Vladimir Putin
-
పుతిన్కు యుద్దమే ఇష్టం.. ట్రంప్ ప్లాన్ కష్టమే: జెలెన్స్కీ
కీవ్: ఉక్రెయిన్-రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై కసరత్తు జరుగుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ఆరోపణలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం తిరస్కరణకు పుతిన్ సన్నద్ధమవుతున్నారని జెలెన్స్కీ అన్నారు. అలాగ, ఉక్రెయిన్ ప్రజలనే చంపాలన్నదే పుతిన్ లక్ష్యం అంటూ వ్యాఖ్యలు చేశారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా జెలెన్స్కీ మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించడానికి కారణాలు వెతుకుతున్నారు. కాల్పుల విరమణను ఆలస్యం చేయడానికి, అమలుకాకుండా ఉండేందుకు పుతిన్ సన్నద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే కాల్పుల విరమణ ఒప్పందానికి పుతిన్ కండీషన్స్ పెడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కారణంగా ఈ విషయం నేరుగా చెప్పడానికి భయపడుతున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగిస్తూ మా దేశ ప్రజలు చంపాలన్నదే పుతిన్ లక్ష్యం. అందుకే కాల్పుల విరమణ ఒప్పందం అంగీకరించకుండా సాకులు వెతుకుతున్నారు.షరతులు లేని కాల్పుల విరమణ కోసం అమెరికా ప్రతిపాదన చేసింది. ఉక్రెయిన్ ఈ ప్రతిపాదనను అంగీకరించింది. దీనిపై పర్యవేక్షణ ధృవీకరణను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు అమెరికా కూడా తెలిపింది. ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. కాల్పుల విరమణ సమయంలో, దీర్ఘకాలిక భద్రత, శాశ్వత శాంతి గురించి అన్ని ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయడం, యుద్ధాన్ని ముగించడానికి ఒక ప్రణాళికను సిద్ధంగా ఉంచాం. ఉక్రెయిన్ వీలైనంత త్వరగా నిర్మాణాత్మకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మేము దీని గురించి అమెరికా ప్రతినిధులతో కూడా మేము చర్చించాం. ఉక్రెయిన్తో యూరోపియన్ భాగస్వాములు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మిత్రదేశాలకు దీని గురించి తెలుసు.ఈ ప్రక్రియను క్లిష్టతరం చేసే పరిస్థితులను మేము ఏర్పాటు చేయడం లేదు. రష్యా కారణంగానే కాల్పుల విరమణ ఒప్పందం ఆలస్యమవుతోంది. పుతిన్ సంవత్సరాల తరబడి శాంతి లేకుండా యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు అతనిపై ఒత్తిడి పెంచాల్సిన సమయం ఆసన్నమైంది. పుతిన్పై ఆంక్షలు విధించాలి. ఈ యుద్ధాన్ని ముగించమని రష్యాను బలవంతం చేయడానికి మేము ప్రతీ ఒక్కరితో కలిసి పని చేస్తూనే ఉంటాము. అని చెప్పుకొచ్చారు. Right now, we have all heard from Russia Putin’s highly predictable and manipulative words in response to the idea of a ceasefire on the front lines—at this moment he is, in fact, preparing to reject it.Of course, Putin is afraid to tell President Trump directly that he wants… pic.twitter.com/SWbYwMGA46— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) March 13, 2025మరోవైపు.. కాల్పుల విరమణ ప్రతిపాదనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా స్పందించారు. మాస్కోలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. ట్రంప్ ఆలోచన సరైందే. కచ్చితంగా మేం మద్దతిస్తాం. అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని మా అమెరికా మిత్రులతో ఇతర భాగస్వాములతో చర్చిస్తాం. ఒప్పందం ఉల్లంఘన కాకుండా.. సరైన యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. యుద్ధం ఆపాలన్న ప్రతిపాదనకు మేం అంగీకరిస్తున్నాం. అయితే కాల్పుల విరమణ.. శాశ్వత శాంతి దిశగా సాగుతుందన్న ఆశాభావంతో అందరం ముందుకు వెళ్లాలి. సమస్య మూలాలను తొలగించాలి’ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్న ట్రంప్నకు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే.. భారత్, చైనా, దక్షిణాఫ్రికా నేతలకూ కృతజ్ఞతలు చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందంలో ఈ మూడు దేశాలు కూడా కీలక పాత్ర పోషించాయని పుతిన్ సంకేతం ఇచ్చారు. -
దానివల్ల ఏమీ ఉపయోగం లేదు: అమెరికాకు తేల్చి చెప్పిన రష్యా
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ ల మధ్య అమెరికా జరుపుతున్న శాంతి చర్చలు ఇప్పట్లో సఫలీకృతం అయ్యేటల్లు కనిపించడం లేదు. ‘ మేము వెనక్కి తగ్గం అంటే.. మేము కూడా వెనక్కి తగ్గేదే లేదు’ అన్నట్లుగా ఉంది ఇరు దేశాల పరిస్థితి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుపుతున్నప్పటికీ అది కాస్తా విఫలయత్నంగానే మిగిలి ఉంది. ఒకవైపు వైట్ హౌస్ వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో జరిపిన చర్చలు వాగ్వాదానికి దారి తీశాయే తప్ప వాటిలో ఎటువంటి ముందడుగు పడలేదు. అదే సమయంలో రష్యాను కూడా కాస్త తగ్గే ఉండమని ట్రంప్ చేస్తున్న విజ్ఞప్తిని కూడా ఆ దేశం పెద్దగా పట్టించుకోవడం లేదు. కనీసం 30 రోజుల శాంతి ఒప్పందంతో ఇరు దేశాల యుద్ధం ఓ కొలిక్కి వస్తుందని ఆశించిన అమెరికాకు ఇరు దేశాల వైఖరి ఏమాత్రం మింగుడు పడటం లేదు.అది ఉక్రెయిన్ ఆర్మీ ఊపిరి తీసుకునేందుకే..తాజాగా అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఆడ్వైజర్ మికీ వాల్ట్ కు ఇదే విషయాన్ని రష్యా స్పష్టం చేసింది. 30 రోజుల మీ శాంతి ఒప్పందం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అత్యంత కీలక విషయాలు చూసే యురీ ఉషాకోవ్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఫోన్ లో అమెరికాకు తేల్చిచెప్పారు.‘మీరు కోరుకునే మా ఇరుదేశాల 30 రోజుల శాంతి ఒప్పందం(కాల్పుల విరమణ ఒప్పందం)తో ఎటువంటి ఉపయోగం లేదు. అది కేవలం ఉక్రెయిన్ ఆర్మీ కి కాస్త రిలాక్స్ కావడానికి మాత్రమే పనికొస్తుంది. మేము కోరుకునేది శాశ్వత శాంతి ఒప్పందం. రష్యా చట్టబద్ధమైన ప్రయోజనాలను" కాపాడే దీర్ఘకాలిక శాంతియుత పరిష్కారం కోసం రష్యా లక్ష్యంగా పెట్టుకుంది. మా తాపత్రయం అంతా దానిపైనే ఉంది. అంతే కానీ 30 రోజుల శాంతి ఒప్పందం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు’ అని అమెరికాకు తేల్చిచెప్పారు. ఫలితంగా ఇరు దేశాల శాంతి ఒప్పందం మళ్లీ మొదటికొచ్చినట్లయ్యింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జెలెన్ స్కీ భేటీ తర్వాత.. రష్యా మళ్లీ ఉక్రెయిన్ పై దాడులకు దిగింది. అదే సమయంలో ఆ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టిన ఉక్రెయిన్ సైతం తాము కూడా తాడో పేడో తేల్చుకుంటామనే రీతిలో యుద్ధ రంగంలోకి దూకింది. ఆ క్రమంలోనే రష్యాపై మెరుపు దాడి చేసింది. సుమారు 300 పైగా డ్రోన్ల సాయంతో రష్యాపై విరుచుకుపడింది. ఈ దాడితో ప్రాణనష్టం, ఆస్తినష్టం కూడా అధికంగా వాటిల్లినట్లు తెలుస్తున్నప్పటికీ, దానిపై రష్యా అధికారిక ప్రకటన ఏమీ చేయలేదు.అమెరికాకు పుతిన్ డిమాండ్స్.. రష్యాకు ట్రంప్ సీరియస్ వార్నింగ్ -
అమెరికాకు పుతిన్ డిమాండ్స్.. రష్యాకు ట్రంప్ సీరియస్ వార్నింగ్
వాష్టింగన్/మాస్కో: ఉక్రెయిన్-రష్యా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదుర్చేందుకు అమెరికా ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్తో డీల్ చేసుకునేందుకు రష్యా పలు డిమాండ్లను అమెరికా ముందుకు తీసుకొచ్చినట్టు యూఎస్కు చెందిన ఇద్దరు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో అమెరికా ప్రతినిధులు రష్యాకు బయలుదేరడం విశేషం.ఉక్రెయిన్తో యుద్ధం ముగింపు, అమెరికాతో సంబంధాల మెరుగు కోసం రష్యా పలు డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఓ జాబితాను సిద్దం చేసి రష్యాకు చెందిన అధికారులు అమెరికాకు అందజేశారు. అయితే, జాబితాలో రష్యా ఏం కోరిందనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. ఇక,గత మూడు వారాలుగా పలు నిబంధనలపై అమెరికా, రష్యా అధికారులు చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా డిమాండ్లు ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది.మరోవైపు.. యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు రష్యా బయల్దేరారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వైట్హౌస్ వద్ద మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ..‘మా ప్రతినిధులు రష్యాకు బయల్దేరారు. కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరిస్తారనే ఆశిస్తున్నాం. లేదంటే యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అదే జరిగితే మాస్కో ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది రష్యాకే వినాశకరంగా మారుతుంది. అలాంటి ఫలితాన్ని నేను కోరుకోవట్లేదు. శాంతిని సాధించడమే నా లక్ష్యం. రష్యా అంగీకరిస్తే అది గొప్ప నిర్ణయం అవుతుంది. లేదంటే ప్రజలు మరణిస్తూనే ఉంటారు’ అని స్పష్టం చేశారు.Trump threatens Putin with 'devastating' punishment if he doesn't agree to 30-day ceasefire with Ukraine. pic.twitter.com/vU6rLTX479— Daily Mail Online (@MailOnline) March 12, 2025ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ మాత్రం కీవ్కు నాటో సభ్యత్వం ఇవ్వాలని ముందు నుంచి డిమాండ్ చేస్తోంది. ఉక్రెయిన్లో విదేశీ దళాలను మోహరించకూడదని చెబుతోంది. ఈ మేరకు అమెరికాతో కూడా చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ డిమాండ్లపైనే రష్యా కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్ను నాటోలో చేర్చకూడదనే వాదనలు వినిపిస్తోంది. మాస్కో కాల్పుల విరమణకు సంతకం చేయకపోతే ఆంక్షల వలయంలో చిక్కుకోవాల్సి ఉంటుంది. -
జెలెస్కీ గ్రీన్సిగ్నల్.. పుతిన్ ప్లానేంటి?
జెద్దా: మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్దానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.అమెరికా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ విషయమై సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా చర్చించారు. ఈ క్రమంలో అమెరికా (USA) ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో, సైనిక సాయం, నిఘా భాగస్వామ్యానికి సంబంధించి తక్షణమే ఉక్రెయిన్పై విధించిన ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇక ఖనిజాల తవ్వకానికి సంబంధించి సాధ్యమైనంత త్వరగా ఒప్పందానికి వచ్చేందుకు రెండు దేశాలు నిర్ణయానికి వచ్చాయి.ఈ సందర్బంగా అమెరికా తరఫున విదేశాంగ మంత్రి మార్కో రుబియో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ కాల్పుల విరమణకు ఓకే చెప్పింది. ఇది యుద్దం ముగింపునకు కీలక పరిణామం. ఈ చర్చల సారాంశాన్ని రష్యాకు కూడా తెలియజేస్తాం. ఇప్పుడు బంతి పుతిన్ చేతిలో ఉంది. రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి’ అని చెప్పుకొచ్చారు. ఇక, ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించి రష్యాతో అమెరికా మాట్లాడనుంది.🚨 BREAKING: Ukraine has agreed to a US proposal for a 30-day ceasefire, contingent on Russia’s acceptance.The US will also resume military aid to Ukraine and lift the pause on intelligence-sharing as part of the agreement.#VMNews pic.twitter.com/FN8QlYlE7C— Virgin Media News (@VirginMediaNews) March 11, 2025రష్యాపైకి ఉక్రెయిన్ డ్రోన్లు..మరోవైపు.. ఉక్రెయిన్ మంగళవారం రష్యాపైకి అతిపెద్ద డ్రోన్ల దాడికి దిగింది. రష్యాలోని 10 ప్రాంతాలపైకి దూసుకొచ్చిన 337 డ్రోన్లను కూల్చివేసినట్టు రష్యా మిలటరీ తెలిపింది. డ్రోన్ల దాడిలో ఒకరు చనిపోగా పదుల సంఖ్యల జనం గాయపడినట్లు రష్యా తెలిపింది. యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో ఉక్రెయిన్–అమెరికా మధ్య సౌదీ అరేబియాలోని జెడ్డాలో మంగళవారం చర్చలు మొదలవడానికి కొద్ది గంటల ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. తాజా దాడిపై ఉక్రెయిన్ స్పందించలేదు. అత్యధికంగా సరిహద్దుల్లోని కస్క్ ప్రాంతంలోకి వచ్చిన 126 డ్రోన్లను కూల్చినట్లు రష్యా మిలటరీ తెలిపింది. రాజధాని మాస్కో దిశగా వచ్చిన మరో 91 డ్రోన్లను ధ్వంసం చేశామంది. ఇంకా, సరిహద్దులకు సమీపంలోని బెల్గొరోడ్, బ్రయాన్స్్క, వొరొనెజ్తోపాటు సుదూర ప్రాంతాలైన కలుగ, లిప్ట్స్్క, నిజ్నీ నొవ్గొరోడ్, ఒరియోల్, రైజాన్లపైకి కూడా ఇవి వచ్చాయని వివరించింది. -
నువ్ చాలా డేంజర్! నీ వల్ల మాకు భారమే తప్ప.. ఏం లాభం లేదు!
నువ్ చాలా డేంజర్! నీ వల్ల మాకు భారమే తప్ప.. ఏం లాభం లేదు! -
పుతిన్కు ట్రంప్ భారీ ఆఫర్.. అమెరికా ప్లాన్ ఏంటి?
వాషింగ్టన్: ఉక్రెయిన్-రష్యా యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విస్టు మీద ట్విస్ట్ ఇస్తున్నారు. రష్యాకు పూర్తి మద్దుతుగా నిలుస్తూ ఉక్రెయిన్కు వరుస షాక్లు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా (Russia)పై అమెరికా గతంలో విధించిన ఆంక్షలను తొలగించాలని ట్రంప్ నిర్ణయం తీసుకుంటున్నట్టు సమాచారం. ఈమేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం తర్వాత నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రష్యాపై పలు ఆంక్షలు విధించారు. పుతిన్ను కంట్రోల్ చేసేందుకు ట్రేడింగ్కు సంబంధించిన ఆంక్షలు పెట్టారు. ఇక, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ ఆంక్షలను తొలగించే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్కు మద్దతుగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే యుద్ధం ముగింపుతో పాటు మాస్కోతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారు.ఇందులో భాగంగా రష్యాకు చెందిన కొన్ని సంస్థలు, వ్యక్తులకు ఉపశమనం కల్పించే దిశగా ట్రంప్ సర్కారు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా జాబితాను సిద్ధం చేయాలని విదేశీ వ్యవహరాలు, ట్రెజరీ మంత్రిత్వ శాఖలను వైట్హౌస్ కోరినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. రాబోయే రోజుల్లో దీనిపై రష్యన్ ప్రతినిధులతో అమెరికా అధికారులు చర్చలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఆంక్షలను తొలగించే క్రమంలో ప్రతిగా మాస్కో నుంచి వాషింగ్టన్ ఏం ఆశిస్తుందనే విషయాలు మాత్రమే తెలియాల్సి ఉంది. దీంతో, అమెరికా ప్లాన్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ జెలెన్స్కీకి ట్రంప్ వరుస షాక్లిస్తున్నారు. తాజాగా రష్యా (Russia)తో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్కు అందించే మిలిటరీ సాయాన్ని అమెరికా నిలిపివేసింది. ఈ మేరకు వైట్హౌస్కు చెందిన ఓ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఉక్రెయిన్తో ఖనిజాల ఒప్పందం విషయం సందర్బంగా ట్రంప్, జెలెన్స్కీ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. BREAKING: The U.S. is preparing to ease sanctions on Russia as President Trump pushes to restore ties and end the war in Ukraine - Reuters pic.twitter.com/D1b16R5WMT— Libs of TikTok (@libsoftiktok) March 3, 2025 -
జెలెన్స్కీకి భారీగా పెరిగిన మద్దతు.. రష్యా స్పందన ఇదే..
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), జెలెన్స్కీ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. వైట్హౌస్లో ఇరువురి మధ్య భేటీ రసాభాసగా, వాగ్వాదంతో ముగిసింది. దీంతో ఎలాంటి ఒప్పందం లేకుండానే జెలెన్స్కీ (Zelenskyy) వైట్హౌస్ను వీడారు. ఈ క్రమంలో పలు దేశాల నేతలు జెలెన్స్కీకి మద్దుతు తెలుపుతున్నారు. ఉక్రెయిన్కు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.ట్రంప్, జెలెన్స్కీ భేటీ అనంతరం యూరోపియన్ యూనియన్కు చెందిన నేతలు స్పందించారు. ఈ సందర్బంగా పోలిష్ ప్రధాన మంత్రి డొనాల్డ్ టస్క్ స్పందిస్తూ.. జెలెన్స్కీ మీరు ఒంటరి కాదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు సంఘీభావం తెలుపుతూ సందేశం విడుదల చేశారు.👉బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ స్పందిస్తూ.. ఉక్రెయిన్కు మద్దుతు ఉంటుందన్నారు.👉ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్పందిస్తూ.. ఉక్రెయిన్ రక్షణ, భవిష్యత్తు గురించి చర్చించడానికి యూరోపియన్ దేశాలు, ఇతర మిత్రదేశాలతో అత్యవసర శిఖరాగ్ర సమావేశానికి పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ అండగా ఉండాలన్నారు.Russia illegally and unjustifiably invaded Ukraine. For three years now, Ukrainians have fought with courage and resilience. Their fight for democracy, freedom, and sovereignty is a fight that matters to us all.Canada will continue to stand with Ukraine and…— Justin Trudeau (@JustinTrudeau) February 28, 2025👉కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందిస్తూ.. రష్యా చట్టవిరుద్ధంగా, అన్యాయంగా ఉక్రెయిన్పై దాడి చేసింది. మూడు సంవత్సరాలుగా ఉక్రేనియన్లు ధైర్యంతో పోరాడుతున్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సార్వభౌమాధికారం కోసం వారి పోరాటం మనందరికీ మేలు కొలుపు. న్యాయమైన, శాశ్వత శాంతిని సాధించడంలో ఉక్రేనియన్లకు కెనడా అండగా నిలుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ నేతలకు జెలెన్స్కీ ధన్యవాదాలు తెలిపారు.ఇది కూడా చదవండి: జెలెన్స్కీతో ట్రంప్ వాగ్వాదం.. దద్దరిల్లిన వైట్హౌస్👉యూరోపియన్ యూనియన్ చీఫ్లు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ఆంటోనియో కోస్టా స్పందిస్తూ.. ఉక్రెయిన్ జెలెన్స్కీ ఎప్పుడూ ఒంటరి కాదు. మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మేమందరం మీతో న్యాయమైన, శాశ్వత శాంతి కోసం పని చేస్తూనే ఉంటాము. దైర్యంగా ఉండంటి అని అన్నారు.👉ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పందిస్తూ.. రష్యా అనే దురాక్రమణతో ముందుకు సాగుతోంది. ఉక్రెయిన్కు అందరం అండగా ఉండాలి. ఉక్రెయిన్కు సాయం చేయడానికి, రష్యాపై ఆంక్షలు విధించడానికి ముందుకు రావాలన్నారు.👉మరోవైపు.. రష్యా మాత్రం ఉక్రెయిన్పై మరోసారి సెటైరికల్ కామెంట్స్ చేసింది. ట్రంప్, జెలెన్స్కీ వాడీవేడీ చర్చపై రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ స్పందిస్తూ.. ఈ పరిణామం ఉక్రెయిన్కు చెంపదెబ్బ లాంటిదన్నారు. జెలెన్ స్కీకి ఇలా జరగాల్సిందే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.JD Vance and Trump just put Zelensky in his place. Wow. Watch this.pic.twitter.com/zndgjKEPKz— End Wokeness (@EndWokeness) February 28, 2025జరిగింది ఇదీ..ఇదిలా ఉండగా.. రష్యా చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్స్కీ శుక్రవారం వైట్ హౌస్కి వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ఇది ట్రంప్నకు ఆగ్రహం తెప్పించింది. అనంతరం, అరుపులు, బెదిరింపులతో వాగ్వాదానికి దారితీసింది. ఉక్రెయిన్ (Ukraine) తీరు మూడో ప్రపంచయుద్ధానికి దారితీయవచ్చని.. జెలెన్స్కీ వైపు వేలెత్తి చూపిస్తూ ట్రంప్ కోపంగా చెప్పారు. కానీ, జెలెన్స్కీ మాత్రం ఉక్రెయిన్ ప్రజల కోసం ట్రంప్ బెదిరింపులకు లొంగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం, జెలెన్స్కీని టార్గెట్ చేస్తూ ట్రంప్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రష్యాతో శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సుముఖంగా లేరని అన్నారు. ఇదే సమయంలో పుతిన్ మాత్రం శాంతి కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. -
Russia-Ukraine war: యుద్ధం @ మూడేళ్లు
ఉక్రెయిన్. రష్యా దురాక్రమణ జెండా ఎగరేసి దూసుకురావడంతో అస్థిత్వమే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్న పొరుగుదేశం. అణ్వస్త్ర సామర్థ్యం, అమేయ సైన్యంతో కొద్దికొద్దిగా ఆక్రమించుకుంటూ వస్తున్న రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్ యుద్ధంచేస్తూ శతథా ప్రయత్నాలు చేయబట్టి రేపటికి సరిగ్గా మూడేళ్లు. ఈ మూడేళ్లలో రష్యా కన్నెర్రజేసి వేలాది సైన్యంతో చేస్తున్న భీకర గగనతల, భూతల దాడుల్లో ఉక్రెయిన్లో సాధారణ ప్రజల వేలాది కలల సౌధాలు పేకమేడల్లా కూలి నేలమట్టమయ్యాయి. వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. శివారు గ్రామాలు, పట్టణాలన్నీ మరుభూములుగా మారిపోయాయి. ఎక్కడ చూసినా మరణమృదంగం నిరాటంకంగా వినిపిస్తోంది. సైనికులు పిట్టల్లా రాలిపోయారు. మార్షల్ లా ప్రయోగించి జెలెన్స్కీ ప్రభుత్వం యువత మొదలు నడివయసు వారిదాకా దమ్మున్న వారందరినీ రణక్షేత్రంలోకి దింపి పోరాటం చేయిస్తోంది. దశాబ్దాల నాటి దౌత్య ఒప్పందాలను ఉల్లంఘించిందని, నాటోలో చేరాలనుకుంటోందని పలు సాకులు చూపి రష్యా సమరశంఖం పూరించింది. దీంతో హఠాత్తుగా యుద్ధంలో కూరుకుపోయినా ఉక్రెయిన్ తన మిత్రబృందం నుంచి అందుతున్న అధునాతన ఆయుధాలతో రష్యాను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ లక్షలాది మంది రష్యన్ సైనికులను నేలకూల్చింది. దీంతో అణ్వస్త్ర బూచి చూపించి భయపెడుతున్న పుతిన్కు యుద్ధాన్ని ఆపడమే ఉత్తమమని అగ్రరాజ్య నయా నాయకుడు డొనాల్డ్ ట్రంప్ టెలీఫోన్ మంతనాలు చేయడంతో యుద్ధం మొదలైన మూడేళ్ల తర్వాత తొలిసారిగా కీలక మలుపు తీసుకుంది. వాస్తవానికి ఈ మలుపు తుది మలుపు అని, ట్రంప్ పట్టుదలతో యుద్ధాన్ని ఆపబోతున్నారని అంతర్జాతీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. 36 నెలల తర్వాత అయినా ఉక్రెయిన్ ఊపిరి పీల్చుకుంటుందో లేదోనని, యుద్ధప్రభావిత విపరిణామాలతో తిప్పలుపడుతున్న ఎన్నో ప్రపంచదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.అత్యంత భీకర ఘర్షణరెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్లో వెలుగుచూసిన అతిపెద్ద వైరం ఇదే. వాస్తవానికి తాజా యుద్ధానికి పునాదులు పదేళ్ల క్రితమే పడ్డాయి. 2014లో ఉక్రెయిన్లోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఉన్నపళంగా ఆక్రమించుకుంది. ఆనాటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్ పైకి రష్యా దండయాత్ర మొదలెట్టింది. వందల కొద్దీ చిన్నపాటి క్షిపణులు ప్రయోగిస్తూ వేలాది సైనికులను కదనరంగంలోకి దింపింది. తొలిరోజుల్లో రాజధాని కీవ్దాకా దూసుకొచ్చి భీకర దాడులు చేసిన రష్యా ఆ తర్వాత ఆక్రమణ వేగాన్ని అనూహ్యంగా తగ్గించింది. ఉక్రెయిన్ వైపు నుంచి ప్రతిఘటన కూడా దీనికి ఒక కారణం. ఉక్రెయిన్ తొలినాళ్లలో యుద్ధంలో తడబడినా ఆ తర్వాత అగ్రరాజ్యం, యూరప్ దేశాల ఆర్థిక, ఆయుధ, నిఘా బలంతో చెలరేగిపోయింది. ధాటిగా దాడులు చేస్తూ పుతిన్ పటాలానికి ముచ్చెమటలు పట్టించింది. దీంతో మరింత శక్తివంతమైన ఆయుధాలను రష్యా బయటకుతీయక తప్పలేదు. దీంతో డ్రోన్లకు ఉక్రెయిన్ పనిచెప్పింది. దృఢత్వానికి చిరునామా అయిన అత్యంత ఖరీదైన వేలాది రష్యన్ యుద్ధట్యాంక్లను సైతం సులువుగా చవకైన డ్రోన్లతో పేల్చేసి జెలెన్స్కీ సేన పలు యుద్ధక్షేత్రాల్లో పైచేయి సాధించింది. 18 శాతం ఆక్రమణఅంతర్జాతీయ మీడియా కథనాలు, రష్యా, ఉక్రెయిన్ ఉన్నతాధికారులు పలు సందర్భాల్లో వెల్లడించిన గణాంకాలను బట్టి చూస్తే ఇప్పటిదాకా రష్యా ఉక్రెయిన్లోని కేవలం 18 శాతం భూభాగాన్ని మాత్రమే ఆక్రమించుకోగలిగింది. కీవ్, లివివ్, డినిప్రో, ఒడెసా వంటి ప్రధాన నగరాలపై దాడి ప్రభావం లేదు. అమెరికా, ఇతర మిత్ర దేశాల నుంచి ఉక్రెయిన్కు అందుతున్న భారీ ఆయుధాలే ఇందుకు ప్రధాన కారణం. ఎప్పటికప్పుడు ఆయుధాలు, మందుగుండు, సైనిక ఉపకరణాలు, ఆర్థిక సాయం అందడంతోపాటు అంతర్జాతీయంగా లభిస్తున్న నైతిక మద్దతుతో రెట్టించిన ఉత్సాహంతో ఉక్రెయిన్ సైనికులు కదనరంగంలో ధైర్యంగా ముందడుగు వేయగల్గుతున్నారు. యుద్ధంలో రష్యా దాదాపు ఏకాకిగా మారింది. రహస్యంగా ఉత్తరకొరియా, చైనా, ఇరాన్ వంటి దేశాల నుంచి ఆయుధాలు, డ్రోన్లు తదితర ఆయుధాలు, కిరాయి సైనికులు తప్పితే రష్యాకు బయటి దేశాల నుంచి ఎలాంటి సాయం అందట్లేదు. అమెరికా తదితర దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షల కత్తి గుచ్చాయి. సొంత దేశంలోనూ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న రష్యన్లు కోట్లలో ఉన్నారు. యుద్ధం కారణంగా విదేశీ వస్తువుల లభ్యత తగ్గి, డిమాండ్ పెరిగింది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి రష్యన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయుధం చేతికిచ్చి యుద్ధానికి పుతిన్ పంపిస్తాడన్న ముందస్తు అంచనాతో తొలినాళ్లలోనే వేలాది మంది యువ రష్యన్లు దేశం నుంచి పారిపోయారు. చివరకు ఖైదీలు, నిందితులను సైతం పుతిన్ సైన్యంలో చేరి్పంచుకుని ఉక్రెయిన్తో పోరాటం చేయిస్తున్నారు.అన్ని రంగాలు తిరోగమనం నష్టాలు చెప్పకపోయినా అంతర్జాతీయంగా తగ్గిన వాణిజ్యంతో ఉక్రెయిన్ నష్టాలు చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయికి చేరుకున్నాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. బాంబు దాడుల్లో ఆనకట్టలు, రహదారులు, భవనాలు, వ్యవసాయ క్షేత్రాలు, పాఠశాలలు, కర్మాగారాలు ఇలా మౌలికవసతుల వ్యవస్థ బాగా దెబ్బతింది. వ్యవసాయం తగ్గిపోయింది. నిరుద్యోగం పెరిగింది. ఇలా ఎన్నో రంగాలు తిరోగమన పథంలో పయనిస్తున్నాయి. దేశ జీడీపీకి వందల బిలియన్ డాలర్ల నష్టం చేకూరింది. వాణిజ్య, పరిశ్రమ రంగానికి సంబంధించి దాదాపు రూ.15 లక్షల కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.5.8 లక్షల కోట్ల నష్టాలు వాటిల్లాయి. రవాణా, వాణిజ్యం, ఎగుమతులు, వ్యవసాయం, విద్యుత్, పరిశ్రమల రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి వందల బిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయని ఓ అంచనా. ఉక్రెయిన్కు మిత్ర దేశాల నుంచి భారీ స్థాయిలో సాయం అందుతున్నా అది ఎక్కువగా సైనిక, రక్షణపర సాయమే తప్పితే సాధారణ ప్రజల జీవితాలను బాగుచేసేది కాదు. దీంతో యుద్ధంలో ఉక్రెయిన్ తన భూభాగాలను మాత్రమే కాదు భవిష్యత్తును కొంత కోల్పోతోందనేది వాస్తవం. ఉక్రెయిన్కు అపార ఆస్తినష్టం రష్యా వైపు సైనికులు, ఆయుధాల రూపంలో నష్టం కనిపిస్తుంటే ఉక్రెయిన్ వైపు అంతకుమించి ఆస్తినష్టం సంభవించింది. లక్షల కోట్ల రూపాయల విలువైన భవనాలు నేలమట్టమయ్యాయి. పెద్ద సంఖ్యలో జనావాసాలపై దాడులతో పెద్దసంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇక దాదాపు లక్షకుపైగా ఉక్రెయిన్ సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 4 లక్షల మంది సైనికులు గాయాలపాలయ్యారు. ఇక స్వస్థలాలు సమరక్షేత్రాలుగా మారడంతో లక్షలాది మంది స్వదేశంలోనే యుద్ధంజాడలేని సుదూర ప్రాంతాలకు తరలిపోయారు. పక్కనే ఉన్న పోలండ్, రొమేనియా దేశాలుసహా అరడజనుకుపైగా దేశాలకు దాదాపు 60 లక్షల మంది శరణార్థులుగా వలసవెళ్లారు. దాదాపు ఉక్రెయిన్ వైపు యుద్ధంలో ఎంత నష్టం జరిగిందనేది స్పష్టంగా తెలీడం లేదు. అమెరికా సహా యూరప్ దేశాల ప్రభుత్వాలు, ఆయా దేశాల్లోని ప్రధాన మీడియా సంస్థలు సైతం ఉక్రెయిన్కు అండగా నిలుస్తున్నాయి. దీంతో ఉక్రెయిన్ సైన్యం, పౌరుల్లో నైతిక స్థైర్యం సడలకూడదనే ఉద్దేశంతో యుద్ధ నష్టాలను తక్కువ చేసి చూపిస్తున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.యుద్ధంలో రక్తమోడుతున్న రష్యాఅణ్వ్రస్తాలు లేకున్నా ఉక్రెయిన్తో యుద్ధం అంత తేలిక కాదని పుతిన్కు రానురాను అర్థమైంది. రష్యాకు తగ్గట్లు ఉక్రెయిన్ సైతం అధునాతన యుద్ధవ్యూహాలను అమలుచేస్తుండటంతో రష్యా వైపు నష్టం భారీగానే ఉంది. అంతర్జాతీయ యుద్ధ పరిశీలనా బృందాలు, సంస్థలు, వార్తాసంస్థల నివేదికలు, అంచనాల ప్రకారం యుద్ధంలో ఏకంగా 8,66,000 మంది రష్యా సైనికులు చనిపోయారు. ఉక్రెయిన్ విషయంలో చూస్తే కేవలం లక్షకుపైగా సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఏకంగా 10,161 రష్యన్ యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ ధ్వంసంచేసింది. ఉక్రెయిన్లో ఎన్నికలొచ్చేనా?రష్యా దాడులు మొదలెట్టగానే జెలెన్స్కీ తమ దేశంలో మార్షల్ లా ప్రయోగించారు. సైనికపాలన వంటి అత్యయిక స్థితి అమల్లో ఉన్న కారణంగా ఉక్రెయిన్లో ఇప్పట్లో ఎన్నికలు సాధ్యంకాదు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాలంటే పార్లమెంట్లో ఏకాభిప్రాయ నిర్ణయం ద్వారా మార్షల్ లాను తొలగించాలి. యుద్ధం జరుగుతుండగా మార్షల్ లాను చట్టప్రకారం తొలగించడం అసాధ్యం. దీంతో ఇప్పట్లో ఎన్నికలు కష్టమని భావిస్తున్నారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించినా జెలెన్స్కీ జాతీయభావం, యుద్ధంలో రష్యాను దీటుగా ఎదుర్కొంటున్నానని చెప్పి మళ్లీ అధికారం కైవసం చేసుకుంటారని విపక్ష పారీ్టలు విమర్శిస్తున్నాయి. యుద్ధంలో ట్రంప్కార్డ్ జెలెన్స్కీ మొండిపట్టుదలతో యుద్ధాన్ని ఇక్కడిదాకా తెచ్చారని సంచలన ఆరోపణలు చేసిన అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ వడివడిగా తీసుకుంటున్న నిర్ణయాలు యుద్ధమేఘాలను శాశ్వతంగా తరిమేస్తాయన్న ఆశలు ఒక్కసారిగా చిగురించాయి. తొలిసారిగా రష్యా విదేశాంగ మంత్రి స్థాయి కీలక నేతలతో ఇటీవల మొదలైన చర్చల ప్రక్రియను ఇప్పుడు యుద్ధంలో కీలకదశగా చెప్పొచ్చు. మంతనాలు మరింత విస్తృతస్థాయిలో జరిగితే మూడేళ్ల యుద్ధానికి ముగింపు ఖాయమనే విశ్లేషణలు పెరిగాయి. ఇప్పటిదాకా ఆక్రమించిన ప్రాంతం రష్యాకే చెందుతుందని, ఇప్పటి ‘వాస్తవాదీన రేఖ’నే అంగీకరిస్తూ జెలెన్స్కీని ఒప్పించాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్కు ఒప్పకోకపోతే మిత్రదేశాల నుంచి ఎలాంటి సాయం అందకుండా అడ్డుకుంటానని ట్రంప్ హెచ్చరించి జెలెన్స్కీని దారికి తెస్తారని భావిస్తున్నారు. అధునాతన ఆయుధాలతో దూసుకొస్తున్న రష్యా సేనలను అడ్డుకోవాలంటే ఉక్రెయిన్కు విదేశీ ఆయుధసాయం తప్పనిసరి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జెలెన్స్కీ అమెరికా పెట్టే షరతులకు ఒప్పకోక తప్పదని, యుద్ధం ఒక రకంగా ముగింపు దిశలో పయనిస్తోందని వార్తలొచ్చాయి. యుద్ధం అంకెల్లో.. చనిపోయిన రష్యా సైనికులు 8,66,000కుపైగా చనిపోయిన ఉక్రెయిన్ సైనికులు 1,00,000కుపైగా ఇప్పటిదాకా రష్యా ఆక్రమించుకున్న ఉక్రెయిన్ ప్రాంతం 18 శాతం సగటున రోజుకు రష్యా ఆక్రమణ రేటు 16.1 చదరపు కిలోమీటర్లు ఉక్రెయిన్కు యూరప్ దేశాల నుంచి అందిన ఆర్థిక సాయం రూ. 14 లక్షల కోట్లు యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్కు ఇచ్చిన రుణాలు రూ. 2 లక్షల కోట్లు– సాక్షి, నేషనల్ డెస్క్ -
పుతిన్, జెలెన్స్కీ కలిసిపోవాలి: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం ముగియాలంటే జెలెన్ స్కీ, పుతిన్ కలిసిపోవాలని సూచించారు. ఇదే సమయంలో లక్షలాది మంది ప్రజల చావులు ఆగాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు ట్రంప్.రష్యా-ఉక్రెయిన్ వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. తాజాగా ట్రంప్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ మధ్య నేను కాల్పల విరమణను చూడాలనుకుంటున్నాను. ఆ ఒప్పందాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నా. ఇప్పటికైనా యుద్ధం ఆపాలని కోరుకుంటున్నాను. కీవ్, మాస్కో మధ్య యుద్ధం ఆగిపోవాలంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలవాల్సిన అవసరం ఉంది. రెండు దేశాల్లో లక్షలాది మంది ప్రజల చావులు ఆగాలని కోరుకుంటున్నాం కాబట్టి అది జరిగి తీరాలన్నారు.#WATCH | Washington | On the Russia-Ukraine conflict, US President Donald Trump says, "President Putin and President Zelenskyy have to get together because we want to stop the war and stop killing millions of people... I want to see a ceasefire, and I want to get the deal done...… pic.twitter.com/404opUoyGl— ANI (@ANI) February 21, 2025అలాగే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అమెరికాను పెద్దగా ప్రభావితం చేయదు. కానీ, యూరప్ను ప్రభావితం చేస్తోంది. యుద్ధం కారణంగా అమెరికా భారీగా సాయం($300 బిలియన్ల) అందించింది. యూరప్ కూడా పెద్ద మొత్తంలో సాయం($100 బిలియన్ల) చేయాల్సి వచ్చింది. బైడెన్ వారికి డబ్బు ఇచ్చారని అన్నారు. ఇదే సమయంలో, ఖనిజ నిక్షేపాల్లో వాషింగ్టన్కు వాటా ఇచ్చేందుకు ఉక్రెయిన్ త్వరలోనే అంగీకారం తెలిపే అవకాశం ఉందని వెల్లడించారు.మరోవైపు.. ట్రంప్ ఇప్పటికే జెలెన్స్కీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని జెలెన్స్కీ యుద్ధం వరకూ తీసుకొచ్చారని నిందించారు. ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్దసంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందన్నారు. యుద్ధానికి ఉక్రెయినే కారణమని, పోరు మొదలుకావడానికి ముందే సంధి చేసుకొని ఉండాల్సిందని అన్నారు. మూడేళ్లుగా ఆ పనిని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. -
ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధం: పుతిన్
మాస్కో: ఉక్రెయిన్ సంక్షోభం మూడో ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న వేళ.. కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి చర్చల్లో రష్యా(Russia) ఓ అడుగు ముందుకు వేసింది. ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో అవసమైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు అని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. సౌదీ అరేబియా వేదికగా అమెరికా దౌత్య వేత్తలతో రష్యా అధికారులు చర్చలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో.. మాస్కో నుంచి ఈ ప్రకటన వెలువడడం విశేషం.ఉక్రెయిన్ సంక్షోభం(Ukraine Crisis) ముగిసేలా ఓ ఒప్పందం కోసం ఈ సమావేశం జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఆ చర్చల అజెండాపై ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయబోమని క్రెమ్లిన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక.. అమెరికాతో చర్చలు ఇరాన్తో సంబంధాలను దెబ్బ తీయొచ్చన్న వాదనను క్రెమ్లిన్ తోసిపుచ్చింది. అయితే తమ ప్రతినిధులు లేకుండానే శాంతి చర్చలు జరుపుతుండడంపై ఉక్రెయిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము లేకుండా జరిపే ఎలాంటి చర్చలకు, ఒప్పందాలకు తాము గుర్తింపు ఇవ్వబోమని అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. మరోవైపు నాటో దేశాలు కూడా రియాద్ వేదికగా జరుగుతున్న ఈ సమావేశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఒకానొక దశలో.. ఇది మాస్కో-వాషింగ్టన్ మధ్య సంబంధాలు బలపర్చుకునే సమావేశాలుగానే నాటో మిత్రపక్షాలు భావిస్తున్నాయి. -
నవాల్నీ మృతికి ఏడాది
మాస్కో: వ్లాదిమిర్ పుతిన్ ఏకఛత్రాధిపత్యాన్ని ధిక్కరిస్తూ, ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ రష్యాలో కీలక విపక్షనేతగా ఎదిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకుడు అలెక్సీ నవాల్నీ మరణించి ఏడాది అయింది. ఈ ఏడాదిలో విపక్షాలను ఏకతాటి మీదకు తెచ్చి ప్రభుత్వ వ్యతిరేకోద్యమాన్ని నడిపే సత్తా ఉన్న నేత లేకుండా పోయాడు. దాంతో రష్యా విపక్షాలు నాయకత్వ లోపంతో ఇబ్బందులు పడుతున్నాయి. విపక్ష పార్టీల్లో ఐక్యత లోపించడం ప్రధాన సమస్యగా తయారైంది. 47 ఏళ్ల నవాల్నీ 2024 ఏడాది ఫిబ్రవరి 16న రష్యా మారుమూల ఆర్కిటిక్ ఖండ సమీపంలోని పీనల్ కాలనీ కారాగారంలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఆయన మరణానికి కారణాలను రష్యా వెల్లడించలేదు. దీంతో రష్యా ప్రభుత్వమే ఆయనను చంపేసిందని విపక్షాలు ఆరోపించాయి. 2020లో సెర్బియా పర్యటనలో ఉన్నప్పుడు నవాల్నీపై నరాల సంబంధ విషప్రయోగం జరిగిన అంశాన్ని విపక్షాలు గుర్తుచేశాయి. నవాల్నీ మృతితో ఇప్పుడు పుతిన్ ఆగడాలకు అడ్డేలేకుండా పోయిందని ఒలెగ్ ఇవనోవ్ వ్యాఖ్యానించారు. 2022లో ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించడం మొదలెట్టాక నవాల్నీ మద్దతుదారు అయిన ఇవనోవ్ రష్యాను వీడి అమెరికాలోని లాస్ఏంజెలెస్లో స్థిరపడ్డారు. ‘‘ రష్యా విపక్షంలో ఇన్నాళ్లూ ఉన్న ఏకైక ఆశాదీపం నవాల్నీ. ఆ దీపాన్ని ఆర్పేశారు. ఇన్నాళ్లూ మా దేశంలో ఏదైనా మంచి మార్పు చోటుచేసుకుని, మంచి రోజులు వస్తాయని ఆశపడ్డాం. నవాల్నీ మరణంతో మా ఆశలు అడుగంటాయి. విపక్షాలు పుతిన్ను ఎదుర్కొంటాయన్న ఆశ దాదాపు పూర్తిగా చచ్చిపోయింది’’ అని ఇవనోవ్ ఆవేదన వ్యక్తంచేశారు. అద్భుతమైన ప్రసంగాలు ఇచ్చే నవాల్నీ మరణం తర్వాత ఆయన తరఫున వాదించిన లాయర్లనూ ‘తీవ్రవాదులు’గా పేర్కొంటూ పుతిన్ ప్రభుత్వం జైలుపాలుచేసింది. అరెస్టు భయంతో నవాల్నీ మద్దతుదారులు రష్యాను వీడారు. కొందరు స్వదేశంలో ఉన్నా మౌనంగా ఉండిపోయారు. -
మా ప్రమేయం లేని ఒప్పందాలను అంగీకరించం: జెలెన్స్కీ
కెమెల్నిత్స్కీ (ఉక్రెయిన్): యుద్ధ విరమణపై తమ ప్రమేయం లేని ఎలాంటి చర్చలు తమకు ఆమోదయోగ్యం కాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. వాటిని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్– రష్యా యుద్ధ విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రష్యా అ« ద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన జెలెన్స్కీతోనూ చర్చలు జరిపారు. చర్చలకు చొరవ తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించాక.. జెలెన్స్కీ గురువారం దీనిపై తొలిసారిగా స్పందించారు. ‘ప్రతీది పుతిన్ ప్రణాళిక ప్రకారం జరగడానికి వీల్లేదు. దీన్ని మేము అంగీకరించం, అనుమతించం’ అని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఒక స్వతంత్ర దేశంగా మా ప్రమేయం లేని ఎలాంటి చర్చలూ మాకు ఆమోదయోగ్యం కాదని మా మిత్రదేశాలకు స్పష్టం చేస్తున్నాని తెలిపారు. శాంతి చర్చలకు ఉక్రెయిన్, యూరప్లను దూరంగా పెట్టడం సబబు కాదని నాటో దేశాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం అసాధ్యమని, రష్యా ఆక్రమిత భూభాగాలను ఉక్రెయిన్ వదులుకోవాల్సి ఉంటుందని అమెరికా రక్షణ మంత్రి పీటే హెగ్సెత్ బుధవారం వ్యాఖ్యానించడంతో.. నాటో దేశాలు చర్చలు ఏకపక్షంగా ఉంటాయేమోనని ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్కు అన్యాయం చేస్తున్నారనే వాదనను హెగ్సెత్ గురువారం ఖండించారు. ‘ఉక్రెయిన్ ప్రమేయం లేకుండా ఉక్రెయిన్ గురించి చర్చలు ఉండకూడదు. ఉక్రెయిన్ వాదనకు చర్చల్లో ప్రాధాన్యం దక్కాలి’ అని బ్రిటన్ రక్షణమంత్రి జాన్ హీలి అన్నారు. -
పుతిన్తో ఫోన్ కాల్ ఎఫెక్ట్.. ఉక్రెయిన్కు షాకిచ్చిన ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్కు వరుస షాక్లు ఇస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడిన తర్వాత ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంపై స్పందిస్తూ కీవ్ నాటో సభ్యత్వం ప్రాక్టికల్గా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో జెలెన్స్కీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే ఉక్రెయిన్తో శాంతి చర్చల్లో రష్యా ప్రధాన డిమాండ్లలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.తాజాగా ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్లో దాదాపు 90 నిమిషాల పాటు సుదీర్ఘంగా ఫోన్కాల్లో మాట్లాడారు. అనంతరం, ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలు మొదలవుతాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో రష్యా అధినేత పుతిన్తో తాను ఈ శాంతి చర్చల కోసం తొలిసారి సౌదీ అరేబియాలో భేటీ కావచ్చని ఓవల్ ఆఫీస్లో ట్రంప్ పేర్కొన్నారు. తేదీలు ఇంకా ఫిక్స్ కాలేదని వెల్లడించారు. అలాగని ఈ భేటీలో భారీ జప్యం జరగదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సౌదీ యువరాజు కూడా భాగం కావచ్చని వెల్లడించారు.మరోవైపు.. రష్యా ఆక్రమణలో ఉన్న భూమి ఉక్రెయిన్ తిరిగి పొందే అవకాశాల్లేవని ట్రంప్ బాంబు పేల్చారు. దీంతో క్రిమియా సహా రష్యా ఆక్రమణల్లోని ప్రాంతాలపై ఉక్రెయిన్ ఆశలకు చెక్ పెట్టినట్టు అయ్యింది. అలాగే, కీవ్ నాటో సభ్యత్వం ప్రాక్టికల్గా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దీంతో, ఉక్రెయిన్కు డబుల్ స్ట్రోక్ తగిలింది.REPORTER: The borders and the lack of NATO membership -- ultimately these are both demands Russia has made. Is there not a danger of handing Russia a win?TRUMP: Well I think if you look at the war, the way the war is going, you'll have to make your own determination pic.twitter.com/ZGQru3Of2g— Aaron Rupar (@atrupar) February 12, 2025ఇదిలా ఉండగా.. ట్రంప్తో ఫోన్కాల్ చర్చలపై జెలెన్స్కీ స్పందిస్తూ..‘మా మధ్య సమగ్రంగా చర్చలు జరిగాయి. కీవ్లో నిజమైన శాంతిని తీసుకొచ్చేందుకు ఏం చేయాలనే అంశంపై మాట్లాడుకొన్నాం. వీటిల్లో దౌత్య, సైనిక, ఆర్థిక అంశాలున్నాయి. తాను, పుతిన్తో మాట్లాడినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. పుతిన్, రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా శక్తి సరిపోతుందని నేను భావిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఉక్రెయిన్కు రష్యా ఝలక్
మాస్కో: ఉక్రెయిన్కు రష్యా ఝలక్ ఇచ్చింది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ చేసిన ప్రతిపాదనను మాస్కో వర్గాలు తోసిపుచ్చాయి శాంతి ఒప్పందంలో భాగంగా.. భూభాగాల పరస్పర మార్పిడికి సిద్ధమని జెలెన్స్కీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. అందుకు తమ దేశం ఏనాటికీ అంగీకరించబోమని రష్యా ప్రకటించింది.ఇది ఎన్నటికీ జరగదు. రష్యా తన భూభాగాన్ని మార్పిడి చేసే అంశాన్ని ఎన్నడూ చర్చించలేదు.. చర్చించబోదు కూడా అని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. రష్యా భూభాగాల్లో అడుగుపెట్టిన ఉక్రెయిన్ బలగాలను తరిమి కొట్టడం లేదంటే నాశనం చేస్తుందని పేర్కొన్నారాయన. రష్యాతో భూభాగ మార్పిడికి తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు ఉక్రెయిన్ భూభాగాలను రష్యా విడిచి పెట్టాలని జెలెన్స్కీ షరతు విధించారు. ఈ సందర్బంగా వాటిలో ఏ భూభాగాలను తిరిగి తీసుకుంటారని మీడియా అడగ్గా తమ భూభాగాలన్నీ ముఖ్యమైనవే అన్నారు. ఏవి తిరిగి తీసుకోవాలనే విషయంపై చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.అయితే ఈ వ్యాఖ్యలపై చర్చ నడుస్తున్న వేళ.. కీవ్పై రష్యా బలగాలు డ్రోన్ దాడులు జరపగా ఒకరు మరణించారు. మరోవైపు.. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం మూడో ఏడాదిలోకి అడుగుపెట్టబోతోంది. ఈ క్రమంలో.. శాంతి చర్చలు జరిగేలా డొనాల్డ్ ట్రంప్ కృషి చేయాలని జెలెన్స్కీ కోరుతున్నారు. తమవద్ద అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయని.. వాటివల్ల అమెరికా కంపెనీలకు లాభాలు చేకూరుతాయని చెబుతున్నారు. -
పుతిన్కు షరతు.. అమెరికాకు జెలెన్ స్కీ బంపరాఫర్!
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేళ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా(Russia) ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాలను పుతిన్ విడిచిపెడితే తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను అప్పగిస్తామని జెలెన్ స్కీ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తాము అనుకున్నది జరగాలంటే రష్యా-ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చొరవ చూపాలని చెప్పుకొచ్చారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘రష్యాతో భూభాగ మార్పిడికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే, ఉక్రెయిన్ భూభాగాలను రష్యా విడిచిపెడితే మా అధీనంలో ఉన్న కుర్స్క్ను వారికి అప్పగిస్తామం’ అని అన్నారు. ఈ సందర్బంగా వాటిలో ఏ భూభాగాలను తిరిగి తీసుకుంటారని మీడియా అడగ్గా తమ భూభాగాలన్నీ ముఖ్యమైనవే అన్నారు. ఏవి తిరిగి తీసుకోవాలనే విషయంపై చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో తాము అనుకున్నది జరగాలంటే రష్యా-ఉక్రెయిన్ల మధ్య చర్చలు జరిగేలా డొనాల్డ్ ట్రంప్ కృషి చేయాలని కోరారు. రష్యా నుంచి తమ భూభాగాలను ఉక్రెయిన్కు అప్పగించినందుకు అమెరికాలో పలు ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు జెలెన్ స్కీ ప్రకటించారు. తమవద్ద అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయని.. వాటివల్ల అమెరికా కంపెనీలకు లాభాలు చేకూరుతాయని తెలిపారు. ఉక్రెయిన్లోనూ ఉద్యోగాలు సృష్టించవచ్చని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. 2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుంది. అనంతరం డోనెస్క్, ఖేర్సన్, లుహాన్స్క్, జాపోరిజ్జియా ప్రాంతాలను తన నియంత్రణలోకి తీసుకుంది. అయినప్పటికీ వాటిపై పుతిన్కు మాత్రం పూర్తి నియంత్రణ లేదు. ఉక్రెయిన్పై యుద్దం సందర్భంగా కూడా రష్యా పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.JUST IN: 🇺🇦🇷🇺 Ukrainian President Zelensky says he's prepared to offer a territory swap with Russia as part of peace deal negotiations to end the war. pic.twitter.com/N9w9uoYfnl— BRICS News (@BRICSinfo) February 11, 2025 -
‘నేనంటే పుతిన్కు భయం’
కీవ్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్పై (vladimir putin) ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్స్కీ (Volodymyr Zelenskyy) సెటైర్లు వేశారు. మూడేళ్లుగా యుద్ధం జరుగుతున్నా మాతో చర్చలు జరిపేందుకు పుతిన్ భయపడుతున్నారు. శక్తివంతమైన నేత భయపడుతున్నారు’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఉక్రెయిన్-రష్యాల దేశాల యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ (donald trump) స్పందించారు. ఇరు దేశాదినేతలు యుద్ధానికి ముగింపు పలికేలా శాంతి చర్చలు జరపాలని హితువు పలికారు. లేదంటే ఇరు దేశాలపై అమెరికా కఠిన ఆంక్షలు విధించాల్సి వస్తుందని హెచ్చరించారు.అయితే, ట్రంప్ హెచ్చరికలపై పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధమేనని తెలిపారు. కానీ, చట్టవిరుద్ధంగా మార్షల్లా విధించిన జెలెన్స్కీతో తాము చర్చలు జరపబోమన్నారు. ఉక్రెయిన్తో చర్చలు జరిపేందుకు మేం సిద్ధం. జెలెన్స్కీ మాతో జరిగే చర్చల్లో పాల్గొంటే. నేను పాల్గొనను. మా తరుఫున ప్రతినిధుల్ని పంపిస్తాం. చర్చలు కూడా మాకు అనుకూలంగా జరగగాలి’ అని వ్యాఖ్యనించారు. Today, Putin once again confirmed that he is afraid of negotiations, afraid of strong leaders, and does everything possible to prolong the war. Every move he makes and all his cynical tricks are aimed at making the war endless.In 2014, Russia started a hybrid war against…— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) January 28, 2025పుతిన్ నిర్ణయంపై జెలెన్ స్కీ మండి పడ్డారు. పుతిన్ స్వార్ధపరడు. మూడేళ్లుగా యుద్ధం జరగుతుంటే కనీసం మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. మాతో మాట్లాడేందుకు పుతిన్ .. అదే అత్యంత శక్తివంతమైన నేత భయపడుతున్నారు.యుద్ధంపై అమెరికా-రష్యాలు చర్చలు జరిపితే అందులో ఉక్రెయిన్ పాల్గొనకపోతే ఎలా? అదే జరిగితే మా ప్రయోజనాలు దెబ్బతినట్లే. తన స్వలాభం కోసం పుతిన్ తన చర్యల ద్వారా డొనాల్డ్ ట్రంప్ను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజమైన శాంతికి రష్యా కట్టుబడి ఉంటే యుద్ధానికి ముగింపు పలకొచ్చు. కానీ పుతిన్ ఆ పని మాత్రం చేయరు. ఉద్దేశ్యపూర్వకంగా చర్చలు జరపకుండా.. యుద్ధాన్ని కొనసాగించేందుకే ఇష్టపడతారని’ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 👉చదవండి : మతిలేని యుద్ధం ఆపండి -
‘పుతిన్ హత్యకు అమెరికా కుట్ర?’
వాషింగ్టన్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ను హతమార్చేందుకు అమెరికా ప్రయత్నించింది. ఇప్పుడీ వ్యాఖ్యలు అంతర్జాతీయ మీడియాలో చర్చాంశనీయంగా మారింది. అయితే ఈ వ్యాఖ్యల్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. అందుకు కారణం ప్రముఖ అమెరికన్ పండిట్, మాజీ ఫాక్స్ న్యూస్ యాంకర్ టక్కర్ కార్ల్సన్ (Tucker Carlson)..తన ‘ది టక్కర్ కార్లసన్ షో’ పాడ్కాస్ట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ రచయిత మాట్ తైబీతో పాడ్కాస్ట్లో కార్ల్సన్ మాట్లాడుతూ.. పుతిన్ను హత్య చేసేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపణలు చేశారు. జోబైడెన్ ప్రభుత్వం పుతిన్ను చంపేందుకు ప్రయత్నించింది. ఇది పిచ్చి, మతిలేని చర్య అని అన్నారు. 🇺🇸🇷🇺 Tucker Carlson said that the Biden administration tried to kill Vladimir PutinThe goal is to start World War III and sow chaos. Carlson said this during an interview with journalist Matt Taibbi. pic.twitter.com/k7STerZxFg— Маrina Wolf (@volkova_ma57183) January 28, 2025అయితే, కార్లసన్ వ్యాఖ్యల్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని జోబైడెన్ మద్దతు దారులు స్పష్టం చేస్తున్నారు. అందుకు ఊతం ఇచ్చేలా 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ మోసం జరిగిందని, అందుకు అర్ధం పర్ధంలేని ఆధారాల్ని టెలికాస్ట్ చేసి ఫాక్స్ న్యూస్లో ఉద్యోగం కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీనికితోడు పుతిన్ను హత్య చేసేందుకు జోబైడెన్ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించిన కార్లసన్ అందుకు తగిన ఆధారాల్ని ఎందుకు చూపించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరోపణలపై జోబైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా స్పందించలేదు, అయితే క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ విషయంపై వ్యాఖ్యానించారు, పుతిన్ భద్రతను నిర్ధారించడానికి రష్యన్ ప్రత్యేక సేవలు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. -
మతిలేని యుద్ధం ఆపండి
వాషింగ్టన్: ఉక్రెయిన్తో మతిలేని యుద్ధానికి ఇకనైనా తెరదించాలని రష్యా అధినేత పుతిన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హితవు పలికారు. యుద్ధాన్ని ముగించేలా ఉక్రెయిన్తో ఒప్పందానికి రావాలని సూచించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. పుతిన్తో సాధ్యమైనంత త్వరగా సమావేశమవుతానని చెప్పారు. యుద్ధం ఆపకపోతే రష్యాపై కఠిన ఆంక్షలు విధించక తప్పదని ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆంక్షల భయంతో పుతిన్ వెనక్కి తగ్గుతారని మీరు భావిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అది నాకు తెలియదు అని ట్రంప్ బదులిచ్చారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధక్షేత్రంలో అమాయకులు బలైపోతున్నారని, అందుకే తక్షణమే ఆ యుద్ధం ఆగిపోవాలని తాను కోరుకుంటున్నట్లు పునరుద్ఘాటించారు. రష్యాతో సంధికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సిద్ధంగా ఉన్నారని ట్రంప్ తెలిపారు. అబార్షన్ వ్యతిరేక ఉద్యమకారులకు ట్రంప్ క్షమాభిక్షషికాగో: అబార్షన్లకు వ్యతిరేకంగా క్లినిక్ల వద్ద నిరసన తెలిపిన ఉద్యమకారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫైల్పై సంతకం చేయడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. శాంతియుతంగా నిరసనలు చేపట్టిన వీరికి శిక్షలు విధించడం సరికాదని తెలిపారు. 2020 అక్టోబర్లో వాషింగ్టన్లోని అబార్షన్ క్లినిక్ను దిగ్బంధించి, తలుపులు మూసి తాళాలు వేసి నిరసన తెలిపిన లారెన్ హార్డీతోపాటు మరో 9 మంది సహ నిందితులకు ట్రంప్ క్షమాభిక్ష ప్రకటన వర్తించనుంది. -
చర్చలకు రాకపోతే ఆంక్షలే : పుతిన్కు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: రష్యా అధినేత పుతిన్ను కలుసుకోవడానికి ఆసక్తితో ఉన్నానని, ఎప్పుడైనా సరే ఆయనతో చర్చలకు తాను సిద్ధమని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. చర్చలకు ముందుకు రాకపోతే రష్యాపై అదనపు ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. చర్చల బల్ల వద్ద కలుసుకుందామని పుతిన్కు సూచించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఇప్పటికే లక్షలాది మంది మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు. సైనికులతోపాటు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం, నగరాలు, పట్టణాలు శిథిలాలుగా మారుతుండడం బాధాకరమని అన్నారు. మీడియాలో వస్తున్న వార్తల కంటే ఉక్రెయిన్లో మృతుల సంఖ్య అధికంగా ఉందన్నారు. వాస్తవాలు చెప్పడం లేదని మీడియాపై మండిపడ్డారు. ట్రంప్ స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. నాలుగేళ్ల క్రితం తాను అధ్యక్షుడిగా ఎన్నికై ఉంటే ఉక్రెయిన్–రష్యా యుద్ధం జరిగేది కాదని స్పష్టంచేశారు. సమర్థుడైన పాలకుడు అధికారంలో ఉంటే యుద్ధాలకు ఆస్కారం ఉండదని అన్నారు. పుతిన్ చాలా తెలివైన వ్యక్తి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తమ గత అధ్యక్షుడు జో బైడెన్ను, రష్యా ప్రజలను పుతిన్ అగౌరవపర్చారని ఆక్షేపించారు. పుతిన్ గురించి తనకు బాగా తెలుసని చెప్పారు. తాను పదవిలో ఉంటే మధ్యప్రాచ్యంలో సంక్షోభం తలెత్తేది కాదని పునరుద్ఘాటించారు. 200 మిలియన్ డాలర్లు అధికంగా ఖర్చు చేశాం ఉక్రెయిన్కు ఆయుధాల సరఫరా, ఆర్థిక సాయం నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడుతున్నామని, త్వరలో పుతిన్తోనూ మాట్లాడుతామని చెప్పారు. ‘‘ఉక్రెయిన్– రష్యా యుద్ధానికి యూరోపియన్ యూనియన్ కంటే అమెరికా 200 మిలియన్ డాలర్లు అధికంగా ఖర్చు చేసింది. మాతో సమానంగా యూరోపియన్ యూనియన్ భారం భరించాల్సిందే. మేము ఎక్కువ ఖర్చు పెట్టాం అంటే నిజంగా మూర్ఖులమే. అందులో సందేహం లేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. శాంతిని కోరుకుంటున్నట్లు జెలెన్స్కీ తనతో చెప్పారని వివరించారు. ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు. పుతిన్ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు చర్చలకు సిద్ధమని ట్రంప్ తేలి్చచెప్పారు. యుద్ధంలో మరణాలు ఇక ఆగిపోవాలని అన్నారు. కృత్రిమ మేధలో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు చైనా నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం టారిఫ్ విధించాలని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. చైనా నుంచి ఫెంటానైల్ అనే ప్రమాదకరమైన మాదకద్రవ్యం రాకుండా అడ్డుకోనున్నట్లు చెప్పారు. చైనా నుంచి మెక్సికో, కెనడా వంటి దేశాలకు, అక్కడి నుంచి అమెరికాకు ఫెంటానైల్ చేరుకుంటోందని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్స్తోపాటు అక్రమ వలసదార్లను అమెరికాలోకి పంపిస్తున్న దేశాల ఉత్పత్తులపై భారీగా పన్నులు విధిస్తామని ఆయన గతంలోనే హెచ్చరించిన సంగతి తెలిసిందే. కృత్రిమ మేధ(ఏఐ) మౌలిక సదుపాయాల కల్పనకు 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఒక కొత్త కంపెనీ ద్వారా నిధులు ఖర్చు చేస్తామన్నారు. ఒరాకిల్, సాఫ్ట్బ్యాంక్, ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో ఈ కంపెనీని స్థాపిస్తామన్నారు. స్టార్గేట్గా పిలిచే ఈ ప్రాజెక్టు ద్వారా లక్ష ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. -
‘ఘోర విమానం ప్రమాదంలో రష్యాదే తప్పు’.. ఇదిగో సాక్ష్యం
బాకో: ల్యాండింగ్ సమయంలో అజర్ బైజాన్ ఎయిర్లైన్స్ (Azerbaijan Airlines)కు చెందిన జె2-8243 విమానం కజకిస్థాన్ కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 38 మంది మృతి చెందగా..29 మంది తీవ్రంగా గాయపడ్డారు.అయితే, ఈ ప్రమాదంపై ఆదివారం (డిసెంబర్ 29) అజర్ బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హామ్ అలీయేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా ప్రాంతం నుంచి జరిపిన కాల్పుల వల్లే అజర్ బైజాన్ విమానం ప్రమాదానికి గురైందని చెప్పారు. విమాన ప్రమాదానికి గల కారణాల్ని మాస్కో దాచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకున్న రష్యా అందుకు బాధ్యత వహిస్తూ.. చేసిన తప్పును ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.‘అజర్ బైజాన్ ఎయిర్లైన్స్ ప్రమాదానికి గల కారణాల్ని దాచేందుకు రష్యాలోని ఓ వర్గం అసత్య ప్రచారం చేస్తుందని, తప్పుడు కథనాలతో మసిపూసి మారేడు కాయ చేస్తుంది. విమాన ప్రమాదం జరిగిన కారణ వేరయితే, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మాస్కో చెబుతున్న కారణాలు వేరేలా ఉన్నాయి. చేసిన తప్పును అంగీకరించడం, అజర్ బైజాన్కు క్షమాపణలు చెప్పడం, విమాన ప్రమాదం జరిగిన తీరుతెన్నుల గురించి ప్రజలకు వివరించాలి అని’ఇల్హామ్ అలీయేవ్ రష్యాకు సూచించారు. President Aliyev: “First, Russia must apologize to Azerbaijan. Second, it must admit its guilt. Third, it must punish the culprits, hold them criminally responsible, and pay compensation to the Azerbaijani state as well as to the affected passengers and crew members. These are… pic.twitter.com/5N16w4Zhfw— Nasimi Aghayev🇦🇿 (@NasimiAghayev) December 29, 2024కాగా, ప్రమాదం జరిగిన రోజున ఉక్రెయిన్ డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు గ్రోజ్ని సమీపంలో రష్యా గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఆ సమయంలో రష్యా క్షిపణి తాకడం కారణంగా విమానం కూలిందంటూ ఉక్రెయిన్తో పాటు అజర్ బైజాన్ కూడా ఆరోపించింది. ఈ క్రమంలోనే అజర్ బైజాన్ విమాన ప్రమాదాన్ని రష్యా ‘విషాదకరమైన సంఘటన’ అని పిలిచినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అజర్బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హామ్ అలీయేవ్ను క్షమాపణలు కోరారు. కానీ, రష్యా జరిపిన క్షిపణుల ప్రయోగం వల్లే విమానం కూలినట్లు ఎక్కడా ప్రస్తావించలేదు. -
టార్గెట్ రష్యా.. ఉక్రెయిన్కు బైడెన్ బంపరాఫర్
మాస్కో: ఇటీవల కాలంలో ఉక్రెయిన్పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే క్రిస్టమస్ వేళ ఉక్రెయిన్ను టార్గెట్ చేస్తూ రష్యా భీకర దాడులకు పాల్పడింది. 70కి పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కు మరోసారి అమెరికా అండగా నిలిచింది.రష్యా దాడుల నుంచి కీవ్ను రక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని వెల్లడించారు. దీనిపై ఇప్పటికే తాను రక్షణ మంత్రిత్వశాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ ప్రజలు చలి నుంచి రక్షణ పొందకుండా ఉండడమే రష్యా దాడి వెనుక ఉద్దేశం. గ్రిడ్ వ్యవస్థను నాశనం చేసి వారికి విద్యుత్ సరఫరా అందకుండా మాస్కో కుట్ర పన్నింది అంటూ సంచలన కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ విషయంలో బైడెన్ ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ట్రంప్ అధికారంలోకి వచ్చేనాటికి ఉక్రెయిన్కు మరింత ఎక్కువ సాయం అందించాలనే ఉద్దేశంతో బైడెన్ సర్కారు వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే 725 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించగా.. దానికి అదనంగా మరో 988 మిలియన్ డాలర్ల ఆయుధ సామగ్రిని ఇస్తామని బైడెన్ కార్యవర్గం హామీ ఇచ్చింది. అమెరికా నుంచి కీవ్కు 2022 నుంచి ఇప్పటి వరకు 62 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు, ఇతర సాయం అందించారు.మరోవైపు.. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధం చేస్తున్న దేశాలకు అమెరికా సాయం అందించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. ఇదే సమయంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో చర్చలు జరపాలని చెప్పుకొచ్చారు. -
ఉక్రెయిన్పై 70 మిసైళ్లు, 100 డ్రోన్లతో రష్యా దాడి
కీవ్ : ఈ వారం ప్రారంభంలో రష్యా వెన్నులో భయం పుట్టించేలా 9/11 దాడుల తరహాలో ఉక్రెయిన్ దాడి చేసింది. కజాన్ నగరంలోని బహుళ అంతస్తుల భవనాలపై మొత్తం 8 డ్రోన్లు చొచ్చుకెళ్లాయి. ఈ దాడికి రష్యా తాజాగా ప్రతీకారం తీర్చుకుంది. ఉక్రెయిన్పై 70మిసైళ్లు,100 డ్రోన్లతో విరుచుకుపడింది.క్రిస్టమస్ పర్వదినాన రష్యా చేసిన దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఖండించారు. తమ దేశ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై అమానవీయంగా దాడి చేసిందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.‘ప్రపంచం మొత్తం క్రిస్టమస్ వేడుకల్లో ఉంటే ఉక్రెయిన్పై రష్యా భారీ ఎత్తున దాడికి దిగింది. దాడి అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ముందస్తు ప్రణాళికలో భాగంగా వ్యూహాత్మకంగా జరిగింది. దాడి మాత్రమే కాదు. దాడి ఎప్పుడు చేయాలనేది ముందే నిర్ణయించుకున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉద్దేశ్యపూర్వకంగా ఈ విధ్వంసానికి తెరలేపారు. ఇంతకంటే అమానుషం ఏముంటుంది?’ అని జెలెన్స్కీ ప్రశ్నించారు. Every massive Russian strike requires time for preparation. It is never a spontaneous decision. It is a deliberate choice – not only of targets but also of timing and date.Today, Putin deliberately chose Christmas for an attack. What could be more inhumane? Over 70 missiles,… pic.twitter.com/GMD8rTomoX— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) December 25, 2024ఉక్రెయిన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై రష్యా భారీ దాడి చేసిందని ఉక్రెయిన్ ఇంధన మంత్రి జర్మన్ గలుష్చెంకో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శత్రువు(రష్యా) మళ్లీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై భారీగా దాడి చేస్తోంది. శత్రు దాడి నుంచి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ప్రతికూల ప్రభావం పడకుండా రక్షణ చర్యలు తీసుకుంటునట్లు చెప్పారు. నగరాలపై దాడులుఒక బాలిస్టిక్ క్షిపణి మంగళవారం సెంట్రల్ ఉక్రెయిన్ నగరమైన క్రివీ రిహ్లోని అపార్ట్మెంట్ భవనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. 15మంది గాయపడ్డారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 32 అపార్ట్మెంట్లతో కూడిన నాలుగు అంతస్తుల రెసిడెన్షియల్ బ్లాక్పై దాడి జరిగినట్లు మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఒలెక్సాండర్ విల్కుల్ టెలిగ్రామ్లో వెల్లడించారు.అదే సమయంలో రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. తమ బలగాలు 59 ఉక్రేనియన్ డ్రోన్లను రాత్రిపూట కూల్చివేసాయని, ఉక్రేనియన్ వైమానిక దళం నల్ల సముద్రం నుండి కాలిబర్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని, అయితే వాటిని వేటిపై ప్రయోగించారనే విషయంపై స్పష్టత లేదని పేర్కొంది. -
పుతిన్ పగ.. అణు యుద్ధానికి టైమ్ ఫిక్స్
-
ఉగ్ర ముద్ర తొలగించేలా.. పుతిన్ కీలక నిర్ణయం
మాస్కో: రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. పలు సంస్థలపై వేసిన ఉగ్రవాద ముద్ర తొలగించేలా కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఉగ్రవాద ముద్రను తొలగించే హక్కును కోర్టులకు అప్పగించింది. సంబంధిత చట్టాన్ని రష్యా పార్లమెంట్ ఆమోదించింది. దీంతో ఆఫ్గాన్ తాలిబన్లు, సిరియా తిరుగుబాటు దారులతో సంబంధాలను ఏర్పరుచుకునేందుకు అవకాశం రష్యాకు కలగనుంది. రష్యా తెచ్చిన కొత్త చట్టం ప్రకారం.. కోర్టులు సదరు సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు గుర్తించాల్సి ఉంటుంది. అనంతరం, ఉగ్రవాద జాబితాలో ఆయా సంస్థలకు కోర్టులు విముక్తి కలిగిస్తాయి. ఇందుకోసం రష్యా ప్రాసిక్యూటర్ జనరల్ ఒక నిషేధిత సంస్థ ఉగ్రవాదానికి దూరంగా ఉందని వివరిస్తూ కోర్టుకు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడు న్యాయమూర్తి ఉగ్రవాద జాబితాలో సదరు సంస్థను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయొచ్చు. రష్యా ఉగ్రవాద జాబితాలో ఫిబ్రవరి 2003లో తాలిబాన్, 2020లో సిరియాను చేర్చింది. అయితే, 20 సంవత్సరాల యుద్ధం తర్వాత 2021 ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన ఆఫ్గన్ తాలిబాన్ ప్రభుత్వంపై రష్యా మెరుగైన సంబంధాలను కొనసాగిస్తుంది. ఉగ్రవాదంపై పోరులో ఇప్పుడు తాలిబాన్ మిత్రదేశమని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పలు మార్లు వ్యాఖ్యానించారు. సిరియాలో ఆరు దశాబ్దాల అసద్ల కుటుంబ పాలన నుంచి సిరియాకు చెందిన హయత్ తహ్రీర్ అల్ షామ్ విముక్తి కలిగించింది. అదే సంస్థపై రష్యా విధించిన ఉగ్ర ముద్రను తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. -
బాంబు దాడిలో రష్యా ఆర్మీ జనరల్ మృతి
మాస్కో: రష్యా రాజధానిలోని మాస్కోలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో రష్యా ఆర్మీ సీనియర్ జనరల్ మృత్యువాతపడ్డారు. ఆర్మీ అణు, జీవ, రసాయన భద్రతా విభాగం చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇగోర్ కిరిల్లోవ్(54) మంగళవారం కార్యాలయానికి వెళ్లేందుకు తన నివాసం ఆవరణలోని కారు వద్దకు రాగా ఆ పక్కనే స్కూటర్లో అమర్చిన బాంబు పేలింది. ఘటనలో కిరిల్లోవ్తోపాటు ఆయన సహాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీని వెనుక తమ సీక్రెట్ సర్వీస్(ఎస్బీయూ) హస్తముందని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. సోమవారం జనరల్ కిరిల్లోవ్పై పలు నేరారోపణలను సంధించిన ఎస్బీయూ, మరునాడే ఈ చర్యకు పాల్పడటం గమనార్హం. ఉక్రెయిన్లో రష్యా బలగాలు ముందుకు సాగుతున్న వేళ తాజా పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయి న్లో రష్యా పాల్పడు తున్న దారుణాల్లో కిరిల్లోవ్ కీలకంగా ఉన్నారంటూ కెనడా, బ్రిటన్ తదితర దేశాలు ఆయనపై ఆంక్షలు విధించాయి. ఉక్రెయిన్ ఆర్మీపై నిషేధిత రసాయన ఆయుధాల వినియోగానికి కిరిల్లోవ్ ఆదేశాలే కారణమని సోమవారం ఎస్బీయూ ఆరోపణలు చేసింది. ‘కిరిల్లోవ్ యుద్ధ నేరస్తుడు, తమ న్యాయబద్ధమైన లక్ష్యం’ అంటూ వ్యాఖ్యానించింది. 2022 ఫిబ్రవరిలో రష్యా దురాక్రమణ మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్ యుద్ధ క్షేత్రంలో 4,800 పర్యా యాలకుపైగా రష్యా రసాయన ఆయుధాలను ప్రయోగించినట్లు ఎస్బీయూ ఆరోపిస్తోంది. మొదటి ప్రపంచ యుద్ధంలో వాడిన క్లోరోపిక్రిన్ అనే విష వాయువును ఉక్రెయిన్ బలగాలపై రష్యా ప్రయోగించినట్లు అమెరికా అంటోంది. ఈ ఆరోపణలను రష్యా తీవ్రంగా ఖండించింది.తగు రీతిలో ప్రతీకారం తప్పదుజనరల్ కిరిల్లోవ్ను చంపేందుకు స్కూటర్లో అమర్చిన బాంబును రిమోట్తో పేల్చినట్లు గుర్తించామని రష్యా అధికారులు చెప్పారు. రష్యా దీనిని ఉగ్రవాద చర్యగా పేర్కొంది. ఉక్రెయిన్ను తగు రీతిలో దండిస్తామని ప్రకటించింది. అధ్యక్షుడు పుతిన్ సారథ్యంలోని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదెవ్ స్పందిస్తూ..సైనిక వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఉక్రెయిన్ ఈ చర్యకు పాల్పడిందన్నారు. ఆ దేశ సైనిక, రాజకీయ నాయకత్వం ప్రతీకార చర్యలను ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. గతంలోనూ ఇటువంటి దాడుల్లో పలువురు రష్యా ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. వీటికి ఉక్రెయినే కారణమని రష్యా నిందించింది.🛑Breaking🛑Senior Russian General Igor Kirillov, head of Russia’s NBC defense forces, killed in a scooter bomb explosion in Moscow (Dec 17). pic.twitter.com/Zn9hhzuz3D— Taymur Malik (@Taymur918) December 17, 2024 -
చైనాకు చెక్.. పుతిన్తో భారత్ భారీ ఒప్పందం
ఢిల్లీ: భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో రాజ్నాథ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ సహాకారంపై చర్చించారు. రష్యా స్నేహితులకు భారత్ అన్నివేళలా అండగా నిలుస్తుందని రాజ్నాథ్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో రష్యాతో భారత ప్రభుత్వం భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది.రష్యా పర్యటనలో రాజ్నాథ్ సింగ్ కీలక ఒప్పందంపై చర్చించారు. రాడార్ వ్యవస్థకు సంబంధించిన భారీ రక్షణ ఒప్పందాన్ని రష్యాతో భారత్ కుదుర్చుకుంది. సుమారు నాలుగు బిలియన్ డాలర్ల ఖరీదైన ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. లాంగ్ రేంజ్ వార్నింగ్ రాడార్ వ్యవస్థ వోరోనెజ్ రాడార్(Radar Voronezh)ను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయనున్నది. ఆ ఒప్పందానికి చెందిన సంప్రదింపులు తుది దశలో ఉన్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.దేశ రక్షణ విషయంలో కేంద్రం టెక్నాలజీని పెంచే ఉద్దేశంతో ముందడుగు వేసింది. మిస్సైల్ బెదిరింపుల్ని గుర్తించి, ట్రాక్ చేసేందుకు సామర్థ్యాన్ని పెంచుకోవాలని భారత్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే రాడార్ వ్యవస్థ కొత్త టెక్నాలజీపై ఫోకస్ పెట్టింది. అయితే, అల్మాజ్-ఆంటే కార్పొరేషన్ కంపెనీ వోరోనేజ్ రేడార్లను ఉత్పత్తి చేస్తున్నది. ఏరోస్పేస్ ఎక్విప్మెంట్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సైల్ సిస్టమ్స్, రేడార్ల ఉత్పత్తిలో ఆ సంస్థ అగ్రస్థానంలో ఉన్నది.Russia is talks to sell gigantic radar to india.Almaz-Antey’s Voronezh radar detects missiles, aircraft, and threats up to 6,000–8,000 km, supporting Russia’s missile defence network. pic.twitter.com/AmCWaX01Rs— Abhimanyu Manjhi (@AbhimanyuManjh5) December 10, 2024ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ దూరం నుంచి క్షిపణుల కదలికల్ని రాడార్లతో పసికట్టేందుకు ఈ కొనుగోలు చేపట్టనున్నారు. అధునాతన రాడార్ వ్యవస్థ చైనా, దక్షిణ, మధ్య ఆసియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఎక్కడి నుంచి అయినా ముప్పును గుర్తించగలదు. దాదాపు 8 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలిస్టిక్ క్షిపణులు, విమానాలను వోరోనేజ్ రాడార్ వ్యవస్థ గుర్తిస్తుందని అధికారులు అంటున్నారు. కొన్ని దేశాల వద్దే ఉన్న ఇలాంటి టెక్నాలజీని ఇప్పుడు భారత్ కూడా సొంతం చేసుకోనున్నట్లు రష్యా చెబుతోంది.ఇక, ఇటీవల అల్మేజ్-ఆంటే బృందం భారత్లో పర్యటించింది. మేకిన్ ఇండియాలో భాగంగా సుమారు 60 శాతం రాడార్ వ్యవస్థను భారతీయ కంపెనీల ఉత్పత్తులతోనే నిర్మించనున్నారు. కర్నాటకలోని చిత్రదుర్గలో దీన్ని ఇన్స్టాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ అడ్వాన్స్డ్ డిఫెన్స్ , ఏరోస్పేస్ సౌకర్యాలు ఉన్నాయి. -
సిరియా అధ్యక్షుడి ఆచూకీ గల్లంతు.. రష్యా కీలక ప్రకటన
డమాస్కస్: సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ చెందారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రష్యా కీలక ప్రకటన చేసింది. బషర్ అల్-అసద్ బ్రతికే ఉన్నారంటూ పరోక్షంగా వ్యాఖ్యానించింది. కానీ ఆయన జాడ గురించి ప్రస్తావించలేదు. ఆదివారం సిరియా దేశం మొత్తాన్ని రెబల్స్ పూర్తిగా ఆక్రమించారు. దీంతో బషర్ ఆల్-అసద్ అధ్యక్ష పదవిని రెబల్స్కు అప్పగించారు. కుటుంబ సభ్యులతో కలిసి విమానంలో పరారయ్యారు. ఆ విమానాన్ని రెబల్స్ కూల్చి వేశారని, కూల్చి వేతతో బషర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరణించినట్లు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి.అయితే, అనూహ్యంగా రష్యా కీలక ప్రకటన చేసింది. శాంతియుతంగా అధికారాన్నిఅప్పగించాలని రెబల్స్ ఆదేశాలు ఇవ్వడంతో బషర్ అల్ అసద్ తన పదవిని విడిచిపెట్టారని, ఆపై దేశం విడిచి వెళ్లినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.కానీ, అసద్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో రష్యా చెప్పలేదు. దేశం వదిలే వెళ్లే సమయంలో జరిపిన చర్చలలో తాము పాల్గొనలేదని పేర్కొంది. మరోవైపు, సిరియాని రెబల్స్ స్వాధీనం చేసుకున్న పరిణామల నేపథ్యంలో రష్యా సైనిక స్థావరాలను హై అలర్ట్లో ఉంచామని, అయితే ప్రస్తుతానికి వాటికి ఎలాంటి తీవ్రమైన ముప్పు లేదని పేర్కొంది.అసద్కు అండగా రష్యాసిరియాలో 2015లో తిరుగుబాటు దళాలకు వ్యతిరేకంగా అసద్ ప్రభుత్వానికి రష్యా అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రత్యర్థి వర్గంపై పెద్దఎత్తున దాడులకు పాల్పడింది. బషర్ ఆల్-అసద్ పదవి విడిచి పెట్టిన అనంతరం జరుగుతున్న వరుస పరిణామలపై రష్యా గమనిస్తుంది. -
మేకిన్ ఇండియా పాలసీ భేష్ : పుతిన్
మాస్కో: భారత్ ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇండియా ఫస్ట్ పాలసీ మేకిన్ ఇండియా అద్భుతమని రష్యాలో జరుగుతున్న15వ వీటీబీ ఇన్వెస్ట్ ఫోరమ్లో కొనియాడారు. ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో పుతిన్ మాట్లాడుతూ.. ‘అభివృద్ధి కోసం స్థిరమైన వాతావరణాన్ని పెంపొందించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు అమోఘం. తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా రూపొందించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల్లో స్థిరమైన వాతావరణాన్ని కొనసాగించేందుకు మోదీ నేతృత్వంలోని భారత్ చేస్తున్న ప్రయత్నాలు భాగున్నాయి. ఈ సందర్భంగా భారత్ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
పుతిన్, కిమ్ మధ్య కుదిరిన డేంజర్ డీల్..
మాస్కో: రష్యా, ఉత్తరికొరియా మధ్య మరో కీలక ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య మిలిటరీ ఒప్పందం అమలులోకి వచ్చింది. ఈ మేరకు నార్త్ కొరియాకు చెందిన అధికారిక న్యూస్ ఏజెన్సీ కేసీఏన్ఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మిలటరీ తమకు అవసరమైన సమయాల్లో సాయం చేసుకోనుంది.రష్యా, ఉత్తర కొరియా మిలిటరీ ఒప్పందం అమల్లోకి వచ్చింది. పరస్పరం మిలిటరీ సాయం చేసుకోవడానికి ఈ ఏడాది జూన్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఒప్పందం చేసుకున్నారు. అయితే, పశ్చిమ దేశాలు విధించే ఆంక్షలను సంయుక్తంగా ఎదుర్కోవడం, ఆపత్కాల సమయంలో తక్షణ మిలిటరీ సాయం చేసుకునేలా రెండు దేశాల ఒప్పందం కుదిరింది. ఇక, అణ్వాయుధాలు కలిగిన ఉత్తర కొరియా తన బలగాలను పంపించి రష్యాకు సాయం చేస్తోందని అమెరికా, ఉక్రెయిన్ దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో రక్షణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. పుతిన్కు సాయం చేసేందుకు రష్యా సైన్యంలోకి నార్త్ కొరియాకు చెందిన దాదాపు పది వేల మంది సైనికులను పంపినట్టు అమెరికా ఆరోపించింది. మరోవైపు.. రష్యా, కొరియా దేశాల మధ్య జరిగిన ఈ కీలక ఒప్పందానికి ప్రతిఫలంగా మాస్కో.. కిమ్కు అధునాతన టెక్నాలజీ అందజేయనుందని వార్తలు వెలువడ్డాయి. పైగా యుద్ధభూమిలో పోరాడటం వల్ల కిమ్ సైనికులు రాటుదేలే అవకాశం ఉందని ఆయా దేశాలకు చెందిన నేతలు చెబుతున్నారు. ఇక, ఇప్పటికే వేల సంఖ్యలో నార్త్ కొరియా సైనికులు ట్రైనింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఉక్రెయిన్తో రష్యా పోరులో భాగంగా పుతిన్కు ఉత్తర కొరియా బలగాలు ఎంతో సాయం చేసే అవకాశం ఉంది. ఉక్రెయిన్పై మరింత ధీటుగా దాడులు చేసేందుకు పుతిన్ ప్లాస్ చేసినట్టు సమాచారం. #BREAKING North Korea, Russia defence treaty has come into force: KCNA pic.twitter.com/3ODW1bg5Bl— AFP News Agency (@AFP) December 4, 2024 -
భారత పర్యటనలో వ్లాదిమిర్ పుతిన్.. షెడ్యూల్ ఖరారు
మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్.. వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్కు రానున్నారు. పర్యటనకు సంబంధించి భారత్ పంపిన తాత్కాలిక షెడ్యూల్ తమకు అందిందని పుతిన్ సహాయకుడు యూరి ఉషకోవ్ చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. దేశాల పర్యటనపై పుతిన్,మోదీల మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం.. ఇప్పటికే మోదీ రష్యాలో పర్యటించగా.. ఈ సారి పుతిన్ భారత్లో పర్యటించనున్నట్లు యూరి ఉషకోవ్ తెలిపారు.మోదీ ఈ ఏడాది రెండుసార్లు రష్యాలో పర్యటించారు. జులైలో రష్యా రాజధాని మాస్కోలో 22వ రష్యా-ఇండియా సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్లో మోదీ పాల్గొన్నారు. రెండోసారి ఈ అక్టోబర్ నెలలో కజాన్ వేదికగా జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సుకు హాజరయ్యారు. -
రష్యా రక్షణ బడ్జెట్ రూ.10 లక్షల కోట్లు!
కీవ్: ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రక్షణ వ్యయాన్ని రికార్డు స్థాయిలో పెంచారు. 2025 బడ్జెట్లో 32.5శాతాన్ని జాతీయ రక్షణకు కేటాయించారు. రక్షణ వ్యయంగా 13.5 ట్రిలియన్ రూబుల్స్ (రూ.పది లక్షల కోట్లు) కేటాయించినట్లు ఆదివారం ప్రకటించారు. గత ఏడాది మొత్తం బడ్జెట్లో 28.3శాతం రక్షణకు కేటాయించగా.. ఈ ఏడాది 32.5శాతానికి చేరింది. రష్యా పార్లమెంటు ఉభయ సభలు, స్టేట్ డ్యూమా, ఫెడరేషన్ కౌన్సిల్ బడ్జెట్ ప్రణాళికలను ఆమోదించాయి. -
నన్ను క్షమించండి ఏంజిలా మెర్కల్ : పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. జర్మనీ మాజీ ఛాన్సలర్ (ప్రధాని) ఏంజిలా మెర్కల్కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. 17 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘటనను ఆయన తాజాగా గుర్తు చేసుకున్నారు. 17ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే?పుతిన్కు శునకాలంటే మహా ప్రాణం. అందుకే దేశాది నేతలతో జరిగే సమావేశాల్లో సైతం శునకాలు పుతిన్తో దర్శనమిస్తుంటాయి. అయితే, 17ఏళ్ల క్రితం అంటే 2007 సోచి నగరంలో పుతిన్- అప్పటి జర్మనీ ప్రధాని ఏంజిలా మెర్కల్ మధ్య ఓ సమావేశం జరిగింది. అయితే ఆ మీటింగ్కు పుతిన్తో పాటు ఆయన పెంపుడు శునకం లాబ్రడార్ కోని కూడా తీసుకువచ్చారు. సమావేశంలో జరుగుతున్నంత సేపు మెర్కల్తో పాటు పుతిన్ చుట్టూ తచ్చాడుతూ కనిపించింది. దీంతో స్వతహాగా శునకాలంటే భయపడే మెర్కల్ లాబ్రడార్ కోని చూసి ఆందోళనకు గురయ్యారు. నాటి ఘటనపై తాను రాసిన పుస్తకంలో మెర్కల్ ‘ఫ్రీడమ్’ అనే టైటిల్తో ప్రస్తావించారు. అందులో పుతిన్ తనని భయపెట్టాలని తన శునకాన్ని సమావేశానికి తెచ్చారని అర్ధం వచ్చేలా రాశారు. తాజాగా విడుదల మెర్కల్ పుస్కకంలో 2007 నాటి ఘటనపై వ్లాదిమిర్ పుతిన్ బహిరంగంగానే స్పందించారు. మెర్కల్కు మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. -
పేరు మార్చుకుని పుతిన్ కూతురు రహస్య జీవనం.. ఎక్కడ ఉన్నారంటే?
మాస్కో: ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్న నాటి నుంచి వ్లాదిమిన్ పుతిన్ ప్రతీరోజు వార్తల్లో నిలుస్తున్నారు. ఇదే సమయంలో పుతిన్.. కుటుంబ సభ్యు గురించి కూడా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక, తాజాగా పుతిన్ రహస్య కుమార్తె తన పేరు మార్చుకుని పారిస్ లో ఉంటున్నారని సమాచారం. ఈ మేరకు పలు కథనాలు వెలువడ్డాయి.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి మరో విషయం బయటకు వచ్చింది. పుతిన్, సెత్వాన్ క్రివోనోగిఖ్ కుమార్తె ఎలిజావేటా క్రివోనోగిఖ్ పేరు బయటకు వచ్చింది. ఎలిజావేటా ప్రస్తుతం తన పేరు మార్చుకుని లాయిజా రోజోవా అనే పేరుతో పారిస్ లో ఉంటున్నారని ఉక్రెయిన్ కు సంబంధించిన మీడియా పలు కథనాల్లో వెల్లడించింది. అయితే, ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రోజోవా రహస్యంగా పారిస్ లో ఉంటున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. వ్యాపారవేత్త అయిన సెత్వాన్ క్రివోనోగిఖ్(49) పుతిన్ భాగస్వామిగా ఉన్నారని మీడియాలో పలు కథనాలు వెల్లడయ్యాయి. ఇక, అంతకుముందు కూడా పుతిన్ మరో కూతురు కేథరిన్ టిఖోనోవా గురించి కూడా ప్రపంచానికి తెలిసింది. కేథరినా ఒక డ్యాన్సర్(జిమ్నాస్టిక్). ఆమె రష్యాకు చెందిన బిలియనీర్ ను వివాహం చేసుకుంది. వారిద్దరూ 2017లో విడిపోయారు.🚨 Vladimir Putin has an illegitimate daughter living under a pseudonym in Paris where she works as a DJ: pic.twitter.com/twtwfxWqyM— Emmanuel Rincón (@EmmaRincon) November 29, 2024 -
ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదు: పుతిన్ షాకింగ్ కామెంట్స్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ పుతిన్ చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారం సమయంలో ట్రంప్ పై జరిగిన హత్యాయత్నాలే తనను షాక్ కు గురిచేశాయని తెలిపారు.పుతిన్ తాజాగా ఖజికిస్తాన్ లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా తెలివైన వ్యక్తి. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా ట్రంప్ వెనుకాడరు. అయితే, ట్రంప్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ఆయన ప్రాణాలకు రక్షణ లేదు. అమెరికా ఎన్నికల ప్రచార సమయంలో ఆయనపై జరిగిన దాడులే ఇందుకు నిదర్శనం. ఎన్నికల సమయంలో ఆయన కుటుంబ సభ్యులపై కూడా దాడులు జరిగాయి. వీటన్నింటినీ ట్రంప్ అర్థం చేసుకోవాలి అని సూచనలు చేశారు. ఇదే సమయంలో ట్రంప్.. యుద్ధాలను సైతం ఆపేయగలరని పుతిన్ కితాబు ఇచ్చారు.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో పెన్సిల్వేనియాలో ట్రంప్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తుపాకీతో కాల్చడంతో ట్రంప్ చెవి దగ్గరి నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ క్రమంలో ట్రంప్ చెవికి గాయమైంది. -
అణుయుద్ధంగా మారనుందా?
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం 1,000 రోజుల మార్కును దాటేసింది. అమెరికా అనూహ్యంగా ఇచ్చిన అనుమతితో ఉక్రెయిన్ ఏటీఏసీఎంఎస్ క్షిపణులను రష్యా మీద ప్రయోగించింది. ఉత్తర కొరియా దళాలను ఈ యుద్ధంలో చేర్చిందనీ, ఇరాన్ సరఫరా చేసిన డ్రోన్లను ఉపయోగిస్తోందనీ రష్యా మీద ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల యుద్ధ పరిధి రెండు దేశాలను దాటి, బహుళజాతి స్వభావానికి విస్తరించినట్టయింది. దీనికితోడు పుతిన్ తమ అణ్వా యుధ సిద్ధాంతాన్ని సవరించడం ద్వారా ఆందోళనను రేకెత్తించారు. 1962 క్యూబా సంక్షోభంలో అమెరికా, రష్యాల్లోని రాబందులు ఘర్షణను తీవ్రతరం చేయాలని కోరినప్పటికీ, అధినేతలు వివేకంతో వ్యవహరించారు. కానీ, ఈ అస్థిర కాలంలో అలాంటి వివేకం సాధ్యమా?రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నవంబర్ 19 నాటికి 1,000 రోజుల మార్కును దాటేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నవంబర్ 17న అమెరికా సైన్యపు టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్(ఏటీఏసీఎంఎస్)ను ఉపయోగించే అధికా రాన్ని ఉక్రెయిన్కు కట్టబెట్టగానే ఆ యుద్ధం పరాకాష్ఠకు చేరుకుంది.ఈ నిర్ణయం ద్వారా, ‘అంకుల్ జో’ ఎట్టకేలకు ‘ధైర్య ప్రదర్శన’ చేసినట్లుగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కాకతాళీయమో, ఉద్దేశ పూర్వకమో గానీ యుద్ధంలో ఆకస్మికమైన, ప్రమాదకరమైన పెరుగు దల స్పష్టంగా కనబడుతోంది.తీవ్రతను పెంచిన జో!దీర్ఘ–శ్రేణి పాశ్చాత్య తయారీ క్షిపణులను ఉపయోగించే ఆమోదం కోసం ఉక్రెయిన్ చాలా కాలంగా ఎదురుచూస్తోంది. అయితే యుద్ధాన్ని ఇద్దరు ప్రత్యర్థులకే పరిమితం చేసే వివేకంతో, సంయమనం చూపుతూ వాషింగ్టన్ దీనిని నిలిపి ఉంచింది. అలాంటిది బైడెన్ అధ్యక్షత దాని ‘అత్యంత బలహీన’ దశలో ఉన్నప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. వైట్ హౌస్ పీఠం కోసం నవంబర్ మొదట్లో అమెరికా ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత, జనవరి 20న కొత్త అధ్యక్షుడు (డోనాల్డ్ ట్రంప్) బాధ్యతలు స్వీకరించే సంధి కాలం ఇది.ఉక్రెయిన్ తన కొత్త ఆయుధాలను ఉపయోగించడంలో ఎక్కువ సమయాన్ని పోగొట్టుకోలేదు. నవంబర్ 20న రష్యాలోని లక్ష్యాలపై ఏటీఏసీఎంస్ క్షిపణులను ప్రయోగించింది. పైగా, బ్రిటన్ సరఫరా చేసిన స్టార్మ్ షాడో క్షిపణులతో అనంతర దాడిని కొనసాగించింది.అంతకుముందు, ఉత్తర కొరియా దళాలను ఈ యుద్ధంలో చేర్చిందనీ, ఇరాన్ సరఫరా చేసిన డ్రోన్లను కూడా ఉప యోగిస్తుందనీ రష్యా మీద ఆరోపణలు వచ్చాయి. తద్వారా రష్యా– ఉక్రెయిన్ మధ్య నుండి యుద్ధ పరిధి రెండు దేశాలను దాటి, విస్తృత బహుళ జాతి స్వభా వానికి విస్తరించినట్టయింది.భయాన్ని పెంచిన రష్యాఅయితే మాస్కో దాదాపు వెంటనే ప్రతీకారం తీర్చుకుంది. నవంబర్ 21న రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తమ సైన్యం తూర్పు ఉక్రేనియన్ నగరమైన డ్నిప్రోపై ‘కొత్త సాంప్రదాయిక మధ్యంతర శ్రేణి క్షిపణి’ని ఉపయోగించి దాడి చేసిందని ప్రకటించారు. దీన్ని ఒరేష్నిక్గా వర్గీకృతమైన ప్రయోగాత్మక మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణిగా గుర్తిస్తున్నారు.అమెరికన్, బ్రిటిష్ దీర్ఘ–శ్రేణి ఆయుధాల వినియోగానికి ప్రతి స్పందనగా, నవంబర్ 21న రష్యన్ సాయుధ దళాలు ఉక్రెయిన్ సైనిక–పారిశ్రామిక సముదాయాలలో ఒకదానిపై దాడిని నిర్వహించా యని పుతిన్ పేర్కొన్నారు. ‘హైపర్సోనిక్ ఒరేష్నిక్ క్షిపణిని ఉప యోగించడానికి కారణం ఏమిటంటే, అమెరికా నేతృత్వంలోని కూటమి ఈ యుద్ధాన్ని మరింత మారణ హోమంవైపు పెంచాలని నిర్ణయించుకుంటే, రష్యా దృఢమైన రీతిలో ప్రతిస్పందిస్తుంది. రష్యా ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉంది. ఎవరైనా ఇప్పటికీ దీనిని అనుమానించినట్లయితే, వారలా చేయకూడదు. ఎల్లప్పుడూ రష్యా ప్రతిస్పందన తగురీతిలో ఉంటుంది’ అని పుతిన్ పేర్కొన్నారు.ఈ ప్రతిస్పందన అణ్వాయుధ సహితంగా ఉంటుందా? అనేక ఐరోపా దేశాలు భయపడే ఘోరమైన దృష్టాంతం ఇది. పుతిన్ తమ అణ్వాయుధ సిద్ధాంతాన్ని సవరించడం ద్వారా ఈ ఆందోళనను మరింతగా రేకెత్తించారు.రష్యా మునుపటి అణు సిద్ధాంతం, సాంప్రదాయ నమూనాలో రూపొందినది. అంటే అణ్వాయుధం అంతటి విధ్వంసకరమైన సామ ర్థ్యాన్ని ఉపయోగించడం గురించి ఆలోచించకుండా, కేవలం ప్రత్యర్థిని, అంటే అమెరికాను ‘నిరోధించడానికి’ మాత్రమే ఉద్దేశించబడింది. రెండవ షరతు ఏమిటంటే, రాజ్య ఉనికికి ముప్పు కలిగించే సాంప్రదాయ సైనిక దాడిని తిప్పికొట్టడం.అయితే, మాస్కో సవరించి ప్రకటించిన నవంబర్ సిద్ధాంతం మొత్తం పరిధిని విస్తరించింది. అణుశక్తి మద్దతు ఉన్న అణుయేతర శక్తి ద్వారా ఎదురయ్యే ఏ దాడినైనా సరే... ఉమ్మడి దాడిగా పరిగణి స్తామని రష్యా పేర్కొంది. అలాగే, మిలిటరీ కూటమిలోని ఒక సభ్య దేశం (ఈ సందర్భంలో, అమెరికా నేతృత్వంలోని కూటమి) చేసే ఏ దాడినైనా మొత్తం కూటమి చేసిన దాడిగా పరిగణిస్తామని కూడా రష్యా స్పష్టం చేసింది.2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధం ప్రారంభ దశ నుండి కూడా మాస్కో తన అణు సామర్థ్యం గురించి యోచిస్తోంది. అయితే, ఒక అవగాహన ప్రకారం రష్యా ఈ రెడ్ లైన్ ను దాటదనీ, దీనిని కేవలం ఒక బెదిరింపుగా మాత్రమే చూడాలనీ కొంరు పాశ్చాత్య వ్యాఖ్యాతలు కొట్టేశారు. కానీ అలాంటి ఆత్మసంతృప్తి తప్పుదారి పట్టించేదీ, ప్రమాదకరమైనదీ కావచ్చు.వివేకం కలిగేనా?అమెరికాకూ, మునుపటి సోవియట్ యూనియన్ కూ మధ్య 1962 క్యూబా క్షిపణి సంక్షోభం ఆ సంవత్సరం అక్టోబర్ మధ్యలో ప్రారంభమై ప్రపంచాన్ని దాదాపుగా అణుయుద్ధంలోకి నెట్టింది. అమెరికా అధ్యక్షుడు జాన్ కెన్నెడీ, సోవియట్ అధ్యక్షుడు నికితా కృశ్చేవ్ అనే ఇద్దరు నాయకులు చివరి నిమిషంలో ప్రదర్శించిన వివేకం కారణంగా ఈ విధ్వంసకరమైన పరస్పర హనన కార్యక్రమం నిలిచిపోయింది. వారు 1962 నవంబర్ 20న సంయుక్తంగా దీనికి ‘మంగళం పాడేయాలని’ నిర్ణయించుకున్నారు.రెండు దేశాల్లోని రాబందులు ఆ ఘర్షణను తీవ్రతరం చేయాలని కోరినప్పటికీ, శిఖరాగ్ర స్థాయిలో అధినేతలు దృఢమైన రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. సోవియట్ జలాంతర్గామి కెప్టెన్ ప్రదర్శించిన వ్యూహాత్మక సంయమనం కారణంగా అదృష్టవశాత్తూ అణు నిషేధం ఉల్లంఘనకు గురికాలేదు. ప్రస్తుత అస్థిర కాలంలో అలాంటి సంయ మనం పాటిస్తారా?ఒరేష్నిక్ను ఆవిష్కరించడం ద్వారా, రేడియేషన్ లేకుండా అణ్వా యుధానికి దగ్గరగా ఉండే అసాధారణ సామర్థ్యాన్ని రష్యా ప్రదర్శించింది. ఒరేష్నిక్ అనేది 2,500 కి.మీ. పరిధి కలిగిన కొత్త తరం రష్యన్ మధ్యంతర శ్రేణి క్షిపణి అనీ, దీన్ని 5,000 కి.మీ. పరిధి వరకు విస్తరించవచ్చనీ రష్యన్ మీడియా నివేదించింది.సహజసిద్ధంగా హైపర్ సోనిక్ అయిన ఈ క్షిపణి వేగం ‘మాక్ 10–మాక్ 11’ మధ్య ఉంటుంది (గంటకు 12,000 కి.మీ. కంటే ఎక్కువ). అంటే దీన్ని గుర్తించడం కష్టం. పైగా, ప్రస్తుత క్షిపణి నిరోధక సాంకేతికత ఈ క్షిపణిని అడ్డగించలేదు. కాలినిన్ గ్రాడ్లోని రష్యన్ స్థావరం నుండి దీన్ని ప్రయోగిస్తే యూరోపియన్ రాజధానులను చాలా తక్కువ సమయంలో (సెకన్లలో) ఢీకొంటుంది: వార్సా 81; బెర్లిన్ 155; పారిస్ 412; లండన్ 416. రష్యా ఉప విదే శాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ అక్టోబర్ 3న ప్రకటన చేస్తూ, అణ్వా యుధ శక్తుల మధ్య ప్రత్యక్ష సాయుధ ఘర్షణ ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయలేమని పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం 1,000 రోజుల మార్కును దాటింది. ఇది క్లిష్టమైన శిఖరాగ్రానికి సిద్ధంగా ఉంది. ఒక పౌర అణు ప్రమాదం లేదా ఉద్దేశపూర్వక సైనిక సంఘటన రెండూ విపత్తుతో కూడి ఉంటాయి. పైగా అమెరికా పాలనలో అత్యంత బలహీనమైన ప్రస్తుత దశ ఏ సంభావ్యతకూ అవకాశం ఇవ్వకూడదు. బైడెన్ పాలన తర్వాత వస్తున్న ట్రంప్ 2.0 అధ్యక్షత విఘాతం కలిగించేదిగానూ, దుస్సాహ సికంగానూ ఉంటుంది. మొత్తం మీద 2025 సంవత్సరం మరింత అల్లకల్లోలంగా ఉండబోతోంది.సి. ఉదయ్ భాస్కర్ వ్యాసకర్త ఢిల్లీలోని సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
యుద్ధానికి తెర దించేందుకు..రష్యా రెడీ!
రెండున్నరేళ్లు దాటిన యుద్ధం. కనీవినీ ఎరగని విధ్వంసం. ఇరువైపులా లెక్కకైనా అందనంత ఆస్తి, ప్రాణనష్టం. యుద్ధంలో నిజమైన విజేతలంటూ ఎవరూ ఉండరని ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నిరూపిస్తోంది. అగ్ర రాజ్యపు అపార ఆర్థిక, సాయుధ సంపత్తి ముందు ఏ మూలకూ చాలని ఉక్రెయిన్ యుద్ధంతో కకావికలైంది. ఆర్థికంగా, సైనికంగా మాత్రమే గాక జనాభాపరంగా, అన్ని రకాలుగానూ దశాబ్దాలు గడిచినా కోలుకోలేనంతగా నష్ట పోయింది. అమెరికా, యూరప్ దేశాల ఆర్థిక, సాయుధ దన్నుతో నెట్టుకొస్తున్నా ట్రంప్ రాకతో ఆ సాయమూ ప్రశ్నార్థకంగా మారేలా కన్పిస్తోంది. అదే జరిగితే చేతులెత్తేయడం మినహా దాని ముందు మరో మార్గం లేనట్టే. ఇంతటి యుద్ధం చేసి రష్యా కూడా సాధించిన దానికంటే నష్టపోయిందే ఎక్కువ. అందులో ముఖ్యమైనది సైనిక నష్టం. యుద్ధంలో ఇప్పటికే ఏకంగా 2 లక్షల మందికి పైగా రష్యా సైనికులు మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి! దీనికి తోడు కనీసం మరో 5 లక్షల మంది సైనిక విధులకు పనికిరానంతగా గాయపడ్డట్టు సమాచారం. ఇది ఆ దేశానికి కోలుకోలేని దెబ్బే. యువతను నిర్బంధంగా సైన్యంలో చేర్చుకునే ప్రయత్నాలూ పెద్దగా ఫలించడం లేదు. యుద్ధ భూమికి పంపుతారనే భయంతో రష్యా యువత భారీ సంఖ్యలో వీలైన మార్గంలో దేశం వీడుతోంది. దాంతో సైనికుల కొరత కొన్నాళ్లుగా రష్యాను తీవ్రంగా వేధిస్తోంది. మరో దారి లేక సైన్యం కోసం ఉత్తర కొరియా వంటి దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి! దీనికి తోడు సుదీర్ఘ యుద్ధం కారణంగా ప్రధానమైన ఆయుధ నిల్వలన్నీ దాదాపుగా నిండుకోవడంతో రష్యాకు ఎటూ పాలుపోవడం లేదు. ఉక్రెయిన్పై సైనిక చర్యను ఇంకా కొనసాగించే విషయంలో స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఉందని ఇప్పటికే రుజువైంది. ఈ నేపథ్యంలో యుద్ధానికి ఏదో రకంగా తెర పడాలని ఉక్రెయిన్తో పాటు రష్యా కూడా కోరుకుంటున్నట్టు సమాచారం. ఇటీవలి పుతిన్ ఉన్నత స్థాయి భేటీలో ఈ అంశమూ చర్చకు వచ్చిందంటున్నారు.ఇవీ షరతులు...→ భూతల యుద్ధంలో ఉక్రెయిన్ నుంచి రష్యా సైన్యానికి గతంలోలా కొన్నాళ్లుగా పెద్దగా ప్రతిఘటన ఎదురవడం లేదు.→ దాంతో నెనెట్స్క్ తదితర ఉక్రెయిన్ భూభాగాల్లోకి రష్యా నానాటికీ మరింతగా చొచ్చుకుపోతోంది.→ కానీ ఇందుకు చెల్లించుకోవాల్సి వస్తున్న సైనిక, ఆయుధ మూల్యం తదితరాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఆలోచనలో పడేసినట్టు వార్తలొస్తున్నాయి. ఏదోలా ఉక్రెయిన్పై యుద్ధానికి తెర దించేందుకే ఆయన మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.→ కొన్ని ప్రధాన షరతులకు ఉక్రెయిన్ అంగీకరించే పక్షంలో యుద్ధా్దన్ని నిలిపేసేందుకు పుతిన్ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు అమెరికా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.→ ఆక్రమిత ప్రాంతాలకు తోడు మరింత భారీ భూభాగాన్ని ఉక్రెయిన్ తమకివ్వాలని పుతిన్ పట్టుబడుతున్నారు.→ అది కనీసం అమెరికాలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన వర్జీనియా పరిమాణంలో ఉండాలని కోరుతున్నారు.→ ఉక్రెయిన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలో సభ్యత్వం ఇవ్వరాదని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ డిమాండ్ను నాటో పరిగణనలోకే తీసుకోవద్దని కోరుతున్నారు. యుద్ధంలో మరణించిన రష్యా సైనికులు: 1.5 లక్షల నుంచి 2లక్షలుగాయపడ్డ సైనికులు: 5 లక్షల పైచిలుకువామ్మో సైన్యం!రష్యా యువతలో వణుకుసైన్యంలో చేరడమనే ఆలోచనే రష్యా యువతకు పీడకలతో సమానం! కొత్తగా చేరేవారిని వేధించడంలో రష్యా సైనికుల ట్రాక్ రికార్డు సాధారణమైనది కాదు! రిటైరైన తర్వాత కూడా వాటిని గుర్తుకు తెచ్చుకుంటూ వణికిపోయే పరిస్థితి! వాటి బారిన పడే బదులు బతికుంటే బయట బలుసాకైనా తినొచ్చని రష్యా యూత్ భావిస్తుంటారు. డెడొవ్షినా అని పిలిచే ఈ వేధింపుల జాఢ్యం ఇప్పటిది కాదు. రష్యా సైన్యంలో 17వ శతాబ్దం నుంచే ఉందని చెబుతారు. దీనికి భయపడి రష్యా యువత సైన్యంలో చేరకుండా ఉండేందుకు వీలైనంతగా ప్రయత్నిస్తుంటుంది. ఉక్రెయిన్ యుద్ధంలో కనీవినీ ఎరగనంత సైనిక నష్టం జరుగుతుండటంతో భారీగా రిక్రూట్మెంట్కు రష్యా రక్షణ శాఖ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. యువతీ యువకులకు వారి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా సైన్యంలో చేరాలని పేర్కొనే ‘డ్రాఫ్ట్ నోటీస్’ పంపిస్తోంది. దాంతో సైనిక జీవితాన్ని తప్పించుకునేందుకు రష్యా యువత లక్షలాదిగా విదేశాల బాట పట్టారు. అలా వెళ్లలేని వారిలో చాలామంది ఫేక్ మెడికల్గా అన్ఫిట్ సర్టిఫికెట్లు సమర్పిస్తుంటారు. ఆ క్రమంలో అవసరమైతే తమ ఎముకలు తామే విరగ్గొట్టుకుంటారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! దాంతో చెచెన్యా, యకుట్జియా, దగెస్తాన్ వంటి సుదూర ప్రాంతాల నుంచి సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన యువతను రక్షణ శాఖ కొన్నాళ్లుగా ప్రధానంగా టార్గెట్ చేస్తోంది. ఖైదీలను నిర్బంధంగా సైన్యంలో చేరుస్తోంది. ఇలాంటి వారిని సైన్యంలో దారుణంగా చూస్తున్నారు. చనిపోతే మృతదేహాలను గుర్తించి గౌరవప్రదంగా కుటుంబీకులకు అప్పగించే పరిస్థితి కూడా ఉండటం లేదు! దీనికి తోడు రష్యాలో మామూలుగానే సైనికులు దారుణమైన పరిస్థితుల్లో పని చేయాల్సి ఉంటుంది. వారికి అత్యంత అవసరమైన పౌష్టికాహారానికే దిక్కుండదు! పైగా సరైన వైద్య సదుపాయమూ అందదు. సంక్షేమం దేవుడెరుగు, చివరికి సైనికుల భద్రతకు కూడా ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యమివ్వదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మామూలు సమయాల్లోనే పరిస్థితి ఇలా ఉంటుందంటే ఇక యుద్ధ సమయాల్లోనైతే సైనికుల భద్రత, సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ సర్కారు అక్షరాలా గాలికే వదిలేస్తుంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
వచ్చే ఏడాది భారత్లో పుతిన్ పర్యటన!
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది భారత్లో పర్యటించే వీలుంది. దశాబ్దాల స్నేహం, బలమైన రక్షణ, వాణిజ్య బంధాలు, పరస్పరసహకారాలతో ఇరుదేశాల ద్వైపాక్షిక బంధం పటిష్టంగా ఉన్న నేపథ్యంలో వార్షిక పర్యటనల్లో భాగంగా వచ్చే ఏడాది పుతిన్ భారత్కు రావొచ్చని దౌత్యవర్గాలు మంగళవారం వెల్లడించాయి. పుతిన్ పర్యటన వేళ రష్యా ఏఏ అంశాలపై భారత్తో ఒప్పందాలు చేసుకోవచ్చు అనేది ఇంకా ఖరారుకాలేదని తెలుస్తోంది. ఈ ఏడాది జూలైలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా రాజధాని మాస్కోలో పర్యటించి పుతిన్తో విస్తృతస్థాయి చర్చలు జరిపిన విషయం విదితమే. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతంకానుందని మంగళవారం రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పుతిన్ భారత పర్యటన ఖాయమని దాదాపు స్పష్టమైంది. మంగళవారం ఆయన భారత సీనియర్ సంపాదకులతో వర్చువల్గా మాట్లాడారు. ‘‘ పుతిన్ త్వరలోనే భారత్లో పర్యటిస్తారు. అయితే పర్యటన తేదీలపై ఇరుదేశాలు సంప్రదింపులు జరపాల్సి ఉంది’ అని పెస్కోవ్ అన్నారు. అయితే ఏ తేదీల్లో ఎన్ని రోజులు భారత్లో పుతిన్ పర్యటిస్తారన్న వివరాలను దిమిత్రీ వెల్లడించలేదు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మోదీ గత నెలలో కజక్స్తాన్లో పర్యటించిన విషయం తెల్సిందే. దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్కు అందించాలని బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెస్కోవ్ మాట్లాడారు. ‘‘అమెరికా నిర్ణయం ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మరింత ఆజ్యంపోస్తోంది. యుద్ధం మరింతగా విస్తరించడం ఖాయం. బైడెన్ ప్రభుత్వం యుద్ధానికే మద్దతు పలుకుతోంది. శాంతిస్థాపనకు కాదు. రష్యాపై అధునాతన ఆయుధాల వినియోగానికి అమెరికా పచ్చజెండా ఊపిన నేపథ్యంలో మేం కూడా మా అణ్వస్త్ర విధానాన్ని సవరించాల్సిన సమయమొచ్చింది’’ అని పెస్కోవ్ అన్నారు. అణ్వాయుధ వినియోగానికి సంబంధించిన కీలక దస్త్రంపై పుతిన్ సంతకం చేసిన వేళ పెస్కోవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం?
రష్యాపై యూఎస్ తయారీ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో ఉక్రెయిన్ దాడులు. తీవ్రస్థాయిలో మండిపడుతున్న రష్యా. దీన్ని అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణిస్తామని ప్రకటన. అణు దాడితో దీటుగా బదులిచ్చేందుకు వీలుగా రష్యా అణు విధానాన్ని సవరిస్తూ అధ్యక్షుడు పుతిన్ నిర్ణయం. ‘ఏ క్షణాన్నయినా అణు యుద్ధం ముంచుకు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి’ అంటూ ప్రజలకు యూరప్ దేశాల ‘వార్ గైడ్లైన్స్’. సోమవారం ఒక్క రోజే శరవేగంగా జరిగిన తీవ్ర ఆందోళనకర పరిణామాలివి! ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి తెర తీసి సరిగ్గా 1,000 రోజులు పూర్తయిన నాడే చోటుచేసుకున్న ఈ తీవ్ర పరిణామాలు గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే నాల్కలు చాస్తున్న యుద్ధ జ్వాలలు మరింతగా విస్తరించి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అన్న ఆందోళనలు సర్వత్రా తలెత్తుతున్నాయి.అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ విజయంతో ఉక్రెయిన్ యుద్ధానికి తెర పడుతుందని, పశ్చిమాసియా కల్లోలమూ కాస్త అదుపులోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇందుకు బీజం పడింది. అమెరికా అందజేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాలో సుదూర లక్ష్యాలపై దాడుల నిమిత్తం వాడేందుకు ఉక్రెయిన్కు ఆయన అనుమతివ్వడం ఒక్కసారిగా ఉద్రిక్తతలను రాజేసింది. దీన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ఉక్రెయిన్ మంగళవారమే రష్యాపై యూఎస్ దీర్ఘశ్రేణి ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టం (ఏటీఏసీఎంస్) బాలిస్టిక్ క్షిపణులను ఎడాపెడా ప్రయోగించింది. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతమే లక్ష్యంగా దాడులకు దిగింది. ఈ క్షిపణులను ఉక్రెయిన్ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి. అలాంటి చర్యలకు దిగితే తీవ్రస్థాయి ప్రతిస్పందన తప్పదని ఇప్పటికే హెచ్చరించిన రష్యా ఈ పరిణామంపై భగ్గుమంది. తమ భూభాగాలపైకి కనీసం ఆరు అమెరికా తయారీ ఏటీఏసీఎంఎస్ క్షిపణులు వచ్చి పడ్డాయని ధ్రువీకరించింది. వాటిలో ఐదింటిని కూల్చేయడంతో పాటు ఆరో దాన్నీ ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. ఉక్రెయిన్పై రష్యా అణు దాడులు! తాజా పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడుతున్నారు. మంగళవారం ఆయన రక్షణ తదితర శాఖల అత్యున్నత స్థాయి అధికారులతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ క్షిపణి దాడులను అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణించాలని నిర్ణయించారు. అందుకు వీలు కలి్పంచేలా దేశ అణు విధానానికి సవరణ కూడా చేశారు! దాని ప్రకారం సంప్రదాయ ఆయుధాలతో రష్యాపై జరిగే దాడికి ఏ అణ్వాయుధ దేశమైనా మద్దతిస్తే దాన్ని ఆ రెండు దేశాల సంయుక్త దాడిగానే పరిగణిస్తారు. సదరు దేశాలపై అణు దాడులకు దిగుతారా అన్నదానిపై సవరణలో స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే రష్యాపై భారీ స్థాయి వైమానిక, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణి దాడులు జరిగితే అణ్వాయుధాలతో బదులిచ్చేందుకు అది వీలు కలి్పస్తుండటం విశేషం! అంతేగాక మిత్ర దేశమైన బెలారస్పై దుందుడుకు చర్యలకు దిగినా అణ్వాయుధాలతో బదులు చెప్పేందుకు తాజా సవరణ అనుమతించనుంది! ఉక్రెయిన్కు మరింత సాయం చేయకుండా యూరప్ దేశాలను నియంత్రించడంతో పాటు అవసరమైతే దానిపై అణ్వాయుధ ప్రయోగానికి, అమెరికాపై సైనిక చర్యకు కూడా దిగడం పుతిన్ తాజా నిర్ణయాల ఉద్దేశమని భావిస్తున్నారు. అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులతో ఉక్రెయిన్ చేసిన తాజా దాడులకు బదులుగానే అణు విధాన సవరణ జరిగిందా అన్న ప్రశ్నకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ నేరుగా బదులివ్వలేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా అణు విధానాన్ని అప్డేట్ చేయాల్సిందిగా పుతిన్ ఆదేశించారంటూ నర్మగర్భంగా స్పందించారు. ఇటీవలి కాలంలో రష్యా అణు విధానానికి పుతిన్ సవరణ చేయడం ఇది రెండోసారి. రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా సైన్యం కూడా ఉక్రెయిన్పై యుద్ధంలో పాల్గొంటుండటం తెలిసిందే. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అమెరికా ఇప్పటికే ప్రకటించింది. దీర్ఘశ్రేణి క్షిపణుల వాడకానికి అనుమతి దాని పర్యవసానమేనంటున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ జ్వాలలు త్వరలో కొరియా ద్వీపకల్పం దాకా విస్తరించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బైడెన్ మతిలేని విధానాలతో ట్రంప్ పగ్గాలు చేపట్టే నాటికే ప్రపంచాన్ని పెనుయుద్ధం ముంగిట నిలిపేలా ఉన్నారని ఆయన కుమారుడు జూనియర్ ట్రంప్ మండిపడటం తెలిసిందే.నిత్యావసరాలు నిల్వ చేసుకోండితాజా పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కన్పిస్తుండటంతో యూరప్ దేశాలు భీతిల్లుతున్నాయి. అలాంటి పరిస్థితే తలెత్తితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ స్వీడన్, ఫిన్లండ్, నార్వే, డెన్మార్క్ తదితర నాటో సభ్య దేశాలు తమ పౌరులను హెచ్చరించడం విశేషం. ‘‘ఏ క్షణంలోనైనా అణు యుద్ధం ముంచుకు రావచ్చు. సిద్ధంగా ఉండండి’’ అంటూ స్వీడన్ ఏకంగా ఇంటింటికీ కరపత్రాలే పంచుతోంది. ‘సంక్షోభమో, యుద్ధమో వస్తే...’ అనే శీర్షికతో కూడిన 52 లక్షల కరపత్రాలను సోమవారం నుంచి వారం పాటు పంచనుంది! అది నిజానికి 32 పేజీలతో కూడిన డాక్యుమెంట్. ‘‘మనపై ఎవరైనా దాడికి తెగబడితే దేశ స్వాతంత్య్ర పరిరక్షణకు అందరమూ ఒక్కటవుదాం’’ అని అందులో పౌరులకు స్వీడన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. దాంతోపాటు, ‘‘పిల్లల డైపర్లు, బేబీ ఫుడ్, దీర్ఘకాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలు, మంచినీరు తదితరాలన్నింటినీ వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’’ అని సూచించింది. అంతేగాక బాంబు దాడులు జరిగితే వాటిబారి నుంచి ఎలా తప్పించుకోవాలి, గాయపడితే రక్తస్రావాన్ని నిరోధించేందుకు, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఏం చేయాలి, యుద్ధ బీభత్సం చూసి భీతిల్లే చిన్నారులను ఎలా సముదాయించాలి వంటి వివరాలెన్నో పొందుపరిచింది.‘‘పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వీడన్ ఇలాంటి చర్యకు దిగడం ఇది ఐదోసారి. నార్వే కూడా ఇలాంటి ‘యుద్ధ’ జాగ్రత్తలతో ప్రజలకు ఎమర్జెన్సీ పాంప్లెంట్లు పంచుతోంది. ‘పూర్తిస్థాయి యుద్ధంతో పాటు ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే వారం దాకా ఇల్లు కదలకుండా గడిపేందుకు సిద్ధపడండి’ అంటూ అప్రమత్తం చేస్తోంది. డెన్మార్క్ కూడా కనీసం మూడు రోజులకు పైగా సరిపడా సరుకులు, మంచినీరు, ఔషధాలు తదితరాలు నిల్వ ఉంచుకోవాలంటూ తన పౌరులందరికీ ఇప్పటికే ఈ–మెయిళ్లు పంపింది! ఫిన్లండ్ కూడా అదే బాట పట్టింది. ‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండండి. నిత్యావసరాలను వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’ అంటూ తన పౌరులకు ఆన్లైన్ బ్రోషర్లు పంపింది.అపారంగా అణ్వాయుధాలు రష్యా వద్ద వేలాదిగా అణ్వాయుధాలు పోగు పడి ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో అణు వార్హెడ్లున్న దేశం రష్యానే. 1994లో సోవియట్ నుంచి విడిపోయేనాటికి ఉక్రెయిన్ వద్ద కూడా భారీగానే అణ్వాయుధాలుండేవి. ఆ జాబితాలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశంగా ఉక్రెయిన్ ఉండేది. కానీ రష్యాతో ఒప్పందంలో భాగంగా తన అణ్వాయుధాలన్నింటినీ నాశనం చేసింది. కాకపోతే అమెరికాతో పాటు అణు సంపత్తి ఉన్న పలు దేశాలు ఉక్రెయిన్కు దన్నుగా ఉన్నాయి.క్షిపణులే మాట్లాడతాయి భారీ క్షిపణి దాడులకు మాకు అనుమతి లభించిందంటూ మీడియా ఏదేదో చెబుతోంది. కానీ దాడులు జరిగేది మాటలతో కాదు. వాటిని ముందుగా చెప్పి చేయరు. ఇక మా తరఫున క్షిపణులే మాట్లాడతాయి. – ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్తో పోరుకు రెడీ.. నార్త్ కొరియా కిమ్ సంచలన నిర్ణయం!
ప్యాంగ్యాంగ్: అణ్వాయుధాల తయారీలో ఉత్తర కొరియా దూసుకెళ్తోంది. అమెరికాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కిమ్ జోంగ్ ఉన్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలను తయారు చేయాలని నార్త్ కొరియా అధికారులకు కిమ్ ఆదేశాలు జారీ చేశారు. కిమ్ ఆర్ఢర్తో కొరియా అధికారులు అణ్వాయుధాలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో కిమ్ జోంగ్ ఉన్ అప్రమత్తమయ్యారు. గత ట్రంప్ పాలనలో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా వ్యూహాలను ఎదుర్కొనేందుకు కిమ్ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలు తయారుచేయాలని కిమ్ మరోసారి తన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఇటీవల తన అధికారులతో కిమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణకొరియాతో కలిసి అమెరికా అణ్వస్త్ర వ్యూహాలకు పదునుపెట్టడాన్ని ఖండించారు. జపాన్తో కలిసి ఆసియా నాటో ఏర్పాటుచేయాలన్న ఆలోచనలను ఆయన తప్పుపట్టారు.మరోవైపు, దక్షిణ కొరియా, అమెరికాపై దాడి చేయడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను కిమ్ సేనలు వేగంగా పెంచుకొంటున్నాయి. అణ్వాయుధాలు, ఖండాంతర క్షిపణులను వేగంగా తయారుచేస్తోంది. ఇక, ఉత్తర కొరియా త్వరలోనే న్యూక్లియర్ బాంబు పరీక్ష నిర్వహించవచ్చని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థలు రెండు వారాల క్రితం నివేదికలు ఇచ్చాయి.ఇదిలా ఉండగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో జెలెన్ స్కీకి అమెరికా సహాకరించడాన్ని కిమ్ తీవ్రంగా ఖండించారు. రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ను పశ్చిమ దేశాలు పావుగా వాడుకుంటున్నాయని ఆరోపించారు. అమెరికా ప్లాన్ ప్రకారమే తన పలుకుబడి పెంచుకునేందుకు ఉక్రెయిన్కు సహకరిస్తోందన్నారు. 🚨#BREAKING: North Korea's Kim Jong Un Is Calling For A "New Cold War"This comes in response to the Biden Administration's recent actions in the East.Kim Jong Un also calls for UNLIMITED EXPANSION OF HIS NUCLEAR WEAPONS.Thoughts? pic.twitter.com/naRaJLkTs8— Donald J. Trump News (@realDonaldNewsX) November 18, 2024 -
రష్యా-ఉక్రెయిన్ వార్పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. పుతిన్కు ఫోన్!
వాషింగ్టన్: గత రెండున్నరేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రెండు దేశాల మధ్య పోరులో ఇప్పటికే వేల సంఖ్యలో సామన్య పౌరులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ మొదటిసారిగా మార్-ఎ-లాగో బహిరంగ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ..‘రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంపై వచ్చిన నివేదికను పరిశీలించాను. గత రెండున్నరేళ్లలో వేలాదిమంది మరణించారు. నేను అధికారంలోకి వచ్చిన అనంతరం రష్యా-ఉక్రెయిన్ల యుద్ధాన్ని ఆపేస్తాను. అలాగే, పశ్చిమాసియాలోనూ శాంతిస్థాపనకు కృషి చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో అమెరికా సైన్యాన్ని బలోపేతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఇదిలా ఉండగా.. అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, తాను అధికారంలోకి వస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ ఇదివరకే పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. ఇక, ఇటీవల ఈవిషయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడి.. యుద్ధాన్ని విస్తరించొద్దని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికైనా రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు నిలిచిపోవాలని దేశాలు కోరుతున్నాయి. This is what POTUS TRUMP wants for ending RUSSIA UKRAINE war , he wants this 800 miles line to be declared LAC with buffer zones on both sides pic.twitter.com/FJEpf4nCXk— VINAY. KUMAR DELHI (@wadhawan2011) November 15, 2024 -
రష్యా అధ్యక్షుడు పుతిన్కు ట్రంప్ ఫోన్కాల్
-
ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ.. అనూహ్య పరిణామం
వాషింగ్టన్: రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికీ తెలియడంలేదు. అయితే పలు దేశాలు ఈ యుద్ధాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. తాజాగా అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇందుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.వాషింగ్టన్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేసి, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించి తగిన సలహాలు ఇచ్చారని, ఈ యుద్ధాన్ని తీవ్రతరం చేయవద్దని కోరారని తెలుస్తోంది. అలాగే ఐరోపాలో అమెరికాకు ఉన్న బలమైన సైనిక ఉనికి గురించి రష్యాను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఉక్రెయిన్లో కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించే మార్గాలపై చర్చించారు. ఉపఖండంలో శాంతిని కొనసాగించే ప్రయత్నాల గురించి కూడా చర్చించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. ఇదివరకే ఫోన్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. కాగా ట్రంప్ తాజాగా పుతిన్తో సంభాషించడంపై ఉక్రెయిన్ ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అయితే ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం దీనిని ఖండించింది. ఈ ఫోను సంభాషణ గురించి ఉక్రెయిన్కు ఎలాంటి ప్రాథమిక సమాచారం ఇవ్వలేదని, ఇది తప్పుడు రిపోర్టు అని పేర్కొంది. BREAKING: 🇺🇸🇷🇺 President-elect Donald Trump holds phone call with Russia's Vladimir Putin to discuss de-escalating the war in Ukraine. pic.twitter.com/2pDW1vARaE— BRICS News (@BRICSinfo) November 10, 2024మరోవైపు ట్రంప్తో ఉక్రెయిన్పై చర్చించేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నారని రష్యా ప్రకటించింది. అయితే రష్యా తన డిమాండ్లను మార్చుకోవడానికి సిద్ధంగా ఉందని దీని అర్థం కాదని కూడా రష్యా స్పష్టం చేసింది. కాగా ఇప్పటివరకూ పుతిన్- ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అధికారికంగా ధృవీకరణ పొందలేదు. స్కై న్యూస్ వంటి ప్రధాన వార్తా నెట్వర్క్లు కూడా ఈ నివేదికను స్వతంత్రంగా ధృవీకరించలేదు.ఇది కూడా చదవండి: పేజర్ దాడులు మా పనే: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు -
రష్యాకు ‘అక్టోబర్’ షాక్.. రోజుకు 1500 మంది సైనికుల మృతి!
లండన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై.. దాదాపు మూడేళ్లు గడుస్తోంది. అయితే.. ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అత్యంత దారుణమైన ప్రతిఘటనను అక్టోబర్ నెలలో రష్యా బలగాలు ఎదుర్కొన్నాయని బ్రిటన్ సాయుధ దళాల అధిపతి అన్నారు. అక్టోబర్లో రోజుకు సగటున 1,500 మంది రష్యన్ సైనికులు మరణించటం లేదా గాయపడటం జరిగిందని బిట్రన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ టోనీ రాడాకిన్ తెలిపారు.‘‘రష్యా తన యుద్ధంలో మరణించిన వారి సంఖ్యను వెల్లడించలేదు. అయితే ఫిబ్రవరి 2022లో రష్యా.. ఉక్రెయిన్పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించినప్పటి నుండి గత నెలలో అత్యధికంగా సైనికులను కోల్పోయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశయం కారణంగా సమామరు 7 లక్షమ మంది మరణించటం లేదా గాయపడటం జరిగింది. పుతిన్ ఆశయం కోసం రష్యా ఈ భారీ నష్టం, నొప్పి, బాధ భరించవల్సి వచ్చింది. చాలా తక్కువ భూభాగం కోసం అధిక సైన్యం నష్టపోయింది. రష్యా ప్రభుత్వం.. రక్షణ, భద్రతపై ప్రజా వ్యయంలో 40 శాతానికి పైగా ఖర్చు చేస్తోంది. అధ్యక్షుడు పుతిన్ దేశంపై అధిక భారం వేశారు. ఉక్రెయిన్కు బ్రిటన్ మద్దతు ఇస్తునే ఉంటుంది. అది అధ్యక్షుడు పుతిన్ గ్రహించవలసిన సందేశం. ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి భరోసా’’ అని అన్నారు.రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాటంలో ఉక్రెయిన్ బలమైన మద్దతుదారులలో బ్రిటన్ ఒకటి. ఉక్రెయిన్కు బిలియన్లకొద్ది పౌండ్లతో సైనిక సహాయంతో పాటు ఆయుధాలు, బలగాలకు శిక్షణను అందిస్తోంది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి పాశ్చాత్య దేశాల భవిష్యత్తు నిబద్ధత గురించి ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ ఉక్రెయిన్కు మద్దతును మరోసారి ప్రకటించటం గమనార్హం.చదవండి: కెనడాలో టెంపుల్పై దాడి.. ఖలిస్తానీ నిరసన నిర్వాహకుడు అరెస్ట్ -
ట్రంప్ గెలుపుపై పుతిన్ రియాక్షన్ ఇదే
మాస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు పుతిన్ అవునని సమాధానం ఇచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదల తర్వాత గురువారం రష్యాలోని సోచిలో ఓ అంతర్జాతీయ సదస్సు జరిగింది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన ట్రంప్కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్తో చర్చలు జరపడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు.. అందుకు తాను సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.అదే సమయంలో ఏడాది జులైలో ట్రంప్పై జరిగిన హత్యాయత్నంపై స్పందించారు. హత్యాయత్నం జరిగిన అనంతరం ట్రంప్ చూపించిన తెగువ, ధైర్యం తనను ఆకట్టుకుందన్నారు. పుతిన్తో మాట్లాడలేదుఅధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తాను 70 మంది దేశాది నేతలతో మాట్లాడానని ట్రంప్ తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమెక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ను గెలిపించాలని పిలుపున్చిన పుతిన్తో తాను మాట్లాడలేదని ట్రంప్ వెల్లడించారు. -
PM Narendra Modi: చర్చలు, దౌత్యానికే మా మద్దతు
కజన్: సంఘర్షణలు, సమస్యల పరిష్కారానికి చర్చలు, దౌత్యమార్గాలే శ్రేయస్కరమని ప్రధాని మోదీ మరోసారి తేల్చిచెప్పారు. శాంతియుత మా ర్గంలో చర్చలు, సంప్రదింపులకే తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఏ సమస్యకైనా యుద్ధాలతో పరిష్కారం లభించందని స్పష్టంచేశారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడానికి శాంతి చర్చలకు శ్రీకారం చుట్టాలని ఇరుపక్షాలకు పిలుపునిచ్చారు.రష్యాలోని కజన్ నగరంలో బుధవారం 16వ ‘బ్రిక్స్’ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. బ్రిక్స్ అనేది విభజన సంస్థ కాదని, మొత్తం మానవాళి ప్రయోజనాల కోసం పనిచేస్తే సంస్థ అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని కూటమికి సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధాలు, సంఘర్షణలు, ఆర్థిక అనిశి్చతి, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి సవాళ్లపై మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపించేలా బ్రిక్స్ సానుకూల పాత్ర పోషించగలదని చెప్పారు. బ్రిక్స్ వైవిధ్యంతో కూడిన, సమగ్ర వేదిక అని వివరించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు వద్దు ‘‘యుద్ధానికి కాదు.. చర్చలు, దౌత్యానికే మా మద్దతు ఉంటుంది. కోవిడ్–19 సంక్షోభాన్ని మనమంతా కలిసికట్టుగా అధిగమించాం అదే తరహాలో ముందు తరాలకు సురక్షితమైన, బలమైన, సౌభాగ్యవంతమైన భవిష్యత్తును అందించడానికి నూతన అవకాశాలు మనం సృష్టించగలం. ప్రస్తుత సవాళ్ల నేపథ్యంలో బ్రిక్స్పై ప్రపంచ దేశాలకు ఎన్నో అంచనాలున్నాయి. వాటిని నెరవేర్చేలా మనం పనిచేయాలి. ఉగ్రవాద భూతాన్ని అంతం చేయడానికి అన్ని దేశాలూ కలిసికట్టుగా కృషి చేయాలి. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పనికిరావు. అందరూ ఒకే ఆలోచనతో ఉంటేనే లక్ష్యం సాధించడం సులువవుతుంది. యువతను ఉగ్రవాదం, తీవ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకోవడానికి కఠిన చర్యలు అవసరం. అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో సమగ్ర తీర్మానం చేసేలా మనమంతా కలిసి ఒత్తిడి పెంచాలి. అలాగే సైబర్ భద్రత, సురక్షితమైన కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం కోసం మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థతోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సమగ్ర సంస్కరణలు అవసరం. నిరి్ధష్ట గడువులోగా సంస్కరణలు వచ్చేలా మనం ఉమ్మడిగా ముందుకు సాగాలి. బ్రిక్స్లో మన ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అంతర్జాతీయ సంస్థలకు బ్రిక్స్ ప్రత్యామ్నాయం అనే భావన రాకూడదు. ఆయా సంస్థలను సంస్కరించే వేదిక అనే అభిప్రాయం అందరిలోనూ కలగాలి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడాన్ని మనం కర్తవ్యంగా స్వీకరించాలి. ఆహార భద్రత, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. బ్రిక్స్లోకి మరికొన్ని భాస్వామ్య దేశాలను ఆహా్వనించడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఈ విషయంలో కూటమి దేశాలు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలి. అదేసమయంలో బ్రిక్స్ వ్యవస్థాపక సభ్యదేశాలను గౌరవించాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. కూటమిలోకి మరో ఐదు దేశాలు బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) కూటమిలో చేరేందుకు గ్లోబల్ సౌత్ దేశాలు ఎంతగానో ఆసక్తి చూపుతున్నాయని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చెప్పారు. ఈ విషయంలో ఆయా దేశాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల పట్ల చురుగ్గా స్పందించాలని కూటమిలోని సభ్యదేశాలకు సూచించారు. కొత్త దేశాలను కూటమిలో భాగస్వాములుగా చేర్చుకోవాలని బ్రిక్స్ ప్రస్తుత సదస్సులో నిర్ణయించినట్లు తెలిపారు. బ్రిక్స్లో తాజాగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) సభ్యదేశాలుగా చేరాయి. బ్రిక్స్ ప్రయాణంలో ఇదొక కీలకమైన ఘట్టమని జిన్పింగ్ చెప్పారు. ఆయన బుధవారం బ్రిక్స్ సదస్సులో మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో బిక్స్ దేశాల్లో 10 ఓవర్సీస్ లెరి్నంగ్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. వీటిలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శిక్షణ ఇస్తామని తెలిపారు. భారత ఆర్థిక ప్రగతి సూపర్: పుతిన్ భారత ఆర్థిక ప్రగతి అద్భుతమంటూ బ్రిక్స్ సదస్సు వేదిక సాక్షిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతించారు. ఈ విషయంలో బ్రిక్స్ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందన్నారు. ‘‘హెచ్చు వృద్ధి రేటు సాధించాల్సిన అవసరాన్ని గురించి దేశాధినేతలుగా మనమంతా తరచూ మాట్లాడుతుంటాం. ప్రధాని మోదీ దాన్ని విజయవంతంగా సాధించి చూపిస్తున్నారు. 7.5 శాతం వృద్ధి రేటుతో భారత్ను మనందరికీ ఆదర్శంగా నిలిపారు. ఆయన సాధిస్తున్న విజయాలకు అభినందనలు. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నందుకు మోదీకి ధన్యవాదాలు’’ అన్నా రు. ద్వైపాక్షిక వర్తకంలో భారత్, రష్యా సాధిస్తున్న వృద్ధి పట్ల పుతిన్ సంతృప్తి వెలిబుచ్చారు. ఉగ్రవాదంతో అందరికీ ముప్పు బ్రిక్స్ సదస్సు అనంతరం కూటమి నేతలు బుధవారం ఒక ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశారు. ఉగ్రవాదాన్ని ‘ఉమ్మడి ముప్పు’గా పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని నియంత్రించడానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని తీర్మానించారు. ఉగ్రవాదం అనేది ఏ ఒక్క మతం, జాతీయత, నాగరికతకు సంబంధించింది కాదని ఉద్ఘాటించారు. అది ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఉగ్రవాద నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని బ్రిక్స్ కూటమి నేతలు నిర్ణయించారు. ప్రపంచానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులను కూడా డిక్లరేషన్లో ప్రస్తావించారు. అజర్బైజాన్లో జరగబోయే కాప్–29 సదస్సులో వాతావరణ మార్పులకు సంబంధించి ఒక పరిష్కారం మార్గం వెలువడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నామని తెలిపారు. -
ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి...అన్నివిధాలా సహకరిస్తాం: మోదీ
కజాన్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి తక్షణం శాంతియుత పరిష్కారం కనుగొనాల్సిన అవసరముందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఎలాంటి సాయమైనా చేసేందుకు భారత్ సదా సిద్ధమని ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఈ మేరకు హామీ ఇచ్చారు. 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మంగళవారం రష్యాలోని కజాన్ నగరం చేరుకున్నారు. గత మూడు నెలల్లో మోదీ రష్యా వెళ్లడం ఇది రెండోసారి. కజాన్ చేరిన కాసేపటికే ఆయన పుతిన్తో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పలు అంశాలపై నేతలిద్దరూ లోతుగా చర్చించుకున్నారు.‘‘ఉక్రెయిన్ సంక్షోభానికి తెర దించే విషయమై మీతో నేను నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నా. నేను ముందునుంచీ చెబుతున్నట్టుగా ఏ సమస్యకైనా శాంతియుత పరిష్కారమే ఏకైక మార్గం’’ అని ఈ సందర్భంగా పుతిన్కు మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఆయనతో అన్ని విషయాలపైనా అర్థవంతమైన చర్చ జరిగినట్టు అనంతరం ప్రధాని వెల్లడించారు.ఉక్రెయిన్పై రెండేళ్లకు పైగా జరుపుతున్న యుద్ధాన్ని విరమించేలా పుతిన్ను ఒప్పించి సంక్షోభానికి తెర దించగలిగింది మోదీ ఒక్కరేనని ప్రపంచ దేశాధినేతలంతా అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి భేటీకి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. రెండు రోజుల పాటు జరగనున్న బ్రిక్స్ సదస్సులో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో కూడా మోదీ సమావేశమయ్యారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ఆయన బుధవారం భేటీ కానున్నారు. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ మేరకు వెల్లడించారు.నాకు, మోదీకి మధ్య అనువాదం అవసరమే లేదునవ్వులు పూయించిన పుతిన్ వ్యాఖ్యలు మోదీతో భేటీ సందర్భంగా పుతిన్ చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. ‘‘భారత్తో రష్యా బంధం ఎంత బలంగా ఉందంటే నా మాటలను అర్థం చేసుకోవడానికి బహుశా మీకు అనువాదం కూడా అవసరం లేదేమో!’’ అని మోదీని ఉద్దేశించి పుతిన్ అన్నారు. దాంతో ప్రధానితో సహా భేటీలో పాల్గొన్న ఇరు దేశాల ఉన్నతాధికారులు తదితరులంతా చిరునవ్వులు చిందించారు. భారత్తో రష్యా బంధం అత్యంత ప్రత్యేకమైనది. ఎంతో దృఢమైనది. అది నానాటికీ మరింతగా బలపడుతోంది’’ అని ఈ సందర్భంగా పుతిన్ అన్నారు.బ్రిక్స్కు పెరుగుతున్న ప్రాధాన్యంఅంతర్జాతీయంగా బ్రిక్స్ కూటమి ప్రాధా న్యం నానాటికీ పెరుగుతోందని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘కీలకమైన అంతర్జాతీయ అంశాలపై చర్చలకు బ్రిక్స్ ప్రధాన వేదికగా మారుతోంది. అభివృద్ధి, పరస్పర సహకారం, వాతావరణ మార్పులు, ఆర్థిక సహకారం, దేశాల మధ్య పలు రకాలైన కీలక సరఫరా వ్యవస్థల నిర్మాణం వంటివాటిపై నూతన ఆలోచనల కలబోతకు కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. గతేడాది పలు కొత్త దేశాలు బ్రిక్స్ సభ్యులుగా చేరాయి. మరెన్నో దేశాలు చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతి, ప్రగతికి సంబంధించిన పలు కీలక అంశాలపై బ్రిక్స్ దేశాధినేతలతో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఈ కూటమి 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలతో బ్రిక్ పేరిట ఏర్పాటైంది. 2010లో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్గా మారింది. గతేడాది ఈజిప్్ట, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ కూడా కూటమిలో చేరాయి.కాల పరీక్షకు నిలిచిన బంధం: మోదీగత మూడు నెలల్లోనే రష్యాలో ఇది తన రెండో పర్యటన అని మోదీ గుర్తు చేసుకున్నారు. ‘‘ఇరు దేశాల మధ్య నానాటికీ బలపడుతున్న ప్రగాఢ బంధానికి, స్నేహానికి, సమన్వయానికి ఇది సూచిక. రష్యా, భారత మైత్రి కాలపరీక్షకు నిలిచిన బంధం. భారత ఆర్థికాభివృద్ధిలో, భద్రతలో రష్యాది కీలక పాత్ర’’ అంటూ ప్రస్తుతించారు. చరిత్రాత్మక కజాన్ నగరంలో భారత్ నూతన కాన్సులేట్ను తెరవడం పట్ల ఆనందంగా ఉందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. గత జూలైలో కూడా ఆయన రష్యాలో పర్యటించడం తెలిసిందే. ఆ సందర్భంగా పుతిన్తో జరిగిన శిఖరాగ్ర భేటీలో పలు విషయాలపై లోతుగా చర్చించారు. -
ట్రంప్ గెలిస్తే.. పుతిన్ కీవ్లో కూర్చుంటారు: కమల
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే.. చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొవల్సి వస్తుందని ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ హెచ్చరించారు. విస్కాన్సిన్లోని పార్టీ మద్దతుదారులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.‘‘డొనాల్డ్ ట్రంప్ ప్రమాదకరమైన వ్యక్తి అని అమెరికా ప్రజలు గుర్తించటం చాలా ముఖ్యమని భావిస్తున్నా. ఇదే విషయాన్ని నేను చాలా బహిరంగంగా చెప్పాను. ట్రంప్ మళ్లీ అమెరికాకు అధ్యక్షుడిగా ఎంపికైతే కలిగే పరిణామాలు చాలా క్రూరంగా ఉంటాయి. నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. అమెరికా మిత్రపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ పొగడ్తలకు సులభంగా తన ఆలోచనలను మార్చుకుంటారు. కోవిడ్ సమయంలో ఆయన ఏం చేశారో అందరికీ తెలుసు. తన వ్యక్తిగత ప్రయోజనం కోసం (రష్యన్ అధ్యక్షుడు) వ్లాదిమిర్ పుతిన్కు రహస్యంగా కోవిడ్ పరీక్షల పరికరాలు పంపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ పదేపదే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆయన ఒక రోజులో పరిష్కరిస్తానని చెప్పారు. లొంగిపోవడం ద్వారా అమెరికా ప్రెసిడెంట్ అటువంటి సమస్యను పరిష్కరించాలని అమెరికన్లుగా మనం భావిస్తున్నామని నేను అనుకోను. డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడైతే వ్లాదిమిర్ పుతిన్ ఏకంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్లో కూర్చుంటారు. ట్రంప్ తనను అభిమానించే వ్యక్తులను సంతోషపెట్టాలని అనుకుంటారు’’ అని అన్నారు. ఇక.. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి సంబంధించి ఇటువంటి వ్యాఖ్యలు ట్రంప్ గంతంలో కూడా చేసిన విషయం తెలిసిందే. -
భారతీయ సినిమాలంటే ఇష్టం.. బాలీవుడ్పై పుతిన్ ప్రశంసలు
మాస్కో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఈనెల 22, 23 తేదీల్లో రష్యాలోని కజాన్ వేదికగా జరిగే 16వ బ్రిక్స్ సమ్మిట్లో పాల్గొనాలని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్యానించారు. దీంతో ప్రధాని మోదీ.. రష్యా పర్యటనకు మరోసారి వెళ్లనున్నారు.ఈ నేపథ్యంలో అధ్యక్షుడు పుతిన్ రష్యా మీడియాతో మాట్లాడుతూ.. భారతీయు సినిమాలు, బాలీవుడ్పై ప్రసంశలు కురిపించారు. భారతీయ సినిమాలకు తమ దేశంలో అత్యంత ప్రజాదరణ ఉందని అన్నారు. బ్రిక్స్ సభ్య దేశాలలో సినిమా షూటింగ్లకు రష్యా ప్రోత్సాహకాలు అందిస్తుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. పుతిన్ మాట్లాడుతూ..‘‘ బ్రిక్స్ సభ్య దేశాలను పరిశీలిస్తే.. రష్యాలో భారతీయ చలనచిత్రాలకు అధిక ప్రజాదరణ ఉందని నేను భావిస్తున్నా. మాకు ప్రత్యేకంగా టీవీ ఛానెల్ ఉంది. భారతీయ చలనచిత్రాలపై చాలా ఆసక్తిని కలిగి ఉన్నాం. ఈ ఏడాది మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సందర్భంగా బ్రిక్స్ దేశాల్లోని సినిమాలను పరిచయం చేస్తాం. #WATCH | On being asked about if Russia will give incentives to BRICS memeber states for shooting of films in the country, Russian President Putin says, "If we look at BRICS member states, I think in this country Indian films are most popular. We have a special TV channel with… pic.twitter.com/w0QGNdH0IV— ANI (@ANI) October 18, 2024 ..నేను భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కావడానికి సిద్ధంగా ఉన్నా. ఈ ప్రతిపాదనపై నా స్నేహితుడు మోదీతో చర్చించడానికి ఎదురు చూస్తూన్నా. తమ మధ్య మా మధ్య 100 శాతం సానుకూల ఒప్పందాలు జరుగుతాయని నమ్మకం ఉంది. ఇక.. భారతీయ చలనచిత్రాలు మాత్రమే కాకుండా వారి సంస్కృతులకు ప్రాతినిధ్యం వహించే బ్రిక్స్ దేశాల నటీనటులు, చైనీస్, ఇథియోపియన్ నటులు ఉన్నారు. అదేవిధంగా మేం థియేట్రికల్ ఫెస్టివల్ నిర్వహించాలని బ్రిక్స్ దేశాలతో చర్చించాం. సినిమా అకాడమీని కూడా నెలకొల్పాం’’ అని పుతిన్ అన్నారు.ఇక.. గడిచిన నాలుగు నెలల్లో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర తరువాత తొలిసారి మాస్కోలో ఈ ఏడాది జులై నెలలో మోదీ పర్యటించారు. ఆ సమయంలో 22వ భారత్–రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. 2006లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు బ్రిక్ గ్రూపును ప్రారంభించాయి. 2010లో దక్షిణాఫ్రికా చేరిన తరువాత అది బ్రిక్స్గా మార్చారు. 2024 జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు కూడా చేరాయి. ప్రస్తుతం ఈ బ్రిక్స్ గ్రూపులో పది దేశాలు ఉన్నాయి. -
ఎన్నికల వేళ ట్విస్ట్.. పుతిన్కు ట్రంప్ సీక్రెట్ కాల్స్?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గత అధ్యక్ష ఎన్నికల ఓటమిచెంది పదవి నుంచి దిగిపోయిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పలు ప్రైవేట్ ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారని వచ్చిన ఆరోపణలను బుధవారం క్రెమ్లిన్ ఖండించింది. ఇటీవల బాబ్ వుడ్వార్డ్ తాను రాసిన ‘వార్’ అనే పుస్తకంలో ట్రంప్,పుతిన్ రహస్య ఫోన్ కాల్స్ విషయాలను ప్రస్తావించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్, పుతిన్ ఫోన్ సంభాషణ తీవ్ర సంచలనంగా మారింది. అయితే.. తాజాగా ఈ ఆరోపణలపై రష్యా స్పందించింది. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవిలో ఉన్నప్పుడు కోవిడ్ మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉందని క్రెమ్లిన్ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.#BREAKING : Kremlin denies calls between Trump and Putin The Russian Presidential spokesman, Dmitry Peskov, has denied information alleging that former US President Donald Trump had spoken on the phone with Russian President Vladimir Putin seven times after the former left… pic.twitter.com/8rbppPeRgD— upuknews (@upuknews1) October 9, 2024 అయితే ఆ సమయంలో తాము కోవిడ్ -19 పరీక్ష పరికరాలను అమెరికాకు పంపినట్లు ధృవీకరించారు. కానీ, ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఇరు నేతలు చాలాసార్లు ఫోన్లో మాట్లాడుకున్నారని పుస్తకంలోని వాదనను ఆయన తీవ్రంగా ఖండించారు. బాబ్ వుడ్వార్డ్ తన పుస్తకంలో చేసిన ఆరోపణలను ‘నిజం కాదు’ అని కొట్టిపారేశారు.బాబ్ వుడ్వార్డ్ తాను రాసిన ‘వార్’ అనే పుస్తకం వారం రోజులల్లో మార్కెట్లోకి విడుదల కానుంది. అయితే అంతకంటే ముందే కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. 2024 ప్రారంభంలో ట్రంప్ తన ఫ్లోరిడా రిసార్ట్ మార్-ఎ-లాగోలో ఉన్నప్పుడు పుతిన్తో.. మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రైవేట్ కాల్ను ఏర్పాటు చేశారు. ఇరు నేతల మధ్య ఇలాంటి ఫోన్ సంభాషణ కేవలం ఒక్కసారి మాత్రమే జరగలేదని ఆ పుస్తకంలో బాబ్ వుడ్వార్డ్ ప్రస్తావించటం చర్చనీయాంశంగా మారింది.చదవండి: హెజ్బొల్లా చితికి పోయింది: అమెరికా -
అమెరికా సహా పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్
-
న్యూక్లియర్ వార్కు సిద్ధం.. పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్
మాస్కో: ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో రష్యాపై దాడులను ఉక్రెయిన్ తీవ్రతరం చేసింది. రష్యాపై దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్కు పలు దేశాలు సాయం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటో దేశాలను పుతిన్ తీవ్రంగా హెచ్చరించారు. పశ్చిమ దేశాలపై అణ్వాయుధాలతో దాడి చేసేందుకు రెడీ అయినట్టు హింట్ ఇచ్చాడు.అమెరికా, యూకే సాయంతో ఉక్రెయిన్.. రష్యాపై భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే రష్యాపై బాంబు దాడికి ఉపయోగించే ‘స్టార్మ్ షాడో’ క్రూయిజ్ క్షిపణిని గత వారం యూకే క్లియర్ చేసింది. యూకే పీఎం కైర్ స్టార్మర్.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ను కలవడానికి వాషింగ్టన్ కూడా వెళ్లారు. రష్యా గడ్డపై ఉక్రెయిన్ ఆయుధాల వినియోగంపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు రష్యా ఇంటెలిజెన్స్కు సమాచారం అందింది. దీంతో, అప్రమత్తమైన రష్యా.. పశ్చిమ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు.తాజాగా రష్యా భద్రతా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. తమ దేశంపై అణు సామర్థ్యం లేని రాజ్యం, అణు సామర్థ్యం కలిగిన దేశం మద్దతుతో మా దేశంపై దాడి చేసినప్పుడు రష్యా ఫెడరేషన్పై సంయుక్త దాడిగా పరిగణిస్తామని పుతిన్ తెలిపారు. ఈ క్రమంలో తాము అణు దాడులు చేసేందుకు వెనుకాడబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. BREAKING:🇷🇺 Vladimir Putin: "We will use NUCLEAR weapons if a mass enemy missile or UAV is launched towards Russia, or when these weapons cross into Russian territory" pic.twitter.com/oDJz1zTTzU— Megatron (@Megatron_ron) September 25, 2024 పుతిన్ హెచరిక తర్వాత రష్యా తన అణు ముసాయిదాలో సవరణలు చేసింది. తాజా సవరణలు ప్రకారం ప్రత్యర్థులు విమానాల ద్వారా భారీ దాడులు చేయడం, క్రూజ్ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించినప్పుడు అణ్వస్త్రాలను వినియోగించేందుకు రష్యా నిర్ణయం తీసుకుంటుంది. ఇక పశ్చిమ దేశాలు తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి ఆయుధాలతో రష్యా భూభాగంపై ఉక్రెయిన్ దాడి చేసేందుకు అనుమతిస్తే కీవ్తో జరుగుతున్న యుద్ధంలో నాటో కూడా చేరినట్లవుతుందని పుతిన్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: 1982 to 2024: ఇజ్రాయెల్ వర్సెస్ హెజ్జ్బొల్లా రక్తచరిత్ర -
కమలా హారీస్కు పుతిన్ మద్దతు.. ట్విస్ట్ ఇచ్చిన లావ్రోవ్
మాస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచ దేశాల ఫోకస్ ఉంది. ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే చర్చ కూడా నడుస్తోంది. ఎన్నికల్లో పలు దేశాలు నేతలు ఎవరికి మద్దతు ఇస్తున్నారనే అంశం కూడా ఎన్నికల్లో కీలక కానుంది. ఇక, కమలా హారీస్కే తమ మద్దతు అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలపై రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ క్లారిటీ ఇచ్చారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలపై లావ్రోవ్ తాజాగా స్పందిస్తూ.. ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్కు మద్దతు ఉంటుందని పుతిన్ సరదాగా మాత్రమే అన్నారు. పుతిన్ అప్పుడప్పుడు జోక్స్ వేస్తుంటారు. అందులో భాగంగానే ఇలా మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మా జోక్యం ఏమీ ఉండదు. ఇంతకుముందు, ఇప్పుడు.. ఎన్నికల్లో జోక్యం చేసుకోము. మా వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదు అంటూ కామెంట్స్ చేశారు. BREAKING: Russian Foreign Minister Sergei Lavrov said in an interview with Sky News Arabia that Putin was JOKING when he said he wanted Kamala Harris to win the election in November.— Amanda Liyang (@esraa28305334) September 22, 2024ఇదిలా ఉండగా.. కొద్దిరోజులు క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్.. అమెరికా ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కమలాతో పనిచేయడం సులువని తనదైన శైలిలో మాట్లాడారు. అయితే, హారీస్ ఎంపికలో జో బైడెన్ నిర్ణయాన్ని తాను గౌరవిస్తానన్నారు. ఏదేమైనా.. ఆ దేశ అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని అక్కడివారే నిర్ణయిస్తారని ముగించారు.అనంతరం, పుతిన్ వ్యాఖ్యలపై వైట్హౌస్ వర్గాలు స్పందించాయి. పుతిన్ కామెంట్స్కు అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ కౌంటరిచ్చారు. అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరనే విషయాన్ని నిర్ణయించేది కేవలం స్థానికులే. మా అధ్యక్ష ఎన్నికలపై పుతిన్ మాట్లాడటం ఆపేస్తే మంచింది. ఈ ఎన్నికల్లో మీ జోక్యాన్ని ఎవరూ కోరుకోవడం లేదు. భవిష్యత్లో కూడా ఎన్నికల గురించి మాట్లాడకండి అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బైడెన్తో చర్చలు ఫలించాయి: ప్రధాని మోదీ -
లంచ్ బ్రేక్లో లవ్వు!
అసలే జననాల రేటు తగ్గుతోంది. అది చాలదన్నట్టుగా రెండున్నరేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం రష్యా సైనికులను భారీగా బలి తీసుకుంటోంది. దీనికి తోడు నిర్బంధంగా సైన్యంలో చేరాల్సి వస్తుండటంతో యువకులు భారీ సంఖ్యలో దేశం వీడుతున్నారు. వెరసి రష్యాలో జనాభా శరవేగంగా తగ్గిపోతోంది. ఈ పరిణామం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను తీవ్రంగా ఆందోళన పరుస్తోంది. దాంతో ఎలాగైనా జనాభాను ఇతోధికంగా పెంచి దేశసేవ చేయాలంటూ రష్యన్లకు ఆయన తాజాగా విజ్ఞప్తి చేశారు. అందుకోసం రోజూ పని మధ్యలో లంచ్, టీ విరామ సమయాల్లో కూడా వీలైనంతగా కిందా మీదా పడాల్సిందిగా సూచించారు! పుతిన్ ఇచి్చన ఈ గమ్మత్తైన పిలుపుపై నెటిజన్లు అంతే ఆసక్తికరమైన కామెంట్లు కూడా చేస్తున్నారు. లంచ్, కాఫీ బ్రేకులను సంతానోత్పత్తికి వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన అవసరం చాలా ఉందని రష్యా ఆరోగ్య మంత్రి యెవగనీ షెస్తోపలోవ్ కూడా పేర్కొనడం విశేషం. ఇది ఆచరణ సాధ్యమా అన్న ప్రశ్నలను ఆయన కొట్టిపారేశారు. ‘‘దయచేసి రోజంతా పనిలో బిజీగా ఉంటున్నామని చెప్పకండి. అది పసలేని సాకు మాత్రమే. సృష్టికార్యానికి ఆఫీసు పని అడ్డంకి కారాదు. లంచ్, కాఫీ బ్రేక్... ఇలా ప్రతి అవకాశాన్నీ సెక్స్ కోసం గరిష్టంగా ఉపయోగించుకోండి. లేదంటే కాలం ఎవరి కోసమూ ఆగదు. బేబీలను కనేందుకు బ్రేక్ టైంలో కష్టపడండి’’ అంటూ హితబోధ కూడా చేశారు.పడిపోతున్న ప్రజనన నిష్పత్తి ఏ దేశంలోనైనా జనసంఖ్య స్థిరంగా ఉండాలన్నా ప్రజనన నిష్పత్తి కనీసం 2.1గా ఉండాలి. రష్యాలో అది నానాటికీ తగ్గిపోతోంది. ప్రస్తుతం ప్రతి మహిళకూ కేవలం 1.4గా ఉంది. 2024 తొలి అర్ధ భాగంలో గత పాతికేళ్లలోనే అత్యంత తక్కువ జననాల రేటు నమోదైంది! ఇది దేశ భవిష్యత్తుకు మరణశాసనమేనంటూ క్రెమ్లిన్ హాహాకారాలు చేస్తోంది.తొలి కాన్పుకు రూ.9.4 లక్షలు! జననాల రేటును పెంచేందుకు రష్యా పలు చర్యలకు దిగింది. అబార్షన్, విడాకులు అత్యంత కష్టసాధ్యంగా మార్చేసింది. పిల్లల్ని కని పెంచడమే మహిళల ప్రధాన బాధ్యతంటూ ప్రముఖులు, మత పెద్దలతో చెప్పిస్తోంది. చెల్యాబిన్స్క్ ప్రావిన్స్ తొలి కాన్పుకు ఏకంగా రూ.9.4 లక్షలు ప్రకటించింది!– సాక్షి, నేషనల్ డెస్క్ -
నా మంచి స్నేహితుడు మోదీ రాక కోసం ఎదురు చూస్తున్నా: పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ నా స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నాం. ఆయనకు నా శుభాకాంక్షలు’అని రష్యా మీడియా సమావేశంలో పుతిన్ చెప్పినట్లు పేర్కొంది.బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యాలోని సెయింట్ పీటర్స్ వర్గ్లో పుతిన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్తో దోవల్ కరచాలనం చేశారు. ఆ ఫొటోల్ని భారత్లోని రష్యన్ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.🇷🇺🤝🇮🇳 On September 12, #Russia's President Vladimir Putin had a meeting with Ajit Doval, National Security Advisor to the Prime Minister of #India, at the Konstantinovsky Palace in #StPetersburg. 👉🏻 https://t.co/vFQ64S4vMq#RussiaIndia #DruzhbaDosti pic.twitter.com/KxcD9aciDG— Russia in India 🇷🇺 (@RusEmbIndia) September 12, 2024 గత నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన చర్చల సారాంశాన్ని అజిత్ దోవాల్ పుతిన్కు వివరించారు. మోదీ ఆదేశాల మేరకు రష్యా పర్యటనకు వచ్చినట్లు అజిత్ దోవాల్ పుతిన్కు వివరించారు. ఈ చర్చల్లో సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు రష్యాలోని కజన్ వేదికగా బ్రిక్స్ దేశాల సదస్సు జరగనుంది. ఆ సదస్సుకు మోదీ వస్తే, ఆయనతో విడిగా భేటీ కావాలనుకుంటున్నట్లు దోవల్కు పుతిన్ చెప్పారు.ఇదే అంశాన్ని రష్యా మీడియా సైతం ప్రస్తావించింది.ఇదీ చదవండి : బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకు ఎసరు..రంగంలోకి సంపన్న మహిళరష్యన్ ఎంబసీ సైతం మోదీ రష్యా పర్యటన సందర్భంగా భారత్ - రష్యాల మధ్య కుదిరిన ఒప్పందాల అమలుకు సంబంధించి వచ్చిన ఫలితాలు,సమీప భవిష్యత్తుకు సంబంధించిన అవకాశాలను వివరించేందుకు బ్రిక్స్ సదస్సు సందర్భంగా అక్టోబర్ 22న ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించాలని పుతిన్ ప్రతిపాదించారు అని టెలిగ్రామ్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో రష్యన్ ఎంబసీ తెలిపింది.కాగా, ఉక్రెయిన్ పర్యటనలో ఆదేశ అధ్యక్షుడు వ్లాదమీర్ జెలెన్ స్కీతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. కొనసాగుతున్న ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని యుద్ధాన్ని ముగించేలా ఉక్రెయిన్-రష్యాలు చర్చలు జరుపుకోవాలని, ఈ రెండు దేశాల్లో శాంతిని పునరుద్ధరించడానికి భారత్ క్రియాశీల పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందని మోదీ అన్నారు. -
మోదీ గొప్ప స్నేహితుడు: పుతిన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. మోదీ తనకు గొప్ప మిత్రుడంటూ పొగిడారు. రష్యాలోని కజాన్లో వచ్చే నెలలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. సెయింట్ పీటర్స్బర్గ్లో జరుగుతున్న బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్) దేశాల జాతీయ భద్రతాదారుల సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం అజిత్ దోవల్ అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యారు. మోదీతో భేటీకి ఆసక్తిగా ఉన్నట్లు ఈ సందర్భంగా పుతిన్ తెలిపారు. దాదాపు మూడు వారాల క్రితం ప్రధాని మోదీ ఉక్రెయిన్లో జరిపిన పర్యటన, అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చల వివరాలను దోవల్ ఆయనకు వివరించారు. ‘బ్రిక్స్ శిఖరాగ్రం సమయంలో అక్టోబర్ 22వ తేదీన మోదీతో సమావేశమవ్వాలని, రెండు దేశాల మధ్య విజయవంతంగా అమలవుతున్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం, భద్రతా పరమైన అంశాలపై చర్చించాలని అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదించారు’ అని రష్యా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే నెల 22–24 తేదీల్లో రష్యాలోని కజాన్ నగరంలో బ్రిక్స్ శిఖరాగ్రం జరగనుంది. జూలైలో మోదీ రష్యాలో పర్యటించారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్, బ్రెజిల్, చైనాలకు కీలకంగా ఉన్నాయని ఇటీవల పుతిన్ పేర్కొనడం తెలిసిందే. కాగా, బ్రిక్స్ శిఖరాగ్రానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా హాజరవనున్నారు. ఈ విషయాన్ని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ధ్రువీకరించారు. గురువారం ఆయన పుతిన్తో సమావేశమయ్యారు. -
పుతిన్ ఆకస్మిక చర్చల ప్రతిపాదన
ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధమనీ, అందుకు ఇండియా, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించాలనీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ నెల 5న చేసిన ఆకస్మిక ప్రతిపాదన ఆసక్తిని కలిగించింది. చర్చలకు ఆయన సుముఖతను చూపటం ఇది మొదటిసారి కాదు. యుద్ధం రెండున్నరేళ్ల క్రితం మొదలు కాగా చర్చల ప్రస్తావనలు గతేడాదిగా వస్తూనే ఉన్నాయి. కొన్నిసార్లు స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యూరోపియన్ దేశాల అధినేతలు, వివిధ అంత ర్జాతీయ సంస్థల బాధ్యులు ఈ మాట అంటూనే ఉన్నారు. కానీ కొన్ని కీలకమైన షరతులను పుతిన్ మొదటి నుంచీ పెడుతున్నారు. వీటిని జెలెన్స్కీ అంతే బలంగా తిరస్కరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చర్చలంటూ జరిగినా, అవి ఎలా ముందుకు సాగేదీ ఎవరూ చెప్పలేరు.జెలెన్స్కీ గత జూన్లో స్విట్జర్లాండ్లో తొంభైకి పైగా దేశాలతో శాంతి సదస్సు నిర్వ హించారు. కానీ ఆ సదస్సుకు ఆయన రష్యాను ఆహ్వానించలేదు. ఆ కారణంగా చైనా వెళ్లలేదు. అంతలోనే ఆయన, త్వరలో మరొక సదస్సు జరపగలమనీ, దానికి రష్యాను ఆహ్వానించగలమనీ ప్రకటించారు. ఆ సదస్సుకు హాజరయ్యేటట్లు రష్యాను ఒప్పించవలసిందిగా కోరేందుకు తన విదేశాంగ మంత్రి దిమిత్రి కునేబాను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వద్దకు రాయబారం పంపారు. ఉక్రెయిన్ ప్రతి పాదనలు ఏమిటో చూసి అపుడు స్పందించగలమన్నది రష్యా జవాబు.ఇవన్నీ జూన్, జూలై పరిణామాలు. అటువంటిది ఇపుడు పుతిన్ ఆకస్మికంగా చర్చల ప్రతిపాదన చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది ఆకస్మికం, ఆశ్చర్యకరంగా తోచటానికి మరికొన్ని కారణాలు న్నాయి. జూన్, జూలై పరిణామాల తర్వాత, కొంత వెనుకముందులుగా చర్చలు ప్రారంభం కావచ్చునని పలువురు భావిస్తుండగా, ఆ తర్వాత కొద్ది వారాలకే ఉక్రెయిన్ సైన్యం తమకూ, రష్యాకూ మధ్యగల ఉత్తర సరిహద్దు నుంచి రష్యాకు చెందిన కర్స్క్ ప్రాంతంపై వేలాది సైన్యంతో మెరుపుదాడి చేసి తగినంత భూభాగాన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. ఇది మరొక ఆశ్చర్యకర పరిణామం. ఎందుకంటే, యుద్ధం జరుగుతున్నది తూర్పు ప్రాంతాలలో. అక్కడ రష్యాది పూర్తి పై చేయిగా ఉండి రోజురోజుకూ ముందుకు చొచ్చుకొస్తున్నారు. ప్రస్తుతం పోక్రొవ్స్క్ అనే అతి కీలకమైన కూడలి పట్టణం వద్ద యుద్ధం కేంద్రీకృతమై ఉంది. ఆ పట్టణాన్ని కోల్పోతే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమంతా ప్రమాదంలో పడుతుంది. స్వయంగా ఉక్రె యిన్ సైన్యం చెప్తున్న దానిని బట్టి ఆ కేంద్రం కొద్ది రోజులలోనే రష్యా చేజిక్కవచ్చు. అటువంటి విపత్కర స్థితిలో పోక్రొవ్స్క్కు అదనపు బలాలను పంపి రక్షించుకునేందుకు బదులు కర్స్క్పై దాడి ఎందుకు అన్న సందేహాలు తలెత్తాయి.ఆ చర్చను కొద్దిసేపు వాయిదా వేసి ప్రస్తుతానికి వస్తే, చర్చల మాట రెండు వైపుల నుంచీ కొత్త కాదు. కానీ, అందుకు ఇండియా, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించాలనటం కొత్తమాట. ఇక్కడ ఒక స్పష్టీకరణ అవసరం. వ్లాడివాస్టోక్లో జరుగుతున్న ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరం సదస్సు సందర్భంగా ఈ మాట వచ్చింది. ఒక విలేఖరి ప్రశ్నకు సమాధానంగా పుతిన్ ఈ మాట అన్నట్లు వార్తలలో కనిపించింది గానీ, అది నిజం కాదని ఆ వీడియోను చూసినపుడు అర్థమవుతుంది. పుతిన్ ఒక లిఖిత ప్రకటనను చదవటం అందులో కనిపిస్తుంది. అనగా, ముందే ఆలోచించి చెప్పిన మాట అది. వార్తలలో వెలువడిన దానిని బట్టి రష్యా అధ్యక్షుడు అన్నది, చర్చలకు తాము సిద్ధం. అందుకు ఇండియా, చైనా, బ్రెజిల్ మధ్య వర్తిత్వం వహించాలి. వారీ పని చేయగలరు. యుద్ధంతో ముడిపడి ఉన్న అన్ని సమస్యలను వారు పరిష్కరించగలరనే విశ్వాసం ఉంది. ఈ అంశంపై తాను వారితో నిరంతరం సంప్రదిస్తున్నాను. జెలెన్స్కీ, బైడెన్ ఇరువురితో మోదీ మాట్లాడగలరు. అంతర్జాతీయ సంబంధాలలో కీలక పాత్ర వహించేందుకు మోదీకి ఇది మంచి అవకాశం అన్నది పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్య. యథా తథంగా ఈ మాటలు ముఖ్యమైనవే. పుతిన్ మరికొన్ని ముఖ్యమైన మాటలన్నారు. వీడియోలో వినిపించిన ఆ మాటలు ఎందువల్లనో వార్తలలో కనిపించలేదు. అవి, ఉక్రెయిన్తో చర్చలకు షరతుల వంటివి. అవి ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ పాలనలో గల డొనెటెస్క్, లుహాన్స్క్, ఖేర్సాన్, జపోరిజిజియా అనే నాలుగు తూర్పు ప్రాంతాలను రష్యాకు వదలి వేస్తున్నట్లు ప్రకటించాలి. (ఇప్పటికే రష్యా అధీనంలో గల క్రిమియా గురించి ఆయన ప్రస్తావించలేదు గానీ, ఆ విషయమై రాజీకి, చర్చలకు అవకాశం లేదని గతంలోనే అన్నారు.) ‘నాటో’లో చేరబోమని కూడా ఉక్రెయిన్ ప్రకటించాలి. ఆ నాలుగు ప్రాంతాల నుంచి సైన్యాన్ని పూర్తిగా ఉపసంహరించాలి. ఇవి జరిగితే ‘అదే నిమిషంలో’ యుద్ధాన్ని విరమించి చర్చలను ప్రకటిస్తాము.అనగా ఇవి చర్చలకు షరతులన్నమాట. ఈ షరతులను పుతిన్ మొదటినుంచీ పెడుతున్నారు. ఆ విషయంలో రాజీ లేదంటున్నారు. వీటిని జెలెన్స్కీ తమ వైపు నుంచి అంతే బలంగా తిరస్కరిస్తున్నారు. పైగా, రష్యా 2014లో ఆక్రమించిన క్రిమియాను తిరిగి ఇవ్వవలసిందేనంటున్నారు. ఇదే మాట ఇటీవల కూడా పునశ్చరించారు. పైన పేర్కొన్న నాలుగు ప్రాంతాలలో గణనీయమైన భాగాన్ని ప్రస్తుత యుద్ధంలో రష్యా ఆక్రమించుకోగా, అక్కడి నుంచి ఖాళీ చేయాలంటున్నారు. నాటో సభ్యత్వం తమ హక్కని వాదిస్తున్నారు. అనగా, ఇవన్నీ చర్చలకు పుతిన్, జెలెన్స్కీల షరతులన్నమాట. తమ సార్వ భౌమత్వం, భౌగోళిక సమగ్రతల పరిరక్షణకు అవసరమని జెలెన్స్కీ చెబుతున్నారు. నాటో కూటమి విస్తరణ నుంచి ఆత్మరక్షణకూ, ఆ నాలుగు ప్రాంతాలలో మెజారిటీలో గల రష్యన్ భాషీయులపై చిరకాలంగా సాగుతున్న ఉక్రెయిన్ వేధింపులు, తరచూ ప్రాణ హననం నుంచి వారిని రక్షించుకునేందుకు ఇది తప్పనిసరి అని రష్యా వాదిస్తున్నది. ఈ షరతులలోని సహేతుకతలలోకి వెళితే రెండు వైపులా న్యాయం కనిపిస్తుంది. ఉక్రెయిన్ భౌగోళిక సమగ్రతకు రక్షణ ఉండవలసిందే. అదే విధంగా, అమెరికన్ నాటో కూటమి క్రమంగా రష్యా సరిహద్దుల వైపు విస్తరిస్తూ, ఉక్రెయిన్ను నాటోలో చేర్చు కొనజూస్తూ, రష్యా అస్తిత్వానికే ముప్పు తలపెడుతున్నపుడు, వారు ఆత్మరక్షణ కోసం ప్రయత్నించరాదని అనలేము. అట్లాగే, పై నాలుగు ప్రాంతాలలోని రష్యన్ భాషీయులపై మొదటినుంచీ తీవ్రమైన వేధింపు మాట నిజమైనందున, వారికి రక్షణ అవసరం.ఈ విధమైన పరిస్థితులు, షరతుల మధ్య ఇండియా, చైనా, బ్రెజిల్లు రాజీ మార్గం కనుగొనటం ఎంత మాత్రం తేలిక కాదు. ఉభయ పక్షాలు ఈ షరతులు విధించటం, వాటిని వారు పరస్పరం తిరస్కరించటం ఇప్పటికే పలుమార్లు జరిగాయి. నాటో ద్వారా ప్రపంచాధిపత్యం అనే లక్ష్యం గల అమెరికా, ఆ కూటమిలో చేరరాదని ఒకవేళ ఉక్రెయిన్ నిర్ణయించుకున్నా అందుకు సమ్మతించే అవకాశం కనిపించదు. ఆ విధంగా మధ్యవర్తుల బాధ్యత మరింత క్లిష్టతర మవుతుంది. అదట్లుంచి భారత్, చైనా, బ్రెజిల్ ప్రముఖ దేశాలు కావటమే గాక రష్యాతో పాటు బ్రిక్స్ కూటమిలో భాగస్వాములు. తన ఆధిపత్యానికి నష్టమని భావించే అమెరికా ఆ కూటమిని భంగ పరిచేందుకు మొదటినుంచి ప్రయత్నిస్తున్నది. ఈ పరిస్థితులన్నింటి మధ్య, ఒకవేళ అసలు ఈ ముగ్గురి మధ్యవర్తిత్వమంటూ సాకారమైనా, అది ఏ విధంగా ముందుకు సాగేదీ ఎవరూ చెప్పలేరు. ఇంతకూ ఈ ప్రతిపాదనకు జెలెన్స్కీ స్పందన ఏమిటో తెలియదు... ఆయన ఇండియా, చైనాల పాత్రను ఇప్పటికే కోరి ఉన్నప్పటికీ.తిరిగి యుద్ధం విషయానికి వస్తే, కర్స్క్పై ఉక్రెయిన్ దాడిలోని ఉద్దేశం రష్యన్ సైన్యాన్ని పోక్రొవ్స్క్ నుంచి అటు మళ్లించేట్లు చేయటమని సైనిక నిపుణులు ఊహాగానాలు చేశారు. కానీ రష్యన్ వ్యూహకర్తలు ఆ పని చేయక పోక్రొవ్స్క్ను, ఇతర తూర్పు ప్రాంతా లను ఆక్రమించే పని సాగిస్తున్నారు. ఆ విధంగా కర్స్క్ వ్యూహం విఫలమైందని ఇపుడు ఉక్రెయిన్ సైన్యాధికారులే అంగీకరిస్తున్నారు. ఉక్రెయిన్ కొత్త సైన్యాధిపతి జనరల్ అలెగ్జాండర్ సిరిస్కియీ కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ, కర్స్క్ వైపు నుంచి కూడా తమపై దాడికి రష్యా ఆలోచించటంతో దానిని నిరోధించేందుకు తామే ముందు దాడి చేశామన్నారు గానీ అది నిజమని తోచదు. అటువైపు రష్యన్ యుద్ధ సన్నాహాలు అసలు లేనే లేవు. పుతిన్ ప్రతిపాదనకు రాగల రోజులలో జెలెన్స్కీ స్పందనలు వచ్చినపుడు గానీ ఈ విషయమై కొంత స్పష్టత రాదు.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
వాళ్లు సంక్షోభాన్ని పోగొట్టగలరు
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన ‘సైనికచర్య’ కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని భారత్, బ్రెజిల్, చైనా పోగొట్టగలవని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు. వ్లాడివోస్తోక్ నగరంలో జరుగుతున్న ఈస్టర్న్ ఎకనమిక్ ఫోరమ్ ప్లీనరీ సెషన్లో పుతిన్ మాట్లాడారు. ‘‘ భారత్, బ్రెజిల్, చైనాలతో నిరంతరం టచ్లోనే ఉన్నా. సంక్షోభం సమసిపోయేలా చేసేందుకు ఈ మూడు దేశాలు తీవ్రంగా కృషిచేస్తున్నాయి. చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ సుముఖంగా ఉంటే నేనూ అందుకు సిద్ధమే’’ అని అన్నారు. ఉక్రెయిన్తో చర్చలకు భారత్ సాయపడగలదని రష్యా అధ్యక్షుడి అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు. ‘‘ చర్చలకు నాయకత్వంవహించే సత్తా మోదీకి ఉంది. ఆయన అయితేనే అటు పుతిన్తో ఇటు జెలెన్స్కీ, అమెరికాతో స్వేచ్ఛగా మాట్లాడగలరు. అంతర్జాతీయ సంబంధాల్లో కీలక భూమిక పోషించేందుకు భారత్కు ఇది సువర్ణావకాశం’’ అని దిమిత్రి అన్నారు. #RussianPresident #Putin Says | 📢Have never refused from peace talks with Ukraine. Says, Istanbul agreement should be the basis📢Also adds, China, Brazil, India could be the mediators in peace talks📢"Biden recommended to support Harris, we will do the same".… pic.twitter.com/RUwWsH9Ihb— CNBC-TV18 (@CNBCTV18Live) September 5, 2024 -
కిమ్కు పుతిన్ గిఫ్ట్..ఈ సారి ప్రత్యేకంగా..
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదమీర్ పుతిన్..ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కి 24 మేలిమి జాతి గుర్రాల్ని బహుమతిగా ఇచ్చారు.ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేస్తుంది. అయితే ఉక్రెయిన్పై దాడి చేసేందుకు తమకు యుద్ధ సామాగ్రిని సరఫరా చేయాలని కొద్ది రోజుల క్రితం పుతిన్.. కిమ్ జోంగ్ ఉన్ని కోరారు. పుతిన్ విజ్ఞప్తితో వెను వెంటనే కిమ్ జోంగ్ ఉన్ ఆఘమేఘాల మీద రష్యాకు యుద్ధ సామాగ్రిని పంపించారు. అందుకు ప్రతిఫలంగా పుతిన్.. ఉత్తర కొరియా అధ్యక్షుడికి గుర్రాల్ని బహుకరించినట్లు అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి. రష్యా పంపిన గుర్రాల్లో కిమ్కు అత్యంత ఇష్టమైన ఓర్లోవ్ ట్రోటర్ జాతికి చెందిన 19 స్టాలియన్లు, ఐదు మరే జాతి గుర్రాలు ఉన్నట్లు టైమ్స్ నివేదించింది. ఈ ఏడాది జూన్లో పుతిన్ ఉత్తర కొరియాలో 24 ఏళ్ల తర్వాత తొలిసారి పర్యటించారు. ఈ పర్యటనలో పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ మధ్య సైనిక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పంగ్సన్ అనే తెల్లటి వేటాడే శునకాలను పుతిన్కు కిమ్ గిఫ్ట్గా ఇచ్చారు కిమ్. అందుకు.. రష్యా అధ్యక్షుడు కూడా ఆరుస్ లిమోసిన్ కారును బహుకరించారు.ఆ తర్వాత కిమ్కు 447 మేకలను ఇచ్చారు. తాజాగా మేలి జాతికి చెందిన గుర్రాలను నియంత కిమ్కు బహుమతిగా ఇచ్చారు. -
శాంతియత్నాలు ఆపొద్దు!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పరిసమాప్తికి భిన్న మార్గాల్లో జరుగుతున్న ప్రయత్నాలు కాస్తా ఆ రెండు పక్షాల మొండి వైఖరులతో స్తంభించినట్టే కనబడుతోంది. రష్యాపై మరిన్ని దాడులు జరిపితే అది చర్చలకు సిద్ధపడుతుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భావిస్తుండగా... దాన్ని పూర్తిగా లొంగ దీసుకునే వరకూ యుద్ధం ఆపే ప్రసక్తి లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి తాజాగా తేల్చిచెప్పారు. యుద్ధం మొదలయ్యాక రెండు దేశాలతోనూ ఐక్యరాజ్యసమితితోపాటు భిన్న సంస్థలూ, దేశాలూ చర్చలు సాగిస్తూనే ఉన్నాయి. కానీ ఎవరికి వారు అంతిమ విజయం తమదేనన్న భ్రమల్లో బతుకున్నంత కాలం సమస్య తెగదు. అలాగని ఏదో మేరకు సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నది వాస్తవం. ఉదాహరణకు హోరాహోరీ సమరం సాగుతున్నప్పుడు రెండేళ్ల క్రితం ఉక్రెయిన్ నుంచి ఆహారధాన్యాలు, ఎరువులు, పొద్దుతిరుగుడు నూనె ఉత్పత్తుల ఎగుమతులు నిలిచి పోగా ఐక్యరాజ్యసమితి చొరవ తీసుకుని రష్యా, ఉక్రెయిన్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించింది. అప్పటికి యుద్ధం మొదలై ఆర్నెల్లు దాటింది. ఫలితంగా నిరుడు జూలై నాటికి దాదాపు మూడు న్నర కోట్ల టన్నుల ఆహారధాన్యాలు ఎగుమతయ్యాయి. ప్రపంచానికి ఆహార సంక్షోభం తప్పింది. ఇటీవలే ఈ రెండు దేశాల మధ్యా యుద్ధ ఖైదీల మార్పిడి కూడా జరిగింది. ఇరువైపులా చెరో 115 మంది సైనికులకూ చెర తప్పింది. తెర వెనక తుర్కియే సంక్షోభ నివారణకు ప్రయత్నిస్తుండగా ప్రధాని మోదీ అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ సందర్శించి ఇరు దేశాల అధినేతలతోనూ మాట్లాడారు. వచ్చే నెలలో ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లినప్పుడు ఆయన మరోసారి జెలెన్స్కీని కలవ బోతున్నారు. అలాగే అక్టోబర్లో బ్రిక్స్ సమావేశాల కోసం రష్యా వెళ్లబోతున్నారు. మోదీ ఉక్రెయిన్ వెళ్లినందుకు పుతిన్ కినుక వహించినట్టే, అంతక్రితం రష్యా వెళ్లినందుకు జెలెన్స్కీ నిష్ఠూరాలాడారు. ఇప్పటికైతే ఉక్రెయిన్ ఒకవైపు నువ్వా నేనా అన్నట్టు రష్యాతో తలపడుతున్నా... డ్రోన్లతో, బాంబులతో నిత్యం దాడులు చేస్తున్నా చర్చల ప్రస్తావన తరచు తీసుకొస్తోంది. రష్యా చర్చలకు వచ్చి తీరుతుందని జెలెన్స్కీ ఇటీవల అన్నారు. అయితే ఇదంతా ఊహలపై నిర్మించుకున్న అంచనా. నిరంతర దాడులతో రష్యాకు గత్యంతరం లేని స్థితి కల్పిస్తే... ఆ దేశం చర్చలకు మొగ్గుచూపుతుందన్నది ఈ అంచనా సారాంశం. నిజానికి నాటో దేశాలు నిరంతరం సరఫరా చేస్తున్న మారణా యుధాలతో, యుద్ధ విమానాలతో ఉక్రెయిన్ దాదాపు మూడేళ్లుగా తలపడుతూనే ఉంది. పర్యవనసానంగా గతంలో కోల్పోయిన కొన్ని నగరాలను అది స్వాధీనం చేసుకుంది కూడా! కానీ రష్యా ప్రతిదాడులతో అవి ఎన్నాళ్లుంటాయో, ఎప్పుడు జారుకుంటాయో తెలియని స్థితి ఉంది. అత్యుత్సాహంతో ఉక్రెయిన్కు అత్యాధునిక ఆయుధాలను, ఎఫ్–16 యుద్ధ విమానాలను తరలించిన అమెరికా నెలలు గడుస్తున్నా వాటి వినియోగానికి ఇంతవరకూ అనుమతినివ్వనే లేదు. ఉదాహరణకు ఉపరితలం నుంచి ప్రయోగించే సైనిక వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థ (ఏటీఏసీఎం) 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అవలీలగా ఛేదిస్తుంది. బ్రిటన్–ఫ్రాన్స్ సంయుక్తంగా రూపొందించిన స్టార్మ్ షాడో 250 కిలోమీటర్ల దూరంలోని దేన్నయినా ధ్వంసం చేస్తుంది. ఈ రకం క్షిపణుల్ని గగనతలం నుంచి ప్రయోగిస్తారు. మరోపక్క జర్మనీ తయారీ టారస్ క్షిపణి కూడా ఇటువంటిదే. పైగా ఇది అమెరికా తయారీ క్షిపణిని మించి శక్తిమంతమైంది. 500 కిలోమీటర్లకు మించిన దూరంలోని లక్ష్యాన్ని గురిచూసి కొడుతుంది. ఇవన్నీ ఇంచుమించు ఏడాదిగా ఉక్రెయిన్ సైనిక స్థావరాల్లో పడివున్నాయి. ఎందుకైనా మంచిదని కాబోలు అమెరికా తన ఎఫ్–16లను నేరుగా ఉక్రెయిన్కు ఇవ్వకుండా నెదర్లాండ్స్, డెన్మార్క్లకు పంపి వారి ద్వారా సరఫరా చేసింది. వీటి వినియోగానికి ఉక్రెయిన్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని బ్రిటన్, ఫ్రాన్స్ పట్టుబడుతుండగా అమెరికాతోపాటు జర్మనీ కూడా ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అదే జరిగితే యుద్ధ తీవ్రత మరింత పెరిగి, రష్యా ఎంతకైనా తెగించే పరిస్థితి ఏర్పడొచ్చునని అమెరికా, జర్మనీ ఆందోళన పడుతున్నాయి. తన భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తున్నా రష్యా నిర్లిప్తంగా ఉండిపోతుండగా ఈ అనవసర భయాలేమిటన్నది బ్రిటన్, ఫ్రాన్స్ల వాదన. కానీ ఒకసారంటూ ఎఫ్16లు వచ్చి పడితే, అత్యాధునిక క్షిపణులు విధ్వంసం సృష్టిస్తే రష్యా ఇలాగే ఉంటుందనుకోవద్దని పెంటగాన్ హెచ్చరిస్తోంది. తప్పనిసరైతే ఉక్రెయిన్ సరిహద్దుల ఆవల ఉన్న రష్యా స్థావరాలను లక్ష్యంగా చేసుకోమంటున్నది. ఈమధ్య క్రిమియాపై దాడికి అనుమతించింది. కానీ కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదిరితే తప్ప రష్యా నగరాల జోలికి పోవద్దని చెబుతోంది. అంతగా భయపడితే అసలు ఇలాంటి ఆయుధాలు, యుద్ధ విమానాలు తరలించటం దేనికి? అవేమైనా ఎగ్జిబిషన్కు పనికొచ్చే వస్తువులా? వాటిని చూసి రష్యా ‘పాహిమాం’ అంటూ పాదాక్రాంతమవుతుందని అమెరికా నిజంగానే భావించిందా? యుద్ధం ఏళ్లతరబడి నిరంతరం కొనసాగుతుంటే ఎప్పుడో ఒకప్పుడు పరిస్థితి చేజారే ప్రమాదం ఉంటుంది. కనుక అమెరికా, పాశ్చాత్య దేశాలు వివేకంతో మెలగాలి. యుద్ధ విరమణకు సకల యత్నాలూ చేయాలి. దాడులతో ఒత్తిడి తెస్తే రష్యా దారికొస్తుందనుకుంటున్న ఉక్రెయిన్కు తత్వం బోధపడాలంటే ముందు అమెరికా సక్రమంగా ఆలోచించటం నేర్చుకోవాలి. ఉక్రెయిన్–రష్యా ఘర్షణ, గాజాలో ఇజ్రాయెల్ ఊచకోతలు ఆగనంతవరకూ ప్రపంచం సంక్షోభం అంచున ఉన్నట్టే లెక్క. అందుకే ప్రపంచ దేశాలు అప్రమత్తం కావాలి. శాంతి నెలకొల్పడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. -
ఉక్రెయిన్ పర్యటనపై.. పుతిన్తో మాట్లాడిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ : ప్రధాని మోదీ ఇటీవల ఉక్రెయిన్లో పర్యటించారు. ఆ పర్యటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడారు. ఈ మేరకు మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈరోజు పుతిన్తో మాట్లాడినట్లు ఎక్స్ వేదికగా తెలిపిన ప్రధాని మోదీ..భారత్-రష్యా దేశాల ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింత బలోపేతం దిశగా అడుగులు పడే చర్యలపై చర్చించారు. దీంతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత ఎప్పుడూ తటస్థంగా లేదని, తాము ఎల్లప్పుడూ శాంతి వైపే ఉన్నామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్తో వివాదాన్ని శాతియుతంగా పరిష్కరించుకోవాలని, అక్కడ శాంతి-స్థిరత్వం కోసం భారత్ పూర్తి మద్దతు అందిస్తుందని చెప్పాము’అని ప్రధాని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు. Spoke with President Putin today. Discussed measures to further strengthen Special and Privileged Strategic Partnership. Exchanged perspectives on the Russia-Ukraine conflict and my insights from the recent visit to Ukraine. Reiterated India’s firm commitment to support an early,…— Narendra Modi (@narendramodi) August 27, 2024 -
ఉక్రెయిన్ సైన్యం మెరుపు దాడులు.. రష్యాలో ఎమర్జెన్సీ!
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరో స్టేజ్కు చేరుకుంది. ఉక్రెయిన్ సైన్యం రష్యాను వణికిస్తోంది. రష్యా భూభాగంలోకి ప్రవేశించిన ఉక్రెయిన్ సైన్యం కస్క్ రీజియన్లో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. ఇక, తాజాగా సరిహద్దుల్లోని బెల్గోరోడ్ను టార్గెట్ చేసింది. దీంతో, ఆ ప్రాంతంలో రష్యా అధికారులు ఎమర్జెన్సీ విధించారు.కాగా, ఉక్రెయిన్ సేనలు రష్యా భూభాగంలోకి దూసుకెళ్తున్నాయి. రష్యా సైన్యాన్ని వెనక్కి తరుముకుంటూ ఆ దేశంలోకి ఉక్రెయిన్ సైన్యం అడుగుపెట్టింది. ఇక, ఇప్పటికే రష్యా భూభాగంలోకి ప్రవేశించిన ఉక్రెయిన్ సైన్యం కస్క్ రీజియన్లో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకొందని ఆ దేశ సైనిక కమాండర్ జనరల్ ఒలెక్సాండర్ సిర్స్కీ వెల్లడించారు. మరోవైపు.. తాజాగా రష్యా సరిహద్దుల్లోని బోల్గోరోడ్పై దాడులు మొదలుపెట్టాయి. దీంతో, అక్కడ ఎమర్జెన్సీ విధించినట్లు అక్కడి గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్వోక్ ప్రకటించారు. దేశంలో ఫెడరల్ ఎమర్జెన్సీ విధించాలని తాము కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు. Belgorod Governor Vyacheslav Gladkov's declaration of a state of emergency signals a significant escalation in Ukrainian cross-border attacks, reflecting a strategic shift towards targeting deep into Russian territory. The state of emergency is not just a security measure, but…— Prof. Jamal Sanad Al-Suwaidi (@suwaidi_jamal) August 14, 2024 ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ సైన్యం ముందుకు వస్తుండటంతో ఇప్పటికే ఇక్కడ పలు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించడం మొదలుపెట్టారు. గత వారం ఉక్రెయిన్ సేనలు వ్యూహం మార్చి రష్యా భూభాగంలో ఎదురుదాడులు మొదలుపెట్టాయి. ఇక, రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇతర దేశాల సైన్యం రష్యా భూభాగంలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. ఇక బెల్గోరోడ్ ప్రాంతంలో షెబ్కినో నగరం, ఉస్టింకా గ్రామాలపై కీవ్ సేనలు డ్రోన్ దాడులు జరిపాయి. 🇺🇦Ukrainian soldiers are advancing to the front line, reinforcing their position in Kursk.#UkraineRussiaWar #Kurskregion #AFU #RussiaUkraineWar #Belgorod pic.twitter.com/gGJN0sAV4L— WorldCrisisMonitor (@WorldCrisisMoni) August 14, 2024 అయితే, ఉక్రెయిన్ దాడులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ స్పందించారు. ఈ క్రమంలో పుతిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ సేనలతో సాగుతున్న భీకర పోరులో మాస్కో విజయం సాధిస్తుందన్నారు. రష్యా రక్షణ శాఖ కూడా ఉక్రెయిన్ డ్రోన్లను తమ సైన్యం కూల్చివేసినట్టు ప్రకటించింది. #UkraineRussiaWar Kursk operation is only the beginning, Ukraine is preparing the next strike, Putin destroying Russia #UkraineRussiaWar #Kursk #Russia #RussiaUkraineWar #RussiaUkraine #Ukraine #UkrainianArmy #UkraineRussiaConflict #Belgorod pic.twitter.com/PH8NzMTY6A— भीम सेना🦂(BALVEER SINGH JATAV) (@akshayhate) August 14, 2024 -
ట్రంప్కు పుతిన్ భయపడ్డారా?
న్యూయార్క్: అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో దేశంపై యుద్ధం చేయలేదని రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి, సెనేటర్ జేడీ వాన్స్ అన్నారు. ఆయన ఆదివారం సీబీఎస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనా, రష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాను పోటీదారుగా, ప్రత్యర్థిగా గుర్తిస్తూ ఆ దేశాన్ని ఎదుర్కొవడానికి గల బలమైన అంతర్జాతీయ ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేయాలని తమ పార్టీ కోరుకుంటుందని అన్నారు. చైనాను నిరోధించగల అంతర్జాతీయ ఫ్రేమ్వర్క్ను ఏర్పాటే మా టార్గెట్గా భావిస్తున్నాం. మేము చైనాతో యుద్ధానికి చేయకూడదని అనుకుంటున్నాం. కానీ ఖచ్చితంగా చైనా మకు విరోధి దేశమే. ఆ విషయం చైనీయులకు కూడా తెలుసు. చైనా టన్నుల కొద్దీ ఫెంటానిల్ను తయారు చేస్తుందిని, అమెరికాలోకి అనుమతిస్తున్నారు. అయితే డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ఈ విషయంలో ఏమీ చేయలేదని అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ కార్మికులతో కూడిన శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అమెరికాకు ఉంది. చైనాను వాణిజ్యపరంగా ఎదుర్కొవల్సి వస్తే.. పోరాడి గెలుస్తాం. కానీ కమలా హారిస్ చేసిన పనిని మేము చేయలేము. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మంచి సంబంధాలను కలిగి ఉన్నందుకు కమలా హారిస్తో సహా డెమోక్రాట్లు డొనాల్డ్ ట్రంప్పై దాడి చేశారనే విషయం మనం గుర్తుంచుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, వ్లాదిమిర్ పుతిన్ మరో దేశంపై యుద్ధం చేయలేదని వాన్స్ అన్నారు. -
రష్యా పైశాచికత్వం!.. ఉక్రెయిన్ సైనికుల శరీర భాగాలతో..
ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్న వేళ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రష్యా సైనికుల ఆగడాలు పీక్ స్టేజ్ చేరుకున్నాయి. యుద్ధంలో చనిపోయిన ఉక్రెయిన్ సైనికుల అవయవాలను రష్యా అమ్ముకుంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల కుటుంబాల సభ్యులు ఆరోపిస్తున్నారు.కాగా, ఫ్రీడమ్ టు డిఫెండర్స్ ఆఫ్ మారియుపోల్ గ్రూప్ అధిపతి లారీసా సలేవా తెలిపిన వివరాల ప్రకారం.. రష్యా సైన్యంలో చేతిలో బంధీలుగా ఉండి చనిపోయిన ఉక్రెయిన్ సైనికుల బాడీల్లో పలు అవయవాలు మిస్ అయినట్టు గుర్తించారు. అయితే, రష్యాకు సంబంధించిన జైళ్లలో ఉక్రెయిన్ సైనికులకు దారుణంగా హింసించి చంపేశారు. అనంతరం, వారి మృతదేహాలను ఉక్రెయిన్కు పంపించారు. అయితే, సైనికుల మృతదేహాలను కుటుంబ సభ్యులు పరిశీలించడంతో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.సైనికుల శరీరభాగాలు తేడాగా ఉండటంతో పరిశీలించగా.. వారి అవయవాలు దొంగిలించారని గుర్తించాం. రష్యా సైనికులు దారుణాలకు ఒడిగట్టారు. అవయవాలు దొంగతనం చేసిన బ్లాక్ మార్కెట్ వాటిని అమ్ముకున్నారు. ఉక్రెయిన్ ఖైదీలను చిత్ర హింసలకు గురి చేసి చంపి.. వారి అవయవాలతో వ్యాపారం చేస్తోంది. ప్రపంచం మొత్తం ఈ దారుణాల గురించి స్పందించాలి. వెంటనే ఈ దురగతాలను ఆపాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. రష్యా సైన్యం చేతిలో బంధీలుగా మారి విడుదలైన సైనికులు బలహీనంగా ఉన్నారని, వారి ఆరోగ్యం క్షీణిస్తోందని ఓ సైనికుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆమె కోరారు. కాగా, ఈ ఆరోపణలను రష్యా తీవ్రంగా ఖండించింది. తమపై ఇలాంటి ఆరోపణలు కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లు గడుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు పదివేల మంది ఉక్రెయిన్ సైనికులు రష్యా సైన్యం చేతిలో బంధీలుగా ఉన్నట్టు సమాచారం. కాగా, వారంతా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అని సైనికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
రష్యా సరిహద్దులో హైటెన్షన్.. యూఎస్ బాంబర్ విమానాలు ప్రత్యక్షం!
మాస్కో: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ రష్యా, అమెరికా మధ్య ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తమ దేశ సరిహద్దులోకి వచ్చిన అమెరికాకు చెందన బాంబర్ విమానాలను రష్యా అడ్డుకుంది. దీంతో, రెండు దేశాల మధ్య ఘర్షణ మరోసారి మొదలైంది.వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన బాంబర్ విమానాలు తమ దేశ సరిహద్దు సమీపంలోకి వచ్చాయని రష్యా ఆరోపించింది. తమ సరిహద్దుకు సమీపించిన రెండు వైమానిక విమానాలను తమ ఫైటర్ జెట్లతో అడ్డుకున్నామని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. వాటిని అమెరికా వాయుసేనకు చెందిన బీ-52హెచ్ వ్యూహాత్మక బాంబర్లుగా తమ సైన్యం గుర్తించిందని తెలిపింది. ఆర్కిటిక్లోని బారెంట్స్ సముద్రంలో ఈ పరిణామం చోటుచేసుకుందని వెల్లడించింది.BREAKING 🇷🇺⚡🇺🇸 Russia said Sunday that it scrambled fighter jets to prevent two US strategic bomber planes from crossing its border over the Barents Sea in the Arctic.“As the Russian fighters approached, the American strategic bombers corrected their flight course, moving away… pic.twitter.com/5kjGYWndfM— Lou Rage (@lifepeptides) July 21, 2024ఇదిలా ఉండగా.. అమెరికా మాత్రం రష్యా ఆరోపణలను ఖండించింది. అంతర్జాతీయ జలాల మీదుగా విమానాలతో గస్తీ నిర్వహిస్తుండటం సాధారణ ప్రక్రియేనని పేర్కొంది. తటస్థ గగనతలంలో వీటిని చేపట్టామని, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగానే నడుచుకున్నామని స్పష్టం చేసింది. దీంతో, రెండు దేశాల మధ్య మళ్లీ మాటల యుద్ధం ప్రారంభమైంది. మరోవైపు.. ఇటీవలి కాలంలో అమెరికా పట్ల రష్యా దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్పై దాడుల సమయంలో నుంచి బైడెన్, పుతిన్ మధ్య పరోక్షంగా వార్ నడుస్తూనే ఉంది. ఇక, రష్యాపై అమెరికా ఆంక్షలు కూడా విధించింది. -
‘బ్రిక్స్’ పార్లమెంట్ రానున్నదా?
ఈ నెల 11–12 తేదీలలో జరిగిన బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో రష్యా అ«ధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ బ్రిక్స్ పార్లమెంట్ ఏర్పాటు ప్రస్తావన చేశారు. ఆ మాట విని ప్రపంచమంతా ఉలిక్కిపడింది. ఆ కొత్త సంస్థ యూరోపియన్ పార్లమెంటుకు, లేదా అసలు ఐక్యరాజ్య సమితికే పోటీ కాకున్నా సమాంతర సంస్థ కాగలదా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యింది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్కు పోటీయా అన్నట్లు ఇప్పటికే బ్రిక్స్ బ్యాంక్ ఏర్పడింది. బ్రిక్స్ దేశాల మధ్య, దానితో పాటు తమ ద్రవ్య మారకాలను అంగీకరించే దేశాలతో అమెరికన్ డాలర్ బదులు తమ కరెన్సీలలోనే లావాదేవీలు జరపటం పెరిగిపోతున్నది. ఈ పరిణామాలన్నీ అమెరికా ఆధిపత్యాన గల ఏకధ్రువ ప్రపంచాన్ని బహుళ ధ్రువ ప్రపంచంగా తిరుగులేకుండా మార్చుతున్నాయి.ప్రస్తుతం ప్రపంచమంతటా చర్చ జరుగు తున్న సరికొత్త విషయం బ్రిక్స్ పార్లమెంట్ నిజంగా ఏర్పడవచ్చునా అన్నది! ‘బ్రిక్స్’ గురించి తెలిసిందే. ‘బ్రిక్స్’ పార్లమెంటరీ ఫోరం మాట విన్నదే. కానీ ‘బ్రిక్స్’ పార్లమెంట్ కొత్త మాట. పార్లమెంటరీ ఫోరం సమావేశాలు ఈ నెల 11–12 తేదీలలో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగినప్పుడు, మొదటి రోజున ప్రారంభోపన్యాసం చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, ఉరుములేని పిడుగువలె బ్రిక్స్ పార్లమెంట్ ఏర్పాటు ప్రస్తావన చేశారు. ఆ మాట విని ప్రపంచమంతా ఉలికి పడింది. ఆయన ఆలో చనలోని ఉద్దేశమేమిటి? ‘బ్రిక్స్’ దేశాలు అందుకు సమ్మతిస్తాయా? ఆ కొత్త సంస్థ లక్ష్యాలేమిటి? అది యూరోపియన్ పార్లమెంటుకు, లేదా అసలు ఐక్యరాజ్య సమితికే పోటీ కాకున్నా సమాంతర సంస్థ కాగలదా? అనే ప్రశ్నలు శరపరంపరగా తలెత్త్తటం మొదలైంది. ఇది ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు కలవరపాటు కలిగిస్తున్నదనేది గమనించవలసిన విషయం.ఇందుకు సంబంధించి తెలుసుకోవలసిన సమాచారాలు కొన్నున్నాయి. అంతకన్నా ముఖ్యంగా అర్థం చేసుకోవలసిన అంత ర్జాతీయ విషయాలు చాలా ముఖ్యమైనవి కొన్నున్నాయి. ఇందులో మొదటగా సమాచారాలను చూద్దాం. ‘బ్రిక్స్’ అనే సంస్థ మొదట ‘బ్రిక్’ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) అనే పేరిట 2006లో ఏర్పడింది. తర్వాత 2011లో సౌత్ ఆఫ్రికా చేరికతో ‘బ్రిక్స్’ అయింది. ఈ సంవత్సరం ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరాయి. తమను కూడా చేర్చుకోవాలంటూ మరొక పాతిక దేశాల వరకు దరఖాస్తు చేసుకున్నాయి. ‘బ్రిక్స్’ సభ్యదేశాలు 2009లో పార్లమెంటరీ ఫోరంను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ ఫోరం 10వ సమావేశాలు ఈ నెలలో జరిగినపుడే పుతిన్ తన ప్రతిపాదన చేశారు. ఆ సమావేశంలో మన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు. నిజానికి బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం అన్నది సభ్య దేశాల పార్లమెంట్ స్పీకర్ల ఫోరం. అందుకు భిన్నంగా, పుతిన్ ప్రతిపాదన కొత్తగా ఒక ఉమ్మడి పార్లమెంటును ఏర్పాటు చేసుకోవటం. ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశాలు వచ్చే అక్టోబర్లో రష్యాలోని కజాన్ నగరంలో జరగ నున్నాయి. ఈ ప్రతిపాదన అపుడు అధికారికంగా చర్చకు వచ్చి,అందరూ ఆమోదించే పక్షంలో ఆచరణకు వస్తుంది. ఈలోగా ఈ విషయమై ప్రపంచమంతటా చర్చలు సాగుతాయి. మరొకవైపు సభ్య దేశాల మధ్య ముందస్తు సంప్రదింపులు జరగగలవని వేరే చెప్ప నక్కరలేదు. పోతే, బ్రిక్స్ లక్ష్యాలే బ్రిక్స్ పార్లమెంటు లక్ష్యాలు, విధులు కాగలవని భావించవచ్చు. బ్రిక్స్ 2006లో ఏర్పడింది. ఎందుకు? ఈ 18 సంవత్సరాలలో ఆ సంస్థ చేసిందేమిటి? అన్నవి మొదట ఉత్పన్న మయే ప్రశ్నలు. ఇది ప్రధానంగా ఆర్థిక, వాణిజ్యపరమైన సంబంధాల కోసం ఏర్పడినటువంటిది. పరస్పర సంబంధాలతో పాటు ఇతర దేశా లతో ఆర్థిక, వాణిజ్య సంబంధాల అభివృద్ధి కూడా ఈ పరిధిలోకి వస్తుంది. బ్రిక్స్కు రాజకీయపరమైన, సైనికమైన, వ్యూహాత్మకమైన లక్ష్యాలు ఏవీ లేవని, గత 18 సంవత్సరాలుగా అదే ప్రకారం పని చేస్తున్నదనేది గమనించవలసిన విషయం. అంతే గమనించవలసిందేమంటే తన ఆర్థిక లక్ష్యాల ప్రకారం బ్రిక్స్ చాలా సాధించింది. ఉదాహరణకు తాజా లెక్కల ప్రకారం, పాశ్చాత్య దేశాల కూటమి అయిన జీ–7 జీడీపీ ప్రపంచంలో 29 శాతం మాత్రమే కాగా, బ్రిక్స్ జీడీపీ 36.8 శాతానికి చేరింది. ఆర్థిక రంగంలో జరుగుతున్నదాని సూచనలను బట్టి చూడగా ఈ వ్యత్యాసం ఇంకా పెరుగుతూ పోగలదన్నది నిపుణుల అంచనా. అది చాల దన్నట్లు మునుముందు సౌదీ అరేబియా, ఇండోనేషియా, మెక్సికో తదితర దేశాలు చేరినపుడు పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. అమె రికా శిబిరానికి బ్రిక్స్ అంటే సరిపడకపోవటానికి ముఖ్యకారణం ఇదే. లోగడ ఆసియాలో ఏషియాన్, ఆఫ్రికాలో ఎకోవాస్, ఇఎసి, లాటిన్ అమెరికాలో సదరన్ కామన్ మార్కెట్ వంటివి ఏర్పడ్డాయి. ఏషియాన్ గొప్పగా విజయవంతం కాగా తక్కినవి అంతగా కాలేదు. పైగా వాటిలో అమెరికా జోక్యాలు బాగా సాగినందున తమకు పోటీగా మారలేదు. తమను అధిగమించటం అంతకన్నా జరగలేదు. బ్రిక్స్ రికార్డు వీటన్నిటికి భిన్నంగా మారింది. ఆ సంస్థ ఆమెరికా జోక్యానికి సమ్మతించలేదు. ఇండియాతో సహా ఎవరూ ఒత్తిళ్లకు లొంగలేదు. ఇది చాలదన్నట్లు అర్థికాభివృద్ధిలో తమను మించిపోతున్నారు. ఒత్తిళ్లను కాదని ఇదే సంవత్సరం ఈజిప్టు, యూఏఈ వంటివి చేరాయి. ఇరాన్ను చేర్చుకోరాదన్న ఒత్తిడికి బ్రిక్స్ సమ్మతించలేదు. అదే పద్ధతిలో సౌదీ, టర్కీ, ఇండోనేషియా, లిబియా, మెక్సికో వంటివి ముందుకు వస్తున్నాయి. ఇదంతా చాలదన్నట్లు, ప్రపంచంపై పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆధిపత్యాన్ని సవాలు చేసే పరిణామాలు మరికొన్ని జరుగుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్కు పోటీయా అన్నట్లు బ్రిక్స్ బ్యాంక్ ఒకటి 2014 లోనే ఏర్పడింది. అమెరికన్ డాలర్ ప్రాబల్యాన్ని అరికట్టేందుకు బ్రిక్స్ కరెన్సీ అయితే ఇంకా రూపొందలేదు గానీ, బ్రిక్స్ దేశాలకు చెల్లింపుల కోసం బ్రిక్స్ చెయిన్ పేరిట ఒక సాధనం చలామణీలోకి వచ్చింది. అట్లాగే ఈ దేశాల మధ్య, దానితో పాటు తమ ద్రవ్య మార కాలను అంగీకరించే దేశాలతో అమెరికన్ డాలర్ బదులు తమ కరెన్సీ లలోనే లావాదేవీలు జరపటం పెరిగిపోతున్నది. బ్రిక్స్ బ్రిడ్జ్ పేరిట మరొక చెల్లింపుల పద్ధతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నింటి ప్రభావాలతో పాశ్చాత్య ప్రపంచపు ఆర్థిక ప్రాబల్యం, పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్యం క్రమంగా బలహీనపడుతున్నాయి. ఉదాహరణకు ప్రస్తుత సంవత్సరంలో బ్రిక్స్ సగటు అర్థికాభివృద్ధి 3.6 శాతం మేర, జీ–7 దేశాలది కేవలం 1 శాతం మేర ఉండగలవని అంచనా. ప్రపంచంలో ఇప్పటికే రెండో అతిపెద్ద ఆర్థికశక్తిగా మారిన చైనా మరొక దశాబ్దం లోపలే అమెరికాను మించగలదన్నది అంతటా వినవస్తున్న మాట. ఈ పరిణామాలన్నీ అమెరికా ఆధిపత్యాన గల ఏకధ్రువ ప్రపంచాన్ని బహుళధ్రువ ప్రపంచంగా తిరుగులేకుండా మార్చుతున్నాయి. ఈ శతాబ్దం ఆసియా శతాబ్దం కాగలదనే జోస్యాలు ఆ విధంగా బలపడుతున్నాయి. చైనా ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో అమెరికా ఒత్తిళ్లను కాదని ఇప్పటికి 150 దేశాలు చేరటం, అందులో వారి శిబిరానికి చెందినవి కూడా ఉండటం ఈ ఆర్థిక ధోరణులకు దోహదం చేస్తున్నది.ఈ విధమైన ప్రభావాలను ముందుగానే అంచనా వేసి కావచ్చు అమెరికన్లు, యూరోపియన్లు మొదటినుంచే బ్రిక్స్ను, బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివును అడ్డుకునేందుకు, బ్రిక్స్లోని సభ్య దేశాలను ఒత్తిడి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూ వస్తున్నాయి. రకరకాల ఆంక్షలు ఏదో ఒక సాకుతో విధించటం (ఇండియాపై కూడా), వివిధ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను భంగపరచజూడటం అందులో భాగమే. భారత, రష్యాల విషయంలోనూ అదే వైఖరి చూపటానికి తాజా ఉదాహరణ ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ, పుతిన్ను కలవటంపై ఆగ్రహించటం. అమెరికా శిబిరం ప్రజాస్వామ్యమనీ, ఆసియా దేశాల స్వేచ్ఛ అనీ, అంతర్జాతీయ నియమాలకూ, ఐక్య రాజ్యసమితి ఛార్టర్కూ కట్టుబడటమనీ నీతులు చాలానే చెప్తుంది. కానీ అందుకు విరుద్ధమైన తమ చర్యల గురించి ఎన్ని రోజుల పాటైనా చెప్పవచ్చు.వీటన్నింటికి విరుగుడుగా తక్కిన ప్రపంచ దేశాలు తీసుకుంటున్న వివిధ చర్యలలో, బ్రిక్స్ పార్లమెంట్ అనే కొత్త ప్రతిపాదన ఒక ముందడుగు కాగల అవకాశం ఉంది. ప్రపంచ దేశాల మధ్య సమా నత్వ ప్రాతిపదికగా పరస్పర సహకారానికి, ఇతోధికాభివృద్ధికి అవస రమైన చర్చలు బ్రిక్స్ పార్లమెంటులో జరగాలన్నది తన ఆలోచన అయినట్లు పుతిన్ చెప్తున్నారు. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
నాటో భేటీ వేళ రష్యా యాత్రా?
వాషింగ్టన్: నాటో శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించడంపై అమెరికా అసంతృప్తితో ఉన్నట్టు బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. ఇది భారత్తో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపగలదని ఆ దేశ ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు చెప్పుకొచి్చంది. ‘‘పుతిన్ను మోదీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న తీరు అమెరికా ప్రభుత్వం లోపల, వెలుపల విమర్శలకు దారి తీసింది. వాషింగ్టన్లో నాటో సదస్సు జరుగుతుండగా మోదీ రష్యాలో పర్యటించడం బైడెన్ యంత్రాంగానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించింది. పుతిన్ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరిని చేయాలన్న నాటో ప్రయత్నాలకు ఇది గండి కొట్టింది. అందుకే అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి కర్ట్ కాంప్బెల్ జూలై మొదట్లోనే భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాట్రాతో మాట్లాడారు. మోదీ రష్యా పర్యటన షెడ్యూల్ మార్చుకోవాల్సిందిగా కోరారు’’ అని నివేదిక వివరించింది. ఈ ఉదంతంపై విదేశాంగ శాఖ స్పందించాల్సి ఉంది. అమెరికాతో స్నేహాన్ని తేలిగ్గా తీసుకోవద్దని భారత్లో ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెట్టీ గురువారం మీడియాతో సమావేశంలో నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అవి రష్యా పర్యటనను ఉద్దేశించేనని చెబుతున్నారు. రష్యాను విశ్వసనీయమైన దీర్ఘకాలిక మిత్ర దేశంగా భారత్ పరిగణించడం పొరపాటని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ అభిప్రాయపడ్డారు. -
మా ఆర్మీలో భారతీయులు ఉండాలనుకోలేదు: రష్యా
ఢిల్లీ: భారతీయ పౌరులు రష్యా దేశ సైన్యంలో భాగం కావాలని తాము ఎప్పుడూ కోరుకోలేని భారత్లోని రష్యా దౌత్యవేత్త రోమన్ బాబుష్కిన్ అన్నారు. ప్రధాని మోదీ రష్యా పర్యటన ముగిసిన నేపథ్యంలో బుధవారం బాబుష్కిన్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘భారతీయ పౌరులు రష్యా సైన్యంలో భాగం కావాలని మేము ఎప్పుడూ కోరుకోలేదు. ఏజెంట్లు మోసం చేయటం వల్ల కొంత మంది టూరిస్టు విసాలపై వచ్చి రష్యా ఆర్మీలో చేరుతున్నారు. ఈ వ్యవహారంలో ఇరు దేశాలు దర్యాప్తు చేసి సమస్యకు త్వరలోనే పరిష్కారం కనుక్కొని చర్యలు తీసుకుంటాం. ఈ వ్యహారంపై భారత్, రష్యా ఒకే ఆలోచనతో ఉంది. అందుకే త్వరలో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయాలనుకోవటం లేదు.మేము చాలా స్పష్టంగా ఉన్నాం. మా సైన్యంలో భారత పౌరులు భాగంకావాలని కోరుకోవటం లేదు. ఈ విషయంపై ఇప్పటి వరకు రష్యా అధికారులు సైతం ఎటువంటి ప్రకటన చేయలేదు. చాలా మంది భారతీ పౌరులు కేవలం డబ్బుల కోసమే రష్యా ఆర్మీలో చేరుతన్నారు. అలాంటి వారిని మేము ఎట్టిపరిస్థితుల్లో కూడా చేర్చుకోము. కేవలం 50 నుంచి 100 మంది భారతీయులు మాత్రమే రష్యా సైన్యంలో ఉన్నారు. ఇది అంత ప్రభావం చూపే విషయం కాదు. రష్యా ఆర్మీలో సహయకులుగా చేరుతున్న పలువురు భారతీయులకు సరైన విసాలు కూడా లేవు. చాలా వరకు వారంతా టూరిస్ట్ వీసా మీద రష్యాకు వస్తున్నారు ’’ అని అన్నారు.ఇది చదవండి: భారతీయులకు భారీ ఊరట.. మోదీ పర్యటనతో పుతిన్ కీలక నిర్ణయంఇక.. రెండు రోజుల రష్యా పర్యటనలో ప్రధాని మోదీ.. రష్యా ఆర్మీలో ఉన్న భారతీయ పౌరులను విడుదల చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చర్చలు జరిపారు. దీనిపై రష్యా సైతం సానూకూలంగా స్పందిస్తూ.. తమ ఆర్మీలో సహయకులుగా పనిచేస్తున్న భారతీయులను స్వదేశానికి పంపిస్తామని హామీ ఇచ్చింది. -
మన అభివృద్ధి ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది
మాస్కో: భారత్ అద్భుత పురోగతి సాధిస్తోందని, దేశాభివృద్ధి చూసి ప్రపంచమే నివ్వెరపోతోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మాస్కో పర్యటనలో ఉన్న మోదీ మంగళవారం అక్కడి ప్రవాసభారతీయులనుద్దేశించి ప్రసంగించారు. ‘మోదీ మోదీ’, ‘మోదీ ఉంటే ఏదైనా సాధ్యమే’ నినాదాల నడుమ నరేంద్ర మోదీ మాట్లాడారు. ‘‘ 140 కోట్ల మంది భారతీయుల శక్తిసామర్థ్యాలను వినియోగించుకుంటూ భారత్ దీటుగా ఎదుగుతోంది. భారతీయులంతా వికసిత్ భారత్ కలను నిజంచేసుకునేందుకు కృతనిశ్చయంతో ముందుకుసాగుతున్నారు. 2014కు ముందు భారత్లో పరిస్థితి వేరేలా ఉండేది.కానీ ఇప్పుడు భారత్ పూర్తి ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతోంది. ఆత్మవిశ్వాసమే భారత్కున్న అతిపెద్ద మూలధనం. మీలాంటి ప్రజల ఆశీస్సులు ఉంటే పెద్ద ఆశయాలను సైతం దేశం సాధించగలదు. అనుకున్న లక్ష్యాలను భారత్ చేరుకోవడం మీరందరూ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో భారత్ తన నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తూ నూతన అధ్యాయనాన్ని లిఖించబోతోంది. సవాళ్లకే సవాల్ విసిరే గుణం నా డీఎన్ఏలోనే ఉంది. సరిగ్గా నెలరోజుల క్రితం మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టా. మూడో దఫాలో మూడు రెట్లు వేగంతో పనిచేస్తా.భారత ఆకాంక్షలను నెరవేరుస్తా. భారత్ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరింపజేయాలనేదే మా ప్రభుత్వ సంకల్పం. పేదల కోసం మూడు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తాం. మూడు కోట్ల మంది పేద మహిళలు లక్షాధికారులను చేస్తాం. గత పదేళ్లలో భారత్లో కనిపించిన అభివృద్ధి ఒక ట్రైలర్ మాత్రమే. వచ్చే పదేళ్లలో అంతకుమించిన అభివృద్ధిని మీరు చూడబోతున్నారు’’ అని మోదీ అన్నారు.సర్వకాల సర్వావస్థలయందు స్నేహితుడే రష్యాతో భారత బంధాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘రష్యా అనే పేరు వినబడగానే ప్రతి భారతీయుని మదిలో మెదిలే ఒకే ఒక్క వాక్యం.. సర్వకాల సర్వావస్థలయందు తోడుగా నిలిచే స్నేహితుడు. నమ్మకమైన నేస్తం’ అని మోదీ కొనియాడారు. ‘అన్ని కాలాల్లోనూ రష్యాతో భారత స్నేహం కొనసాగుతుంది. రష్యాలో గడ్డకట్టే చలిలో ఉష్ణోగ్రత సున్నా డిగ్రీ సెల్సియస్కు పడిపోతుందేమోగానీ ఇండియా–రష్యా స్నేహబంధం ఎల్లప్పుడూ ‘ప్లస్’లోనే నులివెచ్చగా ఉంటుంది అని మోదీ అన్నారు. రష్యాతో పర్యాటకం, వాణిజ్యం, విద్యా రంగాల్లో బంధం బలోపేతానికి భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాలో కొత్తగా రెండు నగరాల్లో భారత కాన్సులేట్లను ఏర్పాటుచేయబోతోంది. ప్రధాని మోదీ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. కజన్, యెకటేరిన్బర్గ్ నగరాల్లో వీటిని నెలకొల్పుతారు. ప్రస్తుతం సెయింట్పీటర్స్బర్గ్, వ్లాడివోస్టోక్ నగరాల్లో మాత్రమే భారత కాన్సులేట్లు పనిచేస్తున్నాయి.ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాల బలోపేతానికి కృషిచేస్తున్నందుకు సూచికగా ప్రధాని మోదీని పుతిన్ ‘ ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ పురస్కారంతో సత్కరించారు. రష్యా అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయ నేతగా మోదీ రికార్డ్ సృష్టించారు. ఈ పురస్కారాన్ని భారతీయులకు అంకితం చేస్తున్నానని పురస్కారం స్వీకరించిన సందర్భంగా మోదీ ‘ఎక్స్’లో పోస్ట్చేశారు. రష్యాలో తొలి క్రైస్తవ మత బోధకుడైన సెయింట్ ఆండ్రూ పేరిట 1698 సంవత్సరంలో రష్యా చక్రవర్తి పీటర్ కృషితో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం ప్రారంభించారు. -
బాంబులు, తూటాల నడుమ... శాంతి చర్చలు సాగవు: ప్రధాని మోదీ
మాస్కో: బాంబులు, తుపాకులు, తూటాల వర్షం నడుమ శాంతి చర్చలు ఎప్పటికీ ఫలప్రదం కాబోవని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం ఎప్పటికైనా చర్చలతోనే లభిస్తుంది తప్ప యుద్ధ క్షేత్రంలో కాదని కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో పిల్లల ఆస్పత్రిపై జరిగిన క్షిపణి దాడిపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. రెండు రోజుల రష్యా పర్యటనలో భాగంగా మంగళవారం ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో క్రెమ్లిన్ భవనంలో మోదీ 22వ ఇండో–రష్యా శిఖరాగ్ర చర్చలు జరిపారు. ముక్కుపచ్చలారని అమాయక చిన్నారులు దాడిలో పదుల సంఖ్యలో బలైన వైనం హృదయాలను తీవ్రంగా కలచివేస్తోందంటూ ఆవేదన వెలిబుచ్చారు.చర్చల వివరాలను మీడియాతో పంచుకుంటూ విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాట్రా ఈ మేరకు వెల్లడించారు. పుతిన్, మోదీ గాఢాలింగనంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర అభ్యంతరం వెలిబుచి్చన నేపథ్యంలో ప్రధాని తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సోమవారం పుతిన్తో వ్యక్తిగత సంభాషణ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధంపై లోతుగా చర్చించినట్టు మోదీ వెల్లడించారు. ‘‘సమస్యకు చర్చల ద్వారానే ముగింపు పలకాలన్నదే భారత వైఖరి. ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజానికి స్పష్టం చేయదలచా. అందుకు అన్నివిధాలా సాయపడేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధమే. నేను చెప్పిన అన్ని విషయాలనూ పుతిన్ ఓపిగ్గా విన్నారు.ఉక్రెయిన్ సమస్యపై అభిప్రాయాలను పంచుకున్నారు. యుద్ధానికి తెర దించేందుకు ఆసక్తికరమైన మార్గాలు చర్చ సందర్భంగా తెరపైకొచ్చాయి’’ అని ప్రధాని వివరించారు. భారత్ను పట్టి పీడిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని కూడా ప్రస్తావించారు. ఉక్రెయిన్ సంక్షోభ నివారణకు మోదీ చేస్తున్న ప్రయత్నాలకు పుతిన్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపినట్టు టాస్ వార్తా సంస్థ పేర్కొంది. అన్ని అంశాలపైనా మోదీ, తాను మనసు విప్పి మాట్లాడుకున్నట్టు పుతిన్ వెల్లడించారు.అనంతరం ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ నేతలిద్దరూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మాస్కో సిటీ హాల్పై, కశీ్మర్లో సైనిక కాన్వాయ్పై ఉగ్రవాదుల ప్రాణాంతక దాడిని తీవ్రంగా నిరసించారు. ఉగ్రవాదంపై పోరులో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ఇవి గుర్తు చేశాయన్నారు. ఉక్రెయిన్ సమస్య పరిష్కారానికి మోదీ చేసిన శాంతి ప్రతిపాదనలతో నాటో కూటమి ఏకీభవించకపోవచ్చని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు.ద్వైపాక్షిక బంధం మరింత సుదృఢంకొన్నేళ్లుగా ప్రపంచాన్ని వేధిస్తున్న ఆహార, ఇంధన, ఎరువుల కొరత భారత్లో రైతులకు ఎదురవకుండా రష్యా అందిస్తున్న సహకారం అమూల్యమంటూ మోదీ కొనియాడారు. ‘‘పుతిన్తో చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగాయి. వర్తకం, వాణిజ్యం, భద్రత, వ్యసాయం, టెక్నాలజీ వంటి పలు రంగాలపై లోతుగా చర్చించాం. పలు రంగాల్లో రష్యాతో బంధాన్ని మరింతగా విస్తరించడమే మా లక్ష్యం’’ అని స్పష్టం చేశారు. ఐరాసతో పాటు పలు అంతర్జాతీయ వేదికలపై పలు అంశాల్లో భారత్, రష్యా సన్నిహితంగా కలిసి పని చేస్తున్నాయని పుతిన్ అన్నారు.‘‘ఇరు దేశాలదీ దశాబ్దాలకు పైబడ్డ సుదృఢమైన బంధం. భారత్తో రష్యా వర్తకం గతేడాది ఏకంగా 66 శాతం పెరిగింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే మరో 20 శాతం పెరుగుదల నమోదైంది’’ అని అన్నారు. అక్టోబర్లో రష్యాలోని కజాన్లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్రానికి మోదీని ఈ సందర్భంగా పుతిన్ ఆహా్వనించారు. అనంతరం మోదీ రష్యా పర్యటన ముగించుకుని ఆస్ట్రియా రాజధాని వియన్నా చేరుకున్నారు. భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించనుండటం 41 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.రష్యా సైన్యంలోని భారతీయులకు విముక్తి!ఉక్రెయిన్ కదనరంగంలో రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను స్వదేశానికి పంపేందుకు రష్యా అంగీకరించింది. పుతిన్ వద్ద ఈ అంశాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారని సబంధిత వర్గాలు వెల్లడించాయి. యుద్ధంలో పని చేస్తున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి పంపిస్తామని పుతిన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రష్యాలో ఉపాధి కల్పిస్తామంటూ కొందరు భారతీయ యువకులను ఏజెంట్లు రష్యాకు తీసుకెళ్లి అక్కడి సైన్యం సహాయకులుగా నియమించిన సంగతి తెలిసిందే. -
ఉక్రెయిన్తో సంక్షోభం.. శాంతి పునరుద్ధరణకు భారత్ సిద్ధం: పుతిన్తో మోదీ
మాస్కో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం మాస్కో చేరుకున్న ఆయనకు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా ఆతిథ్యమిచ్చారు. పుతిన్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ భేటీలో రష్యా ఆర్మీలో పనిచేస్తున్న భారతీయుల విముక్తి, ఉక్రెయిన్ యుద్దం వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.ఉక్రెయిన్తో రస్యా కొనసాగుతున్న యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. యుద్ధం దేనికి పరిష్కారం అవ్వదని ప్రధాని మోదీ పుతిన్తో అన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో శాంతిని పునరుద్ధరించడానికి సహాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉన్నట్లు పుతిన్కు చెప్పారు. భారత్ శాంతికి అనుకూలంగా ఉందని తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి ఇద్దరూ ‘ఓపెన్ మైండ్’తో చర్చలు జరిపినట్లు మోదీ చెప్పారు.“ఉక్రెయిన్తో యుద్ధం గురించి ఓపెన్ మైండ్తో చర్చించడం నాకు సంతోషంగా ఉంది. యుద్ధంపై ఒకరి ఆలోచనలను మరొకరు చాలా గౌరవంగా విన్నాం. యుద్ధమైనా, ఘర్షణలైనా, ఉగ్రదాడులైనా.. ఎవరికైనా ప్రాణహాని జరిగినప్పుడు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ బాధ కలుగుతుంది. అమాయక పిల్లలు చనిపోవడం చూస్తుంటే హృదయాన్ని కదిలిస్తుంది. ఆ బాధ వర్ణనాతీతం. దీనిపై కూడా నేను మీతో చర్చించాను," అని మోదీ పేర్కొన్నారు.రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి పునరుద్ధరణకు సహకరించేందుకు భారత్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని పుతిన్తో చెప్పారు.భారత్ శాంతికి అనుకూలంగా ఉందని మేము మీతో పాటు ప్రపంచానికి హామీ ఇస్తున్నానని తెలిపారు. ఇక శాంతిపై పుతిన్ మాట్లాడిన మాటలు ఆశాజనకంగా ఉన్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: పుతిన్కు మోదీ హగ్.. జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు -
రష్యా పర్యటనలో మోదీ, పుతిన్ ఆలింగనం.. స్పందించిన జెలెన్స్కీ
న్యూఢిల్లీ: భారత్, రష్యాల మైత్రీ బంధాన్ని మరింత బలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రధాని మోదీ రెండ్రోజుల నిమిత్తం రష్యాలో పర్యటిస్తున్నారు. 22వ ఇండో–రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ సోమవారం రష్యా చేరుకున్నారు. మంగళవారం ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని మోదీ అల్పాహారం అనంతరం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ధ్వైపాక్షిక సంబంధాలపై విస్తృతస్థాయి చర్చలు జరిపారు.తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ స్పందించారు. మోదీ పర్యటన, పుతిన్ను ఆలింగనం చేసుకోవడంపై తాను తీవ్ర నిరాశకు గురయ్యానని తెలిపారు. ఇది శాంతి ప్రయత్నాలలకు పెద్ద దెబ్బగా భావించారు.రష్యా క్షిపణుల దాడికి గురైన పిల్లల ఆసుపత్రికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ‘ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నేత(మోదీ) మాస్కోలో ప్రపంచంలోని అత్యంత రక్తపాత నేరస్థుడిని కౌగిలించుకోవడం చాలా నిరాశకు గురి చేసింది. ఇది శాంతి ప్రయత్నాలకు ఓ వినాశకరమైన దెబ్బ’. అని పేర్కొన్నారు.లోక్సభ ఎన్నికల తర్వాత తమ దేశంలో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీని జెలెన్స్కీ ఆహ్వానించారు. అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం మోదీని ఆహ్వానించారు. ఈ ఏడాది మార్చిలో రష్యా అధ్యక్షుడిగా పుతిన్ తిరిగి ఎన్నికైన తర్వాత ప్రధాని ఇరువురు నేతలతో మాట్లాడారు.మోదీ, పుతిన్ మధ్య.. ఉక్రెయిన్ను రష్యా దురాక్రమించిన అంశం, రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా భారతీయులను రిక్రూట్ చేసుకుని ఉక్రెయిన్ యుద్ధక్షేత్రాలకు తరలించిన ఉదంతాలు చర్చకు వచ్చింది. తమ ఆర్మీలో పనిచేస్తున్న భారతీయుల్ని స్వదేశానికి పంపించేలా పుతిన్ అంగీకరిస్తున్నట్లు జాతీయ, అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో రష్యా సైన్యంలోని భారతీయులకు విముక్తి లభించినట్లైంది.కాగా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక మోదీ రష్యాకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిసారి 2022 సెప్టెంబర్లో ఉజ్బెకిస్థాన్లో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా అధ్యక్షుడు పుతిన్ను కలిశారు. ఆ సమయంలో ‘ఇది యుద్ధ యుగం కాదు’ అని పుతిన్తో అన్నారు. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే వివాదానికి పరిష్కారం కనుగొనగలమని నొక్కి చెప్పారు. -
భారతీయులకు భారీ ఊరట.. మోదీ పర్యటనతో పుతిన్ కీలక నిర్ణయం
మాస్కో: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా ఆర్మీలో భారతీయులు సైతం పనిచేస్తున్నారు. ఇటీవల యుద్ధ ప్రాంతాల్లో ఉక్రెయిన్ సైనికులు జరిపిన దాడిలో రష్యా ఆర్మీలో పని చేస్తున్న ఇద్దరు భారతీయులు మరణించారు.అయితే రష్యా పర్యటనలో మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చర్చించారు. అనంతరం తమ ఆర్మీలో పనిచేస్తున్న భారతీయుల్ని స్వదేశానికి పంపించేలా అంగీకరిస్తున్నట్లు పుతిన్ చెప్పారంటూ జాతీయ, అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.ఏజెంట్ల చేతిలో మోసంకొంతకాలం క్రితం విదేశాల్లో భారీ మొత్తంలో జీతాలు చెల్లిస్తామంటూ పలువురు ఏజెంట్లు సుమారు 12 మంది భారతీయుల్ని మోసపూరితంగా హద్దులు దాటించారు. ఉక్రెయిన్పై యుద్ధం చేసేందుకు రష్యా ఆర్మీకి సహాయంగా పంపించారు. రష్యా ఆర్మీ ధరించిఅందుకు ఊతం ఇచ్చేలా ఈ ఏడాది ప్రారంభంలో పంజాబ్, హర్యానాలకు చెందిన వారు రష్యా ఆర్మీ ధరించి ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న వీడియోలో వైరల్గా మారాయి. ఆ వీడియోల్లో ఎక్కువ శాలరీ వస్తుందనే ఆశతో ఏజెంట్లను ఆశ్రయిస్తే వాళ్లు తమని అక్రమంగా రష్యా ఆర్మీలోకి జాయిన్ చేయించినట్లు తెలిపారు. వేరే గత్యంతరం లేక రష్యా ఆర్మీలో పని చేస్తున్నామని, తమని రక్షించమని కోరుకుంటూ ఓ వీడియోను విడుదల చేశారు.ఆ వీడియోపై కేంద్రం స్పందించింది. అక్రమంగా రష్యా ఆర్మీలో పనిచేస్తున్న రక్షించేలా పుతిన్ను సంప్రదిస్తామని హామీ ఇచ్చింది. తక్షణ చర్యల్లో భాగంగా పౌరుల్ని మోసం చేస్తున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. రష్యాలో భారత్ దౌత్య విజయంతాజా పర్యటనలో మోదీ రష్యా ఆర్మీలో భారతీయుల అంశంపై పుతిన్ చర్చించడం, అందుకు ఆయన భారతీయుల్ని విడుదల చేసేందుకు విముఖత వ్యక్తం చేయడం రష్యాలో భారత్ దౌత్య విజయం సాధించినట్లైంది. -
రష్యా పర్యటనలో ప్రధాని మోదీ (ఫోటోలు)
-
మాస్కోలో మోదీ. నేడు పుతిన్తో ప్రధాని మోదీ విస్తృతస్థాయి చర్చలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
India-Russia relations: మాస్కోలో మోదీ.. నేడు పుతిన్తో చర్చలు
మాస్కో/న్యూఢిల్లీ: భారత్, రష్యాల మైత్రీ బంధాన్ని నూతన సమున్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా ప్రధాని మోదీ రెండ్రోజుల రష్యా పర్యటన ఆరంభమైంది. 22వ ఇండో–రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ సోమవారం రష్యాకు విచ్చేశారు. మంగళవారం ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని మోదీ అల్పాహారం అనంతరం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. విస్తృతస్థాయి చర్చలు జరపనున్నారు. తర్వాత దౌత్య, అధికారిక బృందాలతో కలిసి వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఇరుదేశాల మధ్య పటిష్ట మైత్రి, సహకార బంధంపై సమగ్ర, లోతైన చర్చలు జరపనున్నారు. ఉక్రెయిన్ను రష్యా దురాక్రమించిన అంశం చర్చకొచ్చే అవకాశముంది. రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా భారతీయులను రిక్రూట్ చేసుకుని ఉక్రెయిన్ యుద్ధక్షేత్రాలకు తరలించిన ఉదంతాలు చర్చకొచ్చే అవకాశముంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక మోదీ రష్యాకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మోదీకి పుతిన్ విందు...మాస్కో శివారులోని నోవో–ఒగార్యోవో అధికార నివాసంలో మోదీని పుతిన్ సాదరంగా ఆహా్వనించారు. ఆప్యాయంగా ఇరునేతలూ హత్తుకున్నారు. ఈ సందర్భంగా రాత్రి మోదీకి పుతిన్ ప్రత్యేక విందు ఇచ్చారు. మోదీ పాలనలో భారత్ సాధించిన అభివృద్ధిని పుతిన్ ఈ సందర్భంగా కొనియాడారు. అంతకుముందు‡మాస్కో విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి రష్యా మొదటి ఉపప్రధాని డెనిస్ మాన్ట్సురోవ్ సాదర స్వాగతం పలికారు. అక్కడే మోదీ రష్యా సైనికుల సైనికవందనం స్వీకరించారు. ది కార్ల్టన్ హోటల్ల్లో మోదీకి పెద్దసంఖ్యలో భారత సంతతి ప్రజలు స్వాగతం పలికారు. హిందీ పాటలకు భారతీయులు, రష్యా కళాకారులు నృత్యంచేస్తూ మోదీని ఆనందంలో ముంచెత్తారు. ‘ఇప్పుడే మాస్కో నేలపై అడుగుపెట్టా. మిత్రుడు పుతిన్తో భేటీకి ఎదురుచూస్తున్నా. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకోబోతున్నా. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతల స్థాపనకు ఇరువురం మా వంతు కృషిచేస్తాం’’ అని మోదీ ‘ఎక్స్’లో పోస్ట్చేశారు. -
రష్యాలో మోదీకి ఘన స్వాగతం.. హిందీ పాటకు డ్యాన్స్లతో..
మాస్కో: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మోదీ రష్యాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మాస్కోలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. మోదీ రాక సందర్భంగా రష్యన్ డ్యాన్స్ ట్రూప్ ప్రత్యేకంగా దాండియా, గర్భా నృత్యంతో ప్రధానికి స్వాగతం పలికింది.ఇక, మాస్కోలో ల్యాండ్ అయిన తర్వాత మోదీ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ట్విట్టర్లో..‘మాస్కో దిగాను. రెండు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఎదురు చూస్తున్నాను. ముఖ్యంగా భవిష్యత్ సహకార రంగాలలో మన దేశాల మధ్య బలమైన సంబంధాలు మన ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి’ అంటూ కామెంట్స్ చేశారు. Landed in Moscow. Looking forward to further deepening the Special and Privileged Strategic Partnership between our nations, especially in futuristic areas of cooperation. Stronger ties between our nations will greatly benefit our people. pic.twitter.com/oUE1aC00EN— Narendra Modi (@narendramodi) July 8, 2024 ఇదిలా ఉండగా.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు మోదీ మాస్కో వెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు మోదీ రష్యాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ, ఆర్థిక సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇక, మోదీ కోసం పుతిన్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధాని ముచ్చటించనున్నారు. ఇక, రష్యా పర్యటనను ముగించుకుని మోదీ ఆస్ట్రియా వెళ్లనున్నారు. 40 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటించనున్న తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం. PM Modi was greeted with a heartfelt welcome by the Indian community in Moscow, Russia. pic.twitter.com/attIdUeuzP— Chandrajiban Chakma (@Chandrajiba4BJP) July 8, 2024 PM Modi received a warm reception and a Guard of Honour upon his arrival in Moscow, Russia. pic.twitter.com/oM2NtUO1mW— Chandrajiban Chakma (@Chandrajiba4BJP) July 8, 2024 -
రష్యాలో మోదీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నుంచి రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. 22వ ఇండో–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. పలు రంగాల్లో విస్తృతస్థాయి సహకారంపై వారు చర్చిస్తారు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు దిగాక మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. మూడేళ్ల విరామం తర్వాత భారత్–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమిట్లో చర్చించబోయే అంశాలు, తీసుకోబోయే ఉమ్మడి నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చివరిసారిగా 2021 డిసెంబర్లో ఢిల్లీలో ఈ సదస్సు జరిగింది. సోమవారం మధ్యాహ్నం రష్యాకు మోదీ చేరుకున్నాక పుతిన్ ఇచ్చే ప్రత్యేక విందు కార్యక్రమానికి మోదీ హాజరుకానున్నారు. తర్వాత శిఖరాగ్ర సదస్సు జరగనుంది. మరుసటి రోజు రష్యాలోని భారతీయసంతతి వ్యక్తులతో మోదీ మాట్లాడతారు. తర్వాత క్లెమ్లిన్లో అనామక సైనికుల స్మారకం వద్ద అంజలి ఘటిస్తారు. తర్వాత మాస్కోలో ఎగ్జిబిషన్ను సందర్శిస్తారు.ఆస్ట్రియాలోనూ పర్యటనరష్యా పర్యటన తర్వాత 9వ తేదీన మోదీ ఆస్ట్రియాకు వెళ్తారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డీర్ బెల్లాన్, చాన్స్లర్ కార్ల్ నెహామెర్లతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ‘ఆస్ట్రియా, భారత్ మైత్రీబంధానికి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ మోదీతో చర్చల కోసం సిద్ధంగా ఉన్నా’ అని నెహామెర్ శనివారం ‘ఎక్స్’లో చేసిన పోస్ట్కు మోదీ ఆదివారం స్పందించారు. ‘‘ ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు, సహకారంలో కొత్త పథాలను అన్వేషించేందుకు మీతో చర్చల కోసం ఎదురుచూస్తున్నా’’ అని మోదీ ఆదివారం ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. భారత ప్రధాని ఒకరు ఆస్ట్రియాలో పర్యటిస్తుండటం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారికావడం విశేషం. భారత్, ఆస్ట్రియాకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలతో మోదీ భేటీ కొనసాగుతుంది. మాస్కోతోపాటు వియన్నాలోని భారతీయ సంతతి ప్రజలతో ప్రధాని ముచ్చటించనున్నారు. -
కిమ్ మనసు గెల్చుకున్న పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మనసు గెల్చుకున్నారు. తన ప్యాంగ్యాంగ్ పర్యటన సందర్భంలో రష్యన్ మేడ్ లగ్జరీ కారు ఒకదానిని కిమ్కు బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ధృవీకరించగా.. ఓ టీవీ ఛానెల్ ఇందుకు సంబంధించిన ఫుటేజీని ప్రదర్శించింది. రష్యాలో తయారైన ఆరస్ లిమోసిన్ కారు.. తన కాన్వాయ్లోనూ ఉపయోగిస్తున్నారు పుతిన్. అదే కారును ఆయన గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు స్వయంగా కారును పుతిన్ నడపగా, పక్కనే కిమ్ కూర్చుని ఆ ప్రయాణాన్ని ఆస్వాదించారు.Russia’s Vladimir Putin drives North Korea’s Kim Jong-un in Russian Limousine#Ytshorts #Russia #Northkorea #Putin #KimJonun #RussianLimousine pic.twitter.com/qJvVrKMoR7— Business Today (@business_today) June 20, 2024VIDEO CREDITS: Business Today గతేడాది సెప్టెంబర్లో కిమ్, రష్యాలో పర్యటించారు. ఆ టైంలో తన కాన్వాయ్లోని వాహనాలను పుతిన్ స్వయంగా కిమ్కు చూపించి.. ఇద్దరూ సరదాగా ప్రయాణించారు. ఆ టైంలో కిమ్ ఈ కారుపై మనుసు పారేసుకున్నారని, దీంతో ఇప్పుడు పుతిన్ ఇప్పడు ఆ కారును సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇచ్చినట్లు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి.ఇదిలా ఉంటే.. కిమ్ విలాస ప్రియుడనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖరీదైన వస్తువులు, కార్లను ఆయన తన ఖాతాలో ఉంచుకున్నారు. అయితే.. ఉత్తర కొరియాలోకి విలాసవంతమైన గూడ్స్ వెళ్లకుండా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిషేధం విధించింది. అయినప్పటికీ అక్రమ మార్గంలో కిమ్ వాటిని తెప్పించుకుంటారని దక్షిణ కొరియా ఆరోపిస్తుంటుంది.Caption this...pic.twitter.com/ilIUhnxxw1— Mario Nawfal (@MarioNawfal) June 20, 2024ఇదిలా ఉంటే.. దాదాపు 24 సంవత్సరాల తర్వాత నార్త్ కొరియాలో అడుగుపెట్టారు పుతిన్. కొరియా జనం కేరింతలతో అట్టహాసంగా పుతిన్కు ఆహ్వానం లభించింది. ఈ సందర్భంగా ఇరు దేశాల అధినేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. మరోవైపు.. అమెరికా ఒత్తిడి, ఆంక్షలను ఎదుర్కోవడంలో భాగంగా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడమే లక్ష్యంగా వీళ్లిద్దరూ పని చేస్తున్నట్లు వాళ్ల వాళ్ల ప్రకటనలను బట్టి స్పష్టమవుతోంది. -
వియత్నాంతో పుతిన్ చెట్టపట్టాల్
హనోయి: యుద్ధోన్మాదంతో ఉక్రెయిన్పై దండయాత్రకు దిగాక అంతర్జాతీయ మద్దతు కరువైన తరుణంలో రష్యా ఆసియా దేశాలతో మైత్రికి మొగ్గుచూపుతోంది. అందులోభాగంగానే ఉత్తర కొరియా పర్యటన ముగించుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం అక్కడి నుంచి నేరుగా వియత్నాం చేరుకున్నారు. అధికారిక పర్యటనలో భాగంగా గురువారం వియత్నాం అధ్యక్షుడు టో లామ్తో విస్తృతస్థాయి చర్చలు జరిపారు. విద్య, శాస్త్ర సాంకేతికత, చమురు, సహజవాయువుల అన్వేషణ, ఆరోగ్య రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అణు శాస్త్ర సాంకేతికతపై ఉమ్మడి పరిశోధనకూ అంగీకరించారు. -
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పూర్తి మద్ధతు: ఉత్తర కొరియా
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానం మేరకు రెండు రోజులు (ఈనెల18,19) అక్కడ పుతిన్ పర్యటిస్తున్నారు. ప్యోంగ్యాంగ్ విమానాశ్రయానికి స్వయంగా వెళ్లిన కిమ్, పుతిన్కు ఆహ్వానం పలికారు. అనంతరం ప్యోంగ్యాంగ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురు పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ద్వైపాక్షిక చర్చలు జరిపారు.ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యాకు తమ పూర్తి మద్ధతు ఉంటుందని కిమ్ హామీ ఇచ్చారు. ఇరుదేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి, అమెరికా ఆధిప్యత విధానాలకు వ్యతిరేకంగా పోరేండేందుకు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. ఇరు దేశాల మద్య ఆర్థిక, సైనిక సహకారాన్ని విస్తరించేందుకు అంగీకరించినట్లు తెలిపారు.యుద్ధంలో తమ పాలసీలకు మద్ధతు ప్రకటించడంపై కిమ్కు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. అయితే యుద్ధంలో తమకు ఆయుధాలను పంపాలని కిమ్ను కోరినట్టు తెలుస్తోంది. దీనికి బదులుగా ఉత్తర కొరియాకు ఆర్థికంగా, సాంకేతికంగా రష్యా సాయం చేయనున్నట్టు సమాచారం.ఇక ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర సమయంలో పుతిన్ పర్యటనకు రావడం.. అమెరికా సహా దాని మిత్రదేశాలను ఆందోళనకు గురిచేసింది. అణ్వాయుధాలు, క్షిపణి పరీక్షలతో నిత్యం శత్రు దేశాలను కవ్వించే ఉత్తర కొరియా చేతికి రష్యా అత్యాధునిక సాంకేతికత అందితే మరింత ప్రమాదమని పశ్చిమ దేశాల్లో ఆందోళన నెలకొంది.ఇదిల ఉండగా అంతర్జాతీయంగా ఇరుదేశాలపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఒకవైపు.. ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు.. ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలు, ఇతర దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఈ పరిణామాల నడుమ.. వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటించడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి. కాగా గత ఏడాది సెప్టెంబరులో కిమ్ జోంగ్ ఉన్ రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. -
ఆంక్షలపై సమష్టి సమరం
సియోల్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తరకొరియాలో రెండు రోజుల పర్యటనకుగాను బుధవారం ఉదయం ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్ చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమెరికా సారథ్యంలో రష్యా, ఉ.కొరియాలపై కొనసాగుతున్న ఆంక్షలను ఇరుదేశాలు సమష్టిగా ఎదుర్కొంటాయని పుతిన్ ప్రకటించారు. ఉ.కొరియా పర్యట నకు కొద్ది గంటల ముందు ఆయన ఆ దేశ అధికారిక వార్తా సంస్థకు రాసిన వ్యాసంలో పలు అంశాలను ప్రస్తావించారు.‘‘ ఉక్రెయిన్ విషయంలో మా సైనిక చర్యలను సమర్థిస్తూ, సాయం చేస్తున్న ఉ.కొరి యాకు కృతజ్ఞతలు. బహుళ «ధ్రువ ప్రపంచం సాకారం కాకుండా అవరోధాలు సృష్టిస్తున్న పశ్చిమదేశాలను అడ్డుకుంటాం. పశ్చిమదేశాల చెప్పుచేతల్లో ఉండకుండా సొంత వాణిజ్యం, చెల్లింపుల వ్యవస్థలను రష్యా, ఉ.కొరియాలు అభివృద్ధి చేయనున్నాయి. పర్యాటకం, సాంస్కృతికం, విద్యారంగాలకూ ఈ అభివృద్ధిని విస్తరిస్తాం’’ అని పుతిన్ అన్నారు.ఉక్రెయిన్లో రష్యా యుద్ధ జ్వాలలను మరింత రగిల్చేందుకు కావాల్సిన ఆయుధ సంపత్తిని ఉ.కొరియా సమకూర్చుతుండగా, ఆ దేశానికి అణ్వస్త్ర సామర్థ్యం, క్షిపణుల తయారీ, సాంకేతికతలను రష్యా అందిస్తోందని అమెరికాసహా పశ్చిమ దేశాలు ఆరోపిస్తుండటం తెల్సిందే. ఈ ఆరోపణలను రష్యా, ఉ.కొరియా కొట్టిపారేశాయి. పుతిన్ పర్యటన వేళ ఈ ఆయుధ సాయం, టెక్నాలజీ సాయం మరింత పెచ్చరిల్లే ప్రమాదముందని అమెరికా ఆందోళన వ్యక్తంచేసింది. ఉక్రెయిన్తో ఆగదు: అమెరికా‘ఉ.కొరియా బాలిస్టిక్ క్షిపణు లే ఉక్రెయిన్ను ధ్వంసంచేస్తున్నాయి. రష్యా, ఉ.కొరియా బంధం దుష్ప్ర భావం ఉక్రెయిన్కు మాత్రమే పరిమితం కాబోదు కొరియా ద్వీపకల్పంపై పడు తుంది’ అని అమెరికా ప్రతినిధి జాన్ కిర్బీ ఆందోళన వ్యక్తంచేశారు. ‘మండలి తీర్మానాలు, శాంతి, సుస్థిరతలకు విఘాతం కల్గించే రీతిలో రష్యా, ఉ.కొరియా సహకారం పెరగొద్దు’ అని దక్షిణకొరియా హెచ్చరించింది. చెత్త నింపిన బెలూన్లను ద.కొరియా పైకి ఉ.కొరియా వదలడం విదితమే. -
నేడు ఉత్తర కొరియాకు పుతిన్
సియోల్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ఉత్తర కొరియాకు వెళ్లనున్నారు. కిమ్ ఆహా్వనం మేరకు పుతిన్ మంగళ, బుధవారాల్లో తమ దేశంలో పర్యటించనున్నట్టు కొరియన్ సెంట్రల్ అధికారిక న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ప్రకటనను ఇరు దేశాలు ««ధ్రువీకరించాయి. ఉక్రెయిన్పై రష్యా దాడులు, ఉత్తర కొరియా ప్యాంగ్యాంగ్ క్షిపణుల పరీక్షల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గతేడాది చివరలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ రష్యాలో పర్యటించడం సంచలనమైంది. ఉక్రెయిన్పై రష్యా తీవ్రమైన దాడులు చేస్తుండటంతో రష్యాకు అవసరమైన ఆయుధ సంపత్తిని ఉత్తర కొరియా సరఫరా చేస్తోందని, అందుకు బదులుగా రష్యా నుంచి అణు సాంకేతికతను పొందుతోందని దక్షిణ కొరియాతోపాటు అమెరికా ఆరోపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వమున్న రష్యా.. ఉత్తర కొరియాతో ఆయుధ వాణిజ్యం చేస్తే యూఎన్ తీర్మానాలను ఉల్లంఘించడమేనని అంటున్నాయి. అయితే, ఉత్తర కొరియా, రష్యా ఈ కథనాలను ఖండించాయి. కాగా, రష్యా అధ్యక్షుడు ఉత్తర కొరియాలో పర్యటించడం 24 ఏళ్లలో ఇది ప్రథమం. పుతిన్ మొదటిసారి జూలై 2000లో ఉత్తర కొరియాలో పర్యటించారు. మొదటి ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత, అప్పుడు ఉత్తర కొరియాను పాలిస్తున్న కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్తో సమావేశమయ్యారు. పుతిన్ కోసం విలాసవంతమైన వేడుక 1991లో సోవియట్ పతనం తర్వాత ఉత్తర కొరియాతో రష్యా సంబంధాలు బలహీనపడ్డాయి. కిమ్ జోంగ్ ఉన్ తొలిసారిగా 2019లో రష్యాలోని తూర్పు నౌకాశ్రయం వ్లాడివోస్టాక్లో పుతిన్తో సమావేశమయ్యారు. మళ్లీ పుతిన్, కిమ్లు ఇరుదేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో పుతిన్.. కిమ్కు హై–ఎండ్ ఆరస్సెనాట్ కారును పంపారు. ఇప్పుడు ఇరు దేశాల మధ్య అనుబంధాన్ని బయటి ప్రపంచానికి తెలిపేందుకు పుతిన్ కోసం విలాసవంతమైన వేడుకను కిమ్ సిద్ధం చేస్తున్నారు. రాజధాని ప్యాంగ్యాంగ్లోని ఒక చౌరస్తాలో భారీ కవాతు కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు తెలుపుతున్నాయని ఓ న్యూస్ వెబ్సైట్ విశ్లేíÙంచింది. ఉక్రెయిన్పై యుద్ధం తరువాత పుతిన్ను స్వాగతించే దేశాలు తక్కువగా ఉన్నా.. ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటన కిమ్ విజయం అంటున్నారు ఉత్తరకొరియా రాజకీయ విశ్లేషకులు. మాస్కోతో ఆర్థిక, ఇతర సహకారాలను పెంపొందించుకోవడానికి ఈ పర్యటనలు ఉపయోగపడతాయని చెబుతున్నారు. -
చైనా–రష్యా కరచాలనం!
తాము చైనాను పీపుల్స్ రిపబ్లిక్గా గుర్తించి 75 యేళ్లు అవుతుండగా... ఉక్రెయిన్ దురాక్రమణ యుద్ధంలో పట్టు సాధించిన ఛాయలు కనబడుతుండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటనలో ఇరు దేశాలమధ్యా వివిధ ఒప్పందాలు కుదరటంతోపాటు సంయుక్త ప్రకటన కూడా విడుదలైంది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంనాటి మనస్తత్వాన్ని విడనాడాలని రెండు దేశాలూ అమెరికాకు హితవు పలికాయి. ప్రాంతీయ భద్రత, రక్షణ బేఖాతరు చేస్తూ కొన్ని బృందాలకు మద్దతుగా నిలిచే వినాశకర విధానాలకు స్వస్తి పలకాలని సూచించాయి. పుతిన్ వరసగా ఆరోసారి ఎన్నికై దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి తొమ్మిది రోజులవుతోంది. 2030 వరకూ ఆయనదే రాజ్యం. అయితే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచం మునపట్లా లేదు. ఆంక్షల చక్రబంధంలో బిగించి రష్యాను పాదాక్రాంతం చేసుకోవాలని అమెరికా, దానికి మద్దతుగా నిలిచిన యూరొప్ దేశాలూ పట్టుదలగా వున్నాయి. పర్యవసానంగా రష్యా ఆర్థిక వ్యవస్థ బలహీనపడి వణుకుతోంది. ఆ దేశంతో ఎవరు లావాదేవీలు సాగించినా చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరిస్తోంది. రెండేళ్ల క్రితం రష్యా ఉక్రెయిన్పై దండెత్తటానికి కొన్ని రోజులముందు రష్యా–చైనాల మధ్య ‘హద్దుల్లేని వ్యూహాత్మక ఒప్పందం’ కుదిరింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ రెండు దేశాలూ ఇప్పటికీ ‘హద్దులెరగని’ బంధాన్ని కొనసాగిస్తాయా... రష్యాపై అమలవుతున్న ఆంక్షలకూ, అమెరికా హెచ్చరికలకూ చైనా తలొగ్గుతుందా అనే ప్రశ్నలు గత కొన్ని రోజులుగా పాశ్చాత్య ప్రపంచాన్ని వేధిస్తున్నాయి. పుతిన్కు బీజింగ్లో దక్కిన ఘనస్వాగతమూ, ఇరు దేశాల ఉమ్మడి ప్రకటనా, ఉభయ దేశాధినేతల ప్రసంగాలూ గమనించాక అమెరికా, యూరొప్ దేశాలకు అసంతృప్తే మిగిలివుంటుందన్నది వాస్తవం. అయితే 75 ఏళ్లక్రితం కొత్తగా ఆవిర్భవించిన చైనాను గుర్తించిననాటి సోవియెట్ యూనియన్కూ, ఇప్పటి రష్యాకూ పోలికే లేదు. అప్పట్లో అది అమెరికాతో ‘నువ్వా నేనా’ అన్నట్టు తలపడే తిరుగులేని శక్తి. అనంతర కాలంలో ఆ దేశం కుప్పకూలింది. చీలికలు పేలికలైంది. ఈ మూడు దశాబ్దాల్లో గత వైభవాన్ని సంతరించుకోవాలని చేసిన ప్రయత్నాలు ఎంతో కొంత ఫలిస్తున్న వైనం కనబడుతుండగానే క్రిమియా ఆక్రమణ, ఆ తర్వాత ఉక్రెయిన్పై దురాక్రమణ యుద్ధం రష్యాను సంక్షోభంలోకి నెట్టాయి. చైనా మాదిరే భద్రతామండలిలో రష్యా శాశ్వతసభ్య దేశమే కావొచ్చు. కానీ ఇప్పుడది దాదాపు ఒంటరి. చెప్పాలంటే చైనాకు జూనియర్ భాగస్వామి.తమది కూటమి కాదని, తమ స్నేహం వెనకున్న ఉద్దేశం దశాబ్దాల బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లటమేనని ఉభయ దేశాలూ చెబుతున్నాయి. కానీ ఆ రెండు దేశాల ఉమ్మడి ప్రత్యర్థి అమెరికాయేనని ప్రపంచానికంతకూ తెలుసు. డ్రోన్లు, క్షిపణి సాంకేతికత, ఉపగ్రహ నిఘా నివేదికలు, ఫైటర్ జెట్లకు పనికొచ్చే విడిభాగాలు, మైక్రోచిప్లు సరఫరా చేస్తూ దురాక్రమణ యుద్ధానికి చైనా ఆజ్యం పోస్తున్నదని అమెరికా అనుమానం. ఈ చైనా సంస్థలను నిషేధ జాబితాలో పెడతామని హెచ్చరిస్తోంది. ఇది ఎంతోకొంత పనిచేసింది. చైనా బ్యాంకులు రష్యా సంస్థలతో మొన్న మార్చినుంచి లావాదేవీలు బాగా తగ్గించాయి. పర్యవసానంగా ఇటీవల వాణిజ్యం మందగించింది. దీన్ని మళ్లీ యధాస్థితికి తీసుకెళ్లటం పుతిన్ ప్రాధాన్యాంశాల్లో ఒకటి. అందుకే ఆయన వెంట భారీ ప్రతినిధి బృందం బీజింగ్ వెళ్లింది. గత ఆర్థిక సంవత్సరం గణాంకాలు గమనిస్తే చైనాతో రష్యా వాణిజ్యం రికార్డు స్థాయిలో 24,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యే నాటికున్న వాణిజ్యంతో పోలిస్తే ఇది 60 శాతం అధికం. రష్యా ఎగుమతుల్లో చైనా వాటా 30శాతం కాగా,దాని దిగుమతుల్లో చైనా వాటా 40శాతం. ఆంక్షల బారిన పడకుండా వ్యాపార, వాణిజ్యాలను ఎలా కొనసాగించాలన్నదే ప్రస్తుతం రష్యా, చైనాల ముందున్న ప్రశ్న. ఇంధనం, పరిశ్రమలు, వ్యవసాయం, నిర్మాణ రంగాల్లో తమకు సహకరించాలని పుతిన్ అర్థించారు. అలాగే ఆంక్షల తర్వాత ఎలక్ట్రానిక్ ఉపకరణాల నుంచి కార్ల వరకూ అన్ని మార్కెట్లనుంచీ పాశ్చాత్య దేశాలు తప్పుకున్నాయి. ఆ లోటును చైనా తీరుస్తోంది. దాన్ని మరింత పెంచాలని ఉభయ దేశాలూ నిర్ణయించాయి. డాలర్లలో కాక తమ తమ కరెన్సీల్లోనే లావాదేవీలు జరుపుకుంటున్నాయి. జార్ చక్రవర్తుల కాలం నుంచీ పాశ్చాత్య దేశాలతో రష్యాకున్న వాణిజ్యబంధం ఇప్పుడు పూర్తిగా స్తంభించిపోయింది. ఇన్నాళ్లూ యూరొప్ దేశాలకు వెళ్లిన సహజవాయు ఎగుమతుల్ని చైనాకు మళ్లించేందుకు పుతిన్ సిద్ధపడినా ప్రస్తుతానికైతే ఒప్పందం ఖరారు కాలేదు. వ్లాదిమిర్ సోరోకిన్ అనే రచయిత 2028 నాటికి రష్యా పోకడలెలా వుంటాయో చిత్రిస్తూ 2006లో ‘డే ఆఫ్ ఆప్రిష్నిక్’ అనే నవల రాశాడు. అప్పటికల్లా చైనా సాంకేతికతే అన్ని రంగాల్లోనూ వర్ధిల్లుతుందనీ, కానీ జార్ సామ్రాజ్యానికి ఆద్యుడిగా భావించే మధ్యయుగాలనాటి మాస్కో ప్రిన్స్ ఇవాన్ను తలపించే అత్యంత క్రూరమైన పాలన సాగుతుందనీ ఆ కాల్పనిక ఇతివృత్తం చెబుతుంది. పుతిన్ ఎలా పరిణమిస్తారన్న సంగతలావుంచి చైనా సాంకేతికతలు ఇప్పటికే రష్యాకు వచ్చాయి. చైనా కార్లు రష్యా రోడ్లపై పరుగులెడుతున్నాయి. ప్రపంచం గతంలో మాదిరి లేదని, ఎవరినీ ఎవరూ శాసించలేరని అమెరికా, పాశ్చాత్య దేశాలు గుర్తించాలి. ఉద్రిక్తతలు ఉపశమింపజేసేందుకూ, శాంతి సాధనకూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించటం, రాజీకి సిద్ధపడటం అవసరమని ఇరు పక్షాలూ తెలుసుకోవాలి. అందుకు భిన్నమైన వినాశకర మార్గంలో పోతామంటే ప్రపంచ ప్రజానీకం క్షమించదు. -
మాస్ ఎంట్రీ.. చైనాలో పుతిన్కు గ్రాండ్ వెల్కమ్!
బీజింగ్: రెండు రోజుల పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనాకు చేరుకున్నారు. పుతిన్ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కీలక చర్చల్లో పాల్గొననున్నారు.ముఖ్యంగా ఉక్రెయిన్పై యుద్ధం గురించి చర్చించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే, రష్యా ఆర్థికంగా బలపడేందుకు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్టు సమాచారం. ఇక, ఉక్రెయిన్పై యుద్ధం కారణంగా రష్యాపై పశ్చిమ దేశాలు తీవ్ర ఆంక్షలు విధించడంతో క్రెమ్లిన్ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో, పుతిన్ దిద్దుబాటు చర్యలకు ప్లాన్ చేస్తున్నారు.కాగా, రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం తెల్లవారుజామునే చైనాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చైనాలో పుతిన్కు ఘన స్వాగతం లభించింది. రష్యాకు మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పుతిన్ తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. కాగా.. జిన్పింగ్, పుతిన్ భేటీ రెండు దేశాల మధ్య సంబంధాలను మరో లెవల్కు తీసుకువెళ్తుందని ఇండిపెండెంట్ రష్యాన్ పొలిటికల్ అనలిస్ట్ కొస్టానియన్ కల్చేవ్ చెప్పుకొచ్చారు. అలాగే, ఇద్దరు నేతల మధ్య 2022 నుంచి మంచి సత్సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. 🇷🇺🇨🇳Footage of the arrival of the Russian president in BeijingVladimir Putin made his first foreign visit to China in his new presidential term. pic.twitter.com/g8U5SatXE9— S p r i n t e r F a c t o r y (@Sprinterfactory) May 15, 2024ఇదిలా ఉండగా.. చైనా పర్యటన నేపథ్యంలో పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్తో యుద్ధంపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని పుతిన్ అన్నారు. యుద్ధం గురించి చర్చలు జరిపేందుకు మేమెప్పుడూ నిరాకరించలేదు. ప్రస్తుత ఘర్షణకు శాంతియుత మార్గాల్లో సమగ్ర, సుస్థిర పరిష్కారాన్ని మేం కోరుకుంటున్నాం. ఉక్రెయిన్ విషయంపై సంప్రదింపులకు మేం సిద్ధం. కానీ ఆ చర్చల్లో మాతో సహా అన్ని భాగస్వామ్య దేశాల ప్రయోజనాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి అని కామెంట్స్ చేశారు. 🇨🇳Chinese President Xi Jinping to hold a welcome ceremony for🇷🇺Russian President Vladimir Putin, who is paying a two-day state visit to China.What does this visit mean?More details and my analysis to come. pic.twitter.com/B4GFnzssY5— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) May 16, 2024 -
చైనాకు రష్యా అధ్యక్షుడు పుతిన్.. కీలక చర్చలు!
బీజింగ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రేపటి నుంచి(మే 16) నుంచి రెండు రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్.. చైనా పర్యటనపై ఆసక్తి నెలకొంది. పుతిన్, జిన్పింగ్ మధ్య ఎలాంటి చర్చ జరుగుతుందోనన్న చర్చ నడుస్తోంది.కాగా, పుతిన్ ఇటీవలే రష్యాకు ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా, తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా పుతిన్.. చైనాకు వెళ్లనున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో పుతిన్ తమ దేశంలో పర్యటించనున్నారని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే, రష్యా, చైనాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని 75 ఏళ్లైన సందర్భంగా జిన్పింగ్ ఆహ్వానంపైనే పుతిన్ చైనాను సందర్శిస్తున్నారని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది.ఇక, ఈ పర్యటనలో భాగంగా పుతిన్.. చైనా అధినేత షీ జిన్పింగ్తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. వీరి భేటీలో ఉక్రెయిన్-రష్యా దాడుల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్లో రెండేళ్లకు పైగా సాగుతున్న యుద్ధం పరిణామాలు, సంక్షోభం గురించి మాట్లాడనున్నట్టు చైనా మీడియా పేర్కొంది. ఇదే సమయంలో ఉక్రెయిన్లో శాంతి కోసం చైనా ప్రతిపాదనలకు తాము సానుకూలంగా ఉండాలనుకున్నట్టు రష్యా తెలిపింది. President Putin gave an interview to Xinhua News Agency right before his China visitThe President noted that Russia positively assesses China’s approaches to resolving the Ukrainian crisis, and Beijing understands its “root causes”.President Putin responded to China's… pic.twitter.com/k2yaxzjQ3U— jamiemcintyre (@jamiemcintyre21) May 15, 2024 మరోవైపు.. గడిచిన ఎనిమిది నెలల్లో పుతిన్ చైనాను సందర్శించడం ఇది రెండోసారి. ఇదిలా ఉండగా.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గతవారమే యూరప్లో ఐదు రోజుల పర్యటన ముగించుకొని చైనాకు వెళ్లారు. -
Andrei Belousov: రష్యా నూతన రక్షణ మంత్రిగా ఆండ్రీ బెలౌసోవ్
మాస్కో: రష్యా నూతన రక్షణ మంత్రిగా ఆండ్రీ బెలౌసోవ్చేపట్టిన వ్లాదిమిర్ పుతిన్ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. రాజ్యాంగం ప్రకారం శనివారం మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసింది. పాత కేబినెట్లో రక్షణ మంత్రి సెర్గీ షోయిగుకు మాత్రమే అవకాశమివ్వలేదు. రక్షణ శాఖ సహాయ మంత్రి తిమూర్ ఇవనోవ్ అవినీతి ఆరోపణలతో అరెస్ట్ కావడంతో షోయిగుకు పదవీ గండం తప్పదని కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఆదివారం అధ్యక్షుడు పుతిన్ నూతన రక్షణ మంత్రిగా ఆండ్రీ బెలౌసోవ్(65)ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. షోయిగుకు రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ బాధ్యతలను అప్పగించారు. ఆండ్రీ బెలౌసోవ్ 2020 నుంచి ఫస్ట్ డిప్యూటీ ప్రధానమంత్రిగా కొనసాగు తున్నారు. అంతకుముందు ఏడేళ్లపాటు పుతిన్ సలహాదారుగా ఉన్నారు. కొత్త ఆవిష్కరణలకు, నూతన ఆలోచనలకు అనుగుణంగా రక్షణ శాఖను తీర్చిదిద్దేందుకే బెలౌసోవ్ను నియమించినట్లు అధ్యక్ష భవనం తెలిపింది. -
న్యూక్లియర్ డ్రిల్స్కు ఆదేశించిన పుతిన్
ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న తరుణంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్కు సమీపంలో రష్యన్ మిలటరీ, నేవి ఆధ్వర్యంలో అణ్వాయుధాల డ్రిల్స్ నిర్వహించాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించినట్లు ఆ దేశ రక్షణ శాఖ సోమవారం ప్రకటించింది. ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అణుయుద్ధానికి సంబంధించి పుతిన్ పలుసార్లు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.న్యూక్లియర్ డ్రిల్స్ చేస్తున్న సమయంలో నాన్ స్ట్రాటజిక్ న్యూక్లియర్ ఆయుధాలను ఉపయోగించటంపై శిక్షణ తీసుకోనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. నాన్ స్ట్రాటిజిక్ న్యూక్లియర్ ఆయుధాలను టెక్నికల్ వెపన్స్ అంటారు. యుద్ధ క్షేత్రాల్లో ఉపయోగించే మిసైల్స్ గుండా వీటిని ప్రయోగిస్తారు.కొన్ని పశ్చాత్య దేశాల నుంచి తమ దేశానికి పొంచి ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని సమీప భవిష్యత్తులో న్యూక్లియర్ డ్రిల్స్ చేపడతామని రష్యా రక్షణ శాఖ తెలిపింది. అక్రమిత ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనిక బలగాలతో పాటు.. వైమానిక, నౌకా దళాలు న్యూక్లియర్ డ్రిల్స్ పాల్గొంటాయని పేర్కొంది. అమెరికాతో గతంలో చేసుకున్న ‘న్యూ స్టార్ట్ ఒప్పందం’నుంచి తాత్కాలికంగా తప్పుకొంటున్నామని గతేడాది రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. -
మాక్రాన్ Vs పుతిన్: ఫ్రాన్స్కు రష్యా మాస్ వార్నింగ్..
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా సైన్యం దాడులు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్కు మద్దతిస్తున్న ఫ్రాన్స్కు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ తమ మాటను కాదని ఉక్రెయిన్కు దళాలను పంపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరింది. కాగా, తాజాగా రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగో.. ఫ్రాన్స్ రక్షణమంత్రి సెబాస్టియన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్లో దాడుల నేపథ్యంలో అక్కడ ఫ్రెంచ్ దళాల మోహరింపుపై షోయిగో ప్రస్తావించారు. ఒకవేళ నిజంగానే ఉక్రెయిన్లో ఫ్రెంచ్ దళాలు ఉంటే అది వారి దేశానికే తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. అంతేకాకుండా భవిష్యత్త్లో ఉక్రెయిన్కు సైన్యాన్ని పంపించడానికి ఫ్రాన్స్ సాహసిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. దీంతో, వీరి మధ్య సంభాషణ ఉద్రిక్తంగానే జరిగినట్టు సమాచారం. ఇక, ఇటీవల కాలంలో రష్యా విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ గురువారం మరో కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జులైలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్ను రష్యా లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. తప్పుడు సమాచారంతో ఈ క్రీడలకు ఆటంకం కలిగించేందుకు మాస్కో ప్రయత్నిస్తుందని అన్నారు. ఉక్రెయిన్పై జరుగుతున్న యుద్ధంలో రష్యా ఓటమి చెందాల్సిందేనని మెక్రాన్ ఇటీవల ప్రకటనలు ఇస్తున్నారు. రష్యాపై శత్రుత్వాన్ని ప్రేరేపించే ఉద్దేశం ఫ్రాన్స్కు లేనప్పటికీ, ఏదో ఒకరోజు ఐరోపా దళాలు ఉక్రెయిన్కు వెళ్లడం ఖాయమని చెప్పుకొచ్చారు. -
Putin: ‘మాస్కోలో ఉగ్రదాడి.. ఉక్రెయిన్తో లింక్’
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భారీ ఉగ్రదాడిపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. మాస్కోలో చోటు చేసుకున్న నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదలకు ఉక్రెయిన్తో సంబంధాలు ఉన్నాయని అన్నారు. ‘మాస్కోలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఉక్రెయిన్ వైపు పారిపోవడానికి యత్నించారు. తమకు ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు ఉక్రెయిన్-రష్యా సరిహద్దులను క్రాస్ చేసి ఉక్రెయిన్ వైపు వెళ్లడానికి ప్రయత్నించారు’ పుతిన్ స్థానిక టెలివిజన్తో మాట్లాడుతూ ఆరోపించారు. ‘ఈ ఉగ్రదాడి వల్ల వందలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు దేశ వ్యాప్తంగా బాధకరమైన రోజు. ఈ దారుణమైన దాడికి పాల్పన వ్యక్తులు, ఉగ్రసంస్థలను శిక్షిస్తాం. వారు ఎవరైనా.. వారికి వెనక ఎవరున్నా కోరుకోం. ఉగ్రవాదుల వెనక ఎవరు ఉన్నారనే విషయాన్ని గుర్తిస్తాం. రష్యా ప్రజలకు వ్యతిరేకంగా దాడులకు ప్రణాళిక వేసిన వారిని గుర్తించి శిక్షిస్తాం’ అని పుతిన్ హెచ్చరించారు. మాస్కో దాడి వెనకాల ఉక్రెయిన్కు లింక్ ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ఆరోపణలను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ‘మాస్కో ఉగ్రదాడిలో ఉక్రెయిన్కు ఎటువంటి సంబంధం లేదు. ఆ ఉగ్రదాడికి మాకు లింక్ ఉందన్న ఆరోపణలు నిరాధారమైనవి’ అన ఉక్రెయిన్ మిలిటరీ స్పై ఏజెన్సీ స్పష్టం చేసింది. రష్యాలోని మాస్కోలోని ఓ కాన్సర్ట్ హాల్లోకి చొచ్చుకుని వచ్చిన పలువురు సాయుధులు బాంబులు విసురుతూ.. తుపాకులతో అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 133 మంది మరణించారు. వంలాది మంది గాయపడినట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్విస్ వెల్లడించింది. మరోవైపు.. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ మాస్కో దాడి తమ పనే అని ప్రకటించుకుంది. రష్యా రాజధాని మాస్కో శివార్లలో.. మా సంస్థ పెద్ద గుంపుపై దాడి చేసింది. అంతేకాదు మా బృందం సభ్యులు దాడి తర్వాత సురక్షితంగా తమ స్థావరాలకు చేరుకున్నారు అని టెలిగ్రామ్ ద్వారా ఒక సందేశం విడుదల చేసింది. మరోవైపు రష్యా నేషనల్ గార్డు మాత్రం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకుంది. -
రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ప్రధాని మోదీ ఫోన్ కాల్..
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు, ఉక్రెయిన్ అధ్యక్షులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఫోన్లో మాట్లాడారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంపై శాంతి కోసం భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. కాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరూ ప్రధాని మోదీని తమ దేశానికి ఆహ్వానించారు. లోక్సభ ఎన్నికల తర్వాత తమ దేశ పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రాధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో బుధవారం ఫోన్లో మాట్లాడారు. రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా అయిదోసారి ఎన్నికైనందుకు పుతిన్కు ప్రధాని అభినందనలు తెలిపారు. రష్యా ప్రజల శాంతి, అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఆకాంక్షించారు. రాబోయే కాలంలో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారు. ఈ మేరకు ప్రధాని ట్విటర్ ద్వారా వెల్లడించారు. కాగా ఇటీవల జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ ఘన విజయం సాధించారు. దాదాపు 88 శాతం ఓట్లతో ఆయన గెలుపొందారు. ఇప్పటికే 1999 నుంచి రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్న పుతిన్.. మరో ఆరేళ్లపాటు ఆ పదవిలో ఉండనున్నారు. దాంతో రష్యాకు ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన జోసెఫ్ స్టాలిన్ రికార్డును అధిగమించనున్నారు. మరో పోస్ట్లో.. భారత్-ఉక్రెయిన్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై జెలెన్స్కీ మాట్లాడినట్లు ప్రధాని మోదీ తెలిపారు. శాంతిని నెలకొల్పేందుకు చేసే అన్ని ప్రయత్నాలకు భారత్ నుంచి స్ధిరమైన మద్దతు లభిస్తుందని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అలాగే భారత్ నుంచి తమ ప్రజల కోసం మానవతా సహాయాన్ని అందించడం కొనసాగుతుందని పేర్కొన్నారు. చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం అదే! Spoke with President Putin and congratulated him on his re-election as the President of the Russian Federation. We agreed to work together to further deepen and expand India-Russia Special & Privileged Strategic Partnership in the years ahead. @KremlinRussia — Narendra Modi (@narendramodi) March 20, 2024 -
ఎన్నిక అపహాస్యమే అయినా...
అనుకున్నదే అయింది. ఫలితం ముందే నిర్ణయమై, అపహాస్యంగా మారిన రష్యా ఎన్నికల్లో అందరూ ఊహించినట్టే వ్లాదిమిర్ పుతిన్ అయిదో పర్యాయం అధ్యక్షుడయ్యారు. కంటితుడుపుగా సాగిన రిగ్గింగ్ ఎన్నికలన్న విమర్శకుల ఆరోపణలకు తగ్గట్టే ఆయన మునుపెన్నడూ, ఎవరికీ రానన్ని ఓట్లతో అఖండ విజయం సాధించారు. పుతిన్ గెలుపు ముందే నిశ్చయమైనా, సోమవారం అధికారిక వెల్లడింపుతో ఒక తంతు పూర్తయింది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో భిన్నాభిప్రాయాలకూ, రాజకీయ పోటీకీ కాసింత అవకాశమైనా ఇచ్చిన 71 ఏళ్ళ ఈ మాజీ గూఢచారి ఇప్పుడు అందుకు ఏ మాత్రం సిద్ధంగా లేరని తేలిపోయింది. వెరసి, పుతిన్ హయాంలో రష్యాలో పాలన నిరంకుశత్వం నుంచి ఏకఛత్రాధిపత్యం, ఏకవ్యక్తి పాలన దిశగా వెళుతున్నట్టు ప్రపంచానికి ఖరారైంది. సోవియట్ పతనానంతర కాలంలో ఎన్నడూ లేనట్టు రష్యా ఎన్నికల్లో పుతిన్ అత్యధికంగా 88 శాతం దాకా ఓట్లు సాధించడం స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. ప్రధానిగా అయితేనేం, అధ్యక్షుడిగా అయితేనేం పాతికేళ్ళుగా పీఠంపై ఉన్న పుతిన్ ఇప్పుడిక రష్యాపై పూర్తిగా పట్టు బిగించారన్న మాట. అధ్యక్షుడిగా కొనసాగేందుకు వీలుగా ఇప్పటికే ఆయన రాజ్యాంగాన్ని మార్చేశారు. తాజా విజయంతో మరో ఆరేళ్ళు ఆ పదవి ఆయనదే. ఇలాగే, వచ్చే 2030లో సైతం పుతిన్ విజయం సాధిస్తే, కొత్త చరిత్ర ఆవిష్కృతమవుతుంది. అదే జరిగితే, 31 ఏళ్ళ పాటు అధికారం చలాయించిన స్టాలిన్ రికార్డును పుతిన్ తిరగరాసినట్టవుతుంది. పైపెచ్చు, పుతిన్ ఈసారి విజయం సాధిస్తూనే... అమెరికా సారథ్యంలోని ‘నాటో’ కూటమి గనక ఉక్రెయిన్లో బలగాలను మోహరిస్తే సహించబోమన్నారు. అదే గనక జరిగితే ‘పూర్తిస్థాయిలో మూడో ప్రపంచ యుద్ధమే’ అని హెచ్చరించడం గమనార్హం. నిజానికి, మార్చి 15 – 17 మధ్య జరిగిన తాజా ఎన్నికలు పెద్ద ప్రహసనం. అభ్యర్థులుగా అధి కారిక ఆమోదం పొందిన ప్రత్యర్థులు పేరుకు రంగంలో ఉన్నారు. కానీ, బరిలో నిలిచేందుకూ, పోటీలో గెలిచేందుకూ వారు ఇసుమంతైనా ప్రయత్నించలేదు. ఉక్రెయిన్తో రష్యా యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న మరో ఇద్దరు పాపులర్ వ్యక్తులు సైతం మొదట బరిలో ఉన్నారు. తీరా పుతిన్ విజ యంపై ఎంతో కొంత ప్రభావం చూపగల వారి అభ్యర్థిత్వాన్ని సాంకేతిక కారణాలతో తోసిపుచ్చారు. ఇక గత 2018 ఎన్నికల వేళ పుతిన్కు కంటిలో నలుసైన జనాకర్షక ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ గత నెల ఓ ఆర్కిటిక్ జైలులో అంతుచిక్కని రీతిలో మరణించారు. మాస్కో యుద్ధం సందర్భంగా రష్యా కలిపేసుకున్న నాలుగు ఉక్రెయిన్ ప్రావిన్సుల్లోనూ ఓటింగ్ జరిగింది. అయితే, సాయుధ బలగాల కనుసన్నల్లో బలవంతపు ఓటింగ్ వల్ల ఫలితం ఏమిటన్నది అర్థమై పోయింది. ఒకపక్క ఎన్నికలు జరుగుతుండగానే రష్యా భూభాగంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు కొనసాగాయి. కీవ్, దాని పాశ్చాత్య భాగస్వామ్య పక్షాల నుంచి మాస్కోకు ముప్పు తప్పదని తేల్చాయి. పుతిన్ అయిదోసారి గెలిచినా, ప్రజాక్షేత్రంలో అసమ్మతి పుష్కలం. ఫక్తు ఫార్సుగా మారిన ఎన్నికల్ని నిరసిస్తూ, కొందరు ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో రంగు పోశారు. అలాగే, నావల్నీ నివాళికి వేలాది రష్యన్లు హాజరవడం గమనార్హం. అయితే, దేశాన్ని పూర్తిస్థాయి ఏకవ్యక్తి పాలనగా మార్చేసేందుకు పుతిన్కు దక్కిన వరం – ఉక్రెయిన్తో యుద్ధం. ‘ప్రత్యేక సైనిక చర్య’గా స్వల్పకాలిక దాడితో ఉక్రెయిన్పై పైచేయి సాధించాలని ఆయన మొదట భావించారు. తీరా అది దీర్ఘకాలిక పోరై, నష్టా లకు దారి తీసింది. అయినా, అణచివేత కొనసాగిస్తూ, పాశ్చాత్య ప్రపంచంతో సుదీర్ఘ యుద్ధంలో అంతిమ విజయం మనదేనంటూ రష్యన్లతో పుతిన్ నమ్మబలికారు. సలహాదారుల మాట పెడచెవిన పెట్టి, యుద్ధాన్ని ప్రచారంలో ప్రధానాంశం చేశారు. యుద్ధంపై నిరసన నేరమంటూ, నిరసించే పౌరులంతా ‘విదేశీ ఏజెంట్లే’ అంటూ చట్టమే చేశారు. ఎవరేమనుకున్నా మళ్ళీ అధ్యక్షుడయ్యారు. దేశమంతా తన వెంటే ఉందని చాటేందుకు పుతిన్ ఈ ఎన్నికను అవకాశంగా వాడుకున్నారు. అణచివేత మాట అటుంచితే, రష్యాలో ఇప్పటికీ పాపులర్ నేతనని నిరూపించుకున్నారు. ఉక్రెయిన్తో పోరులోనూ మొదట కొద్దినెలలు గట్టి ఎదురుదెబ్బలు తగిలినా, అనూహ్యంగా ఇప్పటికీ పట్టు నిలుపుకొన్నారు. కఠినమైన ఆర్థిక ఆక్షలు ఎదురైనా, దేశ ఆర్థిక వ్యవస్థను అంచనాలను మించేలా నిలబెట్టగలిగారు. పాశ్చాత్య బ్రాండ్లు దేశం విడిచివెళ్ళినా, అదే విధమైన స్థానిక ఉత్పత్తులతో సామన్యులపై ప్రభావం పడకుండా చూసుకున్నారు. ముడి చమురు కొనుగోళ్ళకు యూరప్ అడ్డం తిరిగినా, భారత్, చైనా, టర్కీలతో ఆదాయం పుష్కలంగా కొనసాగేలా చూసుకున్నారు. రష్యాకు రాజకీయ, ఆర్థిక సుస్థిరత సమకూర్చినప్పటికీ, దేశాన్ని నిరంకుశ పాలనలోకి దింపడమే పెద్ద చిక్కు. అయితే, ఇష్టమున్నా, కష్టమైనా కనీసం మరో ఆరేళ్ళ పాటు రష్యా సారథి పుతినే. అమెరికా, దాని మిత్రపక్షాలు సహా అందరూ ఆ వాస్తవాన్ని గుర్తించాలి. ఎలాగోలా పుతిన్కు నచ్చజెబితే తప్ప ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పుడప్పుడే తెర పడే పరిస్థితి లేదని గమనించాలి. పుతిన్తో వైరం పెరిగినకొద్దీ అది తూర్పు ఐరోపాకే కాక మొత్తం ప్రపంచానికే తలనొప్పి అని గ్రహించాలి. పాశ్చాత్యప్రపంచం సైతం తన వైఖరిలోని తప్పులను ఆత్మపరిశీలన చేసుకోవాలి. రష్యాకు మిత్రదేశాలైన భారత్, చైనా లాంటివి ఈ శత్రుత్వ ధోరణి సద్దుమణిగేలా ప్రయత్నించాలి. 2022లో ఉక్రెయిన్పై పుతిన్ జరపదలచిన అణ్వస్త్రదాడిని ఆపింది భారత ప్రధాని, ఇతర నేతలేనంటూ వస్తున్న తాజా కథనాలు విస్మరించలేనివి. అమెరికా, రష్యాలు రెంటితోనూ బలమైన బంధమున్న భారత్ శాంతియుత పరిష్కారానికై కృషి చేయాలి. ఎందుకంటే, ఉక్రెయిన్ యుద్ధం మరింత కాలం కొనసాగడం మానవాళికి ఏమాత్రం మేలు కాదు! -
రష్యాతో నాటో ఘర్షణకు దిగితే... మూడో ప్రపంచ యుద్ధమే
మాస్కో: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మరుక్షణమే వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ దేశాలకు యుద్ధ హెచ్చరికలు పంపారు. ‘‘అమెరికా సారథ్యంలోని నాటో కూటమి, రష్యా సైన్యం మధ్య ప్రత్యక్ష ఘర్షణలు జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. ఆధునిక ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. కానీ అంతటి దారుణ విపత్తును ఎవరూ కోరుకోరు’’ అన్నారు. ఉక్రెయిన్ సైన్యానికి తోడుగా కదనరంగంలోకి ఫ్రాన్స్ బలగాలను దింపే ఉద్దేశముందన్న ఆ దేశ అధ్యక్షుడు మేక్రాన్ వ్యాఖ్యలపై పుతిన్ ఇలా స్పందించారు. ‘‘ఉక్రెయిన్ యుద్ధంలో వందలాది ఇంగ్లిష్, ఫ్రెంచ్ సైనికులు చనిపోయారు. ఇది సరికాదు’’ అన్నారు. చర్చలకు సదా సిద్ధం ఉక్రెయిన్ సైన్యం దాడులు ఇలాగే కొనసాగితే దాని చుట్టూ ఒక బఫర్ జోన్ను సృష్టిస్తామని పుతిన్ అన్నారు. ‘‘దాన్ని దాటి వైరి సైన్యం రష్యా భూభాగంలోకి అడుగుపెట్టడం అసాధ్యం. పూర్తిగా ఓటమి పాలయ్యేలోపు శాంతి బాట పట్టడం ఉత్తమం. చర్చలకు సిద్ధమని మేం మొదట్నుంచీ చెబుతున్నాం’’ అన్నారు. రష్యా అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగలేదన్న అమెరికా, పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. అమెరికాలోనే ఎన్నికలు సజావుగా జరగడం లేదని విమర్శించారు. ట్రంప్కు వ్యతిరేకంగా అధ్యక్షుడు బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 2030 దాకా అధ్యక్ష పీఠంపై రష్యా రాజకీయ వ్యవస్థపై పుతిన్ పట్టు మరోసారి రుజువైంది. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించారు. పోలైన ఓట్లలో 87.29 శాతం (7.6 కోట్ల) ఓట్లు ఆయనకు పడ్డట్టు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సోమవారం ప్రకటించింది. పుతిన్కు ఇన్ని ఓట్లు రావడం ఇదే తొలిసారి. ఆరేళ్లపాటు, అంటే 2030 దాకా పుతిన్ అధ్యక్షునిగా కొనసాగుతారు. ఆయనకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల భాగస్వామ్యం మరింత సుధృఢంకావాలని అభిలషించారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఉత్తరకొరియా పాలకుడు కిమ్, హోండురాస్, నికరాగ్వా, వెనిజులా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాధినేతలూ పుతిన్కు శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమదేశాలు మాత్రం ఈ ఎన్నికలు పెద్ద మోసమని విమర్శించాయి. నవాల్నీని వదిలేద్దామనుకున్నాం.. దివంగత విపక్ష నేత అలెక్సీ నవాల్నీ ప్రస్తావనను పుతిన్ తొలిసారిగా బహిరంగంగా తెచ్చారు. ‘‘ఖైదీల మార్పిడిలో భాగంగా నవాల్నీని విదేశాలకు అప్పగించి పశ్చిమదేశాల జైళ్ల నుంచి రష్యన్లను వెనక్కు తెద్దామని మా అధికారుల సలహాకు వెంటనే ఒప్పుకున్నా. ఆ లోపే ఆయన జైల్లో చనిపోయారు. కొన్ని అలా జరుగుతాయంతే. ఇదే జీవితం’’ అన్నారు. -
అడుగు దూరంలో వరల్డ్ వార్-3.. హెచ్చరించిన పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం అడుగు దూరంలోనే ఉందని పశ్చిమ దేశాలను పుతిన్ హెచ్చరించారు. ఇక, తాజాగా జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ భారీ మెజార్టీతో మరోసారి ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దాదాపు 88శాతం ప్రజల మద్దతుతో ఆయన రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం, పుతిన్ మాట్లాడుతూ.. ఆధునిక ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. మూడో ప్రపంచ యుద్ధం అడుగు దూరంలో ఉంది. రష్యా, అమెరికా నేతృత్వంలోని నాటో కూటమికీ మధ్య ఘర్షణ తలెత్తితే మాత్రం అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని హెచ్చరించారు. అయితే దీన్ని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. ఇదే సమయంలో భవిష్యత్తులో తమ సైన్యాన్ని ఉక్రెయిన్కు పంపుతామన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వ్యాఖ్యలను పుతిన్ తప్పుబట్టారు. ఇక, మార్చి 15 నుంచి 17 మధ్య రష్యా ఎన్నికల సమయంలో ఉక్రెయిన్ దాడులను తీవ్రతరం చేసింది. సరిహద్దు ప్రాంతాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా ఉక్రెయిన్లోని ఖార్కివ్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం అవసరమని మీరు భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు పుతిన్.. దాడులు ఇలాగే కొనసాగితే తమ భూభాగాన్ని రక్షించడానికి రష్యా మరింత ఉక్రేనియన్ భూభాగం నుంచి బఫర్ జోన్ను సృష్టిస్తుందని చెప్పారు. ఇది చదవండి: రష్యా అధ్యక్ష ఎన్నికలు.. పుతిన్ ఘన విజయం ఉక్రెయిన్లో నాటో సైనిక సిబ్బంది ఇప్పటికే ఉన్నారని, రష్యా యుద్ధభూమిలో ఇంగ్లిష్, ఫ్రెంచ్ దళాలు తలపడుతున్నాయి. ఇందులో వారికి ఎటువంటి మంచి జరగడం లేదు.. ఎందుకంటే వారు అక్కడ పెద్ద సంఖ్యలో చనిపోతున్నారని అన్నారు. ఈ రోజు జరుగుతున్న విషాద సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, కీవ్ పాలనలోని భూభాగాల్లో ఒక నిర్దిష్ట 'శానిటరీ జోన్'ని సృష్టించడానికి మేము ఏదో ఒక సమయంలో బలవంతపు చర్యలు చేపడతామని పుతిన్ చెపుకొచ్చారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించడానికి మాత్రం పుతిన్ నిరాకరించారు. ఇదే సమయంలో ఉక్రెయిన్లో యుద్ధాన్ని తీవ్రతరం చేయడాన్ని మెక్రాన్ ఆపివేసి.. శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించాలని తాను కోరుకుంటున్నానని పుతిన్ అన్నారు.. ‘నేను పదే పదే చెబుతున్నాను.. నేను మళ్లీ అదే చెబుతాను.. మేము శాంతి చర్చల కోసం ఉన్నాం.. కానీ శత్రువుల తూటాలు అయిపోతున్నందుకు కాదని వ్యాఖ్యలు చేశారు. -
రష్యాలో ఎన్నికల తంతు!
ఆపద్ధర్మ ఏలుబడితో కలుపుకొని ప్రధానిగా, దేశాధ్యక్షుడిగా పాతికేళ్లనుంచి అవిచ్ఛిన్నంగా రష్యా అధికార పీఠాన్ని అంటిపెట్టుకునివున్న వ్లాదిమిర్ పుతిన్ మరోసారి సార్వత్రిక ఎన్నికల తంతుకు తెరలేపారు. మూడురోజులపాటు జరిగే ఈ ఎన్నికలు శుక్రవారం మొదలయ్యాయి. 14 కోట్ల 30 లక్షలమంది జనాభాగల రష్యాతోపాటు 2014లో అది దురాక్రమించిన క్రిమియా... 2022 నుంచీ దాని ఆక్రమణలోవున్న ఉక్రెయిన్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఎన్నికలు జరుగుతాయి. ప్రభుత్వ మీడియా మినహా మరి దేనికీ చోటీయని రష్యాలో చిన్నపాటి అసమ్మతి వినిపించే ప్రయత్నం చేసినా పెద్ద నేరమవుతుంది. అందుకే ఎన్నికల ముందు నిర్వహించిన సర్వేలన్నీ పుతిన్కు 80 శాతం ప్రజల ఆమోదం వున్నదని చాటాయి. కనుక 71 యేళ్ల పుతిన్ మరోసారి విజయం సాధించి అయిదోసారి అధ్యక్షుడవుతారనీ, 2030 వరకూ ఆయనే పాలిస్తారనీ అందరికీ తెలుసు. ఈ ఎన్నికలు సక్రమంగా జరుగుతున్నాయని చెప్పటానికి నామమాత్రంగా ప్రత్యర్థులు కనబడతారు. కానీ వారెవరికీ ప్రజల్లో విశ్వసనీయత లేదు. ఒకప్పుడు దశాబ్దాలపాటు దేశాన్నేలిన కమ్యూనిస్టు పార్టీ ఏనాడో నామ మాత్రావశిష్టమైంది. ఆ పార్టీ తరఫున 75 యేళ్ల నికొలాయ్ ఖరిటోనోవ్ పోటీచేస్తున్నారు. 2004లో పుతిన్పై మొదటిసారి ఓడిన ఆయన్నే ఈసారి కూడా ఆ పార్టీ నిలబెట్టింది. ఎటూ గెలవని ఎన్నికల కోసం మరొకరిని ముందుకు తోయటం అనవసరమని ఆ పార్టీ భావించివుండొచ్చు. లిబరల్ డెమొ క్రాటిక్ పార్టీ అభ్యర్థి లియోనెడ్ స్లట్స్కీ... పుతిన్ మాదిరే జాతీయవాది. ఆయన గెలుపే తన గెలు పని స్లట్స్కీ ఇప్పటికే ప్రకటించారు. ఉదారవాదిగా ముద్రపడి ఉక్రెయిన్లో ‘శాంతి’ నెలకొనాలని తరచు చెప్పే న్యూ పీపుల్ పార్టీ అధినేత వ్లాడిస్లావ్ దవాన్కోవ్ది కూడా అదే తీరు. ఇక ఉక్రెయిన్తో తలపడటాన్ని తప్పుబట్టిన చరిత్రగల ఇద్దరు అభ్యర్థులను అధికారులు ‘అనర్హులుగా’ తేల్చారు. చాలా దేశాలకు ఇది ఎన్నికల నామ సంవత్సరం. ఇప్పటికే బంగ్లాదేశ్, తైవాన్ ఎన్నికలుపూర్తయ్యాయి. మన దేశంతోపాటు అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఇండొనేసియా తదితర 60 దేశాల్లో ఈ ఏడాదంతా వేర్వేరు నెలల్లో ఎన్నికలుంటాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 200 కోట్లమంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. అంటే ప్రపంచ జనాభాలో నాలుగోవంతన్నమాట! అయితే విజేతలై గద్దెనెక్కేవారు ప్రజాస్వామ్యబద్ధంగానే పాలిస్తారా అన్నది వేరే సంగతి. ఎందుకంటే ప్రజా స్వామ్యం ముసుగేసుకున్న నియంతలూ, సమాజంలో పరస్పర వైషమ్యాలు రెచ్చగొట్టే నేతలూ, గాలి కబుర్లతో గద్దెనెక్కాలనుకునేవారూ ఈ దేశాలన్నిటా వున్నారు. కానీ పుతిన్ మాదిరి బరితెగించిన నేత ఎక్కడా కనబడరు. క్రితంసారి ఎన్నికలకన్నా ఎక్కువ పోలింగ్ అయిందనీ, పుతిన్కు అధిక శాతం మద్దతు లభించిందనీ ‘నిరూపించటానికి’ అధికారగణం ఎక్కడలేని పాట్లూ పడుతూవుంటుంది. 2018 ఎన్నికల సమయంలో పోలైన ఓట్లలో పుతిన్కు 5 కోట్ల 60 లక్షల ఓట్లులభించాయి. కనుక ఈసారి అది ఆరు కోట్లు దాటాలన్నది వారి పట్టుదల. తమ అధీనంలోని ఉక్రెయిన్ భూభాగంలో 45 లక్షలమంది ఓటర్లున్నారని అధికారులు చెబుతున్నారు. కానీ నిత్యం బాంబుల వర్షం కురిసేచోట నిజానిజాలు నిర్ధారించేదెవరు? వారందరికీ ఆన్లైన్ వోటింగ్కు అవకాశం ఇచ్చామని అధికారులు ప్రకటించారు. కనుక రిగ్గింగ్ ఈసారి పాత రికార్డులు బద్దలుకొడుతుందని నిర్ధారణగా చెప్పవచ్చు. వారం పదిరోజుల్లో ఉక్రెయిన్ లెక్క తేల్చి, యుద్ధ విజేతగా చాటుకుని అధ్యక్ష ఎన్నికలకు వెళ్లాలని పుతిన్ తపించారు. కానీ 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలైన నాటి నుంచీ రష్యాకు అడుగడుగునా అవరోధాలే. అమెరికా ఉక్రెయిన్కు భారీయెత్తున సైనిక, ఆర్థిక సాయం అందించటమే కాదు...‘ఉక్రెయిన్ తర్వాత మీవంతే’ అని నాటో కూటమి దేశాలను బెదరగొట్టి ఆ దేశం పక్షాన నిలబడేలా చేసింది. కనుక యుద్ధం రెండేళ్లుదాటి మూడోసంవత్సరంలోకి ప్రవేశించినా పుతిన్కు అక్కడ దారీ తెన్నూ కనబడటం లేదు. పైపెచ్చు ఆయుద్ధంలో రష్యా సైనికులు భారీ యెత్తున మరణిస్తుండటం, అత్యాధునిక ఆయుధాలు అక్కరకు రాకుండా పోవటం, ఉక్రెయిన్ డ్రోన్ దాడులను నిలువరించటంలో వైఫల్యం వంటివి ఆయనకు నిరాశ కలిగిస్తున్నాయి. కానీ ఆ యుద్ధం వల్ల పుతిన్కు జనాల్లో ఆమోదనీయత పెరిగిందని ప్రభుత్వ మీడియా ఊదరగొడుతోంది. అయితే పుతిన్ ఏలుబడి నల్లేరు మీద నడక కాదు. 2006–08 మొదలుకొని రెండేళ్లనాడు మొదలైన ఉక్రెయిన్ దురాక్రమణ యుద్ధం వరకూ ఏదో పేరిట చెలరేగే నిరసనలు తలనొప్పిగానే వున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా, హక్కుల ఉల్లంఘన, దురాక్రమణ యుద్ధాలను నిరసిస్తూ ఈ ఉద్యమాలు సాగాయి. అయితే పుతిన్ వాటన్నిటినీ అణిచేసి, జైళ్లు నింపారు. ప్రస్తుతం రాజకీయ ఖైదీల సంఖ్య 1,16,000 పైమాటే. దేశ పౌరుల్లో పుతిన్ పాలనపై తీవ్ర అసంతృప్తి వుంది. ప్రభుత్వ వ్యయంలో 40 శాతం యుద్ధానికే కేటాయించాల్సివస్తోంది. అయినా ఫలితం నాస్తి. నిరుడు జీడీపీ 3.6 శాతంగా నమోదై జీ–7 దేశాలను అధిగమించింది. రక్షణరంగ పరిశ్రమలు మాత్రమే పచ్చగా వర్ధిల్లుతున్నాయి. అమెరికా ఆంక్షల పర్యవసానంగా దేశంలో అనేక వ్యాపార ‡సంస్థలు కుప్పకూలి మూతబడ్డాయి. వాస్తవాదాయాలు పడిపోయి, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటి పౌరులు సతమతమవుతున్నారు. దానికితోడు అంతర్జాతీయంగా ఏకాకులమయ్యామన్న అసంతృప్తి అదనం. కానీ అధ్యక్ష ఎన్నికల్లో వీటి ప్రభావం కనబడనీయకపోవటం పుతిన్ ప్రత్యేకత. ఈ రీతి, రివాజు ఎన్నాళ్లు కొనసాగుతుందో, నిజమైన ప్రజాస్వామ్యం రష్యాలో ఎప్పుడు చిగురిస్తుందో చూడాలి. -
మొదలైన రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్
వ్లాదిమిర్ పుతిన్ పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చే దేశం రష్యా. చాలా సంవత్సరాలుగా పుతిన్ ఏలుబడిలో ఉన్న రష్యాలో ఇవాళ్టి నుంచి మూడు రోజులు కీలకంగా మారనుంది. అందుకు కారణం.. ఆ దేశానికి అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం. గతంలో ఒక్కరోజులో పోలింగ్ పూర్తయ్యేది. అయితే.. దేశ చరిత్రలో తొలిసారిగా వరసగా మూడు రోజులపాటు అంటే 15, 16, 17 తేదీల్లో పోలింగ్కు రష్యా సిద్ధమైంది. శుక్రవారం పోలింగ్ ప్రారంభమైందక్కడ.. ప్రస్తుత పదవీకాలంతో కలిపి పుతిన్ ఇప్పటికే నాలుగు సార్లు(2000, 2004, 2012, 2018)లో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. 2008లో ప్రధానిగానూ సేవలందించారు. మానవహక్కుల గొంతుక, విపక్ష నేత అలెక్సీ నావల్నీ గత నెల మారుమూల కారాగారంలో అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఈసారి పుతిన్ వ్యతిరేక ఓటింగ్ పెరుగుతుందా? లేదా అనేది వేచిచూడాలి. ఉక్రెయిన్పై దురాక్రమణతో ప్రస్తుతం తన అధీనంలో ఉన్న నాలుగు ఉక్రెయిన్ రీజియన్లలోనూ ఈ ఎన్నిక క్రతువు కొనసాగనుంది. పుతిన్ హవా.. అధ్యక్ష రేసులో పుతిన్ విజయబావుటా ఎగరేస్తారని ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ మీడియా కోడైకూస్తోంది. అయినా సరే పౌర హక్కులను కాలరాస్తూ, నియంత పోకడలతో దేశాన్ని ఏలుతున్న పుతిన్ పాలనకు అంతం పలుకుతామంటూ విపక్ష పార్టీల నేతలు ప్రతినబూనారు. ఎన్నికల రణరంగంలో పుతిన్ను ఓడిస్తామంటూ లిబరల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ రష్యా(ఎల్డీపీఆర్) తరఫున అభ్యరి్థగా లియోనిడ్ స్లట్స్కీ, న్యూ పీపుల్ పార్టీ అభ్యరి్థగా వ్లాదిస్లేవ్ దవాన్కోవ్, కమ్యూనిస్ట్ పార్టీ అభ్యరి్థగా నికోలే ఖరిటోనోవ్లు ఎన్నికల బరిలో నిలిచారు. దేశ ఓటర్లలో పుతిన్కు 75 శాతం మద్దతు ఉందని, ఈ ముగ్గురు తలో 5 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటారని ముందస్తు పోలింగ్ అంచనాలు విశ్లేíÙస్తున్నాయి. పోలింగ్ ఎక్కడెక్కడ? పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ గురువారం కంటే ముందే మొదలుపెట్టారు. శుక్రవారం సాధారణ ఓటింగ్ మొదలైంది. ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాలపై పుతిన్ ప్రధానంగా దృష్టిపెట్టారు. రష్యా భూభాగంలో ఎలాగూ మెజారిటీ సాధిస్తానని పుతిన్ బలంగా నమ్ముతున్నారు. ఉక్రెయిన్ ప్రాంతాల్లో గెలిచి తమది అధర్మ యుద్ధం కాదని ప్రపంచానికి చాటి చెప్పాలని పుతిన్ యోచిస్తున్నారు. ఇక్కడ స్థానిక ఎన్నికలు, రెఫరెండమ్లు ఇప్పటికే నిర్వహించారు. అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘనకు గురయ్యాయని ప్రపంచదేశాలు మొత్తుకున్నా పుతిన్ పట్టించుకోవట్లేదు. ఈసారి 11.42 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలుస్తోంది. అర్హులైన ఓటర్లు విదేశాల్లో ఉన్నా సరే ఓటేయొచ్చు. మార్చి 19 కల్లా తొలి దఫా ఫలితాలు వెల్లడి కావచ్చు. తుది ఫలితాలు తెలియాలంటే మార్చి 29వ తేదీకా ఆగాల్సిందే. 2018 గత అధ్యక్ష ఎన్నికల్లో 68 శాతం పోలింగ్ నమోదైంది. ఇంకెన్నాళ్లు పుతిన్ పాలిస్తారు? మరో రెండు పర్యాయాలు దేశ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అనువుగా చట్టం చేసి 2021లో పుతిన్ దానిపై సంతకం చేశారు. ఈసారి గెలిచి, 2030లోనూ గెలిస్తే 2036దాకా పుతిన్ దేశాధ్యక్షుడిగా కొనసాగుతారు. రష్యా పాలకుడు జోసెఫ్ స్టాలిన్ తర్వాత అత్యంత ఎక్కువకాలం దేశాన్ని పాలించిన నేతగా పుతిన్ పేరు ఇప్పటికే చరిత్రకెక్కింది. కుంభస్థలిని కొట్టగలరా ? పోటీలో ఏ అభ్యర్థి నిలబడాలి అనేది దాదాపు దేశ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) నిర్ణయిస్తుంది. ఎల్డీపీఆర్ నేత లియోనిడ్ స్లట్స్కీ, న్యూ పీపుల్ పార్టీ నేత వ్లాదిస్లేవ్ దవాన్కోవ్, కమ్యూనిస్ట్ పార్టీ నేత నికోలే ఖరిటోనోవ్లు ఈసారి బరిలో దిగారు. పుతిన్ను వీరంతా విమర్శిస్తున్నప్పటికీ ఉక్రెయిన్తో యుద్ధాన్ని వీరు వ్యతిరేకించలేదు. యుద్ధాన్ని వ్యతిరేకించిన ఏకైక విపక్ష నేత బోరిస్ నదేహ్దిన్ను పోటీకి నిలబడకుండా సీఈసీ అడ్డుకుంది. అభ్యరి్ధత్వానికి సరిపడా సంతకాలను సేకరించలేకపోయారని ఆయన అభ్యరి్ధత్వాన్ని తిరస్కించింది. మరో అభ్యర్ధి యెకటేరియా డుంట్సోవానూ సీఈసీ ఇలాగే పక్కకునెట్టింది. పుతిన్ను ప్రధానంగా విమర్శించే విపక్ష నేత అలెక్సీ నావల్నీ ఇప్పుడు ప్రాణాలతో లేడు. స్లట్స్కీ, దవాన్కోవ్, ఖరిటోనోవ్లు దేశ సమైక్యత విషయానికొచ్చేసరికి పుతిన్కు పరోక్షంగా మద్దతు పలుకుతారు. ఈ లెక్కన దేశ సమైక్యత జెండా పట్టిన పుతిన్కే ఎక్కువ ఓట్లు పడతాయి. దీంతో వీళ్లు పుతిన్ను ఓడించడం అనేది అసంభవం. పుతిన్కు నిజంగా అంతటి ఫాలోయింగ్ ఉందా? రష్యా పౌరులు ఆంక్షల చట్రం, నిఘా నీడలో జీవిస్తారని పశి్చమదేశాలు తరచూ ఆరోపిస్తుంటాయి. దీంతో పుతిన్ను ఇష్టపడే ఎన్నుకుంటున్నారా లేదంటే మరో ప్రత్యామ్నాయం లేక పుతిన్కు జై కొడుతున్నారా అనేది ఇతమిద్ధంగా ఎవరికీ తెలీదు. పుతిన్ పాపులారిటీ 80 శాతాన్ని దాటేసిందని అక్కడి ప్రభుత్వేతర ఎన్నికల మేథో సంస్థ ‘ది లెవడా సెంటర్’ ఇటీవల ప్రకటించింది. అయితే 2023 చివరి నుంచి దేశవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరవరలు ఎగిసిన నేపథ్యంలో పుతిన్ పాలనపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగాయని సంస్థ విశ్లేషించడం గమనార్హం. తనను వ్యతిరేకించే వాళ్లను పుతిన్ అస్సలు సహించలేడని పుతిన్కు గతంలో ప్రసంగాలు రాసి ఇచ్చిన అబ్బాస్ గలియమోవ్ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పుతిన్ సేనలకు చెక్.. ఉక్రెయిన్కు బ్రిటన్ భారీ సాయం
లండన్: ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్ తీవ్ర ప్రాణ, నష్టాన్ని చవిచూస్తోంది. మరోవైపు.. చాలా దేశాలు ఉక్రెయిన్కు అండగా నిలుస్తూనే ఉన్నాయి. తాజాగా ఉక్రెయిన్ను బ్రిటన్ భారీ సాయాన్ని అందించినున్నట్టు స్పష్టం చేసింది. కాగా, రష్యా దాడులను సమర్థంగా ఎదుర్కోవడానికి ఉక్రెయిన్కు 10,000 డ్రోన్లు అందిస్తామని బ్రిటన్ తెలిపింది. అయితే, బ్రిటన్ రక్షణ శాఖ మంత్రి గ్రాంట్ షాప్స్ కీవ్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. గతంలో డ్రోన్ల కోసం ఉక్రెయిన్కు 256 మిలియన్ డాలర్ల ప్యాకేజీని బ్రిటన్ ప్రకటించింది. దానికి అదనంగా మరో 160 మిలియన్ డాలర్లను ఈ డ్రోన్ల కోసం కేటాయించారు. 🇬🇧#Britain is set to provide over 10,000 drones to #Ukraine, as reported by European Pravda, citing British Defense Secretary Grant #Shapps. During his visit to Kyiv, he announced that the UK will allocate £325 million to acquire more than 10,000 drones for of Ukraine. 📷: AFP pic.twitter.com/hhL1smfiVz — KyivPost (@KyivPost) March 7, 2024 ఈ ఆయుధ ప్యాకేజీలో 1,000 కమికేజ్ (వన్వే అటాక్) డ్రోన్లు ఉండనున్నాయి. ఇవి నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయగలవు. యూకే అందించిన ఆయుధాలతో ఉక్రెయిన్ బలగాలు నల్ల సముద్రంలో రష్యా నౌకాదళంపై సమర్థంగా దాడి చేస్తున్నట్లు షాప్స్ ఈ సందర్భంగా తెలిపారు. కొద్దిరోజులుగా రష్యా నౌకాదళంపై అనూహ్య దాడులు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం సైతం నల్లసముద్రంలో పెట్రోలింగ్ చేస్తున్న రష్యా యుద్ధనౌకను ఉక్రెయిన్ సముద్ర డోన్లు ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో అది తీవ్రంగా దెబ్బతింది. -
ఉగ్రవాదిగా ఆ దిగ్గజం! ఇది పుతిన్ ఆడే చదరంగం
ప్రత్యర్థుల అణచివేతకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎందాక అయినా వెళ్తారని కళ్లారా చూస్తున్నదే!. నావల్నీ మరణం.. అందుకు ఒక ఉదాహరణ. తాజాగా చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్Garry Kasparovను రష్యా ఉగ్రవాదుల జాబితాలో చేర్చడం.. ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పుతిన్ ప్రభుత్వంపై ఆయన బహిరంగంగా విమర్శలు గుప్పించడమే అందుకు ప్రధాన కారణమని ఇక్కడ చెప్పనక్కర్లేదు. అసలు 'ఉగ్రవాదులు, తీవ్రవాదులు' లిస్టులో చేరడానికి రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఎలాంటి విధానాలు పాటిస్తోంది?.. ఉగ్రవాదులు-అతివాదుల జాబితాలో చేరడానికి ప్రత్యేకించి అర్హతలేమీ అక్కర్లేదు. పుతిన్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే చాలూ. ఇలాగే ఇప్పుడు కాస్పరోవ్ పేరును తీవ్రవాదులు-ఉగ్రవాదుల జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యను సైతం ఈ చెస్ మాజీ ఛాంపియన్ బహిరంగంగానూ ఖండిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రోస్ఫిన్మానిటరింగ్ (రష్యా ఆర్థిక పర్యవేక్షణా సంస్థ) విడుదల చేసిన ఉగ్రవాదుల జాబితాలోకి గ్యారీ కాస్పరోవ్ పేరు చేరింది. గ్యారీ కాస్పరోవ్ ప్రభుత్వ అణచివేత విధానాలకు భయపడి 2014లోనే ఆయన రష్యా నుంచి వెళ్లిపోయారు. పదేళ్లుగా అమెరికాలోనే ఉంటున్నారు. 2022లో రష్యా న్యాయశాఖ ఆయనపై విదేశీ ఏజెంట్ అనే ముద్ర కూడా వేసింది. తాజాగా.. ఈ జాబితాలో ఆయన పేరును చేర్చడం వల్ల ఆయన ఆర్థిక లావాదేవీలపై తీవ్ర ఆంక్షల్ని విధించేందుకు రష్యాకు అవకాశం ఉంటుంది. కాగా, గ్యారీ కాస్పరోవ్పై పుతిన్ సర్కార్ తీసుకున్న చర్యలను హక్కుల సంఘాలు తప్పుబడుతున్నాయి. అణచివేతకు ఈ ఆంక్షలను రష్యా ప్రభుత్వం ఆయుధంగా ఉపయోగిస్తుందని మండిపడుతున్నాయి. -
‘ఉక్రెయిన్ యుద్ధంలో హైపర్సోనిక్ మిసైల్స్ వాడాం’
గత రెండేళ్ల నుంచి రష్యా.. ఉక్రెయన్పై దాడులతో యుద్ధం చేస్తూనే ఉంది. పలు ప్రాంతాలు రష్యా ఆక్రమించుకుంది. మరోవైపు పలుదేశాల మద్దతుతో ఉక్రెయిన్ సైతం రష్యా దాడులకు భయపడకుండా అదును చూసుకోని ప్రతిదాడులకు దిగుతోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ఆయన జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి గురువారం మాట్లాడారు. రష్యా ఆరేళ్ల కిందట ప్రవేశపెట్టిన అత్యాధునిక ఆయుధాలను ప్రస్తుతం ఉపయోగిస్తున్నట్లు పుతిన్ వెల్లడించారు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో కింజాల్, సిర్కాన్ లాంటి హైపర్సోనిక్ మిసైల్స్ను రష్యా సైనిక బలగాలు వాడుతున్నట్లు పేర్కొన్నారు. అవి ఉక్రెయిన్ మిలిటరీ స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో దాడి చేసినట్లు కూడా తెలిపారు. అవన్గార్డ్ స్ట్రాటజిక్ హైపర్సోనిక్ గ్లైడర్లు, పెరిస్వెల్ లేజర్ వ్యవస్థలు ఇప్పటికే పనిచేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా హైపర్సోనిక్ గ్లైడర్లు.. లక్ష్యం దిశగా అణ్వాయుధాలను మోసుకెళ్లుతాయి. హై ఆల్టిట్యూడ్లో అత్యంత వేగంగా ఆ మిసైల్స్ ప్రయాణిస్తాయి. త్వరలోనే హెవీ స్ట్రాటజిక్ ఖండాంతర బాలిస్టిక్ సర్మట్ మిసైల్స్ను విడుదల చేయనున్నట్లు పుతిన్ తెలిపారు. అణ్వాయుధ సహిత క్రూయిజ్ మిసైల్ బురెవెస్నిక్తో పాటు అండర్ వాటర్ అణ్వాయుధ పోసిడాన్ డ్రోన్ ట్రయల్స్ చివరి దశకు చేరుకున్నాయని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. -
Russia-Ukraine War: యుద్ధం X రెండేళ్లు
సైనికంగా సూపర్ పవరైన రష్యా చోటా దేశమైన ఉక్రెయిన్పై ఉన్నట్టుండి విరుచుకుపడి నేటికి రెండేళ్లు. ఉక్రెయిన్ ‘సంపూర్ణంగా నిస్సైనికీకరణే’ లక్ష్యంగా 2022 ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేపట్టిన ఈ దుందుడుకు చర్య ప్రపంచ దేశాలన్నింటినీ నిత్యం ఏదోలా ప్రభావితం చేస్తూనే వస్తోంది. రోజుల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం రెండేళ్లు దాటినా కొనసాగుతూనే ఉందంటే ఉక్రెయిన్ కనబరచిన తిరుగులేని తెగువే ప్రధాన కారణం. కానీ కొన్నాళ్లుగా ఉక్రెయిన్ క్రమంగా చతికిలపడుతుండగా రష్యా దూకుడు పెంచుతోంది. అయినా లొంగేందుకు ఉక్రెయిన్ ససేమిరా అంటోంది. పైగా ఆక్రమిత భూభాగాల నుంచి వైదొలగి, తమకు కలగజేసిన అపార నష్టానికి రష్యా భారీగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఇప్పుడప్పట్లో ముగిసే సూచనలు కని్పంచడం లేదు... యుద్ధం తొలినాళ్లలో రష్యా దూకుడు ప్రదర్శించింది. రష్యా సేనలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపం దాకా దూసుకెళ్లాయి. యూరప్లోనే అతి పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్కేంద్రాన్ని ఆక్రమించడంతో యావత్ యూరప్ ఖండం భద్రతాపరమైన ఆందోళనలతో ఉలిక్కిపడింది. కానీ ఆ జోరుకు నెల రోజుల్లోనే బ్రేకులు పడ్డాయి. ఉక్రెయిన్ దళాలు ముప్పేట దాడులతో రష్యా సైన్యాన్ని దిగ్బంధించాయి. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల దన్నుతో పైచేయి సాధిస్తూ వచ్చాయి. వాటి తీవ్ర ఆంక్షలతో రష్యా అతలాకుతలమైంది. కానీ సెప్టెంబర్ నాటికి జపోరిజియాతో పాటు కీలకమైన డొనెట్స్క్, లుహాన్స్క్, ఖెర్సన్ ప్రాంతాలను స్వా«దీనం చేసుకున్నట్టు ప్రకటించింది. రష్యాకు చెందిన భారీ యుద్ధ నౌకలతో పాటు క్రిమియాతో రష్యాను కలిపే కీలక బ్రిడ్జిని పేల్చేయడం వంటి చర్యలతో ఉక్రెయిన్ అప్పుడప్పుడూ పైచేయి సాధిస్తూ వచి్చంది. 2023 మేలో ఏకంగా మాస్కోలో పుతిన్ అధికార నివాసమైన క్రెమ్లిన్పై రెండు ఉక్రెయిన్ డ్రోన్లు దూసుకెళ్లి కలవరం రేపాయి. తర్వాత నుంచీ ఉక్రెయిన్ దూకుడు నెమ్మదించసాగింది. ఉక్రెయిన్ డ్రోన్ల దాడి దెబ్బకు తొలుత అపార నష్టం చవిచూసిన రష్యా సైన్యం తానూ అదే బాట పట్టింది. కొంతకాలంగా ఇరు బలగాలూ డ్రోన్లపైనే ప్రధానంగా ఆధారపడుతున్నాయి! విదేశాల నుంచి భారీగా అందుతున్న వాటికి అదనంగా 2023లోనే ఉక్రెయిన్ ఏకంగా 3 లక్షల డ్రోన్లను తయారు చేసుకుంది! వాటిని 2024లో 10 లక్షలకు పెంచజూస్తోంది. వీటికి చిన్న తరహా మిసైళ్లు తోడవుతున్నాయి. ఇప్పుడేంటి...! రష్యా తాజాగా ఉక్రెయిన్లోని అది్వవ్కా నగరాన్ని ఆక్రమించింది. ఆ క్రమంలో అతి భారీగా ఆయుధ సామగ్రిని కోల్పోయింది. కాకపోతే కొన్నాళ్లుగా విపరీతంగా వచి్చపడుతున్న చమురు అమ్మకాల లాభాలతో రెట్టించిన ఉత్సాహంతో యుద్ధాన్ని తీవ్రతరం చేస్తోంది. పైగా లక్షలాదిగా అదనపు సైనికులను సిద్ధం చేసుకుంటోంది. ఇవన్నీ ఉక్రెయిన్కు భారీ హెచ్చరిక సంకేతాలే. స్వీయ సాయుధ సామగ్రి నిండుకుంటుండటమే గాక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అమెరికా, పాశ్చాత్య దేశాల నుంచి సాయమూ బాగా తగ్గింది. ఏదేమైనా రష్యా గెలిచేదాకానో, పుతిన్ అధికారంలో ఉన్నంత వరకో యుద్ధం కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ పోరులో ఉక్రెయిన్ మాత్రం ఇప్పటికే బహుశా ఇంకెప్పటికీ కోలుకోలేనంతగా దెబ్బ తిన్నది. అపార నష్టం... ► యుద్ధంలో మరణించిన, క్షతగాత్రులైన రష్యా, ఉక్రెయిన్ సైనికుల సంఖ్య ఏకంగా 5 లక్షలు దాటినట్టు అంచనా. ► 12,000 మందికి పైగా అమాయక ఉక్రేనియ న్లు యుద్ధానికి బలయ్యారు. 20,000 పై చిలుకు మంది క్షతగాత్రులయ్యారు. ► కోటి మంది దాకా ఉక్రేనియన్లు నిర్వాసితులయ్యారు. వీరిలో 60 లక్షలకు పైగా విదేశాలకు వలసబాట పట్టారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతి పెద్ద వలసగా నిలిచింది. ► అమెరికా, పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కు ఇప్పటికే బిలియన్ల కొద్దీ ఆర్థిక సాయం, అంతకు మించి అత్యాధునిక ఆయుధ సాయం చేస్తూ వస్తున్నాయి. ► ఐఎంఎఫ్ కూడా 15.6 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందజేసింది. యుద్ధంలో ఉన్న ఓ దేశానికి ఆర్థిక సాయం ఐఎంఎఫ్ చరిత్రలోనే తొలిసారి. ► రెండేళ్ల యుద్ధంలో 20 శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని మాత్రమే రష్యా ఆక్రమించగలిగింది. అందులోనూ సగం తిరిగి తమ వశమైనట్టు ఉక్రెయిన్ చెబుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పుతిన్ ప్రైవేట్ ఆర్మీలో తెలంగాణ వాసులు
సాక్షి, హైదరాబాద్: రష్యాలో సెక్యూరిటీ గార్డు, హెల్పర్ ఉద్యోగాలు ఇప్పిస్తామన్న బ్రోకర్ల వలకు చిక్కి 12 మంది భారతీయ యువకులు ప్రస్తుతం ప్రాణభయంతో విలవిల్లాడుతున్నారు. ఉక్రెయిన్పై పోరులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్కు చెందిన ప్రైవేటు సైన్యం ‘ది వాగ్నర్’ గ్రూప్లో బలవంతంగా పనికి కుదర్చడంతో వారంతా బాంబులు, తుపాకుల మోత మధ్య బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. తమను వీలైనంత త్వర గా తిరిగి తీసుకెళ్లాలని తమ కుటుంబీకులకు ఆడి యో, వీడియో సందేశాలు పంపుతున్నారు. ఈ బాధితుల్లో హైదరాబాద్లోని బజార్ఘాట్కు చెందిన మహమద్ అస్ఫాన్, నారాయణ్పేట జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ మహ్మద్ సుఫియన్ ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. నమ్మించి మోసం.. బాబా బ్లాగ్స్ పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహించే ఫైసల్ ఖాన్ అలియాస్ బాబా ప్రస్తుతం షార్జాలో ఉంటున్నాడు. దాదాపు 50 వేల మంది ఫాలోవర్లు ఉన్న తన బ్లాగ్ ద్వారానే రష్యాలో సెక్యూరిటీ గార్డు, హెల్పర్ ఉద్యోగాలు ఉన్నాయంటూ ఎర వేశాడు. దీనికి ఆకర్షితుడైన బజార్ఘాట్ ప్రాంతానికి చెందిన మహమద్ అస్ఫాన్ (30) మొదట బాబాను సంప్రదించాడు. ఏడాది కాలం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేలా రష్యాలో ఉద్యోగాలు ఉన్నాయని నమ్మబలికాడు. అతన్నుంచి రూ.3 లక్షలు వసూలు చేసి ఉద్యోగం ఖరారు చేస్తానంటూ నమ్మబలికాడు. మాస్కోలోని తన సబ్ ఏజెంట్లు సుఫాయాన్, మోయిన్, రమేష్లను సంప్రదించాలని సూచించాడు. దీంతో గతేడాది నవంబర్ 12న అస్ఫాన్ చైన్నె విమానాశ్రయం నుంచి షార్జా మీదుగా రష్యా చేరుకున్నాడు. ఈ ప్రయాణం కోసం విజిట్ వీసా ఏర్పాటు చేసిన బాబా.. జాబ్ వీసాను మోయిన్ ఇస్తాడని నమ్మించాడు. అక్కడకు వెళ్లిన అతన్ని రిసీవ్ చేసుకున్న రమేష్ సెక్యూరిటీ ఉద్యోగం అని చెప్పి తీసుకువెళ్లాడు. సంతకాలు తీసుకొని.. మాస్కోలోని ఒక మాల్లో పని చేయాలంటూ రష్యన్ భాషలో రాసి ఉన్న పత్రంపై అస్ఫాన్తో రమేష్ సంతకాలు చేయించాడు. రమేష్, మోయిన్లు అస్ఫాన్ సహా 12 మంది భారతీయులను ఆ సమీపంలోని సైనిక శిబిరానికి తీసుకెళ్లి తుపాకులు వినియోగించడంలో ప్రాథమిక శిక్షణ ఇచ్చారు. సెక్యూరిటీ గార్డు విధుల్లో భాగంగానే ఇది ఇస్తున్నట్లు నమ్మించారు. ఆపై వారిని దాదాపు వెయ్యి కి.మీ. దూరంలోని ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి చేర్చారు. దీంతో తాను సంతకం చేసింది పుతిన్కు చెందిన ప్రైవేట్ ఆర్మీ ది వాగ్నర్ గ్రూప్లో ఏడాదిపాటు పని చేసేందుకని అస్ఫాన్ ఆలస్యంగా గుర్తించాడు. ఆజాద్ యూసుఫ్ అనే భారతీయుడు తమ కళ్లెదుటే అశువులు బాయడంతో మిగిలిన వారంతా ఆందోళన చెందారు. అనంతరం వారిని అక్కడ నుంచి ఉక్రెయిన్లోని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. రూ. లక్ష జీతమంటూ సుఫియన్ను మోసగించి... నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన డ్రైవర్ జహీర్, నాసీమా రెండో కుమారుడు సయ్యద్ మహ్మద్ సుఫియన్ ఇంటర్ వరకు చదువుకొని 2021లో జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లి హోటల్లో పనిచేస్తున్నాడు. అక్కడే అతనికి బాబా పరిచయమయ్యాడు. దుబాయ్లో పనిచేస్తే రూ.30 వేలే వస్తాయ్..అదే రష్యాలో హెల్పర్గా పనిచేస్తే రూ.లక్ష వరకు జీతం వస్తుందని నమ్మించాడు. ఇందుకుగాను తనకు రూ.3 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. అందుకు సుఫియన్ అంగీకరించడంతో తల్లిదండ్రులు అప్పు చేసి ఆ డబ్బు కుమారుడికి ఇచ్చారు. డిసెంబర్ 17న దుబాయ్కు అక్కడి నుంచి 18న రష్యాకు సుఫియాన్ వెళ్లాడు. రక్షించాలంటూ సందేశాలు.. అస్ఫాన్ గతేడాది డిసెంబర్ 13 వరకు కుటుంబీకులతో సంప్రదింపులు జరిపినా ఆపై సిగ్నల్స్ దొరకలేదు. మిగిలిన 11 మందికీ సరైన సిగ్నల్స్ లభించక కుటుంబీకులకు ఆడియో, వీడియో సందేశాలు పంపారు. వాటిలోనే తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ రికార్డుల్లో బాంబుల మోతలు, తుపాకీ కాల్పులు వినిపిస్తున్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు. అస్ఫాన్ సోదరుడు ఇమ్రాన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘అస్ఫాన్కు భార్య, కుమార్తె (2), కుమారుడు (8 నెలలు) ఉన్నారు. ఉక్రెయిన్లోని యుద్ధక్షేత్రంలో ఉన్న అతడిని ఇక్కడకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అస్ఫాన్ ఇటీవల పంపిన సందేశంలో వారి చుట్టూ ఉన్న వాళ్లు యుద్ధంలో మరణిస్తున్నారని చెప్పాడు. నన్ను వెనక్కు తీసుకురావడానికి ఏదైనా చేయాడంటూ వేడుకున్నాడు’ అని పేర్కొన్నాడు. బాధిత కుటుంబాల కోరిక మేరకు స్పందించిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ అంశంపై మాస్కోలోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. -
పుతిన్ ప్రేమలో పడ్డారా? ఆమెతో సన్నిహితంగా!
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఒక మిస్టరీగా ఉంటుంది. 71 ఏళ్ల పుతిన్.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను బయట ప్రపంచానికి తెలియకుండా గోప్యంగా ఉంచుతారు. అయతే తాజాగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనకంటే 32 ఏళ్ల చిన్న వయస్సు గల ఎకటెరినా మిజులినాతో సన్నిహితంగా ఉంటున్నారని తెలుస్తోంది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. 39 ఏళ్ల ఎకటెరినా మిజులినాతో పుతిన్ ప్రేమాయానం కొనసాగిస్తున్నారని ఓ కథనాన్ని ప్రచురించింది. ఎకటెరినా మిజులినా ఒక చరిత్రకారిణి. రష్యా అనుకూల సేఫ్ ఇంటర్నెట్ లీగ్ సంస్థకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. ఈ సంస్థ ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు, ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధంపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను సెన్సార్ చేస్తూ ఉంటుంది. రష్యాకు వ్యతిరేకంగా ఆన్లైన్ వ్యాపించే వ్యతిరేకమైన కంటెంట్ను నిషేధిస్తుంది. ఎకటెరినా మిజులినా.. 69 ఏళ్ల సెనేటర్ ఎలెనా మిజులినా కుమార్తె. ఎలెనా మిజులినాకు అధ్యక్షుడు పుతిన్ బలమైన మద్దతుదారు అనే పేరుంది. ‘అందమైన బార్బీ బొమ్మలాంటి ఆకర్షించే రూపాన్ని కలిగిన ఉన్న మిజులినా అధ్యక్షుడు పుతిన్ పట్ల అభిమానం, విధేయత కలిగి ఉంటారు. ఎకటెరినా మిజులినా.. అధ్యక్షుడు పుతిన్కు సరైన జోడి. పుతిన్ అభిరుచికి అనుగుణంగా ఎకటెరినా ఉంటుంది’అని రష్యన్ మానవ హక్కుల కార్యకర్త ఓల్గా రొమానోవా ఉక్రెయిన్ న్యూస్ చానెల్కు తెలిపారు. మిజులినా.. 2004లో లండన్ విశ్వవిద్యాలయం కళా చరిత్ర, ఇండోనేషియా భాషలో పట్టభద్రులయ్యారు. 2017లో సేఫ్ ఇంటర్నెట్ లీగ్లో చేరడానికి ముందు చైనాను సందర్శించే అధికారిక రష్యన్ ప్రతినిధుల బృందానికి అనువాదకురాలిగా పనిచేశారు. రహస్య ప్రేయసి అలీనా కబయేవా? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఓ రహస్య ప్రేయసి ఉందని, ఆమె పేరు అలీనా కబయేవా అని, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఆమె అజ్ఞాతంలో ఉందనే టాపిక్ నడిచింది. అలీనా కబయేవా.. గతంలో జిమ్నాస్ట్గా ఉండేది. పుతిన్ విడాకుల తర్వాత ఆయనతో చనువుగా ఉంటోంది. ఆపై మీడియా మేనేజర్గా.. ప్రస్తుతం రష్యా రాజకీయాల్లోనూ ఆమె తన మార్క్ చూపిస్తోందని వార్తలు వచ్చాయి. చదవండి: Vladimir Putin Secret Lover: పుతిన్ రహస్య ప్రేయసి.. ఇప్పుడు ఎక్కడ దాక్కుంది? -
పుతిన్పై పోరాటమే..
మాస్కో: రష్యా ప్రభుత్వం, అధ్యక్షుడు పుతిన్పై పోరాటం కొనసాగిస్తానని ఇటీవల మృతి చెందిన ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ భార్య యూలియా నవాల్నయా ప్రతిజ్ఞ చేశారు. సోమవారం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో పలువురు ఈయూ నేతలను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు. భర్త నవాల్నీ అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. ఆయన్ను సుదూర ప్రాంతంలో ఉండే జైలుకు పంపి పొట్టన పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్ను, ఈ పాపంలో పాలు పంచుకున్న వారందరినీ శిక్షించేదాకా పోరాటం కొనసాగిస్తానన్నారు. నవాల్నీ మృతదేహాన్ని ఆయన తల్లికి అప్పగించేందుకు కూడా అధికారులు నిరాకరిస్తున్నారని, సాక్ష్యాలు దొరక్కుండా చేయడమే వారి ఉద్దేశమని ఆరోపించారు. -
Alexei Navalny: నావల్నీ తల, ఒంటిపై కమిలిన గాయాలు
రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై అంతర్జాతీయ స్థాయిలో ఖండనలు వ్యక్తం అవుతున్నాయి. పుతిన్ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించారు గనుకే ఆయన్ని.. తీవ్రవాదం కేసులో జైలుకు పంపారని.. అక్కడే ఆయన్ని చంపేసి ఉంటారని అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆయన్ను హింసించారంటూ వస్తోన్న వార్తలను రష్యా ప్రభుత్వం ఖండించింది. సహజ కారణాల వల్లే చనిపోయారని చెబుతోంది. ఈ క్రమంలో.. ఓ కథనం వెలుగులోకి వచ్చింది. నావల్నీ తల, ఛాతీపై కమిలిన గాయాలున్నాయని స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. మృతదేహం మార్చురీకి తరలించినప్పుడు ఈ గాయాలు కనిపించాయని వైద్య నిపుణుడిని ఉటంకిస్తూ తెలిపింది. ‘‘సాధారణంగా జైల్లో చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను గ్లాజ్కోవా వీధిలోని బ్యూరో ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్కు తరలిస్తారు. ఈ కేసులో కొన్ని కారణాలతో బాడీని క్లినికల్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. తర్వాత మార్చురీ లోపలికి తీసుకువచ్చారు. అక్కడ ఇద్దరు పోలీసుల్ని కాపలా ఉంచారు. ప్రతిఒక్కరూ ఆయన మృతికి గల కారణం తెలుసు కోవాలనుకుంటున్నారు. ఈ గోప్యత దేనికి, వారు ఏదైనా దాచాలనుకుంటున్నారా..?’ అని ఆ వైద్యుడు ప్రశ్నించినట్లు ఆ కథనం పేర్కొంది. ఇదిలా ఉంటే.. సడెన్ డెత్ సిండ్రోమ్ వల్లే అలెక్సీ నావల్నీ చనిపోయినట్లు అధికారులు తనకు సమాచారం అందించారని ఆయన తల్లి లియుడ్మిలాకు మీడియాకు చెప్పారు. అదే సమయంలో.. మృతదేహాన్ని ఇప్పటికీ కుటుంబానికి అప్పగించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నావల్నీకి నివాళులర్పించేవారిని, ర్యాలీలు నిర్వహించేవారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. -
ఆయన మరణం పుతిన్ నాశనానికే: బైడెన్ ఫైర్
ఆయన చనిపోవడం నాకేం ఆశ్చర్యంగా అనిపించలేదు. నావల్నీ(అలెక్సీ నావల్నీ) చావుకి పుతిన్దే బాధ్యత, పుతిన్దే పూర్తి బాధ్యత.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు బైడెన్.. రష్యా ప్రతిపక్ష నేత, పుతిన్ విమర్శకుడు అలెక్సీ నావల్నీ(47) హఠాన్మరణంపై యావత్ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. అర్కిటిక్ సర్కిల్లోని రష్యా పీనల్ కాలనీలో కారాగార శిక్ష అనుభవిస్తున్న ఆయన.. ఉన్నట్లుండి కుప్పకూలి మరణించారని.. వైద్యులు ప్రయత్నించినా లాభం లేకపోయిందని అధికారిక వర్గాలు ప్రకటించాయి. అయితే.. అంతకు ముందు రోజు కూడా కోర్టు విచారణకు నవ్వుతూ హాజరైన నావల్నీ.. ఉన్నట్లుండి మరణించడంతో క్రెమ్లిన్ పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలెక్సీ నావల్నీ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం వైట్హౌజ్లో ఆయన మాట్లాడుతూ.. నావల్నీ మరణం నాకేం ఆశ్చర్యంగా అనిపించలేదు. ఆయనొక పోరాటయోధుడు. అవినీతి విషయంలో పుతిన్ను ఎదురించాడు. పుతిన్ ప్రభుత్వ పాల్పడుతున్న హింసకు ధైర్యంగా అడ్డుచెప్పాడు. నావల్నీ(అలెక్సీ నావల్నీ) చావుకి పుతిన్దే బాధ్యత.. ఇది పుతిన్ వినాశనానికి దారి తీయక తప్పదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. మరోవైపు నావల్నీ మృతిపై పూర్తిస్థాయి నివేదికను రూపొందించే పనిలో ఉన్నట్లు వైట్హౌజ్ వర్గాలు వెల్లడించాయి. #WATCH | On the death of jailed Russian opposition figure and Kremlin critic Alexey Navalny, US President Joe Biden says, "...Putin is responsible for Navalny's death. Putin is responsible..." (Video source: Reuters) pic.twitter.com/6xpoKvAnA4 — ANI (@ANI) February 17, 2024 ఇంకోవైపు మ్యూనిచ్ భద్రతా సదస్సులో పాల్గొన్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్.. అలెక్సీ నావల్నీ భార్య యూలియాని కలిసి ఓదార్చారు. ఆ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ యూలియా కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘నా భర్త మృతి నిజమే అయితే అందుకు పుతిన్, ఆయన అనుచర గణమే బాధ్యులు. ఎప్పటికైనా వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు’’ అని యూలియా అన్నారు. అతి(తీవ్ర)వాదం అభియోగాలపై కిందటి ఏడాది ఆగస్టులో అలెక్సీ నావల్నీకి 19 ఏళ్ల జైలుశిక్ష పడింది. ‘‘నా ప్రాణం ఉన్నంతవరకు లేదా ఈ (పుతిన్) ప్రభుత్వం ఉన్నంత కాలం నేను జైల్లోనే ఉంటానన్న సంగతి నాకు తెలుసు’’ అని నాటి తీర్పు సమయంలో నావల్నీ వ్యాఖ్యానించారు. రెండు నెలల కిందటే ఆయన్ని.. అర్కిటిక్ సర్కిల్లోని రష్యా పీనల్ కాలనీకి తరలించారు. ఇదీ చదవండి: నిరసన గళం మూగబోయింది పుతిన్ హేట్స్ నావల్నీ రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ విధానాలను వ్యతిరేకిస్తూ నావల్నీ అనేక నిరసనలు చేపట్టారు. అందుకుగాను పలుమార్లు అరెస్టయ్యారు. గత అధ్యక్ష ఎన్నికల్లో నావల్నీ పోటీ చేశారు. వ్లాదిమిర్ పుతిన్కు ఆయనంటే తీవ్ర కోపం. నావల్నీ పేరును పలికేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. నావల్నీకి మరింత ఎక్కువ పేరు రావొద్దనే ఆయన పేరును పుతిన్ పలికేవారు కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఎప్పుడైనా ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే.. ఆ వ్యక్తి అని మాత్రమే సంబోధించేవారు. ఆది నుంచీ ధిక్కార స్వరమే! ప్రభుత్వ అధికారుల అవినీతిపై ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. పుతిన్ సర్కారు పాలనా విధానాల్లో లోపాలను తీవ్రంగా ఎండగట్టారు. ఈ క్రమంలో తన ప్రాణాలకు ముప్పు ఎదురైనా లెక్కచేయలేదు. నాయకులు/అధికారుల అవినీతిపై స్వతంత్ర దర్యాప్తు జరిపి అనేక కీలక వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వరంగ టీవీ ఛానళ్లలో నావల్నీకి ఏమాత్రం ప్రచారం లభించేది కాదు. అయితే యూట్యూబ్ వీడియోలు, సామాజిక మాధ్యమ ఖాతాలతో ఆయన జనానికి బాగా దగ్గరయ్యారు. -
ట్రంప్ కంటే బైడెన్ నయం: పుతిన్
మాస్కో: తెంపరితనం, దూకుడుకు మారుపేరైన డొనాల్డ్ ట్రంప్తో పోలిస్తే జో బైడెన్ను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా చూడాలనుకుంటున్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశాభావం వ్యక్తంచేశారు. రష్యా అధికారిక టీవీ ఛానెల్కు బుధవారం ఇచి్చన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పుతిన్ పలు అంశాలపై మాట్లాడారు. ‘‘ రాబోయే అమెరికా ఎన్నికల్లో ఎవరు అధ్యక్షుడు అయినా వారితో రష్యా ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది. రష్యా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే ట్రంప్ కంటే బైడెన్ గెలిస్తేనే మంచిదని అనుకుంటున్నా. ఎందుకంటే ఉపాధ్యక్షుడిగానూ, అధ్యక్షుడిగానూ పనిచేసిన బైడెన్కు అనుభవం ఎక్కువ. పాతకాలం విధానాలను అవలంభించే నేత ఆయన. ఆయనను కొంత అంచనావేయొచ్చు కూడా. ట్రంప్ ఆలోచనలు అనూహ్యం’ అని అన్నారు. బైడెన్ ఆరోగ్యం సరిగా లేదంటూ వస్తున్న వార్తలపై పుతిన్ను ప్రశ్నించగా.. ‘ నేనేమీ డాక్టర్నుకాదు. అయి నా ఇలాంటి ప్రశ్నకు వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. అయితే బైడెన్ ఆరోగ్య సమస్యలు వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రభావం చూపగలవు. నేను గమనించినంత వరకు బైడెన్ ఆరోగ్యంగానే ఉన్నారు. అధ్యక్షుడిగా కొనసాగే సత్తా ఆయనకు లేదు అని నేనైతే అనుకోను. పేపర్ వైపు చూసే ప్రసంగం చదువుతారనేది వాస్తవం. నేను కూడా కొన్ని సార్లు ప్రసంగపాఠాన్ని చూసే చదువుతా. అదేమంత పెద్ద విషయం కాదు. ఏదేమైనా బైడెన్ ప్రభుత్వ విధానాలు చాలా తప్పు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తోనే చెప్పా’’ అని పుతిన్ వెల్లడించారు. -
క్యాన్సర్ వ్యాక్సిన్ తయారికి దగ్గరలో ఉన్నాం: పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా ప్రజల శుభవార్త చెప్పారు. కొన్నాళ్ల నుంచి వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషికి త్వరలో ఫలితం దక్కనుందని తెలిపారు. అతి త్వరలో ప్రాణాంతకమైన క్యాన్సర్కు రష్యా వైద్య శాస్త్రవేత్తలు క్యాన్సర్కు వాక్సిన్ తయారు చేసి అందుబాటులోకి తీసుకురానున్నారని వెల్లడించారు. ‘మేము ఒక క్యాన్సర్ కొత్త జనరేషన్కు సంబంధించి వ్యాక్సిన్లు, ఇమ్యునోమోడ్యులేటరీ డ్రగ్స్ తయారికి దగ్గరగా వచ్చాం. అతి త్వరలో కొత్తగా తయరు చేసిన క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది వ్యక్తిగత థెరపీకి ఈ వ్యాక్సిన్ వినియోగంలోకి వస్తుంది’అని అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. అయితే ఎటువంటి క్యాన్సర్కు వ్యాక్సిన్ కనిపెట్టబోతున్నారన్న విషయాన్ని మాత్రం అధ్యక్షుడు పుతిన్ వెల్లడించకపోవటం గమనార్హం. పలు దేశాలు, కంపెనీలు క్యాన్సర్ వ్యాక్సిన్ తయారికి కృషి చేస్తున్నాయి. గత ఏడాది బ్రిటన్ ప్రభుత్వం జర్మనీకి చెందిన బయోఎన్టెక్ కంపెనీతో ఒప్పదం చేసుకుంది. 2030 నాటికి సుమారు పదివేల మంది పేషెంట్లలకు క్లినికల్ ట్రయల్స్ ద్వారా క్యాన్సర్ చికిత్స అందిచాలని లక్ష్యం పెట్టుకుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీలు మోడెర్నా, మెర్క్ అండ్ కో ఒక ప్రయోగాత్మక క్యాన్సర్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నాయి. సుమారు మూడేళ్ల చికిత్స తర్వాత ప్రాణాంతకమైన చర్మ క్యాన్సర్ మెలనోమా పేషెంట్లలో మరణం సంభవించే అవకాశాన్ని సగానికి తగ్గించనుందని ఆయా కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్ ద్వారా తెలుస్తోంది. ఇక.. కరోనా సమయంలో రష్యా స్పూతినిక్-వి అనే వ్యాక్సిన్ తయారు చేసిన విషయం తెలిసిందే. తమ దేశం తయారు చేసిన ఈ కరోనా వ్యాక్సిన్ను అధ్యక్షుడు పుతిన్ స్వయంగా తీసుకొని ప్రజలకు నమ్మకం కల్పించారు. చదవండి: అమెరికా స్పోర్ట్స్ పరేడ్లో కాల్పులు.. ఒకరు మృతి, 22 మందికి గాయాలు -
‘ఓడితే.. చంపేస్తారు’
శాక్రమెంటో(కాలిఫోర్నియా): ప్రపంచ బిలీయనీర్ ఎలాన్ మస్క్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదని.. ఒకవేళ పుతిన్ ఓడితే గనుక ఆయన్ని హతమారుస్తారంటూ మస్క్ వ్యాఖ్యానించారు. ‘ఎక్స్’ స్పేసెస్ వేదికపై పలువురు ప్రముఖ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చలో సోమవారం ఎలాన్ మస్క మాట్లాడుతూ.. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గరనే అనుకుంటున్న. ఒకవేళ ఓడితే మాత్రం.. కచ్చితంగా ఆయన్ని హతమార్చే అవకాశం ఉంది. కాబట్టే.. ఆయన ఈ యుద్ధాన్ని కొనసాగిస్తారు. ఆయనపై అంత ఒత్తిడి ఉంది అని మస్క్ చెప్పారు. అయితే మస్క్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ‘‘గతంలోనూ నేను ఇదే చెప్పా. ఆ సమయంలో నన్ను చాలామంది విమర్శించారు. కానీ, వాస్తవాలు వేరు. అవి అంతా తెలుసుకోవాలి. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ గెలిచే అవకాశమే లేదు. గెలుస్తుందనుకోవడం ఆ దేశానికి మంచిది కాదు. పైగా ఇంకా ఎక్కువ రోజులు యుద్ధం జరిగితే వాళ్లకే( ఉక్రెయిన్)కే ప్రమాదం. యుద్ధంలో.. అమెరికా ప్రకటించే ఆర్థిక సాయం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు’’ అని మస్క్ తేల్చేశారు. అదే సమయంలో రష్యాతో స్పేస్ ఎక్స్ ఒప్పందం రద్దు అంశాన్ని ప్రస్తావించిన మస్క్.. ఈ యుద్ధంలో తన మరో కంపెనీ పోషిస్తున్న పాత్రపైనా వివరణ ఇచ్చారు. ‘‘రష్యాను అణచివేయడానికి మా కంపెనీల కంటే మరేవీ గొప్పగా పనిచేయలేదు. ఉక్రెయిన్కు ఇప్పటికే స్పేస్ఎక్స్ స్టార్లింక్ సేవలను అందిస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా కీవ్ సమాచార వ్యవస్థలో ఇప్పుడు అది కీలకంగా మారింది. రెండువైపులా ప్రాణనష్టాన్ని నిలువరించడమే తన లక్ష్యమని అన్నారాయన. -
పుతిన్ సంపాదన ఇంత తక్కువా?
వ్లాదిమిర్ పుతిన్ ఆరేళ్లుగా రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది మార్చిలో రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు సంబంధించిన ఆదాయ వివరాలు వెల్లడి కావడం.. ఆ వివరాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఆయన తన ఎన్నికల అఫిడవిట్ పత్రాల్లో ఆదాయం, ఆస్తుల వివరాలు పొందుపరిచారు. తాజాగా ఆయన అఫిడవిట్ వివరాలు ఎన్నికల సంఘం వెబ్సైట్లో పబ్లిష్ చేసింది. గత ఆరేళ్ల నుంచి ఆయన ఆస్తుల విలువ 67.6 మిలియన్ రెబెల్స్ (7,53,000 ఆమెరికన్ డాలర్లు)గా పుతిన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. 2018 నుంచి 2024 వరకు పుతిన్ సంపాధించిన ఆస్తుల విలువ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ పత్రాల వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ డిపాజిట్లు, మిలిటరీ పెన్షన్, పలు స్థలాల అమ్మకం ద్వారా లభించిన మొత్తంగా తెలుస్తోంది. ఇక అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడి వార్షిక జీతమే 4,00,000 అమెరికన్ డాలర్లు. ఈ లెక్క ప్రకారం రష్యా అధ్యక్షుడి వార్షిక ఆదాయం అమెరికా అధ్యక్షుడి కంటే చాలా తక్కువగా ఉండటం గమనార్హం. రష్యా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. పుతిన్ పది వేర్వేరు బ్యాంక్ ఖాతాల్లో 54.5 మిలియన్ రెబెల్స్( 606,000 అమెరికన్ డాలర్లు) నగదు కలిగి ఉన్నారు. ఆయన ఐదు సొంత వాహనాలు కూడా ఉన్నాయి. అందులో రెండు పాతకాలం సోవియట్ యూనియన్ కార్లు GAZ M-21s ఉన్నాయి. 2009లో రష్యా తయారైన 4x4 కారు, 1987 నాటి క్యాంపింగ్ ట్రైలర్ ఉన్నాయి. పుతిన్ మాస్కోలో ఒక అపార్టుమెంట్, సెయింట్ పిరట్స్బర్గ్లో ఒక అపార్టుమెంట్, గ్యారేజ్ కలిగి ఉన్నారు. అయితే పుతిన్ ఫిన్లాండ్ సరిహద్దుల్లో రహస్య నివాసం ఉందని స్థానిక మాస్కో టైమ్స్ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనం ప్రచురించిన ఒక్క రోజు తర్వాత పుతిన్ ఆదాయ, ఆస్తుల విషయాలు కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా వెల్లడికావటంపై చర్చ జరుగుతోంది. కరేలియాలోని లేక్ లడోగా నేషనల్ పార్క్లో పుతిన్ అత్యధునిమైన రహస్య నివాసాన్ని కలిగి ఉన్నట్లు పేర్కొంది. వివాలవంతమైన సౌకర్యాలు ఉన్నట్లు తెలిపింది. ఇక.. రష్యా అధ్యక్ష ఎన్నికలు మార్చి 15 నుండి 17 వరకు మూడు రోజుల్లో జరుగనున్నాయి. 2020లో వివాదాస్పద రాజ్యాంగ సంస్కరణను అనుసరించి పుతిన్(71) కనీసం 2036 వరకు అధికారంలో కొనసాగవచ్చు. -
ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసలు
మాస్కో: ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పలు ప్రతికూల పరిస్థితుల్లో కూడా భారత్ అమలు పరుస్తున్న విదేశి విధానాలు అసాధారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఇటువంటి సమయంలో అన్ని రంగాల్లో ప్రపంచం వ్యాప్తంగా దూసుకుపోవటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంటి ధృడమైన నాయకత్వం ఉండటమే కారణమని మోదీపై పుతిన్ ప్రశంసలు కురిపించారు. భారత్ను శక్తివంతమైన దేశంగా ముందుకు నడిపించటంలో మోదీ గుర్తింపు పొందారని పుతిన్ అభిప్రాయపడ్డారు. గురువారం కలింగ్రాడ్ ప్రాంతంలో నిర్వహించిన ‘రష్యన్ స్టుడెంట్ డే’ కార్యక్రమంలో పుతిన్ పాల్గొన్నారు. ‘ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత్. సమర్థవంతమైన నాయకత్వం లక్షణాలు ఉన్న వ్యక్తి భారత్కు ప్రధానిగా ఉన్నారు. ప్రధాని నాయకత్వ పటిమ వల్లనే ఇండియా ఈ రోజు మనం చూస్తున్న వృద్ధిలోకి వచ్చింది’ పుతిన్ పేర్కొన్నారు. ‘ప్రపంచ వేదికలపై భారత్.. రష్యాపై ఎప్పుడూ వ్యతిరేకమైన వైఖరితో నిర్ణయాలు తీసుకోలేదు. రష్యాపై ఇప్పటివరకు ద్వంద వైఖరిని భారత్ ప్రదర్శించలేదు. అందుకే భారత్, ఆ దేశ నాయకత్వంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉంది’ అని పుతిన్ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి కార్యక్రమం రష్యాతోపాటు ప్రపంచ దేశాల్లో కూడా చర్చకు వస్తోందన్నారు. భారత్కు అంత్యంత ఎక్కువ విదేశి పెట్టుబడులు రష్యా నుంచి లభిస్తున్నాయని తెలిపారు. తమ దేశంలోని పలు కంపెనీలు భారత్లో ఇప్పటికే సుమారు సుమారు 23 బిలియన్ అమెరికా డాలర్ల మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టినట్లు వెల్లడించారు. చదవండి: ఖరీదైన బ్యాగ్ గిఫ్ట్.. దక్షిణ కొరియా రాజకీయాల్లో దుమారం -
North Korea: కిమ్ జోంగ్ ఉన్ కీలక నిర్ణయం.. రష్యా కోసం..
సియోల్: ఉత్తర కొరియా కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత తమ దేశంలోకి విదేశీ పర్యాటకులు వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో, రష్యాకు చెందిన ఓ గ్రూప్ నార్త్ కొరియాలో పర్యటించనున్నారు. ఈ బృందం ఫిబ్రవరి తొమ్మిదో తేదీన ఉత్తర కొరియాకు బయలుదేరనుంది. వివరాల ప్రకారం.. పర్యాటకుల విషయంలో ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2020లో కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత తమ దేశంలోకి మళ్లీ పర్యాటకులు వచ్చేందుకు తాజాగా నార్త్ కొరియా అనుమతి ఇచ్చింది. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నార్త్ కొరియా దాదాపు నాలుగు సంవత్సరాల పాటు పర్యాటకులకు అనుమతించలేదు. దేశంలోకి రాకుండా కఠిన నిబంధనలను విధించింది. ఇక, తాజాగా పర్యాటకులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో రష్యాకు చెందిన టూరిస్టులు ఫిబ్రవరి తొమ్మిదో తేదీన నార్త్ కొరియాకు వెళ్లనున్నారు. అక్కడ నాలుగు రోజులు పాటు పర్యటించనున్నారు. పలు సిటీల్లోకి ప్రవేశించనున్నారు. ఇదిలా ఉండగా.. ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెప్టెంబరులో తూర్పు రష్యాలో ఒక శిఖరాగ్ర సమావేశం కోసం కలుసుకున్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ ఆర్థిక, రాజకీయ, సైనిక రంగాలలో సహకారం అందించుకునేందుకు నిర్ణయించుకున్నారు. మరోవైపు.. ఉత్తరకొరియాకు చైనా నుంచి కూడా సహకారం అందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఎన్నో విషయాల్లో నార్త్ కొరియాకు జిన్పింగ్ మద్దతుగా నిలిచారు. కరోనా సమయంలో కూడా వ్యాక్సిన్లను నార్త్ కొరియాకు చైనా పంపించింది. -
పుతిన్ను ఎలాగైనా ఆపాల్సిందే: బైడెన్
వాషింగ్టన్: ఉక్రెయిన్ను సర్వనాశనం చేసేందుకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంకణం కట్టుకున్నారంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దుయ్యబట్టారు. ‘‘ఆయన యుద్ధోన్మాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవాల్సిందే. ఉక్రెయిన్పై రష్యా తాజాగా క్షిపణుల వర్షం కురిపించిన వైనం ఈ ఆవశ్యకతను మరోసారి గుర్తు చేసింది’’ అన్నారు. తమ దేశంపైకి రష్యా ఏకంగా 110 క్షిపణులను ప్రయోగించిందని, ఈ డాడిలో 31 మంది అమాయకులు బలవగా వందలాది మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం ప్రకటించడం తెలిసిందే. 2022లో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇదే అతి పెద్ద దాడి అని ఉక్రెయిన్ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ను అడ్డుకునేందుకు ఉక్రెయిన్కు మరింత సాయం అందిద్దామని అమెరికా చట్టసభ కాంగ్రెస్కు బైడెన్ పిలుపునిచ్చారు. -
పుతిన్ పిలిచారు.. ఉక్రెయిన్ సంక్షోభానికి తెర పడ్డట్లేనా?
మాస్కో: మూడో ఏడాదిలోకి అడుగుపెట్టక ముందే.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగియనుందా? శాంతి స్థాపనలో భారత్ పెద్దన్న పాత్ర వహించబోతోందా?.. తాజా పరిణామాలు అందుకు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. ఉక్రెయిన్ సంక్షోభం ముగించేందుకు ముందుకు రావాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం అందించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్నారు. బుధవారం ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో క్రెమ్లిన్లో జైశంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ఉక్రెయిన్ సంక్షోభం సహా పలు అంశాలపై వీళ్లు చర్చించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీని రష్యా పర్యటనకు పుతిన్ ఆహ్వానించారు. ‘‘మా చిరకాల మిత్రుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీని చూసేందుకు మేం ఆత్రుతతో ఉన్నాం. ఆయన్ని మా దేశానికి ఆహ్వానిస్తున్నాం. ఉక్రెయిన్ పరిణామాల్ని నేను ఆయనకు( భారత ప్రధాని మోదీ) ఎప్పటికప్పుడు వివరిస్తుంటాను. కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. సమస్యను శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడటానికి ఆయన తన శాయశక్తులా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాడని నేను నమ్ముతున్నా’’ అని జైశంకర్ వద్ద పుతిన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక చక్కని పరిష్కారం చూపగలరని తొలి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ భావిస్తూ వస్తున్నారు. ఈ విషయంపై తరచూ ఇరు దేశాల నేతలు చర్చించుకుంటున్నారనే విషయాన్ని జైశంకర్ మీడియాకు తెలిపారు. ఈ తరుణంలో మోదీకి పుతిన్ ఆహ్వానం ఆసక్తికర చర్చకు దారి తీసింది. పుతిన్ ఆహ్వానం మేరకు వచ్చే ఏడాది వేసవి లోపు.. వీలైతే ఫిబ్రవరిలోపే మోదీ రష్యాలో పర్యటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే విజయాన్నిరష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా ప్రెస్మీట్లో ధృవీకరించారు కూడా. Honoured to call on President Vladimir Putin this evening. Conveyed the warm greetings of PM @narendramodi and handed over a personal message. Apprised President Putin of my discussions with Ministers Manturov and Lavrov. Appreciated his guidance on the further developments of… pic.twitter.com/iuC944fYHq — Dr. S. Jaishankar (@DrSJaishankar) December 27, 2023 External Affairs Minister Dr S Jaishankar met Russian President Vladimir Putin in Moscow pic.twitter.com/aD7LCyjzDD — ANI (@ANI) December 28, 2023 ఇక.. భారత్-రష్యాల ద్వైపాక్షిక ఒప్పందాలు.. ఇతర సంబంధాల బలోపేతం కోసం జైశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. పుతిన్తో భేటీకి ముందు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో జైశంకర్ విడిగా భేటీ అయ్యారు. అంతకు ముందు.. ఇరుదేశాల ఆర్థిక సంబంధిత ఒప్పందాలకు సంబంధించి రష్యా ఉప ప్రధాని డెనిస్తో సమావేశం అయ్యారు. -
ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగానే పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్ష పదవికి వ్లాదిమిరి పుతిన్ ఈసారి స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేయనున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుతిన్ను ఆయన మద్దతుదారులు లాంఛనంగా ప్రతిపాదించారు. మరో ఆరేళ్ల కాలానికి 2024లో రష్యాలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో పుతిన్ అధికార యునైటెడ్ రష్యా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయట్లేదు. అయినప్పటికీ పుతిన్కు ఆ పార్టీ పూర్తి మద్దతునిచ్చింది. పార్టీ టికెట్పై కాకుండా అధ్యక్షునిగా ఇలా పోటీ చేయడానికి కనీసం 500 మంది మద్దతు అవసరమని రష్యా ఎన్నికల చట్టాలు చెబుతున్నాయి. ఇదేగాక 40 ప్రాంతాల నుంచి కనీసం 3 లక్షల మంది సంతకాలను సేకరించాల్సి ఉంటుంది. పుతిన్కు మద్దతు పలికినవారిలో అధికార 'యునైటెడ్ రష్యా పార్టీ' నేతలు, ప్రముఖ నటులు, గాయకులు, క్రీడాకారులు ఉన్నారు. పుతిన్ 2011లో నెలకొల్పిన రాజకీయ సంకీర్ణ కూటమి 'పీపుల్స్ ఫ్రంట్' ఏకగ్రీవంగా ఆయన్ని నామినేట్ చేసింది. త్వరలోనే దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టనున్నారు. 2012 ఎన్నికల్లోనూ ఆయన స్వతంత్రునిగానే బరిలో దిగారు. ఈ సారి కూడా ఆయన ఎన్నికవడం లాంఛనంగా మారనుంది. మరోమారు ఆరేళ్ల పాటు రష్యా అధ్యక్షునిగా పనిచేయనున్నారు. ఇదే చదవండి: బందీలపై కాల్పులు! -
మార్చిలో రష్యా ఎన్నికలు
మాస్కో: రష్యా అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీ ఖరారైంది. 2024 మార్చి 17న ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనపై రష్యా ఎగువ సభ ఫెడరేషన్ కౌన్సిల్ గురువారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో, అధికారికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమయినట్లేనని స్పీకర్ వలెంటినా మట్వియెంకో ప్రకటించారు. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన 71 ఏళ్ల వ్లాదిమిర్ పుతిన్ మరో విడత పోటీ చేస్తానంటూ అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఎన్నికల తేదీ ఖరారైనందున, ఐదో సారీ ఆయన బరిలో ఉంటారని భావిస్తున్నారు. ఆరేళ్ల ఆయన పదవీ కాలం 2024లో ముగియాల్సి ఉంది. కానీ, పుతిన్ తీసుకువచి్చన రాజ్యాంగ సంస్కరణల ప్రకారం 2024 తర్వాత మరో రెండు పర్యాయాలు అంటే 2036 వరకు అధికారంలో కొనసాగేందుకు వీలుంది. రాజకీయ అధికార యంత్రాంగంపై పూర్తి స్థాయిలో పట్టున్న పుతిన్ మార్చిలో జరిగే ఎన్నికల్లో మరో విడత ఎన్నిక కావడం తథ్యమని భావిస్తున్నారు. ఆయన ప్రత్యర్థులుగా భావిస్తున్న వారు జైళ్లలోనో, విదేశాల్లోనో ఉండిపోయారు. చాలా వరకు స్వతంత్ర మీడియా సంస్థలపై నిషేధాలు, నియంత్రణలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పుతిన్ను ఎదుర్కొనే వారెవరనే విషయం ఇంకా వెల్లడికాలేదు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగనున్నట్లు ఇప్పటి వరకు ప్రకటించిన ఇద్దరిలో, మాస్కో ప్రాంత మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు బోరిస్ నదేజ్దిన్, జర్నలిస్ట్, లాయర్ అయిన యక్తెరినా దుంట్సోవా ఉన్నారు. ఉక్రెయిన్తో ఏడాదికి పైగా కొనసాగుతున్న యుద్ధం, ప్రైవేట్ సైన్యాధిపతి యెవ్గెనీ ప్రిగోజిన్ విఫల తిరుగుబాటు వంటివి పుతిన్ ప్రజాదరణపై పెద్దగా ప్రభావం చూపుతున్న దాఖలాలు ఏవీ లేవని పరిశీలకులు అంటున్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకునే వారు.. రష్యా దిగువ సభ డూమాలో గానీ కనీసం మూడో వంతు ప్రాంతీయ శాసనసభలలో ప్రాతినిధ్యం లేని పార్టీ ద్వారా 40 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల నుంచి కనీసం లక్ష సంతకాలను సేకరించాలి. ఏ పారీ్టకీ సంబంధం లేకుండా పోటీ చేసే వారికి కనీసం 40 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల నుంచి 3 లక్షల సంతకాలు అవసరం. ఈ నిబంధనలు పుతిన్కు సైతం వర్తిస్తాయి. 2018లో స్వతంత్రుడిగా పోటీ చేసిన పుతిన్ తరఫున ప్రచారకర్తలు సంతకాలు సేకరించారు. 2012 ఎన్నికల్లో యునైటెడ్ రష్యా పార్టీ ఆయనను నామినేట్ చేసింది. దీంతో, సంతకాల సేకరణ అవసరం లేకుండాపోయింది. -
ఎనిమిది కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనండి: పుతిన్
మాస్కో: రష్యా జనాభాను పెంచడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ అన్నారు. మహిళలు ఎనిమిది మంది అంతకన్నా ఎక్కువ మంది పిల్లలను కనాలని, పెద్ద కుటుంబాలను ఏర్పరచాలని కోరారు. మంగళవారం మాస్కోలో జరిగిన వరల్డ్ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్లో ప్రసంగించారు. "మన పూర్వికులు చాలా మంది పిల్లలను కలిగి ఉండేవారు. మన అమ్మమ్మలు, ముత్తాతలలో చాలా మంది ఏడు, ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నారని గుర్తుంచుకోండి. వారంతా సాంప్రదాయక వారసత్వాన్ని కాపాడుకున్నారు. పెద్ద కుటుంబాలను ఏర్పరచడం మనకు ప్రస్తుతం తప్పనిసరి అవసరం. మన జాతి పునాదులకే గాక ఆద్యాత్మిక వారసత్వానికి ఇది ఎంతో ముఖ్యం" అని పుతిన్ అన్నారు. రష్యాలో గత కొన్ని ఏళ్లుగా జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. అంతేకాకుండా ఉక్రెయిన్ యుద్ధంలోనూ భారీ సంఖ్యలోనే మృతి చెందారు. ఈ వివరాలను పుతిన్ ప్రస్తావించలేదు కానీ ప్రస్తుతం జనాభా ఆవశ్యకతకు ఇది కూడా ముడిపడి ఉంది. రష్యా జననాల రేటు 1990ల నుండి గణనీయంగా పడిపోతోంది. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 3,00,000 వరకు ఉండవచ్చని నిపుణుల అంచానా. రష్యా విధానాలు నచ్చక 8,20,000-9,20,000 మంది ప్రజలు రష్యాను వీడి పారిపోయారని సమాచారం. ఇదీ చదవండి: 'పన్నూ హత్య కుట్ర కేసుపై అమెరికా సీరియస్' -
2024 అధ్యక్ష ఎన్నికల బరిలో పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(71) 2030 వరకు పదవిలో కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆమేరకు వచ్చే ఏడాది మార్చిలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఎన్నడూలేని విధంగా అత్యంత ప్రమాదకరమైన కాలంలో రష్యాను నడిపించాలని ఆయన భావిస్తున్నట్లు అక్కడి మీడియా అంటోంది. దీనిపై తుది నిర్ణయమైపోయిందని, ఇందుకు తగ్గట్లుగా పుతిన్ మద్దతుదారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా సమాచారం. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. ఎన్నికల్లో ఆయనను ఢీకొట్టే ప్రత్యర్థులెవరూ లేరని పరిశీలకులు అంటున్నారు. -
రష్యా, హమాస్ ఒక్కటే: బైడెన్
న్యూయార్క్: హమాస్, రష్యా ఒకటేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య విధానాలను అంతం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్, ఇజ్రాయెల్కు సహాయం చేయడానికి అమెరికా ముందుంటుందని చెప్పారు. హమాస్, పుతిన్ వేరువేరు బెదిరింపులకు పాల్పడుతారు.. కానీ వారిరువురి లక్ష్యం ఒకటేనని దుయ్యబట్టారు. ఈ మేరకు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. 'ప్రపంచ పెద్దగా విచ్చిన్నకర రాజకీయాలకు స్థానం ఇవ్వబోము. హమాస్, పుతిన్ వంటి ఉగ్రవాద సంబంధ శక్తులను గెలవనీయబోము. వారి లక్ష్యాలను ఎప్పటికీ నేను అంగీకరించను. ప్రపంచాన్ని అమెరికా ఐక్యంగా ఉంచుతుంది. మన భాగస్వాములే అమెరికాను సురక్షితంగా ఉంచుతారు. మన విలువలు ఇతర దేశాలతో కలిసి పనిచేసేలా ఉంటాయి.' అని బైడెన్ అన్నారు. ఉక్రెయిన్, ఇజ్రాయెల్కు సహాయం చేయడానికి నిధులను మంజూరు చేయాలని అమెరికా కాంగ్రెస్ను అభ్యర్థించారు. ప్రపంచ నాయకునిగా ఉండటానికి ఈ నిధులే పెట్టుబడులని అన్నారు. ప్రపంచానికి అమెరికానే దీపపు స్తంభం అని చెప్పారు. ఇజ్రాయెల్, పాలస్తీనాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పశ్చిమాసియాలో పర్యటించి వచ్చారు. కల్లోల పరిస్థితులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ప్రపంచ అగ్రనేతగా తన ప్రాబల్యాన్ని చూపుతూ అమెరికా ఎన్నికల్లో ప్రజల మనసుల్ని గెలుచుకునే ప్రయత్నంలో బైడెన్ ఉన్నారు. యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్, ఇజ్రాయెల్లకు రూ.83,1,720 కోట్లు సహాయంగా ఇవ్వడానికి అమెరికా కాంగ్రెస్ను ఇప్పటికే అభ్యర్థించారు. హమాస్-ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు నడుస్తోంది. ఇజ్రాయెల్లో నోవా పండుగ వేళ హమాస్ ఉగ్రవాదులు రాకెట్ దాడులు జరిపారు. ఇజ్రాయెల్ తిరగబడి ధీటుగా బదులిస్తోంది. గాజాను ఖాలీ చేయించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. ఇరుపక్షాల వైపు దాడుల్లో ఇప్పటికే దాదాపు 5000 వేలకు పైగా మంది మరణించారు. యుద్ధంలో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతునిస్తోంది. అటు.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఏడాదిక్రితం నుంచి కొనసాగుతోంది. ఇదీ చదవండి: Israel-Hamas conflict: ఇజ్రాయెల్ ప్రతీకారేచ్ఛ -
చైనా బిగ్ ప్లాన్.. పుతిన్ మద్దతు
తాయ్ పీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా పర్యటనకు బయల్దేరారు. మంగళవారం చైనా రాజధాని బీజింగ్ చేరుకున్నారు. ఆయనకు గార్డ్ ఆఫ్ ఆనర్తో ఘన స్వాగతం లభించింది. ద్వైపాక్షిక విషయాలతో పాటు పలు ఇతర అంశాల్లో ఇరు దేశాల బంధం ఎంత పటిష్టంగా ఉందో చెప్పేందుకు ఈ పర్యటన తాజా నిదర్శనమని అంటున్నారు. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా అవి ఇప్పటికే పరోక్షంగా జట్టు కట్టడం తెలిసిందే. అందులో భాగంగా ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు చైనా మద్దతు పలుకుతోంది. విదేశాల్లో ఆర్థిక, భౌగోళిక, దౌత్యపరమైన ఆధిపత్యం సాధించేందుకు చైనా ప్రదర్శిస్తున్న దూకుడుకు రష్యా దన్నుగా నిలుస్తూ వస్తోంది. ముఖ్యంగా చైనా అధ్యక్షుడు తలపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు (బీఆర్ఐ)కు కూడా రష్యా మద్దతు పలుకుతోంది. ఆ ప్రాజెక్టులో తనకేమీ తప్పుడు ఉద్దేశాలు కనిపించడం లేదని చైనా అధికార మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ చెప్పారు కూడా. బీఆర్ఐ పదో వార్షికోత్సవానికి ఆయన హాజరవుతున్నారు. దీని ద్వారా మధ్య ఆసియాలోని మాజీ సోవియట్ యూనియన్ దేశాల మధ్య ఆర్థిక బంధం ఏర్పాటు చేయాలని ఆశాభావం వెలిబుచ్చారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగేందుకు కొద్ది వారాల ముందు కూడా పుతిన్ చైనాలో పర్యటించారు. ఇక జిన్ పింగ్ కూడా మార్చిలో రష్యాలో పర్యటించారు. ఆ దేశంపై అమెరికా, పాశ్చాత్య దేశాల ఆంక్షలను దుయ్యబట్టారు. ఇది కూడా చదవండి: గాజా ఆస్పత్రిపై భీకర దాడి -
ఇజ్రాయెల్ వార్పై పుతిన్ షాకింగ్ కామెంట్స్.. అమెరికాకు వార్నింగ్!
మాస్కో: ఇజ్రాయెల్లో భయంకర యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య బాంబు దాడుల నేపథ్యంలో వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్-పాలస్తీనా అంశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ఆరోపణలు చేశారు. తాజా పరిస్థితులు అగ్రరాజ్యం అమెరికా పాలసీనే వైఫల్యమే కారణమని చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా ఇజ్రాయల్-పాలస్తీనా అంశంపై పుతిన్ స్పందించారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. ‘స్వతంత్ర సార్వభౌమ’ పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయాల్సిన ‘అవసరం’ ఉందని పుతిన్ అన్నారు. ఇజ్రాయిల్-పాలస్తీనాల మధ్య హింస చెలరేగడానికి అమెరికా పాలసీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా స్వతంత్ర పాలస్తీనా దేశ ఆవశ్యకతను విస్మరించిందన్నారు. మధ్యప్రాచ్యంలో అమెరికా విధానాల వైఫల్యానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. చాలా మంది ప్రజలు నా అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి అంతర్జాతీయ ప్రయత్నాలకు ఆధిపత్యం వహించేందుకు అమెరికా యత్నిస్తోందని పుతిన్ ఆరోపించారు. ఇరువైపులా ఆమోదయోగ్యమైన రాజీ కుదుర్చడంలో వాషింగ్టన్ నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. 1967 యుద్ధంలో జెరూసలెంని ఇజ్రాయిల్ ఆక్రమించింది. రష్యా ఇరు దేశాలతో టచ్ లో ఉందని, వివాదాన్ని పరిష్కరించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని పుతిన్ చెప్పారు. Is the World War 3 near? I am warning that America doesn't interfere in Palestine Israel war, If America does that we will openly help Palestine ~Vladimir Putin#IsraelPalestineWar #VladimirPutin #Russia pic.twitter.com/gAcka9qJ27 — Harsh Sharma (@kikalikesyou) October 9, 2023 ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్లో రష్యా దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్లో ఏడాదిన్నరకు పైగా రష్యా సేనలు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో రష్యా.. ఉక్రెయిన్లో కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. అయితే, ఒకవైపు ఉక్రెయిన్తో యుద్ధం చేస్తూనే మరొకవైపు పుతిన్.. పాలస్తీనాకు మద్దతుగా ప్రకటన చేయడం గమనార్హం. మరోవైపు.. హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో జోక్యం చేసుకోవద్దని, సిరియా, ఇరాన్లను యుద్ధంలోకి దూకవద్దని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా ఇప్పటికే భారీ యుద్ధ నౌకను అక్కడికి పంపిన విషయం తెలిసిందే. His Entire Nuclear Family Wiped Out During The B*mbing of Gaza. Drone Footage! Music | Selena | Rihanna |YE | 50 CENT| Israel War | Hamas | Iran | US United States | UK Britain London England | #viralvideo #snapchat #Esther | #ViralPicture #Memes #LGBT #Offset #Israel #Hamas pic.twitter.com/0GVH7kwQV0 — Coon Memes (@CoonMeme) October 11, 2023 ఇది కూడా చదవండి: ఫలిస్తున్న ఇజ్రాయెల్ ప్లాన్.. హమాస్కు ఊహించని షాక్! -
పుతిన్ పైశాచికత్వం.. ఉక్రెయిన్లో 51 మంది మృతి..
కీవ్: ఉక్రెయిన్లో రష్యా దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏడాదిన్నరకు పైగా రష్యా సైన్యం దాడులు.. ఉక్రెయిన్పై కొనసాగుతున్నాయి. తాజాగా రష్యా రాకెట్లో ఉక్రెయిన్లో భారీ ప్రాణనష్టం చోటుచేసుకుంది. రాకెట్ దాడిలో 51 మంది మృతిచెందినట్టు సమాచారం. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్టు ఉక్రెయిన్ దేశ అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. ఉక్రెయిన్పై దాడులను రష్యా కొనసాగిస్తున్నది. ఈశాన్య ఉక్రెయిన్లోని ఖార్కివ్ ప్రాంతంలో రష్యా రాకెట్ దాడులు చేసింది. గురువారం మధ్యాహ్నం కుప్యాన్స్క్ జిల్లాలోని హ్రోజా గ్రామంలో ఒక షాపు, కేఫ్పై రష్యా రాకెట్ల దాడి జరిగినట్లు ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు. ఈ రాకెట్ దాడిలో సుమారు 51 మంది మరణించినట్లు చెప్పారు. బిల్డింగ్ శిథిలాల్లో కొందరు చిక్కుకున్నట్లు వెల్లడించారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిన్నట్లు టెలిగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు. ⚡️Yermak: Russia attacks village in Kharkiv Oblast, killing 49 people. Russian forces attacked a grocery store in the village of Hroza in Kharkiv Oblast’s Kupiansk district, killing at least 49 people, Andriy Yermak, the head of the Presidential Office, reported on Oct. 5. 📷… pic.twitter.com/rKOmYg8i07 — The Kyiv Independent (@KyivIndependent) October 5, 2023 మరోవైపు.. ఉక్రెయిన్లోని ఖేర్సన్ రిజియన్లోని బెరిస్లావ్ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిపై రష్యా దాడులకు తెగబడింది. ఆసుపత్రి, మెడికల్ ఎమర్జెన్సీ స్టేషన్పై రష్యా బాంబు దాడులు ప్రయోగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 😥Russian bomb hits hospital and emergency medical station in Beryslav, Kherson region#UkraineWar #Ukraina #UkraineRussiaWar #Russia pic.twitter.com/GNXABLsXpr — Hieu Nguyen (@HieuTraderPro) October 5, 2023 కాగా, స్పెయిన్లో జరుగనున్న యూరప్ నేతల సదస్సులో పాల్గోనున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్కీ తాజా రష్యా దాడిపై స్పందించారు. గ్రోసరీ షాపుపై జరిగిన రష్యా రాకెట్ దాడిని క్రూరమైన ఉగ్రవాద దాడి అని ఆరోపించారు. ఈ సంఘటనలో 48 మందికిపైగా మరణించినట్లు తెలుస్తున్నదని వెల్లడించారు. మరోవైపు 19 నెలలుగా ఉక్రెయిన్పై దాడులను రష్యా కొనసాగిస్తున్నది. స్వాధీనం చేసుకున్న కొన్ని ప్రాంతాలను రష్యాలో కలుపుకున్నది. ఇది కూడా చదవండి: పార్లమెంట్ సాక్షిగా ట్రూడో చిల్లర చేష్టలు -
మోదీ చాలా తెలివైన వ్యక్తి: పుతిన్
మాస్కో: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. మోదీని "చాలా తెలివైన వ్యక్తి" అని అభివర్ణించారు. మోదీ నాయకత్వంలో భారతదేశం గొప్ప పురోగతి సాధిస్తోందని చెప్పారు. ఆర్థిక భద్రత, సైబర్ నేరాలకు వ్యతిరేక పోరాటంలో రష్యా , భారతదేశం మధ్య మరింత సహకారం కొనసాగిస్తామని వ్లాదిమిర్ పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్లాదిమిర్ పుతిన్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. "ప్రధాని మోదీతో మేము చాలా మంచి రాజకీయ సంబంధాలను పంచుకుంటున్నాము. ఆయన చాలా తెలివైన వ్యక్తి. మోదీ నాయకత్వంలో భారతదేశం గొప్ప పురోగతిని సాధిస్తోంది" అని పుతిన్ అన్నారు. G20 సమ్మిట్లో న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఆమోదించిన అనంతరం ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసలు కురిపించడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్లో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో శాంతిని నెలకొల్పాలని డిక్లరేషన్ పిలుపునిచ్చింది. అయితే రష్యాపై మాత్రం నిందలు వేయలేదు.ఈ క్రమంలో న్యూఢిల్లీ డిక్లరేషన్ను మాస్కో కూడా స్వాగతించింది. ప్రపంచ జీ20 చరిత్రలో ఇదో మైలురాయి అని పేర్కొంది. G20 దేశాల్లో గ్లోబల్ సౌత్ను ఏకీకృతం చేయడంలో భారత అధ్యక్ష పదవిలో క్రియాశీల పాత్రను ప్రశంసించింది. ఇదీ చదవండి: Lumbini and Pokhara Airport Issue: చైనా ఆటలకు నేపాల్లో భారత్ కళ్లెం! -
ఇప్పుడు పుతిన్కు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ అండ!
సియోల్: ఉక్రెయిన్పై యుద్ధానికి సంబంధించి రష్యాకు ఉత్తర కొరియా పూర్తి మద్దతు ప్రకటించింది. తమ జాతీయ భద్రత కోసం రష్యా చేస్తున్న పోరాటంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు బేషరతుగా పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నట్టు ఉత్తరకొరియా నియంతృత్వ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు. అంతేకాదు ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ‘పవిత్ర పోరాటం’గా అభివర్ణించారు. సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులను ఎదుర్కొనేందుకు తమ దేశం ఎల్లప్పుడూ రష్యాకు మద్దతుగా నిలబడుతుందని తెలిపారు. ఉక్రెయిన్పై దాదాపు ఏడాదిన్నర కింద రష్యా యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. యూరప్ దేశాలు, అమెరికా ఆయుధాలు సాయం చేయడంతో ఈ యుద్ధంలో ఉక్రెయిన్ సమర్థవంతంగా రష్యాకు ఎదురొడ్డి నిలిచింది. ఇన్నాళ్లుగా నిరంతర దాడులతో రష్యాకు ఆయుధాల కొరత తలెత్తింది. ఈ క్రమంలో ఉత్తర కొరియా నియంత కిమ్తో పుతిన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా తూర్పు కొసన సైబీరియా ప్రాంతంలో ఉన్న వోస్తోక్నీ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో బుధవారం పుతిన్తో కిమ్ భేటీ అయ్యారు. ఆయుధాలు, ఆర్థిక అంశాలపై.. రష్యా, ఉత్తరకొరియా మీడియా సంస్థల కథనాల ప్రకారం.. సోవియట్ కాలం నుంచీ ఉత్తరకొరియాకు అండగా ఉన్న విషయాన్ని పుతిన్ తమ భేటీలో గుర్తుచేశారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అంశాన్ని కిమ్ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. రష్యాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘సామ్రాజ్యవాద శక్తుల నుంచి తన సార్వ¿ౌమ హక్కులను, భద్రతను పరిరక్షించుకునేందుకు రష్యా ‘పవిత్ర పోరాటం’ చేస్తోంది. రష్యా ప్రభుత్వానికి డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (ఉత్తర కొరియా) ఎల్లప్పుడూ బేషరతుగా పూర్తి మద్దతు ఇస్తోంది. ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసేందుకు వచి్చన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాం..’’ అని కిమ్ ప్రకటించారు. శాటిలైట్ల కోసమేగా వచ్చింది! పుతిన్ రష్యా స్వయం సమృద్ధ దేశమని, అయితే కొన్ని అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉందని.. వాటిపై కిమ్తో చర్చించానని పుతిన్ వెల్లడించారు. కిమ్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తర కొరియా ఉపగ్రహాలు అభివృద్ధి చేసేందుకు రష్యా సహకరిస్తుందా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘అందుకేగా మేం ఇక్కడికి (భేటీ కోసం) వచ్చింది. రాకెట్ టెక్నాలజీపై ఉత్తర కొరియా నేత చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఉత్తర కొరియా నుంచి ఆయుధాల కొనుగోలు, మిలటరీ సాయం, ఆంక్షల విషయంలో మాట్లాడేందుకు ఇంకా చాలా సమయం ఉంది..’’ అని పేర్కొన్నారు. రష్యా, ఉత్తరకొరియా మధ్య రవాణా, వ్యవసాయం వంటి పరస్పర ప్రయోజనాలున్న ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయని చెప్పారు. పొరుగు దేశమైన ఉత్తర కొరియాకు మానవతా సాయం అందిస్తున్నామన్నారు. రష్యాలోని మరో రెండు నగరాల్లో కిమ్ పర్యటిస్తారని, యుద్ధ విమానాల ప్లాంట్ను, రష్యా పసిఫిక్ నౌకాదళ కేంద్రాన్ని సందర్శిస్తారని వెల్లడించారు. ఆంక్షలతో కలిసిన ఇద్దరు ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. చమురు కొనుగోళ్లు, ఇతర లావాదేవీల విషయంలో సమస్యలతో రష్యా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. మరోవైపు అణ్వస్త్ర క్షిపణుల అభివృద్ధి, ఇటీవల వరుసగా ప్రయోగాలు జరపడం నేపథ్యంలో ఉత్తర కొరియాపై భారీగా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇలా పాశ్చాత్య ప్రపంచం దూరం పెట్టిన ఇరుదేశాల నేతలు పరస్పర సహకారం కోసం కలవడం గమనార్హం. అయితే ఉత్తర కొరియా నుంచి ఆయుధాలు కొనడంగానీ, ఆ దేశానికి రాకెట్, శాటిలైట్ టెక్నాలజీని ఇవ్వడంగానీ దారుణమైన పరిస్థితులకు దారితీస్తాయన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఆ ఆయుధాలు ఇవ్వండి సోవియట్ యూనియన్ కాలం నుంచి ఉత్తర కొరియా, రష్యా మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. 1950–53 మధ్య జరిగిన కొరియన్ యుద్ధంలో సోవియట్ యూనియన్ ఉత్తర కొరియాకు అండగా నిలిచింది. పెద్ద ఎత్తున ఆయుధాలను అందించడం ద్వారా దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా ఆక్రమణకు సహకరించింది. ఆ సమయంలో దక్షిణ కొరియాకు అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు అండగా నిలవడంతో.. చాలా కాలం యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర కొరియాకు సోవియట్ యూనియన్ ఆయుధాల సరఫరా, సహకారం కొనసాగింది. ఈ క్రమంలో నాటి ట్యాంక్ షెల్స్, లాంఛర్లు, మినీ రాకెట్లు లక్షల సంఖ్యలో ఉత్తర కొరియా వద్ద పోగుపడ్డాయి. సోవియట్ డిజైన్ ఆయుధాలే కాబట్టి రష్యా వాటిని నేరుగా వినియోగించుకోగలదు. ఇప్పుడు ఉక్రెయిన్పై యుద్ధంలో వాడేందుకు ఆ ఆయుధాలు ఇవ్వాలని ఉత్తర కొరియాను పుతిన్ కోరారు. మాకు గూఢచర్య ఉపగ్రహ టెక్నాలజీ కిమ్ షరతు రష్యా, చైనా తదితర దేశాల సాయంతో ఉత్తర కొరియా క్షిపణులు, అణ్వస్త్ర సాంకేతికతల విషయంలో ఓ మోస్తరుగా అభివృద్ధి సాధించినా.. ఉపగ్రహాల టెక్నాలజీలో చాలా వెనుకబడి ఉంది. అణు సామర్థ్యమున్న క్షిపణుల ప్రయోగం, ఇతర సైనిక అవసరాల కోసం మిలటరీ/గూఢచర్య ఉపగ్రహాలు తప్పనిసరి. ఈ దిశగా ఉత్తర కొరియా పలుమార్లు ప్రయోగాలు జరిపినా విఫలమైంది. తాజాగా రష్యా ఆయుధాలు అడుగుతున్న నేపథ్యంలో.. మిలటరీ గూఢచర్య ఉపగ్రహాల అభివృద్ధి, సాంకేతికత విషయంలో సాయం చేయాలని కిమ్ షరతు పెట్టినట్టు సమాచారం. ప్రత్యేక రైల్లో.. లిమోజిన్తో సహా.. ఉత్తర కొరియా నుంచి కిమ్ ఏకంగా ఓ ప్రత్యేక రైలులో రష్యాకు వెళ్లారు. క్షిపణి దాడులు జరిగినా కూడా తట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించిన బోగీలు, వెంటనే ఎదురుదాడి చేయడానికి వీలుగా భారీ స్థాయిలో సిద్ధంగా అమర్చిపెట్టిన ఆయుధాలు ఈ రైలు సొంతం. దీనితోపాటు ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనే ప్రత్యేకమైన వాహనాన్ని (లిమోజిన్) కూడా వెంట తీసుకెళ్లారు. వోస్తోక్నీ అంతరిక్ష కేంద్రం సమీపంలోకి రైలు చేరుకున్నాక.. కిమ్ తన లిమోజిన్లో భేటీ అయ్యే స్థలానికి చేరుకోవడం గమనార్హం. కిమ్కు పుతిన్ ఎదురెళ్లి స్వాగతం పలికారని, ఇద్దరూ సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు చర్చించుకున్నారని.. భేటీ అనంతరం కిమ్కు పుతిన్ ప్రత్యేక విందు ఇచ్చారని రష్యా మీడియా వెల్లడించింది. ఈ పర్యటన సందర్భంగా రష్యా అంతరిక్ష కేంద్రంలో కిమ్ కలియదిరిగారని, అక్కడి ప్రత్యేకతలను తెలుసుకున్నారని వివరించింది. -
మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు
ప్రధానమంత్రి నరేంద్రమదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ప్రశంసలు కురిపించారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు మోదీ చేపట్టించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గొప్పదని కొనియాడారు. ఈ విధానాల అమలుకు ప్రధాని మోదీ చూపిస్తోన్న చొరవను మెచ్చుకున్నారు. దీనివల్ల దేశంలోని పరిశ్రమల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. రష్యాలోనూ దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రోత్సహించడంలో భారత్ విజయాలను అనుసరిస్తామని పేర్కొన్నారు ఈ మేరకు వ్లాడివోస్టాక్లో జరిగిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ ప్లీనరీ సెషన్లో పుతిన్ మాట్లాడుతూ..‘ఒకప్పుడు మన దగ్గర దేశంలో తయారు చేసిన కార్లు లేవు. కానీ ప్రస్తుతం మనం కార్లను తయారు చేసుకుంటున్నాం. అయితే అవి 1990లో భారీ మొత్తంలో మేము కొనుగోలు చేసిన మెర్సిడెస్, ఆడికార్ల కంటే సాదాసీదాగా కనిపిస్తున్నాయి. కానీ ఇది సమస్య కాదు. స్వదేశీ తయారీ విషయంలో మనం మన భాగస్వాములు తీసుకుంటున్న నిర్ణయాలను పరిశీలించాలి’ అంటూ రష్యాలో తయారైన కార్ల గురించి ఎదురైన ఓ ప్రశ్నకు పుతిన్ సమాధానం చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ స్వదేశీ తయారీ,వినియోగంపై దృష్టి సారించింది. ఈ విషయంలో ప్రధాని మోదీ కరెక్ట్. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించే విషయంలో మోదీ సరైన విధంగా ముందుకు వెళ్తున్నారని భావిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా 'ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్' (IMEC) రష్యాను ఏ విధంగానూ ప్రభావితం చేయదని పుతిన్ అన్నారు. నిజానికి అది తమ దేశానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. కాగా ఇటీవల భారత్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా కారిడార్ ప్రణాళికలను మోదీ ఆవిష్కరించారు. చదవండి: ఆకాశంలో వజ్రం.. 'లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై' -
రష్యా గడ్డపై కిమ్.. నాలుగేళ్ల తర్వాత తొలిసారి
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం రష్యాలో అడుగు పెట్టారు. రష్యాకు కిమ్ వెళ్లడం ఇది రెండో సారి. తొలుత 2019లో ఆయన మొదటిసారి రష్యాలో పర్యటించారు. దాదాపు నాలుగేళ్ల తరువాత మరోసారి రష్యాలో పర్యటిస్తున్నారు. మంగళవారం కొందరు మంత్రులతో భేటీ అయ్యారు. బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్తో కిమ్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనేది ఇంకా తెలియరాలేదు. 2019లో ఇరువురు నేతలు వ్లాదివోస్తోక్లోనే సమావేశమయ్యారు. ఈసారి కూడా భేటీ అక్కడే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కిమ్ మాట్లాడుతూ.. దేశాల సంబంధాల వ్యూహాత్మక ప్రాముఖ్యత కోసం రష్యాతో భేటీ అవుతున్నట్లు తెలిపారు. ఇక పటిష్టమైన భద్రత మధ్య విలాసవంతమైన బుల్లెట్ ప్రూఫ్ రైలులో సుదీర్ఘంగా ప్రయాణించి రష్యాకు చేరుకున్నారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం ఉత్తర కొరియా రాజధాని పాంగ్యాంగ్ నుంచి రైలులో బయలుదేరారు. 740 కి.మీ ప్రయాణించి ఉత్తర కొరియా సరిహద్దుకు సమీపంలో రష్యా భూభాగంలో ఉన్న వ్లాదివోస్తోక్ నగరానికి ఉత్తర దిక్కున 60 కిలోమీటర్ల దూరంలోని ఉసురియ్స్క్ అనే ప్రాంతానికి ఈ రైలు చేరుకున్నట్లు దక్షిణ కొరియా వార్తా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది. ఈ ప్రాంతంలో కొరియన్ల జనాభా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉంది. అయితే, కిమ్ గమ్యస్థానం ఏమిటన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. కిమ్ రష్యాకు చేరినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ నిర్ధారించారు. పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల ఒంటరిగా మారిన కిమ్ జోంగ్ ఉన్ రష్యా సహాయాన్ని అర్థిస్తున్నారు. చదవండి: అమెరికాకు వ్యతిరేకంగా చేతులు కలిపిన రష్యా, ఉత్తర కొరియా గంటకు 50 కిలోమీటర్ల వేగమే.. ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రయాణించిన రైలుకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ రైలు కేవలం గంటకు 50 కిలో మీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. దీనికి భారీగా సాయుధ కవచాలు అమర్చి ఉండటంతో భారీ బరువు కారణంగా వేగంగా వెళ్లలేదు. ఈ రైలుపేరు తయాంఘో.. అంటే కొరియా భాషలో సూర్యుడు అని అర్థం. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్కు గుర్తుగా ఈ పేరుపెట్టారు. ఆయన కాలం నుంచే ఉ.కొరియా నేతలు సుదూర ప్రయాణాలను రైల్లోనే చేయడం మొదలుపెట్టారు. -
రష్యాకు రైల్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ రష్యాకు పయన మయ్యారు. ఆయన తన సొంత బుల్లెట్ ప్రూఫ్ రైలులో ఆదివారం సాయంత్రం రాజధాని ప్యాంగాంగ్ వదిలివెళ్లారని దక్షిణ కొరియా వర్గాలు తెలిపాయి. మూడు రోజులపాటు జరిగే ఒక అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ సోమవారం వ్లాడివోస్టోక్ వెళ్లారని, అక్కడే ఆయనతో కిమ్ సమావేశమవ్వొచ్చని చెబుతున్నారు. కిమ్ తమ దేశానికి వస్తున్నారంటూ రష్యా కూడా సోమవారం ధ్రువీకరించింది. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు త్వరలో కిమ్ రానున్నారని క్రెమ్లిన్ అధికార వెబ్సైట్ పేర్కొంది. పుతిన్, కిమ్లు త్వరలో కలుసుకుంటారని ఉత్తరకొరియా అధికార వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కూడా తెలిపింది. ‘రష్యా పర్యటనలో కామ్రెడ్ కిమ్ జొంగ్ ఉన్, కామ్రెడ్ పుతిన్తో చర్చలు జరుపుతారు’అని పేర్కొంది. అయితే, ఈ భేటీ ఎప్పుడు, ఎక్కడ ఉంటుందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. కిమ్ విదేశీ పర్యటనలకు వినియోగించే ఆకుపచ్చ బోగీలతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ రైలును రష్యా సరిహద్దుల్లోని ఉత్తరకొరియా రైల్వే స్టేషన్లో ఉండగా గుర్తించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఉక్రెయిన్తో ఏడాదిన్నరగా కొనసాగుతున్న యుద్ధానికి అవసరమైన ఆయుధాల కొనుగోలుకు కిమ్తో పుతిన్ ఒప్పందం కుదుర్చుకునేందుకు అవకాశాలున్నాయన్నది పశ్చిమదేశాల అంచనా. కోవిడ్ మహమ్మారి ప్రబలిన దాదాపు నాలుగేళ్ల తర్వాత కిమ్ మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదే. రైలులోనే ఎందుకు? గతంలో 2019లో మొదటిసారిగా వ్లాడివోస్టోక్లో పుతిన్తో సమావేశమైనప్పుడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లతో సమావేశాలకు రైలులో వెళ్లినట్లుగానే ఈసారీ కిమ్ రష్యాకు రైలులోనే బయలుదేరారు. సొంత రైలులోనే విదేశీ పర్యటనలు చేసిన దివంగత పాలకుడు, తన తండ్రి పాటించిన సంప్రదాయాన్ని కిమ్ కూడా కొనసాగిస్తున్నారు. ఈ రైలుకు 20 బుల్లెట్ ప్రూఫ్ బోగీలుంటాయి. దీనివల్ల సాధారణ రైళ్ల కంటే ఇది ఎక్కువ బరువుంటుంది. సరాసరిన గంటకు 59 కిలోమీటర్లకు మించి వేగంతో ఇది ప్రయాణించలేదు. ఈ వేగంతో ప్యాంగ్యాంగ్ నుంచి వ్లాడివోస్టోక్కు వెళ్లడానికి ఒక రోజంతా పడుతుంది. -
జీ-20: కోవిడ్ కారణంగా మరో నేత మిస్.. పుతిన్, జిన్పింగ్ సహా..
ఢిల్లీ: రేపటి నుంచి దేశ రాజధాని ఢిల్లీలో జీ-20 సదస్సు జరుగనుంది. కాగా, కోవిడ్ కారణంగా మరో నేత జీ-20 సమావేశాలకు హాజరు కావడం లేదు. స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో శాంచెజ్కు కోవిడ్ పాజిటివ్గా తేలడంతో జీ-20 సదస్సుకు ఆయన హాజరుకావడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీంతో, మరో కీలక నేత సమావేశాలకు దూరమయ్యారు. వివరాల ప్రకారం.. జీ-20 సమావేశాలకు స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ హాజరు కావడం లేదు. తాజాగా ఆయనకు కోవిడ్ పాజిటివ్గా తేలడంతో సమావేశాలకు రావడంలేదని తెలిపారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా శాంచెజ్..‘గురువారం నిర్వహించిన కోవిడ్ టెస్టుల్లో పాజిటివ్గా తేలింది. దీంతో, ఢిల్లీలో జరగబోయే జీ-20 సమావేశాలకు హాజరు కావడం లేదు. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. జీ-20 సమావేశాల్లో స్పెయిన్ తరఫున వైఎస్ ప్రెసిడెంట్ నాడియా క్వాలినో శాంటామారియా, విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బరేస్ ప్రాతినిధ్యం వహిస్తారని’ చెప్పారు. అలాగే, యూరోపియన్ యూనియన్(ఈయూ) సహకారం ఉంటుందన్నారు. Esta tarde he dado positivo en COVID y no podré viajar a Nueva Delhi para asistir a la Cumbre del G-20. Me encuentro bien. España estará magníficamente representada por la vicepresidenta primera y ministra de Asuntos Económicos y el ministro de Exteriores, UE y Cooperación. — Pedro Sánchez (@sanchezcastejon) September 7, 2023 ముగ్గురు కీలక నేతలు గైర్హాజరు.. ఇదిలా ఉండగా.. ఢిల్లీ కేంద్రంగా జరుగనున్న జీ-20 సమావేశాలకు ప్రపంచ దేశాల నుంచి నేతలు హాజరుకానున్నారు. ఇక, ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కూడా హాజరు కావడం లేదు. తాజాగా కోవిడ్ కారణంగా స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ జీ-20 సమావేశాల్లో పాల్గొనడం లేదు. దీంతో, ముఖ్యమైన మూడు దేశాల నుంచి అధ్యక్షులు సమావేశాలకు హాజరు కావడం లేదు. ► మరోవైపు.. ప్రపంచంలోని ప్రధాన దేశాల అధినేతలు శుక్రవారం ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని తమ వాణిని వినిపించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ మొదలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వరకు పలు దేశాల నాయకగణం నేడే హస్తినకు చేరుకోనుంది. ► జీ20 సదస్సు కోసం అందరికంటే ముందే భారత్కు చేరుకుంటున్న కీలక నేత రిషి సునాక్. భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని అయిన సునాక్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాలకు ఢిల్లీకి చేరుకుంటారు. కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌదరి ఈయనకు సాదర స్వాగతం పలకనున్నారు. ‘భారత్ జీ20కి సారథ్య బాధ్యతలు వహిస్తున్న ఈ ఏడాదికాలంలో భారత ప్రధాని మోదీ చేస్తున్న కృషి అమోఘం. ఆయన నాయకత్వంలో ప్రపంచ యవనికపై భారత్ సాధిస్తున్న విజయాలు అద్వితీయం’అని రిషి సునాక్ శ్లాఘించారు. ఇది కూడా చదవండి: ఇండియా-భారత్ పేరు మార్పుపై ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..? -
అప్పటి దాకా ధాన్యం ఒప్పందం ఉండదు
మాస్కో: యుద్ధం కొనసాగుతున్న వేళ నల్ల సముద్రం మీదుగా ఉక్రెయిన్ ధాన్యం రవాణా కారిడార్ను పునరుద్ధరించాలంటే పశ్చిమ దేశాలు ముందుగా తమ డిమాండ్లను అంగీకరించాల్సిందేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. దీంతో, ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియా దేశాలకు ఎంతో కీలకమైన ఆహార ధాన్యాల సరఫరాపై నీలినీడలు అలుముకున్నాయి. టర్కీ, ఐరాస మధ్యవర్తిత్వంతో కుదిరిన ధాన్యం రవాణా కారిడార్ ఒప్పందం నుంచి జూలైలో వైదొలిగింది. ఈ ఒప్పందం పునరుద్ధరణపై చర్చించేందుకు సోమవారం రష్యాలోని సోచిలో తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్తో ఆయన సమావేశమయ్యారు. రష్యా నుంచి ఆహారధాన్యాలు, ఎరువుల ఎగుమతులకు గల అవరోధాలను తొలగిస్తామన్న వాగ్దానాలను పశ్చిమదేశాలు నిర్లక్ష్యం చేశాయని ఈ సందర్భంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది వరకు రికార్డు స్థాయిలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యం ఓడల రాకపోకలు, బీమాకు సంబంధించిన అవరోధాల కారణంగా తీవ్రంగా దెబ్బతిందన్నారు. పశి్చమదేశాలు ఇచి్చన వాగ్దానాలను నెరవేర్చిన పక్షంలో కొద్ది రోజుల్లోనే ఒప్పందంపై సంతకాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో త్వరలోనే పురోగతి సాధిస్తామని ఎర్డోగన్ చెప్పారు. -
సైనికులు ప్రాణాలు పోతుంటే..పుతిన్ పట్టనట్లు చేస్తున్న పని చూస్తే..షాకవ్వతారు
ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేకంగా ఉపయోగించే నౌక. దీని పేరు ‘కొసాత్కా’– అంటే ‘కిల్లర్ వేల్’ జాతి తిమింగలం అని అర్థం. పుతిన్ దాదాపుగా మూడేళ్ల కిందటే ఈ భారీ నౌకను సొంతం చేసుకున్నా, ఇటీవలే దీనికి కళ్లుచెదిరే ఖర్చుతో అదనపు హంగులు సమకూర్చడంతో తాజాగా వార్తల్లోకెక్కింది. ఈ నౌకలోని అదనపు హంగుల కోసం 100 మిలియన్ పౌండ్లు (రూ.1.05 లక్షల కోట్లు) ఖర్చు చేయడం విశేషం. ఒకవైపు యుక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో దాదాపు మూడు లక్షల మందికి పైగా రష్యన్ సైనికులు ప్రాణాలు పోగొట్టుకున్నా, ఏమీ పట్టకుండా పుతిన్ తన నౌకను రాజసంగా తీర్చిదిద్దుకోవడానికి భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ఈ నౌక అసలు పేరు ‘ది గ్రేస్ఫుల్’. జర్మనీ రేవు నుంచి పుతిన్ దీనిని 750 మిలియన్ పౌండ్లకు (రూ.7.92 లక్షల కోట్లు) సొంతం చేసుకున్నాక, దీని పేరును ‘కొసాత్కా’గా మార్చుకున్నాడు. యుక్రెయిన్పై సైనిక దాడిని ప్రకటించడానికి కొద్దిరోజుల ముందే ఈ నౌకను రష్యాకు పంపాల్సిందిగా, నౌకా సంస్థను ఆదేశించాడు. ఈ నౌక రష్యా తీరానికి చేరుకున్న 23 రోజుల్లోనే యుద్ధం మొదలైంది. ఒకవైపు యుద్ధం కొనసాగుతుంటే, పుతిన్ మాత్రం ఈ నౌకను తాను కోరుకున్న రీతిలో తీర్చిదిద్దుకునే పనిలోనే నిమగ్నమయ్యాడు. ఇందులో ఖరీదైన క్రిస్టల్ షాండ్లియర్లు, కార్పెట్లు, సోఫాలు, కాఫీ టేబుళ్లు ఏర్పాటు చేయడమే కాకుండా డ్రాయింగ్ రూమ్లలో బంగారు తాపడం చేయించాడు. ఖరీదైన కళాఖండాలను ఏర్పాటు చేయించుకున్నాడు. ఇన్ని హంగులు చేయించుకున్న ఈ నౌక పొడవు దాదాపు అరకిలోమీటరు ఉంటుంది. ఇందులో స్విమింగ్ పూల్స్, పైకప్పు మీద హెలిపాడ్, బంగారు ఫ్రేముల అద్దాలు, బంగారు తాపడం చేయించిన సింక్ పైపులు వంటి ఏర్పాట్లు చాలానే ఉన్నాయి. రష్యన్ అధికార వ్యతిరేక సంస్థ అయిన ‘అలెక్సీ నవాల్నీ’ ఈ నౌక లోపలి హంగుల ఫొటోలను, వాటి ఏర్పాట్లకు అయిన ఖర్చుల వివరాలను ఇటీవల వెలుగులోకి తెచ్చింది. (చదవండి: ఈ పడవ నడవాలంటే ఎండ ఉంటే చాలు! పొద్దుగూకినా ప్రాబ్లం లేదు!) -
విదేశీ పర్యటనకు పుతిన్.. అరెస్ట్ వారెంట్ తర్వాత తొలిసారి..
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎట్టకేలకు దేశం దాటి కాలు బయటపెట్టనున్నారు. అక్టోబర్లో పుతిన్ చైనాలో పర్యటించనున్నట్లు సమాచారం. కాగా ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధ నేరాలకుగానూ పుతిన్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఆయన చేయనున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. వచ్చే అక్టోబరులో జరిగే బెల్ట్ అండ్ రోడ్ సదస్సుకు హాజరుకావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పుతిన్ను ఆహ్వానించగా.. ఇందుకు రష్యా అధ్యక్షుడు అంగీకరించినట్లు బ్లూమ్బర్గ్ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటికే పుతిన్ చైనా పర్యటన కోసం క్రెమ్లిన్ షెడ్యూల్ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఐసీసీ అరెస్ట్ వారెంట్ భయంతో ఆయన అన్ని విదేశీ పర్యటనలనూ వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. చదవండి: ఆకాశంలో అద్భుతం.. నేటి సాయంత్రం సూపర్ బ్లూ మూన్ దర్శనం అరెస్ట్ వారెంట్ కాగా గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా యుద్ధంప్రకటించిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య ఏడాదిన్నరగా సైనిక చర్య కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఉక్రెయిన్లోని చిన్నారులను రష్యా కిడ్నాప్ చేసిందన్న ఆరోపణలపై మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీని ప్రకారం పుతిన్ ఐసీసీలో సభ్యత్వం ఉన్న దేశాల్లో అడుగు పెడితే ఆయన్ను అరెస్టు చేయాల్సి ఉంటుంది. అప్పటి నుంచి ఆయన రష్యా అంతర్జాతీయ సరిహద్దులు దాటలేదు. ఇక అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో సుమారు 120 సభ్య దేశాలు ఉన్నాయి. అయితే వారెంట్ను అమలు చేసే పరిస్థితి మాత్రం అంతర్జాతీయ దేశాల సహకారంపై ఆధారపడి ఉంటుంది. ఇక పుతిన్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి పొరుగున్న ఉన్న సోవియట్ యూనియన్ దేశాలు, ఇరాన్లో మాత్రమే పర్యటించారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సమావేశానికి కూడా గైర్హాజరయ్యారు. వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు అరెస్ట్ వారెంట్పై సౌత్ ఆఫ్రికా కూడా ఐసీసీకి సంతకం చేసింది. అంతేగాక సెప్టెంబర్లో ఢిల్లీ వేదికగా జరగబోయే జీ20 శిఖరాగ్ర సదస్సులోనూ పుతిన్ పాల్గొనడం లేదు. ఈ మేరకు సోమవారం పుతిన్ మోదీకి ఫోన్ చేసి సమావేశానికి రాకపోవడంపై వివరించారు. ఆయనకు బదులు రష్యా తరపున విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరవుతారని పేర్కొన్నారు. ఇక చివరిసారి 2022లో చైనాలో పర్యటించారు. మరోవైపు జీ జిన్పింగ్ ఈ ఏడాది మార్చిలో మాస్కోను సందర్శించారు. మూడోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే ఆయన తొలి విదేశీ పర్యటన. చదవండి: ‘బైడెన్ పిచ్చితో మూడో ప్రపంచ యుద్ధమే!’ -
భారత్కు రాలేనన్న పుతిన్.. అరెస్ట్ భయమే కారణమా?
వచ్చే నెలలో దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే జీ-20 సమావేశాలకు భారత్ సిద్ధమవుతోంది. ఈ సమావేశాలకు ప్రపంచ దేశాల నుంచి నేతలు, ప్రముఖులు హాజరుకానున్నారు. మరోవైపు.. జీ-20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరు కావడం లేదు. ఈ మేరకు పుతిన్.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారు. పుతిన్ బదులుగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరు కానున్నట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. భారత్లో జీ-20 సదస్సు నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోదీకి ఫోన్ చేసినట్లు పీఎంవో సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీలో జరగనున్న జీ-20 సదస్సులో పాల్గొనేందుకు తాను భారత్కు రాలేనని పుతిన్.. మోదీకి తెలిపారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో జరిగే సదస్సులో రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పాల్గొంటారని పుతిన్ స్పష్టం చేశారు. రష్యా నిర్ణయంపై, భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ-20 సమ్మిట్ కార్యక్రమాలకు రష్యా మద్దతు ఇచ్చినందుకు వ్లాదిమిర్ పుతిన్కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై పురోగతిని సమీక్షించారు. గత వారం దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో పరస్పరం మాట్లాడిన నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యల గురించి కూడా మాట్లాడారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఇరువురు నేతలు టచ్లో ఉండేందుకు అంగీకరించారని ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. మరోవైపు.. ఉక్రెయిన్లో దాడుల కారణంగా పుతిన్ అరెస్ట్కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో ఆయన విదేశాలకు వెళ్తే అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ కారణంగానే పుతిన్ ఇతర దేశాల్లో సమావేశాలకు హాజరుకావడంలేదని తెలుస్తోంది. #BREAKING #Russia #India Russian President Vladimir Putin said during a telephone conversation with Indian Prime Minister Narendra Modi that he will not be able to attend the G20 summit, and that Russia will be represented by Foreign Minister Sergei Lavrov, the Indian PM's office… — The National Independent (@NationalIndNews) August 28, 2023 ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియాలో కూలిన అమెరికా నేవీ విమానం -
ప్రిగోజిన్ మరణంపై అనేక అనుమానాలు!
వాషింగ్టన్: రష్యాలోని కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ మరణంపై అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ సహా పదిమంది దుర్మరణం పాలయ్యారు. అయితే, ఈ విమానం ప్రమాదవశాత్తూ కూలిపోలేదని, ఉద్దేశపూర్వకంగా కూల్చేశారని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు, విమానం కూలిన తీరుతో పాటు ఇతరత్రా అంశాలను విశ్లేషించి ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపాయి. ఈ మేరకు పెంటగాన్ అధికార ప్రతినిధి జనరల్ పాట్ రైడర్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానాన్ని క్షిపణితో కూల్చేశారని చెప్పారు. అయితే, దీనిపై మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు. ఈ ఘటనపై అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పుతిన్ తన శత్రువులను తుదముట్టించే క్రమంలోనే ఈ ఘటన జరిగిందని చెప్పారు. విమానం ప్రమాదవశాత్తూ కూలిపోలేదని, కూల్చేశారని వివరించారు. అయితే, పేలుడుకు కారణమేమిటనే విషయం కానీ, తన పేరును కానీ వెల్లడించేందుకు ఆయన ఇష్టపడలేదు. మరోవైపు, తన సెక్యూరిటీతో పాటు తన అనుచరుల భద్రత విషయంలో తమ చీఫ్ ప్రిగోజిన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారని వాగ్నర్ గ్రూపుకు చెందిన సైనికులు చెబుతున్నారు. అలాంటిది కీలక అనుచరులను వెంటబెట్టుకుని ఒకే విమానంలో ఎందుకు ప్రయాణించారో తెలియడం లేదంటున్నారు. వాగ్నర్ గ్రూపులోని కీలక వ్యక్తులంతా సెయింట్ పీటర్స్బర్గ్కు ఎందుకు వెళుతున్నారో కూడా తెలియదని చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక అంతర్జాతీయ మీడియా ప్రిగోజిన్ ఆఫ్రికా దేశంలో ఉన్నారని అక్కడ తమ సైన్యంలో ఎవరైనా చేరాలనుకుంటే చేరవచ్చని ఆయన తెలుపుతున్నట్లు ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం చూస్తే తిరుగుబాటు నాయకుడిని ఆఫ్రికాలోనే హత్య చేసి దాన్ని విమాన ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రిగోజిన్ చనిపోయాడన్న వార్తపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ.. వాస్తవాలు ఏమిటో తెలియదు కానీ ఇందులో ఆశ్చర్యమేమీ లేదని అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ అయితే.. ప్రిగోజిన్ విమాన ప్రమాదంపై హేతుబద్దమైన అనుమానాలున్నాయని అన్నారు. మొత్తంగా రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఎదురు తిరిగితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనడానికి ప్రిగోజిన్ ఉదంతాన్ని ఉదహరిస్తూ ప్రపంచ నేతలు స్పందించడం కొసమెరుపు. ఇది కూడా చదవండి: భారత్ చైనా సంబంధాలు బలపడాలి: జిన్పింగ్ -
విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మృతి.. బైడెన్ షాకింగ్ కామెంట్స్
మాస్కో: రష్యాలో బుధవారం జరిగిన విమానంలో వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్గెనీ ప్రిగోజిన్ మృతిచెందారని రష్యా పౌర విమానయాన సంస్థ ‘రోసావియాత్సియా’ ధ్రువీకరించింది. ప్రిగోజిన్ సహా విమానంలో ఉన్న మొత్తం 10 మంది చనిపోయారని నిర్ధారించింది. రష్యా కిరాయి సైనిక దళమైన వాగ్నర్ గ్రూప్ ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరఫున పోరాడింది. వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ కొన్నిరోజుల క్రితం రష్యా సైన్యంపై తిరుగుబాటు చేసి వెనక్కి తగ్గారు. వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటును రష్యా అధ్యక్షుడు పుతిన్ దేశద్రోహం, వెన్నుపోటుగా అభివరి్ణంచారు. ద్రోహులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. కొన్నిరోజులు పుతిన్ వెనక్కి తగ్గారని, ప్రిగోజిన్కు క్షమాభిక్ష ప్రసా దించి, పొరుగు దేశమైన బెలారస్కు పంపించినట్లు వార్తలు వచ్చాయి. విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. ఈ ప్రమాదం వెనుక పుతిన్ హస్తం ఉందని, ప్రిగోజిన్ను మట్టుబెట్టడానికే ఉద్దేశపూర్వకంగా విమాన ప్రమాదాన్ని సృష్టించారని ఉక్రెయిన్ సహా పశి్చమ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఆశ్చర్యం కలిగించలేదు: బైడెన్ మాస్కో నుంచి సెయింట్ పీటర్స్బర్గ్కు బయలుదేరిన ప్రైవేట్ విమానం బుధవారం నేలకూలి మంటల్లో చిక్కుకుంది. మాస్కోకు ఉత్తర దిశలో 300 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. విమానంలో ముగ్గురు సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులు ఉండగా, అందరూ దుర్మరణం పాలయ్యారు. ప్రిగోజిన్ సహా వాగ్నర్ గ్రూప్ లెఫ్టినెంట్లు మరణించినట్లు సమాచారం. గురువారం తెల్లవారుజామున 10 మృతదేహాలను రష్యాఅధికారులు గుర్తించారు. ఈ విమానాన్ని ప్రిగోజిన్ తరచుగా ఉపయోగించేవారని తెలుస్తోంది. వైమానిక భద్రతా నిబంధలను ఉల్లంఘించడం వల్ల ప్రమాదం జరిగిందన్న కోణంలో అధికారులు ప్రారంభించారు. ప్రమాదానికి కారణం ఏమిటన్నది దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా, ప్రిగోజిన్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. అసలేం జరిగిందో తెలియదు గానీ ప్రిగోజిన్ మరణం తనకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని చెప్పారు. ప్రిగోజిన్ను పుతినే హత్య చేయించారన్నట్టుగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంపై పుతిన్ మౌనం వీడలేదు. గురువారం ఆయన బ్రిక్స్ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రిగోజిన్ మరణం గురించి ప్రస్తావించలేదు. ఇది కూడా చదవండి: రష్యాలో విమాన ప్రమాదం..వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మృతి -
పుతిన్ శత్రువుపై మరిన్ని కేసులు.. ఎంత కాలం శిక్ష పడనుందో తెలుసా?
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు బద్ధ శత్రువైన ప్రతిపక్ష నాయకుడు అలెక్సి నవాల్నీని తీవ్రవాదంతో సహా అనేక నేరాలపై ఇప్పటికే జైలు శిక్షను అనుభవిస్తున్నారు. తీవ్రవాదిగా ప్రకటించబడిన ఆయన పదకొండున్నర సంవత్సరాల జైలు శిక్షలో భాగంగా జనవరి 2021 నుండి శిక్షను అనుభవిస్తుండగా తాజాగా ఆయనపై మరిన్ని అభియోగాలను మోపి అతడి జైలుశిక్షను మరింత పొడిగించనున్నాయి క్రెమ్లిన్ వర్గాలు. ప్రాసిక్యూటర్లు అలెక్సి నవాల్నీపై మోపబడిన అదనపు కేసులు.. తీవ్రవాద సంస్థ ఏర్పాటు, నాజీ మద్దతుదారులకు పునరావాసం, తీవ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా రెండు బహిరంగ సభలు, ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా నవాల్నీ అవినీతి నిరోధక నిధి పేరిట మరో సంస్థను స్థాపించడం, మైనర్లను ఉగ్రవాదం వైపు నడిపించడం (నవాల్నీ సభలకు 18 సంవత్సరాల లోపు వారు హాజరైనందుకు), తీవ్రవాదానికి ఆర్ధికంగా ఊతమిచ్చేందుకు నిధులు సేకరించడం వంటి అభియోగాలను మోపారు. కొత్తగా నమోదైన కేసుల విషయమై నవాల్నీ స్పందిస్తూ ప్రజా జీవితానికి నన్ను దూరంగా ఉంచాలన్న కారణంతోనే మరిన్ని కేసులు మోపి మరో 20 ఏళ్ళ పాటు జైల్లోనే మగ్గిపోయేలా చేయాలని పుతిన్ నేతృత్వంలోని క్రెమ్లిన్ వర్గాలు చూస్తున్నాయన్నారు. తనను తీవ్రవాదిగా చిత్రీకరించి మొత్తంగా 35 ఏళ్ల జైలు శిక్ష విధించాలన్నదే రష్యా అధ్యక్షుడి అభిమతమని అన్నారు. జైల్లో ఉన్నా కూడా తన సోషల్ మీడియా ద్వారా అనుచరుల సాయంతో ఎప్పటికపుడు యాక్టివ్ గా ఉంటారు నవాల్నీ. కొత్త అభియోగాల విషయంలో క్రెమ్లిన్ పన్నుతున్న కుట్రను కూడా ఆయన సోషల్ మీడియాలో పొందుపరిచారు. స్వేచ్ఛతో కూడిన కొత్తదైన ధనిక రాజ్యానికి జన్మనివ్వాలంటే ప్రతి ఒక్కరూ అలాంటి రాజ్యం కోసం త్యాగం చేసి తల్లిదండ్రులు కావాలని కోరారు. ఇది కూడా చదవండి: మెక్సికోలో ఘోరం.. లోయలో పడిన బస్సు.. మృతుల్లో భారతీయులు -
సైన్యం చెరలో నైజర్
అగ్రరాజ్యాల చంపుడు పందెంలో దశాబ్దాలుగా చిక్కిశల్యమైన పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఆ నీడలోనే ఇప్పటికీ బతుకీడుస్తున్నాయని నైజర్లో నాలుగురోజుల క్రితం చోటుచేసుకున్న సైనిక తిరుగుబాటు నిరూపించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు మహమ్మద్ బజూమ్ను అధికారం నుంచి పడగొట్టి ఆయన భద్రతా వ్యవహారాల చీఫ్ ఒమర్ చియానీ పీఠం అధిష్ఠించాడు. అతనికి రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్దతుందని అంటున్నారు. అవిద్య, ఆకలి, ఆర్థిక అసమానతలు పుష్కలంగా ఉన్నచోట నియంతలదే పైచేయి అవుతుందని చరిత్రలో తరచు రుజువవుతున్న సత్యమే. తూర్పున ఎర్ర సముద్ర తీరంలోని సూడాన్తో మొదలుపెట్టి, పడమట అట్లాంటిక్ మహాసముద్ర తీరానికి చేరువలో వుండే గినియా బిసావూ మధ్య వరసగా కొలువుదీరిన ఎనిమిది దేశాలున్న ప్రాంతాన్ని సహేల్ ప్రాంతం అంటారు. వీటిల్లో మిగిలినవన్నీ సైనిక పాలకుల పరం కాగా... తాజాగా నైజర్ సైతం ఆ ఖాతాలో చేరింది. తన అండదండలు పుష్కలంగా ఉన్న బజూమ్ ఉన్నట్టుండి అదృశ్యం కావటం, రెండురోజుల తర్వాత తిరుగుబాటు ప్రకటన రావటం అమెరికాకు మింగుడు పడని అంశం. పశ్చిమాసియా, దక్షిణాసియాలతో పోల్చినా జీహాదిస్టుల బెడదను అధికంగా ఎదుర్కొంటూ నిత్యం నెత్తురోడుతున్న ప్రాంతం సహేల్ ఆఫ్రికా. అత్యంత వెనకబడిన ప్రాంతం కావటం వల్ల అక్కడి మరణాలు మీడియాకు పట్టవుగానీ... నిరుడు ఉగ్రవాదుల హింసాకాండకు ప్రపంచ వ్యాప్తంగా బలైన 6,701 మంది అభాగ్యుల్లో 43 శాతం మంది అక్కడివారే! సహేల్ ప్రాంతం గురించి ఐక్యరాజ్యసమితి వెబ్సైట్ వెతికితే దాన్ని ‘అవకాశాల గడ్డ’గా అభివర్ణిస్తుంది. ప్రపంచంలోనే యువత అధికంగా ఉన్న ప్రాంతమని చెబుతుంది. ఆ ప్రాంతానికి చినుకు గగనం కావొచ్చు. అక్కడి నేలపై పంటలు పెద్దగా పండకపోవచ్చు. కానీ దాని లోలోపల యురేనియంతో సహా అపురూపమైన ఖనిజాలున్నాయి. విస్తృతంగా జలాశయాలున్నాయి. పునరు త్పాదక ఇంధన వనరులకు అది నిలయం. జనాభాలో 64.5 శాతం మంది ఇరౖవై అయిదేళ్లలోపువారే. ఇవన్నీ సహేల్ ప్రాంతానికి శాపంగా కూడా మారాయి. అమెరికా, ఫ్రాన్స్లు ఈ ప్రాంతంపై పట్టుబిగించేందుకు బాహాటంగా ప్రయత్నిస్తుంటే జర్మనీ, ఇటలీ, చైనా వంటివి చడీచప్పుడూ లేకుండా ఆ పని చేస్తుంటాయి. తిరుగుబాటు జరిగే సమయానికి నైజర్లో 1,100 మంది అమెరికా సైనికులున్నారు. అవసరాన్నిబట్టి డ్రోన్ దాడులు నిర్వహించేందుకు ప్రత్యేక స్థావరం ఉంది. కానీ తన మద్దతుదారును అది కాపాడుకోలేకపోయింది. నిజానికి 2021లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే బజూమ్ సైనిక జనరళ్లకు లక్ష్యంగా మారారు. కానీ అప్పట్లో ఆయన్ను వ్యక్తిగత భద్రతా బలగాలు కాపాడాయి. ఇప్పుడు ఆ బలగాలే అదును చూసి కాటేశాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా, సోవియెట్ యూనియన్ల మధ్య పశ్చిమ ఆఫ్రికా దేశాల వనరులను చేజిక్కించుకునేందుకు సాగిన పోటీతో సగటున ప్రతి 55 రోజులకూ ఒక సైనిక తిరుగుబాటు ప్రయత్నం జరిగిందని, అందులో చాలా భాగం విజయవంతమయ్యాయని గణాంకాలు చెబు తున్నాయి. తమ ప్రయోజనాలు నెరవేరే వరకూ స్థానికంగా ఏ పాలకులున్నా, వారు ఎలా పాలిస్తున్నా అగ్రరాజ్యాలు పట్టించుకోవు. ఆ ప్రయోజనాలు దెబ్బతింటే మాత్రం సైనిక నియంత లను గద్దె దించేందుకు ప్రజాస్వామ్య మంత్రాన్ని పఠిస్తాయి. అంతక్రితం దశాబ్దాలపాటు అగ్రరాజ్యాల చెరలో చిక్కుకున్న పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఆ తర్వాత ప్రజాస్వామ్యానికి చేరువైనా, నయా ఉదారవాద ఆర్థిక విధానాల పడగనీడలోనే ఆ ప్రభుత్వాలు కొనసాగటం వల్ల స్థానికులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. పేరుకు ఎన్నికలేగానీ పెత్తనమంతా స్థానికంగా ఉండే సాయుధ ముఠా లదే! ఆ ముఠాల ప్రాపకంతోనే ఏ పాలకులైనా ఎన్నికల్లో గద్దెనెక్కుతారు. కూడు, గూడు, విద్య, వైద్యం, మంచినీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనలోనూ, ఉపాధి చూపటంలోనూ ఆ పాల కులు ఘోరంగా విఫలం కావటం తరచు కనబడేదే! ప్రజల్లో ఆ పాలకుల పట్ల ఉండే అసంతృప్తిని సైన్యంలోని ఉన్నతాధికారవర్గం సాకుగా తీసుకుని అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. పర్యవ సానంగా ముందో వెనకో ఆ దేశాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి సైనిక కుట్రలకు తలవంచాయి. సహేల్ ప్రాంతంలో తిరుగుబాట్లు చేసినప్పుడల్లా సైనిక నియంతలు చెప్పే మొదటి కారణం అవినీతి. ఇప్పుడు నైజర్లో గద్దెనెక్కిన ఒమర్ చియానీ దానికి ఉగ్రవాద బెడదను కూడా జోడించాడు. దేశంలో ఉగ్రవాదం ముప్పు పెరగటం వల్ల సైన్యం జోక్యం తప్పనిసరైందని ప్రకటించాడు. నిజానికి వేరే దేశాల ‘ప్రజాస్వామ్య’ పాలకులతో పోలిస్తే బజూమ్ ఎంతో నయం. అల్ కాయిదా, ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థల దాడులను పూర్తిగా అదుపు చేయలేకపోయినా, వాటిని చాలా మేరకు నియంత్రించారు. పాశ్చాత్య దేశాల మద్దతు పుష్కలంగా ఉండటంతో నిధులు కూడా దండిగానే వచ్చాయి. విద్య, వైద్యంతో పాటు ఉపాధి కల్పన చర్యలు ప్రారంభమయ్యాయి. వాటి ఫలితాలు కూడా ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. బజూమ్కు సైన్యం మద్దతు దండిగా ఉన్నదని, దేశంలో రాజకీయ సుస్థిరత ఏర్పడిందని అందరూ అనుకుంటుండగానే చియానీ రూపంలో సైనిక నియంత అవతరించాడు. సహేల్ ప్రాంతంలోని వేరే దేశాల్లో ఉగ్రవాద బూచిని చూపి, పాలకుల భద్రతకు పూచీపడుతూ పబ్బం గడుపుకుంటున్న కిరాయి సైనిక ముఠా నాయకుడు ప్రిగోజిన్ ఇప్పుడు నైజర్ను ఉద్ధరిస్తానని ముందుకొస్తున్నాడు. అమెరికా, రష్యాల మధ్య సైతం మున్ముందు ఇక్కడ ఘర్షణ రాజుకునే ప్రమాదం ఉంది. ఇన్నిటిమధ్య నైజర్ మనుగడ ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకమే! -
మా దేశంలో కిరాయి సైన్యం లేదు..
మాస్కో: వాగ్నర్ గ్రూప్ ప్రైవేట్ కిరాయి సైనికులకు ఒకే యూనిట్గా సేవలందించేందుకు అవకాశం ఇచి్చనట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. ఇప్పటి వరకు పనిచేసిన విధంగానే అదే కమాండర్ ఆధ్వర్యంలో వారు కార్యకలాపాలు సాగించవచ్చన్నారు. అదే విధంగా, తమ దేశంలో ప్రైవేట్ ఆర్మీ లేదని, అటువంటి వాటికి చట్టబద్ధత లేదని స్పష్టం చేశారు. పుతిన్ 23 ఏళ్ల పాలనలో ఎన్నడూ లేని విధంగా గత నెలలో వాగ్నర్ గ్రూప్ సైనికుల తిరుగుబాటుయత్నం, బెలారస్ అధ్యక్షుడు లుకశెంకో మధ్యవర్తిత్వంతో 24 గంటల్లోనే సద్దుమణగడం తెలిసిందే. ఆ తర్వాత అయిదు రోజులకు జూన్ 29న వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ సహా అందులోని 35 మంది కమాండర్లతో సమావేశమైనట్లు పుతిన్ తాజాగా కొమ్మెర్శాంట్ పత్రికకు ఇచి్చన ఇంటర్వ్యూలో చెప్పారు. తిరుగుబాటుయత్నం కారణాలు, పరిస్థితులపై చర్చించానన్నారు. భవిష్యత్తులో పనిచేసేందుకు గల పలు అవకాశాలను వారి ముందుంచినట్లు వెల్లడించారు. ఇప్పటి మాదిరిగానే గ్రే హెయిర్ అనే కమాండర్ ఆధీనంలో పనిచేయడం అందులో ఒకటన్నారు. ఎటువంటి మార్పులు ఉండవని, గ్రూప్లోని అందరూ అందులో యథావిధిగా కొనసాగవచ్చని చెప్పానన్నారు. చాలా మంది కమాండర్లు ఈ ఆఫర్కు మొగ్గు చూపారన్నారు. అయితే, సమావేశం ముందు వరుసలో కూర్చున్న వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ మాత్రం..తమ వాళ్లకు ఇది నచ్చలేదని చెప్పారన్నారు. అయితే, చివరికి వాగ్నర్ గ్రూప్ ఈ ఆఫర్కు అంగీకరించిందీ లేనిదీ పుతిన్ స్పష్టం చేయకపోవడం గమనార్హం. వాగ్నర్ గ్రూప్కు ఎలాంటి చట్టబద్ధత లేదని ఈ సందర్భంగా పుతిన్ పేర్కొన్నారు. ‘ప్రైవేట్ మిలటరీ సంస్థలకు సంబంధించి దేశంలో ఎలాంటి చట్టాలు లేవు. కాబట్టి, రష్యాలో ప్రైవేట్ ఆర్మీ లేదు. ప్రైవేట్ మిలటరీ కాంట్రాక్టర్ల విషయమై ప్రభుత్వం, పార్లమెంట్ చర్చించాల్సి ఉంది’అని పుతిన్ వివరించారు. వాగ్నర్ గ్రూప్ కిరాయి సైనికులు రష్యా రక్షణ శాఖతో ఒప్పందానికి రావడం లేదా పొరుగునున్న బెలారస్కు వెళ్లిపోవడం, రిటైర్ కావడం వంటి అవకాశాలను ఇచి్చనట్లు గతంలో పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా, వాగ్నర్ గ్రూప్నకు చెందిన కొందరు సభ్యులు బెలారస్లో తమ కార్యకలాపాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. -
నాటో సమ్మిట్లో నోరు జారిన బైడెన్!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పదే పదే అవే పొరపాట్లు చేస్తూ మీడియాకు చిక్కుతున్నాడు. పాపం వృద్ధాప్యం కారణంగానే ఇలా జరుగుతున్నప్పటికీ.. ఆయన తీరుపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఓ అంతర్ఝాతీయ వేదికపైనా ఆయన నోరు జారి కెమెరా కంటికి చిక్కారు. బుధవారం లుథియానా విల్నియస్లో నాటో సదస్సులో అమెరికా అధ్యక్షుడు బైడెన్ టంగ్ స్లిప్ అయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ(Volodymyr).. పేరును ఉచ్ఛరించబోయి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir..) అనబోయారు. వెంటనే తన పొరపాటును గుర్తించి సవరించుకున్న ఆయన.. ఆ తర్వాతి లైన్లో సరైన మాటే అనేశారు. ఆ టైంలో పక్కనే జెలెన్స్కీ కూడా ఉండడం గమనార్హం. 🚨🌎 Biden calls ‘Zelensky’ - VLADIMIR 🤡🚨 Simply unbelievable. pic.twitter.com/Iqo2omXIrj — Concerned Citizen (@cotupacs) July 12, 2023 Vladimir.. Volodymyr వేర్వేరుగా కనిపించే దగ్గరి పదాలే. ఈ రెండింటికీనూ ‘ప్రపంచాధినేత.. శాంతి పాలకుడు’ అనే ద్వంద్వార్థాలు ఉండడం గమనార్హం. బహుశా ఆ కన్ఫ్యూజన్లోనే ఆయన అలా అని ఉంటారు. అయినప్పటికీ.. బైడెన్ వైరల్ అవుతుండడంతో ‘పాపం జెలెన్స్కీ’ అనుకుంటున్నారంతా. ఇదిలా ఉంటే.. బైడెన్ కెమెరా సాక్షిగా ఇంతకు ముందు ఎన్నో తప్పిదాలు చేశారు. ఉక్రెయిన్ విషయంలోనూ ఇదే తొలిసారేం కాదు. ‘‘పుతిన్ కీవ్ను యుద్ధ ట్యాంకర్లతో చుట్టుముట్టొచ్చు. కానీ, ఇరాన్ ప్రజల జీవితాల్ని మసనబార్చలేరంటూ పొంతన లేకుండా మాట్లాడి విమర్శల పాలయ్యారు. ఇక పోయిన నెలలో అయితే పుతిన్ ఇరాక్ యుద్ధంలో(ఉక్రెయిన్ యుద్ధం అనబోయి..) ఓడిపోయాడంటూ ప్రకటించి అందరినీ నోర్లువెళ్లబెట్టేలా చేశాడాయన. 🚨 Biden calls Zelensky ‘Vladimir’ during NATO remarks pic.twitter.com/hsNXZOvJXt — Trending News (@Trendings911) July 13, 2023 -
తిరుగుబాటు నాయకుడు ప్రిగోజిన్ తో పుతిన్ భేటీ..?
మాస్కో: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం 500 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో గత వారం రోజులుగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో ఇటీవల పుతిన్ సైన్యంపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూపు అధినేత యెవ్గేనీ ప్రిగోజిన్ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశమయ్యారు. గత వారం రోజుల్లో ఉక్రెయిన్ కు అమెరికా క్లస్టర్ బాంబులు సాయం చేయడం, టర్కీ దేశం తమవద్ద ఖైదీలుగా ఉన్న ఉక్రెయిన్ కమాండర్ లను విడుదల చేయడం వంటి హఠాత్పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా కూడా కొన్ని కీలక పావులు కదిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. వాగ్నర్ గ్రూపుతోపాటు మరికొన్ని గ్రూపులను కలిపి మొత్తం 35 మందిని అధ్యక్షుడు పుతిన్ తో సమావేశానికి ఆహ్వానించింది క్రెమ్లిన్. ఈ సమావేశానికి కమాండర్లు కూడా హాజరవ్వగా సమావేశం మూడు గంటల పాటు సాగిందని తెలిపాయి క్రెమ్లిన్ వర్గాలు. ఈ సందర్బంగా క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిట్రి పెస్కోవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. సమావేశం ఫలప్రదంగా సాగిందని.. వాగ్నర్ గ్రూపు తాము పుతిన్ సైనికులమని ఆయన ఆదేశిస్తే యుద్ధరంగంలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నామన్నట్లు తెలిపారు. కొద్ది రోజుల క్రితం రష్యా సైన్యానికి ఎదురు తిరిగిన వాగ్నర్ గ్రూపు రోస్తోవ్ లోని సైనిక ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని మాస్కో వస్తున్నాం కాసుకోమని పుతిన్ కే సవాలు విసిరిన విషయం తెలిసిందే. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశంకో చొరవతో సంధి కుదిరి ప్రిగోజిన్ దళాలు తిరుగుముఖం పట్టాయి. ఒప్పందం ప్రకారం ప్రిగోజిన్ బెలారస్ వెళ్లాల్సి ఉండగా వెళ్లకుండా రష్యాలోని ఉన్నారు. ఈ సందర్బంగా యెవ్గేనీ ప్రిగోజిన్ మాట్లాడుతూ మేము చేసింది ప్రభుత్వంపై తిరుగుబాటు కాదని సైనిక బృందాలకు, నాయకులకు న్యాయం చేయమని ప్రభుత్వానికి తెలియజేసాం అంతేనని వివరణ ఇచ్చారు. ఇది కూడా చదవండి: బుద్ధి మారలేదు.. జైలు తప్పలేదు.. -
యుద్ధంలో కీలక పరిణామం..ఉక్రెయిన్ కమాండర్లు విడుదల..
క్యీవ్: శనివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ టర్కీలో ఉన్న వారి తమ కమాండర్లు ఐదుగురిని విడిపించి తిరిగి సొంత దేశానికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో టర్కీ ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని క్రెమ్లిన్ వర్గాలు మండిపడుతున్నాయి. మారియోపోల్ వీరులు.. వీరంతా రష్యా ఆక్రమించుకున్న అతిపెద్ద ప్రాంతం మారియోపోల్ రక్షణ శాఖకు నాయకత్వం వహించారు. అక్కడ రష్యాతో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడినా కూడా ఫలితం లేకపోయింది. హోరాహోరీగా సాగిన యుద్ధంలో రష్యా పైచేయి సాధించి మారియోపోల్ ను ఆక్రమించుకుంది. ఒప్పందంపై టర్కీకి.. దీంతో అనేకమంది ఉక్రెయిన్ సైనికులు అజోవ్ త్సవ్ స్టీల్ ప్లాంటు కింద సొరంగంలో దాక్కున్నారు. గతేడాది మేలో ఉక్రెయిన్ వీరిని లొంగిపొమ్మని ఆదేశించడంతో వీరంతా రష్యా దళాలకు లొంగిపోయి బందీలుగా వెళ్లారు. సెప్టెంబరులో వీరిని అంకారాకు బదిలీ చేస్తూ యుద్ధం ముగిసే వరకు విడిచి పెట్టవద్దని ఖైదీల మార్పిడి ఒప్పందం కూడా కుదుర్చుకుంది. శనివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ టర్కీ అధ్యక్షుడితో చర్చలు జరిపి అనంతరం సింహాలుగా పిలవబడే ఈ ఐదుగురు కమాండర్లను ఉక్రెయిన్కు తిరిగి రప్పించారు. అనంతరం జెలెన్స్కీ టర్కీ అధ్యక్షుడికి కృతఙ్ఞతలు చెప్పారు. ఈ నేపథ్యంలో ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని ఉల్లంఘించి వీరిని విడిచిపెట్టడం అనైతికమని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిట్రి పెస్కోవ్ టర్కీపై త్రీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. 🇺🇦🤝🇺🇦🇹🇷 — On Today, July 8, 2023, in a surprise announcement, #Ukrainian President Volodomyr #Zelenskyy stated that following his visit to the #Turkish Republic, where he met with Turkish President #Erdogan, all leaders of the Ukraine's #Azov Regiment whom fought during the… pic.twitter.com/i3bJuDSXJd — 🔥🗞The Informant (@theinformantofc) July 8, 2023 ఇది కూడా చదవండి: మా నిర్ణయంలో తప్పులేదు.. ఉక్రెయిన్కు సాయంపై బైడెన్ -
మా నిర్ణయంలో తప్పులేదు.. ఉక్రెయిన్కు సాయంపై బైడెన్
వాషింగ్టన్: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఆయుధ నిల్వలుతరిగిపోయిన కారణంగా ఉక్రెయిన్ అమెరికాపై ఒత్తిడి తీసుకురావడంతో వారు ఉక్రెయిన్ దేశానికి క్లస్టర్ బాంబులను పంపించనున్నట్లు ప్రకటించింది. క్లస్టర్ బాంబులు తీవ్రస్థాయిలో ప్రాణనష్టం చేకూరుస్తాయని తెలిసి కూడా అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ సమర్ధించుకున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఒకటిన్నర సంవత్సరం పూర్తి కావస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. ఇంకా జరుగుతూ ఉంది. సుదీర్ఘ కాలంగా యుద్ధం చేస్తోన్న నేపథ్యంలో ఉక్రెయిన్ వద్ద ఆయుధ నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి. అందుకే అగ్రరాజ్యాన్ని సాయం కోరుతూ ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీ జో బైడెన్ పై ఒత్తిడి చేశారు. దీంతో చాలాకాలంగా వారి ఆయుధ కర్మాగారంలో నిల్వ ఉండిపోయిన క్లస్టర్ బాంబులను ఉక్రెయిన్కు పంపించాలన్న నిర్ణయానికి వచ్చింది అగ్ర రాజ్యం. ఈ నిర్ణయాన్ని పలు మానవ హక్కుల సంఘాలు, డెమొక్రాట్లు తప్పుబట్టిన కూడా జో బైడెన్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. క్లస్టర్ బాంబుల తీవ్రత గురించి తెలుసు.. అందుకే ఇన్నాళ్లు వాటిని ఉక్రెయిన్కు పంపలేదు. కానీ ఇప్పుడు వారి వద్ద ఆయుధ నిల్వలు బాగా తగ్గిపోయాయి. ఈ సమయంలో వారిని అలా వదిలేయలేము. నాటో మిత్రదేశాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సుల్లివాన్ ఈ విషయంపై స్పందిస్తూ.. సాధారాణ ఆయుధాలతో పోలిస్తే ఈ క్లస్టర్ బాంబులు పెను విధ్వాంసాన్ని సృష్టిస్తాయి. వీటి కారణంగా భారీగా ప్రాణనష్టం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే వీటిని ఉక్రెయిన్కు పంపే విషయమై తీవ్ర జాప్యం చేశామని అన్నారు. ఆయుధాలు కొరవడిన సమయంలో మిత్రదేశాన్ని అలా వదిలేయకూడదని బాగా ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. క్లస్టర్ బాంబుల ప్రత్యేకత ఏంటి? ఒక క్లస్టర్ బాంబు అంటే అది అనేక బాంబుల సముదాయం. దాన్ని ఒక రాకెట్ ద్వారా గానీ ఫిరంగుల ద్వారా గానీ ఈ క్లస్టర్ బాంబును సంధిస్తే సుమారు 24-32 కిలోమీటర్ల దూరాన ఉన్న లక్ష్యాన్ని కూడా తునాతునకలు చేయవచ్చు. ఒక్కటే బాంబుగా రిలీజైన ఈ క్లస్టర్ గాల్లో చిన్న చిన్న బాంబులుగా విడిపోయి అక్కడక్కడా చెదురుముదురుగా పడి పేలతాయి. కాబట్టే వీటివలన భారీగా ప్రాణనష్టం కూడా వాటిల్లుతుంది. పైగా ఇవి నేల మీద పడిన వెంటనే విస్ఫోటం చెందవు. కొన్ని అప్పుడే పేలగా కొన్ని మాత్రం ఎప్పుడో పేలుతుంటాయి. అందుకే ఐక్యరాజ్యసమితి 2008లో ఈ క్లస్టర్ బాంబుల వాడకాన్ని నిషేధిస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. బ్రిటన్, ఫ్రాన్స్ సహా 120 దేశాలు వీటి వినియోగాన్ని నిషేధిస్తూ సంతకాలు కూడా చేశాయి. 2003లో ఇరాక్ పై చేసిన యుద్ధంలో అమెరికా ఈ క్లస్టర్ బాంబులనే అధికంగా ప్రయోగించింది. అటు తర్వాత అమెరికా వాటిని మళ్ళీ ఎక్కడా ఉపయోగించలేదు. అందుకే వారి వద్ద లక్షల సంఖ్యలో క్లస్టర్ బాంబుల నిల్వ ఉండిపోయింది. ప్రస్తుతం ఉక్రెయిన్కు సాయం చేస్తూ నిల్వలను తగ్గించుకుంటోందని అమెరికా చెబుతుంటే.. అందులో రష్యాపై గెలవాలన్న వారి కాంక్షే కనిపిస్తోందని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. ఇది కూడా చదవండి: బ్రెజిల్లో పేకమేడలా కూలిన భవనం, 8 మంది మృతి -
వాగ్నర్ గ్రూపులోని 21000 మందిని మట్టుబెట్టాం.. జెలెన్స్కీ
క్యీవ్ : ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్పెయిన్ మీడియా నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ రష్యాతో జరుగుతున్న యుద్ధంలో తిరుగుబాటు సైన్యమైన వాగ్నర్ గ్రూపుకు సంబంధించిన సుమారు 21000 మందిని చంపామని మరో 80,000 మంది గాయపడి ఉంటారని నిర్ధారించారు. పదహారు నెలలుగా సాగుతున్న యుద్ధంలో బలమైన రష్యాను ఉక్రెయిన్ సమర్థవంతంగానే ఎదుర్కొంది. రష్యా ఆక్రమించుకున్న ఒక్కో ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటూ ఉక్రెయిన్ ముందుకు సాగుతోంది. ఈ సందర్బంగా స్పానిష్ మీడియా సమావేశంలో పాల్గొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వారడిగిన కొన్ని సందేహాలకు సమాధానమిచ్చారు. యెవ్గెనీ ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ గ్రూపు చేసిన తిరుగుబాటు ప్రస్తావన రాగా రష్యాతో జరిగిన యుద్ధంలో వారు కూడా ఎక్కువగానే నష్టపోయారని తెలిపారు. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో రష్యా ప్రేరేపిత సైన్యమమైన వాగ్నర్ గ్రూపుకు చెందిన సుమారు 80000 మంది గాయాల పాలవగా దాదాపు 21000 మందిని మట్టుబెట్టామని అన్నారు. శత్రువును మా నేల మీద నుండి తరిమేయడమే మా ముందున్న ప్రధమ కర్తవ్యమని తెలిపారు. ఈ యుద్ధ నేపథ్యంలో మీ ప్రాణానికి హాని ఉంది భయంగా లేదా..? అని ఓ విలేఖరి ప్రశ్నించగా.. నాకంటే రష్యా అధ్యక్షుడికే ఎక్కువగా ప్రాణహాని ఉందని, నన్ను చంపాలనే ఉద్దేశ్యం ఆయనకు తప్ప ఎవరికీ లేదని, కానీ ఆయనను చంపాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయని అన్నారు. ఇదిలా ఉండగా జూన్ 29న రష్యా సైన్యం పైన తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూపు రష్యా అధ్యక్షుడికి కంటి మీద కునుకు లేకుండా చేసిన విషయం తెలిసిందే. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశెంకో చొరవ తీసుకుని మధ్యవర్తిత్వం చేయడంతో యెవ్గేనీ ప్రిగోజిన్ దళాలు శాంతించి వెనక్కు మళ్ళిన విషయం తెలిసిందే. కాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రిగోజిన్ దళాలకు మూడు ప్రత్యామ్నాయాలు విధించినట్లు రష్యాతో తిరిగి ఒప్పందం కుదుర్చుకోవాలని, యధావిధిగా పౌరసత్వాన్ని కొనసాగించాలని లేదా బెలారస్ కు తరలిపొమ్మని సూచించినట్లు చెబుతున్నాయి మీడియా వర్గాలు. ఇది కూడా చదవండి: వారు కాపాడటానికి వచ్చారనుకున్నాం.. కానీ.. -
నరేంద్ర మోదీ బిగ్ ఫ్రెండ్
మాస్కో: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ రష్యాకు గొప్ప మిత్రుడు(బిగ్ ఫ్రెండ్) అని పేర్కొన్నారు. మోదీ కొన్నేళ్ల క్రితం ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఎంతగానో ప్రభావితం చేస్తోందని కొనియాడారు. గురువారం మాస్కోలో ఏజెన్సీ ఫర్ స్ట్రాటెజిక్ ఇనీíÙయేటివ్స్(ఏఎస్ఐ) కార్యక్రమంలో పుతిన్ మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మనం కాకపోయినా, మన స్నేహితుడు చేసిన పని సత్ఫలితాలు ఇస్తుంటే అనుకరించడంలో తప్పేమీ లేదన్నారు. స్థానికంగా తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా భారత నాయకత్వం ప్రభావవంతమైన విధానాలను సృష్టిస్తోందని, విదేశీ పెట్టుబడిదారులను అమితంగా ఆకర్శిస్తోందని చెప్పారు. పుతిన్, నరేంద్ర మోదీ చివరిసారిగా 2022 సెపె్టంబర్లో ఉజ్బెకిస్తాన్లో ఓ సదస్సు సందర్భంగా కలుసుకున్నారు. ద్వైపాక్షిక, వ్యూహాత్మక బంధాలు బలోపేతం చేసుకుందాం తమ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయించుకున్నారు. ఇరువురు నేతలు శుక్రవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్లో సంఘర్షణతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించుకున్నారు. కీలక రంగాల్లో భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని ఇరువురూ సమీక్షించారు. ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. రెండు దేశాల నడుమ వ్యాపార, వాణిజ్యాల విలువ నానాటికీ పెరుగుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్లో ఘర్షణ ఆగిపోవాలన్నదే తమ ఉద్దేశమని, దౌత్య మార్గాల్లో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఉక్రెయిన్ నాయకత్వం అందుకు అంగీకరించడం లేదని మోదీకి పుతిన్ తెలియజేశారు. వివాదాలకు తెరదించడానికి దౌత్య ప్రయత్నాలు, చర్చలే మార్గమని మోదీ పునరుద్ఘాటించారు. మోదీ, పుతిన్ మధ్య అర్థవంతమైన, నిర్మాణాత్మక సంభాషణ జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
మోదీ చేసి చూపించారు.. పుతిన్ ప్రశంసలు
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు గుప్పించారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా ప్రధాని మోదీ అద్భుతాలు సృష్టించి అనుకున్నది సాధించారని.. ఆ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారాయన. మా మిత్ర దేశం ఇండియా.. ఆ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యాకు గొప్ప మిత్రుడు. కొన్నేళ్ల కిందట మేక్ ఇండియా అనే కాన్సెప్ట్ను తీసుకొచ్చారు. సమర్థవంతంగా దానిని ఆయన తన దేశంలో అమలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది అని మాస్కోలో జరిగిన ఓ ఈవెంట్లో అధ్యక్షుడు పుతిన్ ప్రసంగించారు. దేశీయ ఉత్పత్తుల ప్రోత్సాహంతో ఎలాంటి అభివృద్ధి సాధించవచ్చో ప్రధాని మోదీ భారత్లో చేసి చూపించారని.. రష్యా దీనిని ఆదర్శంగా తీసుకోవాలని పుతిన్ పేర్కొన్నట్లు అక్కడి మీడియా కథనాలు ప్రచురించింది. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక పాశ్చాత్య దేశాల ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం దారుణంగా పడింది. ఈ నేపథ్యంలో.. స్వదేశీ ఉత్పత్తులపై ఆధారపడడం ద్వారా సంక్షోభం నుంచి బయటపడొచ్చని గత కొంతకాలంగా పుతిన్ రష్యా ప్రజలకు పిలుపు ఇస్తూ వస్తున్నారు. ఇదీ చదవండి: పెద్దన్నకు మతిమరుపే కాదు.. ఈ సమస్య కూడా ఉంది! -
తిరుగుబాటు తర్వాత.. విరుచుకుపడ్డ పుతిన్
మాస్కో: తిరుగుబాటు.. తదనంతరం నాటకీయ పరిణామాల తర్వాత చల్లారిన సెగ.. ఈ క్రమంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎక్కడా కనిపించకపోవడం సర్వత్రా చర్చకు దారి తీసింది. వేర్ ఈజ్ పుతిన్ అంటూ ఉక్రెయిన్, వెస్ట్రన్ మీడియా సంస్థలు పుతిన్ను ఏకిపారేశాయి. ఈ క్రమంలో సోమవారం మీడియా ముందుకు వచ్చిన ఆయన, పాశ్చాత్య దేశాలపై, ఉక్రెయిన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు నేపథ్యంలో రష్యాలో రక్తపాతం కోసం ఉక్రెయిన్, పాశ్చాత్య దేశాలు ఆశలు పెట్టుకున్నాయని, కానీ, ఆ ఆశలు గల్లంతు అయ్యాయని వ్యంగ్యంగా స్పందించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. రష్యన్లు ఒకరినొకరు చంపుకుంటుంటే.. ఉక్రెయిన్, పాశ్చాత్య మిత్రకూటమి చూసి సంతోషించాలనుకున్నాయి. కానీ, రక్తపాతం నివారించేందుకే తాము ప్రయత్నించామని పుతిన్.. ప్రపంచానికి వెల్లడించారు. రష్యా నేల రక్తంతో తడిసి ముద్దవ్వడం మాకిష్టం లేదు. అందుకే వాగ్నర్ పోరాటయోధులకు క్షమాభిక్ష ప్రసాదించాం. తిరుగుబాటు సమయంలో రష్యన్లు ప్రదర్శించిన దేశభక్తికి ప్రత్యేక కృతజ్ఞతలు అని పుతిన్ టీవీ ఛానెల్ ద్వారా ప్రసంగించారు. కీవ్లోని నియో నాజీలు, వాళ్లను పోషిస్తూ వస్తున్న పాశ్చాత్య మిత్రపక్షాలు.. ఇలా రష్యా శత్రువులంతా రష్యాలో సైనికులు ఒకరినొకరు చంపుకోవాలని బలంగా కోరుకున్నాయి. కానీ, భద్రతా బలగాలు ఆ పాచికను పారనివ్వలేదన్నారు. వాగ్నర్ గ్రూప్కు కూడా కొన్ని ఆప్షన్స్ ఇచ్చాం. తిరిగి సైన్యంతో కలిసి పని చేయడమా? బెలారస్కు వెళ్లిపోవడమా? రష్యాకే తిరిగి రావడమా? ఏదో ఒకటి ఎంచుకోవాలని చెప్పాం. జరిగిన పరిణామాల్ని.. ఏదో అంతర్జాతీయ పరిణామంగా చిత్రీకరించేందుకు పాశ్చాత్య మీడియా ప్రయత్నించింది. కానీ, ఇది రష్యా అంతర్గత వ్యవహారం మాత్రమేనని పుతిన్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. ఇదీ చదవండి: పుతిన్తో పెట్టుకున్నావ్.. కిటికీల దగ్గర జాగ్రత్త! -
స్వయంకృతాపరాధం
పాలు పోసి పెంచిన పాము కాటేయడానికి పడగ విప్పి మీదకొస్తే ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుందో రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఇప్పుడు తెలిసొచ్చి ఉంటుంది. శత్రు దేశాలపై దాడి కోసం తాను పెంచిపోషిస్తూ వచ్చిన కిరాయి సైన్యం ‘వాగ్నర్ ప్రైవేట్ మిలటరీ కంపెనీ’, దాని అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ ఒక్కసారిగా తన మీదకే విరుచుకుపడేసరికి పుతిన్ దిగ్భ్రమకు లోనైనట్టున్నారు. గత వారాంతంలో రష్యాలో దాదాపు అంతర్యుద్ధం అంచులకు వెళ్ళిన పరిణామాలు అలాంటివి. దేశానికి దక్షిణాన అతి కీలక నగరాల్లో ఒకటైన రోస్తోవ్ – ఆన్– డాన్ చేజిక్కించుకొని, మాస్కో దిశగా వాగ్నర్ కిరాయి సైనికులు దూసుకు వస్తున్నప్పుడు పరిస్థితి భయానకంగా కనిపించింది. పైకి ఎన్ని బీరాలు పలికినా, చివరకు బెలారస్ దేశాధినేత కుదిర్చిన సంధితో పుతిన్ ఊపిరిపీల్చుకో గలిగారు. ఇప్పటికి వాగ్నర్ సేనలు వెనక్కి తగ్గి, ఉక్రెయిన్తో పోరుకు మళ్ళీ సరిహద్దుల దారి పట్టినా, పుతిన్కు తగిలిన షాక్, ఆయన ఇమేజ్కు పడిన దెబ్బ సామాన్యమైనవి కావు. ఎవరికీ వంగని, దేనికీ లొంగని ధీరుడిగా పేరున్న పుతిన్ ప్రతిష్ఠను ఈ తిరుగుబాటు చావుదెబ్బ తీసింది. ఉక్రెయిన్తో పోరులో బింకంగా ముందడుగు వేస్తున్న ఆయన ఈ దెబ్బ నుంచి కోలుకో వడం సులభమేమీ కాదు. 1999 నుంచి ఇప్పటి దాకా ప్రధానిగానో, అధ్యక్షుడిగానో అధికారంలో ఉంటూ వచ్చారు పుతిన్. రష్యాపై తిరుగులేని పట్టు బిగించిన ఈ ఏలిక తన సుదీర్ఘ హయాంలో తొలిసారిగా పెద్ద సవాలును ఎదుర్కొంటున్నారు. ‘పుతిన్కు వంటగాడ’నే పేరు దక్కిన ఒక దొంగ, హంతకుడు ఆ స్థాయి నుంచి ప్రైవేట్ సైనిక సంస్థకు అధిపతిగా ఎదగడం వెనక ఉన్నది పుతినే అన్నది జగమెరిగిన సత్యం. ఆఫ్రికా నుంచి అరబ్ ప్రపంచం వరకు, తాజా ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఈ కిరాయి మూకల్ని వాడుకుంటూ వచ్చిందీ పుతినే! అందుకే, పూర్తి బాధ్యత కూడా ఆయనదే! ఉక్రెయిన్పై కార్యకలాపాల్లో రష్యా సైనికాధిపతుల పట్ల, ముఖ్యంగా రక్షణ మంత్రి పట్ల ప్రిగోజిన్ కొద్ది నెలలుగా అసంతృప్తితో ఉన్నారు. రక్షణ శాఖలో అగ్రస్థానంలో మార్పుల్ని కోరుకుంటున్నారు. ఆఖరికి ఆయన కిరాయి మూకలు తేలిగ్గా ఒక్కో నగరం దాటుకుంటూ మాస్కో సమీపా నికి రావడం అంతర్యుద్ధ మేఘాలను అలముకొనేలా చేసింది. బెలారస్ నేత లుక షెంకో తెరవెనుక రాజీతో ఇప్పటికి గండం గడిచింది. పుతిన్ మీద ప్రేమ కన్నా, డబ్బు కోసమనే ప్రాణాలకు తెగించే వాగ్నర్ మూకలు వెనుదిరగడం ఊరికే జరగలేదు. దేశద్రోహులంటూ వీరంగం వేసిన పుతిన్ చివరకు ఎవరిపై ఏ కేసులూ పెట్టనని ఒప్పుకోవాల్సి వచ్చింది. ప్రిగోజిన్పై చర్యలుండవని హామీ ఇవ్వాల్సొచ్చింది. రెండు లక్షల కోట్ల డాలర్ల కన్నా తక్కువకు పడిపోయిన జీడీపీతో, ఉక్రెయిన్తో పోరులో నష్టాలతో సతమతమవుతున్న రష్యా కొత్తగా మరో పోరు చేసే పరిస్థితిలో లేదు. వెరసి, తప్పుడు అంచనాలతో ఉక్రెయిన్పై 16 నెలల క్రితం యుద్ధం మొదలుపెట్టి, వెనక్కి రాలేని పద్మవ్యూహంలో చిక్కుకున్న పుతిన్కు ప్రపంచం ముందు ఇవి తీరని తలవంపులే. ఇవన్నీ ఆయన స్వయంకృతాపరాధాలే. బలమైన వాగ్నర్ మూకల్ని రక్షణ శాఖ కిందకు తేవాలన్న రష్యా సైనిక నేతల నిర్ణయం బెడిసికొట్టింది. వ్యూహంలో, దాడుల్లో తమ కన్నా వెనుకబడిన ప్రభుత్వ సైనిక నేతల కింద పనిచేయడం ప్రిగోజిన్కు మింగుడుపడని విషయం. అందువల్లే ఈ తిరుగుబాటు తలెత్తిందట. పుతిన్కు తాను వ్యతిరేకం కాదనే నేటికీ ప్రిగోజిన్ మాట. ఏమైనా, ఇప్పుడు రష్యాకు మరో తలనొప్పి వచ్చి పడింది. ఇకపై ఉక్రెయిన్పై పోరులో రష్యన్ సైనిక నేతలు మునుపటిలా ఈ కిరాయి మూకల్ని నమ్మలేరు. రక్షణ శాఖతో కాంట్రాక్ట్ ఉన్నవారే ఇకపై పోరులో పాల్గొంటారట. కానీ, అపనమ్మకమున్న యుద్ధంలో అడుగు ముందుకు పడదు. అసలే ఉక్రెయిన్లో ఆశించిన పురోగతి లేక అస్తుబిస్తవుతున్న పుతిన్కు ఇది దెబ్బ మీద దెబ్బ. తాజా తిరుగుబాటులో చేరని వాగ్నర్ ఫైటర్లను ప్రభుత్వ సైన్యంలోకి తీసుకోవాలని రష్యా యోచిస్తున్నప్పటికీ, ఇలాంటి మూకలతో రష్యా ఎలా వేగగలదో చెప్పలేం. ప్రిగోజిన్ తిరుగుబాటు ఇప్పటికి టీ కప్పులో తుపానైపోయినా, క్షీణిస్తున్న పుతిన్ పట్టుకు అది ప్రతీక. అణ్వస్త్ర రష్యా సైనిక బలగంలోని బలహీనతలూ, చీలికలూ బట్టబయలయ్యాయి. సైనిక జనరల్స్ను ఒకరి తర్వాత మరొకరిని తొలగిస్తూ వస్తున్న పుతిన్కు యుద్ధంలో తగిన వ్యూహమూ ఉన్నట్టు లేదు. మరోపక్క, తాజా ఘటనలతో యుద్ధంలో ఉక్రెయిన్ సైన్యానికి ఊహించని సానుకూలత వరించింది. ఒకవేళ యుద్ధాన్ని ముగించదలుచుకుంటే ఇరుపక్షాలకూ ఓ చిన్న కిటికీ తెరుచుకుంది. కానీ, కిందపడ్డా నాదే పై చేయి అనే పుతిన్ కానీ, ‘నాటో’ బూచితో రష్యాను దారికి తెచ్చుకోవాలని చూస్తున్న పాశ్చాత్య ప్రపంచం కానీ అందుకు ముందుకొస్తాయా? ఏమైనా రష్యా పరిణామాలను ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. పుతిన్ తదుపరి అడుగులు, భవి తవ్యంపై లెక్కలు కడుతోంది. సైన్యం, పాలనా యంత్రాంగం, వ్యాపార వర్గం సహా వ్యవస్థలన్నిటినీ విడగొట్టి, ఎవరూ అధికారం ప్రోది చేసుకోకుండా బలహీనంగా ఉంచి, నియంత్రణ తన చేతిలో పెట్టుకొనే పుతిన్ ఈ విన్యాసం ఎన్నాళ్ళు చేయగలరో చూడాలి. అందుకే, స్టాలిన్ తర్వాత దీర్ఘకాలం రష్యాను ఏలుతున్న పుతిన్ ఓ అమెరికన్ రాజకీయ శాస్త్రవేత్త అన్నట్టు ఒక రకంగా ‘బలహీన బలిష్ఠుడు’. వాగ్నర్ వ్యవహారం అందుకు తాజా ఉదాహరణ. పామును పెంచుతున్నది పగవాణ్ణి కాటేయడానికని భావించినా విషపురుగుకు తన, పర తేడా ఉండదని మర్చిపోవడమే చిక్కు. ఆ సంగతి అమెరికా, పాకిస్తాన్ నుంచి ఇప్పుడు రష్యా దాకా అందరికీ అనుభవంలోకి వచ్చిన పాఠమే! -
ఉక్రెయిన్.. మంచి ఛాన్స్ మిస్ చేసుకుందా?
దాదాపు పాతికేళ్ల రష్యన్ అధికారంలో పుతిన్ ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ ఎదుర్కొని ఉండడు. అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తే.. తీవ్రారోపణలకు దిగి మరీ తిరుగుబావుటా జెండా ఎగరేయడం, ప్రధాన నగరాల్లో తన సైన్యాన్ని మోహరించి ఉద్రిక్తతలకు కారకుడు కావడం.. చివరకు మిత్రదేశం జోక్యంతో వ్యవహారం చల్లారడం.. కేవలం 36 గంటల్లోనే పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే.. ఈ పరిణాలను నిశితంగా పరిశీలించడమే తప్పా.. తమకు అనుకూలంగా వాడుకోవాలని ఉక్రెయిన్ ఏమాత్రం ప్రయత్నించకపోవడం విడ్డూరం. దురాక్రమణతో దాదాపు ఏడాదిన్నర కాలంగా తీవ్రంగా నష్టపోతోంది ఆ దేశం. పాశ్చాత్యదేశాలు ఎంతలా సాయం అందించిన కూడా ఒంటరి పోరు తప్పడం లేదు. ఈ క్రమంలో వాగ్నర్ గ్రూప్ను తమవైపు తిప్పేసుకునే దిశగా ఉక్రెయిన్ ప్రయత్నాలు చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుల నుంచి వెలువడుతోంది. వాగ్నర్ గ్రూప్ ఉద్దేశం.. ఉక్రెయిన్ ఆక్రమణలో రష్యాకు సహకరించడం. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ నగరం బఖ్ముత్ ఆక్రమణలో కీలక పాత్ర పోషించింది కూడా వాగ్నర్ గ్రూపే. ఈ క్రమంలో.. మే నెలలో అక్కడి నుంచి బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పుతిన్ షెఫ్గా పేరున్న ప్రిగోజిన్ ఉన్నట్లుండి వెనక్కి వస్తున్నట్లు ప్రకటించడం.. ఆ వెంటనే రష్యా మిలిటరీ సంచలన ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన దళంలోని 20వేలమందిని రష్యా మిలిటరీనే పొట్టనబెట్టుకుందని, తన విమర్శలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారడంతో తాజాగా క్షిపణులతో రష్యా రక్షణ శాఖ తన గ్రూప్ను లక్ష్యం చేసుకుందని సంచలన ఆరోపణలు దిగాడు ప్రిగోజిన్. ఈ క్రమంలోనే తిరుగుబాటు ప్రకటన చేయడంతో.. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కట్టడి పాలనను తెరపైకి తెచ్చింది రష్యా. వీక్ పుతిన్! పతిన్కు తిరుగుబాట్లు అణచడం కొత్తేం కాకపోవచ్చు. కానీ, పుతిన్కు ఉక్రెయిన్ యుద్ధం ఓ గుణపాఠం నేర్పింది. చిన్నదేశాన్ని.. సులువుగా ఆక్రమింపజేయొచ్చనే అంచనాలు ఘోరంగా తప్పాయి. ఆ తర్వాత ఆయన ‘పవర్’ ప్రదర్శించే సందర్భమూ ఎక్కడా రాలేదు. ఈ లోపు మరొకటి. వాగ్నర్ గ్రూప్ అనే ప్రైవేట్ సైన్యం తిరుగుబాటు జెండా ఎగరేసింది. పట్టుమని పాతిక వేల మంది కూడా లేరు ఆ గ్రూప్లో. కానీ, అత్యాధునిక ఆయుధాలతో రష్యాలో అల్లకల్లోలానికి.. తీవ్ర ఉద్రిక్తతలకు కారణం కావడం, ఆ తిరుగుబాటును అణచలేక పొరుగు.. మిత్రదేశం అయిన బెలారస్ సాయం తీసుకోవడం పుతిన్ అధికారం ఎంతగా బలహీనపడుతుందో అనే విషయాన్ని తేలతెల్లం చేశాయి. మౌనం దేనికి సంకేతం? నాటకీయ పరిణామాలతో ముగిసింది రష్యా తిరుగుబాటు సంక్షోభం. తిరుగుబాటుకు కారకుడు.. నాయకత్వం వహించిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ నిశబ్ధంగా ఉండిపోయాడు. బెలారస్లో ఆశ్రయం కోసం ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ తిరుగుబాటును దేశద్రోహంగా అభివర్ణించి.. ప్రిగోజిన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మౌనంగా ఉండిపోయారు. అసలా ప్రకటన తర్వాత ఆయన బహిరంగంగా కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శనివారం అర్ధరాత్రి బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో దౌత్యం వహించి చర్చలను ఫలించేలా చేశారు. మాస్కో వైపు వచ్చే యత్నంలోనే.. వందల మైళ్ల దూరం నుంచే వాగ్నర్ బలగాలు వెనక్కి మళ్లిపోయాయి. పుతిన్-ప్రిగోజిన్ మధ్య జరిగిన ఒప్పందం ఏంటన్నది బహిర్గతం కాలేదు. కానీ, తనపై పెట్టిన దేశద్రోహం, తిరుగుబాటు, ఉగ్రవాద కార్యకలాపాల కేసుల్ని కొట్టేయాలని ప్రిగోజిన్.. ప్రిగోజిన్ తిరిగి రష్యాలో అడుగుపెట్టకూడదనే షరతు మీద పుతిన్ అందుకు అంగీకరించినట్లు బెలారస్ మీడియా బెల్టా న్యూస్ కథనాలు ప్రచురిస్తోంది. అలాగే.. దౌత్యం నడిపిన లుకాషెంకోకు పుతిన్ కృతజ్ఞతలు తెలిజయజేసినట్లు తెలిపింది. బంద్ వాతావరణమే! రోస్తోవ్తో పాటు వొరోనెజ్, లిపెట్స్క్ తదితర ప్రాంతాల్లో మోహరించిన వాగ్నర్ దళాలు వెనుదిరిగాయి. ప్రిగోజిన్ అజ్ఞాతంలోకి వెళ్లింది ధృవీకరించుకున్నాక.. రష్యాలోని ప్రధాన నగరాల్లో అత్యవసర పరిస్థితిని.. ఆంక్షలను ఎత్తేశారు. పరిస్థితిని వీలైనంత త్వరగా సాధారణంగా మార్చేందుకు యత్నించారు. అయితే ముందస్తుగా ప్రకటించిన మాస్కో సెలవు దినం మాత్రం కొనసాగుతుందని ప్రకటించారు. అలాగే స్టాక్ ఎక్సేంజ్, బ్యాంకులు యధావిధిగా కొనసాగనున్నాయి. ముందడుగు వేసుంటేనా? ఉక్రెయిన్, పాశ్చాత్య మిత్రపక్షాలు మంచి అవకావం మిస్ చేసుకున్నాయి. రష్యా ఒకటిన్నర రోజు తిరుగుబాటుపై కేవలం కీవ్ వర్గాలు ప్రకటనలనే పరిమితం అయ్యాయి. పరిస్థితులను పరిశీలిస్తున్నామని మాత్రమే పేర్కొన్నాయి. ఇది పుతిన్కు ఘోర అవమానం ప్రకటించాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ. కానీ, ఈలోపే పరిస్థితి చల్లారింది. ప్రిగోజిన్ వెనువెంటనే బలగాల ఉపసంహరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు జెలెన్స్కీ వ్యక్తిగత సలహాదారు మైఖాయిలో పోడోల్యాక్. అయితే ఇది ఆరంభం కాబోలని.. రష్యా భవిష్యత్తులో ఈ తరహావి మరిన్ని జరిగే అవకాశం లేకపోలేదని మాత్రం అంచాన వేశారు. కానీ, ప్రిగోజిన్ బఖ్ముత్లో నాలుగు వారాల ముందే ఇచ్చిన తిరుగుబాటు ప్రకటనను సరిగ్గా గమనించి.. ముందడుగు వేసి ఉంటే అది క్రెమ్లిన్ మెడపై కత్తి పెట్టినట్లు అయ్యి ఉండేదన్నది పలువురి విశ్లేషణ. ఉక్రెయిన్ యుద్ధంలాగా.. ఈ తిరుగుబాటు సుదీర్ఘ కాలం కొనసాగినా.. ఉక్రెయిన్కు లాభం ఉండేదేమో!. ఇదీ చదవండి: ప్రిగోజిన్ తిరుగుబాటు.. రష్యా రక్షణ వ్యవస్థ అంత వీకా? -
రష్యా దుస్థితి చూసి..ప్రపంచ నాయకుల రియాక్షన్ ఎలా ఉందంటే..
ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో యుద్ధం వద్దు చర్చలే ముద్దు అని పిలుపునిచ్చిన రష్యా ఖాతారు చేయలేదు. ఊహించని విధంగా ఉక్రెయిన్పై దురాక్రమణ యుద్ధానికి సై అంటూ.. బాంబులతో దద్ధరిల్లే చేసింది రష్యా. దీంతో ఒక్కసారిగా దేశాలన్ని విస్తుపోయాయి. అక్కడికి ప్రపంచ నాయకులంతా ముందుకు వచ్చి రష్యాకు హితవు పలికిన ససేమిరా అంది. పైగా తమను తాము రక్షించుకునేందుకు చేస్తున్న ప్రత్యేక సైనిక యుద్ధంగా సమర్థించుకుంది. చివరికి రష్యానే ఊహించని రేంజ్లో ప్రైవేట్ సైనిక సంస్థ వాగ్నర్ గ్రూప్ ఇచ్చిన ఝలక్కి గడగడలాడింది. దీంతో రష్యా ఎదుర్కొన్న ఈ అసాధారణ పరిస్థితి గురించి ప్రపంచ నాయకులు ఏమన్నారంటే.. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అండదండగా ఉన్న ప్రైవేట్ సైనిక సంస్థ వాగ్నర్ గ్రూప్ రష్యాపై తిరుబాటు జెండా ఎగరేసింది. ఈ వాగ్నర్ గ్రూప్ అనేది కిరాయి సైన్యం. ఈ సంస్థకి చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్. ఉక్రెయిన్ యుద్ధంలో కీలకంగా వ్యవహరించింది ఈ సంస్థ సైనికులే. అయితే తమ సైనికులకు తగిన గుర్తింపు లేదని పైగా తమ సైనికులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతోందంటూ రష్యా మిలటరీపై ఆరోపణలు చేస్తూ ప్రిగోజిన్ రష్యాపై దాడి చేసేందుకు సన్నద్ధమయ్యారు. అంతేగాదు మిలటరీ నాయకత్వాన్ని కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అతని పేరే ఎత్తకుండకునే దేశద్రోహి, ఇలాంటి వాళ్లకు ఎప్పటికైనా శిక్షపడుతుందంటూ మీడియా ముందు పెడబొబ్బలు పెట్టారు పుతిన్. ప్రిగోజిన్పై తీవ్రవాదం వంటి నేరాలు మోపేందుకు రెడీ అయ్యారు కూడా. ఇలా ప్రకటించారో లేదో వాగ్నర్ సైన్యం రష్యాలో కల్లోలం సృష్టించింది. అప్పటికే ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని ఉత్తర రష్యా వైపు వస్తున్నట్లు ప్రకటించాడు ప్రిగోజిన్. దెబ్బకి రష్యా వెనక్కి తగ్గి.. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశెంకోతో మంతనాలు జరిపించి పరిస్థితిని చక్కబెట్టుకుంది. పైగా ప్రిగోజిన్పై మోపిన నేరాన్ని ఎత్తివేయడమే గాక తిరుబాటులో పాల్గొన్న సైనికులపై కూడా ఎలాంటి విచారణ ఉండదని, యథావిధిగా విధులకు హాజరవ్వచ్చని రష్యా ప్రకటించడం విశేషం. పుతినే కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ని పెంచి పోషించినట్లు సమాచారం. దీని అండ చూసుకునే ఉక్రెయిన్పై యుద్ధానికి దిగాడు. చివరికి అదే శూలంలా మారి గుండెల్లో గుచ్చుకుంది. ఈ ఘటన అతని దీర్ఘకాల నాయకత్వానికి పెను సవాలుగా మారడమేగాక సందిగ్ధంలో పడేసింది. ఇక రష్యా పని అయిపోయిందనకునేలా మచ్చెమటలు పట్టించింది వాగ్నర్ సైనిక సంస్థ. రష్యా తాను ఉక్రెయిన్పై చేస్తున్న యుద్ధం కరెక్ట్ అని సమర్థించుకుంటే..తానే పెంచి పోషించి.. రంగంలోకి దింపిన కిరాయి సైన్యమే ఎదురు తిరిగి ద్రోహం చేసేందుకు రెడీ అయ్యింది. తన వరకు వస్తేగానీ బాధ అంటే ఏంటో తెలియదంటే ఇదే కాబోలు. ఈ ఘటనతో రష్యా బలం, బలహీనతో ఏమిటో ప్రపంచ దేశాలకు అర్థమైపోయాయి. ఈ పరిణామాలన్నింటిని నిశితంగా గమనిస్తున్న కూటమి దేశాలకు కూడా ఈపాటికే అక్కడి పరిస్థితి అర్థమైపోయింది. ఈ పరిణామాలపై దేశాధి నేతల స్పందించారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షడు జో బైడెన్ కూడా రష్యా పరిస్థితిని గమనిస్తున్నారని, మిత్ర దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి ఆడమ్ హాడ్జ్ తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ కూడా రష్యా బలహీనత స్పష్టంగా కనిపిస్తోంది, దాడి చేసేందుకు ఈ కిరాయి సైన్యంపై ఆధారపడితే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తప్పవన్నారు. అంతేగాదు నాటో ప్రతినిధి ఓనా లుంగెస్కు కూటమి కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలపడం విశేషం. ఇక బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ సైతం పరిస్థితిని పర్యవేక్షించడమే గాక ఈ సమయంలో అన్ని దేశాలు సంయమనంతో వ్యవహరిస్తున్నాయన్నారు. కాగా, ఇదే క్రమంలో యూరోపియన్ యూనియన్ చీఫ్ చార్లెస్ మిచెల్ సైతం రష్యా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అలాగే జీ7 దేశాల భాగస్వామ్యాలతో టచ్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది రష్యా అంతర్గత సమస్య అని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ మద్దతు విషయంలో మార్పు ఉండదని దృఢంగా తెలిపారు. Closely monitoring the situation in Russia as it unfolds. In touch with European leaders and @G7 partners. This is clearly an internal Russian issue. Our support for Ukraine and @ZelenskyyUa is unwavering. — Charles Michel (@CharlesMichel) June 24, 2023 (చదవండి: తిరుగుబాటు సైన్యంపై ప్రశంసల వర్షం కురిపిస్తోన్న స్థానికులు.. ) -
వాళ్ళే అసలైన హీరోలు.. వీళ్లంతా పిరికిపందలు
మాస్కో: రష్యాలో తిరుగుబాటు విషయమై బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశెంకో జరిపిన మధ్యవర్తిత్వం ఫలించడంతో వాగ్నర్ బలగాలు తమ స్థావరాలకు తిరుగు ప్రయాణమయ్యాయి. రొస్తోవ్ ప్రజానీకం వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా స్థానికులు తిరిగి వెళ్తోన్న వాగ్నర్ సైన్యాన్ని హీరోలుగానూ స్థానిక పోలీసులను పిరికిపందలగానూ, దొంగలుగానూ అభివర్ణించారు. ప్రిగోజిన్ బృందాలు రష్యాను వీడి వెళ్తోన్న వీడియోలు సోషల్ మీడియాలో రాగానే రొస్తోవ్లోని జనం రోడ్డు మీదకు వచ్చి తమ అభిప్రాయాలను వెల్లడించారు. రష్యా సైన్యం తీరు మొదటి నుంచీ తప్పులతడకగానే ఉందని వాగ్నర్ గ్రూపుపై వారి ఆధిపత్యం సహించలేకే వారు తిరుగుబాటు చేశారని అన్నారు. బఖ్ ముత్ లోనూ ఇతర చోట్ల ఏం జరిగిందో మీరు చూశారు. ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో మన సైనికులు వేల సంఖ్యలో చనిపోయారు. రష్యా సైన్యం వారికి తగినన్ని ఆయుధాలు పంపలేదని, మనవాళ్ళే మనం గెలవకుండా అడ్డుకున్నారని ఇక్కడివారు చెబుతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెంచి పోషించిన కిరాయి సైన్యం ఆయనపైనే తిరుగుబాటు చేసి ప్రిగోజిన్ నాయకత్వంలో మాస్కోకు వస్తున్నామని చెప్పగానే రష్యా సైన్యం భయపడిందని.. వాగ్నర్ సైనికులే అసలైన హీరోలని.. వారికి భయపడి పారిపోయిన ఇక్కడి పోలీసులు పిరికిపందలు, దొంగలని అన్నారు. People in Rostov yell 'shame' and 'traitors' at police who came in to the city after Wagner forces left. pic.twitter.com/bL1Rz8ZX4D — The Spectator Index (@spectatorindex) June 24, 2023 -
రష్యాలో హైడ్రామా మధ్య ముగిసిన తిరుగుబాటు సంక్షోభం
మాస్కో: తిరుగుబాటు నాయకుడు యెవ్జెనీ ప్రిగోజిన్ పై ఉన్న క్రిమినల్ కేసును ఉపసంహరించుకునే విధంగా బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాశెంకో జరిపిన మధ్యవర్తిత్వం ఫలించింది. దీంతో మాస్కో వైపుగా కదులుతామని హెచ్చరించిన వాగ్నర్ తిరుగుబాటు సైన్యం శాంతించి తిరుగుముఖం పట్టింది. క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ మాట్లాడుతూ రక్తపాతాన్ని నిరోధించి, అంతర్గత ఘర్షణలను తగ్గుముఖం పట్టించి, పరిస్థితులు తీవ్ర పరిణామాలకు దారితీయకుండా చూడాలన్నదే మా ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ సందర్బంగా దేశం కోసం వారు చేసిన వీరోచిత పోరాటాలను మేమెప్పుడూ గౌరవిస్తామని అన్నారు. బెలారస్ అధ్యక్షుడు లుకాశెంకో జరిపిన ఈ మధ్యవర్తిత్వం ప్రకారం వాగ్నర్ సైన్యం నాయకుడు యెవ్జెనీ ప్రిగోజిన్ పై ఉన్న క్రిమినల్ కేసును ఎత్తివేస్తున్నట్లుగానూ, అలాగే వాగ్నర్ సైనికులపై ఎలాంటి విచారణ కూడా ఉండదని పెస్కోవ్ అన్నారు. ఇక ఈ తిరుగుబాటులో పాల్గొనని సైనికులు యధాతధంగా తమ విధులకు హాజరవ్వొచ్చని తెలిపారు. యెవ్జెనీ ప్రిగోజిన్ పై తీవ్రవాద నేరం మోపబడ్డ గంటల వ్యవధిలోనే అతని తిరుగుబాటు సైన్యం రష్యాలో ఎంతటి విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసిందే. శనివారం రష్యా సైన్యంపై చేసిన తిరుగుబాటుకి దక్షిణ రష్యా అట్టుడికిపోయింది. అప్పటికే ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుని ఉత్తర రష్యా వైపుగా వస్తున్నామని ప్రిగోజిన్ ప్రకటించారు. దీంతో మరింత విధ్వంసం తప్పదని భావించిన తరుణంలో రష్యా మిత్రపక్షమైన బెలారస్ అధ్యక్షుడు లుకాశెంకో చొరవ తీసుకుని జరిపిన మధ్యవర్తిత్వం ఫలించడంతో ఊపిరి తీసుకున్నాయి రష్యా శ్రేణులు. ఇది కూడా చదవండి: ఈజిప్టుకు చేరుకున్న ప్రధాని మోదీ -
గర్జించిన చెఫ్
ఉక్రెయిన్ సహా వివిధ దేశాల మిలటరీ ఆపరేషన్లలో రష్యా అధినేత పుతిన్కు అండదండగా ఉన్న ప్రైవేట్ సైనిక సంస్థ వాగ్నర్ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ హఠాత్తుగా రష్యన్ సైన్యంపై తిరుగుబాటు చేయడానికి ఎన్నో కారణాలున్నాయి. ఉక్రెయిన్పై రష్యా దండయాత్రలోవాగ్నర్ సంస్థకి తగిన గుర్తింపు రాలేదు. గుర్తింపు అంతా రక్షణ మంత్రి షొయిగు కొట్టేస్తున్నారని రగిలిపోతున్నారు. ఈ ఏడాది జనవరిలో ఉక్రెయిన్లో డొనెట్స్క్ ప్రాంతంలో సొలెడార్ను ఆక్రమించడంలో వాగ్నర్ సైనికులు ప్రాణాలు పణంగా పెడితే రష్యా రక్షణ శాఖ దానిని తమ ప్రతిభగా ప్రచారం చేసుకోవడం ప్రిగోజిన్ సహించలేకపోయారు. ఉక్రెయిన్లో ఇతర నగరాలు స్వా«దీనం చేసుకోవడానికి తాను సైన్యాన్ని సిద్ధం చేసినప్పటికీ రష్యా టాప్ జనరల్ వలెరి గెరసిమోవ్ మారణాయుధాల్ని సరఫరా చేయడంలో విఫలం కావడం కూడా ఆయనని అసహనానికి లోను చేసింది. రక్షణ మంత్రి షొయిగు ఆదేశాల మేరకు వాగ్నర్ సంస్థ సైనిక శిబిరాలపై జరిగిన దాడుల్లో వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో తిరుగుబాటుకు సిద్ధమయ్యానని ప్రిగోజిన్ విడుదల చేసిన వీడియోల్లో ఆగ్రహంతో ఊగిపోతూ చెబుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యా సమరి్థంచుకునే స్థితిలో లేదని అందుకే మిలటరీ నాయకత్వాన్ని కూల్చేస్తామని వారి్నంగ్ ఇచ్చారు. ‘యుద్ధం అవసరం ఉంది. అందుకే సెర్గీ మార్షల్ అయ్యారు. ఆయన రెండో హీరోగా పతకాలు అందుకోవచ్చు. కానీ ఉక్రెయిన్ నిస్సైనీకరణ కు యుద్ధం అవసరం లేదు’అని ప్రిగోజిన్ చెబుతున్నారు. తాను చేస్తున్నది సైనిక తిరుగుబాటు కాదు, న్యాయ పోరాటమన్నది ప్రిగోజిన్ వాదనగా ఉంది. ఎవరీ ప్రిగోజిన్? ఒకప్పుడు అధ్యక్షుడు పుతిన్ దగ్గర చెఫ్. విదేశీ ప్రముఖులు ఎవరైనా వస్తే స్వయంగా గరిటె పట్టి వండి వడ్డించేవారు. ఇప్పుడు తుపాకీ పట్టుకొని ఎదురు తిరుగుతున్నారు. ఒక రెస్టారెంట్తో మొదలైన ఆయన ప్రయాణం ఒక దేశంపైనే తిరుగుబాటు చేసే స్థాయికి ఎదిగింది. ► 1961 జూన్ 1న లెనిన్గ్రాడ్ (ప్రస్తుతం సెయింట్ పీటర్స్బర్గ్)లో జని్మంచారు. ► టీనేజీలోనే దొంగతనాలు, దోపిడీలు చేసి 13 ఏళ్లపాటు జైల్లో ఉండి 1990లో బయటకు వచ్చాడు. ► జైలు నుంచి బయటకి వచ్చాక ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టారు. ధనికులు ఉండే ప్రాంతంలో ఒక రెస్టారెంట్ ప్రారంభించారు. ► సంపన్నులతో పరిచయాలు పెంచుకొని వ్యాపారంలో ఎదిగారు. ► ప్రిగోజిన్కు చెందిన ఒక రెస్టారెంట్కు పుతిన్ వస్తూ ఉండడంతో ఆయనతో పరిచయమైంది. ఆ తర్వాత ప్రొగోజిన్ జీవితమే మారిపోయింది. ► అప్పట్లో రష్యా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పుతిన్ ద్వారా రష్యా ప్రభుత్వం ఇచ్చే అధికారిక విందుల్ని ఏర్పాటు చేసే కాంట్రాక్ట్ లభించింది. ► 2001లో పుతిన్ అధ్యక్షుడయ్యాక ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాలల్లో ఫుడ్ కాంట్రాక్ట్లు కూడా ప్రిగోజిన్కే దక్కాయి. అధికారంలో ఉన్న వారితో ఎలా మెలగాలో ప్రిగోజిన్కు వెన్నతో పెట్టిన విద్య. ► 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ రష్యాలో పర్యటించి విందుని ఆస్వాదించాక ప్రిగోజిన్ను ‘పుతిన్ చెఫ్’అని పిలిచారు. అప్పట్నుంచి అదే పేరు స్థిరపడింది. ► రష్యా సందర్శనకు విదేశీ ప్రముఖులు ఎవరు వచి్చనా పుతిన్తో వారు దిగిన ఫొటోల్లో ప్రొగోజిన్ తప్పనిసరిగా కనిపించేవారు. ఆతిథ్య రంగంలో కోట్లాది రూపాయల కాంట్రాక్ట్లు అతని సొంతమయ్యాయి. ► 2012లో ప్రభుత్వ స్కూళ్లకు కేటరింగ్ నడపడం కోసమే 105 కోట్ల రూబుల్స్ కాంట్రాక్ట్ దక్కింది. ► అలా వచి్చన డబ్బులతో ప్రిగోజిన్ వాగ్నర్ అనే కిరాయి సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ► మొదట్లో వాగ్నర్ సంస్థ తనదేనని ఆయన బాహాటంగా చెప్పుకోలేదు. చిట్టచివరికి 2021లో వాగ్నర్ సంస్థ తనదేనని అంగీకరించారు. ► 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కి అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయించింది ప్రొగోజిన్ అనే అనుమానాలున్నాయి. అప్పట్నుంచి అమెరికా అతనిపై నిషేధం విధించింది. వాగ్నర్ సంస్థ ఏం చేస్తుందంటే..? ► 2014లో క్రిమియాని ఆక్రమించాలని పుతిన్ ప్రణాళికలు సిద్ధం చేసినప్పుడు యెవ్గెనీ ప్రిగోజిన్తో తానే ఈ సంస్థను ఏర్పాటు చేయించారన్న ప్రచారమైతే ఉంది. ► క్రిమియా ఆక్రమణలో తమ చేతికి మట్టి అంటకుండా ఉండడానికే ఈ ప్రైవేటు సైన్యాన్ని పుతిన్ రంగంలోకి దింపారన్న ప్రచారం ఉంది. ► రష్యాలో ప్రైవేటు సైన్యం చట్ట విరుద్ధం. అయినప్పటికీ రష్యా రక్షణ శాఖ కిరాయి సైన్యాన్ని చూసి చూడనట్టుగా వదిలేసేది. ► క్రిమియా తర్వాత తూర్పు ఉక్రెయిన్లో దాన్బాస్లో రష్యా అనుకూల వర్గానికి మద్దతుగా పని చేసి ఆ ఆపరేషన్లో విజయం సాధించింది.అలా వాగ్నర్ కార్యకలాపాలు విస్తరించాయి. ► సిరియాలో రష్యా అనుకూల బషర్ అల్ అసాద్ ప్రభుత్వాన్ని కాపాడడంలో కీలకంగా వ్యవహరించింది. ► లిబియా, మొజాంబిక్, మాలి, సూడాన్, ది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, వెనెజులా ఇలా ఎక్కడ ఘర్షణలు అట్టుడికినా రష్యా జోక్యం ఉంటే అక్కడ తప్పకుండా వాగ్నర్ గ్రూప్ ప్రత్యక్షమయ్యేది. ► ఓ రకంగా వాగ్నర్ పుతిన్కు చెందిన కిరాయి సైన్య#గామారింది. ► ఈ గ్రూపులో మాజీ సైనికులే సభ్యులుగా ఉంటారు. బ్లూమ్బర్గ్ సంస్థ లెక్కల ప్రకారం ఈ గ్రూపులో 60 వేల మంది సైనికులు ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో కీలకం ఏడాదిన్నర క్రితం ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర మొదలు పెట్టినప్పట్నుంచి వార్నర్ సైనికులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్పై రెండు వారాల్లో నెగ్గేస్తామన్న పుతిన్ భ్రమలు తొలగిపోవడంతో వాగ్నర్ సైనికులు మరింత దూకుడుగా ముందుకెళ్లారు. ప్రొగోజిన్ వారు తన సైనికులేనంటూ బహిరంగంగా అంగీకరించడమే కాకుండా యుద్ధాన్ని ముమ్మరం చేశారు. ౖ ఖైదీలను సైనికులుగా చేర్చుకున్నారు. ఈ యుద్ధంలో సంస్థకు చెందిన 50 వేల మంది పాల్గొన్నారు. కీలక నగరాల స్వా«దీనంలో వీరే ముందున్నారు. బఖ్ముత్æ కోసం జరిగిన పోరులో 20 వేల మంది మరణించారు. – సాక్షి నేషనల్ డెస్క్ -
సంక్షోభంలో రష్యా
మాస్కో: ఉక్రెయిన్పై ఏడాదిన్నరగా యుద్ధం చేస్తున్న రష్యా అనూహ్య పరిణామాలతో అంతర్గత సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ఇన్నాళ్లూ ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా తరఫున పోరాడిన ప్రైవేటు సైనిక సంస్థ వాగ్నర్ శుక్రవారం రాత్రికి రాత్రే ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. రష్యా మిలటరీ నాయకత్వాన్ని కూలి్చవేస్తామని వాగ్నర్ చీఫ్ యెవ్గెనీ ప్రిగోజిన్ గర్జించారు. తమ సంస్థకు చెందిన బలగాలను లక్ష్యంగా చేసుకొని రష్యా సైన్యం దాడులకు దిగుతోందని అందుకే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. రష్యాలోని ప్రధాన నగరమైన రోస్తోవ్ దాన్ తమ అధీనంలోనే ఉందని ఆయన ప్రకటించారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగును లక్ష్యంగా చేసుకుంటూ పలు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. తమ సంస్థపై సెర్గీ దాడులు చేయిస్తున్నారని ఆయనను విడిచిపెట్టబోమంటూ ఆగ్రహావేశాలతో వీడియోలో హెచ్చరికలు జారీ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు అత్యంత అంతరంగికుడైన ప్రిగోజిన్ ఈ తిరుగుబాటుకు పాల్పడడాన్ని ప్రభుత్వంలో ఎవరూ జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఈ పరిణామాలతో రష్యాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రిగోజిన్ను నిలువరించడానికి తన సొంత దేశంలోనే రష్యన్ మిలటరీ దాడులకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కల్లోల పరిస్థితుల మధ్య ఏది వాస్తవమో , ఏది కాదో అన్న గందరగోళం కూడా ఏర్పడింది. ఒకానొక దశలో రష్యా అద్యక్షుడు పుతిన్ మాస్కో విడిచి పరారయ్యారన్న వార్తలు హల్చల్ చేశాయి. అయితే అందులో నిజం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ప్రిగోజిన్ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత రెండు దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా అధ్యక్షుడు పుతిన్ పదవీ గండాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ తిరుగుబాటుపై జాతినుద్దేశించిన ప్రసంగించిన పుతిన్ ప్రిగోజిన్ పేరు ప్రస్తావించకుండా దేశద్రోహానికి పాల్పడ్డారని, వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. తిరుగుబాటు చేసిన వారందరినీ కఠినంగా శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దేశంలో బలగాలను, అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశామని, ఎలా ముందుకు వెళ్లాలో ఆదేశాలిచ్చామని చెప్పారు. రష్యా ఎఫ్ఎస్బీ సెక్యూరిటీ సరీ్వస్ ప్రిగోజిన్పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. పుతిన్ తప్పు చేశారు : ప్రిగోజిన్ పుతిన్ ప్రసంగం అనంతరం ప్రిగోజిన్ మరో ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. తమను దేశద్రోహులమని పేర్కొని పుతిన్ అతి పెద్ద తప్పు చేశారన్నారు. ఉక్రెయిన్పై యుద్ధంలో పోరాటం చేసిన తామే అసలు సిసలు దేశభక్తులమని అన్నారు. తాము ప్రభుత్వానికి లొంగి పోయే స్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 25వేల మంది సైన్యంతో తిరుగుబాటు ఉక్రెయిన్ యుద్ధభూమిలో ఉన్న వాగ్నర్ సైనికుల్ని వెనక్కి రప్పించిన ప్రిగోజిన్ రోస్తోవ్ దాన్ నగరంలోసైనిక ప్రధాన కార్యాలయం, ఇతర సైనిక స్థావరాలను తమ అ«దీనంలోకి తెచ్చుకున్నట్టు చెబుతున్నారు. నగరంలో మిలటరీ వాహనాలు, ట్యాంకుల్ని మోహరించిన వీడియోలు కూడా విడుదల చేశారు. ఒక్క తుపాకీ తూటా పేలకుండానే తాము మిలటరీ కార్యాలయాన్ని స్వా«దీనం చేసుకున్నామని ప్రిగోజిన్ చెప్పారు. రక్షణ మంత్రి సెర్గీ షొయిగు, మిలటరీ జనరల్ గెరాసిమోవ్ రోస్తోవ్లోని మిలటరీ కార్యాలయంలో తనతో సమావేశం కావాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ నెరవేర్చకపోతే రాజధాని మాస్కోని ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. వాగ్నర్ సంస్థకు చెందిన దాదాపుగా 25 వేల మంది సైనికులు మాస్కోదిశగా కదులుతున్నట్టు తెలుస్తోంది. మాస్కోకి దక్షిణంఆ 360 కి.మీ. దూరంలోని లిపె్టక్ ప్రావిన్స్లో వాగ్నర్ బలగాలు, ఇతర ఆయుధాల్ని మోహరించినట్టుగా ప్రిగోజిన్ విడుదల చేసిన వీడియోల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని లిపె్టక్ ప్రావిన్స్ గవర్నర్ ఇగోర్ అర్టమోనోవ్ కూడా ధ్రువీకరించారు. వాగ్నర్ సైన్యాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ సేనలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రజల భద్రతకు ఎలాంటి ప్రమాదమూ లేదని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున జనం గుమిగూడే కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు మాస్కో ప్రాంత గవర్నర్ తెలిపారు. విద్యా సంస్థలను జులై ఒకటి దాకా మూసివేసినట్లు తెలుస్తోంది. తాత్కాలిక విరమణ బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకశెంకో మధ్యవర్తిత్వంతో శనివారం రాత్రికల్లా ఇరువర్గాల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరింది. మాస్కో దిశగా వెళుతున్న వాగ్నర్ గ్రూపు సైనికులను ఆగిపోవాల్సిందిగా యెవ్గెనీ ప్రిగోజిన్ ఆదేశాలు ఇచ్చారు. రష్యన్ల రక్తం చిందకూడదనే ఉద్దేశంతోనే మాస్కో దిశగా ముందంజ వేయడాన్ని నిలిపివేసినట్లు తెలిపారు. ఉక్రెయిన్లోని తమ స్థావరాలకు మళ్లాల్సిందిగా తమ బలగాలకు ఆదేశాలు జారీచేసినట్లు వెల్లడించారు. వాగ్నర్ గ్రూపు సైనికుల రక్షణకు పుతిన్ నుంచి హామీ లభించిందని మధ్యవర్తిత్వం వహించిన లుకశెంకో ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి బలహీనంగా రష్యా : జెలెన్స్కీ రష్యాలో అంతర్గత సంక్షోభంతో ఆ దేశం పూర్తి స్థాయిలో బలహీనపడిపోయిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. చెడు మార్గాన్ని అనుసరించే వారందరూ తమను తామే నాశనం చేసుకుంటారన్నారు. ‘‘చాలా కాలంగా రష్యా తన బలహీనతల్ని కప్పిపుచ్చుకుంటూ వస్తోంది. ప్రభుత్వంలో ఉన్న వారి మూర్ఖత్వాన్ని దాచిపెడుతూ వస్తోంది. ఇక ఏదీ దాచి ఉంచలేరు. అబద్ధాలు చెప్పలేరు. రష్యా తమ సైన్యాన్ని దళాలు, కిరాయి సైన్యం ఉక్రెయిన్లో ఎంత కాలం ఉంచుతుందో అంత ఎక్కువ బాధను ఆ దేశం కూడా ఎదుర్కొంటుంది’’ అని జెలెన్స్కీ ట్వీట్ చేశారు.