vijayawada
-
అంగన్వాడీ ఆగ్రహ వేడి..
వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల, కొండాపురం రైల్వేస్టేషన్ల వద్ద మహాధర్నాకు వెళ్లనివ్వకుండా అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. కైకలూరు, ఏలూరు రైల్వే స్టేషన్లు, చేబ్రోలు పోలీస్ స్టేషన్ వద్ద అంగన్వాడీలను నిర్బంధించగా, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన అంగన్వాడీలను అశ్వారావుపేట బోర్డర్లో పోలీసులు అడ్డగించారు. కలపర్రు టోల్ గేట్ వద్ద ప్రైవేట్ వాహనాల్లో పెద్ద సంఖ్యలో తరలివెళుతున్న వారిని అడ్డుకుని కిందకు దించేశారు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: మాట తప్పి మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై అంగన్వాడీలు కన్నెర్ర చేశారు. చంద్రబాబూ.. డౌన్డౌన్! కూటమి సర్కారుకు మా సత్తా చూపిస్తాం..! అంటూ కదం తొక్కారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, టోల్ గేట్ల వద్ద పోలీసు నిర్బంధాలు.. గృహ నిర్బంధాలు.. నోటీసులు.. రెడ్బుక్ రాజ్యాంగంలో సర్కారు అణచివేతలకు వెరవకుండా తరలివచ్చి ఉప్పెనలా విరుచుకుపడ్డారు. విజయవాడ ధర్నా చౌక్లో అంగన్వాడీల ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. ఆంక్షలు, అడ్డంకులను దాటుకుని రాష్ట్రవ్యాప్తంగా భారీగా తరలివచ్చిన అంగన్వాడీలతో సోమవారం విజయవాడలో నిర్వహించిన ‘మహాధర్నా’ దద్ధరిల్లింది. కాగా, పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో 11 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్గా పని చేస్తున్న ఓ మహిళను ఉద్యోగం నుంచి తొలగిస్తామని టీడీపీ –జనసేన కూటమి నేతలు బెదిరించడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన ఆమె పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సర్కారు నిర్బంధకాండ.. అంగన్వాడీల మహాధర్నా నేపథ్యంలో కూటమి సర్కారు ఆదేశాలతో ఆదివారం రాత్రి నుంచి వారిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసు నిర్బంధకాండ కొనసాగింది. అంగన్వాడీలను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు సోమవారం రోజు శిక్షణ, రికార్డుల పరిశీలనకు హాజరు కావాలంటూ ప్రభుత్వ యంత్రాంగం హుకుం జారీ చేసింది. అయినప్పటికీ అంగన్వాడీలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులను రంగంలోకి దించింది. వైఎస్సార్, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, నంద్యాల, తిరుపతి, చిత్తూరు, విజయనగరం తదితర జిల్లాల్లో అంగన్వాడీలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. విజయవాడ మహాధర్నాకు వెళ్లడానికి వీల్లేదంటూ నోటీసులు ఇచ్చారు. కైకలూరు, ఏలూరు రైల్వే స్టేషన్లు, చేబ్రోలు పోలీస్ స్టేషన్ వద్ద అంగన్వాడీలను నిర్బంధించారు. జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు చెందిన అంగన్వాడీలను అశ్వారావుపేట బోర్డర్లో పోలీసులు అడ్డగించారు. కలపర్రు టోల్ గేట్ వద్ద ప్రైవేట్ వాహనాల్లో వెళుతున్న వారిని అడ్డగించి కిందకు దించేశారు. నాడు న్యాయబద్ధమేనన్న లోకేశ్ గతంలో ఆందోళన నిర్వహించిన సమయంలో అంగన్వాడీలను కలసిన నారా లోకేశ్ వారు అడుగుతున్నవి న్యాయబద్ధమైనవని, కూటమి ప్రభుత్వం రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ గుర్తు చేశారు. సమస్యల పరిష్కారం కోసం గతంలో 42 రోజులపాటు సమ్మె చేయడంతో వైఎస్సార్సీపీ హయాంలో ఆరు జీవోలు ఇచ్చిందన్నారు. ఒప్పందం ప్రకారం గతేడాది జూన్లోనే వేతనాలు పెంచాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీల డిమాండ్లను అమలు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధికారంలోకి రాగానే అన్యాయమైపోతాయా? గత ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచి్చన అనేక హామీలను అమలు చేసిందని ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. అయితే మిగిలిన ఒప్పందాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం దగా చేస్తోందని ధ్వజమెత్తారు. గ్రాట్యుటీ, మట్టి ఖర్చులు వంటి అనేక హామీలకు కోతలు పెట్టి మభ్య పెడుతోందన్నారు. ప్రతిపక్షంలో ఉండగా అంగన్వాడీల డిమాండ్లు న్యాయమేనని అనిపించిన కూటమి నేతలకు అధికారంలోకి రాగానే అన్యాయమైపోతాయా? అని నిలదీశారు. నాడొక మాట.. నేడొక మాట కాకుండా హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. నెలాఖరులో జరిగే రివ్యూలు ఆగమేఘాలపై..అంగన్వాడీలు విజయవాడలో మహాధర్నాకు హాజరుకాకుండా కుట్రలకు తెరతీసిన కూటమి ప్రభుత్వం నెలాఖరులో జరిగే సమీక్ష కార్యక్రమాలను అప్పటికప్పుడు తెరపైకి తెచ్చింది. అయినా కడప, బద్వేలులోని ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు కదం తొక్కారు. 2022లో సుప్రీం కోర్టు గ్రాట్యుటీ విషయంలో అంగన్వాడీలకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా అమలు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. మైదుకూరులోని తహసీల్దార్ కార్యాలయం, ప్రొద్దుటూరులోని అర్బన్ సీడీపీవో కార్యాలయం, జమ్మలమడుగు ఐసీడీఎస్ కార్యాలయం, ఎర్రగుంట్ల, కమలాపురం తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంగన్వాడీలు విజయవాడలో మహాధర్నాకు హాజరు కాకుండా ఉయ్యూరు రూరల్ మండలంలో ఐసీడీఎస్ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అంగన్వాడీలకు శిక్షణ, రివ్యూ పేరుతో సోమవారం పెదవోగిరాల ఎంపీపీ పాఠశాలలో సమావేశం నిర్వహించి మమ అనిపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆకునూరు సెక్టర్ రివ్యూ నిర్వహించినట్టు కంకిపాడు ప్రాజెక్టు సీడీపీవో బేబీ సుకన్య తెలిపారు. అంగన్వాడీలను అడ్డుకోవడమే లక్ష్యంగా రివ్యూ నిర్వహించారని ట్రేడ్ యూనియన్ నాయకులు విమర్శించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసుల నిర్బంధకాండను ప్రజా సంఘాలు ఖండించాయి. అక్రమ అరెస్టులపై అంగన్వాడీలు విజయనగరం కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.ఇవీ ప్రధాన డిమాండ్లు...» అంగన్వాడీలకు నెల వేతనం రూ.26 వేలకు పెంచాలి. » గ్రాట్యుటీ చెల్లింపు హామీని అమలు చేయాలి. » మినీ అంగన్వాడీలను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ వెంటనే జీవో ఇవ్వాలి. » రాజకీయ జోక్యాన్ని అరికట్టి హెల్పర్ల పదోన్నతులపై నిర్దిష్ట మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలి. » సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదం తొలగించి సంక్షేమ పథకాలను అంగన్వాడీలకు వర్తింపచేయాలి. » సర్వీసులో ఉంటూ చనిపోయిన వారికి మట్టి ఖర్చులకు రూ.20 వేలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. సమ్మెకాలంలో మృతి చెందిన వారికి కూడా ఇవి వర్తింపజేయాలి. » పెండింగ్లో ఉన్న అంగన్వాడీల అద్దెలు, టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి. అన్ని యాప్లను కలిపి ఒకే యాప్గా మార్పు చేయాలి. » పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. » మెనూ చార్జీలను పెంచాలి. » ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలి. » వేతనంతో కూడిన మెడికల్ లీవ్ కనీసం మూడు నెలలు ఇవ్వాలి. » ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలి. ఐదు సంవత్సరాల పిల్లలందరూ అంగన్వాడీ కేంద్రాలలో ఉండేలా జీవో ఇవ్వాలి. ప్రీ స్కూల్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలనే డిమాండ్ను తక్షణం అమోదించి అమలు చేయాలి. రెడ్ బుక్ పాలనపై కళ్లకు గంతలతో నిరసన» రెడ్బుక్ పాలన నశించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అంబేడ్కర్ సెంటర్లో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. హామీలను వెంటనే అమలు చేయాలని నినదించారు. » అంగన్వాడీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ.. కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరులో తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. » తొమ్మిది నెలలుగా హామీలను అమలు చేయకపోవడం, పోలీస్ నిర్బంధాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏలూరు జిల్లా చింతలపూడిలో అంగన్వాడీలు ప్రదర్శన చేపట్టారు. బోసు బొమ్మ సెంటర్లో రాస్తా రోకో చేశారు. -
మాకు న్యాయం జరిగేవరకు మా పోరాటం ఆగదు.. బాబుపై అంగన్వాడీ వర్కర్లు ఫైర్
-
‘డౌన్ డౌన్ చంద్రబాబు.. మా సత్తా ఏంటో చూపిస్తాం’
ఎన్టీఆర్ జిల్లా, సాక్షి: వేతనాల పెంపు డిమాండ్తో అంగన్వాడీలు చేపట్టిన విజయవాడ మహా ధర్నా.. కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మారుమోగుతోంది. చంద్రబాబూ.. డౌన్ డౌన్.. కూటమి సర్కార్కు మా సత్తా ఏంటో చూపిస్తామంటూ నినాదాలతో విజయవాడ మారుమోగుతోంది. అంతకు ముందు.. ఛలో విజయవాడ ధర్నాను అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించారు. ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు తనిఖీలు నిర్వహించారు. అయినప్పటికీ రాష్ట్రం నలుమూలలా నుంచి అంగన్వాడీలు తరలి వచ్చారు. వేతనాల పెంపు సహా పలు సమస్యల పరిష్కార డిమాండ్లతో అంగన్వాడీలు సోమవారం (మార్చి 10న) ఛలో విజయవాడ ధర్నా నిర్వహించ తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు తమ గుప్పిట పెట్టుకున్నారు. అంగన్వాడీలను ఎక్కడికక్కడే అడ్డుకుంటూ నిరంకుశంగా వ్యవహరించారు. కానీ.. 👉టియర్ గ్యాస్ వాహనంతో..పోలీసుల వలయం దాటి.. విజయవాడకు ఇప్పటికే భారీగా చేరుకున్న అంగన్వాడీలు మహా ధర్నాకు సిద్ధమయ్యారు. అలంకార్ సెంటర్కు అంగన్వాడీలు చేరుకోవడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ సంఖ్యలో మహిళా పోలీసులు, సిబ్బంది మోహరించారు. రోడ్డు బ్లాక్ చేసి ఎవరిని ముందుకు కదలనివ్వడం లేదు. ఈ క్రమంలో.. టియర్ గ్యాస్ వాహనం సైతం అక్కడ కనిపించడం గమనార్హం. అయితే ధర్నాను అడ్డుకుంటే తమ సత్తా చూపిస్తామంటూ అంగన్వాడీలు చెబుతున్నారు.👉రైళ్లోంచి బలవంతంగా.. అనంతపురం నుంచి అంగన్వాడీలు రైలులో విజయవాడకు బయల్దేరారు. అయితే..వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల స్టేషన్లో కార్యకర్తలతో పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. బలవంతంగా వాళ్లను బయటకు దించేశారు. ఈ క్రమంలో చంద్రబాబు డౌన్.. డౌన్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.👉మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ లో పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ప్రతి వాహనాన్ని.. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. -
పోసానిపై ఆగని వేధింపులు.. మరో పీఎస్కు తరలింపు
కర్నూలు/ఎన్టీఆర్, సాక్షి: పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)పై కూటమి సర్కార్ వేధింపులు ఆగడం లేదు. కూటమి పార్టీల నేతలు పెట్టిన కేసుల్లో ఆయనకు వరుసగా ఊరటలు దక్కుతుండడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన్ని ఇంకో కేసులో ఇప్పుడు మరో పీఎస్కు తరలిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నరసరావుపేట పోలీసుల కస్టడీ పిటిషన్ను కోర్టు రద్దు చేసింది. దీంతో ఆగమేఘాల మీద విజయవాడ భవానీపురం పోలీసులు కర్నూల్ జైలుకు చేరుకున్నారు. ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్(PT Warrant) కింది పోసానిని హైదరాబాద్ మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు. సాయంత్రంలోగా ఆయన్ని విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది. కోర్టులో లేదంటే మెజిస్ట్రేట్ ఎదుట పోసానిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రిమాండ్ విధిస్తే గనుక విజయవాడ జైలుకు పోసానిని తరలిస్తారు. లేదంటే మళ్లీ కర్నూలు జైలుకే తరలిస్తారు. ఈ కేసు చాలా ముఖ్యమైందని చెబుతూ కోర్టు నుంచి భవానీపురం పోలీసులు పీటీ వారెంట్ పొందారు.ఇదిలా ఉంటే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు. పోసానిని హైదరాబాద్లోని నివాసంలో అరెస్ట్ చేసి.. ఆ మరుసటి రోజు ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. అటుపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్ జిల్లా ఆదోనీ పీఎస్లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్ కింద ఆయన్ని తరలించారు. ఈ కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన వేసిన పిటిషన్లపై తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్ విచారణ దశలో ఉంది. -
అక్రమ కేసులకు భయపడేది లేదు
విజయవాడ స్పోర్ట్స్: అక్రమ కేసులకు తాము భయపడబోమని హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడినా, ప్రజావ్యతిరేక విధానాలను విమర్శించినా, సభలు, సమావేశాలు పెట్టినా అక్రమ కేసులు నమోదు చేస్తూ కూటమి ప్రభుత్వం పాలనను నెట్టుకొస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక ఎల్రక్టానిక్ మీడియా చానల్ చర్చలో మైనర్ బాలిక పేరును గోరంట్ల మాధవ్ ప్రస్తావించారని, ఇది బాలిక హక్కుల రక్షణకు భంగం కలిగిస్తుందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ విజయవాడ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో యాక్ట్, బీఎన్ఎస్ 72, 79 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం మాధవ్ గురువారం విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. మాధవ్ను సైబర్ క్రైం స్టేషన్ సీఐ శ్రీను మధ్యాహ్నం 12.40 నుంచి 1.25 గంటల వరకు విచారించారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని గతంలోనే నోటీసులు పంపితే ఎందుకు స్పందించలేదు?, మైనర్ బాలిక పేరును చర్చలో ఎందుకు ప్రస్తావించారు?, బాలిక పేరు ప్రస్తావించడం తప్పని మీకు తెలీదా? అని సీఐ ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కేసులో విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని, సాక్షులను బెదిరించవద్దని సూచించి మాధవ్ను పోలీసులు పంపించినట్లు తెలిసింది. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు ఒగ్గు గవాస్కర్, సాయిరాం తదితరుల సమక్షంలో మాధవ్ పోలీసు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులతో వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్సార్సీపీ నాయకులను అడ్డుకోవాలనుకోవడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా పక్కనపెట్టి కేవలం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించడం పైనే కూటమి నాయకులు దృష్టి సారించారని మండిపడ్డారు. ప్రజలపై కూటమి నాయకులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదని విమర్శించారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనపై రాష్ట్ర ప్రజలు ఇప్పటికే విసుగు చెందారని, ఇకపై జరిగే ఎన్నికల్లో ఆయన గెలిచేది లేదని, వైఎస్ జగన్ ఓడేది లేదన్నారు. -
రెండే నెలలు గడువు.. లేకపోతే సమ్మె
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైనా హామీలు అమలు చేయకపోవడంపై ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేలా రెండు నెలల్లో జీవోలు జారీ చేయాలని, లేకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు గురువారం విజయవాడలో భారీ ధర్నా నిర్వహించారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ ధర్నాకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆశాలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోశమ్మ, ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు, కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా అశా వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. పని ఒత్తిడితో ఆశా వర్కర్లు అనారోగ్యం పాలవుతున్నా సెలవులు ఇవ్వడం లేదన్నారు. మెటర్నిటీ లీవులు కూడా ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పని ఒత్తిడి, వెట్టిచాకిరీ వల్ల ఆనారోగ్యం బారినపడి ఇటీవల కాలంలో అనేక మంది ఆశా వర్కర్లు ప్రాణాలు కోల్పోయారన్నారు. బీమా కంపెనీలకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో క్లెయిమ్లు నిలిచిపోయాయని, బాధిత కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక సాయం అందక రోడ్డునపడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక్క పైసా కూడా ఇప్పటివరకు చెల్లించడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర నాయకులు ఎ.కమల, ఎ.వెంకటేశ్వరరావు, పద్మ, రాఘవమ్మ, ధనశ్రీ, లక్ష్మి, సౌభాగ్య, సుభాషిణి, అమర, సుధారాణి, పార్వతి, రమణకుమారి, గంగా, జ్యోతి, వెంకటలక్ష్మి, వెంకటేశ్వరమ్మ, వాణిశ్రీ, తదితరులు మాట్లాడారు. -
విజయవాడలోని ధర్నా చౌక్ కు భారీగా చేరుకున్న ఆశా వర్కర్లు
-
తాడో పేడో తేల్చుకుంటాం.. విజయవాడకు భారీగా చేరుకున్న ఆశావర్కర్లు
సాక్షి, విజయవాడ: ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకొనేందుకు ఆశావర్కర్లు సిద్ధమవుతున్నారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. గత సమ్మె కాలంలో ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాలపై జీవోలు విడుదల చేయాలని ఆశావర్కర్లు కోరుతున్నారు. ఇప్పటికే రెండు రోజుల పాటు ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.గురువారం.. అన్ని జిల్లాల నుంచి ధర్నా చౌక్కు భారీగా చేరుకున్న ఆశా వర్కర్లు.. రోడ్లపై సైతం కార్పెట్లు వేసుకుని ఎండలో ధర్నాకు దిగారు. ఆశా వర్కర్ల కదలికలపై డ్రోన్లు, ఇంటిలిజెన్స్ బృందాల ద్వారా పోలీసులు నిఘా పెట్టారు. ధర్నాచౌక్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.దాదాపు 10 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంటుందని యూనియన్ నాయకులు అంటున్నారు. ఆర్ముడ్ రిజర్వ్, సివిల్, ర్యాపిడ్ యాక్షన్ టీంలను పోలీసులు సిద్ధం చేశారు. ఏడీసీపీ, ఏఎస్పీ, ముగ్గురు డిఎస్పీలు, నలుగురు సీఐలు, ఇతర సిబ్బందితో భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్వష్టమైన ప్రకటన చేస్తే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఆశా వర్కర్లు చెబుతున్నారు. -
పవన్ను కలిసినా జరగని న్యాయం.. తల్లి,కుమార్తె ఆత్మహత్యాయత్నం
సాక్షి,విజయవాడ : అదనపు కట్నం కోసం అత్తింటి అరళ్లు వేగలేకపోతున్నా న్యాయం చేయాలని ఓ బాధితురాలు హోంమంత్రి, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేని అర్జించింది. వాళ్లు పట్టించుకోకపోవడంతో తనకు ఇక చావే శరణ్యమనుకుంది. కుమార్తెతో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటనలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకి ఏం జరిగిందంటే?విజయవాడలో ఆడపిల్లలు పుట్టారని కారణంగా చూపిస్తూ సుభాషిణి అనే మహిళను అత్తమామలు, భర్త, మరిది వేధింపులకు గురి చేసేవారు. ఆ వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లింది. సుభాషిణి తన కుమార్తె (మైనర్)తో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది.ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. ఆడపిల్లలు పుట్టారని అదనపు కట్నం కోసం నా భర్త , అత్తమామలు, మరిది వేధిస్తున్నారు. నా భర్తను ఏడాది నుంచి మా ఇంటికి రానివ్వడం లేదు. నన్ను వదిలించుకోవడానికి గతంలో పిచ్చెక్కిందని పిచ్చాసుపత్రిలో చేర్పించారు. జనసేన కార్యాలయం చుట్టూ పది సార్లు తిరిగా. పవన్ కళ్యాణ్ను ఓ అన్నలా భావించా. న్యాయం జరుగుతుందనుకుని జనసేన కార్యాలయం చుట్టూ తిరిగా. ఓ పవన్ అభిమానిగా న్యాయం జరుగుతుందని నేను ఆశించా. ఆయన అపాయింట్మెంట్ కోసం ఎంతో ప్రయత్నించా ..దొరకనివ్వలేదు. ఫ్యామిలీ మ్యాటర్లో మేం ఇన్వాల్వ్ అవ్వమన్నారు. న్యాయం కోసం హోంమంత్రి అనితను కలిశా. అక్కడ న్యాయం జరగలేదు. జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ... నా సమస్య తీర్చమని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాకు అప్పగించారు.బోండా ఉమా నా సమస్య తీర్చమని విక్రమ్ పబ్లిషర్స్ చక్రవర్తి దగ్గరకు పంపించారు. విక్రమ్ పబ్లిషర్స్ చక్రవర్తి నన్ను బెదిరించి .. తీవ్ర దూర్భషలాడారు. మేం ఉన్నంత వరకూ నీకు న్యాయం జరగదని చక్రవర్తి బెదిరించారు. నాకు న్యాయం జరగట్లేదు కాబట్టి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాం’ అని వాపోయారు. -
వంశీని మెంటల్గా డిప్రెషన్కు గురిచేస్తున్నారు: పంకజశ్రీ
సాక్షి, విజయవాడ: జైల్లో వల్లభనేని వంశీతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి, వంశీ సతీమణి పంకజశ్రీ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో పంకజశ్రీ మాట్లాడుతూ.. వంశీకి ఆస్తమా ఉందని.. నిన్న కోర్టుకి వచ్చినపుడు కూడా నీరసంగా ఉన్నారన్నారు.‘‘ఆయనకు కనీసం కూర్చోటానికి ఒక చైర్ కూడా ఇవ్వటం లేదు. మనిషికి కావాల్సిన మినిమం బేసిక్స్ ప్రొవైడ్ చేయాలి. వంశీని మెంటల్గా డిప్రెషన్కు గురిచేయాలనుకుంటున్నారు. ఇలా చేయటం తప్పు కాదా?. వంశీ మీద రూల్స్ ప్రకారం ఒక్క కేసు లేదు, ఎందుకు ఈ కక్ష సాధింపు. అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం సరికాదు. అధికారంలో ఉంటే ఏమైనా చేయవచ్చా. వంశీని ఇబ్బందులు పడుతున్నారు’ అని పంకజశ్రీ ఆవేదన వ్యక్తంచేశారు.చంద్రబాబు కుటిల రాజకీయం: ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్చంద్రబాబు కుటిల రాజకీయం ప్రజలకు అర్థమైంది. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేక నీచ రాజకీయాలు చేస్తున్నాడు. సత్యవర్ధన్ కిడ్నాప్ జరగలేదు. సత్యవర్ధన్ వాంగ్మూలంలో వంశీకి ఎటువంటి సంబంధం లేదని తేలిపోయింది. 10 తేదీన జడ్జి ముందు వాంగ్మూలం ఇస్తే. 11వ తేదీన కిడ్నాప్ చేశారని వీడియో విడుదల చేశారు. 2004లో గన్నవరానికి వంశీ రాకముందున్న కేసులు కూడా వంశీకి చంద్రబాబు ఆపాదించారు. ఒక సూట్ పెండింగ్ ఉండి, ఒక కుటుంబానికి సంబంధించిన కేసు, వంశీకి ఎటువంటి సంబంధం లేని కేసులో వంశీని ప్రథమ ముద్దాయిగా పెట్టారు. 21 సంవత్సరాల తర్వాత క్రిమినల్ కేసు పెట్టారు. ఇది తప్పుడు సంస్కృతిఒక టీడీపీ నాయకుడు గన్నవరం వద్ద కెనాల్ ప్రాంతాన్ని ఆక్రమిస్తే లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా ఆ నిర్మాణాన్ని తొలగించారు. కలెక్టర్ లెటర్ ఇచ్చినా దానిని తప్పు దోవ పట్టించి... వంశీ పై కేసు పెట్టారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ క్వారీ ఎవరు పెట్టారు?. 2015లో టీడీపీ ప్రభుత్వంలో ఆ క్వారీ పెట్టారు. క్వారీ ల్యాండ్ను జియోకాన్ కంపెనీకి కట్టబెట్టారు. అప్పుడు కేసులు చంద్రబాబు మీద పెట్టాలి. ఈ కేసులన్నీ చూస్తే కేవలం వంశీని ఇబ్బంది పెట్టాలని చేసిన ప్రయత్నమే. తాటికాయంత అక్షరాలతో పచ్చ మీడియా నీతులు వల్లించే కార్యక్రమం చేస్తుందిహోమ్ మినిస్టర్ అనిత ఆడబిడ్డలను అమ్మ అని పిలిస్తే వారి భర్తలు ఏం అవుతారు...అని బూతులు అర్థం వచ్చే మాటలు మాట్లాడుతున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడే మాటలు బూతులు కాదా?. కూన రవికుమార్, అచ్చెన్నాయుడు, రాయపాటి అరుణ, గాయత్రీ వీరందరి మాటలు బూతులు కాదా?. జబర్దస్త్ నటులతో డిబేట్లు పెట్టి బూతులు తిట్టించారు. వంశీ భార్య గురించి బూతులు మాట్లాడారు.. వీరు మాట్లాడేవన్నీ బూతులు.. చేసే పనులన్నీ దుర్మార్గాలు. పవన్ కల్యాణ్ కొడుకులు అంటే బూతు కాదా?.. లోకేష్ బూతులు మాట్లాడితే నీతులుగా కనిపిస్తున్నాయా..?.కమ్మ సామాజిక వర్గంలో బలమైన గొంతు గల నాయకుడిగా లోకేష్ను పైకి తేవాలంటే అదే సామాజిక వర్గంలో ఉన్న వేరే నాయకుడిని తొక్కేయాలని చూస్తున్నారు. పోలీసులు వీరికి భాగస్వాములుగా చేస్తున్న కుట్రలపై న్యాయపరంగా పోరాడుతున్నాం. కూటమిలో పైన పొత్తులు లోపల కత్తులు పెట్టుకొని ఒకరికి ఒకరికి పడక లోకేష్ ను పైకి తేవాలి, సూపర్ సిక్స్ హామీలు తప్పించుకోవాలని చూస్తున్నారు. వంశీకి వైఎస్సార్షీపీ పార్టీ అండగా ఉంటుంది. వంశీ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. -
సత్య వర్ధన్కు నార్కో టెస్ట్లు చేయిస్తే నిజాలు బయటకొస్తాయి.. కోర్టులో వంశీ
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi) పోలీసు కస్టడీ ముగిసింది. కస్టడీ అనంతరం పోలీసులు వంశీని విజయవాడ జిల్లా కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ వద్ద వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు.సత్య వర్ధన్కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తే ఈ కేసులో అసలు నిజాలు బయటకు వస్తాయన్నారు. తనను కేసుతో సంబంధం లేని ప్రశ్నలు అడిగారని న్యాయమూర్తికి తెలిపారు. జైల్లో తనను ఒంటరిగా సెల్లో ఉంచారని,తనకు ఆస్తమా సమస్య ఉందని ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఇబ్బందని అని అన్నారు. అందుకే తనతో పాటు వేరే వారిని కూడా సెల్లో ఉంచాలని కోరారు.వంశీ విజ్ఞప్తిపై స్పందించిన న్యాయమూర్తి ఇప్పటికే మీకు దగ్గరలో అటెండర్ సౌకర్యం కల్పించారు కదా? అని ప్రశ్నించారు. అందుకు వంశీ భద్రత దృష్ట్యా మాత్రమే సెల్లో ఒంటరిగా ఉంచామని జైలు అధికారులు వివరణిచ్చారు. హెల్త్ పరిశీలనకు ఒక వార్డెన్ను ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని చెప్పారు. దీంతో వంశీతో పాటు వేరే వారిని సెల్ ఉంచేందుకు న్యాయమూర్తి జైలు అధికారులకు జారీ చేశారు. -
మల్లాది విష్ణు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన YS జగన్
-
మల్లాది విష్ణు కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్ (ఫోటోలు)
-
మల్లాది విష్ణు కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహం నేడు(ఆదివారం) ఎస్ఎస్ కన్వెన్షన్స్లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు.వైఎస్ జగన్కు మల్లాది విష్ణు, ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. వివాహ మండపం వద్దకు చేరుకున్న వైఎస్ జగన్.. వధూవరులు లక్ష్మీ చంద్రిక, తనికెళ్ల వేంకట సుబ్రహ్మణ్య సాయి కిరణ్లకు శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీర్వదించారు. వివాహ వేడుకకు వైఎస్సార్సీపీ నేతలు హాజరయ్యారు. -
వల్లభనేనీ వంశీతో ములాఖత్.. జైలు సిబ్బందిపై విమర్శలు
సాక్షి,విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేనీ వంశీ వ్యవహారంలో జైలు సిబ్బంది తీరుపై విమర్శలు వెల్లువెత్తతున్నాయి. శుక్రవారం విజయవాడ జిల్లా జైల్లో ఉన్న వల్లభనేనీ వంశీతో మూలఖత్ అయ్యేందుకు జైలు వద్దకు ఆయన సతీమణి పంకజ శ్రీ, మాజీ మంత్రి పేర్ని నాని, వైస్సార్సీపీ డాక్టర్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివ భారత్ రెడ్డిలు వచ్చారు. అయితే, వంశీతో ములాకత్ అయ్యేందుకు వచ్చిన వంశీ సతీమణితో పాటు వైఎస్సార్సీపీ నేతల్ని జైలు సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తాము నిబందనల ప్రకారం ములాఖాత్ కోసం వస్తే ఎందుకు అడ్డుకున్నారని వైఎస్సార్సీపీ నేతలు జైలు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సమయం ముగుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేయడంతో జైలు సిబ్బంది అరగంట తరువాత ములాఖాత్ కోసం లోపలికి పంపించారు. -
ఎత్తైన పంచముఖ మహాశివలింగం, కొలువైన శివపరివారం ఎక్కడో తెలుసా?
36 అడుగుల పంచముఖ మహాశివలింగం 12 అడుగుల ఎత్తులో నందీశ్వరుడు, 40 అడుగుల ఎత్తున్న ఓంకార స్థూపం, అర్ధనారీశ్వరుడు, దత్తాత్రేయుడు, హరిహరుడు, శివపరివారం విగ్రహాలు ఇవన్ని ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా.. అదేనండీ అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ కొలువైన విజయవాడ మొగల్రాజ పురంలోని శివగిరిపైన కొలువుదీరి భక్తులతో పూజలందుకుంటున్నాయి. శివపరివారాన్ని సాధారణంగా చిత్రపటాల్లోనే చూస్తు ఉంటాం కాని ఇక్కడ విగ్రహాల రూపంలో శివ పరివారాన్ని దర్శించుకోవచ్చు. అదెక్కడంటే విజయవాడ మొగల్రాజపురంలోని శ్రీవాగ్దేవీ జ్యోతిర్లింగ క్షేత్రం (శివగిరి)పై 36 అడుగుల ఎత్తు ఉన్న పంచముఖ మహాశివలింగం, శివలింగానికి ఎదురుగా 12 అడుగుల ఎత్తులో నందీశ్వరుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. 40 అడుగుల ఎత్తు్తన్న ఓంకార స్థూపం విజయవాడ నగరం మొత్తం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ఇవే కాకుండా 36 అడుగుల పంచముఖ శివలింగం చుట్టూ దాద్వశ జ్యోతిర్లింగాలను శైవాగమం ప్రకారం ప్రతిష్టించారు. శివగిరిపైన శివపార్వతులు, కుమారస్వామి, విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, అయ్యప్ప, నంది, శృంగి, భృంగి, అర్ధనారీశ్వరుడు, నందీశ్వరుడు, దత్తాత్రేయుడు, హరిహరుడు, కనకదుర్గ, గజలక్ష్మి, సరస్వతి అమ్మవార్ల విగ్రహాలు కూడా కొలువుతీరాయి. గోశాలతోపాటుగా హోమగుండం కూడా ఉన్నాయి. శ్రీ చక్ర ఆకారంలో అష్టాదశ శక్తిపీఠాలను కూడా శివగిరిపై ప్రతిష్టించారు. (ప్రదోష కాలం అంటే ఏంటి, ప్రదోష పూజ ఎలా చేయాలి?) ఏడు అడుగుల నాగ పడగ, నాగదేవత విగ్రహాలు కూడా ఇక్కడ భక్తులతో పూజులు అందుకుంటున్నాయి. ప్రతి ఏడాది మహా శివరాత్రి రోజున చితాభస్మంతో శివలింగానికి అభిషేకం, కపాల హారతి నిర్వహిస్తుంటారు. ఉజ్జయిని నుంచి నాగసాధువులు, అఘోరాలు వివిధ అఖండాల (అఘోరాలు ఉండే అశ్రమాలు) నుంచి శివగిరిపై పూజలు నిర్వహిస్తారు. శివగిరి కొండపైన మరో వైపున 27 అడుగుల ఎత్తులో అభయ ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. కొండ దిగువ నుంచి ఈ విగ్రహాన్ని చూసినప్పుడు కొండపై నుంచి ఆంజనేయస్వామి భక్తులకు అభయాన్ని అందిస్తున్నట్లుగా ఉంటుంది. పూజ చేస్తున్న ముస్లిం మహిళఎలా వెళ్ళాలంటే...ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల దగ్గర ఉన్న సున్నపుబట్టీల సెంటర్ నుంచి శివగిరిపైకి చేరుకోడానికి మెట్ల మార్గం ఉంది. శివగిరిపైనే పూజలకు అవసరమైన పూజాద్రవ్యాలతో పాటుగా తాగునీటి సౌకర్యం కూడా కల్పించారు. కార్తికమాసం అన్ని రోజులు శివగిరిపై ప్రత్యేక పూజలతో పాటుగా ప్రతిరోజూ అన్నదానం నిర్వహిస్తారు. శివరాత్రి రోజున హిమాలయ నాగసాధువులచే చితాభస్మాభిషేకం, శివకళ్యాణంతోపాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శివరాత్రి నాటితో పాటుగా కార్తికమాసంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలను విజయవాడలోని రహదారులపై ఊరేగింపు జరుగుతుంది. ఈ విధంగా ఊరేగింపు జరుగుతున్న సమయంలో అక్కడ ఉండే ఒక ముస్లిం మహిళ వచ్చి శివుడుకి హారతులు ఇస్తారు. శివగిరిపైన భక్తులు వారి సొంత ఖర్చులతో శివలింగాన్ని ప్రతిష్టించుకోవచ్చునని శివగిరి వ్యవస్థాపకుడు మల్లికార్జునశర్మ చెప్పారు. (అన్నీ వింత సందేహాలే...బుర్ర తిరిగిపోతోంది..!) అంతా శివయ్య మహిమే!మా తల్లిదండ్రులు శివయ్యను పూజించేవారు. నేను వృత్తిరీత్యా న్యాయవాదిని, నాకు ఒకరోజు కలలో స్వామి వారు దర్శనం ఇచ్చి కొండపై పంచముఖ శివలింగాన్ని ప్రతిష్టించు, నీకు సాధ్యం అవుతుంది, అంతా నేను చూసుకుంటా అని చెప్పినట్లుగా అనిపించింది. అప్పటి నుంచి ఇంటి దగ్గర ఉన్న కొండపై ఈ పంచముఖ శివలింగాన్ని ప్రతిష్టించాను. శివయ్యే నా ద్వారా ఇదంతా చేయిస్తున్నాడు. మల్లికార్జున శర్మ, శివగిరి వ్యవస్థాపకుడు మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి శివయ్యను దర్శించుకుని వద్దాం. .పదండి...– కొండిబోయిన సుబ్రమణ్యం – సాక్షి, మొగల్రాజపురం, విజయవాడ తూర్పు -
వల్లభనేని వంశీ పిటిషన్లపై నేడు విచారణ
సాక్షి, విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్లపై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో నేడు విచారణ జరగనుంది. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు వంశీ. అలాగే, ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు అనుమతి కోరుతూ వంశీ మరో పిటిషన్లో పేర్కొన్నారు.గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. తను బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఒక పిటిషన్.. అలాగే, ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు అనుమతి కోరుతూ వంశీ మరో పిటిషన్ వేశారు. ఇదే సమయంలో తనకు బ్యారక్లో బెడ్ అనుమతించాలని పిటిషన్లో కోరారు. ఇదిలా ఉండగా.. వంశీని కస్టడీకి కోరుతూ పటమట పోలీసుల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 10 రోజుల కస్టడీకి కోరుతూ విజయవాడ పటమట పోలీసులు పిటిషన్లో కోరారు. -
జగన్ రాకతో హోరెత్తిన విజయవాడ
-
అభిమాన నేత కోసం పోటెత్తిన జనం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అభిమాన నేత వస్తున్నారని తెలిసి విజయవాడ గాంధీనగర్ జనంతో పోటెత్తింది. అక్రమ కేసులో అరెస్టయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలుసుకొనేందుకు గాంధీనగర్లోని జైలు వద్దకు వచ్చిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు బెజవాడ మొత్తం తరలివచ్చిందా అన్నంతగా జనం వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ఉదయం 10 గంటలకే గాంధీనగర్ కిక్కిరిసిపోయింది. దీంతో పోలీసులు జైలు ప్రాంగణానికి అన్ని వైపులా 100 మీటర్ల దూరంలో బారికేడ్లు పెట్టి ప్రజలను అడ్డుకున్నారు. అయినా అభిమాన నేత వైఎస్ జగన్ వచ్చే వరకు బారికేడ్ల ముందే జనం నిరీక్షించారు. ఆయన జైలు పరిసరాల్లోకి చేరుకోగానే అభిమానులు, మహిళలు జై జగన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ముందుకురికారు. బారికేడ్లను తోసుకొని జైలు ప్రాంగణానికి నలువైపులా ఉన్న దారుల్లోకి చొచ్చుకొచ్చారు. ఊహించనంతగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, జగన్ అభిమానులు రావడంతో పోలీసులు వారిని నియంత్రించలేక చేతులెత్తేశారు.వైఎస్ జగన్ వాహనంలో నుంచి బయటకు వచ్చి వారందరికీ అభివాదం చేయగానే కేరింతలు కొట్టారు. వంశీతో ములాఖత్ అనంతరం తిరిగి వెళ్లే సమయంలోనూ జగన్ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పెద్ద ఎత్తున జనాలు తోసుకురావడంతో వాహనం ముందుకు కదలడం కూడా కష్టంగా మారింది. ఓ దశలో జగన్ సెక్యూరిటీ కూడా వారిని నియంత్రించడానికి తీవ్రంగా కష్ట పడాల్సి వచ్చింది. వైఎస్ జగన్ వారందరినీ ఓపిగ్గా పలకరిస్తూ ముందుకు కదిలారు. -
Little Girl: కల నెరవేరిన వేళ
-
వంశీకి పరామర్శ.. చంద్రబాబు-లోకేష్పై వైఎస్ జగన్ ఫైర్ (ఫొటోలు)
-
ఇదీ బాబు, లోకేష్లు మనస్తతత్వం: వైఎస్ జగన్
ఎన్టీఆర్, సాక్షి: సొంత సామాజిక వర్గ నేతలనే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తుండడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి అక్రమ కేసులతో అరెస్టైన వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైల్లో మంగళవారం పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)ని చంద్రబాబు టార్గెట్ చేయడం వెనుక కారణం ఉంది. తన సామాజిక వర్గానికి చెందిన వంశీ ఎదుగుదలను చంద్రబాబు సహించలేకపోయారు. అందుకే తప్పుడు కేసులు పెట్టారు. ఆ సామాజిక వర్గంలో వాళ్లకు అనుకూలంగా ఉండాలి. లేకుంటే.. వెలివేస్తారు. కుదిరితే ఇలా కేసులతో ఇబ్బంది పెడతారు. అదీ చంద్రబాబు మనస్తతత్వం. తనకన్నా, లోకేష్ కన్నా గ్లామర్ ఉంటే చంద్రబాబు(Chandrababu) సహించలేరు. తమ సామాజిక వర్గంలో ఎవరైనా ఎదుగుతుంటే.. వాళ్లిద్దరూ తట్టుకోలేరు. అందుకే వంశీ అంటే చంద్రబాబుకి అంత మంట. అలాంటి వారిపై తప్పుడు ఫిర్యాదులు చేయించడం.. అక్రమ అరెస్టులు, ట్రోల్ చేయించడం వాళ్లిద్దరి నైజం. ఇందుకు చంద్రబాబు కోసమే పని చేసే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. బాబు మాఫియా రాజ్యం(Babu Mafia) నడుస్తోంది. రేపు దేవినేని అవినాష్ లాంటి వారిని కూడా ఇబ్బంది పెట్టొచ్చు’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
జగన్ మాట్లాడుతుంటే సీఎం సీఎం అంటూ నినాదాలు
-
LIVE:వంశీ అరెస్ట్ పై వైఎస్ జగన్ ప్రెస్ మీట్
-
వంశీతో వైఎస్ జగన్ ములాఖత్..మీడియాపై ఆంక్షలు
-
వంశీతో ముగిసిన జగన్ ములాఖత్.. జైలు బయట ఆంక్షల వలయం
ఎన్టీఆర్, సాక్షి: కూటమి నేతల అక్రమ కేసులతో అరెస్టయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)కి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంశీని పరామర్శించేందుకు మంగళవారం ఉదయం విజయవాడ సబ్ జైలుకు వెళ్లారు. వంశీతో వైఎస్ జగన్ ములాఖత్ అయ్యారు. జరిగిన పరిణామాలన్నీ వంశీని అడిగి తెలుసుకుంటున్నారాయన. జగన్ వెంట వంశీ భార్య పంకజశ్రీ లోపలికి వెళ్లారు. ములాఖత్ ముగిశాక బయటకు వచ్చి వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. జగన్ రాక సందర్భంగా జైలు వద్ద కోలాహలం నెలకొంది. వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు జైలు వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఓవరాక్షన్కు దిగారు. జైలు వద్ద అప్రకటిత ఆంక్షలు అమలు చేస్తున్నారు. బారికేడ్లు ఉంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జైలు పరిసరాలకు 500 మీటర్లలోపు ఎవరినీ ఉండనివ్వకుండా వెళ్లగొడుతున్నారు. తొలుత జైలు వద్దకి వచ్చిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ కారును అడ్డుకుని.. ఆమెను నడుచుకుంటూ వెళ్లాలని పోలీసులు సూచించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు జైలు వద్దకు చేరుకునే ప్రయత్నం చేయగా.. వాళ్లనూ అడ్డుకున్నారు. పోలీసుల ‘అతి’పై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంకోవైపు.. మీడియా ప్రతినిధులను కూడా అక్కడ ఉండనివ్వకుండా పోలీసులు దూరంగా పంపించి వేస్తుండడం గమనార్హం. -
నేడు వంశీని పరామర్శించనున్న వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 18న (మంగళవారం) విజయవాడలో పర్యటించనున్నారు.కూటమి ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసుల్లో అరెస్టయి విజయవాడ గాంధీనగర్లోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉదయం 10.30 గంటల ప్రాంతంలో వైఎస్ జగన్ పరామర్శిస్తారు. -
విజయవాడ : భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)
-
రూ.5 కోట్ల కట్నం సరిపోలేదట.. బెజవాడలో నవవధువుకు వేధింపులు
సాక్షి, విజయవాడ: రూ.5 కోట్లు కట్నం ఇచ్చారు.. అయినా సరిపోలేదంటూ వివాహం జరిగిన రెండు రోజులకే వేధింపులు మొదలయ్యాయి. వేధింపులు తాళలేని ఆ వధువు విజయవాడ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త, మామపై ఐపీసీ సెక్షన్ 498A, వరకట్న నిషేధ చట్టం సెక్షన్ 3,4 ల కింది కేసు నమోదు చేసిన పోలీసులు.. కోర్టుకు హాజరుపరిచారు. తండ్రీ కొడుకులకు 14 రోజుల రిమాండ్ విధించి.. నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపించారు. విజయవాడ ఆర్టీసీలో కంట్రోలర్గా పని చేస్తున్న చెరుకూరి లక్ష్మణరావు కుమారుడు హేమంత్ అజయ్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కర్ణాటక రాయచూర్లోకి చెందిన ప్రసన్నకుమార్ కుమార్తె లక్ష్మి కీర్తనకి అజయ్తో పెళ్లి నిశ్చయించారు. పెళ్లికి ముందు నగదు, స్థిరాస్థులు, బంగారం, వెండి మొత్తం కలిపి సుమారు రూ.5 కోట్లు కట్నంగా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నెల 7న రాయచూర్లో కీర్తన, అజయ్ వివాహం ఘనంగా జరిగింది. అయితే, వివాహం జరిగిన రెండు రోజులకే లక్ష్మి కీర్తనకి కట్నం వేధింపులు మొదలయ్యాయి. మరో రూ.50 లక్షలు తేవాలంటూ అజయ్, లక్ష్మణరావు వేధింపులకు గురిచేశారు. కట్నం కోసం నవ వధువును తండ్రి, కొడుకులు బంధించడంతో... టార్చర్ భరించలేక.. భవానీపురం పోలీసు స్టేషన్లో నవవధువు ఫిర్యాదు చేసింది. -
ఆ గ్రంథాలయం... కోచింగ్ కేంద్రం
తిరుమలరావు కరుకోల, సాక్షి, విజయవాడ కోరుకున్న కొలువులో కుదురుకోవాలనుకునే యువతకు ఆ గ్రంథాలయమే కోచింగ్ సెంటర్. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆలంబనగా ఉంటున్న ఆ గ్రంథాలయం వేలాదిమంది యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోను, ప్రభుత్వ సంస్థల్లోనూ ఉద్యోగులుగా ఎంపికయ్యేందుకు బాటలు వేస్తోంది. అందుకే ఆ గ్రంథాలయాన్ని నిరుద్యోగుల కోచింగ్ సెంటర్ అని ముద్దుగా పిలుస్తుంటారు. ఆ విజ్ఞాన నిలయమే విజయవాడలోని రవీంద్రనాథ్ ఠాగూర్ స్మారక గ్రంథాలయం(Rabindranath Tagore Memorial Library).రెండు పత్రికలతో ప్రారంభంగ్రంథాలయ ఉద్యమ స్ఫూర్తితో స్వాతంత్య్రానంతరం 1955లో విజయవాడ గాంధీనగర్లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్మారక గ్రంథాలయం ప్రారంభమైంది. రెండు దినపత్రికలు, మూడు మాసపత్రికలతో మొదలైన ఈ గ్రంథాలయం రవీంద్రనాథ్ ఠాగూర్ శత జయంతి ఉత్సవాల నాటికి ఠాగూర్ స్మారక గ్రంథాలయంగా రూపాంతరం చెందింది. పీడబ్ల్యూడీ విభాగం ఈ గ్రంథాలయానికి స్థలం కేటాయించింది. నిధుల కొరతతో సకాలంలో నిర్మాణం చేపట్టలేకపోయారు.ఈ దశలో దీనికి కేటాయించిన స్థలాన్ని వెనక్కు తీసుకునే ప్రయత్నాలు జరిగాయి. అయితే, అప్పటి మంత్రి కాకాని వెంకటరత్నం సాహితీ అభిమాని కావడంతో ఆ స్థలం గ్రంథాలయ సంస్థకు దక్కేలా చొరవ తీసుకున్నారు. అందువల్ల ఆయన గౌరవార్థం ఇక్కడి భవనానికి కాకాని పౌర గ్రంథాలయంగా నామకరణం చేశారు. అయితే, అధికారికంగా ఠాగూర్ స్మారక గ్రంథాలయంగానే ప్రభుత్వ రికార్డుల్లో ఉంది.కోచింగ్ కేంద్రాన్ని తలపించే వాతావరణంవిశాలమైన గదులు, విడివిడిగా క్యాబిన్లు, పుస్తకాలు, మాగజీన్లతో కళకళలాడే ర్యాకులు వంటి సౌకర్యాలతో పాటు ప్రశాంత వాతావరణం ఈ గ్రంథాలయం సొంతం. ఈ గ్రంథాలయంలోని స్టడీ హాళ్లు, ఆరుబయట వరండాలు పుస్తకాలతో కుస్తీపడుతున్న నిరుద్యోగులతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. భారీ ఫీజులు చెల్లించి, కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు.సివిల్స్, గ్రూప్–1, గ్రూప్–2, డీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే తదితర పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న యువత ఇక్కడ అందుబాటులో ఉండే పుస్తకాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. పోటీ పరీక్షలకు అవసరమయ్యే మెటీరియల్ను అందుబాటులో ఉంచడం ద్వారా గ్రంథాలయ సిబ్బంది ఇతోధికంగా సహకరిస్తున్నారు. ఈ గ్రంథాలయంలో కంప్యూటర్లను, ఉచిత వైఫైని కూడా ఏర్పాటు చేశారు. కంప్యూటర్ల ద్వారా ఇంటర్నెట్ వాడుకోవడానికి గంటకు ఐదు రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నారు.నాటి దినపత్రికలు.. అరలక్షకు పైగా పుస్తకాలు ఈ గ్రంథాలయంలో 1976 నాటి నుంచి నేటి వరకు తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికలను భద్రంగా బైండ్ చేసి, అందుబాటులో ఉంచారు. దాతల నుంచి సేకరించిన వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాలు సహా ఇక్కడ యాభైవేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ దొరికే అరుదైన పుస్తకాల్లో 1990 వరకు ప్రచురించిన ఆంధ్రప్రదేశ్ గెజిట్ ప్రతులు, 1670–1926 వరకు మద్రాస్ సెయింట్ జార్జ్ నివేదికలు కూడా ఉండటం విశేషం.రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలకు చెందిన పలువురు పీహెచ్డీ స్కాలర్లు సైతం తమకు అవసరమైన సమాచారం కోసం ఇక్కడకు వస్తుంటారు. ఈ గ్రంథాలయంలో వివిధ పుస్తక విభాగాలతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికోసం ప్రత్యేకమైన గది, సమావేశ మందిరం కూడా ఉన్నాయి. ఈ సమావేశ మందిరంలో తరచు సాహితీ కళా సాంస్కృతిక సమావేశాలు, ప్రదర్శనలు జరుగుతుంటాయి. ఇక్కడకు పఠనాభిలాష గల గృహిణులు కూడా ఎక్కువగా వస్తుంటారు. కోచింగ్ సెంటర్లకు వెళ్లి శిక్షణ తీసుకునే స్తోమత లేనివారంతా ఇక్కడి సౌకర్యాల పట్ల అమితానందం వ్యక్తం చేస్తున్నారు.విజేతలకు సన్మానం గత రెండు దశాబ్దాల్లో ఈ గ్రంథాలయంలో చదువుకున్న ఎందరో పోటీ పరీక్షల్లో విజయం సాధించి, ఉద్యోగాలు సంపాదించు కున్నారు. ఇక్కడ చదువుకుని, పోటీ పరీక్షల్లో విజయం సాధించిన వారిని కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఒకే వేదికపైకి తీసుకొచ్చి సన్మానిస్తోంది. ఠాగూర్ గ్రంథాలయం తమలాంటి వారి పాలిట దేవాలయమని నిరుద్యోగులు అభివర్ణిస్తున్నారు. ఎందరో నిరుద్యోగుల కలలను నిజం చేస్తున్న ఠాగూర్ స్మారక గ్రంథాలయం ప్రస్థానం మరిన్ని వసంతాల పాటు విరాజిల్లాలని ఆశిద్దాం. చొరవ అవసరం దాదాపు ఏడు దశాబ్దాల నాటి ఈ గ్రంథాలయ భవనాల ఆధునికీకరణపై దృష్టి సారించాలి. పెరుగుతున్న విద్యార్థుల తాకిడికి అనుగుణంగా కొత్త గదుల నిర్మాణం చేపట్టాలి. పోటీ పరీక్షార్థులు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, బల్లలను ఏర్పాటు చేయాలి. ఈ పనులకు ప్రభుత్వ సçహకారంతో పాటు దాతల చొరవ ఎంతో అవసరం. – రవికుమార్, జిల్లా గ్రంథాలయాల కార్యదర్శి, రమాదేవి, నిర్వాహకురాలు -
జైలులో వంశీకి ప్రాణహాని ఉంది: వల్లభనేని పంకజశ్రీ
సాక్షి, విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని శారీరకంగా బాధపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన సతీమణి పంకజశ్రీ. అలాగే, తప్పుడు కేసులతో వంశీని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వంశీపై మోపిన అభియోగాలన్నీ అవాస్తవాలే అని క్లారిటీ ఇచ్చారు.విజయవాడ సబ్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ఆయన భార్య పంకజశ్రీ శనివారం ములాఖత్ అయ్యారు. వారంలో రెండు సార్లు కుటుంబ సభ్యులకు కలిసే అవకాశం ఉండటంతో ఆమె.. ఈరోజు వంశీని కలిశారు. అనంతరం, పంకజశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ సబ్ జైల్లో వంశీకి ప్రాణహాని ఉంది. వంశీని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. వంశీపై తప్పుడు కేసులు పెట్టారు. వంశీ రిమాండ్లో ఉన్నారు.. కేసులు ఇంకా నిర్ధారణ కాలేదు. తప్పుడు కేసులతో వంశీని వేధిస్తున్నారు. వంశీకి ఎలాంటి వైద్య సదుపాయాలు కల్పించడం లేదు. వంశీ శ్వాస సమస్యతో బాధపడుతున్నారు. వంశీపై మోపిన అభియోగాలన్నీ అవాస్తవాలే.వంశీపై వెన్నపూస నొప్పితో, శ్వాసకోస సమస్యతో ఆయన బాధపడుతున్నారు. వంశీ కింద పడుకుంటున్నారు.. బెడ్ కావాలని రిక్వెట్ చేస్తాం. జైలులో ఎవ్వరినీ కలవనివ్వకుండా చేస్తున్నారు. ఆరోగ్యం బాగాలేని వంశీని.. మెంటల్గా టార్చర్ చేస్తున్నారు. మానసికంగా కుంగదీస్తున్నారు. వంశీ ఉన్న బారక్లో 60 సీసీ కెమెరాలు పెట్టారు. వంశీ ఆరోగ్యం బాగుందంటూ డాక్టర్లతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.ఈ వ్యవహారం మీద కోర్టుకు వెళ్తాం. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫోన్ చేశారు.. నాకు ధైర్యం చెప్పారు. వంశీని కలుస్తానని జగన్ చెప్పారు. మాకు వైఎస్సార్సీపీ అన్ని రకాలుగా అండగా ఉంది. లీగల్ టీమ్ని కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. ఇదే సమయంలో సత్యవర్ధన్ని పోలీసులు అదుపులో తీసుకొని మేజిస్ట్రేట్ ముందు ఎందుకు ప్రవేశపెట్టడం లేదు’ అని ప్రశ్నించారు. -
వల్లభనేని వంశీపై కేసులో కుట్రకోణం: మనోహర్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టులో కచ్చితంగా కుట్ర కోణం ఉందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్రెడ్డి ఆరోపించారు. వల్లభనేని వంశీ అరెస్ట్ అంశంను సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్లు వెనుకుండి నడిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఆధారంగా వంశీని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని అన్నారు. సాంకేతికంగా చూస్తే హైదరాబాద్లో వంశీని అరెస్ట్ చేసి నోటీస్ ఇచ్చే సమయానికి సత్యవర్ధన్ను విచారించలేదని పేర్కొన్నారు. టీడీపీ కక్షసాధింపులకు వత్తాసు పలుకుతున్న పోలీసులను రాబోయే రోజుల్లో న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెడతామని మనోహర్రెడ్డి హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గన్నవరం టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులో వైఎస్సార్సీపీ కార్యకర్తలను దాదాపు 90 మందిని అక్రమంగా ఇరికించారు. టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. అయితే ఫిబ్రవరి 10వ తారీఖున కేసులో ఫిర్యాదు దారుడిగా ఉన్న సత్యవర్ధన్.. తనకు ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని, తనను సాక్షిగా పిలిచి సంతకం చేయించుకున్నారని జడ్జి ముందు వాగ్మూలం ఇచ్చారు.కేసు వెనక్కి తీసుకోవాలని నిన్ను ఎవరైనా బెదిరించారా అని జడ్జి ప్రశ్నించినప్పుడు కూడా నా అంతట నేనే ఇష్టపూర్వకంగానే వచ్చానని సత్యవర్ధన్ చెప్పిన మాటలను జడ్జి రికార్డు చేశారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈ కేసులో ఎలాగైనా ఇరికించాలని భావించిన తెలుగుదేశం నేతలు సత్యవర్ధన్ వాగ్మూలంతో ఉలిక్కిపడ్డారు. సత్యవర్ధన్ కుటుంబ సభ్యులను పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురిచేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రలోభాలు పెట్టారు. ఫిబ్రవరి 12న సత్యవర్ధన్ సోదరుడితో నా తమ్ముడ్ని కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేయించి మరో కేసు పెట్టారు. ఈ కేసు ఆధారంగా ఫిబ్రవరి 13న హైదరాబాద్ వెళ్లి ఎఫ్ఐఆర్ కూడా లేకుండా వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు. ఎఫ్ఐఆర్ అడిగితే చిత్తు పేపర్ మీద అక్కడిక్కడే పెన్నుతో రాసి ఒక నోటీస్ ఆయన చేతుల్లో పెట్టారు.విశాఖలో సత్యవర్థన్ను కాపాడామంటూ కొత్త డ్రామాఫిబ్రవరి 13వ తేదీన సత్యవర్ధన్ను విశాఖలో కాపాడామని పోలీసులు కొత్త డ్రామా మొదలుపెట్టారు. కానీ సీసీ టీవీ వీడియో చూస్తే సత్యవర్ధన్ను బెదిరించి పోలీసులే లాక్కుని వెళ్తున్నట్టు ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది. దీనిలో పోలీసుల పాత్రపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. వంశీని అరెస్ట్ చేసిన తర్వాతనే సత్యవర్ధన్ను పోలీసులు విశాఖ నుంచి తీసుకొచ్చారు. సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు సెక్షన్లు నమోదు చేయాలి. కానీ సాంకేతికంగా చూస్తే సత్యవర్ధన్ను విచారించకుండానే వంశీకి నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.ఇదీ చదవండి: అధికారముందనే అహంకారమా?: వంశీ అరెస్ట్పై వైఎస్ జగన్ ఫైర్వంశీని అరెస్ట్ చేసిన తర్వాతనే పోలీసులు విశాఖలో సత్యవర్ధన్ను పట్టుకొచ్చారని అర్థమవుతోంది. ఇదంతా చూస్తుంటే చాలా క్లియర్గా వంశీని కేసులో ఇరికించడానికే టీడీపీ పన్నాగం పన్నింది. ముందుగా అనుకున్నట్టుగా నాన్ బెయిలబుల్, జీవితఖైదుకు సంబంధించిన సెక్షన్లతో పోలీసులు కేసులు సిద్దం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వంశీని విజయవాడకు తీసుకొచ్చిన పోలీసులు, నోటీస్ ఇవ్వడం తప్ప.. ఏ కేసులో, ఎందుకు తీసుకొచ్చింది, వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం కానీ చేయలేదు. నాలుగైదు స్టేషన్లలో తిప్పి రాత్రి 11.45గంటలకు రిమాండ్ రిపోర్టు ఇచ్చి, 12 గంటలకు ఎఫ్ఐఆర్ రాశారు. ఈ మధ్యలో వంశీని ఎలా ఇబ్బంది పెట్టాలో చంద్రబాబు, లోకేష్, డీజీపీ చర్చించుకున్నట్టుగా అర్థం అవుతోంది.చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతోనే..ఈ తతంగమంతా చూస్తుంటే న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ చెప్పినట్టుగానే పోలీసులు కూడా మాట్లాడుతున్నారు. రాజకీయ కక్షసాధింపులకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారు. ఎలా దర్యాప్తు చేయాలి, దర్యాప్తు అధికారులుగా ఎవరుండాలి, దర్యాప్తు చేసి ఏ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎవరెవర్ని సాక్ష్యులుగా తీసుకోవాలి, ఎవర్ని కేసుల్లో ఇరికించాలి, ఇలాంటివన్నీ కూటమి నాయకులే చెప్పడం దానిని పోలీసులు తుచ తప్పకుండా అమలు పరచడం కనిపిస్తోంది.ఇలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి పోలీసులకు ఇదే పని. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను, సానుభూతి పరులను అక్రమ కేసులతో వేధించి జైలు పాలు చేయడం, వైఎస్సార్సీపీ నాయకులను అక్రమ అరెస్టులు చేయడం చేస్తున్నారు. న్యాయస్థానాలంటే గౌరవం లేదుచట్టాలన్నా, న్యాయస్థానాలన్నా కూటమి ప్రభుత్వానికి భయం కానీ, గౌరవం కానీ లేదని ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి జరిగిన ఎన్నో ఘటనలు రుజువు చేస్తున్నాయి. సోషల్ మీడియా కేసుల్లో పోలీస్ స్టేషన్లకు చెందిన సీసీ టీవీ ఫుటేజ్లు అడిగితే ఇవ్వనందుకు సాక్షాత్తు హైకోర్టు డివిజన్ బెంచ్ తీవ్రంగా ఆక్షేపించింది. ఎప్పుడడిగినా ఏదొక కారణం చెప్పి తప్పించుకుంటున్నారని, మా ఆదేశాలను ధిక్కరిస్తే డీజీపీనే కోర్టుకు రప్పిస్తామని గట్టిగా హెచ్చరించింది. హైకోర్టు ఇంత సీరియస్ వార్నింగ్ ఇచ్చినా కూటమి ప్రభుత్వం లెక్క చేయడం లేదంటే న్యాయస్థానాల మీద వారికున్న గౌరవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దెందులూరులో ఒక పెళ్లి వేడుకకు హాజరైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, తన కారుకు అడ్డం లేకపోయినా మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితోపాటు ఆయన డ్రైవర్, ఇతర అనుచరుల మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాడు. ఎమ్మెల్యేనే దారుణంగా దుర్భాషలాడి తిరిగి ఆతనే వైయస్సార్సీపీ నాయకుల మీద కేసులు పెట్టించాడు. నిందితులే బాధితులపై కేసులు పెడుతున్న దారుణాలు నిత్యం జరుగుతున్నాయి.తాము అనుసరిస్తున్న విధానాలు కరెక్టో కాదో పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాబోయే రోజుల్లో మేం చేయబోయే పోరాటంలో పోలీసులే న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాల్సి ఉంటుంది. డీజీపీ నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ వరకు తప్పు చేసింది ఎవరైనా వదిలే ప్రసక్తే ఉండదు. చీఫ్ సెక్రటరీ దగ్గర్నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందర్నీ న్యాయస్థానాల ముందు నిలబెడతాం. -
కక్షతోనే వంశీ అరెస్ట్: Devineni Avinash
-
విజయవాడ జలకన్య ఎగ్జిబిషన్లో భారీ అగ్నిప్రమాదం (ఫొటోలు)
-
విజయవాడలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, విజయవాడ: విజయవాడ నగరంలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సితార గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు.వివరాల ప్రకారం.. విజయవాడలోని సితార గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన జలకన్య ఎగ్జిబిషన్లో బుధవారం మధ్యాహ్నం సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల కారణంగా సమీప నివాసాల్లోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా భారీగా నష్టం జరిగినట్టు తెలుస్తోంది. -
గుణదల మేరీమాత ఉత్సవాలు..వేలాదిగా తరలివస్తున్న భక్తజనం (ఫొటోలు)
-
ఆరున్నొక్కరు.. జారితే దక్కరు
హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలంటూ ఓ వైపు పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా వాహనదారులు లెక్కచేయడం లేదు. విజయవాడ అజిత్సింగ్ నగర్ ప్రాంతంలో ఆరుగురు పిల్లలతో బైక్పై ఇలా దౌడు తీస్తూ ఫొటోకి చిక్కాడు. - సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడబంతికాదది భానుడే చీకట్లను చీల్చుకుని వెలుగులు వెదజల్లుతూ పైకి వస్తున్న బాలభానుడు ఇలా ఓ దీపస్తంభంపైన ఎర్రని బంతి ఉంచినట్లు కనిపించాడు. కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆదివారం ఉదయం ఈ దృశ్యాన్ని సాక్షి కెమెరా క్లిక్మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కడప సండే సందడివారమంతా పనిఒత్తిడితో బిజీబిజీగా గడిపిన నగరప్రజలు ఆదివారం వచ్చేసరికి ఇలా సముద్ర తీరానికి చేరుకుని సేదతీరారు. పర్యాటకుల సందడితో ఆదివారం సాయంత్రం విశాఖ ఆర్కేబీచ్ ఇలా సందడిగా కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
వైభవంగా గుణదల మేరిమాత ఉత్సవాలు
-
విజయవాడ : గుణదల మేరీమాత ఉత్సవాలు ప్రారంభం (ఫొటోలు)
-
అక్కినేని ఫ్యాన్స్ ప్రెసిడెంట్ను కలిసిన నాగచైతన్య.. ఎందుకంటే?
అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో చైతూ సరసన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. తండేల్ చిత్రం సక్సెస్ కావడంతో నాగచైతన్య విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శకుడు చందు మొండేటితో కలిసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.అయితే విజయవాడ వెళ్లిన నాగచైతన్య ఆలిండియా అక్కినేని నాగార్జున యువసేన అధ్యక్షులు సర్వేశ్వరరావు ఇంటికి వెళ్లారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారన్న విషయం తెలుసుకుని ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.కాగా.. తండేల్ చిత్రాన్ని శ్రీకాకుళంకు చెందిన మత్స్యకారుల బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన కొందరు జాలర్లు పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లడంతో అరెస్టయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆధారంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకొచ్చారు. అక్కినేని నాగచైతన్య తండేల్ రాజ్గా పాత్రలో కనిపించారు. -
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న తండేల్ టీమ్ (ఫోటోలు)
-
ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ‘‘ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు.. ఈ 2.0 వేరేగా ఉంటుంది’’ అంటూ వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశాను. ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతా. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తాం’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.బుధవారం ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విజయవాడ నగరపాలక సంస్థ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏమన్నారంటే... ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తుకుతెచ్చుకోండి..‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు, దొంగకేసులు పెడతారు. జైల్లో పెట్టినా భయపడాల్సిన పనిలేదు. కార్యకర్తలకు నేను అండగా నిలుస్తా. మళ్లీ అధికారంలోకి వస్తాం, 30 ఏళ్లు పరిపాలన చేస్తాం. సంపద సృష్టించి పేదలకు పంచుతానని చంద్రబాబు చెప్పారు. కానీ ఈ 9 నెలల్లో సూపర్ సిక్స్ పథకాలను కూడా అమలు చేయలేదు. చంద్రబాబు హామీలను అమలు చేయలేరని నేను ముందే చెప్పాను. చంద్రబాబును నమ్మటం అంటే చంద్రముఖిని నిద్రలేపటమే. రాష్ట్ర బడ్జెట్, చంద్రబాబు హామీల ఖర్చుల గురించి ప్రజలకు వివరంగా చెప్పాను. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. త్వరలోనే జమిలీ ఎన్నికలు అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అఖండ మెజార్టీతో వైఎస్సార్సీపీ గెలుస్తుంది...ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోంది. ఏ గ్రామంలో చూసినా బెల్టు షాపు నడుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యే వేలంపాటలో రూ.2 లక్షలకో, 3 లక్షలకో బెల్టుషాపులు పెట్టిస్తున్నారు. ఇసుక ధర రెట్టింపు అయింది. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. ఏ పని జరగాలన్నా, ఇండస్ట్రీ నడపాలన్నా, మైనింగ్ చేసుకోవాలన్నా ముడుపులు చెల్లించే దుస్థితి వచ్చింది. ఎమ్మెల్యేల దగ్గర్నుంచి చంద్రబాబు వరకు ముడుపులను పంచుకుంటున్నారు...రాజకీయాలలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. ఆ కష్టాలను ఎదుర్కొన్నప్పుడే మనం లీడర్ గా ఎదుగుతాం. ఒకసారి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ప్రజల్లో చులకన అవుతాం. కష్టాలు ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తుకుతెచ్చుకోండి. నామీద టీడీపీ, కాంగ్రెస్ కలిసి అక్రమంగా కేసులు పెట్టారు. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నానన్న కారణంతోనే దొంగకేసులు బనాయించారు. కానీ ఏం జరిగింది? బయటకు వచ్చి, ప్రజల అండదండలతో ముఖ్యమంత్రి అయ్యాను’’ అని వైఎస్ జగన్ గుర్తు చేశారు.ఇదీ చదవండి: ‘ఛీ.. ఎన్టీఆర్ మాటకు తూట్లు పొడిచి మరీ!‘‘విజయవాడ కార్పొరేషన్లో 64 స్థానాలుంటే 49 స్థానాలు అప్పట్లో మనం గెలిచాం. తెలుగుదేశం పార్టీకి వచ్చిన స్థానాలు 14, కమ్యూనిస్టులు 1 గెలిచారు. వాళ్లకు కేవలం 14 స్థానాలున్నా.. ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల ప్రలోభాలపెట్టో, భయపెట్టో 13 మందిని తీసుకున్నారు. అయినా ఇంకా 38 మంది నిటారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడుతున్నాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘కారణం ఏమిటంటే.. ఏ కార్పొరేషన్, మున్సిపాల్టీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఏవి తీసుకున్నా.. ఎన్నికలు అయిపోయిన మూడేళ్ల తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే అటువంటి పరిస్థితుల్లో ఇలాంటి రిజల్ట్తో కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే క్వీన్ స్లీప్ చేయగలిగింది’’ అని వైఎస్ జగన్ చెప్పారు. ..ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశాం. ప్రతినెలా ఏ పథకం అమలు చేస్తామో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ విడుదల చేసి.. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం, ఎక్కడా ప్రజలకు నష్టం జరగకుండా, ఇబ్బందులు పడకుండా ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే.కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పకునేలా....ఆ రోజు కోవిడ్ లాంటి ఊహించని పరిణామాలు వచ్చాయి. ఇలాంటి విపత్తు ఒకటి ఉంటుందా, ఇలాంటిది వస్తే రాష్ట్రం, దేశం అతలాకుతలం అవుతుందన్న పరిస్థితులు ఎప్పుడూ ఊహకు కూడా అందిఉండవు. అలాంటిది వరుసగా రెండు సంవత్సరాలు కోవిడ్ సమస్యలతో అనుకోని ఖర్చులు పెరిగాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గాయి. అయినా ఏ రోజూ కూడా మనం సాకులు చెప్పలేదు. ఏ రోజూ ప్రజలకు ఇవ్వకుండా ఉండడానికి కారణాలు వెదుక్కోలేదు. మన సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాట ఏరోజూ తప్పలేదని వైఎస్సార్సీపీ కార్యకర్తగా గర్వంగా చెబుతున్నాను. ప్రజలకు మంచే చేశాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విలువల కోసం నిలబడి ఉన్న పార్టీ. నా దగ్గర నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు ఇది నా పార్టీ అని కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పకునేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది, నిలబడింది.ప్రజల దగ్గర మన విలువ తగ్గలేదు....ఇవాళ ఎన్నికలు పూర్తయి దాదాపు 9 నెలలు కావస్తోంది. మనం ఓడిపోయినా కూడా ఈ రోజుకు కూడా మనం గర్వంగా తలెత్తుకుని ప్రజల దగ్గరకు పోగలుగుతాం. వాళ్ల చిరునవ్వుల మధ్య నిలబడి వాళ్ల సమస్యలను వినగలుగుతాం. వాళ్లతో మమేకం కాగలుతాం. కారణం ఏ రోజూ మనం వాళ్లను మోసం చేయలేదు. వాళ్లకు ఏరోజూ అబద్దాలు చెప్పలేదు. ఏదైతే చెప్పామో అది చేసి చూపించిన తర్వాత వాళ్లకు ఓట్లు అడిగాం కాబట్టి ప్రజల దగ్గర మన విలువ తగ్గలేదు. ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు....కానీ. .ఎన్నికలు అయిన 9 నెలలు తిరక్కముందే కూటమికి చెందిన ఎమ్మెల్యే దగ్గర నుంచి.. కార్యకర్త వరకు గడప, గడప అంటూ ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. కారణం ఏ గడపకు వెళ్లినా ఎన్నికలు ముందు వీళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ లు, సూపర్ సెవెన్లు ప్రజలు వీళ్లకు చూపించి.. ఆ ఇంట్లో నుంచి ఇద్దరున్నా ముగ్గురు పిల్లలున్నా ఇంటికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను నా రూ.రూ15వేలు ఏమైందని ప్రశ్నిస్తారు. ఆ పిల్లల తల్లులు కూడా నా రూ.18 వేలు ఏమైందని ప్రశ్నిస్తారు. 50 ఏళ్లు నిండిన ఆ తల్లుల అత్తలు, అమ్మలు నా రూ.45వేలు ఏమైందని ప్రశ్నిస్తారు...అదే ఇంట్లో 20 ఏళ్ల పిల్లవాడు నాకు నెల, నెలా రూ.3వేలు ఇస్తానన్నావ్.. నా రూ.36 వేలు ఏమైందని అడుగుతాడు. గ్రామీణ ప్రాంతాలకు వెళితే కండువా వేసుకున్న రైతులు నా రూ.20 వేలు సంగతేంటని నిలదీస్తారు. ఇలా ఏ ఇంటికి వెళ్లినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎన్నికలప్పుడు ఆ రోజు మేం చేయకపోతే నా కాలర్ పట్టుకొండని అన్నాడు. కానీ ఈ రోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారని భయపడి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ఆ రోజే చెప్పా.. చంద్రబాబును నమ్మడం అంటే....ఎన్నికలు అయిపోయిన 9 నెలల తర్వాత ఇవాళ సంపద సృష్టించడం ఎట్లో నా చెవిలో చెబితే నేను తెలుసుకుంటానంటున్నాడు. ఇదే మాటను ఆ రోజే నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని, చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడం అని చెప్పాను. మన మేనిఫెస్టోను, వాళ్ల హామీలను చూపిస్తూ.. చంద్రబాబు చెప్పినవి అమలు చేయడం సాధ్యం కాదని చెప్పాను. రాష్ట్ర బడ్జెట్ ఇది.. మనం చేస్తున్న కార్యక్రమాలు ఇవి.. వీటికింత ఖర్చవుతుంది. మరో వైపు చంద్రబాబు రూ.1.72 లక్షల కోట్లు ఖర్చయ్యే ప్రతిపాదనలు చెబుతున్నాడు. ప్రజలను మోసం చేయడం ధర్మం కాదు....సూపర్ సిక్స్ మోసం, సూపర్ సెవెన్ మోసం అని చెబుతూ.. మనం ఏం చేయగలుగుతామో అన్నది కూడా ప్రజలకు అర్థం అయ్యేటట్టు చెప్పాం. ఆ రోజు కూడా మన ప్రజాప్రతినిధులు, మన శ్రేయోభిలాషులు నా దగ్గరకు వచ్చి మనమూ సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ చెబుదామన్నారు. కానీ నేను ఒక్కటే చెప్పాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేయడం అనవసరం అని చెప్పాను. ఏదైతే చేయగలుగుతామో అదే చెప్పాలి. చేయలేనిది చెప్పి, ప్రజలను మోసం చేయడం ధర్మం కాదని చెప్పాను.ప్రజలకు చంద్రబాబు నైజం పూర్తిగా అర్థమైంది....ఓడిపోయాం ఫర్వాలేదు. ప్రతిపక్షంలో కూర్చున్నాం అదీ ఫర్వాలేదు. మరలా అదే రోజుకు వెనక్కి తిరిగి వెళితే... ఇదే విధంగానే మరలా చెబుతాం.. కారణం రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అదే అర్ధం. జమిలి అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అదే విలువలు, విశ్వసనీయత అన్న పదం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరలా అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే అప్పటికి ప్రజలకు చంద్రబాబు నైజం పూర్తిగా అర్థం అవుతుంది...ఎందుకంటే ఇవాళ ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా పక్కకు వెళ్లిపోవడం ఒక అంశం అయితే... రెండో అంశం వ్యవస్ధలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం రాకమునుపు మన ప్రభుత్వంలో ప్రతిదీ పకడ్బందీగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడనే చర్చ ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ జరుగుతుంది. జగన్ ఉన్నప్పుడు స్కూళ్లు బాగుపడ్డాయి. ఇంగ్లిషు మీడియం వచ్చింది. నాడు-నేడుతో స్కూళ్లు బాగుపడ్డమే కాకుండా సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం మొదలుపెట్టాడు. ఆరో తరగతి నుంచిప్రతి తరగతి గది డిజిటైజ్ అయింది...జగన్ ఉన్నప్పుడే 8వ తరగతి పిల్లాడి చేతిలో ట్యాబులు కనిపించేవి. మరో వైపు ప్రైవేటు బడులు ప్రభుత్వ బడులతో పోటీ పడే పరిస్ధితి రాష్ట్రం ఎప్పుడైనా చూసిందంటే.. అది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. మొట్టమొదటిసారిగా గవర్నమెంటు బడులలో నో వేకెన్సీ బోర్డులు కేవలం వైయస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే కనిపించాయి...మన హయాంలో క్రమం తప్పకుండా తల్లులకు అమ్మఒడి ఇచ్చి, తల్లులను ప్రోత్సహిస్తూ పిల్లలను బడులకు పంపిస్తూ.. వాళ్లు ఎదగాలని, భావి ప్రపంచంతో పోటీపడాలని, ఏలాలని వాళ్ల చదువుల్లో మార్పులు తీసుకొచ్చిన రోజులు మన పాలనలో చూస్తే.. కేవలం 9 నెలల్లో ప్రభుత్వ స్కూళ్లు పరిస్థితి చూస్తే.. నాడు నేడు పాయే.. అమ్మఒడి పాయే. ఇంగ్లిషు మీడియం పాయే. ఆరోతరగతి నుంచి తరగతి గదులు డిజిటైజేషన్ కార్యక్రమమూ పాయే. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబులకు ఇచ్చే కార్యక్రమం పాయే. మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెఫ్ట్ పాయే.వీళ్ల పాంప్లెట్ పేపర్ ఈనాడులో చూశాను. గవర్నమెంటు బడులలో 70 శాతం బడులలో 70 శాతం పిల్లలు లేరు రాశారు. అది వీళ్ల తప్పిదం వల్ల అని రాయకుండా అది కూడా మన తప్పిదం వల్లే జరిగిందని రాశారు...పేదవారికి ఆరోగ్యం బాగా లేకపోతే ఆ పేదవాడి పరిస్థితి ఇవాళ దయనీయంగా తయారయింది. నెట్ వర్క్ ఆసుపత్రులకు వెళితే పేదవాడికి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించే పరిస్దితి లేదు. 1000 ప్రొసీజర్స్ నుంచి 3,300 ప్రొసీజర్లు పేదవాడికి ఉచితంగా వైద్యం అందించేటట్టుగా ప్రొసీజర్లు పెంచడమే కాకుండా, రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచాం. 900 నుంచి 2,400 ఆసుపత్రుల వరకు నెట్ వర్క్ ఆసుపత్రులను పెంచాం. గవర్నమెంటు హాస్పటళ్లలో వైద్యులు, నర్స్ల కొరత అన్నది పరిపాటే అన్న సాంప్రదాయాన్ని మార్చివేశాం.మొట్టమొదటిసారిగా గవర్నమెంటు ఆసుపత్రుల రూపురేఖలను నాడు-నేడు ద్వారా మార్చివేశాం. దేశవ్యాప్తంగా స్పెషలిస్టు డాక్టర్లు కొరత 61 శాతం ఉంటే.. మన రాష్ట్రంలో దాన్ని 4 శాతానికి తీసుకొచ్చిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే. ప్రభుత్వ ఆసుపత్రులుకు వెళితే మందులు దొరకని పరిస్థితి నుంచి.. మందుల కోసం వెలితే డబ్ల్యూ హెచ్ ఓ, జీఎంపీ ప్రమాణాలున్న మందులు మాత్రమే దొరికేలా చేసిన ప్రభుత్వం కూడా వైఎస్సార్సీపీదే.మొట్టమొదటసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా గ్రామాల్లో విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేశాం. అక్కడ 105 రకాల మందులు సరఫరా చేస్తూ.. 24గంటలూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు అందుబాటులోకి ఉండేటట్టు.. 14 రకాల డయాగ్నోస్టిక్ టెస్టులు కూడా అక్కడే చేసేలా విలేజ్ క్లినిక్లు ఏర్పాటుచేశాం. తొలిసారిగా పీహెచ్సీలను బలోపేతం చేసి ప్రతి పీహెచ్సీలోను ఒక డాక్టరు ఉండేలా, మరో డాక్టర్ 104 అంబులెన్స్ లో ఊర్లలో అందుబాటులో ఉండేలా చేసాం. ప్రతి మండలానికి రెండు పీహీచ్సీలను ఏర్పాటు చేశాం. ప్రతి డాక్టర్ ఏ ఊరికి వెళ్లాలో నిర్ణయించి... నెలలో కనీసం రెండు రోజులు ఆ ఊర్లకు వెళ్లేలా చేస్తూ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ ను అందుబాటులోకి వచ్చింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చింది.కనీవీని ఎరుగని విధంగా..కనీవీని ఎరుగని విధంగా మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే అమల్లోకి వచ్చింది. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పోయింది. విలేజ్ క్లినిక్లు పనిచేయడం లేదు. పీహెచ్సీలు కూడా పనిచేయడం లేదు. రూ.3వేల కోట్లు నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లలు చెల్లించలేదు. ప్రతి నెలా రూ.300 కోట్లు అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. అంటే దాదాపుగా రూ.3వేల కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వైద్యం కోసం పేదవాడు ఆసుపత్రికి పోతే ఉచితంగా ఆరోగ్యశ్రీ అందించలేని పరిస్ధితి. ఇదీ మన ప్రభుత్వానికి వీళ్ల ప్రభుత్వానికి తేడా.మొట్టమొదటిసారిగా రైతులకు ఆర్బీకేలు తీసుకుని రావడం, ఇ-క్రాప్ చేయడం, దళారీ వ్యవస్థ తీసివేసి ఆర్బీకే ద్వారానే రైతులకు కనీస గిట్టుబాటు ధర లభ్యమయ్యేలా కొనుగోలు చేయడం, అక్కడే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ కూర్చుని వ్యవస్థను మార్చేలా తీసుకున్న చర్యలన్నీ నాశనం అయ్యాయి. గ్రామంలో ప్రతి సేవకు సచివాలయం ఏర్పాటు చేసి.. ఎవరెవరు ఏ సేవలు చేయాలో నిర్ణయించాం. ప్రతి 50-60 ఇళ్లకు వాలంటీర్ను తీసుకొచ్చి ప్రతి పథకం పారదర్శకంగా ప్రతి ఇంటికి చేర్చే కార్యక్రమాలన్నీ ఇవాళ కొలాప్స్ అయ్యాయి. కేవలం తొమ్మిది నెలల్లోనే వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి.మరో వైపు ఏది చూసినా స్కామే. ఏ గ్రామంలో చూసినా బెల్టుషాపునకు రూ.2 లక్షలకో, రూ.3లక్షలకో ఎమ్మెల్యే దగ్గరుండి వేలం పాడిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి మద్యం అమ్మేలా సపోర్టు చేస్తున్నారు. ఏ గ్రామంలో చూసినా మద్యమే కనిపిస్తోంది. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం నడుపుతున్న మద్యం షాపులు తీసివేసి ప్రైవేటు షాపులు తీసుకొచ్చారు.ఇదీ చదవండి: దొడ్డిదారిలో ‘డిప్యూటీ’ఇసుక ఎక్కడ చూసినా రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా.. ఇండస్ట్రీ నడపాలన్నీ, మైనింగ్ చేసుకోవాలన్నా.. ఏ పనికైనా నా కింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలై చంద్రబాబు వరకు పంచుకుంటున్నారు. ఇవాళ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజలకు మంచి వాళ్లగా కనిపిస్తున్నారు. ఆ స్థాయిలో 9 నెలల కాలంలోనే కూటమి నేతలు దారుణంగా తయారయ్యారు.రాజకీయాలలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొండి. ఆ కష్టాలలో ఉన్నప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కొంటామో అన్నదే మనల్ని నాయకుల్ని చేస్తుంది. కష్టం వచ్చినా మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. ఒక్కసారి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ప్రజల్లో చులకన అవుతాం. కష్టాలు ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తుకుతెచ్చుకొండి.నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. నా మీద కేసులు వేసింది కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులే. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నానన్న కారణంతో దొంగకేసులు బనాయించి 16 నెలలు జైల్లో పెట్టారు. కానీ ఏం జరిగింది. బయటకు వచ్చి, ప్రజల అండదండలతో ముఖ్యమంత్రి అయ్యాను. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొండి.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు, దొంగకేసులు పెడతారు. జైల్లో పెడతారు. అయినా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం. మీకు మంచి చేసిన వారినీ, చెడు చేసిన వారినీ ఇద్దరినీ గుర్తుపెట్టుకొండి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది. మరో ముప్పై సంవత్సరాలు ఏలుతాం. ఒక్కటే గుర్తు పెట్టుకొండి. ఈసారి జగనన్న 2.0 వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా.. ఇది కచ్చితంగా చెబుతున్నాను. జగనన్న1.0లో కార్యకర్తలకు అంత గొప్పగా చేయలేకపోయిండవచ్చు. ప్రతి పథకం, ప్రతి విషయంలో మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకువచ్చి వారి కోసమే తాపత్రయపడ్డాను. వారి కోసమే నా టైం కేటాయించాను, ప్రజల కోసమే అడుగులు వేశాను. కానీ ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశాను. కార్యకర్తల బాధలను గమనించాను. వారి అవస్థలను చూశాను. వీళ్ల కోసం మీ జగన్ అండగా ఉంటాడు’’ అని ఆయన స్పష్టం చేశారు. -
విజయవాడ కార్పొరేటర్లకు వైఎస్ జగన్ దిశానిర్దేశం (ఫొటోలు)
-
విజయవాడ వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
కూటమి అరాచకాలు.. ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నేతల అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. తిరుపతి డిప్యూటీ మేయర్, ఇతర ఎన్నికల్లో టీడీపీ, జనసేన అరాచకాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. కూటమి దౌర్జన్యాలపై ఈసీకి దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి ఫిర్యాదు చేశారు.అనంతరం దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ..‘తిరుపతిలో టీడీపీ, జనసేన గుండాలు రెచ్చిపోయారు. సిగ్గు లేకుండా కార్పొరేటర్లు, మహిళలపై దాడులు చేశారు. కూటమి ప్రభుత్వం లో దాడులు, దౌర్జన్యం పెరిగాయి. మేము నిన్ననే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం. సిగ్గు లేకుండా కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లను బెదిరించి, భయపెట్టి, ప్రలోభ పెట్టి లాక్కుంటున్నారు. అక్రమంగా నిర్వహించిన ఎన్నికలను రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడింది. నిన్ననే మేము ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశాం. కానీ, పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి రక్షణ కవచంగా మారారు. పోలీసుల సమక్షంలోనే కార్పొరేటర్లపై దాడి చేసి ఎత్తుకుని వెళ్లారు. టెంపుల్ సిటీలో ఇలాంటి అరాచకానికి దిగడం దారుణం. నూజివీడులో మంత్రి పార్థసారథి ఎనిమిది మంది కౌన్సిలర్లను లాక్కున్నారు. ఎందుకు అధికార పార్టీ ఇంతగా భయపడుతోంది. ఈ ప్రభుత్వం వైఎస్ జగన్ను చూస్తే వణికిపోతోంది. అందుకే ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇలాంటి దమన కాండే జరుగుతుందన్నారు. ఈ అరాచకాలపై పోరాటం చేస్తామని తెలిపారు.మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి పార్టీలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. తిరుపతిలో మహిళా మేయర్, ఎంపీ, ఎమ్మెల్సీ ఉండగా దాడి చేశారు. కార్పొరేటర్లను బస్సుపై దాడి చేసి ఎత్తుకుపోయారు. ఎస్పీ ఉండగానే ఇంత విధ్వంసం సృష్టించారు. వెంకటేశ్వర స్వామి చూస్తుండగానే ఈ అరాచకానికి పాల్పడ్డారు. మా పార్టీ కార్పొరేటర్లకి భద్రత కావాలని మేము నిన్ననే అడిగాం. పోలీసులు పూర్తిగా టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారు. ఇలాంటి విధ్వంసం ఏనాడు జరగలేదు. ఏమాత్రం సిగ్గు ఉన్న టీడీపీ నేతలు ఇలా వ్యవహరించరు. ప్రజలే కూటమి నాయకులకు తగిన బుద్ధి చెప్పడం ఖాయం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఎన్నికల కమిషనర్ కు YSRCP ఫిర్యాదు
-
ఇన్స్టా లవ్.. బెంగుళూరుకు పయనమైన ముగ్గురు బాలికలు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): ఇంస్టాగ్రామ్లో మూడు నెలల క్రితం పరిచయమైన ఓ వ్యక్తి మాయమాటలు నమ్మి ఓ బాలిక ఇల్లు వదిలి బెంగళూరుకు పయనం కాగా.. ఆమెకు తోడుగా మరో ఇద్దరు బాలికలు వెళ్లేందుకు ప్రయత్నించిన ఘటన అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. నార్త్జోన్ ఏసీపీ స్రవంతిరాయ్ తన కార్యాలయంలో ఈ కేసు వివరాలను మీడియాకు వెల్ల్లడించారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు.. న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన ఓ బాలిక సమీపంలోని ఓ మదర్సాలో చదువుకొని ఇంటి వద్దే ఉంటోంది. ఆమెకు ఇంస్టాగ్రామ్లో బెంగళూరుకు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. వీరిద్దరి మధ్యలో ఆ యువకుడి స్నేహితుడైన గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన వేణు(23) అనే యువకుడు రావడంతో వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి వారు దూరంగా ఉంటుండగా.. మూడు నెలల క్రితం నుంచి వేణు ప్రేమ పేరుతో ఆ బాలికకు మాయమాటలు చెబుతూ వచ్చాడు. తనతో వస్తే బెంగళూరు తీసుకెళ్లి పెళ్లిచేసుకుంటానని నమ్మించడంతో అతగాడి మాటలు విన్న ఆ బాలిక విషయాన్ని తన ఇద్దరి స్నేహితులకు చెప్పింది. దీంతో ఆ ఇరువురు బాలికలు తాము కూడా బెంగళూరు వస్తామని చెప్పడంతో వేణు వారిని తెనాలికి రమ్మని చెప్పాడు. ప్రణాళిక ప్రకారం బాలికలను గురువారం రాత్రి తెనాలికి రప్పించిన వేణు అక్కడ తన స్నేహితులైన కేతవత్ యువరాజ్నాయక్(21), పెద్ద వెంకటేశ్వర్లు(30)ను బాలికలకు పరిచయం చేశాడు. ఉదయాన్నే బెంగళూరుకు రైలులో వెళ్దామని, టికెట్లు కూడా తీసుకున్నామని బాలికలకు చూపించాడు. ఈ రాత్రికి మనం అందరం గుంటూరు జిల్లా చేబ్రోలులోని పెద్ద వెంకటేశ్వర్లు ఇంట్లో ఉందామనుకొని పయనమయ్యారు. గంటల వ్యవధిలో బాలికల ఆచూకీ.. ముగ్గురు బాలికలు కనిపించడం లేదంటూ గురువారం రాత్రి 11 గంటల సమయంలో సింగ్నగర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సింగ్నగర్ సీఐ వెంకటేశ్వర్లు వెంటనే స్పందించి.. ఎస్ఐ సేనాపతి శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువకుల ఇంస్టాగ్రామ్ ఐడీ నంబర్లు, బండి నంబర్ల ఆధారంగా పోలీసులు తెనాలి చేరుకొని బాలికలు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఉంటున్న బాలిక పాత స్నేహితుడు నిందితులను పట్టించడంలో పోలీసులకు సహాయం చేసినట్లు తెలిసింది. బాలికలను వీరు వేరే రాష్ట్రంలోకి తీసుకువెళ్లి వారి జీవితాలను నాశనం చేసేందుకు పన్నాగం పన్నినట్లుగా తెలుస్తోంది. మరో కేసు కూడా.. అదేరోజు అదే ప్రాంతానికి చెందిన మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక కూడా అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందగా ఆ బాలిక ఆచూకీని కూడా గంటల వ్యవధిలోనే గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఏసీపీ వివరించారు. ఒకే రోజు రెండు కేసులలో నలుగురు బాలికల ఆచూ కీని తెలుసుకొని, కేసులను ఛేదించిన బృందాలను సీపీ రాజశేఖర్బాబు, డీసీపీ రామకృష్ణ ప్రత్యేకంగా అభినందించినట్లు స్రవంతిరాయ్ తెలిపారు. -
దావోస్.. అంతా తుస్
సాక్షి,విజయవాడ : పెట్టుబడులు తేకుండానే సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. దావోస్ పర్యటనలో ఒక్క పరిశ్రమతో కూడా ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ప్రపంచ ఆర్థిక వేదిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఏపీకి భారీగా పెట్టుబడులు తెస్తామని బయలు దేరిన చంద్రబాబు, లోకేష్..కానీ మూడు రోజుల దావోస్ సమావేశాల్లో ఒక్క ఎంఓయూ కూడా జరగలేదు. అదే సమయంలో దేశంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో జాతీయ,అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 9.3 లక్షల కోట్లు, తెలంగాణ ప్రభుత్వం రూ.56,300 కోట్ల పెట్టుబడుల ఎంవోయూలు చేసుకున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వంతో మాత్రం ఎంవోయూ కుదుర్చుకునేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రాలేదు. దీంతో ఎంవోయూలు లేకుండా పబ్లిసిటీకే చంద్రబాబు దావోస్ పర్యటన పరిమితమైంది.అదే సమయంలో తన దావోస్ పర్యటన కోసం చంద్రబాబు, తనయుడు నారా లోకేష్లు రూ.3కోట్లకు పైగా ఖర్చు చేసి జాతీయ మీడియా ఇంటర్వ్యూ ఇచ్చారు. దావోస్ పర్యటనలో రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చి పారిశ్రామిక వేత్తలకు నారా లోకేష్ చెడు సందేశం పంపారు. దావోస్ పర్యటనలో లోకేష్ సీఎం కావాలంటూ పరిశ్రమల మంత్రి టీజీ భరత్ భజన చేశారు. బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు భేటీ పబ్లిసిటీకే పరిమితమైంది. ఏపీలో ఎటువంటి కొత్త ప్రాజెక్టుకు ఎంవోయూ చేసుకోని మైక్రోసాఫ్ట్. దావోస్ నుండి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఏపీ అధికారులు తిరుగుముఖం పట్టారు. -
ఓటు వేసి తప్పు చేసాం కన్నీళ్లు తెప్పిస్తున్న పెన్షన్ దారుల కష్టాలు
-
విజయవాడలో హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)
-
‘చలో విజయవాడ’పై ఉక్కుపాదం.. వాలంటీర్ల గృహ నిర్బంధం
సాక్షి, విజయవాడ: వాలంటీర్ల ‘చలో విజయవాడ’(Chalo Vijayawada) కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల(Volunteers)ను హౌస్ అరెస్ట్ చేశారు. కేబినెట్లో వాలంటీర్ల అంశంపై ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సెక్రటేరియట్కు వెళ్లి సీఎంను కలుస్తామన్న వాలంటీర్లపై ప్రభుత్వం నిర్బంధం విధించింది. విజయవాడలోని దాసరి భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.చలో విజయవాడను అడ్డుకోవడంపై వాలంటీర్లు మండిపడ్డారు. గత ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం. వాలంటీర్లకు ఉద్యోగం కల్పించడంతో పాటు బకాయి పడ్డ ఎనిమిది నెలల వేతనం ఇవ్వాలి. పోలీసులతో అడ్డుకున్నంత మాత్రాన మా పోరాటం ఆగదు’’ అని గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హుమాయున్ బాషా అన్నారు.‘‘ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చే వరకూ వదిలిపెట్టం. చంద్రబాబు అబద్ధాల ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నాడు. మమ్మల్ని మోసం చేసిన ఈ ప్రభుత్వం ఎప్పుడుపోతుందోనని వాలంటీర్లు ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట తప్పి మహిళలను మోసం చేశారు. పుట్టని బిడ్డకు పేరెలా పెడతామని మంత్రి డోలా బాలవీరాంజనేయులు మాట్లాడటం సిగ్గుచేటు’’ అని షేక్ హుమాయున్ బాషా మండిపడ్డారు.వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: చంద్రశేఖర్రెడ్డి 2.50 లక్షల మంది వాలంటీర్లను చంద్రబాబు మోసం చేశారని ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. చలో విజయవాడ పేరుతో నిరసనకి పిలుపు ఇస్తే వారిని హౌస్ అరెస్టులు చేస్తున్నారు. వాలంటీర్లను అరెస్టు చేయటం హేయమైన చర్య. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు పది వేల జీతం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్, లోకేష్ కూడా వాలంటీర్లకు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎగ్గొట్టారు’’ అని ఆయన ధ్వజమెత్తారు.‘‘పది వేలకు జీతం పెంచకపోగా గత ఏడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వటం లేదు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు అమలు చేయాలి. ఇప్పుడేమో అసలు వాలంటీర్ల వ్యవస్థే ప్రభుత్వంలో లేదంటూ హేళన చేస్తున్నారు. వాలంటీర్లకు సంబంధించిన జీవో లేకపోతే ఈ ప్రభుత్వం తొలిరోజుల్లో వారిని ఎలా వాడుకుంది?. పంచాయతీరాజ్ శాఖ ద్వారా వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి’’ అని చంద్రశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ‘నాది రాజకీయ పాలన..’ చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం -
పల్లె నుంచి నగరానికి తిరుగు పయనం
చౌటుప్పల్/ చౌటుప్పల్ రూరల్: సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన వారు తిరుగుపయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వైపు వాహనాలు బారులుతీరాయి. దీంతో గురువారం హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. హైదరాబాద్ మార్గంలో ఉదయం నుంచి వాహనాల రాక పెద్ద ఎత్తున సాగుతూనే ఉంది. జంక్షన్లు, క్రాసింగ్ల వద్ద వాహనాలు సాఫీగా ముందుకుసాగేందుకు, ప్రమాదాల నివారణకు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాల కూడలి ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించారు. పంతంగి టోల్ప్లాజా వద్ద సాఫీగా.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాలు సాఫీగా సాగాయి. టోల్ప్లాజాలో 16 గేట్లు ఉండగా, హైదరాబాద్ వైపు 12 గేట్ల నుంచి వాహనాలను పంపించారు. విజయవాడ వైపు నుంచి వస్తున్న వాహనాలకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా జాతీయ రహదారిపై హైవే అథారిటీ అధికారులు గుర్తించిన 17 సమస్యాత్మక ప్రాంతాలతోపాటు ప్రతి గ్రామ స్టేజీ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. -
మా ఆయనకు ఆ వీడియోలు అంటే ఇష్టం
నా వయస్సు 30. నా భర్తకు 35 ఏళ్లు. ఆయన ఈ మధ్య తీవ్రమైన పోర్నోగ్రఫీ వ్యసనానికి గురయ్యాడు. ఇది మా కుటుంబ జీవితంతోపాటు అతని పనితీరునూ ప్రభావితం చేస్తోంది. అతను తన మొబైల్లో పోర్నో వీడియోలు స్క్రోల్ చేయడంలో గంటల తరబడి గడుపుతున్నాడు. నన్ను, మా ఇద్దరు పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆస్లైన్ సెక్స్ చాట్లకు డబ్బు కూడా చెల్లిస్తున్నాడని ఈ మధ్యే తెలిసింది. ఆయన బాస్తో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. నా మీద కూడా ఏమీ ఆసక్తి చూపడం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో మా వివాహబంధాన్ని ఎలా రక్షించుకోవాలో సలహా ఇవ్వగలరు.– అరుణకుమారి, చెన్నైమీ ఆందోళన మీ మాటల్లోనే అర్థమవుతోంది. పోర్నోగ్రఫీ వ్యసనం అనేది కుటుంబ జీవితం, వృత్తిపరమైన పనితీరుపై తీవ్రమైన ప్రభావాలను కలిగించే సంక్లిష్టమైన సమస్య. అతని ప్రవర్తన, మీ కుటుంబంపై దాని ప్రభావం గురించి అతనితో మాట్లాడే ప్రయత్నం (అతన్ని నిందించేటట్లు లేకుండా) చేయండి. మీ ఆందోళనలు, భావాలను ప్రశాంతంగా వ్యక్తపరుస్తూ అతని చర్యలు మీపైన, మీ పిల్లలపైనా ఎంత ప్రభావం చూపుతున్నాయో వివరంగా మాట్లాడి చూడండి. ఒక మంచి సైకియాట్రిస్ట్ లేదా థెరపిస్ట్ సలహాతో కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఇతర చికిత్సా విధానాలతో అతన్ని ఈ వ్యసనానికి దూరం చేయవచ్చు.ఇద్దరూ కలిసి కపుల్ థెరపీకి హాజరు కావడం వల్ల కూడా మరింత మెరుగైన ఫలితాలుంటాయి. ఇది మీ సమస్యలను పరిష్కరించడానికి, మీ మధ్య సాన్నిహిత్యం పెంచడానికి కూడా దోహదపడుతుంది. ఇంట్లో ఇంటర్నెట్ వినియోగం గురించి స్పష్టమైన హద్దులను ఏర్పాటు చేసుకోండి. మీరు ఈ సమస్యల నుండి ధైర్యంగా సమర్థంగా బయటపడేందుకు వ్యక్తిగత కౌన్సెలింగ్ సహాయపడుతుంది. ఇక ఆయన ఈ వ్యసనం నుండి బయట పడటం, మీరు ఆ పరిస్థితుల ప్రభావం నుంచి కోలుకోవడం చాలా సమయం ఓర్పు, క్రమశిక్షణతో కూడుకున్న ప్రక్రియ అని గుర్తుంచుకోండి. ధైర్యంగా ఉండండి. ఈ క్లిష్ట పరిస్థితుల నుండి బయట పడడానికి నమ్మకమైన బంధుమిత్రులు లేదా నిపుణుల సహకారం తీసుకోవడానికి వెనుకాడకండి. మీ భర్త తన వ్యసనాన్ని అంగీకరించడానికి లేదా దాని నుంచి బయట పడడానికి ఇష్టపడకపోతే మీరు మీ శ్రేయస్సు, మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని న్యాయనిపుణుడిని సంప్రదించడం అవసరం కావచ్చు.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
విజయవాడలో సంక్రాంతి వేడుకలు
-
17న విజయవాడలో రైతుల మహా ధర్నా
సాక్షి, అమరావతి : రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం పట్ల రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలలో దాదాపు 80కు పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నప్పటికీ మొక్కుబడిగా 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకుందే తప్ప పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. 2023–24లో ఖరీఫ్తో పాటు రబీ సీజన్లలో వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన 3.91 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు విడుదల చేయలేదు.ఖరీఫ్–2023 సీజన్లో రైతుల తరఫున రూ.930 కోట్ల ప్రీమియం బకాయిలు చెల్లించకపోవడం వల్ల రైతులకు న్యాయంగా దక్కాల్సిన రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారం అందలేదు. ఇలా రైతులకు చెల్లించాల్సిన రూ.12,563 కోట్లు ఎగ్గొట్టింది. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో భారీ ధర్నా నిర్వహణకు ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కే ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం ఇస్తామన్న హామీని ఎప్పుడు అమలు చేస్తారంటూ ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని నిలదీశారు.ఎన్నికలలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నామని గొప్పగా చెబుతున్న చంద్రబాబు.. రైతులకు ఇచ్చిన హామీల సంగతేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి సాయం హామీ ముఖ్యమంత్రికి గుర్తులేదా? గుర్తు ఉన్నా రైతులకు ఇవ్వటం ఇష్టం లేక అమలు చేయటం లేదా.. అన్నది స్పష్టం చేయాలన్నారు. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యల సాధనకు డిమాండ్ చేస్తూ ఈ నెల 17న విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించబోతున్నామని వారు స్పష్టం చేశారు. -
రూ.14.37 కోట్ల బంగారం స్వాదీనం
సాక్షి, అమరావతి: విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.14.37 కోట్ల విలువైన 17.90 కిలోల బంగారాన్ని విజయవాడ కస్టమ్స్ అధికారులు స్వాదీనం చేసుకొని.. ఒక మహిళ సహా 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను విజయవాడ కస్టమ్స్ కమిషనర్ ఎస్.నరసింహారెడ్డి ఆదివారం మీడియాకు తెలియజేశారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారనే సమాచారం మేరకు విజయవాడ కస్టమ్స్(ప్రివెంటివ్) కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించామని చెప్పారు.తాడిపత్రి, నెల్లూరు రైల్వేస్టేషన్తో పాటు బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద కస్టమ్స్(ప్రివెంటివ్), తిరుపతి, గుంటూరు సెంట్రల్ జీఎస్టీ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయని తెలిపారు. ఈ మొత్తం ఆపరేషన్లో విదేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్న 17.90 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని 16 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల్లో ఒక మహిళ కూడా ఉన్నారని చెప్పారు. నిందితులను విశాఖపట్నం ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించినట్టు నరసింహారెడ్డి తెలిపారు. -
విజయవాడ- ఏలూరు హైవేపై ఘోర ప్రమాదం
సాక్షి, కృష్ణాజిల్లా: విజయవాడ- ఏలూరు హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వేగంగా వచ్చి కారు.. మరో కారు ఢీకొట్టింది. ముందు భాగంలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. ఐదుగురి ప్రయాణీకుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం తోషిబా విద్యుత్ కంపెనీలో పని చేస్తున్న శివప్రసాద్కు చెందిన కారుగా గుర్తించారు. గన్నవరం పిన్నమనేని ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు.మరో ఘటనలో...మరో ఘటనలో నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రహదారిపై ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా ట్రాక్టర్ నడిపి మరో వాహన చోదకుడిని బలితీసుకున్నాడు. పట్టపగలు నడిరోడ్డు పై జరిగిన ఈ ఘటనలో వ్యక్తి మృతి దుర్మరణం చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద ఏలూరు రోడ్డుపై శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం చిన ఆగిరిపల్లి ప్రాంతానికి చెందిన బడుగు సోమయ్య (54) వ్యవసాయం చేస్తుంటాడు. ఈయనకు భార్య నలుగురు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె మమతతో కలసి కోర్టు పనుల నిమిత్తమై ద్విచక్రవాహనంపై విజయవాడ వచ్చారు. ఏలూరు రోడ్డు గుణదల నుంచి చుట్టుగుంట వైపు వెళుతుండగా వెనుకగా వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో బైక్పై వెళుతున్న సోమయ్య, మమత రోడ్డుపై పడిపోయారు. అంతటితో ఆగకుండా ఆ డ్రైవర్ తన ట్రాక్టర్ను ముందుకు నడిపాడు.ఈ ఘటనలో రోడ్డుపై పడి ఉన్న సోమయ్యపై ట్రాక్టర్ ఎక్కడంతో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. మమత కొద్ది దూరంలో పడగా ముఖానికి, చేతులకు గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు 108 సహాయంతో బాధితులను వైద్యం నిమిత్తం గుణదలలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన తరువాత సోమయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మమతకు ప్రాణాపాయం లేదని ఆమె కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ సాంబశివరావును అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్ను స్టేషన్కు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. సోమయ్య కుమారుడు బడుగు దీపక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా నిర్లక్ష్యంగా ట్రాక్టర్ను నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్ సాంబశివరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
విజయవాడ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
-
పవన్ పరామర్శ కోసం గేమ్ ఛేంజర్ బాధిత కుటుంబాల పడిగాపులు
-
విజయవాడ : కమనీయంగా గోద, రంగనాథుల కల్యాణం (ఫొటోలు)
-
విజయవాడ మొగల్రాజపురంలో నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు (ఫొటోలు)
-
విద్యుత్ చార్జీల భారంపై వామపక్షాలు వినూత్న నిరసన
-
విజయవాడ : హోరాహోరీగా జాతీయ వాలీబాల్ టోర్నీ (ఫొటోలు)
-
పుస్తకం.. జ్ఞాన మస్తకం
‘పుస్తకాలను ప్రేమించండి. అవి మీ జీవితాన్ని సుఖమయం చేస్తాయి. భావాల, ఉద్రేకాల, సఘటనల, భయంకర గందరగోళంలోంచి బయటపడేసేందుకు మీకు అవి స్నేహపూర్వకమైన సలహాలనిస్తాయి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం, పరులను గౌరవించడం నేర్పుతాయి. హృదయాన్ని, మేధస్సును, మనిషి పట్ల, ప్రపంచం పట్ల ప్రేమతో నింపేస్తాయి’ అన్నారు రష్యాకు చెందిన రచయిత మాక్సీమ్ గోర్కీ. అంతటి ప్రాధాన్యత గల పుస్తకాల పఠనం తగ్గిపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 2 నుంచి 12వతేదీ వరకు విజయవాడలో పుస్తక ప్రదర్శన జరుగుతున్న సందర్భంగా..తెనాలి: ఒకప్పుడు చరిత్ర, సామాజిక పరిజ్ఞానం, కాల్పనిక సాహిత్య రచనలను చదివేవారు. అపరాధ పరిశోధన నవలలు మార్కెట్లోకి వస్తే హాట్కేకులయ్యేవి. పెద్దలు చదువుతుంటే.. పిల్లలు కూడా వాటిపై దృష్టి పెట్టేవారు. ఊళ్లోని లైబ్రరీకి తరచూ వెళ్లటం, పుస్తకాలు ఇంటికి తెచ్చుకుని, చదవటం ఒక అలవాటుగా ఉండేది. పాఠశాలలు, కళాశాలల్లో పుస్తకాల లైబ్రరీ అందుబాటులో ఉండేవి. దిన, వార, మాసపత్రికలతో సహా ప్రముఖ రచయితల రచనలన్నీ వాటిలో లభ్యమయేవి. అప్పట్లో వచ్చే వారపత్రికలు, దినపత్రికల్లో సీరియల్స్గా వచ్చే నవలల కోసం పాఠకులు ఎదురుచూసేవారు. అన్నీ దాచుకుని, సీరియల్ అయిపోగానే నవలగా బైండింగ్ చేయించుకునేవారు. తగ్గుతున్న ప్రచురణకర్తలు పుస్తకానికి గడ్డుకాలం దాపురించడంతో ప్రచురణకర్తలు తగ్గిపోతున్నారు. విజయవాడ కంటే ముందే 1950 కాలంలో తెనాలి ప్రచురణ కేంద్రంగా విరాజిల్లింది. సుప్రసిద్ధ కవులు, రచయితలకు నిలయమైంది. అప్పట్లోనే ఇక్కడినుంచి వార, మాసపత్రికలు వచ్చాయి. ఆ తర్వాత ప్రచురణ కేంద్రంగా వర్ధిల్లిన విజయవాడలో ఒకప్పుడు 50కు పైగా ప్రచురణకర్తలు ఉండగా ప్రస్తుతం అయిదారుగురే ఉన్నారు. చదువరులు తగ్గిపోవటంతో పుస్తకాలు కొనటం లేదు. ప్రచురణకర్తలు గతంలో ఒక్కో పుస్తకాన్ని కనీసం వెయ్యి ప్రతులు ముద్రించేవారు. ఇప్పుడు ఏ పుస్తకమైనా 200కు మించి మార్కెట్ ఉండటం లేదంటున్నారు. నీరసించిన గ్రంథాలయాలు ప్రభుత్వ గ్రంథాలయాలు నీరసించిపోవటం కూడా పుస్తక ప్రాభవం తగ్గటానికి కారణాల్లో ఒకటి. రాష్ట్రంలో ప్రజల నుంచి వసూలు చేసే పన్నులో రూపాయికి 8 పైసలు స్థానిక సంస్థలకు వెళుతున్నా.. గ్రంథాలయాలకు ప్రభుత్వాలు ఏమీ చేయటంలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మూడేళ్ల క్రితం ఒక్కసారి మాత్రమే గ్రంథాలయాలకు కొత్త పుస్తకాలు కొనుగోలు చేశారు. పాఠశాలలు, కాలేజీల్లో లైబ్రరీలు తగ్గిపోయాయి. పుస్తకం గత వైభవాన్ని కోల్పోయింది.జీవనశైలి మారడంతో..క్రమంగా మారుతూ పుస్తకాల వైపు ప్రజల చూపు తగ్గిపోయింది. పిల్లలకు సామాజిక పరిజ్ఞానం, సాహిత్యంపై అభిలాష, చారిత్రక నేపథ్యంపై ఆసక్తిని కలిగించేలా పెద్దల జీవనశైలి ఉండటం లేదు. చిన్నతనం నుంచి పుస్తకాల్ని చదివించాల్సిన అవసరాన్ని గుర్తించటంలో ఇంటినుంచి బడి వరకు అంతా విఫలమయ్యారు. కార్పొరేట్ స్కూళ్ల రాకతో ర్యాంకుల వైకుంఠపాళీలో పిల్లలకు స్కూల్ క్లాసులతోనే పొద్దుపోతోంది. కంప్యూటర్ సైన్స్ కోర్సులతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కడ చూసినా ఇంజినీరింగే. జనరల్ నాలెడ్జి, కరెంట్ ఎఫైర్స్ కోసం కూడా చాలామంది దినపత్రికలు చూడటం లేదంటే అతిశయోక్తి కాదు. ‘గూగుల్ తల్లి’నే అన్నీ అడుగుతున్నారు. సాఫ్ట్వేర్ కొలువులు పుస్తకానికి తీసుకొచ్చిన తంటా ఇది.పుస్తక ప్రచురణ కష్టసాధ్యంగా ఉంది పుస్తకాలు వెయ్యి కాపీలు వేసే ప్రొఫెషనల్ పబ్లిషింగ్ ఇప్పుడు లేదు. యూనికోడ్ వచ్చాక ఎవరికివారు యూనికోడ్లో రాసుకుని తక్కువ కాపీలను డిజిటల్ ప్రింటింగ్ చేయిస్తున్నారు. పుస్తకాలను కొనకపోవటంతో వచ్చిన పరిస్థితి ఇది. సామాజిక శా్రస్తాలు, రాజకీయ నేపథ్యం ఉన్న పుస్తకాలను అధ్యయనం కోసం కొంటున్నారు. చదివినా చదవకున్నా, ఆధ్యాత్మిక పుస్తకాలు పోతున్నాయి. దళిత సాహిత్యం బాగానే అమ్ముడవుతోంది. – వెంకట నారాయణ, పల్లవి పబ్లికేషన్స్, విజయవాడప్రభుత్వ సహకారం ఉంటేనే మనుగడ ప్రభుత్వ సహకారం ఉంటేనే పుస్తకానికి మనుగడ ఉంటుంది. లైబ్రరీల ద్వారా పుస్తకాలు కొనుగోలు చేయించాలి. ఎప్పటికప్పుడు డబ్బులు విడుదల చేయాలి.ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ల్రైబరీలను ఏర్పాటు చేయాలి. వాటికీ పుస్తకాలు సరఫరా చేయాలి. మూడేళ్ల క్రితం కొనుగోలు చేసిన పుస్తకాలకు డబ్బులు వెంటనే విడుదల చేయాలి. – బి.రవికుమార్, నవరత్న బుక్హౌస్, విజయవాడ నవతరం దారి మళ్లింది నవతరం పుస్తక పఠనం నుంచి దారి మళ్లింది. సంపాదనే ముఖ్యమైంది. మానవీయ విలువలపై అవగాహన లేకుండాపోయింది. తెలుగు భాష, సంస్కృతులపై చిన్నచూపు ఏర్పడింది. వ్యక్తిగత స్వార్థం పెరిగి, సాహిత్య పఠనం లేక జరుగుతున్న అనర్థాలివి. గ్రంథాలయాలను ఆధునికీకరించి, పుస్తకాలన్నీ అందుబాటులో ఉంచేలా చేసినపుడే పుస్తకానికి మంచి రోజులొస్తాయి. – వల్లూరు శివప్రసాద్, కన్వీనర్, గ్రంథాలయాల పునర్వికాసం ఉద్యమ వేదిక -
విజయవాడలో సంక్రాంతి సందడి (ఫొటోలు)
-
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రేణూ దేశాయ్, యాంకర్ రవి (ఫోటోలు)
-
యూటర్న్ బాబు.. వాలంటీర్ల వినూత్న నిరసన
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి సర్కార్పై వాలంటీర్ల(Volunteers) పోరాటం కొనసాగుతోంది. తాజాగా విజయవాడ(Vijayawada)లో వాలంటీర్ల నిరసన ఉధృతంగా మారింది. రోడ్డుపై వెనక్కి నడుస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ యూటర్న్ విధానానికి వ్యతిరేకంగా బ్యాక్ వాక్ చేశారు. ఈ సందర్భంగా బాబు వచ్చారు.. జాబ్ తీశారంటూ నినాదాలు చేశారు. అలాగే, పెండింగ్ జీతాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.ఏపీలో వాలంటీర్ల(Volunteers) పోరాటం ఉధృతంగా కొనసాగుతోంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ప్రాధాన్యత ఇస్తామని, వేతనాన్ని కూడా పెంచుతామని కూటమి నాయకులు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల సేవలను చంద్రబాబు ప్రభుత్వం వినియోగించుకోలేదు. ఈ నేపథ్యంలో కూటమి మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించి నెలకు రూ.10వేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, విశాఖలోనూ వాలంటీర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనల్లో వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమను విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిలించాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తూ నిరనసలు చేపట్టారు. చంద్రబాబు సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే అమరావతిలో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
తెలుగు రచయితల సభలా లేక...
ఈ మధ్య విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు జరిగాయి. అయితే వీటి తీరు చూస్తే అవి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభలు అనిపిస్తుంది. ఒక కులం వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేశారా? అనిపించకమానదు. అదే సమయంలో తెలుగు భాషోద్దణ పేరుతో ఆంధ్రప్రదేశ్లోని పేద పిల్లలకు విద్యను దూరం చేయడానికి కుట్ర జరుగుతుందా అన్న అనుమానమూ రాకమానదు. ధనిక ఆసాములంతా ఒక చోట చేరి కడుపు నిండిన కబుర్లు చెప్పుకున్నట్లుగా ఉందన్న భావన కలుగుతుంది. వీరి మాటలు ప్రభుత్వ స్కూళ్లను నీరు కార్చి, ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహించేలా ఉన్నాయి. ఈ రచయితల సభలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రముఖులు లేదంటే వారికి మద్దతు ఇచ్చే మేధావి వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారన్న అభిప్రాయం వచ్చింది. వేదికకు రామోజీరావు పేరు పెట్టడం, ఆయన కోడలు శైలజ వచ్చి తెలుగు గురించి ఉపన్యాసం ఇవ్వడం వంటివి ఈ సభల అజెండాను స్పష్టం చేస్తోంది. ఈ సభలలో పాల్గొన్న ప్రముఖులు ఎవరైనా తమ పిల్లలు, లేదా మనుమళ్లు తెలుగు మాధ్యమంలోనే చదువుతున్నారని చెప్పినట్లు కనిపించలేదు. ప్రధాన అతిధిగా పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈసారి మరింతగా ఓపెన్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి జగన్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోని రద్దు చేయాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. బహుశా ఇదంతా ముందస్తుగానే ఒక అవగాహనతో జరిగి ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ టైమ్లో విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యత లభించింది. ‘నాడు నేడు’ కార్యక్రమం కింద స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలను మార్చివేశారు. ఆంగ్ల మాధ్యమంతోపాటు సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ వంటి జాతీయ, అంతర్జాతీయ సిలబస్లను ప్రవేశపెట్టి పేద పిల్లలకు అతి ఖరీదైన విద్యను ఉచితంగా అందించడానికి జగన్ కృషి చేశారు. అది సహజంగానే పెత్తందారి వర్గానికి నచ్చదు. ప్రైవేటు స్కూళ్లలో ఖర్చు చేసి చదువుకుంటున్న తమ పిల్లలకు, ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు తేడా లేకుండా పోవడం కూడా అంతగా నచ్చదు. అలాంటి తరుణంలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు ఐక్య రాజ్య సమితి వరకు వెళ్లారు.ప్రైవేటు స్కూళ్ల పిల్లలతో పోటీ పడి ఆంగ్లంలో మాట్లాడగలిగే స్థితికి చేరుకుంటున్నారు. అలాగని తెలుగును తక్కువ చేయలేదు. తెలుగును నిర్భంద సబ్జెక్ట్గా చేర్చారు. అయినా కొందరు హైకోర్టుకు వెళ్లారు.ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించారు.జగన్ వెనక్కి తగ్గకుండా ద్విభాష పుస్తకాలు తయారు చేయించారు. దీని తర్వాత కూడా ఈ ఫ్యూడల్ శక్తులకు తృప్తి కలగలేదు. ఇప్పుడు రచయితల సభల పేరుతో ప్రభుత్వ విద్యపై విరుచుకుపడ్డారని అనుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో ఆంగ్ల మాధ్యమంలో చదువుకోక పోతే దేశ, విదేశాలలో మన పిల్లలు పోటీ పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చైనాలో ఆ భాషలోనే చదువుతున్నారు కదా అని కొందరు అనవచ్చు. కాని అక్కడి పరిస్థితి వేరు. మన దేశ వాతావరణం వేరు. అయినా చైనాకు చెందిన లక్షల మంది ఇప్పుడు ఆంగ్ల భాషను అభ్యసించి అమెరికా తదితర దేశాల దారి పడుతున్న విషయాన్ని విస్మరించరాదు. ఎన్వీ రమణ ఉపన్యాసాన్ని పరిశీలించండి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాద్యమం ప్రవేశ పెడుతూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన ‘జీవో8’ను రద్దు చేయాలని అన్నారు. ఆ జీవో పై ఒకరు హైకోర్టుకు వెళ్లి విజయం సాధించారని, దానిపై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని, ఇప్పుడు ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. బహుశా చంద్రబాబు ప్రభుత్వంతో ఉన్న అవగాహన వల్లే ఇలా మాట్లాడి ఉంటారా? అని ప్రముఖ విద్యా వేత్త కంచె ఐలయ్య ప్రశ్నించారు. గత ప్రభుత్వం తెలుగు భాషను అణచివేయడానికో, అభివృద్ది చేయడానికో ఆ జీవో తెచ్చిందని రమణ అన్నారు. నిజంగా అంత పెద్ద స్థాయికి వెళ్లిన వ్యక్తి ఇలా మాట్లాడడం శోచనీయం. ఆంగ్లంలోనే ఉద్యోగాలు వస్తాయని అనుకోవడం భ్రమ అని ఆయన చెబుతున్నారు. ప్రజలు తెలుగు భాషను ఆదరిస్తే ప్రభుత్వాలు దిగివస్తాయని మాజీ చీఫ్ జస్టిస్ అన్నారు. సరిగ్గా ఇదే అంశంపై రమణ స్వయంగా కొన్ని గ్రామాలకు, ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి పిల్లలు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటే బాగుంటుంది కదా! తెలుగు భాషకు ఎవరూ వ్యతిరేకం కాదు. దానిని రక్షించుకోవల్సిందే. కాని అదే సమయంలో పేదల బతుకు తెరువు కూడా ముఖ్యమే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. పైరవి చేసుకుని ఉద్యోగాలు సంపాదించుకోవడమో, ఉన్నత స్థాయికి చేరుకోవడం అందరికి సాధ్యం కాదు. మంచి విద్య వారికి కీలకంగా ఉంటుంది. ఇప్పుడు అమెరికా వెళ్లి స్థిరపడిన లక్షలాది మంది తెలుగువారు ఆంగ్లం నేర్చుకున్న తర్వాతే వెళ్లగలిగారన్నది వాస్తవం. అంతెందుకు! ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత, మాజీ ఎంపీ యార్గగడ్డ లక్ష్మీప్రసాద్ కుమారుడు అమెరికాలోనే నివసిస్తున్నారు. ఆయనకు ఆంగ్లంపై పట్టు వచ్చాకే వెళ్లగలిగారా? లేదా? తెలుగు మీడియంలోనే చదువుకుని ఉంటే అది సాధ్యం అయ్యేదా? ఒకవేళ సాధ్యమైనా ఎంత కష్టపడి ఉండాలి? మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ కూడా తెలుగు గురించి మాట్లాడారు. మరి వారి ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ స్కూల్ లో తెలుగు మీడియం ఉందో, లేదో చెప్పి ఉండాల్సింది. ఆమె కుంటుంబంలోని పిల్లలంతా ఎక్కడ, ఏ భాషలో చదివారో చెప్పినట్లు లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఆంగ్ల మీడియంలోనే చదివారు. ఇప్పుడు మనుమడు దేవాన్ష్ కూడా ఇంగ్లీష్ మీడియంలో అభ్యసిస్తున్నారు కదా? ఇటీవల దేవాన్ష్ చెస్లో మెడల్ సాధించారని వార్తలు వచ్చాయి. ఆయన తెలుగు మీడియంలో చదివి ఉంటే ఈ చెస్ లో గెలవగలిగేవారా అని కంచె ఐలయ్య ప్రశ్నించారు.ప్రైవేటు స్కూళ్లలో అత్యధిక శాతం ఆంగ్ల మీడియమే ఉంది కదా? రాష్ట్ర మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థలలో ఏ మీడియం ఉందో చెప్పాలి కదా? ఇంకా నయం. ఆయనను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెట్టలేదు. ప్రభుత్వ స్కూళ్లలోనే తెలుగు మీడియం ఎందుకు? ప్రైవేటు స్కూళ్లలో కూడా అదే ప్రకారం తెలుగు మీడియం ఉండాలని వీరంతా ఎందుకు డిమాండ్ చేయలేదు? ఇక్కడే వీరి స్వార్దం కనిపిస్తుంది. రామోజీ జ్ఞాపకార్డం అంతా శుభోదయం అని పలకరించుకోవాలని శైలజా కిరణ్ సూచించారు. తెలుగు మీద అంత ప్రేమ ఉంటే కనీసం తెలుగు రాష్ట్రాలలో అయినా తమ సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ పేరులో ఆంగ్లం లేకుండా చూసుకోవాలి కదా! చిట్ ఫండ్స్ను తెలుగీకరించిన తర్వాత ఆమె సలహాలు ఇస్తే బాగుంటుందని కొందరు వ్యంగ్యంగా అంటున్నారు. ఈనాడు దినపత్రికలో తెలుగు రచయితల సభల వార్తలను కవర్ చేసిన సందర్భంలో పలు ఆంగ్ల పదాలు ఎందుకు వాడారో తెలియదు. ఉదాహరణకు కేబీఎన్ కళాశాల అని అన్నారే కాని, దానిని తెలుగులో రాయలేదు. సుప్రీంకోర్టు, జస్టిస్ వంటి ఆంగ్ల పదాలనే వినియోగించారు. నెట్ లో పెట్టిన వార్తల కింద ఎడిషన్ నేమ్, ఆంధ్రప్రదేశ్ అని, పేజ్ నెంబర్ అంటూ ఆంగ్ల ఆక్షరాలతోనే రాశారు. అంటే దాని అర్థమేమిటి? తెలుగు భాషను రక్షించుకుంటూనే ఆంగ్ల భాషపై తెలుగు పిల్లలు పట్టు పెంచుకుంటేనే వారికి భవితవ్యం ఉందన్నది వాస్తవం. అందుకే 95 శాతం మంది ప్రజలు తమ పిల్లలను ఆంగ్ల మీడియంలోనే చదివించుకుంటున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో అయితే అది నూటికి నూరు శాతం ఉంటోంది. ప్రభుత్వ విద్యా సంస్థలలోనే ఎందుకు తెలుగు మాధ్యమం అన్నదానికి ఈ పెద్దలు ఎవరూ సమాధానం చెప్పలేరు. ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఇలా ఆంగ్ల మీడియం కూడా పూర్తిగా ఎత్తివేస్తే ఏపీలో పేద పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదివించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా వారి చదువులకు గండం ఏర్పడుతుంది. తెలుగు రచయితల సభ చివరికి పేదల పాలిట శాపంగా మారితే వారి రచనలకే విలువ లేకుండా పోతుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విజయవాడలో పుస్తకాల పండుగ ప్రారంభం (ఫొటోలు)
-
కష్టాలు చెబితే కస్సు బస్సు..
-
విజయవాడ : 256 అడుగుల రామ్చరణ్ భారీ కటౌట్ (ఫొటోలు)
-
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు (ఫొటోలు)
-
విజయవాడలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
విజయవాడ : వైభవంగా ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు (ఫొటోలు)
-
భవానీల దీక్ష విరమణ.. దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోన్న ఇంద్రకీలాద్రి (ఫోటోలు)
-
విజయవాడ : హై లైఫ్ ఎగ్జిబిషన్లో మోడల్స్ సందడి (ఫొటోలు)
-
మూడు నెలల్లో ముగించేద్దాం
సాక్షి,టాస్క్ ఫోర్స్: ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమోదైన కేసులను యుద్ధప్రాతిపదికన మూసివేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర కార్యాచరణను వేగవంతం చేసింది. చంద్రబాబు కేసులను మొదటి నుంచి పర్యవేక్షిస్తున్న అత్యంత ఖరీదైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఇప్పుడు ఈ వ్యవహారంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. పోలీసు, సీఐడీ విభాగాలను వీలైనంత మేర ఉపయోగించుకోవడం, కేసులను నీరుగార్చడం.. ఇదీ పథకం. ఈ పథకాన్ని సిద్ధార్థ్ లూథ్రా స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. విజయవాడలోని నోవాటెల్ హోటల్ కేంద్రంగా ఆది, సోమవారాల్లో నిర్వహించిన రహస్య సమావేశాల్లో ఈ మేరకు ఓ కుట్రను ఖరారు చేశారని వినిపిస్తోంది. లూథ్రాతో పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు వరుసగా రెండో రోజు మంగళవారం కూడా భేటీ అయ్యారని విశ్వసనీయ సమాచారం. సాక్షులను బెదిరించండి... వాంగ్మూలాలు మార్చండి.. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు బరితెగించి పాల్పడిన దోపిడీని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆధారాలతోసహా నిగ్గు తేల్చింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం, అసైన్డ్ భూముల దోపిడీ, అమరావతి ఇన్నర్రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణాల కుట్రదారు, లబ్ధిదారు చంద్రబాబేనన్నది ఆధారాలతో బట్టబయలైంది. నిబంధనలకు విరుద్ధమని చెప్పినా సరే సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించడంతోనే అక్రమాలకు పాల్పడాల్సి వచ్చిందని ఆనాటి ఉన్నతాధికారులతోపాటు ఇతరులు వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. అక్రమ నిధులు హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి, టీడీపీ బ్యాంకు ఖాతాలకు చేరినట్టు ఆధారాలను సిట్ సేకరించింది. దాంతోనే ఆ కేసుల్లో చంద్రబాబు అడ్డంగా దొరికినట్టైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ కేసుల నుంచి చంద్రబాబు పేరు తప్పించేందుకు కుట్ర పన్నుతోంది. అందుకు గతంలో వాంగ్మూలాలు ఇచ్చిన ఉన్నతాధికారులను, ఇతరులను తీవ్రస్థాయిలో బెదిరించి బెంబేలెత్తించాలని పోలీసు, సీఐడీ ఉన్నతాధికారులకు ఆదేశాలందాయని తెలుస్తోంది. అవసరమైతే వారిపై ఇతరత్రా అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేయాలని కూడా లూథ్రా సలహా ఇచి్చనట్లు సమాచారం. సాక్షులను బెదిరించి దారికి తెచ్చుకోకపోతే చంద్రబాబును ఈ అవినీతి కేసుల నుంచి బయటపడేయడం సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎంతమందిని బెదిరించారు... ఎంతమంది ఇంకా బెదిరించాల్సిన జాబితాలో ఉన్నారనే వివరాలు కూడా లూథ్రా అడిగి తెలుసుకున్నారట.అన్నీ మూసేద్దాం..చంద్రబాబు అవినీతి కేసుల్లో గతంలో సిట్ సేకరించిన డాక్యుమెంటరీ ఆధారాలను తారుమారు చేయాలనేది కూడా ఈ రెండు రోజుల సమావేశాల్లో ఖరారు చేసిన కుట్రలో భాగంగా ఉంది. గతంలో సిట్లో పనిచేసిన కిందిస్థాయి అధికారులను పిలిపించి బెదిరించాలని కూడా లూథ్రా సలహా ఇచ్చారట. ఇప్పటికే తాము నాలుగైదు సార్లు ఆ కిందిస్థాయి అధికారులను తీవ్రస్థాయిలో బెదిరించామని పోలీసు, సీఐడీ అధికారులు ఆయనకు చెప్పారు. అది సరిపోదని....ఆ వేధింపులను ఇంకా తీవ్రతరం చేయాలని లూథ్రా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలన్నీ గరిష్టంగా మూడు నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉందని, ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ రోజువారీగా తనకు నివేదిక ఇవ్వాలని ఓ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారికి లూథ్రా సూచించినట్లు పోలీసు అధికారులు చర్చించుకుంటున్నారు. పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు ఈ పనులు పూర్తి చేస్తే అనంతరం చంద్రబాబుపై కేసులను మూసివేసే సంగతి తాను చూసుకుంటానని సీనియర్ న్యాయవాది లూథ్రా ఈ సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై కేసులను నీరుగార్చే పన్నాగాన్ని కచ్చితంగా అమలు చేస్తామని... త్వరలోనే టాస్క్ పూర్తి చేస్తామని పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో లూథ్రా వ్యాఖ్యానించినట్లు పోలీసు వర్గాలంటున్నాయి. రెండు రోజుల సమావేశాల అనంతరం లూథ్రా ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారని సమాచారం.అంతా లూథ్రా చెప్పినట్లే..సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో యావత్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవçÜ్థకు సూపర్ బాస్గా అవతరించారు. గతంలో చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టు కాగానే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడలో వాలిపోయిన ఆ సీనియర్ న్యాయవాది వ్యవహారం అప్పట్లోనే తీవ్ర చర్చనీయాంశమైంది. రోజుకు రూ.కోటి ఫీజుతోపాటు అదనపు ఖర్చులు వసూలు చేసే లూథ్రా ప్రస్తుతం చంద్రబాబు అవినీతి కేసులను అడ్డగోలుగా క్లోజ్ చేసే పన్నాగానికి సర్వం తానై వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు అవినీతి కేసులను మూసివేయడంతోపాటు...వైఎస్సార్సీపీ నేతలను అక్రమ కేసులతో వేధింపులకు గురిచేసే కుట్రను కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. లూథ్రాయే సుప్రీం అని, ప్రభుత్వ కీలక విభాగాల ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి తేల్చి చెప్పారని కూడా వినిపిస్తోంది. అందువల్లే పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్, న్యాయ విభాగాలు పూర్తిగా లూథ్రా నియంత్రణలోకి వచ్చేశాయి. ఆయన ఆదేశాలకు రాష్ట్ర పోలీసు, సీఐడీ, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు జీ హుజూర్ అంటున్నారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులే కాదు... జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, అవసరమని భావిస్తే చివరికి స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు కూడా ఆయన ఫోన్లు చేసి ఆదేశిస్తున్నారు. వారు చిత్తం మహా ప్రభో.. అని ఆయన ఆదేశాలను శిరసావహిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదు మేరకు నమోదుచేసిన అక్రమ కేసులో రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయ్పాల్పై అక్రమ కేసు నమోదు చేయడంతో పాటు విచారణ పేరుతో ఎలా వేధించాలో ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారికి లూథ్రాయే స్వయంగా నిర్దేశించారని పోలీసులు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, ఇతర అక్రమ కేసులతో వేధింపులను కూడా లూథ్రా నిశితంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారట. సిద్ధార్థ్ లూథ్రా రాజ్యాంగేతర శక్తిగా ఆవిర్భవించారని ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
కదం తొక్కిన వీఓఏలు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కూటమి ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపులు, అక్రమ తొలగింపులకు వ్యతిరేకంగా వెలుగు వీఓఏలు కదం తొక్కారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినదించారు. వీఓఏల నినాదాలతో విజయవాడలోని ధర్నా చౌక్ దద్దరిల్లింది. ఆంధ్రప్రదేశ్ ఐకేపీ యానిమేటర్ల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి యానిమేటర్లు తరలివచ్చారు.యానిమేటర్ల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం వీఓఏలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలన్నారు. కూటమి అధికారంలోకి వచి్చన వెంటనే కాలపరిమితి సర్క్యులర్ను రద్దు చేస్తామని వాగ్దానం చేసిందని గుర్తుచేశారు. వీఓఏలపై పని భారం పెంచుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నారని, ప్రభుత్వ విధానాలను వెంటనే మార్చాలని ఆమె డిమాండ్ చేశారు. రోజుకో రకమైన యాప్తో వీఓఏల జీవితాలతో అధికారులు ఆటలాడుతున్నారన్నారు.అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు రూపాదేవి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై వీఓఏలు పెట్టుకున్న ఆశలను అడియాసలు చేయొద్దన్నారు. అక్రమంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని,బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. -
విజయవాడ ధర్నా చౌక్ లో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ వీఓఏల ధర్నా
-
ఇంద్రకీలాద్రి : అంగరంగ వైభవంగా దుర్గమ్మకు జ్యోతుల ఉత్సవం (ఫొటోలు)
-
విజయవాడ : సిద్ధార్థ ఫెట్ –2024.. ఫ్యాషన్ షో అదుర్స్ (ఫొటోలు)
-
విజయవాడలో 178 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన నగరపాలక సంస్థ
-
పరిహారం చెల్లించాకే భూసేకరణ
సాక్షి, హైదరాబాద్: పరిహారం చెల్లించకుండా భూసేకరణ చేసే ప్రయత్నం సరికాదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. ముందుగా పరిహారం చెల్లించాకే భూములు సేకరించాలని ఎన్హెచ్ఏఐ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన సచివాలయంలో ఎన్హెచ్ఏఐ అధికారులతో జరిపిన సమీక్షలో పలు సూచనలు చేశారు. మంచిర్యాల–విజయవాడ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారికి సంబంధించి ఎన్హెచ్ఏఐ వద్ద పరిహారానికి సంబంధించి డ్రాఫ్ట్ అవార్డులు 1,023 వరకు పెండింగులో ఉండటంపై ప్రశ్నించారు. 15 రోజుల్లో వాటిని క్లియర్ చేస్తామని అధికారులు పేర్కొనే క్రమంలో.. భూమిని సేకరించి పరిహారం చెల్లిస్తామంటూ ఎన్హెచ్ఏఐ అధికారులు పేర్కొనటాన్ని మంత్రి తప్పుపట్టారు.భూముల విలువ ఆధారంగా పరిహారాన్ని ఖరారు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. మన్నెగూడ రోడ్డు విస్తరణ పనులను వచ్చేవారం ప్రారంభించాలని, తాను ఇప్పటికే పదిసార్లు ఆదేశించినా పనులు మొదలుపెట్టకపోవటమేంటని ప్రశ్నించారు. రీజినల్ రింగురోడ్డు ఉత్తర భాగానికి డిసెంబర్/జనవరిలో టెండర్లు పిలవాలని సూచించారు. శ్రీశైలం దారిలో మిషన్ భగీరథ పైపులైన్లు ఉన్నందున తుక్కుగూడ నుంచి డిండి వరకు గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి నిర్ణయించామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.దీని ఆమోదంపై తాను సీఎంతో మాట్లాడతానని మంత్రి పేర్కొన్నారు. రూ.7 వేల కోట్లు ఖర్చయ్యే శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ఎంతో ఉపయుక్తమైందని, ఈ పనుల్లో వేగం పెరగాలని సూచించారు. భద్రాచలానికి 3 గంటల్లో వెళ్లేలా చేసే గౌరెల్లి–వలిగొండ రోడ్డు జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. ఖమ్మం–దేవరపల్లి రోడ్డులో సరీ్వసు రోడ్డు ఆప్షన్ ఉండాలని సూచించారు. విపక్షాల వికృత చేష్టలు.. రైతులకు లాభదాయక పరిహారం ఇచ్చి కీలక ప్రాజెక్టులకు భూసేకరణ కోసం యత్నిస్తుంటే విపక్షాలు కలెక్టర్లపై కూడా దాడులు చేసి చంపేందుకు కుట్రచేస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత రాజకీయాల కోసం కేసీఆర్ రాష్ట్రాన్ని బలిపశువును చేశారని విమర్శించారు. -
విజయవాడ ధర్నా చౌక్ వద్ద వాలంటీర్ల ధర్నా
-
విజయవాడలో బిజినెస్ ఎక్స్పో.. వ్యాపార అవకాశాలపై ప్రచారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వ్యాపార అవకాశాలు, ఉత్పత్తులపై ప్రచారం కల్పించేందుకు ఈనెల 29 నుంచి వచ్చే నెల 1 వరకు విజయవాడలో బిజినెస్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు ఏపీ చాంబర్స్ ప్రకటించింది. ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేస్తున్న ఈ ఎక్స్పోను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని ఏపీ చాంబర్స్ ప్రెసిడెంట్ పొట్లూరి భాస్కరరావు తెలిపారు. ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, బ్యాంకింగ్, టూరిజం, ఇన్ఫ్రా, మహిళా సాధికారత, రియల్ ఎస్టేట్, పునరుత్పాదక ఇంధనం తదితర అంశాలపై ఎక్స్పోలో చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 వరకు ఈ ఎక్స్పోను సందర్శించవచ్చన్నారు.‘ఏఐ’తో వ్యాపార అవకాశాలపై సదస్సుసాక్షి, అమరావతి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను వినియోగించుకోవడం ద్వారా వ్యాపార అవకాశాలు పెంచుకోవడంపై ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్ డిసెంబర్ 4వ తేదీన విజయవాడలో అవగాహన సదస్సు నిర్వహిస్తోంది. విజయవాడలోని హోటల్ వివంతలో నిర్వహించే ఈ సదస్సులో చిన్న, మధ్య తరగతి, ఔత్సాహిక వ్యాపారులు, కుటీర పరిశ్రమల నిర్వాహకులు పాల్గొనవచ్చని విజయవాడ రీజియన్ అధ్యక్షుడు మలినేని రాజయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ నెల 30లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. వివరాలకు 9848077227, andhrachambervijayawada@gmail.comను సంప్రదించా లని సూచించారు.25 వరకు నేచురోపతి కోర్సుకు వెబ్ ఆప్షన్స్సాక్షి, అమరావతి: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రెండో దశ వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి, యోగిక్ సైన్స్ సీట్ల భర్తీకి అభ్యర్థులు ఈనెల 25 వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని ఓ ప్రకటనలో సూచించింది. స్పెషల్ స్ట్రె వేకెన్సీలో 76 ఎంబీబీఎస్ సీట్ల భర్తీ స్పెషల్ స్ట్రె వేకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ కింద కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేసినట్లు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 76 కన్వీనర్ కోటా సీట్లను శనివారం రాత్రి కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 26 మధ్యాహ్నం లోగా కళాశాలల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. ఏఆర్ డెయిరీలో ఏపీ పోలీసుల విచారణసాక్షి, చెన్నై: తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో తమిళనాడులోని దిండుగల్లో ఉన్న ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో 11 మందితో కూడిన ఏపీ పోలీసుల బృందం శనివారం విచారణ చేపట్టినట్లు తెలిసింది. తిరుమల లడ్డూ వివాదంలో కల్తీ జరిగినట్టుగా వచ్చిన ఆరోపణలను ఆదినుంచి ఏఆర్ డెయిరీ తోసిపుచ్చుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఏపీ పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో ఆ పరిశ్రమలోకి వెళ్లినట్టు సమాచారం. -
విజయవాడలో సందడి చేసిన సినీ నటి తేజస్వి మదివాడ (ఫొటోలు)
-
సోషల్ మీడియా యాక్టివిస్టులపై కాల‘కూటమి’ విషం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ సైబర్ క్రైం పోలీస్స్టేషన్ అక్రమ కేసుల కర్మాగారంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తూ.. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ కూటమి నాయకుల మెప్పు కోసం ఖాకీలు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం సోషల్ మీడియా యాక్టివిస్టులను విస్మయానికి గురిచేస్తోంది. టీడీపీ ప్రభుత్వం రాగానే గూండాగిరికి తెగబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కేంద్రంగా ‘వైఎస్సార్ కుటుంబం’, ‘జయహో.. జగనన్న’, ‘ఆంధ్రా సింహం’, ‘వైఎస్సార్ సోషల్ మీడియా ఖమ్మం జిల్లా’ అనే నాలుగు వాట్సాప్ గ్రూపులున్నాయి. ఒక్కోదానిలో గరిష్టంగా 250 మందికి పైగా ఇరు రాష్ట్రాల్లోని వ్యక్తులున్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇటీవల కొంతకాలంగా సోషల్ మీడియా పోస్ట్లపై సైబర్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ మధ్య ఏపీలో వెలుగుచూసిన ఓ పోస్టును సాకుగా చేసుకుని కూటమి నాయకుడొకరు తన పార్టీ కార్యకర్తలతో ఈ నెల 2న అన్ని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులిప్పించాడు. అదే రోజు ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలోనూ 42 కేసులు నమోదు చేశారు. అక్కడితో ఆగకుండా సభ్యులుగా ఉన్న వారికి నోటీసులిచ్చారు. ఎన్టీఆర్ జిల్లాకంచికచర్ల మండలం పెండ్యాలలోని 172 మంది పేదలకూ నోటీసులిచ్చారు. ఈ నెల 8వ తేదీలోపు సమాధానం చెప్పాలని నోటీసుల సారాంశం.ఇలా శుక్రవారం నాటికి 260 మందికి ఇచ్చారు. దీంతో విజయవాడ సైబర్ క్రైం స్టేషన్కు నోటీసులు అందుకున్న వారిలో 160 మంది తరలివచ్చారు. కూటమి సర్కారు వైఫల్యాలు, అక్రమాలపై ప్రశ్నిస్తే.. అమ్మాయిలపై తప్పుడు పోస్టు పెట్టారని అభాండాలు వేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల జోనల్ ఇన్చార్జి హుటాహుటిన స్టేషన్కు చేరుకుని బాధితులకు భరోసా ఇచ్చారు. పలువురు మీడియా ప్రతినిధులు సైతం స్టేషన్కు చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమై నోటీసుల సారాంశాన్ని బయటపెట్టారు.ఇలా చేయడం దారుణం..నేను వైఎస్సార్సీపీకి చెందిన ఓ వాట్సాప్ గ్రూప్తో పాటు మరికొన్ని పార్టీల వాట్సాప్ గ్రూప్ల్లోనూ ఉన్నా. ఇటీవల వైఎస్సార్సీపీ గ్రూప్లో వచ్చిన పోస్ట్ను చూసి.. వెంటనే మర్చిపోయాను. దీనికే నాకు సైబర్ పోలీసుల నుంచి నోటీసు వచ్చింది. స్టేషన్కు వచ్చి వివరణ ఇవ్వమన్నారు. – ఆకుల మురళి, గుంటూరుబెదిరించి రప్పించారు.. నేను మా రాష్ట్రంలో ఓ రాజకీయ పార్టీ బీసీ సంఘం నేతగా ఉన్నా. ఆకస్మాత్తుగా విజయవాడ సైబర్ స్టేషన్ నుంచి నోటీసు వచ్చింది. రాకపోతే ఇంటికొచ్చి అరెస్టుచేస్తామని బెదిరించారు. నోటీసు సారాంశమేంటో తెలుసుకుందామని వచ్చా. – బి. సోమేశ్వరగౌడ్, భద్రాద్రి కొత్తగూడెంఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రామకృష్ణ. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంకు చెందిన ఈయన ఓ జర్నలిస్ట్. ఖమ్మం కేంద్రంగా వైఎస్సార్ కుటుంబం అనే పేరుతో కొనసాగే ఓ వాట్సాప్ గ్రూపులో సభ్యుడు. ఆ గ్రూపు అడ్మిన్ ఇటీవల గ్రూపులో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టాడు. దీనికిగాను రామకృష్ణకు విజయవాడ సైబర్ క్రైం పోలీసులు నోటీసులిచ్చారు. తన నంబర్ అన్నీ రాజకీయల పార్టీల, ప్రభుత్వ అధికారుల వాట్సాప్ గ్రూపుల్లో ఉంటుందని, దీనికి తానేదో తప్పుచేసినట్టు నోటీసిచ్చి విజయవాడకు రప్పించడమేంటని సైబర్ క్రైం పోలీసులను ప్రశ్నించారు. -
చనిపోయిన వారిపై కేసు పెట్టి విచారణకు రమ్మని నోటీసు
-
విజయవాడ నుంచి శ్రీశైలానికి గంటన్నరలో వెళ్లిపోవచ్చు!
ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కలగలసి వెలసిన మహా పుణ్యక్షేత్రం.. ఇల కైలాసం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి అనేకమంది భక్తులు వస్తుంటారు. ఇప్పటి వరకు అటవీ ప్రాంతంలో ఘాట్ రోడ్డు మీద ప్రయాణం ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఇక నుంచి భక్తులకు సరికొత్త మధురానుభూతిని కలిగించేందుకు ‘సీ ప్లేన్’ను పర్యాటక శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. నీటిలో విమానం ఎక్కి.. నీటిలోనే దిగడం ఈ సీ ప్లేన్ ప్రత్యేక. అయితే, అవసరమైనప్పుడు నేలపై కూడా సీ ప్లేన్ ల్యాండ్ అవుతుంది. విజయవాడ–శ్రీశైలం మధ్య సీ ప్లేన్ నడిపేందుకు ఈ నెల 9వ తేదీన ట్రయల్ రన్ నిర్వహించనుంది.తగ్గనున్న ప్రయాణ సమయంవిజయవాడ–శ్రీశైలం మధ్య రోడ్డు మార్గంలో సుమారు 270 కిలో మీటర్లు దూరం ఉంటుందని, సీ ప్లేన్లో సుమారు గంటన్నర సమయంలో చేరుకునే అవకాశం ఉంటుందని పర్యాటక శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం 14 సీటింగ్, 19 సీటింగ్ కెపాసిటీ కలిగిన రెండు సీప్లేన్లు అందుబాటులో ఉన్నాయని, ట్రయల్ రన్ తర్వాత ఖర్చు, నిర్వహణ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ఎన్ని సర్వీసులు నడపాలి, టికెట్ ఎంత వసూలు చేయాలనేది నిర్ణయిస్తామని అధికారులు తెలిపారు. తొలి దశలో విజయవాడ–శ్రీశైలం సీ ప్లేన్ విజయవంతమైతే హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల నుంచి కూడా నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఇదీ సీ ప్లేన్ ప్రణాళిక...సీప్లేన్ టేకాఫ్, టేకాన్కు నీటిలో సుమారు 1.16 కిలో మీటర్ల పొడవు, 120 మీటర్ల వెడల్పు ఉండాలి. పర్యాటకులు సీ ప్లేన్ ఎక్కేందుకు, దిగేందుకు నీటిపై ప్రత్యేక జెట్టీలు అవసరం.శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ వద్ద గల ఎస్ఎల్బీసీ టన్నెల్ సమీపంలో సీ ప్లేన్ ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ పున్నమి ఘాట్ నుంచి బయలుదేరి శ్రీశైలం డ్యామ్ వెనుక భాగంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ సమీపంలో సీ ప్లేన్ దిగుతుంది. అక్కడి నుంచి బోటులో ప్రయాణించి పాతాళగంగకు చేరుకుంటారు. పాతాళగంగ వద్ద ప్లాస్టిక్ జెట్టిపై ప్రయాణికులు దిగి రోప్వే ద్వారా పైకి వచ్చి శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు.తిరుగు ప్రయాణంలో మళ్లీ సీ ప్లేన్ శ్రీశైలం డ్యామ్ వెనుక భాగంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ సమీపంలో బయలుదేరి విజయవాడ పున్నమి ఘాట్కు చేరుతుంది. చదవండి: నా శివయ్యను దర్శనం చేసుకోనివ్వరా.. శ్రీకాళహస్తిలో అఘోరీ ఆత్మహత్యాయత్నం -
ఇంట్లో చెబితే చంపేస్తానని చిన్నారికి టీచర్ బెదిరింపులు
-
మళ్లీ YSRCP గెలవడం ఖాయం
-
బాబుకు బాధిత అవ్వ మాస్ వార్నింగ్..
-
జనసేన ఆఫీస్ దగ్గరే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరీక్షణ
-
మా సర్వీస్ను రెగ్యులరైజ్ చేయాలి
సాక్షి, అమరావతి/ గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ (విలేజ్ క్లినిక్)లో సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్వో)లు డిమాండ్ చేశారు. అదే విధంగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులతో సమానంగా తమకు 23శాతం వేతనాలు పెంచాలని కోరారు. ప్రతి నెలా వేతనంతోపాటు ఇన్సెంటివ్ కూడా చెల్లించాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడలోని ధర్నా చౌక్లో సోమవారం సీహెచ్వోలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విజయవాడకు చేరుకున్న సీహెచ్వోల ధర్నాకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సీహెచ్వోల సమస్యలపై శాసన మండలిలో ప్రస్తావిస్తానని, అదే విధంగా వైద్య శాఖ మంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఎన్హెచ్ఎం జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే 23శాతం జీతాలు పెంచాలని, లేనిపక్షంలో ఇప్పుడు ఇస్తున్న వేతనంతో పాటు ప్రతినెలా రూ.15 వేల ఇన్సెంటివ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్ను పునరుద్ధరించాలన్నారు. సీహెచ్వోల సంఘ రాష్ట్ర అధ్యక్షరాలు ప్రియాంక, ఉపాధ్యక్షుడు ప్రేమ్ కుమార్ తదితరులు మాట్లాడారు. వందలాది మంది సీహెచ్వోలు పాల్గొన్నారు. -
రెండవ రోజు దీక్షల విరమణకు తరలివచ్చిన భవానీలు
-
ఇంద్రకీలాద్రిలో సామాన్య భక్తుల కష్టాలు
-
విజయవాడలో కలకలం.. గంజాయి బ్యాచ్ దాడిలో లోకో పైలట్ మృతి
-
వరద బాధితులకు అండగా విజయవాడలో YSRCP దీక్ష
-
వరద బాధితుల కోసం వైఎస్సార్సీపీ నేతలు నిరాహార దీక్ష
-
వరదలు చూసి వసూలు చేసిన చందాలు పేద వారికి పంచకుండానే మింగేశారు
-
వీఐపీలొస్తే భక్తుల దర్శనాలకు బ్రేక్
-
ఇంద్రకీలాద్రిలో సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు
-
మేయరా...అయితే మాకేంటి?
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలా ద్రిపై విజయవాడ నగ ర మేయర్కు సోమవా రం ఘోర అవమానం ఎదురైంది. కొండపై ఆమెను అడుగడుగునా అధికారులు అవమానించారు. ఆమె కారు ను పదేపదే నిలిపివేశారు. ఆమె కారులోంచి బయటకు వచ్చి తాను మేయర్ని అని, తనకు ప్రొటోకాల్ ఉంటుందని చెబుతున్నా ఎవరూ లెక్క చేయలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కష్టాలుపడి కొండపైకి చేరుకున్న ఆమెను ఆలయ చిన్న రాజగోపురం వద్ద పోలీసులు, దేవస్థానం సిబ్బంది నిలిపివేశారు.దీంతో ఆమె కొద్దిసేపు పక్కనే నిలబడి ఎదురు చూశారు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్న మీడియా ఆమె వద్దకు వచ్చి వీడియో తీస్తుండగా అప్పటికప్పుడు సిబ్బంది స్పందించి గేట్ తీసి ఆమెను లోపలకు పంపించారు. రూ.300 క్యూ లైన్ నుంచి అమ్మవారికి నమస్కారం చేసుకొని మేయర్ బయటకు వచ్చేశారు. సాధారణంగా మేయర్ వచ్చినప్పుడు ఆమెకు ప్రొటోకాల్ అధి కారులు స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం చేయించి, ఆశీర్వాదాలను, ప్రసాదాలను అందించి పంపాల్సి ఉంటుంది.బీసీ మహిళను అవమానించారు ‘అమ్మవారి దర్శనానికి వస్తే నన్ను అవమానించారు. దేవస్థానం చెప్పిన సమయంలోనే నేను కొండపైకి వచ్చాను.నాకు వెహికల్ పాస్ ఇవ్వమని కలెక్టర్, సీపీ, నగర కమిషనర్ను కోరాను. మీరు మేయర్.. మిమ్మల్ని ఎవరు ఆపుతారని అధికారులు అన్నారు. కానీ నాకు అడుగడుగునా అడ్డంకులే. నేను మేయర్ని అని అందరికీ చెప్పుకోవాలి్సన పరిస్థితి కల్పించారు. పోలీసులు, దేవస్థానం అధికారుల తీరు సరిగాలేదు. గతంలో ఏనాడైనా ఇలా జరిగిందా..? కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరం. నగర పాలకసంస్థ సహకారం లేకుండా భవానీదీక్షలు, దసరా ఉత్సవాలను నిర్వహించగలరా? మేయర్ను అందులోనూ బీసీ వర్గానికి చెందిన మహిళను కావాలనే నన్ను అవమానించారు. –రాయన భాగ్యలక్ష్మి, మేయర్ విజయవాడ -
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు
-
విజయవాడ దుర్గగుడిలో జత్వానీకి రాచమర్యాదలు
-
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు
-
ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ప్రారంభం
-
వరద నష్టపరిహారంపై గందరగోళం
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ బుడమేరు వరద నష్టపరిహారంపై గందరగోళ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. బాధితులకు వారి బ్యాంకు ఖాతాల్లో నష్టపరిహారాన్ని జమచేస్తామని ప్రకటించినప్పటికీ అలా కాకపోవడంతో వారు రోడ్డెక్కి లబోదిబోమంటున్నారు. ఇస్తామన్న కొద్దిపాటి పరిహారంలోనూ కోతలు, దానికితోడు సాంకేతిక కారణాలను చూపి నిలిపివేస్తున్నారని వారు మండిపడుతున్నారు. కేవైసీ కాలేదని.. నీ ఖాతా వాడుకలో లేదనే బ్యాంకు సిబ్బంది సమాధానాలతో వరద బాధితులకు దిక్కుతోచడంలేదు.ప్రభుత్వం నష్టపరిహారాన్ని ఎగ్గొట్టడానికే ఈ విధమైన ఎత్తుగడలను అనుసరిస్తోందంటున్నారు. తమకు జరిగిన అన్యాయం.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ నగరంలోని పలు సచివాలయాల వద్ద వరద బాధితులు సోమవారం ధర్నాలు నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయానికి కూడా అనేకమంది తరలివెళ్లారు.బ్యాంకుల్లో బారులుతీరిన బాధితులు.. నిజానికి.. వరద నష్టపరిహారాన్ని ఈనెల 30 నాటికి బాధితుల ఖాతాల్లో జమచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బాధితులు బ్యాంకులకు పోటెత్తారు. అయితే, మీ ఖాతా వాడుకలో లేదని.. కేవైసీ చేయించుకోవాలని బ్యాంకు సిబ్బంది సూచించటంతో ఇళ్లకు వెళ్లి ఆధార్, పాన్కార్డుల జిరాక్స్లను తీసుకుని మళ్లీ వచ్చారు. ఆ తర్వాత క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించినప్పటికీ మళ్లీ ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) లింక్ అంటూ మెలికపెట్టారు. ప్రభుత్వ పథకాల నగదు బ్యాంకు ఖాతాల్లో పడాలంటే ఎన్పీసీఐతో ఖాతాలు లింక్ అయి ఉండాలని అధికారులు చెప్పడంతో బాధితులు అయోమయానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. చాలా కుటుంబాల్లో నాలుగైదు ఏళ్ల క్రితం చనిపోయిన వారి ఖాతాల్లో నగదు జమకావడంతో వారేమి చేయాలో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. -
వరద బాధితులకు అన్యాయం.. నష్టపరిహారం ఎక్కడ..?
-
ఇంకా అందని సాయం..
-
విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత
-
విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత
-
7 వేల కోట్లు నష్టం..700 కోట్లు ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు
-
తిరోగమనంలో విమానయానం
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం తర్వాత వేగంగా కోలుకున్న రాష్ట్ర విమానయాన రంగం తొలిసారిగా నేలచూపులు చూసింది. లాక్డౌన్ తర్వాత ప్రతీ నెలా క్రమంగా పెరుగుతూ వచి్చన ప్రయాణికుల సంఖ్య జూలై నెలలో తగ్గిపోయింది. తాజాగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. గతేడాది జూలై నెలతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ఒక్క విజయవాడ తప్ప రాష్ట్రంలోని మిగిలిన ఐదు విమానాశ్రయాల్లో ప్రయాణికుల సంఖ్యలో భారీ క్షీణత నమోదయ్యింది. రాయలసీమ ప్రాంతంలో ఆ క్షీణత ఇంకా ఎక్కువగా ఉంది.తిరుపతి విమానాశ్రయంలో 4.4 శాతం తగ్గితే కర్నూలులో 63.5 శాతం, కడప విమానాశ్రయంలో 47.4 శాతం తగ్గింది. గతేడాది జూలై నెలలో కడప విమానాశ్రయం నుంచి 6,944 మంది ప్రయాణిస్తే ఇప్పుడు ఆ సంఖ్య 3,650కు పడిపోయింది. అదే సమయంలో కర్నూలులో ప్రయాణికుల సంఖ్య 3,419 నుంచి 1,247కు పడిపోయింది. తిరుపతి విమానాశ్రయంలో కూడా ప్రయాణికుల సంఖ్య తగ్గడం గమనార్హం. విశాఖపట్నంలో కూడా ప్రయాణికుల సంఖ్య 2,28,897 నుంచి 2,25,261కు తగ్గిపోయింది. కానీ ఒక్క విజయవాడలో 15.5 శాతం పెరిగింది.తగ్గించేస్తున్న సరీ్వసుల సంఖ్యప్రయాణికుల సంఖ్య తగ్గడంతో విమానయాన సంస్థలు తమ సరీ్వసులను తగ్గించేస్తున్నాయి. కర్నూలులో విమాన సరీ్వసులు 108 నుంచి 64కు తగ్గిపోయాయి. కడపలో 200 నుంచి 138కు రాజమండ్రిలో 748 నుంచి 694కు సరీ్వసులు తగ్గాయి. ఒక్క విజయవాడలో మాత్రం విమాన సర్వీసులు 1,272 నుంచి 1,553కు పెరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఆర్థిక కార్యకలాపాలు తగ్గడంతో విమాన ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.ప్రభుత్వం రాజధాని అమరావతి అంటూ ఆ ఒక్క ప్రాంతానికే ప్రాధాన్యత ఇస్తుండటంతో మిగిలిన ప్రాంతాల్లో కార్యకలాపాలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయని, దానికి నిదర్శనమే విశాఖతో సహా మిగిలిన విమానాశ్రయాల్లో ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి కారణంగా నిపుణులు విశ్లేíÙస్తున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రాష్ట్రానికి చెందిన కె.రామ్మోహన్నాయుడు ఉన్నప్పటికీ విమాన సరీ్వసులు, ప్రయాణికుల సంఖ్య తగ్గుతున్నాయని, ఇదే విధమైన పరిస్థితి కొనసాగితే త్వరలోనే కడప, కర్నూలు విమానాశ్రయాల్లో సేవలు నిలిచిపోయే ప్రమాదముందని ఆ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
నేడు పీహెచ్సీ వైద్యుల చలో విజయవాడ
సాక్షి, అమరావతి: పీజీ వైద్యవిద్యలో ఇన్సర్వీస్ కోటా కుదింపును నిరసిస్తూ మంగళవారం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యుల సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ యూనస్మీర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్చలకు ప్రభుత్వం పిలుస్తామని చెప్పడంతో సోమవారం వేచి చూసినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ముందు నిర్దేశించుకున్నట్లు మంగళవారం చలో విజయవాడ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్సీ వైద్యులు విజయవాడలో ర్యాలీ నిర్వహించి ధర్నాచౌక్లో శాంతియుత నిరసనలు తెలుపుతారని పేర్కొన్నారు. ఇంకా ప్రభుత్వం స్పందించకపోతే బుధవారం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని తెలిపారు. సమ్మె నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పీహెచ్సీల్లో వైద్యసేవలు అందించబోమని స్పష్టం చేశారు. -
ఫర్నిచర్ పరిశ్రమ వరదార్పణం
సాక్షి, అమరావతి: విజయవాడ వరదల్లో తడిసి ముద్దయిన ఫర్నిచర్ పరిశ్రమకు కోలుకోలేని నష్టం ఏర్పడింది. దాదాపు 15రోజులపాటు ప్లైవుడ్, ఇతర ఫర్నిచర్ సామగ్రి నీటిలో నానిపోయి రూ.కోట్ల నష్టం మిగిలి్చంది. ఉత్పత్తి అయిన ఫర్నిచర్ అమ్మకానికి పనికిరాకుండా తయారైంది. సామగ్రి సైతం ఫర్నిచర్ తయారీకి పనికిరాకుండా పోయింది. దీంతో ఫర్నిచర్ పరిశ్రమలు, వర్క్షాప్ల రోజువారీ పనులు ఇప్పటికీ మొదలయ్యేలా లేవు. ముంపుబారిన 310కి పైగా వర్క్షాపులు విజయవాడ నగరంలో వరద ముంపునకు గురైన అజిత్సింగ్నగర్, రాజరాజేశ్వరీపేట, అంబాపురం, రాజీవ్ నగర్, వాంబే కాలనీ, జక్కంపూడి కాలనీ, పైపుల రోడ్డు, కండ్రిక తదితర ప్రాంతాల్లో 310పైగా ఫర్నిచర్ తయారు చేసే వర్క్షాప్లు ఉన్నాయి. వాటితోపాటు భవానీపురం, అజిత్సింగ్ నగర్ ప్రాంతాల్లో 45కు పైగా ప్లైవుడ్ పరిశ్రమలు ఉన్నాయి. వాటికి అనుబంధంగా ప్రత్యేక గోదాములు కూడా ఉన్నాయి. వాటన్నింటిలోను వరద నీరు చేరి రోజుల తరబడి ఉండిపోవడంతో ప్లెవుడ్ చెక్కలతోపాటు వాటితో తయారు చేసిన వస్తువులు సైతం నానిపోయి ఉబ్బిపోయాయి. ముడిసరుకు, తయారీ సామగ్రి వరద నీటిలో దెబ్బతిని వాటి యజమానులు నష్టపోయారు. ఫర్నిచర్ షాపులు, వర్క్షాపుల్లోని బీరువాలు, సోఫా సెట్లు, ఇనుప సామగ్రి, యంత్రాలు, పనిముట్లు దెబ్బతినడంతో ఒక్కో యజమానికి కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు. ఒక్క ప్లైవుడ్ ఫర్నిచర్, వర్క్షాపులు, పరిశ్రమలకు వచ్చిన నష్టమే మొత్తంగా కనీసం రూ.30 కోట్లు ఉంటుందని అంచనా. ఫర్నిచర్ షాపులు, పరిశ్రమలపై ఆధారపడిన జీవిస్తున్న సుమారు 12 వేల మంది ఉపా«ధికి సైతం పెద్ద దెబ్బ తగిలింది.ఇనుముకు తుప్పు విజయవాడ భవానీపురం ఐరన్ యార్డ్కు వరద తీవ్ర నష్టం తెచ్చింది. 60 ఎకరాల్లో విస్తరించిన ఐరన్ యార్డ్లో 430కి పైగా హోల్సెల్ ఐరన్ వ్యాపార దుకాణాలు ఉన్నాయి. ఈ యార్డ్లో రోజుకు రూ.5 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. ఐరన్ హోల్సేల్ షాపులతోపాటు రిటైల్ షాపులు, శానిటరీ, పైపులు, ప్లైవుడ్, ఎలక్ట్రికల్స్, హార్ట్వేర్, ఆగ్రో, కెమికల్, నిత్యావసర వస్తువుల షాపులు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వరద నీరు ముంచెత్తడంతో అవన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. రోజుల తరబడి నీటిలో నానిపోయిన ఐరన్ నిల్వలు తుప్పుపట్టి రంగు మారడంతో వ్యాపారులు తీవ్ర నష్టాల్లో మునిగిపోయారు. రంగు మారిన ఐరన్ సామగ్రిని తుక్కుకు అమ్ముకోవాల్సిందేనని ఆవేదన చెందుతున్నారు. వరద సమయంలో 15 రోజులపాటు వ్యాపారం చేసే అవకాశం లేకపోగా, ఇప్పుడు పాడైన ఐరన్, ఇతర సామగ్రిని అయినకాడికి అమ్ముకోవాల్సి రావడంతో నష్టాల్లో మునిగిపోతామని చెబుతున్నారు. -
వరద సాయంలోనూ టీడీపీ నేతల పక్షపాతం
-
మానని గాయం.. తీరని నష్టం
సాక్షి, అమరావతి : బుడమేరు వరద బాధితుల్లో ఎవరిని కదిపినా ఒకటే వేదన. 15 రోజులైనా వరద కష్టాలు వీడలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం లక్షకు పైగా కుటుంబాలకు మానని గాయాన్ని మిగిల్చింది. బతుకులను దుర్భరంగా మార్చింది. గత నెల 31న అర్ధరాత్రి విరుచుకుపడ్డ వరదకు సర్వస్వం కోల్పోయి విలపిస్తున్న విజయవాడ శాంతినగర్, పాయకాపురం, పైపుల రోడ్డు, వాంబేకాలనీ, డాబాకోట్లు సెంటర్, ఇందిరానాయక్ నగర్, సింగ్నగర్ నుంచి ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. ఈమె పేరు లావణ్య. ఆమె భర్త నర్సింహారావు. ముగ్గురమ్మాయిల్లో పెద్దమ్మాయికి పెళ్లి చేశారు. ఆమె ప్రస్తుతం రెండు నెలల బిడ్డకు తల్లి.వీరంతా సింగ్ నగర్ శాంతినగర్లో రూ.5 వేలకు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. గత నెల 31 అర్ధరాత్రి హఠాత్తుగా వచ్చిన వరద ఇంటిని ముంచేసింది. సామాన్లు తీసుకునే సమయం కూడా లేదు.చంటిబిడ్డను తీసుకొనిఅందరూ డాబా పైకి పరిగెత్తారు. కేవలం ఓ బరఖాని పైకప్పుగా మార్చుకుని దాని కిందే మూడు రోజులు బతికారు. వీరి అవస్థ చూసి బాలింతరాలికి పక్కింటి వారు ఆశ్రయమిచ్చారు. సహాయక చర్యలకు వచ్చిన హెలికాప్టర్ గాలికి బరఖా చిరిగిపోవడంతో వారం రోజులు వానలోనే గడిపారు. సరైన తిండి, నిద్ర లేవు. వరద తగ్గాక కిందకొచ్చి చూస్తే ఇల్లంతా బురద. ఏ వస్తువూ మిగల్లేదు. మిషన్ కుడితే గానీ ఇల్లు గడవదు. ఇప్పుడదీ పాడైంది. సెప్టిక్ ట్యాంకు నిండా బురద చేరడంతో కనీసం కాలకృత్యాలకూ నరకం చూడాల్సి వస్తోందని ఆ కుటుంబం విలపిస్తోంది.జీవిత కాలం కష్టం.. చెత్త కుప్పల పాలుఏళ్ల తరబడి పేద ప్రజల రెక్కల కష్టం.. ఇదిగో.. ఇలా వరద పాలై రోడ్డు పక్కకు చేరింది. బుడమేరు వరదకు ఇళ్లలో వస్తువులన్నీ పాడైపోయాయి. కాస్త పనికొచ్చే వస్తువులను పాత సామాన్ల వాళ్లు తృణమో పణమో ఇచ్చి పట్టుకెళ్తున్నారు. అందుకూ పనికిరాని వస్తువులను బాధితులు రోడ్లపై పడేస్తున్నారు. దీంతో విజయవాడలోని వరద ప్రాంతాల్లో రోడ్ల పక్కన పాడైన ఇంటి సామాగ్రి గుట్టలు గుట్టలుగా పేరుకుపోతోంది. వాటిని ప్రభుత్వ సిబ్బంది దాదాపు 400 ట్రాక్టర్లలో పైపులరోడ్డు వద్దకు తరలిస్తున్నారు. గుంటూరు, గన్నవరం, ఏలూరు, రాజమండ్రి నుంచి కూడా వరదల్లో మునిగి పనికిరాని సామగ్రిని విజయవాడ పైపులరోడ్డుకు తరలిస్తున్నవారు. అక్కడి నుంచి మేజర్ డంపింగ్ యార్డ్ అయిన ఎక్సెల్ ప్లాంట్కు తరలిస్తున్నారు. – సాక్షి, అమరావతిడాబాలపైనే జీవనంఅర్ధరాత్రి వేళ విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద దాదాపు 60 మంది ప్రాణాలను మింగేసింది. మరునాడే సీఎం చంద్రబాబు వరద ప్రాంతాల్లో తిరుగుతూ ప్రచారార్భాటం మొదలెట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో సాయమంటూ ఊదరగొట్టారు. చేసింది శూన్యం. లక్షలాది మంది నిరాశ్రయుల్లో ఒక్కరికీ ఒక్క రూపాయి తక్షణ సాయం ఇవ్వకుండా తప్పించుకు తిరిగారు. 10 రోజులయ్యాక వరదను జయించేశామని ప్రకటించేసుకుని వెళ్లిపోయారు. ప్రభుత్వ యంత్రాంగమూ మాయమైంది. ఇప్పుడక్కడ మిగిలింది బురద, బాధితులే. బాధితుల పరిస్థితిలో మార్పు లేదు. అక్కడక్కడా పారిశుద్ధ్య సిబ్బంది మాత్రం కనిపిస్తున్నారు. ప్రతి ఇంటిలోనూ విలువైన సామాగ్రి మొత్తం నీటిపాలైంది. అనేక ఇళ్లు నివాసానికి పనికిరాకుండా పోయాయి. బురద కడుగుతామన్న ఫైరింజన్లు కూడా అదృశ్యమైపోయాయి. ఇంట్లో పేరుకున్న బురదను ప్రజలే తొలగించుకుంటున్నారు. ఇందుకు ఇంటికి రూ.5 వేలు నుంచి రూ.10 వేలు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బురద తొలగకపోవడంతో ఇప్పటికీ డాబాలపైనే ప్లాస్టిక్ సంచుల గుడారాల కిందే జీవిస్తున్నారు.ఈ సమయంలో ఓటీపీలా?వరద నష్టం అంచనాల్లోనూ ఓటీపీ అడగడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదల్లో సెల్ ఫోన్లే పోతే ఓటీపీలు ఎలా వస్తాయని అంటున్నారు. భవిష్యత్తుపై బెంగతో దాతలు, స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయిస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు లాటరీ పద్ధతిలో కొన్ని ఇళ్లను దత్తత తీసుకుంటామని చెబుతున్నాయి.ఇక అన్నీ పాత సామాన్లేవరదకు ఇంట్లో గిన్నెల నుంచి విలువైన టీవీలు, ఫ్రిజ్లు, ఏసీలు, మంచాలు, కుర్చీలు.. ఇలా అన్ని వస్తువులూపనికిరాకుండా పోయింది. పుస్తకాలు, దుస్తులను వీధుల్లో ఆరబెట్టుకొంటున్నారు. పనికి రావనుకున్న టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఇతర సామాగ్రిని రోడ్ల పక్కన పడేశారు. వాటిని కేజీల లెక్కన అమ్ముకుంటున్నారు. దీంతో పాత సామాన్లు కొనే వారు గతంలో కేజీకి రూ.20 ఇస్తే ఇప్పుడు రూ.10 కే అడుగుతున్నారు. పుస్తకాలన్నీ పాడవడంతో పిల్లలు స్కూళ్లకు వెళ్లడంలేదు. వీధుల్లో పేరుకున్న చెత్త, మురుగు, దుర్గంధంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. అనేక మంది జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. ఇంత కష్టంలో తాముంటే ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఏమైపోయారని బాధితులు మండిపడుతున్నారు. వలంటీర్లు, సచివాలయ సిబ్బందే తమను బతికించారని చెబుతున్నారు.ఓట్లేయించుకున్న వారేరి?ఇంట్లో సామాన్లన్నీ పాడైపోయాయి. కట్టు బట్టలు మినహా ఏమీ మిగల్లేదు. ఏ ఒక్కరూ సాయం చేయలేదు. కనీసం తిండి కూడా పెట్టలేదు. రోడ్డు వరకూ వరదలోనే వెళ్లి తెచ్చుకున్నాం. ప్రభుత్వం ముందుగానే హెచ్చరించి ఉంటే ఎక్కడికైనా వెళ్లిపోయేవాళ్లం. మా ఏరియా వలంటీర్, సచివాలయ సిబ్బంది తప్ప మా బాగోగులు చూసేందుకు ఎవరూ రాలేదు. ఓట్లేయించుకున్న ఎమ్మెల్యే, కార్పొరేటర్ కన్నెత్తి చూడలేదు. – పావని, శాంతినగర్స్కూలుకి వెళ్లడంలేదుప్రైవేటు స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాను. వరదకు మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. పక్కింటి వాళ్లు ఆశ్రయం ఇచ్చారు. పుస్తకాలన్నీ తడిసిపోయాయి. ఇప్పుడు వాటిని ఆరబెట్టుకుంటున్నా. స్కూలుకు వెళ్లడంలేదు. – ప్రణవి, వాంబేకాలనీఆరోగ్యం పాడైందిఇల్లు మొత్తం మునిగిపోవడంతో డాబాపైకి వచ్చేశాం. బరఖా కిందే ఉంటున్నా. నా ఆరోగ్యం పాడైంది. జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నాను. నా కుమారుడికి ఇటీవలే పోలియో వచ్చింది. ఇప్పుడు మా పరిస్థితి ఇలా అయ్యింది. ఎలా బతకాలో ఏమీ అర్ధం కావడం లేదు. – నాగమణి, శాంతి నగర్ఏదీ మిగల్లేదుఇంట్లో వాషింగ్ మెషిన్లు, కూలర్లు, మోటర్, టీవీ.. ఇలా ఏదీ మిగల్లేదు. రూ.2 లక్షల వరకూ నష్టం వచ్చింది. మూడు రోజులు వరద నీటిలోనే ఉన్నాం. ప్రభుత్వం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేదు. అతికష్టం మీద వరద నుంచి బయటపడి బంధువుల ఇంటికి వెళ్లిపోయాం. తిరిగొచ్చి చూస్తే ఇల్లంతా బురద. సామానంతా పాడైపోయింది.– దివ్యభారతి, పాయకాపురం -
పవన్ కళ్యాణ్... చర్చకు రెడీ... పోతిన మహేష్ ఓపెన్ ఛాలెంజ్
-
అమ్మ సాక్షిగా అవినీతి
-
ఏపీలో రైతులను నిండా ముంచిన ప్రభుత్వ నిర్లక్ష్యం
-
ఏపీతో ఏచూరికి ఎనలేని బంధం
సాక్షి, అమరావతి/సాక్షి, పాడేరు/గాజువాక: అస్తమించిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఆంధ్రప్రదేశ్తో చాలా అనుబంధం ఉంది. ఆయన స్వస్థలం కాకినాడ అయినా.. తండ్రి సర్వేశ్వర సోమయాజి బదిలీపై విజయవాడ ఆర్టీసీలో ఉన్నతాధికారిగా పనిచేసిన సమయంలో ఆరు, ఏడు తరగతులను ఏచూరి విజయవాడలోనే చదువుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్కు వెళ్లారు. 1978లో స్టూడెండ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) జాతీయ అధ్యక్షుడి హోదాలో విజయవాడకు వచ్చారు. విద్యార్థి నాయకుడిగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా, జనరల్ సెక్రటరీగా అనేక కార్యక్రమల్లో పాల్గొన్నారు.గతేడాది నవంబర్లో ప్రజారక్షణభేరి ర్యాలీ, సభకు హాజరయ్యారు. 2022లో దేశ రక్షణ భేరి బహిరంగ సభకు వచ్చారు. అదే ఏడాది జనవరిలో పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలోనూ పాలుపంచుకున్నారు. 2010లో సీపీఎం అఖిల భారత విస్తృతస్థాయి సమావేశాల్లో పాల్గొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మూడు రోజుల పాటు విజయవాడలో ఉండి రాష్ట్రమంతా పర్యటించారు. చివరిగా ఈ ఏడాది మే 10న విజయవాడలో ఇండియా కూటమి నిర్వహించిన కార్యక్రమంలో ఏచూరి పాల్గొన్నారు. ఏచూరి విద్యాభ్యాసం, నివాసం అంతా ఢిల్లీ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ వచి్చనప్పుడు తెలుగులోనే మాట్లాడేవారు. విశాఖతో ప్రత్యేక అనుబంధం సీతారాం ఏచూరికి విశాఖతో ఎనలేని అనుబంధం ఉంది. 2015 ఏప్రిల్ 14 నుంచి 19వ తేదీ వరకు విశాఖలోని పోర్టు స్టేడియంలో నిర్వహించిన సీపీఎం 21వ జాతీయ మహాసభల్లో ఆయన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేట్పరం కాకుండా ఢిల్లీస్థాయిలో పోరాడటంలోను, షిప్యార్డు, బీహెచ్పీవీ, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ రక్షణ కోసం జరిగిన ఉద్యమాల సందర్భంగా ఏచూరి ఢిల్లీ నుంచి విశాఖకు అనేక సార్లు వచ్చారు.విశాఖ స్టీల్ప్లాంట్ స్థాపన కోసం జరిగిన ఉద్యమాల్లోను ఆయన పాల్గొన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటన చేసిన తరువాత జరుగుతున్న ఉద్యమాల్లో కూడా ఆయన ప్రసంగించారు. గత ఏడాది అక్టోబర్ 5న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ప్లాంట్ వద్ద జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆయన మృతి వార్త ఈ ప్రాంత ఉద్యమకారులను, వామపక్షవాదులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కూనవరంలో థింసాతో సందడి ఎన్నికల ప్రచారం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరంలో మే 9న సీతారాం ఏచూరి పర్యటించారు. ఆ సమయంలో థింసా నృత్యంతో సందడి చేశారు. గిరిజనులతో ఫోటోలు దిగారు. ఆయన మృతికి సీపీఎం, సీపీఐతో పాటు కారి్మక సంఘాల నేతలు, అసంఘటిత రంగ కారి్మకులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు. గొప్ప మేధావి ఏచూరి గొప్ప మేధావి, కార్మికవర్గ పక్షపాతి, లౌకిక శక్తుల బలోపేతానికి అంకితమైన నాయకుడు అని సీసీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.మధు అన్నారు. ఆయన మరణం దేశానికి, వామపక్ష ఉద్యమానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ఎంతో బాధను మిగిల్చింది సీతారాం ఏచూరి తుదిశ్వాస వదలడం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు, లౌకికశక్తులకు తీరని లోటు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, వి.శ్రీనివాసరావు అన్నారు. పార్లమెంటు సభ్యుడిగా దేశాభివృద్ధి కోసం ఆయన చేసిన ఉపన్యాసాలు చిరస్థాయిగా ఉంటాయన్నారు. అనేక దేశాల కమ్యూనిస్టు పార్టీల నాయకులతో ఆయనకు స్నేహ సంబంధాలుండేవన్నారు. ఆయన మరణం పట్ల పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తోందని చెప్పారు. రాష్ట్ర పార్టీ తరపున ఢిల్లీలో నివాళులు ఏచూరికి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచీ విజయవాడతో అనుబంధం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, సీహెచ్ బాబూరావు చెప్పారు. పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున పార్టీ సీనియర్ నాయకులు పి.మధు, కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు ఈనెల 14న ఢిల్లీలో ఆయన భౌతికకాయానికి నివాళులరి్పంచి అంత్యక్రియల్లో పాల్గొంటారని చెప్పారు. సీతారాం ఏచూరి మృతి తీరని లోటు సీతారాం ఏచూరి మృతి పట్ల అసెంబ్లీ స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటన్నారు. ఏచూరి పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్నారు. చిరస్మరణీయులు: ఎస్ఎఫ్ఐ దేశంలోని శ్రామిక ప్రజల సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం చేసిన సీతారాం ఏచూరి చిరస్మరణీయులని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఢిల్లీలో కళాశాల రోజుల్లో ఎస్ఎఫ్ఐ నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించి.. రాజకీయాల్లో ఎన్నో ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించారని కొనియాడింది. ఏచూరి కుటుంబ సభ్యులకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్న కుమార్, ఎ.అశోక్ ప్రగాఢ సంతాపం తెలిపారు. విలువలతో కూడిన రాజకీయాలు: యూటీఎఫ్ కామ్రేడ్ సీతారాం ఏచూరి కమ్యూనిస్టు విలువలతో కూడిన రాజకీయాలు చేసిన గొప్ప నాయకుడని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎస్.ప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మృతి తీరని లోటన్నారు. దేశంలో వామపక్ష శక్తుల మధ్యనేకాక అంతర్జాతీయంగా అన్ని కమ్యూనిస్టు సంస్థల మధ్య ఐక్యత సాధించడానికి ఆయన కృషి చేశారన్నారు. త్వరలో కాకినాడలో జరిగే యూటీఎఫ్ స్వరో్ణత్సవ మహాసభలకు ముఖ్య అతిథిగా ఆహా్వనించాలని నిర్ణయించామని, ఇంతలోనే ఈ వార్త వినాల్సి వచ్చిందన్నారు. -
నాలుగు లక్షల మందిని బురదలో ముంచేసిన నేరం బాబుదే
-
మిగిలింది బురదే!
‘వరద నీళ్లు పోయాక వచ్చి చూస్తే మోకాటి లోతు బురద పేరుకుపోయి ఉంది.. ఇంట్లో, బయట కంపు కొడుతోంది.. కట్టుబట్టలతో మిగిలిపోయాం.. దాతలిచ్చింది తిని బతుకుతున్నాం.. మీరు (ఎన్యూమరేషన్ బృందం) ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం.. ఇదిగో చూడండి మా కష్టం, నష్టం.. అక్కడ బురదలో కూరుకుపోయి ఉన్నది పరుపు.. దాని కింద మంచం ఉంది.. ఇంకా దాని కింద పిల్లల పుస్తకాలున్నాయి.. ఆ పక్కనున్న బీరువాలో మా అందరి దుస్తులున్నాయి.. సర్టిఫికెట్లు కూడా అందులోనే పెట్టాం.. పది రోజులుగా నీళ్లలో నాని నాని అవన్నీ పేలికలుగా మారాయి.. అదిగో అది ఫ్రిజ్.. తీద్దామంటే డోర్ తెరుచుకోవడం లేదు.. ఇక్కడ కిచెన్లో ఏది ఏ వస్తువో తెలియడం లేదు. ఇదంతా కల అయితే బావుండనిపిస్తోంది’ అని నష్టం వివరాల నమోదు కోసం వచ్చిన బృందంఎదుట ఓ ఇల్లాలు కన్నీటి పర్యంతమైంది.సాక్షి, అమరావతి/పటమట/సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఒక్కో కుటుంబానిది ఒక్కో దీన గాథ. ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ. విజయవాడలో బుడమేరు వరద మిగిల్చిన విషాదం మాటలకందడం లేదని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. కళ్లెదుటే పలు వస్తువులు నీట కొట్టుకుపోతుంటే అచేతనంగా చూస్తూ ఉండి పోయామని వాపోతున్నారు. కట్టు బట్టలతో బయట పడ్డామని, కంటి మీద కునుకు కరువైందని చెబుతున్నారు. వరద తమకు ఎంత నష్టాన్ని, కష్టాన్ని మిగిలి్చందో ఎన్యుమరేషన్ బృందాల ఎదుట కన్నీటి పర్యంతమై వివరిస్తున్నారు. ఇంత ఘోరమైన పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపులో చిక్కుకున్న ప్రతి పేద కుటుంబం చితికిపోయింది. వారికి కన్నీరు తప్ప మిగిలిందంటూ ఏమీ లేదు. రోజువారీ పనులు చేసుకునే వారి ఇళ్లలో జరిగిన నష్టాన్ని చూస్తుంటే పగ వాడికైనా ఇంతటి కష్టం రాకూడదనిపిస్తుంది. ఇళ్లు మునిగి పోవడంతో వరద తగ్గే వరకు బంధువుల ఇళ్లలో, అక్కడక్కడా తల దాచుకున్న కుటుంబాల వారు.. ఇప్పుడు ఉంటున్న ఇంటికి వచ్చి చూసుకుని భోరున విలపిస్తున్నారు. ఇంట్లోని బట్టలు, మంచం, టీవీ, ఫ్రిజ్, వంట సామాన్లు, పుస్తకాలు, ఇతరత్రా పరికరాలన్నీ పనికి రాకుండా పోవడం ప్రతి ఇంట్లోనూ కనిపిస్తోంది. ఏ రోజుకు ఆ రోజు పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే కుటుంబాలు కనీసం రూ.50 వేలకుపైగా నష్టపోయాయి. పది రోజులుగా పని లేక, కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక, పిల్లలను ఎలా చదివించాలో.. మళ్లీ ఇంటిని ఎలా గట్టెక్కించాలో తెలియక ఆ ఇంటి యజమానులు పడే బాధ వర్ణణాతీతం. ఇంటింటికీ ప్రత్యేక బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి (ఎన్యుమరేషన్) ప్రభుత్వం నియమించిన ఉద్యోగుల బృందాలు వలంటీర్ల సహాయంతో ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నాయి. ప్రభుత్వం రూపొందించి ఇచ్చిన ప్రత్యేక యాప్లో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఇళ్లల్లో దెబ్బతిన్న ఎల్రక్టానిక్, మోటార్, ఇతర సాధారణ వస్తువుల గురించి నమోదు చేస్తున్నాయి. ఈ సందర్భంగా బాధితులు పది రోజులు పడిన కష్టం, వారికి జరిగిన నష్టం గురించి వివరిస్తున్నారు. ఏ ఇంటికి వెళ్లినా పరిస్థితి దారుణంగా ఉంది. కొన్ని చోట్ల ఇళ్ల వద్ద కనీసం నిలబడి మాట్లాడే అవకాశం కూడా లేదు. ఒక అంతస్తు ఉండే ఇళ్లలో ఉంటున్న ఒక్కో కుటుంబానికి కనీసంగా రూ.50 వేలు, గరిష్టంగా లక్షన్నరపైనే నష్టం కనిపిస్తోంది. మధ్యతరగతి కుటుంబాలకైతే రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు, ఎగువ మధ్యతరగతి కుటుంబాలకైతే రూ.10 లక్షల నుంచి అంతకు మించి నష్టం కనిపిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాలు 37 » నగరంలోని 20 కిలోమీటర్ల మేర 37 ప్రాంతాలను మూడు సర్కిళ్లుగా విభజించి అధికారులు వరద ప్రభావిత ప్రాంతాలుగా మ్యాపింగ్ చేశారు. » 32 డివిజన్లలో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, విద్యుత్, వైద్య శాఖల నుంచి ఒక్కొక్కరుగా బృందం ఏర్పాటు చేశారు. అయితే రెవెన్యూ–మున్సిపల్–విద్యుత్ శాఖల మధ్య సమన్వయ లోపంతో అన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సర్వే జరగటం లేదు.» 1,487 మంది వార్డు వలంటీర్లు, వార్డు సచివాలయాల సిబ్బంది, ఏఎస్పీ క్యాడర్ పోలీస్ అధికారి, గ్రూప్–1 కేడర్ అధికారి, ఓ సీనియర్ ఐఏఏస్ అధికారి ఆధ్వర్యంలో సర్వే ప్రక్రియ సాగుతోంది. వాణిజ్య నష్టాన్ని అంచనా వేయటానికి ఏర్పాటైన 200 బృందాలు ఇప్పటి వరకు ఆ పనే ప్రారంభించలేదు.నేడు కేంద్ర బృందం పర్యటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన వరద తీవ్రత, నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం బుధ, గురువారాల్లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించనుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని బృందం ఇప్పటికే విజయవాడకు చేరుకుంది. బుధవారం రెండు బృందాలుగా ఏర్పడి ఒక బృందం ఎనీ్టఆర్, కృష్ణా జిల్లాల్లో.. మరో బృందం గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటించనుంది. కాగా, వరద ప్రభావిత జిల్లాల్లో ఇళ్లకు జరిగిన నష్టం లెక్కింపు బుధవారం సాయంత్రానికి పూర్తి కావాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచి ఆయన వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయం, దాని అధారిత రంగాల నష్టం లెక్కింపు కూడా ఈ నెల 14వ తేదీకి పూర్తి కావాలని సూచించారు.రూ.వేల కోట్లలో నష్టం..ప్రభుత్వ శాఖలకు జరిగిన నష్టం రూ.6,800 కోట్లని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే దీనికి నాలుగైదు రెట్ల నష్టం సాధారణ ప్రజలకు జరిగినట్లు ఎన్యుమరేషన్ బృందాల ద్వారా స్పష్టమవుతోంది. విజయవాడ నగరం, రూరల్ ప్రాంతాల్లో 2.32 లక్షల ఇళ్లు మునిగి పోవడంతో నష్టం అపారంగా ఉంది. ఆ ఇళ్లల్లోని ఫరీ్నచర్, ఎల్రక్టానిక్, మోటార్ వాహనాలు, ఇతర వస్తువుల నష్టం భారీగా కనిపిస్తోంది. బయట పార్క్ చేసిన వాహనాలే సుమారు రెండు లక్షల వరకు ఉంటాయని అంచనా. అందులో లక్షన్నర ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. 30 వేలకుపైగా కార్లు, పది వేల వరకు ఆటోలున్నాయి. మిగిలినవి లారీలు, బస్సులు, ఇతర వాహనాలు ఉన్నాయి. వాటిలో సగానికిపైనే మరమ్మతులకు సైతం పనికిరాని విధంగా పాడైపోయాయి. ఇలా ఇళ్లకు జరిగిన నష్టమే ఊహకు అందని విధంగా ఉంది. ఇవిగాక 5 లక్షల ఎకరాలకుపైగా పంటలు దెబ్బ తిన్నాయి. ఆ నష్టం వ్యవసాయ రంగాన్ని కుదిపేసేలా ఉంది.భోజనం కోసం ఎదురు చూపు మా వీధిలోకి ఏడు అడుగులకుపైగా వరద నీళ్లు వచ్చాయి. కట్టుబట్టలతో నా ముగ్గురు పిల్లలు, భార్యతో కలిసి స్నేహితుడి మేడపైకి ఎక్కేశాం. నీళ్లు తగ్గుముఖం పట్టాయని ఇంటికి వచ్చి చూస్తే సర్వం నీళ్లలో నానిపోయాయి. మంచం, ఫ్రిజ్ పనికొచ్చే పరిస్థితి లేదు. పిల్లలు కట్టుకోవడానికి గుడ్డ పేలిక కూడా మిగల్లేదు. రాడ్ బెండింగ్ చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే నాకు మళ్లీ జీవితాన్ని ఎలా మొదలెట్టాలో తెలియట్లేదు. మావీధి అంతా మురుగు వాసన వస్తోంది. గతిలేక అలానే ఉంటున్నాం. – ఏలియా, వరద బాధితుడు, ఏవీఎస్ రోడ్డు, ప్రకాశ్నగర్ రూ.1.50 లక్షలు నష్టపోయాం మా జీవితం చిన్నది. జీవనోపాధి కోసం నూజివీడు నుంచి ఆరు నెలల కిందట ఇక్కడికి వచ్చి అద్దె ఇంటిలో కాలం వెళ్లదీస్తున్నాం. వరద దెబ్బకు జీవితం చిన్నాభిన్నం అయ్యింది. నా భర్త కాలేశ్వరరావు మార్కెట్లో చెప్పులు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. స్టాక్ అంతా ఇంటిలోనే పెట్టారు. అంతా నీటి పాలైంది. మంచం, పురుపు దుర్వాసన రావడంతో బయట పడేశాం. ఫ్రిజ్, టీవీ, బియ్యం, దుస్తులు, పిల్లల పుస్తకాలతో సహా ఏమీ మిగల్లేదు. మరో వైపు స్టాకు అంతా దెబ్బతింది. రూ.1.50 లక్షల వరకు నష్టపోయాం. – సుమలత, వరద బాధితురాలు, పాయకాపురం» 32 డివిజన్ల పరిధిలోని మూడు సర్కిళ్లలో లక్షన్నరకు పైగా ఇళ్లకు నష్టం » ఒక్కో డివిజన్కు ఒక ఐఏఎస్ అధికారి ఇన్చార్జ్ » 32 డివిజన్ల పరిధిలో 1,700 సర్వే బృందాల ఏర్పాటు » ఒక్కో బృందం ద్వారా 50–100 ఇళ్లు సర్వే » ప్రతి బృందంలో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, విద్యుత్, వైద్య సిబ్బంది » వీరికి తోడుగా సచివాలయ కార్యదర్శి, ఆ ప్రాంత వలంటీర్ » ప్రత్యేక యాప్లో మాత్రమే వివరాలు నమోదు » వాణిజ్య నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలు -
బెజవాడలో శాంతించి పల్లెలపై ప్రతాపం
(బుడమేరు పరీవాహక ప్రాంతం నుంచి సాక్షి ప్రతినిధి) : ‘బుడమేరు వరద ఉధృతి దిగువ ప్రాంతాల్లో ఉగ్రరూపం దాల్చింది. గ్రామాలకు ఆనుకుని ఉన్న పొలాలన్నీ మునిగిపోయి సముద్రాన్ని తలపిస్తున్నాయి. మన పక్క ఊరిలో మెయిన్ రోడ్డుపైకి నీరు వచ్చేసింది. మన ఊరికి అటూ ఇటూ కూడా రోడ్డు మునిగిపోయింది. చుట్టూ నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏ క్షణమైనా మన గ్రామాన్ని వరద నీరు ముంచెత్తవచ్చు. అందరూ అప్రమత్తంగా ఉండాలి..! ’’ బుడమేరు పరీవాహక గ్రామాల్లో పదకొండు రోజులుగా ఇలా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఎప్పుడు వరద విరుచుకుపడుతుందోననే భయంతో నిరంతరం కాపలా కాస్తున్నారు. బుడమేరు వరద ఉధృతితో గ్రామాల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఇది. వరదలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో బెజవాడను ముంచెత్తిన బుడమేరు క్రమంగా శాంతిస్తున్నప్పటికీ పరీవాహక గ్రామాలను మాత్రం బేజారెత్తిస్తోంది. ఖమ్మం–కృష్ణా జిల్లాల నడుమ కొండల్లో మొదలయ్యే బుడమేరు వరద నీరంతా విజయవాడ నుంచి దిగువకు ప్రవహించి కొల్లేరులో కలిసే వరకు అనేక గ్రామాలను చుట్టేస్తోంది. దీంతో పలు గ్రామాలు పదకొండు రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామాల్లో ప్రధాన రహదారులపైకి బుడమేరు వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. పదుల సంఖ్యలో గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి.ఉంగుటూరు మండలం తేలప్రోలు నుంచి గుడివాడ మండలం నందమూరు వెళ్లే ప్రధాన రహదారిపై బుడమేరు వరద నీటి ఉధృతి పదకొండు రోజులుగా తగ్గకపోవడంతో అటువైపు వాహనాలు, ప్రజలు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా కంచె వేసి పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం రాత్రి పగలు గస్తీ కాస్తున్నారు. దీనివల్ల 12 గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. అటువైపు వెళ్లాల్సిన వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో చుట్టూ తిరిగి వచ్చేందుకు అవస్థ పడుతున్నారు. గన్నవరం–పుట్టగుంట ప్రధాన రహదారిపై కొయ్యగూరపాడు రోడ్డు ఇరువైపులా మునిగిపోయింది. దీంతో గన్నవరం, నందివాడ మండలాల్లోని పది గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ శివారు ఎనికేపాడు నుంచి దోనేటుకూరు, నిడమానూరు సరిహద్దుల మీదుగా గూడవల్లి, ఉప్పులూరు, మంతెన, తరిగొప్పుల, ఉంగుటూరు, ఆముదాలపల్లి, కొయ్యగూరపాడు, పుట్టగుంట, అరిపిరాల, రామాపురం, కుదరవల్లి, ఇల్లపర్రు చివరకు ప్రవహించే బుడమేరు వెంకటలక్ష్మీ నరసింహపురం సమీపంలో కొల్లేరులో కలిసే వరకు పలు గ్రామాలను కలవరపెడుతోంది. ఊరి చుట్టూ నీళ్లు.. పదకొండు రోజులుగా బుడమేరు మా గ్రామాన్ని జల దిగ్బంధం చేసింది. ఊరి చుట్టూ వరద నీటి ఉధృతితో రోడ్లు మునిగిపోయాయి. దాదాపు 1,500 మందికిపైగా ఊరిలోనే ఉండిపోయాం. రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రిళ్లు కంటి మీద కునుకులేకుండా గడిపాం. ఇప్పుడిప్పుడే వరద దిగువకు వెళ్తుండటంతో గ్రామంలో నీళ్లు తగ్గుతున్నాయి. –జంజన వెంకటేశ్వరరావు, కొయ్యగూరపాడు గ్రామస్తుడుఎప్పుడూ చూడలేదు.. నేను పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఇంత వరద ఎప్పుడూ చూడలేదు. వరద చుట్టుముట్టడంతో పిల్లలు, పెద్దలు అంతా గ్రామంలోనే ఉండిపోయాం. పదకొండు రోజులుగా యువకులు వరద ప్రాంతాల్లో గస్తీ కాశారు. దాతల సహకారంతో రోజూ భోజనం సమకూర్చారు. –జుజ్జువరపు వెంకట్రావు, కొయ్యగూరపాడు -
కార్మికులను పట్టించుకునేవారే లేరా?
పటమట (విజయవాడ తూర్పు): ఊరు కాని ఊరు.. రోజూ 18 గంటలు పారిశుద్ధ్య పని.. ఉండటానికి సరైన వసతి లేదు.. రోడ్ల పక్కనే జీవనం.. అన్నం పెట్టే వారు లేరు.. స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే భోజనంతోనే కడుపు నింపుకోవడం.. ఇదీ విజయవాడలో వరద అనంతర పారిశుద్ధ్య పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇతర జిల్లాల నుంచి తెప్పించిన కార్మికుల దుస్థితి. మహిళా కార్మికులకు కూడ సరైన వసతి, సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో గంటల తరబడి మురుగు, చెత్తా చెదారంలో పనిచేస్తున్నా కార్మికుల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఇప్పటికే 40 మందికి పైగా కార్మికులు అనారోగ్యం బారిన పడ్డారు. అయినా అధికారులు వారి సంరక్షణ గురించి ఆలోచించడమే లేదు. బుడమేరు వరదకు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 7 డివిజన్లు, సెంట్రల్ డివిజన్లోని 13, పశ్చిమ నియోజకవర్గంలోని 12 డివిజన్లు మునిగిపోయాయి. ఆ ప్రాంతాల్లోని ఇళ్లు, రోడ్లు, వీధుల్లో పేరుకుపోయిన వందల టన్నుల వ్యర్థాలను తొలగించటానికి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల నుంచి 6,800 మంది పారిశుద్ధ్య కార్మికులను పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ తీసుకొచ్చింది. వీరంతా తొమ్మిది రోజులుగా రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. వారితో రోజూ 18 గంటలు పని చేయిస్తున్నారు. వీరికి సరైన వసతి కల్పించలేదు. దీంతో వారంతా రోడ్ల వెంబడి, షాపుల వద్ద గూడు ఏర్పాటు చేసుకుంటున్నారు.ఓవైపు వర్షం, మరోవైపు చలిలో కనీస నిద్ర కూడా లేక కార్మికులు తల్లడిల్లుతున్నారు. మురుగులో పని చేసే వీరికి చెప్పులు, చెత్త ఎత్తే కనీస పరికరాలు కూడా ఇవ్వడంలేదు. సరైన ఆహారాన్ని అందించడం లేదు. ఇదేమని అడిగితే సూపర్వైజర్లు కసురుకుంటున్నారు. దీంతో స్వచ్చంద సంస్థలు ఏర్పాటు చేస్తున్న ఆహార శిబిరాల వద్ద ఆకలి తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుపతి, కర్నూలు, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన 40 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారికి వైద్యం చేయించకుండానే అధికారులు వారిని స్వస్థలాలకు పంపించారు.మమ్మల్ని పట్టించుకోవటం లేదురేయింబవళ్లు పనిచేస్తున్నాం. ఇళ్ల నుంచి వచ్చే చెత్తనంతా ట్రాక్టర్లు, లారీల్లో ఎత్తుతున్నాం. బురద నీరు శరీరమంతా పడుతుంది. దురదలు వస్తున్నాయి. కాళ్లు పాశాయి. మా సమస్యలను చెప్పుకుందామంటే అధికారులు వినే పరిస్థితి లేదు. ఎంతసేపైనా పని చేయాలని ఆదేశిస్తున్నారే కానీ మా సమస్యలను పట్టించుకోవటంలేదు. మా ఆరోగ్యం, కుటుంబాల గురించి కూడా పట్టించుకోవాలి.– శేఖర్, ఆదోని మున్సిపాలిటీ కార్మికుడు -
కాల‘నీళ్లు’!
సాయం చేసే దిక్కు లేదు..నా జీవనోపాధి పోయింది. స్కూల్ దగ్గర ట్రామ్పోలిన్ జంపింగ్ ద్వారా రోజంతా కష్టపడితే రూ.300 వస్తాయి. వాటితోనే నేను, నా భర్త పొట్ట పోసుకుంటున్నాం. ఇప్పుడు వరదలో ట్రామ్పోలిన్ కొట్టుకుపోయింది. పది రోజుల నుంచి తినడానికి తిండి లేదు. సాయం చేసే దిక్కులేదు. – కళావతి, వైఎస్సార్ జక్కంపూడి కాలనీప్రాంతం: వైఎస్సార్ జక్కంపూడి కాలనీ అపార్ట్మెంట్ బ్లాకులు: 250కిపైగా (ఒక్కో బ్లాక్లో 32 ప్లాట్లు) జనాభా: సుమారు 50 వేలు వరద పరిస్థితి: బురద నీళ్లు, చెత్త ఇళ్ల పరిస్థితి: డ్రైనేజీ నీళ్లతోనే ఇంటిలోని బురదను శుభ్రం చేసుకుంటున్న బాధితులు డ్రోన్లతో ఆహారం: ఒక్క డ్రోన్తో కూడా ఆహారం అందించిన దాఖలా లేదు హెలికాఫ్టర్లతో ఆహారం: బాధితులు చేరుకోలేని ప్రదేశాలు, వాటర్ ట్యాంకులపైనే అరకొరగా ఆహార పొట్లాలు పడేశారు. ఫైరింజన్లతో ఇళ్లు శుభ్రం: కాలనీలో ఫైరింజన్ గంట సౌండ్ కూడా వినిపించట్లేదు. పారిశుధ్యం: రోడ్లపై వరదలో కొట్టుకొచి్చన చెత్త మేటలు వేసింది. ఒక్కరైనా పారిశుధ్య సిబ్బంది కనిపించలేదు. తాగునీరు: ప్రతి ఇంటిలోనూ తాగునీటికి కటకటేవరద ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధివిజయవాడలోని వరద ప్రభావిత కాలనీల్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. వరద తగ్గుముఖం పట్టడంతో ప్రజలు పడుతున్న కష్టాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ముంపు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ఆహారం, తాగునీరు సరఫరా చేశామని, ఫైరింజన్ల ద్వారా ఇళ్లను శుభ్రం చేసేశామని ఆర్భాటంగా ప్రకటిస్తున్నా వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. పది రోజుల తర్వాత కూడా బాధితులు ఆకలి, దప్పికలు తీర్చుకోవడానికి రోడ్లపైకి సంచులతో పరుగులు తీస్తున్నారు. ఇళ్లలో చేరిన బురద, చెత్తను శుభ్రం చేసుకోవడానికి బకెట్టు నీళ్లు దొరక్క.. రోడ్డుపై డ్రెయిన్ల నుంచి పొంగిన మురుగు నీటినే వినియోగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కారి్మకులను రప్పించి రోడ్లను అద్దాల్లా తీర్చిదిద్దినట్టు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా కాలనీల్లో చెత్త మేటలు పేరుకుపోయాయి. డ్రెయిన్ల నుంచి పొంగిన మురుగు నీటితో దుర్గంధం ముక్కుపుటాలను అదరగొడుతోంది. ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. విజయవాడ శివారులోని వైఎస్సార్ జక్కంపూడి కాలనీ దుస్థితి ప్రజలు పడుతున్న అవస్థలకు అద్దం పడుతోంది. సోమవారం ‘సాక్షి’ బృందం వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో పర్యటించినప్పుడు కాలనీ వాసులు కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో సుమారు 250కిపైగా బ్లాకుల్లో దాదాపు 50 వేల మంది జీవిస్తున్నారు. రోజూ కూలికి పోతే కానీ ఐదు వేళ్లు నోటికి పోని పరిస్థితుల్లో ఉన్నవారిని బుడమేరు వరద మరింత దుర్భర స్థితిలోకి నెట్టేసింది. ప్రభుత్వం ముందస్తు వరద హెచ్చరికలు చేసినా తమదారి తాము చూసుకునే వాళ్లమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులు దాటాక వరద తగ్గిందని తెలుసుకున్నాకే సీఎం చంద్రబాబు ఆదివారం ఈ ప్రాంతంలో చుట్టపుచూపుగా వచి్చపోయారని బాధితులు మండిపడ్డారు. సీఎం వచ్చి వెళ్లాక కూడా ఇక్కడి పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక్క వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో పరిస్థితి మాత్రమే కాదు.. కండ్రిక, పాయకాపురం, ఉడా కాలనీ, వాంబే కాలనీ, కొత్త, పాత ఆర్ఆర్పేట, పైపుల రోడ్డుతో సహా ముంపు ప్రాంతాలన్నింటిలో దుర్భర పరిస్థితులు ఉన్నాయి. ప్రచార కండూతి తప్ప ఫైరింజన్లు ఎక్కడ? ఓవైపు ముంపునకు గురైన ఇళ్లను ఫైర్ ఇంజన్లతో శుభ్రం చేయిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారు. ప్రధాన రహదారుల వెంట ఉండే కొన్ని ఇళ్లకు మాత్రమే ఫైర్ ఇంజన్ల ద్వారా నీళ్లు కొట్టి ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయించుకుంటున్నారు. చంద్రబాబుది కేవలం ప్రచార కండూతి.. చేసే చేతల్లో ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని జక్కంపూడి కాలనీలోని పరిస్థితులు అద్దం పట్టాయి. గత పది రోజులుగా వరద నీరు, బురద, చెత్తాచెదారం చేరి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇళ్లలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో కాలనీలో రోడ్లపై ఉన్న మురుగు నీటిని బకెట్లలోకి తోడుకుని మహిళలు ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నారు. అదేంటి మురికి నీళ్లతోనే ఇళ్లు శుభ్రం చేసుకుంటున్నారు? ప్రభుత్వం ఫైర్ ఇంజన్లతో శుభ్రం చేయిస్తామని చెబుతోందిగా అని స్థానికులను ప్రశి్నంచగా.. ‘ఇంట్లో వారం నుంచి వాడుకోవడానికి చుక్క నీళ్లు లేవు. ఫైర్ ఇంజన్లు వచ్చి ఇళ్లు కడగటం ఒక్కటే తక్కువైంది మా బతుకులకు’ అని ప్రభుత్వంపై బాధితులు మండిపడ్డారు. డ్రోన్ ఎగిరిందీ లేదు.. ఆహారం అందిందీ లేదు.. ముంపు ప్రాంతాల్లో బాధితులకు డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగు నీరు సరఫరా చేసేశాం.. అందరి ఆకలి తీర్చేశామని రోజు మీడియా సమావేశాల్లో సీఎం చంద్రబాబు ఊదరగొడుతున్నారు. అయితే సుమారు 50 వేల మంది నివాసం ఉంటున్న వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో ఒక్క డ్రోన్ ద్వారా.. ఒక్క ఇంటికి కూడా ఆహారం పంపిణీ చేయలేదని స్థానికులు అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టారు. హెలికాప్టర్లలో వాటర్ బాటిళ్లు, ఆహార పొట్లాలు తెచ్చి కాలనీకి దూరంగా ఉండే వాటర్ ట్యాంక్పై విసిరి వెళ్లారని, పీకల్లోతు నీటిలో వెళ్లి వాటర్ ట్యాంక్లు ఎక్కి ఆహారం, నీళ్లు ఎలా తెచ్చుకుంటారనే ఇంగిత జ్ఞానం కూడా ప్రభుత్వ పెద్దలకు లేదా? అని నిలదీశారు. జలయుద్ధాలు తప్పడం లేదు.. పది రోజులుగా ముంపులో చిక్కుకుపోయిన వారికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు లేవు. స్నానాలు చేసి రోజులు గడుస్తుండటంతో చర్మ వ్యాధులు, దద్దుర్లతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నీళ్ల ట్యాంకర్ కాలనీలోకి రాకముందే దాని వెంట పరుగులు తీస్తూ జలయుద్ధాలు చేస్తున్నారు.కూడబెట్టుకున్నదంతా పోయింది.. కూలినాలి చేసుకుని సంపాదించుకున్నదంతా వరదలో కొట్టుకుపోయింది. ఎలా ఉన్నారని పలకరించిన నాథుడు లేడు. పది రోజులుగా నరకయాతన పడ్డాం. వయసుకు వచి్చన ఆడ బిడ్డలతో ఎక్కడికి వెళ్లి ఉంటాం? ఇంటిలో ఏ వస్తువూ మిగల్లేదు. పునరావాస కేంద్రానికి తరలిస్తామని ఒక్కరూ చెప్పలేదు. ఉచిత బియ్యం ఇస్తామనీ ఇవ్వలేదు. కరెంట్ లేదు. వేసుకోవడానికి సరైన బట్టలు లేవు. పనుల్లేక చేతిలో డబ్బులు లేవు. ఎలా బతికేది? జీవితం రోడ్డున పడింది. – భార్గవి, వైఎస్సార్ జక్కంపూడి కాలనీఒక్క వస్తువు కూడా మిగల్లేదు.. మా తమ్ముడి ఇంటిలో ఫంక్షన్కని ఆగస్టు 25న కాకినాడ నుంచి వచ్చాను. ఆదివారం ఒక్కసారిగా వరద నీరు ఇంటిలోకి రావడవంతో ఒక్క వస్తువు కూడా మిగల్లేదు. ఇద్దరు ఆడ పిల్లలతో మా తమ్ముడు ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా వచ్చి వండుకోవడానికి పప్పులు, ఉప్పులు ఇస్తే కానీ గడవని దుస్థితి ఉంది. – నాగమణి, వైఎస్సార్ జక్కంపూడి కాలనీఈ చిత్రంలోని మహిళ.. సయ్యద్ సమీరా. ఆమె ఇంటి ముందు మురుగు నీరు తటాకాన్ని తలపిస్తోంది. దీంతో విధిలేక తన ఇంటిని శుభ్రం చేసుకోవడానికి ఆ మురుగు నీటినే తీసుకెళుతోంది. ఇదేంటమ్మా.. ప్రభుత్వం ఫైర్ ఇంజన్లతో ఇళ్లు శుభ్రం చేయిస్తామని చెబుతుంది కదా అని ప్రశి్నస్తే.. ‘మా బతుకులకు అదొకటే తక్కువైంది. పది రోజుల నుంచి మురుగు నీటిలోనే పడి ఉన్నాం. ఎవరూ పలకరించిన పాపానపోలేదు. వరద పోయి బురద మిగిలితే.. దాన్ని కడుక్కోవడానికి చెంబు నీళ్లు కూడా ఇవ్వట్లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వరద వస్తుందని ఎవరూ చెప్పలేదు.. అర్ధరాత్రి ఇంటిలోకి నీళ్లు చేరితే.. కట్టుబట్టలతో పై అంతస్తులోకి పరుగులు పెట్టాం.ఇద్దరు చిన్న పిల్లలను పక్కింటిలో ఉంచి మేము నీళ్ల మధ్యే దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు కాలం వెళ్లదీశాం. ఇప్పుడు కట్టుకోవడానికి బట్టలు కూడా లేని దుస్థితిలో ఉన్నాం. ఫ్రిజ్ నీటిలో తేలుతూ రోడ్డుపైకి కొట్టుకొచి్చంది. నా భర్త సయ్యద్ ఖాజా పైపుల రోడ్డులో నిర్వహించే వెల్డింగ్ షాపు కూడా నీటమునిగింది. మొత్తం మెషినరీ కూడా తడిచిపోయింది. ఇళ్లు, షాపు కోల్పోయి రోడ్డుపై పడ్డాం’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇలా సమీరా ఒక్కరే కాదు.. వేలాది మంది సోమవారం వైఎస్సార్ జక్కంపూడి కాలనీలో వరద బాధితులుగా.. కట్టుబట్టలతో రోడ్లపై కష్టాలను అనుభవిస్తూ కనిపించారు.నిత్యావసరాలు కరవై.. 50వేల మంది ఉండే జక్కంపూడి కాలనీని ప్రభుత్వం గాలికొదిలేసింది. అపార్ట్మెంట్లలో గ్రౌండ్ ఫ్లోర్లు నీటమునిగాయి. కాలు బయటకు అడుగు పెట్టలేని దుస్థితిలో పై అంతస్తుల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత నిత్యావసరాలు కూడా ఇక్కడికి చేరలేదు. ఇంటిలో బియ్యం తడిచిపోయి, వంట వస్తువులు నీటిలో మునిగిపోయాయి. దీంతో దాతలు ఇచ్చే ఆహారం కోసం సంచులు తీసుకుని రోడ్లపై పిల్లజల్లాలతో పడిగాపులు కాస్తున్నారు.జీవనాధారం కకావికలంబుడమేరు వరదతో జక్కంపూడి కాలనీకి చెందిన బార్బర్ రాంబాబుకు తీవ్ర నష్టం వారం రోజులు నీటిలోనే బార్బర్ షాపు, ఇల్లుపూర్తిగా పాడైపోయిన షాపులోని కుర్చీలు, వస్తువులు షాపు పునరుద్ధరణకు రూ.లక్ష వరకూ అవసరం కన్నీరుమున్నీరవుతున్న రాంబాబు కుటుంబం వరద ప్రభావిత ప్రాంతం నుంచి సాక్షి ప్రతినిధి బుడమేరు వరద ధాటికి బడుగుల జీవితాలు కకావికలమయ్యాయి. తాము నివాసం ఉంటున్న వీధిలో, కాలనీలోనే చిన్న బడ్డీ కొట్లు, తోపుడు బండ్లు పెట్టుకుని చిరువ్యాపారాలు చేసుకుంటున్నవారు, చేతి వృత్తులను నమ్ముకున్నవారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి. జక్కంపూడి కాలనీకి చెందిన ఇక్కుర్తి రాంబాబుది కూడా అలాంటి కన్నీటి గాథే. జక్కంపూడి కాలనీలోని డ్రెయిన్ పక్కనే చిన్న బార్బర్ షాప్ నడుపుకుంటూ రాంబాబు తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అతని భార్య ఉమామహేశ్వరి ఇళ్లలో పనులకు వెళ్తారు. ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు నగరంలోని ఓ సెలూన్ షాపులో రోజువారీ కూలీకి వెళుతుంటాడు. డిగ్రీ చదువుతున్న రెండో కుమారుడు మణికంఠ కాలేజీ నుంచి వచ్చాక తండ్రికి షాపులో సహాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో గత నెల 31వ తేదీ అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా బుడమేరు వరద ప్రారంభమైంది. తెల్లవారేసరికే జక్కంపూడి కాలనీని ముంచేసింది. రాంబాబు బార్బర్ షాపు కూడా వరద నీటిలో మునిగిపోయింది. వారం రోజులకు పైగానే షాపు నీటిలో ఉంది. షాపు లోపల ఉన్న రెండు కుర్చీలు, సెలూన్ సామాగ్రి అంతా నానిపోయి పనికిరాకుండా మారాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే రాంబాబు ఇంట్లోకి కూడా వరద చేరడంతో సరుకులు, టీవీ, మంచం... ఇలా ఏ ఒక్కటి మిగలకుండా అన్నీ పాడైపోయాయి. వారం రోజులపాటు ఇంటి పై ఫ్లోర్లోని బాల్కనీలో అతని కుటుంబం తలదాచుకుంది. వరద తగ్గుముఖం పట్టడంతో సోమవారం షాప్లోని తడిచిపోయిన వస్తువులన్నింటినీ రాంబాబు, అతని కుమారుడు మణికంఠ బయటపెట్టి బురదను శుభ్రం చేసుకున్నారు. వారి వేదనను గుర్తించిన ‘సాక్షి’ ప్రతినిధి... ‘మళ్లీ ఆ వస్తువులు పనిచేస్తాయా...’ అని అడగ్గా... ఒక్క వస్తువు కూడా పనిచేయదని రాంబాబు బదులిచ్చాడు. ‘రెండు చైర్లు పూర్తిగా పనికి రాకుండాపోయాయి. కొత్తగా కొనుగోలు చేయాలంటే ఒక్కోటి రూ.15 వేలుపైనే చేస్తాయి. అద్దాలు కొత్తగా కొనాలి. వారం పాటు ముంపులోనే ఉండిపోవడంతో షాప్ కూడా దెబ్బతింది. రిపేర్ చేయించాలి. ట్రిమ్మర్లు, కత్తెరలు, దువ్వెనలు, టవల్స్.. ఇలా ప్రతి ఒక్కటి కొత్తగా కొనాలి. కనీసం రూ.లక్ష ఖర్చు అవుతుంది. మరోవైపు చిన్నబ్బాయి కాలేజీ ఫీజులు చెల్లించాలి. ఇంట్లోని వస్తువులు కూడా పాడైపోయాయి. పది రోజుల నుంచి పని లేక ఇళ్లు గడవడం కూడా కష్టంగా ఉంది. ప్రభుత్వం నిత్యావసరాలు కూడా పంపిణీ చేయలేదు.’ అని రాంబాబు ఆవేదన వ్యక్తంచేశారు. -
విజయవాడ వాసుల్ని వీడని వరద, బురద కష్టాలు
-
8 రోజులు గడుస్తున్నా తేరుకోని విజయవాడ ప్రజలు
-
వరద వస్తుందని తెలిసి కూడా చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం!
-
అదంతా అబద్ధం..క్షమించండి.. నిజం ఒప్పుకున్న చంద్రబాబు
-
విజయవాడ వాసులకు పండగ పూట పస్తులు.. చేతులెత్తేసిన ప్రభుత్వం..
-
అక్కడ వందలమంది చావుబతుకుల్లో ఉంటే.. ఇక్కడేమో చంద్రబాబు శవ రాజకీయం..
-
విజయవాడ వరద బాధితుల కోసం వైఎస్ జగన్ రేషన్ వాహనాలు..
-
మా దగ్గరకు ముందుగా వచ్చింది సాక్షినే
-
భయం గుప్పిట్లో బెజవాడ..
-
చంద్రబాబుకు అదే దిక్కు..
-
విజయవాడలో మళ్లీ అడుగుమేర పెరిగిన వరద
-
పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్
-
పక్క ఆధారాలతో పట్టుబడ్డ బాబు.. ముందే తెలిసిన ముంచేశారు
-
కాలనీల్లో కన్నీళ్లే!
(విజయవాడ ముంపు ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధులు) : ఐదు రోజులు గడిచిపోయినా ముంపు నుంచి బెజవాడ బయటపడలేకపోతోంది. వరద కొంతమేర తగ్గినా లోతట్టు ప్రాంతాలు నీళ్లలోనే నానుతున్నాయి. ఏ బాధితుడిని కదిలించినా వ్యథా భరిత గాథలే. వరద తగ్గడంతో విజయవాడ–నూజివీడు రహదారిపై రాకపోకలు మొదలైనా అది కేవలం ప్రధాన రోడ్లకే పరిమితమైంది. ఆ రోడ్డుకి అనుబంధంగా ఉన్న ముఖ్యమైన ప్రాంతాలన్నింటిలో ఇంకా మోకాల్లోతు నీరుంది. ఇంట్లో సరుకులు, వస్తువులు నీళ్లలో మునిగిపోవడంతో మొత్తం మళ్లీ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితులు వాపోతున్నారు. ముంపు ప్రాంతాల్లో విపరీతమైన దుర్గంధం రావడం, ఇళ్లను వెంటనే బాగు చేసుకునే పరిస్థితి లేకపోవడంతో వేలాది కుటుంబాలు ఆ ప్రాంతాన్ని వీడి వలస వెళ్లిపోతున్నాయి. శుభ్రం చేసుకునేందుకు అవస్థలు వరద ప్రాంతాల్లో అక్కడే ఉంటున్న వారు ఇళ్లలో నీరు బయటకు తోడేందుకు ప్రయతి్నస్తున్నారు. బురదను తొలగించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లను శుభ్రం చేసేందుకు పెద్దఎత్తున ఫైరింజన్లు తెప్పించామంటూ ప్రభుత్వం చెబుతున్నా చాలా పరిమిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. ప్రధాన ప్రాంతాల్లో కొన్ని ఇళ్లల్లో నీళ్లు చల్లి వెళ్లిపోవడం మినహా ఫైరింజన్ల వల్ల పెద్దగా ఉపయోగం కనిపించడంలేదు. ముంపులో ఉన్న లక్షల ఇళ్లను ఎవరికి వారే శుభ్రం చేసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. పునరావాసం ఉత్తిమాటే విజయవాడలో ఇంకా నాలుగు లక్షల మందికిపైగా వరద ముంపులో ఉంటే.. కనీసం పది శాతం మందికి కూడా పునరావాసం క ల్పించలేదు. ప్రస్తుతం 42 పునరావాస కేంద్రాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నా అందులో సగం ఎక్కడున్నాయో ఎవరికీ తెలియడం లేదు. అక్కడక్కడా కొన్ని కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లను పునరావాస కేంద్రాలు మార్చినట్లు చెబుతున్నా అరకొరగానే ఉన్నాయి. అధికారికంగా 14 వేల మందికి ఆశ్రయం కల్పించామని ప్రభుత్వం చెబుతుండగా వాస్తవానికి ఆ సంఖ్య రెండు, మూడు వేలు కూడా ఉండదని అధికారవర్గాలే పేర్కొంటున్నాయి. దీంతో బాధితులు ఎవరికి వారు బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. కొందరైతే దూర ప్రాంతాల్లోని బంధువుల ఇంటికి వెళ్లిపోతున్నారు. పునరావాసం ఎలా ఉందో చెప్పడానికి ఇలా బయటకు వెళ్లిపోతున్న వారి సంఖ్యే నిదర్శనం. అందని నిత్యావసరాలు.. ప్రతి బాధిత కుటుంబానికి నిత్యావసరాలు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించినా ఇంతవరకు ఎవరికీ ఇచ్చిన దాఖలాలు కనిపించడంలేదు. 25 కేజీల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, పంచదార, ఆయిల్, బంగాళాదుంపలు, టమాట ఇస్తున్నట్లు చెబుతున్నా అది కూడా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ప్రజలు ఎవరి బాధలు వారే పడి నిత్యావసర వస్తువులు కొనుక్కుంటున్నారు. మరోవైపు బాధితుల రవాణా కోసం బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేశామని చెబుతున్నా అదీ ఎక్కడా కనిపించడంలేదు. మహిళల బాధ వర్ణనాతీతం వరద ప్రాంతాల్లో ఐదు రోజులుగా స్నానం చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. నెలసరితో ఇబ్బంది పడుతున్నవారికి శానిటరీ నాప్కిన్స్ కూడా దొరకడం లేదు. మార్చుకునేందుకు మరో చీరగానీ, డ్రస్గానీ లేక కట్టుబట్టలు పాడైపోయి నరకం అనుభవిస్తున్నారు. చిన్న దుకాణాల పరిస్ధితి దారుణంగా ఉంది. వేలాది దుకాణాల్లో సరుకులు పనికిరాకుండా పోయాయి. బియ్యం, కిరాణా, నిత్యావసర సరుకులు, దుస్తులు, పుస్తకాలు, ఫ్యాన్సీ వస్తువులు విక్రయించే దుకాణదారులు ఆ సరుకంతా బయపడేయడం తప్ప వారికి వేరే మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఇంటికీ రూ.లక్షల్లో నష్టం వరద భారీ నష్టం మిగిల్చింది. ఒక్కో ఇంటికీ రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకూ కేవలం సామాన్లకే నష్టం వాటిల్లింది. ఐదు రోజులుగా నీటిలోనే ఇంటిలో సామాన్లు ఉండిపోవడంతో తడిసి పాడైపోయాయి. అక్కడే ఉండక తప్పదనుకున్న వారు వరద నీరు తగ్గడంతో వస్తువులను రోడ్ల మీదకు తెచ్చి ఆరబెట్టుకుంటున్నారు. ఎండ రాకపోవడంతో బియ్యం, మంచాలు, పరుపులు, ఇతర సామగ్రి బురదతో నిండిపోయి పనికి రాకుండా పోయాయి.వాహనాల మరమ్మతులకు పాట్లు వరద నుంచి బయటపడ్డ వాహనాలను బాగు చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మెకానిక్లు లేక సొంతంగా రిపేరు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొందరు వాహనాలను అక్కడి నుంచి అష్ట కష్టాలు పడి రబ్బరు ట్యూబుల సాయంతో మెకానిక్ల వద్దకు తరలిస్తున్నారు. మరమ్మతులకు ఒక్కో ద్విచక్ర వాహనానికి కనీసం రూ.20 వేలు అడుగుతున్నారు. కంపెనీ షోరూమ్కి తీసుకువెళితే రెట్టింపు బిల్లు వేస్తున్నారు. మాది పల్నాడు జిల్లా చిలకలూరిపేట. నా భార్య రెండో కాన్పు కోసం సింగ్నగర్ వాంబే కాలనీలోని పుట్టింటికి వచ్చింది. వరదలకు మా మామ ఇల్లు మునిగిపోయింది. నేను మా ఊరి నుంచి రాలేక... ఆమె చంటి బిడ్డతో బయటపడలేక నరకయాతన అనుభవించాం. నాలుగు రోజుల తరువాత అతికష్టం మీద ఇక్కడికి వచ్చి చూస్తే ఇల్లంతా బురదతో నిండిపోయింది. సామానంతా పాడైపోయింది. దీంతో అందరం కలసి మా ఊరికి వెళ్లేందుకు వరద నీటిలో కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వచ్చాం. ప్రభుత్వం ఎలాంటి వాహనాలను ఏర్పాటు చేయలేదు – వెంకటరత్నం -
ఏపీలో కేంద్ర బృందం పర్యటన
-
అమరావతిలో పూడ్చేస్తావా..! విజయవాడలో ఆకలి కేకలు వినపడలేదా?
-
ఐదు రోజులైనా ఇంకా ముంపులోనే బెజవాడ
-
విజయవాడలో మరణ మృదంగం..
-
విజయవాడలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం
-
తప్పు చేసి.. పశ్చాత్తాపడుతున్న చంద్రబాబు, పవన్
-
ప్రచార యావలో మునిగి ప్రజలను వరదకి వదిలేసిన చంద్రబాబు
-
చేసింది శూన్యం.. పీక్స్ లో పబ్లిసిటీ..
-
అర్ధరాత్రి విజయవాడలో భారీ వర్షం