YSR Congress Party
-
ఈసీకి జ్ఞానోదయం ఎప్పుడు?
తటస్థతకు తిలోదకాలొదిలి అవకతవకలకు అసలైన చిరునామాగా మారిన ఎన్నికల సంఘం(ఈసీ) సిగ్గుపడాల్సిన విషయమిది. ఆరోపణలొచ్చినప్పుడూ, ఫిర్యాదులందినప్పుడూ మౌనంతోనో, దబా యింపుతోనో తప్పించుకోజూస్తున్న ఈసీపై సోమవారం పార్లమెంటు ఉభయసభలూ దద్దరిల్లాయి. మహారాష్ట్రలో వోటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ ఆరోపణలు చేసి మూణ్ణెల్లవుతోంది. నెల క్రితం కూడా ఆ పార్టీ నాయకుడు రాహుల్గాంధీ మీడియా సమావేశంలో ఈసీపై అభియోగాలు మోపారు. అయిదు నెలల వ్యవధిలో కొత్తగా 39 లక్షలమంది వోటర్లు ఎలా పుట్టుకొచ్చారని ప్రశ్నించారు. అవి ఆధార రహితం, తప్పుదోవ పట్టించే అభాండాలని చెప్పటం తప్ప నిర్దిష్టంగా ఫలానా చోట ఏం జరిగిందో, వోటర్ల సంఖ్య పెరగటానికి కారణమేమిటో వివరించే ప్రయత్నం ఈసీవైపు నుంచి లేదు! అటు బెంగాల్లో ఈ మాదిరి అవకతవకలే బయటపడి ఆ సంస్థ పరువు బజారుపాలు చేశాయి. వోటర్ల జాబితా అవకతవకలతోపాటు నకిలీ వోటరు కార్డులు రాజ్యమేలుతున్నాయని తృణమూల్ ఫిర్యాదు చేస్తే మూడు నెలల్లో సరిచేస్తామన్న జవాబొచ్చింది. వెనువెంటనే దర్యాప్తు చేసి దీనివెనక జరిగిందేమిటో తేల్చిచెప్పడానికి బదులు సరిచేస్తామనటంలో మర్మమేమిటి? అక్కడే కాదు... హరియాణా, గుజరాత్, ఒడిశా, యూపీల్లో సైతం ఇలాగే జరిగిందని విపక్ష సభ్యులు ఆరో పించారు. ఇటీవల ఎన్నికలు జరిగిన ఢిల్లీలోనూ ఇదే తంతు నడిచిందని ఆప్ ఆరోపణ. రాజ్యాంగ సంస్థగా ఎంతో హుందాగా, నియమ నిబంధనలకు లోబడి పనిచేయాల్సిన సంస్థ ఇలా అడుగడు గునా కంతలతో, లోపాయికారీ వ్యవహారాలతో ఎన్నికలు జరిపించటం సిగ్గుచేటు కాదా?ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ నిష్టగా నిర్వహించాల్సిన క్రతువు. అది కాస్తా ఈమధ్య కాలంలో నవ్వుల పాలవుతున్న వైనం కనబడుతున్నా తనకేం సంబంధం లేనట్టు ఆ సంస్థ ప్రవర్తి స్తోంది. ఆంధ్రప్రదేశ్లో నిరుడు ఎన్నికల సందర్భంగా కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమితో కొత్తగా చుట్టరికం కుదిరిందన్న ఏకైక కారణంతో అప్పటి విపక్ష నాయకులు చెప్పినట్టల్లా అధికారు లను బదిలీలు చేశారు. పర్యవసానంగా ఇతర జిల్లాల్లో జరిగిన దారుణ ఉదంతాల సంగతలా ఉంచి పల్నాడు ప్రాంతం ఎంతటి హింసను చవిచూసిందో, ఎన్ని గ్రామాల ప్రజలు ఇళ్లూ వాకిళ్లూ వదిలి ప్రాణభయంతో పారిపోయారో మీడియా సాక్షిగా వెల్లడైంది. పోలింగ్ కేంద్రాల దురాక్రమణ, తెల్లారుజాము వరకూ పోలింగ్ తంతు కానివ్వటం వంటి అరాచకాలకు అంతులేదు. సాయంత్రం గడువు ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రం గేట్లు మూసి ఆ ఆవరణలో ఉన్నవారికి మాత్రమే స్లిప్లిచ్చి వోటు వేయటానికి అనుమతించాలని నిబంధనలు చెబుతున్నాయి. క్యూలో చిట్టచివర గేటు దగ్గర ఉన్నవారికి ఒకటో నంబర్ స్లిప్ ఇవ్వటంతో మొదలెట్టి బూత్ సమీపంలో ఉన్నవారికి ఆఖరి స్లిప్ ఇవ్వాలి. ఓటేశాక ఆ స్లిప్లు భద్రపరచాలి. సీసీ టీవీ ఫుటేజ్లు భద్ర పరచాలి. ఇదంతా జరిగిందా? పోలింగ్ ముగిసిన నాలుగురోజుల తర్వాత 12.5 శాతం వోటింగ్ పెరిగినట్టు చూప టానికి ఈసీ ఏమాత్రం మొహమాట పడలేదు. ఇదంతా ఎక్కడ బయటపడుతుందోనన్న కంగా రుతో పరాజితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే సమయానికే ఈవీఎంల డేటా ఖాళీ చేశారు. వీవీప్యాట్ స్లిప్లు ధ్వంసం చేశారు. ఈవీఎంలలో రికార్డయిన ఓట్ల లెక్కలు బయటకు తీసి, అవి వీవీప్యాట్ స్లిప్లతో సరిపోల్చాలని కోరితే డమ్మీ గుర్తులతో కొత్తగా నమూనా వోటింగ్ నిర్వహించ టానికి సిద్ధపడ్డారు! ఇక భద్రపరిచిన ఈవీఎంలలో చార్జింగ్ ఎలా పెరుగుతుందో ఇంతవరకూ చెప్పలేకపోయింది. వీటిపై వైఎస్సార్ కాంగ్రెస్ నిలదీస్తే జవాబివ్వటానికి ఈసీకి నోరు పెగలదు. పార్లమెంటులో ఇంత దుమారం రేగాక డూప్లికేట్ కార్డులపైనా, వోటర్ల జాబితా అవకతవక లపైనా సాధికారికంగా, పద్ధతిగా జవాబివ్వడానికి బదులు వేరే మార్గం ఎంచుకుంది. ‘ఈసీ వర్గాలు’ అనే పేరుతో ఒక వివరణ బయటికొదిలింది. ఆ సంస్థ తనను తాను ఏమనుకుంటున్నదో గానీ ఇలా మీడియాకు లీకులివ్వటం మర్యాదైన సంగతి కాదు. ఒక పార్టీయో లేదా ప్రభుత్వమో తమ ఆలోచనలపై ప్రజాస్పందనేమిటో తెలుసుకోవటానికి లీకులిస్తుంటాయి. దాని ప్రయోజనం దానికుంటుంది. కానీ ఈసీ అలా చేయటంలో ఆంతర్యమేమిటి? ఉదాహరణకు డూప్లికేట్ వోటర్ కార్డులు వారసత్వపు సమస్యగా తేల్చిచెప్పింది. 2008–13 మధ్యే ఈ కార్డులు జారీ అయ్యాయన్నది. అదే నిజమనుకుంటే ఆ సంగతి ఈసీకి ఎప్పుడు తెలిసింది? తెలిశాక తీసుకున్న చర్యలేమిటి? ఇన్నాళ్లూ సరిచేయక పోవటానికి కారణాలేమిటి? అధికారికంగా ఇలాంటి తెలివితక్కువ జవాబు లిస్తే మరిన్ని ప్రశ్నలు వచ్చిపడతాయన్న భయంతోనే ఆ సంస్థ లీకులతో సరిపెట్టింది.ఎంతకాలం ఈ దాగుడుమూతలు? ఎన్నాళ్లు ఈ అవకతవకలు? ఎన్నికల ప్రక్రియపైనా, వివిధ దశల్లో చోటుచేసుకున్న అక్రమాలపైనా ఫిర్యాదులొస్తే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుని ఇప్పుడు పార్లమెంటులో పెద్ద రాద్ధాంతం జరిగాక లీకులివ్వటం, అవి మరిన్ని సందేహాలకు తావీయటం అప్రదిష్ట కాదా? ఇందువల్ల తమ విశ్వసనీయత దెబ్బతింటుందన్న ఇంగితజ్ఞానం కూడా లేదా? ఓడిన రాజకీయ పార్టీలు మాత్రమే కాదు... సాక్షాత్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన ఎస్వై ఖురేషీ సైతం గతంలోనూ, ఇప్పుడూ కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నికల సంఘం తీరు సవ్యంగా లేదన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతున్నదని హెచ్చరించారు. కనుక ఆ సంస్థ ఇప్పటికైనా పారదర్శకతతో వ్యవహరించటం నేర్చుకోవాలి. తప్పును తప్పుగా ఒప్పుకొనే నిజాయితీ ప్రదర్శించాలి. లేనట్టయితే ప్రజానీకం దృష్టిలో దోషిగా మిగలక తప్పదు. -
ఆ ఐదేళ్లూ గణనీయ ప్రగతి
విత్తు నుంచి పంట విక్రయం వరకు.. ప్రకృతి సాగుకు ప్రోత్సాహం మొదలు యాంత్రీకరణ వరకు.. కౌలు చట్టం నుంచి మద్దతు ధర వరకు.. వ్యవసాయ, అనుబంధ రంగాలకు 2019–24 మధ్య కాలం స్వర్ణయుగం అని తేలింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా రాష్ట్రం గణనీయ పురోగతి సాధించిందని టీడీపీ కూటమి సర్కారు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే –2024 స్పష్టం చేసింది.సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సాధించిన పురోగతిని ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రస్తావించింది. అందులోని ముఖ్య అంశాలు పరిశీలిస్తే..⇒ 2018–19లో 150 లక్షల టన్నులున్న ఆహార పంటల దిగుబడులు 2019లో రికార్డు స్థాయిలో 175 లక్షల టన్నులకు పెరిగాయి. 2019–24 మధ్య సగటున 161.20 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి.⇒ ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 45.59 లక్షల ఎకరాలకు పెరగగా, 2023–24లో రికార్డు స్థాయిలో 365.92 లక్షల టన్నులు దిగుబడులు వచ్చాయి. నేషనల్ ఆయిల్ పామ్ మిషన్లో 2023–24లో రికార్డు స్థాయిలో 2.27 లక్షల హెక్టార్లలో సాగు ద్వారా 17.63 లక్షల టన్నుల దిగుబడులు నమోదైంది.⇒ 2023–24లో 2548.74 లక్షల గుడ్ల ఉత్పత్తితో ఏపీ నంబర్ వన్గా నిలవగా, మాంసం (10.68 లక్షల టన్నులు) ఉత్పత్తిలో ఐదో, పాల (139.94 లక్షల టన్నులు) ఉత్పత్తిలో ఏడో స్థానంలో ఉంది.⇒ గ్యాప్ సర్టిఫికేషన్ ద్వారా రైతులకు మార్కెట్ ధరకు మించి ఆదాయం వచ్చింది. ప్రకృతి సాగుదారులు 4 లక్షల నుంచి 9.53 లక్షలకు పెరిగారు.ఆర్బీకేలు నిజంగా ఓ వినూత్నంరైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) నిజంగా ఓ వినూత్న ప్రయోగమని ఆర్థిక సర్వేలో స్పష్టంగా పేర్కొన్నారు.⇒ విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు చేదోడుగా నిలిచేందుకు ఒకేసారి 10,778 ఆర్బీకేలతో ఈ వ్యవస్థ ఏర్పాటైందని చెప్పుకొచ్చారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశుగ్రాసం, సంపూర్ణ మిశ్రమ దాణా, ఆక్వా ఫీడ్ వంటి సాగు ఉత్పాదకాలను గ్రామ స్థాయిలో రైతులు కోరిన 24 గంటల్లో వారి ముంగిట అందించడం, ఆధునిక సాగు విధానాలు, సలహాలు, సూచనలు అందిస్తూ అగ్రి ఇన్పుట్ షాపులుగా, ఫార్మర్ నాలెడ్జ్ సెంటర్స్గా రైతులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. నియోజకవర్గ స్థాయిలో అగ్రి ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్, ఆక్వా, వెటర్నరీ ల్యాబ్స్ ఏర్పాటుతో నాణ్యమైన సాగు ఉత్పత్తుల పంపిణీ సులభతరమైంది. –రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ద్వారా.. మార్కెట్లో ధర లేని సమయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు మద్దతు ధర దక్కేలా కృషి చేసింది.ఏఐఎఫ్ ద్వారా మౌలిక వసతులు⇒ వ్యవసాయ మౌలిక సదుపాయల నిధి (ఏఐఎఫ్) ద్వారా 2022–24 మధ్య గ్రామ స్థాయిలో ఆర్బీకేలకు అనుబంధంగా రూ.16 వేల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. ⇒ పీఏసీఎస్లను బహుళ ప్రయోజిత సదుపాయాల కేంద్రాలు (ఎంపీఎఫ్సీ)గా తీర్చిదిద్దారు. రూ.736 కోట్లతో 695 గోదాముల నిర్మాణం ద్వారా 3.98 లక్షల టన్నుల అదనపు నిల్వ సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది. ⇒ రికార్డు స్థాయిలో 2,037 పీఏసీఎస్ల డిజిటలైజేషన్తో పాటు 207 పీఏసీఎస్లను ఎఫ్పీవోలుగా అభివృద్ధి చేశారు. ఈ–పీఏసీఏస్లుగా మార్పుతో ఆన్లైన్ లావాదేవీలకు మార్గం సులభతరమైంది. జన ఔషధ కేంద్రాలు, పెట్రోల్ బంకులు, కామన్ సర్వీస్ సెంటర్లుగా పీఏసీఏస్లను తీర్చిదిద్దారు. రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్ను కంప్యూటరైజ్ చేశారు.⇒ చేపల ఉత్పత్తిలో 31 శాతం, రొయ్యల ఉత్పత్తిలో 30 శాతంతో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. స్థానిక వినియోగం పెంచేందుకు డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా ఫిష్ ఆంధ్రకు బ్రాండింగ్ తీసుకొచ్చింది. అప్సడా, ఏపీ ఫిష్ సీడ్, ఫీడ్ యాక్ట్లతో పాటు ఏపీ బొవైన్ బ్రీడింగ్ రెగ్యులేషన్ అండ్ ఆర్టిఫీషియల్ ఇన్సెమినేషన్ సర్వీస్ యాక్ట్, భూ యజమానులకు నష్టం వాటిల్లకుండా పంట సాగు హక్కుదారుల చట్టం వంటి సంస్కరణలకు నాంది పలికింది.కూటమి కనికట్టుకూటమి ప్రభుత్వం వచ్చాక 2024–25లో వ్యవసాయ యాంత్రీకరణ కింద ఒక్క పరికరం కూడా పంపిణీ చేసిన పాపాన పోలేదు. కానీ, ఈ ఏడాది ఏకంగా రూ.75.80 కోట్ల సబ్సిడీతో 42,864 మంది రైతులకు వ్యక్తిగత పరికరాలు ఇచ్చినట్టుగా ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. 80 శాతం సబ్సిడీపై 875 కిసాన్ డ్రోన్స్ ఇచ్చేసినట్టుగానూ ప్రస్తావించారు. కాగా, ఇదే రిపోర్టులో 2021–24 మధ్య ఆర్బీకేలకు అనుసంధానంగా కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ద్వారా వ్యవసాయ యాంత్రీకరణను గత ప్రభుత్వం ప్రోత్సహించిందని కొనియాడడం గమనార్హం. -
కూటమి సర్కార్ వికటాట్టహాసం.. పోసానికి 14 రోజుల రిమాండ్
రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు కూటమి సర్కారు పాతరేసింది. భావ ప్రకటన హక్కు ఓ వర్గం వారికేనని హూంకరిస్తోంది. రాజకీయాలు అన్న తర్వాత విమర్శలు, ప్రతి విమర్శలు.. కామెంట్లు సహజం అన్న స్ఫూర్తిని మంటగలిపింది. ప్రశ్నించే వారిని వేధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. పోలీసులను అడ్డు పెట్టుకుని రాక్షస పాలన సాగిస్తోంది. చట్టం, కోర్టులు అంటే ఏమాత్రం గౌరవం లేనట్లు లెక్కలేనితనంతో బరితెగించింది. పదేళ్ల కిందట నంది అవార్డు తిరస్కరిస్తూ వ్యాఖ్యలు చేస్తే.. దానిపై సంబంధం లేని వారెవరో ఇప్పుడు ఫిర్యాదు చేస్తే.. మరెక్కడో కేసు.. పొరుగు రాష్ట్రంలో అరెస్టు.. స్వయంగా జిల్లా ఎస్పీ పర్యవేక్షణ.. సినీ నటుడు పోసాని కృష్ణ మురళిది అక్రమ అరెస్టు అని చెప్పేందుకు ఇంత కంటే నిదర్శనం అవసరమా?⇒ పక్కా కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం పోసానిని వేధిస్తోందని స్పష్టమవుతోంది. అతనో అంతర్జాతీయ టెర్రరిస్ట్ అన్నట్లు పోలీసులు వ్యవహరించిన తీరు నివ్వెర పరుస్తోంది. రేపటి తేదీ వేసి ఈ రోజే (27వ తేదీ వేసి.. 26నే) అరెస్ట్ చేయడం.. అదీ వేరే రాష్ట్రంలో ఆ రాష్ట్ర పోలీసుల ప్రమేయం లేకుండా బలవంతంగా ఇంట్లోకి చొరబడి భయభ్రాంతులకు గురి చేయడం.. ముందస్తు నోటీసు ఇవ్వకుండా అక్కడి నుంచి ఎత్తుకు రావడం.. 15 గంటల పాటు ఎక్కడుంచారో చెప్పక పోవడం.. తుదకు ఓబులవారిపల్లె పోలీస్స్టేషన్లో విచారిస్తున్నప్పుడు ఏకంగా జిల్లా ఎస్పీ రావడం.. ఉన్నతాధికారులు గంట గంటకూ ఆరా తీయడం.. ఇవన్నీ చూస్తుంటే ఓ వ్యూహం ప్రకారం ప్రభుత్వ పెద్దలే వెనకుండి నడిపించారని తేటతెల్లమవుతోంది.⇒ పోసానిపై ఇచ్చిన ఫిర్యాదు దేశ ద్రోహానికి సంబంధించింది కాదు.. స్మగ్లింగ్కు సంబంధించిందీ కాదు.. హత్యా నేరం అంతకంటే కాదు.. ఆయన వయసు 66 ఏళ్లు.. పైగా గుండె సమస్యతో బాధ పడుతున్నారు.. ఇలాంటి వ్యక్తిని ఇంతగా వేధించాల్సిన అవసరం ఏముంది? ఒక మామూలు కేసు ఇది.. ఇలాంటి కేసులో ఇంత హంగామా, భయభ్రాంతులకు గురి చేయడం అవసరమా? రాత్రిళ్లు అరెస్టు చేయడం ఏమిటి? విచారణ జరుగుతున్న చోటుకు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు రావడం ఎంత వరకు అవసరం? న్యాయవాదులను, వైఎస్సార్సీపీ నేతలను పోసానితో మాట్లాడటానికి ఎందుకు అంగీకరించ లేదు? ఇదంతా కుట్ర కాదా? ఇవన్నీ రెడ్బుక్ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ కావా? దీనిని బరితెగింపు అనాలా.. కండ కావరం అనాలా.. అధికార మదం అనాలా.. లేక ఇంకేమనాలి?సాక్షి, అమరావతి/ఓబులవారిపల్లె/రైల్వేకోడూరు అర్బన్/ సాక్షి, రాయచోటి: రెడ్బుక్ రాజ్యాంగమే పరమావధిగా రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగించింది. సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కక్ష సాధించడం కోసం నిబంధనలకు తిలోదకాలు వదిలింది. తమను అడిగే వారే లేరని, ఎవరైనా ప్రశ్నిస్తే అంతు చూసేదాకా వదలమన్నట్లు వ్యవహరిస్తోంది. పోలీసులను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపుకు పాల్పడుతోంది. ఎప్పుడో పదేళ్ల కిందట నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడెవరో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో బుధవారం రాత్రి 8.45 గంటలకు హైదరాబాద్ గచ్చి»ౌలిలోని ఆయన నివాసంలోకి అన్నమయ్య జిల్లా సంబేపల్లె ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలోని పోలీసు బృందం అక్రమంగా చొచ్చుకెళ్లి, అదుపులోకి తీసుకున్నది మొదలు.. గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటల వరకు ఎక్కడెక్కడో తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేసింది. 15 గంటల తర్వాత ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్కు తీసుకొచ్చింది. అప్పటి వరకు ఆయన్ను ఎక్కడ ఉంచారో, ఎవరి వద్దకు తీసుకెళ్లారో బయటకు పొక్కకుండా సస్పెన్స్ కొనసాగించింది. జనసేన పార్టీ నేత జోగినేని మణి చేసిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్లో పోసానిపై క్రైం నంబరు 65/2025, అండర్ 196, 353(2), 111 ఆర్/డబ్ల్యూ 3(5) ఆఫ్ ది బీఎన్ఎస్ యాక్టు–2023 కింద కేసు నమోదైతే సంబేపల్లె ఎస్ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో బృందాన్ని పంపడం సందేహాలకు తావిస్తోంది. మహా శివరాత్రి పండుగ రోజు అని కూడా చూడకుండా పైశాచికంగా వ్యవహరించారు. ఎన్నికల అనంతరం రాజకీయాలకు స్వస్తి చెప్పి, ఏ పార్టీతో సంబంధం లేకుండా కొనసాగుతున్నానని చెప్పినప్పటికీ వినకుండా, అదే రోజు రాత్రికి రాత్రే జిల్లాకు తీసుకు వచ్చిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. పైగా నోటీసులో 27వ తేదీ వేసి, 26వ తేదీన అదుపులోకి తీసుకోవడం పట్ల న్యాయవాద వర్గాలు విస్తుపోతున్నాయి. ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్కు పోసాని కృష్ణమురళిని తీసుకొస్తున్న పోలీసులు ఒత్తిడికి గురిచేయొద్దన్న వైద్యులు పోసానిని అన్నమయ్య జిల్లా పోలీసులు ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్కు తీసుకు వచ్చిన అనంతరం తొలుత వైద్య పరీక్షలు నిర్వహించారు. గతంలో గుండె సంబంధిత సమస్యలు ఉన్న నేపథ్యంలో స్థానిక పీహెచ్సీ వైద్యుడు గురు మహేష్.. బీపీ, షుగర్, పల్స్ పరిశీలించారు. అన్నీ సాధారణంగానే ఉన్నాయని, తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. అయితే గుండె సమస్య కారణంగా సాఫ్ట్గా విచారించడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైతే పోసాని కృష్ణమురళి ఆరోగ్యం నార్మల్గానే ఉందని వైద్యులు తెలియజేశారు. కాగా, పోసానిని కలవడానికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతిని«ధి, మాజీ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి, మాజీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సుదర్శన్రెడ్డి, పార్టీ లీగల్ సెల్ జిల్లా కనీ్వనర్ నాగిరెడ్డి తదితరులను పోలీసులు అనుమతించ లేదు. తాము పోసానికి వ్యక్తిగత న్యాయవాదులమని, పోసాని వద్ద కాకుండా పక్క గదిలో ఉంటామని చెప్పినా పోలీసులు ఒప్పుకోలేదు. ఈ సందర్భంగా లీగల్ సెల్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగినా వినిపించుకోలేదు. రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఇతర నేతలను సైతం పోలీసులు అడ్డుకున్నారు.హైకోర్టు ఆదేశాల ధిక్కారం ‘కేసులో నిందితుడిని న్యాయవాది కలిసి మాట్లాడవచ్చు. లేదంటే పక్క గదిలో కూర్చోవచ్చు’ అన్న హైకోర్టు ఆదేశాలను పోలీసులు ధిక్కరించారు. పోసాని కృష్ణ మురళి ఏం చేశారని అతడిపై ఈ సెక్షన్లతో కేసు నమోదు చేశారు? అసలు ఫిర్యాదు ఎవరు చేశారన్నది చెప్పాలి కదా.. ఎవరి ఆదేశాలతో ఇలా చేస్తున్నారు?’ అని వైఎస్సార్సీపీ లీగల్ అడ్వయిజర్ నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కూటమి ప్రభుత్వం 9 నెలల పాలనలో సూపర్సిక్స్ పథకాలను అమలు చేయలేదు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే డైవర్షన్ రాజకీయాలు చేస్తోంది.’ అని కొరముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు.ధైర్యంగా ఉండండి.. మేమంతా తోడుగా ఉన్నాం పోసాని సతీమణి కుసుమలతను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పోసాని భార్య పోసాని కుసుమలతతో గురువారం ఫోన్లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని, ఈ అరెస్ట్ విషయంలో పోసాని కృష్ణ మురళికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారని, తామంతా తోడుగా ఉంటామని ధైర్యం చెప్పారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. పార్టీ తరుఫున న్యాయ పరంగా సహాయం అందిస్తామని, ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని తెలిపారు. పోలీస్స్టేషన్కు జిల్లా ఎస్పీఓబులవారిపల్లె పోలీసుస్టేషన్కు పోసాని కృష్ణ మురళిని తీసుకొచ్చిన అనంతరం జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు అక్కడికి చేరుకున్నారు. ఆయన నేరుగా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి కేసు పూర్వాపరాలను పరిశీలించడంతోపాటు పోసానిని కూడా విచారించినట్లు సమాచారం. ప్రభుత్వ న్యాయవాదులను స్టేషన్కు పిలిపించి మంతనాలు సాగించారు. ఈ కేసులో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇటు పోలీసులకు, అటు న్యాయవాద వర్గాలకు మార్గ నిర్దేశం చేసినట్లు తెలిసింది. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్స్టేషన్ నుంచి సమీపంలోని ప్రధాన రహదారి వరకు అటు, ఇటుగా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఎవరినీ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు పోలీసు స్టేషన్ సమీపంలో ఆందోళనకు దిగాయి. వయోభారం, ఆరోగ్యం బాగోలేని వ్యక్తిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఇబ్బందులు పెట్టడం సరికాదని నేతలు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపుగా కేసులు నమోదు చేసిందని ధ్వజమెత్తారు. అర్ధరాత్రి 2.. కొనసాగిన వాదనలు పోసాని కృష్ణ మురళిని ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్లో విచారణ పేరుతో గురువారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9.10 గంటలకు వరకు వేధింపులకు గురి చేశారు. ఆయనకు కొంత మేర అనారోగ్య సమస్యలున్నా అన్ని గంటలపాటు పోలీస్స్టేషన్లోనే ఉంచారు. పోలీసుస్టేషన్ ద్వారం వద్దకు వాహనాన్ని తీసుకెళ్లి పోసానిని ఎక్కించుకుని రైల్వేకోడూరులోని మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లారు. పోసాని తన వెంట తెచ్చుకున్న బ్యాగుతో వాహనంలో ఎక్కి కూర్చున్నారు. పోసాని కొంత మేర నిస్సత్తువతో కనిపించారు. రాత్రంతా వాహనంలో జర్నీ చేయడం, నిద్రలేమితోపాటు అనారోగ్య సమస్యలు, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విచారణ పేరుతో కూర్చోబెట్టడంతో నీరసించిపోయారు. కాగా ఉదయం 5 గంటలదాకా కొనసాగిన వాదనలు. సుమారు 7 గంటలు కొనసాగిన వాదనలు. సుదీర్ఘ వాదనల అనంతరం 14 రోజుల రిమాండ్ విధిస్తూ రైల్వే కోడూరు కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విదించింది. కాసేపట్లో కడప జైలుకు పోసాని తరలింపు.త్రిబుల్ వన్ సెక్షన్ల దుర్వినియోగం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది హామీలు నెరవేర్చడానికని, అయితే వాటిని గాలికి వదిలేసి ఇష్టంలేని వ్యక్తులపై త్రిబుల్ వన్ (111) సెక్షన్లతో కేసులను నమోదు చేస్తోంది. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రతిపక్ష నాయకులపై మూడేళ్ల క్రితం నమోదైన కేసులను తిరగదోడి వేధిస్తోంది. అధికారం మారాక అధికార బలంతో కేసులు పెడుతున్నారా.. అని సుప్రీంకోర్టు తప్పు పట్టినప్పటికీ, 111 సెక్షన్ను దుర్వినియోగం చేస్తోంది. వైఎస్సార్సీపీ నాయకులపై వ్యవస్థీకృత నేరాలకు సంబంధించిన కేసులను పెడుతోంది. వైఎస్సార్సీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, మహిళలపై పెట్టిన పోస్టులకు సంబంధించి ప్రతి జిల్లాలో ఫిర్యాదులు చేసినా, కూటమి ప్రభుత్వం బుట్టదాఖలు చేయలేదా? పోసాని కృష్ణ మురళి పోస్టులకు సంబంధించి కోర్టులు చూసుకుంటాయి. 111 సెక్షన్ దుర్వినియోగం అవుతోందన్న పిటిషన్లు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఇలా చేయడం చట్ట వ్యతిరేకం. మా అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీలకు అతీతంగా వచ్చాం. – పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మాజీ అసిస్టెంట్ అడ్వొకేట్ జనరల్ -
అట్టుడికిన మండలి.. నిలదీసిన వైఎస్సార్సీపీ
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల బలవంతపు రాజీనామాల వ్యవహారం.. రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల ఉపాధి అవకాశాల అంశాలు మంగళవారం శాసన మండలిని కుదిపేశాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా ఒకేసారి 17 మంది వీసీలను బెదిరించి.. బలవంతంగా రాజీనామా చేయించారని, ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ సభ్యులు పట్టుపట్టారు. ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదని, తామెవరినీ బెదిరించలేదని మంత్రి లోకేశ్ దబాయించబోయారు. ‘ఏ వీసీ అయినా ప్రెస్మీట్ పెట్టి చెప్పారా.. వాట్సాప్లో పంపించారా.. ఫలానా వాళ్లు రాజీనామా చేయమన్నారని చెప్పారా.. ఇలా ఏ ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తారా.. ఆరోపణలను వెంటనే వెనక్కు తీసుకోవాలి’ అంటూ గుడ్లురమబోయారు. ‘వీసీలందరికి ఐఏఎస్ అధికారి సౌరబ్ గౌర్ ఫోన్ చేసి రాజీనామా చేయండని ఒత్తిడి చేశారు. కావాలంటే కాల్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. వీసీలు తమ రాజీనామా పత్రంలో ‘ఉన్నత విద్యా మండలి అధికారుల ఆదేశాల మేరకు రాజీనామా చేస్తున్నాం’ అని పేర్కొన్నారు’ అని విపక్ష సభ్యులు ఆధారాలు చూపగా లోకేశ్ వెంటనే మాట మార్చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఎక్కడ కల్పించాలో చూపాలన్న డిమాండ్కు సమాధానం చెప్పలేక మంత్రులు నీళ్లు నమిలారు. తర్జుమా చేయడంలో పొరపాటంటూ మంత్రి లోకేశ్ కవర్ చేసుకునేందుకు విఫల యత్నం చేశారు. సర్కారు ద్వంద్వ నీతిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వీసీలతో బలవంతపు రాజీనామాలుసాక్షి, అమరావతి: ‘గవర్నర్ ప్రసంగంలో వీసీల నియామకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీసీల నియామకం అనేది రెగ్యులర్ ప్రొసెస్. ఏ ప్రభుత్వం అయినా వారి పదవీ కాలం ముగిసిన తర్వాతే సెర్చ్ కమిటీ వేసి నియామకాలు చేపడుతుంది. అయితే రాష్ట్రంలో 19 యూనివర్సిటీలుండగా, 17 వర్సిటీల వీసీలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకేసారి రాజీనామా చేశారు. ఇలా ఇంత మంది రాజీనామాలు చేయడం చరిత్రలో ఎప్పుడూ ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు. బెదిరించి, బలవంతంగా వారితో రాజీనామా చేయించారు. ఏపీపీఎస్సీ చైర్మన్తో కూడా బలవంతగా రాజీనామా చేయించడం నిజం కాదా.. ’ అని శాసన మండలి వేదికగా వైఎస్సార్సీపీ గళం విప్పింది. ఈ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ జోక్యం చేసుకుంటూ.. ‘మేము బెదిరించాం.. భయపెట్టాం.. బయటకు పంపించాం.. అని వైఎస్సార్సీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యాశాఖా మంత్రిగా అడుగుతున్నా.. ఆధారాలుంటే హౌస్లో పెట్టండి’ అని మంత్రి లోకేశ్ సవాల్ విసిరారు. దీనిపై ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి బదులిస్తూ.. ‘నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీలో గొడవలు చేసి, గందరగోళం సృష్టించి.. వీసీ రాజీనామా చేసి పోయేలా చేశారు. నేను అడుగుతున్నది ఒక్కటే.. ఇంత మంది ఒకేసారి రాజీనామా చేస్తే ఎందుకు విచారణ చేయడం లేదో చెప్పాలి’ అని నిలదీశారు. వెంటనే లోకేశ్ జోక్యం చేసుకుంటూ.. ‘ఏదో రాయి వేస్తాం.. మట్టి వేస్తాం.. కడుక్కోండి.. అంటే కుదరదు. మా ప్రభుత్వంలో ఎవరు బెదిరించారో.. ఏమని బెదిరించారో.. రాజీనామా చేసిన వీసీలు ప్రెస్మీట్ పెట్టి చెప్పమనండి.. వీసీ పోస్టుల కోసం 500 మంది అప్లై చేశారు. టాప్ యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లను తీసుకొచ్చి వీసీలుగా నియమించాం. సామాజిక న్యాయం చేశాం. గత ప్రభుత్వం మాదిరిగా ఒక సామాజిక వర్గానికే ఇవ్వలేదు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై వైఎస్సార్సీపీ సభ్యులు స్పందిస్తూ.. ‘దేశ చరిత్రలో ఓ రాష్ట్రంలో ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామా చేయడం జరగలేదు. వారు ఎందుకు రాజీనామాలు చేయాల్సి వచ్చిందో జ్యూడిషియల్ విచారణకు ఆదేశించండి’ అని నిలదీశారు. ఏ ఒక్కరినీ వదిలిపెట్టం.. మంత్రి లోకేశ్ మళ్లీ జోక్యం చేసుకుంటూ.. ‘యూనివర్సిటీలకు ఛాన్సలర్ గవర్నర్. మీరు గవర్నర్ను కించ పరిచినట్టుగా ఆరోపణలు చేస్తున్నారు. లోకేశ్ ఫోన్ చేశాడా.. లేదా ఇక్కడున్న మా మంత్రులు ఎవరు ఫోన్ చేశారో చెప్పమనండి.. లేదా మా ఆఫీస్ నుంచి ఎవరైనా ఫోన్ చేసి బెదిరించారో చెప్పమంటే చెప్పకుండా ఆరోపణలు చేయడం సరికాదు. మీరు చేస్తున్న ఆరోపణల వల్ల విశ్వవిద్యాలయాలకు చెడ్డపేరు వస్తుంది. తక్షణమే బేషరతుగా మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ఆధారాలుంటే బయట పెట్టండి. తప్పకుండా విచారణ జరిపిస్తాం.. ల్యాప్ ట్యాప్ నా దగ్గరే ఉంది.. ఇప్పుడే ఆర్డర్ ఇస్తా.. మాజీ వీసీలు ఎవరైనా మీకు ఫోన్ చేశారా? వాట్సాప్ మెసేజ్ చేశారా? వివరాలు ఇవ్వండి.. చర్యలు తీసుకుంటాం. వీసీల రాజీనామాల వ్యవహారమే కాదు.. 2019 నుంచి ఏం జరిగిందో అంతా బయటకు తీద్దాం. అన్నీ బయటకొస్తాయి. ఇప్పటికే ఒకరు జైల్లో ఉన్నారు. ఎవరినీ వదిలి పెట్టం. వెయిట్ అండ్ వాచ్.. టైమ్, డేట్ రాసుకోండి’ అని తీవ్ర స్వరంతో మంత్రి లోకేశ్ హెచ్చరించారు. ఈ దశలో టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి మాట్లాడుతూ ‘రాజీనామా చేసిన వీసీలంతా మీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి బావమరుదులు, మేనత్తలే అని అన్నారు. వైఎస్ జగన్ ఓడిపోయారు కాబట్టి వారంతా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారన్నారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో గందరగోళంతో చైర్మన్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు.ఇవిగో ఆధారాలు..సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ.. ‘వీసీలందరికీ ఐఏఎస్ అధికారి సౌరబ్ గౌర్æ ఫోన్ చేసి రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు. ఆ మరుసటి రోజే వారంతా రాజీనామా చేశారు. కావాలంటే కాల్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు.. వీసీలు తమ రాజీనామా పత్రంలో ఉన్నత విద్యా మండలి అధికారుల ఆదేశాల మేరకు రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి? తక్షణమే విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు. ఇదే విషయమై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. ‘ఏ విచారణ కావాలి.. జ్యుడీషియల్ విచారణా లేక డిపార్టుమెంటల్ విచారణా.. క్లారిటీ ఇవ్వండి‘ అని చైర్మన్ కోరగా, ‘మేము జ్యూడిషియల్ ఎంక్వైరీ కోరుతున్నాం.. వాళ్లు ఎంక్వైరీ వేసినా మాకు అభ్యంతరం లేదు. మంత్రి చెబుతున్నట్టు 2019 నుంచే కాదు.. కావాలంటే 2014 నుంచి ఎంక్వైరీ చేయండి. మాకు అభ్యంతరంలేదు. వాస్తవాలేమిటో ప్రజలకు తెలుస్తాయి’ అని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ దశలో మంత్రి లోకేశ్ మాట మార్చారు. ‘ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇస్తే ఎంక్వైరీ వేస్తాం. ఏ ఆధారం లేకుండా కేసు పెట్టమంటే ఎలా?’ అని తప్పించుకొనే ప్రయత్నం చేశారు. ‘ముందు ఒకలా మాట్లాడుతున్నారు.. ఆధారాలు చూపాక మరొకలా మాట్లాడుతున్నారు. మీకు చిత్తశుద్ధి లేదు’ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీసీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.బెదిరిపోయేవాళ్లెవరూ లేరు: బొత్స మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ‘ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామాలు ఎందుకు చేయాల్సి వచ్చిందో విచారణ జరపాలని మా సభ్యులు కోరుతున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ఎంక్వైరీ వేయండి.. నిరూపిస్తాం.. నిరూపించకపోతే అప్పుడు మాట్లాడండి. అడిగిన దానికి బదులివ్వకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. మళ్లీ మళ్లీ చెబుతున్నాం. చట్ట ప్రకారం ఏం చేయదల్చుకున్నారో చేయండి. ఇక్కడ ఎవరూ బెదిరిపోయేవాళ్లు, అదిరిపోయే వాళ్లు లేరు. ఎవరు తప్పు చేస్తే వాళ్లు అనుభవిస్తారు. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి’ అని బొత్స సత్యనారాయణ... మంత్రి లోకేశ్కు దీటుగా స్పందించారు. -
ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం: వైఎస్ జగన్
శాసన సభలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీనే. మరో విపక్ష పార్టీ అంటూ లేదు. మిగతావన్నీ అధికారంలో కొనసాగుతున్న పార్టీలే. మరి ప్రతిపక్ష హోదా ఎవరికి ఇస్తారు? సహజంగానే వైఎస్సార్సీపీకే ఇవ్వాలి కదా! హోదా ఇవ్వకపోతే ఎందుకు నడుపుతున్నారు? అవతలి వారు చెప్పేది మనం వినకూడదనుకుంటే ఇక అసెంబ్లీ ఎందుకు? ప్రతిపక్షం చెప్పేది ఆలకించాలి. తద్వారా లోపాలను సరిదిద్ది ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. ఎంతసేపూ పరనింద.. ఆత్మస్తుతేనా? అలాంటప్పుడు ఇక ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. – వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటాన్ని కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) పునరుద్ఘాటించారు. కూటమి ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో తీవ్ర వ్యతిరేకత నెలకొందని.. టీడీపీ ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలిపోయాయని ధ్వజమెత్తారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ‘మనం యుద్ధరంగంలో ఉన్నాం.. విజయం దిశగా అడుగులు వేయాలి.. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలి.. నిజాయితీగా, చిత్తశుద్ధితో ప్రజల తరఫున పోరాటం చేయాలి.. ప్రజలకు తోడుగా ఉంటూ వారితో మమేకమైతే గెలుపు సాధించినట్లే. ప్రజా సమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయవద్దు. మనం వేసే ప్రతి అడుగూ పార్టీ ప్రతిష్టను పెంచేదిలా ఉండాలి. ఎక్కడా రాజీ పడకూడదు’ అని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు. సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..మీ భవిష్యత్తుకు నాది భరోసా..ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంలో మన సమర్ధతను నిరూపించుకోవడానికి ఇదొక అవకాశం. ప్రతి ఒక్కరికీ నేను భరోసా ఇస్తున్నా. మీ భవిష్యత్తుకు నాది భరోసా. నేను మరో 30 ఏళ్లు రాజకీయాలు చేస్తా. పార్టీ కోసం, ప్రజల కోసం గట్టిగా పని చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కళ్లు మూసుకుని తెరిచేలోగా ఏడాది గడిచిపోతోంది. జమిలి ఎన్నికలు అంటున్నారు. అదే జరిగితే ఎన్నికలు మరింత మందుగా వస్తాయి. అందుకే ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా రాజీ వద్దు. ప్రజల తరపున గొంతు విప్పే విషయంలో ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో మనం విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నాం కాబట్టే ఎన్నో క్లిష్ట పరిస్థితులు అధిగమించాం. ఇంత దూరం ప్రయాణం చేశాం. దేవుడు మనల్ని అందరినీ తప్పకుండా ఆశీర్వదిస్తాడు.అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు..అసెంబ్లీలో మనం మినహా వేరే ప్రతిపక్షం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే.. హక్కుగా మనకు సమయం ఇవ్వాల్సి వస్తుంది. సభా నాయకుడితో దాదాపు సమాన స్థాయిలో సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ భయంతోనే ప్రతిపక్ష హోదాను ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లాం. శాసన సభలో మనం ఒక్కరమే ప్రతిపక్షం. అందుకే విపక్ష హోదా అడుగుతున్నాం. సభలో ప్రతిపక్షం స్వరాన్ని వినాలి. తప్పులుంటే సరిదిద్దుకోవాలి. నేను ఏ అంశంపై మాట్లాడినా నిందలకు, దూషణలకు దూరం. ప్రతి అంశాన్నీ ఆధారాలు, రుజువులతో మాట్లాడతా. నా ప్రసంగాల్లో కూడా చాలా సార్లు సభలో చంద్రబాబునాయుడు ఉంటే బాగుండేదని చెప్పా. అయితే ప్రభుత్వ స్వరం మినహా వేరే స్వరం వినపడకూడదన్నట్లు అసెంబ్లీని తయారు చేశారు.ప్రజలకు అన్నీ తెలుసు..పేదల ఇళ్ల కాలనీల పేర్లు కూడా మారుస్తున్నారని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశంలో ప్రస్తావించగా.. ‘‘ఎవరు ఇళ్ల స్ధలాలిచ్చారో, ఎవరు కాలనీలు ఏర్పాటు చేశారో ప్రజలకు తెలుసు. విజయవాడలో అంబేడ్కర్ స్మృతివనాన్ని మనమే నిర్మించాం. కానీ పేరు తీసేయాలన్న దురుద్దేశంతో ఏకంగా అంబేడ్కర్ విగ్రహం మీదే దాడికి దిగారు. ఈ ప్రభుత్వం ఆదేశాలతోనే అదంతా జరిగింది. అధికారులే స్వయంగా దీనికి ఒడిగట్టారు. మరి స్మృతివనం ఎవరు కట్టారో ప్రజలకు తెలియదా? ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ప్రజలకు నేరుగా రూ.2.73 లక్షల కోట్లు అందించి మనం మంచి చేశాం. ఇవాళ మనమిచ్చిన పథకాలన్నీ రద్దు చేశారు. నోటి దాకా వచ్చిన కూడును తీసేశారు. టీడీపీ వాళ్లు ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలాయి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇళ్ల పట్టాలు రద్దు చేస్తే కోర్టుకెళ్తాం..టీడీపీ కూటమి ప్రభుత్వం అన్యాయంగా ఇళ్ల పట్టాలను రద్దు చేస్తోందని సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘‘మన హయాంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఏ పార్టీ అని చూడకుండా, పక్షపాతం లేకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఎవరైనా ఇల్లు కట్టుకోకపోతే ప్రభుత్వమే వారికి ఇల్లు మంజూరు చేసి ఇవ్వాలి. అంతేకానీ పేదలపై కక్షగట్టి పట్టాలు రద్దు చేయడం ఏమిటి? పట్టాలు రద్దు చేస్తే తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాం’’ అని స్పష్టం చేశారు. -
రైతు బతికే పరిస్థితి లేదు!: వైఎస్ జగన్
ఇవాళ రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మొన్నటి వరకూ ధాన్యం రైతుల కష్టాలు చూశాం.. ఇవాళ మిర్చి రైతుల కష్టాలను చూస్తున్నాం. ఒక్క మిర్చే కాదు.. పత్తి, మినుము, కందులు, పెసర, టమాటా.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితి నెలకొంది. నాడు సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ధరలను సమీక్షిస్తూ ఎక్కడైనా పతనమైతే వెంటనే రంగంలోకి దిగి రైతులను ఆదుకున్నాం. కానీ నేడు దళారీల దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. రైతుల జీవితాల్లో వెలుగులు చూసేందుకు వైఎస్సార్సీపీ హయాంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏవీ ఈరోజు కనిపించడం లేదు. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయానికి... ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో అన్నదాతలు పడుతున్న అగచాట్లు చంద్రబాబుకు కనిపిస్తున్నా కళ్లు మూసుకుని కూర్చున్నారని వైఎస్సార్ సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో రైతు బతికే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అన్నదాతల పాలిట శాపంగా మారింది. ఏ రైతన్నా సంతోషంగా లేడు. అన్నదాతల అవస్థలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు’’ అని మండిపడ్డారు. ‘ఇవాళ రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. మరోవైపు దిగుబడులు పడిపోయాయి. మొన్నటి వరకూ ధాన్యం రైతుల కష్టాలు చూశాం.. ఇవాళ మిర్చి రైతుల కష్టాలను చూస్తున్నాం. ఒక్క మిర్చే కాదు.. పత్తి, మినుము, కందులు, పెసర, టమాటా.. ఇలా ఏ పంట తీసుకున్నా రైతులకు గిట్టుబాటు ధర దక్కని దుస్థితి నెలకొంది. దళారులకు తావు లేకుండా పంటల కొనుగోళ్లు జరిపి రైతులను ఆదుకున్న ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈ క్రాప్ గాలికి వదిలేశారు. ఉచిత పంటల బీమా ఎత్తివేశారు. సీజన్ ముగిసేలోపు ఇన్పుట్ సబ్సిడీకి స్వస్తి పలికారు. ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేశారు. ఇక ఇస్తామన్న దాన్నీ ఎగ్గొట్టారు. సూపర్ సిక్స్లో చెప్పినవన్నీ విస్మరించారు. సున్నా వడ్డీ రాయితీ అందడం లేదు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ ద్వారా పరీక్షలు నిర్వహించి నాణ్యమైన సాగు ఉత్పాదకాలు అందించే విధానానికి తిలోదకాలిచ్చారు. నాడు సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ధరలను సమీక్షిస్తూ ఎక్కడైనా పతనమైతే వెంటనే రంగంలోకి దిగి రైతులను ఆదుకుంటే నేడు దళారీల దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. రైతుల జీవితాల్లో వెలుగులు చూసేందుకు వైఎస్సార్ సీపీ హయాంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏవీ ఈరోజు కనిపించడం లేదు’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గుంటూరులోని మిర్చి యార్డుకు వచ్చిన వైఎస్ జగన్ రైతులను కలిసి వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కనీస మద్దతు ధర కూడా దక్కకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని మిర్చి రైతులు ఆయన వద్ద మొర పెట్టుకున్నారు. వారి కష్టాలు, బాధలు తెలుసుకుని చలించిపోయారు. సావధానంగా సమస్యలు ఆలకించి ధైర్యం చెప్పారు. అనంతరం మిర్చి యార్డు బయట వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ఖాతాలోనూ తన పర్యటన వివరాలను పంచుకున్నారు. రైతన్నలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలిరావడంతో మిర్చి యార్డు ప్రాంతం కిక్కిరిసిపోయిందని.. అందువల్ల మీడియా ద్వారా పూర్తిగా మాట్లాడలేకపోయానని.. అన్ని అంశాలను ట్వీట్లో పొందుపరుస్తున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..గుంటూరులో భారీగా హాజరైన జన సందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ ఏ పంట చూసినా ‘మద్దతు’ కరువు..టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు అడుగడుగునా కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయి. పంటలకు మద్దతు ధర దేవుడెరుగు.. అమ్ముకుందామన్నా కొనేవారు లేక అల్లాడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.. మళ్లీ రైతులను పట్టి పీడించడం మొదలు పెట్టారు. అటు తెగుళ్లతో దిగుబడి తగ్గిపోవడం.. ఇటు రేటు లేక అమ్ముకోలేని పరిస్థితులతో అన్నదాతల బతుకు దుర్భరంగా మారింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో రైతులందరి పరిస్థితి దయనీయంగా ఉంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి.. ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఒక్క రివ్యూ కూడా చేయలేదు. ప్రభుత్వం తరఫున రైతులను పలకరించేవారు లేరు. రాష్ట్ర సచివాలయానికి అత్యంత సమీపంలోనే గుంటూరు మార్కెట్ యార్డు ఉన్నా రైతుల ఆక్రోశం, ఆవేదన చంద్రబాబుకు వినిపించడంలేదు. సీఎం చంద్రబాబు రైతులను దళారీలకు అమ్మేశాడు. మిర్చి రైతన్న కుదేలు..మన ప్రభుత్వంలో నిరుడు అత్యధికంగా క్వింటాలు రూ.21 – 27 వేల దాకా పలికిన మిర్చి ధర ఇప్పుడు రూ.8 – 11 వేలకు పడిపోయింది. పంట బాగుంటే మిర్చి ఎకరాకు సగటున 20 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. తెగుళ్ల కారణంగా ఈ ఏడాది దిగుబడులు పడిపోయాయి. ఏ జిల్లాలో చూసినా ఎకరాకు 10 క్వింటాళ్లకు మించి రాలేదు. ఇక పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు కనీసం రూ.1,50,000 పైమాటే అవుతోంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒక్క మిర్చే కాదు.. కంది పండిస్తున్న రైతులు కూడా ధరలు లేక విలవిల్లాడుతున్నారు. కందిపప్పు క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.7,550 అయితే ఇప్పుడు రూ.5,500 కూడా రావడం లేదు. కానీ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150 పైనే ఉంది. అదే గతేడాది రూ.9–10 వేల మధ్య ధర వచ్చేది. గత ఏడాది క్వింటాలు పత్తి రూ.10 వేలు ఉండగా ఇప్పుడు రూ.5 వేలు కూడా దాటడం లేదు. పెసలు కనీస మద్దతు ధర రూ.8,558 కాగా ఇప్పుడు రూ.6 వేలు రావడం కూడా కష్టంగా ఉంది. మినుములు కనీస మద్దతు ధర రూ.7,400. గత ఏడాది క్వింటాలు మినుములు రూ.10 వేలు పలకగా ఇప్పుడు రూ.7 వేలు కూడా రావడం లేదు. టమాటా రైతులకు కిలోకి రూ.3–5 కూడా దక్కడం లేదు. పలావూ.. లేదు! బిర్యానీ లేదు! ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అని కూడా అన్నారు. రైతుకు ఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ సాయం కాకుండా అన్నదాతా సుఖీభవ కింద తాము రూ.20 వేలు చొప్పున ఇస్తామని నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని మోసం చేశారు. మన ప్రభుత్వంలో ఇచ్చిన రైతు భరోసాను కొనసాగించకుండా రద్దు చేశారు. మన ప్రభుత్వంలో ఒక్క రైతు భరోసా కిందే క్రమం తప్పకుండా సుమారు 54 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు అందచేశాం. ఇప్పుడు పలావూ.. లేదు! బిర్యానీ లేదు! ధరల స్థిరీకరణ నిధికి ఎగనామంఉచిత పంటల బీమాను కూడా చంద్రబాబు రద్దు చేశారు. ఒక సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీని చెల్లించే గొప్ప విధానాన్ని, రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారు. ఈ–క్రాప్ లేకుండా చేసేశారు. ధరల స్థిరీకరణ నిధికి ఎగనామం పెట్టారు. కనీసం ఎరువుల పంపిణీలోనూ కొరతే. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడం దారుణం. చంద్రబాబూ..! ఇప్పటికైనా కళ్లు తెరవండి. రైతే రాజు అని గుర్తించండి. అన్నదాత కన్నీరు పెట్టుకుంటే అది రాష్ట్రానికే అరిష్టం. చంద్రబాబు గుంటూరు మార్కెట్ యార్డుకు వచ్చి మిర్చి రైతులతో మాట్లాడి వారికి బాసటగా నిలవాలి. ప్రభుత్వమే మిర్చిని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నాం.ఆదుకోకుంటే తీవ్ర పరిణామాలు..‘ఇవాళ రైతులు ప్రతి విషయంలోనూ దారుణంగా నష్టపోతున్నారు. ఇప్పటిౖకైనా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. రైతులకు పెట్టుబడి సహాయం అందించాలి. చంద్రబాబు కళ్లు తెరిచి గుంటూరు మిర్చి యార్డుకు రావాలి. రైతుల కష్టాలను తెలుసుకుని వారికి గిట్టుబాటు ధర లభించే విధంగా అండగా నిలబడకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలుంటాయని రైతుల తరఫున హెచ్చరిస్తున్నా’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి, పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, గుంటూరు, పల్నాడు జిల్లాల పార్టీ పరిశీలకుడు మోదుగుల, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, ఏసురత్నం, మురుగుడు హనుమంతరావు, మేయర్ కావటి మనోహర్నాయుడు, మాజీ మంత్రి విడదల రజిని, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, మాజీ ఎంపీ నందిగం సురేష్, పార్టీ నేతలు వనమా బాలవజ్రబాబు, అన్నాబత్తుని శివకుమార్, బలసాని కిరణ్, అంబటి మురళీకృష్ణ, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.గుంటూరు మిర్చి యార్డులో రైతులతో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయం చేయకపోగా.. వ్యవస్థలు నిర్వీర్యంచంద్రబాబు అధికారంలోకి వచ్చి రైతులకు సాయం చేయకపోగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలన్నింటినీ మూలన పడేశారు. ఆర్బీకేలను, ఈ–క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లను నీరుగార్చారు. సీజన్ మొదలయ్యే సరికి రైతులకు పెట్టుబడి సహాయం, రైతులకు సున్నా వడ్డీకే రుణాలు, విత్తనాలు, ఎరువులకు సైతం నాణ్యతకు ఆర్బీకేల్లో గ్యారంటీ.. ఇలా మేం తెచ్చిన ప్రతి విప్లవాత్మక మార్పునూ ఉద్దేశపూర్వకంగా మూలనపెట్టారు. ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలన్న ఆలోచనే ఈ ప్రభుత్వానికి లేదు.. ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలన్న ఉద్దేశమే లేదు. ఓ నెంబరుకు ఫోన్ చేస్తే ప్రభుత్వం స్పందిస్తుందన్న నమ్మకం రైతన్నల్లో కనిపించడం లేదు. ఆర్బీకేలు, వాటికి అనుసంధానంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లతో సహా ప్రతి వ్యవస్థ ఇవాళ నిర్వీర్యం అయిపోయాయి. గతంలో ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మాలంటే భయపడే పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వమే దగ్గరుండి ఆర్బీకేల ద్వారా ఎరువులు, విత్తనాల సరఫరా నిలిపివేసింది. రైతులు ప్రైవేట్ డీలర్ల దగ్గర ఎరువులు కొనాల్సి వస్తోంది. వాళ్లు కనీసం రూ.100 నుంచి రూ.400 అధిక ధరలకు బ్లాకులో అమ్ముతున్నారు. క్వాలిటీ కంట్రోల్ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించిన పరిస్థితి ఉంటే.. ఇవాళ నాణ్యమైనవేవీ అన్నదాతలకు అందని దుస్థితి నెలకొంది. ఇక పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ కాకుండా తాము ఇస్తామన్న రూ.20 వేలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం అన్నదాతలను దారుణంగా మోసం చేసింది.గొప్ప మార్పులతో రైతన్నకు అండగా..⇒ వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా కేంద్రం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకటించని పసుపు, మిర్చి, ఉల్లి, అరటి లాంటి పంటలకే కాదు.. మొత్తంగా 24 పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించి, రైతులకు ఎమ్మెస్పీ ధర రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుని కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలుకు రూ.65,258 కోట్లు ఖర్చు చేస్తే... ఇతర పంటల కొనుగోలు కోసం రూ.7,773 కోట్లు వెచ్చించి మన ప్రభుత్వం నాడు రైతులను ఆదుకుంది. ఇవాళ మిర్చి రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే చంద్రబాబు నిద్రపోతున్నాడు.⇒ మన ప్రభుత్వ హయాంలో సీఎం యాప్ అనే గొప్ప మార్పును తెచ్చి ఏపీలో ఏ ప్రాంతంలో ఏ పంట ధర ఎలా ఉందో యాప్ తో సమాచారం సేకరించాం. ఆర్బీకేల సిబ్బంది రైతులకు అందుతున్న ధరలపై ఎప్పటికప్పుడు యాప్లో అప్డేట్ చేసేలా చర్యలు తీసుకున్నాం. ఆ సమాచారం ఆధారంగా కనీస మద్దతు ధర రాని పక్షంలో వెంటనే చర్యలు తీసుకునేవాళ్లం. జేసీల ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖతో కలిసి అవసరమైతే ప్రభుత్వం తరఫున కొనుగోళ్లు చేసేవాళ్లం. కనీస మద్దతు ధరలు ఎంతో తెలియజేస్తూ ఆర్బీకేల్లో పెద్ద పెద్ద పోస్టర్లు ఏర్పాటు చేశాం. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించడానికి 14400, 1907 టోల్ఫ్రీ నంబర్లు కూడా అందుబాటులోకి తెచ్చాం. ఇప్పుడు ఈ వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారు.⇒ ఇప్పుడు మిర్చికి సోకిన మాదిరిగా పంటలకు వ్యాధులు వస్తే మన హయాంలో ఆర్బీకేల సిబ్బంది, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు వెంటనే విషయాన్ని ప్రభుత్వానికి చేరవేసి తగిన చర్యలు చేపట్టేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆర్బీకేల ద్వారా రైతులకు తగిన శిక్షణ అందేది. రైతులకు మెరుగైన అవగాహన కలిగించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్, పొలంబడి లాంటి కార్యక్రమాలు నిర్వహించాం.⇒ రైతులకు అందించే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతపై మన హయాంలో ఎప్పటికప్పుడు పరీక్షలు జరిగేవి. ప్రభుత్వం నెలకొల్పిన 147 ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్ల్లో పరీక్షలు జరిగేవి. ఇప్పుడు ఆ ల్యాబ్లను గాలికొదిలేశారు. ప్రైవేట్కు అప్పగిస్తున్నారు.⇒ మన ప్రభుత్వంలో మార్కెట్లో క్రమం తప్పకుండా అధికారులు తనిఖీలు చేసేవారు. కలెక్టర్లు, ఎస్పీలు ఈ తనిఖీల మీద, తీసుకుంటున్న చర్యల మీద క్రమం తప్పకుండా రిపోర్టులు ఇస్తూ గట్టి పర్యవేక్షణ చేసేవారు. దీనివల్ల నకిలీలకు అడ్డుకట్ట పడేది. ఎక్కడైనా తప్పు జరిగితే సంబంధిత వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకునేవాళ్లం. ⇒ మనం అధికారంలో ఉన్నప్పుడు మిరప రైతులకు ఎప్పుడూ లేని విధంగా చాలా గొప్పగా పంటల బీమా అందించాం. 2019–20లో రూ.90.24 కోట్లు.. 2020–21లో రూ.36.02 కోట్లు... 2021–22లో రూ.439.79 కోట్లు చొప్పున రైతులకు అందించాం. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మన ప్రభుత్వంలో రైతులపై ఒక్కపైసా భారం పడకుండా ఉచిత పంటల బీమాను అమలు చేసి 54.55 లక్షల మందికి రూ.7,802 కోట్లు పంట నష్ట పరిహారం కింద చెల్లించాం. ఇప్పుడు ఉచిత పంటల బీమాను పూర్తిగా రద్దు చేసి రైతులపై భారాన్ని మోపారు. -
కార్యకర్తలకు అన్నలా ఉంటా..: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త తరపున చంద్రబాబుకు చెబుతున్నా... మళ్లీ వచ్చేది జగన్ 2.0 పాలన. అన్యాయాలు చేసే వారెవరినీ వదిలిపెట్టేది లేదు. తప్పు చేసిన వారిని చట్టం ముుందు నిలబెడతాం. కార్యకర్తలకు అన్నలా ఉంటా..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) భరోసానిచ్చారు. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశం సందర్భంగా ఆయన ఏమన్నారంటే..ప్రజలకు తోడుగా.. కార్యకర్తలకు అండగాజగన్ 1.0 పాలనలో అధికారంలోకి వచ్చిన 9 నెలలు కాకమునుపే ఎప్పుడూ చూడని విధంగా కోవిడ్ పరిస్థితుల మధ్యే కాలం గడిపాం. తర్వాత రెండున్నర సంవత్సరాలు కోవిడ్ మధ్యే ఉన్నాం. ఆ టైంలో ప్రజలకు ఎలా తోడుగా ఉండాలనే తపనతో అడుగులు వేశాం. అందుకే కార్యకర్తలకు చేయదగినంత చేయలేకపోయాం. ఈసారి జగన్ 2.0లో ప్రజలకు తోడుగా ఉంటూ.. కార్యకర్తలకు అండగా, వారి ఇంటికి అన్నలా ఉంటా. మార్చి నాటికి స్థానిక సంస్థలకు నాలుగేళ్ల పదవీ కాలం ముగియబోతుంది. తమ వాళ్లను పదవుల్లో కూర్చోబెట్టడానికి ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ప్రయత్నిస్తారు. మన వాళ్లను భయపెట్టడానికి, లొంగదీసుకోవడానికి, ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ ఉన్నా మనం ధైర్యంగా ఉండాలి. ఎల్లకాలం ఇలా ఉండదు. చీకటి తర్వాత వెలుతురు రాక మానదు. రానున్న మూడు సంవత్సరాలు మన క్యారెక్టర్ను కాపాడుకుందాం. మన విలువలు కాపాడుకుందాం. ఆ తర్వాత రాబోయే మన ప్రభుత్వంలో అందరికీ దగ్గరుండి మేలు చేస్తాం.ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ..ఈ ప్రభుత్వంలో ఏ మాదిరిగా పాలన చేస్తున్నారో చూస్తున్నాం. మొన్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. టీడీపీకి ఏమాత్రం సంఖ్యాబలం లేకపోయినా దాడులు చేసి భయపెట్టారు, ప్రలోభపెట్టారు. అన్యాయాలు చేసి గెలిచామంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు. తిరుపతి కార్పొరేషన్లో 49 స్థానాలుంటే వైఎస్సార్సీపీ 48 గెలిచింది. టీడీపీ ఒకే ఒక్కటి గెలిచింది. ఒక్కటే గెలిచిన చోట డిప్యూటీ మేయర్ వాళ్ల మనిషి అని గొప్పగా చెప్పుకుంటున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్సును పోలీసుల ద్వారా వాళ్లే అడ్డుకుంటారు. వాళ్లే పోలీసుల ఆధ్వర్యంలో కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తారు. మళ్లీ ఎన్నికల్లో మావాడు గెలిచాడని నిస్సిగ్గుగా చెప్పుకుంటారు. ఇక ఏలూరు కార్పొరేషన్లో 50 డివిజన్లు ఉంటే అందులో 47 వైఎస్సార్సీపీకి రాగా టీడీపీకి వచ్చింది కేవలం 3 మాత్రమే. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉంటే 54 వైఎస్సార్సీపీవే. ఇక హిందూపురం మున్సిపాల్టీలో 38 డివిజన్లు ఉంటే వైఎస్సార్సీపీకి 29 వచ్చాయి. టీడీపీకి 6 మాత్రమే వస్తే చంద్రబాబు బావమరిది బాలకృష్ణ అక్కడ తమకు పీఠం దక్కిందని అదో ఘనకార్యంలా చెప్పుకుంటున్నారు. పాలకొండలో 20 స్థానాలకు 17 వైఎస్సార్సీపీవే. టీడీపీకి మూడు మాత్రమే ఉన్నాయి. అక్కడ వైఎస్సార్సీపీ వాళ్లను లాక్కోలేక ఎన్నిక వాయిదా వేశారు. తునిలో టీడీపీకి ఒక్కరూ లేరు. అక్కడ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికలు వాయిదా అంటారు. పిడుగురాళ్ల మున్సిపాల్టీలో 33కు 33 వైఎస్సార్సీపీవే. దీంతో అక్కడ కూడా ఎన్నికలు వాయిదా అన్నారు. నూజివీడులో 32 ఉంటే 25 వైఎస్సార్సీపీ, ఏడు టీడీపీవి. నందిగామ మున్సిపాల్టీలో కూడా వైఎస్సార్సీపీదే మెజార్టీ. చివరికి గుంటూరులో కూడా 57లో 46 స్థానాలు వైఎస్సార్సీపీవే. అవిశ్వాసం పెట్టి మేయర్ను దించేస్తామని చెబుతున్నారు. ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది? మన ప్రభుత్వం ఏర్పడిన మూడు సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ప్రజలు ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైఎస్సార్సీపీకి పట్టం కట్టారు. ఆ రోజు తాడిపత్రి, దర్శి రెండు మున్సిపాల్టీలే పోయాయి. తాడిపత్రిలో 20 స్థానాలు వాళ్లకు... 18 స్థానాలు మనకు వచ్చాయి. ఆ రోజు నేను గట్టిగా తుమ్మి ఉంటే ఆ రెండూ కూడా వాళ్లకు వచ్చి ఉండేవి కావు. ప్రజాస్వామం గెలవాలి... ఈరోజు టీడీపీ చేస్తున్నదేమిటి? ఇదా ప్రజాస్వామ్యం? అని అందరూ ఆలోచన చేయాలి. ఇలాంటి రాజ్యం పోవాలి. ప్రజాస్వామ్యం నిలవాలి. విలువలు, వ్యక్తిత్వంతో కూడిన రాజకీయాలు అవసరం. కార్యకర్తలు ఫలానా వాడు మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకుని తిరగాలి. ప్రజలు గొప్పగా చెప్పుకునేలా నాయకత్వం ఉండాలి. ఇదే వైఎస్సార్సీపీ సిద్ధాంతం.స్కాములు మినహా పాలన ఏది?స్కాములు మినహా ఈ ప్రభుత్వంలో ఏమీ జరగడం లేదు. ముఖ్యమంత్రిగా పాలన సాగించేటప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త ఫలానా వ్యక్తి మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకుని చెప్పుకునేలా ఉండాలని అనుకుంటారు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే... చంద్రబాబు, కూటమి నేతలు అధికారంలో ఉంటూ దోచుకోవడం, దోచుకున్నది పంచుకుని తినడం మాత్రమే జరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం స్కామ్, ఇసుక స్కామ్. ఓ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్నా, ఫ్యాక్టరీ నడపాలన్నా ఎమ్మెల్యేకు ఇంత ఇవ్వాలి.. ఆయన చంద్రబాబుకి ఇంత ఇవ్వాలి! ప్రతి నియోజకర్గంలోనూ యథేచ్ఛగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తారేమోనని చిన్న పిల్లలని కూడా చూడకుండా 111 సెక్షన్ కేసులు పెడుతున్నారు. తమ తప్పులను సోషల్ మీడియాలో ప్రశ్నించి పోస్టింగులు పెట్టేవారిపై టెర్రరిస్టుల మాదిరిగా వ్యవస్థీకృత నేర చట్టాల కింద కేసులు బనాయించి జైల్లో పెడుతున్నారు. వివిధ స్టేషన్లు, జిల్లాల చుట్టూ తిప్పుతున్నారు. కానీ చంద్రబాబు మర్చిపోతున్న విషయం ఏమిటంటే... ఇలాంటి అన్యాయాలు చేస్తే ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం. -
చంద్రబాబు చీటర్ కాదా?: వైఎస్ జగన్
ఇవాళ ఈ ప్రభుత్వ హయాంలో ఒకవైపు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయి. ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్లిపోయింది. ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపు విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్.. ఇలా అన్ని వ్యవస్ధలూ తిరోగమనంలో కనిపిస్తున్నాయి. కేవలం.. ముఖ్యమంత్రి మారాడు..! వైఎస్సార్సీపీ పక్కకు వెళ్లి టీడీపీ వచ్చింది..! అంతే తేడా...! ఈ ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ తిరోగమనంలోకి పోయింది. వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన ప్రతి పథకాన్ని రద్దు చేశారు. చంద్రబాబు అమలు చేస్తామన్న ప్రతి పథకం మోసం.. అబద్ధం! కేవలం 9 నెలల కాలంలోనే కనిపిస్తున్న మోసాలివి.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘ఎన్నికల ప్రచారంలో.. ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని చంద్రబాబు చెప్పారు. మరి ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ, ప్రతి వ్యక్తీ ఎందుకు బటన్ నొక్కలేదని చంద్రబాబును అడుగుతున్నారు. చంద్రబాబు ఇప్పుడు బటన్ ఎలా నొక్కాలో తన చెవిలో చెప్పమంటున్నారు. మొహమాటం లేకుండా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. మరి ఈ వ్యక్తి చీటర్ కాదా?.. ప్రజలను మోసం చేసిన వ్యక్తిపై 420 కేసు పెట్టకూడదా..?’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ‘మీరూ, మేమూ.. మనందరం కలిసికట్టుగా నిలబడి ఈ అరాచక ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే పరిస్థితిలోకి తీసుకెళదాం..’ అని పార్టీ నేతలకు, శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మేయర్, ఇతర స్థానిక సంస్థల ప్రజా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు.. నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే..సమావేశానికి హాజరైన ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు చరిత్రను మార్చిన జగన్ 1.0 పాలన..2019–2024 మధ్య జగన్ 1.0 ప్రభుత్వం నడిచింది. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, చరిత్రను మార్చిన పాలన వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది. మన ప్రభుత్వం రాకమునుపు మేనిఫెస్టో అంటే.. చక్కటి అబద్ధాలను రంగు రంగుల కాగితాల్లో ముద్రించి ఎన్నికల్లో పంచడం..! ఎన్నికలు అయినపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం..! అలాంటి పరిస్థితుల నుంచి పాలనలో తులసి మొక్కలా వ్యవస్థను మార్చిన పాలన కేవలం వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా మేనిఫెస్టోను కేవలం రెండు పేజీలకు కుదించి.. అది మాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిదని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వ కార్యాలయం, సీఎంవో, ప్రతి మంత్రి కార్యాలయంలో, ప్రతి కలెక్టర్ కార్యాలయంలోనూ కనిపించేలా ఏర్పాటు చేశాం.బడ్జెట్తోపాటే సంక్షేమ క్యాలెండర్..సంక్షేమ క్యాలండర్ను కూడా బడ్జెట్తోపాటు ప్రవేశపెట్టి ఏ నెలలో ఏ పథకం అమలవుతుందో చెప్పి.. అలా చెప్పిన తేదీకి బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన చరిత్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలో మన పార్టీ హయాంలోనే జరిగింది. అంతగా వ్యవస్థలో మార్పులు చేశాం. గతంలో ప్రభుత్వ సొమ్ము రూపాయి ఇస్తే... 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతుందన్న నానుడిని మార్చి.. లంచాలు, వివక్ష లేకుండా ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు బటన్ నొక్కి ప్రజలకు ఇచ్చింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఒకవైపు కోవిడ్ ఉన్నా.. రాష్ట్రం అతలాకుతలం అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నా.. ఆదాయాలు తగ్గినా.. అనుకోని ఖర్చులు పెరిగినా ఏ రోజూ సాకులు వెతకలేదు. ప్రజలకు చెప్పిన ప్రతి మాటను నెరవేర్చాం. హామీల అమలుతో పాటు అభివృద్ధి..ఒకవైపు చెప్పిన ప్రతి మాటనూ నెరవేర్చి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ మరోవైపు రాష్ట్రంలో కనీవినీ ఎరుగని అభివృద్ధి కూడా చేశాం. ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయి. నాడు – నేడు అనే ఉజ్వల కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల్లో మొదలైంది. ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రభుత్వ స్కూళ్ల ప్రయాణం మొదలైంది. మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణ క్లాసులు మొదలయ్యాయి. మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఆరో తరగతి నుంచి డిజిటల్ బోధన అందించాం. ఎనిమిదో తరగతికి వచ్చేసరికి పిల్లలకు ట్యాబులు అందచేశాం. ఇవన్నీ రావడంతో ప్రైవేట్ స్కూళ్లు.. ప్రభుత్వ బడులతో పోటీ పడాల్సి వచ్చింది. ఒకవైపు తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి ఇస్తూ.. మరోవైపు ఆ పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా చదువుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం.వైద్యంలోనూ ఊహకందని మార్పులు..తొలిసారిగా గ్రామాల్లో విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లు అందుబాటులోకి తెచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత లేకుండా చేశాం. దేశం మొత్తంమీద గవర్నమెంటు ఆసుపత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61 శాతం ఉంటే ఏపీలో మాత్రం స్పెషలిస్టు డాక్టర్ల కొరత కేవలం 4 శాతం మాత్రమే నమోదైంది. జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రులను నాడు నేడు ద్వారా బలోపేతం చేశాం. డబ్ల్యూహెచ్వో, జీఎంపీ ప్రమాణాలు గల ఔషధాలను మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులోకి తెచ్చాం. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఏకంగా 17 మెడికల్ కాలేజీలను మన హయాంలోనే కట్టడం ప్రారంభించాం. పేదవాడికి ఉచితంగా వైద్యం అందిస్తూ ప్రొసీజర్లను వెయ్యి నుంచి ఏకంగా 3,300 వరకు తీసుకెళ్లడంతోపాటు రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించాం.రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ముఖ్యం..గతంలో మనకు 50 శాతం ఓటు షేర్ వచ్చింది. ఈ ఎన్నికల్లో మన ఓటు షేర్ 40 శాతం ఉంది. 10 శాతం ఓట్లు తగ్గాయి. కారణం.. మీ జగన్ ఆ రోజు వారిలా అబద్ధాలు చెప్పలేకపోవడమే. కానీ అధికారానికి దూరమైనా మీ జగన్ లీడర్ అంటే ఇలా ఉండాలని మీ గుండెల్లో ముద్ర వేయగలిగాడు. మీ జగన్ మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాడు. 2019–24 మధ్య మన పాలనను ప్రజలు చూశారు. ఇవాళ చంద్రబాబు పాలన కూడా ప్రజలు చూస్తున్నారు. మనం ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కినా అబద్ధాలు చెప్పలేక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. మరి ఇన్ని మోసాలు చేసిన, ఇన్ని అబద్ధాలు చెప్పిన వ్యక్తి పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి. ఇచ్చిన మాటను గాలికొదిలేసిన ఈ పార్టీలు, ప్రభుత్వం ప్రజల ఓటుతో బంగాళాఖాతంలోకో ఇంకా అథఃపాతాళానికో పోతారు. ఎన్నికల తర్వాత కూడా వైఎస్సార్సీపీ కార్యకర్త సగర్వంగా ప్రతి ఇంటికి వెళ్లగలుగుతాడు. చెప్పిన ప్రతి మాటా నెరవేర్చిన ప్రభుత్వం మాది అని గర్వంగా చెప్పగలుగుతారు. కానీ ఈ రోజు టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఏ ఒక్కరూ, ఏ ఇంటికీ వెళ్లే పరిస్థితి లేదు. వాళ్లు ఏ ఇంటికి వెళ్లినా... చిన్నపిల్లలు తల్లికి వందనం కింద ఇవ్వాల్సిన నా రూ.15 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఆ పిల్లల తల్లులు ఆడబిడ్డ నిధి కింద తమకు ఇవ్వాల్సిన రూ.18 వేలు ఏమయ్యాయని నిలదీస్తారు. ఆ అమ్మల అత్తలు, అమ్మలు మాకు 50 ఏళ్ల వచ్చాయి.. మరి మా రూ.48 వేలు పెన్షన్ డబ్బులు ఎక్కడని ప్రశ్నిస్తారు. ఆ ఇంట్లో రైతులు అన్నదాతా సుఖీభవ కింద తమకు ఇవ్వాల్సిన రూ.20 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువకుడు నిరుద్యోగ భృతి కింద ఇవ్వాల్సిన నా రూ.36 వేలు ఏమయ్యాయని ప్రశ్నిస్తాడు.రైతును చేయి పట్టుకుని నడిపిస్తూ ఆర్బీకేలు..గ్రామాల్లో ఆర్బీకేల వ్యవస్థను ఏర్పాటు చేసి ఊరు దాటాల్సిన అవసరం లేకుండా రైతన్నలకు తోడుగా నిలిచాం. అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ను అసిస్టెంట్గా నియమించి రైతులను చేయి పట్టుకుని నడిపించేలా చర్యలు తీసుకున్నాం. తొలిసారిగా ఇ–క్రాప్ ద్వారా ప్రతి రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశాడో నమోదు చేశాం. రైతులందరికీ ఉచిత పంటల బీమా, గిట్టుబాటు ధర దక్కేలా ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయడంతోపాటు దళారీ వ్యవస్థను తొలగించాం. ఇవన్నీ వైఎస్సార్ సీపీ హయాంలోనే జరిగాయి. అంతేకాకుండా ప్రతి గ్రామంలోనూ సచివాలయాన్ని ఏర్పాటు చేశాం. అదే సచివాలయంలో మన ఊరి పిల్లలే సేవలందిస్తూ కనిపిస్తారు. ప్రతి 60–70 ఇళ్లకు ఒక వలంటీర్ ఇంటికే వచ్చి పారదర్శకంగా సేవలు అందించారు.బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు గ్రామాల్లో ఇళ్లకు వెళ్లినప్పుడు తాము సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఇవ్వలేకపోతే కాలర్ పట్టుకోమని చెప్పారు. బాండ్లు కూడా రాసిచ్చారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ అని రాసిచ్చారు. ఇవాళ బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ అని రుజువు అయింది. ఇప్పుడు ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టారు. త్వరలోనే కాలర్ పట్టుకుని నిలదీసే రోజులు కూడా రానున్నాయి. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం విఫలమైంది. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మంటలపై విచారణ
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసం వద్ద రోడ్డు వెంబడి ఏర్పడిన మంటలపై తాడేపల్లి పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం విచారణ చేపట్టారు. దీన్లోభాగంగా గుంటూరు జిల్లా లా అండ్ ఆర్డర్ ఎస్పీ రవికుమార్, మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి సీఐ కళ్యాణ్రాజు పర్యవేక్షణలో గుంటూరు జిల్లా ఎఫ్ఎస్ఎల్ బృందం, ఫోరెన్సిక్ బృందాలు మంటలు ఏర్పడిన ప్రాంతం వద్ద ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. తాడేపల్లి సీఐ కళ్యాణ్రాజు, ఎస్ఐలు ఖాజావలి, జె. శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద, చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కాగా, వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద పార్కులో మంటలు చెలరేగడం వెనుక కుట్ర ఉందనే అనుమానం కలుగుతోందని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని తాడేపల్లి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసినట్టు వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అంకంరెడ్డి నాగనారాయణమూర్తి చెప్పారు. తరచూ టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా గొడవ చేస్తున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతకు భంగం కలిగేలా నిత్యం ఏదో ఒక ఘటన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. -
స్కామ్ల కోసం సంపద సేల్.. ఆర్థిక విధ్వంసకారుడు చంద్రబాబే
చరిత్రలో నిలబడిపోవాలన్న తపన ఉంది కాబట్టి, ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలన్న ఆరాటం ఉంది కాబట్టి రూ.2.73 లక్షల కోట్లు బటన్ నొక్కి డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం. లంచం లేని పాలన ఎక్కడైనా జరిగిందంటే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అని గర్వంగా చెప్పగలుగుతున్నా. దేశ చరిత్రలో ఇదో రికార్డు. కమీషన్లు రావు కాబట్టి చంద్రబాబు బటన్ నొక్కడం లేదు.– వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్సాక్షి, అమరావతి: నవరత్నాలతో ప్రజలకు మేలు చేయడంతోపాటు ఆర్ధిక క్రమశిక్షణతో తమ ప్రభుత్వం పాలన సాగిస్తే.. తొమ్మిది నెలల్లోనే కూటమి సర్కారు ఆర్ధిక విధ్వంసం, స్కామ్ల కోసం సంపదను తెగనమ్ముతోందని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS JaganMohanReddy) విరుచుకుపడ్డారు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే తన ఆస్తులు, తమ వారి ఆస్తులు పెంచుకుని జేబులు నింపుకోవటమేనని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో జరగని స్కామ్ అంటూ లేదని దుయ్యబట్టారు. తొమ్మిది నెలల పాలనలో రూ.1.45 లక్షల కోట్ల అప్పులతో ఆల్టైమ్ రికార్డు సృష్టించిన చంద్రబాబు ఆర్థిక విధ్వంసకారుడా? లేక కోవిడ్లోనూ వృద్ధి రేటులో దేశంతో పోటీ పడి ఉత్తమ పని తీరు, మెరుగైన వృద్ధి రేటు, తలసరి ఆదాయంలో పెరుగుదల, సామాజిక సేవలపై వ్యయం, మూలధన వ్యయంలో పెరుగుదల నమోదు చేసిన తాము విధ్వంసం సృష్టించినట్లా? అని ప్రశ్నించారు. పారదర్శకంగా ఇసుక విక్రయాల ద్వారా ఖజానాకు ఏటా రూ.750 కోట్ల ఆదాయం సమకూర్చిన తమ ప్రభుత్వం సంపద సృష్టించినట్లా? లేక ఇసుక నుంచి మద్యం దాకా పచ్చముఠాల దోపిడీకి పచ్చజెండా ఊపిన టీడీపీ సర్కారు సంపద సృష్టించినట్లా? అని నిలదీశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టిన తాము సంపద సృష్టించినట్లా? లేక వాటికి అడ్డుపడి ప్రైవేట్కు అప్పగించి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమైన చంద్రబాబు సంపద సృష్టికర్తా? అని ప్రశ్నించారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని తొలగించి జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండర్లతో పారదర్శక విధానాన్ని ప్రవేశపెట్టిన తాము ఆర్థిక విధ్వంసకారులమా? తిరిగి మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతూ కమీషన్లు వసూలు చేసుకుంటున్న చంద్రబాబు ఆర్ధిక విధ్వంసకారుడా? అని ప్రశ్నించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. గత తొమ్మిది నెలలుగా టీడీపీ కూటమి సర్కారు అరాచకాలు, హామీల ఎగవేత, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై దుష్ఫ్రచారాలను కాగ్, కేంద్ర ఆర్ధిక సంఘం, కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ నివేదికల ఆధారంగా ఎండగట్టి కడిగి పారేశారు.అప్పుల్లో ఆల్టైమ్ రికార్డు⇒ తొమ్మిది నెలల పాలనలో అప్పుల విషయంలో మాత్రం చంద్రబాబు రికార్డులు బద్ధలు కొట్టారు. బహుశ ఏ ప్రభుత్వ హయాంలోనూ ఈ స్థాయిలో అప్పులు చేసిన దాఖలాలు లేవు. ఎఫ్ఆర్బీఎం పరిధిలో బడ్జెట్ అప్పులే ఏకంగా రూ.80,827 కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు, తెచ్చే అప్పులు కలిపి మరో రూ.52 వేల కోట్లు ఉంటాయి. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ నుంచి రూ.5వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, సీఆర్డీఏ ద్వారా చేయాలని నిర్ణయించిన అప్పులు మరో రూ.21 వేల కోట్లు ఉంటాయి. మార్క్ఫెడ్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ద్వారా మరో రూ.8 వేల కోట్లు, ఏపీఎండీసీ ద్వారా తేనున్న అప్పులు మరో రూ.5 వేల కోట్లు..! తీసుకొచ్చిన అప్పులు, తేనున్న అప్పులు కలిపితే రూ.1.45 లక్షల కోట్ల పైమాటే. ఇదొక రికార్డు. దీన్ని ఎవరూ బద్ధలు కొట్టలేరు.⇒ ఈ మధ్య నీతి ఆయోగ్ పేరుతో చంద్రబాబు ఆడిన కొత్త డ్రామాలు మీరు చూసే ఉంటారు. ఏదైనా పోల్చినప్పుడు తన ఐదేళ్ల పాలనను, మన ఐదేళ్ల పాలనతో పోల్చి వాస్తవాలివీ అని చెప్పేలా ఉండాలి. కానీ ఈ పెద్ద మనిషి ఏం చేశాడంటే.. తన పాలనలో బెస్ట్ ఇయర్ (2018–19)లో వచ్చిన ఫలితాలను మన హయాంలో వరస్ట్ ఇయర్ (2022–23)తో కంపేర్ చేస్తూ రాష్ట్రం చాలా అన్యాయమైన పరిస్థితుల్లో ఉన్నట్టు చూపించారు. చంద్రబాబు ఐదేళ్ల డేటా.. మన హయాంలో ఐదేళ్ల డేటాను పరిశీలించి ఎవరు ఆర్ధిక విధ్వంసం చేశారో మీరే చూడండి. మా హయాంలో రెండున్నరేళ్లు కోవిడ్ ఉందన్న విషయాన్ని మర్చిపోకండి. కానీ చంద్రబాబు హయాంలో ఎలాంటి కోవిడ్లు లేవు.. మహమ్మారులూ లేవు. ⇒ ఏపీ ఎవరి హయాంలో వేగంగా అడుగులు వేసిందో చెప్పేందుకు జీడీపీ (దేశీయ స్థూల ఉత్పత్తి)లో రాష్ట్ర వాటా ఎంత అన్నది కూడా ప్రామాణికం. దేశ జీడీపీలో రాష్ట్ర వాటా చంద్రబాబు హయాంలో 2014–19లో కేవలం 4.47 శాతం కాగా వైఎస్సార్సీపీ హయాంలో 2019–24లో ఆ వాటా 4.80 శాతానికి పెరిగింది. ఎవరి హయాంలో రాష్ట్రం విధ్వంసమైంది? ఎవరి హయాంలో వృద్ధి పరుగులు తీసింది? అనేది చెప్పేందుకు ఇదొక నిదర్శనం. ⇒ కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ ఇచ్చిన నివేదికతో మరో ఆధారాన్ని చూపిస్తా. చంద్రబాబు దిగిపోయే నాటికి 2018–19లో తలసరి ఆదాయంలో మన రాష్ట్రం దేశంలో 18వ స్థానంలో ఉంది. అదే వైఎస్సార్సీపీ హయాంలో తలసరి ఆదాయంలో మన రాష్ట్రం 2022–23లో 15వ స్థానానికి ఎగబాకింది. మరి ఎవరి హయాంలో ఆరి్ధక విధ్వంసం జరిగింది? ఎవరి హయాంలో ప్రజలు బాగుపడ్డారో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ⇒ వృద్ధి రేటులో మా ప్రభుత్వ హయాంలో 2019–24లో దేశంతో పోటీ పడ్డాం. ప్రతి రంగంలో దేశం కంటే రాష్ట్రం ఉత్తమ ఫలితాలు సాధించింది. దేశ జీడీపీ 2019–24లో 9.34 శాతం కాగా రాష్ట్రం ఏకంగా 10.23 శాతంతో మెరుగైన పనితీరు కనబరిచింది. ⇒ పారిశ్రామిక రంగం జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్) ర్యాంకింగ్ పరిశీలిస్తే చంద్రబాబు దిగిపోయేనాటికి మన రాష్ట్రం 11 స్థానంలో ఉంటే.. 2023–24లో మా ప్రభుత్వం వైదొలిగే నాటికి 9 స్థానానికి ఎగబాకాం. రెండున్నరేళ్లు కోవిడ్ ఉన్నా సరే.. మంచి పనితీరు కనబరిచాం. మరి ఎవరిది ఆర్థిక విధ్వంసం? టీడీపీ హయాంలో 2014–19 మధ్య ఆస్తుల కల్పనలో భాగంగా సగటు మూలధన వ్యయం రూ.13,860 కోట్లు ఖర్చు చేస్తే.. మా హయాంలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ మూలధన వ్యయం కింద రూ.15,632 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు చెప్పండి. ఎవరి హయాంలో ఆర్ధిక విధ్వంసం జరిగింది? ఇక చంద్రబాబు సామాజిక సేవల కింద ఒకే ఒక్క సంవత్సరాన్ని చూపించారు. 2018–19లో సోషల్ సర్వీస్ కింద ఆయన రూ.2,866.11 కోట్లు ఖర్చు చేస్తే.. 2022–23లో రూ.447.78 కోట్లు మాత్రమే వ్యయం చేశారని చెప్పుకొచ్చారు. కానీ 2014–19 మధ్య ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం రూ.2,437 కోట్లు ఖర్చు చేస్తే.. వైఎస్సార్సీపీ హయాంలో దానికి రెట్టింపు.. రూ.5,224 కోట్లు వ్యయం చేశాం. ఇవన్నీ మూలధన వ్యయంలో సోషల్ సర్వీస్ కింద ఖర్చులపై కాగ్ నివేదిక తేల్చిన లెక్కలు. ఒక్క ఏడాదిని మాత్రమే తీసుకుని పోల్చుకోవడం చంద్రబాబు మనస్థత్వానికి, వక్రీకరణలకు అద్దం పడుతోంది. ఏ రకంగా చూసుకున్నా సరే.. మా హయాంలో రాష్ట్రం అన్ని రకాలుగా ముందడుగు వేసింది.ఆర్ధిక అరాచకం..⇒ 2014–19లో టీడీపీ హయాంలో రాష్ట్రం కట్టాల్సిన వడ్డీల వృద్ధి రేటు 15.43 శాతం ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వ జీఎస్డీపీ పెరుగుదల 13.46 శాతం. అంటే చంద్రబాబు చెప్పిన సిద్ధాంతం ప్రకారమే డెట్ సస్టెయినబులిటీ ఎక్కువగా ఉంది. ⇒ 2019–24లో దేశం పరిస్థితిని గమనిస్తే వడ్డీలకు సంబంధించి వృద్ధిరేటు సీఏజీఆర్ 12.80 శాతమైతే.. జీడీపీలో సీఏజీఆర్ 9.34 శాతం ఉంది. దేశం జీరో డెట్ సస్టయినబులిటికీ వెళ్లిపోయింది. రాష్ట్రంలో వడ్డీల వృద్ధి రేటు చంద్రబాబు హయాంలో 15.43 శాతం ఉంటే దాన్ని 13.92 శాతానికి తగ్గించగలిగాం. కానీ ఆ విషయాన్ని మాత్రం చెప్పడు. ఇక జీడీపీ వృద్ధి రేటు 9.34 శాతం ఉంటే మా హయాంలో మన రాష్ట్రం దేశం కంటే మెరుగ్గా 10.23 శాతం గ్రోత్ నమోదు చేసింది. అక్కడ కూడా మనం ప్లస్లోనే ఉన్నాం. ఇవన్నీ దాచిపెట్టి వడ్డీల పెరుగుదల రేటు 13.92 శాతం.. ఏపీ జీఎస్డీపీ 10.23 శాతం అని చెబుతూ రాష్ట్రం విధ్వంసమైందని చంద్రబాబు చెప్పడం ధర్మమేనా? మొత్తం పిక్చర్ గమనిస్తే చంద్రబాబు హయాంలో రాష్ట్రం ఏ స్థాయిలో విధ్వంసమైందన్నది స్పష్టంగా తెలుస్తోంది. జగన్ హయాంలో రాష్ట్రాన్ని చేయిపట్టుకొని నడిపించే కార్యక్రమం జరిగినట్లు విస్పష్టంగా కనిపిస్తోంది. ⇒ ఇక ఎవరి హయాంలో అప్పులు ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనిస్తే.. రాష్ట్రం అప్పులు రూ.14 లక్షల కోట్లు అని చంద్రబాబు ఊదరగొట్టారు. రాష్ట్రం శ్రీలంకలా అయిపోతోందని బండలు వేశాడు. ఇప్పుడు గవర్నర్ ప్రసంగానికి వచ్చేసరికి రాష్ట్రం అప్పులు రూ.10 లక్షలు కోట్లు అని చెప్పారు. శ్వేత పత్రాలు విడుదల చేసే సమయంలో రూ.12.93 లక్షల కోట్లన్నారు. బడ్జెట్ ప్రవేశపెడితే అప్పులు చెప్పాల్సి వస్తుందని వాయిదా వేస్తూ వచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో నవంబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్రం అప్పులు రూ.6,46,531 కోట్లు మాత్రమే అని తనంతట తానే ఒప్పుకోక తప్పలేదు. ఇంత దారుణమైన మనిషి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు. ఈ పెద్దమనిషి చంద్రబాబు ఇలాంటి మోసాలు చేస్తా ఉంటారు. వీటిని ప్రజలు గమనించాలి. ⇒ ఎఫ్ఆర్బీఎం పరిమితులకు లోబడి రాష్ట్ర జీఎస్డీపీలో 3 నుంచి 3.5 శాతం అప్పులు చేయవచ్చని కేంద్రం నిర్దేశిస్తోంది. ఆ ప్రకారమే ఎవరైనా తీసుకోగలుగుతారు. అంతకంటే ఎక్కువ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. చంద్రబాబు పాలనలో 2014–19లో ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటి రూ.31,082 కోట్లు అదనంగా అప్పులు చేశారు. ఆయన తీసుకున్న అదనపు అప్పులతో రూ.17 వేల కోట్లు మా ప్రభుత్వ హయాంలో కోత పెట్టారు. ⇒ చంద్రబాబు హయాంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం కూడా తగ్గింది. 2023–24లో జూన్–డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ.50,804 కోట్లు అయితే.. 2024 జూన్ నుంచి డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.50,544 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 10 శాతం ఆదాయం పెరగడం సాధారణం. అలాంటిది చంద్రబాబు హయాంలో 0.5 శాతం తగ్గింది. అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు చంద్రబాబు, వారి మనుషులు జేబుల్లోకి పోతున్నాయి!⇒ వృద్ధి రేటు తిరోగమనంలో (నెగిటివ్ గ్రోత్) ఉన్నప్పుడు జీఎస్డీపీలో పెరుగుదల ఉంటుందా? రెవెన్యూ గ్రోత్ తగ్గినప్పుడు జీఎస్డీపీ తగ్గాలి కదా! కానీ చంద్రబాబు తన హయాంలో 13 శాతం పెరిగినట్టు రిపోర్టు ఇచ్చారు. ఆయన ఏ స్థాయిలో అబద్ధాలాడుతున్నారో దీన్నిబట్టి తేటతెల్లమవుతోంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చంద్రబాబుకు కొత్తేమి కాదు.⇒ 2016లో చంద్రబాబు దావోస్ వెళ్లినప్పుడు ఏపీకి రక్షణ పరికరాల ప్లాంట్ వస్తుందన్నారు. 2017లో వెళ్లినప్పుడు విశాఖపటా్ననికి హైస్పీడ్ రైళ్ల కర్మాగారం, హైబ్రీడ్ క్లౌడ్ వస్తుందన్నారు. సౌదీ ఆరాంకో వచ్చేస్తుందన్నారు. 2018 పర్యటనలో రాష్ట్రానికి 150 సంస్థలు వచ్చేస్తున్నాయన్నారు. ఇంకా ఎయిర్ బస్, అలీబాబా ఏపీకి వస్తున్నాయన్నారు. 2019 జనవరిలో వెళ్లినప్పుడు ఏపీకి జెన్ ప్యాక్ వస్తుందని ప్రచారం చేసుకున్నారు(ఈనాడు కథనాల క్లిప్పింగ్లను ప్రదర్శించారు). ఇదంతా దొంగల ముఠా.. దోచుకో పంచుకో తినుకో విధానం. ఇలా బిల్డప్లు, అబద్ధాలు చెప్పడం.. మోసాలు చేయడం చంద్రబాబుకు కొత్త కాదు. ⇒ చంద్రబాబు దావోస్ వెళ్లినప్పుడు ఒక్క ఎంవోయూ కూడా చేసుకోలేకపోయారంటే ఇప్పుడు రాష్ట్రానికి ఉన్న పలుకుబడి.. చంద్రబాబు పట్ల పారిశ్రామికవేత్తల్లో ఎలాంటి అభిప్రాయం నెలకొందో చెప్పేందుకు నిదర్శనం. పెట్టుబడులు పెట్టేందుకు జిందాల్ లాంటి సంస్థ వస్తే ఎవరైనా రెడ్ కార్పెట్ పరిచి స్వాగతిస్తారు. కానీ చంద్రబాబు ఏం చేశారంటే.. వాళ్లపై కేసులు పెట్టి, వాళ్ల ప్రతిష్టను నాశనం చేసి భయపెట్టి వెళ్లగొట్టాడు. దీంతో అదే దావోస్లో వాళ్లు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నాడు. సంపద సృష్టించిందెవరు?⇒ రాష్ట్రం ఆదాయాలు పెరిగేలా వైఎస్సార్సీపీ హయాంలో నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపట్టాం. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు ప్రభుత్వ రంగంలో చేపట్టాం. రామాయపట్నం 75–80 శాతం పూర్తయింది. మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో 35–40 శాతం పనులు వేగంగా పూర్తయ్యాయి. 10 ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మా హయాంలో కొన్ని ప్రారంభోత్సవం కూడా చేశాం. వీటి ద్వారా కొన్ని లక్షల కోట్ల ప్రభుత్వ సంపద సృష్టించబడుతుంది. రాష్ట్రానికి సొంత రాబడి పెరగాలంటే ఇలాంటిæ ఆస్తులు ప్రభుత్వం చేతిలో ఉండాలి. ఇవన్నీ ఫైనాన్షియల్ టైఅప్ అయిన ప్రాజెక్టులు వీటి నిర్మాణానికి నిధుల కోసం వెతుక్కోవాల్సిన పని లేదు. డబ్బులొచ్చి మేరిటైం బోర్డు అకౌంట్లో ఉన్నాయి. డబ్బులు డ్రా చేస్తూ కంప్లీట్ చేస్తే చాలు. ఈపాటికే రామాయపట్నానికి ప్రారంభోత్సవం చేయవచ్చు. మిగిలినవి ఒకటి రెండేళ్లలో పూర్తి చేయొచ్చు. అలాంటిది వీటిని అడ్డం పెట్టుకొని స్కామ్లు చేస్తూ అమ్మకానికి పెట్టారు. ⇒ మా హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వీటిలో ఐదు కాలేజీలను మా హయాంలోనే ప్రారంభిస్తే ఈ విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన మరో 5 కొత్త కళాశాలలను అడ్డుకుని తమవారికి ప్రైవేట్కు విక్రయించేందుకు సిద్ధపడుతున్నారు. ⇒ వచ్చే ఐదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లు ఇస్తామని ఈ ఏడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ ఏడాది 10 వేల సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఇలాంటప్పుడు ఎవరైనా సాధ్యమైనన్ని సీట్లు తమ రాష్ట్రానికి రావాలని ఆరాటపడతారు. కానీ మన రాష్ట్రానికి ఇస్తామన్న మెడికల్ సీట్లను సైతం వద్దంటూ కేంద్రానికి లేఖ రాసిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక్క టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రమే. ఇలా స్కామ్ల కోసం ఉన్న ఆస్తులను అమ్ముతున్నారు. సంపద సృష్టి అంటే బాబు జేబు నింపుకోవడమా? చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే.. తన ఆస్తులు, తమ వారి ఆస్తులు పెంచుకోవడం! ఈ ప్రభుత్వ హయాంలో జరగని స్కామ్ అంటూ లేదు. గతంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది. ఈరోజు ఒక్క రూపాయి రావడం లేదు పైగా గతంలో కంటే రెట్టింపు ధర వసూలు చేస్తున్నారు. సంపద సృష్టి చంద్రబాబు జేబులోనే జరుగుతోంది! రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఆవిరవుతోంది. ⇒ ఇక లిక్కర్ స్కామ్.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులను ప్రైవేటు పరం చేసారు. ఇవే ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ను జైల్లో పెట్టారు. చంద్రబాబు తమ ప్రభుత్వంలో స్కామ్లు చేస్తూ అక్కడకు వెళ్లి అరవింద్ కేజ్రీవాల్ను తిట్టి వస్తాడు. మద్యం షాపులను ప్రైవేౖటుపరం చేసాడు. తనవారికి షాపులు ఇప్పించుకునేందుకు తమ ఎమ్మెల్యేలతో ఎలా కిడ్నాప్లు చేయించారో చూశాం. తన పార్టీకి సంబంధించిన వాళ్లు మాత్రమే టెండర్లలో పాల్గొనేలా చేశారు. లాటరీలో కూడా తమ వాళ్లకే షాపులు దక్కేలా చేసుకున్నారు. వేరే వాళ్లు పాల్గొనకుండా పోలీసులు సమక్షంలో చేసారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బెల్టుషాపులకు వేలం పాటలు నిర్వహించారు. ప్రతి గ్రామంలో రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు తమ కార్యకర్తలకు కట్టబెట్టారు. వీటిని పాడుకున్న వారికి పోలీసుల ద్వారా సహకారం అందిస్తున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నా పట్టించుకునే వారే లేరు. అదే ప్రభుత్వ రంగంలో షాపులుంటే ఆ ఆదాయం అంతా ప్రభుత్వానికి వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గుతుంటే చంద్రబాబు ఆదాయం మాత్రం పెరుగుతోంది. ⇒ ఇసుక, మద్యం, సిలికా, క్వార్జ్, ఫ్లైయాష్.. ప్రతిదీ మాఫియానే. అన్నీ పెదబాబు, చినబాబు ఆధ్వర్యంలో నడిపిస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్లు..! మండల, గ్రామ స్థాయిలో కూడా నడుపుతున్నారు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యేలకు అడిగినంత ముట్టజెప్పాల్సిందే! ఎమ్మెల్యేలు దండుకున్న సొమ్ములో పెదబాబు, చినబాబు, దత్తపుత్రుడికి వాటాలు పంపితే అంతా సాఫీగా జరుగుతుంది. ⇒ కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు 10 శాతం చెల్లించి 8 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారు. మేం పారదర్శకంగా అమలు చేసిన జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండర్ల విధానాన్ని రద్దు చేశారు. ఫలితంగా సంపద సృష్టి జరగక ప్రభుత్వ ఆదాయం ఆవిరైపోతోంది. తమ అక్రమాలను ఎవరైనా ప్రశ్నిస్తే రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ బెదిరిస్తున్నారు. నాడు నవరత్నాలు.. నేడు విధ్వంసాలు..⇒ పిల్లలను బడులకు పంపేలా తల్లులకు చేయూతనిస్తూ మేం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని నిలిపివేశారు. ఇది విధ్వంసం కాదా? ⇒ పాఠశాలల్లో నాడు–నేడు పనులను నిలిపివేశారు. ఇది విధ్వంసం కాదా? ⇒ ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీ, మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణను తొలగించి పిల్లలను ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలకు దూరం చేశారు. ఇది విధ్వంసం కాదా?⇒ ఎనిమిదో తరగతి పిల్లలకు ఏటా ట్యాబ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆపేశారు. ఇది విధ్వంసం కాదా? ⇒ సబ్జెక్ట్ టీచర్ విధానానికి గ్రహణం పట్టించారు. వసతి దీవెన పథకాన్ని రద్దు చేసి, విద్యా దీవెన పథకాన్ని అరకొరగా విదిలిస్తున్నారు. చదువులతో చెలగాటం ఆడుతున్నారు. ఇది విధ్వంసం కాదా? ⇒ పథకాలు ఇవ్వకపోగా ఉన్న పథకాలను ఎత్తేసి ప్రజల జీవితాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారు. ఇది విధ్వంసం కాదా?⇒ ఆరోగ్యశ్రీ ఊపిరి తీశారు. ఆరోగ్య ఆసరా ఊసే లేకుండా చేశారు. ఈ రోజు పేదలు అనారోగ్యం బారినపడితే అప్పులపాలు అయ్యే దుస్థితి కల్పించారు. ఇది విధ్వంసం కాదా? ⇒ రైతు భరోసాను నిలిపి వేయడం, ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయడం, ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేయడం విధ్వంసం కాదా? ⇒ అక్కచెల్లెమ్మలను చేయి పట్టి నడిపించే ఆసరా, సున్నా వడ్డీ, ఈబీసీ, కాపు నేస్తం లాంటి పథకాలన్నింటినీ రద్దు చేసి వారి జీవితాలను అగమ్యగోచరంగా మార్చారు. ఇది విధ్వంసం కాదా?⇒ నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, చేదోడు, తోడు లాంటి పథకాలను నిలిపివేసి పేదలకు తీరని ద్రోహం తలపెట్టారు. ఇది విధ్వంసం కాదా? ⇒ ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా.. ఉన్న వాటినే ఊడగొట్టారు. వలంటీర్లను రోడ్డుకు ఈడ్చారు. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేయడం విధ్వంసం కాదా? ⇒ రాష్ట్ర ఆదాయాన్ని పెంచకుండా సొంత జేబులో ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ఇసుక, మద్యం, క్వార్ట్జ్, సిలికా లాంటి వనరులను దోచేస్తున్నారు. ఇది విధ్వంసం కాదా? -
జగన్ 2.0: కార్యకర్తల కోసం.. ఎలా పని చేస్తానో చూపిస్తా
వరుసగా రెండేళ్లు కోవిడ్ కారణంగా అనుకోని ఖర్చులు పెరిగాయి. మరోవైపు రాష్ట్ర ఆదాయాలూ తగ్గాయి. అయినా కూడా మనం ఏ రోజూ సాకులు చెప్పలేదు. ప్రజలకు పథకాలు ఇవ్వకుండా ఉండేందుకు కారణాలను వెతుక్కోలేదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రజలకు ఇచ్చిన మాటను ఏరోజూ తప్పలేదని వైఎస్సార్సీపీ కార్యకర్తగా గర్వంగా చెబుతున్నా. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘‘మన ప్రభుత్వ పాలనతో చంద్రబాబు సర్కార్ పరిపాలనను ప్రజలు పోల్చి చూస్తున్నారు.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు తుంగలో తొక్కారు.. వ్యవస్థలన్నింటినీ పూర్తిగా నిర్వీర్యం చేశారు.. మన ప్రభుత్వంలో ప్రతిదీ పకడ్బందీగా జరిగింది. మరి చంద్రబాబు అదే ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారనే చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీ(YSRCP) అఖండ విజయం సాధించడం తథ్యం.. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టడం ఖాయం. రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు పరిపాలిస్తాం’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy)స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ నగర పాలక సంస్ధ పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ‘ఒక్కటే గుర్తు పెట్టుకోండి.. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..కష్టాలు ఎల్లకాలం ఉండవు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయాల్లో కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాల్లో ఉన్నప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కొంటాం అన్నదే నాయకుల్ని చేస్తుంది. కష్టం వచ్చినా మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. ఒక్కసారి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ప్రజల్లో చులకన అవుతాం. కష్టాలు ఎల్లకాలం ఉండవు. ఎవరికి.. ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తు తెచ్చుకోండి. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. నామీద కేసులు వేసింది కూడా కాంగ్రెస్, టీడీపీ నాయకులే. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నానన్న కారణంతో దొంగ కేసులు బనాయించి 16 నెలలు జైల్లో పెట్టారు. కానీ ఏం జరిగింది? బయటకు వచ్చి ప్రజల అండతో ముఖ్యమంత్రినయ్యా. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు.. దొంగ కేసులు పెడతారు.. జైల్లో పెడతారు. అయినా రెట్టించిన ఉత్సాహంతో పని చేద్దాం. మీకు మంచి చేసిన వారిని, చెడు చేసిన వారినీ ఇద్దరినీ గుర్తు పెట్టుకోండి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ నగర పాలక సంస్థ పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులుదృఢంగా నిలబడినందుకు గర్వపడుతున్నా..విజయవాడ కార్పొరేషన్లో 64 స్థానాలు ఉంటే అప్పట్లో మనం 49 గెలిచాం. టీడీపీకి వచ్చిన స్థానాలు కేవలం 14. కమ్యూనిస్టులు ఒక్క సీటు గెలిచారు. వాళ్లకు కేవలం 14 స్ధానాలున్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత రకరకాల ప్రలోభాలకు గురి చేసి, భయపెట్టి 13 మందిని తీసుకున్నారు. అయినా ఇంకా 36 మంది నిటారుగా నిలబడ్డారని చెప్పేందుకు గర్వపడుతున్నా. కార్పొరేషన్, మున్సిపాలిటీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు.. ఏవి తీసుకున్నా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన మూడేళ్ల తర్వాత వాటికి ఎన్నికలు జరిగితే మన పార్టీ క్లీన్స్వీప్ చేయగలిగింది. ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేశాం. ప్రతి నెలా ఏ పథకాన్ని అమలు చేస్తామో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే సంక్షేమ క్యాలెండర్ను విడుదల చేసి ఏటా క్రమం తప్పకుండా, ప్రజలకు ఎక్కడా నష్టం జరగకుండా, వారు ఇబ్బంది పడకుండా ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే.కాలర్ ఎగరేసి మరీ చెప్పగలం..వైఎస్సార్సీపీ విలువల కోసం నిలబడిన పార్టీ. నా దగ్గర నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకూ ఇది నా పార్టీ అని కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పకునేలా వ్యవహరించాం. ఇవాళ ఎన్నికలు పూర్తయి దాదాపు 9 నెలలు కావస్తోంది. మనం ఓడిపోయినా ఈ రోజుకు కూడా గర్వంగా తలెత్తుకుని ప్రజల దగ్గరకు పోగలుగుతాం. వాళ్ల మధ్య నిలబడి సమస్యలను వినగలుగుతాం. వారితో మమేకం కాగలుతాం. కారణం.. మనం ప్రజలకు మంచే చేశాం. ఏరోజూ మనం వాళ్లను మోసం చేయలేదు. ఏరోజూ అబద్ధాలు చెప్పలేదు. ఏదైతే చెప్పామో.. అది చేసి చూపించిన తర్వాత వాళ్లను ఓట్లు అడిగాం. కాబట్టి ప్రజల దగ్గర మన విలువ తగ్గలేదు.నిలదీస్తారన్న భయంతోనే రెడ్బుక్ రాజ్యాంగం..ఎన్నికలు జరిగి 9 నెలలు కూడా తిరక్కముందే కూటమికి చెందిన ఎమ్మెల్యే మొదలు.. కార్యకర్త వరకు ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. కారణం.. ఏ గడపకు వెళ్లినా ఎన్నికల ముందు వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లు గురించి ప్రజలు నిలదీస్తున్నారు. తల్లికి వందనం కింద తమకిస్తామన్న రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు ప్రశ్నిస్తున్నారు. ఆ పిల్లల తల్లులు ఆడబిడ్డ నిధి కింద తమకు ఇవ్వాల్సిన రూ.18 వేలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. ఆ ఇంట్లో 50 ఏళ్లు నిండిన ఆ తల్లుల అత్తలు, అమ్మలు తమకిస్తామన్న రూ.48 వేలు ఏమయ్యాయని అడుగుతున్నారు. అదే ఇంట్లో 20 ఏళ్ల యువకుడు తమకు ప్రతి నెలా నిరుద్యోగ భృతి కింద ఇస్తామన్న రూ.36 వేల గురించి నిలదీస్తున్నాడు. ఇక గ్రామీణ ప్రాంతాలకు వెళితే అన్నదాతా సుఖీభవ కింద తమకు ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సంగతేమిటని కండువా వేసుకున్న రైతన్నలు నిలదీస్తున్నారు. ఇలా ఏ ఇంటికి వెళ్లినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ రోజు ఎన్నికలప్పుడు తాము చేయలేకపోతే కాలర్ పట్టుకోమన్నారు. అదే మాట గుర్తు చేస్తూ.. ఈరోజు ప్రజలు ఎక్కడ కాలర్ పట్టుకుంటారో అని భయపడి రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు.ఆ రోజే చెప్పా.. అదే జరిగిందిఎన్నికలు అయిపోయిన 9 నెలల తర్వాత.. ఇవాళ సంపద సృష్టించడం ఎలాగో చెవిలో చెబితే తెలుసుకుంటానని చంద్రబాబు చెబుతున్నారు. ఆ రోజే నేను ఎన్నికల ప్రచారంలో చెప్పా. ‘చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే..! చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమే..!’ అని చెప్పా. మన మేనిఫెస్టో, వాళ్ల హామీలను చూపిస్తూ.. చంద్రబాబు చెప్పినవి అమలు చేయడం సాధ్యం కాదని చెప్పా. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. చంద్రబాబు ఆ పథకాలు అమలు చేయలేక చేతులెత్తేశారు.చేసేదే చెప్పాం.. చెప్పిందే చేశాంరాష్ట్ర బడ్జెట్ ఇదీ.. మనం చేస్తున్న కార్యక్రమాలు ఇవీ.. వీటికింత ఖర్చవుతుంది అని నాడు మనం చెప్పాం. మరోవైపు చంద్రబాబు రూ.1.72 లక్షల కోట్లు ఖర్చయ్యే ప్రతిపాదనలు చెబుతున్నారు.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంతా మోసం.. అని వివరిస్తూ మనం ఏం చేయగలుగుతాం అనేది కూడా ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పాం. ఆరోజు మన ప్రజా ప్రతినిధులు, శ్రేయోభిలాషులు నా దగ్గరకు వచ్చి మనం కూడా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లా హామీలు ఇద్దామన్నారు. కానీ అప్పుడు నేను ఒక్కటే చెప్పా.. విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేయడం అనవసరం అని చెప్పా. ఏదైతే చేయగలుగుతామో అదే చెప్పాలి. చేయలేనిది చెప్పి, ప్రజలను మోసం చేయడం ధర్మం కాదని చెప్పా. ఓడిపోయాం.. ఫరవాలేదు. ప్రతిపక్షంలో కూర్చున్నాం.. అదీ ఫర్వాలేదు. మళ్లీ అదే రోజుకు వెనక్కి వెళ్లినా కూడా ఇదే విధంగానే మరలా చెబుతాం. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతకు అర్ధం అదే! జమిలి ఎన్నికలు అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అదే విలువలు, విశ్వసనీయత అన్న పదం మీద వైఎస్సార్సీపీ మళ్లీ అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రజలకు చంద్రబాబు నైజం పూర్తిగా అర్ధం అవుతోంది.ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పని చేస్తుందో చూపిస్తాం. ఇది కచ్చితంగా చెబుతున్నా. జగనన్న 1.0లో కార్యకర్తలకు అంత గొప్పగా చేయలేకపోయి ఉండొచ్చు. ప్రతి పథకం, ప్రతి విషయంలోనూ మొట్టమొదట ప్రజలే గుర్తుకొచ్చి వారి కోసమే తాపత్రయపడ్డా. వారి కోసమే నా టైం కేటాయించా. ప్రజల కోసమే అడుగులు వేశా. కానీ ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశా. కార్యకర్తల బాధలను గమనించా. వారి అవస్థలను చూశా. ఆ కార్యకర్తలకు మీ జగన్ అండగా ఉంటాడు.- వైఎస్ జగన్ ‘‘జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్కూళ్లు బాగుపడ్డాయి. ఇంగ్లిష్ మీడియం వచ్చింది. నాడుృనేడుతో స్కూళ్లు బాగుపడటమే కాకుండా సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రభుత్వ పాఠశాలల ప్రయాణం మొదలైంది. ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గది డిజిటలైజ్ అయింది. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు 8వ తరగతి పిల్లాడి చేతిలో ట్యాబ్లు కనిపించేవి. ప్రైవేట్ స్కూళ్లు ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడే పరిస్ధితిని రాష్ట్రం ఎప్పుడైనా చూసిందంటే.. అది కేవలం వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది. మొదటిసారిగా గవర్నమెంట్ బడులలో నో వేకెన్సీ బోర్డులు కేవలం మన ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే కనిపించాయి..’’- వైఎస్ జగన్ పాలన పోలుస్తున్నారు.. ప్రజలే తేల్చేస్తారుఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా పక్కకు వెళ్లిపోవడం ఒక అంశం అయితే.. రెండో అంశం వ్యవస్ధలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం రాక ముందు మన ప్రభుత్వంలో ప్రతిదీ పకడ్భందీగా జరిగింది. అదే ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నారనే చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది. జగన్ ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలు బాగుపడ్డాయి. మన హయాంలో క్రమం తప్పకుండా తల్లులకు అమ్మఒడి ఇచ్చి పిల్లలను చదివించేలా ప్రోత్సహించాం. వారు ప్రపంచంతో పోటీ పడాలని, ఎంతో ఎదగాలని తపిస్తూ చదువుల్లో సమూల మార్పులు తెచ్చిన పరిస్థితి మన పాలనలో కనిపిస్తే.. ఇప్పుడు 9 నెలల్లోనే ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యమైంది. ఇవాళ ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి చూస్తే.. నాడు–నేడు పాయె... అమ్మఒడి పాయే... ఇంగ్లీషు మీడియం పాయే... ఆరో తరగతి నుంచి తరగతి గదులు డిజిటైజేషన్ కార్యక్రమమూ పాయే... ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చే కార్యక్రమం పాయే... మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెఫ్ట్ కూడా పాయే..! ఇక వీళ్ల పాంప్లెట్ పేపర్ ఈనాడులో చూశా.. 70% బడుల్లో 70 మంది పిల్లలు కూడా లేరు అని రాశారు. అది వీళ్ల తప్పిదం వల్ల అని రాయకుండా అది కూడా మన తప్పిదం వల్లే జరిగిందని రాశారు.ప్రజారోగ్యానికి భరోసా కరువు..పేదవాడికి ఆరోగ్యం బాగా లేకుంటే వారి పరిస్థితి ఇవాళ దయనీయంగా తయారైంది. నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్తే ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించే పరిస్థితి లేదు.అదే మన ప్రభుత్వంలో ఉచితంగా వైద్యం అందించడంతోపాటు ప్రొసీజర్లు వెయ్యి నుంచి ఏకంగా 3,300కి పెంచాం. రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచాం. నెట్వర్క్ ఆస్పత్రులను 900 నుంచి 2,400కి పెంచాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సుల కొరత పరిపాటే అనే సంప్రదాయాన్ని సమూలంగా మార్చేశాం. మొదటిసారిగా గవర్నమెంటు ఆస్పత్రుల రూపురేఖలను నాడు–నేడు ద్వారా మార్చివేశాం. దేశవ్యాప్తంగా స్పెషలిస్టు డాక్టర్లు కొరత 61 శాతం ఉంటే.. మన రాష్ట్రంలో దాన్ని 4 శాతానికి తీసుకొచ్చిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే మందులు దొరకని దుస్ధితి నుంచి.. డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలున్న ఔషధాలు మాత్రమే లభించేలా చేసిన ప్రభుత్వం కూడా వైఎస్సార్ సీపీదే. రాష్ట్రంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశాం. 105 రకాల మందులు సరఫరా చేస్తూ 24 గంటలూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. 14 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు కూడా అక్కడే నిర్వహించేలా విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశాం. తొలిసారిగా పీహెచ్సీలను బలోపేతం చేసి ప్రతి పీహెచ్సీలో ఒక డాక్టరు ఉండేలా, మరో డాక్టర్ 104 అంబులెన్స్లో గ్రామాల్లో అందుబాటులో ఉండేలా చూశాం. ప్రతి మండలానికి రెండు పీహెచ్సీలు ఏర్పాటు చేశాం. ప్రతి డాక్టర్ ఏ ఊరికి వెళ్లాలో నిర్ణయించి నెలలో కనీసం రెండు రోజులు అక్కడకు వెళ్లేలా ‘ఫ్యామిలీ డాక్టర్’ కాన్సెఫ్ట్ను అందుబాటులోకి తెచ్చింది కూడా వైఎస్సార్సీపీ ప్రభత్వమే. కనీవీని ఎరుగని విధంగా తొలిసారిగా ప్రివెంటివ్ కేర్ కూడా వైఎస్సార్ సీపీ హయాంలోనే అమల్లోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా పోయాయి. విలేజ్ క్లినిక్లు పని చేయడం లేదు. పీహెచ్సీలు కూడా పని చేయడం లేదు. కూటమి సర్కారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్ల బిల్లులను చెల్లించలేదు. ఆరోగ్యశ్రీ కింద ప్రతి నెలా రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతోంది. అంటే దాదాపుగా రూ.3 వేల కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ పేదలకు నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందడం లేదు. ఇదీ.. మన ప్రభుత్వానికి, వీళ్ల ప్రభుత్వానికి మధ్య తేడా!అన్ని వ్యవస్థలు నిర్వీర్యం..తొలిసారిగా రైతుల కోసం ఆర్బీకేలు తేవడం.. ఇ–క్రాప్.. దళారీ వ్యవస్థను తొలగించి ఆర్బీకేల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా కొనుగోలు చేయడం.. అక్కడే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ద్వారా వ్యవస్ధను మార్చడం.. ఇలా మనం చేపట్టిన చర్యలన్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నాశనం అయ్యాయి. నాడు గ్రామాల్లో సచివాలయాలను నెలకొల్పి ఎవరెవరు ఎలాంటి పౌర సేవలు అందించాలో నిర్ణయించాం. ప్రతి 50–60 ఇళ్లకు వలంటీర్ను నియమించి ప్రతి పథకాన్ని పారదర్శకంగా ప్రతి ఇంటికీ చేరవేసిన కార్యక్రమాలన్నీ ఇవాళ నాశనం అయ్యాయి. కేవలం తొమ్మిది నెలల్లోనే వ్యవస్ధలన్నీ నాశనం అయ్యాయి. మరోవైపు ఏది చూసినా స్కామే...! ఏ గ్రామంలో చూసినా బెల్టు షాపులను రూ.2 లక్షలకో, రూ.3 లక్షలకో ఎమ్మెల్యేలు దగ్గరుండి వేలం పాడిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి మద్యం అమ్మేలా సపోర్టు చేస్తున్నారు. ఇవాళ ఏ గ్రామంలో చూసినా మద్యమే కనిపిస్తోంది. ప్రభుత్వం నడుపుతున్న మద్యం షాపులను తొలగించి ప్రైవేట్ దుకాణాలను తెచ్చారు. ఎక్కడ చూసినా ఇసుక రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఇండస్ట్రీ నడపాలన్నా, మైనింగ్ చేసుకోవాలన్నా.. ఏ పనికైనా నాకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలై చంద్రబాబు వరకు పంచుకుంటున్నారు. -
వృద్ధాశ్రమంపై ఏలూరు ఎమ్మెల్యే దాష్టీకం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వేధింపుల పర్వం తారాస్థాయిలో కొనసాగుతోంది. ఓ వృద్ధాశ్రమం నిర్వాహకులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడంటూ ముద్ర వేసి అధికారంలోకి వచ్చిన రోజు నుంచీ వేధింపుల తీవ్రత పెంచారు. చివరకు ఆశ్రమం బిల్లులు నగరపాలక సంస్థ నుంచి మంజూరుకాకుండా అడ్డుకోవడంతో పాటు మంగళవారం స్టోర్ రూమ్, మేనేజర్ రూమ్కు అధికారులతో సీల్ వేయించి వృద్ధులను వెళ్లిపోవాల్సిందిగా హుకుం జారీ చేయడం పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఏలూరు నగరంలో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి సోదరుడు బడేటి బుజ్జి హయాంలో 2017లో నగరపాలక సంస్థ పరిధిలో మెప్మా ద్వారా ‘నిశ్చింత పట్టణ నిరాశ్రయుల సేవా కేంద్రం’ను నగరంలోని పత్తేబాదలో ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ బాధ్యతను మదర్ థెరిస్సా ఫౌండేషన్కు అప్పగించి నిర్వహణ కోసం ప్రతి నెలా రూ.50 వేలు నగరపాలక సంస్థ నుంచి మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం ఆశ్రమంలో 48 మంది వృద్ధులున్నారు. వీరికి పూర్తిగా రెండు పూటలా ఆహారం, వసతితో పాటు వైద్యసేవలన్నీ మదర్థెరిస్సా ఫౌండేషన్ నిర్వాహకులే ఉచితంగా చూస్తున్నారు. 2017 నుంచి ఈ కేంద్రం కొనసాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా యథాతథంగా ఇబ్బంది లేకుండా కొనసాగించారు. ఈ క్రమంలో 2024లో టీడీపీ ఎమ్మెల్యేగా ఏలూరు నుంచి బడేటి చంటి గెలుపొందారు. దీంతో ఆశ్రమంపై వేధింపుల పర్వం తారాస్థాయికి చేరింది. నగరపాలక సంస్థ కూడా ప్రతి నెలా బిల్లులు ఇవ్వకుండా ఏడాదికి రూ.6 లక్షలు చొప్పున ఒకేసారి బిల్లులు మంజూరు చేసింది. అలా మూడేళ్ల నుంచి రూ.18 లక్షల మొత్తం మదర్థెరిస్సా ఫౌండేషన్ నిర్వాహకులు రాయి మంగరాజుకు, రాయి విమలాదేవికి రావాల్సి ఉంది. వైఎస్సార్సీపీ పేరుతో వేధింపులు మదర్థెరిస్సా ఫౌండేషన్ నిర్వాహకురాలు రాయి విమలాదేవి 37వ డివిజన్ నుంచి గతంలో టీడీపీ నుంచి గెలుపొంది కార్పొరేటర్గా పనిచేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే సోదరుడు, అప్పటి టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఆశ్రమ బాధ్యతలను నగరపాలక సంస్థ ద్వారా అధికారికంగా అప్పజెప్పారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని సమక్షంలో విమలాదేవి, ఆమె కుమారుడు పార్టీలో చేరారు. ఎక్కడా క్రియాశీలకంగా లేకుండా పూర్తిగా ఆశ్రమ సేవా కార్యక్రమాలకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నిర్వాహకులను ఎమ్మెల్యే ముప్పుతిప్పలు పెడుతున్నారు. గతేడాది జూన్లో మంజూరైన బిల్లును నగరపాలక సంస్థలో నిలుపుదల చేయించి అప్పటి నుంచి వేధిస్తూనే ఉన్నారు. వేధింపులకు పరాకాష్టగా మంగళవారం ఎలాంటి నోటీసులు, ముందస్తు సమాచారం లేకుండా నగరపాలక సంస్థ అధికారి కృష్ణమూర్తి, సిబ్బంది, త్రీటౌన్ పోలీసుల సహకారంతో ఆశ్రమానికి వచ్చి స్టోర్రూమ్, మేనేజర్ రూమ్కు సీల్ వేసి వృద్ధులను బయటికి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు. మరోవైపు ఇదే ఆశ్రమ నిర్వహణ బాధ్యతను నగరపాలక సంస్థ ద్వారా మరొకరికి అప్పగించడం గమనార్హం.ఆత్మహత్యే శరణ్యం.. రూ.18 లక్షలు మంజూరైనా బిల్లు ఇవ్వకుండా వేధించడంతో పాటు ఆకస్మాత్తుగా ఖాళీ చేసి వెళ్లిపోండి అంటున్నారు. మొదటి నుంచీ టీడీపీలోనే ఉన్నాం. నా భార్య టీడీపీ కార్పొరేటర్గా కూడా పనిచేశారు. తమపై ఉన్న కక్షతో తమనే నమ్ముకుని ఉన్న 48 మంది వృద్ధులను బజారుపాలు చేయడం అన్యాయం. మాకు న్యాయం చేసి వృద్ధులను ఆదుకోవాలి. – రాయి మంగరాజు, ఆశ్రమ నిర్వాహకుడు -
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
తాడేపల్లి: వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు జరిగాయి. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా కరణం ధర్మశ్రీను నియమించారు. చోడవరం నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నియమితులయ్యారు. మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్తగా బూడి ముత్యాల నాయుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా తిప్పల దేవన్ రెడ్డి, పి.గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్తగా గన్నవరపు శ్రీనివాస రావు, కాగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి అశోక్ బాబును నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. -
మమ్మల్ని గర్వపడేలా చేశావు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, అమరావతి: ప్రపంచ ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఫైనాన్స్) పట్టా పుచ్చుకున్న సందర్భంగా కుమార్తె వర్షారెడ్డికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘వర్షమ్మకు అభినందనలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజ్ లండన్లో చదివి పట్టభద్రురాలవడంతోపాటు, డిస్టింక్షన్లో ఉత్తీర్ణత సాధించి మాకు ఎంతో గర్వకారణమయ్యావు. ఆ దేవుడి ఆశీస్సులు నీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’ అని స్పందించారు. ఈ సందర్భంగా తన కుటుంబంతో దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. Congratulations dear! Not only have you graduated from a prestigious institute such as King’s College London, but you have made us proud passing with distinction! God bless you dear! pic.twitter.com/8QN5qrGOEe— YS Jagan Mohan Reddy (@ysjagan) January 16, 2025 -
జగన్ హయాం ఆర్థిక ప్రగతికి కితాబు
ప్రపంచ చెస్ మాజీ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ రష్యాలో రాజకీయ అణచివేతలకు వ్యతిరేకంగా ఉద్య మిస్తూ, అనేక పుస్తకాలు రచించారు. ప్రస్తుత రష్యా పాలకుల చేత ఉగ్ర వాదిగా కూడా ముద్ర వేయించుకున్నారు. రష్యాలో నిరంతరం జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా ప్రపంచ వేదికలపై తన గళాన్ని తరచుగా వినిపిస్తున్నారు. ఒక సందర్భంలో ఆయన ‘తప్పుడు వార్తలను ప్రచారం చేసేవారి లక్ష్యం మనల్ని పెడతోవ పట్టించి వారి అజెండాను మనపై రుద్దడమే కాదు, నిజాలను తెలుసుకోవాలన్న మన ఆలోచనలను శాశ్వతంగా నాశనం చేయడం కూడా’ అంటారు. ప్రస్తుత సమాజంలో తప్పుడు కథనాలు, ప్రకటనలు ప్రజల మేధను కలుషితం చేస్తున్నాయి. వారు తప్పుడు నిర్ణయాలు తీసు కునేలా చేస్తున్నాయి. దీనికి ఒక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసినప్పటికీ, ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకొన్నప్పటికీ, అద్భుతమైన ఆర్థిక ప్రగతి సాధించినప్పటికీ; ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, వారి అనుకూల మీడియా నిరంతరం చేసిన తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మారు. ఫలితంగా మంచి చేసే ప్రభుత్వాన్ని చేజేతులా గద్దెదించి, కూటమి నిప్పుల కుంపటిని నెత్తిన పెట్టుకున్నారు. దీని దుష్ఫలితా లను ఆంధ్రులు ఇప్పుడు అనుభవిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వాగ్దానాలు అమలు చేయలేక చేతులెత్తేసి దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి నెలకో వివాదాన్ని సృష్టిస్తోంది. ఆంతేగాక గత ప్రభుత్వం అస్తవ్యస్త విధానాల కారణంగా రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసిందంటూ తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తోంది.కూటమి నేతలు నిత్యం తప్పుడు ప్రచారాలు చేస్తూ జగన్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక వృద్ధి కుంటుపడిందనీ, తాము ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నా మనీ అంటున్నారు. అయితే వీరి అవాస్తవ ప్రచారాన్ని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంకు నివేదికలు పటాపంచలు చేశాయి. జగన్ హయాంలో కుప్పలు తెప్పలుగా అప్పులు చేశారనీ, అప్పుల భారం రూ. 14 లక్షల కోట్లకు చేరిందనీ... ఎన్నికల సమయంలోనూ, తర్వాత కూడా కూటమి నేతలు ప్రచారం చేశారు. అయితే ఈ అప్పులు రూ. 7.5 లక్షల కోట్లు మాత్రమేనని కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్ధారించాయి. జగన్మోహన్రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించిందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా నివేదిక ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండి యన్ స్టేట్స్’లో పేర్కొంది.కోవిడ్ కారణంగా రెండేళ్ళపాటు దేశం ఆర్థిక ఒడు దుడుకులకు లోనయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ మాత్రం జగన్ పాలనలో అనేక రంగాల్లో రెండంకెల వృద్ధిలో దూసుకు పోయింది. 2022–23లో దేశ స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు సుమారు 8 శాతం ఉంటే ఆ ఏడాది ఏపీలో 11.43 శాతం నమోదయ్యింది. జగన్ హయాంలో నాలుగేళ్ళ సగటు వృద్ధి 12.70గా నమోదయ్యింది. ఇది దేశంలోనే అత్యధిక వృద్ధి రేట్లలో ఒకటి. 2018–19 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2018–31 మార్చి 2019) చంద్రబాబు నాయుడు హయాంలో రూ. 7.90 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) విలువ జగన్ ప్రభుత్వ హయాంలో రూ. 13.17 లక్షల కోట్లకు పెరిగినట్లు రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదికలో తెలిపింది. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2018–19లో రూ. 1,54,031 కాగా, 2023–24లో అది రూ. 2,42,479 పెరిగింది. తయారీ రంగం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సమ కూరిన నికర స్థూల విలువ 2018–19లో రూ. 67.30 వేల కోట్లు కాగా, 2023–24లో జగన్ ప్రభుత్వ హయాం నాటికి రూ. 1.29 లక్షల కోట్లకు పెరిగింది. అలాగే ఆహార పంటల సాగు విస్తీర్ణం తగ్గి, వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. ఫలితంగా రైతుల ఆదాయాలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. 2018–19లో రూ. 9.97 లక్షల కోట్లుగా ఉన్న వ్యవసాయ రంగం నికర విలువ 2023–24లో రూ. 16.82 లక్షల కోట్లకు పెరిగింది. 2018–19లో రూ. 56.10 వేల కోట్లుగా ఉన్న నిర్మాణ రంగం నికర విలువ 2023–24లో రూ. 95.74 వేల కోట్లకు పెరిగింది.జగన్ పాలనలో పారిశ్రామిక వేత్తలు పారిపోయారంటూ విష ప్రచారం చేశారు. అయితే పారిశ్రామిక రంగం నికర విలువ 2018–19లో రూ. 1.57 లక్షల కోట్లు కాగా,అది 2023–24లో రూ. 2.82 లక్షల కోట్లకు పెరిగింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల నికర విలువ 2018–19లో రూ. 32.43 వేల కోట్లు కాగా, 2023–24 నాటికి రూ. 56.59 వేల కోట్లకు పెరిగింది. సేవా రంగం నికర విలువ 2018–19లో రూ. 2.96 లక్షల కోట్లు కాగా, అది 2023–24లో రూ. 4.67 లక్షల కోట్లకు పెరిగింది. ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగం గత ప్రభుత్వ హయాంలో 38.41 శాతం, నిర్మాణ రంగంలో 26.75 శాతం, మత్స్య రంగంలో 25.92 శాతం, పారిశ్రామిక రంగంలో 25.58 శాతం, తయారీ రంగంలో 24.84 శాతం, ఆతిథ్య రంగంలో 22.70 శాతం, సర్వీస్ సెక్టార్లో 18.91 శాతం, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 14.50 శాతం వృద్ధి సాధించి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం జగన్ ప్రభుత్వ హయాంలో యేటా 50 లక్షల టన్నుల చేపలు – రొయ్యల ఉత్పత్తులతో, 1.76 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆయిల్ పామ్ సాగులో కూడా ఏపీ దేశంలోనే అగ్ర స్థానంలో ఉంది. దేశ ఎగుమతుల్లో సుమారు 11 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే జరిగాయి. ఏపీ నుంచి సుమారు రెండువేల రకాల ఉత్పత్తులు దేశ విదే శాలకు ఎగుమతి అయ్యాయి. జగన్ పాలనలో మహిళలు, పేదలు కనివిని ఎరుగని రీతిలో సంక్షేమ ఫలాలు అనుభవించారు. పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాల్లో రాష్ట్రం దేశానికే దిశానిర్దేశం చేసింది. కాని జగన్ రాజకీయ ప్రత్యర్థుల అబద్ధపు ప్రచారం ప్రజలను ప్రభావితం చేసింది. ఇప్పుడు ప్రజలు తాము మోసపోయామని వాపోతున్నారు. అధికారం కోసం వెంప ర్లాడే వారు, వారి అడుగులకు మడుగులొత్తే మీడియా వర్గాలు నిజాన్ని ఫణంగా పెట్టి చెప్పే ప్రతి అబద్ధానికి ఏదో ఒక రోజు మూల్యం చెల్లించ వలసి ఉంటుంది.వి.వి.ఆర్. కృష్ణంరాజు వ్యాసకర్త ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్మొబైల్: 89859 41411 -
ప్రజల గొంతుకగా ప్రశ్నిద్దాం
సాక్షి ప్రతినిధి, కడప : ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదు.. ఆరు నెలల్లోనే ఇదివరకెన్నడూ లేనంతంగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. ప్రశ్నించిన వారిని ఇక్కట్ల పాలు చేస్తోంది. అందువల్ల ప్రజల గొంతుకగా మనం ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ప్రశి్నద్దాం.. నిలదీద్దాం. ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటానికి సిద్ధమవ్వండి. ధైర్యంగా ఎదుర్కొందాం. కష్టాలు ఎల్లకాలం ఉండవు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ.. ‘నేనున్నాను..’ అని భరోసా ఇచ్చారు. కష్టాలు కొద్ది కాలమేనని.. ఆ తర్వాత మన టైమ్ వస్తుందని ధైర్యం చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, అరాచక పాలన సాగిస్తోందని, అధికార అండ చూసుకుని ఆ పార్టీ నేతలు అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ వద్ద వాపోయారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఎవరూ అధైర్య పడొద్దని, మంచి రోజులు వస్తాయని, సమస్యలు శాశ్వతం కాదని భరోసా కల్పించారు. మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అందరికీ మంచి జరుగుతుందని చెప్పారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పోరాట పంథా ఎంచుకుని ముందుకు సాగాలని చెప్పారు. ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిక్కిరిసిన క్యాంపు కార్యాలయం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో అందుబాటులో ఉన్నారని తెలుసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు.పులివెందులలోని క్యాంపు కార్యాలయం గురువారం పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ సూచించారు. వివిధ సమస్యలతో బాధ పడుతున్న పలువురు జగన్ను కలిసి విన్నవించుకున్నారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. వారి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలో పక్కనే ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మేలు జరగలేదని వచి్చన వారంతా గోడు వెళ్లబోసుకున్నారు. అన్ని వర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిస్తూ.. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజల నడ్డి విరుస్తున్న విద్యుత్ చార్జీలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిoదని చెప్పారు. కాగా కుప్పం అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని.. వారిని కట్టడి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆ ప్రాంత సర్పంచ్లు, యూత్ వింగ్ నాయకులు వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. ఓ అభిమాని గీసిన జననేత చిత్రం ఫొటో ఫ్రేమ్పై జగన్తో సంతకం చేయించుకున్నాడు. జగన్ను కలిసిన వారిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, డాక్టర్ సుధా, ఎమ్మెల్సీలు డీసీ గోవిందురెడ్డి, రమేష్ యాదవ్, కడప మేయర్ సురేష్ బాబు, జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎస్బి అంజాద్భాషా, గడికోట శ్రీకాంత్రెడ్డి, శెట్టిపల్లె రఘురావిురెడ్డి, మేకా ప్రతాప్ అప్పారావు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఎస్వీ సతీష్ రెడ్డి, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. వైఎస్సార్ టీచర్స్ క్యాలెండర్ ఆవిష్కరణ వైఎస్సార్ టీచర్స్ అసోషియేషన్ క్యాలెండర్, డైరీని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అవలంభిస్తున్న నియంతృత్వ ధోరణి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు వెంకటనాథరెడ్డి, సురేష్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సింగారెడ్డి అమర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఊరూవాడా సంబరాలు
సాక్షి, అమరావతి: అభివృద్ధి, సంక్షేమ సారథి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకొన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు 26 జిల్లాల్లో ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లో కేక్లు కట్ చేశారు. వీధులు, కూడళ్లలో వైఎస్ జగన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. యువత ర్యాలీలు చేశారు. పేదలు, అనాథలకు వస్త్ర దానాలు చేశారు. భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, ఆహారం పంపిణీ చేశారు. తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు, వైఎస్ జగన్ అభిమానులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్ యునెటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 14 దేశాల్లోనూ జగన్ జన్మదిన వేడుకలను అభిమానులు వైభవంగా నిర్వహించారు.⇒ శ్రీకాకుళం జిల్లా పొందూరులో శివాలయం, మెలియాపుట్టిలోని వేణుగోపాలస్వామి ఆలయం, పాతపట్నంలోని నీలమణి దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. టెక్కలి నియోజకవర్గంలో పేద విద్యార్థులకు దుప్పట్లు పంపిణి చేసి, రక్త దాన శిబిరం నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాంలోని సన్ రైజ్ హాస్పిటల్ వద్ద పెద్ద సంఖ్యలో జగన్ అభిమానులు రక్తదానం చేశారు. విజయనగరం పైడితల్లి ఆలయంలో విశేష పూజలు చేశారు. భోగాపురం మండలం ఎ రావివలసలో 52 కిలోల కేక్ కట్ చేసి, అన్నదానం చేశారు.⇒ పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో అనాధాశ్రమంలో అన్నదానం చేశారు. కురుపాం నియోజకవర్గంలో పేద మహిళకు చీరలు పంపిణీ చేశారు. పాలకొండ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మోదకొండమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.⇒ అనకాపల్లి జిల్లా చోడవరం, పాయకరావుపేట నియోజకవర్గాల్లో పలు చోట్ల అన్నదానం చేశారు. ఆసుపత్రులలో రోగులకు పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ సహా నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు.⇒ తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి మండలం ఎర్నగూడెంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రాజమండ్రిలో రక్తదాన శిబిరంతో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్, దంత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా ఆస్పత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరిజిల్లా ఉండి నియోజకవర్గంలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.⇒ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద 60 కిలోల కేక్ కట్ చేశారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో 500 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి, అన్నదానం చేశారు.⇒ గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట, నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేసి, అన్నదానం చేశారు.⇒ కర్నూలు జిల్లాలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ⇒ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీæ చేశారు.⇒ వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు. బద్వేల్ నియోజకవర్గంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కమలాపురంలోని అనాథ∙క్షేత్రాలయంలో అనాథ బాలల మధ్య కేక్ కట్ చేసి, వేడుకలు నిర్వహించారు. కడపలో జిల్లా పరిషత్ సర్కిల్ వద్ద పేదలకు అన్నదానం చేశారు. జమ్మలమడుగులో రక్తదాన శిబిరం నిర్వహించారు.హైదరాబాద్లో మెగా రక్తదాన శిబిరంసాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం వైఎస్ జగనన్న అభిమాన సంఘం కేపీహెచ్బీ కాలనీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రమ్య గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ నేతలు వై.శివరామిరెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, గోరంట్ల మాధవ్, వేంపల్లి సతీష్రెడ్డి, సునీల్రెడ్డి, చల్లా మధుసూదన్రెడ్డి, వై.ఈశ్వరప్రసాద్రెడ్డి, పోసింరెడ్డి సునీల్, ఎస్వీఎస్ రెడ్డి, శ్యామల తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు. మెగా రక్తదాన శిబిరం నిర్వహించడంతో పాటు ఐదు వేల మందికి అన్నదానం చేశారు. చెవిరెడ్డి ఆధ్వర్యంలో భారీగా పేదలకు దుస్తుల పంపిణీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేలాది మంది మహిళలు, కార్యకర్తలకు దుస్తులు పంపిణీ చేశారు. వేలాదిగా తరలివచి్చన అభిమానులకు అన్నదానం చేశారు. ఒంగోలు వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన రక్తదానం శిబిరంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రక్తదానం చేశారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సింగరాయకొండలో అన్నదానం చేశారు.చెన్నైలో ఘనంగా..సాక్షి, చెన్నై: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను చెన్నైలో శనివారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సేవాదళ్ తమిళనాడు అధ్యక్షుడు ఏకే జహీర్ హుస్సేన్ నేతృత్వంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పెరంబూరు, అంబత్తూరు, షొళింగనల్లూరు, తండలం తదితర ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని చోట్లా కేక్లు కట్ చేసి, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ జగన్ ఆయురారోగ్యాలను, విజయాలను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పిల్లలకు బిర్యానీ పంపిణీ చేశారు. వృద్ధుల ఆశ్రమంలో అన్నదానం చేశారు. షొళింగనల్లూరులో రక్తదాన శిబిరం నిర్వహించారు. చెన్నై శివారులోని తండలంలో బ్రహ్మాండ వేడుకగా బర్త్డే కార్యక్రమాన్ని సేవాదళ్ వర్గాలు నిర్వహించాయి. అధ్యక్షుడు జహీర్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి సూర్యారెడ్డి, అధికార ప్రతినిధులు సాయి సింహారెడ్డి, కీర్తి, నేతలు శరవణన్, శరత్కుమార్ రెడ్డి, భాను తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పెద్దసంఖ్యలో మహిళలు, యువత, విద్యార్థులు తరలివచ్చారు. -
మద్దతిచ్చిన వైఎస్సార్సీపీ, టీడీపీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన రాజ్యాంగ (129 సవరణ) బిల్లు–2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు–2024లను ప్రవేశ పెట్టడానికి జరిగిన ఓటింగ్కు వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మద్దతివ్వగా ఎంఐఎం పార్టీ ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించింది. ఒకే దేశం–ఒకే ఎన్నికలకు సంబంధించి తెచ్చిన బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్లో టీడీపీ, వైఎస్సార్సీపీ పార్టీలకు చెందిన ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ఈ సందర్భంగా టీడీపీ తరఫున కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ‘దేశమంతా ఒకే దశలో అసెంబ్లీ, లోక్సభకు ఎన్నికలను నిర్వహించాలనుకుంటోన్న కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని అన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ ఎంపీ మిధున్రెడ్డి ‘ఏకకాల ఎన్నికలతో పార్టీకి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ రాష్ట్రానికి కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నందున మాకు పెద్దగా సమస్యలు లేవు’ అన్నారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తుంది: ఒవైసీజమిలి ఎన్నికల బిల్లును ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఇది స్వయం పాలన హక్కును, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది. ఫెడరలిజం సూత్రాలను ఉల్లంఘిస్తోంది. ఈ తరహా చట్టంతో రాష్ట్రాల అసెంబ్లీలకు మధ్యంతర ఎన్నికలకు వస్తాయి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం. దీనిని ఆమోదించే సామర్థ్యం పార్లమెంటుకు లేదు. రాష్ట్రపతి తరహా ప్రజాస్వామ్యం కోసం నేరుగా ఈ బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల ఉనికిని దెబ్బతీస్తుంది. చివరగా ఈ బిల్లును కేవలం అత్యున్నత నాయకుడి అహాన్ని సంతృప్తి పరచడానికే తీసుకొచ్చారు’ అని పేర్కొన్నారు. -
బాబు సర్కార్ 'బరితెగింపు'
కాళ్లు పట్టుకున్నా కనికరించ లేదువిజయనగరం జిల్లా ఎల్.కోట మండలం కళ్లెంపూడి గ్రామంలోని శ్రీముకికృష్ణంరాజు చెరువు ఆయకట్టు సంఘం ఎన్నికను శనివారం నిర్వహించారు. కూటమి మితృత్వంలో భాగంగా ఇక్కడ ఉన్న ఆరు డైరెక్టర్లలో ఒకటి బీజేపీకి కేటాయించారు. దీంతో ఆయకట్టుకు చెందిన గొలజాం బీజేపీ నాయకుడు కోన మోహన్రావు నామినేషన్ వేసేందుకు కళ్లెంపూడి ఎంపీపీ స్కూల్ పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఆయనను నామినేషన్ వేయకుండా స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే కుర్చీలను పైకి విసిరారు. తన నామినేషన్ స్వీకరించాలని ఆయన డీఈ పి.శ్రీచరణ్ కాళ్లు పట్టుకుని వేడుకున్నా టీడీపీ నాయకుల ఒత్తిడితో పట్టించుకోలేదు. మిగిలిన ఐదు డైరెక్టర్లకు టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి వెను వెంటనే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను నిర్వహించారు. సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో సాగు నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ నేతలు మాత్రమే విజయం సాధించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం బరితెగించింది. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ దౌర్జన్యకాండకు దిగింది. రెవిన్యూ అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. రాష్ట్రంలో సాగు నీటి వినియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలను చేజిక్కించుకోవడానికి అరాచకాలకు తెరలేపింది. రాష్ట్రంలో 49,020 ప్రాదేశిక నియోజకవర్గాలు (టీసీ), 6,149 సాగునీటి వినియోగదారుల సంఘాల (డబ్ల్యూయూఏ)కు సంబంధించి శనివారం రహస్య ఓటింగ్ పద్దతికి తిలోదకాలిచ్చి ఏకగ్రీవాలే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. ఇతర పార్టీల మద్దతుదారులు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా రెండు మూడు రోజులుగా గ్రామ సచివాలయాల్లో నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకుని కుట్రకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ దుర్నీతికి నిరసనగా ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ప్రకటించింది. దీంతో అధికార కూటమి నేతల అరాచకానికి అంతే లేకుండా పోయింది. జి.పెదపూడిలో ఎమ్మెల్యేకు చుక్కెదురు డాక్టర్ బీఆర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం జి.పెదపూడి సాగునీటి సంఘం ఎన్నికలో పి.గన్నవరం జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సూచించిన అభ్యర్థిని రైతులు వ్యతిరేకించి.. సూర్య వెంకట కృష్ణారావును గెలిపించుకున్నారు.ఎటు చూసినా అరాచకమే..⇒ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు చెరువు సాగునీటి సంఘం ఎన్నికల్లో టీడీపీ నాయకులు బరితెగించారు. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘును, అభ్యర్థి దగుమాటి కొండయ్యను పోలీసుల ద్వారా బలవంతంగా స్టేషన్కు తరలించి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు హుటాహుటిన స్టేషన్కు చేరుకుని మాపార్టీ నాయకులను అర్ధరాత్రి సమయంలో ఎందుకు స్టేషన్కు తీసుకువచ్చారంటూ ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ⇒ కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెందుర్రు ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నిక నామినేషన్ పత్రాలను చించేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో తమ మాట వినలేదని టీడీపీ వర్గీయులు రైతులపై అక్రమ కేసులు పెట్టారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లిలో ఓటర్లు ఆందోళనకు దిగారు. 300 మంది ఓటర్లు ఉంటే కేవలం 12 మందిని మాత్రమే లోపలికి ఎలా అనుమతిస్తారని పోలింగ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) సాగునీటి సంఘానికి నామినేషన్ వేయకుండా జెడ్పీటీసీ సభ్యుడు భోగతి ప్రతాప్రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మడకశిర మండలం కల్లుమర్రిలో పోటీలో ఉన్న అభ్యర్థులను పోలీసులు అడ్డుకున్నారు. ⇒ తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తొనుకుమాల రెండు చెరువులకు సంబంధించి పోటీ చేసిన రైతు చక్రపాణిరెడ్డిని అడ్డుకున్నారు. దాదాపు జిల్లా అంతటా టీడీపీ కూటమి నాయకులు చెప్పిన విధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు నడుచుకున్నారు. నువ్వు మాజీ ఎమ్మెల్యే అయితే నాకేంట్రా.. ‘రే.. నువ్వు నన్నేమీ చేసుకోలేవు.. ఏమి చూస్తావు.. ఏమి చేస్తావు రా.. ఇక్కడి నుంచి దెం..యి’ అంటూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని కర్నూలు సీసీఎస్ సీఐ ఇబ్రహీం దుర్భాషలాడారు. ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో ఈ ఘటన జరిగింది. ఓటర్లను అధికార పార్టీ నేతలు అడ్డుకోవడంతో మాట్లాడటానికి వెళ్లడంతో పోలీసులు ఇలా ‘పచ్చ’ నేతల్లా వ్యవహరించారు. దీంతో అక్కడ ఎన్నిక ఏకగ్రీవమైంది. కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్ మండలం బ్రహ్మణదొడ్డిలో టీడీపీ నేత డి.విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు నామినేషన్ పత్రాలను లాక్కొని చింపి వేశారు. పార్లపల్లిలో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిపై దురుసుగా ప్రవర్తిస్తున్న సీసీఎస్ సీఐ ఇబ్రహీం ఇది చేతకాని దద్దమ్మ రాజకీయంనిప్పులు చెరిగిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి కడప (కార్పొరేషన్)/పులివెందుల రూరల్: వైఎస్సార్ జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు పూర్తి అప్రజాస్వామ్యంగా జరిగాయని, ప్రభుత్వం చేతగాని దద్దమ్మ రాజకీయం చేస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి తీరుపై నిప్పులు చెరిగారు. ఆయన మాటలు పిట్టలదొరను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రెండు, మూడు రోజులుగా ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతోందన్నారు. రైతులెవరైనా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. నీటి బకాయిలు లేనట్టు వీఆర్వో నుంచి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి అని, ఆ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన వీఆర్వోలందరినీ మండల కార్యాలయాలకు తరలించి జైల్లో ఖైదీల్లా బంధించారని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఉంటే రైతులు బీటెక్ రవికి చొక్కా, ప్యాంటు విప్పి నిలబెట్టేవారని హెచ్చరించారు. పారదర్శకంగా ఎన్నికలు జరిపే ధైర్యం, తెగువ వారికి ఉన్నాయా.. అని సూటిగా ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకూడదనే ‘నో డ్యూ సర్టిఫికెట్లు’ ఇవ్వలేదన్నారు. దీన్నిబట్టే చేతగాని దద్దమ్మలు ఎవరో అందరికీ తెలుస్తోందన్నారు. ఈ ఎన్నికల కవరేజీకి వెళ్లిన మీడియాపై కూడా దాడి చేయడం సిగ్గు చేటన్నారు. ‘1978 నుంచి ఉన్న మా ఆధిపత్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించాడట. ఓసారి మొహం అద్దంలో చూసుకో. జమ్మలమడుగులో వీఆర్వోలందరినీ వాహనంలో ఎక్కించి దేవగుడిలో బంధించారు. ఓడిపోతామనే భయం వల్లే కదా? వీటికి ఎన్నికలని పేరుపెట్టి గెలుపు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి’ అని రవిపై ధ్వజమెత్తారు. కాగా, ఎంపీ అవినాశ్రెడ్డిని శనివారం (రెండో రోజు) కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. -
చంద్రబాబు భాషకు అర్థాలు వేరు.. 'బాదడమే సంపద సృష్టి'!: వైఎస్ జగన్
అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకుండానే సంపద సృష్టి పేరుతో దాదాపు రూ.18 వేల కోట్లు కరెంటు బిల్లులు బాదేశారు. ఇందులో రూ.6,072 కోట్లకు సంబంధించిన బాదుడు నవంబర్ బిల్లుల్లోనే ప్రారంభమైంది. మరో రూ.11 వేల కోట్ల బాదుడు తర్వాతి నెలలో ఉంటుంది. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమై జీఎస్టీ మీద ఒక శాతం సర్చార్జ్ విధించి, ఆ మేరకు నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. సంపద సృష్టి అంటే ఇలా ప్రజలపై జీఎస్టీ పన్ను భారం మోపడమేనా? చంద్రబాబును సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నా. నీ తల్లి దండ్రులెవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వాళ్లతో కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగాక.. వారిని నీ ఇంటికి పిలిచి భోజనం పెట్టావా? వాళ్లిద్దరూ కాలం చేస్తే కనీసం తల కొరివి అయినా పెట్టావా? ఎలాంటి మానవతా విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు. ఏ గడ్డయినా తింటాడు. ఏ అబద్ధమైనా ఆడతాడు. ఏ మోసమైనా చేస్తాడు. ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరినీ కోరేది ఒక్కటే. ఈ యుద్ధంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. – వైఎస్ జగన్మోహన్రెడ్డిఇదే పెద్ద మనిషి చంద్రబాబు ప్రజలపై రోడ్డు ట్యాక్స్ వేస్తా అంటున్నారు. అలా వసూలు చేసిన డబ్బుతో రోడ్లు వేయిస్తాడట. ఇది సంపద సృష్టి అట. నిజంగా ఆయన బాదుడే బాదుడును నిస్సిగ్గుగా సమర్ధించుకుంటున్నారు. రోడ్లన్నీ మరమ్మతులు చేస్తానని ఎన్నికల్లో గొప్పగా మాట్లాడి.. ఈ రోజు ప్రజలు రోడ్డెక్కితే పన్నుల వాత పెడతామని చెబుతున్నారు. అలా అయితేనే రోడ్లు బాగు చేయిస్తాం.. లేకపోతే రోడ్ల పరిస్థితి అంతేనని చెబుతున్నారు. చంద్రబాబు ప్రతి విషయంలోనూ అబద్ధాలు చెప్పి సీఎం అయ్యారు. సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తానంటూ నమ్మబలికి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు ప్రజలపై పన్నుల మోత మోగిస్తున్నారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టించడమంటే విద్యుత్ చార్జీలు.. యూజర్ చార్జీలు, టోల్ చార్జీలతో బాదడమేనని వ్యాఖ్యానించారు. దాదాపు రూ.18 వేల కోట్ల విద్యుత్తు చార్జీల బాదుడే ఇందుకు నిదర్శనమన్నారు. భావితరాల కోసం గత ప్రభుత్వ హయాంలో సృష్టించిన విలువైన సంపద మెడికల్ కాలేజీలు, పోర్టులను స్కామ్ల కోసం అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అప్పులపై అడ్డగోలుగా అబద్ధాలాడుతున్నారని దుయ్యబట్టారు. అప్పులపై బడ్జెట్లో చూపించింది తప్పైతే మరి ఆ బడ్జెట్ను అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టావు బాబూ? అత నిలదీశారు. ప్రజలు నిలదీస్తారనే భయంతో ప్రతి విషయంలోనూ బొంకిందే బొంకుతున్న నిన్ను ‘బొంకుల బాబు..’ అని ఎందుకు అనకూడదు?’’ అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాఫియా ముఠాలే కనిపిస్తున్నాయన్నారు. ‘మద్యంలో స్కామ్.. ఇసుకలో స్కామ్.. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులతో స్కామ్.. ఎమ్మెల్యేలకు కప్పం కట్టకపోతే నియోజకవర్గాల్లో పనులు సాగని దుస్థితి.. ఎటు చూసినా నాకింత.. నీకింత! అని దోచుకోవడం.. పంచుకోవడమే! ఓవైపు సూపర్ సిక్స్లు లేవు.. సూపర్ సెవెన్లు లేవు.. మరోవైపు ఎవరైనా హక్కుల కోసం, న్యాయం కోసం ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో అక్రమంగా నిర్బంధిస్తున్నారు’ అని మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అప్పుల నుంచి పోలవరం దాకా పలు అంశాలపై సీఎం చంద్రబాబు, మంత్రులు పదే పదే అబద్ధాలు చెబుతుండటాన్ని ఎండగట్టారు. రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన పనులు పూర్తిగా పక్కకు వెళ్లిపోయాయి. ఎక్కడ చూసినా మాఫియా ముఠాలు కనిపిస్తున్నాయి. మద్యంలో ఒక స్కామ్, ఇసుకలో ఇంకో స్కామ్, ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు. ఎక్కడ పరిశ్రమలు, నిర్మాణాలు జరుగుతున్నా.. మైనింగ్ చేస్తున్నా.. ఎమ్మెల్యేలకు కప్పం కట్టకపోతే పనులు సాగని పరిస్థితి. అదానీ వాళ్లు ప్లాంట్ కడుతుంటే కూటమి ఎమ్మెల్యే చంద్రబాబు ప్రోద్బలంతో బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో నాకింత.. నీకింత అని దోచుకోవడం.. పంచుకోవడమే జరుగుతోంది. ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, విద్యుత్ చార్జీలు, రోడ్లు.. అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి లడ్డూ, అప్పులు, రాష్ట్ర ప్రగతి, ఇండస్ట్రీ, పారిశ్రామిక వేత్తలు.. ఇవన్నీ గాక తల్లి, చెల్లి అంటూ నా కుటుంబం మీద ఎక్కడ పడితే అక్కడ ఈ చంద్రబాబు మాట్లాడుతూనే ఉన్నాడు.సూటిగా ఆయన్ను ఓ ప్రశ్న అడుగుతున్నా. నీకూ కుటుంబం ఉంది. మా కుటుంబంలో విబేధాలు ఉండొచ్చు. నువ్వు పెట్టే పోస్టులు కానీ, క్రూరమైన రాజకీయాలు కానీ, ఎవరూ చేయరు. నీలాంటి దుర్మార్గుడైతే తప్ప. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన ఆఫీసులో అధికారిక ప్రతినిధితో నన్ను ‘బోస్డికే’ అని తిట్టించాడు. అది దుర్మార్గం కాదా? నా చెల్లెలు షరి్మల మీద హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36లో ఈయన బావమరిది, లోకేశ్ మామ బాలకృష్ణ సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్ నుంచి తప్పుడు రాతలు రాయించి ప్రచారం చేయలేదా? హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో ఇది నిజమని తేలలేదా? స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అక్రమమైతే, నిందితులను ఈడీ ఎందుకు అరెస్ట్ చేసింది? ఈడీ వాళ్ల ప్రాపర్టీస్ను అటాచ్ చేసింది. స్కిల్ స్కామ్ నుంచే ఆ డబ్బులన్నీ వెళ్లడంతో పక్కాగా స్కామ్ అని తేలడంతోనే వాళ్లను ఈడీ అరెస్ట్ చేసింది. అలాంటప్పుడు ఈ కేసులో చంద్రబాబును కూడా అరెస్ట్ చేయాలి కదా? డబ్బులు ఇచ్చింది చంద్రబాబే కదా? వాళ్లు ‘వివేకం’పేరిట ఇష్టమొచ్చినట్టు సినిమాలు తీస్తే తప్పు లేదు. రాంగోపాల్ వర్మ సినిమా తీసి సెన్సార్ బోర్డు అనుమతితో రిలీజ్ చేస్తే ఆ సినిమాలో తమను కించపరిచారంటూ ఆయనపై కేసులు పెడుతున్నారంటే వీళ్లను ఏమనాలి? సెన్సార్ బోర్డు అప్రూవల్తో విడుదలైన సినిమాను అడ్డం పెట్టుకొని ఆయన్ని పిలిపించే కార్యక్రమం చేస్తున్నారు. అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఇది ఇల్లీగల్ డిటెన్షన్ కాదా? సెన్సార్ బోర్డులు ఎందుకున్నట్టు?సూమో క్లాసిక్ విస్కీ, బెంగళూరు విస్కీ, రాయల్ లెన్సర్ విస్కీ, ట్రోపికానా వీసా బ్రాందీ, షార్ట్ విస్కీ, బ్రాందీ 99, కేరళా మాల్టెడ్ ఫైన్ విస్కీ.. ఇవన్నీ తీసుకొచ్చారు. ఆశ్చర్యం ఏమంటే.. ఇవన్నీ రూ.99 అని చెబుతున్నారు. నాణ్యతను తగ్గించి ఈ బ్రాండ్లు తీసుకొచ్చారు. ఇదే కేరళ మాల్టెడ్ విస్కీ రూ.85కే దొరుకుతుంది. చంద్రబాబు మాత్రం రూ.99కి అమ్ముతున్నారు. నాణ్యత తగ్గించిన మద్యాన్ని వైఎస్సార్సీపీ హయాంలో కంటే ఎక్కువ రేటుకు విక్రయిస్తున్నారు. ఇంతకు ముందు ఉండే బ్రాండ్లు ఎమ్మార్పీ ఇప్పటికీ రూ.120నే. కానీ, ఎక్కడా ఆ ధరకు అమ్మట్లేదు. – వైఎస్ జగన్ఉద్యోగులకు ఐఆర్ ఎక్కడ?చంద్రబాబు ఉద్యోగులను మోసం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఒకటవ తేదీనే జీతం అన్నారు. ఈ నెలలో మూడు వారాలు అయిపోతున్నా చాలా మందికి జీతాలు ఇవ్వలేదు. ఉద్యోగులు అందరూ ఐఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చిన నెలలోపే 27 శాతం ఐఆర్ ఇచ్చాం. చంద్రబాబు వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఇంకా ఐఆర్ ఊసే ఎత్తట్లేదు. చంద్రబాబు వచ్చిన తర్వాత పీఆర్సీ చైర్మన్ను బలవంతంగా రాజీనామా చేయించారు. మరి కొత్త పీఆర్సీ చైర్మన్ నియమించాలా లేదా? మరో వైపు వలంటీర్లు, బేవరేజెస్ కార్పొరేషన్లో పని చేస్తున్న వారి ఉద్యోగాలను పీకేశారు. 104, 108 ఉద్యోగులను పీకడానికి రెడీ అవుతున్నారు. హామీలు అమలు చేయాలని ఆశా వర్కర్లు ధర్నాలు చేస్తున్నారు.తనకు అనుకూలంగా ఉండే ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్పీ ఠాకూర్, యోగానంద్ వంటి రిటైర్డ్ అధికారులను ఓ జట్టుగా తయారు చేసి, చంద్రబాబు తన వద్ద కూర్చో బెట్టుకున్నారు. వీరు జిల్లాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వారి పేర్లను టీడీపీ వర్గాల నుంచి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సేకరిస్తున్నారు. ఈ జాబితా ఆధారంగా ఎస్పీలతో ఫాలో అప్ చేస్తున్నారు. తప్పుడు ఫిర్యాదులు అందగానే కనీస విచారణ లేకుండా నిబంధనలకు విరుద్దంగా కేసులు బనాయిస్తున్నారు. అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఆ తర్వాత కోర్టులకు కూడా హాజరు పర్చడం లేదు. ఎక్కడున్నారో తెలుసుకునేందుకు హెబియస్ కార్పస్ పిటీషన్లు వేయాల్సిన పరిస్థితి ఉంది. రోజుల తరబడి వారి వద్దే పెట్టుకుని, కళ్లకు గంతలు గట్టి రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పుతూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. ఇష్టమొచ్చినట్టు కొట్టడమే కాదు.. వీడియోలు తీసి పైనున్న ఈ జట్టు అధికారులకు పంపుతున్నారు. – వైఎస్ జగన్వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తానని దారుణంగా వంచించావు..మాపై బండవేసే ప్రయత్నంలో భాగంగా 2023 ఆగస్టు నుంచే వలంటీర్ వ్యవస్థ లేదంటున్నారు. ఏ ప్రభుత్వమైనా బడ్జెట్ అప్రూవల్ లేకుండా జీతాలు ఇవ్వగలుగుతుందా? హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా జీతాలు ఇస్తారా? ఈయనేమో హెడ్ ఆఫ్ అకౌంట్ లేదంటారు. అయ్యా చంద్రబాబూ.. హెడ్ ఆఫ్ అకౌంట్లో 2515 మేజర్ హెడ్, 198 మైనర్ హెడ్, 52 సబార్డినేట్ హెడ్, 290 డీటైల్డ్ హెడ్, 293 అబ్జెక్ట్ హెడ్.. ఇవన్నీ వలంటీర్లకు సంబంధించి హెడ్ ఆఫ్ అకౌంట్ నంబర్లు. ఇన్నేళ్లూ ఈ హెడ్ల కిందే జీతాలు ఇస్తున్నారు. ఫైనాన్స్ కాంకరెన్స్తో.. బడ్జెట్లో పెట్టి.. చంద్రబాబు సీఎం అయ్యే వరకు జీతాలు ఇస్తున్నా కూడా.. వలంటీర్లకు ఇచ్చిన హామీని ఎగరగొట్టి అబద్ధాలు, దుష్ప్రచారం చేయడం ధర్మమేనా? నోరు తెరిస్తే అబద్ధాలు.. నోరు తెరిస్తే మోసం. ఇదీ చంద్రబాబు పరిపాలన.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్లకు చెల్లించిన గౌరవ వేతనం వివరాలు వలంటీర్లపై దిక్కు మాలిన అబద్ధాలాడుతున్నారు. అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆగస్టు 2023లోనే.. అంటే మా హయాంలోనే ‘ప్రస్తుతం వలంటీర్లు ఎవ్వరూ పని చేయట్లేదు. 2023 ఆగస్టు నుంచి వలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు’ అని చెబుతున్నారు. కానీ, ఈ ఏడాది వారి గౌరవ వేతనం నిమిత్తం విడుదల చేసిన నిధులు ఎన్ని అన్న ప్రశ్నకు మాత్రం రూ.277 కోట్లు అని సమాధానం ఇచ్చారు. అంటే ఈ సంవత్సరం జీతాలు ఇచ్చినట్టే కదా! ఎన్నికలప్పుడు వలంటీర్లకు రూ.5 వేలు కాదు.. రూ.10 వేలు ఇస్తామని ప్రకటించింది వాస్తవం కాదా బాబూ? వలంటీర్ల వ్యవస్థ ఉనికిలోనే లేదని.. వారికి గౌరవ వేతనం పెంపు అన్నది ఉత్పన్నమే కాదని తేల్చిచెప్పిన సర్కార్.. పోలవరంలో విధ్వంసం బాబు ఘనతే⇒ పోలవరంలో విధ్వంసానికి కారణం చంద్రబాబు విధానాలేనని తేల్చి చెబుతూ ఇటీవల అంతర్జాతీయ నిపుణుల కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా అప్రోచ్ ఛానల్, స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు కట్టాక.. గోదావరి నదికి అడ్డంగా 2.5 కి.మీల పొడవునా ప్రధాన డ్యాం నిర్మించాలి. తొలుత పునాది డయాఫ్రం వాల్ వేసి, ఆ తర్వాత ప్రధాన డ్యాం పనులు చేపట్టాలి.⇒ కానీ.. కాంక్రీట్ పనుల్లో కమీషన్లు ఎక్కువగా రావని.. మట్టి పనుల్లో అయితే ఎక్కువ కమీషన్లు వస్తాయని స్పిల్ వే పునాది స్థాయిలో ఉండగానే చంద్రబాబు ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్ వేశారు. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల పనులు చేపట్టారు. వరద ప్రవాహం స్పిల్ వే వైపు మళ్లించడం సాధ్యం కాకపోవడంతో కాఫర్ డ్యాంలకు ఇరు వైపులా 400 మీటర్లు, 300 మీటర్ల చొప్పున ఖాళీ ప్రదేశాలు వదిలేశారు. 2.5 కి.మీల వెడల్పున ప్రవహించాల్సిన గోదావరి వరద.. కుంచించుకుపోయి ప్రవహించడంతో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు కోతకు గురయ్యాయి. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం, డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతింది. చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. లేదంటే ఈ పాటికి ఎప్పుడో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. ⇒ మేం అధికారంలోకి వచ్చాక గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వేను 48 గేట్లతో సహా పూర్తి చేశాం. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలకు మురమ్మతులు చేసి పూర్తి చేశాం. స్పిల్ వే మీదుగా గోదావరి ప్రవాహాన్ని మళ్లించాం. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతానికి మరమ్మతులు చేసి, యథాస్థితికి తీసుకొచ్చాం. దెబ్బతిన్న డయా ఫ్రం వాల్కు మరమ్మతులు చేయాలా? లేక కొత్తది కట్టాలా అన్నది తేల్చాలని కేంద్రాన్ని కోరాం. దాన్ని తేల్చే బాధ్యతను నిపుణుల కమిటీకి కేంద్రం అప్పగించింది. ⇒ ఇప్పుడు ఆ కమిటీ వచ్చింది. వరద ప్రవాహాన్ని మళ్లించే పనులు పూర్తయిన నేపథ్యంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య కొత్త డయా ఫ్రం వాల్ వేసి, ప్రధాన డ్యాంను పూర్తి చేయడానికి మార్గం సుగమం చేశాం. అయినా చంద్రబాబు గోబెల్స్ మాదిరిగా అబద్ధాల మీద అబద్ధాలు చెబుతూనే ఉన్నాడు. వాళ్లకున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయతగ్గ ముఠా మా దగ్గర లేదు.ఐదేళ్లలో ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చావా? ⇒ చంద్రబాబు హయాంలో ఒక్క నిరుపేద కుటుంబానికి కనీసం ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా? మేము 30.60 లక్షల కుటుంబాలకు అక్క చెల్లెమ్మల పేరుపైనే రిజిస్ట్రేషన్ చేసి ఇంటి స్థలాలు ఇచ్చాం. ఇందులో 21 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. 9.02 లక్షల ఇళ్లను పూర్తి చేశాం. మిగిలిన 11 లక్షల ఇళ్లు పునాదులు దాటి వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. ఏకంగా 17 వేల జగనన్న కాలనీల్లో ఏకంగా ఊళ్లే తయారవుతున్నాయి. ఆ ఇళ్లన్నీ పూర్తయితే జగన్కు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే దురుద్దేశంతో చంద్రబాబు హౌసింగ్ కార్యక్రమాన్ని ఆపేశారు.⇒ మా ప్రభుత్వ హయాంలో సిమెంట్, స్టీలు, ఇతర సామగ్రిని సబ్సిడీపై, ఇసుకను ఉచితంగా ఇచ్చే వాళ్లం. ఇవి కాకుండా రూ.35 వేలు పావలా వడ్డీకి రుణంగా ఇచ్చే వాళ్లం. రూ.1.80 లక్షల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించే వాళ్లం. అంతటి బృహత్తర కార్యక్రమాన్ని నిలిపి వేసినందుకు నిరుపేదలందరూ చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటున్నారు. పేదల ఇళ్ల గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఎందుకు అసెంబ్లీ నడుపుతున్నారో.. ఎందుకు ప్రభుత్వాన్ని నడుపుతున్నారో వీళ్లకే తెలీదు.బినామీలకు దోచిపెట్టేందుకే అసైన్డ్పై దుష్ప్రచారం⇒ అసైన్డ్ భూములపై నిస్సిగ్గుగా అబద్ధాలు.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మా ప్రభుత్వం రాక ముందు పేరుకే దళితులకు భూమి ఉండేది. దానిని అమ్ముకునే స్వేచ్ఛ లేదు. ఇంట్లో వాళ్లకు అత్యవసర పరిస్థితులు ఎదురైనా, వారసుల పేరుపైకి బదిలీ చేయాలన్నా అగమ్య గోచర పరిస్థితి ఉండేది. రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకోలేని నిస్సహాయ స్థితిలో శనక్కాయలకు.. పావలాకు, పది పైసలకు వేరే వాళ్లు కొనుక్కొని అనుభవించే వారు.⇒ మేము అధికారంలోకి వచ్చాక పేదల జీవితాలు మార్చాలని ఆలోచించాం. 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూమి ఉన్న వారికి చట్ట ప్రకారం అన్ని హక్కులు కల్పిస్తూ సొంత భూములుగా మార్చాం. ఆ సొంత భూములను అమ్ముకుంటారా? వాళ్ల పిల్లలకు ఇచ్చుకుంటారా? వాళ్ల ఇష్టం. ఈ లోగా ఎవరైనా భూములు కొనుగోలు చేసి ఉంటే కూడా అవన్నీ ఒరిజినల్ అసైనీలకు వెళ్లిపోతాయి. వాళ్ల పేరుతోనే పట్టా వస్తుంది. కొన్న వాళ్లకు పట్టా రాదు. ఇలా హక్కులిచ్చి 15.21 లక్షల మంది రైతులకు, పేదలకు మంచి చేస్తే కూటమి నాయకులు నిస్సిగ్గుగా బురద వేస్తున్నారు. మళ్లీ పేదల దగ్గర నుంచి హక్కులు తీసుకోవడానికి అడుగులు వేస్తున్నారు. చట్టాన్ని రద్దు చేయడం ద్వారా వారి హక్కులను రద్దు చేయనున్నారు. ఆ తర్వాత అవే భూములను పెత్తందార్లు 10 పైసలకు, 20 పైసలకు కొనుక్కోవచ్చు. వీళ్లకు మాత్రమే మంచి రేటు ఉండాలి. పేదలకు మాత్రం మంచి రేటు రాకూడదు.⇒ చంద్రబాబు ఇచ్చిన ఒక మెమో ద్వారా 2.06 లక్షల ఎకరాలను ఉద్దేశ పూర్వకంగా నిషేధిత జాబితా (22ఏ)లో పెట్టారు. 98 వేల మంది రైతులను నానా కష్టాలకు గురి చేస్తున్నారు. మేము నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించి.. రైతుల భూమిపై చంద్రబాబు చేసిన దాష్టీకం నుంచి విడుదల చేశాం. వారి భూములపై సర్వ హక్కులు కల్పించాం. అది తప్పంటున్నారు. ⇒ ల్యాండ్ పర్చేజ్ స్కీం కింద ఎస్సీ కార్పొరేషన్ రుణాలను రద్దు చేసి 22వేల ఎకరాల భూమిని పంపిణీ చేశాం. ఇది మరో విప్లవం. 2.06 లక్షల ఎకరాల చుక్కల భూముల సమస్యలను పరిష్కరించి ఏకంగా 1.07 లక్షల మంది రైతుల కుటుంబాలకు మేలు చేశాం. 33 వేల ఎకరాల షరతుల భూములపై 22 వేల మంది రైతులకు సర్వ హక్కులు కల్పించాం. ఇదంతా వాళ్లు తప్పంటున్నారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మహిళలు అందరూ మాయమైపోతున్నారని దుష్ప్రచారం చేశారు. ఇందుకు వలంటీర్లు కారణమని, మానవ అక్రమ రవాణా చేస్తున్నారని రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా దత్తపుత్రుడు.. ఇప్పుడు డెప్యూటీ సీఎం ఊగిపోయాడు. వాళ్లు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఈ దుష్ప్రచారం ఒక భాగం. సాక్షాత్తు అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2019–24 మధ్య ఐదేళ్లలో 46 మంది మాత్రమే మానవ అక్రమ రవాణాకు గురయ్యారని, కేవలం 34 కేసులు మాత్రమే నమోదయ్యాయని వాళ్లంతకు వాళ్లే చెప్పారు. గతంలో 30 వేల మంది మానవ అక్రమ రవాణా జరిగిందనే దుష్ప్రచారానికి, వలంటీర్లపై వీళ్లు చేసిన దుష్ప్రచారానికి ఇది ఫుల్స్టాప్ కాదా? – వైఎస్ జగన్కేవలం 46 మంది మహిళలే అక్రమ రవాణాకు గురయ్యారని తేల్చిన కూటమి సర్కార్ మోసాలు, అక్రమాలు, వైఫల్యాలు నిలదీస్తే అక్రమ కేసులా?సూపర్ సిక్స్లు లేవు.. సూపర్సెవెన్లు లేవు.. మరో వైపు అన్ని రకాలుగా రాష్ట్రం వైఫల్యం చెందింది. ఎవరైనా హక్కుల కోసం, న్యాయం కోసం సోషల్ మీడియాలో ప్రస్తావిస్తే చాలు దారుణంగా వేధిస్తున్నారు. పోలీసులను అన్యాయంగా వాడుకుంటున్నారు. ఎమ్మెల్యేల ద్వారా వాళ్ల నియోజకవర్గాల్లో ప్రైవేటు మాఫియా ముఠాను తయారు చేసి కొట్టిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెడుతున్నారు. అక్రమ నిర్బంధాలు (ఇల్లీగల్ డిటెన్షన్) చేస్తున్నారు. తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు.⇒ కొట్టాం.. వీడియోలు తీశాం.. చూసి ఆనందించండి.. అని స్థానిక పోలీసులు పై వాళ్లకు పంపిస్తూ శాడిజం ప్రదర్శిస్తున్నారు. పైగా థర్డ్ డిగ్రీ దెబ్బలు చూపిస్తున్నారు. న్యాయ ప్రక్రియ ముందుకు వెళ్లకుండా చేసేందుకు ఎఫ్ఐఆర్లు అప్లోడ్ చేయడం లేదు. ఎఫ్ఐఆర్ల కోసం బాధితుల బంధువులు పోలీస్ స్టేషన్ల ఎదుట ధర్నాలు చేస్తున్నారు. ఇలా తప్పుడు కేసులతో అరెస్ట్ అయిన వారిని న్యాయవాదులు కష్టపడి బెయిల్పై బయటకు తీసుకొస్తుంటే మరో కేసు పెట్టి అరెస్ట్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి.⇒ చంద్రబాబు అరాచకాలు ఇంతటితో ఆగిపోలేదు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, చివరకు సినీ దర్శకులపై కూడా కేసులు పెడుతున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోటలో ఎస్పీ ప్రోద్భలంతో సీఐ ద్వారా నాటు తుపాకులు పెట్టే కార్యక్రమం చేశారు. తోటలో పని చేస్తున్న 55–60 ఏళ్ల వయసున్న వృద్ధురాలిని కొట్టి ఒప్పించే కార్యక్రమం చేశారు. మేజిస్ట్రేట్ ఎదుట తన దెబ్బలు చూపించి, జరిగిన విషయాన్ని ఆమె చెప్పడంతో ఆ సీఐని మేజిస్ట్రేట్ తిట్టి పంపించిన ఘటన వారం రోజుల క్రితం జరిగింది. తుదకు సినీ దర్శకులను కూడా వదలడం లేదు. వాళ్లేమో ఇష్టానుసారం సినిమాలు తీయొచ్చట.⇒ రాష్ట్రంలో పేకాట జరుగుతుందని, తన నియోజకవర్గంలో నడుస్తోన్న పేకాట క్లబ్ను ఉదాహరణగా చూపుతూ పోస్టు పెట్టినందుకు మా ఎమ్మెల్యే చంద్రన్నపై కూడా కేసు పెట్టారు. ఆయనపై ఇప్పటి వరకు 8 కేసులు పెట్టారు. మరో దళిత ఎంపీ నందిగాం సురేష్పై కేసుల మీద కేసులు పెడుతూనే ఉన్నారు. తెలుగుదేశం ఆఫీసుపై దాడి చేశాడని కేసు పెట్టారు. ఆ రోజు ఆయన అసలు ఊళ్లోనే లేడు. అయినా అరెస్ట్ చేశారు. ఒక కేసులో బెయిల్పై బయటకొచ్చేలోగా మరో కేసు పెడుతున్నారు. అన్నీ దిక్కుమాలిన కేసులే. ఒక దళితుడు, మాజీ ఎంపీ.. 70 రోజులుగా జైలులో ఉన్నాడు. మాజీ మంత్రులు కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజాలపై కూడా ఇష్టానుసారం కేసులు పెట్టారు.⇒ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని తప్పుడు సంప్రదాయానికి నాంది పలుకుతున్నారు. ఒక వైపు కేసులు పెట్టడం, మరొక వైపు ఎవరైనా మాట్లాడితే అన్యాయంగా దూషించడం. ఇంకొక వైపు దుష్ప్రచారాలు చేయడం. ఇది చంద్రబాబు నైజం. టాపిక్ డైవర్షన్, తప్పుడు ప్రచారం, అబద్ధాలు, మోసాలు చేయడంలో చంద్రబాబు స్పెషలిస్ట్. ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం (క్యారెక్టర్ అసాస్నేట్) చేయడంలో ప్రసిద్ధుడు. లక్ష్మీపార్వతితో మొదలు నా వరకు ఎలా ప్రచారం చేశారో చూశాం.నా చెల్లిపై దుష్ఫ్రచారం చేసింది చంద్రబాబే ⇒ చంద్రబాబు తప్పుడు ప్రచారంపై గతంలో నా చెల్లెలు షర్మిల ఏమన్నారో చూడండి. (వీడియోను ప్రదర్శిస్తూ..) ఆ వీడియోలో షర్మిల మాట్లాడుతూ.. ‘ఎన్బీకే బిల్డింగ్ నుంచి దుష్ప్రచారం జరిగిందని ఐపీ అడ్రస్ను బట్టి పోలీసులు చెబుతున్నారు. ఈ వెబ్సైట్లన్నీ ప్రొ టీడీపీ ప్రమోట్ చేసినవే. ప్రత్యర్థులను కించపరిచేవి. ఈ పోస్టింగ్లన్నీ బాలకృష్ణ బిల్డింగ్ నుంచి, ప్రో టీడీపీ సైట్ల నుంచి జరిగాయంటే బాలకృష్ణకు సంబంధం లేదని నేను ఎలా అనుకోవాలి? సంబంధం ఉంది కనుకే బాలకృష్ణ నా మీద నింద వేశారని, పుకార్లు పుట్టించారని, వాటిని ప్రచారం చేశారని నేను విశ్వసిస్తున్నా. బాలకృష్ణ ఇలా దిగజారుడు తనానికి ఎందుకు పాల్పడ్డారో ఆయనే చెప్పాలి’ అన్నారు.⇒ మా ప్రభుత్వ హయాంలో వర్రా రవీంద్రారెడ్డి పేరిట ఐ టీడీపీ సభ్యుడు ఉదయ్భూషణ్ ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మా అమ్మను, మా చెల్లెలిని తిట్టించాడు. వర్రా రవీంద్రరెడ్డి పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఉదయ్ భూషణ్ను ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు ఎంత దారుణమైన నికృష్టుడంటే తన స్వార్థం కోసం ఎవరినైనా సరే వ్యక్తిత్వ హననం చేస్తాడు. వాళ్ల సానుభూతిపరులతో ఫేక్ ఐడీ క్రియేట్ చేయించి, వాళ్లతో మన వాళ్లను తిట్టిస్తాడు.మద్యం, ఇసుక అంతా స్కామ్..⇒ రాష్ట్రంలో ప్రజలకు అవసరమైన పనులు పూర్తిగా పక్కకు వెళ్లిపోయాయి. ఎక్కడ చూసినా మాఫియా ముఠాలు దోచుకుంటున్న పరిస్థితి. చంద్రబాబు అధికారంలోకి వస్తే నాణ్యమైన లిక్కర్ ఇస్తానన్నారు. మద్యం రేటు తగ్గిస్తానన్నారు. ఆశ్చర్యం ఏమంటే.. గతంలో చంద్రబాబు హయాంలో అవే డిస్టిలరీలు.. మా హయాంలో అవే.. ఇప్పుడు కూడా అవే డిస్టిలరీలు. మద్యం ఆదాయంలో చీప్ లిక్కర్ నుంచే 85 శాతం వస్తుంది. చంద్రబాబు వచ్చిన తర్వాత చీప్ లిక్కర్లో నాణ్యత తగ్గించారు. ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. ఎప్పుడూ మనం వినని, చూడని బ్రాండ్లు అవి.⇒ అన్ని చోట్లా బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్నారు. ఒక్కో బెల్టు షాపునకు.. ఒక్కో గ్రామంలో పోటీ పెట్టి వేలం వేస్తున్నారు. రూ.2 లక్షలకు పాడుకున్న వాడికే ఇస్తున్నారు. ఇలా మాఫియా రాజ్యం నడుస్తోంది. మద్యాన్ని ఎమ్మార్పీకి అమ్మకోవాలంటే పోటీ ఎందుకు? ఎమ్మెల్యేలు మనుషులను ఎందుకు కిడ్నాప్ చేయించాలి.. ఎందుకు ఎవరినీ పాడనివ్వకుండా చేయాలి? వేరేవాళ్లకు వచ్చినా షాపులు నడుపుకోలేని పరిస్థితికి ఎందుకు నెట్టేయాలి? ఎమ్మార్పీ ప్లస్ మాఫియాకు కమీషన్ రావాలనే ఇదంతా చేస్తున్నారు. ఇసుక పరిస్థితి కూడా అంతే. హామీ ఇచ్చినట్లు ఎక్కడా ఉచితంగా ఇవ్వడం లేదు. -
సోషల్ మీడియాకు అండగా ‘వైఎస్సార్సీపీ’ ప్రత్యేక బృందాలు
సాక్షి,అమరావతి: సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిల్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండేందుకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ తరపున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం ఈ బృందాలు పనిచేస్తాయి. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఈ బృందాలు పనిచేస్తాయి. -
Andhra Pradesh: ‘మండలి’లో మంటలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై శాసన మండలి అట్టుడికింది. కూటమి సర్కారు నిరంకుశ వైఖరి, అరాచక విధానాలపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే నెపంతో చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులను అరికట్టాలి.. నిరంకుశ రాజ్యం నశించాలి.. ఉయ్ వాంట్ జస్టిస్.. సేవ్ డెమొక్రసీ అంటూ నినదించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కించపరుస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ కూటమి పార్టీలకు చెందిన కొందరు పెట్టిన అభ్యంతరకర పోస్టుల ప్లకార్డులను ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ సభ్యులు ప్రదర్శించారు. యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ అరెస్టులపై చర్చకు అనుమతించాలని వైఎస్సార్సీపీ సభ్యులు మొండితోక అరుణ్కుమార్, తుమాటి మాధవరావు, పి.రామసుబ్బారెడ్డి వాయిదా తీర్మానాన్ని ఇవ్వగా మరో ఫార్మాట్లో తేవాలంటూ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు తిరస్కరించారు. దీనిపై చర్చకు అనుమతించాలంటూ పట్టుబట్టిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, తలశిల రఘురాం, వరుదు కళ్యాణి, కల్పలతారెడ్డి, పండుల రవీంద్రబాబు, తోట త్రిమూర్తులు, మహ్మద్ రుహుల్లా తదితరులు పోడియం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నారా లోకేశ్, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, మండలి చీఫ్విప్ పంచుమర్తి అనురాధ, టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు దీనిపై జోక్యం చేసుకుంటూ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన తర్వాత చర్చకు పట్టుబట్టడం సరికాదన్నారు. దీనిపై మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ రాష్ట్రంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అనేక మంది యువకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని, దీనిపై సభలో ఖచ్చితంగా చర్చ జరపాల్సిందేనని పట్టుబట్టారు. చర్చ కోసం వైఎస్సార్సీపీ సభ్యులు నిరసన తెలపడంతో సభ 34 నిమిషాల పాటు నిలిచిపోయింది. దీంతో చైర్మన్ మోషేన్రాజు సభను కొద్దిసేపు వాయిదా వేసి మళ్లీ కొనసాగించారు. డీఎస్సీ నోటిఫికేషన్ కాలయాపనపై చర్చించేందుకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని కూడా మండలి చైర్మన్ మోషేన్రాజు తిరస్కరించారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై చర్చకు డిమాండ్ చేస్తున్న సభ్యులు మా రాజీనామాలు ఆమోదించండి.. సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులపై చర్చించాలని వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన చేస్తున్న సమయంలోనే వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ రాజీనామాలు ఆమోదించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, టీడీపీ సభ్యులు కలసి వారిని ముందుకు తీసుకెళ్లడం గమనార్హం. ఆ ముగ్గురూ పోడియం పైకి వెళ్లి చైర్మన్ను కలసి తమ రాజీనామాలు ఆమోదించాలని విజ్ఞాపన పత్రాలు అందించారు. మీ రాజీనామాల అంశం పరిశీలనలో ఉందని, వాటిపై తర్వాత నిర్ణయం తీసుకుంటానని చైర్మన్ స్పష్టం చేశారు. బడ్జెట్పై చర్చను అడ్డుకున్న మంత్రులు శాసన మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు బడ్జెట్పై మాట్లాడుతున్న సమయంలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీలు పదేపదే అడ్డుపడి రభస సృష్టించారు. వైఎస్సార్సీపీ సభ్యురాలు వరుదు కళ్యాణి బడ్జెట్పై చర్చను ప్రారంభించగానే మంత్రులు, కూటమి సభ్యులు చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. చర్చ పక్కదారి పడుతోందని, బడ్జెట్పైనే మాట్లాడాలంటూ చైర్మన్ సహనంతో పలుమార్లు కోరినా మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, డోలా బాలవీరాంజనేయస్వామి, అనిత, సవిత పదేపదే అడ్డు తగులుతూ చర్చ కొనసాగనివ్వకుండా చేశారు. విధిలేని పరిస్థితుల్లో చైర్మన్ పది నిమిషాలు సభను వాయిదా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అధికార పార్టీ సభ్యులు అదే ధోరణి కొనసాగించారు. చర్చ పూర్తిగా తప్పుదోవ పట్టి గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు.సర్వనాశనం చేసింది బాబే: బొత్సరాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబేనని, మళ్లీ అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి నాశనం చేశారని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో అందుకు అనుగుణంగా కేటాయింపులు జరపలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్సార్సీపీ సభ్యులు కోరటాన్ని తప్పుబడితే ఎలా? అని ప్రశ్నించారు. హామీలు ఎలా అమలు చేస్తారు? ఎప్పుడు నెరవేరుస్తారు? అని అడిగితే అందులో తప్పు ఏముందన్నారు. తమ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక చర్చను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.ఏం జరిగిందంటే..?బడ్జెట్పై చర్చ సందర్భంగా వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి పారీ్టలు హామీ ఇచ్చినట్లుగా.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.18 వేలు.. రైతులకు రూ.20,000, మహిళలకు నెలకు రూ.1,500 లాంటి పథకాల కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. అయితే బడ్జెట్లో ఈ పథకాలకు ఒక్క పైసా కూడా కేటాయించలేదని చెబుతుండగా.. మంత్రి సవిత, అనిత, పయ్యావుల కేశవ్ ఆమెను పదేపదే అడ్డుకున్నారు. సభ్యులు ప్రసంగించకుండా మంత్రులు ఈ విధంగా పదేపదే అడ్డుపడటం సరికాదని ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. సభ్యుల ప్రసంగంపై అభ్యంతరాలు ఉంటే వాటిని నోట్ చేసుకొని సమాధానం ఇచ్చే సమయంలో వివరణ ఇస్తే సరిపోతుందన్నారు. ఈ సందర్భంగా సభలో ఏ విధంగా నడుచుకోవాలి? ఎలా మాట్లాడాలి? అనే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరగడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు. అనంతరం వరుదు కళ్యాణి తిరిగి చర్చను ప్రారంభిస్తూ దీపం–2 పథకం కింద మూడు ఉచిత సిలెండర్లకు రూ.3,000 కోట్లు అవసరం కాగా బడ్జెట్లో కేవలం రూ.800 కోట్లే కేటాయించారని ప్రస్తావిస్తుండగా.. మంత్రి అనిత నిలబడి ఆమెను అడ్డుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏమైందని కళ్యాణి మాట్లాడుతున్న సమయంలో మంత్రి డోలా వీరాంజనేయస్వామి లేచి నిలబడి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మీ నాయకుడు పారిపోయి ఇంట్లో పడుకున్నారు..! త్వరలో మీరూ పారిపోతారంటూ వైఎస్సార్సీపీ సభ్యులను రెచ్చగొట్టడంతో సభలో అలజడి చెలరేగింది. ఇంతలో హఠాత్తుగా నారా లోకేశ్ లేచి నిలబడి అసందర్భ చర్చను తెరపైకి తెచ్చారు. గౌరవ సభలో మా తల్లిని అవమానించారని, అందుకే ఆగ్రహంతో మాట్లాడుతున్నాం అంటూ ఊగిపోయారు. అయితే రికార్డుల్లో లేని విషయాలు, సభలో లేని వ్యక్తులను ప్రస్తావించి చర్చ చేయడం సరికాదంటూ బొత్స వారించారు. ఇరుపారీ్టల సభ్యులు వాగ్యుద్ధానికి దిగడంతో చైర్మన్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. -
బూచిగా అప్పుల భూతం.. సూపర్ సిక్స్కు ఎగనామం: వైఎస్ జగన్
‘ఎన్నికల వేళ నువ్వు చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి? ఇదిగో నీ సూపర్ సిక్స్.. వాటిని అమలు చేయడానికి కావాల్సిన బడ్జెట్ రూ.74 వేల కోట్లు. కానీ బడ్జెట్లో కేటాయింపు చేయలేదు. నువ్వు చెప్పింది అబద్ధం కాదా? నువ్వు చేసింది మోసం కాదా? నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు? ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా?’ అని ప్రశ్నిస్తూ నేను ఎక్స్, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడతా. వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇదే పోస్టు పెడతారు. ఇదే పోస్టును సోషల్ మీడియాలో పెట్టాలని ప్రతి కార్యకర్తకూ పిలుపునిస్తున్నా. ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. అరెస్ట్ చేయడం మొదలు పెడితే.. అది నాతోనే ప్రారంభించండి.– సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సవాల్సాక్షి, అమరావతి: ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇస్తున్నప్పుడే వాటిని అమలు చేయలేనని తెలిసినా, మోసం చేయడమే తన నైజంగా పెట్టుకున్న చంద్రబాబు.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్ర అప్పులు రూ.11 లక్షల కోట్లు.. రూ.12.50 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లు అంటూ చేసిన దుష్ప్రచారం బడ్జెట్ సాక్షిగా బట్టబయలైందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులపై ఒక అబద్ధాన్ని సృష్టించి.. దాన్నే ఎల్లో మీడియాతో రాయించి.. ఆ తర్వాత దత్తపుత్రుడు, బీజేపీలోని టీడీపీ నాయకురాలు, తన వదినమ్మ, ఇతర పార్టీల్లోని టీడీపీ నాయకులతో పదే పదే మాట్లాడించి దుష్ప్రచారం చేసిన ఆర్గనైజ్డ్ క్రిమినల్ (వ్యవస్థీకృత నేరగాడు) చంద్రబాబు అని ధ్వజమెత్తారు. రాష్ట్రం శ్రీలంకలా దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో అంటూ ఒక పద్ధతి ప్రకారం దుష్ఫ్రచారం చేశారని గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులపై చంద్రబాబు చేసిన దుష్ఫ్రచారాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు. అధికారంలోకి వచ్చాక కూడా ఆర్థిక శాఖపై నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లకు చేరుకుందంటూ సీఎం చంద్రబాబు లీకులు ఇచ్చారని.. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చిత్రీకరిస్తూ సూపర్ సిక్స్, ఇతర హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు రంగం సిద్ధం చేశారని దుయ్యబట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ముందు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లంటూ గవర్నర్తో అబద్ధాలు చెప్పించారని గుర్తు చేశారు. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్లో రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లేనని తేలిందని ఎత్తి చూపారు. తద్వారా చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తారన్నది బట్టయలైందని చెప్పారు. రాష్ట్ర అప్పులపై తాను చెప్పిందంతా అబద్ధమని తేలుతుందని.. సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కేటాయింపులపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ఇన్నాళ్లూ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా సాగదీస్తూ వచ్చారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకాఏమన్నారంటే..ఎనిమిది నెలలయ్యాక బడ్జెట్ ప్రవేశపెట్టడమా? ⇒ ఈ బడ్జెట్ కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రమే ప్రవేశపెట్టిన డాక్యుమెంట్లా ఉంది. నిజంగా ఎవరైనా ఎన్నికలైన వెంటనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్ కేటాయింపులు చేసి, వాటి అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తారు. కానీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 8 నెలలు గడిచాక.. కేవలం మరో నాలుగు నెలలు సమయం మాత్రమే ఉన్న పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ను చూస్తే ఆశ్చర్యమేస్తోంది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు మోసాలు, అబద్ధాలు అన్నీ బయటకొస్తాయని ఇలా చేశారు. ⇒ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు కేటాయింపులు జరపకపోతే మా సూపర్ సిక్స్ ఏమైంది.. సూపర్ సెవెన్ ఏమైందని ప్రజలు నిలదీస్తారని తెలుసు కాబట్టే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా సాగదీస్తూ వచ్చారు. దీనికి రకరకాల కారణాలు చెబుతూ వచ్చారు. పరిమితికి మించి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పులు చేసిందని.. రాష్ట్రాన్ని శ్రీలంక చేసిందని.. ప్రజలను మభ్యపెట్టే విధంగా అబద్ధాలు ప్రచారం చేశారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెబుతూ.. సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూస్తే.. ఆయన ఏ స్థాయి డ్రామా ఆర్టిస్ట్ అన్నది స్పష్టమవుతోంది. బడ్జెట్ డాక్యుమెంట్లో పేర్కొన్న అంశాలే ఇందుకు సాక్ష్యం.చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్కు ఆధారాలు ఇవిగో..05–04–2022: ‘రాష్ట్రం మరో శ్రీలంకగా తయారవుతుంది’ చంద్రబాబు స్టేట్మెంట్. ‘ఈనాడు’లో బ్యానర్ కథనం 13–04–22: ‘శ్రీలంకలా ఏపీ దివాలా తీసినట్టు సీఎం ప్రకటిస్తారేమో?’ అని చంద్రబాబు మరో స్టేట్మెంట్ 19–04–22: చంద్రబాబు చెప్పిన అబద్ధాలను పట్టుకుని ‘మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే’ అంటూ ఈనాడు కథనం 17–05–22: ‘శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరం’లోనే ఉందంటూ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ 21–07–22 : ’శ్రీలంక కంటే రాష్ట్రానికి 4 రెట్లు అప్పు’ అని అప్పటి టీడీపీ నేత, ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్టేట్మెంట్17–02–23 : ‘అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు అప్పు రత్న’ అని పేరు పెట్టాలంటూ దత్తపుత్రుడు మరో ట్వీట్ 25–10–23 : ‘రాష్ట్ర రుణం రూ.11 లక్షల కోట్లు’ అని చంద్రబాబు వదినమ్మ, బీజేపీలో టీడీపీ నాయకురాలు స్వయంగా చూసినట్లు, ఆమెకు తెలిసినట్లు స్టేట్మెంట్⇒ వీటిని బట్టి కొత్త పాత్రధారులు, వారి ఎల్లో మీడియా, ఇతర పార్టీల్లోని టీడీపీ నాయకులతో కలిసి ఒక పద్ధతి ప్రకారం అప్పులపై గోబెల్స్ ప్రచారం చేశారని స్పష్టమవుతోంది. అప్పులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని పార్లమెంటులో కేంద్రం ఇచ్చిన సమా«ధానాన్ని అడ్డుపెట్టుకొని వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని రివర్స్ ప్రచారం. ఢిల్లీకి పోవడం.. రకరకాల ఏజెన్సీలకు లేఖలు రాయడం ఎందుకు? ‘వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు రాకూడదు.. కేంద్ర ప్రభుత్వం సహకరించకూడదు.. ఇక్కడ ఏమెమో జరిగిపోతోందన్న భయం సృష్టించాలి’ అని పద్దతి ప్రకారం ఇవన్నీ చేసుకుంటూ పోయారు.⇒ ఎన్నికలు సమీపించే సరికి అబద్ధాలు ముమ్మరం చేశారు. 2023 ఏప్రిల్ 7వ తేదీన ‘రాష్ట్ర అప్పు రూ.12.50 లక్షల కోట్లు’ అని ఎన్నికలకు నెల ముందు చంద్రబాబు వదినమ్మ స్టేట్మెంట్. ఇందుకు వత్తాసుగా అదే నెల 21న ఒకాయనను పట్టుకొచ్చి.. ఆయనకు ఎకానమిస్ట్ అని బిళ్ల తగిలించి.. ‘రాష్ట్ర రుణాలు రూ.14 లక్షలు కోట్లు’ అని చెప్పించారు. ఆ తర్వాత మిగిలిన వాళ్లు వరుసగా ఇదే పాట అందుకున్నారు. ఒక పద్దతి ప్రకారం అబద్ధాల ప్రచారం జరిగింది.మాకు రూ.42,183.80 కోట్ల బకాయిల బహుమతి⇒ చంద్రబాబు పోతూ పోతూ రూ.42,183.80 కోట్ల బకాయిలు మాకు గిఫ్ట్గా ఇచ్చి పోయాడు. అవన్నీ మేము కట్టాం. ఉపాధి హామీ బకాయిలు రూ.2,340 కోట్లు, ఉద్యోగులకు రెండు డీఏలు బకాయి పెట్టాడు. ఆరోగ్యశ్రీ రూ.640 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ రూ.2,800 కోట్లు, రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు, విత్తన బకాయిలు రూ.380 కోట్లు, పంటల బీమా బకాయిలు రూ.500 కోట్లు, చివరికి పిల్లలకు మధ్యాహ్న భోజనం వండే ఆయాలకు, కోడిగుడ్లకు కూడా బకాయిలు పెట్టాడు.⇒ ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఏ ప్రభుత్వ హయాంలోనైనా కొన్ని బకాయిలు మామూలే. ఏటా ఈ బకాయిలు క్లియర్ అవుతూనే ఉంటాయి. దీన్నేదో చంద్రబాబు వక్రీకరించి.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎగరగొట్టాలనే దూరపు ఆలోచనతో కొత్త కథను బిల్డప్ చేస్తున్నాడు. సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు అబద్ధాలకు రెక్కలు కట్టాడు. ఇలా చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఎవరెవరు భాగస్వాములై ఉన్నారో సాక్ష్యాధారాలతో సహా మీ ముందు పెట్టాను. రాజకీయ లబ్ధి కోసమే అప్పులపై దుష్ఫ్రచారం⇒ ఏ రాష్ట్రమైనా, ఏ ప్రభుత్వమైనా రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా అప్పులు చేయడం బడ్జెట్లో భాగం. ఇది సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం. ప్రతి రాష్ట్రానికి, ప్రతి ప్రభుత్వానికి ఎంత పర్సంటేజ్లో అప్పులు చేయాలో ఎఫ్ఆర్బీఎం నిర్దేశిస్తుంది. ఏ ప్రభుత్వమైనా జీఎస్డీపీలో 3 శాతం నుంచి 3.5 శాతంలోపే అప్పులు తీసుకుంటుంది. అంతకు మించి తీసుకునే అవకాశం ఉండదని అందరికీ తెలుసు.⇒ చంద్రబాబు, ఆయన కూటమి, ముఠా సభ్యులు మాత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులపై ఏ విధంగా ప్రచారం చేశారో అందరికీ తెలిసిందే. ఏ బ్యాంకు అయినా ప్రభుత్వాలకు రుణాలు ఇవ్వాలంటే ఒక పద్ధతి ఉంటుంది. కార్పొరేషన్ల ద్వారా కూడా ఇష్టమొచ్చినట్టు రుణాలు తీసుకోవడానికి అవకాశం లేదు. చంద్రబాబు సుందర ముఖారవిందం చూసో, జగన్ ముఖారవిందం చూసో ఏ బ్యాంకులు అప్పులు ఇవ్వవు. ఇవన్నీ వాస్తవాలు. కేవలం వారు రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఇలా చేశారని స్పష్టమైంది.అధికారంలోకి వచ్చాక కూడా విష ప్రచారమే⇒ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు తన తప్పుడు ప్రచారం మానలేదు. అదే విష ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. జూలై 10వ తేదీన ఆర్థిక శాఖపై సమీక్ష చేస్తూ ‘రాష్ట్రం మొత్తం అప్పులు రూ.14 లక్షల కోట్లు’ అని లీకులిస్తాడు. ఈనాడులో రాస్తారు.. ఈటీవీలో చూపిస్తారు. ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేందుకు చంద్రబాబుకు కారణాలు కావాలి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్’కు కేటాయింపులు చేయకపోతే ప్రజలు నిలదీస్తారని తెలుసు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన దుష్ప్రచారం కొనసాగించారు.⇒ ఒక పద్దతి ప్రకారం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లను తెరమరుగు చేసే కార్యక్రమం. హామీలిచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. అయినా ప్రజలను మోసం చేయాలి. మోసం చేసే సమయంలోనైనా కనీసం నిజాయితీతో మిమ్మల్ని మోసం చేస్తున్నాం అని చెప్పడానికి మళ్లీ జగన్ కావాలి. అందుకోసం రంగం సిద్ధం చేస్తున్నాడు.బడ్జెట్ సాక్షిగా దుష్ఫ్రచారం బట్టబయలు⇒ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్టానికి ఎంత అప్పులు ఉన్నాయో చూపించాలి. అది తప్పనిసరి. ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్రానికి ఎవరి హయాంలో ఎంత అప్పులున్నాయో స్పష్టంగా వాళ్లే పేర్కొన్నారు. 14, 16 పేజీలను గమనిస్తే.. 2018–19 నాటికి.. అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి అప్పులు రూ.2,57,509 కోట్లు. వీటికి ప్రభుత్వ గ్యారంటీతో వివిధ కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు కూడా కలుపుకుంటే మరో రూ.55వేల కోట్లు. అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి (2018–19) రూ.3.13 లక్షల కోట్ల అప్పులున్నాయి. ⇒ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి రూ.3.13 లక్షల కోట్లు ఉన్న అప్పులు, మా ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.4.91,774 కోట్లకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీతో వివిధ కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు మరో రూ.1.54 లక్షల కోట్లు.. రెండు కలిపితే రూ.6.46 లక్షల కోట్లు. ఈ వివరాలను వాళ్లే స్పష్టం చేశారు. అలాంటప్పుడు వాళ్లు ప్రచారం చేసినట్టుగా ఎక్కడ రూ.10 లక్షల కోట్లు, ఎక్కడ రూ.11 లక్షల కోట్లు, ఎక్కడ రూ.12.50 లక్షల కోట్లు, ఎక్కడ రూ.14 లక్షలు కోట్లు అప్పులు? ఇవన్నీ దుష్ప్రచారాలే కదా?అప్పుల రత్న బిరుదు ఎవరికి ఇవ్వాలి?⇒ ఎవరెవరి హయాంలో ఎంతెంత అప్పులు చేశారో అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు (డెట్ కాంపౌండ్ గ్రోత్ రేటు) ఎంతుందో ఒక్కసారి చూద్దాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.1.32 లక్షల కోట్ల అప్పులు ఉంటే.. ఆయన దిగిపోయేసరికి రూ.3.13 లక్షల కోట్లు అప్పులుగా ఉన్నాయి. అంటే అప్పుల సగటు వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్) 19.54 శాతం. అదే మా హయాంలో అప్పు రూ.3.13 లక్షల కోట్ల నుంచి రూ.6.46 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు 15.61 శాతం. అంటే.. చంద్రబాబు కంటే 4 శాతం తక్కువగా అప్పులు చేశాం.⇒ ఇక ప్రభుత్వ రంగ సంస్థల నాన్ గ్యారంటీ అప్పులు చూసినా.. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.8,638 కోట్లు ఉన్న నాన్ గ్యారంటీ అప్పులు.. ఆయన దిగిపోయే నాటికి రూ.77,228 కోట్లకు చేరాయి. పవర్ సెక్టార్, డిస్కమ్లకు చేసిన అప్పులు ఏకంగా 54.98 శాతం పెరిగాయి. మేము డిస్కమ్లు కాపాడేందుకు, పబ్లిక్ సెక్టార్, నాన్ గ్యారంటీడ్ లయబులిటీస్ అయినా సరే దాన్ని తగ్గించే కార్యక్రమం చేశాం. రూ.77,228 కోట్ల నుంచి రూ.75,386 కోట్లకు తగ్గించాం. అంటే మా హయాంలో రుణం పెరగకపోగా – 0.48 శాతం తగ్గించాం. ⇒ ప్రభుత్వ అప్పు, గ్యారంటీ అప్పు,. నాన్ గ్యారంటీ అప్పులు అన్ని కలిపి చూస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి అంటే 2014 నాటికి రూ.1.40 లక్షల కోట్లు ఉంటే.. ఆయన దిగేపోయే సరికి రూ.3.90 లక్షల కోట్లు చేరాయి. అంటే అప్పుల వార్షిక వృద్ధిరేటు 22.63 శాతం ఉంటే.. మా హయాంలో రూ 3.90 లక్షల కోట్లు రూ.7.21 లక్షల కోట్లు అయ్యింది. 13.57 శాతంగా అప్పుల వార్షిక వృద్ధి రేటు నమోదైంది. అది కూడా రెండేళ్లు కోవిడ్ దుర్భర పరిస్థితుల్లో. నిజంగా ఏదైనా అవార్డు ఇవ్వాలంటే మా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, అప్పుల రత్న బిరుదు చంద్రబాబుకు ఇవ్వాలి. -
నేడు బడ్జెట్పై వైఎస్ జగన్ మీడియా సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2024–25కు సంబంధించిన రాష్ట్ర బడ్జెట్పై బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ఉంటుందని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం తెలిపింది. -
Andhra Pradesh: దమన నీతి.. అరాచక రీతి
‘అమ్మకు నిల్లు.. నాన్నకు ఫుల్లు’ అని సోషల్ మీడియాలో పోస్టు పెడితే పోలీసు కేసు.. పోలీస్ స్టేషన్లోనే వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి చేసిన టీడీపీ నేతలపై మాత్రం కేసే లేదు..‘మద్యం వద్దు... బడి ముద్దు’ అని పోస్టు పెడితే వెంటనే కేసు 3 వేల కుటుంబాలు గ్రామాలు విడిచి వెళ్లేట్టు చేసిన టీడీపీ గూండాలపై మాత్రం కేసులు లేవు.. ‘మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ’ అని పోస్టు పెడితే పోలీసు కేసు.. లోకేశ్ ఫొటో ముందు మోకరిల్లి క్షమాపణ చెప్పకపోతే చంపేస్తామని బెదిరిస్తే మాత్రం కేసు లేదు.. ‘రైతుకు పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తారు’ అని పోస్టు పెడితే కేసు..మద్యం దుకాణానికి టెండరుదాఖలు చేసిన ఓ వ్యాపారిపై దాడి చేస్తే మాత్రం కేసే లేదు..ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ విజయభారతికి ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘునాథ్రెడ్డి, డాక్టర్ తనూజరాణి, గొల్ల బాబురావు టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. కూటమి పార్టీల విశృంఖలత్వం వికటాట్టహాసం చేస్తోంది. రాజ్యాంగాన్ని కాలరాస్తూ అరాచక కేళి సృష్టిస్తోంది. పాలకులను ప్రశ్నించే హక్కు పౌరులకు లేదని స్వీయ తీర్పు ఇచ్చుకుంది. కాదు కూడదని ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివిస్టులే లక్ష్యంగా అరాచకానికి తెగబడుతోంది. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజ్యాంగ ధర్మాన్ని మంటగలుపుతూ పౌర హక్కులను కాలరాస్తోంది. వారి ద్వారా ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతోంది. అదుపులోకి తీసుకున్న వారిని 24 గంటల్లో న్యాయ స్థానంలో హాజరు పరచకుండా నిరంకుశంగా వ్యవహరిస్తోంది. మహిళలు, వృద్ధులు.. అన్న విచక్షణ లేకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోంది. ఎఫ్ఐఆర్లలో అక్కసున్న వారి పేర్లు చేరుస్తోంది. ఒక్కొక్కరిపై ఐదారు కేసులు నమోదు చేయిస్తూ రాక్షసానందం పొందుతోంది. నాలుగైదు రోజుల్లోనే 147 అక్రమ కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం.భావ ప్రకటన స్వేచ్ఛకు ఆధునిక కాల వేదికగా నిలుస్తున్న సోషల్ మీడియాను అక్రమ కేసుల ఉక్కు సంకెళ్లతో బంధించేందుకు ఈ సర్కారు విఫలయత్నం చేస్తోంది. ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. - సాక్షి, అమరావతి, నెట్ వర్క్నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఆ చిన్నారిని కనిపించకుండా చేసినా నేటికీ ఆచూకీ కనిపెట్టలేదు... కానీ... అదే నంద్యాల జిల్లాలో పత్రికల్లో ప్రచురితమైన ప్రభుత్వ వ్యతిరేక కథనాలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేశాడని ఫిర్యాదు వచ్చిన వెంటనే ఆ వ్యక్తిని కనిపెట్టి అరెస్ట్ చేశారు. మీడియా కథనాలు పోస్టు చేశాడని.. పత్రికల్లో ప్రచురితమైన ప్రభుత్వ వ్యతిరేక కథనాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడని, టీడీపీ నేతలను కించపరిచే పోస్టులను ఫార్వర్డ్ చేశాడని నంద్యాల జిల్లా మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన తిరుమల కృష్ణ అలియాస్ జగన్ కృష్ణపై ఈ నెల 3వ తేదీన కేసు నమోదు చేశారు. అతనిపై కేసు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు అదే రోజు రాత్రి కర్నూలు సీసీఎస్ పోలీసులు వెల్లడించారు. నాలుగో తేదీ కర్నూలు ఎక్సైజ్ కోర్టు ఇన్చార్జ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుచగా రిమాండ్ విధించారు. కృష్ణను పోలీసులు కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. పిల్లలతో బహిరంగంగా మద్యం విక్రయించేవారిపై చర్యలు శూన్యం... విద్య వద్దు.. మద్యం ముద్దు.. అని ప్రభుత్వ తీరును నిరసిస్తూ పోస్టు పెడితే మాత్రం అరెస్ట్... విద్య వద్దు... మద్యం ముద్దు అన్నందుకు..శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం వీరచిన్నయ్యగారిపల్లికి చెందిన మలక అమర్నాథ్రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారని, చంద్రబాబు, లోకేశ్లను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడుతున్నారని కదిరికి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ నెల 2న కదిరి రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ‘విద్య వద్దు.. మద్యం ముద్దు, నాన్నకు ఫుల్.. అమ్మకు నిల్’ అనే పోస్టులు పెట్టాడని అమర్నాథ్రెడ్డిపై కేసు నమోదు చేశారు. అమర్ నాథ్రెడ్డిని పోలీసులు విచారణ పేరిట స్టేషన్ చుట్టూ తిప్పు కుని ఇబ్బంది పెట్టారు. చివరకు న్యాయ వాదుల సాయంతో బెయిల్ తెచ్చుకున్నాడు. అయినప్పటికీ మరోసారి అదుపులోకి తీసుకున్నారు.శ్రీకాకుళం నగరంలో ఓ మహిళను వివస్త్రను చేసి ఒంటిపై కారం చల్లి కొడితే చర్యలు లేవు... కానీ... అదే జిల్లాలో ఓ వృద్ధురాలు పింఛను కోసం వెళ్లి సొమ్మసిల్లి పడిపోయిందని సోషల్ మీడియాలో ఫొటో పెడితే మాత్రం నిర్బంధిస్తారు? వృద్ధురాలి వేదనను వివరించిందుకు..శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో ఈ నెల 1న బైనపల్లి దానమ్మ అనే వృద్ధురాలు పింఛన్ల కోసం వేచి చూస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. ఆ విషయాన్ని అదే మండలం కొండపల్లి గ్రామానికి చెందిన మడ్డు జశ్వంత్ సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో టీడీపీ నాయకులు అతనిపై కక్ష కట్టి పోలీసుల చేత అక్రమ కేసులు పెట్టించారు. పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి గంటల కొద్దీ ఉండి కుటుంబ సభ్యులను వేధించారు. ఎలాంటి నోటీసూ ఇవ్వలేదు. జశ్వంత్ను స్టేషన్కు తీసుకెళ్లి కనీసం భోజనం పెట్టలేదు. ఇప్పటికీ పిలుస్తూనే ఉన్నారు. ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వలేదని బాధితుడు చెబుతున్నాడు. దళిత వైద్యుడి చొక్కా పట్టుకుని ఎమ్మెల్యే దాడికి ప్రయత్నించినా... విధుల్లో ఉన్న ఎస్ఐని మంత్రి భార్య దుర్భాషలాడినా నో యాక్షన్... పవన్కళ్యాణ్పై మంద కృష్ణమాదిగ తీవ్ర ఆగ్రహం... అని ఓ వ్యక్తి వాట్సాప్ గ్రూపులో పెడితే.. ఆ గ్రూపులో ఉన్నవారికి పోలీసు నోటీసులు వాట్సాప్ గ్రూపులో ఉన్నందుకు..ఎన్టీఆర్ జిల్లా పెండ్యాల గ్రామానికి చెందిన హనుమంతరావు ఒక వాట్సాప్ గ్రూపులో ఉన్నారు. ఆ గ్రూపులో ఇటీవల ‘పవన్కళ్యాణ్పై మంద కృష్ణమాదిగ తీవ్ర ఆగ్రహం. సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం మంద కృష్ణ... పవన్పై తీవ్రమైన వ్యాఖ్యలు.’ అని మరో వ్యక్తి పోస్ట్ పెట్టారు. కానీ, ఆ గ్రూపులో ఉన్నందుకు హనుమంతరావుకు పోలీసులు నోటీసు ఇచ్చారు. ఎన్నికల తర్వాత 179 మంది అత్యంత ఘోరంగా, దారుణంగా హత్యకు గురైనా నిందితులపై చర్యలు శూన్యం... కానీ... ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్టుపై ఫొటోను ఫేస్బుక్లో పెడితే మాత్రం కేసు కట్టి రోజూ స్టేషన్కు పిలిచి వేధింపులు... బాబు అరెస్ట్ ఫొటో షేర్ చేసినందుకు..వినోద్ పెట్టిన పోస్టు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట గ్రామానికి చెందిన పిళ్లెం వినోద్ ప్రైవేట్ ఎలక్రీషియన్గా పనిచేస్తున్నాడు. ఎన్నికల సమయంలో చంద్రబాబు అరెస్టయినప్పటి ఫొటో ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఈ నెల 2న వినోద్పై గ్రామ టీడీపీ నాయకులు పెనుగంచిప్రోలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి రోజూ పోలీస్స్టేషన్కు పిలిపించి కూర్చోబెట్టి నేతలపై పోస్టులు పెట్టవద్దని హెచ్చరిస్తున్నారు.తూర్పు గోదావరి జిల్లాలోని నర్సరీల్లో పనికి వచ్చే వలస కూలీలపై వరుస లైంగిక దాడులకు పాల్పతున్న వారిపై కేసులు లేవు... కానీ... విజయవాడలో వరద సాయంపై పోస్టు పెట్టిన వ్యక్తి కోసం అనేక ప్రాంతాల్లో గాలించి ఆఖరికి ఆలయానికి వెళుతుండగా పట్టుకున్నారు! అగ్గిపెట్టెలు.. కొవ్వొత్తులకు కోట్లు.. అంటేనే.. విజయవాడను వరద ముంచెత్తినప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు కోట్ల రూపాయలు ఖర్చుచేశారని పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు గ్రామానికి చెందిన కల్లా నాగిరెడ్డి ‘ఎక్స్’లో పోస్టు చేశాడు. దీనిపై మార్కాపురానికి చెందిన కుంచాల యశ్వంత్ గత నెల 21వ తేదీన మార్కాపురం టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నవంబర్ 5వ తేదీన ఉదయం తాడేపల్లిలోని అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళుతుండగా అయ్యప్పమాలలో ఉన్న నాగిరెడ్డిని అరెస్టు చేసి మార్కాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. అర్ధరాత్రి సమయంలో 41 (ఏ) నోటీసు ఇచ్చి విడుదల చేశారు.మంగళగిరి నియోజకవర్గంలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టి అర్ధనగ్నంగా లోకేశ్ ఫొటో ఎదుట మోకాళ్లపై కూర్బోబెట్టి క్షమాపణలు చెప్పిస్తే కేసు లేదు... టీడీపీ నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయని ప్రజలు తీసి సోషల్ మీడియాలో పెట్టిన వీడియోను ఫార్వర్డ్ చేస్తే మాత్రం క్షణాల్లోనే అరెస్ట్... వీడియో ఫార్వర్డ్ చేసినందుకు... చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అనుచరుల ఆగడాలు పెరిగిపోయాయని, మద్యం దుకాణాల్లో వాటా అడుగుతూ వ్యాపారులపై దాడులు చేస్తున్నారని సోషల్ మీడియాలో వచ్చిన వీడియోను అక్టోబర్ 27వ తేదీన పాలేటి కృష్ణవేణి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేశారు. ఆమెను ఈ నెల 2వ తేదీన గుంటూరు జిల్లా తాడేపల్లిలో అరెస్ట్ చేసి చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. అదే రోజు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా బెయిల్ మంజూరు చేశారు. వందలాది గ్రామ, వార్డు సచివాలయాలను టీడీపీ మూకలు ధ్వంసం చేసినా ఒక్క కేసు లేదు... రూ.436 కోట్లతో రిషికొండలో అద్భుతమైన భవనం వైఎస్ జగన్ కట్టించారు.. ఐదేళ్లలో నోవాటెల్ హోటల్ అద్దె రూ. 300కోట్లు.. అని పోస్టు పెడితే వెంటనే పోలీస్స్టేషన్లో నిర్బంధం.. రిషికొండలో అద్భుత భవనం అన్నందుకు..ఎన్టీఆర్ జిల్లా పరిటాల గ్రామానికి చెందిన జమలయ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ‘రూ.436 కోట్లతో రిషికొండలో అద్భుతమైన భవనం వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టించారు. ఐదేళ్లలో నోవాటెల్ హోటల్ అద్దె రూ. 300 కోట్లు. మీకు అర్థమైంది’ అని జమలయ్య ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. దీంతో పోలీసులు అతన్ని స్టేషన్కు తీసుకువెళ్లి రెండు రోజులు ఉంచారు. జమలయ్య సెల్ఫోన్ స్వా«దీనం చేసుకుని నోటీసు ఇచ్చారు. తప్పుడు ప్రచారం నమ్మవద్దన్నందుకే... ఎన్టీఆర్ జిల్లా పెండ్యాల గ్రామానికి చెందిన షేక్ షబ్బీర్ తిరుమల లడ్డూ వివాదంలో చంద్రబాబు చేసిన అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దని వాట్సాప్ గ్రూప్లో సమాచారం పెట్టాడు. ఈ విషయాన్ని జీరి్ణంచుకోలేని టీడీపీ మూకలు కేసు పెట్టటంతో షబ్బీర్ను రెండు రోజులపాటు పోలీస్స్టేషన్లో ఉంచి చితకబాదారు. సెల్ఫోన్ తీసుకున్నారు. అతనితోపాటు వాట్సాప్ గ్రూప్లో ఉన్న 170 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్ను పొగిడినందుకే నోటీసు ఎన్టీఆర్ జిల్లా పెండ్యాలకు చెందిన మహ్మద్ నసరత్ ఇటీవల ఓ వాట్సాప్ గ్రూపులో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని పొగుడుతూ పోస్టు పెట్టారు. దానిపై కూడా ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహ్మద్ నసరత్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.ఐటీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేస్తే చాలు... శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన బాలాజీరెడ్డి ఫేస్బుక్లో టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా పోస్టు పెడుతున్నాడని ఐటీడీపీకి చెందిన ఎ.పవన్కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ నెల 2వ తేదీన పోలీసులు అర్ధరాత్రి వేళ బాలాజీరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అదేరోజున రొద్దం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. విచారణ తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. అయితే.. ఈ నెల ఏడో తేదీన మరోసారి అదుపులోకి తీసుకున్నారు. వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన తర్వాత శనివారం విడిచిపెట్టారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వరు.. కేసు వివరాలు చెప్పరు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ షేక్ గౌస్ ఇటీవల ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టారని పోలీసులకు ఫిర్యాదు అందింది. వారం కిందట గౌస్ను పోలీసులు స్టేషన్కు పిలిపించి ఫోన్ తీసుకుని నాలుగు రోజులు స్టేషన్ చుట్టూ తిప్పారు. కేసు నమోదు చేసి 41 నోటీసు ఇచ్చారు. కానీ ఎఫ్ఐఆర్ కాపీ, కేసు వివరాలు అడిగితే స్పందించలేదు. పది నెలల కిందట పోస్టు... ఇప్పుడు అరెస్టు ప్రకాశం జిల్లా సీఎస్ పురం మండలం అనిగాండ్లపల్లికి చెందిన హరీశ్వర్రెడ్డి ‘ఎక్స్’లో ఈ ఏడాది జనవరి 24న నాటి టీడీపీ మహిళా అధ్యక్షురాలు, ప్రస్తుతం హోంమంత్రి వంగలపూడి అనితను అసభ్య పదజాలంతో దూషించారని కోవూరుకు చెందిన టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హరీశ్వర్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు కుటుంబంపై కూడా ‘ఎక్స్’లో హరీశ్వర్రెడ్డి అసభ్యంగా పోస్టింగ్ పెట్టారని నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 6వ తేదీన అరెస్ట్ చేశారు. స్టేషన్ బెయిల్పై వదిలి పెట్టారు. పొదిలిలో ఫిర్యాదు.. విశాఖలో అరెస్టు విశాఖట్నానికి చెందిన బోస రమణారెడ్డి.. ఎక్స్, ఇన్స్ట్రాగామ్లలో పోస్టులు పెట్టడం ద్వారా మంత్రి లోకేష్ గౌరవ మర్యాదలు తగ్గించే ప్రయత్నం చేసినట్లు పొదిలికి చెందిన టీడీపీ నాయకుడు గత నెల 21వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసు విచారణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి విశాఖపట్నం వెళ్లి మరీ రమణారెడ్డిని ఈ నెల 6న అరెస్టు చేసి పొదిలికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి పొదిలి పోలీస్స్టేషన్లోనే ఉన్నట్లు సమాచారం.కందిపప్పు కిలోకి.. 780 గ్రాములే ఉందన్నందుకు.. ప్రభుత్వం ప్రజలకు పౌరసరఫరాల శాఖ కిలో పేరిట ఇస్తున్న కందిపప్పు 780 గ్రాములు మాత్రమే ఉండటంతో ఆ విషయాన్ని గత నెల 4వ తేదీన ఫేస్బుక్లో పెట్టిన అచ్చంపేట మండలానికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ తుమ్మా బాబుల్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరైన బాబుల్ రెడ్డి ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. రెండు, మూడు రోజులు తమకు అందుబాటులో ఉండాలని హెచ్చరించి పంపించారు. జోగి రమేష్ వీడియోను స్టేటస్గా పెట్టుకున్నందుకు.. మాజీ మంత్రి జోగి రమేష్ వీడియోను వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నందుకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన కె.నానిపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. జోగి రమేష్ గతంలో ఒక వేదికపై.. జనసేన నేత పవన్కళ్యాణ్ను ఎన్ని పార్టీలు మారుస్తావ్, ఎన్ని జెండాలు మారుస్తావని ప్రశ్నించారు. ఈ వీడియోని నాని తన వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టు చూసినందుకు సాక్ష్యం చెప్పాలని నోటీసులు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామానికి చెందిన బద్దం అశోకరెడ్డి నిర్వహించే ‘వైఎస్సార్ కుటుంబం’ అనే గ్రూప్లో ఉన్న చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి చెందిన దిలీప్ రెడ్డి, చిట్టిబాబు, జిల్లేడయ్య, మోతీలాల్, సతీష్, అంగముత్తు, జలంధర్లను విజయవాడ సిటీ, సైబర్ క్రైం పోలీస్ స్టేషన్కు సాక్షులుగా రావాలని అండర్ 17 బీఎన్ఎస్ఎస్ కింద నోటీసులు అందించారు. వెంటనే రాకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంతకూ ఆ గ్రూపులో ఏ పోస్టు చూసినందుకు తమను రమ్మంటున్నారో చెప్పకుండానే నోటీసులివ్వడం పట్ల వారు లబోదిబోమంటున్నారు.సీఎం వ్యాఖ్యలను ఖండించారని...శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బండగానిపల్లి గ్రామానికి చెందిన బేరి తిరుపతిరెడ్డి గత నెలలో తిరుపతి లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, బెయిల్పై విడుదలయ్యారు. పోస్టులు ఫార్వర్డ్ చేశారనికావలి పట్టణంలోని 11 వార్డుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆత్మకూరు రాజేష్, దామెర్ల శ్రావణ్ కుమార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తున్నారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కావలి వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వ్యతిరేకత సహించలేక... నెల్లూరు జిల్లాకు చెందిన మద్దిబోయిన వీరరఘు, కుందర్తి శ్రీనివాసులు, మేకల శ్రీనివాసులు(బోగోలు), ఉప్పాల మాచర్ల(ఎస్జీవీ కండ్రిక), ఏకే సుందరరాజు(విశ్వనాథరావుపేట)లు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ప్రభుత్వ వైఫల్యాలపై మీడియాలో వచ్చిన కథనాలు, పోస్టులను ఫార్వర్డ్ చేస్తున్నారని కూటమి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీరిపై నెల్లూరు జిల్లాలో పోలీసులు కేసులు నమోదు చేశారు. తరచూ స్టేషన్లకు పిలిచి ఇబ్బంది పెడుతున్నారు. టీడీపీ నేత మందు పార్టీ ఫొటోలు ఫార్వర్డ్ చేశారని..నెల్లూరు జిల్లా దగదర్తిలో టీడీపీ నేత పమిడి రవికుమార్ చౌదరి తన స్నేహితులతో కలిసి వ్యవసాయ భూముల్లో ఉన్న గెస్ట్హౌస్లో మందుపార్టీ చేసుకున్నారు. ఆ ఫొటోలు ఒక సోషల్ మీడియా గ్రూపులో వచ్చాయి. ఆ ఫొటోలను సబ్బా ప్రభావతి ఇతరుల వాట్సాప్ గ్రూపుల్లోకి ఫార్వర్డ్ చేశారనే కారణంతో ఆమెపై కేసు నమోదు చేశారు.నోటీసు ఇవ్వకుండానే అరెస్టు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్పై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఈ నెల 3వ తేదీన విశాఖకు చెందిన బోడి వెంకటేష్పై బాపట్ల జిల్లా మార్టూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 5వ తేదీన మార్టూరు పోలీసులు విశాఖకు వచ్చారు. నోటీసు ఇవ్వకుండా వెంకటేష్ను దువ్వాడ పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లి విచారించారు. అడిగిన తరువాత 41ఏ నోటీసు ఇచ్చి విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీన మార్టూరు పోలీస్స్టేషన్లో విచారణకు హాజరుకావాలని చెప్పారు. ఇంతలో ఈ నెల 6వ తేదీన గాజువాకకు చెందిన టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు సాకెళ్ల రతన్కాంత్.. బోడి వెంకటేష్పై దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 7వ తేదీన విచారణకు పిలిచి అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. కక్ష కట్టి... కేసు పెట్టి... ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణానికి చెందిన తమ్మవరపు మురళీకృష్ణ, ఎ.నరేంద్ర సోషల్ మీడియా యాక్టివిస్ట్లు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పోస్టులను సోషల్ మీడియాలో ఫార్వార్డ్ చేశారని వారం రోజుల క్రితం వీరిద్దరిపై జగ్గయ్యపేటలో కేసులు నమోదు చేశారు. వారి ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. రోజూ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు.బూట్లు వేసుకుని సీఎం పూజలు చేయడం తప్పు అన్నందుకు... అనంతపురం జిల్లా శెట్టూరు మండలం యాటకల్లు గ్రామానికి చెందిన లక్ష్మణమూర్తి తిరుపతి లడ్డూ వివాదం సమయంలో ఒక వాట్సాప్ గ్రూప్లో ‘పూజా కార్యక్రమాలలో బూట్లు వేసుకుని పాల్గొనే తమరు కూడా హిందూ మతం గురించి మాట్లాడటానికి సిగ్గు ఉండాలి’ అంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి పోస్టు చేశాడని సెపె్టంబర్ 26న టీడీపీ నాయకుడు కళ్యాణదుర్గం అర్బన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి లక్ష్మణమూర్తిని అరెస్టు చేశారు. విచారణ అనంతరం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బైండోవర్శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం కె.పూలకుంట గ్రామానికి చెందిన ఆంజనేయులు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నాడనే కారణంతో ఈ నెల 6వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక రోజు అక్రమంగా నిర్బంధించి మరుసటి రోజు బైండోవర్ చేశారు. ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అరెస్టు చూపకుండా... ఆందోళనకు గురిచేసి..అనంతపురం జిల్లా మదిగుబ్బ గ్రామానికి చెందిన జింకల రామాంజినేయులు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్టు చేశాడన్న అభియోగాలతో ఇటుకలపల్లి పోలీసులు ఈ నెల 5వ తేదీ అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అరెస్టు చూపకుండా, కుటుంబ సభ్యులకు అతని ఆచూకీ తెలపకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. దీంతో కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి రామాంజినేయులు ఆచూకీ తెలపాలని కోరారు. న్యాయస్థానం సీరియస్ కావడంతో పోలీసులు ఎట్టకేలకు శుక్రవారం (ఈ నెల 8న) అనంతపురంలోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.ఇంటూరిపై15 కేసులు?విశాఖపట్నం మధురవాడ పరిధిలోని ధర్మపురి కాలనీకి చెందిన ఇంటూరి రవికిరణ్ పొలిటికల్ పంచ్ వెబ్ చానెల్ నిర్వహిస్తున్నారు. ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో యాక్టివ్గా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ పోలీసులు కేసుల పేరుతో వేధిస్తున్నారు. ఆయనపై దువ్వాడ, గుంటూరు, విజయవాడ, మార్టూర్ పోలీస్స్టేషన్లలో ఒక్కో కేసు.. గుడివాడ పోలీస్స్టేషన్లో రెండు కేసులు, రాజమండ్రిలోని ప్రకాష్నగర్లో పలు కేసులు నమోదు చేశారు. మొత్తంగా ఇతనిపై దాదాపు 15 కేసులు నమోదు చేశారు. తాజాగా రాజమండ్రిలోని ప్రకాష్నగర్ పోలీసులు రవికిరణ్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.రెండేళ్ల క్రితం పోస్టులు పెట్టారని... వైఎస్సార్ జిల్లా వేముల మండలం కొండ్రెడ్డిపల్లెకు చెందిన వర్రా రవీందర్రెడ్డి రెండేళ్ల క్రితం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర నాయకులపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టింగులు పెట్టారని కడప తాలూకా పోలీసుస్టేషన్లో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 4వ తేదీన కేసు నమోదు చేశారు. అదే రోజు రాత్రి కడప నుంచి పోలీసు బృందం కొండ్రెడ్డిపల్లెలోని వర్రా రవీందర్రెడ్డి ఇంటికి వెళ్లింది. ఆయనను 5వ తేదీ తెల్లవారుజామున కడప తాలూకా పోలీసుస్టేషన్కు తీసుకువచ్చారు. 41 నోటీసు ఇచ్చి జామీను ద్వారా పంపించారు. వర్రా రవీందర్రెడ్డి కుటుంబ సభ్యులను కూడా చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్కు తీసుకొచ్చి వేధింపులకు గురిచేశారు. ఈ విషయం మీడియాలో రావడంతో రాత్రి 7 గంటలసమయంలో కుటుంబ సభ్యులకు 41ఏ నోటీసు ఇచ్చి పంపించారు. ఆ తర్వాత మళ్లీ రవీందర్రెడ్డిని ఈ నెల 8వ తేదీన మహబూబ్నగర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎట్టకేలకు అతడ్ని సోమవారం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.భార్యాభర్తలకు చిత్రహింసలు పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన పెద్దిరెడ్డి సుధారాణి భర్త వెంకటరెడ్డి కాంట్రాక్టర్. ప్రస్తుతం వీరు తెలంగాణలోని నల్లగొండ జిల్లా వెంకటరమణ కాలనీలో నివాసం ఉంటున్నారు. టీడీపీ, జనసేన నాయకులపై సుధారాణి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఈ నెల 4వ తేదీన ఆమెతోపాటు భర్త వెంకటరెడ్డిని కూడా సిరిసిల్లలోని జొన్నవాడ గ్రామంలో రాజరాజేశ్వరీదేవి దర్శనానికి వెళ్లగా, చిలకలూరిపేట సీఐ రమేష్, మరో ఏడుగురు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారిని వెంటనే చిలకలూరిపేట తీసుకువచ్చి అక్రమంగా నిర్బంధించి వేధించారు. ఆరో తేదీన వారిని అరెస్టు చేసినట్లు తెలియజేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అయితే, ఆ వెంటనే ప్రకాశం జిల్లా ఒంగోలు వన్టౌన్ పోలీసులు సుధారాణి దంపతులను అదుపులోకి తీసుకుని ఒంగోలుకు తరలించారు. వైఎస్సార్సీపీ న్యాయవాదులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో నవంబరు 9న గుంటూరు కొత్తపేట పోలీసులు జనసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు హడావుడిగా అరెస్టు చూపారు. అంతకు ముందు చిలకలూరిపేట నుంచి ఒంగోలు పోలీసు స్టేషన్కు తరలించి, అక్కడ కూడా మహిళ అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురిచేశారని బాధితురాలు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘సోషల్’ కుట్రవరుస హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రం అట్టుడుకుతుండటం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో హత్యలు, అత్యాచారాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వరుస దాడులు, దౌర్జన్యాలతో యథేచ్ఛగా విధ్వంసకాండ కొనసాగుతోంది. తమకు ఓటేయలేదన్న కారణంతో టీడీపీ గూండాలు కర్రలు, కత్తులు చేత పట్టుకుని స్వైర విహారం చేస్తున్నారు. ఫలితంగా నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 179 మంది హత్యకు గురయ్యారు. మరో నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సుమారు 500 మందిపై హత్యాయత్నాలకు తెగబడ్డారు. ఏకంగా 100 మందిపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయి. వారిలో 11 మందిపై అత్యాచారం చేసి హత్య చేయడం దిగ్భ్రాంతి పరుస్తోంది. 2 వేలకు పైగా దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. టీడీపీ గూండాల దాడులతో భీతిల్లి దాదాపు 3 వేల కుటుంబాలు గ్రామాలు విడిచిపెట్టి ఇతర ప్రాంతాల్లో తల దాచుకుంటున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. బాధితులపైనే ఎదురు కేసులు పెడుతున్నారు. హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు శాఖకు స్పష్టమైన మార్గ నిర్దేశం చేయలేదు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఇసుమంతైనా స్పందించక పోవడం పట్ల ప్రజల్లో తీవ్ర నిరసన వెల్లువెత్తుతోంది. ఈ నిరసన మరింత ఉధృతంగా మారనుందని తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఎప్పటిలాగే డైవర్షన్ రాజకీయాలకు తెర లేపారు. ప్రభుత్వ తీరు పట్ల నిరసన తెలుపుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు పెట్టిస్తూ తనదైన శైలిలో ప్రజల దృష్టి మళ్లించేందుకు పూనుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. -
ప్రశ్నించే స్వరం వినిపించకూడదా?: వైఎస్ జగన్
డీజీపీ చట్టం, న్యాయం వైపు నిలబడాలి. ఇప్పుడున్న డీజీపీ మా హయాంలో ఆర్టీసీ సీఎండీ స్థానంలో పని చేశారు. మంచి పదవి ఇచ్చి బాగా చూసుకున్నాం. కానీ ఈరోజు ఏ స్థాయికి దిగజారిపోయారంటే.. లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తుంటే.. ఆయన అధికార పార్టీ కార్యకర్తలా మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో పోలీసులు సరిగా పనిచేయలేదని చెబుతున్నాడు. మరి ఆయన కూడా ఆ ప్రభుత్వంలో పనిచేశాడు కదా? మరి ఇప్పటి ప్రభుత్వం సవ్యంగా, బ్రహ్మాండంగా పని చేస్తోందా? ఆయన డీజీపీగా ఉన్న ప్రభుత్వం సవ్యంగా పని చేస్తే.. ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు దొంగ కేసులు పెడుతున్నారు? ఐదు నెలలు తిరగక ముందే 91 మంది అక్క చెల్లెమ్మల మీద ఎందుకు అత్యాచారాలు జరిగాయి? ఎందుకు ఏడుగురు మహిళలు చనిపోయారు? చివరకు ప్రజల తరపున గొంతు విప్పుతున్న సోషల్ మీడియా యాక్టివిస్ట్లను ఎందుకు అక్రమ నిర్భంధాలు చేస్తున్నారు?సాక్షి, అమరావతి: కూటమి సర్కారు అక్రమాలు, మోసాలు, వైఫల్యాలపై ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తుండటం.. సామాజిక స్పృహ ఉన్నవారు, సోషల్ మీడియా కార్యకర్తలు నిలదీస్తుండటంతో సీఎం చంద్రబాబు తట్టుకోలేక ప్రశ్నించే స్వరం వినిపిస్తే చాలు అక్రమ కేసులు బనాయించి నిర్బంధిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలను, సోషల్ మీడియా కార్యకర్తలను హింసిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసు సోదరులారా.. న్యాయం, ధర్మం వైపు నిలబడాలని సూచించారు. పోలీసులు టోపీపై కన్పించే 3 సింహాలకు సెల్యూట్ చేయాలేగానీ రాజకీయ నేతల చెప్పినట్టు తప్పుడు కేసులు బనాయిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వమే అధికారంలో ఉండదనే విషయాన్ని పోలీసులు గుర్తించుకోవాలన్నారు. రిటైర్ అయిన తర్వాత వెళ్లిపోతాం అని అనుకుంటున్నారేమో..! సప్త సముద్రాల అవతల ఉన్నా రప్పించి చట్టం ముందు దోçÙులుగా నిలబెడతామన్నారు. దొంగ కేసులు పెడుతున్న ప్రతి పోలీస్ అధికారిపై ప్రైవేటు కంప్లైంట్లు ఫైల్ చేస్తామన్నారు. ప్రతి బాధితుడికి వైఎస్సార్ సీపీ న్యాయ సహాయం అందిస్తుందని చెప్పారు. ఎన్నికల్లో మీరు చెప్పిన సూపర్ సిక్స్లు ఏమయ్యాయని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారన్నారు. వారం రోజుల్లో 101 మంది సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని.. సుప్రీం తీర్పులనూ అవహేళన చేస్తున్నారన్నారు. తన కుటుంబ సభ్యులపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ప్రశ్నించే స్వరాలు ఉండకూడదా? అని నిలదీశారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు బాధితులంతా.. రేపు రెడ్ బుక్ పెట్టుకుంటారు...పోలీసు అంటే గౌరవం ఉండాలి. వ్యవస్థలు బతకాలి కానీ నీరుగారిపోకూడదు. రాజకీయ నేతలు చెబుతున్నారని తెలిసి కూడా తప్పులు చేయడం పోలీసులకు మంచిది కాదు. తిరుపతిలో సుబ్బరాయుడు ఉన్నాడు. చంద్రబాబు తెలంగాణ నుంచి డిప్యూటేషన్పై తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తెలంగాణ వెళ్లిపోతామని అనుకుంటున్నారేమో? తెలంగాణ నుంచి మళ్లీ పిలిపిస్తాం. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా రప్పిస్తాం. రెడ్ బుక్ పెట్టుకోవడం పెద్ద పనికాదు. ఈ రోజు నష్టపోయిన బాధిత కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ రెడ్ బుక్ పెట్టుకుంటారు. వాళ్లందరూ నా దగ్గరకు వచ్చి గ్రీవెన్స్ చెబుతారు. అప్పుడు నేను చూస్తూ ఊరుకోను.వారిని ఎందుకు అరెస్టు చేయరు?రెండేళ్ల క్రితం మా అమ్మ కారు టైర్ బరస్ట్ అయితే.. ఇది ఈరోజు కొత్తగా జరిగినట్లుగా చిత్రీకరించి.. తల్లిని చంపడానికి జగన్ ప్రయత్నించాడని టీడీపీ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో వికృత ప్రచారం చేశారు. ఇది ఫేక్ న్యూస్ కాదా..? అది తప్పుడు కథనం అని మా అమ్మ విజయమ్మ లేఖ విడుదల చేస్తే.. ఆ లేఖను కూడా ఫేక్ లెటర్గా చిత్రీకరిస్తూ టీడీపీ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో దుష్ఫ్రచారం చేయడం వాస్తవం కాదా? చివరకు మా అమ్మ వీడియో ద్వారా టీడీపీ దుష్ఫ్రచారాన్ని ఖండించారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీడీపీ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయడం లేదు? లోకేష్ను ఎందుకు అరెస్టు చేయడం లేదు? కడప ఎస్పీకి నా భార్య ఫోన్ చేసిందని ఆంధ్రజ్యోతిలో వార్త రాశారు. అది తప్పుడు వార్త కాదా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను ఎందుకు లోపల వేయరు? ‘డీజీపీ..! పోలీసు సోదరులారా..! మీ అందరికీ ఒకటే చెబుతున్నా. సీఎం చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం మీ వృత్తిని మీరే కించపరిచినట్లు అవుతుంది. ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదు.. జమిలి ఎన్నికలు వచ్చినా.. నాలుగేళ్ల తర్వాత ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది మేమే.. తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా నిర్భందించిన పోలీసు అధికారులు ఎక్కడున్నా వదలిపెట్టం.⇒ మహానంది మండలం యు.బొల్లవరం గ్రామానికి చెందిన తిరుమల కృష్ణను సీపీఎస్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్ట్ చేసి కర్నూలు తీసుకెళ్లారు. కృష్ణ దివ్యాంగుడని తెలిసీ అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టారు. ⇒ అన్నమయ్య జిల్లా రాయచోటిలో కె.హనుమంతరెడ్డిని రెండ్రోజుల క్రితం పోలీసులు తీసుకెళ్లారు. అరెస్ట్ చూపలేదు. ఎక్కడకు తీసుకెళ్లారో ఇప్పటివరకూ తెలియదు. ⇒ తెలంగాణలో ఉన్న వారినీ తీసుకొచ్చి వేధిస్తున్నారు. నల్గొండకు చెందిన అశోక్రెడ్డిని విజయవాడ సైబర్ పోలీసులు తీసుకొచ్చారు. కుటుంబీకులకూ సమాచారం ఇవ్వలేదు. రాజశేఖరరెడ్డి అనే వ్యకినీ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు. ఈ ఇద్దరినీ వేధిస్తున్నారు. ⇒ ఇప్పటివరకు 101 మందిపై కేసులు పెట్టారు. చట్టప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత వాటిని ఆన్లైన్లో ఉంచాలి. కానీ ఆన్లైన్లో పెట్టడం లేదు. కోర్టులకు అప్లోడ్ చేయడం లేదు. దేశంలో ఇంత అరాచక వ్యవస్థ ఎక్కడైనా ఉందా?వారం రోజుల్లో.. 101 మంది అరెస్టువారం రోజులుగా దాదాపు 101 మంది సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు సంబంధించి సుప్రీం కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. పోలీసులు ఇష్టం వచ్చినట్లు ఇంటికొచ్చి అరెస్ట్లు చేయకూడదు. ముందు 41 ఏ నోటీసు ఇచ్చి విచారణ చేయాలి. ఒకవేళ నిజంగా అరెస్ట్ చేయాల్సి వస్తే వారంట్ జారీ చేయాలి. తర్వాత మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి. ఇది సుప్రీంకోర్టు తీర్పు సారాంశం (అమేష్కుమార్ వర్సస్ బిహార్ కేసులో 2014 జూలై 2న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును చదివి వినిపించారు). కానీ మన రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతోంది? తప్పుడు కేసులు.. అక్రమ నిర్బంధాలు.. అరెస్ట్ చేసే అధికారం లేదని పోలీసులకు తెలుసు. 41 ఏ నోటీసు మాత్రమే ఇవ్వాలని తెలుసు. ఒక వేళ అరెస్ట్ చేయాల్సి వస్తే వారంట్ జారీ చేయాలి. మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి. ఇదీ పద్ధతి. కానీ.. ఎవరైనా ప్రభుత్వంపై గొంతు విప్పితే చాలు.. రాత్రికి రాత్రే.. తెల్లవారుఝామున వారి ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు. గంటల తరబడి.. కొన్ని సమయాల్లో రెండు మూడు రోజులు పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తున్నారు. కొట్టడం, తిట్టడం, అవమానించడం చేస్తున్నారు. ఒక వ్యక్తిపై ఏకకాలంలో పలు స్టేషన్లలో టీడీపీ సానుభూతిపరులతో కేసులు పెట్టిస్తూ అరెస్టు చేస్తున్నారు. రెండు మూడు స్టేషన్లు తిప్పుతున్నారు. పోలీసుల తీరుపై స్థానికులు తిరగబడితే మరో కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఎవరైనా అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యులను స్టేషన్కు తీసుకొస్తున్నారు. కుటుంబ సభ్యులను స్టేషన్కు తీసుకొచ్చే అధికారం ఏ పోలీస్కూ లేదు. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం మాట్లాడిన మాటలు గమనిస్తే డీజీపీపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు స్పష్టమవుతోంది. దాంతో డీజీపీ దగ్గరుండి కేసులు పెట్టించి.. అక్రమ నిర్భంధాలు చేయిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న స్వరాలపై కేసులు పెట్టించే స్థాయికి, తట్టుకోలేని స్థాయికి వెళ్లిపోయారు.ప్రశ్నిస్తే.. కేసులు, అక్రమ నిర్బంధాలా?⇒ విజయవాడలో వరదల నియంత్రణ, సహాయ చర్యల్లో ముఖ్యమంత్రి సహా యంత్రాంగం దారుణ వైఫల్యం చెందడంపై ప్రశ్నిస్తే అక్రమ నిర్బంధాలు. వరద సహాయం పేరుతో కోట్లాది రూపాయలు మింగేసే చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు. 1.50 కోట్ల మందికి ఆహారం అందించడానికి రూ.534 కోట్లు..! కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, మొబైల్ జనరేటర్లపై రూ.23 కోట్లు కొట్టేశారు అని అందరూ మాట్లాడారు. నీళ్లు ఉన్నప్పుడు అక్కడకు ఎలా వెళ్లారు? కరెంట్ ఇచ్చారో లేదో అందరికీ తెలుసు. కానీ.. ఈ అక్రమాలపై ప్రశ్నిస్తే చాలు అక్రమ నిర్భందాలు. మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే.. వాటిపై ప్రశ్నిస్తే అక్రమ నిర్బంధాలు. ఎమ్మెల్యేలు, వారి మనుషులు రౌడీల్లా దౌర్జన్యం చేస్తుండటంపై ప్రశ్నిస్తే అక్రమ నిర్బంధాలు. ⇒ ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు.. ఇప్పుడు ఇసుక ధరలు చూస్తే రెట్టింపు అయ్యాయి. ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయని ప్రశ్నిస్తే అక్రమ నిర్బంధాలు. రేట్లు తగ్గిస్తామని చెప్పిన మద్యంపై ఒక్కపైసా కూడా తగ్గించకుండా, పైపెచ్చు సిండికేట్లుగా మారి ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్ముతుండటంపై ప్రశ్నిస్తుంటే కేసులు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులను ప్రైవేటు వారికి ఎందుకు అప్పగించారయ్యా? అని ప్రశ్నిస్తే కేసులు. అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు తగ్గిస్తామని చెప్పారు కదా..!కానీ ఐదు నెలలు కాకమునుపే ప్రజలపై దాదాపు రూ.6 వేల కోట్ల భారం మోపారు. మరో రూ.11 వేల కోట్లు అదనంగా బాదేందుకు సిద్ధం కావడంపై ప్రశ్నిస్తే.. మళ్లీ అక్రమ నిర్బంధాలు.⇒ మీరు వస్తే సంపద సృష్టిస్తామన్నారు కదా..? ప్రజల కోసం జగన్ సృష్టించిన సంపదను ఎందుకు అమ్మేస్తున్నారు? మీ స్కామ్ల కోసం కొత్తగా కడుతున్న మెడికల్ కళాశాలలను అమ్మేస్తున్నారు. మూడు ప్రైవేటు పోర్టులు..అందులో ఒకటి 80 శాతం, రెండు 50 శాతం పూర్తయ్యాయి.. వాటి నిర్మాణానికి నిధుల కొరత కూడా లేకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. ఇవన్నీ వస్తే కదా ప్రభుత్వాదాయాలు పెరుగుతాయి. ప్రభుత్వ సంపద పెరుగుతుంది. ఇటువంటివి ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. అక్రమ నిర్భందాలు.ఇవేంటి.. తప్పుడు కేసులు కాదా?⇒ (సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు నమోదు చేసిన కొన్ని ఎఫ్ఐఆర్లను వైఎస్ జగన్ చదివి వినిపించారు..) ⇒ ‘విద్య వద్దు.. మద్యం ముద్దు’ సోషల్ మీడియా కార్యకర్త రాసిన మాటలు నిజమే కదా..? అమ్మ ఒడి ఇవ్వడం లేదు. విద్యాదీవెన ఇవ్వడం లేదు. వసతి దీవెన ఇవ్వడం లేదు.. నాన్నకు ఫుల్..అమ్మకు నిల్..! అని అన్నాడు. ఏం తప్పు అన్నాడు? ఈ మాట అన్నందుకు అక్రమంగా నిర్భందిస్తారా? చంద్రబాబు అభిమానుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు పెట్టారు. ⇒ ఇది మరో ఎఫ్ఐఆర్.. పోస్ట్లను ఫార్వర్డ్ చేసినా కేసులే! జనసేన నాయకులతో కాళ్లు పట్టించుకుంటున్న టీడీపీ నేతలు.. అనే వార్త అన్ని టీవీల్లో వచ్చింది. ఆ పోస్టును ఫార్వర్డ్ చేసిన కార్యకర్తపై కేసు పెట్టారు.⇒ ఇది మరో కేసు.. చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం విజయవాడ వరదల్లో రూ.534 కోట్లు ప్రజాధనం లూటీ చేశారు! 23 కోట్లు అగ్గిపెట్టెలు, క్యాండిల్స్ కోసమే లూటీ చేశారు..! ఇవి అందరూ అన్న మాటలే. వీటిని సోషల్ మీడియాలో పెట్టినందుకు కేసులు పెట్టారు.⇒ ఇంకో కేసు... తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చేసిన అసత్య ఆరోపణలు దేవుడికి నచ్చడం లేదని ఓ సోషల్ మీడియా కార్యకర్త పోస్టు పెట్టారు.. అంతకన్నా ఏమీ అనలేదు. ఆ కార్యకర్తపై కూడా కేసు పెట్టారు.⇒ గాజువాకకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ బోడి వెంకటేష్ను దువ్వాడ పోలీసులు మధ్యాహ్నం 3.30 గంటలకు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తల్లిదండ్రులకు చెప్పలేదు. 41 ఏ నోటీసు ఇవ్వలేదు. ఇది సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన కాదా?⇒ తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన సోషల్ మీడియా కార్యకర్త, రైతు ఆళ్ల జగదీష్రెడ్డి 2018లో పెట్టిన పోస్ట్కు సంబంధించి విజయవాడ క్రైమ్ సిటీ పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఇంట్లో సభ్యులకు కూడా చెప్పకుండా తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు వెళ్లి అడిగితే మేం తీసుకెళ్లలేదు.. మాకు సంబంధం లేదని చెప్పారు. ఇంట్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తే పోలీసులే దగ్గరుండి తీసుకెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఇది అక్రమ అరెస్టు కాదా?⇒ చిలకలూరిపేటకు చెందిన పెద్దింటి సుధారాణి ఎన్నికల తర్వాత అరాచకాలు భరించలేక కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వెళ్లిపోయారు. ఐదు నెలల తర్వాత ఆమెను కుటుంబ సభ్యులతో సహా హైదరాబాద్ నుంచి బలవంతంగా తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతున్నారు. పిల్లలను తల్లికి దూరం చేశారు. ఎక్కడకు తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదు. నిన్న చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో ఉన్న ఆమెను ఒంగోలు పోలీస్లు అరెస్ట్ చేశారు. ఇది అక్రమ నిర్భంధం కాదా?⇒ తాడేపల్లిలో అయ్యప్పమాల ధరించిన నాని అనే సోషల్ యాక్టివిస్ట్ను మొదట వినుకొండ అని చెప్పి మార్కాపురం తరలించారు.⇒ నందిగామ నియోజకవర్గం పెండ్యాలలో వాట్సప్ గ్రూప్ అడ్మిన్ను అరెస్ట్ చేసి కొట్టారు. గ్రూపులో ఉన్న వాళ్లకు నోటీసులిచ్చారు. వీళ్లంతా ఒకే గ్రామానికి చెందినవారు. ⇒ గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన వెంకట్రామిరెడ్డి హైదరాబాద్లో ఉంటారు. మాచర్లలో తన బావ ఇంటికి రావడంతో ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు అక్కడకు వెళ్లారు. వెంక్రటామిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన బావను అరెస్ట్ చేశారు. వి«ధి నిర్వహణలో ఆటంకం కలిగించారని కేసు పెట్టారు.⇒ ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంకు చెందిన సన్నీ అనే కార్యకర్తను తిరువూరు పోలీసులు ఉదయం తీసుకెళ్లి కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. 36 గంటల పాటు భోజనం కూడా లేకుండా చేశారు. గ్రామంలోని పెద్దలు వెళ్తే విడుదల చేస్తామని చెప్పి మళ్లీ గంపలగూడెం పోలీస్ స్టేషన్లోనే పెట్టారు.బాధితులకు తోడుగా న్యాయ పోరాటంప్రభుత్వం తరఫున అన్యాయంగా బాధలకు గురైన సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రత్యేకంగా న్యాయ సహాయం అందించేందుకు ఫోన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చాం. మీ తరఫున పోరాటం చేయడానికి వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉంది. సోషల్ మీడియా పరంగా మా మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ అండగా ఉండి కోర్టులో పోరాటం చేస్తారు. పూర్తిగా ప్రైవేటు కంప్లైంట్లు వేసే కార్యక్రమంలో తోడుగా ఉంటారు. వైఎస్సార్ సీపీ ‘వియ్ స్టాండ్ ఫర్ ట్రూత్’ నినాదంతో ఎక్స్లో యాస్ ట్యాగ్తో ముందుకెళ్తోంది. జె.సుదర్శన్ రెడ్డి (సీనియర్ న్యాయవాది) 9440284455కొమ్మూరి కనకారావు (మాజీ చైర్మన్, మాదిగ కార్పొరేషన్) 9963425526దొడ్డా అంజిరెడ్డి (రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్) 9912205535 -
గురి తప్పిన బాణం వెనుక..!
గురి తప్పిన బాణాల గురించి కాదు, గురి పెడుతున్న వేటగాడి గురించి మాట్లాడుకోవాలి. ఆ వేటగాడు అల్లుతున్న ఉచ్చుల గురించి ఆలోచించాలి. ఓట్ల కోసం నూకలు చల్లి ఆపై వల వేసి బంధించే అతడి మాయోపాయాలపై మేధోమథనం జరగాలి. హిరణ్యాక్షుడు పొందిన వరాల చందంగా వార్తా ప్రసార మాధ్యమాస్త్రాలను తన అమ్ములపొదిలో దాచిపెట్టుకున్న అతని వ్యూహ రహస్యాల గురించి మాట్లాడుకోవాలి. ఒక్కో బాణాన్ని మంత్రించి వదిలి పాఠకుల మస్తిష్కాలను స్వాధీనపరచుకోవా లని చూసే అతని తంత్రాంగం గురించి జనాన్ని అప్రమత్తం చేయాలి.రామాయణంలో కనిపించే కిష్కింధ రాజైన వాలికి ఒక విచిత్ర లక్షణం ఉన్నది. తన ఎదుటికి ఎంతటి బలవంతుడు వచ్చినా, అతని బలాన్ని తనలోకి లాగేసుకొనే శక్తి అతని సొంతం. వాలి మాదిరి బలశాలి కాదు మన అనుభవశాలి. కానీ అటువంటి లక్షణం ఒకటి ఈయనకూ ఉన్నది. తన రాజకీయ ప్రత్యర్థి ఏ విషయాల్లో బలవంతుడో గ్రహించి ఆ విషయాల్లోనే అతడు బలహీనుడని గోబెల్స్ ప్రచారం నిర్వహించడంలో మన కురువృద్ధుడు నిష్ణాతుడు. సత్య వాక్పాలన రాముడి బలం అను కుంటే, ఆ రాముడు అబద్ధాలాడతాడని ప్రచారం చేయడం, జనాన్ని నమ్మించడమే ఈయనకున్న నైపుణ్యం.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్రెడ్డి బలం ఆయన వ్యక్తిత్వం. మాట తప్పకపోవడం, మడమ తిప్పక పోవడం ఆ వ్యక్తిత్వ లక్షణాలు. రాజకీయ అడుగులు వేయడం మొదలు పెట్టిన తొలి రోజుల్లోనే ఇది నిరూపితమైంది. పది హేనేళ్ల కింద ఆయన తండ్రి∙చనిపోయినప్పుడు ఆ షాక్ తట్టుకోలేక గుండె పగిలి చనిపోయినవారూ, ఆత్మహత్యలు చేసుకున్నవారూ వందల సంఖ్యలో ఉన్నారు. ఈ పరిణామం వల్ల ఉద్వేగానికి గురైన జగన్ ఆ అమరులందరినీ తన ఆత్మబంధువులుగా ప్రకటించారు. వారందరి ఇళ్లకు వెళ్లి దుఃఖంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తానన్న సంకల్పాన్ని ప్రకటించారు.ఈ సంకల్పానికి కాంగ్రెస్ అధిష్ఠానం అడ్డుతగిలిన సంగతి తెలుగు పాఠకులకు తెలిసిన విషయమే. తమ మాట వింటే భవిష్యత్తులో ముఖ్యమంత్రిని చేస్తామని, వినకపోతే కేసులు పెట్టి జైల్లో వేస్తామని రాయబారాలు నడిపినట్టు అనంతర కాలంలో కాంగ్రెస్ నేతలే బహిరంగంగా వెల్లడించారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వంలో సోనియా గాంధీ మకుటం లేని మహారాణి. ‘ఫోర్బ్స్’ మేగజైన్ 2010లో ప్రకటించిన ప్రపంచంలోని శక్తిమంతుల జాబితా టాప్ టెన్లో ఆమె పేరు ఉన్నది. 2008లో ‘టైమ్’ మేగజైన్ ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో కూడా ఆమె పేరున్నది. అటువంటి రోజుల్లో ఆమె మాటను ధిక్కరించే సాహసం ఎవరు చేస్తారు? కానీ జగన్ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం!ఈ బలమైన వ్యక్తిత్వాన్ని ఉమ్మడి రాష్ట్ర ప్రజలతో పాటు చంద్రబాబు, ఆయన పార్టీ, యెల్లో మీడియా యజమానులు కూడా గుర్తించారు. అందువల్లనే ఆయన వ్యక్తిత్వం మీద దాడిని కేంద్రీకరించారు. యెల్లో సిండికేట్కు కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు. జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టుకున్నారు. అప్పుడు తన ఆగర్భశత్రువైన కాంగ్రెస్తో జతకట్టి జగన్ వ్యక్తిత్వ హననంలో, జైలు పాలు చేయడంలో బాబు కూటమి ప్రధాన బాధ్యత తీసుకున్నది. ఎందువలన? జగన్ బలమైన వ్యక్తిత్వమే భవిష్యత్తులో తమకు ప్రత్యర్థి కాగల దన్న అంచనాతోనే!ఆ వ్యక్తిత్వం పలుమార్లు నిరూపణైంది. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో చేరిన చంద్రబాబు అసాధ్యమైన హామీలను ఇచ్చారు. అప్పుడు రైతులకు రుణమాఫీ ఒక్కటి ప్రకటించాలని శ్రేయోభిలాషులు జగన్కు సలహా ఇచ్చారు. అమలు చేయలేని హామీని ఇవ్వడం కన్నా ప్రతిపక్షంలో కూర్చోవడానికే జగన్ సిద్ధ పడ్డారు. అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టోని మడత పెట్టేయడం ఈ రోజుల్లో రివాజుగా మారింది. ఇటువంటి వాతా వరణంలో అధికారంలోకి వచ్చిన జగన్ ఈ ఆనవాయితీని మార్చారు. ఎన్నికల మేనిఫెస్టోకు పటం కట్టి ప్రభుత్వ కార్యాల యాల్లో పెట్టించారు. ఆ మేనిఫెస్టో అమలుపై ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేస్తూ వచ్చారు.అమలు చేసిన హామీల గురించి చెప్పడం కాదు, మళ్లీ గెలిస్తే అరచేతిలో వైకుంఠం పెడతాననే హామీలే ముఖ్యమని మళ్లీ సలహాలొచ్చాయి. జగన్ వాటికి చెవి ఒగ్గలేదు. కానీ చంద్రబాబు అటే మొగ్గారు. జనం ముందు బయోస్కోప్ పెట్టెను తెరిచి ‘కాశీ పట్నం చూడరబాబు చూడరబాబు’ అంటూ బొందితో కైలా సాన్ని హామీ ఇచ్చారు. దాంతోపాటు కూటమి సమీకృత కార ణాలు, ‘సాంకేతిక’ కారణాలు అనేకం పనిచేసి బాబు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు హామీలు అమలుచేయాలి. అది సాధ్య మయ్యే పని కాదు. ఒక పక్క జగన్ ప్రభుత్వం హామీలను అమలు చేసిన తీరు జనం మదిలో తాజా జ్ఞాపకంగానే ఉన్నది. ఈ జ్ఞాపకాన్ని మరిపించడం కూటమి పెద్దల తక్షణ కర్తవ్యం. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వారు నెలకో రకంగా ప్రయోగిస్తున్న డెవర్షన్ రాకెట్లు ఈ తక్షణ కర్తవ్యంలో భాగమే!ఆస్తి కోసం తల్లీ, చెల్లి మీద జగన్ కోర్టుకు వెళ్లారనే ప్రచారాన్ని గత రెండు మూడు రోజులుగా బాబు క్యాంప్ విస్తృతంగా చేపట్టింది. ఔను ఆయన నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు వెళ్లారు. ఎందుకు వెళ్లారు? ఎవరి కారణంగా అలా వెళ్లక తప్పని అగత్యం ఏర్పడింది? ఈ అంశాల జోలికి మాత్రం యెల్లో మీడియా సహజంగానే వెళ్లదు. జగన్ వ్యక్తిత్వ హననం ఒక్కటే దాని ఎజెండా. ఆ ఎజెండా పరిమితు లకు లోబడే దాని ప్రాపగాండా కార్యక్రమం ఆధారపడి ఉంటుంది. జగన్, షర్మిలల చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి ఈ వివాదానికి సంబంధించిన అంశాలపై మీడియాతో మాట్లా డారు. ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో అన్నాచెల్లెళ్ల మధ్యన ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. జగన్ తన సొంత ఆస్తిలోంచి కొంత భాగాన్ని చెల్లెలికి ఇచ్చేలా ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదు ర్చుకున్నారు. ఇవన్నీ బయటకు వచ్చాయి. జగన్ ఎన్సీఎల్టీకి వెళ్లిన డాక్యుమెంట్ టీడీపీ అధికార ట్విట్టర్ హ్యాండిల్పై ప్రత్య క్షమైంది. షర్మిల రాసిన బహిరంగ లేఖ విడుదలైంది. ఆమె మీడియాతో కూడా మాట్లాడారు.ఈ మొత్తం డాక్యుమెంట్లు, లేఖలు మీడియా సమావేశాల్లో లేవనెత్తిన అంశాలు విస్తృతంగా రెండు రాష్ట్రాల్లోనూ జనంలోకి వెళ్లాయి. ఈ అంశాలపై పెద్ద ఎత్తున చర్చోపచర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ పంచాయతీని పబ్లిక్లోకి తీసుకొచ్చిన సూత్రధారులు, పాత్రధారుల ఉద్దేశం వేరు. జగన్ వ్యక్తిగత ప్రతిష్ఠపై బురద జల్లడం, ఆయన న్యాయ పోరాటాన్ని బలహీన పరచడం, వీలైతే ఆయన బెయిల్ను రద్దు చేయించి మళ్లీ జైలుకు పంపించడం! ఈ పరిణామాన్ని నిశితంగా గమనించిన వారికి కుట్రదారుల ఉద్దేశం సులభంగానే అర్థమవుతుంది. జగన్ మోహన్రెడ్డి క్రియాశీలకంగా రాజకీయాల్లో లేకపోతే లాభం పొందేదెవరు? ఆ లాభంలో ఎంతోకొంత తమ పార్టీకి కూడా దక్కకపోతుందా అని ఒంటె పెదవులకు నక్క ఆశలు పెట్టు కున్నట్టు పొంచి ఉన్నది ఎవరు?డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టకముందే, ఆ మాటకొస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడి పాత్రను కూడా చేపట్టడానికి ముందే జగన్ మోహన్రెడ్డి విజయ వంతమైన వ్యాపారవేత్త. ఆయన సండూర్ పవర్ను 1998లోనే ప్రారంభించారు. విజయవంతమైన వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను విస్తరించుకుంటూ వెళ్లడం సహజం. వారి ట్రాక్ రికార్డును బట్టి పెట్టుబడులు రావడం కూడా సహజమే. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. డాక్టర్ వైఎస్సార్ ప్రతిపక్ష నేతగా ఉన్న కాలంలో గానీ, ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గానీ జగన్ మోహన్రెడ్డి బెంగళూరు కేంద్రంగానే వ్యాపారాలు చేసు కున్నారు తప్ప హైదరాబాద్లో లేరు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన రాజకీయాల్లో క్రియాశీల పాత్రను పోషించ వలసిన అనివార్యత ఏర్పడినప్పుడే ఆయన మకాం హైదరా బాద్కు మారింది. జగన్ మోహన్రెడ్డి స్థాపించిన భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ సంస్థల్లో ఇతరులు పెట్టుబడులు పెట్టడం వెనుక క్విడ్ ప్రోకో దాగున్నదనే ఆరోపణలు తెచ్చి కాంగ్రెస్–టీడీపీ కుమ్మక్కయి ఆయనపై అక్రమ కేసులు పెట్టి పదహారు నెలలు జైలుకు పంపాయి. ఆ సంస్థలు గడిచిన పదహారు పదిహేడేళ్లుగా విజయవంతంగా నడుస్తూ మదుపరులకు లాభాలు తెచ్చి పెట్టడం క్విడ్ ప్రోకో ఆరోపణల్లోని బూటకత్వాన్ని ఎండగట్టింది. మార్కెట్ను విస్తృతంగా అధ్యయనం చేసి సొంత ప్రాజెక్టుతో, సొంత పెట్టుబడులతో పాటు ఇతర ఇన్వెస్టర్లకు తన ప్రాజెక్టుపై నమ్మకం కలిగించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జగన్ తన వ్యాపారాలను విస్తరించుకున్నారు. ఈ ప్రయాణంలో రాజకీ యంగా మాట కోసం నిలబడవలసివచ్చిన కారణంగా ఆయన దారుణమైన వ్యక్తిత్వ హననానికి గురి కావలసి వచ్చింది. ఊహించని నిందలు మోయవలసి వచ్చింది. వ్యక్తిత్వ హననం అనేది హత్యతో సమానమంటారు. ఆ రకంగా చూస్తే కొన్ని వందల సార్లు ఆయన హత్యకు గురి కావలసి వచ్చింది.ఇప్పుడు తల్లీ, చెల్లిపై కోర్టుకెక్కారనే నిందను మోపారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చిన తర్వాత జగన్ మోహన్రెడ్డి వ్యక్తిగత ఔన్నత్యం ప్రజలకు తేటతెల్లమైంది. కుట్రదారుల పని కుడితిలో పడ్డట్టయింది. వారసత్వంగా సంక్ర మించిన ఆస్తులతో పాటు తాను సంపాదించిన ఆస్తులను కూడా జగన్, షర్మిల మధ్య డాక్టర్ వైఎస్సార్ పంపకం చేశారు. భారతి సిమెంట్స్ గానీ, జగతి పబ్లికేషన్స్ గానీ జగన్ మోహన్రెడ్డి స్వార్జితం కనుక పంపకాల్లో అవి రాలేదు. పైగా ఈ రెండు కంపెనీల్లోనూ జగన్, ఆయన సతీమణి భారతిలకు తప్ప షర్మిలకు వాటా కూడా లేదు. సిమెంట్ పరిశ్రమకు తన భార్య పేరునూ, పబ్లికేషన్స్కు భార్యాభర్తలిద్దరి పేర్లూ కలిసేలా ‘జగతి’ అనే పేరును జగన్ పెట్టుకున్నారు. అప్పుడు డాక్టర్ వైఎస్సార్ జీవించే ఉన్నారు. ఒక సందర్భంలో ‘ఈనాడు’ రాసిన అవాకులు చెవాకులకు జవాబునిస్తూ తన భార్య మీద ప్రేమతో తన సిమెంట్ పరిశ్రమకు ఆమె పేరును పెట్టుకున్నానని కూడా జగన్ రాశారు. అప్పుడు వైఎస్సార్ జీవించే ఉన్నారు. ఈ కంపెనీలు వారి కుటుంబ వారసత్వ సంపద కాదనీ, జగన్ స్వార్జితాలే అని చెప్పడానికి ఇటువంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి. తండ్రి చనిపోయిన తర్వాత చాలాకాలం పాటు అన్న తనను బాగానే చూసుకున్నారని షర్మిల కూడా తన బహిరంగ లేఖలో అంగీకరించారు. షర్మిల తనకు చెల్లెలు మాత్రమే కాదు, పెద్ద కూతురు వంటిదని జగన్ ఒక సందర్భంలో ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే తండ్రి మనసుతో ఆలోచించి తన స్వార్జితమైన ఆస్తుల్లో వాటాలు చెల్లెలికి ఇవ్వాలని సంకల్పించారు. అందుకోసం ఒక అవగాహనా పత్రాన్ని (ఎమ్ఓయు) కూడా రాసిచ్చారు. ఇదెప్పుడు జరిగింది... తండ్రి చనిపోయిన పది సంవత్సరాల తర్వాత, షర్మిలకు వివాహం జరిగిన 20 సంవత్సరాల తర్వాత! ఇంతకాలం తర్వాత సొంత ఆస్తిలో చెల్లెలికి భాగం కల్పించిన అన్నలెందరుంటారు? ఈ మధ్య కాలంలో 200 కోట్ల సొంత ఆదాయాన్ని కూడా సోదరికి జగన్ అందజేశారు. ఈ వివరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత జనం దృష్టిలో జగన్ ఔన్నత్యం మరింత పెరిగింది.క్విడ్ ప్రోకో కేసుల కారణంగా ఆస్తులు ఈడీ జప్తులో ఉన్నందువల్ల ఎమ్ఓయూ (అన్రిజిస్టర్డ్)ను రాసుకోవలసి వచ్చింది. లేకపోతే ఈ పంపకాల కార్యక్రమం ఇప్పటికే పూర్తయి ఉండేది. కేసుల వ్యవహారం పూర్తిగా పరిష్కారమయిన పిదప ఆస్తుల బదలాయింపు జరిగేలా ఎమ్ఓయూ రాసుకున్నారు. ఈ పత్రంలోని ప్రతి పేజీ మీద జగన్తో పాటు షర్మిల కూడా సంతకం చేశారు. పత్రం మొదటి పేజీలోని రెండో అంశంలోనే పంపకానికి ప్రతిపాదిస్తున్న ఆస్తుల సొంతదారు జగన్ మోహన్రెడ్డి (the subject properties / owned directly and indirectly through companies by YS Jagan) అనే మాట స్పష్టంగా ఉన్నది. ఈ వాక్యం కింద షర్మిల సంతకం కూడా ఉన్నది.రెండో పేజీలో ఇంకో కీలక అంశమున్నది. తన చెల్లెలి మీద వైఎస్ జగన్కున్న ప్రేమాభిమానాల కారణంగా (In consideration of his love and affection for his sister, YSJ here by agrees....) ప్రతిపాదిత ఆస్తులను బదిలీ చేస్తున్నట్టున్నది. అంతేతప్ప హక్కుగా ఆమెకు బదిలీ చేస్తున్నట్టు లేదు. ఈ పేజీ మీద కూడా షర్మిల సంతకం ఉన్నది. ఈ ఒప్పందం రాసుకున్నది 2019లో. అప్పుడు ఈ ప్రతిపాదిత ఆస్తులు అన్న సొంత ఆస్తులని అంగీకరించి సంతకం కూడా చేశారు కదా!భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్లో వాటాలతో పాటు సరస్వతి పవర్ పూర్తిగా షర్మిలకే బదిలీ అయ్యేటట్లుగా రాసుకుని తాత్కాలికంగా తల్లిగారి పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసి కేసుల పరిష్కారం తర్వాత అది షర్మిలకు బదిలీ అయ్యేలా ఏర్పాటు చేశారు. కానీ ఆ గిఫ్ట్ డీడ్ను తల్లి పేరు మీద షేర్లుగా షర్మిల మార్పించారు. ఒరిజినల్ షేర్ సర్టిఫికెట్లు జగన్ దగ్గర ఉన్నాయని తెలిసీ అవి ఎక్కడో పోయాయని చెప్పి, బదిలీ పత్రాలపై జగన్ సంతకం చేయకుండానే షేర్లు మార్పించారు. ఈడీ జప్తులో ఉన్న ఆస్తుల బదిలీ వల్ల కేసుల్లో న్యాయపరమైన చిక్కులను జగన్ ఎదుర్కోవలసి వస్తుందని తెలిసీ షర్మిల ఈ చర్యకు పాల్పడ్డారు. దాంతో ఈ చట్టవిరుద్ధమైన వ్యవహారాన్ని ఆపాలని జగన్ ఆమెకు లేఖ రాశారు. ఆమె ససేమిరా అనడంతో న్యాయ నిపుణుల సలహా మేరకు ఆయన ఎన్సీఎల్టీ తలుపు తట్టి ఈ బదిలీని ఆపేయాలని కోరవలసి వచ్చింది. ఇదే తల్లినీ, చెల్లినీ జగన్ కోర్టుకీడ్చారని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం లోని అసలు గుట్టు. ఈ రకమైన ప్రచారంతో తన పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకోవాలనీ, జగన్ ప్రతిష్ఠను దెబ్బ తీయాలనీ యెల్లో సిండికేట్ తాపత్రయపడుతున్నది. ఈ దుష్ట పన్నాగానికి షర్మిల పూర్తి స్థాయిలో సహకరిస్తున్నదని శనివారం నాటి ఆమె మీడియా సమావేశం బట్టబయలు చేసింది. జగన్ మోహన్రెడ్డి బెయిల్ రద్దవుతుంది కాబట్టి అమ్మను కోర్టు కీడుస్తారా అని ప్రశ్నించడం ఆశ్చర్యపరిచింది. జగన్ ముందు గానే ఎన్సీఎల్టీకి లేఖ రాయడంతో బెయిల్ రద్దయ్యే అవకాశం పోయిందని ఆమె ఆశాభంగం చెందారా అనే అనుమానం వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది. చంద్రబాబుతో ఆమె పూర్తిస్థాయిలో కుమ్మక్కు అయ్యారనేందుకు ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావా లని వారు ప్రశ్నిస్తున్నారు. వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
తప్పంతా సర్కారుదే: వైఎస్ జగన్
రాష్ట్రంలో జరిగిన ప్రతి ఘటనకు సంబంధించి ప్రభుత్వం తరఫున చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ప్రతి బాధితుడి వద్దకు మంత్రిని పంపించి రూ.10 లక్షలు డబ్బు ఇచ్చి, ఇటువంటి తప్పు ఇంకోసారి జరగనివ్వబోమని లెంపలేసుకోవాలి. ఇలా చేయకపోతే చంద్రబాబు చరిత్ర హీనుడవుతాడు. అత్యాచారం.. ఆపై హత్యకు గురైన చీరాల నియోజకవర్గంలో సుచరిత, నందికొట్కూరు నియోజకవర్గంలో వాసంతి, పొన్నూరు నియోజకవర్గంలో శైలజ, సూళ్లూరుపేట నియోజకవర్గంలో అనికాకుమారి, పాలకొల్లులో కలిశెట్టి అనసూయ, బద్వేల్లో దస్తగిరమ్మ, తెనాలి నియోజకవర్గంలో సహానా కుటుంబాలకు చంద్రబాబు ఇచ్చినా ఇవ్వకపోయినా.. వైఎస్సార్సీపీ రూ.10 లక్షలు చొప్పున ఇచ్చి తోడుగా ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న మేమే రూ.10 లక్షలు ఇస్తున్నప్పుడు... ప్రభుత్వంలో ఉన్న మీరు బాధ్యత తీసుకుని ఏమేం చేయగలుగుతారో చెప్పండి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు సిగ్గు తెచ్చుకోవాలి. ఈ ప్రభుత్వం ఏం చేసినా, చేయకపోయినా బాధ పడాల్సిన అవసరం లేదు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. అప్పుడు వీళ్లందరినీ ఏరి ఏరి జైళ్లలో పెట్టే కార్యక్రమం చేస్తాం. – వైఎస్ జగన్నవీన్తో పాటు కొంత మంది కలిసి మృగాలుగా ప్రవర్తించారు. ఆ చెల్లి (సహానా) శరీరం నిండా కందిపోయిన మచ్చలు కనిపిస్తున్నాయి. లైంగికంగా వేధించడమే కాకుండా ప్రైవేట్ పార్టుల్లో కూడా దెబ్బలు ఉన్నాయి. ఆమె ప్రైవేటు పార్టులలో బ్లీడింగ్ కనిపిస్తున్నప్పుడు ఆ దిశగా ఎందుకు చర్యలు లేవు? ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏమిటి? మేము తోడుగా ఉన్నామని చెప్పాల్సిన ధర్మం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందనే భరోసా ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? కళ్లెదుట వాస్తవాలు కనిపిస్తున్నప్పుడు ఎందుకు ఈ విషయాలన్నీ దాచి పెట్టే కార్యక్రమం చేస్తున్నారు?తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడు ఈ పని చేసినందుకు సిగ్గు పడాల్సింది పోయి.. నిస్సిగ్గుగా ఆ వ్యక్తిని కాపాడుకోవడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇంతకన్నా హేయమైన పని ఏమైనా ఉంటుందా? మీరు ఏ తప్పు చేసినా మద్దతుగా మేముంటామని సాక్షాత్తు చంద్రబాబునాయుడు దగ్గరుండి ప్రోత్సహిస్తుండటం వల్లే రాష్ట్రంలో అఘాయిత్యాలు మితిమీరిపోయాయి. రెడ్బుక్ రాజ్యాంగ పాలనలో రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలు ధైర్యంగా బయటకు వచ్చి తిరగలేని పరిస్థితి నెలకొంది. – వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు బతికే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 77 మందిపై అత్యాచారాలు జరిగాయి. వీరిలో ఏడుగురు హత్యకు గురి కాగా, ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. మహిళల రక్షణను గాలి కొదిలేసింది. మనవాడైతే పర్వాలేదు.. ఏం చేసినా చెల్లుబాటవుతుందనే ధోరణి వల్ల తెలుగుదేశం పార్టీ నేతల అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికైనా మేలుకొని జరిగిన ప్రతి ఘటనకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. దారుణంగా లైంగిక వేధింపులకు గురై, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సహానా కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. ఆస్పత్రిలోని మార్చురీకి వెళ్లి సహానా మృతదేహానికి నివాళి అర్పించారు. ఘటన జరిగిన తీరు, వైద్యం.. తదితర వివరాలను ఆమె కుటుంబ సభ్యులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సహానా కుటుంబ సభ్యులకు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్సీపీ నుంచి ‘హత్యా’చార బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..వాస్తవాలను ఎందుకు దాస్తున్నారు?⇒ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయికి దిగజారాయో చెప్పేందుకు ఇక్కడ నా దళిత చెల్లి పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. చేసిన వాడు మనవాడైతే చాలు.. వాడు ఏం చేసినా పర్వాలేదని కవర్ చేయడానికి, దొంగ కేసులు పెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉంది. నవీన్ అనే వ్యక్తి చంద్రబాబుతో కలిసి దిగిన ఫొటోలు ఉన్నాయి. స్థానిక ఎంపీతో చాలా సన్నిహితంగా ఉన్న పరిస్థితి. ఫొటోలూ కనిపిస్తున్నాయి.⇒ ఇలాంటి వ్యక్తి సహానా పని చేస్తున్న ప్రదేశానికి వచ్చి, ఆమెను కారులో ఎక్కించుకుని వెళ్లాడు. అతనితోపాటు కొంతమందితో కలిసి మృగాలుగా ప్రవర్తించారు. ఆ చెల్లి శరీరం నిండా కందిపోయిన మచ్చలు కనిపిస్తున్నాయి. శారీరకంగా వేధించడమే కాకుండా ప్రైవేట్ పార్టుల్లో కూడా దెబ్బలు ఉన్నాయి. లైంగికంగా కూడా వేధించినట్లు కనపడుతోంది. ఆమె ప్రైవేటు పార్టులలో బ్లీడింగ్ కనిపిస్తున్నప్పుడు ఆ దిశగా ఎందుకు చర్యలు లేవు? ⇒ దాడి తర్వాత జీజీహెచ్లో పడేసి.. ఆమె కుటుంబ సభ్యులు వచ్చే సరికి జారుకున్నాడు. అప్పుడు అక్కడ నవీన్తో మరో ఇద్దరు ఉన్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఎప్పుడైనా ఇలాంటి ఘటన జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏమిటి? మేము తోడుగా ఉన్నామని చెప్పాల్సిన ధర్మం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? తప్పు చేసిన వాడు ఎవరైనా, ఎలాంటి వాడైనా చట్టానికి అతీతుడు కాదు. కచ్చితంగా శిక్ష పడుతుందనే భరోసా ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ⇒ ఎవరైనా కూడా ప్రభుత్వం నుంచి వచ్చి తప్పు జరిగిందమ్మా.. క్షమించమని కోరుతున్నాం.. అని ఎందుకు అడుగలేకపోతున్నారు? అన్ని రకాలుగా ఆదుకుంటూ మంచి పరిహారం ఇచ్చి ఎందుకు తోడుగా నిలబడలేకపోతున్నారు? నా పక్కనే ఆ పాప తల్లి ఉంది. వాళ్ల చెల్లి ఉంది. వీళ్లు చెబుతున్నా, ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఎందుకు వచ్చింది?⇒ నేను వస్తున్నానని తెలిశాక ఆలపాటి రాజా వచ్చాడట. అంతకు ముందు ఎవరూ రాలేదు. తెనాలి ఎమ్మెల్యే, మంత్రి మనోహర్ కనీసం చూడడానికి రాలేదు. హోం మంత్రిగానీ, ఇంకొకరు గానీ, కనీసం స్పందించిన పరిస్థితులు లేవు. ఆ ఫొటోల్లో నిందితుడు నవీన్కు సాక్షాత్తు చంద్రబాబు కండువా కప్పుతా ఉన్నాడు. గుంటూరు ఎంపీకి అత్యంత ఆప్తుడు. వెనకేసుకు తిరిగారు. ఇలాంటి వ్యక్తిని ప్రభుత్వం వెనుకేసుకు వస్తోంది. జరిగిన తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది. తప్పుడు ప్రచారం చేయాలని చూస్తోంది. చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఇలా..⇒ చంద్రబాబు నిందితులను వెనకేసుకొస్తుండటం వల్లే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ప్రతి చోటా జరుగుతున్నాయి. బద్వేల్లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాక పెట్రోలు పోసి నిప్పంటించారు. ⇒ శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బాలికలను అతిదారుణంగా బర్త్ డే పార్టీ అని తీసుకెళ్లి కూల్ డ్రింక్స్లో మందు కలిపి తాగించి అత్యాచారం చేశారు. చేసింది శ్రీకాకుళం జిల్లా పలాసాలో టీడీపీ నేతల పిల్లలు. ఏం చేసినా మమ్మల్ని తాకలేరన్న ధీమాతో ఇద్దరు ఆడపిల్లల్ని బర్త్ డే పార్టీ అని చెప్పి తీసుకెళ్లి మందు కలిపి అత్యాచారం చేసిన ఘటన. జరిగిన దారుణాన్ని ఒప్పుకొని క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రభుత్వం ఏం చేస్తోంది? అక్కడ కూడా పంచాయితీ చేయడానికి ప్రయత్నిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రులు రంగంలోకి దిగి దాన్ని మాఫీ చేయాలని చూస్తున్నారు.⇒ పిఠాపురంలో తెలుగుదేశం నాయకురాలి భర్త 16 ఏళ్ల యువతికి మత్తు మందు ఇచ్చి, ఆటోలో ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడ చెత్త కాగితాలు ఏరుకునేందుకు వచ్చిన వ్యక్తి ఆ బాలిక ప్రాణాలు కాపాడారు. లోకేశ్తో, అచ్చెన్నాయుడుతో ఈ పెద్ద మనిషి ఫొటోలు అందరూ చూశారు. ఈ ఘటన జరిగింది డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం. కనీసం ఆయన ఈ పాప ఇంటికి పోయారా? ఆ కుటుంబాన్ని పరామర్శించారా? అని అడుగుతున్నా. ⇒ హిందూపురంలో దసరా పండుగ రోజు అత్తాకోళ్లలపై గ్యాంగ్రేప్ చేస్తే, మూడు రోజులైనా అరెస్టు చేయాలనే ఆలోచన రాలేదు. అక్కడి ఎమ్మెల్యే బాలకృష్ణ.. ముఖ్యమంత్రికి బావమరిది. వియ్యంకుడు కనీసం చూడడానికి కూడా పోలేదు. ⇒ అనకాపల్లి జిల్లా రాంబొట్ల మండలం కుప్పగంజిపాలెంలో 9వ తరగతి చదువుతున్న బాలికను టీడీపీ నాయకుడు సురేష్ నరికి చంపేశాడు. అంతకు ముందు తనను వేధిస్తున్నాడని ఆ అమ్మాయి కేసు పెడితే, అరెస్టు అయి జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చాడు. మళ్లీ బెదిరించడం మొదలు పెట్టాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. రెడ్బుక్ పాలనలో నిమగ్నమైనవారు ఈ దారుణాన్ని అరికట్టలేకపోయారు. చివరికి సురేష్ అనే ప్రేమోన్మాది ఆ పాపను దారుణంగా చంపేశాడు.ఏ తప్పు చేసినా సర్కారు మద్దతు⇒ రాష్ట్రంలో ఇంతటి దారుణ పరిస్థితులు కనిపిస్తుంటే ఈ ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటోందా? ఈ రెడ్బుక్ పాలనలో టీడీపీకి చెందిన వారు ఏ తప్పు చేసినా, మీరు తప్పు చేయండి.. మేం వెనకేసుకు వస్తాం.. మీకు ఏమీ కాదు.. మేము సపోర్టుగా ఉంటామని సాక్షాత్తు చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. ⇒ పోలీసులు న్యాయంగా దర్యాప్తు చేస్తే, అన్ని వాస్తవాలు బయటకొస్తాయి. ఈ తల్లి (సహానా అమ్మ) 14 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్. నేను పేదలు, దళితులకు తోడుగా ఉంటాను. పేదలు, దళితులంతా మా వారేనని ధైర్యంగా చెబుతాను. పేదలకు తోడుగా ఉన్నామని ప్రభుత్వం చెప్పాలి. కానీ, ఈ ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. పైగా మా పార్టీ వారిని నిందించడం సరైనదేనా? ఆ తల్లికి తోడుగా నిలబడినందుకు మాపై నిందలు వేయడం సబబేనా? ⇒ ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, వరదు కళ్యాణి, మురుగుడు హనుమంతరావు, చంద్రగిరి ఏసురత్నం, కల్పలతారెడ్డి, మాజీ మంత్రులు విడదల రజిని, మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు అన్నాబత్తుని శివకుమార్, కోన రఘుపతి, పార్టీ నేతలు నూరిఫాతిమా, అంబటి మురళీకృష్ణ, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు పాల్గొన్నారు. -
బలంగా ఎదుగుదాం.. పార్టీని పటిష్టంగా నిర్మిద్దాం: వైఎస్ జగన్
మనం ఇంట్లో కూర్చుంటే.. ఏమీ జరగదు. మనం చొరవ తీసుకుని అన్ని అంశాలపై స్పందించాలి. గ్రామ, మండల, నియోజకవర్గాల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలపై స్పందించాలి. అన్యాయాలపై స్పందించాలి. బాధితులకు అండగా నిలవాలి. మనవైపు నుంచి స్పందన లేకపోతే ఆ అంశం మరుగున పడుతుంది. ప్రజలకు న్యాయం జరగదు. – వైఎస్ జగన్ఇసుక ధర రెట్టింపు.. మద్యం టెండర్లలో దారుణాలు.. యథేచ్ఛగా పేకాట క్లబ్లుఈ సోషల్ మీడియా కాలంలో వాళ్ల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా మనం సిద్ధం కావాలిఎప్పటికప్పుడు నివేదికలతో కష్టపడి పని చేసే వారికి గుర్తింపు, ప్రమోషన్లు సాక్షి, అమరావతి: గ్రామ, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత వ్యవస్థీకృతంగా నిర్మించడం ద్వారా దేశంలోనే బలమైన పార్టీగా నిలుపుదామని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. మన పార్టీ ఏర్పాటు చేసుకుని దాదాపు 15 ఏళ్లు అవుతోందని, ఈ సమయంలో వివిధ రకాల ఎన్నికలు చూశామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నామని.. అధికారంలోనూ ఉన్నామని.. స్థానిక సంస్థలతో పాటు చాలా ఎన్నికల్లో పాల్గొన్నామని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామని, గ్రామ స్థాయి నుంచి ప్రతి అడుగులోనూ పార్టీ యుద్ధం చేస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే మంచి ఫలితాలను ఇస్తుందని, అప్పుడే మనం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు శక్తివంతంగా ఉంటామని ఉద్బోధించారు. లోటుపాట్లు సరిదిద్దుకోవడానికి ఇప్పుడు తగినంత సమయం ఉందని, దానిని సద్వినియోగం చేసుకుందామని కోరారు. శాసససభ, పార్లమెంటుకు జమిలి ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేద్దామని జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నిర్మాణంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్లో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. గ్రామ, బూత్ కమిటీలతో మరింత బలోపేతం ⇒ ఇప్పుడు మనం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా కమిటీలు, నియోజకవర్గ స్థాయి, మండల, గ్రామ స్థాయి కమిటీల వరకు ఎలా ఉన్నాయన్న దానిపై పరిశీలన, అవగాహన పెంచుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ పాత్రలను నిర్వర్తించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. మరో ఆరు నెలల్లో మళ్లీ సమావేశం నాటికి గ్రామ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు కావాలి. అక్కడే యూత్, మహిళా, విద్యార్థి విభాగాలతో పాటు విలేజ్ కమిటీ, బూత్ కమిటీల వంటి అనుబంధ విభాగాలకు గ్రామ స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు కావాలి. ⇒ ఈ కమిటీల ఏర్పాటు కాగితాలకే పరిమితం కాకూడదు. దాని వల్ల పార్టీకి ఎలాంటి లాభం ఉండదు. కమిటీల ఏర్పాటుపై మీ పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. ఇలా చేయగలిగితే.. దేశంలోకెల్లా నంబర్ వన్ పార్టీగా ఎదుగుతాం. పార్టీ క్షేత్ర స్థాయి నిర్మాణంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రామ స్థాయి నుంచి మనకు కమిటీలు, నాయకత్వం లేక కాదు. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ సర్పంచ్ లేదా, పోటీ చేసిన అభ్యర్థి మన పార్టీ వారే ఉన్నారు. కాకపోతే వీరందరినీ నిర్మాణాత్మక వ్యవస్థల్లోకి తీసుకురావాలి. అప్పుడు మనం రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన పిలుపునకు గ్రామ స్థాయి వరకు ఉధృత స్పందన వస్తుంది. అది చేయగలగాలి. వైఎస్సార్సీపీ రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో పార్టీ జిల్లాల అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు తదితరులు మన కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా⇒ ఇవాళ వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవరైనా సగర్వంగా కాలర్ ఎగరేసుకుని ప్రతి ఇంటికీ వెళ్లగలం. కారణం మనం చెప్పిన ఎన్నికల మేనిఫెస్టో అన్నదాన్ని చెత్తబుట్టలో వేసే డాక్యుమెంటు కింద కాకుండా.. దేశ చరిత్రలోనే సరికొత్త అర్థం తీసుకువచ్చిన పార్టీ మనది. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావిస్తూ దానిలో చెప్పినవి తూచ తప్పకుండా అమలు చేశాం. ⇒ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్తో పాటే మనం పథకాలు అమలు చేసే తేదీలతో సహా సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసే వాళ్లం. నేరుగా బటన్ నొక్కి మధ్యలో దళారులు లేకుండా అక్కచెల్లెమ్మలకు ఆయా పథకాలు అందించింది కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నదేమిటి? వాళ్లు ఎన్నికలప్పుడు చెప్పిన మాటలేమిటి? ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూసి ఉండం. ఎన్నికలప్పుడు ప్రచారంలో వారిలా మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. అదే మనకు వాళ్లకూ తేడా. విలువలు, విశ్వసనీయత అన్నది ముఖ్యం. ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చుంటే తప్పేముంది? ప్రజల్లో ఆలోచన మొదలైంది ⇒ వైఎస్సార్సీపీ, జగన్ వల్ల జరిగిన మంచి ఏమిటి.. అంటూ మనం చేసిన మంచి పనుల గురించి ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. చెప్పినవన్నీ జగన్ చేశాడని ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశాడు. జగన్ మాకు పలావు పెట్టాడు. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. తీరా చూస్తే పలావు పోయింది.. బిర్యానీ లేదు.. అన్న చర్చ ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది. ఫలానా మంచి మా హయాంలో జరిగిందని.. ప్రజల్లోకి మనం ధైర్యంగా వెళ్లగలుగుతాం. కానీ టీడీపీ కూటమి కార్యకర్తలు ధైర్యంగా వెళ్లగలుగుతారా? ⇒ టీడీపీ వాళ్లు ప్రజల ఇళ్లకు పోయే పరిస్థితులు లేవు. చంద్రబాబు అబద్ధాలకు రెక్కలు కట్టారు. మనం ప్రజల్లోకి వెళ్లినప్పుడు, ప్రతి ఇంటికీ మన నాయకులు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినప్పుడు, ఎవరింటికి పోయినా అందరూ సంతోషంగా దీవించారు. అయితే ఒకవైపు ఈవీఎంల వ్యవహారం, మరోవైపు టీడీపీ మోసపూరిత హామీలతోనే ఓడిపోయాం. 4 నెలల్లోనే ఎప్పుడూ లేనంత వ్యతిరేకత ⇒ మనం అమలు చేసిన హామీలే మనకు శ్రీరామ రక్ష. కేవలం నాలుగు నెలల్లోనే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ప్రభుత్వం మీద కనిపిస్తోంది. వాళ్లు ఎవరి ఇంటికైనా వెళితే మా రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు అడుగుతారు. మా రూ.18 వేలు ఏమయ్యాయని మహిళలు, రూ.48 వేలు ఏమయ్యాయని అవ్వలు, మా రూ.20 వేలు ఏమయ్యాయని రైతులు, మా రూ.36 వేలు ఏమయ్యాయని నిరుద్యోగ యువత అడుగుతారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం మరింతగా ప్రిపేర్ అవ్వాలి. ఒకవైపు హామీల అమలు లేకపోగా, మరోవైపు రాష్ట్రంలో పాలన దారుణంగా తయారైంది. దాదాపు రూ.2,400 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఆరోగ్య ఆసరా లేదు. ప్రభుత్వం ఆస్పత్రులు నిర్వీర్యం అయ్యాయి. ⇒ మూడు త్రైమాసికాలు వచ్చినా, విద్యా దీవెన, వసతి దీవెన లేదు. ఇంగ్లిష్ మీడియం లేదు. సీబీఎస్ఈ లేదు. టోఫెల్ క్లాసులు లేవు. గోరుముద్ద కూడా పాడైపోయింది. అన్ని రంగాలూ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఖరీఫ్ సీజన్ పూర్తవుతున్నా రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఈ–క్రాప్ ఏమైందో తెలియదు. ఆర్బీకేలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. రైతుల పంటలకు కనీస మద్దతు దక్కని పరిస్థితి. ⇒ ఇంటి వద్దకు వచ్చే అన్ని సేవలూ నిలిచిపోయాయి. ఏం కావాలన్నా మళ్లీ జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పాలన వచ్చింది. ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు తొలగించారు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఘోరంగా ఉంది. మహిళలకు భద్రత సున్నా. దిశ యాప్ ఏమైందో తెలియదు. గతంలో మన పాలనలో అక్కచెల్లెమ్మలు ఫోన్ తీసుకుని బయటకు వెళ్లినప్పుడు, ఆపద ఎదురై ఫోన్ చేస్తే.. పది నిమిషాల్లో పోలీసులు వచ్చి ఏమైందని అడిగే పరిస్థితి ఉండేది. అవేవీ ఇప్పుడు లేవు. రాష్ట్రంలో దారుణంగా చిన్నారులను సైతం వదలకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. పోలీసులు దొంగ కేసులకు పరిమితం అయ్యారు. విధి నిర్వహణ మరిచిపోయి మూడు సింహాలకు కాకుండా, రాజకీయ నాయకులకు మడుగులొత్తుతున్నారు. ఎక్కడ చూసినా స్కాంలే కనిపిస్తున్నాయి. ఇసుక ఉచితం అంటూ టెండర్లేంటి? ⇒ ఇసుక ఉచితం అంటూ రెండు రోజుల్లోనే గుట్టుచప్పుడు కాకుండా టెండర్లు నిర్వహించారు. మన హయాంలో కనీసం రాష్ట్ర ఖజానాకు డబ్బులు రావడంతోపాటు ప్రజలకు రీజనబుల్ రేట్లకు ఇసుక వచ్చేది. ప్రతి ఆదివారం ప్రతి నియోజకవర్గంలో ధరలు ఇచ్చే వాళ్లం. అక్రమాలకు పాల్పడితే కేసులు పెట్టేవాళ్లం. అంత కట్టుదిట్టంగా అమలు చేశాం. కానీ ఇప్పుడు దోచుకోవడానికి పాలసీని మార్చారు. అడ్డగోలుగా స్టాక్ యార్డులు, రీచ్ల్లోని ఇసుకను అధికారంలోకి వచ్చిన నెల రోజులకే ఖాళీ చేశారు. ప్రభుత్వానికి సున్నా ఆదాయం. మరోవైపు ధరలు రెండు, మూడు రెట్లు పెరిగాయి. ⇒ మద్యం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మన హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో దుకాణాలు నడిపాం. ఉన్న షాపులు తగ్గించి, పర్మిట్ రూమ్స్ తీసేసి, టైమింగ్స్ పక్కాగా పెట్టి, బెల్టుషాపులు లేకుండా చూసి, అమ్మకం వాల్యూమ్స్ తగ్గించి ప్రజలకు మంచి చేశాం. కానీ ఇప్పుడు మద్యం షాపుల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉచిత వాటాలు అడుగుతూ బెదిరింపులకు దిగుతున్నారు. ఎన్నికలప్పుడు ప్రచారంలో వారిలా మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. అదే మనకు వాళ్లకూ మధ్య తేడా. ప్రతిపక్షంలో కూర్చోడానికైనా మనం వెనకాడం కానీ, అబద్ధాలు చెప్పలేం. నేను చెప్పే ఈ మాటలు ఎవ్వరికీ నచ్చకపోవచ్చు. కానీ విలువలు, విశ్వసనీయత అనే పదాలకు అర్థం ఉండాలి. రాజకీయాల్లో అధికారం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. కానీ మళ్లీ మనల్ని అధికారంలోకి తెచ్చేది మన విశ్వసనీయత, విలువలే. అవి లేనప్పుడు రాజకీయాలకు అర్థం లేదు. ఎన్నికలప్పుడు ఇంటింటికీ వెళ్లి ఆ ఇంట్లో చిన్న పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు (అమ్మ ఒడి), ఆ పిల్లల తల్లి కనిపిస్తే నీకు రూ.18 వేలు (నెలకు రూ.1,500), వాళ్ల చిన్నమ్మ కనిపిస్తే నీకూ రూ.18 వేలు (నెలకు రూ.1,500), 50 ఏళ్లకుపై బడిన పెద్దమ్మ కనిపిస్తే నీకు రూ.48 వేలు (బీసీలకు 50 ఏళ్లకే పింఛన్), ఉద్యోగం కోసం చూస్తున్న యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు (నిరుద్యోగ భృతి), అదే ఇంట్లో మెడలో కండువాతో రైతు కనిపిస్తే చాలు నీకు రూ.20 వేలు (రైతు భరోసా) అని ఇంట్లో ఎవరు కనిపించినా.. నీకు ఇంత.. నీకు ఇంత.. అని ప్రచారం చేశారు. ఇప్పుడు వాటి మాటేంటి?గ్రామ స్థాయి నుంచి పార్టీ ప్రతి అడుగులోనూ యుద్ధం చేస్తోంది. కాకపోతే మనం వ్యవస్థీకృతం(ఆర్గనైజ్డ్)గా యుద్ధం చేస్తున్నామా? లేదా? అన్నది చాలా ముఖ్యం. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే మంచి ఫలితాలు ఉంటాయి. గ్రామ స్థాయి నుంచి మనకు కమిటీలు, నాయకత్వం లేక కాదు. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ సర్పంచ్ లేదా, పోటీ చేసిన అభ్యర్థి మన పార్టీ వారే ఉన్నారు. 86 శాతం సర్పంచ్లు, 90 శాతం పైచిలుకు ఎంపీటీసీ సభ్యులు మన వాళ్లే ఉన్నారు. దాదాపు 15 ఏళ్లుగా ప్రతి గ్రామంలో మనకు ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే వీటిని నిర్మాణాత్మక వ్యవస్థల్లోకి తీసుకురావాలి. గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం మరింత బలంగా ఉండాలి. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలి ⇒ ఇప్పుడు నడుస్తున్నది సోషల్ మీడియా కాలం. ఇది నియోజకవర్గ ఇన్ఛార్జ్ నుంచి గ్రామ స్థాయి లీడర్ వరకు ధ్యాస పెట్టాల్సిన అంశం. ఇవాళ మనం యుద్ధం చేసేది చంద్రబాబుతోనే కాదు. ఒక చెడిపోయిన వ్యవస్థతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, టీడీపీ తప్పుడు సోషల్ మీడియాలతో యుద్ధం చేస్తున్నాం. వాళ్లే అబద్ధాలు సృష్టిస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అందుకే మనం మరింత బలంగా తయారు కావాలి. ప్రతి గ్రామంలోనూ పార్టీ కమిటీలన్నీ సోషల్ మీడియాకు అనుసంధానం కావాలి. ⇒ నియోజకవర్గ స్ధాయిలో జరుగుతున్న అన్యాయాలు, ఆకృత్యాలు చూపించగలగాలి. రెండో వైపున పార్టీ సందేశాలు కూడా గ్రామ స్థాయికి వెళ్లాలి. ఇది సవాల్తో కూడిన కార్యక్రమం. ఇది చేయగలిగే వ్యవస్థ మనకుంది. వచ్చే రోజుల్లో దీనిపై బాగా దృష్టి పెట్టాలి. వైఎస్సార్సీపీని దేశంలో అత్యంత బలమైన పార్టీగా తయారు చేయాలి. స్కామ్లలో కూడా ప్రజలను ఎలా కొత్తగా పిండాలా అని ఆలోచిస్తున్నారు. కనీసం ఇసుక టెండర్లు పిలుస్తున్నారన్న విషయం ఎవ్వరికీ తెలియదు. రెండే రెండు రోజులు టైం ఇచ్చారు. టెండర్లు వేయడానికి ఎవ్వరూ పోకుండా చూశారు. ఎన్నికలకు ముందు ఇసుక ఉచితం అన్నారు. ఎన్నికలు అయిన తర్వాత ఇసుక రేటు మన హయాం కన్నా డబుల్, ట్రిపుల్ రేటు. మన హయాంలో కనీసం రాష్ట్ర ఖజనాకు డబ్బులు రావడంతో పాటు ప్రజలకు రీజనబుల్ రేట్లకు ఇసుక వచ్చేది.ఈ ప్రభుత్వంలో మద్యం షాపుల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు 30 శాతం ఇస్తావా, 40 శాతం ఇస్తావా.. అని బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. షాప్ల కోసం కిడ్నాప్లు కూడా చేస్తున్నారు. నిజంగా లిక్కర్ పాలసీలో దురుద్దేశాలు లేకపోతే ఎమ్మెల్యేలు ఎందుకు పోటీ పడుతున్నారు? అంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు. లిక్కర్ రేట్లు తగ్గిస్తామన్నారు. కానీ, రేట్లు అలాగే ఉన్నాయి. మళ్లీ పర్మిట్ రూమ్స్ తీసుకొస్తున్నారు. బెల్టుషాప్లు ఏర్పాటవుతున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుండగా.. ప్రభుత్వ పెద్దలకు, వాళ్ల అనుచరులకు ఆదాయం పెరుగుతోంది.నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వం వద్దురా.. అని ప్రజలు చెప్పే పరిస్థితి వచ్చింది. నేనెప్పుడూ ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. అంత దారుణమైన పరిపాలన సాగుతోంది. ప్రభుత్వం ఎలా విఫలమైందో నాకన్నా.. నాయకులుగా మీరే బాగా చెబుతారు. ఎన్నికలప్పుడు వాళ్లు చెప్పిన మాటలేమిటి.. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్లు చేస్తున్న పాలన ఏమిటిన్నది గమనిస్తే.. ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల మాటేమిటి? సూపర్ సిక్స్లు ఏమయ్యాయని ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనని.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక కనీసం బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టలేకపోతున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో నడుపుతున్న ప్రభుత్వం ఇది. ప్రతి నియోజకవర్గంలో 10 పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో గ్రావెల్ తోలుకోవాలన్నా, ఫ్యాక్టరీ పెట్టుకోవాలనుకున్నా.. వ్యాపారం చేయాలనుకున్నా.. ఎవరు ఏం చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే. డబ్బు ఇవ్వకపోతే వ్యాపారమే లేదు. పోలీసుల సహాయంతో బెదిరిస్తున్నారు.ప్రతి గ్రామంలోనూ పార్టీ కమిటీలన్నీ సోషల్ మీడియాకు అనుసంధానం కావాలి. కమిటీల్లోని ప్రతి ఒక్కరూ వాళ్ల సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండాలి. మీ పేజీలను మీరే నడపాలి. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్ట్రాగామ్ పేజీలు తయారు చేసుకోవాలి. గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ ఆయా మాధ్యమాల్లో మీ అకౌంట్, మీ పేజీలు నిర్వహించాలి. ఎప్పుడైతే మీరు మీ పేజీలు నడుపుతారో అప్పుడే గ్రామ స్థాయిలో జరుగుతున్న అన్యాయాలను మనం ఎండగట్టగలుగుతాం.చీకటి తర్వాత వెలుగు సహజం పార్టీ భవిష్యత్తు బాధ్యతను పట్టుదలతో నిర్వర్తిస్తే మీకు, పార్టీకి మంచి జరుగుతుంది. మన పని వల్ల పార్టీకి మంచి జరుగుతుందనేది మనం మర్చిపోకూడదు. పార్టీ అధికారంలోకి వస్తే కొట్ల మంది ప్రజలకు, లక్షల మంది కార్యకర్తలకు, వేల మంది నాయకులకు మంచి జరుగుతుంది. ఇవన్నీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. అందరం కలిసికట్టుగా బాధ్యత తీసుకుని అడుగులు వేస్తున్నప్పుడు.. ఇది మన పార్టీ అనేది మన నరనరాల్లో ఇమిడి ఉండాలి. మనం వేసే ప్రతి అడుగు మన పార్టీ కోసం వేస్తున్నామన్నది మన ఒంట్లో ఎక్కించుకోవాలి. కష్టం లేనిదే మనకు అందలం రాదు. 16 నెలలు నేను జైలుకు పోతేనే ముఖ్యమంత్రి అయ్యాను. ఎవరూ చూడని వేధింపులు చూశాను. అకారణంగా 16 నెలలు ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం అన్నది ఎప్పుడూ జరగలేదు. ఒక పార్టీ లేకుండా చేయాలని, ఒక వ్యక్తిని వేధించాలన్న ఉద్దేశంతోనే ఆ స్థాయి వేధింపులు చేశారు. అన్ని నెలలు జైల్లో పెట్టిన తర్వాత, ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి ప్రజలకు మంచి చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. మనం మంచి చేయగలిగాం. దాని అర్థం అన్యాయం జరిగినప్పుడు ఒక మంచి జరుగుతుంది. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. దేవుడు మంచికి తోడుగా ఉంటాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. నష్టాలుంటాయి. ఒక్కోసారి జైలుకు కూడా పోవాల్సి ఉంటుంది. అయితే ఏంటి? ఇవన్నీ జరిగినప్పుడే మనిషి ఎదుగుతాడు. ప్రజల్లో, నాయకత్వం దగ్గర మన్ననలు ఉంటాయి. అన్నీ ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. మన భవిష్యత్ కోసం మనం చేస్తున్నామని గుర్తు పెట్టుకోండి. మన పార్టీ కోసం, మనం అధికారంలోకి రావాలన్న సంకల్పంతో పేదవాడికి మన వల్ల మంచి జరుగుతుందన్న స్థిరమైన నమ్మకంతో అడుగులు వేస్తున్నాం. ఈ విషయం ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకోండి. పనితీరు ఆధారంగా ప్రమోషన్లు జిల్లా అధ్యక్షులు, కమిటీల్లోని వారు.. మీ మీ పనితీరు ఆధారంగా మీ ప్రమోషన్లు ఉంటాయి. మీరు ప్రూవ్ చేసుకోండి. తప్పకుండా ప్రాధాన్యత, అవకాశాలు కల్పిస్తాం. మీకు ప్రమోషన్ ఇచ్చే బాధ్యత నాది. మనం అధికారంలోకి రాగానే మీలో ఎక్కువ మంది మంత్రివర్గంలో ఉండాలని ఆశిస్తున్నాం. జిల్లా అధ్యక్షులకు ఇదొక సువర్ణావకాశం. కష్టపడండి. మీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. మీ జగన్ మీ కష్టాలకు తప్పకుండా ప్రాధాన్యత ఇస్తాడు. అనుబంధ సంఘాల అధ్యక్షులకూ మంచి అవకాశాలు వస్తాయి. మీ పనితీరుపై పరిశీలన, పర్యవేక్షణ ఉంటుంది. రీజినల్ జనరల్ సెక్రటరీలను తీసుకొచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ల పనితీరుపైనా మదింపు ఉంటుంది. రిపోర్టుల ప్రకారం నిర్ణయాలు ఉంటాయి. బాగా పని చేసే వారికీ రేటింగ్స్ ఇస్తాం. -
వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి అని ఆయన అన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని పేర్కొన్నారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులు, సిరిసంపదలతో తులతూగాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
నేడు తిరుమలకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఇందుకోసం ఆయన శుక్రవారం రాత్రికి తిరుమల చేరుకుంటారు. వైఎస్ జగన్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకుని, అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం 10.20 గంటలకు గెస్ట్హౌస్ నుంచి బయలుదేరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు, అనంతరం తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవుతారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మానుకోండి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి.. అవసరం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గమని మండిపడ్డారు. పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పి పంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం అని చంద్రబాబును నిలదీశారు. ‘ఇకనైనా కళ్లు తెరవండి.. వెంటనే ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కు తీసుకోండి. ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోండి’ అని హితవు పలికారు. మెడికల్ కాలేజీల్లో మిగిలిన పనులను పూర్తి చేసి, పేద పిల్లలకు వైద్య విద్యను, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ‘మీకు చేతనైనంత మీరు ఖర్చు చేస్తూ వెళ్లండి.. మీకు చేతకాకపోతే మళ్లీ మేం వచ్చిన తర్వాత అయినా పూర్తి చేస్తాం. అంతేకానీ ఇలా మెడికల్ కాలేజీల ప్రైవేటుపరం మాటున స్కామ్లు చేయడం మానుకోండి. లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని గుర్తించుకోండి’ అని చంద్రబాబును హెచ్చరించారు. మెడికల్ కాలేజీల వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వ తీరును తూర్పారపడుతూ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. అందులో ఇంకా ఏమన్నారంటే.. బాధ్యతల నుంచి తప్పించుకుంటే దాన్ని ప్రభుత్వం అంటారా? ⇒ నాణ్యమైన విద్య, వైద్యాన్ని ప్రజలకు ఒక హక్కుగా అందించడం అన్నది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి, మంచి వైద్యం అందుకోవడానికి ఏ కుటుంబం కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. ఈ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తప్పించుకుంటుంది చంద్రబాబూ? అలా తప్పించుకుంటే, దాన్ని ప్రభుత్వం అని అంటారా? ⇒ దీన్ని గుర్తించే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో రూ.8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించాం. దీని వల్ల ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం వస్తుంది? 2023–24 సంవత్సరాల్లో ఐదు కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావడం నిజం కాదంటారా? తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రానికి రాలేదంటారా? చాలా మంది పేద పిల్లలు సీట్లు సాధించి డాక్టర్ చదువులు చదవడం లేదా? ⇒ నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వెళ్తే ఈ ఏడాదిలో మరో ఐదు కాలేజీలు.. మదనపల్లె, పులివెందుల, ఆదోని, మార్కాపురం, పాడేరుల్లో మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడం ఏంటి? పులివెందుల కాలేజీకి ఎన్ఎంసీ 50 సీట్లు మంజూరు చేస్తే, వద్దంటూ లేఖ రాయడం ఏంటి? మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరంచేసే స్కామ్లకు ఆలోచన చేయడం ఏంటి? ప్రైవేటు మీద అంతమోజు ఎందుకు? ⇒ కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణాల కోసం రూ.2403 కోట్లు ఖర్చు చేసి, ఐదు కాలేజీల్లో క్లాసులు మొదలుపెట్టి, మరో ఐదు కాలేజీలను ఈ ఏడాది నుంచే బోధనకు సిద్ధం చేశాం. మీ ప్రభుత్వం కూడా క్రమంగా ఖర్చు చేసుకుంటూ వెళ్తే మిగిలిన కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయన్నది వాస్తవం కాదా? ⇒ ఇలా చేయకుండా భారం అంటూ చేతులు దులిపేసుకుని ప్రజారోగ్య సంస్థలను అమ్మేస్తారా? ప్రైవేటు మీద మీకు అంత మోజు ఎందుకు? ప్రభుత్వ సంస్థలంటే అంత అసహ్యం ఎందుకు? కోవిడ్లో ఆదుకున్నది ప్రజారోగ్య రంగమే ⇒ కొత్త మెడికల్ కాలేజీల నిర్వహణలో ఇబ్బందులు రాకూడదు, అదే సమయంలో పేద విద్యార్థులకు నష్టం కలగ కూడదన్న విధానంలో మేం సీట్లను భర్తీ చేస్తే, ఎన్నికల్లో ఓట్ల కోసం నానా రాద్ధాంతం చేశారు. అధికారంలోకి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అన్నారు. సీట్ల సంగతి దేవుడెరుగు.. ఇప్పుడు ఏకంగా కాలేజీలనే అమ్మేస్తున్నారు. ఇది ఏరు దాటాక తెప్ప తగలేయడం కాదంటారా? మోసం చేయడమే మీ నైజమని మరోసారి బయట పడ్డారు. ⇒ పార్లమెంటు నియోజకవర్గానికో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే, అది ఆ నియోజకవర్గంలో ఉన్న ఏరియా ఆస్పత్రులకు, సీహెచ్సీలకు, పీహెచ్సీలకు, విలేజ్ క్లినిక్స్కు మార్గదర్శిగా ఉంటుంది. ఆ జిల్లా స్థాయిలో సూపర్ స్పెషాల్టీ సేవలు కూడా పేదలకు ఉచితంగా అక్కడే లభిస్తాయి. అలాంటి కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే ముందుగా నష్టపోయేది పేద విద్యార్థులే కాదు, అక్కడి ప్రజలు కూడా. వారికి నాణ్యమైన వైద్యం అందదు సరికదా.. ప్రైవేటు ఆస్పత్రుల మధ్య పోటీ లోపించి వైద్యం కోసం వసూలు చేసే ఫీజులు ఆకాశాన్ని అంటుతాయి. ⇒ ఎప్పుడైనా ప్రైవేటుకు గవర్నమెంటు పోటీగా ఉంటేనే, రేట్లు రీజనబుల్గా ఉంటాయి. కాలేజీలను ప్రైవేటీకరించాలన్న మీ విధానం అందరినీ దెబ్బ తీస్తుందనడం వాస్తవం కాదా? అటు ప్రజలను, ఇటు పిల్లలను కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో ఆదుకున్నది ప్రజారోగ్య రంగమే అని గుర్తించకపోతే ఎలా చంద్రబాబూ? పేదలకు ఉచితంగా మంచి వైద్యం అందకూడదన్నదే మీ విధానమని తెలుస్తోంది. -
మాకిచ్చిన హామీ సంగతి ఏమైంది సీఎంగారూ?
సాక్షి రాయచోటి: ఎన్నికలకు ముందు ఒక మాట..తర్వాత మరోమాట చెప్పడం టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాటిగా మారింది. గతంలోనూ 2014లో ఇలాంటి మాటలతోనే ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి రాగా మరొక మారు అనేక వర్గాల వారికి మాయా బాబు మహా శఠగోపం పెడుతున్నారు. ఈసారి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామంటూనే ఇప్పటికీ అమలు చేయని తీరును ప్రజలు చర్చించుకుంటున్నారు. మరోవైపు వైఎస్ జగన్ సర్కార్ 2019 నుంచి వలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తేగా...అందులో వలంటీర్లకు సంబంధించి రూ. 5 వేలు కాదు..రూ. 10 వేలు గౌరవ వేతనం పెంచి ఇస్తామని చెప్పి ఏకంగా వ్యవస్థకే మంగళం పాడేలా కనిపిస్తున్నారు. రూ. 10 వేలు పెంపు లేకపోగా చివరికి వారిని పట్టించుకునే పరిస్థితి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం అందించడంలో కీలకపాత్ర పోషించిన వలంటీర్ల కొనసాగింపే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అధికారంలోకి వచ్చినా ఎదురు చూపులే గత సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి సర్కార్ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. చంద్రబాబు ప్రభుత్వంలో వలంటీర్లు కూడా రూ. 10 వేలు గౌరవంగా తీసుకుంటామని ఆశపడ్డ వారికి భంగపాటు తప్పలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు దాటుతున్నా ఇప్పటివరకు అతీగతీ లేదు. అందులోనూ రెండు దఫాలుగా పింఛన్ల పంపిణీలోనూ వలంటీర్లను పక్కన పెట్టి సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టారు. దీనిని బట్టి వలంటీర్లను కొనసాగించడం దాదాపు అనుమానమే. మూడు నెలలుగా వలంటీర్లను మళ్లీ తీసుకుంటారేమోనన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమాన్ని పంచిన వలంటీర్లువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి 2024 ఎన్నికల వరకు ప్రజలకు విశేష సేవలు అందించారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం మొదలుకొని ఎప్పటికప్పుడు ప్రజలకు నీటిని అందించే విషయం, ఆధార్ అప్డేట్లు, సర్టిఫికెట్లు, ఆరోగ్య శిబిరాలు, చిన్నపిల్లలకు వేసే వ్యాక్సిన్లు ఇలా ప్రతి ఒక్కటీ వారి ద్వారానే జరుగుతూ వచ్చింది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సైతం ప్రజలకు చేరవేస్తూ వచ్చారు. వలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే పథకాలతోపాటు పాలన కొనసాగేది. వైఎస్ జగన్ హయాంలో ప్రజలతో అనునిత్యం మమేకం అవుతూ ఒక వెలుగు వెలిగిన వలంటీర్లకు ప్రస్తుతం కష్టకాలం వెంటాడుతోంది. వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలిఎన్నికల ముందు ఓట్లు, సీట్ల కోసం చంద్రబాబు వలంటీర్లకు గౌరవ వేతనం పెంపు పేరుతో వల వేశారు. వలంటీర్ల గౌరవ వేతనం సంగతి దేవుడెరుగు...అధికారంలోకి రాగానే వారి గురించే మరిచిపోయారు. అయితే విజయవాడలో వరదలు పోటెత్తడంతోపాటు బుడమేరుకు గండ్లు పడి జలప్రళయం విజయవాడను ముంచెత్తింది. దీంతో వలంటీర్ల వ్యవస్థ కొనసాగి ఉంటే ఎప్పటికప్పుడు అప్రమత్తం కావడంతోపాటు అన్ని విషయాలు తెలిసేవని, పరిస్థితి మరోలా ఉండేదని వలంటీర్ల గురించి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఉండడం ద్వారా ఉపద్రవాలు, ఉప్పెనలు, ఇతర అతలాకుతలం పరిస్థితులు, ఇంకా ఎలాంటి సమాచారం ఉన్నా ముందే ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంటుందని.. వలంటీర్లను కొనసాగించాలని ప్రజల నుంచి కూడా డిమాండ్ వినవస్తోంది. ప్రజల అవసరాల నిమిత్తం వలంటీర్లను కొనసాగిస్తారో...లేక పక్షపాత ధోరణితో కూటమి సర్కార్ అణచి వేస్తుందో వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా వలంటీర్లు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గౌరవ వేతనాన్ని పెంచి అందరినీ కొనసాగించాలని వలంటీర్ల సంఘం డిమాండ్ చేస్తోంది.తగిన నిర్ణయం తీసుకోవాలి గ్రామ,వార్డు వలంటీర్లను తిరిగి వెంటనే విధుల్లోకి తీసుకుని న్యాయం చేయాలి. వలంటీర్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక రకాలుగా చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించాలి. గత ఆరు నెలలుగా జీతభత్యాలు లేక, విధులు లేక సందిగ్ధావçస్థలో ఉన్న వలంటీర్లపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలి. – రెడ్డి శివకృష్ణ, కొండయ్యగారి పల్లె, నిమ్మనపల్లె మండలం సీఎం హామీని నిలబెట్టుకోవాలి వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి సీఎం చంద్రబాబునాయుడు తన ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం వలంటీర్లకు గౌరవ వేతనం రూ.10వేలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. గ్రామ, వార్డు వలంటీర్ల అవస్థలు గుర్తించి వెంటనే వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వలంటీర్లకు న్యాయం చేయాలి. – వెంకటేష్, గ్రామ వలంటీర్, నిమ్మనపల్లె.విధుల్లోకి తీసుకోండిప్రజలకు ఎన్నో సేవలందించిన వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి. ఎన్నికల సమయంలో కూటమి ప్రభు త్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని వలంటీర్లకు న్యాయం చేయాలి. గతంలో ప్రజలకు ఎన్నో సేవలందించాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలి. – శివరామ్, సంబేపల్లె వలంటీర్ ఎన్నో సేవలందించాంగత ప్రభుత్వంలో ప్రజలకు ఎన్నో సేవలు అందించాము. కరోనా సమయంలో ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండి మందులను అందజేశాము. సుదూర ప్రాంతాలలోని ఆసుపత్రిలో ఆరోగ్యం బాగాలేక చికిత్స పొందుతున్న వారికి పింఛన్, వివిధ పథకాలు అందజేశాము. మా సేవలను గుర్తించాలి. – సుబ్బరాయుడు, వలంటీర్, శెట్టిపల్లె పాళెంగడ్డ, సంబేపల్లె -
చివరకు తప్పుకున్న టీడీపీ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరి నుంచి అధికార టీడీపీ తప్పుకుంది. బలం లేకపోవడం.. బలగానికీ ఇష్టంలేకపోవడంతో పోటీలో ఉంటే చిత్తుగా ఓడిపోవడం తప్పదని పార్టీ పెద్దలు గ్రహించారు. అయినా, కుతంత్రాలపై ఆశలు పెట్టుకున్నారు. చివరికి.. సామదానభేద దండోపాయాలను ఉపయోగించారు. డబ్బులతో అయినా ఓట్లు కొనాలని చివరి నిమిషం వరకూ చూశారు. కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కించిత్తైనా నమ్మకం లేకపోవడంతో కూటమి చేతులెత్తేసి తోకముడిచింది. దీంతో.. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వైఎస్సార్సీపీ కేడర్ చెక్కు చెదరకపోవడంతో ఆ పార్టీ ఖాతాలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటు చేరింది. బొత్స విజయం లాంఛనంగా మారింది. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇది తొలిమెట్టుగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. పోటీకి అందరూ ససేమిరావాస్తవానికి.. ఎలాగైనా ఎవరో ఒకర్ని పోటీలో నిలపాలని కొద్దిరోజులుగా సీఎం చంద్రబాబు భావిస్తూ వచ్చారు. స్థానిక సంస్థల్లో అధికార పక్షానికి బలం లేకపోవడం, వైఎస్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉండటంతో టీడీపీ అ«భ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పీలా గోవింద్లలో ఎవరో ఒకర్ని పోటీచేయించాలని చంద్రబాబు ప్రయత్నించారు. కానీ, గెలిచేందుకు ఏమాత్రం అవకాశంలేకపోవడం.. పైగా బలమైన ప్రత్యర్థి బొత్స ఉండడంతో పోటీకి వారిద్దరూ ససేమిరా అన్నారు. దీంతో దిలీప్ చక్రవర్తిని అభ్యర్థిగా నిలిపేందుకు ప్రయత్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దిలీప్ చక్రవర్తి అనకాపల్లి టికెట్ ఆశించారు. ఆ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో అతనికి ఆశాభంగమైంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఆశపెట్టి అతన్ని బరిలో దించాలని విశాఖ జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబుకు ప్రతిపాదించారు. పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న లోకేశ్ కూడా ఈయన పేరును తెరపైకి తెచ్చారు. గెలిచే అవకాశంలేని ఎమ్మెల్సీ సీటుకు పోటీచేసేందుకు ఆయన కూడా ముందుకు రాకపోవడంతో గత్యంతరంలేని స్థితిలో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు చంద్రబాబు మంగళవారం విశాఖ జిల్లా నేతలకు టెలీకాన్ఫరెన్స్లో వెల్లడించారు. ఓటమి భయంతోనే వెనకడుగుఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలని ముందు నుంచి భావించిన టీడీపీ చివరి నిమిషంలో తప్పుకోవడం వెనుక బలమైన కారణమే ఉంది. విశాఖ స్థానిక సంస్థల్లో సంపూర్ణ మెజారిటీ ఉన్న వైఎస్సార్సీపీని ఎదుర్కొని ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవడం సాధ్యంకాదు. ఈ నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో వచ్చే ఓటమి ఘోర పరాభవం కింద లెక్కే. ఇటీవలే తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోను ఇదే జరిగింది.అక్కడ మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పరాజయం పాలైంది. దీంతో.. స్థానిక సంస్థల్లో పూర్తి మెజారిటీ ఉన్న వైఎస్సార్సీపీని తట్టుకుని నిలబడటం టీడీపీకి పెను సవాల్గా మారే పరిస్థితి ఉందని.. పైగా, ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర నెలలకే ఓటమి చవిచూస్తే ఆ ప్రభావం తట్టుకోవడం కష్టమనే పోటీకి ఎవరూ ముందుకు రాకపోవడంతో చంద్రబాబు చేతులెత్తిసినట్టు సమాచారం. బొత్స ఎన్నిక లాంఛనమేమరోవైపు.. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ సవాల్గా తీసుకుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యూహాత్మకంగా మాజీమంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణను బరిలోకి దించారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సతోపాటు మరో స్వతంత్ర అభ్యర్థి షఫీ ఉల్లా కూడా నామినేషన్ వేశారు. గడువులోగా ఈయన నామినేషన్ ఉపసంహరించుకుంటే పోలింగ్ లేకుండానే బొత్సను విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ పోటీ జరిగినా బొత్స ఎన్నిక లాంఛనమే. దిలీప్కు హితోపదేశం..! ఇదిలా ఉంటే.. దిలీప్ పేరుని ప్రతిపాదించిన లోకేశ్ వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ.. ఆ ప్రతిపాదనలకు చెక్ పెట్టేందుకు వీలుగా టీడీపీ ఉత్తరాంధ్ర సీనియర్లు పావులు కదిపారు. టీడీపీకి చెందిన ఓ మాజీమంత్రి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. దిలీప్ చక్రవర్తికి వ్యాపార భాగస్వామిగా ఉన్న ఓ ఎమ్మెల్సీ ద్వారా మంతనాలు ప్రారంభించారు. సదరు అభ్యర్థిగా భావిస్తున్న వ్యక్తికి హితోపదేశం చేయడం ప్రారంభించారు. రూ.100 కోట్లు కాదు.. రూ.200 కోట్లు ఖర్చుచేసినా.. గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. డబ్బులు, టైమ్ వేస్ట్ అంటూ బ్రెయిన్వాష్ చేశారని సమాచారం. ఓట్ల అంతరం చాలా ఉందనీ.. దాన్ని అధిగమించడం కష్టమనీ.. అందుకే ఓడిపోయే సీటును అంటగట్టేందుకు చూస్తున్నారని చెప్పారు. నామినేషన్ వేసి.. కోట్ల రూపాయలు నష్టపోయే కంటే.. అసలు పోటీలో ఉండకపోవడం మంచిదని సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గ్రహించే గండి బాబ్జీ, పీలా గోవింద్లు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా వివరించారు. అంతా విన్న దిలీప్ పోటీచేయలేనంటూ లోకేశ్కి తెగేసి చెప్పేశారు. -
డబ్బులతో ప్రలోభపెట్టాలని చూస్తున్నారు ఇది అధర్మ యుద్ధం..
-
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
సాక్షి, అమరావతి: ఎవరూ అధైర్యపడవద్దు.. అన్ని విషయాల్లో చివరి వరకు అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారు. తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీస్లో బుధవారం కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా జగన్.. అందరినీ పలకరించి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్సీపీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. -
‘బురిడీ’బాబులు.. అంతా మాయ
ఆంధ్రప్రదేశ్లో గత శాసనసభ ఎన్నికలలో మెజార్టీ ప్రభుత్వ ఉద్యోగులు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారన్న అభిప్రాయం ఉంది. దానికి పలు కారణాలు ఉండవచ్చు. ప్రభుత్వపరంగా కొన్నిలోపాలు ఉండవచ్చు. కాని అదే టైమ్ లో ముఖ్యమంత్రి జగన్ ఏ అధికారిని లేదా ఏ ఉద్యోగిని అగౌరవపరచలేదు. ఎవరిని మోసం చేసే యత్నం చేయలేదు. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఇస్తానని ఎన్నికల ముందు చెప్పినా , అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి అర్ధం చేసుకుని ఉద్యోగులకు పాత పెన్షన్ ఇవ్వలేకపోయినా, ఏ రకంగా వారికి మేలు చేయవచ్చన్నదానిపై దృష్టి పెట్టారు. అందులో బాగంగానే వారికి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ను తీసుకు వచ్చారు. ఇందుకోసం చాలా కసరత్తు చేశారు. ఉద్యోగ సంఘాలతో కూడా పలుమార్లు చర్చించారు. అయినా కొంతమంది ఉద్యోగులకు అది నచ్చలేదు. అదే టైమ్ లో అప్పటి విపక్షనేత, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాని, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు సీపీఎస్కు అనుకూలంగా మాట్లాడారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. వారిని రెచ్చగొట్టడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా చేయని ప్రయత్నం లేదు. అబద్దాలను నిత్యం వండి వార్చేవి. అయినా జగన్ తాను చేయదలచుకున్నది చిత్తశుద్దితో చేసి ఉద్యోగులు రిటైరైనప్పుడు వచ్చే జీతంలో ఏభై శాతం పెన్షన్ వచ్చేలా స్కీమును తెచ్చారు. ఇప్పుడు అది దేశవ్యాప్తంగా చర్చ అయింది. ఆంధ్ర మోడల్ పేరుతో కేంద్రం కూడా దీనిని పరిగణనలోకి తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాలు కూడా ఇది బాగానే ఉందని అభిప్రాయపడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు తాము ఓపీఎస్కు వెళుతున్నామని చెప్పినా, ఆచరణలో చేయలేకపోయాయి.ఈ నేపధ్యంలో ఏపీలో ఎన్నికలు జరగ్గా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు మొదలైనవారు జగన్కు వ్యతిరేకంగా మారారు. కొన్ని ఆందోళనలు కూడా చేపట్టారు. వారంతా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లతో పాటు, ఈనాడు, జ్యోతి వంటి ఎల్లో మీడియా ట్రాప్ లో పడ్డారు. నిజంగానే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పాత పెన్షన్ స్కీమ్ వస్తుంందని అనుకున్నారు. కాని అలా జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులలోనే చంద్రబాబు ప్రభుత్వం యుటర్న్ తీసుకుని జగన్ ప్రభుత్వం ఇచ్చిన జిఓనే అమలు నిమిత్తం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి కూడా ఈనాడు మీడియా దుర్మార్గంగా జగన్ ప్రభుత్వానిదే తప్పు అన్నట్లు పచ్చి అబద్దపు వార్తను రాసి, టీడీపీ ప్రభుత్వ తప్పేమిలేదన్నట్లు కవరింగ్ ఇస్తూ కధనాన్ని ఇచ్చింది. చంద్రబాబు కాని, పవన్ కళ్యాణ్ కాని దీని గురించి మాట్లాడడం లేదు. కనీసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించలేదు. నిజంగానే వీరికి చిత్తశుద్ది ఉంటే జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీఓని, చట్టాన్ని రద్దు చేసి ఉండవచ్చు కదా! లేని లాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసినట్లు ప్రకటించిన చంద్రబాబు నాయుడు జీపీఎస్ను మాత్రం ఎందుకు కొనసాగిస్తున్నారు. ఇది ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేసినట్లు కాదా? అబద్దాలు చెప్పడంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పోటీపడినట్లు కాదా?అంటే ఎవరు బదులు ఇవ్వాలి. కూటమికి మద్దతు ఇచ్చిన ఉద్యోగులు అవాక్కవడం తప్ప ఇంక చేయగలిగింది లేదు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు దీనిపై నిరసన బాట పట్టినా పెద్దగా ఫలితం ఉండదన్న అభిప్రాయం ఉంది. గత ప్రభుత్వం కొద్దిగా ఆలస్యం చేసినా జీతాలు ఏ నెల ఆపలేదు. పేదల స్కీములకు ప్రాధాన్యత ఇచ్చిన కారణంగా ఈ ఇబ్బంది వచ్చింది. అలాగే వారికి సంబంధించిన జిపిఎఫ్,గ్రాట్యుటి తదితర చెల్లింపులలో కొంత ఆలస్యమైన మాట నిజమే. అదే టైమ్ లో ఉద్యోగుల మీద ఎక్కడా వేధింపులు లేవు. గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలు తెచ్చిన తర్వాత వీరిపై పని ఒత్తిడి కూడా తగ్గింది. నేరుగా లబ్దిదారులకు నగదు బదిలీని విజయవంతంగా అమలు చేయడంతో అవినీతి తగ్గింది. అయితే ఈ పద్దతుల వల్ల తమ ప్రాధాన్యత తగ్గిందని కొంతమంది భావించి ఉండవచ్చు. కాని ప్రజల విశాల ప్రయోజనాల రీత్యా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు చేయక తప్పు. ఉద్యోగులను జగన్ ఎప్పుడూ అన్నా.. అంటూ సంబోధించి చాలా మర్యాద ఇచ్చేవారు. అదే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఒకలా, అధికారం వచ్చాక మరొలా ఉంటారని మరోసారి రుజువు చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఒక శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఏదో చిన్న సమస్య వచ్చింది. కొద్ది సెకన్లపాటు అంతరాయం కలిగింది.దానికే ఆయన ఉద్యోగులపై మండిపడ్డారు. వారు ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలని, తమాషాగా ఉందా అని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ తాను 1995 నాటి పాలన తెస్తానని అన్నారు. ఆ రోజుల్లో ఆయన తన గుర్తింపు కోసం ఆకస్మిక తనిఖీలు చేపట్టేవారు. ఎక్కడబడితే అక్కడ ఉద్యోగులను, అధికారులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. వారిని బహిరంగంగా మందలించేవారు.ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఒక అధికారి గుండెపోటుకు గురై మరణించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అది పెద్ద సంచలనం అయింది. అంతేకాదు.2014 టరమ్లో చంద్రబాబు తెలుగుదేశం మీడియా ప్రముఖుడు ఒకరితో కూర్చుని ఉద్యోగుల జీతభత్యాల గురించి ఏమి మాట్లాడుకుంది అంతా విన్నారు. అయినా చంద్రబాబు గొప్పతనం ఏమిటంటే ఉద్యోగులను మళ్లీ తనవైపు తిప్పుకోగలగడం, వారిని నమ్మించడం.అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చినా, చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయకపోయినా ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేయడం. 19952004 మద్య ఏభైకి పైగా ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయించారు. ప్రపంచ బ్యాంకు రుణం కోసం వారు పెట్టిన కండిషన్ల ప్రకారం ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవడానికి అంగీకరించారన్న విమర్శ ఉండేది. అదే చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించేవారు. టీచర్ల పోస్టులను భర్తీ చేయడం లేదని, మెగా డీఎస్సీ అంటూ ఊదరగొడతారు. విశేషం ఏమిటంటే సుమారు లక్షన్నర ఉద్యోగాలను సృష్టించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అయితే, ఆయన ఉద్యోగాలు ఇవ్వలేదని చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ లు ప్రచారం చేస్తే, ఈనాడు, ఆంధ్రజ్యోతి డప్పు కొడితే దానిని కూడా కొంతమేర ప్రజలు నమ్మడం. ఇలా ఎన్నో జిమ్మిక్కులు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు యథాప్రకారం యుటర్న్లు తీసుకోవడం ఆరంభించారు. ఈసారి ఆయనకు పవన్ కళ్యాణ్ జత అయ్యారు. అంతే తేడా. గతంలో సోషల్ మీడియా ఉండేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు వారు ఎన్నికలకు ముందు ఏమి చెప్పారు? ఇప్పుడు ఏమి చేస్తున్నారు ?అన్నదానిపై విశ్లేషణలు వచ్చేస్తున్నాయి. ప్రజలను ఒకటి, రెండుసార్లు మోసం చేయవచ్చుకాని, ఎల్లకాలం మోసం చేయలేరన్న సూక్తి ఉంది. కాని అది చంద్రబాబు విషయంలో వాస్తవం కాదని రుజువు అయింది. ఈ సందర్భంలో మోసం చేసేవారి తప్పుకన్నా, మోసపోయేవారి తప్పే అధికమని అనుకోవాలన్న నానుడి కరెక్టేనేమో! – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మహానేత వైఎస్సార్కు వైఎస్ జగన్ ఘన నివాళి
సాక్షి కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని సోమవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయకు జనవాహిని పోటెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా తరలి వచ్చిన అభిమానులు వైఎస్సార్ ఘాట్ వద్ద ఘన నివాళులర్పించారు. ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డి, మేనత్త వైఎస్ విమలమ్మ, చిన్నాన్న వైఎస్ సుధీకర్రెడ్డి, అత్తమ్మ ఈసీ సుగుణమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితో కలసి ఇడుపులపాయలో వైఎస్సార్కు నివాళులర్పించారు. సమాధి ఘాట్కు పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ జగన్ కాసేపు అక్కడే మోకాళ్లపై కూర్చొని తండ్రిని స్మరించుకున్నారు. నివాళులర్పించే సమయంలో వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.ప్రత్యేక ప్రార్థనలు..సమాధి ఘాట్ వద్ద వైఎస్ జగన్, వైఎస్సార్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రానున్న కాలంలో కొన్ని సమస్యలు ఎదురైనా రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో జగన్ ధైర్యంగా ఎదుర్కొనేలా దేవుడు ఆశీర్వదించాలని మేనత్త విమలమ్మ ప్రార్థన చేశారు. కష్టాలు తాత్కాలికమేనని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్లడం ద్వారా ఎదిరించే శక్తిని ప్రసాదిస్తాడని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్సార్, వైఎస్ జగన్ చేసిన మంచిని ప్రస్తావించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన రమేష్, హేమ దంపతులు వైఎస్ జగన్ను కలిసి తమ మూడు నెలల చిన్నారికి పేరు పెట్టాలని కోరగా విజయశ్రీగా నామకరణం చేశారు.వైఎస్సార్ విగ్రçహం వద్ద నివాళులు..ఇడుపులపాయలోని ఘాట్ ప్రాంగణంలో వైఎస్సార్ విగ్రహానికి వైఎస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. కొద్దిసేపు అక్కడే నిలబడి వైఎస్సార్ను స్మరించుకున్నారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతిరెడ్డి, విమలమ్మ, వైఎస్ సుధీకర్రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, అరకు, తిరుపతి ఎంపీలు తనూజారాణి, గురుమూర్తి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల పార్టీల అధ్యక్షులు కె.సురేష్బాబు, గడికోట శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, డాక్టర్ సుధ, టి.చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, గోవిందరెడ్డి, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, పోచిమరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి, రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, సంబటూరు ప్రసాద్రెడ్డి, జడ్పీ చైర్మన్ శారదాదేవి, పులివెందుల మాజీ మున్సిపల్ చైర్మన్ వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ మ«ధురెడ్డి సతీమణి వైఎస్ మాధవి, వైఎస్సార్సీపీ నాయకులు యువరాజ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి కుమారుడు థామస్రెడ్డి, స్టాన్లీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అందరికీ అభివాదం.. అభిమానులతో సెల్ఫీఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి ఘాట్ ప్రాంగణానికి తరలి వచ్చిన జనవాహినికి వైఎస్ జగన్ అభివాదం చేశారు. వైఎస్సార్ అమర్రహే, వైఎస్ జగన్ నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినాదాలతో ఘాట్ ప్రాంగణం హోరెత్తింది. పలువురి వద్దకు స్వయంగా వెళ్లి పలుకరించిన వైఎస్ జగన్ అడిగిన వారందరితో సెల్ఫీ దిగారు. భారీగా వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మూడు రోజుల జిల్లా పర్యటన ముగించుకుని అనంతరం అక్కడి నుంచి ఉదయం 11.10 గంటలకు గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్కు విమానాశ్రయంలో పలువురు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అడపా శేషు, గౌడ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మాదు శివరామకృష్ణ గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చారు. గొల్లపూడి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కొమ్మ కోటేశ్వరరావు(కోట్లు), జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ గౌసాని, విజయవాడ రూరల్ ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి, జడ్పీటీసీ కాకర్లమూడి సువర్ణరాజు, నిడమానూరు సర్పంచి శీలం రంగారావు, పార్టీ నాయకులు దేవభక్తుని చక్రవర్తి, అశోక్, మేచినేని బాబు, కాట్రు శేషు, రామిశెట్టి వెంకటేశ్వరరావు, సమ్మెట సాంబశివరావు, నిడమర్తి రామారావు, పలువురు విజయవాడ కార్పొరేటర్లు, కార్యకర్తలు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. వారందరినీ ఆప్యాయంగా పలకరించిన వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో తాడేపల్లికి బయలుదేరారు. -
అండగా ఉంటాం.. ఆందోళనొద్దు: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, కడప: ‘టీడీపీ వర్గీయులు అరాచకాలు సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత దాడులు చేస్తున్నారు. కట్టడి చేయాల్సిన ప్రభుత్వం మిన్నకుండిపోయింది. ఇలా ఐదేళ్లలో మనం ఎప్పుడూ దౌర్జన్యాలు చేయలేదు’ అంటూ అనంతపురం జిల్లాకు చెందిన బాధితులు వాపోతుంటే, అధైర్య పడొద్దని.. టీడీపీ దుర్మార్గాలను ధైర్యంగా ఎదుర్కొందామని మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు. ‘మీ ప్రాంతానికి వస్తా.. మీకు అండగా నిలుస్తా.. ఆందోళన పడొద్దు, అందర్నీ కలుస్తా.. టీడీపీ దుర్మార్గాన్ని దీటుగా ఎదుర్కొందాం’ అని ఊరడించారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందుల క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ జిల్లాతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ శ్రేణులు, నాయకులతో ఆయన మమేకమయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నేతలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, వీరాంజనేయులు, మగ్బూల్ బాషా, సాంబశివారెడ్డి తదితరులు వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాల అనంతరం ఆ జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ‘పోరాటాలు మనకు కొత్త కాదు. పోరాటం నుంచే పుట్టిన పార్టీ మనది. ఎంతో కాలం టీడీపీ దౌర్జన్యాలు నడవవు. మనోధైర్యం కోల్పోవద్దు. పార్టీ శ్రేణులకు అండగా ఉండండి. టీడీపీ బాధితులను నేను స్వయంగా కలుస్తా. అండగా నిలుస్తా. టీడీపీ దౌర్జన్యాలను సహించేది లేదు. మనందరం కలసికట్టుగా ఎదుర్కొందాం. మన కాలం వస్తోంది. అంత వరకూ కేడర్కు భరోసా ఇవ్వాలి’ అని ఆయన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. హామీలను విస్మరించి దాడులకు ప్రోత్సాహం ‘ప్రజలకిచ్చిన హామీలను విస్మరించి, చంద్రబాబు సర్కార్ వైఎస్సార్సీపీ కేడర్ను టార్గెట్ చేసి దాడులను ప్రోత్సహిస్తోంది. గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదు. టీడీపీ సర్కార్ వ్యక్తిగత దాడులకు ఉసిగొల్పుతోంది. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ధైర్యంగా ఉండండి. పార్టీ తరఫున అండగా ఉంటాం’ అని మాజీ ఎమ్మెల్యేలు ఎస్ రఘురామిరెడ్డి, డాక్టర్ సుదీర్రెడ్డి తదితరులతో వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబునాయుడు ఇదివరకెన్నడూ లేని రీతిలో దుర్మార్గ సంప్రదాయానికి బీజం వేస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే ఫలితం అనుభవించక తప్పదన్నారు. మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్ఈత కొడుతూ ప్రాణాపాయ స్థితిలోకెళ్లిన యువకుడుతన అంబులెన్స్లో ఆస్పత్రికి తరలింపువైఎస్ జగన్ సకాలంలో స్పందించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడి ప్రాణాలు కాపాడారు. ఆదివారం వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో పర్యటించారు. కోమన్నూతల గ్రామానికి చెందిన నారాయణ స్వామి కుమారుడు నరేష్ (25) సాయంత్రం దిగుడు బావిలో ఈత కొడుతుండగా శ్వాస తీసుకోవడం కష్టమైంది. స్నేహితులు గమనించి, అతన్ని బైక్పై కూర్చోబెట్టుకుని ఆస్పత్రికి పయనమయ్యారు. అదే సమయంలో చిన్నకుడాల వద్ద జగన్ కాన్వాయ్ ఆగింది. వెంటనే ఆ యువకులు తమ స్నేహితుడి పరిస్థితిని కాన్వాయ్లో ఉన్న వారికి వివరించారు. 108కు కాల్ చేసినా రాలేదని చెప్పారు. విషయం తెలుసుకున్న జగన్ ఆలస్యం చేయకుండా తన వెంట ఉన్న అంబులెన్స్లో ఆ యువకుడిని పులివెందుల ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స చేయడంతో అతడికి ప్రాణాపాయం తప్పింది.మాజీ ఎంపీపీ కుటుంబానికి పరామర్శ వైఎస్సార్సీపీ లింగాల మండల కన్వీనర్, మాజీ ఎంపీపీ పెద్ద సుబ్బారెడ్డి సతీమణీ లక్ష్మీనరసమ్మ ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన నేపథ్యంలో వైఎస్ జగన్ ఆదివారం పెద్దకూడాల గ్రామంలో వారి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులందర్నీ పలుకరించి, ధైర్యం చెప్పారు. లింగాల మండలానికి చెందిన వివిధ గ్రామాలకు చెందిన నాయకుల్ని పేరుపేరునా పలుకరించారు. పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. చక్రాయపేట మండలం గొంది గ్రామానికి చెందిన మబ్బు రామయ్య తన పట్టా భూమిలో దౌర్జన్యంగా టీడీపీ వర్గీయులు రోడ్డు వేస్తున్నారని వాపోయారు. అడ్డుకున్న తనపైనే తప్పుడు కేసు బనాయిస్తున్నారని వివరించారు. ఈ ఘటనపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. బాధితుడికి అన్యాయం చేయొద్దని పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు ఓపికగా విన్నారు. అవసరమైన చర్యలకు సిఫారసు చేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కే సురేష్బాబు, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోటూరు చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు. -
కాలయాపనకే తప్ప.. కార్యాచరణ లేదు
సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగిన తీరు, తీసుకున్న నిర్ణయాలను గమనిస్తే అదంతా కాలయాపనకే తప్ప.. కార్యాచరణ లేదనే విషయం స్పష్టమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. అధికారులతో కమిటీ ఏర్పాటుచేస్తూ తీసుకున్న నిర్ణయం విభజన సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెనక్కిలాగే నిర్ణయంగా చూడాల్సి వస్తోందని పేర్కొంది. ఇందుకు సంబంధించి వైఎస్సార్సీపీ స్పందనను మాజీమంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి శనివారం రాత్రి మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో వారు ఏం పేర్కొన్నారంటే..» రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలేంటి? అపరిష్కృత అంశాలేంటి? పంచాల్సిన ఆస్తులేంటి? ఎందుకు ముందుకెళ్లడంలేదు? వీటిపై కోర్టుల్లో ఉన్న కేసులేంటి? అనే వాటిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ స్పష్టత కూడా ఉంది. కొత్తగా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృత అంశాల గుర్తింపునకు మళ్లీ కమిటీ అన్నట్లుగా చెప్పడం విభజిత సమస్యల పరిష్కారంలో మరింత జాప్యానికే దారితీస్తుందన్న సంకేతాన్ని ఇద్దరు సీఎంల సమావేశం ఇచ్చిందని అభిప్రాయపడుతున్నాం.» పార్లమెంటు చేసిన విభజన చట్టంలోని అంశాల అమలుపై కేంద్ర ప్రభుత్వం గతంలో సీనియర్ అధికారి షీలా బేడీ కమిటీని ఏర్పాటుచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆస్తుల వివాదంపై కూడా ఈ కమిటీ పలు సిఫార్సులు చేసింది. వీటిపై అనేక దఫాలుగా పదేళ్లపాటు చర్చలు జరిగాయి. కొన్ని సిఫార్సులను తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. చర్చలను ఆ దశ నుంచి ముందుకు తీసుకెళ్లాల్సిందిపోయి మళ్లీ కమిటీ ఏర్పాటుచేయడమంటే వ్యవహారాన్ని మళ్లీ మొదటికి తీసుకెళ్లడమేనని భావిస్తున్నాం.» ఇక తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అపరిష్కృత అంశాలపై దృష్టిపెట్టాలని, దశాబ్దకాలంగా అంగుళం కూడా ముందుకు పడకపోవడంతో ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి ఎదుట గొంతెత్తారు. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టి నిర్ణీత కాలపరిమితిలోగా సమస్యలు తీరుస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కూడా రెండు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు కూడా విభజిత సమస్యలపై చర్చల ప్రక్రియ వేగం అందుకుంది. వీటిని కూడా ముందుకు తీసుకెళ్లే అంశాలపై దృష్టిపెట్టకుండా మళ్లీ కమిటీని ఏర్పాటుచేయడమంటే.. మళ్లీ వెనక్కి లాగడమే అవుతుందని భావిస్తున్నాం.» పైగా ఇప్పుడు కమిటీ ఏర్పాటు అన్నది కేంద్ర ప్రభుత్వంతో సంబంధంలేకుండా, వారి ప్రమేయంలేకుండా ఏర్పాటవుతోంది. విభజన చట్టం చేసింది పార్లమెంటు, దాన్ని అమలుచేయాల్సింది కేంద్ర ప్రభుత్వం అయినప్పుడు, కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా కమిటీ ఏర్పాటు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. » ఇక రాష్ట్రానికి రావాల్సిన దాదాపు రూ.7వేల కోట్ల విద్యుత్ బకాయిల విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. తద్వారా ఆ బకాయిలు చెల్లింపునకు ఆదేశాలు కూడా ఇచ్చింది. తర్వాత ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. దీనిపై దృష్టిపెట్టి పరిష్కారం సాధించే ప్రయత్నం ఇప్పుడు జరిగిన సమావేశంలో పెద్దగా జరిగినట్లు లేదు. » ముఖ్యంగా నీటి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తీవ్ర అన్యాయాన్ని ఎదుర్కొంటోంది. రాయలసీమ ప్రాంతం గొంతెండుతున్న పరిస్థితుల్లో కూడా విద్యుత్ రూపేణా తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం ఎడమ కాల్వ నుంచి నీటిని ఇష్టానుసారం విడిచిపెడుతోంది. దీనిపై తక్షణం పరిష్కారానికి ప్రయత్నించి ఒక నిర్ణయాన్ని తీసుకోకుండా సమావేశం అసంపూర్తిగా ముగియడం రాష్ట్రానికి అన్యాయం చేసినట్లే. » ఏపీ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ కుడికాల్వ, స్పిల్వే భాగాన్ని వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరిస్తామని కేంద్ర హోంశాఖ ఇచ్చిన హామీ మేరకు సంయమనం పాటించాం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చంద్రబాబు దీనిపై కూడా దృష్టిపెట్టిన దాఖలాలు కనిపించకపోవడంతో విభజిత సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.» ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఏపీ పోర్టులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల్లోనూ తెలంగాణ వాటా కోరినట్లుగా మీడియా సంస్థలు వార్తలను ప్రసారం చేశాయి. అలాగే, ఏడు మండలాల్లోని కొన్ని గ్రామాలను కూడా విలీనానికి ఏపీ సుముఖంగా ఉన్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు దీనిపై తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి ఒక మంత్రి కాని, ఒక అధికారి కాని ఎలాంటి ప్రకటనా చేయకపోవడం ప్రజల అనుమానాలను బలపరిచినట్లే అవుతుందని వైఎస్సార్సీపీ భావిస్తోంది. -
టీడీపీ నేతల దౌర్జన్యం.. కుటుంబమంతా రాత్రి అడవిలోనే..
సాక్షి, టాస్క్ఫోర్స్: రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకానికి భయపడి ఓ కుటుంబం రాత్రంతా అడవిలో తలదాచుకుంది. రాత్రివేళలో క్రూర మృగాలు, పాములు, ఇతర విష పురుగుల మధ్య అడవిలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. ప్రజాస్వామ్య దేశ చరిత్రలో ఇంతటి అరాచకం ఎప్పుడైనా కన్నామా? విన్నామా?.. కానీ ఇది పచ్చి నిజం. సోమల మండలం కమ్మపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నేత సుబ్రమణ్యంరెడ్డి కుటుంబం దీనగాథ ఇది. శుక్రవారం టీడీపీ గూండాలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటిపై దాడి చేశారు. సుబ్రమణ్యంరెడ్డిని బయటకు ఈడ్చుకు వచ్చి తీవ్రంగా కొట్టారు. రకరకాలుగా హింసించారు. ఆయన ఇటుకల బట్టీలోని ఇటుకలన్నింటినీ తరలించుకుపోయారు. బట్టీ మొత్తాన్ని ధ్వంసం చేశారు. సుబ్రమణ్యంరెడ్డి పొలంలో పండించిన టమాటా కోతకొచ్చింది. ఈ పంటను మార్కెట్కు తరలించకుండా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారు. ఆయన పశువులకు గడ్డి కూడా వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు తెలిపినా స్పందన లేకపోవడంతో సుబ్రమణ్యం రెడ్డి కుటుంబం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సమీపంలోని అడవిలోకి పారిపోయింది. శుక్రవారం రాత్రంతా అడవిలోనే గడిపింది. శనివారం కొందరు వ్యక్తులు వారి వద్దకు వెళ్లి ఆ కుటుంబాన్ని బయటకు తీసుకువచ్చి వేరే ప్రాంతంలో ఉంచారు. ఆయన తమను శరణుకోరి.. టీడీపీలో చేరితే క్షమించి వదిలేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. లేదంటే విడిచిపెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు. టీడీపీ నేతల తీరుపై పుంగనూరు ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో ఎవరికి నచ్చిన పార్టీలో వారు పనిచేసే వారని, ఇటువంటి అరాచకం ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చిత్తూరు జిల్లావ్యాప్తంగా దాడులుటీడీపీ నేతలు వారిపై కేసులు రాకుండా బెంగళూరు నుంచి గూండాలను తెచ్చి దాడులు చేయిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గ పరిధిలో ఎవరెవరు వైఎస్సార్సీపీకి పనిచేశారో గుర్తించి మరీ దాడులు చేయిస్తున్నారు. కొద్ది రోజులుగా టీడీపీ నేతలు, వారి గూండాల దౌర్జన్యాలు, దాడులతో చిత్తూరు జిల్లా అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా మారింది. పుంగనూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్సీపీ అభిమానులు ఊర్లొదిలి వేరే ప్రాంతాల్లో తలదాచుకొంటున్నారు. ఇప్పటివరకు 55 కుటుంబాలు స్వగ్రామాలను వీడి వెళ్లాయి. శ్రీకాళహస్తి రూరల్ మండలం ఈశ్వరయ్యకాలనీ, వాగివేడు, నారాయణపురం గ్రామాల నుంచి 75 కుటుంబాలను టీడీపీ నేతలు వెళ్లగొట్టారు. వీరంతా తమను శరణు కోరి, టీడీపీలో చేరితేనే వారిని, వారి ఆస్తులను వదిలేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.రక్షణ కోరినా స్పందించని పోలీసులుటీడీపీ కూటమి దాడులు, దౌర్జన్యాలపై అనేకమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు పోలీసులకు ఫోన్లు చేసి ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన సమయంలో ఇరువురి మధ్య సంభాషణలను బాధితులు రికార్డు చేసుకున్నారు. ఆ రికార్డులను వింటే.. రక్షణ కల్పించాల్సిన పోలీసులేనా అలా మాట్లాడేది అనిపించకమానదు. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతల దౌర్జన్యాలు, దాడులు ఆగకపోవడం, పోలీసులు స్పందించకపోవడంతో బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించటానికి సిద్ధమవుతున్నారు. -
రాజ్యాంగేతర శక్తుల కరాళ నృత్యం
భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించటానికీ, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం వంటి ఉదాత్త అంశాలను అందుబాటులోకి తేవడానికీ మన ‘రాజ్యాంగ పరిషత్’ రాజ్యాంగాన్ని రూపొందించింది. ప్రజాస్వామ్య సాధారణ లక్ష్యాల గురించి రాజ్యాంగ ప్రవేశికలో స్పష్టంగా ఉంది. ప్రధానంగా నిష్పక్షపాత ఎన్నికలు, ప్రజాస్వామ్య పాలన, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం; స్వేచ్ఛ, సమానత్వం, ప్రాథమిక హక్కుల గురించిన ప్రస్తావన అందులో ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రమాణ స్వీకారం చేసే ముందు రాజ్యాంగం మీద పూర్తి విశ్వాసం ఉంచుతామని ప్రమాణం చేస్తారు. కానీ ఇటీవలి (2024) సార్వత్రిక ఎన్నికల్లో చోటు చేసుకున్న రాజ్యాంగ విరుద్ధమైన సంఘటనల గురించి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుతున్నారంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత రాజ్యాంగ విరుద్ధంగా మారిందో చెప్పక తప్పదు. ఆధునిక విజ్ఞాన చక్రవర్తి ‘ఎలెన్ మస్క్’ లాంటి వాళ్ళు ఈవీఎమ్ల పనితీరును ఆక్షేపించారంటేనే ఎంత ఘోరంగా ఎన్నికలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. అమెరికా కూడా ఈసారి మన ఎన్నికలను తప్పు పట్టింది. 20 లక్షల ఈవీఎమ్లు ఎటుపోయాయో ఎవరూ సమాధానం చెప్పరు. న్యాయబద్ధంగా గెలవాల్సిన ఆంధ్ర, ఒరిస్సా ముఖ్యమంత్రులకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా మాయాజాలం జరిగింది. ‘మాకు మంచి చేసిన జగన్ ప్రభుత్వానికి వేసిన మా ఓటు ఏమయ్యింద’ని సామాన్య ఓటరు అడుగుతున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడి చేతిలో 1995 లోనూ ప్రజాస్వామ్యం కుప్ప కూలటం చూశాం. కానీ ఏకంగా ఎన్నికల కమిషన్ సాయం అందించి కూటమి గెలుపు కోసం శ్రమించడం ఇప్పుడే చూస్తున్నాం. ‘దారులన్నీ పెట్టుబడిదారి యంత్రాల కోరల్లోకే అని అర్థమయ్యాక నా వాదనే నాకు బలహీనంగా అనిపిస్తున్నది’ అంటారు కార్ల్ మార్క్స్. ఆధునిక భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అధికారం, డబ్బుల మయం అయిన వైనాన్ని కళ్ళారా చూస్తున్నాం. ‘గెలవటానికి ఏ అడ్డదారైనా ఫర్వాలేదు, గెలవటమే ప్రధానం. ఎన్ని అవినీతి మార్గాలున్నాయో వాటన్నిటి ద్వారా డబ్బు సంపాదించు, వ్యవస్థల్ని అదుపులో పెట్టుకో’ అనే ఎత్తుగడతో చంద్రబాబులాంటి వారు వ్యవహరించారు. వీరి నిఘంటువులో న్యాయం, ధర్మం, మానవత్వం అనేవి లేవు. అబద్ధాలు, అక్రమాలు వీరి ప్రాథమిక సూత్రాలు. గెలుస్తుందన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అడ్డ దారిలో ఓడించారు. గత ఐదేళ్లుగా జగన్ ఏ మంచి చేసినా దానిని ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా గోబెల్స్ ప్రచారాలు సాగిస్తూ, అరాచకాలూ వాళ్ళే చేస్తూ వాటిని జగన్ ప్రభుత్వం మీద రుద్దుతూ వచ్చారు. కూటమి గెలుపు తర్వాత ఇప్పుడు దానిదైన నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అందులో రెడ్బుక్ పాలసీ కూడా ఒకటి. దానిలో భాగంగానే వీళ్ళు చేయబోయే ఆకృత్యాలను ప్రజలకు చేరకుండా ఉండటానికి ముందుగా పచ్చమీడియా తప్ప మిగిలిన అన్ని ఛానెల్స్ను బ్యాన్ చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందే వీళ్ళు ప్రేరేపించిన రౌడీమూకలు రాష్ట్ర్రంలో చెలరేగిపోయారు. వైఎస్సార్సీపీకి ఓట్లేసిన... ఓటర్ల దగ్గర నుండి నాయకుల వరకు ఎవ్వరినీ విడిచిపెట్టటం లేదు. ఏకంగా ఈ మూక ఇళ్ళ మీదకు ఎగబడుతూ తమ వ్యతిరేకుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కత్తిపోట్లతో ప్రాణాలు తీయటానికి ప్రయత్నిస్తున్నారు. గర్భిణీ స్త్రీలను కొడుతున్నారు. నాయకులను చంపటానికి ప్రయత్నిస్తున్నారు. ఒకప్పటి బిహార్లో ఉన్న అరాచకం నేడు ఆంధ్రాలో వర్ధిల్లుతోంది. చివరకు చంద్రబాబు నిరంకుశత్వం ఎంత పరాకాష్టకు చేరిందంటే... వైఎస్సార్సీపీ ఆఫీసును కోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా ఉత్తర ప్రదేశ్లో లాగా పొక్లెయిన్ లతో తెల్లవారేసరికి కూల్చేశారు. కానీ ఏ వార్తా పచ్చ మీడియా రాయదు. చూపించదు. ఈ దుర్ఘటనలు దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళ నమ్మకాన్నీ పోగొడుతున్నాయి. ఇక్కడ గ్రీకు తత్త్వవేత్త ‘ఎపిక్యురస్’ అన్న మాటలు... ‘పదే పదే దుర్మార్గాలు చేస్తున్న వారిని చూస్తుంటే దేవుడు చెడును ఆపాలనుకుంటున్నా ఆపలేకపోతున్నాడా? అలా అయితే ఈ సృష్టి స్థితిలయలు అతని అదుపులో లేవన్నమాట. సమర్థుడే అనుకుంటే చెడును ఎందుకు నివారించటం లేదు. ఈ పగ, ద్వేషాలను, చెడును ఆపే సామర్థ్యం లేకపోతే ఇక ఎందుకండీ దేవుడు. రక్షకుడనే బిరుదులు?’ గుర్తుకొస్తున్నాయి. ఎప్పుడో క్రీస్తుకు పూర్వం అన్న ఈ మాటలు నిజంగా ఆలోచించతగినవే కదా. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ఒక్కసారి జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి పద్యాల్లో చూద్దాం. పోలిక ఎంత బాగా సరిపోతుందో– కర్కశ కరాళ కారుమేఘాల నీడలెగురుతున్నవి/ప్రజల నెమ్ముగములందు/క్రౌర్య కౌటిల్య గాఢాంధకార పటలి /క్రమ్ముకున్నది దిగ్దిగంతమ్ములెల్ల నిజంగానే ‘ఏ నిరర్థ్ధక నిర్భాగ్య నీరస గళాలు ఎలుగెత్తి వాపోతున్నయ్యో– వెలయవో ప్రాభాతశోభావళుల్ అన్నట్లు నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం సుపరిపాలన అందించిన జగన్ మోహన్ రెడ్డి పునరాగమనం కోసం ఆశతో ఎదురుచూద్దాం.డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి -
కోర్టు ఆదేశాలు తుంగలో తొక్కేస్తారా?
సాక్షి, హైదరాబాద్ : తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీయే అధికారులు కూల్చి వేయడం చట్ట విరుద్ధమని, హైకోర్టు ఉత్తర్వులున్నా లెక్క చేయకుండా వ్యవహరించారని మాజీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను ఖాతరు చేయని దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. శనివారం ఆయన హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ‘అధికారంలోకి రావడంతోనే టీడీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యహరిస్తోంది.గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కార్యాలయాలు కట్టుకునేందుకు 2016లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే 340 జీవో తెచ్చారు. దీని ప్రకారం 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ఎకరం వెయ్యి రూపాయల చొప్పున చాలా జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం భూములు పొందారు. పాలకులు మారిపోయినా చట్టం మాత్రం మారదు. అదే చట్ట ప్రకారం కేంద్ర కార్యాలయ నిర్మాణం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2 ఎకరాలు తీసుకుంది.భవన నిర్మాణానికి అనుమతి కోసం దరఖాస్తు చేశాం. ఈ ప్రభుత్వం రావడంతోనే మాకు ప్రొవిజినల్ ఆర్డర్ జారీ చేశారు. నోటీసుపై 10వ తేదీ అని ఉన్నా, మాకు ఇచ్చింది మాత్రం 15వ తేదీ. దీనిపై హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేసి ఉపశమన ఆదేశాలు పొందాం. చట్ట ప్రకారమే ముందుకు సాగాలని న్యాయస్థానం సీఆరీ్డయేను ఆదేశించింది. న్యాయ వ్యవస్థ అంటే లెక్కలేనితనంతో ఆ ఆదేశాలను తుంగలో తొక్కారు’ అని మండిపడ్డారు. ప్రజావేదికతో సంబంధం లేదు ప్రజా వేదికతో కొందరు పోలుస్తుండటం సరికాదని.. దానికి, దీనికి సంబంధం లేదని పొన్నవోలు తెలిపారు. ‘నదీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి నిర్మాణం చేపట్టడానికి వీల్లేదు. అలా ఎవరు చేసినా అది పూర్తి చట్ట వ్యతిరేకం. అలా చేస్తే ప్రజలు ముంపు సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే.. చట్ట ప్రకారం నాటి ప్రభుత్వం ముందుకు వెళ్లింది. అంతే తప్ప అందులో కక్ష పూరితం లేదు.వైఎస్సార్సీపీకి ప్రభుత్వం ఇచ్చిన భూమిలో నిర్మాణం చేసుకోవడం చట్ట వ్యతిరేకం కాదు. ఈ వివాదం ఇప్పుడు అధికారులకు, కోర్టుకు మధ్య అన్న విధంగా మారింది. అధికారంలో ఉండగా వైఎస్సార్సీపీ ఏ ఒక్క అధికారిని ప్రభావితం చేయలేదు. టీడీపీ కట్టుకున్న పార్టీ కార్యాలయాలను కూల్చలేదు. వారు పొందిన స్థలాలను వెనక్కు తీసుకోలేదు. ఐదేళ్లు హూందాగా వ్యవహరించింది. సామాన్యుడు నిర్మాణం కోసం ఎలా అనుమతి పొందుతాడో అలాగే వైఎస్సార్సీపీ ముందుకు వెళ్లింది. ఏదేమైనా చట్ట విరుద్ధంగా కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కిన అధికారుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకునేలా పోరాడతాం’ అని వివరించారు.సీఆర్డీయే ప్రకటనలో అంశాలు వాస్తవం కాదు తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి ఈనెల 1వ తేదీనే కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చామంటూ సీఆరీ్డయే పేరుతో ఒక ప్రకటన సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోందన్న విషయం మా దృష్టికి వచ్చిందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. అయితే ఇందులోని అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. సీఆరీ్డయే ప్రొవిజనల్ ఆర్డర్పై ఈనెల జూన్ 10వ తేదీ వేసి, మాకు జూన్ 15వ తేదీన ఇచ్చారు. నిన్న (శుక్రవారం) కోర్టులో దీనిపైనే వాదోపవాదాలు జరిగాయన్నారు. చట్టాన్ని ఫాలో అవ్వాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఇందుకు సంబంధించిన పత్రాలను మీ ముందు (మీడియా) ఉంచుతున్నామన్నారు.కూల్చి వేయము అని కోర్టుకు చెప్పి..విచారణ సందర్భంగా న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తూ ఎలాంటి కూల్చివేతలు చేపట్టబోమని అధికారులు చెప్పారని పొన్నవోలు తెలిపారు. చట్ట ప్రకారమే వ్యవహరిస్తామని చెప్పారన్నారు. రాత్రికి రాత్రే జేసీబీలు తీసుకొచ్చి కూల్చివేత చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సూర్యోదయానికి ముందు.. సూర్యాస్థమయానికి తర్వాత ఎలాంటి కూల్చివేత కార్యక్రమాలు చేపట్టవద్దని హైకోర్టు ఫుల్ బెంచ్ ప్రభుత్వాలకు గతంలోనే తేల్చి చెప్పింది. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చేంత వరకు కూల్చి వేయడానికి వీల్లేదు. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అవతలి వారి వాదనలు వినాల్సి ఉంటుంది.అందుకు 15 రోజుల సమయం ఉంటుంది. అయినా ప్రభుత్వం ముందుకు వెళితే.. బాధితులు ట్రిబ్యునల్కు కూడా వెళ్లవచ్చు. ట్రిబ్యునల్లో మాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే.. అప్పుడు ల్యాండ్ వ్యాల్యూపై 20 శాతం ఫైన్ స్వీకరించాలి. అట్లా పర్మిషన్ తీసుకోకుండా కడితే శిక్షార్హులు. కూల్చి వేత అనేది ఆఖరి అస్త్రం. అది కూడా ట్రిబ్యునల్ తీర్పు తర్వాతే. ప్రొవిజినల్ ఆర్డర్ మీద కూల్చి వేయడం చట్ట వ్యతిరేకం. ఇది చట్ట ప్రకారం పాటించాలి్సన విధానం. కానీ, ఇలాంటివేవీ పాటించ లేదు. ఈ కేసులో న్యాయవాదిగా ఉన్న నేనే కోర్టు ఆదేశాలను సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్కు మెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా పంపించా. సీఆర్డీఏ చర్య కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. వారిపై సివిల్తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరతాం’ అని వెల్లడించారు. -
నేడు వైఎస్సార్సీపీ విస్తృత సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఈనెల 20న గురువారం తాడేపల్లిలో నిర్వహించనున్నారు. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వీరికి దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో సమావేశం ప్రారంభం అవుతుంది. -
జగన్ ఓటమిని జీర్ణించుకోలేక..
కొవ్వూరు : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలుకావడం ఆ వీరాభిమాని జీర్ణించుకోలేకపోయాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. మొన్నటి ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉంటారని.. తన ఆవేదనను రాష్ట్రపతి దృష్టికి వెళ్తే మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తూ మిత్రులకు పంపిన వీడియో సందేశంలో వివరించాడు. తూర్పుగోదావరి జిల్లా గోదావరి నదిపై ఉన్న గామన్ బ్రిడ్జిపై మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఏమిటంటే.. తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన తాళ్లూరి రాజు, తన భార్య నాగలక్ష్మి, కుమార్తె హర్షిత, కుమారుడు మోక్షిత్తో కలిసి మంగళవారం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య కోవాలని నిర్ణయించుకున్నాడు. కొవ్వూరు–కాతేరు మధ్య గోదావరిపై ఉన్న గామన్ బ్రిడ్జి పైకి వేకువజామునే చేరుకున్నాడు. తాను, తన కుటుంబమంతా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నామని మిత్రులకు వీడియో సందేశం పెట్టాడు. పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, రాజు కుటుంబ సభ్యులు, కొవ్వూరు పట్టణ పోలీసులు ఈ సమాచారం తెలుసుకుని వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్రిడ్జిపై రోడ్డు పక్కన ఫుట్పాత్పై ఉన్న రాజుకు, ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్సార్సీపీ కార్యకర్త చిన్నం హరిబాబు, కొవ్వూరు పట్టణ సీఐ వి. జగదీశ్వరరావు, ఇతర సిబ్బంది నచ్చజెప్పి బయటకు తీసుకుకొచ్చారు.ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉంటారు..అనంతరం.. రాజు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడిగినా వైఎస్సార్సీపీకే ఓటు వేశామంటున్నారని, కానీ, జగన్ ఎలా ఓటమి పాలయ్యారో తెలీడంలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. తన కుటుంబ చావుతోనైన ఎన్నికల్లో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ చేస్తారని ఆశిస్తున్నానన్నాడు. ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి ఉంటారని, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతారని రాజు చెప్పాడు. తన ఆవేదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకువెళ్తే రీపోలింగ్కు ఆదేశిస్తారన్న ఉద్దేశంతో వీడియో ద్వారా తన సందేశాన్ని తెలిపి కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానన్నాడు. తన కుటుంబం చావు ద్వారా జగనన్నకు మేలు చేకూరితే చాలని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇంత మంచి చేసిన జగన్ ఓడిపోతారనుకోలేదు..తనకు రెండుసార్లు యాక్సిడెంట్ అయితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం చేశారని.. కాలులో స్టీల్రాడ్లు వేసి, వైద్యం చేసి, ఇంటికి పంపించారని రాజు తనకు జరిగిన మేలును వివరించాడు. మంచంపై ఉన్న రెండునెలలూ తన కుటుంబ పోషణకు వైఎస్సార్ ఆసరా పేరిట ఆర్థిక సాయం చేశారని.. అలాగే, తనకు ఏళ్ల తరబడి సొంతిల్లు లేదని, జగనన్న దయతో ఇంటి స్థలం ఇచ్చారని, ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పాడు. ఈ ఏడాది తన కుమార్తె చదువుకు అమ్మఒడి సొమ్ము పడుతుందని ఆశపడ్డానని, తన తమ్ముడికీ అమ్మఒడి సాయం అందుతోందని తెలిపాడు. అలాగే, నాన్నమ్మకు రూ.3 వేల పింఛను అందిస్తున్నారని, అందరికీ ఇంత మంచి చేసిన జగన్ ఘోరంగా ఓటమి పాలవుతారని కలలో కూడా ఊహించలేదని కన్నీటితో చెప్పాడు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచీ తనకు కంటి మీద కునుకులేదని, జగనన్న ఓటమి నిరంతరం తనను కలచివేస్తోందని ఆవేదన చెందాడు. ఏదో మోసం జరిగిందనేదే తన బాధ అని, ఈ ఎన్నికలపై విచారణ చేయిస్తే వాస్తవాలు బయటపడతాయన్నాడు.ఇక బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తే ఎన్నికలపై విచారణకు అవకాశం ఉండదన్నారు. అందుకనే తెల్లవారుజామున 5.30 గంటలకు భార్యాపిల్లల్ని తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు బ్రిడ్జిపైకి వచ్చానని చెప్పాడు. రాజు, ఆయన భార్యకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
వెల్డన్ గురు..
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి మద్దెల గురుమూర్తి విజయం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఫలితాలన్నీ కూటమి అభ్యర్థులకే అనుకూలంగా వస్తుండడంతో తిరుపతి పార్లమెంట్ కూడా బీజేపీ అభ్యర్థే గెలుస్తారని ధీమాగా అనుకున్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో తిరుపతి పార్లమెంట్ అభివృద్ధికి చేసిన కృషిని, ఆయన మంచితనంపై అసత్యాలు, అబద్ధాలు విస్తృతంగా ప్రచారం చేసినా.. ఓటర్లు మద్దెల గురుమూర్తికే పట్టం కట్టారు. ఊహించని విధంగా తిరుపతి ఎంపీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడంపై కూటమి నేతలు జీరి్ణంచుకోలేకపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్లో తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే తిరుపతి పార్లమెంట్ కూటమి అభ్యర్థి వరప్రసాద్ పరాజయం పాలవ్వగా వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి 14,569 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం గొప్ప గెలుపు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘క్రాస్’ చేయాలని చూసి బోల్తా పడిన కూటమి.. తిరుపతి ఎంపీ నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తికి అనుకూలంగా భారీస్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగిందనేది స్పష్టం అవుతోంది. ప్రజల కష్టం తెలిసిన వ్యక్తి ఎంపీ కావడంతో నియోజకవర్గానికి ఏదో ఒక మంచి చేయాలనే తపనతో పని చేశారనేది గురుమూర్తికి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. కూటమి ఎంపీ అభ్యర్థి చేసిన దు్రష్పచారాలు ఫలించలేదు. క్రాస్ ఓటింగ్ చేయించి గట్టెక్కాలని భావించారు. కానీ గురుమూర్తి మంచితనం, కృషి ముందు కూటమి కుట్రలు ఏవీ పనిచేయలేదు. అదెలా అంటారా? తిరుపతి లోక్సభ పరిధిలోని తిరుపతిలో 60,255 ఓట్లు, శ్రీకాళహస్తిలో 41,979, సూళ్లూరుపేటలో 28,362, వెంకటగిరిలో 15,454, గూడూరులో 19,915, సర్వేపల్లిలో 15,994 ఓట్ల తేడాతో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఈ మెజారిటీలను చూస్తే కూటమి అభ్యర్థే ఘనవిజయం సాధించాలి. కానీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గరికి వచ్చేసరికి ఓటర్లు వైఎస్సార్సీపీ వైపే మొగ్గుచూపారు. సత్యవేడు, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే మెజారిటీ వచ్చింది. ఈ మెజారిటీతో పాటు కూటమి అభిమానులు తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యరి్థని గెలిపించుకున్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో టీడీపీ అభ్యర్థులంతా గెలిచి, ఎంపీ అభ్యర్థి ఓడిపోవడంపై రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయానికి గురవుతున్నారు. తిరుపతి జిల్లాకు పరిశ్రమలను తీసుకువచ్చేందుకు ఎంపీ గురుమూర్తి గత మూడేళ్లుగా అనేక ప్రయత్నాలు చేశారు. కంపెనీల చుట్టూ తిరుగుతూ వారిని జిల్లావ్యాప్తంగా తిప్పి కంపెనీలు, కార్యాలయాలు ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన వసతులు అన్ని తామే సమకూర్చగలమని విన్నవించారు. తద్వారా ప్రజల్లో గురుమూర్తి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నిస్వార్థంగా ప్రజలకు ఎంతో కొంతమేలు చేయాలనే తత్వం, ఆ కష్టానికి ప్రజల ఆశీర్వాదం మళ్లీ లభించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థులు చాలామంది ఓడిపోయినా గురుమూర్తి గెలిచారంటే అది ఆయన కష్టాలకు తగిన ఫలితమే అని పలువురు చర్చించుకుంటున్నారు. ఎంపీగా గురుమూర్తి అధికారాన్ని పదిమందికి సాయం చేయడంతో పాటు కార్యకర్తలకు, ఓటర్లకు దగ్గర కావడమే ఆయనకు విజయానికి కారణమని రాజకీయ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కలిసొచ్చిన అంశాలు ఇవే.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో 2021 ఉప ఎన్నికల్లో గురుమూర్తి తొలిసారి రాజకీయ ప్రవేశం చేసి తిరుపతి ఎంపీగా 6,2 6,108 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యరి్థ, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీపై 2,71,592 లక్షల మెజారీ్టతో గెలుపొందారు. 👉 ఎంపీగా గత మూడేళ్ల కాలంలో స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సహకారంతో తిరుపతి పార్లమెంట్ అభివృద్ధికి విశేష కృషి చేశారు. 👉 గత మూడేళ్లలో ఎంపీగా గురుమూర్తి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. 👉 తిరుపతి పరిధిలో కొత్త జాతీయ రహదారుల ఏర్పాటు, పులికాట్ సరస్సు పరిధిలోని గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారంలో చొరవ చూపారు. రోడ్ల నిర్మాణానికి ఆటంకంగా ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్ నిబంధనలు సడలించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన సహకారంతో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. వందలాది గ్రామాలకు సంబంధించిన ప్రధాన సమస్య పరిష్కారానికి అధికారిక ప్రక్రియ ప్రారంభింపజేశారు. 👉 అలాగే 16 వేల కేంద్రప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు ఆరోగ్య సంరక్షణకు వెల్నెస్ సెంటర్ తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. 👉 వేలాదిమంది యువతకు ఇంజినీరింగ్ నైపుణ్యం పెంచేలా శిక్షణ ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వ నైలెట్ సంస్థ తిరుపతికి మంజూరు చేయించారు. 👉 స్విమ్స్, డీఆర్డీఓ అనుబంధ సంస్థ డేబెల్తో తక్కువ ఖరీదుకే రోగులకు మెడికల్ ఇంప్లాంట్స్ తయారు చేసే ప్రాజెక్టు తీసుకొచ్చారు. 👉 రైల్వే ప్రాజెక్టుల పురోగతిలో తనదైన ముద్ర వేశారు. తిరుపతి రైల్వేస్టేషన్ను రూ.350 కోట్లతో ప్రాజెక్టు పనుల వేగం పెంచారు. 👉 తిరుపతి ప్రజలకు నరకంగా ఉన్న రాయలచెరువు రైల్వే గేటును తొలగించి అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయించారు. 👉 ఏర్పేడు, వెంకటగిరి రైల్వే ఫ్లైఓవర్లు మంజూరు చేయించారు. 👉 తిరుపతి ఆర్టీసీ బస్టాండ్కు ఎదురుగా రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.80 లక్షలు నిధులు ఇచ్చారు. 👉 యూనివర్సిటీ రోడ్డులో ఉన్న రైల్వే డీఐకాన్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. 👉 వెంకటగిరి కేంద్రీయ విద్యాలయాలన్ని ఇంటరీ్మడియెట్ స్థాయికి పెంచి విద్యార్థులు అక్కడే చదువుకునేలా చర్యలు చేపట్టారు. -
విజయోత్సవాల్లో టీడీపీ శ్రేణుల దాడులు
సాక్షి నెట్వర్క్ : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో టీడీపీ–జనసేన శ్రేణులు మంగళవారం విజయోత్సాహంతో అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఇళ్లపై దాడులు చేశారు. గుంటూరులోని మంత్రి విడదల రజిని కార్యాలయం, పల్నాడు జిల్లాలో ఓ సచివాలయంతోపాటు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చెందిన కళ్యాణమండపాన్ని ధ్వంసం చేశారు.విజయవాడలోని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరులోని వైఎస్ను తొలగించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి ఊరేగింపులు చేయరాదని, బాణాసంచా కాల్చరాదని రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఎంత ప్రచారం చేసినా టీడీపీ–జనసేన శ్రేణులు ఎక్కడా పట్టించుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ దాడులు జరిగాయంటే..» ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం విప్పగుంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముఖ ద్వారం, గేట్ను టీడీపీ నేతలు జేసీబీతో కూల్చివేశారు. ఈ ముఖ ద్వారం, గేట్ను గ్రామానికి చెందిన దాత ముప్పా సుబ్బారావు కుటుంబ సభ్యులు ముప్పా రోశయ్య పేరు మీద 2010లో సుమారు రూ.5 లక్షలతో పాఠశాలకు వీటిని నిర్మించారు. అనంతరం టీడీపీ నేతలు గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు, బీసీ కులానికి చెందిన పెరుగు మాల్యాద్రి ఇంటిని కూల్చడానికి జేసీబీని తీసుకొచ్చి గొడవకు దిగారు. దీంతో మాల్యాద్రితోపాటు అతని భార్య ఆదిలక్ష్మి అడ్డుకోవడంతో టీడీపీ నేతలు వారిపై దాడికి ప్రయత్నించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. జెడ్పీ పాఠశాల ముఖ ద్వారాన్ని కూల్చివేసిన జేసీబీని పోలీస్స్టేషన్కు తరలించారు. అయితే, తెలుగు తమ్ముళ్లు దాని నెంబర్ ప్లేట్ను తొలగించడం గమనార్హం. » పల్నాడు జిల్లా కొండూరులో టీడీపీ శ్రేణులు నిబంధనలకు విరుద్ధంగా పార్టీ జెండాలతో గ్రామంలో ప్రదర్శనలు నిర్వహించారు. ఎస్సీ కాలనీలోకి వెళ్లగానే కొంతమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు వచ్చి మీ ఓట్లు ఇక్కడలేవు కదా వెళ్లి గ్రామాల్లోనే ప్రదర్శనలు చేసుకోండి అనడంతో గొడవలు ప్రారంభమై ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీకి చెందిన పోతిపోగు సమాధానం, బండారు వందనం, బుర్రి పుల్లయ్య, పోతిపోగు దేవయ్య, పోతిపోగు యాకోబు, పోతిపోగు మణమ్మ తదితరులకు గాయాలయ్యాయి. బాధితులను అచ్చంపేట పీహెచ్సీకి తరలించారు. కోనూరులోను ఇదే పరిస్థితి నెలకొంది. విజయోత్సవం పేరుతో టీడీపీ నాయకులు ఎస్సీ కాలనీలో దాడులు నిర్వహించడంతో పలువురు గాయపడ్డారు. బందరులో రాళ్ల దాడి..కృష్ణాజిల్లా మచిలీపట్నంలో బందరు పార్లమెంట్ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, బందరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర కార్యకర్తలు పెద్దఎత్తున వాహనాలపై వైఎస్సార్సీపీ కార్యకర్తలుండే ప్రాంతాలకు వెళ్లి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కూడా ఇలాగే రెచ్చగొట్టారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రతిఘటించేందుకు యత్నించారు. కొంతమంది సీనియర్ నేతలు కార్యకర్తలను సముదాయిస్తుండగా కూటమి కార్యకర్తలు కొడాలి నాని అనుచరుల కారు అద్దాలు పగులగొట్టారు. దీంతో కూటమి కార్యకర్తలు, వైఎస్సార్సీపీ కార్యకర్తల మద్య ఘర్షణ మొదలైంది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ల విసురుకున్నారు. పోలీసులు ఇరు వర్గాలను చెల్లాచెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.కొవ్వూరులో విధ్వంసం..ఎన్నికల్లో విజయం సాధించిన ఆనందంలో టీడీపీ కార్యకర్తలు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులోనూ విధ్వంసం సృష్టించారు. 144 సెక్షన్ ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు కార్యాలయానికి మోటార్ సైకిళ్లపై ర్యాలీగా వెళ్లి అక్కడున్న రెండు కార్లను పూర్తిగా ధ్వంసం చేశారు. పోలీసులు వారిస్తున్నా వారిని గెంటేసి కార్యాలయంపై రాళ్లు రువ్వారు. వైఎస్సార్సీపీ ప్రచార రథంతో పాటు ఇన్నోవా కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు. సుమారు 50 మంది యువకులు పది నిమిషాల పాటు భయానక వాతావరణం సృష్టించారు. ఆ సమయంలో వెంకట్రావు కుటుంబ సభ్యులందరూ కార్యాలయంలోనే ఉన్నారు. టీడీపీ దాడితో వారు తీవ్ర భయాందోళన చెందారు. అక్కడ నుంచి టీడీపీ శ్రేణులు బస్టాండ్ సెంటర్కు చేరుకుని మెప్మా కార్యాలయం తాళాలు పగులగొట్టి అందులోని కంప్యూటర్లు, టేబుళ్లు, కుర్చీలు, ఇతర ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కార్యాలయంలోని రికార్డులన్నింటినీ బయటకు విసిరేశారు. టీడీపీ హయాంలో ఇదే కార్యాలయంలో అన్న క్యాంటీన్ నడిచేది. తాను అన్ని పార్టీల వారితో స్నేహ భావంతో ఉంటానని, ఇలాంటి వి«టద్వంసం తానెన్నడూ చూడలేదని తలారి వెంకట్రావు అన్నారు. » పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ, జనసేన కార్యకర్తలు వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్ల వద్ద బాణసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. మండలంలోని మండపాక గ్రామంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు బోడపాటి వీర్రాజు ఇంటిముందు వీరు బాణసంచా కాల్చడంతో ఆ నిప్పురవ్వలు పడి ఇంట్లోని దుప్పట్లు, ఇతర సామగ్రి దగ్థమయ్యాయి. » ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు భౌతిక దాడులకు దిగారు. దీంతో పల్లెల్లో భయానక వాతావరణం నెలకొంది. పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మెను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పలువురు టీడీపీ కార్యకర్తలు ఫ్యాన్ల రెక్కలు విరిచి ద్విచక్ర వాహనాలకు కట్టి వీధుల్లో ఈడ్చుకుంటూ కేకలు వేస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పాపిరెడ్డిపల్లిలో వైఎస్సార్సీపీ నేత జయచంద్రారెడ్డి కారును పరిటాల సునీత అనుచరులు ధ్వంసం చేశారు. మరికొన్ని గ్రామాల్లో కూడా వైఎస్సార్సీపీ నాయకులు, సానుభూతిపరులను ఇళ్ల వద్దకెళ్లి కవ్వించి కొందరిని గాయపరిచారు. టపాసులు పేల్చి ఇళ్లపైకి వేశారు. జిల్లా వ్యాప్తంగా ఇలా ఎన్నో ఘటనలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయం ధ్వంసం..గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం సమీపంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘మండలి’ విప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయాన్ని టీడీపీ కార్యకర్తలు పూర్తిగా ధ్వంసం చేశారు. పెద్ద సంఖ్యలో ర్యాలీగా వెళ్తూ లేళ్ల అప్పిరెడ్డి కార్యాలయంలోకి చొరబడ్డారు. ఫర్నిచర్, కంప్యూటర్ సామాగ్రి ధ్వంసం చేశారు. అక్కడున్న సిబ్బందిని చంపేస్తామంటూ బెదిరించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బూతులు తిడుతూ కార్యాలయంలోని మొత్తం సామగ్రి పగులగొట్టారు. » చిత్తూరు నగరంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ కార్యాలయాన్ని ధ్వంసంచేసి, పెట్రోలు పోసి నిప్పంటించారు. మార్కెట్ హరి అనే వ్యక్తికి చెందిన రూ.కోటి విలువైన సిగరెట్ స్టాకు గోదాముకు నిప్పంటించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులుగా ఉన్న కన్నన్ నాయకర్, మండీ ప్రభాకర్రెడ్డి, ప్రసన్నకు చెందిన హోటళ్లను, బేకరీలను నేలమట్టం చేశారు. పూతలపట్టులోని పాలకూరులో వైఎస్ విగ్రహాన్ని కూలదోశారు. ఎగువ పాలకూరు, బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లెలో దళితుల ఇళ్లలోకి చొరబడి వారిపై దాడులు చేయగా పలువురు గాయపడ్డారు. పూతలపట్టు నయనంపల్లెలో కిరణ్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్త ట్రాక్టర్కు నిప్పుపెట్టారు. తవణంపల్లెలోని తెల్లగుండ్లపల్లెలో కృష్ణమూర్తి యాదవ్ అనే వైఎస్సార్సీపీ కార్యకర్త జేసీబీను అపహరించి, అతని ఇంటి ప్రహరీనే కూల్చేశారు.» పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎండుగుంపాలెం బీసీ కాలనీలోని వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని గడ్డపారలు, గొడ్డళ్ళలో ధ్వంసం చేశారు. విగ్రహాన్ని పెకిలించి ట్రాక్టర్కు కట్టి ఎన్ఎస్పి కాలువ వద్దకు ఈడ్చుకెళ్లారు. పోలీసులు ధ్వంసమైన విగ్రహాన్ని యథాస్థానానికి చేర్చారు. అలాగే, మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ వర్గీయులు మద్యం సేవించి ద్విచక్ర వాహనాలకు ఫ్యాన్లు కట్టి ఈడ్చుకెళ్లారు. పోలీసుల ఆంక్షలున్నా బాణాసంచా కాల్చి భయభ్రాంతులకు గురిచేశారు. తూబాడు గ్రామంలో టీడీపీ వర్గీయులు రోడ్ల మీద పసుపు నీళ్లు చల్లారు. » గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామంలో తెలుగు తమ్ముళ్లు వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని కూల్చేశారు. గ్రామానికి చెందిన దుర్గారావు అనే నేత ట్రాక్టరుతో గుద్దించి విగ్రహాన్ని కూలగొట్టాడు. అతని కోసం వెతుకుతున్నారు. గ్రామస్తులు అక్కడకు చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. » గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా సోదరుడు కర్నుమా ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు అద్దాలను టీడీపీ శ్రేణులు పగలగొట్టి దాడికి యత్నించారు. కౌంటింగ్ సందర్భంగా కర్నుమా నాగార్జున యూనివర్శిటీకి వచ్చి అనంతరం కుటుంబ సభ్యులతో కారులో గుంటూరు బయల్దేరారు. టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకొచ్చి రాళ్లు, కర్రలతో కారుపై అద్దాలు పగలగొట్టి దాడికి యత్నించారు. కారులో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. కర్నుమా కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. » పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో జరిగిన విజయోత్సవ ర్యాలీ వైఎస్సార్సీపీ నాయకురాలు, గ్రామ సర్పంచ్ చికిలే మంగతాయారు ఇంటి సమీపంలోకి రాగానే కూటమి అభిమానులు తారాజువ్వలు వేస్తూ, మోటార్ సైకిళ్ల సైలెన్సర్లను తొలగించి భీకర శబ్దాలతో నానా హంగామా చేశారు. ఇదే సమయంలో పెదపేటకు చెందిన యువకులతో టీడీపీ–జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగి ఘర్షణలకు పాల్పడ్డారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. » అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పాలచెర్ల గ్రామ సచివాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. దాదాపు పదిమంది గ్రామ సచివాలయానికి చేరుకుని విధుల్లో ఉన్న సిబ్బందిని బెదిరించారు. కిటికీ అద్దాలను పగలగొట్టారు. కంప్యూటర్పై నీళ్లు పోశారు. ప్రింటర్ను, బాత్రూమ్ డోర్లను పగలగొట్టారు. సచివాలయంపైన ఉన్న సింథటిక్ ట్యాంకు పైపులను ధ్వంసం చేశారు. సుమారు రూ.50 వేల మేర నష్టపరిచారు. ఇదే గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్ల దాడిచేశారు.» ఏలూరు జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడులో ఓ పెట్రోలు బంకుతోపాటు దాని యజమాని ఇంటిపై కొందరు టీడీపీ కార్యకర్తలు దాడిచేసి రాళ్లు రువ్వారు. దీంతో ఆ యజమాని, మండల వైస్ ఎంపీపీ అయిన వేమూరి జితేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. » ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని దొరసానిపాడులో ఒక కూల్డ్రింక్ షాపు వద్ద వైఎస్సార్సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఎన్నికల ఫలితాలపై వాగ్వివాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు కూల్డ్రింక్ సీసాలతో దాడి చేసుకున్నారు.ఈ దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన గ్రామ సర్పంచ్ లక్కాబత్తుల సిద్ధిరాజు, లక్కాబత్తుల సురేష్, బిరుదుగడ్డ కిరణ్, అల్లాడ సురేష్, లక్కాబత్తుల జాన్బాబు, బిరుదుగుడ్డ కల్యాణ్, డీజే రాజు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను కవర్ చేస్తున్న ఒక విలేకరి సెల్ఫోన్ను లాక్కుని అతడిని గాయపరిచారు. మరోవైపు.. ఇక్కడి కూటమి కార్యకర్తలు బైక్ ర్యాలీ నిమిత్తం ఎస్సై సతీష్తో ఘర్షణకు దిగారు.» ఇదే జిల్లా భీమడోలు మండలంలోని పోలసానిపల్లి, అంబర్పేట, సూరప్పగూడెం, కురెళ్లగూడెం, భీమడోలు తదితర గ్రామాల్లోనూ గొడవలు చోటుచేసుకున్నాయి. పోలసానిపల్లిలో జనసేన కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ చేసుకుంటూ ఎంపీటీసీ అంబటి దేవీ నాగేంద్రప్రసాద్పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలకు, ఎంపీటీసీ కుమారుడు, కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అధిక సంఖ్యలో ఉన్న జనసేన కార్యకర్తలు ఎంపీటీసీ కుమారుడితో పాటు కుటుంబ సభ్యులపై దాడిచేశారు. వారి దుస్తులను చించివేశారు. అలాగే, అంబర్పేట రైతుభరోసా కేంద్రంలోకి చొరబడిన టీడీపీ కార్యకర్తలు రూ.1.50 లక్షల విలువైన కంప్యూటర్, íప్రింటర్లు, ర్యాక్లు, కుర్చీలను ధ్వంసం చేశారు. సిబ్బంది ఎంత వారించినా టీడీపీ కార్యకర్తలు వినలేదు.విడదల రజిని కార్యాలయం అద్దాలు ధ్వంసం..గుంటూరులో టీడీపీ శ్రేణులు ఎన్నికల విజయోత్సవంలో భాగంగా పెద్దఎత్తున ర్యాలీగా బయల్దేరి వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడదల రజిని కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ కొంతసేపు నినాదాలు చేసి కార్యాలయంపై రాళ్లు విసిరారు. అక్కడున్న పోలీసు సిబ్బంది వారిని వారించినా లెక్కచేయకుండా కార్యాలయం అద్దాలను పగులగొట్టారు. కార్యాలయం షట్టర్లు బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసు అదనపు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని కార్యకర్తలను చెదరగొట్టారు. అయినా టీడీపీ కార్యకర్తలు పోలీసులను లెక్కచేయకుండా కార్యాలయంపై రాళ్లు విసిరారు. » పల్నాడు జిల్లా కొచ్చర్ల సచివాలయంపై మంగళవారం తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తలు దాడిచేశారు. ఇరు పార్టీలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు కర్రలు, గడ్డపార్లతో సచివాలయంపై దాడిచేసి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అనంతరం లోపల ఉన్న ఫర్నిచర్ను ధ్వంసంచేసి సర్పంచ్ కుర్చీని బయటపడేసి తగలబెట్టారు. లోపలున్న కంప్యూటర్ను, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయం పైకెక్కి టీడీపీ జెండాను ఏర్పాటుచేశారు. దీంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కార్యాలయంపైకి రావడంతో సచివాలయ సిబ్బంది పరుగులు తీశారు. పోలీసులు వీరిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. » ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరులోని వైఎస్సార్ పేరును టీడీపీ నేతలు తొలగించారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో టీడీపీకి సానుకూలంగా ఫలితాలు రావడంతో కొందరు టీడీపీ కార్యకర్తలు యూనివర్శిటీ వద్దకు వెళ్లి, మెయిన్ గేటు వద్ద ఉన్న పేరును కాళ్లతో తన్ని ఊడగొట్టడంతో పాటు, భవనం పైకెళ్లి పేరులోని వైఎస్ అక్షరాలను తొలగించారు. ఆ స్థానంలో ఎన్టీ అక్షరాలను పెట్టారు. » పల్నాడు జిల్లా వినుకొండ కారంపూడి రోడ్డులోని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చెందిన కళ్యాణ మండపాన్ని మంగళవారం కొంతమంది అల్లరి మూకలు రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. కళ్యాణ మండపంలోని అద్దాలను పగలగొట్టడమే కాకుండా అక్కడున్న కారును కూడా కాళ్లతో తన్నుతూ సుమారు అరగంటసేపు విధ్వంసం సృష్టించారు. టీడీపీ జెండాలను పట్టుకుని ద్విచక్ర వాహనాలపై కల్యాణ మండపంలోకి ప్రవేశించి ప్రధాన ద్వారం వద్ద అద్దాలు పగలగొట్టి వెళ్లిపోయారు. దీంతో అక్కడ సిబ్బంది కూడా భయభ్రాంతులకు గురయ్యారు. -
ఈసీ నోరుమెదపదేం?!
కోట్లాదిమంది పౌరులు నచ్చినవారిని, సమర్థులనుకున్నవారిని తమ ప్రతినిధులుగా ఎంపిక చేసుకునే అసాధారణ ప్రక్రియ ఎన్నికలు. ఆ ప్రక్రియను ఎంత పారదర్శకంగా...ఎంత వివాదరహితంగా...ఎంత తటస్థంగా నిర్వహిస్తే అంతగా ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఆదినుంచీ ఇందుకు విరుద్ధమైన పోకడలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడింది మొదలు చిత్ర విచిత్ర ధోరణులు కనబడ్డాయి. పోలింగ్ రోజైన ఈనెల 13న, ఆమర్నాడు రాష్ట్రంలో జరిగిన ఉదంతాలు వీటికి పరాకాష్ఠ. వివిధ జిల్లాల్లో చెదురుమదురుగా చోటుచేసుకున్న ఘటనలు ఒక ఎత్తయితే నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరిగిన ఉదంతాల పరంపర మరో ఎత్తు. టీడీపీ రౌడీ మూకలు పోలింగ్ కేంద్రాల్లోకి జొరబడి వైఎస్సార్ కాంగ్రెస్ ఏజెంట్లపై దౌర్జన్యం సాగించి వెళ్లగొట్టడం, వోటేయడానికి క్యూలో నించున్న బలహీనవర్గాలవారినీ, మహిళలనూ కొట్టి వెనక్కిపంపడం వంటి ఉదంతాలపై ఫిర్యాదు చేసినా అరణ్యరోదనే అయింది. అసాంఘిక శక్తులు చొరబడి పోలింగ్ ప్రక్రియను దెబ్బతీయకుండా చూడటానికీ, అవసరమైనప్పుడల్లా కిందిస్థాయి అధికారులకు తగిన ఆదేశాలివ్వడానికీ, సమస్యాత్మక ప్రాంతాలకు బలగాలు తరలించటానికీ వీలుంటుందని ఏర్పాటుచేసిన వెబ్కాస్టింగ్ను ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. దాని నియంత్రణ టీడీపీ చేతుల్లోకి పోయింది. ఆ తర్వాత రెండురోజులూ పచ్చమూకలు తెగబడి రోడ్లపై స్వైరవిహారం చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్కు వోటేశారనుకున్నవారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించాయి. ఈ మూకలకు భయపడి వందలమంది ఇళ్లూ వాకిళ్లూ వదిలి వేరేచోట తలదాచుకోవాల్సివచ్చింది. ఇదంతా చానెళ్లలో ప్రసారం అవుతున్నా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు బాధ్యతవహించాల్సిన అధికారులకుగానీ, శాంతిభద్రతలు పర్యవేక్షించాల్సిన పోలీసు అధికారులకుగానీ చీమకుట్టినట్టయినా లేదు. ఎన్నికలకు రెండురోజుల ముందు త్రికూటమి సౌజన్యంతో విధుల్లో చేరిన ఉన్నతాధికారులు ఈ విధ్వంసకాండ సాగుతున్న సమయంలో మౌనదీక్షలో మునిగిపోయారు. పరువు బజార్నపడిందనుకున్నదో ఏమో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని నివేదిక తెప్పించుకుని ముగ్గురు ఎస్పీలనూ, ఒక కలెక్టర్నూ బదిలీచేసింది. మూడు జిల్లాల్లో 12 మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేసింది. సిట్ ఏర్పాటుచేసి దర్యాప్తు చేయించింది. ఇంత జరిగినా కారంపూడి సీఐగా ఉంటూ టీడీపీ విధ్వంసకాండకు కొమ్ముకాసిన నారాయణస్వామికి మాత్రం ఏం కాలేదు. ఐజీ త్రిపాఠి సరేసరి. వీరు కొత్త కొత్త కేసులు బనాయిస్తూ స్వామిభక్తిని చాటుకుంటున్నారు.త్రికూటమి ఆడించినట్టల్లా ఆడటానికి ఎన్నికల సంఘం రెడీ అయిపోయిందని ఉన్నతాధికారుల ఏకపక్ష బదిలీలు మొదలైనప్పుడే అందరికీ అర్థమైపోయింది. ఎవరిని ఎక్కడ నియమించాలో ఆదేశిస్తూ కూటమి ఇచ్చిన ఆదేశాలకు ‘జీ హుజూర్’ అంటూ కొత్త అధికారులను దించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా కొందరు అధికారులను నియమించటంతో మొదలైన కుట్రపై లోతుగా దర్యాప్తు చేస్తే తప్ప ఎన్నికల రోజునా, ఆ తర్వాతా కొనసాగిన హింస, విధ్వంసకాండ వెనక ఏయే శక్తులున్నాయో వెల్లడి కాదు. మన దేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియను చూసి ముచ్చటపడి అనేక దేశాలు దాన్ని అనుసరించటం మొదలెట్టాయి. ఎప్పటికప్పుడు అభివృద్ధి అవుతున్న కొత్త సాంకేతికతలతో ఎన్నికల ప్రక్రియ మరింత మెరుగ్గా, సాఫీగా సాగేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటున్నది. మరి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఏమైంది? ఈ ఉదంతాల సమయంలో ఎందుకాయన మౌనంగా ఉండిపోయారు? కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునేవరకూ తన వంతుగా చేసిందేమిటి? ఎన్నికల రోజున మాచర్ల వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 8 గ్రామాల్లో టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న వైనం గురించి వరసగా రెండు లేఖలు రాసినా, అలాంటిచోట్ల రీపోలింగ్ నిర్వహించాలని డిమాండు చేసినా మీనా ఎందుకు జవాబీయలేదు? ఈవీఎం పగలగొట్టినట్టు టీడీపీ ఒక వీడియో విడుదల చేసేవరకూ ఆ ఉదంతం తెలియనట్టే ఎందుకున్నారు? 23 గంటల నిడివికిపైగా ఉన్న ఆ వీడియోలో ముందూ వెనకా ఏం జరిగిందో అసలు ఎన్నికల సంఘం చూసిందా? చూస్తే ఎందుకు మౌనం వహించింది? అన్నిటికన్నా చిత్రమేమంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి అదే రోజు రీ పోలింగ్ కోసం డిమాండ్ చేయగా నాలుగైదు రోజుల తర్వాత ఆ వీడియో బయటపెట్టిన టీడీపీ ఇంతవరకూ రీపోలింగ్ కోరనేలేదు. వెబ్కాస్టింగ్ మొత్తం టీడీపీ ముఠా నియంత్రణలో ఉందన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం నోరు మెదపటం లేదు.ఇంత బరితెగింపుతో దేశంలో ఎక్కడా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదు. తన బాధ్యతేమిటో, కర్తవ్యవేమిటో మరిచి తోకపట్టుకుని పోయే చందంగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న ఎన్నికల సంఘం ఇప్పటికైనా మౌనం వీడాలి. నర్సరావుపేట పరిధిలోనే కాదు... ఇతర నియోజకవర్గాల్లోనూ ఈవీఎంలు ధ్వంసం చేసిన ఉదంతాలు వెల్లడయ్యాయి. మంత్రి అంబటి రాంబాబు కొన్నిచోట్ల రీపోలింగ్ కోరారు. వీటన్నిటికీ జవాబు రావాలి. సంజాయిషీ ఇవ్వాల్సిన స్థానంలోవున్నవారు మూగనోము పడితే అనుమానాలు మరింత బలపడతాయి. కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా సాగుతుందా అన్న సందేహాలు తలెత్తుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఈ తలకిందుల వ్యవస్థను నిటారుగా నిలబెట్టాలి. ప్రజాస్వామ్యంపై ప్రజలకుండే విశ్వసనీయతను కాపాడాలి. -
పోటెత్తిన వోటర్లు!
సార్వత్రిక ఎన్నికల తొలి మూడు దశల తీరు వేరు... సోమవారంనాటి నాలుగో దశ పోలింగ్ తీరు వేరు. దేశవ్యాప్తంగా మొత్తం 96 లోక్సభ స్థానాల్లో జనం పెద్దయెత్తున వోటింగ్లో పాల్గొన్నారు. ఈ నాలుగో దశలో లోక్సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అందుకోసమే కాక ఈ రాష్ట్రంవైపు దేశమంతా ఆసక్తిగా చూడటానికి ప్రత్యేక కారణం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అయిదేళ్ల పాలన తర్వాత ప్రజల ఆశీస్సులు కోరుతూ నిర్వహించిన ‘సిద్ధం’ సభలకూ, బస్సు యాత్రకూ పోటెత్తిన జనవాహినిని చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. ‘మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు వోటేయండి’ అంటూ ప్రజానీకానికి పిలుపునీయటం, అందుకు వచ్చిన సానుకూల స్పందన అసాధారణమైనవి. విపక్షం పూనకం వచ్చినట్టు వ్యక్తిగత దూషణలకు దిగినా, కులాల పేరిట ప్రాంతాల పేరిట చిచ్చురేపాలని చూసినా జగన్, ఆయన పార్టీ హుందాగా వ్యవహరించారు. ఈ ఎన్నికలు ‘పేదలకూ, పెత్తందార్లకూ జరిగే యుద్ధం...ఇందులో మీరు ఎటువైపో తేల్చుకోండ’ని ఇచ్చిన ఆయన పిలుపును పల్లెసీమల నుంచి నగరాలు, పట్టణాల వరకూ అన్నిచోట్లా అందరూ అందుకున్నారు. కొత్తగా వోటు హక్కు వచ్చిన యువత మొదలుకొని వృద్ధుల వరకూ...వికలాంగులు మొదలుకొని అనారోగ్యంతోవున్న పెద్దల వరకూ... వేసవి తీవ్రతను కూడా లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు తరలిరావటంలోని ఆంతర్యం అదే. కనుకనే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. వోటేయటానికి బారులు తీరిన మహిళలు, వృద్ధుల్ని చూసి టీడీపీ కూటమి వణికింది. దానికి తోడు గతంలో ఎవరూ సాహసించని, యోచించని ఒక వినూత్న ప్రయోగం చేశారు జగన్. అన్ని సామాజిక వర్గాలకూ పాలనలో సమ భాగస్వామ్యం కల్పించాలన్న పట్టుదలతో లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో దాదాపు సగభాగం అట్టడుగు వర్గాలకు కేటాయించారు. అందువల్లే జనం వైఎస్సార్ కాంగ్రెస్ను గుండెల నిండా హత్తుకున్నారు. సాధారణంగా అయిదేళ్ల పాలన ఏ ప్రభుత్వం పైన అయినా ఎంతో కొంత అసంతృప్తి తీసుకొస్తుంది. అత్యంత జనాకర్షణగల సినీ దిగ్గజం ఎన్టీరామారావు కొత్తగా పార్టీ స్థాపించినప్పుడు రోడ్లపైకి భారీయెత్తున వచ్చిన జనమే... ఆయన పాలన చూశాక మొహం చాటేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. దాన్నుంచి కోలుకుని ప్రజాభిమానాన్ని చూరగొనడానికి ఆయనకు మరో అయిదేళ్లు పట్టింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 4న వెల్లడయ్యాక దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది. జనరంజక పాలన అంటే ఏమిటో... ఏం చేస్తే ప్రజల ఆదరాభిమానాలు సాధించుకోవచ్చునో అన్ని రాష్ట్రాల రాజకీయ నాయకులూ గ్రహిస్తారు. సంక్షేమం అంటే కేవలం తాయిలాలు పంచటం కాదని, వారి భవిష్యత్తును వారే నిర్మించుకునే విధంగా ఆసరాగా నిలబడటమని నిరూపించిన జగన్ను ఇకపై వారంతా రోల్ మోడల్గా తీసుకుంటారు. పిల్లలు బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తేనే కుటుంబాలు బాగుపడతాయని గుర్తించి ఆ రంగాన్ని ప్రక్షాళన చేయటం, ప్రామాణికమైన విద్యనందించటం, ‘నాడు–నేడు’ పేరిట బడులన్నిటినీ తీర్చిదిద్దటం కనీవినీ ఎరుగనిది. వైద్యరంగంపైనా ఆయన అంతే శ్రద్ధ పెట్టారు. భారీయెత్తున సిబ్బందిని నియమించి ఆస్పత్రులను తీర్చిదిద్దటం, ఆధునాతన వైద్య పరికరాలు, ఔషధాలు సమకూర్చటం, పల్లెలకు సైతం వైద్య సేవలు చేరేయటం మామూలు విషయం కాదు. అలాగే రైతు కోసం ఏర్పాటైన వ్యవస్థలైతేనేమి... వలంటరీ వ్యవస్థద్వారా ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లటమైతేనేమి జగన్ విజయాల్లో మచ్చుకు కొన్ని. దేశంలో ప్రజాభిమానాన్ని చూరగొనాలనుకునే నాయకులెవరైనా వీటిని అనుసరించక తప్పదు.అయితే జనం మనస్సుల్లోంచి దీన్నంతటినీ తుడిచేయాలని చూసిన జిత్తులమారి టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి గురించీ, వారి చేష్టలకు వంతపాడిన ఎన్నికల సంఘం గురించీ ప్రస్తావించుకోవాలి. వారి నుంచి ఫిర్యాదు రావటమే తడవుగా ఉన్నతాధికారులను బదిలీ చేయటం, అయిదేళ్ల నుంచి అమలవుతున్న పథకాలకు మోకాలడ్డటం,వారు కోరిన విధంగా అడ్డగోలుగా అధికారుల్ని నియమించటం... టీడీపీ పోకడలపై ఫిర్యాదు చేసినా బేఖాతరు చేయటం లేదా ఆలస్యంగా స్పందించటం తటస్థంగా వుండాల్సిన వ్యవస్థకు తగదు. సాక్షాత్తూ బాబే ఎన్నికల సభల్లో సీఎంనుద్దేశించి దూషించినా... ఆయన్ను రాళ్లతో కొట్టాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా బాబును ఆపే ప్రయత్నం చేయలేదు. వేరే రాష్ట్రాల్లో ప్రధానినుద్దేశించి చిన్న వ్యాఖ్య చేసినా నొచ్చుకున్న ఆ వ్యవస్థ ఏపీలో వీటన్నిటినీ ఎలా కొనసాగనిచ్చింది? అన్నీ ఒక ఎత్తయితే ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై బాబు అండ్ కో సాగించిన దుష్ప్రచారం, ప్రజలను భయపెట్టడం మరో ఎత్తు. బాబు, లోకేష్లపై కేసులు పెట్టాలని ఆదేశించారు సరే... కానీ ఆ తర్వాత అదే అంశంపై నిబంధనలకు విరుద్ధంగా మీడియాలో పూర్తి పేజీ ప్రకటనలిస్తే ఎందుకు సంజాయిషీ కోరలేదు? నిజానికి పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగిందంటే అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ సంయమనమే కారణం. అయినదానికీ, కానిదానికీ రాయలసీమపై అభాండాలేయటం బాబు దురలవాటు. కానీ చిత్రంగా అక్కడ అత్యంత ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఇతరచోట్లే టీడీపీ బరితెగింపుతో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈవీఎంల ధ్వంసం, పెట్రోల్ బాంబులతో దాడి, పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలను బెదిరించటం, బౌన్సర్లతో హడలెత్తించటం, పోలీస్ స్టేషన్పై దండయాత్ర చేయటం దేనికి సంకేతం? ఎన్ని అవరోధాలెదురైనా నిర్భయంగా పోటెత్తి వోటేసిన ప్రజానీకం అభీష్టానిదే అంతిమ విజయం. -
వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చీల్చి, చంద్రబాబుకు మేలు చేకూర్చడమే లక్ష్యంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్పష్టమైంది. పాడేరులో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి వంతల సుబ్బారావును విరమింపజేయడానికి షర్మిల చేసిన ప్రయత్నం షర్మిల ఎల్లో రాజకీయాన్ని తేటతెల్లం చేసింది. వైఎస్సార్సీపీ ఓట్లు కోసమే బుల్లిబాబుకి టికెట్ ఇచ్చామంటూ సుబ్బారావుతో షర్మిల మాట్లాడిన ఆడియో లీకవడంతో అడ్డంగా దొరికిపోయారు.పాడేరు కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల తొలుత వంతల సుబ్బారావును ఎంపిక చేశారు. ఇటీవల పాడేరులో జరిగిన సభలో కూడా సుబ్బారావే అభ్యర్థి అని ప్రకటించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ నుంచి బుల్లిబాబు కాంగ్రెస్లోకి రావడంతో షర్మిల ప్లేటు ఫిరాయించారు. సుబ్బారావును కాదని బుల్లిబాబుకు టికెట్ ఇచ్చారు. దీంతో వంతల సుబ్బారావు రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో షర్మిల సుబ్బారావుతో ఫోన్లో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చేందుకే బుల్లిబాబుకి టికెట్ ఇస్తున్నామనీ.. పోటీ నుంచి తప్పుకోవాలని కోరారు. రెబల్గా బరిలో ఉంటే పార్టీలోకి మళ్లీ రాలేరంటూ హెచ్చరించారు. మీ సభలకంటే నా సభలకే జనాలు ఎక్కువ మంది వస్తున్నారంటూ సుబ్బారావు కూడా ఘాటుగా సమాధానమిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న ఆడియోలో ఏముందంటే..షర్మిల: నమస్తే అన్నా.. ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదన్నా. నెక్ట్స్ టైమ్ తప్పకుండా ఆపర్చ్యూనిటీ ఇస్తాం. పార్టీలో సముచితమైన స్థానం, గౌరవమిస్తాను. మీరు నా సొంత అన్న లెక్క అన్నా. అర్థం చేసుకోకపోతే ఎలా అన్నా. నేనైతే మీకియ్యాలనే అనుకున్నానన్నా. కానీ రఘువీరారెడ్డి గారు ఆల్రెడీ అరకు సీపీఎంకు ఇచ్చేశారు. ఈ సీటు బల్లిబాబుకు ఇమ్మన్నారు. మీకు అన్నీ తెలిసి మేమేదో డబ్బుల కోసమో.. నా టీమ్ ఏదో డబ్బుల కోసమో బుల్లిబాబుకి ఇచ్చామని ప్రచారం చెయ్యడం కూడా కరెక్ట్ కాదు కదా మీరు. అది వాస్తవం కాదు కదా అన్నా..సుబ్బారావు: నేనేమీ ప్రచారం చెయ్యలేదు. నేనైతే ఎక్కడా మీ గురించి కానీ, పార్టీ గురించి కానీ ప్రచారం చెయ్యలేదు.షర్మిల: సరే అన్నా.. ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు. మీరు రెబల్ కావద్దు. నెక్ట్స్టైమ్ తప్పకుండా అవకాశం ఉంటుంది. కమ్ బ్యాక్.సుబ్బారావు: ఇంత అన్యాయం ఏంటి మేడం. ఏ రోజూ జెండా మోయని వాడికీ, పార్టీలో లేనివాడికీ ఇచ్చెయ్యడం వల్ల నాకు బాధ ఉంది. మరొక్క విషయం.. మీరు వేలాది మంది జనం ముందు ప్రకటన చెయ్యకపోయినా బాగుండేది. మీరు ప్రకటన చెయ్యడం వల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను. మా వాళ్లు కూడా ఫీలయ్యారు.షర్మిల: అన్నా.. మీకు అన్నీ తెలుసు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ముఖ్యం, మనకు వైసీపీ ఓటు బ్యాంకు కూడా ముఖ్యము. రెండూ కలిసొస్తాయనే కదా తీసుకుంది. నేను తీసుకుంది ఎందుకు? వైసీపీ ఓటు బ్యాంకు కోసమే కదా.సుబ్బారావు: నేనిప్పుడు చూశాను.. మీరు మాట్లాడింది, మీరు ప్రచారం చేసింది. మొన్న నా జనాల్ని చూస్తే.. మీకంటే ఐదు రెట్లు ఎక్కువ మంది వచ్చారు. రూపాయి ఖర్చు పెట్టకుండా. వీడియోలు పెట్టమంటే పెడతాను. చూడండి. నేను ఓటు బ్యాంకు ఉన్నవాడిని. కానీ.. గ్రౌండ్ లెవల్లో రిపోర్ట్ లేదు అని అన్నారు. నా రిపోర్ట్ ఏంటో ఎవరికెన్ని ఓట్లు వస్తాయో చూడండి. నేను కాంగ్రెస్లోనే ఉంటాను.షర్మిల: అన్నా.. మీరు ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇంక కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి.సుబ్బారావు: మర్చిపోవాలంటే.. మర్చిపోతానిక.షర్మిల: మర్చిపోండి.. మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది. మళ్లీ కుటుంబంలోకి రావడానికి. మీరు రెబల్గా పోటీ చేసినాక, కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసినాక మళ్లా మీరు కాంగ్రెస్లోకి రాలేరు.సుబ్బారావు: నా భవిష్యత్తే డ్యామేజ్ అయ్యింది. నాకింకేముంది మరి.షర్మిల: అదే అన్నా.. ఇప్పుడు ఆలోచించుకోండి. మళ్లీ మీకు కాంగ్రెస్ పార్టీ అవసరము అని వెనక్కొస్తే మీకిక్కడ స్థానం ఉండదు.సుబ్బారావు: మంచిదే కదా. -
తెరపైకి తెలుగు కాంగ్రెస్!
సాక్షి ప్రతినిధి, కడప: సార్వత్రిక ఎన్నికల పర్వంలో రాజకీయ పక్షాల అపవిత్ర కలయికలు తెరపైకి వస్తున్నాయి. తాము గెలవడం కంటే తమ ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టడమే లక్ష్యంగా రాజకీయ పార్టీల మధ్య అవగాహన కుదురుతోంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య కొనసాగుతున్న మైత్రి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. తాము ఎటూ గెలవలేం, వైఎస్సార్సీపీని నియంత్రించడమే లక్ష్యం కావాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. అందివచ్చిన అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ సద్వినియోగం చేసుకుంటోంది. వెరసి తెలుగు కాంగ్రెస్ రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి.ప్రజల ముంగిట్లోకి పాలన తీసుకువచ్చాం. క్షేత్రస్థాయిలో ఎంతో అభివృద్ధి చేశాం.. రాజకీయాలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాం. మరోమారు అవకాశం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను అభ్యర్థిస్తోంది. తమ పాలనలో లబ్ధి చేకూరి ఉంటేనే ఆశీర్వదించండని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం కోరుతున్నారు. చరిత్రలో తన వల్ల మేలు చేకూరి ఉంటే ఓట్లు వేయండనే రాజకీయ నేత ఇంతవరకూ ఎవరూ లేరని ప్రజలు కొనియాడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కుట్రలు, కుయుక్తులతో లబ్ధి పొందాలనే వైఖరిని తెలుగుదేశం పార్టీ అవలంబిస్తోంది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీకి గణనీయంగా పట్టు ఉన్న ఓటర్లలో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధానంగా మైనార్టీ ఓట్లు చీల్చడమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు.వ్యూహాత్మకంగానే అఫ్జల్ఖాన్ అభ్యర్థిత్వంజిల్లాలో వైఎస్ కుటుంబం అన్నా, వైఎస్సార్సీపీ అన్నా పార్టీలకు అతీతంగా ముస్లిం మైనారీ్టలు అండగా నిలుస్తూ వస్తున్నారు. గతంలో అనేక ఎన్నికల్లో ఆ విషయం తేటతెల్లమైంది. ఇప్పటికే కడపలో రెండు పర్యాయాలు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఎస్బి అంజద్బాషా విజయకేతనం ఎగురవేశారు. ప్రస్తుతం మరోమారు తలపడుతున్నారు. ఈమారు వైఎస్సార్సీపీని ఎన్నికల్లో ఎలాగైనా నియంత్రించాలనే లక్ష్యంతో టీడీపీ కుయుక్తులు పన్నుతోంది. ఓవైపు విద్వేషాలు రెచ్చగొడుతూ కుట్ర రాజకీయాలు చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్తో చేతులు కలిపింది. వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్న ముస్లిం మైనారీ్టల ఓట్లు చీల్చేందుకు శతవిధాలా ప్రయతి్నస్తోంది. ఆమేరకే కడపలో అఫ్జల్ఖాన్ను కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీలో దించారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అఫ్జల్ఖాన్ అభ్యర్థిత్వం ఎంచుకోవడం వెనుక కూడా కారణం లేకపోలేదు. ముస్లిం మైనార్టీలలో పఠాన్ తెగకు చెందిన వారిని తమ వైపు మరల్చుకోవాలనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమేరకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఆర్థిక సహకారం అందించేందుకు రహస్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కడప శివార్లలోని జయరాజ్ గార్డెన్లో తెలుగు కాంగ్రెస్ నేతలు సమావేశమై అఫ్జల్ఖాన్ అభ్యరి్థత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.కడప, ప్రొద్దుటూరు, రాయచోటిలలో ఎందుకంటే... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లిం మైనారిలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించడంతో ముస్లిం కుటుంబాలకు ఎంతో లబ్ధి చేకూరింది. తద్వారా వైఎస్ కుటుంబానికి అండగా ఉంటున్నారు. కడపలో ముస్లిం మైనార్టీ ఓటర్లు దాదాపు 90వేలు ఉన్నారు. వీరి మద్దతు ఏకపక్షంగా వైఎస్సార్సీపీకి కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ, జనసేనతో పొత్తు కారణంగా కూడా టీడీపీకి వ్యతిరేకంగా నిలవనున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వారి ఓట్లలో చీలిక తీసుకువస్తే ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందనే దిశగా టీడీపీ నాయకులు అడుగులు వేశారు. ఆ మేరకు కాంగ్రెస్ పారీ్టతో చేతులు కలిపి కడపలో అఫ్జల్ఖాన్ను కాంగ్రెస్అభ్యర్థిగా ఎంపిక చేయించారు. ప్రొద్దుటూరు, రాయచోటి నియోజకవర్గాల్లో కూడా ఇదే పంథాను కొనసాగించారు. ప్రొద్దుటూరులో దాదాపు 45వేలు ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరిలో భారీగా చీలికలు తీసుకురావాలనే ఉద్దేశంతో మహమ్మద్ నజీర్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాయచోటిలో కూడా అల్లాబ„Š ఎంపిక వెనుక కూడా టీడీపీకి లబ్ధి చేకూర్చడమే అసలు లక్ష్యమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో ఇలా అవసరమైన మేరకు సహకరించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో నిత్యం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఫోన్లో టచ్లో ఉన్నట్లు కూడా పలువురు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి జిల్లాలో తెలుగు కాంగ్రెస్ రాజకీయాలు తెర ముందుకు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
యూటర్న్ చంద్రబాబు బాగోతం ఇది
వలంటీర్లకు పది వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పడం ద్వారా మన పాలన గొప్పగా ఉందని ఆయన సర్టిఫికెట్ ఇచ్చారు... ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్య.. రాష్ట్రం విధ్వంసం అయింది..జగన్ ఇంతకాలం ప్రజలకు కనిపించలేదు.. ఇప్పడు మళ్లీ జనంలోకి వస్తున్నారు. అది ఓట్ల మీద ప్రేమ.. జగన్ను ఎవరూ నమ్మవద్దు.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగంలో ఒక భాగం ఐదుకోట్ల మందికి ఏ ఒక్క నాయకుడో సరిపోరు. మూడు పార్టీల బలమైన నాయకత్వం కావాలి.కేంద్ర సహకారం, చంద్రబాబు అనుభవం, జనసేన పోరాట శక్తి కావాలి..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన కొత్త విషయం పవన్ శక్తి, చంద్రబాబు యుక్తి ,మోదీ సంకల్పం ..టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి బలం.. బీజేపీ ఎపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్య ఈ నలుగురు కొద్ది రోజుల క్రితం తణుకు వద్ద జరిగిన సభలో చేసిన ప్రసంగాలను విశ్లేషించండి. జగన్ తాను ఐదేళ్ల పాలన సమయంలో చేసిన వివిధ అబివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సాకల్యంగా వివరించడంతో పాటు, చంద్రబాబు వలంటీర్ల వ్యవస్థపై యూ టర్న్ తీసుకున్న తీరును సమర్ధంగా వివరించగలిగారు.అంతేకాక చంద్రబాబు 2014 లో ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలు, వాటిని అమలు చేయని వైనాన్ని విపులంగా ప్రజలకు తెలియచెప్పారు. జగన్ సభ ఒక ఖాళీ ప్రదేశంలో భారీ ఎత్తున జరిగితే, కూటమి సభ ఒక రోడ్డుమీద జరిపి జనం బాగా వచ్చారని సంతోషపడడం కూటమి నేతల వంతుగా మారింది. జగన్ ఎక్కడా ఎవరిని దూషించకుండా , ప్రత్యేకించి ఆయా నియోజకవర్గాలలో పోటీచేస్తున్న టీడీపీ ,ఇతర పార్టీల అభ్యర్దుల ప్రస్తావన తేకుండా ,తన పార్టీ అభ్యర్ధులను మాత్రం పరిచయం చేసి గెలిపించాలని కోరుతున్నారు. కాని కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఎక్కడకు వెళితే అక్కడ ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్ధిపై తీవ్రమైన విమర్శలు, అడ్డగోలు ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించాలని యత్నించారు. జగన్ తన స్కీముల గురించి ప్రజలకు తెలియచెప్పి, తాను ప్రతి ఇంటికి మంచి చేశానని ధైర్యంగా చెబుతున్నారు. కాని చంద్రబాబు మాత్రం అలా చెప్పలేకపోతున్నారు.పైగా వలంటీర్ల వ్యవస్థపై ఆయన యుటర్న్ తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీ పరువు పోయింది.ఇంతకాలం వలంటీర్లను బండబూతులు తిట్టిన టీడీపీ నేతలు తలలు పట్టుకుని కూర్చున్నారు. చంద్రబాబు మాదిరి ఎప్పటికప్పుడు నాలుక మడతపెట్టి మాట మార్చినట్లు ఎలా చేయాలో తెలియక సతమతమవుతున్నారు. వలంటీర్లు పెన్షన్ దారుల ఇళ్లకు వెళ్లకుండా చేసిన నేపద్యంలో టీడీపీకి అది పెద్ద ఇబ్బందిగా మారింది. దానిని జగన్ తన స్పీచ్లో క్యాష్ చేసుకుంటున్నారు. చంద్రబాబు తను కూడా అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి పదివేల వేతనం ఇస్తానని చెప్పడం ద్వారా తన పాలనకు సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పి విపక్షనేతను డిఫెన్స్ లో పడేశారు. అయితే చంద్రబాబు చేసే వాగ్ధానాలు ప్రజలను మోసం చేయడానికే కాని, అమలు చేయడానికి కాదని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు తీసుకుని ప్రజలతో అవునని చెప్పించారు. ఉదాహరణకు రుణమాఫీ,నిరుద్యోగ భృతి వంటివాటిలో చంద్రబాబు మాట తప్పిన వైనాన్ని జగన్ తెలియచెప్పారు.అలాగే తన ప్రభుత్వంలో పోర్టుల నిర్మాణం, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, పరిశ్రమలకు పునాది పడుతున్న తీరు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో గత మూడేళ్లుగా నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న వైనాన్ని జగన్ విరించారు. కాని అదే చంద్రబాబు,లేదా పవన్ కళ్యాణ్ లు తమ ప్రసంగాలలో ఎక్కడా స్పెసిఫిక్గా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములను విమర్శించలేకపోతున్నారు. పైగా వాటిని మరింతగా ఎక్కువ చేసి అమలు చేస్తామని చెప్పారు. మరి అలాంటప్పుడు రాష్ట్రం విధ్వంసం అయిందని ఆ నేతలు ఎలా చెబుతున్నారో అర్దం కాదు. మోడీ సంకల్పం ఉంది కనుక రాష్ట్రానికి ఉపయోగం అని అంటున్నారే తప్ప, కేంద్రం నుంచి ఏమి సాధిస్తామో చెప్పలేని దయనీయ స్థితి కూటమి నేతలకు ఏర్పడింది. ఉదాహరణకు ప్రత్యేక హోదా అంశాన్ని కూటమి నేతలు ప్రస్తావించలేకపోతున్నారు.ప్రత్యేక హోదా కాకుండా కేంద్రం నుంచి వీరు ఏమి సాధిస్తారో ఎవరికి వివరించలేకపోతున్నారు.రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం డ్రామాలు ఆడుతుండడం, విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ మొదలైన వాటి గురించి వీరు ఒక్క ముక్క మాట్లాడడం లేదు. గతంలో చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలని అన్నప్పుడు కేంద్ర నేతలతో పాటు బీజేపీ రాష్ట్ర నేత దగ్గుబాటి పురందేశ్వరి అది ముగిసిన అధ్యాయం అని అన్నారు. అందుకు చంద్రబాబు ఒప్పుకున్నట్లేనా?బీజేపీ ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్ లను తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దీనిపై చంద్రబాబు అభిప్రాయం ఏమిటి? ఇలాంటివాటిపై అటు చంద్రబాబు కాని, ఇటు పవన్ కళ్యాణ్ కాని మాట్లాడకుండా ఉమ్మడి ఎజెండాతో ,ప్రజా మానిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తున్నామని చెబితే ఎవరు నమ్ముతారు? అసలు ఉద్యోగాలే రాలేదని ఒకసారి, సచివాలయాలలో కొత్తగా వచ్చిన లక్షన్నర మంది ఉద్యోగుల గురించి మరోసారి చంద్రబాబు మాట్లాడుతారు. వీటిలో ఏది విద్వంసం,ఏది నాశనమో చెప్పలేరు.అప్పుల గురించి మాట్లాడతారు.రాష్ట్రం అప్పులపాలైతే సూపర్ సిక్స్ పేరుతో ఏడాదికి లక్షన్నర కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ కార్యక్రమాలకు ఎలా చంద్రబాబు ఖర్చు చేస్తారో వివరించరు. జగన్ అమలు చేసిన అమ్మ ఒడిని తల్లికి వందనం పేరుతో ఎందరు పిల్లలు ఉంటే అందరికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇస్తుంటారు.అది ఎలా సాధ్యమో ఆయన చెప్పరు. ఆ పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్,పురందేశ్వరిలు మాట్లాడరు.ఇవన్ని చూస్తుంటే వీళ్లకు ఒక ఎజెండా లేదు. ముగ్గురు కలిసి జనాన్ని ఎలా మభ్య పెట్టాలా అన్నదానపైనే దృష్టి పెడుతున్నట్లు అనిపిస్తుంది. అయితే జగన్ ను తిట్టడం, లేదంటే రాష్ట్రం విధ్వంసం అయిందని ఆరోపించడం,లేకుంటే జగన్ ఇచ్చిన స్కీములను మరింత ఎక్కువ ఇస్తామని బొల్లడం..జగన్ సభలకు, చంద్రబాబు సభలకు తేడా ఇంత స్పష్టంగా కనిపిస్తుంది.పురందేశ్వరి మాత్రం ఒక మాట చెప్పారు. పవర్ స్టార్ పవన్ శక్తి, చంద్రబాబు యుక్తి, మోడీ సంకల్పం రాష్ట్రానికి ఉపయోగపడతాయని అన్నారు. చంద్రబాబుదంతా కుయుక్తులేనని గతంలో ఈమె అన్నారు. ఇప్పుడేమో ఆ కుయుక్తే ఏమైనా తనకు ఎంపీ పదవి వచ్చేలా చేస్తుందేమోనన్న ఆశతో పురందేశ్వరి ఉన్నారు. పవన్ అయితే ఐదు కోట్ల మందికి ఒక్క నాయకుడు చాలడని అన్నారు. మూడుపార్టీల బలమైన నాయకత్వం కావాలి అని ఆయన చెబుతున్నారు. చంద్రబాబు అనుభవం, జనసేన పోరాట శక్తి కావాలట.కేంద్ర సహయం ఉండాలట. అంటే చంద్రబాబు ఒక్కడు ముఖ్యమంత్రిగా సరిపోడని పవన్ చెబుతున్నట్లే కదా! చంద్రబాబుకు అంత సామర్ధ్యం లేదనే కదా పవన్ ఉద్దేశం? అధికారం వచ్చాక ఈయన కూడా అందులో భాగస్వామి అవుతారా?అవ్వరా? ఎవరిమీద పోరాడుతారు?లేదంటే ఈయన బయట ఉండి మళ్లీ స్పీచ్ లు ఇస్తూ తిరుగుతారేమో తెలియదు.ఒకటి మాత్రం జనానికి చెప్పారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం సరిపోదని చెబుతున్నారని అర్ధం అవుతుంది.రాష్ట్రం కొన ఊపిరితో ఉందట ఎన్డీఏ కూటమి ఆక్సిజన్ అట. అలాగైతే ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోడీతో ఎందుకు చెప్పించలేకపోయారు.ఆయన అసలు రాష్ట్రానికి ఒక్క వరం అయినా ఇచ్చి వెళ్తారా?కేవలం తన కేసులకోసం, కొన ఊపిరితో ఉన్నటీడీపీని బతికించుకోవడం కోసం పొత్తు పెట్టుకుని అదేదో రాష్ట్రం కోసం అని చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినే రోజులు కావివి. వైఎస్సార్సీపీ విధ్వంసం చేస్తోందనే పొత్తు పెట్టుకున్నామని పవన్ అంటున్నారు. ఏమి విధ్వంసమో ఈ మూడు పార్టీల నేతలు చెప్పలేకపోతున్నారు. ఏదో పిచ్చి,పిచ్చి ప్రకటనలు చేసి, సినిమా డైలాగులు మాట్లాడి జనాన్ని బురిడి కొట్టించాలన్న ఉద్దేశం వారిలో కనిపిస్తోంది.తమ పార్టీలను బతికించుకోవడానికి, తాము గెలవలేమన్న భయంతో ఈ మూడు పార్టీలు కలిశాయి తప్ప ఇంకొకటి కాదు. ఓట్లు చీలకూడదని ఎప్పుడైతే అన్నారో, అప్పుడే వీరంతా ఓటమిని అంగీకరించిన్లే అనుకోవాలి.వైఎస్సార్సీపీ వెంటిలేటర్ పై ఉందని అంటున్న చంద్రబాబు దానిని నిజమని నమ్మి ఉంటే ఒంటరిగా పోటీచేసి సవాలు విసిరేవారు. ఇలా అధికారం కోసం జనసేన, బీజేపీ వంటి చిన్నపార్టీలను కాళ్లావేళ్లపడి ఎందుకు బతిమలాడుకుంటారు.ఢిల్లీ వెళ్లి పరువు పోగొట్టుకుని మరీ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు. జగన్ అడిగే ప్రశ్నలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరిల వద్ద సమాధానం లేదు. అందుకే వీరు ఇలా సోది ప్రసంగాలు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారనుకోవాలి. తాను గెలుస్తానన్న ధైర్యం ఉంది కనుక జగన్ ఒంటరిగా బరిలో దిగి ప్రత్యర్దులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ ప్రజలు ఈ కిచిడి కూటమి కావాలా? లేక జగన్ సాహసవంతమైన నాయకత్వం కావాలా? అన్నది తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..
సాక్షి, అమరావతి : మేమంతా సిద్ధం 7వ రోజు బుధవారం (ఏప్రిల్ 3) షెడ్యూల్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మంగళవారం విడుదల చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ మంగళవారం రాత్రి బస చేసిన అమ్మగారిపల్లె ప్రాంతం నుంచి బుధవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. సదుం, కల్లూరు, దామలచెరువు, తలుపులపల్లి మీదుగా తేనెపల్లి చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం రంగంపేట క్రాస్ మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు పూతలపట్టు బైపాస్కు చేరుకుంటారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత పి.కొత్తకోట, పాకాల క్రాస్, గదంకి, పనపాకం, ముంగిలిపట్టు, మామండూరు, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి క్రాస్, రేణిగుంట మీదుగా గురువరాజుపల్లె రాత్రి బసకు చేరుకుంటారు. అన్నమయ్య జిల్లా సిద్ధమా? మేమంతా సిద్ధమంటూ బస్సుయాత్రకి ఆరవ రోజు అన్నమయ్య జిల్లా సిద్ధమా? అంటూ మంగళవారం సీఎం జగన్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. మేమంతా సిద్ధమంటూ బస్సుయాత్రలో ముఖ్యమంత్రితో పాటు జనప్రభంజనం కదం తొక్కి ముందుకు సాగింది. –సాక్షి,అమరావతి -
YSRCP.. జయహో ‘బీసీ’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత 58 నెలలుగా సమాజానికి వెన్నెముకగా బీసీలను తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వారికి 48 శాసనసభ, 11 లోక్సభ స్థానాలు వెరసి మొత్తం 59 స్థానాలు కేటాయించి వారికి పెద్దపీట వేశారు. తద్వారా తన భవిష్యత్తు ప్రణాళికను కూడా ఆయన సుస్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 294 శాసనసభ, 48 లోక్సభ స్థానాలు ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో బీసీలకు ఎవరూ అవకాశం ఇచ్చిన దాఖలాల్లేవు. ఉత్తరప్రదేశ్లో బీసీ నేత అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూడా సీఎం జగన్ ఇచ్చిన రీతిలో బీసీలకు అవకాశం ఇవ్వలేదని.. దేశ చరిత్రలో ఇదో రికార్డు అని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. నిజానికి.. రాష్ట్ర విభజనకు ముందు 2012, జూలై 9న ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీనీ ఆయన అధికారంలోకి వచ్చాక అమలుచేయకుండా తమను వంచించారని బీసీలు రగలిపోతున్నారు. అదే వైఎస్ జగన్ గత ఎన్నికలకు ముందు 2019, ఫిబ్రవరి 17న ఏలూరులో ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో తమకు చెప్పిన దానికంటే అధికంగా చేస్తుండడంపై బీసీలు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు చంద్రబాబును ఛీకొట్టగా.. బీసీలు కూడా తమను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అక్కున చేర్చుకున్న సీఎం జగన్కు జేజేలు పలుకుతున్నారు. భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభలకు తరలివచ్చిన జనసందోహం ఇందుకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు వైఎస్సార్సీపీ వెంట నడుస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో వార్ వన్సైడేనని వారు స్పష్టంచేస్తున్నారు. మొత్తం మీద శాసనసభ, లోక్సభ స్థానాలు కలిపి గత ఎన్నికల కంటే ఇప్పుడు అదనంగా 11 స్థానాలను సీఎం జగన్ తమకు కేటాయించడంపై వారు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అవమానించి, అవహేళన చేసిన బాబు.. నిజానికి.. రాష్ట్ర విభజనకు ముందు 2012, జూలై 9న చంద్రబాబు బీసీ డిక్లరేషన్ను ప్రకటించారు. 2014 ఎన్నికల్లో 100 అసెంబ్లీ స్థానాల్లో టికెట్లు ఇస్తామని.. బీసీ సబ్ప్లాన్ ద్వారా ఏటా రూ.పది వేల కోట్లు చొప్పున కేటాయిస్తామని.. చేనేత, పవర్లూమ్స్ రుణాలను మాఫీ చేస్తానని అందులో ప్రకటించారు. కానీ.. 2014 ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనే బీసీలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వారి సబ్ప్లాన్కు పాతరేశారు. అలాగే, ఐదేళ్లలో బీసీ సబ్ప్లాన్ ద్వారా రూ.50 వేల కోట్ల వరకు ఆ వర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేస్తానని హామీ ఇచ్చి.. అందులో సగం కూడా ఖర్చుచేయలేదు. పైగా.. మంత్రివర్గంలో వారికి సముచిత స్థానం కల్పించని చంద్రబాబు.. 2014–19 మధ్య ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. అంతేకాక.. న్యాయమూర్తులుగా బీసీలు పనికిరారంటూ వారిని అవహేళన చేశారు. ఇచ్చిన హామీలు అమలుచేయాలని అడిగిన బీసీలను తాటతీస్తా.. తోకలు కత్తిరిస్తానంటూ బెదిరించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తమపై వల్లమాలిన ప్రేమను ఒలకబోస్తున్న చంద్రబాబు.. ఇప్పటిదాకా ఖరారు చేసిన 128 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 24 స్థానాలనే తమకు కేటాయించడంపై బీసీలు భగ్గుమంటున్నారు. ఇచ్చిన మాటకంటే అధికంగా.. ఇక గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ను ప్రకటించారు. అందులో వారికిచ్చిన మాట కంటే గత 58 నెలలుగా అధికంగానే న్యాయం చేశారు. ఉదా.. ► గత ఎన్నికల్లో 41 శాసనసభ స్థానాలు, ఏడు లోక్సభ స్థానాల్లో బీసీ వర్గాల అభ్యర్థులను బరిలోకి దించిన జగన్.. అధికారంలోకి వచ్చాక కేబినెట్లో ఆ వర్గాలకు చెందిన 11 మందికి మంత్రి పదవులిచ్చారు. ఒకరిని డిప్యూటీ సీఎంగా నియమించడంతోపాటు ప్రధానమైన రెవెన్యూ, విద్యా, పౌరసరఫరాలు, వైద్యం, ఆరోగ్యం లాంటి ప్రధానమైన శాఖలను ఆ వర్గాలకే అప్పగించి పరిపాలనలో వారికి సముచిత భాగస్వామ్యం కల్పించారు. శాసనసభ స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్కు అవకాశమిచ్చారు. ► ఈ వర్గాలకే చెందిన నలుగురిని రాజ్యసభకు పంపిన సీఎం జగన్ శాసనమండలిలో సైతం సింహభాగం పదవులు వారికే ఇచ్చారు. ► ఇక స్థానిక సంస్థల్లో వైఎస్సార్సీపీకి దక్కిన 13 జెడ్పీ చైర్మన్ పదవులకుగాను ఆరు బీసీలకే ఇచ్చారు. ► 84 మున్సిపల్ చైర్మన్ పదవులకుగానూ 44 వారికే కేటాయించారు. 14 కార్పొరేషన్ల మేయర్ పదవులకుగానూ తొమ్మిది బీసీలకే దక్కేలా చేశారు. ► అలాగే, నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు కేటాయించేలా ఏకంగా చట్టం చేసి మరీ ఇచ్చారు. ► మరోవైపు.. గత 58 నెలలుగా సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.1.23 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.50 వేల కోట్లు వెరసి రూ.1.73 లక్షల కోట్ల ప్రయోజనాన్ని బీసీలకు చేకూర్చారు. దీంతో.. రాజకీయ, ఆర్థిక, విద్యా, మహిళా సాధికారత ద్వారా బీసీలు సామాజిక సాధికారతను సాధించారు. -
విలన్ డెన్లో విదూషకుడు!
శంఖం మోగింది. యుద్ధం మొదలైంది. ఎన్నికల ప్రకటనకు కొన్ని గంటల ముందుగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను పూర్తిగా ప్రకటించింది. జాతీయ స్థాయిలోనే ఈ ఘనత సాధించిన మొదటి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఒక్క అనకాపల్లి లోక్సభ అభ్యర్థిని మాత్రమే పెండింగ్లో పెట్టింది. ఈ దూకుడు వల్ల పోల్ పొజిషన్లో దానికి అడ్వాంటేజ్ దక్కినట్టే. విప్లవాత్మక ఆలోచనలతో మరో ఘనతను కూడా అది సొంతం చేసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలున్నాయి. ఈ రెండొందల స్థానాల్లో వంద స్థానాలను బలహీనవర్గాలకు కేటాయించి రాజకీయ ప్రపంచాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆశ్చర్యంలో ముంచెత్తారు. సామాజిక న్యాయం తమ నినాదం మాత్రమే కాదు, విధానం కూడానని ఆయన చేతల ద్వారా మరోసారి నిరూపించుకున్నారు. బీసీ వర్గాలకు 48 శాసనసభ స్థానాలు, 11 లోక్సభ స్థానాలను వైసీపీ కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 అసెంబ్లీ సీట్లు, 42 లోక్సభ సీట్లు ఉన్నప్పుడు కూడా బీసీలకు ఈ సంఖ్యలో సీట్ల కేటాయింపు ఎప్పుడూ జరగలేదు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసని తరుచూ జగన్ మోహన్ రెడ్డి చెప్పే మాట. ఆ మాటను చేతల్లో చూపించారు. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా తన కోటాలో ఉన్న 144 సీట్లలో 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అందులో 24 స్థానాలు మాత్రమే బీసీలకు దక్కాయి. ఆ పార్టీ కోటాలో ఇంకో 16 స్థానాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో ఏడుగురు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. ఇందులో ఒక్క బీసీకే చోటు దక్కింది. మిగిలిన పధ్నాలుగులో ఇదే నిష్పత్తి కొనసాగుతుందో, పెరుగుతుందో వేచిచూడాలి. బీజేపీకి కేటాయించిన 10 సీట్ల అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. కూటమి తరఫున ఇంకో నలభై సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయవలసి ఉన్నది. ఇందులో 23 స్థానాలను బీసీలకు కేటాయించగలిగితేనే వైసీపీ బీసీ స్కోర్ను అది చేరుకోగలుగుతుంది. బ్రహ్మాండం బద్దలైతే తప్ప అది సాధ్యమయ్యే పనికాదు. ముస్లిం మైనారిటీలకు వైసీపీ 7 అసెంబ్లీ సీట్లను కేటాయించింది. కూటమి తరఫున ఇప్పటికి ముగ్గురే ఎంపికయ్యారు. మిగిలిన 40లో నాలుగు స్థానాలు దక్కే అవకాశాలు మృగ్యం. ఏకంగా 11 లోక్సభ స్థానాలకు బీసీ అభ్యర్థులనే వైసీపీ ఎంపిక చేసింది. ఈ రికార్డును అందుకోవడం కూడా సాధ్యమయ్యే పని కాదు. కూటమి కట్టిన తర్వాత ప్రచారాన్ని పరుగెత్తించగల ఒక శుభ శకునం కోసం బాబు ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తాడేపల్లిగూడెం సభ అట్టర్ఫ్లాప్ కావడంతో తెలుగుదేశం శిబిరం డీలా పడిపోయింది. ఇప్పుడు ప్రధానమంత్రి పేరుతోనైనా చిలకలూరిపేట సభ సక్సెస్ చేయాలని ఆ పార్టీ శ్రేణులు చెమటోడ్చుతున్నాయి. మొత్తం 175 నియోజక వర్గాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు. ‘సిద్ధం’ పేరిట వైసీపీ నిర్వహించిన నాలుగు ప్రాంతీయ సభలు చరిత్ర సృష్టించడం టీడీపీ కూటమికి పెనుసవాల్గా మారింది. ఒక్కో సభకు యాభై కంటే తక్కువ నియోజకవర్గాల నుంచే అభిమానుల సమీకరణ జరిగింది. మొదటి రెండు సభలు ఐదు లక్షల మార్కును దాటితే, చివరి రెండు సభలు పది లక్షల మార్కును దాటాయి. జాతీయ స్థాయిలోనే ఇదొక రికార్డు. రాష్ట్రవ్యాప్త సమీకరణ చేస్తే తప్ప గతంలో ఎన్నడూ కూడా ఐదు లక్షల పైచిలుకు జనసమీకరణ జరగలేదు. ఇప్పుడు ప్రధాని సభ టీడీపీ కూటమికి జీవన్మరణ సమస్యగా మారింది. అందుకే రాష్ట్రవ్యాప్త సమీకరణకు టార్గెట్లు పెట్టారు. రెండు మూడు లక్షలమంది హాజరైనా సరే యెల్లో మీడియా సహకారంతో సభ విజయవంతమైనట్టు ప్రకటించుకోవచ్చని ప్రయాసపడుతున్నారు. నరేంద్రమోదీ రూపంలో ఓ శుభశకునం కోసం ఎదురుచూస్తున్న కూటమికి అమిత్ షా రూపంలో అపశకునం ఎదురైంది. అది కూడా సరిగ్గా ఎన్నికల ప్రకటనకు ఒకరోజు ముందు! శుక్రవారం నాడు ఢిల్లీలో జరిగిన ‘ఇండియా టుడే’ కాన్క్లేవ్లో అమిత్ షా పాల్గొన్నారు. ‘ప్రధానిని టెర్రరిస్టని విమర్శించిన చంద్రబాబుతో మీరెలా పొత్తుపెట్టుకున్నార’న్న ప్రశ్నకు అమిత్ షా బదులిచ్చారు. ‘అలా అని ఆయనే ఎన్డీయే నుంచి వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు బుద్ధొచ్చింది. మళ్లీ మా దగ్గరకు వచ్చాడు’ అనగానే అక్కడున్న అతిథులందరూ పడిపడి నవ్వడం కనిపించింది. ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు పరువుపై పంచనామా జరిగింది. ఇదే కాన్క్లేవ్లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వచ్చినప్పుడు అమిత్ షా హుందాగా మాట్లాడారు. ఒక వ్యక్తి ఇతరుల నుంచి గౌరవాన్ని పొందాలంటే ఆ వ్యక్తికి నిబద్ధత, క్యారెక్టర్ ఎంత ముఖ్యమో ఈ ఘటన ఎత్తిచూపింది. ‘పార్లమెంట్లో కొన్ని బిల్లులకు వైసీపీ మద్దతు ఇచ్చింది కదా... మరి ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేద’ని అమిత్ షాను యాంకర్ ప్రశ్నించారు. ‘‘మేం పెట్టిన ప్రతి బిల్లుకూ ఆ పార్టీ మద్దతు ఇవ్వలేదు. కొన్నిటికి మాత్రమే ఇచ్చింది. అది కూడా ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటేనే ఇచ్చింది తప్ప బీజేపీ కోసం కాద’’ని అమిత్ షా చెప్పారు. అమిత్ షా మాటల సారాంశాన్ని విడమర్చి చెప్పుకుంటే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిల వ్యక్తిత్వం మధ్యన ఉన్న తేడా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబుకు సిద్ధాంతాలతో, రాద్ధాంతాలతో సంబంధం లేదు. అవకాశవాది! అవసరం ఉంటే వస్తాడు. లేకపోతే వెళ్లిపోతాడని అమిత్ షా భావన. జగన్మోహన్ రెడ్డికి సైద్ధాంతిక నిబద్ధత ఉన్నది. ఆ పార్టీ విధానాలకు అనుగుణమైతే మద్దతు ఇస్తారు. లేకపోతే లేదు. సిద్ధాంతపరంగా ఆయన పార్టీకీ, మాకూ పొత్తు పొసగదని కూడా ఆయన పరోక్షంగా చెప్పినట్టు! మనం సినిమాల్లో చూస్తూ వుంటాం, విలన్ డెన్లో ఉండే విదూషక క్యారెక్టర్కు ఆ డెన్లోనే ఏపాటి గౌరవం ఉంటుందో! చంద్రబాబు పరిస్థితి కూడా అంతే! ఎన్డీఏ కూటమిలో చేరినా, కూటమి సభ్యుల దృష్టిలో ఆయనో విదూషకుడు, అసందర్భ ప్రేలాపి, అవకాశవాది. అవకాశవాదంతో అటూ ఇటూ తిరిగినా, బీజేపీ ప్రవచించే పెట్టుబడిదారీ అభివృద్ధి నమూనాతో చంద్రబాబుకు కెమిస్ట్రీ బాగానే కుదురుతుంది. ఈ నమూనా వ్యవస్థలో అధికారంలో ఉన్నవాడు పెత్తందారీ శక్తుల భజంత్రీగా మారితే భారీగా వెనకేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ వెసులుబాటును పద్నాలుగేళ్లపాటు బాబు బాగానే ఒడిసిపట్టుకున్నాడు. కొద్దిమంది పెట్టుబడిదారుల అభివృద్ధే దేశాభివృద్ధిగా, వారి పెరుగుదలే దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలగా పరిగణించే బీజేపీ శిబిరమే చంద్రబాబుకు సహజ ఆవాసం. అందుకే మూడుసార్లు విడాకులు తీసుకున్నా మళ్లీ నాలుగోసారి అదే పార్టీని మనువాడేందుకు ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు. పైగా వాజ్పేయి కార్గిల్ ఊపుమీద ఉన్నప్పుడు, మోదీ గుజరాత్ మోడల్ ఊపుమీద ఉన్నప్పుడు వారి గాలితో గెలిచిన అనుభవం బాబుది. ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి బలహీనంగా కన్పిస్తున్నందువల్ల మళ్లీ మోదీ గాలివాటు బాబుకు అవసరమైంది. అన్నిటినీ మించి తరుముకొస్తున్న అవినీతి కేసుల నుంచి రాబోయే కేంద్ర ప్రభుత్వం ఆయన్ను కాపాడాలి. ఆ రాబోయే ప్రభుత్వం మోదీ సర్కారేనని బాబు నమ్ముతున్నారు. దేశంలో చాలామందికి బాబుకున్న అభిప్రాయమే ఉండవచ్చు. ప్రతిపక్ష శిబిరం బాగా బలహీనంగా కనిపించడం అందుకు ఒక కారణం కావచ్చు. స్వతంత్ర మీడియా సంపూర్ణంగా అంతర్ధానం కావడం మరో కారణం కావచ్చు. ఈ కారణాల వల్ల, దేశానికి అన్నంపెట్టే రైతు తన పంటకు చట్టబద్ధమైన మద్దతు ధర కావాలని ఎలుగెత్తడం మనకు న్యాయమైన కోర్కెగా కనిపించడం లేదు. రోజురోజుకూ వేలాదిమంది యువకులు నిరుద్యోగ సైన్యంలో చేరిపోతున్నా మన కళ్లకు వికసిత భారత విశ్వరూపమే కనిపిస్తున్నది. తరతరాలుగా ఈ నేలపైనే పుట్టి ఈ నేలపైనే శ్వాసిస్తున్న కోట్లాదిమంది ‘మైనారిటీ’ ముద్రకు భయపడి వణికిపోతుంటే విజయోద్వేగంతో మన హృదయాలు ఉప్పొంగుతున్నవి. కనుక చాలామంది మళ్లీ మోదీయే గెలుస్తాడని అనుకుంటే అనుకోవచ్చు. వారికా స్వేచ్ఛ ఉన్నది. మన బాబు కూడా ఆ గుంపులోని గోవిందుడే! ఉత్తరాది మోదీ గాలి అంతో ఇంతో దండకారణ్యాన్ని దాటుకుని రాకపోతుందా, తనను కరుణించకపోతుందా అనే ఆశ ఆయనలో మిణుకుమిణుకుమంటూ ఉండవచ్చు. కానీ తూరుపు కనుమలది తలలు వంచే నైజం కాదు. ఉత్తరాదిలో లేనిదీ... ఏపీలో ఉన్నదీ ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమం. పేదల సాధికారతే తారకమంత్రంగా సాగుతున్న ప్రభుత్వ ప్రాయోజిత విప్లవోద్యమం. భారత రాజ్యాంగ స్ఫూర్తిని తు.చ. తప్పకుండా అమలుచేస్తూ, ఆ రాజ్యాంగ కర్తను నగరం నడిబొడ్డున విశ్వరూపంతో నిలబెట్టిన రాష్ట్రమిది. ఆ భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే కేంద్రానికి పెద్ద ఎత్తున సీట్లు కావాలి. అందుకు కూటములు కావాలి. రాజ్యాంగ రక్షణ కవచంతో సాధికారత సంతరించుకుంటున్న ప్రజలు ఈ ప్రయత్నాలను ఓడిస్తారు. ఆ కూటములనూ ఓడిస్తారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తును గానం చేసిన విశ్వకవి రవీంద్రుని కవిత అందరికీ తెలిసిందే. ‘‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తుకుని తిరుగుతారో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా ఉంటుందో, ఎక్కడ సంకుచిత భావాలతో సమాజం ముక్కలుగా విడిపోదో... ఓ తండ్రీ! అటువంటి స్వర్గసీమకు నా దేశాన్ని తీసుకుని వెళ్లు’’. కవీంద్రుని కలను నిజం చేసే శక్తి మన రాజ్యాంగానికి ఉన్నది. అటువంటి రాజ్యాంగాన్ని మార్చి అసమానతలకు, భయం బతుకులకు బాటలు వేసే ప్రయత్నాలను ఇక్కడి ప్రజలు సహించే పరిస్థితి ఉండదు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు మార్గదర్శకాలను విడుదల చేసిన నేపథ్యంలో రాజ్యాంగ మార్పుల చర్చ మళ్లీ ముందుకొచ్చింది. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే మార్చే సవరణలు చెల్లబోవని గతంలోనే సుప్రీంకోర్టు చాటి చెప్పింది. ప్రస్తుత చట్టం (సీఏఏ) పౌరసత్వానికి మత ప్రాతిపదికను రుద్దుతున్నదని విమర్శకులు గట్టిగా భావిస్తున్నారు. ఇది రాజ్యాంగ లౌకిక స్వభావానికి విరుద్ధం కనుక చెల్లదని వారి వాదన. ఈ వ్యాజ్యం సుప్రీంకోర్టు విచారణకు రాబోతున్నది. ఒకవేళ న్యాయస్థానం కొట్టివేస్తే భారీ మెజారిటీతో వచ్చే ప్రభుత్వం కొత్త రాజ్యాంగాన్ని ముందుకు తేబోతున్నదని విమర్శకులు అనుమానిస్తున్నారు. మన దేశంలోనే కాదు, ప్రపంచమంతటా దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతున్నది. ఇంత గంభీరమైన అంశంపై నాలుగోసారి బీజేపీతో జతకట్టిన చంద్రబాబు ఎంత సింపుల్గా సమాధానం చెబుతున్నారో చూడండి. ‘‘ఏ దేశానికి వెళ్లినా సిటిజన్షిప్ అనేది పారదర్శకంగా ఉంటుంది. అక్కడి నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాల’’ని తేల్చేశారు. కానీ, మత ప్రాతిపదిక అవసరమా అనే కీలక విషయం జోలికి వెళ్లలేదు. పోనీ, ఈ ప్రాతిపదిక చట్టంలో చెప్పినట్టు మూడు దేశాలకూ, నిర్ణీత కాలానికే పరిమితం కావాలి. అంతకుమించి అనుమతించేది లేదని చెప్పినా అదొక లెక్క. కానీ మన నాయకుడు బ్లాంక్ చెక్ ఇచ్చేశాడు. అంతే మరి! విలన్ డెన్లో చేరిన విదూషకుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సీఎం జగన్కు ప్రజలందరూ ఆశీస్సులివ్వాలి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరి తరం కాదని ఎమ్మెల్సీ, శాసన మండలి చీఫ్విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. ప్రజల అవసరాలే తన ఎజెండా అని చెప్పిన ఏకైక నాయకుడు ఆయనేనని కొనియాడారు. ఇలాంటి నాయకుడికి ప్రజలందరి ఆశీస్సులు ఇవ్వాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించి భారీ కేక్ను కట్ చేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. చంద్రబాబుకు అధికారం మీద మాత్రమే ప్రేమ అని.. ప్రజలు, వారి అవసరాల మీద ఏమాత్రం లేదన్నారు. ఈ ఐదేళ్లలో నేను మంచి చేశాననిపిస్తేనే ఓటెయ్యమని సీఎం జగన్ అంటున్నారని.. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి నాయకుడ్ని చూడలేదని ఉమ్మారెడ్డి అన్నారు. అన్నిచోట్లా వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్.. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ముగ్గురు కాదు 30 మంది కలిసొచ్చినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే గెలుపు అని స్పష్టంచేశారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలను వైఎస్సార్సీపీ స్వీప్ చేయబోతోందన్నారు. వైఎస్ జగన్ లాంటి సీఎం మాకు కూడా ఉంటే బాగుంటుందని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా కోరుకుంటున్నారన్నారు. చరిత్ర సృష్టించటం సీఎం జగన్కే సాధ్యమని.. కుప్పంలో చంద్రబాబుని, మంగళగిరిలో లోకేశ్ని ఓడించి తీరుతామని మంత్రి ధీమా వ్యక్తంచేశారు. గుంట నక్కలు, తోడుదొంగలు చేసే నీచ రాజకీయాలను ఎదుర్కొనేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని జోగి రమేష్ పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ‘మండలి’లో విప్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ అంటేనే విశ్వసనీయతకు మారుపేరని.. ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోను అమలుచేసిన ఘనత ఆయనదేనని కొనియాడారు. అన్ని వర్గాలకూ అండగా సీఎం జగన్.. ఇక వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. 13 ఏళ్లుగా ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని తెలిపారు. రైతులు, కార్మికులు, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాలకు ఆయన అండగా నిలిచారన్నారు. ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ మాట్లాడుతూ.. సీఎం జగన్ ఉంటేనే అందరికీ మేలు జరుగుతుందని స్పష్టంచేశారు. ఆయన్ని అణచివేయాలని ఎంతోమంది చూశారని.. కానీ, ఎన్ని కుట్రలు పన్నినా ఎదుర్కొని సీఎం జగన్ విజేతగా నిలిచారన్నారు. ఐదేళ్లలో హామీలన్నీ నెరవేర్చారు.. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. పార్టీ పెట్టినప్పటి నుండి సీఎం జగన్ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావని.. వాటన్నింటినీ ఎదుర్కొని, తట్టుకుని అధికారం సాధించారన్నారు. ఈ ఐదేళ్లలో ఆయన చెప్పిన హామీలన్నింటినీ నెరవేర్చారని గుర్తుచేశారు. ఇక చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ నేతల ఇళ్ల ముందు పడిగాపులు కాశారని.. ఇలాంటి వారు ప్రజలకు ఏం చేస్తారని సురేశ్ ప్రశ్నించారు. మోసాలలో పుట్టి మోసాలు చేసే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసునన్నారు. అంతకుముందు.. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేత పానుగంటి చైతన్య నాయకత్వంలో విద్యార్థులు, యువజనులు జైజై నినాదాలతో భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు సలహాదారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు, ఎన్ఆర్ఐ ప్రతినిధులూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే, పార్టీ 14వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాల సేవా కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ‘జగన్ అనే నేను’.. ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద డిజిటల్ బోర్డు ఏర్పాటుచేశారు. మంత్రి జోగి రమేష్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు ‘జగన్ అనే నేను..’ ఈ కౌంట్డౌన్ బోర్డును ఆవిష్కరించారు. 73 రోజుల్లో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారని చెప్పేందుకు చిహ్నంగా ఈ బోర్టు పెట్టినట్లు పార్టీ నేతలు తెలిపారు. మరోసారి గొప్ప విజయం సాధించేందుకు మీరంతా సిద్ధమా? వైఎస్సార్సీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ పిలుపు సాక్షి, అమరావతి: ‘నేడు మన వైఎస్సార్సీపీ 14వ వ్యవస్థాపక దినోత్సవం. ఆనాడు వందమంది ఏకమై మనపై యుద్ధానికి వస్తే.. అప్పుడు నాకు రక్షణగా నిలిచిన ప్రజల కోసం ప్రారంభమైన పార్టీ మన వైఎస్సార్సీపీ. ఇన్నాళ్లూ నా ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు, అభిమానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ ఎక్స్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ మంగళవారం పోస్ట్ చేశారు. ప్రజాక్షేత్రంలో మరోసారి మనం గొప్ప విజయం సాధించేందుకు మీరంతా సిద్ధమా? అంటూ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి పేర్కొన్నారు. -
Bapatla: జైత్ర యాత్రకు సిద్ధం
సాక్షి ప్రతినిధి, గుంటూరు, సాక్షి, నరసరావుపేట: సిద్ధం... ఈ మాట వింటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమరోత్సాహంతో ఎన్నికల యుద్ధానికి కదం తొక్కుతున్నారు.. మరోవైపు ఈ సభలకు వస్తున్న ప్రతిస్పందన చూసి ప్రతిపక్ష నేతలు మాత్రం ఓటమి భయంతో వణికిపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధం పేరిట ఇప్పటికే మూడు సభలు నిర్వహించి గడచిన నాలుగేళ్ల పది నెలల కాలంలో ప్రజలకు చేసిన మేలును వివరించడంతో పాటు ప్రజలకోసం పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న మూకుమ్మడి కుట్రను వివరిస్తున్నారు. ► అందులో భాగంగా నేడు చివరి సిద్ధం సభ బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని పి.గుడిపాడులో జరగనుంది. ఇందులో పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు జిల్లాల నుంచి పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలు హాజరుకానున్నారు. ► చరిత్రలో నిలిచేపోయే ఈ సభలో పాల్గొనాలని పల్నాడు జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. జననేత సందేశం వినాలని ఆత్రుతతో ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రసంగాన్ని ప్రతి ఇంటికీ చేర్చి మరోసారి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడేలా చూడటమే లక్ష్యంగా నేడు వీరు సిద్ధం సభకు వెళ్లనున్నారు. ► గుంటూరు జిల్లాలో గుంటూరు పశ్చిమ నుంచి మంత్రి విడదల రజని, తూర్పు నుంచి నూరి ఫాతిమా, తాడికొండ నుంచి మేకతోటి సుచరిత, ప్రత్తిపాడు నుంచి బలసాని కిరణ్కుమార్, తెనాలి నుంచి అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి నుంచి ఎమ్మెల్యే ఆర్కే, సమన్వయకర్త మురుగుడు లావణ్య, పొన్నూరు నుంచి అంబటి మురళీకృష్ణ, గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య నేతృత్వంలో జన సమీకరణకు సన్నాహాలు పూర్తి అయ్యాయి. ఇప్పటికే వాహనాలు సిద్ధం చేశారు. ►పల్నాడు జిల్లాలో సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు, మాచర్ల నుంచి ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాల నుంచి ఎమ్మెల్యే కాసు మహే‹Ùరెడ్డి, నరసరావుపేట నుంచి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పెదకూరపాడు నుంచి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, వినుకొండ నుంచి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, చిలకలూరిపేట నుంచి సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో శ్రేణులు పెద్ద ఎత్తున సభకు తరలి వెళ్లడానికి సన్నద్ధం అవుతున్నారు. ► బాపట్ల జిల్లాలో బాపట్ల నుంచి ఎమ్మెల్యే కోన రఘుపతి, అద్దంకి నుంచి సమన్వయకర్త పానెం చిన హనిమిరెడ్డి, రేపల్లె నుంచి సమన్వయకర్త ఈవూరి గణే‹Ù, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, చీరాల నుంచి ఎమ్మెల్యే కరణం బలరాం, సమన్వయకర్త వెంకటేష్, పర్చూరు నుంచి సమన్వయకర్త ఎడం బాలాజీ, వేమూరు నుంచి సమన్వయకర్త వరికూటి అశోక్బాబు నేతృత్వంలో శ్రేణులు కదం తొక్కనున్నాయి. సొంత వాహనాల్లో ప్రయాణం పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఇప్పటికే పలు మార్లు సిద్ధం సభ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి భారీ సంఖ్యలో ప్రజలు సభకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ సీపీ అభిమానుల కోరిక మేరకు సభకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో వాహనాలు ఏర్పాటు చేశారు. మరికొంత మంది కార్యకర్తలు తాము సొంతగా వాహనాలు ఏర్పాటు చేసుకొని సభకు వెళ్లనున్నారు. వీటితో నేడు దారులన్నీ సిద్ధం సభ వైపునకు మళ్లాయి. ఇప్పటికే మంచి జోష్ మీద ఉన్న వైఎస్సార్ సీపీ క్యాడర్ నేడు సిద్ధం సభ వేదికగా సీఎం వైఎస్ జగన్ ఇచ్చే సందేశంతో మరింత పెరిగిన ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో పనిచేసి, పార్టీ అఖండ విజయానికి కృషి చేయనున్నారు. ట్రాఫిక్ మళ్లింపు ఇలా.. నగరంపాలెం: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో ఆదివారం జరగనున్న ‘సిద్ధం’ సభకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. సభకు ప్రజలు భారీగా తరలిరానున్నారు. అటుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు/ వాహనచోదకులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను దారి మళ్లించినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇలా వెళ్లాలి.. ► విజయవాడ, గుంటూరు నుంచి జాతీయ రహదారిపై ఒంగోలు, చెన్నై వైపు వెళ్లే వాహనాలు బుడంపాడు అడ్డరోడ్ మీదగా పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట వైపుగా వెళ్లాలి. ► గుంటూరు నగరం నుంచి ఒంగోలు వెళ్లే వాహనాలు ఏటుకూరు జంక్షన్ నుంచి ప్రత్తిపాడు, పర్చురు, ఇంకొల్లు, నాగులుప్పలపాడు, త్రోవగుంట వైపు వెళ్లాలి. ► గుంటూరు నుంచి నరసరావుపేట మీదుగా ఒంగోలు వెళ్లే వాహనాలు చుట్టుగుంట, పేరేచర్ల, ఫిరంగిపురం, నరసరావుపేట, సంతమాగులూరు అడ్డరోడ్డు జంక్షన్, అద్దంకి, మేదరమెట్ల మీదుగా వెళ్లాలి. ► 16వ నంబర్ జాతీయ రహదారిపై బొల్లాపల్లి టోల్ ప్లాజా నుంచి బొల్లాపల్లి, మేదరమెట్ల వరకు ఎటువంటి వాహనాలకు అనుమతిలేదు. సిద్ధం సభ వాహనాలకు మాత్రమే అనుమతి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి వాహనాల దారి మళ్లింపు అమల్లోకి వస్తోందని జిల్లా ఎస్పీ తెలిపారు. -
175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు గెలుస్తాం
మేదరమెట్ల: రానున్న ఎన్నికల్లో ఎంతమంది ఎన్ని పొత్తులతో వచ్చినా నష్టంలేదని, 175 ఎమ్మెల్యేలతో పాటు 25 ఎంపీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి చెప్పారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని పి.గుడిపాడు జాతీయ రహదారి సమీపంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న సిద్ధం సభకు ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. నాలుగవ సిద్ధం సభను భారీఎత్తున విజయవంతం చేయడానికి సర్వ సన్నద్ధమవుతున్నామని చెప్పారు. గత ఐదేళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరిస్తారన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాక రానున్న ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేయబోతుందనే అంశాలను సీఎం ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన సిద్ధం సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ఆదివారం జరిగే సిద్ధం మహాసభకు సుమారు 15 లక్షల మంది హాజరవుతారని, వచ్చిన వారందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులతో ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈసభ విజయవంతం చేసేందుకు బూత్ లెవల్ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సభ నిర్వహించే వంద ఎకరాలకు పక్కన మరో వంద ఎకరాలను కూడా సిద్ధం చేశామన్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి.. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించిందని చెప్పారు. ఇప్పటికే రామాయపట్నం పోర్టును దాదాపు పూర్తిచేశామని.. తీర ప్రాంతంలో మిగిలిన పోర్టుల పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయన్నారు. ఎన్నో పారిశ్రామిక సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నాయన్నారు. ఏపీలో తలసరి ఆదాయం పెరుగుదలకు అభివృద్ధి పనులే కారణం అన్నారు. అభివృద్ధి లేకపోతే తలసరి ఆదాయం పెరగదని చెప్పారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందజేశామని చెప్పారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం పైగా అమలు చేశామని తెలిపారు. బీసీలకు తెలివితేటలు లేవని, బీసీలు జడ్జిలుగా పనికిరారు అని గతంలో అన్న చంద్రబాబు ఇప్పుడు బీసీ డిక్లరేషన్ అంటే ఎవరూ నమ్మరని చెప్పారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 75 శాతం పదవులు ఇచ్చారని చెప్పారు. వైనాట్ 175 ఎందుకంటున్నామో.. సిద్ధం సభ ద్వారా చూపిస్తామన్నారు. నేషనల్ మీడియా నుంచి కూడా అనేక మంది సిద్ధం సభకు హాజరవుతున్నారని, సిద్ధం సభల గురించి తెలుసుకోవడానికి వారు ఎంతో ఆసక్తితో ఉన్నారన్నారు. మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నాం రానున్న ఎన్నికల కోసం మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ, జనసేనలు పొత్తుల కోసం వెంపర్లాడే పార్టీలని.. తాము ముఖ్యమంత్రిని చూపించి ఓట్లు అడుగుతున్నామని చెప్పారు. అభ్యర్థులను వేరే చోటికి మార్చినంత మాత్రాన తమ పార్టీకి ఎటువంటి నష్టం లేదన్నారు. మార్చి 13, 14 లేదా 15 తేదీల్లో ఎన్నికల ప్రకటన రావచ్చన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన సిద్ధం టీ షర్టులను విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, అద్దంకి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి పానెం చిన హనిమిరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి తాటిపర్తి చంద్రశేఖర్, పొన్నూరు ఇన్చార్జి అంబటి మురళి, గుంటూరు తూర్పు ఇన్చార్జి ఫాతిమా, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
సిద్ధం సభకు సర్వం సమాయత్తం
ఒంగోలు: ఈనెల 10న ప్రకాశం జిల్లా మేదరమెట్ల సమీపంలో నిర్వహించనున్న సిద్ధం సభకు సర్వం సమాయత్తంగా ఉన్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, గుంటూరు, బాపట్ల జిల్లాల పార్టీ కోఆర్డినేటర్ వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులోని వీకేబీ రెస్టారెంట్ కాన్ఫరెన్స్హాలులో సిద్ధం నాలుగో సభ పోస్టర్ను, ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ పాటను రీజినల్ కోఆర్డినేటర్, ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన శనివారం ఆవిష్కరించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. భీమిలి, ఏలూరు, రాప్తాడులలో నిర్వహించిన సిద్ధం సభలు విజయవంతమయ్యాయని చెప్పారు. ఈ నెల 10వ తేదీన మేదరమెట్ల వద్ద నిర్వహించే సిద్ధం సభలో ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారన్నారు. ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో బడుగు బలహీన వర్గాలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి, రాజకీయంగా, సామాజికంగా వారి అభ్యున్నతికి చేసిన కృషిని వివరిస్తారన్నారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోలో పొందుపరచబోయే అంశాలను వివరిస్తారని చెప్పారు. 15 లక్షల మందికిపైగా హాజరవుతారు నాలుగో సిద్ధం సభకు గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి 15 లక్షల మందికిపైగా హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. 100 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధం చేస్తున్నామని, అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని మరో వంద ఎకరాలను కూడా సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. తొలి సిద్ధం సభకు, ప్రస్తుత సభలకు మధ్య సర్వేల ద్వారా పరిశీలిస్తే పార్టీ గ్రాఫ్ విపరీతంగా పెరిగిందన్నారు. దీనిని బట్టి 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 పార్లమెంట్ స్థానాల గెలుపు అతిశయోక్తి కాదని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. ఈ సభ అనంతరం సాధ్యమైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సమన్వయకర్తలు, నియోజకవర్గ ఇన్చార్జులు, పరిశీలకులు అందరితో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. సభకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఆహారం, తాగునీరు, మౌలిక సౌకర్యాలు, వారు తిరిగి వెళ్లేందుకు రవాణా సౌకర్యం అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో కార్యక్రమాన్ని అప్పజెప్పడం ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా చర్యలు చేపట్టామన్నారు. వాహనాల పార్కింగ్, వాటి నిర్వహణ బాధ్యతలను విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, సభా ప్రాంగణం ఏర్పాట్లను ఎమ్మెల్సీ తలశిల రఘురాం పర్యవేక్షిస్తారన్నారు. గత ప్రభుత్వాల పాలనతో పోల్చిచూసుకుంటే బీసీల అభివృద్ధికి ఎవరు పాటుపడుతున్నారో ప్రతి ఒక్కరికీ అర్థమవుతోందని, ఈ నేపథ్యంలోనే బీసీలంతా వైఎస్సార్సీపీ వైపు ఉన్నారన్నారు. బీసీల అభివృద్ధి కాంక్షిస్తూ అటు పార్లమెంట్, ఇటు శాసనసభలో వారికి ఇస్తున్న ప్రాధాన్యత కూడా ఇందుకు నిదర్శనంగా ఉందన్నారు. విజయవంతానికి కృషి చేస్తాం: బాలినేని స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్సీపీ అభిమానులు హాజరయ్యేలా చర్యలు చేపడతామన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన రెండూ కలిసినా వైఎస్సార్సీపీకి వచ్చిన నష్టం ఏమీలేదన్నారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేయాలన్నారు. అంతకు ముందు విజయసాయిరెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, పరిశీలకులు, సమన్వయకర్తలతో భేటీ అయ్యారు. సిద్ధం సభకు సంబంధించి నాయకుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. తనను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు, మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్సీలు పోతుల సునీత, తలశిల రఘురాం, తూమాటి మాధవరావు, శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్, కుందూరు నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు, మేకపాటి విక్రమ్రెడ్డి, దర్శి ఇన్చార్జి బూచేపల్లి శివప్రసాదరెడ్డి, చీరాల ఇన్చార్జి కరణం వెంకటేష్, వేమూరు ఇన్చార్జి వరికూటి అశోక్బాబు, అద్దంకి ఇన్చార్జి పాణెం హనిమిరెడ్డి, తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ విభాగం ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు, లోకేశ్వి దుర్మార్గమైన ఆలోచనలు: గొల్లపల్లి
సాక్షి, అమరావతి/విజయవాడ స్పోర్ట్స్: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, పి.గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు వైఎస్సార్సీపీలో చేరారు. వారు బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువాలు కప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్రెడ్డి, ఎంపీ కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్లనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ పెత్తందార్లకు అనుకూలంగా, దళిత వర్గాలకు, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ టీడీపీ నేతలు, కార్యకర్తల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. నిబద్దతతో పనిచేసిన తనను తీవ్రంగా అవమానించారని, చంద్రబాబు మెడపట్టి పార్టీ నుంచి గెంటేశారని వాపోయారు. సీఎం వైఎస్ జగన్ దేవుడి రూపంలో తనను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. టీడీపీ పుట్టిన నాటి నుంచి తాను కష్టపడి పనిచేశానని, పదవి ఉన్నా లేకపోయినా, గెలిచినా గెలవకపోయినా పార్టీ కోసం పనిచేశానని చెప్పారు. 2014లో అమలాపురం పార్లమెంట్ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత మొండి చేయి చూపించారన్నారు. అయినా క్రమశిక్షణ కలిగిన నేతగా తాను ఎంతో కష్టపడి జిల్లాలో పార్టీని కాపాడుకున్నానని అన్నారు. జనసేన, టీడీపీ పొత్తు పేరు చెప్పి తనకు సీటు లేకుండా చేశారని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ ఉంటే ఉండు పోతే పో అన్నట్లు చూశారని, జీవితంలో ఎప్పుడూ అనుభవించని అవమానం టీడీపీలో ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ తనకు ధైర్యాన్నిచ్చి అండగా ఉంటామని భరోసా ఇచ్చారని చెప్పారు. లోకేశ్ ముఠా రాష్ట్రాన్ని కబళించాలని చూస్తోందని తెలిపారు. చంద్రబాబు స్వార్థపూరిత ఆలో చనలకు పవన్ బలి అయ్యారని, పోత్తులో మోసం చేసి బాబు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. జనసేన మనుగడ కష్టమేనన్నారు. దేవుడిలాంటి మనిషైన వైఎస్సార్ నన్ను ఎంతో దగ్గరకు తీసి రాజకీయంగా ప్రోత్సహించి మంత్రి పదవి ఇచ్చి గౌరవించారని అన్నారు. ఆ మహానుభావుడి కుమారుడైన సీఎం జగన్ దగ్గరకి చేరటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో వైఎస్సార్సీపీ కోసం శాయశక్తులా పనిచేస్తానని చెప్పారు. తుది శ్వాస వరకు సీఎం వైఎస్ జగన్ వెంటే ఉంటానని, ఆయన ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని తెలిపారు. మిథున్రెడ్డి, కేశినేని నానితో చర్చలు గొల్లపల్లి సూర్యారావు మంగళవారం రాత్రి విజయవాడలోని కేశినేని భవన్లో ఎంపీలు కేశినేని నాని, మిథున్రెడ్డితో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు సూర్యారావు ప్రకటించారు. చంద్రబాబు ఆలోచనశైలి పెత్తందార్లకు అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్య క్రమాల పట్ల ఆకర్షితుడినయ్యానని తెలిపారు. -
175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో మొత్తం గెలుద్దాం: సీఎం జగన్
ప్రతి ఇంటికి మంచి జరిగినప్పుడు ప్రతి గ్రామంలోనూ మనకు అత్యధిక మెజారిటీ ఎందుకు రాదు? గ్రామంలో వచ్చిన మెజారిటీ ప్రతి మండలంలోనూ ఎందుకు రాకుండా ఉంటుంది? ప్రతి నియోజకవర్గంలోనూ ఎందుకు రాకూడదు? అది కుప్పమైనా.. ఇచ్చాపురమైనా ఎందుకు జరగకూడదు? పేదవాడు బతకాలంటే, బాగుండాలంటే వైఎస్సార్సీపీ మళ్లీ రావాలి. ఈ విషయం ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలి. ప్రజలకు నేను చేయగలిగినంత మంచి చేశా. ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకుడూ ఎప్పుడూ ఇవ్వని ‘మంచి’ ఆయుధాలను మీ అందరి చేతుల్లో పెట్టా. వీటితో ముందుకు వెళ్లి ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రతి ఒక్కరూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు అడుగులు వేయాలి. – వైఎస్సార్సీపీ నాయకులతో సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో మరో 45 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. గత 57 నెలలుగా లంచాలు, వివక్షకు తావులేకుండా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ 87 శాతం కుటుంబాలకు మంచి చేయగలిగాం. దేశ చరిత్రలో ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడూ ఇవ్వని ఆయుధాలను మీ చేతుల్లో పెట్టా. ఇప్పటికే మన పార్టీ టిక్కెట్లన్నీ దాదాపుగా ఖరారయ్యాయి. రెట్టించిన ఉత్సాహంతో క్షేత్ర స్థాయిలోకి వెళ్లండి. ప్రజలకు మంచి చేసి ఓట్లు అడుగుతున్నామన్న గొప్ప సంతృప్తితో ఇంటింటికీ వెళ్లండి. ఎన్నికల్లో అత్యధిక మెజార్టీలతో గెలిచి రావాల్సిన బాధ్యత మీదే’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో చరిత్రాత్మక విజయం సాధించామని గుర్తు చేశారు. ప్రతి కుటుంబానికీ మంచి చేసిన నేపథ్యంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లోనూ గెలవాల్సిందేనని శ్రేణులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ‘మేము సిద్ధం.. మా బూత్ సిద్ధం’ పేరుతో మంగళవారం సీఎం జగన్ కీలక సమావేశాన్ని నిర్వహించారు. 175 నియోజకవర్గాల నుంచి సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, జగనన్న సచివాలయాల కన్వీనర్లు సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. విశ్వసనీయతే మన బలం.. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా, ఏ ఇంటికి వెళ్లి అడిగినా విశ్వసనీయత ఉన్న పార్టీ ఏదంటే ఒక్క వైఎస్సార్సీపీనే అనే మాట వినపడుతుంది. ఒక పార్టీకి, రాజకీయ నాయకుడికి ఇది చాలా చాలా అవసరం. బహుశా దేశ రాజకీయాల్లో ఇలాంటి గౌరవం ఒక్క వైఎస్సార్సీపీకే దక్కింది. ప్రతి కార్యకర్త తమ నాయకుడిని చూపించి కాలర్ ఎగరేసే పరిస్థితి ఉన్నప్పుడే ఆ పార్టీకి గౌరవం లభిస్తుంది. పార్టీ నాయకుడు కూడా అలాగే వ్యవహరించాలి. విశ్వసనీయతే మన బలం. మనం కూడా అలాంటి వాగ్దానాలిద్దామన్నారు! 2014లో చంద్రబాబు 650 పేజీలతో మేనిఫెస్టో తెచ్చి అందరినీ మోసగించారు. అసాధ్యమని తెలిసినా రైతన్నలకు రూ.87,612 కోట్లు రుణమాఫీ మొదట సంతకంతోనే చేస్తానని నమ్మబలికారు. బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నాడు. దాదాపు రూ.15 వేల కోట్ల పొదుపు సంఘాల రుణాలనూ మాఫీ చేస్తానన్నాడు. ఇంటింటికీ ఉద్యోగం లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి అని అన్నాడు. అప్పుడు మన పార్టీలో కూడా చాలామంది శ్రేయోభిలాషులు మనం కూడా అలాంటి వాగ్దానాలు ఇద్దామన్నారు. ఇప్పుడు హామీలిచ్చి ఎన్నికలు అయిపోయిన తరువాత చూద్దామన్నారు. ఒకవైపు చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతుంటే మనం నీతిగా, నిజాయితీగా యుద్ధం చేయడం కుదరదని నాకు సలహా ఇచ్చారు. అప్పుడు నేను ఒక్కటే అన్నాను. విలువలు, విశ్వసనీయత అనే పదాలకు అర్ధం చెబుతూ మనం చేయగలిగిందే చెబుదామని సూచించా. ఒక పని చేయలేమని తెలిసినప్పుడు మన నోటి నుంచి ఆ మాట రాకూడదని చెప్పా. నాడు ఆ మోసాలకు తోడు ప్రధాని మోదీ గాలి వీస్తుండటంతో దత్తపుత్రుడి సహకారంతో చంద్రబాబు గద్దెనెక్కారు. మోసం చేసి అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోను చంద్రబాబు చెత్తబుట్ట పాలు చేశారు. వెబ్సైట్ నుంచి కూడా మాయం చేశారు. మోసం ఎల్లప్పుడూ నిలబడదు. చివరకు ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారంటే టీడీపీ తరపున గ్రామాల్లో ప్రచారం చేయడానికి కూడా ఆ పార్టీ క్యాడర్ సాహసించలేదు. 99 % హామీలు అమలు చేశాం 2019లో మనం కేవలం రెండు పేజీలతో మేనిఫెస్టో తీసుకొచ్చాం. రెండు పేజీలు ఎందుకంటే ఆ మేనిఫోస్టో ప్రజలకు గుర్తుండాలి. అధికారంలోకి వచ్చాక మనకూ గుర్తుండాలి. నాడు మేనిఫెస్టో అంశాల గురించి చర్చిస్తుంటే విజయనగరం జిల్లాలో అప్పల నరసయ్య ఇవన్నీ సాధ్యమేనా? అని నాతో అన్నారు. ఇవన్నీ కచ్చితంగా చేసి తీరుతామని చెప్పా. అన్నీ ఆలోచన చేసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకున్నాం. ప్రతిమాట నెరవేరుస్తానని చెప్పా. చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా 151 స్ధానాలతో అధికారంలోకి వచ్చాం. 22 ఎంపీ స్ధానాలు గెల్చుకున్నాం. ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చాం, మీరే చూసి టిక్కు పెట్టాలని ప్రతి ఇంటికీ వెళ్లి చిత్తశుద్ధితో అడుగుతున్నాం. నాడు నవ్వుకుని ఉంటారు.. మనం సాధ్యం చేశాం 57 నెలల కాలంలో పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చాం. ఇన్ని వందల కోట్లు, ప్రతి ఇంటికీ రూ.లక్షలు ఇవ్వడం.. అది కూడా పారదర్శకంగా అందించడం సాధ్యమేనా? అని గత ఎన్నికలకు ముందు ఎవరైనా ప్రశ్నిస్తే చాలా మంది నవ్వుకుని ఉంటారు. అయితే అది సాధ్యమేనని మనం వచ్చాక చూపించగలిగాం. గ్రామాల్లో స్కూళ్లు మారాయి. ఊహకు కూడా అందని విధంగా ఇంగ్లీషు మీడియం చదువులు, ట్యాబ్లు, క్లాస్రూమ్లలో డిజిటల్ బోధన తీసుకొచ్చాం. ప్రతి పేద బిడ్డకూ నాణ్యమైన విద్య అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం మనదే. పొరపాటు జరిగితే మళ్లీ అరాచకమే ఎవరైనా పొరపాటున వైఎస్సార్సీపీకి ఓటు వేయకపోతే మళ్లీ జన్మభూమి కమిటీలు సంతకం పెట్టినట్టే. ఇంటివద్దే పారదర్శకంగా అందిస్తున్న పథకాలన్నీ వద్దని మనంతట మనం సంతకం పెట్టినట్టే. పొరపాటు చేస్తే పేదవాడి గురించి ఆలోచించే పరిస్థితే ఉండదు. విశ్వసనీయత అన్న పదానికి అర్ధం ఎక్కడా ఉండదు. మళ్లీ పేదవాడి బతుకు చిన్నాభిన్నమే అవుతుందనే సంకేతం ప్రతి గడపకూ చేరవేయాలి. అమ్మా..! జగన్ ఏదైనా చెబితే చేస్తాడు. చెప్పే ముందు నాలుగు సార్లు ఆలోచన చేస్తాడు. చేయగలిగింది మాత్రమే చెబుతాడు. కానీ చంద్రబాబు అలాంటి వ్యక్తి కాదు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఆయన ఏమైనా చెబుతాడు. అవసరం కోసం ఎవరినైనా మోసం చేస్తాడన్నది మన కళ్లెదుటే కనిపించిన సత్యం. 2014లో ఇదే చూశాం. దానికన్నా మందు కూడా అదే చూశాం. ఇవాళ కేజీ బంగారం, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తానంటున్నాడు. పొరపాటు చేస్తే మళ్లీ అరాచకం వస్తుందని ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలి. సచివాలయం యూనిట్గా.. ప్రతి గ్రామంలో బూత్ స్ధాయిలో మన ఆర్గనైజేషన్ ఎలా ఉందన్నది ఎమ్మెల్యేలు పరిశీలించాలి. నియోజకవర్గస్ధాయి, మండలస్థ్ధాయి నుంచి అన్ని కమిటీలను అసెస్ చేసుకోవాలి. మీ అందరికీ ఒక్కటే సలహా ఇస్తున్నా. ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకోండి. మీకు కళ్లు, చెవులుగా వ్యవహరించే అత్యంత నమ్మకమైన వ్యక్తులను గుర్తించి ఈ నెలన్నర రోజులు అక్కడే పెట్టండి. ఆ సచివాలయం పరిధిలోని కేడర్, అభిమానులు, వలంటీర్లను వారు మీకు దగ్గర చేయాలి. అది మీరు రెగ్యులర్గా పర్యవేక్షించాలి. ప్రతి నియోజకవర్గంలో 80 సచివాలయాలు ఉంటాయి. వాళ్లకు మీ ఫోన్ అందుబాటులో ఉండాలి. వాళ్లు ఏ సచివాలయంలోనైనా, ఎక్కడైనా గ్యాప్ కనిపిస్తున్నట్లు గుర్తిస్తే ఎప్పుడు ఫోన్ చేసినా మీరంతా రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో ఉండాలి. సచివాలయం పరిధిలో ప్రతి అభిమాని, ప్రతి వలంటీర్, కేడర్లో ప్రతి ఒక్కరూ మన ఎమ్మెల్యే అభ్యర్ధికి దగ్గర కావాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. మీరు సచివాలయంలో పెట్టిన వ్యక్తి ద్వారా బూత్ కమిటీల మీద ధ్యాస పెట్టండి. ప్రతి వలంటీర్కు అనుసంధానంగా గృహసారధులతో కలిసి బూత్ కమిటీ సభ్యులను నియమించాం. నలుగురు మనుషులు (ఒక బూత్ ఇన్ఛార్జి, ముగ్గురు కన్వీనర్లు) ఆ బూత్ కింద ఉన్న క్లస్టర్ను పర్యవేక్షించాలి. ఈ ఆర్గనైజేషన్ చాలా ముఖ్యం. దీన్ని గుర్తుపెట్టుకొండి. 45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. ఆర్గనైజేషన్ అత్యంత కీలకం.. మన పార్టీలో టిక్కెట్లన్నీ దాదాపుగా ఖరారు అయ్యాయి. మార్చాల్సినవన్నీ 95 శాతం మార్పు చేశాం. ఇంకా ఏదైనా ఒకటి అరా మాత్రమే ఉంటాయి. కచ్చితంగా ఆర్గనైజైషన్ మీద ధ్యాస పెట్టండి. ఇందులో మీరు విఫలమైతే ఎవరూ కాపాడలేరు. ఎందుకంటే... ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసి, ఇన్ని లక్షలు మీకు మంచి జరిగిందని ఏకంగా లెటర్లు తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశంలో ఎక్కడా ఉండకపోవచ్చు. ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమే మన ఎమ్మెల్యేలకు ఆ అవకాశం కల్పి స్తోంది. కాబట్టి మీరు ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టిండి. ప్రతి ఇంటికి ఇంత మంచి జరిగినప్పుడు ప్రతి గ్రామంలోనూ మనకు అత్యధిక మెజార్టీ ఎందుకు రాదు? గ్రామంలో వచ్చిన మెజార్టీ ప్రతి మండలంలోనూ ఎందుకు రాకుండా ఉంటుంది? ప్రతి నియో జకవర్గంలోనూ ఎందుకు రాకూడదు? అది కుప్పమై నా.. ఇచ్చాపురమైనా ఎందుకు జరగకూ డదు? పేద వాడు బతకాలంటే, బాగుండాలంటే వైఎస్సార్ సీపీ మళ్లీ రావాలి. ఈ విషయం ప్రతి ఇంటికి వెళ్లి చెప్ప గ లిగాలి. ప్రజలకు నేను చేయగలిగినంత మంచి చేశా. ఏ పార్టీ, ఏ రాజకీయ నాయకుడూ ఎప్పుడూ ఇవ్వని ఆయుధాలను మీ అందరి చేతుల్లో పెట్టా. వీటితో ముందుకు వెళ్లి ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత ఈ 45 రోజుల్లో మీరు చేసే ఆర్గనైజేషన్ బలంపై ఆధారపడి ఉంది. ప్రతి ఒక్కరూ రెట్టించిన ఉత్సా హంతో, అంతే విశ్వాసంతో ముందుకు అడుగులు వేయాలి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ విషెష్.. క్లాస్ వార్.. ఇవాళ జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఇది క్లాస్ వార్ అని గుర్తు పెట్టుకోండి. పేదవాడు ఒకవైపున.. పెత్తందార్లు మరొకవైపున నిలిచి యుద్ధం జరుగుతోంది. మీ జగన్ ఉంటే పేదవాడు బాగుపడతాడు. మీ జగన్ ఉంటే లంచాలు, వివక్ష లేకుండా పథకాలు కొనసాగుతాయి. ఇంటికే వలంటీర్ వస్తాడు. అవ్వాతాతలకు తోడుగా ఉంటూ సహాయం అందుతుంది. మీ జగన్ ఉంటేనే బడులు బాగుంటాయి. పేద బిడ్డలకు ఇంగ్లీషు మీడియం అందుతుంది. మీ జగన్ ఉంటేనే గ్రామాలలో విలేజ్ క్లినిక్లు పనిచేయడం కొనసాగుతుంది. విస్తరించిన ఆరోగ్యశ్రీ గొప్పగా సేవలు అందిస్తుంది. ఏ పేదవాడు ఆరోగ్యం కోసం అప్పులు పాలు కాకుండా వైద్యం అందే పరిస్థితి కొనసాగాలంటే జగన్ ఉంటేనే జరుగుతుంది. విద్య, వైద్యం, వ్యవసాయంలో ఎవరి ఊహకూ అందని మార్పులు తీసుకొచ్చాం. అక్క చెల్లెమ్మలకు దిశ యాప్తో భద్రత కల్పిస్తున్నాం. ఇవన్నీ కొనసాగాలంటే మీ జగన్తోనే సాధ్యమనే సందేశాన్ని అందరికీ చేరవేయాలి. కుప్పానికి రూ.1,400 కోట్లు.. ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు రాష్ట్రవ్యాప్తంగా ఏ నియోజకవర్గాన్ని తీసుకున్నా 87 శాతం పైచిలుకు ఇళ్లకు మంచి చేయగలిగాం. కుప్పం గ్రామీణ నియోజవర్గం కాబట్టి అక్కడ 93.29 శాతం ఇళ్లకు మంచి చేయగలిగాం. నేను చెప్పే విషయం చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైనా నేను కుప్పంలో చెప్పిన మాటలు వినకపోతే కచ్చితంగా యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకుని వినండి. ఎందుకంటే కుప్పంలో నేను ప్రస్తావించిన అంశాలే ప్రతి నియోజకవర్గంలోనూ అవే మాదిరిగా పరిస్థితులున్నాయి. కుప్పంలో 87 వేల పైచిలుకు ఇళ్లు ఉంటే ఏకంగా 83 వేల ఇళ్లకు మంచి జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మీ జగన్ బటన్ నొక్కి రూ.2.55 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తే అందులో రూ.1,400 కోట్లు కుప్పం నియోజకవర్గంలో 83 వేల ఇళ్లకు ఇవ్వగలిగాం. కుప్పంలో గతంలో 30 వేల ఇళ్లకు మాత్రమే పెన్షన్ వస్తుంటే మనం 45 వేల కుటుంబాలకు ఇస్తున్నాం. ఒక్క పెన్షన్లకే కుప్పంలో రూ.507 కోట్లు ఇచ్చాం. చేయూత, ఆసరా, విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మఒడి కూడా అలాగే అందించాం. ఇళ్ల స్థ్ధలాలు 30 వేలకు పైగా కుటుంబాలకు అందుతున్నాయి. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు కాకుండా మనం అన్ని వందల కోట్లు ఇచ్చినప్పుడు ప్రత్యర్ధి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. ఈ డేటా మీ అందరికీ అందుబాటులోకి ఉంది. వైఎస్సార్సీపీ గెలుపును ఏ శక్తులూ ఆపలేవు నిత్యం ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యలను ఎక్కడిక్కడ పరిష్కరిస్తున్నాం. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దగ్గరి నుంచి ప్రజల్లో మమేకమై పనిచేస్తున్నాం. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపును ఏ శక్తులు ఆపలేవు. ఎంతమంది జతకట్టుకుని వచ్చినా సీఎం జగన్ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ముందు నిలవలేరు. వీటి గురించి ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటు అతుకుల బొంతగా కనిపిస్తోంది. ఎన్నికలను ఎదుర్కోవడానికి వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు. – ఆర్కే రోజా, మంత్రి సీఎం జగన్ను వాళ్లు తట్టుకోలేరు.. అభ్యర్థులు మాకు దొరక్కపోవటం ఏమిటి? ప్రకటించకపోవటం ఏంటీ? చూస్తున్నారు గదా మా కోలాహలం.. వారు రా కదలిరా.. అంటే ప్రజలు ఎవ్వరూ రావటంలేదు. బాబు–పవన్లు సీట్లు ప్రకటించారు కదా? వారి పార్టీల్లో ఏం జరుగుతోందో చూస్తున్నారు కదా? కాపు సోదరులు, జనసేన కేడర్ పవన్ను సీఎం సీఎం అంటుంటే, పవన్ మాత్రం చంద్రబాబును సీఎం సీఎం అంటున్నారు. ప్యాకేజీ లేకుంటే ఎందుకు అంటారు. 45 రోజులు వేచి చూస్తే సరి. సీఎం జగన్ ముందు వీళ్లు తట్టుకోలేరు. – అంబటి రాంబాబు, మంత్రి ఖాళీ బిందెలే సౌండ్ ఎక్కువ చేస్తాయి... ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి అనే దానిపై సీఎం జగన్ కొన్ని సూచనలు, సలహాలిచ్చారు. సమావేశం విజయవంతంగా జరిగింది. చాలామంచి సందేశం ఇచ్చారు. కేడర్లో నూతనోత్తేజం నెలకొంది. వైఎస్సార్సీపీ 175కు 175 స్థానాల్లో విజయం సాధిస్తుంది. దీన్ని ఎవరూ అడ్డుకోలేరు. పవన్, లోకేశ్, చంద్రబాబు ఆటలు సాగవు. ఎవరు మమ్మల్ని అడ్డుకోలేరు. విశ్వసనీయత ఉన్న పార్టీ వైఎస్సార్సీపీ అని ప్రజలు నమ్ముతున్నారు. టీడీపీ–జనసేన–కాంగ్రెస్–బీజేపీ తీరు ఖాళీ బిందెల టైపు అన్నట్లు ఉంది. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి పవన్, బాబులకు ప్రజల్లో బలంలేదు జనసేన–టీడీపీ పొత్తు హిట్ కాదు. వారికి ప్రజల్లో బలంలేదు. సీఎం జగన్ను ఒంటరిగా ఎదిరించలేం అని తెలిసింది కాబట్టే వారు పొత్తులతో వస్తున్నారు. సంక్షేమ పథకాలు పొందిన ప్రజలు ఒక్కటే చెబుతున్నారు.. మా కుటుంబాల్లో ఎప్పుడు ఇంత మార్పు రాలేదని.. మా కుటుంబాల్లో పెదరికం పోయిందంటున్నారు. కాబట్టి సీఎం జగనన్నకే మళ్లీ ఓటువేసి రెండోసారి ఆయన్ను సీఎంను చేసుకొంటాం అంటున్నారు. బాబు మోసాన్ని, జగన్ మంచిని ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. గెలుపు ఖాయం. – తానేటి వనిత, మంత్రి 99 శాతం హామీలు నెరవేర్చారు జగన్.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 99 శాతం హామీలు నెరవేర్చారు. అందుకే ఈరోజు మా కార్యకర్తలు ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. చంద్రబాబు 600 పైగా హామీలు ఇచ్చి అందులో 10 శాతం కూడా నెరవేర్చలేదు. అసలు మ్యానిఫెస్టోనే వెబ్సైట్ నుంచి తీసేసిన చరిత్ర ఆయనది. డ్వాక్రా రుణమాఫీ, రైతు రూణమాఫీ, ఇంటికొక ఉద్యోగం.. నిరుద్యోగభృతి ఏదీ చేయలేదు. ఏం ముఖం పెట్టుకుని చంద్రబాబు ప్రజల వద్దకు వెళ్తారు. ఈరోజు ఏం చేశామో చెప్పి 175కు 175 ఎమ్మెల్యే స్థానాలు గెలవబోతున్నాం. సంక్షేమం–అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం జగన్ పాలన సాగించారు. – వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ ‘వైనాట్ 175’కు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఏ ప్రభుత్వం కూడా ఇంత సంక్షేమం అందించలేదు. సీఎం జగన్ చెప్పిన పథకాలే కాకుండా చెప్పనివి మరో 24 అమలుచేశారు. సచివాలయంలో డిస్ప్లే బోర్డు చూస్తే వైఎస్సార్సీపీ ప్రజలకు ఏం చేసిందో తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబం జీవన స్థితిగతులు మారాయి. నరసాపురం పార్లమెంట్ స్థానం గతంలో అగ్రవర్ణాల వారికి, ఆర్థికంగా బలమైన వారికే కేటాయించేవారు. ఇప్పుడు నాలాంటి బీసీ మహిళలను సీఎం జగన్ పోటీచేయిస్తున్నారు. ఇది కదా మహిళా సాధికారత. వైనాట్ 175 అందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. – గూడూరు ఉమాబాల, వైఎస్సార్సీపీ నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ -
ఎన్నికలకు ‘సిద్ధం’ కావాలని తెలియజేసేలా సభ
నెల్లూరు(దర్గామిట్ట): బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలో మార్చి 3న సిద్ధం సభను విజయవంతంగా నిర్వహిస్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని తెలియజేసేలా సభ ఉంటుందని చెప్పారు. సిద్ధం సభ విషయమై నగరంలోని జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డితో కలసి ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. తిరుపతి, ప్రకాశం, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమన్వయకర్తలు పాల్గొన్నారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు మూడు సిద్ధం సభలు భీమిలి, ఏలూరు, రాప్తాడులో నిర్వహించామని, మేదరమెట్లలో నిర్వహించే ఆఖరి సభకు 15 లక్షల మంది రావొచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. సభలో సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు నాలుగేళ్ల 10 నెలల కాలంలో అందించిన పాలన, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు తమ పాలనలో అందించిన మేలును వివరిస్తారని చెప్పారు. భీమిలి, ఏలూరు తర్వాత రాప్తాడులో జరిగిన సభ అజరామరమని, ప్రజలను ఉత్తేజ పరిచేలా ఉందన్నారు. తమ పార్టీ మేనిఫెస్టో తయారవుతోందని, త్వరలో విడుదలవుతుందని తెలిపారు. నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్య ర్థిగా శరత్ చంద్రారెడ్డి పోటీ చేయరన్నారు. త్వరలోనే జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిని, నెల్లూరు ఎంపీ అభ్య ర్థిని ప్రకటిస్తామన్నారు. ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, మేకపాటి విక్రమ్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నల్లçపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, అన్నా రాంబాబు, కె.నాగార్జునరెడ్డి, ఎమ్మెల్సీలు పి.చంద్రశేఖర్రెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మేరిగ మురళీ«ధర్, సమన్వయకర్తలు మేకపాటి రాజగోపాల్రెడ్డి, మహ్మద్ ఖలీల్, దద్దాల నారాయణయాదవ్, తాటిపర్తి చంద్రశేఖర్, బూచేపల్లి శివప్రసాదరెడ్డి, చెవిరెడ్డి అభినవ్రెడ్డి, విజయా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆనం విజయ్కుమార్రెడ్డి, మేయర్ స్రవంతి,పాల్గొన్నారు. -
భువనేశ్వరి పోటీ చేసినా ఓటమి తప్పదు
సత్తెనపల్లి: చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పోటీ చేసినా కుప్పంలో ఓటమి తప్పదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ కుర్చీని ఎప్పుడో మడత పెట్టేశారని, రాజ్యసభలోనూ, కుప్పంలోనూ సీటు ఖాళీ అయిందని ఎద్దేవా చేశారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు మంచినీళ్లు కూడా ఇప్పించలేక పోయారన్నారు. వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం కుప్పం ప్రజలకు మంచినీళ్లు ఇస్తోందని చెప్పారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మరో 50 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని, టీడీపీ పని అయిపోయిందని ప్రజలకు అర్థమైందన్నారు. -
YSRCP: సందేహం లేదు సునామీయే
సాక్షి, అమరావతి: ‘సందేహమే లేదు.. రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ సునామీ సృష్టించడం తథ్యం.. అందుకు తార్కాణమే చరిత్రాత్మక రాప్తాడు సభ’ అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం వైఎస్సార్సీపీ నిర్వహించిన ‘సిద్ధం’ సభకు సుమారు పది నుంచి 11 లక్షల మంది అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారని అంచనా. అదీ రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 52 శాసనసభ స్థానాల పరిధి నుంచే ఇంత భారీ స్థాయిలో ప్రజలు కదలిరావడం గమనార్హం. రాప్తాడులో 250 ఎకరాల సువిశాల మైదానంలో ‘సిద్ధం’ సభను వైఎస్సార్సీపీ నిర్వహించింది. ఇందులో 200 ఎకరాల విస్తీర్ణంలో సభను వీక్షించడానికి ఏర్పాట్లు చేసింది. నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో ఇసుకేస్తే రాలనంత స్థాయిలో సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో 1982లో పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వంలో విజయవాడలో కృష్ణా నది ఇసుక తిన్నెలపై సీపీఎం నిర్వహించిన సభకు 5 లక్షల మంది హాజరయ్యారని అప్పట్లో అంచనా. 1990లో వరంగల్లో వంద ఎకరాల మైదానంలో పీపుల్స్ వార్ నిర్వహించిన రైతు కూలీ సభకు పది లక్షల మంది హాజరయ్యారని నిర్వాహకులు ప్రకటించారు. కానీ.. వాస్తవంగా ఆ సభకు ఆరు నుంచి ఏడు లక్షల మంది వచ్చారని అంచనా. ఉమ్మడి రాష్ట్రంలో 1994లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఎన్టీఆర్ ఆధ్యర్యంలో టీడీపీ నిర్వహించిన సభకు పది లక్షల మంది ప్రజలు హాజరయ్యారని నిర్వాహకులు చెప్పుకున్నారు. కానీ.. పరేడ్ గ్రౌండ్స్తోపాటు పక్కనున్న జింఖానా గ్రౌండ్స్, బౌసన్పోలో గ్రౌండ్ కలిసినా దాని విస్తీర్ణం 90 ఎకరాలే. ఈ లెక్కన ఆ సభకు వాస్తవంగా హాజరైంది ఐదు లక్షల మందేనని అంచనా. ఈ మూడు సభలకు ఉమ్మడి రాష్ట్ర పరిధిలోని 23 జిల్లాల నుంచి ప్రజలను సమీకరించడం గమనార్హం. ఇక 2010లో వరంగల్లో వంద ఎకరాల విస్తీర్ణంలో టీఆర్ఎస్ నిర్వహించిన తెలంగాణ గర్జన సభకు పది లక్షల మంది హాజరయ్యారని నిర్వాహకులు చెప్పుకున్నారు. కానీ.. ఆ సభకు వాస్తవంగా హాజరైంది ఏడు లక్షల మందికి కాస్తా అటూ ఇటూ అని అంచనా. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు సభే అతి పెద్ద ప్రజా సభ అని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పెత్తందారులపై పోరుకు సిద్ధమా? అంటూ సీఎం జగన్ పిలుపునిస్తే.. 10 నుంచి 11 లక్షల మంది ఒక్కసారిగా పిడికిలి పైకెత్తి, దిక్కులు పిక్కటిల్లేలా ‘మేం సిద్ధమే’ అంటూ ప్రతిస్పందించారు. ఇది రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జైత్ర యాత్రతో సునామీ సృష్టించడం ఖాయమనడానికి నిదర్శనమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. రణనినాదమై మారుమోగుతున్న ‘సిద్ధం’ ‘మేమంతా సిద్ధం’ అని వైఎస్సార్సీపీ శ్రేణుల ప్రతిస్పందన రణ నినాదమై రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి జనవరి 27న భీమిలి.. ఈనెల 3న దెందులూరు.. ఆదివారం రాప్తాడులలో ‘సిద్ధం’ పేరుతో వైఎస్సార్సీపీ నిర్వహించిన సభలు ఒకదాన్ని మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. భీమిలి సభకు సముద్రంతో పోటీపడుతూ ఉత్తరాంధ్ర ప్రజానీకం కదలివచ్చారు. దెందులూరు సభకు భీమిలి సభ కంటే రెట్టింపు స్థాయిలో ఉత్తర కోస్తా ప్రాంత అభిమానులు పోటెత్తారు. ఇక రాప్తాడు సభ తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతి పెద్ద ప్రజా సభగా నిలిచింది. మూడు సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణుల్లో సరి కొత్త జోష్ నింపింది. మూడు ప్రాంతాల్లో నిర్వహించిన మూడు సభల్లోనూ.. పెత్తందారులపై యుద్ధానికి సిద్ధమా? మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు సిద్ధమా? పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు.. మరోసారి మన పార్టీ వైఎస్సార్సీపీని గెలిపించేందుకు సిద్ధమా? అని సీఎం జగన్ ప్రశ్నిస్తే.. మేం సిద్ధమే అంటూ ఒక్కసారిగా లక్షలాదిమంది ప్రతిస్పందించారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ చేసిన దిశా నిర్దేశం మేరకు 175కు 175 శాసనసభ.. 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా జైత్రయాత్రకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. సీఎం జగన్ నాయకత్వంపై విశ్వాసానికి ప్రతీక ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అధికారం చేపట్టిన తొలి ఏడాదే 95 శాతం సీఎం జగన్ అమలు చేశారు. ఇప్పటికి 99.5 శాతం హామీలు అమలు చేశారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.55 లక్షల కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.1.76 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. దేశ చరిత్రలో డీబీటీ, నాన్డీబీటీ రూపంలో రూ.4.31 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చిన దాఖలాలు లేవు. ఓ వైపు సంక్షేమాభివృద్ధి పథకాలు.. మరో వైపు విద్య, వ్యవసాయ, వైద్య, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలు.. ఇంకో వైపు సుపరిపాలనతో ప్రతి ఇంట్లో.. ప్రతి గ్రామంలో.. ప్రతి నియోజకవర్గంలో సీఎం జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. దాంతో సీఎం జగన్పై ప్రజల్లో మద్దతు రోజు రోజుకూ పెరుగుతోంది. ‘మేం వైఎస్సార్సీపీ కార్యకర్తలం, అభిమానులం’ అంటూ కాలర్ ఎగరేసుకుని గర్వంగా చెప్పుకునే రీతిలో సీఎం జగన్ పరిపాలిస్తుండటం ఆయన నాయకత్వంపై శ్రేణుల్లో విశ్వాసాన్ని మరింతగా పెంచింది. ఇది ‘సిద్ధం’ సభల్లో మరోసారి ప్రతిబింబించిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ–జనసేన శ్రేణులు కకావికలం టీడీపీ–జనసేనల మధ్య పొత్తుల లెక్కలు ఇప్పటికీ తేలలేదు. రెండు పార్టీల మధ్య సిగపట్లు కొనసాగుతున్నాయి. రా కదలి రా.. పేరుతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న సభలకు జనం మొహం చాటేస్తున్నారు. ఇటు ‘సిద్ధం’ సభల్లో లక్షలాది మంది ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్త్తలు, అభిమానులు ‘పోరుకు మేం సిద్ధమే’ అంటూ చేసిన రణనినాదం మోరుమోగుతుండగా.. అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభలకు జన స్పందన కన్పించకపోవడంతో టీడీపీ–జనసేన అగ్రనేతల వెన్నులో వణుకు పుట్టించింది. సిద్ధం సభలు నింపిన జోష్తో ప్రజా క్షేత్రంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ముందుకు దూసుకెళ్తున్నాయి. మరో వైపు పొత్తులు తేలక, చంద్రబాబు–పవన్ల సభలకు జన స్పందన లేక టీడీపీ–జనసేన శ్రేణులు కకావికలమయ్యాయి. ఎన్నికల షెడ్యూలు వెలువడక ముందే వైఎస్సార్సీపీ శ్రేణులు చారిత్రక విజయమే లక్ష్యంగా కదం తొక్కుతుంటే.. టీడీపీ–జనసేన శ్రేణులు నైతిక స్థైర్యం కోల్పోయి చెల్లాచెదురయ్యాయి. ఇది 2019 ఎన్నికల కంటే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి సునామీ సృష్టించడం ఖాయమనడానికి నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
మంచి పాలనకు మళ్లీ ‘సిద్ధం’
జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జల సముద్రం వస్తే ఈరోజు రాప్తాడుకు జన సముద్రం తరలి వచ్చింది. ఈ జన సముద్రానికి, రాయలసీమ గడ్డకు, ప్రతి సీమ బిడ్డకూ మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. పెత్తందార్లకు – పేదలకు మధ్య సంగ్రామం. మన పథకాలతో కోట్లాది మంది గుండె తలుపుతట్టాం. ఈ మంచి కొనసాగాలన్నా, భవిష్యత్లో ఇంకా మంచి పనులు జరగాలన్నా మనం మళ్లీ గెలవాలి. పొరపాటు జరిగితే చంద్రముఖి మన ఇంట్లోకి గ్లాసు పట్టుకొని సైకిల్పై వస్తుంది. పేదల రక్తం తాగేస్తుంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, అనంతపురం: విశ్వసనీయతకు–వంచనకు మధ్య జరగబోతున్న ఎన్నికల యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కోసం వారి తరఫున నిలబడటానికి మీరంతా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ యుద్ధం.. వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడూ మన రాష్ట్రానికి వచ్చిపోతున్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్కు, ఈ గడ్డమీదే పుట్టి ఇక్కడే ఇల్లు కట్టుకుని ప్రజల మధ్యే ఉన్న మనకూ మధ్య జరగబోతోందన్నారు. మనందరి ప్రభుత్వం 57 నెలలుగా అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధిని అడ్డుకుంటూ వాటిని రద్దు చేయడమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు. బాబు మార్కు ఎక్కడైనా ఉందా? ఈ వేదిక నుంచి చంద్రబాబుకు ఒక సవాల్ విసురుతున్నా. మీరు 14 ఏళ్లు పరిపాలన చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. కానీ మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా? మీ పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? మీ పేరు చెబితే విద్యార్థులకు గుర్తొచ్చే పథకం ఏదైనా ఉందా? మీ పేరు చెబితే కనీసం అవ్వాతాతలకైనా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు.. మా పెన్షన్ మా ఇంటికే పంపాడనే పరిస్థితి ఏనాడైనా ఉందా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఫలానా మంచి చేశాడని చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క గ్రామంలోనైనా ఏర్పాటు చేసిన పరిపాలన వ్యవస్థ ఒక్కటైనా కనిపిస్తుందా? బాగుపడిన స్కూళ్లు, ఆస్పత్రులు ఏ గ్రామంలోనైనా ఉన్నాయా? కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామంలోనైనా సరే మీ మార్క్ ఉందా చంద్రబాబూ? పథకాలను పక్కనపెడితే చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా? మేనిఫెస్టోకు రంగులు పూసి ప్రతి సామాజికవర్గాన్ని మోసం చేయడం చంద్రబాబుకు ఆనవాయితీ. ఏనాడైనా కనీసం 10శాతం వాగ్దానాలను అమలు చేశారా? బంగారు కడియం ఇస్తానంటూ ఊబిలోకి దింపి మనుషుల్ని తిన్న పులి మాదిరిగా మరోసారి ఎర వేస్తున్నాడు. అబద్ధాలు చెప్పేటప్పుడు భావ దారిద్య్రం ఎందుకన్నది బాబు నైజం. నమ్మినవాడు మునుగుతాడు.. నమ్మించినవాడు దోచుకోగలుగుతాడన్నది ఆయన సిద్ధాంతం. చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి చెప్పాలి. బాబు మోసాల్ని భరించలేకే కదా ఐదేళ్ల క్రితం అన్ని సామాజికవర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలంతా చొక్కా మడతేసి కుర్చీని లాగేసి చీపుర్లతో ఊడ్చి ఆయన పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు. అదే పని మరోసారి చేయడానికి, చొక్కాలు మడత వేయడానికి మీరంతా సిద్ధంగా ఉండాలి. లబ్ధిదారులే స్టార్ క్యాంపెయినర్లు మన ప్రభుత్వ హయాంలో పథకాలు అందుకున్న ప్రతి కుటుంబం మనకు స్టార్ క్యాంపెయినర్గా బయటకు రావాలి. వైఎస్సార్ సీపీలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాల్సిన అవసరాన్ని చెప్పాలి. మనం చేసినవి తెలియజేస్తూ వాటి కొనసాగింపు ఎంత అవసరమో ప్రతి ఇంటికీ వివరించాలి. ఒక్కసారి అధికారం ఇస్తేనే ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా గ్రామాల్లో రైతన్నను చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థను తెచ్చి తోడుగా నిలిచాం. సాగుకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చాం. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం మొదలు పెట్టింది మీ బిడ్డ ప్రభుత్వమే. ఉచిత పంటల బీమా ఇస్తున్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. ఈ పథకాలన్నీ కొనసాగాలన్నా, బాబు మార్క్ దళారీ వ్యవస్థ మళ్లీ రాకూడదన్నా ప్రతి రైతన్న మన స్టార్ క్యాంపెయినర్గా ముందుకొచ్చి ఇంకో వంద మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. విందు భోజనం, బిర్యానీ పెడతానంటూ ఆశ చూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెను లాక్కోవడానికి అడుగులు వేస్తున్నాడు. గతంలో ఇదే పెద్దమనిషి రూ.87,612 కోట్ల రుణ మాఫీని ఓ మోసంలా ఎలా మార్చాడో ప్రతి రైతన్నకూ గుర్తుచేయాలి. అమ్మ ఒడి, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్లపట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం, దిశ యాప్, మహిళా పోలీస్.. ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రతి అక్కచెల్లెమ్మకు కొనసాగాలంటే జగనన్న ప్రభుత్వానికి అండగా ఉండాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని, మరో వంద మందితో ఓటు వేయించాల్సిన బాధ్యత ఉందని మీరంతా చెప్పాలి. ఏ గ్రామానికైనా వెళదాం.. ఇవాళ రాష్ట్రంలోని ఏ గ్రామానికి వెళ్లి నిల్చున్నా ఓ విలేజ్ సెక్రటేరియట్ కనిపిస్తుంది. పది మంది శాశ్వత ఉద్యోగులు కనిపిస్తారు. నాలుగడుగులు ముందుకేస్తే ఆర్బీకే కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్, కడుతున్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. నాడు–నేడుతో రూపురేఖలు మారిన బడులు, హాస్పిటల్స్ కనిపిస్తాయి. ప్రతి 50–60 ఇళ్లకు చేయి పట్టుకొని నడిపించే మంచి వలంటీర్ వ్యవస్థ ఉంది. ఇవన్నీ ఈ 57 నెలల కాలంలోనే జరిగాయి. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామంలో ఆగి చూసినా, ఏ సామాజికవర్గాన్ని పలుకరించినా మీ జగన్ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. ప్రజలు మనను మొదటిసారి ఆశీర్వదిస్తేనే దేవుడి దయతో ఇంత మంచి చేయగలిగాం. సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుందో ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ‘నా’ వాళ్లకు గరిష్టంగా లబ్ధి అణగారిన వర్గాలను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలంటూ చరిత్రలో చూడని విధంగా నామినేషన్ పనులు, కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసి మరీ ఇస్తున్నది ఎవరంటే మీ జగన్ అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మీ జగన్ బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేసిన రూ.2.55 లక్షల కోట్లలో 75 శాతం ‘నా..’ అని ఆప్యాయంగా పిలుచుకునే వర్గాలకే ఇచ్చాడు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే ఈ 57 నెలల పాలనలోనే ఏకంగా 2.13 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఇచ్చాం. ఆ ఉద్యోగాల్లో 80 శాతం నా ఎస్సీలు, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలకే దక్కాయి. ఇంతటి సామాజిక న్యాయం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే కనిపిస్తోంది. 35 లక్షల ఎకరాలపై అనుభవదారులు, గిరిజనులు, రైతన్నలు, నిరుపేదలకు సర్వహక్కులు ఇచ్చింది ఎవరంటే మీ జగనే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో సింహభాగం వాటా దక్కింది మీ జగన్ వచ్చాకే. చంద్రబాబుకు ఓటేయడం అంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటేయడమే. డీబీటీకి వ్యతిరేకంగా ఓటు వేయడమే. ఈ విషయాన్ని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. మీరంతా గతంలో చంద్రబాబు పాలన చూశారు. ఇంకా చాలామంది పరిపాలన చూశారు. కానీ మేనిఫెస్టోను 99శాతం అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తున్నది మీ జగన్ మాత్రమే. మొదటి చాన్స్ ఇస్తేనే మీ జగన్ ఇంత గొప్పగా అన్ని వర్గాలనూ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు. మరి మూడుసార్లు సీఎంగా, 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయాడని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి అడగండి. మీ జగన్ పేరు చెబితే.. మీ జగన్ పేరు చెబితే.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం, విద్యాకానుక, గోరుముద్ద, బాగుపడ్డ పాఠశాలలు, బైజూస్ కంటెంట్, బైలింగ్యువల్ బుక్స్, ట్యాబ్లు, డిజిటల్ బోధనతో ఐఎఫ్పీ ప్యానళ్లు, తొలిసారిగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, టోఫెల్ శిక్షణ, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం గుర్తొస్తాయి. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో విద్యా దీవెన, వసతి దీవెన, జాబ్ ఓరియెంటెడ్గా కరిక్యులమ్లో మార్పులు, ఆన్లైన్ వర్టికల్స్ చదువులతో అనుసంధానం.. ఇవన్నీ తల్లిదండ్రులకు వివరించాలి. ఇవన్నీ కొనసాగాలంటే, పిల్లలు అనర్గళంగా ఇంగ్లిషులో మాట్లాడాలంటే, పెత్తందార్ల పిల్లలతో పోటీ పడే పరిస్థితి రావాలంటే మీ అన్న మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుందని చెప్పండి. ఇవాళ ఒకటో తరగతిలో ఉన్న పేదింటి పాప, పేదింటి బాబు మరో 10–15 ఏళ్లలో అంతర్జాతీయ చదువులతో గొప్ప ఉద్యోగాలు సాధించాలంటే మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుందని ప్రతి ఇంటికీ చెప్పండి. సైకిల్కు ఓటేయడం అంటే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం రద్దుకు ఓటేస్తున్నామని గుర్తు పెట్టుకోవాలి. ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దే రూ.3 వేల పెన్షన్లు కొనసాగాలన్నా, భవిష్యత్లో పెరగాలన్నా, కొందరికే పింఛన్లు ఇచ్చిన రోజులు మళ్లీ రాకూడదన్నా, లంచాల జన్మభూమి కమిటీలు కాటేయకూడదన్నా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని ఇంటింటికీ వెళ్లి చెప్పాలి. ఇవాళ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరినీ సేవలతో విస్తరించిన ఆరోగ్యశ్రీ, 104, 108 వాహనాలు, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష ఆదుకుంటున్నాయి. వీటి పేరు వింటే కోవిడ్ కష్టకాలంలో అందించిన సేవలు గుర్తుకొస్తాయి. పేదలు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదన్నా, గడపగడపకూ వైద్యం అందించే పరిస్థితి కొనసాగాలన్నా లబ్ధిదారులే స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రావాలని కోరాలి. 57 నెలల్లో మీకోసం 125 సార్లు బటన్లు ఈ 57 నెలల్లో నేను ప్రజల కోసం 125 సార్లు బటన్లు నొక్కా. ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు వెళ్లాయి. ఇంత మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా, ఈ పాలనకు కొనసాగింపుగా ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్ కోసం రెండు బటన్లు నొక్కాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు. ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద శాశ్వతంగా పోతుంది. పొరపాటు చేశారంటే చంద్రముఖి మళ్లీ సైకిలెక్కుతుంది. టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికొస్తుంది. పేదల రక్తం తాగేందుకు లకలకా అంటూ మీ ఇంటి తలుపులు తడుతుందని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ చెప్పండి. మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి మన పాలనలో మీకు మంచి జరిగితే నాకు ఓటు వేయండి అని, మీ బిడ్డకు మీరే సైనికులుగా తోడుగా నిలబడాలని మనం నిబద్ధతతో సిద్ధం అంటుంటే ఏ ఒక్కరికైనా ఏం చేశారో చెప్పుకొనేందుకు ఒక్కటీ కనిపించని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. మేమూ సిద్ధం.. సంసిద్ధం అంటూ చంద్రబాబు పోస్టర్లు వేయిస్తున్నారు. ప్రజలకు మంచి చేయకుండా దేనికయ్యా సంసిద్ధం? ఎందుకు సంసిద్ధం? ఎవరితో యుద్ధం? పెత్తందార్ల తరఫున చంద్రబాబు సంసిద్ధం అంటున్నాడంటే ఎవరితోనయ్యా నువ్వు యుద్ధం చేస్తున్నావ్? కృష్ణుడిలా కోట్ల గుండెలు తోడున్నాయి.. దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడుగా కృష్ణుడి రూపంలో ప్రతి పేదవాడి ఇంట్లో కోట్ల గుండెలున్నాయి. ప్రజలే అండగా, ప్రజలతోనే పొత్తులతో ఎన్నికల పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. ఇది మీ అందరి పార్టీ. జగన్ను నమ్మిన వారికి, పార్టీ కోసం కష్టపడిన వారికి అంచెలంచెలుగా అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైఎస్సార్సీపీ. ప్రతి కార్యకర్తకూ మీ అన్న జగన్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని తెలియజేస్తున్నా. ప్రతి కార్యకర్త, ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మరో రెండు మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత నాది. మా నాయకుడు మాటిచ్చాడంటే చేస్తాడంతే అని ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పుకునేలా ఉండాలి. 99 శాతం వాగ్దానాలు అమలుచేసి ప్రతి ఇంటికీ వెళ్లి మేనిఫెస్టో చూపించి మరీ ప్రజల ఆశీస్సులు కోరుతున్న పార్టీ మనదే. అందుకే ఎన్నికల్లో 175కు 175 మన టార్గెట్. మన టార్గెట్ 25కు 25 ఎంపీ సీట్లు. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ తగ్గేందుకు వీలేలేదు. మరో 55 రోజుల్లో మరో రెండు నెలల్లోనే ఎన్నికలు. ఈరోజు నుంచి చూస్తే మరో 55 రోజులు కూడా ఉండవేమో. చంద్రబాబు అబద్ధాలు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5, ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ఎదుర్కొంటూ పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలి. చీకటి రాతల్ని, చీకటి పనుల్ని బట్టబయలు చేసేందుకు సంసిద్ధంగా ఉండాలి. మీరంతా సెల్ఫోన్ టార్చిలైట్లు వెలిగించి సిద్ధమే అని చెప్పండి. ప్రతి కార్యకర్త, బూత్ కమిటీ సభ్యులు, వలంటీర్లు, గృహ సారథుల పాత్ర అత్యంత కీలకం. సమరభేరి మోగిద్దాం.. సమరనాదం వినిపిద్దాం. చంద్రబాబుకు ఇప్పటికే 75 ఏళ్లు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు 80కి చేరుతుంది. ఎన్నికల తర్వాత టీడీపీ రూపురేఖలు ఎక్కడా కనిపించవు. ఈ ఎన్నికలు చాలా కీలకం కావడంతో పెత్తందార్లంతా ఏకం అవుతున్నారు. వీరంతా సరిపోరని జాతీయ పార్టీలతో పరోక్షంగా ఒకరితో, ప్రత్యక్షంగా మరొకరితో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. ఒకే ఒక్కడిపై యుద్ధం చేయడానికి ఇన్ని తోడేళ్లు ఏకం అవుతున్నాయి. ఈ తోడేళ్లను ఎదుర్కోవాలంటే మీ జగన్ ఒక్కడికే సాధ్యం కాదు. మీ జగన్కు ప్రతి గుండె తోడుగా నిలబడాలి. ప్రతి ఇంట్లో అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, తల్లీతండ్రీ, ప్రతి రైతన్న మీ జగన్కు తోడుగా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాల్సిన అవసరం ఉంది. మీరు వేసే ఓటు పేదవాడి భవిష్యత్ను, జీవితాన్ని నిర్ణయించే ఓటు అవుతుంది. పొరపాటు జరిగిందంటే పేదవాడి బతుకులు అతలాకుతలం అవుతాయి. మీకెందుకు ఓటేయాలి బాబూ? జగన్ మార్కు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నప్పుడు, ప్రతి పేద ఇంట్లో, ప్రతి సామాజికవర్గంలో, ప్రతి ప్రాంతంలో మంచి మార్పు కనిపిస్తున్నప్పుడు బాబుకు ఎందుకు ఓటు వేయాలని అడుగుతున్నా. జగన్ పాలనలో ప్రజలకు మంచి చేయలేదని, జగన్కు ప్రజాబలం లేదని చంద్రబాబు నిజంగా నమ్మితే ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబూ? అని అడుగుతున్నా. ఊతం కోసం అటో కర్రా, ఇటో కర్ర ఎందుకయ్యా? సైకిల్ తోయడానికి నీకొక ప్యాకేజీ స్టార్ ఎందుకయ్యా? జగన్ ప్రతి ఇంటికీ మంచి చేశాడని తెలుసు కాబట్టే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
Babu : కరకట్టపై పొత్తులు.. బాబు ఏమన్నాడంటే.?
కరకట్ట నివాసం వేడేక్కింది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత వారం రోజులుగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని స్వగృహానికే పరిమితమయిన చంద్రబాబు.. ఇవ్వాళ ఉండవల్లిలోని కరకట్ట నివాసానికి వచ్చాడు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పొత్తులపై ఆధారపడి అత్యధికంగా ప్రయోజనం పొందిన చంద్రబాబులో.. ఈ సారి మాత్రం ఆ వెలుగు కనిపించడం లేదు. రాజ్యసభలో సైకిల్ మాయం రాజ్యసభ ఎన్నికలకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. గత పది రోజులుగా తెలుగుదేశం వర్గాలు పోటీ చేస్తామంటూ రంకెలేస్తున్నాయి. మా బాబు మామూలోడు కాదని నేతలు పకడ్భందీగా ప్రకటనలిచ్చేశారు. చంద్రబాబు మీద పార్టీ సీనియర్లకు ఎంత నమ్మకం అంటే.. తమ పార్టీ తరపున గెలిచింది 23 మందే అయినా.. తమకు బలం లేదని తెలిసినా.. తమకు అవకాశమిస్తే.. గెలుస్తామని చెప్పుకున్నారు. ఓటుకు కోట్లు విషయంలో చంద్రబాబుకు ఉన్న అపారమైన అనుభవానికి ఇది ఒక నిదర్శనం. ఎన్నిక ఏదైనా ఎమ్మెల్యే ఎవరైనా.. ఎంత డబ్బైనా ముట్టజెప్పి.. తమవైపుకు తీసుకురాగల శక్తి చంద్రబాబుకు ఉందని నమ్మారు. అయితే ఇవ్వాల్టి కరకట్ట మీటింగ్లో ఈ విషయం తేలిపోయింది. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఏదీ లేదని చంద్రబాబు ప్రకటించారు. YSRCPకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేల కోసం తెరవెనక టిడిపి బృందం ఆహర్నిశలు కృషి చేసినా.. ఫలితం దక్కలేదన్న ఆవేదన బాబు మాటల్లో కనిపించింది. పొత్తులుంటాయి.. కానీ..! కరకట్ట మీటింగ్లో ప్రధానంగా చర్చ జరిగిన రెండో అంశం పొత్తులు. బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నాయంటున్నారు, మరి మనతో ఎవరున్నారని చంద్రబాబును పార్టీ సీనియర్లు అడిగారు. దీనిపై సుదీర్ఘంగా మాట్లాడిన చంద్రబాబు.. పొత్తులు ఉంటాయని, ఆయా పార్టీల వాళ్లకు సీట్లు కేటాయించాలన్నారు. అయితే బీజేపీతో పొత్తు ఉంటుందా? ఉండదా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. కొత్త వాళ్లు పోటీ చేయడం వల్ల ఇప్పటివరకున్న కొందరికి సీట్లు దొరకవని, అయితే వారికి నష్టం కలగకుండా ఉండేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. (వాలంటైన్స్ డే సందర్భంగా చంద్రబాబు పొత్తుల గురించి సోషల్ మీడియాలో చురకలు) ఇంకా మారని తీరు చంద్రబాబు అంటేనే ఫిరాయింపులు. ఫిరాయింపులు అంటేనే చంద్రబాబు. ఎంత సేపు పక్కపార్టీ నేతలపై కన్నేసి పెట్టే చంద్రబాబు.. తాజాగా కరకట్ట మీటింగ్లో YSRCP నేతలెవరయినా వస్తారా అంటూ ఆరా తీసినట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ల మార్పు నిర్ణయం తర్వాత YSRCP నుంచి భారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారని భావించామని నేతలు ప్రస్తావించినట్టు తెలిసింది. కొందరు నేతలకు అక్కడ టికెట్ లేదనడంతో తమ దగ్గరకు వస్తున్నారని, అక్కడ గెలవలేని వాళ్లు.. ఇక్కడ కూడా గెలుస్తారని అనుకోలేమని, అయినా అవకాశం ఉన్నచోట వారే పార్టీకి పెద్ద దిక్కని చెప్పినట్టు తెలిసింది. లోకేష్తో లాభమా? నష్టమా? ఎన్నికలు మరీ దగ్గరకు వచ్చాయని, ఇప్పటివరకు అభ్యర్థులు సరికదా.. పొత్తులు కూడా ఖరారు కాలేదని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అలాగే పార్టీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఒక్క సభ కూడా పెట్టలేదని చెప్పినట్టు తెలిసింది. త్వరలో ‘‘రా....కదలి రా’’ పేరిట తాను సభలు పెట్టబోతున్నట్టు చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. అలాగే లోకేష్ శంఖారావం మీటింగ్ గురించి నేతలతో ప్రస్తావించినప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినట్టు తెలిసింది. తరచుగా లోకేష్ చేస్తున్న ప్రకటనలు అసలుకే మోసం తెచ్చేలా ఉన్నాయంటూ కొందరు బాబుకు చెప్పినట్టు తెలిసింది. ఎన్నికలకు కేవలం 56 రోజులే ఉన్నాయని, ఇంకా పార్టీ నేతలు ఎలక్షన్ మూడ్ లోకి రాకపోతే ఎలా అని చంద్రబాబు అడిగినట్టు సమాచారం. పొత్తులపై క్లారిటీ ఎప్పుడు.? బీజేపీతో పొత్తు పై ఇప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం లేదంటున్నారు టీడీపీ నేతలు. ఈనెల 16 సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో బీజేపీ జాతీయ విస్తృతస్థాయి సమావేశాలున్నాయి. ఈ సమావేశాలు ముగిసేవరకు ఢిల్లీకి రావొద్దని పవన్, బాబులకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి. బీజేపీ హైకమాండ్ పిలుపు కోసం వారం రోజుల నుంచి వేచి చూస్తున్నా పవన్ను పట్టించుకోవడం లేదు. బీజేపీ సమావేశాలు ముగిశాక ఢిల్లీ వెళ్లాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ తహతహలాడుతున్నారు. ఈలోగా 17న పర్చూరులో రా కదలిరా సభకు భారీగా జనాన్ని తీసుకురావాలని చంద్రబాబు నేతలకు ఆదేశాలిచ్చాడు. పార్టీలో ఎవరైనా చేరేవాళ్లుంటే.. తీసుకురావాలని చంద్రబాబు సూచించినట్టు తెలిసింది. -
Adudam Andhra: విజేతల జాబితా ఇదే..
విశాఖ స్పోర్ట్స్: యువత క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తూ నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా..’ తొలి సీజన్ విజేతలకు ముఖ్యమంత్రి జగన్ మంగళవారం విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియంలో ట్రోఫీలతో పాటు మెడల్స్, నగదు ప్రోత్సాహకాల్ని అందించారు. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ మెన్, వుమెన్ విజేతలకు చెక్కులను ట్రోఫీలతో పాటు అందించారు. బ్యాడ్మింటన్ తొలి మూడు స్థానాల్లో నిలిచిన జోడీలకు ట్రోఫీలతో పాటు నగదు ప్రోత్సాహకాల్ని అందించారు. క్రికెట్ పురుషుల విభాగంలో ఏలూరు జట్టు విజేతగా నిలవగా మహిళా విభాగంలో ఎన్టీఆర్ జిల్లా జట్టు గెలుపొందింది. వాలీబాల్ మెన్, వుమెన్ రెండు విభాగాల్లోనూ బాపట్ల విజేతగా నిలిచింది. ఖోఖో మెన్లో బాపట్ల, వుమెన్లో ప్రకాశం జిల్లాలు విజేతలుగా నిలిచాయి. బ్యాడ్మింటన్ మెన్లో ఏలూరు జోడి, వుమెన్లో బాపట్ల జోడి విజేతగా నిలిచింది. కబడ్డీ మెన్లో బాపట్ల, వుమెన్లో విశాఖ జట్లు విజేతలుగా నిలిచి సీఎం జగన్ చేతుల మీదుగా ట్రోఫీలతో పాటు చెక్కులను అందుకున్నాయి. క్రికెట్ విజేత ఏలూరు విశాఖ వైఎస్ఆర్ స్టేడియంలో ఫ్లడ్లైట్ల వెలుతురులో డే నైట్గా సాగిన పురుషుల క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నక్కవానిపాలెం (విశాఖ) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 128 పరుగులు చేసింది. ప్రతిగా అశోక్ పిల్లర్ రోడ్ (ఏలూరు) జట్టు తొలి యాభై పరుగుల్ని వికెట్ కోల్పోకుండానే చేసింది. పది ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయినా 69 పరుగులు చేసి నాలుగో వికెట్ను 87 పరుగుల వద్ద కోల్పోయింది. అనంతరం వికెట్ కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. 16వ ఓవర్లో చివరి రెండు బంతుల్ని సిక్సర్లుగా మలచడం ద్వారా టైటిల్ను సొంతం చేసుకుంది. దీంతో ఏలూరు జట్టు గెలుపొందగా విశాఖ రన్నరప్గా నిలిచింది. మెన్ క్రికెట్ టైటిల్ పోరును సీఎం జగన్ స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించారు. కబడ్డీలో బాపట్ల ఆధిక్యం.. కబడ్డీ పురుషుల ఫైనల్ పోటీ ఏయూ గ్రౌండ్స్లో జరిగింది. టాస్ గెలిచిన నాగులాపురం–1 (తిరుపతి) జట్టు కోర్టును ఎంచుకోగా కొత్తపాలెం–2 (బాపట్ల) జట్టు తొలి రైడ్ నుంచే ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తొలి అర్ధభాగంలో బాపట్ల 15–7తో ఆధిక్యాన్ని ప్రదర్శించింది. తిరుపతి జట్టు రెండో అర్ధభాగంలో కాస్త పుంజుకున్నా ఆధిక్యాన్ని తగ్గించలేకపోయింది. ఇరు జట్లు రెండో అర్ధభాగంలో తొమ్మిదేసి పాయింట్లతో సమ ఉజ్జీగా నిలిచాయి. చివరికి కొత్తపాలెం 2 (బాపట్ల) 26–17తో నాగులాపురం 1 (తిరుపతి)పై గెలుపొంది మెన్ కబడ్డీ విజేతగా నిలిచింది. నాగులాపురం జట్టు రన్నరప్గా నిలిచింది. బాపట్ల తరపున లక్ష్మీనారాయణ, రామకృష్ణ, శ్రీకాంత్, వెంకటేశ్వర, హరిప్రసాద్, బాలకృష్ణ, అనిల్ ప్రసాద్ కోర్టులోకి దిగగా తిరుపతి జట్టు తరపున సతీష్, తరుణ్కుమార్, సుమన్, చిన్నముత్తు, దేవేంద్ర, తమిళైర్సన్, నరసింహ కోర్టులోకి దిగారు. -
రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యం
పట్నంబజారు: రానున్న ఎన్నికల్లో వైఎస్సార్కాంగ్రెస్పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ రీజినల్ కో –ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సమన్వయకర్తలతో సమీక్షాసమావేశం జరిగింది. అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, పరిశీలకులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలు, లోక్సభ స్థానం గెలుపే లక్ష్యంగా దృష్టి సారించి ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఏడు సీట్లలో విజయం తధ్యమని, మంగళగిరిని సైతం గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీకి అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. సీట్ల మార్పు అంశంలో ఎవరైతే గెలుస్తారో, వారిని మార్పు చేశామని, మిగతా వారు అలాగే అభ్యర్థులుగా కొనసాగుతారని తెలిపారు. ఈ సమావేశంలో శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, మేకతోటి సుచరిత, అన్నాబత్తుని శివకుమార్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్యవరప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనిక్రిస్టినా, సమన్వయకర్తలు బలసాని కిరణ్కుమార్, షేక్ నూరిఫాతిమా, గంజి చిరంజీవి, నగర మేయర్ కావటి మనోహర్నాయుడు, పార్టీ నేత రావెల కిషోర్బాబు, విడదల గోపి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, బత్తుల బ్రహ్మానందరెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. -
అటు ఆటలు.. ఇటు ఆరోగ్యం
మన ఊరిలో.. మన వార్డులో మట్టిలో మాణిక్యాలు ఎందరో ఉన్నారు. వారందరినీ గుర్తించి సాన పట్టగలిగితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయవచ్చు. అలాంటి వారిని గుర్తించేందుకే ‘ఆడుదాం ఆంధ్రా..’ అనే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సచివాలయ స్థాయి నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ, ఆటలపై మక్కువ పెంచేందుకు ‘ఆడుదాం ఆంధ్రా..’ ఎంతో దోహదపడుతుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 25.45 లక్షల మంది క్రీడాకారులు ఇందులో పాలుపంచుకున్నారని, ఈ కార్యక్రమాన్ని ఏటా ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. 47 రోజుల పాటు ఉత్సాహభరితంగా నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు ఉత్సవాలు మంగళవారం విశాఖలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి జగన్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆరోగ్యం, వ్యాయామంపై అవగాహన పెంచేలా.. మన ఆరోగ్యానికి వ్యాయామం, క్రీడలు ఎంత అవసరం అనే అంశంపై రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో, ప్రతి గ్రామంలో అవగాహన పెరగాలి. ఆడుదాం ఆంధ్రా ద్వారా ఆరోగ్యం, వ్యాయామం పట్ల అవగాహన పెరగాలన్నది ఒక ఉద్దేశమైతే గ్రామ స్థాయి నుంచి మట్టిలోని మాణిక్యాల్ని గుర్తించి వారి ప్రతిభకు సాన పెట్టి శిక్షణ ఇవ్వడం మరో లక్ష్యం. తద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన యువత రాణించేలా ప్రోత్సహించవచ్చు. ఉత్తరాంధ్ర గడ్డపై సగర్వంగా... ఆడుదాం ఆంధ్రా ద్వారా క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్మాడ్మింటన్ తదితర ఐదు క్రీడల్లో గత 47 రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రతిభను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టాం. 25.40 లక్షల మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు. 3.30 లక్షల పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిగాయి. 1.24 లక్షల పోటీలు మండల స్థాయిలో, 7,346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో, 1,731 పోటీలు జిల్లా స్థాయిలో, 260 మ్యాచ్లు రాష్ట్ర స్థాయిలో నిర్వహించాం. ఫైనల్స్ ముగించుకొని మన విశాఖలో, మన ఉత్తరాంధ్రలో, మన కోడి రామ్మూర్తి గడ్డమీద సగర్వంగా ముగింపు సమావేశాలను నిర్వహిస్తున్నాం. దాదాపు 37 కోట్ల కిట్లు గ్రామ స్థాయి నుంచి పోటీ పడుతున్న పిల్లలందరికీ ఇచ్చాం. రూ.12.21 కోట్ల విలువైన బహుమతులు పోటీలో పాలుపంచుకున్న పిల్లలందరికీ అందిస్తున్నాం. తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఆల్ ది బెస్ట్.. క్రికెట్లో ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెమ్మలను టాలెంటెడ్ ప్లేయర్స్గా గుర్తించాం. కబడ్డీలో ముగ్గురు తమ్ముళ్లు, ఒక చెల్లెమ్మను గుర్తించాం. వాలీబాల్లో ఒక తమ్ముడు, ఒక చెల్లెమ్మ ప్రతిభను చాటుకున్నారు. ఖోఖోలో ఒక తమ్ముడు, చెల్లెమ్మ ప్రతిభను గుర్తించాం. బ్యాడ్మింటన్లో ఒక తమ్ముడు, చెల్లెమ్మ ప్రతిభ నిరూపించుకున్నారు. వారికి సరైన శిక్షణ ఇవ్వగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రోత్సహిస్తూ అడుగులు వేస్తున్నాం. ఎంపికైన తమ్ముళ్లు, చెల్లెమ్మలకు ఆల్ ద బెస్ట్. 14 మంది టాలెంటెడ్ ప్లేయర్స్ దత్తత... ఈ బృహత్తర కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్తో పాటు ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ పాల్గొని ప్రతిభ చాటుకున్న 14 మందిని దత్తత తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. క్రికెట్ నుంచి పవన్ (విజయనగరం), చెల్లెమ్మ కేవీఎం విష్ణువరి్ధని (ఎన్టీఆర్ జిల్లా)ని చెన్నై సూపర్ కింగ్స్ దత్తత తీసుకొని మరింత మెరుగైన శిక్షణ ఇస్తుంది. క్రికెట్ నుంచే శివ (అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా), చెల్లెమ్మ గాయత్రి (కడప జిల్లా)ని దత్తత తీసుకోవడానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ముందుకొచ్చింది. సతీష్ (తిరుపతి), బాలకృష్ణారెడ్డి (బాపట్ల)ని ప్రో కబడ్డీ టీమ్ దత్తత తీసుకుంది. సుమన్(తిరుపతి), సంధ్య (విశాఖ)ను ఏపీ కబడ్డీ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. వాలీబాల్కు సంబంధించి ఎం.సత్యం (శ్రీకాకుళం), మహిళల విభాగానికి సంబంధించి మౌనిక (బాపట్ల)ను దత్తత తీసుకునేందుకు బ్లాక్ హాక్స్ సంస్థ ముందుకొచ్చింది. ఖోఖోకు సంబంధించి కె.రామ్మోహన్ (బాపట్ల), హేమావతి (ప్రకాశం)లకు తర్ఫీదు ఇచ్చేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్ ముందుకొచ్చింది. బ్యాడ్మింటన్లో ఎ.వంశీకృష్ణంరాజు (ఏలూరు), ఎం.ఆకాంక్ష (బాపట్ల)ను ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ దత్తత తీసుకొనేందుకు ముందుకొచ్చింది. ఈ 14 మందికి రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ఆ సంస్థలు మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చేందుకు అడుగులు ముందుకొచ్చాయి. ఇక ఏటా ‘ఆడుదాం ఆంధ్రా’...! ఈరోజు మనం వేసిన అడుగు ఇక ప్రతి సంవత్సరం ముందుకు పడుతుంది. క్రీడల్లో మన యువత ప్రతిభను గుర్తించి మరింత తర్ఫీదు ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేస్తాం. సచివాలయాల స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహిస్తూ వ్యాయామం ఆవశ్యకత, ఆరోగ్య జీవన విధానాలను ముందుకు తీసుకెళతాం. వీటివల్ల ఆటలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ఆకట్టుకున్న లేజర్ షో ముగింపు ఉత్సవాల సందర్భంగా ‘ఆడుదాం ఆంధ్రా’ ప్రత్యేక గీతాన్ని స్టేడియంలో ప్రదర్శించారు. ఈ పాటకు దాదాపు 5 నిమిషాల పాటు కళ్లు మిరుమిట్లు గొలిపేలా ప్రదర్శించిన లేజర్ షో ఆకట్టుకుంది. కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర వైఎస్సార్ సీపీ ఇన్చార్జీ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి ఆర్కే రోజా, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు విడదల రజని, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కలెక్టర్ మల్లికార్జున, ఏసీఏ కార్యదర్శి గోపినాథ్రెడ్డి, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ప్రభుత్వ విప్ కరణం ధర్మ శ్రీ, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి వెంకటసత్యవతి, గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ విశాఖ పార్లమెంట్ సమన్వయకర్త బొత్స ఝాన్సీ, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర పాల్గొన్నారు. కమాన్.. క్రికెట్ టీమ్! క్రికెట్లో విజేతగా నిలిచిన ఏలూరు జట్టుకు చెందిన కెప్టెన్, వైస్ కెప్టెన్ని వేదికపైకి రావాలని తొలుత నిర్వాహకులు ఆహ్వానించగా ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకుని క్రికెట్ టీమ్ మొత్తం వేదికపైకి రావాలంటూ స్వయంగా చేతులు చాచి ఆహ్వానించడంతో జట్టు సభ్యులంతా ఉత్సాహంగా స్టేడియంలో పరుగులు తీస్తూ వచ్చారు. సీఎంతో కరచాలనం కోసం పోటీపడ్డారు. సెక్యూరిటీని వారించి సీఎం వారితో ఎక్కువ సేపు గడిపారు. విజేతలకు ట్రోఫీతో పాటు రూ.5 లక్షల ప్రైజ్ మనీని సీఎం జగన్ అందజేశారు. మహిళా క్రికెట్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, వాలీబాల్ విజేతలు, రన్నరప్లకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందించారు. ఐదు విభాగాల్లో ప్రతిభ చాటిన క్రీడాకారుల జాబితాను స్వయంగా ప్రకటించి బహుమతులు అందించారు. సీఎం జగన్ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారి పేర్లు అడిగి తెలుసుకున్నారు. జగనన్నని కలిశామన్న ఆనందం వారిలో కొట్టొచ్చినట్లు కనిపించింది. అరగంట పాటు మ్యాచ్ వీక్షణ క్రికెట్ మైదానానికి సాయంత్రం 6 గంటలకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ క్రీడాకారులు, ప్రేక్షకులకు అభివాదం చేస్తూ వేదికపైకి చేరుకున్నారు. ఏలూరు, విశాఖ జట్ల మధ్య జరిగిన క్రికెట్ ఫైనల్స్ని అరగంట పాటు ఆసక్తిగా వీక్షించారు. వికెట్ పడినా.. ఫోర్లు, సిక్స్ కొట్టినా.. ఇరు జట్లనూ చప్పట్లతో ప్రోత్సహిస్తూ ఉత్సాహపరిచారు. ఈ మ్యాచ్లో ఏలూరు జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గి విజేతగా నిలిచింది. -
అబద్ధాలే ఆయుధాలు!
వర్తమాన భారత రాజకీయాల్లో అలవోకగా అబద్ధాలు చెప్పగలిగే నేర్పరి ఎవరు? ఈ ప్రశ్నకు తెలుగు రాష్ట్రాల్లోని 90 శాతం మంది ప్రజలు ఠకీమని సమాధానం చెప్పగలరు. అబద్ధం – ఆయనా కవల పిల్లలన్నంతగా అపఖ్యాతిపాలైన ఆ నాయక శిరోమణి పేరు చంద్రబాబని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘నిజం చెబితే ఆయన తల వేయి ముక్కలవుతుందని ముని శాపం వున్నది, అందువల్లనే ఆయన నిజం చెప్పడ’ని వైఎస్సార్ తరుచూ చెబుతుండేవారు. ‘కళ్లార్పకుండా అబద్ధం చెప్పగలిగే వాడే చంద్రబాబ’ని జగన్మోహన్ రెడ్డి పలుమార్లు చెప్పారు. అటువంటి చంద్రబాబు రామోజీరావు చెంతకు చేరారు. లేదా, రామోజీయే చంద్రబాబును చేరదీశారు. రామోజీది గోబెల్స్ అంశ. అంతకంటే నైపుణ్యం గలవాడు. గోబెల్స్ను తొండ అనుకుంటే, రామోజీని ఊసరవెల్లి అనుకోవాలి. భౌతిక శాస్త్రంలో న్యూటన్ వంటివాడు గోబెల్స్ అనుకుంటే, ఐన్స్టీన్ మాదిరిగా అప్డేటెడ్ వెర్షన్ రామోజీ. ఆయనకు రాసు కోవడానికి పత్రికా, చూసుకోవడానికి టీవీలూ, తీసుకోవడానికి స్టూడియో ఉన్న సంగతి తెలిసిందే. వాటి సాయంతో ప్రాప గాండా అనే సబ్జెక్టును అసత్యశాస్త్రంగా అభివృద్ధి చేశారు. రామోజీ–బాబులకు ఇంకొందరు పిల్ల గోబెల్స్ తోడయ్యారు. ఇంకేముంది? అసలే కోతి... కల్లు తాగింది. ఆపై నిప్పు తొక్కింది. దాన్ని ఎగరకుండా ఆపడం ఎవరి తరం? ఆ కల్లు తాగిన కోతికే జనం యెల్లో మీడియా అనే వాడుక పేరు తగిలించారు. ఈ యెల్లో మీడియాకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నదనే సంగతి తెలియనిది కాదు. పొలిటికల్ బాసు బాబు మీద మన యెల్లో మీడియా ఈగనైనా వాలనీయదు. ఆయన్ను కుర్చీలోంచి లాగి గిరాగిరా తిప్పి నేల కేసి కొడుతుంటే చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోదు కనుకనే 2014లో, ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కోటి అబద్ధాల నోము నోచింది. నూరు అబద్ధాలాడైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు కదా పెద్దలు. ఇదే స్ఫూర్తితో కోటి అబద్ధాలా డైనా సరే బాబును కుర్చీలో కూర్చోబెట్టాలనే సంకల్పాన్ని యెల్లో మీడియా తలదాల్చింది. ఈసారి ఇంకా పెద్దఎత్తున శతకోటి అబద్ధాల నోమును ప్రారంభించినట్టున్నారు. యెల్లో పత్రికలూ, ఛానెళ్లూ అబద్ధాల మందుగుండును అడ్డదిడ్డంగా పేలుస్తున్నాయి. ఈ అడ్డగోలు కాల్పులు లక్ష్యాన్ని తాకలేకపోతున్నాయి. జనంలో విశ్వసనీ యత పూర్తిగా సన్నగిల్లింది. వీళ్లు పొరపాటున ఎప్పుడో ఒక నిజం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దాంతో కొత్త వార్ఫ్రంట్స్ను చంద్రబాబు ఓపెన్ చేశారు. తెలుగుదేశం – యెల్లో మీడియాల స్క్రిప్టును చదవడానికి, అబద్ధాలను వల్లె వేయడానికి వేరే గొంతులు కావాలి. వేరే ముఖాలు కనిపించాలి. ఇటువంటి పరకాయ ప్రవేశపు వ్యూహాలను చంద్రబాబు చాలా కాలంగానే అమలు చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఆ వ్యూహా లకు మరింత పదును పెట్టారు. ఇతర పార్టీల్లో, వ్యవస్థల్లో, సంస్థల్లో తన మనుషులను జొప్పించి తనకు అవసరమైనట్టుగా ఆడించుకోవడం చంద్ర బాబు వెన్నుపోటుతో నేర్చిన విద్య. చంద్రబాబు ఉచ్చులోపడి ఆయన మెప్పుకోసం ముఖ్యమంత్రి జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక న్యాయమూర్తి పరిస్థితిని నిన్ననే చూశాము. ఆ న్యాయమూర్తి వ్యవహారశైలిని తప్పుపడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తొలగించింది. పైనున్న వారి అండ చూసుకొని అభ్యంతరకరంగా వ్యవహరించిన న్యాయమూర్తికి శృంగభంగం తప్పలేదు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గద్దె నెక్కాలన్న లక్ష్యంతో అధికార పార్టీ మినహా మిగిలిన అన్ని పార్టీలతోనూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పొత్తులు పెట్టుకోవడానికి చంద్ర బాబు పడుతున్న ప్రయాస కనిపిస్తూనే ఉన్నది. ఇప్పటికే జనసేనను హత్తుకున్న బాబు బీజేపీ పెద్దల కటాక్షం కోసం నిరీక్షిస్తున్న సంగతి గమనిస్తూనే ఉన్నాము. ఇక రాష్ట్రంలో ఖాయిలాపడిన కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు కౌలుకు తీసుకున్న సంగతి కూడా జగమెరిగిన సత్యమే. జనసేన, బీజేపీలు తనకు ఓట్లను జోడించాలి. కాంగ్రెస్ పార్టీ వైసీపీ ఓట్లను చీల్చాలి. ఇదీ చంద్రబాబు–రామోజీల స్వీట్డ్రీమ్. ప్రత్యక్ష పొత్తు పార్టీలతో పాటు పరోక్ష పొత్తు పార్టీ కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధాలను ప్రచారం చేయాలి. అపోహలు సృష్టించాలి. అవసరమైన అబద్ధాల స్క్రిప్టును టీడీపీ అందజేస్తుంది. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అదే పనిలో ఉన్నది. చంద్రబాబు ఆకాంక్షల మేరకే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షు రాలి నియామకం కూడా జరిగింది. పీసీసీ అధ్యక్షురాలితో పాటు ఆ పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం, యెల్లో మీడియా భాషనే మాట్లాడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావుకు ఇంచుమించు చంద్రబాబు కున్నంత రాజకీయ అనుభవం ఉన్నది. ఆయన నిన్న విజయ వాడలో ఒక ప్రెస్మీట్ పెట్టారు. అందులో ఒక అద్భుతమైన, అనూహ్యమైన పొట్టలు పగిలేలా విరగబడి నవ్వించే సంచలన ఆరోపణ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీకి ముడుపులు అందుతున్నాయట! కుబేరుడికి చందాలివ్వడమేమిటో! ప్రపంచంలోనే అత్యంత సంపన్న పార్టీగా బీజేపీకి పేరున్నది. పదేళ్లుగా అవిచ్ఛిన్నంగా కేంద్రంలో అధికారం చలాయిస్తున్నది. మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలూ వారివే. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలంతా ఆ పార్టీ కను సన్నల్లోనే మసులుకుంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పు డిప్పుడే కాలు చేయి కూడదీసుకుంటున్న రాష్ట్రం నుంచి వారికి ముడుపులు కావాలా? ఈ నికృష్టమైన ఆరోపణ చేయడానికి టీడీపీకి ధైర్యం సరిపోదు గనుక ‘బంతి’ని కాంగ్రెస్కు పాస్ చేసింది. బాల్ దొరికిందని గోల్ కొట్టబోయి కేవీపీ బొక్కబోర్లా పడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీతో కలిసి ఉమ్మడిగా అక్రమ కేసును బనాయించి జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా పదహారు నెలలు జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఉత్తి పుణ్యానికి అంతకాలం జైల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయ కత్వం సంతృప్తి చెందినట్లు లేదు. అంధ్రప్రదేశ్ మంత్రులెవరూ అరెస్టు కావడం లేదేమిటని ఆయన చాలా బాధపడ్డారు. రాష్ట్రంలో అవినీతి జరుగుతున్నదని టీడీపీ యెల్లో మీడియా చేస్తున్న విషప్రచారానికి వంత పాడటమన్న మాట. ఇక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలి సంగతి సరేసరి. వైసీపీకి మద్దతునిస్తున్న మైనా రిటీల ఓట్లు చీల్చడానికి బాబు అప్పగించిన బాధ్యత నిర్వహణ కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మణిపూర్లో క్రైస్తవులపై దాడులు జరిగితే జగన్మోహన్ రెడ్డి ఖండించలేదట! అసలు మణిపూర్లో జరిగిందేమిటి? మతాల మధ్యన ఘర్షణగా ఎందుకు చిత్రిస్తున్నారు? రోజూ పత్రికలు చదివే వారికి మణిపూర్ ఘటనల నేపథ్యం తెలిసే ఉంటుంది. అది రెండు తెగల మధ్యన ఏర్పడిన పరస్పర అపనమ్మకం. ఒకరి పట్ల ఒకరిపై అనుమానం. ఇక్కడ మతం లేదు. కొండ ప్రాంత షెడ్యూల్డ్ తెగ కుకీలకు, మైదాన ప్రాంత మెయితీలకు మధ్యన ఏర్పడిన విభేదాలు కారణం. మెయితీల్లో మెజారిటీ ప్రజలు హిందువులు కావడం, కుకీల్లో అత్యధికులు క్రైస్తవులు కావడం యాదృచ్ఛికం. ఈ వివాదానికి అది కారణం కాదు. మెయితీల్లో క్రైస్తవులు, మహ్మదీయులు కూడా ఉన్నారు. మెయితీలకు షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించే ప్రతిపాదన పట్ల కుకీల్లో అభద్రతాభావం ఏర్పడింది. తమ భూములు కూడా క్రమంగా మైదాన ప్రాంతాల వారి చేతుల్లోకి వెళ్లి పోతాయే మోననే భయం కుకీలను ఆందోళనకు పురికొల్పింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం వల్ల ఘర్షణలు చెలరేగి కొన్ని సిగ్గుపడా ల్సిన సంఘటనలు జరిగాయి. కేంద్రం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పరిష్కరించవలసిన స్థానిక సమస్యకు మతం రంగులు పులమడం, మత వైషమ్యాలు లేని రాష్ట్రంలో చిలువలు పలువలు చేర్చి రెచ్చ గొట్టడం అవాంఛనీయం. తమ పబ్బం గడుపుకోవడానికి కుటుంబాలను చీల్చడం, కులాల మధ్య కుంపట్లు పెట్టడం, మతాల మధ్య చిచ్చుపెట్టడం వంటి పనులకు కొందరు రాజకీయవేత్తలు వెనుకాడరు. తమ నోటి వెంట వస్తే రక్తి కట్టవనుకున్న సంభాషణల్ని ఇతరుల చేత పలికిస్తారు. ఆ స్క్రిప్టును చదివేవాళ్లు ఒకటికి పదిసార్లు ఆలోచించి చదవడం మంచిది. అధికారపక్షం మీద అబద్ధాలనే ఆయుధాలుగా ప్రయోగించే కార్యక్రమంలో భాగంగా యెల్లో మీడియా, జనసేనలతోపాటు ఈ వారం కాంగ్రెస్ పరివారాన్ని కూడా చంద్రబాబు రంగంలోకి దించారు. దాంతోపాటు ఒకానొక సర్వే సంస్థను కూడా ప్రయో గించారు. దాని పేరు సీ–వోటర్. ఈ సంస్థకు విశ్వసనీయత లేదనీ, ఈ సంస్థతో చంద్రబాబుకు అక్రమ సంబంధం ఉన్నదనీ చెప్పడానికి కావలసినన్ని రుజువులున్నాయి. ఒక ప్రొఫెషనల్ సంస్థ ఎన్నికల కంటే ముందే ప్రజల మూడ్ను అంచనా కట్టి రిపోర్టు ఇస్తే అది కనీసం 90 శాతమన్నా వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అప్పుడే దాని ప్రొఫెషనలిజం మీద నమ్మకం కుదురుతుంది. గత రెండు దశాబ్దాలుగా మన దేశంలో సెఫాలజీ ఒక శాస్త్రంగా బాగా వేళ్లూనుకున్నది. 90 నుంచి 95 శాతం వరకు కచ్చితత్వంతో చాలా సంస్థలు రిపోర్టులు ఇవ్వ గలుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కచ్చితత్వం లేకపోయినా ట్రెండ్నయితే సరిగ్గానే పట్టుకుంటున్నారు. విజేతను ముందు గానే గుర్తించగలుగుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 86 శాతం (151) అసెంబ్లీ సీట్లను, 88 శాతం (22) పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్నది. ఇటువంటి భారీ విజయాల సందర్భాన్ని వేవ్గా, ప్రభంజనంగా పేర్కొంటారు. ప్రభంజనం ఉన్న సందర్భాల్లో ఔత్సాహిక సర్వే సంస్థలు సైతం విజేతను సరిగ్గానే ఊహిస్తాయి. సీట్ల సంఖ్యను చెప్పడంలో ప్రొఫెషనల్ సంస్థలు కొంతమేరకు దగ్గరగా రావచ్చు. ఇటు వంటి సందర్భాల్లో కూడా సీట్ల సంఖ్యను పక్కనబెట్టి అసలు విజేతనే తప్పుగా ఊహించేవాడు ఎవడైనా ఉంటాడా? ఒక్కడున్నాడు. వాడే సీ–వోటర్. ముందస్తు సర్వేలో వైసీపీకి 10 సీట్లు, టీడీపీకి 15 సీట్లు వస్తాయని రిపోర్టు ఇచ్చాడు. పోలింగ్ జరిగిన రోజు ఎగ్జిట్ పోల్లో కొద్దిగా సవరించి వైసీపీకి 11, టీడీపీకి 14 ఇచ్చాడు. వాస్తవ ఫలితం తెలిసిందే. వైసీపీకి 22, టీడీపీకి 3 సీట్లు వచ్చాయి. ఆ మూడు సీట్లను కూడా పదివేల లోపు ఓట్ల తేడాతోనే టీడీపీ గెలిచింది. అంత వేవ్ను అంచనా వేయలేకపోతే అది ఒక ప్రొఫెషనల్ సంస్థగా పని చేయడం తగునా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో జరిగిన ఎన్నికలను పరిశీలిద్దాం. పోలింగ్ ముగిసిన రోజున సీ–వోటర్ సంస్థ ప్రెస్మీట్ పెట్టి తెలుగుదేశం 160 సీట్లు గెలవబోతున్నదని ప్రకటించింది. వాస్తవానికి ఆ ఎన్నికల్లో టీడీపీకి 47 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి. ప్రొఫెషనల్ సంస్థ చేసే సర్వే ఇంత దారుణంగా వికటిస్తుందా? వచ్చే ఎన్నికలకు సంబంధించి గడిచిన నెల రోజుల్లో 13 సర్వేలు వచ్చాయి. అందులో పన్నెండు సర్వేలు వైసీపీ గెలుస్తుందని చెప్పాయి. 47.7 నుంచి 51 శాతం వరకు ఆ పార్టీ వోట్ షేర్ను అంచనా వేశాయి. టీడీపీ గెలుస్తుందని అంచనా వేసినవాడు మళ్లీ ఒకే ఒక్కడు. వాడే సీ–వోటర్. టీడీపీకి 17 పార్లమెంట్ సీట్లు, వైసీపీకి 8 పార్లమెంట్ సీట్లు వస్తాయని ఆ సంస్థ ఆంచనా వేసింది. వైసీపీకి 41 శాతం, టీడీపీ కూటమికి 45 శాతం ఓటు షేర్ ఉన్నట్టు ప్రకటించింది. ఊరంద రిదీ ఒక దారైతే ఉలిపి కట్టెది ఇంకో దారి అంటారు. ఇప్పుడు సీ–వోటర్ అనే సంస్థదీ అదే దారి. చంద్రబాబుకు సంబంధించిన ఎన్నికలు జరిగే ప్రతి సంద ర్భంలోనూ ఈ సంస్థ ఆయన పార్టీయే గెలుస్తుందని రిపోర్టులు ఇచ్చింది. గడిచిన 25 సంవత్సరాలుగా ఈ సంస్థది ఇదే కథ. చంద్రబాబు అనగానే ఆటోమేటిక్గా విజేత అని వచ్చేట్టు కంప్యూటర్ ప్రోగ్రామింగేదో వీళ్ల దగ్గర ఉన్నట్టున్నది. సీ–వోటర్ అనే సంస్థ చంద్రబాబు పెంపుడు చిలక అనడానికి ఈ ఉదాహరణలు సరిపోతాయి. ఈ పెంపుడు చిలక పలికిందని గడిచిన రెండు రోజులుగా యెల్లో మీడియా పండుగ చేసుకుంటున్నది. కానీ క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ ప్రకారం ఐదేళ్ల కిందటి ఫలితాలే ఆంధ్రప్రదేశ్లో పునరావృతం కాబోతున్నాయని ఘంటాపథంగా చెప్పవచ్చు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
షర్మిలను నిలదీసిన సామాన్యుడు
అనకాపల్లి: కొన్ని రోజుల క్రితం ఏపీలోని కాంగ్రెస్ పార్టీలో చేరి రచ్చబండ కార్యక్రమం పేరుతో ప్రజలకు వద్దకు వెళుతున్న షర్మిలకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ప్రధానంగా వైఎస్సార్ కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్ పార్టీ కండువా మళ్లీ మీరు ఎందుకు కప్పుకున్నారని షర్మిలను ఓ సామాన్యుడు నిలదీశాడు. గతంలో జగనన్న వెంట నడిచి, ఇప్పుడు మళ్లీ మీరు కాంగ్రెస్ పార్టీ అనడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. జగన్ను అన్యాయంగా జైల్లో పెడితే.. అప్పుడు మీరు పాదయాత్ర చేశారని, అప్పుడున్న నిజాయితీ ఇప్పుడెందుకు లేదని నిలదీశాడు. అనకాపల్లి నియోజకవర్గంలో నర్సీపట్నంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో సామాన్యుడి నుంచి ఎదురైన ఈ హఠాత్తు పరిణామంతో షర్మిల ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఈ సందర్భంగా సదరు వ్యక్తి మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబాన్ని వేధించింది. వైఎస్సార్ పేరు ఎఫ్ఐఆర్లో చేర్చింది. జగన్ను అన్యాయంగా జైల్లో పెట్టింది. ఆ సమయంలో మీరు పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ వైఎస్ కుటుంబానికి అండగా నిలబడ్డారు. వైఎస్ కుటుంబానికి చేసిన అన్యాయాన్ని మా కార్యకర్తలమంతా తప్పుపట్టాం. ఆ సమయంలో మేమంతా మీకు, మీ కుటుంబానికి అండగా నిలబడ్డాం. మీ పాదయాత్రలో మీతో నడిచాం. ఇప్పుడు మళ్లీ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటున్నారు. అందుకే నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి’ అంటూ షర్మిలపై ప్రశ్నల వర్షం కురిపించాడు. వైఎస్ జగన్ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, పింఛన్లు మొదలుకొని ప్రతీ పథకం అర్హుడైన పేదవాడికి అందుతుందని స్పష్టం చేశాడు . -
వాగ్దానాల అమలే పాలనకు గీటురాయి
ఎన్నికల మేనిఫెస్టో అనేది కేవలం ఎన్నికల సందర్భంగా ఇచ్చే అహేతుకమైన హామీల పత్రం కాదు. అలవికాని హామీలు గుప్పించడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా తప్పించుకోవడానికి కొన్ని పార్టీలు తమ శక్తియుక్తులను ఉపయోగించడం కనిపిస్తుంది. అయితే ప్రజలు ఇటువంటి పార్టీలను గమనిస్తూనే ఉంటారు. సమయం వచ్చినప్పుడు ఓటు ద్వారా బుద్ధి చెబుతారు. ఇందుకు మంచి ఉదాహరణ 2014లో తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన విధానాన్ని గమనించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి అధికారం కట్టబెట్టడమే. దీన్ని సద్వినియోగం చేసుకొని వైసీపీ 99 శాతం హామీలను నెరవేర్చి మరో విజయం వైపు దూసుకుపోతోంది. ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు తాము ఏం చేస్తామో చెబుతూ ఒక రాజకీయ పార్టీ తన సిద్ధాంతాలు, ఉద్దేశాలు, విధానాలను ప్రతిబింబిస్తూ ఇచ్చే హామీ పత్రమే ఎన్నికల మేనిఫెస్టో. దీని ఆధారంగా, తమ అంచనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా, ఏ పార్టీ మేనిఫెస్టో ఉందో ప్రజలు నిర్ణయించుకొని ఓటువేయడానికి వీలవుతుంది. అందువల్ల, రాజకీయ పార్టీ హామీలు స్పష్టంగా ఉండాలి. అమలులో ఎలాంటి అస్పష్టతకు ఆస్కారం ఇవ్వకూడదు. భారత ఎన్నికల సంఘం 2013 సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా, రాజకీయ పార్టీలకు ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ కింద మార్గదర్శకాలను రూపొందించడానికీ, వారు చేసిన వాగ్దానాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించిన విషయాలపై చర్చించడానికీ, రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కానీ వాటిపై స్పష్టత రాలేదని చెప్పాలి. చట్ట ప్రకారం, ఎన్నికల మేనిఫెస్టోలోని వాగ్దానాలు అవినీతి అక్రమాల కిందకు రావని అందరికి తెలిసిన విషయమే. కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పార్టీల మధ్య సమాన పోటీ స్థాయిని నిర్ధారించ డానికీ, ఎన్నికల స్వచ్ఛతనూ, ప్రజలకు చేసిన వాగ్దానాలనూ కాపా డటం కోసం మాత్రమేనని నిర్ధారించడమైనది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేయడం సర్వసాధారణం. అమెరికాలో, ఇది ఆర్థిక, విదేశీ విధానాలు, ఆరోగ్య సంరక్షణ, పాలనా సంస్కరణలు, పర్యావరణ సమస్యలు, వలసలు వంటివాటిపై వారు చేయబోయే పనులను తెలియచేస్తుంది. అనేక పశ్చిమ ఐరోపా దేశాలలో, మేనిఫెస్టోలు మరింత నిర్దిష్ట విధాన ఎంపికలు, బడ్జెట్ చిక్కులను ప్రస్తావిస్తాయి. 2022లో ఆర్జేడీ ఎంపీ మనోజ్ కె. ఝా రాజ్యసభలో మాట్లా డుతూ, ఎన్నికల మేనిఫెస్టోకు చట్టబద్ధత కల్పించాలని, ఎన్నికల తర్వాత, రాజకీయ పార్టీలు తాము చేసిన వాగ్దానాలను మరచిపోయి ఆడంబరమైన వాదనలు చేయకుండా చట్టం ఉండాలని చెప్పిన విష యాలను గుర్తు చేసుకోవడం సముచితం. మేనిఫెస్టో ఔచిత్యం తగ్గు తోందని వారు ఆవేదన పడుతూ, 1952, 1957, 1962 ఎన్నికలప్పుడు విడుదల చేసిన మేనిఫెస్టోలను ఉటంకించారు. పార్టీలు చేయదగిన అంశాలను మాత్రమే ఆ యా మేనిఫెస్టోల్లో చేర్చేవారని పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ 2014లో విడుదల చేసిన మేనిఫెస్టోను, ‘దశ–దిశ చూపించే ఒక పవిత్ర పత్రం’గా అభివర్ణించారు ఆ పార్టీవారు. దీనిలో ‘కష్టాలలో ఉన్న రైతులను రుణ మాఫీతో ఆదుకొంటాం’ అని చెప్పారు. రుణమాఫీ గురించి ఇంతకు మించి వివరణ మేనిఫెస్టోలో కనపడదు. అనగా ఏ తారీఖు వరకున్న రుణాలు, ఎంత మేరకు మాఫీ చేస్తారనే విషయం ఎక్కడా లేదు. ఈ విషయమై ఆ పార్టీ అధ్యక్షులు బహిరంగ సభలలో చెప్పిన వాగ్దానాలు మేనిఫెస్టోలో లేవు. గెలిచిన తర్వాత ఈ వాగ్దానం అమలును ‘మమ’ అనిపించడానికి పార్టీ పెద్దలు చాలా శ్రమించారు. ప్రొఫెసర్ కె.వి. రమణారెడ్డి, ఇదే పత్రికలోనూ, డెక్కన్ క్రానికల్ ఆంగ్ల పత్రికలోనూ తెలుగుదేశం పార్టీ ఈ విషయమై రైతులను ఏవిధంగా మభ్య పెట్టిందో తన పరిశోధన ద్వారా విశదంగా వివరించారు. ‘వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, రూ 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రైతువారి ఇన్సూరెన్స్’ వంటి హామీలనూ ఇదే మేనిఫెస్టోలో పెట్టారు. కానీ గెలిచాక, వీటి ఊసే లేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ‘రైతుభరోసా కేంద్రా’లను ఏర్పాటు చేసి, రైతుకు కావలసినవన్నీ ఒకే చోట అందుబాటులో ఉంచడంతో బాటు, నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడం, ధరల స్థిరీకరణ నిధి ద్వారా గిట్టుబాటు ధర అందించడం, పంటనష్ట నివారణకు ఇన్సూరెన్స్ అమలుచేసి రైతుకు అండగా నిలవడం వంటి నిర్మాణాత్మక పనులు చేసింది. తెలుగుదేశంవారు ‘మహిళా సాధికారత కోసం డ్వాక్రా రుణాల రద్దుతో బాటు, వారి అభివృద్ధికి, భద్రతకు పెద్దపీట వేయాలని నిర్ణ యించారు.’ కాని, వాస్తవానికి ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ఐదు సంవత్సరాలలో ఏమి జరిగిందో మహిళలకు తెలుసు. ౖవైసీపీ ప్రభుత్వం వచ్చినాక, డ్వాక్రా రుణాలను వడ్డీతో బాటు మాఫీ గావించారు. ఇలా ఎన్నికల వాగ్దానాలను పార్టీలు మరచిపోతే, ప్రజలు మరచిపోతారు లేదా క్షమిస్తారనుకోవడం పెద్ద పొరబాటు. తెలుగు దేశం తన పార్టీ మేనిఫెస్టోలో, ‘రానున్న అయిదేళ్ళలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం/ ఉపాధి అవకాశం కల్పిస్తా’మని మాటిచ్చింది. కానీ దాని గురించి ఏమీ పట్టనట్లు ఐదేళ్లు గడిపేసింది. యువత 2019లో జరిగిన ఎన్నికల్లో, ఎలా గుణపాఠం చెప్పారో అందరికీ తెలిసిందే. ‘గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్, ప్రతి గ్రామానికీ తారు రోడ్డు, ప్రతి వీధికి సిమెంటు రోడ్డు, ప్రతి ఇంటికి ఉచితంగా మరుగుదొడ్డి నిర్మించి ఇచ్చుట’ వంటి హామీలూ తెలుగుదేశం ఇచ్చింది. అయిదేళ్లు ప్రభు త్వంలో ఉండి, ఎన్ని ఇండ్లు కట్టించారో, మిగతా హామీలు ఏమిచేశారో తెలిసిన విషయమే. ఈ విషయమై ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పనులు, కట్టిస్తున్న కాలనీల గురించి, పచ్చ పత్రికలకు కనబడక పోయినా, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తెలుస్తూనే ఉంది. అలాగే పేద పిల్లలకు పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామనీ, హెల్త్ కార్డ్ ద్వారా అన్నిరకాల వ్యాధులకు కార్పొరేట్, ప్రభుత్వ ఆసు పత్రులలో ఉచిత వైద్యం అందిస్తామనీ మాటిచ్చి గెలిచాక టీడీపీ అమలు చేయలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం పదహారు ప్రభుత్వ ఆసు పత్రులను నిర్మించడంతో బాటు డాక్టర్ల నియామకాలు గావించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి ఇస్తున్న ప్రాధాన్యతను కేంద్రం సైతం కొనియాడింది. ఈ మధ్యకాలంలో ప్రారంభించిన ఇంటింటికి వెళ్లి వైద్యపరీక్ష చేయడంతో పాటు ఇతర సేవలందించడం వంటి కార్య క్రమం ఇండియాలోనే ఆరోగ్యరంగంలో ఒక విప్లవం లాంటిది. పేద లకు చదువే ఒక స్థిరమైన ఆస్తిగా గుర్తించి ‘నాడు–నేడు’ ద్వారా చదు వులో తీసుకొచ్చిన సంస్క రణలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. తెలుగుదేశం 2012లో ప్రకటించిన బీసి డిక్లరేషన్ ప్రకారం 100 శాసనసభ స్థానాలు వారికి కేటాయించడం, వారికి ప్రత్యేక బడ్జెట్, బీసీ సబ్–ప్లాన్ పెట్టి అమలు చేస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రక టించారు. గెలిచాక ఇవన్నీ మూలబడ్డాయి. బీసీలకు ప్రస్తుత ప్రభుత్వం ఏమి చేస్తున్నదో అందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయాల ద్వారా అందిస్తున్న అనేక సేవలు గుర్తుకు వస్తే, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతున్నదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగుదేశం తన మేనిఫెస్టోలో, ‘ప్రతి ఒక్క హామీనీ, పథకాన్నీ, చిత్తశుద్ధితో అమలు చేస్తాం, ఆచరణలో ఆదర్శంగా నిలుస్తాం’ అని చెప్పింది. కానీ ఏ ఒక్క హామీనీ సంపూర్ణంగా అమలు చేయలేక పోయింది. కానీ వైసీపీ నాయకత్వం 2019లో ప్రకటించిన మేని ఫెస్టోను ప్రజలకిచ్చిన ‘బాండు పేపరు’గా పరిగణించి నూటికి 99 శాతం అమలుచేసి... చిక్కుముడులు విప్పి, ఆ ఒక్కశాతం కూడా అమ లుకు ప్రయత్నిస్తామని ప్రజలకు చెబుతోంది. సహజంగా అటువంటి నాయకులను ప్రజలు ఆదరిస్తారు, చిరకాలం గుర్తుపెట్టుకొంటారు. ఎన్నికైన ప్రభుత్వానికి వారిచ్చిన మేనిఫెస్టో కీలకంగా ఉండాలి. వాస్తవిక ఎన్నికల మేనిఫెస్టో కోసం, రాజకీయాలను మరింత జవాబు దారీగా, పారదర్శకంగా చేయడానికి ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ అఫ్ కండక్ట్కు పదును పెట్టి ప్రజలికిచ్చిన హామీలను కనీసం మూడు వంతులైనా పాటించేట్లుగా నిబంధనలు పెట్టాలి. లేని పక్షంలో, ప్రజల కిచ్చిన మాట తప్పినట్లుగా పరిగణించి తగిన శిక్ష విధించాలి. అలా కానిచో పార్టీల మధ్య సమాన పోటీ స్థాయి ఉండదు. ఓటర్ల నమ్మ కాన్ని వమ్ము చేసినట్లవుతుంది. డా‘‘ పి. పృథ్వీకర్ రెడ్డి వ్యాసకర్త హైదరాబాద్లోని ‘సెస్’(సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్) సీనియర్ పరిశోధకుడు ‘ prudhvikar@cess.ac.in -
వైఎస్సార్సీపీని తప్పించడమంటే.. టీడీపీకి రాజ్యాధికారం ఇవ్వడం కాదు
పాలకొల్లు సెంట్రల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజ్యాధికారం నుంచి తప్పించడమంటే టీడీపీకి పూర్తిగా రాజ్యాధికారం కట్టబెట్టడం కాదని జనసేన అధినేత పవన్కళ్యాణ్కు మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామ జోగయ్య చురకలు అంటించారు. పవన్ తనకు అధికారం ముఖ్యంకాదు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అంటుంటారని, అలాగైతే అధికారం చంద్రబాబుకు ధారపోస్తే మీరు కలలుగంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దక్కుతాయని జనసైనికులు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారని జోగయ్య ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం ఆయన పవన్నుద్దేశించి సూటిగా పలు ప్రశ్నలు సంధిస్తూ ఒక లేఖ రాశారు. దానిని ఆయన మీడియాకు విడుదల చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. ► జనసైనికులు సంతృప్తిపడేలా సీట్ల పంపకంలో కాకపోయినా ముఖ్యమంత్రి పదవిలోనైనా రెండున్నర సంవత్సరాలు జనసేనకు కట్టబెట్టనున్నట్లు ముందుగానే చంద్రబాబు నోటితో చెప్పించగలరా? ► పవన్కళ్యాణ్, చంద్రబాబునాయుడు అసెంబ్లీ సీట్ల పంపకం, ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో దఫదఫాలుగా సమావేశాలు నిర్వహిస్తుండడం గమనిసూ్తనే ఉన్నాం. కానీ వారిద్దరి మధ్యలో ఏయే చర్చలు జరిగాయో, ఎవరికెన్ని సీట్లు ఇస్తారో, ఏయే అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని అంగీకరించారో వివరిస్తూ ఓ ఎల్లో టీవీ ఛానల్లో జనసేనకు 30 సీట్లని, మరో ఎల్లో వార్తా పత్రికలో 27 సీట్లని ప్రకటనలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. ► ఎన్నికల నోటిఫికేషన్లోగా ఇద్దరు నాయకులు పైవిధంగా ప్రకటించబోతున్నట్లుగా ఎల్లో మీడియాలో రావడం ఎవరిని ఉద్ధరించడానికి? ► వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపాలంటే జనసేన పార్టీకి ఇష్టం ఉన్నా లేకున్నా తెలుగుదేశం పార్టీతో జతకట్టి ముందుకెళ్లడం తప్పని పరిస్థితిగా ఏర్పడింది. ► అయితే, వైఎస్సార్సీపీని రాజ్యాధికారం నుంచి తప్పించడం అంటే టీడీపీకి పూర్తిగా రాజ్యాధికారం కట్టబెట్టడం కాదు. జనసేన సపోర్టు లేకుండా టీడీపీ ఒంటరిగా వెళ్తే మెజారిటీ సీట్లు దక్కించుకోవడం జరిగే పనికాదు. ఇందుకు 2019 ఎన్నికలే నిదర్శనం. ►దీన్ని దృష్టిలో పెట్టుకుంటే జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు కేటాయిస్తుందనేది ప్రధాన అంశంకాదు.. జనసేన టీడీపీకి ఎన్ని సీట్లు ఇస్తుందనేది ముఖ్యమైన అంశం. ►కానీ, 25 శాతం జనాభా ఉన్న కాపులు అధికంగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన టీడీపీ నుంచి ఎన్ని సీట్లు దక్కించుకుంటోంది? 20 లక్షల జనాభా ఉన్న రాయలసీమలో బలిజలు ఎన్ని సీట్లు, ఉత్తరాంధ్రలో ఎక్కువ జనాభా ఉన్న తూర్పు కాపులు ఎన్ని సీట్లు దక్కించుకోగలుగుతున్నారనేది కాపులకు జనసేన సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. చంద్రబాబును అధికారంలోకి తేవడానికి కాదు కాపులు పవన్ వెంట నడిచేది. 175 సీట్లు ఉన్న రాష్ట్రంలో కనీసం 50 సీట్లయినా జనసేన దక్కించుకోగలిగితేనే రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా దక్కే అవకాశం ఉంటుంది. -
దుష్ట చతుష్టయాన్ని తరిమి కొడదాం
సాక్షి, భీమవరం: ‘రాష్ట్రంలో మరో యుద్ధానికి సమయం ఆసన్నమైంది. ఇది మంచికి, చెడుకీ... ప్రజా సేవకునికి, ప్రజా ద్రోహులకూ... సంక్షేమానికి, విధ్వంసానికీ మధ్య యుద్ధం. ఇందులో మంచినే అందరూ కోరుకోవాలి. దుష్ట చతుష్టయాన్ని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలి. జననేత సారథ్యంలో పేదల ఇంట సంక్షేమ కాంతులు విరజిల్లాలంటే ప్రతి ఒక్కరూ చేతులు కలపాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకునేందుకు మరలా వైఎస్సార్సీపీని గెలిపించుకోవాలి. ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలంటే మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి.’ అని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ సమర శంఖారావం పూరిస్తూ ఏలూరు జిల్లా దెందులూరులోని సహారా గ్రౌండ్స్లో శనివారం నిర్వహించిన సిద్ధం సభలో నాయకుల ప్రసంగాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఆ ప్రసంగాల వివరాలు వారి మాటల్లోనే.. జగన్ పాలన వల్లే ధైర్యంగా జనంలోకి గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెబుతాడు ఓ వ్యక్తి. పదేళ్లుగా పార్టీ నడుపుతున్నానంటూ ప్యాకేజీకి అమ్ముడుపోతాడు మరో నాయకుడు. వీళ్లంతా మన నాయకుడిని ఎదుర్కొనేందుకు వస్తున్నామని చెప్తున్నా... ఇప్పటివరకు తమ అభ్యర్థుల పేర్లనే చెప్పలేకపోతున్నారు. కానీ సీఎం జగన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. గతంలో చంద్రబాబు పాలనలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయినా ప్రజల వద్దకు వచ్చారా... ఈ రోజు 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నారంటే అది సీఎం జగన్ సుపరిపాలన వల్లే. – వెలంపల్లి శ్రీనివాస్, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే ఇక వార్ వన్ సైడే ఇది జనమా జన సంద్రమా, లేక జగనన్న ప్రభంజనమా. ప్రజలకు అండగా నిలవడమే తప్ప మడమ తిప్పని నాయకుడు జగన్. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారతకు కొత్త భాష్యం చూపించిన కార్యసాధకుడు మన సీఎం. అందుకే ఆయన్ని చూస్తే పేదలకు కొండంత బలం. మా బలం పేరు జగన్, మా కమిట్మెంట్ పేరు కూడా జగన్. ఈ రోజు 175 స్థానాల్లో పిచ్ ఏదైనా విజయం మనదే. జగనన్న రంగంలోకి దిగాక ఇక వార్ వన్ సైడే. – కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు ఎమ్మెల్యే హామీలన్నీ అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్ నమ్మకానికి మారుపేరు జగన్మోహన్రెడ్డి అయితే.. మోసానికి మారుపేరు చంద్రబాబు. పేదల పక్షపాతి జగన్మోహన్రెడ్డి సమాజం కోసం పాటుపడుతుంటే.. పనికిమాలిన కొడుకు కోసం చంద్రబాబు పాకులాడుతున్నారు. దాదాపు పదేళ్లు టీడీపీలో ఉండి ఎంపీగా పనిచేశాను. ఈ నాలుగున్నరేళ్లు సీఎం జగన్మోహన్రెడ్డి పరిపాలన చూశాను. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి హామీనీ అమలు చేసిన సీఎం ఈయన ఒక్కరే. పేదల కోసం రెండున్నర లక్షల కోట్లు ఖర్చు చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిదే. తన పిల్లల మాదిరి పేదల పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలని, అంబేడ్కర్ అంతటి గొప్పవాళ్లు కావాలని ఆలోచన చేసిన నాయకుడు జగన్. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. – కేశినేని నాని, ఎంపీ జనం హృదయాల్లో జగన్ సుస్థిర స్థానం పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న సమరంలో పేదల పక్షాన పోరాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాష్ట్ర ప్రజానీకం అండగా ఉంది. దానికి నిదర్శనం ఈ సభకు తరలివచి్చన అశేష జనవాహిని. ఐదేళ్ల క్రితం అనితర సాధ్యమైన 3,650 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో చేసిన వాగ్దానాలనే మేనిఫెస్టోగా చేసుకుని ఐదేళ్ల పాలనలో వాటన్నింటినీ నెరవేర్చి కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఆయన సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. మీకు మంచి జరిగిందనుకుంటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడిగిన సీఎం జగన్ లాంటి దమ్మున్న నాయకుడు దేశ చరిత్రలో ఎవ్వరూ లేరు. – ఆళ్ల నాని, ఏలూరు ఎమ్మెల్యే అబద్ధం అంటే చంద్రబాబు... జగన్ అంటే నిజం... ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి జ్యూడీíÙయరీ, లెజిస్లేటరీ, ఎగ్జిక్యూటివ్, జర్నలిజం నాలుగు స్తంభాలు. దురదృష్టం ఏమిటంటే ఈ నాలుగో స్తంభాన్ని ఈనాడు అనే కల్తీ సిమెంట్తో, ఆంధ్రజ్యోతి అనే కల్తీ రాళ్లతో, ఏబీఎన్ అనే బొండి ఇసుకతో, పవన్ కళ్యాణ్ అనే ఉప్పు నీటితో చంద్రబాబు నిరి్మంచిన ప్రజాస్వామ్యం పడిపోదా ? ఆలోచించండి. 600 హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయని చంద్రబాబు అబద్ధం అయితే, నిజం అనే మన నాయకుడు నవరత్నాలే ఇచ్చాడు. పేదవాడికి ఇంగ్లిష్ విద్య అందిస్తుంటే ఈ అబద్దపు చంద్రబాబు అడ్డుపడుతున్నాడు. తెలుగుదేశం కార్యకర్త అవినీతికి కేరాఫ్ అయితే, వైఎస్సార్సీపీ కార్యకర్త ఎవరైనా నిజాయితీకి నిలువుటద్దం. – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర మంత్రి జగనన్న పిలుపే ఒక ప్రభంజనం సిద్ధం.. ఈ పదమే ఒక వైబ్రేషన్. జగనన్న పిలుపే ఒక ప్రభంజనం. ఐదేళ్ల కాలంలో చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేర్చిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డి. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఊరూవాడా తిరిగి డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మహిళలను నమ్మించి అధికారంలోకి వచ్చాక ఏవిధంగా వంచించాడో రాష్ట్రంలోని 79 లక్షల డ్వాక్రా అక్కచెల్లెమ్మలందరికీ తెలుసు. వారంతా మరలా జగన్ను సీఎం చేసేందుకు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. బాబు హయాంలో 30 లక్షలమందికి పింఛన్లిస్తే ఈ రోజు 65 లక్షల 35 వేల మందికి మన జగన్ అందిస్తున్నారు. నాడు ఒక్క ఇంటి పట్టా ఇవ్వకపోగా... ఈ ప్రభుత్వం 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచి్చంది. 45 ఏళ్లు నిండిన 26 లక్షల మంది మహిళలకు చేయూత పథకం ద్వారా సాయం అందిస్తున్నారు. పిల్లలను చదివించుకునేందుకు 50 లక్షల మందికి అమ్మ ఒడి పథకం అందిస్తున్నారు. – పినిపే విశ్వరూప్, రాష్ట్ర మంత్రి -
జగన్ ప్రభం‘జనం’
సిద్ధం సభ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జనం.. జగన్ కలిస్తే ప్రభంజనమేనని గోదారమ్మ సాక్షిగా మరోసారి ప్రజలు చాటిచెప్పారు. రాష్ట్రంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా శ్రేణులను సన్నద్ధం చేయడానికి శనివారం ఏలూరుకు సమీపంలో ‘సిద్ధం’ పేరుతో నిర్వహించిన సభకు కెరటాల్లా జనం పోటెత్తారు. ఉభయగోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి వేలాది వాహనాల్లో లక్షలాది మంది కదలివచ్చారు. సభా వేదికపైకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేరుకోకముందే ప్రాంగణం కిక్కిరిసిపోయింది. లక్షలాది మంది ప్రజలు కోల్కత–చెన్నై జాతీయరహదారిపై నిలబడిపోయారు. సభా ప్రాంగణం నిండిపోవడం, జాతీయ రహదారిపై లక్షలాది మంది ప్రజలు బారులు తీరడంతో.. హైవేపై కలపర్రు టోల్ ప్లాజ్ నుంచి విజయవాడ వైపు 15 కి.మీల పొడవున.. రాజమహేంద్రవరం వైపు గుండుగొలను వరకూ 17 కి.మీల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. సభా ప్రాంగణం, జాతీయ రహదారిపై ఎన్ని లక్షల మంది ఉంటారో.. అదే స్థాయిలో ట్రాఫిక్లో చిక్కుకుపోయిన వాహనాల్లో జనం ఉంటారని చెబుతున్నారు. దుష్టచతుష్టయంపై యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన రణగర్జనకు... సిద్ధమంటూ లక్షలాది గొంతులు ప్రతిధ్వనించాయి. ఎండ తీవ్రత పెరిగినా జనం లెక్క చేయలేదు. సీఎం జగన్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ జై జగన్ అంటూ నినదించారు. జగన్ ఒంటరివాడని దుష్టచతుష్టయం అనుకుంటోందని అంటే.. ‘మీరేలా ఒంటరి అవుతారు.. మేమంతా మీ వెంటే.. మీ సైన్యం మేమే’ అంటూ లక్షలాది గొంతులు నినదించాయి. భీమిలి సభ కంటే రెండు రెట్లు అధికంగా ఏలూరు సభకు జనం తరలివచ్చారు. ‘చంద్ర’ముఖిపై అప్రమత్తం చేద్దాం రాష్ట్రంలో గత 57 నెలలుగా అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన వల్ల ప్రతి ఇంట్లో.. గ్రామంలో.. నియోజకవర్గంలో వచ్చిన విప్లవాత్మక మార్పును కళ్లకు కట్టినట్లు వివరిస్తూ సీఎం జగన్ ప్రసంగించారు. సంక్షేమ పథకాల ద్వారా రూ.2.55 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని.. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పనిచేసినప్పుడు ఇచ్చిన హామీల్లో పది శాతమైనా అమలు చేశారా? అని ప్రతి ఇంటికెళ్లి అడగాలంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీకి ఓటేయకపోవడం.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి ఓటేయడమంటే సంక్షేమ పథకాల రద్దుకు ఆమోదం తెలిపినట్లేనన్నది ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా 124 సార్లు సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధి చేకూర్చారని.. ఇప్పుడు ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాను గుర్తు మీద బటన్ రెండు సార్లు నొక్కాలని.. లేదంటే.. చంద్రముఖి సైకిలెక్కుతుందని హెచ్చరించారు. టీ గ్లాసు పట్టుకొని పేదల రక్తం తాగేందుకు ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుందని గడపగడపకు చెప్పాలని పిలుపునిచ్చారు. పోటెత్తిన యువత సభకు హాజరైన వారిలో అత్యధికులు 20 నుంచి 35 ఏళ్లలోపు వారే ఉండటం గమనార్హం. యువతను అభిప్రాయ నిర్ణేతలుగా రాజకీయ పరిశీలకులు భావిస్తారు. ఏలూరు సభకు యువత పోటెత్తడానికి ప్రధాన కారణం సీఎం వైఎస్ జగన్ విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో తెచ్చిన విప్లవాత్మక మార్పులేనని అంటున్నారు. వైఎస్ జగన్ను మళ్లీ సీఎంగా చేసుకుంటేనే.. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని బలంగా విశ్వసిస్తుండటం వల్లే యువత వైఎస్సార్సీపీ పక్షాన సైనికుల్లా నిలబడుతున్నారని చెబుతున్నారు. ఈ సభకు యువతతో పోటీపడి వృద్ధులు కూడా తరలివచ్చారు. ఉదయం నుంచే బారులు సభకు సీఎం జగన్ మధ్యాహ్నం మూడు గంటలకు వస్తారని తెలిసినా.. ఉదయం 11 గంటల నుంచే జనం తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకే సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దీంతో కోల్కతా–చెన్నై జాతీయ రహదారిపై లక్షలాది మంది జనం నిలబడిపోయారు. సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తున్నంత సేపు ఇంకా వాహనాలు వస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో వేలాది మంది సభకు రాలేక వెనుదిరిగారు. -
జగన్ను మళ్లీ సీఎం చేయడానికి మేమూ సిద్ధం
ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నారు మా ఇంటి ముంగిటకే సీఎం జగన్ పింఛన్ అందిస్తున్నారు. నెలకు రూ.1000 మాత్రమే చంద్రబాబు ఇస్తే సీఎం జగన్ రూ.3 వేలు ఇస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగనన్నకే మా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. – మేకా శ్రీనివాస్, బుద్దాలపాలెం, మచిలీపట్నం జగనన్న మేలు మరువలేం సీఎం వైఎస్ జగన్ మేలు మరువలేం. గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ బియ్యం, ఒకటో తేదీనే పింఛన్లు వలంటీర్లు ఇంటివద్దకే వచ్చి అందిస్తున్నారు. పేద ప్రజలకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది? గ్రామ సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలు ఇంటికే పంపిస్తున్నారు. – ఎం.కృష్ణారెడ్డి, డీఎన్ పాలెం, రంపచోడవరం జగనన్నకే మా మద్దతు సీఎం జగన్మోహన్రెడ్డి చెప్పిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేశారు. 99 శాతం హామీలు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ నెరవేర్చిన దాఖలాలు లేవు. 86 శాతం ప్రజలకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తోంది. మేనిఫెస్టోను వెబ్సైట్లో నుంచి తొలగించిన ప్రబుద్ధులు కూడా ఉన్నారు. వారు ప్రజల్లోకి ఎలా వెళ్లగలుగుతారు? – కరుటూరి ఉమాదేవి, తణుకు ముఖ్యమంత్రి సేవలు శ్లాఘనీయం సీఎం జగన్ సేవలు అద్భుతంగా ఉన్నాయి. సంక్షేమ పథకాల ద్వారా రూ.2.5 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లోకి వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాత్రమే. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన దాఖలాలు లేవు. గతంలో నగదు అంతా ఏమైందో ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు దీనికి బదులు చెప్పాలి. – కంభం రాణి అయ్యంకి, పామర్రు నియోజకవర్గం డ్వాక్రా రుణాలు మాఫీ చేశారు డ్వాక్రా రుణాలు మాఫీ చేసి సీఎం మహిళలకు చేయూత అందిస్తున్నారు. ఒక్కొక్క మహిళకు రూ.5 వేల నుంచి రూ. లక్ష వరకు రుణాల మాఫీ జరిగింది. వైఎస్సార్ చేయూత ద్వారా మరో రూ.18,750 అందించి మహిళలకు ఆసరాగా నిలుస్తున్నారు. గతంలో చంద్రబాబు పసుపు–కుంకుమ పేరుతో మోసం చేశాడు. – ఉడతా రమణ, చిన్నాయగూడెం, గోపాలపురం నియోజకవర్గం రైతులను ఆదుకుంటున్నారు గ్రామాల్లో సుమారు రూ.1 కోటి వ్యయంతో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్ మిల్క్ సెంటర్లు, వెల్ నెస్ సెంటర్లు నిర్మించారు. రైతులకు అందుబాటులో ఎరువులు, సబ్సిడీ విత్తనాలు, యంత్రాలు, పనిముట్లు, ట్రాక్టర్లు సబ్సిడీపై అందిస్తున్నారు. గ్రామాల్లోనే ఆధునిక వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. – జి.ముసలయ్య, బావయ్యపాలెం, ఉంగుటూరు అర్హులైన పేదవారందరికీ ఇళ్ల స్థలాలు అందించారు భారత దేశ చర్రితలో కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అర్హులైన పేదవారందరికీ 33 లక్షల ఇళ్ల స్థలాలు అందించారు. గత పాలకులు ఎవరూ భూమి కొని ఇళ్ల స్థలాలు అందించిన దాఖలాలు లేవు. పేదవానికి ఇంటి స్థలం, నిర్మాణానికి రుణం అందించారు. విద్యుత్, రోడ్లు, నీటి సౌకర్యంతో మరో ఊరు నిర్మాణం చేపడుతున్నారు. – కాటి నాగరాజు, ఉప సర్పంచ్, అప్పాపురం, మండవల్లి, కైకలూరు ప్రతిపక్షాల మాటలు నమ్మం జగనన్న సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు రాష్ట్రం శ్రీలంకలా అయిపోతుందని ప్రతిపక్ష నాయకులు ప్రచారం చేశారు. ఇప్పడు అవే పథకాలు ఇస్తానని చెబుతున్న చంద్రబాబు.. మరి ఇప్పుడు సింగపూర్ అవుతుందా అనే ప్రశ్నకు జవాబివ్వాలి. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రతిపక్షాల మాటలు నమ్మం. – బొజ్జా రామకృష్ణ సోమేశ్వరరావు, అచ్యుతాపురం, మండపేట నియోజకవర్గం నమ్మకానికి ప్రతీక జగన్ సీఎం వైఎస్ జగన్ దూరదృష్టితో ప్రజలు, రాష్ట్రం బాగు కోసం శ్రమిస్తారు. చంద్రబాబు కేవలం వ్యాపార దృక్పథంతో పాలన చేస్తారు. జగన్ నమ్మకానికి ప్రతీక. రాష్ట్ర ప్రజలంతా ఏకపక్షంగా ఆయన్ని మరోసారి ముఖ్యమంత్రిని చేయడం ఖాయం. 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించి చరిత్ర సృష్టిస్తారు. – ఘంటా శ్రీలక్ష్మి, ఎంపీపీ, ఉంగుటూరు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు గ్రామ సచివాలయాల ద్వారా 2.30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఏకైక సీఎం జగన్ మాత్రమే. వైద్య ఆరోగ్య శాఖలో వేలాది మందికి ఉపాధి కల్పించారు. వలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వీరు కరోనా సమయంలో ప్రజలకు బాసటగా నిలిచారు. – వై.నర్సింహారావు, పెదపాడు, దెందులూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి కరోనా ప్రభావం లేకపోయినా, రాష్ట్రం విడిపోకపోయినా ఏపీ ఎంతో అభివృద్ధి జరిగేది. ప్రత్యేక పరిస్థితుల్లో సీఎం జగన్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రం విడిపోయి కేంద్రం ఆర్థికంగా మద్దతు ఇవ్వకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిలుపు చేయలేదు. యథావిధిగా కొనసాగించారు. – ఇళ్ల సాయిబాబా, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా ఏ ప్రాంతంలో చూసినా ఒకే తరహాలో ఆదరణ సీఎం జగన్కు ఏ ప్రాంతంలో చూసినా ఒకే తరహాలో ఆదరణ లభిస్తుంది. తండ్రి బాటలో పయనిస్తూ ఇచ్చిన హామీని మాట తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇక ప్రజలు ఏ రకంగా మరొక వ్యక్తికి అవకాశం ఇస్తారు? జగనే మరోసారి ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం. – కె.కృష్ణ, పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా చంద్రబాబు ఇచ్చే హామీలు ఎవరూ నమ్మరు ఎన్నికల ముందు చంద్రబాబు ఓట్ల కోసం ఇచ్చే హామీలను ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్ని సామాజిక వర్గాల ప్రజలకూ న్యాయం చేస్తున్నారు. ఎవరికి ఏ పథకం అవసరమో గతంలో నిర్వహించిన పాదయాత్రలోనే తెలుసుకున్నారు. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తోంది. – బాబూరావు, గన్నవరం, కృష్ణాజిల్లా నూతన ఒరవడి సృష్టించారు వైఎస్ జగన్ రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించారు. విద్యావంతులు, వివిధ రంగాల్లో నిష్ణాతులను ప్రజాప్రతినిధులుగా ఎంచుకున్న తీరే పాలనపై ఆయనకు ఉన్న ప్రణాళికను తెలి యజేసింది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దుతారు. – దేవబత్తుల శిరీష, ఉప్పులూరు, ఉండి నియోజకవర్గం ఇంతకన్నా మార్పు ఏం కావాలి? ఏ ముఖ్యమంత్రి హయాంలోనైనా ఎమ్మెల్యేలు ఇంటింటా తిరిగినా దాఖలాలు లేవు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఎమ్మెల్యేలు, మంత్రులను సైతం ఇంటింటికీ పంపారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తున్నారు. ఇంతకన్నా మార్పు ఏం కావాలి? – కె.రోజావాణి, పి.గన్నవరం, తూర్పుగోదావరి జిల్లా నేరుగా నగదు బదిలీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి నేటి వరకు ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేశారు. సంక్షేమం లబ్ధి అందని వారికి సైతం ఒకటికి, రెండు సార్లు అవకాశం కల్పించారు. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రంలోనైనా ఉంటారా? – చిట్టూరి శివప్రసాద్, పి.గన్నవరం, తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు వారధిగా ప్రణాళిక ప్రజలకు ప్రజాప్రతినిధులు వారధిగా ఉండేలా సీఎం ప్ర ణాళికను రూపొందించారు. తద్వారా రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించారు. ప్రజలకు, అభివృద్ధి పనులకు మధ్య దళారీలు ఉండకుండా నగదు బదిలీని అమలు చేస్తున్నారు. – ఎన్.సూర్యకుమారి, ఉండి నియోజకవర్గం -
ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కండి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, మీ అన్నను అభిమానించే ప్రతి కార్యకర్తకు, నాయకుడికీ, అభిమానికీ, వలంటీర్కు ఒక విషయం చెబుతున్నా. వార్డు మెంబర్ల దగ్గర నుంచి సర్పంచుల వరకు, ఎంపీటీసీల దగ్గర నుంచి ఎంపీపీల వరకు, జెడ్పీటీసీల దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు, మున్సిపల్ కౌన్సిలర్ల దగ్గర నుంచి చైర్మన్ల వరకు, కార్పొరేటర్ల దగ్గర నుంచి మేయర్ల వరకూ, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న డైరెక్టర్లు, చైర్మన్లు వైఎస్సార్సీపీ ఇతర ప్రజా ప్రతినిధులందరికీ ఒక్కటే చెబుతున్నా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీది. మీ బిడ్డ జగన్ మీ అందరికీ ఒక మంచి సేవకుడు. పెత్తందారులతో యుద్ధానికి నేను సిద్ధం. ఈ యుద్ధం 15 ఏళ్లుగా నాకు అలవాటే. నాతో నడిచారు కాబట్టి మీకూ అలవాటే. ఈ ఒక్కడి మీద కలబడి వంద మంది వంద బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లోంచి పుట్టిన ప్రజల పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఒక్కడి మీద దేశంలోకెల్లా బలమైన 10 వ్యవస్థల్ని ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా. 100 బాణాల్ని, కౌరవ సైన్యాన్ని ప్రజా క్షేత్రంలో మరోసారి ఎదుర్కొని మరో గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు అడుగులు ముందుకు వేద్దాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘57 నెలల్లో మన జగనన్న 124 సార్లు బటన్ నొక్కి రూ.2.55 లక్షల కోట్లు నేరుగా లంచాలు, వివక్షకు తావు లేకుండా మనందరి ఖాతాల్లో నగదు జమ చేశారు. అలాంటి ఆయన కోసం మనం కేవలం రెండు బటన్లు నొక్కలేమా.. అని ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. జగనన్నకు ఓటు వేయక పోవడం అంటే ప్రతిపక్షాలకు ఓటు వేయడమే అర్థం అన్నారు. అంటే సంక్షేమాభివృద్ధి పథకాల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్లవుతుందని ప్రతి ఒక్కరికీ చెప్పాలని కోరారు. ప్రతిపక్షానికి ఓటు వేయడం అంటే మళ్లీ వివక్ష చూపించే జన్మభూమి కమిటీలను బతికించినట్లవుతుందని వివరించాలన్నారు. శనివారం ఆయన ఏలూరు జిల్లా దెందులూరు వద్ద నిర్వహించిన ఎన్నికల శంఖారావం సభలో అశేష జనవాహినినుద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఇంటి వద్దకే పెన్షన్ రావాలన్నా, డీబీటీ స్కీములు రావాలన్నా.. జగనన్న వల్ల మాత్రమే సాధ్యమవుతుందనే విషయాన్ని ఇంటింటా ప్రచారం చేయాలని కోరారు. తనకు తోడేళ్ల మద్దతు లేదని, నక్కజిత్తులు, మోసం చేసే అలవాటు అంత కంటే లేదని చెప్పారు. ‘మీరు రెండు ఓట్ల ద్వారా చంద్రముఖిని శాశ్వతంగా బంధించవచ్చు. లేదంటే అది సైకిలెక్కి, టీ గ్లాసు పట్టుకుని.. పేదల రక్తం తాగేందుకు లక లక అంటూ ఇంటింటికీ వచ్చి అబద్ధాలతో, మోసాలతో ఒక డ్రాక్యులా మాదిరిగా తలుపు తడుతుంది. అప్రమత్తంగా ఉండాలని గడపగడపకు వెళ్లి ప్రతి ఒక్కరికీ చెప్పండి. 14 ఏళ్లు సీఎంగా పని చేసినా, చంద్రబాబు చెప్పుకొనేందుకు ఏమీ లేదు. కాబట్టి చంద్రబాబు రాజకీయం అంతా పొత్తులు, జిత్తులు, నక్కజిత్తులుగా సాగుతోంది. నేను ఇది చేశాను.. నాకు ఓటేయండి అని అడగలేని దుస్థితి ఆయనది. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచింది ఆయనే.. మళ్లీ ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ను గుర్తు తెచ్చుకునేదీ ఆయనే. తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా అని ప్రజల్ని కాదు.. పార్టీలను పిలుస్తున్నాడు. నేనిచ్చే ప్యాకేజీ కోసం రా కదలిరా అని దత్తపుత్రుడిని ప్రత్యేకంగా పిలుస్తున్నాడు. వదినమ్మను పిలుస్తున్నాడు. కమలం పార్టీలో చేరిన ఆయన మనుషులను రా కదలిరా అని పిలుస్తున్నారు’ అని సీఎం జగన్ నిప్పులు చెరిగారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. వాళ్లు నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ ♦ రాష్ట్రాన్ని అన్యాయంగా, అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని, వైఎస్సార్ మరణం తర్వాత ఆయన పేరును అన్యాయంగా ఛార్జ్షీట్లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని కూడా ‘రా.. కదలిరా’ అని చంద్రబాబు పిలుస్తున్నాడు. బాబుకు, దత్తపుత్రుడికి, వదినమ్మకు, చంద్రబాబు బ్యాచ్కు.. అసలు ఈ స్టేట్తోనే సంబంధమే లేదు. వీరిలో ఏ ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఉండరు. వీరంతా నా¯Œన్ రెసిడెంట్ ఆంధ్రాస్. పని పడినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారు. ♦ ఆయన సైకిల్ తొక్కడానికి ఇద్దర్ని, దాన్ని తోయటానికి మరో ఇద్దర్ని, పొత్తులో తెచ్చుకొని రా కదలిరా అని పిలుస్తున్నాడు. చంద్రబాబుకు పొత్తే లేకపోతే 175 చోట్ల ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరు. ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ మీ జగనన్నే టార్గెట్గా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి. పేదవాడి భవిష్యత్ టార్గెట్గా, పేద వాడి సంక్షేమం టార్గెట్గా వీరంతా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నారు. ప్రతి ఇంటికీ మంచి చేయగలిగాం ♦ కార్యకర్తల్ని, నాయకులుగా అభిమానించే విషయంలో, వారికి పదవులు, అధికారం ఇచ్చే విషయంలో ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్లను, చైర్మన్లను నియమించిన చరిత్ర మనది. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్లు, చైర్మన్లు పదవులు ఇవ్వడం మీ జగనన్నకు మాత్రమే సాధ్యం. ♦ గతంలో తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు, పక్షపాతంతో కొద్ది మందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తే, ఆ స్ధానంలో మనందరి ప్రభుత్వం మన చదువుకున్న పిల్లలతో తీసుకువచ్చిన మనదైన వలంటీర్ వ్యవస్థ, ఇంటింటికీ వెళ్లి పని చేస్తున్న మన ప్రభుత్వానికి దన్నుగా, ప్రజల మన్ననలు పొందుతోంది. ♦ పార్టీని అభిమానించే వారికి చరిత్రలో ఎవరూ ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాం. నామినేషన్ పనులు కేటాయింపులో ఇదే పంథా, న్యాయం కొనసాగించాం. ఎవ్వరూ గెలవనన్ని పదవులు, గతంలో ఏ రాజకీయ పార్టీ ఇవ్వనన్ని అవకాశాలు.. వార్డు మెంబరు మొదలు సర్పంచులు, ఎంటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీచైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రి మండలి సభ్యుల వరకు అవకాశాలు కల్పించాం. ♦ ప్రతి ఇంటికీ మంచి చేయగలిగాం. ఇక్కడున్న మనలో ఎవరైనా ఏ పదవికైనా పోటీ పడితే.. రాష్ట్ర ప్రజలు తమకు జరిగిన మంచికి మనల్ని గుండెల్లో పెట్టుకుని ఎప్పుడూ గెలవనంత మెజార్టీతో గెలిపించే కార్యక్రమం జరుగుతోంది. అందుకే భవిష్యత్లో ఇంతకంటే గొప్పగా వారికి పదవులిచ్చే పార్టీ మనది. ఎంతో భవిష్యత్ ఉన్న పార్టీ. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం ♦ వ్యక్తిగతంగా ఒక్క విషయం చెబుతున్నా. పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాం. ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మీ అన్న, మీ తమ్ముడు సలహా ఇచ్చేది ఒక్కటే. గొప్పగా సేవ చేయండి. గొప్పగా మంచి చేయండి. లంచాలు, వివక్ష లేని పరిపాలనలో మీ వంతు కృషి మీరు చేయండి. మీలో ప్రతి ఒక్కరినీ మరో రెండు మెట్లు ఎక్కించే బాధ్యత నాది. టార్గెట్ 175 కి 175 ఎమ్మెల్యేలు, 25 కి 25 ఎంపీలు. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎంపీగానీ, ఒక్క ఎమ్మెల్యేగానీ తగ్గడానికి వీల్లేదు అని తెలియజేస్తున్నా. ఈ లక్ష్యాన్ని చేరుకునేలా గడపగడపకూ వెళ్లి ప్రతి ఒక్కరితో ఓటు వేయించేందుకు మీరంతా సిద్ధం కావాలి. ♦ ఎన్నికల శంఖం మోగుతోంది. బాబు కుట్రలు, కుతంత్రాలను చిత్తు చేసేందుకు మనందరికీ ఉన్న అస్త్రం.. మీ జేబులో ఉన్న మీ సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్తో సోషల్ మీడియా పరంగా సిద్ధంగా ఉండండి. మనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు. మనకు తోడు పైన దేవుడు, మంచి జరిగిన ఇంట్లో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మ, అన్నదమ్ములు, అవ్వాతాత మనకు తోడు. రాబోయే 60 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రజాక్షేత్రంలో పోరాడటానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నా. -
మీరే సారథులు.. మీ జగన్ సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే: సీఎం జగన్
జరగబోయే ఎన్నికల రణ క్షేత్రంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు, మీ అందరికీ తోడు అర్జునుడిలా నేను.. మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మన అస్త్రాలుగా మల్చుకుని, కౌరవ సైన్యం మీద యుద్ధం చేద్దాం. ఎన్నికల యుద్ధంలో మన సంక్షేమం మీద, ప్రతి ఇంటికీ మనం చేస్తున్న మంచి, అభివృద్ధి మీదే వాళ్ల దాడి ఉంటుంది. పేద వాడి భవిష్యత్, సంక్షేమం, గ్రామ గ్రామాన అభివృద్ధి, సామాజిక వర్గాల అభివృద్ధి మీద, మనందరి ప్రభుత్వం రాబోయే తరం కోసం అమలు చేస్తున్న విద్యా విధానం మీద ఈ పెత్తందారులు దాడి చేస్తున్నారు. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, నాడు–నేడుతో మారుతున్న స్కూళ్లు, హాస్పిటళ్లు, పారిశ్రామిక అభివృద్ధి, మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ దండయాత్ర చేస్తోంది. చంద్రబాబు దుష్ట సైన్యాన్ని, వారి కుట్రల్ని, కుతంత్రాల్ని, చీల్చి చెండాడటానికి మళ్లీ మనం సిద్ధమవుదాం. మేనిఫెస్టో రిలీజ్ చేయడం, తర్వాత మోసం చేయడం, దాన్ని చెత్తబుట్టలో పడేయడం.. సంప్రదాయంగా వస్తోంది. మొట్టమొదటిసారిగా ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. మేనిఫెస్టోను చూపించి 99 శాతం వాగ్దానాలను అమలు చేసింది మన వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఇవన్నీ కనిపిస్తున్నా, కళ్లుండీ ఈర్ష్యతో చూడలేని కబోదులు టీవీ చానళ్లు, పేపర్ల రూపంలో ఉన్నాయి. మనల్ని తిట్టే వాళ్ల నోరు మంచిది కాదు. వాళ్లు ఎప్పుడూ అంటూనే ఉంటారు. అబద్ధాల పునాదుల మీద వారు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. మీ ఇంట్లో మంచి జరిగిందా.. లేదా అన్నదే కొలమానంగా తీసుకోవాలి. – సీఎం జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘రాష్ట్రంలో మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్ను మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా సిద్ధమా? పేదల భవిష్యత్ను, పేదలని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తున్న కరోనా లాంటి ఆ దుష్టచతుష్టయం మీద యుద్ధానికి, ఓ మహా సంగ్రామానికి ప్రతి ఒక్కరూ సిద్ధమేనా?’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అశేష జనవాహినిని ప్రశ్నించారు. పేదల భవిష్యత్తును, సంక్షేమాన్ని నిర్దేశించే ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతి గడపకూ వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి, అందులో చెప్పిన 99 శాతం హామీలు నెరవేర్చిన తరుణంలో ఈ ఎన్నికల సంగ్రామానికి మీరే సారథులు అని స్పష్టం చేశారు. మంచి కొనసాగాలంటే మళ్లీ మనందరి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలన్నారు. శనివారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావం ‘సిద్ధం’ సభలో పాల్గొని ప్రసంగించారు. రామాయణం, మహాభారతం.. ఈ రెండింటిలో ఉన్న విలన్లంతా.. ఓ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడి రూపంలో, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు కోవర్టుల రూపంలో ఉన్నారన్నారు. ఇంత మంది తోడేళ్లలా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకుని రెడీగా ఉన్నారని చెప్పారు. ‘వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుందంటే.. ఇన్ని తోడేళ్ల మధ్య జగన్ ఒంటరి వాడిలా కనిపిస్తాడు. కానీ ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్కు మీరు స్థానమిచ్చి, మీ ఇంటి బిడ్డగా మీ గుండెల్లో ఉంచుకున్నారన్నదే నిజం. జగన్ ఏనాడూ ఒంటరి కాదు. వారికి ఎల్లో పత్రికలు, టీవీలు, పొత్తుల సైన్యం తోడుగా ఉంటే నాకున్న తోడు, నా ధైర్యం, నా బలం.. పైనున్న ఆ దేవుడు, నన్ను గుండెల్లో పెట్టుకున్న మీరు. ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకంతో పుట్టిన సైన్యం. ఒక నాయకుడిని ప్రజలు నమ్మారు అంటే వాళ్ల స్పందన, ప్రేమ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇక్కడ కనిపిస్తున్న నా అన్నదమ్ములు, అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యమే నిదర్శనం’ అని అన్నారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. 14 ఏళ్లు సీఎంగా ఉండీ ఏం చేశారని అడగండి ► గోదారమ్మ సీమలో నిలబడి మనకు, ప్రతిపక్షానికి మధ్య ఉన్న తేడాను, ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచిని వివరించడానికి మీ వద్దకు వచ్చాను. ఇంటింటా మనం చేసిన అభివృద్ధి, గ్రామంలో మనం తెచ్చిన మార్పు, లంచాలు, వివక్షకు తావు లేకుండా తెచ్చిన వ్యవస్థ, చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా చూడని విధంగా జరిగిన సామాజిక న్యాయం.. వీటన్నింటికీ మనందరి ప్రభుత్వమే కేరాఫ్ అడ్రస్. ఈ మాటను ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పడానికి, కావాల్సినన్ని అంశాలు పంచుకోవడానికి, తిరుగులేని ఆత్మవిశ్వాసంతో 175కు 175 ఎమ్మెల్యేలు.. 25కు 25 ఎంపీలు గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకు మీ వాడిగా, మీ ముందుకు వచ్చి నా మనసు పంచుకుంటున్నా. నా మాటలు అన్నింటినీ ప్రతి ఇంటికీ తీసుకువెళ్లి ప్రతి ఒక్కరితో పంచుకోవాలి. ► 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజల కోసం ఏం చేశాడు? అని గ్రామాల్లోకి వెళ్లినప్పుడు అమ్మ, అక్క, అన్న, తమ్ముళ్లను అడగండి. గత 10 ఏళ్లుగా వారి బ్యాంకు అకౌంటు వివరాలను వారినే చూడమని చెప్పి అడగండి. ఆ పదేళ్లు.. అంటే చంద్రబాబు 5 సంవత్సరాలు, మీ బిడ్డ జగన్ పాలనలో 5 సంవత్సరాలు.. బ్యాంకు అకౌంటు వివరాల్లో అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బులు పడిందన్నది వారినే చూడమనండి. 1994, 1999, 2014లో ఇచ్చిన టీడీపీ మేనిఫెస్టోలో ఏనాడైనా 10 శాతం అమలు చేశాడా అని అడగండి. ఈ మార్పును ప్రతి ఇంటా వివరించాలి ► మీ బిడ్డ జగన్ 57 నెలల్లో ఏం చేశారనేది ప్రతి ఇంట్లో వివరించండి. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామం తీసుకున్నా, అభివృద్ధి కళ్లకు కనిపిస్తుంది. విలేజ్ సెక్రటేరియట్.. పట్టణంలో వార్డు సెక్రటేరియట్ కనిపిస్తుంది. సచివాలయాల ద్వారా 540 రకాల సేవలు అందిస్తూ, 10 మంది మన పిల్లలే అక్కడే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు. ప్రతి నెలా 1వ తేదీ ఉదయాన్నే ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపుతట్టి.. అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులు.. ఇలా ఏకంగా 66 లక్షల కుటుంబాలను ఆప్యాయంగా పలకరించి, వారి చేతిలో 3 వేల పెన్షన్ పెడుతున్నది మన వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ► లంచాలు, వివక్షకు నాటి జన్మభూమి కమిటీలు మారుపేరు. ఈ రోజు ఏ గ్రామంలో కూడా అలా లంచాలు, వివక్ష లేకుండా సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ తెచ్చింది మీ జగనే. డీబీటీ ద్వారా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపుతున్నదీ మీ జగన్, మీ ప్రభుత్వమే. మీ గ్రామంలో గవర్నమెంట్ బడి, ప్రభుత్వ ఆస్పత్రి మారటానికి నాడు–నేడు చేసినది, చేస్తున్నది మీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. గవర్నమెంట్ బడిలో ఇంగ్లిషు మీడియం, బైలింగ్వల్ టెక్ట్స్ బుక్కులు, చిన్నారుల చేతుల్లో ట్యాబ్లు, డిజిటల్ బోధన, క్లాస్ రూముల్లో ఐఎఫ్పీలు, సీబీఎస్ఈ, ఐబీ వరకు ప్రయాణం అంటే గుర్తుకొచ్చేది మీ జగనే. ► రైతు భరోసా, ఆర్బీకేల ద్వారా రైతన్నను చేయి పట్టుకుని నడిపించేదీ మీ వైఎస్సార్సీపీనే. పేదలు, రైతన్నలకు మంచి చేస్తూ అసైన్డ్ భూముల మీద, 22ఏ భూములు 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులు ఇచ్చింది మీ జగనే. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటూ ఈ 57 నెలల్లో అందించిన రూ.2.55 లక్షల కోట్లలో ఏకంగా 75 శాతం పైగా ఈ వర్గాలకే అందించి దేశంలోనే రికార్డు సృష్టించింది మీ జగన్ ప్రభుత్వమే. ► నామినేటెడ్ పోస్టులు, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టులు, ఆలయ బోర్డులు, వ్యవసాయ మార్కెట్ యార్డులు, కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పోస్టులు చట్టం చేసి మరీ ఇచ్చింది మీ ప్రభుత్వమే. కేబినెట్లో 68 శాతం మంత్రి పదవులు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు దక్కాయి. నలుగురికి డిప్యూటీ సీఎం పదవులు, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్ పర్సన్ మొదలు.. స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ కనీవినీ ఎరుగని రీతిలో, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందీ మీ బిడ్డ జగన్ పాలనలోనే. 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం ► గత ప్రభుత్వ హయాంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే.. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. అందులోనూ 80 శాతం నేను నా.. నా.. అని పిలుచుకొనే నా చెల్లెమ్మలు, తమ్ముళ్లు కనిపిస్తున్నారు. అక్కచెల్లెమ్మలను లక్షాధికారులుగా చేయాలని, వారికి గూడు ఉండాలని ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చిందీ మీ జగనే. అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నదీ మన ప్రభుత్వమే. అక్కచెల్లెమ్మలు పిల్లల్ని బడులకు పంపిస్తే చాలు వారికి తోడుగా ఉంటూ.. అమ్మ ఒడి, పిల్లలకు అండగా ఉంటూ విద్యా దీవెన, వసతి దీవెన, అక్కచెల్లెమ్మలకు ఆసరా, చేయూత, సున్నా వడ్డీ.. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, దిశ యాప్.. మొత్తంగా మహిళా సాధికారత.. ఇవన్నీ మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ► ప్రతి గ్రామంలో ఇవాళ ఒక మహిళా పోలీస్, విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. ఆ గ్రామానికి ఫ్యామిలీ డాక్టర్ వచ్చారు. ప్రతి ఇంట్లోనూ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేస్తూ, వైద్యం చేసి, మందులిస్తున్నది మీ బిడ్డ పాలనలోనే. 108, 104, ఆరోగ్యశ్రీ, రైతన్నలకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు తీసుకొచ్చింది మహానేత దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే, వాటిని మరో నాలుగు అడుగులు ముందుకు వేయిస్తున్నది మీ బిడ్డ హయాంలోనే. ► రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. నాలుగు సీ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, కొత్త ఎయిర్ పోర్టులు వస్తున్నాయి. ఉన్న చోట విస్తరణ పనులు జరుగుతున్నాయి. పారిశ్రామిక కారిడార్లలో ఉరుకులు పరుగులతో పనులు జరుగుతున్నాయి. పారిశ్రామిక వేత్తలతో పాటు సంస్థలు మన రాష్ట్రం వైపు లైను కడుతున్నాయి. ఈ వాస్తవాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి. 2019లో మనం అధికారంలోకి రాకపోయింటే ఇవన్నీ సాధ్యమయ్యేవా? ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిæలంచాలు లేకుండా, కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయ పార్టీ చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ అందుతున్నది ఒక్క జగనన్న పాలనలోనే దేశానికే చూపించగలిగాం. ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్ ► ఈ ఎన్నికలు ఎంత ముఖ్యం అనేది ప్రతి అవ్వాతాతకు, అక్కాచెల్లెమ్మకు, అన్నదమ్ములందరికీ చెప్పాలి. కేవలం ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకొనే ఎన్నికలు కావు. 57 నెలలుగా పేదలకు అందుతున్న సంక్షేమాన్ని, వారి పిల్లల భవిష్యత్ను నిర్ణయించనున్న ఎన్నికలని ప్రతి ఇంట్లో వివరించాలి. ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గం, ప్రతి ప్రాంతం భవిష్యత్, రైతన్న భవిష్యత్, అక్కచెల్లెమ్మల సంక్షేమం, ఇంటింటా అభివృద్ధి, పిల్లల భవిష్యత్ అన్నీ ఈ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయని గమనించండి. చదువు, వైద్యం కోసం పేదవాడు అప్పులపాలు కాకుండా ఉండాలన్నా అది మనందరి ప్రభుత్వమే ఆ పని చేయగలదని ఇంటింటికీ వెళ్లి చెప్పండి. ► అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, వైద్య సేవలు అందుకుంటున్న వారు, ఇలా ప్రతి ఇంట్లో నుంచి ఒకరు స్టార్ క్యాంపెయినర్లుగా రావాలని చెప్పండి. బయటకొచ్చి ప్రతి ఒక్కరూ కనీసం 100 మందితో జరుగుతున్న మంచి గురించి చెప్పాలని వివరించండి. మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యం అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. అమ్మ ఒడి, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ, సొంతిల్లు.. ఇవన్నీ కొనసాగాలంటే అక్కచెల్లెమ్మలే స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలని చెప్పండి. పిల్లల తల్లిదండ్రులంతా మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పండి. రైతు భరోసా కొనసాగాలన్నా, ప్రతి రైతన్నకూ మెరుగైన ఆర్బీకే సేవలు అందాలన్నా, ఉచితంగా ఇన్సూరెన్స్ రావాలన్నా, ఇన్పుట్ సబ్సిడీ దొరకాలన్నా, పగటిపూటే ఉచిత విద్యుత్, దళారీ వ్యవస్థ పోయి రైతన్నకు మద్దతు ధర అందాలన్నా.. కేవలం జగనన్న మాత్రమే చేయగలడని.. ప్రతి రైతన్న స్టార్ క్యాంపెయినర్ కావాలని చెప్పండి. -
అక్షౌహిణులు సిద్ధం!
ఇసుకేస్తే రాలనట్టుగా, నేల ఈనినట్టుగా, ఆకాశానికి చిల్లులు పడి కుండపోతలు కురిసినట్టుగా జనం కనిపిస్తే... వారి సంఖ్యను లక్షల్లో చెబుతారు. అదే స్థాయిలో ఒక సైన్యం కని పిస్తే... పూర్వకాలంలోనైతే అక్షౌహిణుల్లో కొలిచేవారు. ఇదిగో ఇప్పుడు దెందులూరు వైసీపీ సభలో కనుచూపు మేర చీమల దండులా కనిపిస్తున్న వారంతా సైన్యమే! కార్యకర్తల సైన్యం! ఎంతమంది ఉంటారు? రెండు అక్షౌహిణులు? అంతకంటే ఎక్కువ? రథ గజ తురగ పదాతి విభాగాలు కలిసిన ఒక అక్షౌహిణిలో సుమారు 2 లక్షల 20 వేలమంది ఉంటారు. ఇది మహా భారతం లెక్క. పోయిన వారం భీమిలిలో, ఇవ్వాళ దెందులూరులో కార్యకర్తలు ఎందుకిలా పోటెత్తారు? ప్రతి పల్లె నుంచి పదుల సంఖ్యలో ఎందుకు కదిలారు? ప్రభంజనంలా ఎందు కిలా సాగుతున్నారు? వారికేం లాభం? ఏం ఒరిగింది వారికి?... ఎందుకంటే సమాజానికి ఏదో లాభం జరుగుతున్నది. ప్రతి కుటుంబానికీ సంక్షేమం అందుతున్నది. తాము అభిమానిస్తున్న నాయకుని సారథ్యంలోని ప్రభుత్వ పనితీరును వారు గమనించారు. ఈ స్వల్పకాలంలోనే రాష్ట్రంలో మానవాభివృద్ధి సూచి కలు చిగురించడం, మొగ్గ తొడగడం వారి అనుభవంలోకి వచ్చింది.చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీ కార్యకర్తలు ‘జన్మభూమి కమిటీ’ పేరుతో జనాన్ని చెండుకు తిన్నారు. ప్రతి పనికీ రేటు కట్టి పిండుకున్నారు. ఇప్పుడా అవకాశం వైసీపీ కార్యకర్తలకు ఎంతమాత్రం లేదు. ప్రజాహిత కార్యక్రమాల్లో పార్టీ చొరబాట్లు లేవు. అర్హతే ప్రాతిపదికగా పారదర్శక పాలన ప్రతి గ్రామంలోనూ అందుబాటులోకి వచ్చింది. వ్యవస్థలో చోటుచేసుకుంటున్న అభ్యుదయ మార్పులే అధికార పార్టీ కార్యకర్తలను ఉత్తేజితం చేస్తున్నాయి. అందువల్లనే లక్షలాది మంది కార్యకర్తలు సొంత లాభం కోసం పాకులాడకుండా పార్టీ గెలుపు కోసం కెరటాలు కెరటాలుగా తరలివస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ‘సిద్ధం’ సభల్లో కార్యకర్తలనుద్దేశించి ఒక మాట తప్పనిసరిగా చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య కర్తలందరి సమష్టి పార్టీ అని ఆయన చెబుతున్నారు. తనతో పాటు పార్టీ వారంతా ఇందులో భాగస్వాములేనని ప్రకటించారు. తొలి నుంచీ పరిశీలిస్తే ఆయన పార్టీని నడుపుతున్న తీరు కూడా ఇందుకు అనుగుణంగానే కనిపిస్తుంది. పార్టీని తన సొంత సంస్థగా, ప్రైవేట్ ఎంటర్ప్రైజ్గా భావించి ఉంటే తన కుటుంబసభ్యులకే అధికారిక పదవుల్లో కీలక బాధ్యతలు అప్పగించి ఉండేవారేమో! ఆయన ఆ పని చేయలేదు. విస్తృత ప్రజా పునాదితోనే జగన్ పార్టీని నిర్మిస్తున్నారు. అందువల్లనే బహుళ ప్రజానీకపు ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే విధంగా పార్టీ ఆశయాలను, కర్తవ్యాలను రూపొందించు కున్నారు. ఇవాళ ప్రభుత్వ పాలనలోనూ ఆ ఆశయాలే మార్గదర్శ కాలుగా మారాయి. కుటుంబానికి పెద్దపీట వేయకపోవడం వల్ల కొందరు నొచ్చుకొని ఉండవచ్చు. కొందరికి నచ్చకపోవచ్చు. ఆ పరి ణామం ఆయనకు కొంత అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అయినా సరే తన ఆశయపథం నుంచి పక్కకు జరగలేదు. అదేవిధంగా తన పార్టీ కార్యకర్తల అక్రమార్జనకు అవకాశం కల్పించే అడ్డ దారులూ తొక్కలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఆకాంక్షించిన లక్ష్యాల పట్ల జగన్మోహన్రెడ్డి ఎంత నిబద్ధతతో ఉంటారో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అవగతమైంది. ‘మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటు వేయండ’ని గతంలో ఏ నాయ కుడైనా అనగలిగాడా? అలా అనడానికి ఎంత నైతిక బలం ఉండాలి! లక్ష్యాల పట్ల తనకున్న నిబద్ధత వల్లనే ఆ నైతిక బలం ఆయనకు సమకూరింది. వెనుకబాటుతనం కారణంగా సమాజంలోని దగాపడిన తమ్ముళ్లూ, చెల్లెమ్మలూ రాజ్యాంగబద్ధమైన అవకాశాలను అంది పుచ్చుకోలేకపోతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నందువల్ల ఎంతో కొంత ప్రాతినిధ్యం చట్టసభల్లో లభిస్తున్నది. సగం జనాభా ఉన్న బీసీలు మాత్రం ధనస్వామ్యంగా మారిన ఎన్నికల పోరాటంలో నెగ్గుకురాలేకపోతున్నారు. కంటితుడుపుగా ఒకటీ అరా సీట్ల కేటాయింపులకే గతంలో పార్టీలన్నీ పరిమిత మయ్యేవి. కార్మిక – కర్షక పార్టీలుగా తమను తాము చెప్పుకునే కమ్యూనిస్టుల కంటే, బీసీల నాయకత్వంలో ఉన్న ప్రాంతీయ పార్టీల కంటే మిన్నగా జగన్మోహన్రెడ్డి ఈ వర్గాలకు రాజకీయ అవకాశాలను కల్పిస్తున్నారు. లోక్సభ స్థానాలకు పార్టీ ప్రకటించిన 16 సీట్లలో తొమ్మిదింటిని బీసీలకు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలు పోను మిగిలిన వాటిలో నికరంగా బీసీలకు సగం సీట్లు దక్కనున్నాయి. ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించారా? ఛాన్సే లేదు! కానీ అది జగన్ మోహన్ రెడ్డి నిబద్ధత. ఊకదంపుడు ఉపన్యాసాల్లో కాకుండా అభ్యు దయాన్ని ఆచరణలో చూపించిన తొలి రాజకీయవేత్త జగన్ మోహన్రెడ్డి. ‘ఎమ్మెల్యే టిక్కెట్టిస్తాం... ఎన్ని కోట్లు ఖర్చు పెడతావ్, పార్టీకెంత చందా ఇస్తావ’ని ఒక పక్క తెలుగుదేశం నాయకులు అడుగుతున్న రోజులివి. ఉపాధి హామీ కూలీగా పనిచేసే ఒక సాధారణ వ్యక్తిని మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయగల సాహసం ఒక్క జగన్కు తప్ప ఇంకెవరికి ఉంటుంది? పార్టీ కార్యకర్త కావడం, పార్టీ పట్ల విధేయత అతని అర్హతలు. సూపర్ రిచ్ సామాజిక వర్గాలు పెద్ద సంఖ్యలో ఉండే ప్రాంతాలైన రాజమండ్రి, నర్సాపురం లోక్సభ స్థానాలను బీసీ సామాజిక వర్గమైన శెట్టి బలిజలకు కేటాయించవచ్చని ఎవరి ఊహకైనా ఎప్పుడైనా తట్టి వుంటుందా? ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి, నరసరావుపేట లోక్సభా స్థానం నుంచి యాదవ కులానికి చెందిన బీసీ అభ్యర్థులను నిలబెట్టే ఔదార్యం ఎవరైనా కనబరిచారా? విజయవాడ నగర శివార్లలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండే పెనమలూరులో గౌడ అభ్యర్థిని, మైలవరంలో యాదవ అభ్యర్థిని నిలబెట్టగలగడం ఒక్క జగన్కు మాత్రమే సాధ్యమైన విషయం. రాజకీయ రంగంపై పెత్తందారీ వర్గ ఆధిపత్యాన్ని సవాల్ చేసే విధంగా పేద వర్గాలను సాయుధం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆ వర్గాలను ఉత్తేజితం చేస్తున్నాయి. కనుకనే ప్రతిఫలాపేక్ష లేకుండా పార్టీ గెలుపు కోసం పనిచేయడానికి వారు ముందుకొస్తున్నారు. శ్రీమంతుల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను, నాణ్యమైన వైద్యాన్ని పేదవర్గాలకు అందు బాటులోకి తేవడం రాష్ట్ర ప్రజలను అమితంగా ప్రభావితం చేసింది. వ్యవసాయం దండగనే నాయకుడికి చెంపపెట్టు మాదిరిగా ప్రస్తుత ప్రభుత్వ విధానాలున్నాయి. చిన్న, సన్నకారు రైతులను చేయిపట్టుకొని ముందుకు నడిపించే బాధ్యతను ఆర్బీకే సెంటర్లు చేపట్టాయి. ప్రభుత్వ చేయూత నందుకొని ఈ స్వల్పకాలంలోనే సుమారు రెండు లక్షల సూక్ష్మ పరిశ్రమలు ఏర్పడి 16 లక్షల మందికి ఉపాధినందించాయి. ఏ ప్రమాణాల ప్రకారం చూసినా... పారిశ్రామిక వృద్ధిలో గానీ, మౌలికరంగ అభివృద్ధిలోగాని, మానవాభివృద్ధిలోగానీ, ప్రజల ఆస్తుల కల్పనలోగానీ, సంక్షేమ రంగంలోగానీ ఈ ఐదేళ్ల కాలంతో పోల్చదగిన మరో పదవీకాలం ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే లేదు. ఇది వాస్తవ పరిస్థితి. కానీ చంద్రబాబు – రామోజీ ముఠా ఈ వాస్తవాన్ని వక్రీకరించడానికీ, తలకిందు లుగా చూపడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నది. చేతిలో ఉన్న యెల్లో మీడియా సాయంతో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్న ట్టుగా చూపెట్టే పాతకాలపు కనికట్టు విద్యల్ని ప్రదర్శిస్తున్నది. యెల్లో మీడియా రాతలు, మాటలు ఉన్మాద స్థాయికి చేరుకున్నాయి. ఏరకంగానైనా జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి పెత్తందారీ శక్తులు పడరాని పాట్లు పడు తున్నాయి. మరోపక్కన అవకాశవాద పొత్తుతో కుట్రలు పన్ను తున్నాయి. పవన్ కల్యాణ్ పార్టీ అనే తమ బినామీ పార్టీని ఇప్పటికే ముడివేసుకున్నారు. ఇద్దరూ కలిసి బీజేపీ కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్తో పరోక్ష పొత్తు కుదిరింది. వైసీపీ ఓట్లను ఎంతోకొంత చీల్చాలన్న ఏకైక టార్గెట్ను రాష్ట్ర కాంగ్రె స్కు చంద్రబాబు అప్పగించారు. బాబు టార్గెట్ను శిరసా వహిస్తూ పీసీసీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన షర్మిల తన క్యాంపెయిన్ను కూడా ప్రారంభించారు. జగన్ వ్యతిరేక ప్రచారాన్ని మరింత రక్తి కట్టించడం కోసం ఆమె తన కజిన్ సోదరి సునీత సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. చంద్ర బాబు సహాయ సహకారాలు సరేసరి! రాష్ట్రంలో పెత్తందారీ శక్తుల ప్రతినిధులు జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. పేదల ప్రభుత్వం తరఫున వైసీపీ కార్యకర్తలు ఉరిమే ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు. భీమిలిలో, దెందు లూరులో జరిగినవి కార్యకర్తల సభలు మాత్రమే. జనసభలు కావు. కార్యకర్తలే లక్షల సంఖ్యలో పాల్గొనడం చిన్న విషయం కాదు. ‘జన్మభూమి కమిటీ’ల పేరుతో చంద్రబాబు మాదిరిగా జగన్ దోచిపెట్టలేదు కనుక ఈ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు పెద్దగా కష్టపడకపోవచ్చని కలలు కన్నవారి కడుపు మండేలా ఈ సభలు జరిగాయి. సభల్లో పాల్గొనడమే కాదు, యుద్ధానికి తాము సిద్ధమేనంటూ సమరనాదాలు కూడా కార్యకర్తలు చేశారు. ‘ఈ పార్టీ నాదీ, నా కుటుంబానిదీ కాదు... ఇది మీది, కార్యకర్తలందరిదీ’ అన్న జగన్ మాటను మంత్రంగా స్వీకరించారు. ‘ఈ యుద్ధంలో అర్జునుడి పాత్ర నాది. సారథ్యం వహించే కృష్ణపరమాత్మలు మీరే’నని కార్యకర్తలను ఆయన ఉత్సాహ పరిచారు. ‘పార్టీ మీదే, పదవులూ మీవే... ముందు ముందు మరిన్ని పదవులు పార్టీకి విశ్వాసపాత్రులైన కార్యకర్తలకే లభిస్తాయ’ని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ జన్మ భూమి కమిటీల మాదిరిగా ఆదాయం కోసం పనిచేసే కార్య కర్తలం కాదనీ, ఆశయం కోసం పనిచేసేవారమని ఇప్పటికే రుజువు చేసుకున్న వైసీపీ కేడర్ నాయకుని భరోసాతో మరింత స్ఫూర్తిని పొందింది. ప్రాంతాల వారీగా పెత్తందార్లపై ఎన్నికల యుద్ధానికి వైసీపీ అక్షౌహిణులు సిద్ధమవుతున్నాయి. ఈ కార్య కర్తల సమరశీలత లోపించడం ప్రతిపక్ష శిబిరానికి అతిపెద్ద మైనస్ పాయింట్. మీడియా మాయాజాలంతో, కుట్రలతో ఈ మైనస్ను ప్లస్గా మార్చుకోవడం సాధ్యమయ్యే పని కాదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఏలూరు ‘సిద్ధం’కు చురుగ్గా ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షిఅమావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల మూడో తేదీన ఏలూరు జిల్లాలో నిర్వహించనున్న ‘సిద్ధం’ బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ప్రజాప్రతినిధులు గురువారం పరిశీలించారు. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు సభకు తరలిరానున్న క్రమంలో ఆ మేరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 110 ఎకరాల సువిశాల ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది. ఏలూరు ఆటోనగర్, దెందులూరు సమీపంలోని సహారా గ్రౌండ్స్లో బహిరంగ సభ వేదిక పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ సభా వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీల ఏర్పాటు, పార్టీ శ్రేణులందరి దగ్గరకు వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా పార్టీ గుర్తయిన ‘ఫ్యాన్’ ఆకారంలో భారీ వాక్వేను ఏర్పాటు చేశారు. జిల్లా చరిత్రలోనే లక్షలాది మందితో నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో జాతీయ రహదారిపైన ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లూ చేశారు. గోదావరి ప్రజలు సిద్ధం : మంత్రి కారుమూరి ఎన్నికలకు జగన్మోహన్రెడ్డి సిద్ధమంటే గోదావరి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని, ఉభయగోదావరి జిల్లాలు జగన్మోహన్రెడ్డి వెంటే ఉంటాయని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి ప్రతి ఇంటి బిడ్డ అని, సంక్షేమాన్ని ప్రతి ఇంటికి చేర్చి దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించిన నేత అని కొనియాడారు. ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ దెందులూరులో జనసునామీ చూడబోతున్నారని, చంద్రబాబునాయుడు కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదు ఎకరాల్లోనే సభలు పెడుతుంటే జనం రాని పరిస్థితి ఉందని, కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక పిలుపుతో 110 ఎకరాల్లో జరిగే సభకు లక్షలాది మంది తరలిరానున్నారని చెప్పారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఉంగుటూరు ఎమ్మెల్యే వాసుబాబు, సీఎం ప్రోగ్రామ్స్ కోఆరి్డనేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆళ్ళ నాని తదితరులు ఉన్నారు. 3న దెందులూరుకు సీఎం ‘సిద్ధం’ బహిరంగ సభకు ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారైంది. మూడో తేదీ మధ్యాహ్నం 2.45 గంటలకు తాడేపల్లిలోని హెలీప్యాడ్ నుంచి బయలుదేరి 3.20 గంటలకు దెందులూరులో సభా ప్రాంగణం వెనుక భాగంలోని హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులను కలిసిన అనంతరం 3.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని 4.55 గంటలకు సభ ముగిస్తారు. ఐదు గంటలకు హెలికాప్టర్లో తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. -
‘సాధికారత’తో మురిసిన మంగళగిరి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: బడుగు, బలహీన వర్గాల సాధికారతతో గుంటూరు జిల్లా మంగళగిరి మురిసింది. బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో తాము సాధించిన సాధికారతను సగర్వంగా ప్రదర్శించారు. యువత నుంచి వృద్ధుల వరకు ఈ యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ‘మళ్లీ నీవే ముఖ్యమంత్రివి కావాలి జగన్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త గంజి చిరంజీవి అధ్యక్షతన మిద్దె సెంటర్లో జరిగిన భారీ బహిరంగ సభలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన నేతలు సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సాధించిన అభివృద్ధిని వివరించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సామాజిక న్యాయానికి మంగళగిరే నిదర్శనమని చెప్పారు. మంగళగిరి సీటును అగ్రకులానికి చెందిన అభ్యర్థి నుంచి మార్చి బీసీలకు కేటాయించడమే బీసీలకు సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యతను తెలుపుతుందని అన్నారు. సామాజిక విప్లవం తెచ్చిన తొలి సీఎం జగన్ దేశంలో సామాజిక కులాల గురించి ఆలోచించి, సామాజికి విప్లవాన్ని తెచ్చిన తొలి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డే అని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అందలం ఎక్కించారని, ఈరోజు ఇలా తలెత్తుకొని తిరగడానికి సీఎం జగనే కారణమని చెప్పారు. చంద్రబాబు ఆణగారిన వర్గాలను అవమానించేవారని, ఈ వర్గాలను ఓటు బ్యాంకులా మాత్రమే తప్ప ఏనాడూ సాటి మనిషిగా చూడలేదని అన్నారు. మంగళగిరిలో స్థానికుడిగా ఉన్న గంజి చిరంజీవిని గెలిపించుకోవాలని, హైదరాబాదులో ఉండే టీడీపీ అభ్యర్థిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అగ్రస్థానం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ అన్నింటా అగ్రస్థానం ఇస్తున్నారని మంత్రి జోగి రమేష్ చెప్పారు. మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా, నామినేటెడ్ పదవుల్లోనూ ఈ వర్గాలకే పెద్ద పీట వేసిన తొలి సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. అగ్రవర్ణ అభ్యర్థులు గెలిచిన మంగళగిరిలో బీసీ అభ్యర్థి గంజి చిరంజీవిని నిలబెడుతున్నారని, సీఎం జగన్ సామాజిక న్యాయానికి ఇదే నిదర్శనమని చెప్పారు. మంగళగిరి అని స్పష్టంగా పలకటం రాని లోకేశ్కి మంగళగిరి ఎందుకు అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని, బడుగు వర్గాలకు ఆయన చేసిన మేలు మరెవరూ చేయలేరని పార్టీ నేత, ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్ అన్నా రు. రెండుసార్లు రెడ్డి సామాజిక వర్గం గెలిచిన మంగళగిరిలో బీసీ అభ్యర్ధిని రంగంలోకి దింపే సాహసం ఒక్క జగన్ మాత్రమే చేయగలరని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. మంగళగిరిలో బీసీ నేతను గెలిపించుకొనే అవకాశాన్ని వదులుకోవద్దని పిలుపునిచ్చారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, బీసీ విభాగం ఉపాధ్యక్షులు చిల్లపల్లి మోహనరావు పాల్గొన్నారు. -
ఎల్లో మీడియా మాయలో షర్మిల.. వైఎస్సార్ ఆశయాలకు తూట్లు!
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితురాలైన తెలంగాణ నేత వైఎస్ షర్మిల తన సోదరుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వైఎస్ఆర్ అభిమానులలో తీవ్ర ఆగ్రహం తెప్పించాయని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలలో వైఎస్ఆర్ అంటే ఇష్టపడేవారి హృదయాలను ఆమె గాయపరిచేలా మాట్లాడుతున్నారు. తన అన్న తనకేదో అన్యాయం చేశారన్న భావన వచ్చేలా ప్రజలకు సంకేతం ఇస్తున్నారు. షర్మిల ప్రసంగాలు తెలుగుదేశం మీడియా అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటికి మొదటి పేజీ వార్తలుగా ఉపయోగపడుతున్నాయి తప్ప, ఆమెకు దీనివల్ల ప్రత్యేకంగా కలిసి వచ్చే ప్రయోజనం ఏమీ లేదని స్పష్టం అవుతోంది. ప్రభుత్వపరంగా ఆమె చేస్తున్న విమర్శలు అవగాహనా రాహిత్యానికి దర్పణం పడుతుంటే, సీఎం జగన్పై చేసిన వ్యక్తిగత విమర్శలు అర్ధరహితంగా ఉన్నాయని చెప్పాలి. రాజకీయాలలో ఆమె ఏ పార్టీలో అయినా చేరవచ్చు అది ఆమె ఇష్టం. కానీ, కుటుంబ విషయాలను, రాజకీయాలను కలగలిపి మాట్లాడడం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వారి ఏజెంట్లుగా ఉన్న రామోజీరావు, రాధాకృష్ణ వంటివారి కళ్లలో ఆనందం చూడడానికే అయితే మనం చెప్పగలిగేది ఏమీ ఉండదు. షర్మిల, ఆమె భర్త అనిల్ ఇద్దరిని రాజకీయంగా వీరంతా కలిసి వాడుకుని వదలివేస్తారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. షర్మిల స్టేట్మెంట్ల వల్ల కాంగ్రెస్ నేతలు ఎవరూ ఆనందపడుతున్నట్లు లేదు. వారెవరూ పెద్దగా స్పందించడం లేదు. కానీ, టీడీపీ, జనసేన, ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం తెగ ప్రాధాన్యం ఇచ్చి ప్రచారం చేస్తున్నాయి. దీనిని బట్టే ఆమె ఎవరికి సేవ చేస్తున్నది అనే విషయం తెలిసిపోతుంది. ముఖ్యమంత్రి జగన్ తిరుపతిలో జరిగిన ఎడ్యుకేషన్ సమ్మిట్లో రాజ్ దీప్ సర్దేశాయ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ జవాబిస్తూ కాంగ్రెస్ పార్టీకి డర్టీ రాజకీయాలు అలవాటేనని, రాష్ట్రాన్ని దారుణంగా విభజించిందని, అలాగే తమ కుటుంబాన్ని కూడా విభజిస్తోందని అన్నారు. గతంలో తన బాబాయి వివేకానందరెడ్డిని వేరుచేసి తమకు వ్యతిరేకంగా పోటీ చేయించిందని, ఇప్పుడు తమ చెల్లిని విడదీసిందని తప్పుపట్టారు. అంతే తప్ప వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా అనలేదు. కానీ, షర్మిల మాత్రం తమ కుటుంబం విడిపోవడానికి జగనన్న కారణమని ఆరోపించారు. అందుకు సాక్ష్యం తను, తన తల్లి అని ఆమె వ్యాఖ్యానించారు. తనకు అన్యాయం చేసిన ఫర్వాలేదని, కాని రాష్ట్రానికి జగన్ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా తనకేదో అన్యాయం జరిగినట్లు చెప్పడానికి యత్నించారు. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ షర్మిలకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్పాలని కోరారు. ఏపీ రాజకీయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన బదులు ఇచ్చారే తప్ప, షర్మిలపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా హుందాగా వ్యవహరించారు. షర్మిల తనకు జరిగిన అన్యాయం ఏమిటో చెప్పలేకపోయారు కాని, పరిధి దాటి మాట్లాడుతున్నారు. ఇక అభివృద్ది జరగలేదని ఆమె చెబుతున్న అబద్దాలకు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా చేస్తున్న విష ప్రచారానికి తేడా లేకుండా పోయింది. ఆమె అబద్దాలను వైఎస్ జగన్ అబిమానులు తీవ్రంగా ఖండిస్తూ, ఏపీలో ఎక్కడికక్కడ జరిగిన అభివృద్ది పనుల వద్దకు వెళ్లి వీడియో తీసి షర్మిల చూడాలని చెబుతూ యూట్యూబ్లో పెడుతున్నారు. ఉదాహరణకు జగన్ అభిమాని ఒకరు విజయవాడ కృష్ణానది కరకట్ట వద్దకు వెళ్లి అక్కడ జగన్ ప్రభుత్వం నిర్మించిన భారీ రిటైనింగ్ వాల్ చూపించి, దీనిని అభివృద్ది కాదంటారా అని తీవ్రంగా ప్రశ్నించారు. షర్మిల ఇక్కడకు వచ్చి చూడాలని ఆయన సవాల్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ హయాంలో పూర్తి చేసిన వంతెనలపై తిరుగుతూ వీడియోలు తీసి షర్మిలకు తెలియచేయాలని తలపెట్టారు. బాగు పడ్డ స్కూళ్లు, ఆస్పత్రులు, తీర ప్రాంతంలో నిర్మాణంలో ఓడరేవులు, నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు మొదలైన వాటిని షర్మిల చూడాలని అంటున్నారు. షర్మిల శ్రీకాకుళం జిల్లాకు కూడా వెళ్లారు. అక్కడ పలాస వద్ద ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జగన్ ప్రభుత్వం నిర్మించిన సూపర్ స్పెషాలిటి ఆస్పత్రి, 800 గ్రామాలకు ఉపయోగపడే మంచినీటి ప్రాజెక్టును చూసి ఉంటే అభివృద్ది ఎలా జరుగుతోందో తెలుసుకునే అవకాశం ఉండేది. నిజానికి వైఎస్ఆర్ ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా షర్మిల వ్యవహరిస్తున్నారని, సీఎం జగన్ మాత్రం తన తండ్రి పేరును గొప్పగా నిలబెడుతున్నారని వైఎస్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, టీడీపీ మాయలో ఉన్న షర్మిలకు ఇవేవీ కనిపించడం లేదు. షర్మిల మరో ఆరోపణ కూడా చేశారు. సీఎం జగన్ తనను నమ్మినవారిని ముంచారని పిచ్చి ఆరోపణ చేశారు. తనకోసం రాజీనామా చేసిన వారికి మంత్రి పదవులు ఇవ్వలేదని తెలిసి, తెలియని ఆరోపణ చేశారు. నిజానికి జగన్ తన వెంట 2011 నుంచి ఉన్నవారిలో తొంభైఐదు శాతం మందికి ఏదో విధంగా పదవులు వచ్చేలా చేశారు. ఉదాహరణకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, కొడాలి నాని, పేర్ని నాని, ఆళ్ల నాని, రోజా, అంబటి రాంబాబు మొదలైనవారికి మంత్రి పదవులు ఇచ్చారు. కాకపోతే పరిమితులను బట్టి కొందరికి ముందు, మరికొందరికి వెనుకా పదవులు ఇచ్చారు. పలువురికి ప్రభుత్వంలో పదవులు ఇచ్చారు. అంతేకాదు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్నివేల మందికి కార్పొరేషన్ డైరెక్టర్లు, ఇతర పదవులు ఇచ్చి అందరిని సంతృప్తి పరచే యత్నం చేశారు. కానీ, షర్మిల ఏమి చేశారు. తెలంగాణలో వైఎస్సార్టీపీ పెడతానని వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులందరిని పిలిచి, వారిని పార్టీలోకి తెచ్చి, తదుపరి వారితో చెప్పాపెట్టకుండా పార్టీని ఎత్తివేశారు. ఏ కాంగ్రెస్పై ఉమ్ము వేయాలని వైఎస్ చెప్పి ఉండేవారని ఆమె అన్నారో, అదే కాంగ్రెస్లో ఆమె తన పార్టీని విలీనం చేసి వైఎస్ అభిమానులందరిని షాక్కు గురి చేశారు. ఆమె పార్టీలో చేరి కొంత మంది కోట్ల రూపాయలు చేతి చమురు వదిలించుకుని అప్పుల పాలయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమెతో పాటు వైఎస్సార్టీపీలో పనిచేసిన సీనియర్ నేత కొండా రాఘవరెడ్డి ఓపెన్గా చెప్పారు. షర్మిల అహంకారంతో, ప్రస్టేషన్తో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. షర్మిల భర్త అనిల్ మరికొందరితో కలిసి సీఎం జగన్ నుంచి ప్రభుత్వపరంగా అనుచిత లబ్ది పొందాలని చూశారని, దానికి జగన్ అంగీకరించలేదని ఆయన నిర్మొహమాటంగా తెలిపారు. ఆ కారణంతోనే ముఖ్యమంత్రి జగన్కు వ్యతిరేకంగా మారారని ఆయన వెల్లడించారు. అక్రమ కేసులలో జగన్ అరెస్టు అయి జైలులో ఉన్నప్పుడు తనకు తానే పాదయాత్ర చేస్తానని షర్మిల ప్రకటించుకున్నారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం జగన్పై షర్మిల ఆరోపణలు చేయడం ఏ మాత్రం సమర్ధనీయం కాదని అన్నారు. ఈ విషయంలో విజయమ్మ కూడా షర్మిల తీరుపై బాధ పడుతుంటారని కూడా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడిన విషయాల వీడియోలను లక్షల సంఖ్యలో ఆసక్తిగా గమనిస్తున్నారంటేనే ముఖ్యమంత్రి జగన్ పట్ల ప్రజలలో ఎంత అభిమానం ఉందన్నది అర్ధం అవుతుంది. అలాగే షర్మిల మాటలను వారెవ్వరు అంగీకరించడం లేదని తెలుస్తుంది. రాఘవరెడ్డి వ్యాఖ్యలపై స్పందించినా ఆమె ఆత్మరక్షణలో పడినట్లు అనిపిస్తుంది. విజయమ్మతో ఈ విషయాలు చెప్పించాలని అన్నారట. ఆ పని చేయవలసిన అవసరం రాఘవరెడ్డికి ఏమి ఉంటుంది. పైగా కొద్ది రోజుల క్రితమే విజయమ్మ ఇడుపుల పాయలో సీఎం జగన్ పట్ల ఎంత అప్యాయంగా వ్యవహరించింది అందరూ చూశారు. ఈ ఘటనలతో విజయమ్మ బాధపడుతుండవచ్చు. కానీ, షర్మిల కాంగ్రెస్లో చేరడాన్ని ఆమె కూడా సమర్ధించారనే అంతా అనుకుంటున్నారు. అందువల్ల షర్మిల ఇప్పటికైనా అనవసర వ్యర్ధ ప్రసంగాలుమాని ,రాజకీయంగా తనకు తోచిన నాలుగు మాటలు చెప్పుకుని తిరిగితే మంచిది. ఏపీలో షర్మిల పర్యటనలు చేసినా కాంగ్రెస్కు ప్రయోజనమేమీ ఉండదు. కాకపోతే ముఖ్యమంత్రి జగన్కు నష్టం చేయాలన్న దుష్ట తలంపుతో కాంగ్రెస్ పార్టీ ఆమెను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకు వచ్చింది. ఏపీలో కాంగ్రెస్కు ఎవరూ నేతలే లేనట్లు, ఇక్కడ ఉన్న నేతలందరిని చెత్తబుట్టలోకి విసిరేసి, తెలంగాణ నుంచి షర్మిలను తీసుకురావడం ఒక రకంగా ఏపీ ప్రజలను సోనియాగాందీ మరోసారి అవమానించడమే అనిపిస్తుంది. ఇదంతా తెలుగుదేశంతో ఉన్న రహస్య అవగాహన తప్ప మరొకటి కాకపోవచ్చు. ఈ చదరంగంలో షర్మిల పావుగా మిగిలిపోవడం తప్ప సీఎం జగన్కు జరిగే నష్టం ఏమీ ఉండదని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కెదురు
సాక్షి, అమరావతి : అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలతో పాటు ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్విప్ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్విప్ మేరిగ మురళీధర్ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లు జరుపుతున్న విచారణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే.. స్పీకర్, చైర్మన్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు నాలుగు వారాల గడువునిచ్చేలా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న వారు చేసిన అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్, అసెంబ్లీ స్పీకర్లతో పాటు ఫిర్యాదుదారు అయిన మదునూరి ప్రసాదరాజును ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇదీ నేపథ్యం.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి గెలుపొందిన మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్ను ధిక్కరించి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో వైఎస్సార్సీపీ వారిని పార్టీ నుంచి బహిష్కరించింది. ఆ తరువాత వారు టీడీపీలోకి ఫిరాయించారు. ఈ నేపథ్యంలో.. వీరిపై ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలంటూ చీఫ్విప్ మదునూరి ప్రసాదరాజు అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఇదే రీతిలో ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యపై కూడా శాసన మండలిలో చీఫ్విప్ అయిన మేరిగ మురళీధర్ మండలి చైర్మన్కు ఫిర్యాదు చేశారు. వీటిపై అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ విచారణ చేపట్టారు. అనర్హత వేటు ఎందుకు వేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఫిరాయింపుదారులకు ఇటీవల నోటీసులిచ్చారు. ఈనెల 29న విచారణ జరుపుతానని అందులో పేర్కొన్నారు. కానీ, ఈ నోటీసులను రద్దుచేయాలని కోరుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు నలుగురు, ఎమ్మెల్సీ సోమవారం అత్యవసరంగా హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్లు వేర్వేరుగా దాఖలు చేశారు. నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తమకు మరింత గడువునిచ్చేలా స్పీకర్, చైర్మన్లను ఆదేశించాలని, అలాగే విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని వారు తమ పిటిషన్లలో కోర్టును కోరారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం.. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ కృష్ణమోహన్ విచారణ జరిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ప్రసాదరావు ఫిర్యాదుపై స్పీకర్ తమకు నోటీసులిచ్చి, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఈ నెల 8న ఆదేశించారన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్నందున ఆ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు మరింత గడువు కావాలని ఆ నలుగురు కోరడంతో ఈ నెల 26 వరకు స్పీకర్ గడువునిచ్చారన్నారు. తిరిగి ఈనెల 24న స్పీకర్కు లేఖ రాసి, వివరణకు నాలుగు వారాల గుడువునివ్వాలని కోరామన్నారు. అయితే, స్పీకర్ తమ అభ్యర్థనను తిరస్కరించి, ఈ నెల 29న విచారణ జరుపుతామని చెప్పారన్నారు. స్పీకర్ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఏ నిమిషంలోనైనా ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉందని, అందువల్ల అనర్హత పిటిషన్లలో తదుపరి చర్యలన్నీ నిలుపుదల చేయాలని ఆయనతో పాటు ఎమ్మెల్సీ న్యాయవాది కోర్టును కోరారు. ఫిరాయింపుదారులను విచారించిన స్పీకర్ మరోవైపు.. వెలగపూడిలోని తాత్కాలిక శాసనసభలోని తన కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు నలుగురిని స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం విచారించారు. ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని స్పీకర్ వారిని కోరారు. వివరణ ఇవ్వడానికి తమకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని వారు చేసిన విజ్ఞప్తిని స్పీకర్ సున్నితంగా తోసిపుచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే మూడుసార్లు సమయం ఇచ్చామని గుర్తుచేస్తూ వారిని విచారించారు. అలాగే, స్పీకర్కు టీడీపీ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో వాసుపల్లి గణేష్ కూడా విచారణకు హాజరయ్యారు. వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం హాజరుకాలేదు. నోటీసులివ్వడం సహజ న్యాయ సూత్రాలకు ఎలా విరుద్ధం? అనంతరం.. అసెంబ్లీ తరఫున న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు వాదనలు వినిపిస్తూ.. అనర్హత పిటిషన్ల విషయంలో స్పీకర్ గానీ, మండలి చైర్మన్గానీ ఓ ట్రిబ్యునల్గా వ్యవహరిస్తారని తెలిపారు. అందువల్ల వారి నిర్ణయాలను అధికరణ 226 కింద కోర్టుల్లో సవాలు చేయడానికి వీల్లేదన్నారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపే పరిధి హైకోర్టుకు లేదన్నారు. కాలయాపన చేయాలన్న ఉద్దేశంతోనే వివరణ ఇచ్చేందుకు పిటిషనర్లు గడువు కోరుతున్నారని తెలిపారు. న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలకు వారి వారి విధులు, బాధ్యతలున్నాయని, ఒక వ్యవస్థలోకి మరొకరు చొరబడటానికి వీల్లేదన్నారు. చట్టం నిర్ధేశించిన మేరకే స్పీకర్, చైర్మన్ నోటీసులిచ్చి వివరణ కోరారన్నారు. వివరణ కోరకుండా ఉత్తర్వులిస్తే అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమవుతుందే తప్ప, నోటీసులు ఇచ్చి వివరణ కోరడం ఎలా విరుద్ధమవుతుందని ప్రశ్నించారు. స్పీకర్, మండలిౖ చైర్మన్ తుది ఉత్తర్వులు జారీచేయడానికి ముందే దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలు అపరిపమైనవని మెట్టా చంద్రశేఖర్రావు వివరించారు. ఇలా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్.. పిటిషనర్లు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయలేమని తేల్చిచెప్పారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేశారు. -
రాజ్యసభకు మోగిన నగారా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఏప్రిల్ 2న ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూలు జారీచేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను ఫిబ్రవరి 8న జారీచేయనుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఫిబ్రవరి 15 కాగా.. ఫిబ్రవరి 16న నామినేషన్లను పరిశీలిస్తారు. వాటి ఉపసంహరణకు తుది గడువు ఫిబ్రవరి 20. పోలింగ్ను ఫిబ్రవరి 27న ఉ.9 గంటల నుంచి సా.4 గంటల వరకూ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపును ఫిబ్రవరి 27న సా.5 గంటల నుంచి చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. గతంలో రాష్ట్ర కోటాలో రాజ్యసభకు ఎన్నిౖకైన వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (వైఎస్సార్సీపీ), కనకమేడల రవీంద్రకుమార్ (టీడీపీ), సీఎం రమేష్ (బీజేపీ)ల పదవీకాలం ఏప్రిల్ 2తో పూర్తికానుంది. ఖాళీ కానున్న ఈ మూడు రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రస్తుతం శాసనసభలో ఉన్న సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే ఈ మూడు రాజ్యసభ స్థానాలూ వైఎస్సార్సీపీ ఖాతాలోకి చేరడం ఖాయం. దీంతో రాష్ట్ర కోటాలో మొత్తం 11 స్థానాలూ వైఎస్సార్సీపీ పరమవుతాయి. అంటే.. ఏప్రిల్ 2 తర్వాత రాజ్యసభలో టీడీపీ ఉనికే లేకుండాపోతోంది. ఆ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటివరకు 41 ఏళ్లలో రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోవడం ఇదే ప్రథమం అవుతుంది. అప్పట్లో ఆ ఎనిమిదీ వైఎస్సార్సీపీకే.. ఇక రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 250 లోపు ఉండాలి. ప్రస్తుతం ఆ సభ్యుల సంఖ్య 245. ఇందులో 233 మందిని దేశంలోని రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. మిగతా 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. మన రాష్ట్ర కోటాలో రాజ్యసభ సభ్యుల సంఖ్య 11. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీకి ఇద్దరు.. టీడీపీకి 9 మంది సభ్యులు ఉండేవారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 50 శాతం ఓట్లతో 151 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలు నెరిపి.. అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్రావు, టీజీ వెంకటేష్లను బీజేపీలోకి ఫిరాయించేలా చంద్రబాబు చక్రం తిప్పారు. రాష్ట్ర కోటాలో ఎన్నికైన రాజ్యసభ సభ్యుల్లో 2020లో నలుగురు (టీడీపీ), 2022లో నలుగురు (ముగ్గురు టీడీపీ, ఒకరు వైఎస్సార్సీపీ) పదవీకాలం పూర్తవడంతో ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించింది. అసెంబ్లీలో వైఎస్సార్సీపీకి ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ఈ ఎనిమిది స్థానాలు వైఎస్సార్సీపీకే దక్కాయి. ఇందులో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి సీఎం జగన్ చాటిచెప్పారు. ఒక్కో స్థానం గెలవాలంటే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు.. మరోవైపు.. రాష్ట్ర కోటాలో ఖాళీకానున్న మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తోంది. టీడీపీ సభ్యుడు గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించడంతో ప్రస్తుతం అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 174కు తగ్గింది. ఇందులో సాంకేతికంగా చూస్తే వైఎస్సార్సీపీ బలం 151.. టీడీపీ బలం 22.. జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. వీటిని పరిగణలోకి తీసుకుంటే.. రాజ్యసభకు ఒక స్థానం నుంచి ఎన్నిక కావాలంటే 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ప్రస్తుతం శాసనసభలో వైఎస్సార్సీపీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే.. మూడు స్థానాలు ఆ పార్టీ ఖాతాలో చేరడం ఖాయం. -
YSRCP: జనక్షేత్రంలో జేజేలు
సాక్షి, అమరావతి: నాలుగున్నరేళ్లలో దాదాపు రూ.4.21 లక్షల కోట్లను డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో రాష్ట్ర ప్రజలకు అందించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి ఇంటి తలుపు తట్టి సంక్షేమంతో పలుకరించింది. సుపరిపాలనతో ఎన్నికల హామీలను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆశీర్వదిస్తూ ప్రజలు ప్రతి అడుగులోనూ వెన్నంటే నిలుస్తున్నారు. తాజాగా నిర్వహించిన భీమిలి సభ సీఎం జగన్కు జనామోదం ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపించింది. సముద్రంలా ఉప్పొంగిన జన వాహిని సంక్షేమ ప్రభుత్వానికి మద్దతు పలికింది. మరోవైపు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు లక్షల మందిని సమీకరించాలని ఆదేశించినా ఏ సభ చూసినా పట్టుమని 10 – 15 వేల మంది కూడా రాకపోవడంతో బేజారెత్తుతున్నారు. నియోజకవర్గాల ఇన్చార్జీలపై కన్నెర్ర చేస్తున్నారు. ప్రజాభీష్టం అలా ఉన్నప్పుడు తామేం చేయగలమని పార్టీ నేతలు నిస్పృహ వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు 15 సభలకు వచ్చిన జనం మొత్తం అంతా కలిపినా కూడా సీఎం జగన్ తాజాగా పాల్గొన్న ఒక్క భీమిలి సభతో పోలిస్తే సగం మంది కూడా లేకపోవడం గమనార్హం. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీలపై ప్రజల్లో అసంతృప్తి కలగడం సాధారణం! కానీ రాష్ట్రంలో మాత్రం ఎన్నిక ఏదైనా సరే ఏకపక్షంగానే ఫలితాలు వెలువడటం ప్రజాభీష్టానికి తార్కాణంగా నిలుస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజురోజుకూ ప్రజాదరణ వెల్లువెత్తుతోంది. పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు, తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక.. బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాల ఉప ఎన్నికల్లో ఇది స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 25కు 25 లోక్సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఇటీవల టైమ్స్ నౌ లాంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. గత 56 నెలలుగా ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రతి ఇంటా.. ప్రతి గ్రామం.. ప్రతి నియోజకవర్గంలో వచ్చిన విప్లవాత్మక మార్పే వైఎస్సార్సీపీకి రోజురోజుకూ ప్రజాదరణ పెరగడానికి దారి తీస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకవైపు సీఎం జగన్కు జనం నీరాజనాలు పలుకుతుండటం, వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు ప్రతి నియోజకవర్గంలోనూ జనం పోటెత్తుతుండటం.. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభలకు జనం మొహం చాటేస్తుండటాన్ని బట్టి చూస్తే 2019కి మించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అత్యంత భారీ విజయాన్ని సాధించడం ఖాయమని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. నిబద్ధతతో పెరుగుతున్న విశ్వసనీయత.. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు తన దృష్టికి తెచ్చిన వాటితోపాటు తాను స్వయంగా గుర్తించిన సమస్యలను క్రోడీకరించి వాటి పరిష్కారమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను రూపొందించి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్సభ (88 శాతం) స్థానాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. దేశ చరిత్రలో ఇంత ఘనవిజయం సాధించిన పార్టీ మరొకటి లేదు. టీడీపీ 39.17 శాతం ఓట్లతో 23 శాసనసభ, మూడు లోక్సభ స్థానాలకే పరిమితమైంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతం హామీలను అమలు చేసిన సీఎం జగన్ నిబద్ధత చాటుకుంటూ ఇప్పటికే 99.5 శాతం హామీలను నెరవేర్చారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలేదు. ఇప్పటిదాకా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.53 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.1.68 లక్షల కోట్లు వెరసి మొత్తం రూ.4.21 లక్షల కోట్ల మేర పేదలకు ప్రయోజనాన్ని చేకూర్చారు. దేశ చరిత్రలో ఈ స్థాయిలో డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో ప్రజలకు మరెవరూ మేలు చేసిన దాఖలాలు లేవు. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సింహభాగం పదవులు ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా సామాజిక న్యాయం అంటే ఇదీ అని దేశానికి సీఎం జగన్ చాటి చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించడం ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు. వలంటీర్ల ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను చేరువ చేశారు. విద్య, వ్యవసాయ, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో అగ్రభాగాన నిలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్పై ప్రజల్లో విశ్వసనీయత రోజురోజుకు పెరుగుతోంది. ఎన్నడూ ఇచ్చిన మాటకు కట్టుబడని నైజం కలిగిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరి పట్ల నానాటికీ వ్యతిరేకత పెరుగుతోంది. విశ్వసనీయతకు పట్టం.. టీడీపీ చరిత్రలో 2019 ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు చెల్లాచెదరయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల.్లో పోటీ చేసేందుకు ఆపార్టీకి అభ్యర్థులు సైతం దొరకని దుస్థితి ఏర్పడింది. పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో ఆందోళన చెందిన చంద్రబాబు నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ను అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్ర చేశారు. 2021 ఫిబ్రవరిలో 13,094 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా వైఎస్సార్సీపీ మద్దతుదారులు 10,299 పంచాయతీల్లో (80 శాతం) గెలుపొందారు. టీడీపీని 2,166, జనసేనను 157 పంచాయతీలకు ప్రజలు పరిమితం చేశారు. ► ఆ తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించిన చంద్రబాబు పంచాయతీ ఎన్నికల కంటే మరింత ఘోర పరాభవం తప్పదని పసిగట్టి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే క్షేత్ర స్థాయిలో పార్టీ నేతలకు భారీ ఎత్తున ఇం‘ధనం’ సమకూర్చి నిమ్మగడ్డ రమేష్తో కలిసి కుట్రలకు పాల్పడినా మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించింది. ► మండల, జిల్లా పరిషత్ ఎన్నికల తరహాలోనే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ నిమ్మగడ్డ రమేష్తో కలిసి చంద్రబాబు పన్నిన కుట్రలను ప్రజలు చిత్తు చేశారు. వైఎస్సార్సీపీకి చారిత్రక విజయాన్ని అందించారు. ► స్థానిక సంస్థల ఎన్నికల్లో (పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్) టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సైకిల్ నామరూపాలు లేకుండా పోయింది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ గెలుస్తూ వస్తున్న, ప్రస్తుతం బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోనూ చిత్తుగా ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో టీడీపీ నెగ్గిన 23 నియోజకవర్గాల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం గమనార్హం. ► తిరుపతి లోక్సభ, బద్వేలు శాసనసభ స్థానాలకు 2021లో, ఆత్మకూరు శాసనసభ స్థానానికి 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కంటే అత్యధిక మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ► సీఎం జగన్ విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారనేందుకు అధికారం చేపట్టిన నాటి నుంచి వైఎస్సార్సీపీ సాధించిన వరుస ఘనవిజయాలే తార్కాణమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ► ఇటీవల జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ప్రజా తీర్పు పేరుతో నిర్వహించిన సర్వేలో 1.16 కోట్ల కుటుంబాలు (80 శాతం కుటుంబాల ప్రజలు) మా నమ్మకం నువ్వే జగన్ అంటూ నినదించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో 25కు 25 లోక్సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని తాజాగా టైమ్స్ నౌ లాంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ వెల్లడైంది. -
ఎన్నికల కురుక్షేత్రంలో అభిమన్యుడిని కాను.. అర్జునుడిని: సీఎం జగన్
అటు సముద్రం.. ఇటు జన సముద్రం కనిపిస్తోంది. ఇక్కడకు వచ్చిన ప్రతి అక్క, చెల్లెమ్మ, అన్న, తమ్ముడు, స్నేహితుడు, అవ్వ, తాతల్లో కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం, సేనాధిపతులు కనిపిస్తున్నారు. ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తుంటే.. అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది. గజదొంగల ముఠా ఉంది. వారి వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలు మోసపూరిత వాగ్దానాలు, ఎత్తులు, పొత్తులు, చిత్తుల పద్మవ్యూహం కనిపిస్తోంది. ఆ పద్మవ్యూహంలో చిక్కుకొని బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఈ అర్జునుడికి మీ అందరి తోడు.. కృష్ణుడి రూపేణా అండదండలున్నాయి. అందుకే మీ బిడ్డ భయపడడు. దేనికీ తొణకడు. గత ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేశాం. తద్వారా చెప్పాడంటే చేస్తాడంతే.. అని నిరూపించాం. ఇది నా ఒక్కడి పార్టీ కాదు. ఇది అందరి పార్టీ. అందుకే నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని పదవులు, నియామకాల్లో అగ్రభాగం కల్పించాం. రానున్న ఎన్నికలు పేదలకు ఎంతో కీలకం. మన పిల్లలకు ఇంగ్లిష్ విద్య అందాలన్నా.. వారికి ట్యాబ్లు రావాలన్నా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఐఎఫ్బీ ప్యానల్స్తో విద్యను అందించాలన్నా.. పోటీ ప్రపంచంతో మన విద్యార్థులు ధైర్యంగా ఢీకొట్టాలన్నా.. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే పింఛను చేతికి అందాలన్నా.. ఆర్బీకేల ద్వారా రైతుల అవసరాలు తీరాలన్నా.. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్ విధానం కొనసాగాలన్నా.. మనందరి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలి. ఇందుకోసం ప్రతీ ఒక్కరు గడప గడపకు వెళ్లి మన ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భీమిలిలో అటు సముద్రం.. ఇటు జన సముద్రం సాక్షిగా దిక్కులు పిక్కటిల్లేలా లక్షలాది జన నినాదాల నడుమ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు. అబద్ధానికి, నిజానికి.. మోసానికి, విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఇక్కడున్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడని సీఎం జగన్ స్పష్టం చేశారు. పొత్తులు, జిత్తుల పద్మవ్యూహాలతో చంద్రబాబు నేతృత్వంలోని కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రజల ఆశీస్సులు, దేవుడి దయ వంటి కృష్ణుడి ఆశీస్సులతో మీ బిడ్డ జగన్ సిద్ధంగా ఉన్నాడని ప్రకటించారు. 2024 జైత్ర యాత్రకు భీమిలి నుంచే శంఖం పూరిస్తున్నామని చెప్పారు. భీమిలి నియోజకవర్గం తగరపువలస జంక్షన్ వద్ద శనివారం ‘సిద్ధం’ పేరుతో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర వైఎస్సార్ కుటుంబ సమావేశానికి సీఎం హాజరయ్యారు. సభలో అభిమాన జనం మధ్య ఏర్పాటు చేసిన ర్యాంపుపై అడుగులు ముందుకు వేస్తూ అభివాదం చేశారు. శంఖం పూరించి.. నగారా మోగించి 2024 ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధమని లక్షలాది మంది శ్రేణుల ఈలలు, కేకలు, నినాదాల మధ్య ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సాధించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. గత 56 నెలలో కాలంలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్ని చూసినా మనం చేసిన మంచి కనపడుతుందని తెలిపారు. సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ విధానం, నాడు–నేడుతో మారిన పాఠశాలలతో రాష్ట్రమంతటా వైఎస్సార్సీపీ మార్క్, జగన్ మార్క్ కనిపిస్తోందన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు హయాంలో ఆయన మార్క్ పని ఒక్కటీ లేదని దుయ్యబట్టారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. పథకాలే ఎన్నికల బాణాలు, అస్త్రాలు ► 2024 ఎన్నిల్లో మన పార్టీ జైత్ర యాత్రకు.. మరో పాతికేళ్ల పాటు సంక్షేమ, అభివృద్ధి పాలన కొనసాగింపునకు.. ఈ భీమిలిలో సన్నాహక సమావేశం జరుగుతోంది. మన పార్టీని భుజాన మోసిన, మోస్తున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆత్మీయులలో ఆత్మవిశ్వాసం నింపేందుకే ఇక్కడ సమావేశమయ్యాం. మేనిఫెస్టో ద్వారా మనం ఇచ్చిన ప్రతి మాటా అధికారంలోకి వచ్చాక త్రికరణ శుద్ధితో ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చిన ఈ పార్టీలో మీతో నా ఆలోచనలను పంచుకోడానికే ఈ సమావేశం. ► పేద ప్రజల మీద ప్రేమతో, బాధ్యతతో 56 నెలల కాలంలో అమలు చేస్తున్న పథకాలే మనకు రానున్న ఎన్నికలకు బాణాలు, అస్త్రాలు. ఈ యుద్ధంలో 175కు 175 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్. గెలుపే మన లక్ష్యం. దేవుడి దయతో ప్రతి ఇంటికి, ప్రాంతానికి, ఊరికి చేసిన మేలుతో చంద్రబాబుతో సహా వారంతా ఓడాల్సిందే. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం వారికి లేదు ► గత ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు చెప్పిన మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్తబుట్టలో వేశాయి. మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని మార్చింది. అందుకే ప్రజలకు మనం దగ్గరయ్యాం. వైఎస్సార్ కాంగ్రెస్ను ప్రజలు తమ పార్టీగా భావిస్తున్నారు. చంద్రబాబు 75 ఏళ్ల వయస్సు మళ్లిన నాయకుడు. ► ఒంటిరిగా పోటీ చేసే ధైర్యం లేక దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడు తున్నాడంటే దాని అర్థం ఏమిటో ఆలోచించండి. చంద్రబాబు తాను మంచి పని చేశానని, ఒక స్కీమ్ పెట్టామని చెప్పలేక.. కొత్త వాగ్దానాలతో గారడి చేయాలని చూస్తున్నాడంటే ప్రజల్లో వారు లేరని అర్థం. చివరికి 2019లో వచ్చినన్ని 23 స్థానాలు కూడా వారికి రావని అర్థం. 175 స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు అభ్యర్థులు కూడా లేరని అర్థం. మన చరిత్ర ఇంటింటి విజయగాథ ► వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఓ విప్లవ గాథ. మన ప్రభుత్వ చరిత్ర ఇంటింటి విజయ గాథ. మన భవిష్యత్తు.. సామాజిక వర్గాల ఇంద్ర ధనస్సు. మనది వయస్సుతో పాటు మంచి భవిష్యత్తు ఉన్న పార్టీ. మన పాలనలో అన్ని రంగాల్లో చిత్తశుద్ధితో సంక్షేమం, అభివృద్ధి కనిపిస్తుంది. ఈ రెండింటిలో సరికొత్త రికార్డును సృష్టించిన పార్టీ అని గర్వంగా చెబుతున్నా. నేను మోసాన్ని నమ్ముకోలేదు. ఇంటింటికి చేసిన సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకొని ప్రజల దగ్గరకు మళ్లీ వెళుతున్నాను. ► పేదరికం, అసమానత సంకెళ్లను బద్దలు కొట్టి.. ప్రతి పేద కుటుంబానికి మంచి చేస్తూ.. 21 శతాబ్ధంలోకి నడిపిస్తున్న మనసున్న, బాధ్యత గల ప్రభుత్వం మనది. ఇదే విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. 70 రోజుల్లో ఎన్నికల యుద్ధానికి ప్రతి ఒక్కరి భుజస్కందాలపై బాధ్యతలు పెడుతున్నాం. అబద్ధానికి నిజానికి.. మోసానికి, విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న యుద్ధమిది. 2014లో చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో 650 వాగ్దానాలు ఇచ్చారు. అందులో 10 శాతం కూడా అమలు చేయలేదు. మన ప్రభుత్వం 99 శాతం వాగ్దానాలు అమలు చేయడం వల్ల ప్రతి ఇంట్లో సంతోషం చూసి సంబర పడుతున్నాం. నా గుండెల నిండా మీరే.. ► పేద సామాజిక వర్గాల మీద ప్రేమ ఉంది కాబట్టే నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అంటూ నామినేటెడ్ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరీ సగం పదవులన్నీ ఈ వర్గాలకే ఇచ్చాం. కేబినెట్లో ఏకంగా 68 శాతం మంత్రి పదవులు, నలుగురు డిప్యూటీ సీఎంలు, చట్టసభ స్పీకర్ ఒక బీసీ, కౌన్సిల్ చైర్మన్గా ఒక ఎస్సీ, డిప్యూటీ చైర్పర్సన్గా ఒక మైనార్టీ కనిపిస్తున్నారు. స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసి వారిని గుండెల్లో పెట్టుకున్నాం. ఆలయ కమిటీ చైర్మన్లుగా, ఏఎంసీ చైర్మన్లుగా కనిపిస్తున్నారు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు. ఆ ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టే ఇది మనందరి ప్రభుత్వం. ► ఈ 56 నెలల్లో 2.13 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకొచ్చాం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 4 లక్షల ఉద్యోగాలు ఉంటే.. మీ బిడ్డ ప్రభుత్వం మరో 2.13 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చింది. ఇందులో ఏకంగా 80 శాతం నా.. నా.. నా.. అని పిలుచుకొనే నా తమ్ముళ్లు, చెల్లెమ్మలు ఉన్నారని గర్వంగా తెలియజేస్తున్నా. ► అక్కచెల్లెమ్మలపై ప్రేమ గుండెల నిండా ఉంది కాబట్టే లంచాలు, వివక్ష లేకుండా మీ బిడ్డ ఒక బటన్ నొక్కి రూ.2.53 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి వేశాడు. ఇంతటి ఆప్యాయత చూపిస్తున్నాం కాబట్టే అట్టడుగున ఉన్న వారికి అధికారుల నుంచి లీడర్ల దాకా చిక్కటి చిరునవ్వుతో సెల్యూట్ కొడుతున్నారు. పేద, సామాజిక వర్గాల మీద ప్రేమ చూపించడంలో చంద్రబాబు మార్క్ ఎక్కడ? ► పేద వర్గాలు కనిపిస్తే ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా.. అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడతాడు. సాక్షాత్తు సీఎం నోటి నుంచి అటువంటి మాటలు వస్తే గ్రామాల్లో ఎవరైనా ఆ ఎస్సీలను పట్టించుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తా ఖబడ్దార్.. అంటే గ్రామాల్లో వారిని పట్టించుకుంటారా? చంద్రబాబుకు పేద, సామాజిక వర్గాలపై, వారి అభ్యున్నతిపై ప్రేమ ఎక్కడుంది? ఎక్కడ చూసినా, ఏ పేదవాడి ఇంటికి వెళ్లినా కనిపించేది వైఎస్సార్సీపీ, జగన్ మార్క్ మాత్రమే. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు.. ► రాష్ట్రంలో కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామానికైనా వెళ్లండి. మీ ఇష్టం. ఎక్కడకు వెళ్లినా ఆ గ్రామానికి చంద్రబాబు ఏం చేశారంటే చెప్పడానికి ఏమీ కనిపించదు. జగన్ ఏం చేశాడంటే.. ఈ 56 నెలల్లో ప్రతి గ్రామంలో ఎన్నెన్నో మార్పులు కనిపిస్తున్నాయి. గ్రామ సచివాలయాలు కనిపిస్తాయి. 540 పౌర సేవలు. అందులో దాదాపు 10 మంది మన పిల్లలు శాశ్వత ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు. ఎక్కడా అవినీతి, లంచాలు, వివక్ష ఉండదు. ► ఇంటింటికీ ఒకటో తేదీ ఉదయాన్నే పెన్షన్ అయినా, పౌర సేవలైనా, ఏ పథకమైనా మన గడపకే తెచ్చి చిరునవ్వుతో అందించే మనలో భాగమైన ఓ గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం. రైతన్నను చేయి పట్టుకొని నడిపించే ఆర్బీకే వచ్చింది. అదే గ్రామంలో ఒక విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఇంటింటినీ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం.. ఇటువంటివన్నీ మీ బిడ్డ పాలనలోనే వచ్చాయి. ► నాడు–నేడుతో విద్యా రంగానికి మంచి రోజులు వచ్చాయి. ఇంగ్లీష్ మీడియంతో మొదలు ట్యాబ్లు, ఐఎఫ్బీ, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు ఇలా అన్నీ మన ప్రభుత్వంలోనే అమలయ్యాయి. అదే గ్రామంలో సచివాలయంలో మహిళా పోలీస్. ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలోని ఫోన్లో దిశ యాప్.. వారికి ఎటువంటి అపాయం సంభవించినా కేవలం బటన్ నొక్కిన వెంటనే లేదా మొబైల్ అయిదుసార్లు ఊపితే 10 నిమిషాల్లో పోలీస్ సోదరుడు వచ్చి చెల్లమ్మను ఏమైందని అడిగే వ్యవస్థ వచ్చింది ఇప్పుడే. బ్రాడ్ బ్యాండ్, డిజిటల్ లైబ్రరీలు కట్టిందీ ఇప్పుడే. ► ఇలాంటి మంచి పనులు చేయాలనే ఆలోచన 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు ఏనాడూ రాలేదు. ఎందుకంటే వీరు పెత్తందారులు కాబట్టి. పల్లె ప్రజలంటే బాబు దృష్టిలో పని మనుషులు. పెత్తందారుల పొలాల్లో, ఇళ్లలో పని చేసే పని మనుషులు. పొట్ట పోసుకోవడం కోసం ఉండే జనావాసం ఆ పల్లె అని చంద్రబాబు నమ్మకం. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ గ్రామం, పల్లె బాగుపడదు. ప్రజలు, పేదవాడు బాగుపడాలి, గొప్పగా చదవాలి, భవిష్యత్తు మారాలన్న తాపత్రయం పెత్తందార్లకు లేదు. ఎక్కడ చూసినా వైఎస్సార్సీపీ, జగన్ మార్క్ ► రైతు సంక్షేమాన్ని చూస్తే మనమక్కెడ.. చంద్రబాబు ఎక్కడ? అని ఆలోచన చేయాలి. రుణమాఫీ చేస్తానని నిలువునా ముంచింది చంద్రబాబు. రైతులు 87,612 కోట్లు బ్యాంకులకు కట్టొద్దని పిలుపిచ్చాడు. మొట్టమొదటి సంతకంతో రుణమాఫీ అని వాగ్దానం చేశాడు. మేనిఫెస్టోలో పెట్టి రైతులను మోసం చేశాడు. ► ఈ రోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఆర్బీకే అంటే జగన్. సకాలంలో విత్తనమైనా, ఎరువులైనా, ఇన్పుట్ సబ్సిడీ అయినా సకాలంలో అందుతున్నాయంటే గుర్తుకొచ్చేది మీ జగన్. పగటి పూట ఉచిత్ విద్యుత్, ఉచిత బీమా, సున్నా వడ్డీ అందుతున్నాయన్నా, ఆక్వా రైతులకు కరెంట్ సబ్సిడీ అందుతోందంటే గుర్తుకొచ్చేది జగన్. ► ఏ పొలంలోకి వెళ్లినా చంద్రబాబు చెప్పుకోడానికి ఏముంది? చంద్రబాబు మార్క్ ఎక్కడుంది? ఎక్కడ చూసినా వైఎస్సార్సీపీ, జగన్ మార్క్ కనిపిస్తోంది. ప్రజల వైద్యం, ఆరోగ్యం విషయానికి వస్తే.. 108, 104 చూసినా, 3,257 ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీ విస్తరించినా.. ఆరోగ్య ఆసరా చూసినా, గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్, ఇంటింటినీ జల్లెడ పడుతూ నిర్వహిస్తున్న ఆరోగ్య సురక్ష, 17 కొత్త మెడికల్ కాలేజీలు, వైద్య రంగంలో 53 వేల కొత్త నియామకాలు.. నాడు–నేడుతో బాగుపడుతున్న ఆస్పత్రులు.. ఇలా ఏది తీసుకున్నా ఒక వైఎస్సార్సీపీ, జగన్ మార్క్ కనిపిస్తోంది. ► ఏ ప్రభుత్వ బడిని తీసుకున్నా.. మొత్తంగా విద్యా రంగాన్ని తీసుకున్నా.. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం, తెలుగు, ఇంగ్లిష్ భాషలు ఉన్న పాఠ్యపుస్తకాలు, బైజూస్ కంటెంట్, మన ప్రభుత్వ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్లు, క్లాస్రూమ్లలో ఐఎఫ్పీలు, గోరుముద్ద, బడి తెరిచే సరికే విద్యా కానుక, పెద్ద చదువులు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలు అవ్వకూడదని ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇస్తూ జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, విదేశాల్లోని టాప్ యూనివర్శిటీల్లో ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా డిగ్రీల అనుసంధానం ఇలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. జాబ్ ఓరియంటెడ్ కరిక్యులం ద్వారా ఇంటర్న్షిప్తో డిగ్రీలో చేర్చడం, ఇలా విద్యా రంగంలో ఏది తీసుకున్నా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పెత్తందారులను ఓడిద్దాం ► వచ్చే ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం. వారి వంచనకు, మన విశ్వసనీయతకు మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు వారి దోచుకో, పంచుకో, తినుకో అనే విధానానికి మన డీబీటీ అంటే బటన్ నొక్కడం.. నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బు వెళ్లిపోడానికి మధ్య జరుగుతున్న యుద్ధం. వారి సామాజిక అన్యాయానికి మన సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసే వారి కుట్రలకు, మన సంక్షేమ ప్రభుత్వానికి మధ్య యుద్ధం. వచ్చే రెండు నెలలు మనందరికీ నిత్యం యుద్ధమే. ఈ 70 రోజులు ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీకి ఒక సైన్యంలా పని చేయాలి. ► ప్రతిపక్షాలు పది వైపుల నుంచి చేసే దాడులను వారి ఎల్లో మీడియాను, వారి సోషల్ మీడియాను, అందులో చేసే దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి. ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్పోన్లు ఉన్నాయి. అవే మీకు అస్త్రాలు. సెల్ఫోన్ ఉన్న ప్రతి పేద వాడు కూడా సోషల్ మీడియాను శాసించవచ్చు. బూత్ కమిటీల సభ్యులు, గృహ సారథులు, వలంటీర్లు, సామాన్య కార్యకర్త మొదలు, రాజ్యసభ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ కీలకమైన పాత్ర పోషించాలి. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు. 25కి 25 ఎంపీలు మన లక్ష్యం. ► ప్రతి ఇంటికి మంచి చేశాం. ప్రతి గ్రామంలో మంచి జరిగింది. అందులో 60 శాతం కుటుంబాలు మీ వెంట, మన వెంట ఉంటే అన్ని సీట్లు మనవే. మంచి చేసిన, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం, ప్రతి పేదవాడి భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన, చేస్తున్న ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం. ఈ యుద్ధానికి సిద్ధం, సై అంటున్న మీ బిడ్డకు మీరందరూ తోడుగా ఉండడానికి సిద్ధమా అని అడుగుతున్నా. (సిద్ధం.. అని జనం నుంచి కేకలు) జనంలో లేని, పేదవారి గుండెల్లో లేని వారు, దిగజారుడు పార్టీలన్నింటికీ మీ జగనన్నే టార్గెట్. పేదవాడి భవిష్యత్తు, వైఎస్సార్సీపీయే లక్ష్యంగా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి. దుష్ట చతుష్టయాన్ని, గజదొంగల ముఠాను, ఓడించేందుకు మీరు సిద్ధమా.. (సిద్ధమేనని నినాదాలు) వారందరిపై ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు, దేవుడి దయ ఉన్నంత వరకు మీ బిడ్డ ఏ ఒక్కరికీ భయపడడు. సమరనాదం చేస్తూ ఎన్నికల శంఖారావం పూరిస్తూ మేం యుద్ధానికి సిద్ధమని వైఎస్సార్సీపీ ఇక్కడి నుంచి పిలుపునిస్తోంది. -
పుట్టింటోళ్ళు తరిమేశారు.. కట్టుకున్నోడు వదిలేశాడు!
మూడిళ్ళ చుట్టం మూతి ఎండి చచ్చినట్లు అయిందట. మాఇంటికి రాలేదు కదా... వాళ్ళింటికి కదా వచ్చారు.. అక్కడే తింటారులే అని ఈ ఇంటివాళ్ళు... అదేం లేదులే.. అక్కడికి వెళ్ళాడు కదా... తినేసి వస్తాడేమో అని ఆ ఇంటివాళ్ళు మొత్తానికి ఆ చూట్టానికి చుక్కలు చూపించి చివరకు పస్తులు పెట్టారట.. అలా అయ్యేలా ఉంది రఘురామకృష్ణం రాజు పరిస్థితి. బిజెపి... టిడిపి.. ఇలా అన్ని పార్టీల్లో తిరిగేసి. ఎక్కడ నిలువనీడ లేకుండా ఉండిపోయే పరిస్థితుల్లో అయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచారు. 2019లో వైఎస్సార్సీపీలో చేరి ఎంపీగా గెలిచిన రఘురామ ఆ తర్వాత ముసుగు తీసి చంద్రబాబు ఏజెంట్ గా మారిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో బాటు ప్రభుత్వాన్ని, అధికారులను విమర్శించడం మొదలెట్టారు. ఇదంతా సహజంగా అటు తెలుగుదేశానికి, దాని మద్దతుదారులయిన మీడియా సంస్థలకు అయన ఒక సోర్స్ గా మారిపోయారు. అయన రోజూ జగన్ మోహన్ రెడ్డిని. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ టీవీల్లో మాట్లాడడం.. దాని ఆయా సంస్థలు ఘనంగా ప్రచురించడం జరుగుతూ వస్తోంది. మొదట్లో అయన వ్యాఖ్యలు.. కామెంట్లకు మంచి రేటింగ్స్... వ్యూవర్ షిప్ ఉండేది కానీ నిత్యం జగన్ను తిట్టడమేపనిగా పెట్టుకున్న ఆయన్ను ఇక ప్రజలు చూడడం మానేశారు. అయినా సరే ఆయనకు వేరే గత్యంతరం లేక ఆయా మీడియా సంస్థలను అనధికార రెగ్యులర్ యాంకర్ కమ్. మోడరేటర్ కమ్ సలహాదారు... విశ్లేషకుడుగా మారిపోయారు. ఈ ఎపిసోడ్లన్నీ ముగిసి ఇప్పుడు ఆయా పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. జనసేన... తెలుగుదేశం.. వైయస్సార్ కాంగ్రెస్.. ... చివరకు ఒక్కసీటు కూడా గెలవని బిజెపి సైతం తమ అభ్యర్థులను సిద్ధం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ రఘురామకృష్ణం రాజుకు ఎవరు టికెట్ ఇస్తారన్నది అర్థం కావడం లేదు. ఆయన్ను ఎవరూ భరించలేరు.. పైగా ఆయనకు సొంత క్యాడర్ లేదు.. ప్రజల్లోనూ ఆదరణ లేదు.. అలాంటపుడు ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తే అయన దెబ్బకు ఆ ఎంపీ పరిధిలోని ఏడు ఎమ్మెల్యే సీట్లు సైతం ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆయన్ను అందరూ ఒక ఐటం క్యారెక్టర్ మాదిరి వాడుకుని పక్కనపడేస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. కుక్కను శత్రువుమీద మొరగడానికి పెంచుకుంటాం... మనమీద మొరుగుతుంది అనుకుంటే చెప్పుతో కొడతాం అనే సినిమా డైలాగ్ మాదిరి... ఆయన్ను టీడీపీ... దాని అనుబంధ మీడియా కేవలం ప్రభుత్వాన్ని విమర్శించినంతవరకే మీడియాలో కవరేజి ఇచ్చి ఊరుకుంటారు తప్ప ఆయనకు ఎక్కడా టిక్కెట్ మాత్రం ఇవ్వరు అంటున్నారు. ఆయనకు నర్సాపురం... లేదా ఇంకోచోట టికెట్ ఇస్తే అయన అసమర్థత.. అహంకారం .. ఇవన్నీ కలగలిసి మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు ఓడిపోతారన్న ఆందోళన ఆయనపార్టీల్లో కనిపిస్తోంది. అందుకే కేవలం ఆయన్ను తమ ఛానెళ్లలో చూపడానికి మాత్రమే వాడుకుని ఎన్నికలు.. టిక్కెట్స్ ఇచ్చేవేళ పక్కన పెట్టేస్తారు అని అంటున్నారు. ఆయన్ను ఎంపీ అభ్యర్థిగా టీడీపీ.. జనసేన కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఎంపీగా గెలిచిన నాలుగేళ్ళ తరువాత అయన భోగినాడు సొంత నియోజకవర్గం నర్సాపురం వచ్చారు. ఆయనకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో భారీగా భౌన్సర్లను ఆయనే ఏర్పాటు చేసుకుని ఊళ్లోకి వచ్చారు తప్ప ఆయనకోసం ఎక్కడా అభిమానులు. క్యాడర్ ఎదురు చూడలేదు. దీంతో రాజకీయంగా అయన పాత్ర ముగిసినట్లేనని, కేవలం టీడీపీ అనుకూల మీడియాలో వ్యాఖ్యానాలు చేసుకోవడానికి మాత్రమే పనికొస్తారు తప్ప కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయనకు దక్కదని నరసాపురం ప్రజలు అంటున్నారు. ✍️ సిమ్మాదిరప్పన్న -
భళా... తాటాకు చప్పుళ్ల తాండవం!
‘ఆర్తనాదములు శ్రవణానందకరముగా నున్నవి’ – ఘటోత్కచుని వేషంలో ఎస్వీ రంగారావు చెప్పిన డైలాగ్ ఇది – ఆల్టైమ్ గ్రేట్ మూవీ ‘మాయాబజార్’ క్లైమాక్స్ సీన్లో! కుట్రలతో, కుయుక్తులతో, కపటంతో, వంచనతో పాండవులను వేధిస్తున్న దుష్టచతుష్టయ కౌరవ ముఠాకు ఘటోత్కచుడు తన ఇంద్రజాలంతో బుద్ధి చెబుతాడు. అతని మాయాజాలంలో చిక్కుకొని గిలగిల కొట్టుకుంటూ పలాయన మంత్రం పఠిస్తున్న ఆ కౌరవ మూకను చూసి పగలబడి నవ్వుతాడు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఉరఫ్ వెన్నుపోటు బాబు అనే కాలం చెల్లిన నాయకుడు మనుగడ కోసం ప్రదర్శి స్తున్న గారడీ విద్యలు కూడా వినోదం పుట్టిస్తున్నవి. ఏఐ టెక్నాలజీ కాలంలో కూడా కనికట్టు టెక్నిక్ల దశను ఈ వృద్ధ నేత దాటలేకపోతున్నారు. ఈ తరహా బేసిక్ మోడల్ నాటు విద్య లనే... బాబు చాణక్యాలు, బాబు ‘చక్ర’ వ్యూహాలుగా యెల్లో మీడియా ప్రచారం చేసిపెట్టింది. ఇప్పుడు కూడా యెల్లో పిల్లి కళ్లు మూసు కొని పాలు తాగే వ్యూహాలను అమలు చేస్తున్నది. తాటాకు చప్పుళ్లను కూడా అణుబాంబు విస్ఫోటాలుగా ప్రచారం చేసే పనిలో యెల్లో మీడియా నిమగ్నమై ఉన్నది. మార్చి నెలాఖరులోగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తి కావచ్చని వినబడుతున్నది. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వరకు కూడా యాభై శాతానికి పైగా ఓటింగ్ బలం ఉన్నది. ముఖ్యమంత్రి రేటింగ్లో చంద్రబాబు అందుకోలేనంత దూరంలో జగన్మోహన్రెడ్డి ఉన్నారు. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నవారు 58 శాతం మంది ఉన్నారు. ఇటువంటి క్షేత్ర వాస్తవికత గురించిన స్పష్టమైన అవగాహన టీడీపీ కూటమికి ఉన్నది. అయిననూ ఎన్నికల్లో గెలిచి తీరవలె! ఎలా? వీలైనన్ని ఎక్కువ పొత్తులు పెట్టుకొని తమ కూటమి బలాన్ని ఎంతో కొంత పెంచుకోవాలి. ఇదొక్కటే సరిపోదు. వైసీపీ ఓటింగ్ బలంలో కోతపెట్టాలి. ఈ రెండంచెల వ్యూహాన్ని చాలాకాలంగానే టీడీపీ పెద్దలు అమలు చేస్తున్నారు. ఈ కార్య క్రమానికి వ్యూహం లాంటి గొప్ప మాటలు అనవసరం. ఇదో అనైతిక ఎత్తుగడ. దిగజారుడు విధానం. చంద్రబాబు ఆశించే పొత్తులకు సైద్ధాంతిక ప్రాతిపదిక అవసరం లేదు. భావజాల సారూప్యత గురించిన చింతే లేదు. తనకు ఐడియాలజీలు లేవని ఆయనే ప్రకటించుకున్నారు. కమ్యూనిజం అంతరించిందనీ, టూరిజమే అసలైన ఇజమనీ ఓ దివ్య సందేశాన్ని కూడా ఆయన వెలువరించారు. అయినా సరే, మన ఏపీ కమ్యూనిస్టుల్లో కొందరు ఎర్రజెండాలను చంద్ర బాబుకు వింజామరలుగా ఉపయోగించడానికి ఏమాత్రం వెనుకాడరు. ఇదేమి సంబంధమో సామాన్యులకు అర్థం కాదు. అదో దేవ రహస్యం. ‘ఏ బంధమో ఇది ఏ బంధమో, ఏ జన్మబంధాల సుమ గంధమో’ అని నిట్టూర్పులతో పాడుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. కోస్తా జిల్లాల్లో ఒక బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులు చంద్రబాబుకు సహజ శత్రువులు. ఈ వ్యతిరేక ప్రవాహం తనను రాజకీయంగా ముంచేయకుండా ఉండటానికి పవన్ కల్యాణ్ ద్వారా ఒక డైవర్షన్ స్కీమ్ను తయారు చేసుకున్నారు. తన అవసరాన్ని బట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకో, చీలడం కోసమో ఈ డైవర్షన్ స్కీమ్ను ఆయన వినియోగిస్తాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న పార్టీయే గనుక తెలుగుదేశం పొత్తు కోసం నిలబడే తొలి పార్టీ – జనసేన. అదొక్కటే సరిపోదు. బీజేపీ కూడా తోడు రావాలి. ఐదేళ్ల కింద ఎన్నికలు ముగిసిన మరుసటిరోజు నుంచే చంద్రబాబు బీజేపీతో సయోధ్య ప్రయత్నాలు మొదలుపెట్టారు. సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ వగైరా పలువురు నాయకులను ఢిల్లీ లాబీయింగ్ కోసం కమలం పార్టీలో ప్రవేశపెట్టారు. పవన్ కల్యాణ్తో తాను పెట్టించిన పార్టీని ఎన్డీఏలో చేర్పించారు. పూర్వాశ్రమంలో తాను ఎన్డీఏలో ఉన్న కాలం నాటి కొందరు సావాసగాళ్ల తోడ్పాటును కూడా పొందు తున్నారు. బీజేపీ వాళ్లకు కూడా ప్రతి రాష్ట్రంలో ఎన్డీఏకు ఎన్నో కొన్ని సీట్లు రావాలని ఉంటుంది కనుక తమ పొత్తుకు అంగీకరించక తప్పదని తెలుగుదేశం అంచనా. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమించేలా చంద్రబాబు కూటమి పావులు కదిపింది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచి బాబు అప్పగించిన ‘మిషన్’పైనే ఆమె పనిచేస్తున్నారు. ఈ పండుగలోపునే ‘మిషన్ ఎకాంప్లిష్డ్’ అనే ప్రకటన ఆమె చేసే అవకాశం ఉన్నదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ కటాక్ష వీక్షణాల కోసం ఇంతగా పరిత పిస్తున్న బాబు బృందం మరి ఆరేళ్ల కింద ఎందుకు విడి పోయినట్టు? మోదీతో సహా బీజేపీ నాయకత్వంపై ఎందుకు తీవ్రమైన విమర్శలు చేసినట్టు? బాబు రాజకీ యాల్లో సిద్ధాంతాలే కాదు లాజిక్ కూడా ఉండదు. అవకాశ వాదమే ఎజెండా! అధికారమే అంతిమ లక్ష్యం!! చంద్రబాబు ఆకాంక్షల మేరకు, పురంధేశ్వరి అభిలషి స్తున్నట్టుగా... బీజేపీతో కూడా పొత్తు కుదిరితే ఇంతటితో ప్రత్యక్ష పొత్తుల వ్యవహారం కొలిక్కి వచ్చినట్టే! ఇక పరోక్ష పొత్తుల కార్యక్రమాన్ని చాలాకాలంగా టీడీపీ నరుక్కొస్తున్నది. బీజేపీ ఉన్న కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు చేరే అవకాశం ఉండదు కనుక వీరిని అధికార పార్టీ ఓట్లు చీల్చేందుకు ఉపయో గించుకోవాలనే చావు తెలివితేటలతో టీడీపీ ప్లాన్ రూపొందించుకున్నది. కాంగ్రెస్ పార్టీకి గత కొంతకాలంగా వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సునీల్ కనుగోలు సహకారాన్ని కూడా చంద్ర బాబు తీసుకుంటున్నారట! సునీల్ కూడా చంద్రబాబు సామా జిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. కాంగ్రెస్ అధిష్ఠానంతో చంద్రబాబు మైత్రీ బంధం ఈనాటిది కాదు. గడిచిన పుష్కరకాలంగా అది బలపడుతూనే వస్తున్నది. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ భవిష్యత్తును మొగ్గలోనే తుంచేయడం కోసం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఉమ్మడి ప్రణాళికతో పనిచేశాయి. ఉమ్మడిగా ఆయనపై కేసులు వేశాయి. ఆయనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన న్యాయ మూర్తిని పదవీ విరమణ అనంతరం మానవ హక్కుల కమిషన్కు చైర్మన్గా ప్రతిష్ఠించారు. జాతీయ స్థాయిలో చిక్కి శల్యావశిష్ట స్థితికి చేరిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించిన వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఆయన మరణానంతరం ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా చేర్చి కాంగ్రెస్ హైకమాండ్ దారుణమైన కృతఘ్నతకూ, నమ్మకద్రోహానికీ పాల్పడింది. చంద్రబాబు సలహా సంప్రదింపులు కూడా ఈ వంచన వెనుక ఉన్నాయి. విభజిత ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్రంలో ఎన్టీఏతో నాలుగేళ్లు కాపురం చేసిన తర్వాత తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టేందుకు చంద్రబాబు ఆ కూటమి నుంచి వైదొలిగారు. ఆ సమయంలో మరోసారి కాంగ్రెస్కు చేరువై ఆ పార్టీకి వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఆర్థిక సహకారం అందించినట్టు కూడా వార్తలు వచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్లోనైతే ఆయన మాటే చెల్లుబాటైంది. ఆయనే ఆర్థిక సహకారం అందించి కలిసి పోటీ చేశారు. తాజా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వాన్ని సమకూర్చడమే గాక ఆర్థికంగానూ తోడ్పడ్డారనేది బహిరంగ రహస్యమే. జగన్మోహన్రెడ్డి రాజకీయ జీవితాన్ని మొగ్గలోనే తుంచడానికి వివేకానందరెడ్డి రూపంలో ఆయన కుటుంబాన్ని చీల్చినట్టే ఇప్పుడు ఆయన సోదరి షర్మిలను తెలంగాణ కార్య క్షేత్రం నుంచి ఏపీలోకి దించాలనే కాంగ్రెస్ ప్రయత్నాల వెనుక వ్యూహం కూడా చంద్రబాబుదే! తెలంగాణ కాంగ్రెస్లో షర్మిలకు భాగస్వామ్యం కల్పించడానికి రేవంత్రెడ్డి వ్యతిరేకించడం, ఆమె ఇడుపులపాయ, విజయవాడల పర్యటనలకు సీఎం రమేశ్ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయడం, పులివెందులలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉండే బీటెక్ రవి కడప ఎయిర్పోర్టులో బ్రదర్ అనిల్తో రాజకీయ చర్చలు జరపడం... ఇవన్నీ చంద్రబాబు పాత్రను నిర్ధారిస్తున్నాయి. అడ్రస్ గల్లంతయిన కాంగ్రెస్ పార్టీకి ఆశ్రయం కల్పించడం కోసం చంద్రబాబు ఎందుకు తాపత్రయపడు తున్నట్టు? కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత వైసీపీ ఓట్లను చీల్చక పోతుందా అన్న ఆశ. కుళ్లిపోయి కంపు గొడుతున్న పాతకాలపు రాజకీయ చతురత ఇది. ఏపీ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీనీ, హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎగవేసిన బీజేపీనీ కుడిఎడమల నిలబెట్టుకొని అధికార పార్టీపై యుద్ధం చేయాలనుకోవడమే ఒక దిక్కుమాలిన ఆలోచన. మెదడు పూర్తిగా పాడైతే తప్ప ఈ తరహా ఆలోచనలు ఎవరూ చేయలేరు. నెగెటివ్ ఓటును చీల్చాలంటే ఒక అర్థం ఉంటుంది. పాజిటివ్ ఓటును ఎట్లా చీల్చగలుగుతారు? అది ప్రభుత్వం పట్ల అభిమానంతో వేసే ఓటు కదా? మరో పార్టీతో ఎట్లా పంచుకుంటారు? అది పక్కన పెడితే, జగన్ ప్రభుత్వం ఈ దేశం ముందుకు ఒక కొత్త ఎజెండాను తీసుకొచ్చింది. మెజారిటీ ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలందరూ సాధికారత సంతరించుకోవడమే ఆ ఎజెండా. ఈ సరికొత్త నమూనా ఇప్పుడు ప్రపంచంలోని అభ్యుదయ శక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నది. రాష్ట్రంలోని బహుజనులంతా జగన్ పార్టీ గొడుగు కిందకు సమీకృతమవుతున్నారు. పాచిపోయిన వ్యూహాలతో, ఊకదంపుడు హామీలతో వారిని చీల్చడం కలలోని మాట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి కూడా సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నమైనది. సామాజిక న్యాయాన్ని మరింత ముందుకు తీసుకొనిపోవడం, స్థానిక ప్రజల ఆకాంక్షలనూ, సామాజిక వర్గాల ఆకాంక్షలనూ గౌరవించడం, ప్రజా ప్రతినిధులను ప్రజలకు జవాబుదారీగా నిలపడం జగన్ మోహన్ రెడ్డి ఎజెండాలో భాగం. టిక్కెట్ల పంపిణీలోనూ ఇది ప్రతిఫలిస్తున్నది. ఈ కొత్త ఒరవడిని ఊహించలేని యెల్లో మీడియా, సాంప్రదాయ రాజకీయ పరిశీలకులు హరాయించు కోలేకపోతున్నారు. ఏదో జరిగిపోతున్నదని తాటాకు చప్పుళ్లతో హడావిడి చేస్తున్నారు. జగన్ మోహన్రెడ్డి మాత్రం కూల్గా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. యెల్లో మీడియా సంగతి తెలిసిందే. అది చేసే గోబెల్స్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ తరహా దుష్ప్రచారం సంగతీ తెలిసిందే. చంద్ర బాబు పరిపాలనలో అభివృద్ధి అంతరిక్షాన్ని తాకిందనీ, జగన్ మోహన్రెడ్డి దాన్ని పాతాళంలోకి తోసేసాయనీ రాయని రోజు లేదు. అమరావతి అనే రాజధాని నగరం అలనాటి విజయ నగరంలా వెలిగిపోయిందనీ, ఇప్పుడు మసకబారిందనీ రాస్తున్నారు. ‘కత్తులును ఘంటములు కదనుదొక్కినవిచట... అంగళ్ల రతనాలు అమ్మినారట ఇచట...’ అంటూ గ్రాఫిక్–డిజైన్లను చూపెడుతున్నారు. ఇప్పుడు రాజధాని రాళ్లపాలైందని వాపోతు న్నారు. నిజానికి రాష్ట్రంలోని ఏ పట్టణాన్ని తీసుకున్నా చంద్ర బాబు ఐదేళ్ల పాలనతో పోలిస్తే ఈ అయిదేళ్లలో జరిగిన అభివృద్ధే ఎక్కువ. మౌలిక వసతుల రంగంలో గడిచిన డెబ్బయ్యేళ్ల అభివృద్ధిని సవాల్ చేసేదిగా ఈ ఐదేళ్ల కాలం నిలబడిపోతుంది. ఏకకాలంలో నాలుగు ఓడరేవులు శరవేగంగా పూర్తవు తున్నాయి. పది ఫిషింగ్ హార్బర్లు రూపుదిద్దుకుంటున్నాయి. విశాఖ సమీపంలో గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం పనులు జరుగుతున్నాయి. 17 మెడికల్ కాలేజీలు నిర్మాణ మవుతున్నాయి. 13 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ప్రతి పల్లె ఒక మినీ రాజధానిగా మారింది. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, విలేజ్ క్లినిక్లు వగైరా వేలాది కొత్త భవనా లతో గ్రామసీమలు కళకళలాడుతున్నాయి. పేద బిడ్డలకు అధు నాతనమైన బడులు అందుబాటులోకి వచ్చాయి. ఇంటి ముందటే ఆధునిక వైద్యం లభిస్తున్నది. ఇటువంటి మార్పులను యెల్లో మీడియా డార్లింగ్ విజనరీ కలలో కూడా ఊహించి ఉండరు. అందుకే కలవరపడుతున్నారు. తాటాకుల చప్పుళ్లు చేస్తున్నారు. ఐదు వేల మంది యువకులకు శిక్షణ ఇచ్చి ఒక మౌత్ పబ్లిసిటీ వింగ్ (మూతి ప్రచారంగాళ్లు)ను ఏర్పాటు చేసి జనంలోకి వదిలారు. రాబిన్ శర్మ టీమ్తో పాటు ఒక రిటైర్డ్ డీఐజీ ఈ వింగ్ను పర్యవేక్షిస్తున్నారు. నలుగురు కూడిన ప్రతి చోటకు ఈ మూతి ప్రచారంగాళ్లు చేరుకుంటారు. జగన్ ప్రభు త్వానికి వ్యతిరేక గాలి వీస్తున్నదని, అన్నిచోట్లా ఓడిపోతారని చెబుతారు. ఎన్నికలయ్యేంత వరకూ వీరి పని ఇదే! ఈ ప్రచారంతో జనం ప్రభావితం కావాలనే అథమస్థాయి ఎత్తుగడ. వీరి ఆపసోపాలూ, ఆయాస ప్రయాసలూ వినోదభరితంగానే ఉన్నాయి. గెలుపు మీద నమ్మకం లేక గిమ్మిక్కులు ప్రదర్శిస్తుంటే గమ్మత్తుగానే కనిపిస్తున్నది. ఔను! వారి ఆర్తనాదములు శ్రవణా నందకరముగా నున్నవి!! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
బోగస్ ఓట్లకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
ఎన్నికలలో అక్రమాలు ఎలా చేయాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదంటారు. ఓటర్ల జాబితాలో దొంగ ఓట్ల చేర్పు నుంచి, వ్యతిరేకుల ఓట్ల తొలగింపు వరకు, పొరుగు రాష్ట్రాల నుంచి బోగస్ ఓటర్లను తీసుకు రావడం నుంచి , తాను చేసే అవకతవకలన్నిటిని ఎదుటివారిపై రుద్దడం వరకు ఆయనకు ఆయనే సాటి. ఒక విధంగా చెప్పాలంటే ఆయన కు ఈ సబ్జెక్టు లో డాక్టరేట్ ఇవ్వవచ్చు. దొంగ ఓట్లు అధికంగా వేయడం టీడీపీ ఆవిర్భావం నుంచే అయితే, బోగస్ ఓట్లను సృష్టించడం, ఎన్నికలలో విపరీత వ్యయం చేయడం చంద్రబాబు టీడీపీని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అంటే ఆశ్చర్యం కాదు. ✍️ఈ మధ్యకాలంలో తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి దొంగఓట్లు అని, టీడీపీ ఓట్లను తొలగిస్తున్నారని విపరీత ప్రచారం చేస్తున్నప్పుడే అనుమానం వచ్చింది. బహుశా టీడీపీ వీటన్నిటిని భారీగా చేయడానికి రంగం సిద్దం అవుతున్నదేమోనని.తాజాగా వచ్చిన వార్తలుచూస్తే అది నిజమని తేలిపోయింది. ఏకంగా హైదరాబాద్ లో ప్రత్యేక క్యాంపులు పెట్టి ఏపీ ఓటర్ల జాబితాలో టీడీపీ సానుభూతిపరులను చేర్పిస్తున్నారు. ఎంత ధైర్యం. వ్యవస్థలు తమ గుప్పిట్లోనే ఉంటాయిలే అన్న భావన. ముందుగానే దొంగ,దొంగ అని అరిస్తే తమ జోలికి రారులే అన్న తెంపరితనం వంటివి ఉండబట్టే ఇలా చేయగలుగుతున్నారు. ఏ రాజకీయ పార్టీ దొంగ ఓట్లను చేర్పించినా తప్పే.అలాగే ఎవరిదైనా నిజమైన ఓటు తొలగించినా సరికాదు. కాని ప్రస్తుతం టిడిపి నేతలు కాని, ఆ పార్టీకి కొమ్ముకాస్తూ నానా పాట్లు పడుతున్న ఈనాడు రామోజీరావు వంటివారు దీనిపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీపైన , ప్రభుత్వంపైన దుమ్మెత్తి పోస్తున్నారు. ✍️ఈనాడు, జ్యోతి వంటి మీడియాలు ఒకవేళ రెండు పార్టీలు అలాంటివి చేస్తుంటే ,ఇద్దరి గురించి రాయవచ్చు. అలాకాకుండా టీడీపీ ఎంతో సత్యసంధత కలిగిన పార్టీ అయినట్లు, వైసిపి అచ్చంగా దొంగ ఓట్లను చేర్చే పార్టీ అయినట్లు తప్పుడు వార్తలు ఇస్తున్నారు.నిజానికి చంద్రబాబుకు మొదటి నుంచి ఈ అలవాటు ఉంది. 1999 లో మొదటిసారి ఆయన ఎన్నికలలో డబ్బు పంపిణీకి డ్వాక్రా సంఘాల మహిళలను వినియోగించారని వార్తలు వచ్చాయి. అది కూడా ఎన్నికలు అయిపోయాకే తెలిసింది. అంత గుట్టు చప్పుడు కాకుండా ఆయన చేయగలరు. అలాగే దొంగ ఓట్ల విషయంలోను ఎవరికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉండేది. 2004 ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆ పార్టీ శాసనసభ పక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆద్వర్యంలో అలాంటి దొంగ ఓట్లన్నిటిని ఒక పెద్ద జాబితా తయారు చేసి ఒక ర్యాలీగా వెళ్లి ఎన్నికల ముఖ్య అధికారికి అందచేశారు.అప్పటివరకు ఇంత భారీ ఎత్తున బోగస్ ఓట్లు చేర్చుతారన్న సంగతే ప్రజలకు పెద్ద గా తెలియదంటే అతిశయోక్తి కాదు. ✍️తెలుగుదేశం 1983లో ఆవిర్భవించింది. అంతకు పూర్వం ఈ దొంగ ఓట్ల గోల చాలా తక్కువగా ఉండేది. 1983 లో ప్రముఖ సినీ నటుడు ఎన్ టి రామారావు పార్టీని స్థాపించడంతో ఆయనపై అభిమానంతో ఉమ్మడి ఏపీలో ప్రత్యేకించి కోస్తా,రాయలసీమ జిల్లాలలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేశారు. అంటే వేరే వారి ఓటును ఇంకొకరు వేసేయడం అన్నమాట. అసలు ఓటరు వచ్చేసరికి అక్కడ ఓటు వేసేసినట్లు నమోదు అయి ఉండేది.అప్పటికి ఇంకా ఈ బోగస్ ఓట్ల సృష్టి మొదలు కాలేదు. తదుపరి చంద్రబాబు నాయుడు టీడీపీలోకి రావడం, పార్టీలో కీలకభూమిక పోషించడం, ఎన్ టి రామారావును పదవినుంచి లాగేసి తాను అధిష్టించడం, ఆ తర్వాత ఎన్నికల కోసం బోగస్ ఓట్లను కూడా తయారు చేయడం ఆరంభించారు. 1983లో ఓటమి తర్వాత చంద్రబాబునాయుడు చంద్రగిరి నుంచి కుప్పంకు మారి, దానిని ఈ బోగస్ ఓట్లకు ప్రయోగశాలగా మార్చారు. ✍️పొరుగు రాష్ట్రాలు తమిళనాడు,కర్నాటక ల నుంచి కూడా జనాన్ని తెచ్చి ఓటర్లుగా నమోదు చేయించడం, పోలింగ్ రోజున వారితో వేయించడం, వీలైతే ఇతర మార్గాల ద్వారా నకిలీ ఓట్లను సృష్టించడం కూడా చేశారు. దివంగత నేత, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చంద్రమౌళి దీనిపై పరిశోధన చేశారు. ఆయన కుప్పంలో చంద్రబాబుపై పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత మొత్తం ఓటర్ల జాబితాను పరిశీలిస్తే ముప్పైవేలకు పైగా ఇతర రాష్ట్రాల ఓటర్లు కాని, దొంగ ఓట్లు కాని ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత వాటిపై ఆయన ఫిర్యాదులు ఇవ్వడం ఆరంభించారు. తద్వారా ఒక పదిహేడువేల వరకు తగ్గించగలిగామని అప్పట్లో చెబుతుండేవారు. అందువల్లే గత ఎన్నికలలో ఆయన మెజార్టీ కూడా బాగా తగ్గింది. చంద్రమౌళి అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుమారుడు భరత్ కూడా ఆ దొంగ ఓట్లను తొలగించడానికి యత్నిస్తున్నారు. ✍️చంద్రబాబు తన అనుభవాన్ని రాష్ట్రవ్యాప్తం చేశారు. 2024 ఎన్నికలలో గెలవకపోతే టీడీపీకి, తన కుమారుడు లోకేష్ కు భవిష్యత్తు ఉండదన్న భయంతో మీడియా అధిపతులుగా ఉన్న రామోజీ,రాధాకృష్ణ తదితరుల అండతో భారీ ఎత్తున ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని అర్ధం అవుతుంది.పర్చూరు, అద్దంకి మొదలైన నియోజకవర్గాలలో దొంగ ఓట్ల తొలగింపు వార్తలు చదివితే టీడీపీ ఎన్ని కుట్రలు అయినా చేస్తుందన్న విషయం బోదపడుతుంది.తెలంగాణ ఎన్నికలు ముగిసిన వెంటనే హైదరాబాద్ లో ఉండే టీడీపీ సానుభూతిపరులను ఎపి ఓటర్లుగా మార్చడానికి పెద్ద కార్యక్రమమే చేపట్టారు.ఇందుకోసం బానర్ లు కూడా కట్టి శిబిరాలు నిర్వహించారంటే ఏమనుకోవాలి?నిజానికి ఏ వ్యక్తికైనా ఒకే చోట ఓటు ఉండాలి.రెండు చోట్ల ఉంటే అది నేరం కూడా అవుతుంది. ✍️అయినా టీడీపీ ప్రత్యేక డ్రైవ్ ద్వారా దొంగ ఓట్లను నిర్భీతిగా చేర్చుతోంది.అంతేకాక గతంలో సేవామిత్ర పేరుతో ఓటర్ల వ్యక్తిగత వివరాలు సేకరించిన టీడీపీ, ఇప్పుడు మరో పేరుతో యాప్ ను తయారు చేసి వినియోగిస్తోందట. తద్వారా వ్యతిరేక ఓటర్లను గుర్తించి వారి పేర్లను జాబితా నుంచి తొలగించడానికి పన్నాగం పన్నిందట. విశేషం ఏమిటంటే ఈ మధ్య ఒక టిడిపి ఎమ్మెల్యే మీడియా సమావేశం పెట్టి మంగళగిరిలో ఒక అడ్రస్ ఇచ్చి సుమారు ఏభై ఓట్లు ఉన్నాయని వెల్లడించారట. తీరా అవి టిడిపివారే చేర్పించినవని తెలిశాక నాలుక కరుచుకున్నారట.టిడిపి వారు చేర్పించిన దొంగ ఓట్లను కాపాడే బాధ్యతను రామోజీరావు, రాధాకృష్ణలు తమ భుజాన వేసుకున్నారు. ఎక్కడైనా వైసిపివారివి ఉంటే వాటిపై కొండెక్కి కూయడం కూడా చేస్తుంటారు. ✍️మీడియా ఇంత దుర్మార్గంగా మారడం ఇప్పుడే చూస్తున్నాం. దీనిపై టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లు పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకున్నాయి. అయితే తాము చప్పిన ఓట్లను తొలగించకపోతే అధికారుల నిర్లక్ష్యం అని టీడీపీ మీడియా ప్రచారం చేస్తోంది. ఈ మధ్య కొత్తగా ఒక దుకాణం మొదలైంది. సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ పేరుతో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఒక తంతు నడుపుతున్నారు. ఆయన టీడీపీ బోగస్ ఓట్ల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు ఎంత అరాచకంగా పనిచేసింది.. ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరించింది అంతా గమనించారు. కాని ఆయన ఇప్పుడు సుద్దులు చెబుతుంటే ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది. ఆయనకు తోడు మరో మాజీ డీజీపీ కూడా ఒక సదస్సులో పాల్గొనడం వింతగా ఉంది.ఆయన 1994 లో విధులలో ఉంటూనే తన సోదరుడి టిక్కెట్ ను తీసుకోవడానికి ఏకంగా గాంధీ భవన్ కే వెళ్లారు. ✍️అలాంటివారితో ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని కొందరు స్వార్ధపరులు బయల్దేరారు. ఇదే సందర్భంలో ఎన్నికలలో డబ్బు ఖర్చు చేయడం గురించి కూడా చెప్పుకోవాలి. ఎన్ టి రామారావు టైమ్ లో డబ్బు అంతగా ఖర్చు పెట్టేవారు కాదు. ప్రధాన రాజకీయ పక్షంగా ఉన్న కాంగ్రెస్ కూడా అలాగే ఉండేది. కాని చంద్రబాబు సి.ఎమ్. అయ్యాక డబ్బు ఎలా ఖర్చు పెట్టి ఎన్నికలను గెలవవచ్చో అందరికి తెలియచెప్పారనుకోవాలి. అత్తిలి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే ఓటర్లకు నగదుతో పాటు స్వీట్ బాక్స్ కూడా ఇప్పించారని అప్పట్లో మంత్రిగా పనిచేసిన వేణుగోపాలాచారి ఒక టీవీ డిబేట్లో వెల్లడించారు. అది మొదలు ఓటు విలువను రెండువేల వరకు తీసుకు వెళ్లారు. తెలుగుదేశం పార్టీ వెనుక తిరుగుతున్న జనసేన కూడా ఆయా అంశాలలో టీడీపీ మార్గాన్నే ఎంపిక చేసుకున్నట్లుంది. ✍️జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు తెలంగాణ ఎన్నికలు ముగిసిన వెంటనే హైదరాబాద్ లోని తన ఓటును కుటుంబంసహా మంగళగిరి సమీపంలోని వడ్డేశ్వరంలో చేర్పించుకున్నారని వార్తలు వచ్చాయి. టీడీపీతో కలిసి వెళితే వారు ఎన్ని తక్కువ సీట్లు ఇచ్చినా, డబ్బు బాగా ఇస్తారన్న ఆశతో జనసేన అధినాయకత్వం పొత్తు పెట్టుకోవడానికి సిద్దమవుతోందన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు ,ఒడిషా వంటి సరిహద్దు రాష్ట్రాలలో నివసిస్తున్న తమ మద్దతుదారులను ఎపి లో కూడా ఓటర్లుగా చేర్పించడానికి టిడిపి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి వైసిపి రంగంలోకి దిగింది. ✍️నిజానికి ఆధార్ కార్డు ఆధారంగా డబుల్ ఓట్ల సమస్యను తొలగించవచ్చు.కాని న్యాయపరమైన సమస్యల కారణంగా ఆ విషయంలో అధికారులు ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి విషయాలలో చంద్రబాబును ఎదుర్కోవాలంటే అంత తేలికైన విషయం కాదని దొంగ ఓట్లు, బోగస్ ఓట్ల విషయంలో వస్తున్న వార్తలను పరిశీలిస్తే అర్ధం అవుతుంది. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్. -
AP: లోక్సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి బీసీ సంఘం మద్దతు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ బీసీ సంఘం మద్దతు తెలిపింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతు తెలపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ప్రకటించింది. వైఎస్సార్సీపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ నాయకుడు మాత్రమే కాదని.. సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రజల జీవితాలను బాగుచేస్తున్నారన్నారు. ఆయన పాలనలో బీసీల పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారని తెలిపారు. గత పాలకులు ఓట్ల సమయంలో డబ్బులు, మద్యం, తినడానికి రేషన్ ఇచ్చి చేతులు దులుపుకునే వారని విమర్శించారు. చంద్రబాబు 14 ఏళ్లు పాలించి బీసీలకు చేసిందేం లేదని మండిపడ్డారు. ‘బీసీల పిల్లలు ఫీజులు కట్టడానికి రక్తం అమ్ముకున్నారు. సీఎం జగన్ అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి అనేక పధకాలు పెట్టి బీసీల బిడ్డలను చదివిస్తున్నారు. జగన్ పాలనలో మా బతుకులు మారాయి. ఖబడ్డార్ ప్రతిపక్ష పార్టీలు. మీ మోసాలు మాకు తెలిశాయి. ఇన్నేళ్లు మమ్మల్ని మోసం చేశారు. డబ్బు, నోరు, శక్తి, పేరు లేనినవాళ్ళకి పదవులు ఇచ్చిన ఏకైక వ్యక్తి సీఎం జగన్ వైఎస్సార్సీపీ హయాంలో బీసీలకు జరిగిన మంచి గురించి 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేయండి. ఇతర రాష్ట్రాల్లో బీసీల పరిస్థితి బాలేదు. ఇంకా అక్కడ హాస్టళ్లు, గురుకులాలు, తిండి కోసం కొట్లాడుతున్నారు. ఇక్కడి బీసీలు విమానాలు ఎక్కుతున్నారు.. కార్లలో తిరుగుతున్నారు. బీసీలకు అధికారం, సంపద, విద్య, హోదా ఇస్తున్నారు. ప్రతిపక్షాల మోసపు మాటలు నమ్మవద్దు. వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుపు.. బీసీల గెలుపు’ అని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బడుగు, బలహీన వర్గాల బలమైన గొంతుక అని ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు మారేష్ తెలిపారు. నవరత్నాల ద్వారా బీసీలకు జరిగిన మేలును 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామని చెప్పారు. 139 బీసీ కులాలు సీఎం జగన్ వెంట నడుస్తాయని అన్నారు. చంద్రబాబు బీసీ నేత అచ్చెన్నాయుడిని పక్కకుపెట్టి పవన్ కల్యాణ్ను అక్కున చేర్చుకున్నారని విమర్శించారు. ఇన్నేళ్లు చంద్రబాబు బీసీలకు చేసింది శూన్యమని మండిపడ్డారు. 6 కి.మీ లు వెళ్లి పెన్షన్ తెచ్చుకునే పరిస్థితి కావాలా? ఉదయం 6 గంటలకు పెన్షన్ ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే పరిస్థితి కావాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. చదవండి: కాంగ్రెస్లో ఎవరున్నా మాకు ప్రత్యర్థులే: మంత్రి పెద్దిరెడ్డి -
దూకుడు పోరాటాలే అందలం ఎక్కిస్తాయా?
దేశంలో గత కొన్ని దశాబ్దాలుగా జరు గుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే అగ్రెసివ్ పోరాటాలూ, రాజకీయాలే ఆయా రాజకీయ పార్టీలను అందలం ఎక్కిస్తాయా అని అనిపిస్తోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిజాయితీగా దూకుడు (అగ్రె సివ్)గా పోరాడిన పార్టీలనే ఓటర్లు ఆదరిస్తారని పలు ఎన్నికలు నిరూపిస్తున్నాయి. బీజేపీ చేపట్టిన రామజన్మ భూమి ఉద్యమం, అయోధ్య రథయాత్ర, అస్సాం గణ పరిషత్ రాజకీయాల నుంచి మొదలు పెట్టి ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దాకా నిశితంగా పరిశీలిస్తే ఈ సంగతి విదితమవుతుంది. 1984 సాధారణ ఎన్నికలలో కేవలం 2 సీట్లు మాత్రమే సాధించిన బీజేపీ అప్పటి దాకా విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాలు నిర్వహిస్తున్న అయోధ్య ఉద్యమానికి బహి రంగంగా మద్దతు పలికింది. అప్పటి బీజేపీ అధ్యక్షుడైన లాల్ కృష్ణ అడ్వాణీ చేపట్టిన అయోధ్య రథయాత్ర దేశంలో సంచలనం రేపింది. అడ్వాణీతో పాటు అనేకమంది కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. తదనంతర పరిణామాలు ఆ పార్టీని కేంద్రంలోనూ, పలు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి తీసుకువచ్చాయి. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో కూడా అగ్రెసివ్ రాజకీయాలే ‘అస్సావ్ు గణ పరిషత్’ను అధికారంలోకి తీసుకు వచ్చాయి. అస్సాంలోకి విచ్చలవిడిగా జరుగుతున్న బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదార్లకు వ్యతిరేకంగా ‘ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్’ (ఆసు) ఉద్యమించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆసు ప్రఫుల్ల కుమార్ మహంత నేతృత్వంలో ‘అస్సాం గణ పరిషత్ (ఏజీపీ) పేరుతో రాజకీయ పార్టీగా ఆవిర్భవించి అస్సాంలో అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చింది. మహంత చేపట్టిన విద్యార్థి ఉద్యమానికి ప్రేరేపి తులైన అస్సాం ప్రజానీకం ఆయన నేతృత్వంలోని అస్సాం గణ పరిషత్కు అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతుగా నిలిచారు. అలాగే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎమ్సీ) అధినేత్రి మమతా బెనర్జీ తన దూకుడుతనంతో కూడిన రాజకీయ ఉద్యమాలతోనే దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కమ్యూనిస్టులను ఓడించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో సమైక్యాంధ్రకు ‘రెండు కళ్ల సిద్ధాంతం’తో పరోక్ష మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తదితర పక్షాలను వెనక్కినెట్టి అధికారాన్ని చేపట్టింది. అయితే ప్రజా సమస్యలను తెలుసుకుంటూ నాటి తెలుగు దేశం పాలనను ఎండగడుతూ పాదయాత్ర చేసిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజల మనసు గెలుచుకున్నారు. ఫలితంగా మలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అధికారం అప్పగించారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రం ఏర్పాటు తర్వాత వరుసగా రెండు సార్లు తెలంగాణ ప్రజలు అధికారాన్ని కట్ట బెట్టడం గమనార్హం. ఆ పార్టీ చేసిన అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల ముందు ఎండగట్టిన బీజేపీ పోరాటాల ద్వారా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. నాటి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైన బండి సంజయ్ చేపట్టిన ‘మహా సంగ్రామ పాదయాత్ర’తో బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాగా బలపడింది. నిరుద్యోగులు, ఉద్యోగులు ఆర్టీసీ కార్మికులు, టీచర్లు వంటి వారి సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసింది. దీంతో దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికలతోపాటు జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య విజయాలను ప్రజలు అందించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ను పార్టీ అధ్యక్ష స్థానం నుంచి బీజేపీ కేంద్ర నాయకత్వం మార్చింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఎదుర్కొనేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ప్రజలను నమ్మించ డంలో సఫలీకృతులయ్యారు. గతంలోని కాంగ్రెస్ నాయకుల కంటే విభిన్నమైన రీతిలో పార్టీని ఉద్యమ పంథాలో ముందుకు నడిపి రాష్ట్రంలో ఇతర పక్షాల మద్దతు అవసరం లేకుండానే 64 సీట్లు సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ విధంగా కేంద్రంలో కాని, రాష్ట్రాల్లో కాని ప్రజలపక్షాన నిలిచి దూకుడుగా రాజకీయాలు చేసిన పార్టీలనే ప్రజలు అందలం ఎక్కిస్తారని తేటతెల్లమవుతోంది. శ్యామ్ సుందర్ వరయోగి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
AP: తమ్ముళ్ల ‘ఉనికి’పాట్లు
సంక్షేమ పథకాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంది. గడప గడపకు మన ప్రభుత్వంతో నాయకులు ఇంటి వద్దకే వచ్చి అభివృద్ధిని వివరించడంతో పాటు సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తుండటం సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ఈ కోవలోనే శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటికే రెండు విడతలుగా విజయదుందుభి మోగించిన వైఎస్సార్సీపీ.. హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఎన్నికలు సమీపిస్తున్నా తెలుగుదేశం పారీ్టలో అభ్యర్థి ఎవరనే విషయంలోనూ స్పష్టత కొరవడింది. ఇప్పటి వరకు అంటీముట్టనట్లుగా ఉన్న ఇద్దరు నాయకులు ఇప్పుడు తమ ‘ఉనికి’ చాటుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ‘తమ్ముళ్ల’ను గందరగోళానికి గురిచేస్తుండటం గమనార్హం. సాక్షి, నంద్యాల: శ్రీశైలం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థులే విజయకేతనం ఎగరవేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డిపై 39వేలకు పైగా మెజారీతో గెలుపొందారు. 2024లో జరిగే ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ నమోదు దిశగా పార్టీ దూసుకుపోతోంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీలో అభ్యర్థి ఎవరనే విషయంలోనూ స్పష్టత కరువైంది. ఓటమి తప్పదని తెలిసినా ఇద్దరు నేతలు సీటు తనకంటే తనకని సిగపట్లకు సిద్ధమయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా గ్రూపులుగా ఏర్పడి దూషణలకు తెరతీయడం పార్టీ పరువు బజారున పడుతోంది. ఇదే సమయంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సీట్ల కేటాయింపు విషయంలో బేరం పెట్టారనే చర్చ జరుగుతోంది. ఎవరు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకుంటారో వాళ్ల వైపే ఆయన మొగ్గు చూపుతున్నట్లు ఆ పార్టీ వర్గీయులే చెప్పుకుంటున్నారు. ఇకపోతే 2014లో వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత అధికారంలో ఉన్న టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆయనపై నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిణామం 2019 ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపించింది. టీడీపీ నుంచి పోటీ చేసిన బుడ్డా వైఎస్సార్ సీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి చేతిలో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్గా కొనసాగుతున్నా.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కనీస పోటీ ఇవ్వలేకపోవడం గమనార్హం. పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసి ప్రజా క్షేత్రంలో తిరుగులేదని చాటుకుంది. లోకేశ్ మద్దతు తనకే ఉందని, జిల్లా టీడీపీ నాయకులు కూడా అభ్యర్థిగా తన పేరునే అధిష్టానికి సూచించారని చెప్పుకుంటున్న బుడ్డా పార్టీ ఫిరాయింపు మచ్చను ఇప్పటికీ తుడిచేసుకోలేకపోతున్నారు. వైఎస్సార్సీపీపై అభిమానంతో గెలుపును అందిస్తే.. తమ మనోభావాలను టీడీపీకి తాకట్టు పెట్టారని ప్రజలు ఇప్పటికీ ఆయనపై భగ్గుమంటున్నారు. డబ్బు మూటలతో ఏరాసు.. ఏరాసు ప్రతాపరెడ్డి కాంగ్రెస్ హయాంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందినా.. రాష్ట్ర విభజన తర్వాత 2014లో పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీ చేశారు. అయితే ప్రజలు ఆయనను ఆదరించకపోవడంతో ఓటమిని చవిచూశారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. తాజాగా ఆయన శ్రీశైలం నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టీడీపీ తరపున పావులు కదుపుతున్నారు. ఎన్నికల సమయంలో తప్పితే ఎప్పుడూ కనిపించని, ప్రజలతో సత్సంబంధాలు లేని ఈయన డబ్బును నమ్ముకుని రాజకీయం చేసేందుకు సిద్ధమయ్యారనే చర్చ జరుగుతోంది. టిక్కెట్ తనకు ఇస్తే ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదనే విషయాన్ని ఆయన ఇటీవల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కలిసి తన ప్రతిపాదనను ఆయన ముందుంచినట్లు తెలిసింది. ఆ మేరకు ఆయన జనవరిలో తనను ఇన్చార్జ్గా ప్రకటిస్తారని తన వర్గంతో చెప్పుకుంటున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే ఏరాసు అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ నేతలు మాండ్ర శివానందరెడ్డి, గౌరు వెంకటరెడ్డి అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా వార్ నిన్న మొన్నటి వరకు ప్రజల్లో ఎక్కడా కనిపించని ఏరాసు ఎన్నికల సమయంలో తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేసమయంలో టీడీపీ టిక్కెట్ తనకేనని ఆయన ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో బుడ్డా వర్గం సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలకు దిగుతోంది. ఎన్నికల సమయంలో ఆయన షో చేస్తున్నారని ఘాటు గా స్పందిస్తోంది. టిక్కెట్ ఎవరికనే విషయంలో ఆ పార్టీ నిర్ణయం తీసుకోలేకపోవడం పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. ఇప్పటి ఆ పార్టీ వర్గీయులు ఒక్కొక్కరుగా వైఎస్సార్సీపీలో చేరిపోతుండగా.. నేతలను కూడా ఓటమి భయం వెంటాడుతోంది. వీరిద్దరి మధ్య నెలకొన్న విభేదాలతో రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అహ్మద్ హుస్సేన్ కూడా టీడీపీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చర్చ జరుగుతోంది. -
కమలాపురం.. జనసంద్రం
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పోటెత్తారు. చెన్నూరులో నిర్వహించిన బహిరంగ సభకు జనం వెల్లువలా తరలివచ్చారు. వివిధ గ్రామాల నుంచి డప్పుల దరువులు, ఆటపాటలతో ప్రజానీకం ర్యాలీగా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఇలా వేలాది మంది తరలి రావడంతో సభాస్థలిలో అందరూ కూర్చునే పరిస్థితి లేకుండా పోయింది. వెరసి చెన్నూరులో ఎటు చూసినా, ఏ వీధిలో చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్సార్సీపీ జెండాలను రెపరెపలాడిస్తూ కనిపించారు. కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు తమ ప్రసంగాల్లో సీఎం జగన్ పేరును ఉచ్ఛరించగా.. సభికులు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. అంబేడ్కర్ ఆలోచన విధానాలు అమలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావ్ పూలే, కొమురం బీమ్ వంటి మహానీయుల ఆలోచనలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అణగారిన వర్గాలకు అండగా, భావి తరాల ఉన్నతికి దూరదృష్టితో పెద్దపీట వేస్తున్న వైఎస్ జగన్ను మరోమారు మన కోసం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కామెడీ యాక్టర్ పవన్, నయవంచకుడు చంద్రబాబు కలిసికట్టుగా వస్తున్నారని, వారి మాయమాటలు నమ్మొద్దని సూచించారు. సామాజిక సాధికారత మా విధానం : డిప్యూటీ సీఎం అంజద్బాషా స్వతంత్ర భారతదేశంలో సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగానే మిగిలిపోయిందని, అయితే వైఎస్సార్సీపీ సామాజిక సాధికారతను తన విధానంగా మార్చుకుందని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్బీ అంజాద్బాషా చెప్పారు. 2014–19 వరకు సాగిన టీడీపీ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీకి కూడా మంత్రివర్గంలో స్థానం లభించలేదని, వైఎస్సార్సీపీ.. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా చేసిందని, మరో నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించిందన్నారు. తనకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారని చెప్పారు. ఏపీలోనే సామాజిక విప్లవం: మంత్రి మేరుగు సామాజిక న్యాయం అనేది ఏపీలోనే, వైఎస్ జగన్ నాయకత్వంలోనే సాకారమైందని సాంఘిన సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. రాజ్యాంగ బద్ధంగా బడుగులకు రావాల్సిన హక్కులు సంక్రమిస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో దళితులపై, బీసీలపై దాడులు చూశామని, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అన్న నాడే చంద్రబాబు దళితద్రోహి అని తేలిపోయిందని, బీసీల తోకలు కత్తిరిస్తానన్న నాడే బీసీ వ్యతిరేకి అని వారు పసిగట్టారని చెప్పారు. సన్నిధి గొల్ల కొనసాగింపు: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తిరుమల సన్నిధి గొల్లను తిరిగి కొనసాగించి రాష్ట్రంలోని యాదవుల ఆత్మగౌరవాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిపారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. రాయలసీమలో తొలిసారి యాదవులకు ఎమ్మెల్సీ దక్కిందని, మేయర్ పదవులను యాదవులకు అప్పగించి గౌరవించిన చరిత్ర సీఎం జగన్దేనన్నారు. ఆచరణలో చూపిన సీఎం: ఎంపీ అవినాష్రెడ్డి సామాజిక సాధికారిత కాగితాలకే పరిమితమయ్యేదని.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే దానిని ఆచరణలో చూపారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి చెప్పారు. కేబినెట్ కూర్పు నుంచి నామినేటెడ్ పదవులు.. చివరకు ఆలయాల పాలక మండళ్లలో సైతం చిత్తశుద్ధి ప్రదర్శించారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం పాటించిన చరిత్ర జగనన్నదేనని మాజీ ఎంపీ బుట్టా రేణుకా అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రమేష్యాదవ్, రామచంద్రారెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
దొంగ ఓట్ల దొంగలెవరు?
మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగబోతోంది. ఈ క్రమంలో దొంగ ఓట్ల అంశం మళ్లీ తెరపైకి రావడంతో ఓటర్లలో గందరగోళ పరిస్థితులు నెలకొనే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే దొంగ ఓట్లకు సంబంధించి పోటాపోటీగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అసలు దొంగ ఓట్లను ఎవరు ప్రోత్సహిస్తున్నారన్న దానిపై పలు కోణాల్లో అనేక మంది విశ్లేషణలు చేశారు. అయితే, ఎవరైనా దొంగతనం చేసినప్పుడు భయపడటం పరిపాటి. అదే పరిస్థితి తెలుగుదేశం ఎదుర్కొంటోంది. టీడీపీ పాలన కాలం నుంచి తమకు తెలియకుండా తమ ఇంటి నెంబరుతో కొన్ని ఓట్లు చలామణిలో ఉండటాన్ని ఇప్పుడు తెలుసుకుని ఇంటి యజమా నులు విస్తుపోతున్నారు. ఇదెలా సాధ్యమంటూ ముక్కున వేలేసు కుంటు న్నారు. ‘ఓటర్ల జాబితాల్లో అక్రమాలు’ అంటూ గావు కేకలు పెట్టిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు మౌనం దాల్చడం అనుమానా లకు తావిస్తోంది. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు భారీ మెజారిటీతో గెలవడం కోసం పక్కనే ఉన్న తమిళనాడుకు చెందిన వందల మంది పేర్లను తన నియోజకవర్గంలో చేర్పించారన్న అపవాదు ఉండనే ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ నకిలీ ఓటర్ల అంశం తెరపైకి రావడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటుచేసుకున్నాయనీ, వాటిని సరిదిద్దాలనీ, ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదనీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కలెక్టర్లను కలసి ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో కలెక్టర్లకు వైసీపీ నుండి ఫిర్యాదులు అందాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని తమకు తెలిసిందనీ, వీటిని సరిదిద్దాలనీ వైసీపీ కోరింది. 2019కు ముందు నుంచే ఒకే డోర్ నెంబర్లో 50 నుంచి 100 ఓట్ల వరకు ఉన్నాయని వైసీపీ ఫిర్యాదులో పేర్కొంది. అదే విధంగా ఒకే వ్యక్తి ఏపీలోనూ, తెలంగాణ లోనూ రెండుచోట్లా ఓటుహక్కు కలిగి వున్నారని వివరించింది. ఒకే వ్యక్తికి మున్సిపల్ ఏరియాలోనూ, గ్రామంలోనూ, వేరు వేరు నియోజకవర్గాల్లో కూడా ఓటుహక్కు ఉందని పేర్కొంది. తమ పార్టీ కార్యకర్తలు పలు ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి పరిశీలన చేయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయనీ, ఆ చిరునామాలలో ఉంటున్న వారిని అడగగా తమకు ఈ విషయం తెలియదని చెబుతున్నారనీ వైసీపీ తన ఫిర్యాదులో పేర్కొంది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ విధంగా ఉద్దేశ్యపూర్వకంగా దొంగ ఓట్లను చేర్చారనీ, ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత ఇలాంటి ఓట్ల అవకతవకలు, బోగస్ ఓట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కూడా వైసీపీ ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా తుదిజాబితా విడుదలకు ముందు ఇలాంటి బోగస్, అక్రమ ఓట్లపై విచారణ జరిపి ప్రజాస్వామ్యయుతంగా అర్హులైన ప్రతి ఓటరుకూ ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకునేందుకు ఈసీ ఉపక్రమించబోతోందని తెలుస్తోంది. ఓటర్ల ఓట్లను ఇంటింటికీ వెళ్లి పరిశీలిస్తున్న టీడీపీ కార్యకర్తలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇలా చేయడం చట్ట విరుద్ధం. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడమే కాక టీడీపీ యాప్లో సేకరించిన సమాచారాన్ని ఎక్కించే మిషతో టెలిఫోన్ నెంబర్ తీసుకుని ఓటీపీ సైతం అడుగు తున్నారని అన్నమయ్య జిల్లాలో ప్రజలు వాపోతున్నారు. ఓటీపీ కాని, వ్యక్తిగత సమాచారం కాని ఇవ్వని వారిపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని కూడా అనేక మంది చెబుతున్నట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందుతున్నాయి. రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు ఓ ఇంట్లోకి వెళ్లి సమాచారం అడగటం... వారు ఇవ్వటానికి ఇష్టపడక పోవడంతో వారిపై దౌర్జన్యానికి దిగారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. బాబు భరోసా, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడానికి సమాచారం అడిగారనీ, 2024లో టీడీపీ ప్రభుత్వం రానుందని ప్రజలను మభ్యపెడుతూ మోసగిస్తున్నారని అనేక చోట్ల ప్రజలు బహిరంగంగానే అంటున్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించకుండా చూడటంతో పాటు దౌర్జన్యాలను అరికట్టడం ఇప్పుడు ఎన్నికల సంఘం ముందున్న తక్షణ కర్తవ్యం. అలా చేసినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది. దొంగ ఓట్లను అరికట్టడానికి ఆధార్ కార్డును అనుసంధానం చేయడం ఉత్తమమైన మార్గం. ఈ విధానాన్ని ఇటీవలికాలంలో తెలంగాణ ఎన్నికల సంఘం ప్రారంభించింది. అయితే, మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకో ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రజాస్వామ్యం పరిపుష్టం కావడానికి, దొంగ ఓట్ల గోల పోవడానికి ఇది ఎంతో మేలు చేకూర్చే అంశం. వైసీపీపై ఇష్టారీతిన ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్న తెలుగుదేశం పార్టీగానీ, ఆ పార్టీని భుజాన వేసుకుని మోసే మీడియా కానీ ఈ ప్రతిపాదనపై ఎందుకు స్పందించడం లేదో అర్థం కావట్లేదు. ఇలా కోరడానికి కూడా నిజంగా ధైర్యం ఉండాలి. తాము తప్పు చేయనప్పుడు భయమెందుకు అన్న రీతిలోనే వైసీపీ అధినేత జగన్ ఈ కార్యక్రమానికి తెరతీశారు. ఆ ధైర్యం మాత్రం తెలుగుదేశం పార్టీ అధి నేత చేయలేకపోతున్నారంటే ఏమను కోవాలి. ఆయనే దొంగ ఓట్లను ప్రోత్స హిస్తున్నారనుకోవాల్సి వస్తోంది. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో అటు తమిళనాడు, ఇటు కర్ణాటకల నుండి పెద్ద ఎత్తున (వేలల్లో) ప్రజల పేర్లను చేర్పించిన తాను తన కేడర్కు ఏం చెబుతారన్నది బహిరంగ రహ స్యమే. ‘ఆవు చేలో మేస్తే .. దూడ గట్టున మేస్తుందా’ అన్న సామెత ఇందుకు అతికినట్లు సరిపోలుతుంది. వివేకవంతులైన ఓటర్లు ఈ తంతు అంతా గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటి నుండే వారి వారి ప్రాంతాల్లో నివాసం లేని అనేకానేక మంది పేర్లను గుర్తించి బహిరంగ పరుస్తున్నారు. ఇది నిజంగా ప్రజల్లో వచ్చిన చైతన్యం. ప్రజల్లో ఈ తరహా చైతన్యం రావడం స్వాగతించదగ్గ పరిణామం. గ్రామాలు, వార్డులు, పట్ట ణాలు ఇలా... అన్ని చోట్లా తమకు తెలియని ఓటర్లు ఉంటే వెంటనే గుర్తించి ఈసీకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టేలా ప్రజలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డా‘‘ పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాసకర్త వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మొబైల్: 98481 05455 -
వెల్లివిరిసిన గిరిజన చైతన్యం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సుదీర్ఘకాలంగా వెనుకబడి ఉన్న గిరిజన ప్రాంత దశను మార్చేలా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గిరిజనం జై కొట్టారు. విద్య, వైద్య రంగాలను సమూలంగా మార్చడమే గాక ప్రభుత్వ సేవలను తమ ఆవాసాలకే చేర్చినందుకు హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలిపారు. భారీఎత్తున భూ పంపిణీతో బతుకులు మార్చిన జగనన్నకు జేజేలంటూ పాటలు పాడారు. గిరిజన పక్షపాతికి సుదూర గిరిశిఖర గ్రామాల నుంచీ తరలివచ్చి ధన్యవాదాలు చెప్పారు. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర దృశ్యమిది. గిరిజన చైతన్యానికి ఈ యాత్ర అద్దంపట్టింది. తొలుత కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం నందివానివలస గ్రామం నుంచి వందలాది యువకులు ద్విచక్రవాహనాలపై ర్యాలీగా బయల్దేరారు. 11 గ్రామాల మీదుగా 12 కిలోమీటర్లకు పైగా సాగిన ఈ ర్యాలీకి ప్రజలు ప్రతి గ్రామంలో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కురుపాం పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అధ్యక్షతన భారీ బహిరంగ సభ జరిగింది. సభ ఆద్యంతం జై జగన్, జై జై జగన్ నినాదాలతో హోరెత్తింది. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చేసిన మేలును ప్రజాప్రతినిధులు వివరిస్తుంటే ప్రజలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ప్రత్యేక జిల్లాతో గిరిజనులకు గుర్తింపు: ఎంపీ గొడ్డేటి మాధవి సుదీర్ఘకాలంగా వెనుకబడి ఉన్న గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని, ప్రత్యేకంగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటుచేసి 45 లక్షల మంది గిరిజనులకు గుర్తింపు ఇచ్చారని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి చెప్పారు. ప్రజలంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. సీఎం జగన్ దేశానికే స్ఫూర్తి: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి, చెప్పని పథకాలను ఎన్నింటినో అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ దేశానికే స్ఫూర్తిగా నిలిచారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసి, సాధికారత కల్పించిన సీఎం ఒక్క జగన్ మాత్రమేనని అన్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం చంద్రబాబు సొంత మామకు వెన్నుపోటు పొడిచినట్లే 2014 ఎన్నికల్లో గెలిపించిన ప్రజలనూ మోసం చేశారని చెప్పారు. 2024 ఎన్నికల్లోనూ మాయమాటలు చెప్పడానికి చంద్రబాబు సహా టీడీపీ మోసగాళ్లు మళ్లీ ప్రజల ముందుకొస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని అన్నారు. గిరిజన బిడ్డలకు పెద్దపీట: ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర రాష్ట్రంలోని గిరిజనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు అనేక నామినేటెడ్ పదవులు ఇచ్చి అన్ని రంగాల్లో ముందడుగు వేసేలా తీర్చిదిద్దుతున్నారని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. చంద్రబాబు ఏనాడూ గిరిజనులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. బాబుకు భిన్నంగా సీఎం వైఎస్ జగన్ గిరిబిడ్డలను అనేక పథకాలతో ఆదరిస్తున్నారని, మంచి విద్య, అధునాతన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. గిరిజనులకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత వైఎస్ జగన్దేనని అన్నారు. గిరిజనులకు అందుబాటులో విద్య: ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, సాలూరులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంతో పాటు పార్వతీపురంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా గిరిజనులకు ఉన్నత విద్యను సీఎం వైఎస్ జగన్ అందుబాటులోకి తెస్తున్నారని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడే సీఎం జగన్ వెంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నిలవాలని, లేదంటే నష్టపోతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మచిలీపట్నంలో కదం తొక్కిన బడుగు జనం
చిలకలపూడి (మచిలీపట్నం): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన చేయూతతో ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధించిన బడుగు, బలహీన వర్గాలు మచిలీపట్నంలో కదంతొక్కాయి. బుధవారం ఇక్కడ జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. సీఎం జగన్ అండతో తాము సాధించిన విజయాన్ని వివరిస్తూ నియోజకవర్గంలో కలియతిరిగారు. జై జగన్ అంటూ వీరు చేసిన నినాదాలతో మచిలీపట్నం మారుమోగింది. స్థానిక ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆధ్వర్యంలో సాధికార యాత్ర ఘనంగా జరిగింది. అనంతరం జరిగిన సభలో ప్రజలు అశేష సంఖ్యలో పాల్గొన్నారు. బస్సు యాత్రలో పాల్గొన్న నాయకులు అట్టడుగు వర్గాల ఆశలు, ఆశయాలు నెరవేర్చిన సీఎం జగన్: మంత్రి ధర్మాన సభలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని అట్టడుగు వర్గాలు ఆశలు, ఆశయాలను నెరవేర్చారని చెప్పారు. ఎలాంటి ఉద్యమాలు లేకుండానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు రాజకీయ అధికారం కట్టబెట్టారని, ఇలా చేయడానికి దమ్ము, ధైర్యం ఉండాలని అన్నారు. 32 లక్షల మందికి ఇళ్లస్థలాలు అందించటం ద్వారా ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించారన్నారు. చంద్రబాబు విద్యను ప్రైవేటు పరం చేయటం వల్ల అట్టడుగు వర్గాలకు విద్య అందలేదన్నారు. వైఎస్ జగన్ కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దటంతో పాటు విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు ఇచ్చి పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్నారని, తల్లుల ఖాతాల్లో అమ్మఒడి ద్వారా నగదు జమ చేస్తున్నారని వివరించారు. ఈ నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ లక్షల కోట్లు నేరుగా లబి్ధదారుల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. తలసరి ఆదాయం, వ్యవసాయం, జీవన ప్రమాణాలు, పరిశ్రమల కల్పనలో మన రాష్ట్రం దేశంలోనే 4, 5 స్థానాల్లో ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెబుతుండగా రాష్ట్రంలో అభివృద్ధి లేదని ప్రతిపక్షాలు విమర్శించడం శోచనీయమన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకంటే మెరుగైన పాలన అందిస్తున్న సీఎం జగన్ను ఆదరించాలని కోరారు. బడుగుల తలరాతలు మారుస్తున్న జగన్: ఎమ్మెల్యే అనిల్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కులవృత్తుల వారికి కత్తెరలు, ఇస్త్రీ పెట్టెలు, గొర్రెలు, వలలు ఇచ్చి వారు ఇలాగే బతకాలని చంద్రబాబు ప్రయత్నిస్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే బడుగులకు ప్రపంచస్థాయి విద్యనందిస్తూ వారి తలరాతలు మారుస్తున్నారని అన్నారు. మత్స్యకారుల వలసల నివారణకు, వారి ఉపాధికి సీఎం జగన్ తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నారన్నారు. 2019లో గెలిపించినందుకు సీఎం జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ద్వారా పదడుగులు ముందుకు వేస్తే 2024లో గెలిపిస్తే 100 అడుగులు ముందుకు వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఒక ఇంట్లో ఒకరు చదువుకుంటే నెలకు రూ.15 వేలు, ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.90 వేలు అని లోకేశ్ చెప్పారని, ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. ఇలా ఇస్తే ఏడాదికి లక్ష కోట్ల రూపాయలు దీనికే సరిపోతాయన్నారు. జగన్ను మళ్లీ గెలిపించుకుందాం: ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ చంద్రబాబు ఒక్క ముస్లిం నాయకుడినీ మంత్రిగా చేయలేదని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు ఇవ్వలేదని, సీఎం జగన్ డిప్యూటీ సీఎం పదవితో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇచ్చి గౌరవించారని ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు సీఎం జగన్ కృషి చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆర్థికంగా, సామాజికంగా తలెత్తుకొనేలా చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని బందరు ఎమ్మెల్యే పేర్ని నాని చెప్పారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్, ఎమ్మెల్సీ పోతుల సునీత, వైఎస్సార్సీపీ యువజన విభాగం జోనల్ ఇన్చార్జి పేర్ని కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
కమిట్మెంట్ రాజకీయాలే ఊపిరిగా...
స్వాతంత్య్రానంతరం రాజకీయాల్లో కొన్ని విలువలుండేవి. కమిట్ మెంట్ రాజకీయాలుండేవి. క్రమక్రమంగా అవి మాయమై, గెలవ డమన్నదే ప్రధానాంశం అయిపోయింది. అంతే కాదు, పార్టీ సంగతి ఎలా ఉన్నా వ్యక్తిగత గెలుపునకు ప్రాధాన్య మివ్వడం పెరిగింది. సిద్ధాంతాలు మాయమై శుష్క వాగ్దానాలతో పొద్దుబుచ్చడం, గెలిచిన తర్వాత వాటిని గాలి కొదిలేయడం మామూలై పోయింది. అటువంటి పరిస్థితుల్లో వైఎస్ రాజ శేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యి అనేక వినూత్న పథకాలను అమలుచేసి రాజకీయాల్లో నవ శకాన్ని సృష్టించారు. యువనాయకుడు జగన్ తండ్రి ఆదర్శా లనూ, పోరాటపటిమనూ సొంతం చేసుకొని, స్పష్టమైన రాజకీయ దృక్పథంతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎన్నికల్లోకి దిగారు. 2014 ఎన్నికల్లో, అతి స్వల్పకాలంలోనే గెలుపు అంచులవరకెళ్ళారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమ్రంతి అయిన చంద్రబాబు జగన్పై కక్ష సాధింపు చర్యలకు తెరతీశారు. సింగపూర్ లాంటి రాజధాని అంటూ గాలిమేడలు కడుతూ ఐదేండ్లు గడిపారు. ఇదే సమయంలో జగన్ తండ్రిని ఆదర్శంగా తీసుకొని ఏపీలో సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలకు, కన్నీళ్ళకు కారణాలను అన్వేషించారు. తండ్రిని మించిన ఆదర్శాలతో, ప్రగతిశీల భావజాలంతో, స్పష్ట మైన రాజకీయ దృక్పథంతో, మానవీయ పథకా లతో, సామాజిక న్యాయబాటను తనదిగా చేసు కొని ఎన్నికల బరిలోకి దిగారు. దిగ్విజయం సొంతం చేసుకొన్నారు.చంద్రబాబులా పార్టీ మార్పిడులను ప్రోత్స హించి ఉంటే, టీడీపీ ప్రతిపక్షంగా కూడా మిగి లేది కాదు. కాని జగన్ ఆ పని చేయలేదు. 2019లో అధికారం చేపట్టిన జగన్ పాద యాత్రలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను మేని ఫెస్టోలో పొందుపరచి దాదాపు నూటికి నూరు పాళ్లూ నెరవేర్చారు. ప్రభుత్వ రంగంలో విద్యాలయాలను బలో పేతం చేయడం, ఆంగ్ల మాధ్యమంలో విద్య, ఆరోగ్యశ్రీని మరిన్ని రోగాలకు వర్తింప చేయడం, ‘అమ్మ ఒడి’ లాంటి పథకాలు ప్రజా మన్నన పొందాయి. వ్యవసాయ రంగాన్ని, పారి శ్రామిక రంగాన్ని బలోపేతం చేయడం ఉత్పత్తి రంగంలో రాష్ట్రం ముందడుగు వేసేలా చేసింది. లక్షలాది ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ సమ స్యను తీర్చ డమే కాక ‘సచివాలయ’ వ్యవస్థ ద్వారా పాలనను ప్రజల గడప దగ్గరకు చేర్చారు జగన్. ఇప్పుడు జగన్ పాలనతో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకీ పుట్టగతులు లేని పరిస్థితులొచ్చాయి. జనం అంతా ఆయన వైపే! ఇది ప్రచారంతో వచ్చింది కాదు, పనుల వల్ల వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్లో జగన్ పథకాలతో, పాలనతో లబ్ధిపొందని గడపంటూ లేదు. ఈ నాలుగేళ్ళుగా టీడీపీ, జనసేన, బీజేపీ జగన్పై ఎన్ని అభాండాలు మోపినా, ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్నే కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరో ఐదారు నెలల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల వేడి ఎప్పుడో రాజుకుంది. అనైతిక పొత్తులు, ఏ విలువలూ లేని రాజకీయాలు, రంధ్రాన్వేషణలు, ఎలాగైనా సరే గెలిచి తీరాలన్న పట్టుదలలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మూడు దశాబ్దాల పైగా చరిత్ర ఉన్న పార్టీ, పది పన్నెండేళ్ల వయసున్న పార్టీని ఓడించడానికి సినీగ్లామర్ని ఉప యోగించుకోవడానికీ, కులమతాలను రెచ్చగొట్టే పార్టీతో పొత్తు పెట్టు కోవడానికీ సిద్ధమవుతోంది. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అను భవం, నలభై ఏండ్ల రాజకీయాను భవం ఉన్న పార్టీ నాయకునికి ఇతర పార్టీలతో పొత్తు ఎందుకో అర్థంకాని విషయం. పనినే దైవంగా భావించి, ప్రజలనే దేవు ళ్ళుగా భావిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జగన్ మరోసారి సీఎం కావడం ఖాయం. రాజకీయ విలువల వలవలొలుస్తున్న నాయకులను, పార్టీలను మట్టికరిపించి, రాజ కీయ శాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా మార్చే క్రమాన్ని ప్రజలే అడ్డుకొంటారని జగన్ పాలన రుజువు చేస్తున్నది. డా‘‘ కాలువ మల్లయ్య వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత మొబైల్: 91829 18567 -
జనం మెచ్చిన 'జగన్'
సాక్షి, అమరావతి: ప్రతి గ్రామంలోనూ ఘన స్వాగతాలు.. అపూర్వ ఆదరణ నడుమ జనమంతా మెచ్చిన కార్యక్రమం ‘ఏపీకి జగనే ఎందుకు కావాలంటే..’ (వై ఏపీ నీడ్స్ జగన్) ఘన నీరాజనాలు అందుకుంటోంది. ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని చూసినా వివక్షకు తావులేకుండా, లంచాలకు ఆస్కారం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో పారదర్శకంగా అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్రమంతటా ప్రజలు బాసటగా నిలుస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఒక్కరికీ తెలియచేస్తూ చేపట్టిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 18,12,831 కుటుంబాలు భాగస్వాములయ్యాయి. ఈ నెల 9వ తేదీన ఈ కార్యక్రమం ఘనంగా ఆరంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 2.60 లక్షల కస్టర్లు ఉండగా ఇప్పటిదాకా 54,779 క్లస్టర్ల పరిధిలో ప్రారంభమై దిగ్విజయంగా కొనసాగుతోంది. సచివాలయాల వద్ద ‘సంక్షేమ – అభివృద్ధి బోర్డులు’ గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ఒక్కో సచివాలయం పరిధిలో గత నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం ఎంత మంది లబ్ధిదారులకు ఏ పథకాల ద్వారా ఎంత మొత్తం ప్రయోజనం చేకూర్చిందనే వివరాలతో ఆయా సచివాలయాల వద్ద ‘సంక్షేమ – అభివృద్ధి బోర్డులు’ ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో రోజూ మండలానికి ఒక సచివాలయ పరిధిలో సందడిగా బోర్డుల ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగుతోంది. సంక్షేమ బోర్డును ఆవిష్కరించిన మరుసటి రోజు నుంచి ఆయా సచివాలయాల పరిధిలో రోజుకు 15 ఇళ్ల చొప్పున సందర్శిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి వివరిస్తున్నారు. 7,170 సచివాలయాల్లో బోర్డుల ఆవిష్కరణ ఈ నెల 9వ తేదీన కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఆదివారం వరకు 7,170 సచివాలయాల పరిధిలో సంక్షేమం – అభివృద్ధి వివరాలతో కూడిన బోర్డుల ఆవిష్కరణ పూర్తి అయినట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు సంక్షేమ బోర్డుల ఆవిష్కరణ జరిగిన సచివాలయాల పరిధిలో 34.91 లక్షల కుటుంబాలు ఉండగా దాదాపు 18,12,831 కుటుంబాల ఇంటి సందర్శన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం ఆయా కుటుంబాలకు ఏ పథకం ద్వారా ఎంత లబ్ధి చేకూర్చిందనే వివరాలను వివరిస్తున్నారు. గతంలో పోలిస్తే నాలుగున్నరేళ్లలో గ్రామ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులను తెలియచేస్తున్నారు. -
బొబ్బిలిలో బడుగుల గర్జన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజిక సాధికార విజయ నినాదంతో గర్జించారు. బుధవారం బొబ్బిలిలో జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలకు నియోజకవర్గం నలు దిక్కుల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. వందలాది బైక్లతో యువకులు ర్యాలీగా వచ్చారు. ముందుగా మెట్టవలసలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే), భారత్ నిర్మాణ్ సేవా కేంద్రం–వెల్నెస్ సెంటర్ భవనాలను డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలో అట్టహాసంగా యాత్ర నిర్వహించారు. బొబ్బిలి శ్రీకళాభారతి ఆడిటోరియం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాది మంది పోటెత్తారు. జై జగన్... జై వైఎస్సార్సీపీ నినాదాలతో ప్రజలు హోరెత్తించారు. నాలుగేళ్లలో ఎంతో మేలు: శంబంగి రైతులు ఎక్కువగా ఉన్న బొబ్బిలి నియోజకవర్గంలో ఈ నాలుగేళ్లలో కొత్తగా 11,500 ఎకరాలకు సాగునీరు అందించామని, మరో 4,500 ఎకరాలకు నీరందించడానికి పనులు చేయాల్సి ఉందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నఅప్పలనాయుడు చెప్పారు. ఈ సభలో ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం బలహీనవర్గాలకు పెద్ద పదవులిచ్చిన సీఎం జగన్: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పెత్తందారులకు మాత్రమే పెద్దపీట వేసిన టీడీపీ పాలనకు భిన్నంగా బలహీనవర్గాలకు పెద్ద పదవులు కట్టబెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారికీ సీఎం జగన్ సముచిత స్థానం ఇచ్చారన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. ధనవంతుల పిల్లల్లాగే పేదల బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం విద్యను అందుబాటులోకి తెచ్చారన్నారు. బడుగు, బలహీన వర్గాలు సాధించిన సాధికారత కొనసాగాలంటే సీఎం వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పాలన జగన్తోనే సాధ్యం: పుష్పశ్రీవాణి సంక్షేమ పాలన సీఎం వైఎస్ జగన్తోనే సాధ్యమని కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. వివిధ సంక్షేమ పథకాల కింద దళితులకు రూ.75 వేల కోట్లు, గిరిజనులకు రూ.25 వేల కోట్ల ఆర్థిక ప్రయోజనం అందించారని చెప్పారు. బొబ్బిలి గడ్డపై జనసునామీ: మజ్జి శ్రీనివాసరావు సీఎం వైఎస్ జగన్ పిలుపుతో జరుగుతున్న సామాజిక సాధికార యాత్రకు బొబ్బిలి గడ్డపై జనసునామీ పోటెత్తిందని విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చెప్పారు. బొబ్బిలి ప్రజల చిరకాల వాంఛ రెవెన్యూ డివిజన్ను సీఎం జగన్ సాకారం చేశారని చెప్పారు. చెరకు రైతుల బకాయిలు సుమారు రూ.35 కోట్లు చెల్లించారన్నారు. గతంలో ఇక్కడ గెలిచిన బొబ్బిలి రాజులు పదవుల కోసం పార్టీ మారారని, ఆస్తులు పెంచుకోవడమే తప్ప ప్రజల కష్టాలను పట్టించుకోలేదని విమర్శించారు. -
ప్రకాశించిన సాధికారత
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరంలో సామాజిక సాధికారత ప్రకాశించింది. సామాజిక చైతన్యం ఉవ్వెత్తున ఎగిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు రోడ్లపైకి చేరి పండుగ చేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ అందించిన చేయూతతో తాము సాధించిన సాధికారతను ప్రతిబింబిస్తూ నగరంలోని బడుగు, బలహీనవర్గాలు బుధవారం పెద్ద ఎత్తున సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించాయి. ఒకప్పుడు అవమానాలకు గురైన తాము సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ భరోసాతో తలెత్తుకు తిరుగుతున్నామంటూ నినదించారు. జోరు వానలోనూ బస్సు యాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. నగర వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. భారీ గజమాలలు, సంప్రదాయ నృత్యాలు, డప్పుల మోతలు, బాణాసంచాతో జై జగన్ నినాదాలతో ఒంగోలు నగరం మార్మోగింది. కర్నూలు బైపాస్ రోడ్డు నుంచి అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వరకు ర్యాలీ సాగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కుల వృత్తులు ప్రతిబింబించేలా శకటాలను యాత్రలో ప్రదర్శించారు. అనంతరం ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్ సెంటర్లో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. సభలో మాట్లాడుతున్న మంత్రి మేరుగు నాగార్జున ఇదో సామాజిక విప్లవం: మంత్రి విడదల రజిని సభలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ తెచ్చిన సామాజిక సాధికారతకు ఈ వేదికపై ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మంత్రులు, మేయరు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర నేతలే నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. మంత్రివర్గం నుంచి అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే సీఎం జగన్ పెద్దపీట వేశారని తెలిపారు. పేదవానికి కార్పొరేట్ వైద్యం, విద్య అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. ఇదో సామాజిక విప్లవమని అన్నారు. బలహీనవర్గాల విద్యార్థులకు ఉన్నత చదువులు: ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆంధ్రాలో అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు ఉన్నత స్థాయి చదువులు చదివి అమెరికా, ఆ్రస్టేలియా, కెనడా వంటి దేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. సీఎం జగన్ సుపరిపాలన చూశాక ఒడిశా, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలను కూడా ఆంధ్రాలో కలపాలంటూ డిమాండ్లు వస్తున్నాయన్నారు. జగనన్న ఆలోచనలకు మేం నిదర్శనం: మంత్రి ఆదిమూలపు సురేశ్ సీఎం జగనన్న ఆలోచనా విధానానికి నిలువెత్తు నిదర్శనం ఈ సభావేదికపై ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజాప్రతినిధులమని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను సీఎం జగన్ ఉన్నతంగా తీర్చిదిద్ది, ఇంగ్లిష్ మీడియం చదువులు అందించడాన్ని మిగతా రాష్ట్రాలూ అందిపుచ్చుకుంటున్నాయని తెలిపారు. ఇంగ్లిష్ మీడియం, సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, అధునాతన ప్రభుత్వ ఆస్పత్రులతో సీఎం జగన్ రోల్ మోడల్గా నిలిచారన్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి: మంత్రి మేరుగు పేదల పక్షపాతిగా సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. వైఎస్ జగన్ 75 శాతం మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చారని, ఇంతకంటే సామాజిక సాధికారత చేసే నాయకులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఒంగోలులో ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే పోటీ కూడా చేయను : బాలినేని ఒంగోలు నగర ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు 25 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడితే టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వచ్చే నెలలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా 25 వేల మందికి ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం జరుగుతోందన్నారు. ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఒంగోలులో పోటీ కూడా చేయనన్నారు. వైఎస్సార్ హయాంలో ఒంగోలులో వైద్య కళాశాల, ప్రభుత్వ ఆస్పత్రి నిర్మించామని తెలిపారు. ఇప్పుడు ఒంగోలు నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు రూ.350 కోట్లతో మంచినీటి పథకానికి, మరో రూ.350 కోట్లతో కొత్తపట్నం మండలంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, నందిగం సురేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత, ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
బనగానపల్లెలో జనసునామీ
సాక్షి, నంద్యాల: బనగానపల్లె నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వారు సాధించిన సామాజిక సాధికారతను చాటి చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండతో తాము సమాజంలో ఎదిగిన తీరును, తలెత్తుకొని తిరగగలుగుతున్న వైనాన్ని తెలుపుతూ బుధవారం భారీగా సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువత, వృద్ధులు అధిక సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు. యాత్రకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రజలతో పట్టణంలోని రోడ్లన్నీ కిక్కిరిశాయి. స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన బనగానపల్లె పట్టణంలో జరిగిన బహిరంగ సభకు ఇసుకేస్తే రాలనంతగా ప్రజలు పోటెత్తారు. జై జగన్.., మళ్లీ జగనే కావాలి అంటూ ప్రజలు చేసిన నినాదాలతో సభాప్రాంగణం హోరెత్తింది. అభివృద్ధి పథంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు: ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చేయి పట్టుకొని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పారు. బడుగు, బలహీనవర్గాలకు అంతర్జాతీయ స్థాయి విద్య, అధునాతన వైద్యం అందిస్తూనే, అనేక పథకాలతో, కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకు అన్ని పదవుల్లో అధిక శాతం ఈ వర్గాలకే ఇస్తూ సీఎం జగన్ అందిస్తున్న చేయూత మరెవరికీ సాధ్యం కాదని తెలిపారు. సీఎం జగన్ వల్లే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం దక్కిందని, ఈ వర్గాలే ప్రభుత్వానికి వెన్నెముక అని అన్నారు. మీ కుటుంబానికి మేలు జరిగితేనే ఓటు వేయండని ధైర్యంగా అడుగుతున్న సీఎం దేశంలో జగన్ మాత్రమేనన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఏనాడూ మైనార్టీలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ శాఖను ఇతర వర్గాలకు కేటాయించిన ఘనుడు చంద్రబాబేనన్నారు. చంద్రబాబు దళితులను అవమానించారు: ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దళిత, బలహీన వర్గాలను సీఎం జగన్ గుండెల్లో పెట్టుకొని చూసుకొంటున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్పారు. దళితుడిని ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి గౌరవించారన్నారు. అన్ని పథకాలు, పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పెద్ద పీట వేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లను, ఆస్పత్రులను సీఎం జగన్ కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలకు పైగా లబ్ధి చేకూర్చారని గుర్తు చేశారు. చంద్రబాబు దళితులను తీవ్రంగా అవమానించారని, స్నానం చేయరని, శుభ్రంగా ఉండరని, వారికి రాజకీయాలెందుకంటూ టీడీపీ నేతలు నీచంగా మాట్లాడినా చంద్రబాబు ఖండించలేదని తెలిపారు. సొంత సామాజిక వర్గమే ఎప్పటికీ అధికారం చెలాయించాలనుకునే వ్యక్తి చంద్రబాబు మాత్రమేనన్నారు. ధన, కుల, అవినీతి దాహమే బాబు అజెండా అని మండిపడ్డారు. వెన్నుపోట్లకు కేరాఫ్ అడ్రస్ బాబు అని చెప్పారు. అవినీతికి తలుపులు బార్లా తెరిచిన ఘనత ఒక్క చంద్రబాబుదేనని అన్నారు. అధికారంలోకి రావడానికి చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను నమ్ముకుంటే.. సీఎం వైఎస్ జగన్ ప్రజలను మాత్రమే నమ్ముకున్నారన్నారు. దళితులకు పెద్దపీట వేసిన సీఎం జగన్: ఎంపీ డాక్టర్ గురుమూర్తి రాజ్యాధికారంలో భాగస్వాములైనప్పుడే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమని నమ్మి, ఆచరణలో పెట్టిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి అన్నారు. నామినేటెడ్ పదవులతో పాటు నామినేషన్ కింద ఇచ్చే పనుల్లోనూ దళితులకు పెద్దపీట వేశారన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పదవీకాలంలో 34 వేల ఉద్యోగాలే ఇచ్చారని, ఈ నాలుగున్నరేళ్లలో సీఎం వైఎస్ జగన్ లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని కొనియాడారు. ఈ సమావేశంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పాల్గొన్నారు. -
బడుగుల విజయ నినాదం
ఒంగోలు, విశాఖ దక్షిణ, బనగానపల్లెలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్రలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వారు హాజరై తాము సాధించిన సాధికారతను చాటి చెప్పారు. బడుగులను చంద్రబాబు దారుణంగా అవమానిస్తే.. సీఎం జగన్ చేయి పట్టుకొని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నారని కొనియాడారు. సీఎం జగన్ అండతో తాము సమాజంలో ఎదిగిన తీరును, తలెత్తుకొని తిరగగలుగుతున్న వైనాన్ని తెలియజేశారు. సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన చేయూత, పథకాలతో సాధికారత సాధించిన బడుగు, బలహీనవర్గాల ప్రజలు విశాఖ నగరంలో విజయ నినాదం చేశారు. వేల సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు బుధవారం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. వైఎస్సార్సీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రను పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని డైమండ్ పార్క్ నుంచి టౌన్ కొత్త రోడ్డు వరకు జరిగిన ఈ భారీ యాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వందలాది మోటారు సైకిళ్లతో యువత బైక్ ర్యాలీ చేశారు. తీన్మార్ డప్పులు.. డీజేలు, జానపద నృత్యాలతో యాత్ర కోలాహలంగా జరిగింది. టౌన్ కొత్త రోడ్డు వద్ద జరిగిన బహిరంగ సభకు నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో ఆ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. రాష్ట్రాభివృద్ధికి, ముఖ్యంగా విశాఖ నగరాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యక్రమాలను మంత్రులు వివరిస్తుంటే సభా ప్రాంగణమంతా జై జగన్ నినాదాలతో దద్దరిల్లింది. సభలో మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ కులగణన దేశానికే ఆదర్శం: స్పీకర్ తమ్మినేని ప్రతి కులానికీ ప్రాధాన్యం కల్పించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని శాసన సభాపతి తమ్మినేని సీతారాం చెప్పారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రపై దేశంలో చర్చ మొదలైందని, ఇది శుభపరిణామమని అన్నారు. ఒక రాష్ట్రంలో ఇన్ని సామాజికవర్గాలకు సమాన హక్కులు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్కే సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో అన్ని సామాజికవర్గాలు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, 700 మందికి డైరెక్టర్ల పదవులిచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్కు మాత్రమే దక్కిందని తమ్మినేని అన్నారు. ముఖ్యమంత్రి జగన్వి సాహసోపేత నిర్ణయాలు: ఎంపీ మోపిదేవి ప్రతి పేదవాడినీ ఆర్థికంగా బలంగా నిలబెట్టేందుకు ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్న ఏకైక సీఎం జగన్ మాత్రమేనని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ చెప్పారు. ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంపై వెంటనే స్పందించిన సీఎం జగన్.. బాధితులకు 80 శాతం సాయం చేస్తూ.. ధైర్యం అందించారని చెప్పారు. హుద్హుద్ తుపాను బాధితులకు పరిహారాన్ని అందించలేని దౌర్భాగ్యపు సీఎంగా చంద్రబాబు చరిత్రకెక్కారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, వరుదు కల్యాణి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మేయర్ గొలగాని హరివెంకటకుమారి, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా, నెడ్క్యాప్ చైర్మన్ కె.కె.రాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర విలువ పెరుగుతుంది: మంత్రి సీదిరి అప్పలరాజు రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మారితే ఉత్తరాంధ్ర జిల్లాల యువతకు ఇక్కడే ఉపాధి లభిస్తుందని, ఉత్తరాంధ్ర ప్రజల ఆస్తులకు విలువ పెరుగుతుందని వివరించారు. మత్స్యకార నాయకుడు పార్లమెంట్లో అడుగుపెట్టారంటే అది వైఎస్ జగన్ ఘనతేనని అన్నారు. 2019 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకి ముచ్చెమటలు పట్టించిన భరత్ మత్స్యకారుడేనన్నారు. 2024లో చంద్రబాబుని ఓడించి, ఇంటికి పంపేది కూడా మత్స్యకారుడేనన్న విషయం గర్వంగా చెప్పే రోజులు వచ్చాయన్నారు. ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద బాధిత మత్స్యకారులకు పవన్ ఇచ్చే డబ్బు సినిమాల ద్వారా వచ్చినదికాదని, టీడీపీ నుంచి తీసుకున్న ప్యాకేజీ డబ్బు అని, మత్స్యకారులు ఎవరూ ఆ సొమ్ము తీసుకోవద్దని పిలుపునిచ్చారు. నిజం అంటే జగన్.. అబద్ధం అంటే బాబు: మంత్రి చెల్లుబోయిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ నిజం అంటే జగన్ అని, అబద్ధం అంటే చంద్రబాబు అని చెప్పారు. మత్స్యకారులకు కష్టం వస్తే గంటలో చెక్కులు పంపిణీ చేయించిన నేత జగన్ నిజమైన నేత అయితే, మోసాలతో కాలం వెళ్లబుచ్చే నేత చంద్రబాబు అని అన్నారు. -
పారిశ్రామికవాడలో సాధికార నినాదం
సాక్షి, అనకాపల్లి: పారిశ్రామికవాడలో సామాజిక సాధికారత నినాదం మార్మోగింది. సోమవారం అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు విజయ యాత్ర చేశారు. ఈ యాత్రకు వేలాదిగా తరలివచ్చిన ఈ వర్గాల ప్రజలు సీఎం వైఎస్ జగన్ పాలనలో తమకు లభించిన ప్రాధాన్యతను, రాజ్యాధికారం పొందిన వైనాన్ని ప్రజలకు వివరిస్తూ నియోజకవర్గం మొత్తం కలియదిరిగారు. ఈ యాత్రతో యలమంచిలి–అచ్యుతాపురం రహదారి జనంతో కిక్కిరిసిపోయింది. జగన్ నామస్మరణతో ఊరూవాడా మార్మోగాయి. అచ్యుతాపురంలో సభ జరిగిన క్రీడా మైదానం నిండిపోవడంతో పాటు యలమంచిలి రోడ్డు, పూడిమడక రోడ్డు జనంతో నిండిపోయాయి. సాయంత్రం చల్లబడి చిన్న పాటి చినుకులు పడడంతో ఆహ్లాదకర వాతావరణంలో సభ జరిగింది. మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధించిన వైనాన్ని వివరించినప్పుడు ప్రజలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. పేదల బతుకులు మార్చిన సీఎం జగన్ : మంత్రి ధర్మాన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ప్రతి పేదవాడికీ మేలు చేస్తూ వారి బతుకులను మారుస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. రామరాజ్యాన్ని మించి జగనన్న రాజ్యాన్ని తీసుకొచ్చారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు అందించారని తెలిపారు. ఈ వర్గాలకు చట్టసభల్లో అవకాశం కల్పించారని, కేబినెట్లో 17 కీలక మంత్రి పదవులు ఇచ్చి దేశ చరిత్రలోనే ఏ సీఎం చేయని విధంగా సామాజిక న్యాయం చేశారని అన్నారు. బడుగుల కుటుంబాలన్నీ ఆర్థికంగా బలపడ్డాయని, ఇది కాదా సామాజిక న్యాయం అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల పేరిట డబ్బు వృథా చేస్తున్నారని అన్న ప్రతిపక్షనేత చంద్రబాబు ఇప్పుడు అంతకు రెట్టింపు పథకాలు ఇస్తానంటున్నాడని, ఆయన మాయమాటలను నమ్మకుండా అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో పేదోడు ఎదిగాడు: ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు సీఎం జగన్ పాలనలో బడుగు, బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సామాజిక సాధికారత తీసుకొచ్చారన్నారు. సీఎం జగన్ బడుగు బలహీనర్గాలకు చెందిన నలుగురికి ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారన్నారు. రాజ్యసభకు నలుగురు బీసీలను పంపించారన్నారు. అనేక మందిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేశారని, నామినేటెడ్ పదవుల్లోనూ ఈ వర్గాలకే పెద్ద పీట వేశారని చెప్పారు. చంద్రబాబు పాలనలో సామాజిక న్యాయమనే పదమే రాలేదని చెప్పారు. మహిళా సాధికారత మరువరానిది: ఎంపీ సత్యవతి అనకాపల్లి ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ రాజ్యాన్ని స్థాపించారని, విద్య, వైద్యంలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారని చెప్పారు. మహిళా సాధికారత తీసుకొచ్చారని చెప్పారు. సంక్షేమ పథకాల లబ్ధిని మహిళల ఖాతాల్లోనే జమ చేస్తున్నారన్నారు. జెట్టీల నిర్మాణంతో మత్స్యకారులకు మహర్దశ: ఎమ్మెల్యే రమణమూర్తిరాజు యలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు (కన్నబాబురాజు) మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని చెప్పారు. మత్స్యకారుల కోసం రాష్ట్రంలో కొత్తగా 8 జెట్టీలు నిర్మిస్తున్నారని, వాటిలో రూ.397 కోట్లతో నిర్మిస్తున్న అచ్యుతాపురం జెట్టీ కూడా ఒకటన్నారు. దాదాపు 950 పడవలు వేటకు వెళ్లేలా జెట్టీ ఉంటుందని, జిల్లాలోని మత్స్యకారులంతా వేటాడుకున్నా సరిపోయేంత పెద్దగా ఉంటుందన్నారు. పనులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. ఆనాడు వైఎస్సార్ తీసుకొచ్చిన పారిశ్రామిక సెజ్ కారణంగా ఈ ప్రాంతవాసులు ఆర్థికంగా బలోపేతమయ్యారని, 2 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయని చెప్పారు. ఇప్పుడు వైఎస్ జగన్ సెజ్లను బలోపేతం చేసి, కొత్త పరిశ్రమలు తెస్తున్నారని, వీటి ద్వారా లక్షలాది ఉద్యోగాలు కొత్తగా వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణమూర్తి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు రాజాం, కొత్తపేట నియోజకవర్గాల్లో యాత్ర
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో సామాజిక న్యాయానికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలకు ప్రభంజనంలా కదలి వస్తున్నారు.అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర రెండో దశ బుధవారం ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, గుంటూరు జిల్లా పొన్నూరు, శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గాల్లో బుధవారం యాత్ర జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కదలి రావడంతో మూడు నియోజకవర్గాల్లో యాత్ర విజయవంతమైంది. సంక్షేమ పథకాల ద్వారా సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు–పవన్ చేసిన మోసాలను నేతలు సభల్లో వివరిస్తున్నప్పుడు ‘ఆపు బాబూ నాటకం.. జగనే మా నమ్మకం’ అంటూ ప్రజలు ప్రతిస్పందించారు. కుటుంబం, గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్లాలంటే వైఎస్ జగన్నే మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నేతలు పిలుపునిచ్చినప్పుడు.. ‘జగనే కావాలి.. జగనే రావాలి’ అంటూ ప్రజలు పెద్ద ఎత్తు నినదించారు. గురువారం విజయనగరం జిల్లా రాజాం, అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గాల్లో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. -
బడుగుల కల సాకారం
సాక్షి, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో బుధవారం సామాజిక సాధికార బస్సు యాత్ర ఓ ఉత్సవంలా సాగింది. అశేష జనవాహిని మధ్య పండగ వాతావరణంలో బస్సు యాత్ర జరిగింది. ఈ యాత్రకు అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును కీర్తిస్తూ ముందుకు సాగారు. సాయంత్రం హిందూపురం అంబేడ్కర్ కూడలిలో అశేష జనవాహిని మధ్య జరిగిన సభలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు రాష్ట్రంలో సామాజిక న్యాయం నెలకొన్న తీరును వివరించారు. బడుగుల కల సాకారం చేసిన సీఎం జగన్: ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా రాష్ట్రంలో సామాజిక సాధికారతను సాధించడం ద్వారా సీఎం వైఎస్ జగన్ బడుగుల కలను సాకారం చేశారని ఉపముఖ్యమంత్రి అంజాద్బాషా అన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు అయినా, వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పట్టించుకున్న నాయకుడు లేరన్నారు. వార్డు స్థాయి నుంచి పార్లమెంటు వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నాలుగింట మూడొంతుల ప్రాధాన్యం ఇచ్చిన ఘనత వైఎస్ జగన్దేనని చెప్పారు. పలు సంక్షేమ పథకాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అభివృద్ధిలోకి తెచ్చారని తెలిపారు. మైనార్టీల పట్ల చంద్రబాబుది దుర్మార్గపు బుద్ధి అని, 2009లో హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన అబ్దుల్ ఘనీని 2014లో పక్కనబెట్టి బాలకృష్ణకు టికెట్ ఇచ్చారని తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం సామాజిక సాధికార సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు స్వాతంత్య్రం ఇప్పుడే: మంత్రి గుమ్మనూరు జయరామ్ వైఎస్ జగన్ సీఎం అయ్యాకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు స్వాతంత్య్రం వచ్చిందని మంత్రి గుమ్మనూరు జయరామ్ చెప్పారు. గత ఏడు దశాబ్దాలుగా ఏపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అణచివేతకు గురయ్యారని తెలిపారు. ఈసారి ఫ్యాన్ గాలికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మైండ్ బ్లాక్ కావాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఏకమై టీడీపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. హిందూపురంలో చరిత్ర తిరగరాద్దాం: మంత్రి ఉషశ్రీ చరణ్ 40 ఏళ్లుగా హిందూపురంలో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించి చరిత్ర తిరగరాద్దామని మంత్రి ఉషశ్రీ చరణ్ పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నసీఎం జగన్కు అందరమూ సహకరిద్దామని అన్నారు. బడ్జెట్లో మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన ఘనత జగన్దేనని చెప్పారు. పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ పాలన – రాజ్యసభ సభ్యుడు ఆర్.క్రిష్ణయ్య ఏపీ పాలన పక్క రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉందని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య చెప్పారు. బెంగళూరు నుంచి హిందూపురం వస్తుండగా.. కొందరు వచ్చి ఏపీలో పాలన బాగుందని, వారి ప్రాంతాలను ఏపీలో కలిపేందుకు ఉద్యమం చేయాలనుకుంటున్నామని, అందుకు తన సహకారం కోరారని తెలిపారు. ఒక సీఎంకు ఇంతకంటే ఇంకేం కావాలని అన్నారు. జగన్ పాలన ఇలాగే కొనసాగితే రానున్న 20 ఏళ్లలో దేశంలోనే ఏపీ అత్యంత ధనిక రాష్ట్రంగా అవుతుందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్సీ మంగమ్మ, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, డాక్టర్ పీవీ సిద్దారెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక తదితరులు పాల్గొన్నారు. -
మేము సైతం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే..(వై ఏపీ నీడ్స్ జగన్) కార్యక్రమంలో ఇప్పటి దాకా ‘మేము సైతం..’ అంటూ 4,23,821 కుటుంబాలు భాగస్వామ్యమయ్యాయి. ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమానికి మధ్యలో దీపావళి కారణంగా మూడు రోజులు విరామం ఏర్పడింది. 9న 664 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో, 10న మరో 689 సచివాలయాల పరిధిలో, 14న 647 సచివాలయాల పరిధిలో, 15న మరో 504 సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గృహసారథులు, వైఎస్సార్సీపీ అభిమానులు, వలంటీర్లు పాలుపంచుకుంటున్నారు. ఆయా సచివాలయాల పరిధిలో కార్యక్రమం ప్రారంభమైన రోజునే.. ఏ సచివాలయం పరిధిలో ఎంత మందికి ఏయే పథకాల ద్వారా లబ్ధి కలిగిందన్న వివరాలతో కూడిన సంక్షేమ, అభివృద్ధి బోర్డులను స్థానిక ప్రజా ప్రతినిధులు ఆవిష్కరించారు. బుధవారం వరకు ఇలా 2,504 సచివాలయాల వద్ద సంక్షేమ, అభివృద్ధి బోర్డులను ఆవిష్కరించారు. వీటి ఆవిష్కరణ జరిగిన తర్వాత రోజు నుంచే ఆయా సచివాలయాల పరిధిలో రోజుకు 15 ఇళ్ల చొప్పున కలుస్తున్నారు. ఇప్పటి వరకు (మధ్యలో 3 రోజులు సెలవులు పోను) 16,169 మంది 4,23,821 కుటుంబాల వద్దకు వెళ్లి.. ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబానికి కలిగిన ప్రయోజనం, ఆ ఊరు మొత్తానికి కలిగిన ప్రయోజనాన్ని వివరించి చెప్పారు. -
‘వై ఏపీ నీడ్స్ జగన్’: జనం పట్టిన జెండా
సాక్షి, అమరావతి: సంక్షేమమే అభివృద్ధి అని నిరూపించిన సంక్షేమ ప్రదాతకు నీరాజనం పలికారు. విద్య – వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులతో మేలు చేసిన ప్రజానేతకు బ్రహ్మరథం పట్టారు. వ్యవసాయాన్ని పండుగగా మార్చి రైతును రాజుగా చేసిన రైతు బాంధవుడికి జేజేలు పలికారు. పోర్టులు, రహదారులతో పారిశ్రామికాభివృద్ధిని పరుగులెత్తిస్తూ ఉపాధి కల్పిస్తున్న ప్రగతిశీలిపై ప్రశంసల వర్షం కురిపించారు. తాము, తమ కుటుంబం, గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్లాలంటే మాట తప్పని, మడమ తప్పని యోధుడు ‘జగనే కావాలంటూ..’ అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై నినదించారు. అందరి ఆకాంక్షలను నెరవేరుస్తూ, మనోభావాలను గౌరవిస్తున్న వైఎస్సార్ సీపీ తమదంటూ ప్రజలంతా పార్టీ జెండాను పట్టారు. విజయవాడ, విశాఖలో భారీ ర్యాలీలతో కదం తొక్కారు. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ (ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే..) కార్యక్రమం ప్రారంభం సందర్భంగా తొలిరోజు గురువారం గ్రామ, వార్డు సచివాలయాల వద్ద నెలకొన్న పండుగ వాతావరణం ఇదీ! చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో వై ఏపీ నీడ్స్ జగన్ బుక్ను అందజేస్తున్న ఎమ్మెల్సీ భరత్ సాదర స్వాగతాల నడుమ.. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా విప్లవాత్మక పరిపాలనతో చేసిన మంచిని వివరించడంతోపాటు అధికారంలో ఉండగా చంద్రబాబు – పవన్ కళ్యాణ్ జోడీ చేసిన మోసాలను గుర్తు చేయడమే లక్ష్యంగా చేపట్టిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమం గురువారం 26 జిల్లాల్లో 660 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో భారీ జనసందోహం, జగన్నినాదాల మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైఎస్సార్సీపీ నియోజకవర్గాల ఇన్చార్జ్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు, గృహ సారథులు, కార్యకర్తలు, పార్టీ మద్దతుదారులు, సీఎం జగన్ అభిమానులు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొన్నారు. మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడి నేతృత్వంలో ప్రజాప్రతినిధులు మధ్యాహ్నం గ్రామ సచివాలయాల వద్దకు చేరుకోగానే సర్పంచులు, సచివాలయ ఉద్యోగులు, గ్రామ ప్రజలు సాదరంగా స్వాగతం పలికారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా గ్రామానికి చేసిన మంచిని గణాంకాలతో సహా వివరించేలా సంక్షేమ బోర్డును ఆవిష్కరించారు. అనంతరం భారీ జనసందోహం మధ్య గ్రామ ప్రధాన కూడళ్లలో వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరించి నేతలు ప్రసంగించారు. వాస్తవాలను వివరించి వంచనలను ఎండగడుతూ నాలుగున్నరేళ్లుగా సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా రాష్ట్రాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రగతిపథంలో నిలపడాన్ని నేతలంతా ప్రజలకు వివరించారు. ఆయా గ్రామాలకు చేసిన మంచిని గణాంకాలతో సహా కళ్లకు కట్టినట్లు వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 99.5 శాతం హామీలను సీఎం వైఎస్ జగన్ అమలు చేసి మాట నిలబెట్టుకోగా 2014లో చంద్రబాబు వ్యవసాయ, డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా నిలువుగా మోసగించిన తీరును వివరించారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో నాడు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే చంద్రబాబు మేనిఫెస్టోను మాయం చేయడాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు పూచీ తనదంటూ 2014లో నమ్మబలికిన పవన్ కళ్యాణ్ అనంతరం దగా చేసిన తీరును ఎండగట్టారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు–పవన్లు ఉమ్మడి మేనిఫెస్టోతో వస్తున్నారని, వారికి తగినరీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సుపరిపాలన కొనసాగాలంటే సీఎం జగన్ను ఆశీర్వదించి మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతపురంజిల్లా రాయదుర్గంలో సంక్షేమ లబ్ధి బోర్డును ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వవిప్ కాపు రామచంద్రారెడ్డి మా నమ్మకం నువ్వే జగన్ అంటూ నినాదాలు.. నేతలు పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తున్న సమయంలో పలుచోట్ల మా నమ్మకం నువ్వే జగన్.. జగనన్నే మా భవిష్యత్తు అంటూ ప్రజలు నినదించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వల్ల మంచి జరిగిందని అనుకుంటేనే ఓటేయాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేస్తున్నారని, మంచి చేసిన జగన్ వెంటే తాము నడుస్తామని ప్రజలు స్పష్టం చేశారు. విప్లవాత్మక పరిపాలనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్న దుష్ట శక్తుల ఆట కట్టిస్తామంటూ నినదించారు. నేడు 721 సచివాలయాల పరిధిలో ప్రారంభం.. గ్రామాల్లో సమావేశాలు ముగిశాక రాత్రికి వైఎస్సార్సీపీ నేతల ఇళ్లలో పార్టీ నేతలు బస చేశారు. శుక్రవారం ఉదయం వలంటీర్లు, గృహ సారథులతో కలిసి ఇంటింటా ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. గ్రామ సచివాలయం పరిధిలోని ప్రతి ఇంటికీ వలంటీర్లు, గృహ సారథులు, పార్టీ మద్దతుదారులు, సీఎం జగన్ అభిమానులు వెళ్లి ప్రచారాన్ని కొనసాగిస్తారు. ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలో వివరిస్తూ 24 పేజీలతో రూపొందించిన పుస్తకాన్ని ప్రతి ఇంటికీ అందించనున్నారు. సీఎం వైఎస్ జగన్ హామీల అమలు తీరు – చంద్రబాబు హామీల అమలు తీరుపై ప్రతి ఇంటా సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రజాతీర్పు పుస్తకంలో ఆయా కుటుంబాల అభిప్రాయాన్ని నమోదు చేస్తారు. మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడి నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాన్ని నేడు 721 సచివాలయాల పరిధిలో ప్రారంభించనుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ర్యాలీగా వస్తున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు విజయవాడ, విశాఖలో భారీ ర్యాలీలు ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమం సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్ మారుతీనగర్ 29వ సచివాలయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా పెడనలో ర్యాలీని మంత్రి జోగి రమేష్ జెండా ఊపి ప్రారంభించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సమన్వయకర్త కె.కె.రాజు ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో ఎమ్మెల్సీ భరత్ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
జగనే ఎందుకంటే..
సాక్షి, అమరావతి: చరిత్ర పుటలు ఎరుగని విప్లవాత్మక పాలనతో నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ, ప్రతి పౌరుడికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా చేకూర్చిన మేలును వివరిస్తూ రూపొందించిన భారీ కార్యక్రమం ‘వై ఏపీ నీడ్స్ జగన్’ (ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే..) గురువారం నుంచి ప్రారంభం కానుంది. పరిపాలనా సంస్కరణలు, వినూత్న కార్యక్రమాల ద్వారా దేశమంతా ప్రశంసించేలా మన రాష్ట్రం సాధించిన పురోభివృద్ధిని అందరికీ క్షుణ్నంగా తెలియజెప్పేలా దీనికి రూపకల్పన చేశారు. మండలం ప్రాతిపదికన ప్రతి మండలంలో రోజుకొక సచివాలయం పరిధిలో ఈ ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. తొలిరోజు రాష్ట్రవ్యాప్తంగా 711 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వేడుకగా ప్రారంభం కానుంది. గ్రామాలు, పట్టణాలు, నగరాలలో ఏయే పథకాల ద్వారా ఎంత మంది లబ్ధి పొందారనే వివరాలతో ఆయా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద సంక్షేమ అభివృద్ధి బోర్డులను ఆవిష్కరిస్తారు. ప్రతి రోజు సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్య ఆయా సచివాలయాల పరిధిలో దీన్ని నిర్వహిస్తారు. స్థానిక ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో చేపట్టే ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఇతర ప్రముఖలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. గృహ సారథులు, పార్టీ సానుభూతిపరులు, సీఎం వైఎస్ జగన్ అభిమానులు ఇందులో పాల్గొంటారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా జరిగిన ప్రగతి, సాకారమైన మార్పులను తెలియచేయడంతోపాటు గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తారు. సచివాలయ పరిధిలోని ప్రతి ఒక్కరినీ భాగస్వాములను ఈ కార్యక్రమంలో చేసేలా ఒక రోజు ముందే వివరాలను ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. ఆ తర్వాత రోజు నుంచి వలంటీర్లు వారి పరిధిలో రోజుకు 15 ఇళ్ల చొప్పున సందర్శించి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక కొత్తగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి చెప్పడంతో పాటు ఆయా కుటుంబాలకు ఎలాంటి లబ్ధి చేకూరింది? ఆ గ్రామానికి ఎంత మేలు జరిగింది? అనే వివరాలను సమగ్రంగా వెల్లడిస్తారు. ఒక్కో గ్రామ సచివాలయం పరిధిలో ఐదు రోజుల పాటు, వార్డు సచివాలయం పరిధిలో దాదాపు ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. సచివాలయాల వారీగా ఏర్పాటు చేసే సంక్షేమ, అభివృద్ధి బోర్డులను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇప్పటికే ఆయా ప్రాంతాలకు చేరవేసింది. షెడ్యూల్ వివరాలతో సచివాలయాలకు సమాచారం.. రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు గురువారం 711 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో కలిపి మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఉండగా మండలాల ప్రాతిపదికన రోజుకొక సచివాలయం పరిధిలో కార్యక్రమాన్ని ఆరంభిస్తారు. నగరాలు, పెద్ద పట్టణాల్లో సులభంగా కొనసాగించేలా చిన్న ప్రాంతాలుగా వర్గీకరించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో కలిపి మొత్తం దాదాపు 900 మండలాల ప్రాతిపదికన కార్యక్రమం అమలుకు కార్యాచరణ సిద్ధం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈవోపీఆర్డీ, పట్టణ ప్రాంతాల్లో అడిషనల్ కమిషనర్లు దీనికి నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరించనున్నారు. ఈ నెల 23వతేదీ వరకు 7,610 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఏ రోజు, ఎక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే వివరాలతో ఇప్పటికే షెడ్యూల్ రూపొందించి కలెక్టర్ల ద్వారా ఆయా సచివాలయాలకు సమాచారం అందించినట్లు అధికారులు వెల్లడించారు. మిగతా సచివాలయాలకు కూడా త్వరలో షెడ్యూల్ ఖరారు కానుంది. సచివాలయాల పరిధిలో ‘సంక్షేమ, అభివృద్ధి బోర్డు’ ఆవిష్కరణ కార్యక్రమం పూర్తయిన వెంటనే ఎవరెవరు దీనికి హాజరయ్యారనే వివరాలతోపాటు ఫోటోను ఆయా మండల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక వెబ్పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 24 పేజీలతో ప్రత్యేక బుక్లెట్లు వై ఏపీ నీడ్స్ జగన్ (ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే..) పేరుతో నిర్వహించనున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా 24 పేజీలతో కూడిన ప్రత్యేక బుక్లెట్లను రూపొందించారు. వలంటీర్లు ఇంటింటి సందర్శనకు వెళ్లిన సమయంలో వీటిని ప్రతి నివాసంలోనూ పంపిణీ చేస్తారు. పాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రజలకు ప్రభుత్వ సేవలను గడప వద్దే అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయాలు – వలంటీర్లు వ్యవస్థను నెలకొల్పిన విషయం తెలిసిందే. పునర్విభజనతో 26 జిల్లాల ఏర్పాటు, వివక్షకు తావులేకుండా సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాల అమలు, నవరత్నాల పథకాల ద్వారా ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాల కల్పన, సామాజిక న్యాయం నినాదంతో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు సముచిత స్థానం, మహిళా సాధికారితకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరిస్తూ సీఎం జగన్ తనదైన ముద్రతో చేపట్టిన పాలనా సంస్కరణలతో ప్రత్యేకంగా బుక్లెట్ను రూపొందించారు.అభివృద్ధిపై జాతిపిత గాంధీజీ మొదలు రాజ్యాంగ రూపకర్త బీఆర్ అంబేడ్కర్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, నోబెల్ గ్రహీతలు ఆమర్త్యసేన్, అభిజిత్ బెనర్జీ, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తదితరుల నిర్వచనాలను బుక్లెట్లో ప్రత్యేకంగా ప్రచురించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల జీవితాల్లో చోటు చేసుకున్న మార్పులు, తలసరి ఆదాయం, జీఎస్డీపీ పెరుగుదల, పారిశ్రామిక వృద్ధి రేటు, పరిశ్రమల ఏర్పాటు, ఎంఎస్ఎంఈల ద్వారా కొత్తగా ఉద్యోగాల కల్పన, సమగ్ర భూ సర్వే, రైతు భరోసా, ఇతర కార్యక్రమాల ద్వారా అన్నదాతలకు అందిస్తున్న తోడ్పాటు, వ్యవసాయ వృద్ధి రేటులో పెరుగుదల, అమ్మ ఒడి, నాడు – నేడు ద్వారా మారిపోయిన ప్రభుత్వ స్కూళ్ల స్వరూపం, ఆరోగ్య ఆసరా, ఫ్యామిలీ డాక్టర్ లాంటి వినూత్న కార్యక్రమాలతో పాటు వైద్య రంగంలో భారీ మౌలిక వసతుల కల్పనతో పేదలకు సులభంగా అందుతున్న వైద్య సేవలు, పింఛన్లు, సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో చోటు చేసుకున్న మార్పులు, దిశ యాప్, పొదుపు సంఘాలకు ప్రోత్సాహం, మహిళా సాధికారిత కోసం చేపట్టిన చర్యలు, రాష్ట్రంలో కొత్తగా పోర్టులు, ఎయిర్పోర్టుల నిర్మాణం, పేదలందరికీ ఇళ్లు, మౌలిక వసతుల కల్పన లాంటి వివరాలను బుక్లెట్లో పొందుపరిచారు. మొత్తంగా వివిధ కార్యక్రమాల ద్వారా నాలుగున్నరేళ్లలో ప్రతి ఒక్కరికీ చేకూరిన లబ్ధి, గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ప్రజలకు జరిగిన మేలును సోదాహరణంగా వివరిస్తూ బుక్లెట్ రూపుదిద్దుకుంది. పేదల జీవితాలు బాగు పడేవరకు ఈ కార్యక్రమాలు కొనసాగాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షను బుక్లెట్లో ప్రత్యేకంగా ఉదహరించారు. వలంటీర్లు రోజుకు 15 ఇళ్ల సందర్శన నాలుగున్నరేళ్లలో ప్రతి గడపకూ జరిగిన మంచిని వలంటీర్లు ఇంటింటి సందర్శన సమయంలో ఆయా కుటుంబ సభ్యులందరికీ సమగ్రంగా తెలియజెప్పేలా రోజుకు 15 ఇళ్ల చొప్పున మాత్రమే సందర్శించేలా ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా సచివాలయం పరిధిలో ఎంత ప్రయోజనం పొందుతున్నారో వలంటీర్లు ప్రతి కుటుంబానికి తెలియజేస్తారు. ఒకవేళ ఎవరికైనా ఏమైనా అందకుంటే సత్వరమే వారికి అందించి ప్రయోజనం చేకూర్చేలా చర్యలు చేపడతారు. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలో నాడు – నేడు ద్వారా సాకారమైన మార్పులను వివరిస్తారు. ఇంగ్లీషు మీడియం, స్కూళ్లలో 6వ తరగతి నుంచే ఐఎఫ్ఫీ ప్యానెళ్లు, 8వ తరగతిలో ట్యాబ్లు పంపిణీ వరకూ మారిపోయిన ప్రభుత్వ విద్యా వ్యవస్థ గురించి తెలియచేస్తారు. వైద్య రంగంలో విలేజ్ క్లినిక్స్తో సహా గ్రామంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, ఆర్బీకేలు లాంటి వ్యవస్థతో వ్యవసాయ రంగంలో మునుపెన్నడూ చూడని మార్పుల గురించి ప్రతి ఇంటికీ వివరిస్తారు. పథకాల అమలులో పూర్తి పారదర్శకత, సోషల్ ఆడిట్తో ప్రజలకు అందుతున్న నాణ్యమైన సేవల తీరును వివరిస్తారు. దిశ యాప్, ప్రభుత్వ పరిపాలనలో వచ్చిన విప్లవాత్మక మార్పులు గురించి వలంటీర్లు తెలియచేస్తారు. ఆర్థిక ప్రగతిలో గతంలో ఎలా ఉన్నాం? ఇప్పుడు ఎలా ఉన్నాం? అన్న అంశాలను ప్రతి ఇంటికీ చాటి చెబుతారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? గడప గడపకూ మన ప్రభుత్వం సమయంలో ప్రజల నుంచి అందిన వినతుల పరిష్కారం కోసం చేసిన వ్యయం వివరాలను వలంటీర్లు ఇంటింటికీ వివరించి చెప్పనున్నారు. -
కేబినెట్లోనూ సామాజిక సాధికారత
సాక్షి, నరసరావుపేట: రాష్ట్ర కేబినెట్లో 25 మంత్రులకుగాను 17 పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించి, వారికి పెద్దపీట వేసిన జగనన్నకు అండగా నిలవాల్సిన ఆవశ్యకత తెలిపేందుకే ఈ బస్సు యాత్ర అని మంత్రి విడదల రజిని తెలిపారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం శివయ్య స్థూపం సెంటర్లో జరిగిన భారీ బహిరంగసభలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నాలుగున్నరేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు ఎలా మేలు చేసిందో వారు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ఎంపీ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్, నామినేటెడ్ పదవుల్లో సైతం చరిత్రలో మరే సీఎం ఇవ్వని విధంగా పదవులు అందించిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. ఈ ప్రభుత్వంలో నలుగురు బీసీ నేతలను రాజ్యసభకు పంపడం విశేషమన్నారు. బడుగు, బలహీన వర్గాలకు డీబీటీ ద్వారా సుమారు రూ.2.4 లక్షల కోట్లకు పైగా లబ్ధిచేకూర్చిన ప్రభుత్వం ఇదేనన్నారు. పథకాల అమలులో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో 90 శాతం ఆడపడుచులకు ఏదో ఒక ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధిచేకూరిందన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు తోకను రానున్న ఎన్నికల్లో బీసీలు తమ ఓటు ద్వారా కత్తిరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇంత చేస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తెచ్చే బాధ్యత మనందరి మీద ఉందని రజిని పిలుపునిచ్చారు. ఆచరణలో సామాజిక విప్లవం చూపిన జగన్.. మరో మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. దేశంలో ఎందరో మహనీయులు సామాజిక విప్లవం రావాలి, దేశం బాగుపడాలి, పేదవారు బాగుండాలని కోరుకున్నారని.. కానీ, దాన్ని ఆచరణలో చూపిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కితాబిచ్చారు. చంద్రబాబు పాలనలో అవమానాలు ఎదుర్కొన్నామని.. ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబు పాలనలో దళితులపై పెద్ద సంఖ్యలో దాడులు జరిగాయని గుర్తుచేశారు. జగనన్న మాత్రం అలా చూడలేదన్నారు. రాష్ట్రంలో పేదరికం 12 శాతం నుంచి 6 శాతానికి తెచ్చారంటే మన జీవన విధానం పెరిగిందా? తగ్గిందా? అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. సినీ నటుడు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ముందు వరుసలో నిలబెట్టిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. ‘నువ్వు నాతో ఉండాలని జగనన్న అన్నారు. మీకోసం ఎంతదూరమైనా వెళ్తా అని నేను మాటిచ్చా’నన్నారు. మైనార్టీలు త్వరలోనే శుభవార్త వింటారని అలీ చెప్పారు. నా వాళ్లంటూ అక్కున చేర్చుకున్నారు తరతరాలుగా ద్వితీయశ్రేణి మనుషులుగా బతుకుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నా వాళ్లు అంటూ ఆప్యాయంగా పిలిచి రాజకీయ, ఆర్థిక, సామాజికంగా వారిని ఎంతో ప్రోత్సహిస్తున్న వ్యక్తి జగన్ అని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఎస్టీలకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదన్నారు. జగన్ మాత్రం డిప్యూటీ సీఎం ఇవ్వడంతోపాటు, ట్రైబల్ కమిషన్ ఏర్పాటు, ఎస్టీలకు ఎమ్మెల్సీ పదవీ ఇచ్చారన్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా రాష్ట్రంలో 3.26 లక్షల ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం గిరిజనులకు అందజేసిందన్నారు. 17న ‘వరికపూడిసెల’ పనులు ప్రారంభం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో జగనన్న వినుకొండలో వరికపూడిసెల ప్రాజెక్టు నిర్మిస్తామని ఇచ్చిన హామీని అమలుచేస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఈనెల 17న మాచర్లలో సీఎం పర్యటనలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో పల్నాడుకు మెడికల్ కళాశాల, వరికపూడిసెల ప్రాజెక్టుకు అన్ని అనుమతులు, రూ.3 వేల కోట్లతో హైవేలు, జేజేఎం పనులు, కేంద్రీయ విద్యాలయాలు తెచ్చామని, మరోసారి అవకాశమిస్తే పల్నాడు రూపురేఖలే మారుస్తామన్నారు. గతంలో అధికారంలో ఉన్న వారు ఏమిచేయలేదని.. వినుకొండ అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము టీడీపీకి ఉంటే ముందుకు రావాలని ‘లావు’ సవాలు విసిరారు. ఆచరణలో గుర్రం జాషువా ఆశయాలు బడుగు, బలహీన వర్గాలను ఉన్నత స్థాయివైపు చేయి పట్టుకుని తీసుకెళ్లిన ఘనత జగన్కే దక్కిందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నిజమైన సామాజిక సాధికారత ఫలితాలెలా ఉంటాయో చేతల్లో చూపించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమన్నారు. సామాజిక సాధికారత ఏంటో ఈ సభావేదిక చూస్తే ఆర్థమవుతుందని.. మాలాంటి ఎంతోమందిని మంత్రులుగా, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా చేసి చట్టసభల్లో మాకు సముచిత స్థానం కల్పించారన్నారు. గుర్రం జాషువా ఆశయాలు, ఆలోచనలను ఆచరణలో పెడుతున్న వ్యక్తి జగన్ అన్నారు. బడుగువర్గాలకు మేలు చేసే గట్టున ఉంటారా, పెత్తందార్ల గట్టున ఉంటారా అన్నది ప్రజలు నిర్ణయం తీసుకోవాలన్నారు. 2019లో ఇచ్చిన తీర్పు మరోసారి 2024లో సైతం ఇచ్చి జగనన్నను గెలిపించాలని కోరారు. సాధికారత యాత్రకు జేజేలు స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నేతృత్వంలో జరిగిన ఈ యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. వేలాది మంది ప్రజలు, పార్టీ నేతలు యాత్రకు పూలవర్షం, గజమాలలతో స్వాగతం పలికారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నేతల ప్రసంగాల్లో జననేత జగనన్న పేరు వినగానే ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘‘మా నమ్మకం నువ్వే జగన్’’.. ‘‘జగన్ రావాలి–జగనే కావాలి’’.. ‘‘వై నాట్ 175’’ అంటూ జనం ప్రతిస్పందించారు. రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ వి. విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీలు చంద్రగిరి ఏసురత్నం, పోతుల సునీత, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, ఇతర నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు ఫూలే, బాబు జగజ్జీవన్రామ్, కొమురం భీం, భారతరత్న అబ్దుల్ కలాం చిత్రపటాలు, మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఉంచి నేతలు నివాళులు అర్పించారు. -
Fact Check: రోడ్డున పడ్డది రామోజీ పరువే..
సాక్షి, అమరావతి: డబుల్ రోడ్డు కనిపిస్తే తెలంగాణ అని,సింగిల్ రోడ్డు వస్తే అది ఏపీ అని జనం అనుకుంటున్నట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఓ ఎన్నికల సభలో ఓ అడ్డగోలు ప్రసంగం చేస్తే దానిని పట్టుకుని ఎల్లో మీడియా రాజగురువు శివాలెత్తిపోయారు. తెలంగాణలో బాగున్న రోడ్లు, ఏపీలో బాలేని రోడ్లు కొన్ని ఏరుకొచ్చి అచ్చేసి చంకలుగుద్దుకున్నారు. ఏపీలో నిగనిగలాడేరోడ్లు ఆయన ‘ఎల్లో’ కామెర్ల కళ్లకు కనిపించవు. ఇక తెలంగాణలోని గుంతల రోడ్లు కనిపిస్తాయని ఎలా అనుకుంటాం. ఇక కేసీఆర్ అతిశయం.. తన అక్కసు రాతలు.. కలగలిపి రాష్ట్రంలో రోడ్లపై రామోజీరావు మరోసారి విషం చిమ్మారు. హ్రస్వదృష్టితో ఓ అవాస్తవ కథనాన్ని వండివార్చారు. ‘రాష్ట్రం పరువు రోడ్డున పడేశారు’ అంటూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు తన ఈనాడు పత్రిక ద్వారా ప్రయత్నించారు. టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం పునరుద్ధరిస్తోందన్న వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా ఆ కథనంలో విస్మరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఎప్పటిలాగే అక్కసు వెళ్లగక్కారు. రామోజీ వక్రబుద్ధిని రాష్ట్రంలోని రోడ్ల స్థితిగతులే బయటపెట్టాయి. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే రోడ్లు మెరుగ్గా ఉన్నాయన్నది స్పష్టమైంది. దాంతో ఈనాడు రామోజీరావు పరువే రోడ్డున పడింది. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం క్రమం తప్పకుండా చేపట్టాల్సిన రోడ్ల మరమ్మతులు, నిర్వహణను గత చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. దాంతో 2019 నాటికి రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్ల పునరుద్ధరణ పనులను చేపట్టింది. వరుసగా రెండేళ్లు భారీ వర్షాలతో పాటు కోవిడ్ పరిస్థితులు తగ్గిన తరువాత యుద్ధ ప్రాతిపదికన రోడ్ల పునరుద్ధరణ పనులను వేగవంతం చేసింది. దాంతో రాష్ట్రంలో రోడ్లు మెరుగయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నుంచి 2019 వరకూ ఆర్అండ్బీ రోడ్లపై రూ. 3,335.3౦ కోట్ల పనులు చేస్తే బిల్లులు మాత్రం రూ. 2,772.6 కోట్లు మాత్రమే చెల్లించారు. దాదాపు రూ. 562.7 కోట్లు పెండింగ్లో పెట్టారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో రూ. 471.15 కోట్ల పనులు చేస్తే బిల్లులు మాత్రం రూ. 387.78 కోట్లు విడుదల చేశారు. రూ. 86.37 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టారు. అంటే 2014–19 మధ్య కోవిడ్ లాంటి పరిస్థితులు లేకపోయినా, భారీ వర్షాలు లేకపోయినా ఈరెండు శాఖల పరిధిలో రూ. 3,160.38 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. యుద్ధ ప్రాతిపదికన పనులు వైఎస్సార్సీపీ 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్అండ్బీ పరిధిలో నూతన రహదారులు నిర్మాణం, రహదారుల వెడల్పు, సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చడానికి రూ.3,371 కోట్లు ఖర్చు చేశారు. వాటితోపాటు రహదారుల నిర్వహణ, మరమ్మతుల కోసం రూ. 5,342 కోట్లు వెచ్చించారు. ► గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ.236 కోట్లతో ఇప్పటివరకు 473.43 కి.మీ. మేర రహదారులు నిర్మించారు. ఇదే శాఖలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు రూ. 273.53 కోట్లతో 231.50 కి.మీ. మేర గ్రావెల్ రోడ్లు వేశారు. దాంతో 433 హేబిటేషన్స్కు రహదారి సౌకర్యం కలిగింది. రూ. 99.06 కోట్ల వ్యయంతో మరో 306 హేబిటేషన్స్లో 129.70 కి.మీ. మేర మెటల్ రహదార్లు నిర్మించారు. 359 హేబిటేషన్స్లో రూ. 56.25 కోట్ల వ్యయంతో 255.70 కి.మీ. మేర బీటీ రహదార్లు వేశారు. 36 హేబిటేషన్స్లో రూ. 29.84 కోట్ల వ్యయంతో 38.56 కిలోమీటర్ల సిమెంట్ రహదార్లు నిర్మించారు. ► పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఏపీఆర్ఆర్పీ కింద రూ. 1,273.82 కోట్లతో 2,334 కి.మీలు., పీఎంజీఎస్వై పథకంలో రూ.1,877.49 కోట్లతో 2,971 కి.మీలు., నాబార్డు నిధులు రూ.224.38 కోట్లతో 425 కి.మీలు., జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు రూ. 2,068 కోట్లతో 5,983 కి.మీ. మేర బీటీ, సీసీ రహదారులు నిర్మించారు. ► ఆర్అండ్బీ రోడ్ల పరిధిలో దాదాపుగా 11,500 కి.మీలు., పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పరిధిలో దాదాపు 1,394.34 కి.మీ. నిడివి ఉన్న రోడ్లకు.. మొత్తంగా 12,894 కి.మీ మేర రోడ్లకు మరమ్మతులు చేశారు. తెలంగాణ వార్తలు రాసే ధైర్యం లేదా రామోజీ తెలంగాణలో రోడ్ల దుస్థితిని ఉద్దేశ పూర్వకంగా పట్టించుకోలేదన్నది ఈనాడు రాతల్లో స్పష్టమవుతోంది. ఆ రాష్ట్రంలో బిల్లులు మంజూరు చేయలేదని కాంట్రాక్టర్లు ఇటీవల ధర్నాలు చేశారు. ఆ వార్త ప్రచురించేందుకు మాత్రం రామోజీరావుకు ధైర్యం సరిపోలేదు. అసలు తెలంగాణలో కాంట్రాక్టర్లు ధర్నా చేశారనే విషయాన్ని పట్టించుకోలేదు. అటువంటి రామోజీరావు ఆంధ్ర ప్రదేశ్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రోడ్లు నిర్మిస్తున్నా దుష్ప్రచారం చేస్తుండటం విడ్డూరంగా ఉంది. ఇటు వాస్తవాలను చూడలేరా! ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతుండటంతో ఈనాడు పత్రిక ద్వారా రోజుకో రీతిలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే ‘పచ్చ’గురువు రామోజీరావు పనిగా పెట్టుకున్నారు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఏపీ–తెలంగాణ సరిహద్దుల్లో రోడ్ల పరిస్థితిపై వాస్తవాలను వక్రీకరించారు. రామోజీరావు వాస్తవాలు విస్మరించినా.. ప్రజలు మాత్రం నిజాలను గుర్తిస్తూనే ఉన్నారు. ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో తెలంగాణ సరిహద్దుల వద్ద రోడ్లను పరిశీలిస్తే ఆ వాస్తవాలు తెలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ పరిధిలో కొత్తగా నిర్మించిన రోడ్లు దర్శనమిస్తుండగా.. తెలంగాణ పరిధిలో రోడ్లు పూర్తిగా గుంతలతో నిండి ఉన్నాయనే వాస్తవం కళ్లకు కనపడుతుంది. -
సామాజిక సాధికారతకు బాట
రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధించడానికి సరిగ్గా ఆరేళ్ల క్రితం తొలి అడుగు పడింది. ప్రజల కష్టాలు తెలుసుకుని... కన్నీళ్లు తుడిచి... నేనున్నా అంటూ భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టి ఆరేళ్లు పూర్తయ్యాయి. దేశ రాజకీయాల్లోనే ఈ పాదయాత్ర ఓ సంచలనం. 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాలతో రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జనం విజయం అందించిన తర్వాత, వైఎస్పార్సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు పాలనలో పెద్దపీట వేసింది. సామాజిక న్యాయమంటే నినాదం కాదు విధానమని సీఎం వైఎస్ జగన్ చాటి చెబుతున్నారు. మళ్లీ రాజన్న రాజ్యాన్ని తేవాలన్న సంకల్పంతో వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సమాధి వద్ద 2017 నవంబర్ 6న వేసిన తొలి అడుగు కోట్లాది హృదయాలను స్పృశిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9న ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 134 శాసనసభ నియోజక వర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజులపాటు 3,648 కిలోమీటర్ల మేర ప్రజాసంకల్ప పాదయాత్ర సాగింది. ఈ యాత్రలో 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రసంగించారు. పాదయాత్ర ఆద్యంతం జననేతను నిరుపేద మహిళలు, చేయూతకు నోచుకోని వృద్ధులు, ఉపాధి లేని యువత, రైతులు, రైతు కూలీలు సహా కలుసుకోని వర్గం అంటూ లేదు. కావాలి జగన్ ... రావాలి జగన్ అంటూ నినదిస్తూ అన్ని వర్గాల ప్రజలు పూలబాట పరచి అపూర్వ స్వాగతం పలికారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలు విని, వాటిని పరిష్కరించి... జీవితాల్లో వెలుగులు నింపుతానని జగన్ భరోసా ఇచ్చారు. రెండే రెండు పేజీల మేనిఫెస్టో పాదయాత్రలో కోట్లాది మందితో మమేక మైనప్పుడు వారు తన దృష్టికి తెచ్చిన, తాను గుర్తించిన సమస్యల పరిష్కారమే అజెండాగా కేవలం రెండే రెండు పేజీలతో 2019 ఎన్నికల మేనిఫెస్టోను జగన్ విడుదల చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో గెలిపించడం ద్వారా వైఎస్సార్సీపీకి చారిత్రక విజయాన్ని ప్రజలు అందించారు. జగన్ ముఖ్యమంత్రిగా 2019 మే 30న ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణమే మేనిఫెస్టో అమలుకు శ్రీకారం చుట్టడం ద్వారా సామాజిక విప్లవానికి నాంది పలికారు. సామాజిక న్యాయం నినాదం కాదు అమలు చేయాల్సిన విధానామని అధికారం చేపట్టిన రోజే చాటిచెప్పారు. సీఎం వైఎస్ జగన్ 2019 జూన్ 8న 25 మందితో ఏర్పాటుచేసిన తొలి మంత్రివర్గం ద్వారా సామాజిక న్యాయాన్ని ఎలా చేయాలో దేశానికి చాటిచెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 14 మందికి (56 శాతం) మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే, అందులో నలుగురు (80 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే. 2022 ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో మరో అడుగు ముందుకేసి ఆ వర్గాల వారికి ఏకంగా 17 మందికి(70 శాతం) స్థానం కల్పించారు. శాసనసభ స్పీకర్గా బీసీ, శాసనమండలి ఛైర్మన్గా తొలిసారిగా ఎస్సీ, వైస్ ఛైర్పర్సన్ గా తొలి సారిగా మైనార్టీ మహిళను నియమించారు. దేశ చరిత్రలో తొలిసారిగా హోంశాఖ మంత్రిగా ఎస్సీ మహిళను నియమించారు. వైఎస్సార్సీపీకి ఎనిమిది రాజ్యసభ స్థానాలు దక్కితే అందులో నాలుగు ఆ వర్గాలకే ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవుల్లో 68 శాతం(29 మంది) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే అవకాశం ఇచ్చారు. స్థానిక సంస్థల్లోనూ అదే ప్రాధాన్యం ఇచ్చారు. దేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు పదవులు ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా రాజకీయ సాధికారతకు బాటలు వేశారు. సామాజిక న్యాయం నినాదంతో అధికారంలోకి వచ్చిన మాయవతి వంటి వారు కూడా ఈ స్థాయిలో ఆ వర్గాలకు పరిపాలనలో భాగస్వామ్యం ఇచ్చిన దాఖలాలు లేవు. సామాజిక న్యాయాన్ని దేశానికి చాటిన నేత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతం అమలు చేసిన సీఎం వైఎస్ జగన్ ... ఇప్పటికి 99 శాతం అమలు చేశారు. దేశ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో నవ రత్నాల్లోని సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి రూ. 2.40 లక్షల కోట్లను డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా జమా చేశారు. ఇందులో 75 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే చేరాయి. దీని ద్వారా ఆ వర్గాల ప్రజలు పేదరికం నుంచి గట్టెక్కి, ఆర్థిక సాధికారత సాధించడానికి బాటలు వేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.67 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. సుమారు 30 లక్షల మందికిపైగా ఇంటి స్థలాలను ఇచ్చి, పక్కా గృహాలను నిర్మిస్తూ పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు ద్వారా కార్పొరేట్ స్కూళ్ల స్థాయికి అభివృద్ధి చేసి... ఇంగ్లీషు మీడియం భోదనను ప్రవేశపెట్టి... అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తూ ఆ వర్గాలు విద్యా సాధికారత సాధించడానికి బాటలు వేశారు. ఆసరా, చేయూత వంటి పథకాల ద్వారా ఆర్థికంగా ఊతమిచ్చి, పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా మహిళా సాధికారతకు మార్గం సుగమం చేశారు. దేశానికి స్వతంత్రం వచ్చిననాటి నుంచి ఇప్పటి దాకా రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే, అందులో గత 53 నెలల్లో భర్తీ చేసినవే 2.07 లక్షలు. సామాజిక సాధికారత సాధించడానికి బాటలు వేసిన సీఎం వైఎస్ జగన్కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు అగ్రవర్ణ పేదల్లోనూ నానాటికీ ఆదరణ పెరుగుతోంది. రాష్ట్రంలో 2019 ఎన్నికల తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ,మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక, నగరపాలక వంటి స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు తిరుపతి లోక్సభ... బద్వేలు, ఆత్మకూరు శాసన సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు రికార్డు మెజారిటీతో విజయం సాధించడమే అందుకు నిదర్శనం. గత 53 నెలలుగా జగన్ చేసిన మేలును వివరించడానికి అక్టోబర్ 26 నుంచి వైఎస్సార్సీపీ ప్రారంభించిన సామాజిక సాధికార యాత్రకు అన్ని వర్గాల పేదలు బ్రహ్మరథం పడుతూ, 2024 ఎన్నికల్లోనూ సామాజిక న్యాయ నిర్మాత జగనే కావాలి జగనే రావాలి అంటూ ఒక్కటై నినదిస్తున్నారు. – రామగోపాల్ ఆలమూరు‘సాక్షి’ స్పెషల్ కరెస్పాండెంట్ -
ప్రజా సంకల్ప యాత్రకు నేటితో ఆరు వసంతాలు పూర్తి
►ఏలూరు జిల్లా: సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కైకలూరులో సంబరాలు ►వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి,కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ, వైఎస్సార్ సీపీ నాయకులు,కార్యకర్తలు ►కృష్ణాజిల్లా: సీఎం జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 6 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పెడన వైఎస్సార్సీపీ కార్యాలయంలో కేక్ కటింగ్ ►పాల్గొన్న పెడన పట్టణ వైఎస్సార్సీపీ కన్వీనర్ బండారు మల్లి, పార్టీ నాయకులు ►పశ్చిమగోదావరి జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పూర్తి చేసుకుని నేటితో ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. ►అనంతరం పేదలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ►తాడేపల్లి: పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్సీ, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ►హాజరైన పలు కార్పోరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు ►నెల్లూరు: జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ ఆఫీస్ లో వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి కాకాని ►అనంతరం నాయకులతో కలిసి కేక్ కటింగ్ చేసిన మంత్రి ►కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతి. ►ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ.. ‘ ప్రతిపక్ష నేతగా జగన్ చేసిన ప్రజాసంకల్పయాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. పాదయాత్ర లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత 99 శాతం నెరవేర్చాం. మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా క్యాడర్ కష్టపడి పని చెయ్యాలి. ►తిరుపతి: తుడా వైఎస్సార్ సర్కిల్ వద్ద ప్రజా సంకల్ప పాదయాత్ర ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు. ►సీఎం జగన్మోహన్రెడ్డి చిత్ర పటానికి పాలభిషేకం చేసిన మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, టౌన్ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్ రెడ్డి,టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయ చంద్రారెడ్డి, కార్పొరేటర్లు వెంకటేష్, మునిరామిరెడ్డి,పొన్నాల చంద్ర, నరసింహచారి పేదల కష్టాలు తెలుసుకునేందుకు వేసిన తొలి అడుగుకు ఆరేళ్లు పూర్తయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సంకల్ప యాత్ర (పాదయాత్ర)కు శ్రీకారం చుట్టి నేటి (సోమవారం)తో ఆరు వసంతాలయ్యాయి. 2017 నవంబరు 6వ తేదీన వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2017 నవంబరు 14 నుంచి 2018 డిసెంబర్ 3వ తేదీ వరకు 18 రోజుల పాటు ప్రజా సంకల్ప యాత్ర సాగింది. ఏడు నియోజకవర్గాలు, 14 మండలాలు, 66 గ్రామాలమీదుగా 263 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది జననేతతో కలసి అడుగులు వేశారు. పాదయాత్ర ద్వారా తెలుసుకున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను, అనుభవాలను మేనిఫెస్టోగా రూపొందించి 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చారు. రెండేళ్లలో 90శాతం, నాలుగున్నరేళ్లలో 99 శాతం హామీలు అమలు చేసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజాసంకల్ప యాత్రకు ఆరు వసంతాలు పూర్తయిన సందర్భంగా సోమవారం కర్నూలులో పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కమిటీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటలకు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కేక్ కటింగ్ చేయనున్నట్లు జిల్లా కమిటీ పేర్కొంది. -
వైఎస్సార్సీపీలో 300 మంది టీడీపీ కార్యకర్తల చేరిక
లక్కవరపుకోట/జామి/వేపాడ: విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండలానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 300 మంది వైఎస్సార్సీపీలో చేరారు. శనివారం సామాజిక సాధికార బస్సు యాత్ర జమ్మాదేవిపేటకు చేరుకున్న వేళ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సమక్షంలో పార్టీలో చేరిన నాయకులకు రాష్ట్ర విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వేపాడ మండలం మాజీ ఎంపీపీ దొగ్గ శ్రీదేవి, కుమ్మపల్లి కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు దొగ్గ సూరిదేముడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దొగ్గ శ్రీనివాసరావు, కుమ్మపల్లి మాజీ సర్పంచ్ దొగ్గ లక్ష్మి తదితరులు ఉన్నారు. -
సామాజిక ప్రభంజనం
సీఎం వైఎస్ జగన్ చర్యలతో రాష్ట్రంలో సాకారమైన సామాజిక సాధికారతను వివరించేందుకు వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలకు జనం పోటెత్తుతున్నారు. సాధికారత ఫలితాలను ప్రతిబింబిస్తున్నారు. గత నెల 26న ప్రారంభమైన సామాజిక సాధికార యాత్రలు ఇప్పటివరకు 3 ప్రాంతాల్లో 19 నియోజకవర్గాల్లో విజయవంతంగా సాగాయి. వీటికి వస్తున్న అశేష జనం సామాజిక విప్లవ సారథి సీఎం జగన్కు జేజేలు పలుకుతున్నారు. ‘మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్తు, జగనే కావాలి – జగనే రావాలి’ అంటూ నినదిస్తున్నారు. యాత్రలో భాగంగా పలు చోట్ల బైక్, కారు ర్యాలీలు, పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహిస్తోన్న సభలకు పెద్ద ఎత్తున ప్రజలు కదలివస్తుండటంతో సభా ప్రాంగణాలు జనసంద్రాలుగా మారుతున్నాయి. సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక విప్లవానికి తెరతీశారని రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున చెప్పారు. దేశంలో గరీబీ హటావో వంటి నినాదాలు ఎన్ని వచ్చినా పేదవాడి తలరాతని మార్చింది ఒక్క వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు. దళితులు, బీసీలను చిన్నచూపు చూసిన చంద్రబాబు పాలనకు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్ పాలనకు తేడా గమనించాలని కోరారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని మాయాబజారు సెంటర్లో స్థానిక ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రులు ప్రసంగించారు. సీఎం వైఎస్ జగన్ నాలుగున్నరేళ్ల సుపరిపాలనలో కుల, మత, ప్రాంత, పార్టీల వివక్ష చూపకుండా సామాజిక న్యాయం పాటించి ప్రతి ఒక్కరికీ మేలు చేశారని మంత్రి సురేష్ చెప్పారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే కలగలిపితే అభినవ అంబేడ్కర్ వైఎస్ జగన్ అని కొనియాడారు. డాక్టర్ వైఎస్సార్ మైనార్టీలకు కల్పించిన రిజర్వేషన్ల సాక్షిగా సీఎం వైఎస్ జగన్ ప్రతి అంశంలోనూ వారికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో కనీసం మైనార్టీలను పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేవన్న విపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 2019లో 22వ స్థానంలో ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి వైఎస్ జగన్ పాలనలో మొదటి స్థానానికి రావడం అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమానికి నిదర్శనమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ భావజాలమే ప్రజలను మోసం చేయడమన్నారు. చంద్రబాబు ఆఖరికి న్యాయమూర్తికి కూడా అబద్ధాలు చెప్పి ఒక్క రోజు ఆసుపత్రిలో ఉండి, రెండో రోజే ఇంటికి వచ్చి కార్యకలాపాలు చేస్తున్నారని విమర్శించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరిగిన సభకు హాజరైన అశేష జన సందోహంలో ఓ భాగం చంద్రబాబు అంటే అబద్ధం.. వైఎస్ జగన్ అంటే నిజం రాష్ట్రంలో అధిక భాగం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకులానే చూశాయని, సీఎం వైఎస్ జగన్ వారికి అన్ని రంగాల్లో పెద్ద పీట వేసి, బలహీన వర్గాల పక్షమని చాటి చెప్పారని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెప్పారు. చంద్రబాబు అంటేనే అబద్ధమని, సీఎం జగన్ అంటే నిజమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం దిశగా సీఎం వైఎస్ జగన్ పునాది వేశారన్నారు. సమ సమాజ స్థాపన కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. చంద్రబాబు హయాంలో అణగారిన వర్గాలను అవమానించి, అణచివేశారని, సీఎం వైఎస్ జగన్ ఈ వర్గాలకు పూర్తి స్థాయి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పేదలకు రూ. 2.35 లక్షల కోట్లు నేరుగా అందజేసిన ఘనత సీఎం జగన్దేనని అన్నారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా ప్రజలకు మేలు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని అన్నారు. సీఎం వైఎస్ జగన్ నాలుగున్నరేళ్లలో పేదరిక నిర్మూలనకు, పేదలకు ఆస్తుల కల్పనకు కృషి చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు చెప్పారు. సీఎం జగన్ పాలన దేశంలోనే ఓ చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. ఏసీల్లో కూర్చొని మాట్లాడుకునే చంద్రబాబు, పవన్, లోకేశ్లకు పేదల కష్టాలు ఎలా తెలుస్తాయని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ అన్నారు. వైఎస్ జగన్ చేసిన మేలును చూశారు కాబట్టే ఆయన కటౌట్ చూసి ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. 2024 ఎన్నికల్లో సీఎం జగన్ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన వైద్యం, విద్య అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరిఫాతిమా చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, పోతుల సునీత, పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ ఏపీ టాప్: విజయసాయిరెడ్డి
సాక్షి, పల్నాడు జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏం చేశామో చెప్పేందుకే సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర చేస్తున్నామని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. యాత్ర సందర్భంగా శుక్రవారం మాచర్ల నియోజకవర్గం రెంటచింతలలో ఆయన పార్టీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ తో సమావేశమయ్యారు. 2019 మాదిరిగానే 2024లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ ఇచ్చామని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందనేది అవాస్తవమన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలవి తప్పుడు ఆరోపణలని దుయ్యబట్టారు. సీఎం జగన్ పాలనలో ఏపీ ప్రజల తలసరి ఆదాయం పెరిగిందన్నారు. సీఎం జగన్ విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఫిషింగ్ హార్బర్స్, పోర్టులు నిర్మిస్తున్నామని, అభివృద్ధి విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. రాషష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బస్సుయాత్ర జరుగుతుందని తెలిపారు. మాచర్ల నియోజకవర్గానికి ఈ నాలుగున్నరేళ్లలో డీబీటీ ద్వారా రూ. 890కోట్లు , రూ. 300 కోట్లు నాన్ డీబీటీ ద్వారా ఖర్చు చేశామన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఇదే మీటింగ్లో పాల్గొన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. నాలుగున్నరేళ్ళ పాలనలో ఒకటి, అర లోపాలు ఉంటే ఉండవచ్చన్నారు. ఉన్నది లేనట్టు అబద్ధాలు ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం చేసిందే చెప్పండని ఇన్ఫ్లూయెన్సర్లకు సూచించారు. -
వేలం పాటలు మొదలయ్యాయి!
ఎన్నికల సీజన్ మొదలవడంతో, మళ్లీ మేనిఫెస్టోలను రూపొందించే పనిలో అన్ని రాజకీయ పార్టీలూ తలము నకలు అవుతున్నాయి. మేనిఫెస్టో అనేది రాజకీయ పార్టీలు అవి అధి కారంలోకి వచ్చిన తరువాత చేయగల పనులను పేర్కొనే హామీ పత్రం. మేనిఫెస్టోను నమ్మే చాలా మంది ఓట్లు వేస్తూ ఉంటారు. కాని, చాలా రాజ కీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత మేనిఫెస్టోను మరచిపోయి ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తాయి. ఎక్కడో ఒకటో ఆరో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలాంటివి మాత్రం మేని ఫెస్టోను బైబిల్, భగవద్గీత, ఖురాన్ల వంటి పవిత్ర గ్రంథాలుగా భావిస్తున్నాయి. ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాయి. మేనిఫెస్టోలో అనేక సంక్షేమ పథకాలను ప్రకటించటం ప్రతి పార్టీ చేసే పనే. అయితే వాటిని చిత్తశుద్ధితో ఎంత వరకు అమలు చేశారు అనేది ముఖ్యం, చిత్తశుద్ధితో చేసే ఏ పనైనా విజయవంతమవుతుంది. తద్వారా ప్రజలకు మేలు కలిగి పాల కులు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఒకప్పుడు ‘రెండు రూపాయలకు కిలో బియ్యం’ తన మేనిఫెస్టోలో పొందు పరిచి, చిత్తశుద్ధితో అమలు పరిచిన నందమూరి తారక రామా రావు ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నారు. ఈ పథకం పేరు చెప్పగానే ఆయనే గుర్తుకు వస్తారు. అలాగే ప్రజల ఆరోగ్యం కోసం ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని రూపొందించిన డా‘‘ వై.ఎస్. రాజశేఖర రెడ్డి పేరు చెప్పగానే ఆరోగ్యశ్రీనే గుర్తుకు వస్తుంది. అదేవిధంగా పేద పిల్లల చదువుల కోసం అహర్నిశలూ పాటు పడుతున్న నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పగానే ‘అమ్మ ఒడి’ గుర్తుకొస్తుంది. పేదవాడి సంక్షేమం గురించి చిత్తశుద్ధితో ఆలోచించి అమలు పరిచే పథకాలకు ఎప్పటికీ మరణం ఉండదు. అందుకనే ఆ పథకాలూ, వాటిని అమలు పరిచిన నాయకులు చిరస్మరణీయం. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ఆ పథకాలను మాత్రం మార్చలేని పరిస్థితికి పార్టీలు వచ్చాయి అంటే అవి ఎంతగా ప్రజలకు మేలు చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ‘మేము అధికారంలోకి వస్తే కొనసాగిస్తాము’ అని ప్రతిపక్షాలు ప్రజలకు హామీ ఇస్తున్నాయి అంటే ఆ పథకాలు ఎంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల పక్క రాష్ట్రంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మెచ్చి ప్రజలు అక్కడ ఒక రాజకీయ పార్టీకి అధికారం కట్ట బెట్టడంతో, అవే హామీలను తెలుగు రాష్ట్రాలలో కూడా కొన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నాయి. పొందు పరచడమేకాక ఒకరు వంద ఇస్తానంటే మరొకరు రెండు వందలు ఇస్తాం అంటూ వేలం పాటలు మొదలు పెట్టారు. వెయ్యి రూపాయలు ఉన్న వంట గ్యాస్ సిలిండర్ పై ఇటీవల కేంద్ర ప్రభుత్వం రెండు వందలు తగ్గించింది. అంటే ఏడు వందలకే ఇస్తుందన్నమాట. ఇది చూసి మరో రెండు వందలు తగ్గించి, ఐదు వందలకే ఇస్తామని మరో పార్టీ ప్రకటిస్తే, ఇంకో పార్టీ నాలుగొందలకే ఇస్తామని ప్రకటించింది. వృద్ధులకు ఇచ్చే పెన్షన్ను ఒక పార్టీ మూడు వేలు అంటే... మరో పార్టీ ఐదు వేలు అంటోంది. ఇలా వేలం పాటల్లో ఇచ్చే హామీలను అధికారం వచ్చిన తరువాత గాలికి వదిలేస్తారు అనటంలో ఏ సందేహం లేదు. మేనిఫెస్టోలో ప్రకటించే సంక్షేమ పథకాలకూ, ఉచిత పథకాలకూ ఉన్న తేడా ప్రజలు గుర్తించాలి. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి కొన్ని రాజకీయ పార్టీలు గ్యారంటీ నినాదాన్ని అందుకున్నాయి. కొంత మంది భవిష్యత్తుకు గ్యారంటీ అంటే మరి కొంతమంది ‘ఆరు స్కీముల’ గ్యారంటీ అంటూ ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారు. ఒకప్పుడు ఈ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకపోవటంతో గ్యారంటీ స్కీములతో ముందుకొచ్చారిప్పుడు ప్రజలను నమ్మించ టానికి! మరికొంత మంది ఇంటింటికీ తిరిగి, తమ స్కీముల వల్ల ఎంత లబ్ధి చేకూరుతుందో అంత మొత్తానికి ‘బాండ్లు’ రాసిస్తామని వాగ్దానాలు చేస్తున్నారు. అంటే ఒక రకంగా ఓట్లు కొనుగోలు చేస్తున్నట్లే! చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలను అమలు చేసే వాళ్ళనే ప్రజలు నమ్ముతారు. ప్రజల నమ్మకం ముందు ఈ గ్యారంటీలు, బాండ్లు ఎందుకూ కొరగావు. ఒకసారి నమ్మకాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రాదు. కొన్నిసార్లు ఇచ్చిన హామీల్లో ఒకటో, రెండో అమలు చేయడం సాధ్యం కాదు. అలాంట ప్పుడు నిజాయతీగా ఎందుకు అమలు చేయలేక పోతున్నదీ ప్రజలకు వివరిస్తే అర్థం చేసుకుంటారు. అలా కాకుండా ఉత్తుత్తి హామీలు ఎన్ని ఇచ్చినా ఏ ఉపయోగమూ ఉండదు! ఈదర శ్రీనివాస రెడ్డి వ్యాసకర్త నాగార్జున యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ -
మన బిడ్డల భవిష్యత్ కోసం జగన్ కావాలి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ఇన్నేళ్లూ ప్రభుత్వాలన్నీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగానే చూశాయి. వాడుకుని వదిలేశాయి. కానీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టాక మన బిడ్డలకు ఇంగ్లిష్ చదువులు చెబుతున్నారు. వారి రక్షణకు భరోసా కల్పిస్తున్నారు, అక్కచెల్లెమ్మలకు చేయూతనిస్తున్నారు. అవ్వా తాతలను మనవడిలా వెంట ఉండి నడిపిస్తున్నాడు. మన బిడ్డల ఉన్నత చదువులకు, వారి భవిష్యత్కు మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని పలువురు మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేపట్టిన సామాజిక సాధికార యాత్ర గురువారం భారీ జన సందోహంమధ్య పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో సాగింది. సాయంత్రం 5 గంటలకు బుక్కరాయసముద్రం సభా వేదిక వద్దకు చేరుకుంది. సాధికారత అంటే ఏంటో చేసి చూపించారు: మంత్రి ఉషశ్రీ సామాజిక సాధికారత అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసి చూపించారని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ చెప్పారు. మహిళా సాధికారత కోసం రూ.25 వేల కోట్లు వెచ్చించారని తెలిపారు. జనరంజక పాలన అందించారని, ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయన పేరు చెప్పుకుని గర్విస్తున్నామన్నారు. కేబినెట్లో పదకొండు మంది బీసీ మంత్రులు: అంజాద్ బాషా సీట్లు, ఓట్లతో పాటు మంత్రి పదవులు, ఇతర పదవుల్లోనూ సామాజిక న్యాయం కల్పించిన సీఎం జగన్ అన్ని వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పారు. జగన్ హయాంలో 11 మంది బీసీలు, ఐదుగురు ఎస్సీలు మంత్రులయ్యారన్నారు. 2024లో పేదలకు–పెత్తందార్లకు మధ్య కురుక్షేత్ర సంగ్రామం జరుగుతోందని, పేదల పక్షాన మనందరం జగన్కు ఓటేసి గెలిపించుకోవాలని చెప్పారు. స్వాతంత్య్రం ఇప్పుడే వచ్చింది: మంత్రి జయరాం భారత స్వాతంత్య్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు ఇప్పుడే అసలు సిసలు స్వాతంత్య్రం వచ్చిందని కార్మిక శాఖ మంత్రి జి.జయరాం చెప్పారు. పదవుల్లో, ఉద్యోగాల్లో, సంక్షేమ పథకాల లబ్ధిలో అన్నింటా స్వేచ్ఛ వచ్చిందన్నారు. పల్లెల్లో ప్రతి తల్లి, ప్రతి తండ్రీ జగన్ను కొడుకుగా భావిస్తున్నారని, చదువుకునే చిన్నారులతో మేనమామగా పిలిపించుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు. ఎస్సీలకు మేలు జరగకుండా బాబు అడ్డుకున్నారు: ఎంపీ సురేష్ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తే మురికివాడ అవుతుందని చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకొన్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. పేదలందరికీ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తున్న ఘనత వైఎస్ జగన్దేనని అన్నారు. 14 ఏళ్ల సీఎం అనుభవం నలభై ఏళ్ల కుర్రాడి ముందు వెలవెల పోయిందని అన్నారు. శింగనమల సెంటిమెంటు పనిచేస్తుంది: జొన్నలగడ్డ శింగనమల నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, మీరందరూ ఇక్కడ మళ్లీ వైఎస్సార్సీపీకి ఓటేసి జగన్ను సీఎం చెయ్యాలని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కోరారు. నియోజకవర్గంలో 40 చెరువులను లోకలైజ్ చేసి రైతులకు జగన్ అండగా నిలిచారని, ఈ నియోజకవర్గంపై ఆయనకు ప్రత్యేక ప్రేమ ఉందన్నారు. జగన్ అన్నట్టు 175కు 175 సీట్లు సాధ్యమే అని తెలిపారు. ఈ యాత్రలో ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, సిద్దారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్, బీసీ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ బీసీ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగో సింహం ఓటు వేట
వారంతా చట్టాన్ని కాపాడే విధుల్లో సత్తా చాటారు.. కానీ చట్టాలు చేసే పదవిని మాత్రం ఆశించిన స్థాయిలో పొందలేకపోయారు! ప్రజలను రక్షించే బాధ్యతలను సక్సెస్ఫుల్గా నిర్వహించిన వారు ‘పొలిటికల్ సైన్స్’లో మాత్రం ఫెయిలయ్యారు!! ప్రత్యక్ష లేదా పరోక్ష రాజకీయాల్లో తమ మార్కును చాటలేకపోయారు... ఖాకీ నుంచి ఖద్దరు వైపు మళ్లిన కొందరు పోలీసుల ప్రస్థానం ఇది. ఉమ్మడి ఏపీ మొదలు తెలంగాణలో పోలీసు యూని ఫాం వదిలి ఖద్దరు తొడిగిన మాజీ అధికారుల్లో విజయం సాధించిన వారి సంఖ్య అతితక్కువే. ముగ్గురు మాత్రమే మంత్రి పదవులు అలంకరించగలిగారు. మిగిలిన వారిలో కొందరు పార్టీ పదవుల్లో పనిచేసినా, చేస్తున్నా వారివి తెరవెనుక పాత్రలే అయ్యాయి. ఏమాత్రం ప్రభావం చూపలేక... కొందరు మాజీ పోలీసు అధికారులు రాజకీయాల్లోకి వచ్చినా ఏ మాత్రం తమ ఉనికి చాటలేకపోయారు. కనీసం ఎన్నికల్లో పోటీ, గెలపోటములు, పెద్దల సభలు, నామినేటెడ్ పదవులు సహా ఏ ఒక్కటీ తమ ఖాతాల్లో వేసుకోలేకపోయారు. క్లిష్ట సమయంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్గా పనిచేసి ఘర్షణల్ని అదుపు చేయమంలో తనకు తానే సాటి అని పేరొందిన ఐపీఎస్ అధికారి ఎంవీ భాస్కర్రావు. ఆపై రాష్ట్ర డీజీపీగానూ పని చేశారు. ఈయన రాజకీయంగా మిగిలిన వారి కంటే మరో అడుగు ముందుకు వేశారు. పదవీ విరమణ పొందిన అనంతరం ఈయనే సొంతంగా ఆంధ్రనాడు పేరుతో పార్టీ స్థాపించారు. విజయవాడ సీపీగా, వరంగల్ ఎస్పీగా పనిచేసిన సమయంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఐపీఎస్ అధికారి డీటీ నాయక్ రిటైరయ్యాక ప్రజారాజ్యం పార్టీలో చేరారు. మహబూబాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీ తరఫున గతంలో వరంగల్ ఎంపీగా పోటీ చేసిన దొమ్మాట సాంబయ్య ఇన్స్పెక్టర్గా కరీంనగర్ జిల్లాలో పని చేస్తూ వీఆర్ఎస్ తీసుకున్నారు. రీఎంట్రీ ఇచ్చింది ఒక్కరే... ఖాకీ వదిలి ఖద్దరు తొడిగాక తిరిగి ‘వెనక్కు’ రావడం దాదాపు అసాధ్యం. అయితే హైదరాబాద్లోని చిలకలగూడ ఠాణాలో ఇన్స్పెక్టర్గా పని చేసిన హనుమంతరావు పీఆర్పీ ఆవిర్భావంతోనే వీఆర్ఎస్ తీసుకొని ఆ పార్టీలో చేరారు. విజయనగరం జిల్లా సాలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆపై మళ్లీ పోలీసు ఉద్యోగంలో చేరారు. అదనపు ఎస్పీ వరకు పదోన్నతులు కూడా పొందారు. ♦ సీనియర్ ఐపీఎస్ రావులపాటి సీతారామరావు రిటైరయ్యాక టీడీపీలో, రిటైర్డ్ డీఐజీ స్థాయి అధికారి చంద్రశేఖర్రెడ్డి, మాజీ డీజీ స్థాయి అధికారి ఎస్కే జయచంద్రం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ♦ రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న సమయంలో వివాదాస్పద పరిస్థితుల్లో తన డీఎస్పీ పోస్టుకు రాజీనామా చేసిన నళిని తొలుత టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. ఆపై బీజేపీలో చేరారు. ♦ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి, కాగజ్నగర్ నుంచి పోటీ చేస్తున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ భవితవ్యం ఎలా ఉంటుందో వేచి చూడాలి. మంత్రులుగా ముగ్గురే... ♦ ఉమ్మడి రాష్ట్ర డీజీపీగా పనిచేసిన 1954 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పీవీ రంగయ్య నాయుడు 1991లో ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అప్పటి పీవీ నరసింహారావు కేబినెట్లో 1996 వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆపై ఎమ్మెల్సీగానూ వ్యవహరించారు. ♦ హైదరాబాద్ పోలీసు కమిషనర్గా పని చేసిన కె.విజయరామారావు, ఆపై సీబీఐ డైరెక్టర్గానూ వ్యవహరించారు. రిటైరయ్యాక టీడీపీలో చేరి 1999లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. చంద్రబాబు మంత్రివర్గంలో వాణిజ్య పన్నులు, రోడ్లు భవనాల శాఖల్ని పర్యవేక్షించారు. 2004 ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఇటీవలే కన్నుమూశారు. ♦ వరంగల్ జిల్లా మదనపల్లెలో పుట్టిన పి.బలరామ్నాయక్ మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారిన నాయక్ 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. ఎంపీగా గెలిచి యూపీఏ–2లో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. అలా మెరిసి.. ఇలా తెరమరుగై... హైదరాబాద్ పోలీసు కమిషనర్ నుంచి డీజీపీ వరకు అనేక కీలక పోస్టుల్లో పనిచేసిన ఐపీఎస్ అధికారి వి.దినే‹Ùరెడ్డి పదవీవిరమణ అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి విధానా లకు ఆకర్షితుడై రాజకీయాల్లోకి దిగాలని నిర్ణయించుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 సాధారణ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆపై బీజేపీ చేరినా ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. డీజీపీ ర్యాంక్లో ఉండి హైదరాబాద్ పోలీసు కమిషనర్గా పనిచేసిన తొలి ఐపీఎస్ అధికారి పేర్వారం రాములు ఆపై ఉమ్మడి ఏపీ డీజీపీగానూ వ్యవహరించారు. రిటైర్మెంట్ అనంతరం తొలుత టీడీపీలో చేరిన ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్లో చేరారు. అయినప్పటికీ పొలిటికల్గా తన మార్కు చూపించుకోలేకపోయారు. -
వెల్లివిరిసిన సామాజిక చైతన్యం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలు.. రాష్ట్రంలో నేడు ఏ రంగంలో చూసినా వీరిదే అగ్రస్థానం. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాధించిన సామాజిక న్యాయం. అదే ఇప్పుడు రాష్ట్రమంతటా చైతన్యాన్ని రగిలించింది. జగన్నినాదమై మార్మోగుతోంది. సామాజిక సాధికారతై వెలుగులీనుతోంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన వైఎస్సార్సీపీ ‘సామాజిక సాధికార’ బస్సు యాత్ర ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో ఏకకాలంలో ప్రారంభమైన ఈ బస్సు యాత్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సామాజిక విప్లవాన్ని ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్తోంది. పార్టీకి చెందిన కోఆర్డినేటర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతల ఆధ్వర్యంలో సాగుతున్న యాత్రకు ప్రజలు అడగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో తమకు పట్టం కట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా నిలవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఏకమై కదలివచ్చారు. తమకు జరిగిన సామాజిక న్యాయాన్ని ప్రతిధ్వనించారు. రాష్ట్రంలో గత 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సామాజిక న్యాయాన్ని.. 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆ వర్గాలకు చేసిన ద్రోహాన్ని వివరించి.. ఆ వర్గాలను ఏకం చేయడం ద్వారా 2024 ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను చేపట్టింది. ఈ యాత్ర గురువారం ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, కోస్తాలో గుంటూరు జిల్లా తెనాలి, రాయలసీమలో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గాల నుంచి ప్రారంభమైంది. ఇచ్ఛాపురంలో ఆ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పిరియా సాయిరాజ్, తెనాలిలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, శింగనమలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఈ యాత్రకు నేతృత్వం వహించారు. ఇచ్ఛాపురం, తెనాలి, శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో బహిరంగ సభలు జరిగాయి. మూడు ప్రాంతాల్లో బస్సు యాత్ర, సభలకు ప్రజలు పోటెత్తారు. సీఎం వైఎస్ జగన్ చేసిన సామాజిక న్యాయానికి నీరాజనాలు పలికారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును మంత్రులు, నేతలు వివరించారు. ఆ ప్రసంగాలను ప్రజలు ఆసక్తిగా విన్నారు. ప్రసంగాల్లో నేతలు సీఎం వైఎస్ జగన్ పేరు ఎత్తగానే.. ‘మా నమ్మకం నువ్వే జగన్’.. ‘జగనన్నే మా భవిష్యత్తు’.. ‘జగనే రావాలి – జగనే కావాలి’ అంటూ జనం ప్రతిస్పందించారు. సామాజిక సాధికార యాత్ర రెండో రోజు శుక్రవారం ఉత్తరాంధ్రలో గజపతినగరం, కోస్తాలో నరసాపురం, రాయలసీమలో తిరుపతిలో జరగనుంది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం వద్ద సామాజిక సాధికార యాత్రకు స్వాగతం పలుకుతున్న జనసందోహానికి అభివాదం చేస్తున్న మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు వెల్లువలా అభిమానం శ్రీకాకుళంలో ప్రారంభమైన బస్సు యాత్రకు నరసన్నపేట నియోజకవర్గం మడపాం, కోట బొమ్మాళి వద్ద ఘన స్వాగతం లభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు, మహళలు వెల్లువలా తరలివచ్చారు. మడపాం వద్ద బాణసంచాతో స్వాగతం పలికారు. యాత్రలో భాగంగా మంత్రుల బృందం కంచిలి మండలం బూరగాం సచివాలయాన్ని సందర్శించి, అక్కడి సిబ్బందితో మాట్లాడారు. స్థానికులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. మద్యపానం మానుకోవాలని హితవు పలికారు. పలాస టి.కె.ఆర్.కల్యాణ మండపంలో మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో మేధావుల సదస్సు నిర్వహించారు. ఇచ్ఛాపురంలో జరిగిన సభలో ప్రసంగించిన నేతలు జగన్ పేరు చెప్పిన ప్రతిసారీ ప్రజలు జయజయధ్వానాలు చేశారు. బడుగు జన కెరటం.. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో రూరల్ మండలం కొలకలూరులో ప్రారంభమైన బస్సు యాత్రకు, తెనాలిలో జరిగిన సభకు బడుగు జనులు కెరటంలా తరలివచ్చారు. సాయంత్రం 6.32 గంటలకు సభా ప్రాంగణానికి యాత్ర చేరగానే జనం జయజయధ్వానాలు చేశారు. అందరికీ అభివాదం చేస్తూ దళిత, ముస్లిం, బడుగు బలహీనవర్గాల ప్రజాప్రతినిధులు వేదికపైకి చేరుకున్నారు. సభకు ఎమ్మెల్యే శివకుమార్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర మంత్రి జోగి రమేష్ ‘జగనన్న రథచక్రాలు రాష్ట్రంలో దూసుకెళుతున్నాయి’ అనగానే జై జగన్.. జైజై జగన్ అంటూ జనం నినదించారు. ‘నిజం నిగ్గు తేలినందునే బాబు బొక్కలోకి వెళ్లాడు..’ అనగానే జనం ‘నిజం...నిజం’ అంటూ కేకలు పెట్టారు. ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించినపుడు కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో ట్రాక్టర్లు, బైక్ ర్యాలీతో సామాజిక సాధికార యాత్రకు స్వాగతం పలుకుతున్న ప్రజలు జన సంతసం.. జగన్నినాదం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికారత బస్సు యాత్ర, బుక్కరాయసముద్రంలో జరిగిన సభ జన సంద్రాన్ని తలపించాయి. బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఈ కార్యక్రమాలకు భారీగా తరలివచ్చారు. నియోజకవర్గ కేంద్రమైన శింగనమలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో బస్సు యాత్ర ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు డా. బీఆర్ అంబేడ్కర్, వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘నాడు–నేడు’ పనుల ఫొటోలను పరిశీలించారు. అక్కడి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. అనంతరం బస్సు యాత్ర ప్రారంభించారు. బస్సు ముందు వైఎస్సార్సీపీ శ్రేణులు బైక్ ర్యాలీ చేశాయి. రోటరీపురం గ్రామం వద్ద ప్రజలు పూల వర్షం కురిపించారు. బుక్కరాయసముద్రం వద్ద యాత్రకు ప్రజలు స్వాగతం పలికారు. ఇక్కడ జరిగిన సభలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడారు. సీఎం జగన్ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించిన సందర్భంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జాతీయ నేతలకు నివాళులు వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్రలో భాగంగా జరుగుతున్న సభల్లో పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు ముందుగా జాతీయ నేతలకు నివాళులర్పించారు. ప్రతి సభలో వేదికపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, బాబు జగజ్జీవన్రామ్, అల్లూరి సీతారామరాజు, భారతరత్న అబ్దుల్ కలాం చిత్రపటాలను, మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు, ఇతర నేతలు ఈ చిత్రపటాల వద్ద పుష్పాలు ఉంచి, నేతలకు నివాళులర్పించారు. అనంతరం సభ ప్రారంభించారు. -
నేటి నుంచి ‘సామాజిక సాధికార యాత్ర’
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని రాష్ట్ర మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, ప్రభుత్వ సలహాదారు(మైనార్టీ వ్యవహారాలు) జియావుద్దీన్, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతునాయక్లు ప్రశంసించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ చేసిన మంచిని వివరించి.. ఆయా వర్గాలను ఏకం చేయాలన్న లక్ష్యంతో సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సు యాత్రను వైఎస్సార్సీపీ చేపట్టిందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర పోస్టర్లను వారు ఆవిష్కరించారు. అనంతరం సామాజిక సాధికార యాత్ర బస్సుకు పూజలు చేసి, ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో మూడు విడతలుగా సామాజిక సాధికార యాత్ర జరుగుతుందన్నారు. తొలి విడత యాత్ర గురువారం ప్రారంభమవుతుందని.. నవంబర్ 9న ముగుస్తుందని చెప్పారు. రోజూ మూడు ప్రాంతాల్లో ఒక్కో నియోజకవర్గంలో ఈ యాత్ర జరుగుతుందని.. సాయంత్రం బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. తొలి విడతలో మూడు ప్రాంతాల్లోని 39 నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగుతుందని వివరించారు. యాత్రలో పేదలందరినీ ఏకం చేసి పెత్తందార్లపై రణభేరి మోగిస్తామని ప్రకటించారు. వచ్చే ఎన్నికల సంగ్రామంలో.. పేదల పక్షాన నిలిచిన సీఎం వైఎస్ జగన్కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు దన్నుగా నిలిచి, పెత్తందార్లను మట్టికరిపించాలని పిలుపునిచ్చారు. మీడియాతో ఎవరేమన్నారంటే.. పేదలు వృద్ధిలోకొస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందంటా! ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికే సామాజిక సాధికార యాత్ర చేపట్టాం. ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీ సిలబస్ను ప్రవేశపెడితే.. పేద పిల్లలు వృద్ధిలోకి వస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని పెత్తందార్లు గగ్గోలు పెట్టారు. చివరకు సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాలిస్తే.. అక్కడికి వారొస్తే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని పెత్తందార్లు ఏకంగా కోర్టుల్లో వాదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఆలయాల్లోకి కూడా పెత్తందార్లు రానివ్వలేదు. జగనన్న సీఎం అయ్యాక పేదలకు అవే ఆలయ కమిటీల్లో పదవులిచ్చారు. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి, తర్వాత తప్పించుకునే వ్యక్తి చంద్రబాబు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి జగనన్న. తమ పక్షాన నిలిచిన జగనన్నకు పేదలు దన్నుగా నిలుస్తారు. రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న దళిత విద్యార్థులతో పవన్ ఇంగ్లీష్లో మాట్లాడగలరా? – ఆదిమూలపు సురేష్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి చంద్రబాబు అవమానిస్తే.. సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారు... ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు దళితులను అవహేళన చేస్తే.. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకూ సింహభాగం పదవులిచ్చి అక్కున చేర్చుకుని ఆత్మగౌరవం నిలిపిన నేత సీఎం వైఎస్ జగన్. దళితుల మీద చంద్రబాబు హయాంలో జరిగినన్ని దాడులు మరెప్పుడూ జరగలేదు. జగనన్న పాలనలో పేదల బతుకులు మారాయి. సామాజిక సాధికార యాత్ర పేరుతో మేం పేదల కోసం బస్సు యాత్ర చేస్తుంటే.. నిజం గెలవాలనే పేరుతో జైల్లో ఉన్న వ్యక్తి కోసం భువనేశ్వరి యాత్ర చేస్తున్నారు. గత ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను ఓటు బ్యాంకుగానే చూసింది. సీఎం వైఎస్ జగన్ ఆ వర్గాలను పేదరికం నుంచి గట్టెక్కించేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. దీని వల్లే రాష్ట్రంలో పేదరికం 12 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. వైఎస్సార్సీపీ పేదల పార్టీ. ఈ ప్రభుత్వం పేదలది. – మేరుగు నాగార్జున, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అర్హతే ప్రామాణికం రాష్ట్ర వనరులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందించాలనే తపనతో సీఎం జగన్ పనిచేస్తున్నారు. అర్హతే ప్రామాణికంగా వివక్షకు తావులేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాల ద్వారా పేదలకు లబ్ధి చేకూర్చుతున్నారు. కరోనా సమయంలో తిండిలేక అనేక రాష్ట్రాల్లో ప్రజలు చనిపోయారు. కానీ సీఎం వైఎస్ జగన్ పుణ్యమాని ఏపీలో అలాంటి పరిస్థితి రాలేదు. – కొలుసు పార్థసారథి, మాజీ మంత్రి సామాజిక న్యాయం నినాదం కాదు.. అది ఓ విధానం.. సామాజిక న్యాయం కేవలం నినాదం కాదు.. అమలు చేయాల్సిన విధానం అని స్పష్టం చేసి.. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు సీఎం వైఎస్ జగన్. పేదల పక్షాన సీఎం జగన్ నిలబడితే, చంద్రబాబు పెత్తందార్ల వైపు నిలబడ్డారు. పేదలు బాగుపడాలంటే జగనే మళ్లీ సీఎం కావాలి. పేదలంతా కలిసి పెత్తందార్లను ఎదుర్కోవడానికే ఈ యాత్ర చేపట్టాం. – జియావుద్దీన్, మాజీ ఎమ్మెల్యే 175 నియోజకవర్గాల్లో సామాజిక భేరి జగనన్న పాలన జనం మెచ్చిన పాలన. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సీఎం జగన్ సామాజిక న్యాయా న్ని, ధర్మాన్ని పాటిస్తున్నారు. మంత్రివర్గంలో 70 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. టీడీపీ హయాంలో బీసీ అంటే బిజినెస్ క్లాస్.. జగనన్న పాలనలో బీసీలను సమాజానికి బ్యాక్బోన్ క్లాస్గా మార్చారు. అలాంటి జగనన్న కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. గురు వారం æనుంచి 175 నియోజకవర్గాల్లో సామాజిక భేరి మోగించబోతున్నాం. పెత్తందార్ల కోటలను బద్ధలు కొట్టేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మంతా సంఘటితంగా ముందుకెళుతున్నాం. సీఎం జగన్ నాయకత్వాన్ని పటిష్టపరుస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి పేద లకు–పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధంలో చేయి చేయి కలిపి.. జగనన్నకు అండగా నిలుద్దాం. ని జం గెలవాలని యాత్ర చేపట్టిన భువనేశ్వరి నిజా లు చెప్పాలి. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికా రాన్ని దక్కించుకున్నప్పటి నుంచి 2019 వరకూ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు అనేక కుంభకో ణాలకు పాల్పడ్డారు. పాపం పండింది, అవినీతి బయటపడింది కాబట్టే రాజమండ్రి జైల్లో ఉన్నా రు. అందుకే భువనేశ్వరి నిజం గెలవాలని కాకుండా చంద్రబాబు పాప పరిహార యాత్ర చేయాలి. – జోగి రమేష్, గృహనిర్మాణ శాఖ మంత్రి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను బాబు ఓటు బ్యాంకుగానే చూశారు రాష్ట్ర జనాభాలో సుమారు 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలున్నారు. వారి అవసరాలను గుర్తించడం పాలకుల ప్రాథమిక కర్తవ్యం. ఆయా వర్గాలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే చూశారు. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం చంద్రబాబు ఎన్నడూ ఆలోచించలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల్లో వెలుగులొచ్చాయి. సంక్షేమాభివృద్ధి పథకాలతో వారి జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి. సామాజిక ఆవశ్యకతను నొక్కిచెప్పేందుకే ఈ యాత్రను చేపట్టాం. – హనుమంతు నాయక్, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు. పెత్తందారులను ఎదుర్కొనే యాత్ర ఇది.. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ చేసేది సామాజిక సాధికార యాత్ర అని ఆ పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పేదలందరూ కలిసి పెత్తందారులను ఎదుర్కొనే యాత్ర ఇది.. జగనన్న ప్రభుత్వంలో జరిగిన మంచిని, సాధికార న్యాయాన్ని తెలియజేసేందుకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుంచి మూడు ప్రాంతాల్లో సామాజిక సాధికార బస్సు యాత్ర చేస్తున్నట్లు వివరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక సాధికార యాత్ర ద్వారా వెనుకబడిన(వెన్నెముక) వర్గాల సాధికారత కోసం జగనన్న ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన మేలు, చేయబోతున్న మేలు గురించి తెలియజేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి మూడు దశల్లో బస్సు యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. మొదటి దశ ఈ నెల 26 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో 39 నియోజకవర్గాలను కవర్ చేయటమే లక్ష్యంగా యాత్ర సాగుతుందని తెలిపారు. బస్సు యాత్ర రాష్ట్రంలోని ఇచ్చాపురం(శ్రీకాకుళం జిల్లా), సింగనమల (అనంతపురం జిల్లా), తెనాలి(గుంటూరు జిల్లా)లో ప్రారంభమవుతుందని వివరించారు. ఆయా నియోజకవర్గానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వారితో మమేకమవుతూ యాత్ర సాగుతుందని చెప్పారు. సామాజిక న్యాయాన్ని, ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని స్పష్టం చేశారు. జగనన్న పాలనలో కేబినెట్ కూర్పు దగ్గర నుంచి 68 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత కలి్పంచారని తెలిపారు. స్పీకర్ స్థానం నుంచి మండలి చైర్మన్ దాకా ఇలా ఒకటి రెండు కాదు.. జనరల్ స్థానాలను సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు ఇచ్చి గౌరవించిన జగనన్నకు జేజేలు పలుకుతూ సామాజిక సాధికార యాత్రను కొనసాగించనున్నామని చెప్పారు. నిజం గెలవబట్టే చంద్రబాబు జైల్లో.. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడని, నారా భువనేశ్వరి కూడా నిజం గెలవాలని కోరుకుంటే బాబు జీవితంలో జైలు నుంచి బయ టకురాలేరని వైవీ అన్నారు. భువనేశ్వరి చేపడుతున్న నిజం గెలవాలి యాత్రను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అవినీతికి పాల్పడి చంద్రబాబు జైలుకెళ్లారు.. ఆ చెడ్డ పేరు కప్పిపుచ్చుకునేందుకు తెలివిగా నిజం గెలవాలని చంద్రబాబు సతీమణి యాత్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు కూడా తెలివైన వారేనన్నారు. సీఎం వైఎస్ జగన్పై టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మటం లేదన్నారు. బాబు అవినీతి చేశారు.. అందుకే జైలు కెళ్లారు అని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. -
విప్లవాన్ని వివరిద్దాం.. రేపటి నుంచి వైఎస్సార్సీపీ బస్సు యాత్ర
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ ‘సామాజిక సాధికార యాత్ర’ గురువారం ఉత్తరాంధ్రలో ఇచ్ఛాపురం, కోస్తాలో తెనాలి, రాయలసీమలోని శింగనమల నియోజకవర్గాల్లో ఒకేసారి ప్రారంభం కాబోతోంది. ఈ మూడు ప్రాంతాల్లోనూ రోజుకు ఒక్కో నియోజకవర్గం చొప్పున యాత్ర కొనసాగుతుంది. యాత్రలో భాగంగా ఆ నియోజకవర్గంలో సభనూ నిర్వహిస్తారు. అంటే రోజూ మూడు ప్రాంతాల్లో మూడు సభలు. స్థానిక ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త సారధ్యంలో ఈ యాత్ర జరుగుతుంది. రాష్ట్రంతోపాటు ఆ నియోజకవర్గంలో సంక్షేమాభివృద్ధి పథకాలు, పదవుల పంపకంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేసిన ప్రయోజనాన్ని ఈ యాత్ర ద్వారా ఆయా వర్గాలకు చెందిన మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు వివరిస్తారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమాభివృద్ధి పథకాలు, పదవుల పంపకంలో చంద్రబాబు చేసిన సామాజిక ద్రోహాన్ని.. టీడీపీ సర్కార్ అవినీతి, అక్రమాలు, దాషీ్టకాలను ప్రజలకు గుర్తు చేస్తారు. సీఎం వైఎస్ జగన్ పేదల పక్షాన నిలిస్తే.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియాతో జట్టుకట్టి పెత్తందారీ వ్యవస్థకు దన్నుగా ఎలా నిలుస్తున్నారన్నది చూపిస్తారు. పేదల పక్షాన నిలిచిన సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీని గెలిపించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరిస్తారు. వైఎస్సార్సీపీ గెలిచిన నాటి నుంచీ రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నాలుగు కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఈనెల 9న విజయవాడలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్రతినిధుల సభలో సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఆ నాలుగింట్లో.. గురువారం నుంచి డిసెంబరు 31 వరకు జరిగే ఈ యాత్ర ఒకటి. ఇదీ... సామాజిక న్యాయం అంటే సామాజిక న్యాయంలో వైఎస్ జగన్ దార్శనికతను ఇపుడు దేశం మొత్తం ప్రశంసిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంక్షేమ పథకాలతో ఆర్థికంగా చేయూతనిచ్చి పేదరికం నుంచి గట్టెక్కించడం ద్వారా ఆర్థిక సాధికారత.. అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి పథకాలతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్డడం ద్వారా విద్యా సాధికారత.. నామినేటెడ్ నుంచి కేబినెట్ వరకూ సింహభాగం పదవులు ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం ఇవ్వడం ద్వారా రాజకీయ సాధికారత.. సంక్షేమ పథకాల నుంచి పదవుల వరకూ మహిళలకు పెద్దపీట వేయడం ద్వారా మహిళా సాధికారతకు కృషి చేస్తుండటాన్ని సామాజిక వేత్తలూ ప్రశంసిస్తున్నారు. ► సామాజిక న్యాయమనేది తమ నినాదం కాదని, తమ విధానమని నిరూపిస్తున్న వైఎస్ జగన్... ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతాన్ని అమలు చేసి చూపించారు. ఇప్పటిదాకా 99.5 శాతం హామీలను అమలు చేసి... దేశ చరిత్రలోనే ఎన్నికల మేనిఫెస్టోకు కొత్త నిర్వచనం ఇచ్చారు. ► సంక్షేమ పథకాల కింద... ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇప్పటిదాకా రూ.2.38 లక్షల కోట్లను జమ చేశారు. ఇందులో 75 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేరాయి. నగదు బదిలీ కాకుండా ఇతర పథకాల ద్వారా రూ.2.33 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. ► నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు ధీటుగా అభివృద్ధి చేసిన సీఎం వైఎస్ జగన్.. పేద పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా ఇంగ్లీషు మీడియం భోదనను ప్రవేశపెట్టారు. అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు విద్యా సాధికారత సాధించడానికి మార్గం సుగమం చేశారు. ► వైఎస్సార్ ఆసరా, చేయూత వంటి పథకాల ద్వారా ఆర్థికంగా తోడ్పాటును అందించి.. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకూ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేసి మహిళా సాధికారతకు మార్గం వేశారు. రాజ్యాధికారంలో సింహభాగం వారికే... ► 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి.. 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్సభ స్థానాల్లో (88 శాతం) వైఎస్సార్సీపీ విజయ ఢంకా మోగించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్... తొలి మంత్రివర్గం నుంచే సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. 25 మందితో ఏర్పాటు చేసిన కేబినెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 మందికి (56 శాతం) స్థానం కల్పించారు. రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇచ్చారు. ► ఐదుగురు డెప్యూటీ సీఎంలను నియమిస్తే.. అందులో నలుగురిని (80 శాతం) ఆ వర్గాల నుంచే నియమించారు. ► శాసనసభ స్పీకర్గా బీసీ వర్గాలకు చెందిన తమ్మినేని సీతారం, శాసనమండలి ఛైర్మన్గా రాష్ట్ర చరిత్రలో తొలి సారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు, మండలి డిప్యూటీ ఛైర్పర్సన్గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంకు అవకాశమిచ్చారు. ► 2022, ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరణ ద్వారా 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో సామాజిక న్యాయం చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఏకంగా 17 మందికి (70 శాతం) మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ► టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాజ్యసభకు బీసీ వర్గానికి చెందిన ఒక్కరిని కూడా పంపించలేదు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే.. అందులో నలుగురు బీసీలను (50 శాతం) సీఎం వైఎస్ జగన్ రాజ్యసభకు పంపారు. ► ఇక శాసనమండలిలో వైఎస్సార్సీపీకి 43 మంది ఎమ్మెల్సీలు ఉంటే.. ఇందులో 29 మంది(68 శాతం) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే. 2014–19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీకి 48 ఎమ్మెల్సీ స్థానాలు దక్కితే.. అందులో కేవలం 18 పదవులు (37 శాతం) మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికిచ్చారు చంద్రబాబు. ఏమీ చెయ్యకుండా కూడా మీడియా బలంతో చెలామణి అయిన చంద్రబాబుకు అసలు సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కుందా? రాజ్యాధికారంలో.. పరిపాలనలో సింహభాగం వాటా ఇవ్వడం ద్వారా తన చిత్తశుద్ధితో సామాజిక న్యాయానికి కొత్త అర్థం చెప్పిన సీఎం వైఎస్ జగన్తో బాబుకు పోలికెక్కడ? స్థానిక సంస్థల్లోనూ సామాజిక సాధికారత.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ ఉత్తర్వులు జారీ చేస్తే.. దానిపై హైకోర్టులో టీడీపీ నేతలతో చంద్రబాబు కేసులు వేయించారు. దాంతో బీసీలకు రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గాయి. టీడీపీ కుట్రలు చేసిన రిజర్వేషన్లు తగ్గించినా.. పార్టీపరంగా 34 శాతం కంటే ఎక్కువే ఇస్తానని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఆ మేరకే స్థానిక సంస్థలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి సింహభాగం పదవులిచ్చారు. ► రాష్ట్రంలో 648 మండలాలకు ఎన్నికలు జరిగితే... 637 మండలాల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించింది. ఇందులో 237 మండల పరిషత్ అధ్యక్ష పదవులను బీసీలకు(38 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి ఎంపీపీ పదవుల్లో 67 శాతం ఇచ్చారు. ► 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో ఒక్క బీసీలకే 6 (46 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కలిపి ఏకంగా 9 జడ్పీ ఛైర్మన్ పదవులు(69 శాతం) ఇచ్చారు. ► రాష్ట్రంలో 14 మున్సిపల్ కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. 14 మేయర్ పదవుల్లో బీసీలకు ఏకంగా 9 పదవులు (64 శాతం) ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 14 కార్పొరేషన్ మేయర్ పదవులకుగానూ 12 పదవులు (86 శాతం) వారికే ఇచ్చారు. ► 87 మున్సిపాల్టీలలో ఎన్నికలు జరిగితే.. అందులో 84 మున్సిపాల్టీలలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఇందులో 44 మున్సిపల్ ఛైర్మన్ పదవులను బీసీలకు(53 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలవర్గాలకు కలిపి 58 మున్సిపల్ ఛైర్మన్ పదవులు(69 శాతం) ఇచ్చారు. చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు..: నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు పదవులిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఆ వర్గాలకు రిజర్వేషన్ చేస్తూ చట్టం చేయడం దేశంలో ఇదే తొలిసారి. ► 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లను నియమిస్తే... అందులో బీసీలకు 76 పదవులు (39 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కలిపి 117 పదవులు(60 శాతం) ఇచ్చారు. ► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్ పదవులలో 53 పదవులు (39శాతం) బీసీలకే ఇచ్చారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 137 పదవుల్లో 79 పదవులు(58 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. ► 137 ప్రభుత్వ కార్పొరేషన్ పదవులకు సంబంధించి... 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవులుంటే అందులో 201 పదవులు బీసీలకు(41 శాతం) ఇచ్చారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 484 పదవుల్లో 280 పదవులు(58 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. ► బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. వాటికి ఆ వర్గాల వారినే ఛైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్లలో ఆయా వర్గాలకు 684 డైరెక్టర్ పదవులూ ఇచ్చారు. ఆలయ బోర్టులు, ఆలయ ఛైర్మన్ పదవుల్లో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. దాదాపుగా 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503... అంటే సగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. ► రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిననాటి నుంచీ ఇప్పటిదాకా 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తే... అందులో గతన 53 నెలల్లో భర్తీ చేసినవే 2.07 లక్షలు. సగానికన్నా ఎక్కువైన ఈ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే 80 శాతం దక్కాయి. అదీ.. సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇస్తున్న విలువ. ఒకరేమో ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ ఆ వర్గాన్ని హేళన చేసే నాయకుడు. మరొకరేమో ఆ వర్గానికి ఉప ముఖ్యమంత్రి, శాసనమండలి ఛైర్మన్.. రాష్ట్ర హోంమంత్రి వంటి పదవులిచ్చి గౌరవించిన నేత. ఒకరేమో న్యాయం చేయాలని అభ్యర్ధించిన నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తరిస్తానంటూ.. మత్స్యకారులను తోలుతిస్తానంటూ బెదిరించిన నాయకుడు. మరొకరేమో కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకూ పదవుల్లో, సంక్షేమాభివృద్ధి పథకాల్లో సింహభాగం బీసీలకే ఇచ్చిన నేత. ఇదే... మౌలికంగా చంద్రబాబు నాయుడికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా. అసలు ఎస్సీలను హేళన చేసి, బీసీలను బెదిరించి తన సామాజిక వర్గానికే, తన లాబీయిస్టులకే రాజ్యసభ పదవుల్లో అగ్రభాగం కట్టబెట్టిన చంద్రబాబుకు.... అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీకి దక్కిన రాజ్యసభ పదవుల్లో 50 శాతాన్ని బీసీలకే ఇచ్చిన జగన్తో పోలికే లేదు. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు రాష్ట్రానికి వెన్నెముక అంటూ చాటిచెప్పిన జగన్కు దరిదాపుల్లో కూడా లేని నాయకుడు చంద్రబాబు. అలాంటి చంద్రబాబు సైతం తనకున్న మీడియా బలంతో అన్నివర్గాలకూ న్యాయం చేస్తున్నట్లుగా కొన్నాళ్లు చెలామణి కాగలిగారు. కాకపోతే రోజులు మారి.. ఎప్పటికప్పుడు జనాలకు నిజాలు తెలుస్తున్నాయి. ఇదిగో... ఇలా వాస్తవాలు వివరించే క్రమంలోనే గత 53 నెలలుగా సీఎం వైఎస్ జగన్ చేస్తున్న సామాజిక న్యాయాన్ని.. 2014–19 మధ్య చంద్రబాబు చేసిన సామాజిక ద్రోహాన్ని ప్రజల ముందు పెట్టడానికి ‘సామాజిక సాధికారత యాత్ర’ మొదలు కాబోతోంది. గురువారం నుంచి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఒకే సారి వైస్సార్ సీపీ ఈ బస్సుయాత్రకు శ్రీకారం చుడుతోంది. చంద్రబాబుకు ఎన్నికల ముందు మాత్రమే జనం కనిపిస్తారు. అందుకే ఆయన శంకుస్థాపనలు చేసినా, పదవులిచ్చినా, జీవోలిచ్చినా అన్నీ ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు మాత్రమే జరుగుతాయి. అది కూడా కొన్ని కాగితాలపైనే!!. 2014లో గెలిచిన చంద్రబాబు... 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రమే ఎస్టీకి తన కేబినెట్లో స్థానమిచ్చారు. గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసిందీ అప్పుడే. గత ఎన్నికలకు రెండునెలల ముందు వరకూ ముస్లింలకు సైతం చంద్రబాబు కేబినెట్లో స్థానం లేదు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రభుత్వం ఏర్పాటవుతూనే ఎస్టీలకు ఉపముఖ్యమంత్రి స్థానాన్నిచ్చారు. ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తిని సైతం ఉప ముఖ్యమంత్రిని చేయటంతో పాటు ముస్లిం మహిళను శాసనమండలి ఛైర్పర్సన్గా నియమించారు. సంక్షేమాభివృద్ధి పథకాల నుంచి కేబినెట్–నామినేటెడ్ వరకూ ఆ వర్గాలకు పెద్దపీట వేశారు. అంతేకాదు!! కోడలు మగ పిల్లాణ్ణి కంటానంటే అత్త వద్దంటుందా? అంటూ మహిళల పుట్టుకనే హేళన చేసింది చంద్రబాబయితే... హోంమంత్రిగా, శాసనమండలి ఛైర్పర్సన్గా మహిళలను నియమించడమే కాక కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకూ వారికి సింహభాగం పదవులిచ్చి, ఆసరా, చేయూత వంటి పథకాలతో ఆర్థికంగా తోడ్పాటునందిస్తున్నది వైఎస్ జగన్. సామాజిక న్యాయంలో వీళ్లకసలు పోలిక ఉందా? -
పవన్.. నీకంటే ఊసరవెల్లి నయం
శ్రీరంగరాజపురం(చిత్తూరు జిల్లా): ‘పవన్కళ్యాణ్.. నీకంటే ఊసరవెల్లి నయం’ అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. మండలంలోని ములురు గ్రామంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఊసరవెల్లి తన స్వభావంతో ఆత్మరక్షణ కోసం రంగు మార్చుకుంటుందని తెలిపారు. జనసేన అధినేత పవన్కళ్యాణ్ మాత్రం టీడీపీ ఎంత ఎక్కువ ప్యాకేజీ ఇస్తుందో.. అంత ఎక్కువగా రంగులు మారుస్తాడని విమర్శించారు. చంద్రబాబు పాపపు సొమ్ముతో లాయర్లు పండుగ చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాజుల సొమ్ము రాళ్ల పాలు.. అన్న చందంగా పరిస్థితి తయారైందన్నారు. -
Fact Check: అప్పులపై తప్పుడు కథనం
సాక్షి, అమరావతి: ‘తప్పులెన్ను వాడు తన తప్పులెరుగడు’ అన్నది గతం. ఈనాడు రామోజీరావు విషయంలో ‘ఒప్పులన్నింటినీ తప్పులనే వాడు తన తప్పులెరుగడు’ అంటూ అన్వయించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహరహం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం శ్రమిస్తూనే అభివృద్ధికీ బాటలు వేస్తున్నారు. అందులో భాగంగా కొంతమేర అప్పులూ తెస్తున్నారు. ఈ అప్పులపై ఈనాడులో తప్పుడు రాతలు రాస్తూ.. రామోజీ గత ప్రభుత్వాలు తెచ్చిన అప్పులను, వాటిని అవి ఏ విధంగా పక్కదారి పట్టించాయన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. ఏడాదిలో చేయాల్సిన అప్పులు ఐదు నెలల్లోనే అంటూ ఓ దిగజారుడు కథనాన్ని ఈనాడులో అచ్చేశారు. ఇదే రామోజీకి గత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే చివరి ఏడాది చేసిన భారీ అప్పులు, వాటిని పక్కదారి పట్టించిన వైనం కనిపించలేదు. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు చేయాల్సిన అప్పు కూడా చంద్రబాబే చేశారని కాగ్ గణాంకాలు స్పష్టంగా చెప్పినా రామోజీ చూడనట్లే ఉన్నారు. ఎందుకంటే అప్పుడు ఆయన ఇష్టుడైన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎప్పుడూ చంద్రబాబే సీఎంగా ఉండాలనే కాంక్ష బలీయంగా ఉన్న రామోజీకి ఆ సీట్లో వైఎస్ జగన్ ఉండటం ససేమిరా ఓర్చుకోలేరు. అందుకే అవే కాగ్ గణాంకాల్లో కేపిటల్ వ్యయం, సామాజిక రంగ వ్యయం ఉన్నా సరే వాటిని మరుగున పరిచేసి కేవలం అప్పులపైనే కథనం అల్లారు. అదేదో మహా తప్పిదమైనట్లు రోత రాతలు రాశారు. ఎఫ్ఆర్బీఎం చట్టం నిబంధనలకు లోబడి, కేంద్ర అనుమతుల మేరకే అప్పులు చేసినప్పటికీ ఈ రుణాలపై రామోజీ పదే పదే విష ప్రచారానికి దిగుతున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం 2018–19 బడ్జెట్లో రూ24,205 కోట్లు అప్పు చేస్తామని చెప్పి ఏకంగా రూ.34,751 కోట్లు అప్పు చేసింది. అంటే బడ్జెట్లో చెప్పిన దానికన్నా రూ.9,546 కోట్లు ఎక్కువగా (139 శాతం అదనంగా) అప్పు చేసినట్లు కాగ్ గణాంకాలే తెలిపాయి. ఇది తప్పు అని రామోజీకి అనిపించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో చెప్పిన అప్పుల్లో ఆగస్టు నెలాఖరు వరకు 72.28 శాతమే అప్పు చేసింది. అదీ నిబంధనల మేరకే. అంతే కాదు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం ఐదు నెలల్లోనే సామాజిక రంగంపై ఏకంగా రూ.68,012 కోట్లు వ్యయం చేసినట్లు కాగ్ స్పష్టంగా లెక్కగట్టి చెప్పింది. గత చంద్రబాబు ప్రభుత్వం సహా దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వమూ సామాజిక రంగంపై ఇంతగా ఎప్పుడూ ఖర్చు చేయలేదని కాగ్ తేటతెల్లం చేసింది. సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, తాగునీటి రంగాలపై చేసే ఖర్చు. ప్రజలకు అత్యంత అవసరమైన రంగాలివి. ప్రజా సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న దృఢ సంకల్పానికి నిదర్శనమిది. మరో పక్క బడ్జెట్లో కేపిటల్ వ్యయానికి చేసిన కేటాయింపుల్లో కేవలం ఐదు నెలల్లోనే.. అంటే ఆగస్టు వరకు 40.79 శాతం ఖర్చు చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని కాగ్ వెల్లడించింది. ప్రజా సంక్షేమాన్ని, కేపిటల్ వ్యయాన్ని వక్రీకరిస్తూ తప్పుడు సమాచారం ఇచ్చే స్థాయికి ఈనాడు రామోజీ దిగజారారు. బాబు తెచ్చిన అప్పులు బండెడు చంద్రబాబు దిగిపోయే ఆర్థిక సంవత్సరంలో తరువాతి ప్రభుత్వానికి కూడా అప్పు పుట్టనంతగా ముందుగానే రుణాలు తెచ్చేసినా రామోజీ ఒక ముక్క కూడా రాయలేదు. చంద్రబాబు ప్రభుత్వం అదనంగా చేసిన అప్పులను తరువాతి సంవత్సరాల్లో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అప్పుల నుంచి తగ్గిస్తామని కేంద్రం హెచ్చరించినా రామోజీకి తప్పనిపించలేదు. కేవలం వైఎస్ జగన్ సీఎంగా ఉన్నారని, ఆయన ప్రజా సంక్షేమానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారన్న దుగ్ధే రామోజీలో కనిపిస్తోంది. -
పాజిటివ్ ఓటుతోనే మళ్లీ పగ్గాలు..
సాక్షి, అమరావతి: రానున్న ఎన్నికల్లో ప్రజలు తమ పాజిటివ్ ఓటుతోనే మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టనున్నారని ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ధీమా వ్యక్తంచేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గత నాలుగేళ్ల నాలుగు నెలల కాలంలో అమలుచేసిన పాలన సంస్కరణలు, సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన, అవినీతి రహిత కార్యక్రమాలే తమ పా ర్టీకి వజ్రాయుధాలన్నారు. గత ఎన్నికలకు ముందు చెప్పినవి చిత్తశుద్ధితో అమలుచేశామని, దీంతో ప్రజలు ప్రభుత్వంపట్ల పూర్తి సంతృప్తిని కనబరుస్తున్నారని చెప్పారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘సీం వైఎస్ జగన్ ఎన్నికల కోసం పనిచేసే మనిషి కాదు. ప్రజలకు వీలైనంత ఎక్కువ మంచి చేసి, ప్రజల మనసులో స్థానం సంపాదించుకోవాలన్న ఆశయంతో పనిచేస్తున్న వ్యక్తి. రాష్ట్రంలో 1.62 కోట్ల కుటుంబాల ఇళ్లకు వలంటీర్లను పంపి, అందరి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని, ఆ ఊళ్లో డాక్టర్ల క్యాంపులు పెట్టి ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా వైద్యసేవలు అందిస్తున్నారంటే రాష్ట్ర ప్రజలపట్ల సీఎం చిత్తశుద్ధి తెలిసిపోతోంది. ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన కార్యక్రమాలతో ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి కుటుంబం జగన్మోహన్రెడ్డిని తమ సొంత కుటుంబ సభ్యుడిగా భావించే పరిస్థితి ఉంది. మరోవైపు.. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు అడ్డుపడడమే పనిగా పనిచేస్తున్నాయి’అని అన్నారు. దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు.. విజయవాడ దుర్గగుడితో పాటు రాష్ట్రంలో పలు ప్రముఖ ఆలయాల్లో దసరా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయి. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. రాష్ట్రంలో కొన్ని ఆలయాల స్థాయిని పెంచడం ద్వారా దేవదాయ శాఖలో అదనంగా 14 డిప్యూటీ కమిషనర్లు, నలుగురు అసిస్టెంట్ కమిషనర్ల పోస్టులు అవసరమవుతాయి. పదోన్నతుల ద్వారా ఇప్పటికే ఉన్న సిబ్బందికి ఈ పోస్టుల భర్తీలో ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే, బ్యాంకుల్లో ప్రస్తుతం నగదు డిపాజిట్లకు ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్నందున.. గతంలో తక్కువ వడ్డీ రేటుకు డిపాజిట్లు చేసిన చోట సమీక్షించి, అవసరమైతే పాత డిపాజిట్లను రద్దుచేసి కొత్తగా అదనపు వడ్డీ రేటుకు డిపాజిట్ చేసే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశించాం. -
విప్లవాత్మక పరిపాలన
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా విప్లవాత్మక మార్పులతో 52 నెలలుగా సుపరిపాలన అందిస్తున్నామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. గత పాలకులకు భిన్నంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన 99 శాతం వాగ్దానాలను అమలు చేయడం ద్వారా జగన్ చెప్పాడంటే చేస్తాడని.. మాట నిలబెట్టుకుంటాడని.. కష్టమైన, నష్టమైనా అండగా ఉంటాడనే మంచి పేరును దేవుడి దయతో తెచ్చుకోగలిగామన్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు మన ప్రభుత్వం చేసిన మంచే మన ధైర్యం.. మన బలం.. మన ఆత్మవిశ్వాసమని పార్టీ ప్రతినిధులకు ఉద్బోధించారు. సోమవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్రతినిధుల సదస్సులో గత 52 నెలలుగా అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు చేసిన మంచిని వివరిస్తూ సీఎం జగన్ సుదీర్ఘంగా ప్రసంగించారు. మనం చేసిన మంచితో ప్రతి ఇంట్లో.. ప్రతి గ్రామంలో.. ప్రతి నియోజకవర్గంలో మార్పులు కళ్లెదుటే కనిపిస్తున్నప్పుడు 175కు 175 శాసనసభ స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా అడుగులు వేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులను సమన్వయం చేసుకుంటూ ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతి ఇంటికీ వెళ్లి మనం చేసిన మంచిని వివరిస్తూ ప్రతిపక్షాల తీరును ఎండగట్టి అక్కచెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటూ అడుగులు ముందుకు వేయించాల్సిన బాధ్యత మీ భుజస్కందాలపై పెడుతున్నానని మార్గనిర్దేశం చేశారు. బహుశా మార్చి, ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. టీడీపీ, జనసేన సహా విపక్షాల తీరుపై సీఎం జగన్ పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ ప్రజలతో మరింతగా మమేకమయ్యేందుకు చేపట్టనున్న ఎనిమిది కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ప్రకటించారు. సదస్సులో సీఎం జగన్ ఏమన్నారంటే.. అధికారం మనకు బాధ్యత మాత్రమే.. దేవుడి దయతో ప్రజలిచ్చిన అధికారం అన్నది మనకి బాధ్యతను మాత్రమే నేరి్పందని తెలియచేస్తూ వారికి తొలి సేవకుడిగా మీ ముందు మాట్లాడుతున్నా. అలా బాధ్యతగా వ్యవహరించాం కాబట్టే ఈ 52 నెలల్లో పౌరసేవల డెలివరీ విధానం, డీబీటీ ద్వారా విప్లవాత్మక మార్పులు తెచ్చాం. మూడు ప్రాంతాల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మూడు రాజధానులను ప్రకటించే నిర్ణయం తీసుకున్నాం. 26 జిల్లాలను ఏర్పాటు చేశాం. ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్ధాయిలో సచివాలయ వ్యవస్ధ, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ వ్యవస్ధను తేగలిగాం. ప్రభుత్వ పథకాలను అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ అందించగలుగుతామా? ఇది సాధ్యమేనా? అనుకునే పరిస్థితుల నుంచి ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేకుండా పారదర్శకంగా అందించే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగలిగాం. డీబీటీలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు 75 శాతానికిపైనే ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు మేనిఫెస్టో గురించి చెబుతారు. ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో వేసిన గత పాలకులకు భిన్నంగా మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం వాగ్దానాలు అమలు చేయడం ద్వారా జగన్ చెప్పాడంటే చేస్తాడని, మాట నిలబెట్టుకుంటాడని, కష్టమైనా నష్టమైనా అండగా ఉంటాడనే మంచి పేరును దేవుడి దయతో నాలుగున్నరేళ్ల పాలనలో తెచ్చుకోగలిగాం. అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలను గుండెల నిండా ప్రేమతో అభిమానించాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, బీసీలు, మైనార్టీలంటూ.. ప్రతి మాటకు ముందు నా అనే మాటకు అర్ధం చెబుతూ రూ.2.35 లక్షల కోట్లను డీబీటీ ద్వారా బటన్ నొక్కి నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాం. నా అనే మాటకు అర్ధం చెబుతూ నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు 75 శాతానికి పైచిలుకు ఇవ్వగలిగాం. 80 శాతానికిపైగా ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రం మొత్తమ్మీద ఇప్పటివరకూ 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే కేవలం ఈ నాలుగున్నరేళ్లలో మరో 2.07 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా మీ బిడ్డ ప్రభుత్వం ఇవ్వగలిగింది. ఇందులో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏకంగా 80 శాతం పైచిలుకు ఉద్యోగాలను ఇవ్వగలిగాం. 31 లక్షల ఇళ్ల పట్టాలను నా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాం. 22 లక్షల ఇళ్లు ఈ రోజు వారి పేరుతో వేగంగా కడుతున్నాం. ఇందులో అత్యధికంగా 80 శాతం పైచిలుకు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాం. సామాజిక న్యాయం అనే పదానికి అర్ధం చెబుతూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ కాంట్రాక్టుల్లో ఏకంగా 50 శాతం నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చట్టం చేసి మరీ ఇవ్వగలిగాం. పేదలకు తోడుగా నిలబడ్డాం.. విద్య, వైద్య వ్యవసాయ రంగాలు బాగుంటేనే మారుమూల పల్లెల్లో పేద కుటుంబాలకు మంచి జరుగుతుందని నమ్మి ఈ మూడు రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పేదరికం పోవాలని, పేదరికంలో ఉన్నవాళ్లు పైకి రావాలని, పేదరికం అడ్డు రాకూడదని ఈ మూడు స్తంభాలను బలపర్చాం. రైతులు, రైతు కూలీలు, మహిళలకు తోడుగా నిలిచాం. నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రాంతాలవారీగా, సామాజిక వర్గాల వారీగా గుర్తించిన ప్రతి సమస్యకూ ఈ 52 నెలల కాలంలో పరిష్కారం చూపగలిగాం. నా సేనానులు.. దళపతులు ఈ రోజు ఇక్కడికి వచ్చిన పార్టీ జిల్లా అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, జేసీఎస్ కో ఆర్డినేటర్లు, నియోజకవర్గాల పరిశీలకులు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, ఏఎంసీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నేతలు, జెడ్పీటీసీలు,ఎంపీపీలు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, మున్సిపల్ చైర్పర్సన్లు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, కార్పొరేటర్లు.. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ గుర్తు మీద ఎన్నికైన మండలం, ఆపై స్థాయిలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు, వారితో పాటు సమావేశానికి వచ్చిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నా మంత్రిమండలి సహచరులందరికీ మీ తమ్ముడిగా, అన్నగా నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నా. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ రెండు మెట్లు ఎదిగి మరో రెండు మెట్లు ఎదగడానికి సిద్ధంగా ఉన్న ప్రజాసేవకులు, నా సేనానులే. ఇక్కడకు రాలేని నా కుటుంబ సభ్యులైన ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు అందరూ నా దళపతులే. జనవరి 1 నుంచి మరో నాలుగు కార్యక్రమాలు అక్టోబరు 25 నుంచి మొదలయ్యే నాలుగు కార్యక్రమాలు జనవరి 15 వరకు జరుగుతాయి. అవే కాకుండా జనవరి 1 నుంచి మరో నాలుగు కార్యక్రమాలు కూడా మొదలవుతాయి. జనవరి 1 నుంచి పెన్షన్ పెంపు.. నా అవ్వాతాతలకు, నా వితంతు అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ రూ.3,000 వరకూ పెంచుకుంటూ పోతామని చెప్పిన పెన్షన్ పెంపు కార్యక్రమానికి జనవరి 1న శ్రీకారం చుడతాం. ఈ కార్యక్రమం జనవరి 10వ తారీఖు వరకు 10 రోజుల పాటు జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తే ఇవాళ మీ బిడ్డ హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లిస్తున్నాడన్న విషయాన్ని చెప్పాలి. మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు పెన్షన్ల ఖర్చు కేవలం రూ.400 కోట్లు కాగా ఈ రోజు మీ బిడ్డ చిరునవ్వుతో భరిస్తున్న భారం నెలకు అక్షరాలా రూ.2,000 కోట్లు అని వివరించాలి. జనవరి 10 నుంచి వైఎస్సార్ చేయూత జనవరి 10 నుంచి రెండో కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత మొదలవుతుంది. జనవరి 10 నుంచి జనవరి 20 వరకు ప్రతి గ్రామంలోనూ జరుగుతుంది. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ద్వారా ఇప్పటికే మూడు దఫాల్లో రూ.14,129 కోట్లు ఇచ్చాం. జనవరిలో ఇవ్వబోయేది కూడా కలుపుకొంటే ఈ ఒక్క కార్యక్రమానికే ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇచ్చినట్లవుతుంది. అంతే కాకుండా వారికి బ్యాంకు రుణాలతో తోడ్పాటు అందిస్తున్నాం. అక్కచెల్లెమ్మలు విజయగాధలను అందరికీ తెలియచేసే ఈ పండుగ వాతావరణంలో మీరందరూ భాగస్వాములై వారి ఆశీస్సులు తీసుకోవాలి. జనవరి 20 నుంచి వైఎస్సార్ ఆసరా.. జనవరి 20 నుంచి 30వతేదీ వరకు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం చివరి విడత నిధుల్ని చెల్లిస్తూ జగనన్న మాట నిలబెట్టుకుంటున్నాడని చెప్పాలి. నాలుగు దఫాలుగా నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటానని చెప్పా. మన ప్రభుత్వం రాకమునుపు పొదుపు సంఘాల ఎన్పీఏలు, అవుట్ స్టాండింగ్లు 18 శాతం కాగా ఈరోజు కేవలం 0.3 శాతం మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే మూడు దఫాలుగా ఆసరా కార్యక్రమం ద్వారా రూ.19,178 కోట్లు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టాం. చివరి విడతగా మరో రూ.6500 కోట్లు నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం జనవరి 20 నుంచి 30 వరకు ఆసరా ద్వారా చెల్లించి తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. కేవలం వైఎస్ఆర్ ఆసరా ద్వారానే దాదాపు రూ.26 వేల కోట్లు వారి చేతిలో పెట్టాం. సున్నావడ్డీ ద్వారా మరో రూ.5వేల కోట్లు ఇచ్చాం. ఫిబ్రవరి: మళ్లీ జగనన్ననే తెచ్చుకుందాం ఇక ఫిబ్రవరిలో మళ్లీ జగనన్ననే తెచ్చుకుందాం కార్యక్రమాన్ని చేపట్టాలి. ఇది జగనన్న పంపించిన మేనిఫెస్టో అని చెబుతూ ప్రతి ఇంటికీ తీసుకుని వెళ్లే కార్యక్రమం చేస్తాం. ఫిబ్రవరిలో ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మార్చిలో ఎన్నికలకు సన్నద్ధం కావాలి కాబట్టి మనం చేసిన మంచిని గ్రామ గ్రామాన, ఇంటింటా అందరికీ తెలియజేసేలా, పర్యవేక్షించే బాధ్యతను మీ భుజస్కంధాలపై మోపుతున్నాం. మీలో ప్రతి ఒక్కరూ ఇక్కడ తెలుసుకున్న ప్రతి అంశంపైన గ్రామస్ధాయిలో అవగాహన కలిగించాలి. ఎన్నికల తర్వాతా.. జనంలోనే మన మాదిరిగా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా నిరంతరం జనంలో ఉన్న పార్టీ దేశంలో మరొకటి లేదని సగర్వంగా తెలియజేస్తున్నా. కోవిడ్ సమయంలో ఆదాయాలు తగ్గినా కూడా మాటకు కట్టుబడి ప్రజలకు మంచి చేశాం. మన బలం మాట నిలబెట్టుకోవడం. మన బలం విశ్వసనీయత అన్న పదానికి నిజమైన అర్ధం చెప్పడం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాలకు నిండు మనసుతో చేసిన మంచి మన బలం. 87 శాతం పైచిలుకు ఇళ్లల్లో మనం చేసిన మంచే కనిపిస్తుంది. నాలుగున్నరేళ్లలో మనం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో కళ్లెదుటే స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు మరి వై నాట్ 175? మనమంటే గిట్టని వారు ఎన్ని చెబుతున్నా అది కచ్చితంగా సాధ్యమే. ఇక మరింతగా ప్రజల్లోకి.. ఇప్పుడు అక్టోబరులో ఉన్నాం. బహుశా ఎన్నికలు మార్చి, ఏప్రిల్లో జరుగుతాయి. ఇన్ని అడుగులు మనం వేశాం. రాబోయే నెలల్లో వేసే అడుగుల గురించి మీ అందరితో నా ఆలోచనలను ఇవాళ పంచుకుంటా. వాటిని మీరు గ్రామస్ధాయిలోకి తీసుకెళ్లి కచ్చితంగా, బాగా అమలయ్యేలా మీరు పర్యవేక్షించాలి. ఈ బాధ్యతను మీరు తీసుకోవాలి. గ్రామ స్ధాయిలో సమావేశాలను నిర్వహించి గొప్పగా అడుగులు పడేలా చర్యలు తీసుకోవాలి. జగనన్న ఆరోగ్య సురక్ష.. నాలుగు కార్యక్రమాల్లో ఒకటి.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. ఇది ఇప్పటికే జరుగుతోంది. మీరు మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మీవల్ల ప్రజలకు మరింత ఉపయోగం ఈ కార్యక్రమం ద్వారా జరగాలి. గత నెల 30న మొదలుపెట్టిన ఈ కార్యక్రమం నవంబరు 10 వరకు కొనసాగుతుంది. ప్రివెంటివ్ కేర్లో దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అడుగులు వేస్తున్నాం. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా సచివాలయాల పరిధిలో 15 వేల క్యాంపులను అర్బన్, రూరల్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం. మొత్తంగా 1.60 కోట్ల ఇళ్లను కవర్ చేస్తున్నాం. ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటిని మ్యాపింగ్ చేస్తున్నాం. ఉచిత పరీక్షలకు శ్రీకారం చుట్టాం. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటినీ జల్లెడ పడుతున్నాం. ఆ ఇంట్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వారిని చేయిపట్టుకుని నడిపించడమే కాకుండా అన్ని రకాలుగా తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తున్నాం. మొత్తం 5 దశలలో నిర్వహిస్తున్నాం. ఐదో దశ కీలకం. మీరు ఎక్కువగా నిమగ్నం కావాల్సిన దశ ఇదే. ఇక మీదట ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియగా జరుగుతుంది. గ్రామాల్లో ప్రతి 6 నెలలకొకమారు ఈ క్యాంపు జరుగుతుంది. ‘‘వై ఏపీ నీడ్స్ జగన్..’’ ఇక రెండో కార్యక్రమం.. ‘‘వై ఏపీ నీడ్స్ జగన్’’. ప్రజలందరి ఆశీస్సులతో వారికి మరింత సేవ చేయడానికి, మరింత మంచి చేయడానికి కొనసాగాల్సిన అవసరాన్ని వివరించే కార్యక్రమమే ఇది. ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలని వివరిస్తూ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమం నవంబరు 1 తేదీ నుంచి మొదలవుతుంది. డిసెంబరు 10 వరకు దాదాపు 40 రోజులపాటు జరుగుతుంది. ఇందులో రెండు ముఖ్యమైన దశలుంటాయి. మొదటిది మన గ్రామాల్లోని సచివాలయాలను సందర్శించడం. రెండో దశగా రాష్ట్రంలో ఉన్న 1.60 కోట్ల ఇళ్లకు, ప్రతి గడపకూ వెళ్లేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. గ్రామంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఎంతమందికి లబ్ధి జరిగింది? వీటికి సంబంధించిన బోర్డుల ఆవిష్కరణ కార్యక్రమంలో మీరంతా పాల్గొనాలి. ఆ తర్వాత గ్రామంలో పార్టీ జెండా ఎగరవేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. స్ధానిక పెద్దల ఇంటికి వెళ్లి వారి ఆశీస్సులు పొందాలి. ఈ 52 నెలల కాలంలో గ్రామం నుంచి రాజధానుల వరకు మన ప్రభుత్వం ఎన్నెన్ని మార్పులు తెచ్చిందో ఇటీవల స్వాతంత్ర దినోత్సవం రోజు నా ప్రసంగంలో సుదీర్ఘంగా వివరించా. అందులో ప్రతి అంశాన్ని మండలస్ధాయి నాయకత్వం అర్ధం చేసుకోవాలి. గ్రామ స్ధాయి నాయకత్వానికే కాకుండా పెద్దలందరికీ వివరించే కార్యక్రమం జరగాలి. సచివాలయ కన్వీనర్లు, వలంటీర్లు, గృహ సారధులు ప్రతి ఇంటినీ, ప్రతి గడపనూ విధిగా సందర్శించాలి. 99 శాతం వాగ్ధానాలను పూర్తి చేసిన విషయాన్ని మేనిఫెస్టో చూపిస్తూ వివరించాలి. అదే సమయంలో మన సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు 2014లో గత ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టోను కూడా చూపించాలి. ప్రతి వాగ్ధానాన్ని వాళ్లు ఎలా ఎగ్గొట్టారో, ప్రజలను ఎలా మోసం చేశారో వివరించాలి. ఆ మోసాల గురించి ప్రతి ఇంట్లో టైం తీసుకుని వినయంగా, సుదీర్ఘంగా చెప్పే కార్యక్రమం చేయాలి. బస్సు యాత్రలు.. మూడో కార్యక్రమంగా బస్సు యాత్రలు అక్టోబరు 25వ తేదీన మొదలవుతాయి. డిసెంబరు 31 వరకు దాదాపు 60 రోజుల పైచిలుకు జరిగే కార్యక్రమమిది. రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు జరుగుతాయి. ఒక్కో టీమ్లో పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సీనియర్ నాయకులంతా ఉంటారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మీటింగ్లు ఆ నియోజకవర్గంలో జరుగుతాయి. రోజూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు మీటింగ్లు జరుగుతాయి. ఒక్కో రోజు ఆ ప్రాంతంలోని అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి మీటింగ్ పెట్టి ప్రభుత్వం చేసిన మంచి గురించి, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, మారిన మన ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రుల గురించి, మారిన మన వ్యవసాయం గురించి, జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తూ స్ధానికంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రానికి మూడు ప్రాంతాల్లో మూడు పబ్లిక్ మీటింగ్లు, బస్సు పైనుంచే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభకు స్ధానిక ఎమ్మెల్యే లేదా అసెంబ్లీ కన్వీనర్ అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా 60 రోజుల పాటు ప్రతిరోజూ మూడు ప్రాంతాల్లో మూడు మీటింగ్లు ఉంటాయి. మీరంతా ఈ బస్సు యాత్ర కార్యక్రమంలో పాల్గొని మమేకం కావాలి. ఇది మామూలు బస్సు యాత్ర కాదు. ఒక సామాజిక న్యాయ యాత్ర. పేదవాడికి జరిగిన మంచిని వివరించే యాత్ర. 60 రోజుల్లో మొత్తం 175 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు జరుగుతాయి. ఆడుదాం ఆంధ్రా.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత నాలుగో కార్యక్రమంగా డిసెంబర్ 11 నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ మొదలవుతుంది. ఇది డిసెంబర్ 11 నుంచి సంక్రాంతి వరకు అంటే జనవరి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించే క్రీడా సంబరం. ఆడుదాం ఆంధ్రా ద్వారా నైపుణ్యం ఉన్నవారిని గ్రామస్ధాయి నుంచి గుర్తించి ప్రోత్సహించడం ప్రభుత్వ ఉద్దేశం. భారతదేశ టీమ్లో వైనాట్ ఆంధ్రప్రదేశ్? అనే రీతిలో కార్యక్రమం జరగాలి. ఈ కార్యక్రమం 45 రోజుల పాటు జరుగుతుంది. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి మొదలై మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్ధాయిలో ఈ క్రీడా సంబరాలు జరుగుతాయి. మన గ్రామంలో మరుగునపడి ఉన్న మన పిల్లల టాలెంట్ను దేశానికే పరిచయం చేసే కార్యక్రమం ఇది. ఇక నుంచి ఈ కార్యక్రమం ఏటా జరుగుతుంది. -
వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం: లక్ష్యం.. క్లీన్ స్వీప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా సోమవారం విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జ్లు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షుల నుంచి జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షుల వరకు 8 వేల మందికిపైగా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. గత 53 నెలలుగా సుపరిపాలన, సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రతి ఇంటికీ, గ్రామానికీ, నియోజకవర్గానికీ, జిల్లాకు, రాష్ట్రానికీ చేసిన మంచిని మరింత ప్రభావవంతంగా వివరించడం.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న ఎక్కడికక్కడ తిప్పికొట్టడంపై ప్రతినిధులకు సీఎం వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు – పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం సమగ్రాభివృద్ధి దిశగా పరుగులెత్తిస్తున్న తీరును కళ్లకు కట్టినట్లుగా వివరించి.. ప్రగతిపథంలో రాష్ట్రం దూసుకెళ్లాలంటే మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాలని సూచించనున్నారు. ఇందుకు ‘రాష్ట్రానికి జగనే కావాలి’ (వై ఏపీ నీడ్స్ జగన్) కార్యక్రమాన్ని చేపట్టాల్సిన తీరుపై ప్రతినిధులకు మార్గ నిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులు సీఎం సందేశాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్తారు. దేశ చరిత్రలోనే కొత్త రికార్డు సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ స్థానాలు, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తొలి ఏడాదే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేసి మేనిఫెస్టోకు సిసలైన నిర్వచనం ఇచ్చారు. ఇప్పటికే 99.5 శాతం హామీలు అమలు చేశా>రు. గత 53 నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రమాణికంగా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.4.69 లక్షల కోట్ల ప్రయోజనం పేదలకు చేకూర్చారు. దేశ చరిత్రలో ఎన్నడూ ఈ స్థాయిలో పేదలకు లబ్ధి చేకూర్చిన దాఖలాలు లేవు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. వార్డు, గ్రామ సచివాలయాలు, జిల్లాల పునర్విభజన ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి.. ప్రజల ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారు. పోర్టులు, షిప్పింగ్ యార్డులు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేశారు. దాంతో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్తోంది. తద్వారా సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీకి ప్రజల్లో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం జరిగిన పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాలు సాధించడంతో పాటు తిరుపతి లోక్సభ, బద్వేలు, ఆత్మకూరు శాసనభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో విజయభేరి మోగించడం అందుకు నిదర్శనం. నిత్యం ప్రజలతో మమేకం అధికారంలోకి వచ్చాక అనునిత్యం ప్రజలతో సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు, ప్రజాప్రతినిధులు మేమకమవుతున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా చేసిన మంచిని ప్రతి ఇంటికీ వివరించడానికి 2022 మే 11న చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంటికీ సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా చేసిన మేలును వివరించి.. ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టడానికి ఈ ఏడాది ఏప్రిల్ 7 నుంచి 29 వరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో 1.45 కోట్ల కుటుంబాలతో వైఎస్సార్సీపీ శ్రేణులు మమేకమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘మెగా పీపుల్స్ సర్వే’లో 1.16 కోట్ల కుటుంబాల ప్రజలు అంటే 80 శాతం మంది ప్రభుత్వానికి మద్దతు ప్రకటించి.. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ నినదించారు. ఇటీవల ప్రముఖ జాతీయ ఛానల్ టైమ్స్ నౌ నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 25కు 25 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం తథ్యమని తేలడమే అందుకు నిదర్శనం. ప్రజల్లో అత్యంత సానుకూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సమన్వయంతో పనిచేస్తే 175కు 175 స్థానాల్లో విజయం సాధించడం సాధ్యమేనని పార్టీ ప్రతినిధులకు సీఎం వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. ఎన్నికలకు సమాయత్తం : సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసే క్రమంలో సోమవారం పార్టీ ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నాలుగున్నరేళ్లలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడం.. ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని ఎక్కడికక్కడ సమర్థవంతంగా తిప్పికొట్టి.. ప్రజల ఆశీర్వాదం కోరే దిశగా శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారని వివరించారు. విజయవాడలో ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న పార్టీ ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశ ఏర్పాట్లను ఆదివారం ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పార్టీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి, పార్టీ నేతలు చల్లా మధుసూధనరెడ్డి, పుత్తా ప్రతాపరెడ్డి తదితరులతో కలిసి పరిశీలించారు. సమావేశానికి హాజరయ్యే ప్రతినిధులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయలని సూచించారు. భద్రత ఏర్పాట్ల గురించి విజయవాడ పోలీస్ కమీషనర్ కాంతిరాణా టాటా వివరించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనసాగడం ఐదుకోట్ల మంది ప్రజలకు చారిత్రక అవసరం అన్నారు. అవినీతి పరుడైన చంద్రబాబు ప్రజల కోసం పోరాటం చేసి జైలుకు వెళ్లినట్లుగా టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం చేసుకుంటుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల సభకు హాజరయ్యే ఆహ్వానితులు సకాలంలో సభ ప్రాంగణానికి చేరుకోవాలని ఆ పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఆదివారం ఆయన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సోమవారం ఉదయం టిఫిన్తో పాటు మధ్యాహ్నం మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, రొయ్యల కూర, పీతల వేపుడు, రసం, కుండ పెరుగు.. తదితర 30 రకాల వంటకాలతో పసందైన భోజనం అందిస్తామన్నారు. ఆహ్వానితులు ఉదయం 8.30 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకోవాలన్నారు. పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారని, పోలీసులు స్టేడియం లోపల, బయట కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారని చెప్పారు. -
పెడనలో అల్లర్లకు పవన్ కుట్ర
సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా పెడనలో జరగబోయే వారాహి యాత్రపై దాడిచేసే అవకాశం ఉందంటూ జనసేన అధినేత పవన్కళ్యాణ్ చేసిన పిచ్చివ్యాఖ్యలపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. దాడికి యత్నిస్తున్నారంటూ పిచ్చి ఆరోపణలు చేయటంకాదు.. ఆధారాలుంటే నిరూపించే దమ్ముందా? అంటూ ఆయన సవాల్ విసిరారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. పెడన ప్రజలు శాంతి కాముకులని.. ఏనాడూ చిన్న హింసకు కూడా పాల్పడలేదని చెప్పారు. అలాంటి వాళ్లు నిన్ను అడ్డుకోవడానికి, నీ సభను చెదరగొట్టడానికి కత్తులు, రాడ్లతో దాడులు చేస్తారని అంటావా? అని జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు నీ వారాహి యాత్రను అడ్డుకోవాల్సిన అవసరం మాకేంటని మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. అవనిగడ్డ సభ ఫ్లాప్తో పవన్లో దిగులు పట్టుకుంది. పెడనలో కూడా బుధవారం జరిగే సభకు ఇలాగే జనం రారని భయపడుతున్నారు. అంగళ్లు మాదిరిగా అక్కడ గొడవల్ని సృష్టించే కుట్రకు తెరతీశారు. అందుకే పవన్ ఇలా మాట్లాడుతున్నారు. జైలులో ఉన్న దత్తతండ్రి మాస్టర్స్కెచ్ ఇది. ఆదిలోనే టీడీపీ, జనసేన పొత్తు వికటించింది. చంద్రబాబుతో జతకు పవన్ ఒక్కడే తహతహలాడున్నారు. అధినేత నిర్ణయాన్ని పవన్ అభిమానులు, జనసేన పార్టీ కేడర్ ఒప్పుకోలేకపోతోంది. ఇక జనసేన పార్టీ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. పవన్ చాప, దిండు సర్దుకుని హైదరాబాద్కు వెళ్లడమే తరువాయి. అవనిగడ్డలో మూడుగంటలసేపు కష్టపడి మీటింగ్ కొనసాగిస్తే కేవలం 300 మంది మాత్రమే సభాస్థలిలో ఉన్నారు. అది కూడా టీడీపీ, జనసేన జతకట్టిన తర్వాత జరిగిన మొట్టమొదటి సభలో. ఇదీ వాళ్ల పరిస్థితి. పార్టీ పరువు పోతుందని జనసేన, టీడీపీ నేతలు తమ కేడర్కు ఫోన్లు చేస్తేనే అంతమంది వచ్చారు. జనసేన అలా చతికిలపడడానికి కారణం టీడీపీతో జత కట్టడమే. అధినేత తీరు వారికి నచ్చడంలేదని దీంతో తేలిపోయింది. పవన్కళ్యాణ్ను నమ్మొద్దు.. గతకాలపు అనుభవాల్ని తెలుసుకున్న తర్వాత కూడా టీడీపీతో జతకట్టి చంద్రబాబును మరోమారు గద్దెనెక్కించేందుకు జనసేన కార్యకర్తలెవరూ సిద్ధంగా లేరు. ఇదే విషయంపై బాహాటంగానే ఆ పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఇక ఆ పార్టీ కార్యకర్తలకు, పవన్కళ్యాణ్ అభిమానులకు చెప్పేదేమంటే, ఇప్పటికైనా ఆయన మాటల్లోని మర్మాన్ని అర్థంచేసుకోవాలి. పవన్ను నమ్మితే జనసైనికులు నట్టేట మునిగినట్లే. -
టీడీపీ దుశ్శాసన పార్టీ
ఒక మహిళపై టీడీపీ నేత బండారు అభ్యంతరకర ఆరోపణలు చేస్తే లోకేశ్తో పాటు టీడీపీ నేతలు మద్దతివ్వడం సిగ్గుచేటు. ఆడ పుట్టుకను అపహస్యం చేసిన వ్యక్తి ఆ పారీ్టకి జాతీయ అధ్యక్షుడు.. ఆడపిల్ల కనిపిస్తే ముద్దుపెట్టాలని చెప్పిన వ్యక్తి ఆ పార్టీ ఎమ్మెల్యే.. ఇలాంటి వారున్న టీడీపీకి మహిళలంటే ఎలా గౌరవం ఉంటుంది? తిరుపతి రూరల్/సాక్షి అమరావతి: విశ్వవ్యాప్తంగా అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్న నేటి రోజుల్లో ఇంకా పాతకాలం నాటి సంకుచిత ఆలోచనలతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు, మంత్రి ఆర్కే రోజాను ఉద్దేశిస్తూ నీచాతి నీచంగా విమర్శించడంపై సభ్య సమాజం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా, టీడీపీ అధిష్టానం అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పైగా.. అతని వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ఆయన అరెస్టును తెలుగుదేశం పార్టీ నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తోంది. మహిళలంటే టీడీపీకి ఇంత చిన్నచూపా అని మహిళాలోకం ప్రశ్నిస్తోంది. ఇంతలా స్త్రీలను కించపరుస్తున్న ఆ పార్టీ నేతలను కట్టడి చేయకుండా ఇంకా ప్రోత్సహించేలా వ్యవహరించడం ఏమిటని నిలదీస్తోంది. ఈ నేపథ్యంలో.. తనకు ఎదురైన అవమానంపై మంత్రి రోజా మంగళవారం తిరుపతి మీడియా సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అసత్య ఆరోపణలు, విమర్శలతో మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్న టీడీపీ దుశ్సాసన పార్టీ అని ఆమె ఘాటుగా విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మహిళా లోకాన్నే అవమానించేలా మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యక్తిగత విమర్శలపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను టీడీపీ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి వేధిస్తున్నారంటూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. బ్లూ ఫిలిమ్స్లో నటించింది అంటూ నన్ను టార్చర్ చేస్తున్నారు.. అసెంబ్లీలో సీడీలను కూడా చూపించారు.. కానీ, ఎప్పుడూ నిరూపించలేదు. మహిళలు నచ్చినట్లు బతకమని సుప్రీంకోర్టే చెప్పింది. మీరెవరు నా క్యారెక్టర్ను జడ్జ్ చేయడానికి? మహిళల్ని టీడీపీ ఆట వస్తువుల్లా చూస్తోంది. దమ్ముంటే సీడీలను ప్రజల్లోకి విడుదల చేయాలి. నాపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు సమర్థించడం సరికాదు. లోకేశ్తో పాటు ఇతర టీడీపీ నేతలు సత్యనారాయణ అరెస్టును ఖండించారు. వారి తల్లులు, భార్యలు, కూతుళ్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైతే ఇలాగే చేస్తారా? మహిళపై అభ్యంతరకర ఆరోపణలు చేస్తే బండారు కుటుంబం, టీడీపీ ఖండించకుండా ఆయనకు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు. ఎన్టీయార్కు అన్నం కూడా పెట్టని వాళ్లు ఈరోజు మాట్లాడుతున్నారు. లోకేశ్ ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం బ్రాహ్మణి మానుకుని జగన్న చేస్తున్న అభివృద్ధిని స్వాగతించాలి. మహిళలంటే టీడీపీలో చిన్నచూపు.. టీడీపీ అంటే దండుపాళ్యం పార్టీ.. తెలుగు దొంగల పార్టీ, తెలుగు దుశ్శాసన పార్టీ. ఆడ పుట్టుకను అపహస్యం చేసిన వ్యక్తి ఆ పార్టీకి జాతీయ అధ్యక్షుడు.. ఆడపిల్ల కనిపిస్తే ముద్దుపెట్టాలి అని చెప్పిన వ్యక్తి ఆ పార్టీ ఎమ్మెల్యే.. మహిళలంటే అంత చిన్నచూపు చూసే టీడీపీలో మహిళలంటే ఎలా గౌరవం ఉంటుంది? మహిళలు రాజకీయాల్లోకి రావటమే తప్పు అన్నట్లు దండుపాళ్యం నేతలు ఒళ్లు బలిసి విమర్శలు చేస్తున్నారు. రాజకీయాల్లో 20 ఏళ్లుగా ఉన్నా.. మహిళా సాధికారితకు పాటుపడుతున్నా. మహిళలను కానీ, మా నాయకుడు జగనన్నను కాని విమర్శిస్తే ఊరుకోను. ఇలాంటి దిగజారుడు విమర్శలతో తన గొంతు నొక్కాలని ప్రయత్నించినా ఊరుకోను. బండారును వదిలిపేట్టేది లేదు. అతనిపై పరువునష్టం దావావేసి న్యాయపోరాటం చేస్తా. ఇక నగరి ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా నా పనితీరుపై చర్చకు రావాలి. ధమ్ముంటే నా నియోజకవర్గానికి వచ్చి అభివృద్ధి చూడండి. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి. అంతేగానీ.. చేతకాని దద్దమ్మల్లాగా ఆడవాళ్ల వ్యక్తిత్వ హననానికి పాల్పడొద్దు. మానవమృగం బండారు ఆకృత్యాలను సమర్థిస్తారా? – జాతీయ మీడియాను ప్రశ్నిస్తూ రోజా ‘ఎక్స్’లో పోస్ట్ పురుషాధిక్య ప్రపంచంలో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల కోసం పోరాడుతున్న తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా దారుణమైన వ్యాఖ్యలు చేసిన మానవమృగం టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణను సమర్థిస్తారా? అంటూ జాతీయ మీడియాను ప్రశ్నిస్తూ మంత్రి ఆర్కే రోజా మంగళవారం ‘ఎక్స్’లో (ట్వీట్) పోస్టుచేశారు. ‘ఎందుకు మౌనంగా ఉన్నారు? మహిళలను కించపరిచిన మానవమృగం బండారును ఎందుకు ప్రశ్నించరు?’.. అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. బండారు వంటి పురుషాహంకారం కలిగిన వారు, వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోషించాలని కలలుగనే ప్రతి అమ్మాయి స్వప్నం సాకారం కాకుండా దెబ్బతీస్తారని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పోస్టును ఆమె ఇండియా టీవీ, ఎన్డీటీవీ, సీఎన్ఎన్ న్యూస్18, రిపబ్లిక్ టీవీ ఛానళ్లను ట్యాగ్ చేశారు. ‘అన్ని రంగాల్లో మహిళలు ప్రగతిపథంలో దూసుకెళ్తున్నా బండారు సత్యనారాయణ వంటి కొంతమంది మానవమృగాల మధ్యయుగం నాటి ఆలోచనలు మారలేదు. నా వ్యక్తిత్వంపై పాశవికంగా దాడిచేస్తూ.. నన్ను కించపరుస్తూ అత్యంత దారుణమైన నిరాధారమైన ఆరోపణలు నాపై చేశారు’.. అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. -
Times Now Survey : ‘ఫ్యాన్’ ప్రభంజనం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాజాగా మారిన రాజకీయ పరిస్థితులు, కొత్త సమీకరణాల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘టైమ్స్ నౌ’ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 51.10 శాతం ఓట్లను సాధించి 25కిగానూ 25 లోక్సభ స్థానాలనూ దక్కించుకోవడం ద్వారా వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని తేల్చింది. ఫ్యాన్ తుపాన్లో టీడీపీ, జనసేన, ఎన్డీయే, ఇతర పక్షాలు గల్లంతు కావడం ఖాయమని స్పష్టం చేసింది. అవినీతి కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టై జైలులో ఉన్న నేపథ్యంలో టీడీపీ 36.40 శాతం ఓట్లకే పరిమితం అవుతుందని తేల్చింది. ప్రజల్లో సానుభూతి పొందేందుకు చంద్రబాబు చేసిన యత్నాలు ఫలించలేదని, టీడీపీ ఒక్క లోక్సభ స్థానంలోనూ విజయం సాధించే అవకాశం లేదని.. ఒక ఎంపీ స్థానంలో మాత్రమే ఒకింత ఉనికి చాటుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇక పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన 10.1 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటుందని, ఒక్క లోక్సభ స్థానంలో కూడా కనీసం పోటీని ఇవ్వలేదని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో బీజేపీ 1.30 శాతం ఓట్లకు పరిమితం కాగా సీపీఐ, సీపీఎం సహా వామపక్షాలు 1.10 శాతం ఓట్లకు పరిమితం అవుతాయని పేర్కొంది. అధికార పార్టీకి మరింత పెరిగిన ఆదరణ దేశంలో అన్ని రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్లో ప్రజల అభిప్రాయంపై టైమ్స్ నౌ సంస్థ తాజాగా విస్తృతంగా సర్వే చేసింది. సర్వేకు సంబంధించిన ఫలితాలను సోమవారం రాత్రి టైమ్స్ నౌ చానల్ ప్రసారం చేసింది. విశ్లేషకులతో చర్చ నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో 22 లోక్సభ స్థానాల్లో విజయం సాధించిన వైఎస్సార్సీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 24–25 ఎంపీ స్థానాల్లో విజయభేరీ మోగిస్తుందని సర్వేలో వెల్లడైందని వ్యాఖ్యాత పద్మజాజోషి వెల్లడించారు. గత 52 నెలలుగా సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో వైఎస్సార్సీపీకి ప్రజాదరణ మరింత పెరిగిందని విశ్లేషించారు. అందుకే అధికార పార్టీ 22 లోక్సభ స్థానాల నుంచి 25 ఎంపీ సీట్లలో క్లీన్ స్వీప్ చేసి తిరుగులేని విజయం సాధించే స్థాయికి చేరుకుందని తెలిపారు. The @TimesNow -ETG survey predicts clean sweep for @YSRCParty in AP with 24 -25 Lok Sabha seats.#YSJaganAgain#YSRCPAgainhttps://t.co/G6dY75KvHE — YSR Congress Party (@YSRCParty) October 3, 2023 విశ్వసనీయతకు పట్టం.. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసే స్థాయికి దారితీసిన పరిస్థితులపై టైమ్స్ నౌ ఛానల్ చర్చ నిర్వహించింది. సర్వే ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టాయని చర్చలో పాల్గొన్న విశ్లేషకులు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పేర్కొన్నారు. గత ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు వైఎస్సార్సీపీ తిరుగులేని శక్తిగా అవతరించడానికి ప్రధాన కారణమేంటని చర్చలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని వ్యాఖ్యాత పద్మజా జోషి ప్రశ్నించారు. ఎన్నికల హామీల్లో 99.5 శాతం హామీలను సీఎం వైఎస్ జగన్ అమలు చేశారని అబ్బయ్య చౌదరి గుర్తు చేశారు. సీఎం జగన్ ఏదైనా చెప్పారంటే చేస్తారనేది ప్రజల్లో బలంగా నాటుకుపోయిందన్నారు. వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన.. అవినీతికి తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు అందిస్తుండటం.. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో సంస్కరణల ద్వారా అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడాన్ని ప్రజలు చూస్తున్నారన్నారు. దీన్ని చంద్రబాబు పాలనతో పోల్చుకుంటున్న ప్రజలు సీఎం జగన్తోనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధ్యమని బలంగా నమ్ముతున్నారని, అందుకే 25కుగానూ 25 లోక్సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందన్నది సర్వే ద్వారా తేలిందన్నారు. ఫలించని సానుభూతి డ్రామా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మాజీ సీఎం చంద్రబాబును జైలుకు పంపడం వల్ల ఆయనపై ప్రజల్లో సానుభూతి ఏమైనా కనిపిస్తోందా? అని చర్చలో పాల్గొన్న ప్రముఖ జర్నలిస్ట్, కాలమిస్ట్ అశుతోష్ను వ్యాఖ్యాత పద్మజా జోషి ప్రశ్నించారు. దీనిపై అశుతోష్ స్పందిస్తూ.. అవినీతి కేసులో రిమాండ్పై జైలులో ఉన్న చంద్రబాబు పట్ల ప్రజల్లో ఏమాత్రం సానుభూతి కనిపించడం లేదని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భారీ ఎత్తున అవినీతికి పాల్పడటం వల్లే ఇప్పుడు ప్రజల్లో ఆయన పట్ల సానుకూల అభిప్రాయం లేదని విశ్లేషించారు. రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబును అక్రమ కేసులో జైలుకు పంపారని నారా లోకేష్తోపాటు టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు విశ్వసించడం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబులో ఇప్పటికైనా మార్పు రావాలని, ఆయన వైఖరిపై పునరాలోచించుకోవాలని సూచించారు. 2019 కంటే మిన్నగా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో విజయకేతనం ఎగురవేయడం ద్వారా వైఎస్సార్సీపీ రికార్డు సృష్టించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే మేనిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేయడం ద్వారా సీఎం జగన్ దేశం దృష్టిని ఆకర్షించారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ రాష్ట్రాన్ని ప్రగతిపథాన అగ్రభాగాన నిలబెట్టారు. అర్హతే ప్రామాణికంగా, ఎలాంటి వివక్ష, లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారు. గత 52 నెలల్లో సంక్షేమ పథకాల కింద డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లో రూ.2.36 లక్షల కోట్లను జమ చేశారు. వ్యవసాయ, విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మక సంస్కరణలను తెచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిపాలనను వికేంద్రీకరించి ప్రజల ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తూ సుపరిపాలన అందిస్తున్నారు. దీంతో సీఎం వైఎస్ జగన్కు ప్రజల్లో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ చారిత్రక విజయాలు సాధించడమే అందుకు తార్కాణం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 2019 ఎన్నికల కంటే మిన్నగా అంటే 51.10 శాతం ఓట్లతో 24 నుంచి 25 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం ఖాయమని టైమ్స్ నౌ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ‘వైనాట్ 175..?’ అని ముఖ్యమంత్రి జగన్ పదే పదే చెబుతున్న అంశాలకు ఈ సర్వే ఫలితాలు దగ్గరగా ఉండటం గమనార్హం. -
కళ్లెదుటే ఖరీదైన లోగిళ్లు!
కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన అప్పారావు దినసరి కూలి. ఆర్నెళ్ల క్రితం వరకూ నెలకు రూ.2,500 అద్దె చెల్లించాల్సి రావడంతో కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉండేది. ఆయన భార్య రత్నం సొంత ఇంటి కలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా నెరవేర్చింది. సామర్లకోట నుంచి ప్రత్తిపాడుకు వెళ్లే రోడ్డులో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఆమె కుటుంబానికి ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని ఇవ్వడంతోపాటు గృహ నిర్మాణానికి ఆర్థికంగా చేదోడుగా నిలిచింది. ఏమ్మా ఈ ఇల్లు మీదేనా? చాలా బాగుందంటూ ఎవరైనా పలకరిస్తే చాలు.. ‘అవునండీ సీఎం జగన్ మాకిచ్చిన కానుక ఈ ఇల్లు. ఇన్నాళ్లూ అద్దెలు కట్టలేక, పిల్లల చదువులు, కుటుంబ పోషణకు చాలా ఇబ్బందులు పడ్డాం. కొత్త ఇంటిలోకి వచ్చాక చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతున్నా. వేడినీళ్లకు చన్నీళ్లలా మా సంపాదన ఉంది’ అని ఆనందంగా చెబుతోంది. సామర్లకోట లేఔట్లో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న కృష్ణకుమారి అనే మహిళను ఇక్కడికి వచ్చి ఎన్నిరోజులు అయింది? అని పలుకరించగా ‘నా భర్త చిరు వ్యాపారి. వివాహం అయిన రోజు నుంచి అద్దె ఇంటిలోనే ఉంటున్నాం. సంపాదన ఖర్చులకే సరిపోయేది కాదు. స్థలం కొనడానికే రూ.10 లక్షలు దాకా ఉండాలి. దీంతో ఇక ఇంటి కల నెరవేరదని ఆశ వదులుకున్న తరుణంలో ప్రభుత్వం పేదలకు స్థలాలు ఇచ్చి ఇంటిని కూడా మంజూరు చేస్తోందని తెలియడంతో దరఖాస్తు చేసుకున్నాం. ఎనిమిది నెలల క్రితం గృహ ప్రవేశం కూడా చేశాం. నా బిడ్డ చదువులకు కూడా ప్రభుత్వం సాయం చేస్తోంది. ఇప్పటివరకు మూడుసార్లు అమ్మఒడి వచ్చింది. రూ.75 వేలు పొదుపు సంఘం రుణం వచ్చింది’ అని సంతోషం వ్యక్తం చేస్తోంది. (వడ్డే బాలశేఖర్ – సామర్లకోట నుంచి సాక్షి ప్రతినిధి): ఒకేసారి 30 లక్షల మందికిపైగా ఇళ్ల స్థలాలు.. అది కూడా ఖరీదైన ప్రాంతాల్లోనే.. ఆపై గృహ నిర్మాణాలను కూడా చేపట్టడం దేశ చరిత్రలోనే ఒక సంచలనం. అక్క చెల్లెమ్మల సొంతింటి స్వప్నాన్ని సాకారం చేసేందుకు భూ సేకరణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.75,670 కోట్లను వ్యయం చేసింది. అంత విలువైన స్థిరాస్తిని మహిళల చేతుల్లో పెట్టింది. పేదల పక్కా ఇళ్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 68,677 ఎకరాలను పంపిణీ చేసిందని కేంద్ర గృహ నిర్మాణ శాఖ సైతం ప్రశంసించింది. 17,005 జగనన్న కాలనీల్లో సకల సామాజిక, కనీస సదుపాయాలను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం దశలవారీగా దాదాపు రూ.30 వేల కోట్లను వ్యయం చేస్తోంది. ఇక ఆగస్టు నెలాఖరు వరకు 21.31 లక్షల ఇళ్ల నిర్మాణాల కోసం మరో రూ.12,295.97 కోట్లను అక్క చెల్లెమ్మల ఖాతాలకు పారదర్శకంగా జమ చేసింది. ఉచితంగా ఇచ్చే ఇసుకతోపాటు రాయితీపై సామగ్రిని సమకూరుస్తోంది. తద్వారా మరో రూ.40 వేల మేరకు లబ్ధిదారులకు ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన ప్రాంతాన్ని బట్టి స్థలం, ఇంటి విలువ రూ.15 లక్షలు, ఆపైన పలుకుతుండటం విశేషం. ఇళ్ల లబ్ధిదారుల్లో బీసీ మహిళలే అత్యధికంగా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికార యంత్రాంగానికి మార్గ నిర్దేశం చేస్తున్నారు. పూర్తైన ఇళ్లకు మంచినీటి, విద్యుత్ సరఫరాపై క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా తనిఖీలు జరిపి నిర్థారించేలా చర్యలు తీసుకున్నారు. రోజు వారీ లక్ష్యాలను నిర్ధారించి ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షిస్తుండటంతో ఐదు లక్షలకుపైగా పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యాయి. ఖరీదైన ప్రాంతంలో పేదలకు ఇళ్లు కాకినాడ జిల్లా సామర్లకోట – ప్రత్తిపాడు రోడ్డులో 2,412 నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 54 ఎకరాల్లో ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది. రెండు కాలనీలుగా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇప్పటివరకు 800 వరకూ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. మరో 1,408 ఇళ్లు పునాదిపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈ నెల 5వ తేదీన సామర్లకోట వైఎస్సార్ జగనన్న కాలనీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించి పేదల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో సామర్లకోట మునిసిపాలిటీలోని జగనన్న కాలనీల్లో ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టింది. సామర్లకోట నుంచి ప్రత్తిపాడు వెళ్లే ప్రధాన రహదారికి పక్కనే ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఇక్కడ సెంటు స్థలం మార్కెట్ విలువ రూ.10 లక్షలపైన పలుకుతోందని చెబుతున్నారు. విద్యుత్, నీటి సరఫరాతో పాటు, ఇతర సదుపాయాలను కూడా ప్రభుత్వం సమకూరుస్తోంది. స్థలం, ఇంటి రూపంలో ఒక్కో పేద మహిళకు రూ.15 లక్షలకుపైగా విలువైన ఆస్తిని సీఎం జగన్ సమకూర్చారు. అత్యంత నాణ్యత ప్రమాణాలతో.. పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాలను స్మశానాలతో పోల్చుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు విషం కక్కారు. నిత్యం పేదల ఇళ్ల పథకంపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోంది. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా కాలనీల్లో అత్యంత నాణ్యత ప్రమాణాలతో పేదల ఇళ్ల నిర్మాణాలున్నాయి. ప్రతి ఇంటికీ హాల్, కిచెన్, బెడ్రూమ్, వరండా, స్టేర్ కేస్ లాంటి వసతులు ఉండటం విశేషం. సామర్లకోటలో మెజారిటీ లబ్ధిదారులు తామే ఇళ్లు నిర్మించుకునే ఆప్షన్ ఎంచుకున్నారు. ఆప్షన్–3 లబ్ధిదారుల ఇళ్లను షీర్వాల్ టెక్నాలజీలో అజయ వెంచర్స్ లేబర్ ఏజెన్సీ నిర్మిస్తోంది. ఉచితంగా ఇసుక.. సబ్సిడీపై సామగ్రి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ రెండు విడతల్లో 21.25 (టిడ్కోతో కలిపి) లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇంటి నిర్మాణానికి యూనిట్కు రూ.1.80 లక్షలు చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. పావలా వడ్డీకే రూ.35 వేలు బ్యాంక్ రుణం, రూ.15 వేలు విలువైన ఉచిత ఇసుక, సబ్సిడీపై సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామాగ్రిని అందించడం ద్వారా మరో రూ.40 వేల మేర లబ్ధిదారులకు ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా.. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఈ ఏడాది ఆగస్టు నాటికి ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నిర్మాణం పూర్తయిన ఇళ్లు 5,24,850కి చేరుకున్నాయి. మిగిలినవి శరవేగంగా కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 43,602 ఇళ్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లాలో 37,141 ఏలూరు జిల్లాలో 26,815 ఇళ్లు పూర్తయ్యాయి. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ బిల్లులను ప్రభుత్వం వేగంగా చెల్లిస్తోంది. నిర్మాణాలు పూర్తయిన వెంటనే ఇళ్లకు చకచకా విద్యుత్, నీటి సరఫరా కనెక్షన్లు అందచేస్తోంది. 5న సామర్లకోట లే అవుట్లో ఇళ్లకు సీఎం జగన్ ప్రారంభోత్సవాలు పేదలందరికి ఇళ్లు–నవరత్నాల్లో భాగంగా పూర్తయిన ఐదు లక్షల గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 5వ తేదీన సామర్లకోటలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా జరుగుతుందని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్ జైన్ తెలిపారు. అదే రోజు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన లే అవుట్లలో ఇళ్లను మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రారంభిస్తారని, సామూహిక గృహ ప్రవేశాలు ఉంటాయని అజయ్ జైన్ ‘సాక్షి’కి వెల్లడించారు. ఐదు లక్షల గృహాల లే అవుట్లలో నూటికి నూరు శాతం మంచినీటి, విద్యుత్ సదుపాయాలను కల్పించినట్లు చెప్పారు. రహదారులు, అంతర్గత రహదారులు, స్వాగత తోరణాలు కూడా పూర్తైనట్లు తెలిపారు. ఇప్పటి వరకు 5.24 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయని చెప్పారు. తిరగకుండానే మంజూరైంది.. టీడీపీ హయాంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకుంటే పట్టించుకోలేదు. ఆ పార్టీ సానుభూతిపరులం కాదని సంక్షేమ పథకాల నుంచి తొలగించారు. తమ పార్టీ జెండా పట్టుకుంటే అన్నీ వస్తాయని ఆ పార్టీ నాయకులు చాలాసార్లు ఆశ పెట్టారు. ఇప్పుడు ఏ నాయకుడు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే మాకు ఇంటి స్థలం మంజూరైంది. త్వరలో గృహప్రవేశం కూడా చేయనున్నాం. ప్రభుత్వం మాకిచ్చింది సెంటు స్థలమేనని హేళనగా మాట్లాడుతున్న టీడీపీ నాయకులు వారి ప్రభుత్వంలో గజం స్థలం కూడా ఇచ్చిన పాపాన పోలేదు. – సూర్య భాస్కర్ కుమార్, సామర్లకోట, కాకినాడ జిల్లా దశాబ్దాల కల నెరవేరింది.. మా ఆయన చిరు వ్యాపారి. ఆయన సంపాదనంతా ముగ్గురమ్మాయిల చదువులు, కుటుంబ పోషణకే సరిపోయేది. వారికి పెళ్లిళ్లు చేయడానికి తలకు మించిన భారమైంది. దీంతో మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలన్న కోరిక అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు సీఎం జగన్ మా దశాబ్దాల ఇంటి కలను నెరవేర్చారు. ఆయన రుణం ఈ జన్మకు తీర్చుకోలేం. – లంక లక్ష్మి, వైఎస్సార్–జగనన్న కాలనీ సామర్లకోట, కాకినాడ జిల్లా ఇంతకన్నా మేలు ఏ ప్రభుత్వం చేయలేదు.. నెలకు రూ.3,500 చెల్లించి అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. సుమారు 10 ఇళ్లు మారాం. గత ప్రభుత్వంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలంలో ఇల్లు నిర్మించుకుని ఆత్మగౌరవంతో జీవిస్తున్నాం. మా పిల్లల చదువులకు కూడా అమ్మఒడి ద్వారా సీఎం జగన్ అండగా నిలుస్తున్నారు. ఇంతకన్నా మేలు మాకు ఏ ప్రభుత్వం చేయలేదు. – వి.సతీష్, పద్మావతి, వైఎస్సార్, జగనన్న కాలనీ సామర్లకోట పేదరిక నిర్మూలనే లక్ష్యంగా.. రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా సీఎం జగన్ పాలిస్తున్నారు. ప్రజల కనీస అవసరాల్లో ఒకటైన గూడు కోసం ఏ ఒక్కరు బాధ పడకుండా చర్యలు చేపట్టారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనిధంగా పేదలకు ఏకంగా 30 లక్షలకు పైగా ఇంటి పట్టాలు ఇచ్చారు. ఐదు లక్షల ఇళ్లను త్వరలో లబ్ధిదారులకు అందిస్తున్నాం. శరవేగంగా మిగిలిన నిర్మాణాలను కూడా పూర్తి చేస్తాం. – దవులూరి దొరబాబు, పెద్దాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఎప్పటికప్పుడు పురోగతి పరిశీలన పేదల ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నాం. జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తున్నాం. సామర్లకోటలో త్వరలో సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నాం. – డాక్టర్ లక్ష్మీశా, ఎండీ, ఏపీ గృహనిర్మాణ సంస్థ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి సమాజంలో సముచిత స్థానం లభిస్తుంది. ఇది కేవలం గృహ నిర్మాణంగానే చూడకూడదు. ఇళ్ల నిర్మాణంతో అనుబంధ రంగాల కార్మికులకు కూడా ఉపాధి లభిస్తుంది. సిమెంట్, ఇనుము, ఇటుకలు.. ఇలా వివిధ పరిశ్రమల ఉత్పత్తిలో వృద్ధి పెరుగుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం జరుగుతుంది. పేదలు తమ సంపాదనలో తిండికి పెట్టే ఖర్చుతో సమానంగా ఇంటి అద్దెలు చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి పక్కా ఇళ్లు సమకూరితే అద్దెల భారం తగ్గుతుంది. ఆ మొత్తాన్ని మంచి ఆహారం, ఆరోగ్యం, పిల్లల భవిష్యత్ కోసం ఖర్చు చేస్తారు. దీంతో మానవ వనరుల అభివృద్ధి సాధ్యమవుతుంది. – ప్రొఫెసర్ కె.మధుబాబు, ఆర్థిక శాస్త్రం విభాగాధిపతి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం -
ఇక టాప్ గేర్..!
ప్రజల్లో... ఎవరికి ఇస్తే సరైంది? అనే ప్రతిపాదికనే టిక్కెట్లు ఇస్తా. టికెట్టు ఇవ్వనంత మాత్రాన.. ఆ మనిషి నా మనిషి కాకుండా పోతాడని అనుకోవద్దు. టికెట్ ఇస్తే అది ఒక బాధ్యత. టికెట్ వచ్చినా, రాకున్నా మీరు ఎప్పటికీ నా వాళ్లుగానే ఉంటారు. అది కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. జుత్తు ఉంటేనే ముడివేసుకోగలం. అధికారంలో ఉంటేనే ప్రజలకు మరింత మంచి చేయగలం. టికెట్ ఇవ్వలేని పక్షంలో వారికి మరొకటి ఇస్తా. లీడర్ మీద, పార్టీ మీద నమ్మకం ఉంచాలి. అప్పుడే అడుగులు సరైన మార్గంలో పడతాయి. టికెట్ల విషయంలో నేను తీసుకోబోయే నిర్ణయాలకు అందరూ పెద్ద మనసుతో సహకరించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: శాసనసభ సమావేశాలు బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో ఇక మనం గేర్ మార్చాల్సిన సమయం ఆసన్నమైందని పార్టీ నేతలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఇన్ని రోజులు మనం చేసిన ప్రచారం, గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఒక ఎత్తు కాగా శాసనసభ సమావేశాలు ముగిశాక నిర్వహించే కార్యక్రమాలు, ఎన్నికలకు సన్నద్ధమయ్యే తీరు ఇంకొక ఎత్తు అని పేర్కొన్నారు. ఇన్ని రోజులు మనం బాగా చేశాం కదా..! వచ్చే ఆరు నెలలు సరిగా పని చేయకపోయినా పర్వాలేదనే భావన సరి కాదని హితవు పలికారు. రానున్న ఆర్నెల్లు్ల ఎలా పని చేస్తామన్నదే చాలా ముఖ్యమైన విషయమని, ఇది మనసులో పెట్టుకుని ప్రతి అడుగూ ముందుకు వేయాలని పార్టీ నేతలకు సూచించారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జ్లు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. జగనన్న ఆరోగ్య సురక్ష, ఏపీకి జగనే కావాలి (వై ఏపీ నీడ్స్ జగన్) అనే పేరుతో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై వచ్చే రెండు నెలల్లో నిర్వహించే ప్రచారంపై చర్చించారు. ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన తీరుపై పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేశారు. సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు సాధ్యమేనని నేను గతంలోనే చెప్పా నేను ఇంతకు ముందే చెప్పా.. 175కు 175 స్థానాల్లో గెలుపు ఎందుకు సాధ్యం కాదు? వైనాట్ 175? ఇది సాధ్యమే. క్షేత్రస్థాయిలో అందుకు తగ్గ సానుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టే ఇది సాధ్యం. మనం క్షేత్ర స్థాయిలో అంత బలంగా ఉన్నాం కాబట్టే ప్రతిపక్షాలు ఒంటరిగా పోటీ చేయలేక, భయపడి పొత్తులకు వెళ్తున్నాయి. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మన పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజల సానుకూల స్పందనను మీరంతా కళ్లారా చూశారు. ప్రతి ఇంటికీ మీరు వెళ్లినప్పుడు, అక్కచెల్లెమ్మలకు లేఖలను అందించినప్పుడు వారిలో వచ్చిన స్పందనను మీరు చూశారు. ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే ధైర్యం, ఇదే ముందు చూపు, ఇదే ముందస్తు ప్రణాళికతో అందరూ అడుగులు ముందుకేయాలి. అందుకనే ఇంతకుముందు చేసిందంతా ఒక ఎత్తు, ఈ ఆరు నెలల్లో మనం చేయబోయేది మరొక ఎత్తు! ప్రజలతో నిరంతరం సంబంధాలు నెరపుతూ వారితో మమేకమై ఉండడం ఒక ముఖ్యమైన విషయం కాగా.. ఆర్గనైజేషన్, ప్లానింగ్, వ్యూహాలు మరొక ముఖ్యమైన అంశాలు. వీటికి సంబంధించిన ప్రతి అడుగు రాబోయే రోజుల్లో వేయాలి. రాబోయే రోజుల్లో పరిశీలకులు, ప్రాంతీయ సమన్వయకర్తలు ఇంకా క్రియాశీలక పాత్ర పోషిస్తారు. ప్రతి నియోజక వర్గంలో విభేదాలు లేకుండా చూసుకోవడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. గ్రామ, మండల స్ధాయి నాయకుల్లో ఎలాంటి విభేదాలున్నా వాటిన్నింటినీ పరిష్కరించుకుని, సమన్వయపర్చుకుని అడుగులు వేయించాలి. వచ్చే ఆర్నెల్లు్ల వీటిపై దృష్టి పెట్టాలి. సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ప్రజల్లో.. ఎవరికిస్తే సరైందనే ప్రాతిపదికనే టికెట్లు.. మరో విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. మనం అంతా ఒక కుటుంబంలో సభ్యులమే. చాలామందికి తిరిగి టికెట్లు రావొచ్చు.. కొంతమందికి ఇవ్వలేకపోవచ్చు. ప్రజల్లో మీరు ఉన్న పరిస్థితులను బట్టి.. మనం వేసే అడుగులు బట్టి.. ఏది కరెక్ట్? ఎవరికి ఇస్తే కరెక్టు? అనే ప్రాతిపదికన నిర్ణయాలను తీసుకోవచ్చు. సర్వేలు కూడా దాదాపు తుది దశలోకి వస్తున్నాయి. చివరి దశ సర్వేలు కూడా జరుగుతుంటాయి. రానున్న రెండు నెలలు అందరూ ఎంత ఎక్కువగా ప్రజల్లో ఉంటే అంత మంచి ఫలితాలు మీపట్ల వస్తాయి. అందుకనే ప్రజల్లో మమేకమై ఉండండి. 2 నెలలు.. 2 భారీ కార్యక్రమాలు వచ్చే రెండు నెలలకు సంబంధించి రెండు భారీ కార్యక్రమాలను చేపడుతున్నాం. జగనన్న ఆరోగ్య సురక్ష, ఏపీకి జగనే కావాలి అనే కార్యక్రమాలను పార్టీ నుంచి చేపడుతున్నాం. ఏపీకి జగనే కావాలి కార్యక్రమం ద్వారా గత నాలుగేళ్లకుపైగా ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధిని చాలా స్పష్టంగా చూపిస్తాం. గతంలో మనం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమం చాలా సానుకూల ఫలితాలను ఇచ్చింది. దాదాపు 98 లక్షల సర్టిఫికెట్లు ఇచ్చాం. లబి్ధదారులందరినీ జల్లెడ పట్టి వారందరికీ సహాయ, సహకారాలు అందిస్తూ మంచి చేయగలిగాం. అర్హులైనవారికి అవసరమైన ధ్రువపత్రాలను జారీచేశాం. దీనిలాగే ఆరోగ్య సురక్షను చేపడుతున్నాం. ఐదు దశల్లో జగనన్న ఆరోగ్య సురక్ష.. ► జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆరోగ్య పరంగా ప్రతి ఇంటినీ జల్లెడపడతాం. ప్రతి ఇంట్లోనూ పరీక్షలు చేస్తాం. ఉచితంగా మందులు ఇస్తాం. గుర్తించిన వారికి చేయూతనిచ్చి వారికి మెరుగైన చికిత్సలు అందిస్తాం. నయం అయ్యేంతవరకూ విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్్టతో వారికి చేయూతనిస్తాం. ఇది కూడా మరొక విప్లవాత్మకమైన కార్యక్రమం. ఇందులో ప్రజా ప్రతినిధులను, పార్టీ శ్రేణులను మమేకం చేస్తాం. ► మొత్తం ఐదు దశల్లో జగనన్న సురక్షకార్యక్రమం జరుగుతుంది. మొదటి దశలో వలంటీర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి వివరిస్తారు. ► రెండో దశలో ఏఎన్ఎంలు, సీహెచ్ఓలు, ఆశావర్కర్లు ప్రతి ఇంటికీ పరీక్షలు చేయడానికి వెళ్తారు. ఆరోగ్యశ్రీని ఎలా ఉపయోగించుకోవాలి? అన్న దానిపై కూడా అవగాహన కల్పిస్తారు. ► మూడో దశలో వలంటీర్లు, గృహసారథులు, ప్రజాప్రతినిధులు క్యాంపు ఏర్పాటు తేదీ, వివరాలు తెలియజేస్తారు. క్యాంపు కన్నా మూడు రోజులు ముందు ఈ కార్యక్రమం జరుగుతుంది. ► నాలుగో దశలో క్యాంపులను ఏర్పాటు చేస్తారు. దీని తర్వాత ఐదో దశలో అనారోగ్యంతో ఉన్నవారిని గుర్తించి వారికి నయం అయ్యేంతవరకూ చేయూత నిస్తారు. ఇప్పటికే కార్యక్రమం మొదలయ్యింది. పూర్తిస్థాయి అవగాహనకోసం ఈ వర్క్షాపు నిర్వహిస్తున్నాం. ఈ రెండు కార్యక్రమాల్లో కేడర్ను, గ్రామస్ధాయిలో ప్రజా ప్రతినిధులను, వలంటీర్లను పాల్గొనేలా ఇన్వాల్వ్ చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం గురించి మీకు పూర్తి అవగాహన ఉండాలి. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలి. ► నవంబర్ చివరికి గడప గడపకూ కార్యక్రమాన్ని పూర్తిచేయాలి. ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాల్లో మమేకం కావాలి. -
అసెంబ్లీ సాక్షిగా.. టీడీపీ బరితెగింపు
శాసన సభ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు గురువారం టీడీపీ ఎమ్మెల్యేలు వీరంగం సృష్టించారు. చట్ట సభ ప్రతిష్టను దిగజారుస్తూ, స్పీకర్ పట్ల అమర్యాదగా వ్యవహరించారు. ఎలాగైనా సరే సస్పెండ్ అవ్వాలన్న ఉద్దేశంతోనే సభలో అడుగుపెట్టిన వారు ఆద్యంతం వీధి రౌడీలను మరిపిస్తూ చిల్లరగా వ్యవహరించారు. పోడియంపైకి చేరుకుని అసభ్య చేష్టలు, సైగలతో రెచ్చిపోయారు. పయ్యావుల, తదితరులు సీనియర్ ఎమ్మెల్యేలు అయినప్పటికీ సభా మర్యాద పాటించలేదు. సభలో వీడియో చిత్రీకరణ నిషేధం అని తెలిసినప్పటికీ ఆ పనే చేస్తూ.. ఇలాంటి వాళ్లా మన ప్రజాప్రతినిధులు అని ప్రజలు ఛీదరించుకునేలా దిగజారి నడుచుకున్నారు. అరుపులు, కేకలు, బూతులే తమకు తెలుసన్నట్లు నిస్సిగ్గుగా ప్రవర్తించారు. సాక్షి, అమరావతి: అసెంబ్లీ వేదికగా టీడీపీ గురువారం ఇంకో మెట్టు దిగజారింది. సభలో ఏం మాట్లాడాలో తెలియక అడ్డగోలుగా వ్యవహరించింది. బూతులు మాట్లాడుతూ.. స్పీకర్ను అడ్డుకుంటూ.. సభా సంప్రదాయాలను మంటగలుపుతూ అధికార పక్ష సభ్యులను రెచ్చగొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఉదయం 9 గంటలకు సభలో క్వశ్చన్ అవర్లో కల్యాణమస్తు పథకంపై ఎమ్మెల్యే వి.కళావతి అడిగిన ప్రశ్నకు మంత్రి మేరుగు నాగార్జున సమాధానం చెబుతుండగా.. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అంశంపై వాయిదా తీర్మానం కింద చర్చించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి, బాలవీరాంజనేయస్వామి, చిన్నరాజప్ప తదితరులు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంలోకి చొచ్చుకువెళ్లారు. వీరితోపాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి కూడా కేకలు వేస్తూ వెళ్లి వారితో కలిశారు. ఇరు వైపుల నుంచి స్పీకర్ చైర్ను చుట్టుముట్టి ఆయనపై పేపర్లు విసురుతూ నినాదాలు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో చంద్రబాబు పాత్రపై టీడీపీ వాయిదా తీర్మానం కోరిందని, ఆ సభ్యులకు కావాల్సినంత సమయం ఇచ్చి చర్చిద్దామని, అంతవరకు సంయమనం పాటించాలని శాసన సభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్వీకర్ ద్వారా టీడీపీ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. సభ ప్రారంభమైనప్పటి నుంచి 28 నిమిషాలపాటు వారు నినాదాలు చేస్తూనే వికృత చేష్టలకు పాల్పడ్డారు. స్పీకర్ కుర్చీని సైతం లాగి పడేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కల్పించుకుని చంద్రబాబు అరెస్టు అంశం కోర్టు తేలుస్తుందని, ఆ విషయం అక్కడ వాదించుకోవాలని సూచించారు. సభలో టీడీపీ సభ్యులు ఇలా రెచ్చగొట్టేలా ప్రవర్తించవద్దని, సభా మర్యాదలకు భంగం కలుగుతుందని చెబుతుండగా, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి స్పీకర్ టేబుల్పై ఉన్న పత్రాలను విసిరేసి, కంప్యూటర్ మానిటర్ను లాగిపడేశారు. మరో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గ్లాసులో నీటిని టేబుల్పై పోయడంతో పలు పేపర్లు తడిచిపోయాయి. అయినా స్పీకర్ తమ్మినేని సంయమనంతో వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఎథిక్స్ కమిటీతో విచారణకు సిఫారసు శాసనసభలో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఆస్తికి నష్టం చేకూరిస్తే 365 నియమావళి ప్రకారం సదరు సభ్యుల నుంచి ఆ మొత్తాన్ని రాబడతామని స్పీకర్ సీతారాం చెప్పారు. వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్లు ఫైల్ చించి వేయడం, బాటిల్ను పగలగొట్టడం, స్పీకర్ పోడియం వద్ద మానిటర్, వైర్లను తుంచి వేయడం గర్హనీయమన్నారు. సభా మర్యాదలను కాలరాస్తూ ప్రతిపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తన, సభాపతి స్థానాన్ని ధిక్కరిస్తూ చోటుచేసుకున్న ఘటనలను పూర్తిగా పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, అనగాని సత్యప్రసాద్లను సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. సరైన ఫార్మేట్లో వస్తే చర్చకు సిద్ధం సభలో టీడీపీ సభ్యుల వ్యవహార శైలి క్రిమినల్ చర్యల కిందకు వస్తుందని మంత్రి బుగ్గన మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యులు సరైన ఫార్మేట్లో వాయిదా తీర్మానం ఇస్తే ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ సభను అటంక పరుస్తూ ఉండటంతో తొలుత 15మంది సభ్యులను ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు పయ్యావుల కేశవ్, బెందాళం అశోక్, కింజారపు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, ఘన వెంకటరెడ్డి నాయుడు, గద్దె రామ్మోహన్రావు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయ స్వామిలతోపాటు ఉండవల్లి శ్రీదేవిని ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. అయితే వారు బయటకు వెళ్లకుండా నినాదాలు చేస్తూ సభకు అడ్డుతగలడంతోపాటు బిజినెస్ రూల్స్కు విరుద్ధంగా సెల్ఫోన్లతో వీడియోలు చిత్రీకరిస్తుండగా అధికార పక్ష సభ్యులు రోజా, ఉషశ్రీ చరణ్లు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. తొలుత పయ్యావుల కేశవ్ను ఒక రోజే సస్పెండ్ చేసినా.. నిబంధనలు తుంగలో తొక్కి వీడియోలు చిత్రీకరించినందుకు ప్రస్తుత సభాకాలం మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యులు ఎంతకీ సభలోనే నినాదాలు చేస్తుండటంతో వారిని బయటకు పంపించాలని స్పీకర్ మార్షల్స్ను ఆదేశించారు. సెల్ఫోన్లు సభ బయటే.. శాసనసభలో సభ్యులు సెల్ఫోన్ల వినియోగంపై స్పీకర్ స్పష్టమైన రూలింగ్ ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. జీరో అవర్లో మాట్లాడిన మంత్రి.. ప్రతిపక్ష సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫోన్లు పట్టుకుని వీడియోలు తీయడాన్ని తప్పుపట్టారు. ‘సెల్ఫోన్లు సభలోకి తీసుకురావచ్చా? తీసుకొస్తే వీడియోలు తీయోచ్చా? స్పీకర్ రూలింగ్ ఇవ్వాలి’ అని కోరారు. రూలింగ్ ఇచ్చిన తర్వాత కూడా నియమాలను ఉల్లంఘిస్తే ఎటువంటి శిక్ష విధించాలో కూడా చెప్పాలన్నారు. లేకుంటే సభలో వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో తమకు నచ్చినట్టు చిత్రీకరించుకుని సమాజాన్ని తప్పుదారి పట్టిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రూలింగ్పై స్పీకర్ స్పందిస్తూ ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్లు, కెమెరాలు సభలో వినియోగించకూడదని బిజినెన్స్ రూల్స్లో స్పష్టంగా ఉన్నాయని చదివి వినిపించారు. అయినప్పటికీ సభ్యుల సెల్ఫోన్లను సభ వెలుపలే డిపాజిట్ చేసిన తర్వాత లోనికి వచ్చేలా విధానాన్ని తీసుకొస్తామన్నారు. జీరో అవర్ అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేశారు. మీసం మెలేసి కవ్వించిన బాలకృష్ణ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతుండగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీసం మెలేసి ‘చూసుకుందాం రా’ అన్నట్టు వేలు చూపిస్తూ కవ్వించారు. బాలకృష్ణ చర్యలను తప్పుబట్టిన మంత్రి రాంబాబు మీసాలు మెలేయడానికి ఇదేమి సినిమా కాదని హితవుపలికారు. ఈలోగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కొందరు కలుగజేసుకుని టీడీపీ ఎమ్మెల్యేల తీరును తప్పుపడుతూ మాట్లాడారు. ఇరుపక్షాల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం నడిచింది. గందరగోళ పరిస్థితుల మధ్య సభ అదుపు తప్పుతుండటంతో స్పీకర్ సభను కొద్ది నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి 11.05 గంటలకు సభ ప్రారంభం కాగానే.. టీడీపీ సభ్యులు మళ్లీ స్పీకర్ను ముట్టడించేందుకు యత్నిస్తుండగా మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. ఇక్కడా బాలకృష్ణ రెండోసారి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చూస్తూ వికృతంగా చప్పట్లు కొట్టారు. దీంతో మరోసారి రభస మొదలైంది. మంత్రి బుగ్గన మాట్లాడుతూ స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించి సభా మర్యాదలకు భంగం కలిగించిన టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోకుంటే ఇదే అలవాటైపోతుందని, వారిపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. శాసనసభలో అసభ్యకరంగా సైగలు చేస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ టీడీపీ సభ్యులు పట్టు వీడకపోవడంతో వారి నినాదాల మధ్య స్పీకర్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ‘సభ అత్యంత గౌరవించే సభాపతి స్థానాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. సభాపతిని అగౌరవ పరిచేలా కాగితాలు విసిరివేశారు. ప్రజాస్వామ్యహితంగా నిరసన తెలుపకుండా సభ ఔన్నత్యాన్ని కించపరిచేలా తొడలు చరుస్తూ, మీసాలు మెలివేస్తూ వికృత చేష్టలకు ఒడిగట్టారు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. వెల్లోకి వచ్చి మీసాలు మెలివేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ సభా సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారన్నారు. దీనిని మొదటి తప్పుగా భావిస్తున్నామని.. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ఉద్దేశ పూర్వకంగానే టీడీపీ రాద్ధాంతం ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా శాసన సభ వేదికగా అవినీతికి పాల్పడి, పేద విద్యార్థులను మోసం చేసిన వ్యక్తికి వత్తాసు పలుకుతూ ప్రతిపక్ష సభ్యులు రాద్ధాంతం చేయడం సిగ్గుచేటని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మండిపడ్డారు. ఉద్దేశ పూర్వకంగా స్పీకర్ స్థానాన్ని అగౌరవ పరుస్తూ ప్రభుత్వ ఆస్తులను నాశనం చేస్తున్న సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రెజరీ బెంచ్ సభ్యులను రెచ్చగొట్టేలా ప్రతిపక్షం వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబు దోపిడీకి పూర్తి ఆధారాలున్నందునే జైలుకు వెళ్లగా, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీడీపీ సభ్యులు సభాకాలాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. -
జనాభా పెరుగుదలకు తగ్గట్లుగా ఓటర్లు పెరగలేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఓటర్ల పెరుగుదల నమోదు కాలేదని.. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ విచారణ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి పేర్ని నాని సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్కుమార్ మీనాను గురువారం కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో 2014 నుండి 2019 వరకు, 2019 నుండి 2023 వరకు రాష్ట్రంలో నమోదైన ఓటర్ల సంఖ్య హెచ్చుతగ్గులకు సంబంధించిన వివరాలను ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకూ ఓటర్ల జాబితాలో 30,08,032 ఓట్లు పెరిగాయని.. కానీ, 2019 నుంచి 2023 కాలంలో 38 వేల ఓట్లు తగ్గాయని వివరించారు. అదే విధంగా.. ఓటర్ల వృద్ధి చూసినట్లయితే 2014–19 మధ్య కాలంలో 8.1 శాతం మేర వృద్ధి నమోదైందని.. 2019 నుంచి 2023 మధ్య 0.09 శాతం క్షీణత నమోదైందని తెలిపారు. గతేడాది కంటే 2023లో నికర ఓట్ల సంఖ్య తగ్గిందని, దీనిని బట్టి నకిలీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని స్పష్టమవుతోందన్నారు. 2019 ఓటర్ల జాబితా నుండి నకిలీ ఓట్లను తొలగించే అంశాన్ని పరిశీలించి, నకిలీ ఓట్ల విషయంపై సమగ్ర విచారణ జరపాలని పేర్ని నాని కోరారు. అలాగే, 2014–2023 మధ్య జనాభా వృద్ధి రేటు 1.1 శాతం వుందని, ఈ విధంగా చూస్తే నికర ఓటర్ల సంఖ్య పెరగాలి కానీ తగ్గడంపై తమకు అనుమానాలున్నాయన్నారు. దీనికి కారణం 2014–19 సమయంలో తెలుగుదేశం పార్టీ పెద్దఎత్తున దొంగ ఓట్లను చేర్చడమే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. -
ఐటీ హబ్గా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: ఐటీ హబ్గా విశాఖ అభివృద్ధి చెందనుందని వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు చెప్పారు. ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ త్వరలోనే విశాఖలో తన కార్యకలాపాలను ప్రారంభించనుందని తెలిపారు. వైఎస్సార్ హయాంలో విశాఖలో ఐటీకీ జీవం పోస్తే.. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఐటీ అభివృద్ధి పరుగులు పెడుతోందని ప్రశంసించారు. ఎండాడ సమీపంలో ఐటీ సెజ్ హిల్ నంబర్–2లో ఇన్ఫోసిస్ సంస్థ ఏర్పాటు కానున్న నూతన భవనాన్ని బుధవారం ఇన్ఫోసిస్ ప్రతినిధులతో కలిసి వారు పరిశీలించారు. అనంతరం ఇన్ఫోసిస్ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. సమావేశంలో ఇన్ఫోసిస్ సంస్థ మౌలిక సదుపాయాల విభాగం వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ నీలాద్రి ప్రసాద్మిశ్రా, మౌలిక సదుపాయాల అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పునీత్ దేశాయ్, మౌలిక సదుపాయాల రీజినల్ హెడ్ కులకర్ణి, సంస్థ ఇతర ప్రతినిధులు జయచంద్రన్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇన్ఫోసిస్ కంపెనీ కార్యకలాపాలకు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. సంస్థ ప్రారంభోత్సవ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు ఉన్నారు. -
ఆనం.. ఏమిటీ ఆగం..?
నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంగంలో బుధవారం చీప్ పాలిటిక్స్ చేసి నవ్వుల పాలయ్యారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సంగంలో స్థానిక వలంటీర్లతో సమావేశాన్ని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి సూచనల మేరకు ఏర్పాటు చేశారు. సచివాలయాల పరిధిలో సమస్యల గుర్తింపు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, తదితర అంశాలపై ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇలా రెండు రోజులుగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సంగంలోని సొసైటీ కార్యాలయంలో వలంటీర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి స్థానిక మండలాధ్యక్షులతో పాటు ఎమ్మెల్యే ప్రతినిధులు హాజరయ్యారు. అయితే వలంటీర్లతో సొసైటీ కార్యాలయంలో సమావేశాన్ని పెట్టడమే తప్పనే రీతిలో అక్కడికి వెళ్లిన ఆనం రామనారాయణరెడ్డి నానా హంగామా చేశారు. ఓట్ల తొలగింపు ప్రక్రియ చేస్తున్నారంటూ ఆరోపణలకు దిగారు. వాస్తవానికి కలెక్టర్ హరినారాయణన్ సంగం మండలంలో ఇటీవల పర్యటించి ఓట్ల తొలగింపు, చేర్పుల విషయాన్ని పరిశీలించారు. ఎక్కడా అవకతవకలు జరగలేదని ఆయన ప్రకటించిన విషయం విదితమే. అయితే ఇవేవీ తెలుసుకోకుండా ఆనం రామనారాయణరెడ్డి హడావుడి చేయడంపై పలువురు మండిపడుతున్నారు. -
ప్రతి ఓటరూ ఆధార్తో లింక్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఓటరునూ ఆధార్తో అనుసంధానం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముఖేష్కుమార్ మీనాకు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విజ్ఞప్తి చేశారు. దీనివల్ల దొంగ ఓట్లను పూర్తిగా నివారించడంతోపాటు ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉండకుండా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఈవో ముఖేష్కుమార్ మీనాను మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్కుమార్, పార్టీ నేత దేవినేని అవినాశ్తో కూడిన వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం కలిసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేసిన అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. చాలా చోట్ల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, ఒకే ఫోటో లేదా ఒకే పేరు, ఒకే ఓటర్ ఐడీతో చాలా ఓట్లు ఉన్న విషయాన్ని సీఈవో దృష్టికి తెచ్చామన్నారు. ఒక మనిషికి ఒకే ఓటు ఉండాలని వైఎస్సార్సీపీ కోరుకుంటోందన్నారు. ప్రతి ఓటరునూ ఆధార్తో అనుసంధానం చేయాలన్న తమ విజ్ఞప్తిపై సీఈవో సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వినతిపత్రమిస్తున్న వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం అక్రమాలు టీడీపీ సర్కార్ నిర్వాకాలే.. ఓటర్ల జాబితాలను ప్రభుత్వం మార్చేస్తోందంటూ గత 15 రోజులుగా ఈనాడు, ఆంధ్రజ్యోతితోపాటు టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. 2017, 2018, 2019 ఓటర్ల జాబితాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు 2023లో ఓటర్ల జాబితా ఎలా ఉందనే విషయాన్ని సీఈవోకి ఉదాహరణలతో సహా తెలియచేశాం. పేరులో చిన్న మార్పు, అడ్రస్లో చిన్న మార్పుతో ఒకే మనిషికి రెండు, మూడు ఓట్లు ఉన్నాయి. అలా 59,18,631 ఓట్లు ఉన్నట్లు 2019 ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇవాళ 2023 జాబితాను చూస్తే పేరు, చిరునామాలో చిన్న మార్పులు, ఫోటోల మార్పుతో.. ఒకే మనిషికి రెండు మూడు చోట్ల దాదాపు 40 లక్షల ఓట్లు ఉండగా.. తెలంగాణ, ఏపీలో రెండు చోట్లా ఓట్లున్న వారు దాదాపు 16.59 లక్షల మంది ఉన్నారు. ► 9,242 ఇళ్లలో 20 నుంచి 30 ఓట్ల వరకు ఉండగా 2,643 ఇళ్లలో 31 నుంచి 40 ఓట్ల వరకు ఉన్నాయి. 1,223 ఇళ్లలో 41–50 ఓట్లున్నాయి. ఇంకా 1,614 ఇళ్లలో 51–100 వరకు ఓట్లున్నాయి. 386 ఇళ్లలో 101–200 ఓట్లున్నాయి. 96 ఇళ్లలో 201 నుంచి ఏకంగా 500 వరకు ఓట్లున్నాయి. 14 ఇళ్లలో 501 నుంచి 1,000 ఓట్ల దాకా ఉన్నాయి. ఇవన్నీ 2019 ఓటర్ల జాబితాలో కూడా ఉన్నాయి. ఇక ఏ డోర్ నెంబరూ లేకుండా ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లున్నాయో కూడా సీఈవోకు వివరించాం. 2019లో కూడా ఆ ఓట్లపై చర్యలు తీసుకోవాలని మేం కోరినా అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిపి ఓటర్ల జాబితాను సవరించాలని సీఈవోను కోరాం. నాడు కళ్లు మూసుకున్నావా రామోజీ? ► ఒకే డోర్ నెంబరుతో 500 ఓట్లున్నాయని ఈనాడు రామోజీరావు మమ్మల్ని నిందిస్తున్నారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారం విజయవాడ సూర్యారావుపేట పోలింగ్ బూత్ను పరిశీలిస్తే కడియాలవారి వీధి పేరుతో ఉన్న డోర్ నెంబర్లో 2019లో కూడా 500 ఓట్లు ఉన్నాయి. మరి ఆ ఆషాఢభూతి ఇప్పుడు కొత్తగా ఓట్లు చేర్చారని మాపై ఆరోపణలు చేస్తున్నారు. పాపాలు చేసింది వారైతే నిందలు మోపేది మాపైనా? ► రేపల్లెలో ఎడాపెడా దొంగ ఓట్లున్నాయని ఒక పేపర్లో రాశారు. నిజానికి అది 2019 నాటి ఓటర్ల జాబితా. అప్పుడే అవకతవకలు చేశారు. ఒకే డోర్ నెంబర్లో 148 ఓట్లు న్నాయి. జర్నలిస్టుల ముసుగులో కుల పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయి. ఆ అవకతవకలన్నీ 2019 ఓటర్ల జాబితాలో ఉన్నాయి. మరి ఆనాడు ఎందుకు వార్తలు రాయలేదు? ► పార్వతీపురం నియోజకవర్గంలో సున్నా నెంబర్ ఇంట్లోనూ వందల సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. మరి ఆనాడు మీకు ఇవేవీ కనిపించలేదా? ధృతరాష్ట్రుడిలా రామోజీకి కళ్లు కనిపించలేదా? ► 2019లోనే ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగాయి. అప్పుడే మేం వాటిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వాటిని ఇప్పుడు మేం సవరిస్తుంటే దొంగ ఓట్లు చేరుస్తున్నామంటూ నిందిస్తున్నారు. జాబితాలో పెరిగిందెక్కడ? రాష్ట్రంలో 2019 జనవరి నాటికి 3,98,34,776 మంది ఓటర్లు ఉండగా 2023 జనవరి నాటికి 3,97,96,678 మంది ఓటర్లున్నారు. మరి అలాంటప్పుడు మేం కొత్తగా ఓటర్లను ఎక్కడ చేర్పించినట్లు? మేం నిజంగా ఆ పని చేసి ఉంటే ఓటర్ల సంఖ్య పెరగాలి కదా? గజదొంగ చంద్రబాబు దొంగతనాలు చేసి నీతికధలు చెబుతున్నాడు. ఓటమి భయంతో మాపై ఆరోపణలు చేస్తున్నాడు. ప్రజలను కాకుండా కుట్ర రాజకీయాలను నమ్ముకున్న చంద్రబాబును సమర్థిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాస్తున్నాయి. డూప్లికేట్లనే తొలగించామని సీఈవోనే చెప్పారు ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దొంగ ఓట్లను గుర్తించి 2020లో 1,85,193 ఓట్లను తొలగించింది. 2021లో 1,11,076 ఓట్లు, 2022లో 11.23 లక్షల ఓట్లు వెరసి మొత్తం 14 లక్షలకు పైగా దొంగ ఓట్లను తొలగించారు. డూప్లికేట్ ఓట్లు, ఒకే ఫోటో ఉన్న ఓట్లకు సంబంధించి 10,52,326 ఓట్లను తొలగించినట్లు సీఈవోనే స్వయంగా మీడియాకు చెప్పారు. ఒకవేళ మేం దొంగ ఓట్లను చేర్పిస్తే ఇలా తొలగిస్తామా? ఆ నీచ రాజకీయం బాబుదే.. రాష్ట్రంలో 2019 ఓటర్ల జాబితాలే ఇవాళ్టికి కూడా కొనసాగుతున్నాయి. ఆ లోపాలను సవరించమని మేం కోరుతున్నాం. దొంగ ఓట్లను చేర్చడం.. అవతల పార్టీ ఓట్లను తొలగించడం చంద్రబాబుకే అలవాటు. తప్పుడు మార్గాల్లో గెలవాలని ప్రయత్నించడం ఆయనకు ఆనవాయితీ. ► తెలంగాణకు చెందిన బీజేపీ నేత బండి సంజయ్ కూడా మమ్మల్ని విమర్శిస్తున్నాడు. చంద్రబాబు కోసం ఆయన పని చేస్తున్నారు. ఎందుకీ దిక్కుమాలిన రాజకీయాలు? ► నాడు టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అంటే 2015 జనవరి నాటికి 22,76,714 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. మరో ఏడాదిలో అంటే 2016లో 13,00,613 మంది ఓటర్లను తొలగించారు. 2017లో మరో 14,46,238 మందిని తొలగించారు. అలా మూడేళ్లలో టీడీపీ హయాంలో మొత్తం 50,23,565 మంది ఓటర్లను జాబితాల నుంచి తొలగించారు. ► సేవామిత్ర అనే యాప్ ద్వారా వైఎస్సార్సీపీ సానుభూతిపరులను గుర్తించి వారందరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. దానిపై మేం పోరాడాల్సి వచ్చింది. కోర్టులు, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి ఆ ఓట్లను తిరిగి చేర్పించే ప్రయత్నం చేశాం. -
రాజన్న రాజ్యంలో రైతే రారాజు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ వేసిన ప్రతీ అడుగు, చేసిన ప్రతీ ఆలోచన రైతుల కోసమే. రైతును రాజుగా చూడాలన్న కాంక్షతో అమలుచేసిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు వారి హృదయాలలో చెరగని ముద్రవేశాయి. ఉచిత విద్యుత్ ఫైల్పై తొలి సంతకంతో మొదలైన తన పాలనలో అడుగడుగునా రైతులకు తోడుగా నిలిచారు. రుణమాఫీతో రైతుకు వెన్నుదన్ను.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రుణమాఫీని అమలుచేయగా, దేశంలోనే అత్యధికంగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 64లక్షల మంది రూ.11,100 కోట్ల లబ్ధిపొందారు. రుణమాఫీ దక్కని 36 లక్షల మంది రైతులకు “ప్రోత్సాహం కింద’ ఒకొక్కరికి రూ.5వేల చొప్పున రూ.1,800 కోట్లు అందించారు. పునరావాస ప్యాకేజీ కింద.. వ్యవసాయ కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడిన భూ యజమానులు, కౌలుదారుల కుటుంబాలకు సైతం రూ.2లక్షల ఎక్స్గ్రేషియా అందించారు. అలాగే, ఉమ్మడి ఏపీలోని 23 డీసీసీబీల్లో 18 డీసీసీబీలు దివాళ తీసే స్థాయికి చేరుకోగా, వైద్యనాథన్ కమిటి సిఫార్సు మేరకు ఒక్క సంతకంతో రూ.1,800 కోట్ల సాయం అందించి సహకార రంగం పునరుజ్జీవానికి బాటలు వేశారు. ప్రపంచంలోనే తొలిసారి పావలా (3 శాతం) వడ్డీకే రుణాలకు శ్రీకారం చుట్టారు. కనీస మద్దతు కనీవినీ రీతిలో పెంపు.. 1999లో క్వింటాల్కు రూ.490 ఉన్న ధాన్యం కనీస మద్దతు ధర 2004లో టీడీపీ అధికారం కోల్పోయే నాటికి రూ.550కు చేరింది. ఐదేళ్లలో పెరిగిన ఎమ్మెస్పీ కేవలం రూ.60 (12.5%) మాత్రమే. అలాంటిది 2004–09 మధ్య రూ.550 నుంచి రూ.1,000కు అంటే అక్షరాల రూ.450 (78.5%) పెరిగిందంటే అది ఆ మహానేత కృషి ఫలితమే. ధాన్యంతో పాటు ఇతర పంటల మద్దతు ధరను భారీగా పెంచగలిగారు. తండ్రి బాటలో తనయుడు రైతుల కోసం ఆ మహానేత ఒక అడుగు వేస్తే.. నేను రెండడుగులు ముందుకేస్తానంటూ అధికారంలోకి వచ్చింది మొదలు నాలుగేళ్లుగా రైతు సంక్షేమం కోసమే సీఎం జగన్ అహరహం శ్రమిస్తున్నారు. మహానేత జయంతిని ఏటా రైతు దినోత్సవంగా రైతుల మధ్యలో జరుపుకుంటున్నారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించేలా ఆర్బీకేలు తీసుకొచ్చారు. సహకార రంగ బలోపేతానికి రూ.295 కోట్ల మూలధనంగా సమకూర్చారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. ఇక సంక్షేమ పరంగా చూస్తే.. వైఎస్సార్ రైతుభరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇలా రైతు సంక్షేమం కోసం గతంలో ఎన్నడూలేని విధంగా ఈ నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం అక్షరాల రూ.1,70,769.23 కోట్ల లబ్ధిని చేకూర్చింది. -
వైఎస్సార్సీపీని మళ్లీ అధికారంలోకి తెచ్చేలా అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలు
సాక్షి, అమరావతి : ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం మరో 9 నెలల్లో ముగియనుందని.. అనంతరం జరిగే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వరుస విజయాన్ని సొంతం చేసుకోనుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీకి రెండోసారి విజయాన్ని కట్టబెట్టేలా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విరాజిల్లుతున్నాయని పేర్కొన్నారు. తాడేపల్లిలో గురువారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2024 మార్చి 15లోగా ఏపీ శాసనసభ ఎన్నికల తేదీలు ప్రకటిస్తారని తెలిపారు. 2019 ఎన్నికల తేదీలు ప్రకటించేందుకు ఆరు నెలల ముందు నాటి అధికార టీడీపీ.. ఓటర్ల వ్యక్తిగత వివరాలను తనకు అనుకూలంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయని, ఆ తర్వాత అవి వాస్తవాలన్న విషయం ప్రజలకు అర్థమైందని తెలిపారు. ఇంటింటికి వెళ్లి సర్వేల పేరుతో వివరాలు సేకరించి నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ అభిమానుల ఓట్లు తొలగించే కార్యక్రమాలు టీడీపీ చేసిందని, వైఎస్ జగన్ నేతృత్వంలోని పార్టీ యావత్తూ ఉద్యమించి.. నాటి టీడీపీ సర్కారు అప్రజాస్వామిక చర్యలకు అడ్డుకట్టవేశారని గుర్తు చేశారు.వైఎస్సార్సీపీ ప్రజాహిత విధానాలు, కార్యక్రమాల కారణంగా వరుసగా రెండోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని రాజకీయ నిపుణులు, విశ్లేషకులు కూడా అంచనావేస్తున్నారని చెప్పారు. నాలుగున్నరేళ్లుగా నగదు బదిలీ ప్రక్రియ విజయవంతంగా అమలవుతోందని, వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనతో ప్రజలు గరిష్ట స్థాయిలో సంతృప్తి చెందుతున్నారని తెలిపారు. గత ఎన్నికలప్పుడు టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసిన కట్టుకథలను కొంతమంది నమ్మి ఉండొచ్చని, కానీ ఇప్పుడు వైఎస్సార్సీపీ శాసన సభ, లోక్సభ ఎన్నికల్లో మరోసారి తిరుగులేని విజయం సాధిస్తుందనడంపై రాష్ట్రం ప్రజానీకానికి ఎలాంటి అనుమానాలూ లేవన్నారు. వైఎస్సార్సీపీని రెండోసారి గెలిపించి తమ సంక్షేమానికి, ప్రగతికి మార్గం సుగమం చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది జగమెరిగిన సత్యమని విజయసాయిరెడ్డి వివరించారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన జనసేన అభ్యర్థి
కాకినాడ: గత సార్వత్రిక ఎన్నికలలో రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమి చెందిన రాయపురెడ్డి ప్రసాద్ (చిన్న) వైఎస్సార్ సీపీలో చేరారు. బుధవారం జగ్గంపేట మండలం ఇర్రిపాక వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా ద్వారా కలుసుకున్నారు. పార్టీ లో చేరేందుకు ఆసక్తి చూపడంతో ఆయనను సీఎం జగన్ సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, యువ నాయకుడు జక్కంపూడి గణేష్ పాల్గొన్నారు. చిన్న రాక పార్టీకి బలం: జక్కంపూడి గణేష్ ప్రకాశం నగర్: రాయపురెడ్డి చిన్న రాకతో వైఎస్సార్ సీపీకి మరింత బలం చేకూరిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రీజనల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గణేష్ మాట్లాడుతూ 30 ఏళ్ళుగా తమ తండ్రి జక్కంపూడి రామ్మోహనరావుకు వెన్నెంటి ఉండి పనిచేసిన రాయపురెడ్డి చిన్న బుధవారం ఇర్రిపాకలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జనసేనకు పెద్ద షాక్ తగిలినట్లు అయిందన్నారు. చిన్న తమ సొంత మనిషి అన్నారు. జక్కంపూడి రామ్మోహనరావు మరణం అనంతరం కూడా తమతో కలిసి పయనించడమే కాకుండా స్థానిక కంబాలచెరువు వద్ద జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారన్నారు. చిన్నకు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో మంచి కేడర్ ఉందని, సొంత సొమ్ము ఖర్చు చేసి ఎంతోమందికి సహకారం అందించారన్నారు. అటువంటి నాయకుడు ఇప్పుడు తమ పార్టీలో చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మరింత భారీ మెజార్టీతో రాజానగరంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే టీడీపీ, ఇతర పార్టీల నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా పనిచేసినవారు పెద్ద ఎత్తున పార్టీలో చేరనున్నారని తెలిపారు. త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహించి తమ సత్తా చాటుతామన్నారు. ఈ బహిరంగ సభలో తాము నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి నివేదిను ప్రజల ముందు ఉంచుతామన్నారు. తమ పార్టీ నుంచి ఒకరు బయటకు వెళితే నలుగురు పార్టీలోకి వస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సంక్షేమ పాలనకు ఆకర్షితుడనై పార్టీలో చేరాను : రాయపురెడ్డి చిన్న రాయపురెడ్డి చిన్నా మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగనన్మోహన్రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలనకు ఆకర్షితుడనై వైఎస్సార్ సీపీలో చేరానన్నారు. వచ్చే ఎన్నికల్లో జక్కంపూడి రాజా అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. తాను జక్కంపూడి కుటుంబంలో ఒక సభ్యుడినేనని అనివార్య కారణాలతో బయటకు వెళ్లానన్నారు. తనను స్వయంగా సీఎం జగన్ వద్దకు తీసుకువెళ్లి వైఎస్సార్ సీపీ కండువా వేయించిన గణేష్కు అభినందనలు తెలిపారు. పార్టీ కోసం పనిచేయండి .మీకు తగిన ప్రాధాన్యం ఇస్తానని ముఖ్యమంత్రి జగనన్మోహనన్రెడ్డి హామీ ఇచ్చారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో తనకు అనేక ఇబ్బందుల ఎదురయ్యాయని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది ఎదురుకాలేదని అన్నారు. ఇకపై నియోజకవర్గంలో ఒక్క ఓటుకు నలుగురుం పనిచేస్తామన్నారు. ఈ సమావేశంలో దాట్ల పృథ్వీరాజ్, కోరుకొండ మండం పార్టీ ఉపాధ్యక్షుడు ఉల్లి గణ పాల్గొన్నారు. -
లోఫర్ లోకేశ్.. అని నేననగలను..
నూజివీడు: లోఫర్ లోకేశ్ అని తానూ అనగలనని, అయితే అలా మాట్లాడే వ్యక్తిత్వం తనది కాదని, ఎందుకంటే తనకు సంస్కారం ఉందని స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నారా లోకేశ్పై మండిపడ్డారు. ఏలూరు జిల్లా ముసునూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో తన కుమారుడిని కేటుగాడని అనడంపై ఆదివారం ఎమ్మెల్యే విలేకర్ల సమావేశం నిర్వహించి లోకేశ్ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. దమ్ముంటే నూజివీడు సెంటర్కొచ్చి కేటుగాడని మాట్లాడతావా అని సవాల్ చేశారు. తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, నిన్ను ఎన్నికల్లో పోటీచేసిన తొలిసారే ప్రజలు తన్ని తరిమేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. నిజానిజాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. నూజివీడు వచ్చి రౌడీయిజం చేయాలని ప్రయత్నించినా, ప్రోత్సహించినా ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. లోకేశ్ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ లోకేశ్ యువగళం పేరుతో నిర్వహించిన పాదయాత్ర నూజివీడు నియోజకవర్గంలో అట్టర్ఫ్లాప్ అయిందని ఎమ్మెల్యే మేకా ప్రతాప్ చెప్పారు. కనీసం వెయ్యి మంది కూడా లోకేశ్ వెంట నడవలేదని ఎద్దేవా చేశారు. ఇక నియోజకవర్గంలో ఇసుకను దోచుకున్నది, నీరు–మట్టి పథకంలో మట్టిని దోచుకున్నదీ ఎవరో కూడా నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. భూకబ్జాలంటూ చెబుతున్నారని, ఎక్కడ భూకబ్జా చేస్తున్నానో చూపిస్తే అదే భూమిని చంద్రబాబుకు, లోకేశ్కు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు రాసిస్తానన్నారు. ఇక మాగంటి బాబు సినిమాల్లో నటిస్తే బెటరని, బాగా రాణిస్తారని ఎమ్మెల్యే ప్రతాప్ ఎద్దేవా చేశారు. శనివారపుపేట నుంచి బ్లేడ్ బ్యాచ్ను తీసుకొచ్చారని అంటున్నారని, రాష్ట్రంలో బ్లేడ్బ్యాచ్ల అడ్రస్లు, పేకాట క్లబ్లు, లిక్కర్ మాఫియా అడ్రస్లు మాగంటి బాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియవన్నారు. లోకేశ్ రాజకీయాలకు పనికిరాడని, టీడీపీ ఇక అధికారంలోకి రాదని మేకా ప్రతాప్ చెప్పారు. -
‘ఫ్యామిలీ డాక్టర్’తో పల్లెకు రక్ష
(పమిడివారిపాలెం, పెదపాలెం, కాకుమాను గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి వడ్డే బాలశేఖర్): ‘ఏం తాత.. ఆరోగ్యం ఎలా ఉంది? మందు బిళ్లలు సమయానికి వేసుకుంటున్నావా?’ అని డాక్టర్ అడిగితే.. ‘ఆరోగ్యం బాగానే ఉంది’ అనేలా రెండు చేతులు కదిలిస్తూ సైగల ద్వారా ఆరి నాగేశ్వరరావు సమాధానం ఇచ్చారు. ఇంతలో పక్కనే ఉన్న నాగేశ్వరరావు భార్య విమల మాట్లాడుతూ.. ‘మీరు చెప్పినట్టే మాత్రలు సమయానికి వేస్తున్నాం. రోజులో 3 సార్లు పడుకునే స్థితి (పొజిషన్)లో మార్పులు చేస్తున్నాం’ అని వివరించింది. గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన వృద్ధుడు నాగేశ్వరరావు రెండేళ్లుగా ఆర్థో, న్యూరో సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నాడు. వీటికి తోడు బీపీ సమస్య కూడా ఉంది. వయోభారం, అనారోగ్య సమస్యల రీత్యా మంచానికి పరిమితం అయ్యాడు. దీంతో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుని, మందులు తీసుకోవడం కోసం వైద్యుడి వద్దకు నాగేశ్వరరావు వెళ్లాలంటే ఈ కుటుంబానికి ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఇంటికి కిలోమీటర్కు పైగానే దూరంలో ఉన్న పీహెచ్సీకి వెళ్లడానికి ప్రత్యేకంగా ఓ ఆటో మాట్లాడుకోవాలి. రాను పోను సుమారు రూ.300 అవుతుంది. కదల్లేని స్థితిలో ఉన్న నాగేశ్వరరావును ఆటో ఎక్కించి, ఆస్పత్రిలో చూపించుకునిగి మళ్లీ ఇంటికి చేర్చాలంటే ఇద్దరు వ్యక్తులు కచ్చితంగా తోడుండాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానంలో ఈ వ్యయ ప్రయాసలు ఏమీ లేకుండా కాకుమాను పీహెచ్సీ డాక్టర్.. వృద్ధుడైన నాగేశ్వరావు ఇంటికి క్రమం తప్పకుండా వస్తున్నాడు. బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొలె్రస్టాల్, రక్తం గడ్డ కట్టడాన్ని నియంత్రించే మాత్రలు ఇస్తున్నారు. ఈ క్రమంలో నాగేశ్వరావు భార్య విమల మాట్లాడుతూ ‘ఒకప్పుడు ఆయన్ని ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్లం. ఆ రోజు మా పిల్లలు పనులు వదులుకోవాల్సి వచ్చేది. ఇప్పుడా ఇబ్బందులు లేవు. డాక్టరే మా ఇంటికి వస్తున్నారు. మా ఆయన ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటోంది. నెల నెలా వలంటీర్ ఇంటికే వచ్చి పెన్షన్ కూడా ఇచ్చి వెళుతున్నారు. గతంలో ఆయన కిందపడి కాలు విరిగినప్పుడు ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేయించి ఆదుకుంది’ అని సంతోషం వ్యక్తం చేసింది. ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానంపై ‘సాక్షి’ గుంటూరు జిల్లాలోని పొన్నూరు, పెదకాకాని, పెదనందిపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి అమలు తీరును పరిశీలించగా ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమైంది. గుంటూరుకు వెళ్లే బాధ తప్పింది.. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పెదపాలెం గ్రామానికి చెందిన కావూరి శేషగిరిరావుకు 90 ఏళ్లు. ఆయన సతీమణి వెంకాయమ్మకు 70 ఏళ్లుపైనే ఉంటాయి. పిల్లలందరూ వేరే ఊళ్లలో స్థిరపడ్డారు. వృద్ధులు ఇద్దరే ఉంటారు. వయో భారానికి తోడు శేషగిరిరావుకు బీపీ, షుగర్ ఉన్నాయి. వెంకాయమ్మ గుండెకు కొన్నేళ్ల క్రితం స్టెంట్ వేశారు. దీంతో వీరిద్దరూ క్రమం తప్పకుండా ఆస్పత్రికి వెళ్లి చెకప్ చేయించుకుని మందులు వాడాల్సిన పరిస్థితి. ప్రతి నెలా గుంటూరులోని మిలటరీ ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ను అందుబాటులోకి తేవడంతో పాటు, ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామంలోని వీరి ఇంటికి వైద్యుడు వచ్చి మందులు ఇచ్చారు. ఈ మందులను తీసుకెళ్లి గుంటూరు మిలటరీ ఆస్పత్రిలో చూపిస్తే తామిచ్చే మందులు కూడా అవే అన్నారు. దీంతో వెంకాయమ్మ దంపతులు గుంటూరుకు వెళ్లడం మానేశారు. క్రమం తప్పకుండా ఫ్యామిలీ డాక్టర్ వీరి ఇంటికి వెళుతున్నారు. వైద్య సేవలు అందిస్తున్నారు. ‘ఒకప్పుడు గుంటూరు మిలటరీ ఆస్పత్రికి పోయి రావడానికి రోజంతా సరిపోయేది. బాగా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఇంటి దగ్గరకే డాక్టర్ వస్తుండటం మాకెంతో ఉపయోగకరంగా ఉంది. ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది. మాలాంటి ఎందరికో చాలా మంచి చేస్తోంది’ అని వెంకాయమ్మ అభిప్రాయపడింది. ఇలా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానం వల్ల వృద్ధులు, వ్యాధిగ్రస్తులున్న ఊరు, ఇంటి వద్దకే వెద్యులు వచ్చి సేవలు అందిస్తూ, ఆరోగ్య వివరాలను వాకబు చేస్తుండటం పట్ల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం జగన్ పుణ్యమా అని ఆస్పత్రుల చుట్టూ తిరిగే అవస్థలు తప్పాయని మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంత ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యయ, ప్రయాసలకు ఫుల్స్టాప్ పెదనందిపాడు మండలం పమిడివారిపాలెం గ్రామంలో సుమారు 900 మంది జనాభా ఉంటారు. వీరిలో 170 మందికి పైగా బీపీ, షుగర్తో బాధ పడుతున్నారు. వీరితో పాటు గర్భిణులు, బాలింతలు, వృద్ధులు క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించి, వైద్య పరీక్షలు చేయించుకుని మందులు వాడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 14 కి.మీ దూరంలో ఉండే పెదనందిపాడు పీహెచ్సీ, 20 కి.మీకు పైగా దూరంలో ఉండే ప్రత్తిపాడు సీహెచ్సీ, పొన్నూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలి. ఇంట్లో మోటార్ సైకిల్ ఉంటే పర్వాలేదు. లేదంటే ప్రత్యేకంగా ఆటో మాట్లాడుకుని వెళ్లాల్సిందే. ఒకసారి ఆటోలో ఆస్పత్రికి పోయి రావాలంటే రూ.500 పైనే ఖర్చవుతుంది. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ వల్ల ఈ వ్యయ, ప్రయాసలకు ఫుల్స్టాప్ పడింది. ఈ విధానంలో పెదనందిపాడు పీహెచ్సీ డాక్టర్ ప్రతి నెలా క్రమం తప్పకుండా నాలుగో శుక్రవారం గ్రామానికి వస్తున్నారు. రోజంతా గ్రామంలో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు. మంచానికే పరిమితం అయిన వృద్ధులు, ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, బాలింతలు, ఆరోగ్యశ్రీ రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి వారి ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. మరోవైపు పక్కనే మూడు కి.మీ దూరంలో ఉన్న పుసులూరు గ్రామంలో ప్రభుత్వం వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. తొలగిన ఆర్థిక భారం.. ఇబ్బందులు.. ఫ్యామిలీ డాక్టర్తో రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రజలు ప్రాథమిక వైద్యం కోసం సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి రావడానికి అయ్యే రవాణా వ్యయం రూ.కోట్లలో ఉంటుంది. ఇప్పుడు ఈ ఆరి్థక భారం, ఇతర ఇబ్బందులకు విముక్తి లభించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామంలోనే విలేజ్ క్లినిక్ సేవలు ప్రారంభం అయ్యాయి. 12 రకాల వైద్య సేవలు, 14 పరీక్షలు, 105 రకాల మందులు అక్కడే అందుబాటులోకి వచ్చాయి. టెలీ మెడిసిన్ ద్వారా గైనిక్, పీడియాట్రిషన్, ఇతర స్పెషాలిటీ వైద్యుల కన్సల్టెన్సీ లభిస్తోంది. పీహెచ్సీ డాక్టర్ ప్రతి నెలా గ్రామాలకే వెళుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అవుట్ పేషెంట్(ఓపీ) క్లినిక్ నిర్వహించి, ఆ తర్వాత మంచానికి పరిమితం అయిన వారికి వైద్య సేవలు అందించడానికి గృహాలు సందర్శిస్తున్నారు అదే విధంగా అంగన్వాడీలు, పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఇప్పటి వరకు 2.04 కోట్ల మందికి వైద్యం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్రన్ గత ఏడాది అక్టోబర్ 21న ప్రారంభించారు. పూర్తి స్థాయిలో ఈ ఏడాది ఏప్రిల్లో అందుబాటులోకి వచ్చింది. కాగా గత ఏడాది అక్టోబర్ 21 నుంచి ఇప్పటి వరకు పీహెచ్సీ వైద్యులు 10,032 విలేజ్ క్లినిక్స్ పరిధిలో 1,82,459 సార్లు సందర్శించారు. 2,10,75,065 మందికి వైద్య సేవలు అందించారు. ‘ఫ్యామిలీ డాక్టర్’తో గ్రామాల్లో అందే వైద్య సేవలు ► జనరల్ అవుట్ పేషెంట్ సేవలు ► బీపీ, షుగర్, ఊబకాయం లాంటి జీవనశైలి జబ్బుల కేసుల ఫాలోఅప్ ► గర్భిణులకు యాంటినేటల్ చెకప్స్, బాలింతలకు పోస్ట్నేటల్ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తింపు. చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చిన లోపాల గుర్తింపు ► రక్తహీనతతో బాధ పడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు ► ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స జరిగిన రోగులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితం అయిన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం ► పాలియేటివ్ కేర్ ► తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ నిర్ధారణ ఇవీ 14 రకాల వైద్య పరీక్షలు ► గర్భం నిర్ధారణకు యూరిన్ టెస్ట్ ► హిమోగ్లోబిన్ టెస్ట్ ► ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్ (షుగర్) ► మలేరియా టెస్ట్ ► హెచ్ఐవీ నిర్ధారణ ► డెంగ్యూ టెస్ట్ ► మలీ్టపారా యూరిన్ స్ట్రిప్స్ (డిప్ స్టిక్) ► అయోడిన్ టెస్ట్ ► వాటర్ టెస్టింగ్ ► హెపటైటిస్ బి నిర్ధారణ ► ఫైలేరియాసిస్ టెస్ట్ ► సిఫ్లిస్ ర్యాపిడ్ టెస్ట్ ► విజువల్ ఇన్స్పెక్షన్ ► స్పుటమ్ (ఏఎఫ్బీ) ‘ఫ్యామిలీ డాక్టర్’ కోసం ప్రభుత్వ చర్యలు ఇలా.. ► మండలానికి రెండు పీహెచ్సీలు ఉండేలా ప్రస్తుతం ఉన్న 1,142 పీహెచ్సీలకు అదనంగా 88 కొత్త పీహెచ్సీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ప్రతి పీహెచ్సీలో తప్పనిసరిగా ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన భవనాలు నిర్మాణంలో ఉంటుండగానే కార్యక్రమం అమలు కోసం వైద్యులను అందుబాటులోకి తెచ్చింది. ► మరోవైపు మండలంలో ఒక పీహెచ్సీ, సీహెచ్సీ ఉన్న చోట 63 చోట్ల వైద్యులను నియమించి వారిని సీహెచ్సీలో కో లొకేట్ చేసి సేవలు అందిస్తున్నారు. ఎవరైనా వైద్యులు సెలవు పెడితే కార్యక్రమానికి ఇబ్బంది రాకుండా పూల్ అప్ వైద్యులను అందుబాటులో ఉంచారు. ► 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో పాటు వైద్యులు గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 10,032 విలేజ్ క్లినిక్స్ను నెలలో రెండుసార్లు సందర్శించడానికి వీలుగా అప్పటికే ఉన్న 676 ఎంఎంయూ వాహనాలకు అదనంగా 260 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ► అన్ని విలేజ్ క్లినిక్స్లో 105 రకాల మందులను అందుబాటులో ఉంచారు. ► ఎన్సీడీ సర్వేలో భాగంగా 30 ఏళ్లు పైబడిన వారందరినీ వైద్య శాఖ స్క్రీనింగ్ చేపట్టింది. వీరిలో గుర్తించిన బీపీ, షుగర్, ఇతర సమస్యల బాధితులను ఫ్యామిలీ డాక్టర్తో అనుసంధానించారు. వారికి నిరంతర ఫాలో అప్ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద సమస్య అయితే తప్ప ఊరు దాటం 15 ఏళ్లుగా బీపీ, షుగర్ సమస్యలున్నాయి. గతంలో రెగ్యులర్ చెకప్ కోసం పొన్నూరు, గుంటూరుకు వెళ్లేవాడిని. ప్రతి నెలా వెళ్లి రావడం ఇబ్బందిగా ఉండేది. కొన్ని సందర్భాల్లో చెకప్కు వెళ్లడం మానేసి మందులు మాత్రం వాడేవాన్ని. అలా నిర్లక్ష్యం చేయడంతో కొన్నిసార్లు ఇబ్బంది అయింది. ప్రభుత్వం కొద్ది నెలల నుంచి డాక్టర్ను గ్రామానికే పంపుతోంది. దీంతో గ్రామంలోనే వైద్యం అందుతోంది. డాక్టర్ గ్రామానికి వచ్చే ముందు రోజు మైక్లో ప్రకటిస్తారు. ఇప్పుడు చాలా పెద్ద సమస్య అయితేనే మా ఊరి వాళ్లు పొన్నూరు, గుంటూరు వెళుతున్నారు. – పారి జలందర్, పమిడివారిపాలెం, గుంటూరు జిల్లా చాలా ఆనందంగా ఉంది రెండేళ్లుగా బీపీ సమస్య ఉంది. దీంతో మందులు వాడుతూ, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ చెప్పారు. మా ఊళ్లోనే ప్రభుత్వం విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసింది. ఇక్కడే పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు. పొన్నూరు నుంచి ప్రభుత్వ డాక్టర్ కూడా క్లినిక్కు వస్తారు. ముందు రోజు ఆశ, ఏఎన్ఎం సమాచారం ఇస్తారు. బీపీ స్థాయిని బట్టి డాక్టర్లు మందులు ఇస్తున్నారు. మందులు బాగా పని చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ వ్యవస్థను తేకపోయినట్లైతే పొన్నూరుకు పోవాల్సి వచ్చేది. దీంతో రాను, పోను ఆటో చార్జీల రూపంలో అదనపు ఖర్చులు పెట్టుకోవాల్సి ఉండేది. ఇప్పుడా సమస్య లేదు. – రత్నకుమారి, పెదపాలెం, గుంటూరు జిల్లా చాలా మంచి పని చేశారు రెండేళ్ల నుంచి బీపీ, షుగర్తో బాధ పడుతున్నాను. నెలనెలా చెకప్లు చేయించుకోవాలి. రోజూ మందులు వేసుకోవాలి. వైద్యం కోసం పొన్నూరు, గుంటూరుకు వెళ్లేదాన్ని. నన్ను చెకప్కు తీసుకుని వెళ్లడానికి మా ఇంట్లో ఎవరో ఒకరు తోడు ఉండాల్సి వచ్చేది. ప్రస్తుతం ఊర్లోనే మందులు ఇస్తున్నారు. టెస్ట్లు చేస్తున్నారు. డాక్టర్ కూడా మా ఊరికే వస్తున్నారు. ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. ఈ విధానం లేకుంటే మా ఇబ్బందులు వర్ణాతీతం. – ముప్పలనేని సుబ్బాయమ్మ, పమిడివారిపాలెం, గుంటూరు జిల్లా మంచి కార్యక్రమం మన దేశంలో ఇప్పటి వరకు గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడం కోసం ఏఎన్ఎం, ఆశ, ఎంఎల్హెచ్పీ వ్యవస్థ మాత్రమే ఉంది. గ్రామ స్థాయిలోనే వైద్యులు నేరుగా ప్రజలకు సంరక్షణ అందించే వ్యవస్థ లేదు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా డాక్టర్లను గ్రామ స్థాయిలోకి తీసుకుని వెళ్లి ప్రజలకు సేవలు అందించడం మంచి నిర్ణయం. ప్రజారోగ్య వ్యవస్థలో ప్రాథమిక వైద్య సేవలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. వివిధ జబ్బులు, అనారోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించడం, ఆ దశలోనే రోగికి సరైన వైద్య సేవలు అందించడం కీలకం. ఈ నేపథ్యంలో వైద్యులు క్రమం తప్పకుండా గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రజలతో మమేకం అవ్వడంతో చాలా వరకు జబ్బులు, సమస్యలు ప్రారంభ దశలోనే బయటపడతాయి. దీనికి తోడు బీపీ, షుగర్, ఇతర నాన్ కమ్యూనికబుల్ డిసిజెస్తో బాధపడే వారికి నిరంతర ఫాలోఅప్ సేవలు అందుతాయి. తద్వారా భవిష్యత్లో వారు గుండె, కిడ్నీ, మెదడు సంబంధిత పెద్ద జబ్బులు ఎదుర్కోకుండా కాపాడటానికి వీలుంటుంది. ప్రజలపై ఆరి్థక భారం పడదు. – డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు ప్రజల సంతృప్తి స్థాయి తెలుసుకుంటున్నాం ఫ్యామిలీ డాక్టర్ సేవల పట్ల ప్రజల సంతృప్తి స్థాయిలను తెలుసుకుంటున్నాం. ఇందుకోసం బోధనాస్పత్రుల్లోని ఎస్పీఎం విభాగాన్ని కార్యక్రమంలో భాగస్వామిని చేశాం. ప్రతి జిల్లాలో ర్యాండమ్గా ఒకటి రెండు గ్రామాలను ఎంపిక చేసి ఫ్యామిలీ డాక్టర్ సేవలు పొందిన వారి నుంచి వైద్య విద్యార్థులు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. సేవలు పొందిన వారిలో అత్యధికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన నెగిటివ్ ఫీడ్ బ్యాక్కు కారణాలు అన్వేషించి, పరిష్కరిస్తున్నాం. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
యెల్లో బ్యాచ్ ఏడుపే.. వైఎస్సార్సీపీ ఎదుగుదల
సాక్షి, అమరావతి/నెట్వర్క్: ఎన్నిక ఏదైనా, ఎప్పుడొచ్చినా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ విజయ పరంపర కొనసాగుతుందని మరోమారు రుజువైంది. ప్రతిపక్షం ఎన్ని కూతలు కూసినా.. యెల్లో మీడియా ఎన్ని విషపు రాతలు రాసినా.. జనాదరణ సంక్షేమ ప్రభుత్వానిదేనని తేలింది. రాష్ట్రంలో ఫ్యాన్ స్పీడ్కు ప్రత్యర్థి పార్టీలు పత్తాలేకుండా పోయాయి. పంచాయతీ ఉప ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయ దుందుభి మోగించారు. రాష్ట్రంలో మొత్తం 66 గ్రామాల సర్పంచ్ పదవులకు గాను 64 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో ఏకగ్రీవమైన 30 సర్పంచ్ పదవులు వైఎస్సార్సీపీ మద్దతుదారులకే దక్కాయి. మిగిలిన 34 సర్పంచ్ పదవుల ఎన్నికల్లో 23 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయ కేతనం ఎగురవేశారు. 10 స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు, ఒక స్థానం జనసేన మద్దతుదారుకు దక్కింది. మొత్తం 1,062 వార్డుల్లో 63 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. ఎన్నికలు జరిగిన 243 వార్డుల్లో 149 వైఎస్సార్సీపీ, 90 టీడీపీ, 4 జనసేన మద్దతుదారులు దక్కించుకున్నారు. మొత్తంగా ఏకగ్రీవాలతో కలిపి 810 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు, 182 వార్డుల్లో టీడీపీ మద్దతుదారులు, 7 వార్డుల్లో జనసేన మద్దతుదారులు గెలుపొందారు. తాజా గెలుపుపై వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోని చలివెందుల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. తాడిపత్రి నియోజకవర్గంలోని జేసీ బ్రదర్స్ సొంత మండలం పెద్దపప్పురులో వైఎస్సార్సీపీ మద్దతు దారులు గెలుపొందారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఆయా గ్రామాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగింది. రెండు గంటల అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రి ఏడు గంటలలోపే విజేతలను ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాఖా కుప్పంలో మరోసారి ఆ పార్టీకి తీవ్ర భంగపాటు ఎదురైంది. జిల్లాల వారీగా ఎన్నికలు జరిగిన స్థానాల్లో ఫలితాలు ఇలా.. ► శ్రీకాకుళం జిల్లాలో నాలుగు సర్పంచ్ స్థానాలకుగాను వైఎస్సార్సీపీ మద్దతుదారులు మూడు చోట్ల, టీడీపీ మద్దతుదారు ఒక చోట గెలుపొందారు. ఎన్నికలు జరిగిన 10 వార్డు సభ్యులకుగాను వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఆరుచోట్ల, టీడీపీ సానుభూతిపరులు నాలుగు చోట్ల విజయం సాధించారు. ► పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. రెండు వార్డు సభ్యులకుగాను వైఎస్సార్సీపీ, టీడీపీ బలపర్చిన అభ్యర్థులు చెరో స్థానాన్ని దక్కించుకున్నారు. ► విజయనగరం జిల్లాలో మూడు సర్పంచ్ స్థానాలను వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు కైవసం చేసుకోగా.. వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారు చెరో స్థానంలో గెలుపొందారు. ఎనిమిది వార్డు సభ్యులకు గాను వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఆరుచోట్ల, టీడీపీ మద్దతుదారులు రెండుచోట్ల విజయం సాధించారు. ► అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు స్థానాలకుగాను వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు రెండు చోట్ల, టీడీపీ మద్దతుదారు ఒకచోట విజయం సాధించారు. ఇక్కడ 14 వార్డు సభ్యులకుగాను 11 మంది వైఎస్సార్సీపీ, ఇద్దరు టీడీపీ మద్దతుదారులు, ఇతరులు ఒకరు గెలుపొందారు. ► అనకాపల్లి జిల్లాలో ఎన్నిక జరిగిన ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ మద్దతుదారుడు గెలుపొందారు. ఈ జిల్లాలో ఏడు వార్డు సభ్యులకుగాను ఐదుచోట్ల వైఎస్సార్సీపీ, రెండుచోట్ల టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ► విశాఖ జిల్లాలో ఎన్నిక జరిగిన రెండు వార్డులనూ వైఎస్సార్సీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ► కాకినాడ జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ ఆరు వార్డు సభ్యుల స్థానాల్లో వైఎస్సార్సీపీ ఒకటి, టీడీపీ–3, జనసేన మద్దతుదారు ఒకచోట, ఇతరులు ఒక చోట విజయం సాధించారు. ► డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నిక జరిగిన ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ మద్దతుదారుడు విజయం సాధించారు. ఆరు వార్డు సభ్యులకు గాను ఐదుచోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు.. ఇతరులు ఒకచోట గెలుపొందారు. ► తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది వార్డు సభ్యుల స్థానాలకుగాను నాలుగింటిని వైఎస్సార్సీపీ, మూడింటిని టీడీపీ, ఒక చోట జనసేన మద్దతుదారులు గెలుపొందారు. ► పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. 10 వార్డు సభ్యులకుగాను ఆరుచోట్ల వైఎస్సార్సీపీ, నాలుగింటిలో టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ► ఏలూరు జిల్లాలో మూడు సర్పంచ్ స్థానాలనూ వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులే గెలుపొందారు. ఈ జిల్లాలో 21 వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో చెరో పది స్థానాల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారులు, ఒకచోట జనసేన సానుభూతిపరుడు విజయం సాధించారు. ► కృష్ణా జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు విజయం సాధించారు. ఇక్కడ మొత్తం ఎనిమిది వార్డు సభ్యుల స్థానాల్లో చెరో నాలుగింటిలో వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ► ఎన్టీఆర్ జిల్లాలో రెండు సర్పంచ్ స్థానాలనూ వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో మూడు వార్డు సభ్యులకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండింటిని వైఎస్సార్సీపీ, ఒకటి టీడీపీ సానుభూతిపరుడు దక్కించుకున్నారు. ► గుంటూరు జిల్లాలో ఒక్క సర్పంచ్ స్థానంలో టీడీపీ సానుభూతిపరుడు గెలుపొందారు. ఇక్కడ ఏడు వార్డు సభ్యులకుగాను రెండుచోట్ల వైఎస్సార్సీపీ, నాలుగుచోట్ల టీడీపీ, ఒకచోట జనసేన బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ► పల్నాడులో ఎన్నికలు జరిగిన 14 వార్డుల్లో 8 చోట్ల వైఎస్సార్సీపీ, ఆరుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ► బాపట్ల జిల్లాలో రెండుచోట్ల సర్పంచ్ ఎన్నికలు జరగ్గా.. వైఎస్సార్సీపీ, జనసేన బలపర్చిన అభ్యర్థులు చెరో స్థానాన్ని చేజిక్కించుకున్నారు. జిల్లాలో మొత్తం 11 వార్డు స్థానాల్లో ఆరింటిని వైఎస్సార్సీపీ, ఐదింటిని టీడీపీ బలపర్చిన అభ్యర్థులు దక్కించుకున్నారు. ► ప్రకాశం జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడ 15 వార్డు సభ్యుల స్థానాల్లో ఎనిమిదింటిని వైఎస్సార్సీపీ, ఏడుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ► నెల్లూరు జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ మద్దతుదారుడు గెలుపొందారు. 11 వార్డు సభ్యులకుగాను 6 చోట్ల వైఎస్సార్సీపీ, ఐదుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ► తిరుపతిలో ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో ఏడు వార్డు సభ్యులకుగాను ఆరుచోట్ల వైఎస్సార్సీపీ, ఒకచోట టీడీపీ మద్దతుదారు గెలుపొందారు. ► చిత్తూరు జిల్లాలో ఏడు వార్డు సభ్యులకుగాను ఆరింట వైఎస్సార్సీపీ, ఒకచోట టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ► కర్నూలులో ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ మద్దతుదారుడు కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో మొత్తం 15 వార్డు సభ్యులకుగాను తొమ్మిది చోట్ల వైఎస్సార్సీపీ, ఆరుచోట్ల టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. ► అనంతపురంలో టీడీపీ సానుభూతిపరుడు ఒక సర్పంచ్ స్థానంలో గెలుపొందారు. ఇక్కడ 11 వార్డు సభ్యుల స్థానాలకుగాను ఆరింట వైఎస్సార్సీపీ, ఐదుచోట్ల టీడీపీ మద్దతిచి్చన అభ్యర్థులు విజయం సాధించారు. ► నంద్యాల జిల్లాలో వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి ఒక సర్పంచ్ స్థానంలో విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 19 వార్డు సభ్యుల స్థానాలకుగాను 16 చోట్ల వైఎస్సార్సీపీ, మూడుచోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ► శ్రీసత్యసాయి జిల్లాలో ఎన్నిక జరిగిన సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. మొత్తం 13 వార్డు సభ్యుల స్థానాలకుగాను ఆరుచోట్ల వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు, ఏడుచోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ► వైఎస్సార్ జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు గెలుపొందారు. ఈ జిల్లాలో మూడు వార్డు స్థానాల్లో రెండు చోట్ల వైఎస్సార్సీపీ, ఒకచోట టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ► అన్నమయ్య జిల్లాలో మూడు వార్డుల్లో రెండింటిని వైఎస్సార్సీపీ, ఒకటి టీడీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. కుప్పంలో చంద్రబాబుకు పరాభవం చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఆరు వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో ఐదుగురు వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్న వార్డులో కూడా వైఎస్సార్సీపీ మద్దతుదారు గెలుపొందడం విశేషం. ఒక్క స్థానంలో మాత్రమే టీడీపీ మద్దతుదారు విజయం సాధించారు. -
Times Now ETG Survey: మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని టైమ్స్ నౌ సర్వేలో మరోసారి స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24 నుంచి 25 లోక్సభ స్థానాల్లో ఆ పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని తెలిపింది. ఏప్రిల్లో నిర్వహించిన సర్వేలో వైఎస్సార్సీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని తేలిన విషయం తెలిసిందే. జూన్ 15– ఆగస్టు 12వ తేదీ మధ్య తాజాగా మరోసారి నిర్వహించిన సర్వేలోనూ అవే ఫలితాలు పునరావృతమయ్యాయని తెలిపింది. ఏప్రిల్లో జరిగిన సర్వే, తాజా సర్వే ఫలితాల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. ఆ తేడా జాతీయ స్థాయి ఫలితాల్లోనే కనిపించింది. ఏపీకి సంబంధించి గతంలో మాదిరిగానే 24 నుంచి 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుస్తుందని తేలింది. కాగా, 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ 49.8 శాతం ఓట్లతో 22 స్థానాల్లో నెగ్గింది. ఈసారి 51.3 శాతం ఓట్లతో మొత్తం స్థానాలను తన ఖాతాలో వేసుకుంటుందని టైమ్స్ నౌ సర్వే తేల్చడం విశేషం. అంటే కిందటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఆ పార్టీ ఓట్ల శాతం 1.50 శాతం పెరుగనున్నట్లు స్పష్టమవుతోంది. వైఎస్సార్సీపీ పట్ల నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణకు ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పేదలకు నిరంతరాయంగా అందిస్తున్న సంక్షేమ పథకాలు, జనాభాలో దాదాపు 90 శాతం మందికి నేరుగా అందుతున్న నగదు సాయం, అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శక పాలన.. వైఎస్సార్సీపీకి జనాదరణను పెంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో 175 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించడం అసాధ్యం కాదని ఆ పార్టీ తొలి నుంచి చెబుతోంది. If BJP joins TDP, they're strengthening Chandrababu Naidu. Else, YSRCP can sweep all 25 seats: @sreeramjvc, on seat share in AP as per @ETG_Research Survey In last 3 LS polls, Cong's highest seat share in K'taka was 9, while BJP has got 25: @Sanju_Verma_ tells @PadmajaJoshi pic.twitter.com/4xm06LEprr — TIMES NOW (@TimesNow) August 16, 2023 -
వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఒక కుటుంబం.. రూ.7.91 లక్షల ప్రయోజనం
నరసన్నపేట: ఈ చిత్రంలో ఉన్నది పట్నాన శంకరరావు, లక్ష్మి కుటుంబం. నరసన్నపేట మేజర్ పంచాయతీ కలివరపుపేట వీధిలో నివాసముంటున్నారు. వీరికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకంగా రూ.7.91 లక్షల ప్రయోజనం కలిగింది. శంకరరావుకు వాహనమిత్ర, భార్య లక్ష్మికి వైఎస్సార్ ఆసరా, తల్లి అన్నపూర్ణకు పింఛన్, కుమారుడు కమలకుమార్కు జగనన్న విద్యాదీవెన, కుమార్తె చంద్రికకు జగనన్న వసతి దీవెన పథకాలు వర్తించాయి. ఇంటి స్థలం, నిర్మాణానికి నిధులు సైతం మంజూరయ్యాయి. ఇచ్ఛాపురం నుంచి నరసన్నపేటకు వలస వచ్చామని, ఇల్లు లేక అనేక ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు సొంత ఇల్లు నిర్మించుకుంటున్నామని ఆనందం వ్యక్తం చేశారు. -
క్యాన్సర్ బాధితులకు ‘ఆరోగ్యసిరులు’
క్యాన్సర్ బారినపడిన పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ కొండంత అండగా ఉంటోంది. 2019 నుంచి ఇప్పటివరకు 2.64 లక్షల మంది బాధితులకు జగన్ ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఉచితంగా చికిత్స అందించింది. ఇందుకోసం రూ.1,801 కోట్లు ఖర్చుచేసింది. ఈ ఫొటోలో మంచంపై ఉన్న మహిళ పేరు కె. సువార్త. ఈమెది పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం అల్లూరివారిపాలెం గ్రామం. పొదుపు సంఘాల ఆర్పీగా పనిచేస్తోంది. భర్త ఆటో డ్రైవర్. కొద్దినెలల క్రితం గొంతులో సమస్య మొదలైంది. క్రమంగా ఆ సమస్య తీవ్రమై ఆహారం తీసుకోవడానికి ఇబ్బందిగా మారింది. దీంతో వైద్యులను సంప్రదిస్తే.. గొంతు క్యాన్సర్గా నిర్ధారించారు. ఉన్నంతలో సంతోషంగా జీవించే ఆ కుటుంబంలో ఆందోళన మొదలైంది. ఇంతలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్కు ఉచిత వైద్యం లభిస్తుందని తెలియడం రాజేశ్కు ఎంతో ఊరటనిచ్చింది. దీంతో విజయవాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి భార్యను తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలో రాజేశ్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకూ నా కుటుంబానికి సీఎం జగన్ ప్రభుత్వం అనేక పథకాలు అందించింది. ఇప్పుడు నా ఇల్లాలు క్యాన్సర్తో బాధపడుతుంటే ఉచిత వైద్యం కూడా అందిస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం లేకుంటే ఈ రోజున నా భార్యను బతికించుకునేందుకు నేను ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చేదో’’.. అని అంటున్నాడు. – సాక్షి, అమరావతి ఇలా సువార్తలాగే క్యాన్సర్ బారినపడ్డ పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం కొండంత అండగా ఉంటోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకం పరిధిని సీఎం జగన్ విస్తరించారు. టీడీపీ ప్రభుత్వంలో 1,059గా ఉన్న ప్రొసీజర్స్ను ఏకంగా 3,257కు పెంచారు. అలాగే, టీడీపీ హయాంలో 200లోపు మాత్రమే క్యాన్సర్ ప్రొసీజర్లు ఉండగా ప్రస్తుతం 400కు పైగా క్యాన్సర్ ప్రొసీజర్లు పథకం పరిధిలోకి వచ్చాయి. లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) బాధితులకు నిర్వహించే అత్యంత ఖరీదైన బోన్ మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ను ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారు. అలాగే, రూ.10 లక్షలు, ఆపైన ఖర్చయ్యే ఈ ప్రొసీజర్ను పూర్తి ఉచితంగా చేస్తున్నారు. ఇలా ఏ తరహా క్యాన్సర్కైనా ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్స లభిస్తోంది. ఒక్క క్యాన్సరే కాకుండా.. క్యాన్సర్కే కాక.. హృద్రోగాలు, కిడ్నీ, లివర్ ఇలా వివిధ రకాల చికిత్సలు ఆరోగ్యశ్రీ ద్వారా బాధితులకు ఉచితంగా అందుతున్నాయి. అదే టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడంతో అప్పట్లో పేదలు పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. కానీ, ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం తీసుకొస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చర్యలతో పేద, మధ్యతరగతి ప్రజలకు భారీ మేలు చేకూరుతోంది. ప్రొసీజర్లను 3,257కి పెంచి 2019 నుంచి ఇప్పటికి 40 లక్షల మందికి ఉచిత వైద్యం అందించారు. చికిత్స అనంతరం విశ్రాంత సమయానికి ఆరోగ్య ఆసరా కింద కూడా అండగా నిలుస్తున్నారు. ఇలా ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కోసం 2019 నుంచి ఇప్పటికి రూ.10వేల కోట్లకు పైగా జగన్ సర్కార్ ఖర్చుచేసింది. ప్రభుత్వమే నా మనవరాలిని బతికించింది.. నా మనవరాలికి బ్లడ్ క్యాన్సర్. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి మాది. మమ్మల్ని ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుంది. ఒకరోజు జీవచ్ఛవంలా పడిపోయిన పాపను ఎత్తుకుని విజయవాడలోని హెచ్సీజీ ఆస్పత్రికి వెళ్లాం. అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా పాపకు వైద్యం మొదలుపెట్టారు. ప్రస్తుతం వైద్యం కొనసాగుతోంది. ఈరోజు నా మనవరాలి ప్రాణాలను సీఎం జగన్ ప్రభుత్వం కాపాడింది. – శాంతకుమారి, విజయవాడ 2.64 లక్షల మందికి వైద్యం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ కింద 2,64,532 మంది క్యాన్సర్ బాధితులకు ఉచితంగా వైద్యం అందించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా రూ.1,801.30 కోట్లు ఖర్చుచేసింది. ఇదే 2014–19 మధ్య టీడీపీ హయాంలో క్యాన్సర్ చికిత్సకు కేవలం రూ.751.56 కోట్లు ఖర్చుచేశారు. అంటే.. నాలుగేళ్లలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం టీడీపీ కంటే రూ.1,049.74కోట్లు అదనంగా ఖర్చుచేసింది. ప్రభుత్వమే నా మనవరాలిని బతికించింది.. నా మనవరాలికి బ్లడ్ క్యాన్సర్. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి మాది. మమ్మల్ని ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుంది. ఒకరోజు జీవచ్ఛవంలా పడిపోయిన పాపను ఎత్తుకుని విజయవాడలోని హెచ్సీజీ ఆస్పత్రికి వెళ్లాం. అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా పాపకు వైద్యం మొదలుపెట్టారు. ప్రస్తుతం వైద్యం కొనసాగుతోంది. ఈరోజు నా మనవరాలి ప్రాణాలను సీఎం జగన్ ప్రభుత్వం కాపాడింది. – శాంతకుమారి, విజయవాడ ఆరోగ్యశ్రీ లేకపోయి ఉంటే.. మా నాన్నకు గొంతు క్యాన్సర్ వచ్చింది. ఆయన కౌలు రైతు. వ్యవసాయం మీద వచ్చే ఆదాయంతో వాళ్లు జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాన్సర్ చికిత్సకు సొంతంగా ఖర్చుపెట్టే స్థోమత లేదు. ఆరోగ్యశ్రీ పథకం మా నాన్నను ఆదుకుంది. పథకం లేకపోయి ఉంటే ఎంతో కష్టంగా ఉండేది. ఈ మేలును ఎప్పటికీ మరువలేం. – ప్రశాంతి, శృంగవృక్షం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా పూర్తి ఉచితంగా వైద్యం.. అన్ని రకాల క్యాన్సర్తో పాటు, రూ.వెయ్యి వైద్యం ఖర్చు దాటే ప్రతి ప్రొసీజర్ను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చింది. అర్హులైన లబ్దిదారులకు ఉచితంగా వైద్యం అందేలా చూస్తున్నాం. చికిత్స అనంతరం రోగుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. మెజారిటీ శాతం సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పథకాన్ని మరింతగా మెరుగుపరచడానికి నిరంతరం కసరత్తు చేస్తున్నాం. – ఎంఎన్ హరేంధిరప్రసాద్, సీఈఓ, డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
చంపిన వాళ్లే సానుభూతికి ప్రయత్నిస్తున్నారు
సత్తెనపల్లి: వంగవీటి మోహనరంగా తనకు ప్రాణహాని ఉందని తెలిసి రక్షణ కోరితే.. ఆనాటి ప్రభుత్వం రక్షణ కల్పించక పోగా హత్య చేశారని, చంద్రబాబు, నాటి హోంమంత్రి ప్రోద్బలంతోనే ఆ హత్య జరిగిందని రాష్ట్ర మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. పేదల పక్షపాతి రంగాను కుట్ర చేసి దారుణంగా చంపిన వాళ్లే తిరిగి సానుభూతి కోసం ఆయన జయంతి, వర్థంతిలను నిర్వహిస్తున్నారని టీడీపీ నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు. వంగవీటి మోహనరంగా జయంతిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంగళవారం ఆయన కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పలువురు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
రంగా పేరు తలిచే అర్హత టీడీపీకి లేదు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): పేద, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన వంగవీటి మోహనరంగాను పొట్టన పెట్టుకుంది ఎవరో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. రంగా వెన్నులో దిగిన కత్తి, ఆయనపై విసిరిన బాంబు.. టీడీపీది కాదా.. చంద్రబాబుది కాదా.. సైకిల్ది కాదా అని ప్రశ్నించారు. రంగాను చంపిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి ఆయన బొమ్మ పెట్టుకునే అర్హత కూడా లేదన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే రంగా ఆత్మ శాంతిస్తుందా ప్రశ్నించారు. వంగవీటి మోహనరంగా 76వ జయంతి వేడుకలను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నేత ఆకుల శ్రీనివాసకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించన ఈ కార్యక్రమానికి మంత్రి జోగి రమేశ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి రమే‹Ùనాయుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. రంగా వ్యక్తి కాదు ఒక శక్తి.. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా పేరు పలికే అర్హత పవన్కళ్యాణ్కు లేదన్నారు. చంద్రబాబు పల్లకిని పవన్ మోస్తే.. రంగా అభిమానులు కూడా మోయాలా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు, పవన్ కళ్యాణ్ దయచేసి రంగా పేరును వాడొద్దని అన్నారు. రంగా పేరును వాడే అర్హత వైఎస్సార్ అభిమానులమైన తమకే ఉందన్నారు. రంగా పేరును కలకాలం నిలిచేలా చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. రంగా ఒక వ్యక్తి కాదని శక్తి అని పేర్కొన్నారు. ఆయన అందరి వాడన్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రంగా విధానాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని, కాపులకు రాజకీయంగా, ఆర్థికంగా అండగా నిలిచారన్నారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ అందరిలోనూ ధైర్యం నింపగల శక్తిమంతుడు రంగా అని కొనియాడారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానంటే వైఎస్సార్, రంగానే కారణమన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు వంగవీటి రంగా ఒక ఐకాన్ అని పేర్కొన్నారు. మంచి చేస్తున్న వారికి అండగా నిలవాల్సిన అవసరం కాపులకు ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా రంగాతో కలిసి నడిచిన పది మందిని ఘనంగా సత్కరించారు. అనంతరం రంగా జీవిత చరిత్రలో కొన్ని అంశాలతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎపీఎండీసీ చైర్మన్ పుణ్యశీల, వైఎస్సార్సీపీ నేతలు భవకుమార్, మహమూద్, రాధారంగా మిత్రమండలి నాయకులు చెన్నుపాటి శ్రీను పాల్గొన్నారు. -
అల్లూరే అందరికీ స్ఫూర్తి
సాక్షి,అమరావతి: బ్రిటీష్ వలస పాలకులకు వ్యతిరేకంగా, ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు అని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్, జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి కొనియాడారు. ఇంతటి ఘనచరిత్ర కలిగిన స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరిని తరతరాలవారు స్మరించుకునేలా, సీఎం వైఎస్ జగన్ ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టా రని చెప్పారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరిగాయి. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విజయసాయిరెడ్డి ప్రసంగిస్తూ అల్లూరి స్ఫూర్తితో, ఆదివాసీల హక్కుల్ని కాపాడటంలోనూ, వారికి అన్నిరకాలుగా అండదండలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందన్నారు. గిరిజనులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశామని, వారి ఆధీనంలోని పోడు భూముల వ్యవసాయాన్ని ఎవరూ ఆటంకపరచకుండా వ్యవసాయ పట్టాల్ని ఇచ్చామని వివరించారు. శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ అల్లూరి జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కల్యాణి, మొండితోక అరుణ్కుమార్, పార్టీ ఎస్టీ విభాగ అధ్యక్షుడు హనుమంతు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే జగనన్న సురక్ష లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హత ఉన్న 99 శాతం మందికి సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్ అందించారని.. సాంకేతిక కారణాలతో లబ్ధి పొందని ఒక శాతం లబ్ధిదారులకు కూడా ప్రయోజనం చేయాలన్న లక్ష్యంతోనే ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చెప్పారు. శనివారం రాష్టవ్యాప్తంగా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞ్ఞప్తి చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మండలానికి రెండు చొప్పున 1,305 సచివాలయాల్లో క్యాంపులు నిర్వహించారని తెలిపారు. లబ్ధిదారులకు అవసరమైన ధ్రువపత్రాలను అక్కడికక్కడే అధికారులు జారీ చేశారని వెల్లడించారు. ఇంకా ఏమన్నారంటే... దేశ చరిత్రలో ఇదే ప్రథమం: మంత్రి మేరుగు కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా.. ఎలాంటి లంచాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ రూపంలో రూ.2.23 లక్షల కోట్లను జమ చేశారు. దేశ చరిత్రలో ఈ స్థాయిలో డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన దాఖలాలు లేవు. చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే.. వారికి లబ్ది చేకూర్చడానికి అవసరమైన సర్టిఫికెట్లు ఉచితంగా జారీ చేయడం, వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా జగనన్న సురక్ష పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. వలంటీర్లు, సచివాలయాల సిబ్బంది, గృహసారథులు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి.. వారి సమస్యలను తెలుసుకుని టోకెన్లు ఇస్తారు. శనివారం నుంచి ఈ నెల 30 వరకూ సచివాలయాల పరిధిలో క్యాంపులు నిర్వహించి.. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్ల జారీ, పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం వంటి సమస్యలను మండల, సచివాలయ అధికారులు దగ్గరుండి పరిష్కరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. అధికారులే ప్రజల వద్దకు వస్తున్నారు ఎక్కడైనా మాకు సమస్యలు ఉన్నాయని ప్రజలు అధికారుల వద్దకు వస్తారు. కానీ.. సీఎం వైఎస్ జగన్ మాత్రం అధికారులనే ప్రజల వద్దకు పంపి వారి సమస్యలు ఏమిటో తెలుసుకుని పరిష్కరించేలా క్యాంపులు ఏర్పాటు చేయడం సుపరిపాలనకు తార్కాణం. ఈ నెలలోనే విద్యార్థులు కళాశాలలకు వెళ్తారు కాబట్టి వారికి కావాల్సిన సర్టిఫికెట్లను ముందుగానే ఇవ్వడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు ఆగస్టు నుంచే సంక్షేమ పథకాల క్యాలెండర్ కూడా అమలవుతుంది. -
‘జన్ గన్ కా మన్’ సర్వే: ఫ్యాను హోరు.. కారు జోరు..! కమల వికాసం
న్యూఢిల్లీ/ సాక్షి, అమరావతి: దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే.. బీజేపీ కూటమే మూడోసారి అధికారంలోకి వస్తుందని తాజా అధ్యయనం తేల్చింది. ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 25 ఎంపీ సీట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని, తెలంగాణలోనూ బీఆర్ఎస్ 9 నుంచి 11 సీట్లతో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుందని పేర్కొంది. ‘జన్ గన్ కా మన్’ పేరిట ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘టైమ్స్ నౌ–నవభారత్’ సర్వే చేసి ఈ మేరకు నివేదికను తాజాగా విడుదల చేసింది. అన్నీ సీట్లూ వైఎస్సార్ సీపీకే.. ఆంధ్రప్రదేశ్లో వినూత్నమైన సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలతో సుపరిపాలన అందిస్తూ దూసుకెళ్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి ప్రజాదరణ మరింత పెరిగినట్టు సర్వేలో తేటతెల్లమైంది. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాలకుగాను 22 సీట్లను గెలుచుకున్న వైఎస్సార్సీపీ.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే 51శాతం ఓట్లతో 24 నుంచి 25 స్థానాలు దక్కించుకుంటుందని సర్వే వెల్లడించింది. ఇక తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతవడం ఖాయమని, ఆ పార్టీ 36 శాతం ఓట్లకే పరిమితం అవుతుందని, ఒక్క సీటైనా కచ్చితంగా గెలిచే అవకాశం కనిపించడం లేదని పేర్కొంది. లోక్సభలో ఎన్డీయే, కాంగ్రెస్ కూటముల తర్వాత వైఎస్సార్ సీపీ అత్యధిక స్థానాలతో మూడో స్థానంలో నిలుస్తుందని వెల్లడించింది. తెలంగాణలో బీఆర్ఎస్ హవా తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ 37 శాతం ఓట్లతో 9 నుంచి 11 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే పేర్కొంది. 29.2 శాతం ఓట్లతో కాంగ్రెస్ 2 నుంచి 3 స్థానాలు, 25.3 శాతం ఓట్లతో బీజేపీ 3 నుంచి 5 స్థానాలు సాధించవచ్చని తెలిపింది. మూడోసారీ బీజేపీ సర్కారే.. జాతీయ స్థాయిలో వరుసగా మూడోసారి బీజేపీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని సర్వే పేర్కొంది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మొత్తం 543 లోక్సభ స్థానాలకుగాను.. బీజేపీ, దాని మిత్రపక్షాలు (ఎన్డీయే) కలసి 285 నుంచి 325 సీట్లు సాధిస్తాయని వివరించింది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కలసి 111 నుంచి 149 సీట్లకే పరిమితం అవుతాయని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 20 నుంచి 22 లోక్సభ సీట్లు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ 12 నుంచి 14 సీట్లు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆప్ 4 నుంచి 7 స్థానాలు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ 4 నుంచి 8 స్థానాలకు పరిమితం అవుతాయని స్పష్టం చేసింది. ఇతరులు 18 నుంచి 38 సీట్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. 2019 ఎన్నికలకంటే మిన్నగా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో 50శాతం ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో విజయకేతనం ఎగురవేయడం ద్వారా రికార్డు సృష్టించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే మేనిఫెస్టోలోని 95 శాతం హామీలను అమలు చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశం మొత్తం చూపును తన వైపు తిప్పుకొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. అర్హతే ప్రామాణికంగా ఎలాంటి వివక్ష, లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారు. నాలుగేళ్లలో సంక్షేమ పథకాల కింద డీబీటీ పద్ధతిలో పేదల ఖాతాల్లో రూ. 2.23 లక్షల కోట్లు జమ చేశారు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిపాలను వికేంద్రీకరించి ప్రజల ఇంటి గుమ్మం వద్దనే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. దాంతో సీఎం వైఎస్ జగన్కు ప్రజల్లో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ చారిత్రక విజయాలు సాధించడమే ఇందుకు తార్కాణం. ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే 2019 ఎన్నికల కంటే మిన్నగా.. అంటే 51 శాతం ఓట్లతో 24 నుంచి 25 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని టైమ్స్ నౌ–నవభారత్ సర్వేలో వెల్లడైంది. ‘వైనాట్ 175’ అంటూ ముఖ్యమంత్రి చెబుతున్న విషయానికి ఈ సర్వే దగ్గరగా ఉండటం గమనార్హం.