వాత పెడుతూ, శత్రుదేశం చైనాకు నిర్వహణ హక్కులు కట్టబెట్టారని ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ఎలాగైనా సరే పనామా కాలువపై యాజమాన్య హక్కులను తిరిగి సంపాదిస్తామని ప్రమాణస్వీకారం రోజే ట్రంప్ ప్రకటించారు. 13 ఏళ్ల పాటు సుదీర్ఘ చర్చల తర్వాత 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, పనామా పాలకుడు ఒమర్ టోరిజోస్కు పనామాకాలువ బాధ్యతలు అప్పగించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్ సంచలన నిర్ణయాలు.. ఖుషీలో ఇజ్రాయెల్, ఉక్రెయిన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇజ్రాయెల్-గాజా అంశంపై ఫోకస్ పెట్టిన ట్రంప్.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్కు 2,000 పౌండ్ల బరువున్న బాంబులను అమెరికా సరఫరా చేసేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో, ఇజ్రాయెల్కు మరింత బలం పెరగనుంది.కాగా, గాజాలో విధ్వంస తీవ్రతను తగ్గించేందుకు గత బైడెన్ సర్కారు తీసుకొన్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పక్కనపెట్టారు. ఇజ్రాయెల్కు 2,000 పౌండ్ల బరువున్న బాంబులను అమెరికా సరఫరా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో రానున్న రోజుల్లో దాదాపు 1,800 ఎంకే-84 బాంబులను ఇజ్రాయెల్కు సరఫరా చేయనున్నారు. వీటిని బంకర్ బస్టర్లు అని కూడా అంటారు. ఇక, ట్రంప్ నిర్ణయాన్ని ఇప్పటికే పెంటగాన్ ప్రతినిధులు టెల్అవీవ్కు వెల్లడించారు.అయితే, ఇజ్రాయెల్-గాజా యుద్ధం ప్రారంభమైన కొద్దిరోజులకు ఈ బాంబులను బైడెన్ నిలిపివేశారు. గతంలో ఈ బాంబులను జనావాసాలపై వాడుతున్నారని ఆందోళనలు వ్యక్తం కావడంతో బైడెన్ వీటిని నిలిపేశారు. దీంతో అవి గోదాముల్లోనే ఉండిపోయాయి. నాడు బైడెన్ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇజ్రాయెలే స్వయంగా దేశంలో ఈ బాంబులను తయారు చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు కొన్ని రక్షణ సంస్థలకు కాంట్రాక్టులు కూడా ఇచ్చింది. వాస్తవానికి గతంలో అమెరికానే దాదాపు 10,000 ఎంకే-84లను ఇజ్రాయెల్కు సరఫరా చేసింది. ఇక, తాజాగా ట్రంప్ నిర్ణయంతో అమెరికా నుంచి ఇజ్రాయెల్కు బాంబు చేరనున్నాయి.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ విషయంలో కూడా ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విదేశాలకు అమెరికా అందించే అన్ని రకాల సాయాలను 90 రోజులపాటు నిలిపేస్తూ కార్యనిర్వాహక ఆదేశాలపై ట్రంప్ సంతకం చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం తమ దేశానికి అమెరికా సైనిక సహాయాన్ని ఆపలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. కష్ట సమయంలో సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు ట్రంప్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ తన సైనిక అవసరాల్లో 40 శాతం అమెరికాపైనే ఆధారపడింది. ఇప్పటికే 725 మిలియన్ డాలర్ల ప్యాకేజీ, 988 మిలియన్ డాలర్ల సామగ్రిని అందజేస్తామని మాజీ అధ్యక్షుడు బైడెన్ గతంలో ఉక్రెయిన్కు హామీ ఇచ్చారు. వాషింగ్టన్ నుంచి కీవ్కు 2022 నుంచి ఇప్పటి వరకు 62 బిలియన్ డాలర్లు ఆయుధాలు, ఇతర సాయం అందించారు. -
ట్రంప్ దూకుడు.. మన విద్యార్థుల్లో ఆందోళన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు అక్కడి భారతీయ విద్యార్థుల్లో ఆందోళనలు పెంచుతోంది. ఆయన రెండోసారి బాధ్యతలు చేపట్టడానికి వారిలో చాలామంది పార్ట్టైమ్ ఉద్యోగాలకు గుడ్బై చెప్పారు. కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టాల భయమే ఇందుకు కారణం. వారిలో చాలామంది ఉన్నత చదువుల కోసం అప్పులు చేసి అమెరికా వచ్చినవాళ్లే. దాంతో తల్లిదండ్రులకు భారంగా కావద్దని పార్ట్టైమ్గా చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తుంటారు. ఎఫ్–1 వీసాపై ఉన్న విద్యార్థులకు వారానికి 20 గంటల వరకు పని చేయడానికి అనుమతిస్తారు. కానీ చట్టం, వీసా నిబంధనలు అనుమతించని ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. కానీ ఇకపై అలాంటివి చేస్తూ పట్టుబడితే నేరుగా డీపోర్టేషనేనని ట్రంప్ హెచ్చరించడంతో మన విద్యార్థులు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడటం లేదు. కొన్ని నెలలపాటు పరిస్థితి చూశాకే పార్ట్టైం కొలువులపై నిర్ణయానికి వస్తామంటున్నారు. ధీమా పోయింది.. ఇప్పటిదాకా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ చదువుకోవచ్చనే ధీమా ఉండేదని, ఇప్పుడది కాస్తా పోయిందని మన విద్యార్థులు ఆవేదన చెందుతుందున్నారు. ‘‘రూ.42 లక్షలు అప్పు చేసి మరీ వచ్చా. కాలేజీ కాగానే చిన్న కఫేలో రోజుకు ఆరు గంటలు పని చేసేవాన్ని. గంటకు ఏడు డాలర్ల చొప్పున ఇచ్చేవారు. నెలవారీ ఖర్చులు హాయిగా వెళ్లిపోయేవి. కానీ ఇలా అనధికారికంగా పని చేస్తున్న వారిపై ఇమ్మిగ్రేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలియడంతో గత వారం రాజీనామా చేశా’’ఇల్లినాయీ వర్సిటీకి చెందిన ఓ భారతీయ విద్యార్థి చెప్పారు. ‘‘ఇప్పటికే నా పొదుపులో చాలావరకు వాడేశా. రూమ్మేట్స్ నుంచి అప్పు తీసుకుంటున్నా. ఇంకెంతకాలం నెట్టుకురాగలనో తెలియడం లేదు’’అని టెక్సాస్లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న మరో విద్యార్థి వాపోయాడు. ఈ అనిశ్చితి విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై బాగా ప్రభావం చూపుతోంది. అతి పెద్ద విద్యార్థి సమూహం... అమెరికాలో చదివే విదేశీ విద్యార్థుల్లో మనవాళ్లు అతి పెద్ద సమూహం. ఈ విషయంలో చైనాను కూడా దాటేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) నివేదిక ప్రకారం 2022–23లో 2.69 లక్షల భారత విద్యార్థులు అమెరికాలో చదువుతున్నారు. అంతకుముందు ఏడాది కంటే అది ఏకంగా 35% అధికం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఏ తప్పు చేయనప్పుడు క్షమాభిక్షలు దేనికి?’
క్యాపిటల్ ఘటనలో నిందితులకు క్షమాభిక్ష, టిక్టాక్ అంశంతోపాటు పలు ఆసక్తికర అంశాలపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత బుధవారం తొలిసారి వ్యక్తిగత ఇంటర్వ్యూలో ఆయన పాల్గొన్నారు. ఫాక్స్ న్యూస్ ఛానెల్ ప్రతినిధి సీన్ హన్నిటీ అధ్యక్షుడు ట్రంప్ను పలు ఆసక్తికర అంశాలపై ప్రశ్నలు సంధించగా.. తనదైన శైలిలో ఆయన స్పందించారు.టిక్ టాక్ బ్యాన్పై.. చైనాలో ఆ యాప్ తయారైందని మీరు అంటున్నారు. కానీ, ఆ దేశంలో ఇంకా చాలా తయారవుతున్నాయి. మరి ఇక్కడ వాటి ప్రస్తావన ఎందుకు రావడం లేదు. కేవలం అమెరికా యువతపై నిఘా పెట్టడమే చైనా పనా?. యువత కేవలం సరదా కాలక్షేపం కోసం మాత్రమే ఆ యాప్ను ఉపయోగిస్తున్నారు. టిక్టాక్పై తాజాగా అమెరికా నిషేధం విధించగా.. దానిని ఎత్తివేసే ప్రయత్నాలను ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టింది👉కాపిటల్ భవనంపై దాడి కేసులో.. చాలా మంది అమాయకులు. అర్థమైందా?. 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ హిల్(Capitol Hill) భవనంపై జరిగిన దాడి ఘటనలో పాల్గొన్న 1,600 మందికి ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం కూడా చేశారు. ఆ అల్లర్లలో పాల్గొన్న తన మద్దతుదారులను విడుదల చేస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.👉జో బైడెన్(Joe Biden) పోతూపోతూ..విశిష్ట అధికారాలను ఉపయోగించి స్వీయ క్షమాభిక్ష పెట్టుకున్నారు. తన కుటుంబ సభ్యులతో సహా తనకు కావాల్సిన వాళ్లకు క్షమాభిక్షలు ప్రసాదించుకున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. గతంలో నేను అధ్యక్షుడిగా దిగిపోయే సమయంలో.. నన్ను అలా చేయమని నా చుట్టూ ఉన్న అధికారులు సూచించారు. చివరకు.. నాకు నేనుగా క్షమాభిక్ష విధించుకునే ఆప్షన్ను కూడా నా ముందు ఉంచారు. కానీ, నేనెవరికీ క్షమాభిక్ష ప్రసాదించే ఉద్దేశం లేదని చెప్పా. మేం ఎలాంటి తప్పు చేయలేదు. అలాంటప్పుడు క్షమాభిక్ష ఎందుకు?. మా వాళ్లంతా దేశభక్తులే అని అన్నారాయన.👉ఓవల్ ఆఫీస్(అమెరికా అధ్యక్ష కార్యాలయం)కు తిరిగి రావడంపై.. స్పందిస్తూ.. ఇక్కడ బోలెడంత పని ఉంది. ద్రవ్యోల్బణం, యుద్ధాలు.. ఇలా ఎన్నో సంక్షోభాలు నడుస్తున్నాయి. అసలు ఈ టైంలో మనం ఇక్కడ ఉండాల్సింది కాదు(నవ్వుతూ..). 👉లాస్ ఏంజెల్స్ కార్చిచ్చుపై.. ఇది ముమ్మాటికీ ఆ రాష్ట్ర గవర్నర్ గావిన్ న్యూసోమ్ చేతకానితనమే. ఉత్తరాది నుంచి వచ్చే నీటిని అతను విడుదల చేయాల్సి ఉంది. తద్వారా మంటలను కట్టడి చేసే అవకాశం ఉండేది.👉అక్రమ వలసదారుల్లో(Illegal Immigrants) నేరస్తుల సంఖ్య అధికంగానే ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి 2 కోట్లకు పైగా నేరస్తులు అమెరికాకు అక్రమంగా వలసలు వచ్చారు!. బైడెన్ పాలనతో ప్రపంచంలోని జైళ్లన్నీ ఖాళీగా మగ్గుతున్నాయి(సెటైరిక్గా). వలసదారుల చట్టం అమలు కోసం శాంక్చురీ సిటీలకు కేటాయించే ఫెడరల్ ఫండ్స్కు కోత విధించాల్సిన అవసరం ఉంది. నేను చేయగలిగిన పని అదొక్కటే అనిపిస్తోంది. 👉దేశంలో ఉగ్రవాదుల సంఖ్య పెరిగిపోయింది. వాళ్ల లెక్కలు తేల్చాల్సి ఉంది. -
చైనా విస్తరణ కాంక్షకు ‘పనామా’తో ట్రంప్ ఆజ్యం పోస్తున్నారా?
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్ ప్రారంభోపన్యాసంలో పనామా కాలువ గురించి చేసిన వ్యాఖ్యలపై విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనామా కాలువను బల ప్రయోగంతోనైనా స్వాదీనం చేసుకుంటామంటూ ట్రంప్ చేసిన ప్రకటన మున్ముందు ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందంటున్నారు. ప్రారంభ ప్రసంగంలో ట్రంప్ పనామా కాలువ చైనా నియంత్రణలోకి వెళ్లిపోయిందని, 1977 నాటి ఒప్పందాన్ని పనామా ఉల్లంఘించిందని ఆరోపించారు. అప్పట్లో కాలువను అమెరికా మూర్ఖంగా పనామాకు ఇచ్చివేసిందని వ్యాఖ్యానించారు. అమెరికా నౌకల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తోందని, అందుకే స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకే ట్రంప్ ఈ ప్రకటన చేసినట్లుగా భావించినప్పటికీ డ్రాగన్ దేశ విస్తరణ కాంక్షకు బలమిస్తున్నట్లు అవుతుందని అంటున్నారు. తైవాన్ను, ఇతర ప్రాంతాలను కలిపేసుకునేందుకు ఇదో సాకుగా చూపే ప్రమాదముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో, తైవాన్ పట్ల చైనాను సంయమనంగా వ్యవహరించేలా చేయడమన్న దశాబ్దాల అమెరికా విధానానికి వీడ్కోలు పలుకుతూ ట్రంప్ చేసిన అనూహ్య ప్రకటన తన విస్తరణ కాంక్షకు చట్టబద్ధతగా ఆ దేశం భావించే ప్రమాదముందని చెబుతున్నారు. రష్యా, చైనాల సరసన అమెరికా? అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకమునుపే ట్రంప్ పనామా కాలువ అమెరికాకే చెందుతుందంటూ చేసిన వ్యాఖ్యలపై నిపుణులు పెదవి విరిచారు. అలాంటప్పుడు, చైనా, రష్యాల చర్యల కంటే అమెరికా ఏవిధంగా మెరుగనే ప్రశ్న ఉత్పన్నమవుతుందని వారన్నారు. ఉక్రెయిన్ తమకే చెందుతుందంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. తైవాన్ను బలప్రయోగంతోనైనా స్వాదీనం చేసుకుంటామని చైనా బెదిరింపులకు దిగుతోంది. ట్రంప్ కూడా పనామా, గ్రీన్ల్యాండ్లను సైనిక చర్యతో అయినా స్వాధీనం చేసుకుంటామంటున్నారు. ఆ రెండు దేశాలకు, అమెరికాకు తేడా ఏముంటుంది?’అని న్యూయార్క్కు చెందిన జర్నలిస్ట్ గెరాల్డో రివెరా ‘ఎక్స్’లో పేర్కొన్నారు. సార్వభౌమ దేశాన్ని స్వాదీనం చేసుకుంటామనడం ట్రంప్ విస్తరణవాదానికి ఉదాహరణ అని వాషింగ్టన్కు చెందిన మరో జర్నలిస్ట్ పేర్కొన్నారు. చైనాకు ఓ అవకాశం కానుందా? పనామా కాలువతోపాటు సరిహద్దులను ఆనుకుని ఉన్న కెనడాను, ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని డెన్మార్క్ పాలనలోని గ్రీన్ల్యాండ్ను కలిపేసుకుంటామంటూ ట్రంప్ చేసిన ప్రకటనలు.. రష్యా, చైనాలు కూడా తమ ఆక్రమణలను అమెరికా గుర్తిస్తుందనే సంకేతాలిచ్చినట్లవుతుందని సీఎన్ఎన్ యాంకర్ జిమ్ సియుట్టో ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఇటువంటి ప్రకటనలు అమెరికా విశ్వసనీయతను దెబ్బతీస్తాయని, చైనాకు విస్తరణకు గేట్లు తెరిచినట్లవుతుందని ఆ దేశ విశ్లేషకులు అంటున్నారు. ఒక వేళ అమెరికా గ్రీన్ల్యాండ్ను ఆక్రమిస్తే చైనా తైవాన్ను తప్పక స్వా«దీనం చేసుకుంటుందని వాంగ్ జియాంగ్యు అనే హాంకాంగ్ ప్రొఫెసర్ స్పష్టం చేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన తైవాన్ అంశం సహా అన్ని విషయాలపైనా ట్రంప్తో బేరసారాలకు అవకాశముంటుందని చైనా అధికార వర్గాలు భావిస్తున్నాయని షాంఘైలోని ఫుడాన్ వర్సిటీ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రొఫెసర్ ఝావో మింగ్హావో అంటున్నారు. కాలువపై చైనా పెత్తనం నిజమేనా? పసిఫిక్–అట్లాంటిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా ప్రభుత్వం 1904–1914 సంవత్సరాల మధ్య పనామా కాలువను తవ్వించింది. దీనివల్ల ఈ రెండు సముద్రాల మధ్య ప్రయాణ దూరం చాలా తగ్గింది. 1977లో కుదిరిన ఒప్పందం ప్రకారం 1999 నుంచి పనామా నియంత్రణ కొనసాగుతోంది. పనామా కాలువ గుండా వెళ్లే ఓడల్లో 70 శాతం అమెరికావే కావడం గమనార్హం. భద్రతకు ముప్పు కలిగితే కాపాడేందుకు అమెరికా జోక్యం చేసుకోవచ్చు. ప్రస్తుతం, కాలువను చైనా నియంత్రించడం లేదు, నిర్వహించడం లేదు. కానీ, హాంకాంగ్కు చెందిన సీకే హచిసన్ అనుబంధ కంపెనీ పనామా కాలువలోని కరీబియన్, పసిఫిక్ ఎంట్రన్స్ వద్ద నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తోంది. ఇదికాకుండా, చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో 2017లో చేరిన మొట్టమొదటి లాటిన్ అమెరికా దేశం పనామాయే. 2016లో చైనా ప్రభుత్వ సీవోఎస్సీవోకు చెందిన ఓట మొదటిసారిగా పనామా కాలువలోకి ప్రవేశించింది. అదే ఏడాది, చైనా కంపెనీ లాండ్బ్రిడ్జి గ్రూపు మార్గరిటా దీవిలోని అతిపెద్ద నౌకాశ్రయాన్ని కొనుగోలు చేసింది. పనామా కాలువపై మరో వంతెన నిర్మాణ కాంట్రాక్టును చైనా కంపెనీలే దక్కించుకున్నాయి. ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం విస్తరిస్తుండటం అమెరికాకు కంటగింపుగా మారింది. ‘సాంకేతికంగా కాలువపై హక్కులు మావే. మరో దేశం చేతుల్లోకి కాలువ వెళుతోంది. వాస్తవానికి పరాయి దేశం తన కంపెనీల ద్వారా కాలువపై పెత్తనం సాగిస్తోంది’అని విదేశాంగ మంత్రి మార్కో రుబియో సైతం పేర్కొన్నారు. కాలువను అమెరికా కొంటుందనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మోదీ, ట్రంప్ భేటీ ఫిబ్రవరిలో?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ ఫిబ్రవరిలోనే జరగనుందా? ఈ దిశగా ఇరు దేశాల దౌత్యవేత్తల స్థాయిలో ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయా? అవుననే అంటోంది రాయిటర్స్ వార్తా సంస్థ. వారు వాషింగ్టన్లో భేటీ కానున్నారని భారత దౌత్యవర్గాలను ఉటంకిస్తూ కథనం వెలువరించింది. ‘‘ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంలో మోదీ, ట్రంప్ మధ్య ఉన్న స్నేహబంధం కీలకపాత్ర పోషించనుంది. చైనా దూకుడును అడ్డుకోవడంపై ఈ భేటీలో నేతలిద్దరూ దృష్టి సారించే అవకాశముంది. ఇక భారతీయులను ఆందోళన పరుస్తున్న వలసలపై కఠిన వైఖరి, జన్మతః పౌరసత్వం రద్దు తదితర అంశాలను మోదీ ప్రముఖంగా లేవనెత్తవచ్చు. హెచ్–1బీ వీసాల్లో సింహభాగం భారతీయులే దక్కించుకుంటారన్నది తెలిసిందే. అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న సుంకాలు మరీ ఎక్కువని పదేపదే ఆక్షేపిస్తున్న ట్రంప్ ఈ అంశాన్ని మోదీతో లేవనెత్తవచ్చు. సుంకాలను తగ్గించడంతో పాటు అమెరికా పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా పలు నిర్ణయాలను ఈ భేటీలో ట్రంప్ ముందుంచాలని మోదీ భావిస్తున్నారు’’ అని రాయిటర్స్ పేర్కొంది. భారత్కు అతి పెద్ద వర్తక భాగస్వామిగా అమెరికా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2023–24లో 118 బిలియన్ డాలర్ల మేరకు ద్వైపాక్షిక వర్తకం జరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చర్చలకు రాకపోతే ఆంక్షలే : పుతిన్కు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: రష్యా అధినేత పుతిన్ను కలుసుకోవడానికి ఆసక్తితో ఉన్నానని, ఎప్పుడైనా సరే ఆయనతో చర్చలకు తాను సిద్ధమని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. చర్చలకు ముందుకు రాకపోతే రష్యాపై అదనపు ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. చర్చల బల్ల వద్ద కలుసుకుందామని పుతిన్కు సూచించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఇప్పటికే లక్షలాది మంది మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు. సైనికులతోపాటు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం, నగరాలు, పట్టణాలు శిథిలాలుగా మారుతుండడం బాధాకరమని అన్నారు. మీడియాలో వస్తున్న వార్తల కంటే ఉక్రెయిన్లో మృతుల సంఖ్య అధికంగా ఉందన్నారు. వాస్తవాలు చెప్పడం లేదని మీడియాపై మండిపడ్డారు. ట్రంప్ స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్ల క్రితం తాను అధ్యక్షుడిగా ఎన్నికై ఉంటే ఉక్రెయిన్–రష్యా యుద్ధం జరిగేది కాదని స్పష్టంచేశారు. సమర్థుడైన పాలకుడు అధికారంలో ఉంటే యుద్ధాలకు ఆస్కారం ఉండదని అన్నారు. పుతిన్ చాలా తెలివైన వ్యక్తి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తమ గత అధ్యక్షుడు జో బైడెన్ను, రష్యా ప్రజలను పుతిన్ అగౌరవపర్చారని ఆక్షేపించారు. పుతిన్ గురించి తనకు బాగా తెలుసని చెప్పారు. తాను పదవిలో ఉంటే మధ్యప్రాచ్యంలో సంక్షోభం తలెత్తేది కాదని పునరుద్ఘాటించారు. 200 మిలియన్ డాలర్లు అధికంగా ఖర్చు చేశాం ఉక్రెయిన్కు ఆయుధాల సరఫరా, ఆర్థిక సాయం నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడుతున్నామని, త్వరలో పుతిన్తోనూ మాట్లాడుతామని చెప్పారు. ‘‘ఉక్రెయిన్– రష్యా యుద్ధానికి యూరోపియన్ యూనియన్ కంటే అమెరికా 200 మిలియన్ డాలర్లు అధికంగా ఖర్చు చేసింది. మాతో సమానంగా యూరోపియన్ యూనియన్ భారం భరించాల్సిందే. మేము ఎక్కువ ఖర్చు పెట్టాం అంటే నిజంగా మూర్ఖులమే. అందులో సందేహం లేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. శాంతిని కోరుకుంటున్నట్లు జెలెన్స్కీ తనతో చెప్పారని వివరించారు. ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు. పుతిన్ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు చర్చలకు సిద్ధమని ట్రంప్ తేలి్చచెప్పారు. యుద్ధంలో మరణాలు ఇక ఆగిపోవాలని అన్నారు. కృత్రిమ మేధలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు చైనా నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం టారిఫ్ విధించాలని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. చైనా నుంచి ఫెంటానైల్ అనే ప్రమాదకరమైన మాదకద్రవ్యం రాకుండా అడ్డుకోనున్నట్లు చెప్పారు. చైనా నుంచి మెక్సికో, కెనడా వంటి దేశాలకు, అక్కడి నుంచి అమెరికాకు ఫెంటానైల్ చేరుకుంటోందని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్తోపాటు అక్రమ వలసదార్లను అమెరికాలోకి పంపిస్తున్న దేశాల ఉత్పత్తులపై భారీగా పన్నులు విధిస్తామని ఆయన గతంలోనే హెచ్చరించిన సంగతి తెలిసిందే. కృత్రిమ మేధ(ఏఐ) మౌలిక సదుపాయాల కల్పనకు 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఒక కొత్త కంపెనీ ద్వారా నిధులు ఖర్చు చేస్తామన్నారు. ఒరాకిల్, సాఫ్ట్బ్యాంక్, ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో ఈ కంపెనీని స్థాపిస్తామన్నారు. స్టార్గేట్గా పిలిచే ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. -
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం
-
భవిష్యత్తు బంగారమేనా?
అనుకున్నదే అయింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూనే డొనాల్డ్ ట్రంప్ తన మాటలు, చేతలు, చేష్టల ద్వారా సంచలనాలు సృష్టించారు. గతంలో దేశానికి 45వ అధ్యక్షుడిగా పనిచేసి, తాజాగా 47వ అధ్యక్షుడిగా సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ తన తొలి ప్రసంగంలోనే ‘ఇక నుంచి అమెరికాకు స్వర్ణయుగం’ అంటూ అమెరికన్లలో ఆశలు, ఆకాంక్షలు పెంచారు. అయితే, ‘అమెరికాను మళ్ళీ ఘనమైన దేశంగా తీర్చిదిద్దాల’ని (మాగా) నినదిస్తూ ఆయన ప్రకటించిన కొన్ని చర్యలు ఆధిపత్య, విస్తరణవాదానికి ప్రతీకగానూ ప్రతిధ్వనించాయి. వర్తమాన ప్రపంచ అధికార క్రమాన్ని మార్చివేసే పలు చర్యలకు నడుం బిగి స్తున్న తీరు, అలాగే కోవిడ్, చైనాలను సాకుగా చూపుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి, అలాగే పర్యావరణ రక్షణపై ప్యారిస్ ఒప్పందం నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ట్రంప్ పదవీ ప్రమాణ స్వీకారం పైకి సాదాసీదా అధికార మార్పిడిగా అనిపించవచ్చు. రాజకీయ ప్రత్యర్థులు సైతం చిరునవ్వులు చిందిస్తూ సౌహార్దం చూపుకుంటున్నట్టు కనిపించవచ్చు. అంతమాత్రాన అంతా మామూలే అనుకొంటే పొరపాటు. పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో దర్శనమిచ్చిన ఐక్యతకు భిన్నంగా ప్రత్యర్థులపై తుపాకులు ఎక్కుపెట్టిన తీరు ఆయన ప్రసంగంలో స్పష్టంగా వినిపించింది. కునారిల్లిన దేశాన్ని తాను మాత్రమే మళ్ళీ పునరుత్తేజితం చేయగలనన్న భావన కలిగించడంతో పాటు ఆయన ఒకటికి రెండు జాతీయ ఎమర్జెన్సీలు ప్రకటించడం పెను పర్యవసానమే. అలాగే, చైనా నుంచి పనామా కాలువను వెనక్కి తీసుకోవాలని పిలుపునివ్వడమూ వివాదాస్పదమే. బలప్రయోగం ద్వారా మాత్రమే సాధ్యమయ్యే అలాంటి పనుల ప్రస్తావన నిప్పుతో చెలగాటానికి సిద్ధమని స్పష్టం చేయడమే. ఇక, గద్దెనెక్కిన తొలిరోజునే ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా ట్రంప్ ప్రకటించడంతో రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా మరెన్ని ఆశ్చర్యకర పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఉద్విగ్నత నెలకొంది. పదవి చేపడుతూనే ట్రంప్ చకచకా సంతకాలు చేసిన పదుల సంఖ్యలోని కార్యనిర్వాహక ఆదేశాలు ఆసక్తికరం. పర్యావరణ పరిరక్షణను గాలికొదిలేయడం, జన్మహక్కుగా సంక్రమించే పౌర సత్వంపై అమెరికా రాజ్యాంగాన్ని సైతం తోసిపుచ్చడం లాంటివి ఇట్టే మింగుడుపడే అంశాలు కావు. జాతీయతతో సంబంధం లేకుండా దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నవారికి పుట్టినబిడ్డలకు సైతం 150 ఏళ్ళ పైచిలుకుగా అమెరికా పౌరసత్వం దక్కుతూ వచ్చింది. కానీ, నెల రోజుల్లో అమలులోకి రానున్న తాజా ఆదేశం ఫలితంగా ఇప్పుడిక అలాంటి పిల్లలకు పౌరసత్వ పత్రాలివ్వరు. అదేమంటే, 1868లో చేసిన 14వ సవరణ కింద అమెరికా గడ్డపై పుడితేచాలు ఆ పిల్లలకు మారుమాట లేకుండా పౌరసత్వమివ్వాలనేమీ లేదనీ, సవరణను తప్పుగా వ్యాఖ్యానించారనీ ట్రంప్ వాదన. తాత్కాలిక వీసాలతో అమెరికాలో నివసిస్తూ, ఉద్యోగాధారిత గ్రీన్కార్డ్కై దీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న 10 లక్షల పైచిలుకు మంది భారతీయులకు ఈ కొత్త నిర్ణయం అశనిపాతమే. ఇప్పటికే కొన్నిచోట్ల ఇమ్మిగ్రేషన్ లాయర్లు కోర్టుకెక్కిన ఈ ఆదేశం గనక అమలైతే, తాత్కాలిక వర్క్ వీసాలు, టూరిస్ట్ వీసాలపై అగ్రరాజ్యంలో ఉంటున్నవారి సంతానానికి అక్కడి పౌరసత్వ ఆశలు అడుగంటినట్లే. 2022 నాటి అమెరికా జనాభా లెక్కలపై ప్యూ రిసెర్చ్ విశ్లేషణ ప్రకారం అమెరికాలో 48 లక్షల మంది భారతీయ అమెరికన్లుంటే, వారిలో మూడింట రెండొంతుల మంది వలసజీవులే. కేవలం 34 శాతం, మరో మాటలో 16 లక్షల మంది మాత్రం అగ్రరాజ్యంలోనే పుట్టారు. ఇక, చట్టవిరుద్ధమైన వలసల్ని అడ్డుకుంటాననీ, సరైన పత్రాలు లేని లక్షలాది వలస జీవుల్ని దేశం నుంచి పంపివేస్తాననీ ట్రంప్ చేసిన గర్జన కూడా లక్షలమందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ జాబితాలో మెక్సికో (40 లక్షలు), ఎల్ సాల్వడార్ (7.5 లక్షలు) తర్వాత 7.25 లక్షల మంది భారతీయులదే మూడో స్థానం. ఫలితంగా, ట్రంప్ ప్రతి మాట, ప్రతి అడుగు మనవాళ్ళలో ఆదుర్దా పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ కొత్త ఏలుబడిలో భారత్తో బంధం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. మరోపక్క డెమోక్రాట్లను జనం బాధలు పట్టని కులీనులుగా చిత్రించి, సామాన్య పౌరుల సంరక్ష కుడిగా ఎన్నికల్లో తనను తాను చూపుకొన్న ట్రంప్ను అతిగా నమ్మి మోసపోయామనే భావన రేకెత్తడం సహజమే. చేతిలోని నియంత్రణ నిర్ణయాలే అండగా ఇటీవలే ఓ బ్రాండెడ్ క్రిప్టో టోకెన్ ద్వారా ఆయన వందల కోట్ల డాలర్ల లబ్ధి పొందాడనే విమర్శలూ గుప్పుమంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 80 ఏళ్ళ తర్వాత కీలక సమయంలో పగ్గాలు చేపట్టిన ట్రంప్ తన మద్దతుదారులకై ఏమైనా చేసేలా ఉన్నారు. 2021లో అమెరికా అధ్యక్ష భవనంపై దాడి చేసిన దాదాపు 1500 మంది దుండగులకూ ఆయన తక్షణం సామూహిక క్షమాభిక్ష ప్రసాదించడమే అందుకు తార్కాణం. నాలుగేళ్ళు విచారించి, శిక్షలు వేసిన న్యాయవ్యవస్థను అలా నూతన అధ్యక్షుడు పరిహసించినట్టయింది. ఆశ్రితులు, ఆర్థిక దాతలు, బంధు మిత్రులకై క్షమాభిక్ష వ్యవస్థను దుర్వినియోగం చేయడంలో నిన్నటి బైడెన్ నుంచి నేటి ట్రంప్ దాకా అందరూ ఒకే తాను గుడ్డలన్న మాట. కాలు మోపిననాడే కాపురం చేసే లక్షణం తెలిసిందన్నట్టు ట్రంప్ 2.0 హయాం ఆరంభమవు తూనే రోజులు ఎలా ఉండనున్నాయో తేటతెల్లమైంది. బహుళ ధ్రువ ప్రపంచం వైపు అంతర్జాతీయ అధికార క్రమం అడుగులేస్తున్న కాలంలో ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో సామాజిక, ఆర్థిక రంగాల్లో ట్రంప్ ఆధిపత్యభావ నిర్ణయాలు రానున్న నాలుగేళ్ళలో ప్రపంచాన్ని కుదిపేయడం ఖాయం. -
జన్మతః పౌరసత్వం రద్దు
వాషింగ్టన్: తాత్కాలిక వీసాలపైనైనా అమెరికాలో ఉద్యోగాలు చేయాలని, సంతానానికి జన్మనివ్వాలని, తద్వారా వారికి అమెరికా పౌరసత్వం దక్కాలని కోరుకొనే భారతీయులతోపాటు ప్రపంచ దేశాల పౌరులకు, అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులకు నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పెద్ద షాక్ ఇచ్చారు. జన్మతః పౌరసత్వం దక్కే విధానానికి మంగళం పాడేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ సంచలన నిర్ణయాలకు తెరతీశారు. అంతా ఊహించినట్లుగానే తనకున్న అసాధారణ అధికారాలు ఉపయోగించుకొని పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు.స్థానిక కాలమానం ప్రకారం సోమవారం 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన తన కార్యాచరణ ప్రారంభించడం గమనార్హం. గంటల వ్యవధిలోనే పలు కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. తొలుత క్యాపిటల్ వన్ ఎరీనాలో మద్దతుదారుల సమక్షంలో, అనంతరం శ్వేతసౌధం ఓవల్ ఆఫీసులో ఆయన సంతకాలు చేయడం, మరోవైపు ఉత్తర్వులు వెలువడడం వెనువెంటనే జరిగిపోయాయి. వలసలు, వాతావరణ మార్పులు, క్షమాభిక్షలు, జన్మతః పౌరసత్వం రద్దు వంటి కీలక అంశాలపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ అయ్యాయి. పత్రాలపై తన సంతకాన్ని ట్రంప్ బహిరంగంగా ప్రజలకు చూపించారు. ఆ పెన్నులను ఉత్సాహంగా జనంపైకి విసిరేశారు. చరిత్రలోనే అత్యంత అధ్వాన పరిపాలన గత ప్రభుత్వ హయాంలో జరిగిందని ట్రంప్ ఆరోపించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 78 విధ్వంసకర విధానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.అమెరికాకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ ట్రంప్ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. భారతీయులతోపాటు ప్రపంచదేశాల ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేయగల నిర్ణయాలు సైతం ఉన్నాయి. కానీ, ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లకు చట్టపరమైన రక్షణ కొంతవరకే ఉంటుందని, ఆయన తర్వాత పగ్గాలు చేపట్టబోయే అధ్యక్షులు గానీ, కోర్టులు గానీ వాటిని తిరగదోడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ నిర్ణయాలకు కోర్టుల్లో సవాళ్లు ఎదురుకావడం ఖాయమని అంటున్నారు. నూతన అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఏమిటంటే... జన్మతః పౌరసత్వం లేనట్లే అమెరికాలో నివసిస్తున్న అక్రమవలసదార్లకు, వలస వచ్చినవారికి, తాత్కాలిక వీసాలపై ఉంటున్నవారికి అమెరికా గడ్డపై సంతానం జన్మిస్తే.. ఇకపై జన్మతః అమెరికా పౌరసత్వం లభించదు. తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా ఇక్కడ పుట్టిన వారి బిడ్డలకు జన్మతః పౌరసత్వం లభించే వెసులుబాటు గత శతాబ్ద కాలంగా అమలవుతోంది. ఈ మేరకు వందేళ్ల క్రితమే 14వ రాజ్యాంగ సవరణ చేశారు. 1868లో చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని ట్రంప్ ఆదేశించారు. జన్మతః పౌరసత్వం లభించే అవకాశం ఉండొద్దని తేల్చిచెప్పారు. దీనివల్ల లక్షలాది మందికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి.ప్రధానంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులకు జన్మించే సంతానానికి ఇక్కడి పౌరసత్వం దక్కడం కష్టమే. అయితే, ఈ విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని కొందరు ఫెడరల్ కోర్టులో సవాలు చేసినట్లు తెలిసింది. చట్టపరంగా ఇది చెల్లదని అంటున్నారు. ట్రంప్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం.. అమెరికా గడ్డపై పుట్టినవారికి పౌరసత్వం రావాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కరైనా అమెరికా పౌరులై ఉండాలి. లేదా చట్టపరమైన శాశ్వత నివాసిత హోదా(గ్రీన్కార్డు హోల్డర్) ఉండాలి. ఒకవేళ వలసదార్లు అమెరికా సైన్యంలో పని చేస్తూ ఉంటే వారికి జన్మించే పిల్లలకు కూడా పౌరసత్వం లభిస్తోంది. అక్రమ వలసదారులంతా వెనక్కే మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ‘రిమెయిన్ ఇన్ మెక్సికో విధానాన్ని ట్రంప్ పునరుద్ధరించారు. ప్రస్తుతం సరిహద్దుల్లో వేచిచూస్తున్న 70 వేల మంది నాన్–మెక్సికన్ శరణార్థులను వెనక్కి పంపించబోతున్నారు. ‘క్యాచ్ అండ్ రిలీజ్’కు శుభంకార్డు వేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని గుర్తించి వెనక్కి పంపబోతున్నారు. శరణార్థులుగా గుర్తించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నవారికి కూడా వదిలిపెట్టరు. అక్రమ వలసదార్లంతా అమెరికాను విడచిపెట్టి వెళ్లిపోవాల్సిందే. లేకపోతే బలవంతంగానైనా వెళ్లగొడతారు. ఈ విషయంలో ట్రంప్ నిర్ణయానికి చట్టపరమైన సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. జాతీయ అత్యవసర పరిస్థితి అమెరికా సార్వభౌమత్వం ప్రమాదంలో పడిందని ట్రంప్ ఎప్పటినుంచో చెబుతున్నారు. అందుకే మెక్సికో సరిహద్దుల్లో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. దీంతో మెక్సికో సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి, గోడ నిర్మాణానికి స్వేచ్ఛగా నిధులు వాడుకొనే అవకాశం ట్రంప్కు లభించింది. డ్రగ్స్ గ్యాంగ్లపై ఉగ్రవాద ముద్ర అమెరికాలో చెలరేగిపోతున్న మాదక ద్రవ్య ముఠాలు, అంతర్జాతీయ డ్రగ్స్ గ్యాంగ్లను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా పరిగణిస్తూ ట్రంప్ ఉత్తర్వు జారీ చేశారు. ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలున్న జాబితాలో ఇవి చేరబోతున్నాయి. అంటే డ్రగ్స్ గ్యాంగ్లపై ఇక కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. ఇంధన అత్యవసర పరిస్థితి ట్రంప్ జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. చమురు నిల్వలు పెంచాలని ఆదేశించారు. శిలాజ ఇంధనాల ఉత్పత్తిని భారీ పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాస్కా నుంచి చమురు, గ్యాస్, ఇతర సహజ వనరులను భారీగా సమీకరించాలని పేర్కొంటూ ఉత్తర్వుపై సంతకం చేశారు. హరిత ఉద్యోగాల(గ్రీన్ జాబ్స్) కల్పనకు జో బైడెన్ తీసుకొచ్చిన గ్రీన్ న్యూ డీల్ను నిలిపివేశారు. టిక్టాక్ మరో 75 రోజులు అమెరికాలో టిక్టాక్పై నిషేధం విధిస్తూ తీసుకొచ్చిన చట్టం అమలును ట్రంప్ 75 రోజులపాటు వాయిదా వేశారు. చైనాకు చెందిన టిక్టాక్కు ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదు. టిక్టాక్ను తొలుత వ్యతిరేకించిన ట్రంప్ తర్వాత సానుకూలంగా మారిపోయారు. ఎన్నికల ప్రచారంలో ఈ మాధ్యమాన్ని చక్కగా వాడుకున్నారు. కొత్త నియామకాలకు చెల్లు! అమెరికా సైన్యంతోపాటు కొన్ని ఇతర విభాగాల్లో తప్ప ప్రభుత్వంలో కొత్త నియామకాలు చేపట్టవద్దని ట్రంప్ తేలి్చచెప్పారు. ప్రభుత్వంపై ట్రంప్ పూర్తి పట్టుసాధించేదాకా నియామకాలు ఉండవు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులంతా ఆఫీసులకు కచ్చితంగా హాజరై విధులు నిర్వర్తించాల్సిందేనని, ఇంటి నుంచి పనిచేసే వెలుసుబాటు ఎవరికీ ఉండదని ట్రంప్ స్పష్టంచేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పునరుద్ధరణ దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పునరుద్ధరిస్తూ, ప్రభుత్వ సెన్సార్íÙప్ను నియంత్రిస్తూ ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. జో బైడెన్ హయాంలో డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ వంటి సంస్థల సాగించిన కార్యకలాపాలపై విచారణ జరపాలని అటార్నీ జనరల్ను ఆదేశించారు. విదేశాలకు సాయం నిలిపివేత విదేశాలకు ఆర్థిక సాయం తాత్కాలికంగా నిలిపివేస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు. విదేశాలకు సహాయం అందించే కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని తెలిపారు. ‘అమెరికా ఫస్ట్’ విదేశాంగ విధానంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వెనెజ్వెలాపై ఆంక్షలు పునరుద్ధరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల జాబితాలో క్యూబాను మళ్లీ చేర్చారు. పౌరుల జీవన వ్యయం తగ్గింపు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు పౌరుల జీవన వ్యయాన్ని గణనీయంగా తగ్గించాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లు, ఆరోగ్య సంరక్షణ, గృహోపకరణాలు, నిత్యావసరాలు, ఇంధనం ధరలు తగ్గించాలన్నారు. దీనిపై వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని చెప్పారు. జీవన వ్యయం ఏ మేరకు తగ్గిందో 30 రోజుల్లోగా తనకు నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ఇకపై గల్ఫ్ ఆఫ్ అమెరికా గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాలని ట్రంప్ స్పష్టంచేశారు. అలాస్కాలోని మౌంట్ డెనాలీ పేరును మౌంట్ మెక్కిన్లీగా మార్చాలన్నారు. వాస్తవానికి మౌంట్ మెక్కిన్లీ పేరును బరాక్ ఒబామా హయాంలో మౌంట్ డెనాలీగా మార్చారు. కెనడా, మెక్సికో ఉత్పత్తులపై పన్నుల మోత కెనడా, మెక్సికో నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులు, వస్తువులపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పన్ను లు పెంచాలని ట్రంప్ ఆదేశించారు. చైనా, కెనడా, మెక్సికో తదితర దేశాలతో వాణిజ్య సంబంధాల్లో అనైతిక పద్ధతులపై సమీక్ష నిర్వహించాలన్నారు. ట్రాన్స్జెండర్లకు చేదు వార్త లింగ మార్పిడి చేయించుకున్నవారికి ట్రంప్ చేదువార్త చెప్పారు. అమెరికాలో ఇకపై పురుష, మహిళ అనే రెండు లింగాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని, మూడో లింగాన్ని గుర్తించడం లేదని స్పష్టంచేశారు. మహిళలు గానీ, పురుషులు గానీ లింగ మార్పిడి చేయించుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. అయితే, ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో ఇక్కట్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి. మద్దతుదారులకు క్షమాభిక్ష 2021 జనవరి 6వ తేదీన క్యాపిటల్ భవనంపై దాడి కేసులో నిందితులైన తన మద్దతుదారులకు ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించేశారు. దోషులుగా తేలినవారికి విముక్తి కల్పించారు. జైలుశిక్షలు సైతం రద్దు చేశారు. మొత్తానికి ట్రంప్ దాతృత్వం వల్ల 1,500 మందికిపైగా నిందితులు/దోషులు కేసుల నుంచి బయటపడ్డారు. పోలీసులతో ఘర్షణకు దిగి బీభత్సం సృష్టించినవారందరిపై ట్రంప్ కరుణ చూపారు. వారిపై నమోదైన కేసులన్నీ ఒక్క కలంపోటుతో రద్ద య్యాయి. ఇప్పటికే జైలుపాలైన వారంతా ఇక బయటకు రాబోతున్నారు.వలస నేరగాళ్లకు మరణ శిక్ష ఉద్యోగం, ఉపాధి కోసం అమెరికాకు వలస వచ్చి నేరాలకు పాల్పడివారికి మరణశిక్ష విధించబోతున్నారు. అమెరికాలో ఇటీవల మరణశిక్షలు విధించలేదు. ట్రంప్ వాటిని పునరుద్ధరిస్తున్నా రు. హత్యలు చేసినవారికి మరణశిక్ష విధి స్తారు. అలాగే యూఎస్ శరణార్థి సెటిల్మెంట్ ప్రోగ్రామ్ను ట్రంప్ రద్దు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు గుడ్బైప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు ట్రంప్ గుడ్బై చెప్పేశారు. డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా తప్పుకొనే ప్రక్రియ ప్రారంభమైనట్లే. ఇది చాలా పెద్ద నిర్ణయమని ఆయన అభివర్ణించారు. 2020లో కోవిడ్–19 మహమ్మారి ఉధృతి సమయంలో డబ్ల్యూహెచ్ఓ వ్యవహార శైలి పట్ల ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికా పట్ల ఆ సంస్థ స్పందన సక్రమంగా లేదని విమర్శించారు. చైనా పట్ల పక్షపాతం చూపుతోందని మండిపడ్డారు. ట్రంప్ తాజా నిర్ణయంపై డబ్ల్యూహెచ్ఓ విచారం వ్యక్తంచేసింది.పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వెనక్కిచరిత్రాత్మక పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంటోంది. తద్వారా వాతావరణ మార్పులను నియంత్రించడంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కృషికి భారీ విఘాతం కలగబోతోంది. పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి అమెరికా వైదొలగుతున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ తేల్చిచెప్పారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. 2017లో ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. కానీ, మళ్లీ ఆ ఒప్పందంలో భాగస్వామిగా చేరారు. ఏమిటీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్? అమెరికా ప్రభుత్వాన్ని శీఘ్రగతిన సంస్కరించడానికి, పరిపాలనను పరుగులు పెట్టించడానికి డొనాల్డ్ ట్రంప్ ఎంచుకున్న మార్గం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. కాంగ్రెస్ అనుమతి లేకుండానే అధ్యక్షుడు కొన్ని నిర్ణయాలు తీసుకొనే అధికారం ఇలాంటి ఉత్తర్వుల ద్వారా లభిస్తుంది. అయితే, కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రభుత్వం ఎలా వ్యవహరించాలని అధ్యక్షుడు కోరుకుంటాడో ఆ మేరకు కొన్ని స్టేట్మెంట్లపై సంతకాలు చేస్తాడు. ఆ స్టేట్మెంట్లను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఉంటారు. ఇలాంటి ఆర్డర్లు ఒక రకంగా సలహాలు, విజ్ఞప్తుల్లాంటివే. కొన్ని ఆర్డర్లను సవాలు చేయడానికి వీల్లేదు. కొన్నింటిని కోర్టుల్లో సవాలు చేయొచ్చు. కాంగ్రెస్ లేదా కోర్టులు ఇలాంటి ఉత్తర్వులను నిలిపివేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. -
జైశంకర్కు ముందు సీటు.. మెలానియా తళుకులు.. సందడిగా సాగిన ట్రంప్ ఈవెంట్లో చిత్రాలెన్నో!
-
ట్రంప్, జేడీ వాన్స్ ప్రమాణం.. ప్రత్యేక ఆకర్షణగా ఉషా చిలుకూరి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలు దేశాధినేతలు, ప్రముఖులు పాల్గొన్నారు. ఇక, జేడీ వాన్స్ ప్రమాణం సందర్భంగా ఆయన పక్కనే తన భార్య ఉషా వాన్స్(Usha Vance) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఉషా చిలుకూరి ఆనందంతో ఉప్పొంగిపోయారు. సాధారణంగా అధ్యక్షుడి కంటే ముందు ఉపాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ క్రమంలోనే తొలుత అమెరికా నూతన ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ చేత సుప్రీంకోర్టు న్యాయమూర్తి బ్రెట్ కవనాగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా భార్య ఉషా చిలుకూరి, పిల్లలు ఆయన పక్కనే నిల్చుని ఉన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం జేడీ వాన్స్.. తన సతీమణి ఉషా చిలుకూరి ప్రేమగా ముద్దిచ్చారు.ఇక, ప్రమాణం సందర్బంగా జేడీ వాన్స్..‘విదేశీ, దేశీయ శత్రువులందరికీ వ్యతిరేకంగా.. నేను యునైటెడ్ స్టేట్స్ రాజ్యాంగానికి మద్దతు ఇస్తానని, దానిని రక్షించుకుంటానని నేను గంభీరంగా ప్రమాణం చేస్తున్నాను. నేను అమెరికా రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం, విధేయతను కలిగి ఉంటాను. ఎటువంటి మెంటల్ రిజర్వేషన్ లేదా ఎగవేత ఉద్దేశ్యం లేకుండా.. నేను ఈ బాధ్యతను స్వేచ్ఛగా తీసుకుంటాను. నేను ప్రవేశించబోయే పదవి విధులను నేను చక్కగా, నమ్మకంగా నిర్వర్తిస్తాను అని అన్నారు.Having a woman who looks into your eyes with the trust and faith that J.D. Vance's wife, Usha, does is truly beautiful. It's a wonderful day for such a lovely family. pic.twitter.com/QviCXTK9PO— Kish (@kish_nola) January 20, 2025ఇదిలా ఉండగా.. జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్ భారత సంతతికి చెందినవారు. ఆమెకు తెలుగు మూలాలు కూడా ఉన్నాయి. ఆమె తల్లిదండ్రుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్. వారు సుదీర్ఘ కాలం కిందటే ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. దీంతో ఉషా చిలుకూరి అక్కడే జన్మించారు. 1986లో కాలిఫోర్నియాలో జన్మించిన ఉషా చిలుకూరి.. శాన్ డియాగో శివారులో పెరిగారు. ఆమె రాంచో పెనాస్క్విటోస్లోని మౌంట్ కార్మెల్ హైస్కూల్లో విద్యను అభ్యసించారు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. ఆమె యేల్ విశ్వవిద్యాలయం నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీని పొందారు.జేడీ వాన్స్తో పరిచయం..2013లో జేడీ వాన్స్ను ఉషా చిలుకూరి కలిశారు. వారు కలిసి సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికాపై చర్చా సమూహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ బంధం ఏర్పడింది. ఆ తర్వాత వారు 2014లో వివాహం చేసుకున్నారు. ఒక హిందూ పూజారి సమక్షంలో నిర్వహించిన వేడుకలో ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జేమ్స్ డేవిడ్ వాన్స్-ఉషా చిలుకూరి వాన్స్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు ఇవాన్, వివేక్, మిరాబెల్.Vice President JD Vance and Second Lady Usha joined President Trump and First Lady Melania for an inaugural ball dance. I’m crying 🥹❤️🇺🇸pic.twitter.com/vqLtMpB2sy— Jane Carrot (@JanecheersJazz) January 21, 2025 -
ట్రంప్ ప్రమాణం.. ఫుల్ జోష్లో ఎలాన్ మస్క్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ భవనంలో ఈ వేడుక జరిగింది. ట్రంప్ ప్రమాణం వేళ బిలియనీర్ ఎలాన్ మస్క్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. వేదికపై డ్యాన్స్ చేస్తూ ఎంతో ఆనందంగా కనిపించారు.అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎలాన్ మస్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదికపై హాడావుడి చేశారు. అక్కడి వచ్చిన ప్రముఖులు, పార్టీ నేతల్లో జోష్ నింపారు. అలాగే, ట్రంప్ ప్రసంగంలో భాగంగా దేశ సంపదను పెంచుతానని, భూభాగాన్ని విస్తరిస్తానంటూ పేర్కొన్నారు. అంగారక గ్రహంపైకి అమెరికా వ్యోమగాములను పంపిస్తానని ట్రంప్ చెప్పారు. తమ జెండాను అక్కడ పాతుతామన్నారు. ఈ వ్యాఖ్యలకు మస్క్ సంబురపడిపోయారు.Elon Musk’s reaction to Trump saying today: “We will pursue our manifest destiny into the stars by launching American astronauts to plant the Stars and Stripes on the planet Mars.” pic.twitter.com/XMLQC2OTuu— Sawyer Merritt (@SawyerMerritt) January 20, 2025 ఈ సందర్బంగా ఎలాన్ మస్క్ థంబ్ చూపిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇక, ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో రానున్న కాలంలో మస్క్ మరిన్ని రాకెట్ ప్రయోగాలు చేపట్టే అవకాశం ఉంది. దీంతో మార్స్ గ్రహం అంశం ఇప్పుడు మరింత హాట్ టాపిగ్గా మారింది. ఇక, మస్క్ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.pic.twitter.com/hH6i7xYy60— Elon Musk (@elonmusk) January 20, 2025కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి ట్రంప్తో కలిసి మస్క్ ముందుకు సాగారు. ఎన్నికల్లో ట్రంప్ గెలిచే వరకు మస్క్ అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక, ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ విజయం సాధించడంతో తన కేబినెట్లో మస్క్కు కీలక పదవి అప్పగించారు.DO NOT BELIEVE THE MEDIA The media is misleading you. Elon Musk never did a Nazi salute. Watch the full video: He simply gestured and said, “Thank you, my heart goes out to you.” pic.twitter.com/e3vBaLoVqx— DogeDesigner (@cb_doge) January 20, 2025 -
ట్రంప్ ఇచ్చిన బాధ్యతల నుంచి వైదొలగిన వివేక్ రామస్వామి.. కారణం?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణం వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్ కార్యవర్గంలో కీలకమైన డోజ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ) బాధ్యతల నుంచి భారత అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) తప్పుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విషయాన్ని వెల్లడించారు. ఇందుకు కారణం మాత్రం వెల్లడించలేదు.భారత సంతతి వివేక్ రామస్వామి కీలక ప్రకటన చేశారు. ట్రంప్ కార్యవర్గంలో కీలకమైన డోజ్ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్టు తెలిపారు. అయితే, ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ఎలాన్ మస్క్తోపాటు వివేక్ రామస్వామిని ఈ బాధ్యతల్లో నియమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఒహైయో గవర్నర్గా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో వివేక్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సందర్బంగా వివేక్ రామస్వామి.. డోజ్ ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. ప్రభుత్వాన్ని క్రమబద్ధీకరించడంలో ఎలాన్ మస్క్ బృందం విజయం సాధిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఒహియోలో నా భవిష్యత్ ప్రణాళికల గురించి త్వరలో నేను మరిన్ని చెప్పాలి. ముఖ్యంగా, అధ్యక్షుడు ట్రంప్ అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడానికి మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన నిర్ణయం ఆసక్తికరంగా మారింది.It was my honor to help support the creation of DOGE. I’m confident that Elon & team will succeed in streamlining government. I’ll have more to say very soon about my future plans in Ohio. Most importantly, we’re all-in to help President Trump make America great again! 🇺🇸 https://t.co/f1YFZm8X13— Vivek Ramaswamy (@VivekGRamaswamy) January 20, 2025ఇదిలా ఉండగా.. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలిరోజే దాదాపు 100కుపైగా కార్యనిర్వాహక ఆదేశాల (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల)పై సంతకాలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడి చేతిలో అత్యంత శక్తిమంతమైన సాధనంగా పేర్కొనే ఈ ఆదేశాల ప్రాధాన్యం, వాటి అమలు గురించిన అంశాలను పరిశీలిస్తే.. అమెరికా చట్టసభ ఆమోదం లేకుండా సమాఖ్య ప్రభుత్వానికి అధ్యక్షుడు జారీ చేసే లిఖితపూర్వక ఆదేశాలనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటారు. ప్రభుత్వ విధానాలకు సంబంధించి అధ్యక్షుడు తీసుకునే కీలక నిర్ణయాలు ఇందులో ఉంటాయి.కేంద్ర సంస్థలకు ఆదేశాలు ఇవ్వడం లేదా నివేదికలను కోరడం వంటివి ఉండవచ్చు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఈ ఆదేశాలు జారీచేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. ఆ దేశాలకు చట్టబద్ధత ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను తిరస్కరించేందుకు చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం కాంగ్రెస్కు ఉన్నప్పటికీ.. దానిపై వీటో అధికారం మాత్రం అధ్యక్షుడిదే. అందుకే కాంగ్రెస్ ఆమోదించలేని అంశాలను తమ అజెండాలో అధ్యక్షుడు పెట్టుకుంటారు. చట్టసభ ఆమోదం లేకుండా జారీచేసే అధికారం అధ్యక్షుడికి ఉన్నా.. వీటికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆదేశాలను వ్యతిరేకించ లేనప్పటికీ.. ఆ నిర్ణయాలకు అవసరమైన నిధులు ఇవ్వకుండా అడ్డుకోవడం లేదా ఇతర అడ్డంకులు సృష్టించడం ద్వారా వీటి అమలుకు ‘కాంగ్రెస్’ ఆటంకం కలిగించే వీలుంది. మునుపటి అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయడానికి ఈ ఎగ్జిక్యూటివ్ను కొత్త అధ్యక్షుడు ఉపయోగించే అవకాశం ఉంది. -
ట్రంప్ దూకుడు.. తొలి రోజే సంచలన నిర్ణయాలు
President Donald Trump Key Decisions Updates..అమెరికా అధ్యక్షుడిగా(47వ) బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.నలుగురు అధికారులపై ట్రంప్ వేటు..అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ట్రంప్ దూసుకెళ్తున్నారు.నలుగురు అధికారులపై ట్రంప్ వేటు వేశారు.అలాగే, ‘వెయ్యి మందికి’ హెచ్చరికలు మంజూరుతన అధ్యక్ష కార్యాలయం ప్రస్తుతం వడపోత పనులు చూస్తోందని ట్రూత్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించిన ట్రంప్మునుపటి అధ్యక్షుడి కాలంలో నియమితులైన వెయ్యి మందిపై వేటు పడనుందని వెల్లడి‘అమెరికాను మళ్లీ గొప్పగా మార్చాలి’ అనే మా విధానానికి అనుగుణంగా లేని వారంతా విధుల్లో కొనసాగలేరని వ్యాఖ్యలుఖడ్గం పట్టుకుని ట్రంప్ డ్యాన్స్అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం వేళ ట్రంప్ డ్యాన్స్అమెరికా మిలటరీకి చెందిన ఖడ్గంతో ట్రంప్ డ్యాన్స్ చేశారు.ట్రంప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. THE MOST DANGEROUS MAN IN THE WORLD RIGHT NOW...😎🇺🇸🤣🤣🤣 pic.twitter.com/b0MwA5xf2l— il Donaldo Trumpo (@PapiTrumpo) January 21, 2025 భారతీయులకు ట్రంప్ ఝలక్?విదేశీ మహిళలు అమెరికాలో ప్రసవిస్తే వారి శిశువులు పొందే పౌరసత్వ హక్కును రద్దు చేసిన ట్రంప్పేరెంట్స్లో ఒకరికైనా యూఎస్ సిటిజన్షిప్, శాశ్వత నివాసి, యూఎస్ మిలిటరీ సభ్యత్వం ఉండాలి.ఇలా ఏదో ఒక గుర్తింపు ఉండాలని నిబంధన విధించిన ట్రంప్2024 గణాంకాల ప్రకారం అమెరికాలో 5.4 మిలియన్ల భారతీయ అమెరికన్లుయూఎస్ జనాభాలో 1.47 శాతం మంది భారతీయులే. ఇక, చైనీయులు కూడా అమెరికాలో భారీ సంఖ్యలోనే ఉన్నారు. దీంతో, వారు కూడా అమెరికాను వీడే అవకాశం ఉంది. పుతిన్కు హెచ్చరికలు..ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై స్పందించిన ట్రంప్..రష్యాను పుతిన్ నాశనం చేస్తున్నారన్న మండిపడిన ట్రంప్.యుద్ధాన్ని ఆపేందుకు ఉక్రెయిన్ ప్రతిపాదిస్తున్న ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు అంగీకరించడం లేదని కామెంట్స్పుతిన్ వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకోవాలని సూచనలేకపోతే రష్యా గొప్ప ఇబ్బందుల్లో చిక్కుకుంటుందని హెచ్చరిక కెనడా, మెక్సికో ఉత్పత్తులపై పన్నులు: ట్రంప్కెనడా, మెక్సికో షాకిచ్చిన ట్రంప్.ఫిబ్రవరి 1 నుంచి కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం పన్నులు విధింపు.ఆ రెండు దేశాలు సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేయకపోతే పన్నుల విధింపు తప్పదని ఇది వరకే హెచ్చరించిన ట్రంప్ఈ మేరకు తాజాగా ప్రకటనఅయితే, చైనా ఉత్పత్తులపై సుంకాల విధింపు గురించి వెల్లడించని అమెరికా నూతన అధ్యక్షుడుPresident Trump: 25% tariffs on each of Canada and Mexico beginning February 1st. pic.twitter.com/ncfBmMI242— Stephen Taylor (@stephen_taylor) January 21, 2025క్యాపిటల్ దాడి కేసులు రద్దు.. ట్రంప్ క్షమాభిక్ష2021 జనవరి 6న దాడుల్లో పాల్గొన్న 1500 మందికి ఉపశమనం కల్పించిన ట్రంప్కార్యాలయంలోకి వచ్చిన మొదటి రోజునే తనకున్న ప్రత్యేక అధికారాల వినియోగంఈ చర్యతో యూఎస్ న్యాయశాఖ చరిత్రలోనే అతిపెద్ద విచారణ, సుదీర్ఘ దర్యాప్తునకు ముగింపుతన మద్దతుదారులకు క్షమాభిక్ష ప్రసాదిస్తానని ఎన్నికల సమయంలోనే హామీట్రంప్ కీలక సంతకాలు ఇవే..బైడెన్ ప్రభుత్వం జారీ చేసిన 80 విధ్వంసకర, రాడికల్ పరిపాలనా ఉత్తర్వులు రద్దు చేసిన ట్రంప్ట్రంప్ యంత్రాంగంపై పట్టు సాధించేవరకు అధికారులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండా ఉత్తర్వులుమిలిటరీ, ఇతర ముఖ్యమైన ప్రాంతాలు మినహా అన్ని సమాఖ్య నియామకాలు నిలిపివేతపారిస్ వాతావరణ ఒప్పందం నుంచి బయటకు వచ్చిన ట్రంప్వాక్ స్వాతంత్ర్యంపై సెన్సార్ తొలగింపు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఔట్..అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం. అమెరికాను ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి తొలగిస్తూ సంతకం. కోవిడ్ వ్యాప్తి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బాధ్యతారాహిత్య తీరుతో ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ఈమేరకు నిర్ణయం తీసుకొన్నారు. President Trump withdraws the United States from the World Health Organization.pic.twitter.com/4vnEJTQQl9— நெல்லை செல்வின் (@selvinnellai87) January 21, 2025 AMERICA IS BACK. 🇺🇸Every single day I will be fighting for you with every breath in my body. I will not rest until we have delivered the strong, safe and prosperous America that our children deserve and that you deserve. This will truly be the golden age of America. pic.twitter.com/cCuSV8Q44Z— President Donald J. Trump (@POTUS) January 20, 2025 మోదీ అభినందనలు..అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు. ట్విట్టర్ వేదికగా మోదీ..‘నా ప్రియ మిత్రుడు డొనాల్డ్ ట్రంప్నకు అభినందనలు. ఇరు దేశాలకు ప్రయోజనం కలిగించేందుకు, ప్రపంచ భవితను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఆయనతో మరోసారి కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఆయన పదవీకాలం సాఫీగా సాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని కామెంట్స్ చేశారు. ఉత్తర్వులే ఉత్తర్వులు! బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వలసలపై ఉక్కుపాదం, మెక్సికో సరిహద్దుల్లో మరిన్ని సైనిక దళాల మోహరింపు, జన్మతః పౌరసత్వ విధానం రద్దు, చైనా, కెనడాలపై టారిఫ్ల పెంపు, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడం వంటివి వీటిలో ఉన్నట్టు వైట్హౌస్ వర్గాలు చెప్పాయి. వివరాలు వెల్లడించేందుకు నిరాకరించాయి. అయితే చాలా ఉత్తర్వుల అమలుపై న్యాయపరమైన సవాలు ఎదురవడం ఖాయమంటున్నారు.ట్రంప్ రాకతో వైట్హౌస్ వెబ్సైట్ కూడా కొత్త రూపు సంతరించుకుంది. ‘అమెరికా ఈజ్ బ్యాక్’ అనే హెడ్డింగ్తో ‘నా ప్రతి శ్వాసతోనూ అమెరికన్ల కోసమే పోరాడతా’ అంటూ ట్రంప్ సందేశాన్ని హోం పేజీలో హైలైట్ చేసింది. ట్రంప్ తాజా నిర్ణయాలను పోస్ట్ చేసింది. ‘‘పన్నులు, చమురు ధరలు, విద్యుత్ చార్జీలు తగ్గుతాయి. సైన్యాన్ని ఆధునికీకరిస్తారు. విఫల విధానాలు రద్దవుతాయి. పలు దేశాల్లో జరుగుతున్న యుద్ధాలకు తెర దించేందుకు ట్రంప్ ప్రాధాన్యమిస్తారు’’ అని పేర్కొంది. BREAKING: President Trump signs an Executive Order designating the cartels as foreign terrorist organizations pic.twitter.com/Pc6pbMsbBo— Libs of TikTok (@libsoftiktok) January 21, 2025 -
మొండిఘటం మరో చరిత్ర!
వివాదాలు. విమర్శలు. అభిశంసనలు. కోర్టు కేసులు. రుజువైన క్రిమినల్ నేరాలు. సొంత పార్టిలోనే విమర్శలు. మొత్తంగా రాజకీయ భవితవ్యంపైనే నీలినీడలు. హత్యాయత్నాలు. ప్రత్యర్థుల ప్రచార హోరు. వీటన్నింటినీ తట్టుకుంటూ 78 ఏళ్ల వయసులోనూ మరోసారి అమెరికా అధ్యక్షునిగా గెలిచి చూపించిన మొండి ఘటం డొనాల్డ్ ట్రంప్. ఆ ఘనత సాధించిన అత్యంత వృద్ధునిగా రికార్డు సృష్టించి విమర్శకుల నోళ్లు మూయించారు. రెండుసార్లూ ట్రంప్ ఓడించిన డెమొక్రాట్ ప్రత్యర్థులు మహిళలే కావడం విశేషం. 2016 అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ను ఓడించగా ఈసారి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్పై ఆయన ఘనవిజయం సాధించారు. కష్టకాలాన్ని దాటి... నిజానికి గత నాలుగేళ్లూ ట్రంప్కు కష్టకాలంగానే గడిచాయి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓటమితో ఆయనకు సమస్యలు మొదలయ్యాయి. ఆ ఓటమిని ఒప్పుకోకపోవడమే గాక బైడెన్కు అధికార పగ్గాలు అప్పగించేందుకు కూడా ట్రంప్ నిరాకరించారు. బైడెన్ విజయాన్ని ధ్రువీకరించేందుకు 2021 జనవరి 6న కాంగ్రెస్ సంయుక్త భేటీ జరుగుతున్న క్యాపిటల్ హిల్పైకి మద్దతుదారులను దాడికి ఉసిగొల్పి ప్రపంచాన్నే నివ్వెరపరిచారు. ఆ క్రమంలో చోటుచేసుకున్న హింసాకాండ ఇటీవలి దాకా కేసుల రూపంలో ట్రంప్ను వెన్నాడింది. తర్వాత హష్ మనీ ఉదంతంలో క్రిమినల్ కేసును ఎదుర్కొన్నారు. న్యాయ విచారణకు హాజరైన ఏకైక మాజీ అధ్యక్షునిగా చెత్త రికార్డునూ మూటగట్టుకున్నారు. హష్ మనీ కేసులో దోషిగానూ రుజువయ్యారు. అలా నేరస్తునిగా ముద్రపడ్డాక అధ్యక్షుడైన తొలి నేతగా కూడా నిలిచారు! డెమొక్రాట్ల అభ్యర్థిగా బైడెన్ తప్పుకుని కమలా హారిస్ తెరపైకి రావడంతో పోరు హోరాహోరీగా సాగడం ఖాయమంటూ అంచనాలు వెల్లువెత్తాయి. అందుకు తగ్గట్టే ఆమెతో జరిగిన ఏకైక అధ్యక్ష డిబేట్లో ట్రంప్ పూర్తిగా తేలిపోయారు. అయినా ఎక్కడా వెనక్కు తగ్గలేదు. అభిమానుల తిరుగులేని మద్దతు ఆయనకు పెట్టనికోటగా నిలిచింది. ప్రచార క్రమంలో పెన్సిల్వేనియాలో ట్రంప్పై జరిగిన హత్యాయత్నం సంచలనం రేపింది. దుండగుని తూటా ఆయన చెవిని గాయపరుస్తూ దూసుకెళ్లడంతో ప్రాణాపాయం త్రుటిలో తప్పింది. అలాంటి సమయంలోనూ పిడికిలి బిగించి ‘ఫైట్, ఫైట్’అని నినదిస్తూ ట్రంప్ ప్రదర్శించిన మొక్కవోని ధైర్యం అమెరికన్లను ఆకట్టుకుంది. ఆయన అమెరికా ఫస్ట్ నినాదం ఓటర్లను మరోసారి ప్రభావితం చేసింది. వలసలపై ఉక్కుపాదం మోపుతానని, ఆర్థిక అవ్యవస్థను చక్కదిద్దుతానని, చైనాకు ముకుతాడు వేస్తానని, యుద్ధాలకు తెర దించుతానని, మొత్తంగా అమెరికాను తిరిగి గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన హామీలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. వాటిముందు హారిస్ ఆఫ్రో ఆసియన్ మూలాలు, ప్రచార వ్యూహాల వంటివేవీ పని చేయలేదు. గత నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఏకపక్ష విజయం సాధించారు. అమెరికాలో కెనడా 51వ రాష్ట్రంగా మారితే మేలనడం, చైనాపై టారిఫ్లు తప్పవని హెచ్చరించడం, గ్రీన్లాండ్ను, పనామా కాల్వను స్వా«దీనం చేసుకుంటానని, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానని ప్రకటించడం ద్వారా తన పాలన ఎలా ఉండనుందో సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో అధ్యక్షునిగా రెండో విడతలో ట్రంప్ ఏమేం చేస్తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. ఆది నుంచీ... ట్రంప్ 1946 జూన్ 14న న్యూయార్క్ లోని క్వీన్స్లో మేరీ ఫ్రెడ్ దంపతులకు జన్మించారు. ఐదుగురు సంతానంలో నాలుగోవాడు. పెన్సిల్వేనియా వర్సిటీలో ఫైనాన్స్లో డిగ్రీ చేశారు. 1971లో తండ్రి నుంచి రియల్టీ వ్యాపార బాధ్యతలను స్వీకరించారు. హోటల్స్, రిసార్టులు, నిర్మాణంతో పాటు క్యాసినోలు, గోల్ఫ్ కోర్సులు తదితరాల్లోకీ విస్తరించారు. రియాలిటీ టీవీ షో ద్వారా దేశవ్యాప్తంగా పాపులరయ్యారు. ట్రంప్కు మూడు పెళ్లిళ్లయ్యాయి. మోడల్, క్రీడాకారిణి ఇవానా జెలింకోవాకు 1990లో విడాకులిచ్చారు. వారికి డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంకా, ఎరిక్ జన్మించారు. 1993లో మార్లా మేపుల్స్ను పెళ్లాడి టిఫానీకి జన్మనిచ్చారు. 1999లో ఆమెకు విడాకులిచ్చి 2005లో స్లొవేనియా మోడల్ మెలానియాను పెళ్లాడారు. వారి సంతానం బారన్ విలియం ట్రంప్.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇక స్వర్ణయుగం.. అన్నింటా ‘అమెరికాయే ఫస్ట్’: ట్రంప్
వాషింగ్టన్: అమెరికాకు తిరిగి స్వర్ణయుగాన్ని తీసుకొస్తానని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ జె.ట్రంప్ ప్రకటించారు. దేశ 47వ అధ్యక్షునిగా సోమవారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ఆ వెంటనే జాతినుద్దేశించి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. నాలుగేళ్ల డెమొక్రాట్ల పాలనలో అమెరికాకు అన్ని రంగాల్లోనూ తీరని ద్రోహం జరిగిందని ఆక్షేపించారు. దాన్ని సమూలంగా సరిదిద్దేలా ప్రజలు ఎన్నికల్లో తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారన్నారు. ‘‘అమెరికా పతనానికి ఈ క్షణమే అడ్డుకట్ట పడింది. స్వర్ణయుగం మొదలైంది. ఈ జనవరి 20 అమెరికా పాలిట విముక్తి దినం. భవిష్యత్తంతా ఇక మనదే. మన దేశం నేటినుంచి అన్నిరంగాల్లోనూ అద్భుతంగా రాణిస్తుంది. భూమిపైనే అత్యంత శక్తిమంతమైన, గౌరవప్రదమైన దేశంగా ప్రపంచమంతటా మన్ననలు పొందుతుంది. ప్రతి దేశమూ అబ్బురపడేలా, అసూయ చెందేలా, అభినందించేలా అభివృద్ధి చెందుతుంది. అన్ని విషయాల్లోనూ ‘అమెరికా ఫస్ట్’ అన్నదే మన నినాదం. అదే మన మూలమంత్రం’’ అని 78 ఏళ్ల ట్రంప్ ప్రకటించారు. ‘‘మీ నమ్మకాన్ని మీ సంపదను, ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను మీకు తిరిగిస్తా’’ అని అమెరికా ప్రజలకు వాగ్దానం చేశారు. అరగంట పాటు సాగిన తొలి ప్రసంగంలో ట్రంప్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంటలు రేపే నిర్ణయాలు ప్రకటించారు. మెక్సికో సరిహద్దుల్లో తక్షణమే జాతీయ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు. ‘‘అమెరికాలోకి వలసలపై ఉక్కుపాదం మోపుతాం. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మారుస్తున్నాం. పనామా కాల్వను అమెరికా స్వా«దీనం చేసుకుంటుంది’’ అని ప్రకటించారు. పనామా కాల్వపై చైనా పెత్తనం సాగుతోందని, వద్ద అమెరికా నౌకలపై భారీగా సుంకాలు విధిస్తున్నారని ఆక్షేపించారు. ‘‘వరక్త వ్యవస్థను సమూలంగా మారుస్తాం. అమెరికన్లను సంపన్నులుగా మార్చడమే లక్ష్యంగా పలు దేశాలపై సుంకాలు, ఇతర టారిఫ్లను పెంచుతాం. వాటి వసూలుకు ప్రత్యేక ప్రభుత్వ విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. డ్రగ్ కార్టల్స్ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటిస్తాం. 1978 నాటి విదేశీ శత్రువుల చట్టాన్ని తిరిగి తెచ్చి వాటిని అంతం చేస్తాం. పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతోంది’’ అని ప్రకటించారు. లూథర్కింగ్ కలలను నిజం చేస్తా ట్రంప్ తన ప్రసంగంలో బైడెన్ పాలనపై నిప్పులు చిమ్మారు. ‘‘ఆర్థిక, విద్య, ఆరోగ్య వ్యవస్థలన్నింటినీ బైడెన్ యంత్రాంగం కుప్పకూల్చింది. లాస్ ఏంజెలెస్ మంటల వంటి మామూలు సమస్యలను కూడా పరిష్కరించలేకపోయింది. భయంకరమైన నేరగాళ్లకు, డ్రగ్స్ బానిసలకు దేశాన్ని స్వర్గధామంగా మార్చింది. న్యాయవ్యవస్థను విషపూరితంగా, హింసాత్మకంగా మార్చి ఆయుధంలా వాడుకుంది’’ అని ఆరోపించారు. ‘‘న్యాయవ్యవస్థకు సంకెళ్ల నుంచి విముక్తి కల్పిస్తా. అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న ధరలకు, ద్రవ్యోల్బణానికి కళ్లెం వేస్తా. దేశీయ చమురు ఉత్పత్తిని భారీగా పెంచుతా. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం’’ అని ప్రకటించారు. ‘‘250 ఏళ్ల అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడూ ఎదుర్కోనన్ని పరీక్షలను ఎనిమిదేళ్లుగా ఎదుర్కొంటూ వచ్చా. బహుశా అమెరికాను తిరిగి గొప్పగా తీర్చిదిద్దేందుకే దేవుడు నన్ను హత్యాయత్నం నుంచి కాపాడాడేమో’’ అన్నారు. దాంతో రిపబ్లికన్ నేతలంతా పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. బైడెన్, హారిస్ మౌనంగా వీక్షించారు. ‘‘ఈ రోజు హక్కుల ఉద్యమకారుడు మార్టీన్ లూథర్కింగ్ జూనియర్ డే. అమెరికా కోసం ఆయన కన్న కలలను సాకారం చేసి చూపిస్తా. మార్టీన్ లూథర్ లక్ష్యాల సాధనకు మనమంతా సమైక్యంగా కృషి చేద్దాం’’ అని ప్రజలకు ట్రంప్ పిలుపునిచ్చారు. వైట్హౌస్కు స్వాగతం: బైడెన్ అంతకుముందు సోమవారం ఉదయం బైడెన్ తన వారసుడు ట్రంప్ను అధ్యక్ష భవనం వైట్హౌస్లోకి ఆత్మియంగా ఆహ్వానించారు. ట్రంప్ దంపతులు వాహనం దిగగానే ప్రధాన ద్వారం వద్ద భార్య జిల్తో కలిసి స్వాగతించారు. ‘వైట్హౌస్కు మరోసారి స్వాగతం’ అంటూ అభినందనలు తెలిపారు. అధ్యక్ష సంప్రదాయం ప్రకారం ట్రంప్ కోసం ఓవల్ కార్యాలయంలో లేఖ రాసిపెట్టారా అని మీడియా ప్రశ్నించగా, ‘అది మా ఇద్దరి మధ్య వ్యవహారం’ అంటూ చమత్కరించారు. అనంతరం ట్రంప్ దంపతులను లోనికి తీసుకెళ్లారు. సంప్రదాయం ప్రకారం వారికి తేనీటి విందు ఇచ్చారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దంపతులు కూడా కాబోయే ఉపాధ్యక్షుడు వాన్స్, ఉష దంపతులకు స్వాగతం పలికారు. వాన్స్కు హారిస్ అభినందనలు తెలిపారు. ఫొటోలకు పోజులిచ్చాక వాన్స్ దంపతులను హారిస్ దంపతులు వైట్హౌస్ లోనికి తోడ్కొని వెళ్లారు. అంతకుముందు ట్రంప్ తన కుటుంబీకులతో కలిసి వైట్హౌస్ సమీపంలోని చారిత్రక సెయింట్ జాన్ ఎపిస్కోపల్ చర్చి వద్ద సంప్రదాయ ప్రార్థనలు జరిపారు. అర్జెంటీనా ప్రెసిడెంట్ మెయిలీతో పాటు కూడా పారిశ్రామిక దిగ్గజాలంతా వాటిలో పాల్గొనడం విశేషం.ప్రమాణస్వీకారం ఇలా..ట్రంప్ నాలుగేళ్ల విరామం అనంతరం వైట్హౌస్లో తిరిగి అడుగుపెట్టారు. సోమవారం మధ్యాహ్నం క్యాపిటల్ హిల్ భవనంలోని రొటుండా హాల్లో డెమొక్రాట్ నేత 82 ఏళ్ల జో బైడెన్ నుంచి లాంఛనంగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. విపరీతమైన చలి నేపథ్యంలో ఇండోర్లో జరిగిన కార్యక్రమంలో అమెరికా మాజీ అధ్యక్షులు జార్జి డబ్లు్య.బుష్, బిల్ క్లింటన్ దంపతులు, బరాక్ ఒబామా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మెయిలీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుని ప్రమాణస్వీకారానికి దేశాధినేతలు రావడం ఇదే తొలిసారి. దిగ్గజ టెక్ కంపెనీల సారథులు, పారిశ్రామికవేత్తలు ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్, మార్క్ జుకర్బర్గ్, జెఫ్ బెజోస్, టిమ్ కుక్, ముకేశ్ అంబానీ దంపతులు, రూపర్డ్ మర్డోక్ షౌ చూ తదితరులు కూడా హాజరయ్యారు. అంతకుముందు ట్రంప్ దంపతులు వైట్హౌస్లో అధ్యక్షుడు జో బైడెన్ దంపతుల నుంచి సంప్రదాయ తేనీటి విందు స్వీకరించారు. తర్వాత బైడెన్తో కలిసి ట్రంప్ ఒకే కారులో క్యాపిటల్ హిల్కు చేరుకున్నారు. ఇద్దరూ కలిసే రొటుండా హాల్లో అడుగుపెట్టారు. వెంటనే హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఆహూతులంతా ట్రంప్కు, ఆయన రన్నింగ్మేట్ జె.డి.వాన్స్, ఉష దంపతులకు ఘనస్వాగతం పలికారు. తొలుత వాన్స్తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రెట్ కవనా ఉపాధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మరో న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ట్రంప్తో ప్రమాణస్వీకారం చేయించారు. ‘‘అమెరికా అధ్యక్షునిగా నా బాధ్యతలను విశ్వాసపాత్రునిగా నెరవేరుస్తా. అమెరికాను, దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తా’’ అంటూ తన తల్లి ఇచి్చన వ్యక్తిగత బైబిల్తో పాటు లింకన్ బైబిల్పై ప్రమాణం చేశారు. అనంతరం భార్య మెలానియా చెంపపై ముద్దాడారు. ఆమె హ్యాట్ అడ్డురావడంతో చిరునవ్వులు చిందించారు. ట్రంప్కు ప్రపంచం నలుమూలల నుంచీ అభినందనల సందేశాలు వెల్లువెత్తాయి. ‘నా ప్రియమిత్రుడు ట్రంప్కు హృదయపూర్వక అభినందనలు’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉత్తర్వులే ఉత్తర్వులు! బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ట్రంప్ భారీగా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వలసలపై ఉక్కుపాదం, మెక్సికో సరిహద్దుల్లో మరిన్ని సైనిక దళాల మోహరింపు, జన్మతః పౌరసత్వ విధానం రద్దు, చైనా, కెనడాలపై టారిఫ్ల పెంపు, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడం వంటివి వీటిలో ఉన్నట్టు వైట్హౌస్ వర్గాలు చెప్పాయి. వివరాలు వెల్లడించేందుకు నిరాకరించాయి. అయితే చాలా ఉత్తర్వుల అమలుపై న్యాయపరమైన సవాలు ఎదురవడం ఖాయమంటున్నారు. ట్రంప్ రాకతో వైట్హౌస్ వెబ్సైట్ కూడా కొత్త రూపు సంతరించుకుంది. ‘అమెరికా ఈజ్ బ్యాక్’ అనే హెడ్డింగ్తో ‘నా ప్రతి శ్వాసతోనూ అమెరికన్ల కోసమే పోరాడతా’ అంటూ ట్రంప్ సందేశాన్ని హోం పేజీలో హైలైట్ చేసింది. ట్రంప్ తాజా నిర్ణయాలను పోస్ట్ చేసింది. ‘‘పన్నులు, చమురు ధరలు, విద్యుత్ చార్జీలు తగ్గుతాయి. సైన్యాన్ని ఆధునికీకరిస్తారు. విఫల విధానాలు రద్దవుతాయి. పలు దేశాల్లో జరుగుతున్న యుద్ధాలకు తెర దించేందుకు ట్రంప్ ప్రాధాన్యమిస్తారు’’ అని పేర్కొంది. ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టా వంటి వైట్హౌస్ సోషల్ మీడియా ఖాతాలకు కూడా కొత్త రూపు వచ్చింది.విక్టరీ ర్యాలీలో ట్రంప్ డ్యాన్స్ ఆశ్చర్యపరిచిన విలేజ్ పీపుల్ ప్రదర్శన వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’విక్టరీ ర్యాలీని తన ఐకానిక్ డ్యాన్స్ మూవ్స్తో ముగించారు. 1978 నుంచి హిట్ అయిన ‘విలేజ్ పీపుల్’ట్రాక్ మరోసారి మార్మోగింది. ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఈ విలేజ్ పీపుల్ బ్యాండ్ ఈ పాటను ప్రదర్శించగా వారి వెనుక నిలబడిన ట్రంప్ అప్పుడప్పుడు పాడారు. స్టేజ్ మీద విలేజ్ పీపుల్ ఏడో సభ్యుడిగా చేరి ట్రంప్ డ్యాన్స్ చేశారు. మార్పుకోసం ఎదురుచూస్తున్నా వాషింగ్టన్: ట్రంప్ సారథ్యంలో అమెరికాలో చాలా మార్పులు చేయడానికి తాను ఎదురు చూస్తున్నానని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా ప్ర మాణ స్వీకారానికి ముందు వాషింగ్టన్లోని క్యాపిటల్ వన్ ఏరీనాలో ఆదివారం రాత్రి జరిగిన మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ విజయోత్సవ ర్యాలీలో మస్క్ పాల్గొని ప్రసంగించారు. ‘‘మేం చాలా మార్పులు చేయాలని చూస్తున్నాం. శతాబ్దాలపాటు అమెరికా బలీయశక్తి గా కొనసాగేందుకు వీలుగా మార్పులు చేయ డం ముఖ్యం. అమెరికాను మళ్లీ గొప్పగా మా ర్చుదాం’’అని మస్క్ అన్నారు. మస్క్... లిటి ల్ ఎక్స్ అని పిలుచుకునే తన కుమారుడు ఎ క్స్ ఎ–12 ను కూడా వేదికపైకి తీసుకొచ్చారు. -
ప్రపంచ ఎకానమీపై ట్రంప్ ఎఫెక్ట్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి పగ్గాలు చేపట్టడమనేది అంతర్జాతీయ భౌగోళిక–రాజకీయాల్లో మార్పులకు దారి తీయొచ్చని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఎకానమీ, వ్యాపారాలపై గణనీయమైన ప్రభావాలు పడొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో చోటు చేసుకున్న పరిణామాలను విశ్లేషించిన సందర్భంగా బిర్లా ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 2025లో ప్రపంచంలో అనిశ్చితి, అనూహ్యమైన, సాంప్రదాయానికి భిన్నమైన పరిస్థితులు నెలకొంటాయని బిర్లా చెప్పారు. ఒకవైపు అవకాశాలు మరోవైపు అనిశ్చితి ఉంటుందన్నారు. భారత్ వెలుపల అమెరికా తమకు అతి పెద్ద మార్కెట్ అని, అక్కడ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నామని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం కాగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. అవకాశాలు అందిపుచ్చుకోనున్న భారత్ .. పుష్కలంగా పారిశ్రామిక సామర్థ్యాలున్నా అంతగా గుర్తింపునకు నోచుకోని భారత్.. ఇప్పుడు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సంసిద్ధంగా ఉందని బిర్లా చెప్పారు. యాపిల్ ఉత్పత్తుల తయారీ భారత్కి రావడం మంచి పరిణామమని, త్వరలోనే ప్రపంచంలోనే పావు వంతు ఐఫోన్లు భారత్లోనే ఉత్పత్తి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారతీయ ఆటోమొబైల్, సిమెంటు పరిశ్రమ మొదలైనవన్నీ అంతర్జాతీయంగా ఎదుగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ తయారీ రంగంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని పేర్కొన్నారు. 21వ శతాబ్దపు తొలి రెండు దశాబ్దాల్లో టెక్నాలజీ విప్లవం చోటు చేసుకుందని.. దీనితో ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ తగు మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తోందని తెలిపారు. రాబోయే దశాబ్దంలో ప్రపంచాన్ని ఏకం చేయగలిగే శక్తిగా టెక్నాలజీని వినియోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం
Donald Trump Inauguration Live Updates..10:33PMThe 60th Presidential Inauguration Ceremony https://t.co/kTB4w2VCdI— Donald J. Trump (@realDonaldTrump) January 20, 2025అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారంఅమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం స్వీకారం చేశారు వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ రోటుండా ఇండోర్లో ట్రంప్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. అమెరికాకు అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావడం ఇది రెండోసారి. ఇక అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేశారు. దీనిలో భాగంగా 25వేల మందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ నుంచి విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరయ్యారు. ముందుగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణ స్వీకారం చేయగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు.వాషింగ్టన్ డీసీలో ట్రాఫిక్ ఆంక్షలుట్రంప్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం సందర్భంగా వాషింగ్టన్ డీసీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు రహదారులు మూసివేయడంతో పాటు మెట్రో సర్వీసులను మళ్లించారు. 9:25PMవైట్హౌస్కు ట్రంప్.. స్వాగతం పలికిన బైడెన్ 👉కాసేపట్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్కు చేరుకున్నారు. డొనాల్డ్ ట్రంప్కు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సాదర స్వాగతం పలికారు.Joe y Jill Biden reciben a Donald y Melania Trump antes de su salida de la Casa Blanca.Al mediodía de hoy y siguiendo lo establecido en la Constitución, Donald Trump prestará juramento y asumirá su cargo como presidente de EUA. pic.twitter.com/699c25xd7A— InformaES 🇸🇻 (@InformaESV) January 20, 2025 👉రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. 78 ఏళ్ల వయసులో అగ్రరాజ్యాధినేతగా మరోసారి బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ సందడి నెలకొంది. Donald Trump et Melania Trump arrivent à la messe à l'église St. Johns avant la 60e investiture présidentielle.#Trump2025 pic.twitter.com/Sax4VpgfO6— ICÔNE (@IconeMediaFR) January 20, 2025వైట్హౌస్లో బైడెన్ సెల్ఫీ..👉కొద్ది గంటల్లో ముగియనున్న జో బైడెన్ అధ్యక్ష పదవీ కాలం. అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ సెల్ఫీ. అంతకుముందు వైట్హౌస్కు చేరుకున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ దంపతులకు స్వాగతం పలికిన జో బైడెన్, జిల్.For me, the People’s House has always been about welcoming everyone. America, thank you for trusting me with this sacred place. I’ve loved opening the doors to the Oval Office wider than ever these past four years. pic.twitter.com/G3BmVqEEiY— President Biden (@POTUS) January 20, 2025 One more selfie for the road. We love you, America. pic.twitter.com/71k46uGADV— President Biden (@POTUS) January 20, 2025 ట్రంప్కు పుతిన్ అభినందనలు..👉అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం వేళ ట్రంప్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు. ఇదే సమయంలో ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేసిన పుతిన్. డొనాల్డ్ ట్రంప్ రాబోయే అమెరికా ప్రభుత్వంతో ఉక్రెయిన్ వివాదంపై చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఏదైనా పరిష్కారం శాశ్వత శాంతిని నిర్ధారిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ప్రజల చట్టబద్ధమైన ప్రయోజనాలను గౌరవించడం ఆధారంగా శాశ్వత శాంతి నెలకొల్పాలన్నారు.Russian President Vladimir Putin said Monday he was open to talks on the Ukraine conflict with Donald Trump's incoming US administration and hoped any settlement would ensure "lasting peace"."We are also open to dialogue with the new US administration on the Ukrainian… pic.twitter.com/AvkRFAjhhv— Hespress English (@HespressEnglish) January 20, 2025 👉చర్చీలో డొనాల్డ్ ట్రంప్ దంపతులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తన నివాసం వద్ద ఉన్న సెయింట్ జాన్స్ చర్చికి చేరుకున్న డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్👉ప్రపంచదేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ప్రమాణ వేడుకకు ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. విపరీతమైన చలి కారణంగా వేడుకను ఆరుబయట కాకుండా క్యాపిటల్ భవంతి లోపలే నిర్వహించనున్నారు. రొనాల్డ్ రీగన్ 1985లో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పుడు ఇలాగే చేయాల్సి వచ్చింది. 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి అలా జరుగుతోంది.🇺🇸TRUMP, MELANIA SPOTTED AT ST. JOHN’S CHURCH AHEAD OF INAUGURATION#Trump2025 #TrumpInauguration2025 #Inauguration2025 #Inauguration pic.twitter.com/ydj19nb4FD— MOHAMMAD AL_ARSHASHAN (@MOHAMMAD_ALARSH) January 20, 2025 తొలిరోజే భారీగా సంతకాలు! 👉మొదటి రోజే తనదైన ముద్ర కనిపించేలా ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మేరకు సుమారు 100 కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసేలా ఆయన బృందం రంగం సిద్ధం చేసింది. ఎన్నికల వాగ్దానాల మేరకు ఇవి జారీ అవుతాయని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అమెరికా దక్షిణ సరిహద్దులు మూసివేయడం, అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసి వెనక్కి పంపించడం, ట్రాన్స్జెండర్ల హక్కులు కాలరాయడం, చమురు వెలికితీత పెంచడం, క్యాపిటల్ భవంతి వద్ద రగడకు సంబంధించి దోషులుగా తేలిన సుమారు 1,500 మందికి క్షమాభిక్ష ప్రసాదించడం వంటివాటిని తొలిరోజే మొదలుపెట్టాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు.Live from Washington D.C. ‼️Dion Powell MPA is right outside Capital One Arena, mingling with the excited crowds as they await the historic inauguration of Donald Trump as the 47th President of the United States. @DION_POWELL00 #Inauguration2025 #TrumpInauguration pic.twitter.com/waunBxNaMP— LiveONE.TV (@LiveONE_TV) January 20, 2025 ఫలితాల అనంతరం..👉ఫలితాల అనంతరం కూడా ట్రంప్ పలు కీలక ప్రకటనలు చేశారు. కెనడాను 51వ రాష్ట్రంగా చేయడం, గ్రీన్ల్యాండ్, పనామాలను స్వాధీనం చేసుకోవడం, గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడం వంటి ప్రకటనలు చేసిన ట్రంప్.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే కీలక ఆదేశాలపై సంతకాలు చేస్తానని ప్రకటించారు. ముఖ్యంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డిపార్టేషన్ ఆపరేషన్ చేపడతామని చెప్పారు.Les gens entrent maintenant dans l’arène Capital OnePour L'investiture de Donald J. Trump en tant que 47e président des États-Unis#Trump2025 #TrumpInauguration #DonaldTrump #DonaldTrump2025 #JDVance2025 #ElonMusk2025 #magaQuebec #maga2025 #ElonMusk pic.twitter.com/rlKRS8ZoWX— LE PRÉSIDENT DONALD TRUMP 2025/2029 (@INFOQUBEC) January 20, 2025 కుటుంబ నేపథ్యం..👉న్యూయార్క్లోని క్వీన్స్లో మేరీ, ఫ్రెడ్ దంపతులకు జూన్ 14, 1946న డొనాల్డ్ ట్రంప్ జన్మించారు. తండ్రి ఫ్రెడ్ ట్రంప్ ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఐదుగురు సంతానంలో ట్రంప్ నాలుగోవాడు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కామర్స్లో 1968లో డిగ్రీ పట్టా పొందారు.👉తండ్రి కంపెనీలో 1971లో బాధ్యత స్వీకరించిన ట్రంప్.. అనంతరం ట్రంప్ ఆర్గనైజేషన్గా పేరు మార్చారు. హోటల్స్, రిసార్టులు, నిర్మాణ రంగం, క్యాసినోలు, గోల్ఫ్ కోర్స్ల్లో అడుగుపెట్టి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. 2004లో ‘ది అప్రెంటిస్’ రియాల్టీ టీవీ షోతో దేశమంతా పాపులర్ అయ్యారు.👉క్రీడాకారిణి, మోడల్ ఇవానా జెలింకోవాను తొలుత వివాహం చేసుకున్న ట్రంప్.. 1990లో ఆమెకు విడాకులు ఇచ్చారు. వీరికి డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్లు సంతానం. ఆ తర్వాత నటి మార్లా మార్పెల్స్ను 1993లో పెళ్లి చేసుకున్న ట్రంప్.. 1999లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. వీరి కుమార్తె టిఫానీ ట్రంప్. స్లొవేనియాకు చెందిన మాజీ మోడల్ మెలానియాను 2005లో ట్రంప్ వివాహం చేసుకున్నారు. వీరి కుమారుడు బారన్ విలియమ్ ట్రంప్.👉రిపబ్లికన్ పార్టీ తరఫున 2016 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ట్రంప్.. డెమోక్రటిక్ నేత హిల్లరీ క్లింటన్పై విజయం సాధించారు. 2020 ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఓటమి చెందిన ట్రంప్.. 2024లోనూ బరిలోకి దిగారు. డెమోక్రట్ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్పై విజయం సాధించి రెండోసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. -
అధ్యక్షుడిగా కొన్ని గంటలే.. బైడెన్ సంచలన నిర్ణయాలు!
వాషింగ్టన్: మరికొన్ని గంటల్లో అమెరికాకు అధ్యక్షుడిగా మరోసారి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదే సమయంలో జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో బైడెన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధ్యక్ష స్థానంలో బైడెన్ పలువురికి క్షమాభిక్షలు కల్పిస్తున్నారు.వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడిగా తనకు ఉన్న ప్రత్యేక అధికారాలతో చివరి గంటల్లో జో బైడెన్(joe Biden) క్షమాభిక్షలు ఇస్తున్నారు. మరికొద్ది గంటల్లో జో బైడెన్ అధ్యక్ష పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలోనే అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లె తదితరులకు ముందస్తు క్షమాభిక్ష జారీ చేశారు. అలాగే, క్యాపిటల్ హిల్ దాడులపై విచారణ జరిపిన హౌస్ కమిటీ సభ్యులకూ కూడా ఉపశమనం కల్పించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రతీకార చర్యలు తీసుకునేందుకు వీలులేకుండా ఈమేరకు చర్యలు తీసుకున్నారు. దీంతో, క్షమాభిక్షల వ్యవహారం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. 2021, జనవరి ఆరో తేదీన క్యాపిటల్ హిల్పై దాడులు జరిగిన విషయం తెలిసిందే.ఈ సందర్బంగా బైడెన్ మాట్లాడుతూ.. ఈ ప్రజా సేవకులు మన దేశానికి గౌరవంగా, విశిష్టతతో సేవ చేశారు. అన్యాయంగా, రాజకీయంగా ప్రేరేపించబడిన నేరాల కారణంగా శిక్ష అనుభవిస్తున్నారు. ఇవి అసాధారణమైన పరిస్థితులు అంటూ చెప్పుకొచ్చారు. Biden Grants Last Minute Gutless Preemptive Pardons to Protect Allies from the Legal ProcessIn a spineless final act before leaving office, President Joe Biden issued preemptive pardons to several individuals he believed could be prosecuted by the incoming Trump administration. pic.twitter.com/2KEgLr0iMe— RICKY YUNG (@RickyYung33770) January 20, 2025మరోవైపు.. అమెరికా అధ్యక్ష పీఠం దిగబోతున్న జో బైడెన్ తన పదవీకాలంలో చివరి రోజున దక్షిణ కరోలినాలో గడిపారు. 2020లో డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో నెగ్గినప్పటి నుంచి ఆ ప్రాంతంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం శ్వేతసౌధానికి చేరింది. పదవి ముగుస్తున్న తరుణంలో ఆయన వీడ్కోలు ప్రసంగం చేయనున్నారు. గతంలో తన విజయానికి కారకులైనవారికి అక్కడి నుంచి కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. శ్వేతసౌధాన్ని బైడెన్ ఖాళీచేసి వెళ్లడానికి, ట్రంప్ అందులోకి రావడానికి కావాల్సిన ఏర్పాట్లను ఐదు గంటల్లో పూర్తి చేయాల్సి ఉండటంతో సంబంధిత సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. 🚨BREAKING: Joe Biden just left Air Force One for the last time as President. pic.twitter.com/UMRCk7rRag— Benny Johnson (@bennyjohnson) January 20, 2025 -
నేడే డొనాల్డ్ ట్రంప్ పట్టాభిషేకం
వాషింగ్టన్: రెండున్నర నెలల ఎదురుచూపులు ముగిశాయి. (Donald Trump,)డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు. దేశ 47వ అధ్యక్షునిగా సోమవారం (Oath Taking Ceremonyప్రమాణస్వీకారం చేయబోతున్నారు. (Washington)వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్లో రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన అతిరథ మహారథుల సమక్షంలో అట్టహాసంగా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని తొలుత ఆరుబయట తలపెట్టినా, గడ్డకట్టించే చలి కారణంగా రొటుండా హాల్ లోనికి మార్చారు. దాంతో రొనాల్డ్ రీగన్ తర్వాత గత 40 ఏళ్లలో ఇండోర్లో అధ్యక్ష ప్రమాణం చేస్తున్న తొలి నేతగా ట్రంప్ నిలవనున్నారు. ఈ నేపథ్యంలో ఆహూతులను కూడా వేలనుంచి 500 లోపునకు కుదించారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చైనా ఉపాధ్యక్షుడు హాన్జెంగ్తో పాటు పలువురు దేశాధినేతలు తదితరులు కూడా హాజరవనున్నారు. 2021 క్యాపిటల్ హిల్ దాడి నిందితులు కూడా కోర్టు ప్రత్యేక అనుమతితో కార్యక్రమంలో పాల్గొంటుండటం విశేషం. ట్రంప్ శనివారం సాయంత్రమే కుటుంబసమేతంగా ఫ్లోరిడా నుంచి ప్రత్యేక విమానంలో వాషింగ్టన్ చేరుకున్నారు. రాత్రి స్టెర్లింగ్లోని ఆయన సొంత నేషనల్ గోల్ఫ్ క్లబ్లో మొదలైన ప్రమాణ స్వీకార వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సందడి చేశారు. అనంతరం కాబోయే ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్, ఆయన సతీమణి ఉషా చిల్లకూరితో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండోసారి పగ్గాలు చేపడుతూనే ట్రంప్ తనదైన శైలిలో దూకుడు కనబరచనున్నారు. పాలన పగ్గాలు చేపట్టిన తొలి రోజే టిక్టాక్పై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తేయనున్నట్టు ఆయన ఆదివారం ప్రకటించారు. అంతేగాక ఏకంగా 100కు పైగా అధికారిక ఉత్తర్వులు జారీ చేయబోతున్నారు. నవంబర్ 5న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ట్రంప్ ఓడించడం తెలిసిందే. ఆయన 2017–21 మధ్య తొలి దఫా అమెరికా అధ్యక్షునిగా పనిచేశారు. ట్రంప్ అభిమానులకు పోటీగా ఆయన వ్యతిరేకులు కూడా శనివారం నుంచే వైట్హౌస్ ముందు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఏప్రిల్లో భారత పర్యటన?ఏప్రిల్లో ట్రంప్ భారత పర్యటన ఉండే అవకా శం కనిపిస్తోంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక వీ లైనంత త్వరగా భారత్లో పర్యటించాలని ఆయ న యోచిస్తున్నట్టు ఫైనాన్షియల్ డైలీ వెల్లడించింది. ‘‘దీనిపై ఆయన ఇప్పటికే తన సలహాదారులతో లోతుగా చర్చిస్తున్నారు. డిసెంబర్ చివర్లో క్రిస్మస్ సందర్భంగా అమెరికాలో పర్యటించిన విదేశాంగ మంత్రి జైశంకర్తో ఈ దిశగా ఇప్పటికే ఒక దఫా చర్చలు కూడా జరిగాయి’’ అని తెలిపింది. అంతకుముందే ప్రధాని మోదీని అమెరికాలో పర్యటించాల్సిందిగా ట్రంప్ ఆహ్వానించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు వివరించింది. చైనాపై టారిఫ్లు తప్పవన్న తన వ్యాఖ్యల తాలూకు ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఆ దేశంలో కూడా ట్రంప్ పర్యటిస్తారని ఆయన సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. కార్యక్రమానికి అతిరథులు ప్రపంచ కుబేరులు, వ్యాపార దిగ్గజాలు ఎలాన్ మస్్క, మార్క్ జుకర్బర్గ్, జెఫ్ బెజోస్, ముకేశ్ అంబానీ దంపతులు తదితరులు ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంబానీ దంపతులు శనివారం రాత్రే ట్రంప్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం ఆయనతో పాటు క్యాండిల్ లైట్ డిన్నర్లో పాల్గొన్నారు. ట్రంప్ వ్యక్తిగతంగా ఆహ్వానించిన 100 మంది జాబితాలో భారత్ నుంచి వారు మాత్రమే ఉన్నారు.ప్రమాణ స్వీకారం ఇలా... → ట్రంప్ ఆదివారం (అమెరికా కాలమానం ప్రకారం) ఆర్లింగ్టన్ జాతీయ స్మారకం వద్ద కార్యక్రమంలో, క్యాపిటల్ వన్ ఎరీనా ర్యాలీలో పాల్గొంటారు. → సోమవారం ఉదయం సెయింట్ జాన్స్ ఎపిస్కోపల్ చర్చిలో ట్రంప్ ప్రార్థనలతో కార్యక్రమాలు మొదలవుతాయి. → అనంతరం దిగిపోనున్న అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు వైట్హౌస్లో ట్రంప్కు తేనీటి విందు ఇస్తారు. → తర్వాత అంతా కలిసి క్యాపిటల్ హిల్ భవనానికి చేరుకుంటారు. → లింకన్ బైబిల్పై ప్రమాణం చేసి అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. → తర్వాత ప్రారంభోపన్యాసం చేస్తారు. రెండో టర్ములో తన ప్రాథమ్యాలను క్లుప్తంగా వివరిస్తారని భావిస్తున్నారు. → అనంతరం బైడెన్, కమలా హారిస్కు లాంఛనంగా వీడ్కోలు పలుకుతారు. → తర్వాత ట్రంప్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తూ వైట్హౌస్ ఓవల్ ఆఫీసులో అధికారిక పత్రాలపై సంతకాలు చేస్తారు. అధ్యక్షునిగా తొలి ఆదేశాలు జారీ చేస్తారు. → అధికారిక విందు అనంతరం సాయుధ బలగాలపై సమీక్ష జరుపుతారు. -
ట్రంప్ అధ్యక్ష పట్టాభిషేకం.. ఈ విశేషాలు తెలుసా?
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ మరోసారి వైట్హౌజ్లో అడుగుపెట్టనున్నారు. అమెరికా 47వ అధ్యక్షునిగా సోమవారం(జనవరి 20వ తేదీ) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాషింగ్టన్ డీసీలో జరగబోయే ఈ ఘట్టానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రపంచంలోని పలు దేశాధినేతలకు ఆహ్వానం వెళ్లింది.ట్రంప్ ప్రమాణ స్వీకారానికి రాజకీయ ప్రముఖులుచైనా తరపున అధ్యక్షుడు జీ జిన్పింగ్ బృందం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిఅర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ హంగేరియన్ ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్ భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా హాజరవుతున్నట్లు తెలిపారు ఇంగ్లండ్ మాజీ అధ్యక్షుడు నిగెల్ పాల్ ఫారేజ్, ఎరిక్ జెమ్మూర్ (ఫ్రాన్స్), మాజీ బ్రెజిలియన్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోలు సైతం ఉన్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారంలో వ్యాపార దిగ్గజాలు టెస్లా సీఈవో ఇలాన్ మస్క్అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ టిక్ టాక్ సీఈవో షౌ జి చెవ్ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రముఖుల డుమ్మాట్రంప్ ప్రమాణ స్వీకారానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఆహ్వానం అందలేదు. అయితే ప్రమాణ స్వీకారం తరువాత పుతిన్తో ట్రంప్ ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గైర్హాజరు కానున్నారు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ వున్కు ఆహ్వానం వెళ్లిందా? అనేదానిపై స్పష్టత లేదు. మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా.. ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ముందస్తు సమాచారం ఇచ్చారు. అధ్యక్ష ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ సమయంలో మాజీ అధ్యక్షులు.. వాళ్ల వాళ్ల సతీమణులు హాజరుకావడం ఆనవాయితీ వస్తోంది. గడ్డకట్టే చలిలోనూ గడ్డకట్టే చలిలోనూ అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేందుకు రాజధాని వాషింగ్టన్లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.అయితే మరికొన్ని గంటల్లో అమెరికా 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ట్రంప్ వాషింగ్టన్ చేరుకున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం జరగనున్న సోమవారం రోజున వాషింగ్టన్ డీసీలో ఉష్ణోగ్రతలు సగటున మైనస్ 11 డిగ్రీల సెల్సీయస్ మేర ఉంటాయని వాతావరణ అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో ట్రంప్ రోటుండా సముదాయం లోపల ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎనిమిదేళ్ల క్రితం తొలిసారి అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారంఅమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం రాజధాని వాషింగ్టన్ అందంగా ముస్తాబైంది. 8 ఏళ్ల కిందట ట్రంప్ తొలిసారిగా 2017లో అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2017 నుంచి 2021 వరకు సేవలందించారు. అయితే 2020 ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓడిపోయారు. అనూహ్యంగా గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ట్రంప్ విజయం సాధించారు. దీంతో ట్రంప్ రెండో దఫా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. జనవరి 20, 2025న 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.క్యాపిటల్ భవనంపై దాడి నిందితులకు ఆహ్వానం2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓటమిని జీర్ణించుకోలేని ఆయన మద్దతు దారులు వాషింగ్టన్లోని క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లారు. ఆ సమయంలో ట్రంప్ మద్దతు దారులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా, ట్రంప్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేలా ఆహ్వానాలు పంపించినట్లు సమాచారం.కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లుట్రంప్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో వాషింగ్టన్లో కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో దాదాపు 30 మైళ్ల పరిధిలో తాత్కాలిక కంచెను ఏర్పాటు చేశారు. దాదాపు 25వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా తమ పనిని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి అంతరాయం కలిగించే చర్యలను, నిరసనలను ముందస్తుగా గుర్తించే పనిలో పడ్డారు. -
జిన్పింగ్తో ట్రంప్ చర్చలు
బీజింగ్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ఫోన్లో మాట్లాడారు. ‘‘వ్యాపారం, వాణిజ్యం, టిక్టాక్ తదితర అంశాలపై జిన్పింగ్తో చక్కటి సంభాషణ జరిగింది. ప్రపంచాన్ని మరింత భద్రంగా మార్చడానికి చేయాల్సిందంతా చేస్తాం’’ అని ట్రంప్ ఉద్ఘాటించారు. అధ్యక్షుడిగా రెండో టర్మ్లో చైనాతో సంబంధాలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. -
ప్రమాణస్వీకారానికి... మిషెల్ దూరం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మాజీ ప్రథమ మహిళా మిషెల్ ఒబామా దూరంగా ఉండనున్నారు. ఆమె భర్త, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతున్నా 150 ఏళ్ల సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తూ మిషెల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే జరిగిన మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు కూడా మిషెల్ హాజరు కాని విషయం తెలిసిందే. దాంతో ఒబామా దంపతులకు విభేదాలొచ్చాయని, త్వరలో విడాకులు తీసుకుంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వారి సన్నిహిత వర్గాలు ఈ వార్తలను ఖండించాయి. ఫేక్ నవ్వులు నవ్వలేకే ప్రమాణ స్వీకారానికి మిషెల్ దూరంగా ఉంటున్నారని తెలిపాయి. ఆమెతో పాటు డెమొక్రాట్లు నాన్సీ పెలోసీ, అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టేజ్ తదితరులు కూడా ట్రంప్ ప్రమాణస్వీకారానికి హాజరవడం లేదు. నాలుగేళ్ల కిందట జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ట్రంప్ కూడా గైర్హాజరవడం తెలిసిందే. తద్వారా వైట్హౌస్ సంప్రదాయాన్ని ఆయన ఉల్లంఘించారు. -
ట్రంప్ ప్రమాణానికి... జోరుగా ఏర్పాట్లు
వాషింగ్టన్: అగ్రరాజ్యాధినేతగా డొనాల్డ్ ట్రంప్ (78) రెండోసారి శ్వేతసౌధంలో అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. అమెరికా 47వ అధ్యక్షునిగా సోమవారం ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా శనివారం నుంచి నాలుగు రోజుల పాటు అట్టహాసంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రమాణస్వీకార కమిటీ ప్రకటించింది. ‘‘శనివారం బాణసంచా నడుమ కార్యక్రమాలు లాంఛనంగా మొదలవుతాయి. అనంతరం ఫ్లోరిడాలోని ట్రంప్ గోల్ఫ్ కోర్స్ బయట, వాషింగ్టన్ డీసీలోనూ పలు వీఐపీ ఈవెంట్లు జరుగుతాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (ఎంఏజీఏ) పేరిట విజయోత్సవ ర్యాలీలుంటాయి. సోమ వారం ట్రంప్ ముందుగా సెయింట్ జాన్స్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం వైట్హౌస్లో తేనీటి విందు జరుగుతుంది. ఆ తర్వాత కాపిటల్ భవనంలోని వెస్ట్ లాన్లో (స్థానిక కాలమానం ప్రకారం) ఉదయం 9.30 నుంచి ప్రధాన కార్యక్రమం ఉంటుంది. సంగీత కార్యక్రమాల అనంతరం ట్రంప్ లాంఛనంగా పదవీ ప్రమాణం చేసి అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. తర్వాత జె.డి.వాన్స్ ఉపాధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అనంతరం తన లక్ష్యాలు తదితరాలను వెల్లడిస్తూ అధ్యక్ష హోదాలో ట్రంప్ తొలి ప్రసంగం చేస్తారు. తర్వాత సెనేట్ చాంబర్లోని ప్రెసిడెంట్ రూమ్లో కీలక పత్రాలపై సంతకం చేయడంతో ప్రమాణ కార్యక్రమం ముగుస్తుంది. మధ్యాహ్నం తొలి అధికారిక విందు అనంతరం క్యాపిటల్ హిల్ భవనం నుంచి పెన్సిల్వేనియా అవెన్యూ మీదుగా వైట్హౌస్ దాకా ట్రంప్ పరేడ్గా వెళ్తారు’’ అని వెల్లడించింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచీ ఏకంగా 2 లక్షల మంది సోమవారానికల్లా వాషింగ్టన్ చేరుకుంటారని కమిటీ తెలిపింది. నవంబర్ 6న జరిగిన ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్పై ట్రంప్ ఘనవిజయం సాధించి రెండోసారి అధ్యక్షుడు కానున్నారు. 2017–2021 మధ్య తొలిసారి అధ్యక్షునిగా పని చేయడం తెలిసిందే. మాజీ అధ్యక్షులంతా హాజరు సోమవారం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, కమలతో పాటు మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి డబ్లు్య.బుష్, బరాక్ ఒబామా కూడా పాల్గొంటారు. వీరిలో ఒబామా మినహా మిగతా వారంతా సతీసమేతంగా వస్తున్నారు. పలువురు దేశాధినేతలు, వీవీఐపీలు, ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా తరఫున ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్తో పాటు ఐటీ, ఇతర దిగ్గజ సంస్థల అధినేతలు కూడా హాజరవుతున్నారు. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్ (ఫేస్బుక్), జెఫ్ బెజోస్ (అమెజాన్) రూపంలో ప్రపంచ కుబేరుల్లో ముగ్గురు వేదికపై కనిపించనుండటం విశేషం. ట్రంప్ హయాంలో అమెరికా టెక్ బిలియనీర్ల అడ్డగా మారనుందని బైడెన్ తాజాగా తన వీడ్కోలు సందేశంలో హెచ్చరించడం తెలిసిందే.అధికారిక ఫొటోల విడుదల ప్రమాణస్వీకార సంబంధిత కార్యక్రమాల్లో ఉపయోగించేందుకు ట్రంప్, వాన్స్ అధికారిక చిత్రాలను తాజాగా విడుదల చేశారు. వాన్స్ చేతులు కట్టుకుని సరదాగా చిరునవ్వులు చిందిస్తుండగా ట్రంప్ ఫొటో అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. పెదాలు బిగించి, నుదురు చిట్లించి కెమెరావైపు తీక్షణంగా చూస్తూ కనిపిస్తున్నారు. ఇది అచ్చం కాపిటల్ హిల్ దాడి కేసులో 2023లో ట్రంప్ న్యాయ విచారణకు హాజరైన సందర్భంగా పోలీసు అధికారులు తీసుకున్న ఆయన మగ్ షాట్ను పోలి ఉండటం విశేషం. రెండో టర్ములో సంప్రదాయ పోకడలను మరింతగా ధిక్కరించి తీరతానని ప్రతీకాత్మకంగా చెప్పేందుకు ట్రంప్ కావాలనే ఇలాంటి ఫొటోను ఎంచుకున్నారని భావిస్తున్నారు.హాలీవుడ్ ప్రత్యేక రాయబారులుగా గిబ్సన్ తదితరులు నటులు జాన్ వొయిట్, మెల్ గిబ్సన్, సిల్విస్టర్ స్టాలోన్లను హాలీవుడ్ ప్రత్యేక రాయబారులుగా నియమిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. నాలుగేళ్లుగా నేలచూపులు చూస్తున్న హాలీవుడ్ను బలోపేతం చేసి పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నాల్లో వారు తనకు సహాయ సహకారాలు అందిస్తారని వెల్లడించారు. వీరిలో వొయిట్ చిరకాలంగా ట్రంప్కు మద్దతుదారు కాగా గిబ్సన్, స్టాలోన్ కూడా తాజా ఎన్నికల్లో ట్రంప్ను బలపరిచారు. -
అమెరికన్లకు బైడెన్ హెచ్చరిక.. ఫేర్వెల్ స్పీచ్లో సంచలన కామెంట్స్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్న వేళ జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో సామ్రాజ్యవాదం రూపుదిద్దుకుంటోందని అన్నారు. అలాగే, కొద్దిమంది అతి సంపన్నుల చేతుల్లోనే అధికార కేంద్రీకరణ ఉండబోతుంది అంటూ హెచ్చరించారు. దీంతో, ఆయన కామెంట్స్ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.మరో ఐదు రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి జో బైడెన్ దిగిపోనున్నారు. ఈ నేపథ్యంలో ఓవల్ కార్యాలయం నుండి తన వీడ్కోలు ప్రసంగం చేశారు బైడెన్. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ..‘నేడు అమెరికాలో విపరీతమైన సంపద, శక్తి కలిగిన ఒక సామ్రాజ్యవాదం రూపుదిద్దుకుంటోంది. ఇది మొత్తం ప్రజాస్వామ్యాన్ని, మన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను హరించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో అమెరికా ప్రజలు తప్పుడు ప్రచారాలను చూడాల్సి ఉంటుంది. పత్రికా స్వేచ్ఛ క్షీణిస్తోందని హెచ్చరించారు. ఇది ఆందోళనకరంగా మారే ఛాన్స్ ఉందన్నారు.ఇదే సమయంలో ఇది అధికార దుర్వినియోగానికి వీలు కల్పిస్తుందన్నారు. సోషల్ మీడియాలో అసత్య కథనాలు భారీగా స్థాయిలో వెలుగు చూస్తాయి. అధికారం కోసం నిజం అణిచివేయబడుతోందంటూ ఘాటు విమర్శలు చేశారు. అధికార దుర్వినియోగాన్ని అదుపు చేయకపోతే ప్రమాదకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అలాగే, ప్రతీ అమెరికా పౌరుడు తమ హక్కులను కాపాడుకునేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు.Biden: "I want to warn the country of some things that give me great concern. That's the dangerous concentration of power in the hands of a very few ultra wealthy people and the dangerous consequences if their abuse of power is left unchecked. Today, an oligarchy is taking shape" pic.twitter.com/3JFO40udS3— Aaron Rupar (@atrupar) January 16, 2025ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికే పలు దేశాల అధినేతలకు ఆహ్వానం వెళ్లింది. దీంతో, పలువురు దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. -
ట్రంప్ను ఓడించేవాడిని: బైడెన్ పశ్చాత్తాపం
వాషింగ్టన్: ఇలీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై అధ్యక్షుడు జోబైడెన్ పశ్చాత్తాపపడ్డారు. నాడు తాను తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి చెందారు. మీడియా సమావేశంలో అధ్యక్షుడు బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొన్నటి అమెరికా ఎన్నికల్లో తాను పోటీ చేసి ఉంటే డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ను తప్పకుండా ఓడించేవాడినన్నారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో అధ్యక్షుడు బైడెన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒక జర్నలిస్ట్ ‘ఎన్నికల్లో పోటీ చేయకూడదని మీరు నిర్ణయించుకున్నందున, అది ట్రంప్కు మళ్లీ అధికారం అప్పగించడంలో సహాయపడిందని, ఇటువంటి భావన మీకు కలిగిందా? అని అడిగారు. దీనికి బైడెన్ సమాధానమిస్తూ ‘నేను పూర్తిగా అలా అనుకోవడం లేదని, కానీ నేను గనుక పోటీ చేసి ఉంటే, ట్రంప్ను కచ్చితంగా ఓడించేవాడిననే నమ్మకం నాకు ఉంది’ అని అన్నారు. JUST IN: President Biden says he could have and would have won the 2024 election, says Kamala Harris could have and would have won too.Someone should tell him that Kamala did in fact run and did not win."I would have beaten Trump, could have beaten Trump, and I think that… pic.twitter.com/7oOWeSJ2hs— Collin Rugg (@CollinRugg) January 10, 2025డొనాల్డ్ ట్రంప్ను ఓడించే విషయంలో కమలా హారిస్ (Kamala Harris) కూడా సమర్థురాలని బైడెన్ పేర్కొన్నారు. ఆమె అద్భుతంగా పని చేస్తారని, అందుకే ఆమె ట్రంప్ను ఓడించగలరనే నమ్మకం తనకు కలిగిందని, అటువంటి నమ్మకంతోనే ఆమెకు మద్దతునిచ్చానని బైడెన్ పేర్కొన్నారు. అయితే డెమోక్రటిక్ పార్టీ(Democratic Party)లో ఐక్యత కోసమే తాను పోటీ నుంచి తప్పుకున్నాట్లు బైడెన్ తెలిపారు.బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని తొలుత భావించినప్పటికీ ఆరోగ్య సమస్యలు, సొంత పార్టీ లోని వ్యతిరేకత రావడంతో పోటీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. అనంతరం తమ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలాహారిస్కు మద్దతు ప్రకటించారు. నిరంకుశత్వం కంటే దేశం గొప్పదని బైడెన్ వ్యాఖ్యానించారు. కమలా హ్యారిస్ 2028లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తప్పకుండా మళ్లి పోటీ చేస్తారని బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: మదురో అరెస్టుకు ఆధారాలందించండి: బైడెన్ -
కార్చిచ్చుపై ప్రెస్మీట్లో ముత్తాతనయ్యానని జో బైడెన్ ప్రకటన
లాస్ ఏంజెలెస్: అమెరికా అధ్యక్షుడు బైడెన్కు ఇబ్బందికర అనుభవం ఎదురైంది. లాస్ ఏంజెలెస్తో పాటు దక్షిణ కాలిఫోర్నియా మొత్తాన్ని భీకర కార్చిచ్చు చుట్టుముట్టి పెను నష్టం చేస్తున్న విషయం తెలిసిందే. దాని ధాటికి ఇప్పటికే లక్షన్నర మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇళ్లతో పాటు సర్వం బుగ్గి పాలై భారీగా ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా లాస్ ఏంజెలెస్లో హాలీవుడ్ తారలతో పాటు ప్రముఖులుండే అతి సంపన్న ఆవాసాలు పెద్ద సంఖ్యలో అగ్నికి ఆహుతిగా మారాయి. ఈ విపత్తుపై స్థానిక శాంటా మోనికాలో బైడెన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఉన్నట్టుంది వ్యక్తిగత ప్రకటన చేశారు. తనకు ముని మనవడు పుట్టాడని చెప్పుకొచ్చారు. ‘ఈ ప్రతికూల వార్తల నడుమ ఒక శుభవార్త. ఈ రోజే నేను ముత్తాత అయ్యాను. చాలా కారణాలతో నాకీ రోజు గుర్తుండిపోతుంది‘ అని అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ‘పేరుకేమో అగ్ర రాజ్య అధ్యక్షుడు. కనీసం ఎక్కడేం మాట్లాడా లో తెలియదా?‘ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాస్ ఏంజెలెస్ మంటల్లో బైడెన్ కుమారుని ఇల్లు కూడా బుగ్గిగా మారినట్టు వార్తలొచ్చాయి. ‘అది పూర్తిగా కాలిపోయిందని తొలుత చెప్పారు. బానే ఉందని ఇప్పుడంటున్నారు‘ అంటూ ఈ వార్త లపై బైడెన్ స్పందించారు.ప్రెస్ మీట్కు ముందే...మీడియా సమావేశానికి ముందే బైడెన్ స్థాని క ఆస్పత్రిలో ముని మనవడిని చూసి వచ్చారు. ఆ ఫొటోలు విపరీతంగా షేర్ అవుతున్నాయి. పదవిలో ఉండగా ముత్తాత అయిన తొలి అమెరికా అధ్యక్షునిగా కూడా 82 ఏళ్ల బైడెన్ రికార్డు సృష్టించడం విశేషం. పెద్ద వయసులో అధ్యక్షుడు అయిన రికార్డు ఆయన పేరిటే ఉండటం తెలిసిందే. 77 ఏళ్ల వయసులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 78 ఏళ్ల ట్రంప్ ఇప్పుడా రికార్డును తిరగరా యనున్నారు. ఈ నెల 20న ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనుండటం తెలిసిందే. -
నేనొచ్చేలోపే బందీలను వదిలేయండి
వాషింగ్టన్: హమాస్– ఇజ్రాయెల్ యుద్ధంలో బందీలుగా మారిన ఇజ్రాయెల్, అమెరికన్ పౌరుల విడుదలపై కాబోయే అమెరికా అధ్యక్షుడు (Donald Trump)డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్ శివారు ప్రాంతాలపై దాడిచేసి అపహరించుకుపోయిన అమాయకులను జనవరి 20వ తేదీలోపు విడుదలచేయకుంటే దారుణ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హమాస్కు ట్రంప్ హెచ్చరికలు జారీచేశారు. ఫ్లోరిడాలోని మార్–ఏ–లాగో రిసార్ట్లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. ఇప్పటికే ఖతార్ వేదికగా (Hamas)హమాస్ ప్రతినిధులు, ఇజ్రాయెల్ ఉన్నతాధికారులకు మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల పై చర్చలు జరుగుతు న్న విషయం తెల్సిందే. ఈ అంశాన్ని ట్రంప్ ప్రస్తావించారు.అంత అమానుషంగా ప్రవర్తిస్తారా?‘‘ఇప్పుడు జరుగుతున్న సంప్రదింపుల ప్రక్రియకు నేను భంగం కల్గించదల్చు కోలేదు. నేను అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టడానికి ఇంకా రెండు వారాల సమయం ఉంది. ఈలోపు కాల్పుల విరమణ ఒప్పందం కుదరాల్సిందే. బందీలను క్షేమంగా తిరిగి పంపకపోతే హమాస్ తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోక తప్పదు. నేను అధ్యక్షుడిని అయ్యాక పశ్చిమాసియా దారుణ పరిస్థితులను చవిచూస్తుంది. ఇంతకు మించి హమాస్కు నేనేం చెప్పను. అసలు వాళ్లు అలా దాడి చేయకుండా ఉండాల్సింది. వాళ్లను కిడ్నాప్ చేయకుండా ఉండాల్సింది. వాళ్లు ఇంకా బందీలుగా ఉండకూడదు. బందీలను విడిచి తీసుకురావాలని అమెరికా, ఇజ్రాయెల్ ప్రజలు నన్ను వేడుకున్నారు. కనీసం మా అబ్బాయి మృతదేహమైనా మాకు అప్పగిస్తారా? అని కొందరు తల్లులు, తండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. కిడ్నాప్ చేసి తీసుకెళ్తూ అమ్మాయిలను జడలు పట్టి వాహనాల్లో పడేశారు. ఆ రోజు కిడ్నాప్కు గురైన అమ్మాయి చనిపోయింది. అసలు అమ్మా యిలతో అంత అమానుషంగా ప్రవర్తిస్తారా?’’ అని ట్రంప్ ఆగ్రహంగా మాట్లాడారు.చివరి దశలో చర్చలుపశ్చిమాసియా పర్యటన ముగించుకుని వచ్చిన ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవెన్ చార్లెస్ విట్కోఫ్ సైతం మాట్లాడారు.‘‘ చర్చలు చివరి దశలో ఉన్నాయి. దోహాలో చర్చలు ఇంకా ఎందుకు ముగింపునకు రాలేదనేది నేను ఇప్పుడే వెల్లడించలేను. కాబోయే అధ్యక్షుడి హెచ్చరికలను హమాస్ దృష్టిలో పెట్టుకో వాలి’’ అని విట్కోప్ అన్నా రు. కాల్పుల విరమణ ఒప్పందం అమలైతే ఇద్దరు అమెరికన్లుసహా 34 మంది బందీలను విడుదలచేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ఖతార్ చర్చల్లో హమాస్ ప్రతినిధులు చెప్పారు. జో బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం 2023 అక్టోబర్ ఏడున దాడి జరిగిన కొద్దివారాలకే కాల్పుల విరమణ ఒప్పందాన్ని దాదాపు ఓ కొలిక్కి తెచ్చింది. ఆ సమయంలో డజన్ల మంది బందీలను హమాస్ విడుదల చేసింది. తర్వాత హమాస్, ఇజ్రాయెల్ పర స్పర దాడులు అధికమవడంతో బందీల విడు దల ప్రక్రియ హఠాత్తుగా ఆగిపోయింది. ఆ తర్వాత కాల్పుల విరమణ, బందీల విడు దలపై చర్చల్లో పీఠముడి పడి ఇంతవరకు ఓ కొలిక్కిరాలేదు. బందీలను విడిచించాలని ట్రంప్ హెచ్చరించిన వేళ గాజాలో ఒక బందీ మృతదేహాన్ని ఇజ్రాయెల్ బలగాలు గుర్తించాయి. మరో మృతదేహం లభించినా అది ఎవరిది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మృతిచెందిన బందీని యూసెఫ్ అల్ జైదానీగా గుర్తించారు. -
స్మార్ట్ పీపుల్ కావాలి
వాషింగ్టన్: స్థానిక అమెరికన్లకే అధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న రిపబ్లికన్ల ఎన్నికల హామీకి విరుద్ధంగా విదేశీయులకు హెచ్–1బీ వీసాల జారీని ప్రపంచ కుబేరుడు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ సహ సారథి వివేక్ రామస్వామి సమర్థిస్తున్న వేళ కాబోయే అమెరికా అధ్యక్షుడు మరోసారి హెచ్–1బీ వీసాలను సమర్థించారు. అమెరికాకు ఎల్లప్పుడూ కేవలం సమర్థవంతులైన వ్యక్తులే అవసరమని ట్రంప్ నొక్కి చెప్పారు. ‘‘ అమెరికాకు ఎల్లప్పుడూ సమర్థవంతులైన వ్యక్తులే కావాలని నేను ఆశిస్తా. స్మార్ట్ జనం మాత్రమే అగ్రరాజ్యంలో అడుగుపెట్టాలి. గతంలో ఎన్నడూ లేనంతగా అమెరికాలో ఉద్యోగ కల్పన జరగ బోతోంది. దేశానికి నైపుణ్యవంతమైన కార్మికుల అవసరం చాలా ఉంది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బుధవారం అమెరికాలోని మార్–ఏ–లాగో రిసార్ట్లో ట్రంప్ను స్థానిక మీడియా పలకరించింది. ‘‘హెచ్–1బీ వీసాలపై నా అభిప్రాయం ఎన్నటికీ మారదు. నిఫుణులే అమెరికాకు కావాలి’’ అని స్పష్టంచేశారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీకి సంయుక్త సారథులుగా నియమితులైన ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి హెచ్–1బీ వీసాల జారీని సమర్థిస్తూ వ్యాఖ్యానించడం, వారికి ఇప్పటికే ట్రంప్ మద్దతు పలకడం తెల్సిందే. అయితే అమెరికన్లకే తొలి ప్రాధాన్యం అంటూ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన ట్రంప్ ఇప్పుడు మాట మార్చారని అమెరికన్ మీడియా చేస్తున్న వాదనలను ట్రంప్ తోసిపుచ్చారు. మొదట్నుంచీ తాను హెచ్–1బీకి అనుకూలమేనని పునరుద్ఘాటించారు. కేవలం అత్యంత నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులకే ఉపాధి కల్పిస్తూ స్థానిక సాధారణ, తక్కువ నైపుణ్యమున్న అమెరికన్లకు సరైన ఉద్యోగాలు దక్కకపోతే ఆగ్రహావేశాలు భవిష్యత్తులో పెరిగే ప్రమాదముందని రాజకీయ పండితుడు క్రేగ్ ఆగ్రనోఫ్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ ఐటీ రంగంలో ముఖ్యమైన ఉద్యోగాలన్నీ హెచ్–1బీ వీసాదారులకే తన్నుకు పోతే స్థానిక ఐటీ ఉద్యోగార్థుల పరిస్థితి ఏంటి?’ అనే ప్రశ్నకు ఇంతకాలం ఏ నేతా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని క్రేగ్ వ్యాఖ్యానించారు. స్థానిక అమెరికన్లతో పోలిస్తే తక్కువ వేతనాలకే ఎక్కువ నైపుణ్యాలున్న విదేశీయులు లభిస్తుండటంతో అమెరికన్ కంపెనీలు హెచ్–1బీ వీసా విధానం ద్వారా విదేశీయులకే అధిక ప్రాధాన్యతనిచ్చి అమెరికాకు రప్పిస్తుండటం తెల్సిందే. -
జిమ్మీ కార్టర్ అస్తమయం
వాషింగ్టన్: అమెరికా 39వ అధ్యక్షుడు, డెమొక్రటిక్ నేత జిమ్మీ కార్టర్ ఇక లేరు. ఇటీవలే 100వ పుట్టిన రోజు జరుపుకున్న ఆయన జార్జియా రాష్ట్రంలో ప్లెయిన్స్లోని తన నివాసంలో ఆదివారం ప్రశాంతంగా కన్నుమూశారు. అమెరికా అధ్యక్షుల్లో అత్యధిక కాలం జీవించిన రికార్డు ఆయనదే. 1977–81 మధ్య అధ్యక్షునిగా చేసిన కార్టర్ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు దేశాధినేతలు కార్టర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన నాయకత్వ పటిమ తిరుగులేనిదని బైడెన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. గొప్ప వ్యక్తిత్వానికి, సానుకూల దృక్పథానికి కార్టర్ ప్రతిరూపమని కొనియాడారు. కార్టర్ అంత్యక్రియలను జనవరి 9న పూర్తి అధికార లాంఛనాలతో జరపనున్నట్టు ప్రకటించారు. రాజకీయంగా, సైద్ధాంతికంగా కార్టర్తో తాను తీవ్రంగా విభేదించినా ఆయన నిష్కళంక దేశభక్తుడన్నది నిస్సందేహమని ట్రంప్ పేర్కొన్నారు. కార్టర్ అంత్యక్రియలు స్వగ్రామంలో ఆయనకెంతో ఇష్టమైన సొంత వ్యవసాయ క్షేత్రంలోనే జరిగే అవకాశముంది. రైతు బిడ్డ జిమ్మీ కార్టర్గా ప్రసిద్ధుడైన జేమ్స్ ఎర్ల్ కార్టర్ జూనియర్ ఓ నికార్సైన రైతు బిడ్డ. 1924 అక్టోబర్ 1న జార్జియాలోని ప్లెయిన్స్ అనే చిన్న పట్టణంలో జని్మంచారు. ఆయన తండ్రి కార్టర్ సీనియర్ ఓ రైతు. తల్లి లిలియన్ నర్సు. 1943లో అమెరికా నావల్ అకాడమీలో క్యాడెట్గా ఆయన కెరీర్ మొదలైంది. దీర్ఘకాలం పాటు విధులు నిర్వర్తించడమే గాక ప్రతిష్టాత్మక అణు జలాంతర్గామి కార్యక్రమానికి ఎంపికయ్యారు. 1962లో తొలిసారి సెనేటర్గా ఎన్నికయ్యారు. 1970లో జార్జియా గవర్నర్ అయ్యారు. 1974లోనే అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ రాజీనామాకు దారితీసిన వాటర్గేట్ కుంభకోణం నుంచి అమెరికా అప్పటికింకా బయట పడనే లేదు. 1977 ఎన్నికల్లో నెగ్గి అమెరికా అధ్యక్షుడయ్యారు. 1979లో ఈజిప్టు, ఇజ్రాయెల్ మధ్య చరిత్రాత్మక శాంతి ఒప్పందంలో కీలకపాత్రధారిగా నిలిచారు. చైనాతో అమెరికా దౌత్య సంబంధాలకు తెర తీసిన అధ్యక్షునిగా నిలిచిపోయారు. మానవ హక్కులే మూలసూత్రంగా అమెరికా విదేశాంగ విధానాన్ని పునరి్నర్వచించారు. అయితే అఫ్గానిస్తాన్పై సోవియట్ యూనియన్ ఆక్రమణను అడ్డుకోలేకపోయారు. ఇరాన్ బందీల సంక్షోభమూ కార్టర్ చరిత్రపై ఓ మచ్చగా మిగిలింది. డజన్ల కొద్దీ అమెరికన్లను ఇరాన్ తిరుగుబాటు విద్యార్థులు బందీలుగా చేసుకోవడం స్వదేశంలో ఆయన ప్రతిష్టను బాగా దెబ్బతీసింది. 1980 ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి రొనాల్డ్ రీగన్ చేతిలో ఓటమి చవిచూశారు. అలా వైట్హౌస్ను వీడినా కార్టర్ ప్రజాసేన మాత్రం నిరి్నరోధంగా కొనసాగింది. అమెరికా ప్రభుత్వం తరఫున ఉత్తర కొరియాకు శాంతి స్థాపన బృందాన్ని తీసుకెళ్లారు. అంతర్జాతీయంగా శాంతి స్థాపనకు చేసిన నిరి్వరామంగా కృషికి నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. కార్టర్కు ముగ్గురు పిల్లలున్నారు. ఆయన భార్య రోసలిన్ ఏడాది క్రితమే మరణించారు. When I look at Jimmy Carter, I see a man not only for our times, but for all times. A man who embodied the most fundamental human values we can never let slip away.And while we may never see his likes again, we would all do well to try to be a little more like Jimmy Carter. pic.twitter.com/I0xDM05xmH— President Biden (@POTUS) December 30, 2024భారత్తో అనుబంధం కార్టర్కు భారత్తో మంచి అనుబంధముంది. ఆయన తల్లి లిలియన్ పీస్ కార్ప్స్ బృందంలో భాగంగా 1960ల చివర్లో భారత్లో హెల్త్ వలంటీర్గా పని చేశారు. దాంతో కార్టర్ భారత్కు సహజ మిత్రునిగా పేరుబడ్డారు. మన దేశంలో పర్యటించిన మూడో అమెరికా అధ్యక్షునిగా నిలిచారు. 1977లో కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఎమర్జెన్సీని ఎత్తేసిన మరుసటేడాది కార్టర్ భార్యాసమేతంగా భారత్కు వచ్చారు. ఆ సందర్భంగా భారత పార్లమెంటులో చేసిన ప్రసంగంలో నియంతృత్వ పాలనను స్పష్టంగా వ్యతిరేకించారు. ద్వైపాక్షిక సంబంధాలను ఎంతగానో మెరుగుపరిచినదిగా ఆ పర్యటన చిరస్థాయిగా నిలిచిపోయింది. కార్టర్ దంపతులు ఢిల్లీ సమీపంలోని ఓ గ్రామాన్ని సందర్శించడం అందరినీ ఆకర్షించింది. -
అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్
వాషింగ్టన్: అమెరికా జాతీయ పక్షిగా బట్టతల డేగ (బాల్డ్ ఈగల్)ను అధ్యక్షుడు జో బైడెన్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై సంతకం చేశారు. ఈ పక్షిని దశాబ్దాలుగా అమెరికా అధికార చిహ్నంగా వాడుతోంది. 1782 నుంచీ యూఎస్ గ్రేట్ సీల్పై, డాక్యుమెంట్లలో దీన్ని ఉపయోగిస్తున్నారు. దేశ రాజముద్రపైనా ఇది ఉంది. అయినప్పటికీ అధికారికంగా హోదా మాత్రం కల్పించలేదు. తర్వాత అనేకసార్లు దీన్ని మార్చడానికి విఫల యత్నాలు జరిగాయి. తెల్లటి తల, పసుపు పచ్చ ముక్కు, గోధుమ రంగు శరీరంతో కూడిన బాల్డ్ ఈగల్ను జాతీయ పక్షిగా ప్రతిపాదిస్తూ మిన్నెసోటా సభ్యుడు అమీ క్లోజౌచెర్ డిసెంబర్ 16న సెనెట్లో బిల్లు ప్రవేశ పెట్టారు. దాన్ని సభ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బైడెన్ ఆమోదముద్రతో 240 ఏళ్ల తరవాత బాల్డ్ ఈగల్కు జాతీయ పక్షి హోదా దక్కింది. తొలిసారి రాగి సెంటుపై బాల్డ్ ఈగల్ ఉత్తర అమెరికాకు చెందిన పక్షి. మొట్టమొదట 1776లో మసాచుసెట్స్ రాగి సెంటుపై ఇది అమెరికా చిహ్నంగా కనిపించింది. తర్వాత వెండి డాలర్, హాఫ్ డాలర్, క్వార్టర్ తదితర యూఎస్ నాణేల వెనుక భాగంలో చోటుచేసుకుంది. బంగారు నాణేలకు ఈగల్, హాఫ్ ఈగల్, క్వార్టర్ ఈగల్, డబుల్ ఈగల్ అని నామకరణమూ చేశారు. 1940 జాతీయ చిహ్న చట్టం కింద బాల్డ్ ఈగల్ రక్షిత పక్షి. దాన్ని క్రయ విక్రయాలు చట్టవిరుద్ధం. ‘‘బాల్డ్ ఈగల్ను 250 ఏళ్లుగా జాతీయ చిహ్నంగా ఉపయోగిస్తూ వస్తున్నాం. దాన్నిప్పుడు అధికారికంగా ప్రకటించుకున్నాం’’అని నేషనల్ ఈగల్ సెంటర్ నేషనల్ బర్డ్ ఇనిషియేటివ్ కో చైర్మన్ జాక్ డేవిస్ ఒక ప్రటకనలో తెలిపారు. ఈ అర్హత మరే పక్షికీ లేదన్నారు. -
ఎలాన్ మస్క్కు ట్రంప్ స్వీట్ వార్నింగ్?
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఎవరు?. ‘‘ఇదేం ప్రశ్న!. మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్ నినాదంతో మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ మీద నెగ్గిన డొనాల్డ్ ట్రంప్దే’’ అని మీరు అనొచ్చు. కానీ, గత వారం పదిరోజులుగా అమెరికాలో సోషల్ మీడియాలో మరో తరహా చర్చ నడుస్తోంది. ట్రంప్ పేరుకే వైట్హౌజ్లో అధ్యక్ష స్థానంలో ఉంటారని.. కానీ ఎలాన్ మస్క్ మొత్తం నడిపిస్తారనే ప్రచారం నడిచింది. అయితే..మస్క్ అధ్యక్షుడని.. ట్రంప్ ఉపాధ్యక్షుడంటూ ప్రచారం తారాస్థాయికి చేరడం డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఏమాత్రం భరించలేకపోతున్నారట!. అందుకే ఎలాన్ మస్క్పై ఆగ్రహం వ్యక్తం చేశారట!.ఈ మేరకు సోషల్ మీడియాలోనూ ఓ సందేశం వైరల్ అయ్యింది. దాని సారాంశం పరిశీలిస్తే..‘‘అమెరికాకు కాబోయే అధ్యక్షుడ్ని నేనే. ఇంకెవరో కాదు. మీడియాగానీ, ఇంకెవరైనాగానీ ఎలాన్ మస్క్ అంతా తానై నడిపిస్తారని ప్రచారం చేయొచ్చు. కానీ, ఇది నా విజన్.. నా నాయకత్వం.. నా అమెరికా. ఎలాన్ మస్క్ నా ఎన్నికల ప్రచారం కోసం సాయం చేసి ఉండొచ్చు.అతను గొప్ప మేధావే కావొచ్చు. కానీ, రాజకీయాలకొచ్చేసరికి నా ఇష్టప్రకారమే నడుస్తుంది. ఎలాన్.. నీ మద్దతుకు కృతజ్ఞతలు. కానీ, అదే సమయంలో నువ్వు గీత దాటొద్దు. అమెరికాను మరింత గొప్పగా తీర్చిదిద్దడమే ఇప్పుడు నా ముందున్న ఆశయం. ఇది అమెరికన్ల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అంతేగానీ మస్క్ ఇగోకు సంబంధించిన అంశం కాదు’’ అంటూ ఓ సందేశం గత ఐదు రోజులుగా చక్కర్లు కొడుతోంది.అయితే.. ఆ సందేశానికి డొనాల్డ్ ట్రంప్నకు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఆయన సోషల్ మీడియా అకౌంట్ నుంచి అలాంటి సందేశమూ ఒకటి వైరల్ కాలేదు. ఆ ఇమేజ్ను వెరిఫై చేయగా.. ఉత్తదేనని ఫ్యాక్ట్ చెక్(Fact Check)లో తేలింది. అయితే ప్రస్తుత పరిణామాల ఆధారంగానే ఆ సందేశాన్ని ఉద్దేశపూర్వకంగా ఎవరో వైరల్ చేసినట్లు స్పష్టం అవుతోంది.అసలు విషయం ఏంటంటే.. సాధారణంగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎవరినీ లెక్కచేయరు. గతంలో అది చూశాం. కానీ, ఈసారి అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్కు ప్రపంచదేశాధినేతలు ఫోన్ చేస్తే పక్కనే ఉన్న మస్క్తోనూ మాట్లాడించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆపై స్వయంగా మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్ ప్రయోగాన్ని స్వయంగా హాజరై వీక్షించారు ట్రంప్. ఇక.. కొత్తగా సృష్టించిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(డోజ్)కు సహ సారథిగా కొనసాగాల్సిన మస్క్ ఏకంగా అధ్యక్షుడి నిర్ణయాల్లో కలగజేసుకుంటున్నారనేది ఆ ఆరోపణల సారాంశం. సొంత వ్యాపార ప్రయోజనాలే పరమావధిగా నడుచుకునే ఓ టెక్ బిలియనీర్ ఆలోచనలే.. జనవరి 20వ తేదీ నుంచి ప్రభుత్వ నిర్ణయాలుగా అమలుకాబోతున్నాయని డెమొక్రాట్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే.. ఈ వాదనకు బలం చేకూరేలా.. డోజ్తో మొదలుపెట్టి ఆపై వేలుపెట్టి.. అమెరికా ప్రభుత్వ అనవసర ఖర్చులకు కత్తెర వేసే పనిని ట్రంప్ తన భుజాలకెత్తుకున్నారు. ఇది అంతటితో ఆగలేదు. అమెరికా తాత్కాలిక బడ్జెట్ అయిన ద్రవ్య వినిమయ బిల్లులోనూ వేలు పెట్టారు. బిల్లు తెచ్చిన దిగువసభ స్పీకర్ మైక్ జాన్సన్పై మస్క్ బహిరంగంగా విమర్శలు చేశారు. అమెరికా తలపై షట్డౌన్ కత్తి వేలాడుతున్నా సరే ఈ బిల్లు ఆమోదం పొందకూడదని మస్క్ తెగేసి చెప్పారు. ట్రంప్ సైతం మస్క్ అభిప్రాయంతో ఏకీభవించడంతో రిపబ్లికన్లు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు.. ద్రవ్య బిల్లులో ఏముందో ఆ పార్టీ సెనేటర్లు మస్క్కు చెందిన ఎక్స్(ట్విటర్) ద్వారానే తెలుసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.ట్రంప్ ఏన్నారంటే..ఆరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్ సిటీలో ట్రంప్ పాల్గొన్న అమెరికాఫీస్ట్ కార్యక్రమంలో ప్రేక్షకులు ‘అధ్యక్షుడు మస్క్’అంటూ నినాదాలు ఇవ్వడంతో ట్రంప్ స్పందించారు. పీఎం కాకపోతే ఏకంగా ప్రెసిడెంట్ అవుతారని డెమొక్రాట్ల చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై ట్రంప్ మాట్లాడారు. ‘‘మస్క్(Musk) ఏనాటికీ అధ్యక్షుడు కాలేడు. నా సీటు భద్రం. ఆయన అమెరికాలో పుట్టలేదుగా. అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన వ్యక్తికే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసే అర్హత ఉంటుంది’’అని ట్రంప్ అన్నారు. మస్క్ మనసులో..ఎలాన్ మస్క్(Elon Musk) ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ఏనాడూ ప్రకటించలేదు. అలాగే.. ట్రంప్నకు తన మద్దతును బహిరంగంగానే ప్రకటించారు. కానీ, దేశ ప్రయోజనాలకంటే మస్క్ సొంత వ్యాపారాలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారనే ఆరోపణలను మాత్రం ఎందుకనో ఖండించడం లేదు. పైగా ‘అధ్యక్షుడు’ అనే ట్యాగ్ మీద కూడా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.అగ్రరాజ్యానికి అధినేతగా ట్రంప్ కొనసాగినా.. ఆర్థిక వ్యవస్థ మస్క్ చేతుల్లోకి వెళ్తుందని ఇటు డెమోక్రాట్లు.. అటు రిపబ్లికన్లు కూడా గుసగుసలాడుకుంటున్నారు. త్వరలో కొలువుతీరే కొత్త ప్రభుత్వంలో మస్క్ నిర్ణయాలే ఎక్కువగా అమలుకు నోచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే జరిగితే.. రిపబ్లికన్ పార్టీలో కలకలం రేగడం, వాళ్లిద్దరి మధ్య స్నేహ బంధానికి బీటలు వారడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు!.చదవండి👉పంజాబ్ పోలీస్ వర్సెస్ బ్రిటన్ ఆర్మీ! -
‘అతడు ఏనాటికీ అమెరికా అధ్యక్షుడు కాలేడు!’
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం వెనుక టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ చేసిన కృషి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అంతేకాదు.. రాబోయే కాలంలో ఆయన పాలనలో మస్క్ కీలక పాత్ర సైతం పోషించడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అయితే.. అలాంటి వ్యక్తిపై ట్రంప్ ఇప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదీ.. ప్రత్యర్థుల విమర్శల నేపథ్యంలో..ప్రపంచంలో అత్యధిక సంపద కలిగి ఉన్న ఎలాన్ మస్క్ను.. అమెరికాకు షాడో ప్రెసిడెంట్గా పేర్కొంటూ ఓ ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా ప్రత్యర్థి డెమొక్రటిక్ పార్టీ ఈ ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తోంది. ప్రజలచేత ఎన్నుకోబడని ఓ వ్యక్తి(ఎలాన్ మస్క్).. అధికారం చెలాయించేందుకు సిద్ధమైపోతున్నాడు. రాబోయే రోజుల్లో అమెరికా ఆదాయ వ్యవహారాలన్నింటిని ప్రెసిడెంట్ మస్క్ చేతుల మీదుగానే నడుస్తాయి అంటూ ఎద్దేవా ప్రకటనలు చేస్తోంది. ఈ తరుణంలో..ఆదివారం అరిజోనా ఫీనిక్స్లో ఓ కార్యక్రమానికి హాజరైన ట్రంప్కు ఇదే ప్రశ్న ఎదురైంది. ‘‘ఎలాన్ మస్క్ ఏదో ఒకనాటికి అమెరికా అధ్యక్షుడు కాకపోతాడా?’’ అని ప్రశ్నించింది. దానికి ఆయన ‘నో’ అనే సమాధానం ఇస్తూ కారణం వివరించారు.‘‘అతడు అధ్యక్షుడు కాలేడు. ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పదల్చుకున్నా. ఎందుకంటే.. అతను ఈ దేశంలో పుట్టలేదు. కాబట్టి అది ఏనాటికి జరగదు’’ అని చెప్పారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ఆ దేశ గడ్డపై పుట్టిన వ్యక్తి మాత్రమే అధ్యక్షుడు కాగలడు. ఎలాన్ మస్క్ సౌతాఫ్రికాలో పుట్టాడు.ఇదిలా ఉంటే.. రిపబ్లికన్ పార్టీలోనూ మస్క్కు వ్యతిరేక వర్గం తయారవుతున్నట్లు సమాచారం. ఓ ప్రభుత్వ ఫండింగ్ ప్రతిపాదనను తిట్టిపోస్తూ ఎలాన్ మస్క్ చేసిన ట్వీటే అందుకు కారణం. -
దాతలకు బైడెన్, హారిస్ కృతజ్ఞతలు
వాషింగ్టన్: ఎన్నికల ఓటమి తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు హారిస్ తొలిసారిగా ఒకే చోట కలిసి కనిపించారు. డెమొ క్రటిక్ నేషనల్ కమిటీ ఆదివారం నిర్వహించిన హాలిడే పార్టిలో వారిద్దరూ వేదికను పంచుకున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచార నిమిత్తం 200 కోట్ల డాలర్లకు పైగా విరాళాలిచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘డెమొక్రాట్లు విలువల కోసం పోరాటం సాగించాలి. మన స్ఫూర్తి ఓడలేదు. మనం ఓడిపోలేదు. బలంగా ఉన్నాం. దేనికోసం పోరాడుతున్నామో మనకు స్పష్టత ఉంది’’అని అతిథులుతో బైడెన్, హారిస్ అన్నా రు. ‘‘కింద పడితే కచ్చితంగా లేవాల్సిందే.. ఎంత వేగంగా లేస్తారనేదే వ్యక్తికైనా, పార్టికైనా కొలమానమని మా నాన్న చెప్పేవారు’’అని బైడెన్ అన్నారు. నవంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు గట్టి పోటీ ఇచ్చారని భావించిన హారిస్ చివరికి ఆయన చేతిలో భారీ తేడాతో ఓడటం తెలిసిందే. హారిస్ భవితవ్యం ఏమిటి? హారిస్ తన సొంత రాష్ట్రమైన కాలిఫోరి్నయా గవర్నర్ పదవికి పోటీ చేయాలని కొందరు డెమొక్రాట్లు కోరుతున్నారు. ఆమె మాత్రం తన భవిష్యత్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బైడెన్ జనవరి 20న అధ్యక్ష పదవి నుంచి వైదొలగనుండటం తెలిసిందే. అయినా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ అమెరికా సమాజంలో నెలకొన్న లోతైన విభేదాలను చక్కదిద్దేందుకు కృషి చేయాలనుకుంటున్నట్లు ఆయన సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘మీకందరికీ బ్యాడ్ న్యూస్ ఏమిటంటే నేనెక్కడికీ వెళ్లడం లేదు. ఇక్కడే ఉండాలనుకుంటున్నా’’అని నవ్వుతూ అన్నారు. -
ట్రంప్కు నెతన్యాహూ ఫోన్
జెరుసలేం: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్లో మాట్లాడారు. హమాస్పై యుద్ధంలో విజయం సాధించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. సిరియా పరిస్థితులపై తన వైఖరిని ట్రంప్తో పంచుకున్నారు. సంభాషణలోని కీలకాంశాలను వివరిస్తూ నెతన్యాహు ఓ వీడియో ప్రకటన షేర్ చేశారు. ‘‘శనివారం సాయంత్రం జరిగిన సంభాషణలో ఇరువురం పలు అంశాలపై చర్చించాం. సంభాషణ చాలా స్నేహపూర్వకంగా సాగింది. ఇజ్రాయెల్ విజయాన్ని పూర్తి చేయాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడుకున్నాం. బందీల విడుదలకు మేం చేస్తున్న ప్రయత్నాల గురించి సుదీర్ఘంగా చర్చించాం. బందీలతో పాటు మృతులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఇజ్రాయెల్ అహర్నిశలు కృషి చేస్తుంది’’ అని చెప్పారు. אמרתי שנשנה את המזרח התיכון וזה מה שקורה. סוריה היא לא אותה סוריה. לבנון היא לא אותה לבנון. עזה היא לא אותה עזה. איראן היא לא אותה איראן. pic.twitter.com/IFVso1czkH— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) December 15, 2024సిరియాతో ఘర్షణ ఇప్పట్లో లేదుసిరియాలో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని తిరుగుబాటు దళాలు కూలదోశాక అక్కడి పరిస్థితిని నెతన్యాహు ప్రస్తావించారు. ‘‘సిరియాతో ఘర్షణపై మా దేశానికి ఏ ఆసక్తీ లేదు. పరిస్థితులను బట్టి స్పందిస్తాం’’ అన్నారు. హెజ్బొల్లాకు సిరియా గుండా ఆయుధాల రవాణాకు అనుమతించడాన్ని ఖండించారు. -
పలు దేశాలకు ట్రంప్ వార్నింగ్.. కారణం ఇదే..
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో వలసదారులకు కాబోయే కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భయం పట్టుకుంది. అమెరికాలో వలసదారులపై కఠినంగా వ్యవహరించనున్నట్టు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా ట్రంప్ తీసుకుంటున్నారు. ఇక, తాజాగా వలసదారులపై మరో కీలక ప్రకటన చేశారు.డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికాలో ఉన్న వలసదారులు వెంటనే దేశం విడిచి వెళ్ళిపోవాలి. అమెరికాలో ఏయే దేశాల వారైతే ఉన్నారో.. వారిని వెంటనే తమ దేశాలు వెనక్కి పిలిపించుకోవాలి. ఇలా జరగకపోతే.. ఆయా దేశాలతో అమెరికా వ్యాపార సంబంధాలు నిలిపి వేయడం జరుగుతుంది. వలసదారులను వెనక్కి తీసుకోవడానికి నిరాకరించే దేశాలకు అమెరికా నుంచి ఎలాంటి వ్యాపారాలు, ఎగుమతులు, దిగుమతులు జరగవు. అన్ని వ్యాపారాలను చాలా కష్టతరం చేస్తాం. ఆ దేశాలకు సుంకాలను భారీగా పెంచేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై పలు దేశాలు టెన్షన్ పడుతున్నాయి. ఇదిలా ఉండగా.. కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వలసదారుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. అక్రమ వలదారులు ఎవరున్నా వాళ్ళపై సైనిక చర్యలు తీసుకుంటానని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా చట్టాలను అనుసరించే ఎవరైనా తమ దేశంలో ఉండేలా చూసుకుంటామని ట్రంప్ హామీ ఇచ్చారు.ఇక, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్ట్ ట్రంప్ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 20న ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలు దేశాల అధినేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు ఆహ్వానం వెళ్లింది. -
ఇరాన్తో యుద్దం.. ట్రంప్ వ్యాఖ్యలపై టెన్షన్?
వాషింగ్టన్: ఇరాన్తో యుద్ధంపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఏదైనా జరగవచ్చు’ అంటూ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఇరాన్పై దాడులు చేస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా.. ఇరాన్తో యుద్ధానికి వెళ్లే అవకాశాల గురించి ప్రశ్నించగా.. ఏదైనా జరగవచ్చు.. కాలం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రష్యాపై ఉక్రెయిన్ క్షిపణులతో విరుచుకుపడటం అత్యంత ప్రమాదకరమైన విషయంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై ఆసక్తి నెలకొంది. ట్రంప్ హయాంలో ఇరాన్పై దాడులు తప్పవని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారని పలువురు చెబుతున్నారు.ఇదిలా ఉండగా.. గతంలో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇరాన్ను పలుమార్లు హెచ్చరించారు. ట్రంప్ మొదటి టర్మ్లో 2020లో ఇరాన్పై వైమానిక దాడులకు ఆదేశించాడు. ఈ దాడుల్లో భాగంగా టాప్ మిలిటరీ కమాండర్ ఖాసీం సులేమానీని హతమార్చారు. 2015లో ఇరాన్తో బరాక్ ఒబామా కుదుర్చుకున్న అణు బప్పందాన్ని సైతం ట్రంప్ విరమించుకున్నారు. అదే సమయంలో ఇరాన్పై ట్రంప్ ఆర్థిక ఆంక్షలను సైతం విధించారు.మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్ను ప్రఖ్యాత టైమ్ మేగజైన్ ఈ ఏటి మేటి వ్యక్తిగా గుర్తించింది. ఈ గౌరవం ఆయనకు దక్కడం ఇది రెండోసారి. 2016లోనూ ట్రంప్ ‘పర్సన్ ఆఫ్ ఇయర్’ అయ్యారు. ఈ క్రమంలో ‘2024 పర్సన్ ఆఫ్ ఇయర్ ట్రంప్’ అని టైమ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ శామ్ జాకోబ్ చెప్పారు. ఈ సందర్భంగా ట్రంప్ గురువారం ఉదయం న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఓపెనింగ్ బెల్ మోగించారు. Trump to Time Magazine on the possibility of war with Iran: “Anything is possible.” pic.twitter.com/LKHA7tJU0p— Open Source Intel (@Osint613) December 12, 2024 -
39 మందికి బైడెన్ క్షమాభిక్ష
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగుస్తుండటంతో బైడెన్ క్షమాభిక్ష, శిక్షాకాలం తగ్గింపుల జోరు పెంచారు. అమెరికా చరిత్రలో ఎన్నడూలేనంతగా ఒకేసారి ఒకేరోజు 1,500 మంది ఖైదీలకు శిక్షాకాలం తగ్గించారు. మాదకద్రవ్యాల వినియోగం, స్వలింగ సంపర్కులు తదితర నేరాలుచేసిన వాళ్లు వీరిలో ఉన్నారు. హింసాత్మకంకాని నేరాల్లో దోషులుగా తేలి శిక్ష అనుభవిస్తున్న మరో 39 మంది ఖైదీలకు బైడెన్ ఏకంగా క్షమాభిక్ష ప్రసాదించారు. ఆధునిక అమెరికాలో ఒక అధ్యక్షుడు ఒకే రోజులో ఇంతమంది ఖైదీల పట్ల దయ చూపడం ఇదే తొలిసారి కావడం విశేషం. కోవిడ్ సంక్షోభకాలంలో కారాగారాల్లో కరోనా విజృంభించి ఎక్కువ మంది ఖైదీలు వైరస్బారిన పడి మృతిచెందడం కంటే విడిగా దూరం దూరంగా ఉంటే మంచిదని భావించి ఆనాడు చాలా మందిని బైడెన్ సర్కార్ విడిచిపెట్టింది. అలా స్వస్థలాలకు వెళ్లిన ఖైదీలను కొని నెలలపాటు గృహనిర్బంధంలో ఉంచింది. గురువారం వీళ్లంతా శిక్షాకాలం తగ్గింపు ఉపశమనం పొందారు. -
‘టైమ్స్’ ఈ ఏటి మేటి వ్యక్తి ట్రంప్
వాషింగ్టన్: కాబోయే అమెరికా అధ్యక్షుడు∙డొనాల్డ్ ట్రంప్ను ప్రఖ్యాత టైమ్ మేగజైన్ ఈ ఏటి మేటి వ్యక్తిగా గుర్తించింది. ఈ గౌరవం ఆయనకు దక్కడం ఇది రెండోసారి. 2016లోనూ ట్రంప్ ‘పర్సన్ ఆఫ్ ఇయర్’ అయ్యారు. ‘2024 పర్సన్ ఆఫ్ ఇయర్ ట్రంప్’ అని టైమ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ శామ్ జాకోబ్ చెప్పారు. ఈ సందర్భంగా ట్రంప్ గురువారం ఉదయం న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఓపెనింగ్ బెల్ మోగించారు. -
ఉక్రెయిన్లో తక్షణమే శాంతి నెలకొనాలి
వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం తక్షణమే ఆగిపోవాలని అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. నాటో నుంచి అమెరికా వైదొలిగే అంశాన్ని పరిశీలిస్తున్నామని కూడా ఆయన వెల్లడించారు. పారిస్లో శనివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం ట్రంప్ తన సొంత ట్రూత్ సోషల్లో.. ‘రష్యాతో వెయ్యి రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఉక్రెయిన్ ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నా’ అంటూ వ్యాఖ్యానించారు. ‘అవసరమే లేని యుద్ధంలో రష్యా, ఉక్రెయిన్లు రెండూ వేలాదిగా సైనికులను పోగొట్టుకున్నాయి. అందుకే చర్చలు ప్రారంభించి, వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలి. ఎన్నో ప్రాణాలు అనవసరంగా బలయ్యాయి. ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను కోరుతున్నా’ అని ఆయన పేర్కొన్నారు. ట్రంప్తో సమావేశం నిర్మాణాత్మకంగా జరిగిందని అంతకుముందు జెలెన్స్కీ పేర్కొన్నారు. ‘శాంతి ఒప్పందంతో మాకు న్యాయం జరగాలి. రష్యా, పుతిన్, ఇతర దురాక్రమణదారులు ఇలాంటి యుద్ధాలకు దిగే అవకాశం మళ్లీ ఇవ్వరాదు’అని స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో తాము 43 వేల మంది సైనికులను కోల్పోయామని, మరో 3.70 లక్షల మంది క్షతగాత్రులయ్యారని జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధమేనని రష్యా ట్రంప్ ప్రకటనపై ఈ మేరకు స్పందించడం గమనార్హం. అయితే, అధ్యక్షుడిగా పుతిన్ ఉన్నంతకాలం రష్యాతో చర్చల ప్రసక్తే లేదని గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రకటనను గుర్తు చేసింది.నాటో నుంచి బయటికొస్తాంనాటో నుంచి అమెరికా బయటికి వచ్చే విషయం ఇప్పటికీ తమ పరిశీలనలో ఉందని, అది సాధ్యమేనని ట్రంప్ ఎన్బీసీ చానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘నాటోలో అమెరికా బలగాలుండాలంటే బదులుగా యూరప్, కెనడా ప్రభుత్వాలు అందుకయ్యే వ్యయం భరించాలి. అప్పుడే వాళ్లు మమ్మల్ని సమభావంతో చూస్తున్నట్లు లెక్క. అలాగైతేనే మేం నాటోలో కొనసాగుతాం’ అని ఆయన స్పష్టం చేశారు. యూరప్, కెనడాలకు తామెందుకు భద్రత కల్పించాలంటూ అమెరికా అధ్యక్షుడిగా ఉండగా గతంలోనే ఆయన ప్రశ్నించడం తెల్సిందే. -
నాసా చీఫ్గా జేర్డ్
వాషింగ్టన్: బిలియనీర్ వ్యోమగామి జేర్డ్ ఐజాక్మన్ను నాసా చీఫ్గా కాబోయే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంపిక చేశారు. ఫ్లోరిడా డెమొక్రటిక్ మాజీ సెనేటర్ బిల్ నెల్సన్ స్థానంలో జేర్డ్ ఇకపై నాసా అడ్మినిస్ట్రేటర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. హైస్కూల్ డ్రాపవుట్ నుంచి అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తగా ఎదిగిన 41 ఏళ్ల జేర్డ్కు రెండు సార్లు అంతరిక్షంలోకి వెళ్లిన అనుభవం ఉంది. అంతరిక్షంలో స్పేస్వాక్ చేసిన తొలి ప్రైవేట్ వ్యోమగామిగా గుర్తింపుపొందారు. పైలట్, వ్యోమగామి అయిన జేర్డ్ను నాసా అడ్మినిస్ట్రేటర్గా నామినేట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని ట్రంప్ అన్నారు. ప్రస్తుతం ‘షిఫ్ట్4 పేమెంట్స్’ కంపెనీ సీఈవోగా ఉన్న జేర్డ్ తన 16వ ఏటలోనే ఈ కంపెనీని ప్రారంభించారు. 1983 ఫిబ్రవరి 11న న్యూజెర్సీలో జన్మించిన జేర్డ్ ఐజాక్మన్ 16వ ఏట హైస్కూలు చదువు మానేశారు. ‘నాసా చీఫ్గా పనిచేయడానికి అధ్యక్షుడు ట్రంప్ నామినేషన్ను స్వీకరించడం నాకు గౌరవంగా ఉంది. రెండో అంతరిక్ష యుగం ఇప్పుడే మొదలైంది. నాసా బృందంతో కలిసి పనిచేయడం జీవితకాల గౌరవం’ అని జేర్డ్ అన్నారు.Trump picks billionaire Jared Isaacman to lead NASA pic.twitter.com/cViJxvbK5y— Vaišvydas (@PauldoesShit) December 5, 2024 -
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. లింక్డిన్ కో-ఫౌండర్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్ : ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సంస్థ లింక్డిన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ట్రంప్ విజయంతో రీడ్ హాఫ్మన్ అమెరికా వదిలేందుకు సిద్ధమైనట్లు అమెరికా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. BREAKING: Democratic Mega-Donor, Reid Hoffman tells friends he is considering leaving the United States following President Trump’s Election Win. Bye! ✌🏻 pic.twitter.com/g2olDLGVR8— Ian Jaeger (@IanJaeger29) December 2, 2024అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపుతో డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థుల్లో భయం మొదలైందని అమెరికా స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. అందుకు ఊతం ఇచ్చేలా లింక్డిన్ కో-ఫౌండర్ హాఫ్మన్ దేశాన్ని వదిలి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హాఫ్మన్ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్కు మద్దతు పలికారు. ఆమె ఎన్నికల ప్రచారానికి 10 మిలియన్ డాలర్లు విరాళం అందించారు.దీనికి తోడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ట్రంప్ మరణాన్ని కోరుకున్నట్లు పరోక్షంగా వ్యాఖ్యానించారు.అయితే,వీటన్నింటికి కంటే ట్రంప్పై మాజీ న్యూయార్క్ మ్యాగజైన్ రచయిత ఇ.జీన్ కారోల్ పరువు నష్టం దావా వేశారు. అందుకు హాఫ్మన్ సహకరించారు. ఈ భయాలతో హామ్మన్ అమెరికాను వదిలేయాని నిర్ణయానికి వచ్చినట్లు అమెరికన్ మీడియా కథనాలు చెబుతున్నాయి. -
ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదు: పుతిన్ షాకింగ్ కామెంట్స్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ పుతిన్ చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారం సమయంలో ట్రంప్ పై జరిగిన హత్యాయత్నాలే తనను షాక్ కు గురిచేశాయని తెలిపారు.పుతిన్ తాజాగా ఖజికిస్తాన్ లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా తెలివైన వ్యక్తి. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా ట్రంప్ వెనుకాడరు. అయితే, ట్రంప్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ఆయన ప్రాణాలకు రక్షణ లేదు. అమెరికా ఎన్నికల ప్రచార సమయంలో ఆయనపై జరిగిన దాడులే ఇందుకు నిదర్శనం. ఎన్నికల సమయంలో ఆయన కుటుంబ సభ్యులపై కూడా దాడులు జరిగాయి. వీటన్నింటినీ ట్రంప్ అర్థం చేసుకోవాలి అని సూచనలు చేశారు. ఇదే సమయంలో ట్రంప్.. యుద్ధాలను సైతం ఆపేయగలరని పుతిన్ కితాబు ఇచ్చారు.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో పెన్సిల్వేనియాలో ట్రంప్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తుపాకీతో కాల్చడంతో ట్రంప్ చెవి దగ్గరి నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ క్రమంలో ట్రంప్ చెవికి గాయమైంది. -
అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు
ఒట్టావా: కెనడా దిగుమతులపై అధిక పన్నుల భారం వేస్తానని కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో కెనడా సైతం దీటుగా స్పందించడంపై దృష్టి సారించింది. అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించాలనే విషయాన్ని పరిశీలిస్తోంది. దక్షిణ, ఉత్తర సరిహద్దుల గుండా మాదకద్రవ్యాలు, వలసదారుల అక్రమచొరబాట్లను నిలువరించకపోతే అటు మెక్సికో, అటు కెనడా దిగుమతులపై ఏకంగా 25 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ అమెరికా ఎన్నికల ప్రచారంవేళ ఓటర్లకు వాగ్దానాలు చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో అమెరికాతో వాణిజ్యం బలోపేతంపై ఉపప్రధాని, ఆర్థిక శాఖ మంత్రి క్రిస్టినా ఫ్రీలాండ్, అంతర్గత వ్యవహారాలు, ఇతర శాఖల మంత్రులు, అమెరికాలో కెనడా రాయబారి కిస్టెన్ హిల్మ్యాన్లతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గురువారం అత్యవసరంగా సమావేశమయ్యారు. అమెరికాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తూ అధిక పన్నులు మోపడంపై చర్చించారు. ఐక్య ఫ్రంట్ను ఏర్పాటు చేయాల్సి ఉందని ఆయన నొక్కి చెప్పారు. అయితే కెనడాను మెక్సికోను ఒకే గాటిన కట్టడం అన్యాయమని మంత్రులు జస్టిన్ వద్ద ప్రస్తావించారు. కెనడా నుంచి వలసలను తగ్గించడానికి, వనరులను అందించడానికి, ట్రంప్ పరిపాలనతో కలిసి పనిచేయడానికి సిద్దమేనని ఈ సందర్భంగా ట్రూడో అన్నారు. మాదక ద్రవ్యాలు తమ దేశం సమస్య కాదని, సుంకాలు రెండు దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని కెనడా మంత్రులు అభిప్రాయపడ్డారు. అమెరికాకు దిగుమతి అవుతున్న చాలా ఉత్పత్తులు కెనడా నుంచే వస్తున్నాయి. ప్రతిరోజూ దాదాపు రూ.22,000 కోట్ల విలువైన వస్తుసేవలు కెనడా నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. అమెరికా ముడిచమురు అవసరాల్లో 60 శాతం కెనడానే తీరుస్తోంది. 85 శాతం అమెరికా విద్యుత్ ఉపకరణాలు కెనడా నుంచే వస్తున్నాయి. 34 అత్యంత విలువైన ఖనిజధాతువులు, లోహాలు కెనడా నుంచి దిగుమతి అవుతున్నాయి. ప్రతీకార సుంకాల పరిశీలన.. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని రకాల ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను విధించే అవకాశాలను కెనడా పరిశీలిస్తోందని సీనియర్ అధికారి ఒకరు గురువారం వెల్లడించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి కెనడా సిద్ధమవుతోందని, ప్రతీకారంగా ఏ వస్తువులపై సుంకాలు విధించాలనే విషయంపై చర్చిస్తోందని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో అధిక సుంకాలు విధించినప్పుడు, ఇతర దేశాలు ప్రతీకార సుంకాలతో ప్రతిస్పందించాయి. గతంలోనూ 2018లో కెనడా నుంచి దిగుమతి అయిన స్టీల్, అల్యూమినియంపై అమెరికా అదనపు పన్నలు విధించింది. దీనికి ప్రతికా కెనడా సైతం అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై వేలకోట్ల పన్నులను ముక్కుపిండి వసూలుచేసింది. మెక్సికోతో ట్రంప్ చర్చలు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్తో అద్భుతమైన చర్చ జరిగిందని ట్రంప్ బుధవారం చెప్పారు. ‘‘వలసదారులు అమెరికా దక్షిణ సరిహద్దు గుండా లోపలికి అక్రమంగా చొరబడకుండా ఇకపై మెక్సికో సమర్థవంతంగా అడ్డుకోనుంది. ఈ చర్యలు తక్షణం అమల్లోకి వస్తాయి. ఈ చర్యలు అమెరికా చేపడుతున్న అక్రమ ఆక్రమణ నిరోధక కార్యక్రమాలకు ఎంతగానో దోహదపడుతుంది. క్లాడియా షీన్బామ్కు ధన్యవాదాలు’’అని ట్రంప్ పోస్ట్చేశారు. ‘‘అమెరికాలోకి భారీగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చేపట్టాల్సిన ఉమ్మడి చర్యలపై క్లాడియాతో చర్చించా’’అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ భేటీ తర్వాత అమెరికా అధిక పన్నుల భారం నుంచి మెక్సికోకు ఉపశమనం లభిస్తుందో లేదో తెలియరాలేదు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక తీసుకునే నిర్ణయాలపై ఇది ఆధారపడి ఉంటుంది. -
హష్ మనీ కేసులో ట్రంప్కు ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్కు కేసుల నుంచి భారీ ఉపశమనం లభిస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హష్ మనీ కేసులో దోషిగా తేలిన ట్రంప్కు శిక్షను న్యాయస్థానం నిరవధికంగా వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కేసులో న్యూయార్క్ కోర్టు ఆయనకు నవంబర్ నెలలోనే శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో కేసుల విషయంలో విచారణ ఎదుర్కోకుండా ఆయనకు రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలోనే హష్ మనీ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు న్యూయార్క్ కోర్టును ఆశ్రయించారు. దీంతో శిక్షపై స్టే కోసం దరఖాస్తు చేయాలని న్యాయస్థానం సూచించింది. ట్రంప్కు ఇది భారీ విజయమని ఆయన తరఫు ప్రతినిధులు చెప్పారు. శృంగార తార స్టార్మీ డేనియల్స్తో ట్రంప్ ఏకాంతంగా గడిపినట్లు ఆరోపణలు వచ్చాయి. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరువిప్పకుండా చేయడానికి రిపబ్లికన్ పార్టికి విరాళంగా అందిన సొమ్ము నుంచి డబ్బులు చెల్లించారని బయటపడింది. ట్రంప్ తన లాయర్ ద్వారా 1.30 లక్షల డాలర్లు ఇచ్చినట్లు రుజువైంది. అంతేకాదు స్టార్మీ డేనియల్స్కి చెల్లించిన డబ్బుల వివరాలను ట్రంప్ లెక్కల్లో చూపలేదు. -
ఉద్యోగాలపై బాంబు పేల్చిన వివేక్ రామస్వామి.. భారీగా కోతలు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం అందుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే వివేక్ రామస్వామి, ఎలాన్ మస్క్కు కీలక బాధ్యతలను అప్పగించారు. ఇక, బాధ్యతల్లో చేరకముందే వివేక్ రామస్వామి పెద్ద బాంబ్ పేల్చారు. ఉద్యోగాల్లో కోతలు ఉంటాయని హింట్ ఇచ్చారు.ఇటీవల ఫ్లోరిడాలోని ట్రంప్ ఎస్టేట్ మారలాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో వివేక్ రామస్వామి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘లక్షల మంది ఫెడరల్ బ్యూరోక్రాట్లను బ్యూరోక్రసీ నుంచి సామూహికంగా తొలగించే స్థాయిలో నేను, ఎలాన్మస్క్ ఉన్నాం. అలా ఈ దేశాన్ని మేం కాపాడాలనుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీగా కోతలు విధించే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఇక, ముందు నుంచి డొనాల్డ్ ట్రంప్.. అమెరికా ఫస్ట్ అనే నినాదం చేస్తున్న విషయం తెలిసిందే. Vivek Ramaswamy on a mission.#MAGA pic.twitter.com/wYivstPqDV— TheTrumpestFuture (@trumpestfuture) November 16, 2024 -
ట్రంప్ సెలక్షన్ సూపర్.. తులసీ గబ్బార్డ్పై నిర్మలా సీతారామన్ ప్రశంసలు
ఢిల్లీ: అగ్ర రాజ్యం అమెరికా నిఘా విభాగానికి అధిపతిగా తులసీ గబ్బార్డ్ను ఎంపిక చేయడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హర్షం వ్యక్తం చేశారు. తులసీ గబ్బార్డ్ ఎంతో అంకితభావంతో పనిచేసే వ్యక్తి అని నిర్మలా ప్రశంసలు కురిపించారు.అమెరికా నిఘా విభాగానికి అధిపతిగా తులసీ గబ్బార్డ్ ఎంపికపై తాజాగా నిర్మలా సీతారామన్ స్పందించారు. నిర్మల ట్విట్టర్ వేదికగా..‘గత 21 ఏళ్లగా అమెరికా ఆర్మీ రిజర్వ్లో లెఫ్టినెంట్ కల్నల్గా తులసీ సేవలందించారు. మీతో నేను చేసిన కొన్ని సంప్రదింపుల సందర్భంగా మీ ఆలోచనలు, అంకితభావం.. కొన్ని విషయాల పట్ల స్పష్టత నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. కీలక బాధ్యతలు చేపట్టబోతున్న మీకు శుభాకాంక్షలు అని చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా గతంతో ఆమెతో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలను షేర్ చేశారు. Congratulations @TulsiGabbard on being selected to serve as Director of National Intelligence. For 21 yrs you served the USA as a soldier becoming a Lt. Colonel in Army Reserve. In my few interactions with you, have been impressed by the clarity of your thoughts and dedication.… pic.twitter.com/b5LSZyx9F9— Nirmala Sitharaman (@nsitharaman) November 15, 2024ఇదిలా ఉండగా.. అమెరికా నిఘా విభాగానికి అధిపతిగా తులసీ గబ్బార్డ్ వ్యవహరించబోతున్నారు. ఈ క్రమంలో జాతీయ భద్రతా ఏజెన్సీ (ఎన్ఎస్ఏ), సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)తో పాటు.. దాదాపు 18 యూఎస్ నిఘా సంస్థలు ఆమె పర్యవేక్షణలో ఉంటాయి. ప్రపంచంలో ఏ మారుమూల ఏం జరిగినా.. ఇవి సేకరిస్తాయి. చివరికి సీఐఏ అధిపతి కూడా ఆమెకు రిపోర్టు చేస్తారు. నిఘా సమాచారాన్ని సేకరించి రోజువారీ కీలక సమాచారాన్ని అధ్యక్షుడికి ఆమె వెల్లడిస్తారు. 9/11 దాడుల తర్వాత ఏర్పడిన కమిషన్ సూచనల మేరకు ఏర్పాటు చేసిన అత్యంత కీలక పదవి ఇది.తులసీ గబ్బార్డ్.. 1981లో అమెరికాలో జన్మించారు. ఆమె కుటుంబం హవాయిలో స్థిరపడింది. 21 ఏళ్లు రాగానే 2002లో ఆమె హవాయి రాష్ట్ర చట్టసభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ఏడాదే హవాయి నేషనల్ ఆర్మీ గార్డ్స్లో చేరారు. అదే ఏడాది ఆమె వివాహం ఎడ్వర్డ్ టమాయోతో జరిగింది. 2004-05లో ఇరాక్ యుద్ధ క్షేత్రంలో మెడికల్ యూనిట్లో పనిచేశారు. ఆ తర్వాత భర్త నుంచి విడిపోయారు. 2007లో అలబామా మిలిటరీ అకాడమీలోని యాక్సిలరేటెడ్ ఆఫీసర్స్ క్యాండిడేట్ స్కూల్ గ్రాడ్యుయేషన్ సాధించారు. దాని 50 సంవత్సరాల చరిత్రలో ఈ పట్టా అందుకున్న తొలిమహిళగా నిలిచారు. ఆ తర్వాత మళ్లీ కువైట్లో ఉగ్రవాద వ్యతిరేక శిక్షణ యూనిట్లో పనిచేశారు. ఆమెకు కాంబాట్ మెడికల్ బ్యాడ్జ్, మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ లభించాయి. 2010లో హోనలులు సిటీ కౌన్సిల్కు ఎన్నికయ్యారు. గతంలో డెమోక్రటిక్ పార్టీ తరఫున నెగ్గి కాంగ్రెస్కు ఎన్నికయ్యారు. 2013 నుంచి 2021 వరకు కాంగ్రెస్లో సభ్యురాలిగా ఉన్నారు. 2022లో డెమోక్రటిక్ పార్టీని వీడారు. తాజా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్నకు మద్దతు పలికారు. -
ట్రంప్ కీలక నిర్ణయం.. కరోలిన్ సరికొత్త రికార్డు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం అందుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ట్రంప్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తన టీం సభ్యుల పేర్లను వరసబెట్టి ప్రకటిస్తున్నారు. తాజాగా తన ప్రెస్ సెక్రటరీగా కరోలిన్ లీవిట్ను ఎన్నుకున్నారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ చరిత్రలో లీవిట్(27) అతి పిన్న వయస్కురాలుగా రికార్డుకెక్కారు.తన ప్రచార ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ను వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీగా డొనాల్డ్ ట్రంప్ నియమించారు. ఈ మేరకు ట్రంప్ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం, ట్రంప్ మాట్లాడుతూ.. నా ఎన్నికల ప్రచారంలో కరోలిన్ లీవిట్ ప్రెస్ సెక్రటరీగా అద్భుతంగా పనిచేశారు. ఆమెను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తుందని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. కరోలిన్ తెలివైనది. చాలా ప్రభావవంతమైన కమ్యూనికేటర్. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చే సమయంలో దేశ ప్రజలకు మా సందేశాన్ని అందించడంలో ప్రభుత్వానికి ఆమె ఎంతో సహాయపడుతుందని నాకు విశ్వాసం ఉంది’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వైట్ హౌస్ ప్రెస్ కార్యాలయంలో లీవిట్ పనిచేశారు. ఆ తర్వాత ఆమె న్యూయార్క్ రిపబ్లికన్ ప్రతినిధి ఎలిస్ స్టెఫానిక్కు కమ్యూనికేషన్స్ డైరెక్టర్గా కొనసాగారు. ఇక, 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ ప్రచార ప్రతినిధిగా లీవిట్ వ్యవహరించారు.Congratulations Karoline Leavitt can't wait till you blast the swamp flies and tell the truth pic.twitter.com/ISuRbcNUV7— Liberty Loving Granddad (@Kid60618) November 16, 2024 -
అమెరికా ఆరోగ్య మంత్రిగా... వ్యాక్సిన్ల వ్యతిరేకి
వాషింగ్టన్: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య, ప్రజా సేవల మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమకారుడు రాబర్ట్ ఎఫ్ కెనెడీ జూనియర్ను నియమించనున్నట్లు ప్రకటించారు. ‘‘ప్రజారోగ్యం విషయంలో మందుల కంపెనీల మోసాలు, తప్పుడు సమాచారం తదితరాలతో అమెరికన్లు చాలాకాలంగా నలిగిపోయారు. కెనెడీ వీటికి అడ్డుకట్ట వేసి అమెరికాను మళ్లీ గొప్పగా, ఆరోగ్యంగా మారుస్తారు. ఔషధాలు, వ్యాక్సిన్లు, ఆహార భద్రత, వైద్య పరిశోధన, సామాజిక భద్రత, మెడికేర్ వంటి కీలక వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు’’ అని తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్లో పోస్ట్ చేశారు. ‘మేక్ అమెరికా హెల్దీ అగైన్’ నినాదానికి కెనెడీ పూర్తిగా న్యాయం చేస్తారని విశ్వాసం వెలిబుచ్చారు. తన రెండో విడత పాలనలో ప్రజారోగ్యం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కెనెడీకి పూర్తి స్వేచ్ఛనిస్తానని ట్రంప్ పదేపదే చెప్పుకొచ్చారు. టీకాలు తదితరాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తికి ఏకంగా ఆరోగ్య శాఖ అప్పగించడం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కీలక నియామకాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంటుంది. రాజకీయ కుటుంబం కెనెడీ ఉన్నత రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి రాబర్ట్ ఎఫ్.కెనెడీ మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనెడీకి తమ్ముడు. అమెరికాకు అటార్నీ జనరల్గా పని చేశారు. ఈసారి డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం అధ్యక్షుడు జో బైడెన్తో కెనెడీ పోటీ పడ్డారు. తర్వాత స్వతంత్ర అభ్యరి్థగా బరిలో నిలిచారు. తాను గెలిస్తే ఆరోగ్య విధాన పర్యవేక్షణను అప్పగిస్తానని ట్రంప్ హామీ ఇవ్వడంతో ఆయనకు మద్దతుగా పోటీ నుంచి తప్పుతకున్నారు. అనంతరం ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఎన్నికల చివరి దశలో ట్రంప్ కోసం కెనెడీ ముమ్మరంగా ప్రచారం కూడా చేశారు. వ్యాక్సిన్లకు ఫక్తు వ్యతిరేకి ప్రపంచంలోనే ప్రముఖ వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమకారుల్లో కెనెడీ ఒకరు. ఆటిజం తదితర ఆరోగ్య సమస్యలకు టీకాలు కారణమవుతాయన్నది ఆయన వాదన. వ్యాక్సిన్ అస్సలు సురక్షితం కావని, ప్రభావవంతమైనవీ కావని తానిప్పటికీ నమ్ముతున్నానని చెబుతారు. పిల్లలకు టీకాలను సూచించే సీడీసీ మార్గదర్శకాలను వ్యతిరేకించాలని 2021లో ప్రజలకు పిలుపునిచ్చారు. టీకాలకు వ్యతిరేకంగా ఏకంగా ఓ స్వచ్ఛంద సంస్థనే స్థాపించారు. అది టీకా సంస్థలతో పాటు వాటికి మద్దతిచ్చే పలు వార్తా సంస్థలపై కూడా కోర్టుల్లో పోరాడుతోంది. ప్రముఖ న్యాయవాది అయిన కెనెడీ పురుగుమందులు, ఫార్మా కంపెనీలపై కేసుల్లో స్వయంగా వాదిస్తుంటారు. ప్రాసెస్డ్ ఫుడ్, కలుపు మందుల వాడకానికి కూడా ఆయన ఫక్తు వ్యతిరేకి. అమెరికాలో ఆహార పరిశ్రమపై చిరకాలంగా పెత్తనం చలాయిస్తున్న భారీ వాణిజ్య కమతాలు, దాణా పరిశ్రమలను బాగా విమర్శిస్తుంటారు. దశాబ్దాలుగా దేశమంతటా నమ్మకమైన అనుచరగణాన్ని నిర్మించుకున్నారు. ఆహార పదార్థాల విషయంలో కఠిన నిబంధనలు విధించాలన్నది కెనెడీ వైఖరి. అమెరికాలో ఆహారాన్ని ఆరోగ్యకరంగా మారుస్తానని, ఈ విషయంలో యూరప్ తరహా నిబంధనలు తెస్తానని చెబుతున్నారు. ఆరోగ్య శాఖకు సంబంధించి పలు విభాగాల ఉద్యోగుల నేపథ్యాన్ని లోతుగా పరిశీలిస్తామని కూడా ప్రకటించారు. ఫార్మా తదితర కంపెనీల్లో చేసిన నేపథ్యమున్న వారిని ఏం చేయాలో నిర్ణయిస్తామని చెప్పారు. వ్యాక్సిన్ పరిశోధనలను పర్యవేక్షించే వందలాది ఉద్యోగులను తొలగించాలనుకుంటున్నట్లు ఆయన చెప్పడం కలకలం రేపింది. వివాదాస్పదుడు కూడా పలు వివాదాల్లో కూడా కెనెడీ పతాక శీర్షికలకెక్కారు. ఎలుగుబంటి కళేబరాన్ని న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్లో పడేసి అది బైక్ ఢీకొని చనిపోయినట్టు చిత్రీకరించారు. దాన్ని ఆయనే కారుతో గుద్ది చంపారంటారు. బీచ్లో ఒడ్డుకు కొట్టుకొచి్చన ఓ తిమింగలం తలను కత్తిరించి కారుకు కట్టి ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తే వెల్లడించింది. దాంతో కెనెడీ కోర్టు కేసును ఎదుర్కోవాల్సి వచ్చింది. తీవ్ర ఆందోళనలు కెనెడీ నియామకం ప్రజారోగ్య నిపుణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చిన్నారులను మహమ్మారుల బారినుంచి కాపాడే టీకాలకు వ్యతిరేకంగా ఉద్యమించే వ్యక్తి చేతుల్లో ప్రజల ఆరోగ్యాన్ని బలి పెడుతున్నారంటూ వారంతా మండిపడుతున్నారు. ఆరోగ్య మంత్రి పదవికి అవసరమైన ఒక్క అర్హత కూడా ఆయనకు లేదని అమెరికాలోని ప్రఖ్యాత ప్రజారోగ్య స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ ప్రెసిడెంట్ డాక్టర్ పీటర్ లురీ అన్నారు. ఆ పదవికి ఆయన పూర్తిగా అనర్హుడంటూ సెంటర్స్ పర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ డాక్టర్ మండీ కోహెన్ ధ్వజమెత్తారు. ‘‘ఆరోగ్యం విషయంలో అమెరికన్లు మళ్లీ తిరోగమన బాటను కోరుకోవడం లేదు. పిల్లలు, పెద్దలు ఆరోగ్య సమస్యల బారిన పడటం, ప్రాణాలు కోల్పోవడం వంటివి చూడాలనుకోవడం లేదు’’ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అంతర్గత వ్యవహారాల మంత్రిగా డౌగ్ బర్గమ్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా నార్త్ డకోటా గవర్నర్ డౌగ్ బర్గమ్ను ట్రంప్ ఎంచుకున్నారు. నిజానికి ఆ యన ట్రంప్ రన్నింగ్మేట్ అవుతారని తొలుత అంతా భావించారు. 67 ఏళ్ల బర్గం రెండోసారి గవర్నర్గా కొనసాగుతున్నారు. తొలుత రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వ రేసులో కూడా కొనసాగారు. తర్వాత తప్పుకుని ట్రంప్కు మద్దతుగా ముమ్మరంగా ప్రచా రం చేశారు. పూర్వాశ్రమంలో సాఫ్ట్వేర్ దిగ్గజమైన ఆయన అనంతరం ట్రంప్ మాదిరిగానే రియల్టీ వ్యాపారంలో కూడా రాణించారు. ‘హష్ మనీ’ లాయర్కు అందలం తన హష్ మనీ కేసును వాదిస్తున్న న్యాయ బృందం సారథి టాడ్ బ్లాంచ్ను దేశ డిప్యూటీ అటార్నీ జనరల్గా ట్రంప్ ఎంపిక చేశారు. న్యాయ శాఖలో ఇది రెండో అత్యున్నత పదవి. అటార్నీ జనరల్గా మాట్ గేట్జ్ ఆయన ఇప్పటికే ఎంచుకోవడం తెలిసిందే. కాంగ్రెస్ మాజీ సభ్యుడు డగ్ కొలిన్స్ను వెటరన్స్ వ్యవహారాల మంత్రిగా ట్రంప్ ఎంచుకున్నారు. -
రష్యా-ఉక్రెయిన్ వార్పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. పుతిన్కు ఫోన్!
వాషింగ్టన్: గత రెండున్నరేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు దేశాల మధ్య పోరులో ఇప్పటికే వేల సంఖ్యలో సామన్య పౌరులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ మొదటిసారిగా మార్-ఎ-లాగో బహిరంగ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ..‘రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంపై వచ్చిన నివేదికను పరిశీలించాను. గత రెండున్నరేళ్లలో వేలాదిమంది మరణించారు. నేను అధికారంలోకి వచ్చిన అనంతరం రష్యా-ఉక్రెయిన్ల యుద్ధాన్ని ఆపేస్తాను. అలాగే, పశ్చిమాసియాలోనూ శాంతిస్థాపనకు కృషి చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో అమెరికా సైన్యాన్ని బలోపేతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఇదిలా ఉండగా.. అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, తాను అధికారంలోకి వస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ ఇదివరకే పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఇక, ఇటీవల ఈవిషయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడి.. యుద్ధాన్ని విస్తరించొద్దని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికైనా రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు నిలిచిపోవాలని దేశాలు కోరుతున్నాయి. This is what POTUS TRUMP wants for ending RUSSIA UKRAINE war , he wants this 800 miles line to be declared LAC with buffer zones on both sides pic.twitter.com/FJEpf4nCXk— VINAY. KUMAR DELHI (@wadhawan2011) November 15, 2024 -
రక్షణ మంత్రిగా హెగ్సెత్
వాషింగ్టన్: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం పలు అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఫాక్స్ న్యూస్ చానల్ హోస్ట్, మాజీ సైనికాధికారి పీట్ హెగ్సెత్ను రక్షణ మంత్రిగా, కీలకమైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్గా జాన్ రాట్క్లిఫ్ను ఎంపిక చేశారు. సౌత్ డకోటా గవర్నర్ క్రిస్టీ నోయెమ్ను హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం చీఫ్గా, అర్కన్సాస్ మాజీ గవర్నర్ మైక్ హకబీ (69)ని ఇజ్రాయెల్లో అమెరికా రాయబారిగా నియమించాలని నిర్ణయించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి స్టీవెన్ విట్కాఫ్ను పశ్చిమాసియాకు తన ప్రత్యేక దూతగా నియమించారు. డొనాల్డ్ రమ్స్ఫెల్డ్ తర్వాత అతి పిన్న వయస్కుడైన రక్షణ మంత్రిగా 44 ఏళ్ల హెగ్సెత్ రికార్డు సృష్టించనున్నారు. ఆయన జీవితమంతా సైనికుల కోసం, దేశం కోసం యోధుడిగా గడిపారంటూ ట్రంప్ ప్రశంసించారు. ఇక క్రిస్టీది సరిహద్దు భద్రతపై ఏమాత్రం రాజీ పడని తత్వమంటూ కొనియాడారు. హెగ్సెత్ 2003లో సైన్యంలో చేరారు. ఇరాక్, ఆఫ్గానిస్తాన్లలో పని చేశారు. 2016 నుంచి ఫాక్స్ న్యూస్ వీకెండ్ మార్నింగ్ టాక్ షో నిర్వహిస్తున్నారు. ‘ది వార్ ఆఫ్ వారియర్స్’పేరుతో పుస్తకాలు రాశారు.సీఐఏ డైరెక్టర్గా సన్నిహితుడుకీలకమైన సీఐఏ డైరెక్టర్గా ఎంపికైన రాట్క్లిఫ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడు. భారత సంతతికి చెందిన కశ్యప్ (కాష్) పటేల్కు ఈ పదవి దక్కుతుందని తొలుత ఊహాగానాలు వినిపించాయి. ‘‘2016 ఎన్నికలప్పుడు రష్యా కుట్ర అంటూ సాగిన తప్పుడు ప్రచారం డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పనేనని బయట పెట్టడం మొదలుకుని సత్యం కోసం, నిజాయితీ కోసం పోరాడిన యోధుడు జాన్ రాట్క్లిఫ్. అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ల్యాప్టాప్ గురించి 51 మంది ఇంటెలిజెన్స్ అధికారులు అబద్ధాలు చెప్పినా ఆయన మాత్రమే అమెరికన్ ప్రజలకు నిజం చెప్పారు’’అంటూ ట్రంప్ ప్రశంసించారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షునిగా ఉన్నప్పుడు రాట్క్లిఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా పనిచేశారు. 2020లో ఆయన్ను అమెరికా అత్యున్నత గూఢచారిగా ధ్రువీకరించారు. -
ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళనకో శాఖ..సారథులుగా మస్క్, వివేక్
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారత మూలాలున్న రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామిలకు కీలక బాధ్యతలు అప్పగించాలని అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. యంత్రాంగంలో సమూల ప్రక్షాళన కోసం వారి సారథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) ఏర్పాటును ప్రకటించారు. ‘‘ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళన, మితిమీరిన నిబంధనలకు కోత, అనవసర ఖర్చు తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్ వ్యవస్థీకరణ తదితరాలను ఈ శాఖ పర్యవేక్షించనుంది. ఇందుకు ‘ది గ్రేట్’ మస్క్, ‘అమెరికా దేశభక్తుడు’ వివేక్ నాయకత్వం వహిస్తారు. తమ అమూల్య సలహాలతో సేవ్ అమెరికా ఉద్యమానికి మార్గదర్శనం చేస్తారు’’ అని పేర్కొన్నారు. అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకు 250 ఏళ్లు నిండే 2026 జూలై 4వ తేదీకల్లా ప్రక్షాళన ప్రక్రియను పూర్తి చేయాలని మస్క్, వివేక్లకు డెడ్లైన్ విధించారు. ‘డోజ్’ను ఈ కాలపు మన్హాటన్ ప్రాజెక్టుగా ట్రంప్ అభివరి్ణంచారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అణుబాంబుల నిర్మాణానికి చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘మన్హాటన్’. డోజ్ పనితీరుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇది ఫెడరల్ అడ్వైజరీ కమిటీ చట్టం పరిధిలోకి రావచ్చంటున్నారు. ప్రభుత్వోద్యోగులు ఆస్తులు తదితర వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాల్సి ఉంటుంది. అయితే మస్క్, రామస్వామి ప్రభుత్వంలో చేరకుండా బయటి నుంచే పనిచేస్తారని ట్రంప్ చెప్పడంతో ఆ నిబంధన వారికి వర్తించే అవకాశం లేదు. గతంలోనూ అమెరికా అధ్యక్షులు ఇలా ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేశారు. రిపబ్లికన్ పార్టీకే చెందిన రొనాల్డ్ రీగన్ 1981–1989 మధ్య ‘గ్రేస్ కమిషన్’ను స్థాపించారు. ఇక ప్రకంపనలే: మస్క్ డోజ్ ఏర్పాటును మస్క్ స్వాగతించారు. ఇది ప్రభుత్వ వ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తుందన్నారు. ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావచ్చన్నారు. పారదర్శకత కోసం డోజ్ చర్యలన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. ప్రజా ధనం వృ«థాను అరికట్టేందుకు లీడర్ బోర్డ్ ఏర్పాటవుతుందని తెలిపారు. ట్రంప్ టీమ్లో తొలి భారత అమెరికన్ ట్రంప్ 2.0 టీమ్లో చోటు సంపాదించిన తొలి భారత అమెరికన్గా 39 ఏళ్ల వివేక్ నిలిచారు. డోజ్ ఏర్పాటుపై ఆయన హర్షం వెలిబుచ్చారు. ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళనలో సున్నితంగా వ్యవహరించబోమని స్పష్టం చేశారు. కాలం చెల్లిన పలు ఫెడరల్ ఏజెన్సీలను తొలగించాలంటూ ప్రచార పర్వంలో రిపబ్లికన్లు తరచూ ఉపయోగించిన నినాదం ‘షట్ ఇట్ డౌన్’ను ఈ సందర్భంగా రీ పోస్ట్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు వివేక్ పూర్తిస్థాయిలో మద్దతివ్వడం తెలిసిందే. ట్రంప్ విజయానంతరం పలు టీవీ షోల్లో మాట్లాడుతూ ఆయన్ను ఆకాశానికెత్తారు. వివేక్ 1985 ఆగస్టు 9న ఒహాయోలోని సిన్సినాటిలో జని్మంచారు. ఆయన తల్లిదండ్రులు తమిళనాడుకు చెందిన కేరళ బ్రాహ్మణులు. ఆయన ఒహాయోలోని రోమన్ కాథలిక్ స్కూల్లో చదివారు. హార్వర్డ్ నుంచి జీవశాస్త్రంలో పట్టా పొందారు. యేల్ లా స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యారు. హెడ్జ్ ఫండ్ ఇన్వెస్టర్గా చేశారు. యేల్లో డిగ్రీ పూర్తవకముందే మిలియన్ల కొద్దీ సంపాదించానని చెప్పుకుంటారు. 2014లో ఓ బయోటెక్ కంపెనీని స్థాపించారు. 2023 నాటికే వివేక్ సంపద ఏకంగా 63 కోట్ల డాలర్లని ఫోర్బ్స్ అంచనా వేసింది. 18 ఏళ్లకే అద్భుత ప్రసంగం హైసూ్కల్ విద్యారి్థగా సెయింట్ 18 ఏళ్ల వయసులో జేవియర్ స్కూల్లో వివేక్ చేసిన ప్రసంగ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ప్రసంగం పొడవునా ఆయన కనబరిచిన ఆత్మవిశ్వాసం, భవిష్యత్తును గురించి మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. Congratulations to @elonmusk and @VivekGRamaswamy on this historic achievement! $DOGE #DonaldJTrump #ElonMusk #MAGA #TrumpVance2024 #VivekRamaswamy pic.twitter.com/6b98v4hyyO— Brock W. Mitchell (@BrockWMitchell) November 13, 2024 -
చివరి వారాల్లో అధ్యక్ష పీఠంపై కమల?
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల హోరాహోరీ పోరులో కాస్తంత వెనకబడి తొలి మహిళా దేశాధినేతగా అధ్యక్షపీఠంపై కూర్చునే సువర్ణావకాశాన్ని పోగొట్టుకున్న డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ను గద్దెనెక్కించాలని గట్టిగానే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వివాదాలకు కేంద్రబిందువైన ట్రంప్ స్థానికత సెంటిమెంట్ను రెచ్చగొట్టి అంతర్జాతీయ దౌత్యనీతిని పక్కకునెట్టి, దిగజారుడు వ్యక్తిగత దూషణలకు దిగి ఎలాగోలా పాపులర్ ఓటును ఒడిసిపట్టారన్న విమర్శల వేళ అగ్రరాజ్యంలో కొత్తరకం డిమాండ్ తెరమీదకొచ్చింది. చిట్టచివర్లో రేసులోకి దిగి, ఎన్నికల్లో చివరిదాకా పోరాడి అద్భుత పోరాటస్ఫూర్తిని ప్రదర్శించిన కమలాహారిస్కు చివరివారాల్లో అయినా అధ్యక్ష పట్టాభిషేకం చేయాలని చాలా మంది డెమొక్రాట్లు కోరుకుంటున్నారు. అయితే ఇదేతరహా డిమాండ్లకు తలొగ్గి అధ్యక్ష రేసు నుంచి అనూహ్యంగా తప్పుకున్న బైడెన్ ఈసారి ఏకంగా అధ్యక్ష పదవినే త్యాగం చేస్తారా? ఒకవేళ త్యజించినా హారిస్ అధ్యక్షపీఠమెక్కడం నైతికంగా ఎంత వరకు సబబు? అనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘‘ బైడెన్ అద్భుతమైన నేత. ప్రజల ఎన్నో కోరికలను ఆయన నెరవేర్చారు. ఈ ఒక్క విన్నపాన్నీ ఆయన మన్నించాలి. అధికార మార్పిడికి ఒప్పుకుని హారిస్కు అవకాశం ఇవ్వాలి. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టడానికంటే ముందే హారిస్ ఈ చివరి వారాలు అధికారంలో ఉంటే నైతిక విజయం కమలదే అనే బలమైన వాదనను వినిపించినవాళ్లమవుతాం. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో ఆమె విజయావకాశాలూ మెరుగవుతాయి. చివరి రోజుల్లో బైడెన్ చేయగల గొప్పపని అంటూ ఏదైనా ఉందంటే అది ఇదే’’ అని కమలాహారిస్ కమ్యూనికేషన్స్ విభాగ మాజీ డైరెక్టర్ జమాల్ సైమన్స్ ఆదివారం విజ్ఞప్తిచేశారు. ‘‘ దేశవ్యాప్తంగా ట్రంప్తో పోలిస్తే కేవలం 36 లక్షల ఓట్లు మాత్రమే హారిస్కు తక్కువ వచ్చాయి. కోట్లాది మంది హారిస్ను అధ్యక్షపీఠంపై చూడాలనుకున్నారు. బైడెన్ దిగిపోయి హారిస్కు అవకాశమిస్తే వారి కల నెరవేరుతుంది. అమెరికా సైతం తొలి అధ్యక్షురాలిని చూస్తుంది’’ అని మరో డెమొక్రటిక్ నేత, నటుడు ఆండీ ఓస్ట్రీ అన్నారు. ట్రంప్తో ముఖాముఖి డిబేట్కు ముందువరకు బైడెనే డెమొక్రటిక్ అభ్యర్థి. డిబేట్లో పేలవ ప్రదర్శన తర్వాత అత్యున్నతస్థాయి డెమొక్రటిక్ నేతలు అప్రమత్తమయ్యారు. వెంటనే బైడెన్ను రేస్ నుంచి తప్పించారు. కమలను బరిలో నిలిపారు. ఈసారి కూడా టాప్ డెమొక్రాట్ల లాబీయింగ్ పనిచేస్తుందో లేదో ఎవరికీ తెలీదు. అసలు ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా లేవా అనే వార్తపై కూడా అంతర్జాతీయ మీడియాకు లీకులు రావడం లేదు. 25వ సవరణ ఏం చెప్తోంది?అమెరికా రాజ్యాంగం ప్రకారం చూస్తే కమల ప్రెసిడెంట్ కావడం సాధ్యమే. రాజ్యాంగంలోని 25వ సవరణలోని ఒకటో సెక్షన్ ప్రకారం అధ్యక్షుడిని ఆ పదవి నుంచి తొలగించినా, అధ్యక్షుడు రాజీనామా చేసినా, లేదంటే చనిపోయినా అప్పటి ఉపాధ్యక్ష స్థానంలో ఉన్నవారే అధ్యక్షులవుతారు. ప్రస్తుతం కమల ఉపాధ్యక్షురాలు కాబట్టి ఒకవేళ బైడెన్ రాజీనామా చేసి తప్పుకుంటే సహజంగానే కమలకు అధ్యక్షపగ్గాలు చేతికొస్తాయి. అయితే ఇలా ఉద్దేశపూర్వకంగా చేయడం అనైతికమవుతుందని రిపబ్లికన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘‘ ఈ దుశ్చర్య ఏకంగా అధ్యక్షుడికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర’’ అని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. కమల ఎందుకు అధ్యక్ష పదవికి అనర్హురాలో మరికొందరు భాష్యం చెబుతున్నారు. ఒక రాష్ట్రంలో అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు గెలిస్తే ఆ రాష్ట్రంలోని ఓట్లన్నీ ఒక్క అభ్యర్థికే ధారాదత్తం అవుతాయి. ఈ విధానం కారణంగానే 2016 ఎన్నికల్లో ట్రంప్ గెలిచారు. ఆ ఎన్నికల్లో హిల్లరీక్లింటర్ను దేశవ్యాప్తంగా అత్యధిక ఓట్లు వచ్చాయి. అంటే పాపులర్ ఓటు సాధించారు. కానీ ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ సాధించలేకపోయారు. ఈసారి ఎన్నికల్లో కనీసం పాపులర్ ఓటు సాధించిఉంటే కమలకు నైతిక అర్హత ఉండేదేమోనని కొందరు అభిప్రా యపడ్డారు. ఈసారి ఎన్నికల్లో ట్రంప్ పాపులర్ ఓటుతోపాటు అత్యధిక ఎలక్టోరల్ ఓట్లనూ సాధించడం విశేషం. ఏదేమైనా పార్టీ తరఫున అభ్యర్థిత్వ రేసు నుంచి అనూహ్యంగా తప్పుకున్న బైడెన్ ఈసారి శ్వేతసౌధం నుంచి కూడా అర్ధంతరంగా బయటికొస్తారేమోనని కమల అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఎగ్జిట్పోల్స్లో ట్విస్ట్!
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా ఉన్నాయి. ఇద్దరు అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారీస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇక, ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్పోల్స్ ఇంకా ఆసక్తికరంగా మారాయి.👉కాగా, అమెరికా దేశ పరిస్థితులపై 70 శాతం మంది ఓటర్లు తాము నిరాశాజనకంగా ఉన్నామని చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో ఇద్దరు అభ్యర్థులకు స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడం విశేషం. దీంతో, గెలుపు ఎవరిది అనే అంశంపై ఎగ్జిట్ పోల్స్ స్పష్టమైన వివరాలను వెల్లడించలేదు.👉ఇక, ఎన్నికలపై ఫస్ట్ వేవ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. అమెరికన్ ప్రజలు దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు సర్వే సంస్థలు వెల్లడించాయి.👉ఎన్నికలపై సీబీఎస్ న్యూస్ విడుదల చేసిన పోల్స్ ప్రకారం అమెరికాలో 10 మందిలో దాదాపు ఆరుగురు ప్రజాస్వామ్య స్థితిని తమ మొదటి సమస్యగా పేర్కొన్నారు. అలాగే, ఐదు శాతం మంది ఓటర్లు అబార్షన్ చట్టంపై ఫోకస్ ఉన్నట్టు చెప్పుకొచ్చారు. 10 మందిలో ఒకరు ఆర్థిక వ్యవస్థను ప్రాధాన్యతా అంశంగా ఎంచుకున్నారు.👉అలాగే, సీఎన్ఎన్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. దాదాపు మూడు వంతుల ఓటర్లు ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థకు కట్టుబడి ఓటు వేసినట్టు చెప్పారు. ఇద్దరు అభ్యర్థులపై ప్రతికూల అభిప్రాయాన్ని చూపించారు. ఇదిలా ఉండగా..ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పనితీరుపై పది మందిలో నలుగురు ఓటర్లు మెచ్చుకున్నారు. మిగిలిన ఆరుగురు అసంతృప్తిని వ్యక్తం చేశారు. 👉ఇక, ఇప్పటి వరకు వెలువడిన ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ ఆరు రాష్ట్రాల్లో విజయం సాధించారు. మరో తొమ్మిదో రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. మరోవైపు.. కమలా హారీస్ ఒక్క చోట విజయం సాధించగా, మరో ఐదు రాష్ట్రాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించేది వీరే
అమెరికా నుంచి సాక్షి టీవీ ప్రతినిధి ఇస్మాయిల్అమెరికా అధ్యక్ష ఎన్నికలపై అటు డెమొక్రాట్లు ఇటు రిపబ్లికన్లు పూర్తిగా విడిపోయిన నేపథ్యంలో ఒక వర్గం మాత్రం మౌనం వహిస్తోంది. అటు హారిస్కు కానీ ఇటు ట్రంప్కు గానీ మద్దతు ఇవ్వడంపై వీరు ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించడం లేదు. వారే స్వతంత్ర ఓటర్లు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించేది వీరే. నువ్వా నేనా అన్నట్టు జరుగుతున్న అమెరికా ఎన్నికల్లో ఏడు బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్లో విస్తరించి ఉన్న స్వతంత్ర ఓటర్లే నిర్ణాయకం కాబోతున్నారు. పెరుగుతున్న స్వతంత్ర ఓటర్ల సంఖ్యప్రముఖ శాంపిల్ సర్వే గాలప్ పోల్ డేటా ప్రకారం 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఓటు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిలో 43 శాతం తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా చెప్పుకుంటున్నారు. 27% మంది రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులుగా, మరో 27 శాతం మంది డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులుగా ప్రకటించుకున్నారు. 1990లో కేవలం 32 శాతం మంది ఓటర్లు మాత్రమే తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా ప్రకటించుకున్నారు. కాలంతో పాటు ఇండిపెండెంట్ ఓటర్ల సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.7 రాష్ట్రాల్లో కీలకం⇒ అమెరికాలో పార్టీతో అనుబంధం అనేది చాలా సాధారణ మైన అంశం. ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రైమ రీస్లో ఓటు వేసేందుకు చాలామంది పార్టీ ఓటర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ప్రైమరీస్ అంటే ఒక పార్టీ నుంచి ఎవరు అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయాలనే విషయంపై జరిగే పోలింగ్. సాధారణ ఓటర్లు ఈ పోలింగ్లో పాల్గొంటారు. వీరు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలంటే చాలా రాష్ట్రాల్లో కచ్చితంగా ఏదో ఒక పార్టీ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఈ డేటా ప్రకారమే చాలామందిని అమెరి కాలో డెమొక్రాట్ ఓటర్లు, రిపబ్లికన్ ఓటర్లుగా పిలుస్తారు.అమెరికాలో సర్వే సంస్థలు తాము చేసే సర్వేల ఆధారంగా పార్టీ ఓటర్ల సంఖ్యను లెక్కగడుతోంది. దీని ఆధారంగానే ఏ పార్టీకి ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనే విషయం తేలుతుంది. ఈ గణాంకాల ఆధారంగానే చాలా రాష్ట్రాలను బ్లూస్టేట్స్, రెడ్ స్టేట్స్గా తేలుస్తారు. డెమొక్రాట్ ఓటర్లు ఎక్కువగా ఉంటే అది బ్లూ స్టేట్ అని రిపబ్లికన్ ఓటర్లు ఎక్కువగా ఉంటే రెడ్ స్టేట్ అని తేలిపోతుంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు దాదాపు ఊహించిన దానికి అనుకూలంగానే ఉంటాయి. ఎక్కడైతే రెండుపార్టీల మద్దతు దారుల మధ్య తేడా మూడు శాతం కంటే తక్కువగా ఉంటుందో దానిని బ్యాటిల్ స్టేట్ లేదా పర్పుల్ స్టేట్గా పిలుస్తారు. ఇప్పుడు ఏడు బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ ఉన్నాయని భావిస్తుండగా..వీటిల్లో ఈ ఇండిపెండెంట్ ఓటర్లే నిర్ణాయక శక్తిగా మారారు.కొత్త తరం ఓటర్లే ఎక్కువ..అమెరికాలోని కొత్త తరం ఎక్కువగా స్వతంత్ర భావాలు కలిగి ఉంది. ముఖ్యంగా మిలేనియల్స్ లేదా జనరేషన్ వై ఎక్కువగా ఇండిపెండెంట్ ఓటర్లుగా ఉన్నారని పరిశోధనలో తేలింది. స్వతంత్ర ఓటర్లలో 1981–96 మధ్యలో జన్మించిన జనరేషన్ వైకి చెందిన వారే 36% మంది ఉన్నారు. ఇక తరువాతి తరం అంటే 1997– 2012 మధ్య జన్మించిన జెన్జీ స్వతంత్ర ఓటర్లలో 26% ఉన్నారు. అంటే స్వతంత్ర ఓటర్లలో 52% మంది వై, జీ తరంవారే.ఇక ఓటర్ల మూలాలను పరిశీలిస్తే 31% మంది నల్ల జాతీయులు, 52% మంది లాటినోస్, 43% మంది ఏషియన్ అమెరికన్లు తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా ప్రకటించు కున్నారు. మాజీ సైనికులు సైతం పెద్ద ఎత్తున తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా చెప్పుకుంటున్నారు. 18–49 సంవత్సరాల మద్య ఉన్న దాదాపు 59% మంది మాజీ సైనికులు తమను తాము స్వతంత్ర ఓటర్లుగా చెప్పుకుంటున్నారు.పేరుకే స్వతంత్ర ఓటర్లు⇒ అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేసే ఈ స్వతంత్ర ఓటర్లపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సర్వేల్లో తమను తాము స్వతంత్ర ఓట ర్లుగా చెప్పుకునే వీరంతా నిజంగానే స్వతంత్ర ఓటర్లా? అన్న విషయంపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా మీరు ఏ పార్టీ భావ జాలాన్నినమ్ముతున్నారన్నప్పుడు వీరిలో చాలామంది రిపబ్లికన్ లేదా డెమొక్రాట్ పార్టీకి మద్దుతుదారు లుగా తేలిందని కీత్ అనే అమెరికన్ పొలిటికల్ అనలిస్ట్ ‘ది మిత్ ఆఫ్ ఇండిపెండెంట్ ఓటర్’పుస్తకంలో వివరించడం గమనార్హం. చాలామంది తమను తాము ఇండిపెండెంట్ ఓటర్గా చెప్పుకున్నప్పటికీ ఏదో ఒక స్థాయిలో రాజకీయ పార్టీలతో అనుబంధం కలిగి ఉన్నారని పరిశోధనల్లో బయటపడింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో 10 శాతానికి మించి నిజమైన స్వతంత్ర ఓటర్లు లేరని అక్కడి రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.కొత్త అభ్యర్థుల వైపే వీరి మొగ్గుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త అభ్యర్థుల వైపే ఇండిపెండెంట్ ఓటర్లు ఎక్కు వగా మక్కువ చూపుతున్నా రని గణాంకాలు చెబుతు న్నాయి. 2008లో బరాక్ ఒబామా పోటీ చేసిన సందర్భంగా దాదాపు 54% స్వతంత్ర ఓటర్లు ఆయనకు ఓటువేశారు. 2016లో ట్రంప్కు 52% మంది ఇండిపెండెంట్ ఓటర్లు మద్దతు పలికారు. ఇక 2020లో జో బైడెన్కు అత్యధికంగా 56.5 శాతం మంది మద్దతు తెలిపారు.⇒ ఇండిపెండెంట్ ఓటర్లలో 75శాతం మంది ఓటర్లు తమ వ్యక్తిగతమైన ఆర్థిక స్థితిని ప్రభావితం చేయగల అంశాలే తమ ప్రాధాన్యత అని చెబుతున్నారు. ⇒ 73 శాతం మంది నేరాలను అదుపు చేసేవారికే తమ ఓటు అని చెబుతున్నారు. ⇒ 63 శాతం మంది అమెరికా తన మిత్రదేశాల కోసం అత్యధికంగా ఖర్చు చేయడం సరికాదంటున్నారు. ⇒ 57 శాతం అబార్షన్ హక్కులే తమ ప్రాధాన్యత అంటున్నారు⇒ 56 శాతం జాత్యహంకారం తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నారు. -
అధ్యక్ష ఎన్నికల వేళ.. ఇజ్రాయెల్కు ట్రంప్ మాస్ వార్నింగ్!
వాషింగ్టన్: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో మారణహోమం జరుగుతోంది. వందల, వేల సంఖ్యలో ప్రజల బలైపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. తాను అమెరికా ఎన్నికల్లో గెలిచి వైట్హౌస్లోకి అడుగుపెట్టే నాటికి గాజాలో యుద్ధం ముగియాలని హెచ్చరికలు జారీ చేశారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ట్రంప్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను అమెరికా ఎన్నికల్లో గెలిచి వైట్హౌస్లోకి అడుగుపెట్టే నాటికి గాజాలో యుద్ధం ముగియాలని నెతన్యాహును కోరారు. వీలైనంత త్వరగా ముగింపు పలకాలని కోరారు. ప్రజా సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఇక, గతంలోనూ గాజాలో యుద్ధం ముగింపు గురించి నెతన్యాహుకు ట్రంప్ ప్రతిపాదించారు. ఇటీవల కూడా ఆయన నెతన్యాహుతో ఈ విషయం గురించి మరోసారి చర్చించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. నవంబర్ ఐదో తేదీన అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కమలా హారీస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వీరిద్దరూ ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గాజాలో ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ ఇలాంటి కామెంట్స్ చేశారనే చర్చ నడుస్తోంది. ఇక, ఇజ్రాయెల్ విషయంలో కమలా హారీస్ కూడా సీరియస్గా ఉన్న విషయం తెలిసిందే. -
అమెరికా ఎన్నికల సర్వేలో సూపర్ ట్విస్ట్.. లీడ్లోకి ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఎన్నికలు గెలుపు ఎవరిది? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. విజయం కోసం ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఇద్దరు అభ్యర్థులు. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ మద్దతు కూడగట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు.. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుపై సర్వేలు ఆసక్తికర ఫలితాలను వెల్లడిస్తున్నాయి.అగ్ర రాజ్యం అమెరికాలో నవంబర్ 5వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ మధ్య ఆధిపత్యంపై వాల్ స్ట్రీట్ జర్నల్ చేపట్టిన సర్వేలో కీలక విషయాలను వెల్లడించింది. వీరిద్దరి మధ్య స్వల్ప తేడాతో పోటీ కొనసాగుతోందని స్పష్టం చేసింది. తాజా సర్వే ప్రకారం.. ట్రంప్నకు 47 శాతం, హారీస్కు 45 శాతం మంది ఆదరణ ఉన్నట్టు తెలిపింది. సర్వే మార్జిన్ ప్లస్ లేదా మైనస్ 2.5 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. దీంతో, ట్రంప్ లీడ్లోకి వచ్చినట్టు స్పష్టం చేసింది.ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకోవడం ఇద్దరు అభ్యర్థులు స్వరం పెంచారు. తాజాగా ట్రంప్పై కమల విరుచుకుపడ్డారు. ట్రంప్ అసమర్థుడని, అధ్యక్ష పదవికి కరెక్ట్ కాదని.. ఆయనో నియంత అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో రాజ్యాంగానికి కట్టుబడి ఉండే సైన్యం ట్రంప్కు నచ్చదు. అమెరికా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని ఆయన చేసిన ప్రతిజ్ఞను గతంలో ఉల్లంఘించారు. గత వారమే తన సహచర అమెరికన్లను అంతర్గత శత్రువులుగా పేర్కొన్నారు అంటూ మండిపడ్డారు. ఇక, తనపై ఆరోపణలకు ట్రంప్ కౌంటరిచ్చారు. ఎన్నికల్లో ఒక వేళ కమలా హారీస్ గెలిస్తే.. అమెరికాలో చైనా ఆడుకుంటుంది. ఆమెకు చిన్న పిల్లను చేసి జిన్పింగ్ గేమ్ ఆడుకుంటారని సెటైర్లు వేశారు. -
US Elections: ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేవారికే పట్టం
అమెరికాలో అధ్యక్ష పోరు మరింత రసవత్తరంగా మారింది. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తమ హోరాహోరీ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఓటర్లను తమ వైపునకు మళ్లించుకునేందుకు అన్ని చేస్తున్నారు. అయితే ఇంతలో మరో పరిణామం వెలుగు చూసింది.ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న ప్రస్తుత తరుణంలో ఇద్దరు అధ్యక్ష అభ్యర్థులకు స్పష్టమైన మెజారిటీ కనిపించడంలేదు. ఇది ‘అసోసియేటెడ్ ప్రెస్- ఎన్ఓఆర్సీ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్’ సర్వేలో వెల్లడయ్యింది. ఈ సంస్థ చేసిన సర్వే ప్రకారం, 10మంది ఓటర్లలో నలుగురు, డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించగలడన్నారు. మరోవైపు కమలా హారిస్ కూడా మెరుగ్గానే ఎకానమీని సరిదిద్దగలరని అంతే మంది తమ అభిప్రాయం తెలిపారు. ఈ సర్వేలో కొందరు అటు ట్రంప్, ఇటు కమలా ఇద్దరికీ మద్దతు పలకడం గమనార్హం.ఈ సర్వేలో వెల్లడైన అభిప్రాయాల ప్రకారం 10మంది ఓటర్లలో 8మంది ఓటర్లు, ఆరోగ్య సంరక్షణ, నేరాలు కన్నా ఎకానమీనే ప్రధాన సమస్యగా పరిగణిస్తున్నామని, వీటి పరిష్కారంలో ఉత్తమంగా ఉన్న అభ్యర్థలకే మద్దతిస్తామన్నారు. మూడింట ఒక వంతు మంది మాత్రమే జాతీయ ఆర్థిక వ్యవస్థ కొంతమేరకు బాగుందని అభిప్రాయడ్డారు. సర్వేలో పాల్గొన్న ఓటర్లలో సగం మందికిపైగా ఆరోగ్య సంరక్షణ తమ ప్రధాన ప్రయారిటీగా పేర్కొన్నారు. మరికొందరు దేశంలో పెరుగుతున్న నేరాలు, ఇమ్మిగ్రేషన్, అబార్షన్ పాలసీ, గన్ పాలసీలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకొందరు వాతావరణ మార్పు, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ఓటర్లను ప్రభావితం చేస్తాయన్నారు. గాజాలో యుద్ధాన్ని ఎవరు సమర్థంగా నియంత్రిచగలుగుతారనే ప్రశ్నకు ఇద్దరికీ సమాన ఓట్లు రావడం విశేషం. ఇమ్మిగ్రేషన్ సమస్యను హారిస్ కంటే ట్రంప్ మెరుగ్గా నిర్వహిస్తారని కొందరు తెలిపారు.అమెరికాలో ద్రవ్యోల్బణం నాలుగు దశాబ్దాల గరిష్ఠానికి చేరింది. ప్రజలు తమ నిత్యావసరాల ఖర్చులపై ఆందోళన చెందుతున్నారు. స్టాక్ మార్కెట్ లాభాల కన్నా ద్రవ్యోల్బణం విషయాన్నే ప్రజలు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రధాన అభ్యర్థులు కమల, ట్రంప్లకు దేశ ఆర్థిక వ్యవస్థ చక్కదిద్దడంపై విభిన్న ఆలోచనలు ఉన్నాయి. కమలా హారిస్ తమ ప్రణాళికలన్నింటికీ పూర్తిగా బడ్జెట్ నుంచే నిధులు సమకూరుస్తామని చెబుతున్నారు. అయితే ట్రంప్ తమ ప్రణాళికల కోసం అవసరమైతే అప్పు చేసైనా ఆ ఖర్చును భర్తీ చేస్తామని చెబుతున్నారు. సంపన్నులకు పన్ను మినహాయింపులు ఇవ్వడం ద్వారా అభివృద్ధి జరుగుతుందని ట్రంప్ అంటున్నారు. దీంతో వారు మరిన్ని పెట్టుబడులు పెడతారని చెబుతున్నారు. నవంబర్ 5న జరగనున్నాయి.ఇది కూడా చదవండి: తైవాన్ విషయంలో చైనాపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు -
#USELections2024 : కమలా హారీస్ అరుదైన ఫొటోలు
-
కమలా హారీస్కు పుతిన్ మద్దతు.. ట్విస్ట్ ఇచ్చిన లావ్రోవ్
మాస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ దేశాల ఫోకస్ ఉంది. ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే చర్చ కూడా నడుస్తోంది. ఎన్నికల్లో పలు దేశాలు నేతలు ఎవరికి మద్దతు ఇస్తున్నారనే అంశం కూడా ఎన్నికల్లో కీలక కానుంది. ఇక, కమలా హారీస్కే తమ మద్దతు అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలపై రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ క్లారిటీ ఇచ్చారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలపై లావ్రోవ్ తాజాగా స్పందిస్తూ.. ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్కు మద్దతు ఉంటుందని పుతిన్ సరదాగా మాత్రమే అన్నారు. పుతిన్ అప్పుడప్పుడు జోక్స్ వేస్తుంటారు. అందులో భాగంగానే ఇలా మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మా జోక్యం ఏమీ ఉండదు. ఇంతకుముందు, ఇప్పుడు.. ఎన్నికల్లో జోక్యం చేసుకోము. మా వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదు అంటూ కామెంట్స్ చేశారు. BREAKING: Russian Foreign Minister Sergei Lavrov said in an interview with Sky News Arabia that Putin was JOKING when he said he wanted Kamala Harris to win the election in November.— Amanda Liyang (@esraa28305334) September 22, 2024ఇదిలా ఉండగా.. కొద్దిరోజులు క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్.. అమెరికా ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కమలాతో పనిచేయడం సులువని తనదైన శైలిలో మాట్లాడారు. అయితే, హారీస్ ఎంపికలో జో బైడెన్ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానన్నారు. ఏదేమైనా.. ఆ దేశ అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని అక్కడివారే నిర్ణయిస్తారని ముగించారు.అనంతరం, పుతిన్ వ్యాఖ్యలపై వైట్హౌస్ వర్గాలు స్పందించాయి. పుతిన్ కామెంట్స్కు అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ కౌంటరిచ్చారు. అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని నిర్ణయించేది కేవలం స్థానికులే. మా అధ్యక్ష ఎన్నికలపై పుతిన్ మాట్లాడటం ఆపేస్తే మంచింది. ఈ ఎన్నికల్లో మీ జోక్యాన్ని ఎవరూ కోరుకోవడం లేదు. భవిష్యత్లో కూడా ఎన్నికల గురించి మాట్లాడకండి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బైడెన్తో చర్చలు ఫలించాయి: ప్రధాని మోదీ -
ఉక్రెయిన్పై ఏం చేద్దాం?
వాషింగ్టన్/న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. యుద్ధానికి తెర దించే మార్గాలపై లోతుగా చర్చించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం రాత్రి ప్రధాని అమెరికా చేరుకున్నారు. అనంతరం నేరుగా డెలావెర్లో విల్లింగ్టన్ లోని బైడెన్ నివాసానికి వెళ్లారు. మోదీకి అధ్యక్షుడు ఘనస్వాగతం పలికారు. వారిద్దరూ ఆతీ్మయంగా కౌగిలించుకున్నారు. అనంతరం మోదీ చేయి పట్టుకుని బైడెన్ లోనికి తీసుకెళ్లారు. పలు అంశాలపై నేతలిద్దరూ చాలాసేపు చర్చలు జరిపారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ఈ భేటీలో పరిష్కార మార్గం లభించవచ్చని భావిస్తున్నారు. ఇజ్రాయెల్–గాజా ఘర్షణతో పాటు అమెరికా–భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం తదితర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అంతకుముందు పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో మోదీకి ఘనస్వాగతం లభించింది. ఆయన్ను చూసేందుకు ప్రవాస భారతీయులు భారీగా తరలివచ్చారు. వారితో ఆయన కరచాలనం చేస్తూ అటోగ్రాఫ్లు ఇస్తూ సందడి చేశారు.అమెరికాతో బంధం బలోపేతం ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతికి కృషి చేయడానికి భావసారూప్య దేశాలకు ‘క్వాడ్’ అత్యంత కీలకమైన వేదిక అని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు అమెరికా బయల్దేరే ముందు ప్రకటన విడుదల చేశారు. ‘‘బైడెన్, ఆ్రస్టేలియా ప్రధాని అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో భేటీ అయ్యేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. అమెరికాలోని ప్రవాస భారతీయులను కలుసుకోబోతుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు. మోదీ అమెరికాలో కీలక సదస్సులు, సమావేశాల్లో పాల్గొంటారు. బైడెన్తో పాటు పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. విల్మింగ్టన్లో క్వాడ్ సదస్సులో, న్యూయార్క్లో ఐరాస సాధారణ సభలో ‘సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్’లో ప్రసంగిస్తారు. లాంగ్ ఐలండ్లో ప్రవాస భారతీయుల భేటీలో పాల్గొంటారు. ప్రఖ్యాత అమెరికా కంపెనీల సీఈఓలతో సమావేశమై ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ వంటి అధునాతన సాంకేతికతపై చర్చిస్తారు. -
ట్రంప్కు భారీ మెజార్టీ.. కమలాకు ట్విస్ట్ ఇచ్చిన కీలక యూనియన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇక, అమెరికా పలు యూనియన్ల ఓట్ల కీలకంగా మారనున్నాయి. కొన్ని యూనియన్ల సభ్యులు డొనాల్డ్ ట్రంప్కు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.కాగా, అమెరికాలో ఇంటర్నేషనల్ బ్రదర్హుడ్ ఆఫ్ టీమ్స్టర్స్ యూనియన్కు సంబంధించిన ఓట్లు ఎన్నికల్లో కీలకంగా మారానున్నాయి. ఈ యూనియల్లో దాదాపు 1.3 మిలియన్ల సభ్యులు ఉన్నారు. ఈ యూనియన్లో ట్రక్ డ్రైవర్లు, ఎయిర్లైన్స్ పైలట్స్, జూకీపర్ల వరకు అనేక ఇతర కార్మికులు కూడా ఉన్నారు. ఇక, యూనియన్కు సంబంధించి బుధవారం ఎలక్ట్రానిక్ పోల్ను విడుదల చేశారు. ఈ పోల్స్లో ఎక్కువ మంది డొనాల్డ్ ట్రంప్వైపే మొగ్గుచూపారు.యూనియన్ సభ్యుల జాతీయ ఎలక్ట్రానిక్ పోల్ ప్రకారం.. ట్రంప్కు 59.6 శాతం ఓట్లు రాగా, కమలా హారీస్కు మాత్రం కేవలం 34 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో, కమలాపై ట్రంప్ పైచేయి సాధించారు. ఇక, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల నుంచి తప్పుకోకముందు ఆయనకు మద్దుతుగా 44 శాతం ఓట్లు వచ్చాయి. కాగా, యూనియన్లో మెజార్టీ ఓటర్లు ట్రంప్కు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఓట్లు అభ్యర్థులు ఇద్దరికీ యూనియన్ కీలకంగా మారనుంది. అయితే, 2000 సంవత్సరం నుంచి ఈ యూనియన్ సభ్యులు డెమోక్రటిక్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఇక, ఈ ఎన్నికల్లో మాత్రం రిపబ్లిక్ పార్టీ అభ్యర్థికి సపోర్టు ఇస్తూ పోల్స్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.ఇప్పటి వరకు యూనియన్ మద్దతు ఇలా..1984లో ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్కు1988లో వైస్ ప్రెసిడెంట్ జార్జ్ హెచ్డబ్ల్యు బుష్తో సహా రిపబ్లికన్లను ఆమోదించారు.1996 తర్వాత యూనియన్ ఆమోదం పొందకపోవడం ఇదే మొదటిసారి.2000 నుండి ప్రతి డెమోక్రాటిక్ అభ్యర్థికి అనుకూలంగా ఉన్నారు. ఇది కూడా చదవండి: Israel Hezbollah War: పేజర్లో 3 గ్రాముల పేలుడు పదార్థం! -
దూసుకుపోతున్న కమల.. ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు కమలా హారీస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఆసక్తికర పోటీ నడుస్తోంది. ప్రచారంలో కమలా హారీస్ దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు ట్రంప్పై కమల పైచేయి సాధిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆగస్టులో ట్రంప్నకు వచ్చిన విరాళాల కంటే హారిస్ రెట్టింపు విరాళాలు సేకరించడం విశేషం.కాగా, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక, తాజాగా ఆగస్టులో ట్రంప్నకు వచ్చిన విరాళాల కంటే హారిస్ రెట్టింపు విరాళాలు సేకరించడం గమనార్హం. ఇందులో భాగంగా కమలా హారీస్ ఆగస్టులో 30లక్షల మంది దాతల నుంచి 36.1కోట్ల డాలర్ల విరాళాలను సేకరించారు. ఇదే ఊపులో సెప్టెంబర్లో న్యూయార్క్, అట్లాంటా, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కోలలో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు హారిస్ బృందం ఏర్పాట్లు చేస్తోంది.మరోవైపు.. ట్రంప్ మాత్రం కమలా హారీస్తో పోల్చుకుంటే కొంత వెనుకంజలో ఉన్నారు. ట్రంప్ ఆగస్టులో కేవలం 13కోట్ల డాలర్లను మాత్రమే సేకరించినట్లు ఆయన బృందం వెల్లడించింది. ఈ క్రమంలో ట్రంప్ కంటే కమలకు.. దాదాపు మూడు రెట్లు ఎక్కువ విరాళాలు వచ్చాయి. ఇక, డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత కమలా హారీస్ పూర్తి స్థాయి ప్రచారాన్ని మొదలుపెట్టారు. నవంబర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. -
‘ట్రంప్’ అనే పేజీని తిప్పేందుకు అమెరికన్లు సిద్ధం: కమలా హారీస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్.. మాజీ అధ్యక్షుడుపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా రాజకీయ చరిత్ర అనే పుస్తకంలో ట్రంప్ అనే పేజీని తిరగేసేందుకు అమెరికన్లు సిద్ధంగా ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు.ఇక, తాజాగా కమలా హారీస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా ప్రజలు కొత్త చరిత్ర తిరగరాసేందుకు సిద్ధమయ్యారు. అమెరికా రాజకీయ చరిత్ర అనే పుస్తకంలో ట్రంప్ పేజీని తిరగేసేందుకు ప్రజలు రెడీగా ఉన్నారు. ట్రంప్ మాటలను నమ్మడానికి అమెరికన్లు సిద్ధంగా లేరు. ప్రజలు కొత్త మార్గం కోసం సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దురదృష్టవశాత్తూ గత దశాబ్దంలో మన దేశాన్ని విభజించడం గురించి ఎజెండాను ముందుకు తెచ్చే వ్యక్తిని మాజీ అధ్యక్షుడి(ట్రంప్)గా కలిగి ఉన్నాము. ఇకపై అలాంటి తప్పు జరగదని భావిస్తున్నాను. ట్రంప్.. అమెరికా అభివృద్ధిలో పలువురి పాత్ర, వారి కృషిని తగ్గించే ప్రయత్నం చేశారు. ఇవ్వన్నీ ప్రజల మనస్సుల్లో ఉన్నాయి.ఇదే సమయంలో మరో సంచలన ప్రకటన చేశారు. తాను అధికారంలోకి వస్తే కేబినెట్లోకి రిపబ్లికన్ను తీసుకుంటానని ప్రకటించారు. ఇక, గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలని ఆమె ఆకాంక్షించారు. మిత్ర దేశమైన ఇజ్రాయెల్ విషయంలో అధ్యక్షుడు బైడెన్ విధానాలనే తాను కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. Vice President Harris: I think that people are ready for a New Way Forward. Sadly, in the last decade, we have had in the former president, someone who has been pushing an agenda that is about diminishing the character and the strength of who we are as Americans and dividing our… pic.twitter.com/r78F4cC2ys— Kamala HQ (@KamalaHQ) August 30, 2024ఇదే అమెరికా అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. మొదటగా, మధ్యతరగతికి మద్దతు ఇవ్వడానికి, వారిని బలోపేతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నా అత్యంత ప్రాధాన్యతలలో ఇది ఒకటి. నేను అమెరికా ప్రజల ఆకాంక్షలు, లక్ష్యాలు, ఆశయాలను నెరవేర్చడమే మా లక్ష్యం. సరిహద్దుల్లో అక్రమ వలసలపై కఠినంగా ఉండేందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నాం. అక్రమ వలసలను అసలు అంగీకరించేది లేదు. పన్నుల విషయంలో కూడా కొన్ని విధివిధానాలను రూపొందించడం జరిగింది. దాని ప్రకారం ముందుకు సాగుతాం. శిలాజ ఇంధనాలు అధికంగా ఉండే పెన్సిల్వేనియాలో వివాదాన్ని పరిష్కరించాలని స్పష్టమైన లక్ష్యంతో ఉన్నాం అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. ఎన్నికల సందర్బంగా అమెరికన్లను ఆకట్టుకునేందుకు ట్రంప్ వరాలు ఇస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే మహిళలకు ఉచిత ఐవీఎఫ్ చికిత్సను అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఐవీఎఫ్ చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. లేనిపక్షంలో బీమా కంపెనీలు తప్పనిసరిగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే, దీన్ని ఎలా అమలు చేయనున్నారు? నిధులను ఎలా సమకూరుస్తారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. -
కమల పౌరసత్వంపై కొత్త ట్విస్ట్.. అమెరికాలో చర్చ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అమెరికాలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరుతున్న వేళ అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ అనర్హురాలంటూ సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. దీంతో, ఈసారి అధ్యక్ష ఎన్నికల మరింత రసవత్తరంగా మారింది.కాగా, యూఎస్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రిపబ్లికన్ అసెంబ్లీస్ (ఎన్ఎఫ్ఆర్ఏ) అనే సంస్థ కమలా హారిస్ అనర్హురాలంటూ సరికొత్త వాదనను ప్రచారంలో పెట్టింది. ‘సహజ పౌరసత్వం’ ఉన్నవాళ్లు మాత్రమే అధ్యక్ష పదవికి అర్హులని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందన్నది దాని వాదన. ‘అమెరికా పౌరసత్వం ఉన్న దంపతులకు ఈ గడ్డపై పుట్టినవాళ్లను మాత్రమే సహజ పౌరులుగా రాజ్యంగం నిర్వచిస్తోంది. 1857 నాటి ప్రఖ్యాత డ్రెడ్ స్కాట్ వర్సెస్ స్టాన్ఫర్ కేసులో అమెరికా సుప్రీంకోర్టు తీర్పు కూడా దీన్ని ధృవీకరిస్తోంది. ఈ నిర్వచనం ప్రకారం హారిస్తో పాటు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి వంటివాళ్లు కూడా అధ్యక్ష పదవికి అనర్హులే’ అని ఎన్ఎఫ్ఆర్ఏ చెప్పుకొచ్చింది. ఈ కీలక మౌలిక ప్రాతిపదికను తుంగలో తొక్కుతూ డెమోక్రటిక్ పార్టీ హారిస్కు అధ్యక్ష అభ్యర్థిత్వం కట్టబెట్టిందని ఆరోపించింది.మరోవైపు.. న్యాయ నిపుణులు మాత్రం ఎన్ఎఫ్ఆర్ఏ వాదనను కొట్టిపారేస్తున్నారు. ‘ఇది రాజ్యాంగానికి వక్రభాష్యమే. పైగా ఎన్ఎఫ్ఆర్ఏ ఉటంకిస్తున్న డ్రెడ్ స్కాట్ వర్సెస్ స్టాన్ఫర్ తీర్పు అమెరికా సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యంత చెత్త తీర్పుగా నిలిచిపోయింది. తల్లిదండ్రులకు అమెరికా పౌరసత్వముందా, లేదా అన్నదానితో నిమిత్తం లేకుండా ఈ గడ్డపై పుట్టే వారంతా దేశ పౌరులేనని ఆ తర్వాత సుప్రీంకోర్టు పలు తీర్పునిచ్చింది. ఎన్ఎఫ్ఆర్ఏ వాదనను వర్తింపజేయాల్సి వస్తే బ్రిటిష్ మూలాలున్న తొలినాళ్ల అధ్యక్షులు జార్జి వాషింగ్టన్, జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్సన్, జేమ్స్ మాడిసన్ కూడా ఆ పదవికి అనర్హులే’’అని వారంటున్నారు. రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు మద్దతు పలికిన ఎన్ఎఫ్ఆర్ఏ హారిస్పై ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హారిస్ తల్లి భారత్కు, తండ్రి జమైకాకు చెందిన వారన్నది తెలిసిందే.ఏమిటా తీర్పు? డ్రెడ్ స్కాట్ వర్సెస్ స్టాన్ఫర్ కేసు 1857 నాటిది. అప్పట్లో అమెరికాలో పలు రాష్ట్రాల్లో బానిసత్వానికి చట్టబద్ధత ఉండేది. తనను స్వేచ్ఛా జీవిగా ప్రకటించాలంటూ డ్రెడ్ స్కాట్ అనే ఆఫ్రికన్ అమెరికన్ బానిస సుప్రీంకోర్టుకెక్కాడు. అందుకు కోర్టు నిరాకరించింది. పైగా ‘ఆఫ్రికన్ అమెరికన్లు దేశ పౌరులే కాదు. కనుక వారికి సుప్రీంకోర్టుకెక్కే అర్హతే లేదు’’అని కోర్టు పేర్కొంది. పైగా దేశ అత్యున్నత చట్టసభ అయిన కాంగ్రెస్కు బానిసత్వాన్ని నిషేధించే అధికారం లేదంటూ తీర్పు వెలువరించింది. దాంతో అమెరికాలో బానిసత్వ రగడ తీవ్రతరమై అంతర్యుద్ధానికి దారితీసింది. ఆ తీర్పును పక్కన పెడుతూ అమెరికా రాజ్యాంగానికి 13, 14వ సవరణలు తీసుకొచ్చారు. బానిసత్వాన్ని రద్దు చేయడమే గాక జాతి భేదాలతో నిమిత్తం లేకుండా అమెరికాలో పుట్టిన వాళ్లంతా దేశ పౌరులేనంటూ చట్టం చేశారు. -
అమెరికన్లకు ఇదే నా హామీ.. కమల ఎమోషనల్ కామెంట్స్
చికాగో: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ నామినేషన్ను కమలా హారీస్ అధికారికంగా ఆమోదించారు. ఈ సందర్భంగా డెమోక్రటిక్ పార్టీ తరఫున పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.కాగా, కమలా హారీస్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరిస్తూ డెమోక్రటిక్ పార్టీ జాతీయ సమావేశంలో గురువారం ఆమె ప్రసంగించారు. ఈ సమావేశం చికాగో యునైటెడ్ సెంటర్లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా కమలా హారీస్ మాట్లాడుతూ..‘అమెరికన్ ప్రజల తరపున అధ్యక్షుడిగా మీ నామినేషన్ను నేను అంగీకరిస్తున్నాను. ఈ ఎన్నికలతో మరో చరిత్ర సృష్టించబోతున్నాం. మన దేశంలో ద్వేషం, విభజన పోరాటాలను అధిగమించడానికి మంచి అవకాశం వచ్చింది. ఒక కొత్త మార్గంలో అమెరికన్లు అందరికీ అధ్యక్షుడిగా ఉంటానని నేను హామీ ఇస్తున్నాను. దేశాన్ని పార్టీలకు, స్వయం ప్రతిపత్తికి అతీతంగా ఉంచుతాను. పవిత్రమైన అమెరికా ప్రాథమిక సూత్రాలను శాంతియుత బదిలీకి స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలనుకుంటున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. ఇక, ఇదే సమయంలో తన తల్లిదండ్రులను గుర్తు చేసుకొని ఉద్వేగానికి లోనయ్యారు. My mother, Dr. Shyamala Gopalan Harris, came to the United States from India alone at 19. She was a force who had two goals in life: to cure breast cancer and to raise my sister Maya and me.Her dedication, determination, and courage shaped who I am today. pic.twitter.com/ZZWS1uUGMZ— Vice President Kamala Harris (@VP) August 22, 2024తాను అధ్యక్షురాలిగా ఎన్నికైతే అమెరికా వలస విధానాన్ని సంస్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ సహా నాటో కూటమి దేశాలకు అండగా ఉంటామని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్పై ఆమె విరుచుకుపడ్డారు. ఆయన నిబద్ధత ఉన్న నాయకుడు కాదని విమర్శించారు. ఆయన తిరిగి శ్వేతసౌధంలోకి అడుగుపెట్టే అవకాశం వస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ట్రంప్ తన స్వార్థం కోసమే రాజకీయాలు చేస్తారు. ఆయనకు విశ్వసనీయత ఉండదు అంటూ కామెంట్స్ చేశారు. Harris: In many ways Donald Trump is an unserious man, but the consequences of putting Donald Trump back in the White House are extremely serious...he tried to throw away your votes. When he failed, he sent an armed mob to the Capitol where they assaulted law enforcement officers pic.twitter.com/muKQlUGMfe— Aaron Rupar (@atrupar) August 23, 2024మన ప్రత్యర్థులు ప్రతీరోజూ అమెరికాను కించపరుస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. నాటోను విడిచిపెడతానని ట్రంప్ బెదిరించారు. అతను పుతిన్ను మా మిత్రదేశాలపై దాడి చేయమని ప్రోత్సహించాడు. రష్యా-ఉక్రెయిన్పై దాడి చేయడానికి ఐదు రోజుల ముందు నేను జెలెన్స్కీని కలిశాను. నాటో మిత్ర దేశాలకు నేను అండగా ఉంటాను. అలాగే, గాజా-ఇజ్రాయెల్ అంశంలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ అనే ఉగ్రవాద సంస్థ కలిగించిన భయానక స్థితిని ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పటికీ ఎదుర్కోకూడదు. తనను తాను రక్షించుకునే ఇజ్రాయెల్ హక్కు కోసం ఎల్లప్పుడూ నిలబడుతాను. గాజాలో జరిగినది వినాశకరమైనది అని అన్నారు.ఇక, ప్రపంచంలోనే అత్యంత బలమైన పోరాట శక్తిని అమెరికా ఎల్లప్పుడూ కలిగి ఉండేలా చూస్తాను. దేశ దళాలను, వారి కుటుంబాలను సంరక్షించే మా పవిత్ర బాధ్యతను నేను నెరవేరుస్తాను. కమాండర్ ఇన్ చీఫ్గా వారిని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. వారి సేవ మరియు త్యాగాన్ని ఎప్పుడూ కించపరచను అంటూ కామెంట్స్ చేశారు. Harris: As commander in chief, I will ensure America always has the strongest, most lethal fighting force in the world. And I will fulfill our sacred obligation to care for our troops and their families and I will always honor and never disparage their service and sacrifice pic.twitter.com/So07fNYX9e— Aaron Rupar (@atrupar) August 23, 2024 ఇక, నాలుగు రోజుల డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ చివరి రోజున అధ్యక్ష అభ్యర్థిగా ఆమె అంగీకార ప్రసంగంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, అధ్యక్షుడిగా ఆయన పాత్ర స్పూర్తిదాయకం అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక, కమలా హరీస్ ప్రసంగం కొనసాగుతుండగా పార్టీ కార్యకర్తలు కమల.. కమల, అమెరికా.. అమెరికా అంటూ నినాదాలు చేశారు.BREAKING: Kamala Harris just slammed Donald Trump for being an unserious person. Retweet to make sure every American sees this takedown. pic.twitter.com/iY3wv10tFL— Kamala’s Wins (@harris_wins) August 23, 2024 మరోవైపు.. కమలా హారీస్కు జో బైడెన్ అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా బైడెన్..‘ కమలా హారిస్ అధ్యక్ష పదవికి నామినేషన్ను అంగీకరించడం చూసి నేను గర్వపడుతున్నాను. ఆమె మా భవిష్యత్తు కోసం పోరాడుతున్నందున ఆమె అత్యుత్తమ అధ్యక్షురాలు అవుతుంది అంటూ కామెంట్స్ చేశారు. #WATCH | Chicago, USA: Kamala Harris accepts the Democratic party nomination for US PresidentShe says, "I accept your nomination to be President of the United States of America. And with this election, our nation has a precious, fleeting opportunity to move past the bitterness,… pic.twitter.com/BWZgRWwVqO— ANI (@ANI) August 23, 2024 -
కమలా హారీస్ ఓ కీలుబొమ్మ: వివేక్ రామస్వామి
చికాగో: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ను టార్గెట్ చేస్తూ రిపబ్లిక్ పార్టీ నేత వివేక్ రామస్వామి తీవ్ర విమర్శలు చేశారు. కమలా హారీస్ కీలుబొమ్మ అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో అమెరికా ప్రజలు వాస్తవాలను గ్రహించాలని కోరారు.కాగా, వివేక్ రామస్వామి తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘కమలా హారీస్ ఓ కీలుబొమ్మ. చక్రంలో ఇరుక్కున్న ఓ పిల్లి వంటి వ్యక్తి ఆమె. ఇక్కడ వాస్తవం ఏమిటంటే.. అమెరికా విధానాలకు ఆమె ఎంతో దూరంగా ఉన్నారు. ఆమెకు ప్రజాదరణ చాలా తక్కువ. అది మాకు ఎంతో కలిసి వస్తుంది. ఎన్నికల్లో మేము తప్పకుండా విజయం సాధిస్తాం. ఆమె ఆర్థిక విధానాలు విఫలయమ్యాయి. మేము పాలసీలో గెలుస్తాము. ఈ దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించే పది మిలియన్ల మందికి సరిహద్దును తెరిచి ఉంచడం అమెరిక్లను ఎంతో అభ్యంతరకరం. దేశ సరిహద్దుల విషయంలో భద్రతకు మేము కట్టుబడి ఉన్నాము. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా సరైన ఎంపిక అని నేను భావిస్తున్నాను. ట్రంప్ విజయం సాధించేందుకు మేము అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం . సెనేట్ మరియు హౌస్పై కూడా మాకు నియంత్రణ ఉంటేనే మేము ఆ ఎజెండాను అమలు చేస్తాము’ అంటూ చెప్పుకొచ్చారు. -
ట్రంప్ ఓ లూజర్
షికాగో: డొనాల్డ్ ట్రంప్పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఓవైపు అధ్యక్ష అభ్యరి్థగా పోటీ చేస్తూ మరోవైపు అమెరికాను విఫల దేశంగా అభివర్ణిస్తున్నారు. అదీ ట్రంప్ స్థాయి! అన్ని విషయాల్లోనూ ట్రంప్ ఇప్పటికే ఓడిపోయారు. ఆయనో లూజర్’’ అంటూ తూర్పారబట్టారు. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్లు గెలిచి అమెరికాను మరోసారి గెలిపిస్తారని విశ్వాసం వెలిబుచ్చారు. పార్టీ అధ్యక్ష అభ్యరి్థ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్పై ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం షికాగోలో డెమొక్రటిక్ పార్టీ జాతీయ కన్వెన్షన్ (డీఎన్సీ)ను ఉద్దేశించి బైడెన్ వీడ్కోలు ప్రసంగం చేశారు.రాజకీయ నాయకునిగా ఆయన తన 52 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ను ముగిస్తున్న సందర్భంగా తొలి రోజు భేటీ ఆద్యంతం అత్యంత ఉద్వేగపూరితంగా సాగింది. హారిస్ కోసం అధ్యక్ష బరి నుంచి తప్పుకుని డెమొక్రాట్ల విజయావకాశాలను అమాంతంగా పెంచేసిన 81 ఏళ్ల బైడెన్ను నేతలు, ప్రతినిధులు ముక్త కంఠంతో ప్రశంసించారు. సమావేశానికి ఆయనకు అపూర్వరీతిలో స్వాగతం పలికారు. ఆయన తన స్థానం నుంచి లేచింది మొదలు వేదికనెక్కేదాకా ఆద్యంతం కరతాళ ధ్వనులతో హోరెత్తించారు.బైడెన్ మాట్లాడటం ప్రారంభించగానే సభలో ఉది్వగ్న వాతావరణం నెలకొంది. ‘వుయ్ లవ్ జో!’, ‘థాంక్యూ జో’ అంటూ ప్రతినిధులంతా ప్లకార్డులు ప్రదర్శించారు. నాలుగు నిమిషాలకు పైగా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. దాంతో భావోద్వేగానికి లోనైన బైడెన్ కాసేపు ప్రసంగాన్ని ఆపేశారు. కృతజ్ఞతాపూర్వకంగా పదేపదే ‘థాంక్యూ...’ అంటూ నిలబడిపోయారు. ‘కమలకు కూడా కృతజ్ఞతలు. ఆమె అమెరికాకు 47వ ప్రెసిడెంట్ కావడం తథ్యం’ అన్నారు. 59 ఏళ్ల హారిస్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వాన్ని గురువారం లాంఛనంగా అంగీకరించనున్నారు. నవంబర్ 5న జరిగే ఎన్నికలో 78 ఏళ్ల ట్రంప్తో ఆమె తలపడతారు. సర్వస్వం దేశానికే ధార పోశా: తాను, హారిస్ ఈ నాలుగేళ్లలో అపూర్వ విజయాలు సాధించామని బైడెన్ చెప్పుకొచ్చారు. అధ్యక్షునిగా కొన్ని తప్పులు చేసినా దేశం కోసం సర్వస్వం ధారపోశానంటూ ఆత్మవిమర్శ చేసుకున్నారు. ‘‘2020లో కుమారుని మృతితో నా ఆత్మలో ఓ భాగాన్ని శాశ్వతంగా కోల్పోయా. అయినా ట్రంప్ వంటి విచి్ఛన్న శక్తిని నిలువరించేందుకు అంతటి బాధనూ పక్కన పెట్టి మరీ అధ్యక్ష బరిలో దిగా. అలా 2020లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం. 2024లో మరోసారి కాపాడుకోవాలి’’ అంటూ డెమొక్రాట్లకు, అమెరికన్లకు పిలుపునిచ్చారు. అనంతరం మాట్లాడిన డెమొక్రాట్ నేతలంతా అధ్యక్షునిగా బైడెన్ అందించిన సేవలు చిరస్మరణీయమంటూ ప్రస్తుతించారు.వేదిక బయట ‘గాజా’ నిరసనలుగాజా యుద్ధంలో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతును వ్యతిరేకిస్తూ వేలాదిగా పోటెత్తిన నిరసనకారులతో షికాగో వీధులు నిండిపోయాయి. కన్వెన్షన్ సమీపంలో వారు ఆందోళనకు దిగారు. సమూహాలుగా విడిపోయి భద్రతా వలయాలను బద్దలు కొట్టేందుకు విఫలయత్నం చేశారు. వారి ఆందోళనల్లో న్యాయముందని బైడెన్ తన ప్రసంగంలో అన్నారు. ఇరువైపులా అమాయకులను చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.హారిస్... చరిత్రాత్మక ప్రెసిడెంట్ అవుతారు: బైడెన్డెమొక్రాట్ నేతలు, ప్రతినిధుల అభిమానపు జల్లుల్లో తడిసి ముద్దైన బైడెన్.. ‘అమెరికా, ఐ లవ్ యూ’ అంటూ 50 నిమిషాల పాటు సుదీర్ఘంగా మాట్లాడారు. పార్టీ బాధ్యతలను లాంఛనంగా హారిస్కు అప్పగించారు. అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగిన మేటి నేత హారిసేనన్నారు. ఆమె చరిత్రాత్మక ప్రెసిడెంట్గా నిలుస్తారంటూ జోస్యం చెప్పారు.‘‘హారిస్ను ఉపాధ్యక్షురాలిగా ఎంచుకోవడం, ఇప్పుడు నాకు బదులుగా అధ్యక్ష అభ్యర్థిగా నిలపడం నా అత్యుత్తమ నిర్ణయాలు’’ అని చెప్పుకొచ్చారు. హారిస్కు, ఆమె రన్నింగ్ మేట్ వాల్జ్కు ఓ ఉత్తమ కార్యకర్తగా అన్నివిధాలా సహకరిస్తానన్నారు. ‘స్వేచ్ఛ కోసం ఓటేసేందుకు, హారిస్ను ప్రెసిడెంట్గా ఎన్నుకునేందుకు మీరంతా సిద్ధమేనా?’ అంటూ బైడెన్ ప్రశ్నించడంతో వేలాది మంది ప్రతినిధులు సిద్ధమేనంటూ పిడికిళ్లు బిగించి నినదించారు.బైడెన్ కంటతడి బైడెన్ వేదికపైకి రాగానే ఆయన గురించి కూతురు యాష్లీ పరిచయ వాక్యాలు చెప్పారు. తన తండ్రి మహిళల పక్షపాతి అని చెప్పుకొచ్చారు. వారిని ఆయన ఎంతగా గౌరవిస్తారో స్వయంగా చూశానన్నారు. దాంతో బైడెన్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. పక్కకు తిరిగి కళ్లు తుడుచుకుని కూతుర్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. అధ్యక్ష రేసు నుంచి వైదొలగడం బైడెన్ రాజకీయ జీవితంలోనే అత్యంత ముఖ్యమైన, క్లిష్టమైన నిర్ణయమని ఆయన భార్య జిల్ బైడెన్ ఈ సందర్భంగా అన్నారు.నాడు మరీ కుర్రాణ్ని.. నేడు మరీ ముసలాణ్నిఈ సందర్భంగా తన వయసు గురించి బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘తొలిసారి సెనేటర్గా ఎన్నికైనప్పుడు మరీ కుర్రాడిని. 30 ఏళ్లు కూడా నిండలేదు. ఇప్పుడేమో అమెరికా అధ్యక్షునిగా కొనసాగేందుకు మరీ ముసలివాడినైపోయాను’’ అంటూ చమత్కరించారు. గాజుతెరను బద్దలు కొడుతుంది హారిస్పై హిల్లరీ ప్రశంసలు హారిస్పై మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ప్రశంసల వర్షం కురిపించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కావాల్సిన విజన్, అనుభవం, వ్యక్తిత్వం ఆమెలో పుష్కలంగా ఉన్నాయన్నారు. 76 ఏళ్ల హిల్లరీ వేదికపైకి రాగానే సభికులంతా పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. ‘‘హారిస్ అమెరికాకు తొలి అధ్యక్షురాలవడం, తద్వారా దేశ చరిత్రలోనే అత్యంత కఠినమైన, అతి పెద్దదైన గాజుతెరను బద్దలు కొట్టడం ఖాయం. మనమంతా కలిసికట్టుగా కొట్టిన దెబ్బలకు ఆ తెర ఇప్పటికే బీటలువారింది. దాన్ని పూర్తిగా బద్దలు కొట్టే సత్తా హారిస్కుంది’’ అని ఆమె జోస్యం చెప్పారు.రుణపడి ఉంటాం: హారిస్ బైడెన్ ప్రసంగానికి ముందు హారిస్ మాట్లాడారు. ఆమె ప్రసంగం షెడ్యూ ల్లో లేకపోయినా బైడెన్ను కృతజ్ఞతలు తెలిపేందుకు వేదికపైకొచ్చారు. ఆయన నాయకత్వాన్ని, సేవలను కొనియాడారు. ‘జో, మీకెప్పటికీ రుణపడి ఉంటాం. మీ వారసత్వాన్ని కొనసాగిస్తాం’’ అన్నారు. హారిస్ మాట్లాడుతున్నంతసేపూ సభికులు హర్షధ్వానాలతో హోరెత్తించారు.నిన్ను చూసి గరి్వస్తున్నా: ఒబామా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా బైడెన్ను ప్రశంసలతో ముంచెత్తారు. ‘జో, మీ హుందాతనాన్ని, లక్ష్యసాధన పట్ల మీరు చూపే అచంచలమైన విశ్వాసాన్ని ఆరాధిస్తా. నాలుగేళ్లుగా మీరు అమెరికాకు ఇచి్చన అత్యంత అమూల్యమైన విలువలు ఇవే. మిమ్మల్ని ప్రెసిడెంట్ అని పిలవడం నాకెప్పుడూ గర్వకారణమే. మీరు నా స్నేహితునివని చెప్పుకునే అవకాశమిచ్చినందుకు కృతజ్ఞుడిని’’ అన్నారు. -
ఎన్నికల ప్రచారంలో ట్విస్ట్: కమలా హారీస్ కాదు.. ఓన్లీ ‘కమల’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇప్పటికే పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఎన్నికల్లో ఓటర్లు ఆకర్షించేందుకు డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్ కొత్త ప్లాన్తో ముందుకు సాగుతున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా తన పేరులోని ‘కమల’ అనే పదాలను మాత్రమే వాడుతున్నారు. ‘కమల’ అనే పిలవాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. కాగా, ఎన్నికల సమయంలో ఓటర్లతో మంచి సంబంధాన్ని పెంపొందించడానికి ప్రచారంలో ఆమె మొదటి పేరు ‘కమలా’ను స్వీకరించారు. మాజీ అధ్యక్షడు బరాక్ ఒబామా, పలువురు నేతల సూచనల మేరకు కమలా హారీస్ తన పేరును ‘కమల’గా మార్చుకుని ముందుకు సాగుతున్నారు. ఇక, డెమోక్రటిక్ మద్దతుదారులు కూడా ఆమెను కమలా.. కమలా అని నినాదాలు చేస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు కమలా అని నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. కమలా అంటే ఆమె తల్లి పెట్టిన సాంస్కృతిక మరియు జాతి పేరు. ఇదిలా ఉండగా.. కమలా హారీస్ను డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా ఆమోదించిన 48 గంటల్లో పార్టీ ప్రచార సోషల్ మీడియాను 'బిడెన్ హెచ్క్యూ' నుండి 'కమలా హెచ్క్యూ'కి త్వరగా రీబ్రాండ్ చేసింది. 'హారీస్' నుండి 'కమల'కి మారడం ద్వారా తన ప్రచారంలో ఓటర్లకు దగ్గర కావడానికి ప్లాన్ చేసుకున్నారు. మరోవైపు.. డొనాల్డ్ ట్రంప్ కూడా ఆమె పలుమారు కమలా అని సంబోంధించడంతో ఈజీగా ఆ పేరు ప్రజల్లోకి వెళ్తుందనే కారణంగానే ఇలా ఫిక్స్ చేసినట్టు సమాచారం. -
నేను ఓడిపోతే ఆ దేశంలో కలుద్దాం.. ట్రంప్ వ్యాఖ్యలు వైరల్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇద్దరు ప్రధాన అభ్యర్థులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోతే అమెరికాను వీడుతానని చెప్పుకొచ్చారు. వెనిజులాకు వెళ్లిపోతానని అన్నారు.కాగా, అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏదైనా జరిగి నేను ఓడిపోతే అమెరికాను వీడుతాను. మనం మళ్లీ వెనిజులాలో కలుద్దాం అంటూ మస్క్తో ట్రంప్ అన్నారు. ఎందుకంటే.. అమెరికా కంటే వెనిజులా సురక్షితమైన ప్రాంతం. మీరు కూడా అక్కడికి రండి.. ఇద్దరం కలిసి డిన్నం చేద్దాం అని చెప్పారు.ఇదే సమయంలో బైడెన్ సర్కార్పై సెటైరికల్ కామెంట్స్ చేశారు. వెనిజులాలో ప్రమాదకరమైన నేరస్థులను కూడా జైళ్ల నుంచి విడుదల చేస్తున్నారు. అనంతరం, వారిని అమెరికాకు అక్రమంగా వలస పంపిస్తున్నారు. అందుకే అక్కడ నేరాల రేటు బాగా తగ్గింది. అదే సమయంలో అమెరికాలో క్రైమ్ రేటు బాగా పెరిగిందన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మరో కామెంట్ కూడా చేశారు. తాను ఎన్నికల్లో గెలిస్తే అక్రమ వలసలను అడ్డుకుంటానని అన్నారు. అమెరికాలోకి అక్రమ వలసలను అడ్డుకోవడమే తన లక్ష్యం అని చెప్పుకొచ్చారు. ఇక, ట్రంప్ వ్యాఖ్యలపై డెమోకట్రిక్ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోతున్నట్టు తెలుసుకున్నారని కామెంట్స్ చేశారు. ఓటమిని ఒప్పుకున్నారు కాబట్టే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. -
ట్రంప్లాంటోళ్లను చాలామందినే చూశా: కమలా హారిస్
తమ జాతీయతను ప్రశ్నిస్తూ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు డెమోక్రాటిక్ అభ్యర్ధి కమలా హారిస్ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ ఎలాంటి వాడో తనకు ఎప్పుడో తెలుసని, ఆయన మళ్లీ పాత పాటే పాడుతున్నారంటూ ధీటుగా బదులిచ్చారు.తన కెరీర్లో ట్రంప్ లాంటి వారెంతో మంది నేరస్థులతో వ్యవహరించినట్లు కమలా హారిస్ తెలిపారు. వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికవకముందు గతంలో అటార్నీ జనరల్, డిస్ట్రిక్ట్ అటర్నీ, కోర్టు ప్రాసిక్యూటర్గా ఉన్న సమయంలో ఇలాంటివెన్నో ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు.‘ట్రంప్ మళ్లీ తన పాతకాలపు విభజన సిద్ధాంతం, అగౌరవపర్చే ప్రవర్తననే ప్రదర్శిస్తున్నారు. అందుకే ఇలాంటివారు కాకుండా అమెరికా ప్రజలకు ఉత్తమ నాయకులు రావాలి. మన వైవిధ్యాలు మనల్ని విడదీయకూడదు. ఐకమత్యంగా ఉంచాలి. అదే మన బలం. వాస్తవాలను చెప్పాల్సి వచ్చినప్పుడు శత్రుత్వం, కోపంతో స్పందించేవారు మనకు వద్దు. వాస్తవాలను అంగీకరించి వాటిని ధైర్యంగా చెప్పే నాయకులు కావాలి’ అని వ్యాఖ్యానించారు.Throughout my career, I’ve taken on perpetrators of all kinds, and let me tell you: I know Donald Trump’s type. pic.twitter.com/EP9e8ClVKE— Kamala Harris (@KamalaHarris) August 1, 2024 కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీలో దిగుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్పై జాతీపరమైన గుర్తింపుపై మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. ఆమె భారతీయురాలా?.. లేక నల్లజాతీయురాలా?’అంటూ ప్రశ్నించారు. ఆమె ఎల్లప్పుడూ భారతీయ వారసత్వానికి చెందినవారే. ఇన్నాళ్లూ దాన్నే ప్రచారం చేస్తూ వచ్చారని విమర్శించారు.ఆమె నల్లజాతీయురాలని కొన్నేళ్ల క్రితం వరకు తనకు తెలియదని, ఇప్పుడు ఆమె ఉన్నట్టుండి నల్లజాతీయురాలిగా మారిపోయారు. ఇంతకీ ఆమె భారతీయురాలా? నల్లజాతీయురాలా?’’ అని ట్రంప్ ప్రశ్నించారు. ఈ విమర్శలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.కాగా కమలా హారిస్ భారత సంతతికి చెందినవారన్న విషయం తెలిసిందే. ఆమె తల్లి భారతీయురాలు, తండ్రి జమైకన్. ఇద్దరూ యునైటెడ్ స్టేట్స్కు వలస వచ్చారు. అయతే కమలా నల్లజాతి, ఆసియా వారసత్వం రెండింటినీ కలిగి ఉన్న తొలి అమెరికన్ ఉపాధ్యక్షురాలు. ఈ ఏడాది నవంబర్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో హారిస్ గెలిస్తే దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు కానున్నారు.. -
Trump Vs Kamala: ఎన్నికల సర్వేల్లో సూపర్ ట్విస్ట్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల వేళ అగ్ర రాజ్యం అమెరికా రాజకీయం ఆసక్తికరంగా మారింది. డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారీస్ పోటీ నిలుస్తున్నారు. ఈ క్రమంలో డెమోక్రటిక్ పార్టీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని నిర్ధారించే అధికారిక పత్రాలపై ఆమె సంతకాలు చేశారు. కాగా, ఆమె రేసులో వచ్చిన వెంటనే ట్రంప్ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. ఎన్నికల సర్వేల్లో కమలా హారీస్ దూసుకుపోతున్నారు.వివరాల ప్రకారం.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో సమానంగా కమల హారీస్ ప్రజామోదాన్ని పొందుతున్నారని న్యూయార్క్ టైమ్స్– సియానా కాలేజ్ తాజా పోల్స్లో వెల్లడించింది. ఇక, సర్వేలో పాల్గొన్న అమెరికా ఓటర్లలో 48 శాతం మంది ట్రంప్ వైపు మొగ్గగా, 47 శాతం మంది కమలా హారీస్కు మద్దతు తెలిపారు. ఇదే న్యూయార్క్ టైమ్స్ పత్రిక జూలై మొదటివారంలో నిర్వహించిన సర్వేలో బైడెన్పై ట్రంప్ ఏకంగా ఆరు పాయింట్ల ఆధిక్యాన్ని సాధించారు. దీన్ని హారీస్ ఒక పాయింటుకు తగ్గించడం గమనార్హం. రిజిస్టర్డ్ ఓటర్లలో ట్రంప్కు 48 శాతం, హారీస్కు 46 శాతం మద్దతు లభించింది. ఇదిలా ఉండగా.. రిపబ్లికన్లలో ట్రంప్ను 93 శాతం మంది బలపరుస్తుండగా, కమలా హారిస్కు సైతం డెమోక్రాట్లలో 93 శాతం మద్దతు లభించడం విశేషం. శ్వేతజాతియేతర, యువ ఓటర్లలో బైడెన్కు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. ఇప్పుడు హారీస్కు మాత్రం ఈ వర్గాల నుంచి భారీగా మద్దతు లభిస్తోందని సర్వే తెలిపింది. లాటిన్ అమెరికా మూలాలున్న ఓటర్లు, 30 ఏళ్ల లోపు ఓటర్లలో హారిస్కు 60 శాతం మద్దతు లభించింది.మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల రేసులో కమలా హరీస్ వచ్చిన వెంటనే ఆమెకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తుంది. అంతకుముందు జరిపిన ఓ ఎన్నికల సర్వేలో కూడా ట్రంప్ కంటే కమలా హారీస్ ముందంజలోనే ఉన్నారు. దాదాపు రెండు శాతం ఓట్లతో కమలా దూసుకెళ్లారు. దీంతో, రాబోయే ఎన్నికల్లో విజయం తమదేనంటూ డెమోక్రాట్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, సొంత పార్టీలో కూడా నేతల నుంచి హారీస్కు పూర్తి మద్దతు లభించడం విశేషం. -
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్
వాష్టింగన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్(59) అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా ఖరారు అయ్యారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేసినట్లు తెలిపారామె. అన్ని ఓట్లూ పొందేందుకు కృషి చేస్తానని, నవంబర్లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని ఎక్స్ ఖాతాలో ఆమె పేర్కొన్నారు. అయితే ఆమె తమ అభ్యర్థి అని డెమోక్రటిక్ పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. Today, I signed the forms officially declaring my candidacy for President of the United States.I will work hard to earn every vote.And in November, our people-powered campaign will win. pic.twitter.com/nIZLnt9oN7— Kamala Harris (@KamalaHarris) July 27, 2024అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల అధ్యక్ష రేసు నుంచి వైదొలుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయన ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్ పేరును డెమోక్రటిక్ అభ్యర్థిగా ప్రతిపాదించారు. దీంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆమె మద్దతు కూడగట్టుకుంటున్నారు.నేపథ్యం.. కమలా హారిస్ పూర్తి పేరు.. కమలాదేవి హారిస్. ఆమె భారతీయ మూలాలున్న వ్యక్తి. తల్లి శ్యామలా గోపాలన్ చెన్నైవాసి. పైచదువుల కోసం అమెరికా వెళ్లి.. అక్కడే శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు. కమల తండ్రి డొనాల్డ్ హ్యారిస్. జమైకాకు చెందిన ఆయన అర్థశాస్త్ర ప్రొఫెసర్. అమెరికాలో జన్మించిన కమల.. తల్లి భారతీయురాలు కాబట్టి భారతీయ అమెరికన్, తండ్రి ఆఫ్రికన్ కాబట్టి ఆఫ్రికన్ అమెరికన్ అయ్యారు. హోవార్డ్ విశ్వవిద్యాలయం నుంచి అర్థశాస్త్రంలో డిగ్రీ చేశారు కమల. క్యాలిఫోర్నియా యూనివర్సిటీ పరిధిలోని హేస్టింగ్స్ కాలేజ్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టరేట్ అందుకొన్నారు. అటార్నీ జనరల్గా..హోవార్డ్లో చదువుతున్నప్పుడే విద్యార్థి నాయకురాలిగా పోటీ చేశారామె. చదువు పూర్తి చేసిన తర్వాత క్యాలిఫోర్నియాలోని అలమెడా కౌంటీకి డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా పని చేశారు. శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో కెరీర్ క్రిమినల్ యూనిట్లో మేనేజింగ్ అటార్నీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై శాన్ఫ్రాన్సిస్కో సిటీ అటార్నీ జనరల్గా రెండు పర్యాయాలు ఎన్నికై సమర్థంగా తన బాధ్యతలు నిర్వహించారు కమల. 2003లో ఆ పదవి చేపట్టిన కమల 2011 వరకు అందులోనే కొనసాగారు. ఆపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా ఎన్నికయ్యారు. సెనేటర్ నుంచి తక్కువ టైంలో.. 2017లో క్యాలిఫోర్నియా సెనేటర్గా కీలక బాధ్యతలు చేపట్టారు. తద్వారా కరోల్ మోస్లే తర్వాత ‘అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్’లో అడుగుపెట్టిన తొలి నల్ల జాతీయురాలిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2020లో అమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. కమలా హారిస్ అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు. మొదటి నల్లజాతి, దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వైస్ ప్రెసిడెంట్ కూడా ఆమే. ఇప్పుడు ఏకంగా అధ్యక్ష పదవికే గురిపెట్టారు. డెమోక్రటిక్ పార్టీ ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తే.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(78)తో ఆమె పోటీ పడనున్నారు. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా గెలిస్తే.. అగ్ర రాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించినట్లే అవుతుంది. -
ఎట్టకేలకు కమలా హారిస్కు మద్దతు ప్రకటించిన ఒబామా
అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్కు.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒమాబా మద్దతు ప్రకటించారు. నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ను వారు ఆమోదించారు. న స్నేహితురాలు హారీస్ అమెరికాకు గొప్ప అధ్యక్షురాలు అవుతుందని భావిస్తున్నామని, ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. ‘అధ్యక్ష ఎన్నికల్లో నా స్నేహితురాలు యూనైటెడ్ స్టేట్స్కు అధ్బుతమైన అధ్యక్షురాలిగా అవుతుంది. రెండు రోజుల క్రితం కమలా హ్యారిస్కు మేము ఫోన్ చేశాం. మిచెల్, నేను ఆమెతో మాట్లాడాం. తనకు మా పూర్తి మద్దతు ఉందని ఆమెకు చెప్పాము. ఈ క్లిష్టమైన సమయంలో నవంబర్లో జరిగే ఎన్నికల్లో ఆమె గెలుపొందేందుకు మేము చేయగలిగినదంతా చేస్తాం. నీ పట్ల మాకు గర్వంగా ఉంది. నువ్వు చరిత్ర సృష్టిస్తామని తెలుసు’ అని అని బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు.ఇక ఈ నవంబర్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. రేసు నుంచి తప్పుకున్న అధ్యక్షుడు బైడెన్.. తన స్థానంలో కమలా హ్యారిస్ను ప్రతిపాదించారు. అయితే కమలా హ్యారిస్ విషయంలో డెమోక్రటిక్ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పటి వరకు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన మద్దతును తెలపలేదు. అయితే ఇవాళ ఒబామా దంపతులు .. కమలా హారిస్కు మద్దతు ప్రకటించారు. -
పెరిగిపోతున్న మద్దతు.. కమలా హారిస్ సరికొత్త రికార్డ్లు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా భారత సంతతి అమెరికన్ కమలా హారిస్ దూసుకుపోతున్నారు. అన్నీ వర్గాల నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది. అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నవారి గెలుపు ఓటములపై పలు సంస్థలు ప్రీపోల్ సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ సర్వేల్లో కమలా హారిస్కు అనుకూలంగా 44 పాయింట్ల లభించగా.. డొనాల్డ్ ట్రంప్కు 42 పాయింట్లు లభించాయి.ఈ తరుణంలో కమలా హారిస్ అధ్యక్ష ఎన్నికల కోసం ఫండ్ రైజింగ్ ఈవెంట్ను నిర్వహించారు. ‘వైట్ ఉమెన్: ఆన్సర్ ది కాల్’ పేరిట ఆన్లైన్లో జూమ్ మీటింగ్ వేదికగా జరిగిన 90 నిమిషాల ఫండ్ రైజింగ్ ఈవెంట్లో సుమారు 2 మిలియన్ డాలర్లు..భారత కరెన్సీలో 16.48 కోట్లను నిధులు సమకూరినట్లు తెలుస్తోంది.ఒక లక్షా 64 వేల మంది పాల్గొన్న ఆ జూమ్ మీటింగ్లో యూజర్ల తాకిడికి అంతరాయం ఏర్పడింది. దీంతో పలువురు ఔత్సాహికులు యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ను వీక్షించేందుకు వెళ్లారు. స్ట్రీమింగ్లో పింక్, కొన్నీ బ్రిటన్ వంటి ప్రముఖులు పాల్గొన్నట్లు సమాచారం.From PINK to Maria Shriver to the kneeling America hating Megan Rapinoe… The Harris campaign hosted a successful Zoom fundraiser targeting white women. Drew 130K attendees & raised $1.3 Million in less than an hour. Finished at $2 Million. They’re all in for Kamala. pic.twitter.com/ghxbdGcdWg— ChiTown Conservative 🌎☄️#TeamAsteroid (@gingertealkp) July 26, 2024 ఈ జూమ్ మీటింగ్ ఉద్దేశ్యం అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు నిర్వహించినట్లు కమలా హారిస్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా జూమ్ మీటింగ్లో పాల్గొన్న ఎరిన్ గల్లఘర్ మాట్లాడుతూ..నేను జోక్ చేయడం లేదు. కమలా నిర్వహించిన లైవ్ స్ట్రీమ్కి యూజర్ల తాకిడి ఎక్కువై.. లైవ్ స్ట్రీమ్లో అంతరాయం ఏర్పడింది. మీరే అర్ధం చేసుకోండి కమలా హారిస్కు ఏ స్థాయిలో అమెరికన్ల నుంచి మద్దతు లభిస్తుందోనని అని అన్నారు. -
కమలా హారీస్పై నమ్మకముంది: బైడెన్ సతీమణి జిల్
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష రేసులోకి ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ రావడంతో సమీకరణాలు మారిపోతున్నాయి. ఎన్నికల్లో కమలా హారీస్ విజయం సాధిస్తుందనే నమ్మకంతో డెమోక్రాట్స్ ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్.. కమలా హారీస్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెపై నమ్మకం ఉంచాల్సిన సమయం వచ్చిందంటూ జిల్ బైడెన్ చెప్పుకొచ్చారు.కాగా, అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్ బైడెన్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా జిల్ బైడెన్..‘మమ్మల్ని విశ్వసించిన వారికి నా కృతజ్ఞతలు. మీరు ఇన్ని రోజులు జో బైడెన్పై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. మాపై మీ అభిమానం ఎల్లప్పుడూ నా హృదయంలో నిండి ఉంటుంది. ఇప్పుడు కమలా హారీస్పై ఆ నమ్మకాన్ని ఉంచాల్సిన సమయం వచ్చింది. ఆమెపై నాకు నమ్మకముంది’ అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఇక, తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడానికి గల కారణాన్ని జో బైడెన్ చెప్పుకొచ్చారు. తాజాగా జో బైడెన్ మాట్లాడుతూ.. ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామాన్ని పరిరక్షించటం కంటే పదవులు ముఖ్యం కాదు. కొత్త తరానికి అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నా. అమెరికాను ఏకం చేయటంలో ఇదే ఉత్తమైన మార్గం. యువ గళం వినిపించడానికి ఇదే సరైన సమయం అని అన్నారు. అలాగే, అమెరికా ప్రజలకు అధ్యక్షుడిగా పనిచేయడం నా జీవితంలో లభించిన గొప్ప గౌరవమని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఏకం కావాలి. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో పార్టీని ఏకం చేయాల్సిన అవసరం ఉంది అంటూ కామెంట్స్ చేశారు. -
ట్రంప్ Vs హారీస్.. ఎన్నికల సర్వే పోల్స్లో బిగ్ ట్విస్ట్!
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులోకి ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ రాకతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా వెలువడిన ఎన్నికల పోల్స్ ట్రంప్పై కమలా హారీస్దే పైచేయి అని చెబుతున్నాయి. ఆమె గెలుపు ఖాయమంటూ నంబర్స్ రిలీజ్ చేస్తున్నాయి.కాగా.. తాజాగా నిర్వహించిన ఐపీఎస్ఓఎస్, నేషనల్ పోల్స్ ప్రకారం.. ట్రంప్ కంటే కమలా హారీస్ ముందంజలో ఉన్నారు. ఈ పోల్స్ ఫలితాల్లో కమలా హారీస్కు 44 శాతం ఓట్లు నమోదు కాగా, ట్రంప్కు మాత్రం 42 శాతం పోలయ్యాయి. దీంతో, రెండు శాతం ఓటింగ్లో కమలా ముందంజలో ఉన్నారు. ఇక, సర్వే సందర్భంగా సందర్భంగా ఓటర్లు మాట్లాడుతూ.. తమ మద్దతు కమలా హారీస్కే అంటున్నారు. ఆమె సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలరు. ఈ విషయంలో ట్రంప్ కంటే ఆమెనే బెటర్ అంటూ కితాబిస్తున్నారు. ఇదే సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్కు మాత్రం 22 శాతం ఓటు షేర్ రావడం గమనార్హం.ఇదిలా ఉండగా.. డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరు దాదాపు ఖరారైంది. అధ్యక్ష అభ్యర్థికి కావాల్సిన 1,976 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు ఆమెకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో డెలావెర్లోని ప్రచార ప్రధాన కార్యాలయాన్ని హారిస్ సోమవారం సందర్శించారు. బైడెన్ ప్రచారం బృందంతో ఆమె సమావేశమయ్యారు. అదే బృందంతో కలిసి పనిచేయనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా 106 రోజులే ఉన్నాయని, గెలుపు కోసం నిర్విరామంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా.. తన రిపబ్లికన్ ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్పై హారిస్ విరుచుకుపడ్డారు.ఆయన కుంభకోణాలను గుర్తు చేశారు. నేరాలను ఎత్తి చూపారు. మహిళలను వేధించిన మృగం, మోసగాడు, తన స్వార్థ ప్రయోజనాలకోసం నియమా లను ఉల్లంఘించిన వ్యక్తని విమర్శించారు. ‘ట్రంప్ ఏ రకమో నాకు తెలుసు’ అంటూ ఎద్దేవా హారిస్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో కలిసి పనిచేయడం తనకు దక్కిన ఒక గొప్ప గౌరవమన్నారు. -
కమలా హారిస్కు మద్దతుగా ట్రంప్ విరాళం!.. జోరుగా సెటైర్లు
అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవడం, డెమోక్రటిక్ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును ఆయన ప్రతిపాదించడం, మద్దతు కూడగట్టుకునేందుకు ఆమె ప్రయత్నాలు ముమ్మరం చేయడం.. అదే టైంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆమెను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఈలోపు సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ తెర మీదకు వచ్చింది.బైడెన్ వైదొలగిన తర్వాత హారిస్ ప్రచారం బృందం 24 గంటల్లో 81 మిలియన్ డాలర్ల విరాళాలను సేకరించింది. దీంట్లో 60 శాతం తొలిసారి దాతల నుంచి వచ్చినవే కావడం గమనార్హం. మరి కమలా హారిస్కు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ‘కానుక’ సంగతి ఏంటి? అని కొందరు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుస్తున్నారు. అయితే ఇది ఇప్పట్లో జరిగింది కాదు.2011 సెప్టెంబర్లో కమలా హారిస్ కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా ఉన్నారు. ఆమె మళ్లీ పోటీ చేయడం కోసం ఆమెకు మద్దతుగా విరాళాల సేకరణ జరిగింది. ఆ సమయంలో ట్రంప్ తరఫున 6,000 డాలర్ల డొనేషన్ కమలా హారిస్కు వెళ్లింది. ఇందులో 5,000 డాలర్లను ట్రంప్ సంతకంతో కూడిన చెక్ డొనేషన్ రూపంలో ఆమెకు వెళ్లింది. మరో వెయ్యి డాలర్లు 2013 ఫిబ్రవరిలో ట్రంప్ పేరిట హారిస్ ఖాతాలోకి వెళ్లింది. ఇక.. 2014 జూన్లో కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రీ-ఎలక్షన్ కమిటీ సభ్యురాలైన ట్రంప్ కూతురు ఇవాంకా.. మరో 2,000 డాలర్లను విరాళంగా ఇచ్చారు. అంటే.. మొత్తంగా ట్రంప్ కుటుంబం 8,000 డాలర్లను డొనేషన్ రూపంలో కమలా హారిస్కు మద్దతుగా ఇచ్చిందన్నమాట. అయితే ఇది ఆ కుటుంబం కావాలని చేసిన పనేం కాదు. అప్పటి న్యూయార్క్ ప్రాసిక్యూటర్ ఎరిక్ ష్నీడెర్మాన్ కమలా హారిస్ తరఫున ఫండ్ రైజర్గా ఉండగా.. ఆయన విజ్ఞప్తి మేరకు ట్రంప్ కుటుంబం అలా డొనేషన్లు ఇచ్చింది.ఇక ఇప్పుడు ఆ డొనేషన్ ప్రస్తావన తెర మీదకు వచ్చింది. ఫ్లోరిడా డెమోక్రటిక్ సభ్యుడు జరెడ్ మోస్కోవిట్జ్ ఎక్స్ వేదికగా ‘‘తెలివైన పెట్టుబడి’’ అని చేసిన ట్వీట్ ఒకటి చర్చనీయాంశమైంది. ఆమె ఇప్పుడు డెమోక్రటిక్ అభ్యర్థి కాబట్టి ఆ డబ్బును ఉపయోగించుకోలేరని మరో నెటిజన్ సెటైర్ వేశారు. ట్రంప్ దీనికి ఏం సమాధానం చెప్తారో అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశారు.కొసమెరుపు ఏంటంటే.. శాక్రమెంటో బీ పత్రికా కథనం ప్రకారం.. 2020లో యూఎస్ సెనేట్కు కమలా హారిస్ పోటీ చేశారు. ఆ టైంలో ఆ 6 వేల డాలర్ల మొత్తాన్ని ఆమె సెంట్రల్ అమెరికాలోని ఓ పౌర హక్కుల సంస్థకు విరాళంగా ఇచ్చారట. -
మలుపు తిప్పిన నిష్క్రమణ
అందరూ అనుమానిస్తున్నట్టే జరిగింది. చెప్పాలంటే అనివార్యమైనదే అయింది. మరో నాలుగు నెలల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు ఉన్నాయనగా రెండోసారి ఆ పదవికి ఎన్నికయ్యేందుకు చేస్తున్న ప్రచారం నుంచి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత దేశాధ్యక్షుడు జో బైడెన్ పక్కకు తప్పుకున్నారు. వైట్హౌస్ పీఠానికి రేసు నుంచి వైదొలగుతున్నట్టు ఆదివారం ఆయన ఆకస్మికంగా చేసిన ప్రకటన ఒక విధంగా సంచలనమే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక పార్టీ అభ్యర్థి ఇలా అర్ధంతరంగా బరిలో నుంచి వైదొలగిన ఘటన మునుపెన్నడూ జరగనిదే. అలాగని కొద్ది వారాలుగా అమెరికాలో జరుగుతున్న పరిణామాల రీత్యా బైడెన్ ప్రకటన మరీ అనూహ్యమేమీ కాదు. ఎన్నికల్లో పోటీ పడకున్నా, పదవీకాలం పూర్తయ్యే వరకు దేశాధ్యక్షుడిగా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని ప్రకటించిన ఆయన తన స్థానంలో పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారిస్ పేరు ప్రస్తావించడం, ఆమె అభ్యర్థిత్వాన్ని తోటి డెమోక్రాట్లు బలపరుస్తుండడంతో అమెరికా ఎన్నికల కథ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఇటీవలే ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్న ఘటనతో అన్నీ ప్రతికూలంగా కనిపిస్తున్న వేళ డెమోక్రాటిక్ పార్టీకి ఇది కొత్త ఊపిరి పోస్తోంది. మళ్ళీ ఆశలు చిగురింపజేస్తోంది. ఇరవై తొమ్మిదేళ్ళ వయసులో జో బైడెన్ జాతీయస్థాయి రాజకీయ జీవితం ప్రారంభించారు. రిపబ్లికన్ సెనెటర్ను ఓడించడం ద్వారా 1972లో ఆయన కెరీర్ మొదలైంది. సరిగ్గా 52 ఏళ్ళ తర్వాత అమెరికా చరిత్రలో అత్యంత పెద్ద వయసు అధ్యక్షుడైన ఆయన యుద్ధం చేయకుండానే అస్త్రసన్యాసం చేయాల్సి వచ్చింది. నెలన్నర క్రితం కూడా బరిలో నుంచి తప్పుకొనేది లేదని బల్లగుద్ది చెప్పిన బైడెన్ ఇప్పుడిలాంటి నిర్ణయం తీసుకున్నారంటే... ఒక రకంగా అది ఆయన స్వయంకృతం. మరోరకంగా క్షేత్రస్థాయి పరిస్థితుల పట్ల పెరిగిన అవగాహన అని చెప్పక తప్పదు. ఆయనలో ఈ ప్రాప్తకాలజ్ఞతకు చాలా కారణాలే దోహదపడ్డాయి. ట్రంప్తో తొలి చర్చలోనే తడబడడం దగ్గర నుంచి నడకలో, నడతలో, మాటలో మార్పు తెచ్చిన వయోభారం, అభ్యర్థిని మార్చాలంటూ సొంత పార్టీ వారి నుంచే కొంతకాలంగా పెరుగుతున్న ఒత్తిడి వరకు ఇలా అనేకం అందులో ఉన్నాయి. అలాగే, ఆరునూరైనా సరే ముందనుకున్నదే చేసి తీరాలన్న మంకుపట్టు కన్నా రాజకీయాల్లో పట్టువిడుపులు ముఖ్యమనీ, కళ్ళెదుటి వాస్తవాలను బట్టి విజయం కోసం ఆట తీరు మార్చడం కీలకమనీ డెమోక్రాటిక్ పార్టీ అర్థం చేసుకుంది. అందుకే, బైడెన్ పోటీ ఉపసంహరణ నిర్ణయం తీసుకుంది. దీన్ని స్వాగతించాల్సిందే తప్ప తప్పుబట్టడానికి లేదు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన పదవికి డెమోక్రాటిక్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు 59 ఏళ్ళ కమలా హ్యారిస్ ఇప్పుడు ముందు వరుసలో ఉన్నారు. భారతీయ మూలాలున్న ఈ లాయర్ మొదట అటార్నీ జనరల్గా ఎదిగి, ఆ పైన సెనెటరయ్యారు. నిజానికి, అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళ, తొలి నల్లజాతి అమెరికన్, తొలి దక్షిణాసియా అమెరికన్ ఆమే! ఉపాధ్యక్షు రాలిగా ఆమె అద్భుతాలు చేయకపోయినా, చిందరవందరైన డెమోక్రాటిక్ పార్టీని మళ్ళీ చక్కదిద్ది గాడిన పెట్టగలరని ఆశ. ఇప్పుడు ఆమె ముందున్న అసలు సవాలదే. ఆమెను అభ్యర్థిగా ప్రకటించడానికి డెమోక్రాట్లు జాగు చేయకపోవచ్చు. అదే జరిగాక... ఎంతైనా స్త్రీ అనీ, ఆమె జాతి ఫలానా అనీ ప్రత్యర్థి ట్రంప్ బృందం ప్రచార దాడులు ప్రారంభించడం ఖాయం. అయితే, గతంలో ఇలానే బరాక్ ఒబామాపై ప్రచారాలు సాగినా, అవేవీ ఓటర్లు పట్టించుకోలేదు. అధ్యక్షుడిగా ఆయన రెండు సార్లు గెలిచారన్నది గమనార్హం. ధాటిగా మాట్లాడుతూ, ప్రచారం చేసే సత్తా ఉన్న కమల ఎన్నికల్లో అద్భుతం చేసినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ట్రంప్కు అడ్డుకట్ట వేయలేకున్నా, కనీసం ఆయన తలతిక్క నిర్ణయాలు తీసుకొనే వీలు లేని రీతిలో అమెరికన్ కాంగ్రెస్ ఎన్నికయ్యేలా చేయగలరని విశ్లేషణ. పునర్వైభవం కోసం డెమోక్రాట్లు అంతా ఏకమవుతున్న వేళ సొంత నియోజకవర్గమంటూ లేని కమల ముందుగా భాగస్వాముల్ని, సమర్థకుల్ని, సహాయకుల్ని, అనుభవజ్ఞులూ – ప్రతిభావంతులైన బృందాన్నీ సమకూర్చుకోవాలి. కీలక రాష్ట్రాల్లో వారే ఆమెకు అండ. నిజానికి, పరిస్థితులు చూస్తుంటే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు అమెరికా ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని నాయకత్వ కొరత పీడిస్తున్నట్టుంది. ఇటు డెమోక్రాట్లు, అటు రిపబ్లికన్లు – ఇరు పక్షాల్లోనూ ప్రజాదరణతో పాటు నేర్పు, ఓర్పున్న సమర్థులైన నాయకులెవరూ కనిపించడం లేదు. ఎవరూ రెండుసార్లకు మించి దేశాధ్యక్ష పదవిని చేపట్టరాదన్న అమెరికా రాజ్యాంగం ఒబామా లాంటి వారి పునఃప్రతిష్ఠకు అడ్డంకిగా మారింది. అది లోటే అయినా, ఆ నిబంధనలోని విస్తృత ప్రజాస్వామ్యస్ఫూర్తి, దూరాలోచన అర్థం చేసుకోదగినవే. అనుభవం లేనంత మాత్రాన అధ్యక్షబాధ్యతల్లో విఫలమవుతారనీ లేదు. మునుపటి అధ్యక్షులు చాలామంది అందుకు ఉదాహరణ. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, ఏ కొత్త బాధ్యతా కష్టం కాదు. పైగా, ట్రంప్కు మళ్ళీ పట్టం కట్టడానికి సుతరామూ ఇష్టం లేని అమెరికన్లకు ఇప్పుడు కమల మినహా ప్రత్యామ్నాయం లేదు. అదీ ఆమెకు కలిసిరావచ్చు. అయితే, హత్యాయత్నం తర్వాత పిడికిలి పైకెత్తి, పోరాటానికి నినదించి హీరో స్థాయికి పెరిగిన ట్రంప్ ప్రాచుర్యాన్ని తక్కువగా అంచనా వేయలేం. యువ ఓటర్లను ఆకర్షించడం కోసం ఉపాధ్యక్ష పదవికి 39 ఏళ్ళ జె.డి. వాన్స్ను ఎంపిక చేసుకొని ట్రంప్ మంచి ఎత్తుగడే వేశారు. మొత్తానికి, రోజులు గడుస్తున్నకొద్దీ అమెరికా ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయమనిపిస్తోంది. ఎందుకంటే, అయిపోయిందనుకున్న ఆట అసలు ఇప్పుడే మొదలైంది! -
డెమోక్రాట్ అభ్యర్థిపై సస్పెన్స్.. ట్విస్ట్ ఇచ్చిన ఒబామా!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ నేతలు బైడెన్ను ప్రశంసిస్తున్నారు. పార్టీ ప్రయోజనాల కోసం తప్పుకొని నిస్వార్థంగా వ్యవహరించాలని కొనియాడుతున్నారు. మరోవైపు.. ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ కూడా బైడెన్ నిర్ణయాలన్ని స్వాగించారు.ఈ నేపథ్యంలో ఎన్నికల బరి నుంచి బైడెన్ తప్పుకోవడంపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు. ‘‘బైడెన్ నిర్ణయం దేశంపై ఆయనకున్న ప్రేమను చాటుతుంది. రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. అయినప్పటికీ.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఆయన గొప్ప దేశభక్తుడు. అధ్యక్షుడిగా బైడెన్ అంతర్జాతీయ వేదికపై అమెరికా గొప్పతనాన్ని చాటిచెప్పారు. నాటోను పునరుజ్జీవింపజేశారని తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను ఏకం చేశారు’’ అని ఒబామా కొనియాడారు. ఇదే సమయంలో కమలా హారీస్ అభ్యర్థిత్వానికి బైడెన్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ఒబామా మాత్రం ఇప్పటివరకు ఆమెకు మద్దతుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు.. కొత్త నామినీ ఎంపిక కోసం సరైన ప్రక్రియతో ముందుకురావాలని పిలుపునివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా.. రాబోయే రోజుల్లో ఊహించని పరిణామాలు ఎదురుకాబోతున్నాయని, డెమోక్రటిక్ పార్టీ శ్రేణులను ఒబామా అప్రమత్తం చేశారు.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష బరి నుంచి బైడెన్ తప్పుకోవడంతో డెమోక్రటిక్ పార్టీలో సస్పెన్స్ కొనసాగుతోంది. బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీలో అయోమయ పరిస్థితి నెలకొంది. బరిలో ఎవరు నిలుస్తారనే చర్చ తీవ్రతరమైంది. వచ్చే నెలలో జరిగే పార్టీ సదస్సులో అభ్యర్థి ఎవరనేది తేలనుంది. ఈ సందర్భంగా 4,700 మంది ప్రతినిధులు నామినీని ఆమోదించాల్సి ఉంటుంది. మళ్లీ ప్రతినిధులతోపాటు మాజీ అధ్యక్షులు, మాజీ ఉపాధ్యక్షుల మద్దతును హారిస్ కూడగట్టుకోవాల్సిందే. ఇక, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్ ఇప్పటికే హారీస్కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. -
అధ్యక్ష రేసులో కమలా హారీస్.. ట్రంప్ రియాక్షన్ ఇదే
వాషింగ్టన్: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడ్న్ రేసు నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ నిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కమలా హారీస్పై రిపబ్లికన్ పార్టీ అధ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ కంటే కమలా హారీస్ను ఓడించడం చాలా తేలిక అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కమలా హారీస్పై సోషల్ మీడియా వేదికగా ట్రంప్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. అధ్యక్ష పదవికి బైడెన్ అన్ఫిట్. ప్రజాసేవకు బైడెన్ పనికిరాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు. బైడెన్ హయాంలో మాతో పాటు అమెరికా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మేము అధికారంలోకి వచ్చాక బైడెన్ చేసిన డ్యామేజ్ని పూర్తి స్థాయిలో నివారిస్తామని చెప్పారు.అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ వైదొలగారు. పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను పోటీ నుంచి వైదొలగుతున్నట్లు ఆదివారం బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు లేఖ రాశారు. లేఖలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు కృతజ్ఞతలు చెప్పిన బైడెన్.. ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘ఈ రోజు నా పూర్తి మద్దతును హారిస్కు ఇస్తున్నా. ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తున్నా. డెమోక్రాట్లు ఐక్యంగా ట్రంప్ను ఓడించండి’ అని ఆయన పేర్కొన్నారు. డెమోక్రాట్లలోనూ ఎక్కువ మంది 59 ఏళ్ల హారిస్వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యలంలో కమలా హారీస్ పోటీలో నిలిచే అవకాశం ఉంది. -
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
అమెరికా అధ్యక్ష్య ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తాను అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. డెమోక్రటిక్ పార్టీ, దేశ ప్రజల ప్రయోజనాల కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు బైడెన్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్గా పూర్తికాలం కొనసాగుతానన్నారు. ఇటీవల ట్రంప్తో జరిగిన ముఖాముఖి చర్చలో బైడెన్ నిరాశపరిచారు. రానున్న ఎన్నికలకు తదుపరి డెమొక్రాట్ అభ్యర్థిగా కమలా హారిస్ను జో బైడెన్ ప్రతిపాదించారు.జో బైడెన్ సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో సైతం బైడెన్ బాధపడుతున్నారు. -
ఎన్నికల్లో గెలుపు మనదే: కమలా హారీస్
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార డెమోక్రటికల్ పార్టీలో రాజకీయం రసవత్తరంగా మారింది. అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో అధికారం రిపబ్లిక్ పార్టీదే అని చెప్పుకొచ్చారు.కాగా, అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ పోటీ చేస్తే ప్రచారానికి నిధులు నిలిపివేస్తామని డెమోక్రటిక్ పార్టీ దాతలు బెదిరించడంతో కమలా హారీస్ రంగంలోకి దిగారు. తాజాగా ఆమె నిధుల సేకరణ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమలా హారీస్.. పార్టీకి చెందిన దాతలను శాంతింపజేశారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ గెలవబోతుందన్నారు. బైడెన్ తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో ఏ అభ్యర్థి అమెరికా ప్రజలకు మొదటి స్థానం ఇస్తారో మాకు తెలుసు. మా అధ్యక్షుడు జో బైడెన్.. 2024 అధ్యక్ష రేసులో కొనసాగుతానని ప్రమాణం చేశారని ఆమె గుర్తు చేశారు. అలాగే, ఎక్కువ మంది చట్టసభ సభ్యులు మరోసారి అధ్యక్షుడిగా జో బైడెన్ను నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. తొమ్మిది మంది డెమోక్రాటిక్ చట్టసభ సభ్యులు బైడెన్ను ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకోవాలని పిలుపునిచ్చారు. మరికొందరు డెమోక్రటిక్ పార్టీ నేతలు కూడా బైడెన్ ఎన్నికల నుంచి తప్పుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఆయన కమలా హారీస్లో పోటీలో ఉండాలని కోరుతున్నారు. ఈ ఎన్నికల్లో ట్రంప్కు పోటీగా కమలా హారీసే కరెక్ట్ పోటీదారు అంటూ పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇటీవల మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల ఘటన తర్వాత యూఎస్ ప్రెసిడెంట్గా విజయం సాధించే అవకాశాలు ఎక్కువయ్యాయి. దీంతో, ట్రంపే గెలుస్తారనే చర్చ నడుస్తోంది. -
అధ్యక్షుడిగా ట్రంప్ మళ్లీ గెలిస్తే?
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఊహించినట్టుగానే రిపబ్లికన్ పార్టీ తన అధికారిక అధ్యక్ష అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్ను ఎంచుకుంది. ఇప్పటికే ట్రంప్కు సానుకూల పవనాలు వీస్తుండగా, ఆయన మీద జరిగిన హత్యాయత్నం ఆయన విజయావకాశాలను మరింతగా పెంచేవుంటుంది. అయితే ఇంకోసారి ట్రంప్కు అధికార పగ్గాలు చిక్కితే రకరకాలుగా నష్టం జరిగే అవకాశాలు మెండు! ప్రజాస్వామ్యం, వాతావరణ మార్పు అంశాల్లో ట్రంప్ నిర్ణయాలు అమెరికాను బలహీనపరచడమే కాకుండా... భారత దేశానికీ ఆందోళన కలిగించేవే. ట్రంప్ తన పాత వైఖరినే కొనసాగిస్తే చైనా ఆధిపత్యం పెరుగుతుంది. అమెరికా అంతర్గతంగా బలహీనపడితే కూడా లాభపడేది చైనా మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలి.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరిగిన తొలి ముఖాముఖి చర్చ జో బైడెన్కు ఓ దుస్వప్నంలా మిగిలిపోయింది. తడబాటు, తత్తరపాటు, మతిమరపు లతో బైడెన్ పై అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగానూ వ్యతిరేకులు పెరిగిపోయారు. బైడెన్ వైఫల్యం కాస్తా ట్రంప్కు వరంగా మారిందని చెప్పాలి. అధ్యక్షుడిగా బైడెన్ రికార్డు బాగానే ఉంది. కానీ చర్చ కార్య క్రమం మాత్రం అతడి వయసు, మానసిక ఆరోగ్యంపై అనేక సందే హాలు లేవనెత్తింది. డెమోక్రాట్ల విశ్వసనీయతతోపాటు వైట్హౌస్పై కూడా నమ్మకం సడలించే వ్యవహారమిది. డెమోక్రాట్లకు ఓటేయాల్సిందిగా మద్దతుదారులు కూడా అడిగేందుకు సందేహించే పరిస్థితి వచ్చింది. బైడెన్ ఇవేవీ పట్టించుకునే పరిస్థితిలో లేరు. పోటీ నుంచి తప్పుకొమ్మని చాలామంది సలహా ఇస్తున్నా... అధికారాన్ని వదులు కునేందుకు సిద్ధంగా లేరు. పైగా తాను మాత్రమే ట్రంప్ను ఓడించ గలనని అంటున్నారు.వాతావరణ మార్పును పట్టించుకోరు!ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఇంకోసారి ఎన్నికైతే ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానాలు వెతుక్కోవాల్సి వస్తోంది. చాలా రకాలుగా విధ్వంసం జరుగుతుందన్నది కచ్చితం. కాకపోతే భారతదేశం అంటే మనం ఆలోచించాల్సిన అంశాలు ప్రధానంగా రెండు ఉన్నాయి. శతాబ్దాలుగా... ఇప్పుడు కూడా అమె రికా వెలువరించే కర్బన ఉద్గారాలు భారీ స్థాయిలో ఉన్నాయన్నది తెలిసిందే. ఇందుకు బాధ్యత వహించే విషయంలో మాత్రం అగ్ర రాజ్యం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. వాతావరణ మార్పుల ప్రభావాన్ని అడ్డుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు తన వంతు సాయం అందించేందుకు తిరస్కరిస్తోంది. వినియోగదారుల కేంద్రంగా నడిచే ఆర్థిక వ్యవస్థగానే మిగిలిపోయిన అమెరికా విచ్చల విడి ఖర్చులు, వనరుల వృథాకు ప్రసిద్ధి. కపటత్వం కూడా ఎక్కువే. కోట్లాదిమందిని పేదరికం కోరల నుంచి తప్పించాల్సిన బాధ్యత ఉన్న దేశాలు అభివృద్ధి విషయంలో రాజీపడాల్సిందిగా కోరడం దీనికి నిదర్శనం. చారిత్రక బాధ్యతలను విస్మరించడం, తమ జీవనశైలిని మార్చుకునే ప్రయత్నాలు అస్సలు చేయకపోవడం అమెరికాకు మాత్రమే ప్రత్యేకం. ఈ విషయమై అటు డెమోక్రాట్లనూ, ఇటు రిపబ్లికన్లనూ ఇద్దరినీ నిందించాల్సిందే. అయితే బైడెన్ గద్దెనెక్కిన తరువాత ప్యారిస్ ఒప్పందానికి ఊ కొట్టడం, వాతావరణ మార్పులకు సంబంధించి చట్టాన్ని ఆమోదించడం, స్థానికంగా కర్బన ఉద్గారాల తగ్గింపునకు లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. వాతావరణ సంక్షోభ నివారణ యత్నాలకు రుణసాయం ఇచ్చేలా బ్యాంకులను ప్రోత్సహించారు కూడా. ఈ చర్యలన్నీ నామమాత్రంగానైనా తానూ బాధ్యత తీసుకుంటున్న భావన కలిగించాయి. ఒకవేళ ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపడితే ఇవేవీ కొనసాగించడన్నది కచ్చితం. తొలి దఫా గద్దెనెక్కి నప్పటి చందంగానే వాతావరణ మార్పులన్నవి అసలు సమస్యే కాదన్నట్టుగా నటిస్తారు.ట్రంప్ అధ్యక్షుడైతే పాశ్చాత్య దేశాల నుంచి భారత్పై వస్తున్న ఒత్తిడి తగ్గుతుందని అనుకునేందుకు బాగానే ఉంటుంది కానీ... అది స్వల్పకాలికం మాత్రమే. వాతావరణ మార్పులనేవి ప్రపంచం మొత్తం సమస్య. ఈ సమస్య ముదిరిపోవడంలో అమెరికా పాత్ర పెద్దది. పరిష్కారం కూడా అమెరికా ప్రమేయంతో మాత్రమే సాధ్యమవుతుంది. ట్రంప్ తన పాత వైఖరినే కొనసాగిస్తే ఈ విషయంలో చైనా ఆధిపత్యం పెరుగుతుంది. వాతావరణ పరిరక్షణకు సంబంధించి టెక్నాలజీల అభివృద్ధిలోనూ ముందుకు దూసుకెళుతుంది. ఫలితంగా ఇప్పటివరకూ వాతావరణ మార్పుల అంశంపై పని చేస్తున్న ప్రపంచ బ్యాంకు వంటి ఆర్థిక సంస్థలు నిర్వీర్యమవుతాయి. అమెరికాకు చెందిన ప్రైవేట్ కంపెనీలు వాతావరణ మార్పులకు సంబంధించి పెట్టుబడులు పెట్టడం నిలిచిపోతుంది. దీనివల్ల వాతావరణ మార్పు లను ఎదుర్కొనేందుకు ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్న దేశాలు నష్టపోవాల్సి వస్తుంది. వ్యవస్థలు దెబ్బతింటాయి!రెండో విషయానికి వద్దాం. అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థలో బోలెడన్ని లోటుపాట్లు ఉన్నాయి. న్యాయవ్యవస్ధను ఉదాహరణగా తీసుకుంటే అక్కడ న్యాయమూర్తులు శాశ్వత ప్రాతిపదికన నియ మితులవుతారు. ఫలితంగా వారికి బాధ్యత శూన్యం. పైగా న్యాయ మూర్తుల నియామకాలు అధికార వర్గం ద్వారా జరుగుతాయి. ఫలి తంగా వీరు పక్షపాతంగా ఉండేందుకూ, తాము నమ్మే భావజాలానికి అనుగుణంగా నడుచుకునేందుకూ అవకాశాలు ఎక్కువ. ఫలితంగా ప్రజాస్వామ్యంలో అతి కీలకమైన ఒక అంగం విపరీతమైన అధికా రాలు కలిగి ఉండటమే కాకుండా... సైద్ధాంతిక అంశాలపై విభజితమై ఉంటుంది.అంతెందుకు అమెరికా ఎన్నికల వ్యవస్థనే తీసుకుంటే... అధ్యక్ష తరహా ఎన్నికల వ్యవస్థ ఉంది. మెజారిటీ ప్రజల అభిప్రాయం, ఫలితాలతో నిమిత్తం లేదు. ఫలితంగా అవినీతిపరుడైన నేత... విరాళాలిచ్చే వారు కుమ్మక్కయ్యే అవకాశం ఉంటుంది. 2020 నాటి ఎన్నికలు ఎంతో మెరుగ్గానే జరిగాయని అనుకున్నా ఆ తరువాత అమెరికాలో సగం మంది ఎన్నికల ప్రక్రియను, అధికార మార్పిడి జరిగిన తీరును తప్పుపట్టడం గమనార్హం. ఈ సమస్యలకు అమెరికా రాజ్యాంగ నిర్మాణం ఒక కారణమని చెప్పాలి. వ్యవస్థలు అధికారంలో ఎవరున్నారు అన్న అంశం ఆధారంగా ఒడుదొడుకులకు లోను కాకూడదు. ట్రంప్ అమెరికా సుప్రీంకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల నియామకాలకు ప్రతిపాదించడం ఇప్పటికే మానవ, మహిళ హక్కుల విషయంలో ప్రతికూల పరిస్థి తులు తెచ్చి పెట్టాయి. అబార్షన్ విషయంలో అధ్యక్షుడికి తిరుగులేని అధికారాలు దక్కిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ గద్దెనెక్కితే మరింత మంది న్యాయమూర్తులను ఆయన సుప్రీంకోర్టులో నియమించవచ్చు. ఎన్నికల ఫలితాలను సవాలు చేయడం మాత్రమే కాకుండా... నేరం రుజువైనా అధికారంలో కొనసాగేందుకు ప్రయత్నించడం వంటివి ఎక్కువ అవుతాయి. జాతి వివక్ష పెరగడం, క్రిస్టియన్ జాతీయతా భావజాలం పెరగడం ప్రజాస్వామ్యానికి మంచి చేసే అంశాలు కాదు. ట్రంప్ గెలుపుతోపాటు సెనేట్లో కూడా రిపబ్లిక న్లకు ఆధిక్యం దక్కితే గోరుచుట్టుపై రోకటిపోటు చందం కాక తప్పదు.భారత్ ఆలోచించాలి!భారతదేశ అధికార వర్గాలు ట్రంప్ మరోసారి గెలిస్తే ఏమిటన్న అంశంపై ఆలోచన మొదలుపెట్టాల్సిన అవసరం ఉంది. ట్రంప్ రాకతో ప్రజాస్వామ్యంలో మన లోటుపాట్లు పక్కకు వెళ్లిపోతాయిలే అనుకుంటే అది తప్పే అవుతుంది. వాస్తవానికి సమస్య మరింత పెరుగుతుంది. అమెరికా వ్యవస్థలు, సంస్థల పనితీరుపై చర్చ ఎంత పెరిగితే ఆ దేశ రాజకీయం అంత అస్థిరమవుతుంది. సమాజం కూడా రకరకాల అంశాలపై ముక్కలు అవుతుంది. ఈ పరిణామాలన్నీ చివ రకు అంతర్గత కుమ్ములాటలకూ, సంఘర్షణలకూ తావిస్తాయి.అంతర్జాతీయ, దేశీ రాజకీయాలపై అమెరికాను ఎంత కఠినంగానైనా విమ ర్శించవచ్చు కానీ... ఆ దేశం అంతర్గతంగా బలహీనపడితే లాభ పడేది చైనా మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలి. అంతేకాదు... అమె రికాకు వలస వెళ్లిన, ఉద్యోగాలు చేసుకుంటున్న భారతీయులకూ, ఇతర దేశస్థులకూ అంత మంచిది కాదు. ట్రంప్ తిరిగి అధ్యక్షుడు కావడం ప్రపంచ రాజకీయాలు, వాతావరణ మార్పుల సమస్యలకు నిర్ణయా త్మకం కానుందన్నది నిస్సందేహం!ప్రశాంత్ ఝా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
మళ్లీ తడబడ్డ బైడెన్
మిల్వాయుకీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తడబాట్ల పరంపర అంతులేకుండా కొనసాగుతూనే ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై దాడి తర్వాత ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన మళ్లీ తప్పులు మాట్లాడారు. విభేదాలను బ్యాలెట్ బాక్సుల్లో పరిష్కరించుకుంటాం అనబోయి ‘బ్యాటిల్ (యుద్ధ) బాక్సుల్లో’ పరిష్కరించుకుంటామని అన్నారు. దాంతో ఆయన సొంత పార్టీ అయిన డెమొక్రాట్ నేతలు మరోసారి తలపట్టుకున్నారు. ట్రంప్పై దాడి నేపథ్యంలో ఇది రాజకీయంగా ఉద్రిక్తతలను తగ్గించుకోవాల్సిన సమయమని బైడెన్ అభిప్రాయపడ్డారు. ‘‘రాజకీయాలంటే యుద్ధ క్షేత్రం కాదు. పారీ్టలుగా నేతల మధ్య విభేదాలు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ మనం శత్రువులం కాదని, కలిసి పనిచేసే వారిమని, తోటి పౌరులమేనని గుర్తుంచుకోవాలి. చర్చలైనా, మరోటైనా శాంతియుతమైన జరగాలి. మన దేశంలో హింసకు తావు లేదు. జాతిగా మనమంతా ఒక్కటి కావాల్సిన సమయమిది’’ అంటూ పిలుపునిచ్చారు. -
NATO Summit: బైడెన్.. మళ్లీ తడబడెన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పట్టువీడటం లేదు. అధ్యక్ష బరి నుంచి తప్పుకోవాలంటూ ఇంటా బయటా డిమాండ్లు నానాటికీ పెరిగిపోతున్నా ఆ ప్రసక్తే లేదని మరోసారి కుండబద్ధ్దలు కొట్టారు. 81 ఏళ్ల వయసులోనూ రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ఓడించి మరోసారి అధ్యక్షునిగా పని చేసే సామర్థ్యం తనలో పుష్కలంగా ఉందని చెప్పుకొచ్చారు. నాటో శిఖరాగ్రం ముగింపు సందర్భంగా గురువారం బైడెన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తన వయసు, ఫిట్నెస్పై పెరిగిపోతున్న సందేహాల్లో పస లేదని నిరూపించేందుకు శాయశక్తులా ప్రయతి్నంచారు. అయితే గంటకు పైగా జరిగిన ఈ భేటీలోనూ ఆయన తడబాట్ల పర్వం కొనసాగడం డెమొక్రాట్ల శిబిరంలో ఆందోళనలను మరింత పెంచింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అనబోయి ట్రంప్ అంటూ బైడెన్ తికమకపడ్డారు! అధ్యక్ష రేసు నుంచి మీరు తప్పుకుంటే ట్రంప్ను ఓడించే సత్తా హారిస్కు ఉందా అని విలేకరులు ప్రశ్నించగా, ‘‘అధ్యక్షునిగా పని చేయగల అర్హత, సత్తా ట్రంప్కు ఉన్నాయి. కనుకనే ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నా’’ అన్నారు. దాంతో అంతా అవాక్కయ్యారు. అయినా బైడెన్ తన వ్యాఖ్యలను సరిచేసుకోలేదు. అంతకుముందు నాటో వేదికపై కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని సభ్య దేశాల ప్రతినిధులకు ‘అధ్యక్షుడు పుతిన్’ అంటూ పరిచయం చేశారు!! జెలెన్స్కీ దీన్ని తేలిగ్గా తీసుకుంటూ నవ్వేసినా ప్రతినిధులంతా తెల్లబోయారు. ఈ నేపథ్యంలో బైడెన్ మానసిక ఆరోగ్యంపై నెలకొన్న సందేహాలు మరింత పెరిగాయి. అయితే వైద్యులు సూచిస్తే మానసిక పరీక్షలకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ‘‘అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఇప్పటిదాకా మూడుసార్లు న్యూరో పరీక్షలు చేయించుకున్నా. తాజా పరీక్ష గత ఫ్రిబ్రవరిలో జరిగింది. నేను మానసికంగా ఫిట్గా ఉన్నాననేందుకు అధ్యక్షునిగా నేను తీసుకుంటున్న రోజువారీ నిర్ణయాలే రుజువు. కానీ నేనెంత చేసినా ఎవరూ సంతృప్తి చెందడం లేదు’’ అంటూ వాపోయారు! అయితే తన అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల్లో భయాలను దూరం చేయాల్సిన అవసరముందని అంగీకరించారు. బ్రహా్మండంగా పని చేశా అధ్యక్ష ఎన్నికల్లో తలపడేందుకు అత్యంత అర్హున్ని తానేనని బైడెన్ చెప్పుకున్నారు. ‘‘ట్రంప్ను ఓసారి ఓడించా. మళ్లీ ఓడించి తీరతా. అప్పుడే ఏమీ అయిపోలేదు. ప్రచారంలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది’’ అన్నారు. నాలుగేళ్లలో అమెరికాను అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేశానంటూ గణాంకాలు ఏకరువు పెట్టారు. ఆర్థిక రంగంలో తన పనితీరు చాలా బాగుందని ఏకంగా 16 మంది నోబెల్ గ్రహీతలైన ఆర్థికవేత్తలు కితాబిచ్చారని చెప్పుకున్నారు. రాత్రి 8 గంటల తర్వాత ప్రచారంతో పాటు ఎలాంటి కార్యక్రమాలూ పెట్టుకునేది లేదని తానన్నట్టు వచి్చన వార్తలను బైడెన్ ఖండించారు. విదేశీ వ్యవహారాలు తదితరాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. గాజా ఆక్రమణ కూడదంటూ ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూను, ఉక్రెయిన్పై యుద్ధంలో మద్దతివ్వొద్దంటూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను హెచ్చరించానని చెప్పుకొచ్చారు. రష్యాతో సాన్నిహిత్యానికి చైనా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. లాడెన్ను చంపగానే అఫ్గాన్ నుంచి అమెరికా పూర్తిగా వైదొలగాల్సిందన్నారు.ట్రంప్ విసుర్లు బైడెన్ తనను ఉపాధ్యక్షునిగా పేర్కొనడంపై ట్రంప్ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ‘బిగ్ బోయ్ జో మీడియా భేటీ మొదట్లోనే నన్ను తన ఉపాధ్యక్షునిగా చెప్పుకు న్నారు’’ అని ఎద్దేవా చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు.పెరుగుతున్న వ్యతిరేకత తనకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న సొంత పార్టీ నేతలు, ఎంపీల విశ్వాసాన్ని చూరగొనడమే లక్ష్యంగా తాజా మీడియా సమావేశంలో బైడెన్ సర్వశక్తులూ ఒడ్డారు. కానీ ఆ ప్రయత్నంలో ఆయన విఫలమయ్యారని పరిశీలకులు అంటున్నారు. బైడెన్ తప్పుకోవాలని సమావేశం ముగియగానే ముగ్గురు ప్రముఖ డెమొక్రాట్ ఎంపీలు జిమ్ హైమ్స్, స్కాట్ పీటర్స్, ఎరిక్ సొరెన్సన్ పిలుపునిచ్చారు! దాంతో ఆయన వైదొలగాలని డిమాండ్ చేస్తున్న సొంత పార్టీ ఎంపీల సంఖ్య 17కు పెరిగింది. నిజానికి గత నెల సీఎన్ఎన్ చానల్లో జరిగిన తొలి అధ్యక్ష డిబేట్లో ట్రంప్ ముందు బైడెన్ పూర్తిగా తేలిపోవడం తెలిసిందే. దానితో పోలిస్తే తాజా మీడియా భేటీలో ఆయన మెరుగ్గానే మాట్లాడారు. తాను తీరిక లేని షెడ్యూల్తో బిజీగా గడుపుతుంటే ట్రంప్ మాత్రం గోల్ఫ్ ఆడుతూ సేదదీరుతున్నారంటూ దుయ్యబట్టారు. ‘‘ట్రంప్ నాలుగేళ్ల పాలనలో అస్తవ్యస్తం చేసిననాటో కూటమిని ఎంతగానో శ్రమించి ఒక్కతాటిపైకి తెచ్చా. నాటో శిఖరాగ్రంలో పాల్గొన్న దేశాధినేతలెవరూ నా ఫిట్నెస్ను, మానసిక ఆరోగ్యాన్ని సందేహించలేదు. పైపెచ్చు ట్రంప్ మళ్లీ రావొద్దని, నేనే గెలవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు’’ అని అన్నారు.ఒబామా, పెలోసీ కూడా... బైడెన్ తప్పుకోవాలంటున్న డెమొక్రాటిక్ పార్టీ నేతల జాబితాలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా చేరుతున్న సూచనలు కని్పస్తున్నాయి. ట్రంప్ను ఓడించడం బైడెన్కు తలకు మించిన పనేనని వారిద్దరూ తాజాగా ప్రైవేటు సంభాషణలో అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. నాటో శిఖరాగ్రం అనంతరం బైడెన్ మీడియా సమావేశం చూసి వారు మరింతగా పెదవి విరిచినట్టు డెమొక్రటిక్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘బైడెన్ అధ్యక్ష అభ్యరి్థత్వం దాదాపుగా ముగిసిన కథే. ఆయనకు మనస్తాపం కలగకుండా, పార్టీ అవకాశాలు దెబ్బ తినకుండా దీన్ని ప్రకటించడం ఎలాగన్నది మాత్రమే తేలాల్సిలి ఉంది. బహుశా బైడెన్ తనంత తానుగా తప్పుకుంటారని ఒబామా, పెలోసీ భావిస్తున్నారు. లేదంటే ఆయనకు నచ్చజెప్పి తప్పించే బాధ్యత తీసుకోగలిగింది వారిద్దరే’’ అని పేర్కొంటున్నాయి. ఈ విషయమై ఉన్నత స్థాయి డెమొక్రాట్ నేతలు గురువారం ఉదయం పెలోసీతో సమావేశమైనట్టు అమెరికా మీడియా పేర్కొంది. ‘‘ఇక ట్రంప్ను ఓడించడం బైడెన్కు శక్తికి మించిన పనేనన్న అభిప్రాయంతో పెలోసీ కూడా ఏకీభవించారు. అయితే నాటో శిఖరాగ్రం జరుగుతున్న నేపథ్యంలో దేశాధినేతల ముందు బైడెన్ను ఇబ్బంది పెట్టడం సరికాదని, కనీసం ఒక రోజన్నా ఆగాలని సూచించారు. దాంతో బైడెన్ను తప్పించేందుకు ఆమె కూడా సుముఖంగానే ఉన్నట్టు తేలిపోయింది. అందుకే భేటీ తర్వాత పలువురు డెమొక్రాట్ ఎంపీలు బైడెన్ తప్పుకోవాలని బాహాటంగా డిమాండ్ చేశారు’’ అంటూ యూఎస్ మీడియాలో జోరుగా కథనాలు వెలువడుతున్నాయి. -
బైడెన్ తప్పుకోవడమే మంచిది: హాలీవుడ్ హీరో
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్పై రోజురోజుకీ వ్యతిరేకత ఎక్కువవుతోంది. ప్రత్యర్థులతోపాటు సొంత పార్టీ నుంచి సైతం బైడెన్ అభ్యర్ధిత్వంపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల బైడెన్ సొంత పార్టీకి చెందిన మహిళా సెనేటర్ నాన్సీ పెలోసి బైడెన్.. ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని అన్నారు.తాజాగా డెమోక్రాటిక్ పార్టీకి పెద్ద ఎత్తున ఫండ్స్ అందుస్తున్న ప్రముఖ నటుడు, దర్శకుడు జార్జ్ క్లూనీ సైతం అద్యక్షుడు జో బైడెన్పై పోటీపై పెదవి విరిచారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి బైడెన్ తప్పుకోవాలని కోరారు. ఆయనతో ఎన్నికలకు వెళ్తే గెలవడం కష్టమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే జరిగితే డెమోక్రాటిక్ పార్టీ అటు ప్రతినిధుల సభతో పాటు సెనేట్లోనూ మెజారిటీ కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ మేరకు బైడెన్ ఎన్నికల ప్రచారాన్ని ముగించాలని కోరుతూ ప్రముఖ వార్తా ప్రతిక న్యూయార్క్ టైమ్స్లో భావోద్వేగమైన లేఖ చేశారు.బైడెన్తో సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధం కలిగి ఉన్న జార్జ్.. డెమొక్రాటిక్ పార్టీకి మద్దతునిచ్చే హాలీవుడ్ ఎలైట్ సభ్యులలో ఒకరు. పార్టీ కోసం ఎన్నోసార్లు నిధులు కూడా సేకరించారు. క్లూనీ తను రాసిన లేఖలో.. బైడెన్ తనకు మంచి మిత్రుడని, అతన్ని ఎంతో నమ్ముతానని చెప్పారు. గతంలో తన కోసం ఎంతో పనిచేశానని గుర్తు చేశారు.అయితే అప్పటి బైడెన్ కు.. ఇప్పుడున్న బైడెన్ కు చాలా తేడా ఉందని రాశారు. అతను సమయానికి వ్యతిరేకంగా గెలవలేని ఒక యుద్ధంతో పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. "నాకు చెప్పేందుకు మాటలు రావడం లేదు. కానీ మూడు వారాల క్రితం ఫండ్ రైజర్లో నేను కలిసిన జో బైడెన్.. ఒకప్పటి ఓ బైడెన్ వేరు. అతనిలో చాలా మార్పులు వచ్చాయి. 2010, 2020 చూసిన బైడెన్ కూడా కాదు. ఆయనలో ఎలాంటి ఉత్సాహం లేదు. బైడెన్ అంటే ఇటీవల డిబెట్లో చూసిన వ్యక్తినే మనం చూశాం.. ట్రంప్ తో జరిగిన చర్చలో తన ప్రదర్శన పేలవంగా ఉంది.డెమొక్రాటిక్ చట్టసభ సభ్యులు బిడెన్ను ఉపసంహరించుకోవాలని బహిరంగంగా పిలుపునివ్వంతో పరిస్థితి మరింత దిగజారింది. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు. ప్రతీ చట్ట సభ్యుడు, గవర్నర్ ఇదే భావిస్తున్నారు. వారందరితో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. ఇక బైడెన్ తనంటే తానే తప్పుకోవడం మంచిది." అని భావోద్వేగంగా లేఖలో రాశారుఅయితే ఎన్నికలకు నాలుగు నెలలముందు బైడెన్ తప్పుకుంటే డెమొక్రాట్ పార్టీలో నాయకత్వ సంక్షోభం ఏర్పడుతుందనే వాదనను క్లూనీ కొట్టి పారేశారు. బైడెన్ స్థానంలో కొత్త అభ్యర్థి ఎవరనే అంశాన్ని ఆగస్టులో జరిగే డెమొక్రాట్ మీటింగ్ లో వైస్ ప్రెసిడెంట్ కమాలా హ్యారిస్, మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్, ఇతర నాయకులంతా కలిసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.మరోవైపు జో బైడెన్.. తాను అధ్యక్ష ఎన్నికల్లో తప్పకుండా పోటీచేస్తానని.. తప్పుకునే ప్రసక్తే లేదని చెప్పారు. ఇక బైడెన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే వాళ్లలో చక్ షుమర్, హకీమ్ జెఫ్రీస్, నాన్సీ పెలోసి లాంటి అగ్రనాయకులతో పాటు.. డెమొక్రాట్ పార్టీకి చెందిన కొందరు సేనేటర్లు కూడా ఉన్నారు. అందుకే వారంతా బైడెన్ ని తప్పకోవాలని బహిరంగంగా చెబుతున్నారు. -
ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలు అందజేస్తాం
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో రష్యాకు పరాభవం తప్పదని తేలి్చచెప్పారు. ఉక్రెయిన్కు అండగా నిలుస్తామని, గగనతలంలో శత్రువును మట్టికరిపించే ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలు అందజేస్తామని ప్రకటించారు. తాజాగా ‘నాటో’ 75వ సదస్సులో బైడెన్ ప్రసంగించారు. అమెరికాతోపాటు జర్మనీ, నెదర్లాండ్స్, రొమేనియా, ఇటలీ దేశాలు ఉక్రెయిన్కు అదనంగా ఐదు వ్యూహాత్మక ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలను అందజేయబోతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో పదుల సంఖ్యలో టాక్టికల్ ఎయిర్–డిఫెన్స్ వ్యవస్థలను ఉక్రెయిన్కు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. తాము అందజేసే క్రిటికల్ ఎయిర్–డిఫెన్స్ ఇంటర్సెప్టర్లతో రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ పైచేయి సాధిస్తుందని స్పష్టం చేశారు. రష్యా క్షిపణుల దాడులు, వైమానిక దాడుల నుంచి ఉక్రెయిన్ నగరాలతోపాటు ఉక్రెయిన్ సైన్యాన్ని కాపాడే ఇంటర్సెప్టర్లను వందల సంఖ్యలో అందిస్తామని పేర్కొన్నారు. యుద్ధంలో 3.50 లక్షల మందికిపైగా రష్యా సైనికులు మరణించడమో, గాయపడడమో జరిగిందని చెప్పారు. ఉక్రెయిన్ స్వేచ్ఛాయుతమైన, స్వతంత్రదేశంగా కొనసాగుతుందని ఉద్ఘాటించారు. ఎన్నికల దాకా ఎదురు చూడాలా?: జెలెన్స్కీ ఈ ఏడాది నవంబర్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే ముందే రష్యా అధినేత పుతిన్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. నాటో సదస్సులో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల దాకా ప్రపంచం ఎదురు చూడొద్దని చెప్పారు. ఉక్రెయిన్కు ఎఫ్–16 ఫైటర్ జెట్లు ఇస్తాం: నార్వే ఉక్రెయిన్కు ఆరు ఎఫ్16 ఫైటర్ జెట్లు అందజేస్తామని నాటో సభ్యదేశమైన నార్వే ప్రధాని జోనాస్ ప్రకటించారు. అయితే, ఎప్పటి నుంచి ఈ యుద్ధ విమానాలు ఉక్రెయిన్కు అందజేస్తారన్నది ఆయన వెల్లడించలేదు. -
దేవుడు తప్ప నన్నెవరూ... తప్పించలేరు: బైడెన్
వాషింగ్టన్: తన ఆరోగ్యంపై వ్యక్తమవుతున్న ఆందోళనలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (81) కొట్టిపారేశారు. అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని దేవుడు తప్ప తననెవరూ ఒప్పించలేరని ఏబీసీ ఛానల్ ఇంటర్వ్యూలో అన్నారు. గత వారం రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో చర్చలో బైడెన్ పదేపదే తడబటడం, ఆగి ఆగి మాట్లాడటంతో ఆయన మానసిక సంతులతపై డెమొక్రాట్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. బైడెన్ వైదొలగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సర్వేల్లోనూ ఆయనకు ప్రజాదరణ పడిపోయింది. విరాళాలు ఇచ్చే దాతలు కూడా బైడెన్ తప్పుకుంటేనే తమ ఆర్థిక సహకారం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఒత్తిళ్లు పెరుగుతున్నా బైడెన్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు. ప్రపంచాన్ని నడుపుతున్నానని, అధ్యక్షుడిగా ఉండటానికి తనకంటే మరెవరికీ యోగ్యత లేదన్నారు. మెదడు పనితీరుపై పరీక్ష చేయించుకొని ఫలితాలను ప్రజల ముందు పెడతారా అని ప్రశ్నించగా తాను రోజూ పరీక్ష ఎదుర్కొంటున్నానని బదులిచ్చారు.మూడున్నరేళ్ల పాలనలో తాను ఎన్నో విజయాలు సాధించాననీ, అవి ట్రంప్తో గంటన్నర పాటు జరిపిన చర్చ వల్ల వమ్ము కావన్నారు. కొవిడ్ నుంచి అమెరికాను గట్టెక్కించి ప్రపంచంలోనే అత్యంత బలీయ ఆర్థిక వ్యవస్థగా నిలిపానని బైడెన్ తెలిపారు. తన ముదిమి వయసు గురించి చాలా చర్చ జరుగుతోందనీ, కోటిన్నర కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి తన వయసు అడ్డురాలేదని పేర్కొన్నారు. -
బిగ్ డిబేట్లో బైడెన్ బేజారు!.. ‘నేనేం కుర్రాడిని కాదుగా’
వాషింగ్టన్: వాడీవేడిగా సాగిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(81), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(78)ల చర్చ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. నువ్వు అబద్ధాలకోరువంటే.. నువ్వే అబద్ధాలకోరువంటూ మాటల దాడి చేసుకున్నారు ఈ ఇద్దరూ. అయితే డిబేట్లో ట్రంప్ పైచేయి సాధించారంటూ బైడెన్ డెమొక్రటిక్ సహచరులు సైతం అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.ట్రంప్తో సాగిన డిబేట్లో తన ప్రదర్శపై అధ్యక్షుడు బైడెన్ శుక్రవారం స్పందించారు. ‘‘స్పష్టంగా చెప్పాలంటే.. నేను కుర్రాడిని కాదనే విషయం నాకు తెలుసు. అలాగని నడకలోనూ, మాటల్లోనూ, చర్చల్లోనూ అంత తేలికగా వ్యవహరించను. నేను ఈ బాధ్యతను(అధ్యక్ష పదవి) మళ్లీ సమర్థవంతంగా నిర్వహించగలనని మనసారా, ఆత్మ సాక్షిగా నమ్మాను. కాబట్టే మళ్లీ బరిలో నిలుచున్నా. ఏది ఏమైనా.. అధ్యక్ష రేసు నుంచి తప్పుకునేది లేదు. రిపబ్లికన్ ప్రత్యర్థి ట్రంప్ను ఓడించి తీరతా’’ అని బైడెన్ అన్నారు.దేశాధ్యక్ష పీఠం కోసం డెమొక్రటిక్ పార్టీ నుంచి బైడెన్, రిపబ్లికన్ల తరఫున ట్రంప్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి(భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం) జరిగిన డిబేట్లో పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి వీరిద్దరి మధ్య ఇదే తొలి ముఖాముఖి చర్చ. దేశ ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు, విదేశాంగ విధానం, గర్భవిచ్ఛిత్తి తదితర అంశాలపై ఒకరికొకరు ప్రశ్నలు సంధించుకొని.. దాదాపు 90 నిమిషాలపాటు ఆరోపణలు గుప్పించుకున్నారు. -
గెలుపెవరిది..? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ వర్సెస్ ట్రంప్
జో బైడెన్. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు. డోనాల్డ్ ట్రంప్. అమెరికా మాజీ అధ్యక్షుడు. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి అధ్యక్ష పదవి కోసం తలపబడుతున్నారు. వైట్ హౌస్ రేసులో ఢీ అంటే ఢీ అంటున్నారు. జో బైడెన్ వృద్ధాప్యంతో ఇబ్బంది పడుతున్నారు. స్ట్రాంగ్ లీడర్ అన్న భావన కలిగించలేకపోతున్నారు. ఇక నాలుగేళ్లు ట్రంప్ పాలన ఎలా సాగిందో ప్రపంచమంతా చూసింది. డెమోక్రాట్స్ బైడెన్కి, రిపబ్లికన్స్ ట్రంప్కి జై కొట్టేశారు. ఇంత వరకు బానే ఉంది. కానీ...గత అధ్యక్షులతో పోల్చితే...సమర్థ నాయకత్వం అందించే భరోసాని వీరిద్దరూ అమెరికాకి ఇవ్వగలరా అన్న ప్రశ్న మాత్రం సజీవంగానే ఉంది.అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే...కేవలం ఆ దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా అందరి అటెన్షన్ అటే ఉంటుంది. ఇప్పుడు కూడా అక్కడి ఎన్నికల కేంద్రంగా జరగుతోంది అదే. కాకపోతే ఆ అటెన్షన్ కేవలం ఎన్నికల సమరం మీద మాత్రమే కాదు. బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల నాయకత్వ లక్షణాల కేంద్రంగా, ఇద్దరు అభ్యర్థులను చుట్టుముట్టిన వివాదాల కేంద్రంగా..వరల్డ్ వైడ్గా చర్చ సాగుతోంది.నిజానికి జో బైడెన్, డోనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలకి కొత్త కాదు. ప్రపంచ ప్రజలకు కొత్త కాదు. ఇద్దరి పాలనని అమెరికన్స్తో పాటు ప్రపంచ ప్రజలంతా చూశారు.అదే సమయంలో ఇద్దరు ఎదుర్కొంటోన్న అనేక సమస్యలను కూడా వరల్డ్ అంతా చూస్తోంది. వృద్ధాప్యం వల్ల వచ్చే అనేక ఆరోగ్య సమస్యలు...జో బైడెన్ నాయకత్వాన్ని సవాల్ చేస్తోంది. అలానే కుమారుడి మీద కేసులు కూడా ఆయన్ను ఇరుకున పెడుతున్నాయి. ఇక ట్రంప్ సంగతి సరే. ఇద్దరు అభ్యర్థులు వివాదాల కేంద్రంగానే తమ ఉనికిని చాటుకుంటున్నారు.అమెరికా రాజకీయాల్లో వృద్ధులు పదవులు చేపట్టడంపై చాలా కాలం నుంచి చర్చ సాగుతోంది. అమెరికా పౌరుల పదవీ విరమణ వయస్సు 67 ఏళ్లు. కానీ రాజకీయాల్లో రిటైర్మెంట్ వయసంటూ లేదు. బైడెన్ వయస్సు 81. ట్రంప్ వయస్సు 78. ఆ వయస్సు అమెరికాకి నాయకత్వం వహించే స్థాయిలో శారీరిక, మానసిక ఆరోగ్యం సహకరిస్తుందా అన్న చర్చ ఒకవైపు సాగుతోంది. మరోవైపు బైడన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సార్లు ఆయన వయస్సు కేంద్రంగా చర్చ సాగుతూ వచ్చింది. తాజాగా జీ-7 దేశాల సదస్సులో బైడెన్ వింతగా ప్రవర్తించడంతో...మరోసారి ఈ చర్చ తెరపైకి వచ్చింది.అది.. ఇటలీ తీరప్రాంత నగరం అపూలియా. జీ7 సదస్సు ఆరంభం కావడానికి ముందు అపూలియా తీర ప్రాంతాన్ని ఆయా దేశాల నేతలు సందర్శించారు. అక్కడ ఉన్న వాటర్ స్పోర్ట్స్ను వీక్షించారు. పారా గైడ్లింగ్ చేస్తున్న వారిని పలకరించారు. కానీ.. అదే సమయంలో జో బైడెన్ మాత్రం వింతగా ప్రవర్తించారు. తీర ప్రాంతం వద్ద రిషి సునాక్, జస్టిన్ ట్రూడో, మెలోనీ, ఉర్సులా వాన్ డెర్.. ఒకవైపు ఉండి వాటర్ స్పోర్ట్స్ను తిలకిస్తుండగా.. జో బైడెన్ మాత్రం వారికి దూరంగా వెళ్లి దిక్కులు చూస్తూ నిలబడిపోయారు. అక్కడ ఎవరూ లేకపోయినా ఎవరితోనో ఆయన మాట్లాడుతున్నట్టు సైగలు చేశారు. కుడి చెయ్యి పైకి ఎత్తి పలకరించడం కనిపించింది. ఈ సమయంలో బైడెన్ను గమనించిన మెలోని ఆయన దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకువచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అయితే.. బైడెన్ ఇలా వింతగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు పలు సందర్భాల్లో కూడా ఆయన ఇలాగే చేశారు. అమెరికాకు సంబంధించి చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై సంతకం చేసే కార్యక్రమంలో సెనేట్ మెజార్టీ లీడన్ చక్ షూమర్ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. పొడియం వద్దకు వచ్చిరాగానే ముందుగా బైడెన్కు షేక్హ్యాండ్ ఇచ్చి, ఆ తర్వాత అక్కడే ఉన్న మిగితా వారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అప్పటికి తను షేక్హ్యాండ్ ఇచ్చిన విషయం మర్చిపోయిన బైడెన్.. మరోసారి షేక్ హ్యాండ్ కోసం చేతిని ముందుకు తీసుకెళ్లారు. కాసేపు అలాగే షేక్ హ్యాండ్ పొజిషన్లో ఉంచి షాక్తో మళ్లి చేతిని కిందకు దించాడు బైడెన్.కొన్నాళ్ల క్రితం వైట్హౌస్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో అధ్యక్షుడి ప్రవర్తన ఇలాగే ఉంది. ఆయన చుట్టూ ఉన్నవారంతా అక్కడ వినిపిస్తున్న సంగీతానికి తగ్గట్టుగా కాలుకదుపుతుంటే.. బైడెన్ మాత్రం కొంతసేపు అలాగే నిల్చుండి పోయారు. ఏం జరుగుతుందో అర్ధం కానట్లు చూస్తుండిపోయారు. కొన్ని సెకన్లపాటు అలాగే ఉండిపోయిన బైడెన్ ఆ తర్వాత తేరుకున్నారు.ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలోనూ బైడెన్ దొరికిపోయారు. మీడియాతో మాట్లాడే క్రమంలో రష్యా దేశం, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పేరు సైతం మర్చిపోయారు. తనతోపాటు పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షురాలను ప్రథమ మహిళ అని సంబోధించి చాలా గందరగోళానికి గురయ్యారు. ఇప్పుడు బైడెన్ తీరు అధికార డెమొక్రాటిక్ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే బైడెన్ ప్రవర్తనని...రిపబ్లికన్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తోంది. ఇకపై ప్రచారంలో దీన్ని ఒక కీలక అస్త్రంగా మార్చుకోవచ్చు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ని...గన్ కొనుకోలు కేసులో మొత్తం మూడు ఆరోపణల్లోనూ కోర్టు దోషిగా తేల్చింది. అటు ట్రంప్ మీద ఉన్న ఆరోపణల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరోపణలు మాత్రమే కాదు. హష్ మనీ కేసులో ఆయన దోషిగా తేలారు. త్వరలోనే శిక్ష ఏంటన్నది న్యాయస్థానం ప్రకటించనుంది. ట్రంప్ వయస్సు కూడా 78 ఏళ్లు కావడంతో...వృద్ధాప్యం కోణంలో ఆయన నాయకత్వం మీదా చర్చ జరుగుతోంది. ఇలా అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఇద్దరూ సమర్థ నాయకత్వం అందించగలరా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ పాయింట్గా మారింది.క్రిమినల్ కేసులో దోషిగా తేలిన కుమారుడిని కలిగి ఉన్న తొలి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. క్రిమినల్ కేసులో దోషిగా తేలిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. వైట్ హౌస్లో అడుగుపెట్టిన నాటి నుంచి... తన ప్రవర్తనతో చర్చనీయాంశంగా మారిన అధ్యక్షుడు బైడెన్. అమెరికాలో చరిత్రలోనే అత్యంత వివాదాస్పద అధ్యక్షుడుగా ట్రంప్కి అద్భుతమైన రికార్డు ఉండనే ఉంది. ఇప్పుడు ఇద్దరి వయస్సు కేంద్రంగా కూడా వాడి వేడి చర్చ సాగుతోంది. ఇలా అనేక కోణాల్లో బైడెన్, ట్రంప్ మధ్య నెగిటివ్ వైబ్రేషన్స్ బలంగా హల్చల్ చేస్తున్నాయి. అదే సమయంలో ఇద్దరి మధ్య వాడి వేడి సమరం తప్పదని ఎన్నికల సాగుతోన్న తీరు చెప్పకనే చెబుతోంది. అమెరికా అధ్యక్ష రేసులో బైడెన్ కన్నా ట్రంప్ ముందున్నారు. ట్రంప్ ట్రాక్ రికార్డ్ అంతా వివాదాలు, ఆరోపణల మయమే. అయినా సరే...ప్రచారంలో ట్రంప్ దూకుడుని బైడెన్ అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్కి మరో సమస్య వచ్చి పడింది. ఆయన కుమారుడు హంటర్ బైడెన్...క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో...బైడెన్ కేంద్రంగా నెగిటివిటీ పెరుగుతోంది. తుపాకీ కొనుగోలు సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ దోషిగా తేలారు. ఆయనపై మోపిన 3 అభియోగాల్లోనూ నేర నిర్ధారణ జరిగింది. డెలావెర్లోని విల్మింగ్టన్ కోర్టు జడ్జి మేరీఎల్లెన్ నోరీకా... హంటర్ నేరాన్ని నిర్ధారించారు. అయితే శిక్షా కాలాన్ని వెల్లడించలేదు. కానీ ఈ తరహా కేసుల్లో 25 ఏళ్ల వరకూ శిక్ష పడుతుంది. అదే సమయంలో తొలిసారి నేరానికి పాల్పడినందు వల్ల అంత శిక్ష పడక పోవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. నేరాన్ని నిర్ధారించిన జడ్జి.. ఎంత కాలం శిక్ష వేయనున్నారనేది వెల్లడించలేదు. ఎప్పటి నుంచి శిక్షను అమలు చేసేదీ చెప్పలేదు. 2018లో తుపాకీ కొనుగోలు సందర్భంగా ఆయుధ డీలరుకు ఇచ్చిన దరఖాస్తు ఫారంలో హంటర్ తప్పుడు సమాచారం ఇచ్చారు. తాను అక్రమంగా డ్రగ్స్ కొనుగోలు చేయలేదని, వాటికి బానిస కాలేదని, తనవద్ద అక్రమంగా ఆయుధం లేదని వెల్లడించారు. అయితే అది తప్పని తేలింది. అప్పటికే హంటర్ డ్రగ్స్ అక్రమంగా కొనుగోలు చేశారు. వాటికి బానిసగా మారారు. 11 రోజులపాటు అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారు. హంటర్పై మరో కేసు ఉంది. కాలిఫోర్నియాలో 1.4 మిలియన్ డాలర్ల పన్ను ఎగవేత కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. కాలిఫోర్నియా కోర్టులో సెప్టెంబరులో ఇది విచారణకు రానుంది.బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడానికి కొద్ది రోజుల ముందే...డోనాల్డ్ ట్రంప్ని హష్ మనీ కేసులో దోషిగా తేల్చింది మన్హట్టన్ కోర్టు. శృంగార తార స్టార్మీ డానియల్స్తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారనే ఆరోపణలు ఉన్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు... ట్రంప్ తన న్యాయవాది ద్వారా ఆమెకు 1.30 లక్షల డాలర్ల హష్మనీని ఇప్పించారన్నది ఆరోపణ. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశార ని, అందుకోసం రికార్డులన్నింటినీ తారుమారు చేశారన్నది ప్రధాన అభియోగం. ఇలా మొత్తం 34 అంశాల్లో ఆయనపై నేరారోపణలు నమోదయ్యాయి. ఆరు వారాల విచారణ అనంతరం ట్రంప్పై మోపిన అభియోగాలన్నీ నిజమేనని 12 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించింది. ట్రంప్తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమేనని స్టార్మీ డానియల్స్ స్వయంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆమెతో సహా మొత్తం 22 మంది సాక్షులను కోర్టు విచారించింది.45 ఏళ్ళ డేనియల్స్ అసలు పేరు స్టెఫానీ క్లిఫర్డ్. ఆమె లూసియనాలో జన్మించారు. శృంగార చిత్రాల నటి, దర్శకురాలు డేనియల్స్. సినీ రంగంలో ఆమె ప్రతిభకు గాను అనేక అవార్డులు గెలుచుకున్నారు. 2006 జులై లో ఒక చారిటీ గోల్ఫ్ ట్రోర్నమెంట్లో ట్రంప్ని ఒక చారిటీ గోల్ఫ్ టోర్నమెంట్లో కలిసినట్టుగా డేనియల్స్ చెబుతున్నారు. లేక్ తాహో వద్ద నున్న హోటల్ గదిలో తాము ఇద్దరం పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనట్టు ఆమె తెలిపారు.2016 ఎన్నికల ముందు...ట్రంప్ లాయర్ కోహెన్...తనకు హష్ మనీ కింద ఒక లక్షా 30 వేల డాలర్లు ఇచ్చినట్టు డేనియర్స్ తెలిపారు. అమెరికాలో రహస్య ఒప్పందం కింద ఒకరికి నష్టపరిహారం చెల్లించడం చట్టవిరుద్ధం కాదు. కానీ ట్రంప్ ఖాతాల్లో ఈ చెల్లింపులను లీగల్ ఫీజులుగా పేర్కొనడం ద్వారా వ్యాపార రికార్డులను తారుమారు చేశారని ట్రంప్ పై అభియోగాలు నమోదయ్యాయి. హానికారక సమాచారం ప్రజలకు తెలియకుండా ఉండేందుకు నేరాలను కప్పిపుచ్చేందుకు ట్రంప్ ప్రయత్నించారని... డిస్ట్రిక్ట్ అటార్నీ అల్విన్ బ్రాగ్ ఆరోపించారు. 2018 ఆగస్టులో పన్నుల ఎగవేత, డేనియల్స్కు చెల్లింపుల విషయంలో ప్రచార ఆర్థిక నిబంధనలను అతిక్రమించిన కేసులో దోషిగా తేలడంతో... ట్రంప్ మాజీ లాయర్ కోహెన్ జైలు పాలయ్యారు. అయితే ఈ చెల్లింపులతో ట్రంప్కు ఎలాంటి సంబంధం లేదని తొలుత కోహెన్ చెప్పారు. కానీ తరువాత ట్రంపే 1,30,000 డాలర్ల హుష్ చెల్లింపులు చేయాల్సిందిగా ఆదేశించారని అంగీకరించారు. ఈ డబ్బును ట్రంప్ లెక్కల్లో ఎలాగోలా సెట్ చేశారని కూడా చెప్పారు.దోషిగా తేలడంతో ట్రంప్ జైలుకెళ్లాల్సిందేనా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. దీనికి కచ్చితమైన సమాధానం చెప్పలే మని నిపుణులు అంటున్నారు. బిజినెస్ రికార్డులు తారుమారు అనేది న్యూయార్క్లో తక్కువ తీవ్రత ఉన్న నేరంగా పరిగణిస్తారు. గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. దీనిపై పూర్తి విచక్షణాధికారం న్యాయమూర్తిదే. అయితే, కచ్చితంగా జైలు శిక్ష విధిస్తారా, జరిమానాతో సరిపుచ్చుతారా అనేది చెప్పలేమని న్యాయ నిపుణులు వెల్లడించారు. ఇంత కంటే తీవ్రమైన మరో మూడు కేసుల్లోనూ ట్రంప్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అవేవీ ఎన్నికల ముందు విచారణకు వచ్చే అవకాశం లేదని ట్రంప్ న్యాయవాదుల బృందం ధీమాగా ఉంది. మరోవైపు రిపబ్లికన్ పార్టీ ఈ విషయంలో ట్రంప్కి గట్టిగానే మద్దతు తెలుపుతోంది.ట్రంప్ మద్దతుదారులు ఈ కేసును బైడెన్ రాజకీయ కుట్ర అంటారు, ట్రంప్ వ్యతిరేకులు ఆయనకు శిక్షపడినందుకు సంతోషిస్తారు. రాజకీయాన్ని అటుంచితే, మరోసారి దేశాధ్యక్షుడు కావాలనుకుంటున్న ఓ మాజీ అధ్యక్షుడు ఇలా వరుస కేసులు ఎదుర్కోవడం, నేరస్థుడిగా ముద్రపడటం అమెరికా పరువు ప్రతిష్ఠలకు భంగకరమే అంటున్నారు పరిశీలకులు. అయితే...ఈ తరహా వివాదాలు, కేసులు, ట్రంప్కి కొత్త కాదు. ట్రంప్ని ఈ కోణంలో చూడటం అమెరికన్స్కి కొత్త కాదు. దీంతో...కోర్టు విధించే శిక్ష ఏంటి ? ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో అటు బైడెన్ కుమారుడు క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో...బైడెన్ మీద ఆప్రభావం ఎంత వరకు పడుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. -
అమెరికా–చైనా చర్చలపర్వం
ఎడతెగని చర్చలు జరుగుతున్నాయంటే, అయినా కనుచూపుమేరలో పరిష్కారం కానరా లేదంటే... కనబడని కారణాలేవో అడ్డుపడుతున్నాయని అర్థం. సమస్య తీవ్రంగా ఉన్నదని తాత్పర్యం. ఈనెల ప్రారంభంనుంచి అమెరికా–చైనాలమధ్య భిన్న అంశాలపై చర్చోపచర్చలు సాగుతూనే వున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్లు నేరుగా ఫోన్లో సంభాషించుకున్నారు. నాలుగు నెలలక్రితం తొలిసారి మాట్లాడుకున్న ఈ నేతలిద్దరూ మళ్లీ మాట్లాడుకోవాల్సిన పనిబడటం గమనించదగిందే. వారం తిరగకుండానే అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ ఎలెన్ చైనా సందర్శనకొచ్చి ప్రధాని లీ కియాంగ్తోపాటు చైనా ఉన్నత స్థాయి అధికారులను కలిసి మాట్లాడారు. అంతకుమునుపే ఇరు దేశాల ఉన్నతాధికారులు నాలుగు రోజులపాటు చర్చించుకున్నారు. త్వరలోనే అమెరికా విదేశాంగమంత్రి ఆంథోనీ బ్లింకెన్ చైనా వెళ్లబోతున్నారు. ఇలా సంభాషణల పరంపర కొనసాగుతున్నది గానీ పరిష్కారం కానరావటం లేదు. వీటికి సమాంతరంగా చైనాను కట్టడి చేసే ఇండో–పసిఫిక్ వ్యూహంలో భాగంగా 2021లో రూపుదిద్దుకున్న సైనిక సహకార సంస్థ ‘ఆకస్’ కార్యకలాపాలు చురుకందు కున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ రక్షణమంత్రులు ఇటీవల భేటీ అయ్యారు. ఇందులో మనదేశాన్ని కూడా చేర్చు కోవాలని అమెరికా తహతహలాడుతున్నా ఎలాంటి సైనిక ఒడంబడికల్లోనూ భాగం కారాదన్న విధానానికే ఇంతవరకూ మన దేశం కట్టుబడివుంది. మొదట్లో పెద్దగా ఆసక్తి చూపని జపాన్ మాత్రం చేరే అవకాశం ఉందంటున్నారు. అలాగని మన దేశం మౌనంగా ఏమీ లేదు. దక్షిణ చైనా సముద్రంలో చైనానుంచి తరచు బెదిరింపులు ఎదుర్కొంటున్న ఆగ్నేయాసియా దేశాలకు మద్దతుగా నిలుస్తామని చాటుతూనేవుంది. ఇటీవల చైనా గస్తీ నౌకలు చేసిన దాడుల్లో ఫిలిప్పీన్స్ వాణిజ్య నౌకలు రెండు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవలే ఆ దేశాన్ని సందర్శించి అండగా వుంటామని ప్రకటించారు. దక్షిణ చైనా సముద్రంలో 90 శాతం తన సొంతమని చైనా చెప్పుకుంటోంది. నిరంతర గస్తీ కాస్తోంది. సమస్యేమంటే ప్రపంచ సముద్ర ఉత్పత్తుల వాణిజ్యంలో 60 శాతం దక్షిణ చైనా సముద్రం వైపే సాగుతోంది. అంతర్జాతీయంగా చైనాను కట్టడి చేయటమే అత్యవసరమని భావిస్తున్న అమెరికాకు రష్యా దూకుడు ఊహించని పరిణామం. రెండేళ్ల క్రితం ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ యుద్ధం ప్రారంభించాక దృష్టి అటువైపు మళ్లింది. ఉక్రెయిన్కు ఆయుధాలందించటం ద్వారా రష్యాను దారికి తేవొచ్చని భావించిన అమెరికాకు నిరాశే ఎదురైంది. రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలు సైతం ఆశించినంత ఫలితాన్నివ్వలేదు. రష్యాకు ఇరాన్ నుంచి డ్రోన్లు అందుతున్నాయి. ఎడాపెడా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవటం ద్వారా రష్యాకు చైనా అండగా నిలుస్తోంది. ఉత్తర కొరియా సైతం చైనా ద్వారా రష్యాకు సహాయసహకారాలందిస్తోందని అమెరికా భావిస్తోంది. ఇటు ఇజ్రాయెల్ దుందుడుకుతనంతో గాజా మండుతోంది. ఇజ్రాయెల్ను ఎలాగైనా దారికి తేవా లన్న బైడెన్ ఎత్తుగడలు ఫలించటం లేదు. కనుకనే దౌత్యరంగంలో వున్నంత దూకుడు రక్షణరంగంలో కనబడటం లేదన్నది బైడెన్పై వున్న ప్రధాన విమర్శ. ఈ ఏడాది చివర అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నందున ఈ విమర్శలు బైడెన్ను కలవరపెడుతున్నాయి. పర్యవసానంగా చైనాతో చర్చోప చర్చలు సాగుతున్నాయి. వాణిజ్యపరంగా అమెరికాకు మరో ప్రత్యేక సమస్య కూడా వుంది. అంతర్జాతీయ మార్కెట్లోకి అపరిమితంగా వచ్చిపడుతున్న చైనా ఎలక్ట్రిక్ కార్లు, సౌరశక్తి ప్యానెళ్లు, ఇతర ఉపకరణాలు అమెరికాకు తలనొప్పి తెస్తున్నాయి. వాటివల్ల అమెరికా ఉత్పత్తులు అమ్ముడుకావటం కష్టమవుతోంది. అమెరికా పరిశ్రమలు సంక్షోభంలో పడుతున్నాయి. ఈ నెల మొదట్లో జో బైడెన్, షి జిన్పింగ్ మధ్య ప్రధానంగా తైవాన్, దక్షిణ చైనా సముద్రం అంశాలపై చర్చలు నడిస్తే... చైనా తమ వాణిజ్య దూకుడుకు కళ్లెం వేయటంపై జానెట్ ఎలెన్ ప్రధాని లీ కియాంగ్తో చర్చించారు. దీన్ని ఆపకపోతే మరో మూడేళ్లలో అవసరానికి మించి ఏటా 50 లక్షల నుంచి కోటి ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్కొస్తాయన్నది అమెరికా అంచనా. కృత్రిమ మేధ, సెమీ కండక్టర్ తదితర అంశాల్లో తమ ఎదుగుదలను నిరోధించేలా అమెరికా వ్యవహరిస్తున్నదని చైనా ఆరోపణ. కనుకనే ఇరుదేశాల ఉన్నతాధికారులమధ్యా వరసగా నాలుగురోజులపాటు చర్చలు సాగినా... నేరుగా ఎలెన్, లీ కియాంగ్లు సంభాషించుకున్నా పరిష్కారం దొరకలేదు. చిత్రమేమంటే అమెరికా, చైనాల మధ్య అనేక అంశాల్లో తీవ్ర విభేదాలున్నా వాణిజ్యపరంగా ఆ రెండు దేశాలూ పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడక తప్పని స్థితి. అందుకే ఇండో–పసిఫిక్ అంశంలో దూకుడుగా వున్నట్టు కనిపిస్తున్నా వాణిజ్య సమస్యలపై ఏదోవిధంగా చైనాను దారికి తెచ్చుకోవాలని అమెరికా తాపత్రయపడుతోంది. ట్రంప్ హయాంలో చైనాపై విధించిన ఆంక్షల్లో చాలా భాగం బైడెన్ కొనసాగించారు. వీటికి మరిన్ని జోడిస్తానన్న బైడెన్ హెచ్చరికలు ఆచరణలోకి రాకపోయినా అవసరాన్నిబట్టి అప్పుడప్పుడు సడలింపు వైఖరితో ఉన్నామన్న సంకేతాలు రెండు దేశాలూ ఇస్తున్నాయి. ఎలాంటి సమస్యలకైనా ఓర్పుగా సాగించే సంభాషణలు పరిష్కారాన్ని చూపుతాయి. ఘర్షణల నివారణ ఎప్పుడూ మంచిదే. ఎందుకంటే ఘర్షణలవల్ల అంతిమంగా విధ్వంసం తప్ప మరేమీ మిగలదు. అయితే ఏ చర్చలైనా నిర్మాణాత్మకంగా వుండాలి. చిత్తశుద్ధితో సాగాలి. లేనట్టయితే నిష్ఫలమవుతాయి. -
నెతన్యాహూతో ఇజ్రాయెల్కు నష్టమే: బైడెన్
విలి్మంగ్టన్: గాజాలో హమాస్పై యుద్ధం పేరిట ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తన సొంత దేశానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. నెతన్యాహూ అనాలోచిత చర్యల వల్ల ఇజ్రాయెల్కు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోందని అన్నారు. గాజాలో సాధారణ పౌరుల మరణాలను నియంత్రించడంలో నెతన్యాహూ దారుణంగా విఫలమవుతున్నారని ఆక్షేపించారు. బైడెన్ శనివారం మీడియాతో మాట్లాడారు. తిరుగుబాటుతో సంబంధం లేని పాలస్తీనియన్ల ప్రాణాలు కాపాడాలని, ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్కు సూచించారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ మిలిటెంట్లు చేసిన దాడిని తాము ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. హమాస్ను వేటాడే హక్కు ఇజ్రాయెల్కు ఉందని వెల్లడించారు. కానీ, సాధారణ ప్రజలపై దాడి చేయడం సరైంది కాదని తేల్చిచెప్పారు. గాజాలో మరణాల సంఖ్య ఇజ్రాయెల్ చెబుతున్నదానికంటే ఎక్కువగానే ఉన్నట్లు తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. గాజాలో అమాయకుల మరణాలు ఇంకా పెరిగితే ఇజ్రాయెల్ అంతర్జాతీయ మద్దతును కోల్పోతుందని బైడెన్ కొన్ని రోజుల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
USA: బైడెన్ వద్దు.. మిషెల్లీ ఒబామా బెటర్.. ఆసక్తికర పోల్స్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. 2024 అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు ఫోకస్ పెట్టాయి. దీంతో, రెండు పార్టీలు హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే, అధికార డెమోక్రటిక్ పార్టీలో ఆసక్తికర పరిమాణం చోటుచేసుంది. డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బదులుగా.. మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ ఒబామా బరిలో నిలవాలని అమెరికన్లు కోరుకుంటున్నారని రాస్ముస్సెన్ రిపోర్ట్స్ పోల్ పేర్కొంది. వివరాల ప్రకారం.. 2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ మరో దఫా ఎన్నికల్లో నిలబడేందుకు అమెరికన్లు ఇష్టపడటం లేదు. ఆయన వయసు, మానసిక ఆరోగ్య స్థితిని ఇందుకు కారణంగా చూపుతున్నారు. అలా చెబుతున్నవారు దాదాపు 48 శాతం ఉన్నారని తేలింది. బైడెన్ బదులు.. మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ ఒబామాను కోరుకుంటున్నారని రాస్ముస్సెన్ రిపోర్ట్స్ పోల్ పేర్కొంది. కాగా, 38 శాతం మంది జో బైడెన్ను కోరుకోవడం లేదని ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ ఒక వార్తను ప్రచురించింది. If Michelle Obama decides to replace President Biden ,then it's an absolute game over for Trump or Republicans . She will win presidency hands down, and for us, staunch Gandhian will be the most powerful person on the face of earth. Let the game begin @MichelleObama pic.twitter.com/pFkyFrYO67 — Prashant shah (@prashantsapp) February 28, 2024 ఇక, అదే సమయంలో బైడెన్ను మార్చే అవకాశాలు లేవని 45 శాతం మంది అభిప్రాయపడుతున్నారని సర్వేలో వెల్లడైంది. బైడెన్ మరోసారి ఎన్నికకు సిద్ధపడకపోతే ఆయన స్థానంలో ఎవరైతే బాగుంటందనే ప్రశ్నతో సర్వే నిర్వహించారు. ఇందులో మిషెల్లీ ఒబాబాకే ఎక్కువ సంఖ్యలో మద్దతు పలికారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ తదితరులు తదుపరి స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉండగా.. మిషెల్లీ ఒబామా మాత్రం తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తితోలేనని ఇప్పటికే ప్రకటించారు. కాగా, జనవరిలో ఒక పాడ్క్యాస్ట్ ఇంటర్వ్యూలో మిషెల్లీ ఒబామా మాట్లాడుతూ 2024 అధ్యక్ష ఎన్నికల్లో వచ్చే ఫలితం గురించి తాను భయపడుతున్నానని వ్యాఖ్యానించారు. అలాగే, తనకు ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన లేదన్నారు. -
సన్నగిల్లిన బైడెన్ జ్ఞాపకశక్తి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బైడెన్ జ్ఞాపకశక్తి తగ్గిందనే విషయాన్ని ఒక నివేదిక తగిన సాక్ష్యాధారాలతో బహిర్గతం చేయడంతో ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే బైడెన్ వృద్ధాప్యాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచు కున్న రిపబ్లికన్లకు తాజా నివేదిక మరో శక్తివంతమైన ప్రచారాస్త్రమైంది. అయితే ఈ నివేదికలోని అంశాలన్నీ తప్పు అని 81 ఏళ్ల బైడెన్ ఖండించినా ఆ నివేదికలో పేర్కొన్న విషయాలను గమనిస్తే అవన్నీ నిజాలే అని అనిపించకమానవు. తక్కువ జ్ఞాపకశక్తి ఉన్న వృద్ధుడు అని బైడెన్ను నివేదిక అభివర్ణించింది. గత జనవరిలో వాషింగ్టన్లోని బైడెన్ కార్యాలయంలో రహస్య పత్రాలను సిబ్బంది కనిపెట్టడంతో ఆ విషయం అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్దాకా వెళ్లింది. దీంతో ఆయన న్యాయశాఖ స్పెషల్ కౌన్సిల్గా రాబర్ట్ హుర్ను నియమించారు. ఈయన ఇటీవల బైడెన్ను ఏకధాటిగా ఐదు గంటలపాటు ఇంటర్వ్యూ చేసి ఆయన జ్ఞాపకశక్తిపై ఒక అంచనాకొచ్చారు. ఇదిగాక ఇతరత్రా సాక్ష్యాధారాలను ఆయన తన నివేదికలో వెల్లడించారు. గురువారం విడుదలైన ఆ 345 పేజీల నివేదికలో ఏమన్నాయంటే.. ► బరాక్ ఒబామా హయాంలో ఉపా« ద్యక్షుడిగా పనిచేసినకాలంలో అఫ్గానిస్తాన్ లో అమెరికా స్థావరాలు, సైన్యం మొహరింపు రహస్యాలను ఒక ప్రైవేట్ వ్యక్తితో బైడెన్ పంచుకున్నారు. సంబంధిత రహస్య పత్రాలను డెలావర్లోని తన గ్యారేజీలో మర్చి పోయారు. ► తన కుమారుడు బ్యూ బైడెన్ క్యాన్సర్ తో ఏ సంవత్సరంలో చనిపోయిందీ బైడెన్ ఠక్కున చెప్పలేకపోయారు ► ఉపాధ్యక్షుడిగా ఏ సంవత్సరంలో దిగిపోయారు అనేదీ ఈయనకు సరిగా గుర్తులేదు ► తన జీవితచరిత్ర రాస్తున్న ఒక రచయితకు సున్నితమైన అంశాలున్న ఒక నోటు పుస్త కం ఇచ్చారు. అందులో అఫ్గానిస్తాన్కు సంబంధించిన రహస్య సమాచారం ఉంది. అవన్నీ అబద్ధా్దలు: బైడెన్ ‘దాదాపు 40 సంవత్సరాల క్రితం విషయాలను ఠక్కున చెప్పాలంటే ఎలా?. నా కుమారుడి మరణాన్ని చర్చించకూడదనే ఆ ప్రశ్న సమయంలో స్పందించలేదు. రెండోసారీ అమెరికాకు అధ్యక్షుడిగా కొనసాగే శక్తిసామర్థ్యాలు నాకున్నాయి’’అని బైడెన్ పనరుద్ఘాటించారు. అయితే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలపై తడబడుతూ, పొరబడటం గమనార్హం. -
USA: అధ్యక్ష రేసులో ట్రంప్ లైన్ క్లియర్!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష బరిలో నిలిచేందుకు మాజీ అధ్యక్షుడు, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ దాదాపు లైన్ క్లియర్ అయ్యింది. న్యూ హాంప్షైర్లో రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో కూడా ట్రంప్ ఘన విజయం సాధించారు. ట్రంప్ ప్రత్యర్థి నిక్కీ హేలీ ఓటమి చెందారు. దీంతో, ట్రంప్ అధ్యక్ష రేసులో ముందంజలో ఉన్నారు. అయితే, ట్రంప్ విజయం అనంతరం నిక్కీ హేలీ స్పందించారు. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్కు అధినందనలు తెలిపారు. ఈ క్రమంలో అధ్యక్ష పదవికి నామినేషన్ కోసం పోటీపడిన అభ్యర్థుల్లో ముగ్గురు ఇప్పటికే తప్పుకోవడంతో రిపబ్లికన్ పార్టీలో పోటీ అంతా ట్రంప్, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ మధ్యనే కేంద్రీకృతమైంది. భారత సంతతికే చెందిన మరో అభ్యర్థి వివేక్ రామస్వామి, న్యూ జెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్లు బరినుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. వీరిలో రామస్వామి, డిశాంటిస్లు ట్రంప్నకు మద్దతు ప్రకటించారు. ఇక హ్యాంప్ షైర్ గవర్నర్ సునును మద్దతు ఉన్న హేలీ ఆ రాష్ట్ర ప్రైమరీలో ట్రంప్నకు గట్టి పోటీ ఇస్తారని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా ట్రంప్కు మద్దతు ఇవ్వడంతో ఆయన ముందంజలో నిలిచారు. డొనాల్డ్ ట్రంప్కు 55.5 శాత ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తంగా 41,423 ఓట్లు పడ్డాయి. 46.1 శాతంతో 36,083 ఓట్లను సాధించారు నిక్కీ హేలీ. కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇద్దరి ఓట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. BREAKING: Essential projects Donald Trump will win the #NewHampshirePrimary pic.twitter.com/yitff269Fg — Essential Filmworks 🇺🇸 (@Real_EF_News) January 24, 2024 ఇదిలా ఉండగా, అంతకుముందు.. అయోవా స్టేట్లో నిర్వహించిన ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకు 52.8 శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయి. అభ్యర్థి ఎన్నికల్లో నిలిచిన రాన్ డీశాంటీస్- 21.4, నిక్కీ హేలీ-17.7, వివేక్ రామస్వామి- 7.2 శాతం ఓట్లు పడ్డాయి. El expresidente de #EEUU🇺🇲 Donald Trump gana las primarias republicanas en #NewHampshire pic.twitter.com/4spzM0jPmQ — Allan Berfield 🌎 (@allanberfield) January 24, 2024 అయితే, ఈ ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్లో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. దీంతో, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ.. ఎన్నికల కోసం సన్నాహాలు చేపట్టింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తమ పార్టీ అభ్యర్థిగా ఎన్నుకుంది. 2019 నాటి ఎన్నికల్లో ఓడినా మళ్లీ ట్రంప్ అభ్యర్థిత్వానికే మొగ్గు చూపింది. -
పుతిన్ను ఎలాగైనా ఆపాల్సిందే: బైడెన్
వాషింగ్టన్: ఉక్రెయిన్ను సర్వనాశనం చేసేందుకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంకణం కట్టుకున్నారంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దుయ్యబట్టారు. ‘‘ఆయన యుద్ధోన్మాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాల్సిందే. ఉక్రెయిన్పై రష్యా తాజాగా క్షిపణుల వర్షం కురిపించిన వైనం ఈ ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసింది’’ అన్నారు. తమ దేశంపైకి రష్యా ఏకంగా 110 క్షిపణులను ప్రయోగించిందని, ఈ డాడిలో 31 మంది అమాయకులు బలవగా వందలాది మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం ప్రకటించడం తెలిసిందే. 2022లో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇదే అతి పెద్ద దాడి అని ఉక్రెయిన్ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ను అడ్డుకునేందుకు ఉక్రెయిన్కు మరింత సాయం అందిద్దామని అమెరికా చట్టసభ కాంగ్రెస్కు బైడెన్ పిలుపునిచ్చారు. -
Israel-Hamas war: ఇజ్రాయెల్పై బైడెన్ అసంతృప్తి!
వాషింగ్టన్: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దండయాత్రను అమెరికా అధ్యక్షుడు బైడెన్ తొలిసారిగా తప్పుబట్టారు. బుధవారం వాషింగ్టన్లో నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఇజ్రాయెల్ యుద్ధరీతిపై బైడెన్ మాట్లాడారు. ‘‘ ఇజ్రాయెల్ భద్రత అనేది అమెరికాతో ముడిపడి ఉంది. ఇన్నాళ్లూ ఐరోపా సమాఖ్య, యూరప్ దేశాలూ ఇజ్రాయెల్కు మద్దతుగా నిలబడ్డాయి. కానీ ఇప్పుడా పరిస్థితి నెమ్మదిగా మారుతోంది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న విచక్షణారహిత బాంబుదాడులే ఇందుకు ప్రధాన కారణం. మరి ఈ విషయం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు తెలుసో తెలీదో. గాజావ్యాప్తంగా ఇళ్లలో ఉన్న సాధారణ ప్రజానీకాన్ని చిదిమేస్తూ భవనాలపై దారుణ బాంబింగ్ కొనసాగుతోంది. ఈ దాడుల పర్వం మరికొన్ని వారాలు, నెలలపాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ సైన్యాధికారులే చెబుతున్నారు. అమా యక పాలస్తీనియన్ల భద్రత ఇప్పుడు ప్రమాదంలో పడింది’’ అని ఇజ్రాయెల్ భీకర గగనతల, భూతల దాడులను బైడెన్ ఆక్షేపించారు. ఈ విషయమై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ ఈ వారమే ఇజ్రాయెల్లో పర్యటించి భారీ దాడులకు ఎప్పుడు చరమగీతం పాడుతారనే దానిపై ఒక హామీ తీసుకోనున్నారు. ‘‘ 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా అఫ్గాని స్తాన్లో యుద్ధానికి దిగింది. అమెరికా చేసిన ఇలాంటి అతి ‘స్పందన’ తప్పిదాల నుంచి ఇజ్రాయెల్ ఏమీ నేర్చుకున్నట్లు కనిపించట్లేదు. ఇది ఇలాగే కొనసాగితే అంతర్జాతీయ మద్దతును ఇజ్రాయెల్ కోల్పోతుంది’’ అని బైడెన్ హెచ్చరించారు. బైడెన్ వ్యాఖ్యలపై హమాస్ సాయుధసంస్థ ప్రతినిధి బీరుట్ నగరంలో మాట్లాడారు. ‘‘ఈ యుద్ధ విపరి ణామాలు ఇజ్రాయెల్లో త్వరలోనే కనిపిస్తాయి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తర్వాత శ్వేతసౌధంలో బైడెన్ సీటు గల్లంతవుతుంది’’ అని హమాస్ రాజకీయవిభాగం నేత ఒసామా హమ్దాన్ వ్యాఖ్యానించారు. -
బైడెన్తో జిన్పింగ్ భేటీ
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో చైనా అధినేత షీ జిన్పింగ్ సమావేశానికి రంగం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన ఈ భేటీ జరుగనుంది. ఇటీవలి కాలంలో అమెరికా–చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇరువురు నాయకుల సమావేశం అవుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంబంధాలను పునరుద్ధరించుకొనే దిశగా వారిద్దరూ చర్చలు జరుపునున్నట్లు తెలుస్తోంది. ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార మండలి(ఏపీఈసీ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు జిన్పింగ్ మంగళవారం అమెరికా చేరుకున్నారు. ఆయన అమెరికాకు రావడం ఆరేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. -
అల్ఖైదా కంటే ప్రమాదకరం
వాషింగ్టన్: పాత మసీదులు, యూదుల పురాతన ఆలయాల ఆనవాళ్లు ఉన్న పవిత్ర ప్రాంతాలపై పట్టు కోసం మొదలైన పాలస్తీనా–ఇజ్రాయెల్ యుద్ధం పలు మలుపులు తీసుకుంటున్న వేళ హమాస్ సాయుధసంస్థపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. అమెరికాలోని ఫిలడెలి్ఫయాలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బైడెన్ మాట్లాడారు. 2001 సంవత్సరంలో 9/11 సెపె్టంబర్ దాడులకు తెగబడిన అల్ఖైదా ఉగ్రసంస్థ కంటే హమాస్ ప్రమాదకరమైనదని అభివరి్ణంచారు. హమాస్ దాడులకు గురైన ఇజ్రాయెల్కు అమెరికా ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. ‘ ఇజ్రాయెల్పై దాడి చేసి హమాస్ ఏకంగా వేయి మందికిపైగా అమాయకులను పొట్టనబెట్టుకుంది. అల్ఖైదా సృష్టించిన 9/11 దాడులకంటే ఈ దాడి అత్యంత దారుణం. అల్ఖైదా కంటే హమాస్ ప్రమాదకరం. అల్ఖైదాను మించిన దుషు్టలు వీరు. మొదట్నుంచీ చెబుతున్నట్లే మేం ఇజ్రాయెల్కు బాసటగా నిలబడతాం. ఆత్మరక్షణ కోసం, ప్రతిదాడుల కోసం ఇజ్రాయెల్ తీసుకునే ప్రతి నిర్ణయానికి, ప్రతీ చర్యకూ అమెరికా అండగా ఉంటుంది. గాజాలో నెలకొన్న మానవీయ సంక్షోభానికి తక్షణం ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. ఇందుకోసమే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇప్పటికే ఇజ్రాయెల్కు చేరుకున్నారు’ అని బైడెన్ చెప్పారు. ఐరాసతోనూ చర్చిస్తున్నాం ‘ఇజ్రాయెల్ ప్రభుత్వంతోనేకాదు దాని పొరుగున ఉన్న జోర్డాన్, ఈజిప్ట్ ఇతర అరబ్ దేశాలతో మంతనాలు జరుపుతున్నాం. ఇరువైపులా దాడులు, ప్రతిదాడులతో పాలస్తీనా, ఇజ్రాయెల్లలో నెలకొన్న మానవీయ సంక్షోభం పోగొట్టేందుకు ఐక్యరాజ్యసమితితోనూ సమష్టిగా కృషిచేస్తున్నాం. చర్చిస్తున్నాం’ అని అన్నారు. -
ఉక్రెయిన్కు మరో రూ.2,695 కోట్ల సాయం
వాషింగ్టన్: రష్యా సైనిక చర్య వల్ల ఎంతగానో నష్టపోయిన ఉక్రెయిన్కు ఇప్పటికే వివిధ రూపాల్లో సాయం అందించిన అగ్రరాజ్యం అమెరికా మరో భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. భద్రతా సాయం కింద ఉక్రెయిన్కు 325 మిలియన్ డాలర్లు (రూ.2,695 కోట్లు) ఇవ్వనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఆయన తాజాగా వైట్హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. రష్యాతోయుద్ధంపై వారు చర్చించుకున్నారు. రష్యా దురాక్రమణ నుంచి ఉక్రెయిన్ సార్వ¿ౌమత్వాన్ని కాపాడడమే తమ కర్తవ్యమని బైడెన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ప్రజలు అంతులేని ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, క్షిపణి నిరోధక వ్యవస్థలు సహా ఉక్రెయిన్కు రూ.2,695 కోట్ల సాయం అందజేయబోతున్నామని తెలిపారు. అబ్రామ్స్ యుద్ధ ట్యాంకులను వచ్చేవారం ఉక్రెయిన్కు ఇస్తామని వివరించారు. -
మహాత్ముని పలుకులే భారత్–అమెరికా మైత్రికి మూలం
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీజీ ప్రబోధించిన సంరక్షణ సూక్తులే భారత్–అమెరికా మధ్య సత్సంబంధాలకు మూలమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మహాత్ముని సమాధి ‘రాజ్ఘాట్’లో నివాళులరి్పంచిన సందర్భంగా బైడెన్ పలు ట్వీట్లు చేశారు. ‘ గాం«దీజీ ప్రవచించిన సంరక్షణ సూక్తులే ఇరు దేశాల మధ్య దృఢ బంధానికి మూలం. మన రెండు దేశాలు మధ్య నెలకొన్న పరస్పర నమ్మకం, సంరక్షణ బాధ్యతలే మన పుడమి సంరక్షణకూ దోహదపడుతున్నాయి’ అని అన్నారు. ‘మోదీతో విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు ఫలవంతంగా ముగిశాయి. 31 అధునాతన డ్రోన్ల కొనుగోలు, భారత్లో జీఈ జెట్ ఇంజిన్ల సంయుక్త తయారీసహా పలు కీలక ఒప్పందాలు కుదిరాయి’ అని చెప్పారు. ‘ఈ రోజు ఇక్కడికి(రాజ్ఘాట్)కు తీసుకొచ్చిన మీకు(ప్రధాని మోదీ) నా కృతజ్ఞతలు. అద్భుతంగా అతిథ్యమిచి్చ, జీ20 సదస్సును సజావుగా నిర్వహించి, కూటమికి విజయవంతంగా సారథ్యం వహించారు. రాజ్ఘాట్కు రావడం నిజంగా గర్వంగా ఉంది. గాం«దీజీ ఆచరించి చూపిన సత్యం, అహింసా మార్గాలు ప్రపంచానికి ఆచరణీయాలు. ఇవి ఎల్లప్పుడూ ప్రపంచదేశాలకు స్ఫూర్తిదాయకాలు. ఇదే మన రెండు దేశాల బంధానికి పునాది రాళ్లు’ అని మోదీనుద్దేశిస్తూ బైడెన్ ట్వీట్చేశారు. జీ20 సదస్సు ముగిశాక భారత్కు బైబై చెప్పిన బైడెన్.. వియత్నాంకు పయనమయ్యారు. మహాత్మునికి జీ20 నేతలంతా పుష్పగుచ్ఛాలతో నివాళులర్పిస్తున్న ఫొటోను, కార్యక్రమానికి సంబంధించిన 19 సెకన్ల వీడియోను బైడెన్ ట్వీట్ చేశారు. జీ20 దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు కూటమే స్వయంగా పరిష్కార మార్గాలు కనిపెట్టగలదని బైడెన్ ధీమా వ్యక్తంచేశారు. మహాత్మునికి నేతల నివాళి జీ20 సదస్సుకు విచ్చేసిన నేతలంతా ఆదివారం రాజ్ఘాట్కు వెళ్లి మహాత్మాగాం«దీకి నివాళులరి్పంచారు. మొదట వారంతా వర్షం నీరు నిలిచిన రాజ్ఘాట్ లోపలికొచ్చారు. 1917 నుంచి 1930 వరకు గాం«దీజీ నివసించిన సబర్మతి ఆశ్రమం ఫొటో ఉన్న ప్రాంతం వద్ద నిల్చుని విడివిడిగా ఒక్కో నేతకు మోదీ స్వాగతం పలికారు. ఫొటో చూపిస్తూ ఆశ్రమం ప్రత్యేకతలను వివరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ అంగవస్త్రం బహూకరించారు. మోదీ, సునాక్ పాదరక్షలు లేకుండా రాజ్ఘాట్ లోపలికి ప్రవేశించగా, మిగతా నేతలు.. నిర్వాహకులు సమకూర్చిన తెల్లని పాదరక్షలు ధరించారు. తర్వాత నేతలంతా కలిసి గాం«దీజీ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. అక్కడి శాంతికుడ్యంపై సంతకాలు చేశారు. -
G20 summit: నేడే మోదీ– బైడెన్ చర్చలు
న్యూఢిల్లీ: జీ 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్ వస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరుదేశాల మధ్య ప్రపంచ, వ్యూహాత్మక స్థాయి భాగస్వామ్యాన్ని మరింతగా దృఢతరం చేసుకోవడమే చర్చల ప్రధాన అజెండా కానుంది. స్వచ్ఛ ఇంధనం, వర్తకం, హై టెక్నాలజీ, రక్షణ వంటి రంగాల్లో ప్రస్తుత పరస్పర సహకారాన్ని సమీక్షించి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సమస్యలను అధిగమించే మార్గాలపై నేతలు దృష్టి సారిస్తారు. బైడెన్ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ చేరుకుంటారు. ఆదివారం జీ 20 సదస్సు ముగియగానే వియత్నాం బయల్దేరతారు. మోదీ, ఇతర నేతలతో ఈ వారాంతంలో ఫలప్రదమైన చర్చల కోసం బైడెన్ ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారని వైట్ అండ్ హౌజ్ ప్రెస్స్ కార్యదర్శి కరిన్ జీన్ పియరీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చివరిసారిగా 2020లో భారత్ను సందర్శించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. -
G20 Summit: అతిథులొస్తున్నారు...
ప్రపంచంలోని ప్రధాన దేశాల అధినేతలు శుక్రవారం ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని తమ వాణిని వినిపించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ మొదలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వరకు పలు దేశాల నాయకగణం నేడే హస్తినకు చేరుకోనుంది. మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ 2012లో అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా జీ20 సదస్సుకు హాజరుకావడం లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం ఈ భేటీకి గైర్హాజరు అవుతున్నారు. ఏయే దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు శుక్రవారం ఏ సమయానికి విచ్చేస్తున్నారో ఓసారి చూద్దామా! ► రేపు ఢిల్లీలో ప్రారంభంకానున్న జీ–20 శిఖరాగ్ర సదస్సు బ్రిటన్ :: రిషి సునాక్ జీ20 సదస్సు కోసం అందరికంటే ముందే భారత్కు చేరుకుంటున్న కీలక నేత రిషి సునాక్. భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని అయిన సునాక్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌదరి ఈయనకు సాదర స్వాగతం పలకనున్నారు. ‘భారత్ జీ20కి సారథ్య బాధ్యతలు వహిస్తున్న ఈ ఏడాదికాలంలో భారత ప్రధాని మోదీ చేస్తున్న కృషి అమోఘం. ఆయన నాయకత్వంలో ప్రపంచ యవనికపై భారత్ సాధిస్తున్న విజయాలు అద్వితీయం’అని రిషి సునాక్ శ్లాఘించారు. జపాన్ :: ఫుమియో కిషిదా సునాక్ విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికే పాలెం విమానాశ్రయంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా విమా నం ల్యాండ్ కానుంది. మధ్యా హ్నం 2.15 గంటలకు ఆయన భారత గడ్డపై అడుగుపెడతారు. ఈయనను సైతం కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌదరి రిసీవ్ చేసుకోనున్నారు. కిషిదా భారత్కు రావడం ఇది రెండోసారి. ఇటీవల మార్చి నెలలో భారత్లో రెండు రోజులపాటు పర్యటించి ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అమెరికా :: జో బైడెన్ అగ్రరాజ్యాధినేత జో బైడెన్ రాకపైనే అందరి కళ్లు. ఈయన సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి జనరల్(రిటైర్డ్) వీకే సింగ్ బైడెన్కు సాదర ఆహ్వానం పలుకుతారు. బైడెన్ సతీమణి జిల్కు కరోనా పాజిటివ్ రావడంతో బైడెన్ జీ20 సదస్సుకు వస్తారో రారో అనే సందిగ్ధత నెలకొంది. బైడెన్కు చేసిన కరోనా టెస్ట్లో నెగటివ్ ఫలితం రావడంతో ఆయన పర్యటన ఖాయమైంది. అయినా సరే సదస్సు సందర్భంగా ఆయన మాస్క్ ధరించే పాల్గొంటారని అధికార వర్గాలు వెల్లడించాయి. కెనడా :: జస్టిన్ ట్రూడో అమెరికా తర్వాత ఆ దేశానికి ఉత్తరవైపు పొరుగు దేశం కెనడా తరఫున ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో భారత్లో అడుగుపెడతారు. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం పాలెం ఎయిర్పోర్టుకు చేరుకుంటుంది. కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ జస్టిన్కు సాదర స్వాగతం పలుకుతారు. ఖలిస్తాన్ వేర్పాటువాదులకు చిరునామాగా నిలిచిన కెనడాలో ఇటీవల వేర్పాటువాద సంస్థలు రెచ్చిపోయాయి. భారత వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ కెనడా–భారత్ సత్సంబంధాలను క్షీణింపజేశాయి. ప్రతిపాదిత వాణిజ్య ఒడంబడికను కెనడా అర్ధంతరంగా ఆపేసింది. ఈ తరుణంలో జీ20 వేదికగా కెనడా అగ్రనేత భారత్లో పర్యటించడం ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. చైనా :: లీ కియాంగ్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వాస్తవానికి ఈ సదస్సులో పాల్గొనాలి. కానీ ఈసారి ఆయన బదులు చైనా ప్రధాని లీ కియాంగ్ వస్తున్నారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. ‘జిన్పింగ్ గైర్హాజరు ఊహించిందే. ఇది జీ20 కూటమి పరస్పర ఉమ్మడి నిర్ణయాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావంచూపబోదు’అని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కుండబద్దలు కొట్టారు. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, అకాŠస్య్ చిన్ ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ తమ కొత్త భౌగోళిక పటాన్ని చైనా విడుదలచేయడంతో డ్రాగన్ మీద భారత్ ఆగ్రహంగా ఉంది. జర్మనీ, ఫ్రాన్స్ల నేతలూ.. యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ రాత్రి ఏడున్నరకు ఢిల్లీలో దిగుతారు. యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్ సైతం జీ20 సదస్సుకు వస్తున్నారు. సింగపూర్ ప్రధాని లూంగ్ లీని కేంద్ర సహాయ మంత్రి మురుగన్ రిసీవ్ చేసుకుంటారు. జర్మనీ చాన్స్లర్ స్కోల్జ్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు వస్తున్నారు. ఈయనను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ రిసీవ్ చేసుకోనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ శనివారం మధ్యాహ్నం 12.35 నిమిషాలకు వస్తారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మహిళా మంత్రి అనుప్రియా సింగ్ పాటిల్ మేక్రాన్కు స్వాగతం పలుకుతారు. క్యూ కట్టనున్న నేతలు సౌదీ అరేబియా ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకుంటారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు సుక్ ఇయోల్ యూన్ సాయంత్రం 5.10కి వస్తున్నారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసీ, ఆ్రస్టేలియా ప్రధాని అల్బనీస్ సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో చేరుకుంటారు. ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడో రాత్రి సమయంలో రానున్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ పదిగంటలకు చేరుకుంటారు. స్పెయిన్ అధ్యక్షుడు పెట్రో పెరిజ్ రాత్రి 10.15కు చేరుకుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పర్యావరణ హామీలపై దృష్టి
వాషింగ్టన్: వర్ధమాన దేశాలకు చేసిన వాగ్దానాలను, పర్యావరణం సహా కీలక అంశాలపై హామీలను నెరవేర్చడం తదితరాలు జీ20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రాథమ్యాలు కానున్నాయి. ఆయన భారత పర్యటనకు సంబంధించి బుధవారం చేసిన ప్రకటనలో వైట్హౌస్ ఈ మేరకు పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జీ20 సదస్సు గొప్పగా విజయవంతం అవుతుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్ ఆశాభావం వెలిబుచ్చారు. బైడెన్ గురువారం భారత్ రానున్నారు. శుక్రవారం ఆయన మోదీతో భేటీ అవుతారు. శని, ఆదివారాల్లో జీ20 భేటీలో పాల్గొంటారు. -
జీ20 నేతలకు మెనూ సిద్ధం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 9, 10వ తేదీల్లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురు ప్రపంచ దేశాల నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఎన్నో పోషకాలతో నోరూరించే భారతీయ తృణధాన్యాల వంటకాల రుచిని వీరికి చూపించనున్నారు. భారత్ మంటపంలో జరుగుతున్న శిఖరాగ్రం ఏర్పాట్లను జీ20 స్పెషల్ సెక్రటరీ ముక్తేశ్ పర్దేశి ఆదివారం పీటీఐకి వివరించారు. ‘మన దేశ స్ట్రీట్ ఫుడ్, ప్రాంతీయ, స్థానిక వంటకాలను వారికి సరికొత్త రీతిలో పరిచయం చేయనున్నాం. ఢిల్లీలోని చాందినీ చౌక్ తదితర ప్రాంతాల్లోని స్ట్రీట్ ఫుడ్కు ఎంతో పేరుంది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న మీడియా సెంటర్లో భారతీయ స్ట్రీట్ ఫుడ్ రుచిని ఆస్వాదించొచ్చు’అని పర్దేశి వివరించారు. ప్రపంచదేశాల నేతల సతీమణుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. ‘నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో షాపింగ్ అనుభవంతో కూడిన భారతీయ ప్రసిద్ధ హస్తకళల వారసత్వంపై లైవ్ షోలు ఏర్పాటుచేశాం. నేతలు, ప్రతినిధులకిచ్చే బహుమతుల ఎంపికలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం’అని చెప్పారు. ‘ప్రపంచ నాయకులకిచ్చే బహుమతులు గౌరవభావాన్ని పెంచేలా, వారి మనస్సును ఆకట్టుకునేలా ఉండాలని ప్రధాని చెప్పారు. ఆ మేరకు తివాచీలు, హస్తకళల వస్తువులు, పెయింటింగ్ల వంటి వాటితో జాగ్రత్తగా తయారు చేసిన జాబితాను అందజేశాం’అని తెలిపారు. శిఖరాగ్రానికి వివిధ దేశాల నుంచి 10 వేల మందికి పైగా తరలిరానున్నారని పర్దేశి చెప్పారు. ‘శిఖరాగ్రంలో చివరి సెషన్లో జీ20 తదుపరి అధ్యక్ష హోదాలో బ్రెజిల్ లాంఛనప్రాయంగా బాధ్యతలను చేపడుతుంది. నవంబర్ 30వ తేదీన ప్రధాని బ్రెజిల్కు వెళ్లి బాధ్యతలను అప్పగించే అవకాశం లేకపోవడంతో ఈ మేరకు నిర్ణయించారు’అని పర్దేశి చెప్పారు. -
8న ప్రధాని మోదీతో బైడెన్ భేటీ
వాషింగ్టన్: జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత్ రానున్న అధ్యక్షుడు బైడెన్ ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారని వైట్ హౌస్ తెలిపింది. భారత్ అధ్యక్షతన ఈ నెల 9, 10వ తేదీల్లో జీ20 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ‘జీ20 సదస్సులో పాల్గొనేందుకు సెప్టెంబర్ 7వ తేదీన అధ్యక్షుడు బైడెన్ ఢిల్లీకి చేరుకుంటారు. 8న ప్రధాని మోదీతో ఆయన సమావేశమవుతారు’ అంటూ వైట్ హౌస్ శుక్రవారం రాత్రి బైడెన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్లో వివరించింది. 9, 10వ తేదీల్లో జరిగే జీ20 శిఖరాగ్ర భేటీల్లో ఆయన పాల్గొంటారు. ఇతర జీ20 భాగస్వామ్య దేశాల నేతలతో ఆయన క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్, వాతావరణ మార్పులను నిలువరించడం వంటి అంతర్జాతీయ అంశాల్లో ఉమ్మడి ప్రయత్నాలపై చర్చిస్తారని వైట్ హౌస్ తెలిపింది. 10న వియత్నాంకు బయలుదేరి వెళతారని పేర్కొంది. -
ఆ పాప నా మనవరాలే : బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుటుంబ వ్యవహారంపై గత కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చకు ఆయన ఎట్టకేలకు తెర దించారు. నేవీ జాన్ రాబర్ట్స్ అనే నాలుగేళ్ల చిన్నారి తన మనవరాలేనని అంగీకరించారు. ఆ పాప తన ఏడవ మనవరాలని ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘‘ నా కుమారుడు హంటర్ బైడెన్, లండెన్ రాబర్ట్లకు 2018లో కలిగిన సంతానమే చిన్నారి నేవీ. హంటర్, లండెన్లు తమ కుమార్తె క్షేమం కోసం వారిద్దరి మధ్య సంబంధాలను పెంపొందించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని ఆ ప్రకటనలో చెప్పారు. ఇదేమీ రాజకీయ వ్యవహారం కాదని, కుటుంబ వ్యవహార మని స్పష్టం చేశారు. నేవీతో పాటుగా తమ మనవలు, మనవరాళ్లు అందరికీ అంతా మంచి జరగాలని తాను, జిల్ బైడెన్ కోరుకుంటున్నామని బైడెన్ పేర్కొన్నారు. నేవీ రాబర్ట్స్ పెంపకం బాధ్య తలపై తల్లి లండెన్ రాబర్ట్ కోర్టుకెక్కిన సమయంలో వారిద్దరి మధ్య సంబంధం వెలుగులోకి వచ్చింది. అప్పట్లోనే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన కోర్టు నేవీ తండ్రి హంటర్ బైడెనేనని నిర్ధారించింది. హంటర్ బైడెన్ 2021లో తాను రాసిన పుస్తకంలో లండెన్తో సంబంధం గురించి రాశారు. డ్రగ్స్కు బానిసగా ఉన్న సమయంలో ఆమె తన జీవితంలోకి వచ్చిందని ఆ తర్వాత ఆమెని మర్చిపోయానని ఆ పుస్తకంలో రాశారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు పాప బాధ్యతను తాను కూడా తీసుకున్నానని అందులో రాసుకొచ్చారు. ఇంత జరిగినా అధ్యక్షుడు బైడెన్ ఈ వ్యవహారంపై స్పందించకపోవడం చిన్నారి నేవీని మనవరాలిగా స్వీకరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బైడెన్ ఈ ప్రకటన చేశారు. -
మా దగ్గరా బోలెడు క్లస్టర్ బాంబులు
కీవ్: ఉక్రెయిన్కు అమెరికా విధ్వంసకర క్లస్టర్ బాంబులను సరఫరా చేయడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. తమ వద్ద కూడా క్లస్టర్ బాంబుల నిల్వలు దండిగా ఉన్నాయని ప్రకటించారు. ఈ వివాదాస్పద ఆయుధాలను ఉక్రెయిన్ వాడిన పక్షంలో తగు రీతిలో స్పందించే హక్కు తమకుందని హెచ్చరించారు. ‘మా వద్ద క్లస్టర్ బాంబులు ఉన్నప్పటికీ ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు వాటిని వాడలేదు. అటువంటి అవసరం కూడా మాకు రాలేదు’ అని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ ఇప్పటికే క్లస్టర్ బాంబులను వాడినట్లుగా పలు ఆధారాలను అసోసియేటెడ్ ప్రెస్, అంతర్జాతీయ మానవతావాద సంస్థలు చూపుతున్నాయి. రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో, యుద్ధక్షేత్రంలో రష్యా ఆర్మీపై ఉక్రెయిన్ పైచేయి సాధించాలంటే విధ్వంసకర క్లస్టర్ బాంబులే మార్గమని అమెరికా అంచనా వేస్తోంది. క్లస్టర్ బాంబుల సరఫరాపై నెలలపాటు అమెరికా మల్లగుల్లాలు పడింది. ఉక్రెయిన్కు వీటిని అందజేయాలన్న నిర్ణయానికే అధ్యక్షుడు బైడెన్ చివరికి మొగ్గు చూపారు. ప్రమాదకరమైనవిగా భావించే క్లస్టర్ బాంబులను చివరిసారిగా అమెరికా 2003లో ఇరాక్ యుద్ధంలో వాడినట్లు చెబుతోంది. ప్రస్తుతం ఆ దేశం వద్ద 30 లక్షల క్టస్టర్ ఆయుధ నిల్వలున్నాయి. డొనెట్స్క్, ఖెర్సన్ ప్రాంతాలే లక్ష్యంగా గత 24 గంటల్లో రష్యా రెండు షహీద్ డ్రోన్లను, రెండు క్రూయిజ్ మిస్సైళ్లను, రెండు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సైళ్లతోపాటు 40 వైమానిక దాడులు, 46 రాకెట్ దాడులు జరిపిందని ఉక్రెయిన్ తెలిపింది. -
బీచ్లో బైడెన్ సందడి.. వైరల్గా ఫొటోలు
డెలావర్: ఊపిరిసలపని పనుల్లో సతమతమయ్యే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డెలావర్ బీచ్లో సందడి చేశారు. 80 ఏళ్ల వయసున్న బైడెన్ భార్య జిల్ బైడెన్, మనవరాలు ఫిన్నెగన్తో కలిసి బీచ్లో కాసేపు సన్ బాత్ తీసుకున్నారు. కుటుంబంతో కలిసి బీచ్లో ఎంజాయ్ చేస్తూ పని ఒత్తిళ్ల నుంచి రిలాక్సయ్యారు. బీచ్కి వెళ్లే వారికి అధ్యక్షుడు వస్తున్నారని సమాచారం కాస్త ముందుగా ఇచ్చారు. దీంతో బీచ్లో అక్కడక్కడా జనం కనిపిస్తూనే ఉన్నారు. అయిదు రోజుల యూరప్ పర్యటనకి వెళ్లడానికి ముందు శనివారం డెలావర్లోని రెహోబాత్ బీచ్కు బైడెన్ వచ్చారు. ఆ రోజు కాస్త సూర్యుడు రావడంతో సన్ బాత్ తీసుకున్న ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. -
బైడెన్కు తీవ్ర నిద్ర సమస్య
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిద్రకు సంబంధించిన స్లీప్ అప్నియా అనే తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నారు. దీంతో, ఆయన కొన్ని రోజులుగా నిద్ర కోసం సీపాప్(కంటిన్యువస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెజర్) అనే యంత్రాన్ని వాడుతున్నారని వైట్హౌస్ అధికారులు తెలిపారు. స్లీప్ అప్నియా సమస్య ఆయనకు దశాబ్దకాలంగా ఉందని తెలిపారు. 2008 నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన తన మెడికల్ రిపోర్టుల్లో వెల్లడిస్తున్నారని కూడా పేర్కొన్నారు. స్లీప్ అప్నియా అనేది సాధారణంగా కనిపించే సమస్య. నిద్రలో ఉన్న సమయంలో గాలి పీల్చుకోవడం తరచూ ఆగిపోతుంటుంది. ఈ సమస్య ఉన్న వారు రాత్రి మొత్తం నిద్రపోయినా పగటి వేళ అలసిపోయినట్లు ఉంటారు. సీపాప్ యంత్రాన్ని అధ్యక్షుడు మంగళవారం రాత్రి కూడా వాడాల్సి వచి్చందని వైట్హౌస్ అధికారులు వివరించారు. షికాగోలో ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు బయలుదేరిన సమయంలో ఆయన ముఖంపై గీతలు కనిపించాయి. సీపాప్ పరికరాన్ని వాడటం వల్లే ఇలా గీతలు పడ్డాయని తెలిపారు. -
భారత్–అమెరికా భాగస్వామ్యానికి ప్రపంచంలో ప్రాముఖ్యత: బైడెన్
వాషింగ్టన్: భారత్–అమెరికా భాగస్వామ్యానికి, స్నేహానికి ప్రపంచంలో అత్యధిక ప్రాముఖ్యత ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా, సన్నిహితంగా, స్థిరంగా ఉన్నాయని వివరించారు. వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నతస్థాయికి చేర్చాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ మేరకు బైడెన్ తాజాగా ట్వీట్ చేశారు. బైడెన్ ట్వీట్ పట్ల ప్రధాని మోదీ స్పందించారు. భారత్–అమెరికా స్నేహం ప్రపంచదేశాల అభ్యున్నతికి తోడ్పతుందని పేర్కొన్నారు. మన భూగోళం మరింత ఉత్తమంగా, స్థిరంగా మారడానికి ఇరుదేశాల భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడుతుందని ట్విట్టర్లో స్పష్టం చేశారు. బైడెన్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని తెలిపారు. ఇటీవల తాను చేపట్టిన పర్యటన భారత్–అమెరికా నడుమ సంబంధ బాంధవ్యాల బలోపేతానికి దోహదపడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్, అమెరికా దేశాల మధ్యనున్న సన్నిహిత, లోతైన భాగస్వామ్యాన్ని మోదీ పర్యటన మరింత దృఢతరం చేసిందని అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్హౌజ్ హర్షం వ్యక్తం చేసింది.