viral video
-
ఇరాన్ బీచ్లో‘బ్లడ్ రెయిన్’ : నెటిజన్లు షాక్, వైరల్ వీడియో
ఇరాన్లో జరిగిన ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యం ఒకటి వైరల్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా నెటిజనులను ఆశ్చర్యపరిచింది. ఇరాన్లో లోని రెయిన్ బో ఐలాండ్ లో రక్తంలా ఎర్రని రంగులో వర్షం కురిసింది. ఈ భారీ వర్షం తర్వాత ఎర్రగా మెరిసే బీచ్ వీడియోలు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. చాలామంది దీనిని "రక్త వర్షం (Blood Rain)" అని భయపడిపోతోంటే, మరికొందరు ఈ అసాధారణ దృశ్యాన్ని చూసి ముగ్దులైపోతున్నారు. అసలు విషయం ఏమిటంటే..టూర్ గైడ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో ప్రకారం ఆకాశం నుంచి ధారగా కురుస్తున్న వర్షం అక్కడి కొండలపై ఎర్రటి ధూళితో చేరింది. ఆ తరువాత ఎర్ర రంగులో బీచ్లోకి ప్రవహిస్తోంది. మెరిసిపోయే ముదురు ఎరుపు రంగులో నీరు సముద్రంలోకి చేరుతుంది. అద్భుతమైన ఈ దృశ్యాన్ని తిలకించేందుకు ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. View this post on Instagram A post shared by جزیره هرمز | امید بادروج (@hormoz_omid) రెయిన్ బో ఐలాండ్లో వర్షాన్ని టూరిస్టులు ఎంజాయ్ చేశారు. సముద్ర తీరంలోని గుట్టలపై పడిన బ్లడ్ రెయిన్ జలపాతంలా కిందకు దూకుతుంటే ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. దీనిపై నెటిజన్ల కమెంట్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. "ఈ దృశ్యం నిజంగా అద్భుతమైనది మరియు ప్రత్యేకమైనది.", పకృతిలోని వింతలకు ఇదొక ఉదాహరణ, "దేవునికి మహిమ ఎంత అందం. నిజానికి, దేవుడు రెండు ప్రపంచాలకూ అత్యుత్తమ చిత్రకారుడు" ఇలా ఎవరికి తోచినట్టుగా వారు కమెంట్స్ పెడుతున్నారు. What’s going on here? Alien weather phenomenon? Horror from beyond the deep? It looks like this beach is bleeding, with the rains turning blood red and oozing back out into the sea, and indeed, it’s even called the “Blood Rain”. Fortunately, it’s not actually blood.. It’s rust! pic.twitter.com/dbqMdtF7qG— briefchaatindia (@briefchaatindia) March 13, 2025 కాగా హార్ముజ్ జలసంధిలోని రెయిన్బో ద్వీపంలోని బీచ్, అధిక స్థాయిలో ఇనుము , ఇతర ఖనిజాలను కలిగి , సహజంగా ఎర్ర నేల కారణంగా ఇరాన్లో ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఈ అగ్నిపర్వత నేలలో అధిక ఐరన్ ఆక్సైడ్ కంటెంట్ కారణంగా తీరంలో ఏడాది పొడవునా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఖనిజాలు భారీ ఆటుపోట్లతో కలిసి తీరప్రాంతానికి ప్రకాశవంతమైన ఎరుపు రంగును సంతరించుకుంటుంది. ఇది ఎవరో సముద్రంలో పెద్ద బకెట్తో ఎరుపు పెయింట్ను కుమ్మరించినట్టు కనిపిస్తుంది. రెయిన్ బో ఐలాండ్ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రితం ఓ అగ్ని పర్వతం ఉండేదని, దాని నుంచి వెలువడిన లావా చల్లారి ఈ దీవి ఏర్పడిందని ఇరాన్ చరిత్రకారులు చెబుతున్నారు. -
ఆ చెఫ్ హస్తకళ అదుర్స్..! ఆహా బంగాళదుంపతో ఇలా కూడా..
పాకశాస్త్ర నిపుణులు చేతులు అద్భుతమైన వంటలే కాదు..హస్తకళకు పెట్టింది పేరు అనొచ్చు. ఎందుకంటే రెస్టారెంట్లలో చెఫ్లు కేవలం వండటానికే పరిమితం కారు. వండిన ఐటెమ్స్ని అందంగా ప్లేటులో పెట్టడం కూడా ఓ కళ. అది ఉంటేనే మంచి చెఫ్గా పేరు తెచ్చుకోగలరు, ఆ రంగంలో రాణించగలరు. అయితే ఇదంతా ఎందుకంటే.?..చెఫ్లు కూరగాయలతో భలేగా అందమైన ఆకృతులు మలిచి మరీ ఫుడ్ని సర్వ్ చేస్తారని తెలిసిందే. ఆ కళా నైపుణ్యంతోనే ఈ చెఫ్ ఏకంగా జ్యువెలరీనే డిజైన్ చేశాడు. దేనితోనో తెలుసా..?..అందరూ ఇష్టంగా తినే ఆలుతో ఈ ఫ్రెంచ్ చెఫ్ బ్రాస్లెట్ మాదిరి ఆకృతిని తయారు చేశాడు. చక్కగా టీ తాగేటప్పుడు చిప్స్లా తినే ఆలుతో చక్కగా ధరించే ఆభరణాన్ని డిజైన్ చేసిన తీరుకి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆ చెఫ్ ఆ బంగాళ దుంపను చెక్కి..చక్కగా దీర్ఘచతురస్రాకార ఆకృతులను చేశాడు. ఆ తర్వాత వాటిని లింక్ చైన్ మాదిరిగా రూపొందించాడు. అది ఆశాంత చూసేంత వరకు జ్యువెలరీ అని తెలియదు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు మాత్రం ఆ చెఫ్ హస్తకళా నైపుణ్యానికి ఫిదా అవుతూ..ప్రశంసల వర్షం కురిపించారు. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరీ.. View this post on Instagram A post shared by LEROY. SAITO. LE SQUER. (@lsltoronto) (చదవండి: మహిళలు నిర్మించిన అద్భుత స్మారక కట్టడాలు..! నాటి చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం..) -
రికార్డింగ్ డ్యాన్సర్కు ముద్దు.. బూతు పాటతో ఎమ్మెల్యే రచ్చ
అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ యూబ్యూటర్పై ఏకంగా ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే మండిపడ్డారు. అలాంటిది ఒక ప్రజాప్రతినిధే బహిరంగంగా అశ్లీల నృత్యాలను ప్రొత్సహించడం.. అందునా ఆయనే అసభ్యంగా ప్రవర్తించడం.. పైగా వేదిక మీదే బూతు పాట పాడడంతో.. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అని పలువురు నెట్టింట ప్రశ్నలు గుప్పిస్తున్నారు.బీహార్ జనతా దల్(యునైటెడ్) ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ నీరజ్ అలియాస్ గోపాల్ మండల్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. భగల్పూర్ జిల్లా నౌగాచియాలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అక్కడ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది.వేదిక మీద ఉన్న నృత్యకారిణి దగ్గరకు వెళ్లి.. ఆమె పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. కరెన్సీ నోటును ఆమె చెంపకు అతికించాడు. అక్కడితో ఆగకుండా.. నేను డ్యాన్స్ మాత్రమే చేయలేదు.. ఆమెను ముద్దు కూడా పెట్టుకున్నా అంటూ మైకులో ప్రకటించారు. ఇది ఇక్కడితోనే ఆగలేదు. రాత్రి సయమంలో జరిగిన వేడుకల్లోనూ ఆయన పాల్గొన్నారు. రికార్డింగ్ డ్యాన్సర్లతో చిందులేశారు. ఆపై మైక్ అందుకుని బూతు పాటలు పాడి అక్కడున్నవాళ్లను హుషారెత్తించారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఆర్జేడీ భగ్గుమంది. ఇలాంటి వాళ్లపై కేసులు నమోదు చేస్తారా? చర్యలు తీసుకుంటారా? అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ప్రజాప్రతినిధులపై కూడా న్యాయస్థానాలు తీవ్ర వ్యాఖ్యలు చేయాలని పలువురు కోరుకుంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.होली मिलन समारोह में जदयू विधायक गोपाल मंडल ने महिला डांसर के गाल पर नोट चिपकाया और साथ में मंच पर लगाए ठुमके।#Gopalmandal #Bihar #BiharNews #Bhagalpur #Holi2025 pic.twitter.com/ZBNs32uQz1— FirstBiharJharkhand (@firstbiharnews) March 10, 2025JDU विधायक गोपाल मंडल#gopalmandal @Jduonline @RJDforIndia #BiharNews #bhagalpur pic.twitter.com/1nikGeTmWV— Shri Dhiraj Sharma (Journalist) (@ShriDhiraj) March 11, 2025గోపాల్ మండల్ వార్తల్లోకి ఎక్కడం తొలిసారేం కాదు. గతంలో ఆయన అండర్వేర్పై రైలులో తిరిగి వైరల్ అయ్యారు. కొందరు ప్రయాణికులు ఆ చర్యను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ టైంలోనూ ఆయనపై విమర్శలు రాగా.. కంపార్ట్మెంట్లో మహిళలు లేరని, బాత్రూం వెళ్లాల్సి రావడంతో అలా వెళ్లానని అప్పుడు తన చర్యను సమర్థించుకున్నారాయన. -
భారత్ గెలుపు వేళ అభిమానులపై దాడి.. నిందితులకు పోలీసుల వింత శిక్ష
భోపాల్: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం తర్వాత దేశవ్యాప్తంగా అభిమానాలు సంబరాలు జరుపుకున్నారు. సంబరాల సందర్భంగా మధ్యప్రదేశ్లో అల్లర్లు చేలరేగాయి. అభిమానులు ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో ఘర్షణకు కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారికి పోలీసులు వింత శిక్ష విధించారు. వారికి గుండు గీయించి, ఊరేగింపు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ టీమ్ని రోహిత్ సేన ఓడించింది. ఈ విజయం పట్ల దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు వేడక చేసుకున్నారు. విజయం అనంతరం రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తి చేశారు. అయితే, మధ్యప్రదేశ్ మోవ్, దేవాస్ నగరాల్లో విజయోత్సవాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వేడుకల సందర్బంగా పట్టణంలోని జామా మసీదు దగ్గర అభిమానుల మీద దాడి జరిగింది. అక్కడ ఎందుకు ఊరేగింపు చేస్తున్నారంటూ గొడవ మొదలుపెట్టారు. మాటామాటా పెరగడంతో ఊరేగింపు మీద రాళ్ళు రువ్వారు. ఆ దాడిలో పలువురు క్రికెట్ ప్రేమికులు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు అసాంఘిక శక్తులు క్రీడాభిమానుల వాహనాలను ధ్వంసం చేసారు. రెండు వాహనాలకు, రెండు దుకాణాలకూ నిప్పు పెట్టారు. దీంతో హింస చెలరేగింది.అయితే, దేవాస్లో జరిగిన అల్లర్లలో పాల్గొన్నట్లుగా భావిస్తున్న నిందితులను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. వారికి గుండు గీయించి, ఊరేగింపు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న కొందరు యువకులు అత్యుత్సాహంతో పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. వీరిని కస్టడీలోకి తీసుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.VIDEO | Madhya Pradesh: Police shave heads and parade those accused of creating ruckus in Dewas after India's ICC Champions Trophy victory on the night of March 9. (Full video available on PTI Videos - https://t.co/dv5TRAShcC) pic.twitter.com/PqCIvX4p0y— Press Trust of India (@PTI_News) March 11, 2025 -
కలికాలంలో.. ఓ తండ్రి విషాదగాథ!
తెలుగులో చంద్రమోహన్-జయసుధ నటించిన కలికాలం అనే సినిమా ఒకటుంది. సమాజంలో.. తల్లిదండ్రుల పట్ల పిల్లలు వ్యవహరించే తీరును సమకాలీన అంశాల ఆధారంగా అప్పట్లో చూపించారు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. అయితే ఆనాటికి.. ఈనాటికి ఆ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని నిరూపించిన ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది.హరేంద్ర మౌర్య(46).. మోరెనా టౌన్లో ఎలక్ట్రీషియన్ పని చేసేవారు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు.. ఓ కొడుకు. మార్చి 1వ తేదీన ఒకేసారి ఇద్దరు కూతుళ్లకు అంగరంగ వైభవంగా వివాహం చేశాడాయన. అయితే కొన్ని గంటలకే ఆ ఇంట విషాదం నెలకొంది. ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న హరేంద్ర.. ఎంత సేపటికి బయటకు రాలేదు. దీంతో తలుపులు బద్ధలు కొట్టి చూడగా ఆయన ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించారు. కిందకు దించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. మృతదేహాన్ని గ్వాలియర్ మెడికల్ కాలేజీకి తరలించారు.భార్య విడాకులు తీసుకుంటుందనే ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డాడని బంధువుల్లో కొందరు.. ఇంట్లో మనస్పర్థలవల్లే ఆయన చనిపోయాడని చుట్టుపక్కలవాళ్లు.. సొంత తండ్రి, సోదరుడే హరేంద్రను చంపారని భార్య తరఫు బంధువులు.. ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడుకోసాగారు. ఈలోపు ఓ భయంకరమైన విషయం వెలుగు చూసింది.హరేంద్రను అతని భార్య, కూతుళ్లు కలిసి దారుణంగా హింసించిన వీడియో ఒకటి సోషల్ మీడియాకు ఎక్కింది. భార్య ఆయన కాళ్లను పట్టుకుంటే.. ఓ కూతురు చేతులు పట్టుకుంది. మిగతా ఇద్దరు కూతుళ్లు కర్రలతో ఆయన్ని విచక్షణ రహితంగా చితకబాదారు. ఆ బాధతో ఆయన అరుస్తున్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి. కొడుకు ఆ తండ్రిని రక్షించే ప్రయత్నం చేయగా.. అతన్ని వారించి మరీ హరేంద్రను హింసించడం ఆ వీడియోలో ఉంది. ఆ వీడియోను ఎవరు చిత్రీకరించారో.. ఎవరు బయట పెట్టారో తెలియదుగానీ.. హరేంద్ర మరణించిన తర్వాత బయటకు రావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. Note: కలవరపరిచే దృశ్యాలు ఉన్న కారణంగా.. వీడియోను అప్లోడ్ చేయలేకపోతున్నాంఈ వీడియో ఆధారంగా హరేంద్రది బలవన్మరణం కాదని.. అతన్ని హింసించి హత్య చేశారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఆ వీడియో రికార్డు చేసినట్లు ఉండగా.. పోలీసులు ఈ వీడియో ఆధారం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ తండ్రికి ఎలాగైనా న్యాయం చేయాలంటూ పలువురు నెట్టింట డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
Hyderabad: పిల్లల్ని చంపి దంపతుల బలవన్మరణం
-
వీడియో: అమ్మాయిని పగబట్టిన కుక్కలు.. భయానక దాడి
జైపూర్: ఓ యువతి ఫోన్ మాట్లాడుతూ ఇంట్లో నుంచి బయటకు రావడమే ఆమెకు శాపమైంది. దాదాపు 10 వీధి కుక్కలు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి. ఆమెకు వెంటాడి మరీ గాయపరిచాయి. ఈ దారుణ ఘటన రాజస్థాన్లోని అల్వర్ నగరంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. అల్వర్లోని జేకే నగర్కు చెందిన నవ్య ఫోన్ మాట్లాడుతూ ఇంటి బయటకు వచ్చింది. ఫోన్ మాట్లాడుకుంటూ అలా కొంత దూరం ముందుకు నడిచింది. ఈ క్రమంలో 10-12 కుక్కలు అకస్మాత్తుగా ఆమెపైకి వచ్చి దాడి చేశాయి. అనంతరం నవ్య పరుగులు తీస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే కుక్కలు ఆమెపై దాడి చేయడం వల్ల నవ్య కింద పడిపోయింది. అయినప్పటికీ కుక్కలు వదలకుండా ఆమెపై దాడి చేశాయి.ఈ సమయంలో పక్కన ఉన్న ఇంట్లో వారు, స్కూటీపై వెళ్తున్న మహిళ వెంటనే స్పందించి కుక్కలను తరిమేశారు. దీంతో, నవ్యపై దాడిని ఆపేసి పారిపోయాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు.. ఈ ఘటన తర్వాత బాధితురాలు, ఫిజియోథెరపీ చదువుతున్న నవ్య మాట్లాడుతూ.. కుక్కల దాడి కారణంగా చాలా భయపడినట్లు చెప్పింది. రెండు రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇలా జరిగిందని వెల్లడించింది. పలుచోట్ల గాయాలైనట్టు తెలిపింది.ఇదిలా ఉండగా.. ఈ ఘటన తర్వాత వీధి కుక్కలకు ఆహారం పెట్టే ఓ మహిళను స్థానికులు మందలించారు. వీధి కుక్కల దాడులు పెరగడానికి ఇదే కారణమని చెప్పారు. గత ఐదేళ్లుగా వీధి కుక్కలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని ఈ ప్రాంత కౌన్సిలర్ అన్నారు. ఈ సమస్యను మున్సిపల్ కార్పొరేషన్ బోర్డులో అనేకసార్లు లేవనెత్తానని, కానీ ఎటువంటి పరిష్కారం చూపించలేదని తెలిపారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. Is there any city in India that does not have to suffer because of street dogs. This is from Alwar in Rajasthan. pic.twitter.com/0dmZaNdFpu— Ravi Handa (@ravihanda) March 8, 2025 -
పెళ్లికూతురు డ్యాన్స్, నోట్ల వర్షం: చివరికి ఏమైందంటే..!
భారతీయ వివాహ వేడుకల్లో ఆడంబరాలు, విలాసాలకు, సంప్రదాయాలకు కొదవూ ఉండదు. అలాగే వధూవరులు ఆనందంతో నృత్యం చేయడం చాలాకామన్. ట్రెండింగ్లో ఉండే పాటలకు డ్యాన్స్లు చేస్తూ సోషల్మీడియాను షేక్ చేసిన ఉదంతాలు గతంలో చాలా చూశాం. కానీ వీటన్నింటికీ భిన్నంగా వధువు వార్తల్లో నిలిచింది. ఆమె చర్యకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. స్టోరీ ఏమిటంటే..డిజైనర్ దుస్తులు, విలువైన ఆభరణాలతో అందంగా ముస్తాబైన వధువు తన పెళ్లిలో డ్యాన్స్ చేస్తోంది. జరీ వర్క్చేసిన ఎరుపు రంగు లెహంగా, దుప్పట్టా, హారాలు, సరిపోయే చెవిపోగులు, చూడమణితో చూడముచ్చటగా ఉన్న ఆమెను అందరూ ఉత్సాహపరుస్తున్నారు. ఇంతలో కొంతమంది అతిథులు ఆమెపై నోట్ల వర్షం కురిపించడం ప్రారంభించారు. దీంతో ఆమె వెంటనే ఆగిపోయింది. అంతేకాదు ఆమె ముఖం చిన్నబుచ్చుకుంది. నృత్యం చేయడం ఆపి, గౌరవంగా తల వంచుకుని, నిశ్శబ్దంగా పక్కకు వెళ్ళిపోయింది. ఇదే అందర్నీ ఆశ్చర్యపర్చింది. నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. View this post on Instagram A post shared by SR Cinematic (@sr_cinematicc) అటువంటి సంప్రదాయాలకు వ్యతిరేకంగా నిలబడినందుకు నెటిజన్లు ఆమెను ప్రశంసించారు. ఇది చాలాచోట్ల సాధారణమైనప్పటికీ, ఆధునిక యుగంలో ఇలాంటి వాటి గురించి పునరాలోచించాలని ఒకరు, "చాలా అందంగా.. తన సంతోషంగా నృత్యం చేస్తోంది....ఆమె ఇతరులను సంతోష పెట్టడం కోసం కాదు, తనకోసం ఆనందంగా నృత్యం చేస్తోంది. వాళ్ కానీ డబ్బులు విసరడం ఎందుకు, అందుకే ఆమె ఆపేసింది అని మరొకరు రాశారు. 'అత్యంత అందమైన వధువు' అని మరికొందరు, ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆచారాలా? ప్రశ్నించారు.మరోవైపు మరికొందరు వధువు తన వివాహంలో నృత్యం చేసినందుకు ఆమెను విమర్శించారు కూడా. వివాహ మర్యాదలు, ఆచారాల చుట్టూ చర్చకు దారితీసిందీ ఘటన.చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా! -
మహిళలూ ఒక్క అరగంట మీ కోసం : నీతా అంబానీ సందేశం వైరల్ వీడియో
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) మహిళల కోసం ఓ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా ఫిట్నెస్ గురించి, ఆమె ష్యాషన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆరు పదుల నిండిన వయసులో కూడా అనేక కార్యక్రమాలతో చాలా చురుగ్గా నిర్మాణాత్మకంగా ఉంటారు ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ మార్చి 8న నీతా అంబానీ మహిళల కోసం ఒక వీడియోను షర్ చేశారు. ఫిట్నెస్ రొటీన్లో క్రమశిక్షణ, అభిరుచిరెండింటినీ మిళితం చేయాలని సూచించారు. అన్ని వయసుల మహిళలు తమ ఆరోగ్యం , శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వ్యాయామం మనలో సానుకూల ధోరణిని పెంచుతుంది,మనసుకు ప్రశాతంనిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సందడిగా మారింది. తాను ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, ఎలాంటి వ్యాయామం చేస్తారో, తన జీవన శైలి వివరాలను పంచుకున్నారు. అలాగే మహిళలు తమ ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని నీతా అంబానీ సూచించారు. ప్రస్తుతం తన వయసు 61 ఏళ్లని.. ఆరేళ్ల వయస్సునుంచి డ్యాన్స్ ప్రాక్టీస్, వ్యాయాం చేస్తూ ఇప్పటికీ ఎంతో ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన ఫిట్నెస్ దినచర్య గురించి కూడా వివరించారు. రోజూ 30 నిమిషాల పాటూ ఫిట్నెస్ కోసం కేటాయిస్తానని, వాకింగ్, జిమ్, స్విమ్మింగ్ చేస్తానని తెలిపారు. చురుగ్గా ఉండటం చక్కెర, చక్కెర ప్రత్యామ్నాయ పదార్థాలను కూడా తీసుకోనని వెల్లడించారు. రోజుకి 5-7వేల అడుగులు నడవడంతోపాటు శాఖాహారంమాత్రమే తీసుకుంటూ, సరైన మోతాదులో ప్రోటీన్, పోషకాలు ఉండేలా జాగ్రత్తపడతానని చెప్పారు.ముఖ్యంగా అంతేకాదు మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవడానికి, దీనికి సంబంధించిన చర్యను ప్రారంభించడానికి సమయం మించిపోలేదని గుర్తు చేశారు. ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరమన్నారు. కండరాలు బలహీనపడతాయి. ఎముకల బలం తగ్గుతుంది. అందుకే మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒక్క అరగంట : నీతా అంబానీ ఫిట్నెస్ మంత్రా వైరల్ వీడియో ‘‘61 ఏళ్లలో నేనుచేయగిలిగనపుడు.. మీరెందు చేయలేరు.. కదలండి! ఒక్క అరగంట మీకోసం కేటాయించుకోండి!!’’ అంటూ నీతా అంబానీ మహిళలకు పిలుపునిచ్చారు. -
కన్నీరు పెట్టుకున్న కొండా సురేఖ
-
BCCI: ‘రోహిత్ లావుగా ఉన్నాడు.. కెప్టెన్గానూ గొప్పోడు కాదు ’.. స్పందించిన బీసీసీఐ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ షామా మొహమద్(Dr Shama Mohamed) చేసిన వ్యాఖ్యలను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా(Devajit Saikia ) ఖండించారు. బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తుల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో భారత్ సెమీ ఫైనల్ ఆడేందుకు సిద్ధమవుతుంటే.. రాజకీయ నాయకులు జట్టుపై ప్రభావం పడేలా ఇలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.కాగా చాంపియన్స్ ట్రోఫీ- 2025లో భాగంగా టీమిండియా ఆదివారం న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. కివీస్ను 44 పరుగుల తేడాతో ఓడించి హ్యాట్రిక్ విజయంతో లీగ్ దశను ముగించింది. అయితే, దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 15 పరుగులకే అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన షామా మొహమద్ ‘ఎక్స్’ వేదికగా రోహిత్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.యావరేజ్ ఆటగాడు.. అవునా?‘‘క్రీడాకారులు ఫిట్గా ఉండాలి. అతడు అధిక బరువుతో ఉన్నాడు. కెప్టెన్గానూ ఆకట్టుకోలేకపోతున్నాడు. మాజీ కెప్టెన్లతో పోలిస్తే అసలు అతడు ఎందుకూ కొరగాడు. యావరేజ్ ఆటగాడు’’ అని షామా పేర్కొన్నారు. అయితే, రోహిత్ శర్మను ఉద్దేశించి ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ద్వైపాక్షిక సిరీస్లలో భారత్కు అధిక విజయాలు అందించడంతో పాటు.. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని తర్వాత టీమిండియాకు వరల్డ్కప్ అందించిన సారథి, వన్డేలలో అత్యధికంగా మూడు డబుల్ సెంచరీ చేసిన మొనగాడి పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు సరికాదంటూ పెద్ద ఎత్తున షామాపై ట్రోలింగ్ జరిగింది.అదేమీ బాడీ షేమింగ్ కాదే!ఈ నేపథ్యంలో వివరణ ఇచ్చే క్రమంలో షామా మొహమద్ మాట్లాడిన తీరు రోహిత్ అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది. ‘‘క్రీడాకారులకు ఫిట్నెస్ ఎంత ముఖ్యమో చెప్పే క్రమంలో నేను ఆ ట్వీట్ చేశాను. అదేమీ బాడీ షేమింగ్ కాదే!.. నేను కేవలం ఫిట్నెస్ గురించే మాట్లాడాను. అతడు కాస్త లావుగా ఉన్నాడనిపించింది. అదే విషయం గురించి ట్వీట్ చేశా.కారణం లేకుండానే నాపై మాటల దాడికి దిగుతున్నారు. ఇతర కెప్టెన్లు.. అంటే ధోని, గంగూలీ, ద్రవిడ్, టెండుల్కర్, కపిల్ దేవ్, విరాట్ కోహ్లిలతో అతడిని పోల్చినప్పుడు రోహిత్ గురించి నాకేం అనిపించిందో అదే చెప్పాను. ఇది ప్రజాస్వామ్యం. నా అభిప్రాయాన్ని పంచుకునే హక్కు నాకు ఉంది. నా మాటల్లో తప్పేముంది?నేను ఓ వ్యక్తిని ఉద్దేశించి ఇలా మాట్లాడలేదు. అయినా ప్రజాస్వామ్యం గురించి అర్థం చేసుకోవడంలో నేను విఫలమయ్యాననుకుంటా. నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో ఇలా మాట్లాడకూడదేమో’’ అని షామా మొహమద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే, షామా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలపగా.. బీజేపీ మాత్రం ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.హుందాగా ప్రవర్తించాలిఇక ఈ విషయంపై తీవ్రస్థాయిలో దుమారం రేగడంతో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్వయంగా స్పందించారు. ‘‘టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఇలాంటి మాటలు వినాల్సి రావడం దురదృష్టకరం. బాధ్యత గల పదవుల్లో ఉన్న వ్యక్తులు హుందాగా ప్రవర్తించాలి. టీమిండియా కీలక సెమీ ఫైనల్ ఆడేముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు’’ అని షామా వ్యాఖ్యలను ఖండించారు.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించిన రోహిత్ సేన.. తదుపరి పాకిస్తాన్, న్యూజిలాండ్పై వరుస విజయాలు సాధించింది. ఈక్రమంలో గ్రూప్-‘ఎ’ టాపర్గా నిలిచిన టీమిండియా మంగళవారం నాటి తొలి సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.చదవండి: వారిద్దరూ అద్భుతం.. కానీ అది మాకు తలనొప్పిగా మారింది: రోహిత్#WATCH | On her comment on Indian Cricket team captain Rohit Sharma, Congress leader Shama Mohammed says, "It was a generic tweet about the fitness of a sportsperson. It was not body-shaming. I always believed a sportsperson should be fit, and I felt he was a bit overweight, so I… pic.twitter.com/OBiLk84Mjh— ANI (@ANI) March 3, 2025 -
తొమ్మిది సెంచరీలు.. సిగ్గుతో తలదించుకోండి!.. వీడియో వైరల్
విదర్భ బ్యాటర్ కరుణ్ నాయర్(Karun Nair) మరోసారి శతక్కొట్టాడు. రంజీ ట్రోఫీ(Ranji Trophy) ఎలైట్ 2024-25 సీజన్ ఫైనల్లో భాగంగా కేరళపై సెంచరీ సాధించాడు. ఈ సందర్భంగా అతడు సెలబ్రేట్ చేసుకున్న విధానం నెటిజన్లను ఆకర్షించింది. ఈ నేపథ్యంలో భీకర ఫామ్లో ఉన్న ఆటగాడి పట్ల వివక్ష చూపిస్తున్న టీమిండియా సెలక్టర్లు సిగ్గుతో తలదించుకోవాలంటూ అతడి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.కాగా దేశవాళీ క్రికెట్ తాజా ఎడిషన్లో ఫార్మాట్లకు అతీతంగా కరుణ్ నాయర్ దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ(Vidarbha) కెప్టెన్గా వ్యవహరించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. కేవలం ఎనిమిది ఇన్నింగ్స్లోనే 779 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా ఐదు శతకాలు ఉండటం విశేషం.ఈ నేపథ్యంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక చేసిన జట్టులో కరుణ్ నాయర్కు స్థానం దక్కాలని భారత మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్ చేశారు. అయితే, బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అతడి అత్యద్భుత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోలేదు.ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. నలభై ఏళ్ల వయసుకు దగ్గరపడుతున్న వాళ్లను జట్టులోకి తీసుకోలేమని వ్యాఖ్యానించాడు. అతడు ఫామ్లో ఉన్నప్పటికీ ప్రస్తుత జట్టులో చోటు ఇవ్వలేమని కుండబద్దలు కొట్టాడు.23వ శతకంఈ క్రమంలో నిరాశకు గురైనప్పటికీ కరుణ్ నాయర్ ఆ ప్రభావాన్ని తన ఆట మీద పడనీయలేదు. రంజీ రెండో దశ పోటీల్లో భాగంగా క్వార్టర్ ఫైనల్లో తమిళనాడుపై శతకం(122) బాదిన అతడు.. తాజాగా ఫైనల్లోనూ సెంచరీతో మెరిశాడు. నాగ్పూర్ వేదికగా కేరళ జట్టుతో జరుగుతున్న తుదిపోరులో నాలుగో రోజు ఆటలో భాగంగా కరుణ్ నాయర్.. 184 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడికి ఇది 23వ శతకం.సెలబ్రేషన్స్తో సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్!ఈ నేపథ్యంలో హెల్మెట్ తీసి బ్యాట్ను ఆకాశం వైపు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్న కరుణ్ నాయర్... ఆ తర్వాత బ్యాట్, హెల్మెట్ను కింద పెట్టేసి.. తన చేతి వేళ్లలో తొమ్మిదింటిని ఎత్తి చూపాడు. దేశీ తాజా సీజన్లో తాను తొమ్మిది సెంచరీలు సాధించానని.. ఇకనైనా టీమిండియాలో చోట ఇవ్వండి అన్నట్లుగా సెలక్టర్లకు సందేశం పంపాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా 2016లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కరుణ్ నాయర్ ఇప్పటి వరకు కేవలం ఆరు టెస్టులు, రెండు వన్డేలు ఆడాడు. టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ సాయంతో 374 పరుగులు చేసిన అతడు.. వన్డేల్లో 46 రన్స్ చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. కేరళతో శనివారం నాటి ఆట ముగిసే సరికి కరుణ్ నాయర్ 280 బంతులు ఎదుర్కొని 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు.. ఈ మ్యాచ్లో విదర్భ పటిష్ట స్థితిలో నిలిచింది. నాలుగో రోజు ఆట పూర్తయ్యే సరికి కేరళ కంటే 286 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: 'భారత్దే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఒకే ఒక్క పరుగు తేడాతో'.. క్లార్క్ జోస్యం 💯 for Karun Nair 👏A splendid knock on the big stage under pressure 💪It's his 9⃣th 1⃣0⃣0⃣ in all formats combined this season, and the celebration says it all👌🙌#RanjiTrophy | @IDFCFIRSTBank | #FinalScorecard ▶️ https://t.co/up5GVaflpp pic.twitter.com/9MvZSHKKMY— BCCI Domestic (@BCCIdomestic) March 1, 2025 -
బీహార్లో పోస్టింగ్ ఇచ్చారని టీచర్ తిట్ల దండకం.. తర్వాత ఏమైందంటే?
పాట్నా: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అన్నాక బదిలీలు తప్పనిసరి. విధుల్లో భాగంగా వారు ఎక్కడికైనా వెళ్లాల్సిందే. ఇతర రాష్ట్రాలకైనా, దేశ సరిహద్దులకైనా వెళ్లక తప్పదు. ఈ క్రమంలో తమకు నచ్చిన ప్రాంతానికి బదిలీ చేయకపోతే ఉద్యోగులు బాధపడతారనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. తనకు బీహార్లో పోస్టింగ్ ఇచ్చారని ఓ టీచర్ తిట్ల దండకం ఎత్తుకున్నారు. అంతటితో ఆగకుండా బీహార్ ప్రజలను దారుణంగా అవమానించారు. ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు ఆమెను సస్పెండ్ చేశారు.వివరాల ప్రకారం.. కేంద్రీయ విద్యాలయంలో ప్రొబేషన్లో ప్రైమరీ టీచర్ దీపాలీ షాకు బీహార్లోని జెహానాబాద్లో పోస్టింగ్ వచ్చింది. దీంతో, ఆమె ఆవేశానికి లోనయ్యారు. బీహార్లో పరిస్థితులు నచ్చకపోవడంతో తిట్ట దండకం అందుకున్నారు. ఇదే సమయంలో బీహార్ ప్రజలను అవమానించేలా ఆమె మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వీడియోలో టీచర్ దీపాలీ షా మాట్లాడుతూ.. నాకు బీహార్లో పోస్టింగ్ ఇచ్చారు. ఇంతకన్నా దేశ సరిహద్దుల్లో జాబ్ వచ్చినా బాగుండేది. అక్కడికి వెళ్లేందుకు కూడా నేను రెడీ ఉన్నాను. నాకు బీహార్కు వెళ్లాలని లేదు. బీహార్ ప్రజలకు అసలు పౌర స్పృహే ఉండదు. భారత్ ఇంకా అభివృద్ధి చెందిన దేశంగా మిగిలిపోయిందంటే దానికి బీహారీలు కూడా ఒక కారణం. బీహార్ను భారత్ నుంచి తొలగించిన రోజు మనం అభివృద్ధి చెందిన దేశంగా మారుతాం. మన రైల్వేలను కూడా బీహారీలే భ్రష్టు పట్టిస్తున్నారు అంటూ బూతులు తిట్టారు.అంతేకాకుండా.. కేంద్రీయ విద్యాలయాలు కేవలం బీహార్లో మాత్రమే ఉన్నాయా?. వేరేచోట నాకు పోస్టింగ ఇవ్వొచ్చు కదా?. నాపై వారికున్న శత్రుత్వం ఏమిటో తెలియడం లేదు. దేశంలో అత్యంత చెత్త ప్రాంతానికి నన్ను పంపించారు. కొందరు కోల్కతాకు వెళ్లేందుకు ఇష్టపడరు. నేను అక్కడికి వెళ్లేందకు సిద్ధంగా ఉన్నాను. ఈశాన్య రాష్ట్రాలకు కూడా వెళ్లడానికి రెడీ ఉన్నాను. నన్ను గోవాకో, ఒడిశాకో, హిమాచల్ ప్రదేశ్కో లేదా దక్షిణాది చివరకు లద్దాఖ్కు పంపించినా బాగుండేది’ అంటూ కామెంట్స్ చేశారు.దీంతో, ఆమె వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో బీహార్ ఎంపీ శాంభవి దృష్టికి వచ్చింది. దీంతో, ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రీయ విద్యాలయ కమిషనర్కు లేఖ రాశారు. ఈ క్రమంలో ఆమెను తక్షణం సస్పెండ్ చేస్తే ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్క వీడియోను ఆమెను చిక్కుల్లో పడేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. A primary school teacher in Bihar's Jehanabad has been suspended after a video of her making offensive comments about the state went viral. In the video, she used inappropriate language and expressed dissatisfaction with her posting in Bihar, calling it "India's worst region."… pic.twitter.com/lvy64rULO6— The Tatva (@thetatvaindia) February 28, 2025 -
మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్
-
మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్
సాంప్రదాయ భారతీయ వివాహాలలో వివాహిత మహిళలను మంగళసూత్రం, నుదుటిన బొట్టు, కాళ్లకు మెట్టెలు విధిగా పాటిస్తారు. మంగళసూత్రం భార్యాభర్తల మధ్య ప్రేమకు ప్రతీక అని. స్త్రీ మంగళసూత్రాన్ని ధరించినప్పుడు, వైవాహిక జీవితాన్ని అన్ని కష్టాల నుండి కాపాడుతుందని చెబుతారు. మహిళలు కూడా అది తమకు శుభప్రదంగా, మంగళకరంగా ఉంటుందని భావిస్తారు తాజాగా అమెరికాకు చెందిన ఒక మహిళ మంగళసూత్రాలు, మెట్టెలు, పట్టీలు బొట్టు ధరించడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది అంతేకాదు భారతదేశంలో వివాహిత హిందూ మహిళలు ధరించే మంగళసూత్రం లేదా కుంకుమ, ఎందుకు ధరిస్తారనే ప్రశ్నలకు కౌంటర్ కూడా ఇచ్చింది.గోవాకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది అమెరికాకుచెందిన జెస్సికా. సూపర్ మార్కెట్ నుంచి బైటికి వస్తున్నప్పుడు ఆమె మెడలో మంగళసూత్రం, మెట్టెలు, పట్టీలు పెట్టుకొని, భారతీయ సంప్రదాయాలను స్వీకరించడం గురించి ఒక అమెరికన్ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అయ్యింది. అమెరికాలో ఉంటూ కూడా ఇవన్నీ ధరించడం చర్చకు దారితీసింది. ఇలా ఎందుకు ధరిస్తావని అమెరికాలోని ఇండియన్స్ తనని విచిత్రమైన ప్రశ్నలు అడుగుతారని చెప్పుకొచ్చింది. ‘నేను ఒక భారతీయడ్ని పెళ్లి చేసుకున్నా. వివాహిత హిందూ మహిళ ఈ వస్తువులను ధరించడం కామనే కదా.. అని చెప్పాను. ఇలా చెప్పడం కరెక్టే కదా. నేను సరిగ్గానే సమాధానం చెప్పానా?’ కామెంట్ చేయాలంటూ నెటిజనులను కోరింది.చదవండి: వింగ్డ్ బీన్స్..పోషకాలు పుష్కలం : ఒకసారి పాకిందంటే!ఒక్క రక్త పరీక్ష : రానున్న పదేళ్లలో మన మరణం గుట్టు! కొత్త పరిశోధన నెటిజన్లు ఏమన్నారంటేఆచారాలను పాటిస్తూ, భర్త సంస్కృతిని గౌరవించినందుకు చాలామంది జెస్సికాను ప్రశంసించారు. మరికొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. పంజాబీ సిక్కుని పెళ్లి చేసుకొని 39 ఏళ్లు. అయినా ఇప్పటికే ప్రశ్నలు ఎదురైతాయి. అయినా వాటిని ధరించడం ఇష్టం.. అందుకే వేసుకుంటాను.. సత్ శ్రీ అకల్ అని చెప్పి వెళ్ళిపోతాను అని ఒకరు వ్యాఖ్యానించగా, పెళ్లై 23 ఏళ్లు..అయినా సరే భారతీయ ఆహారం ఇష్టమా? దానిని ఎలా వండాలో తెలుసా? అని అడుగుతారు.. వచ్చు అని చెబితే తెగ ఆశ్చర్య పోతారు అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేసింది మరో మహిళ. ‘‘ఎయిర్పోర్టుల్లో సెక్యూరిటీ సిబ్బంది కూడా అడుగుతారు.. ఒక భారతీయుడిని వివాహం చేసుకున్నానని వారికి చెబుతాను. అపుడు వారు దాన్ని లైక్ చేస్తారు. అలాగే నువ్వు నిజమైన భారతీయ మహిళవి' అన్నపుడు నాకు భలే గర్వంగా అనిపిస్తుంది. జెస్సికా సాంప్రదాయాలను పాటించడాన్ని ప్రేమిస్తున్నాను" అని మరొక యూజర్ రాశారు.కాగా ఇన్స్టాగ్రామ్లో వెర్నేకర్ ఫ్యామిలీ పేరుతో ఉన్న జెస్సికా వెర్నేకర్, భారతీయుడితో తన ప్రేమ, పెళ్లి గురించి కొన్ని రీల్స్ ద్వారా పంచుకుంది. స్పోర్ట్స్ బైక్పై ప్రయాణం ద్వారా అతణ్ని కలుసుకున్నట్టు గుర్తుచేసుకుంది. ఆ పరిచయం ప్రేమగా నైట్క్లబ్లకు వెళ్లి కలిసి నృత్యం చేసేవాళ్ళమని, పెళ్లి చేసుకున్నా మని తెలిపింది. తన భర్త అమ్మమ్మతో సహా తన కుటుంబాన్ని మొత్తం ఆకట్టుకున్నాడని చెప్పింది. ప్రస్తుతం జెస్సికా భర్తతో కలిసి అమెరికాలో నివసిస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. -
Champions Trophy 2025: భారత అభిమానిని స్టేడియంలో నుంచి ఈడ్చుకెళ్లిన పాక్ సిబ్బంది
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కొత్త వివాదం తలెత్తింది. భారత జెండాను కలిగి ఉన్నాడన్న కారణంగా లాహోర్లోని గడాఫీ స్టేడియం నుండి ఓ వ్యక్తిని బయటకు ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో పాకిస్తాన్ భద్రతా సిబ్బంది భారత జెండాను లాక్కొని, జెండాను పట్టుకున్న వ్యక్తిని స్టేడియంలో నుండి బయటికి ఊడ్చుకెళ్లారు. ఫిబ్రవరి 22వ తేదీన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Laughter Colours | Memes Only (@laughtercolours)ఈ వీడియో సోషల్మీడియాలో పోస్ట్ అయిన సెకెన్లలో వైరలైంది. భారత జెండా కలిగి ఉన్న వ్యక్తి పాకిస్తాన్ పౌరుడే అయినప్పటికీ భారత అభిమాని అని తెలుస్తుంది. సదరు వ్యక్తిని పాక్ భద్రతా సిబ్బంది కొట్టి అరెస్ట్ చేశారని ప్రచారం జరుగుతుంది. ఈ వీడియోపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నుంచి ఎలాంటి స్పందన లేదు. భారత జెండా పట్టుకున్న వ్యక్తి పేరు, వివరాలు కూడా తెలియరాలేదు. ఈ వీడియో నిజమైతే మరెన్ని వివాదాలకు దారి తీస్తుందో వేచి చూడాలి. భద్రతా సిబ్బంది నిజంగానే భారత అభిమానిపై దాడి చేసుంటే పాక్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత అభిమానులు ఈ వీడియోపై తీవ్రంగా స్పందిస్తున్నారు. క్రికెట్ను క్రికెట్ లాగే చూడాలి. క్రికెట్ను ఇతరత్రా విషయాలతో ముడి పెట్టకూడదని అంటున్నారు.ఇదిలా ఉంటే, 29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్కు (ఛాంపియన్స్ ట్రోఫీ) ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్.. పట్టుమని 10 రోజులు కూడా టోర్నీలో నిలువలేకపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైన ఆరు రోజుల్లోనే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. నిన్నటి మ్యాచ్లో బంగ్లాదేశ్పై న్యూజిలాండ్ విజయం సాధించడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ కథ ముగిసింది. ఈ టోర్నీలో పాక్ వరుసగా న్యూజిలాండ్, భారత్ చేతుల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొంది. న్యూజిలాండ్ చేతిలో ఓటమితో పాక్తో పాటు బంగ్లాదేశ్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన భారత్, న్యూజిలాండ్ జట్లు గ్రూప్-ఏ నుంచి సెమీస్కు అర్హత సాధించాయి. ఈ టోర్నీలో పాక్ తమ చివరి గ్రూప్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడుతుంది. గ్రూప్-ఏ నుంచి సెమీస్ బెర్తులు ఖరారు కావడంతో ఈ మ్యాచ్కు ప్రాధాన్యత లేదు. మరోవైపు ఈ టోర్నీలో భారత్, న్యూజిలాండ్ ప్రయాణం జోరుగా సాగుతుంది. ఇరు జట్లు పాకిస్తాన్, బంగ్లాదేశ్లను మట్టికరిపించాయి. ఈ రెండు జట్ల మధ్య నామమాత్రపు పోరు మార్చి 2న జరుగనుంది.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్లో ఇవాళ (ఫిబ్రవరి 25) జరగాల్సిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఫలితంగా ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇప్పటివరకు సౌతాఫ్రికా, ఆసీస్ తలో మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆసీస్తో పోలిస్తే సౌతాఫ్రికా మెరుగైన రన్రేట్ కలిగి ఉంది. ఈ గ్రూప్లో ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది. ఈ రెండు జట్లు తమతమ తొలి మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతిలో ఓడాయి. సౌతాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ను.. ఆస్ట్రేలియా ఇంగ్లండ్ను మట్టికరిపించాయి. టోర్నీలో రేపు ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి. -
ఫోన్కు పుణ్యస్నానం..భర్తకు ప్రేమతో!
ప్రయాగ్ రాజ్: ఇప్పుడు ఏదైనా ఆన్ లైనే. ఆనాడు ఓ కవి.. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. ఇప్పుడు ఆన్ లైన్ కు కాదు ఏదీ అనర్హం అన్న పరిస్థితులు దాదాపు వచ్చేశాయి. ఇప్పటికే ఆన్ లైన్ నిశ్చితార్థాలు, ఆన్ లైన్ పిండ ప్రదానాలు వంటివి ఎన్నో చూశాం. అయితే తాజాగా ఆన్ లైన్ పుణ్యస్నానం కూడా వచ్చేసింది. మహా కుంభమేళాలో కొందరు వ్యాపార కోణంలో ఆన్ లైన్ పుణ్యస్నానాలకు శ్రీకారం చుడితే. మరికొందరు తమ బంధువులు ఎవరైనా అక్కడకు రాలేని పరిస్థితి ఉంటే ఫోన్ తోనే పుణ్యస్నానం పూర్తి చేయిస్తున్నారు. ఫోన్ ను నీటిలో ముంచి భర్తకు పుణ్య స్నానం చేయించిన ఒక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో బెడ్ పై ఉన్న భర్తకు వీడియో కాల్ చేసిన సదరు మహిళ.. ఫోన్ ను నీటిలో పలుమార్లు ముంచింది. ఇలా భర్త పుణ్యస్నానాన్ని పూర్తి చేయించింది ఆ మహిళ. దీనికి సంబంధించిన వీడియోను శిల్పా చౌహాన్ అనే మహిళ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ పోస్ట్ చేయగా, అది వైరల్ గా మారింది. View this post on Instagram A post shared by ❣️Shilpa Chauhan Up54❣️ (@adityachauhan7338) మహా కుంభ్లో డిజిటల్ స్నానం రూ.1100 మాత్రమేనట.. ఏం బిజినెస్ ఐడియా గురూ..! -
హల్దీ ఫంక్షన్లో హనుమాన్ హల్చల్.. వైరల్ వీడియో
పెళ్లిళ్లల్లో ఎపుడు ఏం జరుగుతుందో తెలియదు. మూడుముళ్లూ పడి, అమ్మాయి అత్తారింటికి వెళ్లేదాకా వధువు తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. మర్యాదలకోసం అత్తింటివారు చేసే ఆగడాలు, పెళ్లి కొడుకు అలకలు, అబ్బో..ఇలాంటి వ్యవహారాలు చాలానే ఉంటాయి. అందుకే పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. కానీ ఒక షాదీలోకి అనుకోని అతిధి వచ్చి గందరగోళం సృష్టించింది. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చివరిదాకా చదవాల్సిందే.!పెళ్లి వారంతా హల్దీ వేడుకలో సందడిగా ఉంటే, ఎక్కడినుంచి వచ్చిందో ఒక మర్కటం నానా హంగామా చేసింది. సందు చూసుకొని తన ప్లాన్ పక్కాగా అమలు చేసింది. దీనికి తోడు ఇంకో పిల్లకోతి కూడా చేరింది. అతిథుల చేతిలోని పళ్లను చేతపట్టుకుని గెంతులేస్తూ అక్కడున్న వారినందరినీ హడలెత్తించింది. దీనికి సంబంధించిన వీడియో ఇన్స్టాలో షేర్ అయింది. వధూవరుల హల్దీ సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అతిథులంతా వధూవరులకు పసుపు పూస్తూ, నవ్వుతూ తుళ్లుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఉత్సాహంగా పూర్తిగా వేడుకల్లో మునిగిపోయారు. మరికొందరు ఫోటోలు క్లిక్ చేస్తూ బిజీ...బిజీగా ఉన్నారు. ఇంతలో, ఒక కొంటె కోతి, దాని పిల్ల ఎంట్రీ ఇచ్చాయి. పళ్లు,పళ్లాలతో కొతి గెంతులు వేసింది. ఇంతటితో ఆగలేదు.. ఏకంగా పండ్లతో నిండిన పళ్లాన్ని పట్టుకుని కనిపించింది. ఓరి దేవుడా.. అని స్పందించేలోగానే అతిథుల చేతిలోని పండ్లను చేతబట్టుకొని ఇంకోచోటికి తుర్రుమంది. దీంతో పెళ్లి కొడుకు సహా అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత మెల్లిగా అక్కడ్నించి జారుకుంది. కాసేపటికి తేరుకున్న అందదూ నవ్వుల్లో మునిగి పోయారు. మనమూ కోతి నుంచే వచ్చాంగా అనుకున్నారో ఏమోగానీ మరింత అల్లరి చేశారు. దీంతో అప్పటిదాకా ఆందోళనగా ఉన్న అక్కడి వాతావరణం మంకీ గలాటాతో నవ్వులతో నిండిపోయింది. View this post on Instagram A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis); స్వయంగా హనమాన్జీ యే వచ్చాడు: నెటిజన్లుఈవీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హనుమాన్ జీ వివాహాన్ని ఆశీర్వదించడానికి వచ్చాడు" , స్వయంగా హనుమంతుడే దిగివచ్చాడు అని కొందరు, ఏది జరిగినా మన మంచికే అని మరికొందరు, అయ్యో.. ఇంకొన్ని పళ్లు తీసుకుని వెళ్లాల్సి ఉందని కొంతమంది నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. -
చాలా అలసిపోయాను.. అది నా బలహీనత.. కానీ అదే బలం: కోహ్లి
విరాట్ కోహ్లి అంటే విరాట్ కోహ్లి(Virat Kohli)నే.. తనకు ఎవరూ సాటిలేరు.. సాటిరారు అని మరోసారి నిరూపించాడు ఈ రన్మెషీన్. తన పనైపోయిందన్న వారికి అద్బుత శతకంతో ఫినిషింగ్ టచ్ ఇచ్చి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్(India vs Pakistan)తో పోరులో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు.ఈ సందర్భంగా కోహ్లి ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్గా నిలవడంతో పాటు.. ఈ మైలురాయి చేరుకున్న మూడో ప్లేయర్గా చరిత్రకెక్కాడు. అంతేకాదు.. ఓ ఐసీసీ టోర్నమెంట్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఆటగాడిగా వరల్డ్ రికార్డు సాధించాడు.అదే విధంగా చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో తనకు ఒక్క శతకం కూడా లేదన్న లోటును కూడా కోహ్లి ఈ మ్యాచ్ సందర్భంగా తీర్చేసుకున్నాడు. ఇక వన్డేల్లో అత్యధికంగా 51 సెంచరీలు పూర్తి చేసుకుని ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్గా నిలిచిన కోహ్లి.. అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 82 సెంచరీల మైలురాయిని అందుకుని.. శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ రికార్డుకు మరింత చేరువయ్యాడు.ఈ నేపథ్యంలో తన మ్యాచ్ విన్నింగ్స్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘‘సెమీస్ చేరే అవకాశం ఉన్న కీలక మ్యాచ్లో ఈ తరహాలో ఆడటం సంతృప్తిగా ఉంది. రోహిత్ అవుటైన తర్వాత మధ్య ఓవర్లలో ఎలాంటి సాహసోపేత షాట్లకు పోకుండా జాగ్రత్తగా ఆడే బాధ్యత నాపై పడింది. చాలా అలసిపోయానుఇది సరైన వ్యూహం. నేను వన్డేల్లో ఎప్పుడూ ఇలాగే ఆడతాను. నా ఆట గురించి నాకు చాలా బాగా తెలుసు. బయటి విషయాలను పట్టించుకోకుండా నా సామర్థ్యాన్ని నమ్ముకోవడం ముఖ్యం.ఎన్నో అంచనాలు ఉండే ఇలాంటి మ్యాచ్లలో వాటిని అందుకోవడం నాకు కష్టం కాదు. స్పిన్లో జాగ్రత్తగా ఆడుతూ పేస్ బౌలింగ్లో పరుగులు రాబట్టాలనే స్పష్టత నాకు ఉంది. గిల్, అయ్యర్ కూడా బాగా ఆడారు. ఈ ఇన్నింగ్స్తో నేను చాలా అలసిపోయాను. తర్వాతి మ్యాచ్కు వారం రోజుల విరామం ఉంది. 36 ఏళ్ల వయసు ఉన్న నాకు ఇది సంతోషాన్ని కలిగించే విషయం’’ అని పేర్కొన్నాడు.నాకు ఇదొక క్యాచ్-22 లాంటిదిఇక బీసీసీఐ టీవీ ఇంటర్వ్యూలో భాగంగా తన బలహీనత, బలం అయిన షాట్ గురించి కోహ్లి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘కవర్ డ్రైవ్ షాట్.. నాకు ఇదొక క్యాచ్-22 లాంటిది(ముందే వద్దని అనుకున్నా ఓ పని చేయకుండా ఉండలేకపోవడం అనే అర్థంలో). అంటే.. చాలా ఏళ్లుగా నాకు ఇది బలహీనతగా మారింది. అయితే, ఈ షాట్ కారణంగా నేను ఎన్నో పరుగులు రాబట్టాను.ఈరోజు మాత్రం ఆచితూచే ఆడాను. తొలి రెండు బౌండరీలు కవర్ డ్రైవ్ షాట్ల ద్వారానే వచ్చినట్టు గుర్తు. అయితే, కొన్నిసార్లు రిస్క్ అని తెలిసినా సాహసం చేయకతప్పలేదు. ఏదేమైనా అలాంటి షాట్లు ఆడటం ద్వారా మ్యాచ్ నా ఆధీనంలో ఉందనే భావన కలుగుతుంది.వ్యక్తిగతంగా నాకిది ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్. ఇక జట్టుకు కూడా ఇది గొప్ప విజయం’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా వన్డేల్లో ఫామ్లోకి వచ్చినప్పటికీ.. టెస్టుల్లో కోహ్లి అవుటైన తీరుపై మాత్రం విమర్శలు ఎక్కువగానే వచ్చాయి. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ సమయంలో ఆఫ్ సైడ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడే క్రమంలో అతడు ఎక్కువసార్లు అవుటయ్యాడు. అయితే, తాజాగా ఆ షాట్ల గురించి కోహ్లి ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం విశేషం.చదవండి: Virat Kohli: ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్ View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
రోడ్డెక్కిన అత్తాకోడళ్లు.. చూసి తీరాల్సిందే!
అత్తాకోడళ్లంటే శత్రువులు అనే భావన చాలామందిలో స్థిరపడిపోయింది. వీరి మధ్య జరిగే వివాదాలను టీవీ సీరియళ్లలో ఆసక్తికరంగా చూపిస్తుంటారు. చిన్నపాటి విషయానికే కొందరు అత్తాకోడళ్లు తెగ తిట్టేసుకుంటారని, కొట్టేసుకుంటారనే ఆరోపణలు వినిపిస్తుంటాయ. తాజాగా అత్తాకోడళ్లకు సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది.మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో రోడ్డున పడిన అత్తాకోడళ్ల ఉదంతం చోటుచేసుకుంది. సోషల్ మీడియా(Social media)లో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోలో అత్తాకోడళ్లు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని, కొట్టుకున్న దృశ్యం కనిపిస్తుంది. ఒకరిపై మరొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పరస్పరం తిట్టుకోవడంతో పాటు దుస్తులు చించుకునే వరకూ వెళ్లడాన్ని ఈ వీడియోలొ చూడవచ్చు. వారి కుటుంబ సభ్యులు అత్తాకోడళ్లను విడిపించేందుకు ప్రయత్నించినప్పటికీ ఏ మాత్రం ఫలితం ఉండదు. Kalesh b/w Mother-in-Law and Daughter-in-Law Outside Court, Nashik MHpic.twitter.com/QAjcpr6sYu— Ghar Ke Kalesh (@gharkekalesh) February 21, 2025ఈ అత్తాకోడళ్లు(Daughter-in-laws) యద్ధంలో ముందుగా అత్త తన కోడలి జుట్టు పట్టుకుని కింద పడేస్తుంది. అయితే కోడలు తాను ఏం తక్కువ తిన్నానంటూ అత్తపై దాడికి దిగుతుంది. ఈ వీడియోలో నల్ల చీర కట్టుకున్న ఒక మహిళ అత్తా కోడళ్ల యుద్దానికి ఆజ్యం పోస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ దృశ్యం కుటుంబ కలహాలకు మించిన రేంజ్లో ఉంది. అయితే పోలీసులు రంగప్రవేశం చేశాక పరిస్థితి అదుపులోకి వచ్చిందని సమాచారం. ఇది కూడా చదవండి: Mahashivratri: మహాశివరాత్రి ఎలా మొదలయ్యిందంటే.. -
వివాహ వేడుకలో విషాదం.. విచారణలో బయటపడ్డ అసలు విషయం
Shocking Viral Video: పెళ్లి వేడుకలో అంతా హుషారుగా డ్యాన్సులు వేస్తున్నారు. అంతలో ఊహించిన ఘటన.. ఆ ఊరిలో తీవ్ర విషాదం నింపింది. హుషారుగా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో ఆ ఊరి సర్పంచ్ భర్త ఊపిరి ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే.. ఈలోపు సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో చక్కర్లు కొట్టగా.. విచారణలో అసలు విషయం బయటపడింది.పంజాబ్ జలంధర్ గోరయా ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆ ఊరి సర్పంచ్ భర్త పరమ్జిత్ సింగ్(49) ఓ వివాహ వేడుకలో హుషారుగా చిందులేస్తూ కుప్పకూలిపోయారు. గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు, పోలీసులు వెల్లడించారు. అయితే సోషల్ సోషల్ మీడియాలో ఓ వైరల్ అయ్యింది.వివాహ వేడుకలో ఓ వ్యక్తి చిందులేస్తూ.. తుపాకీ పేల్చాడు. అయితే అది పక్కనే డ్యాన్స్ చేస్తున్న పరమ్జిత్కు తగిలింది. దీంతో ఆయన కిందపడిపోయారు. కిందపడిన పరమ్జిత్.. తుపాకీతో కాల్చిన వ్యక్తిని మందలించారు కూడా. అయితే ఆ వెంటనే ఆయన అలాగే స్పృహ కోల్పోయారు. వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. బుల్లెట్ గాయంతోనే పరమ్జిత్ మరణించాడని, విషయం బయటకు రాకుండా బాధిత కుటుంబం పెద్దల సమక్షంలో డబ్బు తీసుకుందని తేలింది. పిస్టల్ పేల్చిన వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పంజాబ్ సహా భారతదేశంలో ఇలాంటి వేడుకలలో బహిరంగంగా ఆయుధాల్ని ప్రదర్శించడం నిషిద్ధం. ఒకవేళ అది ఉల్లంఘిస్తే నేరం కిందకే వస్తుంది. जालंधर में एक शादी समारोह में की गई हवाई फायरिंग में एक युवक को गोली लग गई, जिससे उसकी मौत हो गई. जानकारी के मुताबिक मृतक गांव की मौजूदा सरपंच के पति हैं. घटना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है. #Jalandhar | #Firing pic.twitter.com/NovyLH21vK— Veer Arjun (@VeerArjunDainik) February 22, 2025 VIDEO Credits: VeerArjunDainik -
Viral: నారీశక్తి.. చంటిబిడ్డతో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్
నాణేనికి రెండు వైపుల మాదిరే.. సోషల్ మీడియాలో రెండు పార్శ్వాలు ఉంటాయి. మంచిని ఎక్కువగా చర్చించినప్పుడు మధ్యలో చెడును.. అలాగే చెడుపై ఎక్కువగా చర్చ జరిగినప్పుడు మధ్యలో మంచి ప్రస్తావననూ తెస్తుంటుంది. అయితే నెట్టింట వైరల్ అవుతున్న ఓ అమ్మ విషయంలోనూ ఇదే జరుగుతోంది ఇప్పుడు.ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటన జరిగిన మరుసటి రోజు.. అక్కడ ఓ మహిళా కానిస్టేబుల్ విధుల్లో ఉంది. ఆ టైంలో ఆమె తన చంటిబిడ్డతో కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో.. అందంగా ఎడిట్ చేసిన ఆమె ఫొటో సైతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. చాలామంది అమ్మ గొప్పతనమంటూ ఆ ఫొటోలు స్టేటస్గా పెట్టుకున్నారు కూడా. మరోవైపు..This picture is representative of what Bharat truly is - young, responsible and hardworking. Balancing family and work. Instilling same values to the next generation. While we celebrate rich celebrities as icons, we tend to forget the real women of Bharat - young mothers who… pic.twitter.com/uZSCpTPIzm— Tejasvi Surya (@Tejasvi_Surya) February 17, 2025రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం ఈ ఫొటోకు స్పందించారు. నిజమైన భారత్ ఇదేనని, నారీ శక్తికి ఆమె ప్రతిరూపమంటూ కొనియాడారు. RPF ఇండియా కూడా ఎక్స్ అకౌంట్లో ఆ వీడియోను పోస్ట్ చేసింది. తన విధులతో పాటు తల్లిగా బాధ్యతను విస్మరించని కానిస్టేబుల్ రీనా గొప్ప యోధురాలు అంటూ గర్వంగా ప్రకటించుకుంది. అదే సమయంలో విమర్శలు మొదలయ్యాయి.She serves, she nurtures, she does it all—A mother, a warrior, standing tall…Constable Reena from 16BN/RPSF performing her duties while carrying her child, representing the countless mothers who balance the call of duty with motherhood every day.#NariShakti #HeroesInUniform… pic.twitter.com/enzaw0iDYo— RPF INDIA (@RPF_INDIA) February 17, 2025ప్రముఖ నగరాల్లో రైల్వేస్టేషన్లలో ఏమేరు రద్దీ ఉంటుందో చూస్తున్నదే. అలాగే ఈ మధ్య అయితే తోపులాట, తొక్కిసలాట ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వారిని నియంత్రించాల్సిన బాధ్యత.. ఇలాంటి కానిస్టేబుళ్లకే ఉంటుంది. అలాంటప్పుడు ఆమె అలా తన బిడ్డ ప్రాణాలు పణంగా పెట్టి మరీ విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. అలాగే.. బిడ్డల సంరక్షణ కోసం ఆర్పీఎఫ్ స్టేషన్లలో ఉండే సదుపాయాల్ని ఆమె వినియోగించుకోవాల్సిందని సూచిస్తున్నారు. మరోవైపు.. నారీశక్తి అని పిలడడంపైనా పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా బిడ్డతో విధులకు హాజరుకావడాన్ని అన్యాయంగా అభివర్ణిస్తున్నారు. అధికారులైనా ఈ విషయంలో చొరవ చూపాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. ఇక.. బిడ్డ పెంపకం విషయంలోనూ ఆమెకు ఉన్న ఇబ్బందుల గురించీ, ఆమెపై ఉన్న బాధ్యతల గురించీ కొందరు ప్రస్తావిస్తున్నారు.Quit romanticising women doing it all by themselves. She should have help raising her baby when she's on duty, she absolutely doesn't need to do this alone, she's doing it because she has no choice, because men barely help with raising a child. Call it what it is: she's solidly… pic.twitter.com/G7M6LGXdOM— Dr. Ruchika Sharma (@tishasaroyan) February 17, 2025అదే సమయంలో.. ఆమెకు ఉన్న సవాళ్లను ప్రస్తావిస్తూ కొందరు పోస్టులు పెడుతుండడం గమనార్హం. అయినా సరే మహిళలు ఎక్కడా వెనుకడుగేయకుండా, ఆ సవాళ్లను లెక్కచేయకుండా ఈ పోటీ ప్రపంచంతో పోటీపడుతుండటం.. అన్నింటికి మించి అటు అమ్మగా, ఇటు ఆర్పీఫ్ కానిస్టేబుల్గా మెప్పించడం గొప్ప విషయమని వాదిస్తున్నారు. -
పతి దేవుడిపై ప్రతీకారమా? బెంబేలెత్తుతున్న బట్టతల బంగారమ్స్!
కాదేదీ వైరల్కు అనర్హం అన్నట్టు ఉంటుంది సోషల్ మీడియా వ్యవహారం. ఎపుడు ఎలాంటి వీడియో వైరల్ అవుతుందో తెలియదు. అనేక సామాజిక అంశాలతోపాటు, ప్రేయసీ ప్రియుల చిలిపి తగాదాలు, భార్యభర్తల సరసాలు ,ఫైటింగ్లు లాంటి వీడియోలు నెట్టింట సందడి చేస్తూ ఉంటాయి. అలా తన పతిదేవుడిపై ఒక సతీమణి ప్రతీకారం తీర్చుకున్న వైనం వైరల్గా మారింది. ప్రతీకారం అంటే అదేదో హింసా, ప్రతి హింస అనుకునేరు. చదవండి మరి!తనకు చపాతి కావాలని అడిగాడు ఓ భర్త. ‘హే...పో.. ఇపుడెవరు చేస్తారు’ అంది భార్యామణి విసుగ్గా. నేనేమైనా మణులు, మాణిక్యాలు అడిగానా, చపాతియేగా..నాకోసం ఆ మాత్రం చేయలేవా అన్నాడు భర్త. అంతే క్షణాల్లో అక్కడి వాతావరణం మారిపోయింది. ముందు ఇల్లు పీకి పందిరేసినంత పనిచేసిన భార్య చివరికి చపాతీ తయారీకి రంగంలోకి దిగింది. ‘‘ఇగో.. నేను చపాతీ చేయాలంటే నువ్వు సాయం చేయాలి మరి అంది గోముగా.. ఓ..దానిదేముంది చేసేద్దాం అన్నాడు భార్యామణి అసలు ప్లాన్ తెలియని భర్త.అంతే కిచెన్ లోకి వెళ్లి గోధుమపిండి తీసుకొచ్చింది. బాగా పిసికి మెత్తగా పిండిని రెడీ చేసేసింది. ఆ తర్వాత ఇంటి పక్కన ఉన్న ఖాళి ప్రదేశంలో, చపాతీలు కాల్చేందుకు కట్టెల పొయ్యి సిద్ధం చేసింది. ఇది చూసి ఇంకా ఉత్సాహంతో రంగంలోకి దిగాడు భర్త. మాంచిగా మఠం వేసుకుని కూర్చున్నాడు. మరి చపాతీలు చేయడానికి పీట ఏది అని అడిగాడు.. దానికి ఆమె పీటా, గీటా లేదని చెప్పింది. ‘‘అదేమిటోయ్..పీట లేకుండా చపాతీ ఎలా చేసేది’’ అంటూ భార్యమీద గుర్రుమన్నాడు. అప్పుడు తన ప్లాన్ను పక్కాగా అమలు చేసే సమయం కోసం ఎదురు చూస్తున్న భార్యామణి అటు ఇటు చూసిన ఆమె మీ గుండుగా నున్న....గా, దాని మీద చేస్తాను అన్నది. ఓసి నీ దుంపదెగ ఇదేం పని హూంకరించాడు భర్త. అవన్నీ జాన్తా నహీ.. మీకు చపాతి కావాలా? వద్దా? అని ఆమె ప్రశ్నించింది. సరే అలానే కానివ్వూ అని అన్నాడు. అలా అనడం ఆలస్యం, ఇంక ఏ మాత్రం సంకోచించకుండా, నున్నటి అతగాడి గుండు మీద తన ప్రతాపన్నంతా చూపించింది (చాలా రోజులనుంచి బోడి గుండు మీదు కోపం ఉన్నట్టుంది పాపం..) చపాతీలు వత్తడం మొదలుపెట్టింది. భర్త చక్కగా పిండిలో ముంచి ఇవ్వడం, ఆమె గుండ్రంగా చపాతీ వత్తడి, ఆ తరువాత దాన్ని ఆయనగారు తీసి పెనం మీద కాల్చడం.. ఇందులో చూడవచ్చు. గతేడాది నవంబరులో షేర్ అయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఫన్నీగా కమెంట్స్ చేశారు.అరే... ఇందేంది భయ్యా.. నవ్వి నవ్వి మేం పోతే ఎవరు గ్యారెంటీ అంటూ కామెంట్ చేస్తున్నారు. కిచెన్లో చపాతీలు తయారు చేయడానికి పీట కూడా లేదా? ఎంత బోడిగుండు అయితే మాత్రం భర్త తల మీద చపాతీలు చేస్తారా? రివెంజ్ ఇలా తీర్చుకుంటారా అన్నారు. అంతేకాదు కొంతమంది భార్యలు కూడా ఇదే ఫాలో అయితే బోడినెత్తి బంగారు బాబుల పరిస్థితి ఏంటి బాసూ అంటూ వ్యాఖ్యానించారు. మరికొందరేమో సోషల్ మీడియాలో హైప్ కోసం ఇలాంటి పనులు చేస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. View this post on Instagram A post shared by GUAH BOCAH BOJONGGEDE (@katababa_) -
ఓసీడీ ఉన్నట్లు ఉంది.. ట్రైన్ క్లీనింగ్ పెట్టుకున్నాడు!
-
ఓసీడీ ఉన్నట్లు ఉంది.. ట్రైన్ క్లీనింగ్ పెట్టుకున్నాడు!
రైళ్లు స్టేషన్లలో ఆగినప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అది కూడా ప్రధాన స్టేషన్లలో వద్దో, జంక్షన్ల వద్దో ట్రైన్లను శుద్ధి చేసే కార్యక్రమం చేస్తూ ఉండటం మనకు తరుచు కనిపిస్తూ ఉంటుంది. దానికి ప్రత్యేకమైన సిబ్బంది ఉంటారు. దానికో ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ట్రైన్ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నాడు. అది కూడా ట్రైన్ కదులుతున్నప్పుడే క్లీనింగ్ కార్యక్రమం పెట్టేశాడు. మనోడికి ఆ ట్రైన్ నీట్ గా కనిపించలేనట్లు ఉంది. అందుకే అలా క్లీనింగ్ చేసినట్లు ఉన్నాడు.రైల్వే ట్రాక్ పక్కగా ఉండే వాటర్ \హోస్ తీసుకుని వచ్చే వెళ్లే ట్రైన్లపై నీళ్లు కొడుతూ ఉన్నాడు. అయితే ఒక ట్రైన్ పై వాటర్ హోస్ తో క్లీన్ చేయడాన్ని ఒక యూజర్ తన కెమెరాలో బంధించాడు. దీన్ని సోషల్ మీడియా హ్యాండిల్ ‘రెడ్డిట్’ తన ఖాతాలో పోస్ట్ చేసింది.ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘మనోడికి ఓసీడీ ఉన్నట్లు ఉంది.. ట్రైన్ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నాడు’ అని ఒకరు రియాక్ట్ కాగా, ప్యాసింజర్ల పై కోపంలా ఉంది. ప్రత్యేకంగా ట్రైన్ లో డోర్ వద్ద ఉన్న ప్రయాణికుల్నే టార్గెట్ చేసి అలా వాటర్ స్ప్రే చేస్తున్నాడు’ అని మరొకరు స్పందించారు. ‘ ఇలా కొడితే ట్రైన్ ఖాళీ అయ్యి తనకు సీట్ దొరుకుతుందని కాబోలు’ అని మరొక నెటిజన్ రియాక్ట్ అయ్యారు. -
బెంగళూరులో దారుణం.. టోల్గేట్ వద్ద అరాచకం!
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. టోల్గేట్ వద్ద ఓ వ్యక్తిని కారు కొంత దూరం లాకెళ్లి పడేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.వివరాల ప్రకారం.. కర్ణాటకలోని నెలమంగళలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టోల్బూత్ వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. టోల్గేట్ వద్ద ఓ కారును మరో కారు ఓవర్ టేక్ చేయడంతో సదరు కారులో వ్యక్తి.. ముందుకు వచ్చి కారులో ఉన్న వ్యక్తిని ప్రశ్నించారు. దీంతో, టోల్బూత్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ముందు కారులో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఆవేశంతో రగిలిపోయాడు.ఈ క్రమంలోనే కారు స్టార్ చేసి.. వాగ్వాదానికి దిగిన వ్యక్తి కాలర్ పట్టుకుని కారును ముందుకు నడిపాడు. ఆ తర్వాత కారు ఆ వ్యక్తిని దాదాపు 50 మీటర్ల దూరం కారు ఈడ్చుకెళ్లింది. కొంత దూరం వెళ్లాక అతడిని వదిలిపెట్టడంతో ఆయన కిందపడిపోయాడు. కారు డ్రైవర్ మాత్రం ఆగకుండా వెళ్లిపోయాడు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. Shocking Incident in Bengaluru!A man was dragged for 50 meters by a car at Nelamangala toll booth after an argument over overtaking. The entire incident was caught on CCTV. Police have launched an investigation to identify the accused. #Bengaluru #RoadRage #ViralVideo pic.twitter.com/mFJ8YOMXoQ— Shubham Rai (@shubhamrai80) February 16, 2025 -
61 ఏళ్ల వయసులో మరోసారి ప్రేమలో పడ్డ ‘ఐపీఎల్ సృష్టికర్త’!.. ఎవరీమె?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తొలి చైర్మన్, వ్యాపారవేత్త లలిత్ మోదీ(Lalit Modi) మరోసారి ప్రేమలో పడ్డాడు. రీమా బౌరీ(Rima Bouri)తో పాతికేళ్లుగా తనకున్న స్నేహం ప్రేమగా రూపాంతరం చెందిందని తెలిపాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఈ విషయాన్ని లలిత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.దేశం విడిచిపారిపోయికాగా వ్యాపార కుటుంబానికి చెందిన లలిత్ మోదీ ఢిల్లీలో జన్మించాడు. ఐపీఎల్(IPL) సృష్టికర్తగా పేరు ప్రఖ్యాతులు పొందిన అతడు.. అదే స్థాయిలో అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఆర్థిక అవకతవలకు పాల్పడి దేశం విడిచిపారిపోయే పరిస్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం లలిత్ మోదీ లండన్లో తలదాచుకుంటున్నట్లు జాతీయ మీడియా కథనాల ద్వారా వెల్లడైంది.భార్య కంటే తొమ్మిదేళ్లు చిన్నఇదిలా ఉంటే.. లలిత్ మోదీ వృత్తిగత జీవితం మాదిరే వ్యక్తిగత జీవితం కూడా సంచలనాల మయమే. వయసులో తనకంటే తొమ్మిదేళ్లు పెద్దదైన, డివోర్సీ మినాల్ను లలిత్ మోదీ ప్రేమించి పెళ్లాడాడు. ఆమె కోసం కుటుంబాన్ని ఎదిరించి మరీ ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చిన లలిత్.. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగాడు.ఇక లలిత్- మినాల్ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె అలియా, కుమారుడు రుచిర్ మోదీ ఉన్నారు. వీరిద్దరితో పాటు మినాల్కు మొదటి వివాహం ద్వారా కలిగిన కుమార్తె కరీమా సంగ్రాణిని కూడా లలిత్ మోదీ చేరదీసినట్లు కథనాలు ఉన్నాయి. లలిత్ ప్రాణంగా ప్రేమించిన మినాల్ క్యాన్సర్తో పోరాడి దురదృష్టవశాత్తూ 2018లో కన్నుమూశారు.సుస్మితా సేన్తో ప్రేమలో ఉన్నట్లుఅప్పటి నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న లలిత్ మోదీ గతేడాది.. విశ్వ సుందర్ సుస్మితా సేన్తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించి సంచలనానికి తెరదీశాడు. అనంతరం.. ఆమెను బెటర్ హాఫ్ అని సంబోధిస్తూ పెళ్లి వార్తలకు ఊతమిచ్చాడు. అయితే, ఆ తర్వాత ఇద్దరూ వీటిని ఖండించడంతో ఊహాగానాలకు చెక్ పడింది.అయితే, తాజాగా.. 61 ఏళ్ల లలిత్ మోదీ తాను మరోసారి ప్రేమలో పడ్డట్లు తెలపడం విశేషం. ‘‘ఒక్కసారి అదృష్టం అంటారు... మరి నేను మాత్రం రెండుసార్లు లక్కీ అయ్యాను. 25 ఏళ్ల స్నేహం ప్రేమగా రూపాంతరం చెందిన వేళ.. అవును ఇది రెండోసారి జరిగింది. మీ జీవితాల్లోనూ ఇలా జరిగే ఉంటుంది. హ్యాపీ వాలైంటైన్స్ డే’’ అంటూ రీమా బౌరీతో ఉన్న ఫొటోలతో కూడిన వీడియోను లలిత్ మోదీ షేర్ చేశాడు.జీవితాంతం నువ్వే నా ప్రేమఇందుకు స్పందిస్తూ.. ‘‘లవ్ యూ మోర్’’ అని రీమా పేర్కొనగా.. లలిత్.. ‘‘జీవితాంతం నువ్వే నా ప్రేమ’’ అంటూ రొమాంటిక్గా బదులివ్వడం విశేషం. కాగా రీమా బౌరీ వృత్తిరీత్యా మార్కెటింగ్ కన్సల్టెంట్గా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. 2022లో లలిత్ మోదీ తన కుమార్తె ఆలియా వివాహం జరిపించాడు. బ్రెట్ కార్ల్సన్ అనే విదేశీయుడిని ఆలియా పెళ్లి చేసుకున్నారు. ఇటలీలోని వెనిస్ నగరంలో వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఇదిలా ఉంటే.. 2008లో మొదలైన ఐపీఎల్ పదిహేనేళ్లుగా విజయవంతమైన లీగ్గా కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చి 21 నుంచి ఈ మెగా క్రికెట్ ఈవెంట్ మొదలుకానుంది.చదవండి: అప్పుడే ఆఫర్ వచ్చింది.. కానీ!.. వదిలేసిన ఫ్రాంఛైజీ జట్టుకే కెప్టెన్గా.. View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi) -
MahaKumbh : బ్రహ్మాండమైన వ్యాపారం నెలకు లక్షన్నర!
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న మహాకుంభమేళా 2025 ఉత్సాహంగా కొనసాగుతోంది. రికార్డు స్థాయి భక్తులతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఆధ్యాత్మిక ఉత్సవంలో అనేక ఆసక్తికరమైన విషయాలకు కేంద్రంగా మారుతోంది. రుద్రాక్ష మాలలు అమ్ముకునే మోనాలీసా, వేపపుల్లలు అమ్ముకునే ప్రేమికుడు..ఇలా చిన్న వ్యాపారులకు కూడా ఆదాయమార్గాలను విస్తృతం చేసింది. తాజాగా ఈ కోవలో నిలిచాడు చాయ్ వాలా. కుంభ్ చాయ్వాలా టీ కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందామా?మన చాయ్వాలా పేరు శుభం ప్రజాపత్. అతని కేవలం వయస్సు 20 ఏళ్లే. కానీ అతడి ఐడియా మాత్రం అదిరింది. మహాకుంభమేళాను సందర్శించే భక్తులుకు టీ , వాటర్ బాటిళ్లు టీ అమ్మడం ద్వారా చక్కటి ఉపాధిని వెదుక్కున్నాడు. అంతేకాదు రోజుకు రూ. 5 వేలకు పైగా సంపాదిస్తున్నాడు. అంటే నెలకు లక్షా 50వేలు అన్నమాట. ఇది సంపాదన ఒక కార్పొరేట్ఉద్యోగి, ఐటీ ఉద్యోగి వేతనానికి ఏ మాత్రం తీసిపోదు.కుంభమేళా ప్రారంభానికి రెండు రోజుల ముందే టీ అమ్మడాన్ని మొదలు పెట్టాడు. ఒక్కో టీ 10 రూపాయలు చొప్పున విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. ఈ ఉత్సవం ముగియగానే తన పని తాను చేసుకుంటానని, ఈ నెల రోజుల వ్యాపారం బాగా వర్కవుట్ అయ్యిందని చెబుతున్నాడు శుభం ప్రజాపత్. తన చిన్న బిజినెస్ ఐడియా లక్షాధికారిని చేసిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. మొత్తానికి తనకు రెండు లక్షల రూపాయల దాకా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాడు. (టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్తో వాలెంటైన్స్ డే స్పెషల్) View this post on Instagram A post shared by Shubham Prajapat (@madcap_alive)స్వయంగా కంటెంట్ క్రియేటర్ అయిన ప్రజాపత్ తాను టీ అమ్ముతున్న వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో క్లిప్లో ఒక చిన్న బండిపై చాయ్, వాటర్ బాటిళ్లు అమ్ముతున్నట్లు మనం చూడవచ్చు. ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉంటుందనీ మధ్యాహ్నం మాత్రం కాస్త విశ్రాంతి దొరుకు తుందని చెప్పుకొచ్చాడు. ప్రజాపత్ ఐడియాకు జనం ఫిదా అవుతున్నారు. మరో విధంగా చెప్పాలంటేకుంభ చాయ్వాలా ఇపుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు. ప్రపంచలోని అతిపెద్ద ఆ ఆధ్యాత్మిక సమావేశం కుంభమేళా కుంభమేళా. జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ఈ కుంభమేళాకు రోజు కోట్లాది మంది భక్తులు ,పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేయడానికి వస్తున్నారు. ఇప్పటి వరకు 50 కోట్లకు మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు. ఇటీవల రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం ప్రయాగ్రాజ్లో పుణ్య స్నానాలు చేసిన సంగతి విదితమే. -
‘అమ్మా బంగారు తల్లీ.. కారులో అలా చేయొద్దమ్మా!’
వైరల్: కరోనా టైం నుంచి వర్క్ఫ్రమ్ హోమ్కు ప్రపంచం అలవాటు పడిపోయింది. ఒకానోక టైంకి వచ్చేసరికి.. ఈ తరహా పని తీరు ఉద్యోగుల మానసిక స్థితిపైనా ప్రభావం చూపెట్టడం మొదలుపెట్టింది. అయితే పరిస్థితులు మారుతున్నా కొద్దీ క్రమక్రమంగా కంపెనీలు హైబ్రీడ్ విధానానికి వాళ్లను అలవాటు చేశాయి. ఈ క్రమంలో.. అటు ఆఫీస్.. ఇటు ఇల్లు కాని పరిస్థితుల్లో ఉద్యోగులు నలిగిపోతుండడం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఎక్కడపడితే అక్కడ తమ లాప్ట్యాప్లతో వర్క్ చేస్తున్న దృశ్యాలు తరచూ వైరల్ అవుతున్నాయి. అయితే ఇలాంటి చేష్టలకు దిగిన బెంగళూరు మహిళా టెకీకి పోలీసులు సర్ప్రైజ్ ఇచ్చారు. బెంగళూరులోని ఆర్టీ నగర్ ప్రాంతంలో కారులో వెళ్తూ ఓ మహిళా టెకీ ల్యాప్టాప్లో వర్క్ చేసింది. అదే సమయంలో డ్రైవింగ్ కూడా చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్గా మారింది. ఇది బెంగళూరు పోలీసుల దృష్టికి చేరడంతో.. వాళ్లకు చర్యలకు ఉపక్రమించారు. ఓవర్ స్పీడింగ్, డ్రైవింగ్లో అలసత్వంగా ఆమె చర్యను గుర్తించి రూ.వెయ్యి ఫైన్ విధించారు. వర్క్ఫ్రమ్ ‘హోమ్’.. కారులో కాదమ్మా! అంటూ.. జరిమానా నోటీసు అందిస్తూ.. ఎక్స్లో బెంగళూరు నార్త్ ట్రాఫిక్ డీసీపీ పోస్ట్ చేశారు."work from home not from car while driving" pic.twitter.com/QhTDoaw83R— DCP Traffic North, Bengaluru (@DCPTrNorthBCP) February 12, 2025 -
మహిళ ప్యాంట్ జేబులో పేలిన స్మార్ట్ఫోన్: ఒక్కసారిగా మంటలు
బ్రెజిల్లోని అనపోలిస్లోని ఒక సూపర్ మార్కెట్ లో ఒక మహిళ జేబులో ఉన్నట్టుండి సెల్ఫోన్ పేలిపోయింది. ఈ షాకింగ్ ఘటన సీసీటీవీలో రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సెల్ ఫోన్లు అసలెందుకు పేలతాయి?షాపింగ్ మాల్ భర్తతో కలిసి షాపింగ్లో సందడి ఉంది ఒక మహిళ. ఇంతలో ప్రమాద ఎలాంటి సంకేతాలు లేకుండానే ఒక్కసారిగా జేబులోని ఫోన్ ద్వారా మంటలంటుకున్నాయి. వెనుక జేబులో ఉన్న ఫోన్ పేలిపోవడంతో, పొగ, మంటలు వ్యాపించాయి. చుట్టు పక్కల వారు భయంతో పరుగులుతీశారు. దీంతో పక్కనే ఉన్న భర్త పోన్ తీసి బైట పడేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. View this post on Instagram A post shared by JahTop (@jahtop_)ఈ ప్రమాదంలో ఆమె వెనుక భాగం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలు ఎవరు? అనే వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు. అయితే పేలిన ఫోన్ మోటరాలా కంపెనీదని తేలింది. పేలుడుకు కారణమేమిటి?ఎలక్ట్రికల్ ఇంజనీర్ క్లెబర్ డా సిల్వీరా మోరీరా లిథియం-అయాన్ బ్యాటరీలు పెద్ద మొత్తంలో శక్తిని నిల్వ చేస్తాయని, కొన్ని పరిస్థితులలో అవి వేడెక్కడంపల్ల ఒక్కోసారి పేలతాయని నిపుణులు తెలిపారు. ఫోన్ పేలుళ్లకు నిపుణులు చెబుతున్న అనేక సాధారణ కారణాలుబ్యాటరీ పాడైపోవడం, ఒత్తిడి : ఫోన్ మీద కూర్చోవడం లేదా దానిపై ఒత్తిడి తీసుకు రావడం వల్ల, పేలవచ్చు. షార్ట్ సర్క్యూట్ సంభవించవచ్చు.డూప్లికేట్ ఛార్జర్లు: చౌకైన లేదా నకిలీ ఛార్జర్లను ఉపయోగించడం వల్ల వోల్టేజ్ హెచ్చుతగ్గులతో, బ్యాటరీ దెబ్బతింటుంది.బాగా వేడెక్కడం: ఫోన్ను ప్రత్యక్ష సూర్యకాంతిలో ఉంచడం లేదా వేడి వాతావరణంలో ఛార్జ్ చేయడం వల్ల పేలిపోవచ్చు.ఛార్జింగ్లో ఉండగా వాడకం: గేమ్లు ఆడటం, వీడియోలు చూడటం లేదా ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఉపయోగించడం వల్ల బ్యాటరీ వేడెక్కుతుంది. ఫలితంగా మంటలు వ్యాపించవచ్చు.పేలుడుపై కంపెనీ స్పందనపేలుడుకు గల కారణాలను తెలుసుకునేందుకు మోటరోలా రంగంలోకి దిగింది. బాధితురాలితో మాట్లాడినట్టు కంపెనీ ధృవీకరించింది. తమ ఉత్పత్తులన్నీ కఠినమైన పరీక్షల ద్వారా మార్కెట్కు వెడతాయని, భద్రత పట్ల నిబద్ధతగా వ్యవహరిస్తామంటూ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. సాంకేతిక విశ్లేషణ చేస్తున్నట్టు తెలిపింది. -
బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ వేడుకలో రాధికా అంబానీ స్టెప్పులు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కోడలు, అనంత్ అంబానీ భార్య రాధికా అంబానీ తన డ్యాన్స్తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ వేడుకలో రాధిక అంబానీ తనదైన శైలిలో ఆకట్టుకుంది. స్టైలిష్ లుక్తో అందర్నీ కట్టి పడేసింది. స్నేహితులు కృష్ణ పరేఖ్, యష్ సింఘాల్ సంగీత్ వేడుకలో అనంత్ అంబానీ,రాధికా అంబానీతో కలిసి తమ స్నేహితులతో కలిసి సందడి చేశారు. అంతేకాదు అనార్కలి డిస్కో చలి అంటూ ప్రెండ్స్తో కలిసి సూపర్ స్టెప్పులేసింది రాధిక. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. రాధికా అంబానీ తన స్నేహితుల బృందంతో కలిసి విలాసవంతమైన సంగీత్ వేడుకలో నృత్యం చేసింది. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. ఇటీవల ముంబైలో ట్రైడెంట్ ఒబెరాయ్ హోటల్లో జరిగిన విలాసవంతమైన సంగీత్ వేడుకలో 'అనార్కలి డిస్కో చలి'కి తన అద్భుతమైన స్టెప్పులేసింది. 2012 చిత్రం హౌస్ఫుల్ 2 మూవీలోని ఈ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ వివాహానికి రాధిక అంబానీ స్టైలిష్ లుక్ మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. సిల్వర్ కలర్ లెహెంగాలో అందంగా ముస్తాబైంది. డైమండ్ బ్యాంగిల్స్ , చెవిపోగులతో తన లుక్ మరింత గ్రాండ్గా ఉండేలా జాగ్రత్తపడింది. దిల్ ధడక్నే దో చిత్రంలోని గల్లన్ గుడియాన్ లాంటి పాటలకు కూడా ఆమె ఉత్సాహంగా స్టెప్పులు వేస్తూ కనిపించింది. మరో వీడియోలో, ఆమె భర్త అనంత్ అంబానీ, వరుడు యష్ సింఘాల్, వారి స్నేహితులతో కలిసి నృత్యం చేస్తూ కనిపించారు. ఇదీ చదవండి: సబీర్ భాటియా లవ్ స్టోరీ : స్టార్ హీరోయిన్తో లవ్? కానీ పెళ్లి మాత్రం! View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) కాగా వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ చ శైలా మర్చంట్ దంపతుల కుమార్తెరాధికా మర్చంట్. అలాగే అంబానీముఖేష్ , నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీని ప్రేమించి పెళ్లి చేసుకుంది.వివాహం తర్వాత తన అంబానీ ఇంటి పేరుతో కలిపి రాధికా అంబానీగా మారిపోయింది. యూరప్లో క్రూయిజ్తో సహా రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ వేడుకల పాటు గత ఏడాది జూలై 12న అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇది "ఇండియాస్ వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్"గా నిలిచింది. ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక డిసెంబరులో రిలీజ్ చేసిన " మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024" జాబితాలో అనంత్-రాధికా అంబానీ కపుల్ని చేర్చడం విశేషం. -
వీడియో: కన్నీళ్లను దిగమింగుకున్న ఆప్ నేత
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంపై ఆప్ నేత, ఆరోగ్య శాఖ మంత్రి(కాబోయే మాజీ) సౌరభ్ భరద్వాజ్ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ గ్రాండ్ విక్టరీ కైవసం చేసుకోగా, అరవింద్ కేజ్రీవాల్ సహా ఆప్ దిగ్గజాలంతా ఈ ఎన్నికలో ఓడిన సంగతి తెలిసిందే. అయితే.. ఓటమిని అంగీకరిస్తున్నట్లు చెబుతూనే సౌరభ్ భదర్వాజ్ కన్నీళ్లను దిగమింగుకున్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భరద్వాజ్ బీజేపీ అభ్యర్థి షికా రాయ్ చేతిలో ఓడారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘ఆటలో గెలుపోటములు సహజమే. అలాగే రాజకీయాల్లో కూడా. నా.. పార్టీ ఓటమిని నేను అంగీకరిస్తున్నా. కానీ, కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే మాత్రం భరించలేకపోతున్నా’’ అంటూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టబోయారాయన. అయితే వెంటనే పక్కకు వెళ్లి.. ఆ కన్నీళ్లను దిగమింగుకున్నారు.ఢిల్లీలో ఆప్ కోసం ప్రతీ కార్యకర్త కష్టపడ్డారని, వాళ్లను చూస్తే గర్వంగా ఉందని అన్నారాయన. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. Saurabh Bharadwaj of Aam Admi Party gets emotional when his cader visit him to console after losing in Delhi elections He couldn’t control from crying! He contested from Greater Kailash and lost by 3188 votes! Shika Rai won from this place!#saurabhbhardwaj #DelhiElection2025… pic.twitter.com/ktFqzvKUUg— North East West South (@prawasitv) February 10, 2025 గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి గత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో సౌరభ్ భరద్వాజ్ నెగ్గారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి.. బీజేపీ షికా రాయ్ చేతిలో మూడు వేల ఓట్ల ఆధిక్యంతో ఓడారు. షికా రాయ్కు 49,594 ఓట్లు పోలవ్వగా, భరద్వాజ్కు 46,406 ఓట్లు పడ్డాయి. అలాగే.. కాంగ్రెస్ అభ్యర్థి గర్విత్ సింఘ్వీకి 6,711 ఓట్లు పోలయ్యాయి. 2015 ఎన్నికల్లో బీజేపీ రాకేష్ కుమార్పై 14 వేల ఓట్లు, 2020 ఎన్నికల్లో 16 వేల ఓట్ల ఆధిక్యంతో భరద్వాజ్ గెలుపొందడం గమనార్హం. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో.. బీజేపీ 48 సీట్లు దక్కించుకుని అద్భుత విషయం సాధించింది. గత రెండు ఎన్నికల్లో 67, 62 సీట్లు సాధించిన ఆప్.. ఈసారి 22 స్థానాలకు పడిపోయింది. ఇక.. కాంగ్రెస్ జీరోకి పరిమితమైంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక.. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరే అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. -
Bird Flu : చికెన్ తినకండి
-
భలే కుర్రాడు.. ఆన్సర్ షీట్లో ఆ ఒక్క ముక్క రాసి..
సోషల్ మీడియా ప్లాట్ఫారం ప్రతీరోజూ మనకు వింతలు, విచిత్రాలను చూపిస్తుంటుంది. వీటిలో కొన్ని వారేవా అనిపిస్తుంగా, మరికొన్ని నమ్మలేనివిగా ఉంటాయి. ఇదేవిధంగా సోషల్ మీడియాలో కొందరు తమ ప్రతిభను ప్రదర్శిస్తుంటారు. మరికొందరు ఫన్నీ వీడియోలు షేర్ చేస్తూ తెగ నవ్విస్తుంటారు.సోషల్ మీడియాలో విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. ఇవి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. హాల్ టిక్కెట్లలో ఒక విద్యార్థి పేరుకు బదులు మరొకరి పేరు రావడం, ఎగ్జామ్ సెంటర్లో తప్పులు రావడం లాంటివి మనం ఇంతవరకూ చూసివుంటాం. అలాగే సమాధాన పత్రంలో కొందరు విద్యార్థులు వింత సమాధానాలు రాయడం, ఏవో విజ్ఞప్తులు, అభ్యర్థనలు చేయడం లాంటివాటి గురించి మనం అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. అయితే దీనికి భిన్నంగా ఒక తెలివైన విద్యార్థి ఆన్సర్ షీట్లో ఏమి రాశాడో తెలిస్తేఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు.వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నదాని ప్రకారం ఒక టీచర్ ఎవరో విద్యార్థి ఆన్సర్ షీట్ చెక్ చేస్తూ కనిపిస్తారు. ఆయన వీడియోను దగ్గరకు తీసుకురమ్మని సైగలు చేయడం కూడా కనిపిస్తుంది. తరువాత కెమెరాను ఆన్సర్ షీట్పై ఫోకస్ చేయమని ఆ టీచర్ చెప్పడాన్ని గమనించవచ్చు. తరువాత ఆయన మాట్లాడుతూ ‘ఈ కుర్రాడు అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం రాశాడు. Define Aura 🗿 pic.twitter.com/MHzKmXZKlX— Prof cheems ॐ (@Prof_Cheems) February 7, 2025పేపర్ చివరిలో రాసినది కూడా సరైన సమాధానమే’ అంటూ ఆ కుర్రాడు సమాధాన పత్రంలో చివర రాసిన వాక్యాన్ని చూపిస్తారు. ఆ కుర్రాడు ‘అందరూ నువ్వు ఫెయిల్ కావాలని ఎదురుచూస్తున్నప్పడు.. విజయం సాధిస్తే ఆ ఆనందమే వేరు’ అని రాశాడు. దీనిని చూపించిన తరువాత టీచర్ ఆ ఆన్సర్ షీట్పై 80కి 80 మార్కులు వేయడం కనిపిస్తుంది. ఈ వీడియోను @Prof_Cheems పేరుతో సోషల్ మీడియా ప్లాట్ఫారంలో పోస్టు చేశారు. ఈ వీడియోను ఇప్పటిరకూ 2 లక్షల 92 వేల మంది వీక్షించారు. ఇది కూడా చదవండి: ఢిల్లీ ఫలితాలు: ఇవేం మీమ్స్రా బాబూ.. నవ్వలేక చస్తున్నాం! -
వీరి వీడియోలు క్షణాల్లో వైరల్.. టాప్-10 భారత యూట్యూబర్లు
యూట్యూబ్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలువురికి ఉపాధి మార్గంగా మారింది. కెమెరాలు, మైకులు పట్టుకుని తిరుగుతూ, అందమైన ప్రకృతిని లేదా జనం తిరుగాడే ప్రాంతాలను చిత్రీకరిస్తూ, యూ ట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. తద్వారా వారు ఆనందాన్ని అందుకోవడమే కాకుండా, మనకు వినోదాన్ని కూడా పంచుతున్నారు. అలాగే యూట్యూబ్ నుంచి ఆదాయాన్ని కూడా అందుకుంటున్నారు. ఇదేకోవలో మన దేశానికి చెందిన 10 మంది యూట్యూబర్లు ఇంటర్నెట్ను శాసిస్తున్నారు. వారి జాబితా ఇలా..అజయ్ నాగర్అజయ్ నాగర్.. దేశంలో ప్రముఖ యూట్యూబర్గా పేరొందారు. 2000 జూన్ 12న హర్యానాలోని ఫరీదాబాద్లో జన్మించారు. అజయ్నాగర్ ‘CarryMinati’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా రోస్ట్ వీడియోలు, కామెడీ, గేమింగ్ వీడియోలతో అందరికీ వినోదాన్ని పంచుతుంటారు. ఇతని యూట్యూబ్ ఛానల్ నాలుగు కోట్ల పైగా సబ్స్క్రైబర్లున్నారు. "YouTube vs TikTok" వంటి వీడియోలు అజయ్ నాగర్కు మరింత ఆదరణను తెచ్చిపెట్టాయి.ఆశిష్ చంచలానీఆశిష్ చంచలానీ (Ashish Chanchlani) ప్రముఖ కామెడీ క్రియేటర్. ఆయన "Ashchanchlani Vines" అనే యూట్యూబ్ ఛానల్తో విపరీతమైన ఆదరణను అందుకున్నారు. 1993 డిసెంబర్ 7న ముంబైలో జన్మించిన ఆశిష్ తన వినోదాత్మక వీడియోలు, స్కిట్స్, హాస్యంతో కూడిన కంటెంట్తో యువతలో పాపులర్ అయ్యారు. ఆశిష్ చంచలానీ ఛానల్ మూడు కోట్లకు పైగా సబ్స్క్రైబర్లను అందుకుంది. ఆశిష్ తన వీడియోలలో సాధారణ పరిస్థితులను కూడా వినోదాత్మకంగా చూపించి, జనాలకు నవ్వు తెప్పించే ప్రయత్నం చేస్తుంటారు.భువన్ బామ్భువన్ బామ్.. ఇతనొక కామెడీ కంటెంట్ క్రియేటర్. ఆయన "BB Ki Vines" అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదరణ పొందారు. 1994 సెప్టెంబర్ 22న న్యూఢిల్లీలో జన్మించిన భువన్, తన వినోదాత్మక వీడియోలు, స్కిట్స్తో యువత అభినందనలు అందుకుంటున్నారు. ఈ ఛానల్ రెండు కోట్లకు పైగా సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంది. భువన్ తన వీడియోల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతపై సరదా కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు.అమిత్ భదానాఅమిత్ భదానా (Amit Bhadana).. ప్రముఖ కంటెంట్ క్రియేటర్. కామెడీ వీడియోలను చేయడంలో ముందుంటారు. ‘Amit Bhadana’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయ్యారు. 1999 జూలై 7న న్యూఢిల్లీ లో జన్మించిన అమిత్, తన వీడియోలలో హాస్యంతోపాటు రోజువారీ జీవితం, సామాన్య పరిస్థితులు, కుటుంబ సంబంధాలు తదితర విషయాలపై వినోదాత్మక కంటెంట్ అందిస్తుంటారు.సందీప్ మహేశ్వరిసందీప్ మహేశ్వరి.. ఈమె భారతీయ పారిశ్రామిక దిగ్గజం. మోటివేషనల్ స్పీకర్, ఎంట్రప్రెన్యూర్. 1975 సెప్టెంబరు 28న న్యూఢిల్లీ లో జన్మించిన సందీప్, "Sandeep Maheshwari" అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు పలు అంశాలలో స్ఫూర్తి అందిస్తుంటారు. మహేశ్వరి తన వీడియోలలో జీవితంలో సానుకూలత, మనోభావాల నియంత్రణ మొదలైన అంశాల గురించి చెబుతూ యువతకు సన్మార్గాన్ని చూపిస్తుంటారు.గౌరవ్ చౌధరిగౌరవ్ చౌధరి (Gaurav Chaudhary) టెక్నికల్ క్రియేటర్. "Technical Guruji" అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా టెక్నాలజీ, గాడ్జెట్లు, నూతన ఆవిష్కరణలు, రివ్యూ, టిప్స్ , ట్రిక్స్ తెలియజేస్తుంటారు. 1995 అప్రిల్ 7న రాజస్థాన్లో జన్మించిన గౌరవ్ టెక్నికల్ విషయాలను శరళమైన భాషలో అందిస్తుంటారు. టెక్నికల్ గురూజీ ఛానల్ రెండు కోట్లకు పైగా సబ్స్క్రైబర్లను పొందింది.నిశ్చయ్ మల్హన్ నిశ్చయ్ మల్హన్ (Nischay Malhan), Triggered Insaan పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. 1995 నవంబర్ 3న న్యూఢిల్లీలో జన్మించిన నిశ్చయ్, తన వీడియోల్లో రోస్టింగ్, కామెడీ, మీమ్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈయన ఇతర క్రియేటర్లపై చేసిన పంచ్లు పాపులర్ అయ్యాయి.హరిష్ బెనివాల్హరిష్ బెనివాల్ ప్రముఖ కామెడీ క్రియేటర్. ఆయన "Harish Beniwal" అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదరణ పొందారు. హరిష్ తన వీడియోల్లో ప్రధానంగా కామెడీ స్కిట్స్, హాస్యభరిత కంటెంట్ను చూపిస్తుంటారు. 1996లో జన్మించిన హరిష్, తన వినోదాత్మక వ్యవహారశైలితో యువతను ఆకట్టుకుంటున్నారు.సమయ్ రైనాసమయ్ రైనా.. కామెడీ క్రియేటర్, స్ట్రీమర్. ఆయన "Samay Raina" అనే ఛానల్ పాపులర్ అయ్యారు. సమయ్ పలు రోస్ట్ వీడియోలు, కామెడీ స్కిట్స్, లైవ్ స్ట్రీమింగ్తో యువతను అలరిస్తుంటారు. 1996లో జమ్ము కశ్మీర్లో జన్మించిన సమయ్, తన ఇన్స్పిరేషనల్, సరదా వీడియోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నెటిజన్లకు మంచి వినోదం అందించేందుకు ప్రయత్నిస్తుంటారు.నిషా మధులికనిషా మధులిక.. ప్రముఖ భారతీయ ఫుడ్ కంటెంట్ క్రియేటర్. ‘Nisha Madhulika’ అనే ఛానల్ ద్వారా పాపులర్ అయ్యారు. ఇందులో ఆమె ఇండియన్ వంటకాల తయారీని వివరంగా చూపిస్తుంటారు. 1963లో జన్మించిన నిషా తన వీడియోలలో సులభంగా వంటలు చేసుకునే విధానాన్ని చెబుతుంటారు. నిషా మధులిక ఛానల్ కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆహార ప్రియులు నిషా మధులిక ఛానల్ను ఫాలో చేస్తుంటారు. ఇది కూడా చదవండి: ‘ఆప్’ ఓటమితో పంజాబ్లో వణుకు.. సీఎంకు ముచ్చెమటలు -
సడెన్గా పులి ఎంట్రీ..ఛేజ్ చేసేంత దూరంలో రైతు! ట్విస్ట్ ఏంటంటే..
ఒక్కోసారి ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియదు. మనం ప్రమాదకరమైన ప్రదేశంలోకి వెళ్లకపోయినా ఊహించిన విధంగా ప్రమాదం మనల్ని వెతుక్కుంటూ వస్తే అదృష్టం ఉంటే తప్ప బయటపడటం అంత ఈజీ కాదు. అలాంటి సందర్భమే ఎదురైంది ఈ రైతుకి. తప్పించుకునే అవకాశం లేని విత్కర పరిస్థితిని ఎదుర్కొన్నాడు. సరిగ్గా ఆ టైంలో జరిగిన గమ్మత్తైన తమాషా ఆ రైతుకి భూమ్మీద నూకలున్నాయనే దైర్యాన్ని ఇచ్చింది. ఏం జరిగిందంటే..ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని పిలిభిత్(Pilibhit)లో ఒక రైతు బైక్పై కూర్చొని మరో వ్యక్తితో ఏదో సీరియస్గా మాట్లాడుతుంటాడు. ఇంతలో గడ్డిపొదల నుంచి నెమ్మదిగా పులి(Tiger) నక్కి నక్కి వస్తుంటుంది. దీన్ని ఆ ఇరువురు వ్యక్తులు గమనించరు. అయితే పులి మాత్రం దాక్కుంటూ వారిని సమీపిస్తుంటుంది. అమాంతం దాడి చేసేంత దూరంలోకి సమీపించేత వరకు గమనించరు ఆరైతు, సదరు వ్యక్తి. ఆ తర్వాత అంత దగ్గరగా పులిని చూసి స్టన్నైపోతారు. ఆ తర్వాత వెంటనే తేరుకుని ఎలాగైనా తప్పించుకోవాలన్న ఉద్దేశ్యంతో బైక్ని వెనక్కి తిప్పేందుకు రెడీ అవుతాడు. చెప్పాలంటే పులి వారిపై దాడి చేసేంత దగ్గరలోనే ఉన్నారు వాళ్లు. కానీ ట్వీస్ట్ ఏంటంటే ఆ ఉన్నటుండి పులి దాడి చేయకుండా నెమ్మదిగా కూర్చొని అలా సేద తీరుతుంటుంది. నిజానికి దాడి చేసేలా సైలెంట్గా నక్కి వచ్చింది కాస్తా ఒళ్లు విరుచుకుంటూ కూర్చొంటుంది. దీంతో ఆ ఇద్దరు బతికిపోయంరా బాబు అనుకుంటూ అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి(Indian Forest Service (IFS)) షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్గా మారింది.A farmer and a tiger encounter. This is what coexistence looks like. From Pilibhit. pic.twitter.com/4OHGCRXlgr— Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 3, 2025 (చదవండి: రూ. 75 కోట్లు విలువ చేసే హోటల్ని జస్ట్ రూ. 875లకే అమ్మకం..!) -
‘‘వీళ్లు మనుషుల్రా..బాబూ..!’’ జేసీబీని ఎత్తికుదేసిన గజరాజు, వైరల్ వీడియో
సాధారణంగా సాధు జంతువులైనా, అడవి జంతులైనా వాటికి హాని కలుగుతుందన్న భయంతోనే ఎదుటివారిపై దాడి చేస్తాయి ఈ విషయంలో ఏనుగు ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలా సహనం నశించి ప్రాణ భయంతో ఏనుగు తిరగబడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఆహారం కోసం వచ్చి తనదారిన తాను పోతున్న అడవి ఏనుగును అనవసరంగా కావాలనే రెచ్చగొట్టారు తుంటరిగాళ్లు. వేలం వెర్రిగా వీడియోలను తీసుకుంటూ వేధించారు. ‘‘చూసింది.. చూసింది.. మనుషులురా..ఇక వీళ్లు.. మారరు.. అనుకున్నట్టుంది.. తనదైన శైలిలో ప్రతాపం చూపించింది. జేసీబీని ఎత్తి కుదేసింది. పశ్చిమ బెంగాల్లో ఫిబ్రవరి 1న జరిగిన ఈ సంచలన ఘటన సోషల్ మీడియా ఆగ్రహానికి కారణమైంది. పశ్చిమ బెంగాల్లోని జల్పైగురిలోని డామ్డిమ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆహారం కోసం ఒక పెద్ద ఏనుగు అపల్చంద్ అడవి నుండి బయటకు వచ్చింది. స్థానికులు దానిని వెంటాడారు. ఏనుగును వేధించి వెంబడించారు. అక్కడ ఉన్న వారిలో ఒకరు ఏనుగు తోక పట్టుకొని లాగారు. సహనం నశించిన అది చుట్టూ మూగినవారిపై దాడి చేసింది.. నిర్మాణ సామగ్రిని,సమీపంలోని వాచ్టవర్ను లక్ష్యంగా చేసుకుంది. జేసీబీపై తన ఆగ్రహాన్ని ప్రకటించింది. డ్రైవర్ ఎక్స్కవేటర్ బకెట్ను ఉపయోగించి దానిని ఎదుర్కొన్నాడు. దీంతో ఏనుగు పారిపోవడానికి అలా తిరిగిందో మళ్లీ జనం ఎగబడటం వీడియోలో రికార్డ్ అయింది. స్థానికులెవరికీ గాయాలు కాలేదు.కానీ ఏనుగుకి తొండంపై గాయాలైనాయి. దీంతో నెటిజనులు మండిపడుతున్నారు. ఏనుగుని గాయపర్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. TRAGIC THIS: In search of food but disturbed by human noise, a wild elephant attacked a JCB and a watchtower in Damdim (Dooars) today. In the chaos, the tusker also sustained injuries. pic.twitter.com/ZKlnRixaFN— The Darjeeling Chronicle (@TheDarjChron) February 1, 2025వన్యప్రాణులతో సహజీవనం చేయాలని, వాటి పట్ల దయతో వ్యవహరించాలనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు చాలామంది. అలాగే అడవి జంతువులను కాపాడటానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంత క్రూరత్వాన్ని ప్రదర్శించిన వారిపైఅటవీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, లేకపోతే కొన్ని సంవత్సరాల్లో ఇవి పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. "ఏనుగులను ఏమీ అనకపోతే వాటిదారిన అవి పోతాయి, వేధిస్తేనే తిరగబడతాయని మరొకొరు పేర్కొన్నారు. ఇదీ చదవండి: బాల్యంలో నత్తి.. ఇపుడు ప్రపంచ సంగీతంలో సంచలనం!మరోవైపు జేసీబీ డ్రైవర్ , ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు ఏనుగును వేధించారనే ఆరోపణలపై వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972లోని బహుళ సెక్షన్ల కింద వన్యప్రాణి కార్యకర్త తానియా హక్తో పాటు, మరికొందరు ఫిబ్రవరి 2న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధికారులు స్పందించారు. అడవి ఏనుగును రెచ్చగొట్టాడనే ఆరోపణలతో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.జేపీబీ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. జేసీబీ క్రేన్తో ఏనుగును రెచ్చగొట్టి దాడి చేసినందుకు నిందితుడిని అరెస్టు చేసినట్లు పశ్చిమ బెంగాల్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ దేబల్ రే తెలిపారు. ఏనుగును అడవిలోకి వదిలేశామని అన్నారు.బెంగాల్ ప్రస్తుతం దాదాపు 680 ఏనుగులకు నిలయంగా ఉంది. అడవి ఏనుగులు తరచుగా ఆహారం కోసం జల్పైగురి, నక్సల్బరి, సిలిగురి , బాగ్డోగ్రా వంటి ప్రాంతాలలో తిరుగుతుంటాయి. సాధారణంగా, స్థానికులు సురక్షితమైన దూరంలో ఉంటూ, వారితో ప్రేమగా, శాంతియుతంగా ఉంటారు. అయినా పశ్చిమ బెంగాల్ అడవులలో మానవ-ఏనుగుల సంఘర్షణ చాలా కాలంగా కొనసాగుతున్న సమస్య. దీనివల్ల పెద్ద సంఖ్యలో మానవ మరణాలు సంభవిస్తున్నాయి. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జూలై 2024 నాటి డేటా ప్రకారం, 2023-24లో పశ్చిమ బెంగాల్లో మానవ-ఏనుగుల సంఘర్షణ కారణంగా 99 మానవ మరణాలు సంభవించాయి.ఇది ఒడిశా ,జార్ఖండ్లతో పాటు దేశంలోనే అత్యధిక మరణాలలో ఒకటి. 2022-2023 మంత్రిత్వ శాఖ డేటా ఆధారంగా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్లో వేటాడటం, విద్యుదాఘాతం, విషప్రయోగం రైలు ప్రమాదాలు వంటి మానవ ప్రేరిత కారకాల వల్ల తక్కువ సంఖ్యలో ఏనుగుల మరణాలు నమోదయ్యాయి. ఇక్కడ 2023లో మొత్తం ఏడు ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. -
రాహుల్ ద్రవిడ్కు తృటిలో తప్పిన ప్రమాదం
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు (Rahul Dravid) తృటిలో ప్రమాదం తప్పింది. నిన్న (ఫిబ్రవరి 4) బెంగళూరులో రాహుల్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రాహుల్కు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. నిన్న సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని ఓ బిజీ రోడ్డులో (కన్నింగ్హమ్ రోడ్) రాహుల్ ప్రయాణిస్తున్న కారును ఓ ఆటో ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం ద్రవిడ్ ఆటో డ్రైవర్తో వాగ్వాదానికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.In #Bengaluru: A video of former India cricket captain and coach Rahul Dravid getting into an argument with an autodriver on Cunningham Road after a minor collision surfaced on Tuesday evening. No one was injured. pic.twitter.com/0tAtoqQk96— TOI Bengaluru (@TOIBengaluru) February 4, 2025ఈ ప్రమాదంలో రాహుల్ కారుకు స్వల్ప డ్యామేజీ అయ్యింది. ఇందుకే ద్రవిడ్ ఆటో డ్రైవర్తో వాదనకు దిగాడు. ద్రవిడ్.. తన మాతృభాష కన్నడలో ఆటో డ్రైవర్పై అసహనాన్ని ప్రదర్శించాడు. ఘటన స్ధలం నుంచి బయల్దేరేముందు ద్రవిడ్ సదరు ఆటో డ్రైవర్ వివరాలు తీసుకున్నాడు. అయితే అతనిపై ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదు. ఎప్పుడూ కూల్గా కనిపించే ద్రవిడ్ నడి రోడ్డుపై ఓ ఆటో డ్రైవర్తో వాదనకు దిగడం క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.52 ఏళ్ల రాహుల్ ద్రవిడ్.. తన 16 ఏళ్ల కెరీర్లో మైదానంలో గొడవలు పడిన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ప్రత్యర్థులు రెచ్చిగొడితే రాహుల్ తన బ్యాట్తో సమాధానం చెప్పేవాడు కానీ ఎప్పుడూ గొడవకు దిగేవాడు కాదు. అలాంటి ద్రవిడ్ ఓ ఆటో డ్రైవర్తో వాగ్వాదానికి దిగడంపై ప్రస్తుతం నెట్టింట చర్చ నడుస్తుంది.ఇదిలా ఉంటే, ద్రవిడ్ హెడ్ కోచ్గా ఉండగా భారత్ 2024 టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. టీమిండియా హెడ్ కోచ్గా ద్రవిడ్కు అదే చివరి టోర్నమెంట్. టీమిండియా కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాక ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్గా రీ జాయిన్ అయ్యాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాహుల్ తనదైన మార్కును చూపించాడు. ఆ వేలంలో ద్రవిడ్ సూచనలతో రాయల్స్ 13 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని దక్కించుకుంది. వైభవ్ లీగ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. -
పెళ్లై పాతికేళ్లు : ఆంటీ కోసం అంకుల్ డ్యాన్స్! వైరల్ వీడియో
భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు (Husband And Wife Relationship) కాలం గడిచే కొద్దీ మరింత బలపడతాయి. పిల్లలు, బాధ్యతలు, కష్టాలు కన్నీళ్లు ఎన్ని ఉన్నా వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. సంసార సాగరాన్ని ఈదుతున్న క్రమంలో వారి సఖ్యత మరింత దృఢపడుతుంది. పది కాలాల పాటు పదిలంగా ఉంటుంది. కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందనేది సామెత. అలా ఒకరి పట్ల ఒకరు విశ్వాసంతో, ఒకరి ఇష్టా ఇష్టాలను గౌరవించుకుంటూ పోతే ఎలాంటి విభేదాలకు, పొరపచ్చాలకు తావుండదు. ఇద్దరిమధ్య ఆరోగ్యకరమైన బంధం ఏర్పడుతుది. అది భవిష్యత్తరాలకు పునాది అవుతుంది. ఇదంతా ఎందుకంటే 25వ వార్షికోత్సవం (25th Wedding Anniversary) సందర్భంగా భార్య కోసం ఒక భర్త చేసిన రొమాంటిక్ డ్యాన్స్ ఇంటర్నెట్లో హృదయాలను గెలుచుకుంటోంది. సతీపతుల బంధం కాలానికి లొంగేదికాదు, ఏ వయసులోనైనా అది మనోహరమైనదే,స్వచ్ఛమైనదే తేల్చి చెప్పిన ఈ వీడియో నెట్టింట విశేషంగా నిలుస్తోంది.మూడు ముళ్లు, ఏడు అడుగులతో మొదలైన ఆలుమగల అనుబంధం నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తారు పెద్దలు. అలా పాతికేళ్ల పాటు దంపతులుగా జీవించిన ఒక జంట తమ 25వ పెళ్లి రోజు వేడుకలను నిర్వహించుకుంటోంది. చుట్టూ కుటుంబ సభ్యులు, హితులు,సన్నిహితులు, అతిథులు అంతా ఉత్సాహంగా ఉన్నారు. దంపతులు అందంగా ముస్తాబయ్యారు. అందరి సమక్షంలో మరోసారి దండలు మార్చుకున్నారు. దీంతో ఆనందంగా శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఇంతలో భర్త ఉత్సాహంగా డ్యాన్స్ వేయడం మొదలు పెట్టాడు. దీంతో పక్కనే భార్య సిగ్గుల మొగ్గైంది. అటు అతిథులు కూడా గొంతు కలిపారు. అక్కడే ఉన్న యువత చప్పట్లతో వారిని ఉత్సాహ పరిచారు. మరికొందరు ఈ ఆయన డ్యాన్స్ను తమ కెమెరాలలో బంధించారు. View this post on Instagram A post shared by Sakshi Bisht | Cabin Attendant (@sakshi__bisht1) బాలీవుడ్ మూవీ కభీ ఖుషీ కభీ గమ్ సినిమాలో షారుఖ్ ఖాన్ క్లాసిక్ సాంగ్ ‘ యే లడ్కా హై’ పాటు చక్కటి అభినయం చేస్తూ భార్యపై తన ప్రేమను బహిరంగంగా వ్యక్త పరిచడం నెటిజనులను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ రొమాంటిక్ డ్యాన్స్కు సోషల్ మీడియాలో వైరల్గామారింది. సాక్షి బిస్త్ అనే యూజర్ ఐడీలో గత ఏడాది అక్టోబరులో పోస్ట్ అయిన ఈ వీడియో దాదాపు 11.1 లక్షల వ్యూస్ సంపాదించింది. భార్యభర్తల ప్రేమ అనురాగం పటిష్టంగా ఉండాలంటే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. భాగస్వాముల మధ్య విశ్వసనీయత ముఖ్యం అంటూ పలువురు ఈ జంటకు అభినందనలు తెలిపారు. -
Virat Kohli: పన్నెండేళ్ల తర్వాత రీఎంట్రీ.. క్లీన్బౌల్డ్! దారుణ వైఫల్యం
‘కింగ్’ రాకతో రంజీ(Ranji Match)లకు కూడా కళొచ్చింది. పుష్కర కాలం తర్వాత రికార్డుల రారాజు రంజీ బరిలో దిగగానే అభిమానం కట్టలు తెంచుకుని స్టేడియం కిక్కిరిసిపోయింది. అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుందా అన్న స్థాయిలో ఫస్ట్క్లాస్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దాదాపు ఇరవై ఏడు వేల మంది తరలివచ్చారు. సూపర్స్టార్ బ్యాటింగ్ చేస్తే చూడాలని ఆశగా రెండో రోజు వరకు వేచి చూశారు.కానీ వారి ఆశలపై ‘రన్మెషీన్’ నీళ్లు చల్లాడు. పట్టుమని పది పరుగులు కూడా చేయకుండానే క్రీజును వీడాడు. తన వైఫల్యాల పరపరంపర కొనసాగిస్తూ భారంగా నిష్క్రమించాడు. దీంతో స్టేడియమంతా ఒక్కసారిగా మూగబోయింది. తమ అభిమాన ఆటగాడు మైదానం వీడుతుంటే అంతా నిరాశగా అతడి వైపు చూస్తూ ఉండిపోయారు.ఆసీస్ గడ్డపై విఫలంగత కొంతకాలంగా టెస్టుల్లో విఫలమవుతున్న భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి(Virat Kohli).. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఫామ్లోకి వచ్చినట్లే కనిపించాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో భాగంగా పెర్త్లో జరిగిన తొలి టెస్టులో శతకం బాది టచ్లోకి వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ తర్వాత మాత్రం అదే జోరును కొనసాగించలేకపోయాడు.ముఖ్యంగా ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడబోయిన ప్రతిసారీ ఆసీస్ బౌలర్ల చేతికి ఇచ్చి వికెట్ సమర్పించుకున్నాడు కోహ్లి. ఈ క్రమంలో ‘కింగ్’ పనైపోయిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగి మునుపటి లయను అందుకోవాలనే సూచనలు వచ్చాయి.తొలిరోజు ఫీల్డింగ్కే పరిమితమైన కోహ్లిఈ క్రమంలో సొంతజట్టు ఢిల్లీ తరఫున రైల్వేస్తో మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లి రంజీల్లో పునరాగమనం చేశాడు. సొంత మైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం మొదలైన ఈ మ్యాచ్ను చూసేందుకు జనం పోటెత్తారు. వాళ్లంతా వచ్చింది కేవలం కోహ్లిని చూడటానికే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.Cameras 📸. Posters 🖼️ Chants 🗣️Cheers 👏A fantastic reception for @imVkohli as he walks out to bat 🔥#RanjiTrophy | @IDFCFIRSTBankScorecard ▶️ https://t.co/IhwXam37gl pic.twitter.com/FXnCSzmOfC— BCCI Domestic (@BCCIdomestic) January 31, 2025 అయితే, ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. తొలిరోజు కోహ్లి ఫీల్డింగ్కే పరిమితమయ్యాడు. తనదైన శైలిలో ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ సందడి చేశాడు. ఇక ఆయుశ్ బదోని సారథ్యంలోని ఢిల్లీ జట్టు.. రైల్వేస్ను తొలి ఇన్నింగ్స్లో 241 పరుగులకు ఆలౌట్ చేసింది. అనంతరం గురువారమే బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ.. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 41 పరుగులు చేసింది.ఒకే ఒక్క ఫోర్ఈ క్రమంలో రెండో రోజైన శుక్రవారం ఆట సందర్భంగా కోహ్లి క్రీజులోకి వచ్చాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన అతడు పదిహేను బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క ఫోర్ సాయంతో ఆరు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. రైల్వేస్ పేసర్ హిమాన్షు సంగ్వాన్ బౌలింగ్లో షాట్ ఆడబోయి.. క్లీన్బౌల్డ్ అయ్యాడు. బౌలర్ దెబ్బకు కోహ్లి ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది. దీంతో రైల్వేస్ జట్టు సంబరాలు అంబరాన్నంటగా.. ప్రేక్షకులంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇక కోహ్లి రంజీ రీఎంట్రీలో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచి పెవిలియన్ బాట పట్టిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. ఇదిలా ఉంటే.. 40 ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులే చేసింది.చదవండి: చరిత్ర సృష్టించిన సౌరాష్ట్ర బ్యాటర్.. రంజీల్లో ఆల్టైమ్ రికార్డుHarish Sangwan Knocked Out Virat King Kohli , At The Score of 6 (Full Crowd Reaction + Celebration) #ViratKohli𓃵 | #ViratKohli pic.twitter.com/QBHLRfsLKb— 𝐒𝐑𝐈𝐉𝐀𝐍 🇮🇹 (@LegendDhonii) January 31, 2025 -
‘స్టూడెంట్తో పెళ్లి’.. వివాదంలో మహిళా ప్రొఫెసర్
పవిత్రమైన బంధాల్లో గురుశిష్యుల బంధం ఒకటి. అయితే అతిజుగుప్సాకరమైన పనులతో దాని పవిత్రతను దెబ్బ తీస్తున్నవాళ్లను తరచూ చూస్తున్నాం. తాజాగా ఓ మహిళా ప్రొఫెసర్కు సంబంధించిన ఓ వీడియో ఇన్స్టాగ్రామ్ను కుదిపేస్తోంది. తన స్టూడెంట్నే ఆమె వివాహం చేసుకున్న వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది..పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు 150 కిలోమీటర్ల దూరంలో నదియాలో ఉంది హరిన్ఘటా టెక్నాలజీ కాలేజీ. ఈ కాలేజీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ పరిధికి వస్తుంది. ఈ కాలేజీలో ప్రొఫెసర్గా పని చేసే పాయల్ బెనర్జీ.. తన స్టూడెంట్ను వివాహమాడింది. ఆమె నుదుట ఆ విద్యార్థి కుంకుమ దిద్దడం దగ్గరి నుంచి.. దండలు మార్చుకోవడం, ఏడగుడులు వేయడం ఇలా అన్నీ సంప్రదాయ పద్ధతిలో క్లాస్రూంలోనే జరిగిపోయాయి. పైగా హల్దీ వేడుకలను కూడా విద్యార్థుల మధ్య కోలాహలంగా నిర్వహించారు. మొత్తానికి ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు కాస్త వైరల్ కావడంతో.. ఆమె పాపులర్ అయిపోయారు. సరదా కామెంట్లతో పాటు సీరియస్గా విమర్శలు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విచారణ చేపట్టారు. అయితే.. ఇక్కడే ప్రొఫెసర్ పాయల్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.VIDEO Credits: HornbillTV అది నిజం వివాహం కాదని, సరదా కోసం చేసిన ప్రయత్నమని చెబుతున్నారు. పాయల్ ఓ సైకాలజీ ప్రొఫెసర్. సైకలాజికల్ డ్రామాలో భాగంగా అలాంటి క్లాస్ను నిర్వహించాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. తానంటే గిట్టని వాళ్లు ఆ వీడియోను బయటపెట్టారని ఆమె మండిపడ్డారు. అయినప్పటికీ అధికారులు మాత్రం ఆమె వివరణతో సంతృప్తి చెందలేదు.ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. పూర్తి నివేదిక వచ్చేదాకా ఆమెను సెలవుల్లో పంపారు. మరోపక్క.. ఈ ఘటనపై స్పందించేందుకు విద్యార్థులెవరూ సుముఖత చూపించకపోవడం గమనార్హం. -
MahaKumbh Mela 2025 - కలియుగ శ్రవణ్ కుమరుడు ఇతడు...
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025 ) అనేక విశేషాలతో చర్చల్లో నిలుస్తోంది. రికార్డు స్థాయిలో మహా కుంభమేళాకు భక్తులు హాజరవుతున్నారు. పవిత్ర త్రివేణి సంగమం వద్ద స్నానాలు ఆచరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నివేదిక ప్రకారం, బుధవారం ఉదయం 6 గంటల వరకు 1.75 కోట్ల మంది ప్రజలు పవిత్ర స్నానాలు చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం వేదికగా హృదయాలను కదిలించే వీడియోలు అనేకం నెట్టింట విశేషంగా నిలుస్తున్నాయి. అటు భక్తులను, ఇటు నెటిజన్లను విస్మయానికి గురిచేస్తున్నాయి.తాజాగా 65 ఏళ్ల వృద్ధుడు తన 92 ఏళ్ల తల్లిని ప్రతిరోజూ 50 కిలోమీటర్లు నడిచి ప్రయాగ్రాజ్లోని కుంభమేళాకు తీసుకువెళుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘కలియుగ్ శ్రవణ్ కుమార్’ అంటూ ఈ వీడియో సంచలనంగా మారింది. పదండి ఆ వివరాలు తెలుసుకుందాం.పురాణ గాథలోలని శ్రవణ కుమారుడి (జన్మనిచ్చిన, అంధులైన తల్లిదండ్రులను కావడిలో మోస్తూ ఎన్నో ప్రాంతాలు తిరిగి తన మరణం వరకు కూడా కంటికి రెప్పలా చూసుకున్న పురాణ పురుషుడు శ్రవణ కుమారుడు) నుంచి ప్రేరణ పొందాడో ఏమో గానీ, తన తల్లిని బండిమీద కూర్చోబెట్టి, స్వయంతా తాను లాగుతూ పవిత్ర మహాకుంభ మేళాకు తీసుకొని వచ్చాడు. యూపీలోని ముజఫర్ నగర్కు చెందినమాలిక్ (Malik) వయసు 65 ఏళ్లు కావడం విశేషం. ఆయన జబ్బీర్ దేవి వయసు 92 ఏళ్లు. తల్లి కోరిక నెరవేర్చాలన్న ధృఢ సంకల్పంతో బండిపై కూర్చోబెట్టి లాగుతూ కుంభమేళాకు తరలివచ్చాడు. ఇలా 13 రోజులు పాటు తల్లిని తీసుకెళ్లాలన్న కృతనిశ్చయంతో ఉన్నాడు. ముజఫర్ నగర్ నుంచి ప్రయాగరాజ్కు 780 కిలోమీటర్లు. త్రివేణి సంగమంలో కుంభ్ స్నానం చేయాలని తన తల్లి కోరిక తీర్చడం తన బాధ్యత అని చెప్పాడు. అతని సంకల్పం, సాహసం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తల్లి పట్ల అతనికున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ‘‘కలియుగ్ కా శ్రవణ్ కుమార్' అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ యుగానికి గొప్పోడు అని కొందరు. "ప్రతీ తల్లి ఇలాంటి కొడుకును పొందాలని కోరుకుంటుంది"అని మరొకరు వ్యాఖ్యానించారు. ముసలి వయసులో తల్లిదండ్రుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న వారికి ఈయన కథ ఆదర్శనీయం, ఆచరణీయం అంటున్నారు.Watch: In Bulandshahr, Uttar Pradesh, A man is walking with a cart, taking his 92-year-old mother to the Maha Kumbh in Prayagraj. They started their journey from Muzaffarnagar, fulfilling her wish to bathe at the Kumbh pic.twitter.com/2IstKkqMXY— IANS (@ians_india) January 28, 2025 -
Maha Kumbh 2025: ఈ జంట చేసిన పనికి నెటిజన్లు..!
జాతరలు, మేలాల సందర్భంగా కొంతమంది తప్పిపోవడం, కుటుంబం నుంచి విడిపోవడం లాంటి అనేక సంఘటనలు గతంలో చాలా చూశాం. ఇలాంటి ఉదంతాలపై అనేక సినిమాలు కూడా రూపొందాయి. లక్షల జనసమూహంతో ప్రజలు ఒకచోట చేరే మహాకుంభ్ మేళా ఉత్సవంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కుంభమేళాలో తప్పిపోకుండా ఉండేందుకు ఒక జంట స్పెషల్ సొల్యూషన్ వెదుక్కున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా 2025కు ప్రపంచం నలుమూలల నుండి భక్తులు విచ్చేస్తున్నారు. 144 సంవత్సరాల తర్వాత, పవిత్రమైన గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద ఈ ధార్మిక కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ పవిత్ర స్నానం చేస్తేతమ పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.'లవ్ ఎట్ ఇట్స్ పీక్'కుంభమేళాకు వచ్చిన వీరు తాము తప్పిపోకుండా ఉండేందుకు ఒకరికొకరు తాడుతో కట్టేసుకున్నారు. భారీ జనసమూహం మధ్య, తాము కనెక్ట్ అయ్యేలా, విడిపోకుండా చూసుకోవడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ దృశ్యాలు పలువుర్ని విపరీతంగా ఆకర్షించాయి. మహిళ తన తలపై ఏదో బరువు మోస్తోంది. వెనక కాస్త పెద్దవాడిగా కనిపిస్తున్న పురుషుడు వెడుతున్నాడు. దీనికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ రీల్ వైరల్మారింది.ఇన్స్టాగ్రామ్ పేజీ- @log.kya.sochenge లో ఇది షేర్ అయింది.మహా కుంభ్కు హాజరైన ఒక జంట ఐక్యంగా ఉండేలా చూసుకోవడానికి తమను తాము తాడుతో కట్టుకున్నారు. ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రత్యేక శ్రద్ధ, భక్తి అందర్నీ ఆకర్షించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహా కుంభ్లో ఇటువంటి హృదయపూర్వక దృశ్యాలు ఐక్యతాసారాన్ని ప్రతిబింబిస్తాయంటూ ఈ పేజ్ పేర్కొంది. ఇప్పటికే ఇది 40.1 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. View this post on Instagram A post shared by LOG KYA SOCHENGE (@log.kya.sochenge) సోషల్ మీడియా వినియోగదారులు ఈ జంట క్రియేటివిటికీ, ప్రేమకు ముగ్ధులై పోయారు. ‘‘పొద్దున్నలేస్తే సెలబ్రిటీల విడాకుల వార్తలతో విసిపోతున్న మనకు ఈ రకమైన క్లిప్లు నిజంగా హృదయపూర్వకంగా ఉన్నాయి” అని ఒకరు, "ఆధునిక సమస్యలకు ఆధునిక పరిష్కారాలు’’ అని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం. -
యూపీ: బాగ్పత్లో ఘోర ప్రమాదం
-
వీడియో: బతుకు జీవుడా.. గాజాకు నడుచుకుంటూ లక్షల మంది..
జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కారణంగా గాజా ప్రజలు సర్వస్వం కోల్పోయారు. వేల సంఖ్యలో మరణాలు, కోట్ల సంఖ్యలో ఆస్తి నష్టం జరిగింది. అనేక మంది గాజా ప్రజలు తాము పుట్టిన భూమిని వదిలి శరణార్థి శిబిరాలకు వెళ్లారు.ఇప్పుడు యుద్ధం ముగిసిన నేపథ్యంలో మళ్లీ బతుకు జీవుడా అంటూ తమ నివాసాలకు చేరుకుంటున్నారు. పొట్టచేతపట్టుకొని ఎలా వెళ్లారో అలాగే, మళ్లీ తిరిగి వెళ్తుంటే అక్కడ తమకంటూ ఏమైనా మిగిలుందో లేదో తెలియని దుస్థితి వారిని వేధిస్తోంది. ఎలాబతకాలో తెలియని ఆందోళన వారి హృదయాలను బరువెక్కిస్తోంది. ఇవన్నీ ఆలోచించుకుంటూ లక్షలాది మంది గాజా ప్రజలు తమ ప్రాంతానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఎన్నో ఆలోచనలు వారిని వెంటాడుతున్నాయి. కొన్ని లక్షల మంది గుంపు గాజా వైపు వెళ్తున్న దృశ్యాలను నెటిజన్లను కన్నీరుపెట్టిస్తున్నాయి.The Flag of Palestine is Raised above the people returning home to Northern Gaza after 15+ months! pic.twitter.com/inLghaC33G— Ryan Rozbiani (@RyanRozbiani) January 27, 2025కాగా, అక్టోబర్ 7, 2023లో ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడి గాజా ప్రజల పాలిట శాపమైంది. హమాస్ దాడితో ఇజ్రాయెల్ ప్రతి దాడి మొదలుపెట్టడంతో ఉత్తర గాజా నుంచి సుమారు 10 లక్షల మంది దక్షణాదికి తరలివెళ్లిపోయారు. శరణార్థి శిబిరాల్లో కాలం వెళ్లదీశారు. ఉత్తర ప్రాంతంలో బెంజమిన్ నెతన్యాహు సేనల దాడులతో ఆ ప్రాంతంలో ఉన్న కొద్దిపాటి సౌకర్యాలు శిథిలమయ్యాయి. ఈ ఘర్షణలో హమాస్ అగ్రనాయకత్వం మొత్తం మృత్యువాతపడింది. ఈ నేపథ్యంలో హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో, వీరంతా స్వస్థలం బాటపడ్డారు.A million Palestinians returning to their destroyed homes and towns in the north of #Gaza this morning is the crystal clear response to those who still plot to uproot us from our homeland. There is only one direction of travel ahead of the Palestinian people after a 100 years of… pic.twitter.com/PsU7ip89jq— Husam Zomlot (@hzomlot) January 27, 2025 THE RETURN TO THE NORTH OF GAZA pic.twitter.com/qg5ddiqAre— Muhammad Smiry 🇵🇸 (@MuhammadSmiry) January 27, 2025ఇదిలా ఉండగా..ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఓ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు గాజా పొరుగునే ఉన్న ఈజిప్టు, జోర్డాన్లు పునరావాసం కల్పించాలన్నారు. ఈ ప్రతిపాదన వారిని తమ సొంత ప్రాంతానికి శాశ్వతంగా దూరంగా చేస్తుందా? అనే ఆందోళనా వ్యక్తమైంది. ఇక పాలస్తీనా వాసులు తిరిగి రావడాన్ని హమాస్ విక్టరీగా అభివర్ణించుకుంది. “Don’t leave, don’t leave me” .. A little girl embraces her father after returning to the north of Gaza. pic.twitter.com/0T3AhoafyF— Eye on Palestine (@EyeonPalestine) January 27, 2025We are returning to the north of Gaza pic.twitter.com/IwRFKZ2hzV— Muhammad Smiry 🇵🇸 (@MuhammadSmiry) January 27, 2025 -
మాములు పెళ్లి వింత కాదు..! వరుడే పండితుడిగా మారి..
పెళ్లితంతులో పలు విచిత్రమైన ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు చూశాం. వధువు లేదా వరుడు విలక్షణంగా ఉండాలని చేసిన చిత్ర విచిత్రమైన పనులు చూశాం. కానీ ఇలాంటి వింతను ఏ పెళ్లితంతులో చూసి ఉండరు. వామ్మో వరుడికి మరీ ఇంతటి ఆత్మనిర్భరత అని విస్తుపోతారు. ఆఖరికి పెళ్లి విషయంలో ఇంతలానా అంటూ విస్తుపోయారు బంధువులు. పూజరి ఉన్నా సరే కాదని మరీ పెళ్లితంతు జరిపించాడు. ఎలాగో తెలుసా..!ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో చోటు చేసుకుంది. సహరాన్పూర్లోని రాంపూర్కు చెందిన వివేక్ కుమార్ అనే వ్యక్తి తన పెళ్లికి తానే పండితుడయ్యాడు. వధువు పక్కన కూర్చొని వరడే(Groom) తన వివాహా మంత్రాలు అతడే జపిస్తూ పెళ్లితంతుని విజయవంతంగా పూర్తి చేశాడు. ఇది చూసి అక్కడున్న వాళ్లందరికీ నోట మాటరాలేదు. మంత్రాలు చక్కగా వల్లిస్తూ(Chants Mantras) ప్రతి తంతుని అందరినీ ఆశ్చర్యపరిచేలా పూర్తి చేశాడు. ఈ వివాహ తంతుని చూస్తే ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi) చెప్పిన ఆత్మనిర్భర్ భారత్ గుర్తుకొస్తుంది. దీని అర్థం స్వావలంబన భారతదేశం. దీన్ని ప్రధాని మోదీ 2020లో ప్రారంభించారు. భారతీయులు స్వతంత్రంగా స్వావలంబనగా ఉండటానికి ప్రోత్సహించే కార్యక్రమం ఇది. ఆయన ఉద్దేశ్యం ప్రకారం ఆత్మనిర్భర్ భారత్కి 'ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, వ్యవస్థ, వైబ్రెంట్ డెమోగ్రఫీ అనేవి ఐదు మూల సంభాలని ఆ దిశగా మనమంతా ఏ దేశంపై ఆధాపడకుండా ఎదగాలనేది ఆయన ఆంతర్యం. అందుకే మోదీ ఆత్మనిర్భర్ భారత్ అని నినదించారు. అందుకు అర్థం వచ్చేలా ఈ వరడు తన పెళ్లికి తానే పండితుడిగా మారి వివాహం చేసుకున్నాడు. మోదీ భారత్ తొందరలో ఆత్మ నిర్భర్గా మారుతుందని తరుచుగా అనేవారు. ఔను..! అనేలా ఈ వరుడు ఇలా చేతల్లో చూపించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం ఈ వ్యక్తి అని ఒకరు, తన పెళ్లిని అద్భుతంగా ఉండాలని ఇలా చేశాడంటూ మరొకరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.Groom Becomes Priest: #Saharanpur Man Conducts His Own Wedding Rituals pic.twitter.com/keHAABXD77— Genzdigest (@Genzofficia_l) January 25, 2025 (చదవండి: అద్భుతమైన వెయిట్ లాస్ జర్నీ..! ఏకంగా 150నుంచి 68 కిలోలు..) -
హైవే మధ్యలో రెండంతస్తుల ఇల్లు..! ఎక్కడంటే..
డెవలప్మెంట్లో భాగంగా నేషనల్ హైవేలను నిర్మిస్తుంటారు. ఒక్కోసారి వాటి కారణంగా ప్రదేశంలో మన బిల్డింగ్లు ఉంటే కోల్పోక తప్పదు. ప్రభుత్వం ఎంతోకొంత నష్టపరిహారం ఇచ్చి..తరలించడం జరగుతుంది. అయితే ఇక్కడొ తాత ప్రభుత్వం తరలి వెళ్లిపోయేందుకు ఎన్ని కోట్లు ఆఫర్ అందించినా సేమిరా అన్నడు ఫలితంగా ఏం జరిగిందో తెలిస్తే అవాక్కవ్వుతారు. పాపం ఆ తాత అలా మంకుపట్టు పట్టి ఉండకుండా బాగుండనని ఇప్పుడు బాధపడుతున్నాడు.అసలేం జరిగిందంటే..చైనాలోని జిన్క్సీలో ఉన్న హువాంగ్ పింగ్ రెండంతస్తులి ఇల్లు ప్రదేశంలో హైవే నిర్మిస్తున్నానరు. దాంతో చైన ప్రభుత్వం ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయేలా డబ్బు ఆఫర్ చేసింది. ఎంతలా నచ్చచెప్పిన వినలేదు. ఏకంగా రెండు కోట్లు ఆఫర్ చేసినా తగ్గేదే లే..అన్నాడు. దాంతో ప్రభుత్వం అతడి ఇల్లు మినహా ఇరువైపులా హైవే నిర్మించేసింది. దీంతో అతడికి నిత్యం దుమ్ము, రణగొణధ్వనుల మద్య నెలకొన్న ఇల్లులా చికాకు తెప్పిస్తుంది. అబ్బా ఆ రోజు ఎందుకంతా పట్టు పట్టానా అని బాధపడుతున్నాడు. ఒక్కసారి టైమ్ వెనక్కెళ్లితే..చైనా ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ని హాయిగా అందుకుంటానని బాధగా చెబుతున్నాడు. ప్రస్తుతం అతడి ఇల్లు ఎలా ఉందండి సరిగ్గా హైవే మధ్యలోఉన్న ఇల్లులా ప్రధాన ఆకర్షణగా ఉంది. పైగా చుట్టపక్కల నివాసితులు ఆ తాత ఇంటి వద్దకు వచ్చి పోటోలు తీసుకునే ఓ విచిత్రమైన ఇల్లులా అయిపోయింది. అంతేగాదు ఆ తాతను చైనాలో "స్ట్రాంగ్ నెయిల్ హౌస్ యజమాని" అని పిలుస్తారు. ఎందుకంటే నెయిల్ హౌస్ అనేది ఆక్రమిత ఇంటికి చైనీస్ పదం. అభివృద్ధికి ఆటంకం కలిగించే తమ ఆస్తి కోసం పోరాడే యజమానులను చైనాలో ఇలా పిలుస్తారు. కాగా, 2017లో, షాంఘైలో దాదాపు 14 సంవత్సరాలుగా ఒక ప్రధాన రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన ఒక ప్రసిద్ధ "నెయిల్ హౌస్" చివరకు కూల్చివేశారు. తగినంత పరిహారం లేదని పేర్కొంటూ ఆ ఇంటి యజమానులు 2003 నుంచి తరలింపు ఆఫర్లను తిరస్కరించారు. కానీ చివరకు రూ. 3 కోట్ల పరిహారంతో మకాం మర్చాడానికి అంగీకరించినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లుకొడుతోంది. The stubborn old Chinese man who refused to sell his house for a government project now regrets his decision.Huang Ping, from Hunan province, hoped for more money but lost everything. The government built a road around his house, leaving it in the middle of a busy street. Now,… pic.twitter.com/it0rYe2fhd— Ibra ❄️ (@IbraHasan_) January 25, 2025 (చదవండి: ఇప్పుడు పుట్టి ఉంటే కచ్చితంగా ఆటిజం నిర్ధారణ అయ్యేది: బిల్గేట్స్) -
Maha Kumbh 2025: తేనె కళ్ల మోనాలిసా ఇల్లు ఇదే.. వైరల్ వీడియో
ఉత్తరప్రదేశ్లోని మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వచ్చిన కొందరు సోషల్ మీడియాలో ప్రముఖస్థానం సంపాదించుకుంటున్నారు. ఈ జాబితాలోకే వస్తారు మోనాలిసా. కుంభమేళాకు వచ్చిన వారిని తన అందమైన కళ్లతో కట్టిపడేసిన మోనాలిసా తాజాగా మరో వీడియోను విడుదల చేశారు. అందులో తాను ఎక్కడ నివసిస్తున్నానో, తాముంటున్న ఇల్లు ఎలా ఉందో చూపించారు. ఇటీవలి కాలంలో మోనాలిసాతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి యూట్యూబర్లు ఆమె వెంటపడుతున్నారు. కొందరు ఆమెతో ఫోటోలు దిగాలని, మరికొందరు వీడియోలు తీయాలని తాపత్రయపడుతున్నారు. दोस्तों मेरा इंस्टाग्राम अकाउंट किसी ने हैक कर लिया, बहुत जल्दी ही दूसरा एकाउंट बनाऊँगी।हम बोल भी क्या सकते हैं, उम्मीद है कि बापस मिल जायेगा। pic.twitter.com/rRLlQE8sPZ— Monalisa Bhosle (@MonalisaIndb) January 25, 2025మోనాలిసా 'ఎక్స్'లో ఒక వీడియోను షేర్ చేశారు. దీనిలో ఆమె ‘నేను ఇక్కడ ఉంటున్నాను. ఇది మా ఇల్లు. ఈ ప్రాంతంలో 100 మందికి పైగా జనం ఉంటున్నారు. నేను పూసల దండలు అమ్మడానికి ప్రయాగ్రాజ్ వెళ్ళాను. అక్కడ దండలు అమ్మడం కుదరలేదు. ఎవరో నా ఇన్స్టాగ్రామ్ ఐడీని కూడా హ్యాక్ చేశారు. నా ఐడిని హ్యాక్ చేసిన వారు నా ఐడిని తిరిగి ఇవ్వండి. దాని నుండి ఎంతోకొంత సంపాదించాలనుకున్నాను’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: Republic Day 2025: మువ్వన్నెల రైల్వే స్టేషస్లు.. మురిసిపోతున్న ప్రయాణికులు -
సైఫ్ అంతత్వరగా ఎలా కోలుకున్నారంటే..
ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్(54)పై జరిగిన దాడి గురించి దేశమంతా చర్చించుకుంది. పదునైన ఆయుధంతో ఆయనపై దాడి జరగ్గా.. సర్జరీ తదనంతరం వారం తిరగకముందే ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే.. అంత త్వరగా ఆయన కోలుకుని డిశ్చార్జి కావడం, పైగా ఆయనే స్వయంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోవడంపై ఆసక్తికరమైన చర్చ నడిచింది. ఈ క్రమంలో.. ఓ డాక్టర్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan)పై నిజంగానే దాడి జరిగిందా?.. నెట్టింట జోరుగా గిన చర్చ ఇది. ఇక మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే, సంజయ్ నిరుపమ్ లాంటి ప్రముఖ నేతలు సైతం సైఫ్ దాడి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆస్పత్రి నుంచి సైఫ్ బయటకు వచ్చేశారు. ఆయనకేం జరగనట్లు ఉంది. ఆయనపై నిజంగానే దాడి జరిగిందా? లేదంటే నటిస్తున్నారా?’’ అంటూ కామెంట్లు చేశారు. ఆఖరికి మీమ్స్ పేజీలు సైతం ఈ పరిణామాన్ని వదల్లేదు. అయితే ఆశ్చర్యకరరీతిలో వైద్యులు సైతం ఈ చర్చలో భాగమై తమవంతు అనుమానాలను బయటపెట్టారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి ఆ అనుమానాల్ని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు.‘‘సుమారు 80 ఏళ్ల వయసున్న ఓ పెద్దావిడకు ఫ్రాక్చర్ కారణంగా వెన్నెముకకు సర్జరీ జరిగింది. పైగా ఆమె మడమకు కూడా ఫ్రాక్చర్ అయ్యింది. అయినా కూడా ఆమె వాకర్ సాయంతో నడవగలిగింది. ఆ వీడియోనే ఆయన నెట్లో షేర్ చేశారు. పైగా ఆవిడ ఎవరో కాదట.. స్వయానా ఆయన తల్లేనట!‘‘సైఫ్కు నిజంగానే సర్జరీ జరిగిందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. వాళ్లలో కొందరు డాక్టర్లు కూడా ఉన్నారు. అలాంటివాళ్లందరి కోసమే ఈ ఉదాహరణ. ఇది 2022 నాటి వీడియో. మా అమ్మకు ఉదయం సర్జరీ అయితే.. సాయంత్రానికే ఆమె నడిచారు. అలాంటప్పుడు ఆవిడ కంటే తక్కువ వయసున్న వ్యక్తి(సైఫ్ను ఉద్దేశించి..) నిలబడి నడవలేరంటారా?.. అని ఆయన ప్రశ్నించారు.For people doubting if Saif Ali Khan really had a spine surgery (funnily even some doctors!). This is a video of my mother from 2022 at the age of 78y, walking with a fractured foot in a cast and a spine surgery on the same evening when spine surgery was done. #MedTwitter. A… pic.twitter.com/VF2DoopTNL— Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) January 22, 2025సైఫ్కు అయిన గాయాలు.. ఆయనకు జరిగిన శస్త్రచికిత్సతో పోలిస్తే మా అమ్మ పరిస్థితి మరీ దారుణం. దాడిలో గాయపడ్డ సైఫ్కు వెన్నెముక వద్ద గాయం, ఫ్లూయెడ్ లీకేజీ జరిగాయి. అత్యవసర సర్జరీతో వెన్నెముక భాగంలో ఇరుక్కుపోయిన కత్తి భాగాన్ని తొలగించారు. ఆ ఫ్లూయెడ్ లీకేజీని సరిచేశారు. అలాగే మా అమ్మకు వెన్నెముకలోనే ఫ్రాక్చర్ అయ్యింది. అయినా కూడా మరుసటి రోజే డిశ్చార్జి చేశారు. ఈరోజుల్లో బైపాస్ సర్జరీ చేయించుకున్నవాళ్లే.. మూడో, నాలుగో రోజుకి చక్కగా నడుస్తూ మెట్లు ఎక్కేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాకు వచ్చే ముందు కాస్త విషయ పరిజ్ఞానం పెంచుకోండి’’ అంటూ చురకలటించారాయన.మెడికల్ రిపోర్ట్ ప్రకారం.. జనవరి 16వ తేదీ అర్ధరాత్రి సమయంలో సైఫ్పై దాడి జరిగింది. నిందితుడు ఆయన్ని ఆరుసార్లు కత్తితో పొడిచాడు. వీపులో, నడుం భాగంలో, మెడ, భుజం, మోచేతి భాగంలో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో ఆయనకు ఎమర్జెన్సీ సర్జరీలు చేశారు. ఒకరోజు అబ్జర్వేషన్లో ఉంచాక ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారు.‘‘సైఫ్ మాట్లాడగలుగుతున్నారు. నడవగలుగుతున్నారు. చేయి, మెడపై గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేశాం. శరీరం నుంచి పదునైన వస్తువును బయటకు తీశాం. వెన్నెముకకు ఎటువంటి ప్రమాదం లేదు. ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చాం. ప్రస్తుతం ఆహారం తీసుకుంటున్నారు. రెండుమూడు రోజుల తర్వాత డిశ్చార్జి చేస్తాం’’ అని జనవరి 18న ముంబై లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. చెప్పినట్లుగానే మూడు రోజుల అబ్జర్వేషన్ తర్వాత ఆయన్ని డిశ్చార్జి చేశారు. -
ఆ రేంజ్ ధర పలికే ఇడ్లీలా..?
ఇడ్లీ(Idli) అనగానే చీప్ ధరలో దొరికే బ్రేక్ఫాస్ట్గా భావిస్తాం. అయితే ఈ సౌత్ ఇండియన్ వంటకం హోటల్ రేంజ్ని బట్టి ధరలు కూడా వేరేలెవల్లో ఉంటాయి. అయితే విలాసవంతమైన హోటల్లో దొరికే ఇడ్లీ టేస్ట్ మతిపోయేలా ఉంటుందనుకుంటున్నారా...?. అలా అనుకుంటే పొరపాటే. ఎందుకో ఈ వైరల్ వీడియోని చూస్తే మీకే తెలుస్తుంది. బెంగుళూరు వ్లాగర్(Bengaluru Vlogger) వీధుల్లో ఉండే హోటల్లో(roadside shop) దొరికే రూ. 5ల ఇడ్లీ నుంచి విలాసవంతమైన ప్యాలెస్లో దొరికే రూ. 5 వేల రూపాయల వరకు వివిధ ధరలు పలికే ఇడ్లీనే టేస్ట్ చేశాడు. పైగా వాటికి టేస్ట్కి రేట్స్ కూడా ఇచ్చాడు. ఆ వీడియోలో ముందుగా వీధులలో అమ్మే రూ. 5ల ఇడ్లీని తినేందుకు సాదాసీదాగా వెళ్లి టేస్టీ చేసి చూశాడు. రుచి అదుర్స్ అంటూ పదికి తొమ్మిదన్నర మార్కులు వేశాడు. ఆ తర్వాత ప్రముఖ రామేశ్వరం కేఫ్(Rameshwaram cafe)లోని రూ. 50ల ఇడ్లీని టేస్ చేయడానికి వెళ్లాడు. అయితే ఈ ఇడ్లీ టేస్ట్కి ఏడున్నర మార్కులు వేశాడు. తాజ్ హోటల్(Taj Hotel)లో ఇడ్లీని టేస్ట్ చేయగా అక్కడ దానిని చక్కగా ప్లేట్లో తీసుకురావడం తోపాటు నైఫ్, ఫోర్క్లు ఇచ్చారు. వాటితో అక్కడ ఇడ్లీని తినడం ఇబ్బందిగా అనిపించినా.. అలా తినక తప్పలేదు. అయితే అక్కడ టేస్ట్కి నాలుగున్నర మార్కులే వేశాడు. ఇక చివరగా ఓ లగ్జరీయస్ ప్యాలెస్లో ఇడ్లీ తినడానికి వెళ్లాడు. అక్కడ ఇడ్లీ ఖరీదు ఏకంగా రూ. 5వేల రూపాయలు. 23 క్యారెట్ల బంగారంతో చేసిన ఇడ్లీ ఇది. పాపం అన్ని డబ్బులు వెచ్చించినా..కొద్దిగా మాత్రమే తినగలిగాడు. ఇక నావల్ల కాదంటూ వదిలేశాడు. ఫైనల్గా రూ. 5 ఇడ్లీనే చాలా టేస్ట్గా ఉందని చెప్పడం విశేషం. అయితే నెటిజన్లు రుచి అనేది రేంజ్ హోటల్ని బట్టికాదు..చేసే విధానం పరిశుభ్రంగా ఉంటే ఆటోమేటిగ్గా రుచి బాగుంటుందని కొందరూ, మరీ రూ. 5 కోట్ల రూపాయల ఇడ్లీని ఎప్పుడూ తింటావ్ అని కామెంట్లు చేస్తూ పోస్ట్లు పెట్టారు. View this post on Instagram A post shared by Cassy Pereira (@cassiusclydepereira) (చదవండి: సోనాలి బింద్రే మెరిసే చర్మం రహస్యం..ఆ భారతీయ సంప్రదాయ మొక్క..! ) -
లడ్డూలిస్తా వదిలేయండి సార్.. చలాన్కు లడ్డూ లంచమా?!
ట్రాఫిక్, పోలీసులు అనగానే, ట్రాఫిక్ సిగ్నల్ జంప్, నిబంధనలను ఉల్లంఘన, చలాన్లు ఇవన్నీ గుర్తొస్తాయి కదా.. కానీ పెళ్లి, పెళ్లికూతురు, లడ్డూలు ఇలాంటివేమీ అస్సలు ఊహించం కదా. పంజాబ్లో ఇలాంటి అసాధారణ సంఘటన ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.పెళ్లి అంటేనూరేళ్ల పంట. ఆ అందమైనక్షణాలను కలకాలం గుర్తుండిపోయేలా పదిలపర్చుకోవాలని అందరూ భావిస్తారు. ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ దగ్గర్నుంచి హనీమూన్ దాకా ప్రతీదీ స్పెషల్గా ప్లాన్ చేసుకుంటారు. ఇందులో చిన్న చిన్న సర్ప్రైజ్ల వరకూ ఉంటాయి. మరికొన్ని వివాహాలలో మాంసాహారం లేదనో, వండ లేదనీ, మర్యాదలు బాగా జరగలేదు లాంటి ఆవేశకావేశాలు, కోపతాపాలు కామన్గా ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆంచల్ అరోరాకు ఊహించని అనుభవం ఎదురైంది. పెళ్లి, హల్దీ వేడుక హడావిడిలో ట్రాఫిక్ సిగ్నల్ను జంప్ చేసేసింది. ఇది కాస్త పోలీసు (పంజాబీ) అధికారుల కంటబడింది. ఊరుకుంటారా మరి.. ట్రాఫిక్ ఉల్లంఘన అంటూ కారు ఆపారు. ఇక్కడే ఆసక్తికరమైన సంఘటన జరిగింది.దీంతో హల్దీ వేడుక ముస్తాబులో ఉన్న ఆంచల్.. చిరునవ్వుతో అధికారులను పలకరిస్తూ, "మేరీ హల్దీ హై, జాన్ దో (ఇది నా హల్దీ వేడుక, దయచేసి నన్ను వెళ్లనివ్వండి.)" అని వేడుకుంది.ఇది విన్న పోలీసుల మనసు కరిగింది. సరే పెళ్లి కదా అనుకొని ఆమెను వెళ్లనివ్వాలని ఎంచుకున్నారు. చలాన్ రద్దు చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే పెళ్లి.. సరే.. కాస్త నోరు తీపి చేసి పోరాదా (ముహ్ మిథా కర్కే జానా”) అని అడిగారు సరదాగా. తప్పకుండా “లడ్డూ కా డబ్బా పక్కా” అని బదులిచ్చింది. దీంతో అక్కడున్న వారంతా నవ్వుల పువ్వులయ్యారు. షాదీ ముబారక్ చెప్పి ఆశీర్వాదాలు అందిస్తూ అక్కడినుంచి వెళ్లిపోయారు అధికారులు. దీనికి సంబంధించిన వీడియోను ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది. అంతేకాదు అదే పెళ్లి కొడుకు అయితే పరిస్థితి వేరేలా ఉండేది అంటూ నెటిజన్లు కామెడీగా స్పందించారు. లడ్డూ లంచం అని ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘అదే అబ్బాయైతే.. పొట్టు పొట్టు కొట్టేవాళ్లు..("అభి లడ్కా హోతా తో నంగా కర్కే మార్తా యూజ్") పెళ్లి కొడుకైతే చలానా పక్కా ఇచ్చేవాళ్లు అంటూకే కా బ్యా హోతా తో.. పక్కా చలాన్ థా.") అంటూ కమెంట్ చేయడంతో మరికొంతమంది కూడా హా .. అవును అంటూ స్పందించడం విశేషం. View this post on Instagram A post shared by Jist (@jist.news) -
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం
-
ఈ తేనె కళ్ల వెనుక ఇంత కథ ఉందా?
-
మద్యం మత్తులో జైలర్ విలన్ అర్ధ నగ్నంగా హల్ చల్
-
సీరియస్ మీటింగ్.. సైలెంట్గా రమ్మీ!
అనంతపురం అర్బన్: కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తరువాత రెవెన్యూ శాఖలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) పోస్టు అత్యంత కీలమైనది. అలాంటి పోస్టులో ఉన్న అధికారి అందరికీ ఆదర్శంగా, జవాబుదారీగా ఉండాలి. అయితే జిల్లా రెవెన్యూ అధికారి ఎ.మలోల వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కీలకమైన సమావేశం జరుగుతున్న సమయంలో.. అదేమీ తనకు పట్టనట్లు బాధ్యతలు విస్మరించి తన మొబైల్ ఫోన్లో ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడుతూ కెమెరాకు చిక్కారు. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. వివరాలు.. ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 20న అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు వినోద్కుమార్, టి.ఎస్.చేతన్తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్సీ, ఇతర సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. ఇదే సమయంలో వేదికపై ఉన్న డీఆర్ఓ మలోల అక్కడి వ్యవహారం తనకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తూ.. తన పక్కన ఉన్నతాధికారులు ఉన్నారనే కనీస ఆలోచన లేకుండా మొబైల్ ఫోన్లో ఆన్లైన్ రమ్మీ ఆడారు. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో అదికాస్తా వైరల్గా మారింది. వివరణ కోరిన కలెక్టర్ కీలక సమావేశం జరుగుతున్న సమయంలో డీఆర్ఓ మలోల ఆన్లైన్లో రమ్మీ ఆడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కలెక్టర్ వి.వినోద్కుమార్ తీవ్రంగా పరిగణించారు. డీఆర్ఓను వివరణ కోరినట్లు తెలిసింది. దీంతో డీఆర్ఓ మలోల స్వయంగా కలెక్టర్ బంగ్లాకు వెళ్లి కలెక్టర్కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. -
ప్రాంక్ చేసి నవ్విద్దాం అనుకుంటే..అదే చివరి నవ్వు అయిపాయే..!
సోషల్ మీడియ స్టార్డమ్ కోసం ఎలా పడితే అలా వీడియోలు చేసేస్తున్నారు. అసలు ఇది కరెక్టేనా సురక్షితంగానే చేస్తున్నామా అని కూడా ఆలోచించటం లేదు. వీడియో పోస్ట్ చేశామా..? వ్యూస్ వచ్చాయా..?, ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం. ఇంకేమీ చూడటం లేదు. ఎలాంటిదైనా చేయడానికి రెడీ. ముఖ్యంగా ప్రాంక్ వీడియోలు మరింత ప్రమాదరకంగా మారాయి. అవతల వాడిని తక్కువ చేయడం లేదా వెధవిని చేస్తే పకాలించి నవ్వడం అనేదే ధ్యాసగా చేసేస్తున్నారు. ఇలాంటివి ఒక్కోసారి ప్రమాదాల తోపాటు శత్రుత్వాన్ని తెచ్చిపెడతాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఇలానే ఓ వ్యక్తి సరదాగా నవ్విద్దామని చేసిన ఫ్రాంక్ కాస్తా చిరునవ్వునే లాక్ చేసేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి షాపు ముందు హాయిగా కూర్చొని ఓ పవర్ఫుల్ గమ్(Superglue)ని తీసుకుని పెదాలపై వేసుకుంటాడు. ఆ తర్వాత వీడియో(Viral Video)లో చూడండి అన్నట్లుగా పెదాలను(Lips) దగ్గరకు చేసి ఉంచుతాడు. అవి లాక్ అవుతాయా లేదా టెస్ట్ చేద్దామనుకున్నాడు. కానీ నిజంగానే అతుక్కుపోవడంతో ఏం జరుగుతుందో అర్థ కాలేదు ఆ వ్యక్తికి. పాపం ఆ వ్యక్తి ఏమో హే..అతుక్కోలేదని ఎగిరి గంతేసి చెప్పి నవ్విద్దామనుకుంటే రివర్స్ అయిపోయింది. తనకు చిరునవ్వే లేకుండా చేస్తుందని అనుకోలేదు. పాపం పెదాలను ఎలా విడిపించాలో తెలియక ఏడ్చేశాడు. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం ఎలాంటివి చేస్తే మంచిది అనేది తెలియదా అని ఒకరూ, మంచి గుణపాఠం నేర్చుకున్నాడు. మళ్లీ చేయడు ఇలాంటివి అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Badis TV (@badis_tv) (చదవండి: డొనాల్డ్ ట్రంప్ కుటుంబ వృక్షం: తల్లిదండ్రులు వలసదారులు..) -
చింటూగాడి రివెంజ్
పగలు మనుషులకేనా? ప్రకృతిలో ఉన్న ప్రతీ జీవికీ ఉంటుందా? అనే అనుమానాలు.. తరచూ జరిగే కొన్ని సంఘటనలు చూసినప్పుడు, విన్నప్పుడు కలగకమానదు. అయితే ఇక్కడో చింటూగాడి స్వీట్ రివెంట్ ఏకంగా నెట్టింట హల్ చల్ చేస్తోంది. ప్రహ్లాద్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జనవరి 17వ తేదీన ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు తన కారులో బయల్దేరాడు. గల్లీ చివర అనుకోకుండా ఓ వీధి కుక్కను డ్యాష్ ఇచ్చాడు. దానికి పెద్దగా గాయాలు కాకపోయినా.. అరుస్తూ ఆ కారును కాస్త దూరం వెంబడించిందది. తిరిగి.. అర్ధరాత్రి టైంలో ప్రహ్లాద్ ఇంటికి చేరుకున్నాడు. కారును ఇంటి బయట పార్క్ చేసి ఆయన కుటుంబం నిద్రకు ఉపక్రమించింది. తెల్లారి లేచి చూసేసరికి కారు మీద గీతలు పడి ఉన్నాయి. చిన్నపిల్లల పనేమో అనుకుని సీసీటీవీ ఫుటేజీ తీసి చూశాడాయన. అయితే అందులో ఓ కుక్క కారుపై కసాబిసా తన ప్రతీకారం తీర్చుకోవడం కనిపించింది. ఆ కుక్క పొద్దున ఆయన కారుతో ఢీ కొట్టిందే. ఉదయం తన కారువెంట మొరుగుతూ పరిగెట్టిన కుక్కను చూసి నవ్వుకున్న ఆయన.. అదే శునకంగారి స్వీట్ రివెంజ్కు, జరిగిన డ్యామేజ్కు ఇప్పుడు తలపట్టుకుని కూర్చుకున్నారు. ఈ వీడియోతో పాటు ఆ టైంలో తన మొబైల్తో ఓ వ్యక్తి తీసిన వీడియో కూడా ఇప్పుడు అక్కడ వైరల్ అవుతోంది. Sagar: फिल्मी स्टाइल में कुत्ते ने लिया अपना बदला, टक्कर मारने वाली कार को ढूंढकर मारे स्क्रैच#sagar #dog #madhyapradesh #MPNews #filmystyle #cars pic.twitter.com/rhEWZ8lyHf— Bansal News (@BansalNewsMPCG) January 21, 2025 సాధారణంగా కుక్కలకు చింటూ అని పేరు పెట్టి.. తెలుగు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ చేస్తాయో తెలిసిందే కదా. అలా ఈ చింటూగాడి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. -
ఆ డాక్టర్ డేరింగ్కి మతిపోవాల్సిందే..! వామ్మో మరీ ఇలానా..
ఓ డాక్టర్ తన భార్యకు భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేందుకు ఓ భయానక సాహసానికి ఒడిగట్టాడు. పైగా తన భార్య కోరికను తీర్చేందుకే ఇలా చేశానని చెబుతున్నాడు. ఆ ఘనకార్యం వింటే..అమ్మబాబోయే ఏం డాక్టర్వయ్యా బాబు అని మండిపడతారు.ఈ వింత ఘటన చైనా(China)లో చోటుచేసుకుంది. తైవాన్లోని తైపీకి చెందిన డాక్టర్ చెన్ వీ నోంగ్(Dr Chen Wei-nong) అనే సర్జన్ తనకు తానుగా వేసక్టమీ ఆపరేషన్(Dr Chen Wei-nong) చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోని డాక్యుమెంట్ రూపంలో నెట్టింట షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ సర్జన్(surgeon) నెట్టింట హాట్టాపిక్గా మారాడు. భవిష్యత్తులో ఇంక పిల్లలు పుట్టకూడదనే తన భార్య కోరికను నెరవేర్చేందుకు ఇలా చేశానని తెలిపాడు. అదే తాను తన భార్యకు ఇచ్చే అతిపెద్ద బహుమతి అని చెబుతుండటం విశేషం. ఆయన ఆ వీడియోలో తనకు తానుగా ఎలా వేసెక్టమీ ఆపరేషన్ చేసుకుంటున్నాడో కనిపిస్తుంది. నిజానికి ఈ సర్జరీ జస్ట్ 15 నిమిషాల్లో పూర్తి అవుతుంది. కానీ ఆయన స్వయంగా చేసుకోవడంతో ఒక గంట వ్యవధి తీసుకుని విజయవంతంగా తన సర్జరీని పూర్తి చేసుకున్నాడు. అంతేగాదు ఆ సర్జరీ చేసిన ప్రదేశంలో ఎంత పెయిన్ ఉంటుందో కూడా వివరించాడు. డాక్టర్ చెన్ వేసెక్టమీ ఆపరేషన్ పదకొండు దశలు గురించి ఆ వీడియోలో వివరంగా వెల్లడించారు. అంతేగాదు ఆ వీడియోలో మరసటి రోజు తాను పూర్తిగా కోలుకున్నట్లు కూడా తెలిపాడు. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి ఆ డాక్టర్ డేరింగ్కి విస్తుపోయారు. ఎంత డాక్టర్ అయినా తనకు తాను స్వయంగా సర్జరీ చేసుకోవడం అంటే మాటలు కాదు. కచ్చితంగా ఈయన మంచి నైపుణ్యం గల సర్జన్ అయ్యి ఉండాలి అంటూ పోస్టులు పెట్టారు. కాగా, ఆ డాక్టర్ చెన్ దంపతులకు ఎంతమంది పిల్లలు అనేది తెలియాల్సి ఉంది. కానీ పిలల్లు పుట్టకుండా మహిళలే కాదు భర్తలు కూడా ఇలాంటి విషయంలో కాస్త ముందుకువచ్చి వారి బాధను తగ్గించే యత్నం చేయాలనే అవగాహన కల్పిస్తున్నట్లుగా ఉంది ఇతడి సాహసం. వాస్తవానికి చాలామటుకు మహిళలే పిల్లలు పుట్టకుండా(ట్యూబెక్టమీ) ఆపరేషన్ చేయిచుకుంటున్నారు. View this post on Instagram A post shared by 陳瑋農 整形外科 醫師。晶華診所院長。 (@docchen3) (చదవండి: అనారోగ్యానికి ‘ఆహారం’ కావద్దు!) -
అమిత్ షా అన్నదొకటి చిన్నమ్మ చెప్పిందొకటి
-
బ్రిటీష్ సింగర్ నోట ‘జై శ్రీరామ్’.. వీడియో వైరల్
బ్రిటిష్ సింగర్ క్రిస్ మార్టిన్ నోట ‘‘జై శ్రీరాం’’ అనే పదం వినిపించింది. ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న ఆయన శనివారం సాయంత్రం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో తన బ్యాండ్ ‘కోల్డ్ప్లే’ బృందంతో ప్రదర్శన ఇచ్చారు. ఫిక్స్ యూ, ఏ స్కై ఫుల్ ఆఫ్ స్టార్స్తో యువతను ఉర్రుతలూగించారు. ఈ క్రమంలో.. ప్రదర్శన ముగించే సమయానికి క్రిస్ మార్టిన్(Chris Martin) అక్కడున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై చూపించిన అభిమానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పట్టుకున్న ఫ్లకార్డుపై జై శ్రీరాం అని ఇంగ్లీష్లో రాసి ఉంది. అది చూసి ఆయన ‘‘జై శ్రీరామ్’’(Jai Shreeram) అనడంతో స్టేడియం మారుమోగిపోయింది. ఆపై ఆ పదం అర్థం ఏంటని? అక్కడున్నవాళ్లను అడిగి తెలుసుకున్నారు. When Chris Martin said ‘Jai Shri Ram’ at Mumbai concert... the crowd went wild!#ChrisMartin #MumbaiConcert #ColdplayInIndia #JaiShriRam pic.twitter.com/yNeB6FcMOF— India Today NE (@IndiaTodayNE) January 19, 2025బూమ్ బూమ్ బుమ్రా పేరు కూడా.. ప్రదర్శన ఇచ్చే టైంలో ఉన్నట్లుండి మార్టిన్ నోట జస్ప్రీత్ బుమ్రా పేరు ప్రస్తావన కూడా వచ్చింది. ‘‘ఆగండి.. ప్రదర్శన అయిపోలేదు. చివరగా జస్ప్రీత్ బుమ్రా వచ్చి పాల్గొంటాడట’’ అని మార్టిన్ మైకులో చెప్పాడు. దీంతో అభిమానులు బుమ్రా నినాదాలతో హోరెత్తిపోయారు. అయితే అలాంటిదేం అదేం జరగకపోయినా.. క్రిస్ మార్టిన్ నోట బుమ్రా పేరు రావడంతో క్రికెట్ అభిమానులు మాత్రం ఖుషీ అయ్యారు.Coldplay's Mumbai concert on Saturday was unforgettable for music lovers and cricket fans. During the performance, Chris Martin surprised the audience by mentioning India's star bowler, Jasprit Bumrah.#ColdplayMumbai #Coldplay #JaspritBumrah #ChrisMartin #MusicConcert pic.twitter.com/TMz2wscdkm— Mid Day (@mid_day) January 19, 2025ఇదిలా ఉంటే.. హాలీవుడ్ స్టార్ డకోటా జాన్సన్(Dakota Johnson), క్రిస్ మార్టిన్ ప్రియురాలు. ఈ ఇద్దరూ భారత్ సందర్శనకు వచ్చారు. తాజాగా.. ముంబైలోని ప్రసిద్ధ శ్రీ భూల్నాథ్ ఆలయాన్ని ఈ జంట దర్శించుకుంది. ఆధ్యాత్మిక సందర్శన కోసం సాంప్రదాయ భారతీయ దుస్తుల్లో కనిపించారు. క్రిస్ బ్లూ కుర్తాలో మెడపై రుద్రాక్ష మాలతో కనిపించాడు. Dakota Johnson telling her wishes in ear of Shri Nandi Maharaj. Amazing how foreign nationals come to India and try following our culture and traditions! #Coldplay #ChrisMartin #DakotaJohnson pic.twitter.com/0Dz19yXg5c— Priyanshi Bhargava (@PriyanshiBharg7) January 18, 2025 ఆలయంలో నంది చెవిలో మార్టిన్ తన మనసులోని కోరికను వినిపించగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతకు ముందు.. మార్టిన్, జాన్సన్లు ముంబైలో ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న వీడియో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. -
ఇదేం విడ్డూరం..సింగిల్ అరటిపండు అంత ఖరీదా..?
మన దేశంలో వీధి విక్రేతల్లో కొందరూ చేసే పనులు చాలా గమ్మత్తుగా ఉంటాయి. అత్యాశతో చేస్తారో లేక విదేశీయలును చూడగానే అమాంతం ధర పెంచి చెబుతారో తెలియదు. ఒక్కసారిగా నిశితంగా ఆలోచిస్తే వారి ఉద్దేశ్యం సబబే అనిపిస్తంది. మరోకోణంలో చూస్తే భారతీయలంటే చులకన భావం కలుగుతుందేమో అనే సందేహం కలుగుతుంది. ఎందుకిదంతా అంటే..ఇక్కడొక వీధి వ్యాపారి ఓ విదేశీయుడికి అమ్మకం ధర చెప్పిన విధానం చూస్తే..షాకవ్వుతాం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో హ్యూ అనే విదేశీయుడు అటుగా వెళ్తున్న తోపుడు బండిపై అరటిపండ్లను అమ్ముకుంటున్న విక్రేతని పలకరిస్తాడు. అతని నుంచి అరటిపండ్లను కొనుగోలు చేద్దామనే ఉద్దేశ్యంతో ధర అడుగుతాడు. అయితే ఆ వ్యాపారి కళ్లు చెదిరే రేంజ్లో ధర చెబుతాడు. ఏకంగా ఒక్క అరటిపండే ధరే రూ. 100 పలుకుతుందని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు.అయితే ఆ విదేశీయుడు హ్యూ. సరిగ్గా విన్నానా..? లేదా అని అయోమయానికి గురై మరొక్కసారి అడుగుతాడు. కానీ ఆ వ్యాపారి అనుమానం తలెత్తకుండా నమ్మేలా చెబుతున్న ఆ తీరుని చూసి కంగుతింటాడు ఆ విదేశీయుడు. సారీ తాను అంత ధర చెల్లించలేను అని చెప్పడమే గాక ఇలా అమ్మితే కచ్చితంగా మీరు నష్టపోతారని అంటాడు. ఆ తర్వాత తన బ్రిటన్ దేశంలోని అరటిపండ్ల ధరతో పోలస్తూ..భారత్లోని ఒక అరటిపండు ధరకు యూకేలో ఎనిమిది అరటిపండ్లను కొనుగోలు చేయవచ్చని అంటాడు. బహుశా ఇది విదేశీయుడికి మాత్రమే ఈ అమ్మకం ధర అని ఆ వీడియోలో చెబుతుండటం కనిపిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్ టాపిక్గా మారింది. అయితే నెటిజన్లు మాత్రం బ్రో ఇది ఫారెన్ టాక్స్, చెల్లించి భారత్ ఎకానమీని మార్చేందుకు తమరి వంతుగా సాయం చెయ్యొచ్చు కదా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Hugh Abroad (@hugh.abroad)(చదవండి: మాములు వెయిట్ లాస్ జర్నీ కాదు..! ఏకంగా 145 కిలోలు నుంచి..) -
కోల్కతా ఆర్జీకార్ కాలేజీ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై సంచలన తీర్పు
-
బామ్మకు స్వీట్ సర్ప్రైజ్ : 20 లక్షలకు పైగా వ్యూస్
జైనబ్ రోష్నా దుబాయిలో ఉంటుందన్న మాటేగానీ కేరళలోని బామ్మ జ్ఞాపకాలు ఎప్పుడూ తనతోనే ఉంటాయి. ఆ జ్ఞాపకాలు హాయిగా ఉంటాయి, నవ్విస్తాయి. కొన్నిసార్లు భావోద్వేగానికి గురి చేస్తాయి. తనకు తీరిక దొరికినప్పుడల్లా బామ్మతో ఫోన్లో మాట్లాడుతుంది జైనబ్.‘ఇలా ఫోన్లో మాట్లాడుకోవడమేనా! నన్ను చూడడానికి ఎప్పుడు వస్తావు?’ అని అడుగుతుంది బామ్మ.‘నువ్వు దూరంగా ఉంటే కదా రావడానికి. నువ్వు ఎప్పుడూ నా కళ్ల ముందే ఉంటావు’ అని నవ్వుతుంది జైనబ్.‘నీ మాటలకేంగానీ... నువ్వు నన్ను చూడడానికి రావాల్సిందే’ అన్నది బామ్మ. అటు నుంచి నవ్వు మాత్రమే వినిపించింది! కట్ చేస్తే...ఆ రోజు బామ్మగారి బర్త్డే. తన ఊళ్లో ఆ రోజు కూడా బామ్మ అన్ని రోజులలాగే ఎప్పటిలాగే ఉంది. ‘నా బర్త్డేను జైనబ్ ఎంత ఘనంగా చేసేదో’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి వినిపించింది.ఎవరా అని చూస్తే... ఊహించని వ్యక్తి. నిజమా? భ్రమా!’ అనుకుంటుండగానే సంతోషంగా అరిచింది జైనబ్. స్వీట్ షాక్ నుంచి తేరుకున్న తరువాత... View this post on Instagram A post shared by ZAINAB ROSHNA | ZR✌🏻 (@zainabroshna) ‘నన్ను చూడడానికి వచ్చావా తల్లీ... ఒక్క మాటైనా చెప్పలేదు...’ అంటూ సంతోషంతో కళ్ల నీళ్ల పెట్టుకుంది బామ్మ. ‘ముందే చెబితే ఏం మజా ఉంటుంది! ఇలా వస్తేనే సర్ప్రైజింగ్గా ఉంటుంది’ అన్నది జైనబ్. ఆ రోజు వంద పండగలు ఒకేసారి వచ్చినంత సంతోషంగా ఫీల్ అయింది బామ్మ. ప్రేమగా, గారాబంగా మనవరాలిని ముద్దు పెట్టుకుంది. ‘గత ఏడాది మా అమ్మమ్మ పుట్టిన రోజున నా ఎమిరేట్స్ యూనిఫాం ధరించి వీడియో కాల్ చేశాను. నన్ను యూనిఫాంలో చూసి అమ్మమ్మ ఆశ్చర్యపడింది. కొత్త అమ్మాయిని చూసినట్లుగా ఉంది అని నవ్వింది. ఈ పుట్టిన రోజుకు మరింత సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. అందుకే చెప్పకుండా వచ్చాను’ అని ఇన్స్టా పోస్ట్లో రాసింది జైనబ్.ఒక్క మాటలో చెప్పాలంటే... ఇది మామూలు సంఘటన. అయితే సోషల్ మీడియా లో బామ్మ, మనవరాళ్ల వీడియో ఎంతో సందడి చేస్తోంది. దుబాయి నుంచి వచ్చిన జైనబ్ బామ్మ గదిలోకి సంతోషంగా పరుగెత్తుతున్న దృశ్యాలు నెటిజనులను ఆకట్టుకున్నాయి.జైనబ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్ 2.3 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ వీడియో క్లిప్ నేపథ్యంలో అమ్మమ్మ, నానమ్మలతో తమకు ఉన్న విలువైన జ్ఞాపకాలు పంచుకున్నారు నెటిజనులు.‘అమ్మ దగ్గర కంటే అమ్మమ్మ దగ్గరే నాకు చనువు ఎక్కువ. ఈ వీడియో క్లిప్ చూసినప్పుడు మా అమ్మమ్మ గుర్తుకు వచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి. పెద్దవాళ్లు మన నుంచి ఏమీ కోరుకోరు. మనం వారికి ఒకసారి కనిపించినా పెద్ద బహుమతిగా ఫీలవుతారు’ అని స్నేహ అనే నెటిజన్ తన కామెంట్ పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఈ బామ్మ, మనవరాళ్ల వీడియో ఎంతో సందడి చేస్తోంది. దుబాయి నుంచి వచ్చిన జైనబ్ బామ్మ గదిలోకి సంతోషంగా పరుగెత్తుతున్న దృశ్యాలు నెటిజనులను ఆకట్టుకున్నాయి. జైనబ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్ 2.3 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. చదవండి: Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్ ఎట్రాక్షన్, ఎవరీ బాహుబలిఅత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు -
రూల్స్ ఫాలో కావాలా?.. అయితే జరిగేది ఇదే!
మన దేశ ప్రజలకు క్రమశిక్షణ ఉండదని తరచూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండడం చూస్తుంటాం. మనం రూల్స్ పెట్టుకుంటాం. కానీ, వాటిని మన అవసరాలకు ఉల్లంఘిస్తూనే ఉంటాం అని చాలామంది తిట్టిపోస్తుంటారు. ఇది కొత్తేం కాదు కదా అనుకుంటున్నారా?. అయితే యూపీలో జరిగిన ఓ తమాషా ఘటన గురించి మీకు చదివి తెలుసుకోవాల్సిందే.India Not For Beginers అంటూ సోషల్ మీడియాలో తరచూ నడిచే ట్రోలింగ్ను చూస్తుంటాం. ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన అలాంటి అభిప్రాయాన్నే కలగజేయకమానదు. రూల్స్ ఫాలో కావాలా? అయితే జరిగేది ఇదే అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఉత్తర ప్రదేశ్లో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు.. నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధన తెచ్చింది యోగి ప్రభుత్వం. అయితే దాన్ని అమలు చేయడంలో బంకు నిర్వాహకులకు ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. తాజాగా హపూర్(Hapur) జిల్లాలో జరిగిన ఘటనలోకి వెళ్తే..మొన్న సోమవారం సాయంత్రం ఓ వ్యక్తి బైక్తో ఓ బంక్లోకి వచ్చాడు. అయితే హెల్మెట్ లేకపోవడంతో సిబ్బంది పెట్రోల్ పోయడానికి నిరాకరించారు. ‘‘రూల్స్ది ఏముంది లే.. పోయండబ్బా’’ అని సిబ్బందికి రిక్వెస్ట్ చేశాడా వ్యక్తి. అయితే.. తమ ఓనర్కు తెలిస్తే తిట్టిపోస్తాడని వాళ్లు కరాకండిగా చెప్పేశారు వాళ్లు. దీంతో కోపంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు..అతను అలా వెళ్లాడో లేదో.. ఓ ఐదు పది నిమిషాలకు బంక్లో కరెంట్ పోయింది. చుట్టుపక్కల అంతా కరెంట్ ఉండగా.. తమకు మాత్రమే కరెంట్ పోవడంతో సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఓనర్కి సమాచారం ఇవ్వడంతో అతను విద్యుత్ సిబ్బందికి ఫోన్ చేయించి రప్పించాడు. వాళ్లు వచ్చి చూసేసరికి బంక్కు పవర్ సప్లై అయ్యే ఫ్యూజు పీకేసి ఉంది. అయితే..ఈలోపు అక్కడే ఉన్న కొందరు కాసేపటి కిందట ఓ వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ ఎక్కాడని చెప్పడంతో.. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించారు. సీసీటీవీలో పోల్ మీద కనిపించిన వ్యక్తి ఇందాక బంక్కు వచ్చాడని సిబ్బంది చెప్పగా.. విద్యుత్ సిబ్బంది సైతం అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. అతను తమ తోటి సిబ్బంది అని చెప్పడంతో ఈసారి బంక్ ఓనర్ కంగుతిన్నాడు. ఆ వెంటనే పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తనకు పెట్రోల్ పోయకుండా రూల్స్ పాటించమన్నందుకే ఆ పని చేశానంటూ కోపంగా చెబుతున్నాడా లైన్మెన్.యూపీలో ఇప్పుడు ప్రతీ బంక్ వద్ద నో హెల్మెట్.. నో పెట్రోల్(No Helmet No Petrol) పేరిట బోర్డులు కనిపిస్తున్నాయి. బైక్ నడిపే వ్యక్తి మాత్రమే కాదు.. బంక్లోకి వచ్చే టైంలో పైలాన్ రైడర్లూ ఉన్నా హెల్మెట్ తప్పనిసరి చేశారు. అంతేకాదు.. బంకుల వద్ద గొడవలు జరిగే అవకాశం ఉండడంతో సీసీఫుటేజీలను ఏర్పాటు చేసుకోవాలని బంక్ యాజమానులకు అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ నిబంధనలు తమ వ్యాపారాన్ని దెబ్బ తీస్తాయంటూ బంకు ఓనర్లు మొదటి నుంచి గగ్గోలు పెడుతూనే ఉన్నారు.#Hapurपिलखुवा क्षेत्र के परतापुर रोड स्थित श्री जी फ्यूल पर एक अजीबो गरीब मामला सामने आया हैबिना हेलमेट बिजली विभाग के कर्मचारियों को पेट्रोल ना देना पेट्रोल पंप संचालक को पड़ा भारी लाइनमैन ने काट दी पेट्रोल पंप की बिजलीघटना सीसीटीवी में हुई कैद @DmHapur pic.twitter.com/My77ptruK3— Asian News UP (@AsianNewsUP) January 15, 2025 -
జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్ ను నిలదీసిన టీడీపీ, జనసేన నేతలు
-
జపాన్లో ఇంత క్లీన్గా ఉంటుందా..!
ఏ దేశమైనా.. రోడ్లను ఎంత శుభ్రం చేసినా వాహనాలు, మనుషుల కారణంగా దుమ్ము లేకుండా ఉండదు. చెత్త లేకుండా చూడొచ్చు గానీ దుమ్ము లేకుండా అంటే కొంచెం కష్టమే. కానీ నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోని చూస్తే మాత్రం ఆ దేశంలో అంత క్లీన్గా ఉంటుందా అని నోరెళ్ల బెడతారు.భారతదేశానికి చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్(Indian Influencer) జపాన్(Japan) పరిశుభ్రత(Cleanest)ను టెస్ట్ చేసింది. ఎందుకంటే జపాన్ కూడా ప్రపంచంలోని అత్యంత పరిశుభ్రమైన దేశాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఆ నేపథ్యంలోనే ఈ ఇన్ఫ్లుయెన్సర్ అది నిజమా..? కాదా..? అని స్వయంగా టెస్ట్ చేసింది. అందుకోసం ఒక షాపులోకి వెళ్లి తెల్లటి సాక్సులు కొత్తవి కొనుగోలు చేసింది. వాటిని వేసుకుని బూట్లు లేకుండా ఆ పరిసర ప్రాంతాల్లో నడిచింది. బూట్లను చేతితో పట్టుకుని సమీపంలో ఉన్న జీబ్రా క్రాసింగ్లు, ఫుట్పాత్లు వద్ద కలియతిరిగింది. ఆ తర్వాత కూల్గా సాక్స్ని విప్పి..చూస్తే ఒక్క మరక లేకుండా క్లీన్గా కనిపించాయి. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం ఇదస్సలు నమ్మశక్యంగా లేదు. అసాధ్యం అని కామెంట్ చేస్తున్నారు. అందులోకి తెల్లటి సాక్స్లు ఎంతలా పరిసరాలను క్లీన్గా ఉంచినా.. వినియోగిస్తే మాత్రం మాసినట్లు కనిపిస్తాయి. అలాంటిది ఈ సాక్సులు మాత్రం కొన్నప్పుడూ ఎలా ఉందో అలానే ఉంది. కాబట్టి ఇది నమ్మగిన వీడియో కాదంటూ తిట్టిపోస్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా ఆ వీడియోలో చైనా రోడ్లు క్లీన్గానే కనిపించాయి. డెస్ట్ కనిపించనంత క్లీన్గా అనేది కొంచెం నమ్మశక్యం కానిదే. కానీ వాళ్లు చెత్త అనేది కనిపించకుండా పరిసరాలను అంతలా శుభ్రంగా ఉండేలా మెయింటైన్ చేస్తున్నందుకుగానూ తప్పకుండా ప్రశంసించాల్సిందే కదూ..!. View this post on Instagram A post shared by Simran Jain (@simranbalarjain) (చదవండి: మహాకుంభ మేళలో యోగమాతగా తొలి విదేశీ మహిళ..!) -
మ్యాట్రి 'మనీ' స్కాం: అలాంటి వీడియోలతో బెదిరింపులు, బీ కేర్ఫుల్!
పెళ్లిళ్ల పేరయ్యల కాలం దాదాపు కనుమరుగైపోయింది. ఇపుడంతా మ్యాట్రీ మోనీ వెబ్సైట్ల హవానే నడుస్తోంది. ప్రాథమికంగా అన్ని వివరాలను ఆన్లైన్లోనే తెలుసుకుని అపుడు రంగంలోకి దిగుతున్న పరిస్థితినిమనం చూస్తున్నాం. అమ్మాయిల తల్లిదండ్రులైనా, అబ్బాయిల తల్లిదండ్రులైనా చాలావరకు ‘మ్యాట్రీ మోనీ’ పై ఆధారపడుతున్నారు. ఇక్కడే కేటుగాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. పదండి!మోసాలకు కాదేదీ అనర్హం అన్నట్టు.. ప్రతీ విషయాన్ని తమ కనుగుణంగా మలుచు కుంటున్నారు కేడీగాళ్లు. ఆఖరికి మ్యాట్రీమోనీ సైట్లను కూడా వదలడం లేదు. మ్యాట్రిమోని సైట్ల కేంద్రంగా పెరిగిపోతున్న మోసాలు అంటూ దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఒక వీడియోను షేర్ చేశారు. మ్యాట్రి 'మనీ' మోసాలతో తస్మాత్ జాగ్రత్త! అంటూ ఒక పోస్ట్ పెట్టారు. మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో పరిచయమైన యువతి, యువకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన సజ్జనార్ ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వీడియో కాల్స్ చేయమన్నా, న్యూడ్ ఫోటోలు అడిగిన కచ్చితంగా అనుమానించాల్సి ఉందనీ, ఒకటి పది సార్లు ఆలోచించాలని తెలిపారు. అలాగే మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సజ్జనార్ ట్వీట్ చేశారు.ఈ వీడియోలో ఒక యువతి తన స్నేహితురాలి అనుభవాన్ని గురించి వివరించారు. ఈ వివరాల ప్రకారం మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతీయువతుల ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తారు స్కాం రాయుళ్లు. ఆ తరువాత పెళ్లి పేరుతో మాయమాటలు చెబుతారు. మభ్యపెట్టి మెల్లిగా వీడియో కాల్స్ చేస్తారు. ఆ తరువాత ఈ వీడియో సాయంతో న్యూడ్ వీడియోలను తయారు చేస్తారు. ఆపై ఈ వీడియోలు చూపించి బెదిరింపులకు పాల్పడతారు. అడిగిన సొమ్ము ముట్టచెప్పక పోతే..న్యూడ్ వీడియోలను బయట పెడతామంటూ బెదిరిస్తారు. దీంతో ఈ వ్యవహారం బయటకి వస్తే పరువు పోతుందని భయంతో వణికిపోతారు బాధితులు. అడిగినంత ముట్జచెప్పి కష్టాల్లో పడుతున్నారు. అంతేకాదు పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరిన్ని సమస్యలు తప్పవనే భయంతో ఫిర్యాదులకు జంకుతున్నారు. మ్యాట్రి 'మనీ' మోసాలతో తస్మాత్ జాగ్రత్త!!మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతీయువతుల ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్న కేటుగాళ్ళు.పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి న్యూడ్ వీడియో కాల్స్.న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్.. అడిగిన డబ్బు ఇవ్వాలని బెదిరింపులు.మ్యాట్రిమోని… pic.twitter.com/wS48rAVmTp— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 13, 2025 ఇలాంటి స్కాంలపై అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఇలాంటి బెదిరింపులకు భయపడ కూడదు. సంబంధిత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. లేదంటే సైబర్ క్రైం విభాగాన్ని గానీ వెంటనే సంప్రదించాలి. ఇలా చేయడం వల్ల మరింత బాధితులు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా కాపాడిన వారమవుతాం. అలాకాకుండా పరువు పోతుందని భయపడితే, కేటుగాళ్లు పన్నిన ఉచ్చులోకి మరింత లోతుగా చిక్కుకుంటామనే సంగతి గుర్తుంచు కోవాలి. -
ఇలాంటి మేకప్ నైపుణ్యం ఉంటే ఏ వధువైనా అదుర్స్..!
మేకప్ అనగానే వేసుకున్నప్పుడూ అతిలోక సుందరిలా..తీసేశాక ఆమెనా అన్నంత సందేహం వస్తుంది. ముఖ్యంగా కలర్ తక్కువగా ఉండే వాళ్ల గురించి ఇక చెప్పాల్సిన పని లేదు. అందుకే చామనఛాయా ఉన్న చాలమంది వధువులు, కాస్త రంగు తక్కువగా ఉన్నవారు మేకప్ వేసుకునేందుకు సుముఖత చూపించరు. ఎందుకంటే మేకప్ తర్వాత వాళ్ల లుక్ మారిపోతుంది. దీంతో ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అదే తమ రంగుకి అనుగుణమైన మేకప్తో అందంగా కనిపించేలా చేస్తే ఆత్మవిశ్వాసంగా, నిండుగా ఉంటుంది. అలాంటి మేకప్ నైపుణ్యంతో ఇక్కడొక కళాకారిణి అందరి హృదయాలను దోచుకుంటోంది. ఎవ్వరైనా ఆమె మేకప్ నైపుణ్యతకు ఫిదా అయిపోతారు. ఇంతకీ ఎవరంటే ఆమె..!చెన్నై(Chennai)కి చెందిన మేకప్ ఆర్టిస్ట్(makeup artist) నిర్మలా మోహన్ స్కిన్ టోన్కు సరిపోయే మేకప్లతో ఆకట్టుకుట్టోంది. రంగు తక్కువగా ఉన్నా కూడా ఇనుమడింప చేసే మేకప్తో అందంగా కనిపించేలా చేస్తోంది. అందానికి అసలైన నిర్వచనం చెప్పేలా మేకప్ నైపుణ్యంతో ఫిదా చేస్తోంది. చర్మం కలర్(skin colour) నలుపుగా ఉన్నవాళ్లని తెల్లగా కనిపించేలా మేకప్ వేస్తారు చాలామంది. ఆ తర్వాత అసలు రంగు ఇదా అని ముఖం మీదే అనడంతో కలర్ తక్కువగా ఉండే అమ్మాయిలు మేకప్ వేసుకునేందుకు భయపడుతున్నారు. అలా కాకుండా వారి రంగుకి సరిపోయే మేకప్తో వాళ్ల చర్మం రంగులోనే మరింత అందంగా కనిపించేలా తీర్చిదిద్దితుంది నిర్మల. ఇదే ఆమె బ్యూటీ ట్రిక్కు. అందుకు సంబంధించిన వీడియోలను ఇన్స్టాలో షేర్ చేయడంతో అందరూ ఆమె కళా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Nirmala Mohan 💃🏻 (@nirmala_makeupartistry) ఇలా రంగు తక్కువగా ముదురు గోధుమ రంగులో ఉండే వాళ్ల స్కిన్ టోన్కి అనుగుణమైన రంగులోనే కాంతిమంతంగా కనిపించేలా చేస్తే.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపినవాళ్లం అవుతాం. వారి ముఖాలు కూడా కాంతిగా వెలుగుతాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి వాళ్లకు వైట్ వాష్ చేయకూడదు. మేకప్ వేస్తేనే అందం లేదంటే చూడలేం అన్నట్లు ఉండకూడదు. సహజ సౌందర్యం ఉట్టిపడేలా తీర్చిదిద్దే మేకపే అమ్మాయిలకు గౌరవంగా ఉంటుందని అంటోంది నిర్మల. దీంతో వాళ్లు మునుపటి రూపాన్ని చూపించేందుకు వెనడుగు వేయరని నమ్మకంగా చెబుతోంది. View this post on Instagram A post shared by Nirmala Mohan 💃🏻 (@nirmala_makeupartistry) (చదవండి: తల్లే కూతురు పెళ్లిని ఆపేసింది..! ట్విస్ట్ ఏంటంటే..) -
తల్లే కూతురు పెళ్లిని ఆపేసింది..! ట్విస్ట్ ఏంటంటే..
కూతురు పెళ్లి చేసుకుని ఆనందంగా భర్త, అత్తమామలతో ఉండాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. అందుకోసం ఆచితూచి మరీ వెతికి వెతికి మంచి సంబంధం తెచ్చుకుంటారు. అన్నేళ్లుగా అపురూపంగా పెంచుకున్న కూతుర్ని ఇంకో ఇంటికి పంపించేటప్పుడూ.. అక్కడ కూడా అంతే ఆనందంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటాం. అలా ఆలోచించే ఓ తల్లి తన కూతురు పెళ్లిని పెళ్లి పీటల మీదే అర్థాంతరంగా ఆపేసింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని చూసి అక్కడ వేదికపై ఉన్నవారు, వరుడు తరుపు వారు కంగుతిన్నారు. అయితే ఆ తల్లి ఇలాంటి అనూహ్య నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలిస్తే..ఆమెను అభినందించకుండా ఉండలేరు.ఎందుకంటే..ఈ అనూహ్య సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఇంకొద్దిసేపులో అంగరంగ వైభవంగా పెళ్లి జరగనుంది. సరిగ్గా ఆ సమయంలో వధువు తల్లి ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నాం..ప్లీజ్ వెళ్లిపోండని వరుడిని, అతని కుటుంబ సభ్యులను వేడుకుంది. ఇదేంటి కరెక్ట్గా ఈ టైంలో ఇలా అంటుందని అంతా విస్తుపోయారు. కానీ అక్కడున్న కొంతమంది ఆమె సరైన నిర్ణయం తీసుకుందనే అనుకున్నారు. ఎందుకంటే సరిగ్గా పెళ్లితంతు సమయంలో కూడా వరుడు ఫుల్గా తాగి స్నేహితులతో కలిసి గొడవ చేశాడు. అక్కడున్న వారిని ఇబ్బందికి గురి చేశారు వరుడు, అతడి స్నేహితులు. దీంతో వధువు తల్లి ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడే అతడి ప్రవర్తన ఇలా ఉంది. భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందనే భయంతో ఆ తల్లి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు నిజంగా "ఇది చాలా ధైరవంతమైన నిర్ణయం. ఫైనాన్షియల్ పరంగా ఇంత ఖర్చు అయ్యిందే అనే ఆలోచనకు తావివ్వకుండా కూతురు భవిష్యత్తే ముఖ్యం అని ఇంత పెద్ద నిర్ణయం తీసుకుందా ఆ తల్లి, అందుకు ఎంతో ధైర్యం ఉండాలి కూడా అంటూ నెటిజన్లు ఆ తల్లి పై ప్రశంసలు జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు". View this post on Instagram A post shared by News For India (@news.for.india) (చదవండి: 'ఏది వడ్డించినా సంతోషంగా తింటా': మోదీ) -
కన్నౌజ్ రైల్వే స్టేషన్లో కూలిన పైకప్పు
-
హాలీవుడ్ హిల్స్ పైనా వేగంగా వ్యాపించిన అగ్ని కీలలు
-
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లో పడి ఐదుగురు మృతి
-
ఎమ్మెల్యే గురుప్రీత్ గోగిని కాల్చి చంపిన దుండగులు
-
మాయదారి గుండెపోటు : చిన్నారి ‘గుండెల్ని’ పిండేస్తున్న వీడియో
చిన్నారుల నుంచి పెద్దల దాకా గుండెపోటుతో సంభవిస్తున్న హఠాన్మరణాలు ఆందోళన రేపుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కారణంలో చిన్నారుల గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తుండటం కలచివేస్తోంది. తాజాగా మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈసారి 8 ఏళ్ల బాలిక (School Girl) ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. గుజరాత్లోని అహ్మదాబాద్లోని (Ahmedabad) థల్తేజ్ ప్రాంతంలో శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి.అహ్మదాబాద్లోని గార్గి రాణపరా(Gargi Ranapara) జేబార్ స్కూల్ ఫర్ చిల్డ్రన్లో గార్గి మూడో తరగతి చదువుతోంది. పాఠశాలకు వచ్చిన కొద్దిసేపటికే ఛాతీ నొప్పికి గురైంది. క్లాస్ రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా నొప్పి రావడంతో కాసేపు అక్కడే నిలబడింది. నొప్పితో బాధపడుతూనే అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది. అంతే కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఇది గమనించిన టీచర్లు ఆమెకు సపర్యలు చేశారు. బాలికను కాపాడేందుకు టీచర్లు సీపీఆర్ చేశారు. అయినా బాలికలో ఎలాంటి చలనం లేదు. వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే సమయానికే బాలిక పరిస్థితి విషమించింది. వైద్యులు ఆమెను బతికించేందుకు తీవ్రంగా శ్రమించారు. వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. గార్గి గుండెపోటుతో మరణించిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పాఠశాల ప్రిన్సిపల్ శర్మిష్ఠ సిన్హా వెల్లడించారు.గార్గి పాఠశాల ఆవరణలో కొంచెం అనారోగ్యంగా కనిపించిందని, కొద్దిసేపు కూర్చున్న వెంటనే కుప్పకూలిపోయిందని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన టీచర్లు, విద్యార్థులు వెంటనే ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించినా, ఆమెనుకాపాడలేకపోయామని విచారం వ్యక్తం చేశారు.మరోవైపు దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక గుండెపోటుకు గల కారణాలలపై అన్ని కోణల్లో దర్యాప్తు చేస్తున్నామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నీరజ్ బడ్గుజర్ ప్రకటించారు.🚨HEART BREAKING A 8 year old girl , all of a sudden fell down and died in school. Video from Krnavati (Ahmedabad) , Gujarat.What is happening to kids and youngsters ?? Almost every week we see or hear such cases . Instead of blaming Covid vaccines , we need to get into the… pic.twitter.com/R66mcrOIK9— Amitabh Chaudhary (@MithilaWaala) January 10, 2025 > కాగా ముంబైకి చెందిన గార్గి, తన బంధువుల ఇంటిలో ఉంటూ అహ్మదాబాద్లో చదువుకుంటోంది. గతంలో పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవని సమాచారం. ఇటీవల బెంగళూరులో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల బాలిక తేజస్విని పాఠశాల కారిడార్లో గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.గుండెపోటు లక్షణాలుఛాతీ నొప్పి,ఊపిరి ఆడకపోవడంవికారం, చెమటలు పట్టడం చేతులు, వీపు లేదా దవడలో నొప్పి వంటివి సాధారణ లక్షణాలునోట్: గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. అయితే, గుండె పోటు వెనుక చాలా కారణాలు ఉండొచ్చు. అందుకే ఏ చిన్న అనారోగ్యం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. మరీ ముఖ్యంగా జిమ్ చేస్తున్నాం కదా, ఆరోగ్యంగానే ఉన్నాం కదా అని అస్సలు అనుకోకూడదు. ఇటీవలి కేసులను దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లల్లో అయినా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి కారణాలను రూల్ అవుట్ చేసుకోవడం చాలా అవసరం. -
ఢిల్లీలో 23 స్కూళ్లకు బాంబు బెదిరింపు
-
కోల్డ్ కాఫీ చేసిన రాహుల్ గాంధీ, వైరల్ వీడియో
కాంగ్రెస్ నాయకుడు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకు సంబంధించి ఒక వీడియో నెట్టింట సందడిగా మారింది. ఏ ప్రదేశానికి వెళ్లినా, ఏ మీటింగ్కు హాజరైనా జనంతో మమేకం కావడం రాహుల్ గాంధీకి బాగా అలవాటు. అలా ఇటీవల కాఫీ చైన్ను సందర్శించిన సందర్భంగా, స్వయంగా కోల్డ్ కాఫీ తయారు చేశారు. కెవెంటర్స్ స్టోర్ను సందర్శించి అక్కడ కోల్డ్ కాఫీ తయారు చేసిన అనుభవాన్ని సోషల్ స్వయంగా రాహుల్ గాంధీ మీడియాలో పంచుకున్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో ఒక పాపులర్ కాఫీ షాప్ను సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు, సిబ్బందితో సంభాషించారు. కొత్త తరం, కొత్త మార్కెట్ కోసం మీ లెగసీ బ్రాండ్ను ఎలాంటి మార్పులు తీసుకొస్తారు అని అడిగినపుడు కెవెంటర్స్ యువ వ్యవస్థాపకులు తన కొన్ని విలువైన విషయాలను పంచుకున్నారని తెలిపారు. అక్కడున్న అభిమానులతో సెల్ఫీలకు ఫోజులిచ్చారు. రాహుల్ దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్గా మారింది. (లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు : చిక్కుల్లో మాల్యా కొడుకు-కోడలు, అప్డేట్ ఇదే!)కెవెంటర్స్ సిబ్బంది కోల్డ్ కాఫీ ఎలా తయారు చేస్తారో చూడాలనుకుంటున్నారా అని అడిగి మరీ కోల్డ్ కాఫీ తయారీ గురించి వివరించేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే “లేదు,లేదు.. నేను తయారు చేస్తాను’’ అంటూ తానే చేస్తానని రాహుల్ ముందుకు రావడం విశేషం. స్టోర్ సిబ్బంది సూచనలతో దాన్ని తయారుచేసి కస్టమర్కు అందించడం ఈ వీడియోలో చూడవచ్చు. అంతేకాదు కెవెంటర్స్ నిజాయితీగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారంటూ కితాబిచ్చారు. తరతరాలుగా మన ఆర్థిక వృద్ధికి ఊతమిస్తున్నఇలాంటివారికి మద్దతివ్వాలని పేర్కొన్నారు రాహుల్. ఇదీ చదవండి: బెంచింగ్ డేటింగ్ గురించి తెలుసా, ఇలా అయితే డేంజరే!కెవెంటర్స్ సహ వ్యవస్థాపకులు అమన్ అరోరా ,అగస్త్య దాల్మియాతో వారి వ్యాపారం ,విస్తరణ ప్రణాళికల గురించి కూడా మాట్లాడారు. ఇపుడు తమ దృష్టిని టైర్ 2, టైర్ 3 ,టైర్ 4 నగరాలపై కేంద్రీకరిస్తున్నామని తెలిపారు.How do you shake up a legacy brand for a new generation and a new market?The young founders of Keventers shared some valuable insights with me recently.Play-fair businesses like Keventers have driven our economic growth for generations. We must do more to support them. pic.twitter.com/LSdiP8A9bQ— Rahul Gandhi (@RahulGandhi) January 9, 2025కాగా కెవెంటర్స్ సంస్థ ఇటీవలే వందేళ్లు పూర్తిచేసుకుంది. ఇటీవల కంపెనీ వాఫ్ఫల్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఇవి భారతదేశం అంతటా 170 కి పైగా ప్రత్యేకమైన రిటైల్ బ్రాండ్ షాపులలో అందుబాటులో ఉన్నాయి. రూ. 99 ప్రారంభ ధరకు, కెవెంటర్స్ వాఫ్ఫల్స్ ఆరు ప్లేవర్లలో లభిస్తాయి. క్లాసిక్ హనీ బటర్, లోటస్ బిస్కాఫ్, కిట్ కాట్ క్రంచ్, నుటెల్లా, ట్రిపుల్ చాక్లెట్ . వైట్ చాక్లెట్. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. -
అడ్డుకున్న పోలీసులు... తగ్గేదేలే అంటూ నడుచుకుంటూ వెళ్లిన జగన్
-
37 కిలోలు తగ్గి, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన గృహిణి
వెయిట్ లాస్ జర్నీ అంత ఈజీగా సాగదు. మరీ ముఖ్యంగా పెళ్లి, పిల్లలు తరువాత విపరీతంగా పెరిగిన బరువును తగ్గించుకోవడం మహిళలకు కత్తిమీద సామే. ఎంతో పట్టుదల కావాలి. అలా 37 కిలోల బరువును తగ్గించుకొని ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్గా అవతరించిందో గృహిణి. అసాధ్యం కాదు అనుకున్న దాన్ని సాధ్యం చేయడంలో ఉన్న కిక్కే వేరు అంటున్న ఆ గృహిణి గురించి తెలుసుకుందామా...!బరువు తగ్గే క్రమంలో 36 ఏళ్ల తనుశ్రీ అనే ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ తన స్ఫూర్తిదాయకమైన ప్రయాణం సోషల్ మీడియాను ఆకర్షిస్తోంది. అంకితభావం , పట్టుదలతో ఆమె సాధించిన విజయంపై ప్రశంసలు లభించాయి. View this post on Instagram A post shared by Tanusree Srcd (@livefitwithtanu) బాల్యం నుంచీ బొద్దుగానే ఉం డే తనుశ్రీ తన ఇరవైలలో,ముఖ్యంగా గర్భం దాల్చిన తర్వాత బాగా బరువు పెరిగిపోయింది. దీంతో పెరిగిన తన శరీరాన్ని చూసుకొని ఆశ్చర్యపోయింది. దీంతో తన కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గిపోతున్నాయని గమనించింది. తన ఆరోగ్యం, విశ్వాసాన్ని తిరిగి పొందాలని నిశ్చయించుకుని రంగంలోకి దిగింది. View this post on Instagram A post shared by Tanusree Srcd (@livefitwithtanu) తల్లిగా, గృహిణిగా ఇంటి బాధ్యతలను మోస్తూనే గత ఆరేళ్లకుపైగా పట్టుదలగా ఆహార నియమాలు, ఇంట్లోనే సులువైన వ్యాయాయాలు ఆచరించింది. తాను అనుకున్నది సాధించింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే వెనక్కి తగ్గలేదు. ఒక ప్రణాళికగాబద్దంగా తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటూ, గృహోపకరణాలతోనే క్రియేటివ్గా వ్యాయామాలను చేసింది. జీవనశైలి మార్పులతో పాటు స్వీయ సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చింది. తను అనుకున్న ఫిట్నెస్ లక్ష్యాన్ని చేరుకుంది.ఈ వీడియో చేసిన నెటిజన్లు ఆమెను కొనియాడారు. భలే చేంజ్ కనిపించింది. శారీరకంగా , మానసికంగా తన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకునే, ప్రేమించే వ్యక్తి కంటే అందమైనది ఇంకేముంటుంది. మంచి పనిచేస్తున్నారు..ఇలాగే ముందుకెళ్లండి అంటూ ఆమె ఫాలోయర్లు ఆమెకు సపోర్ట్గా నిలిచారు. ‘‘ఇంతకు ముందులా గృహస్థంగా, అమాయకంగా కాకుండా, ఇపుడు నమ్మకంగా, బలంగా, అందంగా కనిపిస్తున్నారు.కష్టే ఫలి అంటే ఇది కొందరు వ్యాఖ్యానించారు. "అద్భుతం, మీలోని మార్పు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ స్ఫూర్తి చాలా ప్రశంసనీయం నా భార్య కూడా 2018 సంవత్సరంలో అచ్చం ఇలాంటి విజయాన్నే సాధించిందని మరో యూజర్ కామెంట్ చేశారు. -
‘‘ఇదెక్కడి పెళ్లి గోలరా నాయనా’’ వైరల్ వీడియో : ఎలిమినేట్ చేసేయండంటూ ఫైర్
కెనడాలో అర్థరాత్రి జరిగిన భారతీయ వివాహ వేడుకపై కెనడాకు చెందిన ఒక మహిళ విమర్శలు గుప్పించింది. ఆమె ఫ్రస్ట్రేషన్కు సంబంధించి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. స్టోరీ ఏంటంటే..భారతీయ వివాహాలు, సందడిపై ఒక కెనడియన్ మహిళ పోస్ట్ చేసిన వీడియో క్లిప్ ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో జాత్యహంకార చర్చకు దారి తీసింది. సాడీ క్రోవెల్(Sadie Crowell) అనే యువతి తన ఇంటి పక్కన జరుగుతున్న ఒక భారతీయ పెళ్లి( Indian Wedding )కి సంబంధించిన హడావిడి, శబ్దాల గురించి విసుక్కుంటూ ఒక వీడియో పెట్టింది. అర్థరాత్రి ఇదేంగోలరా బాబు, నిద్ర రావడం లేదు ఆవేదన వ్యక్తంచేసింది. రాత్రినుంచీ ఒకటే మ్యూజిక్.. నిద్రే లేదు.. ఉదయం 9 అవుతున్నా.. ఆ సౌండ్స్ గోల ఆగ లేదంటూ విమర్శలు గుప్పించింది. పనిలో పనిగా తన బాల్కనీ నుండి పెళ్లి బరాత్కు సంబంధించిన వీడియోతీసి పోస్ట్ చేసింది. దీంతోఇది కాస్తా వైరల్ అయింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. ఇంకొందరు ఆమె తీరు ఫన్నీగా ఉందంటూ వ్యాఖ్యానించారు. మరికొందరు ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. మరో అడుగు ముందుకేసిన మరో యూజర్ వాళ్లని దేశంనుంచి తరిమేయాలంటూ కమెంట్ చేశారు. ముఖ్యంగా భిన్న సంస్కృతుల మధ్య గౌరవం, సామరస్యం ఉండాలని కొంతమంది వ్యాఖ్యానించడం గమనార్హం .సోషల్ మీడియాలోఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు రావడం బాధాకరమన్నారుకొందరు నెటిజన్లు. అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకునేందుకు వేదికగా ఉపయోగపడుతున్న సోషల్ మీడియా విద్వేషాలను రెచ్చగొట్టే వేదికగా మారకూడదని హితవు పలకడం విశేషం.మరికొన్ని వ్యాఖ్యలు ఇలా ఉన్నాయ్"ఆ పరిస్థితిలో స్పానిష్ ప్రజలు పెద్ద బకెట్ల నీటిని కిటికీ నుండి విసిరేవారు" "నివాస ప్రాంతంలో ఈ రకమైన బిగ్గరగా చికాకు కలిగించడం అనుమతించబడుతుందా?" సామూహిక వలసలున్నపుసామూహిక బహిష్కరణ ఎందుకు జరగకూడదు?!“మాకా” (మేక్ కెనడా గ్రేట్ ఎగైన్) అనే కొత్త పాలసీని రూపొందించాలి’.“వీళ్లు (Indians) ఇక్కడికి మంచిగా బతకడానికి వచ్చారు కానీ, మన దేశానికి తగ్గట్టు మారాలి కానీ, వాళ్ల గోలను ఇక్కడ రుద్దకూడదు” Everyone will despise the Indians given enough time pic.twitter.com/8V42PLGLRW— Canadian Girl 🇧🇲 (@alwaysaracist) January 7, 2025 -
కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన న్యూజిలాండ్ ప్లేయర్.. వీడియో వైరల్
శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ ఆల్రౌండర్ నాథన్ స్మిత్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద స్మిత్ పక్షిలా గాల్లోకి ఎగిరి సూపర్ మ్యాన్ క్యాచ్ పట్టుకున్నాడు. ఛేదనలో లంక ఇన్నింగ్స్ 29వ ఓవర్లో (ఆఖరి బంతికి) ఇది జరిగింది. విలియమ్ ఓరూర్కీ బౌలింగ్లో లంక బ్యాటర్ ఎషాన్ మలింగ రూమ్ తీసుకుని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని వికెట్కీపర్ వెనుక భాగంలో డీప్ థర్డ్ దిశగా గాల్లోకి ఎగిరింది. నాథన్ స్మిత్ కొద్ది మీటర్ల పాటు స్ప్రింట్ చేసి బౌండరీ రోప్కు ముందు అద్బుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. NATHAN SMITH GRABS AN ABSOLUTE STUNNER. 🤯pic.twitter.com/wDknkRRFOV— Mufaddal Vohra (@mufaddal_vohra) January 8, 2025దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. క్రికెట్ అభిమానులు నాథన్ స్మిత్ విన్యాసానికి ముగ్దులవుతున్నారు. సూపర్ క్యాచ్ అంటూ కొనియాడుతున్నారు.కాగా, ఈ మ్యాచ్లో శ్రీలంక న్యూజిలాండ్ చేతిలో 113 పరుగుల తేడాతో ఓడింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. వర్షం కారణంగా 37 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర (63 బంతుల్లో 79; 9 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ద శతకం బాదగా.. వన్ డౌన్ బ్యాటర్ మార్క్ చాప్మన్ (52 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. డారిల్ మిచెల్ (38), గ్లెన్ ఫిలిప్స్ (22), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. విల్ యంగ్ 16, టామ్ లాథమ్ 1, నాథన్ స్మిత్ 0, మ్యాట్ హెన్రీ 1, విలియమ్ ఓరూర్కీ 3 పరుగులు (నాటౌట్) చేశారు. లంక బౌలర్లలో మహీశ్ తీక్షణ హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హసరంగ రెండు, ఎషాన్ మలింగ, అశిత ఫెర్నాండో తలో వికెట్ తీశారు.అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 30.2 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. లంక ఇన్నింగ్స్లో కమిందు మెండిస్ (64) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. చమిందు విక్రమసింఘే (17), జనిత్ లియనగే (22), అవిష్క ఫెర్నాండో (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. కివీస్ పేసర్ విలియమ్ ఓరూర్కీ లంక టాప్ స్కోరర్ కమిందు వికెట్ సహా మూడు వికెట్లు తీశాడు. జాకబ్ డఫీ రెండు వికెట్లు పడగొట్టగా.. మ్యాట్ హెన్రీ, నాథన్ స్మిత్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
Viral: హిజాబ్ ధరించమన్నందుకు ఏం చేసిందంటే..
వైరల్ వీడియో: హిజాబ్ విషయంలో ఇస్లాం దేశాలు ఎంత కఠినంగా వ్యవహరిస్తుంటాయో తరచూ మనం చూస్తున్నాం. చాలావరకు దేశాలు కఠిన చట్టాలు..శిక్షలు సైతం అమలు చేస్తున్నాయి కూడా. అయితే.. ఇరాన్లో మోరల్ పోలీసింగ్ పేరిట అక్కడి ప్రభుత్వమే దగ్గరుండి మరీ జరిపించే దారుణాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.అందుకే అక్కడ మహిళల పోరాటాలు తరచూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా.. ఇంటర్నెట్లో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. హిజాబ్ ధరించమని ఓ మతపెద్ద ఒకావిడను ఒత్తిడి చేశాడు. అంతే.. చిర్రెత్తుకొచ్చిన ఆమె ఆయన వెంటపడింది. ఆయన తలపై ఉన్న పాగాను లాగిపడేసి.. దానినే తలపై కప్పేసుకుంది.‘‘ఇప్పుడు మీ గౌరవం ఏమైంది?. నా భర్తను మీరేం చేశారు?’’ అంటూ గట్టిగా అరుస్తూ కనిపించింది. కచ్చితంగా ఎప్పుడు జరిగిందో తెలియదుగానీ రాజధాని టెహ్రాన్లోని మెహ్రాబాద్(Mehrabad) ఎయిర్పోర్టులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.మసిహ్ అలినెజద్ అనే మహిళా జర్నలిస్ట్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. ‘‘ఆ తలపాగాలు పవిత్రమైనవి, అవే తమ గౌరవమని, ఇతరులెవరూ వాటిని ముట్టుకోకూడదని ఆ మత పెద్దలు చెబుతుంటారు. కానీ, తన నిరసనతో ఈమె వాళ్లకు సరైన పాఠం చెప్పింది. లింగవివక్ష పోరాటంలో అలసిపోయిన ఇరాన్ మహిళలు.. ఇప్పుడు ఆగ్రహంతో ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారన్నడానికి ఇదే ఉదాహరణ’’ అని పోస్ట్ చేశారామె.A brave woman at Tehran’s Mehrabad Airport confronted a cleric harassing her for not wearing a hijab. In a bold act of defiance, she removed his turban and wore it like a scarf, turning oppression into resistance.For years, clerics have claimed their turbans and robes are… pic.twitter.com/Mdj1c0b3Vo— Masih Alinejad 🏳️ (@AlinejadMasih) January 6, 2025ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై అధికార ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC)కి చెందిన మీడియా సంస్థ ‘మష్రెగ్’మాత్రం ఘటనపై మరోలా కథనం ఇచ్చింది. ఆ మహిళ మతిస్థిమితం లేనిదని, ఆమెను అదుపులోకి తీసుకుని వదిలేసిట్లు ఓ వార్త ప్రచురించింది. అయితే..నెటిజన్లు మాత్రం ఆ మహిళకు మద్దతుగా నిలిచారు. తమ హక్కుల కోసం అనేకమంది మహిళలకు ఆమె ప్రతినిధిగా కనిపించారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే.. గతేడాది నవంబర్లో టెహ్రాన్ ఆజాద్ యూనివర్సిటీలో హిజాబ్ నిరసనల్లో భాగంగా ఓ యువతి ఏకంగా దుస్తులు విప్పేసి ప్రభుత్వంపై నిరసన తెలిపింది. అయితే ఇరాన్ ప్రభుత్వం మహిళల వరుస నిరసనలను వాళ్ల ఆవేశంలో తెలివితక్కువతనంతో చేస్తున్న పనులుగా పేర్కొంటూ అణచివేస్తోంది. 1979లో ఇస్లామిక్ విప్లవం నుంచి ఇరాన్లో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ను ధరించడాన్ని తప్పనిసరిగా అమలుచేస్తున్నారు. ఇది సరిగ్గా అమలయ్యేలా 2005 నుంచి నైతిక పోలీసు విభాగం పర్యవేక్షిస్తోంది. అయితే. 2022లో హిజాబ్ సరిగా ధరించలేదని మాసా అమీని అనే యువతిపై నైతిక పోలీసులు దాడి చేయగా.. ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో రెండు నెలలకుపైగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకింది. చివరికి మోరల్ పోలీసింగ్ను ఇరాన్ రద్దు చేయాల్సి వచ్చింది. అయితే కిందటి ఏడాదిలో ఆ వ్యవస్థ మళ్లీ అమల్లోకి వచ్చింది. దీంతో మహిళల నిరసనలు మళ్లీ యధావిధిగా కొనసాగుతున్నాయి. అయితే.. ఈ నిరసనలపై ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తన పాలనకు వ్యతిరేకంగా మహిళలు చేస్తున్న నిరసనలు తమ శత్రువులు చేయిస్తున్నారని ఖమేనీ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో.. ‘స్త్రీ ఒక సున్నితమైన పుష్పం.. ఇంట్లో పనిమనిషి కాదు. స్త్రీని పువ్వులా చూసుకుంటూ.. దాని తాజాదనం, సువాసన, దానినుంచి కలిగే ప్రయోజనాలను పొందాలి’ అని ఓ కవిత్వం సైతం రాసుకొచ్చారు. -
చిరుతను బంధించిన ధైర్యశాలి
తుమకూరు: చిరుత కనిపించిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆమడ దూరం పరిగెడతారు. అయితే ఓ యువకుడు ధైర్యసాహసాలు ప్రదర్శించి, ప్రాణాలకు తెగించి ఓ చిరుతను తోక పట్టుకొని బోనులోకి నెట్టేశాడు. ఈఘటన జిల్లాలోని తిపటూరు తాలూకా రంగాపురం వద్ద జరిగింది.గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుతను పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేయగా అటవీశాఖ అధికారులు సమీపంలో బోను ఏర్పాటు చేశారు. పరలేహళ్లి రోడ్డులోని కుమార్ అనే వ్యక్తికి చెందిన తోటలో చిరుత నిద్రావస్థలో ఉండగా దానిని బంధించేందుకు అటవీ అధికారులు, సిబ్బంది సకల సరంజామాతో వచ్చారు.అయితే చిరుతను పట్టుకునేందుకు భయంతో వెనుకాడుతుండగా గ్రామానికి చెందిన ఆనంద్ అనే యువకుడు ముందుకు వచ్చాడు. చిరుత తోకను పట్టుకుని బోనులోకి లాగి పడేశాడు. అదే సమయంలో అక్కడే ఉన్న అటవీ సిబ్బంది వల విసిరి చిరుతను బంధించడంలో సఫలమయ్యారు. కాగా యువకుడి ధైర్యసాహసాలను పలువురు ప్రశంసించారు. The #forest department officials with the help of a local youth Anand captured a #leopard at Rangapur Village in #Tumakuru... pic.twitter.com/QFrdogAvqt— Yasir Mushtaq (@path2shah) January 7, 2025 -
పవన్ కల్యాణ్ మానవత్వం లేదా..?
-
బాబర్పైకి బంతి విసిరిన ముల్దర్.. పాక్ బ్యాటర్ రియాక్షన్ వైరల్
సౌతాఫ్రికా- పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు సందర్భంగా వియాన్ ముల్దర్(Wiaan Mulder)- బాబర్ ఆజం(Babar Azam) మధ్య వాగ్వాదం జరిగింది. తన పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు బాబర్ వియాన్ ముల్దర్ వైపునకు దూసుకువచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ ముదరగా.. ఫీల్డ్ అంపైర్ జోక్యం చేసుకుని ఇరువురికి నచ్చజెప్పాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మిశ్రమ ఫలితాలుకాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లు ఆడేందుకు పాకిస్తాన్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టీ20 సిరీస్ జరుగగా.. ఆతిథ్య జట్టు 2-0తో నెగ్గింది. అనంతరం వన్డే సిరీస్లో మాత్రం పర్యాటక పాకిస్తాన్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. చరిత్రలోనూ ఎన్నడూ లేనివిధంగా.. సౌతాఫ్రికా గడ్డపై 3-0తో వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది.అరుదైన ఘనతతద్వారా ప్రొటిస్ దేశంలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి జట్టుగా మహ్మద్ రిజ్వాన్ బృందం నిలిచింది. అయితే, టెస్టు సిరీస్లో మాత్రం పాకిస్తాన్ జట్టు తడబడుతోంది. సెంచూరియన్లో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో రెండు వికెట్ల తేడాతో షాన్ మసూద్ బృందం ఓటమిపాలైంది. ఇక శుక్రవారం మొదలైన రెండో టెస్టులోనూ కష్టాల్లో కూరుకుపోయింది.రెకెల్టన్ భారీ డబుల్ సెంచరీకేప్టౌన్లో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రియాన్ రెకెల్టన్ భారీ డబుల్ సెంచరీ(259)తో విరుచుకుపడగా.. కెప్టెన్ తెంబా బవుమా(106), వికెట్ కీపర్ బ్యాటర్ వెరియెన్నె(100) కూడా శతక్కొట్టారు. మార్కో జాన్సెన్(62) అర్ధ శతకంతో రాణించగా.. కేశవ్ మహరాజ్ తన వంతుగా 40 పరుగులు సాధించాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా ఏకంగా 615 పరుగులు స్కోరు చేసింది.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 194 పరుగులకే కుప్పకూలింది. పాక్ తొలి ఇన్నింగ్స్లో బాబర్ ఆజం 58 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 46 పరుగులు చేశాడు. ప్రొటిస్ బౌలర్లలో రబడ మూడు వికెట్లు తీయగా.. క్వెనా మఫాకా, కేశవ్ మహరాజ్ చెరో రెండు, మార్కో జాన్సెన్, వియాన్ ముల్దర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.షాన్ మసూద్ శతకం.. సెంచరీ మిస్ అయిన బాబర్ ఆజంఈ నేపథ్యంలో.. మొదటి ఇన్నింగ్స్లో 200కు పైగా ఆధిక్యం సంపాదించిన సౌతాఫ్రికా పాకిస్తాన్ను ఫాలో ఆన్ ఆడిస్తోంది. దీంతో వెంటనే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాక్ జట్టు శుభారంభం చేయగలిగింది. కెప్టెన్ షాన్ మసూద్ సెంచరీ(145)తో చెలరేగగా.. బాబర్ ఆజం కూడా శతకం దిశగా పయనించాడు. అయితే, సోమవారం నాటి ఆటలో భాగంగా 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. జాన్సెన్ బౌలింగ్లో బెడింగ్హామ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అయితే, అంతకంటే ముందు అంటే.. ఆదివారం నాటి ఆటలో భాగంగా బాబర్ ఆజం- ప్రొటిస్ పేసర్ వియాన్ ముల్దర్ మధ్య గొడవ జరింది. తన బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి బాబర్ విఫలం కాగా.. ముల్దర్ బంతిని చేజిక్కించుకుని బ్యాటర్ వైపు బలంగా విసిరాడు.సౌతాఫ్రికా పేసర్ దూకుడు.. ఉరిమి చూసిన బాబర్ ఆజంఅప్పటికే ప్రమాదాన్ని పసిగట్టిన బాబర్ ఆజం వికెట్లకు కాస్త దూరంగానే ఉన్నా బంతి అతడికి తాకింది. దీంతో బాబర్ కోపోద్రిక్తుడై.. చూసుకోవా అన్నట్లుగా ముల్దర్వైపు ఉరిమి చూశాడు. అయితే, అతడు కూడా ఏమాత్రం తగ్గకుండా బాబర్ను చూస్తూ దూకుడుగా మాట్లాడాడు. దీంతో గొడవ పెద్దదయ్యే సూచన కనిపించగా అంపైర్ జోక్యం చేసుకుని ఇద్దరినీ సముదాయించాడు. ఇక ఈ మ్యాచ్లో 352 పరుగులకు సగం వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్.. ఓటమి నుంచి తప్పించుకునేందుకు పోరాడుతోంది.Fight moment between Babar Azam and Wiaan Mulder. 🥵Wiaan Mulder unnecessary throws the ball at Babar Azam & showing him verbal aggression. #BabarAzam𓃵 #PAKvsSA #SAvPAK pic.twitter.com/PZnPNTWELZ— Ahtasham Riaz (@ahtashamriaz22) January 5, 2025 -
రైనో కళ్లలో పడ్డారు, ఆపై.. కజిరంగా పార్క్లో భయానక ఘటన
Viral Video మృత్యువు.. ఎటు నుంచి, ఏ రూపంలో ముంచుకొస్తుందో తెలియదు. అలాంటిది చావు ముఖం ఇలా ఉంటుందా? అని ఆ తల్లీకూతుళ్లు గజగజ వణికిపోయారు కాసేపు. అసోం కజిరంగా నేషనల్ పార్క్లో జరిగిన ఓ భయానక ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.ఖడ్గమృగం.. చూడడానికి ఎంతటి భారీకాయంగా ఉంటుందో అంతే ప్రమాదకరమైంది కూడా. ఉగ్రరూపంలో అది చేసే దాడి.. పెద్ద పెద్ద వాహనాలను సైతం కూలదోస్తుంది. అలాంటి జీవి కళ్లెదుట ఆ తల్లీకూతుళ్లు ప్రాణ భయంతో రోదనలు పెడుతూ కాసేపు గడిపారు.కజిరంగా నేషనల్ పార్క్లో ఖడ్గమృగం మంద నడుమ.. టూరిస్టుల జీపులు తిరుగుతూ కనిపించాయి. అయితే మరి దగ్గరగా ఉండడంతో.. వేగంగా వెళ్లేందుకు రెండు జీపులు ప్రయత్నించాయి. ఈ క్రమంలో హఠాత్తుగా మలుపు తిరిగిన రెండో జీపు వెనుక నుంచి తల్లీకూతుళ్లు కిందపడిపోయారు. అంతే.. ఒక్కసారిగా అటు టూరిస్టులు.. ఇటు ఆ తల్లీకూతుళ్ల అరుపులతో ఆ ప్రాంతం మారుమోగింది. ఆ ఇద్దరికీ అతిసమీపంలోనే ఉన్న ఖడ్గమృగం(Rhino).. వెనక్కి తిరిగివాళ్లను చూసింది. ఈలోపు.. అక్కడే ఉన్న మరో ప్రయాణికుల జీపు వైపుగా ఇంకో రైనో దూసుకెళ్లింది. కట్ చేస్తే..ఆ తల్లీ తన కూతురిని అదిమి పట్టుకుని నేలపై పడుకునిపోయింది. రక్షించమంటూ గట్టిగా అరుస్తూ వేడుకుంది. ఈలోపు.. ముందుకు వెళ్లిన జీపు నెమ్మదిగా వాళ్ల దగ్గరకు చేరుకుంది.క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ బిడ్డతో తల్లి వాహనం ఎక్కేసింది. దీంతో ఖడ్గమృగం దాడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు.కాస్త దూరంలో మరో టూరిస్టు వాహనంలో ఉన్న వ్యక్తి.. అదంతా చిత్రీకరించడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో.. పర్యాటకుల భద్రత గురించి చర్చ మొదలైంది. తమదాకా విషయం రావడంతో అధికారులు వైరల్ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు.. ఇలాంటి ప్రాంతాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. కజిరంగాలో బాగోరీ రేంజ్లో ఈ మధ్యే ఈ ఘటనచోటు చేసుకున్నట్లు సమాచారం.అసోం కజిరంగా(Kaziranga) నేషనల్ పార్క్లో 2,613 రైనోలు ఉన్నాయి(2022 లెక్కల ప్రకారం..). ప్రపంచంలోని ఖడ్గమృగాల జనాభాలోనే ఇది దాదాపు 70 శాతం.పైగా ఒంటి కొమ్ము రైనోలకు కజిరంగా నేషనల్ పార్క్ సుప్రసిద్ధం. కొమ్ము 57 సెంటీమీటర్ల పొడుగు పెరుగుతుంది.బరువు.. 2,200 కేజీల నుంచి 3 వేల కేజీల బరువు దాకా పెరుగుతాయి. ఎత్తు 5.7-6.7 ఫీట్లు Horrible incident at the Kaziranga National Park in Assam. Two women fell off a safari jeep as a rhino could be seen in very close proximity. Moments later, a second rhino came running towards another jeep safari, forcing it to take a reverse gear. The women escaped unharmed… pic.twitter.com/6s9zz8WHSZ— Vani Mehrotra (@vani_mehrotra) January 6, 2025అంత భారీకాయం ఉన్నప్పటికీ.. గంటకు 25 మైళ్ల వేగంతో(40 కిలోమీటర్లు) పరిగెడుతాయి. ఇవి బాగా ఈదగలవు కూడా.ఇవి హెర్బివోర్స్. గడ్డి, ఆకులు, పండ్లు తింటాయి.వీటి చర్మం దళసరిగా ఉండి.. ముడలతో ఉంటుంది. వీటి జీవితకాలం 40 సంవత్సరాలుప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీని వరల్డ్ రైనో డేగా నిర్వహిస్తారు.ఈ భూమ్మీద ఐదు జాతుల ఖడ్గమృగాలు ఉన్నాయి. వాటి సంరక్షణ కోసం అవగాహనగా ఈ రోజును నిర్వహిస్తుంటారు. 2024లో ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవాన్ని చాలా ప్రత్యేకంగా నిర్వహించారుకీప్ ద ఫైవ్ ఎలైవ్(ఆ ఐదింటిని బతకనిద్దాం) పేరుతో డేను నిర్వహించారు. -
నేను కూడా మనిషినే.. వెక్కి వెక్కి ఏడ్చిన మాధవీలత
-
ప్రమాదాలు పొంచి ఉన్నాయి జాగ్రత్త.. వీడియో షేర్ చేసిన కేంద్రమంత్రి
ఈటానగర్: దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాదిలో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో నదులు, సరస్సులు మంచుతో గడ్డ కడుతున్నాయి. ఇక, పలు పర్యాటక ప్రాంతాలకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. దీంతో, కొన్ని చోట్ల వారు ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్లో పర్యాటకులు ప్రమాదానికి గురైన వీడియోను కేంద్రమంత్రి కిరణ్ రిజుజు సోషల్ మీడియాలో షేర్ చేశారు.అరుణాచల్ ప్రదేశ్లోని సుందరమైన సెలా పాస్ వద్ద సరస్సు మంచుతో గడ్డకట్టింది. దీంతో,.సందర్శకుల తాకిడి ఎక్కువైంది. ఈ క్రమంలో ఆదివారం సరస్సు వద్దకు వెళ్లిన పర్యాటకుల బృందం అక్కడికి చేరుకుంది. అనంతరం, వారు సరస్సులోకి దిగారు. ఒకచోట గడ్డకట్టిన మంచు పగుళ్లు రావడంతో కొందరు పర్యాటకులు గడ్డకట్టిన నీటిలో పడిపోయారు. దీంతో, మంచు గడ్డ నుంచి బయటకు వచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. అదృష్టవశాత్తు అక్కడే ఉన్న పర్యాటకులు వారిని కాపాడారు.ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కేంద్రమంత్రి కిరణ్ రిజుజు(Kiren Rijiju) ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఈ సందర్బంగా కిరణ్ రిజుజు.. గడ్డకట్టిన ప్రదేశాల వద్దకు పర్యాటకులు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సమయంలో స్థానిక గైడ్స్ సలహాలు తీసుకోవడం మంచిది. మంచుపై నడిచే సమయంలో హిమాపాతం గురించి తెలుసుకోండి. ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కారణంగా వెచ్చని బట్టలు ధరించి ఆనందించండి. మీ భద్రత ముఖ్యం అంటూ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్గా మారింది.At Sela Pass in Arunachal Pradesh. My advice to tourists: Walk on the Frozen Lakes with experienced people, drive carefully on slippery snow roads and be aware of snow avalanche. Temperatures is freezing so wear warm clothes and enjoy. Your safety is important. pic.twitter.com/UWz8xOzd57— Kiren Rijiju (@KirenRijiju) January 5, 2025 -
ఇదెక్కడి రనౌట్ రా సామీ.. క్రికెట్ చరిత్రలో వింత ఘటన
పాకిస్తాన్ దేశవాలీ క్రికెట్లో ఓ వింత రనౌట్ చేసుకుంది. కైడ్ ఏ ఆజమ్ ట్రోఫీలో భాగంగా పెషావర్తో జరిగిన మ్యాచ్లో సియాల్కోట్ బ్యాటర్ మొహమ్మద్ వాలీద్ దురదృష్టకర రీతిలో రనౌటయ్యాడు. బౌలర్ రిటర్న్ త్రోను తప్పించుకోబోయి మొహమ్మద్ వాలీద్ గాల్లోకి ఎగరగా.. అదే సమయంలో బంతి వికెట్లను తాకింది. దీంతో వాలీద్ రనౌటయ్యాడు. ఈ వింత రనౌట్కు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది.A STRANGE RUN-OUT IN PAKISTAN DOMESTIC CRICKET. 🤯 pic.twitter.com/dCCV6e9DhO— Johns. (@CricCrazyJohns) January 4, 2025పూర్తి వివరాల్లో వెళితే.. పెషావర్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ ఖాన్ సంధించిన బంతిని మొహమ్మద్ వాలీద్ డిఫెండ్ చేసుకున్నాడు. ఆ బంతి నేరుగా బౌలర్ ఆమిర్ ఖాన్ చేతుల్లోకి వెళ్లింది. బ్యాటర్ ముందుకు రావడం చూసిన ఆమిర్ ఖాన్ బంతిని వికెట్లపైకి విసిరాడు. అప్పటికే క్రీజ్లో ఉన్న వాలీద్ బంతి నుంచి తప్పించుకోబోయి పైకి జంప్ చేశాడు. వాలీద్ గాల్లో ఉండగానే బంతి వికెట్లను తాకింది. దీంతో పెషావర్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశారు. అప్పీల్ రీజనబుల్గా ఉండటంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్కు రెఫర్ చేశాడు. పలు కోణాల్లో రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ బ్యాటర్ వాలీద్ను రనౌట్గా ప్రకటించాడు. వాలీద్ గాల్లో ఉన్నప్పుడు బంతి వికెట్లను తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనపడింది. క్రికెట్ చరిత్రలో ఇలాంటి విచిత్ర రనౌట్లు చోటు చేసుకోవడం చాలా అరుదు. ఈ రనౌట్కు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు ఇదెక్కడి రనౌట్ రా సామీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం పాక్ జాతీయ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పాక్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో పాక్ బౌలర్లు తేలిపోవడంతో సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా బ్యాటర్లు మూడంకెల స్కోర్ చేశారు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. టెంబా బవుమా (106), కైల్ వెర్రిన్ (100) సెంచరీ అనంతరం ఔట్ కాగా.. డబుల్ సెంచరీ చేసిన ర్యాన్ రికెల్టన్ (233 నాటౌట్) క్రీజ్లో ఉన్నాడు. 123 ఓవర్ల అనంతరం సౌతాఫ్రికా స్కోర్ 477/6గా ఉంది. రికెల్టన్కు జతగా జన్సెన్ క్రీజ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో రెండో రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది. -
హృతిక్ రోషన్ వర్కౌట్లు చూస్తే మతిపోవడం ఖాయం..!
బాలీవుడ్లో అత్యధిక పారితోషకం తీసుకునే నటులలో ఒకరు హృతిక రోషన్. ఆయన వైవిధ్యభరితమైన నటనకు గానూ ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డుల తోసహా ఇతర అవార్డులు ఎన్నో గెలుచుకున్నారు. ఎంతో స్టైలిష్గా ఉంటే హృతిక్కి అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎంతో క్రేజ్ ఉంది. ఆయన ఫిట్నెస్ బాడీకి ఎవ్వరైన ఫిదా అవ్వాల్సిందే. అంతలా కండలు తిరిగిన దేహంతో ఓ యోధుడిలా ఉంటాడు. ఐదు పదుల వయసులో కూడా ఆయన అంతే యంగ్గా ఫిట్గా ఎలా మెయింటైన్ చేస్తున్నాడా అనే సందేహం కలగక మానదు. ఎందుకంటే దీనికి మాములు డెడీకేషన్ సరిపోదు మరీ..హృతిక్ కండలు తిరిగిన దేహం వెనుక ఎంతో శ్రమ, కఠిన వర్కౌట్లు ఉంటాయి. ఫిట్నెస్ పరంగా ఎలాంటి వర్కౌట్లు చేస్తాడో తెలిస్తే మతిపోవడం ఖాయం. అతడు చెమటలు పట్టేలా చేసే.. బరువులు(లాగడం/ఎత్తడం)తో కూడిన వ్యాయామాలు చూస్తే మనకే నొప్పులొచ్చేస్తాయి. అవి చెమటోడ్చి పనిచేసే వాళ్ల మాదిరిగా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే మూటలు ఎత్తేవాళ్లు చేసేవిలా ఉంటాయి. అవి అలాంటి ఇలాంటి కఠినమైన వ్యాయామాలు కాదు. వెయిట్లిఫ్ట్ క్రీడాకారులు మాదిరిగా ఉంటాయి. చూస్తే మాత్రం..ఇంతలానా వర్కౌట్లు అని నోరెళ్లబెడతారు. ఈ కొత్త ఏడాది తన వ్యాయమాల ప్లాన్ ఏంటీ అంటూ క్యాప్షన్తో తన వర్కౌట్ల సెషన్ వీడియోని నెట్టింట పోస్ట్ చేశాడు. ఆ వీడియోల్లో చాలా నొప్పితో కూడిన జిమ్ ఎక్స్ర్సైజుల చూస్తే బాబోయ్ అనిపిస్తుంది. కష్టం, నొప్పితో కూడిని ఈ కఠినతరమైన వ్యాయామాలతోనే నటుడు హృతిక్ ఇంతలా బాడీ మెయింటెయిన్ చేస్తున్నాడా అని విస్తుపోతారు. అందుకు చాలా గట్టి నిబద్ధత కావాలి. ఇంతలా మనసు పెట్టి చేస్తున్నాడు కాబట్టి అతడికి అంతమంది అభిమానులు కాబోలు అనిపిస్తుంది. ఈ శరీరాకృతి కారణంగానే హృతిక్కి మంచి మంచి రోల్స్(క్యారెక్ట్ర్స్) వచ్చాయి. ముఖ్యంగా క్రిష్ సినిమాలో కండలు తిరిగిన దేహంతో చేసే ఫైటింగ్లు, అద్భుతాలు ప్రేక్షకుల్ని కళ్లప్పగించి చూసేలా చేస్తాయి. తన కష్టానికి ప్రతిఫలమే ఈ స్టార్డమ్ అని చెప్పొచ్చు. ఏదీ ఏమైన హృతిక్ డెడికేషన్కి సలాం కొట్టాల్సిందే కదూ..! View this post on Instagram A post shared by HRX (@hrxbrand) (చదవండి: షాలిని పాసీ అందమైన కురుల రహస్యం ఇదే..!) -
కొత్త సంవత్సరంలో తొలి అడుగులు
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా నిత్యం సామాజిక మాధ్యమా(Social Media)ల్లో యాక్టివ్గా ఉంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటారు. కొత్త సంవత్సరం సందర్భంగా తాజాగా ఆయన తన ఎక్స్(X.com) ఖాతాలో షేర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తల్లిబిడ్డల మధ్య ప్రేమను తెలియజేస్తూ, కొత్తగా ఏదైనా ప్రయత్నించాల్సినప్పుడు తల్లి నుంచి వచ్చే ప్రోత్సాహం ఎంతో విలువైందనేలా తెలిపే ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.ఈ వీడియోలో తల్లి తన పక్కన చిన్నపాపను ఉంచి ఫ్లోర్ క్లీన్ చేస్తూంటుంది. ఒక్కసారిగా చిన్నపాప లేచి నడిచేందుకు ప్రయత్నించడం చూసి తల్లి తన పని ఆపేస్తుంది. కొంచెంకొంచెంగా నడవడానికి ప్రయత్నిస్తున్న తన బిడ్డను చూసిన తల్లి హృదయం ఆనందంతో నిండి బిడ్డను మరిన్ని అడుగులు వేసేలా ప్రోత్సహిస్తుంది. బిడ్డ తన మొదటి అడుగులు వేసేందుకు కొంత తడబడినా పట్టుదలతో ముందుకు సాగుతుంది. ఆ చిన్నారి తాపత్రయాన్ని గమనించిన తల్లి ప్రేమగా ఒళ్లోకి తీసుకుని ముద్దాడుతుంది.That’s one way of starting a New Year. Baby steps. The first steps towards fulfilling our new resolutions…🙂 pic.twitter.com/Qs7GGZEx9b— anand mahindra (@anandmahindra) January 1, 2025ఇదీ చదవండి: ‘జీ’కు సెబీ మళ్లీ షోకాజ్ నోటీసులుఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ‘ఇది కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఒక మార్గం. బేబీ స్టెప్స్.. మన కొత్త ప్రయత్నాలు నెరవేర్చే దిశగా తొలి అడుగులు పడాలి’ అని రాసుకొచ్చారు. -
వీడియో: 15 అడుగుల స్టేజ్పై నుంచి పడిపోయిన మహిళా ఎమ్మెల్యే.. తీవ్ర గాయాలు
తిరువనంతపురం: ఈవెంట్కు వెళ్లడమే కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే పాలిట శాపమైంది. సదరు ఎమ్మెల్యే ఈవెంట్లో వేదికపై నుంచి కింద పడిపోవడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆమె తలకు గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్పై చికిత్స జరుగుతోంది. ఇక, ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది.కేరళలోని కలూర్ స్టేడియంలో ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్ హాజరయ్యారు. ఈ క్రమంలో స్టేజీపై సదరు ఎమ్మెల్యే నిర్వాహకులు, కార్యక్రమానికి వచ్చిన వారితో మాట్లాడుతున్నారు. అనంతరం, కుర్చీలో నుంచి లేచి పక్కకు వెళ్లే సమయంలో ఆమె.. వేదికపై నుంచి జారి పడ్డారు. ఈ సమయంలో నేల మీద కాంక్రీట్ స్లాబ్కు తలకు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తీవ్ర రక్తస్రావం అయింది.అయితే, వేదిక ఎత్తు దాదాపు 15 అడుగులు ఉండటంతో ఎమ్మెల్యే తలకు, ఊపిరితిత్తులకు గాయాలయ్యాయి. అలాగే, గర్భాశయం, వెన్నెముకలో గాయాలు కూడా అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్పై వైద్యం జరుగుతోందని.. ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగైనట్టు వైద్యులు వెల్లడించారు. తన వద్దకు వచ్చిన వారిని గుర్తించి, ఆమె మాట్లాడుతున్నారని వైద్యులు తెలిపారు.Footage of MLA Uma Thomas falling from the stage at Kaloor JLN Stadium is now out.#umathomas #kochi #kerala pic.twitter.com/xW7saafNEw— Sreelakshmi Soman (@Sree_soman) January 2, 2025ఇదిలా ఉండగా.. ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. వేదిక ఏర్పాటు విషయంలో నిర్వాహకుల నిర్లక్ష్యం, తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. కార్యక్రమం నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. The site where MLA Uma Thomas fell at the Kaloor stadium and the visuals from the dance event that took place.@NewIndianXpress video by @sanesh_TNIE@MSKiranPrakash @PaulCithara #UmaThomas #Kaloor #Kochi #Kerala pic.twitter.com/odr6oj98y8— TNIE Kerala (@xpresskerala) December 29, 2024 -
వాట్సాప్లో మునిగిపోవడం వల్లే ఘోరం!
తిరువనంతపురం: కేరళ కన్నూరు స్కూల్ బస్సు ప్రమాదం ఘటనలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. సరిగ్గా ప్రమాదం జరిగిన సమయంలోనే.. డ్రైవర్ ఫోన్ నుంచి వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ అయ్యి ఉంది. దీంతో డ్రైవర్ ఫోన్లో మునిగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.కన్నూరు జిల్లా వలక్కై శ్రీస్కంధపురం వద్ద బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ స్కూల్కు చెందిన బస్సు ఒకటి బోల్తాపడడంతో ఓ చిన్నారి మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బస్సు కిటీకిలోంచి చిన్నారి బయట ఎగిరిపడగా.. ఆ వెంటనే బస్సు ఆమె మీద పడడంతో చిధ్రమయ్యింది. కలవరపరిచే ఆ దృశ్యాలు సోషల్ మీడియాకు చేరాయి.#Kerala : A tragic accident occurred in Valakkai, Sreekantapuram, #Kannur, when a school bus belonging to Chinmaya School overturned, claiming the life of an 11-year-old student and injuring 13 others.The deceased, Nedya S Rajesh, a Class 5 student, lost her life after falling… pic.twitter.com/csNHtZAiv3— South First (@TheSouthfirst) January 1, 2025అయితే నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ వాదనను డ్రైవర్ నిజాం తోసిపుచ్చాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను.. తాను బస్సు నడుపుతూ ఫోన్ వాడలేదని.. ఎలాంటి వాట్సాప్ స్టేటస్(Whatsapp Status) అప్లోడ్ చేయలేదని.. బహుశా ఫోన్ టచ్ అయ్యి అలా జరిగి ఉంటుందని చెబుతున్నాడు. అంతేకాదు బస్సు బ్రేకులు పడకపోవం వల్లే యాక్సిడెంట్ జరిగిందని అంటున్నాడతను. అయితే.. యాక్సిడెంట్ టైంకే డ్రైవర్ వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ అయిన విషయాన్ని స్థానిక చానెల్స్ ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి.ఇక బస్సును పరిశీలించిన మోటార్ వెహికిల్స్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ డ్రైవర్ వాదనను కొట్టిపాస్తున్నారు. బ్రేకులు కండిషన్లోనే ఉన్నాయని చెబుతున్నారు. అలాగే బస్సు ఫిట్నెస్ సర్టిఫికెట్ కిందటి నెల డిసెంబర్ 29తో ముగియగా.. తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ దాకా రెన్యువల్ అయినట్లు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం(Driver Negligence) వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు..స్థానికులు మాత్రం సర్వీస్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లే ప్రమాదకరమైన మలుపు కారణంగానే ఈ ఘోరం జరిగిందని, తరచూ ఇక్కడ పలు ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతుండడం గమనార్హం.అప్పటికే ఆలస్యమైంది..శ్రీస్కంధపురం స్కూల్ బస్సు ప్రమాదం(School Bus Accident)లో చనిపోయిన స్టూడెంట్ను ఐదో తరగతి చదువుతున్న నెద్యా రాజేష్(11)గా గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి చేరుకున్న స్థానికులు పిల్లలను బయటికి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. అయితే.. బస్సు కింద నలిగిపోయిన నెద్యాను మాత్రం కాస్త ఆలస్యంగా గుర్తించినట్లు చెబుతున్నారు వాళ్లు.‘‘పెద్ద శబ్దం రాగానే ఇక్కడున్న కొందరం పరిగెత్తాం. బోల్తా పడ్డ బస్సులోంచి పిల్లల రోదనలు వినిపించాయి. వాళ్లను బయటకు తీసి నీళ్లు తాగించాం. డ్రైవర్ సహా పిల్లల్లో కొందరికి గట్టి దెబ్బలే తగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించాం. కానీ, ఓ అమ్మాయి బస్సు కిందే ఉందన్న విషయం కాసేపటికి తెలిసింది. ఆమెను బయటకు తీసేసరికి బాగా రక్తం పోయి స్పృహ లేకుండా ఉంది. ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది’’ అని స్థానికుడొకరు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 15 మందికి చికిత్స అందుతుండగా.. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
అమెరికాలో మన బాస్మతి బియ్యం సంచి క్రేజ్ : నెట్టింట సందడి
సాధారణంగా మహిళలు ట్రెండ్కు తగ్గట్టు తమ హ్యాండ్ బ్యాగులు ఉండేలా జాగ్రత్తపడతారు. ఆఫీస్ వేర్ బ్యాగులు, పార్టీ వేర్ టినీ బ్యాగులు, లగ్జరీ హ్యాండ్ బ్యాగ్లు, హై-ఎండ్ డిజైనర్ పర్స్లు...ఇలా సమ యానుకూలంగా ఎవరి టేస్ట్కు తగ్గట్టు వారు ధరించడం ప్టైల్. ఆమెరికాకు చెందిన మహిళ ఒక సాధారణమైన బియ్యం సంచిని స్టయిలిష్గా టోట్ బ్యాగ్ (Tote bag) సెలూన్కు తీసుకొని వెళ్లిన వైనం నెట్టింట వైరల్ అవుతోంది.మెడ్రన్ దుస్తుల్లో ఉన్న ఒక మహిళ (US Woman) ఒక సెలూన్లో బాస్మతి బియ్యం (Basmati Rice) సంచిని టోట్గా తీసుకువెళ్లడం నెటిజనులను ఆకర్షిస్తోంది ఇండియాలోని ఒకబ్రాండ్కు చెందిన బాస్మతీ బియ్యం సంచిని డిజైనర్ బ్యాగ్లాగా ధరించింది. అమెరికాలో ట్రెండింగ్లో ఏమి ఉందో చూశారా.. అంటూ షేర్ అయిన ఈ వీడియో ఇప్పటికే ఇది 8 లక్షలకు పైగా వ్యూస్ను సాధించింది.‘‘భలే ఉంది, వాటే క్రియేటివిటీ , బోల్డ్ ఫ్యాషన్ ప్రయోగం, బాస్మతి ఉండగా, ఇక గూచి ఎందుకు, ‘‘అయ్యయ్యో.. నా దగ్గర ఉన్న చివరి బియ్యం బస్తా బ్యాగ్ విసిరేసా ..ముందే ఇది చూసి ఉంటేనా..’’ అంటూ రకరకాలుగా నెటిజన్లు ఫన్నీ కామెంట్లను పోస్ట్ చేశారు. రోజువారీ వస్తువులను ఇలా రీయూజ్ చేయడం బావుంది, ఇది పీక్ సస్టైనబిలిటీ - ఒక ప్రయోజనంతో కూడిన ఫ్యాషన్." అని మరికొంతమంది స్పందించారు. అలాగే మొత్తానికి మన జ్యూట్ బ్యాగులు అమెరికన్ల మనసు దోచుకుంటున్నాయి అన్నారు మరికొంతమంది నెటిజన్లు. -
జైస్వాల్ అవుటా? నాటౌటా?.. అంపైర్ కళ్లకు ఏమైంది?
మెల్బోర్న్ టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ అవుటైన తీరు వివాదాస్పదంగా మారింది. స్నీకో మీటర్లో స్పైక్ రాకున్నా జైసూను అవుట్గా ప్రకటించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో భారత బ్యాటర్కు అన్యాయం(Yashasvi Jaiswal’s controversial dismissal) జరిగిందంటూ టీమిండియా అభిమానులు సోషల్ మీడియా వేదికగా అంపైర్ నిర్ణయంపై మండిపడుతున్నారు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy) ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన టీమిండియా.. మూడు టెస్టులు పూర్తి చేసుకుని ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. ఈ క్రమంలో మెల్బోర్న్ వేదికగా గురువారం మొదలైన బాక్సింగ్ డే టెస్టు భారత్కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే రోహిత్ సేనకు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి.ఆది నుంచే తడ‘బ్యా’టు.. ‘స్టార్లు’ దారుణంగా విఫలంఇంతటి కీలక టెస్టులో ఆది నుంచే తడబడ్డ టీమిండియా.. తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్(82) అద్భుత ఇన్నింగ్స్.. నితీశ్ కుమార్ రెడ్డి(114) శతకం వల్ల మ్యాచ్లో నిలవగలిగింది. ఇక ఆసీస్ను రెండో ఇన్నింగ్స్లో 234 పరుగులకే కట్టడి చేసి భారత బౌలర్లు మ్యాచ్పై ఆశలు సజీవం చేశారు.ఈ క్రమంలో ఆసీస్ నిర్దేశించిన 340 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. మళ్లీ పాత కథే పునరావృతమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ(9), కేఎల్ రాహుల్(0), విరాట్ కోహ్లి(5) పూర్తిగా విఫలమయ్యారు. అయితే, ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆది నుంచి క్రీజులో పాతుకుపోయి.. ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు.పంత్ కాసేపురిషభ్ పంత్(Rishabh Pant- 30)తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు జైస్వాల్. అయితే, మిగతా బ్యాటర్ల నుంచి మాత్రం అతడికి పెద్దగా సహకారం అందలేదు. అయినప్పటికీ పట్టుదలగా నిలబడ్డ జైసూ.. అనూహ్య రీతిలో పెవిలియన్ చేరాల్సి వచ్చింది.నాటౌట్ ఇచ్చిన ఫీల్డ్ అంపైర్ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో షార్ట్ బాల్ను ఎదుర్కొనేందుకు సిద్ధమైన జైసూ.. షాట్ కనెక్ట్ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో బంతి వెళ్లి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది. అయితే, ఆస్ట్రేలియా అప్పీలు చేసినా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.స్పైక్ రాలేదు.. అయినాదీంతో ఆసీస్ రివ్యూకు వెళ్లగా.. థర్డ్ అంపైర్ నిర్ణయం కీలకంగా మారింది. అయితే, బంతి బ్యాట్ను లేదంటే గ్లౌవ్ను తాకిందా అన్న విషయం స్పష్టంగా కనబడలేదు. అంతేకాదు.. శబ్దాన్ని సూచించే స్నీకో మీటర్లోనూ స్పైక్ రాలేదు. అయినప్పటికీ తనకు బంతి గ్లౌవ్ను తాకినట్లుగా కనిపించిందని పేర్కొంటూ థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు.ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తారుమారు చేసి.. జైస్వాల్ను అవుట్గా ప్రకటించాలని సూచించాడు. దీంతో టీమిండియా కీలక వికెట్ కోల్పోయింది. 208 బంతులు ఎదుర్కొని 84 పరుగులు చేసిన జైస్వాల్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఏడో వికెట్గా అతడు వెనుదిరిగాడు.అయితే, తనను అవుట్గా ప్రకటించడం పట్ల జైసూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, ఇద్దరు ఫీల్డ్ అంపైర్లు అతడిని మైదానం వీడాల్సిందిగా సూచించడంతో నిరాశగా వెనుదిరిగాడు.అంపైర్కు కళ్లు కనిపించడం లేదా?ఈ నేపథ్యంలో జైస్వాల్ అవుటైన తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. టెక్నికల్ ఎవిడెన్స్ కాకుండా.. కేవలం విజువల్ ఎవిడెన్స్ ద్వారా.. అది కూడా క్లారిటీ లేకుండా బ్యాటర్ను ఎలా అవుట్గా పరిగణిస్తారని టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అంపైర్కు కళ్లు కనిపించడం లేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా 184 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. తద్వారా ఐదు టెస్టుల సిరీస్లో 1-2తో వెనుకబడి ఉంది.చదవండి: వారి మాటలు తప్పని నిరూపించా.. ఇక మిగిలింది అదే: నితీశ్ రెడ్డిThird Umpire giving the decision on Yashasvi Jaiswal. pic.twitter.com/HVYzaNkLlf— Mufaddal Vohra (@mufaddal_vohra) December 30, 2024 -
అంత ప్రమాదంలో బతికి బట్టకట్టాడు.. మరో వీడియో వైరల్
ఒక ఘోర ప్రమాదం.. అందులో చావు అంచు నుంచి బయటపడితే ఎవరైనా ఏం చేస్తారు?.. దేవుడికి దణ్ణం పెట్టి అక్కడి నుంచి పరుగులు తీస్తారు. ఇంకాస్త ధైర్యవంతులైతే ఆపదలో ఉన్నవాళ్లకు సాయం చేస్తారు. కానీ, ఇక్కడో ప్రయాణికుడు మాత్రం స్పాట్లో కలియదిరుగుతూ ఆ తీవ్రతను తెలియజేస్తూ ఏకంగా ఓ వీడియో తీశాడు. అజర్ బైజన్ ఎయిర్లైన్స్(Azerbaijan Airlines) ప్రమాదం తాలుకా మరో వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.అజర్ బైజన్ ఎయిర్లైన్స్కు చెందిన జె2-8243 విమానం ప్రమాదానికి గురికావడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదం జరిగాక ఓ ప్రయాణికుడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. సుబ్ఖోన్ రఖిమోవ్ అనే ఆ ప్రయాణికుడు అదృష్టంకొద్దీ స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 🚨AZERBAIJAN AIRLINES PASSENGER WHO SURVIVED CRASH FILMS SHRAPNEL DAMAGESubkhon Rakhimov, a passenger on the Azerbaijan Airlines flight that tragically crashed, miraculously survived the incident. He initially filmed a video for his wife as the plane plummeted from the sky.… https://t.co/J9oGZIpGiG pic.twitter.com/0nk9YIbtJV— Mario Nawfal (@MarioNawfal) December 26, 2024అయితే ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే.. తన ఫోన్లో అక్కడి దృశ్యాలను చిత్రీకరించాడు. అయితే విమాన తోకభాగంపై, రెక్కలపై చిన్న చిన్న రంధ్రాలు ఉండడం గమనించవచ్చు. విశేషం ఏంటంటే.. అంతకు ముందు ప్రమాద సమయంలోనూ వైరల్ అయిన వీడియో కూడా ఈయనగారు పోస్ట్ చేసిందే.ప్రమాదం సమయంలో భయాందోళనకు గురైన ప్రయాణికుల హాహాకారాలు వీడియోలో వినిపిస్తున్నాయి. సుబ్ఖోన్ రఖిమోవ్ మాత్రం భగవంతుడ్ని ప్రార్థిస్తూ కనిపించాడు. ఆపై విమానం కూలిన అనంతరం ప్రయాణికులు చెల్లాచెదరుగా పడి ఉన్న దృశ్యాలు కనిపించాయి.The final moments of the Azerbaijan Airlines plane before its crash in Kazakhstan were captured by a passenger onboard.Aftermath also included in the footage. pic.twitter.com/nCRozjdoUY— Clash Report (@clashreport) December 25, 2024బాకు నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తుండగా కజకిస్థాన్(Kazakhstan)లోని అక్టౌలో కూలిపోయింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై అంతర్జాతీయ మీడియా పలు కథనాలు వెలువడ్డాయి. ఈ ప్రమాదం నుంచి 29 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన అజర్బైజన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం నేపథ్యంలో గురువారం ఒక్కరోజు జాతీయ సంతాపం దినంగా పాటించారు.ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. పొగమంచు కారణంగా జరిగిందని.. పక్షిని ఢీ కొట్టడంతో జరిగిందని రకరకాల ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. అయితే ప్రమాదం జరిగిన తీరు.. విమాన రెక్కలకు ఉన్న రంధ్రాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా పనిగా ఊహాజనిత కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాడిని తిప్పికొట్టే క్రమంలో రష్యా వైమానిక దళాలు జరిపిన దాడిలో.. ఈ విమాన ప్రమాదం జరిగిందా? అని తొలుత చర్చ నడిచింది. అయితే ఇటు రష్యాతో పాటు అటు కజకస్తాన్.. ఘటనపై దర్యాప్తు పూర్తి కాకుండా ఒక నిర్దారణకు రావడం సరికాదని చెబుతున్నాయి.ఇదీ చదవండి: ఉక్రెయిన్కు బైడెన్ బంపరాఫర్ -
జుట్టుండాలేగానీ.. మతిపోయే స్టైల్స్ ఇదిగో ఇలా!
ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో కాదేది కళకు అనర్హం. కాలి గోటి నుంచి తల వెంట్రుకల ద్వారా ప్రతీదీ స్టైలిష్గా ఉండాలి. ఫ్యాషన్లో ట్రెండ్ సెట్ చేయాలి. ఈ క్రేజీ ట్రెండ్కనుగుణంగా డిజైనర్లు కూడా కొత్త కొత్త డిజైన్లతో ఆకట్టుకుంటున్నారు. అయితేతాజాగా సరికొత్త హెయిర్ ఆర్ట్తో వారెవ్వా అనిపించుకున్నారు ఒక స్టైలిస్ట్. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. జుట్టు ఉన్న అమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే అన్నట్టు ఈ వీడియోలో హెయిర్ ఆర్టిస్ట్ అతేఫ్ కాబిరి జుట్టును రకరకాలుగా కళాత్మకంగా తీర్చిద్దిద్దింది. అద్భుతమైన డిజైన్లతో అబ్బుర పోయేలా చేసింది. @రైన్మేకర్ అనే యూజర్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. A compilation of the most extraordinary and complex hair artworks Atefeh Kabiri.[📹 atefe_kabiri_hairstylist]pic.twitter.com/U4IAQ1SLx8— Massimo (@Rainmaker1973) December 27, 2024 -
కోహ్లికి అవమానం.. ఇంత నీచంగా ప్రవర్తిసారా?
మెల్బోర్న్ టెస్టులో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి అవమానం జరిగింది. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ పెవిలియన్కు వెళ్తున్న సమయంలో.. ప్రేక్షకులు పరుష పదజాలంతో అతడిని దూషించారు. దీంతో వెనక్కి తిరిగి వచ్చిన కోహ్లి సీరియస్గా చూస్తూ.. వారికి బదులిచ్చేందుకు సిద్ధం కాగా.. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అతడికి నచ్చజెప్పి పంపించారు.ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test) మొదలైంది.ఆసీస్ స్కోరు 474ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో కంగారూ జట్టు తొలి ఇన్నింగ్స్లో 474 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. టాపార్డర్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal- 82) అద్బుత అర్ధ శతకంతో మెరవగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(3) విఫలమయ్యాడు.ఆది నుంచే తడ‘బ్యాటు’.. ఆదుకున్న జోడీవన్డౌన్లో వచ్చిన కేఎల్ రాహుల్ 24 పరుగులకే నిష్క్రమించగా.. విరాట్ కోహ్లి(86 బంతుల్లో 36).. జైస్వాల్తో కలిసి 102 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. దీంతో కాస్త కోలుకున్నట్లే కనిపించిన టీమిండియాకు.. వరుస ఓవర్లలో జైస్వాల్- కోహ్లి అవుట్ కావడంతో గట్టి షాక్ తగిలింది. రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ 46 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.ఇదిలా ఉంటే.. ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్లో వికెట్ కీపర్కు క్యాచ్ అవుటైన కోహ్లి.. పెవిలియన్కు వెళ్తుండగా.. ఆసీస్ ఫ్యాన్స్ అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఏంటీ మీ సంగతి?దీంతో వెనక్కి తిరిగి వచ్చిన కోహ్లి.. ‘‘ఏంటీ మీ సంగతి?’’ అన్నట్లుగా సీరియస్ లుక్ ఇచ్చాడు. అంతలో అక్కడ ఉన్న భద్రతా అధికారి.. కోహ్లిని అనునయించి.. నచ్చజెప్పి లోపలికి తీసుకువెళ్లాడు.కాగా బాక్సింగ్ డే టెస్టు తొలిరోజు ఆట సందర్భంగా ఆసీస్ యువ ఓపెనర్, అరంగేట్ర బ్యాటర్ సామ్ కొన్స్టాస్(60)తో కోహ్లికి గొడవ(Virat Kohli- Sam Konstas Altercation) జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీ కోహ్లి మ్యాచ్ ఫీజులో ఇరవై శాతం మేర కోత కూడా విధించింది. ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? అయితే, ఈ గొడవను దృష్టిలో పెట్టుకుని ఆసీస్ మీడియాతో పాటు ఆ దేశ అభిమానులు కోహ్లి పట్ల అవమానకర రీతిలో వ్యవహరించారు. కోహ్లిని ఉద్దేశించి.. జోకర్ అన్న అర్థంలో ఆసీస్ మీడియా కథనాలు ప్రచురించింది. ఇక కంగారూ జట్టు అభిమానులేమో ఇలా గ్రౌండ్లో కోహ్లిని హేళన చేస్తూ అభ్యంతరకర భాష ఉపయోగించారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ ఘాటుగా స్పందించారు. దిగ్గజ ఆటగాడి పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? అని సోషల్ మీడియా వేదికగా #Viratkohli #KingKohli అంటూ ట్రెండ్ చేస్తున్నారు.విమర్శించండి.. కానీభారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా సతీమణి, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. ‘‘అత్యుత్తమ బ్యాటర్ పట్ల ఇలా అగౌరవంగా ప్రవర్తించడం సరికాదు. విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది. కానీ హద్దులు మీరి.. అసభ్యంగా వ్యవహరించకూడదు’’ అని సంజనా పేర్కొన్నారు.చదవండి: టీమిండియా అంటే చాలు, రెచ్చిపోతాడు.. స్టీవ్ స్మిత్ ప్రపంచ రికార్డుReally disrespectful behavior with country's best batter. Criticism is ok, but abuse crosses the line. Upholding the spirit of cricket and supporting our players with dignity.#ViratKohli𓃵 #INDvsAUS #AUSvIND pic.twitter.com/NnZPDkeOs7— Sanjana Ganesan 🇮🇳 (@iSanjanaGanesan) December 27, 2024 -
కోడిగుడ్లతో బీజేపీ సీనియర్ ఎమ్మెలేపై దాడి
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ఆర్ ఆర్ నగర్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడి(Muniratna Naidu)పై కొందరు ఆగంతకులు కోడిగుడ్డు విసిరారు. అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి మునిరత్న బెయిల్ మీద బయటకు వచ్చి రెండు నెలలు అయ్యింది. అయితే అప్పటి నుంచి ఆయనకు ప్రజల్లోకి వచ్చింది ఇదే తొలిసారికాగా.. ఆ టైంలోనే దాడి జరగడం గమనార్హం.బుధవారం లక్ష్మీ నగర్లో నిర్వహించిన వాజ్పేయి(Vajpayee) శతజయంతి ఉత్సవాల్లో మునిరత్న పాల్గొన్నారు. తిరిగి తన అనుచరులతో వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఆయనపైకి గుడ్డు విసిరారు. ఆపై మంటతో కాసేపు ఆయన విలవిలలాడిపోయారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఆయనకు రకరకాల వైద్య పరీక్షలు జరిపారు. చివరకు ఆయన బాగానే ఉన్నారని ప్రకటించి అర్ధరాత్రి పూట వైద్యులు డిశ్చార్జి చేశారు.ఇదిలా ఉంటే.. మునిరత్న నాయుడు రాజకీయాలతోనే కాదు.. సినిమాలతోనూ పేరు సంపాదించుకున్నారు. ఉపేంద్ర, దర్శన్ లాంటి అగ్ర తారాలతో ఆయన చిత్రాలను నిర్మించారు. 2013, 2018, 2020, 2024 ఎన్నికల్లో రాజరాజేశ్వరి నగర్(RR Nagar) నుంచి ఆయన ఎమ్మెల్యేగా నెగ్గారు. గతంలో కర్ణాటక కేబినెట్ మినిస్టర్గానూ పని చేశారు. అయితే.. In a dramatic incident on Wednesday, #BJP MLA #Munirathna was targeted with an egg during an event marking the birth anniversary of former Prime Minister #AtalBihariVajpayee in #Bengaluru's #NandiniLayout.Police have arrested three individuals in connection with the attack and… pic.twitter.com/TWavEBJADq— Hate Detector 🔍 (@HateDetectors) December 25, 2024ఈ ఏడాది సెప్టెంబర్లో ఆయనపై అనూహ్యమైన ఆరోపణలు వచ్చాయి. సోషల్ వర్కర్గా పని చేసే ఓ మహిళ(40) ఫిర్యాదుతో ఈ బీజేపీ ఎమ్మెల్యేపై పలు నేరాల కింద కేసు నమోదయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద మూడు రోజులుల్లో ఉండి బయటకు వచ్చారాయన. అయితే బయటకు వచ్చి కొన్నినిమిషాలకే.. అత్యాచారం కేసు(Rape Case)లో ఆయన్ని మరోసారి అరెస్ట్ చేశారు.వాపై నెలరోజులపాటు సెంట్రల్ జైల్లో గడిపిన ఆయనకు.. అక్టోబర్ మూడో వారంలో ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఊరట ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది. గుడ్డు దాడిపై రాజకీయం తమ పార్టీ సీనియర్ నేత మునిరత్నపై కోడిగుడ్డు దాడి కాంగ్రెస్ కార్యకర్తల పనేనని బీజేపీ(BJP) ఆరోపిస్తోంది. మునిరత్న మరో అడుగు ముందుకు వేసి.. ఇది తనను చంపేందుకు జరిగిన కుట్ర అని ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మరికొందరు కాంగ్రెస్ నేతలు ఈ కుట్రలో భాగమయ్యారని అన్నారాయన. అయితే ఘటనపై నందిని లేఅవుట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల వివరాలను వెల్లడించాల్సి ఉంది. -
స్టూడెంట్స్తో మహిళా ప్రొఫసర్ క్రేజీ డ్యాన్స్ : వీడియో హల్చల్
సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్స్కు క్రేజ్ ఎక్కువ. సూపర్ హిట్ సాంగ్కు రీల్స్ చేసినా, డ్యాన్స్ చేసిన ఇక రచ్చ రచ్చే. తాజాగా కొచ్చిన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ పుష్ప -2 సినిమాలో హిట్ సాంగ్ కి చేసిన డ్యాన్సింగ్ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇన్స్టాలో షేర్ అయిన ఈ వీడియో ఇప్పటికే 70 లక్షలకుపైగా వ్యూస్ను సంపాదించింది.కొచ్చిన్ (Cochin)యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT)లో వేడుకలు ఘనంగా జరుగు తున్నాయి. ఇందులో భాగంగా విద్యార్థినిలు డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు. అప్పటిదాకా ప్రశాంతంగా చూస్తూ కూర్చున్న మహిళా ప్రొఫెసర్ విద్యార్థినిలతో జత కలిసి స్టెప్పులు వేయడం మొదలు పెట్టారు. తన చేతిలోని బ్యాగ్ను కుర్చీపై పెట్టి మరీ రంగంలోకి దిగి పోయారామె. అమ్మాయిలతో సమానంగా జోరుగా డ్యాన్స్ చేశారు. అదీ చీరలో.. సూపర్ స్టెప్స్తో తమకు పోటీగా మేడమ్ తమతో జత కట్టడం చూసిన విద్యార్థినులు మరింత ఉత్సాహంగా డాన్స్ ఇరగదీశారు. ఏ పాటకో తెలుసా?పుష్ప 2: ది రూల్ మూవీలోని ‘పీలింగ్స్’ సాంగ్కు మైక్రోబయాలజీ ప్రొఫెసర్,డిపార్ట్మెంట్ హెడ్ (HOD), అయిన పార్వతి వేణు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. “మీ హెచ్ఓడీ మేడమ్ మీ కంటే ఎక్కువ వైబర్గా ఉన్నప్పుడు” అనే క్యాప్షన్తో షేర్ అయిన ఈ వీడియోను నెటిజన్లు ఉత్సాహంగా కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by @ottta_mynd -
అల్లు అర్జున్ ఇంటి గేటును పరదాలతో మూసివేసిన సిబ్బంది
-
చిన్నారులను కూడా వదలని కర్కశత్వం
-
సర్ఫరాజ్ కెప్టెన్సీలో కోహ్లి.. గెలిచింది మాత్రం వాళ్లే!
టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా కంగారూ జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో పెర్త్లో జరిగిన తొలి మ్యాచ్లో గెలుపొందిన భారత్.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో మాత్రం ఓటమిని చవిచూసింది.బాక్సింగ్ డే టెస్టు కోసం సన్నద్ధంఇక వర్షం వల్ల బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో జరిగిన మూడో టెస్టు ‘డ్రా’గా ముగియడంతో ఇరుజట్లు ఇప్పటికీ 1-1తో సమంగా ఉన్నాయి. తదుపరి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో భారత్- ఆసీస్ తలపడనున్నాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రాక్టీస్ ముమ్మరం చేసిన భారత ఆటగాళ్లు నెట్స్లో తీవ్రంగా చెమటోడుస్తున్నారు. ఈ క్రమంలో ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ లైవ్లీ ఫీల్డింగ్ డ్రిల్తో టీమిండియా ప్లేయర్ల మధ్య పోటీ నిర్వహించాడు. ఇందులో భాగంగా ఆటగాళ్లను మూడు జట్లుగా విభజించారు. వీటికి యువ క్రికెటర్లనే కెప్టెన్లుగా నియమించడం విశేషం.సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్సీలో కోహ్లిగ్రూప్-1లో భాగంగా సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లి, దేవ్దత్ పడిక్కల్, అభిమన్యు ఈశ్వరన్, హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్.. గ్రూప్-2లో మహ్మద్ సిరాజ్ సారథ్యంలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డి.. గ్రూప్-3లో ధ్రువ్ జురెల్ నాయకత్వంలో జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శుబ్మన్ గిల్, ప్రసిద్ క్రిష్ణ, వాషింగ్టన్ సుందర్ ఈ డ్రిల్లో పాల్గొన్నారు.జురెల్ సారథ్యంలోని జట్టుదే గెలుపుఅయితే, ఫీల్డింగ్తో అద్భుత నైపుణ్యాలతో మెరిసిన జురెల్ బృందం గెలిచింది. ఈ నేపథ్యంలో జురెల్ కెప్టెన్సీలోని జట్టుకు మూడు వందల డాలర్ల క్యాష్ రివార్డు లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతోంది. కాగా మెల్బోర్న్లో డిసెంబరు 26 నుంచి 30 వరకు నాలుగో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.అలా అయితేనే ఫైనల్ ఆశలు సజీవంఇక భారత్- ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టెస్టుకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదిక. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో మిగిలిన ఈ రెండు టెస్టులు గెలిస్తేనే రోహిత్ సేన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇక బ్రిస్బేన్ టెస్టు తర్వాత భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ల రూపంలో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఆసీస్తో సిరీస్కు అందుబాటులో ఉండటంతో అశూ స్థానాన్ని బీసీసీఐ భర్తీ చేయలేదు. చదవండి: పాకిస్తాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి జట్టుగా ఘనత View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
#HBDYSJAGAN: ట్రెండ్ సెట్ చేసిన అభిమానం
Jagan Birthday Shakes Social Media: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం నేడు. అయితే.. ముందు నుంచే ఈ కోలాహలం నడిచింది. మొన్నా.. నిన్నంతా.. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే జగనన్న అంటూ సోషల్ మీడియా హోరెత్తగా.. ఇవాళ హ్యాపీ బర్త్ డే వైఎస్ జగన్ తో ఊగిపోతోంది. ఇవాళ జననేత పుట్టిన రోజు సందర్భంగా.. వైఎస్సార్సీపీ తరఫున, అలాగే అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలకు, ఇతర కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. కానీ, ఈలోపే సోషల్ మీడియా దద్దరిల్లడం మొదలైంది. జగన్ బర్త్డే హ్యాష్ ట్యాగ్ దుమ్మురేపేస్తోంది. ఎక్స్(మాజీ ట్విటర్)లో ఇండియా వైడ్గా టాప్ ట్రెండింగ్లో వైయస్ జగన్ బర్త్డే కొనసాగుతోంది.#HBDYSJagan#HBDYSJagananna#HbdysJagansir200K Tweets Done & Dusted✅🔥#HBDYSJagan pic.twitter.com/mrLVHcdqTr— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) December 21, 2024తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలలా, విదేశాల నుంచి కూడా #HBDYSJagan తో పాటు అనుబంధ హ్యాష్ ట్యాగ్తో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఈ దెబ్బకు హేటర్స్ సైతం పోటాపోటీ పోస్టులు వేయలేక చల్లబడ్డారు. ఇంకోపక్క.. ఏపీలోనే కాదు తెలంగాణలోనూ జగన్.. వైఎస్సార్సీపీ అభిమానులు రాత్రి నుంచే సంబురాలు చేస్తున్నారు. రాజధాని హైదరాబాద్లో కూకట్పల్లి, పంజాగుట్టలో వేడుకలు అంటూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. శివమెత్తి లేచిన అభిమానం 🔥🔥@ysjagan #HBDYSJagan #YSJagan pic.twitter.com/5gl8NZwhUT— 𝐑𝐚𝐠𝐮𝐥𝐮𝐭𝐮𝐧𝐧𝐚 𝐘𝐮𝐯𝐚𝐭𝐚𝐫𝐚𝐦 (@karnareddy4512) December 20, 2024ఏ యేడు కాయేడు సోషల్ మీడియాలో వైఎస్ జగన్ బర్త్డే పోస్టుల రూపంలో సరికొత్త రికార్డు నెలకొల్పుతోంది. ఎక్స్లో టాప్ త్రీ పొజిషన్లోనే సుమారు 10 గంటలకు పైగా కొనసాగడం.. మామూలు విషయం కాదు. తెల్లవారుజాము నుంచి పోస్ట్ చేసేవాళ్ల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఒక్క ఎక్స్లోనే కాదు.. ఇటు వాట్సాప్ స్టేటస్ల రూపంలో, మరోవైపు ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, ఫేస్బుక్లోనూ జగన్ బర్త్ డే సందర్భంగా అభిమానం ఉప్పొంగుతోంది.ఇదీ చదవండి: ఎవరేమన్నా.. జగన్ విషయంలో ఇదే అక్షర సత్యం! -
రంగారెడ్డి జిల్లా కోకాపేట్ లో బ్లాస్టింగ్స్ కలకలం
-
ఏడు ఆపరేషన్లు, ఏడు లక్షలు ఖర్చు, చివరికి ఏడడుగులు: ముద్దుగుమ్మల లవ్స్టోరీ
ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్లో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు అమ్మాయిల స్నేహం వీర ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఇందులో పెద్ద వింత ఏముంది అనుకుంటున్నారా? ఈ జంటలోఒక అమ్మాయి తన లింగాన్ని మార్చుకుని పెళ్లి చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్లో జరిగిన వివాహానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఒక అమ్మాయి ఏకంగా ఏడుసార్లు లింగ మార్పిడికి సంబంధించిన ఆపరేషన్లు చేయించుకుంది ఇందుకోసం ఏడు లక్షల రూపాయలు ఖర్చుపెట్టింది. అంతేకాదు ఇరు కుటుంబాల అంగీకారంతో అంగరంగ వైభవంగాజరిగిన పెళ్లి వేడుకలో ఏడడుగులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట తెగవైరల్ అవుతున్నాయి.#UttarPradesh | Two girls got married, with one undergoing a gender change to become a man and taking on the role of the groom.This unique marriage has become the talk of the entire Kannauj district!What are your thoughts about this marriage? pic.twitter.com/w2Jskwytk2— Organiser Weekly (@eOrganiser) December 20, 2024 కన్నౌజ్లోని సరయామీరాలో ఉన్న డెవిన్ తోలా ప్రాంతానికి వీరిద్దరూ ఇటీవల కొన్ని రిలేషన్షిప్లో ఉన్నారట. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో తన లింగాన్ని మార్చుకొని మరీ స్నేహితురాల్ని పెళ్లాడింది. గతేడాది ఉత్తరప్రదేశ్లోని బరేలీలో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. బదౌన్కు చెందిన ఓ యువతి టీచర్ గా పని చేసేందుకు బరేలీకి వచ్చింది. అక్కడ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అయితే పెళ్లి, లేదంటే చావు అన్న స్థితికి వచ్చారు. దీంతో కుటుంబ సభ్యుల చొరవతో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని అన్ని అవరోధాలు అధిగమించిన తరువాత వివాహం చేసుకున్నారు. -
మనిషి మెదడులో రహస్య గదులు..
-
2025 లో మహా ప్రళయం
-
అధికారులకు అరగంట శిక్ష!
అధికారులు ప్రజలతో వ్యవహరించే తీరు కొన్నిసార్లు వివాదాస్పదంగా మారుతుంటుంది. ఆ టైంలో చూసేవాళ్లకు రక్తం మరిగిపోతుంటుంది. వాళ్లు ఉన్నది తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించడానికే కదా! అనుకుంటాం. అయితే.. అలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు ఇక్కడ ఓ ఉన్నతాధికారి భలే శిక్ష విధించారులేండి.అది నోయిడా అథారిటీ కార్యాలయం. సోమవారం నాడు ఓ వృద్ధ జంట తమ పని కోసం అక్కడికి వచ్చారు. చాలాసేపు దాకా అక్కడున్నవాళ్లెవరూ వాళ్లను పట్టించుకోలేదు. దీంతో బిక్కుబిక్కుమంటూ వాళ్లు అలా నిలబడే ఉండిపోయారు. ఇది నోయిడా అథారిటీ సీఈవో లోకేష్ ఎం గమనించారు. మరో అరగంట పోయాక చూస్తే.. ఆ వృద్ధ జంట అలాగే నిలబడి ఉన్నారట!. దీంతో.. ఆయన తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చారు.వెంటనే.. బయటకు వచ్చి అరగంట పాటు నిలబడి పని చేయండి అని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. దీంతో అక్కడున్నవాళ్లంతా నిర్ఘాంతపోయారు. అలా నిలబడి పని చేస్తే.. ఆ వృద్ధ జంట పడ్డ కష్టమేంటో మీకు తెలుస్తుంది అని ఆయన వాళ్లకు చెప్పినట్లు తెలుస్తోంది. హ్యాట్సాఫ్ సర్!.. ప్రస్తుతం ఆ శిక్షకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.In Noida Authority, an elderly couple was struggling to get their file approved but faced complete neglect. Witnessing this, the CEO took a bold step – ordered all employees to stand and work for 30 minutes as punishment!#CEO #Noida pic.twitter.com/RrZMOAc4xn— Sneha Mordani (@snehamordani) December 17, 2024 -
Kohli- Gambhir: మ్యాచ్ గెలిచినంత సంబరం.. రోహిత్ సైతం..
గబ్బా టెస్టులో నాలుగో రోజు టీమిండియాకు అనుకూలించింది. ఓవర్ నైట్ స్కోరు 51/4తో మంగళవారం నాటి ఆట మొదలుపెట్టిన భారత్ను ఓపెనర్ కేఎల్ రాహుల్ తన ఆటతో ఆదుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(10) విఫలమైనా.. వికెట్ పడకుండా జాగ్రత్త పడిన ఈ కర్ణాటక బ్యాటర్.. విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 139 బంతులు ఎదుర్కొని 84 పరుగులతో రాణించాడు.రాహుల్, జడేజా విలువైన అర్ధ శతకాలుఇక కేఎల్ రాహుల్తో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా అదరగొట్టాడు. ఏడో స్థానంలో వచ్చిన జడ్డూ 123 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. వీరిద్దరు హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ టీమిండియాకు కష్టాలు తప్పలేదు. ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకోవాలంటే.. జడ్డూ తొమ్మిదో వికెట్గా వెనుదిరిగే సమయానికి భారత్ ఇంకా ముప్పై మూడు పరుగులు చేయాల్సి ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో క్రీజులోకి వచ్చిన టెయిలెండర్ ఆకాశ్ దీప్ బ్యాట్తో అదరగొట్టాడు.గట్టెక్కించిన పేసర్లుమరో పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా ఫాలో ఆన్ ముప్పు నుంచి తప్పించుకుంది. దీంతో భారత శిబిరంలో ఒక్కసారిగా సంబరాలు మొదలయ్యాయి.మ్యాచ్ గెలిచినంత సంబరంహెడ్కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సంతోషం పట్టలేకపోయారు. గంభీర్ అయితే ఒక్కసారిగా తన సీట్లో నుంచి లేచి కోహ్లికి హై ఫైవ్ ఇచ్చాడు. ఇక కోహ్లి కూడా మ్యాచ్ గెలిచామన్నంత రీతిలో ఆనందంతో పొంగిపోయాడు. రోహిత్ను చీర్ చేస్తూ గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. రోహిత్ కూడా చిరునవ్వులు చిందించాడు. అవును మరి.. టెస్టుల్లో ఇలాంటి మూమెంట్లే సిరీస్ ఫలితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. గబ్బా టెస్టును కనీసం డ్రాగా ముగించిన భారత్కు సానుకూలాంశమే. ఇదిలా ఉంటే.. నాలుగో రోజు ఆట ముగిసే సరికి బుమ్రా 10(27 బంతుల్లో ఒక సిక్స్), ఆకాశ్ దీప్27 (31 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్)తో క్రీజులో ఉన్నారు. వీరిద్దరు చెరో సిక్సర్ బాదడం ఆఖర్లో హైలైట్గా నిలిచింది.గబ్బాలో కనీసం డ్రా కోసంకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇరుజట్ల మధ్య పెర్త్లో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆసీస్ గెలిచాయి. దీంతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది.ఈ క్రమంలో బ్రిస్బేన్లోని గబ్బా మైదానంలో శనివారం మూడో టెస్టు మొదలైంది. ఇందులో టాస్ గెలిచిన రోహిత్ సేన తొలుత బౌలింగ్ చేయగా.. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్కు దిగిన టీమిండియా మంగళవారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి తొమ్మిది వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఇక గబ్బా టెస్టుకు ఆరంభం నుంచే వర్షం అంతరాయం కలిగించడం టీమిండియాకు కాస్త అనుకూలించిందని చెప్పవచ్చు.చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం Moment hai bhai, moment hai ft. #ViratKohli! 😂#AUSvINDOnStar 👉 3rd Test, Day 5 | 18th DEC, WED, 5:15 AM! #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/3s0EOlDacC— Star Sports (@StarSportsIndia) December 17, 2024Read the lips of Gambhir and Kohli, follow-on bach gaya bc 😂 pic.twitter.com/ibIRSQTwEK— Prayag (@theprayagtiwari) December 17, 2024THE MOMENT AKASH DEEP & BUMRAH SAVED FOLLOW ON..!!!! 🇮🇳- The celebrations and Happiness of Virat Kohli, Rohit Sharma & Gautam Gambhir was priceless. ❤️ pic.twitter.com/i0w0zRyNPa— Tanuj Singh (@ImTanujSingh) December 17, 2024 -
కెమిస్ట్రీ పాఠాన్ని ఇలా కూడా బోధిస్తారా? ఆ టీచర్ వేరే లెవల్!
ఉపాధ్యాయుల బోధనా పద్ధతులన్నీ.. విద్యార్థులకు విపులంగా అర్థం కావాడమే ప్రధాన అంశం. అందుకోసం ఒక్కొక్క టీచర్ ఒకో పంథాలో తమ క్లాస్ని చెబుతుంటారు. కొందరు టీచర్లు చెప్పే బోధనా పద్ధతి విద్యార్థులకు బోరింగ్ ఫీలింగ్ కలగుకుండా ఆ సబ్జెక్ట్పై ఆసక్తిని పెంచేలా ఉంటుంది. అచ్చం అలానే ఓ ఫిజిక్స్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు రసాయన శాస్త్రంలోని ఓ కాన్సెప్ట్ క్లియర్గా అర్థం కావాలని ఎంతలా కష్టపడ్డాడో చూస్తే.. ఫిదా అవ్వాల్సిందే.ఎలా చెప్పారంటే..ప్రముఖ ఎడ్ టెక్కి చెందిన ఒక ఫిజిక్స్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు కెమిస్ట్రీలోని చిరాలటీ కాన్సెప్ట్ని బోధిస్తున్నారు. చిరాలటీలో అణువులు ఒక చిరాల్ కేంద్రాన్ని కలిగి ఉంటాయి. అద్దంలో అతిగా ఇంపోజ్ కావు. కాకపోతే రసాయన చర్యలో ఎడమ, కుడిగా కుడి ఎడమ గానూ అద్దంలో కనిపించే చిత్రంలాగా కనిపిస్తుంది. అదే దీని ప్రత్యేకత. ఇది విద్యార్థులకు అర్థమయ్యేలా తన శరీర భంగిమలతో క్లియర్గా వివరించారు. చెప్పాలంటే తన బోధనలో యోగాని కూడా మిళితం చేసి చెబుతున్నట్లుగా వివరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆ ఉపాధ్యాయుడికి తన వృత్తిపై ఉన్న అభిరుచి, నిబద్ధతలను ప్రశంసిచగా, మరికొందరు ఇంతలా కష్టపడటం ఎందుకు త్రీడీ వస్తువులతో లేదా ఏదైనా ప్లాస్టిక్ వస్తువులను ఉదాహరణగా తీసుకుని చెబితే సరి అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.Absolute cinema 🎥 pic.twitter.com/KkhZwOr9dD— Priyanka 🪷 (@Oyepriyankasun) December 14, 2024 (చదవండి: 20 ఏళ్లకే డాక్టర్, 22 ఏళ్లకు ఐఏఎస్ ఆఫీసర్..ఇవాళ ఏకంగా..!) -
పులిహోర ప్రసాదంలో పురుగులు
-
రోడ్డుపై బోల్తా పడిన పెట్రోల్ ట్యాంకర్
-
చెన్నైకి చేరుకున్న గుకేశ్.. వరల్డ్ చాంపియన్ భావోద్వేగం
ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ స్వదేశానికి తిరిగి వచ్చాడు. చదరంగ రారాజు హోదాలో తొలిసారి భారత్లో అడగుపెట్టాడు. ఈ వరల్డ్ చాంపియన్ సోమవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నాడు.నాలో శక్తిని, స్థైర్యాన్ని నింపారుఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వ అధికారులు, జాతీయ చెస్ సమాఖ్య ముఖ్యులు, అభిమానులు గుకేశ్కు ఘన స్వాగతం పలికారు. సందర్భంగా... గుకేశ్ మాట్లాడుతూ.. ‘‘సొంతగడ్డ మీద తిరిగి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. మీ అభిమానం, మద్దతు చూసిన తర్వాత.. భారత్కు ఈ విజయం ఎంతటి గొప్ప అనుభూతిచ్చిందో నాకు మరింతగా అర్థమైంది. మీరంతా అత్యద్భుతం. నాలో శక్తిని, స్థైర్యాన్ని నింపారు’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది. కాగా భారత్ తరఫున వరల్డ్ చెస్ చాంపియన్గా నిలిచిన రెండో ఆటగాడిగా పద్దెమినిదేళ్ల గుకేశ్ చరిత్రకెక్కాడు. చెన్నైకే చెందిన విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించాడు. అంతేకాదు.. అత్యంత పిన్న వయసులోనే ప్రపంచ చాంపియన్ అయిన చెస్ ప్లేయర్గానూ రికార్డు సాధించాడు. సింగపూర్ సిటీలో ఇటీవల జరిగిన క్లాసికల్ ఫార్మాట్లో గుకేశ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ను ఓడించిడిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్మాస్టర్ డింగ్ లిరెన్ను ఓడించి చాంపియన్ కిరీటాన్ని అందుకున్నాడు. 32 ఏళ్ల లిరెన్తో జరిగిన 14 గేమ్ల పోరులో 7.5–6.5 పాయింట్ల తేడాతో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. 58 ఎత్తుల్లో లిరెన్ ఆట కట్టించి విజేతగా అవతరించాడుభారీ నజరానాఈ నేపథ్యంలో దొమ్మరాజు గుకేశ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక వరల్డ్ చాంపియన్గా ట్రోఫీతో పాటు గుకేశ్ 13 లక్షల 50 వేల డాలర్ల(రూ.11.45 కోట్లు) ప్రైజ్మనీ పొందాడు. ఇక తమ రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకువచ్చిన గుకేశ్ను కొనియాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భారీ నజరానా ప్రకటించారు. గుకేశ్కు రూ. ఐదు కోట్ల క్యాష్ రివార్డు అందచేస్తామని తెలిపారు. చదవండి: WPL 2025 Auction: ఆశ్చర్యం.. అనూహ్యం.. వారిపై కోట్ల వర్షం! వీరికి మొండిచేయి#WATCH | Chennai, Tamil Nadu: World Chess Champion #GukeshD says, "I am very glad to be here. I could see the support that and what it means to India...You guys are amazing. You gave me so much energy..." pic.twitter.com/iuFXDiLcjx— ANI (@ANI) December 16, 2024 -
‘నీకసలు మెదడు ఉందా?’.. భారత పేసర్పై రోహిత్ ఫైర్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు. యువ పేసర్ ఆకాశ్ దీప్ బౌలింగ్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ‘‘నీకసలు బుర్ర(మెదడు) ఉందా?’’ అంటూ ఆకాశ్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మూడో టెస్టులో పటిష్ట స్థితిలో ఆసీస్బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టులు ఆడుతోంది. ఇందులో ఇరుజట్లు ఇప్పటికే చెరో విజయం సాధించి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో భారత్- ఆసీస్ మధ్య శనివారం మొదలైన మూడో టెస్టులో ఆతిథ్య జట్టు పటిష్ట స్థితిలో కొనసాగుతోంది.గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన రోహిత్ సేనకు చేదు అనుభవం ఎదురైంది. తొలి రోజు నుంచే మెరుగైన బ్యాటింగ్తో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా... రెండోరోజు ఆట పూర్తయ్యేసరికి ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది.మొదటి ఇన్నింగ్స్లో 445ఈ క్రమంలో 405/7(101 ఓవర్లు) ఓవర్నైట్ స్కోరుతో సోమవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టి.. మరో 40 పరుగులు జతచేసింది. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా మొత్తంగా 445 పరుగుల భారీ స్కోరు సాధించింది.ఇక ఆసీస్ ఇన్నింగ్స్లో సోమవారం 114వ ఓవర్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆకాశ్ దీప్ చేతికి బంతినిచ్చాడు. అయితే, 28 ఏళ్ల ఈ పేసర్.. ఆసీస్ కీపర్ అలెక్స్ క్యారీ క్రీజులో ఉన్న సమయంలో వైడ్ బాల్ వేశాడు.సర్ మే కుచ్ హై?వేగంగా వచ్చిన ఈ బంతిని ఆపేందుకు టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేసిన ప్రయత్నం వృథాగా పోయింది ఫలితంగా ఆసీస్ ఖాతాలో అదనపు పరుగులు(2) చేరగా.. సహనం కోల్పోయిన రోహిత్ శర్మ.. ఆకాశ్ను ఉద్దేశించి..‘‘అబ్బే సర్ మే కుచ్ హై?(బుర్రలో ఏమైనా ఉందా?)’’ అంటూ కామెంట్స్ చేయగా.. స్టంప్ మైకులో రికార్డయ్యాయి.ఇక మూడో రోజు ఆటలో భాగంగా బుమ్రా మరో వికెట్ తీయగా.. ఆకాశ్ దీప్(క్యారీ వికెట్), మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. మొత్తంగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో బుమ్రాకు ఆరు, సిరాజ్కు రెండు, ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డిలకు ఒక్కో వికెట్ దక్కింది. వర్షం వల్ల మూడో రోజు ఆటకు అంతరాయంకాగా ఆకాశ్కు విదేశీ గడ్డపై ఇదే తొలి మ్యాచ్. అడిలైడ్లో ఆడిన హర్షిత్ రాణాపై వేటు పడగా.. అతడి స్థానాన్ని బ్రిస్బేన్లో ఆకాశ్ భర్తీ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. వర్షం వల్ల మూడో రోజు ఆట అర్ధంతరంగా ముగిసిపోయింది. అప్పటికి భారత్ 17 ఓవర్లు ఆడి నాలుగు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఆసీస్ కంటే తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 394 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: ‘రోహిత్ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్ చేయండి’Rohit Sharma & Stump-mic Gold - the story continues... 😅#AUSvINDOnStar 👉 3rd Test, Day 3 LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/vCW0rURX5q— Star Sports (@StarSportsIndia) December 16, 2024 -
Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్
-
గర్ల్ ఫ్రెండ్ ముద్దుల కోసం ఎంత పనిచేశాడు... భలే చిట్కా అంటున్న నెటిజన్లు!
విజ్ఞాన, వినోదాల మహాసాగరం సోషల్ మీడియా. ప్రతీ నిత్యం వేల కొద్దీ వీడియోలు ఇన్స్టా, ట్విటర్, ఫేస్బుక్ తదితర వేదికల్లో హల్ చల్ చేస్తూనే ఉంటాయి. కొన్ని విజ్ఞానదాయకంగా ఉంటాయి. మరికొన్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఇంకొన్ని వోర్నీ యేశాలో అనేలా ఉంటాయి. తాజాగా ఒక యువ జంట ముద్దుల వీడియో ఒకటి ‘అరే..ఏంటిరా ఇది’’ అని కుర్రకారు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఈ వీడియో ఏకంగా 70 లక్షలకుపైగా వ్యూస్ సాధించింది. గర్ల్ ఫ్రెండ్ ముద్దుల కోసం భలే ట్రిక్ వాడాడుగా అంటున్నారు నెటిజన్లు. అదేంటో మీరూ చూసేయండి!నోట్ : ప్రేమ అనేది వ్యక్తిగత అంశం. ఇది ఫన్నీ వీడియో అని మాత్రం గమనించగలరు. Bro unlocked new technique to get more kiss😭 pic.twitter.com/0CgkECwAsw— Bey (@beyya1202) December 11, 2024 -
‘యానిమల్’ వార్ మెషిన్గన్ వాహనంపై పెళ్లి ఊరేగింపు, నెటిజన్ల కామెంట్స్
‘మురారి’, ‘వరుడు’ సినిమాల లెవల్లో పెళ్లి చేసుకోవాలని ఒకపుడు పెళ్లి కాని పిల్లలు కలలు కనేవారు. కాలానికి తగ్గట్టు ఇపుడు ట్రెండ్ మారింది. బ్లాక్ బస్టర్ మూవీ ప్రేరణతో పెళ్లి చేసుకోవడం విశేషంగా నిలిచింది. 'వార్ మెషిన్ గన్'తో వధూవరుల ఎంట్రీ అందరి దృష్టిని ఆకర్షించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్ల వేలాది ఫన్నీ కామెంట్లతో సందడితో ఏకంగా 15 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.రణబీర్ కపూర్ , నేషనల్ క్రష్ రష్మిక నటించిన యానిమల్ స్ఫూర్తితో కదిలే స్టీల్ మెషిన్ గన్పై జంట వివాహ వేడుకును జరుపుకున్నారు. ఇన్స్టాగ్రామ్ యూజర్ ఆశిష్ సుయ్వాల్ ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ మూవీలో రణబీర్ కేరెక్టర్ 500 కిలోల మూవబుల్ స్టీల్ మెషిన్ గన్ని ఉపయోగించి తన శత్రువులతో పోరాడిన దృశ్యాలు అభిమానులను ఉర్రూతలూగించి. ఈ నేపథ్యంలో యాక్షన్ సీక్వెన్స్లా ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంగాపై వివాహ వేదికకు చేరుకోవడాన్ని ఈ వీడియోలు చూడవచ్చు. వధువు సిగ్గుతో గన్ క్యారేజ్పై కూర్చొని ఉండగా, వరుడు గర్వంగా ఈ స్పెషల్ రైడ్ను ఆస్వాదిస్తున్నాడు. View this post on Instagram A post shared by Ashish Suiwal (@saini5019) “హవ్వా పగ, ప్రతీకారంతో అధికారంకోసం మనుషులను చంపే పాత్రగా ఎందుకు మారతారు" అని ఒకరు, "ఆమె తన జీవితంలో తదుపరి యుద్ధానికి సిద్ధమవుతోంది’’ అని ఒకరు వ్యాఖ్యానించారు క్రియేటివిటీకోసం ఎంతకైనా తెగిస్తున్నారు అంటే ఇంకొక నెటిజన్ ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఇది ఎక్కడ జరిగింది అనే వివరాలు మాత్రం అందుబాటులో లేవు. -
Nampally: పెట్రోల్ బంక్లో అగ్నిప్రమాదం
-
Mumbai: ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది
-
వృద్ధురాలిపై వీధి కుక్కల దాడి, వైరల్ వీడియో
థానేలోని టిటా్వలా థానేలో కుక్కలు వీరంగం సృష్టించాయి. ఓ వృద్ధురాలిపై దాడి చేయడంతో పరిస్థితి విషమించింది. ఈమేరకు పోలీసు అధికారి ఆదివారం వివరాలు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉన్నట్టుండి దాడిచేసిన నాలుగు కుక్కలు ఆమెపై ఎగబడ్డాయి. మహిళ వాటి నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించిది. అయినా కూడా ఒకదాని తరువాత ఒకటి నలువైపులా ఆమెపై ఎటాక్ చేశాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఉల్హాస్నగర్ సెంట్రల్ ఆసుపత్రిలో చేర్చారు. ముంబైలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని జేజే ఆసుపత్రికి అధునాతన సంరక్షణ కోసం తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆమె స్టేట్మెంట్ను ఒకసారి నమోదు చేస్తాం. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుంది’ అని కల్యాణ్ తాలూకా పోలీస్ స్టేషన్ అధికారి వెల్లడించారు. ठाणे के टिटवाला में आवारा कुत्तों ने एक बुजुर्ग महिला पर हमला किया.आवारा कुत्तों ने महिला को 50 मीटर तक घसीटा..महिला बुरी तरह से घायल.महिला का इलाज अस्पताल में चल रहा है..चार आवारा कुत्तों ने महिला पर किया जानलेवा हमला..पूरी घटना सीसीटीवी में कैद. pic.twitter.com/BX5CmYQFYj— Vivek Gupta (@imvivekgupta) December 8, 2024 -
పెదవులు బొద్దుగా కనిపించాలంటే..!
ఇంట్లో దొరికే వాటినే సౌందర్య సాధనాలుగా ఉపయోగించుకుని అందాన్ని సంరక్షించుకోవడం చూశాం. వాటిల్లో ఎక్కువగా సెనగపిండి, బియ్య పిండి, మొక్కల ఆధారితమైనవే. ఇక్కడొక ఇన్ఫ్లుయెన్సర్ ఏకంగా పచ్చిమిర్చి కూడా అందానికి ఉపయోగపడుతుందంటూ ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఢిల్లీకి చెందిన శుభంగి ఆనంద్ అనే ఇన్ఫ్లుయెన్సర్ వివాదాస్పదమైన బ్యూటీ టిప్ని షేర్ చేసింది. అందులో పచ్చిమిరపకాయలతో లిప్స్టిక్ వేసుకున్నట్లు చూపించింది. సహజమైన బొద్దు పెదవుల కోసం ఇది ప్రయత్నించమంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకుంది. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. View this post on Instagram A post shared by SHUBHANGI ANAND 🧿👑 (@shubhangi_anand__) View this post on Instagram A post shared by SHUBHANGI ANAND 🧿👑 (@shubhangi_anand__)strong> ఘాటుతో ఉండే పచ్చిమిర్చి వంటివి చర్మానికి హాని కలిగించేవని. ఇలాంటి పిచ్చిపిచ్చి టిప్స్ షేర్ చేయొద్దని తిట్టిపోశారు. పెద్దాలు బొద్దుగా ఉండటం అటుంచితే..అవి కాలిన గాయాల వలే వాచిపోయి అసహ్యంగా మారతాయని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. అయినా అందానికి సంబంధించినవి సమంజసంగా హానికరం కానివి పెట్టాలి. ఏదో సోషల్ మీడియా క్రేజ్ కోసం ఇలా చేస్తే..వ్యూస్ రావడం మాట దేవుడెరగు అస్సలు ఆ అకౌంట్కి సంబంధించిన వీడియోలను అసహ్యించుకునే ప్రమాదం లేకపోలేదు.(చదవండి: నడవలేనంత అనారోగ్య సమస్యలతో వినోద్ కాంబ్లీ: ఆ వ్యాధే కారణమా..?) -
నడవలేనంత అనారోగ్య సమస్యలతో వినోద్ కాంబ్లీ: ఆ వ్యాధే కారణమా..?
ఒకప్పుడు మైదానంలో తన విధ్వంసకర బ్యాటింగ్తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన స్టార్ ఆటగాడు, భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాడు. ఒకప్పుడు మంచి ఫిటెనెస్తో చలాకీగా ఉండే కాంబ్లీ పలు అనారోగ్య సమస్యలతో నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. దిగ్గజ క్రికెట్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్తో కలిసి కాంబ్లీ కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమం కారణంగానే కాంబ్లీ పరిస్థితి గురించి ప్రపంచానికి తెలిసింది. అతడి స్థితిని చూసి అభిమానులంతా కాంబ్లీకి ఏమైందంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా కాంబ్లీ తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడటానికి దారితీసిన కారణాలు, అలాగే ఒకప్పుడు ఫిట్గా ఉండే వ్యక్తిని డిప్రెషన్ ఇంతలా కుంగదీసి అనారోగ్యం పాలు చేస్తుందా అంటే..వినోద్ కాంబ్లీ ఇలా తీవ్రమైన అనారోగ్య స్థితిలో కనిపించటం తొలిసారి కాదు. గతంలో కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అనేక సందర్భాలు ఉన్నాయి. 2013లో ముంబైలో డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటుకి గురయ్యాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు కోలుకున్నాడు. ఆయన 2012లో రెండు ధమనులలో అడ్డంకులను తొలగించుకునేందుకు యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ఆ తర్వాత నుంచి పూర్తిగా కోలుకోలేదని కాంబ్లీ అంతరంగికులు చెబుతున్నారు. ఎందుకంటే..ఒక్కసారి గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స లేదా కొద్దిపాటి వేరే చికిత్సలు తీసుకున్నప్పుడు సమతుల్యమైన జీవనశైలిని పాటించక తప్పదు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. పలు అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. డిప్రెషన్..దీనికి తోడు కాంబ్లీ తాను డిప్రెషన్తో బాధపడుతున్నట్లు పలు ఇంటర్వూల్లో వెల్లడించారు. సచిన్ సచిన్ స్థాయికి చేరుకోగల సత్తా ఉన్నా చేజేతులా కెరీర్ నాశనం చేసుకున్నట్లు కాంబ్లీ సన్నిహిత వర్గాలు చెబుతుంటారు. కెరీర్ ఫెయిల్యూర్ తదితర కారణాలతో తీవ్ర డిప్రెషన్కు వెళ్లాడు. దీంతో వినోద్ కాంబ్లీ మద్యానికి బానిసైనట్లు తెలుస్తుంది. తాగుడు మానేయాలని చాలాసార్లు ప్రయత్నించాడని, అందుకోసం డీ అడిక్షన్ సెంటర్ నుంచి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత కూడా ఆయన మద్యం తాగడం మానలేదని తెలుస్తుంది. ఇక్కడ డిప్రెషన్ ఎంతటి ఫిట్నెస్తో ఉన్న వ్యక్తిని అయినా అమాంతం కుంగదీసీ చేతకాని వాడిలా కూర్చొబెట్టేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అలాగే మద్యం అడిక్షన్..ఇది కూడా మనిషిని పదిమంది ముందు సగౌరవంగా బతకనివ్వకుండా చేసే అతి భయనాక మహమ్మారి. దీని ముందు ఎంతటి మహమహులైనా.. నిలవలేరు. దీనికి బానిసై జీవితాలని నాశనం చేసుకున్న వారెందరో ఉన్నారు. ఇక్కడ కాంబ్లీ పరిస్థితి కూడా ఇదే. ఇక్కడ కాంబ్లీ పూర్తిగా కోలుకుని ఆరోగ్యంతో ఉండాలని దాదాపు 14సార్లు పునరావాస కేంద్రానికి తీసుకువెళ్లినట్లు అతడి స్నేహితుడు అంపైర్ కుటో తెలిపారు. అంటే కాంబ్లీ ఎంతటి పరిస్థితిలో ఉన్నాడో స్పష్టమవుతోంది. ఇక్కడ ఏ మనిషి అయినా తనకు తాను బాగుండాలని గట్టిగా అనుకుంటేనే.. ఎవ్వరూ సాయం అందించినా సఫలం అవుతుంది. సగం ఆరోగ్యం నయమవ్వడానికి ఆయా వ్యక్తుల సంకల్ప బలమే ఆధారం. కాబట్టి ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదురయ్యే ఉద్దాన పతనాలకు ప్రాధాన్యత ఇవ్వొద్దు. దేన్నైనా సమంగా స్వీకరించే స్థితప్రజ్ఞతను అలవరుచుకోండి. "దేన్ని కోల్పోయినా, మనిషి గమ్యం ఆగకూడదనేది గుర్తించుకుండి. కడ వరకు పూర్తి ఆరోగ్యంతో ఒకరి ఆసరా లేకుండా జీవనం సాగించడమే అత్యంత అదృష్టమని భావించండి. ఇలాంటి దృకప్పథం అలవాటు చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యల బారినపడరు". అని చెబుతున్నారు మానసిక నిపుణులు. दोस्ती किसे कहते हैं, और इसके मायने क्या होते हैं…इस सचिन-कांबली के 20 सेकंड के वीडियो को देख कर समझ सकते हैं..#SachinTendulkar #VinodKambli pic.twitter.com/WqsYoHzQ3x— Dr Ajeet Hindu (@AjitSin0001) December 3, 2024 -
నెలకు రూ.80,000.. ఇదేదో సాఫ్ట్వేర్ జీతం కాదు!
నెలకు రూ.85,000 వరకు వేతనం.. ఇదేదో సాఫ్ట్వేర్ ఉద్యోగి జీతం అనుకుంటే పొరపడినట్లే.. ఇది ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ సంపాదన! అవునండి.. దాదాపు రోజుకు 13 గంటలపాటు విభిన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి బెంగళూరులోని ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ సంపాదిస్తున్న మొత్తం అది. తన సంపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించిన ఓ వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.బైక్ ట్యాక్సీలు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రజాదరణ పొందాయి. చాలామంది డ్రైవర్లకు, స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి మంచి అవకాశాలను అందిస్తున్నాయి. ఉబర్, రాపిడో, ఓలా.. వంటి కంపెనీలు ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో ఉంచాయి. బెంగళూరుకు చెందిన ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ ఉబర్, రాపిడోలో వచ్చిన రైడ్లను పూర్తి చేస్తూ, రోజుకు 13 గంటల పాటు పనిచేస్తూ నెలకు రూ.80,000-రూ.85,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ మేరకు అప్లోడ్ చేసిన వీడియో చూసినవారు బైక్ ట్యాక్సీ డ్రైవర్గా ఉంటూ అంతమొత్తంలో ఆర్జించడంపట్ల ఆశ్చర్య పోతున్నారు.A classic Bengaluru moment was observed in the city when a man proudly claimed that he earns more than ₹80,000 per month working as a rider for Uber and Rapido. The man highlighted how his earnings, driven by his hard work and dedication, have allowed him to achieve financial… pic.twitter.com/4W79QQiHye— Karnataka Portfolio (@karnatakaportf) December 4, 2024ఇదీ చదవండి: నిలిచిన రైల్వే ఈ-టికెట్ సేవలు..!ఇటీవల @karnatakaportf పోస్ట్ చేసిన ఈ వీడియోకు మూడు వేలకు పైగా లైకులు, ఆరు లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై వీక్షకులు విభిన్నంగా కామెంట్ చేస్తున్నారు. కొందరు డ్రైవర్ అంకితభావం, కృషిని ప్రశంసిస్తున్నారు. ‘మేము కూడా అంత సంపాదించడం లేదు భయ్యా!’ అని మరొకరు కామెంట్ చేశారు. 13 గంటల పాటు రోడ్డుపై డ్రైవింగ్ చేయడం చాలా కష్టమని మరోవ్యక్తి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. -
'కిస్సిక్' పాటకు బామ్మలు అదిరిపోయే డ్యాన్స్
'పుష్ప 2'లో ఐటమ్ సాంగ్ 'కిస్సిక్'.. బాగానే ఫేమస్ అయింది. రిలీజైనప్పుడు బాగాలేదన్నారు గానీ ఇప్పుడు అందరూ తెగ డ్యాన్సులు చేస్తున్నారు. పిల్లల నుంచి పెద్దోళ్ల వరకు ఎవరూ తగ్గట్లేదు. మిగతా వాళ్ల సంగతేమో గానీ ఓ అనాథశ్రమంలో బామ్మలు ఈ పాటకు డ్యాన్స్ చేయడం మాత్రం తెగ వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)కర్ణాటక బెల్గం ఊరిలో శాంతాయ్ వృద్ధాశ్రమం ఉంది. ఇందులో ఉంటే బామ్మలు ట్రెండీ గీతాలకు ఎప్పటికప్పుడు డ్యాన్స్ చేస్తూ బాగానే ఫేమ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్లలో ఓ నలుగురు.. 'దెబ్బలు పడతయ్రోయ్' అంటూ 'పుష్ప 2' పాటకు భలే స్టెప్పులేశారు. ఈ వీడియో ఇప్పుడు తెలుగు నెటిజన్లకు తెగ నచ్చేస్తోంది. 'కిస్సిక్' పాటలో కనిపించిన శ్రీలీల కూడా వీళ్ల డ్యాన్స్కి ఫిదా అయిపోయింది. వీడియోకి లైక్ కొట్టింది.'పుష్ప 2' కలెక్షన్స్ విషయానికొస్తే మూడు రోజుల్లో రూ.621 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి.. భారత బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కేవలం హిందీలోనూ రూ.200 కోట్లకు పైగా నెట్ వసూళ్లు వచ్చినట్లు స్వయంగా నిర్మాతలే ప్రకటించారు. ఆదివారం కూడా భారీగానే టికెట్ సేల్స్ అయ్యింటాయి. టోటల్ వీకెండ్ వసూళ్ల రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ యాక్టర్స్) View this post on Instagram A post shared by Shantai Vruddashram (Old Age Home) (@shantai_second_childhood) -
‘ఇక్కడి నుంచి వెళ్లిపో’.. సెంచరీ వీరుడిపై కోపంతో ఊగిపోయిన సిరాజ్!
టీమిండియాతో పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా మెరుగైన స్కోరు సాధించింది. శుక్రవారం నాటి తొలి రోజు ఆటలో భారత్ను 180 పరుగులకే ఆలౌట్ చేసిన కంగారూలు.. తమ మొదటి ఇన్నింగ్స్లో 337 పరుగులు చేసింది. 86/1 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాటి రెండో రోజు ఆటను మొదలుపెట్టిన కమిన్స్ బృందం మరో 251 పరుగులు జమ చేసి ఆలౌట్ అయింది.ఆస్ట్రేలియా బ్యాటర్లలో మార్నస్ లబుషేన్(64) అర్ధ శతకంతో మెరవగా.. ఐదో నంబర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్(140) భారీ శతకం బాదాడు. టీమిండియా బౌలర్లకు కొరకాని కొయ్యగా మారి.. 141 బంతుల్లోనే 140 పరుగులు స్కోరు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో ఏకంగా 17 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం.అద్భుత యార్కర్తో హెడ్కు చెక్అయితే, ప్రమాదకారిగా మారిన హెడ్ను పెవిలియన్కు పంపేందుకు భారత బౌలర్లు కఠినంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు సిరాజ్కు అతడి వికెట్ దక్కించుకోవడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ 82వ ఓవర్లో బంతితో బరిలోకి దిగిన సిరాజ్.. అద్భుత యార్కర్తో హెడ్ను బౌల్డ్ చేశాడు.‘‘ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపో’’ ఇక కీలక వికెట్ దక్కిన ఆనందంలో సిరాజ్.. హెడ్ను ఉద్దేశించి ‘‘ఇక వెళ్లు’’ అన్నట్లుగా సైగ చేస్తూ వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు బదులుగా హెడ్ సైతం అతడికి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. దీంతో మరింతగా కోపం తెచ్చుకున్న సిరాజ్.. ‘‘ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపో’’ అన్నట్లు ఉగ్రరూపం ప్రదర్శించాడు. అయితే, హెడ్ మాత్రం తన సెంచరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రేక్షకులకు అభివాదం చేస్తూ మైదానాన్ని వీడాడు.డీఎస్పీ సర్కు కోపం వచ్చిందిఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘‘డీఎస్పీ సర్కు కోపం వచ్చింది. శతకం బాదిన ఆటగాడికి తనదైన స్టైల్లో సెండాఫ్ ఇచ్చాడు’’ అంటూ అభిమానులు సరదాగా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘అతి చేయవద్దు సిరాజ్.. కాస్త సంయమనం పాటించు’’ అని హితవు పలుకుతున్నారు.కాగా భారత బౌలర్లలో పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ నాలుగేసి వికెట్లతో చెలరేగగా..నితీశ్ రెడ్డి ఒక వికెట్ దక్కించుకున్నాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. పెర్త్ వేదికగా తొలి టెస్టులో 295 పరుగులతో ఆసీస్ను ఓడించిన భారత్.. రెండో టెస్టులో కాస్త తడబడుతోంది. అడిలైడ్ వేదికగా ఈ డే అండ్ నైట్ మ్యాచ్లో ఇరుజట్ల తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి కమిన్స్ బృందం.. రోహిత్ సేనపై 157 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: IND vs AUS: జైశ్వాల్ కళ్లు చెదిరే క్యాచ్.. విరాట్ కోహ్లి రియాక్షన్ వైరల్The end of a sensational innings! 🗣️#AUSvIND pic.twitter.com/kEIlHmgNwT— cricket.com.au (@cricketcomau) December 7, 2024 -
ఏడు ఖండాలను చుట్టి వచ్చిన వందేళ్ల బామ్మ..!
మన దేశంలో ఉండే పర్యాటక ప్రదేశాలను చుట్టిరావడమే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్, జర్నీ ప్లాన్ అన్నీ అనుకూలంగా ఉంటేనే సాధ్యం. ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు.. ఏ మూడో.. నాలుగో చుట్టి వచ్చి హమ్మయ్యా అనుకుంటాం. కానీ ఈ బామ్మ మాత్రం ఏకంగా ఏడు ఖండాలను చుట్టి రావాలనుకుంది. అక్కడ విభిన్న సంప్రదాయాలు, ప్రజల జీవనశైలిని గురించి తెలుకోవాలని ఆరాటపడింది ఈ బామ్మ. వృద్ధాప్యం సమీపిస్తున్న వెనక్కి తగ్గలేదు. చివరకు తాను అనుకున్నట్లుగానే ఏడు ఖండాలు చుట్టివచ్చి..అందిరిచే ప్రశంసలందుకుంది. ఆమె ఎవరంటే..102 ఏళ్ల డోరతీ స్మిత్ అత్యంత సాహసోపేతమైన కలను నిజం చేసుకుని.. అద్భతమైన ఘనతను సాధించింది. మొత్తం ఏడు ఖండాలను సందర్శించి శెభాష్ అనిపించుకుంది. చాలాకాలంగా ఈ బామ్మ భూగోళాన్ని చుట్టిరావాలని కలలు కంది. ఆ కలను నిజం చేసుకునేలా..సుమారు ఆరు ఖండాలను సందర్శించింది. అయితే చివరి ఖండం వచ్చేటప్పటికీ వృద్ధరాలైపోవడంతో.. ఎలా? అని కలవరపడింది. అయితే "యస్ థియరీ" అనే యూట్యూబ ఛానెల్ క్రియేటర్స్ అమ్మర్ కందిల్, స్టాపన్ టేలర్ ఈ బామ్మ డ్రీమ్కు సాయం అందించారు. ఈ క్రియేటర్స్ కాలిఫోర్నియాలోని రెడ్వుడ్స్ రిటైర్మెంట్ విలేజ్లో ఒక కథను చిత్రీకరిస్తుండగా .. బామ్మ స్మిత్ని కలిశారు. ఆమె జీవిత అభిరుచుకి ఫిదా అయ్యి..ఆమెకు సాయం చేసేందుకు ముందుక వచ్చారు. ఆమె చూడాల్సిన చివరి ఖండమైన ఆస్ట్రేలియాను తన కూతరు అడ్రియన్తో కలిసి వెళ్లేలా జర్నీ ప్లాన్ చేశారు ఈ క్రియేటర్స్. ఆ బామ్మ జర్నీలో కందిల్, టేలర్ కూడా చేరారు. ఇక 102 ఏళ్ల బామ్మ క్వాంటాస్ విమానంలోని బిజినెస్ క్లాస్లో ప్రయాణించి ఆస్ట్రేలియా చేరుకుంది. అక్కడ చూడవల్సిన స్మిత్ సిడ్నీ హార్బర్ క్రూయిజ్, వైల్డ్ లైఫ్ సిడ్నీ జూ, ఒపేరా హౌస్, బోండి బీచ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలన్నింటిని సందర్శించింది. తనకు ఈ సిడ్నీ పర్యటన అత్యంత మనోహరంగా ఉందని, అక్కడి ఆహారం, ప్రజల జీవనశైలి అత్యద్భుతంగా ఉన్నాయంటోంది స్మిత్. అంతేగాదు ఆస్ట్రేలియాలో టేకాఫ్కు ముందు పైలట్లు, సిబ్బంది ఆమెను సత్కరించడం విశేషం. అందుకు సంబంధించిన వీడియోని కూడా కందిల్, టేలర్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడంతో నెట్టింట తెగ వైరల్గా మారింది. (చదవండి: ప్రపంచంలోనే చెత్త ఎయిర్లైన్స్.. ఇండిగో స్థానం ఇది!) -
శిఖర్ ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్.. సిక్సర్ల వర్షం.. 51 బంతుల్లోనే..
టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం నేపాల్ ప్రీమియర్ లీగ్(ఎన్పీఎల్)తో బిజీగా ఉన్నాడు. ఎన్పీఎల్ ఆరంభ ఎడిషన్లో కర్నాలీ యాక్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న గబ్బర్.. బుధవారం నాటి మ్యాచ్లో సిక్సర్ల వర్షం కురిపించాడు.ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్ కీర్తిపూర్ వేదికగా ఖాట్మండూ గుర్ఖాస్తో జరిగిన మ్యాచ్లో శిఖర్ ధావన్.. 51 బంతుల్లోనే 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. గబ్బర్ ఇన్నింగ్స్లో ఐదు సిక్సర్లు, నాలుగు బౌండరీలు ఉండటం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన కర్నాలీ యాక్స్.. ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.గబ్బర్ మెరుపుల వీడియో వైరల్అయితే, ఖాట్మండూ గుర్ఖాస్ బ్యాటర్ల విజృంభణ కారణంగా.. కర్నాలీ యాక్స్కు మూడు వికెట్ల తేడాతో ఓటమి తప్పలేదు. ఏదేమైనా ఈ మ్యాచ్లో శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ హైలైట్గా నిలిచింది. గబ్బర్ పరుగుల విధ్వంసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అభిమానులను ఆకర్షిస్తోంది.ఎనిమిది జట్లుకాగా ఈ ఏడాది మొదలైన నేపాల్ ప్రీమియర్ లీగ్లో చిట్వాన్ రైనోస్, జనక్పూర్ బోల్ట్స్, సుదుర్పశ్చిమ్ రాయల్స్, ఖాట్మండూ గుర్ఖాస్, లుంబిని లయన్స్, కర్నాలీ యాక్స్, బీరట్నగర్ కింగ్స్, పొఖరా అవెంజర్స్ జట్లు పాల్గొంటున్నాయి. కర్నాలీ యాక్స్ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్లలో రెండూ ఓడిపోయింది.ఇదిలా ఉంటే.. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్తో పాటు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకున్నాడు శిఖర్ ధావన్. అనంతరం లెజెండ్స్ లీగ్లో భాగమైన గబ్బర్.. నేపాల్ లీగ్ క్రికెట్లోనూ ఆడుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో మూడు ఫార్మాట్లలో కలిపి పదివేలకు పైగా పరుగులు చేసిన 38 ఏళ్ల ధావన్.. 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియాలో సభ్యుడు.చదవండి: వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి DHA-ONE HAS ARRIVED! 🌪️Shikhar Dhawan scored an unbeaten 72, including 5 huge sixes, powering Karnali Yaks to a competitive total 🤩#NPLonFanCode pic.twitter.com/lPVx9uUYPz— FanCode (@FanCode) December 4, 2024 -
వినోద్ కాంబ్లీని కలిసిన సచిన్.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి
ప్రముఖ క్రికెట్ కోచ్ రమాకాంత్ విఠల్ ఆచ్రేకర్ 92వ జయంతిని ముంబైలో ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ పార్క్లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ‘గురు’ ఆచ్రేకర్ మొమోరియల్ను సచిన్ ఆవిష్కరించారు.స్నేహితుడితో కరచాలనంఇక ఈ కార్యక్రమంలో సచిన్ చిన్ననాటి స్నేహితుడు, మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కూడా పాల్గొన్నాడు. అయితే, సచిన్ కంటే ముందే కాంబ్లీ వేదిక మీదకు చేరుకోగా.. సచిన్ వస్తూ వస్తూ తన స్నేహితుడితో కరచాలనం చేశాడు.చేయి వదిలేందుకు ఇష్టపడని కాంబ్లీఅయితే, కాంబ్లీ మాత్రం సచిన్ చేతిని వదలకుండా గట్టిగా అలాగే పట్టుకున్నాడు. దీంతో పక్కనున్న వ్యక్తి కాంబ్లీ నుంచి అతడి చేతిని విడిచిపించడానికి కాస్త కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత సచిన్ తన కుర్చీ వద్దకు వెళ్లి కూర్చోగా.. కాంబ్లీ స్నేహితుడి వైపే చూస్తూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాంబ్లీపై నెటిజన్ల సానుభూతి.. ఈ పరిస్థితికి కారణం ఎవరు?ఈ నేపథ్యంలో వినోద్ కాంబ్లీ పరిస్థితిని చూసి నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. సచిన్ స్థాయికి చేరుకోగల సత్తా ఉన్నా చేజేతులా కెరీర్ నాశనం చేసుకుని.. ఇలాంటి దుస్థితికి చేరుకున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. వ్యక్తిగతంగానూ క్రమశిక్షణ లోపించినందు వల్లే అతడి కెరీర్ అర్ధంతరంగా ముగిసిపోయిందన్న కాంబ్లీ సన్నిహిత వర్గాల మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కాగా కాంబ్లీ ప్రస్తుతం ఆరోగ్యపరంగా.. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.కాగా భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 1993- 2000 మధ్య వినోద్ కాంబ్లీ 17 టెస్టులు, 104 వన్డే మ్యాచ్లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 1084, 2477 రన్స్ చేశాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్. ఇక దేశీ టోర్నీలో 2004లో మధ్యప్రదేశ్తో మ్యాచ్ సందర్భంగా ముంబైకి చివరగా ఆడాడు కాంబ్లీ.ఇదిలా ఉంటే.. 2013లో వినోద్ కాంబ్లీకి హార్ట్ ఎటాక్ వచ్చింది. కారులో వెళ్తున్న సమయంలో గుండెపోటు రాగా.. ఓ పోలీస్ అధికారి గమనించి సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.సెంచరీ సెంచరీల వీరుడిగా సచిన్మరోవైపు.. సచిన్ టెండుల్కర్ భారత క్రికెట్కు మారుపేరుగా ఎదిగాడు. టీమిండియా తరఫున 664 మ్యాచ్లు ఆడి 34357 పరుగులు సాధించాడు. ఇప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్గా సచిన్ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. అంతేకాదు.. ఇంటర్నేషనల్ క్రికెట్లో వంద సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు కూడా సచినే. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ‘భారత రత్న’తో సత్కరించింది. ఇక సచిన్, కాంబ్లీ ఇద్దరూ ఆచ్రేకర్(1932- 2019) శిష్యులే కావడం గమనార్హం.చదవండి: WTC Final: న్యూజిలాండ్ అవకాశాలపై నీళ్లు చల్లిన ఐసీసీ #WATCH | Maharashtra: Former Indian Cricketer Sachin Tendulkar met former cricketer Vinod Kambli during an event in Mumbai.(Source: Shivaji Park Gymkhana/ANI) pic.twitter.com/JiyBk5HMTB— ANI (@ANI) December 3, 2024 -
లక్ష కేసులు పెట్టినా నన్ను ఆపలేరు..
-
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది
-
Death Clock: డెత్ డేట్ ఎప్పుడో చెప్పేస్తుంది
-
కారుపై మట్టితో యువకుడి స్టంట్.. పోలీసుల దెబ్బకు తిక్క కుదిరింది!
సోషల్ మీడియా వినియోగం పెరగడంతో ప్రతిఒక్కరూ క్రేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. షార్ట్స్, రీల్స్ చేస్తూ తొందరగా పాపులారిటీ తెచ్చుకోవాలని ఉబలాటపడుతున్నారు. ఈ క్రమంలో పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా యువత స్టంట్ల పేరుతో ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు.తాజాగా ఓ వ్యక్తి తన కారుతో విచిత్రమైన ప్రయోగం చేసి చిక్కుల్లో పడ్డాడు. ఉత్తర ప్రదేశ్లోని మీరట్లో ఈ ఘటన జరిగింది. ముందలి గ్రామానికి చెందిన ఇంతేజార్ అలీ అనే వ్యక్తి తన మహీంద్రా థార్ కారు పైకప్పుపై పార సాయంతో మట్టిని నింపాడు. తర్వాత రోడ్డు మీద రాంగ్ రూట్లో అతివేగంతో ప్రయాణించాడు. దీంతో గాలికి ఆ మట్టి పైకి ఎగిరింది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింటా వైరల్గా మారాయి.ఈ వీడియోను చూసిన అనేక మంది స్టంట్ చేసిన యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ పుటేజీ అధారంగా యువకుడిని మీరట్ పోలీసులు పట్టుకున్నారు. అతనిక రూ. 25 వేల చలాన్ విధించారు. मेरठ में THAR पर मिट्टी चढ़ाकर युवक ने दिखाया स्टंटpic.twitter.com/PqBGtMJ935— Priya singh (@priyarajputlive) November 29, 2024 -
ఈవీఎంలపై కట్టలు తెంచుకున్న జనాగ్రహం.. కరెక్టేనా?
ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(EVM)ల పనితీరుపై రాజకీయ వర్గాల్లోనే కాదు.. జనాల్లోనూ చాలా అనుమానాలే ఉన్నాయి. ఊహించని రీతిలో వెలువడే ఫలితాలే.. ఆ అనుమానాల్ని బలపరుస్తుంటాయి. అలాంటప్పుడే గో బ్యాక్ టూ బ్యాలెట్ పేపర్ అనే వాయిస్ వినిపిస్తుంటుంది. అయితే లోపాల సంగతిని పక్కనపెట్టి.. అవకతవకలకు ఆస్కారం లేదంటూ ఎన్నిక సంఘం, కేంద్రం వాటి వినియోగాన్ని సమర్థిస్తుంటాయి. తాజాగా.. ఇవాళ సుప్రీం కోర్టు సైతం బ్యాలెట్ పేపర్లను వెనక్కి తేలేమంటూ తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే..మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంలపై ప్రజాగ్రహం వెల్లువెత్తిందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాఢి ఘోర పరాభవం చవిచూసింది. కాంగ్రెస్ పార్టీ 101 స్థానాల్లో పోటీ చేసి.. కేవలం 16 స్థానాల్లో గెలిచింది. ఓడినవాళ్లలో.. దూలే రూరల్ నుంచి పోటీ చేసిన కునాల్ పాటిల్ కూడా ఉన్నారు. ఆయన బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర పాటిల్ చేతిలో ఓటమి చెందారు. అయితే..కాంగ్రెస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. నియోజకవర్గంలోని అవధాన్ గ్రామంలో జనం ఈవీఎంలకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. కాంగ్రెస్కు పట్టు ఉన్న ఈ గ్రామంలో.. కునాల్కు జీరో ఓట్లు వచ్చాయని, అందుకే ఈవీఎంలకు వ్యతిరేకంగా వాళ్లు నిరసన తెలుపుతున్నారనేది ఆ వీడియో సారాంశం. అయితే..ఈ వీడియో ఆధారంగా కాంగ్రెస్ నేతలంతా ఎన్నికల సంఘాన్ని ట్యాగ్ చేస్తూ.. ఈవీఎంల పని తీరుపై ప్రశ్నలు సంధిస్తున్నారు. వీళ్లలో యూపీ కాంగ్రెస్ కమిటీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ పాన్ఖురి పాథక్ కూడా ఉన్నారు. గ్రామంలోని 70 శాతం జనాభా కునాల్కు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈవీఎంలను బీజేపీ తప్పుడుగా ఉపయోగించుకుంటోందని పేర్కొన్నారు. కానీ..In Maharashtra people are out on the streets protesting against EVM manipulation... Will any Godi Media channel dare to show this ?NO. https://t.co/yTtAyoqav0— Pankhuri Pathak पंखुड़ी पाठक پنکھڑی (@pankhuripathak) November 25, 2024ఎన్నికల సంఘం ఆ ఆరోపణలన్నింటిని తోసిపుచ్చింది. అవధాన్లో కునాల్ పాటిల్కు 1,057 ఓట్లు పోలయ్యాయని ధూలే జిల్లా ఎన్నికల కార్యాలయం ప్రకటించింది. అలాగే.. రాఘవేంద్ర పాటిల్కు ఇక్కడ 1,741 ఓట్లు వచ్చాయని పేర్కొంది. దీంతో.. ఆ వీడియో ఫేక్ అనేది స్పష్టమైంది.నవంబర్ 20వ తేదీన మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరగ్గా.. నవంబర్ 23వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. ధూలే రూరల్ నియోజకవర్గంలో రాఘవేంద్ర పాటిల్కు 1,70,398 ఓట్లు, కునాల్ పాటిల్కు 1,04,078 ఓట్లు పడ్డాయి. -
రాష్ట్రపతి ముర్మును అవమానించిన రాహుల్.. బీజేపీ ఆరోపణలు
న్యూఢిల్లీ: రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అగౌరవపరిచారని బీజేపీ ఆరోపించింది. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ముర్ముకు శుభాకాంక్షలు చెప్పకుండా ఆమెను అవమానపరిచారని ఆరోపించింది. జాతీయ గీతం సమయంలో కూడా రాహుల్ పరధ్యానంలో ఉన్నారని మండిపడింది. ఈమేరకు సోషల్ మీడియాలో వరుస వీడియోలను షేర్ చేసింది.పాత పార్లమెంట్ భవనంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా స్మారక నాణెం, స్టాంపులను రాష్ట్రపతి విడుదల చేశారు. అనంతరం స్టేజీపై ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. राहुल गांधी को इतना घमंड है कि राष्ट्रपति जी का अभिवादन तक नहीं किया। सिर्फ इसलिए क्योंकि वो जनजातीय समाज से आती हैं, महिला हैं और राहुल गांधी कांग्रेस के राजकुमार? कैसी घटिया मानसिकता है ये? pic.twitter.com/shtP5s2dxs— Amit Malviya (@amitmalviya) November 26, 2024అయితే అక్కడే ఉన్న రాహుల్ గాంధీ మాత్రం రాష్ట్రపతి ముర్ముకు శుభాకాంక్షలు చెప్పకుండా వేదికపై నుంచి వెళ్లిపోయాడని ఎక్స్ వేదికగా బీజేపీ నేత అమిత్ మాల్వీయ విమర్శించారు. జాతీయ గీతం ప్లే అవుతున్న సమయంలో అందరూ ముందుకు చూస్తే.. రాహుల్ మాత్రం పక్కకు, కిందకు చూస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రపతి, ఇతర నాయకులు నిలబడి ఉండగానే గాంధీ కూర్చోవడానికి ప్రయత్నించారని విమర్శించారుCongress always disrespects President Smt Droupadi Murmu ji, because she is the first Tribal woman to occupy the highest office of the land. Rahul Gandhi and family despise SC, ST and OBCs. It shows. pic.twitter.com/CR3v8pAioL— Amit Malviya (@amitmalviya) November 26, 2024‘రాహుల్ గాంధీ తన దృష్టిని 50 సెకన్లు కూడా కేంద్రీకరించలేరు. కానీ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిపై పూర్తిగా అసహ్యకరమైన వ్యాఖ్య చేసే ధైర్యం అతనికి ఉంది. జాతీయ గీతం ముగియగానే, వేదికపై ఉన్న రాహుల్ గాంధీ దిగిపోవడానికి ప్రయత్నిచారు. రాహుల్ ద్రౌపది ముర్మును ఎప్పుడూ అగౌరపరుస్తుంటారు. ఎందుకంటే ఆమె దేశ అత్యున్నత పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళ కాబట్టి. రాహుల్, గాంధీ కుటుంబం.. ఎస్సీ, ఎస్టీ,ఓబీలపై ప్రేమలేదు’ అని విమర్శలు గుప్పించారు.Rahul Gandhi can’t hold his attention for even 50 seconds and he had the audacity to make an absolutely distasteful comment on the President of United States. pic.twitter.com/TAesrKmrmS— Amit Malviya (@amitmalviya) November 26, 2024 అయితే ఈ వీడియోలపై పలువురు స్పందిస్తూ.. రాష్ట్రపతి పట్ల రాహుల్ అహంకారం ప్రదర్శించారని, మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి తరువాత రాహుల్ నిరాశలో కూరుకుపోయారని, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. అయితే బీజేపీ ఆరోపణలపై రాహుల్ గాంధీ కానీ, ఇతర కాంగ్రెస్ నేతలు కానీ స్పందించలేదు. -
యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ని తలపిస్తూ..కొత్త పెళ్లికొడుకు సాహసం, వైరల్ వీడియో
కాబోయే భార్యను తలచుకుంటూ ముసి ముసి నవ్వులతో పెళ్లి కొడుకు దేవ్ కుమార్ గుర్రమెక్కి పెళ్లి మంటపానికి బందు మిత్ర సపరివారంగా తరలి వెళ్లాడు. బాజా భజంత్రీల సమక్షంలో అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశాడు. కొత్తభార్యతో ఆనందంగా ఇంటికి బయలుదేరాడు. మెడలో మెరిసిపోతున్న కరెన్సీ మాలను చూసుకుంటున్నాడు. ఇంతలో ఎక్కడనుంచి వచ్చాడో తెలియదు ఆగంతకుడు. పెళ్లి కొడుకు మెడలోని కరెన్సీ దండలోని 100 రూపాయలనోటను అమాంతం ఎగరేసుకుపోయాడు ఘొక మినీ ట్రక్ డ్రైవర్ కాజేశాడు. ఒక్క క్షణం బిత్తరపోయినా, వెంటనే తేరుకుని అత్యత సాహసంగా అతణ్ణి వెంబడించి పట్టుకున్నాడు. బాలీవుడ్ బ్లాక్బస్టర్ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్గా సాగిన ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.పియూష్ రాయ్ అనే జర్నలిస్టు ఈ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. దీని ప్రకారం. తన మెడలోని నోట్ల దండను ట్రక్ డ్రైవర్ కొట్టేయడంతో వెంటనే అప్రమత్తమైన వరుడు పెళ్లీ, గిళ్లీ తరువాత చూద్దాం అనుకున్నాడో ఏమో గానీ, నగదు దండను చోరీ చేసిన డ్రైవర్ను పట్టుకునేందుకు రంగంలోకి దిగిపోయాడు. హైవేపై ట్రక్ను వెంబడించాడు. అత్యంత సాహసంతో స్టంట్మ్యాన్లాగా ట్రక్పైకి దూకాడు. చాకచక్యంగా క్యాబిన్లోకి ప్రవేశించి అతగాడిని దొరకబుచ్చుకున్నాడు. నాలుగు తగిలించాడు. ఇంతులో అతని వెనకాలే ఫాలో అయిన స్నేహితులు, చుట్టుపక్కల వాళ్లు కూడా తోడయ్యాడు. దీంతో పొరపాటు జరిగిందని వదిలేయాలంటూ లబోదిబో మన్నాడు. దీంతో దేవ్ కుమార్ హీరోగా అయిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పన్నీ కామెంట్లను షేర్ చేశారు. దెబ్బకి పెళ్లి కూతురు ఫిదా అని ఒకరు, కొత్త పెళ్లి కూతురు స్పైడర్ మాన్ స్పైడర్ మాన్ నా మనసు దోచేశావ్ అని పాడుకుంటుందేమో అని మరికొందరు వ్యాఖ్యానించారు. మరోవైపు పెళ్లి రాత్రిని తప్పించుకోవడానికి వరుడు ఇలా ప్లాన్ చేసి ఉంటాడని కొందరు, ఇంత చేసినా అమ్మాయి ఇంప్రెస్ అవుతుందా అని ఇంకొందరు ఫన్నీగా కమెంట్ చేశారు. <Video of the year! In UP's Meerut, groom Dev Kumar was happily getting home after the wedding when a pick up driver pinched a note from his currency tucked garland. What followed was a near Bollywood, daring chase for justice! Groom Dev Kumar asked for lift from a motorist,… pic.twitter.com/libIH8PRTT— Piyush Rai (@Benarasiyaa) November 25, 2024రవాణా సంస్థ ప్రకటనట్రక్ స్థానిక రవాణా సంస్థకు చెందినది, దీని యజమాని మనీష్ సెహగల్ ఈ సంఘటనపై భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్రక్ డ్రైవర్ దొంగ కాదని, దొంగతనంతో అతనికి ఎటువంటి సంబంధం లేదని వాదించారు. అతని వాహనానికి వ్యతికేంగా వేగంగా దూసుకురావడం వల్లే పెళ్లి ఇలా చేశాడని ఆరోపించారు. ఎలాంటి సంబంధం లేనప్పటికీ వరుడు , అతని స్నేహితులు డ్రైవర్పై దాడి చేశారని సెహగల్ ఆరోపించారు. దీంతో ఏం జరిగిందో స్పష్టత లేక బుర్ర గోక్కుంటున్నారట స్థానిక పోలీసులు. ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. -
మంటల్లో విమానం.. 89 మందిని సినీ ఫక్కీలో రక్షించిన సిబ్బంది
టర్కీలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. రష్యా నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్ ప్లేన్కు మంటలు అంటుకున్నాయి. అయితే.. ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తతో ప్రయాణికులు, విమాన సిబ్బంది మొత్తం అందరూ సురక్షితంగా బయటపడ్డారు.అజిముత్ ఎయిర్లైన్స్కు చెందిన సుఖోయ్ సూపర్ జెట్ విమానం(రష్యా).. నల్ల సముద్రం తీరాన ఉన్న సోచి రిసార్ట్ నుంచి ప్రయాణికులను తీసుకుని టర్కీ అంటల్యా ఎయిర్పోర్టుకు చేరింది. అయితే ల్యాండ్ అయ్యే సమయంలో ఇంజిన్లో మంటలు చెలరేగి.. క్రమంగా విమానానికి వ్యాపించాయి.విమానంలో 89 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వెంటనే పైలట్ విమానాన్ని రన్వేపై ర్యాష్ ల్యాడింగ్ చేశాడు. అయితే సకాలంలో ఎయిర్పోర్ట్ సిబ్బంది స్పందించారు. సినీ ఫక్కీలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. విమానం నుంచి అందరినీ బయటకు రప్పించారు. మంటలను ఆర్పేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సదరు విమానం ఏడేళ్ల కిందటే సర్వీస్లోకి వచ్చిందని, అలాగే ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు విమానయాన సంస్థ ప్రకటించింది. This was the terrifying moment a plane the #Russian-made #Sukhoi Superjet 100 passenger plane from #AzimuthAirlines went up in flames following a nightmare landing at a #Turkish #Antalya airport. pic.twitter.com/QY3EmzdQBY— Hans Solo (@thandojo) November 25, 2024 -
వర్షం కురిసినప్పుడు వచ్చే సువాసనను పోలిన అత్తరు గురించి తెలుసా..!
రకరకాల పెర్ఫ్యూమ్లు వాడుతంటాం కదా. తొలకరి జల్లులు పడినప్పుడు వచ్చే సువాసనను పోలిన అత్తర్ గురించి విన్నారా..!. అలాంటి అత్తరును మనదేశంలోని పెర్ఫ్యూమ్కి రాజధానిగా పిలిచే ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ ప్రాంతం తయారు చేస్తుంది. నిజానికి ఈ మట్టివాసనను 'పెట్రికోర్' అంటారు. అయితే కన్నౌజ్ ప్రాంతంలో దీన్నే "మిట్టి అత్తర్" పేరుతో ఈ పెర్ఫ్యూమ్ని తయారుచేస్తున్నారు. దీన్ని పురాత భారతీయ సాంప్రదాయ పద్ధతిలో చేస్తున్నారు. చెప్పాలంటే ఇది అత్యంత శ్రమ, సమయంతో కూడిన పద్ధతి. అందుకోసం వాళ్లు ఎలాంటి కెమికల్స్ వంటి వాటిని ఉపయోగించరు. మరీ వర్షం కురిసినప్పుడు వచ్చే నేల వాసనను పోలిన అత్తరు తయారీకీ ఏం ఉపయోగిస్తారంటే..గంగా నది ఒడ్డున ఉండే మట్టిని, గులాబి రేకులు లేదా మల్లెపువ్వులతో ఈ అత్తరుని తయారు చేస్తారు. తయారీ విధానానికి ఉపయోగించే పాత్రలు సింధులోయ నాగరికత టైంలో ఉపయోగించినవి. ఈ అత్తరు తయారీ విధానం దాదాపు ఐదువేల ఏళ్ల నాటిది. కానీ ఇప్పటికీ అదే పద్ధతిలోనే అత్తరు తయారు చేయడం కన్నౌజ్ ప్రాంతవాసుల ప్రత్యేకత. అంతేగాదు తయారీ మొత్తం పర్యావరణ హితంగానే చేస్తారు. కనీసం ప్రాసెసింగ్ పద్ధతుల్లో కూడా కేవలం కట్టెల పొయ్యలతో మండిస్తారు. ఇక ప్యాకింగ్ వద్దకు వస్తే చిన్న లెదర్ బాటిల్ రూపంలో ఈ అత్తర్లను మార్కెట్లోకి తీసుకువస్తారు. అయితే ప్రస్తుతం ఈ అత్తరు తయారీ పద్ధతిని సవరించి.. బొగ్గులు, కట్టెల పొయ్యలకు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి మరింత అనుకూలమైన పద్ధతుల కోసం అన్వేషిస్తున్నట్లు ఫ్రాగ్రాన్స్ అండ్ ఫ్లేవర్ డెవలప్మెంట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్డిసి) డైరెక్టర్ శక్తి వినయ్ శుక్లా చెబుతున్నారు. శుక్లా ఈ "మిట్టి అత్తర్"ని సహజమైన డీ-మాయిశ్చరైజర్గా అభివర్ణిస్తున్నారు. (చదవండి: దుస్తుల నుంచి కర్రీ వాసనలు రాకూడదంటే..!) -
అంతగనం ఏముంది అనుకోకండి : కోటి దిశగా దూసుకుపోతోంది!
సోషల్ మీడియాలో ఏది సంచలనంగా మారుతుందో.. ఏది వైరల్గా మారుతుంది ఊహించలేం. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.నైజీరియాకు కెందిన వైవన్నే అనే యూజర్ ఒక వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. ది బ్యూటిఫుల్ రెస్క్యూ టీం అనే క్యాప్షన్తో పోస్ట్ అయిన ఈ వీడియో నెటిజనులకు బాగా నచ్చేసింది. రీట్వీట్లు, లైక్ల వర్షం కురుస్తోంది. సూపర్.. క్యూట్ అంటూ కమెంట్లు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఇది 90 లక్షలకు పైగా వ్యూస్ను దక్కించుకుంది.ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అంటే...మీరే చూసేయండి!That was a beautiful rescue team😁🥰 pic.twitter.com/75AZNcFi64— Yvonne (@Yummy_yvy) November 24, 2024 -
IND Vs AUS: నితీశ్ రెడ్డి ధనాధన్.. బౌలింగ్లోనూ అదుర్స్! బ్యాటర్ ఫ్యూజులు ఔట్
టీమిండియా యువ క్రికెటర్, విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ టెస్టుల్లో తొలి వికెట్ తీశాడు. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ను అద్భుత రీతిలో బౌల్డ్ చేసి.. సత్తా చాటాడు. కాగా ఐపీఎల్-2024లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టిన నితీశ్.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో 21 ఏళ్ల నితీశ్ రెడ్డి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి.. ఈ ఏడాది అక్టోబరులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్తో సొంతగడ్డపై జరిగిన టీ20 సిరీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చి.. మూడు మ్యాచ్లలో కలిపి 90 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు.అయితే, అనూహ్య రీతిలో నితీశ్ రెడ్డిని సెలక్టర్లు ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడే జట్టుకు ఎంపిక చేశారు. ఇందుకు ప్రధాన కారణం నితీశ్కు ఉన్న అరుదైన పేస్ బౌలింగ్ ఆల్రౌండ్ నైపుణ్యాలే! హార్దిక్ పాండ్యా కేవలం వన్డే, టీ20లకే పరిమితం కావడంతో టెస్టుల్లో అతడి వారసుడి కోసం టీమిండియా ఎదురుచూస్తోంది.ముంబై ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ కూడా పేస్ బౌలింగ్ ఆల్రౌండరే అయినా.. ఆసీస్ టూర్కు మాత్రం బీసీసీఐ నితీశ్నే ఎంపిక చేసింది. గాయం నుంచి కోలుకున్నప్పటికీ శార్దూల్ను పక్కనపెట్టి.. ఈ యువ ఆటగాడికి పెద్దపీట వేసింది.అంతేకాదు... మెగా సిరీస్కు నితీశ్ను సన్నద్ధం చేసే క్రమంలో.. భారత్-‘ఎ’ జట్టు తరఫున ఆడేందుకు ముందే అతడిని ఆస్ట్రేలియాకు పంపించింది. అయితే, ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్ల అనధికారిక టెస్టు సిరీస్లో నితీశ్ ఆకట్టుకోలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్లోనూ విఫలమయ్యాడు.ఆసీస్తో అనధికారిక సిరీస్లో 71 (0, 17, 16, 38) పరుగులు మాత్రమే చేయడంతో పాటు.. ఒకే ఒక్క వికెట్ తీశాడు నితీశ్. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో టెస్టుల్లో అతడిని ఆడిస్తారా? లేదా? అన్న సందేహాల నడుమ.. మేనేజ్మెంట్ మాత్రం నితీశ్ రెడ్డిపై నమ్మకం ఉంచింది.ఈ క్రమంలో పెర్త్ వేదికగా తొలి టెస్టు సందర్భంగా నితీశ్ రెడ్డి.. టీమిండియా తరఫున టెస్టుల్లో అడుగుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్లో జట్టు కష్టాల్లో ఉన్న వేళ ఆదుకోవడంతో పాటు.. రెండో ఇన్నింగ్స్లోనూ ధనాధన్ బ్యాటింగ్తో అలరించాడు.మొదటి ఇన్నింగ్స్లో 59 బంతుల్లో 41 పరుగులతో భారత టాప్ స్కోరర్గా నిలిచిన ఈ ఆల్రౌండర్.. రెండో ఇన్నింగ్స్లో తన ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లితో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 27 బంతుల్లోనే 38 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇక సోమవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా నితీశ్ రెడ్డి టెస్టుల్లో వికెట్ల ఖాతా కూడా తెరిచాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో ప్రమాదకారిగా పరిణమించిన మిచెల్ మార్ష్(47)ను నితీశ్ తన బౌలింగ్ నైపుణ్యంతో బోల్తా కొట్టించాడు.అతడి బౌలింగ్లో మార్ష్ షాట్ ఆడే ప్రయత్నంలో విఫలం కాగా.. బంతి తాకి స్టంప్స్ ఎగిరిపడ్డాయి. దీంతో మార్ష్ షాకింగ్ రియాక్షన్తో క్రీజును వీడాడు. ఈ క్రమంలో ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. కాగా తొలి టెస్టులో టీమిండియా ఆసీస్కు 534 పరుగుల భారీ లక్ష్యం విధించింది. అయితే, ఆసీస్ 182 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.EDGE & GONE!Nitish Kumar Reddy gets the big fish #MitchellMarsh!#AUSvINDOnStar 👉 1st Test, Day 4, LIVE NOW! #AUSvIND #ToughestRivalry pic.twitter.com/n4mKpojPhp— Star Sports (@StarSportsIndia) November 25, 2024 -
Viral video: ఒకప్పుడు విదేశాల్లో టెకీ.. ఇప్పుడు బిచ్చగాడు
అతను ఒకప్పుడు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో, ఆ తరువాత బెంగళూరులో ఓ ప్రముఖ టెక్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేశాడు. ఇప్పుడదే బెంగళూరులోని జయనగర్ వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్నాడు. మద్యానికి బానిసవడమే తన దుస్థితికి కారణమని చెబుతున్నాడు. అతను తనతో పంచుకున్న కథను శరత్ యువరాజా అనే యువకుడు ఇన్స్టాలో షేర్ చేశాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐన్స్టీన్ మొదలుకుని పలువురు తత్వవేత్తల దాకా అందరి గురించీ అతను అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ధ్యానం, తత్వశాస్త్రం, సైన్స్ వంటి అంశాలపై లోతైన వ్యాఖ్యలు చ్తేస్తున్నాడు. అయితేనేం, ‘తల్లిదండ్రులను కోల్పోవడం నన్ను మద్యం మత్తులోకి నెట్టింది. అది అదుపు తప్పి ఈ గతి పట్టింది. నిరాశ్రయుడిగా మారి బతకడం కోసం భిక్షాటన చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘మతం కులం, ఇవన్నీ కలగలసి చివరకు నేనేమయ్యానో చూడండి. నేనింకా చదవాలి’’ అని మరో వీడియోలో చెప్పాడు. సాయం చేయడానికి ప్రయత్నిస్తే నిరాకరించాడని శరత్ పేర్కొన్నారు. ‘‘దాంతో ఎన్జీవోలను సంప్రదించా. కానీ పోలీసుల ప్రమేయంతోనే అతన్ని మార్చడం సాధ్యమని డాక్టర్లు అంటున్నారు’’ అని చెప్పారు. వ్యసనాలకు దూరంగా ఉండటం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వృత్తిలో విజయాలు తదితరాలపై ఈ వీడియోలు ఆన్లైన్లో గట్టి చర్చకు దారి తీశాయి. View this post on Instagram A post shared by 𝙎𝙃𝘼𝙍𝘼𝙏𝙃 YUVARAJ🌎 (@sharath_yuvaraja_official) -
Devendra Fadnavis: నాడు శపథం చేసి.. నేడు సీఎం రేసులో ముందంజలో..
మహారాష్ట్రకి ఒకసారి ముఖ్యమంత్రిగా పని చేసి.. మరోసారి అధికారం అంచుల దాకా తీసుకెళ్లి.. చివరకు పార్టీ కోసం సీఎం పదవిని సైతం త్యాగం చేశాడన్న పేరు ఉంది దేవేంద్ర ఫడ్నవిస్కు. మహారాష్ట్ర ఫలితాల వేళ.. సీఎం రేసులో మొదట వినిపించిన పేరు ఈయనదే. అలాగే.. ఈయనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ట్రెండింగ్లోకే వచ్చింది. ‘‘నా నుంచి బొట్టుగా నీరుపడుతోందని.. ఇల్లు కట్టుకోవాలని చూడకండి. నేనొక మహాసముద్రాన్ని.. కచ్చితంగా తిరిగి వస్తా.. అంటూ అసెంబ్లీలో ఆయన మాట్లాడిన ఐదేళ్ల కిందటి నాటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.महाराष्ट्र चुनाव के नतीजों के बाद ये वीडियो आज चर्चा में हैंठीक 5 साल पहले देवेंद्र फड़नवीस ने कहा था: मेरा पानी उतरता देखमेरे किनारे पर घर मत बसा लेनामैं समंदर हूँलौटकर वापस आऊँगा#DevendraFadnavis Aditya Thackeray #महाराष्ट्र संजय राउत Ajit Pawar EVMS #ToxicTheMovie pic.twitter.com/KQNhzdalrg— political voices (@politicvoices_) November 23, 2024‘‘కచ్చితంగా మావాడే సీఎం అవుతాడు. అందులో ఎలాంటి అనుమానాలే అక్కర్లేదు. తను 24 గంటలు నిద్రాహారాలు మానేసి కూటమి విజయం కోసం కృషి చేశాడు. ఈ ప్రయాణంలో కోట్లమంది అక్కాచెల్లెళ్ల ఆశీర్వాదం అతనికి ఉంది’’ అంటూ ఫడ్నవిస్ తల్లి సరిత అంటున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145. సోలోగానే బీజేపీ 100కిపైగా సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో సీఎం రేసులో దేవేంద్ర ఫడ్నవిస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ అంచనాకు తగ్గట్లు.. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ బాధ్యతలు స్వీకరిస్తారని బీజేపీ నేత ప్రవీణ్ ధరేకర్ చెబుతున్నారు. రేపు ఢిల్లీ నుంచి పార్టీ పరిశీలకులు వస్తారని, 25న మహారాష్ట్ర బీజేఎల్పీ సమావేశం జరగనుందని చెప్పారాయన. ఆ ప్రకటన వెలువడిన వెంటనే.. ఫడ్నవిస్ అనుచరులు టపాసులు కాల్చి.. మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. -
‘వదినమ్మ వచ్చేసింది’.. పెర్త్ స్టేడియంలో అనుష్క రియాక్షన్స్ వైరల్
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి గత కొన్ని రోజులుగా ఫామ్లేమితో సతమతమవుతున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో టెస్టుల్లో నిరాశపరిచిన కోహ్లి.. తనకు ఘనమైన రికార్డు ఉన్న ఆస్ట్రేలియా గడ్డ మీద కూడా శుభారంభం అందుకోలేకపోయాడు.జాగ్రత్త పడి ఉంటే..పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో శుక్రవారం మొదలైన టెస్టులో కోహ్లి విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో పన్నెండు బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులే చేశాడు. ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్ బౌలింగ్లో ఉస్మాన్ ఖవాజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, కోహ్లి జాగ్రత్త పడి ఉంటే.. వికెట్ పడకుండా ఉండేదే!ఎప్పుడెప్పుడు లండన్ ఫ్లైట్ ఎక్కేద్దామా!ఈ నేపథ్యంలో మరోసారి కోహ్లి ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. కొంతమందైతే అతడి కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగుతూ.. సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ‘‘ఎప్పుడెప్పుడు మ్యాచ్ ముగుస్తుందా.. ఎప్పుడెప్పుడు లండన్ ఫ్లైట్ ఎక్కేద్దామా! అని చూడటం తప్ప.. జట్టు కోసం నేనేం చేస్తున్నాన్న ఆలోచనే లేదు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.కాగా కోహ్లి భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తమ రెండో సంతానానికి లండన్లో జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కుమారుడు అకాయ్ పుట్టిన తర్వాత విరుష్క జోడీ ఎక్కువగా అక్కడే గడుపుతోంది. ముఖ్యంగా అనుష్క ఏవైనా ప్రమోషన్లు ఉంటే మాత్రమే ఇండియాకు వస్తోంది.ఆస్ట్రేలియా పర్యటనకు మాత్రం కుటుంబ సమేతంగా!మరోవైపు.. కోహ్లి సైతం ఇండియాలో మ్యాచ్ పూర్తవగానే లండన్ వెళ్లిపోతున్నాడు. అయితే, ఆస్ట్రేలియా పర్యటనకు మాత్రం కోహ్లి కుటుంబ సమేతంగా వచ్చినట్లు తెలుస్తోంది. తమ పిల్లలు వామిక, అకాయ్లను కూడా వెంట తీసుకు వచ్చినట్లు సమాచారం. ఇక పెర్త్ స్టేడియంలో అనుష్క టీమిండియాను ఉత్సాహపరుస్తూ కనిపించింది. ముఖ్యంగా శనివారం నాటి రెండో రోజు ఆటలో ఆసీస్ ఆలౌట్ కాగానే ఆమె ఇచ్చిన రియాక్షన్ అభిమానులకు ఫిదా చేస్తోంది.వదినమ్మ వచ్చేసింది..‘‘వదినమ్మ వచ్చేసింది.. కోహ్లి భాయ్ నువ్వు సెంచరీ చేయడమే మిగిలి ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కనీసం రెండో ఇన్నింగ్స్లోనైనా బ్యాట్ ఝులిపిస్తే చూడాలని ఉందని ఫ్యాన్స్ రన్మెషీన్కు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ను 104 పరుగులకే కట్టడి చేసి.. మొదటి ఇన్నింగ్స్లో 46 పరుగుల ఆధిక్యం సంపాదించింది. చదవండి: హర్షిత్.. నీ కంటే నేను ఫాస్ట్గా బౌల్ చేయగలను: స్టార్క్ వార్నింగ్.. రాణా రియాక్షన్ వైరల్Anushka Sharma Reaction, After Australia's last wicket😍#ViratKohli | #AnushkaSharma pic.twitter.com/AItKHrFfpB— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) November 23, 2024 -
హర్షిత్.. నీ కంటే నేను ఫాస్ట్గా బౌల్ చేస్తా: స్టార్క్ వార్నింగ్.. రాణా రియాక్షన్ వైరల్
ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య తొలి టెస్టు.. రెండో రోజు ఆట సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్.. భారత యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు ‘స్వీట్ వార్నింగ్’ ఇచ్చాడు. అయితే, ఇందుకు హర్షిత్ స్పందించిన తీరు నెట్టింట వైరల్గా మారింది.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్- భారత్ మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. ఇందులో భాగంగా పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య శుక్రవారం మొదటి టెస్టు ఆరంభమైంది. ఇక ఈ మ్యాచ్కు వ్యక్తిగత కారణాల దృష్ట్యా రోహిత్ శర్మ దూరం కాగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు.ఇక పెర్త్లో టాస్ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆతిథ్య ఆసీస్ సైతం తొలి రోజే బ్యాటింగ్కు దిగింది. ఈ క్రమంలో ఆది నుంచే ఆసీస్ బ్యాటర్లను టార్గెట్ చేస్తూ పేస్ దళ నాయకుడు బుమ్రా వికెట్ల వేట మొదలుపెట్టగా.. మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా అతడికి సహకారం అందించారు.రాణా తొలి వికెట్ అతడేఫలితంగా శుక్రవారం నాటి ఆటలో టీమిండియా పైచేయి సాధించగలిగింది. బుమ్రా నాలుగు వికెట్లతో రాణించగా.. సిరాజ్ రెండు వికెట్లు కూల్చాడు. ఇక అరంగేట్ర బౌలర్ హర్షిత్ రాణా ట్రవిస్ హెడ్(11) రూపంలో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో తొలి వికెట్ దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి ఆసీస్ ఏడు వికెట్ల నష్టానికి 67 రన్స్ మాత్రమే చేసింది.అంతేకాదు.. శనివారం నాటి రెండో రోజు ఆరంభంలోనే వికెట్ తీసి మరోసారి దూకుడు ప్రదర్శించింది. ప్రమాదకారిగా మారుతున్న అలెక్స్ క్యారీ(21)ని బుమ్రా అవుట్ చేయగా.. నాథన్ లియాన్(5)ను హర్షిత్ పెవిలియన్కు పంపాడు.అయితే, ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ మాత్రం క్రీజులో పాతుకుపోయి.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఈ క్రమంలో ఆసీస్ ఇన్నింగ్స్ 40వ ఓవర్లో బుమ్రా.. హర్షిత్ను రంగంలోకి దించాడు. ఈ క్రమంలో మూడో బంతిని హర్షిత్ బౌన్సర్గా సంధించగా.. స్టార్క్ హెల్మెట్కు తగిలింది.హర్షిత్.. నేను నీ కంటే వేగంగా బౌలింగ్ చేయగలనుదీంతో కంగారూపడిన హర్షిత్ స్టార్క్ వైపు చూస్తూ అంతే ఓకే కదా అన్నట్లు సైగలతోనే అడిగాడు. ఇందుకు బదులుగా నవ్వులు చిందించిన స్టార్క్.. ‘‘హర్షిత్.. నేను నీ కంటే వేగంగా బౌలింగ్ చేయగలను. పాత జ్ఞాపకాలు గుర్తున్నాయి’’ అంటూ ఐపీఎల్లో తాము కలిసి ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు.ఇక స్టార్క్ మాటలతో ఒక్కసారిగా హర్షిత్ చిరునవ్వులు చిందిస్తూ అలాగే అన్నట్లు తలూపాడు. మామూలుగా ఆసీస్- భారత్ మ్యాచ్ అంటే స్లెడ్జింగ్ మొదట గుర్తుకువస్తుంది. అయితే, హర్షిత్- స్టార్క్ మాత్రం ఇలా ఫ్రెండ్లీగా ఉండటం అభిమానులను ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా ఐపీఎల్-2024లో హర్షిత్ రాణా, స్టార్క్ కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిథ్యం వహించారు. జట్టును చాంపియన్గా నిలపడంలో ఈ ఇద్దరు పేసర్లు తమ వంతు పాత్రలు పోషించారు. అదీ సంగతి!!104 పరుగులకే కుప్పకూలిన ఆసీస్ఇక క్రీజులో పాతుకుపోయి జిడ్డు బ్యాటింగ్తో భారత బౌలర్లను ఇబ్బంది పెట్టిన స్టార్క్ వికెట్ను ఆఖరికి హర్షిత్ దక్కించుకోవడం విశేషం. మొత్తంగా 112 బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేసిన స్టార్క్ పదో వికెట్గా వెనుదిరగడంతో ఆసీస్ ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో 104 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో బుమ్రా ఐదు, రాణా మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు.Mitch Starc offers a little warning to Harshit Rana 😆#AUSvIND pic.twitter.com/KoFFsdNbV2— cricket.com.au (@cricketcomau) November 23, 2024 -
Video: పెళ్లి ఊరేగింపులో బంధువుల రచ్చ.. గాల్లోకి 20 లక్షలు జల్లుతూ
పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ గొప్ప మలుపు. సంప్రదాయంతో ఒక్కటయ్యే మధురమైన వేడుక. పెళ్లిని ఎవరైనా జీవితంలో గుర్తిండిపోయేలా చేసుకోవాలనుకుంటారు. అతిథులందరి సమక్షంలో గ్రాండ్గా జరుపుకుంటారు. అయితే ఒక చోట మాత్రం కొందరు పెళ్లి ఊరేగింపులో హల్చల్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. గాల్లోకి ఏకంగా లక్షలు వెదజల్లారు. ఈఘటన ఉత్తర ప్రదేశ్లోని సిద్ధార్థనగర్లో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.అఫ్జల్, అర్మాన్ వివాహాం జరిగిన అనంతరం ఊరేగింపు నిర్వహించారు. అంత సవ్యంగా సాగుతుండగా.. వరుడు, వధువు పక్కన ఉన్న బంధువులు ఒక్కసారికి గాలిలోకి డబ్బులు విసిరారు. చుట్టుపక్కలా ఉన్న ఇళ్లపై, జేసీబీలపై నిలబడి నోట్ల కట్టలను గాల్లోకి జల్లారు. రూ. 100, 200, 500 నోట్ల కట్టలను గాలిలోకి విసిరారు.దీంతో గాల్లో ఎగురుతున్న నోట్లను స్థానికులు పట్టుకునేందుకు ఎగబడ్డారు. గాలిలో దాదాపు రూ. 20 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో.. నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. కొంతమంది నెటిజన్లు డబ్బును అవసరమైన వారికి పంచాలని సూచించారు., మరికొందరు ఆదాయపు పన్ను కార్యాలయానికి కాల్ చేసి దీనిపై ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఇంత డబ్బుతో నలుగురు పేద అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి ఉండేవారని మరొకరు వ్యాఖ్యానించారు. అయితే దీనిపై ఇంకా పోలీసులు స్పందించలేదు. View this post on Instagram A post shared by 𓂀 𝔹𝕒𝕣𝕖𝕚𝕝𝕝𝕪_𝕛𝕙𝕦𝕞𝕜𝕒𝕔𝕚𝕥𝕪𝟘𝟘𝟙 𓂀 (@bareilly_jhumkacity001) -
కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్న మంధన
మహిళల బిగ్బాష్ లీగ్లో టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధన కళ్లు చెదిరే రన్నింగ్ క్యాచ్ పట్టుకుంది. డబ్ల్యూబీబీఎల్లో అడిలైడ్ స్ట్రయికర్స్కు ఆడే మంధన పెర్త్ స్కార్చర్స్తో జరిగిన మ్యాచ్లో అదిరిపోయే ఫీల్డింగ్ విన్యాసాన్ని ప్రదర్శించింది. ఈ మ్యాచ్లో మంధన అమండ జేడ్ బౌలింగ్లో కార్లీ లీసన్ క్యాచ్ను పట్టుకుంది. స్కార్చర్స్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ తొలి బంతికి లీసన్ కవర్స్ దిశగా షాట్ ఆడగా.. మిడ్ ఆఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న మంధన వెనక్కు పరిగెడుతూ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకుంది. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరవతువుంది.WHAT A STUNNING CATCH BY SMRITI MANDHANA IN WBBL 🤯🔥 pic.twitter.com/byoJRzx69i— Johns. (@CricCrazyJohns) November 19, 2024మూడు క్యాచ్లు పట్టుకున్న మంధన ఈ మ్యాచ్లో మంధన మొత్తం మూడు క్యాచ్లు పట్టుకుంది. ఈ మూడు అద్భుతమైన క్యాచ్లే. మైదానంలో పాదరసంలా కదిలిన మంధన బ్యాట్తోనూ రాణించింది. 29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 41 పరుగులు చేసింది. మంధన బ్యాట్తో, ఫీల్డ్లో రాణించడంతో అడిలైడ్ స్ట్రయికర్స్ 30 పరుగులు తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రయికర్స్.. మంధన (41), కేటీ మ్యాక్(41), లారా వోల్వార్డ్ట్ (48) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. స్కార్చర్స్ బౌలర్లలో అలానా కింగ్ 3, కెప్టెన్ సోఫీ డివైన్ 2, క్లో ఐన్స్వర్త్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కార్చర్స్.. మెగాన్ షట్ (3/19), ముషాంగ్వే (2/35), అమండ జేడ్ వెల్లింగ్టన్ (2/26), తహిల మెక్గ్రాత్ (1/27) ధాటికి నిర్ణీత ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్కార్చర్స్ ఇన్నింగ్స్లో బ్రూక్ హ్యాలీడే (47), సోఫీ డివైన్ (35), అలానా కింగ్ (29 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
పియర్సింగ్ సర్వీస్ గురించి తెలుసా..! సానియా మీర్జా..
పియర్సింగ్ సర్వీస్ గురించి సిటీలో ఉండేవాళ్లకు బాగా తెలుస్తుంది. ఇటీవల చెవితో సహా బాడీకి రకరకాల జ్యువెలరీని కుట్టించుకుంటున్నారు. ఇలా పెట్టుకోవడం ఓ ట్రెండ్లా ఫీలవ్వుతోంది యువత. కాలేజ్ అమ్మాయిల దగ్గర నుంచి ఇంట్లో ఉండే గృహిణుల వరకు అందరూ వీటిని ధరిస్తున్నారు. ఒకప్పుడు చిన్నిపిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు తొమ్మిదో నెల లేదా సవంత్సరంలోపు చెవులు కుట్టించేవారు పెద్దవాళ్లు. పైగా అదొక పెద్ద హడావిడి తంతులా ఉండేది. కానీ ఇప్పుడు సింపుల్గా కానిస్తున్నారు. ఎలాంటి ఏడుపులు ఉండవు. రక్తం కారకుండా మంచి సాంకేతికతో కూడిన పరికరాలతో చక్కగా కుట్టేస్తున్నారు. అదికూడా ఇంట్లోనే హాయిగా కుట్టించుకోవచ్చు. దీన్నే ఆంగ్లంలో పియర్సింగ్ సర్వీస్ అని పిలుస్తారు. ఇటీవల సానియా కూడా ఈ సర్వీస్తో ఇంట్లోనే చెవుల కుట్టించుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియోలో సానియా దుబాయ్లోని తన ఇంటి నాలుగు గోడల మద్య ఓ సాంకేతిక నిపుణుడితో చెవులు కుట్టించుకున్నట్లు తెలిపింది. తన స్నేహితులు, సోదరి అనమ్ మీర్జాతో కలిసి మిరుమిట్లు గొలిపై స్టడ్ చెవిపోగులను కుట్టించుకుంది. తన బెస్ట్ ఫ్రెండ్స్తో సరదాగా గడిపిన ఈ మధుర క్షణాన్ని వీడియోలో బంధించిన దానికి "పర్ఫెక్ట్ గర్ల్స్ నైట్ ఇన్" అనే క్యాప్షన్తో నెట్టింట పోస్ట్ చేశారు. ఆ వీడియోలో సానియా తన చెవి అంతటా అద్దుతమైన చెవిపోగులను పెట్టుకుంది. View this post on Instagram A post shared by The PiercingSpot (@piercingspot)పియర్సింగ్ సర్వీస్:ప్రస్తుతం ఇది ఓ మంచి స్టైలిష్ వ్యాపారంలా సాగుతుంది. ఈ సర్వీస్తో నొప్పిలేకుండా చెవులు ఈజీగా కుట్టించుకోవచ్చు. కొందరు బాడీ అంతటా రకరకాలుగా కుట్టించుకుంటారు. జస్ట్ ఒక్క కాల్తో ఇంటికే నేరుగా వచ్చి సర్వీస్ అందిస్తారు. పైగా మనకు నచ్చిన చెవిపోగులను ఎంచుకుని మరీ పెట్టించుకోవచ్చు. ఇలాంటి హై రేంజ్ సర్వీస్ దుబాయ్, హైదరాబాద్ వంటి మహా నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా అందుబాటులో ఉన్న జస్ట్ సాంకేతికతో స్టడ్చెవిపోగులు పెడతారంతే. అయితే ఈ అత్యాధునిక సర్వీస్లో మాత్రం ఫ్యాన్సీ, బంగారం లేదా వెండి చెవిపోగులను కూడా సెలెక్ట్ చేసుకుని మరి పెట్టించుకోవచ్చు. ఎలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా సర్వీస్ అందిచడమే గాక కనీసం రక్తం కూడా రాకుండా చాలా సింపుల్గా చెవులు కుట్టేస్తారు. View this post on Instagram A post shared by Anam Mirza (@anammirzaaa) (చదవండి: 'లాస్ట్ హోప్ కాదు... బెస్ట్ కేర్'..!) -
'ఎల్లప్పుడూ స్ట్రాంగ్గా ఉండాలంటే'..!: ఇవాంక ట్రంప్ ఫిట్నెస్ మంత్ర..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్గా, తల్లిగా రెండు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే స్ట్రాంగ్ విమెన్. ముగ్గురు పిల్లల తల్లి అయినా.. ఆమె ఇప్పటకీ అంతే స్లిమ్గా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఆమె శరీరాకృతి చూస్తే 16 ఏళ్ల అమ్మాయే అన్నంత అందంగా ఉంటుంది. అంతలా టోన్డ్ ఫిజిక్ని మెయింటైన్ చేసేందుకు ఎలాంటి వర్కౌట్లు చేస్తుంటుందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఇవాంక. సాధారణ వ్యాయమాలతో సరిపెట్టెకుండా అలాంటి వర్కౌట్లు కూడా చేస్తే.. ఎప్పటికీ స్ట్రాంగ్గా ఉండగలమని అంటోంది. ఇంతకీ ఆమె విల్లులాంటి శరీరాకృతి కోసం ఎలాంటి వ్యాయామాలు చేస్తుందో తెలుసా..!.చాలామంది మహిళల మాదిరిగానే తాను కూడా కార్డియో, యోగా, పైలేట్స్ వంటి వర్కౌట్లపైనే దృష్టిసారిస్తానని ఆ వీడియోలో పేర్కొంది ఇవాంక. అయితే తన కండరాల బలం కోసం ప్రస్తుతం తాను వెయిట్ లిఫ్టింగ్ వర్కౌట్లపై శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఎప్పుడూ సాధారణ వ్యాయామాలే కాకుండా ఎల్లప్పుడు స్ట్రాంగ్గా ఉండేందుకు ఇలాంటి వ్యాయామాలు కూడా చేయాలని చెబుతోంది. మన కండరాలు బలోపేతంగా ఉండేలా స్క్వాట్లు, డెడ్లిఫ్ట్లు, హింగ్లు, పుష్-పుల్ అప్స్ వంటి వర్కౌట్లు అవసరమని గట్టిగా విశ్వసిస్తానంటోంది ఇవాంక. స్ట్రాంగ్గా ఉండేందుకు ఇలాంటివి ప్రతి మహిళ తప్పనిసరిగా చేయాలని చెబుతోంది. అంతేగాదు వర్కౌట్లలో అత్యంత కీలకమైనవి ఇవేనని పేర్కొంది. వారంలో నాలుగు రోజులు ఇలాంటి వ్యాయామాలకు కేటాయిస్తానని చెప్పారు. జిమ్కి వెళ్లడమే గాక ఆరు బయట సర్ఫింగ్ పాడిల్ టెన్నిస్, స్విమ్మింగ్, వేక్ సర్ఫింగ్, బ్రెజిలియన్ జియు-జిట్సు, హైకింగ్, వాకింగ్, గోల్ప్ వంటి వాటిల్లో కూడా పాల్గొంటానని అన్నారు. తాను రొటీన్ వ్యాయామాలతో సరిపెట్టనని గేమ్చేంజర్లా వివిధ వ్యాయామాలపై దృష్టిపెడతానని చెప్పారు. తాను శరీరాకృతి విల్లులా ఉండేలా.. అత్యంత బలంగా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెబుతోంది ఇవాంక. అందుకు అంకితభావంతో కూడిన నిబద్ధత అవసరమని చెప్పారు. అలా క్రమతప్పకుండా వర్కౌట్లు చేస్తే మంచి ఫిట్నెస్ లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని అంటోంది. అలాగే వీడియోలో అందర్నీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిట్గా ఉండమని కోరింది ఇవాంక. View this post on Instagram A post shared by Ivanka Trump (@ivankatrump) (చదవండి: బెల్ట్లు, చెప్పులతో కొట్టేవారు: ఆయుష్మాన్ ఖురాన్! బాల్యం భారంగా మారకూడదంటే..) -
అంబులెన్స్కు దారివ్వని కారు.. షాకిచ్చిన పోలీసులు!
రోడ్డు మీద వెళ్లేటపుడు అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే. అయితే అంబులెన్స్ సౌండ్ వినిపించగానే ఎంతటివారైనా వెంటనే తమ వాహనాలను సైడ్కు తీసుకుంటారు. సినీ సెలబ్రిటీలైనా, రాజకీయ నేతలైనా.. చివరికి ప్రధాని, రాష్ట్రపతి అయినా సరే అంబులెన్స్ వెళ్లేందుకు దారి ఇస్తారు. కానీ ఓ ప్రబుద్దుడు అంబులెన్స్కు దారి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు.దీంతో ఆ వ్యక్తికి పోలీసులు షాక్ ఇచ్చారు. కారు నడిపిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా.. భారీ జరిమానా కూడా విధించారు. ఈ ఘటన కేరళలోని త్రిస్సూర్లో నవంబర్ 7న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కేరళలో ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అతడిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. చలకుడిలోని పొన్నాని నుంచి త్రిస్సూర్ మెడికల్ కాలేజీకి అంబులెన్స్లో తీసుకెళ్తున్నారు. రోడ్డుపైకి వచ్చాక అన్ని వాహనాలు పక్కకి తొలగి అంబులెన్స్కు దారిచ్చాయి. కానీ ఓ కారు మాత్రం అంబులెన్స్ కు దారివ్వకుండా ఏకంగా రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించింది. అంబులెన్స్ డ్రైవర్ అదే పనిగా హారన్ కొడుతున్నా, ఆ కారు ఓనర్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఈ వ్యవహారాన్నంతా అంబులెన్స్ లోని ఓ వ్యక్తి ఫోన్ ద్వారా వీడియో రికార్డు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, నెటిజన్లు ఆ కారు యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వీడియో కేరళ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వెంటనే రంగంలోకి దిగారు. వీడియో ఆధారంగా ఆ కారు ఎవరిదో గుర్తించిన పోలీసులు. నేరుగా ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి.. దాదాపు రూ.2.5 లక్షల భారీ జరిమానా విధించారు. అంతేకాదు అతడి లైసెన్స్ కూడా రద్దు చేశారు.A car owner in Kerala has been fined Rs/- 2.5 Lakh and their license has been cancelled for not giving away the path for an ambulance. pic.twitter.com/GwbghfbYNl— Keh Ke Peheno (@coolfunnytshirt) November 17, 2024 -
50లో కూడా శిల్పం లాంటి బాడీ...ఇదిగో సింపుల్ వర్కౌట్
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ...ఈ పేరు వినగానే శిల్వం లాంటి ఆమె శరీర ఆకృతి గుర్తు వస్తుంది. శిల్పాశెట్టి పెద్ద ఫిట్నెస్ ఫ్రీక్. అందుకే యాభైయ్యవ పడి దగ్గరపడుతున్నా టోన్డ్, ఫిట్ బాడీతో 90వ దశకంలో ఎంత ఫిట్గా, అందంగా ఉందో ఇప్పటికీ అదే సౌష్టవాన్ని మెయింటైన్ చేస్తోంది. మరోవిధంగా చెప్పాలంటే అంతకు మించి. చక్కని ఆహార అలవాట్లు, చక్కటి వ్యాయామమే ఆమె సౌందర్య రహస్యం. ఇప్పటికీ యోగాసనాలతో అభిమానులను ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. తాజా మండే మోటివేషన్ అంటూ ఒక వీడియోను ఇన్స్టాలో షేర్ చేసింది. స్విస్ బాల్లో ప్రోన్ రివర్స్ హైపర్ల గురించి ఈ వీడియోలో తెలిపింది శిల్పా శెట్టి.. ఇది చాలా సింపుల్. వెన్నుముక, పిరుదులకు చాలా బలమైన వ్యాయామం ఇది. అదే సమయంలో బాలెన్స్ను కాపాడుకోవడానికి కూడా మంచిది. జీవితంలో, వృత్తిలో, రెండింటిలో బలాన్ని పెంపొందించడానికి, సమన్వయాన్ని మెరుగుపరచడాని, స్టెబిలిటీకి చాలా మంచిది అంటూ ఈ వ్యాయామం గురించి చెప్పుకొచ్చింది. మీ రొటీన్లో ఎక్స్ర్సైజ్లో 15-20 సార్లు మధ్యలో 45 సెకన్లపాటు విరామం తీసుకుని మూడుసార్లు చేయాలని వివరించింది. చిన్ని చిన్న అడుగులతోనే పురోగతి మొదలవుతుంది అనే సందేశాన్ని కూడా ఫ్యాన్స్కు ఇచ్చేసింది. అంతేకాదు కార్తీక సోమవారం సందర్బంగా ఉజ్జయినిలోని మహాకాల్ నగరంలో పరమశివుణ్ణి దర్శించుకుంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన బాబా మహాకాల్ జ్యోతిర్లింగం వద్ద భర్తతో కలిసి ప్రత్యేక పూజలు చేసింది. ఈ విషయాలను ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది. (గొంతు నొప్పితో ఆసుపత్రికి : డాక్టర్ చెబితే ‘ఏప్రిల్ పూల్’ అనుకుంది..చివరికి! ) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
మంచు కురిసిన వేళ: కశ్మీర్ సొగసు చూడ తరమా!
శీతాకాలం మంచు అనగానే ఇండియాలో తొలుతగా గుర్తొచ్చే ప్రదేశం జమ్ము కశ్మీర్. రాష్ట్రంలో లోని పలు ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు, దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. #WATCH | J&K: Upper reaches of Bandipora, including border areas of Gurez, Tulail & Kanzalwan, covered under a white sheet of snow as snowfall continues in the region. pic.twitter.com/UL23aw4xwX— ANI (@ANI) November 16, 2024 కాశ్మీర్లోని పర్యాటక ప్రాంతం, స్కీయింగ్కు ప్రసిద్ధి చెందిన గుల్మార్గ్లో శనివారం తొలి మంచు ప్రవాహమై మెరిసింది. ఇంకా కుప్వారా జిల్లా , బందిపొరా జిల్లా, గురెజ్ , కంజల్వాన్ తదితర ప్రాంతాల్లో కూడా భారీగా మంచు కురుస్తోంద. కొండలపై ఎటు చూసిన వెండి వెన్నలలా మంచుకురుస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. కాశ్మీర్లోని ఎగువ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి మంచు కురుస్తుందని, మైదాన ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షం కురిసిందని అధికారులు ఇక్కడ తెలిపారు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది . Snowing heavily over Sonamarg, almost 1-2 inches snowfall accumulated in the area. pic.twitter.com/RTAGuMPGaP— Kashmir Weather Forecast (@KashmirForecast) November 16, 2024