West Indies
-
ఐసీసీ బీసీసీఐ ఆడమన్నట్టల్లా ఆడుతుంది.. విండీస్ దిగ్గజ బౌలర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గెలవడాన్ని పాకిస్తాన్ వాళ్లే కాకుండా ఇతర దేశాల వాళ్లు కూడా జీర్జించుకోలేకపోతున్నారు. మెగా టోర్నీలో టీమిండియా తమ మ్యాచ్లన్నీ ఒకే వేదికపై ఆడి లబ్ది పొందిందని కొన్ని భారత వ్యతిరేక శక్తులు అవాక్కులు చవాక్కులు పేలుతున్నాయి. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ప్రాతినిథ్యమే లేని విండీస్ కూడా ఈ అంశంపై నోరు మెదపడం మొదలుపెట్టింది. భారత్ దుబాయ్లోనే తమ మ్యాచ్లన్నీ ఆడటాన్ని విండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ ఆండీ రాబర్ట్స్ తప్పుబట్టాడు. మిగతా జట్లు మైళ్లకు మైళ్లు ప్రయాణించి మ్యాచ్లు ఆడితే, టీమిండియా మాత్రం కాలు కదపకుండా ఒకే వేదికపై అన్ని మ్యాచ్లు ఆడిందని అన్నాడు. టోర్నీకి ఆతిథ్యమిచ్చినా పాకిస్తాన్ కూడా టీమిండియాతో మ్యాచ్కు దుబాయ్కు వెళ్లిందని గుర్తు చేశాడు. ఇలాంటప్పుడు పాక్ జట్టుకు ఆతిథ్య సౌలభ్యం ఎక్కడ లభించిందని ప్రశ్నించాడు. ఒకే వేదికపై టీమిండియా మ్యాచ్లు షెడ్యూల్ చేసినందుకు ఐసీసీపై కూడా ధ్వజమెత్తాడు. బీసీసీఐ ప్రతి కోరికను తీర్చడాన్ని ఐసీసీ మానుకోవాలని సూచించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తటస్థ వేదిక (దుబాయ్) విషయంలో ఐసీసీ బీసీసీఐకి అనుకూలంగా వ్యవహరించిందని మండిపడ్డాడు. ఒకే వేదికపై అన్ని మ్యాచ్లు ఆడటం ద్వారా టీమిండియా లబ్ది పొందిందని ఆరోపించాడు. ఈ విషయంలో మిగతా జట్లకు అన్యాయం జరిగిందని వాపోయాడు. ఇకనైనా ఐసీసీ బీసీసీఐకి సహకరించడం మానుకోవాలని అన్నాడు. 2024 టీ20 వరల్డ్కప్లోనూ ఓ విషయంలో ఐసీసీ బీసీసీఐకి సహకరించిందని నిరాధార ఆరోపణ చేశాడు. టీమిండియా కోసం బీసీసీఐ చేసే ప్రతి అభ్యర్థనను నెరవేర్చకూడదని ఐసీసీకి సూచించాడు. అప్పుడప్పుడైనా బీసీసీఐకి నో చెప్పాలని వ్యంగ్యంగా అన్నాడు. ప్రపంచంలో బీసీసీఐ ధనిక బోర్డు కావడంతో ఐసీసీ వారి చెప్పినట్టల్లా ఆడుతుందని అన్నాడు. తనవరకు ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ బోర్డు అని ఎద్దేవా చేశాడు. బీసీసీఐ ప్రతి విషయంలో ఐసీసీని శాశిస్తుందని తెలిపాడు. రేపటి రోజుల్లో బీసీసీఐ నో బాల్స్ వద్దు, వైడ్ బాల్స్ వద్దన్నా ఐసీసీ తలూపుతుందని అన్నాడు. బీసీసీఐని తృప్తి పరిచేందుకు ఐసీసీ ఏమైనా చేస్తుందని అన్నాడు. 74 ఏళ్ల ఆండీ రాబర్ట్స్ తొలి మూడు వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో విండీస్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఈ మూడింటిలో విండీస్ తొలి రెండు ప్రపంచకప్లను గెలిచింది. 1983 వరల్డ్కప్లో కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్లో విండీస్ను చిత్తు చేసి ఛాంపియన్గా అవతరించింది. నేడు రాబర్ట్స్ చేసిన వ్యాఖ్యలు నాటి ప్రపంచకప్ అవమానాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినట్లుంది. కాగా, రాబర్ట్స్ లేవనెత్తిన విషయాన్నే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ కూడా లేవనెత్తాడు. ఒకే వేదికపై ఆడి, ఎలాంటి ప్రయాణ బడలికలు లేకుండా టీమిండియా లబ్ది పొందిందని సోషల్మీడియా వేదికగా ఆరోపించాడు. అయితే ఒకే వేదికపై మ్యాచ్లు ఆడటం వల్ల టీమిండియాకు అదనంగా ఒరిగిందేమీ లేదని పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రం అనడం విశేషం. ఈ టోర్నీలో భారత్ వేదికతో సంబంధం లేకుండా చాలా బలంగా ఉండిందని అక్రం అన్నాడు. ఈ జట్టుతో భారత్ పాకిస్తాన్లో కూడా గెలిచేదని తెలిపాడు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అన్ని మ్యాచ్లను దుబాయ్లో అడి అన్నింటా విజయాలు సాధించింది. ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ను చిత్తు చేసి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. వాస్తవానికి ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యమిస్తున్నప్పటికీ.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా పాక్లో పర్యటించడానికి బీసీసీఐ ఒప్పుకోలేదు. సుదీర్ఘ చర్చల అనంతరం ఐసీసీ టీమిండియా మ్యాచ్లను దుబాయ్కు మార్చింది. -
లేటు వయసులోనూ రెచ్చిపోతున్న దిగ్గజాలు.. మాస్టర్స్ లీగ్లో మరో సెంచరీ
క్రికెట్ దిగ్గజాలు లేటు వయసులోనూ రెచ్చిపోతున్నారు. యువ ఆటగాళ్లకు తామేమీ తీసిపోమని పరుగుల వరద పారిస్తున్నారు. దిగ్గజాల కోసం తొలిసారి నిర్వహించిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో మాజీ క్రికెటర్లు సెంచరీల మోత మోగిస్తున్నారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 14 మ్యాచ్లు జరగ్గా ఏకంగా ఏడు సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో ఆసీస్ దిగ్గజం షేన్ వాట్సన్ ఒక్కడే 3 సెంచరీలు బాదాడు. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు బెన్ డంక్, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర, శ్రీలంక మాజీ బ్యాటర్ ఉపుల్ తరంగ, తాజాగా విండీస్ మాజీ ప్లేయర్ లెండిల్ సిమన్స్ తలోసారి శతక్కొట్టారు. ఈ టోర్నీలో భారత్ తరఫున ఒక్క సెంచరీ కూడా నమోదు కానప్పటికీ.. దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్, అంబటి రాయుడు, యూసఫ్ పఠాన్, గురుకీరత్ సింగ్, సౌరభ్ తివారి తలో హాఫ్ సెంచరీ చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన సచిన్ పూర్వపు రోజుల గుర్తు చేశాడు.నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా మాస్టర్స్పై విండీస్ మాస్టర్స్ 29 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఈ మ్యాచ్లో విండీస్ బ్యాటర్ లెండిల్ సిమన్స్ చెలరేగిపోయాడు. కేవలం 54 బంతుల్లోనే శతకొట్టాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 59 బంతుల ఎదుర్కొన్న సిమన్స్ 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశాడు. విండీస్ ఇన్నింగ్స్ చివర్లో చాడ్విక్ వాల్టన్ (12 బంతుల్లో 38 నాటౌట్; 6 సిక్సర్లు) సిక్సర్ల సునామీ సృష్టించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. డ్వేన్ స్మిత్, పెర్కిన్స్ తలో 5 పరుగులు చేయగా.. దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా 29, ఆష్లే నర్స్ డకౌటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో క్రూగర్, ఎన్తిని తలో 2 వికెట్లు తీయగా.. మెక్ లారెన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. రవి రాంపాల్ 5 వికెట్లతో విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో రిచర్డ్ లెవి 44, జాక్ కల్లిస్ 45, జాక్ రుడాల్ఫ్ 39 పరుగులు చేశారు. హషిమ్ ఆమ్లా (3), అల్విరో పీటర్సన్ (7) లాంటి స్టార్లు విఫలమయ్యారు. ఈ టోర్నీలో శ్రీలంక, భారత్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్కు అర్హత సాధించగా.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ నిష్క్రమించాయి. శ్రీలంక, భారత్ తలో 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. -
రాణించిన సంగక్కర.. విండీస్పై శ్రీలంక ఘన విజయం
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్-2025లో శ్రీలంక మూడో విజయం నమోదు చేసింది. వెస్టిండీస్తో నిన్న (మార్చి 6) జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మాస్టర్స్.. కెప్టెన్ కుమరా సంగక్కర (42 బంతుల్లో 47) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. గుణరత్నే (64) అర్ద సెంచరీతో సత్తా చాటాడు. వీరిద్దరు మినహా లంక ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. తిరుమన్నే (14), ఆఖర్లో చతురంగ (17 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. జయసింఘే, ప్రసన్న, లక్మల్ డకౌట్లు కాగా.. తరంగ, జీవన్ మెండిస్ తలో పరుగు చేశారు. విండీస్ బౌలర్లలో ఆష్లే నర్స్ 3 వికెట్లు పడగొట్టగా.. టీనో బెస్ట్ 2, జెరోమ్ టేలర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ డ్వేన్ స్మిత్ (49), లెండిల్ సిమన్స్ 37 (నాటౌట్) విండీస్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వీరికి ఇతరుల నుంచి సహకారం లభించకపోవడంతో విండీస్ శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. చాడ్విక్ వాల్టన్ డకౌట్, నర్సింగ్ డియోనరైన్ 14, జోనాథన్ కార్టర్ 17, ఆష్లే నర్స్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో దినేశ్ రామ్దిన్ (15 నాటౌట్) వేగంగా పరుగులు సాధించేందుకు ప్రయత్నించినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లంక బౌలర్లలో ఇసురు ఉడాన పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు తీశాడు. చతురంగ డిసిల్వ, జీవన్ మెండిస్ తలో వికెట్ పడగొట్టారు.ఈ గెలుపుతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. సచిన్ నేతృత్వంలోని భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. భారత్, శ్రీలంక తలో 4 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించినప్పటికీ.. మెరుగైన రన్రేట్ కారణంగా భారత్ టాప్ ప్లేస్లో ఉంది. లంక చేతితో ఓటమితో విండీస్ మూడో స్థానానికి పడిపోయింది. విండీస్ ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించింది. ఆసీస్, ఇంగ్లండ్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు తలో 3 మ్యాచ్లు ఆడి చెరో మ్యాచ్లో గెలిచారు. ఈ టోర్నీలో ఇంగ్లండ్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో ఓటమిపాలై, చిట్ట చివరి స్థానంలో ఉంది. -
క్రిస్ గేల్ విధ్వంసం.. లేటు వయసులోనూ తగ్గని యూనివర్సల్ బాస్
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్లో (International Masters League 2025) ఇవాళ (ఫిబ్రవరి 27) వెస్టిండీస్ మాస్టర్స్, ఇంగ్లండ్ మాస్టర్స్ జట్లు తలపడుతున్నాయి. నవీ ముంబై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి వెస్టిండీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. విధ్వంసకర ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (Chris Gayle) చెలరేగండతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. గేల్తో పాటు మరో ఓపెనర్ డ్వేన్ స్మిత్ , నర్సింగ్ డియోనరైన్, ఆష్లే నర్స్ కూడా చెలరేగారు. గేల్ 19 బంతులు ఎదుర్కొని 3 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో గేల్ పాత రోజులను గుర్తు చేశాడు. లేటు వయసులోనూ విధ్వంసం సృష్టించాడు. డ్వేన్ సైతం వేగంగా పరుగులు సాధించాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. డియోనరైన్ 23 బంతుల్లో 3 సిక్సర్ల సాయంతో 35 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖర్లో ఆష్లే నర్స్ 13 బంతుల్లో 2 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 29 పరుగులు చేశాడు. విండీస్ ఇన్నింగ్స్లో కిర్క్ ఎడ్వర్డ్స్ 9, చాడ్విక్ వాల్టన్ 9, దినేశ్ రామ్దిన్ 8, జెరోమ్ టేలర్ ఒక్క పరుగు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మాంటీ పనేసర్ 3 వికెట్లు తీయగా.. క్రిస్ స్కోఫీల్డ్ 2, క్రిస్ ట్రెమ్లెట్ ఓ వికెట్ పడగొట్టారు.కాగా, ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ ఈ ఏడాదే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ లీగ్లో 6 దేశాలకు (భారత్, శ్రీలంక. వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్) చెందిన దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు పాల్గొంటున్నారు. భారత్కు సచిన్, శ్రీలంకకు సంగక్కర, వెస్టిండీస్కు బ్రియాన్ లారా, ఆస్ట్రేలియాకు షేన్ వాట్సన్, సౌతాఫ్రికాకు జాక్ కల్లిస్, ఇంగ్లండ్కు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహిస్తున్నారు. భారత మాస్టర్స్ జట్టులో సచిన్తో పాటు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు తదితర మాజీ స్టార్ ఆటగాళ్లు పాల్గొననున్నారు.ఈ ఎడిషన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో భారత్ అత్యధిక మ్యాచ్లు గెలిచింది. భారత మాస్టర్స్.. శ్రీలంక, ఇంగ్లండ్ మాస్టర్స్పై విజయాలు సాధించారు. మరో రెండు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా మాస్టర్స్పై విండీస్.. సౌతాఫ్రికా మాస్టర్స్పై శ్రీలంక మాస్టర్స్ విజయాలు సాధించారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
'ఐరెన్ లెగ్' ఆండ్రీ రసెల్.. ఎక్కడ అడుగుపెడితే అక్కడ భస్మం..!
విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ (Andre Russell) ఫ్రాంచైజీ క్రికెట్లో తీరిక లేకుండా గడుపుతున్నాడు. రాత్రి ఓ లీగ్ ఆడితే, ఉదయం మరో లీగ్లో పాల్గొంటున్నాడు. మొన్న రసెల్ గంటల వ్యవధిలో (15 గంటలు) దేశాలు దాటి రెండు వేర్వేరు లీగ్ల్లో పాల్గొన్న వైనం సోషల్మీడియాలో వైరలయ్యింది. ఇదే సమయంలో రసెల్ ఓ అపవాదును కూడా మూటగట్టుకున్నాడు. నిద్ర లేకుండా జర్నీ చేసి రెండు వేర్వేరు లీగ్ల్లో పాల్గొంటే రెండు చోట్ల రసెల్ జట్లు లీగ్ల నుంచి నిష్క్రమించాయి. దీంతో నెటిజన్లు రసెల్ను ఐరెన్ లెగ్ అని అంటున్నారు. రసెల్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆ జట్టు భస్మం అంటూ కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్లు రసెల్పై ఈ స్థాయిలో విరుచుకుపడటానికి అతని పేలవ ఫామ్ కూడా ఓ కారణం. రసెల్ ఇటీవలికాలంలో ఏ లీగ్లోనూ చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేదు. ఇంకా చెప్పాలంటే అన్ని చోట్లా దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్లో మెరుపులు లేవు, బౌలింగ్లో వికెట్లు లేవు. దీంతో అభిమానులు చిరెత్తిపోయి రసెల్పై దుష్ప్రచారం మొదలుపెట్టారు. వయసు మీద పడింది, ఇక తప్పుకో అని కొందరంటుంటే.. మరికొందరేమో, పోయి జాతీయ జట్టుకు ఆడుకోమని సలహాలు ఇస్తున్నారు. ఇంకొందరేమో డబ్బు కోసం రెస్ట్ లేకుండా ఇన్ని ఊర్లు తిరగాలా అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రసెల్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించకుండా ప్రైవేట్ లీగ్ల్లో ఆడుతున్న విషయం తెలిసిందే.రసెల్ ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో (ILT20) అబుదాబీ నైట్రైడర్స్ తరఫున ఆడి తొలి బంతికే డకౌటయ్యాడు. ఆ మ్యాచ్లో ఓటమితో ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో అబుదాబీ నైట్రైడర్స్ కథ ముగిసింది (నిష్క్రమించింది). ILT20లో తన జట్టు ఓడిన వెంటనే రసెల్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బంగ్లాదేశ్కు పయనమయ్యాడు. ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో పాల్గొన్నాడు. ఈ లీగ్లో ఖుల్నా టైగర్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రంగ్పూర్ రైడర్స్కు ప్రాతినిథ్యం వహించిన రసెల్ 9 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో ఓ ఓవర్ బౌలింగ్ కూడా చేసిన రసెల్ వికెట్ లేకుండా 14 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్లో రంగ్పూర్ రైడర్స్ ఓటమికి రసెల్ ప్రధాన కారణం కానప్పటికీ.. అతని జట్టు మాత్రం లీగ్ నుంచి నిష్క్రమించింది.ఇదిలా ఉంటే, ఇంటర్నేషనల్ లీగ్ టీ20, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లు చివరి దశకు చేరాయి. బీపీఎల్లో ఫార్చూన్ బారిషల్ ఫైనల్కు చేరగా.. రేపు రెండో క్వాలిఫయర్ జరుగనుంది. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లీగ్ దశ మ్యాచ్లన్నీ ముగిశాయి. డెజర్ట్ వైపర్స్, దుబాయ్ క్యాపిటల్స్, ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్జ్ తదుపరి దశకు క్వాలిఫై అయ్యాయి. -
PAK Vs WI: పాక్ స్పిన్నర్కు ఇచ్చిపడేసిన విండీస్ బౌలర్
వెస్టిండీస్ క్రికెట్ జట్టు 35 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై చారిత్రక విజయం సాధించింది. ముల్తాన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో వెస్టిండీస్ పాక్ను 120 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. రెండో టెస్ట్లో 9 వికెట్లు తీయడంతో పాటు తొలి మ్యాచ్లో 10 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన విండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.మ్యాచ్ మూడో రోజు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. విండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్ పాక్ ఆటగాడు సాజిద్ ఖాన్కు ఇచ్చిపడేశాడు. పాక్ రెండో ఇన్నింగ్స్లో సాజిద్ను ఔట్ చేయగానే వార్రికన్ ప్రముఖ రెజ్లర్, హాలీవుడ్ నటుడు జాన్ సీనా స్టయిల్లో "యూ కాంట్ సీ మీ" సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అలాగే టీమిండియా గబ్బర్ శిఖర్ ధవన్ తరహాలో తొడ కొట్టి తన ఆనందాన్ని చాటుకున్నాడు.Jomel Warrican has the last laugh over Sajid Khan.📸: Fan Code pic.twitter.com/Y69W3WfY7m— CricTracker (@Cricketracker) January 27, 2025వాస్తవానికి వార్రికన్ ఈ తరహా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సాజిద్ ఖానే కారణం. విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో వార్రికన్ను ఇబ్బంది పెట్టిన (బౌలింగ్తో) సాజిద్ ఖాన్.. ఓ దశలో జాన్ సీనా స్టయిల్లో "యూ కాంట్ సీ మీ" సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అప్పుడే నవ్వుతూ ఊరకుండిపోయిన వార్రికన్.. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో తన టైమ్ రాగానే సాజిద్ ఖాన్ను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడు. It was an exceptional Test win for the Windies.pic.twitter.com/hQxrpKEy6S— CricTracker (@Cricketracker) January 27, 2025అప్పుడు సాజిద్ ఖాన్ కేవలం జాన్ సీనా సెలబ్రేషన్స్ మాత్రమే చేసుకుంటే, వార్రికన్ ఇప్పుడు జాన్ సీనా సెలబ్రేషన్స్తో పాటు గబ్బర్ "థై ఫైవ్" సెలబ్రేషన్స్ కూడా రిపీట్ చేశాడు.వార్రికన్.. సాజిద్ ఖాన్కు "టిట్ ఫర్ టాట్" చెప్పిన విధానం సోషల్మీడియాలో వైరలవుతుంది. వార్రికన్ను క్రికెట్ అభిమానులు కరెక్టే చేశావని సమర్దిస్తున్నారు. ఓవరాక్షన్ చేసిన సాజిద్ ఖాన్కు బంతితోనే బుద్ది చెప్పావంటూ కామెంట్స్ చేస్తున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. విండీస్ నిర్దేశించిన 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పాక్ చతికిలపడింది. 76/4 ఓవర్నైట్ స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన పాక్.. మరో 57 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన ఆరు వికెట్లు కోల్పోయింది. మూడో రోజు తొలి గంటలోనే మ్యాచ్ ముగిసింది. వార్రికన్ పాక్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఫలితంగా పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో 133 పరుగులకే కుప్పకూలింది.వార్రికన్ 5, కెవిన్ సింక్లెయిర్ 3, గుడకేశ్ మోటీ 2 వికెట్లు తీసి పాకిస్తాన్ పతనాన్ని శాశించారు. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో బాబర్ ఆజమ్ చేసిన 31 పరుగులే అత్యధికం కాగా.. మొహమ్మద్ రిజ్వాన్ (25), కమ్రాన్ గులామ్ (19), సౌద్ షకీల్ (13), సల్మాన్ అఘా (15) రెండంకెల స్కోర్లు చేశారు.అంతకుముందు విండీస్ రెండో ఇన్నింగ్స్లో 244 పరుగులకు ఆలౌటైంది. బ్రాత్వైట్ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గుడకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.తొలి రోజు ఆటలో ఇరు జట్లు తమతమ తొలి ఇన్నింగ్స్లను ముగించాయి. బౌలర్లు.. ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగడంతో మొదటి రోజు 20 వికెట్లు నేలకూలాయి. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 163 పరుగులకే ఆలౌట్ కాగా.. పాకిస్తాన్ 154 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో పాక్ స్పిన్నర్ నౌమన్ అలీ హ్యాట్రిక్ (తొలి ఇన్నింగ్స్లో) సహా 10 వికెట్లు తీయగా.. విండీస్ స్పిన్నర్ వార్రికన్ 9 వికెట్లు (తొలి ఇన్నింగ్స్లో 4, రెండో ఇన్నింగ్స్లో 5) పడగొట్టాడు. కాగా, తొలి టెస్ట్లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
PAK Vs WI: చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. 21వ శతాబ్దంలో పాక్ గడ్డపై తొలి విజయం
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన రెండో టెస్ట్లో వెస్టిండీస్ 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. ఈ విజయం విండీస్ క్రికెట్ చరిత్రలో చారిత్రక విజయం. 21వ శతాబ్దంలో పాక్ గడ్డపై ఆ జట్టుకు ఇది తొలి టెస్ట్ విజయం. విండీస్ చివరిసారి 1990లో పాకిస్తాన్ గడ్డపై టెస్ట్ విజయం సాధించింది. మళ్లీ 35 ఏళ్ల తర్వాత విండీస్ పాక్ను వారి సొంతగడ్డపై మట్టికరిపించింది.మ్యాచ్ విషయానికొస్తే.. 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ 133 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. స్పిన్నర్లు గోమెల్ వార్రికన్ (5/27), కెవిన్ సింక్లెయిర్ (3/61), గుడకేశ్ మోటీ (2/35) పాకిస్తాన్ పతనాన్ని శాశించారు. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్లో బాబర్ ఆజమ్ చేసిన 31 పరుగులే అత్యధికం కాగా.. మొహమ్మద్ రిజ్వాన్ (25), కమ్రాన్ గులామ్ (19), సౌద్ షకీల్ (13), సల్మాన్ అఘా (15) రెండంకెల స్కోర్లు చేశారు. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 76 పరుగులుగా ఉండింది. మూడో రోజు ఆట తొలి సెషన్లోనే పాక్ మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. విండీస్ స్పిన్నర్లు పాక్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు.అంతకుముందు విండీస్ రెండో ఇన్నింగ్స్లో 244 పరుగులకు ఆలౌటైంది. బ్రాత్వైట్ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గుడకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.తొలి రోజు ఆటలోనే ఇరు జట్లు తమతమ తొలి ఇన్నింగ్స్లను ముగించాయి. బౌలర్లు.. ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగడంతో మొదటి రోజు 20 వికెట్లు నేలకూలాయి. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 163 పరుగులకే ఆలౌట్ కాగా.. పాకిస్తాన్ 154 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో పాక్ స్పిన్నర్ నౌమన్ అలీ హ్యాట్రిక్ (తొలి ఇన్నింగ్స్లో) సహా 10 వికెట్లు తీయగా.. విండీస్ స్పిన్నర్ వార్రికన్ 9 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ మొత్తంలో పేసర్లకు నాలుగు వికెట్లు మాత్రమే దక్కాయి. మిగతా 36 వికెట్లను ఇరు జట్ల స్పిన్నర్లు షేర్ చేసుకున్నారు. రెండు టెస్ట్ మ్యాచ్ల్లో కలిపి 19 వికెట్లు పడగొట్టిన విండీస స్పిన్నర్ జోమెల్ వార్రికన్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. రెండో టెస్ట్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసినందుకు గానూ వార్రికన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. కాగా, రెండు మ్యాచ్ ఈ సిరీస్లోని తొలి టెస్ట్లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో గెలుపొందింది. -
కొనసాగుతున్న బాబర్ ఆజమ్ వైఫల్యాల పరంపర.. 61 ఇన్నింగ్స్లుగా ఒక్క సెంచరీ లేదు..!
అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. మూడు ఫార్మాట్లలో బాబర్ సెంచరీ చేసి 61 ఇన్నింగ్స్లు అవుతుంది. ఇన్ని ఇన్నింగ్స్లుగా సెంచరీ చేయని తొలి టాపార్డర్ బ్యాటర్గా బాబర్ అప్రతిష్ఠ మూటగట్టుకున్నాడు.గత 10 టెస్ట్ ఇన్నింగ్స్ల్లో బాబర్ స్కోర్లు..31(67)1(5)5(11)8(20)5(18)30(71)11(18)31(77)22(50)0(2)ముల్తాన్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లోనూ బాబర్ విఫలమయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో బాబర్ 31 పరుగులు చేసి రెండో రోజు ఆట ముగియడానికి కొద్ది నిమిషాల ముందు నిష్క్రమించాడు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ కష్టాల్లో ఉంది. 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో పాక్ గెలవాలంటే ఇంకా 178 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు మాత్రమే ఉన్నాయి. సౌద్ షకీల్ (13), కషిఫ్ అలీ (1) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు విండీస్ రెండో ఇన్నింగ్స్లో 244 పరుగులకు ఆలౌటైంది. బ్రాత్వైట్ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గుడకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.తొలి రోజు ఆటలో ఇరు జట్లు తమతమ ఇన్నింగ్స్లను ముగించాయి. బౌలర్లు.. ముఖ్యంగా స్పిన్నర్లు చెలరేగడంతో మొదటి రోజు 20 వికెట్లు నేలకూలాయి. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 163 పరుగులకే ఆలౌట్ కాగా.. పాకిస్తాన్ 154 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో పాక్ స్పిన్నర్ నౌమన్ అలీ హ్యాట్రిక్ సహా 10 వికెట్లు తీశాడు. -
PAK VS WI 2nd Test: టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో తొలి రోజు ఏకంగా 20 వికెట్లు పడ్డాయి. ఆసియా ఖండంలో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు 20 వికెట్లు పడటం ఇదే మొదటిసారి. గతంలో ఎన్నడూ ఆసియా పిచ్లపై తొలి రోజే 20 వికెట్లు పడలేదు. తొలి రోజు పడిన వికెట్లలో 16 స్సిన్నర్లకు దక్కగా.. 4 పేస్ బౌలర్లు పడగొట్టారు.ఈ మ్యాచ్ తొలి రోజు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 163 పరుగులకు ఆలౌటైంది. నౌమన్ అలీ హ్యాట్రిక్ సహా ఆరు వికెట్లు పడగొట్టి విండీస్ నడ్డి విరిచాడు. సాజిద్ ఖాన్ 2, అబ్రార్ అహ్మద్, కషిఫ్ అలీ తలో వికెట్ తీశారు. విండీస్ ఇన్నింగ్స్లో చివరి ముగ్గురు ఆటగాళ్లు గడకేశ్ మోటీ (55), కీమర్ రోచ్ (25), గోమెల్ వార్రికన్ (36 నాటౌట్), కవెమ్ హాడ్జ్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం బరిలోకి దిగిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 154 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ ఇన్నింగ్స్ను నేలమట్టం చేశారు. గోమెల్ వార్రికన్ 4, గుడకేశ్ మోటీ 3, కీమర్ రోచ్ 2 వికెట్లు పడగొట్టారు. పాక్ ఇన్నింగ్స్లో మహ్మద్ రిజ్వాన్ (49) టాప్ స్కోరర్గా నిలిచాడు. సౌద్ షకీల్ 32 పరుగులు చేశాడు. షాన్ మసూద్ 15, ముహమ్మద్ హురైరా 9, బాబర్ ఆజమ్ 1, కమ్రాన్ గులామ్ 16, సల్మాన్ అఘా 9, నౌమన్ అలీ 0, సాజిద్ ఖాన్ 16 (నాటౌట్), అబ్రార్ అహ్మద్ 2, కషిఫ్ అలీ డకౌటయ్యారు.9 పరుగుల లీడ్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ 244 పరుగులకు ఆలౌటైంది. విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ బ్రాత్వైట్ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గుడకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (2), ముహమ్మద్ హురైరా (2), కమ్రాన్ గులామ్ (19) నిరాశపరచగా.. బాబర్ ఆజమ్ (31) మరోసారి లభించిన శుభారంభాన్ని భారీ స్కోర్గా మలచలేకపోయాడు.సౌద్ షకీల్ (13)తో పాటు కషిఫ్ అలీ (1) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో పాక్ గెలవాలంటే మరో 178 పరుగులు చేయాలి. విండీస్ బౌలర్లలో కెవిన్ సింక్లెయిర్ రెండు వికెట్లు పడగొట్టగా.. గుడకేశ్ మోటీ, జోమెల్ వార్రికన్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో పాక్ తొలి టెస్ట్లో 127 పరుగుల తేడాతో నెగ్గింది. -
పాకిస్తాన్ విజయ లక్ష్యం 254
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 244 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో లభించిన 9 పరుగుల లీడ్ కలుపుకుని విండీస్ పాకిస్తాన్ ముందు 255 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. విండీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ బ్రాత్వైట్ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గుడకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 154 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ ఇన్నింగ్స్ను నేలమట్టం చేశారు. గోమెల్ వార్రకన్ 4, గుడకేశ్ మోటీ 3, కీమర్ రోచ్ 2 వికెట్లు పడగొట్టారు. పాక్ ఇన్నింగ్స్లో మహ్మద్ రిజ్వాన్ (49) టాప్ స్కోరర్గా నిలిచాడు. సౌద్ షకీల్ 32 పరుగులు చేశాడు. షాన్ మసూద్ 15, ముహమ్మద్ హురైరా 9, బాబర్ ఆజమ్ 1, కమ్రాన్ గులామ్ 16, సల్మాన్ అఘా 9, నౌమన్ అలీ 0, సాజిద్ ఖాన్ 16 (నాటౌట్), అబ్రార్ అహ్మద్ 2, కషిఫ్ అలీ డకౌటయ్యారు.విండీస్ పరువు కాపాడిన చివరి ముగ్గురు బ్యాటర్లుఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 163 పరుగులకు ఆలౌటైంది. 54 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన విండీస్ను చివరి ముగ్గురు బ్యాటర్లు ఆదుకున్నారు. గడకేశ్ మోటీ 55, కీమర్ రోచ్ 25, గోమెల్ వార్రికన్ 36 (నాటౌట్) పరుగులు చేశారు. నౌమన్ అలీ (6/41) విండీస్ను ఆరేశాడు. సాజిద్ ఖాన్ 2, అబ్రార్ అహ్మద్, కషిఫ్ అలీ తలో వికెట్ తీశారు.కష్టాల్లో పాక్255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ షాన్ మసూద్ (2), ముహమ్మద్ హురైరా (2), కమ్రాన్ గులామ్ (19) నిరాశపరిచారు. బాబర్ ఆజమ్ (26), సౌద్ షకీల్ (3) క్రీజ్లో ఉన్నారు. 17 ఓవర్ల అనంతరం పాక్ స్కోర్ 59/3గా ఉంది. ఈ మ్యాచ్లో పాక్ గెలవాలంటే మరో 195 పరుగులు చేయాలి. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ, కెవిన్ సింక్లెయిర్, జోమెల్ వార్రికన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో పాక్ తొలి టెస్ట్లో 127 పరుగుల తేడాతో నెగ్గింది. -
వెస్టిండీస్కు షాకిచ్చిన బంగ్లాదేశ్.. ఒకే ఒక విజయం దూరంలో..!
బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు వెస్టిండీస్కు షాకిచ్చింది. ఐసీసీ ఛాంపియన్షిప్లో భాగంగా జరిగిన వన్డే మ్యాచ్లో 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఏ ఫార్మాట్లో అయినా బంగ్లాదేశ్కు విండీస్పై ఇదే తొలి గెలుపు. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ వన్డే ప్రపంచ కప్కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ప్రపంచకప్కు అర్హత సాధించేందుకు బంగ్లాదేశ్ ఒకే ఒక మ్యాచ్ దూరంలో ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్ల మధ్య నిన్న (జనవరి 21) రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్కు ఊహించని పరాభవం ఎదురైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.5 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ నిగార్ సుల్తానా (68) బాధ్యతాయుతంగా ఆడి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. శోభన మోస్తరి (23), షోర్నా అక్తెర్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. వీరు మినహా బంగ్లా ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును దాటలేదు. ఫర్జానా హాక్ 18, ముర్షిదా ఖాతూన్ 12, షిర్మన్ అక్తెర్ 11, ఫహిమా ఖాతూన్ 4, రబేయా ఖాన్ 1, నహీదా అక్తెర్ పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో కరిష్మా రామ్హరాక్ 4 వికెట్లు తీయగా.. ఆలియా అలెన్ 3, డియాండ్రా డొట్టిన్, ఫ్రేసర్, అఫీ ఫ్లెచర్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ 35 ఓవర్లలో 124 పరుగులకే చాపచుట్టేసింది. బంగ్లా బౌలర్లు మరుఫా అక్తెర్ (8-0-35-2), నహీదా అక్తెర్ (10-0-31-3), రబేయా ఖాన్ (8-0-19-2), ఫహీమా ఖాతూన్ (5-0-17-2) రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. వీరి ధాటికి పటిష్టమైన విండీస్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలింది. విండీస్ ఇన్నింగ్స్లో షెర్మైన్ క్యాంప్బెల్ (28) టాప్ స్కోరర్గా నిలువగా.. కెప్టెన్ హేలీ మాథ్యూస్ (16), ఆలియా అలెన్ (15), చెర్రీ ఫ్రేసర్ (18 నాటౌట్), కరిష్మ రామ్హరాక్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ మూడు మ్యాచ్ల సిరీస్లో విండీస్ ఆధిక్యాన్ని తగ్గించింది. ప్రస్తుతం ఇరు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచాయి. తొలి వన్డేలో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను మట్టికరిపించింది. సిరీస్లో చివరిదైన, నిర్ణయాత్మకమైన మూడో వన్డే జనవరి 24న జరుగనుంది. -
WI Vs PAK: 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా.. బ్యాట్తో రికార్డు సృష్టించిన విండీస్ బౌలర్లు
148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ ఇన్నింగ్స్లో చివరి ముగ్గురు ఆటగాళ్లు.. తొలి ఎనిమిది మంది ఆటగాళ్ల కంటే ఎక్కువ స్కోర్ చేశారు. టెస్ట్ క్రికెట్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. పాకిస్తాన్తో తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్లో విండీస్ ప్లేయింగ్ ఎలెవెన్లోని చివరి ముగ్గురు ఆటగాళ్లు గుడకేశ్ మోటీ, జోమెల్ వార్రకన్, జేడెన్ సీల్స్ వరుసగా 19, 31 (నాటౌట్), జేడెన్ సీల్స్ 22 పరుగులు చేశారు. విండీస్ ఇన్నింగ్స్లో వీరికి మించి ఎవరూ స్కోర్ చేయలేదు. టాప్-8 బ్యాటర్స్లో అత్యధిక స్కోర్ 11 పరుగులు మాత్రమే. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్వైట్, ఎనిమిదో నంబర్ ఆటగాడు కెవిన్ సింక్లెయిర్ తలో 11 పరుగులు చేశారు. మిగతా ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.తొలి ఇన్నింగ్స్లో విండీస్ 66 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో చివరి ముగ్గురు బ్యాటర్లు ఓ మోస్తరు స్కోర్లు చేసి తమ జట్టును మూడంకెల స్కోర్ (137) దాటించారు.ఇక్కడ మరో ఆసక్తికర మరో విషయం ఏంటంటే.. విండీస్ తొలి ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్లుగా నిలిచిన చివరి ముగ్గురు రెండో ఇన్నింగ్స్లో ఖాతా కూడా తెరవలేకపోయారు. ఈ మ్యాచ్లో విండీస్ పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడినా విండీస్ బౌలర్లు బ్యాట్తో సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో విండీస్ చివరి ఇద్దరు ఆటగాళ్లు మరో రికార్డు నెలకొల్పారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో (ఓ ఇన్నింగ్స్లో) చివరి ఇద్దరు ఆటగాళ్లు (జోమెల్ వార్రకన్ (31 నాటౌట్), జేడెన్ సీల్స్ 22) టాప్ స్కోరర్లుగా నిలవడం ఇది మూడోసారి.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో విజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్లో పాక్ స్పిన్ త్రయం సాజిద్ ఖాన్ (9 వికెట్లు), నౌమన్ అలీ (6 వికెట్లు), అబ్రార్ అహ్మద్ (5 వికెట్లు) మొత్తం 20 వికెట్లు పడగొట్టింది. వెస్టిండీస్ రెండు ఇన్నింగ్స్ల్లో 137, 123 పరుగులకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్లో 230 పరుగులకు ఆలౌటైన పాక్.. సెకెండ్ ఇన్నింగ్స్లో 157 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో విండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్ 10 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో మరో రికార్డు కూడా నమోదైంది. పాక్ గడ్డపై అతి పొట్టి టెస్ట్ మ్యాచ్గా (బంతుల పరంగా) ఈ మ్యాచ్ రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్ కేవలం 1064 బంతుల్లోముగిసింది.ఓవరాల్గా టెస్ట్ క్రికెట్లో బంతుల పరంగా అతి త్వరగా ముగిసిన టెస్ట్ మ్యాచ్గా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్ 2023-24లో సౌతాఫ్రికాలోని కేప్టౌన్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
పాక్ గడ్డపై పొట్టి మ్యాచ్
పాకిస్తాన్, వెస్టిండీస్ జట్ల మధ్య ముల్తాన్ వేదికగా నిన్న (జనవరి 19) ముగిసిన టెస్ట్ మ్యాచ్ రికార్డుపుటల్లోకెక్కింది. ఈ మ్యాచ్ పాకిస్తాన్ గడ్డపై అత్యంత పొట్టి మ్యాచ్గా (బంతుల పరంగా) రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్ కేవలం 1064 బంతుల్లోనే ముగిసింది. పాకిస్తాన్ గడ్డపై అతి త్వరగా (బంతుల పరంగా) ముగిసిన టెస్ట్ మ్యాచ్ ఇదే. ఓవరాల్గా టెస్ట్ క్రికెట్లో బంతుల పరంగా అతి త్వరగా ముగిసిన టెస్ట్ మ్యాచ్గా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్ 2023-24లో సౌతాఫ్రికాలోని కేప్టౌన్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బంతుల పరంగా అతి వేగంగా ముగిసిన టెస్ట్ మ్యాచ్ల జాబితాలో తాజాగా ముగిసిన పాకిస్తాన్, వెస్టిండీస్ మ్యాచ్ 10వ స్థానంలో నిలిచింది.పాకిస్తాన్ గడ్డపై బంతుల పరంగా అతి పొట్టి టెస్ట్ మ్యాచ్లు..2025- పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్, ముల్తాన్ (1064 బంతుల్లో ముగిసింది)1990- పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్, ఫైసలాబాద్ (1080 బంతుల్లో)1986- పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్, లాహోర్ (1136)2001- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, ముల్తాన్ (1183)2024- పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్, రావల్పిండి (1233)బంతుల పరంగా అతి వేగంగా ముగిసిన టెస్ట్ మ్యాచ్లు..624- భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (2023,24, కేప్టౌన్)656- సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా (1931-32, మెల్బోర్న్)672- వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ (1934-35, బ్రిడ్జ్టౌన్)788- ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (1888, మాంచెస్టర్)842- భారత్ వర్సెస్ ఇంగ్లండ్ (2020-21, అహ్మదాబాద్)872- న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (1945-46, వెల్లింగ్టన్)893- పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (2002-03, షార్జా)920- శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా (2022, గాలే)1011- జింబాబ్వే వర్సెస్ న్యూజిలాండ్ (2005, హరారే)1064- పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ (2025, ముల్తాన్)ఔ1069- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ (2023-24, మీర్పూర్)1423- ఐర్లాండ్ వర్సెస్ జింబాబ్వే (2024, బెల్ఫాస్ట్)కాగా, ముల్తాన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్లో పాక్ స్పిన్ త్రయం సాజిద్ ఖాన్ (9 వికెట్లు), నౌమన్ అలీ (6 వికెట్లు), అబ్రార్ అహ్మద్ (5 వికెట్లు) 20 వికెట్లు పడగొట్టింది. వెస్టిండీస్ రెండు ఇన్నింగ్స్ల్లో 137, 123 పరుగులకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్లో 230 పరుగులకు ఆలౌటైన పాక్.. సెకెండ్ ఇన్నింగ్స్లో 157 పరుగులే చేయగలిగింది. ఈ మ్యాచ్లో విండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్ 10 వికెట్లు తీశాడు. -
అజేయ శతకంతో కదంతొక్కిన కెప్టెన్.. తొలి వన్డేలో బంగ్లాపై విండీస్ ఘన విజయం
ఐసీసీ ఛాంపియన్షిప్ 2025లో భాగంగా బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు వెస్టిండీస్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నాయి. వన్డే సిరీస్లో భాగంగా నిన్న (జనవరి 19) సెయింట్ కిట్స్లో తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆతిథ్య వెస్టిండీస్ పర్యాటక బంగ్లాదేశ్ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టి తమ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది.తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో షర్మిన్ అక్తర్ (42), ముర్షిదా ఖాతూన్ (40), శోభన మోస్తరీ (35), షోమా అక్తర్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఫర్జానా హక్ (10), కెప్టెన్ నిగర్ సుల్తానా (14), రబెయా ఖాన్ (1), నహిదా అక్తర్ (9), సుల్తానా ఖాతూన్ (2) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో డియాండ్రా డొట్టిన్ మూడు వికెట్లతో చెలరేగగా.. ఆలియా అలెన్, హేలీ మాథ్యూస్ తలో రెండు, అఫీ ఫ్లెచర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్ 31.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ అజేయ సెంచరీతో (93 బంతుల్లో 104 నాటౌట్; 16 ఫోర్లు) విండీస్ను విజయతీరాలకు చేర్చింది. క్యియానా జోసఫ్ (79 బంతుల్లో 70; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించింది. మాథ్యూస్, జోసఫ్ తొలి వికెట్కు రికార్డు స్థాయిలో 163 పరుగులు జోడించారు. వన్డౌన్లో వచ్చిన షెర్మైన్ క్యాంప్బెల్ 14 పరుగులతో అజేయంగా నిలిచింది. క్వియానా జోసఫ్ వికెట్ రిబేయా ఖాన్కు దక్కింది. ఈ గెలుపుతో విండీస్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మథ్య రెండో వన్డే జనవరి 21న జరుగనుంది. -
PAK vs WI: తిప్పేసిన పాకిస్తాన్
ముల్తాన్: సొంతగడ్డపై చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టు చక్కటి ప్రదర్శన కనబర్చింది. వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పూర్తిగా స్పిన్కు సహకరించేలా రూపొందించిన పిచ్పై... సాజిద్ ఖాన్, అబ్రార్ అహ్మద్, నోమాన్ అలీ కలిసి ప్రత్యర్థి 20 వికెట్లు పడగొట్టడం విశేషం.ఓవర్నైట్ స్కోరు 109/3తో ఆదివారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ జట్టు 46.4 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ షాన్ మసూద్ (52; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్కడే అర్ధశతకం సాధించగా... మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. మాజీ కెపె్టన్ బాబర్ ఆజమ్ (5), సౌద్ షకీల్ (2), మొహమ్మద్ రిజ్వాన్ (2), ఆఘా సల్మాన్ (14) ఒకరి వెంట ఒకరు పెవిలియన్ బాటపట్టారు. కరీబియన్ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ వారికన్ 7 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 93 పరుగులతో కలుపుకొని వెస్టిండీస్ ముందు 251 పరుగుల లక్ష్యం నిలిచింది. బంతి గింగిరాలు తిరుగుతున్న పిచ్పై వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్లో 36.3 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది. అలిక్ అథనాజె (68 బంతుల్లో 55; 7 ఫోర్లు) ఒక్కడే హాఫ్సెంచరీ చేయగా... మిగిలిన వాళ్లు నిరాశపరిచారు. పాక్ బౌలర్లలో ఆఫ్స్పిన్నర్ సాజిద్ ఖాన్ 5 వికెట్లు పడగొట్టగా... అబ్రార్ అహ్మద్ 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 9 వికెట్లు తీసిన సాజిద్ ఖాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం నుంచి ముల్తాన్లోనే రెండో టెస్టు ప్రారంభంకానుంది. -
రెచ్చిపోయిన స్పిన్నర్లు.. విండీస్ను చిత్తుగా ఓడించిన పాకిస్తాన్
ముల్తాన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ నిర్దేశించిన 251 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ చేతులెత్తేసింది. పాక్ స్పిన్నర్లు సాజిద్ ఖాన్ (15-3-50-5), అబ్రార్ అహ్మద్ (11.3-2-27-4), నౌమన్ అలీ (10-1-42-1) చెలరేగడంతో విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో 123 పరుగులకే కుప్పకూలింది. విండీస్ను గెలిపించేందుకు అలిక్ అథనాజ్ (55) విఫలయత్నం చేశాడు. విండీస్ ఇన్నింగ్స్లో క్రెయిగ్ బ్రాత్వైట్ (12), మికైల్ లూయిస్ (13), టెవిన్ ఇమ్లాచ్ (14), కెవిన్ సింక్లెయిర్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. కీసీ కార్తీ 6, జస్టిన్ గ్రీవ్స్ 9, కవెమ్ హాడ్జ్, మోటీ, వార్రికన్ డకౌటయ్యారు.ఏడేసిన వార్రికన్విండీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జోమెల్ వార్రకన్ (18-3-32-7) స్పిన్ మాయాజాలం దెబ్బకు పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో 157 పరుగులకే ఆలౌటైంది. గుడకేశ్ మోటీ ఓ వికెట్ తీయగా.. ఇద్దరు పాక్ ఆటగాళ్లు రనౌట్ అయ్యారు. పాక్ ఇన్నింగ్స్లో షాన్ మసూద్ (52) టాప్ స్కోరర్ కాగా.. ముహమ్మద్ హురైరా 29, బాబర్ ఆజమ్ 5, కమ్రాన్ గులామ్ 27, సౌద్ షకీల్ 2, మహ్మద్ రిజ్వాన్ 2, సల్మాన్ అఘా 14, నౌమన్ అలీ 9, సాజిద్ ఖాన్ 5, ఖుర్రమ్ షెహజాద్ డకౌటయ్యారు.పాక్ స్పిన్నర్ల మాయాజాలంఅంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 137 పరుగులకే కుప్పకూలింది. నౌమన్ అలీ (11-2-39-5), సాజిద్ ఖాన్ (12-0-65-4), అబ్రార్ అహ్మద్ (1.2-1-6-1) విండీస్ నడ్డి విరిచారు. విండీస్ ఇన్నింగ్స్లో 10, 11వ నంబర్ ఆటగాళ్లు వార్రికన్ (31 నాటౌట్), జేడన్ సీల్స్ (22) మాత్రమే 20కి పైగా పరుగులు చేశారు. బ్రాత్వైట్ (11), కెవిన్ సింక్లెయిర్ (11), మోటీ (19) రెండంకెల స్కోర్లు చేయగా.. మికైల్ లూయిస్ (1), కీసీ కార్తీ (0), కవెమ్ హాడ్జ్ (4), అలిక్ అథనాజ్ (6), జస్టిన్ గ్రీవ్స్ (4), టెవిన్ ఇమ్లాచ్ (6) సింగిల్ డిజిట్ స్కోర్లకే టపా కట్టేశారు.రాణించిన షకీల్, రిజ్వాన్ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 230 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (84), మహ్మద్ రిజ్వాన్ (71) అర్ద సెంచరీలు సాధించి పాక్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. పాక్ తొలి ఇన్నింగ్స్లో షాన్ మసూద్ 11, ముహమ్మద్ హురైరా 6, బాబర్ ఆజమ్ 8, కమ్రాన్ గులామ్ 5, సల్మాన్ అఘా 2, నౌమన్ అలీ 0, సాజిద్ ఖాన్ 18, ఖుర్రమ్ షెహజాద్ 7 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో వార్రికన్, జేడన్ సీల్స్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. కెవిన్ సింక్లెయిర్ 2, మోటీ ఓ వికెట్ దక్కించుకున్నారు.ఈ గెలుపుతో రెండు మ్యాచ్ల సిరీస్లో పాక్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఇదే వేదికగా జనవరి 25 నుంచి ప్రారంభం కానుంది. -
టీ20 వరల్డ్కప్లో బోణీ కొట్టిన భారత్
అండర్-19 మహిళల టీ20 వరల్డ్కప్-2025లో భారత్ బోణీ కొట్టింది. కౌలాలంపూర్ వేదికగా వెస్టిండీస్తో ఇవాళ (జనవరి 19) జరిగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ను భారత బౌలర్లు 44 పరుగులకే (13.2 ఓవర్లలో) కుప్పకూల్చారు. పరుణిక సిసోడియా మూడు, ఆయుశి శుక్లా, జోషిత్ వీజే తలో రెండు వికెట్లు పడగొట్టారు. ముగ్గురు విండీస్ బ్యాటర్లు రనౌటయ్యారు. విండీస్ ఇన్నింగ్స్లో అసాబి ఖలందర్ (12), కేనిక కస్సార్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఏకంగా ఐదుగురు విండీస్ బ్యాటర్లు డకౌటయ్యారు.45 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ గొంగడి త్రిష 4 పరుగులు చేసి ఔట్ కాగా.. జి కమలిని (16), సనికా ఛల్కే (18) భారత్ను విజయతీరాలకు చేర్చారు. విండీస్ బౌలర్ క్లాక్స్టన్కు త్రిష వికెట్ దక్కింది. కాగా, ప్రస్తుత వరల్డ్కప్లో భారత్.. శ్రీలంక, మలేసియా, వెస్టిండీస్తో కలిసి గ్రూప్-ఏలో పోటీ పడుతుంది.గ్రూప్-ఏలో భాగంగా ఇవాళే మరో మ్యాచ్ జరిగింది. మలేసియాపై శ్రీలంక 139 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో దహామి సనేత్మ (55) అర్ద సెంచరీతో రాణించింది. 163 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మలేసియా 23 పరుగులకే ఆలౌటైంది. మలేసియా ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. లంక బౌలర్లలో చమోది ప్రబోద (4-2-5-3) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు మూడు వికెట్లు తీసింది. ఈ టోర్నీలో భారత్ జనవరి 21న (మలేసియాతో) తమ తదుపరి మ్యాచ్ ఆడుతుంది. జనవరి 23న భారత్.. శ్రీలంకతో తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది. -
విండీస్ స్పిన్నర్ మాయాజాలం.. 157 పరుగులకే కుప్పకూలిన పాకిస్తాన్
పాకిస్తాన్, వెస్టిండీస్ జట్ల మధ్య ముల్తాన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. మూడో రోజు ఆట ప్రారంభించిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్లో 157 పరుగులకే కుప్పకూలింది. విండీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్ ఏడు వికెట్లు తీసి పాక్ను దెబ్బకొట్టాడు. మరో స్పిన్నర్ గుడకేశ్ మోటీ ఓ వికెట్ తీశాడు. పాక్ ఇన్నింగ్స్లో ఇద్దరు (షాన్ మసూద్, ఖుర్రమ్ షెహజాద్) రనౌట్ అయ్యారు. షాన్ మసూద్ 52, ముహమ్మద్ హురైరా 29, బాబర్ ఆజమ్ 5, కమ్రాన్ గులామ్ 27, సౌద్ షకీల్ 2, మహ్మద్ రిజ్వాన్ 2, సల్మాన్ అఘా 14, నౌమన్ అలీ 9, సాజిద్ ఖాన్ 5, ఖుర్రమ్ షెహజాద్ డకౌటయ్యారు.తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని కలుపుకుని పాక్ విండీస్ ముందు 251 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో విండీస్ సైతం తడబడుతుంది. ఆ జట్టు 9 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో విండీస్ గెలవాలంటే మరో 221 పరుగులు చేయాలి. చేతిలో ఎనిమిది వికెట్లు మాత్రమే ఉన్నాయి. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్(12), కీసీ కార్తీ (6) ఔట్ కాగా.. మికైల్ లూయిస్ (11), కవెమ్ హాడ్జ్ (0) క్రీజ్లో ఉన్నారు. సాజిద్ ఖాన్కు రెండు వికెట్లు దక్కాయి.అంతకుముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో 230 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్ (84), మహ్మద్ రిజ్వాన్ (71) అర్ద సెంచరీలు సాధించి పాక్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. పాక్ తొలి ఇన్నింగ్స్లో షాన్ మసూద్ 11, ముహమ్మద్ హురైరా 6, బాబర్ ఆజమ్ 8, కమ్రాన్ గులామ్ 5, సల్మాన్ అఘా 2, నౌమన్ అలీ 0, సాజిద్ ఖాన్ 18, ఖుర్రమ్ షెహజాద్ 7 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో వార్రికన్, జేడన్ సీల్స్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. కెవిన్ సింక్లెయిర్ 2, మోటీ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 137 పరుగులకే కుప్పకూలింది. పాక్ స్పిన్నర్లు నౌమన్ అలీ (11-2-39-5), సాజిద్ ఖాన్ (12-0-65-4), అబ్రార్ అహ్మద్ (1.2-1-6-1) విండీస్ నడ్డి విరిచారు. విండీస్ ఇన్నింగ్స్లో 10, 11వ నంబర్ ఆటగాళ్లు వార్రికన్ (31 నాటౌట్), జేడన్ సీల్స్ (22) మాత్రమే 20కి పైగా పరుగులు చేశారు. వీరిద్దరు చివరి వికెట్కు 46 పరుగులు జోడించి విండీస్ పరువు కాపాడారు. లేకపోతే విండీస్ 100లోపే ఆలౌటయ్యేది. విండీస్ ఇన్నింగ్స్లో వీరితో పాటు బ్రాత్వైట్ (11), కెవిన్ సింక్లెయిర్ (11), మోటీ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మికైల్ లూయిస్ 1, కీసీ కార్తీ 0, కవెమ్ హాడ్జ్ 4, అలిక్ అథనాజ్ 6, జస్టిన్ గ్రీవ్స్ 4, టెవిన్ ఇమ్లాచ్ 6 పరుగులు చేశారు. -
యువ సమరం... నేడే ఆరంభం
రెండేళ్ల క్రితం నిర్వహించిన ఐసీసీ మహిళల అండర్–19 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన యువ భారత్... ట్రోఫీ నిలబెట్టుకునేందుకు సిద్ధమైంది. మహిళల క్రికెట్కు మరింత తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి నేటి నుంచి తెరలేవనుండగా... రేపు జరగనున్న తొలి పోరులో వెస్టిండీస్తో యువ భారత్ తలపడనుంది. షఫాలీ వర్మ, రిచా ఘోష్ వంటి సీనియర్ స్థాయిలో ఆడిన ప్లేయర్లతో బరిలోకి దిగి తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన భారత్... ఈసారి కూడా ఆధిపత్యం కొనసాగించాలని చూస్తుంటే... తొలిసారి ట్రోఫీ చేజిక్కించుకోవాలని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా తహతహలాడుతున్నాయి. 2023 వరల్డ్కప్ జట్టులోనూ ఆడిన తెలుగు ప్లేయర్లు గొంగడి త్రిష, షబ్నమ్లపై ఈసారీ భారీ అంచనాలు ఉన్నాయి. మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఈరోజు జరిగే ఆరు మ్యాచ్ల్లో స్కాటాండ్తో ఆస్ట్రేలియా (ఉదయం గం. 8 నుంచి); ఐర్లాండ్తో ఇంగ్లండ్ (ఉదయం గం. 8 నుంచి); సమోవాతో నైజీరియా (ఉదయం గం. 8 నుంచి); నేపాల్తో బంగ్లాదేశ్ (ఉదయం గం. 8 నుంచి); అమెరికాతో పాకిస్తాన్ (మధ్యాహ్నం గం. 12 నుంచి); దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ (మధ్యాహ్నం గం. 12 నుంచి) తలపడతాయి. కౌలాలంపూర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ రెండో ఎడిషన్కు రంగం సిద్ధమైంది. మొత్తం 16 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్కు శనివారం తెరలేవనుంది. 2023లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి వరల్డ్కప్లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన భారత జట్టు ట్రోఫీ కైవసం చేసుకోగా... ఈసారి డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతున్న యంగ్ ఇండియా టైటిల్ నిలబెట్టుకుంటుందా చూడాలి. ఫార్మాట్ ఎలా ఉందంటే... మొత్తం 16 జట్లను 4 గ్రూప్లుగా విభజించారు. వెస్టిండీస్, శ్రీలంక, ఆతిథ్య మలేసియాతో కలిసి భారత జట్టు గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనుంది. ఒక్కో గ్రూప్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు (12) ‘సూపర్ సిక్స్’ దశకు చేరుకుంటాయి. ఈ 12 జట్లను ‘సూపర్ సిక్స్’లో రెండు గ్రూప్లుగా విభజిస్తారు. గ్రూప్–1లో ఆరు జట్లు... గ్రూప్–2లో మరో ఆరు జట్లు ఉంటాయి. ‘సూపర్ సిక్స్’ మ్యాచ్లు ముగిశాక గ్రూప్–1, గ్రూప్–2లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. సీనియర్ జట్టులోకి దారి... సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న ప్లేయర్లు ఈ టోర్నీలో రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నారు. గత ఎడిషన్ ఫైనల్లో ఇంగ్లండ్పై గెలిచిన షఫాలీ వర్మ సారథ్యంలోని టీమిండియా... ఈసారి కూడా అదే ఆధిపత్యం కనబర్చాలని చూస్తోంది. 2023 అండర్–19 ప్రపంచకప్లో రాణించడం ద్వారా టిటాస్ సాధు, శ్వేత సెహ్రావత్... ఆ తర్వాతి కాలంలో భారత మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అదే బాటలో పయనించి మెరుగైన ప్రదర్శనతో ఈ ఏడాది భారత్లో జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలని యంగ్ ప్లేయర్లు కసరత్తులు చేస్తున్నారు. త్రిష రెండోసారి... గత ప్రపంచకప్ ఫైనల్లో భారత్ తరఫున అత్యధిక స్కోరర్గా నిలిచిన హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిష వరుసగా రెండోసారి ఈ మెగా టోర్నీలో ఆడనుంది. గత నెల మహిళల అండర్–19 ఆసియాకప్లో భారత జట్టు విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన త్రిష... ఈసారి కూడా మెరుగైన ప్రదర్శన చేసి సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా సాగుతోంది. శనివారం స్కాట్లాండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్తో టోర్నీకి తెరలేవనుండగా... ఆదివారం జరగనున్న తమ తొలి పోరులో వెస్టిండీస్తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. సమోవా, నైజీరియా, నేపాల్, మలేసియా జట్లు తొలిసారి ఐసీసీ టోర్నీలో ఆడనున్నాయి. ఈ టోర్నీలో ప్రధానంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల నుంచి యంగ్ ఇండియాకు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఇటీవల ఆసియాకప్ నెగ్గి మంచి జోరుమీదున్న అమ్మాయిలు కలసి కట్టుగా కదంతొక్కితే టైటిల్ నిలబెట్టుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. భారత మహిళల అండర్–19 టి20 క్రికెట్ జట్టు: నికీ ప్రసాద్ (కెప్టెన్), సానిక చల్కె, త్రిష, కమలిని, భవిక అహిరె, ఐశ్వరి అవసారె, మిథిలా, జోషిత, సోనమ్, పరుణిక, కేసరి ధ్రుతి, ఆయుషి శుక్లా, అనందిత, షబ్నమ్, వైష్ణవి. -
నేటి నుంచి పాక్, విండీస్ తొలి టెస్టు
ముల్తాన్: పాకిస్తాన్ పర్యటనలో వెస్టిండీస్ రెండు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. నేటి నుంచి ముల్తాన్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. స్పిన్ ట్రాక్పై కరీబియన్ను ఎదుర్కోనేందుకు ఆతిథ్య జట్టు కసరత్తు చేస్తోంది. ఇంగ్లండ్తో గత అక్టోబర్లో వాడిన స్పిన్ పిచ్నే ఈ మ్యాచ్కు సిద్ధం చేశారు. అప్పుడు సాజిద్ ఖాన్, నోమన్ అలీ తిప్పేశారు. ఈ తాజా సిరీస్లోనూ వాళ్లిద్దరిపై పాకిస్తాన్ గంపెడాశలు పెట్టుకుంది. సొంతగడ్డ అనుకూలతలతో వెస్టిండీస్తో తలపడతామని పాక్ కెప్టెన్ షాన్ మసూద్ చెప్పాడు. స్వదేశంలో 2–1తో ఇంగ్లండ్ను ఓడించిన పాక్... దక్షిణాఫ్రికా పర్యటనలో 0–2తో ఓడిపోయింది. అయితే మరోవైపు వెస్టిండీస్ ఈ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) రెండేళ్ల సైకిల్లో అసలు ఒక్క సిరీస్ కూడా గెలుపొందలేకపోయింది. భారత్ సహా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల చేతిలో ఓడిన విండీస్... గట్టి ప్రత్యర్థి ఆస్ట్రేలియాను 1–1తో డ్రాతో నిలువరించింది. కానీ బంగ్లాదేశ్తో కూడా 1–1తో సిరీస్ను ‘డ్రా’ చేసుకోవడంతో డబ్ల్యూటీసీలో కరీబియన్ జట్టు అట్టడుగున నిలిచింది. అయితే గత ఫలితాలతో సంబంధం లేకుండా ఈ డబ్ల్యూటీసీ సైకిల్ను విజయంతో ముగించేందుకే పాకిస్తాన్ పర్యటనకు వచ్చినట్లు వెస్టిండీస్ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్ చెప్పాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ప్రధాన వేదికలైన కరాచీ, లాహోర్లలో నవీకరణ పనులు జరుగుతుండటంతో రెండో టెస్టు కూడా ముల్తాన్లోనే ఈ నెల 25 నుంచి జరుగుతుంది. -
పాకిస్తాన్కు ఎదురుదెబ్బ
స్వదేశంలో వెస్డిండీస్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు పాకిస్తాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యువ వికెట్కీపర్ బ్యాటర్ హసీబుల్లా ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాక్టీస్ సెషన్స్ సందర్భంగా హసీబుల్లా ఖాన్ గాయపడినట్లు పాక్ మీడియా తెలిపింది. 21 ఏళ్ల హసీబుల్లా ఖాన్ విండీస్తో టెస్ట్ సిరీస్లో మహ్మద్ రిజ్వాన్తో పాటు వికెట్కీపర్ కమ్ బ్యాటర్గా ఎంపిక కావాల్సి ఉండింది. అయితే ఊహించని గాయం టెస్ట్ అరంగేట్రం చేయాలనుకున్న హసీబుల్లా ఆశలపై నీళ్లు చల్లింది. హసీబ్ గతేడాదే వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. హసీబ్ గాయపడటంతో విండీస్తో సిరీస్లో పాక్ రిజ్వాన్పైనే పూర్తిగా ఆధార పడాల్సి ఉంటుంది. విండీస్తో సిరీస్ కోసం పాక్ జట్టును త్వరలోనే ప్రకటిస్తారు.అందుబాటులో ఉండని స్టార్ బ్యాటర్పాక్ ఇటీవలే ఓ కీలక బ్యాటర్ సేవలు కోల్పోయింది. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ సందర్భంగా ఆ జట్టు స్టార్ ఓపెనర్ సైమ్ అయూబ్ తీవ్రంగా గాయపడ్డాడు. సైమ్కు ఆరు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. దీంతో సైమ్ విండీస్తో సిరీస్కు అందుబాటులో ఉండే అవకాశం లేదు.జనవరి 17 నుంచి ప్రారంభంవిండీస్తో తొలి టెస్ట్ జనవరి 17 నుంచి ప్రారంభమవుతుంది. ముల్తాన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. దీనికి ముందు విండీస్ పాక్-ఏతో రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ జనవరి 10, 11 తేదీల్లో జరుగుతుంది. జనవరి 25 నుంచి 29 తేదీల మధ్యలో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్కు కూడా ముల్తానే ఆతిథ్యమివ్వనుంది.18 ఏళ్ల విరామం తర్వాత..18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విండీస్ పాక్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడనుంది. దీంతో ఈ సిరీస్కు ప్రాధాన్యత సంతరించుకుంది.డబ్ల్యూటీసీ 2023-25లో చివరిదిపాకిస్తాన్ క్రికెట్ జట్టుకు విండీస్తో సిరీస్ డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో చివరిది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్, విండీస్ చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇరు జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి ఎప్పుడో బయటకు వచ్చాయి.కాగా, పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇటీవలే సౌతాఫ్రికా గడ్డపై ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను పాక్ 0-2 తేడాతో కోల్పోయింది.రెండు రోజుల వార్మప్ మ్యాచ్ కోసం పాక్-ఏ జట్టు..ఇమామ్ ఉల్ హాక్ (కెప్టెన్), మొహమ్మద్ హురైరా, ఒమైర్ యూసఫ్, అలీ జర్యాబ్, సాద్ ఖాన్, కషిఫ్ అలీ, మొహమ్మద్ సులేమాన్, హుసేన్ తలాత్, హసీబుల్లా ఖాన్ (వికెట్కీపర్), రొహైల్ నజీర్ (వికెట్కీపర్), ముహమ్మద్ మూసా, మొహమ్మద్ రమీజ్ జూనియర్పాకిస్తాన్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు వెస్టిండీస్ జట్టు..క్రెయిగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, మిఖైల్ లూయిస్, కీసీ కార్టీ, జస్టిన్ గ్రీవ్స్, గుడకేశ్ మోటీ, జాషువ డ సిల్వ, తెవిన్ ఇమ్లాచ్, అమిర్ జాంగూ, ఆండర్సన్ ఫిలిప్, జోమెల్ వార్రికన్, కెవిన్ సింక్లెయిర్, కీమర్ రోచ్, జేడెన్ సీల్స్ -
విండీస్ బౌలర్ చెత్త ప్రదర్శన.. ఒక్క బంతికి ఇన్ని పరుగులా..?
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024-25లో వెస్టిండీస్ బౌలర్ ఒషేన్ థామస్ చెత్త ప్రదర్శన చేశాడు. ఈ లీగ్లో ఖుల్నా టైగర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న థామస్.. చిట్టగాంగ్ కింగ్స్తో ఇవాళ (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్లో ఒక్క బంతికి ఏకంగా 15 పరుగులు సమర్పించుకున్నాడు. 15 runs off 1 ball! 😵💫Talk about an eventful way to start the innings! #BPLonFanCode pic.twitter.com/lTZcyVEBpd— FanCode (@FanCode) December 31, 2024ఛేదనలో ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన థామస్ వరుసగా N 0 N6 Wd Wd N4 0 0 N 2 W 0 పరుగులు సమర్పించుకున్నాడు. టీ20 క్రికెట్లో ఇదో చెత్త ప్రదర్శన. మొత్తంగా ఈ మ్యాచ్లో ఒకే ఓవర్ వేసిన థామస్ 18 పరుగులిచ్చి ఓ వికెట్ తీసుకున్నాడు. థామస్ ఓవర్లో 4 నో బాల్స్, 2 వైడ్లు ఉన్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరగుల భారీ స్కోర్ చేసింది. బొసిస్టో (50 బంతుల్లో 75 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), మహిదుల్ ఇస్లాం అంకోన్ (22 బంతుల్లో 59 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలతో రాణించారు. ఖుల్నా టైగర్స్ ఇన్నింగ్స్లో మొహమ్మద్ నయీమ్ 26, కెప్టెన్ మెహిది హసన్ మిరాజ్ 18, ఇబ్రహీం జద్రాన్ 6, అఫీఫ్ హొసేన్ 8 పరుగులు చేశారు. చిట్టగాంగ్ బౌలర్లలో అలిస్ అల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చిట్టగాంగ్ 18.5 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అబూ హైదర్ (3.5-0-44-4), మొహమ్మద్ నవాజ్ (3-0-13-2) చిట్టగాంగ్ టైగర్స్ను దెబ్బకొట్టారు. ఒషేన్ థామస్, హసన్ మహమూద్, నసుమ్ అహ్మద్, మెహిది హసన్ మిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. చిట్టగాంగ్ ఇన్నింగ్స్లో షమీమ్ హొసేన్ (38 బంతుల్లో 78; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. షమీమ్ ఒంటరిగా పోరాడి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. షమీమ్ మినహా చిట్టగాంగ్ ఇన్నింగ్స్లో నయీమ్ ఇస్లాం (12), పర్వేజ్ హొసేన్ ఎమోన్ (13), ఉస్మాన్ ఖాన్ (18), ఖలీద్ అహ్మద్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. 162 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్
వెస్టిండీస్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్.. భారత బౌలర్ల ధాటికి 38.5 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ ఆరు వికెట్లతో విజృంభించగా.. రేణుకా ఠాకూర్ నాలుగు వికెట్లు నేలకూల్చింది.నిప్పులు చెరిగిన రేణుకాఇన్నింగ్స్ ఆరంభంలో టీమిండియా పేసర్ రేణుకా సింగ్ నిప్పులు చెరిగింది. తొలి బంతికే ఓపెనర్ క్వియానా జోసఫ్ను ఔట్ చేసిన రేణుకా.. అదే ఓవర్ చివరి బంతికి మరో ఓపెనర్, కెప్టెన్ హేలీ మాథ్యూస్ను క్లీన్ బౌల్డ్ చేసింది. అనంతరం రేణుకా ఐదో ఓవర్లో మరో వికెట్ పడగొట్టింది. ఈసారి ఆమె స్టార్ ప్లేయర్ డియాండ్రా డొట్టిన్ను క్లీన్ బౌల్డ్ చేసింది. దీంతో వెస్టిండీస్ 9 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.దీప్తి శర్మ మాయాజాలంవిండీస్ పతనానికి రేణుకా సింగ్ పునాది వేయగా.. ఆతర్వాత పనిని దీప్తి శర్మ పూర్తి చేసింది. దీప్తి ఏ దశలోనూ విండీస్ బ్యాటర్లను కుదురుకోనివ్వలేదు. మధ్యలో షెమెయిన్ క్యాంప్బెల్ (46), చిన్నెల్ హెన్రీ (61) నిలకడగా ఆడినప్పటికీ.. ఈ ఇద్దరిని దీప్తి స్వల్ప వ్యవధిలో పెవిలియన్కు పంపింది. విండీస్ ఇన్నింగ్స్లో క్యాంప్బెల్, హెన్రీతో పాటు ఆలియా అలెన్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.సిరీస్ సొంతంమూడు మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ను భారత్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి రెండు వన్డేల్లో భారత్ భారీ తేడాతో విండీస్ను చిత్తు చేసింది. ఈ రెండు వన్డేల్లో భారత్ భారీ స్కోర్లు నమోదు చేసింది. వన్డే సిరీస్కు ముందు జరిగిన టీ20 సిరీస్ను సైతం భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. -
క్లీన్స్వీప్ ఖాయమేనా!
వడోదర: అద్భుతమైన ఆటతీరుతో ప్రత్యర్థిని చిత్తు చేస్తున్న భారత మహిళల జట్టు ఇప్పుడు క్లీన్స్వీప్ లక్ష్యంగా ఆఖరి పోరుకు సిద్ధమైంది. అచ్చొచ్చిన వడోదర పిచ్పై నేడు జరిగే మూడో వన్డేలో వెస్టిండీస్ను ‘ఢీ’కొట్టేందుకు సిద్ధమైంది. హర్మన్ప్రీత్ బృందం ఉన్న ప్రస్తుత ఫామ్ దృష్ట్యా 3–0తో సిరీస్ను ముగించడం ఏమంత కష్టం కానేకాదు. 217/4, 314/9, 358/5... ఆఖరి టి20 సహా, గత రెండు వన్డేల స్కోర్లివి. దుర్బేధ్యమైన టాపార్డర్ బ్యాటింగ్ లైనప్, నిప్పులు చెరుగుతున్న బౌలింగ్ కరీబియన్కు కష్టాలనే మిగిలిస్తున్నాయి. మరోవైపు రెండు పరిమిత ఓవర్ల సిరీస్లను సమర్పించుకున్న వెస్టిండీస్ ఇప్పుడు పరువు కోసం పాకులాడుతోంది. పర్యటనలో ఆఖరి పోరులో గెలిచి స్వదేశానికి విజయంతో పయనం కావాలని భావిస్తోంది. కానీ ఇదంతా సులభం కాదు. స్మృతిని ఆపేదెవరు? భారత ఓపెనర్ స్మృతి మంధాన జోరే జట్టుకు కొండంత బలంగా మారింది. గత ఐదు ఇన్నింగ్స్లలో వరుసగా 54, 62, 77, 91, 53... అర్ధసెంచరీలను అవలీలగా బాదేసింది. అసాధారణ ఫామ్లో ఉన్న స్మృతికి ఇప్పుడు టాపార్డర్లో ప్రతీక రావల్, హర్లీన్ డియోల్ జతవ్వడంతో విండీస్ బౌలింగ్ అదేపనిగా కుదేలవుతోంది. వీళ్లకు అడ్డుకట్ట వేయడం ఎలాగో తెలియక కరీబియన్ జట్టు సతమతమవుతోంది. అలాగని జెమీమా రోడ్రిగ్స్, కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్లు ఉన్న మిడిలార్డర్ తక్కువేం కాదు. ‘టాప్’ శుభారంభాల్ని భారీస్కోర్లుగా మలిచేయడంలో మిడిలార్డర్ పాత్ర చాలావుంది. ఇక బౌలింగ్ దళం కరీబియన్ల పాలిట సింహస్వప్నమవుతోంది. పేస్లో రేణుక, దీప్తిశర్మ, స్పిన్లో ప్రియా మిశ్రా నిలకడగా విండీస్ బ్యాటర్లకు ముందరికాళ్లకు ముందే బంధమేస్తున్నారు. ఇలాంటి ఆతిథ్య జట్టుకు చివరి వన్డేలో గెలుపు సాధ్యమే! కష్టాల్లో కరీబియన్ టీమ్ భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ మహిళల జట్టుకు వరుసగా తీవ్ర నిరాశ ఎదురవుతూనే ఉంది. టి20 సిరీస్లో ఒక మ్యాచ్ అయినా నెగ్గింది. ఇప్పుడు వన్డే సిరీస్లో ఆ ఫలితం కోసం పెద్ద పోరాటం చేసినా కూడా... ప్రస్తుత పరిస్థితుల్లో ఓదార్పు కష్టంగానే కనబడుతోంది. తొలివన్డేలో అయితే ఘోరంగా కుప్పకూలిన విండీస్ సేన గత మ్యాచ్లో మాత్రం భారత బౌలర్లను కాస్త ఢీకొట్టగలిగింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్, షెమైన్ క్యాంప్బెల్, జైదా జేమ్స్, అఫీ ఫ్లెచర్ నిలకడను ప్రదర్శించారు. అయితే ప్రత్యర్థి 300 పైచిలుకు చేసే స్కోర్లను కట్టడి చేసే బౌలర్లయితే లేరు. రెండు మ్యాచ్ల్ని పరిశీలిస్తే కాస్తో... కూస్తో... ప్రభావం చూపిన బౌలర్ దాదాపు లేదనే చెప్పొచ్చు. ఇలాంటి స్థితిలో ఉన్న హేలీ మాథ్యూస్ సేన 0–3ని తప్పించుకొని 1–2తో ముగించడం పెద్ద సవాలే! తుది జట్లు (అంచనా) భారత జట్టు: హర్మన్ప్రీత్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, ప్రతీక, హర్లీన్ డియోల్, జెమీమా, రిచా ఘోష్, దీప్తిశర్మ, టిటాస్ సాధు, రేణుక, ప్రియా మిశ్రా, సైమా ఠాకూర్. వెస్టిండీస్ జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్ ), క్వియాన, నెరిస్సా క్రాఫ్టన్, రషద విలియమ్స్, డియాండ్రా, షెమైన్, ఆలియా, జైదా జేమ్స్, అఫీ ఫ్లెచర్, కరిష్మా, షమీలియా కానెల్. -
రెండో వన్డేలో భారత్ ఘన విజయం
-
రికార్డు సృష్టించిన టీమిండియా
-
భారత మహిళల ‘రికార్డు’ విజయం
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు రికార్డు ప్రదర్శనతో వెస్టిండీస్తో జరిగిన టి20 సిరీస్ను సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్లో, ఆపై బౌలింగ్లో చెలరేగిన భారత్ 60 పరుగుల తేడాతో విండీస్ మహిళల జట్టుపై ఘన విజయం సాధించి మూడు మ్యాచ్ల సిరీస్ను 2–1తో గెలుచుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధాన (47 బంతుల్లో 77; 13 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ రిచా ఘోష్ (21 బంతుల్లో 54; 3 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ సెంచరీలతో చెలరేగగా... జెమీమా రోడ్రిగ్స్ (28 బంతుల్లో 39; 4 ఫోర్లు), రాఘ్వీ బిస్త్ (22 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు చేసింది. చినెల్ హెన్రీ (16 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా, రాధ యాదవ్కు 4 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య ఆదివారం వడోదరలో తొలి వన్డే జరుగుతుంది. మెరుపు బ్యాటింగ్... తొలి ఓవర్లోనే ఉమా ఛెత్రి (0) అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ పేలవంగా ఆరంభమైంది. అయితే ఆ తర్వాత స్మృతి, జెమీమా కలిసి విండీస్ బౌలర్లపై చెలరేగారు. హెన్రీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టిన స్మృతి... డాటిన్ వేసిన తర్వాతి ఓవర్లో 3 ఫోర్లు, 1 సిక్స్ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. కరిష్మా ఓవర్లో జెమీమా 3 ఫోర్లు సాధించడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 61 పరుగులకు చేరింది. 27 బంతుల్లో ఆమె అర్ధ సెంచరీ పూర్తయింది. రెండో వికెట్కు జెమీమాతో 98 పరుగులు (55 బంతుల్లో), మూడో వికెట్కు రాఘ్వీతో 44 పరుగులు (27 బంతుల్లో) జోడించిన తర్వాత స్మృతి వెనుదిరిగింది. అయితే ఆ తర్వాత వచి్చన రిచా విరుచుకుపడింది. తన తొలి మూడు బంతులనే 6, 4, 4గా మలచిన ఆమె హేలీ ఓవర్లో వరుసగా 2 సిక్స్లు బాదింది. అలీన్ బౌలింగ్లో మరో భారీ సిక్స్తో 18 బంతుల్లో రిచా రికార్డు హాఫ్ సెంచరీని అందుకుంది. ఛేదనలో విండీస్ బ్యాటర్లంతా తడబడ్డారు. అసాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒత్తిడికి గురై వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. హెన్రీ కొద్దిగా పోరాడటం మినహా మిగతా వారంతా విఫలం కావడంతో విజయానికి జట్టు చాలా దూరంలో నిలిచిపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) హెన్రీ (బి) డాటిన్ 77; ఉమా ఛెత్రి (సి) జోసెఫ్ (బి) హెన్రీ 0; జెమీమా (ఎల్బీ) (బి) ఫ్లెచర్ 39; రాఘ్వీ బిస్త్ (నాటౌట్) 31; రిచా ఘోష్ (సి) హెన్రీ (బి) అలీన్ 54; సజన (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–1, 2–99, 3–143, 4–213. బౌలింగ్: చినెల్ హెన్రీ 2–0–14–1, డాటిన్ 4–0–54–1, హేలీ మాథ్యూస్ 4–0–34–0, కరిష్మా 3–0–44–0, అలీన్ 4–0–45–1, ఫ్లెచర్ 3–0–24–1. వెస్టిండీస్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) సజన (బి) రాధ 22; ఖియానా జోసెఫ్ (సి) టిటాస్ సాధు (బి) సజన 11; డాటిన్ (సి) రాధ (బి) టిటాస్ సాధు 25; క్యాంప్బెల్ (సి) స్మృతి (బి) దీప్తి 17; చినెల్ హెన్రీ (సి) రాఘ్వీ (బి) రేణుక 43; క్రాఫ్టన్ (రనౌట్) 9; అలీన్ (బి) రాధ 6; షబిక (సి) సజన (బి) రాధ 3; జైదా (సి) రిచా (బి) రాధ 7; ఫ్లెచర్ (నాటౌట్) 5; కరిష్మా (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–20, 2–57, 3–62, 4–96, 5–129, 6–136, 7–137, 8–142, 9–147. బౌలింగ్: రేణుకా సింగ్ 3–0–16–1, సజీవన్ సజన 2–0–16–1, సైమా ఠాకూర్ 4–0–33–0, టిటాస్ సాధు 3–0–31–1, రాధ యాదవ్ 4–0–29–4, దీప్తి శర్మ 4–0–31–1. 217/4 అంతర్జాతీయ టి20ల్లో భారత మహిళల జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. ఇదే ఏడాది యూఏఈపై సాధించిన 201/5 స్కోరును భారత్ అధిగమించింది. 18 హాఫ్ సెంచరీకి రిచా తీసుకున్న బంతులు. సోఫీ డివైన్, లిచ్ఫీల్డ్ పేరిట వేగవంతమైన అర్ధసెంచరీ రికార్డును రిచా సమం చేసింది. 30 స్మృతి మంధాన అర్ధ సెంచరీల సంఖ్య. సుజీ బేట్స్ (29)ను అధిగమించి అగ్ర స్థానానికి చేరింది.763 ఈ ఏడాది అంతర్జాతీయ టి20ల్లో స్మృతి చేసిన పరుగులు. క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా చమరి అటపట్టు (720) రికార్డును స్మృతి సవరించింది. -
విండీస్ను వారి సొంతగడ్డపై చిత్తు చేసిన బంగ్లాదేశ్
వెస్టిండీస్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను బంగ్లాదేశ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. భారతకాలమానం ప్రకారం ఇవాళ (డిసెంబర్ 18) ఉదయం జరిగిన రెండో టీ20లో బంగ్లాదేశ్ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో షమీమ్ హొస్సేన్ (17 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. షమీమ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయుంటే బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైనా చేయలేకపోయేది. మెహిది హసన్ మిరాజ్ (26), జాకిర్ అలీ (21), మెహిది హసన్ (11), సౌమ్య సర్కార్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో మోటీ 2, అకీల్ హొసేన్, రోస్టన్ ఛేజ్, అల్జరీ జోసఫ్, ఓబెద్ మెక్కాయ్ తలో వికెట్ పడగొట్టారు.130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. బంగ్లా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 18.3 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. తస్కిన్ అహ్మద్ 3, మెహిది హసన్, తంజిమ్ హసన్ సకీబ్, రిషద్ హొసేన్ తలో 2, హసన్ మహమూద్ ఓ వికెట్ తీసి విండీస్ను దెబ్బకొట్టారు. బంగ్లా బౌలర్లు స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుని ఔరా అనిపించారు. విండీస్ ఇన్నింగ్స్లో రోస్టన్ ఛేజ్ (32), అకీల్ హొసేన్ (31), జాన్సన్ ఛార్లెస్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లాదేశ్కు వెస్టిండీస్పై ఆరేళ్ల తర్వాత తొలి సిరీస్ విజయం ఇది. బంగ్లాదేశ్ చివరిసారి 2018లో వెస్టిండీస్పై టీ20 సిరీస్ విక్టరీ సాధించింది. బంగ్లాదేశ్.. వెస్టిండీస్ను వారి సొంతగడ్డపై చిత్తు చేయడం విశేషం. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 డిసెంబర్ 19న జరుగనుంది. -
హేలీ మాథ్యూస్ మెరుపులు
ముంబై: వెస్టిండీస్తో గత టి20 మ్యాచ్ ప్రదర్శనను భారత మహిళలు పునరావృతం చేయలేకపోయారు. సమష్టి వైఫల్యంతో రెండో టి20 మ్యాచ్ను పర్యాటక జట్టుకు అప్పగించారు.మంగళవారం జరిగిన ఈ పోరులో విండీస్ మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. తాజా ఫలితంతో మూడు మ్యాచ్ల సిరీస్ 1–1తో సమం కాగా, చివరి టి20 రేపు జరుగుతుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా... వెస్టిండీస్ 15.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 160 పరుగులు చేసి విజయాన్నందుకుంది. భారత్ ఇన్నింగ్స్లో స్మృతి మంధాన (41 బంతుల్లో 62; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, వికెట్ కీపర్ రిచా ఘోష్ (17 బంతుల్లో 32; 6 ఫోర్లు) దూకుడుగా ఆడింది. స్మృతి ఇచ్చిన మూడు సునాయాస క్యాచ్లను (30, 40, 40 పరుగుల వద్ద) విండీస్ ఫీల్డర్లు వదిలేయడం కూడా ఆమెకు కలిసొచ్చింది. 37 బంతుల్లో ఆమె అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. అయితే మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో జట్టు భారీ స్కోరు సాధించలేకపోయింది. ఛేదనలో వెస్టిండీస్ కెపె్టన్ హేలీ మాథ్యూస్ (47 బంతుల్లో 85 నాటౌట్; 17 ఫోర్లు), ఖియానా జోసెఫ్ (22 బంతుల్లో 38; 6 ఫోర్లు, 2 సిక్స్లు) తొలి వికెట్కు 40 బంతుల్లోనే 66 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఖియానా వెనుదిరిగినా...మాథ్యూస్, షిమైన్ క్యాంప్బెల్ (26 బంతుల్లో 29 నాటౌట్; 4 ఫోర్లు) కలిసి జట్టును గెలిపించారు. వీరిద్దరు రెండో వికెట్కు అభేద్యంగా 55 బంతుల్లోనే 94 పరుగులు జత చేయడంతో మరో 26 బంతులు మిగిలి ఉండగానే విండీస్ విజయం ఖాయమైంది. మోకాలికి స్వల్ప గాయంతో బాధపడుతున్న కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ రెండో టి20కి దూరం కావడంతో స్మృతి సారథిగా వ్యవహరించింది. ఆమె స్థానంలో ఉత్తరాఖండ్కు చెందిన 20 ఏళ్ల రాఘ్వీ బిస్త్ ఈ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) ఫ్లెచర్ (బి) మాథ్యూస్ 62; ఉమా ఛెత్రి (బి) డాటిన్ 4; జెమీమా (ఎల్బీ) (బి) మాథ్యూస్ 13; రాఘ్వీ (ఎల్బీ) (బి) ఫ్లెచర్ 5; దీప్తి శర్మ (రనౌట్) 17; రిచా (సి) క్యాంప్బెల్ (బి) డాటిన్ 32; సజన (ఎల్బీ) (బి) ఫ్లెచర్ 2; రాధ (సి) డాటిన్ (బి) హెన్రీ 7; సైమా (సి) డాటిన్ (బి) హెన్రీ 6; టిటాస్ (నాటౌట్) 1; రేణుక (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–6, 2–35, 3–48, 4–104, 5–108, 6–113, 7–144, 8–149, 9–155. బౌలింగ్: చినెల్ హెన్రీ 4–0–37–2, డాటిన్ 4–0–14–2, హేలీ మాథ్యూస్ 4–0–36–2, కరిష్మా 3–0–19–0, ఫ్లెచర్ 3–0–28–2, అష్మిని 2–0–25–0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (నాటౌట్) 85; ఖియానా జోసెఫ్ (సి) రిచా (బి) సైమా 38; క్యాంప్బెల్ (నాటౌట్) 29; ఎక్స్ట్రాలు 8; మొత్తం (15.4 ఓవర్లలో వికెట్ నష్టానికి) 160. వికెట్ల పతనం: 1–66. బౌలింగ్: రేణుకా సింగ్ 3–0–29–0, టిటాస్ సాధు 2–0–32–0, దీప్తి శర్మ 3–0–26–0, సైమా ఠాకూర్ 3–0–28–1, రాధ యాదవ్ 2–0–27–0, సజీవన్ సజన 2.4–0–17–0. -
వెస్టిండీస్ ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్గా వరల్డ్కప్ విన్నర్..
వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్గా ఆ జట్టు మాజీ కెప్టెన్ డారెన్ సామీ ఎంపికయ్యాడు. మంగళవారం సెయింట్ విన్సెంట్లో జరిగిన విలేకరుల సమావేశంలో వెస్టిండీస్ (CWI) క్రికెట్ మైల్స్ డైరెక్టర్ బాస్కోంబ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం విండీస్ వైట్ బాల్ హెడ్ కోచ్గా సామీ.. ఏప్రిల్ 1, 2025 నుంచి టెస్టు జట్టు ప్రధాన కోచ్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ప్రస్తుత హెడ్ కోచ్ ఆండ్రీ కోలీ స్ధానాన్ని సామీ భర్తీ చేయనున్నాడు. ఆండ్రీ కోలీ కాంట్రాక్ట్ వచ్చే ఏడాది మార్చితో ముగయనుంది.కాగా సామీ సారథ్యంలోనే రెండు టీ20 వరల్డ్కప్(2012, 2016)లను వెస్టిండీస్ క్రికెట్ జట్టు సొంతం చేసుకుంది. కాగా వన్డే ప్రపంచకప్-2023కు ఆర్హత సాధించికపోవడంతో వెస్టిండీస్ క్రికెట్పై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో విండీస్ క్రికెట్ బోర్డు సామీని తమ జట్టు వైట్బాల్ హెడ్ కోచ్గా నియమించింది. విండీస్ వైట్బాల్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన తమ జట్టుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడి నేతృత్వంలో విండీస్ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది.చదవండి: శెభాష్.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం -
WI Vs BAN: వెస్టిండీస్పై చారిత్రక విజయం సాధించిన బంగ్లాదేశ్
వెస్టిండీస్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. కింగ్స్టౌన్ వేదికగా ఇవాళ (డిసెంబర్ 16) జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. విండీస్ గడ్డపై టీ20ల్లో బంగ్లాదేశ్కు ఇది తొలి విజయం. తద్వారా ఈ మ్యాచ్కు చారిత్రక గుర్తింపు దక్కింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. సౌమ్య సర్కార్ (43), జాకెర్ అలీ (27), మెహిది హసన్ (26 నాటౌట్), షమీమ్ హొసేన్ (27) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో అకీల్ హొసేన్, ఓబెద్ మెక్కాయ్ తలో రెండు వికెట్లు తీయగా.. రోస్టన్ ఛేజ్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ పడగొట్టారు.148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ 19.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. మెహిది హసన్ 4 వికెట్లు తీసి విండీస్ను దెబ్బకొట్టాడు. హసన్ మహహూద్, తస్కిన్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. తంజిమ్ హసన్, రిషద్ హొసేన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. రోవ్మన్ పావెల్ (60) విండీస్ను గెలిపించేందుకు చివరి వరకు ప్రయత్నం చేశాడు. విండీస్ ఇన్నింగ్స్లో రోవ్మన్ పావెల్తో పాటు రొమారియో షెపర్డ్ (22), జాన్సన్ ఛార్లెస్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లాదేశ్ వికెట్కీపర్ లిట్టన్ దాస్ ఐదుగురు విండీస్ బ్యాటర్లను ఔట్ చేయడంలో భాగమయ్యాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 డిసెంబర్ 17న జరుగనుంది.కాగా, టీ20 సిరీస్కు ముందు జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆతిథ్య వెస్టిండీస్ 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. -
మెరిసిన జెమీమా, స్మృతి
నవీ ముంబై: భారత మహిళల జట్టు చాన్నాళ్ల తర్వాత ఆల్రౌండ్ ప్రదర్శనతో చెప్పుకోదగ్గ విజయం సాధించింది. వెస్టిండీస్తో ఆదివారం జరిగిన తొలి టి20 మ్యాచ్లో టీమిండియా 49 పరుగుల తేడాతో వెస్టిండీస్పై నెగ్గింది. టాపార్డర్ బ్యాటర్లు స్మృతి మంధాన (33 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్స్లు), జెమీమా రోడ్రిగ్స్ (35 బంతుల్లో 73; 9 ఫోర్లు, 2 సిక్స్లు) దంచేయగా, బౌలింగ్లో టిటాస్ సాధు (3/37), దీప్తి శర్మ (2/21), రాధా యాదవ్ (2/28) కరీబియన్ జట్టును దెబ్బతీశారు. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఉమా ఛెత్రి (26 బంతుల్లో 24; 4 ఫోర్లు), రిచా ఘోష్ (14 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. కరిష్మా రమ్హార్యాక్ 2, డియాండ్ర డాటిన్ 1 వికెట్ తీశారు. అనంతరం వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులే చేసి ఓడింది. ఓపెనర్ కియానా జోసెఫ్ (33 బంతుల్లో 49; 5 ఫోర్లు, 3 సిక్స్లు), డియాండ్ర డాటిన్ (28 బంతుల్లో 52; 4 ఫోరు, 3 సిక్స్లు) రాణించారు. జెమీమాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మంగళవారం ఇదే వేదికపై రెండో టి20 మ్యాచ్ జరుగుతుంది. స్కోరు వివరాలు భారత మహిళల ఇన్నింగ్స్: స్మృతి (సి) కియానా (బి) కరిష్మా 54; ఉమా ఛెత్రి (బి) కరిష్మా 24; జెమీమా రోడ్రిగ్స్ (రనౌట్) 73; రిచా ఘోష్ (సి) మంగ్రూ (బి) డియాండ్ర 20; హర్మన్ప్రీత్ (నాటౌట్) 13; సజన (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 195. వికెట్ల పతనం: 1–50, 2–131, 3–155, 4–190. బౌలింగ్: చినెలీ హెన్రీ 2–0–17–0, జైదా జేమ్స్ 1–0–13–0, హేలీ 3–0–38–0, కరిష్మా 4–0–18–2, అఫీ ఫ్లెచర్ 3–0–39–0, డియాండ్ర 4–0–37–1, షమిలియా 1–0–11–0, కియానా జోసెఫ్ 2–0–22–0. వెస్టిండీస్ మహిళల ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) సబ్–మిన్నుమణి (బి) టిటాస్ 1; కియానా (సి) సైమా (బి) టిటాస్ 49; షెమైన్ (బి) దీప్తి శర్మ 13; డియాండ్ర (సి) రాధ (బి) టిటాస్ 52; చినెలీ హెన్రీ (సి) సబ్–మిన్నుమణి (బి) రాధ 7; షబిక (నాటౌట్) 15; అఫీ ఫ్లెచర్ (బి) దీప్తి శర్మ 0; జైదా (సి) ఉమా ఛెత్రి (బి) రాధ 5; మంగ్రూ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–2, 2–36, 3–80, 4–108, 5–126, 6–127, 7–140. బౌలింగ్: రేణుక 4–0– 25–0, టిటాస్ సాధు 4–0–37–3, దీప్తిశర్మ 4–0– 21–2, సైమా 4–0–35–0, రాధ 4–0–28–2.3622 అంతర్జాతీయ మహిళల టి20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్గా స్మృతి మంధాన గుర్తింపు పొందింది. ఇన్నాళ్లు హర్మన్ప్రీత్ (3589 పరుగులు) పేరిట ఉన్న రికార్డును స్మృతి సవరించింది. 117 అంతర్జాతీయ మహిళల టి20ల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ డియాండ్రా డాటిన్ (117) ఘనత సాధించింది. న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ (114) పేరిట ఉన్న రికార్డును డియాండ్రా బద్దలు కొట్టింది. -
విండీస్ పేసర్కు షాకిచ్చిన ఐసీసీ
వెస్టిండీస్ పేసర్ అల్జరీ జోసఫ్కు ఐసీసీ షాకిచ్చింది. డిసెంబర్ 8న బంగ్లాదేశ్తో జరిగిన వన్డే మ్యాచ్కు ముందు ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 1ని ఉల్లంఘించినందుకు గానూ జోసఫ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. అదనంగా జోసఫ్ యొక్క క్రమశిక్షణా రికార్డుకు ఒక డీమెరిట్ పాయింట్ జోడించబడింది. ఐసీసీ నివేదిక ప్రకారం.. మ్యాచ్ ప్రారంభానికి ముందు జోసఫ్ స్పైక్లతో పిచ్పై అడుగు పెట్టకుండా ఉండమని ఫోర్త్ అంపైర్ సూచించాడు. అయితే ఇది పట్టించుకోని జోసఫ్ స్పైక్లతో పిచ్పై అడుగుపెట్టడంతో పాటు అంపైర్ను అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ చర్య ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3ని ఉల్లంఘణ కిందకు వస్తుంది. జోసఫ్ తన నేరాన్ని అంగీకరించినట్లు మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో తెలిపాడు. జోసఫ్ గత 24 నెలల వ్యవధిలో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం ఇది రెండో సారి.ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేయగా.. వెస్టిండీస్ 47.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (113) మెరుపు శతకం బాది విండీస్ను గెలిపించాడు. ఈ సిరీస్లో రెండో వన్డే ఇవాళ (డిసెంబర్ 10) జరుగుతుంది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 5 ఓవర్లు పూర్తయ్యే సరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోయి 34 పరుగులు చేసింది. తంజిద్ హసన్(30), లిటన్ దాస్ (1) క్రీజ్లో ఉన్నారు. -
WI Vs BAN: రూథర్ ఫర్డ్ విధ్వంసం.. బంగ్లాను చిత్తు చేసిన వెస్టిండీస్
బంగ్లాదేశ్తో మూడు వన్డేల సిరీస్లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. సెయింట్ కిట్స్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. 295 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ 5 వికెట్లు కోల్పోయి 47.4 ఓవర్లలో చేధించింది. కరేబియన్ బ్యాటర్లలో షర్ఫెన్ రూథర్ఫర్డ్(113) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ షాయ్ హోప్(86) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లలో టాంజిమ్ హసన్, నహిద్ రానా, రిహద్ హోస్సేన్, మెహది హసన్ మిరాజ్, సౌమ్య సర్కార్ తలా వికెట్ సాధించారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్(74) టాప్ స్కోరర్గా నిలవగా.. టాంజిద్ హసన్(60), మహ్మదుల్లా(50), జకీర్ అలీ(48) రాణించారు. విండీస్ బౌలర్లలో షెపర్డ్ మూడు వికెట్లు పడగొట్టగా.. అల్జారీ జోషఫ్ రెండు, సీల్స్ ఒక్క వికెట్ సాధించారు.చదవండి: IND vs AUS: ట్రావిస్ హెడ్, సిరాజ్లకు షాక్ ఇవ్వనున్న ఐసీసీ!? -
విండీస్ ఆటగాళ్లకు జరిమానా
బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్ట్లో వెస్టిండీస్ 101 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను వెస్టిండీస్ ఆటగాళ్లు జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్లకు జరిమానా పడింది. సీల్స్ వికెట్ తీసిన ఆనందంలో బంగ్లా ఆటగాళ్ల పట్ల దూకుడుగా వ్యవహరించినందుకు గాను అతని మ్యాచ్ ఫీజ్లో 25 శాతం కోత విధించారు. అలాగే అతనికి ఒక డీమెరిట్ పాయింట్ కూడా లభించింది.ఆల్రౌండర్ కెవిన్ సింక్లెయిర్ ప్లేయింగ్ ఎలెవెన్లో లేకపోయినా, ప్రత్యామ్నాయ ఫీల్డర్గా వచ్చి స్లెడ్జింగ్కు పాల్పడ్డాడు. దీంతో అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పడింది. సింక్లెయిర్, సీల్స్ అంపైర్లు ఎన్ని సార్లు హెచ్చరించినా పట్టించుకోకుండా బంగ్లాదేశ్ ఆటగాళ్ల పట్ల దూకుడుగా వ్యవహరించారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సీల్స్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. ఈ ఇన్నింగ్స్లో అతను 15.5 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కాగా, రెండు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో వెస్టిండీస్ తొలి టెస్ట్లో నెగ్గగా.. బంగ్లాదేశ్ రెండో టెస్ట్లో విజయం సాధించింది. ఫలితంగా 1-1తో సిరీస్ సమంగా ముగిసింది. -
ఐదేసిన రాణా.. ఆధిక్యంలో బంగ్లాదేశ్
జమైకా వేదికగా వెస్టిండీస్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. ఈ మ్యాచ్లో తొలుత వెస్టిండీస్ ఆధిక్యం సాధించినట్లు కనిపించింది. అనంతరం బంగ్లా బౌలర్లు రెచ్చిపోవడం.. బ్యాటర్లు ఓ మోస్తరుగా రాణించడంతో మ్యాచ్పై వెస్టిండీస్ పట్టు కోల్పోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 211 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. మహ్మదుల్ హసన్ జాయ్ (0), షద్మాన్ ఇస్లాం (46), షహదత్ హొసేన్ దీపు (28), మెహిది హసన్ మిరాజ్ (42), లిటన్ దాస్ (25) ఔట్ కాగా.. జాకెర్ అలీ (29), తైజుల్ ఇస్లాం (9) క్రీజ్లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో షమార్ జోసఫ్ 2, అల్జరీ జోసఫ్, జేడన్ సీల్స్, జస్టిన్ గ్రీవ్స్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులకే ఆలౌటైంది. నహిద్ రాణా (5/61) దెబ్బకు విండీస్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. హసన్ మహమూద్ 2, తస్కిన్ అహ్మద్, తైజుల్ ఇస్లాం, మెహిది హసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. విండీస్ ఇన్నింగ్స్లో కీసీ కార్తీ (40), క్రెయిగ్ బ్రాత్వైట్ (39), మికైల్ లూయిస్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 164 పరుగులకు ఆలౌటైంది. జేడన్ సీల్స్ అద్భుతమైన స్పెల్తో (15.5-10-5-4) బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశాడు. షమార్ జోసఫ్ 3, కీమర్ రోచ్ 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు. బంగ్లా ఇన్నింగ్స్లో షద్మాన్ ఇస్లాం (64) టాప్ స్కోరర్గా నిలువగా.. మెహిది హసన్ (36), షహాదత్ హొసేన్ (22), తైజుల్ ఇస్లాం (16) రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, రెండు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో వెస్టిండీస్ తొలి మ్యాచ్లో 201 పరుగుల తేడాతో గెలుపొందింది. -
విండీస్తో వన్డే సిరీస్కు బంగ్లా జట్టు ప్రకటన.. కెప్టెన్గా మెహిది హసన్
వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టును ఇవాళ (డిసెంబర్ 2) ప్రకటించారు. రెగ్యులర్ కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ సిరీస్కు బంగ్లా కెప్టెన్గా మెహిది హసన్ మిరాజ్ వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్కు ముందు బంగ్లాదేశ్ జట్టును గాయాల సమస్య వేధిస్తుంది.సీనియర్ ఆటగాళ్లు ముష్ఫికర్ రహీం, తౌహిద్ హ్రిదోయ్ గాయాల కారణంగా ఈ సిరీస్కు దూరమయ్యారు. ఈ సిరీస్కు ముస్తాఫిజుర్ రహ్మాన్, జకీర్ హసన్ను ఎంపిక చేయలేదు. ముస్తాఫిజుర్ తన భార్య మొదటి బిడ్డకు జన్మనివ్వనుండటంతో స్వదేశానికి వెళ్లనున్నాడు. ఫామ్ లేమి కారణంగా జకీర్ హసన్ను ఈ సిరీస్కు ఎంపిక చేయలేదు. ఈ జట్టులో వికెట్కీపర్ బ్యాటర్ లిటన్ దాస్, పర్వేజ్ హొసేన్ ఎమోన్, అఫీఫ్ హొసేన్ ధృబో, హసన్ మహమూద్, తంజిమ్ హసన్ సకీబ్ చోటు దక్కించుకున్నారు. సీనియర్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ఈ సిరీస్కు దూరంగా ఉన్నాడు. విండీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ డిసెంబర్ 8, 10, 12 తేదీల్లో సెయింట్స్ కిట్స్ వేదికగా జరుగనుంది.విండీస్తో వన్డే సిరీస్కు బంగ్లాదేశ్ జట్టు..మెహిది హసన్ మిరాజ్ (కెప్టెన్), లిటన్ కుమార్ దాస్ (వికెట్కీపర్), తంజిద్ హసన్ తమీమ్, సౌమ్య సర్కార్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, మహముదుల్లా, జాకర్ అలీ అనిక్, అఫీఫ్ హొస్సేన్ ధృబో, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, షొరీఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సకిబ్, నహిద్ రాణా -
టెస్ట్ క్రికెట్లో విండీస్ బౌలర్ అద్భుతం.. గడిచిన 46 ఏళ్లలో..!
టెస్ట్ క్రికెట్లో విండీస్ బౌలర్ జేడన్ సీల్స్ అద్భుతం చేశాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో సీల్స్ 15.5 ఓవర్లలో 10 మెయిడిన్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. గడిచిన 46 ఏళ్లలో టెస్ట్ క్రికెట్లో ఇదే అత్యంత పొదుపైన స్పెల్గా రికార్డులు చెబుతున్నాయి. JAYDEN SEALES BOWLED THE MOST ECONOMICAL SPELL IN TEST CRICKET IN LAST 46 YEARS:15.5-10-5-4. 🤯pic.twitter.com/CYoA6ljM6Y— Mufaddal Vohra (@mufaddal_vohra) December 2, 2024ఈ ఇన్నింగ్స్లో సీల్స్ ఎకానమీ రేట్ 0.31గా ఉంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది ఏడో అత్యుత్తమ ఎకానమీ రేట్గా రికార్డుల్లోకెక్కింది. ఈ రికార్డును సాధించే క్రమంలో సీల్స్ దిగ్గజ బౌలర్ జిమ్ లేకర్ రికార్డును అధిగమించాడు. 1957లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో లేకర్ ఓవర్కు సగటున 0.37 పరగులిచ్చాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ సగటు భారత దిగ్గజ బౌలర్ బాపు నాదకర్ణి పేరిట ఉంది. నాదకర్ణి 1964లో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఓవర్కు సగటున 0.15 పరుగులిచ్చాడు. ఈ ఇన్నింగ్స్లో నాదకర్ణి 32 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. ఇందులో 27 మెయిడిన్లు ఉన్నాయి.ఆల్టైమ్ రికార్డుటెస్ట్ క్రికెట్లో సీల్స్ అత్యంత పొదుపైన నాలుగు వికెట్ల (15.5-10-5-4) ఘనత సాధించిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు పాక్కు చెందిన పర్వేజ్ సజ్జద్ పేరిట ఉండేది. 1965లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో సజ్జద్ 12 ఓవర్లలో 8 మెయిడిన్లు వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇన్నింగ్స్లో సజ్జద్ సగటు 0.41 కాగా.. బంగ్లాతో మ్యాచ్లో సీల్స్ సగటు 0.31గా ఉంది.ఉమేశ్ యాదవ్ రికార్డు బద్దలు కొట్టిన సీల్స్1978 నుంచి టెస్ట్ల్లో అత్యంత పొదుపైన సగటు భారత పేసర్ ఉమేశ్ యాదవ్ పేరిట ఉండేది. 2015లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఉమేశ్ 0.42 సగటున బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్లో 21 ఓవర్లు వేసిన ఉమేశ్ 9 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో 16 మెయిడిన్లు ఉన్నాయి. తాజాగా ఉమేశ్ రికార్డును సీల్స్ బద్దలు కొట్టాడు.కుప్పకూలిన బంగ్లాదేశ్జమైకా వేదికగా బంగ్లాదేశ్తో జరుగతున్న రెండో టెస్ట్లో వెస్టిండీస్ పట్టు సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 71.5 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. జేడన్ సీల్స్ 4, షమార్ జోసఫ్ 3, కీమర్ రోచ్ 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ తీసి బంగ్లా ఇన్నింగ్స్ను కుప్పకూల్చారు. బంగ్లా తరఫున షద్మాన్ ఇస్లాం (64), మెహిది హసన్ మిరాజ్ (36), షహాదత్ హొసేన్ దీపు (22), తైజుల్ ఇస్లాం (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. మికైల్ లూయిస్ 12 పరుగులు చేసి ఔట్ కాగా.. క్రెయిగ్ బ్రాత్వైట్ (33), కీసీ కార్తీ (19) క్రీజ్లో ఉన్నారు. లూయిస్ వికెట్ నహిద్ రాణాకు దక్కింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు విండీస్ ఇంకా 94 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, రెండు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో వెస్టిండీస్ తొలి మ్యాచ్లో 201 పరుగుల తేడాతో నెగ్గింది. -
WI Vs BAN: విండీస్తో తొలి టెస్ట్.. ఓటమి దిశగా బంగ్లాదేశ్
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ గెలవాలంటే మరో 225 పరుగుల చేయాలి. చేతిలో మరో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. చివరి రోజు ఆట మిగిలి ఉంది.పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 9 వికెట్ల నష్టానికి 450 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. జస్టిన్ గ్రీవ్స్ (115) అజేయ శతకంతో కదం తొక్కగా.. మికైల్ లూయిస్ (97), అలిక్ అథనాజ్ (90) తృటిలో సెంచరీలు చేజార్చుకున్నారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ 3, తస్కిన్ అహ్మద్, మెహిది హసన్ తలో 2, తైజుల్ ఇస్లాం ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. మొమినుల్ హక్ (50), జాకెర్ అలీ (53) అర్ద సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 3, జస్టిన్ గ్రీవ్స్, జేడెన్ సీల్స్ తలో 2, కీమర్ రోచ్, షమార్ జోసఫ్ చెరో వికెట్ పడగొట్టారు.181 పరుగుల ఆధిక్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో 152 పరుగులకు ఆలౌటైంది. తస్కిన్ అహ్మద్ (6/64) విండీస్ను దెబ్బకొట్టాడు. విండీస్ ఇన్నింగ్స్లో అలిక్ అథనాజ్ (42) టాప్ స్కోరర్గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని వెస్టిండీస్ బంగ్లాదేశ్ ముందు 334 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.ఛేదనలో (నాలుగో రోజు ఆట ముగిసే) బంగ్లాదేశ్ 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. జాకెర్ అలీ (15), హసన్ మహమూద్ (0) క్రీజ్లో ఉన్నారు. కీమర్ రోచ్, జేడెన్ సీల్స్ తలో మూడు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ను దెబ్బతీశారు. షమార్ జోసఫ్కు ఓ వికెట్ దక్కింది.కాగా, రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు వెస్టిండీస్లో పర్యటిస్తుంది. సిరీస్లో భాగంగా ప్రస్తుతం తొలి టెస్ట్ జరుగుతుంది. -
WI Vs BAN: విండీస్తో తొలి టెస్ట్.. వెనుకంజలో బంగ్లాదేశ్
విండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ వెనుకంజలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. బంగ్లా ఇన్నింగ్స్లో మొమినుల్ హక్ (50), జాకెర్ అలీ (53) అర్ద సెంచరీలతో రాణించగా.. మహ్మదుల్ హసన్ జాయ్ 5, జాకిర్ హసన్ 15, షహాదత్ హొసేన్ 18, లిటన్ దాస్ 40, మెహిది హసన్ మిరాజ్ 23, తైజుల్ ఇస్లాం 25, హసన్ మహమూద్ 8 పరుగులు చేశారు. తస్కిన్ అహ్మద్ 11, షొరీఫుల్ ఇస్లాం 5 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. జస్టిన్ గ్రీవ్స్, జేడన్ సీల్స్ తలో రెండు వికెట్లు.. కీమర్ రోచ్, షమార్ జోసఫ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 450 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. జస్టిన్ గ్రీవ్స్ అజేయ శతకంతో (115) కదంతొక్కగా.. ఓపెనర్ మికైల్ లూయిస్ మూడు పరుగుల తేడాతో.. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అలిక్ అథనాజ్ 10 పరుగుల తేడాతో సెంచరీలను చేజార్చుకున్నారు. ఆఖర్లో కీమర్ రోచ్ బంగ్లా బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. రోచ్ 144 బంతులు ఎదుర్కొని 47 పరుగులు చేశాడు.విండీస్ ఇన్నింగ్స్లో కవెమ్ హాడ్జ్ (25), జాషువ డసిల్వ (14), జడెన్ సీల్స్ (18), షమార్ జోసఫ్ (11 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ బ్రాత్వైట్ (4), అల్జరీ జోసఫ్ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కాగా.. కీసి కార్తీ డకౌటయ్యాడు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, మెహిది హసన్ మీరాజ్ తలో రెండు.. తైజుల్ ఇస్లాం ఓ వికెట్ దక్కించుకున్నారు.కాగా, రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు వెస్టిండీస్లో పర్యటిస్తుంది. సిరీస్లో భాగంగా ప్రస్తుతం తొలి టెస్ట్ జరుగుతుంది. -
గ్రీవ్స్ అజేయ సెంచరీ.. విండీస్ భారీ స్కోర్
బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. జస్టిన్ గ్రీవ్స్ అజేయ శతకంతో (115) కదంతొక్కాడు. ఓపెనర్ మికైల్ లూయిస్ (97) మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అలిక్ అథనాజ్ కూడా 10 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆఖర్లో కీమర్ రోచ్ బంగ్లా బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. రోచ్ 144 బంతులు ఎదుర్కొని 47 పరుగులు చేశాడు. విండీస్ ఇన్నింగ్స్లో కవెమ్ హాడ్జ్ (25), జాషువ డసిల్వ (14), జడెన్ సీల్స్ (18), షమార్ జోసఫ్ (11 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. కెప్టెన్ బ్రాత్వైట్ (4), అల్జరీ జోసఫ్ (4) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరమితం కాగా.. కీసి కార్తీ డకౌటయ్యాడు. 144.1 ఓవర్లలో విండీస్ 9 వికెట్ల నష్టానికి 450 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్, మెహిది హసన్ మీరాజ్ తలో రెండు.. తైజుల్ ఇస్లాం ఓ వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. మహ్మదుల్ హసన్ జాయ్ (5), జకీర్ హసన్ (15) ఔట్ కాగా.. మొమినుల్ హాక్ (7), షాహదత్ హొసేన్ దీపు (10) క్రీజ్లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్, అల్జరీ జోసఫ్కు తలో వికెట్ దక్కింది. కాగా, రెండు మ్యాచ్లో టెస్ట్ సిరీస్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్, 3 మ్యాచ్ల టీ20 సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు వెస్టిండీస్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం తొలి టెస్ట్ జరుగుతుంది. -
ఇంగ్లండ్, విండీస్ల ఆఖరి టి20 రద్దు
గ్రాస్ ఐలెట్ (సెయింట్ లూసియా): కరీబియన్ పర్యటనలో ఆఖరిదైన ఐదో టి20 రద్దవడంతో ఇంగ్లండ్ 3–1తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి జరగాల్సిన మ్యాచ్ సరిగ్గా ఐదు ఓవర్లు ముగిశాక వర్షంతో ఆగిపోయింది. అప్పటికే మ్యాచ్ నిలిచే సమయానికి మొదట బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 44 పరుగులు చేసింది. ఓపెనర్లు లూయిస్ (20 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్లు), షై హోప్ (10 బంతుల్లో 14 నాటౌట్, 3 ఫోర్లు) అజేయంగా ఉన్నారు. అయితే భారీ వర్షంతో అవుట్ ఫీల్డ్ అంతా చిత్తడిగా మారింది. తిరిగి ఆట నిర్వహించలేని పరిస్థితి తలెత్తడంతో ఫీల్డు అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ద్వైపాక్షిక సిరీస్లో మొదటి మూడు టి20ల్లో వరుసగా ఇంగ్లండే గెలిచి మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్ను నెగ్గింది. ఈ సిరీస్లో 9 వికెట్లు తీసిన ఇంగ్లండ్ సీమర్ సాకిబ్ మహ్మూద్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు అందుకున్నాడు. ఈ పర్యటనలో ముందు మూడు వన్డేల సిరీస్ను ఆతిథ్య వెస్టిండీస్ 2–1తో కైవసం చేసుకుంది. అయితే ఈ ద్వైపాక్షిక సిరీస్లో ఫలితాలు వచ్చిన ఈ ఏడు మ్యాచ్ల్లోనూ టాస్ నెగ్గి... ఫీల్డింగ్ ఎంచుకొని, లక్ష్యాన్ని -
వెస్టిండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ దూరం
బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ వెస్టిండీస్ ప్రకటించింది. ఈ జట్టుకు క్రైగ్ బ్రాత్వైట్ సారథ్యం వహించనున్నాడు. బ్రాత్వైట్ డిప్యూటీగా జాషువ డి సిల్వా ఎంపికయ్యాడు.అయితే ఈ సిరీస్కు స్టార్ ఆల్రౌండర్ జాసన్ హోల్డర్ భుజం గాయం కారణంగా దూరమయ్యాడు. గత కొంతకాలంగా హోల్డర్ భుజం గాయంతో బాధపడుతున్నాడు. బంగ్లా సిరీస్ సమయానికి కోలుకుంటాడని అంతా భావించారు. కానీ అతడు ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో సెలక్టర్లు జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోలేదు. మరోవైపు విండీస్ దేశీవాళీ టోర్నీ యునైటెడ్ సూపర్50 కప్లో మూడు సెంచరీలు సాధించిన జస్టిన్ గ్రీవ్స్కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. అదేవిధంగా స్పిన్నర్ కెవిన్ సింక్లైర్ కూడా జట్టులోకి వచ్చాడు. నవంబర్ 22 నుంచి ఆంటిగ్వా వేదికగా ఈ సిరీస్ ప్రారంభం కానుంది. విండీస్ ప్రస్తుతం స్వదేంలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడుతోంది.బంగ్లాతో టెస్టులకు విండీస్ జట్టు: క్రైగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), జాషువా డా సిల్వా (వైస్ కెప్టెన్), అలిక్ అథానాజ్, కీసీ కార్టీ, జస్టిన్ గ్రీవ్స్, కవెమ్ హాడ్జ్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, మికిల్ లూయిస్, అండర్సన్ ఫిలిప్, కెమర్ రోచ్, జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, జోమెల్, జోమెల్ వారికన్ చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు -
వచ్చే నెలలో విండీస్తో భారత మహిళల జట్టు సిరీస్
ముంబై: వచ్చే నెలలో భారత మహిళల క్రికెట్ జట్టు వెస్టిండీస్తో 3 వన్డేలు, 3 టి20లు ఆడనుంది. దాంతో పాటు జనవరిలో స్వదేశంలో ఐర్లాండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ మూడు సిరీస్ల కోసం బీసీసీఐ బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 15 నుంచి వెస్టిండీస్ మహిళల జట్టు భారత్లో పర్యటించనుండగా... నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో వరుసగా మూడు టి20లు (15న, 17న, 19న) ఆడనుంది. ఆ తర్వాత వడోదరలో డిసెంబర్ 22, 24, 27వ తేదీల్లో మూడు వన్డేలు ఆడనుంది.అనంతరం వచ్చే ఏడాది జనవరి 10, 12, 15న రాజ్కోట్లో ఐర్లాండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది భారత్ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుండగా... ఐసీసీ మహిళల చాంపియన్షిప్లో భాగంగా ఈ సిరీస్లు జరగనున్నాయి. -
ఇంగ్లండ్ బౌలర్కు జరిమానా
ఇంగ్లండ్ స్టార్ పేసర్ రీస్ టాప్లేకు జరిమానా పడింది. వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20 సందర్భంగా టాప్లే అసహనంతో కుర్చీని విరుగగొట్టాడు. దీంతో ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘణ కింద టాప్లే మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. అలాగే టాప్లే ఓ డీమెరిట్ పాయింట్ కూడా పొందాడు.పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20 సందర్భంగా టాప్లే గాయపడ్డాడు (మోకాలి గాయం). ఆ మ్యాచ్లో 2.4 ఓవర్లు వేసిన టాప్లే, ఆతర్వాత గాయం కారణంగా తన కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోయాడు. గాయం అనంతరం టాప్లే అర్దంతరంగా మైదానాన్ని వీడాడు. మైదానాన్ని వీడే క్రమంలో టాప్లే అసహసనంతో హ్యాండ్రెయిల్పై కుర్చీతో బలంగా కొట్టాడు. ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించిన ఐసీసీ.. కోడ్ ఆఫ్ కాండక్ట్ లెవెల్-1 ఉల్లంఘన కింద జరిమానా విధించింది. గాయం కారణంగా టాప్లే రెండో టీ20లో కూడా ఆడలేదు. అతను మూడో టీ20 ఆడటం కూడా అనుమానమే అని తెలుస్తుంది.టాప్లే గాయపడిన మ్యాచ్లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. ఫిల్ సాల్ట్ మెరుపు సెంచరీతో కదంతొక్కడంతో ఇంగ్లండ్ 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.అనంతరం జరిగిన రెండో టీ20లో కూడా ఇంగ్లండే విజయం సాధించింది. ఈ మ్యాచ్లో జోస్ బట్లర్ మెరుపుల కారణంగా ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. బట్లర్ వీర ఉతుకుడు ఉతకడంతో ఇంగ్లండ్ మరో 31 బంతులు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో టీ20 నవంబర్ 14న సెయింట్ లూసియా వేదికగా జరుగనుంది. -
WI vs ENG 2nd T20: స్పిన్నర్ యార్కర్ వేస్తే ఎలా ఉంటుందో తెలుసా..?
క్రికెట్లో సాధారణంగా ఫాస్ట్ బౌలర్లు యార్కర్లు వేయడం మనం చూస్తుంటాం. అదే ఓ స్పిన్నర్ యార్కర్ వేస్తే ఎలా ఉంటుందో తెలియాలంటే ఈ వీడియో చూడండి. వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య తాజాగా జరిగిన టీ20 మ్యాచ్లో ఓ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అద్భుతమైన యార్కర్ను సంధించాడు. స్పిన్నర్ నుంచి అనూహ్యంగా యార్కర్ లెంగ్త్ బాల్ రావడంతో బ్యాటర్ చేసేదేమీ లేక నిశ్చేష్టుడిగా మిగిలిపోయాడు.AN OFF SPINNER WITH A YORKER. 🤯- Dan Mousley bamboozled Rovman Powell. 🔥 pic.twitter.com/UnFQHjOsmG— Mufaddal Vohra (@mufaddal_vohra) November 11, 2024పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు బ్యాటర్ రోవ్మన్ పావెల్ 40 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసి జోరు మీదున్నాడు. ఈ దశలో ఇంగ్లండ్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ డాన్ మౌస్లీ కళ్లు చెదిరే యార్కర్తో రోవ్మన్ పావెల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మౌస్లీ సంధించిన యార్కర్ లెంగ్త్ బంతికి రోవ్మన్ దగ్గర సమాధానం లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.కాగా, వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య నిన్న (నవంబర్ 10) జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రోవ్మన్ పావెల్ (43) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. రొమారియో షెపర్డ్ (22), నికోలస్ పూరన్ (14), రోస్టన్ ఛేజ్ (13), మాథ్యూ ఫోర్డ్ (13 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మౌస్లీ, లివింగ్స్టోన్, సకీబ్ మహమూద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. జోస్ బట్లర్ (45 బంతుల్లో 83; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో 14.5 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. బట్లర్కు జతగా విల్ జాక్స్ (29 బంతుల్లో 38), లివింగ్స్టోన్ (11 బంతుల్లో 23 నాటౌట్) రాణించారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఫిల్ సాల్ట్ డకౌట్ కాగా.. జేకబ్ బేతెల్ 3 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-0 ఆధిక్యంలో వెళ్లింది. -
WI VS ENG 1st T20: ఫిల్ సాల్ట్ సరికొత్త చరిత్ర
ఇంగ్లండ్ ఆటగాడు ఫిలిప్ సాల్ట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో ఒకే దేశంపై అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. సాల్ట్ వెస్టిండీస్పై మూడు సెంచరీలు చేశాడు. సాల్ట్ తన టీ20 కెరీర్లో చేసిన మూడు సెంచరీలు విండీస్పై చేసినవే కావడం విశేషం. సాల్ట్ తర్వాత ఒకే దేశంపై అత్యధిక సెంచరీలు చేసిన ఘనత ఎవిన్ లెవిస్ (భారత్పై 2), గ్లెన్ మ్యాక్స్వెల్ (భారత్పై 2), ముహమ్మద్ వసీం (ఐర్లాండ్పై 2), లెస్లీ డన్బర్లకు (బల్గేరియాపై 2) దక్కుతుంది.బాబర్ ఆజమ్ రికార్డును సమం చేసిన సాల్ట్తాజాగా విండీస్పై చేసిన సెంచరీతో సాల్ట్ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకాడు. సాల్ట్ 34 మ్యాచ్ల్లో మూడు సెంచరీలు చేసి మ్యాక్స్వెల్ (5 సెంచరీలు), రోహిత్ శర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (4), ఎస్ డవిజి (3) తర్వాతి స్థానాల్లో నిలిచాడు. టీ20ల్లో సాల్ట్, డవిజి సహా ముహమ్మద్ వసీం, కొలిన్ మున్రో, బాబర్ ఆజమ్లు తలో మూడు సెంచరీలు చేశారు. కాగా, వెస్టిండీస్తో జరిగిన టీ20 మ్యాచ్లో ఫిల్ సాల్ట్ మెరుపు సెంచరీతో (54 బంతుల్లో 103 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఫలితంగా వెస్టిండీస్పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్లో నికోలస్ పూరన్ (38), రొమారియో షెపర్డ్ (35 నాటౌట్), గుడకేశ్ మోటీ (33), ఆండ్రీ రసెల్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహమూద్ నాలుగు, ఆదిల్ రషీద్ మూడు వికెట్లు పడగొట్టారు.అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. సాల్ట్ సుడిగాలి శతకంతో చెలరేగడంతో 16.5 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. సాల్ట్తో పాటు జాకబ్ బేతెల్ (58 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లలో విల్ జాక్స్ 17 పరుగులు చేయగా.. జోస్ బట్లర్ గోల్డన్ డకౌటయ్యాడు. మోటీ, షెపర్డ్కు తలో వికెట్ దక్కింది. కాగా, ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. -
సాల్ట్ విధ్వంసకర సెంచరీ.. విండీస్ను చిత్తు చేసిన ఇంగ్లండ్
వెస్టిండీస్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. బార్బోడస్ వేదికగా జరిగిన తొలి టీ20లో విండీస్పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్(38) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రస్సెల్(30), రొమారియో షెపర్డ్(35), మోటీ(33) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో షకీబ్ మహ్మద్ 4 వికెట్లతో పడగొట్టగా, అదిల్ రషీద్ 3, ఓవర్టన్, లివింగ్ స్టోన్ తలా వికెట్ సాధించారు.సాల్ట్ విధ్వంసకర సెంచరీ..అనంతం 183 పరుగుల భారీ లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంగ్లండ్ ఊదిపడేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 54 బంతులు ఎదుర్కొన్న 9 ఫోర్లు, 4 సిక్స్లతో 103 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాట జాకబ్ బెతల్(58) హాఫ్ సెంచరీతో మెరిశాడు. విండీస్ బౌలర్లలో మోటీ, షెపర్డ్ తలా వికెట్ మాత్రమే సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 నవంబర్ 10న ఇదే బార్బోడస్లో జరగనుంది.చదవండి: ద్రవిడ్ చిన్న కొడుకు వచ్చేస్తున్నాడు.. ఆ టోర్నమెంట్కు ఎంపిక -
విధ్వంసం సృష్టించిన ఎవిన్ లెవిస్.. తొలి వన్డేలో విండీస్ విజయం
ఆంటిగ్వా వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ డక్వర్త్ లూయిస్ పద్దతిన 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 45.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. గుడకేశ్ మోటీ (4/41) ఇంగ్లండ్ను దెబ్బకొట్టాడు. విండీస్ బౌలర్లలో మాథ్యూ ఫోర్డ్, జేడెన్ సీల్స్, అల్జరీ జోసఫ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో లియామ్ లివింగ్స్టోన్ (48) టాప్ స్కోరర్గా నిలువగా.. సామ్ కర్రన్ 37, జాకబ్ బేతెల్ 27, జోర్డన్ కాక్స్ 17, ఫిలిప్ సాల్ట్ 18, విల్ జాక్స్ 19, ఆదిల్ రషీద్ 15, డాన్ మౌస్లీ 8, జేమీ ఓవర్టన్ 0, జోఫ్రా ఆర్చర్ 7 పరుగులు చేశారు.అనంతరం వెస్టిండీస్ స్వల్ప లక్ష్య ఛేదనకు దిగగా వర్షం పలు మార్లు అంతరాయం కలిగించింది. విండీస్ స్కోర్ 157/2 (25.5 ఓవర్లు) వద్ద నుండగా మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన విండీస్ను విజేతగా ప్రకటించారు.విధ్వంసం సృష్టించిన ఎవిన్ లెవిస్స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ ఓపెనర్ ఎవిన్ లెవిస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎడా పెడా బౌండరీలు, సిక్సర్లు బాది విధ్వంసం సృష్టించాడు. 69 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేశాడు. విండీస్ ఇన్నింగ్స్లో బ్రాండన్ కింగ్ 30, కీసీ కార్టీ 19, షాయ్ హోప్ 6 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్స్టోన్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, మూడు వన్డేలు, ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్లో పర్యటిస్తుంది. వన్డే సిరీస్లో తొలి మ్యాచ్ గెలిచి విండీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఆంటిగ్వా వేదికగా నవంబర్ 2న జరుగనుంది.చదవండి: IPL 2025: ఫ్రాంచైజీలు వదులుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే..! -
ఇంగ్లండ్తో వన్డే సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాడి రీ ఎంట్రీ
స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యుల వెస్టిండీస్ జట్టును ఇవాళ (అక్టోబర్ 30) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా షాయ్ హోప్ వ్యవహరించనున్నాడు. విధ్వంసకర ఆటగాడు షిమ్రోన్ హెట్మైర్ చాలాకాలం తర్వాత తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. హెట్మైర్ 2023 డిసెంబర్లో ఇంగ్లండ్పైనే తన చివరి వన్డే ఆడాడు. 2019 డిసెంబర్ నుంచి హెట్మైర్ వన్డేల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. అలిక్ అథనాజ్ స్థానంలో హెట్మైర్ జట్టులోకి వచ్చాడు. విండీస్ ఇటీవలే శ్రీలంకలో పర్యటించి టీ20, వన్డే సిరీస్లను కోల్పోయింది. ఇంగ్లండ్తో సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించిన జట్టునే యధాతథంగా (ఒక్క మార్పు) కొనసాగించారు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ అనంతరం విండీస్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం జట్టును ప్రకటించాల్సి ఉంది. వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును కూడా నిన్ననే ప్రకటించారు.ఇంగ్లండ్తో వన్డే సిరీస్ కోసం విండీస్ జట్టు..షాయ్ హోప్ (కెప్టెన్), అల్జరీ జోసెఫ్, జ్యువెల్ ఆండ్రూ, షిమ్రోన్ హెట్మైర్, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడకేష్ మోటి, జేడెన్ సీల్స్, రోమారియో షెఫర్డ్, హేడెన్ వాల్ష్ జూనియర్విండీస్తో వన్డేలకు ఇంగ్లండ్ జట్టు..లియామ్ లివింగ్స్టోన్ (కెప్టెన్), విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, డాన్ మౌస్లీ, జాకబ్ బేతెల్, సామ్ కర్రన్, ఫిలిప్ సాల్ట్, మైఖేల్ కైల్ పెప్పర్, జాఫర్ చొహాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సకీబ్ మహమూద్, రీస్ టాప్లే, జాన్ టర్నర్షెడ్యూల్అక్టోబర్ 31- తొలి వన్డే (ఆంటిగ్వా)నవంబర్ 2- రెండో వన్డే (ఆంటిగ్వా)నవంబర్ 6- మూడో వన్డే (బార్బడోస్)నవంబర్ 9- తొలి టీ20 (బార్బడోస్)నవంబర్ 10- రెండో టీ20 (బార్బడోస్)నవంబర్ 14- మూడో టీ20 (సెయింట్ లూసియా)నవంబర్ 16- నాలుగో టీ20 (సెయింట్ లూసియా)నవంబర్ 17- ఐదో టీ20 (సెయింట్ లూసియా) -
మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ..! కట్ చేస్తే.. విధ్వంసకర సెంచరీ
పల్లెకలె వేదికగా శ్రీలంకతో జరిగిన మూడు వన్డేలో 8 వికెట్ల తేడాతో(డక్వర్త్ లూయిస్ పద్దతి) వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్డిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్ ఆహ్హనించాడు. అయితే శ్రీలంక స్కోర్ 17.2 ఓవర్లలో 81-1 వద్ద వర్షం మ్యాచ్కు అంతరాయం కలిగించింది.ఆ తర్వాత దాదాపు రెండు గంటల తర్వాత మ్యాచ్ మళ్లీ తిరిగి ప్రారంభమైంది. మ్యాచ్కు 23 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్(22 బంతుల్లో 56, 9 ఫోర్లు, ఒక సిక్సర్), నిస్సాంక(56) హాఫ్ సెంచరీలతో మెరిశారు.అనంతరం డక్వర్త్లూయిస్ పద్దతి ప్రకారం విండీస్ టార్గెట్ను 23 ఓవర్లలో 195 పరుగులగా నిర్ణయించారు. ఈ భారీ లక్ష్యాన్ని విండీస్ సునాయసంగా ఛేదించేసింది. 22 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి కరేబియన్లు ఊదిపడేశారు.లూయిస్ విధ్వంసకర సెంచరీ..కాగా మూడేళ్ల తర్వాత విండీస్ వన్డే జట్టులోకి వచ్చిన ఓపెనర్ ఎవిన్ లూయిస్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 61 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్లతో లూయిస్ 102 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు సర్ఫెన్ రూథర్ ఫర్డ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 50) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక ఈ ఓటమితో విండీస్ వైట్వాష్ నుంచి తప్పించుకుంది. అదేవిధంగా తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన శ్రీలంక 2-1 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుంది. Back like he never left! 💪🏻 In an emphatic win for the West Indies, Evin Lewis smashed an unbeaten 102 off 61 balls against Sri Lanka in his first ODI since 2021! 😍#SLvWIonFanCode pic.twitter.com/0nr2rTs01j— FanCode (@FanCode) October 27, 2024 -
SL Vs WI: శ్రీలంక జోరు.. విండీస్ బేజారు
స్వదేశంలో విండీస్తో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్లలో శ్రీలంక జోరు కొనసాగుతోంది. 2-1 తేడాతో ఇప్పటికే టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న లంకేయులు.. తాజాగా వన్డే సిరీస్ను కూడా సొంతం చేసుకున్నారు. నిన్న (అక్టోబర్ 23) జరిగిన రెండో వన్డేలో అసలంక సేన 5 వికెట్ల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది.వర్షం కారణంగా 44 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 36 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (80), గుడకేశ్ మోటీ (50 నాటౌట్) హాఫ్ సెంచరీలు చేయడంతో విండీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 58 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన విండీస్ను వీరిద్దరూ ఆదుకున్నారు. తీక్షణ (3/25), అషిత ఫెర్నాండో (3/35), హసరంగ (4/40) విండీస్ను దెబ్బకొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక.. అసలంక (62 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించడంతో 38.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. శ్రీలంక ఇన్నింగ్స్లో నిషన్ మధుష్క (38), సమరవిక్రమ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ రెండు, మోటీ, ఛేజ్ తలో వికెట్ పడగొట్టారు. నామమాత్రమైన మూడో వన్డే అక్టోబర్ 26న జరుగనుంది. చదవండి: విరాట్ కోహ్లిని వెనక్కినెట్టిన రిషభ్ పంత్ -
రెచ్చిపోయిన లంక బ్యాటర్లు.. విండీస్ ఖాతాలో మరో పరాజయం
శ్రీలంక పర్యటనలో వెస్టిండీస్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. పల్లెకెలె వేదికగా నిన్న (అక్టోబర్ 20) జరిగిన వన్డే మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విండీస్ను చిత్తు చేసింది. వర్షం అంతరాయల నడము సాగిన ఈ మ్యాచ్లో శ్రీలంక డక్వర్త్ లూయిస్ పద్దతిన విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్కు ముందు జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను కూడా శ్రీలంక 2-1 తేడాతో గెలుచుకుంది.నిన్న జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 38.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలుకావడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన లంక లక్ష్యాన్ని 37 ఓవర్లలో 232 పరుగులుగా నిర్దారించారు. విండీస్ ఇన్నింగ్స్లో షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ 74 (నాటౌట్), రోస్టన్ ఛేజ్ 33 (నాటౌట్), కీసీ కార్తీ 37 పరుగులు చేశారు. లంక బౌలర్లలో హసరంగ 2, వాండర్సే, అసలంక తలో వికెట్ పడగొట్టారు.ఛేదనలో శ్రీలంక 31.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. లంక బ్యాటర్లు నిషన్ మధుష్క (69), చరిత్ అసలంక (77) రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. ఆఖర్లో కమిందు మెండిస్ (30 నాటౌట్) ధాటిగా ఆడాడు. విండీస్ బౌలర్లలో గుడకేశ్ మోటీ 3, అల్జరీ జోసఫ్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్లో శ్రీలంక ఘనంగా బోణీ కొట్టింది. రెండో వన్డే అక్టోబర్ 23 పల్లెకెలె వేదికగానే జరుగనుంది. చదవండి: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ -
ఫైనల్లో న్యూజిలాండ్
షార్జా: మహిళల టి20 ప్రపంచకప్లో 14 ఏళ్ల విరామం తర్వాత న్యూజిలాండ్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ 8 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ వెస్టిండీస్ను ఓడించింది. తద్వారా ఈసారి మహిళల టి20 ప్రపంచకప్లో కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. ఈ టోర్నీ చరిత్రలో న్యూజిలాండ్ 2009, 2010లలో వరుసగా రెండుసార్లు ఫైనల్లోకి ప్రవేశించి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడుతుంది. విండీస్తో జరిగిన సెమీఫైనల్లో మొదట న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. జార్జియా ప్లిమర్ (33; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. విండీస్ బౌలర్ డాటిన్ నాలుగు వికెట్లు తీసింది. అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి ఓడిపోయింది. -
SL Vs WI: మెండిస్, పెరీరా విధ్వంసం.. మూడో టీ20లో విండీస్ చిత్తు
దంబుల్లా వేదికగా వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో 9 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2–1తో లంక సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన స్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ రావ్మన్ పావెల్(27 బంతుల్లో 37; ఒక ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలవగా.. గుడకేశ్ మోతీ (15 బంతుల్లో 32; ఒక ఫోర్, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగిలిన ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ, హసరంగ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.అదరగొట్టిన మెండీస్, పెరీరా..అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 18 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదిపడేసింది. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (50 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కుశాల్ పెరీరా (36 బంతుల్లో 55 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ అర్ధశతకాలతో చెలరేగారు. వీరిద్దరితో నిసాంక (22 బంతుల్లో 39; 7 ఫోర్లు, ఒక సిక్సర్) కూడా మెరుపులు మెరిపించాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆక్టోబర్ 20 నుంచి ప్రారంభం కానుంది.చదవండి:IND Vs NZ ODI Series: న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన -
T20 WC 2024: పట్టిక తారుమారు.. సెమీస్ బెర్తులు ఖరారు
మహిళల టీ20 ప్రపంచకప్-2024లో సెమీ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టాప్-4కు అర్హత సాధించగా.. గ్రూప్-బి నుంచి ఊహించని జట్టు సెమీస్కు దూసుకువచ్చింది. కాగా బంగ్లాదేశ్లో నిర్వహించాల్సిన ఈ మెగా టోర్నీ వేదికను ఐసీసీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు మార్చిన విషయం తెలిసిందే.బంగ్లాలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తలెత్తిన అల్లర్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఐసీసీ ఈవెంట్లో గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక.. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్, ఇంగ్లండ్, స్కాట్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పోటీపడ్డాయి.టీమిండియాకు కలిసి రాలేదుఅయితే, టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉన్న భారత జట్టు పేలవ ప్రదర్శనతో కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో గ్రూప్-ఏలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టాప్-4లో సగర్వంగా అడుగుపెట్టాయి. అయితే, గ్రూప్-బి టాపర్గా ఉన్న ఇంగ్లండ్ ఊహించని రీతిలో ఒక్క మ్యాచ్ ఫలితంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.ఒక్క మ్యాచ్తో ఫలితం తారుమారువెస్టిండీస్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో హీథర్ నైట్ బృందం.. విండీస్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో గ్రూప్-బి పాయింట్ల పట్టిక తారుమారైంది. మొదటిస్థానంలో ఉన్న ఇంగ్లండ్ మూడో స్థానానికి, మూడో స్థానంలో ఉన్న వెస్టిండీస్ టాప్లోకి వచ్చింది. ఇరు జట్లు పాయింట్ల పరంగా(6) సమానంగా ఉన్నా.. నెట్రన్రేటులో వెస్టిండీస్(1.536).. ఇంగ్లండ్(1.091) కంటే మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం.ఫలితంగా గ్రూప్-బి నుంచి వెస్టిండీస్ సెమీస్కు వచ్చింది. మరోవైపు.. ఇదే గ్రూపులో ఉన్న సౌతాఫ్రికా కూడా ఆరు పాయింట్లే కలిగి ఉన్నా.. నెట్రన్రేటే(1.382) ఆ జట్టుకూ మేలు చేసి టాప్-4లో చేర్చింది. అలా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా మహిళా టీ20 వరల్డ్కప్-2024లో తమ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి.షెడ్యూల్, వేదికలు ఇవే👉మొదటి సెమీ ఫైనల్- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా- అక్టోబరు 17, దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, దుబాయ్.👉రెండో సెమీ ఫైనల్- వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్, అక్టోబరు 18, షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా.👉రెండు మ్యాచ్లూ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు మొదలవుతాయి.ఆస్ట్రేలియా జట్టుఅలిసా హీలీ (కెప్టెన్), డార్సీ బ్రౌన్, యాష్ గార్డనర్, కిమ్ గార్త్, గ్రేస్ హారిస్, అలానా కింగ్, ఫోబీ లిచ్ఫీల్డ్, తహ్లియా మెక్గ్రాత్ (వైస్ కెప్టెన్), సోఫీ మొలినెక్స్, బెత్ మూనీ, ఎలిస్ పెర్రీ, మెగాన్ స్కట్, అన్నాబెల్ సదర్లాండ్, హీథర్ గ్రాహం, జార్జియా వేర్హామ్.సౌతాఫ్రికా జట్టులారా వోల్వార్డ్ (కెప్టెన్), అన్నేక్ బాష్, టాజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నేరీ డెర్క్సెన్, మికే డి రైడర్, అయాండా హ్లూబీ, సినాలో జాఫ్తా, మారిజానే కాప్, అయబోంగా ఖాకా, సునే లూస్, నోన్కులులెకో మ్లాబా, సెష్నీ నాయుడు, తుమీ సెఖుఖున్, క్లోయ్ ట్రియాన్.వెస్టిండీస్ జట్టుహేలీ మాథ్యూస్ (కెప్టెన్), ఆలియా అల్లేన్, షమీలియా కాన్నెల్, డియోండ్రా డాటిన్, షెమైన్ కాంప్బెల్లె (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), అష్మిని మునిసర్, అఫీ ఫ్లెచర్, స్టెఫానీ టేలర్, చినెల్ హెన్రీ, చెడియన్ నేషన్, కియానా జోసెఫ్, జైదా జేమ్స్, కరిష్మా రాంహారక్, మాండీ మంగ్రూ, నెరిస్సా క్రాఫ్టన్.న్యూజిలాండ్ జట్టుసోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఇజ్జీ గాజ్, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, ఫ్రాన్ జోనాస్, లీ కాస్పెరెక్, మెలీ కెర్, జెస్ కెర్, రోజ్మేరీ మైర్, మోలీ పెన్ఫోల్డ్, జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవే, లీ తహుహు.చదవండి: W T20 WC: ‘హర్మన్పై వేటు! స్మృతి కాదు.. కొత్త కెప్టెన్గా ఆమెకు ఛాన్స్ ఇస్తేనే’ -
W T20 WC: ఇంగ్లండ్ ఇంటికి...సెమీఫైనల్లో వెస్టిండీస్
దుబాయ్: ఈ ప్రపంచకప్లో ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్. గ్రూప్ ‘బి’లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్లు గెలిచి అగ్రస్థానంలో ఇంగ్లండ్, రెండు విజయాలతో వెస్టిండీస్ మూడో స్థానంలో ఉన్నాయి. మంగళవారం జరిగిన మ్యాచ్ ఈ స్థానాల్ని తారుమారు చేసింది. ఇంగ్లండ్ మహిళల జట్టు అనూహ్యంగా ఒక్క ఆఖరి పోరుతో ఇంటిబాట పట్టింది. వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో గెలిచి ‘టాప్’లోకి వచ్చి నిలిచింది. మూడు జట్లు 6 పాయింట్లతో సమంగా ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్రేట్ విండీస్ (1.536) జట్టును సెమీఫైనల్స్కు పంపింది. ఈ గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికా (1.382) రెండో జట్టుగా ముందంజ వేసింది. ఇంగ్లండ్ (1.091) మూడో స్థానంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్ నెగ్గిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. టాపార్డర్లో బౌచిర్ (14), డ్యానీ వ్యాట్ (16), అలైస్ క్యాప్సీ (1) నిరాశ పరచడంతో 34 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ దశలో నట్ సీవర్ బ్రంట్ (50 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు) ఒంటరి పోరాటం చేసింది. కెపె్టన్ హీథెర్ నైట్ (13 బంతుల్లో 21; 3 ఫోర్లు)తో చకచకా 46 పరుగులు జోడించింది. అయితే 80 పరుగుల జట్టు స్కోరు వద్ద హీథెర్ రిటైర్డ్హర్ట్ కావడంతో ఇంగ్లండ్ ఆటతీరు మారింది. తర్వాత వచ్చిన వారిలో ఏ ఒక్కరూ కనీసం 8 పరుగులైనా చేయలేకపోవడంతో ఇంగ్లండ్ 150 మార్క్ను కూడా అందుకోలేకపోయింది. అఫీ ఫ్లెచర్ 3, హేలీ మాథ్యూస్ 2 వికెట్లు తీశారు. తర్వాత వెస్టిండీస్ ఇంకో 2 ఓవర్లు మిగిలుండగానే 18 ఓవర్లలో నాలుగే వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు హేలీ మాథ్యూస్ (38 బంతుల్లో 50; 7 ఫోర్లు, 1 సిక్స్), క్వియానా జోసెఫ్ (38 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్లు) ధనాధన్ ఆరంభమిచ్చారు. మెరుపు వేగంతో ఆడిన ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తిచేసుకున్నారు.తొలి వికెట్కు 12.2 ఓవర్లలో 102 పరుగులు జోడించాక క్వియానా, తర్వాత ఓవర్లో కెపె్టన్ హేలీ నిష్క్రమించారు. అప్పటికి 41 బంతుల్లో 38 పరుగులు కావాల్సి ఉండగా, డాటిన్ (19 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్లు ) ధాటిగా ఆడింది. గెలుపు వాకిట ఆమె బౌల్డ్ కాగా, మిగతా లాంఛనాన్ని ఆలియా అలెన్ (4 బంతుల్లో 6 నాటౌట్; 1 ఫోర్) పూర్తి చేసింది. గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా; శుక్రవారం జరిగే రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్తో వెస్టిండీస్ తలపడతాయి. -
SL Vs WI: విండీస్తో రెండో టీ20.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన శ్రీలంక
డంబుల్లా వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక జట్టు నామమాత్రపు స్కోర్కే పరిమితమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో పథుమ్ నిస్సంక అర్ద సెంచరీతో (54) రాణించగా.. కుసాల్ మెండిస్ 26, కుసాల్ పెరీరా 24, కమిందు మెండిస్ 19, చరిత్ అసలంక 9, భానుక రాజపక్స 5, వనిందు హసరంగ 5 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ రెండు వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్, షమార్ జోసఫ్, షమార్ స్ప్రింగర్ తలో వికెట్ దక్కించుకున్నారు.కాగా, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. టీ20 సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. కమిందు మెండిస్ (51), చరిత్ అసలంక (59) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 180 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రాండన్ కింగ్ (63), ఎవిన్ లెవిస్ (50) అర్ద సెంచరీలు చేసి విండీస్ను గెలిపించారు. చదవండి: న్యూజిలాండ్తో తొలి టెస్ట్.. భారీ రికార్డుపై కన్నేసిన విరాట్ -
కింగ్, లూయిస్ ఊచకోత.. శ్రీలంకను చిత్తు చేసిన వెస్టిండీస్
శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. దంబుల్లా వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యాన్ని కరేబియన్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లో చేధించింది.లక్ష్య చేధనలో విండీస్ ఓపెనర్లు బ్రాండెన్ కింగ్, ఈవెన్ లూయిస్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. 33 బంతులు ఎదుర్కొన్న కింగ్ 11 ఫోర్లు, 1 సిక్స్లతో 63 పరుగులు చేయగా, లూయిస్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 50 రన్స్ చేశాడు. లంక బౌలర్లలో మతీషా పతిరానా రెండు వికెట్లు పడగొట్టగా, హసరంగా, మెండిస్,థీక్షణ చెరో వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.లంక బ్యాటర్లలో కెప్టెన్ అసలంక(59, 9 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా, కమిందు మెండిస్(51) పరుగులతో రాణించాడు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్ రెండు వికెట్లు, అల్జారీ జోషఫ్, షెమర్ జోషఫ్, మోటీ,స్ప్రింగర్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆక్టోబర్ 15న దంబుల్లా వేదికగానే జరగనుంది.చదవండి: T20 WC: ఆసీస్ చేతిలో ఓటమి.. భారత్ సెమీస్కు చేరాలంటే? -
T20 World Cup 2024: బంగ్లాదేశ్ను చిత్తు చేసిన విండీస్
మహిళల టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా బంగ్లాదేశ్తో నిన్న (అక్టోబర్ 10) జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 103 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ నిగార్ సుల్తాన్ (39) టాప్ స్కోరర్గా నిలువగా.. దిలారా అక్తెర్ (19), శోభన (16), రితూ మోనీ (10) రెండంకెల స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో కరిష్మా రామ్హరాక్ అద్భుతంగా బౌలింగ్ చేసి (4-0-17-4) బంగ్లాదేశ్ను దెబ్బకొట్టింది. అఫీ ఫ్లెచర్ 2, హేలీ మాథ్యూస్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ 12.5 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. హేలీ మాథ్యూస్ 34, స్టెఫానీ టేలర్ 27, షెమెయిన్ క్యాంప్బెల్ 21, డియాండ్రా డొట్టిన్ 19, చిన్నెల్ హెన్రీ 2 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో నహిద అక్తెర్, మరుఫా అక్తెర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో వెస్టిండీస్ గ్రూప్-బి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ గ్రూప్లో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉండగా..స్కాట్లాండ్ ఇదివరకే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది.ఇదిలా ఉంటే, గ్రూప్-ఏలో పోటీలు అత్యంత రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ గ్రూప్లో ఆస్ట్రేలియా టాప్లో ఉండగా.. భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. శ్రీలంక టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈ గ్రూప్లో సెమీస్ బెర్త్ల కోసం నాలుగు జట్ల మధ్య పోటీ నెలకొంది. గ్రూప్ మ్యాచ్లు ముగిసిన అనంతరం టాప్-2లో ఉండే జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. భారత్ తమ చివరి గ్రూప్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 13న జరుగుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెమీస్కు చేరవచ్చు. చదవండి: ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి.. చివరి స్థానానికి పడిపోయిన పాకిస్తాన్ -
WT20 WC: విండీస్ మహిళల ధనాధన్ విక్టరీ
దుబాయ్: వెస్టిండీస్ మహిళల ఆల్రౌండ్ ప్రదర్శనకు బంగ్లాదేశ్ బెంబేలెత్తిపోయింది. దీంతో టి20 ప్రపంచకప్లో భాగంగా గురువారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో మాజీ చాంపియన్ వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ నెగ్గిన కరీబియన్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. కెప్టెన్ నిగర్ సుల్తానా (39; 4 ఫోర్లు) మాత్రమే రాణించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్పిన్నర్ కరిష్మా రమ్హరక్ (4–0–17–4) ఉచ్చులో బంగ్లా బ్యాటర్లంతా కుదేలయ్యారు. అఫీ ఫ్లెచర్ 2 వికెట్లు తీసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 12.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 104 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ , ఓపెనర్ హేలీ మాథ్యూస్ (22 బంతుల్లో 34; 6 ఫోర్లు), స్టెఫానీ టేలర్ (29 బంతుల్లో 27 రిటైర్డ్హర్ట్; 3 ఫోర్లు) తొలి వికెట్కు 7.3 ఓవర్లలో 52 పరుగులు జోడించి శుభారంభమిచ్చారు.షెర్మయిన్ (16 బంతుల్లో 21; 2 ఫోర్లు), డియాండ్రా డాటిన్ (7 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) మిగతా పనిని పూర్తి చేశారు. బంగ్లా బౌలర్లలో నహిదా అక్తర్, మారుఫా అక్తర్ చెరో వికెట్ తీశారు. -
వెస్టిండీస్ ధనాధన్ విజయం
దుబాయ్: మాజీ చాంపియన్ వెస్టిండీస్ మహిళల టి20 ప్రపంచకప్లో తమ రెండో లీగ్ మ్యాచ్లో గెలుపు ఖాతా తెరిచింది. తొలి మ్యాచ్లో సఫారీ చేతిలో ఓడిన 2016 చాంపియన్ ఆదివారం గ్రూప్ ‘బి’లో జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో స్కాట్లాండ్పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన స్కాట్లాండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ఓపెనర్లు సారా బ్రిస్ (2), సస్కియా హార్లీ (11)లను ఆరంభంలోనే అవుట్ చేయడంతో స్కాట్లాండ్ తిరిగి పుంజుకోలేకపోయింది. వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ కేథరిన్ బ్రిస్ (31 బంతుల్లో 25; 1 ఫోర్), అయిల్సా లిస్టెర్ (33 బంతుల్లో 26; 1 ఫోర్) కాసేపు క్రీజులో నిలబడటంతో స్కాట్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. కరీబియన్ బౌలర్లలో అఫీ ఫ్లెచెర్ 3 వికెట్లు తీయగా, చినెల్లి హెన్రీ, హేలీ మాథ్యూస్, కరిష్మా తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ ఆరంభంలోనే ఓపెనర్లు స్టెఫానీ టేలర్ (4), హేలీ మాథ్యూస్ (8) వికెట్లను కోల్పోయి తడబడింది. అయితే క్వినా జోసెఫ్ ( 18 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్), డియాండ్రా డాటిన్ (15 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు), చినెల్లి హెన్రీ (10 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఆట ఆడి వేగంగా మ్యాచ్ను ముగించారు. దీంతో విండీస్ 11.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసి గెలిచింది. ఒలివియా బెల్కు 2 వికెట్లు దక్కాయి. రాచెల్, ప్రియనాజ్ ఛటర్జీ చెరో వికెట్ తీశారు. స్కోరు వివరాలు స్కాట్లాండ్ ఇన్నింగ్స్: హార్లీ (సి) డాటిన్ (బి) హేలీ మాథ్యూస్ 11; సారా బ్రిస్ (బి) హెన్రీ 2; కేథరిన్ బ్రిస్ (సి) కరిష్మా (బి) ఫ్లెచర్ 25; లిస్టెర్ (సి) కరిష్మా (బి) ఫ్లెచర్ 26; ప్రియనాజ్ ఛటర్జీ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఫ్లెచర్ 0; జాక్ బ్రౌన్ (రనౌట్) 11; డార్సీ కార్టర్ (నాటౌట్) 14; కేథరిన్ ఫ్రేజర్ (రనౌట్) 6; రాచెల్ (బి) కరిష్మా 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 99. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–59, 4–59, 5–76, 6–76, 7–98, 8–99. బౌలింగ్: హెన్రీ 4–2–10–1, హేలీ మాథ్యూస్ 4–0–21–1, కరిష్మా 4–0–24–1, అశ్మిని మునిసర్ 1–0–8–0, అఫీ ఫ్లెచర్ 4–0–22–3, క్వినా జోసెఫ్ 1–0–2–0, ఆలియా అలెన్ 2–0–10–0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) కేథరిన్ బ్రిస్ (బి) ప్రియనాజ్ 8; స్టెఫానీ (బి) రాచెల్ 4; క్వినా జోసెఫ్ (సి) ప్రియనాజ్ (బి) ఒలివియా బెల్ 31; షెర్మయిన్ (సి అండ్ బి) ఒలివియా బెల్ 2; డాటిన్ (నాటౌట్) 28; చినెల్లి హెన్రీ (నాటౌట్) 18; ఎక్స్ట్రాలు 10; మొత్తం (11.4 ఓవర్లలో 4 వికెట్లకు) 101. వికెట్ల పతనం: 1–5, 2–32, 3–48, 4–59. బౌలింగ్: రాచెల్ స్లేటర్ 2–0–17–1, కేథరిన్ బ్రిస్ 3–0–22–0, ఒలివియా బెల్ 3–0–18–2, ప్రియనాజ్ 1–0–15–1, అబ్తాహ మక్సూద్ 2.4–0–28–0. -
పూరన్ సుడిగాలి శతకం
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2024 చివరి లీగ్ దశ మ్యాచ్లో గయానా అమెజాన్ వారియర్స్పై ట్రిన్బాగో నైట్రైడర్స్ 74 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్రైడర్స్ నికోలస్ పూరన్ సుడిగాలి శతకంతో (59 బంతుల్లో 101; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. HUNDRED FOR NICHOLAS POORAN IN CPL...!!!! 🙇- Pooran is a beast in T20s, What a remarkable consistency. pic.twitter.com/2gn9VaD5c6— Johns. (@CricCrazyJohns) September 30, 2024జేసన్ రాయ్ (26 బంతుల్లో 34), కీసీ కార్తీ (13 బంతుల్లో 27 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. పోలార్డ్ 19, రసెల్ 9, టిమ్ డేవిడ్, పార్రిస్ డకౌట్ అయ్యారు. వారియర్స్ బౌలర్లలో షమార్ జోసఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇమ్రాన్ తాహిర్, ప్రిటోరియస్ తలో వికెట్ దక్కించుకున్నారు.137 పరుగులకే కుప్పకూలిన వారియర్స్212 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అమెజాన్ వారియర్స్ 137 పరుగులకే (18.5 ఓవర్లలో) కుప్పకూలింది. టెర్రన్స్ హిండ్స్, వకార్ సలాంకీల్, నాథన్ ఎడ్వర్డ్స్ తలో మూడు వికెట్లు తీసి వారియర్స్ను దెబ్బకొట్టారు. అకీల్ హొసేన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. వారియర్స్ ఇన్నింగ్స్లో రహ్మానుల్లా గుర్బాజ్ (36), షాయ్ హోప్ (28), గుడకేశ్ మోటీ (26 నాటౌట్), ఇమ్రాన్ తాహిర్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. హెట్మైర్ (9), కీమో పాల్ (1), మొయిన్ అలీ (5), రొమారియో షెపర్డ్ (0), ప్రిటోరియస్ (0) విఫలమయ్యారు.ఈ మ్యాచ్ ఫలితంతో ఎలిమినేటర్, క్వాలిఫయర్-1లో తలపడబోయే జట్లేవో తేలిపోయాయి. అక్టోబర్ 1న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో ట్రిన్బ్రాగో నైట్రైడర్స్, బార్బడోస్ రాయల్స్ తలపడనుండగా.. అక్టోబర్ 2న జరిగే క్వాలిఫయర్-1లో గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా కింగ్స్ పోటీ పడనున్నాయి. లీగ్ మ్యాచ్లన్నీ పూర్తయ్యాక గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ లూసియా కింగ్స్, ట్రిన్బాగో నైట్రైడర్స్, బార్బడోస్ రాయల్స్ పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచాయి.చదవండి: చెలరేగిన అదైర్ బ్రదర్స్.. సౌతాఫ్రికాపై ఐర్లాండ్ సంచలన విజయం -
మహిళల టి20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లో భారత్ ఘన విజయం
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచకప్ తొలి వార్మప్ మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత అమ్మాయిల జట్టు 20 పరుగుల తేడాతో వెస్టిండీస్ మహిళల జట్టుపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(40 బంతుల్లో 52; 5 ఫోర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకోగా... యస్తిక భాటియా (24; ఒక ఫోర్, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించింది. వెస్టిండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ నాలుగు వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. చీనిల్ హెన్రీ (48 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించింది. భారత బౌలర్లలో పూజ వస్త్రకర్ 3, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. రెండో వార్మప్ మ్యాచ్లో మంగళవారం దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో భారత జట్టు తలపడనుంది. గురువారం నుంచి మహిళల ప్రపంచకప్ ప్రధాన టోర్నీ ప్రారంభం కానుంది. -
నికోలస్ పూరన్ వరల్డ్ రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
వెస్టిండీస్ స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్ టీ20 క్రికెట్లో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ట్రిన్బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న పూరన్.. తాజా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వరల్డ్ రికార్డు సృష్టించాడు. శనివారం సీపీఎల్లో భాగంగా బార్బడోస్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగులు చేసిన పూరన్ ఈ ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో ఇప్పటివరకు 65 ఇన్నింగ్స్ల్లో 42.02 సగటుతో 2,059 పరుగులు చేశాడు. అందులో 14 హాఫ్ సెంచరీలు ఉండడం గమనార్హం. కాగా ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పేరిట ఉండేది. 2021 ఏడాదిలో 45 టీ20 ఇన్నింగ్స్లలో 2,036 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో రిజ్వాన్ ఆల్టైమ్ రికార్డును ఈ కరేబియన్ విధ్వంసకర వీరుడు బ్రేక్ చేశాడు. ఈ ఏడాదిలో టీ20ల్లో వెస్టిండీస్, డర్బన్ సూపర్ జెయింట్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్, ఎంఐ న్యూయార్క్, నార్తర్న్ సూపర్ ఛార్జర్స్, రంగ్పూర్ రైడర్స్, ట్రిన్బాగో నైట్ రైడర్స్ జట్లకు పూరన్ ప్రాతినిథ్యం వహించాడు. -
Dwayne Bravo: అసలు సిసలు ‘చాంపియన్’!
ప్రపంచంలోని ఏ మూల ఫ్రాంచైజీ లీగ్ క్రికెట్ జరుగుతున్నా అందులో అతడు ఉండాల్సిందే! జాతీయ జట్టు మొదలుకొని... విశ్వవ్యాప్తంగా మొత్తం 43 జట్లకు ప్రాతినిధ్యం వహించిన చరిత్ర అతడిది! అటు బౌలర్గా ఇటు బ్యాటర్గా మైదానంలో ఆల్రౌండ్ మెరుపులకు కేరాఫ్ అడ్రస్ అతడు! రెండుసార్లు టి20 ప్రపంచకప్ గెలిచిన జట్టులోనూ సభ్యుడు, పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, ఫ్రాంచైజీ క్రికెట్లో అత్యధిక ట్రోఫీలు సాధించిన ప్లేయర్... ఇలా లెక్కకు మిక్కిలి ఘనతలు సాధించిన అతడే వెస్టిండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో. రెండు దశాబ్దాలుగా ఏదో ఒక జట్టులో ప్లేయర్గా కొనసాగుతున్న డ్వేన్ బ్రావో ఆటగాడిగా తన క్రికెట్ ఇన్నింగ్స్కు శుభంకార్డు వేశాడు. ఆట నుంచి వీడ్కోలు తీసుకున్నా ఏదో ఒక హోదాలో ఈ ఆటలోనే కొనసాగేందుకు బ్రావో నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్ జట్టు తరఫున బ్రావో ‘మెంటార్’ పాత్రలో కనిపించనున్నాడు. రెండు దశాబ్దాలుగా మైదానంలో తన ఆటతీరుతో పాటు ఆటాపాటతోనూ అశేష అభిమానులను సొంతం చేసుకొని ప్లేయర్గా రిటైరైన నేపథ్యంలో ‘చాంపియన్’ బ్రావోపై ప్రత్యేక కథనం. టి20 ఫార్మాట్ ప్రారంభమైనప్పటి నుంచి పొట్టి క్రికెట్పై తనదైన ముద్రవేసిన వెస్టిండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో ఆటలోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. మూడేళ్ల క్రితమే జాతీయ జట్టు తరఫున చివరి టి20 మ్యాచ్ ఆడిన బ్రావో... తాజాగా ఫ్రాంచైజీ క్రికెట్కు కూడా వీడ్కోలు పలికాడు. కెరీర్లో 582 టి20 మ్యాచ్లాడిన 41 ఏళ్ల బ్రావో... 631 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. అఫ్గానిస్తాన్ స్పిన్ స్టార్ రషీద్ ఖాన్ 613 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి తప్పుకునే సమయానికి 183 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఘనత సాధించిన బ్రావో... వచ్చే సీజన్ నుంచి ‘మెంటార్’గా దర్శనమివ్వనున్నాడు. ఐపీఎల్లో అపార అనుభవం ఉన్న బ్రావో... డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్రైడర్స్కు మెంటార్గా వ్యవహరించనున్నట్లు వెల్లడించాడు. డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్గా గుర్తింపు సాధించిన బ్రావో... టి20ల్లో చివరి నాలుగు (17 నుంచి 20) ఓవర్లలో 322 వికెట్లు పడగొట్టి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ జోర్డాన్ డెత్ ఓవర్స్లో 201 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు. చెన్నై చిన్నోడు! ఐపీఎల్ ఆరంభం నుంచి వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించిన బ్రావో... 2011 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఆడటాన్ని ఎంతగానో ఇష్టపడే బ్రావో... సుదీర్ఘ కాలం పాటు చెన్నై ప్రధాన బౌలర్గా కొనసాగాడు. ప్రత్యర్థి ప్లేయర్లు భారీ షాట్లు కొడుతున్న ప్రతిసారీ ధోని బంతిని బ్రావో వైపు విసిరే వాడంటే... అతడిపై మహీకి ఉన్న నమ్మకమేంటో అర్థం చేసుకోవచ్చు. ఇతర లీగ్లతో పోల్చుకుంటే ఐపీఎల్లో తన బౌలింగ్తోనే ఎక్కువ ఆదరణ పొందిన బ్రావో... అత్యుత్తమ ఫీల్డర్ అనడంలో సందేహం లేదు. సర్కిల్లో ఫీల్డింగ్ చేస్తే చుట్టు పక్కల గోడ కట్టినట్లే అనే గుర్తింపు తెచ్చుకున్న బ్రావో... బౌండరీ మీద ఎన్నో అద్భుత క్యాచ్లు అందుకున్నాడు. సిక్సర్ ఖాయమనుకున్న బంతిని సైతం కచ్చితమైన అంచనాతో గాల్లోకి ఎగిరి అమాంతం ఒడిసి పట్టడంలో బ్రావోది అందెవేసిన చేయి. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బ్రావో ఎప్పుడూ బౌండరీ వద్దే కనిపించేవాడు. ఆటతీరుతోనే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించి వాటికి నృత్యరీతులను జత చేయడంలోనూ బ్రావో సిద్దహస్తుడు. ఆటతో పాటే పాట! మైదానంలో ఎంతో సరదాగా ఉండే బ్రావోను ప్రత్యర్థి ప్లేయర్లు సైతం ఇష్టపడేవారు. వికెట్ తీసినప్పుడు జరుపుకునే సంబరాల నుంచి మొదలుకొని విజయం సాధించినప్పుడు చేసే డాన్స్ వరకు అన్నిట్లో ప్రత్యేకత చాటుకున్న బ్రావో.. ఐపీఎల్లో రెండు సీజన్లలో 25 కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. 2013 సీజన్లో 32 వికెట్లు తీసిన బ్రావో... 2015లో 26 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ టి20 ఫార్మాట్లో 684 మ్యాచ్లాడి అగ్రస్థానంలో ఉండగా... 582 మ్యాచ్లతో బ్రావో రెండో స్థానంలో నిలిచాడు. షోయబ్ మాలిక్ (542 మ్యాచ్లు), సునీల్ నరైన్ (525 మ్యాచ్లు), రసెల్ (523 మ్యాచ్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఫ్రాంచైజీ క్రికెట్లో విశ్వవ్యాప్తంగా 28 జట్లకు ప్రాతినిధ్యం వహించిన బ్రావో... 2012, 2016లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ జాతీయ జట్టులో కీలక పాత్ర పోషించాడు. సుదీర్ఘ కెరీర్లో పదో స్థానంలో మినహా అన్ని స్థానాల్లో బ్యాటింగ్కు దిగిన దిగిన బ్రావో... 442 ఇన్నింగ్స్ల్లో 6970 పరుగులు సాధించాడు. ఇందులో ఒక్క సెంచరీ కూడా లేకపోగా... 20 అర్ధశతకాలు ఉన్నాయి. ఆల్రౌండర్కు ప్రతిరూపం బ్యాట్తో 5 వేల పైచిలుకు పరుగులు... బంతితో 300 వికెట్లు... 200 క్యాచ్లు పట్టిన బ్రావో నిఖార్సైన ఆల్రౌండర్ అనిపించుకున్నాడు. పురుషుల టి20 క్రికెట్లో 17 టోర్నమెంట్ ఫైనల్స్లో బ్రావో విజేతగా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో ఇదే అత్యధికం కాగా... కీరన్ పొలార్డ్ 16 టోర్నీల్లో చాంపియన్గా నిలిచాడు.కరీబియన్ ప్రీమియర్ లీగ్లో ఐదు (2015, 2017, 2018, 2020, 2021), ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మూడు (2011, 2018, 2021), ఐసీసీ టి20 ప్రపంచకప్లో రెండు (2012, 2016), కరీబియన్ టి20 లీగ్లో రెండు (2011/12, 2012/13), స్టాన్ఫోర్డ్ లీగ్ (2007/08), సీఎల్టి20 (2014), బీపీఎల్ (2016/17), పీఎస్ఎల్ (2019), ఐఎల్టి20 (2023/24)ల్లో ఒక్కో టైటిల్ సాధించాడు.ఆటగాడిగా ఉన్న సమయంలోనే సహచరులకు అవసరమైన సమయాల్లో సూచనలిస్తూ పెద్దన్న పాత్ర పోషించిన బ్రావో... ఇప్పుడు ఇక పూర్తిస్థాయిలో మెంటార్గా వ్యవహరించనున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్లో సుదీర్ఘ కాలంగా ట్రిన్బాగో నైట్ రైడర్స్కు ప్రాతినిధ్యం వహించిన బ్రావో... వచ్చే ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్గా కనిపించనున్నాడు. -
శ్రీలంకలో విండీస్ పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే..!
శ్రీలంకలో వెస్టిండీస్ పర్యటన ఖరారైంది. పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం వెస్టిండీస్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 13, 15, 17 తేదీల్లో డంబుల్లా వేదికగా జరుగనుంది. అనంతరం అక్టోబర్ 20 నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్ అక్టోబర్ 20, 23, 26 తేదీల్లో క్యాండీ వేదికగా జరుగనుంది.కాగా, ఇటీవలికాలంలో శ్రీలంక ఫార్మాట్లకతీతంగా రాణిస్తుంది. స్వదేశంలో భారత్ను వన్డే సిరీస్లో 2-0 తేడాతో ఓడించిన శ్రీలంక.. ఆతర్వాత ఇంగ్లండ్ను వారి సొంతగడ్డపై ఓ టెస్ట్ మ్యాచ్లో ఓడించింది. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లోనూ శ్రీలంక సత్తా చాటుతుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో శ్రీలంక 63 పరుగుల తేడాతో గెలుపొందింది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్లోనూ శ్రీలంక పైచేయి సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో లంకేయులు భారీ స్కోర్ సాధించారు.వెస్టిండీస్ విషయానికొస్తే.. ఈ కరీబియన్ జట్టు ఇటీవల సౌతాఫ్రికాను మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. దానికి ముందు జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను విండీస్ 0-1 తేడాతో కోల్పోయింది. అంతకుముందు ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను కూడా వెస్టిండీస్ 0-3 తేడాతో కోల్పోయింది. ప్రస్తుతం వెస్టిండీస్లో కరీబియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుండటంతో ఆటగాళ్లంతా ఆ లీగ్లో బిజీగా ఉన్నారు. చదవండి: కన్నీటిపర్యంతమైన బ్రావో -
కన్నీటిపర్యంతమైన బ్రావో
విండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరీబియన్ ప్రీమియర్ లీగ్-2024లో సెప్టెంబర్ 24న సెయింట్ లూసియా కింగ్స్తో జరిగిన మ్యాచ్ బ్రావో కెరీర్లో చివరి మ్యాచ్. ఈ మ్యాచ్లో బ్రావో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. మ్యాచ్ అనంతరం బ్రావో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఉబికి వస్తున్న బాధను ఆపుకోలేక కన్నీటిపర్యంతమయ్యాడు. బ్రావో కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. Champion Dwayne Bravo announces his retirement from all formats of cricket.Know more: https://t.co/ljuWjTsGQS— CricTracker (@Cricketracker) September 27, 20242021లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన బ్రావో.. వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ గెలిచిన రెండు సందర్భాల్లో (2012, 2016) ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. బ్రావో పొట్టి క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కొనసాగుతున్నాడు. బ్రావో తన టీ20 కెరీర్లో 582 మ్యాచ్లు ఆడి 631 వికెట్లు పడగొట్టాడు. బ్రావో తాజాగా ఐపీఎల్లో కేకేఆర్ ఫ్రాంచైజీ మెంటార్గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2025 నుంచి బ్రావో కేకేఆర్ మెంటార్గా వ్యవహరిస్తాడు. కాగా, 40 ఏళ్ల బ్రావో 2004లో తన అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టాడు. నాటి నుంచి 2021 వరకు అతను విండీస్ జాతీయ జట్టుకు సేవలందించాడు. ఈ మధ్యలో 40 టెస్ట్లు, 164 వన్డేలు, 91 టీ20లు ఆడాడు. బౌలింగ్ ఆల్రౌండర్ అయిన బ్రావో తన అంతర్జాతీయ కెరీర్లో 6300 పైచిలుకు పరుగులు సాధించి, 363 వికెట్లు పడగొట్టాడు. బ్రావో 2008 నుంచి 2022 వరకు వివిధ ఫ్రాంచైజీల తరఫున ఐపీఎల్లో ఆడాడు. క్యాష్ రిచ్ లీగ్లో బ్రావో 161 మ్యాచ్లు ఆడి 1560 పరుగులు చేసి 183 వికెట్లు తీశాడు. చదవండి: భారత్తో టెస్ట్ మ్యాచ్.. బంగ్లాదేశ్ వీరాభిమానిపై దాడి.. ఆసుపత్రికి తరలింపు -
నేను హార్డ్ హిట్టర్ని.. వచ్చే వరల్డ్కప్లోనూ ఆడతా!
మరో రెండేళ్ల పాటు తాను అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని వెస్టిండీస్ వెటరన్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ అన్నాడు. మునుపటి కంటే ఇప్పుడే మరింత ఫిట్గా ఉన్నానని.. టీ20 ప్రపంచకప్-2026లోనూ తనను చూస్తారని పేర్కొన్నాడు. తమ కోచ్ డారెన్ సామీ తనను మరికొన్నాళ్లపాటు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాల్సిందిగా కోరాడని.. అలాంటపుడు తానెలా జట్టుకు దూరమవుతానని ప్రశ్నించాడు.హార్డ్ హిట్టర్కాగా 2010లో వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేసిన రసెల్.. టీ20 స్పెషలిస్టుగా గుర్తింపు పొందాడు. జాతీయ జట్టుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పొట్టిలీగ్లలో భాగమవుతూ హార్డ్ హిట్టర్గా పేరొందాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 82 టీ20లు ఆడిన ఈ బౌలింగ్ ఆల్రౌండర్.. 60 వికెట్లు తీయడంతో పాటు 1033 పరుగులు చేశాడు.విధ్వంసకర వీరుడుఇక ఐపీఎల్లో అయితే తనబ్యాటింగ్ తీరుతో విధ్వంసకర వీరుడిగా పేరొందిన ఆండ్రీ రసెల్ 126 మ్యాచ్లలో.. 2484 పరుగులు చేశాడు. ఇందులో 170 ఫోర్లు, 209 సిక్సర్లు ఉన్నాయి. ఇక మొత్తంగా 115 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రైటార్మ్ ఫాస్ట్బౌలర్.ట్రోఫీలు గెలిచిన జట్లలో సభ్యుడుఇక.. వెస్టిండీస్ తరఫున టీ20 ప్రపంచకప్-2012, 2016 ట్రోఫీలు గెలిచిన జట్లలో సభ్యుడైన రసెల్.. చివరగా టీ20 వరల్డ్కప్-2024 సందర్భంగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఐసీసీ టోర్నీలో సౌతాఫ్రికాతో మ్యాచ్లో ఆఖరిగా ఆడాడు. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024తో బిజీగా ఉన్న రసెల్.. ట్రింబాగో నైట్ రైడర్స్కు ఆడుతున్నాడు.ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లలో 207కు పైగా స్ట్రైక్రేటుతో 56 పరుగులు రాబట్టిన రసెల్.. కేవలం ఒకే ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ త్వరలోనే శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ సిరీస్కు తాను అందుబాటులో ఉంటానని 36 ఏళ్ల రసెల్ స్పష్టం చేశాడు.బంతిని బాదగల సత్తా నాకు ఉందిఇండియా టు డేతో మాట్లాడుతూ.. ‘‘2026 వరల్డ్కప్లో నేను కచ్చితంగా ఆడతాను. ఎందుకంటే నాలో క్రికెట్ ఆడగల సత్తా ఇంకా మిగిలే ఉందని మీకు కూడా తెలుసు. నేను ఇప్పటికే అంతర్జాతీయక్రికెట్ నుంచి తప్పుకొని ఉండవచ్చు. అలా చేస్తే యువ ఆల్రౌండర్లకు అవకాశాలు రావచ్చు.అయితే, నేను ఇప్పటికీ బంతిని అనుకున్న చోటకు బాదగలను. అద్భుతమైన పేస్తో బౌలింగ్ చేయగలను. ఇంకా ఫిట్గానే ఉన్నాను. కాబట్టి ఇక్కడితో ఎందుకు ఆగిపోవాలి’’ అంటూ రసెల్ ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడు. తమ కోచ్ ఈ విషయం గురించి తనతో చర్చించాడని.. మరికొన్నాళ్లపాటు విండీస్కు ఆడతానని తెలిపాడు.చదవండి: వీవీఎస్ లక్ష్మణ్ క్యాచ్ డ్రాప్ చేశా.. నా కెరీర్ అంతటితో ఖతం! -
ఐదు వికెట్లతో చెలరేగిన భారీకాయుడు
కరీబియన్ ప్రీమియర్ లీగ్లో క్రికెట్ భారీకాయుడు రకీమ్ కార్న్వాల్ చెలరేగిపోయాడు. బార్బడోస్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించే రకీమ్.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఐదు వికెట్లు తీశాడు. భారీ సిక్సర్లు అలవోకగా కొట్టగలడని పేరున్న రకీమ్ ఈసారి బంతితో సత్తా చాటాడు. FIVE WICKET HAUL FOR RAHKEEM CORNWALL. ⚡🤯- The Magician of Barbados Royals in CPL 2024...!!!! pic.twitter.com/49zUlypBjZ— Johns. (@CricCrazyJohns) September 18, 2024ఈ మ్యాచ్లో రకీమ్ తన కోటా నాలుగు ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. రకీమ్తో పాటు నవీన్ ఉల్ హక్ (4-0-21-3), ఓబెద్ మెక్కాయ్ (2.1-0-11-2) రాణించడంతో పేట్రియాట్స్ 110 పరుగులకే (19.1 ఓవర్లలో) కుప్పకూలింది. పేట్రియాట్స్ ఇన్నింగ్స్లో ఆండ్రీ ఫ్లెచర్ (32), జాషువ డసిల్వ (25), అన్రిచ్ నోర్జే (22), హసరంగ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.కాగా, ప్రస్తుత కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఎడిషన్లో బార్బడోస్ రాయల్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాలుగింట విజయాలు సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. మరోవైపు సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ఈ సీజన్లో పేలవ ప్రదర్శనలు కనబరుస్తూ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో కేవలం ఒక్క దాంట్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సెయింట్ లూసియా కింగ్స్ రెండో స్థానంలో, గయానా అమెజాన్ వారియర్స్ మూడు, ట్రిన్బాగో నైట్రైడర్స్ నాలుగో స్థానంలో, ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ ఐదో స్థానంలో ఉన్నాయి.చదవండి: ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్.. -
చరిత్ర సృష్టించిన హెట్మైర్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024లో గయానా అమెజాన్ వారియర్స్ మరో అద్బుత విజయం సాధించింది. ఈ లీగ్లో భాగంగా గురువారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్తో జరిగిన మ్యాచ్లో 40 పరుగుల తేడాతో అమెజాన్ వారియర్స్ విజయభేరి మోగిచింది.267 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ కిట్స్ 18 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌటైంది. సెయింట్ కిట్స్ ఇన్నింగ్స్లో కెప్టెన్ ఆండ్రీ ఫ్లెచర్(33 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్లతో 81 పరుగులు) అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. మిగితా బ్యాటర్ల నుంచి ఆశించినంత మేర సహకారం అందకపోవడంతో సెయింట్ కిట్స్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. గయానా బౌలర్లలో స్పిన్నర్లు ఇమ్రాన్ తహీర్, మోటీ తలా మూడు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిటోరియస్ రెండు, కిమో పాల్, రిఫర్ చెరో వికెట్ పడగొట్టారు.హెట్మైర్ విధ్వంసం..ఇక తొలుత బ్యాటింగ్ చేసిన గయానా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 266 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గయానా బ్యాటర్లలో షిమ్రాన్ హెట్మైర్ విధ్వంసం సృష్టించాడు. తొలి మ్యాచ్లో నిరాశపరిచిన హెట్మైర్.. ఈ మ్యాచ్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. 39 బంతులు ఎదుర్కొన్న ఈ కరేబియన్ ఆటగాడు 11 సిక్స్లు సాయంతో 91 పరుగులు చేశాడు.అతడితో పాటు గుర్బాజ్ 69 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.హెట్మైర్ వరల్డ్ రికార్డు..ఇక ఈ మ్యాచ్లో విధ్వంసం సృష్టించిన హెట్మైర్ ఓ వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో ఒక్క ఫోర్ కూడా కొట్టకుండా పదికి పైగా సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్గా హెట్మైర్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్లో 11 సిక్స్లు బాదిన హెట్మైర్ కనీసం ఒక్క ఫోరు కూడా కొట్టకపోవడం విశేషం. అంతకుముందు ఫోరు కూడా లేకుండా అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు ఇంగ్లండ్ ఇంగ్లండ్ ఆటగాడు రికీ వెసెల్స్ పేరిట ఉండేది. 2019లో టీ20 బ్లాస్ట్ మ్యాచ్లో నాటింగ్హామ్షైర్పై రికీ వెసెల్స్ బౌండరీ లేకుండా 9 సిక్సర్లు బాదాడు. Shimron Hetmyer is today's Dream11 MVP. pic.twitter.com/dKFLBJoAmp— CPL T20 (@CPL) September 5, 2024 -
బ్రావో 'ది ఛాంపియన్'.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
వెస్టిండీస్ నుంచి ఎంతో మంది ఆటగాళ్లు క్రికెట్ ప్రపంచాన్ని జయించారు. అందులో ఒకడే దిగ్గజ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా పేరు గాంచాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు వీరుడుగా నిలిచాడు. తన విరోచిత పోరాటాలతో విండీస్కు రెండు వరల్డ్కప్లను అందిచాడు. తన ప్రదర్శనతో, డ్యాన్స్లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అతడు కరేబియన్ అయినప్పటకి భారత్లో కూడా ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు.అయితే ఇకపై బ్రావో డ్యాన్స్లు మైదానంలో కన్పించవు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఈ వెస్టిండీస్ దిగ్గజం.. ఇప్పుడు ప్రొఫెషనల్ క్రికెట్కు కూడా గుడ్బై చెప్పేశాడు. ఎక్కడైతే తన కెరీర్ మొదలైందో అక్కడే ముగించనున్నాడు. సొంత ప్రజలముందే సగర్వంగా తనకు ఇష్టమైన ఆటనుంచి తప్పకోనున్నాడు. ఈ ఏడాది కరీబియన్ ప్రీమియర్ లీగ్తో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు బ్రావో వెల్లడించాడు. ఈ నేపథ్యంలో బ్రావో తన టీ20 క్రికెట్ జర్నీపై ఓ లుక్కే ద్దాం.టీ20 స్పెషలిస్టు.. విండీస్ హీరోబ్రావో ఒక టీ20 స్పెషలిస్టు. 2006లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బ్రావో.. తన బౌలింగ్, బ్యాటింగ్తో విండీస్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. మఖ్యంగా 2012, 2016 టీ20 ప్రపంచకప్లను వెస్టిండీస్ సొంతం చేసుకోవడంలో బ్రావోది కీలక పాత్ర. ఈ రెండు మెగా టోర్నీల్లో బ్రావో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు.విండీస్కే కాకుండా ఫ్రాంచైజీ క్రికెట్లో సైతం తన మార్క్ చూపించాడు. ఐపీఎల్లో కూడా దుమ్ములేపాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలకు ఈ కరేబియన్ ధీరుడు ప్రాతినిథ్యం వహించాడు. సీఎస్కే తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డు ఇప్పటకీ బ్రావో(154) పేరిటే ఉంది.స్లోయర్ బాల్స్ స్పెషలిస్టు..బ్రావో హార్డ్ హిట్టింగ్ స్కిల్స్తో పాటు అద్బుతమైన బౌలింగ్ నైపుణ్యాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్లోయర్ బాల్స్తో ప్రత్యర్ధి బ్యాటర్లను బోల్తా కొట్టించడం బ్రావో స్పెషాలిటీ. అంతేకాకుండా డెత్ ఓవర్ స్పెషలిస్టుగా బ్రావో పేరు గాంచాడు. ఇవన్నీ అతడిని టీ20 క్రికెట్లో విలువైన ఆస్తిగా మార్చాయి.2021లో గుడ్బైబ్రావో తన కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2021 టీ20 వరల్డ్కప్ లో ఆస్ట్రేలియాపై ఆడాడు. అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలికాడు. తన చివరి సహచర ఆటగాళ్లు, ఆసీస్ క్రికెటర్ల నుంచి బ్రావో గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించాడు. తన ఇంటర్ననేషనల్ కెరీర్లో 295 మ్యాచ్ల్లో విండీస్కు బ్రావో ప్రాతినిథ్యం వహించాడు. టీ20ల్లో రికార్డు అదుర్స్..టీ20 క్రికెట్ చరిత్రలో బ్రావోకు ఘనమైన రికార్డులు ఉన్నాయి. అంతర్జాతీయ మ్యాచ్లు, లీగ్లు సహా మొత్తం 578 టీ20 మ్యాచ్లు ఆడిన అతడు ఏకంగా 630 వికెట్లు పడగొట్టాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో బ్రావో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. టీ20 క్రికెట్లో 630 వికెట్లతో పాటు అతడు 6,970 పరుగులు కూడా చేశాడు.ఛాంపియన్ డ్యాన్స్..బ్రావో "ఛాంపియన్ డ్యాన్స్ వరల్డ్ క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. వికెట్ తీసినా ప్రతీసారి మైదానంలో డ్యాన్స్ చేస్తూ బ్రావో సెలబ్రేషన్స్ చేసుకుంటాడు. ఇది 2016 టీ20 వరల్డ్కప్ నుంచి బ్రావో ఈ విధంగా డ్యాన్స్ సెలబ్రేషన్స్ చేస్తున్నాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన విండీస్ దిగ్గజం
విండీస్ దిగ్గజ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో ప్రొఫెషనల్ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ ప్రొఫెషనల్ క్రికెట్లో తనకు చివరి టోర్నీ అని ఇన్స్టా వేదికగా వెల్లడించాడు. 40 ఏళ్ల బ్రావో ఇదివరకే అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికాడు. బ్రావో సీపీఎల్లో ట్రిన్బాగో నైట్రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. బ్రావో టీ20ల్లో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. 2006 నుంచి ప్రొఫెషనల్ టీ20లు ఆడుతున్న బ్రావో తన కెరీర్లో మొత్తం 579 మ్యాచ్లు ఆడి 630 వికెట్లు పడగొట్టాడు. పొట్టి క్రికెట్ చరిత్రలో బ్రావోతో పాటు రషీద్ ఖాన్ మాత్రమే 600 వికెట్ల మైలురాయిని దాటాడు. View this post on Instagram A post shared by Dwayne Bravo aka SIR Champion🏆🇹🇹 (@djbravo47)బ్రావో తన రిటైర్మెంట్ సందేశంలో ఇలా రాసుకొచ్చాడు. "ఇది ఓ గొప్ప ప్రయాణం. ఈ రోజు నేను కరీబియన్ ప్రీమియర్ లీగ్ నుండి రిటైర్మెంట్ను ప్రకటించాలనుకుంటున్నాను. ఈ సీజన్ నా చివరిది. కరీబియన్ ప్రజల ముందు నా చివరి ప్రొఫెషనల్ టోర్నమెంట్ ఆడేందుకు ఎదురు చూస్తున్నాను. ట్రిన్బాగో నైట్రైడర్స్ను ఉద్దేశిస్తూ.. ఎక్కడైతే మొదలు పెట్టానో, అక్కడే ముగించాలని కోరుకుంటున్నాను.కాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని క్రికెట్ లీగ్ల్లో పాల్గొన్న బ్రావో.. వెస్టిండీస్ తరఫున 40 టెస్ట్లు, 164 వన్డేలు, 91 టీ20లు ఆడాడు. ఇందులో దాదాపు 6500 పరుగులు చేసి 363 వికెట్లు తీశాడు. బ్రావో ఖాతాలో 5 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్రావో అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్లోనూ సత్తా చాటాడు. అతను వివిధ ఫ్రాంచైజీల తరఫున 161 మ్యాచ్లు ఆడి 1560 పరుగులు చేసి, 183 వికెట్లు తీశాడు. -
టీ20 వరల్డ్కప్ కోసం విండీస్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ రీఎంట్రీ
మహిళల టీ20 వరల్డ్కప్ కోసం వెస్టిండీస్ జట్టును నిన్న (ఆగస్ట్ 29) ప్రకటించారు. ఈ జట్టులో స్టార్ ప్లేయర్ డియాండ్రా డొట్టిన్కు చోటు కల్పించారు. 2022లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన డొట్టిన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని తిరిగి జట్టులో చేరింది. మహిళల టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు డొట్టిన్ పేరిట ఉంది. విండీస్ జట్టుకు హేలీ మాథ్యూస్ సారథ్యం వహించనుంది. మొత్తం 15 మంది సభ్యుల బృందాన్ని ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేశారు. ఇటీవల శ్రీలంకలో పర్యటించిన జట్టులో నాలుగు మార్పులు చేశారు విండీస్ సెలెక్టర్లు. డొట్టిన్తో పాటు అష్మిని మునిసర్, మ్యాండీ మంగ్రూ, అన్క్యాప్డ్ ప్లేయర్ నెరిస్సా క్రాఫ్టన్లను కొత్తగా జట్టులోకి వచ్చారు. శ్రీలంక టూర్లో ఆడిన చెర్రీ ఫ్రేసర్, రషాదా విలియమ్స్, షబిక గజ్నబీ, కేట్ విల్మాట్ స్థానాల్లో వీరికి అవకాశం లభించింది.కాగా, 2016 ఎడిషన్ ఛాంపియన్స్ అయిన వెస్టిండీస్.. త్వరలో ప్రారంభంకాబోయే వరల్డ్కప్లో గ్రూప్-బిలో పోటీపడనుంది. ఈ గ్రూప్లో బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. విండీస్.. అక్టోబర్ 4న సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్తో తమ వరల్డ్కప్ క్యాంపెయిన్ ప్రారంభించనుంది.వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్), షెమైన్ కాంప్బెల్, ఆలియా అలెన్, అఫీ ఫ్లెచర్, అష్మిని మునిసర్, చెడీన్ నేషన్, చినెల్ హెన్రీ, డియాండ్రా డొట్టిన్, కరిష్మా రామ్హారక్, మ్యాండీ మంగ్రూ, నెరిస్సా క్రాఫ్టన్, క్వియానా జోసఫ్, షమీలియా కానెల్, స్టెఫానీ టేలర్, జైదా జేమ్స్ -
రిటైర్మెంట్ ప్రకటించిన విండీస్ ఫాస్ట్ బౌలర్
వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షానన్ గాబ్రియెల్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతను ఇన్స్టా వేదికగా వెల్లడించాడు. 36 ఏళ్ల షానన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగినా క్లబ్, ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. 2010 దశకంలో షానన్కు విండీస్ ఫాస్ట్ బౌలర్గా మంచి గుర్తింపు ఉండింది. 2012-23 మధ్యలో అతను 59 టెస్ట్లు, 25 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. షానన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్తో పోలిస్తే టెస్ట్ల్లో బాగా రాణించాడు. షానన్ టెస్ట్ల్లో 166 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 6 ఐదు వికెట్ల ఘనతలు ఉన్నాయి. షానన్ వన్డేల్లో 33, టీ20ల్లో 3 వికెట్లు తీశాడు. షానన్ తన రిటైర్మెంట్ సందేశంలో ఇలా రాసుకొచ్చాడు. 12 ఏళ్ల కెరీర్లో విండీస్ క్రికెట్ కోసం నన్ను నేను అంకితం చేసుకున్నాను. తనకెంతో ఇష్టమైన క్రీడను అత్యున్నత స్థాయిలో ఆడటం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అన్ని మంచి విషయాలు ఏదో ఒక రోజు ముగియాలి. తన రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం అని భావించి వీడ్కోలు పలుకుతున్నాను. సుదీర్ఘ ప్రయాణంలో తనకు తోడుగా ఉండి సహకరించిన వారందకీ ధన్యవాదాలు అని షానన్ తన రిటైర్మెంట్ సందేశంలో రాసుకొచ్చాడు. కాగా, షానన్ 2012లో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ మ్యాచ్తో విండీస్ తరఫున అరంగేట్రం చేశాడు. అతను గతేడాది భారత్తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. -
సిక్సర్ల వర్షం కురిపించిన పూరన్.. సౌతాఫ్రికాను క్లీన్ స్వీప్ చేసిన వెస్టిండీస్
సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను వెస్టిండీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. నిన్న (ఆగస్ట్ 27) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో విండీస్ డక్వర్త్ లూయిస్ పద్ధతిన 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలుకావడంతో మ్యాచ్ను అక్కడితో ఆపేశారు. అనంతరం వర్షం తగ్గుముఖం పట్టాక డక్వర్త్ లూయిస్ పద్ధతిన విండీస్ లక్ష్యాన్ని 13 ఓవర్లలో 116 పరుగులుగా నిర్ధారించారు. 116 పరుగుల లక్ష్యాన్ని విండీస్ కేవలం 9.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.రాణించిన షెపర్డ్తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. రికెల్టన్ (27), మార్క్రమ్ (20), ట్రిస్టన్ స్టబ్స్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు వికెట్లు తీసి రాణించాడు. అకీల్ హొసేన్, మాథ్యూ ఫోర్డ్ తలో వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో రీజా హెండ్రిక్స్ దుబారాగా బంతులు వేస్ట్ చేశాడు. హెండ్రిక్స్ 20 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. ఆఖర్లో స్టబ్స్ వేగంగా పరుగులు చేయడంతో సౌతాఫ్రికా 100 పరుగుల మార్కును దాటగలిగింది. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ తన కోటా రెండు ఓవర్లలో ఓ మెయిడిన్ వేశాడు.సిక్సర్ల వర్షం కురిపించిన పూరన్109 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. నికోలస్ పూరన్ (13 బంతుల్లో 35; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (24 బంతుల్లో 42 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), షిమ్రోన్ హెట్మైర్ (17 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో సునాయాసంగా విజయతీరాలకు చేరింది. ఈ సిరీస్లోని మూడు మ్యాచ్లలో పూరన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ సిరీస్లో అతను 205.17 స్ట్రయిక్రేట్తో 12 సిక్సర్లు బాదాడు. -
రెచ్చిపోయిన పేసర్లు.. వరుసగా రెండో మ్యాచ్లో విండీస్ విజయం.. సిరీస్ కైవసం
టరౌబా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. షాయ్ హోప్ (41), రోవ్మన్ పావెల్ (35), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (29), అలిక్ అథనాజ్ (28) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా.. విండీస్ పేసర్లు రొమారియో షెపర్డ్ (4-0-15-3), షమార్ జోసఫ్ (4-0-31-3), అకీల్ హొసేన్ (4-0-25-2), మాథ్యూ ఫోర్డ్ (2.4-0-25-1) ధాటికి 19.4 ఓవర్లలో 149 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో రీజా హెండ్రిక్స్ (44), ట్రిస్టన్ స్టబ్స్ (28), ఎయిడెన్ మార్క్రమ్ (19), ర్యాన్ రికెల్టన్ (20), రస్సీ వాన్ డర్ డస్సెన్ (17) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ గెలుపుతో వెస్టిండీస్ మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. పూరన్ మెరుపులతో విండీస్ తొలి మ్యాచ్లో విజయం సాధించింది. నామమాత్రపు మూడో టీ20 ఆగస్ట్ 27న ఇదే వేదికగా జరుగనుంది. కాగా, టీ20 సిరీస్కు ముందు వెస్టిండీస్, సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగగా.. ఈ సిరీస్ను సౌతాఫ్రికా 1-0 తేడాతో కైవసం చేసుకుంది. -
వెస్టిండీస్ విజయ లక్ష్యం 263
ప్రొవిడెన్స్: రెండో టెస్టు మ్యాచ్లో వెస్టిండీస్కు దక్షిణాఫ్రికా 263 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో 25 ఓవర్లు ముగిసే సరికి విండీస్ 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. అంతకు ముందు దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్లో 246 పరుగులకు ఆలౌటైంది. కైల్ వెరీన్ (59), ఎయిడెన్ మార్క్రమ్ (51), టోనీ జోర్జీ (39), వియాన్ ముల్డర్ (34) కీలక పరుగులు సాధించారు. విండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ (6/61) ఆరు వికెట్లతో ప్రత్యరి్థని దెబ్బ తీయగా...వారికాన్, గుడకేశ్ మోతీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. -
దక్షిణాఫ్రికా ఆధిపత్యం
ప్రొవిడెన్స్: వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. రెండో ఇన్నింగ్స్లో 26 ఓవర్లలో వికెట్ నష్టానికి 93 పరుగులు చేసింది. దాంతో దక్షిణాఫ్రికా ఆధిక్యం 109 పరుగులకు చేరింది. టోనీ జోర్జి (39) రాణించాడు. అంతకు ముందు దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్లో 16 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. సఫారీ బౌలర్ల ధాటికి వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 144 పరుగులకే ఆలౌటైంది. జేసన్ హోల్డర్ (88 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరిపోరాటం చేసి అర్ధసెంచరీ సాధించాడు. వియాన్ ముల్డర్ (4/32), బర్గర్ (3/49), కేశవ్ మహరాజ్ (2/8) విండీస్ను దెబ్బ తీశారు. దక్షిణాఫ్రికా కూడా తమ తొలి ఇన్నింగ్స్లో 97 పరుగుల వద్దే 9వ వికెట్ కోల్పోయినా...డీన్ పీట్ (38 నాటౌట్), బర్గర్ (23) కలిసి 63 పరుగుల చివరి వికెట్ భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. -
కుప్పకూలిన దక్షిణాఫ్రికా
ప్రొవిడెన్స్: వెస్టిండీస్ పేసర్ల ధాటికి రెండో టెస్టులో దక్షిణాఫ్రికా బ్యాటర్లు తడబడ్డారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు... విండీస్ బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.షామర్ జోసెఫ్ (5/33), జైడెన్ సీల్స్ (3/41) ధాటికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 47 ఓవర్లలో 134 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. డేవిడ్ బెడింగ్హమ్ (28), ట్రిస్టన్ స్టబ్స్ (26), కైల్ వెరినె (21) ఓ మాదిరిగా ఆడగా.. కెపె్టన్ తెంబా బవుమా (0), మార్క్రమ్ (14), టోనీ డి జోర్జి (1), ముల్డర్ (0), కేశవ్ మహరాజ్ (0) విఫలమయ్యారు. -
వెస్టిండీస్తో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. ఫాస్ట్ బౌలింగ్ సంచలనం ఎంపిక
వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (ఆగస్ట్ 14) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా ఎయిడెన్ మార్క్రమ్ ఎంపికయ్యాడు. అన్క్యాప్డ్ ప్లేయర్, ఫాస్ట్ బౌలింగ్ సంచలనం క్వేనా మపాకా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్కు సీనియర్లు రబాడ, నోర్జే, డికాక్, క్లాసెన్లను పరిగణలోకి తీసుకోలేదు దక్షిణాఫ్రికా సెలెక్టర్లు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కారణంగా వీరికి విశ్రాంతి కల్పించినట్లు తెలుస్తుంది. మపాకాతో పాటు మరో అన్క్యాప్డ్ ప్లేయర్ జేసన్ స్మిత్ను ఎంపిక చేశారు సెలెక్టర్లు. స్మిత్ ఇటీవల ముగిసిన సీఎస్ఏ టీ20 ఛాలెంజ్ టోర్నీలో 41.57 సగటున 291 పరుగులు చేశాడు. స్మిత్ పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. మపాకా విషయానికొస్తే.. ఈ ఫాస్ట్ బౌలింగ్ సంచలనం ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అండర్-19 వరల్డ్కప్లో విశేషంగా రాణించాడు. ఆ టోర్నీలో అతను 21 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఈ ప్రదర్శన కారణంగా మాపాకా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఎంపికయ్యాడు. టీ20 వరల్డ్కప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి తర్వాత దక్షిణాఫ్రికా ఆడనున్న మొట్టమొదటి టీ20 సిరీస్ ఇదే.వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు దక్షిణాఫ్రికా జట్టు..ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఓట్నీల్ బార్ట్మన్, నండ్రే బర్గర్, డొనోవన్ ఫెరియెరా, జోర్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, ప్యాట్రిక్ క్రూగర్, క్వేనా మపాకా, వియాన్ ముల్దర్, లుంగి ఎంగిడి, ర్యాన్ రికెల్టన్, జేసన్ స్మిత్, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్డర్ డస్సెన్, లిజాడ్ విలియమ్స్ -
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టిక ఇలా..!
వెస్టిండీస్, సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టిక ఇలా ఉంది. ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పులేమీ జరగలేదు. వెస్టిండీస్ తొమ్మిదో స్థానంలో.. సౌతాఫ్రికా ఏడో స్థానంలో కొనసాగుతున్నాయి. తొమ్మిది మ్యాచ్ల్లో ఆరు విజయాలు సాధించిన భారత్ పాయింట్ల పట్టికలో టాప్లో ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి.Here’s the updated World Test Championship (WTC) points table following the draw in the first Test between the West Indies and South Africa in Port of Spain. pic.twitter.com/tpVGXbhAZd— CricTracker (@Cricketracker) August 12, 2024ఇదిలా ఉంటే, వెస్టిండీస్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ పిచ్, వాతావరణం కారణంగా డ్రాగా ముగిసింది. చివరి రోజు 298 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ మ్యాచ్ ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అలిక్ అథనాజ్ (92) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి విండీస్ను ఓటమి బారి నుంచి తప్పించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 357 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్లో 173 పరుగులు చేసింది. అనంతరం విండీస్ తొలి ఇన్నింగ్స్లో 233, రెండో ఇన్నింగ్స్లో 201 పరుగులు చేసింది. చివరి రోజు విండీస్ బ్యాటర్లు సంయమనంతో బ్యాటింగ్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
వరుస ఫలితాల పరంపరకు బ్రేక్
టెస్ట్ క్రికెట్లో వరుస ఫలితాల పరంపరకు బ్రేక్ పడింది. సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య నిన్న ముగిసిన మ్యాచ్ డ్రా కావడంతో టెస్ట్ల్లో వరుస ఫలితాలకు ఎండ్ కార్డ్ పడింది. గతేడాది జులైలో చివరిగా ఓ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మళ్లీ ఇన్నాళ్లకు మరో మ్యాచ్ డ్రా అయ్యింది. ఈ మధ్యలో 28 టెస్ట్ మ్యాచ్ల్లో ఫలితాలు తేలాయి. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వరుసగా ఇన్ని మ్యాచ్ల్లో ఫలితం తేలడం ఇదే మొదటిసారి. డ్రాకు డ్రాకు మధ్య అత్యధిక ఫలితాల రికార్డు గతంలో 23గా ఉండింది. మే, 2022- డిసెంబర్, 2022 మధ్యలో 23 మ్యాచ్ల్లో ఫలితాలు తేలాయి. దీనికి ముందు పలు సందర్భాల్లో డ్రాకు డ్రాకు మధ్యలో 20కిపైగా మ్యాచ్ల్లో ఫలితాలు తేలాయి.ఇదిలా ఉంటే, వెస్టిండీస్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ పిచ్, వాతావరణం కారణంగా డ్రాగా ముగిసింది. చివరి రోజు 298 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ మ్యాచ్ ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అలిక్ అథనాజ్ (92) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి విండీస్ను ఓటమి బారి నుంచి తప్పించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 357 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్లో 173 పరుగులు చేసింది. అనంతరం విండీస్ తొలి ఇన్నింగ్స్లో 233, రెండో ఇన్నింగ్స్లో 201 పరుగులు చేసింది. చివరి రోజు విండీస్ బ్యాటర్లు సంయమనంతో బ్యాటింగ్ చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన మాజీ క్రికెటర్ కొడుకు
పారిస్ ఒలింపిక్స్లో వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ విన్స్టన్ బెంజమిన్ కొడుకు రాయ్ బెంజమిన్ గోల్డ్ మెడల్ సాధించాడు. విశ్వక్రీడల్లో యూఎస్ఏకు ప్రాతినిథ్యం వహించిన రాయ్.. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్లో 46.46 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో రాయ్ ప్రపంచ రికార్డు హోల్డర్, నార్వేకు చెందిన కార్స్టన్ వార్హోమ్ను ఓడించి పసిడి పతకం నెగ్గాడు.రాయ్ ఒలింపిక్స్ స్వర్ణం సాధించడం పట్ల తండ్రి విన్స్టన్ ఎనలేని ఆనందం వ్యక్తం చేశాడు. తన కొడుకు సాధించిన విజయాన్ని విన్స్టన్ ప్రపంచ కప్ ఫైనల్ గెలుపుతో పోల్చాడు. రాయ్ ఈ విజయం సాధించడానికి ఎంతో కష్టపడ్డాడని విన్స్టన్ తెలిపాడు. రాయ్ విజయం యునైటెడ్ స్టేట్స్కే కాకుండా తాను పుట్టి పెరిగిన ఆంటిగ్వాకు కూడా కీర్తి ప్రతిష్టలు తెచ్చిందని విన్స్టన్ అన్నాడు.59 ఏళ్ల విన్స్టన్ 80, 90 దశకాల్లో వెస్టిండీస్ తరఫున 21 టెస్ట్లు, 85 వన్డేలు ఆడి 161 వికెట్లు తీశాడు. లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ కూడా అయిన విన్స్టన్ టెస్ట్ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. 27 ఏళ్ల రాయ్ బెంజమిన్.. విన్స్టన్ ఆరుగురు సంతానంలో ఒకరు. రాయ్ టోక్యో ఒలింపిక్స్లో రజతం సాధించాడు. చిన్నతనంలో క్రికెట్ పట్ల ఆకర్శితుడైన రాయ్.. ఆతర్వాత మనసు మార్చుకుని ట్రాక్ ఆండ్ ఫీల్డ్ గేమ్స్ వైపు మళ్లాడు. -
113 మీటర్ల భారీ సిక్సర్! (వీడియో)
ది హాండ్రడ్ లీగ్-2024లో వెస్టిండీస్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న నికోలస్ పూరన్ మరోసారి విధ్వంసం సృష్టించాడు.ఆదివారం మాంచెస్టర్ ఒరిజినల్స్తో జరిగిన మ్యాచ్లో పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 153 పరుగుల లక్ష్య చేధనలో మాంచెస్టర్ బౌలర్లను ఈ కరేబియన్ బ్యాటర్ ఊచకోత కోశాడు. 33 బంతులలో 2 ఫోర్లు, 8 సిక్స్లతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్లో పూరన్ ఓ భారీ సిక్సర్ బాదాడు. నార్త్రన్ ఇన్నింగ్స్ 74వ బంతిని స్కాట్ క్యూరీ.. పూరన్కు సరిగ్గా స్లాట్లో సంధించాడు. ఈ క్రమంలో పూరన్ కాస్త క్రీజు నుంచి డీప్గా వెళ్లి మిడ్ వికెట్పై నుంచి 113 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు.అతడి పవర్ బంతి ఏకంగా స్టేడియం బయట పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో మాంచెస్టర్పై నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ విజయం సాధించింది. 🤯 113-METRE 6️⃣ OUT THE GROUND! 🤯Oh, Nicholas Pooran! 🤩#TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/LDayQyjKAT— The Hundred (@thehundred) August 11, 2024 -
రాణించిన రూట్, స్టోక్స్.. తృటిలో సెంచరీ చేజార్చుకున్న స్మిత్
బర్మింగ్హమ్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ టెయిలెండర్లు సత్తా చాటారు. ఫలితంగా ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 376 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (87) కెరీర్లో 63వ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన వికెట్ జేమీ స్మిత్ (95) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. బెన్ స్టోక్స్ (54), క్రిస్ వోక్స్ (62) అర్ద సెంచరీలతో ఆకట్టుకున్నారు. జాక్ క్రాలే 18, బెన్ డకెట్ 3, మార్క్ వుడ్ 0, ఓలీ పోప్ 10, హ్యారీ బ్రూక్ 2 నిరాశపర్చగా.. పదో నంబర్ ఆటగాడు గస్ అట్కిన్సన్ 21 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, జేడన్ సీల్స్ 3, షమార్ జోసఫ్ 2, గుడకేశ్ మోటీ ఓ వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఆలౌటైన అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 61 పరుగులు వెనుకపడి ఉంది. క్రెయిగ్ బ్రాత్వైట్ (0), కిర్క్ మెక్కెంజీ (8) ఔట్ కాగా.. మికైల్ లూయిస్ (18), అలిక్ అథనాజ్ (5) క్రీజ్లో ఉన్నారు. క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 282 పరుగులకు ఆలౌటైంది. క్రెయిగ్ బ్రాత్వైట్ (61), జేసన్ హోల్డర్ (59) అర్ద సెంచరీలతో రాణించగా.. జాషువ డసిల్వ (49) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ 4, క్రిస్ వోక్స్ 3, మార్క్ వుడ్ 2, షోయబ్ బషీర్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో ఇంగ్లండ్ తొలి రెండు టెస్ట్ల్లో విజయం సాధించి, సిరీస్ను ఇదివరకే కైవసం చేసుకుంది. -
తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్
బర్మింగ్హమ్ వేదికగా వెస్టిండీస్తో ఇవాల్టి నుంచి (జులై 26) మొదలయ్యే మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించారు. ఈ జట్టులో ఇంగ్లండ్ ఎలాంటి మార్పులు చేయలేదు. రెండో టెస్ట్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది.కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ జయకేతనం ఎగురవేసింది. తొలి టెస్ట్లో ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో.. రెండో టెస్ట్లో 241 పరుగుల తేడాతో విజయం సాధించింది.విండీస్తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్ -
బెన్ స్టోక్స్ డూప్.. వైరల్ వీడియో
ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ను పోలిన ఓ వ్యక్తి స్టాండ్స్లో తారసపడ్డాడు. సదరు వ్యక్తిని చూసి బెన్ స్టోక్స్ ఆశ్చర్యపోయాడు. గడ్డం, హెయిర్ స్టయిల్, ముఖ ఆకృతి తనలాగే ఉండటంతో స్టోక్స్ కళ్లప్పగించి చూశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.TWO BEN STOKES IN THE TEST MATCH....!!!! 🤯 pic.twitter.com/qU3kQm9Zyy— Johns. (@CricCrazyJohns) July 21, 2024ఇదిలా ఉంటే, రెండో టెస్ట్లో వెస్టిండీస్పై ఇంగ్లండ్ 241 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్లో 425 పరుగులు చేయగా.. విండీస్ తొలి ఇన్నింగ్స్లో 457, రెండో ఇన్నింగ్స్లో 143 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఓలీ పోప్ (121), హ్యారీ బ్రూక్ (109), జో రూట్ (122).. విండీస్ ఆటగాడు కవెమ్ హాడ్జ్ (120) సెంచరీలు చేశారు. సిరీస్లో నామమాత్రపు మూడో టెస్ట్ జులై 26న మొదలవుతుంది. -
ENG VS WI: టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ 241 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్స్ల్లో 400కు పైగా స్కోర్ చేసింది. 147 ఏళ్ల ఇంగ్లీష్ క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం తొలిసారి. ఇదే మ్యాచ్లో విండీస్ సైతం తొలి ఇన్నింగ్స్లో 400కు పైగా స్కోర్ చేసింది.టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి..ఓ టెస్ట్ మ్యాచ్లో ఒకటి, రెండు, మూడు ఇన్నింగ్స్ల్లో 400కు పైగా స్కోర్లు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులు, సెకెండ్ ఇన్నింగ్స్లో 425 పరుగులు చేయగా.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 457, సెకెండ్ ఇన్నింగ్స్లో 143 పరుగులు చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. 385 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఐదేయడంతో (5/41) 143 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో 400కు పైగా స్కోర్ చేయడంతో పాటు 41 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించిన విండీస్.. సెకెండ్ ఇన్నింగ్స్లో చేతులెత్తేసింది. బషీర్తో పాటు క్రిస్ వోక్స్ (2/28), అట్కిన్సన్ (2/49), మార్క్ వుడ్ (1/17) విండీస్ పతనాన్ని శాశించారు. విండీస్ ఇన్నింగ్స్లో క్రెయిగ్ బ్రాత్వైట్ (47), జేసన్ హోల్డర్ (37), మికైల్ లూయిస్ (17), జాషువ డసిల్వ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు.ఈ మ్యాచ్లో గెలుపుతో ఇంగ్లండ్.. మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ (121), సెకెండ్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ (51) చేసిన ఓలీ పోప్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. విండీస్ తొలి ఇన్నింగ్స్లో కవెమ్ హాడ్జ్ (120) సెంచరీతో ఆకట్టుకోగా.. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ (109), జో రూట్ (122) సెంచరీలతో సత్తా చాటారు. -
241 పరుగులతో నెగ్గిన ఇంగ్లండ్
నాటింగ్హమ్: వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు 241 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. నాలుగో రోజు ఇంగ్లండ్ నిర్దేశించిన 385 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో 36.1 ఓవర్లలో 143 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ 41 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి విండీస్ను దెబ్బ తీశాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 248/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 92.2 ఓవర్లలో 425 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (109; 13 ఫోర్లు), జో రూట్ (122; 10 ఫోర్లు) సెంచరీలు సాధించారు. -
స్మిత్, విలియమ్సన్ సరసన రూట్
ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు పట్టు బిగించింది. జో రూట్ (122), హ్యారీ బ్రూక్ (109) శతకాలతో విజృంభించడంతో ఇంగ్లీష్ టీమ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 425 పరుగులు చేసింది. తద్వారా విండీస్ ముందు 385 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.స్మిత్, విలియమ్సన్ సరసన చేరిన రూట్టెస్ట్ల్లో 32వ సెంచరీతో కదంతొక్కన రూట్.. స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ సరసన చేరాడు. స్మిత్, విలియమ్సన్ టెస్ట్ల్లో చెరి 32 సెంచరీలు చేశారు. ఫాబ్ ఫోర్గా పిలువబడే వారిలో స్మిత్, విలియమ్సన్, రూట్ తలో 32 టెస్ట్ సెంచరీలు చేయగా.. కోహ్లి 29 సెంచరీలతో వెనకపడ్డాడు.రూట్ తాజా సెంచరీ ద్వారా సాధించిన రికార్డులు..యాక్టివ్ ప్లేయర్లలో అత్యధిక సెంచరీలు ఇంగ్లండ్ తరఫున రెండో అత్యధిక టెస్ట్ సెంచరీలు (కుక్ 33 సెంచరీలు) యాక్టివ్ ప్లేయర్లలో మూడో అత్యధిక సెంచరీలు (మూడు ఫార్మాట్లలో) (విరాట్ 80, రోహిత్ శర్మ 48, రూట్ 48)టెస్ట్ల్లో తొలిసారిఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో 400 ప్లస్ స్కోర్లు (416 & 425) చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ ఈ ఫీట్ సాధించడం ఇది తొలిసారి. ఓవరాల్గా టెస్ట్ల్లో 12 సార్లు మాత్రమే ఈ ఫీట్ నమోదైంది. ఆస్ట్రేలియా అత్యధికంగా ఆరు సార్లు రెండు ఇన్నింగ్స్ల్లో 400 ప్లస్ స్కోర్లు చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులు చేసింది. ఓలీ పోప్ (121) సెంచరీ చేశాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన విండీస్ తొలి ఇన్నింగ్స్లో 457 పరుగులు చేసింది. కవెమ్ హాడ్జ్ (120) కెరీర్లో తొలి సెంచరీతో కదంతొక్కాడు. 385 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. -
బ్రూక్ సెంచరీ.. రూట్ రికార్డు హాఫ్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్
ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు భారీ ఆధిక్యం దిశగా సాగుతుంది. హ్యారీ బ్రూక్ కెరీర్లో ఐదో శతకం.. సొంతగడ్డపై తొలి శతకం పూర్తి చేసి సత్తా చాటాడు. బ్రూక్ 118 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 109 పరుగుల వద్ద బ్రూక్.. జేడన్ సీల్స్ బౌలింగ్లో వికెట్కీపర్ జాషువ డసిల్వకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బ్రూక్ కేవలం 23 ఇన్నింగ్స్ల్లో ఐదు సెంచరీలు చేయడం విశేషం. బ్రూక్ క్రికెట్లో 14 టెస్ట్లు ఆడి 62.55 సగటున 1376 పరుగులు చేశాడు.బ్రూక్కు జతగా మరో ఎండ్లో బ్యాటింగ్ చేస్తున్న జో రూట్ కెరీర్లో 63వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ విభాగంలో సచిన్ టెండూల్కర్ (68) టాప్లో ఉండగా.. శివ్నరైన్ చంద్రపాల్ (66) రెండో స్థానంలో నిలిచాడు. రూట్.. అలెన్ బోర్డర్, రాహుల్ ద్రవిడ్తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు.హాఫ్ సెంచరీ పూర్తి చేయకముందే రూట్ టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఎనిమిదో స్థానానికి (11869) ఎగబాకాడు. ఈ జాబితాలో సచిన్ (15921) టాప్లో ఉండగా.. పాంటింగ్, కలిస్, ద్రవిడ్, కుక్, సంగక్కర, లారా.. రూట్ కంటే ముందున్నారు.కాగా, నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 300 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రూట్ (80), జేమీ స్మిత్ క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 416 పరుగులు, విండీస్ 457 పరుగులు చేశాయి. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో ఓలీ పోప్ (121), విండీస్ తొలి ఇన్నింగ్స్లో కవెమ్ హాడ్జ్ (120) సెంచరీలు చేశారు. -
విండీస్ ప్లేయర్ భారీ సిక్సర్.. ప్రేక్షకులకు తప్పిన పెను ప్రమాదం
ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మూడో రోజు ఆటలో విండీస్ ఆటగాడు షమార్ జోసఫ్ బాదిన ఓ భారీ సిక్సర్ దెబ్బకు స్టేడియం పైకప్పుపై టైల్స్ బద్దలయ్యాయి.Omg that six by Shamar Joseph broke the roof and part of that roof fell on the spectators unbelievable#WTC25 | 📝 #ENGvWI pic.twitter.com/xU8IMTgF5T— Cinephile (@jithinjustin007) July 20, 2024బద్దలైన టైల్స్ కింద కూర్చున్న ప్రేక్షకులపై పడబోగా వారు తప్పించుకున్నారు. ఒకవేళ ప్రేక్షకులు అప్రమత్తం కాకపోయి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. రూఫ్ కింద కూర్చున్న వారు తీవ్ర గాయాల పాలయ్యేవారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.కాగా, 11వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన షమార్ జోసఫ్ మూడో రోజు ఆటలో చెలరేగిపోయాడు. షమార్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేసి చివరి వికెట్గా వెనుదిరిగాడు. షమార్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా విండీస్కు 41 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్ లభించింది.అంతకుముందు కవెమ్ హాడ్జ్ (120) సెంచరీతో.. అలిక్ అథనాజ్ (82), జాషువ డసిల్వ (82 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించడంతో విండీస్ తొలి ఇన్నింగ్స్లో 457 పరుగులు చేసింది. దీనికి ముందు ఓలీ పోప్ (121) సెంచరీతో.. బెన్ డకెట్ (71), బెన్ స్టోక్స్ (69) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసి 207 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. హ్యారీ బ్రూక్ (71), జో రూట్ (37) క్రీజ్లో ఉన్నారు. -
విండీస్ ప్లేయర్ క్రేజీ సెలెబ్రేషన్స్
ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్ (121) సెంచరీ.. బెన్ డకెట్ (71), బెన్ స్టోక్స్ (69) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 3, జేడన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, కవెమ్ హాడ్జ్ తలో 2, షమార్ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్.. లంచ్ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్వైట్ 48, మికైల్ లూయిస్ 21, కిర్క్ మెక్కెంజీ 11 పరుగులు చేసి ఔట్ కాగా..అలిక్ అథనాజ్ 5, కవెమ్ హాడ్జ్ 1 పరుగుతో క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 2, అట్కిన్సన్ ఓ వికెట్ పడగొట్టారు. వెస్టిండీస్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 327 పరుగులు వెనుకపడి ఉంది.The Crazy Celebration of Kevin Sinclair.🤯- ONE OF THE BEST CELEBRATION IN CRICKET. 🔥 pic.twitter.com/o9OZOwhSWu— Tanuj Singh (@ImTanujSingh) July 19, 2024సింక్లెయిర్ క్రేజీ సెలెబ్రేషన్స్ఈ మ్యాచ్ తొలి రోజు విండీస్ ఆటగాడు కెవిన్ సింక్లెయిర్.. హ్యారీ బ్రూక్ వికెట్ తీసిన ఆనందంలో వినూత్న రీతిలో సంబురాలు చేసుకున్న వైనం సోషల్మీడియాలో వైరలవుతుంది. సింక్లెయిర్.. బ్రూక్ ఔట్ అవ్వగానే గాల్లోకి పల్టీలు కొడుతూ క్రేజీగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. సింక్లెయిర్కు ఇలాంటి సెలబ్రేషన్స్ కొత్తేమీ కాదు. ఆస్ట్రేలియాతో జరిగిన తన తొలి మ్యాచ్లోనూ ఇలాంటి సంబురాలే చేసుకున్నాడు. -
ICC: ఐసీసీకి రూ. 167 కోట్ల నష్టం!.. కారణం ఇదే?
టీ20 ప్రపంచకప్-2024 పొట్టి క్రికెట్ ప్రేమికులకు భిన్నమైన అనుభవాన్ని అందించింది. ఈ ఐసీసీ టోర్నీకి తొలిసారిగా ఆతిథ్యం ఇచ్చిన అమెరికాలోని న్యూయార్క్ పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపించింది.ఫలితంగా పరుగుల ప్రవాహానికి బదులు వికెట్ల జాతర జరిగింది. న్యూయార్క్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నసావూ కౌంటీ స్టేడియంలోని డ్రాప్ ఇన్ పిచ్ వల్ల మ్యాచ్లన్నీ.. టీ20 ఫార్మాట్కు పూర్తి భిన్నంగా జరిగాయనే చెప్పవచ్చు.ముఖ్యంగా యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్కు కూడా ఇదే వేదిక కావడం గమనార్హం. అయితే, మరో వేదిక వెస్టిండీస్లో మాత్రం మెరుగైన స్కోర్లు నమోదయ్యాయి.ఇక ఐసీసీ ఈవెంట్లో టీమిండియా చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్కప్-2024 టోర్నీ కి సంబంధించిన సంచలన వార్త తెరమీదకు వచ్చింది.ఐసీసీకి రూ. 167 కోట్ల నష్టం!.. కారణం ఇదే?ఈ టోర్నీ అంతర్జాతీయ క్రికెట్ మండలికి నష్టాన్ని మిగిల్చిందని దాని సారాంశం. క్రికెట్కు పెద్దగా ఆదరణ లేని అమెరికాలో ఈ మెగా ఈవెంట్ను నిర్వహించడం వల్ల దాదాపు రూ. 167 కోట్ల(భారత కరెన్సీలో) నష్టం వచ్చిందని వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది.ఈ విషయం గురించి ఐసీసీ వార్షిక సమావేశంలో చర్చకు రానుందని తెలిపింది. కొలంబో వేదికగా శుక్రవారం ఈ మీటింగ్ జరుగనుంది.అయితే, వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా చర్చింననున్న తొమ్మిది పాయింట్ల ఎజెండాలో ఈ పాయింట్ లేకపోయినా.. పోస్ట్ ఈవెంట్ రిపోర్టుకు సంబంధించిన నివేదిక మాత్రం తయారు చేసినట్లు పీటీఐ పేర్కొంది.కొత్త చైర్మన్ ఎవరు?ఇక ఈ ఈవెంట్లో ప్రధానంగా ఐసీసీ కొత్త చైర్మన్ నియామకం గురించి కూడా చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయని పీటీఐ వెల్లడించింది. గ్రెగ్ బార్క్లే స్థానంలో బీసీసీఐ కార్యదర్శి జై షా నియామకం, దాని పర్యావసనాల గురించి చర్చ జరుగనున్నట్లు పేర్కొంది.అదే విధంగా.. ఐసీసీ చైర్మన్ పదవీకాలానికి సంబంధించి మార్పులు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిపింది. చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తి అత్యధికంగా మూడు దఫాలు రెండేళ్ల చొప్పున కొనసాగవచ్చు. అయితే, తాజాగా దీనిని రెండు దఫాలు.. మూడేళ్ల చొప్పున కొనసాగేట్లు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది.చదవండి: అతడు కెప్టెన్ నమ్మకాన్ని కోల్పోయాడు.. అందుకే జట్టుకు దూరం! -
నేటి నుంచి ఇంగ్లండ్, విండీస్ రెండో టెస్టు... వుడ్కు చోటు
వెస్టిండీస్ జట్టుతో నేడు నాటింగ్హామ్లో మొదలయ్యే రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. లార్డ్స్లో జరిగిన తొలి టెస్టు తర్వాత ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో అండర్సన్ స్థానంలో రెండో టెస్టు కోసం మరో పేస్ బౌలర్ మార్క్ వుడ్కు ఇంగ్లండ్ తుది జట్టులో చోటు లభించింది. 34 ఏళ్ల మార్క్ వుడ్ ఇప్పటి వరకు 34 టెస్టులు ఆడి 108 వికెట్లు పడగొట్టాడు. మూడు టెస్టుల సిరీస్లో ఇంగ్లండ్ తొలి మ్యాచ్లో ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో గెలిచింది. -
ఇంగ్లండ్తో రెండో టెస్ట్.. విండీస్ తుది జట్టు ప్రకటన
ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం వెస్టిండీస్ తుది జట్టును ఇవాళ (జులై 17) ప్రకటించారు. ఈ మ్యాచ్ కోసం విండీస్ ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి టెస్ట్లో ఆడిన జట్టునే ఈ మ్యాచ్లోనూ కొనసాగించనుంది.ఇంగ్లండ్ తమ తుది జట్టును నిన్ననే ప్రకటించింది. ఆండర్సన్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ ఆడబోయే తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో గెలుపొందింది.లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో సత్తా చాటింది. అరంగేట్రం పేసర్ గస్ అట్కిన్సన్ ఈ మ్యాచ్లో చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్లో ఏడు, సెకెండ్ ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో అదరగొట్టాడు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిన ఆండర్సన్ పర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్లో ఒకటి, సెకెండ్ ఇన్నింగ్స్లో మూడు వికెట్లు పడగొట్టాడు.ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన మరో ఆటగాడు జేమీ స్మిత్ బ్యాటింగ్, వికెట్కీపింగ్లో ఆకట్టుకున్నాడు. జేమీ డెబ్యూ ఇన్నింగ్స్లో 70 పరుగులు చేయడంతో పాటు మ్యాచ్లో నాలుగు క్యాచ్లు అందుకున్నాడు. జేమీతో పాటు జాక్ క్రాలే, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్ హాఫ్ సెంచరీలు చేయడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 371 పరుగులు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. అట్కిన్సన్ ధాటికి తొలి ఇన్నింగ్స్లో 121 పరుగులకు.. సెకెండ్ ఇన్నింగ్స్లో 136 పరుగులకు ఆలౌటైంది. రేపటి టెస్ట్ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్వెస్టిండీస్ ప్లేయింగ్ XI: క్రెయిగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), మికిల్ లూయిస్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జాషువా డ సిల్వా (వికెట్కీపర్), జేసన్ హోల్డర్, గుడకేష్ మోటీ, అల్జరీ జోసెఫ్, షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్ -
సచిన్, నేనూ కాదు.. అత్యుత్తమ క్రికెటర్ అతడే: లారా
క్రికెట్ ప్రపంచంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్, వెస్టిండీస్ లెజెండ్ బ్రియన్ లారా రికార్డుల రారాజులుగా వెలుగొందారు. తమ తరంలోని ఆటగాళ్లకు సాధ్యం కాని అరుదైన ఘనతలెన్నో సాధించారు.అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాల వీరుడిగా సచిన్ చెక్కు చెదరని రికార్డుని సొంతం చేసుకుంటే.. టెస్టుల్లో క్వాడ్రపుల్ సెంచరీ(400) బాది రికార్డుల్లో తన పేరును పదిలం చేసుకున్నాడు లారా.ఇక ఈ ఇద్దరు దిగ్గజాలు పరస్పరం గౌరవ, మర్యాదలతో మెలగడమే కాకుండా చిరకాల స్నేహితులుగా కూడా కొనసాగుతున్నారు. సందర్భం వచ్చినపుడల్లా సచిన్పై ప్రశంసలు కురిపించే బ్రియన్ లారా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.తామిద్దరి కంటే కూడా అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడు వేరొకరు ఉన్నారంటూ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. లారా చెప్పిన క్రికెటర్ మరెవరో కాదు ఆల్రౌండర్ కార్ల్ హూపర్. విండీస్ మాజీ కెప్టెన్.ఈ విషయం గురించి తన పుస్తకంలో ప్రస్తావించిన లారా.. ‘‘కార్ల్ వంటి అత్యుత్తమ ఆటగాడిని నేను ఇంత వరకు చూడలేదు. టెండుల్కర్ గానీ, నేను గానీ ప్రతిభ విషయంలో అతడికి దరిదాపుల్లో కూడా లేమంటే అతిశయోక్తి కాదు.కెప్టెన్గానూ కార్ల్ కెరీర్ ఎంతో మెరుగ్గా ఉంది. సారథిగా ఉన్న సమయంలోనూ సగటున 50కి పైగా పరుగులు సాధించాడు. నిజానికి వివియన్ రిచర్ట్స్కి నాకంటే కూడా కార్ల్ అంటేనే ఎక్కువ ఇష్టం.అతడి ఆటను ఇష్టపడేవాడు. తనపైనే ప్రేమను కురిపించేవాడు’’ అని పేర్కొన్నాడు. కాగా 1987- 2003 మధ్య కాలంలో వెస్టిండీస్కు ప్రాతినిథ్యం వహించాడు కార్ల్ హూపర్.కుడిచేతి వాటం కలిగిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. కెరీర్లో మొత్తంగా 102 టెస్టులు ఆడిన హూపర్ 5762 పరుగులు సాధించాడు. ఇందులో 13 శతకాలతో పాటు ఒక డబుల్ సెంచరీ ఉంది. ఇక 114 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక 227 వన్డేల్లో ఏడు సెంచరీల సాయంతో 5761 రన్స్ చేసిన కార్ల్ హూపర్.. 193 వికెట్లు పడగొట్టాడు. కాగా 1999 వరల్డ్కప్ టోర్నీకి ముందు రిటైర్మెంట్ ప్రకటించిన హూపర్.. 2001లో కెప్టెన్గా రీఎంట్రీ ఇవ్వడం గమనార్హం. 22 టెస్టుల్లో విండీస్కు అతడు సారథిగా వ్యవహరించాడు.కెప్టెన్ కాకముందు హూపర్ బ్యాటింగ్ సగటు 36.46గా ఉంటే.. నాయకుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత 46కు పైగా ఉండటం విశేషం. ఈ నేపథ్యంలోనే లారా హూపర్ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. -
వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో పాకిస్తాన్
పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (జులై 12) సాయంత్రం జరిగిన తొలి సెమీస్లో పాక్ టీమ్.. వెస్టిండీస్ ఛాంపియన్స్పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్లో కెప్టెన్ యూనిస్ ఖాన్ (65), కమ్రాన్ అక్మల్ (46), ఆమెర్ యామిన్ (40 నాటౌట్), సోహైల్ తన్వీర్ (33) సత్తా చాటగా.. షాహిద్ అఫ్రిది (1), షోయబ్ మాలిక్ (0), మిస్బా ఉల్ హక్ (0) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో ఫిడేల్ ఎడ్వర్డ్స్ 3, సులేమాన్ బెన్ 2, జెరోమ్ టేలర్, డ్వేన్ స్మిత్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్.. 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటై, ఓటమిపాలైంది. విండీస్ ఇన్నింగ్స్లో ఆష్లే నర్స్ (36) టాప్ స్కోరర్గా కాగా.. డ్వేన్ స్మిత్ (26), క్రిస్ గేల్ (22), రయాద్ ఎమ్రిట్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సోహైల్ ఖాన్ 4, వాహబ్ రియాజ్, షోయబ్ మాలిక్ తలో 2 వికెట్లు పడగొట్టారు. రెండో సెమీఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. -
12 వికెట్లతో చెలరేగిన అట్కిన్సన్.. విండీస్కు ఘోర పరాభవం
లార్డ్స్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ అరంగేట్రం పేసర్ గస్ అట్కిన్సన్ ఆకాశమే హద్దుగా చెలరేగి 12 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు తీసిన అట్కిన్సన్.. రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో విజృంభించాడు. అట్కిన్సన్ ధాటికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 121 పరుగులకు.. రెండో ఇన్నింగ్స్లో 136 పరుగులకు కుప్పకూలింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ అట్కిన్సన్ (7/45), ఆండర్సన్ (1/26), క్రిస్ వోక్స్ (1/29), స్టోక్స్ (1/14) ధాటికి 121 పరుగులకే చాపచుట్టేసింది. విండీస్ ఇన్నింగ్స్లో మికైల్ లూయిస్ (27) టాప్ స్కోరర్గా నిలిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 371 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఐదుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేశారు. జాక్ క్రాలే 76, ఓలీ పోప్ 57, జో రూట్ 68, హ్యారీ బ్రూక్ 50, జేమీ స్మిత్ 70 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్ 4, గుడకేశ్ మోటీ, జేసన్ హోల్డర్ తలో 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు.250 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ను అట్కిన్సన్ మరోసారి దెబ్బకొట్టాడు. ఈ సారి అతను ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/61) విజృంభించాడు. అట్కిన్సన్తో పాటు ఆండర్సన్ (3/32), స్టోక్స్ (2/25) రాణించడంతో విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో 136 పరుగులకు కుప్పకూలింది. విండీస్ ఇన్నింగ్స్లో మోటీ (31 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. దిగ్గజ ఫాస్ట్ బౌలర్ ఆండర్సన్ తన సుదీర్ఘ కెరీర్ను గెలుపుతో ముగించాడు. -
ఇన్నింగ్స్ విజయం దిశగా ఇంగ్లండ్
లండన్: వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ విజయం దిశగా సాగుతోంది. మ్యాచ్ రెండో రోజు 250 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 79 పరుగులు సాధించింది. అండర్సన్, అట్కిన్సన్, స్టోక్స్ రెండు వికెట్ల చొప్పున తీశారు. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే వెస్టిండీస్ మరో 171 పరుగులు చేయాలి. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 189/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 90 ఓవర్లలో 371 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (68; 7 ఫోర్లు), హ్యారీ బ్రూక్ (50; 5 ఫోర్లు, 1 సిక్స్), తొలి టెస్టు ఆడుతున్న జేమీ స్మిత్ (70; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. విండీస్ బౌలర్లలో జీడెన్ సీల్స్ 4 వికెట్లు పడగొట్టగా... హోల్డర్, గుడకేశ్ మోతీ 2 వికెట్లు చొప్పున తీశారు. -
Viral Video: మోటీ మాయాజాలం.. స్టోక్స్కు ఫ్యూజులు ఔట్
లార్డ్స్ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం సాధించింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 371 పరుగులకు ఆలౌటై, 250 పరుగుల లీడ్లో కొనసాగుతుంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో ఐదుగురు (క్రాలే (76), పోప్ (57), రూట్ (68), బ్రూక్ (50), జేమీ స్మిత్ (70)) అర్ద సెంచరీలు సాధించారు. విండీస్ బౌలర్లలో జేడన్ సీల్స్ 4, జేసన్ హోల్డర్, గుడకేశ్ మోటీ తలో 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు. అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 121 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ అరంగేట్రం బౌలర్ గస్ అట్కిన్సన్ (7/45) విండీస్ పతనాన్ని శాశించాడు. ఆండర్సన్, వోక్స్, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో మిఖైల్ లూయిస్ (27) టాప్ స్కోరర్గా నిలిచాడు.AN ABSOLUTE CHERRY FROM MOTIE. - The reaction of Ben Stokes says all. 😲pic.twitter.com/NTnSvRQXhJ— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2024మోటీ మాయాజాలంఈ మ్యాచ్లో విండీస్ బౌలర్ గుడకేశ్ మోటీ రెండు వికెట్లే తీసినా రెండూ హైలైట్గా నిలిచాయి. మోటీ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్లు స్టోక్స్, రూట్లను బోల్తా కొట్టించాడు. ఈ ఇద్దరిని మోటీ అద్భుతమైన బంతులతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ముఖ్యంగా స్టోక్స్ బౌల్డ్ అయిన బంతి నమ్మశక్యంకాని రితీలో టర్నై మిడిల్ స్టంప్ను గాల్లోకి లేపింది. ఈ బంతికి స్టోక్స్ వద్ద సమాధానం లేక నోరెళ్లబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. -
నిప్పులు చెరిగిన ఇంగ్లండ్ బౌలర్.. చరిత్రపుటల్లో చోటు
లార్డ్స్ వేదికగా వెస్టిండీస్తో ఇవాళ (జులై 10) మొదలైన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ అరంగేట్రం పేసర్ గస్ అట్కిన్సన్ నిప్పులు చెరిగాడు. తొలి ఇన్నింగ్స్లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా అరంగేట్రంలో ఇంగ్లండ్ తరఫున మూడో అత్యుత్తమ గణాంకాలను.. ఓవరాల్గా తొమ్మిదో అత్యుత్తమ గణాంకాలను (అరంగేట్రం) నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో అట్కిన్సన్ ఓ ఓవర్లో నాలుగు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. అట్కిన్సన్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 121 పరుగులకే కుప్పకూలింది. అట్కిన్సన్.. క్రెయిగ్ బ్రాత్వైట్ (6), కిర్క్ మెకెంజీ (1), అలిక్ అథనాజ్ (23), జేసన్ హోల్డర్ (0), జాషువ డసిల్వ (0), అల్జరీ జోసఫ్ (17), షమార్ జోసఫ్ (0) వికెట్లు పడగొట్టాడు. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడుతున్న జిమ్మీ ఆండర్సన్, క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో మిఖైల్ లూయిస్ అత్యధికంగా 27 పరుగులు చేయగా.. అలిక్ అథనాజ్ (23), కవెమ్ హాడ్జ్ (24) 20 పరుగుల మార్కును దాటారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. ఆదిలోనే బెన్ డకెట్ (3) వికెట్ కోల్పోయినప్పటికీ.. ఆతర్వాత కుదురుగా ఆడుతుంది. 14 ఓవర్ల అనంతరం ఆ జట్టు వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. జాక్ క్రాలే (30), ఓలీ పోప్ (29) క్రీజ్లో ఉన్నారు. డకెట్ వికెట్ జేడన్ సీల్స్కు దక్కింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి విండీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఇది తొలి టెస్ట్ మ్యాచ్. రెండో మ్యాచ్ జులై 18న, మూడో మ్యాచ్ జులై 26న మొదలుకానున్నాయి.ఇంగ్లండ్ తరఫున అరంగేట్రంలో అత్యుత్తమ గణాంకాలు..జాన్ ఫెర్రిస్-సౌతాఫ్రికాపై 7/37డొమినిక్ కార్క్-వెస్టిండీస్పై 7/43గస్ అట్కిన్సన్-వెస్టిండీస్పై 7/45ఓవరాల్గా టెస్ట్ అరంగేట్రంలో అత్యుత్తమ గణాంకాలుఆల్బర్ట్ ట్రాట్-ఇంగ్లండ్పై 8/43రాబర్ట్ మెస్సీ- ఇంగ్లండ్పై 8/53నరేంద్ర హిర్వాని- వెస్టిండీస్పై 8/61లాన్స్ క్లూసెనర్- ఇండియాపై 8/64నరేంద్ర హిర్వాని- వెస్టిండీస్పై 8/75రాబర్ట్ మెస్సీ- ఇంగ్లండ్పై 8/84ఆల్ఫ్రెడ్ వాలెంటైన్- ఇంగ్లండ్పై 8/104జేసన్ క్రేజా- ఇండియాపై 8/215కైల్ అబాట్- పాకిస్తాన్పై 7/29డొమినిక్ కార్క్- వెస్టిండీస్పై 7/43గస్ అట్కిన్సన్-వెస్టిండీస్పై 7/45 -
చెలరేగిన బ్యాటర్లు.. విండీస్ చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024లో భాగంగా ఇవాళ (జులై 9) వెస్టిండీస్ ఛాంపియన్స్, ఇంగ్లండ్ ఛాంపియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్పై విండీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. ఇయాన్ బెల్ (64 బంతుల్లో 97; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), రవి బొపారా (30 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), కెవిన్ పీటర్సన్ (19 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో శామ్యుల్ బద్రీ, జేరోమ్ టేలర్, ఆష్లే నర్స్, డారెన్ స్యామీ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్.. చాడ్విక్ వాల్టన్ (42 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆష్లే నర్స్ (25 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభించడంతో 19.3 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. ఇంగ్లండ్ బౌలర్లలో సమిత్ పటేల్ 2, రవి బొపారా, ఉస్మాన్ అఫ్జల్, సైడ్ బాటమ్ తలో వికెట్ పడగొట్టారు.మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా సెమీస్కు చేరగా.. మిగతా రెండు బెర్త్ల కోసం ఇండియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా పోటీపడుతున్నాయి. -
ఇంగ్లండ్తో తొలి టెస్ట్.. విండీస్ తుది జట్టు ప్రకటన
ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జులై 10 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ లార్డ్స్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్, వెస్టిండీస్ తమతమ తుది జట్లను ప్రకటించాయి.ఈ మ్యాచ్ ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జిమ్మీ ఆండర్సన్కు చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఈ టెస్ట్ అనంతరం ఆండర్సన్ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్గా పని చేస్తాడు. ఈ సిరీస్లో మిగతా రెండు టెస్ట్లు ట్రెంట్బ్రిడ్జ్ (జులై 18-22), ఎడ్జ్బాస్టన్ (జులై 26-30) వేదికగా జరుగనున్నాయి.తొలి టెస్ట్కు ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్.వెస్టిండీస్ తుది జట్టు: క్రెయిగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), మికిల్ లూయిస్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జాషువా డ సిల్వా (వికెట్కీపర్), జేసన్ హోల్డర్, జేడెన్ సీల్స్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, గుడకేష్ మోటీ. -
విండీస్తో తొలి టెస్ట్కు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే.. చివరి మ్యాచ్ ఆడబోతున్న ఆండర్సన్
ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జులై 10 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ లార్డ్స్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్ దిగ్గజ పేసర్ జిమ్మీ ఆండర్సన్ కెరీర్లో చివరి మ్యాచ్. ఈ టెస్ట్ అనంతరం ఆండర్సన్ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్గా పని చేస్తాడు. ఈ సిరీస్లో మిగతా రెండు టెస్ట్లు ట్రెంట్బ్రిడ్జ్ (జులై 18-22), ఎడ్జ్బాస్టన్ (జులై 26-30) వేదికగా జరుగనున్నాయి.విండీస్తో తొలి టెస్ట్కు ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్.వెస్టిండీస్ తుది జట్టు (అంచనా): క్రెయిగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), మికిల్ లూయిస్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జాషువా డ సిల్వా (వికెట్కీపర్), జాసన్ హోల్డర్, కెవిన్ సింక్లైర్, అల్జారీ జోసెఫ్, షమర్ జోసెఫ్, గుడకేష్ మోటీ. -
క్రిస్ గేల్ ఊచకోత..వయసు మీద పడినా అదే జోరు
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 44 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తగ్గడం లేదు. కెరీర్ ఉన్నతిలో ఎలా విధ్వంసం సృష్టించాడో, లేటు వయసులోనే అదే తరహాలో రెచ్చిపోతున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భాగంగా సౌతాఫ్రికా ఛాంపియన్స్తో జరిగిన మ్యాచ్లో గేల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ది బౌలర్లను చీల్చిచెండాడు. కేవలం 40 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. ఫలితంగా వెస్టిండీస్ ఛాంపియన్స్.. సౌతాఫ్రికా ఛాంప్స్పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.THE CHRIS GAYLE SHOW IN WCL. 🐐70 (40) with 4 fours and 6 sixes - the vintage Universe Boss at the Edgbaston Stadium, he's hitting them cleanly. 🌟 pic.twitter.com/jM5O2Lt7uo— Mufaddal Vohra (@mufaddal_vohra) July 8, 2024ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ఆష్వెల్ ప్రిన్స్ (46 నాటౌట్), డేన్ విలాస్ (44 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో రిచర్డ్ లెవి 20, నీల్ మెక్కెంజీ 0, జాక్ కలిస్ 18, జస్టిన్ ఓంటాంగ్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. విండీస్ బౌలర్లలో జేసన్ మొహమ్మద్ 2, శామ్యూల్ బద్రీ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్.. క్రిస్ గేల్, చాడ్విక్ వాల్టన్ (29 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) రెచ్చిపోవడంతో 19.1 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. డ్వేన్ స్మిత్ 22, జోనాథన్ కార్టర్ 6, ఆష్లే నర్స్ 0 పరుగులకు ఔట్ కాగా..వెర్నన్ ఫిలాండర్ 2, లాంగ్వెల్డ్త్, మెక్ కెంజీ తలో వికెట్ పడగొట్టారు.కాగా, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఆరు జట్లు (పాకిస్తాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, భారత్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా) పాల్గొంటున్న విషయం తెలిసిందే. జులై 3న ప్రారంభమైన ఈ టోర్నీలో ఇప్పటివరకు 10 మ్యాచ్లు జరిగాయి. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో టాప్లో ఉంది. ఆతర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా ఉన్నాయి. అన్ని జట్లలో దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. -
వరుసగా రెండో మ్యాచ్లో గెలిచిన పాకిస్తాన్.. ఈసారి విండీస్పై విజయం
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో పాకిస్తాన్ ఛాంపియన్స్ వరుసగా రెండో మ్యాచ్లో విజయం సాధించింది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన పాక్.. రెండో మ్యాచ్లో వెస్టిండీస్ను ఓడించింది. బర్మింగ్హమ్ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్లో పాక్ 29 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన విండీస్ 165 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమతమై ఓటమిపాలైంది.రాణించిన షోయబ్ మాలిక్టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ షోయబ్ మాలిక్ (41 బంతుల్లో 54; 5 ఫోర్లు, సిక్స్), షర్జీల్ ఖాన్ (15 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో ఆమిర్ యామిన్ (11 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝులిపించాడు. విండీస్ బౌలర్లలో ఆష్లే నర్స్ 3, ఫిడేల్ ఎడ్వర్డ్స్ 2, శామ్యుల్ బద్రీ, జేరోమ్ టేలర్, సులేమాన్ బెన్ తలో వికెట్ పడగొట్టారు.నిప్పులు చెరిగిన సోహైల్ తన్వీర్.. సత్తా చాటిన అఫ్రిది195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. సోహైల్ తన్వీర్ (4-0-14-4), షాహిద్ అఫ్రిది (3/31), వాహబ్ రియాజ్ (2/18) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసి 165 పరుగులకే (9 వికెట్ల నష్టానికి) పరిమితమైంది. విండీస్ ఇన్నింగ్స్లో డ్వేన్ స్మిత్ (46 బంతుల్లో 65;8 ఫోర్లు, 2 సిక్సర్లు), జోనాథన్ కార్టర్ (25 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించినా ఉపయోగం లేకుండా పోయింది. -
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ మెంటార్గా జేమ్స్ ఆండర్సన్
ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం, ఇంగ్లండ్ ఆల్టైమ్ గ్రేట్ జేమ్స్ ఆండర్సన్.. స్వదేశంలో వెస్టిండీస్తో జరుగబోయే టెస్ట్ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పనున్నాడు. ఆండర్సన్ రిటైరయ్యాక కూడా ఇంగ్లండ్ జట్టుతోనే కొనసాగనున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆండర్సన్ను ఫాస్ట్ బౌలింగ్ మెంటార్గా నియమించింది. తన చివరి టెస్ట్ ముగిసిన వెంటనే ఆండర్సన్ కొత్త బాధ్యతలు చేపడతాడు.ఇంగ్లండ్.. జులై 10 నుంచి స్వదేశంలో వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. జులై 10, 18, 26 తేదీల్లో మూడు మ్యాచ్లు మొదలవుతాయి. లార్డ్స్, ట్రెంట్బ్రిడ్జ్, ఎడ్జ్బాస్టన్ వేదికగా ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. లార్డ్స్లో జరుగబోయే టెస్ట్తో ఆండర్సన్ రిటైర్ కానున్నాడు. ఆండర్సన్ బౌలింగ్ మెంటార్గా తన ప్రస్తానాన్ని విండీస్తో రెండో టెస్ట్ నుంచి మొదలుపెడతాడు.జట్ల వివరాలు..ఇంగ్లండ్ (తొలి రెండు టెస్ట్లకు): హ్యారీ బ్రూక్, జో రూట్, డేనియల్ లారెన్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), క్రిస్ వోక్స్, ఓలీ పోప్, జేమీ స్మిత్, జేమ్స్ ఆండర్సన్ (తొలి టెస్ట్కు మాత్రమే), గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, డిల్లన్ పెన్నింగ్టన్, మ్యాట్ పాట్స్వెస్టిండీస్: క్రెయిగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), కవెమ్ హాడ్జ్, అలిక్ అథనాజ్, జకరీ మెక్క్యాస్కీ, జేసన్ హోల్డర్, కిర్క్ మెక్కెంజీ, జాషువ డసిల్వ, టెవిన్ ఇమ్లాక్, అల్జరీ జోసఫ్, షమార్ జోసఫ్, మిఖైల్ లూయిస్, గుడకేశ్ మోటీ, జేడన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, జెర్మియా లూయిస్ -
ODI Series: స్వదేశంలో శ్రీలంకకు చుక్కెదురు.. విండీస్ చేతిలో పరాభవం
సొంత దేశంలో శ్రీలంక మహిళల క్రికెట్ జట్టుకు చుక్కెదురైంది. ద్వీప దేశం.. మరో ద్వీప దేశమైన వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో వెస్టిండీస్.. 2-1 తేడాతో శ్రీలంకను ఓడించింది. హంబనతోట వేదికగా జరిగిన నిర్ణయాత్మకమైన మూడో టీ20 వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. చమారీ ఆటపట్టు (38), హర్షిత మాధవి (28), కవిష దిల్హరి (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో ఆలియా అలెన్, అఫీ ఫ్లెచర్ తలో 2 వికెట్లు.. చినెల్ హెన్రీ, రమ్హరాక్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం 142 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హేలీ (49), క్యాంప్బెల్ (41 నాటౌట్), స్టెఫానీ టేలర్ (33) విండీస్ విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. లంక బౌలర్లలో కావ్య కవింది 2, సుగందిక కుమారి, కవిష దిల్హరి తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ శ్రీలంక నెగ్గగా.. విండీస్ వరుసగా రెండు, మూడు మ్యాచ్లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. టీ20 సిరీస్కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్ను శ్రీలంక 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్లో కోసం వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించింది. -
సత్తా చాటిన ఫ్లెచర్.. రెండో టీ20లో విండీస్ గెలుపు
మహిళల క్రికెట్లో భాగంగా హంబన్తోట వేదికగా శ్రీలంకతో ఇవాళ (జూన్ 26) జరిగిన టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలు కావడంతో లంక ఇన్నింగ్స్ను అక్కడే ముగించారు. లంక బ్యాటర్లలో విష్మి గౌతమ్ (24), చమారీ ఆటపట్టు (26), హర్షిత మాధవి (14), కవిష దిల్హరి (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. ఇమేష దులాని (6), హసిని పెరీరా (3 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్ నాలుగు వికెట్లతో చెలరేగింది.వర్షం కారణంగా లంక ఇన్నింగ్స్ అర్దంతరంగా ముగియడంతో డక్వర్త్ లూయిస్ పద్దతిన విండీస్ విజయ లక్ష్యాన్ని 15 ఓవర్లలో 99 పరుగులుగా నిర్దారించారు. 99 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ 14.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. మాథ్యూస్ (29), స్టెఫానీ టేలర్ (28 నాటౌట్), షెమెయిన్ క్యాంప్బెల్ (16), ఆలియా అలెన్ (15 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. క్వియాన జోసఫ్ (6), చెడీన్ నేషన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యారు. లంక బౌలర్లలో చమారీ ఆటపట్టు, కవిష దిల్హరి, సిచిని నిసంసలా తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఈ మ్యాచ్లో గెలవడంతో మూడు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జూన్ 28న ఇదే వేదికగా జరుగనుంది. -
మాకు ఇదొక గుణపాఠం.. వాళ్లు అద్భుతం: మార్క్రమ్
టీ20 ప్రపంచకప్-2024లో సెమీస్ చేరడం సంతోషంగా ఉందని సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ హర్షం వ్యక్తం చేశాడు. తమ జట్టు అద్భుతంగా ఆడిందని.. ఈ గెలుపు తమకు ఊరటనందించిందని పేర్కొన్నాడు.వర్షం పడి వెలిసిన తర్వాత పిచ్ బ్యాటింగ్కు మరింత అనుకూలంగా మారిందన్న మార్క్రమ్.. వీలైనంత త్వరగా మ్యాచ్ పూర్తి చేయాలని భావించినట్లు తెలిపాడు. అందుకు తగ్గట్లుగానే ఫలితం కూడా వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో భాగంగా వెస్టిండీస్తో సోమవారం జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. అంటిగ్వా వేదికగా టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు విండీస్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.వర్షం వల్ల అంతరాయం సౌతాఫ్రికా బౌలర్ల దెబ్బకు వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి కేవలం 135 పరుగులు మాత్రమే చేసింది. రోస్టన్ చేజ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. ఓపెనర్ కైలీ మేయర్స్ 35 పరుగులతో రాణించాడు.ప్రొటిస్ స్పిన్నర్ తబ్రేజ్ షంసీ మూడు కీలక వికెట్లు కూల్చి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. ఇక ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించగా.. రెండో ఇన్నింగ్స్ను 17 ఓవర్లకు కుదించారు.డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం సౌతాఫ్రికా లక్ష్యాన్ని 123 పరుగులుగా నిర్దేశించారు. ఈ క్రమంలో ఆరంభంలో ప్రొటిస్ జట్టు వికెట్లు కోల్పోయినా.. ట్రిస్టన్ స్టబ్స్(29), హెన్రిచ్ క్లాసెన్(22), మార్కో జాన్సన్(14 బంతుల్లో 21) మెరుగ్గా రాణించి జట్టుకు విజయం అందించారు.మాకిది ఒక గుణపాఠం లాంటిదేమరో ఐదు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేదించిన సౌతాఫ్రికా సెమీ ఫైనల్లో అడుగుపెట్టగా.. ఆతిథ్య వెస్టిండీస్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ మాట్లాడుతూ.. ‘‘మా వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.వికెట్ను సరిగ్గా అంచనా వేసి అందుకు తగ్గట్లుగా ఆడారు. షంసీ రూపంలో మిస్టరీ స్పిన్నర్ను వెస్టిండీస్పై అస్త్రంలా ప్రయోగించి విజయవంతమయ్యాం.అయితే, లక్ష్య ఛేదనలో భాగస్వామ్యాలు నెలకొల్పడంలో మేము విఫలమయ్యాం. మాకిది ఒక గుణపాఠం లాంటిదే. పరిస్థితులకు అనుగుణంగా ఇంకాస్త తెలివిగా వ్యవహరించి ముందుకు సాగాలి’’ అని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో మార్క్రమ్ 18 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీశాడు.చదవండి: కోహ్లి, రోహిత్లకు అదే ఆఖరి ఛాన్స్.. పట్టుబట్టిన గంభీర్! -
చాలా బాధగా ఉంది.. అదే మా ఓటమికి కారణం: వెస్టిండీస్ కెప్టెన్
టీ20 వరల్డ్కప్-2024లో ఆతిథ్య వెస్టిండీస్ ప్రయాణం ముగిసింది. సూపర్-8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైన విండీస్ సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో(డక్ వర్త్ లూయిస్ పద్దతి) వెస్టిండీస్ పరాజయం పాలైంది.చివరి వరకు విండీస్ అద్బుతంగా పోరాడనప్పటకి విజయం మాత్రం ప్రోటీస్నే వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్లు నిర్ణీత 20 ఓవర్లలో 135 పరుగులకే పరిమితమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఆ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో ప్రోటీస్ లక్ష్యాన్ని 17 ఓవర్లలో 123 పరుగులకు కుదించారు. అయితే మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యాక దక్షిణాఫ్రికా వికెట్ల పతనం కొనసాగింది.చివరికి ఆల్రౌండర్ మార్కో జానెసన్ 21 పరుగులతో ఆజేయంగా నిలిచి దక్షిణాఫ్రికాను సెమీస్కు చేర్చాడు. ఇక ఓటమిపై మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ రావెమన్ పావెల్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమిపాలైమని పావెల్ తెలిపాడు."ఈ మ్యాచ్లో ఓటమి మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది. కానీ ఆఖరి వరకు పోరాడినందుకు మా బాయ్స్కు క్రెడిట్ ఇవ్వాలనకుంటున్నాను. మేము ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో దారుణంగా విఫలమయ్యాం. మిడిల్ ఓవర్లలో పరుగులు సాధించలేకపోయాము.సరైన భాగస్వామ్యాలు నెలకొల్పకపోవడంతో నామమాత్రపు స్కోర్కే పరిమితమయ్యాం. కానీ 135 పరుగులను కాపాడుకోగలమని మా బౌలర్లు విశ్వసించారు. అందుకు తగ్గట్టు చివరివరకు తమ వంతు ప్రయత్నం చేశారు. మేము సెమీఫైనల్కు చేరుకోపోవచ్చు గానీ గత 12 నెలలగా మేము బాగా ఆడుతున్నాం. ఈ టోర్నీలోమాకు అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. ఇది నిజంగా మాకు చాలా సంతోషాన్నిచ్చింది. మాకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికి ధన్యవాదాలని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో పావెల్ పేర్కొన్నాడు. -
T20 World Cup 2024: ఉత్కంఠ పోరులో విండీస్పై గెలుపు.. సెమీస్కు సౌతాఫ్రికా
టీ20 వరల్డ్కప్ 2024లో మరో ఉత్కంఠ పోరు జరిగింది. ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్తో జరిగిన సూపర్-8 సమరంలో సౌతాఫ్రికా చివరి ఓవర్లో విజయం సాధించింది. సౌతాఫ్రికా గెలుపుకు చివరి ఓవర్లో 5 పరుగులు అవసరం కాగా.. జన్సెన్ తొలి బంతినే సిక్సర్గా మలిచి తన జట్టుకు సెమీస్ బెర్త్ ఖరారు చేశాడు.వర్షం అంతరాయం నడుమ సాగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. తబ్రేజ్ షంషి (4-0-27-3), జన్సెన్ (2-0-17-1), మార్క్రమ్ (4-0-28-1), కేశవ్ మహారాజ్ (4-0-24-1), రబాడ (2-0-11-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్ (52), కైల్ మేయర్స్ (35) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో విండీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు వరుణుడు అడ్డుతగిలాడు. రెండో ఓవర్లో మొదలైన వర్షం దాదాపు గంటపాటు కొనసాగడంతో 17 ఓవర్లకు మ్యాచ్ను కుదించి, సౌతాఫ్రికా ముందు 123 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. వర్షం ప్రారంభానికి ముందే 2 వికెట్లు (15 పరుగులకే) కోల్పోయిన సౌతాఫ్రికా ఆతర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిపించింది. అయితే మార్కో జన్సెన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (21 నాటౌట్) ఆడి సౌతాఫ్రికాను గెలిపించాడు. సఫారీ ఇన్నింగ్స్లో ట్రిస్టన్ స్టబ్స్ (29), క్లాసెన్ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లు రోస్టన్ ఛేజ్ (3-0-12-3), ఆండ్రీ రసెల్ (4-0-19-2), అల్జరీ జోసఫ్ (4-0-25-2) దక్షిణాఫ్రికా శిబిరంలో ఆందోళన రేకెత్తించారు. ఈ మ్యాచ్లో ఓటమితో విండీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. నిన్న జరిగిన మ్యాచ్లో యూఎస్ఏపై గెలుపుతో గ్రూప్-2 నుంచి సెమీస్కు చేరిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. గ్రూప్-2 నుంచి సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్కు చేరగా.. విండీస్, యూఎస్ఏ టోర్నీ నుంచి వైదొలిగాయి. -
T20 World Cup 2024: సౌతాఫ్రికా సెమీస్కు చేరాలంటే 136 పరుగులు చేయాలి
టీ20 వరల్డ్కప్ సూపర్-8 పోరులో ఇవాళ (జూన్ 24) సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. ఇవాళ ఉదయం ప్రారంభమైన ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. తబ్రేజ్ షంషి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించి విండీస్ను దెబ్బకొట్టాడు. షంషి 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. షంషికి జతగా సఫారీ బౌలర్లంతా రాణించారు. జన్సెన్, మార్క్రమ్, కేశవ్ మహారాజ్, రబాడ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్లో రోస్టన్ ఛేజ్ (52) అర్దసెంచరీతో రాణించగా.. కైల్ మేయర్స్ 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. వీరిద్దరు మినహా విండీస్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. హోప్ 0, పూరన్ 1, రోవ్మన్ పావెల్ 1, రూథర్ఫోర్డ్ 0, రసెల్ 15, అకీల్ హొసేన్ 6 పరుగులకు ఔటయ్యారు. అల్జరీ జోసఫ్ (11 నాటౌట్), మోటీ (4) నాటౌట్గా నిలిచారు. 10 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో వచ్చాయి. కాగా, గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్ సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఆ జట్టు నిన్న యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో గెలుపొంది దర్జాగా సెమీస్లోకి అడుగుపెట్టింది. ఈ గ్రూప్ నుంచి రెండో బెర్త్ కోసం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్లో విండీస్ గెలిస్తేనే సెమీస్కు చేరుకుంటుంది. సౌతాఫ్రికా ఓడితే నెట్ రన్రేట్ కీలకమవుతుంది. -
T20 World Cup 2024: ఇలా జరిగిందా.. సౌతాఫ్రికా పని గోవిందా..!
టీ20 ప్రపంచకప్ 2024లో అజేయ జట్టుగా ఉన్న సౌతాఫ్రికాకు ఏ జట్టుకు ఎదురుకాని కష్టం వచ్చి పడింది. ఆ జట్టు ఒకే ఒక్క మ్యాచ్లో ఓడితే ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించే ప్రమాదంలో పడుతుంది. ప్రస్తుత ప్రపంచకప్లో సౌతాఫ్రికా ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో గెలిచినా సెమీస్ అవకాశాలు ఇంకా సంక్లిష్టంగానే ఉన్నాయి. ఆ జట్టు సూపర్-8లో తమ చివరి మ్యాచ్లో ఓడితే ఏకంగా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది.గ్రూప్ దశలో అన్ని మ్యాచ్లు.. సూపర్-8లో రెండు మ్యాచ్లు గెలిచినా కేవలం ఒక్క ఓటమే సౌతాఫ్రికా కొంపముంచుతుంది. ఆ జట్టుకు ఇలాంటి అనుభవాలు కొత్త కానప్పటికీ.. ఈసారి మాత్రం జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం మంచి జట్టు కలిగి ఉండి కూడా ప్రపంచకప్ గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకుంటుంది.ఇలా జరిగిందా..గ్రూప్-2లో భాగంగా సౌతాఫ్రికా రేపు (జూన్ 24) ఉదయం 6 గంటలకు (భారతకాలమానం ప్రకారం) జరుగబోయే మ్యాచ్లో ఆతిథ్య వెస్టిండీస్తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా ఓడి.. దీనికి ముందు జరిగే మ్యాచ్లో యూఎస్ఏపై ఇంగ్లండ్ 10 కంటే ఎక్కువ పరుగులు లేదా ఓవర్ మార్జిన్ తేడాతో గెలిస్తే.. వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు సెమీస్కు చేరతాయి.అదెలా అంటే.. యూఎస్ఏపై ఇంగ్లండ్, సౌతాఫ్రికాపై వెస్టిండీస్ గెలిస్తే.. అప్పుడు మూడు జట్ల (వెస్టిండీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా) ఖాతాల్లో తలో నాలుగేసి పాయింట్లు ఉంటాయి. అప్పుడు నెట్ రన్రేట్ ఆధారంగా వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు సెమీస్కు చేరతాయి. సౌతాఫ్రికా ఇంటిముఖం పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఇంగ్లండ్పై యూఎస్ఏ అయినా గెలవాలి లేదా విండీస్పై సౌతాఫ్రికా అయినా గెలవాలి. -
వెస్టిండీస్కు గుడ్ న్యూస్.. జట్టులోకి విధ్వంసకర ఆటగాడు
టీ20 వరల్డ్కప్-2024లో మిగిలిన మ్యాచ్లకు వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ బ్రాండెన్ కింగ్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్తో జరిగిన సూపర్-8 మ్యాచ్లో కింగ్కు పక్కటెముకుల గాయమైంది. అతడు పూర్తిగా కోలుకోవడానికి రెండు వారాల సమయం పడుతుందని విండీస్ వైద్యబృందం వెల్లడించింది.ఈ క్రమంలో అతడి స్ధానాన్ని విధ్వంసకర ఆల్రౌండర్ కైల్ మేయర్స్తో విండీస్ క్రికెట్ బోర్డు భర్తీ చేసింది. మైర్స్ భర్తీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టెక్నికల్ కమిటీ ఆమోదించింది. అతడు దక్షిణాఫ్రికాతో జరిగే తమ చివరి సూపర్-8 మ్యాచ్కు విండీస్ జట్టుతో చేరే అవకాశముంది. కాగా టీ20ల్లో మైర్స్కు అద్బుతమైన రికార్డు ఉంది. టీ20ల్లో మైర్స్ 727 పరుగులతో పాటు 34 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇంగ్లండ్తో జరిగిన తొలి సూపర్-8 మ్యాచ్లో ఓటమి పాలైన కరేబియన్లు.. అమెరికాతో మ్యాచ్లో తిరిగి కమ్బ్యాక్ ఇచ్చారు.యూఎస్పై 9 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. విండీస్ తమ ఆఖరి సూపర్-8 మ్యాచ్లో ఆదివారం(జూన్ 23) దక్షిణాఫ్రికాతో తలపడనుంది. సెమీస్కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ విండీస్కు చాలా కీలకం. -
T20 WC: విండీస్ ఓపెనర్ విధ్వంసం.. అమెరికా చిత్తు
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. అమెరికాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి జయభేరి మోగించింది. సొంతగడ్డపై జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లలో.. గ్రూప్-2లో భాగమైన వెస్టిండీస్ తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో ఓడింది.ఈ క్రమంలో శనివారం నాటి తమ రెండో మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేసిన కరేబియన్ జట్టు.. అమెరికాకు చుక్కలు చూపించింది. బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్ వేదికగా టాస్ గెలిచిన వెస్టిండీస్.. అమెరికాను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.చెలరేగిన బౌలర్లుఅయితే, విండీస్ పేసర్లు, స్పిన్నర్లు విజృంభించడంతో అమెరికా బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్లలో స్టీవెన్ టేలర్(2) పూర్తిగా నిరాశపరచగా.. ఆండ్రీస్ గౌస్ 29 పరుగులతో రాణించాడు. వన్డౌన్ బ్యాటర్ ఎన్ఆర్ కుమార్ 20 రన్స్తో ఫర్వాలేదనిపించాడు.మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కు అందుకోలేకపోయారు. ఈ క్రమంలో 19.5 ఓవర్లలో 128 పరుగులు మాత్రమే చేసి అమెరికా ఆలౌట్ అయింది.వెస్టిండీస్ బౌలర్లలో పేసర్లు ఆండ్రీ రసెల్ మూడు, అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రోస్టన్ చేజ్(3/19) పొదుపుగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీయగా.. గుడకేశ్ మోటికి ఒక వికెట్ దక్కింది.ఆకాశమే హద్దుగా ఇక లక్ష్య ఛేదనలో విండీస్ ఓపెనర్ షాయీ హోప్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 39 బంతుల్లోనే 4 ఫక్షర్లు, 8 సిక్సర్ల సాయంతో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ జాన్సన్ చార్ల్స్ 15, నికోలస్ పూరన్ 12 బంతుల్లో 27 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. షాయీ హోప్తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.విండీస్ సెమీస్ ఆశలు సజీవంషాయీ హోప్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా కేవలం 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన వెస్టిండీస్ నెట్ రన్రేటు(+1.814)ను భారీగా పెంచుకుంది. గ్రూప్-2 టాపర్ సౌతాఫ్రికా(4 పాయింట్లు, నెట్ రన్టేరు +0.625), ఇంగ్లండ్(2 పాయింట్లు, నెట్ రన్రేటు +0.412)ల కంటే మెరుగైన స్థితిలో నిలిచింది. సెమీస్ ఆశలు సజీవం చేసుకుంది. మరోవైపు.. అమెరికా ఆడిన రెండింట ఓడి టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది.చదవండి: T20 WC 2024: దక్షిణాఫ్రికా సూపర్... View this post on Instagram A post shared by ICC (@icc) -
ఓటమి బాధలో ఉన్న విండీస్కు బిగ్ షాక్.. టోర్నీ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్?
టీ20 వరల్డ్కప్ గ్రూపు స్టేజిలో అజేయంగా నిలిచిన వెస్టిండీస్కు సూపర్-8లో బిగ్ షాక్ తగిలింది. సెయింట్ లూసియా వేదికగా ఇంగ్లండ్తో జరిగిన సూపర్-8 మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఓటమి పాలైంది. 181 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విండీస్ బౌలర్లు విఫలమయ్యారు. 181 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు 17.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్( 7 ఫోర్లు, 5 సిక్స్లతో 87 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్తో మ్యాచ్ను ఫినిష్ చేశాడు.విండీస్కు బిగ్ షాక్..ఇక ఓటమి బాధలో ఉన్న కరేబియన్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ బ్రాండెన్ కింగ్ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో కింగ్ గాయపడ్డాడు. సామ్కుర్రాన్ బౌలింగ్లో కవర్స్ దిశగా షాట్ ఆడే సమయంలో కింగ్ పక్కటెముకలకు గాయమైంది. దీంతో హఠాత్తుగా తీవ్రమైన నొప్పితో కింగ్ విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి అతడి నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో ఫిజియో సాయంతో కింగ్ మైదానాన్ని వీడాడు. అతడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. అయితే కింగ్ గాయంపై విండీస్ క్రికెట్ బోర్డు ఎటువంటి ప్రకటన చేయలేదు. విండీస్ తమ తదుపరి మ్యాచ్లో జూన్ 22న అమెరికాతో తలపడనుంది. -
రోహిత్ను గుర్తు చేసిన కింగ్.. స్టేడియం బయటకు బంతి! వీడియో
టీ20 వరల్డ్కప్-2024లో సెయింట్ లూసియా వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్ ఓపెనర్ బ్రాండెన్ కింగ్ అద్బుతమైన షాట్తో మెరిశాడు. ఈ మ్యాచ్లో కింగ్ భారీ సిక్స్ కొట్టాడు. అతడు కొట్టిన షాట్కు బంతి 101 మీటర్ల దూరం వెళ్లి స్టేడియం బయటపడింది. విండీస్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఇంగ్లండ్ పేసర్ రీస్ టాప్లీ తొలి రెండు బంతులను డాట్లగా వేశాడు. అనంతరం మూడో బంతిని స్టంప్స్ లైన్ దిశగా ఫుల్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. బంతి స్లాట్లో ఉండడంతో కింగ్ మిడ్ వికెట్ మీదగా భారీ సిక్స్ బాదాడు. దెబ్బకు బంతి స్టేడియం బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను గుర్తు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రోహిత్ కూడా అచ్చెం ఈ విధంగానే మిడ్ వికెట్ దిశగా ఈజీగా భారీ సిక్స్లు కొడుతుంటాడు. ఇక ఈ మ్యాచ్లో 23 పరుగులు చేసిన కింగ్ దురదృష్టవశాత్తు రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
98 పరుగుల వద్ద.. రనౌట్ కావాలని కోరుకోరు కదా!
కఠిన శ్రమ, త్యాగాల ఫలితమే టీ20 ఫార్మాట్లో తన విజయానికి కారణమని వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ అన్నాడు. పొట్టి ఫార్మాట్లో విండీస్ తరఫున దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టడం సంతోషంగా ఉందన్నాడు.టీ20 ప్రపంచకప్-2024 లీగ్ దశ ఆఖరి మ్యాచ్లో భాగంగా అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో పూరన్ దంచికొట్టిన విషయం తెలిసిందే. సెయింట్ లూసియా వేదికగా 53 బంతుల్లో 98 పరుగులు చేసిన పూరన్.. దురదృష్టవశాత్తూ రనౌట్గా వెనుదిరిగాడు.అలా సెంచరీకి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. అయితే, క్రిస్ గేల్ను అధిగమించి విండీస్ తరఫున టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా చరిత్రకెక్కాడు.ఈ నేపథ్యంలో నికోలస్ పూరన్ స్పందిస్తూ.. ‘‘98 పరుగుల వద్ద అవుటవ్వాలని ఎవరూ కోరుకోరు. గౌరవప్రదమైన స్కోరు నమోదు చేయాలనే తొందరలో అలా జరిగిపోయింది.ఏదేమైనా జట్టును గెలిపించడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా క్రిస్ గేల్ మాదిరి ప్రేక్షకులకు వినోదం పంచడం నాకెంతో ఇష్టం. ఇక ముందు కూడా ఇలాగే ముందుకు సాగుతాను’’ అని నికోలస్ పూరన్ చెప్పుకొచ్చాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024 ఆరంభంలో పూరన్ విఫలమయ్యాడు. న్యూజిలాండ్పై 17, ఉగాండాపై 22, పపువా న్యూగినియాపై 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు.ఆఖరి మ్యాచ్లో.. అసలైన మజాటీ20 ప్రపంచకప్ లీగ్ దశ ఆఖరి మ్యాచ్లో క్రికెట్ ప్రేక్షకులకు అసలైన మజా లభించింది. నామమాత్రమైన మ్యాచ్లో కరీబియన్ హిట్టర్ నికోలస్ పూరన్ (53 బంతుల్లో 98; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) అఫ్గానిస్తాన్పై ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. అతని వీరవిహారంతో ఈ టి20 ప్రపంచకప్లోనే ఆతిథ్య వెస్టిండీస్ అత్యధిక స్కోరు నమోదు చేసింది.ఇప్పటికే ఇరుజట్లు తదుపరి ‘సూపర్–8’ దశకు అర్హత సంపాదించాయి. దీంతో గ్రూప్ ‘సి’లో ఎవరికీ ఫలితంతో పని లేని ఈ మ్యాచ్లో విండీస్ 104 పరుగుల భారీ తేడాతో అఫ్గానిస్తాన్పై జయభేరి మోగించింది. టాస్ నెగ్గిన అఫ్గాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఒకే ఓవర్లో 36 పరుగులు... విండీస్ ఇన్నింగ్స్ మొదలైన కాసేపటికే ఓపెనర్ బ్రాండన్ కింగ్ (7) రెండో ఓవర్లో నిష్క్రమించాడు. క్రీజులో ఉన్న మరో ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (27 బంతుల్లో 43; 8 ఫోర్లు)తో జతకట్టిన పూరన్... అఫ్గాన్పై విధ్వంసరచన చేశాడు. దీంతో జట్టు స్కోరు కేవలం 3.1 ఓవర్లలోనే 50 దాటింది.అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఈ నాలుగో ఓవర్లోనే ఏకంగా 36 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్ను పూర్తిగా పూరనే ఎదుర్కొని 6, నోబ్+4, వైడ్+4, 0, లెగ్బై 4, 4, 6, 6లతో చుక్కలు చూపించాడు. ఈ మెరుపుల తుఫాన్తో కరీబియన్ జట్టు పవర్ ప్లే (6 ఓవర్లు)లో 92/1 స్కోరు చేసింది. 7.4 ఓవర్లలో జట్టు స్కోరు 100 దాటాక చార్లెస్ అవుటయ్యాడు. 37 బంతుల్లో 80 పరుగుల ధనాధన్ భాగస్వామ్యానికి తెరపడింది.క్రీజులోకి షై హోప్ (17 బంతుల్లో 25; 2 సిక్స్లు) రావడంతో పూరన్ 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే హోప్ అవుట్ కావడంతో కెపె్టన్ రోవ్మన్ పావెల్ (15 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్లు) కూడా ధాటిగానే ఆడాడు. ఆఖర్లో కెపె్టన్ రషీద్ ఖాన్ వేసిన 18వ ఓవర్ను అసాంతం ఆడిన పూరన్ 0, 6, 4, 6, 2, 6లతో 24 పరుగులు సాధించాడు.ఈ వేగంలో విండీస్ 19వ ఓవర్లో 200 పరుగుల మైలురాయిని దాటింది. కానీ ఆఖరి ఓవర్లో సెంచరీకి 2 పరుగుల దూరంలో పూరన్ రనౌటయ్యాడు. గుల్బదిన్ నైబ్కు 2 వికెట్లు దక్కగా, అజ్మతులా ఒమర్జాయ్, నవీనుల్ హక్ చెరో వికెట్ తీశారు. అఫ్గాన్ టపటపా... అనంతరం అసాధ్యమైన లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ 16.2 ఓవర్లలోనే 114 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ ఇబ్రహీమ్ జద్రాన్ (28 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, నాలుగో వరుస బ్యాటర్ అజ్మతుల్లా (19 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) కాస్త మెరుగ్గా ఆడారంతే!ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరే చేయలేదు. విండీస్ బౌలర్లలో పేసర్ ఒబెద్ మెకాయ్ 3 వికెట్లు పడగొట్టగా... స్పిన్నర్లు గుడకేశ్ మోతీ, అకిల్ హోసీన్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ గెలుపుతో విండీస్ గ్రూప్ ‘సి’లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ నెగ్గి అజేయంగా ‘సూపర్–8’ పోరుకు సమాయత్తమైంది. చదవండి: పిచ్ ఎలా ఉంది బుమ్రా?.. అయినా మాకిదే అలవాటే: రోహిత్ శర్మ -
T20 World Cup 2024: ఆ మూడు టీమ్లు ఒకవైపు.. పూరన్ ఒక్కడు ఒకవైపు..!
టీ20 వరల్డ్కప్ 2024లో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. గ్రూప్-సిలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్పై అదే గ్రూప్కు చెందిన ఉగాండ, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా చేసిన స్కోర్ల కంటే.. విండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ ఒక్కడు (ఆఫ్ఘనిస్తాన్పై) చేసిన స్కోరే అధికంగా ఉంది.ఆఫ్ఘనిస్తాన్పై ఉగాండ 58 పరుగులకు, న్యూజిలాండ్ 75, పపువా న్యూ గినియా 95 పరుగులకు ఆలౌట్ కాగా.. అదే ఆఫ్ఘనిస్తాన్పై పూరన్ ఒక్కడు 98 పరుగులు చేశాడు. జట్టు మొత్తం చేయలేని పరుగులు పూరన్ ఒక్కడు చేయడంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ వరల్డ్కప్లో ఆఫ్ఘన్ బౌలర్లపై (ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో) ఏ ఒక్క జట్టు కనీసం 100 పరుగుల మార్కును కూడా తాక లేకపోగా.. విండీస్ మాత్రం ఏకంగా 218 పరుగులు చేసింది.విండీస్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. పూరన్ (98), జాన్సన్ ఛార్లెస్ (43), హోప్ (25), పావెల్ (26) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.అనంతరం 219 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. విండీస్ బౌలర్ల ధాటికి 114 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా విండీస్ 104 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. గ్రూప్-సి నుంచి విండీస్, ఆఫ్ఘనిస్తాన్ ఇదివరకే సూపర్-8కు క్వాలిఫై కావడంతో ఈ మ్యాచ్కు ప్రాధాన్యత లేకుండా పోయింది.గ్రూప్-ఏ నుంచి భారత్ (A1), యూఎస్ఏ (A2) సూపర్-8కు అర్హత సాధించగా,, గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1), ఇంగ్లండ్ (B2), గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1), వెస్టిండీస్ (C2), గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1), బంగ్లాదేశ్ (D2) సూపర్-8లోకి ప్రవేశించాయి.సూపర్-8 గ్రూప్-1లో గ్రూప్-ఏ నుంచి భారత్ (A1).. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1).. గ్రూప్-డి నుంచి బంగ్లాదేశ్ (D2) జట్లు ఉన్నాయి.సూపర్-8 గ్రూప్ 2లో గ్రూప్-ఏ నుంచి యూఎస్ఏ (A2).. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ (B2).. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్ (C2).. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి.సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్లు..జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (సెయింట్ విన్సెంట్)సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్లు..జూన్ 19- యూఎస్ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)జూన్ 21- యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)జూన్ 23- యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా) -
రెండో వన్డేలోనూ విండీస్ను చిత్తు చేసిన శ్రీలంక.. సిరీస్ కైవసం
మహిళల ఐసీసీ వన్డే ఛాంపియన్షిప్లో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల సిరీస్ను శ్రీలంక మరో మ్యాచ్ ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లో కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న వెస్టిండీస్ మహిళల జట్టు ఇవాళ (జూన్ 18) రెండో వన్డే ఆడింది. ఈ మ్యాచ్లో అతిథ్య శ్రీలంక.. పర్యాటక జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్లో కూడా శ్రీలంకనే విజయం సాధించింది.గాలే వేదికగా జరిగిన రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్...లంక బౌలర్ల ధాటికి 31 ఓవర్లలోనే 92 పరుగులకే చాపచుట్టేసింది. కవిష దిల్హరి (6-0-20-4), చమారీ ఆటపట్టు (2-0-8-0), అచిని కులసూరియా (7-1-6-2), సుగందిక కుమారీ (6-0-16-1) విండీస్ పతనాన్ని శాశించారు. విండీస్ ఇన్నింగ్స్లో రషాదా విలియమ్స్ (24), చెడీన్ నేషన్ (12), ఆలియా అలెన్ (16), అఫీ ఫ్లెచర్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 93 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. ఓపెనర్ విష్మి గుణరత్నే (50) అర్దసెంచరీతో రాణించడంతో 21.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. లంక ఇన్నింగ్స్లో విష్మితో పాటు కవిష దిల్హరి (28) రాణించింది. విండీస్ బౌలర్లలో కరిష్మ రామ్హరాక్ 2, షమీలియా కానెల్, ఆలియ అలెన్, జైదా జేమ్స్ తలో వికెట్ పడగొట్టారు.ఈ సిరీస్లో జరగాల్సిన చివరి వన్డే జూన్ 21 ఇదే వేదికగా జరుగనుంది. వన్డే సిరీస్ ముగిసిన అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. జూన్ 24, 26, 28 తేదీల్లో ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. -
చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. ఆసీస్, భారత్కు కూడా సాధ్యం కాలేదు
టీ20 వరల్డ్కప్-2024లో వెస్టిండీస్ జట్టు తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. మంగళవారం తమ చివరి లీగ్ మ్యాచ్లో అఫ్గానిస్తాన్ను 104 పరుగులతో విండీస్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఆరంభంలోనే ఓపెనర్ కింగ్ వికెట్ కోల్పోయినప్పటకి.. పూరన్, చార్లెస్ మాత్రం విండీస్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో పవర్ప్లే ముగిసే సరికి విండీస్ స్కోర్ బోర్డు 92 పరుగులకు చేరింది.చరిత్ర సృష్టించిన విండీస్..తద్వారా వెస్టిండీస్ ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. టీ20 వరల్ఢ్కప్ మ్యాచ్లో పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా విండీస్ రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు నెదర్లాండ్స్ పేరిట ఉండేది. టీ20 వరల్డ్కప్-2024లో ఐర్లాండ్పై పవర్ప్లేలో నెదర్లాండ్స్ 91 పరుగులు చేసింది. తాజా మ్యాచ్లో అఫ్గాన్పై పవర్ప్లేలో 92 పరుగులు చేసిన విండీస్.. డచ్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసింది. కాగా ఈ మెగా టోర్నీ తొలి రౌండ్లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన కరేబియన్ జట్టు గ్రూపు-సి నుంచి అగ్రస్ధానంలో నిలిచింది. -
టీ20 వరల్డ్కప్లో చెత్త రికార్డు.. ఒకే ఓవర్లో 36 పరుగులు! వీడియో
అఫ్గానిస్తాన్ స్టార్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్గా ఒమర్జాయ్ రికార్డులకెక్కాడు.టీ20 వరల్డ్కప్-2024లో సెయింట్ లూసియా వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఒకే ఓవర్లో 36 పరుగులిచ్చిన ఒమర్జాయ్.. ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసున్నాడు. ఈ మ్యాచ్లో విండీస్ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన ఒమర్జాయ్కు నికోలస్ పూరన్ చుక్కలు చూపించాడు. ఆ ఓవర్లో పూరన్ 3 సిక్స్లు, రెండు ఫోర్లతో 26 పరుగులు రాబట్టగా.. ఒమర్జాయ్ ఎక్స్ట్రాస్( వైడ్+4, నో బాల్, 4 లెగ్ బైస్)రూపంలో 10 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తంగా ఆ ఓవర్లో 36 పరుగులు వచ్చాయి.ఇక ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2007 టీ20 వరల్డ్కప్లో బ్రాడ్ బౌలింగ్లో భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ వరుసగా 6 సిక్స్లు బాది 36 పరుగులు రాబాట్టాడు.మళ్లీ 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్కప్లో ఒకే ఓవర్లో 36 పరుగులు వచ్చాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అఫ్గాన్పై 104 పరుగుల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. అయితే ఇరు జట్లు ఇప్పటికే సూపర్-8కు అర్హత సాధించాయి. View this post on Instagram A post shared by ICC (@icc) -
అఫ్గాన్ను చిత్తు చేసిన విండీస్.. 104 పరుగుల తేడాతో ఘన విజయం
టీ20 వరల్డ్కప్-2024లో వెస్టిండీస్ తమ చివరి లీగ్ మ్యాచ్ను విజయంతో ముగించింది. సెయింట్ లూసియా వేదికగా అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 104 పరుగుల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది.219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్.. కరేబియన్ బౌలర్ల దాటికి 114 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బౌలర్లలో ఒబెడ్ మెకాయ్ 3 వికెట్లతో అదరగొట్టగా.. అకిల్ హుస్సేన్, మోటీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు రస్సెల్, జోషఫ్ కూడా చెరో వికెట్ సాధించారు. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్(38) మినహా మిగితందరూ దారుణంగా విఫలమయ్యారు.పూరన్ ఊచకోత..అంతకుముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు.ఈ మ్యాచ్లో కేవలం 53 బంతులు ఎదుర్కొన్న పూరన్ 6 ఫోర్లు, 8 సిక్స్లతో 98 పరుగులు చేసి రనౌటయ్యాడు.ఇక అతడితో పాటు చార్లెస్(43), హోప్(25), పావెల్(26) పరుగులతో రాణించారు. ఈ ఏడాది వరల్డ్కప్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇక అఫ్గాన్ బౌలర్లలో గుల్బాదిన్ నైబ్ రెండు వికెట్లు పడగొట్టగా.. అజ్మతుల్లా, నవీన్ ఉల్ హాక్ తలా వికెట్ సాధించారు. కాగా గ్రూపు సి నుంచి అఫ్గానిస్తాన్, విండీస్ ఇప్పటికే సూపర్-8కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. -
పూరన్ విధ్వంసం.. టీ20 వరల్డ్కప్-2024లో భారీ స్కోర్
టీ20 వరల్డ్కప్-2024లో వెస్టిండీస్ తమ చివరి లీగ్ మ్యాచ్లో జూలు విదిల్చింది. సెయింట్ లూసియా వేదికగా గ్రూపు-సిలో భాగంగా అఫ్గానిస్తాన్తో మ్యాచ్లో విండీస్ బ్యాటర్లు అదరగొట్టారు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని పూరన్ కోల్పోయాడు. ఈ మ్యాచ్లో కేవలం 53 బంతులు ఎదుర్కొన్న పూరన్ 6 ఫోర్లు, 8 సిక్స్లతో 98 పరుగులు చేసి రనౌటయ్యాడు.ఇక అతడితో పాటు చార్లెస్(43), హోప్(25), పావెల్(26) పరుగులతో రాణించారు. ఈ ఏడాది వరల్డ్కప్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇక అఫ్గాన్ బౌలర్లలో గుల్బాదిన్ నైబ్ రెండు వికెట్లు పడగొట్టగా.. అజ్మతుల్లా, నవీన్ ఉల్ హాక్ తలా వికెట్ సాధించారు. -
T20 WC: రిటైర్మెంట్ ప్రకటించిన వెటరన్ క్రికెటర్
నెదర్లాండ్స్ క్రికెటర్ సిబ్రాండ్ ఎంగెల్బ్రెచ్ ఆటకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది.టీ20 ప్రపంచకప్-2024 లీగ్ దశలో శ్రీలంక చేతిలో నెదర్లాండ్స్ ఓటమి తర్వాత సిబ్రాండ్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా సౌతాఫ్రికాలోని జొహన్నస్బర్గ్లో 1988లొ జన్మించిన సిబ్రాండ్.. అక్కడే క్రికెటర్గా మారాడు.విరాట్ కోహ్లి క్యాచ్ అందుకునిఅండర్-19 ప్రపంచకప్-2008లో సౌతాఫ్రికా తరఫున బరిలోకి దిగిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్.. నాడు యువ భారత్తో మ్యాచ్లో విరాట్ కోహ్లి ఇచ్చిన క్యాచ్ను అద్భుత రీతిలో అందుకున్నాడు.జాంటీ రోడ్స్ మాదిరి క్యాచ్ పట్టాడంటూ అప్పట్లో సిబ్రాండ్పై ప్రశంసలు కురిశాయి. ఇక తర్వాత సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్లో కేప్ కోబ్రాస్(2008/09, 2015/16), వెస్టర్న్ ప్రావిన్స్(2009/10 to 2016/17) జట్లకు మూడు ఫార్మాట్లలో ప్రాతినిథ్యం వహించాడు.చాంపియన్స్-2014 లీగ్లో భాగంగా కోబ్రాస్ తరఫున.. జేపీ డుమిన్ స్థానంలో బరిలోకి దిగి.. సూపర్ ఓవర్లో 11 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అయితే, ఆ తర్వాత ఉన్నత విద్యనభ్యసించడంపై దృష్టి పెట్టిన సిబ్రాండ్ క్రికెట్కు విరామం ఇచ్చాడు.ఉద్యోగం కోసం అక్కడికిఎంబీఏ చేసేందుకు ఆటను పక్కనపెట్టి.. చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించాడు. ఈ క్రమంలో ఉద్యోగ విధుల నిమిత్తం 2021లో నెదర్లాండ్స్కు మకాం మార్చాడు. అక్కడ క్లబ్ క్రికెట్ ఆడిన సిబ్రాండ్.. డచ్ టాప్క్లాసెస్ చాంపియన్షిప్-2023లో వూబర్గ్ సీసీ కెప్టెన్గా వ్యవహరించాడు.ఈ నేపథ్యంలో 2023లో వన్డే వరల్డ్కప్లో భాగంగా న్యూజిలాండ్తో మ్యాచ్ సందర్భంగా.. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2024లో టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చిన సిబ్రాండ్.. ప్రపంచకప్-2024 జట్టులోనూ భాగమయ్యాడు.ఇక ఇప్పటి వరకు మొత్తంగా డచ్ జట్టు తరఫున 12 వన్డేలు, 12లు ఆడిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఆయా ఫార్మాట్లలో 385, 280 పరుగులు చేశాడు. ఇక రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ అయిన 35 ఏళ్ల సిబ్రాండ్ టీ20లలో 5 వికెట్లు కూడా పడగొట్టాడు.టీ20 వరల్డ్కప్-2024 - గ్రూప్-డి శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్👉వేదిక: సెయింట్ లూసియా, వెస్టిండీస్👉టాస్: నెదర్లాండ్స్.. తొలుత బౌలింగ్👉శ్రీలంక స్కోరు: 201/6 (20)👉నెదర్లాండ్స్ స్కోరు: 118 (16.4)👉ఫలితం: 83 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ను చిత్తు చేసిన శ్రీలంక👉ఈ మ్యాచ్లో సిబ్రాండ్ చేసిన పరుగులు: 11.చదవండి: అతడికి టీ20 జట్టులో ఉండే అర్హతే లేదు: సెహ్వాగ్ -
టీ20 వరల్డ్కప్లో నేడు (జూన్ 17) మరో ఆసక్తికర సమరం
పొట్టి ప్రపంచకప్ 2024లో ఇవాళ (జూన్ 17) మరో ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. సూపర్-8 బెర్త్లు ఖరారు కావడంతో నామమాత్రంగా సాగనున్న ఈ మ్యాచ్లో వెస్టిండీస్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఢీకొట్టనున్నాయి. గ్రూప్-సిలో భాగంగా జరుగనున్న ఈ మ్యాచ్ సెయింట్ లూసియా వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం 6 గంటలకు మొదలుకానుంది. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ జట్లు ఇదివరకే సూపర్-8కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.గ్రూప్-సిలో భాగంగా ఇవాళే మరో మ్యాచ్ కూడా జరుగనుంది. ట్రినిడాడ్ వేదికగా పపువా న్యూ గినియా.. న్యూజిలాండ్ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. న్యూజిలాండ్, పపువా న్యూ గినియా సూపర్-8కు అర్హత సాధించకపోవడంతో ఈ మ్యాచ్ కూడా నామమాత్రంగా సాగనుంది.కాగా, ఇవాల్టి మ్యాచ్లతో సంబంధం లేకుండానే సూపర్-8 బెర్త్లు ఖరారయ్యాయి. సూపర్-8 గ్రూప్-1లో గ్రూప్-ఏ నుంచి భారత్ (A1).. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1).. గ్రూప్-డి నుంచి బంగ్లాదేశ్ (D2) జట్లు ఉన్నాయి.సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్లు..జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (సెయింట్ విన్సెంట్)సూపర్-8 గ్రూప్ 2లో గ్రూప్-ఏ నుంచి యూఎస్ఏ (A2).. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ (B2).. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్ (C2).. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి. సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్లు..జూన్ 19- యూఎస్ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)జూన్ 21- యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)జూన్ 23- యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)గ్రూప్-1, గ్రూప్-2ల్లో అన్ని మ్యాచ్లు ముగిశాక మొదటి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. -
T20 World Cup 2024: న్యూజిలాండ్ స్టార్ పేసర్కు మందలింపు
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఐసీసీ నియమావళిని ఉల్లఘించినందుకు గానూ న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ మందలింపుకు గురయ్యాడు. ఈ మ్యాచ్లో సౌథీ ఔటయ్యాక డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తూ హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సర్ను పగులగొట్టాడు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్ల్లో గ్రౌండ్ పరికరాలను ధ్వంసం చేస్తే ఆర్టికల్ 2.2 ఉల్లంఘన కింద ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటారు. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను సౌథీ స్వల్ప మందలింపుకు గురి కావడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ పొందాడు. గడిచిన 24 నెలల్లో సౌథీకి ఇది మొదటి ఉల్లంఘణ కావడంతో ఐసీసీ మందలింపుతో వదిలి పెట్టింది. సౌథీ తన తప్పిదాన్ని మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ముందు అంగీకరించాడు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్ 2024లో న్యూజిలాండ్ ప్రస్తానం ముగిసింది. ఆ జట్టు మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఓడటంతో న్యూజిలాండ్ అధికారికంగా టోర్నీ నుంచి వైదొలిగింది. న్యూజిలాండ్ అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. న్యూజిలాండ్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా..ఛేదనలో చేతులెత్తేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. -
T20 WC: గిల్తో పాటు అతడు ఇంటికి! వాళ్లిద్దరు అక్కడే..
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా అదరగొడుతోంది. లీగ్ దశలో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-8కు చేరుకున్న రోహిత్ సేన.. తదుపరి కెనడాతో తలపడనుంది.ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడెర్డేల్లో ఇరు జట్ల మధ్య జూన్ 15న మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ తెరమీదకు వచ్చింది.వరల్డ్కప్-2024 జట్టులో ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లుగా ఉన్న స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్, యువ పేసర్ ఆవేశ్ ఖాన్ స్వదేశానికి తిరిగి రానున్నట్లు సమాచారం. అయితే, వీరితో పాటు ఇదే కేటగిరిలో ఉన్న రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ మాత్రం ప్రధాన జట్టుతో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం వీరు నలుగురు టీమిండియాతో కలిసి చార్టెడ్ ఫ్లైట్లో ఫ్లోరిడాకు చేరుకున్నట్లు సమాచారం. అక్కడ కెనడాతో మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్, ఆవేశ్ ఖాన్ భారత్కు తిరిగి పయనం కానున్నట్లు తెలుస్తోంది. కారణం ఏమిటి?ఈ మెగా టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి ఓపెనర్గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ అందుబాటులో ఉన్నాడు. సంజూ శాంసన్ రూపంలో మరో ఆప్షన్ కూడా ఉంది.ఈ నేపథ్యంలో గ్రూప్ దశ ముగిసిన తర్వాత ఇక శుబ్మన్ గిల్తో అవసరం ఉండదని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. గ్రూప్ దశలోని నాలుగు మ్యాచ్లు అమెరికాలో పూర్తి చేసుకున్న తర్వాత టీమిండియా.. మిగతా మ్యాచ్ల కోసం వెస్టిండీస్కు వెళ్లనుంది.అవసరం లేదుఇక విండీస్ పిచ్లు స్లోగా.. స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదనపు పేసర్తో అవసరం లేదు.ఇప్పటికే పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్తో పాటు ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఎక్స్ట్రాగా ఆవేశ్ ఖాన్ను ఇంటికి పంపించాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే, హిట్టర్ రింకూ సింగ్తో పాటు బ్యాకప్ పేసర్గా ఖలీల్ అహ్మద్ను మాత్రం కొనసాగించనుందని సమాచారం. కాగా టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా ఇప్పటి వరకు ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికా జట్లపై విజయాలు సాధించింది. గ్రూప్- ఏ టాపర్గా సూపర్-8కు అర్హత సాధించింది.చదవండి: T20 World Cup 2024: వరల్డ్కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది? -
T20 World Cup 2024: పూర్వ వైభవం దిశగా వెస్టిండీస్
ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన వెస్టిండీస్ వరుస విజయలతో దూసుకుపోతుంది. ఈ ఎడిషన్లో కరీబియన్ టీమ్ పపువా న్యూ గినియా, ఉగాండ, తాజాగా న్యూజిలాండ్పై ఘన విజయాలు సాధించి గ్రూప్-సి నుంచి సూపర్-8కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.ఈ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన విండీస్.. హ్యాట్రిక్ విజయాలు సాధించి టైటిల్ ఫేవరెట్లలో ముందు వరుసలో నిలిచింది. ఈ టోర్నీకి ముందు విండీస్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. జట్టులో అందరూ విధ్వంసకర వీరులే అయినప్పటికీ, ఆ జట్టు 2023 వన్డే వరల్డ్కప్కు, 2022 టీ20 వరల్డ్కప్కు అర్హత సాధించలేకపోయింది.ప్రస్తుత ప్రపంచకప్లో విండీస్ మెరుపు ప్రదర్శనల వెనక ఆ జట్టు కోచ్ డారెన్ సామీ కీలకపాత్ర పోషిస్తున్నాడు. రెండు సార్లు (2012, 2016) విండీస్ను ప్రపంచ ఛాంపియన్గా నిలిపిన సామీ.. ప్రస్తుత వరల్డ్కప్లో కోచ్గా తన మార్కును చూపిస్తున్నాడు. సామీ ఆధ్వర్యంలో విండీస్ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుంది. స్వదేశంలో ఆడుతుండటం విండీస్కు అదనంగా కలిసొస్తుంది.ఇదిలా ఉంటే, సూపర్-8కు ఇదివరకే అర్హత సాధించిన వెస్టిండీస్ గ్రూప్ దశలో తమ తదుపరి మ్యాచ్ను జూన్ 19న ఆడనుంది. సెయింట్ లూసియా వేదికగా జరిగే ఆ మ్యాచ్లో కరీబియన్ టీమ్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. సూపర్-8 రెండో మ్యాచ్లో వెస్టిండీస్.. సౌతాఫ్రికాను ఢీకొంటుంది. -
నికోలస్ పూరన్ అరుదైన ఘనత.. గేల్ రికార్డు బ్రేక్
వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో వెస్టిండీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా పూరన్ రికార్డులకెక్కాడు. టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 17 పరుగులు చేసిన పూరన్.. ఈ అరుదైన ఫీట్ను తన పేరిట లిఖించుకున్నాడు. పూరన్ ఇప్పటివరకు విండీస్ తరపున 91 టీ20లు ఆడి 1914 పరుగులు చేశాడు. పూరన్ కెరీర్లో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. విండీస్ తరపున 79 మ్యాచ్లు ఆడిన గేల్ 1899 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్తో గేల్ అల్టైమ్ రికార్డును పూరన్ బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్పై 13 పరుగుల తేడాతో విండీస్ విజయం సాధించింది.దీంతో సూపర్-8కు కరేబియన్ జట్టు అర్హత సాధించింది. అదే విధంగా విండీస్ చేతిలో ఓటమి చవిచూసిన కివీస్.. తమ సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. -
వెస్టిండీస్పై ఓటమి.. టీ20 వరల్డ్కప్ నుంచి న్యూజిలాండ్ ఔట్!
టీ20 వరల్డ్కప్-2024లో న్యూజిలాండ్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ట్రినిడాడ్ వేదికగా ఆతిథ్య వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 13 పరుగుల తేడాతో కివీస్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో రూథర్ఫర్డ్(68) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగితా కరేబియన్ బ్యాటర్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లతో సత్తాచాటగా.. సౌథీ, ఫెర్గూసన్ తలా రెండు వికెట్లు, నీషమ్, శాంట్నర్ చెరో వికెట్ సాధించారు.నిప్పులు చేరిగిన జోషఫ్..అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులకే పరిమితమైంది. విండీస్ పేసర్ అల్జారీ జోషఫ్ 4 వికెట్లతో కివీస్ను దెబ్బతీశాడు. జోషఫ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు సాధించాడు. అతడితో పాటు స్పిన్నర్ మోటీ 3 వికెట్లతో చెలరేగాడు. ఇక బ్లాక్క్యాప్స్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(40) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.సూపర్-8కు విండీస్.. ఇంటికి కివీస్ఇక ఈ విజయంతో వెస్టిండీస్ గ్రూపు-సి నుంచి సూపర్-8కు అర్హత సాధించగా.. ఓటమిపాలైన కివీస్ తమ సూపర్-8 అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. మరో విధంగా చెప్పాలంటే ఈ టోర్నీ నుంచి న్యూజిలాండ్ దాదాపుగా ఇంటిముఖం పట్టినట్లే. రెండు ఓటములతో కివీస్ పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో కొనసాగుతోంది.ఇప్పటికే గ్రూపు-సి నుంచి విండీస్ సూపర్-8కు క్వాలిఫై కాగా.. మరో బెర్త్ కోసం అఫ్గానిస్తాన్ అడుగు దూరంలో నిలిచింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఘన విజయం సాధించిన అఫ్గానిస్తాన్.. గ్రూప్-సి పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో ఉంది. అఫ్గాన్కు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఒక్క మ్యాచ్లో విజయం సాధించినా చాలు నేరుగా సూపర్-8కు అఫ్గానిస్తాన్ నేరుగా క్వాలిఫై అవుతోంది.చదవండి: Rohit Sharma: ఇక్కడ గెలవడం అంత తేలికేమీ కాదు.. క్రెడిట్ వాళ్లకే -
రూ. 250 కోట్లు.. బ్యాటర్లకు చుక్కలే! కూల్చేయనున్న ఐసీసీ?
అమెరికాలోని ప్రఖ్యాత నగరంలోని స్టేడియం... నిర్మాణానికి దాదాపుగా 250 కోట్ల రూపాయల ఖర్చు... 34,000 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా మ్యాచ్ను వీక్షించేలా సీటింగ్ సామర్థ్యం..పరుగుల వరద పారుతుందని భావిస్తే టీ20 ఫార్మాట్కు భిన్నంగా లో స్కోరింగ్ మ్యాచ్లు.. బౌండరీల సంగతి దేవుడెరుగు సింగిల్స్ తీయాలన్నా కష్టంగా తోచే పిచ్. 👉తొలి మ్యాచ్లో శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికా.. నమోదైన స్కోర్లు.. 77 (19.1), 80/4 (16.2). ఆరు వికెట్ల తేడాతో లంకపై సౌతాఫ్రికా విజయం.👉రెండో మ్యాచ్లో ఇండియా వర్సెస్ ఐర్లాండ్.. స్కోర్లు 96 (16), 97/2 (12.2).. ఎనిమిది వికెట్ల తేడాతో ఐర్లాండ్ను చిత్తు చేసిన టీమిండియా.👉ముచ్చటగా మూడో మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడ్డ కెనడా.. స్కోర్లు 137/7 (20)- 125/7 (20). 12 పరుగుల తేడాతో కెనడా గెలుపు.👉ఇక నాలుగో మ్యాచ్ నెదర్లాండ్స్- సౌతాఫ్రికా మధ్య. ఇది కూడా లో స్కోరింగ్ మ్యాచే! నెదర్లాండ్స్ 103 రన్స్ చేస్తే.. సౌతాఫ్రికా 106 పరుగులు సాధించి.. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.👉ఐదో మ్యాచ్.. వరల్డ్కప్కే హైలైట్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. ఇండియా 119 పరుగులకు ఆలౌట్ అయితే.. పాక్ 113 పరుగుల వద్దే నిలిచి.. ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది.👉ఆ తర్వాత సౌతాఫ్రికా(113/6)తో బంగ్లాదేశ్(109/7) తలపడగా.. ప్రొటిస్ జట్టు బంగ్లాపై నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది.👉ఏడో మ్యాచ్లో కెనడా- పాకిస్తాన్ పోటీపడగా.. 106 పరుగులకే పరిమితమైన కెనడా.. 107 పరుగులు(17.3 ఓవర్లలో) చేసిన పాక్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడింది.ఇదే ఆఖరు.. కూల్చేయడమే తరువాయిఇక ఆఖరిసారిగా ఇక్కడ ఆతిథ్య అమెరికా జట్టు టీమిండియాతో తలపడేందుకు సిద్ధమైంది. గ్రూప్-ఏ లో ఉన్న ఈ జట్ల మధ్య జరిగే మ్యాచే ఇక్కడ జరిగే చివరి మ్యాచ్. ఆ తర్వాత దీనిని కూల్చేస్తారు.అవును.. మీరు విన్నది నిజమే. ఇదంతా న్యూయార్క్లోని నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గురించే! టీ20 ప్రపంచకప్ టోర్నీకి అమెరికా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.20 జట్లు.. తొమ్మిది వేదికలువెస్టిండీస్తో కలిసి ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న యూఎస్ఏలో మూడు వేదికల్లో మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.న్యూయార్క్- నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఫ్లోరిడా- లాడర్హిల్లోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ కౌంటీ స్టేడియం, డల్లాస్-టెక్సాస్లోని గ్రాండ్ ప్రయరీ క్రికెట్ స్టేడియాలలో మ్యాచ్లు నిర్వహిస్తున్నారు.అయితే, వీటిలో నసావూ కౌంటీ స్టేడియాన్ని ఈ ఈవెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి తాత్కాలికంగా నిర్మించింది. జూన్ 3- 12 వరకు ఎనిమిది మ్యాచ్లు పూర్తైన తర్వాత దీనిని డిస్మాంటిల్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.పెదవి విరిచిన ప్రేక్షకులుఅయితే, డ్రాప్- ఇన్ పిచ్ ఉన్న ఈ స్టేడియం కోసం ఐసీసీ సుమారుగా రూ. 250 కోట్లు ఖర్చు చేసినా.. సదుపాయాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదీ బిగ్ ఆపిల్ సిటీలోని నసావూ కౌంటీ స్టేడియం సంగతి!!టీ20 ప్రపంచకప్-2024లో మొత్తం 20 జట్లు భాగం కాగా.. అమెరికాలో మూడు, వెస్టిండీస్(గయానా, బార్బడోస్, ఆంటిగ్వా, ట్రినిడాడ్, సెయింట్ విన్సెంట్, సెయింట్ లూసియా)లోని ఆరు నగరాలు ఇందుకు ఆతిథ్యం ఇస్తున్నాయి. చదవండి: WC: పక్కా టీ20 టైప్.. న్యూయార్క్ పిచ్ వెనుక ఇంత కథ ఉందా? -
T20 WC 2024: నేపాల్ జట్టుకు గుడ్న్యూస్
టీ20 ప్రపంచకప్-2024లో నేపాల్ జట్టు ఆడే చివరి రెండు మ్యాచ్లకు ఆ జట్టు స్టార్ క్రికెటర్ సందీప్ లమిచానే అందుబాటులోకి రానున్నాడు. గతంలో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని ఎనిమిదేళ్ల జైలు శిక్షకు గురై... ఆ తర్వాత ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు నుంచి విముక్తి పొందిన లమిచానేకు అమెరికా ప్రభుత్వం వీసా నిరాకరించింది.దాంతో అతను అమెరికా వేదికగా తొలి రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. నేపాల్ తమ చివరి రెండు మ్యాచ్లను వెస్టిండీస్ వేదికగా ఆడనుంది. ఈనెల 15న దక్షిణాఫ్రికాతో, 17న బంగ్లాదేశ్తో కింగ్స్టౌన్లో తలపడనుంది. ఈ నేపథ్యంలో సందీప్ లమిచానే ఇప్పటికే వెస్టిండీస్కు చేరుకున్నాడు.కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సందీప్ లమిచానే కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. టీ20 ఫార్మాట్లో అద్భుతంగా రాణించిన ఈ లెగ్ స్పిన్ బౌలర్.. నేపాల్ తరఫున ఇప్పటి వరకు మొత్తంగా 52 టీ20లు ఆడి 98 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 51 వన్డేలు ఆడి 112 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్కప్-2024లో గ్రూప్-డిలో ఉన్న నేపాల్ నెదర్లాండ్స్తో తమ తొలి మ్యాచ్ ఆడింది. ఇందులో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తదుపరి జూన్ 12న శ్రీలంకతో ఫ్లోరిడా వేదికగా తలపడనుంది. ఈ మ్యాచ్కు కూడా సందీప్ దూరంగా ఉండనున్నాడు.టీ20 ప్రపంచకప్-2024 కోసం నేపాల్ ప్రకటించిన జట్టురోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సా, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్బన్షి, కరణ్ కెసి, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, ప్రతిస్ జిసి, సందీప్ జోరా, అబినాష్ బోహారా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ.సందీప్ లమిచానే -
WI Vs UGA: దటీజ్ పావెల్.. టీ20 వరల్డ్కప్లో భారీ సిక్సర్! వీడియో వైరల్
టీ20 వరల్డ్కప్ 2024లో భారీ సిక్స్ నమోదైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉగండాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ కెప్టెన్ రోవ్మన్ పావెల్ భారీ సిక్స్ కొట్టాడు. అతడు కొట్టిన షాట్కు బంతి 107 మీటర్ల దూరం వెళ్లి స్టేడియం బయటపడింది.ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన ఫ్రాంక్ న్సుబుగా.. తొలి బంతిని ఆఫ్-స్పిన్నింగ్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో ఫ్రంట్ ఫుట్కు వచ్చిన పావెల్.. లాంగ్-ఆన్ దిశగా భారీ సిక్స్ బాదాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ పేరిట ఉండేది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో సాల్ట్ 105 మీట్లర్ల సిక్స్ బాదాడు. తాజా మ్యాచ్తో సాల్ట్ను పావెల్ అధిగమించాడు. ఇక ఈ మ్యాచ్లో 134 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. 74 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన ఉగండా.. విండీస్ బౌలర్ల దాటికి కేవలం 39 పరుగులకే కుప్పకూలింది. విండీస్ స్పిన్నర్ అకిల్ హుస్సేన్ 5 వికెట్లతో ఉగండా పతనాన్ని శాసించగా.. జోషఫ్ రెండు, మోటీ, రస్సెల్, షెఫెర్డ్ తలా వికెట్ సాధించారు. ఉగండా బ్యాటర్లలో జుమా మియాగీ(13) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ జాన్సన్ చార్లెస్(44) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రస్సెల్(30 నాటౌట్), పావెల్(23), పూరన్(22) పరుగులతో రాణించారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
WI Vs UGA: 39 పరుగులకే ఆలౌట్.. టీ20 వరల్డ్కప్లో చెత్త రికార్డు
టీ20 వరల్డ్కప్-2024లో పసికూన ఉగండా ఘోర పరాభవం మూట కట్టుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 134 పరుగుల తేడాతో ఉగండా ఓటమి పాలైంది.174 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన ఉగండా విండీస్ బౌలర్ల దాటికి విల్లవిల్లాడింది. కేవలం 39 పరుగులకే ఉగండా కుప్పకూలింది. విండీస్ స్పిన్నర్ అకిల్ హుస్సేన్ 5 వికెట్లతో ఉగండా పతనాన్ని శాసించగా.. జోషఫ్ రెండు, మోటీ, రస్సెల్, షెఫెర్డ్ తలా వికెట్ సాధించారు. ఉగండా బ్యాటర్లలో జుమా మియాగీ(13) టాప్ స్కోరర్గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.చెత్త రికార్డు..ఈ క్రమంలో ఓ చెత్త రికార్డును ఉగండా తమ పేరిట లిఖించుకుంది. టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన నెదర్లాండ్స్ చెత్త రికార్డును ఉగండా సమం చేసింది. 2014 టీ20 వరల్డ్కప్లో శ్రీలంకపై నెదర్లాండ్స్ కూడా 39 పరుగులకే ఆలౌటైంది. ఇక జాబితాలో తర్వాతి స్ధానాల్లో నెదర్లాండ్స్(44), వెస్టిండీస్(55), ఉగండా(58) ఉన్నాయి.వెస్టిండీస్ అరుదైన రికార్డు..టీ20 వరల్డ్కప్ టోర్నీలో పరుగుల పరంగా భారీ తేడాతో గెలిచిన రెండో జట్టుగా విండీస్ నిలిచింది. ఈ మ్యాచ్లో 134 పరుగుల తేడాతో కరేబియన్ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలో అగ్రస్ధానంలో శ్రీలంక ఉంది. జోహాన్స్బర్గ్ వేదికగా జరిగిన 2007 వరల్డ్కప్లో కెన్యాపై శ్రీలంక ఏకంగా 172 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది -
WI Vs UGA: 5 వికెట్లతో చెలరేగిన అకిల్.. పసికూనపై విండీస్ ఘన విజయం
టీ20 వరల్డ్కప్-2024లో వెస్టిండీస్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా ఉగండాతో జరిగిన మ్యాచ్లో 134 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది.174 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన ఉగండా.. విండీస్ బౌలర్ల దాటికి కేవలం 39 పరుగులకే కుప్పకూలింది. విండీస్ స్పిన్నర్ అకిల్ హుస్సేన్ 5 వికెట్లతో ఉగండా పతనాన్ని శాసించగా.. జోషఫ్ రెండు, మోటీ, రస్సెల్, షెఫెర్డ్ తలా వికెట్ సాధించారు. ఉగండా బ్యాటర్లలో జుమా మియాగీ(13) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ జాన్సన్ చార్లెస్(44) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రస్సెల్(30 నాటౌట్), పావెల్(23), పూరన్(22) పరుగులతో రాణించారు. ఉగండా బౌలర్లలో కెప్టెన్ మసాబా రెండు వికెట్లు పడగొట్టగా.. నక్రాని, కెవాటియా, రామ్జనీ తలా వికెట్ సాధించారు. -
WI Vs UGA: చెలరేగిన విండీస్ బ్యాటర్లు.. పసికూన ముందు భారీ టార్గెట్
టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా గయానా వేదికగా ఉగండాతో జరుగుతున్న మ్యాచ్లో వెస్టిండీస్ బ్యాటర్లు చెలరేగారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ జాన్సన్ చార్లెస్(44) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రస్సెల్(30 నాటౌట్), పావెల్(23), పూరన్(22) పరుగులతో రాణించారు. ఓ దశలో విండీస్ ఈజీగా 200 పరుగుల మార్క్ దాటుతుందని అంతా భావించారు. కానీ ఉగండా బౌలర్లు ఆఖరి 6 ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 200 పరుగుల మార్క్ను కరేబియన్లు దాటలేకపోయారు. ఉగండా బౌలర్లలో కెప్టెన్ మసాబా రెండు వికెట్లు పడగొట్టగా.. నక్రాని, కెవాటియా, రామ్జనీ తలా వికెట్ సాధించారు. -
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన వెస్టిండీస్
టీ20 వరల్డ్కప్-2024 ముగిసిన అనంతరం వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా విండీస్ ఆతిథ్య ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది. జులై 10న లార్డ్స్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు క్రైగ్ బ్రాత్వైట్ సారథ్యం వహించనున్నాడు.అదేవిధంగా టీ20 వరల్డ్కప్-2024కు గాయం కారణంగా దూరమైన స్టార్ ఆల్రౌండర్ జాసన్ హోల్డర్.. ఇంగ్లండ్ సిరీస్కు మాత్రం అందుబాటులోకి వచ్చాడు. మరోవైపు దేశీవాళీ క్రికెట్లో అదరగొడుతున్న మైకిల్ లూయిస్ తొలిసారి విండీస్ సెలక్టర్లు పిలుపునిచ్చారు.వెస్టిండీస్ టెస్టు జట్టు: క్రైగ్ బ్రాత్వైట్ (కెప్టెన్), అలిక్ అథానాజ్, జాషువా డా సిల్వా, జాసన్ హోల్డర్, కావెం హాడ్జ్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారీ జోసెఫ్ (వైస్-కెప్టెన్), షమర్ జోసెఫ్, మికిల్ లూయిస్, జాచరీ మెక్కాస్కీ, మెక్కాస్కీ గుడాకేష్ మోటీ, కెమర్ రోచ్, జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లైర్ -
వామ్మో.. ఇదేమి సిక్స్రా బాబు! దెబ్బకు స్టేడియం బయటకు బంతి
టీ20 వరల్డ్కప్-2024లో ఆతిథ్య వెస్టిండీస్ శుభారంభం చేసింది. ఆదివారం గయనా వేదికగా పాపువా న్యూ గినియా (PNG)తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో విజయం విండీస్ విజయం సాధించింది. అయితే పీఎన్జీ విధించిన 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిడానికి వెస్టిండీస్ తీవ్రంగా శ్రమించింది. 137 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన వెస్టిండీస్ కు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. అలై నౌ బౌలింగ్ లో జాన్సన్ చార్లెస్ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత పూరన్, కింగ్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. అయితే వరుసక్రమంలో వికెట్లు కోల్పోయి విండీస్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రోస్టన్ చేజ్ చివరివరకు క్రీజులో ఉండి అద్భుతమైన ఇన్నింగ్స్తో కరేబియన్ జట్టును గెలిపించాడు. రోస్టన్ ఛేజ్ (42 నాటౌట్, 27 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడితో పాటు నికోలస్ పూరన్ 27 పరుగులు, రోమ్ మన్ పావెల్ 15, ఆండ్రీ రస్సెల్ 15 పరుగులతో రాణించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది.పూరన్ భారీ సిక్సర్.. ఇక ఈ మ్యాచ్లో వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ భారీ సిక్సర్ బాదాడు. విండీస్ ఇన్నింగ్స్ 6 ఓవర్ వేసిన పీఎన్జీ స్పిన్నర్ బౌ.. తొలి బంతిని ఓవర్పిచ్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో పూరన్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి భారీ సిక్సర్ కొట్టాడు. పూరన్ పవర్కు బంతి స్టేడియం బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.చదవండి: మేజర్ లీగ్ క్రికెట్లో ఆడనున్న సన్రైజర్స్ కెప్టెన్.. The man-in-form! 💥After patiently biding his time, #NicholasPooran unleashes with a MAXIMUM and a boundary! 💪🏻📺 | #WIvPNG | LIVE NOW | #T20WorldCupOnStar (Only available in India) pic.twitter.com/A4rWKKcCk7— Star Sports (@StarSportsIndia) June 2, 2024 -
వెస్టిండీస్ను భయపెట్టిన పసికూన.. చెమటోడ్చి నెగ్గిన కరేబియన్లు
గయానా: టి20 ప్రపంచకప్కు ఆతిథ్యమిస్తున్న రెండో దేశం వెస్టిండీస్ కూడా టోర్నిలో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో రెండుసార్లు చాంపియన్ విండీస్ ఓటమి అంచుల్లోంచి బయటపడి 5 వికెట్ల తేడాతో పపువా న్యూగినీ జట్టుపై గెలిచి ఊపిరి పీల్చుకుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పపువా న్యూగినీ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు టోని వుర (2), అసద్ వాలా (21), లెగా సియాక (1) నిరాశ పరచడంతో 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ దశలో సెసె బావు (43 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. చార్లెస్ అమిని (12)తో ఐదో వికెట్కు 44 పరుగులు జోడించాడు. జట్టు స్కోరు 98 వద్ద ఆరో వికెట్గా సెసె బావు నిష్క్రమించగా, కిప్లిన్ డొరిగా (18 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడటంతో పపువా ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. విండీస్ బౌలర్లలో రసెల్, జోసెఫ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం వెస్టిండీస్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోస్టన్ చేజ్ (27 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) విండీస్ను ఒడ్డున పడేసే ఆట ఆడాడు.సులువైన ప్రత్యర్థే అయినా... ఏమంత కష్టం కానీ లక్ష్యమే ఎదురైనా... వెస్టిండీస్ గెలిచేందుకు ఆపసోపాలు పడింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్, పూరన్ ఉన్నంత వరకు 8 ఓవర్లలో విండీస్ 61/1 స్కోరు చేసింది. గెలిచేందుకు 72 బంతుల్లో 76 పరుగులు చేస్తే సరిపోతుంది. కానీ తర్వాతి వరుస ఓవర్లలో పూరన్ (27 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్లు), కింగ్ (29 బంతుల్లో 34; 7 ఫోర్లు) అవుటయ్యాక పరిస్థితి మారింది. కెప్టెన్ రొవ్మన్ పావెల్ (15), రూథర్ఫోర్డ్ (2) వికెట్లు పారేసుకోవడంతో సమీకరణం 24 బంతుల్లో 40 పరుగుల వద్ద కష్టంగా కనిపించింది. ఈ దశలో రసెల్ (9 బంతుల్లో 15 నాటౌట్; 1 సిక్స్) వచ్చాక చేజ్ ధాటిగా ఆడాడు. 18వ ఓవర్లో 2 బౌండరీలు, ఓ సిక్స్ బాది 18 పరుగులు పిండుకున్నాడు. మరుసటి ఓవర్లోనూ చేజ్ 2 ఫోర్లు కొట్టడంతో 19వ ఓవర్ ఆఖరి బంతికి లక్ష్యాన్ని చేరుకుంది. -
సూపర్ క్యాచ్.. జడేజాను గుర్తు చేసిన విండీస్ ఆటగాడు! వీడియో
టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా గయానా వేదికగా పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్ సంచలన క్యాచ్తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్తో న్యూ గినియా కెప్టెన్ ఆసద్ వాలాను ఛేజ్ పెవిలియన్కు పంపాడు. న్యూ గినియా ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన అల్జారీ జోసెఫ్ ఔట్సైడ్ ఆఫ్దిశగా లెంగ్త్ డెలివరీ సంధించాడు. ఆ లెంగ్త్ డెలివరీని ఆసద్ వాలా బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న ఛేజ్ డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్ను అందుకున్నాడు. ఇది చూసిన న్యూ గినియా కెప్టెన్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను గుర్తు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా జడేజా కూడా ఈ విధంగానే పాయింట్లో ఎన్నో మెరుపు క్యాచ్లను అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూ గునియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పీఎన్జీ బ్యాటర్లలో సెసే బౌ(50) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బౌకు ఇది తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం గమనార్హం. ఇక అతడితో పాటు కెప్టెన్ అసద్ వాలా(21), డొరిగా(27) పరుగులతో రాణించారు. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పీఎన్జీని వలా, బావు అదుకున్నారు.వీరిద్దరూ విండీస్ బౌలర్లకు అడ్డుగా నిలవడంతో పీఎన్జీ గౌరవప్రదమైన స్కోర్ సాధించగల్గింది. ఇక వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్, జోసెఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హోస్సేన్, షెఫెర్డ్, మోటీ తలా వికెట్ సాధించారు. SCREAMER! 🥵#AlzarriJoseph strikes in his very first over and gets the #PapuaNewGuinea skipper caught at point!📺 | #WIvPNG | LIVE NOW | #T20WorldCupOnStar (Only available in India) pic.twitter.com/g0EaFdHsNb— Star Sports (@StarSportsIndia) June 2, 2024 -
పీఎన్జీ బ్యాటర్ల అద్బుత పోరాటం.. విండీస్ టార్గెట్ ఎంతంటే?
టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా గయానా వేదికగా పాపువా న్యూ గినియా, వెస్టిండీస్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూ గునియా పర్వాలేదన్పించింది. పటిష్టమైన కరేబియన్ బౌలింగ్ లైనప్ను ఎదుర్కొన్న న్యూ గునియా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పీఎన్జీ బ్యాటర్లలో సెసే బౌ(50) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బౌకు ఇది తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం గమనార్హం. ఇక అతడితో పాటు కెప్టెన్ అసద్ వాలా(21), డొరిగా(27) పరుగులతో రాణించారు. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పీఎన్జీని వలా, బావు ఆదుకున్నారు. వీరిద్దరూ విండీస్ బౌలర్లకు అడ్డుగా నిలవడంతో పీఎన్జీ గౌరవప్రదమైన స్కోర్ సాధించగల్గింది. ఇక వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్, జోసెఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హోస్సేన్, షెఫెర్డ్, మోటీ తలా వికెట్ సాధించారు. -
T20 WC 2024: ఇరవై జట్లు.. ఆటగాళ్ల లిస్టు.. పూర్తి వివరాలు
అంతర్జాతీయ క్రికెట్ మండలి నేతృత్వంలో 2007లో మొదలైన టీ20 ప్రపంచకప్ టోర్నీ విజయవంతంగా ఎనిమిది ఎడిషన్లు పూర్తి చేసుకుంది. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి తొమ్మిదో ఎడిషన్ మొదలుకానుంది.ఈ మెగా ఈవెంట్ ఆరంభం నుంచి ఇప్పటి దాకా ఇద్దరంటే ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే కొనసాగుతున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బంగ్లాదేశ్ మాజీ సారథి షకీబ్ అల్ హసన్కు మాత్రమే ఈ అరుదైన ఘనత సాధ్యమైంది.పటిష్ట భారత జట్టును మరోసారి పొట్టి ప్రపంచకప్ టోర్నీలో ముందుకు నడిపించే క్రమంలో రోహిత్ నాయకుడిగా బరిలో దిగనుండగా.. నజ్ముల్ షాంటో సారథ్యంలో షకీబ్ ఆల్రౌండర్గా వరల్డ్కప్లో భాగం కానున్నాడు.ఇదిలా ఉంటే.. ఈసారి ఏకంగా 20 జట్లు ఈ ఐసీసీ టోర్నమెంట్లో పాల్గొననున్నాయి. నాలుగు గ్రూపులుగా వీటిని విభజించారు. మరి 20 జట్లలో భాగమైన ఆటగాళ్లు ఎవరో చూద్దామా?👉గ్రూప్- ఏ: ఇండియా, పాకిస్తాన్, యూఎస్ఏ, ఐర్లాండ్, కెనడా👉గ్రూప్- బి: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్👉గ్రూప్- సి: వెస్టిండీస్, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఉగాండా, పపువా న్యూగినియా👉గ్రూప్- డి: సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్.ఇండియారోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.. రిజర్వ్ ప్లేయర్లు: శుబ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.పాకిస్తాన్బాబర్ ఆజం(కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్.యునైటెడ్ స్టేట్స్మోనాక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్, ఆండ్రీస్ గౌస్, కోరె అండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్, నితీష్ కుమార్, నౌష్టుష్ కెంజిగే, సౌరభ్ నెత్రాల్వాకర్, షాడ్లీ వాన్ షాల్క్విక్, స్టీవెన్ టేలర్, షయాన్ జహంగీర్. రిజర్వ్ ప్లేయర్లు: గజానంద్ సింగ్, జువానోయ్ డ్రైస్డేల్, యాసిర్ మొహమ్మద్.ఐర్లాండ్పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండ్రూ బాల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, జోష్ లిటిల్, బారీ మెకార్తీ, నీల్ రాక్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.కెనడాసాద్ బిన్ జాఫర్ (కెప్టెన్), ఆరోన్ జాన్సన్, రవీందర్పాల్ సింగ్, నవనీత్ ధాలివాల్, కలీమ్ సనా, దిలోన్ హెయిలీగర్, జెరెమీ గోర్డాన్, నిఖిల్ దత్తా, పర్గత్ సింగ్, నికోలస్ కిర్టన్, రేయాన్ ఖాన్ పఠాన్, జునైద్ సిద్ధిఖీ, దిల్ప్రీత్ బజ్వా, శ్రేయాస్ మొవ్వా, రిషివ్ జోషి.రిజర్వ్ ప్లేయర్లు: తజిందర్ సింగ్, ఆదిత్య వరదరాజన్, అమ్మర్ ఖలీద్, జతిందర్ మథారు, పర్వీన్ కుమార్.ఇంగ్లండ్జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లీ, మార్క్ వుడ్.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా. ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్-మెగర్క్, మాట్ షార్ట్.నమీబియాగెరార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేన్ గ్రీన్, మైఖేల్ వాన్ లింగెన్, డైలాన్ లీచర్, రూబెన్ ట్రంపెల్మాన్, జాక్ బ్రాసెల్, బెన్ షికోంగో, టాంగెని లుంగామెని, నికో డావిన్, జేజే స్మిత్, జాన్ ఫ్రైలింక్, జేపీ కోట్జ్, డేవిడ్ వీస్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, మలన్ క్రూగర్, పీడీ బ్లిగ్నాట్.స్కాట్లాండ్రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్, బ్రాడ్ క్యూరీ, క్రిస్ గ్రీవ్స్, ఓలీ హెయిర్స్, జాక్ జార్విస్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, బ్రాండన్ మెక్ ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, క్రిస్ సోల్, చార్లీ టియర్, మార్క్ వాట్, బ్రాడ్ వీల్.ఒమన్అకిబ్ ఇలియాస్ (కెప్టెన్), జీషాన్ మక్సూద్, కశ్యప్ ప్రజాపతి, ప్రతీక్ అథవాలే, అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, మహ్మద్ నదీమ్, నసీమ్ ఖుషీ, మెహ్రాన్ ఖాన్, బిలాల్ ఖాన్, రఫీవుల్లా, కలీముల్లా, ఫయాజ్ బట్, షకీల్ అహ్మద్, ఖలీద్ కైల్. రిజర్వు ప్లేయర్లు: జతిందర్ సింగ్, సమయ్ శ్రీవాస్తవ, సుఫ్యాన్ మెహమూద్, జయ్ ఓదెరా.వెస్టిండీస్రోవ్మన్ పావెల్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయిర్, షాయీ హోప్, అకీల్ హొసేన్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్ఫర్డ్, రొమారియో షెపర్డ్, ఒబెడ్ మెకాయ్.న్యూజిలాండ్కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రాస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌథీట్రావెలింగ్ రిజర్వ్: బెన్ సియర్స్.అఫ్గనిస్తాన్రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, కరీం జనత్, నంగ్యాల్ ఖరోతి, ముజీబ్ యువర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్ మాలిక్. రిజర్వ్ ప్లేయర్లు: సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీం సఫీ.ఉగాండాబ్రియాన్ మసాబా (కెప్టెన్), సైమన్ సెసాజీ, రోజర్ ముకాసా, కాస్మాస్ క్యూవుటా, దినేష్ నక్రానీ, ఫ్రెడ్ అచెలం, కెన్నెత్ వైస్వా, అల్పేశ్ రాంజానీ, ఫ్రాంక్ న్సుబుగా, హెన్రీ స్సెన్యోండో, బిలాల్ హస్సున్, రాబిన్సన్ ఓబుయా, రియాజత్ అలీ షా, జుమా మియాజీ, రోనక్ పటేల్. ట్రావెలింగ్ రిజర్వ్స్: ఇన్నోసెంట్ మ్వెబాజ్, రోనాల్డ్ లుటాయా.పపువా న్యూగినియాఅస్సాడోల్లా వాలా (కెప్టెన్), అలీ నావో, చాడ్ సోపర్, సీజే అమిని, హిలా వరే, హిరి హిరి, జాక్ గార్డనర్, జాన్ కరికో, కబువా వాగి మోరియా, కిప్లింగ్ డోరిగా, లెగా సియాకా, నార్మన్ వనువా, సెమా కామియా, సెసే బావు, టోనీ ఉరా.సౌతాఫ్రికా ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నియల్ బార్ట్మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్చ్యూన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జే, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్.శ్రీలంకవనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక, కుశాల్ మెండిస్, పథుమ్ నిస్సాంకా, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, ఏంజెలో మాథ్యూస్, దసున్ షనక, ధనంజయ డిసిల్వా, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలగే, దుష్మంత చమీరా, నువాన్ తుషార, మతీషా పతిరణ, దిల్షాన్ మదుశంక. ట్రావెలింగ్ రిజర్వ్స్: అసితా ఫెర్నాండో, విజయకాంత్ వియాస్కాంత్, భానుకా రాజపక్స, జనిత్ లియానాగే.బంగ్లాదేశ్నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), టస్కిన్ అహ్మద్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్ తమీమ్, షకీబ్ అల్ హసన్, తౌహీద్ హ్రిదోయ్, మహ్మద్ ఉల్లా రియాద్, జకర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, షేక్ మహేది హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, తాంజీమ్ హసన్ సకీబ్. ట్రావెలింగ్ రిజర్వ్స్: అఫిఫ్ హుస్సేన్, హసన్ మహమూద్.నెదర్లాండ్స్స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), ఆర్యన్ దత్, బాస్ డి లీడ్, కైల్ క్లెయిన్, లోగాన్ వాన్ బీక్, మ్యాక్స్ ఓ డౌడ్, మైఖేల్ లెవిట్, పాల్ వాన్ మీకెరెన్, ర్యాన్ క్లెయిన్, సాకిబ్ జుల్ఫికర్, సిబ్రాండ్ ఎంగెల్బ్రెచ్ట్, తేజ నిడమనూరు, టిమ్ ప్రింగిల్, విక్రమ్ సింగ్, వివ్ కింగ్మా, వెస్లీ బారేసి. ట్రావెలింగ్ రిజర్వ్: ర్యాన్ క్లెయిన్నేపాల్రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సాహ్, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్బన్షి, కరణ్ కేసీ, గుల్షన్ ఝా, సోంపాల్ కామి, ప్రతిస్ జీసీ, సందీప్ జోరా, అవినాష్ బోహరా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ.చదవండి: T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలుT20 WC 2024: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్ ఏంటి?.. వివరాలు -
వారెవ్వా జోసెఫ్.. దెబ్బకు వార్నర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
వెస్టిండీస్ యువ పేస్ సంచలనం షామర్ జోసెఫ్ టీ20 వరల్డ్కప్-2024కు సన్నద్దమవుతున్నాడు. ఈ క్రమంలో ట్రినిడాడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వార్మాప్ మ్యాచ్లో జోసెఫ్ సంచలన బంతితో మెరిశాడు. ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను జోషఫ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. జోషఫ్ వేసిన డెలివరీకి వార్నర్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఆసీస్ ఇన్నింగ్స్ 2వ వేసిన జోషఫ్ తొలి మూడు బంతుల్లో ఏకంగా 14 పరుగులు సమర్పించుకున్నాడు. వార్నర్ రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. ఈ సమయంలో జోసెఫ్ సూపర్ కమ్బ్యాక్ ఇచ్చాడు. నాలుగో బంతిని జోసెఫ్.. వార్నర్కు బ్యాక్-ఆఫ్-లెంగ్త్ డెలివరీగా సంధించాడు. అయితే వార్నర్ ఈ డెలివరీని లెగ్ సైట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్కు మిస్ అయ్యి ఆఫ్ స్టంప్ను గిరాటేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఈ ఏడాది ఆసీస్తో గబ్బా వేదికగా జరిగిన టెస్టులో సంచలన ప్రదర్శన కనబరిచిన జోసెఫ్ ఓవర్నైట్ స్టార్గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇక వార్మాప్ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్పై 35 పరుగుల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. విండీస్ బ్యాటర్లలో పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో పూరన్ 75 పరుగులు చేశాడు. జాన్సన్ ఛార్లెస్(40), రూథర్ఫోర్డ్(47) పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య చేధనలో ఆసీస్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగలిగింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
పూరన్ సిక్సర్ల సునామీ.. ఆసీస్కు ఝలక్ ఇచ్చిన విండీస్
టీ20 వరల్డ్కప్ 2024 వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా ఇవాళ వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు ఊహించని ఝలక్ ఇచ్చింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. పూరన్ సిక్సర్ల సునామీనికోలస్ పూరన్ ఐపీఎల్ ఫామ్ను కొనసాగిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. పూరన్ సిక్సర్ల సునామీ ధాటికి ట్రినిడాడ్లోని క్వీన్స్ పార్క్ మైదానం తడిసి ముద్దైంది. విండీస్ ఇన్నింగ్స్లో పూరన్తో పాటు ప్రతి ఆటగాడు చెలరేగి ఆడారు. తలో చేయి వేశారు..హోప్ 8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 14 పరుగులు.. జాన్సన్ ఛార్లెస్ 31 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 40 పరుగులు.. రోవ్మన్ పావెల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులు.. హెట్మైర్ 13 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 18 పరుగులు.. రూథర్ఫోర్డ్ 18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశారు. విండీస్ బ్యాటర్ల విధ్వంసం ధాటికి ఆసీస్ బౌలర్లందరూ 10కిపైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. జంపా 2, టిమ్ డేవిడ్, ఆస్టన్ అగర్ తలో వికెట్ పడగొట్టారు.పోరాడిన ఆసీస్అనంతరం అతి భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. గెలుపు కోసం చివరి దాకా పోటీపడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్లోనూ ప్రతి ఒక్కరూ చెలరేగి ఆడారు. వార్నర్ 6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 15 పరుగులు.. ఆస్టన్ అగర్ 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28.. మార్ష్ 4 బంతుల్లో బౌండరీ సాయంతో 4 పరుగులు.. ఇంగ్లిస్ 30 బంతుల్లో 5 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో 55 పరుగులు.. టిమ్ డేవిడ్ 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 25 పరుగులు.. వేడ్ 14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 25 పరుగులు.. నాథన్ ఇల్లిస్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39.. జంపా 16 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 21.. హాజిల్వుడ్ 3 బంతుల్లో 3 పరుగులు చేశారు. మ్యాచ్ గెలిచేందుకు ఆసీస్కు ఈ మెరుపులు సరిపోలేదు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, మోటీ చెరో 2 వికెట్లు.. అకీల్ హొసేన్, షమార్ జోసఫ్, ఓబెద్ మెక్కాయ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో కూడా ఆసీస్ తొలి వార్మప్ మ్యాచ్లోలా తొమ్మిది మంది ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది. ఆసీస్ రెగ్యులర్ జట్టు సభ్యులు అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు కారణం. -
T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
టీ20 ప్రపంచకప్ టోర్నీకి అమెరికా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తోంది. వెస్టిండీస్తో కలిసి ఈ ఏడాది మెగా ఈవెంట్ నిర్వహణ హక్కులు దక్కించుకుంది. తద్వారా కొత్త స్టేడియాల్లో పొట్టి ఫార్మాట్లో ఐసీసీ టోర్నమెంట్ మ్యాచ్లను వీక్షించే అవకాశం ప్రేక్షకులకు దక్కింది.మరి టీ20 వరల్డ్కప్-2024 పూర్తి షెడ్యూల్, సమయం, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ తదితర విశేషాలు తెలుసుకుందామా?!గ్రూప్ దశలో...👉జూన్ 1: అమెరికా వర్సెస్ కెనడా- టెక్సాస్(భారత కాలమానం ప్రకారం జూన్ 2 ఉదయం ఆరు గంటలకు ఆరంభం)👉జూన్ 2: వెస్టిండీస్ వర్సెస్ పపువా న్యూగినియా- గయానా(రాత్రి ఎనిమిదిన్నర గంటలకు)నమీబియా వర్సెస్ ఒమన్- బార్బడోస్(జూన్ 3 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 3: శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికా- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)అఫ్గనిస్తాన్ వర్సెస్ ఉగాండా- గయానా(జూన్ 4 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 4: ఇంగ్లండ్ వర్సెస్ స్కాట్లాండ్- బార్బడోస్(రాత్రి ఎనిమిది గంటలకు)నెదర్లాండ్స్ వర్సెస్ నేపాల్- డల్లాస్- రాత్రి తొమ్మిది గంటలకు)👉జూన్ 5: ఇండియా వర్సెస్ ఐర్లాండ్- న్యూయార్క్- (రాత్రి ఎనిమిది గంటలకు)ఆస్ట్రేలియా వర్సెస్ ఒమన్- బార్బడోస్- (జూన్ 6 ఉదయం ఆరు గంటలకు)పపువా న్యూగినియా వర్సెస్ ఉగాండా- గయానా- (జూన్ 6 ఉదయం ఐదు గంటలకు)👉జూన్ 6- యూఎస్ఏ వర్సెస్ పాకిస్తాన్- డల్లాస్(రాత్రి తొమ్మిది గంటలకు)నమీబియా వర్సెస్ స్కాట్లాండ్- బార్బడోస్(జూన్ 7 అర్ధరాత్రి 12. 30కి ఆరంభం)👉జూన్ 7- కెనడా వర్సెస్ ఐర్లాండ్- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్- డల్లాస్(జూన్ 8 ఉదయం ఆరు గంటలకు)న్యూజిలాండ్ వర్సెస్ అఫ్గనిస్తాన్- గయానా(జూన్ 8 ఉదయం ఐదు గంటలకు)👉జూన్ 8- నెదర్లాండ్స్ వర్సెస్ సౌతాఫ్రికా- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- బార్బడోస్- (రాత్రి 10 30 నిమిషాలకు)వెస్టిండీస్ వర్సెస్ ఉగాండా- గయానా(జూన్ 9 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 9- ఇండియా వర్సెస్ పాకిస్తాన్- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)ఒమన్ వర్సెస్ స్కాట్లాండ్- అంటిగ్వా(రాత్రి 10.30 నిమిషాలకు)👉జూన్ 10- సౌతాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)👉జూన్ 11- పాకిస్తాన్ వర్సెస్ కెనడా- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)ఆస్ట్రేలియా వర్సెస్ నమీబియా- అంటిగ్వా(జూన్ 12 ఉదయం ఆరు గంటలకు)శ్రీలంక వర్సెస్ నేపాల్- ఫ్లోరిడా(జూన్ 12 ఉదయం ఐదు గంటలకు)👉జూన్ 12- యూఎస్ఏ వర్సెస్ ఇండియా- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్- ట్రినిడాడ్(జూన్ 13 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 13- బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్- సెయింట్ విన్సెంట్(రాత్రి ఎనిమిది గంటలకు)అఫ్గనిస్తాన్ వర్సెస్ పపువా న్యూగినియా- ట్రినిడాడ్(జూన్ 14 ఉదయం ఆరు గంటలకు)ఇంగ్లండ్ వర్సెస్ ఒమన్- అంటిగ్వా(జూన్ 14 అర్ధరాత్రి 12.30 నిమిషాలకు)👉జూన్ 14- యూఎస్ఏ వర్సెస్ ఐర్లాండ్- ఫ్లోరిడా(రాత్రి ఎనిమిది గంటలకు)న్యూజిలాండ్ వర్సెస్ ఉగాండా-ట్రినిడాడ్(జూన్ 15 ఉదయం ఆరు గంటలకు)సౌతాఫ్రికా వర్సెస్ నేపాల్(జూన్ 15 ఉదయం ఐదు గంటలకు)👉జూన్ 15- ఇండియా వర్సెస్ కెనడా- ఫ్లోరిడా(రాత్రి ఎనిమిది గంటలకు)నమీబియా వర్సెస్ ఇంగ్లండ్- అంటిగ్వా(రాత్రి 10.30కి)ఆస్ట్రేలియా వర్సెస్ స్కాట్లాండ్- సెయింట్ లూసియా(జూన్ 16 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 16- పాకిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్- ఫ్లోరిడా(రాత్రి ఎనిమిది గంటలకు)శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్- సెయింట్ లూసియా(జూన్ 17 ఉదయం ఆరు గంటలకు)బంగ్లాదేశ్ వర్సెస్ నేపాల్- సెయింట్ విన్సెంట్(జూన్ 17 ఉదయం ఐదు గంటలకు)👉జూన్ 17- న్యూజిలాండ్ వర్సెస్ పపువా న్యూగినియా- ట్రినిడాడ్ (రాత్రి ఎనిమిది గంటలకు)వెస్టిండీస్ వర్సెస్ అఫ్గనిస్తాన్- సెయింట్ లూసియా(జూన్ 18 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 19- ఏ2 వర్సెస్ డీ1 సూపర్-8 గ్రూప్-2- అంటిగ్వా(రాత్రి ఎనిమిది గంటలకు)బీ1 వర్సెస్ సీ2- సెయింట్ లూయీస్(జూన్ 20 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 20- సీ1 వర్సెస్ ఏ1- బార్బడోస్(రాత్రి ఎనిమిది గంటలకు)బీ2 వర్సెస్ డీ2- అంటిగ్వా(జూన్ 21 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 21- బీ1 వర్సెస్ డీ1- సెయింట్ లూసియా(రాత్రి ఎనిమిది గంటలకు)ఏ2 వర్సెస్ సీ2- బార్బడోస్- (జూన్ 22 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 22- ఏ1 వర్సెస్ డీ2- అంటిగ్వా(రాత్రి ఎనిమిది గంటలకు)సీ1 వర్సెస్ బీ2- సెయింట్ విన్సెంట్(జూన్ 23 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 23- ఏ2 వర్సెస్ బీ1- బార్బడోస్(రాత్రి ఎనిమిది గంటలకు)సీ2 వర్సెస్ డీ1- అంటిగ్వా(జూన్ 24 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 24- బీ2 వర్సెస్ ఏ1- సెయింట్ లూయీస్(రాత్రి ఎనిమిది గంటలకు)సీ1 వర్సెస్ డీ2- సెయింట్ విన్సెంట్(జూన్ 25 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 26- సెమీ ఫైనల్ 1- ట్రినిడాడ్(జూన్ 27 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 27- సెమీ ఫైనల్ 2- గయానా(రాత్రి ఎనిమిది గంటలకు)👉జూన్ 29- ఫైనల్- బార్బడోస్(రాత్రి ఏడున్నర గంటలకు).లైవ్ స్ట్రీమింగ్(ఇండియాలో)👉స్టార్ స్పోర్ట్స్ షోలో ప్రత్యక్ష ప్రసారం(టీవీ)👉డిస్నీ+హాట్స్టార్(డిజిటల్)చదవండి: T20 WC 2024: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్ ఏంటి?.. పూర్తి వివరాలు -
T20 WC: అది బలహీనత కాకూడదు: కోహ్లి కామెంట్స్ వైరల్
టీమిండియా 2013లో చివరిసారిగా ఐసీసీ ట్రోఫీ సాధించింది. అప్పటి నుంచి మళ్లీ ఇంత వరకు మెగా టైటిల్ నెగ్గనేలేదు. గతేడాది సొంతగడ్డపై భారీ అంచనాల నడుమ వన్డే వరల్డ్కప్ బరిలో దిగిన రోహిత్ సేన లీగ్ దశలో దుమ్ములేపింది.ఓటమన్నదే ఎరుగక సెమీ ఫైనల్ చేరి.. ఆపై ఫైనల్లోనూ అడుగుపెట్టింది. కానీ.. అసలైన పోరులో.. అహ్మదాబాద్లో దాదాపు లక్ష మంది అభిమానుల నడుమ.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్కు అడుగు దూరంలో నిలిచిపోయింది.ఒత్తిడిలో చిత్తైఫైనల్లో ఒత్తిడికి చిత్తై కంగారూలకు ట్రోఫీని సమర్పించుకుంది. ఇక దాదాపు పదకొండేళ్ల తర్వాత మరోసారి ఐసీసీ టైటిల్ సాధించే అవకాశం ముంగిట నిలిచింది టీమిండియా. టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటి విజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది.అభిమానుల అంచనాలు కూడా అదే రేంజులో ఉన్నాయి. చాలా మంది మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు కూడా టైటిల్ ఫేవరెట్లలో రోహిత్ సేన ముందుంటుందనే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.మా మీద ఆశలు పెట్టుకోవద్దని నేను చెప్పనుభారీ అంచనాలు ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయని.. కాబట్టి ఇలాంటి హైప్నకు తాము దూరంగా ఉంటేనే మంచిదని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘మా మీద ఆశలు పెట్టుకోవద్దని నేను చెప్పను.నిజానికి మన దేశంలో క్రికెట్కు ఉన్న స్థానం వేరు. అదే మన బలం. అయితే, ఒక్కోసారి అతిగా ఆలోచిస్తూ.. మనపై భారీ అంచనాలు ఉన్నాయనే విషయాన్ని పదే పదే గుర్తుచేసుకుంటూ.. ఆ దిశగా దృష్టి సారిస్తే అదే బలహీనతగా మారే అవకాశం ఉంది.దానిని నుంచి స్ఫూర్తి, శక్తిని పొందేలా ఉండాలికాబట్టి మన బలాన్ని మాత్రమే నమ్ముకుని.. దానిని నుంచి స్ఫూర్తి, శక్తిని పొందేలా ఉండాలి. మాకు వెన్నుదన్నుగా ఉన్న అభిమానుల కోసం.. వారి కలలు నెరవేర్చేలా ఆడాలి అన్న ఆలోచన మాత్రమే దరికిరానివ్వాలి’’ అని స్టార్ స్పోర్ట్స్తో విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు.కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్కప్-2024 టోర్నీ జూన్ 1న మొదలుకానుంది. ఇక ఈ మెగా టోర్నీలో టీమిండియా జూన్ 5న ఐర్లాండ్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే రోహిత్ శర్మ సారథ్యంలో ఆటగాళ్లంతా అమెరికా చేరుకోగా.. కోహ్లి ఇంకా భారత్లోనే ఉన్నాడు.చదవండి: T20 WC: ఓపెనర్గా రోహిత్ శర్మ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!