volunteers
-
వలంటీర్ల వ్యవస్థకు మంగళం!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పైరవీలు, పక్షపాతానికి తావులేకుండా ఐదేళ్ల పాటు లబ్దిదారుల ఇళ్ల వద్దనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి దేశవ్యాప్తంగా ప్రశంసలందుకున్న వలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం అటకెక్కించేసింది. గత ఏడాది ఎన్నికల ముందు.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం, వారి గౌరవ వేతనం రెట్టింపు చేస్తామని ఊరూవాడా హోరెత్తించిన కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థను చిదిమేశారు. తాజాగా.. ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ నిధులు కేటాయించకపోవడంతో 2.66 లక్షల మంది వలంటీర్ల కుటుంబాలు రోడ్డునపడినట్లయింది. నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉపాధి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు విజయవంతంగా కొనసాగిన వలంటీర్ల వ్యవస్థ ద్వారా పేద నిరుద్యోగ యువత పెద్దఎత్తున ఉపాధి పొందారు. అప్పట్లో 20–25 ఏళ్ల మధ్య వయస్సు వారు 27 శాతం మంది, 26–30 ఏళ్ల మధ్య వారు 36 శాతం, 31–35 ఏళ్ల మధ్య వారు 28 శాతం కలిపి మొత్తం 91 శాతం మంది 35 ఏళ్లలోపు వారే ‘వలంటీర్’గా ఉపాధి పొందారు. మరోవైపు.. వలంటీర్లుగా అప్పటి ప్రభుత్వం నియమించిన వారిలో 49 శాతం మంది బీసీలు, 27 శాతం మంది ఎస్సీలు, ఏడు శాతం మంది ఎస్టీలున్నారు. అలాగే, మొత్తం మీద 1,25,781 మంది మహిళలు ఉపాధి పొందారు. తొమ్మిది నెలలుగా ఆందోళన చేస్తున్నా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వలంటీర్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు గత ఏడాది ఎన్నికల ముందు ఉగాది పండుగ రోజున.. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో పాటు ప్రస్తుతం వారి గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఊదరగొట్టారు. అయితే, జూన్లో అధికారంలోకి వచ్చాక ఆ నెల నుంచి వలంటీర్ల వేతనాలను ప్రభుత్వం నిలిపివేసింది. అంతేకాక.. అప్పటివరకూ అన్ని రకాల విధులు నిర్వహించిన వీరిని ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. దీంతో వలంటీర్లు చంద్రబాబు ఇచి్చన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తునే ఉన్నారు. అయినా, ఈ సర్కారుకు చీమ కుట్టినట్లు కూడా లేదు. వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాంతెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా మీకు (వలంటీర్లకు) హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం. వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది పండుగరోజున తీపి కబురు మీ అందరికీ ఇస్తాం. రూ.ఐదువేలు కాదు.. రాబోయే రోజుల్లో పదివేల రూపాయల పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. 2024 ఉగాది పండుగ రోజున పార్టీ నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు -
ఓ మంత్రిగారు.. చించినాడ పూతరేకులు..
సాక్షి, భీమవరం : ‘చంద్రబాబునాయుడుగారు, పవన్కళ్యాణ్గారు చెప్పారమ్మా.. మీ వలంటీరు జాబ్కు రూ.5 వేలు ఏ మూలకి సరిపోతాయి? ఖర్చులు బోలెడు పెరిగిపోయాయి కదా? మన ప్రభుత్వంలో వలంటీరు వ్యవస్థను కొనసాగిస్తాం. మీకు రూ.10 వేలు జీతం ఇస్తాం. రేపొద్దున్న మన ప్రభుత్వంలో అన్నయ్య ఇదిగో 10 వేలు అందుకున్నానని ఆనందంగా మన చించినాడ పూతరేకుల ప్యాకెట్ పట్టుకుని రావాలి’.. అంటూ పాలకొల్లు నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయుడు(Nimmala Rama Naidu)ఎక్కడ వలంటీరు కనిపించినా ఈ హామీ ఇచ్చేవారు.రూ.10 వేలు తీసుకున్నాక ఆనందంగా చించినాడ పూతరేకుల ప్యాకెట్ కానుకగా ఇవ్వాలని చెప్పి ఆకట్టుకునే ప్రయత్నం చేసేవారు. అప్పట్లో ఆయన పాలకొల్లు కళాకారులనే మించిపోయారు. ఇంటింటికీ వెళ్లి అమ్మ, అక్క, చెల్లి, బావ, తమ్ముడు.. అని అందరితో వరసలు కలుపుతూ సూపర్ సిక్స్లో ఎవరెవరికి ఎంత నగదు వస్తుందో తనదైన శైలిలో వివరించేవారు. ఆనక ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టులు చేయించుకునే వారు. ఇప్పుడదే ఆయన్ను వెంటాడుతోంది.పాలన పగ్గాలు చేపట్టి ఎనిమిది నెలలు కావస్తోంది. ఆర్థిక పరిస్థితి చూస్తుంటే హామీల అమలు సాధ్యంకాదంటూ సీఎం చంద్రబాబు చేతులెత్తేయ్యడంతో సూపర్సిక్స్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రజలు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్, నిమ్మల ప్రసంగాలు, వాటి అమలుకు ఇప్పుడు చేతులెత్తేసిన దృశ్యాలతో రీల్స్ ద్వారా ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. మంత్రి నిమ్మలకు రీల్స్ సెగ.. ఇక పాలకొల్లులోని ఒక ఇంటి వద్ద ఉన్న చిన్నపిల్లలను చూపిస్తూ నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అంటూ నాడు నిమ్మల రామానాయుడు చెప్పిన వీడియో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. తలి్లకి వందనం ఇప్పట్లో రాదని తెలిసి ఆ వీడియోకు గోదావరి వెటకారం, యాసను జోడించి మరీ నెటిజన్లు రీల్స్ చేసి మంత్రి నిమ్మలకు వ్యతిరేకంగా పోస్టు చేస్తున్నారు. కొందరైతే తమ సెల్ఫోన్లకు ఈ ఆడియోను రింగ్టోన్లుగా పెట్టేసుకున్నారు.ఇలా గత రెండ్రోజులుగా నిమ్మల హామీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండవుతున్నాయి. అలాగే, మన ప్రభుత్వంలో మీకు రూ.10 వేలు వేతనం వచ్చిన ఆనందంతో కానుకగా తనకు చించినాడ పూతరేకులు తీసుకొచ్చి ఇవ్వాలంటూ వలంటీర్లతో చెప్పిన వీడియోలను జతచేసి సోషల్ మీడియాలో వేల సంఖ్యలో షేర్ అవుతున్నాయి. వలంటీర్లను కొందరు కూటమి నేతలు వంచించిన తీరును ఎండగడుతుండగా, మరికొందరు వాటికి మద్దతుగా కామెంట్లు పెడుతూ నిరసన తెలుపుతున్నారు. పూతరేకులు దొరక్క కలవలేకపోయారంటూ వంటి పోస్టులతో ఆడుకుంటున్నారు. అధికారం కోసం హామీలిచ్చేయ్యడం, గద్దెనెక్కాక వాటిని విస్మరించడం పూర్వపు రోజులని.. ఇప్పుడు సోషల్ మీడియా నుంచి తప్పించుకోలేరంటూ సెటైర్లు వేస్తున్నారు. -
వలంటీర్ల కోసం సమిధనవుతా..
సాక్షిప్రతినిధి, విజయవాడ: ‘కష్టాల్లో ఉన్న వలంటీర్ వ్యవస్థను కాపాడుకుందాం.. కరోనా సమయంలో వారు చేసిన సేవలను గుర్తిద్దాం. మనలోని మానవత్వాన్ని చాటుకుందాం’ అంటూ ఓ యువకుడు బ్యానర్ను ప్రదర్శిస్తూ విజయవాడలోని అంబేడ్కర్ స్మృతివనం దగ్గర సోమవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. వలంటీర్లపై టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత ధోరణిని నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్ననికి చెందిన నక్కా వాసు ఒంటిపై పెట్రోల్ పోసుకుని లైటర్తో నిప్పు అంటించుకుంటుండగా.. అక్కడే విధుల్లో ఉన్న సూర్యారావుపేట సీఐ అబ్దుల్ అలీషేక్ అడ్డుకున్నారు.ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న వాసు అనంతరం సూర్యారావుపేట స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా విధుల్లోకి తీసుకోవాలని వలంటీర్లు చేస్తున్న ఆందోళన తనను కలిచి వేసిందన్నాడు. కరోనా సమయంలో సొంత వాళ్లే దగ్గరకు రాని దుర్భర పరిస్థితుల్లో వలంటీర్లు ప్రజలకు మర్చిపోలేని సేవలందించారని గుర్తుచేశాడు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు నేడు పింఛన్ కోసం పడరాని పాట్లు పడుతున్నారని, వలంటీర్లు ఉన్నప్పుడు హాయిగా ఇళ్ల వద్దే పింఛన్లు తీసుకున్నారని చెప్పారు.అప్పటి నుంచే వలంటీర్ వ్యవస్థకు అభిమానిగా మారానని, అంతటి సేవ చేసిన వలంటీర్లను ప్రస్తుత ప్రభుత్వం విధుల్లోకి తీసుకోకుండా వేధిస్తుండటంపై మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకునేందుకు యత్నంచినట్టు చెప్పాడు. వాసు కొన్నేళ్లుగా తండ్రితో కలిసి ఉండవల్లి సమీపంలోని పోలకంపాడులో ఉంటున్నాడు. కుంచనపల్లిలో నాటు కోళ్ల ఫాంను నడుపుతూ విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లోని చికెన్ షాపులకు సరఫరా చేస్తుంటాడు. వాసు తండ్రి ఫైర్ స్టేషన్లో పని చేస్తుంటాడు. వాసుకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. వలంటీర్ వ్యవస్థ రావాలని బలంగా కోరుకుంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. -
బాబు, పవన్ ను ఏకిపారేసిన వాలంటీర్లు
-
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై వాలంటీర్ల మండిపాటు
-
‘చలో విజయవాడ’పై ఉక్కుపాదం.. వాలంటీర్ల గృహ నిర్బంధం
సాక్షి, విజయవాడ: వాలంటీర్ల ‘చలో విజయవాడ’(Chalo Vijayawada) కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల(Volunteers)ను హౌస్ అరెస్ట్ చేశారు. కేబినెట్లో వాలంటీర్ల అంశంపై ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సెక్రటేరియట్కు వెళ్లి సీఎంను కలుస్తామన్న వాలంటీర్లపై ప్రభుత్వం నిర్బంధం విధించింది. విజయవాడలోని దాసరి భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.చలో విజయవాడను అడ్డుకోవడంపై వాలంటీర్లు మండిపడ్డారు. గత ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం. వాలంటీర్లకు ఉద్యోగం కల్పించడంతో పాటు బకాయి పడ్డ ఎనిమిది నెలల వేతనం ఇవ్వాలి. పోలీసులతో అడ్డుకున్నంత మాత్రాన మా పోరాటం ఆగదు’’ అని గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హుమాయున్ బాషా అన్నారు.‘‘ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చే వరకూ వదిలిపెట్టం. చంద్రబాబు అబద్ధాల ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నాడు. మమ్మల్ని మోసం చేసిన ఈ ప్రభుత్వం ఎప్పుడుపోతుందోనని వాలంటీర్లు ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట తప్పి మహిళలను మోసం చేశారు. పుట్టని బిడ్డకు పేరెలా పెడతామని మంత్రి డోలా బాలవీరాంజనేయులు మాట్లాడటం సిగ్గుచేటు’’ అని షేక్ హుమాయున్ బాషా మండిపడ్డారు.వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: చంద్రశేఖర్రెడ్డి 2.50 లక్షల మంది వాలంటీర్లను చంద్రబాబు మోసం చేశారని ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. చలో విజయవాడ పేరుతో నిరసనకి పిలుపు ఇస్తే వారిని హౌస్ అరెస్టులు చేస్తున్నారు. వాలంటీర్లను అరెస్టు చేయటం హేయమైన చర్య. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు పది వేల జీతం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్, లోకేష్ కూడా వాలంటీర్లకు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎగ్గొట్టారు’’ అని ఆయన ధ్వజమెత్తారు.‘‘పది వేలకు జీతం పెంచకపోగా గత ఏడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వటం లేదు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు అమలు చేయాలి. ఇప్పుడేమో అసలు వాలంటీర్ల వ్యవస్థే ప్రభుత్వంలో లేదంటూ హేళన చేస్తున్నారు. వాలంటీర్లకు సంబంధించిన జీవో లేకపోతే ఈ ప్రభుత్వం తొలిరోజుల్లో వారిని ఎలా వాడుకుంది?. పంచాయతీరాజ్ శాఖ ద్వారా వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి’’ అని చంద్రశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ‘నాది రాజకీయ పాలన..’ చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం -
వాలంటీర్లకు పదివేలు ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు: పెద్దిరెడ్డి
-
వలంటీర్లను కొనసాగించలేం
సాక్షి, విశాఖపట్నం: వలంటీర్ల వ్యవస్థను కొనసాగించలేమని, వారిని విధుల్లోకి తీసుకుంటే న్యాయ పరమైన సమస్యలు తలెత్తుతాయని ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. వలంటీర్లపై స్పష్టమైన విధానంతో ఉన్నామని చెప్పారు. పుట్టని బిడ్డకు పేరెలా పెడతామని తమ మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారని వ్యాఖ్యానించారు. ‘వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం. అంతేకాకుండా మీ గౌరవ వేతనాన్ని నెలకు రూ.5 వేల నుంచి రెట్టింపు చేసి రూ.10 వేలు ఇస్తాం’ అని ఎన్నికల ముందు ఎంతో నమ్మకంగా ఊరూరా బహిరంగ సభల్లో పదే పదే చెప్పిన చంద్రబాబు, లోకేశ్.. కూటమి పార్టీల నేతలు అధికారంలోకి రాగానే నిస్సిగ్గుగా ఇలా మాట మార్చడం విస్తుగొలుపుతోంది.మంత్రి లోకేశ్ తీరు ఏరు దాటాక తెప్పను తగలేసిన వైనాన్ని గుర్తుకు తెస్తోంది. ప్రజల ఇళ్ల వద్దకే సేవలు అందించడానికి విప్లవాత్మకంగా తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకు సాగడం అందరికీ తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి పార్టీల నేతలు ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకుని వలంటీర్ల సేవలను ఆపించినా, గత ప్రభుత్వం వారికి ఏప్రిల్, మే నెల జీతాలు అందజేసింది. జూన్ 1న వారు వేతనం అందుకున్నారు. ఆ సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్.. కూటమి నేతల వైఖరిని ఎండగడుతూ.. ‘తాత్కాలికంగా వాళ్లు మీ సేవలను ఆపించారు. అయినా ఏప్రిల్, మే నెలల జీతాలిచ్చాం. ఎన్నికలవ్వగానే తిరిగి మీరు మీ విధి నిర్వహణలో ఉంటారు.’ అని స్పష్టం చేయడం విదితమే.హెడ్ ఆఫ్ ఆకౌంట్ల వివరాలే అందుకు నిదర్శనం. వలంటీర్ల సేవలను ప్రశంసిస్తూ ఏటా వారిని మూడు రకాల అవార్డులతో సత్కరించడం కూడా తెలిసిందే. ఇలాంటి వలంటీర్ల వ్యవస్థపై కూటమి నేతలు ఆది నుంచీ విషం చిమ్ముతూనే ఉన్నారు. ఓ దశలో వారిపై కిడ్నాపర్లుగా, సంఘ విద్రోహ శక్తులుగా, ఉమెన్ ట్రాఫికర్స్గా కూడా నిందలేశారు. తీరా ఎన్నికలు సమీపించగానే.. వారిని బుట్టలో వేసుకుని ఓట్లు వేయించుకోవడానికి నెలకు రూ.10 వేలు ఇస్తామని డప్పు కొట్టారు.కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలు గడుస్తున్నా, వలంటీర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ వారు కొద్ది రోజులుగా ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు గాను ఆదివారం విశాఖ వచ్చిన మంత్రి లోకేశ్.. వలంటీర్లపై తన కపట వైఖరిని వెల్లడించడం చూసి సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. వారిని ఇక కొనసాగించే ప్రసక్తే లేదన్నట్లు చెప్పడం పట్ల వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాలకే డబ్బుల్లేవు.. ‘ప్రతినెలా రూ.4 వేల కోట్ల ఆర్థిక లోటుతో రాష్ట్ర బడ్జెట్ నడుస్తోంది. జీతాలు ఇవ్వడానికి సైతం ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. కేంద్రం సహకారంతో నెట్టుకొస్తున్నాం’ అని లోకేశ్ అన్నారు. గంజాయి నిర్మూలనకు రెండేళ్ల సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. వాల్తేరు డివిజన్ను రెండు రాష్ట్రాలు చూసుకుంటాయని, మిలీనియం టవర్లో టీసీఎస్ సెంటర్ రావడానికి మరో రెండు, మూడేళ్లు పడుతుందన్నారు. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, చెన్నై–విశాఖ ఇండ్రస్టియల్ కారిడార్లో క్రిస్ సిటీనోడ్, పలు జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు రైల్వే జోన్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారన్నారు. -
వాలంటీర్లను విధుల్లోకి తీసుకోమని పరోక్షంగా స్పష్టం చేసిన లోకేష్
-
వాలంటీర్లను తీసుకుంటే లీగల్ సమస్యలు: నారా లోకేష్
సాక్షి, అమరావతి: కూటమి నేతలు మాటల మార్చారు. వాలంటీర్ల విషయంలో కూటమి నేతలు యూటర్న్ తీసుకున్నారు. ఎన్నికలకు ముందు ఒకలా.. ప్రభుత్వంలో మరోలా మాట్లాడుతూ.. వాలంటీర్ల(volunteers)ను తీసుకుంటే లీగల్ సమస్యలు వస్తాయని బూకాయిస్తున్నారు. దీంతో, వాలంటీర్లకు నిరాశే ఎదురుకానుంది.వాలంటరీ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మొండిచేయి ఇచ్చింది. వారిని విధుల్లోకి తీసుకోమని మంత్రి నారా లోకేష్(Nara Lokesh) పరోక్షంగా స్పష్టం చేశారు. పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతారని తమ మంత్రి చెప్పారని ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో వాలంటీర్లను తీసుకుంటే లీగల్ సమస్యలు వస్తాయని చెప్పుకొచ్చారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) మాత్రం ఎన్నికలకు ముందు వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుందన్నారు. అలాగే, వాలంటీర్లకు రూ.10వేలు జీతం ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు మాట మార్చడం గమనార్హం.ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాపంగా వాలంటీర్లు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తమను విధుల్లోకి తీసుకోవాలని నిరసనల్లో పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు హామీ ఇచ్చిన విధంగా తమకు రూ.10వేల జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసనల్లో భాగంగా విజయవాడలో వాలంటీర్లు వినూత్నంగా వెనక్కి నడుస్తూ ఆందోళనలు చేపట్టారు. ఇది యూటర్న్ ప్రభుత్వం అనే ప్రయత్నం భాగంగా తాము ఇలా వెనక్కి నడిచినట్టు తెలిపారు. -
ఊపందుకుంటున్న వలంటీర్ల ఆందోళనలు
సాక్షి,అమరావతి/సత్యనారాయణపురం(విజయవా డ సెంట్రల్)/కర్నూలు (సెంట్రల్): ఎన్నికల ముందు ఉగాది పండుగ రోజున చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మి మోసపోయిన వలంటీర్ల ఆందోళనలు మరింతగా ఊపందుకున్నాయి. వరుసగా గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మరోవిడత ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2న గ్రామ, వార్డు సచివాలయం అడ్మిన్లకు వినతిపత్రాలు ఇవ్వగా.. 3న జిల్లా కేంద్రాల్లో న్యాయం చేయాలని కోరుతూ వలంటీర్లు మోకాళ్ల మీద కూర్చుని భిక్షాటన చేశారు.ఇక శనివారం (4న) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వలంటీర్లూ వెనుకకు నడుస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వలంటీర్లకు న్యాయంచేస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక యూటర్న్ తీసుకోవడాన్ని నిరసిస్తూ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ బ్యాక్వాక్ చేస్తున్నారన్న దానిని గుర్తుచేస్తూ తమ ఆందోళన నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడంతో పాటు వలంటీర్లకు రూ.10 వేలు ఇచ్చే బాధ్యత తమది అంటూ ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని వలంటీర్ల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. పైగా.. జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటివరకు వేతనాలు చెల్లించలేదని వారంటున్నారు. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వలంటీర్లు వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు.ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాం..ఈ నేపథ్యంలో శనివారం విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో వలంటీర్లు ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ వెనక్కి నడిచి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పరుచూరి రాజేంద్రబాబు, లంక గోవిందరాజులు మాట్లాడుతూ.. విజయవాడ వరద ముంపు సమయంలో వలంటీర్లతో సేవలు చేయించుకుని నేడు కనీసం వారికి సచివాలయాల్లో హాజరు వేసుకునే అవకాశం కూడా కల్పించకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు.వలంటీర్లకు గత ఎనిమిది నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించి వారికి రూ.పది వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా 2.60 లక్షల వలంటీర్లు, వారి కుటుంబ సభ్యులు అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడించి నిరసన తెలియజేస్తామని వారు హెచ్చరించారు.బాబుగారూ.. మా కడుపులు కొట్టొద్దు!ఇక కర్నూలులో కూడా వలంటీర్లు వినూత్నంగా నిరసన వ్యక్తంచేశారు. ఖాళీ ప్లేట్లు పట్టుకుని భిక్షాటన చేశారు. తమ కడుపులు కొట్టొద్దని సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ను ఈ సందర్భంగా వేడుకున్నారు. ముందుగా కలెక్టరేట్ గేటు నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా నిర్వహించారు. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించి భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వలంటీర్లు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా స్వచ్ఛంధంగా పనిచేశామని.. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమను తీసివేయడం అన్యాయమన్నారు. ఎన్నికల సమయంలో వలంటీర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. లేదంటే పెద్దఎత్తున వీధి పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమాలకు ఏఐవైఎఫ్ మద్దతిస్తోంది. -
బాబు వచ్చాడు.. జాబ్ తీశాడు.. వెనక్కి నడిచి వాలంటీర్ల నిరసన
-
ఉద్యోగ భద్రత కల్పించాలి..
సాక్షి నెట్వర్క్: తమకు ఉద్యోగ భద్రత(job security) కల్పించాలని, ఎన్నికల ముందు టీడీపీ(TDP) ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేల వేతనం ఇవ్వాలని డిమాండు చేస్తూ గ్రామ, వార్డు వలంటీర్లు(Volunteers) శుక్రవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన దీక్షలు చేపట్టారు. తక్షణం వలంటీర్లను రెన్యువల్ చేసి, ఆరు నెలలుగా పేరుకుపోయిన వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన దీక్షలకు ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు సంఘీభావం తెలిపి మాట్లాడారు. అధికారంలోకి రాక ముందు ఒక మాట, వచ్చాక మరోమాట మాట్లాడడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు.అల్లూరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ఎదుట వలంటీర్లు నిరసన దీక్షలు(Volunteers Protest) ప్రారంభించారు. వలంటీర్లను రెన్యూవల్ చేయకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మోసంచేసిందని ఆరోపిస్తున్న టీడీపీ నాయకులు.. లిక్కర్ టెండర్లు, ఇసుక టెండర్లు ఇచ్చినట్లుగానే వలంటీర్లను కూడా రెన్యువల్ చేస్తూ ఎందుకు ఆదేశాలివ్వరని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం తమను రోడ్డునపడి అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చిందని విజయవాడలో వలంటీర్లు ఆవేదన వ్యక్తంచేశారు. తమ దుస్థితికి ప్రభుత్వమే కారణమంటూ వారు దుమ్మెత్తి పోశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వలంటీర్స్ అసోసియేషన్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం జరిగింది. కూటమి ప్రభుత్వం తమను రోడ్డున పడేసిందని, ఈ దుస్థితికి కారణం ప్రభుత్వమేనని ఆరోపించారు. మంచి ప్రభుత్వమని స్టిక్కర్లు వేసుకోవడం కాదు, వలంటీర్లకు మేలుచేసే మంచి జీఓలు తెచ్చి రాష్ట్రంలోని 2.60 లక్షల వలంటీర్ల కుటుంబాలను ఆదుకోవాలని వలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు కోరారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేల ఇళ్ల వద్దకు వెళ్లి భిక్షాటన చేస్తామని.. అలా చంద్రబాబు ఇంటికీ వెళ్తామన్నారు. ఇక విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కూడా ఈ నిరసన దీక్ష జరిగింది. -
చంద్రబాబుకు జ్ఞానాన్ని ప్రసాదించండి
అజిత్సింగ్నగర్ (విజయవాడసెంట్రల్)/కపిలేశ్వరపురం/అయినవిల్లి : ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే బుద్ధి, జ్ఞానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రసాదించాలని కోరుతూ వలంటీర్లు ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఏపీ వలంటీర్ అసోసియేషన్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సింగ్నగర్ కృష్ణా హోటల్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద గురువారం వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ వలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ.. చంద్రబాబు 2024 ఎన్నికలకు ముందు వలంటీర్లను కొనసాగిస్తామని, వారికి నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని, అన్ని విధాలా న్యాయం చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇటీవల విజయవాడలో బుడమేరు వరదల సమయంలో కూడా వలంటీర్లతో సేవలు చేయించుకొని, సచివాలయాల్లో కనీసం అటెండెన్స్ వేసుకునే అవకాశాన్ని కూడా కల్పించకుండా వివక్ష చూపుతోందన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా బకాయి పడ్డ గౌరవ వేతనం చెల్లించలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు తగిన జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదించి వలంటీర్లకు న్యాయం చేసేలా చూడాలని కోరుతూ ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మమత, దమ్ము రమేష్, నరేష్, కల్యాణ్, షేక్ సైదాబీ, భాను, తేజస్విని, స్వప్న, షైనీ, రాజ్ కుమార్, సీపీఐ నాయకుడు కె.వి.భాస్కరరావు, ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు.ఎన్నికల హామీని అమలు చేయాలి గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసి, తమను విధుల్లోకి తీసుకోవాలని వలంటీర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఏడు నెలలుగా తమకు జీత భత్యాలు ఇవ్వడం లేదని ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదారిలంక, అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంలోని పంచాయతీ కార్యాలయాల్లో ఈ మేరకు గురువారం వారు వినతిపత్రాలు అందజేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో వలంటీర్లు తమ సమస్యలపై సచివాలయంలో వినతిపత్రం అందజేశారు. -
ఏపీ వ్యాప్తంగా వాలంటీర్ల నిరసన
-
రేపటి నుంచి వలంటీర్ల నిరసనలు
సాక్షి, అమరావతి: కొత్త సంవత్సరంలోనైనా సీఎం చంద్రబాబు ఎన్నికల వాగ్ధానాలను అమలు చేయాలని, వలంటీర్లకు న్యాయం చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలంటూ స్టేట్ వలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 2న జరగనున్న కేబినెట్ భేటీలో వలంటీర్లకు న్యాయం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతూ 2,3,4 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.జనవరి 2న గ్రామ, వార్డు సచివాలయం అడ్మిన్లకు వినతి పత్రాలు, 3న జిల్లా కేంద్రాల్లో మోకాళ్లమీద కూర్చుని భిక్షాటన, 4న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్యాక్ వాక్ చేస్తున్నారని గుర్తు చేస్తూ వలంటీర్లు బ్యాక్ టు వాక్ పేరుతో వెనుకకు నడుస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వివరించారు. -
‘ఉద్యోగ భద్రత’ హామీ నిలబెట్టుకోండి
సాక్షి,పాడేరు/హుకుంపేట/ముంచింగిపుట్టు (అల్లూరి జిల్లా): గ్రామ వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ.. రూ.10 వేల వేతనంతో ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూటమి నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వలంటీర్లు డిమాండ్ చేశారు. పాడేరుతో పాటు చింతూరు, జి.మాడుగుల, అరకులోయ, ముంచంగిపుట్టు, హుకుంపేట తదితర ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి రిలే దీక్షలు నిర్వహించారు. దీక్షల ముగింపు సందర్భంగా శనివారం ధర్నాలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. హుకుంపేటలో వలంటీర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బర్లు కొండబాబు,గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.కృష్ణారావు మాట్లాడుతూ వలంటీర్ల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జి.మాడుగులలో వలంటీర్లంతా రోడ్డుపై భిక్షాటన చేశారు. కూటమి ప్రభుత్వం మొండి వైఖరిని వీడి తమకు న్యాయం చేయని పక్షంలో తమ ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
ఆందోళనలతో దద్దరిల్లుతున్న ఏపీ..
-
Andhra Pradesh: ఆందోళనలతో అట్టుడికిన రాష్ట్రం
సాక్షి, నెట్వర్క్: కూటమి సర్కారు తీరుపై రాష్ట్రం నలుచెరుగులా అసహనం కట్టలు తెంచుకుంది. గిరిజన గురుకులాల టీచర్లు సీఎం చంద్రబాబు ఇంటి ఎదుట బైఠాయించారు.. విధుల్లోకి తీసుకోవాలంటూ వలంటీర్లు ధర్నాలు చేపట్టారు.. సమ్మె సైరన్ మోగించిన 108 ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు.. సమస్యలు పరిష్కరించాలంటూ పిడికిలి బిగించి ఆశా వర్కర్లు భారీ ధర్నాకు దిగారు.. ఆకలి కేకలతో అలమటిస్తున్న ఆయాలు పెండింగ్ జీతాల కోసం పొలికేక పెట్టారు.. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సోమవారం ఎక్కడికక్కడ రోడ్లెక్కితే.. ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు.. పారిశుధ్య కార్మీకులు.. వీవోఏలు.. మధ్యాహ్న భోజన కార్మీకులు.. పాఠశాల ఆయాలు.. సీహెచ్సీ వైద్యులు.. వెలుగు యానిమేటర్లు వివిధ రూపాల్లో ఆందోళనలు.. నిరసనలు చేపట్టారు. మొత్తంగా వీరందరి ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికింది. 108 ఉద్యోగుల భారీ ధర్నా సకాలంలో జీతాలు చెల్లించడంతోపాటు 104, 108 వ్యవస్థలను ప్రభుత్వమే నిర్వహించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో 108 అంబులెన్స్ ఉద్యోగులు సోమవారం మహాధర్నా చేపట్టారు. ఏపీ 108 సేవల కాంట్రాక్టు ఉద్యోగుల యూనియన్ గౌరవాధ్యక్షులు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 25 నుంచి సమ్మె చేపడతామని నోటీసిచ్చినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల పేరిట ఈనెల 22న వైద్యశాఖ ఉన్నతాధికారులు బెదిరింపు ధోరణిలో మాట్లాడారన్నారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలోనూ 108 ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. కలెక్టరేట్ల వద్ద వలంటీర్ల నిరసన ఏపీ గ్రామ, వార్డు వలంటీర్లు సోమవారం గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అన్నమయ్య జిల్లా రాయచోటి, పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్లు, రాజంపేట సబ్ కలెక్టరేట్ వద్ద, విజయవాడ ధర్నా చౌక్లో భారీ ధర్నాలు, ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వలంటీర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఇందులో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు తలకిందులుగా నిలబడి నిరసన తెలియజేశారు. గుంటూరు, నెల్లూరు, కర్నూలు కలెక్టరేట్ల వద్ద సంఘ నేతలు మాట్లాడుతూ తమను ఉద్యోగాల్లోకి తీసుకొని, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ అధ్యాపకుల ధర్నా రాష్ట్రంలోని గిరిజన గురుకులాల్లోని ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు తమను మెగా డీఎస్సీ నుంచి మినహాయించాలని, ఔట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలని, 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో సోమవారం భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ కలెక్టరేట్ వద్ద ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ధర్నా చేపట్టారు. దద్దరిల్లిన విశాఖ కలెక్టరేట్చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ.. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ చేసిన ధర్నాలతో విశాఖపట్నం కలెక్టరేట్ సోమవారం దద్దరిల్లింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మీకులు, సామాజిక కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న వీవోఏలతో పాటు మధ్యాహ్న భోజన పథకం కార్మీకులకు 5 నెలల వేతన బకాయిలు చెల్లించాలంటూ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు చెల్లించాలంటూ నినాదాలు చేసి కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ⇒ విశాఖ సెవెన్హిల్స్ ఆస్పత్రిలో 30 మంది హౌస్కీపింగ్ కార్మీకులను తొలగించడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ⇒ ఇసుక విధానం ఎంతోమంది జీవితాల్ని రోడ్డున పడేసిందంటూ క్వారీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కలెక్టరేట్ ఎదుట భారీఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టింది. అసోసియేషన్ కార్యదర్శి కర్రి రమణ ఆధ్వర్యంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్కు వినతిపత్రం అందించారు. ఇసుక రీచుల్లో దళారులు దోచేస్తున్నారనీ.. టన్నుకు అదనంగా రూ. 300 వరకూ వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయాల ఆందోళనచిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఆయాలకు 5 నెలలుగా జీతాలు మంజూరు చేయలేదని సోమవారం ఆయాలు చిత్తూరు కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఆయాలకు చీపురుకట్టలు, ఫినాయిల్, గ్లౌజు, సోపులు ప్రభుత్వమే ఇవ్వాలన్నారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట పెండింగ్ జీతాలు ఇవ్వాలని పాఠశాలలో పని చేసే ఆయాలు ధర్నాకు దిగారు. పంటకు పరిహారం ఇవ్వాలని ధర్నావిజయనగరం జిల్లాలో కోత దశలో ఉన్న వరి పంటను కత్తెర, కొమ్ము పురుగు ఆశించి కంకులన్నీ రాలిపోతున్నాయని, పరిహారం అందజేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సభ్యులు సోమవారం ధర్నా చేశారు. సమగ్ర కులగణన చేపట్టాలిసమగ్ర కులగణన చేపట్టాలని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు కల్లూరి నాగరాజు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. ఇదే విషయంపై రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కమిటీ నాయకులు అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్కు వినతిపత్రం అందించారు. తక్షణం బ్లాస్టింగ్లు ఆపండి.. అపరిమిత బ్లాస్టింగ్లతో మార్టూరు బీటలు వారుతోందని, సర్వే నంబర్ 1 కొండపై ఖనిజాన్ని దోచేస్తూ ప్రజలను కాలుష్యంలోకి నెట్టేస్తున్న క్వారీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అనకాపల్లి మండలం మార్టూరు గ్రామస్తులు డిమాండ్ చేశారు. కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టి.. కిడ్నీ బాధితులుగా మారుతున్న ప్రజలను కాపాడాలంటూ కలెక్టరేట్లో ఫిర్యాదు ఇచ్చారు.చంద్రబాబు ఇంటి వద్ద ధర్నావిద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ను కలిసేందుకు గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్సోర్సింగ్ టీచర్ల ప్రయత్నానికి పోలీసులు సోమవారం అడ్డుతగిలారు. మెగా డీఎస్సీతో తమకు అన్యాయం జరుగుతోందని, కనీసం తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్(సీఆర్టీ)గా మార్చాలనే డిమాండ్పై 1,656 మంది ఔట్సోర్సింగ్ టీచర్లు ఈ నెల 16 నుంచి సమ్మెబాట పట్టిన సంగతి తెలిసిందే. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసం వద్ద ధర్నా చేస్తున్న గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్సోర్సింగ్ టీచర్లు అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఉండవల్లిలోని ప్రజాదర్బార్ వేదిక వద్ద లోకేశ్ను కలిసేందుకు ఔట్సోర్సింగ్ టీచర్లు తరలివచ్చారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్ను కలిసి వినతిపత్రం అందిస్తామని టీచర్లు ఎంత మొరపెట్టుకున్నప్పటికీ పోలీసులు అనుమతించలేదు. పోలీసులు, టీచర్ల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో సీఎం ఇంటి వద్దే టీచర్లు బైఠాయించారు. పరిస్థితి అదుపుతప్పేలా ఉండటంతో గిరిజన గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి సదా భార్గవి వచ్చి వారితో చర్చలు జరిపారు. ప్రభుత్వం దృష్టికి మీ విషయాన్ని తీసుకెళ్తామని, విధుల్లో చేరాలని కోరారు. ఇప్పటికే ఒకసారి ఆందోళన చేశామని, తమ డిమాండ్ను పరిష్కరిస్తామని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చి ఇంత వరకు పరిష్కరించలేదని టీచర్లు మండిపడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు సమ్మె విరమించేదిలేదని స్పష్టం చేశారు. దీంతో సదాభార్గవి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల ధృష్టికి తీసుకెళ్లారు. అనంతరం లోకేశ్ సమావేశంలో బిజీగా ఉన్నారంటూ లోకేశ్ ఓఎస్డీ వరప్రసాద్ ఔట్సోర్సింగ్ టీచర్లతో మాట్లాడారు. తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్లుగా పరిగణించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లి మూడు రోజుల్లో ఏ విషయాన్ని చెబుతామని వరప్రసాద్ చెప్పడంతో ఔట్సోర్సింగ్ టీచర్లు ధర్నాను విరమించి వెనుదిరిగారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించే వరకు సమ్మె విరమించేది లేదని గిరిజన గురుకులాల ఔట్సోర్సింగ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మీనాయక్ తేల్చిచెప్పారు. 15 ఏళ్లకుపైగా గురుకులాల్లో కేవలం రూ.10,500 నుంచి రూ.18,000 చాలీచాలని జీతాలతో సేవలు అందిస్తున్న తమకు డీఎస్సీ కారణంగా అన్యాయం జరుగుతోందన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించేవరకు సమ్మె కొనసాగిస్తామని చెప్పారు. పిడికిలి బిగించిన ఆశా వర్కర్లు.. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ఆశాలు భారీ ధర్నా నిర్వహించారు. తమను ప్రభుత్వం కార్మీకులుగా గుర్తించాలని, పదవీ విరమణ ప్రయోజనాలను అందించాలని డిమాండ్ చేశారు. అలాగే రిటైర్మెంట్ వయసును పెంచాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, సహజ మరణానికి రూ. 2లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 6 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీహెచ్సీ వైద్యుల ధర్నా విజయవాడ ధర్నా చౌక్లో పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యులు ధర్నా చేశారు. పీజీ కోటా తగ్గింపుపై ఆందోళన చేపట్టారు. బుడమేరు వరదల వల్ల నష్టపోయిన తమకు పరిహారం అందించాలని కోరుతూ బాధితులు ధర్నా చేపట్టారు. భవన నిర్మాణ కార్మికుల ఆందోళన ప్రభుత్వం ఉచిత ఇసుక అందించాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు విజయవాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. పనులు లేక అల్లాడుతున్న 40లక్షల మంది కార్మీకులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఏపీ వెలుగు యానిమేటర్ల ధర్నా విజయవాడలో కలెక్టరేట్ వద్ద ఏపీ వెలుగు యానిమేటర్లు ధర్నా నిర్వహించారు. రాజకీయ కక్షలతో తొలగించిన వీఓఏలను విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీలు రద్దు చేయాల్సిందే విద్యుత్ సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని సీపీఎం నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ శ్రీకాకుళం జిల్లా హిరమండలం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. నిత్యావసర వస్తువుల ధరలతో బెంబెలేత్తిపోతున్న సామాన్యులపై విద్యుత్ చార్జీల పేరుతో మరింత భారం మోపడం సరికాదన్నారు. విజయవాడలోనూ విద్యుత్ ట్రూఅప్ చార్జీల పేరుతో వినియోగదారులపై భారాలు మోపడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. -
విజయవాడ ధర్నా చౌక్ వద్ద వాలంటీర్ల ధర్నా
-
పెద్దలే పిల్లలై..!
ఆటలు, పాటలు.. అంటే మనకు పిల్లలే గుర్తొస్తారు. కానీ వృద్ధులు కూడా తమ బాల్యం నాటి రోజులు గుర్తు చేసుకుని ఆడిపాడితే ఎలా ఉంటుంది. అచ్చు అదే ఆలోచన చేసింది వీ ది వలంటీర్స్ అనే స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ ఆధ్వర్యంలో వృద్ధుల కోసం ఆదివారం బౌరంపేటలోని ఓ పాఠశాలలో ‘పెద్దల జాతర’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో 30 వృద్ధాశ్రమాల నుంచి దాదాపు 400 మంది వృద్ధులు పాల్గొన్నారు. ఆడుతూ, పాడుతూ, రంగురంగుల బొమ్మలు వేసి రోజంతా సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమాన్ని ఏటా జరుపుతుంటారు. అయితే తొలిసారిగా హైదరాబాద్లో నిర్వహించడం విశేషం. -
ఏపీ వ్యాప్తంగా వాలంటీర్ల నిరసనలు
-
మా ఉద్యోగాలు మాకు ఇచ్చే వరకు చంద్రబాబుని వదిలే ప్రసక్తే లేదు.. వాలంటీర్లు సీరియస్ వార్నింగ్
-
వలంటీర్లను కొనసాగించాలి
సీతమ్మధార/చిలకలూరిపేట/తిరుపతి అర్బన్: వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి, రూ.10 వేల వేతనం చెల్లిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు ధర్నా నిర్వహించారు. విశాఖ జీవీఎంసీ గాం«దీపార్కులో జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు మణి మాట్లాడుతూ చంద్రబాబు చెప్పిన మాటకు పూర్తి భిన్నంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ లేదని ప్రకటించడం విశ్వాస ఘాతుకమని దుయ్యబట్టారు. తక్షణం వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఏపీ ప్రజా గ్రామ వార్డు వలంటీర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంధం దీప్తి మాట్లాడుతూ కరోనా సమయంలో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలందించామని గుర్తు చేశారు. చాలామంది కరోనా రోగుల్ని ఆస్పత్రులకు తీసుకెళ్లి, మెరుగైన వైద్యం అందించామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు నడిరోడ్డు మీదికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. వలంటీర్లకు న్యాయం చేయకపోతే విజయవాడలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం కక్షసాధింపు తగదు ఇచ్చిన హామీ మేరకు వార్డు, గ్రామ వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని ఏపీ వలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జంగాల చైతన్య డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వలంటీర్లను విధుల్లోకి తీసుకొనేది లేదని చేసిన ప్రకటనకు నిరసనగా శుక్రవారం వలంటీర్లతో కలసి చిలకలూరిపేటలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఉన్న వలంటీర్లను కొనసాగిస్తూ వాళ్లకు ఉద్యోగ భద్రత కలిగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతోపాటు ఐదు నెలల బకాయిలు చెల్లించి రూ.10 వేల గౌరవవేతనం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని, రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసిన వలంటీర్లను కొనసాగేలా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. సీఎం, డిప్యూటీ సీఎం న్యాయం చేయాలి ‘మా ఉద్యోగం మాకు ఇవ్వండి.. మాకు రాజకీయ రంగు పూయకండి..ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అదేశాలను తు.చ. తప్పకుండా పాటించడమే మా పని.. గత సర్కార్లోను ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో వారధిలాగానే పనిచేశాం’ అంటూ వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వద్ద వలంటీర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచి్చన హామీని నిలబెట్టుకోమని గుర్తుచేస్తున్నట్లు చెప్పారు. -
గ్రామ సచివాలయ వాలంటీర్లకు స్వచ్ఛందంగా ద్రోహం చేసిన బాబు
-
చంద్రబాబు వాలంటీర్లను మోసం చేశాడు: Kannababu
-
జీతాల కోసం ఆశా వర్కర్లు రోడ్డెక్కెతున్నారు
-
వలంటీర్ వ్యవస్థకి చంద్రబాబు ప్రభుత్వం షాక్
-
కర్నూలులో రోడ్డెక్కిన వాలంటీర్లు..
-
వలంటీర్ల వ్యవస్థకు మంగళం!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో ఐదేళ్లపాటు ఎలాంటి అవినీతి, పక్షపాతం, పైరవీలకు తావులేకుండా సామాజిక పింఛను లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి నగదు అందజేసిన గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మంగళం పాడేసినట్టే. సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్ ప్రతిపాదనల్లో వలంటీర్లకు ప్రతినెలా గౌరవ వేతనాల చెల్లింపుల కోసం నిధులే కేటాయించలేదు.గ్రామ వలంటీర్ల వేతనాలకే 2022–23 ఆరి్థక ఏడాదిలో రూ.1,183.80 కోట్లు, 2023–24 ఆర్థిక ఏడాదిలో రూ.1,201.79 కోట్లను అప్పటి వైఎస్ జగన్ సర్కారు బడ్జెట్లో కేటాయించి వారికి చెల్లించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో 2024–25 ఆర్థిక సంవత్సరానికి గ్రామ వలంటీర్లకు రూ.194.69 కోట్లు, వార్డు వలంటీర్లకు రూ.82.51 కోట్లు మాత్రమే కేటాయించింది. ఆ మొత్తం కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్లో పొందుపర్చి ఏప్రిల్, మే నెలల్లో వలంటీర్లకు చెల్లించిన గౌరవ వేతనాల నిమిత్తమే ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపుల కింద చూపించారు.ఆ రెండు నెలల కోసం వ్యయం చేసిన మొత్తం తప్ప.. తదనంతర 10 నెలల నిమిత్తం బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. వలంటీర్లకు ఇప్పటికే ప్రభుత్వం 5 నెలల వేతనాలు బకాయి పడింది. ఆ మొత్తంతోపాటు వచ్చే 5 నెలల వేతనాలు చెల్లించేందుకు బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. పట్టణాల్లో వార్డు వలంటీర్ల పరిస్థితీ అంతే..పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వార్డు వలంటీర్ల వేతనాలకు సైతం ఎలాంటి కేటాయింపులు చేయలేదు. 2022–23 ఆర్థిక ఏడాదిలో వార్డు వలంటీర్ల కోసం రూ.409.12 కోట్లు, 2023–24 ఆరి్థక ఏడాదిలో రూ.412.37 కోట్లను ప్రతిపాదించిన వైఎస్ జగన్ సర్కారు వారికి చెల్లింపులు చేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో వార్డు వలంటీర్ల కోసం 2024–25 ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ.82.51 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే ఇప్పటికే వార్డు వలంటీర్లకు చెల్లించిన ఏప్రిల్, మే నెలల వేతనాలకు ఖర్చు చేసిన మొత్తం తప్ప.. 5 నెలల పెండింగ్ వేతనాలు, వచ్చే 5 నెలల్లో చెల్లించాల్సిన వేతనాలకు పైసా కూడా కేటాయించలేదు. -
వలంటీర్ల కొనసాగింపుపై పిల్లిమొగ్గలు
ఇలా మోసం.. ‘వలంటీర్లను కొనసాగించడానికైనా.. రద్దు చేయడానికైనా అసలు వాళ్లు జీవోలోనే ఎక్కడా లేరు. గత వైఎస్సార్సీïపీ ప్రభుత్వమే వలంటీర్లను చాలా అన్యాయంగా మోసం చేసింది’ బుధవారం ఉపముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన పంచాయతీరాజ్ చాంబర్ ప్రతినిధుల సమావేశంలో పవన్కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలివి.ఇదీ వాస్తవం.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోపే 2019 జూన్ 22, 23 తేదీల్లో జీవో–104, జీవో–201 ద్వారా అధికారికంగా ఏర్పడిన గ్రామ/వార్డు వలంటీర్ల వ్యవస్థ కూటమి ప్రభుత్వంలోనూ నేటికీ కొనసాగుతూనే ఉంది. దీనికి విజయవాడ వరద బాధితులకు సాయమందించేందుకు కూటమి ప్రభుత్వం అధికారికంగా వినియోగించుకుంది. వరద బాధితుల గుర్తింపు (ఎన్యుమరేషన్ ప్రక్రియ)లో వలంటీర్లను వినియోగించుకునేందుకు 2024 సెప్టెంబర్ 7న రెవెన్యూ శాఖ (డిజిస్టార్ మేనేజ్మెంట్) స్పెషల్ సీఎస్ జారీ చేసిన మెమో నంబర్–2544493తో పాటు 2024 సెపె్టంబర్ 9న ఎన్జీఆర్ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులు సైతం సాక్ష్యాలుసాక్షి, అమరావతి: అసెంబ్లీ ఎన్నికలకు ముందు వలంటీర్లకు ఇచి్చన హామీని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఆ నెపాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టేసి తప్పించుకునేందుకు కొత్త డ్రామాలు మొదలు పెట్టింది. ఏపీలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఈ ఏడాది జూన్ 12న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ.. వలంటీర్లు అనేవారే ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిన జీవోల్లో ఎక్కడా లేరన్నట్టు.. గత ప్రభుత్వ హయాంలోనే వారు ఉద్యోగాల్లో లేరన్నట్టు ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ మాట్లాడిన మాటలను వలంటీర్ల సంఘాలు, అధికార, రాజకీయ వర్గాలు తప్పుపడుతున్నాయి. అవసరమొచి్చనప్పుడు అలా.. విజయవాడ వరదల్లో సహాయక చర్యల సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వలంటీర్ల సేవలు గుర్తొచ్చాయి. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో పాటు వలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లకు జీతాలు చెల్లింపులు నిలిచిపోయాయి. వలంటీర్లను పింఛన్ల పంపిణీ సహా అన్నిరకాల ప్రభుత్వ విధుల నుంచి దూరంగా పెట్టంది. జూలై, ఆగస్ట్, సెపె్టంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో 1వ తేదీన వలంటీర్లకు చెల్లించాల్సిన గౌరవ వేతనాలనూ చెల్లించలేదు.విజయవాడ వరద సమయంలో వరద సహాయక కార్యక్రమాలతోపాటు వరద నష్టాల అంచనాల తయారీలో వలంటీర్ల సేవలను ప్రభుత్వం వినియోగించుకుంది. సీఎం ఆదేశాల మేరకు విజయవాడ ప్రాంత వలంటీర్లు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా నగర పరిధిలోని వార్డు సచివాలయాల అడ్మిన్ సెక్రటరీల వద్ద రిపోర్టు చేయాలని 2024 సెపె్టంబర్ 2న గ్రామ వార్డు సచివాలయాల అధికారులు టెలీకాన్ఫరెన్స్ ద్వారా మౌఖిక ఆదేశాలు జారీ చేయగా.. వరద అంచనాల తయారీకి సచివాలయాల వారీగా ఏర్పాటు చేసిన అధికారుల బృందాల్లో వలంటీర్లను సభ్యులుగా చేరుస్తూ 2024 సెపె్టంబర్ 7న రెవెన్యూ స్పెషల్ సీఎస్ జారీ చేసిన మెమోతో పాటు 2024 సెపె్టంబర్ 9న ఎన్జీఆర్ జిల్లా కలెక్టర్ లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. నిమ్మకు నీరెత్తినట్టి వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఐదేళ్ల పాటు ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఎలాంటి వివక్ష, రాజకీయ పక్షపాతం, పైరవీలు, అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల గడప వద్దకు చేర్చడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు. తమకు వేతనాలు చెల్లించాలని కోరుతూ 20 వారాలుగా వలంటీర్లు రోడ్డెక్కి నిరసనలు కొనసాగిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కొనసాగిస్తున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు, నిరసన ర్యాలీలు, రిలే నిరాహారదీక్షలు చేపట్టి వినతిపత్రాలు అందజేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల ముందు చంద్రబాబు హామీ మేరకు వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు, పెండింగ్ బకాయిల చెల్లింపులపై నెలల తరబడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ.. ఇప్పుడు తమ వైఫల్యాలను గత ప్రభుత్వంపై నెట్టేసే చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. -
నేడు వలంటీర్ల ఆవేదన సదస్సు
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుతోపాటు గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచాలని కోరుతూ ఏఐవైఎఫ్ అనుబంధ ఏపీ రాష్ట్ర వలంటీర్ల అసోసియేషన్ ఆధ్వర్యాన శనివారం విజయవాడలో వలంటీర్ల ఆవేదన సదస్సు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరుచూరి రాజేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఐదు నెలల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలన్న అంశంపై సదస్సులో చర్చించనున్నట్టు పేర్కొన్నారు. -
వలంటీర్లపై బాబు కూటమి కుట్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ లేకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వలంటీర్లను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయకుండా తప్పించుకునేందుకే కూటమి నేతలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వలంటీర్లకు సంబంధించి ఎలాంటి వ్యవస్థ లేదని, గత ప్రభుత్వం వారిని మోసం చేసిందని, దాని వల్ల నిర్ణయం తీసుకోలేకపోతున్నామని డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ చెప్పడమూ ఈ కుట్రలో భాగమేనన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను పూర్తి పారదర్శకంగా ఇంటి గడప వద్దే అందించడం కోసం 50 ఇళ్లకు ఒక వలంటీర్ నియామకానికి ప్రత్యేక శాఖనే ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆ శాఖ బాధ్యతను ఒక మంత్రికి అప్పగించిందని వెల్లడించారు. ఇప్పుడు కూడా మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి ఆ శాఖను కేటాయించారన్న విషయం తెలుసుకోవాలన్నారు.వలంటీర్ల నియామకంపైనా వైఎస్ జగన్ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, పవన్ ఆ జీవోలు తెప్పించుకుని చూడాలని చెప్పారు. అంత పక్కాగా వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తే, దానిపై పవన్ వెటకారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వలంటీర్ల వ్యవస్థపై టీడీపీకి, జనసేన పార్టీకి సదభిప్రాయం లేదనడానికి గతంలో చంద్రబాబు, పవన్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ప్రజలకు వలంటీర్లు అందించిన సేవలు ఎనలేనివని, కోవిడ్ బాధితులను వారి కుటుంబ సభ్యులే పట్టించుకోకపోతే వీరు ప్రాణా లకు తెగించి సేవలందించారని, అలాంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పవన్ క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఎన్నికల్లో వలంటీర్లకు కూటమి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వారిన తిరిగి విధుల్లోకి తీసుకొని, గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. వలంటీర్లకు ఏ హామీ ఇవ్వలేదని కూటమి నేతలు అనుకొంటే.. తిరుమల శ్రీవారి ఎదుట ప్రమాణం చేయాలని సుధాకర్బాబు సవాల్ చేశారు.నేడు వలంటీర్ల ఆవేదన సదస్సు సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచి్చన హామీ మేరకు వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుతోపాటు గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచాలని కోరుతూ ఏఐవైఎఫ్ అనుబంధ ఏపీ రాష్ట్ర వలంటీర్ల అసోసియేషన్ ఆధ్వర్యాన శనివారం విజయవాడలో వలంటీర్ల ఆవేదన సదస్సు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరుచూరి రాజేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వలంటీర్లకు ఉద్యోగ భద్రత కలి్పంచాలని, ఐదు నెలల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలన్న అంశంపై సదస్సులో చర్చించనున్నట్టు పేర్కొన్నారు. -
పరిసరాలపై విశ్వాసం
సాక్షి, సిటీబ్యూరో: ప్లాస్టిక్ సంచులు, ఇతర వ్యర్థాలను కాల్వలు, చెరువు కట్టలు, రహదారికి ఇరువైపులా ఎక్కడపడితే అక్కడ పడేస్తుండటం గమనిస్తాం. ఆయా ప్రాంతాలను శుభ్రం చేయాలంటే పురపాలక సిబ్బంది రావాలని అనుకుంటాం. ఆలస్యమైతే ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తాం.. అలా కాకుండా మనమే శుభ్రం చేద్దామని కంకణం కట్టుకున్నవారెంతమంది ఉంటారు? అలాంటి వారు నగరంలో చాలా అరుదనే చెప్పాలి.కొందరు యువత మాత్రం చెరువుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలు, ఇతర వ్యర్థాలను తొలగించే కార్యక్రమానికి నడుం బిగించారు. 2021 నుంచి నగరంలో సరూర్నగర్ చెరువు, అమీన్పూర్ చెరువు, నల్లగండ్ల చెరువు, గాంధీ చెరువు, పీరంచెరువు, ఖాజాగూడ చెరువు, తదితర ప్రాంతాల వద్ద కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి సెలవు రోజునా చెరువు కట్ట, పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలన్నది వారి లక్ష్యం. ఫలితంగా పర్యావరణ పరిరక్షణ, ఇతర వ్యక్తుల్లో క్లీనింగ్ పట్ల స్పృహ కల్పించడం, ఎన్నో రకాల పక్షులను ఆదుకున్నట్లవుతుందని భావిస్తున్నారు. ఐదుగురు స్నేహితులతో ప్రారంభమైన విశ్వ సస్టైనబుల్ ఫౌండేషన్ ప్రస్తుతం సుమారు 500 మందికిపైగా వలంటీర్లను జత చేసుకుంది.బృందాలుగా ఏర్పడి...వీరంతా బృందాలుగా ఏర్పడి చెరువులను దత్తత తీసుకుంటున్నారు. వారాంతంలో వారికి కేటాయించిన చెరువుల దగ్గర ప్రజలు వేసే చెత్త, ప్లాస్టిక్ సంచులు, తాగుబోతులు విసిరేసిన గాజు సీసాలు వంటి వ్యర్థాలను ఏరిపారేస్తున్నారు. సంచుల్లో ప్యాక్ చేసి జీహెచ్ఎంసీకి తరలిస్తున్నారు. దేశంలోనే మొదటి బయోడైవర్సిటీ చెరువుగా గుర్తింపు పొందిన అమీన్పూర్ చెరువుతో పాటు నగరంలో పలు చెరువులకు వలస పక్షలు వస్తున్నాయి.ఈ సీజన్లో వాటి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలా వలస వచ్చిన పక్షలు ఇక్కడ ప్లాస్టిక్ భూతానికి బలైపోతున్నాయి. ఆహారంగా చేపలు, ఇతర కీటకాలను వేటాడే సమయంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్నాయి. ఈ క్రమంలో వాటికి ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలి. ప్రకృతి సిద్ధంగా ఉన్న చెరువులను ఆహ్లాదకరంగా మార్చాలనే పట్టుదలతో ఒక్కో చెరువునూ ఒక్కో బృందం పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం నగరంలో ఏడు బృందాలు పనిచేస్తున్నాయి. -
చిక్కిపోతున్న పింఛన్లు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య నెలనెలకూ చిక్కిపోతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం ఐదు నెలల్లోనే ఏకంగా 1,35,690 మందికి పింఛన్ ఆపేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు.. ఈ ఏడాది మేలో 65,49,864 మందికి పింఛన్ల పంపిణీ జరగ్గా, తాజాగా నవంబర్ 1న (శుక్రవారం) 64,14,174 మందికి మాత్రమే పింఛన్ పంపిణీ చేసేందుకు డబ్బు విడుదల చేశారు. గత ఐదు నెలల్లో కొత్తగా ఒక్కరికి కూడా ప్రభుత్వం సామాజిక పింఛన్లు మంజూరు చేయలేదు. పైగా ఏళ్ల తరబడి ప్రతి నెలా పింఛను తీసుకుంటున్న వారికి కోతలు పెట్టేందుకు ఎక్కడలేని ఉత్సాహం కనబరుస్తోంది. ఇక అక్టోబర్లో జరిగిన పంపిణీకి, ప్రస్తుత నెలలో జరుగుతున్న పంపిణీ మధ్య నెల రోజుల వ్యవధిలోనే పింఛన్ల సంఖ్య 24,710కి తగ్గిపోయాయి. సాధారణంగా లబ్ధిదారుల్లో మరణాలు ఎంత ఎక్కువగా ఉన్నాయనుకున్నా, ప్రతినెలా 10–15 వేలకు మించవని గణాంకాలు చెబుతున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అధికారులు ఎడాపెడా పింఛన్ల తొలగింపు కార్యక్రమాలు చేపడుతున్నారు. పంపిణీలో ఆధిపత్యం కోసం గొడవలురాష్ట్రంలో ఏళ్ల తరబడి ప్రతి నెలా అవ్వాతాతలకు అందజేసే పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా రాజకీయ రంగు పులిమింది. ఈ పంపిణీ పూర్తిగా తమ కనుసన్నల్లోనే జరగాలని టీడీపీ నాయకులు రాష్ట్రంలో అత్యధిక చోట్ల స్థానికంగా పింఛన్లను పంపిణీ చేసే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని హెచ్చరిస్తూ, పంపిణీ చేసే ఉద్యోగుల వెంట లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి పెత్తనం చెలాయిస్తున్నారు. కూటమిలోని టీడీపీ–జనసేన–బీజేపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. నవంబరు 1 (శుక్రవారం) పింఛన్ల పంపిణీ జరగాల్సి ఉండగా, ఒకరోజు ముందు గురువారం దెందులూరు నియోజకవర్గంలోని పైడిచింతలపాడులో టీడీపీ–జనసేన నాయకులు ఎవరికి వారు కొన్ని ప్రత్యేకించిన ఏరియాల్లో పింఛను పంపిణీ తమ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరగాలంటూ పట్టుబట్టి, ఘర్షణలు పడటం గమనార్హం. సిబ్బందికి షోకాజ్ నోటీసులువలంటీర్లు లేకుండానే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పుకునేందుకు కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. ఉదయం 6.15 వరకు పింఛన్ల పంపిణీ ప్రారంభించలేదంటూ ఒక్క మచిలీపట్నం పరిధిలోనే 70 మంది వార్డు సచివాలయాల ఉద్యోగులకు నగర కార్పొరేషన్ షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో 14 మందికి, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేట మండలంలో 28 మందికి, పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో 15 మందికి, బాపట్ల జిల్లా అద్దంకిలో ఆరుగురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ అయినట్టు తెలిపారు. ఇవి కేవలం తమకు అందిన సమాచారం మేరకు మాత్రమేనని, ఇంకా పలు ప్రాంతాల్లో ఇలాంటి వేధింపులు కొనసాగుతున్నాయని వాపోయారు. ఒక్క జూలై నెలలోనే దాదాపు 4 వేల మంది గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారని.. ఇలా ప్రతి నెలా జారీ చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. ఇదిలా ఉండగా, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం అల్లూరు గ్రామానికి చెందిన నత్తల వజ్రమ్మ (62) కావలిలో తన కూతురు శిరీష (33)వద్దకు వెళ్లింది. 1వ తేదీ పింఛను తీసుకునేందుకు కూతురితో కలిసి వస్తూ.. కావలిలో రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లీ కూతుళ్లు ఇద్దరూ మృతి చెందారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పంలో కుప్పం–3 సచివాలయం వద్దకు వృద్ధులను పిలిపించి పింఛన్లు పంపిణీ చేశారు. వరదయ్యపాళెం మండలం ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్గా పని చేస్తున్న అనిత.. చిన్నపాండూరు సచివాలయ పరిధిలోని యానాదివెట్టు, రాచర్ల గ్రామాల్లో ఫించన్లు పంపిణీ చేశారు. సమస్యల నడుమ పంపిణీనవంబరు 1వ తేదీ (శుక్రవారం) సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60.76 లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరిగినట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. అయితే పంపిణీలో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ఉద్యోగులు సర్వర్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంపిణీ సమయంలో లబ్ధిదారులకు డబ్బులు అందజేసిన అనంతరం ఆయా లబ్ధిదారుల నుంచి వేలి ముద్రలు ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య సర్వర్ పనిచేయక పోవడంతో దాదాపు రెండు గంటల పాటు పంపిణీ నిలిచిపోయింది. మరోవైపు.. వేలిముద్ర నమోదుకు ఉపయోగించే స్కానర్లకు సంబంధించి సాఫ్ట్వేర్ అప్డేట్కు ప్రభుత్వం డబ్బులు చెల్లించని కారణంగా అవి పని చేయలేదు. అప్పటికప్పుడు వాటి స్థానంలో వేరే స్కానర్లు మార్చాల్సి వచ్చింది. దీంతో పలు ప్రాంతాల్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెట్ల కింద, సచివాలయాల్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రాణం మీదకు తెచ్చిన పింఛన్కాశీబుగ్గ: పింఛను పంపిణీ ఓ వృద్ధురాలి ప్రాణం మీదకు తెచ్చింది. శ్రీకాకుళం జిల్లా, పలాసలోని, వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామంలో బైనపల్లి దానమ్మ వితంతువు పింఛన్ కోసం మండుటెండలో నిరీక్షించింది. ఉదయం ఏడు గంటల లోపల నామమాత్రంగా పనిచేసిన సర్వర్ ఒక్కసారిగా ఆగిపోవడంతో పింఛన్ల పంపిణీ మళ్లీ మధ్యాహ్నానికి గానీ ప్రారంభం కాలేదు. అప్పటి వరకూ నిరీక్షించిన దానమ్మ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. గతంలో పింఛన్ ఇంటికి వచ్చి అందించేవారని, ఇప్పుడు ఎండలో పడిగాపులు కాయాల్సి వస్తోందని పింఛనుదారులు వాపోతున్నారు. -
సోమవారం... వలంటీర్ల నిరసన వారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం వలంటీర్ల నిరసన వారంగా మారిపోయింది. గత ఐదేళ్లు ఎలాంటి వివక్ష, రాజకీయ పక్షపాతం, పైరవీలు, అవినీతికి తావులేకుండా ప్రభుత్వ సేవలను ప్రజల గడప వద్దకే చేర్చడంలో కీలకపాత్ర పోషించిన లక్షలాది మంది గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్లు గత 16 వారాలుగా రోడ్డెక్కి తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతోపాటు పెండింగ్లో పెట్టిన గౌరవ వేతనాలు చెల్లించాలని కోరుతూ ప్రతి సోమవారం అన్ని జిల్లాల్లో నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ కలెక్టర్లు, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు.ఇందులో భాగంగా ఈ వారం కూడా రాష్ట్రంలోని పలు మండలాల్లో వలంటీర్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మండల స్థాయి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ముఖ్యంగా విజయనగరం కలెక్టరేట్ ముందు వలంటీర్లు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లు నెరవేర్చాలని కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వలంటీర్లు డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు నెలల గౌరవ వేతనాలు చెల్లించాలని నినదించారు. ఐదు నెలలుగా తేల్చని కూటమి సర్కారుఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కానీ ఈ ఏడాది జూన్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఎన్నికల ముందు వరకు వలంటీర్లు నిర్వహిస్తున్న పింఛన్ల పంపిణీ సహా అన్ని విధుల నుంచి పూర్తిగా పక్కన పెట్టారు. జూలై, ఆగస్టు,సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన గౌరవ వేతనాలను ఒక్కరికి కూడా చెల్లించలేదని వలంటీర్ల సంఘ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికైనా వలంటీర్లకు ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలుచేయాలని వారు కోరారు. -
సీఎం చెప్పినా స్పందన లేదు!
సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వాళ్లు ఎలాంటి ఆదేశాల జారీ చేసినా.. క్షణాల్లో అమలులోకి వస్తాయి. సుదీర్ఘమైన కసరత్తు అవసరమైతే ఆ చర్యలు మొదలువతాయి. అవసరమైతే కమిటీలు, కమీషన్లు ఏర్పాటవుతాయి. అధికారులంతా ఆఘమేఘాల మీద ఉరుకులుపరుగులు పెడతారు. అయితే సీఎం ఎ.రేవంత్రెడ్డి ‘ట్రాఫిక్–ట్రాన్స్జెండర్ల సేవలు’ విషయంలో గత నెల 13న కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉన్నతమైన ఆలోచన చేసిన ముఖ్యమంత్రి.. ట్రాన్స్జెండర్స్ వల్ల సామాన్యులకు ఎదురవుతున్న సమస్యల తొలగింపుతో పాటు వారికి గౌరవప్రదమైన జీవితం అందించడం కోసం ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతల్లో వారికీ భాగస్వామ్యం కల్పించాలని యోచించారు. ట్రాఫిక్ ఇక్కట్లు తప్పించడం కోసం పోలీసులు, హోంగార్డ్స్ తరహాలోనే ట్రా¯Œన్స్జెండర్లనూ వినియోగించాలని అధికారులకు ఆదేశించారు. ట్రాన్స్జెండర్లకు ఉద్యోగావకాశాలు తగ్గాయని, ఇలా చేస్తూ ప్రతి నెలా నిరీ్ణత మొత్తం అందిస్తే వారికి కొంత ఉపాధి కల్పింనట్లవుతుందని భావించారు. ప్రత్యేక శిక్షణ, యూనిఫామ్ ఉండాలంటూ... ఈ ప్రతిపాదనల్ని అమలులో పెట్టడానికి తక్షణం చర్యలు తీసుకోవాలంటూ గత నెల 13న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్పాత్లతో పాటు ఇతర అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా సీఎం ఈ విషయం స్పష్టం చేశారు. ట్రాఫిక్ వాలంటీర్ల నియామకం కోసం ఆసక్తి ఉన్న ట్రాన్స్జెండర్ల వివరాలు సేకరించాలని, వారం నుంచి పది రోజుల పాటు అవసరమైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ వాలంటీర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా అందించాలన్న ముఖ్యమంత్రి కొన్ని నమూనాలను పరిశీలించారు. సిబ్బంది కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ట్రాఫిక్ విభాగానికి ఈ ప్రయోగం సక్సెస్ అయితే పెద్ద ఉపశమనమే లభిస్తుంది. ఇప్పటికే ఆ రెండు నగరాల్లో అమలు... ట్రాఫిక్ విధుల్లో ట్రాన్స్జెండర్ల సేవలు వినియోగం అనేది దేశంలో సరికొత్త విధానమేమీ కాదు. తమిళనాడు రాజధాని చెన్నై ట్రాఫిక్ పోలీసులు 2013లోనే ఈ తరహా ప్రయోగం చేశారు. వన్ ఇండియా రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సహాయంతో పది మంది ట్రాన్స్జెండర్లకు శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ వాలంటీర్లుగా మార్చారు. వారికి నెలకు రూ.9 వేల పారితోషకం అందించారు. 2018లో కర్ణాటకలోని టుమ్కూరు పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రద్దీ వేళల్లో ట్రాఫిక్ నియంత్రణతో పాటు రహదారి నిబంధనలు, రోడ్డు భద్రతా అంశాలపై అవగాహన కల్పించడానికి ట్రాన్స్జెండర్లతో ఓ బృందాన్ని వేర్పాటు చేశారు. వాలంటీర్ల మాదిరిగా వీరికీ పారితోíÙకం అందిస్తూ రహదారులపై సేవలు వినియోగించుకున్నారు. కొచి్చన్ మెట్రో రైల్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా వినియోగించిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క అడుగూ వేయని అధికారులు...ట్రాన్స్జెండర్ల సేవలు వినియోగం విషయంలో ముఖ్యమంత్రి ఆదేశాలను అమలులో పెట్టే దిశలో అధికారులు కనీసం ఒక్క అడుగు కూడా వేయలేదు. దేశంలో ప్రస్తుతం ఎక్కడెక్కడ అమలులో ఉంది? ఫలితాలు ఏంటి? ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి? తదితరాలు అధ్యయనం పైనా దృష్టి పెట్టలేదు. వీరి ఎంపికకు సంబంధించి ట్రాఫిక్ విభాగాలు, ట్రాన్స్జెండర్ల సంఘాలతోనూ సంప్రదింపులు జరపలేదు. ముఖ్యమంత్రి జారీ చేసిన ఆదేశాలకు సంబంధించిన ఆచరణ విధివిధానాలను ఏ అధికారీ సమీక్షించలేదు. కనీసం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) సైతం ఈ కోణంలో చర్యలు తీసుకోకపోవడంతో క్షేత్రస్థాయి అధికారులు అసలు పట్టించుకోవట్లేదు. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న ఆమ్రపాలి ఆంధ్రాకు వెళ్లిపోవడం, ప్రస్తుతం బల్దియాకు ఇన్చార్జ్ కమిషనర్ ఉండటంతో ‘ట్రాఫిక్ వాలంటీర్ల’ ప్రతిపాదన పట్టాలెక్కే పరిస్థితి కనిపించట్లేదు. -
సంచలనాల వ్యవస్థకు ఐదేళ్లు
సాక్షి, అమరావతి: బాపూజీ మహాత్మా గాంధీ కలలుగన్న అసలైన గ్రామ స్వరాజ్యానికి నిలువటద్దంగా.. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా రాష్ట్రంలో సేవలందించే గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటై ఐదేళ్లు పూర్తయ్యాయి. స్వాతంత్య్రం వచ్చాక 77 ఏళ్ల పాటు రూ.లక్షల కోట్లు వెచ్చి0చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అనేక పథకాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసే పటిష్ట వ్యవస్థ లేనందున లక్ష్య సాధన అంతంత మాత్రంగానే ఉండింది. ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రంలో 2019 అక్టోబరు 2వ తేదీన అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2019కి ముందు రాష్టంలో దాదాపు 3 వేల గ్రామ పంచాయతీలకు కనీసం ఆఫీసు భవనాలు లేవని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో చాలా పెద్ద గ్రామాల్లో సైతం శిథిలావస్థకు చేరిన పంచాయతీ ఆఫీసు తప్ప మరో ప్రభుత్వ ఆఫీసు లేని దుస్థితి.నాలుగైదు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక్కరే ఉండే పంచాయతీ కార్యదర్శి.. ఆ పంచాయతీ ఆఫీసుకు ఎప్పుడొస్తారో.. ఆ ఆఫీసును ఎప్పుడు తెరుస్తారో ఆ గ్రామ ప్రజలకే తెలియని పరిస్థితి. అలాంటిది వైఎస్ జగన్ ప్రభుత్వం.. 15,004 గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు అనంతరం కొత్తగా 1.34 లక్షల శ్వాశత ప్రభుత్వ ఉద్యోగాలను అప్పటికప్పుడే మంజూరు చేసింది. కేవలం నాలుగు నెలల కాలంలో వాటి భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ ఉద్యోగాల కోసం 21.69 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకొని, 19,50,630 మంది రాత పరీక్షలకు హాజరయ్యారు. ఇది దేశంలోనే ఒక రికార్డు. ఫలితంగా ప్రతి గ్రామంలో 8–10 మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు అందుబాటులోకి వచ్చారు. సచివాలయాలకు అనుబంధంగా పని చేసేందుకు గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు.. పట్టణాలు, నగరాల్లో ప్రతి 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించింది. మరో వైపు జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు.. రెవిన్యూ డివిజన్లను 52 నుంచి 77కు పెంచింది. అధునాతన వసతులు.. పారదర్శక సేవలు » గతంలో పంచాయతీ ఆఫీసులు ఇరుకు భవనాల్లో కొనసాగితే.. గత ప్రభుత్వం ప్రతి చోటా ఒక్కోదానికి రూ.43.60 లక్షలు ఖర్చు పెట్టి 2,623 చదరపు అడుగుల విశాలమైన రెండంతస్తుల సచివాలయం భవనాలను నిరి్మంచింది. మొత్తం రూ.4,750 కోట్ల ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా 10,893 గ్రామ సచివాలయాలను మంజూరు చేయగా, అత్యధిక చోట్ల భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. » ఒక్కో సచివాలయంలో రెండేసి కంప్యూటర్లను యూపీఎస్ సహా అందించింది. ఇలా రాష్ట్రంలోని సచివాలయాలకు 30,004 కంప్యూటర్లు, 15,002 యూపీఎస్లు, 15,002 ప్రింటర్లతో పాటు 3 వేల ఆధార్ కిట్లు, 2,86,646 ఫింగర్ ప్రింట్ స్కానర్లు పంపిణీ చేసింది. వలంటీర్లతో పాటు ఇతర సచివాలయ సిబ్బందికి విధులను వేగంగా నిర్వహించడం కోసం, టెక్నాలజీని ఉపయోగించడం కోసం 2,91,590 స్మార్ట్ ఫోన్లను సిమ్ కార్డులతో ఇచ్చింది.ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ తీరు » వలంటీర్లకు నిలువెత్తు మోసం చేసిన కూటమి ప్రభుత్వం» ఎన్నికల ముందు వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని హామీ.. ఆచరణలో గత నాలుగు నెలలుగా వలంటీర్లకు జీతాలు చెల్లించని ప్రభుత్వం.» లబ్ధిదారుల ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీకి తూట్లు. వలంటీర్లకు కాకుండా సచివాలయాల సిబ్బందికి ఆ బాధ్యత అప్పగింత. దీంతో చాలా చోట్ల సచివాలయాల వద్దకే లబ్ధిదారులను పిలిపించుకొని పింఛన్ల పంపిణీ. » ప్రభుత్వ ఆఫీసుల్లో పనులకోసం మళ్లీ మండలాలు, పట్టణాల్లో ఉండే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి.» బుడమేరు (విజయవాడ)వరదలో గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థను సరిగా ఉపయోగించుకోని ప్రభుత్వం. ఫలితంగా ప్రభుత్వ సాయం కోసం జిల్లా కలెక్టరేట్ చూట్టు తిరుగుతున్న బాధితులు.» ప్రస్తుతం ఎక్కువగా కరెంటు బిల్లుల చెల్లింపుల వినతుల పరిష్కారానికి పరిమితం. » నాలుగు నెలలుగా వలంటీర్లకు ఎలాంటి విధులు అప్పగించని వైనం.. మూడు నెలలుగా అందని గౌరవ వేతనం. » గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సీఎం చంద్రబాబు స్టిక్కర్లను ఇంటింటికీ అంటించే పని అప్పగింత.మొత్తం గ్రామ, వార్డు సచివాలయాలు : 15,004» వీటిలో జగన్ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు 1.34లక్షలు» గ్రామ, వార్డు వలంటీర్లు 2.66 లక్షలు» గత ఐదేళ్లలో అందించిన సేవలు 11.48కోట్లు» కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయాల భవనాలు :10,893సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా అందిన సేవలు» రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఏకంగా 11.48 కోట్ల ప్రజా వినతుల పరిష్కారం. » 545 వరకు రాష్ట్ర ప్రభుత్వ సేవలతో పాటు పాస్పోర్టు బుకింగ్ తదితర కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల సర్విసులు » అత్యధికంగా కుల, ఆదాయ ధ్రువీకరణ ప్రతాలు, వ్యవసాయ భూముల అడంగులు, 1బీ వంటి కీలక వినతుల పరిష్కారం. » వివిధ సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.2.73 లక్షల కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో రూ.1.84 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో నేరుగా జమ. » కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పథకాల వర్తింపు.» పారదర్శకత కోసం ప్రతి పథకం అమలు సమయంలో సోషల్ ఆడిట్.. సచివాలయాల వద్ద అర్హుల జాబితా ప్రదర్శన. » ఏదైనా కారణంగా పథకం లబ్ధి అందని వారి కోసం ప్రతి ఆరు నెలలకొకసారి మళ్లీ అవకాశం కలి్పంచడం. » ప్రతి నెలా ఠంఛన్గా ఒకటో తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ » గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందుబాటులోకి భూముల రిజిస్ట్రేషన్ వంటి సేవలు » ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్లో ఉన్న వినతుల పరిష్కారం.. కుల, ఆదాయ, వివిధ ధృవీకరణ ప్రతాల మంజూరుకు ప్రత్యేకంగా జగనన్న సురక్షా క్యాంపుల ఏర్పాటు. » ప్రతి నెలా ఆధార్ క్యాంపులు ఏర్పాటు » కోవిడ్ సమయంలో వలంటీర్లు–సచివాలయాల సిబ్బంది ద్వారా వేగంగా రోగుల గుర్తింపు, తక్షణమే వైద్య సేవలు అందించేలా చర్యలు. తద్వారా మృతుల సంఖ్య కట్టడి. దాదాపు 30 దఫాలుగా ఫీవర్ సర్వే. » ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సాధించేందుకు యునిసెఫ్తో కలిసి ఉమ్మడి కార్యాచరణ. » గ్రామ, వార్డు సచివాలయాల పరిశీలకు కేంద్రం, వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేక బృందాలు.. వాటి నుంచి ప్రశంసలు -
రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల నిరసన
-
ఉద్యోగ భద్రత కల్పించాలి
సాక్షి, అమరావతి/పాడేరు: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వివిధ జిల్లా కేంద్రాల్లో వలంటీర్లు సోమవారం నిరసన ర్యాలీలు నిర్వహించారు. పెండింగ్ బకాయిలతో సహా వలంటీర్ల గౌరవ వేతనాలు అక్టోబరు 25లోగా చెల్లించకుంటే నిరసన దీక్షలు చేపడతామని.. రాబోయే కేబినెట్ సమావేశంలోగా తమకు న్యాయం చేయకుంటే ‘చలో సీఎం క్యాంపు కార్యాలయం’ చేపట్టనున్నట్లు వలంటీర్ల సంఘాలు హెచ్చరించాయి. ఇక వీరి ఆందోళనలకు సీపీఐ అనుబంధ ఏఐవైఎఫ్ ప్రతినిధులు తమ సంఘీభావం ప్రకటించారు. ఇదిలా ఉంటే.. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 11 మండలాలకు సంబంధించిన దాదాపు రెండువేల మంది వలంటీర్లు పాడేరులో సుమారు మూడు కిలోమీటర్ల మేర భారీ ప్రదర్శన నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో పలువురు వలంటీర్లు చంటి పిల్లలతో పాల్గొన్నారు. అనంతరం గంటసేపు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ వలంటీర్లతో మాట్లాడి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం వలంటీర్లు ఆయనకు వినతిపత్రాన్ని ఇచ్చారు. అలాగే, కర్నూలు కలెక్టరేట్ ఎదుట కూడా వలంటీర్లు భారీఎత్తున ఆందోళన నిర్వహించి, ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ ఏడాది జూన్లో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వీరికి గౌరవ వేతనాలు చెల్లించలేదు. -
ఏం చేశారని 100 రోజుల సంబరాలు.. బాబు పై వాలంటీర్లు ఫైర్
-
కదం తొక్కిన వలంటీర్లు
సాక్షి, అమరావతి/సీతమ్మధార : రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లకు గత మూడు నెలలుగా ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండింగ్ వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ మరో విడత సోమవారం అన్ని జిల్లాల్లో వలంటీర్లు ఆందోళనలు నిర్వహించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల వేదికలో వలంటీర్ల ప్రతినిధి బృందాలు ఆయా జిల్లాల కలెకర్లను కలిసి ఈ మేరకు వినతిపత్రాలను అందజేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో పాటు వలంటీర్ల గౌరవ వేతనం రెట్టింపు చేసి రూ.10 వేలకు పెంచుతామని ప్రకటించారని ఈ సందర్భంగా వలంటీర్ల సంఘాల నేతలు గుర్తించారు. కూటమి ప్రభుత్వం వలంటీర్ల విషయంలో స్పష్టమైన నిర్ణయం వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ నెల 26 నుంచి 2 వరకు వలంటీర్లు శాంతియుత నిరసనలకు సీపీఐ అనుబంధ ఏఐవైఫ్ పిలుపునిచ్చింది. వలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోండివలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ ప్రజా వార్డు వలంటీర్ అసోసియేషన్ ఆధ్వరం్యలో వలంటీర్లు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంధం దీప్తి మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు వలంటీర్లను విధుల్లోకి తీసుకుంటామని, ప్రతి నెల రూ.10 వేలు వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన వలంటీర్లను తిరిగి కొనసాగించాలన్నారు. వలంటీర్ల ధర్నాకు సీఐటీయూ సంఘీభావం ప్రకటించింది. ధర్నాలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకటసుబ్బయ్య, భవానీప్రసాద్, కోడూరి రాము, పెంచలయ్య, బాలకృష్ణప్రసాద్, కోడూరు లక్ష్మణ్, ఆంజనేయులు, అజార్, రాజు, పార్వతి, గుణసాయి, కె.రాజు, సంధ్య, శృతి, గాయత్రి, నాగపుష్ప, భారతి, సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్, సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్.జ్యోతీశ్వరరావు, కె.కుమారమంగళం, జి.అప్పలరాజు తదితరులున్నారు. -
ఏమీ లేదనిపింఛెన్..
కాకినాడ సిటీ: తమను గెలిపిస్తే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల ఊసే ఎత్తడం లేదు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పింఛన్ మొత్తాన్ని రూ. 4 వేలకు పెంచుతామని చంద్రబాబు చెప్పారు. అలాగే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ వృద్ధాప్య పింఛన్ కింద రూ. 4 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.ప్రతి ఎన్నికల సభలోనూ దీనిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 96 రోజులు గడుస్తున్నా, కొత్త పింఛన్ల ఊసే లేకుండా పోయింది. కాకినాడ జిల్లాలో 50 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలు దాదాపు 2.50 లక్షల మంది ఉంటారు. ఇందులో కనీసం 1.70 లక్షల మంది అర్హులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నారు. వీరందరూ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి ఇప్పట్లో కొత్త పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. ప్రస్తుత లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నారని, వారిని తీసేసిన తర్వాతే ఆ స్థానంలోనే ఇస్తారనే ప్రచారం చేస్తున్నారు.అర్జీలు.. బుట్టదాఖలుకొత్త పింఛన్ల కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలు, ఎంపీడీఓ, డీఆర్డీఏ కార్యాలయాల చుట్టూ 50 ఏళ్లు నిండిన లబ్ధిదారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త పింఛన్లపై తమకు మార్గదర్శకాలు రాలేదని అధికారులు వారిని వెనక్కి పంపుతున్నారు. దీంతో ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన మాటలను నమ్మి మోసపోయామని అవ్వాతాతలు అంటున్నారు. అధికారం చేపట్టి 96 రోజులైనా 50 ఏళ్లకే పింఛన్ లేదు, సూపర్–6 హామీలు లేవు. వెరసి 2024–25లో హామీల అమలు లేనట్లేనని సంకేతాల ఇస్తున్నారు.వలంటీర్ వ్యవస్థకు మంగళంగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాలను రూ. 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత వలంటీర్ వ్యవస్థ ఊసే లేకుండా పోయింది. జూలై, ఆగస్టు నెలల పింఛన్ల పంపిణీ అబాసుపాలైంది. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలనే ఆదేశాలు ఉండగా, ఇది అమలు కావడం లేదు. 30 శాతం వరకూ మాత్రమే ఇంటి దగ్గర పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 70 శాతం ప్రధాన కూడళ్లు, ఆలయాలు, అంగన్వాడీ సెంటర్లు, రచ్చబండ, సచివాలయాల్లో అందజేస్తున్నారు.3,112 పింఛన్ల కోతకూటమి ప్రభుత్వం వచ్చాక నెల నెలా పింఛన్లలో కోత పడుతోంది. కాకినాడ జిల్లాలో ఈ ఏడాది జూన్తో పోలిస్తే సెప్టెంబర్ పింఛన్లలో 3,112 కోత కోశారు. పింఛన్లను అడ్డుగోలుగా కోస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది జూన్లో జిల్లాలో 2,79,805 పింఛన్లు ఉండగా, సెప్టెంబర్లో 2,76,683కి తగ్గించారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే 3,112 పింఛన్లను తొలగించిన వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను కూడా ఎంపిక చేయలేదు.వైఎస్సార్ సీపీ హయాంలో ఇలా..వైఎస్సార్ సీపీ హయాంలో ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్లను మంజూరు చేసేవారు. ఏటా జనవరి, జూలై నెలల్లో అర్హులందరికీ అందించేవారు. రాజకీయాలకు అతీతంగా, అర్హతనే ప్రామాణికంగా ఇచ్చేవారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు తీసుకుంటే చాలు ఆటోమేటిక్గా పింఛన్ మంజూరయ్యేది. వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో కొత్త పింఛన్లు జిల్లాలో 64 వేలకు పైగా ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకూ ఉన్న అప్పటి టీడీపీ పాలనలో కొత్త పింఛన్ పొందాలంటే చాలా కష్టమయ్యేది. జన్మభూమి కమిటీలను ముడుపులతో ప్రసన్నం చేసుకుంటేనే పింఛన్ ఇచ్చేవారు. వచ్చే జనవరి నుంచి మళ్లీ జన్మభూమి–2 కార్యక్రమం చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. జన్మభూమితో పాటే జన్మభూమి కమిటీలు కూడా రాబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తే ముడుపులు ఇచ్చిన వారికే అందలం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్జెండర్లను వలంటీర్లుగా నియమించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోంగార్డ్స్ ప్రస్తుతం ఈ విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డ్స్ తరహాలోనే ట్రాన్స్జెండర్లకు ఈ విధులు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్థిక భరోసా.. సమాజంలో గౌరవం వలంటీర్లుగా పనిచేసే ట్రాన్స్జెండర్లకు ప్రతినెలా కొంత స్టైఫండ్ ఇవ్వాలని, దీంతో వారికి ఆర్థికంగా భరోసా కలి్పంచడంతో పాటు సమాజంలో గౌరవస్థానం కల్పించవచ్చునని సీఎం పేర్కొన్నారు. ఆసక్తిగా ఉన్న ట్రాన్స్జెండర్ల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వారం, పది రోజులపాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలని, విధుల్లో ఉండే ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా ఉండాలని అధికారులకు సూచించారు.శుక్రవారం సచివాలయంలో జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లు, ఫుట్పాత్లు, ఇతర అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సమీక్షా సమావేశం సందర్భంగా సీఎం ఈ విషయం వెల్లడించారు. సీఎం నిర్ణయంతో ఈ కార్యక్రమం విజయవంతమైతే దేశంలో ఇతర నగరాలు కూడా దీనిని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. అడిషనల్ కమిషనర్లందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, ఘనవ్యర్థాల నిర్వహణ మెరుగుపడాలని చెప్పారు. -
సమస్యల్ని పంచుకుంటున్నాం..అవగాహన పెంచుకుంటున్నాం..
‘క్షణంలో వెయ్యోవంతు కాలంలో జీవితం పట్ల దృక్పథం మారిస్తే చాలు ఓ జీవితాన్ని నిలబెట్టగలుగుతాం’అంటున్నారు వన్లైఫ్ వలంటీర్లు. మానసిక ఒత్తిడి, ఇతరత్రా సమస్యలతో ఆత్మహత్య లాంటి ఆలోచనల నుంచి విముక్తి కల్పించడానికి జాతీయస్థాయిలో 24/7 సేవలు అందిస్తోది వన్లైఫ్ సంస్థ. దీని ఆధ్వర్యంలో గత కొంత కాలంగా పనిచేస్తున్న హైదరాబాద్కు చెందిన వలంటీర్లు సాక్షితో తమ అనుభవాలు పంచుకున్నారు. –సాక్షి, హైదరాబాద్ఫోన్ కాల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదించిన వారికి సంబంధించిన సమస్యల విషయంలో మేం పూర్తిగా గోప్యత పాటిస్తాం. కాల్స్ కోసం 24/7 అందుబాటులో ఉంటాం అంటున్న వలంటీర్లు చెప్పిన విశేషాలు వారి మాటల్లోనే...ఒత్తిడిని చిత్తు చేస్తూ..ట్రిపుల్ ఐటీ పూర్తి చేశా..చదువుకునే సమయం నుంచీ ఒత్తిడి బాగా ఉండేది. అయితే లోకువగా చూస్తారేమోనని ఎవరికీ చెప్పలేకపోయేవాడ్ని. అదే సమయంలో వన్లైఫ్ సంస్థ గురించి తెలిసింది..వీరిని అప్రోచ్ అయ్యి నా ఒత్తిడి పోగొట్టుకోగలిగాను. మరెంతో మందికి పరిష్కారంగా మారాలని వన్లైఫ్లో వలంటీర్గా జాయినయ్యా. మూడేళ్ల నుంచి ప్రతీ శనివారం 4గంటల పాటు వలంటీర్గా ఇంటి నుంచే చేస్తున్నా. తొలుత చాలా నెగిటివిటీ వస్తుంటుంది జాగ్రత్త అని ఫ్యామిలీ మెంబర్స్ హెచ్చరించారు. అయితే ట్రైనింగ్ తీసుకోవడం వల్ల నాకేమీ సమస్య అనిపించలేదు. స్టూడెంట్స్ పరీక్షల టైమ్లో ఎక్కువ కాల్స్ రిసీవ్ చేసుకున్నా. అది నేను అనుభవించి వచ్చాను కాబట్టి బాగా కనెక్ట్ అయ్యాను. లవ్ ప్రాబ్లెమ్స్తో కూడా వస్తున్నాయి.. ఇతరుల సమస్యలు వినడం వల్ల మన సమస్యలు చిన్నగా అనిపిస్తూంటాయి. అలా ఈ పని నాకు వ్యక్తిగత జీవితంలో సమస్యల పరిష్కారానికి కూడా చాలా హెల్ప్ అయింది. –సూర్య, మాదాపూర్నాలో ఉన్న ఖాళీని భర్తీ చేసుకుంటూ...రిటైర్మెంట్ తర్వాత కొంత ఎంప్టీనెస్ అనిపించి ఈ సేవలోకి వచ్చాను. నాకు విభిన్న భాషల్లో పట్టు ఉండడం వల్ల దేశవ్యాప్తంగా కాల్స్ వస్తుంటాయి. రిలేషన్ షిప్స్కు సంబంధించినవే ఎక్కువగా వస్తున్నాయి. ‘నేను అమ్మాయిని కాను నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు... నాది అబ్బాయి మనస్తత్వం అని చెప్పలేకపోతు న్నా’అంటూ ఓ అమ్మాయి చేసిన కాల్, అలాగే ఓ అమ్మాయి తనను ప్రేమ పేరుతో డబ్బులు ఖర్చుపెట్టించి వదిలేసిందని, నేనెంతో తెలివిగల వాడ్ని అనుకునేవాడ్ని ఎలా ఇలా మోసపోయానో’అంటూ మరో అబ్బాయి కాల్... ఇలాంటివి కొన్ని గుర్తుండిపోయే సమస్యలు వస్తుంటాయి. వారితో మాట్లాడడం ద్వారా వారిలో కొత్త ఆలోచనలు వచ్చేలా చేయడమే ముఖ్యం తప్ప సలహాలు, సూచనలు ఇవ్వడం చేయం. –రుక్మిణి, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్అవగాహన పెంచుతున్న సమస్యలు...హైటెక్ సిటీలో ఐటీ ఉద్యోగినిగా చేస్తున్నా. ఏడాది నుంచి వన్లైఫ్లో వలంటీర్గా రాత్రి 9 నుంచి 11 గంటల సమయంలో కాల్స్ అటెండ్ అవుతుంటా. ఇష్టం వచ్చినట్టు లోన్స్ తీసుకున్నాం కట్టలేకపోతున్నాం లాంటి సమస్యల నుంచివిడాకుల తర్వాత లోన్లీనెస్ ఫేస్ చేయలేకపోతున్నాం దాకా ఎన్నో రకాల సమస్యలతో కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం అయిందేమిటంటే...ప్రాబ్లెమ్ని ఇతరులతో షేర్ చేసుకుంటే మమ్మల్ని ఎలా జడ్జ్ చేస్తారో అని భయంతో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. ఈ వలంటరీ విధుల వల్ల అనేక రకాల సమస్యలపై యుక్త వయసులోనే అవగాహన కలుగుతోంది.–అనూష, బోయినపల్లిజీవితం మీద ఆశ చిగురించేలా చేయొచ్చు విద్యార్థుల్లో అధిక గ్రేడ్స్కు సంబంధించిన ఒత్తిడి అంచనాలు, ఇతరులతో పోల్చడం, ర్యాగింగ్. మిగిలిన వారిలో అనుబంధాలు, అంచనాలు, తీర్చలేని డిమాండ్లు, సందేహాలు పరస్పరం నిందించుకోవడం తగాదాలు, వాదనలు, కోపం, ఆందోళన,.ఆర్థిక సంక్షోభాలు, వంటివి ప్రతికూలతకు దారి తీసిన ఫలితంగానే ఆత్మహత్యకు ఆలోచనలు చేస్తారు. అలాంటివారిలో జీవితం పట్ల ఆసక్తి పెంచే ఆలోచనల్ని ప్రోత్సహించడం, సానుకూలతను అందించడం, జీవితం అప్పుడే అయిపోలేదని నొక్కిచెప్పడం తమ కోసం మేం ఒక స్టాండ్ తీసుకోవడానికి ప్రోత్సహించడం చేస్తాం. ఒక్కో కాల్ అత్యధికంగా 45 నిమిషాల పాటు వింటాం. మా దగ్గర సీనియర్ కౌన్సెలర్లు ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ ఉన్నారు. కాలర్స్ మాటల్ని బట్టి ప్రమాదస్థాయిని అర్థం చేసుకొని, వెంటనే జోక్యం చేసుకొని, 3 నుంచి 4 ఫాలో అప్లు, కౌన్సెలింగ్ సెషన్స్ కొనసాగిస్తాం. పదేళ్లుగా మా వన్లైఫ్ ద్వారా ఏడాదికి 30 మంది వరకూ ఆత్మహత్య ఆలోచనల నుంచి దారి మళ్లించామని చెప్పగలను. మరింత మందిని వలంటీర్లుగా చేరమని ఆహ్వానిస్తున్నాం. ఈ వలంటీర్ వర్క్ మన ద్వారా మరికొందరికి జీవితం మీద ఆశ చిగురించేలా చేయడంతో పాటు మన జీవితంలోనూ ఎన్నో మంచి మార్పులకు దోహదం చేస్తుందని రచ్చితంగా చెప్పగలను. –రెబెకామరియా, వన్లైఫ్ నిర్వాహకులుఆలోచనల నుంచి డైవర్ట్ చేస్తే ఆత్మహత్యలు తగ్గిపోతాయి...వన్లైఫ్లో చేరాక మూమెంటరీ థింకింగ్ గురించి అర్థమైంది. ఫోన్ చేసినప్పుడు వారిని కాసేపు డైవర్ట్ చేస్తే చాలు. చాలా వరకూ ఆత్మహత్య ఆలోచనలు సమసిపోతాయి. కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం వల్లనే చాలా వరకూ భారం తగ్గుతుంది. జీవితం చాలా గొప్పదనే విషయం తెలిసేలా చేస్తా తప్ప సలహాలు, సూచనలు ఇవ్వను. తొలుత ఫ్రీగా మాట్లాడలేరు కానీ కాసేపు గడిచాక చాలా ఫ్రీగా మాట్లాడతారు. ఎవరికీ చెప్పలేని తీవ్రమైన ర్యాగింగ్ సంఘటనల నుంచి, భార్య వెళ్లిపోయింది పిల్లలు లేరు దాకా ఎన్నో.. నేను 15 ఏళ్ల పాటు ప్రొఫెసర్గా పనిచేశాను కాబట్టి నాకు ఈ పని కొంచెం సులభంగా మారింది. చేసేవారిలో 90 శాతం మంది కేవలం బాధలను చెప్పుకోవడం కోసమే చేస్తారు. మాట్లాడుతుండగానే వారి స్కిల్స్ గుర్తించి వాటిని వారికి గుర్తు చేస్తా. –వెంకటరమణి -
నాడు వద్దన్నారు..నేడు వారే దిక్కయ్యారు
సాక్షి, అమరావతి/వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): ‘వలంటీర్లు ఏమి చేస్తారు, సంచులు మోసే పనులే కదా..అంతకుమించి వారు చేసే పనులు ఏమిటి?’ అంటూ చంద్రబాబు నాడు వలంటీర్లను ఎద్దేవా చేశారు. అయితే వరద బీభత్సానికి పాలకులకు దిమ్మతిరిగి వరద బాధితులకు పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి వలంటీర్లే అవసరమవుతారని ఇప్పుడు గుర్తించారు. సచివాలయం, వలంటీర్ వ్యవస్థల పేరు కూడా ఎత్తడానికి ఇష్టపడని చంద్రబాబుకు వారి విలువలు, సేవలు ఇప్పుడు తెలిసివచ్చాయి. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సాయమందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఆహారం భారీగా ఉన్నా పంపిణీ వ్యవస్థ సరిగా లేక గందరగోళ పరిస్థితులు తలెత్తుతుండటంతో అధికారులు వలంటీర్ల ద్వారానే బాధితులకు సాయమందించగలమని సీఎంకు చెప్పారు. దీంతో వెంటనే సీఎం ఆదేశాలతో అధికారులు వలంటీర్లకు కబురు చేస్తున్నారు. బుధవారం నుంచి సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు ఎక్కడికక్కడ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. నేటి నుంచి పూర్తి స్థాయిలో వలంటీర్లు సేవలు అందించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. గతంలో వరదలొస్తే వలంటీర్లతోనే బాధితులకు భోజనం ఏర్పాట్లుగోదావరి వరద ముంపులో ఉన్న వందలాది మంది బాధితుల వద్దకు పీకల్లోతు నీళ్లలో వెళ్లి వలంటీర్లు తక్షణ సాయాన్ని అందించి వెలకట్ట లేని సేవలతో ప్రశంసలు అందుకున్నారు. 2020, 2022ల్లో గోదావరికి వరదలు వచ్చిన సమయంలో..వరదలు వస్తాయన్న ముందస్తు సమాచారంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ ముందుగానే వలంటీర్లను అప్రమత్తం చేసి బా«ధితులను ఆదుకున్నారు. అధికారులు కూడా వెళ్లడానికి సాహసించని లోతట్టు లంక గ్రామాలకు ప్రాణాలకు తెగించి ప్రభుత్వం సమకూర్చిన సహాయ సామగ్రి, నిత్యావసరాలను బాధితులకు వలంటీర్ల కొద్ది గంటల్లోనే అందించారు. గతంలో వరదల సమయంలో గోదావరి ఏటిగట్లకు గండ్లు పడి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించిన సందర్భాలు కోకొల్లలుగా ఉండగా, 20219–23 మధ్య వరదల సమయంలో ప్రతి అర కిలో మీటర్ ఏటిగట్టు పర్యవేక్షణ బాధ్యత ఒక వలంటీర్కు అప్పగించడంతో వారు ప్రజలను అప్రమత్తం చేస్తూ వచ్చారు. అప్పట్లో ఏటిగట్లకు ఊలలు పడినా, గట్లు కుంగిపోయినా, గండ్లు పడిన విషయం ఉన్నతాధికారులకు చేరేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయేది. వలంటీర్లు వరద సేవల్లో పాల్గొన్నప్పుడు, వరదల్లో చిక్కుకున్న బాధితులను గుర్తించడం దగ్గర నుంచి పునరావాస కేంద్రాలకు తరలింపు, భోజనాలు, నిత్యావసరాల పంపిణీలో ప్రాణాలకు తెగించి సేవలందించారు. మధ్యాహ్నం 12 గంటలు దాటకుండానే బాధితులకు భోజనం ప్యాకెట్లు, మంచినీళ్లు అందించారు. 2020, 2022 జూలై, ఆగస్ట్ల్లో సంభవించిన వరదల్లో మామిడికుదురు మండలం పెదపట్నం గ్రామంలోనైనా, బి.దొడ్డవరం, అప్పనపల్లి బాడవ గ్రామాల్లో మోకాలికిపైగా నీటిలో వలంటీర్లు నడచి భుజాలపై ఆహార పొట్లాలు తీసుకువెళ్లి ఊరందరికీ ఆహారం, తాగునీటి ప్యాకెట్లు అందజేశారు. నాటి వరదల్లో జగన్ ప్రభుత్వం ఉచితంగా నిత్యావసరాలు, కూరగాయలను ఏటిగట్లకు చేర్చితే, ఏటిగట్టు నుంచి ఏ గ్రామానికి ఆ గ్రామ వలంటీర్ బాధ్యతగా తీసుకుని పడవలో తీసుకువెళ్లి అందించారు. -
AP: వలంటీరన్నా గుర్తొస్తున్నావ్!
ప్రస్తుతం భారీ వర్షాలకుతోడు వరదలతో పలు జిల్లాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తే యడంతో ఆదుకునేవారు లేక విలవిల్లాడుతున్నారు. ఇళ్లను వరదనీరు చుట్టుముట్టడంతో బయటకు వచ్చే దారిలేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాగడానికి గుక్కెడు తాగునీరు లేక.. ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం వాడుకుని ఉంటే ఈ దుస్థితి దాపురించేది కాదని బాధితులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వరదలు సంభవించినప్పుడు ప్రభావిత ప్రాంతాల్లో వలంటీర్లు స్వయంగా భుజం లోతు నీళ్లలోనూ బాధితుల ఇళ్లకు వెళ్లి వారి క్షేమ సమాచారాలు ఆరా తీశారని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా బాధితులకు ఆహార పదార్థాలు, బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు అందించారని చెబుతున్నారు. నాడు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో వలంటీర్లు నిత్యం వరద పరిస్థితిని అంచనా వేయడం, నది గట్లు ఎలా ఉన్నాయో పరిశీలించి ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులకు తెలిపేవారని అంటున్నారు. నేడు చంద్రబాబు ప్రభుత్వం వలంటీర్లను పక్కనపెట్టడంతో తమకు కోలుకోలేని దెబ్బ తగిలిందని బాధితులు వాపోతున్నారు. నాడు: వలంటీర్ల సేవలతో ప్రజలు సురక్షితంబి.దొడ్డవరంలో ట్రాక్టరులో కూరగాయలు తీసుకువచ్చి అందిస్తోన్న వలంటీర్ కోళ్ల సురేష్ మామిడికుదురు మండలంలో నడుములోతు నీటిలో నిత్యావసరాలు అందిస్తున్న సురేష్ అప్పనపల్లి బాడవలో బాధితుల కోసం పీకల్లోతు ముంపులో నిత్యావసరాలను బుజానకెత్తుకుని వెళుతోన్న వలంటీర్ నీతిపూడి నాగరాజు నేడు: బాబు జమానాలో ప్రజలకు ఇక్కట్లు సింగ్ నగర్ ప్లై ఓవర్పైన ఆహారం కోసం ఎగబడుతున్న వరద నిర్వాసితులు సింగ్ నగర్ ప్లై ఓవర్పైన ఆహారం కోసం ఎగబడుతున్న వరద నిర్వాసితులు కుందావారి కండ్రికలో బాధితులే వాటర్ క్యాన్లు తెచ్చుకుంటున్న దృశ్యం -
వరద బీభత్సం: వాలంటీర్లు లేక ప్రజల అష్టకష్టాలు
సాక్షి,విజయవాడ: ఏపీలో వాలంటీర్లు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వాలంటీర్ల సేవలు లేక రాష్ట్రంలో వరద బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏర్పాటుచేసిన వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వీర్యం చేసిన విషయం తెలిసిందే. తుపాన్లు, వరదల సమయంలో బాధితులకు గతంలో వాలంటీర్లు అండగా నిలిచేవారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ, గుంటూరులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచినీళ్లు, ఆహారం, పునరావాసం లేక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కనీసం అందుబాటులో ఉన్న వాలంటీర్లను కూడా వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం వినియోగించడం లేదు. వాలంటీర్లు ఉన్నప్పుడు తమకు సమస్యలు లేవని బాధితులు గుర్తుచేసుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో విపత్తుల వేల వాలంటీర్లు విస్తృతంగా సేవలందించారని చెబుతున్నారు. వాలంటీర్లపై కక్ష ప్రజలకు శిక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీ ప్రభుత్వంపై వాలంటీర్ల ఆగ్రహం
-
అడక్కుండానే హామీ ఇచ్చి.. అడుక్కునేలా చేస్తున్నారు
సాక్షి, అమరావతి/కృష్ణలంక (విజయవాడ తూర్పు): అడక్కుండానే వార్డు, గ్రామ వలంటీర్లకు హామీలిచ్చిన సీఎం చంద్రబాబు.. వాటిని అమలు చేయకుండా వలంటీర్లను అడుక్కునేలా చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వలంటీర్ల యూనియన్ మండిపడింది. ఆంధ్రప్రదేశ్ వలంటీర్ల యూనియన్ రాష్ట్రస్థాయి సదస్సు ఎంబీ భవన్లో మంగళవారం జరిగింది. వివిధ జిల్లాల నుంచి తరలివచి్చన యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. వలంటీర్లు ఎవరూ అడగకపోయినా సీఎం చంద్రబాబే వలంటీర్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, అధికారంలోకి వచ్చాక మూడు నెలలుగా వలంటీర్లకు జీతాలు చెల్లించకుండా తమ పొట్టకొడుతున్నారని వాపోయారు. ఐదేళ్లలో అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన విధుల్లో తాము పాల్గొన్నామని పేర్కొన్నారు. ఎన్నికల ముందు అడగకుండానే హామీ ఇచ్చి.. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు వలంటీర్లను ఏదో ఒక పార్టీ వారిగా ముద్రవేసి అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఏదో ఒక పార్టీకి చెందిన వాళ్లం కాదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతన బకాయిలు చెల్లించి, నెలవారీ వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలని కోరుతూ సదస్సు తీర్మానించింది. రాజీనామా చేసిన వలంటీర్లను కూడా మానవతా దృక్పథంతో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో వలంటీర్లకు ప్రత్యేక వెయిటేజీ ప్రకటిస్తూ, అర్హతలను బట్టి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ మరో తీర్మానం చేశారు.సీఐటీయూ మద్దతు వలంటీర్ల డిమాండ్లకు సీఐటీయూ మద్దతు తెలిపింది. వలంటీర్ల సమస్యల పరిష్కార సాధనలో సీఐటీయూకు అనుబంధంగా యూనియన్ను ఏర్పాటు చేసింది. సీఐటీయూ కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ.. గ్రామ, వార్డు వలంటీర్లను విధుల్లో కొనసాగించి ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, రూ.10 వేల వేతనం చెల్లిస్తామన్న హామీని అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా హుమయూన్ బాషా, ఉపాధ్యక్షునిగా వెంకటసుబ్బయ్య, కార్యనిర్వాహక కార్యదర్శిగా దీప్తి, కోశాధికారిగా హేమంత్ను ఎన్నుకున్నారు. సదస్సులో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు కె.ఉమామహేశ్వరరావు, ఆర్వీ నరసింహరావు పాల్గొన్నారు. -
వాలంటీర్లను చంద్రబాబు మోసం చేయడంపై YSRCP ఫైర్
-
బాబు తేనె పూసిన కత్తికి వాలంటీర్లు బలి: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: అధికారంలోకి వచ్చేందుకు ఎన్ని అబద్దాలు చెప్పడానికైనా వెనుకాడని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మరోసారి నిరూపితమైంది. అధికారం కోసం అలవి కాని హామీలు ఇచ్చి ఇప్పుడు తీర్చలేక ప్రజలను మోసం చేస్తున్నాడు. మరోవైపు.. ఎన్నికలకు ముందు వాలంటీర్లపై కపట ప్రేమ చూపించి అధికారంలోకి వచ్చాక.. వారిని నట్టేట ముంచేశాడు. దీంతో వారంతా దిక్కులేని స్థితిలో రోడ్డున పడ్డారని వాలంటీర్ల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. కాగా, వాలంటీర్లకు జరిగిన అన్యాయంపై వైఎస్సార్సీపీ స్పందించింది. తాజాగా వైఎస్సార్సీపీ ఎక్స్ వేదికగా.. సీఎం చంద్రబాబు మొదటి నుంచీ వాలంటీర్లపై అక్కస్సు వెళ్లగక్కుతూనే ఉన్నారు. కానీ, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఎలక్షన్స్ ముందు కపట హామీలతో వాలంటీర్లను మభ్యపెట్టాడు. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాలంటీర్లను నట్టేట ముంచేశాడు. వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యంపై క్లారిటీ ఇస్తూ.. వారి గ్రూపులన్నింటినీ డిలీజ్ చేయాలని అధికారులను చంద్రబాబు ఆదివారం ఆదేశించారు. చంద్రబాబు తేనే పూసిన కత్తికి బలైపోయి లక్షలాది మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారు అని పేర్కొంది.ఇక, ఎన్నికల సమయంలో వాలంటీర్లపై చంద్రబాబు ఎంతో కపట ప్రేమను చూపించారు. తాము అధికారంలోకి వస్తే.. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించి.. వారికి జీతం రెట్టింపు చేస్తామన్నారు. వాలంటీర్ల జీతం రూ.10వేలు ఇస్తానని దొంగ హామీ ఇచ్చారు. కానీ, గెలిచాక మాత్రం చేతులెత్తేశారు. వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి అక్కసు వెళ్లగక్కిన @ncbn.. ఎన్నికల ముందు మాత్రం కపట హామీలతో వారిని మభ్యపెట్టి.. గెలిచాక నట్టేట ముంచేశాడు. వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యంపై క్లారిటీ ఇస్తూ.. వాలంటీర్ గ్రూప్లన్నీ డిలీట్ చేయాలని అధికారులకి ఆదివారం ఆదేశాలుచంద్రబాబు తేనె పూసిన కత్తికి… pic.twitter.com/16asihjkF1— YSR Congress Party (@YSRCParty) August 5, 2024 -
వాలంటీర్ల వాట్సాప్ గ్రూపులన్నీ తొలగించాలని చంద్రబాబు సర్కార్ ఆదేశం
-
విధుల్లేకుండా.. జీతాలివ్వకుండా..
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు టీడీపీ–జనసేన–బీజేపీ నేతల మాటలకు.. అధికారంలోకి వచ్చాక వారి వైఖరికి ఎక్కడా పొంతన లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు తీవ్ర నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయా పార్టీల నేతలు చేస్తున్న ప్రకటనలు.. ప్రభుత్వ తీరు చూస్తుంటే తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని వారు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికల ముందు కొందరు రాజీనామాలు చేయగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 లక్షల 6వేల మంది వలంటీర్లు ఇప్పటికీ విధుల్లో కొనసాగుతున్నారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక వారికి జూలై ఒకటిన చెల్లించాల్సిన వేతనాలు ఇప్పటికీ అందలేదు. పైగా.. విధులూ చెప్పడంలేదు. స్థానిక ఎమ్మెల్యేల మౌఖిక ఆదేశాలతో డీడీఓలు వలంటీర్ల గౌరవ వేతన బిల్లులు పెట్టడంలేదని వలంటీర్ల సంఘాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి.. జూన్ ఒకటిన వీరు సకాలంలో వేతనాలు అందుకోగా జూన్ 4న ఎన్నికల ఫలితాలు తర్వాత వీరి ఇక్కట్లు మొదలయ్యాయి. దీంతో జూన్ నెల గౌరవ వేతనాలు ఇప్పటివరకు వలంటీర్లకు అందలేదు. అలాగే, రేపు ఆగస్టు 1న చెల్లించాల్సిన వేతనాలకు సంబంధించిన ప్రక్రియను కూడా ఎక్కువమంది డీడీఓలు తాత్సారం చేస్తున్నారని ఈ సంఘాలు ఆరోపిస్తున్నాయి. విధులు అప్పజెప్పని సర్కారు.. మరోవైపు.. కూటమి ప్రభుత్వం అధికారికంగా వలంటీర్లకు ఎలాంటి విధులు కూడా అప్పజెప్పడంలేదని వారంటున్నారు. గత ఐదేళ్ల పాటు రాష్ట్రంలో పింఛన్ పంపిణీని వీరు ప్రతీనెలా ఠంఛనుగా ఒకటో తేదీ తెల్లవారుజామునే లబి్ధదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందించగా.. చంద్రబాబు సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత జూలై ఒకటిన వలంటీర్లతో కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇక ఆగస్టు ఒకటిన చేపట్టే పింఛన్ల పంపిణీకీ కూడా ప్రభుత్వం వలంటీర్లను దూరంగా ఉంచబోతోంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం తమతో దోబూచులాడుతోందని... అలాగే, వలంటీర్ల వ్యవస్థ అవసరమేలేదన్నట్లుగా ఉందని వలంటీర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఐదేళ్లపాటు అన్నింటా వారే..వాస్తవానికి.. గత ఐదేళ్లలో వలంటీర్ల సేవలు కేవలం పింఛన్ల పంపిణీకే పరిమితం కాలేదు. రాష్ట్రంలో 2019–24 మధ్య ప్రభుత్వం అమలుచేసిన 33 రకాల ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ఎలాంటి అవినీతికి, పైరవీలకు తావులేకుండా ఆయా పథకాల లబ్ధిని నేరుగా లబి్ధదారుల ఇంటివద్దే వలంటీర్లు అందించారు. గ్రామాల్లో ప్రభుత్వాఫీసుల్లో ఎవరికి ఏ పని ఉన్నా వలంటీర్లు వారికి దిక్సూచిగా పనిచేశారు. ప్రభుత్వం ఏ పథకం అమలుచేసినా వీరే ఇంటింటికీ వెళ్లి ఆయా పథకాల గురించి వారికి వివరించి, అర్హులను గుర్తించి, అవి వారికి అందేలా ఎంతో తోడ్పడ్డారు. కరోనా వంటి అత్యంత విపత్కర పరిస్థితుల్లో వలంటీర్ల సేవలను ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా రెండు విడతల చొప్పున ఫీవర్ సర్వేను విజయవంతంగా పూర్తిచేసి కరోనా నియంత్రణలో కీలక భూమిక పోషించారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం అవన్నీ మర్చిపోయి పింఛన్ల పంపిణీ నుంచి వారిని దూరంపెట్టి ఆ కార్యక్రమానికి వారి అవసరమేలేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఆందోళన బాటలో వలంటీర్లు..ఇదిలా ఉంటే.. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇవ్వడంతో పాటు వారి గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని అరచేతిలో వైకుంఠం చూపించారు. కానీ, ఎన్నికల్లో గెలిచాక టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నేతల్లో తమపట్ల స్పష్టమైన వ్యతిరేక భావన కనిపిస్తోందని వలంటీర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్కు ముందు పనిచేసిన వలంటీర్లు అందరినీ కొనసాగించడంతో పాటు తమకు జూన్ నెల గౌరవ వేతనం బకాయిలతో చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. నెలన్నర రోజులుగా మంత్రులు, అధికారులకు కూడా వినతిపత్రాలు అందజేసినట్లు వలంటీర్ల సంఘ ప్రతినిధులు చెప్పారు. -
ఇదేం శాడిజం.. పింఛన్ పంపిణీకి తంటాలు
విజయవాడ, సాక్షి: పింఛన్ పంపిణీకి కూటమి ప్రభుత్వం తంటాలు పడుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నిష్ఫక్షపాతంగా పని చేసిన వలంటీర్ వ్యవస్థను పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నాలు ఇంకా బలంగానే చేస్తోంది. ఈ క్రమంలో ఈ నెలలో కూడా పంపిణీకి సచివాలయ ఉద్యోగుల్నే రంగంలోకి దించింది... వలంటీర్లు లేకుండానే గత నెల పింఛన్లను పంపిణీ చేసింది ప్రభుత్వం. దీంతో వలంటీర్లు అవసరం ఏముంది? అనే ఆలోచనను సీఎం చంద్రబాబు ప్రభుత్వం ముందుకు తెస్తోంది. అంతేకాకుండా జగన్ తెచ్చిన వలంటీర్ వ్యవస్థను మనం కొనసాగించడం ఏంటని.. దానిని రద్దుచేయాలని కూటమి నేతలు చంద్రబాబును కోరుతున్నట్టుగా కూడా ప్రచారం చేస్తున్నారు. మోసపోయాం: వలంటీర్లువైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పంపిణీ కోసం వైఎస్ జగన్ వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే.. తొలినాళ్లలో వలంటీర్లపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు.. ఎన్నికల ప్రచారం నాటికి స్వరం మార్చారు. తాను అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని, గౌరవ వేతనం రెట్టింపు చేసి నెలకు రూ.10వేలు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు ఎన్నికల టైంలో ఈసీకి ఫిర్యాదు చేయడం ద్వారా చంద్రబాబు.. వలంటీర్లను పెన్షన్ పంపిణీకి దూరం చేసి లబ్ధిదారులకు నరకం చూపించారు. ఈ క్రమంలో కొందరు చనిపోయారు కూడా. ఏపీలో ఎన్నికల ముందు రెండు నెలలు.. ఎన్నికల తర్వాత రెండు నెలలు.. వలంటీర్లు ఖాళీగా ఉన్నారు. చంద్రబాబు పెంచి ఇస్తామన్న గౌరవవేతనం మాట దేవుడెరుగు.. వాళ్లకు రెగ్యులర్గా వచ్చే గౌరవ వేతనాలు కూడా అందలేదు. ఇక ఆగస్టులో వారికి వేతనాలు ఇస్తారో? లేదో? తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్నికలు జరిగి రెండు నెలలు పూర్తయినా ఎలాంటి విధులు అప్పగించకపోవడం, వేతనాలు లేకపోవడంతో వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. తమను కొనసాగిస్తారో.. తొలగిస్తారో అనే అనుమానాల మధ్యే వలంటీర్లు కలెక్టరేట్లు చుట్టూ తిరుగుతూ వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు కూడా!చంద్రబాబు శాడిజానికి వలంటీర్లు మాత్రమే కాదు.. సచివాలయ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకటో తేదీ తెల్లవారుజాము నుంచే పింఛన్ పంపిణీ చేయాలని, ఒకవేళ గ్రామాల్లో నివాసం లేని వాళ్లు ఇవాళ అర్ధరాత్రిలోపే సచివాలయంలో బస చేయాలని జిల్లా కలెక్టర్, ఎంపీడీవోలకు మౌలిక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో అధికారుల ఉత్తర్వులతో సచివాలయ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యధిక శాతం మహిళా ఉద్యోగులే ఉండగా.. రాత్రిపూట సచివాలయంలో ఏ విధంగా బస చేస్తామని ప్రశ్నిస్తున్నారు. పోనీ పెన్షన్ పంపిణీ అయినా వాళ్ల చేత సక్రమంగా చేయించారా? అంటే అదీ లేదు. టీడీపీ నేతల జోక్యంతో అది కాస్త రాజకీయ కార్యక్రమంగా నడిచింది. మరోవైపు సర్వర్లో ఇబ్బందులతో ఇటు సచివాలయ ఉద్యోగులు.. అటు ఫించన్దారులు నానా ఇబ్బందులు పడ్డారు. -
volunteers: మాకు న్యాయం చేయండి
సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ): వలంటీర్లకు జూన్ నెల గౌరవ వేతన బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు వలంటీర్ల ప్రతినిధులు జిల్లా కలెకరేట్లతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికల్లో వినతిపత్రాలు సమర్పించారు. ఆయా వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనాన్ని రూ. 5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల ముందు చంద్రబాబు బహిరంగ సభలలో చెప్పడంతో పాటు మేనిఫెస్టోలో హామీ ఇచి్చన విషయం తెలిసిందే. అయితే, ప్రతి నెలా ఇచ్చే సామాజిక పింఛన్లను.. 2019 ఆగస్టులో వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి వారే క్షేత్రస్థాయిలో సమర్థంగా పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం మొదటిసారి ఇచి్చన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వలంటీర్లను దూరంగా పెట్టి, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా నిర్వహించారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి మొదలయ్యే పింఛన్ల పంపిణీ కూడా వలంటీర్లతో సంబంధం లేకుండా సచివాలయాల ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర మంది వలంటీర్లు విధుల్లో కొనసాగుతుండగా, వారిలో దాదాపు 75 శాతం మందికి జూన్ నెల గౌరవ వేతనం ఇప్పటి వరకూ కూడా అందలేదని వలంటీర్ల సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.#APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని... అందరూ వాలంటీర్లు *సోమవారం(జూలై 29) కర్నూలు కలెక్టరేట్ లో* జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. #GVWV pic.twitter.com/NH5Jt9ASy0— 𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽 (@news_volunteer) July 29, 2024రూ. 10 వేలు వేతనం ఇవ్వాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వలంటీర్లు సోమవారం విశాఖ కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆం«ధ్రప్రదేశ్ వలంటీర్లు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జగదీష్, కార్యదర్శి సంపత్ మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణమే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న వేతన బకాయిలు వెంటనే ఇవ్వాలని కోరారు.#APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని.*సోమవారం(జూలై 29) విజయనగరం కలెక్టరేట్ లో* జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి మరియు MLA గారికి వినతిపత్రం సమర్పించారు. #GVWV pic.twitter.com/hmmBZ2bu1D— 𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽 (@news_volunteer) July 29, 2024 #APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని... అందరూ వాలంటీర్లు సోమవారం(జూలై 29) గుంటూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. #GVWV pic.twitter.com/AgWIHFBtaG— 𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽 (@news_volunteer) July 29, 2024 #APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని.*సోమవారం(జూలై 29) విజయనగరం కలెక్టరేట్ లో* జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి మరియు MLA గారికి వినతిపత్రం సమర్పించారు. #GVWV pic.twitter.com/hmmBZ2bu1D— 𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽 (@news_volunteer) July 29, 2024VIDEO and Photo Credits: 𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయండి సాక్షి, అమరావతి: టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన వైవీబీ రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ సోమవారం గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. చాంబర్ రాష్ట్ర కమిటీ సోమవారం విజయవాడలో సమావేశమై ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ,ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, కౌన్సిలర్, కార్పొరేటర్, చైర్మన్, మేయర్ల ఒక నెల గౌరవ వేతనాన్ని అమరావతి అభివృద్ధికి విరాళంగా ఇవ్వాలని తీర్మానించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ను కలిసి తమ సంఘం 16 డిమాండ్ల వినతిపత్రం ఇచ్చి, చర్చించి ఆయా డిమాండ్లను పరిష్కరించ వలసిందిగా కోరాలని తీర్మానించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఏడాదిలో ఒకరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరో తీర్మానం చేశారు. -
వలంటీర్లపై ముందడుగా, వెనకడుగా?
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కిత్రం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన వలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగించే అలోచనలో ఉందా లేదా అన్న అంశంపై మంగళవారం శాసన సభ సమావేశాల ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో చర్చ జరగనుంది. మంగళవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ముందుగా నిర్ణయించిన పది ప్రశ్నల్లో ఈ అంశం మూడోది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, బి. విరూపాక్షి లేవనెత్తిన ఈ ప్రశ్నకు సాంఘిక సంక్షేమ శాఖ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖల మంత్రి డోలా బాల వీరాంజనేయులు సమాధానం చెప్పనున్నారు. ఈ సందర్బంగా సభలో జరిగే చర్చలో వలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వ ఆలోచనలు, సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ప్రకారం వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా.. వారి గౌరవ వేతనం పెంపు హామీని నిలబెట్టుకుంటారా అన్న విషయాలపై చాలా వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.త్రిశంకుస్వర్గంలో వలంటీర్ల వ్యవస్థప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి, వారికి అన్ని విధాలా సహకరించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 ఆగస్టులో వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థపై అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా విరుచుకుపడేవారు. దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి మాట మార్చేశారు. వలంటీర్లను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రూ. 10 వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఊసే ఎత్తడంలేదు. పైగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి జులై ఒకటి నుంచి చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వలంటీర్లను తప్పించారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ చేశారు. వలంటీర్లు ప్రతి నెలా కీలకంగా నిర్వహించే విధుల్లో పింఛన్ల పంపిణీ ప్రధానమైనది. అటువంటి కార్యక్రమానికే దూరంగా పెట్టడంతో వలంటీర్ల వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు ఏమిటన్న విషయంపై అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుందా లేదంటే ఇంకేమైనా తీవ్రమైన నిర్ణయం తీసుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవే అనుమానాలతో రాష్ట్రంలో పలుచోట్ల వలంటీర్లు ఆందోళనలు చేస్తున్నారు. సోమవారం విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయం వద్ద ప్రస్తుతం అధికారికంగా విధుల్లో కొనసాగుతున్న పలువురు వలంటీర్లు నిరసన తెలియజేశారు. వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, ఎన్నికల ముందు చెప్పిన ప్రకారం గౌరవ వేతనం రూ. 10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. -
ఏపీ హైకోర్టులో కొడాలి నానికి ఊరట
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రంలో వలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నమోదు చేసిన కేసుపై 41ఏ ప్రోసీజర్ పాటించాలని కోర్డు ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.కాగా, మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. వలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసులో కొడాలి నాని ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపథ్యంలో విచారణలో భాగంగా 41ఏ ప్రొసీజర్ను పోలీసులు పాటించాలని కోర్టు ఆదేశించింది. అలాగే, విచారణలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించాలని హైకోర్టు పోలీసులను ఆదేశాలు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.ఇదిలా ఉండగా.. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల ప్రోత్బలంతో కొందరు వలంటీర్లు వైఎస్సార్సీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. దీంతో, వారికి వత్తాసు పలుకుతూ పోలీసులు కూడా అక్రమంగా కేసులు నమోదు చేశారు. -
వలంటీర్ల ఆందోళన బాట.. పోలీసుల అత్యుత్సాహం
ఎన్టీఆర్, సాక్షి: పింఛన్ల పంపిణీని సచివాలయ ఉద్యోగులతో చేయించడంతో వలంటీర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో తమకు జీతాలు పెంచుతామని చెప్పిన కూటమి నేతలు.. తీరా అధికారంలో వచ్చాక విధులకు తమను దూరం చేయడాన్ని ప్రతికూల సంకేతంగా భావిస్తున్నారు. వలంటీర్ వ్యవస్థకు భద్రత కల్పించాలని కోరుతూ ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. వలంటీర్లు చలో విజయవాడకు పిలుపు ఇచ్చారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో విజయవాడలో హైఅలర్ట్ నెలకొంది. కలెక్టరేట్ వద్ద పోలీస్ సిబ్బంది భారీగా మోహరించారు. నగర వ్యాప్తంగా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వలంటీర్లను అదుపులోకి తీసుకునేందుకు బస్టాండ్, రైల్వే స్టేషన్లలో పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరినీ చెక్ చేయడంతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. కేవలం వాట్సాప్ గ్రూపుల్లో జరిగిన ప్రచారంతో ఇంత హడావిడి చేయడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ర్యాలీ, ప్రదర్శనలకు వలంటీర్లు తమను ఎలాంటి అనుమతి కోరలేదని విజయవాడ పోలీసులు చెబుతున్నారు. శాంతి భద్రతల కట్టడి సెక్షన్లు అమలులో ఉన్నాయని వారు చెబుతున్నారు. మరోవైపు వలంటీర్ సేవల్ని ఎలా ఉపయోగించుకుంటారు?.. వాళ్ల ఉద్యోగ భద్రతపై ఇప్పటిదాకా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం. -
పింఛన్ల పంపిణీ.. పవన్ కళ్యాణ్కు పరాభవం
పిఠాపురం: వలంటీర్లు లేకపోతే అసలు పింఛన్ల పంపిణీ అసాధ్యమన్నారని, కానీ వారి అవసరం లేకుండా పింఛన్లు పంపిణీ చేసి చూపించామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచి్చన హామీ ప్రకారం ఒకటో తేదీన వలంటీర్లు లేకుండానే సచివాలయాలు, వివిధ శాఖల సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేస్తున్నారన్నారు.గతంలో పింఛన్ల పంపిణీలో కొందరు వలంటీర్లు లబ్ధిదారుల వద్ద రూ.100కు తక్కువ కాకుండా తీసుకునేవారని తనకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వ సిబ్బందితోనే పింఛన్లు పంపిణీ చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుందని అన్నారు. లబ్ధిదారుల వద్ద డబ్బు అడిగేందుకు అవకాశం కూడా ఉండదని, ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి బాధ్యత తీసుకుంటారని చెప్పారు. వలంటీర్లు లేకుండానే వ్యవస్థలతో పని చేయిస్తే ఎలా ఉంటుందో దీని ద్వారా చేసి చూపించామన్నారు.వంద శాతం గ్రామాలకు పూర్తి స్థాయి రక్షిత మంచినీరు అందించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయడం, ప్రతి ఇంటికీ లోటు లేకుండా స్వచ్ఛమైన నీరు అందించి, ప్రజలందరి ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలనేదే తన లక్ష్యమని చెప్పారు. రక్షిత మంచి నీరు, ఉపాధి, సాగునీటి కాలువల పూడికతీత వంటివి చేసి, ప్రజలకు దగ్గర కావాలనేది తన ఆకాంక్ష అన్నారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలనేది తన ప్రయత్నమన్నారు. రాష్ట్రంలో ఏ పరిశ్రమ నుంచి ఎంత కాలుష్యం విడుదలవుతోందనే ఆడిట్ లెక్కలు తీయిస్తున్నామని చెప్పారు. పరిశ్రమల నిర్వాహకులే కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కలెక్టర్ షాన్మోహన్, ఎస్పీ సతీష్కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పాల్గొన్నారు.పవన్ కళ్యాణ్కు పరాభవం భీమవరం: పింఛన్ల పంపిణీ కరపత్రంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ముద్రించకపోవడం ఆయన్ని పరాభవించడమేనని జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ సహకారంతో అధికారంలోకి వచి్చన చంద్రబాబు పింఛన్ల కరపత్రంపై కేవలం తన చిత్రాన్ని మాత్రమే ముద్రించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. కరపత్రంపై పవన్ ఫొటో ముద్రించకుండా దారుణంగా అవమానించారని వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం తాను మాత్రమే ప్రచారం పొందాలన్న యావ చంద్రబాబుకు ఇంకా పోలేదని జనసేన కార్యకర్తలు, నాయకులు విమర్శిస్తున్నారు. అంతేకాదు.. ఎన్టీఆర్ పేరుతో పంపిణీ చేస్తున్న పింఛన్ల కరపత్రంపై ఎన్టీఆర్ చిత్రాన్ని కూడా వేయకపోవడం గమనార్హం. దీనిపై ఎనీ్టఆర్ అభిమానులు కూడా మండిపడుతున్నారు. -
వాలంటీర్లు వేస్ట్.. తేల్చి చెప్పిన టీడీపీ నేత
-
వాలంటీర్లు వద్దట!.. జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కాకినాడ జిల్లా: వాలంటీర్లపై తమ అసలు రంగును టీడీపీ నేతలు బయటపెడుతున్నారు. వాలంటీర్ల సేవలు అవసరం లేదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తేల్చి చెప్పేశారు. వాలంటీర్లు వద్దని టీడీపీ లేజిస్లేటివ్ సమావేశంలో చెబుతా.. అసెంబ్లీ సమావేశాల్లో ఒత్తిడి చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. వాలంటీర్ల కంటే పారిశుధ్య కార్మికులకు రూ.10 వేలు ఇచ్చి నియమించుకోవాలన్న జ్యోతుల నెహ్రూ.. సచివాలయ ఉద్యోగులకు కాపలా కుక్కల్లా ఏన్డీఏ కార్యకర్తలు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.కాగా, ఐదేళ్ల క్రితం ఏర్పాటైన విప్లవాత్మక వలంటీర్ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలో పెట్టేసింది. 2019 ఆగస్టులో గత ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టగా వీరు నిర్వహించే విధుల్లో ప్రతి నెలా టంఛన్గా పింఛన్ల పంపిణీ అత్యంత కీలకం. అయితే జూలైలో పింఛన్ల పంపిణీని వలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా నిర్వహించాలని మంత్రివర్గ తొలి సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో వలంటీర్ల వ్యవస్థపై అటు అధికార వర్గాలు ఇటు రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారి గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. టీడీపీ–జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోనూ దీన్ని పొందుపరిచారు. అయితే ఇప్పుడు వలంటీర్లు ప్రధానంగా నిర్వహించే విధుల నుంచి వారిని దూరంగా ఉంచడం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పింఛన్ల పంపిణీకి సన్నద్ధం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చర్చనీయాంశంగా మారింది. -
చంద్రబాబు కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు
-
వలంటీర్లకు విధులేవి?
సాక్షి, అమరావతి: ఐదేళ్ల క్రితం ఏర్పాటైన విప్లవాత్మక వలంటీర్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం త్రిశంకు æస్వర్గంలో పెట్టేసింది. 2019 ఆగస్టులో గత ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టగా వీరు నిర్వహించే విధుల్లో ప్రతి నెలా టంఛన్గా పింఛన్ల పంపిణీ అత్యంత కీలకం. అయితే జూలైలో పింఛన్ల పంపిణీని వలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా నిర్వహించాలని సోమవారం మంత్రివర్గ తొలి సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో వలంటీర్ల వ్యవస్థపై అటు అధికార వర్గాలు ఇటు రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారి గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. టీడీపీ–జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోనూ దీన్ని పొందుపరిచారు. అయితే ఇప్పుడు వలంటీర్లు ప్రధానంగా నిర్వహించే విధుల నుంచి వారిని దూరంగా ఉంచడం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పింఛన్ల పంపిణీకి సన్నద్ధం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చర్చనీయాంశంగా మారింది. లక్షన్నర మంది విధుల్లోనే..రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున గతంలో 2.65 లక్షల మంది వలంటీర్లు విధులు నిర్వర్తించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత మినహా ఐదేళ్ల పాటు వలంటీర్ల సేవలు కొనసాగాయి. అనంతర పరిణామాల నేపథ్యంలో పలువురు రాజీనామాలు చేయగా ప్రస్తుతం లక్షన్నర మందికి పైగా విధుల్లో కొనసాగుతున్నారు. అయితే పింఛన్ల పంపిణీతో పాటు ఇతర సాధారణ విధులు కూడా అప్పగించకుండా వారిని దూరంగా ఉంచడం ప్రశ్నార్థకంగా మారింది.ఆగస్టు 14 ఆఖరి గడువు..సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో నెలవారీ గౌరవ వేతనంతో పనిచేసే వారిని కొనసాగించేందుకు నిర్దిష్ట సమయంలోగా ఎప్పటికప్పుడు అనుమతులు మంజూరు చేస్తారు. 2019 ఆగస్టులో ఏర్పాటైన వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు గడువు ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీతో ముగియనుంది. అనంతరం ఈ వ్యవస్థను కొనసాగించాలంటే ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది. వలంటీర్లకు బాబు వెన్నుపోటు! వలంటీర్లకు చంద్రబాబు తనదైన శైలిలో వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ‘వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ.. వారికి నెలకు రూ.10 వేలు జీతం ఇస్తానని ఎన్నికల సమయంలో బాబు హామీ ఇచ్చారు. అయితే జూలై 1న వలంటీర్లతో కాకుండా, సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని తాజాగా కేబినెట్లో నిర్ణయించారు. అంటే వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడే దిశగా నిర్ణయం తీసుకున్నారు’ అని సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విటర్)లో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. -
వాలంటీర్లకు షాకిచ్చిన ఏపీ కేబినెట్..
-
వాలంటీర్లకి చంద్రబాబు మార్క్ వెన్నుపోటు.. వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: వాలంటీర్లపై చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెడుతూ.. సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయించాలని నిర్ణయించింది. 1వ తేదీన సచివాలయ ఉద్యోగుల చేత పెన్షన్ డోర్ డెలివరీ చేయనుంది. అన్ని రకాల పెన్షన్లు సచివాలయ ఉద్యోగులతోనే పంపిణీ చేయనున్నామని.. వాలంటీర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి పార్థసారథి తెలిపారు.చంద్రబాబు ప్రభుత్వం తీరుపై వైఎస్సార్సీపీ మండిపడుతోంది. ‘‘జులై 1న సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తూ.. రూ.10 వేలు జీతం ఇస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకి మంగళం పాడే దిశగా చంద్రబాబు సర్కార్ నిర్ణయాలు తీసుకుంటుంది’’ అని వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది.వాలంటీర్లకి చంద్రబాబు మార్క్ వెన్నుపోటు!జులై 1న సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయంవాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తూ.. రూ.10 వేలు జీతం ఇస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బాబు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకి మంగళం పాడే దిశగా నిర్ణయాలు— YSR Congress Party (@YSRCParty) June 24, 2024 కాగా, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సేవ కంటే కక్షసాధింపునకే ప్రాధాన్యం ఇస్తోంది. వెలకట్టలేని అభిమానంతో గత ప్రభుత్వంలో జగనన్న సైన్యంలా వలంటీర్లు పని చేసిన సంగతి తెలిసిందే. వాలంటీర్లుగా పనిచేసి వారిని లక్ష్యంగా చేసుకుని రాజకీయ క్రీడకు తెరతీసింది చంద్రబాబు సర్కార్. వలంటీర్ల వ్యవస్థనే నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులైన ప్రతి ఒక్కరికీ అందేలా, ఇంటింటికి వెళ్లి అందించడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు. -
వలంటీర్ల వ్యవస్థపై నేడు స్పష్టత!
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కిందట రాష్ట్రంలో కొత్తగా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం యథావిధిగా పూర్తిస్థాయిలో అమలు చేస్తుందా లేక మార్పులు చేస్తుందా అన్నదానిపై సోమవారం కొంత స్పష్టత వస్తుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మొన్నటి ఎన్నికల్లో గెలుపొందిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వలంటీర్ల వ్యవస్థపై చర్చించే అవకాశం ఉందని, ఈ వ్యవస్థపై ప్రభుత్వ ఆలోచనలు ఏమిటన్నది తెలుస్తుందని చెబుతున్నాయి.చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ.. గత ఐదేళ్లలో కొత్తగా ఏర్పడిన ఈ వ్యవస్థకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయనతోపాటు మంత్రివర్గ సభ్యులందరికీ కూలంకషంగా వివరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఉన్నతాధికారులు వివిధ రకాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు (పీపీటీలు) సిద్ధం చేశారు. మంత్రివర్గ సమావేశానికి ముందే సోమవారం సంబంధిత మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఆ శాఖ అధికారులతో వేరుగా సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో ప్రతి 50 ఇళ్లకు ఒకరు, పట్టణ ప్రాంతాల్లో 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున మొత్తం 2.65 లక్షలమంది వలంటీర్లతో 2019 ఆగస్టు 15న గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన విషయం తెలిసిందే. అదే ఏడాది 2019 ఆక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను కూడా అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు ఏకంగా 1.34 లక్షల కొత్త శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేసి అప్పటికప్పుడే భర్తీ చేసింది.ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. అయితే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా గౌరవ వేతనంతో పనిచేసే 2.65 లక్షల మంది వలంటీర్లపై మొన్నటి ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం అనేక ఆంక్షలు విధించడంతో పాటు ఇతర కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వలంటీర్లు రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం దాదాపు లక్షన్నరమంది వలంటీర్లు మాత్రమే పనిచేస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. -
వలంటీర్లతో రాజకీయ కుట్రలు
నెల్లూరు సిటీ: అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రజా సేవ కంటే ప్రతీకారేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తోంది. వెలకట్టలేని అభిమానంతో గత ప్రభుత్వంలో జగనన్న సైన్యంలా వలంటీర్లు పని చేశారు. పిచ్చుకలపై బ్రహ్మాస్త్రంలా వలంటీర్లుగా పనిచేసి వారిని లక్ష్యంగా చేసుకుని రాజకీయ క్రీడకు తెరతీశారు. వలంటీర్లు అందరూ సామాన్యులే. ఇటువంటి వారిని భయపెట్టి వలంటీర్ల వ్యవస్థనే నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులైన ప్రతి ఒక్కరికీ అందేలా, ఇంటింటికి వెళ్లి అందించడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు. నెల్లూరునగరంలోని రూరల్ నియోజకవర్గ పరిధిలో 26 డివిజన్లలో మొత్తం 1,148 మంది వలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ముందు టీడీపీ నాయకులు ఈసీని అడ్డు పెట్టుకుని పింఛన్లు పంపిణీని వలంటీర్ల ద్వారా చేయనీయకుండా అడ్డుకున్నారు. ప్రజలకు సేవ చేయలేని విధుల్లో తాము కొనసాగలేమని దాదాపు 442 మంది వలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. తమకు ఇంతటి గౌరవాన్ని కల్పించిన జగనన్నకు మద్దతుగా వలంటీర్లందరూ ఆదాల ప్రభాకర్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అయితే అప్పట్లో కొందరు వలంటీర్లకు తాయిళాలు ఎరవేసి టీడీపీలో చేర్చుకున్నారు. ఆ రోజు పార్టీలో చేరిని వారిని లక్ష్యంగా చేసుకుని వారి వేళ్లతో వారి కళ్లు పొడుకునే విధంగా టీడీపీ నాయకులు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు.అధికారం రావడంతో...టీడీపీ అధికారంలోకి రావడంతో ఎన్నికల ముందు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి వైఎస్సార్సీపీలో చేరిన వలంటీర్లను అడ్డం పెట్టుకుని అప్పట్లో వైఎస్సార్సీపీ నేతలు తమను బెదిరించి రాజీనామా చేయించారంటూ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయిస్తున్న వైనం చూస్తుంటే టీడీపీ నీచ రాజకీయాలు, కుట్రలు ఏ స్థాయికి వెళ్లాయో అర్థమవుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం 41 డివిజన్, ఆదివారం 21వ డివిజన్ వైఎస్సార్సీపీ నాయకులపై ఫిర్యాదులు చేయించారు.మాజీ వలంటీర్ల ఫిర్యాదునెల్లూరు(క్రైమ్): గతంలో వైఎస్సార్సీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు మాజీ వలంటీర్లు ఆదివారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గడిచిన రెండు రోజులుగా పలు పోలీసుస్టేషన్లలో వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కార్పొరేటర్లు, నేతలపై వలంటీర్లు వరుస పెట్టి ఫిర్యాదులు చేయడం వెనుక ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. అధికార పార్టీ నేతలు ఓ పథకం ప్రకారమే వైస్సార్సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.గత ప్రభుత్వంలో జగనన్న సేవకులుగా పనిచేసిన వలంటీర్లను అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయ కుట్రలకు, వేధింపులకు తెర తీసింది. ఎన్నికలకు ముందు వలంటీర్లపై టీడీపీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి విధులకు దూరం చేసింది. దీంతో టీడీపీ కుట్రలను నిరసిస్తూ వలంటీర్లు కొందరు తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేసి తమ ఆరాధ్య నేత వైఎస్ జగన్ సైన్యంగా ఎన్నికల విధుల్లో కీలకంగా పాల్గొన్నారు. ఇదే టీడీపీకి రుచించలేదు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు వారిని భయపెట్టి, ప్రలోభపెట్టి వైఎస్సార్సీపీ నేతలపై పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయిస్తుండడంపై చర్చనీయాంశంగా మారింది. -
వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర
-
ఈ దొంగల్ని నమ్మొద్దు
చిత్తూరు రూరల్(కాణిపాకం): కొత్త వలంటీర్ల పేరుతో తెలుగుదేశం పార్టీ సరికొత్త మోసానికి తెరతీసింది. ఇటీవల రాజీనామా చేసిన వలంటీర్ల స్థానంలో తమ పార్టీకి చెందిన కొందరు యువకులను గ్రామాల్లోని పేదల ఇళ్లకు పంపిస్తోంది. వారి ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోంది. చిత్తూరు రూరల్ మండలంలో ఈ నయా మోసం వెలుగులోకి వచ్చింది. ఇటీవల చిత్తూరు మండలంలో చాలామంది వలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. దీనిని ఆసరాగా చేసుకుని స్థానిక టీడీపీ నేతలు కొందరు యువకులను ఎంపిక చేసి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్లుగా మిమ్మల్నే నియమిస్తామని నమ్మబలికారు. వారికి వలంటీర్లు ఎలాంటి సేవలు అందిస్తారనే విషయంపై శిక్షణ ఇచ్చారు. అనంతరం 50 ఇళ్లకు ఒకరిని చొప్పున పంపించారు. ఇక వారు పేదల ఇళ్లకు వెళ్లి ‘తాము కొత్త వలంటీర్లం. ఇక వచ్చేది టీడీపీ. కాబట్టి టీడీపీకి ఓటు వేయండి. లేకపోతే ఏ పథకం రాదు..’ అని బెదిరిస్తున్నారు. టీడీపీ కరపత్రాలు చూపిస్తూ పింఛన్లు, ఇంటి స్థలం.. అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పేదల అవసరాలను గుర్తించి ఆర్థికంగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. టీడీపీ ఆడుతున్న ఈ కొత్త వలంటీర్ల డ్రామాపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ ఎటువంటి మోసాలకైనా పాల్పడుతుందనేందుకు కొత్త వలంటీర్ల డ్రామా ఒకటని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి దొంగలను నమ్మరాదన్న భావనను వారు వెలిబుచ్చారు. దీనిపై కొందరు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
వైఎస్ జగన్... ఆ పేరే ఓ స్ఫూర్తి...
సాక్షి, అమరావతి: ‘పేదలు ఎదగాలంటే ప్రభుత్వ సాయం కావాలి. అందుకు సంక్షేమ పథకాలు చాలా వరకూ తోడ్పడతాయి. ఒక వైపు సంక్షేమం... మరోవైపు అభివృద్ధి ఏపీలో సమపాళ్లలో జరుగుతోంది. అందుకు కారకుడైన జగన్ అంటే అందుకే నాకు ప్రత్యేకమైన అభిమానం’ అంటున్నారు సినీ నటుడు రాజా రవీంద్ర. వ్యక్తిగతంగా తనకే కాదు చాలా మందికి ఆయన ఇన్స్పిరేషన్ అంటూ కొనియాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన పట్ల తన అభిప్రాయాల్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..పేదలు ఎదగాలంటే...ప్రభుత్వ ఆసరా కావాలి.. పేదలు, దిగువ మధ్య తరగతి వర్గాలు ఎదగాలంటే మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతికి చేరాలంటే అది వారి కాయకష్టం మీద అయ్యేపని కాదు. కాబట్టి తప్పకుండా సంక్షేమ పథకాలు అవసరమవుతాయి. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పలు రూపాల్లో ఆసరా అందిస్తోంది.అన్నివర్గాల జీవన ప్రమాణాలు మెరుగవ్వాలంటే వారికి ప్రభుత్వం తప్పనిసరిగా అందివ్వాల్సింది విద్య, వైద్యం. ఈ విషయంలో చాలా మార్పులు జరిగాయి.దళారీలు లేకుండా చేరుతున్న లబ్ధి సంక్షేమ పథకాల అమలు విషయంలో గ్రామ వలంటీర్ల విధానం చాలా మంచి కాన్సెప్్ట. వీరి వల్ల మధ్యలో ఎవరికీ ఎటువంటి లంచాలు, పైరవీలతో తావు లేకుండా పేదలకు పథకాలు అందుతున్నాయి. ఈ వ్యవస్థ ఎంత గొప్పదో... ప్రయోజనాలు పొందుతున్నవారికి బాగా అర్థమవుతుంది. ఈ సంక్షేమ పథకాలన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా అమలు చేయడం గొప్ప విషయం. అధికారంలోకి రావడం కోసం పొత్తుల కన్నా ఒంటరిపోరుకే జగన్ సై అంటారు. ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆయన మీద అభిమానం చెక్కు చెదరలేదు. ఈ ఎన్నికల్లో జగన్ విజయం తథ్యం. ఖరీదైన వైద్యానికీ సర్కారు సాయం ప్రస్తుతం రోగాలు వస్తే దానికి వైద్యం ఎంత ఖరీదైపోయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏ రోగం వచ్చిన లక్షలకు లక్షలు మంచినీళ్లలా ఖర్చుచేయాల్సి వస్తోంది. ఒక కిడ్నీ పాడైనా చికిత్సకు రూ.20 లక్షలపైనే ఖర్చవుతోంది. ఈ పరిస్థితుల్లో అనుకోని వ్యాధి వస్తే ఎగువ మధ్యతరగతి కుటుంబాలు ఎలా తట్టుకోగలవు? ఇక నిరుపేదల సంగతైతే వేరే చెప్పనక్కర లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకం వారిని ఎంతగానో ఆదుకుంటోంది. ఇప్పుడు వైద్య పరిమితిని రూ.25లక్షలకు పెంచారు. ఇది నిజంగా ఎక్స్ట్రార్డినరీ స్టెప్. విద్యతోనే విజయం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నాడు నేడు పేరిట ప్రభుత్వ పాఠశాలల్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. కొన్ని తరగతుల విద్యార్థులకు ట్యాబ్స్ అందిస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఇంగ్లిష్ మీడియం కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇది ఒక సమగ్ర విద్యావికాస మార్గంగా చెప్పాలి. వీటన్నింటివల్లా పాఠశాలల్లో చదివే వారిలో కనీసం 10శాతం మంది వృద్ధిలోకి వచ్చే అవకాశం కచి్చతంగా ఉంటుంది. అలా వచ్చిన వారు రూ.లక్షల్లో జీతాలు తెచ్చుకోగలుగుతారు. అప్పుడు తప్పకుండా పేదల జీవన ప్రమాణాల స్థాయి మారిపోతుంది. నిజంగా జరగాల్సింది అదే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతోంది. -
మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
కర్నూలు(అగ్రికల్చర్): టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాల కారణంగా పింఛన్దారుల కష్టాలు తొలగిపోలేదు. మే నెలలో కూడా పింఛన్ పొందేందుకు అవస్థలు తప్పేలా లేవు. దాదాపు ఐదేళ్లుగా వార్డు, గ్రామ వలంటీర్ల ద్వారా ఇంటింటికి చేరుతున్న పింఛన్ను అడ్డుకున్నది టీడీపీ వారేనన్న విషయం అందరికీ తెలిసిందే. వలంటీర్లతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో టీడీపీ అధినేత చంద్రబాబు శిష్యుడు నిమ్మగడ్డ రమేష్కుమార్ కోర్టులను, ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు. పింఛన్ల పంపిణీతో సహా సంక్షేమ పథకాల అమలులో వలంటీర్లను వినియోగించరాదని, వారిని పూర్తిగా పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో పింఛన్దారులకు మొదటిసారిగా ఏప్రిల్ నెలలో కష్టాలు మొదలయ్యాయి. ఎర్రటి ఎండలో ముదిమి వయస్సులో పింఛన్ కోసం రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి వచ్చింది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలోసచివాయాలకు వెళ్లాల్సి రావడంతో వడదెబ్బ, ఇతర కారణాలతో 35 మంది మృత్యువాత పడ్డారు. టీడీపీ నేతల కుట్రల ఫలితంగా మే నెలలో కూడా పింఛన్ల పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే మే నెల పింఛన్ల పంపిణీలో అధికారులు కొన్ని మార్పులు చేశారు.నగదు బదిలీ సాధ్యమేనా? పింఛన్ల పంపిణీలో మే నెల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అమలు చేస్తున్నారు.లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా పింఛన్ మొత్తం బదిలీ చేయనున్నారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంగా బాధపడుతున్న వారు, మంచం పట్టి వీల్చైర్కు పరిమితమైన వారు, సైనిక్ సంక్షేమ పింఛన్లు పొందుతున్న వారికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటిదగ్గరే పింఛన్లు పంపిణీ చేస్తారు. మిగిలిన కేటగిరీ పింఛన్దారులకు డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు. డీబీటీ పరిధిలోకి రాని వారికి మాత్రం 3వ తేదీ నుంచి నగదు రూపంలో ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేస్తారు. చాలా మంది పింఛన్దారులకు బ్యాంకు ఖాతాలు లేవు.డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ ఎంతవరకు విజయవంతం అవుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఠంచన్గా ఒకటో తేదీనే పింఛన్ సొమ్ము చేతితో పడితే ఆ ఆనందమే వేరు. డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తే నగదు కోసం మళ్లీ బ్యాంకులకు వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అవ్వాతాతలు, వితంతువులైన అక్కచెల్లెమ్మలు, ఇతర పింఛన్దారులకు టీడీపీ నేతల కుట్రలతో కష్టాలు మొదలయ్యాయనేది బహిరంగ రహస్యమే. తమకు కష్టాలను తెచ్చి పెట్టిన వారికి ఓటుద్వారా బుద్ధి చెబుతామని అవ్వాతాతలు స్పష్టం చేస్తున్నారు. మే నెల పింఛన్ల పంపిణీ 5వ తేదీ వరకు జరగనుంది. మే నెలలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,68,742 పింఛన్లకు రూ.139.82 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. కర్నూలు జిల్లాలో 2,46,340 పింఛన్లకు రూ.73,74,49,500, నంద్యాల జిల్లాలో 2,22,402 పింఛన్లకు రూ.66,08,47,000 పంపిణీ చేయనున్నారు.సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదు ∙ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన కర్నూలు(సెంట్రల్): లబి్ధదారులు ఎవరూ పింఛన్ కోసం గ్రామ, వార్డు సచివాయాలకు రావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన తెలియజేశారు. సామాజిక భద్రత పింఛన్ పంపిణీ అంశంపై స్పెషల్ సీఎస్ ఆజయ్జైన్, పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్కుమార్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పింఛన్దారులు ఎవరూ పింఛన్ కోసం గ్రామ, వార్డు సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదన్నారు. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, మంచానికే పరిమితమైన వారు, వీల్ చైర్లో ఉన్న వారు, సైనిక సంక్షేమ పింఛన్ పొందుతున్న వారు, వితంతువులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ జమ చేస్తామన్నారు. ఎవరికైనా బ్యాంకు ద్వారా చెల్లించలేని పక్షంలో ఇంటివద్దకే పింఛన్ తెచ్చి ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి,జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఆర్డీఏ పీడీ సలీం బాషా పాల్గొన్నారు. -
అవ్వాతాతలకు బాబు బ్యాచ్ తెచ్చిన కష్టాలు
సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్ను అడ్డంపెట్టుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్రంలోని లక్షలాది అవ్వాతాతలు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. వీరికి జీవనాధారమైన ప్రభుత్వ పింఛను అందకుండా కుట్రలు పన్నుతున్నారు. సీఎం జగన్ వలంటీర్ల ద్వారా 65,49,864 మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛను లబ్ధిదారులకు నెలనెలా ఠంఛనుగా ఒకటో తేదీనే వారున్న చోటునే పింఛను అందిస్తున్నారు. గత ఐదేళ్లుగా నిరి్వఘ్నంగా ఇంటి వద్దే పింఛను అందుతుండటం చంద్రబాబు నేతృత్వంలోని ఎల్లో బ్యాచ్కు కంటగింపయింది. దీంతో బాబు బ్యాచ్ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుల కారణంగా పింఛన్ లబ్ధిదారులు గత నెలలో సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకోవాల్సి వచ్చింది. అయినా చంద్రబాబు బ్యాచ్ పచ్చ కళ్లు చల్లబడకపోవడంతో వీరికి మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. చంద్రబాబు హయాంలో పింఛను మంజూరవడమే గగనమైతే, ఆ వచ్చే కాస్త పింఛను కోసం అవ్వాతాతలు, దివ్యాంగులను నానా అగచాట్లకు గురిచేసే వారు. అందులోనూ కమీషన్లు గుంజేవారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛన్దారుల అవస్థలకు చెల్లుచీటీ పాడారు. సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఎప్పటికప్పుడే కొత్త పింఛన్ల మంజూరు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛనుగా పింఛను ఇంటి వద్దే అందించేవారు. సీఎం జగన్ చేపట్టిన ఈ అద్భుత కార్యక్రమంతో గత 58 నెలలుగా పింఛనుదారులు ఎటువంటి ఇబ్బందీలేకుండా వారి డబ్బులు అందుకున్నారు. ఇదే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ లు, ఎల్లో బ్యాచ్, ఎల్లో మీడియాకు మింగుడుపడలేదు. ఎన్నికల కోడ్ నెపంతో వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఉన్న రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్ తదితరులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలని నెల కిత్రమే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. డీబీటీ విధానంలో లేదంటే శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్ద పంపిణీ చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ఏప్రిల్ నెల పింఛను డబ్బును సచివాలయాల వద్ద పంపిణీ చేస్తూనే, విభిన్న దివ్యాంగులు, కదల్లేక మంచానికి లేదా వీల్చైర్కే పరిమితమైన వారికి, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు వారి ఇంటి వద్దే పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీ ఈ నెల 3న మొదలుపెట్టి 8వ తేదీకల్లా పూర్తిచేశారు. సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకొనే క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. చల్లారని పచ్చ కళ్లు ఏప్రిల్ నెలలో పింఛను లబ్ధిదారులను నానా అగచాట్లకు గురి చేసినప్పటికీ, పచ్చ కళ్లు చల్లబడలేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి మళ్లీ ఫిర్యాదులు చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్నతాధికారులందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ, వ్యక్తిగతంగా వారి ప్రతిష్ట దిగజార్చేలా టీడీపీ అనుకూల మీడియాలో పింఛన్ల పంపిణీపై రకరకాల తప్పుడు కథనాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో పింఛన్ల పంపిణీపై పలు సూచనలు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా లబ్ధిదారులకు నేరుగా డబ్బుల పంపిణీకి బదులు బ్యాంకుల్లో జమ చేసేలా అధికారులు మళ్లీ మార్పులు చేయాల్సి వచి్చంది. 48,92,503 మంది అవ్వాతాతలు, ఇతరుల పింఛన్ డబ్బులు ఆధార్ నంబర్తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. మే, జూన్ రెండు నెలల పాటు వీరు కుటుంబంలో లేదా తెలిసిన వారిలో ఎవరో ఒకరి వెంట బెట్టుకొని బ్యాంకుల దాకా వెళ్లి ఆ డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. గత నెలలో సచివాలయాల్లో డబ్బు తీసుకున్న వీరికి ఇప్పుడు బ్యాంకులకు వెళ్లాలంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉంటుంది. సాధారణంగా అన్ని గ్రామాల్లో బ్యాంకులు ఉండవు. బ్యాంకులో పని ఉంటే సమీపంలోని పెద్ద పంచాయతీలకో, మండల కేంద్రాలు, లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లాలి. ఈ రెండు నెలలూ పింఛను కోసం అవ్వాతాతలకు ఈ అవస్థలు తప్పవు. మండుటెండల్లో ఎవరో ఒకరిని వెంటబెట్టుకొని ఆటోలోనో, బస్సులోనో పక్క ఊరు లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లి డబ్బు తెచ్చుకోవాలి. దీని కోసం ఒక కుటుంబంలో ఇద్దరు ఒకట్రెండు రోజులు పనులు మానుకొని, డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్లిరావాల్సి ఉంటుంది. వీరు కాకుండా విభిన్న దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో పింఛను పొందే వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు, యుద్ధ వీరుల వృద్ధ వితంతువులతో పాటు బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం లేని వారు, అసలు బ్యాంకు ఖాతాలే లేని వారికి శాశ్వత ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2.66 లక్షల మంది వలంటీర్లు ఐదు రోజుల్లో నిర్వహించే కార్యక్రమాన్ని ఇప్పుడు అందుబాటులో ఉన్న శాశ్వత ఉద్యోగుల ద్వారా వారి ఎన్నికల విధులకు ఆటంకం కలగకుండా ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు 20 రోజుల దాకా సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి నిర్ణయం వల్ల ఒక గ్రామంలో రోజుకు కొందరికి అంది, మరికొందరికి అందకపోతే పింఛనుదారులలో అలజడి రేగే అవకాశమూ ఉందని అధికారులు అంటున్నారు. అయినప్పటికీ, సకాలంలో పింఛన్ల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.గత చంద్రబాబు ప్రభుత్వంలో పింఛనుదారులకు అన్నీ కష్టాలే.. 2014 – 19 మధ్య రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పింఛనుదారులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అవ్వాతాతలు, దివ్యాంగులు పింఛను మంజూరు కోసం ఆఫీసుల చుట్టూ ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండేది. పింఛన్ల మంజూరు మొదలు, తొలగింపులు వంటి వాటిని కూడా జన్మభూమి కమిటీలకే చంద్రబాబు అప్పగించారు. ఆ జన్మభూమి కమిటీల్లో గ్రామాల్లో ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలే పూర్తిగా ఉండడంతో వాళ్లు టీడీపీకి ఓటు వేసిన వారికి లేదా లంచాలు ఇచి్చన వారికే కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు.ప్రత్యర్ధి పార్టీల సానుభూతిపరులకు పింఛన్లు మంజూరయ్యేవే కావు. ఒకవేళ అప్పటికే ఎవరికైనా మంజూరై ఉంటే నిర్దాక్షిణ్యంగా తొలగించారన్న ఆరోపణలున్నాయి. పింఛన్లు మంజూరైన వారు కూడా ఆ డబ్బు కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ఊరిలో ఎప్పుడు పింఛను పంపిణీ జరుగుతుందో తెలియక ప్రతి రోజూ ఆఫీసు దాకా వచ్చి ఎండలో కూర్చొని ఊసూరుమంటూ తిరిగి వెళ్లే పరిస్థితి ఉండేది. -
రాజీనామాలు వలంటీర్ల వ్యక్తిగతం
సాక్షి, అమరావతి: రాజీనామాలు వలంటీర్ల వ్యక్తిగత వ్యవహారమని, అందువల్ల వారి రాజీనామాలను ఆమోదించకుండా తాము ఆదేశాలివ్వడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం హైకోర్టుకు నివేదించింది. రాజీనామా చేయడానికి వీల్లేదని నియామక నిబంధనల్లో ఉంటే తప్ప ఎవ్వరినీ రాజీనామా చేయవద్దంటూ ఆదేశాలు ఇవ్వలేమని ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వివరించారు.వలంటీర్ పోస్టులో ఉన్నంత వరకే వారిపై తమకు అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. రాజీనామాల తరువాత వలంటీర్లు ప్రైవేటు వ్యక్తులు అవుతారని, నచ్చిన విధంగా ఉండే స్వేచ్ఛ వారికి ఉందని వివరించారు. పిటిషనర్ అభ్యర్థన చాలా విచిత్రంగా ఉందని, వలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని తాము ఆదేశించాలని కోరుతున్నారని, ఆ పని తామెలా చేయగలమని ప్రశ్నించారు.ఈ వివరాలన్నింటితో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నెల 22 వరకు 62,571 మంది వలంటీర్లు రాజీనామా చేశారుఎన్నికలు పూర్తయ్యేంత వరకు వలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ బుధవారం మరోసారి విచారణ జరిపారు. కేంద్ర ఎన్నికల సంఘం తరఫున అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. గత నెల 18 నుంచి ఈ నెల 22వ తేదీ వరకు 62,571 మంది వలంటీర్లు రాజీనామా చేశారని తెలిపారు.ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు 929 మంది వలంటీర్లను తొలగించామన్నారు. వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచుతూ ఉత్తర్వులిచ్చామని, పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించకుండా సర్క్యులర్లు జారీ చేశామన్నారు. ఇప్పుడు వారి రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని తాము ఆదేశించాలని పిటిషనర్ కోరుతున్నారని, ఇదెలా సాధ్యమని అన్నారు.ఇప్పుడు వలంటీర్లు ఖాళీగా ఉన్నారుప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వలంటీర్లకు ఎలాంటి పనులు అప్పగించలేదన్నారు. వారు ఖాళీగా ఉన్నారని, అయినా వారికి గౌరవ వేతనం చెల్లిస్తూనే ఉన్నామన్నారు. దీని వల్ల ఖజానాపై భారం పడుతోందని వివరించారు.పిటిషనర్ తరఫున న్యాయవాది పీవీజీ ఉమేష్ వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగంలోని అధికరణ 324 కింద ఎన్నికల సంఘం ఎలాంటి ఆదేశాలైనా ఇవ్వొచ్చన్నారు. వలంటీర్లు రాజీనామా చేసి అధికార పార్టీకి సహకరిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. -
వలంటీర్ చెప్పినవారికి ఓటేసేంత బలహీనంగా ఓటర్లు లేరు
సాక్షి, అమరావతి: వలంటీర్ల మాటలు విని.. వారు చెప్పినవారికి ఓటు వేసేంత బలహీనంగా ఓటర్లు లేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. వలంటీర్, లబ్దిదారు మధ్య ఉన్న అనుబంధం వలంటీర్ రాజీనామాతో తెగిపోతుందని స్పష్టం చేసింది. అలాంటప్పుడు వలంటీర్ చెప్పినట్టు ఓటరు ఎందుకు చేస్తారని ప్రశ్నిం చింది. వలంటీర్లు తమ జేబులో నుంచి తీసి డబ్బేమీ ఇవ్వడం లేదని, అలాంటప్పుడు వారి మాటలను ఓటరు ఎందుకు వింటారని పిటిషనర్ను నిలదీసింది. ఎవరైనా కూడా ఓటరును పోలింగ్ బూత్ వద్దకు వెళ్లేంత వరకే ప్రభావితం చేయగలిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. పోలింగ్ బూత్లోకి వెళ్లాక ఓటరు తనకు నచ్చినవారికే ఓటు వేస్తారని తెలిపింది. రాజీనామా చేశాక ఎవరైన వలంటీర్ ఏదైనా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిం చింది. మొత్తం వలంటీర్లు ఎందరు? ఎంతమంది పనిచేస్తున్నారు? రాజీనామా చేసినవారెందరు? తదితర వివరాలను తమ ముందుంచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ విచారణ జరిపారు. రాజీనామా చేశాక మేమేం చేయలేం.. కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది శివదర్శన్ వాదనలు వినిపిస్తూ.. వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారన్నారు. ఎన్నికల్లో విధుల్లో పాల్గొనకుండా, పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించకుండా వలంటీర్లను నియంత్రిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఒకవేళ వలంటీర్ రాజీనామా చేస్తే వారిపై ఎన్నికల సంఘానికి ఎలాంటి నియంత్రణ ఉండదన్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. వారికి సైతం ప్రాథమిక హక్కులున్నాయని.. ఇష్టానుసారం రాజీనామా చేసే హక్కు వారికి సైతం ఉందన్నారు. వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు పిటిషనర్ ఎలాంటి ఉదంతాలను పొందుపరచలేదని చెప్పారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ప్రత్యక్ష పరిచయాలతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు.. పిటిషనర్ రామచంద్ర యాదవ్ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేష్ వాదనలు వినిపిస్తూ.. అధికార పార్టీకి సహకరిస్తున్నారన్న ఆరోపణలతో వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచుతూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఆ ఆదేశాల నుంచి తప్పించుకునేందుకు వలంటీర్లు ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిదారులతో వలంటీర్లు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నారన్నారు. ఇప్పుడు రాజీనామాలు చేసి ఎన్నికల్లో లబ్దిదారులను అధికార పార్టీ వైపు తిప్పడానికి వారిని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. అందువల్ల వలంటీర్ల రాజీనామాల విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. మరి సెలబ్రిటీలు కూడా ప్రచారం చేస్తున్నారుగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ.. వలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేసి, ఆయా పార్టీల అభ్యర్థుల అవకాశాలను ప్రభావితం చేయడం సాధ్యమా? అని ప్రశ్నిం చారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఒకరు పెద్ద ధనవంతుడు, మరొకరు పేద వ్యక్తి అయి ఉంటే, ఆ పేద వ్యక్తి.. తాను ఎన్నికల్లో తలపడేందుకు సమాన అవకాశాలు కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరగలడా? అని నిలదీశారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు సెలబ్రిటీలు కూడా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఊహల ఆధారంగా పిటిషనర్ ఈ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. రాజీనామాలు చేశాక వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఎక్కడా కూడా పిటిషన్లో పేర్కొనలేదన్నారు. వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారని, వరుసగా వారు మూడు రోజుల పాటు విధులకు హాజరు కాకుంటే వారిని విధుల నుంచి తొలగించవచ్చన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందజేసేందుకే వలంటీర్లను నియమించామని చెప్పారు. వారు కేవలం గౌరవ వేతనం మాత్రమే అందుకుంటున్నారని గుర్తు చేశారు. కొందరు తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు గౌరవ వేతనం పెంచుతామంటూ ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేస్తున్నారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఈ రోజుల్లో ఐఏఎస్ అధికారులు కూడా తమ ఉద్యోగానికి రాజీనామా చేసి, నచ్చిన పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు. కాబట్టి రాజీనామా చేశాక ఎవరినీ నియంత్రించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. -
Fact check: అబద్ధాలు రచించెన్
సాక్షి, అమరావతి: అబద్ధం.. కుళ్లు.. భయం.. వీటికి ప్యాంటూ చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం రామోజీ మాదిరే ఉంటాయేమో! జగన్ పరిపాలనలో అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు ప్రతి నెలా పింఛన్లు అందుకుంటూ ఆనందంగా ఉంటే రామోజీకి కంపరంగా ఉంది. ఈ వర్గాల్లో జగన్కు పెరుగుతున్న పరపతిని చూసి తన భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తోంది. అందుకే వాస్తవాలకు మసిపూసి ‘నవరత్నాలు – నయవంచన’ అంటూ మరో అబద్ధపు కథనాన్ని అచ్చేసేశారు. ఈ నిస్సిగ్గు పాత్రికేయాన్ని చూసి అక్షరాలు సిగ్గుతో తలదించుకోవాల్సిందేనేమో...!! పింఛనుదారుల సంఖ్య పెరిగింది జగన్ హయాంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. ఇందులో 29.51 లక్షల మంది జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొత్తగా పింఛన్లు అందుకున్నవారే. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో పింఛన్ల సంఖ్య ఏ మాత్రం పెరగలేదు. అప్పట్లో 43.11 లక్షల మంది పింఛనుదారులున్నారని లెక్కలు చెబుతున్నా 39 లక్షల మందికే చెల్లింపులు జరిపేది. నాలుగు నుంచి 5 లక్షల మందికి ఎగ్గొట్టేది. రామోజీ దగ్గర ఈ లెక్కలు లేవో.. లేక కావాలనే విస్మరించారో. ఇంటికో పింఛను విధానం బాబుదే కుటుంబానికి ఒక్కటే పింఛను విధానం జగన్ ప్రభుత్వం అమలు చేసినట్టు ఈనాడు ఓ అబద్ధాన్ని రాసింది. ఈ విధానం ప్రవేశపెట్టిందే చంద్రబాబు ప్రభుత్వం. 2014 సెప్టెంబర్ 18న ఆర్సీ నంబరు 1053 పేరిట జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఐదేళ్ల పాటు దీన్ని అమలు చేసింది. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒకే ఇంటిలో ఇద్దరు దివ్యాంగులున్నా రెండో పింఛను ఇచ్చే విధానాన్ని అమలు చేశారు. మరో వైపు.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల చొప్పున నెలనెలా పింఛన్ అందిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే కొత్తగా తీసుకొచి్చన ఈ మేలును బహుశా రామోజీ మరిచిపోయి ఉంటారు. కోతల్లేవు పింఛనుదారులలో మరణాల సంఖ్యను ఎక్కువగా చూపి పింఛన్లను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తగ్గించినట్టు ఈనాడు ఇంకో అబద్ధం ప్రచురించింది. సాధారణంగా పింఛనుదారుల్లో 0.5 శాతం మరణాలు నమోదవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇది 0.8 శాతం ఉండొచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2015 మేలో 0.8 శాతం మేర అంటే 36,406 మరణాలు నమోదు కావడంతో ఆ నెలలో పింఛన్లకు కోత పెట్టింది. అదే ఏడాది ఏప్రిల్లో 0.6 శాతం మేర అంటే 22,334 మంది పింఛనుదారులు మరణించినట్లు లెక్కలు వేసి వాటిని తొలగించింది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో వాస్తవ మరణాలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆ మేరకే తొలగింపులు ఉంటున్నాయి. గత ఆరు నెలల గణాంకాలు తీసుకుంటే ఏ నెలలోనూ ఈ సంఖ్య 20 వేలకు మించలేదు. పింఛను విధానంలో మరెన్నో మార్పులు ► గత పాలనలో పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు చాంతాడంత క్యూలో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.6 లక్షల గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీ పొ ద్దున్నే లబ్ధిదారుల గడప వద్దనే అందిస్తోంది. ► పింఛన్ల మంజూరులో లంచాలు, వివక్ష, జన్మభూమి కమిటీల పెత్తనాన్ని జగన్ కూకటివేళ్లతో పెకలించారు. కుల, మత వర్గ, పార్టీలకు అతీతంగా లంచాలు, వివక్ష, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తున్నారు. అర్హులై ఉండి ఒకవేళ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం ఇస్తూ ప్రతి ఏటా జూన్, డిసెంబర్లలో అందజేస్తున్నారు. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో లబి్ధదారుల జాబితాలు ప్రదర్శించి, సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకంగా లబి్ధదారులను ఎంపిక చేస్తున్నారు. ► గత ప్రభుత్వంలో దివ్యాంగులకు 5 ఏళ్లలో అందిన లబ్ధి కేవలం రూ.58,500. ఈ ప్రభుత్వంలో లబ్ధి రూ.1,91,000. అంటే రూ.1,32,500 అదనం. ► పెన్షన్లపై నెలవారీ సగటు వ్యయం రూ.400 కోట్ల నుంచి రూ.1968 కోట్లకు పెంపు. ► 2014–19 మధ్య గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్లపై సగటున వ్యయం రూ.400కోట్లు. -
యూటర్న్ చంద్రబాబు బాగోతం ఇది
వలంటీర్లకు పది వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పడం ద్వారా మన పాలన గొప్పగా ఉందని ఆయన సర్టిఫికెట్ ఇచ్చారు... ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్య.. రాష్ట్రం విధ్వంసం అయింది..జగన్ ఇంతకాలం ప్రజలకు కనిపించలేదు.. ఇప్పడు మళ్లీ జనంలోకి వస్తున్నారు. అది ఓట్ల మీద ప్రేమ.. జగన్ను ఎవరూ నమ్మవద్దు.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగంలో ఒక భాగం ఐదుకోట్ల మందికి ఏ ఒక్క నాయకుడో సరిపోరు. మూడు పార్టీల బలమైన నాయకత్వం కావాలి.కేంద్ర సహకారం, చంద్రబాబు అనుభవం, జనసేన పోరాట శక్తి కావాలి..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన కొత్త విషయం పవన్ శక్తి, చంద్రబాబు యుక్తి ,మోదీ సంకల్పం ..టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి బలం.. బీజేపీ ఎపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్య ఈ నలుగురు కొద్ది రోజుల క్రితం తణుకు వద్ద జరిగిన సభలో చేసిన ప్రసంగాలను విశ్లేషించండి. జగన్ తాను ఐదేళ్ల పాలన సమయంలో చేసిన వివిధ అబివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సాకల్యంగా వివరించడంతో పాటు, చంద్రబాబు వలంటీర్ల వ్యవస్థపై యూ టర్న్ తీసుకున్న తీరును సమర్ధంగా వివరించగలిగారు.అంతేకాక చంద్రబాబు 2014 లో ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలు, వాటిని అమలు చేయని వైనాన్ని విపులంగా ప్రజలకు తెలియచెప్పారు. జగన్ సభ ఒక ఖాళీ ప్రదేశంలో భారీ ఎత్తున జరిగితే, కూటమి సభ ఒక రోడ్డుమీద జరిపి జనం బాగా వచ్చారని సంతోషపడడం కూటమి నేతల వంతుగా మారింది. జగన్ ఎక్కడా ఎవరిని దూషించకుండా , ప్రత్యేకించి ఆయా నియోజకవర్గాలలో పోటీచేస్తున్న టీడీపీ ,ఇతర పార్టీల అభ్యర్దుల ప్రస్తావన తేకుండా ,తన పార్టీ అభ్యర్ధులను మాత్రం పరిచయం చేసి గెలిపించాలని కోరుతున్నారు. కాని కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఎక్కడకు వెళితే అక్కడ ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్ధిపై తీవ్రమైన విమర్శలు, అడ్డగోలు ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించాలని యత్నించారు. జగన్ తన స్కీముల గురించి ప్రజలకు తెలియచెప్పి, తాను ప్రతి ఇంటికి మంచి చేశానని ధైర్యంగా చెబుతున్నారు. కాని చంద్రబాబు మాత్రం అలా చెప్పలేకపోతున్నారు.పైగా వలంటీర్ల వ్యవస్థపై ఆయన యుటర్న్ తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీ పరువు పోయింది.ఇంతకాలం వలంటీర్లను బండబూతులు తిట్టిన టీడీపీ నేతలు తలలు పట్టుకుని కూర్చున్నారు. చంద్రబాబు మాదిరి ఎప్పటికప్పుడు నాలుక మడతపెట్టి మాట మార్చినట్లు ఎలా చేయాలో తెలియక సతమతమవుతున్నారు. వలంటీర్లు పెన్షన్ దారుల ఇళ్లకు వెళ్లకుండా చేసిన నేపద్యంలో టీడీపీకి అది పెద్ద ఇబ్బందిగా మారింది. దానిని జగన్ తన స్పీచ్లో క్యాష్ చేసుకుంటున్నారు. చంద్రబాబు తను కూడా అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి పదివేల వేతనం ఇస్తానని చెప్పడం ద్వారా తన పాలనకు సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పి విపక్షనేతను డిఫెన్స్ లో పడేశారు. అయితే చంద్రబాబు చేసే వాగ్ధానాలు ప్రజలను మోసం చేయడానికే కాని, అమలు చేయడానికి కాదని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు తీసుకుని ప్రజలతో అవునని చెప్పించారు. ఉదాహరణకు రుణమాఫీ,నిరుద్యోగ భృతి వంటివాటిలో చంద్రబాబు మాట తప్పిన వైనాన్ని జగన్ తెలియచెప్పారు.అలాగే తన ప్రభుత్వంలో పోర్టుల నిర్మాణం, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, పరిశ్రమలకు పునాది పడుతున్న తీరు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో గత మూడేళ్లుగా నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న వైనాన్ని జగన్ విరించారు. కాని అదే చంద్రబాబు,లేదా పవన్ కళ్యాణ్ లు తమ ప్రసంగాలలో ఎక్కడా స్పెసిఫిక్గా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములను విమర్శించలేకపోతున్నారు. పైగా వాటిని మరింతగా ఎక్కువ చేసి అమలు చేస్తామని చెప్పారు. మరి అలాంటప్పుడు రాష్ట్రం విధ్వంసం అయిందని ఆ నేతలు ఎలా చెబుతున్నారో అర్దం కాదు. మోడీ సంకల్పం ఉంది కనుక రాష్ట్రానికి ఉపయోగం అని అంటున్నారే తప్ప, కేంద్రం నుంచి ఏమి సాధిస్తామో చెప్పలేని దయనీయ స్థితి కూటమి నేతలకు ఏర్పడింది. ఉదాహరణకు ప్రత్యేక హోదా అంశాన్ని కూటమి నేతలు ప్రస్తావించలేకపోతున్నారు.ప్రత్యేక హోదా కాకుండా కేంద్రం నుంచి వీరు ఏమి సాధిస్తారో ఎవరికి వివరించలేకపోతున్నారు.రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం డ్రామాలు ఆడుతుండడం, విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ మొదలైన వాటి గురించి వీరు ఒక్క ముక్క మాట్లాడడం లేదు. గతంలో చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలని అన్నప్పుడు కేంద్ర నేతలతో పాటు బీజేపీ రాష్ట్ర నేత దగ్గుబాటి పురందేశ్వరి అది ముగిసిన అధ్యాయం అని అన్నారు. అందుకు చంద్రబాబు ఒప్పుకున్నట్లేనా?బీజేపీ ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్ లను తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దీనిపై చంద్రబాబు అభిప్రాయం ఏమిటి? ఇలాంటివాటిపై అటు చంద్రబాబు కాని, ఇటు పవన్ కళ్యాణ్ కాని మాట్లాడకుండా ఉమ్మడి ఎజెండాతో ,ప్రజా మానిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తున్నామని చెబితే ఎవరు నమ్ముతారు? అసలు ఉద్యోగాలే రాలేదని ఒకసారి, సచివాలయాలలో కొత్తగా వచ్చిన లక్షన్నర మంది ఉద్యోగుల గురించి మరోసారి చంద్రబాబు మాట్లాడుతారు. వీటిలో ఏది విద్వంసం,ఏది నాశనమో చెప్పలేరు.అప్పుల గురించి మాట్లాడతారు.రాష్ట్రం అప్పులపాలైతే సూపర్ సిక్స్ పేరుతో ఏడాదికి లక్షన్నర కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ కార్యక్రమాలకు ఎలా చంద్రబాబు ఖర్చు చేస్తారో వివరించరు. జగన్ అమలు చేసిన అమ్మ ఒడిని తల్లికి వందనం పేరుతో ఎందరు పిల్లలు ఉంటే అందరికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇస్తుంటారు.అది ఎలా సాధ్యమో ఆయన చెప్పరు. ఆ పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్,పురందేశ్వరిలు మాట్లాడరు.ఇవన్ని చూస్తుంటే వీళ్లకు ఒక ఎజెండా లేదు. ముగ్గురు కలిసి జనాన్ని ఎలా మభ్య పెట్టాలా అన్నదానపైనే దృష్టి పెడుతున్నట్లు అనిపిస్తుంది. అయితే జగన్ ను తిట్టడం, లేదంటే రాష్ట్రం విధ్వంసం అయిందని ఆరోపించడం,లేకుంటే జగన్ ఇచ్చిన స్కీములను మరింత ఎక్కువ ఇస్తామని బొల్లడం..జగన్ సభలకు, చంద్రబాబు సభలకు తేడా ఇంత స్పష్టంగా కనిపిస్తుంది.పురందేశ్వరి మాత్రం ఒక మాట చెప్పారు. పవర్ స్టార్ పవన్ శక్తి, చంద్రబాబు యుక్తి, మోడీ సంకల్పం రాష్ట్రానికి ఉపయోగపడతాయని అన్నారు. చంద్రబాబుదంతా కుయుక్తులేనని గతంలో ఈమె అన్నారు. ఇప్పుడేమో ఆ కుయుక్తే ఏమైనా తనకు ఎంపీ పదవి వచ్చేలా చేస్తుందేమోనన్న ఆశతో పురందేశ్వరి ఉన్నారు. పవన్ అయితే ఐదు కోట్ల మందికి ఒక్క నాయకుడు చాలడని అన్నారు. మూడుపార్టీల బలమైన నాయకత్వం కావాలి అని ఆయన చెబుతున్నారు. చంద్రబాబు అనుభవం, జనసేన పోరాట శక్తి కావాలట.కేంద్ర సహయం ఉండాలట. అంటే చంద్రబాబు ఒక్కడు ముఖ్యమంత్రిగా సరిపోడని పవన్ చెబుతున్నట్లే కదా! చంద్రబాబుకు అంత సామర్ధ్యం లేదనే కదా పవన్ ఉద్దేశం? అధికారం వచ్చాక ఈయన కూడా అందులో భాగస్వామి అవుతారా?అవ్వరా? ఎవరిమీద పోరాడుతారు?లేదంటే ఈయన బయట ఉండి మళ్లీ స్పీచ్ లు ఇస్తూ తిరుగుతారేమో తెలియదు.ఒకటి మాత్రం జనానికి చెప్పారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం సరిపోదని చెబుతున్నారని అర్ధం అవుతుంది.రాష్ట్రం కొన ఊపిరితో ఉందట ఎన్డీఏ కూటమి ఆక్సిజన్ అట. అలాగైతే ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోడీతో ఎందుకు చెప్పించలేకపోయారు.ఆయన అసలు రాష్ట్రానికి ఒక్క వరం అయినా ఇచ్చి వెళ్తారా?కేవలం తన కేసులకోసం, కొన ఊపిరితో ఉన్నటీడీపీని బతికించుకోవడం కోసం పొత్తు పెట్టుకుని అదేదో రాష్ట్రం కోసం అని చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినే రోజులు కావివి. వైఎస్సార్సీపీ విధ్వంసం చేస్తోందనే పొత్తు పెట్టుకున్నామని పవన్ అంటున్నారు. ఏమి విధ్వంసమో ఈ మూడు పార్టీల నేతలు చెప్పలేకపోతున్నారు. ఏదో పిచ్చి,పిచ్చి ప్రకటనలు చేసి, సినిమా డైలాగులు మాట్లాడి జనాన్ని బురిడి కొట్టించాలన్న ఉద్దేశం వారిలో కనిపిస్తోంది.తమ పార్టీలను బతికించుకోవడానికి, తాము గెలవలేమన్న భయంతో ఈ మూడు పార్టీలు కలిశాయి తప్ప ఇంకొకటి కాదు. ఓట్లు చీలకూడదని ఎప్పుడైతే అన్నారో, అప్పుడే వీరంతా ఓటమిని అంగీకరించిన్లే అనుకోవాలి.వైఎస్సార్సీపీ వెంటిలేటర్ పై ఉందని అంటున్న చంద్రబాబు దానిని నిజమని నమ్మి ఉంటే ఒంటరిగా పోటీచేసి సవాలు విసిరేవారు. ఇలా అధికారం కోసం జనసేన, బీజేపీ వంటి చిన్నపార్టీలను కాళ్లావేళ్లపడి ఎందుకు బతిమలాడుకుంటారు.ఢిల్లీ వెళ్లి పరువు పోగొట్టుకుని మరీ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు. జగన్ అడిగే ప్రశ్నలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరిల వద్ద సమాధానం లేదు. అందుకే వీరు ఇలా సోది ప్రసంగాలు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారనుకోవాలి. తాను గెలుస్తానన్న ధైర్యం ఉంది కనుక జగన్ ఒంటరిగా బరిలో దిగి ప్రత్యర్దులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ ప్రజలు ఈ కిచిడి కూటమి కావాలా? లేక జగన్ సాహసవంతమైన నాయకత్వం కావాలా? అన్నది తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఇప్పటి నుండి సీఎం జగన్ కోసం పని చేస్తాం: ఏపీ వాలంటీర్లు
-
అట్టడుగు వర్గాలకు చేరిన కొత్త నమూనా
శరదృతువు వేకువ వేళల్లో చెట్లకు పట్టి ఉండే మంచు మాదిరిగా పైకి కనిపించకుండా, ఒక ‘ఫీల్ గుడ్’ వాతావరణం ఈ రోజున మన రాష్ట్రమంతా ప్రజల్లో వ్యాపించి ఉంది. నాలుగు కారణాల వల్ల ఈ మాన సిక స్థితి (ఫీల్) మన సమాజం అంచులలోని (మార్జినలైజ్డ్) ప్రజల వరకు చేరుతూ, క్రమంగా ఒక భావనగా వారిలోకి లోతుగా ఇప్పటికే అది ఇంకింది. ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి అని చూసినప్పుడు, మొదటిది– ప్రతి యాభై కుటుంబాలకు అయాచి తంగా దొరికిన ‘గైడ్’ మాదిరిగా ‘కనెక్ట్’ అయిన ‘వాలెంటీర్లు’. రెండవది – అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏదో ఒక పథకంలో అందిన ఆర్థిక సహాయం. మూడవది – ‘స్మార్ట్ ఫోన్’ వినియోగం అన్ని ఆర్థిక వర్గాలకు చేరడం. చివరిది ‘సంక్షేమరాజ్యం’ భావన స్థిరపడడానికిగాను ప్రజల సమీ పానికి పరిపాలన చేరడానికి పాత 13 జిల్లాలు 26 కావడం. మరి కొందరు దీన్ని – ‘విధ్వంసం’ అంటు న్నారు కదా అంటే, అదీ నిజమే. కాలం చెల్లిన పాతవాటిని పక్కకు నెట్టి, వాటి స్థానంలోకి వచ్చే ‘కొత్త’ ఏదైనా అలా అనిపించడం సహజమే. అయితే, కాలంలో వచ్చే మార్పులో భాగంగా వేగం కోసం ‘ఐ.టి.’ ద్వారా ‘స్మార్ట్ గవర్నెన్స్’ సాంకేతికతను పరిపాలనకు అన్వయించే మార్పు ప్రక్రియ గురించి, రేపటి తరం ఏమని అనుకుంటున్నది? అనేది ఇక్కడ ప్రధానం. భవిష్యత్తు యువతదే కనుక వర్తమానం సమీక్షకు వాళ్ళే నిజమైన న్యాయ నిర్ణేతలు. అయితే, నువ్వు ఏ కాలానికి అర్హమైన నాయ కుడివి? అనేది ఇక్కడ అతి విలువైన అంశం. ఈ ప్రభుత్వం వేటి కేంద్రితంగా ఉన్నదో చూడండి– ఒకటి ‘ప్రజలు’. రెండు ‘ప్రాంతము.’ చరిత్రలో ఈ రెండింటినీ లక్ష్యంగా చేసుకుని పరిపాలించిన రాజులు విఫలం కాలేదు. ఈ రెండింటి కోసం నీకున్న ఐదేళ్ళ కాలపరిమితిలో నువ్వు ఏమి చేశావు? అనేది ప్రజల ముందుకు వెళ్లి వాళ్లకు చెబితే చాలు. నీ నిజాయతీని ప్రజలు గమనించి మిగిలింది కూడా నువ్వే పూర్తి చెయ్యి, అని మళ్ళీ నీకే కుర్చీ అప్పగిస్తారు. మన రాష్ట్రంలోని ఆలో చనాపరులకు మన ప్రతిపక్ష నాయకుడి విషయంలో ఇక్కడే అనుమానం కలుగుతున్నది. గతంలో ‘జన్మభూమి’ నుంచి ‘విజన్– 2020’ వరకు ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు కోసం మేధో కసరత్తు చేసిన అనుభవం పెట్టు కుని, ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ ‘పబ్లిక్ పాల సీ’ని ప్రతిపక్షం తరఫున లేదా వారి కూటమి తరఫున గానీ ప్రకటించలేక పోవడం ఏమిటి? రాజకీయ విమర్శ కోసం సి.ఎం.ను– ‘సైకో’ అని, ప్రభుత్వ పరిపాలన ‘విధ్వంసం’ అని అన్న ప్పుడు, అ మాటలకు సవివరమైన వివరణ ఎందుకు ఇవ్వరు? మీరు అంటున్న ‘విధ్వంసం’ నిజమై, అదే అనుభవం రాష్ట ప్రజలకు కూడాఉండి ఉంటే, అదేదో వివరం చెబితే ప్రజలు కూడా వాళ్ళూ మీతో ‘కనెక్ట్’ అవుతారు కదా? మీరు చేస్తున్న ఇటువంటి ఆరోపణలు అస్పష్టంగా ఎందుకు ఉంటున్నాయి? ప్రభుత్వంపై చేస్తున్న విమర్శ విషయంలో ప్రతిపక్షం నిస్సహాయత చూశాక, ‘కూటమి’ని పక్కనపెట్టి – ‘కొత్త రాష్ట్రానికి కొత్త నమూనా పాలన అందిస్తున్న ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ ప్రభుత్వం వల్ల ప్రయోజనాలు ఏమిటి? అనే వైపు మధ్యతరగతి ఆలోచనాపరుల దృష్టి మారింది. ‘సాఫ్ట్వేర్’ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ‘కరోనా’ కాలంలో కంపెనీలు ‘వర్క్ ఫ్రం హోమ్’ అవకాశం ఇచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి రాకను ప్రోత్సహిస్తూ–‘వర్క్ ఫ్రం హోమ్ టౌన్’ నినాదంతో ‘బి టైప్’ పట్టణాల్లో ‘టవర్ల’ సామర్థ్యం పెంచి, స్థానిక ఇంజనీరింగ్, పాలి టెక్నిక్ కాలేజీల్లో వీరి కోసం ‘వైఫై’ సేవలు ఏర్పాటు చేసింది. మన రాష్ట్రానికొస్తే ఏమిటి పరిస్థితి? అనేదానికి వీరికి ఇదొక – ‘డ్రెస్ రిహా ర్సిల్స్’ అయింది. అంతేకాదు, ప్రభుత్వ ప్రాధాన్యతలుగా మారిన విద్య, వైద్యం, శాంతి భద్రతలు; ‘లీజర్’ కోసం రూపు మారుతున్న ‘పబ్లిక్ పార్కులు’, రెస్టారెంట్లు, అందుబాటులోకి వస్తున్న ‘క్యాబ్ సర్వీసులు’... ఇవన్నీ ఇక ముందు యువత మన రాష్ట్రంలో విస్తరిస్తున్న కంపెనీల్లో ఉపాధి వెతుక్కునే అంశాలు. ఇందులో వీరి అమ్మానాన్నల ‘పిల్లలు దగ్గరలో ఉద్యోగం చేసుకుంటూ అందుబాటులో ఉంటే బాగుండు’ అన్న ఆశను స్పర్శించే అంశం కలిసి ఉందనేది విడిగా చెప్పనక్కర లేదు. ఈ అంశంపై వ్యాసం రాయడం మొదలు పెట్టినప్పుడు ‘వాలంటీర్ల’ వివాదం అప్పటికి ఇంకా మొదలు కాలేదు. దీన్ని ముగించేటప్పటికిరాష్ట్రంలో మారిన సామాజిక సన్నివేశం, పైన చెప్పిన ‘ఫీల్ గుడ్’ భావనను వాస్తవం చేసింది. కొత్త రాష్ట్రానికి కొత్త నమూనా పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఒనకూరే ప్రయోజనాలు ఏమిటి? అనే వైపు మధ్యతరగతి ఆలోచనాపరుల దృష్టి ఇప్పటికే మారింది. ఇక ముందు మన అనుభవంలోకి రానున్న రాష్ట్ర అభి వృద్ధి ప్రణాళికా రచనలో ఏమున్నదీ అ పార్టీ ఎన్ని కల ‘మ్యానిఫెస్టో’లో వెల్లడి కావలసి ఉంది. జాన్సన్ చోరగుడి వ్యాసకర్త సామాజిక, అభివృద్ధి అంశాల విశ్లేషకులు -
వాలంటీర్ల సేవలపై టాలీవుడ్లో సినిమా!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఎంత అద్భుతంగా పని చేస్తుందో అందరికి తెలిసిందే. ఎక్కడ అవినీతి జరగకుండా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ నేరుగా లబ్దిదారులకు అందిచడంలో వాలంటీర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వృద్దులకు, వికలాంగులకు నెల నెల వారి గడపవవద్దకే వెళ్లి ఫించన్లు అందిస్తున్నారు. గతంలో ప్రభుత్వ పథకాలు పొందాలి అంటే.. స్థానిక రాజకీయనేతలు, ప్రజాప్రతినిధుల చుట్టు తిరిగాల్సి అవసరం వచ్చేది. కానీ ఇప్పుడు అర్హత ఉంటే చాలు.. వాలంటీర్లు మీ ఇంటి వద్దకే వచ్చి ఆయా పథకాలను అందిస్తున్నారు. ఈ వ్యవస్థపై అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా ‘వాలంటీర్’ వ్యవస్థ గురించి చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ వ్యవస్థపై టాలీవుడ్లో ‘వాలంటీర్’ అనే సినిమా కూడా రాబోతుంది. ఈ చిత్రంలో సూర్య కిరణ్ హీరోగా నటించగా.. ప్రసిద్ధి దర్శకత్వం వహిస్తున్నారు. రాకేష్ రెడ్డి నిర్మాత. ఈ రోజు(ఏప్రిల్ 12) తిరుపతిలో ఈ సినిమా టైటిల్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ.. ‘వాలంటీర్ల సేవలపై వస్తున్న ‘వాలంటీర్’ మూవీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవ చేస్తూ ప్రభుత్వానికి తోడుగా ఉంటున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ సర్వీస్ చేస్తున్నాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం వాలంటీర్ వ్యవస్థను సమర్థించారు. నిజాయితీగా సేవ చేస్తున్న వాలంటీర్ వ్యవస్థను లేకుండా చేయాలని చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు. నిమ్మగడ్డ రమేశ్తో ఈసీకి ఫిర్యాదు చేయించి వాలంటీర్ సేవలను నిలిపివేశారు. చంద్రబాబు చేసిన కుట్ర వల్ల ఇప్పటికే 33 మంది వృద్ధులు, వితంతువులు చనిపోయారు.పేద ప్రజలకు సీఎం జగన్ చేస్తున్న సేవలను చూసి ఓర్వలేకనే చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నాడు’ అని విమర్శించాడు. నిర్మాత, వైఎస్సార్సీపీ నేత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వాలంటీర్లు రియల్ హీరోలు. తమిళనాడు, కర్ణాటకతో పాటు దేశం మొత్తం ఈ వ్యవస్థపై ప్రశంసలు కురిపిస్తుంది. అలాంటి గొప్ప వ్యవస్థపై సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది. త్వరలోనే వాలంటీర్ చేస్తున్న సేవలను వెండితెరపై చూస్తారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన.. సినిమాను మాత్రం విడుదల చేసి తీరుతాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ శ్రీకృష్ణమా చార్యులు, సుమతీ రెడ్డి, సాహితీవేత్త శ్రీదేవి తదితరులు హాజరయ్యారు. -
వాలంటీర్ వ్యవస్థపై విషం కక్కి ఇప్పుడు ప్రేమ కురిపిస్తున్న చంద్రబాబు
-
వలంటీర్లపై చంద్రబాబుది కపట ప్రేమే
సాక్షి, అమరావతి: వలంటీర్లపై చంద్రబాబుది కపట ప్రేమ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. నిన్నటి వరకు వలంటీర్లను తూలనాడిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రేమ చూపిస్తారంటే ఎవరూ నమ్మరని అన్నారు. సజ్జల బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గోనె సంచులు మోస్తారు, ఆడవారి వివరాలు సేకరిస్తారు, అర్ధరాత్రి తలుపులు కొడతారని వలంటీర్ల గురించి నిన్నటిదాకా అన్న చంద్రబాబు.. ఇప్పుడు వలంటీర్లను కొనసాగిస్తా, రూ.10 వేలు ఇస్తా అంటే వలంటీర్లు, జనం నమ్మరని చెప్పారు. వలంటీర్లపై ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాశారని, చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ ద్వారా కేసులు వేయించి, ఫిర్యాదులు చేయించారని తెలిపారు. వలంటీర్ల పేరుతో జన్మభూమి కమిటీలను తెచ్చి, వాటిలోని సభ్యులనే వలంటీర్లుగా తేవాలనేది చంద్రబాబు పథకమని, అదెప్పటికీ జరగదని అన్నారు. వలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకుంది చంద్రబాబే అని చెప్పారు. పైపెచ్చు నేడు 33 మంది చనిపోయారంటూ ఎన్హెచ్చార్సీకే ఫిర్యాదు చేశారని, వారికి వీలుంటే ఐక్యరాజ్యసమితికైనా ఫిర్యాదు చేస్తారని ఎద్దేవా చేశారు. వలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తారని బాబు అనడం అబద్ధమని స్పష్టం చేశారు. శవ రాజకీయాలు చేసేది చంద్రబాబేనని, వృద్ధులు చనిపోతే దానిని వైఎస్సార్సీపీకి అంటగట్టాలని చూస్తున్నారన్నారు. వలంటీర్లు గత నాలుగున్నరేళ్ళుగా పింఛన్లు, పథకాలను ప్రజలకు అందిస్తున్నారని, రెండు నెలలు అడ్డుకోవడం ద్వారా వారి ప్రభావాన్ని ఆపగలరనుకుంటే అవివేకమే అవుతుందని తెలిపారు. సీఎం జగన్ రోడ్ షోలకు లభిస్తున్న ఆదరణ చూసి భయపడి ఇలాంటివి చేస్తున్నారని అన్నారు. మార్గదర్శి పేరుతో రామోజీ ఆర్థిక నేరాలు మార్గదర్శిపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని సజ్జల అన్నారు. మార్గదర్శి పేరుతో ఈనాడు రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని చెప్పారు. రామోజీ అక్రమాలు, మోసాలన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తాయన్నారు. చంద్రబాబును గద్దెనెక్కించేందుకు రామోజీరావు పూర్తిగా దిగజారిపోయారని, నిత్యం సీఎం జగన్పై విషం కక్కుతున్నారని అన్నారు. అందరికి నీతులు చెప్పే రామోజీరావు ఏనాడైనా నిష్పక్షపాతంగా వార్తలు రాశారా అని ప్రశ్నించారు. మార్గదర్శి ఫైనాన్స్పై తీర్పు వస్తే ఆ వార్త ఈనాడులో ఎక్కడా లేదన్నారు. రామోజీ సృష్టించిన అబద్ధాలనే బ్యానర్ కథనాలుగా ఇస్తున్నారన్నారు. సాక్షాత్తు కోర్టులోనే ఏపీ ప్రభుత్వం ఆయనకు వ్యతిరేకంగా ఉందని రామోజీరావు లాయర్ ద్వారా చెప్పారని అన్నారు. ఈనాడు స్క్రిప్టులనే చంద్రబాబు మాట్లాడతారని, వాటినే సోషల్ మీడియాలో నిజమనేలా దుష్ప్రచారం చేస్తారని చెప్పారు. చంద్రబాబును అర్జెంట్గా గద్దెనిక్కించాలనే తపన రామోజీలో కనపడుతోందన్నారు. సీఎం జగన్ వ్యవస్థలను సక్రమంగా నడుపుతూ, చట్టాలను గౌరవిస్తూ ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళ్తున్నారన్నారు. వాస్తవాలు బయటకు రావాలనే తాపత్రయం సీఎం జగన్లో ఉందని చెప్పారు. ఇదే క్రమంలో రామోజీరావు మార్గదర్శి అక్రమాలను, చంద్రబాబు స్కామ్లను బయటకు తెస్తున్నారని అన్నారు. అభ్యర్థుల ఎంపికలో కూటమిలోనే గందరగోళం వైఎస్సార్సీపీ టీం బ్రహ్మాండంగా ఉందని, తమ అభ్యర్థులను మార్చాల్సిన స్థితి లేదని సజ్జల స్పష్టం చేశారు. శాస్త్రీయ పద్ధతిలో, సుదీర్ఘ కసరత్తు తర్వాత అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. అభ్యర్థుల మార్పు జరుగుతుందనేది తప్పుడు ప్రచారమన్నారు. అభ్యర్థుల ఎంపికపై కూటమిలోనే గందరగోళం ఉందని, వారిలో వారికి పొత్తులు కుదరక నిత్యం అభ్యర్థులను మారుస్తూ.. వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. నూటికి నూరు పాళ్లు విజయం వైఎస్సార్సీపీదేనని సజ్జల స్పష్టం చేశారు. టీడీపీ వాళ్ళే హింసకు పాల్పతున్నారు రాష్ట్రంలో టీడీపీ వాళ్ళే హింసకు పాల్పడుతూ ఆ బురద వైఎస్సార్సీపీపై వేస్తున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా సజ్జల చెప్పారు. మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ వాళ్లపై దాడిచేసింది టీడీపీనేనని, ఒంగోలులో గొడవ చేసిందీ టీడీపీ వాళ్లేనని అన్నారు. సీఎం జగన్ ప్రజాస్వామ్యబద్దంగా ప్రజల్లోకి వెళ్లి తాను చేసింది చెప్పి మధ్దతు కోరుతున్నారని తెలిపారు. చంద్రబాబు, పవన్, పురందేశ్వరికి ఏం చేయాలో తెలియక గంగవెర్రులెత్తుతున్నారని చెప్పారు. రాబోయే తీర్పుకు వారు ఇప్పట్నుంచే సాకులు వెతుక్కుంటున్నారన్నారు. -
మహిళా వలంటీర్లపై గూండాగిరి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకులందరినీ గుండాలు, రౌడీలంటూ నోరు పారేసుకుంటుంటారు. కానీ, ఆయన పార్టీ అభ్యర్థులు, నాయకులు మహిళా వలంటీర్ల పైన కూడా దౌర్జన్యానికి దిగి, గృహ నిర్బంధానికి పాల్పడ్డారు. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ సహా ఆ పార్టీ నాయకులు గురువారం సాగించిన గూండాగిరీతో మహిళా వలంటీర్లు బెంబేలెత్తిపోయారు. ఓ మహిళా వలంటీరు పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటుండగా ఆ భవనంలోకి చొరబడటమే కాకుండా, ఆమెతో పాటు వేడుకలకు వచ్చిన మిగతా మహిళా వలంటీర్లపై దౌర్జన్యం చేసి, కుర్చిలు విరగ్గొట్టి, వారిని గృహ నిర్బంధం చేసి భయభ్రాంతులకు గురి చేశారు. భయంతో మహిళలు కేకలు వేసినా, గర్భిణి ఉందని మొత్తుకున్నా ఖాతరు చేయలేదు. గంటన్నర పాటు మహిళలు ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రాణ భయంతో పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి ఆ మహిళలను విడిపించారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మహిళా వలంటీరు మొయ్యా దుర్గా భవాని కాకినాడ రూరల్ నియోజకవర్గం వినాయక కేఫ్ సమీపంలోని ఓ భవనంలో గురువారం ముందస్తు పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. ఈ వేడుకలకు ఆమె స్నేహితురాళ్లైన పలువురు మహిళా వలంటీర్లు హాజరయ్యారు. పుట్టిన రోజు కేకు, కూల్ డ్రింక్లు సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే హఠాత్తుగా 30 మందిని వెంట బెట్టుకుని కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) అక్కడకు వచ్చారు. ఇక్కడ పార్టీ సమావేశం పెట్టుకుంటున్నారంటూ పెద్దగా కేకలు వేస్తూ వారిపై విరుచుకుపడ్డారు. పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటున్నామని చెబుతున్నా వినకుండా తలుపులు తన్నుకుంటూ లోపలకు వెళ్లి వీరంగం సృష్టించారు. దీంతో మహిళా వలంటీర్లు భయాందోళనలకు గురయ్యారు. తమతో పాటు గర్భిణి ఉన్నారని, ఆమె భయపడిపోతున్నారని, కేకలు వేయవద్దని బతిమిలాడారు. అయినా వారు వినలేదు. నానా రచ్చ చేసి, వలంటీర్లు కూర్చున్న కుర్చిలను ధ్వంసం చేశారు. మహిళా వలంటీర్లు లోపల ఉండగానే నానాజీ కనుసైగలతో ఆ పార్టీ కార్యకర్తలు గది తలుపులు మూసేసి గొళ్లేలు పెట్టేసి, భవనం కింది భాగంలోకి వెళ్లిపోయారు. మహిళా వలంటీర్లు కిటికీల వద్దకు వచ్చి తలుపులు తీయాలని, ఊపిరి ఆడటంలేదని ఎంతసేపు అర్థించినా వినిపించుకోలేదు. జనసేన నాయకుల విధ్వంసంతో గర్భిణి నున్న చిట్టమ్మ గదిలోనే సొమ్మసిల్లి పడిపోవడంతో అంతా భయకంపితులయ్యారు. వారిలో ఒక వలంటీరు తన మొబైల్ ఫోను ద్వారా కాకినాడ డీఎస్పీ హనుమంతరావుకు సమాచారం అందించింది. దీంతో సర్పవరం సీఐ వైఆర్కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడకు చేరుకున్నాయి. పోలీసులు తలుపులు తెరిచి మహిళా వలంటీర్లను విడిపించారు. అక్కడ రాజకీయ పార్టీ సమావేశం జరుగుతోందంటూ పంతం నానాజీ పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆ కార్యాలయంలో రాజకీయ పార్టీకి సంబంధించి ఎటువంటి ఆధారాలూ లేవని ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్చార్జి బీబీబీ రాజు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీశామని, అన్ని వివరాలు రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్కు నివేదిస్తామని రాజు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు జనసేన నాయకుల దాడిపై రమణయ్యపేట కూరగాయల మార్కెట్ వీధికి చెందిన బాధిత వలంటీరు దుర్గాభవాని సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు జనసేన అభ్యర్థి పంతం నానాజీతో పాటు పలువురిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మహిళల గృహ నిర్బంధం, భయభ్రాంతులకు గురి చేయడం, మూకుమ్మడిగా వచ్చి దౌర్జన్యం చేశారనే అభియోగాలపై ఐపీసీ 143, 452, 341, 342, 506 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. భయంతో వణికిపోయాం ఒకేసారి మూకుమ్మడిగా వచ్చి పడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. నాకు ఏడో నెల. గర్భిణి అని కూడా కనీసం జాలి, కరుణ కూడా లేకుండా గదిలో నిర్బంధించి తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ఏం జరుగుతుందోనని భయంతో వణికిపోయాం. తీవ్ర ఆందోళనతో సొమ్మసిల్లి పడిపోయాను. – నున్న చిట్టమ్మ, రమణయ్యపేట మహిళలని కూడా చూడలేదు జనసేన నాయకులు, కార్యకర్తలు అమానుషంగా ప్రవర్తించారు. పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటున్న వారు మహిళలని కూడా చూడకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారు. కుర్చీలు విరగ్గొట్టేశారు. అసలు ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే దౌర్జన్యం చేసి, తలుపు గడియ పెట్టేసి వెళ్లిపోయారు. ఏ రాజకీయ పార్టీ సమావేశం పెట్టుకోవడంలేదని ఎంత చెప్పినా వినలేదు. – కుసనం శాంతకుమారి, రమణయ్యపేట పుట్టిన రోజు చేసుకుంటుంటే నిర్బంధించారు నా పుట్టిన రోజు శుక్రవారం అయినప్పటికీ స్నేహితులందరూ అందుబాటులో ఉండరని చెప్పడంతో గురువారమే వేడుకలు చేసుకునేందుకు వారందరినీ ఆహా్వనించాను. కేకు తెచ్చుకొని పార్టీ సిద్ధమవుతుండగా ఒకేసారి గుంపుగా వచ్చిన జనసేన నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మా కార్యాలయం గది తలుపులు మూసేసి, గడియ పెట్టి నిర్బంధించారు. ఎంత వేడుకున్నా తలుపులు తీయలేదు. – మొయ్యా దుర్గాభవాని, రమణయ్యపేట, కాకినాడ రూరల్ -
కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీపై క్రిమినల్ కేసు
సాక్షి, కాకినాడ: కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీపై క్రిమినల్ కేసు నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. నానాజీ పై Cr.no 267/2024 U/s 143, 454, 341, 342, 506 R/w 149 IPC సెక్షన్లు నమోదయ్యాయి. కాకినాడ జిల్లాలో వాలంటీర్లపై జనసేన గూండాల అమానుషంగా ప్రవర్తించారు. ఆరుగురు వాలంటీర్లను రెండు గంటల పాటు ఓ గదిలో నిర్భంధించి తాళం వేశారు. గదిలో ఫర్నిఛర్ ధ్వంసం చేసి వాలంటీర్లపై దౌర్జన్యం చేశారు. వాలంటీర్లలో ఏడు నెలల గర్భవతి ఉన్నా జనసేన గూండాలు కనికరించలేదు. తమ తోటి వాలంటీర్ పుట్టిన రోజు సందర్భంగా రమణయ్యపేట మోక్షిత ఫైనాన్స్ కంపెనీలో వీరంతా కలుసుకున్నారు. స్వీట్స్, కూల్ డ్రీంక్స్ తీసుకొని ఆనందంగా మాట్లాడుకున్నారు. అయితే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న నెపంతో లోపలికి చొరబడిన కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీ, తన కార్యకర్తలతో కలసి వాలంటీర్లపై దాడికి దిగారు. రెండు గంటల పాటు వాలంటీర్లను నిర్బంధించి నానా హంగామా చేశారు. జనసేన దౌర్జన్యానికి గర్భంతో ఉన్న వాలంటీర్ సొమ్మసిల్లి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్నికల అధికారులు గదిలోకి వెళ్లి చూడగా అక్కడ కూల్ డ్రింక్స్, స్వీట్స్ గుర్తించారు. కాగా పంతం నానాజీ తీరుపై వాలంటీర్లు మండిపడుతున్నారు. ఇదీ చదవండి: పవన్కు వీళ్లా స్టార్ క్యాంపెయినర్లు! -
వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా
-
ఎమ్మెల్వోలపై ఏడుపు
సాక్షి, అమరావతి: ‘ఈనాడు’ రోత రాతలు చూస్తుంటే ప్రభుత్వం ద్వారా ఎవరికి ప్రయోజనం చేకూరినా వారిపై ఎన్నికల సంఘం ఎడాపెడా కేసులు నమోదు చేయాల్సిందేననే ఆక్రోశం కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడంపై వలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకు కాంట్రాక్టర్ల వద్ద విధులు నిర్వహించే ఎమ్మెల్వోలపై ఏడుపుగొట్టు కథనాలను ప్రచురించింది. ఒకవైపు వలంటీర్లను ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కాజేసే దొంగలుగా చిత్రీకరిస్తూ మరోవైపు తాయిలాలను ఎర వేయడంపై విస్మయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈనాడు ఆరోపణ: ఎమ్మెల్వోలను వైఎస్సార్సీపీ స్లీపర్ సెల్స్లా ప్రజలపైకి వదిలారు. వాస్తవం: వలంటీర్లు ప్రజల నుంచి ఎలాంటి వ్యక్తిగత సమాచారం సేకరించరు. ప్రభుత్వ పథకాల అమలు ప్రక్రియలో సేకరించే వివరాలను యాప్లో నమోదు చేయగానే నేరుగా రాష్ట్ర ప్రభుత్వ అ«దీనంలో ఉండే డేటా సెంటర్లో నిక్షిప్తమవుతుంది. వలంటీర్ల వద్ద ఉండే మొబైల్ యాప్లోని సమాచారాన్ని పరిశీలించేందుకు ఎమ్మెల్వోలకు లాగిన్ అవకాశం ఉండదు. ఈనాడు ఆరోపణ: ఎమ్మెల్వోలు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవం: వలంటీర్ల నుంచి ఫోన్లు, నంబర్లను స్వాదీనం చేసుకున్నాక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయడం ఎలా సాధ్యమో ఈనాడుకే తెలియాలి. -
మమల్ని వశపరుచుకోవటం నీ తరం కాదు బాబు కు వాలెంటీర్ల చెంపపెట్టు
-
నాలుక మడతేస్తూ 'నయవంచన'
సాక్షి, అమరావతి: నరంలేని నాలుక ఎన్ని వంకర్లయినా తిరుగుతుంది.. టీడీపీ అధినేత చంద్రబాబులా ఏదైనా మాట్లాడుతుంది. నిన్నటి వరకూ వలంటీర్లను ఇష్టం వచ్చినట్లు తిట్టిన నోటితోనే ఇప్పుడు వారిని కొనసాగిస్తామని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం కంటే ఎక్కువ ఇస్తామంటూ ఊసరవెల్లే సిగ్గుపడేలా ఎన్నికల వేళ చంద్రబాబు రంగులు మారుస్తున్నారు. తనకు రాజకీయ అవసరం తప్ప దేనిపైనా ఒక నిర్దిష్టంగా విధానమంటూ ఉండదని తన అవకాశవాద నైజాన్ని ఆయన మరోసారి చాటుకున్నారు. తాను అధికారంలోకి వస్తే వలంటీర్లకు ఇప్పుడిస్తున్న రూ.5 వేల గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతానని ఉగాది వేడుకల సందర్భంగా చంద్రబాబు ప్రకటించడంతో టీడీపీ నేతలే అవాక్కయ్యారు. మూడ్రోజుల క్రితమే వలంటీర్లకు నెలనెలా రూ.50 వేలు వచ్చేలా చేస్తానని ఆయన నమ్మబలికారు. అసలు ఆ వ్యవస్థ పనికి రానిదని, దాన్ని రద్దుచేస్తానన్న నోటితోనే ఇప్పుడు దాన్ని కొనసాగిస్తానని పొంతలేని మాటలంటూ ‘నయా’వంచన చేస్తున్నారు. అవసరార్థం ఎప్పటికప్పుడు తన విధానాలు, మాటలకు తూచ్ చెబుతూ ఎక్కడికక్కడ ఊసరవెల్లిలా చంద్రబాబు రంగులు మార్చడం చూసి సొంత పార్టీ వాళ్లే నోరెళ్లబెడుతున్నారు. అప్పుడు అన్ని మాటలు అని.. నిజానికి.. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేస్తున్న వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, టీడీపీ, జనసేన నేతలు గతంలో చేసిన దు్రష్పచారం అంతా ఇంతా కాదు. వలంటీర్లు చేసేది గోనె సంచులు మోసే ఉద్యోగమని, అవి ఉద్యోగాలా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాత్రిళ్లు ఇళ్లకు వెళ్లి తలుపులు కొడుతున్నారని, ఆడవాళ్లకు వలంటీర్ల వల్ల రక్షణ కరువైందంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఊళ్లలో వలంటీర్లు న్యూసెన్స్గా మారారని, వీళ్లు ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారారని.. అంతేకాక, బెదిరింపులు, అవినీతికి పాల్పడుతున్నారని ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేశారు. ఆయన దత్తపుత్రుడు పవన్కళ్యాణ్ అయితే మరింత రెచ్చిపోయి రాష్ట్రంలో వేలాది మంది మహిళలు అదృశ్యమవుతున్నారని, అందుకు వలంటీర్లే కారణమని వారిపై అడ్డగోలు అభాండాలు వేశారు. తామొస్తే వలంటీర్ల వ్యవస్థ నడుం విరగ్గొడతామంటూ బరితెగించి మాట్లాడారు. ఎల్లో మీడియాలో అయితే వలంటీర్లకు వ్యతిరేకంగా టన్నుల కొద్దీ వ్యతిరేక కథనాలు అచ్చోసింది. చివరికి.. వలంటీర్ల వ్యవస్థను ఆపేందుకు చంద్రబాబు తన మనుషుల ద్వారా కోర్టుల్లో పిటిషన్లు సైతం వేయించారు. వారిని అడ్డుకోవడం ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ఆపడానికి ఆయన చేయని కుట్రలేదు. నిమ్మగడ్డ ద్వారా వలంటీర్లకు బ్రేకులు.. చివరికి.. తన కోసమే పనిచేసే, తన నమ్మిన బంటు అయిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్కుమార్ ద్వారా కోర్టుకు వెళ్లి ఎన్నికల సమయంలో వారు విధుల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారు. తద్వారా ఈనెల వృద్ధులు, దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ల పంపిణీని అడ్డుకున్నారు. ఇంటింటికీ వెళ్లి వారికి వలంటీర్లు పింఛన్లు ఇవ్వకుండా ఆపి అనేకమంది వృద్ధుల మరణాలకు కారకుడిగా నిలిచారు. దీంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబికింది. చంద్రబాబు తమకిచ్చే పింఛన్లు రాకుండా అడ్డుకున్నారనే విషయం ప్రతి పింఛన్దారునికి అర్థమవడంతో ఆయన వెంటనే తన నాలుక మడతేశారు. తాను పింఛన్ల పంపిణీని ఆపమనలేదని, వలంటీర్లకు తాము వ్యతిరేకం కాదంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అంతేకాక.. ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాసి ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేయాలని మొసలికన్నీరు కారుస్తూ తెగ హడావుడి చేశారు. అయితే, అప్పటికే చంద్రబాబు చేసిన నష్టం, ఆడిన నాటకాలు ప్రజలకు తెలిసిపోయింది. టీడీపీ నేతల బరితెగింపు వ్యాఖ్యలు.. ఇదిలా ఉంటే.. పింఛన్ల పంపిణీపై తన కుట్ర బెడిసికొట్టడంతో నిమిషాల్లో చంద్రబాబు స్వరం మార్చినా టీడీపీ నేతలు మాత్రం మరింత రెచ్చిపోయారు. ► రాజమండ్రి అర్బన్ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు తాము చేసిన ఫిర్యాదులవల్లే వలంటీర్ల వ్యవస్థ ద్వారా జరిగే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ నిలిచిపోయిందని బహిరంగంగా చెప్పారు. ఇది తమ ఘనతేనని మీడియా సమావేశంలో ఆయన గొప్పగా ప్రకటించుకున్నారు. ► శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుదీర్రెడ్డి అయితే వలంటీర్లు ఉగ్రవాదులని, స్లీపర్ సెల్స్లా పనిచేస్తున్నారంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ► అలాగే, కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి రూ.3 వేలు పింఛను తీసుకోకపోతే ముసలోళ్లు చచ్చిపోతారా అంటూ జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు. ..ఇలా టీడీపీ నేతలంతా వలంటీర్లు, అవ్వాతాతల పింఛన్లపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. అంతటితో ఆగకుండా వలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ ఆదేశించినప్పుడు టీడీపీ శ్రేణులు సంబరాలు కూడా చేసుకున్నాయి. ప్రజాగ్రహంతో నయా..వంచన ఈ నేపథ్యంలో.. వలంటీర్లు, పింఛనర్లకు వ్యతిరేకంగా టీడీపీ వికృతంగా ఆడిన ఈ రాజకీయ క్రీడతో ప్రజల్లో చంద్రబాబు, టీడీపీ, జనసేనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తమ నోటి దగ్గర కూడును చంద్రబాబు తీసివేశారని తిట్టని పింఛనర్లు లేరు. దీంతో బెంబేలెత్తిపోయిన చంద్రబాబు ప్లేటు ఫిరాయించారు. వలంటీర్లపై కొత్త మోసానికి తెరతీశారు. నష్ట నివారణకు తాను వ్యతిరేకించిన వ్యవస్థను పొగుడుతూ కొత్త పాచిక విసిరారు. చివరికి తాను అధికారంలోకొస్తే వారిని కొనసాగిస్తానని, గతం కంటే ఎక్కువ భృతి ఇస్తానని చెబుతూ వారిని ఆకట్టుకునేందుకు మరో డ్రామా మొదలుపెట్టారు. ఇన్నాళ్లూ తిట్లు, శాపనార్థనాలతో అడుగడుగునా అవమానించిన వారిని నెత్తిన పెట్టుకుంటానంటూ చంద్రబాబు కల్లబొల్లి కబుర్లు చెబుతుండడం చూసి వలంటీర్లు ఆయన్ను వింతగా చూస్తున్నారు. తమను లేకుండా చేస్తామన్న వారే ఇప్పుడు ఓట్ల కోసం తమకు గేలం వేస్తుండడం చూసి హేళనగా నవ్వుకుంటున్నారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు గతంలో చాలా చూసినా ఇప్పుడు తమతో ఆడుతున్న నాటకాలు చూసి వలంటీర్లు ఛీదరించుకుంటున్నారు. టీడీపీకి విరాళాలివ్వండి.. ఇక టీడీపీకి విరాళాలివ్వాలని చంద్రబాబు కోరారు. పార్టీకి విరాళలిచ్చేందుకు తీసుకువచ్చిన వెబ్సైట్ను మంగళవారం టీడీపీ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. తన వంతుగా రూ.99,999లు ఆన్లైన్ ద్వారా చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో తమ పార్టీకి కార్యాలయాలు లేవన్నారు. టీడీపీ ఏనాడూ భూములు తీసుకుని ప్యాలెస్లు కట్టలేదని చెప్పారు. అంతకుముందు.. టీడీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు, పంచాగ శ్రవణం జరిగాయి. జన్మభూమి కమిటీలతో ద్రోహం చేసినట్లేగా.. ఇదిలా ఉంటే.. వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పడం ద్వారా తన హయాంలోని జన్మభూమి కమిటీలతో ప్రజలు దగా పడ్డారనే విషయాన్ని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. అప్పట్లో జన్మభూమి కమిటీలు ప్రజలను ఎన్నో రకాలుగా రాచి రంపాన పెట్టాయి. ప్రభుత్వ సేవలు, పథకాలు అందాలంటే ఈ కమిటీలకు లంచాలు ఇచ్చుకోవాల్సిందే. దీనిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చి తెలుగుదేశం పార్టీపై జనం తిరుగుబాటు చేసే పరిస్థితి ఏర్పడింది. ఫలితంగానే 2019 ఎన్నికల్లో చంద్రబాబు చిత్తుగా ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించి ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను వారి ద్వారా అమలుచేశారు. లంచాలకు ఆస్కారం లేకుండా నేరుగా ప్రజల అకౌంట్లలోకి ఆ పథకాల డబ్బులు బదిలీ చేశారు. ఇక వలంటీర్ల ద్వారా పించన్ల పంపిణీ అయితే విప్లవాత్మకమైన రీతిలో జరిగింది. ఇలాంటి వ్యవస్థపై చంద్రబాబు ఈర‡్ష్య, అసూయతో రగిలిపోయారు. నోటికొచ్చినట్లు అవాకులు చెవాకులు పేలారు. దీంతో పార్టీకి నష్టం జరగడంతో మాటమార్చి దాన్ని కొనసాగిస్తానని చెప్పడం, తాను వారికి ఇంకా ఎక్కువ పారితోషికం ఇస్తానని చెప్పడం చూస్తుంటే తన జన్మభూమి కమిటీలు విఫలమైనట్లు అంగీకరించినట్లేనని తేలిపోయింది. ముందు ఆ విషయాన్ని ఒప్పుకుని లెంపలు వేసుకుంటే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
అవ్వాతాతలూ ఆలోచించండి.. బాబు చెప్పేవన్నీ అబద్ధాలే: సీఎం జగన్
వాళ్లు ఎలాగూ చేసేది లేదు కాబట్టి చెప్పడానికేముంది? నోటికి అడ్డేముంది? అబద్ధాలకు రెక్కలు కట్టేస్తే చాలు.. ఎలాగూ చేసేది లేదు కదా! అనే మనస్తత్వం వాళ్లది. మీ బిడ్డ అలా కాదు. ఏదైనా చెప్పాడంటే కచ్చితంగా చేసి చూపిస్తాడు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మన ప్రభుత్వం పెట్టే మొదటి సంతకం వలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించడమే. – పింఛన్దారులతో సీఎం జగన్ సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: ‘‘పేదలకు గానీ, అవ్వాతాతలకు గానీ, పిల్లలకు గానీ, ఏ వర్గానికైనా సరే.. మంచి చేసే విషయంలో జగన్తో పోటీ పడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడు అని గర్వంగా చెబుతున్నా. వెసులుబాటును బట్టి అవకాశం ఉంటే ఎక్కడా మీ బిడ్డ తగ్గడు. మరీ ముఖ్యంగా అవ్వాతాతల విషయంలో అసలు తగ్గే అవకాశం, పరిస్థితి ఉండనే ఉండదు అని స్పష్టంగా చెబుతున్నా. మన ప్రమాణ స్వీకారం రోజు వలంటీర్ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించే కార్యక్రమంపైనే మొట్ట మొదటి సంతకం చేస్తా’’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మీ బిడ్డకు అబద్ధాలు ఆడటం, మోసం చేయడం తెలియదు కాబట్టి బాబు, ఆయన కూటమితో ఈ రెండు విషయాల్లో మాత్రం పోటీ పడలేడని వ్యాఖ్యానించారు. సోమవారం ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి గ్రామంలో పెన్షనర్లతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ఏమన్నారంటే.. అవ్వాతాతలపై ప్రేమతో... ఈరోజు అవ్వాతాతలతోపాటు ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలపై ఆలోచన చేయమని కోరుతున్నా. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ ఇచ్చిన పెన్షన్ రూ.1,000 మాత్రమే. అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు సమర్పించుకుంటేనే అందిన దుస్థితి. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకు కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. అప్పట్లో నెలకు వెచ్చించిన వ్యయం కేవలం రూ.400 కోట్లు. అలాంటి పరిస్థితుల్లో మొట్ట మొదటి సారిగా మీ బిడ్డ అవ్వాతాతల గురించి, వారి కష్టాలు, ఆత్మగౌరవం గురించి ఆలోచన చేశాడు. అధికారంలోకి రాగానే దేశంలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి నిర్వచనం ఇస్తూ ప్రతి గ్రామంలో సచివాలయాలను నెలకొల్పి వలంటీర్ వ్యవస్థను తెచ్చాం. ప్రతి నెలా 1వ తారీఖునే అది సెలవు రోజైనా, ఆదివారమైనా సరే ఇంటివద్దే నేరుగా అవ్వాతాతల చేతుల్లో పెన్షన్లు పెట్టిన పరిస్థితి 56 నెలలు మన ప్రభుత్వం హయాంలోనే జరిగింది. గతంలో 39 లక్షలు మంది మాత్రమే íపింఛనుదారులుండగా ఈరోజు వివక్ష లేకుండా 66.34 లక్షల మందికి ఠంఛన్గా పెన్షన్ అందిస్తున్నాం. అది కూడా గత సర్కారు హయాంలో మాదిరిగా రూ.వెయ్యి కాకుండా ఏకంగా రూ.3 వేల దాకా పెంచుకుంటూ వెళ్లి అవ్వాతాతలకు మంచి చేశాం. ఈ తేడాను ఒక్కసారి గమనించండి. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి. ఆ అవ్వలు, తాతలు, అభాగ్యుల పట్ల మనసులో నిజమైన ప్రేమ ఉంటేనే ఇలాంటి మంచి ఆలోచనలు వస్తాయి. ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో సామాజిక పింఛన్ లబ్ధిదారులతో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి సభకు హాజరైన అవ్వాతాతలు బాబు ఆ ఆలోచనే చేయలేదు.. మీరంతా గత పాలకులను చూశారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మూడుసార్లు పరిపాలన చేశానని చెబుతుంటారు. కానీ ఏ ఒక్క రోజైనా మీ బిడ్డ మాదిరిగా అవ్వాతాతల గురించి ఆయన ఆలోచన చేశాడా? అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలనే తాపత్రయం, మనసులో ప్రేమ ఉంటేనే చేతల్లో బయటకు వస్తుంది. ఇవాళ రాజకీయాలు పాతాళానికి దిగజారాయి. విలువలు, విశ్వసనీయత లేవు. ఈ వ్యవస్థను మార్చడానికి మీ బిడ్డ తొలిసారిగా అడుగులు వేగంగా వేశాడు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో ఏకంగా 99 శాతం అమలు చేసి చిత్తశుద్ధితో మీ ముందుకు వచ్చాడు. మీ బిడ్డకు అబద్ధాలు, మోసాలు తెలియవు. ఏదైనా చెప్పాడంటే కచ్చితంగా చేసి చూపిస్తాడు. మీ ముందు ఉంచుతున్న వాస్తవాలపై ఆలోచన చేయమని అందరినీ కోరుతున్నా. దేశంలో రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మనదే జనాభా ప్రకారం చూస్తే ఐదు కోట్ల మందిలో 66.34 లక్షల మందికి పెన్షన్లు, అత్యధికంగా పింఛన్ మొత్తాన్ని అందిస్తున్న రాష్ట్రం మనదే. నెలకు రూ.3 వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పింఛన్ల కోసం నెలకు రూ.400 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి నుంచి ఈరోజు నెలకు రూ.2 వేల కోట్లు కేవలం పెన్షన్ల కోసమే అందచేస్తున్నాం. సంవత్సరానికి రూ.24 వేల కోట్లు పెన్షన్ల రూపంలో ఇస్తున్నాం. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలిపితే ఏకంగా రూ.90 వేల కోట్లు పెన్షన్ల రూపంలో అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకు చేతిలో పెట్టినట్లయింది. ఏటా రూ.24 వేల కోట్లు పింఛన్ల కోసం ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాగా బిహార్లో రూ.4300 కోట్లు, ఉత్తరప్రదేశ్లో రూ.5,160 కోట్లు, కర్ణాటకలో రూ.4,700 కోట్లు, పక్కన తెలంగాణలో రూ.8,180 కోట్లు చొప్పున ఏటా పెన్షన్ల కోసం వ్యయం చేస్తున్నారు. ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నానంటే అవ్వాతాతలను మోసం చేసేందుకు రూ.4 వేలు.. రూ.5 వేలు.. రూ.6 వేలు అని చెబుతారు. ఇంకా అవసరం అయితే ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికీ రూ.8 వేలు అని కూడా అంటారు. మేనిఫెస్టోలో చెప్పినా, చెప్పకపోయినా చేయగలిగిందే చెప్పాలి. చెయ్యలేనిది నా నోట్లో నుంచి రాదు. ఈ 58 నెలల పాలన చూస్తే చెప్పనివి కూడా చాలా చేసిన పరిస్థితి మీ అందరికీ కనిపిస్తుంది. బాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టినట్లే 2014లో చంద్రబాబు స్వయంగా సంతకం చేసి ప్రధాని మోదీ, దత్తపుత్రుడి ఫొటోలతో ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పాడో మీ అందరికీ తెలుసు. ఎన్నికలు ముగిసి అధికారంలోకి రాగానే ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశాడు. మీ అందరికీ అందుకే చెబుతున్నా. మోసం చేసే వాళ్లను, అబద్ధాలు చెప్పే వాళ్లను నమ్మొద్దండీ. మీ బిడ్డ పేదల సంక్షేమానికి సంవత్సరానికి దాదాపుగా రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా మీ బిడ్డ సమూల మార్పులు తేవడంతో ఈరోజు ఇన్ని మంచి పనులు జరుగుతున్నాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని నమ్మబలుకుతున్న చంద్రబాబు హామీలు రూ.1.40 లక్షల కోట్లు దాటుతున్నాయి. సునాయాసంగా నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే పులి నోట్లో తలకాయ పెట్టినట్లే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. మీలో ఎవరైనా నాకు సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే స్లిప్పులో రాసి బాక్సులో వేస్తే నావద్దకు వస్తాయి. తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు చంద్రబాబు చేసిన పనికి... నాకు కాలు విరగడంతో ఆపరేషన్లు జరిగాయి. అన్ని పథకాలు కలిపి రూ.3.40 లక్షలు అందాయి. నీ మేలు ఎప్పుడూ మరవలేం. చంద్రబాబు చేసిన పనికి చాలా కష్టం అయింది. నాకు ఆయాసం ఉంది. మూడుసార్లు కూర్చుని లేచి సచివాలయానికి వెళ్లా. తోడు కోసం ఓ పాపను తీసుకెళితే రాయి తగిలి కింద పడటంతో ఆమె ముక్కుకు గాయం అయింది. మమ్మల్ని ఇంత కష్టపడేలా చేసింది చంద్రబాబే. రైతుభరోసా సహా నాకు ఎన్నో పథకాలు అందాయి. మొన్ననే కంటి ఆపరేషన్ చేయించుకున్నా. నీవల్లే ధైర్యంగా బతుకుతున్నా. – కర్నాటి సుబ్బులు, కుర్చేటి మండలం, అగ్రహారం ఎంత ఇబ్బంది బాబూ.. ఇన్నాళ్లూ వలంటీర్లు ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయాన్నే రూ.3 వేల పెన్షన్ మా చేతుల్లో పెడితే ఈనెలలో మాత్రం మూడు చోట్లకు తిప్పారు. సచివాలయానికి వెళితే అక్కడ కాదన్నారు. ఇంకో చోటకు వెళితే అక్కడా కాదన్నారు. మోకాళ్ల నొప్పితో ఎన్నిచోట్లకు తిరిగానో, ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో ఈ బాబు! ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుంటే అడ్డుపడుతున్నారు. మాకు వలంటీర్లు, వలంటీర్ల వ్యవస్థ కావాలి. కరోనాలో మాసు్కలతో సహా ఇంటివద్దకే పంపించారు. ఇంటింటికీ రేషన్ పంపిస్తున్నారు. గడప గడపకు పథకాలు అందుతున్నాయి. వలంటీర్ల వ్యవస్థను తొలగిస్తే ఒప్పుకోం. – పట్రా ప్రభావతి, దర్శి దివ్యాంగులు, వృద్ధులపై అక్కసు.. టీడీపీ హయాంలో దివ్యాంగులు ఎంత కష్టపడ్డారంటే జన్మభూమి కమిటీలకు ముడుపులు చెల్లించాల్సి వచ్చేది. మీరు (సీఎం జగన్) పాదయాత్ర చేసినప్పుడు కొన్ని హామీలిచ్చారు. అందులో ఇవ్వని హామీ ఒకటి ఏమిటంటే దేవుడి దూతలా వలంటీర్లను పంపించడం. వారు ఇంటింటికీ వచ్చి దివ్యాంగులకు పెన్షన్లే కాకుండా సదరం సర్టిఫికెట్ నుంచి ఆధార్ కార్డు దాకా ప్రతి ఒక్కటీ అందేలా చేశారు. బాబు మిమ్మల్ని ఏమీ చేయలేక అక్కసుతో దివ్యాంగులు, వృద్ధుల మీద పడ్డారు. పిటిషన్ వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కచ్చితంగా చెబుతున్నా వాళ్లు మట్టి కొట్టుకుపోతారు. 70 ఏళ్ల వృద్ధురాలు పెన్షన్ కోసం వెళ్తూ మండుటెండలో సొమ్మసిల్లి పడిపోవటాన్ని నేను కళ్లారా చూశా. దీనికి ఎవరు కారణమనేది అందరూ ఆలోచన చేయాలి. – నర్సింహారావు, దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుడు నిన్నే నమ్ముకున్నానయ్యా.. నా పిల్లలకు అమ్మఒడి వచ్చింది. నాకు, నా కోడలికి వైఎస్సార్ ఆసరా వచ్చింది. నా కొడుక్కి రైతుభరోసా వచ్చింది. మాకు అన్నీ వచ్చాయి. నాకు వైఎస్సార్ ఇల్లు కట్టించాడు. నాకు నలుగురు కొడుకులున్నా నువ్వే నా కొడుకువి. నా కడుపులోనే ఉన్నావ్ నువ్వు. నాకు రూ.3 వేలు పెన్షన్ వస్తోంది బ్యాంకుల నుంచి రూ.23 వేలు వచ్చాయి. నేను నిన్నే నమ్ముకుని ఉన్నానయ్యా. – గంగిరెడ్డి మంగమ్మ, బొట్టపాలెం దోమలు కుడుతున్నా.. పింఛన్ కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి మాకు పెన్షన్ వస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెల్లవారుజామున 4 గంటలకే పెన్షన్ కోసం పంచాయతీ ఆఫీస్కు వెళ్లేవాడిని. నాకన్నా ముందే నలుగురు ఉండేవాళ్లు. అక్కడ 10 కుర్చీలే ఉండేవి. దోమలు కుడుతున్నా బయటకు వెళ్తే కుర్చీ పోతుందనే భయంతో వెళ్లేవాడ్ని కాదు. కండువా తీసుకుని ఆ దోమలను కొట్టుకుంటూ వుండేవాడ్ని. సిబ్బంది 8 గంటలకు వచ్చేవారు. అన్ని పూర్తి చేసేసరికి 9 గంటలు అయ్యేది. అప్పటికే దాదాపు రెండు మూడొందల మంది వచ్చి పుస్తకాలు పెట్టేవారు. తర్వాత వచ్చేవాళ్లను తరువాత రావాలని పంపేవారు. అలా వారం రోజులు పెన్షన్లు ఇచ్చేవారు. ఈ బాధ ఎప్పుడు పోతుందా అని అనుకునేవాడ్ని. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వలంటీర్ ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన బంగారు మెదడు నుంచి వచ్చిన ఆలోచనలే. అటువంటి మేధావి ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టం. రావణాసురుడు, హిరణ్యకశిపుడు లాంటి వారికి మే 13న ప్రజాకోర్టు శిక్ష వేస్తుంది. జూన్ 4న శిక్ష అమలు జరుగుతుంది. – వెంకటపతి, దర్శి పల్లెటూళ్లకు పాలన తెచ్చారు.. నవరత్నాల పథకాల వల్ల మాలాంటి పేదలకు నాలుగు వేళ్లు నోట్లోకి పోతున్నాయి. నాడు పరిపాలన కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యేది. నేడు పల్లెటూళ్లకు పరిపాలన తెచ్చిన ఘనత మన జగన్మోహన్రెడ్డికే దక్కుతుంది. గతంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా మండల ఆఫీస్కు వెళ్లాల్సిందే. ఇప్పుడు అన్నీ గ్రామాల్లోనే లభిస్తున్నాయి. గుంపులు గుంపులుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి నీలాంటి దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడ్ని చూసి భయపడుతున్నారు. – శ్రీనివాస్రెడ్డి, బసిరెడ్డిపాలెం గ్రామం నీ నీడన మేం ఉండాలి.. నా పెనిమిటి మరణించి 15 ఏళ్లు అయింది. నాకు ఇల్లూ వాకిలీ లేదు. ఒంటరి మహిళ పెన్షన్ వస్తోంది. ఇప్పటి వరకూ రూ.1.30 లక్షల మేర లబ్ధి పొందా. ఈనెల పెన్షన్ వలంటీర్ ఇవ్వలేదు. నా కుమారుడిని అడిగితే దర్శి వెళ్లి తెచ్చుకోవాలన్నాడు. నా ఆరోగ్యం బాగాలేదు. నడవలేను. ఎవరినో బతిమాలి వెళ్లి పెన్షన్ తెచ్చుకున్నా. జగనన్నా మళ్లీ నువ్వే రావాలి. 175కి 175 రావాలి. నీ నీడన మేం ఉండాలి. మంచి మనసున్న మారాజు నువ్వు. సొంత కొడుకులు, కోడళ్లు పదెకరాల ఆస్తి ఇచ్చినా మనల్ని చూడరు. కానీ అందరినీ చూసే మంచి మనసున్న మనిషి దైవబలంతో ఆ తల్లికి జన్మించాడు. అలాంటి జగనన్నను మనం గెలిపించుకోవాలి. – వెంకాయమ్మ, శివాజీ నగరం వార్డు, దర్శి, వితంతు పెన్షన్ లబ్ధిదారు ఐదు గద్దలు మాపై పడ్డాయి.. టీడీపీ హయాంలో వెయ్యి రూపాయలు అరకొర పెన్షన్లు ఇవ్వడంతోపాటు ఒక íపింఛనుదారుడు చనిపోతేనే రెండో వ్యక్తికి జన్మభూమి కమిటీలు మంజూరు చేసేవి. వలంటీర్లను అడ్డుకునేందుకు రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి లాంటి ఐదు గద్దలు తోడయ్యాయి. ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసి నాలాంటి గుడ్డోళ్లు, ముసలోళ్లను దెబ్బ తీశారు. పది మంది చూపు పడితే బండ రాళ్లైనా పగిలిపోతాయి. 69 లక్షల మంది చూపు పడి ఆ ఐదుగురూ నామరూపాలు లేకుండా పోతారు. – శ్రీను, పెద ఉయ్యాలవాడ, దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుడు -
మీ రాజీనామాలతో బాబు గుండెల్లో రైళ్లు
కావలి/నెల్లూరు(దర్గామిట్ట)/అల్లూరు/కావలి: రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్ల రాజీనామాలతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని సీఎం వైఎస్ జగన్అన్నారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా శనివారం మధ్యాహ్నం ముసునూరు టోల్ప్లాజా సమీపంలో ఉన్న ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు వచ్చిన ఆయన్ను కావలికి చెందిన పలువురు వలంటీర్లు కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘రెండోసారి మిమ్మల్ని సీఎంగా చేసుకునేందుకు కావలి పట్టణానికి సంబంధించిన వలంటీర్లందరం రాజీనామా చేశాం’ అని తెలపగా.. పైవిధంగా సీఎం జగన్ స్పందించారు. తాను రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే వలంటీర్లకు సంబంధించిన ఫైలుపైనే తొలి సంతకం చేస్తానని, సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురస్కారాలను కొనసాగిస్తామని చెప్పారు. జిల్లాలో క్లీన్ స్వీప్ ఖాయం జిల్లాలోని ఒక పార్లమెంట్, 8 అసెంబ్లీ స్థానాల్లో క్లీన్స్వీప్ చేయడం తథ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇందుకు గుర్తుగా నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం స్టే పాయింట్ వద్ద టీషర్టుల మీద 8 బై 8 వైఎస్సార్సీపీ స్టాంప్ను వేసి అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు లోక్సభ అభ్యర్థి వి.విజయసాయిరెడ్డి, ఉదయగిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డి తదితరులు ఉన్నారు. -
61.37 లక్షల మందికి రూ.1,847.85 కోట్లు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు.. వలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయించి తీవ్ర అవాంతరాలు సృష్టించాలని చూసినా ప్రభుత్వం ఠంఛన్గా పింఛన్ పంపిణీ చేసింది. కేవలం రెండున్నర రోజుల వ్యవధిలోనే 61,37,464 మంది లబ్ధిదారులకు రూ.1,847.85 కోట్లను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాల వద్ద బుధవారం మధ్యాహ్నం నుంచి పంపిణీ ప్రారంభించి, శుక్రవారం సాయంత్రానికి 93.42 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తి చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దే సచివాలయాల ఉద్యోగులు పింఛన్లు పంపిణీ చేశారు. చిత్తూరు, ఏలూరు, విశాఖపట్నం జిల్లాల్లో 95 శాతం మందికి పైగా పంపిణీ పూర్తయినట్టు అధికారులు తెలిపారు. శనివారం కూడా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సచివాలయాల వద్ద పంపిణీ కొనసాగుతుంది. -
ముసలి వాళ్లపై ఎల్లో శాడిజం...ఇదేం సైకోయిజం బాబూ..!
-
పేదలు పణంగా బాబు రాజకీయం
రాజకీయాల్లో వ్యూహాలు – ప్రతి వ్యూహాలు, ఎత్తుకు పైఎత్తులు వేయటం, ప్రత్యర్ధిని దెబ్బతీసి తాము అధికార పగ్గాలు చేపట్టాలనుకోవటం సహజం. దీని కోసం కొంతమంది స్ట్రైట్ పాలిటిక్స్ చేస్తే మరి కొంతమంది నాయకులు వెన్ను పోట్లు, కుట్రలు, కుతంత్రాలతో రాజకీయం చేస్తారు. ఇవి కూడా చర్చనీయాంశమే అయినా... పవర్ కోసం కొట్లాట రాజకీయ పార్టీలు, రాజ కీయ ప్రత్యర్ధుల మధ్య ఉండటం వరకు సమర్థించవచ్చు. కాని స్వార్థం హద్దులు దాటి అధికారం కోసం, ప్రత్యర్ధిని దొంగ దెబ్బ తీయటం కోసం ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెట్టాలనుకోవటం, బలహీన వర్గాల ప్రజలతో చెలగాటం ఆడే కుట్రలు... ఏ మాత్రం సహించ దగినవి కాదు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కూటమి ఇప్పుడు ఇటువంటి ప్రమాదకర రాజకీయ క్రీడకు తెర తీశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తీవ్ర అనారోగ్యగ్రస్థులకు వారి ఇంటి దగ్గరే వాలంటీర్లు పెన్షన్ అందించే విధానాన్ని చంద్రబాబు అడ్డుకున్నారు. తన జేబులోని మనిషి, తన సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి వాలంటీర్లు పెన్షన్లను లబ్ధిదారులకు పంచకూడదని ఫిర్యాదు చేయించారు. వీరి ఫిర్యాదుకు అను గుణంగా ఈసీ ఆదేశాలు ఇవ్వటంతో ఇప్పుడు 66 లక్షల మంది పెన్షనర్లు మూడు నెలల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర చరిత్రలో, బాబు హయాంలో పెన్షన్ల కోసం ప్రభుత్వ ఆఫీసుల వద్ద పండుటాకులు ఎలా పడిగాపులు పడేవారో పత్రికల్లో ఫోటోలతో సహా వార్తలు నిత్యం వస్తూ ఉండేవి. వారం, పది రోజుల పాటు చెప్పులరిగేలా తిరగాల్సి వచ్చేది ఆ రెండు వందల రూపాయల పెన్షన్ కోసం. పూట గడవని స్థితిలో బడుగు బలహీన వర్గాలకు చెందిన అవ్వా తాతలు అలానే అంతటి కష్టాన్నీ భరించే వారు. కాస్త కాలు చేయి బాగానే ఉన్నవారు సరే. మరి మంచాన పడిన వారు, నాలుగడుగులు కూడా వేయలేని వారు, ఆసరా లేకుండా నిలబడ లేని వారి పరిస్థితిని ఊహించగలమా? జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షలాది మంది నిస్సహాయులను ఇటువంటి దుఃస్థితి నుంచి బయటపడేశారు. పెన్షన్ కోసం మంచం దిగాల్సిన అవసరం రాకుండా సగౌరవంగా వాలంటీర్లే లబ్ధి దారుల ఇళ్ళకు వెళ్ళి అవ్వా, తాతల చేతుల్లో పెట్టే విధంగా వాలంటీర్–సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చారు. అది కూడా ఫస్ట్ తేదీనే, కోడి కూయక ముందే! ఇప్పుడు అక్షరాల 3 వేల రూపాయల పెన్షన్ 66 లక్షల మందికి అందు తోంది. వృద్ధులనే కాదు వికలాంగులు, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్థులు, క్యాన్సర్ వంటి తీవ్ర రోగాల పాలైన వారిని కూడ ప్రభుత్వం పెన్షన్ ఇచ్చి ఆదుకుంటోంది. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడేందుకు వీరి ఆరోగ్యం సహకరించదు. ఓ వైపు మండుతున్న ఎండలను తట్టుకునే శక్తీ ఉండదు. చంద్రబాబు చేసిన కుట్ర వల్ల మంచాన పడిన వారు కూడా పెన్షన్ కోసం సచివాలయం చుట్టూ తిరిగాల్సిన దుఃస్థితి ఏర్పడింది. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు ఉన్న భయం, ఆక్రోశం ఇవాళ్టిది కాదు. గత రెండు, మూడేళ్ల నుంచి రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు. పట్టుమని పాతికేళ్లు నిండని ఈ పిల్లలను రెడ్ లైట్ ఏరియాకు మహిళలను సరఫరా చేసే బ్రోకర్లుగా, హ్యూమన్ ట్రాఫికర్లుగా, దొంగలుగా పవన్, చంద్రబాబు మొన్నటి వరకు చిత్రించిన విషయాన్ని ఎవరూ మరచిపోలేదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి చేసిన మంచి వల్ల ప్రజలంతా జగన్కే మళ్లీ పట్టం కడ తారన్న ఆందోళనతోనే చంద్రబాబు ఇంతటి క్రూరమైన క్రీడకు తెర తీశారు. దీని ద్వారా చంద్ర బాబు రెండు విషయాలపై స్పష్టత ఇచ్చారు. రెండున్నర లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయటం మొదటి లక్ష్యం. బడుగు బలహీన వర్గాలకు చెందిన పండు టాకులనూ, నిస్సహాయులనూ మళ్లీ రోడ్డున పడవేసి పెత్తందారీ, దురహంకారపూరిత ఆనందాన్ని పొందటం రెండో లక్ష్యం. వృద్ధులు, నిస్సహాయులను క్షోభ పెడితే ఆ పాపం ఊరకనే పోదు. ఇది నిజం! – ఆర్ఎస్ -
ఈ సైకోయిజాన్ని ఏమనాలి పసుపుపతి..
టీడీపీ రాజకీయ భవిష్యత్తును ఎల్లో సమాధిలో కుళ్ళబెట్టిన.. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలను వదల బొమ్మాళీ వదల అంటున్నావా లేదా పసుపుపతీ.. వాలంటీర్లపై కక్షతో నిమ్మగడ్డకు ఎల్లో ముసుగు తొడిగి కోర్టుల్లో కేసులు వేయించావా లేదా పసుపుపతీ.. జగన్ను ఎదుర్కోలేక పండుటాకులపై పగ పెంచుకున్నావా లేదా పసుపుపతీ.. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ అందకుండా కుట్రలు కుతంత్రాలు చేశావా లేదా.. పసుపుపతీ. అవ్వాతాతలు ఎండలో మలమలా మాడుతుంటే.. పైశాచికానందం పొందుతున్నావా లేదా పసుపుపతీ.. వికలాంగులు నానా అవస్థలు పడుతుంటే రాక్షసానందం పొందుతున్నావా లేదా.. పసుపుపతీ. చేసిందంతా చేసి నెపం జగన్ సర్కార్పై వేసేందుకు ఎల్లో తాతను వాడుకుంటున్నావా లేదా పసుపుపతీ... ఒక్కటి మాత్రం నిజం సిల్వర్ స్క్రీన్ పై అరుంధతి సినిమాలో పశుపతి క్యారెక్టర్ లాగే ...పొలిటికల్ స్క్రీన్ పై అధికారంపై వ్యామోహంతో చంద్రబాబు పసుపుపతిలా మారిపోయారు. పైగా నేను అరుంధతి సినిమాలో పశుపతినే అని బహిరంగంగా చెప్పుకుంటున్నారంటే... ఈ సైకోయిజాన్ని ఏమనాలి. అయ్యా పసుపుపతి గారూ...నీకు, నీఎల్లో ముఠాకు అవ్వాతాతల ఉసురు తగలడం గ్యారంటీ.. రామోజీ 87 ఏళ్ళ గుండెపై ఒట్టు.. అవ్వాతాతల కన్నీళ్ళు, వికలాంగుల కన్నీళ్ళు.. శాపమై మిమ్మల్ని వెంటాడటం గ్యారంటీ. చేసిందంతా చేసి పురాణాలు ప్రబోధిస్తున్న నువ్వు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పు అంటున్నారు.. అవ్వాతాతలు, విలాంగులు, వితంతువులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు. 1. జగన్ ను నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక పండుటాకులపై పగ తీర్చుకుంటున్నావు.. ఇదేం సైకోయిజం బాబూ 2. అవ్వాతాతల పింఛన్లు ఆపేందుకు అడ్డదారిలో నిమ్మగడ్డను ఈసీ దగ్గరకు పంపావు.. ఇదేం సైకోయిజం బాబూ 3. పెన్షన్ల పంపిణీకి నువ్వే అడ్డంకులు సృష్టించి ఎల్లో మీడియాతో రివర్స్ ఎటాక్ చేయిస్తున్నావు.. ఇదేం సైకోయిజం బాబూ 4. పండుటాకుల పింఛన్లపై కుట్రచేసి.. ఇప్పుడు నెపం ప్రభుత్వం పైకి నెట్టేసే ప్లాన్ వేశావు.. ఇదేం సైకోయిజం బాబూ 5. ఎండలో మలమలా మాడుతున్న వృద్ధుల్ని చూసి పైశాచికానందం పొందుతున్నావు.. ఇదేం సైకోయిజం బాబూ 6. సచివాలయాల దగ్గరకు నీ పచ్చమూకను పంపి పెన్షన్ల పంపిణీకి అడ్డంకులు సృష్టిస్తున్నావు.. ఇదేం సైకోయిజం బాబూ 7. అవస్థలు పడుతున్న అవ్వాతాతలు తిరగబడతారని నిమ్మగడ్డను కలుగులో దాక్కోమన్నావు.. ఇదేం సైకోయిజం బాబూ 8. అచ్చెన్నాయుడితో వాలంటీర్లపై ఫిర్యాదు చేయించింది నువ్వే అని చెప్పుకోలేకపోతున్నావు.. ఇదేం సైకోయిజం బాబూ 9. చేసిందంతా చేసి సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్లు పంపణీ చేయాలని ఉచిత సలహాలిస్తున్నావు.. ఇదేం సైకోయిజం బాబూ 10. వాలంటీర్లపై నిమ్మగడ్డ, రామోజీలతో కుట్ర చేసి అవ్వాతాతల ఉసురుపోసుకుంటున్నావు.. ఇదేం సైకోయిజం బాబూ -
ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడం ఏపీలోనే..
సాక్షి, అమరావతి: ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో మరెక్కడా లేదని, ఇలా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను తీసుకెళ్లడం చాలా మంచి పని అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పెన్షన్లు పంపిణీ చేయకుండా వలంటీర్లపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) గత నెల 30న జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో జోక్యానికి నిరాకరించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, వృద్ధులు, రోగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇళ్లకే వెళ్లి పింఛన్లు అందచేసే ఏర్పాట్లు చేశామన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనను పరిగణనలోకి తీసుకుంది. ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో తమ జోక్యం అవసరం లేదంది. ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్ను) కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల్లో క్యూలో నిల్చుకుని పెన్షన్ తీసుకోవాల్సి వస్తోంది పెన్షన్లు పంపిణీ చేయకుండా వలంటీర్లపై నిషేధం విధిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను చట్ట విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా, కుంచెనపల్లి, మున్నంగికి చెందిన వంగా వరలక్ష్మి, వంగా బిందు, అల్లు సునీత దాఖలు చేసిన పిల్పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల సంఘం ఉత్తర్వుల కారణంగా పెన్షనర్లు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి క్యూలో నిల్చుని పింఛన్లు తీసుకోవాల్సి వస్తోందన్నారు. పక్షవాతం, కిడ్నీ తదితర రోగాలతో బాధపడే వారు పింఛను పొందలేని పరిస్థితి ఉందన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ప్రత్యామ్నాయల సంగతి ఏమిటని, దేశవ్యాప్తంగా ఎలాంటి విధానం అమలవుతోందని ఆరా తీసింది. ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం ఈ రాష్ట్రంలో తప్ప ఎక్కడా లేదని, ఇది మంచి పని అని వ్యాఖ్యానించింది. ► కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ స్పందిస్తూ, తమ ఆదేశాల మేరకు పెన్షనర్లు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందన్నారు. వృద్ధులు, రోగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇళ్లకే వెళ్లి పింఛన్లు ఇచ్చేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. మిగిలిన వారు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్లు పొందేలా ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఈ మేరకు ఈ నెల 2న మెమో జారీ చేసిందని తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సంతృప్తి చెందామని ధర్మాసనం తెలిపింది. అలా అయితే తాను లేవనెత్తిన అంశాలన్నింటినీ రికార్డ్ చేయాలని, తరువాత తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని శివప్రసాద్రెడ్డి చెప్పారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండని శివప్రసాద్ను ధర్మాసనం కోరింది. పెన్షన్లు పంపిణీ చేయకుండా వలంటీర్లపై నిషేధం విధిస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు ఏకపక్షమని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సంప్రదించకుండానే నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. రాజకీయ దురుద్దేశాలతోనే నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో పనిచేసే సిటిజన్ ఫర్ డెమొక్రసీ ఎన్నికల సంఘం వద్ద పిటిషన్ దాఖలు చేసిందన్నారు. గతంలో ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేశారని తెలిపారు. శివప్రసాద్ వాదనలు విన్న ధర్మాసనం.. పిల్ను కొట్టేస్తున్నట్లు తెలిపింది. దేశంలో మిగిలిన అన్ని చోట్లా ప్రజలే వెళ్లి పెన్షన్లు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఇదే అంశంపై మరో ఐదుగురు కూడా పిటిషన్ దాఖలు చేశారని మరో న్యాయవాది చెప్పగా, ఆ వ్యాజ్యాన్ని కూడా కొట్టేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. -
పండుటాకులు విలవిల
సాక్షి నెట్వర్క్: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిల కుట్రలతో అవ్వాతాతలు విలవిలలాడుతున్నారు. ఎన్నికల సంఘంపై తమ అనుకూలురుతో ఒత్తిడి తెచ్చి పింఛన్ల పంపిణీ చేయనీయకుండా వలంటీర్లను ఈ ముగ్గురు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో అవ్వాతాతలు, ఇతర పింఛన్ లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వలంటీర్ల ద్వారా ప్రతినెలా 1నే లబ్దిదారులు ఇళ్ల వద్దే ప్రభుత్వం పింఛన్ అందిస్తుండగా ఈసారి టీడీపీ, జనసేన కుతంత్రాలతో సచివాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ప్రస్తుతం ఎండా కాలం కావడంతో వేసవి తాపానికి వడదెబ్బ కొట్టి మృత్యువాత పడుతున్నారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 20 మంది పింఛన్ లబ్దిదారులు మృత్యువాత పడటం విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబీకులు చంద్రబాబు వ్యవహార శైలిపై మండిపడ్డారు. ఆయన వల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉసురు చంద్రబాబుకు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. చేయాల్సిందంతా చేసి టీడీపీ నేతలు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. ఒక్కరోజే 20 మంది మృత్యువాత అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లెకు చెందిన ఎన్.రాజమ్మ (85) సచివాలయం వద్దకు నడిచి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో రాయి కాలుకు తగిలి ముందుకుపడి మృతి చెందింది. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం గొల్లవాండ్లపల్లిలో టీడీపీ కుట్రలతో ఆందోళనకు గురైన దుగ్గిలమ్మ(70) అనే వృద్ధురాలు మృతిచెందింది. అలాగే గుండెపోటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం మద్దులచెర్వులో చోటు చేసుకుంది. అదేవిధంగా కొండకమర్ల పంచాయతీ పోలేవాండ్లకొత్తపల్లిలో సన్నాయప్ప (73) తన భార్య పింఛన్ కోసం ఎండలో నడుచుకుంటూ వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత వడదెబ్బకు గురై మృతి చెందాడు. సూళ్లూరుపేట సాయినగర్లో ఈశ్వరవాక లలితమ్మ (58) వితంతు పింఛను కోసం గాండ్లవీధి సచివాలయం వద్ద క్యూలో నిలబడి ముందుకు పడిపోయి ప్రాణాలు విడిచింది. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం ఎరికంబట్టు దళితవాడకు చెందిన అప్పాస్వామి(75) పెన్షన్ కోసం ఇంటి బయటే మంచంపై ఎదురు చూస్తూ ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురై మరణించాడు. అలాగే చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం మండలం నెరబైలుకు చెందిన నన్నేసాహెబ్ (76) పింఛన్ కోసం వెళ్లి సచివాలయం వద్ద కుర్చిలో కుప్పకూలిపోయాడు. హుటాహుటిన సచివాలయం వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు నన్నేసాహెబ్ను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఘడియపూడి పునరావాస కాలనీలో బొమ్మల శేషయ్య (70) పింఛన్ కోసం సచివాలయానికి వెళ్లి ఇంటికి చేరుకుని భోజనం చేసి నీరసంగా పడుకున్నాడు. సాయంత్రం 5 గంటల సమయంలో కుటుంబ సభ్యులు లేపడానికి ప్రయత్నించగా విగత జీవుడై ఉన్నాడు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్ళపల్లికి చెందిన బుర్ర శామ్యూలు (71) గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. అలాగే గుంటూరు జిల్లా కొల్లిపరలో దొప్పలపూడి బాబూరావు (62) వ్యవసాయ కూలీ. ఈ క్రమంలో పింఛన్ కోసం సచివాలయానికి వెళ్లిన బాబూరావు తిరిగొస్తూ ఇంటికి సమీపంలో కుప్పకూలిపోయి మరణించాడు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరుకు చెందిన సయ్యద్ ఖాదర్బాషా బోదకాలుతో బాధ పడుతున్నాడు. ఈసారి సచివాలయం వద్ద ఇస్తారని తెలిసి కుమారుడి బైక్పై అక్కడకు వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగొచ్చాక అస్వస్థతకు గురై మృతిచెందాడు. కాకినాడ జిల్లా తూరంగి పగడాలపేటకు చెందిన అడపా వీర్రాజు (67) పింఛన్ కోసం సచివాలయం వద్దకు వెళ్లాడు. తిరిగి వస్తూ మార్గమధ్యంలో కళ్లు తిరగడంతో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే స్థానికులు వీర్రాజును ఇంటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. అలాగే ఏటిమొగ ప్రాంతానికి చెందిన పట్టా అప్పారావు(61) సమీపంలోని సచివాలయానికి వెళ్లాడు. ఎండ తీవ్రతతో సచివాలయం దగ్గరే స్పృహ తప్పాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఏటిమొగలోని రాజీవ్ గృహకల్ప సముదాయానికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలికి చెందిన పిల్లి నాగేశ్వరమ్మ (75) కిలోమీటరుకు పైగా దూరంలో ఉన్న సచివాలయానికి కాలినడకన బయలుదేరింది. కొంత దూరం నడిచి ఆయాసంతో పడిపోయి మృత్యువాత పడింది. పల్నాడు జిల్లా దుర్గి మండల పరిధిలోని నెహ్రూనగర్ తండాకు చెందిన రమావత్ సాలిబాయి (70) పెన్షన్ కోసం ముటుకూరు 2 సచివాలయానికి ఆటోలో వెళ్తుండగా దారి మధ్యలో సొమ్మసిల్లి కుప్పకూలింది. ఆమెను ముటుకూరు పీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లె పంచాయతీ దిగువతొట్లివారిపల్లె గ్రామానికి చెందిన టి. మంగమ్మ(68) ఇంట్లోనే ఉన్నట్టుండి హఠాత్తుగా కుప్పకూలిపోయి మృతి చెందింది. పింఛన్ కోసం ఎండలో వెళ్లి వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఆనందపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు రాజుబాబు (48) పింఛన్ కోసం పంచాయతీ కార్యాలయానికి ఎండలో వెళ్లాడు. దీంతో వడదెబ్బకు గురికావడంతో ఇంటికి వచ్చాక తీవ్ర అస్వస్థతకు లోనై మృతి చెందినట్లు ఆయన భార్య సీత తెలిపింది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ వేలమామడికి చెందిన పాడి సొములు(65) పింఛన్ కోసం పెదకోట సచివాలయానికి నడుచుకుని వెళుతుండగా జాలడ గ్రామ సమీపంలో ఆయాసం రావడంతో కూర్చొన్నాడు. అదే సమయంలో సొమ్మసిల్లిపోవడంతో మృత్యువాత పడ్డాడు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన పింఛన్ లబ్దిదారుడు పాతకోకిల పెద్దిరాజు (63) పింఛన్ ఇస్తున్నారని తెలిసి సచివాలయానికి బయలుదేరాడు. తీవ్ర ఉద్వేగానికి గురైన పెద్దిరాజు ఇల్లు దాటి వెళుతుండగా కొద్దిదూరంలో కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. చేతులు విరిగి.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొర్లకుంట సచివాలయానికి పింఛన్ తీసుకునేందుకు వెళ్లిన పోలి తులసమ్మ అనే వృద్ధురాలు తిరిగి వస్తూ కింద పడటంతో చేయివిరిగింది. ప్రకాశంజిల్లా ముండ్లమూరు మండలం వేంపాడుకు చెందిన గ్రంధి మరియమ్మ (71) పింఛను నగదు కోసం ముండ్లమూరు సచివాలయానికి వెళ్లింది. మండుటెండలో ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్ సెంటరుకు వచ్చింది. ఆటో ఎక్కే క్రమంలో ఎండధాటికి సొమ్మసిల్లి కింద పడిపోయింది. ఈ క్రమంలో ఆమె మూతికి, పెదాలకు తీవ్రగాయాలయ్యాయి. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన పరుచూరి కృష్ణకుమారి (74) గుండెపోటుకు గురయ్యారు. చల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన పొన్న సుబ్బారావు అనే వృద్ధుడు పింఛను కోసం గ్రామ సచివాలయానికి వెళుతూ మార్గమధ్యంలో స్పృహ తప్పి పడిపోయారు. పింఛన్ తీసుకోవాలంటే 30 కి.మీ వెళ్లాల్సిందే టీడీపీ నేతల నిర్వాకంతో వలంటీర్లు ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో గిరిజనులు అల్లాడుతున్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం చెన్నపాలెం గ్రామం గారపెంట పంచాయతీలో ఉండగా దాని సచివాలయం పుల్లలచెరువులో ఉంటుంది. పుల్లలచెరువు నుంచి చెన్నపాలెం గిరిజనగూడెం వెళ్లాలంటే రానుపోను కలిపి 30 కి.మీ దూరం. ఇప్పటి వరకు వలంటీర్లు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ ఇస్తున్నారు. ఈనెల వలంటీర్లు రాకపోవడంతో కదలలేని స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులు కూడా సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవాల్సి వచ్చింది. మండుటెండలో అంతదూరం వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి కల్పించారంటూ వృద్ధులు, వికలాంగులు టీడీపీ నేతలపై మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల డ్రామాలు ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డ్రామాలు మొదలుపెట్టారు. బుధవారం పట్టణంలోని సచివాలయాల వద్దకు వచ్చి పింఛన్ల పంపిణీకి సంబంధించి టీడీపీ వల్ల ఎలాంటి తప్పు జరగలేదని చెప్పి వృద్ధులను నమ్మించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఇలా ఎందుకు కూర్చోబెట్టారు అంటూ సచివాలయ ఉద్యోగులను ప్రశ్నించారు. సచివాలయం బయటకు వచ్చి పింఛన్దారులతో మాట్లాడుతూ ఇంకా పింఛన్ డబ్బులు రాలేదు కానీ టీడీపీ వల్లే పింఛన్లు ఇంటికి రావడం లేదని అంటున్నారన్నారు. ఎమ్మెల్యే నిమ్మల వెళ్లిపోయిన తర్వాత అక్కడున్న పింఛన్దారులంతా ఇంటికి పింఛన్లు రాకుండా ఈ టీడీపీ నాయకులే అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వైఖరిపై పింఛన్దారుల ధర్నా పింఛను పంపిణీ విధానంపై చంద్రబాబు వైఖరి పట్ల లబ్దిదారులు నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడులో సచివాలయం వద్ద పింఛనుదారులు బుధవారం ధర్నా నిర్వహించారు. ప్రతి నెల వలంటీర్ల ద్వారా ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ల కార్యక్రమాన్ని అడ్డుకున్న చంద్రబాబు వైఖరి నశించాలని నినాదాలు చేశారు. పాత పద్ధతిలో వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా గంగూరులో ‘బోడె’ శవ రాజకీయం టీడీపీ, జనసేన కుట్రలతో ఈసారి పింఛన్ ఇవ్వటానికి వలంటీర్ లేకపోవటంతో కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో వెంపటి వజ్రమ్మ (80)గుండెపోటుకు గురై మరణించింది. గంగూరు ఏఆర్ నగర్ కాలనీలో ఉంటున్న వజ్రమ్మ గంగూరు 2 సచివాలయానికి పింఛన్ సొమ్ము కోసం వెళ్లగా బ్యాంకు నుంచి సొమ్ము రావాలని, సాయంత్రం పింఛన్ ఇస్తామని చెప్పడంతో తిరిగి ఇంటికి వచ్చింది. సచివాలయం నుంచి ఇంటికి వచ్చిన కొద్ది క్షణాలకే గుండెపోటుకు గురై మృత్యువాత పడింది. మరోవైపు చేయాల్సిందంతా చేసి డ్రామాలకు టీడీపీ నేతలు తెరలేపారు. వజ్రమ్మ మృతిని శవ రాజకీయం చేయాలని టీడీపీ నేతలు యత్నించగా స్థానిక మహిళలు తీవ్ర అభ్యంతరం తెలిపి తిప్పికొట్టారు. వజ్రమ్మ మృతి సమాచారం తెలుసుకున్న రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి, పెనమలూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి జోగి రమేష్ బాధితురాలి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వజ్రమ్మకు నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. కాగా.. మంత్రి అక్కడ ఉన్న సమయంలోనే టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ కూడా తన అనుచరులతో రావటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మంత్రి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న సమయంలో టీడీపీ అభ్యర్థి బోడెప్రసాద్, అతని అనుచరులు కల్పించుకుని జగన్ పింఛన్ ఇవ్వకపోవటంతోనే వజ్రమ్మ మరణించిందంటూ ఆరోపించారు. బోడె ప్రసాద్ వ్యాఖ్యల పట్ల మహిళలు అభ్యంతరం తెలిపారు. వజ్రమ్మ మరణాన్ని శవ రాజకీయం చేయాలని టీడీపీ నేతలు చేసిన యత్నాన్ని లబ్ధిదారులే తిప్పికొట్టారు. వలంటీర్లు పింఛను ఇస్తే చంద్రబాబుకు బాధ ఏంటని బోడె ప్రసాద్ను మహిళలు, పింఛన్ లబ్ధిదారులు ప్రశ్నించారు. జగనన్న పాలనలో ప్రతి నెల వేకువజామునే వలంటీర్లు ఇళ్లకు వచ్చి పింఛన్ ఇస్తుంటే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట అని మండిపడ్డారు. వజ్రమ్మ అన్యాయంగా చనిపోయిందని, ఇప్పుడు పరామర్శించడానికి వచ్చారా అని నిలదీశారు. ఒక్కసారిగా మహిళలు తిరగబడటంతో టీడీపీ నేతలు వెనక్కి తగ్గారు. -
చంద్రబాబు.. ఇప్పుడెందుకు నోరు మెదపవు?
అవ్వతాతలకు పెన్షన్ అందకుండా కుట్ర చేశారు.. ముసలి వాళ్లు, వికలాంగుల కన్నీళ్లపై నోరు మెదపరు.. నిమ్మగడ్డ, ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నావు.. చంద్రబాబు.. ఇప్పుడెందుకు నోరు మెదపవు? రామోజీ.. అవ్వాతాతల కష్టాలు ఎందుకు రాయవు? చేసిదంతా చేసి ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్. అవ్వాతాతల రియాక్షన్ చూసి బాబు సైలెంట్ అయిపోయాడా? పింఛన్ దారులకు సమాధానం చెప్పలేక ఎల్లో ముఠా నోరు మూతబడిందా? గత ఇదిలా ఉండగా నాలుగున్నరేళ్లుగా ప్రతి నెలా 1నే వలంటీర్ల ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే అందిస్తున్న పింఛన్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బాబుతో సన్నిహితంగా వ్యవహరించే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిపోయింది. పింఛన్ల పంపిణీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలులో గ్రామ, వార్డు వలంటీర్లను దూరం చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పక్కన పెట్టడం.. సచివాలయాలకే వెళ్లి పింఛన్ పొందాల్సి రావడంతో అవ్వాతాతలు, దివ్యాంగులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. చంద్రబాబు అండ్ కో కుటిల రాజకీయాలకు వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతు అక్కచెల్లెమ్మలు మండుటెండల్లో రోడ్లపై నిలబడాల్సి వచ్చింది. ఈ ఉదంతంతో పేదలంటే చంద్రబాబుకు ఎంత వ్యతిరేకత ఉందో మరోసారి స్పష్టమైంది. చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్తామంటున్నారు పెన్షనర్లు. అదేదో సినిమాలో డైలాగు లాగా... వాడు ఎక్స్ దొంగ.. ఎప్పుడు దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ..! అన్నట్టుగా సేమ్ టు సేమ్ పాలిటిక్స్ లోనూ చంద్రబాబు ఇంతే..! కుట్రలు, కుతంత్రాలు చేయడం.. నిమిషంలో దొరికిపోవడం. వాలంటీర్ల విషయంలో ఇదే చేశాడు. అడ్డంగా బుక్కయ్యాడు. ఇప్పుడు చేయి నోటికి అడ్డంగా పెట్టుకుని సైలెంట్ అయ్యాడు. నిమ్మగడ్డను కలుగులో దాక్కోమని చెప్పాడు. ఎల్లో మీడియాను జగన్ పై రివర్స్ అటాక్ చేయమన్నాడు. దత్తపుత్రుడ్ని హైదరాబాద్ పోయి ఆసుపత్రి బెడ్పైకి పడుకోమన్నాడు. నాకర్థం కాదు.. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్లంటే.. చంద్రబాబు ఆయన పచ్చ ముఠాకు ఎందుకంత కోపం.. ఎందుకంత కసి.. ఎందుకంత కక్ష.. వాళ్ల నోటి దగ్గర కూడు లాగేసుకుని రాక్షసానందం పొందాలని ఎందుకు అనుకుంటున్నారు. చంద్రబాబు ముఠా ఎన్ని కుట్రలు చేసినా.. ప్రభుత్వం మాత్రం ఆ 66 లక్షల మందికి పెన్షన్లు అందించేందుకు వేరే మార్గాలు అన్వేషించింది.. పెన్షన్లు ఇవ్వడం ప్రారంభించింది. సచివాలయాలకు రాలేని వారికి ఇంటికే వెళ్లి పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చింది. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థతో రాష్ట్రం రూపురేఖలనే జగన్ మార్చేశారు. జగన్కు వస్తున్న మంచి పేరు చూసి తట్టుకోలేక కోర్టుల్లో కేసుల మీద కేసులు వేసి.. ఈసీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు ఇచ్చి.. ఆఖరికి అవ్వాతాతలకు వాలంటీర్లు ఫించన్లు ఇవ్వకూడదన్న ఆర్డర్ తెచ్చుకున్నారు. దాని ఫలితం ఏ రకంగా ఉంటుందో.. అవ్వాతాతల శాపనార్థాలు ఏ స్థాయిలో ఉంటాయో.. ఈరోజు పచ్చ ముఠాకు అర్థమైంది. దెబ్బకు ఠా దొంగల ముఠా అన్నట్టుగా.. ఎక్కడి దొంగలు అక్కడే సైలెంట్ అయిపోయారు. అయినా సరే అవ్వాతాతల కన్నీళ్లకు కారణమైన 74 ఏళ్ల కుప్పం తాత.. 87 ఏళ్ల ఎల్లో తాత.. ప్రజలు అడుగుతున్న ఈ పది ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. 1. జగన్ ను నేరుగా ఎదుర్కోలేక అడ్డదారిలో నిమ్మగడ్డను తెరపైకి తెచ్చావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 2. పేదలకు పింఛన్ల అందకుండా నిమ్మగడ్డకు పసుపు ముసుగు తొడిగి ఈసీ వద్దకు పంపించావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 3. నిమ్మగడ్డతో సుప్రీం కోర్టులో, ఢిల్లీ హైకోర్టులో, ఏపీ హైకోర్టులో వరుస కేసులు వేయించావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 4. జగన్ నా మనవడు.. నా కొడుకు అంటున్న అవ్వాతాతలపై కక్ష తీర్చుకున్నావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 5. సంక్షేమంతో సుఖంగా ఉన్న వికలాంగులు, వితంతువులపై పగ తీర్చుకున్నావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 6. ఎర్రటి ఎండలోకి వృద్ధులను లాగి పచ్చమూక పైశాచికానందం పొందుతోందా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 7. పింఛన్ వస్తుందో రాదోనన్న భయంతో తాత చనిపోతే తేలు కుట్టిన దొంగల్లా ఉన్నారా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 8. నీ కుట్రలు, కుతంత్రాలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో నిమ్మగడ్డను కలుగులో దాక్కోమన్నావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 9. వాలంటీర్లు ఫించన్లు అందించకూడదంటూ ఈసీకి ఫిర్యాదు చేయించింది నేనే అని చెప్పలేకపోతున్నావా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు 10. అవ్వాతాతలు నిలదీస్తారని పవన్ హైదరాబాద్ పారిపోయి హాస్పిటల్ బెడ్ పై పడుకుని నటిస్తున్నాడా లేదా.. నీ 74 ఏళ్ళ గుండెపై ఒట్టేసి నిజం చెప్పు చంద్రబాబు -
నంద్యాలలో 27 మంది వాలంటీర్లు రాజీనామా
-
TDP కుతంత్రాలను ఛీకొడుతున్న అవ్వాతాతలు
-
సరిదిద్దుకోలేని తప్పు చేశావ్ చంద్రబాబూ..!
-
కుట్ర ఫలించి.. గడప దాటించి!
చంద్రబాబు అండ్ కో కుట్ర ఫలించింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదనే పంథాన్ని నెగ్గించుకున్నారు. ఫలితంగా పింఛన్దారులకు పింఛన్ కష్టాలు పునరావృతం కానున్నాయి. తెలుగుదేశం నేతలు, చంద్రబాబు అనుంగు శిష్యుడు నిమ్మగడ్డ రమేష్ ఒకవైపు కోర్టుల్లో వలంటీర్లపై కేసులు వేయడం.. మరోవైపు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేయడం తెలిసిందే. దీంతో వలంటీర్లను పింఛన్ల పంపిణీకి ఎన్నికల కమిషన్ దూరం పెట్టి సచివాలయాల ద్వారా పంపిణీకి అనుమతి ఇచ్చింది. ఐదేళ్లుగా ఇంటి వద్దే పింఛను అందుకుంటున్న లబి్ధదారులు టీడీపీ కుట్రతో మొదటిసారి గడప దాటాల్సి రావడం గమనార్హం. కర్నూలు(అగ్రికల్చర్): ఈనెల 3 నుంచి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించి 4,69,789 పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.140,15,56,500 బ్యాంకులకు విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాలకు పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో సచివాలయాల అడ్మిన్ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు బ్యాంకుల నుంచి బుధవారం నగదు డ్రా చేయనున్నారు. వీలైనంతవరకు బుధవారమే పంపిణీ చేసే విధంగా ఆదేశాలు జారీ అయినా గురువారం నుంచి పూర్తి స్థాయిలో పింఛన్ల పంపిణీ మొదలవుతుంది. కర్నూలు జిల్లాలో 672, నంద్యాల జిల్లాలో 516 సచివాలయాల్లో పించన్ల పంపిణీ జరుగుతుంది. 6వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో 2,46,863 పింఛన్లకు రూ.73.90 కోట్లు, నంద్యాల జిల్లాలో 2,22,935 పింఛన్లకు రూ.66.24 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. దాదాపు ఐదేళ్ల పాటు వలంటీర్లు ప్రతి నెలా 1వ తేదీనే పింఛన్దారుల ఇళ్లకు వెళ్లి సొమ్ము అందజేసేవారు. దీంతో పింఛన్దారులు వలంటీర్లను గుండెల్లో పెట్టుకున్నారు. ఎలాంటి చీకూచింతా లేకుండా పింఛన్ పొందుతున్న వారికి పచ్చ కూటమి కారణంగా మళ్లీ కష్టాలు వచ్చి పడ్డాయి. బ్యాంకుల నుంచి నగదు డ్రా చేయాల్సి ఉన్నందున మొదటి రోజు పంపిణీలో జాప్యం జరుగుతుంది. 5, 6 తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. లబ్ధిదారుల్లో ఆందోళన ప్రస్తుతం ఉష్ణోగ్రతలు దాదాపు 44 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇంతటి తీవ్రమైన ఎండల్లో పింఛన్దారులు కిలో మీటర్ల దూరంలోని గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు 4.70 లక్షల మందికి కష్టాలు తెచ్చిపెట్టిన టీడీపీపై పింఛన్దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటికే పింఛన్ పంపితే... చంద్రబాబు మళ్లీ పాత పద్ధతిలో సచివాలయాల చుట్టూ తిప్పేలా చేశాడని పింఛన్దారుల్లో ఆందోళన వెల్లువెత్తుతోంది. సచివాలయంలో 10 మంది వరకు ఉద్యోగులు ఉంటారు. అందరికీ పింఛన్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. పింఛన్ల పంపిణీ ముగిసే వరకు సచివాలయాల వద్ద షామియానాలు వేయడంతో పాటు నీటి సదు పాయం కలి్పంచేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వీరికి ఇంటి వద్దే పంపిణీ ► ఉమ్మడి జిల్లాలో 4.69 లక్షల పింఛన్లు ఉండగా... ఇందులో వికలాంగులు, వయోవృద్ధులు (నడవలేని వారు), మంచానికే పరిమితమైనవారు, కిడ్నీ, డయాలసిస్ పేషెంట్లకు ఇంటి వద్దే సచివాలయ ఉద్యోగులు పింపిణీ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ► ఇటువంటి వారు దాదాపు 30–40 శాతం మంది ఉంటారు. ► సచివాలయాలకు దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీకి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ► సచివాలయాల్లేని మజరా గ్రామాల్లో పింఛన్ల సంఖ్య ఆధారంగా ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ► ఒకవైపు 30–40 శాతం మందికి ఇంటి వద్ద.. మిగిలిన వారికి సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ చేయనుండటం గందరగోళానికి దారితీసే పరిస్థితి ఏర్పడింది. బాబు ఎంత పని చేశావయ్యా.. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదేళ్లూ ఎప్పుడూ పింఛన్ కోసం ఆలోచించలేదు. ఠంచన్గా ప్రతి నెల 1వ తేదీన వలంటీర్లు ఇంటికొచ్చి ఇచ్చారు. చంద్రబాబు చేసిన పనికి పింఛన్ తీసుకునే వాళ్లంతా ఇప్పడు భయపడుతున్నారు. మా లాంటి వారికి ఇంటికొచ్చి ఎవరు వస్తారో తెలియదు. ఎవరినీ అడగాలో అర్థం కావడం లేదు. చంద్రబాబుకు ముసలోళ్ల మీద దయలేదు. –కరీంబీ, డబ్ల్యూ.గోవిందిన్నె, దొర్నిపాడు మండలం లైన్లో ఎండకు ఎంత సేపు నిలవాలనో.. నాకు వితంతు పింఛన్ వస్తుంది. ప్రతి నెలా వలంటీర్లు తెల్లవారుజూమున ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చారు. కానీ ఈ నెల ఒకటవ తేదీ వచ్చింది కానీ పింఛను అందలేదు. వలంటీర్ను అడిగితే సచివాలయానికి రావాలని చెబుతున్నారు. అందరూ అక్కడికి పోతే పెద్ద లైన్లో ఎండకు ఎంత సేపు నిలవాలనో తెలియడం లేదు. కూలీకి వెళ్లకుండా పింఛన్ కోసం వెళ్లాల్సి వస్తుంది. చంద్రబాబు మాలాంటి పేదల మీద ఎప్పుడూ ఏడుస్తుంటాడు. – తెలుగు వెంకట లక్ష్మమ్మ, గిద్దలూరు గ్రామం, సంజామల మండలం మా ఉసురు తగులుతుంది టీడీపీ పాలనలో పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయలేదు. అప్పట్లో పంచాయతీ కార్యాలయం వద్ద వారాల కొద్ది ఎదురు చూసేటోళ్లం. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ ద్వారా ఒకటో తేదీ తెల్లవారుజామున ఇంటి వద్దకు పింఛన్ ఇచ్చి పంపుతున్నాడు. పింఛన్లు వలంటీర్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకోవడం దారుణం. చంద్రబాబుకు ఓటు వేసే ప్రసక్తే లేదు. మా ముసలోళ్ల ఉసురు ఆయనకు తగులుతుంది. – బోయ నరసమ్మ, నాగలదిన్నె, నందవరం మండలం -
చంద్రబాబు ఏ స్థాయికి దిగజారిపోయాడో ఆలోచించండి: సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: చంద్రబాబు డ్రామాలు.. దిగజారుడుతనంపై ప్రజలు ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ‘‘2014లో చంద్రబాబు సంతకం చేసి ఇంటింటికీ పంపిన మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కానీ ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో దత్తపుత్రుడు, మోదీ గారితో కలిసి చంద్రబాబు మరో డ్రామాకి తెరదీస్తున్నాడు’’ అని ఎక్స్ వేదికగా సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అదే ఎక్స్ లో మరో ట్వీట్ చేసిన జగన్.. ‘‘లక్షల మంది అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకి ప్రతి నెలా ఒకటో తారీఖున చేతికి పెన్షన్ ఇచ్చే వలంటీర్లు.. ఏప్రిల్ 1 నుంచి ఇవ్వ డానికి వీల్లేదని చంద్రబాబు ఆయన మనుషుల చేత ఈసీకి ఫిర్యాదు చేయించి ఆదేశాలిప్పించాడు. చంద్రబాబు ఏ స్థాయికి దిగజారిపోయాడో ఆలోచించండి’’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వలంటీర్ లపై ప్రతిపక్షాల వ్యూహం ఓటమికి చంద్రబాబు సిద్ధం
-
పండుటాకులపై పగా?
‘మేం ఏం పాపం చేశాము. మాపైన వాళ్లకు ఎందుకంత పగ. వలంటీర్లపై కక్షగట్టి మా నుంచి దూరం చేశారు. ఒకటో తేదీ తెల్లవారేసరికి ఇంటికొచ్చే పెన్షన్ని రానీయకుండా చేశారు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. మళ్లీ మేము క్యూల్లో నిలబడాలా..?. మండుటెండల్లో సొమ్మసిల్లి పడిపోవాలా..?. పనులు మానుకుని.. ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరీక్షించాలా..?’ అంటూ పెన్షన్ దారులు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబునాయుడు అండ్ కో.. వలంటీర్లపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల కమిషన్ వారిని సంక్షేమ పథకాల నుంచి మినహాయించింది. లబి్ధదారులకు ఒకటో తేదీ అందాల్సిన పెన్షన్ అందకుండా పోయింది. దీంతో లబి్ధదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. గుడ్డివారి గోష్ట టీడీపీకి తగులుతుంది నాకు కంటి చూపులేదు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే మనిషి తోడుకావాలి. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యాన ఇంటి వద్దనే ప్రతినెలా ఒకటవ తేదీ గ్రామ వలంటీర్ ద్వారా పింఛన్ అందుకునేదాన్ని. తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని ఈ నెల నుంచి ఎన్నికల సాకు చూపి వలంటీర్లను ప్రభుత్వ సేవల నుంచి పక్కన పెట్టడం దురదృష్టకరం. నా లాంటి కంటిచూపు లేని వాళ్లు ఎక్కడో ఉన్న సచివాలయం వద్దకు వెళ్లి క్యూలో నిలబడి పింఛన్ ఎలా తీసుకోవాలి..?. మాలాంటి వారి గోడు తప్పక తెలుగుదేశం పార్టీకి తగులుతుంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి కష్టాలు ఎన్నో పడ్డాము.గత 58 నెలలు ఆ బాధల నుంచి జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని విముక్తి లభించింది. మళ్లీ వలంటీర్ల ద్వారానే పింఛన్ సొమ్ము ఇంటి వద్దకు వచ్చి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. –నాగమ్మ, వెంగారెడ్డికండ్రిగ, వరదయ్యపాళెం మండలం లేవలేని స్థితిలో ఉన్నా నాకు రెండు సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి కదల్లేక మంచానికే పరిమితమైనాను. నెలనెలా వచ్చే పింఛనుపైనే మందులుమాకులు ఇతరులతో చెప్పి తెప్పించుకునేవాడిని. ప్రతినెలా ఒకటో తారీఖున వలంటీర్ నిద్రలేపి నా వేలిముద్ర తీసుకుని ఇంటివద్దనే పింఛన్ ఇచ్చేవాడు. ఈ రోజు(సోమవారం) పింఛన్ ఇవ్వలేదు. సచివాలయానికి వెళ్లి తెచ్చుకోమంటున్నారు. నేను అంత దూరం వెళ్లి పింఛన్ ఎలా తెచ్చుకునేది..?. ఏ పుణ్యాత్ముడో ఫిర్యాదు చేసి నాలాంటి వారి ఉసురు పోసుకున్నాడు. పింఛన్ ఇంటికి రాకుండా చేశారు. నేను సచివాలయానికి వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే నలుగురిని మంచంపై సచివాలయం వద్దకు మోసుకెళ్లాలి. అదే వలంటీర్ అయితే ఇంటివద్దకే వచ్చి ఇచ్చిపోయుండేవాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఏ దిగులూ లేకుండా ఉండేది. ఇప్పుడు ఇంటికాడికి తెచ్చి ఇవ్వకపోయినా ఆయన చేసిన మేలు మరిచిపోతామా?. – గోవిందనాయుడు, కుప్పంబాదూరు గ్రామం, రామచంద్రాపురం టీడీపీ పాలనలో అష్టకష్టాలు..మళ్లీనా? వాకాడు మండలం, ఇన్నమాల గ్రామానికి చెందిన పోలయ్య వయసు 91, చేను చెంగమ్మ వయసు 85, ఇన్నమాల సుబ్బమ్మ వయసు 86, బండి వెంకటసుబ్బయ్య వయసు 78. వీరి వలంటీర్లు ఉమ్మడి మోహన్, పీ.సులోచన, అఖిల కవిత. సోమవారం ఒకటో తేదీ కావడంతో వారి రాకకోసం ఎదురు చూశారు. కొత్త వ్యక్తులు ఎవరు కనిపించినా నాయనా.. మీరు మాకు పింఛన్ ఇచ్చే వారా?.. అయితే నా పేరు ఫలానా.. నాకు పింఛన్ ఇవ్వండి’ అని అడిగి మరీ నిరాశ చెందారు. తెల్లవారు జాము నుంచి అవ్వాతాతలు వీ«ధి కాలవలపై కూర్చుని పింఛన్ కోసం ఎదురు చూసి నిట్టూర్పుతో వెనుదిరిగారు. చంద్రబాబు పుణ్యమా అంటూ మరో మూడు నెలలు పింఛన్ ఇంటికి రాదని సమాచారం తెలుసుకున్న అవ్వాతాతలు మాకు పింఛన్ రాకుండా చేసిన చంద్రబాబు, వారి మనుషులు మట్టి కొట్టుకుపోతారని శాపనార్థాలు పెట్టారు. వాకాడు మండలం, గొల్లపాళెం గ్రామ వీధిలో కూర్చుని ఎదురు చూస్తున్న అవ్వాతాతలు వాకాడు మండలం, గొల్లపాళెం గ్రామ వీధిలో కూర్చుని ఎదురు చూస్తున్న అవ్వాతాతలు బాబు కుట్రలకు బలైపోయాం టీడీపీ హయాంలో పింఛన్ వచ్చే వరకు ప్రతిరోజూ అవస్థలే. ఎప్పుడు..? ఎక్కడిస్తారో తెలియని పరిస్థితి. పంచాయతీ, పోస్టల్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ కష్టాల నుంచి వృద్ధులను, వితంతువులను గట్టెక్కించారు. వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామ వలంటీర్ ద్వారా ప్రతినెలా ఒకటో తేదీనే మా ఇంటికే వచ్చి పింఛన్ ఇస్తున్నారు. అనారోగ్య కారణంతో మంచానికే పరిమితమైన నాలాంటి వారికి ఈ పద్ధతి ఎంతో ఊరటనిచ్చింది. ఇప్పుడు మళ్లీ సచివాలయాలకు వెళ్లి పింఛన్ తీసుకునే పరిస్థితులు ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. నేను సచివాలయానికి వెళ్లాలంటే అద్దె ఆటో కావాలి. దానికి తోడు నా వెంట మరో వ్యక్తి సహాయం అవసరం. ఇంట్లో వారు సైతం పనులు మానుకుని నా వెంట రావాల్సిన పరిస్థితి. వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేసే దాంట్లోనూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయం చేయడం సరైన పద్ధతి కాదు. నాలాంటి వృద్ధులు, వితంతువులు, ప్రత్యేక ప్రతిభావంతులు టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాలకు ఓటుతో బుద్ధి చెబుతాం. –మాచాలమ్మ, పెద్ద పాండూరు, వరదయ్యపాళెం మండలం మేమంటే బాబుకు ఎందుకంత కక్ష గతంలో వెయ్యి రూపాయల పింఛన్ కోసం మండుటెండల్లో కిలోమీటరు పొడవున ఉండే క్యూలో నిలబడేదాన్ని. నా మనవడు జగన్ వచ్చాక ఆ పరిస్థితి లేదు. నాకు ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారు జామున్నే మా వలంటీర్ సులోచన ఇంటికొచ్చి తలుపుతట్టి పింఛన్ ఇచ్చేది. ఈనెల ఒకటోతేదీ వచ్చినా మా వలంటీర్ ఇంటికి రాలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గడపలో కూర్చుని ఎదురు చూశాను. ఎందుకు రాలేదని వేరే వాళ్లను అడిగితే చంద్రబాబు, వాళ్ల మనుషులు వలంటీర్లుపై కోర్టుకు వెళ్లి కేసు వేశారని చెప్పారు. మరో మూడు నెలలు ఆఫీసుకాడికి వెళ్లి పింఛన్ తీసుకోవాలన్నారు. చంద్రబాబుకు పోయే కాలం దగ్గరపడి పేదలను ఇలా కష్టాలు పెడుతున్నాడు. చంద్రబాబు అప్పుడు అలా చేశాడు.. ఇప్పుడు ఇలా అడ్డుకుంటున్నాడు. ఆయన పాలనలో ఆఫీసుల చుట్టూ తిప్పించుకుని నాలుగో రోజున పింఛన్ ఇచ్చే వారు. ఇప్పుడు నా మనవడు జగన్ దయతో ఐదేళ్లు ఆ కష్టాలు తప్పినాయి. మళ్లీ చంద్రబాబు పాత రోజులను తీసుకురావడం దుర్మార్గం. చేను చెంగమ్మ వృద్ధురాలు, గొల్లపాళెం, వాకాడు మండలం మా ఉసురు తగలకుండా పోదు జగనన్న ప్రభుత్వ హయంలో మాకు తెల్లారేసరికి నిద్రలేపి పింఛన్ ఇచ్చారు. వలంటీర్ల ద్వారా ప్రతినెలా 1వ తేదీనే ఇంటికొచ్చి పింఛను ఇచ్చి, సమస్యలు అడిగి తెలుసుకునేవారు. జీతం తరహాలో పింఛను తీసుకుంటున్నాం. కరోనా కష్టకాలంలోనూ వలంటీర్లు మాకు అండగా నిలిచారు. వలంటీర్ల సేవలు మాకు ఎంతో బలాన్ని ఇచ్చాయి. ఇప్పుడేమో ఎన్నికలు అని చెప్పి మాకు పింఛన్ అందకుండా చేశారు. పింఛన్ అడ్డుకున్న వాళ్లకు మాలాంటి ముసలోళ్ల ఉసురు తప్పకుండా తగులుతుంది. ప్రభుత్వం వలంటీర్ల ద్వారా మాకు మంచి చేస్తుంటే ఓర్వలేక అడ్డుపడడం బాధగా ఉంది. ఎవరో వద్దన్నారని వలంటీర్లు ఏమో ఈరోజు పింఛను ఇవ్వలేదు. ఎందుకని అడిగితే టీడీపీ వాళ్లు వలంటీర్ల ద్వారా పింఛను ఇవ్వొద్దని అడ్డుకున్నారని తెలిసింది. ఇది మంచి పద్ధతేనా..?. మాలాంటి ముసలోళ్లకి మంచి జరిగితే ఓర్వలేరా..?. మాలాంటి వాళ్లపైన కక్షగడ్డి పింఛన్ రాకుండా చేశారు. మా ఉసురు తలగకుండా పోదు. – సరసమ్మ, ఎర్రమిట్ట, తిరుపతి -
మేమంటే బాబుకు ఎందుకంత కక్ష
‘మేం ఏం పాపం చేశాము. మాపైన వాళ్లకు ఎందుకంత పగ. వలంటీర్లపై కక్షగట్టి మా నుంచి దూరం చేశారు. ఒకటో తేదీ తెల్లవారేసరికి ఇంటికొచ్చే పెన్షన్ని రానీయకుండా చేశారు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. మళ్లీ మేము క్యూల్లో నిలబడాలా..?. మండుటెండల్లో సొమ్మసిల్లి పడిపోవాలా..?. పనులు మానుకుని.. ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరీక్షించాలా..?’ అంటూ పెన్షన్ దారులు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబునాయుడు అండ్ కో.. వలంటీర్లపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల కమిషన్ వారిని సంక్షేమ పథకాల నుంచి మినహాయించింది. లబి్ధదారులకు ఒకటో తేదీ అందాల్సిన పెన్షన్ అందకుండా పోయింది. దీంతో లబి్ధదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. గుడ్డివారి గోష్ట టీడీపీకి తగులుతుంది నాకు కంటి చూపులేదు. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే మనిషి తోడుకావాలి. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యాన ఇంటి వద్దనే ప్రతినెలా ఒకటవ తేదీ గ్రామ వలంటీర్ ద్వారా పింఛన్ అందుకునేదాన్ని. తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని ఈ నెల నుంచి ఎన్నికల సాకు చూపి వలంటీర్లను ప్రభుత్వ సేవల నుంచి పక్కన పెట్టడం దురదృష్టకరం. నా లాంటి కంటిచూపు లేని వాళ్లు ఎక్కడో ఉన్న సచివాలయం వద్దకు వెళ్లి క్యూలో నిలబడి పింఛన్ ఎలా తీసుకోవాలి..?. మాలాంటి వారి గోడు తప్పక తెలుగుదేశం పార్టీకి తగులుతుంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి కష్టాలు ఎన్నో పడ్డాము.గత 58 నెలలు ఆ బాధల నుంచి జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని విముక్తి లభించింది. మళ్లీ వలంటీర్ల ద్వారానే పింఛన్ సొమ్ము ఇంటి వద్దకు వచ్చి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. –నాగమ్మ, వెంగారెడ్డికండ్రిగ, వరదయ్యపాళెం మండలం లేవలేని స్థితిలో ఉన్నా నాకు రెండు సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి కదల్లేక మంచానికే పరిమితమైనాను. నెలనెలా వచ్చే పింఛనుపైనే మందులుమాకులు ఇతరులతో చెప్పి తెప్పించుకునేవాడిని. ప్రతినెలా ఒకటో తారీఖున వలంటీర్ నిద్రలేపి నా వేలిముద్ర తీసుకుని ఇంటివద్దనే పింఛన్ ఇచ్చేవాడు. ఈ రోజు(సోమవారం) పింఛన్ ఇవ్వలేదు. సచివాలయానికి వెళ్లి తెచ్చుకోమంటున్నారు. నేను అంత దూరం వెళ్లి పింఛన్ ఎలా తెచ్చుకునేది..?. ఏ పుణ్యాత్ముడో ఫిర్యాదు చేసి నాలాంటి వారి ఉసురు పోసుకున్నాడు. పింఛన్ ఇంటికి రాకుండా చేశారు. నేను సచివాలయానికి వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే నలుగురిని మంచంపై సచివాలయం వద్దకు మోసుకెళ్లాలి. అదే వలంటీర్ అయితే ఇంటివద్దకే వచ్చి ఇచ్చిపోయుండేవాడు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఏ దిగులూ లేకుండా ఉండేది. ఇప్పుడు ఇంటికాడికి తెచ్చి ఇవ్వకపోయినా ఆయన చేసిన మేలు మరిచిపోతామా?. – గోవిందనాయుడు, కుప్పంబాదూరు గ్రామం, రామచంద్రాపురం టీడీపీ పాలనలో అష్టకష్టాలు..మళ్లీనా? వాకాడు మండలం, ఇన్నమాల గ్రామానికి చెందిన పోలయ్య వయసు 91, చేను చెంగమ్మ వయసు 85, ఇన్నమాల సుబ్బమ్మ వయసు 86, బండి వెంకటసుబ్బయ్య వయసు 78. వీరి వలంటీర్లు ఉమ్మడి మోహన్, పీ.సులోచన, అఖిల కవిత. సోమవారం ఒకటో తేదీ కావడంతో వారి రాకకోసం ఎదురు చూశారు. కొత్త వ్యక్తులు ఎవరు కనిపించినా నాయనా.. మీరు మాకు పింఛన్ ఇచ్చే వారా?.. అయితే నా పేరు ఫలానా.. నాకు పింఛన్ ఇవ్వండి’ అని అడిగి మరీ నిరాశ చెందారు. తెల్లవారు జాము నుంచి అవ్వాతాతలు వీ«ధి కాలవలపై కూర్చుని పింఛన్ కోసం ఎదురు చూసి నిట్టూర్పుతో వెనుదిరిగారు. చంద్రబాబు పుణ్యమా అంటూ మరో మూడు నెలలు పింఛన్ ఇంటికి రాదని సమాచారం తెలుసుకున్న అవ్వాతాతలు మాకు పింఛన్ రాకుండా చేసిన చంద్రబాబు, వారి మనుషులు మట్టి కొట్టుకుపోతారని శాపనార్థాలు పెట్టారు. వాకాడు మండలం, గొల్లపాళెం గ్రామ వీధిలో కూర్చుని ఎదురు చూస్తున్న అవ్వాతాతలు వాకాడు మండలం, గొల్లపాళెం గ్రామ వీధిలో కూర్చుని ఎదురు చూస్తున్న అవ్వాతాతలు బాబు కుట్రలకు బలైపోయాం టీడీపీ హయాంలో పింఛన్ వచ్చే వరకు ప్రతిరోజూ అవస్థలే. ఎప్పుడు..? ఎక్కడిస్తారో తెలియని పరిస్థితి. పంచాయతీ, పోస్టల్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ కష్టాల నుంచి వృద్ధులను, వితంతువులను గట్టెక్కించారు. వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి గ్రామ వలంటీర్ ద్వారా ప్రతినెలా ఒకటో తేదీనే మా ఇంటికే వచ్చి పింఛన్ ఇస్తున్నారు. అనారోగ్య కారణంతో మంచానికే పరిమితమైన నాలాంటి వారికి ఈ పద్ధతి ఎంతో ఊరటనిచ్చింది. ఇప్పుడు మళ్లీ సచివాలయాలకు వెళ్లి పింఛన్ తీసుకునే పరిస్థితులు ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. నేను సచివాలయానికి వెళ్లాలంటే అద్దె ఆటో కావాలి. దానికి తోడు నా వెంట మరో వ్యక్తి సహాయం అవసరం. ఇంట్లో వారు సైతం పనులు మానుకుని నా వెంట రావాల్సిన పరిస్థితి. వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేసే దాంట్లోనూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయం చేయడం సరైన పద్ధతి కాదు. నాలాంటి వృద్ధులు, వితంతువులు, ప్రత్యేక ప్రతిభావంతులు టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాలకు ఓటుతో బుద్ధి చెబుతాం. –మాచాలమ్మ, పెద్ద పాండూరు, వరదయ్యపాళెం మండలం మేమంటే బాబుకు ఎందుకంత కక్ష గతంలో వెయ్యి రూపాయల పింఛన్ కోసం మండుటెండల్లో కిలోమీటరు పొడవున ఉండే క్యూలో నిలబడేదాన్ని. నా మనవడు జగన్ వచ్చాక ఆ పరిస్థితి లేదు. నాకు ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారు జామున్నే మా వలంటీర్ సులోచన ఇంటికొచ్చి తలుపుతట్టి పింఛన్ ఇచ్చేది. ఈనెల ఒకటోతేదీ వచ్చినా మా వలంటీర్ ఇంటికి రాలేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గడపలో కూర్చుని ఎదురు చూశాను. ఎందుకు రాలేదని వేరే వాళ్లను అడిగితే చంద్రబాబు, వాళ్ల మనుషులు వలంటీర్లుపై కోర్టుకు వెళ్లి కేసు వేశారని చెప్పారు. మరో మూడు నెలలు ఆఫీసుకాడికి వెళ్లి పింఛన్ తీసుకోవాలన్నారు. చంద్రబాబుకు పోయే కాలం దగ్గరపడి పేదలను ఇలా కష్టాలు పెడుతున్నాడు. చంద్రబాబు అప్పుడు అలా చేశాడు.. ఇప్పుడు ఇలా అడ్డుకుంటున్నాడు. ఆయన పాలనలో ఆఫీసుల చుట్టూ తిప్పించుకుని నాలుగో రోజున పింఛన్ ఇచ్చే వారు. ఇప్పుడు నా మనవడు జగన్ దయతో ఐదేళ్లు ఆ కష్టాలు తప్పినాయి. మళ్లీ చంద్రబాబు పాత రోజులను తీసుకురావడం దుర్మార్గం. చేను చెంగమ్మ వృద్ధురాలు, గొల్లపాళెం, వాకాడు మండలం మా ఉసురు తగలకుండా పోదు జగనన్న ప్రభుత్వ హయంలో మాకు తెల్లారేసరికి నిద్రలేపి పింఛన్ ఇచ్చారు. వలంటీర్ల ద్వారా ప్రతినెలా 1వ తేదీనే ఇంటికొచ్చి పింఛను ఇచ్చి, సమస్యలు అడిగి తెలుసుకునేవారు. జీతం తరహాలో పింఛను తీసుకుంటున్నాం. కరోనా కష్టకాలంలోనూ వలంటీర్లు మాకు అండగా నిలిచారు. వలంటీర్ల సేవలు మాకు ఎంతో బలాన్ని ఇచ్చాయి. ఇప్పుడేమో ఎన్నికలు అని చెప్పి మాకు పింఛన్ అందకుండా చేశారు. పింఛన్ అడ్డుకున్న వాళ్లకు మాలాంటి ముసలోళ్ల ఉసురు తప్పకుండా తగులుతుంది. ప్రభుత్వం వలంటీర్ల ద్వారా మాకు మంచి చేస్తుంటే ఓర్వలేక అడ్డుపడడం బాధగా ఉంది. ఎవరో వద్దన్నారని వలంటీర్లు ఏమో ఈరోజు పింఛను ఇవ్వలేదు. ఎందుకని అడిగితే టీడీపీ వాళ్లు వలంటీర్ల ద్వారా పింఛను ఇవ్వొద్దని అడ్డుకున్నారని తెలిసింది. ఇది మంచి పద్ధతేనా..?. మాలాంటి ముసలోళ్లకి మంచి జరిగితే ఓర్వలేరా..?. మాలాంటి వాళ్లపైన కక్షగడ్డి పింఛన్ రాకుండా చేశారు. మా ఉసురు తలగకుండా పోదు. – సరసమ్మ, ఎర్రమిట్ట, తిరుపతి -
సేవలు తొలగి.. వేదన మిగిలి!
మంచానికే పరిమితమైన ఈ వృద్ధురాలి పేరు కురువ లింగమ్మ. పెద్దకడబూరు మండలం మేకడోణ గ్రామానికి చెందిన ఈమె కుమారుడి వద్ద ఉంటోంది. వ్యవసాయ పనులు చేసుకునే కుమారుడు.. పింఛన్ డబ్బులతో ఈమెకు వైద్యం చేయిస్తున్నాడు. ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తుండటంతో తమకు ఎలాంటి కష్టాలు ఉండేవి కాదని చెబుతున్నాడు. ప్రస్తుతం సచివాలయానికి వెళ్లాలంటే పనులు మానుకోవాలని, అక్కడ పింఛన్ తీసుకోవడానికి ఎన్ని రోజులు తిరగాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చంద్రబాబుకు ముసలోళ్ల ఉసురు తప్పదని కన్నీటి పర్యంతమయ్యాడు.కర్నూలు(అగ్రికల్చర్): పింఛన్ల పంపిణీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలులో గ్రామ, వార్డు వలంటీర్లను దూరం చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పక్కన పెట్టడం... సచివాలయాలకే వెళ్లి పింఛన్ పొందాల్సి రావడంతో అవ్వాతాతలు, దివ్యాంగులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. మళ్లీ టీడీపీ హయాంలో పరిస్థితులే ఉత్పన్నం అవుతుండాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 20 వేల మందికిపైగా వలంటీర్లు ఉన్నారు. మొదటి నుంచి వారిపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్కల్యాణ్ విషయం చిమ్ముతున్నారు. వీరిని పింఛన్ల పంపిణీకి దూరం చేయడంపై అంతటా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 43–44 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో సచివాలయాలకు వెళ్లి వృద్ధులు, దివ్యాంగులు పింఛన్ ఎలా తీసుకుంటారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఎన్నికల ముందే పింఛన్దారులకు ఇన్ని కష్టాలు తెచ్చిపెడితే... పొరపాటున టీడీపీ ప్రభుత్వం వస్తే మన పరిస్థితి ఏమిటి చాలా మంది ప్రశి్నస్తున్నారు. కరోనా సమయంలో స్వచ్ఛంద సేవలు.. రెండేళ్ల పాటు కరోనా రక్కసి జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేసింది. లాక్డౌన్, కర్ఫ్యూతో కరోనా సమయంలో పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. అంతటి తీవ్రమైన పరిస్థితుల్లో వలంటీర్లు స్వచ్ఛంద సేవలు అందించారు. కోవిడ్ టెస్ట్లు చేయించడం, పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్లకు తరలించడం, నెగిటివ్ వచ్చిన వారిని ఇళ్లలోనే ఉంచడం చేశారు. కరోనా సమయంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన రూ.వెయ్యి ఆర్థిక సాయాన్ని అందించారు. సరుకులు, రైస్, మాస్్కలు కూడా పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి అనుమానాస్పదులను గుర్తించి కోవిడ్ పరీక్షలు నిర్వహించడంలో ప్రధాన భూమిక పోషించారు. వలంటీర్ల నిస్వార్థ సేవ కార్యక్రమాలతో కరోనా నుంచి గట్టెక్కామనే అభిప్రాయం ఎవరూ కాదనలేని నిజం. అవినీతికి తావులేకుండా పథకాల అమలు టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజల రక్తమాంసాలను పీల్చి వేశాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన వలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఎక్కడా అవినీతి, అక్రమాలకు తావు లేకుండా, రాజకీయాలు, కులమతాలకు అతీతంగా వలంటీర్లు సంక్షేమ పథకాలు అమలు చేశారు. పథకాల కోసం ప్రజలు సచివాలయాల చుట్టూ తిరుగలేదు. మండల స్థాయి కార్యాలయాలకు వెళ్లలేదు.. కానీ అర్హత కలిగిన వారందరికీ పథకాలు అమలయ్యాయి. ఇందుకు వలంటీర్లే కారణం. వలంటీర్ వ్యవస్థతో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుండటం, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటం చంద్రబాబు, అతని అనుయాయులు తట్టుకోలేక ఎన్నికల సమయంలో వారి సేవలను ప్రజలకు దూరం చేశారు. ఉసురు తగులుతుంది ‘మంచి చేయరు... మంచి చేసే వారిని సహించరు.. మీ హయాంలో అంతంతమాత్రం చెల్లించే పింఛన్ పొందడం కోసం ఎన్నో కష్టాలు పడ్డాం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత పింఛన్ కష్టాలను మరచిపోయాం. మళ్లీ మీ కారణంగా కష్టాలు చుట్టుముడుతున్నాయి’ అని పింఛన్దారులు వాపోతున్నారు. తమ ఉసురు తగులుతుందని వృద్ధులు, దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఉన్న బాలిక పేరు గీత. మానసిక స్థితి సరిగా లేని దివ్యాంగురాలు. కౌతాళానికి చెందిన బాలికకు తండ్రి ఈరన్న సపర్యలు చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ ఈ బాలికకు వలంటీర్ వచ్చి పింఛన్ ఇచ్చేవారు. ఈ డబ్బుతో ఈరన్న మందులు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం పింఛన్ కోసం సచివాలయాల వద్దకు వెళ్లాలని చెప్పడంతో ఈరన్న ఆవేదన వ్యక్తం చేసున్నాడు. తన కుమార్తె నడవలేదని, ఎత్తుకుపోవాలని, అక్కడ పింఛన్ తీసుకోవడానికి ఎన్నికష్టాలు పడాలో అని ఆందోళన చెందుతున్నాడు. –కౌతాళం కుమార్తెను పట్టుకుని నడిపిస్తున్న ఈమె పేరు లక్ష్మి. కోసిగి కడపాళెం వీధిలో నివాసం ఉంటున్నారు. ఈమె కుమార్తె రామచంద్రమ్మకు కళ్లు కనిపించవు. మాటలు రావు, కూర్చోలేదు, నడవలేదు. ఎప్పుడూ మంచానికే పరిమితమై ఉంటుంది. పట్టుకుని నడిపిస్తే అయిదు అడుగులు వేస్తోంది. అంతలో ఏడ్చేస్తుంది. నరాలు బలహీనంగా ఉండడంతో బయోమెట్రిక్ ద్వారా పింఛన్ తీసుకోవడానికి చేతి వేళ్లు పడవు. ఈ దివ్యాంగురాలికి ఆర్బీఎస్ ద్వారా ప్రతి నెలా వలంటీర్ ఇంటికి వెళ్లి రూ.3వేలు పింఛన్ అందజేస్తున్నారు. ఈ నెల పింఛన్ ఎలా తీసుకోవాలని తల్లి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేన్తున్నారు. – కోసిగిభయపడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన వలంటీరు వ్యవస్థను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎన్నికల సమయంలో మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వలంటీరుగా ఎప్పటిలాగే ప్రజలకు సేవలు అందిస్తాం. – అనిల్, చెరుకులపాడు స్వచ్ఛందంగా సేవలు అందించాం ప్రభుత్వం మాకు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కలి్పంచింది. మాకు కేటాయించిన కుటుంబాలకు స్వచ్ఛందంగా సేవలు అదించాం. ప్రభుత్వ పథకాలను అందించి అవసరమైన సేవలను చేశాం. ఎన్నికల సమయంలో మమ్మల్ని దూరం పెట్టాలని చూస్తున్నారు. అందుకే మేమే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం. – ప్రేమ్కుమార్, చెరుకులపాడు రాజీనామాతో బుద్ధి చెబుతాం మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారికి మా రాజీనామాలతో బుద్ధి చెబుతాం. ఐదేళ్లు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కలి్పంచిన ముఖ్యమంత్రి జగనన్నకు రుణపడి ఉంటాం. ప్రజలకు సేవలు అందించడంలో చాలా తృప్తిని పొందాం. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశంతో మనో ధైర్యం పెరిగింది. – వీరయ్య ఆచారి, కొసనాపల్లి బాధ కలిగించింది నాలుగున్నరేళ్ల పాటు నిస్వార్థంగా సేవలు అందించాం. ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు చేశాం. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను లబి్ధదారులకు అందించాం. మాపై టీడీపీ, జనసేన నేతలు ఎప్పుడూ విషం చిమ్ముతూనే ఉన్నారు. ఎన్నో అభాండాలు వేశారు. చివరికి సంక్షేమ పథకాల అమలుకు దూరం చేయడం బాధ కలిగించింది. వలంటీర్ల సేవలను గుర్తించకుండా బురద చల్లడం దారుణం.– విజయ్ రాజ్కుమార్, లక్ష్మీనగర్, కర్నూలు -
వలంటీర్ల మాటెత్తితే అంతెత్తున లేస్తారని తెలిసి కూడా ఎందుకెత్తావయ్య!!
-
సేవలు తొలగి.. వేదన మిగిలి!
మంచానికే పరిమితమైన ఈ వృద్ధురాలి పేరు కురువ లింగమ్మ. పెద్దకడబూరు మండలం మేకడోణ గ్రామానికి చెందిన ఈమె కుమారుడి వద్ద ఉంటోంది. వ్యవసాయ పనులు చేసుకునే కుమారుడు.. పింఛన్ డబ్బులతో ఈమెకు వైద్యం చేయిస్తున్నాడు. ప్రతి నెలా ఒకటో తేదీన వలంటీర్ వచ్చి పింఛన్ ఇస్తుండటంతో తమకు ఎలాంటి కష్టాలు ఉండేవి కాదని చెబుతున్నాడు. ప్రస్తుతం సచివాలయానికి వెళ్లాలంటే పనులు మానుకోవాలని, అక్కడ పింఛన్ తీసుకోవడానికి ఎన్ని రోజులు తిరగాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చంద్రబాబుకు ముసలోళ్ల ఉసురు తప్పదని కన్నీటి పర్యంతమయ్యాడు. కర్నూలు(అగ్రికల్చర్): పింఛన్ల పంపిణీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలులో గ్రామ, వార్డు వలంటీర్లను దూరం చేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పక్కన పెట్టడం... సచివాలయాలకే వెళ్లి పింఛన్ పొందాల్సి రావడంతో అవ్వాతాతలు, దివ్యాంగులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. మళ్లీ టీడీపీ హయాంలో పరిస్థితులే ఉత్పన్నం అవుతుండాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 20 వేల మందికిపైగా వలంటీర్లు ఉన్నారు. మొదటి నుంచి వారిపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్కల్యాణ్ విషయం చిమ్ముతున్నారు. వీరిని పింఛన్ల పంపిణీకి దూరం చేయడంపై అంతటా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 43–44 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో సచివాలయాలకు వెళ్లి వృద్ధులు, దివ్యాంగులు పింఛన్ ఎలా తీసుకుంటారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఎన్నికల ముందే పింఛన్దారులకు ఇన్ని కష్టాలు తెచ్చిపెడితే... పొరపాటున టీడీపీ ప్రభుత్వం వస్తే మన పరిస్థితి ఏమిటి చాలా మంది ప్రశి్నస్తున్నారు. కరోనా సమయంలో స్వచ్ఛంద సేవలు.. రెండేళ్ల పాటు కరోనా రక్కసి జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేసింది. లాక్డౌన్, కర్ఫ్యూతో కరోనా సమయంలో పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. అంతటి తీవ్రమైన పరిస్థితుల్లో వలంటీర్లు స్వచ్ఛంద సేవలు అందించారు. కోవిడ్ టెస్ట్లు చేయించడం, పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్లకు తరలించడం, నెగిటివ్ వచ్చిన వారిని ఇళ్లలోనే ఉంచడం చేశారు. కరోనా సమయంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన రూ.వెయ్యి ఆర్థిక సాయాన్ని అందించారు. సరుకులు, రైస్, మాస్్కలు కూడా పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి అనుమానాస్పదులను గుర్తించి కోవిడ్ పరీక్షలు నిర్వహించడంలో ప్రధాన భూమిక పోషించారు. వలంటీర్ల నిస్వార్థ సేవ కార్యక్రమాలతో కరోనా నుంచి గట్టెక్కామనే అభిప్రాయం ఎవరూ కాదనలేని నిజం. అవినీతికి తావులేకుండా పథకాల అమలు టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ప్రజల రక్తమాంసాలను పీల్చి వేశాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన వలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఎక్కడా అవినీతి, అక్రమాలకు తావు లేకుండా, రాజకీయాలు, కులమతాలకు అతీతంగా వలంటీర్లు సంక్షేమ పథకాలు అమలు చేశారు. పథకాల కోసం ప్రజలు సచివాలయాల చుట్టూ తిరుగలేదు. మండల స్థాయి కార్యాలయాలకు వెళ్లలేదు.. కానీ అర్హత కలిగిన వారందరికీ పథకాలు అమలయ్యాయి. ఇందుకు వలంటీర్లే కారణం. వలంటీర్ వ్యవస్థతో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుండటం, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటం చంద్రబాబు, అతని అనుయాయులు తట్టుకోలేక ఎన్నికల సమయంలో వారి సేవలను ప్రజలకు దూరం చేశారు. ఉసురు తగులుతుంది ‘మంచి చేయరు... మంచి చేసే వారిని సహించరు.. మీ హయాంలో అంతంతమాత్రం చెల్లించే పింఛన్ పొందడం కోసం ఎన్నో కష్టాలు పడ్డాం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత పింఛన్ కష్టాలను మరచిపోయాం. మళ్లీ మీ కారణంగా కష్టాలు చుట్టుముడుతున్నాయి’ అని పింఛన్దారులు వాపోతున్నారు. తమ ఉసురు తగులుతుందని వృద్ధులు, దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఉన్న బాలిక పేరు గీత. మానసిక స్థితి సరిగా లేని దివ్యాంగురాలు. కౌతాళానికి చెందిన బాలికకు తండ్రి ఈరన్న సపర్యలు చేస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ ఈ బాలికకు వలంటీర్ వచ్చి పింఛన్ ఇచ్చేవారు. ఈ డబ్బుతో ఈరన్న మందులు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం పింఛన్ కోసం సచివాలయాల వద్దకు వెళ్లాలని చెప్పడంతో ఈరన్న ఆవేదన వ్యక్తం చేసున్నాడు. తన కుమార్తె నడవలేదని, ఎత్తుకుపోవాలని, అక్కడ పింఛన్ తీసుకోవడానికి ఎన్నికష్టాలు పడాలో అని ఆందోళన చెందుతున్నాడు. –కౌతాళం కుమార్తెను పట్టుకుని నడిపిస్తున్న ఈమె పేరు లక్ష్మి. కోసిగి కడపాళెం వీధిలో నివాసం ఉంటున్నారు. ఈమె కుమార్తె రామచంద్రమ్మకు కళ్లు కనిపించవు. మాటలు రావు, కూర్చోలేదు, నడవలేదు. ఎప్పుడూ మంచానికే పరిమితమై ఉంటుంది. పట్టుకుని నడిపిస్తే అయిదు అడుగులు వేస్తోంది. అంతలో ఏడ్చేస్తుంది. నరాలు బలహీనంగా ఉండడంతో బయోమెట్రిక్ ద్వారా పింఛన్ తీసుకోవడానికి చేతి వేళ్లు పడవు. ఈ దివ్యాంగురాలికి ఆర్బీఎస్ ద్వారా ప్రతి నెలా వలంటీర్ ఇంటికి వెళ్లి రూ.3వేలు పింఛన్ అందజేస్తున్నారు. ఈ నెల పింఛన్ ఎలా తీసుకోవాలని తల్లి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేన్తున్నారు. – కోసిగి భయపడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన వలంటీరు వ్యవస్థను చూసి ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎన్నికల సమయంలో మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వలంటీరుగా ఎప్పటిలాగే ప్రజలకు సేవలు అందిస్తాం. – అనిల్, చెరుకులపాడు స్వచ్ఛందంగా సేవలు అందించాం ప్రభుత్వం మాకు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కలి్పంచింది. మాకు కేటాయించిన కుటుంబాలకు స్వచ్ఛందంగా సేవలు అదించాం. ప్రభుత్వ పథకాలను అందించి అవసరమైన సేవలను చేశాం. ఎన్నికల సమయంలో మమ్మల్ని దూరం పెట్టాలని చూస్తున్నారు. అందుకే మేమే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం. – ప్రేమ్కుమార్, చెరుకులపాడు రాజీనామాతో బుద్ధి చెబుతాం మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారికి మా రాజీనామాలతో బుద్ధి చెబుతాం. ఐదేళ్లు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కలి్పంచిన ముఖ్యమంత్రి జగనన్నకు రుణపడి ఉంటాం. ప్రజలకు సేవలు అందించడంలో చాలా తృప్తిని పొందాం. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశంతో మనో ధైర్యం పెరిగింది. – వీరయ్య ఆచారి, కొసనాపల్లి బాధ కలిగించింది నాలుగున్నరేళ్ల పాటు నిస్వార్థంగా సేవలు అందించాం. ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు చేశాం. రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను లబి్ధదారులకు అందించాం. మాపై టీడీపీ, జనసేన నేతలు ఎప్పుడూ విషం చిమ్ముతూనే ఉన్నారు. ఎన్నో అభాండాలు వేశారు. చివరికి సంక్షేమ పథకాల అమలుకు దూరం చేయడం బాధ కలిగించింది. వలంటీర్ల సేవలను గుర్తించకుండా బురద చల్లడం దారుణం. – విజయ్ రాజ్కుమార్, లక్ష్మీనగర్, కర్నూలు -
మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్న వాలంటీర్లు..
-
టీడీపీ కుట్రల వల్లే పింఛన్ల పంపిణీలో జాప్యం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు చేసే టక్కు టమారాలు, దొంగవిధానాలు, అబద్ధపు హామీలు, బూటకపు కూటములు ఈ ఎన్నికల్లో పనిచేయబోవని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని 50వ డివిజన్ ఆదివారం పేట పరిసర ప్రాంతంలో సోమవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. వలంటీర్లపై టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి, కుట్రలు కుతంత్రాలు పన్నిన కారణంగా పంపిణీలో జాప్యం చోటుచేసుకుందని మండిపడ్డారు. లబ్ధిదారులంతా ఇప్పుడు సచివాలయాల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. జాతీయ సంస్థల సర్వేల్లో ఏపీ బెస్ట్ 2019 నుంచి 2024 వరకు జరిగిన అభివృద్ధిపై జాతీయ సంస్థలు అనేక సర్వేలు చేశాయని, జీఎస్డీపీ టీడీపీ హయాంలో 22వ స్థానంలో ఉంటే ఈ ఐదేళ్లలో 5వ స్థానానికి వచి్చందన్నారు. తలసరి ఆదాయం 17 నుంచి 9వ స్థానానికి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందన్నారు. ఇవన్నీ అభివృద్ధి సూచికలు కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పేరాడ తిలక్ను గెలిపించాలని కోరారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు మంత్రి ధర్మాన ప్రసంగిస్తున్న సమయంలో 70 ఏళ్ల వృద్ధురాలు కూర్మాపు లకు‡్ష్మమమ్మ మధ్యలో లేచి మైక్ దగ్గరికి వెళ్లి మాట్లాడారు. ‘మీ అందరికీ దండంబాబు.. ఏ దిక్కు మొక్కులేని నాకు జగన్బాబు దయవల్ల వలంటీర్ ఇంటికొచ్చి పెన్షన్, బియ్యం ఇస్తున్నారు. నాకు భర్తలేడు. కోడలు చనిపోయింది. నా కొడుక్కి, ఇద్దరు మనవళ్లకు నేనే గంజి పోస్తున్నాను. తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తుకే ఓటేసి జగన్బాబును, పెసాదుబాబును గెలిపిస్తా’ అంటూ తన యాసలో చెప్పి అందరినీ ఆకట్టుకుంది. -
అవ్వాతాతలపై చంద్రబాబు కక్ష
సాక్షి నెట్వర్క్ : పేదవారంటే చంద్రబాబుకు మొదటి నుంచీ చులకన భావమేనని.. ప్రతీనెల ఒకటో తేదీనే వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అవ్వాతాతలకు పింఛన్లు ఇవ్వడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నాడని, అందుకే వారిపై ఆయన కక్ష కట్టాడని పలువురు మంత్రులు మండిపడ్డారు. దీంతో చంద్రబాబు తన జేబు సంస్థ అయిన ‘సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ’ముసుగులో తన నమ్మినబంటు నిమ్మగడ్డ రమేష్కుమార్తో ఈసీకి ఫిర్యాదు చేయించి.. దాన్ని వైఎస్సార్సీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నీచ రాజకీయాలు చేస్తూ వలంటీర్లపై ఫిర్యాదు చేయడమంటే.. ప్రజలకు జరుగుతున్న మేలు అడ్డుకోవడమేనన్నారు. వచ్చే ఎన్నికల్లో అవ్వాతాతలే చంద్రబాబుకు బుద్ధిచెబుతారన్నారు. ఎవరెవరు ఏమేన్నారంటే.. ఈసీ ఆదేశాలను పునఃసమీక్షించాలి.. ప్రతీనెలా ఒకటో తేదీన ప్రభుత్వమిచ్చే పెన్షన్లపై ఎన్నో ఆశలు పెట్టుకుని అవ్వాతాతలు జీవిస్తున్నారు. అలాంటి వారికి వలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయరాదని ఈసీ ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించాలి. పేదోడు బాగా ఉంటే చంద్రబాబుకు తిన్నది అరగదు. పెన్షన్లు ఇవ్వనీయకుండా.. నిరుద్యోగుల డీఎస్సీని అడ్డుకున్న దుషు్టడు చంద్రబాబు. పెన్షన్ పంపిణీకి ఎటువంటి ప్రత్యామ్నాయం చేసినా ఇబ్బందులు తప్పవు. అది ఒక నెలతో పోయేది కాదు.. మూడునెలల పాటు అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకుంటే ఆ పాపం శాపమై చంద్రబాబుకు చుట్టుకుంటుంది. – బొత్స సత్యనారాయణ, మంత్రి వలంటీర్లపై విషం కక్కుతున్నారు పది మంది జీవితాల బాగు కోసం పాటుపడుతూ.. పారదర్శకంగా ప్రజాసేవకు అంకితమైన వలంటీర్లపై చంద్రబాబు, పచ్చబ్యాచ్ విషం కక్కుతున్నారు. ప్రజల కోసం అహరి్నశలు పాటుపడుతున్న వలంటీర్లంటే ఎందుకంత భయం? చంద్రబాబు ఓటమి భయంతోనే వలంటీర్లపై తప్పుడు ఫిర్యాదులు చేయించి కక్ష సాధిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. మొత్తం వలంటీరు వ్యవస్థనే తీసేసే హెచ్చరికగానే దీన్ని భావించాలి. అవ్వాతాతలు పింఛన్ల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిసినా అమానవీయంగా ఎన్నికల కమిషనర్కు టీడీపీ ఫిర్యాదు చేసింది. చంద్రబాబుకు వారి ఉసురు తగులుతుంది. – విడదల రజిని, మంత్రి బాబుకు అవ్వాతాతల శాపనార్థాలు అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, కిడ్నీ బాధితులు 1వ తేదీ ఉ.5 గంటల నుంచి ఇంటిగుమ్మంలో పింఛను కోసం ఎదురుచూస్తారు. పెత్తందార్లకు వెన్నుదన్నుగా నిలబడి ప్యాకేజీలు గుంజుకునే చంద్రబాబు పేదలను ఎప్పుడూ ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు. ముందునుంచీ వలంటీరు వ్యవస్థపై పడి ఏడుస్తున్నాడు. ఇప్పుడు తన నమ్మినబంటు నిమ్మగడ్డ రమేష్తో ఎన్నికల అధికారికి పిటిషన్ ఇచ్చి వలంటీర్లను విధుల నుంచి తప్పించి పాపం మూటగట్టుకున్నాడు. అవ్వాతాతల శాపనార్థాలు ఆయనకు తగులుతాయి. వారు పడే బాధ నువ్వు కూడా అనుభవించే రోజు వస్తుంది. – కారుమూరి నాగేశ్వరరావు, మంత్రి చంద్రబాబుది రాక్షసానందం అవ్వాతాతలు, వికలాంగులు, వ్యాధిగ్రస్తుల ఇంటికి వలంటీర్లు రాకుండా అడ్డుకున్న పాపం చంద్రబాబుదే. గ్రామ వలంటీర్ వ్యవస్థను అడ్డుకుని ఆయన రాక్షసానందం పొందుతున్నారు. ఆయన కుట్రతో అవ్వాతాతలు పింఛన్ల కోసం ఇకపై మండుటెండల్లో ఎన్ని కష్టాలు పడాల్సి ఉంటుందో? వలంటీర్లను అడ్డుకుని ఇప్పుడు పింఛన్లు పంపిణీ చేయాలంటూ చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే తమ బతుకులు ఏవిధంగా ఉంటాయోనని పేదలు బెంబేలెత్తిపోతున్నారు. టీడీపీ కూటమికి వారు బుద్ధిచెప్పడం ఖాయం. – ఆదిమూలపు సురేష్, మంత్రి చంద్రబాబు నరరూప రాక్షసుడు అవ్వాతాతలపై ఎటువంటి కనికరం లేకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నరరూప రాక్షసుడిలా వ్యవహరించాడు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచీ కడుపు మంటతోనే ఉన్నాడు. ప్రతినెలా ఒకటో తేదీన అవ్వాతాతలకు, దివ్యాంగులకు, దీర్ఘకాల రోగుల ఇళ్లకు వలంటీర్లు వెళ్లి, ఆప్యాయంగా పలకరిస్తూ రూ.3 వేల పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు చూడలేకపోయారు. దీంతో వలంటీర్ల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించేలా చేశారు. దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది, ఇబ్బందులు పడేది పెన్షన్దారులే. – మార్గాని భరత్రామ్, ఎంపీ పెన్షనర్లే టీడీపీ కూటమికి బుద్ధిచెబుతారు పింఛన్దారులను ఇబ్బంది పెట్టడం దారుణం. చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ద్వారా వలంటీర్లతో పింఛన్లను పంపిణీ చేయవద్దని ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేయడం సరికాదు. వచ్చే ఎన్నికల్లో పెన్షనర్లే తెలుగుదేశం కూటమికి బుద్ధిచెబుతారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా వైఎస్సార్సీపీ గెలుపు ఖాయం. – ఏకుల రాజేశ్వరిరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి -
తిరుగుబాటుతో తత్తరపాటు..
సాక్షి, అమరావతి: అవ్వాతాతలను అవస్థలకు గురి చేస్తూ ఇంటివద్ద పింఛన్ల పంపిణీకి అడ్డుపడ్డ పచ్చ ముఠా దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో తత్తరపాటుకు గురై రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు బరి తెగించింది. వలంటీర్లపై ఆది నుంచి విద్వేషాన్ని పెంచుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బృందం ఇన్నాళ్లూ సజావుగా సాగిన సామాజిక పింఛన్ల పంపిణీకి ఎన్నికల వేళ ఆటంకాలు కల్పించేందుకు సాహసించింది. గత నాలుగున్నరేళ్లకు పైగా రాష్ట్రంలో వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతి నెలా ఠంచన్గా లబ్ధిదారుల ఇంటివద్దే చిన్న అవాంతరం కూడా లేకుండా కోవిడ్ వేళ కూడా పెన్షన్లు అందచేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం కారణంగా ఇప్పుడు ఆ ప్రక్రియకు ఇబ్బందులు తలెత్తలేదన్నది నిజం. స్వతంత్ర సంస్థ ముసుగులో బాబు రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్న రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలో కొత్తగా పుట్టుకొచ్చిన ‘సిటిజన్ ఫర్ డెమోక్రసీ’ వరుస ఫిర్యాదులతో ఇంటివద్ద ఫించన్ల పంపిణీకి బ్రేక్ పడింది. ఆ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25వ తేదీల్లో రెండు విడతలుగా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పింఛన్ల పంపిణీ నుంచి వలంటీర్లను దూరంగా ఉంచడంతోపాటు వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను సైతం స్వాదీనం చేసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వాస్తవాలు ఇవి కాగా ఇందులో అధికార పార్టీ కుట్ర దాగి ఉందంటూ ఈనాడు రామోజీ తన విద్వేషాన్ని కుమ్మరించారు. ఆపాలని అడిగి ఆపై నాటకాలు.. వలంటీర్ల ద్వారా ఇంటివద్ద పింఛన్ల పంపిణీని వ్యతిరేకిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం గమనార్హం. మరోవైపు టీడీపీ నాయకులు ‘ఛలో సచివాలయం’ పేరుతో మీడియా ముందు హడావుడి చేస్తూ రాజకీయ డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. నిమ్మగడ్డ నిర్వాకాలు.. ► రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో ఉన్నప్పుడు నిమ్మగడ్డ రమేష్ రాజ్యాంగ విరుద్ధంగా, వివాదాస్పదంగా ప్రవర్తించారు. స్థానిక సంస్థల్లో ఏర్పడే ఖాళీలకు చట్ట ప్రకారం ఆర్నెళ్లలోగా ఎన్నికలు నిర్వహించాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఓ జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా దీనివల్ల ఆ జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఉన్న తమ సామాజికవర్గం నేత పదవికి ఎసరు వస్తుందని ఉప ఎన్నిక జరపలేదని నిమ్మగడ్డపై విమర్శలున్నాయి. ► వలంటీర్లకు వ్యతిరేకంగా 2023 డిసెంబరు నాలుగో తేదీన నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ సుప్రీం కోర్టులో కేసు వేసి మధ్యలోనే ఉపసంహరించుకుంది. ► మళ్లీ 2024 జనవరి 12న అదే సంస్థ వలంటీర్లకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుపై తమకు నమ్మకం లేదన్నట్టు పిటిషన్లో నిమ్మగడ్డ తదితరులు పేర్కొన్నారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆ విషయాన్ని ఏపీ హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ పిటిషన్ను కొట్టివేసింది. ► తర్వాత నిమ్మగడ్డకు చెందిన సంస్థ 2024 మార్చి 13న వలంటీర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయానికే వదిలివేస్తూ తీర్పు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ► 2021లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వలంటీర్ల వద్ద నుంచి ఫోన్లను స్వా«దీనం చేసుకోవాలంటూ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చినట్టు అధికారులు గుర్తు చేస్తున్నారు. అప్పుడు నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలనే అచ్చెన్నాయుడు వలంటీర్లకు వ్యతిరేకంగా ఈసీకి అందజేసిన వినతిపత్రంలో పొందుపరిచారు. ► సచివాలయాల ఉద్యోగులు ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులే అయినప్పటికీ వారికి ఎన్నికల నిర్వహణపై అనుభవం లేదని, వారికి ఎన్నికల విధులు అప్పగించవద్దని నిమ్మగడ్డ సంస్థ ఈసీని కోరింది. మరోవైపు సచివాలయాల ఉద్యోగుల ద్వారానే లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ల పంపిణీ చేపట్టాలంటూ టీడీపీ, ఈనాడు ప్రేమ ఒలకబోస్తున్నాయి. అన్నీ ఆలోచించాకే.. సచివాలయాల ఉద్యోగులు ఇన్నాళ్లూ విధి నిర్వహణలో భాగంగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లేందుకు వలంటీర్లపై ఆధారపడే పని చేస్తూ వచ్చారు. ఇప్పుడు పింఛన్ల పంపిణీ బాధ్యతను వారికి అప్పగించినా లబ్ధిదారుల పేర్లు తెలుస్తాయి కానీ ఇళ్ల వివరాలు తెలిసే అవకాశం ఉండదు. మళ్లీ వారు తిరిగి గ్రామంలో ఎవరో ఒకరిపై ఆధారపడే పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల అభిమానులు వారిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. దీనిపై అధికారులు తర్జనభర్జన పడిన అనంతరమే గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఫించన్ల పంపిణీకి నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పడు 2019 ఎన్నికల సమయంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన నాన్ ఐఏఎస్ అధికారిని తొలుత ఓఎస్డీగా నియమించుకొని తరువాత సెర్ప్ సీఈవోగా బాధ్యతలు అప్పగించారు. అదే అధికారి నేతృత్వంలో ఎన్నికల వేళ మహిళా ఓట్లర్లను ప్రభావితం చేసేలా పొదుపు మహిళలకు పసుపు కుంకుమ తాయిలాలు విడుదల చేయడం గమనార్హం. పది రోజుల క్రితమే నిర్ణయం.. ఈ నెలలో పింఛన్ల పంపిణీని మూడో తేదీ నుంచి చేపట్టనుండటంపైనా టీడీపీ, ఈనాడు దుష్ప్రచారానికి దిగాయి. ఆర్థిక సంవత్సరం ముగింపుతో పాటు బ్యాంకులకు వరుసగా సెలవులు రావడంతో ఏప్రిల్ 3వ తేదీ నుంచి అవ్వాతాతలకు పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని పది రోజుల కిత్రం ఎన్నికల కోడ్ వచ్చాకే అధికారుల స్థాయిలో నిర్ణయం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో అప్పుడే వివరించారు. పింఛను డబ్బులను సచివాలయాల సిబ్బంది ఏప్రిల్ రెండో తేదీన డ్రా చేసుకునేందుకు వెసులుబాటు కల్పించగా మూడో తేదీ నుంచి పంపిణీ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అప్పుడే జిల్లా అధికారులకు సమాచారమిచ్చారు. ఆర్థిక సంవత్సరం ముగింపు, సెలవుల కారణంగా ఏటా ఏప్రిల్ నెలలో మూడో తేదీ తర్వాత పంపిణీ కొనసాగడం అనవాయితీగా జరుగుతోంది. గతేడాది కూడా ఏప్రిల్లో మూడో తేదీ నుంచే పింఛన్ల పంపిణీ కొనసాగినట్లు అధికారులు గుర్తు చేస్తున్నారు. -
బోసి నవ్వులకు భరోసా ఏదీ?
వేకువజామునే వచ్చి ‘అవ్వా.. తాత.. ఇదిగో మీ పింఛన్ సొమ్ము తెచ్చాను. తీసుకోండి’ అంటూ అప్యాయంగా పలకరించే వలంటీర్ సేవలను నిర్ధాక్షిణ్యంగా చంద్రబాబు రాక్షసానందం కోసం నిలిపివేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. వృద్దులు, వికలాంగులు, వితంతువులు ఆశగా ఎదురు చూసే వలంటీర్లను ఆ సేవల నుంచి తొలగించారనే నిజాన్ని నమ్మలేక దిగాలు పడిపోయారు. వలంటీర్లను తొలగించాలంటూ చంద్రబాబు కుట్రతో ఎన్నికల కమిషన్కు íఫిర్యాదు చేయడంతో వారిని ఆ విధుల నుంచి తప్పించారు. దీంతో ప్రతి నెల మాదిరిగానే ఈ నెల సూర్యుడు పొడవకుండానే వస్తారని వేచి చూసి.. చూసి బారెడు పొద్దెక్కినా రాకపోవడంతో చంద్రబాబు కుటిలత్వం వల్ల పింఛన్ అందలేదని తెలుసుకుని గుండెలు అవిసేలా రోదించారు. ప్రతి నెలా ఒకటో తేదీన బోసి నవ్వులతో ఎదురు చూసే ఆ వృద్దులు మళ్లీ క్యూ లైన్లలో నిలబడాలా ? అనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకపక్క ఎండలు మండిపోతున్న తరుణంలో గంటలపాటు సచివాలయాల అరుగులమీద అధికారుల కోసం ఎదురుచూసిన జ్ఞాపకాలను చూసి ఆందోళన చెందుతున్నారు. - సాక్షి, నెట్వర్క్ ఇలాగైతే ఎలా..? ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్దురాలి పేరు పొటుకూరి గంగమ్మ. వయస్సు 85 సంవత్సరాలు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పంచాయతీలోని సురేంద్రం. సొంతంగా ఏ పని చేసుకోలేదు. కనీసం లేచి నిలబడలేదు. ప్రతి నెల వలంటీర్ వచ్చి ఈమెకు పింఛన్ నగదు అందచేసేవారు. వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయించకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించడంతో ఈ నెల సకాలంలో పింఛన్ అందలేదు. ఈమె పింఛన్ తీసుకోడానికి సచివాలయానికి వెళ్లాలంటే నాలుగు ఫర్లాంగులు దూరం ప్రయాణించాలి. అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితిలో ఉంది. ఇద్దరు పట్టుకుని ఆటోలో తీసుకువెళ్లాలి. ప్రస్తుతం సచివాలయానికి వెళ్లి తీసుకోవాలని చెప్పడంతో ఎలా వెళ్లాలి అని ఆందోళన చెందుతోంది. –పొటుకూరి గంగమ్మ, సురేంద్రం గ్రామం, అల్లూరి సీతారామరాజు జిల్లా అయ్యో అననివారు లేరు ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నాళం శివకృష్ణ. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెంగళరావు నగర్కు చెందిన ఈయన పుట్టుకతో అంధుడు. పోలియో బారిన పడిన దివ్యాంగురాలు రాజేశ్వరిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. ఆరేళ్ల క్రితం శివకృష్ణకు రోడ్డు ప్రమాదంలో నడుము దెబ్బతిని స్పర్శ లేకుండా పోయింది. అప్పటి నుంచి మంచానికే పరిమితం అయ్యాడు. దివ్యాంగ (అంధుడు) పెన్షన్ పొందుతున్నాడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని స్టాండ్ సహకారంతో నడుస్తున్న భార్య రాజేశ్వరికి కూడా పెన్షన్ మంజూరైంది. వచ్చే పింఛన్, అమ్మ ఒడి పథకంతో ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ జీవితం గడుపుతున్నారు. మంచానికే పరిమితమైన భర్త, స్టాండ్ సహాయంతో నడుస్తున్న భార్య ఇద్దరూ పింఛన్ కోసం కనీసం సచివాలయానికి కూడా వెళ్లలేని పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వెళ్లలేని వారికి వలంటీర్ల సహకారంతో ప్రతినెలా 1వ తేదీన ఇంటికి వచ్చి పింఛన్ అందజేసేవారు. టీడీపీ నీచ రాజకీయాలకు ఈ కుటుంబం ఇప్పుడు దిక్కుతోచనిస్థితిలో పడిపోయింది. – అంధుడు శివకృష్ణతో భార్య రాజేశ్వరి వెంగళరావునగర్, గుంటూరు జిల్లా డయాలసిస్ ఎలా చేయించుకోవాలి ? 68 ఏళ్లు పైబడిన నేను చాలాకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా. వారంలో ఒకసారి డయాలసిస్, మరో రోజు వైద్యం చేయించుకుంటున్నా. షుగరు, బీపీ, గుండెకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతి నెలా వలంటీర్ వచ్చి 1వ తేదీన తెల్లవారకముందు రూ.10 వేలు పింఛన్ అందించేవాడు. వాటిని వైద్యం కోసం ఉపయోగిస్తాను. కానీ వలంటీర్లు పింఛన్ ఇవ్వడానికి వీల్లేదంటూ చంద్రబాబు చేసిన ఇబ్బందికి ఈ నెల పింఛన్ అందలేదు. సచివాలయానికి వెళ్లి క్యూలో నిలబడలేని పరిస్థితి. మా లాంటి రోగులను, వృద్ధులు, దివ్యాంగులను ఇబ్బందులు పెట్టి చంద్రబాబు ఏం సాధిస్తాడు. – మాతంగి వెంకాయమ్మ, డయాలసిస్ రోగి, హరిశ్చంద్రపురం, తుళ్లూరు మండలం, గుంటూరు జిల్లా సచివాలయాల్లో పడిగాపులు తప్పవా..? నాలుగు సంవత్సరాలుగా వలంటీర్ ప్రతి నెల 1వ తేదీన ఇంటికే వచ్చి పింఛన్ అందించేవాడు. నా లాంటి వృద్ధులకు ఎంతో మేలు జరిగేది. ఇప్పుడు సచివాలయాలకు వెళ్లి పింఛన్ తీసుకోవాలంటున్నారు. ఒకపక్క ఎండలు మండిపోతున్నాయి. అక్కడికి వెళ్లి పడిగాపులు కాసి తెచ్చుకొనేందుకు ఇబ్బందిగా ఉంటుంది. పింఛన్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాను, వలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ నిలిపివేయాలనడం చాలా దారుణం. అధికారులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఇస్తారో తెలియదు. వృద్దుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ కొనసాగించాలి. – సయ్యద్ పెద్దబీబి, ఉరుటూరు, వీరపునాయునిపల్లె మండలం, కడప జిల్లా అన్ని తానై చూసేది ఒకటోతేదీ వస్తే వలంటీర్ మా వీధిలోకి వచ్చి ఇంటింటికి వెళ్లి పింఛన్ ఇచ్చేది. గతంలో పెన్షన్ తీసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరిగి బాధలు పడేదాన్ని. వలంటీర్ వ్యవస్థ వచి్చన తరువాత పెన్షన్తో పాటు అన్ని తానై చూసేది. గతంలో భారీ వర్షాలు రావడంతో మా ప్రాంతం వరద ముంపునకు గురైంది. ఇళ్లలోకి నీళ్లు చేరవడంతో ముందుగానే వలంటీరు వచ్చి జాగ్రత్తలు తీసుకుని మాకు పునరావాసం కలి్పంచి సహాయం చేసింది. అలాంటి వారిని పెన్షన్ల పంపిణీ బాధ్యత నుంచి తప్పించడం బాధాకరం. – గులాబ్జాన్, బాపక కాలువ, మదనపల్లె.చిత్తూరు జిల్లా. ఇక మాకు పస్తులే కాళ్లు చేతులు సన్నగిల్లి ఒంట్లో సత్తువ లేక మంచం పట్టాను. ఐదేళ్లుగా ఇంటికే పొద్దున్నే వలంటీర్ వచ్చి పెన్షన్ అందించేవారు. మా లాంటి వృద్ధులకు వరంలా ఉండేది. ఇప్పుడు మానవత్వం లేని రాజకీయ స్వార్థంతో మేమంతా సచివాలయం వద్ద పెన్షన్ తీసుకోవాలని చెబుతు న్నారు. వలంటీర్ తెచ్చి పింఛన్ ఇవ్వకుంటే పస్తులతో చావు తప్పదు. ఆర్.కరాపాడులో సచివాల యం వద్దకు వెళ్లేందుకు శరీరం సహకరించదు. మా లాంటి పేదలపై ఇటువంటి కక్షసాధింపు మంచిది కాదు –హత్తి త్రినాథ్, కన్నుపుట్టుగ, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా ఈ పాపం ఊరికే పోదు నా వయసు 85 సంవత్సరాలు. అనారోగ్యంతో మంచంలో నుంచి లేవాలంటే ఇద్దరు మనుషులు పట్టుకుని లేపాలి. ప్రతి నెలా వలంటీరు ఇంటికి వచ్చి వృద్దాప్య పింఛన్ ఇచ్చేవాడు. ఈ నెల ఇంకా అందలేదు. సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాలంటే నా వల్ల కాదు. వలంటీర్ నేను ఉండే మంచం దగ్గరికే వచ్చి పింఛను ఇచ్చే వాడు. ఇప్పుడు అక్కడికి తీసుకెళ్లేవారు లేరు. ఈ పాపం ఊరికే పోదు – షేక్ బడేబి,కురిచేడు, ప్రకాశం జిల్లా నడవలేని నేను సచివాలయానికి ఎలా వెళ్లాలి? ఉదయం నుంచి వలంటీరు వచ్చి పింఛన్ ఇస్తారేమో అని ఎదురు చూశాను. మూడో తేదీ వరకు పింఛన్ ఇవ్వరని తెలిసింది. సచివాలయానికి వెళ్లి నేనే పింఛన్ను తెచ్చుకోవాలని చెబుతున్నారు. మోకాళ్లు నొప్పులతో నడవలేని స్థితిలో ఉన్నాను. ఇప్పటి వరకు గ్రామ వలంటీరు ఒకటొవ తేదీనే మా ఇంటికి వచ్చి పింఛన్ అందించారు. ఇప్పుడు వలంటీర్లు పని చేయకూడదని చెప్పడం దారుణం. వలంటీర్లు పనిచేయకపోతే నాలాంటి వాళ్లు చాలా ఇబ్బంది పడతారు. ఈ ఐదేళ్ల నుంచి పింఛన్ కోసం వెళ్లే నరకయాతన తప్పింది. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితులు వచ్చాయి. – సూరగాని తులశమ్మ, జి.కొండూరు, ఎన్టీఆర్ జిల్లా) పింఛన్ కటకటే.. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాను. డయాలిసిస్ చేయించుకునే స్థోమత లేకపోయినప్పటికీ సీఎం జగన్ ప్రభుత్వం ఉచిత వైద్యంతోపాటు రూ.10 వేలు పింఛన్ను మూడు నెలలుగా అందజేస్తోంది. ప్రతినెలా ఒకటో తేదీనే వలంటీరు ఇంటికి వచ్చి పింఛన్ అందజేసేవారు. వలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయవద్దంటూ ఫిర్యాదు చేయడంతో ఈ నెల సచివాలయం వద్దకు వెళ్లి తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. నేను సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడాలి. – నాబాన వెంకటే‹Ù, గర్భాం గ్రామం, మెరకమూడిదాం మండలం, విజయనగరం జిల్లా రెండు కిలోమీటర్లు నడవాలి ప్రతి నెలా ఒకటో తేదీన మా వలంటీరు ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేది. ఇప్పుడు సచివాలయానికి వచ్చి పింఛన్ తీసుకోమంటున్నారు. మా ఇంటి నుంచి 2.కి.మీ దూరంలో ఉన్న వీరఘట్టం సచివాలయానికి నేను నడిచి వెళ్లాలి. ఓ పక్క ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ ఎండల్లో పింఛన్ కోసం వెళితే మళ్లీ తిరిగి ఇంటికి వస్తానో రానో అని భయంగా ఉంది. చంద్రబాబు తీరు సరైనదికాదు. – బిడ్డిక పెద్ద సుంబురు, అచ్చెపువలస గిరిజన గ్రామం, పార్వతీపురం మన్యం జిల్లా చంద్రబాబుకు కడుపుమంట ఎందుకో? వలంటీర్లు ఉదయాన్నే తలుపుతట్టి పింఛన్ డబ్బులు ఇచ్చేవారు. అంతేకాదు వలంటీర్ల వల్ల అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయి. ఇపుడు తగుదనమ్మా అని చంద్రబాబు వలంటీర్లను అడ్డుకుని పింఛన్ ఇవ్వకుండా చేస్తే ఎంత ఇబ్బంది. దీనివల్ల ఆయనకు ఒరిగేది ఏమిటి? – బి.మంగమ్మ, పింఛన్ లబి్ధదారు, చెందోడు, కోట మండలం, తిరుపతి జిల్లా మళ్లీ పాత కష్టాలేనా .నేను దివ్యాంగురాలిని. గతంలో పెన్షన్ కోసం మా నాన్న వెంకటరమణ ప్రతి నెలా ఒకటో తేదీన కె.నగరపాలెం పంచాయతీ కార్యాలయానికి ఆటోలో తీసుకొని వెళ్లేవారు. ఒక్కోసారి నెలకు రెండు మూడు సార్లు తిరగాల్సి వచ్చేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆ కష్టం తప్పింది.ఈ ఐదేళ్లు ఎక్కడికి వెళ్లకుండానే ఇంటికే పెన్షన్ వచి్చంది. ఇప్పుడు వలంటీర్లు పెన్షన్ను అందించకూడదని అంటున్నారు. – చల్లపల్లి ఎరి్నకుమారి, మంగమారిపేట, విశాఖ జిల్లా పింఛన్ కోసం పక్క ఊరికి వెళ్లాలా..? వలంటీర్లు నెలనెలా ఠంఛన్గా ఇంటికే వచ్చి అందజేసేవారు. ఇకపై పింఛన్ తీసుకునేందుకు పక్క ఊర్లో ఉన్న సచివాలయానికి వెళ్లాలా? నాకు చాలా ఏళ్లుగా ఆరోగ్యం బాగోలేక ఇంట్లో నుంచి కదలలేని పరిస్థితి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ ద్వారా నాకు పింఛన్ డబ్బులు ఇంటికి వచ్చి ఇచ్చేవారు. నడవలేని నాకు ఇక ఇబ్బందులు తప్పవు. అక్కడ పడిగాపులు కాసే ఓపిక నాకు లేదు. – వరికూటి మాలకొండారెడ్డి, చెన్నారెడ్డిపల్లి, పొదలకూరు మండలం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆయన బుద్ధే అంత నాకు పెన్షన్ను ప్రతి నెలా ఒకటో తేదీన మా వలంటీర్ తలుపుతట్టి ఇచ్చేవారు. చంద్రబాబు రాజకీయంలో ఇప్పుడు నేను పెన్షన్ తీసుకోవాలంటే మా గ్రామ సచివాలయానికి వెళ్లాలి. ఎక్కడ వడదెబ్బ తగులుతుందోనని భయమేస్తోంది. ఇలా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబుకు మా ఉసురు తప్పక తగులుతుంది. – కోటపాటి పెంచలయ్య, దిగువపేటలోని గాం«దీవీది, సిద్దవటం, వైఎస్సార్ జిల్లా నేను సచివాలయానికి ఎలా వెళ్లేది? గత రెండేళ్లుగా పక్షవాతంతో కాళ్లు పూర్తిగా చచ్చుబడ్డాయి. లేవలేని దుస్థితి. 24 గంటలు మంచంపైనే ఉండాల్సి వస్తుంది. ప్రతి నెలా ఇంటి వద్దకే వచ్చి వలంటీర్ పింఛన్ ఇచ్చివెళ్లేది. ప్రస్తుతం వలంటీర్లకు పింఛన్ పంపిణీ నిలిపివేయడం చాలా దారుణం. నేను ఏవిధంగా సచివాలయానికి వెళ్లాలి. ఎలా పింఛన్ తీసుకోవాలని, వరుసలో ఎలా నిలబడాలి. గుర్తొస్తేనే భయమేస్తోంది. – సువార్తమ్మ, క్రిష్టిపాడు గ్రామం, దొర్నిపాడు మండలం, నంద్యాల జిల్లా ఆ తిప్పలు మాకొద్దు నాకు 77 ఏళ్లు. ఎవరూ లేరు. చెల్లెలు కొడుకే అన్నం పెడుతున్నాడు. నడవలేని దుస్థితిలో పింఛన్ డబ్బులే ఆసరా. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పింఛన్ కోసం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపురం నడిచి వెళ్లేవాళ్లం. ఇప్పుడు ప్రతి నెల వలంటీర్ ఇంటికొచ్చి పింఛన్ ఇస్తున్నారు. ఈ నెల పింఛన్ డబ్బులు కోసం ఎదురు చూశా. కానీ సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవాలంటున్నారు. జీ.ఎర్రగుడి సచివాలయం వెళ్లాలంటే 14 కిలోమీటర్లు. నడవలేని స్థితిలో ఉన్న నేను అంతదూరం వెళ్లి పింఛన్ ఎలా తెచ్చుకోవాలో తెలియడం లేదు. మాలాంటి వాళ్లను ఇబ్బంది పెడితే ఏమొస్తుంది. – సయ్యద్ గూడమ్మ, తుగ్గలి మండలం, ఆర్.కొట్టాల గ్రామం, కర్నూలు జిల్లా -
‘పెత్తందారీ ప్రయోజనాల కిరాయి వ్యక్తి చంద్రబాబు’
సాక్షి, తాడేపల్లి: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలకు చంద్రబాబు నాయుడు భిన్నం అని, పెత్తందారీ ప్రయోజనాల కోసం పని చేసే కిరాయి వ్యక్తి అని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్రావు ధ్వజమెత్తారు. పేదవర్గాలంతా కూలోళ్లుగానే బతకాలన్నది చంద్రబాబు అహంకారమని, ఎస్పీలు, బీసీల్నీ పదే పదే అవమానించి, టిప్పర్ డ్రైవర్లకు వైఎస్సార్సీపీ సీట్లు ఇస్తోందా అని వ్యాఖ్యానించిన అహంకారి బాబును క్షమించే ప్రసక్తే లేదన్నారు. జూపూడి ప్రభాకర్రావు మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. విభిన్న ప్రచారశైలిలో పెత్తందారీ పార్టీలు ప్రస్తుత ఎన్నికల రణరంగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఐదేళ్లల్లో పేదల పక్షాన నిలబడి తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను, చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాలను చెప్పుకుంటూ పోతుంది. కానీ, ఏరోజూ పేదలను పట్టించుకోనటు వంటి అవతల వర్గం మాత్రం ఒకదానికి ఒకటి పొంతన లేకుండా పెత్తందారీ పోకడలతోనే ప్రచారంలో ఉంది. ముగ్గురు కలిసినా ప్రజలు వాళ్లను ఆదరిస్తారో లేదో కూడా అర్ధం కానటు వంటి పరిస్థితి. అందువల్ల ఆ పార్టీలు ఒకరికొకరు సఖ్యత లేకుండా అవతలగానే ఉండిపోతున్న స్థితి. పేదల కష్టసుఖాలు, వారి ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే.. మిగతా పార్టీల ఎన్నికల ప్రచారశైలి మాత్రం ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా భిన్నంగా ఉందన్న సంగతి చూస్తున్నాం. పెత్తందార్ల ప్రయోజనాల కిరాయి వ్యక్తి చంద్రబాబు పెత్తందారీ ప్రయోజనాల కోసం ఒక కిరాయి మనిషిలా చేతల్లోనే కాకుండా.. మాటల్లోనూ చంద్రబాబు మాట్లాడుతున్నాడు. మొన్న శింగనమల అభ్యర్థి వీరాంజనేయులను ఉద్దేశించి.. టిప్పర్ డ్రైవర్కు సీటిచ్చి నిశానీలుగా వారిని వాడుకుని, వాళ్లద్వారా సంతకాలు పెట్టించుకుని వైఎస్ఆర్సీపీ ఏలాలని చూస్తుందంటూ ఎగతాళి చేశారు. అదే మా పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్ మాత్రం.. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లుగా సహస్ర వృత్తులు టిప్పర్ డ్రైవరైనా, çప్లంబర్, మేసన్, వెల్డర్, కుమ్మరి, చాకలికి గానీ.. అనేక వత్తులకు గౌరవం తేవడానికి కృషి చేస్తున్నారు. దశాబ్దాలుగా చట్టసభల్లోకి వెళ్లనటువంటి ఈ వర్గాలను చట్టసభల్లో నిలబెట్టి వాళ్ల వర్గాల తరఫున వారు మాట్లాడుకునేలా చూడాలని ఆయన తపిస్తున్నారు. బాబూ.. నీకూ సీఎం జగన్కు ఉన్న వ్యత్యాసమిది రెండెకరాలతో రాజకీయం మొదలుపెట్టి లక్షల కోట్లకు నువ్వు ఏ విధంగా ఎదిగావో అందరికీ తెలుసు. ఈ విషయంపై ఎస్సీ, ఎస్టీలు ఏనాడూ దృష్టి పెట్టలేదు. అయితే, నువ్వు మాత్రం దళితులు, బీసీలు, మైనార్టీ వర్గాల్లోని పేదలంతా మీ చెప్పుచేతల కింద మోచేతి నీళ్లు తాగుతూ బతకాలని కోరుతున్నావు. ఏంటి మీ పెత్తందారీ అహంకారం..? మీతో సరిసమానంగా ఉండే హక్కు దళితులకు లేదనుకుంటున్నావా..? ఉన్నా ఉపయోగించుకోరాదని నుకుంటున్నారా..? ఇప్పుడు మీరునుకుంటున్న పెత్తందారీ పోకడలకు కాలం చెల్లింది. మాకు కొండంత అండగా శ్రీ వైఎస్ జగన్ ఉన్నారు. అదే నీకూ.. మా జగన్ గారి మధ్య ఉన్న వ్యత్యాసం. మేం బాగు పడితే మీకెందుకంత కడుపుమంట? పేద కుటుంబాల పిల్లలకు చదువు ఖరీదు కాకూడదని అమ్మ ఒడి ద్వారా ఏడాదికి రూ.15 వేలు అందించే ప్రభుత్వాన్ని అవహేళన చేస్తావా చంద్ర బాబూ..? ఉచిత విద్యను అందించే బడులను బాగుచేసి కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా అన్ని సౌకర్యాలు కల్పించి పిల్లలకు యూనిఫాం, పుస్తకాలు, బూట్లుతో పాటు తరగతి గదుల్లో ఇంగ్లీషు పాఠాలు చెబుతుంటే.. పేదలకు ఇంగ్లీషు బోధన అవసరమా..? అంటూ కోర్టులకెళ్లి మరీ అడ్డుకుంటావా..? ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ట్యాబ్లిస్తే మీకంత కడుపు మంట ఎందుకు..? పేద వర్గాలకు కొండంత అండగా సీఎం జగన్ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్ మొదట్నుంచీ ఒక విషయం పదేపదే చెబుతున్నారు. పేదలు.. పెత్తందారీ వర్గం మధ్య జరుగుతోన్న యుద్ధమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నారు. రూ.2.70 లక్షల కోట్లను పేదల పక్షాన నిలబడి ప్రభుత్వం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందించి పేదవర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన గొప్ప వ్యక్తి జగన్గారు. బ్యాంకు అకౌంట్లు పెత్తందారీ అగ్ర వర్ణాలకే కాదు. దళిత, బీసీ, మైనార్టీలకూ ఉంటాయని, అకౌంట్లలో డబ్బులు నేరుగా జమ అవుతాయని నిరూపించిన పేదల పక్షపాతి ప్రభుత్వం ఇది. మా సంక్షేమం జోలికొస్తే ఊరుకోబోం చంద్రబాబూ.. బహిరంగ సభల్లో నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్ధమౌతుందా..? నీకు పిచ్చి పట్టిందో, వయస్సు పెరిగి చాదస్తం పెరిగిందో.. లేదంటే, ఎన్నికలవగానే పారిపోదామనుకుంటున్నావో అర్ధం కావట్లేదు. కానీ, మా నాయకుడు జగన్ గారు చేస్తోన్న అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాల జోలికొస్తే మాత్రం దళిత, బీసీ, మైనార్టీల వర్గాలు ఊరుకోరు. మిమ్మల్ని, మీతో పాటు వచ్చే పార్టీలను తరిమి తరిమి కొడతారు. తండ్రీకొడుకులకు పరిపాలనా అర్హతే లేదు పేదవాడికి , బడుగు బలహీనవర్గాలకు చట్టసభల్లో అడుగుపెట్టే అర్హత లేదని నువ్వంటే.. నీకూ, నీ కొడుకుకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత మీకెక్కడిదని చంద్రబాబు, లోకేశ్లను అడుగుతున్నాను. నీ కొడుకు ఎమ్మెల్యేగా గెలవలేక దొడ్డిదారిన మంత్రిపదవిలో కూర్చొని ఏం చేశాడు..? అతనికి ఉన్న అడ్మినిస్ట్రేషన్ స్థాయి ఎంత..? పరిపాలన, పేదల బతుకుల పట్ల అతనికున్న అవగాహనేంటి..? 2014 నుంచి 2019 వరకు మీరు చేసిన పరిపాలన ఏంటి..? మీ పరిపాలనలో మీ కులస్తులు, మీకు కొమ్ముకాసే అగ్రవర్ణాలు తప్ప ప్రయోజనాలు పొందిన వారెవరు..? ప్రజలు అన్నీ గమనించారు కాబట్టే.. 2019లో మిమ్మల్ని 23 సీట్లకే పరిమితం చేశారు.అయినా మీ వైఖరి మారలేదు. అందుకే రాష్ట్రంలో పేదవర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా మీపై తిరగబడే రోజులొచ్చాయి. అంబేద్కర్, ఫూలే అంటే మీకు నచ్చదా..? చంద్రబాబు హయాంలో అంబేద్కర్ విగ్రహం పెడతానన్నాడు. అది ఎటు పోయిందో ఏం చేశాడో తెలియదు. కానీ, అదే అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తులో మా నాయకుడు జగన్మోహన్రెడ్డి గారు విజయవాడ లో నిలబెట్టి దళితుల ఆత్మగౌరవాన్ని ఆకాశమంతా ఎత్తున ఆవిష్కరించా రు. కనీసం, ఏ ఒక్కరోజైనా ఆ విగ్రహం దగ్గరకు వెళ్లి తెలుగుదేశం పార్టీ నేతలు రెండు పువ్వులు అంబేద్కర్ గారి పాదాల దగ్గర పెట్టారా..? అంటే, అంబేద్కర్, ఫూల్ గారంటే మీకు నచ్చదా..? అంబేద్కర్ రాజ్యాంగమంటే మీకు గౌరవం లేదా..? ఎస్సీలు రెడ్లను పెళ్లి చేసుకుంటే అసెంబ్లీ, పార్లమెంట్లకు వస్తారా.. అంటూ మాట్లాడుతున్నావే.. నీకసలు బుద్ధుందా చంద్రబాబూ..? 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశానంటావే.. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవశాలిగా చెప్పుకుంటావే.. మరి, ఇన్నాళ్లలో నువ్వు ఏనాడూ అగ్రవర్ణాలను వివాహమాడిన ఎస్సీలకు సీట్లివ్వలేదా..? అంటే, అంబేద్కర్ గారు పెట్టిన కులనిర్మూలనకు, రాజ్యాంగంలో రాసుకున్న దానికి మీరు వ్యతిరేకమా..? కుల వ్యతిరేక పోరాటంలో వైఎస్ఆర్ కుటుంబం కుల నిర్మూలన గానీ.. కులం అనేది ఈ దేశంలోనే ఉండరాదని రాజ్యాంగంలో రాసుకున్న దాన్ని ఆచరణలో చూపినటు వంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడిగారి కుటుంబ గొప్పదనం గురించి నీకు తెలుసా చంద్రబాబూ..? రాజశేఖర్రెడ్డి గారి మేనత్తలంతా ఎస్సీలను చేసుకున్నోళ్లు కాదా..? నీ కుటుంబంలో .. నీ ఇంట్లో ఎక్కడైనా ఒక ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ జరిగిందా..? ఒక ఎస్సీని, ఒక బీసీని పెళ్లి చేసుకున్న చరిత్ర నీదగ్గర ఉందా..? ఆయా వర్గాలన్నింటినీ కూలోళ్లుగా మీ ఇళ్లల్లో పనిచేయించుకున్నారే గానీ.. వాళ్లను వివాహమాడి మీ ఇంట్లో భాగస్వామ్యం కల్పించలేని అహంకారివి నువ్వు. అలాంటి నీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మనోభావాలు ఏవిధంగా అర్ధమౌతాయి. బాబును క్షమించే ప్రసక్తేలేదు.. తరిమి కొడతాం చంద్రబాబును ఏ విధంగా.. ఎందుకు క్షమించాలి..? ఇదే చంద్రబాబు గతంలో ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా..? అని అవమానించాడు. బీసీలనైతే నోరెత్తితే తోకలు కత్తిరిస్తానన్నాడు. ఇలాంటి నీచమైన భావజాలం ఉన్న నాయకుడ్ని ఊరూరా దళిత వాడల్లో జనం అడుగడుగునా నిలదీయండి. అంబేద్కర్ విగ్రహాన్ని తాకనటువంటి నువ్వు.. ఆయన రాసిన రాజ్యాంగాన్ని గౌరవించని నువ్వు.. ఎస్సీ నాయకులపై నోటికొచ్చిన విధంగా మాట్లాడే నువ్వు.. ఈ రాష్ట్ర పరిపాలనకు అర్హుడివి కాదు. ఇదే విషయాన్ని రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఆలోచన చేసి తగిన నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రంలోనే గొప్ప సంస్కరణవాదిగా మా నాయకుడు జగన్ ఉన్నారు గనుకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు ఆయన పక్షాన నిలుస్తున్నారు. అందువల్ల ఆయనే తిరిగి సీఎం అవుతారని జూపూడి స్పష్టం చేశారు. -
కృష్ణా జిల్లాలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు
-
వలంటీర్లంటేనే వణికిపోతున్న పెత్తందారులు
పోగాలము దాపురించినప్పుడు ఇలాగే చేస్తుంటారు. రాజకీయాలలో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే ఉంటాయి.తెలుగుదేశం పరిస్థితి అలాగే తయారైంది. ఏపీలో వలంటీర్ల సేవలకు బ్రేక్ పడేలా తాము చేసిన కుట్ర ఫలించాయని తెలుగుదేశం పార్టీ నేతలు లోలోపల సంతోషించవచ్చేమో కాని, అదే వారికి రాజకీయంగా ఉరితాడు కాబోతోంది.వచ్చే రెండు నెలలు వలంటీర్ల ద్వారా వృద్దులకు పెన్షన్ పంపిణీ చేయరాదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.ఇది ఏపీ ప్రజలకు శరాఘాతం వంటిదే. తెలుగుదేశం పార్టీ వలంటీర్ల వ్యవస్థపై నిత్యం విషం కక్కుతున్న సంగతి తెలిసిందే. టీడీపీకి ఏజెంట్ గా మారిన మాజీ ఐఎఎస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రయోగించి ఈ మేరకు ఉత్తర్వులు తెప్పించారు. రమేష్ వలంటీర్లకు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లడమే కాకుండా, ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఈనాడు రామోజీరావు ఎన్నోసార్లు వలంటీర్ల వ్యవస్థపై విద్వేషం కక్కుతూ వార్తలు రాయించారు. ✍️టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు వలంటీర్లను పలుమార్లు అవమానించారు. వారిని మూటలు మోసే ఉద్యోగం చేసేవాళ్లని, ఆడవాళ్లను ఇబ్బందిపెట్టేవారని ఇలా పిచ్చి ఆరోపణలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి వలంటీర్లను కిడ్పాపర్లుగా అబివర్ణించారు. ఏపీ ప్రజల పట్ల ఏ మాత్రం మానవత్వం లేనివారు, ప్రజల సంక్షేమం కోరుకోనివారు ,దుర్గార్గులు మాత్రమే ఇలాంటి ఉత్తర్వుల కోసం ప్రయత్నిస్తారు. నిమ్మగడ్డ రమేష్ అలాంటి విలన్ పాత్రను పోషించారని చెప్పాలి. కాకపోతే సినిమాలో విలన్ అంతిమంగా ఓడిపోయినట్లే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయంగా మూల్యాన్ని చెల్లించుకోబోతోంది. రమేష్ కుమార్ ఆ పార్టీకి మేలు చేయాలనుకుని ఉండవచ్చుకాని జరగబోయేది కీడే అన్న సంగతి ఇప్పుడు బోదపడుతుంంది. ఈ విషయంలో చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ లపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత రావడంతో వారిద్దరూ మాట మార్చి వలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని ప్రకటించారు. చంద్రబాబు అయితే ఏకంగా ఏభైవేల రూపాయల వరకు వారికి ఆదాయం వచ్చేలా చేస్తానని అబద్దపు హామీని కూడా ఇచ్చేశారు. ఇళ్త వద్దకే పెన్షన్ ఇవ్వాలని అంటున్నారు. ✍️మరో వైపు ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి తమ వర్గం మీడియాను, ఇంకో వైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వంటి ప్రజా వ్యతిరేకులను ఉపయోగించి వలంటీర్ల వ్యవస్థపై కేసులు వేయించారు.నీచమైన కధనాలు రాయించారు. దీనికి తోడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేయడం ఆరంభించారు. అందుకు ప్రాతిపదికగా 2019 లో మొదటి దశలోనే ఎన్నికలు అంటే ఏప్రిల్ పదకుండు కల్లా ఎన్నికలు ముగియగా,ఈసారి అలాకాకుండా ఎన్నికలను నాలుగోదశకు మార్పించడంలో చంద్రబాబు బృందం సఫలం అయింది. టీడీపీ, జనసేన,బీజేపీ కూటమిలో గొడవలను సర్దుబాటు చేసుకోవడం కోసమే ఈ ఏర్పాటు అన్న అభిప్రాయం ఏర్పడింది.అలాగే ఐటి,సీబీఐ వంటి అదికారులు రంగప్రవేశం చేసి తమ వద్ద ఉండే నల్లధనం పట్టుబడకుండా జాగ్రత్తలు పడ్డారనుకోవాలి. అవి చాలవన్నట్లు ఇప్పుడు వలంటీర్ల వ్యవస్థపై కాటు వేశారు.ఈ మూడు నెలలు వలంటీర్ల సేవలు ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడంలో కృతకృత్యులయ్యారు. ✍️కాని దీనివల్ల వారికి ఈ ఆదేశమే యమపాశంగా మారబోతోందన్న విశ్లేషణలు వస్తున్నాయి. వలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయవద్దని చెప్పడం వల్ల సకాలంలో వృద్దులకు పెన్షన్ అందే అవకాశం ఉండదు.దీనిపై ప్రజలలో నిరసన వస్తుంది.ఇప్పటికే ఆ నిరసనలను టీడీపీ చవిచూస్తోంది. ఇదంతా తెలుగుదేశం నిర్వాకమని తెలుసుకోవడం కష్టం కాదు. అప్పుడు బలహీనవర్గాల ప్రజలంతా, ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న స్కీముల లబ్దిదారులంతా తెలుగుదేశంపై మరింత ఆగ్రహం చెందుతారు. వలంటీర్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించినా, హైకోర్టు అబిప్రాయపడినా ఇప్పటికిప్పుడు రెండున్నర లక్షలమందికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడం సాధ్యం కాని పని. గ్రామ,వార్డు సచివాలయానికి వెళ్లి తీసుకోవాలని అన్నప్పటికీ, వృద్దులంతా ఇబ్బంది పడతారు.దీనికి కారణం ఏమిటని వారు తెలుసుకుని టీడీపీని మరింత అసహ్యించుకుంటారు. వారు పట్టుబట్టి తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పాలని నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడే ఆపివేసిన వలంటీర్ల వ్యవస్థను టిడిపి కూటమి అధికారంలోకి వస్తే పూర్తిగా ఎత్తివేస్తారని జనం భావిస్తారు. ✍️అది టీడీపీకి మరింత శరాఘాతం అవుతుంది.అయితే ఈ ఆదేశాలతో తమకు సంబంధం లేదని టీడీపీ చెప్పడానికి యత్నిస్తోంది. అందులో వాస్తవం ఎంతో కొంత ఉందని అనుకోవాలంటే,చంద్రబాబు వెంటనే ఎన్నికల సంఘానికి వలంటీర్ల సేవలను యధావిధిగా కొనసాగించాలని లేఖ రాయాలి. అలా చేస్తారా?చేయరు.పైగా డబుల్ గేమ్ ఆడుతున్నారు. వలంటీర్లు తమ వద్ద ఉన్న సిమ్ కార్డులు,టాబ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అందచేయాలని కూడా ఎన్నికల సంఘం ఆదేశించింది.దీంతో ఒకరకంగా వలంటీర్లకు స్వేచ్చ లబించవచ్చు.వారు తమ ఇష్టం వచ్చినట్లు ఎన్నికలలో పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వారిని లబ్దిదారులంతా ఎందుకు పెన్షన్ రాలేదని అడిగితే ఎటూ టిడిపినే కారణమని చెబుతారు.దానివల్ల ఎవరికి నష్టం జరిగేది ఊహించుకోవచ్చు. 1999 ఎన్నికల సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చే స్కీమ్ ఒకదానిని కేంద్రం అమలులోకి తెచ్చింది. ✍️అప్పటికే ఎన్డీఏలో భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని కేంద్రం నుంచి అధికంగా గ్యాస్ సిలిండర్లు వచ్చేలా చేసుకున్నారు.అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ నేత కొణిజేటి రోశయ్య ఎన్నికల సంఘానికి దీనిపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించినట్లు లేదు కాని, చంద్రబాబు ,టీడీపీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.పేదలకు గ్యాస్ కనెకక్షన్లు ,సిలిండర్లు ఇస్తుంటే కాంగ్రెస్ వారు అడ్డుకుంటున్నారని ఆరోపించేవారు. దానిపై కాంగ్రెస్ నేతలు వివరణ ఇవ్వడానికి ఇబ్బంది పడేవారు. ఎన్నికల సందర్భంలో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ విమర్శించేది. కాని దానిని చంద్రబాబు తనకు అడ్వాంటేజ్ గా మార్చుకున్నారు. ఆ అంశంతో పోల్చితే వలంటీర్ల వ్యవస్థపై తెలుగుదేశం చేసిన నిర్వాకం చాలా పెద్దది. దారుణమైనది. ✍️అప్పుడు గ్యాస్ సిలిండర్ల స్కీమ్ వల్ల కొన్నివేల మంది మాత్రమే ప్రయోజనం పొందేవారు. కాని ఇప్పుడు వలంటీర్ల వల్ల కోట్లాది మంది ప్రజలు సేవలు పొందుతున్నారు. అలాంటి సేవలపై కక్షకట్టి ఆపేశారన్న విమర్శ సహజంగానే టీడీపీ, చంద్రబాబులపై వస్తుంది. దీనిపై ఆత్మరక్షణలో పడే చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వడానికి సతమతం అవుతున్నారు. ఈలోగా అధికార వైఎస్సార్సీపీ ఈ పాయింట్ పై విరుచుకుపడింది. వృద్దులు, బలహీనవర్గాలంటే టిడిపికి గిట్టదని, చంద్రబాబు పెత్తందార్ల ప్రతినిది అని ,అందుకే పేదల పొట్టగొట్టే పని చేశారని ఆరోపించారు. ఏతావాతా టీడీపీకి ముందు నుయ్యి,వెనుక గొయ్యి అన్న చందంగా పరిస్థితి ఏర్పడింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో తమకు సంబంధం లేదని అబద్దం చెప్పడానికి యత్నిస్తారు.కాని పలుమార్లు ఆయనతో సమావేశాలు పెట్టించి ప్రభుత్వంపై విమర్శలు చేయించడం, గతంలో ఆయన ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు టీడీపీ మద్దతు ఇవ్వడం వంటి ఘట్టాలు జ్ఞప్తికి వస్తాయి. ✍️నిజానికి వలంటీర్ల వల్ల కేవలం పెన్షన్ లే కాదు..అనేక రకాల ఇతర సేవలు కూడా అందుతున్నాయి. అర్హులైన ప్రజలకు ఏదైనా స్కీము వర్తింప చేయదలిస్తే వలంటీర్ కు చెప్పేవారు. వలంటీర్లు వారినుంచి దరఖాస్తు తీసుకుని గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా తగు ఉత్తర్వులు పొంది,వాటిని లబ్దిదారులకు అందచేస్తుంటారు. ఎవరికి పుట్టిన తేదీ సర్టిఫికెట్, కులం ,ఆదాయం తదితర సర్టిఫికెట్లు అవసరమైనవారికి ఇళ్ల వద్దకే తెచ్చి ఇస్తుంటారు.ఇప్పుడు వాటన్నిటికి బ్రేక్ పడుతుంది.ఇప్పుడే ఆపేసి ప్రజలందరిని ఇబ్బందులకు గురి చేసినవారు ,ఎన్నికల తర్వాత ఏమి చేస్తారో అన్న సందేహం వస్తుంది. ఇవన్ని టీడీపీకి నష్టం చేసే అంశాలే అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే శాసనసభ ఎన్నికల తరుణంలో తెలుగుదేశం పార్టీ తనకు తానే ఉరితాడు పేనుకుని మరీ తన మేడకు చుట్టుకుని ఆత్మహత్య చేసుకోబోతోందన్న భావన కలుగుతుంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చేతులారా చేసుకున్న చంద్రబాబు..టీడీపీ నెత్తిన బండరాయి..
-
పేదలపై ఇంత కక్ష ఎందుకు బాబూ?
సాక్షి, అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఏపీ సీఎం జగన్ ఆచరణలో అమలు చేస్తుంటే, చంద్రబాబు మాత్రం పేదలపై కక్ష పెంచుకుంటున్నారని యూకేలోని పలువురు ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. ‘గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగంగా సీఎం జగన్ వలంటీర్ల వ్యవస్థ తెచ్చారు. వారు ఇంటింటికీ వెళ్లి పేదలకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు, అలాంటి వారిపై ఇంతగా కక్షకడతారా?’ అని చంద్రబాబును ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్రకు మద్దతు తెలుపుతూ వైఎస్సార్సీపీ యూకే సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో లండన్ ఇల్ఫోర్డ్ లోని శ్రేయాస్ హోటల్లో సమావేశం నిర్వహించారు. చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాతణ్ కలిసి సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా కోర్టుల్లో పిటిషన్లు వేసి పేదలకు వలంటీర్లు పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారన్న విషయం మీడియా ద్వారా తెలుసుకొని, లండన్ పార్లమెంట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏపీలో సమూల మార్పులు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ యూకే కనీ్వనర్లు డాక్టర్ ప్రదీప్ చింతా, ఓబులరెడ్డి పాటకోట మాట్లాడుతూ గ్రామాల్లో సీఎం జగన్ సమూల మార్పులు తెచ్చారన్నారు. అక్కచెల్లెమ్మలకు రూ.2.70 లక్షల కోట్లు బటన్ నొక్కి వారి అకౌంట్లలోకి జమ చేశారని, ఒక్క పైసా లంచం లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా అర్హులందరికీ పథకాలు అందించారని గుర్తుచేశారు. అమ్మఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, పెన్షన్ కానుక, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, జగనన్న చేదోడు, జగనన్న తోడు, 31 లక్షల ఇళ్ల పట్టాలు కల్యాణమస్తు, షాదీ తోఫా సైతం ఇలా అనేక పథకాలు పేదలకు అందించారని వివరించారు. అందుకే సిద్ధం బస్సుయాత్ర విజయవంతంగా సాగుతోందన్నారు. ఏపీలో కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని గాం«దీకి విన్నవించామన్నారు. తొలుత వారు సిద్ధం పోస్టర్లు పట్టుకొని సీఎం జగన్ బస్సు యాత్రకు మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు జై జగన్, జోహర్ వైఎస్సార్, ఎన్నికలకు మేం అంతా సిద్ధం, వైనాట్ 175 అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అక్కడి వైఎస్సార్సీపీ నాయకులు సురేంద్ర రెడ్డి అలవల, నారాయణరెడ్డి బూర్ల, మలిరెడ్డి కిషోర్, భూమిరెడ్డి కార్తీక్, పాలెం క్రాంతి, శ్రీనివాస్ తాళ్ల, శ్రీనివాస్రెడ్డి దొంతిబోయిన, ప్రతాప్ భీమిరెడ్డి, వజ్రాల రాజశేఖర్, పూర్ణచంద్ర దుగ్గెంపూడి, శ్రీకాంత్ ముక్కు, ఆవుల వంశీకృష్ణ, కంభంపాటి వినయ్, కిరణ్ కొరికాన, వీర పులిపాకల, శ్యామ్, చాగంటి మణికంఠేశ్వర పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. -
మళ్లీ ‘అవ్వ’స్థలు తప్పవా!
నక్కపల్లి(అనకాపల్లి జిల్లా): రేపటి నుంచి పింఛన్ ఇంటికి తెచ్చి ఇవ్వరన్న వార్తలు అవ్వాతాతల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. టీడీపీ హయాంలో పడిన అవస్థలు జ్ఞప్తికి తెచ్చుకుని వారు ఆవేదన చెందుతున్నారు. పంచాయతీ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందేమోనని మదనపడుతున్నారు. ఇదే విషయంపై తన గోడు వెలిబుచ్చారు ఓ అవ్వ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చినదొడ్డిగల్లుకు వచ్చిన వైఎస్సార్ సీపీ అనకాపల్లి లోక్సభ అభ్యర్థి, ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు కురందాసు వృద్ధురాలు ఎరకమ్మ ఇంటికి వెళ్లారు. పింఛను వస్తుందా అంటూ ఆరా తీశారు. ఎరకమ్మ బదులిస్తూ ‘‘ఇప్పటివరకు ప్రతినెలా ఒకటో తేదీ పొద్దుపొద్దునే వలంటీరు వచ్చి డబ్బులిస్తున్నాడు. రేపు ఒకటోతేదీ కదా పింఛను ఇంటికి తెచ్చి ఇవ్వరంట. మేమే సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాలంట. వలంటీర్లను తీసేశారంట నిజమేనా బాబూ! ఈ వయసులో సచివాలయం వరకు వెళ్లి తెచ్చుకోలేమయ్యా.. ఇంటికొచ్చి ఇచ్చేటట్టు చూడయ్యా’’ అంటూ వేడుకుంది. ముత్యాలనాయుడు స్పందిస్తూ చంద్రబాబు వల్లే ఎన్నికల అధికారులు వలంటీర్లను రెండునెలలపాటు ఆపారు. జగనన్నకు ఓట్లు వేసి గెలిపిస్తే మళ్లీ వలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్ ఇస్తారు. మీరంతా జగన్కే ఓట్లు వేయాలని’’ అని వివరించారు. అవ్వ మాట్లాడుతూ ‘‘నా ఓటు జగన్బాబుకే కొడుకా’’ అని వెల్లడించింది. అదే గ్రామంలో అప్పారావు అనే వృద్ధుడూ పింఛన్ ఇంటికే తెచ్చివ్వాలని కోరాడు. -
పింఛన్లపై బాబు డబుల్ గేమ్
సాక్షి, అమరావతి: అటుపక్క సామాజిక పింఛన్లను అడ్డుకోవడం.. ఇటుపక్క సకాలంలో ఇచ్చేయాలంటూ ఎన్నికల సంఘానికి లేఖలు రాయడం! ఇదీ చంద్రబాబు రెండు నాలుకల వైఖరి! స్వార్థ ప్రయోజనాల కోసం దిగజారుడు రాజకీయాలు, పేదల నోట్లో మట్టి కొట్టే ఆలోచనలు తనకు మినహా మరెవరికీ ఉండవని మరోసారి రుజువు చేసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా ప్రభుత్వం నియమించిన వలంటీర్లు ప్రతి నెలా ఒకటో తేదీన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇంటివద్దే పింఛన్లు అందిస్తూ పాలనను ప్రతి గడపకూ చేరువ చేశారు. దేశంలోనే తొలిసారిగా సీఎం జగన్ తీసుకొచ్చిన ఈ వ్యవస్థపై చంద్రబాబు వేయని నింద లేదు, చేయని ఆరోపణ లేదు. వివక్ష, లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాల ద్వారా పేదలు పారదర్శకంగా లబ్ధి పొందడం టీడీపీకి, ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది. చంద్రబాబు, ఆయన పార్ట్నర్ పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా నిత్యం అభాండాలు వేయడమే పనిగా వ్యవహరించారు. వలంటీర్లు రాత్రిళ్లు వెళ్లి తలుపులు కొడుతున్నారని, వారి వల్ల ఆడపిల్లలకు రక్షణ లేదని, ఆ వ్యవస్థను రద్దు చేయాలని కుట్రపూరిత ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ అయితే రాష్ట్రంలో వేలమంది యువతులు కనిపించకుండా పోయారని, అందుకు వలంటీర్లే కారణమంటూ దారుణంగా మాట్లాడారు. ఇలా అడుగడుగునా విపక్షం వేధించి అవమానించినా వలంటీర్లు పేదల సంక్షేమమే లక్ష్యంగా సేవాభావంతో విధులు నిర్వహించారు. నిమ్మగడ్డ ద్వారా.. సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా చేయడం ద్వారా ప్రభుత్వంపై బురద చల్లాలన్నది చంద్రబాబు కుతంత్రం. ఈ పనిని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఆయన ప్రత్యేకంగా అప్పగించారు. నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చంద్రబాబుకు అనుకూలంగా ఏ స్థాయిలో పని చేశారో అందరికీ తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ కోసం హఠాత్తుగా వాయిదా వేసి రాజ్యాంగాన్నే అపహాస్యం చేసిన చరిత్ర ఆయనది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూనే హైదరాబాద్లోని ఓ హోటల్లో చంద్రబాబు బినామీలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ను కలసి చంద్రబాబు కోసం ఏం చేయడానికైనా వెనుకాడబోనని చాటుకున్నారు. పదవీ విరమణ తరువాత కూడా నిస్సిగ్గుగా చంద్రబాబుకు మేలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. అందుకోసం కొంతమందిని పోగుచేసి సిటిజన్ డెమొక్రటిక్ ఫోరం పేరుతో తెర వెనుక రాజకీయాలు నడిపారు. అందులో భాగంగానే వలంటీర్ల వ్యవస్థ లేకుండా చేసేందుకు కోర్టులో కేసు వేశారు. పింఛన్ల పంపిణీకి అడ్డుపడి ఈసీకి ఫిర్యాదులు చేశారు. ప్రజాగ్రహంతో... పింఛన్ల పంపిణీకి అడ్డంకులు సృష్టించడంలో సక్సెస్ అయిన చంద్రబాబు, నిమ్మగడ్డ కుట్రపూరిత రాజకీయాలతో వలంటీర్లను ప్రజలకు దూరం చేయగలిగామని చంద్రబాబు బృందం చంకలు గుద్దుకున్నా ఒకటో తేదీ రావడంతో వారిలో వణుకు మొదలైంది. చంద్రబాబు, నిమ్మగడ్డ నిర్వాకాల కారణంగా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ ఆగిపోయే పరిస్థితి నెలకొంది. దీనిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నట్లు పసిగట్టిన చంద్రబాబు బృందం ప్లేటు ఫిరాయించింది. తాము అడ్డుకున్న కార్యక్రమం గురించి మళ్లీ వారే ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం గమనార్హం. పింఛన్ల పంపిణీకి తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ అందులో పేర్కొన్నారు. -
సంక్షేమ వారధులు వాలంటీర్లు.. మీ సేవలు మరువలేం(ఫైల్ ఫోటోలు)
-
చంద్రబాబు ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచి కక్ష కట్టారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటింటికీ అందుతున్నాయన్నారు. వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా? ‘‘చంద్రబాబుది మోసపూరిత రాజకీయం. ఒక రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా?. చంద్రబాబు ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తున్నారని సజ్జల దుయ్యబట్టారు. ‘‘వాలంటీర్లపై చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నాడు. పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే చంద్రబాబు గిట్టదు. నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు తరపున పనిచేస్తున్నారు. సిటిజన్ ఫర్ డెమొక్రసీలో ఉండేది చంద్రబాబు మనుషులే. తానొస్తే ఈ వ్యవస్థలు ఏమీ ఉండవని చంద్రబాబు మేసెజ్ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు పడితే 2.5 లక్షల జలగలు తయారయ్యేవి. చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం కూడా లేదు. వృద్ధులకు, వికలాంగులను ఇబ్బంది పెడితే మీకు ఏమొస్తుంది. చంద్రబాబు విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడు కాదు’’ అంటూ సజ్జల ధ్వజమెత్తారు. సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు.. ‘‘పవన్ను చంద్రబాబు మింగేస్తాడని ముందే చెప్పాం. పవన్కు ఇచ్చిన సీట్లలోనూ చంద్రబాబు మనుషులే ఉన్నారు. పెన్షనర్లు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు అందజేస్తాం. లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లి పెన్షన్లు తీసుకోవాలి. మూడో తేదీన పెన్షన్లు అందిస్తాం’’ అని సజ్జల వెల్లడించారు. ‘‘పేదలను రాచి రంపాన పెట్టంలో చంద్రబాబు ఎంతో ఉత్సాహం చూపుతారు. వాలంటీర్లు వద్దనుకుంటే చంద్రబాబు కోర్టుకు వెళ్లొచ్చు. వాలంటీర్లకు బదులుగా జన్మభూమి కమిటీలను తెస్తామని చెప్పుకోవచ్చు కదా?. వాలంటీర్లంటే చంద్రబాబుకు ఎందుకంత భయం?. సిటిజన్స్ ఫర్ డ్రమొక్రసీ అనే సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. ఈ సంస్థ ఏర్పాటు అయిన 15 రోజులకే వాలంటీర్లపై కోర్టులో కేసు వేశారు. చంద్రబాబు పార్టీ ఆఫీసులో తయారయ్యే స్క్రిప్టు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ వ్యవహరిస్తారు. కపిల్ సిబాల్ లాంటి కోట్లకు కోట్లు తీసుకునే లాయర్లతో కేసులు వేయించారు’’ సజ్జల ధ్వజమెత్తారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మళ్లీ పాతరోజులు.. చంద్రబాబు లాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే మళ్ళీ పాతరోజులు వస్తాయి. పెన్షన్లు అందటం కాదుకదా.. కనీసం దరఖాస్తు చేసుకోవటానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. చిన్న సర్టిఫికేట్ కావాలన్నా రోజుల తరపడి తిరిగే పరిస్థితి గతంలో ఉండేది. ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తున్నది వాలంటీర్లే. చంద్రబాబు కడుపుమంటతో వృద్దులు, వికలాంగులకు సేవలను నిలిపేశారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేయాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మరి సచివాలయ సిబ్బందిని కూడా జగనే నియమించారు కదా?’’ అని సజ్జల ప్రశ్నించారు. లబ్ధిదారులే మాకు స్టార్ క్యాంపెయినర్లు సీఎం జగన్ బస్సుయాత్రకు జనసునామీ కదిలి వస్తోంది. పొత్తు పెట్టుకున్న జనసేన, బీజేపీలను చంద్రబాబు మింగేశారు. పిఠాపురానికి ఎవరో పంపితే పవన్ వెళ్లాల్సి వచ్చింది. ఇష్టం లేకుండా పవన్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. సీఎం సీఎం అనే పరిస్థితి నుంచి చివరికి 21 సీట్లకే పరిమితం అయ్యాడు. బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. టీడీపీలో జెండా ఎత్తేసే పరిస్థితి వచ్చిందని చంద్రబాబుకు అర్థం అయింది. అందుకే చౌకబారు మాటలు, దూషణలతో ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు అత్యంత కీలకం. కుట్రలు చేసే వారెవరో, మేలు చేసే వారెవరో ప్రజలకు అర్థం అయ్యింది. ప్రతి ఇంట్లో ఉన్న లబ్ధిదారులే మాకు స్టార్ క్యాంపెయినర్లు’’ అని సజ్జల పేర్కొన్నారు. ఇదీ చదవండి: పేదవాళ్ల లబ్ధిపై టీడీపీ కుట్రల రాజకీయం: మంత్రి బొత్స -
వాలంటీర్లపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న టీడీపీ నేతలు
-
అవ్వాతాతలపై బాబు పగ..
-
పింఛన్ల పంపిణీకి వలంటీర్లు దూరం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెన్షన్లతో సహా ఇతర అన్ని సంక్షేమ పథకాల నగదు పంపిణీ విధుల నుంచి వలంటీర్లను దూరంగా ఉంచాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలను జారీచేసింది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పదేపదే చేసిన ఫిర్యాదులకు తోడు.. అదే సంస్థ హైకోర్టులో వేసిన కేసు, వలంటీర్లకు వ్యతిరేకంగా పదేపదే వివిధ దినపత్రికల్లో వస్తున్న కథనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలను జారీచేస్తున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొంది. అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి సంక్షేమ పథకం కిందైనా నేరుగా నగదును ఇచ్చే విధుల నుంచి వలంటీర్లను తొలగించాలని స్పష్టంచేసింది. అదే విధంగా వలంటీర్లకు ఇచ్చిన సెల్ఫోన్లు, ట్యాబ్లు వంటి ఇతర పరికరాలని్నంటినీ కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తయ్యే వరకు డీఈఓకి అప్పజెప్పాల్సిందిగా ఆదేశించింది. ఇక పెన్షన్లు వంటి సంక్షేమ పథకాల నగదు పంపిణీ కోసం రెగ్యులర్ ఉద్యోగుల ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్న ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) వంటి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల సంఘం కోరింది. -
వలంటీర్లపై ఈసీ నిర్ణయం దురదృష్టకరం
సాక్షి, అమరావతి/సత్తెనపల్లి: వలంటీర్లపై ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే అవ్వాతాతలు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడతారని, ఈసీ నిర్ణయం దురదృష్టకరమని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈసీ నిర్ణయంపై శనివారం రాత్రి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కక్షతో పేదలను ఇబ్బంది పెట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వలంటీర్లపై చంద్రబాబు, పవన్ అనేక పర్యాయాలు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఇప్పుడు ఏకంగా నిమ్మగడ్డ రమేష్కుమార్ సాయంతో ఎన్నికల కమిషన్కు చంద్రబాబు ఫిర్యాదు చేయించారన్నారు. వారి వత్తిడికి తలొగ్గి వలంటీర్లను సంక్షేమ పథకాలు పంపిణీ చేయకుండా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. కుట్రలతో చంద్రబాబు వలంటీర్లను బలి చేయాలనుకున్నారన్నారు. చంద్రబాబు తీరుతో రాష్ట్రంలో బలౌతున్నది వలంటీర్లు కాదని, అవ్వాతాతలు, వికలాంగులు, సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబి్ధదారులని మంత్రి అన్నారు. ఇప్పటికైనా ఈసీ తన నిర్ణయాన్ని పునరాలోచన చేసి వృద్ధులు, వికలాంగులకు అవస్థలు లేకుండా చూడాలని కోరారు. చంద్రబాబుకు బుర్రదొబ్బింది అత్యంత ఖరీదైన నేటి రాజకీయ పరిస్థితుల్లో సామాన్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టికెట్లు ఇస్తున్న చాణక్యతను, ఎత్తుగడలను అర్థం చేసుకోలేక చంద్రబాబుకు బుర్ర దొబ్బిందని మంత్రి రాంబాబు ఎద్దేవా చేశారు. విద్యావంతుడు, దళితుడు, టిప్పర్ డ్రైవర్గా జీవనం వెళ్లదీస్తున్న వీరాంజనేయులుకు సీఎం జగన్మోహన్రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వడంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. చంద్రబాబు డబ్బున్న కోటీశ్వరులకు, ఎన్నారైలకు, సంపన్నులకు టికెట్లు ఇస్తుండగా.. సీఎం జగన్మోహన్రెడ్డి అత్యంత సామాన్యులకు టికెట్లు ఇస్తూ సరికొత్త సంప్రదాయాన్ని తీసుకొస్తున్న వీరుడన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన మోసగాడని విమర్శించారు. వృద్ధులు, వికలాంగులకు తీరని ద్రోహం: కారుమూరి వలంటీర్ల విధులు నిర్వహించకుండా జిత్తుల మారిన నక్కలా చంద్రబాబు అడ్డుకుని వృద్ధులు, వికలాంగులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు తీరని ద్రోహం చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. ఈసీ నిర్ణయంపై స్పందిస్తూ.. నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎలక్షన్ కమిషన్కు లేఖ రాయించి వలంటీర్ల సేవలు నిలిపి వేయించిన నీచుడు చంద్రబాబు అన్నారు. ప్రజలకు మేలు చేసే ఏ కార్యక్రమమైనా చంద్రబాబుకు ద్వేషమే అన్నారు. ఎవరైనా ఏడుస్తుంటే చంద్రబాబు ఆనందిస్తాడని, ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు ఏడుస్తాడని అన్నారు. వలంటీర్లు రాకపోవడంతో ఎండల్లో గంటల తరబడి క్యూలైన్లో నిలబడి పెన్షన్ తీసుకునే అవ్వాతాతలు సొమ్మసిల్లి పడిపోతే చంద్రబాబుకు సంతోషమని మండిపడ్డారు. చంద్రబాబు, ఆయన తోక పారీ్టలకు ఏనాడూ వలంటీర్లంటే ఇష్టం లేదని, వారిపై కక్షగట్టి విధులికప అడ్డుకుని ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘నిమ్మగడ్డ రమేష్కుమార్తో ఫిర్యాదు చేయించడం దుర్మార్గం’ పెన్షన్ పంపిణీపై నిమ్మగడ్డ రమేష్కుమార్తో చంద్రబాబు ఫిర్యాదు చేయించడం దుర్మార్గమని, చంద్రబాబు పెత్తందారీ పోకడలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీని వాస్ మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్టు ఇప్పుడు జరుగుతున్నది పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధమేనన్నారు. పేదలకు అందించే పెన్షన్లు నిలుపుదల చేయడం చాలా దారుణమన్నారు. మేధావుల ముసుగులో 64 లక్షల మంది పెన్షనర్ల నోట్లో మట్టికొట్టారన్నారు. నిమ్మగడ్డ రమేష్తో పాటు మరికొందరు చంద్రబాబు ఏజెంట్లుగా, తొత్తులుగా మారారన్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పెన్షన్లు ఇవ్వొద్దని చెప్పించారన్నారు. దీనికి టీడీపీ కచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందేనని అన్నారు. చంద్రబాబు పాలనలో మూడు రోజులు క్యూలో నిలబడితేనే పెన్షన్లు వచ్చేవి కాదని, జగన్ పాలనలో ఇప్పుడు నేరుగా ఇంటికే అందిస్తున్నా చంద్రబాబు అండ్ కో కుట్రలు చేస్తున్నారన్నారు. వృద్ధుల ఉసురు బాబుకు కచ్చితంగా తగులుతుందన్నారు. పెన్షన్ల పంపిణీ అంశంపై ఎన్నికల కమిషన్ పునరాలోచించుకోవాలన్నారు. వృద్ధుల్ని కష్టపెడతారా: వాసిరెడ్డి పద్మ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ఇంటిగడప వద్దకే చేరుస్తున్న వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, ఆయన బ్యాచ్ మొదటినుంచీ కుట్రలు చేస్తున్నారని, చివరకు ప్రజలకు సంక్షేమం అందకుండా చేయడానికి కూడా వెనుకాడలేదని వైఎస్సార్సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్కుమార్ ఫిర్యాదుతో సంక్షేమ పథకాల పంపిణీలో వలంటీర్లను ఉపయోగించవద్దంటూ శనివారం ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడంపై వాసిరెడ్డి పద్మ స్పందించారు. ఇంట్లో మగాళ్లు లేనప్పుడు వలంటీర్లు వచ్చి తలుపులు కొడతారని, వలంటీర్లు మీ ఇంటికి వస్తే తరిమేయాలని చంద్రబాబు గతంలో అనేక మాటలు అన్నారన్నారు. చంద్రబాబు ,పవన్ , పచ్చ మీడియా కలిసి మొత్తం వలంటీర్ల వ్యవస్థనే తుంచేసే కుట్రలు చేశారన్నారు. ఎన్నికల కమిషన్ సైతం ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకోకుండా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. ‘వలంటీర్లపై ఫిర్యాదు చేయడానికి సిగ్గులేదా’ చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేస్తున్న కొంతమంది మేధావుల ముసుగులో వలంటీర్లపై కుట్రలు చేస్తున్నారని శాసనమండలిలో విప్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. వలంటీర్లు జీతాలు కోసం కాకుండా సేవా దృక్పథంతో పనిచేస్తున్నారన్నారు. చంద్రబాబు సహా ప్రతిపక్ష నాయకులంతా వలంటీర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. స్వచ్ఛంద సంస్థల ముసుగులో కుహనా మేధావులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారన్నారు. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడానికి వీలు లేదంటూ వలంటీర్లపై కంప్లైంట్స్ చేయటం దారుణమన్నారు. చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటం కోసం నిమ్మగడ్డ రమేష్ పనిచేస్తున్నారన్నారు. పేదల కోసం పనిచేసే వలంటీర్లపై ఫిర్యాదు చేయటానికి సిగ్గు లేదా అని ప్రశి్నంచారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే: ఎమ్మెల్యే కన్నబాబు వలంటీర్లను నియంత్రించేందుకు చంద్రబాబు అండ్కో చేసిన ప్రయత్నాలు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. వలంటీర్లు ప్రజలకు గొప్పగా సేవలు అందిస్తున్నారన్నారు. ఈ ఐదేళ్ళ కాలంలో వలంటీర్లు లాంటి వ్యవస్థ పెట్టడానికి వేరే రాష్ట్రం ధైర్యం చేయలేకపోయిందన్నారు. ప్రజలకు గొప్ప సేవలందించే వలంటీర్లను నియంత్రించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు, పవన్ వలంటీర్లపై దుర్మార్గమైన కామెంట్లు చేశారన్నారు. తాజాగా ఎన్నికల కమిషన్కు నిమ్మగడ్డ ద్వారా వలంటీర్లపై పిర్యాదు చేశారు. ఈ రెండు నెలలు పెన్షన్లు అందకుండా చేశామని చంద్రబాబు పండుగ చేసుకుంటున్నాడన్నారు. వలంటీర్లను నియంత్రిస్తే వైఎస్సార్సీపీని నియంత్రించామని అనుకోవడం చంద్రబాబు భ్రమ అన్నారు. -
‘ఎవడైనా ఏడుస్తుంటే చంద్రబాబు ఆనందిస్తాడు’
ప. గో. జిల్లా: నిమ్మగడ్డ రమేష్ చేత ఎలక్షన్ కమిషన్కి లేఖ రాయించి వాలంటీర్ల సేవలు నిలిపి వేయించిన నీచుడు చంద్రబాబు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. చంద్రబాబు మాయల ఫకీరు, జిత్తులమారి నక్క అంటూ మండిపడ్డారు. ‘ప్రజలకు మేలు చేసేది ఏదైనా చంద్రబాబుకి ద్వేషమే. ఎవరైనా ఏడుస్తుంటే చంద్రబాబు ఆనందిస్తాడు. ఎండలు మండుతున్నాయి . పెన్షన్ల కోసం అవ్వాతాతలు మళ్ళీ లైన్లో నిలబడి సొమ్మ సిల్లీ పడిపోతే చంద్రబాబుకి సంతోషం. చంద్రబాబుకి అయన తోక పార్టీకి ఏనాడూ వాలంటీర్లు అంటే ఇష్టం లేదు. చంద్రబాబు సిగ్గు లేకుండా, దుర్మార్గంగా, హేయమైన విధానాలు పాటిస్తూ నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లపై పిర్యాదు చేయించాడు. వాలంటీర్లపై చంద్రబాబు నీచ బుద్ధి కపట ప్రేమ ఈరోజు బయటపడింది’ అని కారుమూరి విమర్శించారు. -
‘వాలంటీర్లపై ఈసీ నిర్ణయం దురదృష్టకరం’
పల్నాడు జిల్లా: ఏపీలో సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం పునరాలోచించుకోవాలని అంబటి విజ్ఞప్తి చేశారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే అవ్వా తాతలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. ‘సీఎం జగన్పై కక్షతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు వాలంటర్లీపై అనేక అనుచిత వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు.. నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయించాడు. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి. పెన్షన్లు తీసుకునే వారిపై కక్షతోనే చంద్రబాబు నాయుడు ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు, కుట్రలు, కుతంత్రాలతో వాలంటీర్లను బలి చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ బలవుతుంది వాలంటీర్లే కాదు.. అవ్వా తాతలు, దివ్యాంగులు, సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబ్ధిదారులు’ అని అంబటి స్పష్టం చేశారు. -
ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు
సాక్షి, విజయవాడ: ఏపీలో సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ ముగిసేవరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులపై చంద్రబాబు కుట్రలు ఏపీలో ప్రభుత్వం పథకాల లబ్ధిదారులపై చంద్రబాబు కుట్రలకు తెరలేపారు. అవ్వాతాతాలపై కసి తీర్చుకుంటున్న చంద్రబాబు.. నిమ్మగడ్డ రమేష్ ద్వారా వాలంటీర్లపై ఫిర్యాదు చేయిచారు. చంద్రబాబు కుట్రలతో వాలంటీర్ల సేవలకు ఈసీ బ్రేక్ వేసింది. వాలంటీర్లు పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు ఇవ్వకూడదంటూ నిమ్మగడ్డ ఫిర్యాదుతో వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు పెట్టింది. పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదంటూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్లు, ట్యాబ్లు ఉన్నతాధికారులకు అందించాలని ఆదేశించింది. కోడ్ ముగిసేవరకు పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాల పంపిణీకి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో క్షేత్రస్థాయిలో పైరవీలు, అవినీతి అన్న వాటికి తావేలేకుండా.. కుల, మత, ప్రాంత, వర్గ తారతమ్యాలకు అతీతంగా.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలను అందజేయడంలో కీలకంగా పనిచేస్తున్న వలంటీర్లపై కుట్రకు ఎల్లో బ్యాచ్ బరితెగించింది. -
టీడీపీ, జనసేన వేధింపులు తాళలేకపోతున్నాం
రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సచివాలయ వ్యవస్థలో ఐదేళ్లుగా పనిచేస్తున్న తమను టీడీపీ, జనసేన నాయకులు వేధిస్తుండడంతో రాజీనామా చేస్తున్నట్లు రాజమహేంద్రవరం నగరానికి చెందిన 15 మంది వలంటీర్లు చెప్పారు. బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్, సచివాలయ అడ్మిన్ సెక్రటరీలకు వారి రాజీనామాలను అందజేశారు. వివరాల్లోకి వెళితే రాజమహేంద్రవరం 1వ డివిజన్ 2వ సచివాలయానికి చెందిన ఒకరు, 48వ డివిజన్ 89వ సచివాలయానికి డివిజన్కు చెందిన ఐదుగురు, 90వ సచివాలయానికి చెందిన తొమ్మిది మంది వలంటీర్లు రాజీనామాలను అడ్మిన్ సెక్రటరీలకు అందజేశారు. ఈ సందర్భంగా వలంటీర్లు మాట్లాడుతూ.. తాము ప్రజలకు నిస్వార్థంగా సేవచేస్తూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ పథకాన్ని ప్రజలకు చేరువ అయ్యేటట్టు చూస్తున్నామన్నారు. అయితే క్షేత్ర స్థాయిలో విధినిర్వహణ సమయంలో టీడీపీ, జనసేన నాయకులు తమను వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. మిత్రులు, బంధువులతో మాట్లాడినా అనుమానంగా చూస్తున్నారని, ఇది భరించలేకపోతున్నామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వలంటీర్లుగా కొనసాగలేమని చెప్పారు. ఈ విషయమై నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ సత్యవేణి స్పందిస్తూ.. 15 మంది వలంటీర్ల రాజీనామాలు అందాయన్నారు. వాటిపై కమిషనర్కు నివేదిక సమర్పిస్తున్నట్లు తెలిపారు. -
వలంటీర్లు టెర్రరిస్టులా!?
సాక్షి, అమరావతి/వీరపునాయునిపల్లె/ఏర్పేడు (తిరుపతి జిల్లా)/ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు) /కవితి/టంగుటూరు : నిరంతరం ప్రజల సేవలో ఉంటున్న వలంటీర్లను శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్రెడ్డి టెర్రరిస్టులతో పోల్చడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ వ్యవస్థను మెచ్చుకుంటుంటే టీడీపీ నేతలు మాత్రం రాజకీయ కోణంలో వారిని టార్గెట్ చేయడంపై అన్ని వర్గాలు మండిపడుతున్నాయి. సేవే పరమావధిగా ప్రజలకు మంచి చేస్తున్న వీరిని స్లీపర్స్ సెల్స్ అని.. ఉగ్రవాదులు, డేటా చోరీ చేస్తున్నారని అనడం చాలా బాధాకరమని.. సుధీర్రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బేషరతుగా రాష్ట్రంలోని వలంటీర్లందరికీ క్షమాపణలు చెప్పాలని వలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బొజ్జల సుధీర్రెడ్డి వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్ చంద్రశేఖర్రెడ్డి మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. కరోనా కష్టకాలంలో వలంటీర్ల సేవలను మరచిపోయారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వారు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని, అలాంటి వారిని ఉగ్రవాదులతో పోల్చడం అమానుషమన్నారు. గతంలో చంద్రబాబు, పవన్కళ్యాణ్లు కూడా వలంటీర్లను తీవ్రంగా విమర్శించారని.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మంచిగా అమలవుతుండడంతో టీడీపీ, జనసేన పార్టీలకు కడుపుమంటగా మారిందన్నారు. వలంటీర్ల విశ్వసనీయత, తేల్చుకుందామా? మరోవైపు.. బొజ్జల సుధీర్రెడ్డి వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ వలంటీర్స్ అసోషియేషన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది. ప్రజలోకి మీరు, మేము వెళ్దాం.. ఎవరిపట్ల మంచితనం, విశ్వసనీయత, విశ్వాసం ఉందో చూద్దాం అని వలంటీర్లందరి తరఫున కమిటీ సవాల్ విసిరింది. అప్పట్లో సొంత కుటుంబ సభ్యులే దగ్గరికి రాని పరిస్థితుల్లో వలంటీర్లు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి సేవలు చేశారని.. అలాగే, ఆ రోజుల్లో సుధీర్రెడ్డి హైదరాబాద్కే పరిమితమయ్యారని.. కానీ, వలంటీర్లు ప్రజలకు అందించిన సేవలు ఆయనకేం తెలుసని ప్రశ్నించింది. ‘అలాంటి వారిపై సుధీర్రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చాలా బాధాకరమని, సుధీర్రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని వలంటీర్లందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం’.. అంటూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పీట నాగమల్లేష్, ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు మద్దిలి కాళిదాస్, ఉపాధ్యక్షులు పూజారి ఉదయ్కుమార్, సంయుక్త కార్యదర్శి కొమ్ము సురేష్బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 13 మంది వలంటీర్లు రాజీనామా.. సుధీర్రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలంలోని పాయసంపల్లె సచివాలయ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 13మంది వాలంటీర్లు మంగళవారం రాజీనామా చేశారు. ఎంపీడీఓ పులి రాంసింగ్, పంచాయతీ కార్యదర్శి విజయ్కుమార్ నాయక్లకు రాజీనామా పత్రాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీ నేతలు వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపట్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యాయమని ఆవేదన వ్యక్తంచేశారు. అవ్వతాతలు, చదువురాని పేదలకు సేవచేసేందుకు సీఎం వైఎస్ జగన్ తమకు అవకాశం కల్పించడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నామని.. కానీ, టీడీపీ నేతలు దీనిని రాజకీయం చేస్తున్నారన్నారు. బొజ్జల సుధీర్రెడ్డి లాంటి నేతలు మరోసారి విమర్శించేందుకు అవకాశంలేకుండా రాజీనామాలు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇక తిరుపతి జిల్లా ఏర్పేడులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వివిధ సచివాలయాలకు చెందిన వలంటీర్లు నిరసన చేపట్టారు. టీడీపీ అంటేనే టెర్రరిస్ట్ పార్టీ అని వారు మండిపడ్డారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు సేవచేస్తున్న వలంటీర్లను జిహాదీ తీవ్రవాదులు, బాంబులు పెట్టే టెర్రరిస్టులు, స్లీపర్ సెల్స్ అంటూ వ్యాఖ్యానించడం దారుణమన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన బొజ్జల వలంటీర్లకు క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి: మంత్రి సురేష్ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ సంక్షేమ సారథులుగా సేవలందిస్తున్న వలంటీర్లపై టీడీపీ నాయకులు, కూటమి పార్టీల నేతలు అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని మంత్రి, కొండపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మీడియా సమక్షంలో చెప్పారు. వలంటీర్లను చూస్తే చంద్రబాబు కూటమికి భయం పట్టుకుందన్నారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల సంగతి తెలుస్తామని గతంలో వారు మాట్లాడారన్నారు. ప్రజలకు సేవలు చేస్తున్న వలంటీర్లపై టీడీపీ నేతలు ఇలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వలంటీర్లే బుద్ధి చెబుతారని మంత్రి హెచ్చరించారు. అలాగే, వలంటీర్లపై టీడీపీ, జనసేసే, బీజేపీ కూటమి పగబట్టిందని విశాఖ ఎంపీ, తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖలో విమర్శించారు. వలంటీర్లను టెర్రరిస్టులుగా పేర్కొనడం దారుణమన్నారు. వలంటీర్లపై టీడీపీ కూటమి పగబట్టడం దారుణమన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం తెచ్చిన జన్మభూమి కమిటీలు ప్రజలను ఎలా దోచుకున్నాయో అందరికీ తెలిసిందేనని.. కానీ, వలంటీర్లు అలా కాదని.. వారు అందిస్తున్న సేవలను ప్రజలు మరిచిపోరన్నారు. -
బొజ్జల సుధీర్ రెడ్డిపై మండిపడుతున్న ప్రజలు
-
బాబు బాటలోనే.. బొజ్జల విషపు వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న వలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్రెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారు. కరోనా వంటి విపత్కర సమయంలో ధైర్యంగా సేవలు అందించారన్న విషయం కూడా మర్చిపోయి వారిని జిహాదీ తీవ్రవాదులు, టెర్రరిస్టులతో పోల్చారు. బొజ్జల విషపు వ్యాఖ్యలపై ఇప్పుడు వలంటీర్లు భగ్గుమంటున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు, మంత్రులు కూడా బొజ్జల వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. బొజ్జల సుధీర్రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు నిరసనలు చేపడుతున్నారు. తమకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాము సేవకులమని ప్రజలకు సేవ చేసేందుకే పనిచేశామని చెబుతున్నారు. కరోనాలో ప్రజలందరికీ మందులు, ఇతర సామగ్రిని ఇళ్లకు చేర్చామని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో తమపై ఆరోపణలు చేస్తున్న సుధీర్రెడ్డి హైదరాబాద్లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలే ఈ ఎన్నికల్లో అతనికి బుద్ధి చెబుతారన్నారు. సుధీర్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం: ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి ప్రతిపక్షాలు ఉద్యోగులపై అభాండాలు వేస్తున్నాయి ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగం ప్రభుత్వ చట్టాలను నిర్వర్తించడమే ఉద్యోగస్తుల బాధ్యత రాష్ట్రాన్ని బాగు చేసేందుకే వాలంటీర్, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు వలంటీర్, సచివాలయ వ్యవస్థలకు జాతీయ స్థాయిలో మంచిపేరు వచ్చింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే వాలంటీర్ వ్యవస్థను విమర్శిస్తున్నారు శ్రీ కాళహస్తి టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం కరోనా సమయంలో సుధీర్ రెడ్డి హైదరాబాద్ లో దాకున్నాడు కరోనా సమయంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పనిచేశారు లోకేష్ పోలీసులను బెదిరిస్తున్నారు పార్టీలు వస్తూ పోతూ ఉంటాయి.. ఉద్యోగులే పర్మినెంట్ ఎన్నో పార్టీలను చూశాం కానీ టీడీపీ మాదిరిగా ఎవరూ ఉద్యోగులను బెదిరించలేదు లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులకు ఎవరూ భయపడరు ఉద్యోగులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది కోవిడ్ వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చాయి ఎన్ని సమస్యలు ఉన్నా ఇటీవలే రెండు డీఏ ఇచ్చారు ఉద్యోగులు ఏది అడిగినా చేయాలనే తాపత్రయం సీఎం జగన్ ది ఆర్థిక సమస్యలతోనే కొన్ని చేయలేకపోతున్నారు దశలవారీగా ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తున్నాం ఉద్యోగస్తులంతా పోస్టల్ బ్యాలెట్ ను తప్పకుండా ఉపయోగించుకోవాలి వెల్ఫేర్ స్కీమ్స్ లో దేశానికే ఆదర్శంగా ఉన్న ప్రభుత్వానికి ఉద్యోగస్తులంతా అండగా ఉండాలి టీడీపీకి ప్రజలే గుణపాఠం చెప్తారు: మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి వలంటీర్ల వ్యవస్థకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది కానీ టీడీపీ వాళ్లు వలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చడం దారుణం వలంటీర్లు స్లీపర్ సెల్స్ అంటూ శ్రీకాళహస్తి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి దారుణంగా మాట్లాడారు గతంలో చంద్రబాబు కూడా వలంటీర్ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడారు టీడీపీకి ప్రజలే గుణపాఠం చెప్తారు నిస్వార్ధంగా సేవలు అందిస్తున్న వలంటీర్ల గురించి నీచంగా మాట్లాడడం సిగ్గుచేటు టీడీపీపై ఇక ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ప్రజలకు సేవ చేస్తున్న వలంటీర్లను ఏ ఒక్కరు వదులుకోరు కేవలం తమ స్వార్థం కోసం వలంటీర్లపై టీడీపీ నిందలు వేస్తోంది టీడీపీ ఓ జిహాదీ పార్టీ: ఎంపీ మార్గాని భరత్ ఫైర్ వలంటీర్లను బొజ్జల సుధీర్ టెర్రరిస్టులతో పోల్చడం దారుణం జగనన్న పేదలకు సహాయం చేస్తున్నాడని కారణంతోనే జీతం లేకపోయినా వలంటీర్లు పనిచేశారు అభం శుభం తెలియని వలంటీర్లపై కత్తి కట్టడం దారుణం తెలుగుదేశం పార్టీ ఒక జిహాది పార్టీ వెల్లంపల్లి వార్నింగ్ వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బొజ్జల సుధీర్రెడ్డికి వెల్లంపల్లి శ్రీనివాస్ వార్నింగ్ సుధీర్ రెడ్డి మనీషా . పశువా ? వలంటీర్లు ప్రజల కుటుంబ సభ్యులు లాంటి వారు అలాంటి సేవకుల గురించి ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదు బొజ్జల క్షమాపణలు చెప్పాల్సిందే: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి వలంటీర్లను చూసి చంద్రబాబుకు, టీడీపీ నేతలకు వెన్నులో వణుకు పుడుతుంది.. వలంటీర్లు ఉగ్రవాదులు కాదు సేవా సైనికులు వలంటీర్లలో 70 శాతంకు పైగా మహిళలే ఉన్నారు వారంతా ఉగ్రవాదులా? గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వలంటీర్లతోనే సాధ్యమైంది వలంటీర్లలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ లో ఉన్నారు వారంటే చంద్రబాబుకు చులకన అందుకే టీడీపీ నేతలు వారిని ఉగ్రవాదులతో పోల్చుతున్నారు సుధీర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి ఓ మీడియా ఇంటర్వ్యూలో సుదీర్రెడ్డి మాట్లాడుతూ.. వలంటీర్లు జిహాదీ తీవ్రవాదులు, బాంబులు పెట్టే టెర్రరిస్టులు, స్లీపర్ సెల్స్ అంటూ తీవ్రంగా వాఖ్యానించారు. వలంటీర్లను జగన్మోహన్రెడ్డి తెలివిగా ఏర్పాటు చేశారన్నారు. వలంటీర్లు వారికిచ్చిన విధులు వారు నిర్వహించడం లేదని.. డేటా చౌర్యం చేసి ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఒక వ్యక్తి ఎవరితో తిరుగుతాడు. ఏ పార్టీతో ఉంటాడు. అతని కూతురు ఎక్కడ ఉంది. కొడుకు ఏం చేస్తుంటాడు. వాడు మంచివాడా.. కాదా.. లాంటి వివరాలు వలంటీర్లు సేకరిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో వలంటీర్లను సంఘ విద్రోహ శక్తులైన స్లీపర్ సెల్స్తో పోల్చారాయన. -
బొజ్జల సుధీర్ వ్యాఖ్యలపై వాలంటీర్ల ఆగ్రహం
-
బాబు, పవన్ రూటులో నిమ్మగడ్డ.. వలంటీర్లపై విషం
సాక్షి, విజయవాడ: ప్రజలతో నిత్యం మమేకమై సేవలందిస్తూ.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న వలంటీర్ వ్యవస్థను దెబ్బకొట్టడమే లక్ష్యంగా పచ్చ బ్యాచ్ ప్రయత్నాలు సాగుతున్నాయి. వృద్ధులు, వికలాంగుల పట్ల కనికరం కూడా లేకుండా, ప్రజలకు జరుగుతున్న మంచిని చూడకుండా వలంటీర్లపై విషం కక్కుతున్నారు. డబ్బులు చేతికి ఇవ్వొద్దు, అకౌంట్లలో వేయాలంటూ సీఈవోకు మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. ‘‘అకౌంట్ ఉన్న వాళ్లు తీసుకుంటారు. అకౌంట్ లేదంటే.. పెన్షనర్లే వెళ్లి డబ్బులు తెచ్చుకుంటారు. పెన్షనర్ల దగ్గరకు వెళ్లి వాలంటీర్లు డబ్బులు అందించడం వద్దు. పింఛన్ పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలి’’ అంటూ వలంటీర్లపై నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటనల రూటులోనే నిమ్మగడ్డ వెళ్తున్నట్లు కనిపిస్తోంది. శభాష్ వలంటీర్.. కరోనా వైరస్ భయపెడుతున్నా... వరద వణికిస్తున్నా... ప్రతిపక్షాలు వెక్కిరిస్తున్నా.. వలంటీర్లు వెన్నుచూపలేదు. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కరోనా కష్టకాలంలో అందరూ ఉన్నా ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నవారి వద్దకు వెళ్లి భరోసా కల్పించారు. లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు. వాన వచ్చినా... వరద వచ్చినా ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారకముందే అవ్వతాతల ఇంటి తలుపుతట్టి పింఛను అందిస్తున్నారు. అర్హత గల తల్లికి అమ్మఒడి... అక్కచెల్లెమ్మలకు ఆసరా... చేయూత... నిరుపేదలకు నివేశన స్థలం.. పక్కా ఇళ్లు... విద్యార్థులకు విద్యాదీవెన... ఇలా ఒకటేమిటీ సమస్త సంక్షేమ పథకాలను ప్రజల గడప వద్దకే చేరుస్తూ శభాష్ వలంటీర్ అని అందరి మన్ననలు పొందుతున్నారు. వలంటీర్ల వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలిపారు. ఈసీ పేరుతో తప్పుడు ప్రచారం.. కాగా, వలంటీర్లపై ఫిర్యాదులు చేయాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ సీఈవో కార్యాలయం ఖండించింది. రాజకీయ ప్రచారంలో పాల్గొనే వలంటీర్లను ఎవరైనా మీ కంట కనబడితే వారి ఫోటోలు,వీడియోలతో పాటు వలంటీర్ల పేరు, ఊరు పేర్లు తెలియజేస్తూ ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, లోకేషన్ను 9676692888కు వాట్సాప్కు షేర్ చేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వలంటీర్లపై ఫిర్యాదులు చేయాలంటూ తామెలాంటి సర్క్యూలర్ జారీ చేయలేదని, ఇదీ ఫేక్ న్యూస్ అంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఏపీ సీఈవో పేర్కొన్నారు. -
వాలంటీర్లపై వేటు? టీడీపీ తప్పుడు ప్రచారం
-
వలంటీర్ల వల్ల మంచే జరుగుతోందిగా
సాక్షి, అమరావతి: వలంటీర్ల వల్ల మంచే జరుగుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వారి వల్ల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువవుతున్నాయని తెలిపింది. వారి విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని స్పష్టం చేసింది. వారి విషయంలో స్పందించాల్సింది ఎన్నికల సంఘమేనని తేల్చి చెప్పింది. వలంటీర్లు ఎన్నికల్లో విధుల్లో పాల్గొనకుండా ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేసింది. వలంటీర్ల నియామకం, తదితరాల వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 2.57 లక్షల మంది కార్యకర్తలను గ్రామ, వార్డు వలంటీర్లుగా నియమించారని, దీనిని చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్ కడప జిల్లా రాజంపేటకు చెందిన షేక్ అబూబాకర్ సిద్దిఖీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ, అధికార పార్టీకి చెందిన కార్యకర్తలనే వలంటీర్లుగా నియమించారని, వారి ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని అధికార పార్టీ చూస్తోందని అన్నారు. రాష్ట్ర ఖజానా నుంచే వీరికి గౌరవ వేతనం చెల్లిస్తోందని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, వలంటీర్ల వల్ల మంచే జరుగుతోంది కదా, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు కదా అని వ్యాఖ్యానించింది. వలంటీర్లు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఉన్నం మురళీధరరావు కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. -
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగంలో తప్పేముంది?
సాక్షి, అమరావతి : పల్నాడు జిల్లాలో ఇటీవల నిర్వహించిన గ్రామ, వార్డు వలంటీర్ల అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ప్రతిపక్ష నేతను విమర్శిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రసంగాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించడం ఏమిటంటూ హైకోర్టు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో గత ప్రభుత్వంలో ఏర్పాటైన జన్మభూమి కమిటీలను, ప్రస్తుతం తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థను పోల్చారని, దీనిని తామెలా తప్పుపట్టగలమని ప్రశ్నించింది. అలా పోలిక తేవడానికి వీల్లేదంటారా అంటూ నిలదీసింది. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా ప్రజలకు వలంటీర్లు మంచి పని చేయడంలేదా? మంచి చేసిన వాళ్లను సన్మానించకూడదా అని పిటిషనర్ను ప్రశ్నించింది. ఈ కార్యక్రమానికి ఖర్చు చేసిన మొత్తాన్ని ముఖ్యమంత్రి నుంచి వసూలు చేయాలని ఎలా కోరతారు అంటూ ప్రశ్నించింది. వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనాలా? వద్దా? అన్నది నిర్ణయించాల్సింది కేంద్ర ఎన్నికల సంఘమే తప్ప, తాము కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. అందులో జోక్యం చేసుకోలేమంది. వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందని సీఈసీ తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ హైకోర్టుకు వివరించారు. పోలింగ్ ఏజెంట్లుగా కూడా వ్యవహరించడానికి వీల్లేదని చెప్పామని, ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు. వలంటీర్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నందున, ఈ వ్యాజ్యంలో విచారించేందుకు ఏమీ లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. పిల్ను కొట్టేసింది. ఈ మేరకు ప్ర«దాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలంటూ పిల్ ఎన్నికల్లో వలంటీర్లకు ఎలాంటి విధులు అప్పగించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా అన్నంభొట్లవారి పాళెం గ్రామానికి చెందిన చెన్నుపాటి సింగయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ కేంద్రాల్లోకి వలంటీర్లు వెళ్లకుండా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టును కోరారు. పల్నాడు జిల్లాలో జరిగిన గ్రామ, వార్డు వలంటీర్ల అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ప్రతిపక్ష నేతను విమర్శిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రసంగాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కూడా సింగయ్య కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అంబటి సుధాకర్రావు వాదనలు వినిపిస్తూ.. వలంటీర్ల సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ప్రభుత్వ విజయం కోసం వలంటీర్లు కృషి చేయాలని, ప్రతిపక్షంపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేలా వలంటీర్లను ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ముఖ్యమంత్రి ప్రసంగంలో జన్మభూమి కమిటీల ప్రస్తావన వచ్చిందని, ఆ కమిటీలు ఏమిటని ప్రశ్నించింది. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలని సుధాకర్రావు చెప్పారు. అలా అయితే ముఖ్యమంత్రి ప్రసంగంలో తప్పేముందని ధర్మాసనం ప్రశ్నించింది. గత ప్రభుత్వం తీసుకొచి్చన జన్మభూమి కమిటీలు, ప్రస్తుతం ఉన్న వలంటీర్ల వ్యవస్థను పోల్చుతూ మాట్లాడారని, దానిని చట్ట విరుద్ధంగా ప్రకటించమంటే ఎలా అంటూ నిలదీసింది. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా ప్రజలకు వలంటీర్లు మంచి పని చేయడంలేదా అని ప్రశ్నించింది. మంచి చేస్తున్నారని, అయితే ముఖ్యమంత్రి చెప్పిన విధంగా వలంటీర్లు పని చేస్తే ఎన్నికలు నిష్పాక్షికంగా జరగవని సుధాకర్రావు తెలిపారు. అందుకే వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరుతున్నామన్నారు. అది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనిదని ధర్మాసనం తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చినప్పుడు పిటిషనర్కు ఇంకా కావాల్సింది ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. ఓటర్లు చాలాతెలివి గల వాళ్లు ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం న్యాయవాది అవినాష్ దేశాయ్ జోక్యం చేసుకుంటూ.. వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు మాత్రమే ఎన్నికల విధుల్లో పాల్గొంటారని, వలంటీర్లకు, ఈ ఉద్యోగులకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ వ్యాజ్యంలో తదుపరి విచారించేందుకు ఏమీ లేదని స్పష్టం చేసింది. ఈ సమయంలో సుధాకర్రావు ఏదో చెప్పబోగా.. ధర్మాసనం ఆయన్ని వారించింది. ఓటర్లు చాలా తెలివి గల వారని, వారి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఓటర్లు ఎంత తెలివి గల వాళ్లో న్యాయవ్యవస్థలో ఉన్న మనందరికీ బాగా తెలుసునంటూ న్యాయవాద సంఘాల ఎన్నికల గురించి ధర్మాసనం ప్రస్తావించింది. న్యాయవాద సంఘాల ఎన్నికలప్పుడు ఓటర్లు ఓ వర్గం ఇచ్చే విందులో పాల్గొని, మరో వర్గానికి ఓటు వేస్తుంటారని నవ్వుతూ వ్యాఖ్యానించింది. ఓటర్ల గురంచి చింతించాల్సిన అవసరం లేదంది. పిల్ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
చెప్పాడంటే చేస్తాడంతే.. సీఎం జగన్ సందేశంతో లేఖలు
సాక్షి,అమరావతి: సుపరిపాలనతో రాష్ట్రంలో ప్రతి ఇంటికీ పారదర్శకంగా మేలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో చేకూర్చిన ప్రయోజనాలను వివరిస్తూ రూపొందించిన లేఖను నేరుగా లబ్ధిదారులకు అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్ల ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఆదివారం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్ సందేశంతో కూడిన లేఖలను ప్రతి ఇంటికీ అందజేయనున్నారు. ఐదేళ్లలో ఒక్కో ఇంటికి ఏ పథకం ద్వారా మొత్తం ఎంత మేర ప్రయోజనం కలిగిందో వివరిస్తూ లబ్ధిదారులవారీగా ప్రత్యేకంగా అనుబంధ పత్రాన్ని రూపొందించారు. లేఖ పంపిణీ సమయంలో వలంటీర్లు ఆయా కుటుంబాలకు చెందిన ఒక సభ్యుడి నుంచి ఈ– కేవైసీ తీసుకోనున్నారు. లేఖ సారాంశం ఇదీ.. రాష్ట్ర ప్రజలందరికీ.. ► ముఖ్యమంత్రిగానే కాకుండా మీలో ఒకడిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ బిడ్డగా మీ అందరితో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నా. మీ అందరి చల్లని దీవెనలతో ఏర్పాటైన మనందరి ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకుంటోందని తెలియజేయడానికి నేనెంతగానో సంతోషిస్తున్నా. ఈ ఐదేళ్లలో మీ బిడ్డ ప్రభుత్వం సాధించిన విజయాల్లో కొన్నిటిని మీకు మరోసారి గుర్తు చేయదలిచా. మీకిచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలోని నవరత్నాలను అమలు చేసి 99.5 శాతం హామీలను మనందరి ప్రభుత్వం పూర్తి చేయగలిగింది. గత పాలకులు తమ మేనిఫెస్టోని మాయం చేసి మోసగిస్తే మనం భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి ప్రతి హామీని నెరవేరుస్తూ మేనిఫెస్టోకి జవాబుదారీతనం, సార్ధకత తీసుకురాగలిగాం. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రతి ఇంటికీ ప్రభుత్వ సేవలు, సంక్షేమ ఫలాలను అందించగలిగాం. ► నాడు– నేడు ద్వారా కార్పొరేట్ పాఠశాలల కంటే మిన్నగా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను మార్చాం. ప్రభుత్వ స్కూళ్లన్నింటిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందుబాటులోకి తేవడంతోపాటు ఐబీ దిశగా అడుగులు వేయగలిగాం. విద్యార్ధులందరికీ ఉచితంగా యూనిఫాం, ఫాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ట్యాబ్లు సమకూర్చి జగనన్న గోరుముద్ద ద్వారా రోజూ రుచికరమైన భోజనం అందజేస్తున్నాం. జగనన్న వసతిదీవెన, విద్యాదీవెన, విదేశీ విద్యాదీవెనలతో పాటు డిజిటల్ క్లాస్ రూంలు, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ లాంటి కార్యక్రమాలు చేపట్టగలిగాం. ఈ ఐదేళ్లలో విద్యారంగానికే సుమారు రూ.74 వేల కోట్లు ఖర్చు చేశాం. ఇది విద్యా రంగంలో మీ కళ్ల ముందే మీ బిడ్డ తీసుకొచ్చిన మార్పు. గత పాలకులు మన బిడ్డల భవిష్యత్ గురించి ఏనాడైనా ఇలా పట్టించుకున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ► వైద్యం కోసం పేదలెవరూ అప్పుల పాలు కాకూడదన్నది మీ బిడ్డ తపన, తాపత్రయం. ఖరీదైన కార్పొరేట్ వైద్యం పేదలకు ఉచితంగా అందించేలా ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచగలిగాం. గతంలో ఆరోగ్య శ్రీ ద్వారా 1,000 రకాల చికిత్సలే అందగా ఇప్పుడు ఏకంగా 3,257 రకాల చికిత్సలను ఉచితంగా అందిస్తున్నాం. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను మనందరి ప్రభుత్వంలో అభివృద్ది చేసుకోగలిగాం. విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలతో గ్రామీణ ప్రజల గడప వద్దకే మెరుగైన వైద్య సేవలను తీసుకెళ్లగలిగాం. ► గ్రామాల్లో ఆర్బీకేలను నెలకొల్పి రైతులకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు తోడుగా ఉంటున్నాం. రైతన్నకు ఇచ్చిన మాట ప్రకారం క్రమం తప్పకుండా రైతు భరోసా, ఉచిత పంటల బీమా, ధాన్యం కొనుగోలు సొమ్మును నేరుగా ఖాతాల్లో జమ చేయగలిగాం. ఐదేళ్లలో రైతులకు రూ.1,75,007 కోట్లు సాయంగా అందించి వారికి అండదండగా నిలవగలిగాం. ► మీ బిడ్డ ప్రభుత్వంలో ఇవాళ ప్రతి ఊరు మారింది. ఏ ఊరికి వెళ్లినా ప్రతి 50 గడపలకు ఒక వలంటీరుతో పాటు గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ సదుపాయం, నాడు–నేడుతో రూపు మారిన గవర్నమెంట్ బడులు కనిపిస్తాయి. పెన్షన్ మొదలు ఇంటికే రేషన్, సర్టిఫికెట్లు, మెడికల్ టెస్ట్ల వరకు అన్ని రకాల సేవలు తలుపు తట్టి మరీ అందిస్తున్నాం. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా ప్రభుత్వాన్నే వారి గడప వద్దకు తేగలిగాం. గతంలో ఎప్పుడైనా ఈ పరిస్థితి ఉందా? పాలన, సేవలు అందించే విషయంలో మీ బిడ్డ తెచ్చిన ఈ మార్పును గమనించమని కోరుతున్నా. ► 31 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికీ కనీసం రూ.10 లక్షల విలువైన ఇంటి పట్టాలను వారి పేరిటే రిజిస్ట్రేషన్ చేసి సొంతింటి కలను సాకారం చేసే దిశగా అడుగులు వేయగలిగాం. అక్కచెల్లెమ్మల పేరిటే సంక్షేమ ఫలాలను అందించి మహిళా సాధికారితను సాకారం చేశాం. ► కులమతాలు, ఏ పార్టీ అనే వివక్ష లేకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేసి డీబీటీతో రూ.2.62 లక్షల కోట్లు పేదల ఖాతాల్లోకి నేరుగా జమ చేసి లబ్ధి చేకూర్చాం. పేదలకు తోడుగా నిలిచి వారి జీవన ప్రమాణాలు పెరిగేలా తోడ్పాటు అందించాం. ► ఈ ఐదేళ్లలో ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి ఎంత మేలు చేశామన్నది మీ కళ్ల ముందే కనిపిస్తోంది. ప్రతి పేద కుటుంబానికి అండగా నిలబడగలిగాం. మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డను మరోసారి ఆశీర్వదించండి. ఇట్లు.. మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి -
బాబుకు మాత్రమే ఉన్న అరుదైన టాలెంట్
-
టీడీపీ నేత ప్రవీణ్ కు వాలంటీర్లు స్ట్రాంగ్ వార్నింగ్
-
వలంటీర్లపై మరో పిటిషన్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గ్రామ, వార్డు వలంటీర్ వ్యవస్థను తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2019లో జారీచేసిన జీఓ–104తో పాటు తదనుగుణంగా జారీచేసిన ఉత్తర్వులను చట్ట విరుద్ధంగా, ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 2.57 లక్షల మంది కార్యకర్తలను గ్రామ, వార్డు వలంటీర్లుగా నియమించారని, దీనిని చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్ కడప జిల్లా, రాజంపేటకు చెందిన షేక్ అబూబాకర్ సిద్ధిఖీ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారు. 2019 నుంచి ఇప్పటివరకు ఖజానా నుంచి వలంటీర్లపై ఖర్చుచేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీఎం జగన్ని ఆదేశించాలని సిద్ధిఖీ తన వ్యాజ్యంలో కోర్టును కోరారు. అలాగే, రానున్న ఎన్నికల్లో పోలింగ్ బూత్ ఏజెంట్లుగా వ్యవహరించకుండా, ఓటర్ల స్లిప్పులను పంపిణీ చేయకుండా వలంటీర్లను నిలువరించాలని కూడా కోర్టును అభ్యర్థించారు. అలాగే, ఎన్నికలు ముగిసేవరకు వలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాల పంపిణీ జరగకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని సిద్ధిఖీ తన వ్యాజ్యంలో కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, గ్రామ, వార్డు వాలంటీర్ల శాఖ ముఖ్య కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీఎం వైఎస్ జగన్, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, 9 మంది వాలంటీర్లను ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిల్పై సీజే నేతృత్వంలోని ధర్మాసనం వచ్చే వారం విచారణ జరిపే అవకాశాలున్నాయి. గతంలోనే హైకోర్టు నిరాకరణ.. వాస్తవానికి.. గ్రామ వలంటీర్ల నియామకాన్ని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ 2019లోనే ప్రయత్నించింది. అయితే, హైకోర్టు ఆ ప్రయత్నాలను అప్పుడే అడ్డుకుని నియామకాలను నిలుపుదల చేసేందుకు నిరాకరించి అందుకు సంబంధించిన అనుబంధ పిటిషన్ను కొట్టేసింది. వారి నియామకాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి కారణం కనిపించడంలేదని స్పష్టంచేసింది. రాజస్థాన్ ప్రభుత్వం అమలుచేసిన గ్రామ సహాయక్ విధానాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు సమర్థించిన విషయాన్ని కూడా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు చేర్చాలన్న ఉద్దేశంతోనే వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో హైకోర్టు ప్రాథమికంగా ఏకీభవించింది. ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే.. ఇక వలంటీర్లను అడ్డుకునేందుకు 2021లో కూడా టీడీపీ ప్రయత్నించింది. అందుకు అప్పటి ఎన్నికల కమిషనర్ సైతం సహకరించారు. అయితే, టీడీపీ నేతలు, ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. అప్పుడు వివాదాస్పద అధికారిగా పేరుపడ్డ నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలంటూ కలెక్టర్లకు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుబట్టి నిలిపివేసింది. వారు అధికార దుర్వినియోగానికి పాల్పడి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనేందుకు ఎలాంటి ఆధారాల్లేవని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తున్న వలంటీర్లను వారి విధుల నిర్వహణకు అనుమతించాలన్నది కోర్టు అభిప్రాయమని తేల్చిచెప్పింది. వలంటీర్ల కార్యకలాపాలను నిలువరించాల్సిన అవసరంలేదంది. తమ ఫోన్లలో ఉన్న లబ్ధిదారుల డేటాను వలంటీర్లు దుర్వినియోగం చేస్తారన్న ఎన్నికల కమిషన్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. డేటాను దుర్వినియోగం చేయాలనుకుంటే అందుకు ఫోన్లే అవసరంలేదని, ఫోన్లు లేకపోయినా కూడా దుర్వినియోగం చేస్తారని, ఈ విషయంలో ఎన్నికల కమిషన్ది అనవసర ఆందోళన మాత్రమేనని కొట్టిపారేసింది. ఎస్ఈసీ ఉత్తర్వులపై ధర్మాసనం ఆందోళన.. ఇక హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ ఎన్నికల కమిషన్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్పై విచారణ జరిపిన ధర్మాసనం, సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొద్దిగా సవరించింది. వలంటీర్లు ఎన్నికల సందర్భంగా ఉన్నతాధికారుల వద్ద ఫోన్లను ఉంచాలని, అవసరమైనప్పుడు వాటిని వాడుకోవచ్చునని తెలిపింది. అయితే, ఫోన్లు వాడకుండా వలంటీర్లపై నిషేధం విధించేందుకు ధర్మాసనం నిరాకరించింది. అలా చేయడం వలంటీర్ల విధులను అడ్డుకోవడమేనని తేల్చిచెప్పింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు మౌఖిక వ్యాఖ్యలు కూడా చేసింది. వలంటీర్లు తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే నేరుగా తామే చర్యలు తీసుకుంటామని అప్పటి ఎన్నికల సంఘం చెప్పడంపై ధర్మాసనం ఆందోళన కూడా వ్యక్తం చేసింది. ఇది తమను అత్యంత ఆందోళనకు గురిచేస్తోందని.. అలా నేరుగా చర్యలు తీసుకునే అధికారం, పరిధి ఎన్నికల కమిషన్కు లేవని స్పష్టంచేసింది. అవసరానికి మించి వలంటీర్లపై ఆంక్షలు విధిస్తున్నారని అభిప్రాయపడింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. -
సీఎం జగన్ చిత్రపటానికి రాజధాని ప్రాంత రైతు కూలీల క్షీరాభిషేకం
మంగళగిరి : రాజధాని ప్రాంత రైతు కూలీలు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతు కూలీల పింఛన్ను సీఎం జగన్ రూ.5 వేలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం గుంటూరు జిల్లా యర్రబాలెం, నిడమర్రులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవితో కలిసి పర్యటించి వలంటీర్ల ద్వారా రైతు కూలీలకు రూ.5 వేల చొప్పున పింఛన్లను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో యర్రబాలెంలో పలువురు లబ్ధిదారులు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి, నిడమర్రులో వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ కుల, మత, రాజకీయాలకతీతంగా రైతు కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అందిస్తోందని, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ రూ.5 వేల పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో తమ స్వార్థం కోసం, స్వలాభం కోసం రైతులను, రైతు కూలీలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతులు లబ్ధిపొందలేకపోయారని, ఇక రైతు కూలీల జీవితాలైతే అగమ్యగోచరంగా తయారైన పరిస్థితులను చూశామన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో రైతుల భూములను తీసుకున్న చంద్రబాబు.. రాజధానిని నిర్మించలేకపోవడంతో పాటు రైతులు, రైతు కూలీలకు న్యాయం చేయలేకపోయాడని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా తాను రైతు కూలీలను ఆదుకుంటానని వాగ్దానం చేశారని, ఆ మేరకు రూ.2,500గా ఉన్న రైతు కూలీల పింఛన్ను రూ.5 వేలకు పెంచారని ప్రశంసించారు. -
వ్యవసాయంలో ఏపీ ఆదర్శం
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రామ స్థాయిలో నెలకొల్పిన వలంటీర్లు, రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) వ్యవస్థ రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. రైతులకు అవసరమైన మందులు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలతో పాటు ప్రభుత్వ పథకాలను కూడా అన్నదాతలకు చేరువ చేస్తున్నాయి. వీటితో పాటు వ్యవసాయ అధికారులూ క్షేత్రస్థాయిలో రైతులకు అన్ని విధాలుగా సహాయ పడుతున్నారు. మరీ ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ ప్రవేశ పెట్టి, సమర్ధంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం రైతుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఇతర పథకాలపైనా పూర్తి స్థాయిలో అవగాహన పెరగడానికి దోహదపడింది. ఈ పథకాలను ఏపీ రైతులు సమర్ధంగా వినియోగించుకుంటున్నారు. పథకాల అమలు, రైతులకు అవగాహన కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ పథకాలపై రైతుల అవగాహనపై నాబార్డు నిర్వహించిన సర్వే ఈ విషయాలను వెల్లడించింది. ప్రధానంగా రుణాలు, బీమా, నిల్వ, మార్కెటింగ్పై రైతుల్లో అవగాహన, రైతులకు పథకాల అనుకూలత తదితర అంశాలపై నాబార్డు సర్వే నిర్వహించి, నివేదిక విడుదల చేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ పథకాల పట్ల దేశంలో ఇతర రాష్ట్రాలకన్నా ఆంధ్రప్రదేశ్లోని రైతులకు అత్యధిక అవగాహన ఉందని ఈ సర్వే తెలిపింది. రైతులకు సీఎం జగన్ ఇచ్చిన ‘భరోసా’ ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న రైతు భరోసా పథకం పట్ల రైతుల్లో సానుకూలత నెలకొందని, వారికి ఈ పథకం ప్రయోజనకరంగా ఉందని సర్వే పేర్కొంది. కిసాన్ క్రెడిట్ కార్డు (కెసీసీ)ల పట్ల ఏపీ రైతుల్లో అత్యధికంగా 86 శాతం అవగాహన ఉందని, మహారాష్ట్రలో కేవలం 27 శాతమే అవగాహన ఉందని తెలిపింది. ఆంధ్రఫ్రదేశ్ రైతుల్లో పంటల బీమా పథకాల పట్ల అత్యధిక అవగాహన ఉందని తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయడమేనని పేర్కొంది. దీంతో పాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల పట్ల కూడా ఏపీ రైతుల్లో పూర్తిస్థాయిలో అవగాహన ఉందని చెప్పింది. పంటల బీమా పథకంపై ఏపీ రైతుల్లో 83 శాతం, రాజస్థాన్ రైతుల్లో 66 శాతం అవగాహన ఉందని తెలిపింది. ఇతర రాష్ట్రాలకు ఏపీనే ఆదర్శం వివిధ పథకాలు, పంటల బీమా అమలు, అవగాహనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఇతర రాష్ట్రాలకు ఓ మంచి ఉదాహరణ అని నాబార్డు తెలిపింది. ఏపీలో ప్రతి గ్రామంలో వ్యవసాయ అధికారి ఉన్నారు. ఆ అధికారి ప్రతి నెలా రైతులకు సంబంధించిన పథకాలపై సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతు భరోసా కేంద్రాల వారీగా గ్రామ స్థాయిలో వలంటీర్లు ప్రతి గ్రామంలో సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ రైతులకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. వివిధ పథకాలపై రైతులతో దరఖాస్తులు చేయించడం, పునరుద్ధరణ, సమస్యలు, క్లెయిమ్స్ పరిష్కారాల్లో వలంటీర్లు సహకరిస్తున్నారు. అలాగే ఈ–క్రాప్ పోర్టల్–అప్లికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో రైతులు, పంటలు మొదలైన వాటి గురించి సమాచారం ఉంటుంది. పంటల బీమా, క్లెయిమ్ల సమాచారం పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. రైతులు సాగు కోసం చేసిన వ్యయం, క్లెయిమ్ మొత్తాన్ని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకు క్లెయిమ్ మొత్తాన్ని బదిలీ చేస్తోంది. ఇది ఈ–యాప్తో సాధ్యమవుతోంది అని నాబార్డు తెలిపింది. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం, పథకాలను వినియోగించుకోవడంలో రైతుల్లో అవగాహన చాలా బాగుందని, ఇది రైతు భరోసా కేంద్రాల ఫలితమేనని నాబార్డు సర్వే వివరించింది. -
వాలంటీర్లపై చంద్రబాబు,పవన్ ఏడుపు: కొడాలి నాని
-
Jones Manikonda: ట్యూషనమ్మ
విజయవాడకు చెందిన 50 ఏళ్ల జోన్స్ మానికొండ వెనుక ఏ ఆర్థిక అండాదండా లేదు. కాని ఆమె విజయవాడలో, కృష్ణాజిల్లాలో ఇంకా రాష్ట్రవ్యాప్తంగా మురికివాడల పిల్లల కోసం 60 ట్యూషన్ కేంద్రాలను వాలంటీర్లతో నడుపుతోంది. నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల వల్ల స్కూల్ ΄ాఠాల పట్ల భయం ఏర్పడకుండా, స్కూల్ మానేయకుండ ఈ ఈవెనింగ్ ట్యూషన్స్ సాయపడుతున్నాయి. మొత్తం 6 వేల మంది పిల్లలు ఇప్పటికి జోన్స్ వల్ల మేలు ΄÷ందారు. మామూలు పిల్లల సాయంత్రాలు వేరు. తల్లి వారికి స్నానం చేయించి, తినడానికి ఏదైనా ఇచ్చి, కాసేపు ఆడుకోనిచ్చి, ఆ తర్వాత చదువుకు కూచోబెడుతుంది. చదివిస్తుంది. లేదంటే ట్యూషన్కు పంపుతుంది. మరి మురికివాడల్లోనో? ఆ పిల్లలు స్కూల్కు వెళ్లడమే కష్టం. ఇంటికొచ్చాక ΄ాఠాలు చదివించాలంటే తల్లికి తీరిక ఉండదు. లేదా ఆమెకు చదువు రాదు. తండ్రికి అసలే పట్టదు. మరుసటి రోజు స్కూల్కు వెళితే హోమ్వర్క్ చేయలేదని టీచర్ తిడుతుందని భయం. దాని బదులు స్కూల్ ఎగ్గొట్టడమే నయం. ఇలా ఆ పిల్లలు డ్రాపవుట్స్గా మారితే? అందుకే జోన్స్ మానికొండ మురికివాడల్లో ట్యూషన్లు నడుపుతుంది. ఆదర్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ పేరుతో ఆమె నడుపుతున్న ట్యూషన్లు ఆంధ్రప్రదేశ్లో పిల్లల చదువుకు మేలు చేస్తున్నాయి. చదువే గౌరవం విజయవాడలోనే పుట్టి పెరిగిన జోన్స్ మానికొండ ఏడుగురు సంతానంలో రెండవది. సోషియాలజీలో ΄ోస్ట్గ్రాడ్యుయేషన్ చేశాక ఎం.ఈడీ. చేసి, సైకాలజీలో మరో పీజీ చేసింది. ‘మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అందరం బాగా చదువుకున్నాం. చదువు మాత్రమే మనిషికి గౌరవం, ఉ΄ాధి ఇవ్వగలదు. కాని నేటికీ చాలా పేదవాడల్లో పిల్లలకు చదువు అందడం లేదు. మురికివాడల్లోని పిల్లల కోసం ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నాను. ప్రతి ఒక్కరూ చదువుకునేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే కాదు సమాజం మీద కూడా ఉంది’ అంటుందామె. సమాజసేవ కోసం అవివాహితగా ఉండాలని నిర్ణయించుకుంది జోన్స్. వెనుకబడ్డ సమూహాలు మురికివాడల్లో ఎక్కువగా ఉంటున్నది వెనుకబడ్డ సమూహాలు అని గమనించి ఆ సమూహాల మీద దృష్టి పెట్టింది జోన్స్. యానాది, ఎరుకల, వడ్డెర, జంగం, సుగాలి, కోయ... ఇలా 19 సమూహాలను గుర్తించి వారి నివాస ్ర΄ాంతాల్లో ట్యూషన్ సెంటర్లను నిర్వహిస్తోంది. మొత్తం కృష్ణాజిల్లాలో 22, విజయవాడలో 13, వైజాగ్లో 4, హైదరాబాద్లో 3 సెంటర్లు ఆమె ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. 48 టీచర్లు, 13 మంది వాలంటీర్లు మురికివాడల్లో ట్యూషన్లు చెబుతూ పిల్లలు స్కూళ్లకెళ్లి బాగా చదువుకునేలా సహాయం చేస్తున్నారు. బంధుమిత్రుల సాయంతో జోన్స్ నిర్వహిస్తున్న ఈవెనింగ్ ట్యూషన్లకు నెలకు దాదాపు 2 లక్షల ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులో దాదాపు ఎక్కువ భాగం సౌత్ ఆఫ్రికాలోని ఒక సోదరుడు, సింగపూర్లో ఉన్న ఒక సోదరి ఇస్తారు. మరికొంత సాయం స్నేహితుల వల్ల... దాతల వల్ల అందుతుంది. ‘కేవలం చదువు మాత్రమే కాదు... ఈ పిల్లలకు ΄ûష్టికాహారం, పరిశుభ్రమైన బట్టలు కూడా కావాలి. ఆ దిశగా కూడా నా సేవ కొనసాగాలని కోరుకుంటున్నాను. పేదరికం వల్ల పిల్లల్ని పనుల్లో పెట్టే తల్లిదండ్రులను ఒప్పించి ఆ పిల్లలను బడికి పంపేలా చూడటం మాకున్న అతిపెద్ద సవాలు’ అంటుంది జోన్స్. లెక్చరర్గా ఉద్యోగం మానేసి మరీ ఆమె చేస్తున్న ఈ సేవకు సమాజం నుంచి మరింత మద్దతు దొరుకుతుందని ఆశిద్దాం. -
పవన్ కల్యాణ్కు షాక్.. క్రిమినల్ కేసు నమోదు
సాక్షి, గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు బిగ్ షాక్ తగిలింది. గుంటూరులో పవన్పై క్రిమినల్ కేసు నమోదైంది. దీంతో, కోర్టు ఎదుట హాజరు కావాలని జిల్లా జడ్జి శరత్బాబు నోటీసుల్లో పేర్కొన్నారు. వివరాల ప్రకారం.. జనసేన అధినేత పవన్పై గుంటూరులో క్రిమినల్ కేసు నమోదైంది. ఏపీలో వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ వాలంటీర్లు పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కోర్టు డైరెక్షన్తో ఐపీసీ సెక్షన్ 499, 500 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో మార్చి 25వ తేదీన గుంటూరు కోర్టులో పవన్ హాజరు కావాలని నాలుగో అదనపు జడ్జి శరత్బాబు తాజాగా ఇచ్చిన నోటీసుల్లో స్పష్టం చేశారు. కాగా, జూలై మూడో తేదీన ఏలూరులో జరిగిన వారాహియాత్రలో వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. -
వాలంటీర్లు నా సైన్యం : సీఎం వైఎస్ జగన్
-
అన్నా.. మీ చిరునవ్వే.. మాకు ఆత్మస్థైర్యం.. వాలంటీర్ల భావోద్వేగం
సాక్షి, గుంటూరు: సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న వలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నగదు పురస్కారాలతో సత్కరించింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా, ప్రభుత్వం ఈ ఏడాది నగదు పురస్కారాలను భారీగా పెంచింది. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు ఏమన్నారంటే.. వారి మాటల్లోనే ఆ అనుభూతి మరిచిపోలేం.. అన్నా, మీరు పాదయాత్రలో మా కష్టసుఖాలు తెలుసుకుని నేను విన్నాను. నేను ఉన్నాను అన్న మాటకు కట్టుబడి సీఎం అయిన తర్వాత వలంటీర్ వ్యవస్ధను ఏర్పాటుచేసి రాష్ట్రాన్ని అభివృద్ది పథంలోకి తీసుకెళ్లారు. నాకు కేటాయించిన 64 కుటుంబాలలో ఏ కుటుంబం ఏ పథకానికి అర్హులో గుర్తించి వారికి ఆ పథకం అందించేటప్పుడు వారి మొహాల్లో ఆనందం, పెదాలపై చిరునవ్వు చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతి నెలా పింఛన్ ఇచ్చేటప్పుడు అవ్వాతాతలు మా పెద్దకొడుకుకు మా దీవెనలు ఉంటాయని మా చేతులు తాకినప్పుడు ఉండే అనుభూతి మరిచిపోలేం. నా పరిధిలో వృద్దాప్య పింఛన్ తీసుకునే తాత ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఒకటో తారీకు నేను రాత్రి 12 వరకు ఆయన దగ్గర కూర్చుని యాప్ ఓపెన్ అవగానే ఆయనకు పింఛన్ ఇచ్చాను. ఆ తర్వాత 2,3 గంటలకు దురదృష్టవశాత్తూ ఆయన చనిపోయారు. అప్పుడు తన భార్య వచ్చి నన్ను హత్తుకున్నప్పుడు ఇది కదా సేవ అని అనిపించింది, మన ప్రభుత్వంలో రైస్ కార్డులు ఇచ్చినప్పుడు వారు పొందే ఆనందం అంతా ఇంతా కాదు. ప్రతి నెలా రైస్ తీసుకుంటూ అక్కా మీ వల్లే మాకు సాధ్యమైందనేటప్పుడు సంతోషంగా ఉంటుంది. తల్లి గర్భంలోని శిశువు నుండి వృద్దాప్యం వరకు ప్రతి ఒక్కరికీ... వారికి సంక్షేమ పథకాలు అందించే సీఎంను ఎవరు వదులుకుంటారు. ఇన్ని పథకాలు ఇస్తున్న సీఎంగారి వైపు, మన రాష్ట్రం వైపు చూడకుండా ఎవరైనా ఉంటారా. అందుకే మీరు ప్రజల గుండెల్లో ప్రత్యక్ష దైవమయ్యారు. మేం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని మా వలంటీర్ల తరపున హామీ ఇస్తున్నాను. ప్రజలు మీ కోసం సిద్దంగా ఉన్నారన్నా, మీ పాలన కోసం మళ్లీ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ధన్యవాదాలు. -దాసరి జ్యోత్స్నా దేవి, వలంటీర్, గొల్లపాలెం, ఫిరంగిపురం మండలం మీ పాలనలో మరోసారి మేం పనిచేయడానికి సిద్దం.. అన్నా, నా క్లస్టర్లో 62 కుటుంబాలు ఉన్నాయి. అన్ని కుటుంబాలకు మీ పథకాలు అందాయి. మీరు పాదయాత్రలో అందరికీ భరోసా ఇచ్చారు, మీరు మీ మాట నిలబెట్టుకున్నారు, మీరు 2,62,000 మంది వలంటీర్ సైన్యాన్ని సిద్దం చేశారు. మీ ఆశయాలను నిలబెట్టేలా మేం పనిచేశాం. గతంలో సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా ఉండేవి. కానీ ఈ రోజు ప్రతి గడప తొక్కి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తున్నారు. అన్నా నా పరిధిలో 22 ఏళ్ల యువకుడు కూలి పనులకు వెళ్లి 4 వ అంతస్ధు నుంచి కిందపడి చావు అంచులవరకూ వెళ్లాడు. కానీ ఆరోగ్యశ్రీలో 25 లక్షల వరకూ ఉచిత వైద్యం సంజీవనిలా పనిచేసింది. అతని కుటుంబానికి ఆరోగ్య ఆసరా నెలకు రూ. 5,000 చొప్పున రెండునెలలకు రూ.10 వేలు ఇచ్చాం. నా పరిధిలో ఉన్న వారికి పింఛన్లు ఇచ్చేటప్పుడు సంతోషంగా పండుగలా తీసుకుంటున్నారు, మీ చిరునవ్వు మాకు ఆత్మస్ధైర్యాన్ని ఇస్తుంది. ఈ వలంటీర్ వ్యవస్ధను మొదట్లో చాలా కించపరిచి మాట్లాడారు. కానీ మీరు మాకు అండగా నిలిచి ఇచ్చిన ధైర్యం మాకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. మీరు నా వలంటీర్లు అంటూ అన్న ప్రతి సారి మాకు రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు సేవ చేశాం. మేం ఈ జన్మలో మరిచిపోలేం, మాలోని ప్రతిభను గుర్తించి మాకు ఇచ్చే ఈ అవార్డులను పెంచడం చాలా సంతోషంగా ఉంది. అన్నా మీ పాలనలో మరోసారి మేం పనిచేయడానికి సిద్దం. మేము మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం, మా వలంటీర్ కుటుంబ సభ్యులందరి తరపునా మీకు ధన్యవాదాలు. షేక్ జుబేర్, వలంటీర్, బేతపూడి, ఫిరంగిపురం అందరికీ నమస్కారం, అన్నా మీరు సీఎం అయిన తర్వాత దాదాపు 2,55,000 కు పైగా వలంటీర్లను గుర్తించి వారి ద్వారా అందిస్తున్న సేవలు ప్రపంచానికే ఆదర్శం, చంద్రబాబు అనేక మాటలు చెప్పి మాట తప్పిన విషయం అందరికీ తెలుసు, మీరు ఈ వలంటీర్ వ్యవస్ధ తీసుకొచ్చినప్పుడు అనేకమంది అవాకులు చవాకులు మాట్లాడారు, ఇప్పుడు అదే నోటితో పొగుడుతున్నారు. అది కదా పాలన అంటే.. గతంలో వలంటీర్లను ఇంటికి రానివ్వడానికి జంకేవారు కానీ ఇప్పుడు మా అమ్మాయి, అబ్బాయి అని మాట్లాడుతున్నారు, సూర్యుడి కంటే ముందు తెల్లవారుజామునే ఇంటి తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్నారు. కోవిడ్ సమయంలో వలంటీర్లు సైనికుల్లా సేవలందించారు, వారి సేవలకు గర్వపడుతున్నాం, ఈ రోజు పెద్దలెవరికైనా బాగులేకపోతే బిడ్డలకు ఫోన్ చేసినా చేయకపోయినా వలంటీర్కు చేసి అడుగుతున్నారు. మిమ్మల్ని మళ్లీ సీఎం చేసుకుంటాం.. ఒక వలంటీర్ను స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ చేసిన ఘనత మీదే అన్నా, మన దేశం హరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం చూసింది కానీ మన రాష్ట్రానికి ఉద్యోగ విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి మీరు, ఒకే నోటిఫికేషన్తో 1,35,000 సచివాలయ సిబ్బందిని కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా ఉద్యోగాలు కల్పించారు, కేంద్రం లెక్కల ప్రకారం 16 లక్షల మందికి రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించబడ్డాయి, పేద ప్రజల గుండె చప్పుడు మీరు, ఈ ప్రాంతంలో కార్మెల్ మాత కొండ పైకి ఘాట్ రోడ్డు అడుగుతున్నారు, మిమ్మల్ని మళ్లీ సీఎం చేసుకుని ఆ కోరిక తీర్చుకుంటాం. ధన్యవాదాలు. -మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే, ప్రత్తిపాడు ఇదీ చదవండి: 11/11 : రాజ్యసభలో YSRCP 100% స్కోరు -
కాపీ.. పేస్ట్ వాళ్లది కిచిడీ మేనిఫెస్టో.. చంద్రబాబును ఆటాడుకున్న సీఎం జగన్