Bhadradri
-
భక్తుల పాలిట కొంగుబంగారం.. బాలాజీ
బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన వెంకటేశ్వరస్వామి ఆలయం (ఇన్సెట్) స్వామివారి ఉత్సవ విగ్రహాలు అన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): అన్నపురెడ్డిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఈనెల 12 నుంచి 17 వరకు ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 14వ తేదీ రాత్రి 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరగనుంది. 17న శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. చారిత్రక నేపథ్యం ఇలా.. కాకతీయుల సామ్రాజ్యంలో అన్నపురెడ్డి అనే సేనాని ఈ ప్రాంతానికి వచ్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆ పేరుతోనే గ్రామానికి అన్నపురెడ్డిపల్లి అని నామకరణం జరగగా.. ఆయన ఇక్కడ చిన్న గుడి నిర్మించారు. అంతేకాక ఈ ప్రాంతంలో రాముడు చెరువు, నల్లచెరువును కూడా నిర్మాణం చేశారు. అనంతరం ఈ ప్రాంతానికి వచ్చిన కళ్లూరి వెంకటప్పయ్య మాత్యులు 1870 ప్రాంతంలో గుడిని విస్తరింపజేసినట్లు తెలుస్తోంది. 1969లో ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లింది. 1974లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆధ్వర్యంలో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశారు. నైజాం నవాబు కాలంలోనే అప్పటి నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వేలాది ఎకరాల భూమిని అగ్రహారంగా ఇచ్చినట్లు సమాచారం. అందులో ప్రస్తుతం 2,300 ఎకరాల భూములు స్వామివారికి ఉన్నాయి. అన్ని ఏర్పాట్లు చేశాం స్వామివారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలువైపుల నుంచీ వేలాది మంది భక్తులు వస్తారు. వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. చలవ పందిళ్లు వేయించాం. భక్తుల కోసం ప్రత్యేకంగా సత్తుపల్లి, కొత్తగూడెం డిపోల నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తాయి. –పాకాల వెంకటరమణ, ఆలయ ఇన్చార్జ్ మేనేజర్నేటి నుంచి అన్నపురెడ్డిపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు -
ఐటీసీ సహకారంతో ఆర్థిక భరోసా
బూర్గంపాడు: నిరుపేద, ఒంటరి, వితంతు మహిళలకు వృత్తి విద్యా శిక్షణ ఇచ్చి, వారి జీవనోపాధికి ఐటీసీ సహకారం అందిస్తుందని ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. సారపాకలోని ఐటీసీ కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం జరిగిన ఐటీసీ బంగారు భవిష్యత్ కార్యక్రమానికి పీఓతో పాటు పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. పేద మహిళల ఆసక్తిని గుర్తించి వారికి అయా రంగాల్లో ఐటీసీ శిక్షణ ఇస్తుందన్నారు. ఐటీసీ బంగారు భవిష్యత్ కార్యక్రమాన్ని మరింతగా విస్తరించి ఏజెన్సీ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ఐటీసీ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. సీఎస్సార్ నిధులతో గ్రామాల్లో మౌలికవసతులు, విద్య, వైద్య రంగాల్లో అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఏజెన్సీలోని పేదల ఆర్థికాభివృద్ధికి ఐటీసీ అన్ని విధాల చేయూతనందించడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఐటీసీ బంగారు భవిష్యత్ కార్యక్రమంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో ఐటీసీ పీఎస్పీడీ యూనిట్ హెడ్ శైలేంద్రసింగ్, జనరల్ మేనేజర్(హెచ్ఆర్) శ్యామ్కిరణ్, చెంగలరావు తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్, ఎమ్మెల్యేలు పాయం, తెల్లం -
కొలిక్కివచ్చిన స్థల సేకరణ!
25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ స్థలంపై చిక్కుముడి వీడే అవకాశం ఉంది. మున్సిపల్ డంప్ యార్డు నుంచి రైల్వే లైన్ వరకు ఉన్న 25 ఎకరాల స్థలంలో భవన నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అయితే అక్కడి రైతులు కొందరు ఆ భూమి తమదంటూ కోర్టును ఆశ్రయించారు. సదరు రైతుల చూపుతున్న భూమి ఆ సర్వే నంబర్లో లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇదే విషయం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు సర్వే చేశారు. రెండు మూడు రోజుల్లో స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేస్తామని సింగరేణి జీఎం వి.కృష్ణయ్య, తహసీల్దార్ కె.రవికుమార్ కలెక్టర్ జితేష్కు, ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వివరించారు. ఐటీఐ, ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాలకు ఈ నెల 17న మంత్రులు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ఆలోగా అధికారులు స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తిచేయాల్సిఉంది. కాగా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు సుమారు రూ. 200 కోట్లు, ప్రభుత్వాస్పత్రికి రూ.37 కోట్లు, ఐటీఐకి రూ.11 కోట్లు.. మొత్తం రూ.248 కోట్లను ప్రభుత్వం కేటాయించిన విషయం విదితమే. ఇల్లెందు: నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ ఐటీఐ, 100 పడకల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలకు స్థలాల ఎంపిక తుది దశకు చేరింది. ఇటీవల కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఇల్లెందులోని మెయిన్రోడ్లో ఉన్న సింగరేణి స్థలాలను స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి పరిశీలించి సుముఖత వ్యక్తం చేశారు. కొందరు సింగరేణి ఉద్యోగులు క్వార్టర్లలో నివాసం ఉంటుండగా, వారిని మరోచోటకు తరలించాల్సి ఉంది. వారం పది రోజుల్లో సింగరేణి సీఎండీ నుంచి కూడా ప్రభుత్వ ఐటీఐ స్థలం కోసం అనుమతి వచ్చే అవకాశం ఉంది. మూడు ప్రధాన భవనాల నిర్మాణాలకు 35 ఎకరాల స్థలాల ఎంపిక దాదాపుగా ఒక కొలిక్కివచ్చింది. నాన్వెజ్ మార్కెట్, సింగరేణి స్థలంలో ఆస్పత్రి, ఐటీఐ ఇల్లెందులో రూ.4.50 కోట్లతో గత ప్రభుత్వం వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం చేపట్టింది. నిధుల్లేక పనులు నిలిచిపోగా మరో వైపు పట్టణానికి దూరంగా ఉండటంతో ప్రజలు, వ్యాపారులు వచ్చే అవకాశం ఉండదని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు పూర్తిగా నిలిపివేసింది. తాజాగా ఆ స్థలాన్ని ప్రభుత్వ ఐటీఐ భవనం కోసం కేటాయించాలని నిర్ణయించారు. పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి నుంచి ఉప్పిడి మిల్లు వరకు సుమారు అర కిలోమీటర్ మేర సింగరేణి క్వార్టర్లు ఉన్నాయి. వాటిలో 15 మంది సింగరేణి ఉపాధ్యాయులు, కార్మికులను అయ్యప్ప టెంపుల్ ఏరియా, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వెనుక ఉన్న ఖాళీ క్వార్టర్లకు తరలించనున్నారు. ఇక ప్రైవేటు వ్యక్తులను క్వార్టర్ల నుంచి ఖాళీ చేయించనున్నారు. మార్కెట్, సింగరేణి క్వార్టర్ల స్థలం కలుపుకుని రోడ్డు వెంట ఉన్న దాదాపు పదెకరాలను 100 పడకల ఆస్పత్రి, ఐటీఐల కోసం ప్రభుత్వం తీసుకోనుంది. దీంతో ప్రభుత్వాస్పత్రి, ఐటీఐ ప్రభుత్వ నడిబొడ్డున ఏర్పాటుకానున్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్, ప్రభుత్వాస్పత్రి, ఐటీఐలకు 35 ఎకరాలు గుర్తింపు సుమారు రూ.248 కోట్లతో మూడు ప్రధాన భవనాల నిర్మాణం ఇల్లెందులో ఈ నెల 17న మంత్రులు శంకుస్థాపన చేసే అవకాశం -
శ్రమించారు.. గ్రూప్స్లో మెరిశారు
ఇల్లెందు: జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు గ్రూప్– 1, గ్రూప్–2 పరీక్షల్లో ప్రతిభ చూపారు. ఇల్లెందు ఎస్ఐ దొడ్డపనేని సందీప్ కుమార్ గ్రూపు–1లో సత్తా చాటారు. మెయిన్స్ పరీక్షలో 502 మార్కులు సాధించారు. ఇప్పటివరకు ఆరు ఉద్యోగాలు కై వసం చేసుకుని ప్రస్తుతం ఎస్ఐగా పని చేస్తున్నారు. ఆయనది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామం కాగా, తల్లిదండ్రులు సర్వేశ్వరరావు, పద్మ వ్యవసాయం చేస్తున్నారు. గ్రూప్–4, రైల్వేలో రెండు ఉద్యోగాలు, పంచాయతీ కార్యదర్శి, ఫారెస్టు శాఖలో కొలువు కొట్టారు. తాజాగా గ్రూప్–1 సాధించడంతో ఆర్డీఓ లేదా డీఎస్పీ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. గ్రూప్–2లో 61వ ర్యాంక్ఇల్లెందురూరల్: మండలంలోని ఇందిరానగర్ గ్రామానికి చెందిన పేరాల రాజ్కిషోర్ తొలి ప్రయత్నంలోనే గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 61వ ర్యాంకు సాధించాడు. కోచింగ్కు వెళ్లకుండా ఇంటివద్దే ఆన్లైన్లో గ్రంథాలయాల్లో చదివి పరీక్షకు సన్నద్ధమయ్యాడు. కుమారుడు విజయం సాధించడంతో తల్లిదండ్రులు సరిత, రాజేంద్రప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు.గ్రూప్–1లో సత్తా చాటిన ఎస్ఐ -
సీసీ కెమెరాల ఏర్పాటు
అశ్వారావుపేట: అశ్వారావుపేట సరిహద్దు చెక్పోస్టు వద్ద పౌరసరఫరాల శాఖ అధికారులు సోమవారం సీసీ కెమెరాలను అమర్చారు. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా రవాణా అవుతున్న రేషన్ బియ్యంపై ‘బియ్యం దందాను ఆపేదెవరు’అనే శీర్షికన ఈ నెల 5న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాలతో నిఘా పెంచారు. ఇప్పటికే సూర్యాపేట జిల్లా మెట్పల్లి, కోదాడ వద్ద కెమెరాలు ఏర్పాటు చేశామని, తాజాగా అశ్వారావుపేట వద్ద కూడా ఏర్పాటు చేసినట్లు ఎగ్జిక్యూటివ్ ప్రాజెక్ట్ అసోసియేట్ శ్రవణ్, అసిస్టెంట్ అక్బర్ తెలిపారు. వారి వెంట అశ్వారావుపేట సివిల్ సప్లయీస్ డీటీ గుర్రం ప్రభాకర్ ఉన్నారు.రేపు జిల్లా సీనియర్ హాకీ మెన్ ఎంపికలుకొత్తగూడెంటౌన్: లక్ష్మీదేవిపల్లిలోని రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల 13న సీనియర్ హాకీ మెన్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బట్టు ప్రేమ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభ చూపినవారిని ఈనెల 16 నుంచి 18 తేదీ వరకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు హాకీ ఇండియా గుర్తింపు కార్డు, ఆధార్కార్డు తీసుకురావాలని సూచించారు. యువికకు దరఖాస్తుల ఆహ్వానంకొత్తగూడెంఅర్బన్: యువశాస్త్రవేత్తలను తయారుచేసేందుకు ఇస్రో చేపట్టిన కార్యక్రమం యువికకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి, జిల్లా సైన్స్ అధికారి చలపతిరాజు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. 9వ తరగతి విద్యార్థులు అర్హులని, ఈ నెల 23వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 7న ఎంపికై న జాబితా విడుదల చేస్తారని, ఎంపికై న విద్యార్థులకు మే 19 నుంచి 30వ తేదీ వరకు ఇస్రోకు చెందిన ఏడు కేంద్రాల్లో శిక్షణ ఇస్తారని వివరించారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారిని సంప్రదించాలని కోరారు. ఎకై ్సజ్ ఉద్యోగులకు రివార్డులుఖమ్మంక్రైం: గంజాయి రవాణా, అమ్మకం కేసుల్లో నిందితుల అరెస్ట్, శిక్ష పడేలా దర్యాప్తు చేపట్టిన ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎకై ్సజ్ ఉద్యోగులు రివార్డులు అందుకున్నారు. వీరిని హైదరాబాద్లో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి అభినందించి రివార్డులు అందజేశారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేష్, ఖమ్మం, కొత్తగూడెం ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు నాగేందర్రెడ్డి, జానయ్య, మణుగూరు, భద్రాచలం సీఐలు రాజిరెడ్డి, రహీమున్నీసాబేగంతో పాటు రాజు, సర్వేశ్వరరావు, రవికుమార్, కానిస్టేబుళ్లు మారేశ్వరావు, నాగేశ్వరరావు, పగిడిపర్తి గోపి రివార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. ఏసీబీకి చిక్కిన ఎకై ్సజ్ ఉద్యోగి ఖమ్మంక్రైం: ఉద్యోగ విరమణ సమయం సమీపించినా తీరు మార్చుకోలేని ఎకై ్సజ్ ఉద్యోగి ఒకరు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం బస్ డిపో రోడ్డులో సాయికృష్ణ బార్ నిర్వహించిన శ్రీనివాస్ ఆరేళ్ల క్రితం మూసివేశాడు. మళ్లీ తెరవాలని నిర్ణయించుకున్న ఆయన ఏడాది లైసెన్స్ ఫీజు చెల్లించగా ఎకై ్సజ్ శాఖ అధికారులు అనుమతించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో బార్ లైసెన్స్కు జిరాక్స్ కాపీ కావాలని న్యాయవాది చెప్పడంతో శ్రీనివాస్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ భూక్యా సోమ్లానాయక్ను సంప్రదించాడు. ఇందుకోసం రూ.2వేలు డిమాండ్ చేయగా ఆర్థిక సమస్యలతో అంత ఇచ్చుకోలేనని చెప్పాడు. అయితే, లైసెన్స్ శ్రీనివాస్ తల్లి పేరిట ఉన్నందున ఆమెనే తీసుకురావాలని సూచించాడు. కానీ వృద్ధురాలైన ఆమె రాలేదని చెప్పినా ససేమిరా అనడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వారి సూచన మేరకు రూ.1,500 ఇస్తానని శ్రీనివాస్ చెప్పగా సోమ్లానాయక్ అంగీకరించాడు. ఈమేరకు నగదుతో శ్రీనివాస్ను పంపించి మాటువేసిన ఏసీబీ అధికారులు డబ్బు తీసుకుంటుండగా సోమ్లాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోన్నారు. కాగా, ఏసీబీ దాడి జరిగిన సమయాన ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నాగేందర్రెడ్డి సహా పలువురు అధికారులు ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గాను హైదరాబాద్లో రివార్డులు అందుకుంటుండడం గమనార్హం. 2012లో ఇదే ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఓ ఉద్యోగి పట్టుబడిన విషయాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు. -
పీహెచ్సీని సందర్శించిన డీఎంహెచ్ఓ
చండ్రుగొండ : చండ్రుగొండలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ మంగళవారం సందర్శించారు. ‘పీహెచ్సీలో చెట్లు దగ్ధం’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఆస్పత్రిని సందర్శించి డాక్టర్ తనుజ, సిబ్బందితో మాట్లాడి చెట్ల దగ్ధమైన సంఘటనపై ఆరా తీశారు. కాలిపోయిన ప్రదేశాన్ని శుభ్రం చేయించి కొత్తగా మొక్కలు నాటించాలని సూచించారు. అనంతరం పీహెచ్సీని, రికార్డులను పరిశీలించారు. ఆ తర్వాత ఎర్రగుంట పీహెచ్సీని సందర్శించి అసంక్రమిత వ్యాధులపై సర్వే పక్కాగా నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆరోగ్య ఉపకేంద్రాల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. డాక్టర్ ప్రియాంక, డీపీఎంఓ శ్రీనివాస్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
కేసులు సత్వరమే పరిష్కరించాలి
కొత్తగూడెంటౌన్: కేసుల్లో ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నిక్షిప్తం చేయాలని, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ రోహిత్రాజు సూచించారు. మంగళవారం కొత్తగూడెంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీసు స్టేషన్ల వారీగా కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులతో సమన్వయం చేసుకోవాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీలో అలసత్వం వహించొద్దన్నారు. నేరస్తులకు శిక్షపడేలా చేసి కన్వీక్షన్ రేటు పెంచాలని కోరారు. ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, నాగరాజురెడ్డి, ఎస్సైలు హారిక, హసీనా తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్రాజు -
బీటీపీఎస్కు జనరేటర్ ట్రాన్స్ఫార్మర్..
పాల్వంచరూరల్: భారీ వాహనంలో పెద్ద జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ను మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు తరలిస్తున్నారు. మంగళవారం పాల్వంచలోని బీసీఎం జాతీయ రహదారి మీదుగా విద్యుత్ కేంద్రానికి తరలిస్తుండగా పలువురు ఆసక్తిగా తిలకించారు. మణుగూరు బీటీపీఎస్లో గత జూన్ చివరిలో జీటీ(జనరేటర్ ట్రాన్స్ఫార్మర్)–1 పిడుగు పడి కాలిపోయింది. దీంతో మరమ్మతులకు తమిళనాడు రాష్ట్రంలోని చైన్నెకు తరలించారు. మరమ్మతులు పూర్తికావడంతో సుమారు 15 రోజుల క్రితం 112 టైర్లు కలిగిన భారీ వాహనంపై జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుని ఇంజనీర్లు బయల్దేరారు. పాల్వంచ మీదుగా వెళ్తున్న వాహనం బుధవారం మణుగూరుకు చేరే అవకాశం ఉంది. -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.16న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలుకొత్తగూడెంటౌన్: దమ్మపేటలోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈనెల 16న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మహీదర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో జావెలిన్త్రో, 100, 400 మీటర్ల పరుగుపందెంలో బాలురు, బాలికలు, సీ్త్ర, పురుషులకు పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇక్కడ ప్రతిభ చాటిన క్రీడాకారులను ఈనెల 23న హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని, వివరాలకు కోచ్ జె.కృష్ణ(70135 52707)ను సంప్రదించాలని సూచించారు. స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులుభద్రాచలం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యాన కొనసాగుతున్న మోడల్ స్పోర్ట్స్ స్కూళ్లలో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. కిన్నెరసానిలోని బాలురు, కాచనపల్లిలోని బాలికల స్పోర్ట్స్ స్కూళ్లతో పాటు హైదరాబాద్ బోయిన్పల్లిలోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో ఐదో తరగతికి ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు డివిజన్ స్థాయిలో ఈనెల 16 నుంచి 18వరకు, జిల్లాస్థాయిలో 26 నుంచి 28వ తేదీ వరకు పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 9 – 11 ఏళ్ల వయస్సు కలిగిన గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు అర్హులని వెల్లడించారు. భద్రాద్రి జిల్లా విద్యార్థులు కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో, ఖమ్మం జిల్లా విద్యార్థులు ఉసిరికాయలపల్లిలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జరిగే డివిజన్ స్థాయి పోటీలకు అన్ని ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. అపై జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు తుది ఎంపిక పోటీలు నిర్వహించి ప్రవేశాలకు అర్హులను ఎంపిక చేస్తామని పీఓ తెలిపారు. సింగరేణిలో లైజన్ ఆఫీసర్ల నియామకంసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి వ్యాప్తంగా విస్తరించి ఉన్న 11 ఏరియాలకు 11 మంది లైజన్ ఆఫీసర్లను యాజమాన్యం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేట్ ఏరియాకు వి.మురళి, కొత్తగూడెం ఏరియాకు ఆవధూత శ్రీధర్, ఇల్లెందుకు జి.నాగశేషు, మణుగూరుకు పి, వీరభద్రరావు, ఆర్జీ–1కు పి.శ్రీనివాస్, ఆర్జీ–2కు పి.వేణుగోపాల్. ఆర్జీ –3కి చంద్రశేఖర్, భూపాలపల్లి ఏరియాకు పి.బాలరాజు, బెల్లంపల్లికి ఎం,మధుకుమార్, మందమర్రికి ఎండీ ముస్తఫా, శ్రీరాంపూర్ ఏరియాకు ఎన్. సత్యనారాయణను నియమిస్తున్నట్లు ప్రకటించింది. -
ఐటీసీ సహకారంతో ఆర్థిక భరోసా
బూర్గంపాడు: నిరుపేద, ఒంటరి, వితంతు మహిళలకు వృత్తి విద్యా శిక్షణ ఇచ్చి, వారి జీవనోపాధికి ఐటీసీ సహకారం అందిస్తుందని ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. సారపాకలోని ఐటీసీ కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం జరిగిన ఐటీసీ బంగారు భవిష్యత్ కార్యక్రమానికి పీఓతో పాటు పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. పేద మహిళల ఆసక్తిని గుర్తించి వారికి అయా రంగాల్లో ఐటీసీ శిక్షణ ఇస్తుందన్నారు. ఐటీసీ బంగారు భవిష్యత్ కార్యక్రమాన్ని మరింతగా విస్తరించి ఏజెన్సీ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ఐటీసీ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. సీఎస్సార్ నిధులతో గ్రామాల్లో మౌలికవసతులు, విద్య, వైద్య రంగాల్లో అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఏజెన్సీలోని పేదల ఆర్థికాభివృద్ధికి ఐటీసీ అన్ని విధాల చేయూతనందించడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఐటీసీ బంగారు భవిష్యత్ కార్యక్రమంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో ఐటీసీ పీఎస్పీడీ యూనిట్ హెడ్ శైలేంద్రసింగ్, జనరల్ మేనేజర్(హెచ్ఆర్) శ్యామ్కిరణ్, చెంగలరావు తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్, ఎమ్మెల్యేలు పాయం, తెల్లం -
పేరు మారినా సేవలు అంతంతే..
● సమస్యలకు నిలయంగా అశ్వారావుపేట పట్టణం ● ఇన్చార్జ్లతోనే నెట్టుకొస్తున్న మున్సిపల్ పాలన అశ్వారావుపేట : ఎన్నో ఏళ్ల ఎదురుచూపుల తర్వాత ఎట్టకేలకు అశ్వారావుపేట మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. కానీ సేవలు మాత్రం ఇంకా గ్రామ పంచాయతీ స్థాయిలోనే ఉన్నాయి. ఈ మున్సిపాలిటీకి ఇన్చార్జ్ కమిషనర్, జేఏఓ, టీపీఓలను నియమించిన ప్రభుత్వం.. ఆ తర్వాత పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తోంది. రెగ్యులర్ అధికారులను నియమించకపోవడం, అవసరమైన నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. బిల్ కలెక్టర్లు వసూలు చేసే పన్నుల జమ, ఖర్చులు చూసుకోవడం మినహా మరో పనేమీ జరగడం లేదు. ఇంటి అనుమతుల కోసం వచ్చేవారిని ఎల్ఆర్ఎస్ పేరుతో వెనక్కు పంపుతున్నారు. పారిశుద్ధ్య పనులు, చెత్త సేకరణ అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. అశ్వారావుపేట, గుర్రాలచెరువు, పేరాయిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయాల్లో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్లే ప్రస్తుతం మున్సిపాలిటీలో విధులు నిర్వర్తిస్తున్నారు. పట్టణ పరిధిలోని జాతీయ రహదారిని ఊడ్చిన దాఖలాలు లేవు. రహదారి మొత్తం దుమ్ము, ధూళితో దర్శనమిస్తుండగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక జాతీయ రహదారి వెంట కూడా వీధి దీపాలు వెలగడం లేదు. తాగునీటి సరఫరా కూడా గతం కంటే మెరుగుపడలేదు. ఖమ్మం రోడ్లోని ఓ రెస్టారెంట్ వద్ద తాగునీటి పైప్లైన్ నెల రోజులుగా లీకవుతూ నీళ్లు వృథాగా పోతున్నాయి. ఆ తర్వాత అవే మురికి నీరు పైపులైన్ ద్వారా సరఫరా అవుతున్నాయి. ప్రతిరోజూ ఇద్దరు, ముగ్గురు వచ్చి పగటి వేళలో నీళ్లు తోడి పోతుండగా మరుసటి రోజు తెల్లారేసరికి మళ్లీ గుంత నిండుతోంది. ఇదే నిత్యకృత్యం తప్ప సమస్య పరిష్కారం కాలేదు. గ్రామపంచాయతీలుగా ఉన్నప్పటి తాగునీటి ట్యాంకర్లను మోడల్ కాలనీలో అనధికారికంగా ఇళ్ల నిర్మాణాలకు, పునాదుల్లో నీళ్లు నింపేందుకు వినియోగిస్తున్నారు. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారినా పాత పంచాయతీ కార్యదర్శులే సేవలందిస్తున్నారు. మున్సిపల్ పాలన ఎప్పుడు ప్రారంభిస్తారని ఇన్చార్జ్ కమిషనర్ సుజాతను వివరణ కోరగా.. ఇంకా పూర్తిస్థాయిలో సిబ్బంది స్థాయిలో రాలేదని.. మరికొంత సమయం పడుతుందని చెప్పారు. -
14న ఫాల్గుణ పౌర్ణమి వేడుకలు
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఈనెల 14న ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ రమాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రామయ్య పెళ్లి పనులకు ఆరోజే శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద పసుపు దంచి తలంబ్రాలు కలిపే వేడుక ప్రారంభం అవుతుందని, అనంతరం వసంతోత్సవం, డోలోత్సవం ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా బేడా మండపంలో జరిగే నిత్యకల్యాణాన్ని రద్దు చేశామని పేర్కొన్నారు. భద్రాచలం దివ్యక్షేత్రానికి అనుబంధంగా ఉన్న పర్ణశాలలోనూ ఈ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులు ప్రసాదాలు విక్రయించొద్దు.. శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తులు, తోపుడు బండ్ల వారు, ఇతరులు ప్రసాదాల పేరుతో లడ్డూలు, పులిహోర విక్రయించడాన్ని నిషేధించినట్లు ఈఓ రమాదేవి తెలిపారు. ఈ నిబంధనలను అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రామయ్య పెళ్లి పనులకు ఆ రోజే శ్రీకారం -
ప్రగతికి బాటలు పడేనా ?
వాతావరణ ం జిల్లాలో బుధవారం ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతాయి. ఉదయం ప్రారంభమయ్యే ఎండ మధ్యాహ్నానికి తీవ్రమవుతుంది. బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025పారిశ్రామిక రంగంలో.. పాల్వంచ కేటీపీఎస్లో కొత్తగా 400 ఎకరాల స్థలం అందుబాటులోకి వచ్చింది. అక్కడ టీజీ జెన్కో ఆధ్వర్యంలో కొత్త యూనిట్ ప్రారంభించాలనే డిమాండ్ ఉంది. అలాగే ఏపీ స్టీల్స్, స్పాంజ్ ఐరన్ స్థలాలను సెమీ కండక్టర్ల తయారీ వంటి న్యూఏజ్ పరిశ్రమలకు కేటాయించేలా విధానపరమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరముంది. దీంతో పాటు కొత్తగూడెంలో మూతబడిన బేరియం ఫ్యాక్టరీ, కిన్నెర స్టీల్స్ తదితర పరిశ్రమల స్థలాలు సైతం నిరూయోగంగా ఉన్నాయి. వీటిని ఎలా వినియోగంలోకి తేవాలనే అంశాలపై దృష్టి సారించాలి. జిల్లాలో ఇప్పటికే పత్తి విరివిగా సాగవుతుండగా కొత్తగా వరి, పామాయిల్ సాగు పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగా రైస్ మిల్లుల వంటి అనుబంధ పరిశమ్రలు ప్రైవేట్, గిరిజన సహకార సంఘాల ఆధ్వర్యంలో వచ్చేలా ఈ బడ్జెట్లో ప్రోత్సహకాలు అందితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. యూనివర్సిటీకి ఇప్పటికే ప్రతిపాదనలు.. జిల్లాలోని అన్ని ప్రాంతాలకూ మొబైల్ నెట్వర్క్ సౌకర్యం కలించాల్సిన అవసరముంది. ప్రతీ గ్రామానికి రోడ్డు సౌకర్యం, అందుకోసం అటవీ శాఖ నుంచి అనుమతులు ఇప్పించాలని అసెంబ్లీలో గొంతు విప్పేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. దీంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇప్పటికీ యూనివర్సిటీ లేదు. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. దీనిపై ఈ బడ్జెట్లో సానుకూల నిర్ణయం వస్తుందని పలువురు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ‘సీతారామ’తో న్యాయం దక్కేనా ? ఉమ్మడి జిల్లాకు వరప్రదాయినిగా పేర్కొంటున్న సీతారామ ప్రాజెక్టుతో జిల్లాలోని భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాలకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదు. పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాలకూ అంతంతమాత్రమే. దీంతో గోదావరి జలాలు జిల్లాలోని పొలాల్లో ప్రవహించేలా అనుబంధ పథకాలు కావాలని జిల్లా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించనున్నారు. ఎయిర్పోర్టు గురించి మాట్లాడుతా నియోజకవర్గానికి కావాల్సిన కేటాయింపులపై ఇప్పటికే పలుమార్లు లేఖలు అందించా. ప్రధానంగా కొత్తగూడెం ఎయిర్పోర్టు, కార్పొరేషన్ ఏర్పాటు, హరిత హోటల్ వంటి అంశాలపై అసెంబ్లీలో చర్చిస్తా. ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ సామాన్య, మధ్యతరగతి వర్గాలకు మేలు చేసేలా బడ్జెట్ ప్రవేశపెడుతుందని ఆశిస్తున్నా. బడ్జెట్లోని అంశాలను పరిశీలించాక స్పష్టమైన అభిప్రాయాన్ని అసెంబ్లీలో చెబుతా. – కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే విద్య, వైద్యంపై ఫోకస్ అన్నపురెడ్డిపల్లిలో 100 పండకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కోరుతా. యంగ్ ఇండియా స్కూల్కు భూమి గుర్తించినందున నిధులు మంజూరు చేయాలని అడుగుతా. అశ్వారావుపేట మున్సిపల్ భవనం నిర్మాణానికి, మూకమామిడి, వెంగళరాయసాగర్, గుమ్మడవెల్లి మధ్య తరహా ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని అసెంబ్లీలో ప్రస్తావిస్తా. – జారే ఆదినారాయణ, అశ్వారావుపేట ఎమ్మెల్యే ఎత్తిపోతలకు నిధులపై మాట్లాడుతా ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రగళ్లపల్లి ప్రాజెక్ట్ నిర్మాణంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. దీని వల్ల 40 వేల ఎకరాలకు రెండు పంటలకు నీరందుతుంది. అన్ని గ్రామాలకూ తాగునీరు అందించడంతో పాటు విద్య, వైద్య రంగాల్లో సేవల విస్తరణకు తగిన నిధులు కావాలని అడుగుతా. – తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే అటవీ అనుమతులపై ప్రస్తావిస్తా ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతులు ఇప్పించే అంశంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. ఏజెన్సీ గ్రామాల్లో విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేలా నిధులు కేటాయించాలని కోరుతా. సీతారామ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గానికి గరిష్ట స్థాయిలో మేలు చేయాల్సిన అవసరంపై మాట్లాడుతా. – పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే కాలేజీలు కావాలి ఇల్లెందు నియోజకవర్గ కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల, నర్సింగ్ కాలేజీలు మంజూరు చేయాలని కోరుతా. నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్టు నీటిని తరలించాలని డిమాండ్ చేస్తా. ఇల్లెందు కేంద్రంగా రెవెన్యూ డివిజన్, కొమురారం, బోడు మండలాల ఏర్పాటు అంశాన్ని ప్రస్తావిస్తా. – కోరం కనకయ్య, ఇల్లెందు ఎమ్మెల్యే భక్తుల కొంగుబంగారం.. అన్నపురెడ్డిపల్లి శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. . 8లోన్యూస్రీల్ఎకో – టెంపుల్ టూరిజం.. పారిశ్రామిక ప్రాంతంగా వెలుగొందుతున్న జిల్లా ఎకో – టెంపుల్ టూరిజంలో అవకాశాలు ఎయిర్పోర్టు, యూనివర్సిటీపై గంపెడాశలు సీతారామ ద్వారా జిల్లాకు న్యాయం దక్కేనా.. అసెంబ్లీలో వాణి వినిపించనున్న ఎమ్మెల్యేలు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్.. జిల్లా ప్రగతికి అన్ని విధాలా బాటలు వేయాలని పలువురు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు తమ ప్రాంత అభివృద్ధి, సంక్షేమం కోరుతూ రాష్ట్ర సర్కారుకు నివేదికలు సమర్పించారు. ఇక అసెంబ్లీలో తమ వాణి వినిపించేందుకు సిద్ధం అవుతున్నారు. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంభద్రాచలం, పర్ణశాల, అన్నపురెడ్డిపల్లి, కిన్నెరసాని అభయారణ్యం, కనకగరిగి గుట్టలు, మోతెగడ్డ వంటివి ఎకో – టెంపుల్ టూరిజానికి అనువుగా ఉన్నాయని ఇప్పటికే గుర్తించారు. గతంలో ప్రకటించిన టూరిజం పాలసీలో వీటికి చోటు కూడా దక్కింది. దీనికి కొనసాగింపుగా ఈ బడ్జెట్లో ఎకో – టెంపుల్ టూరిజానికి నిధులు మంజూరైతే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా హోం స్టే విధానాలకు ప్రోత్సాహకాలు దక్కితే ఇంకా బాగుంటుంది. గతంలో ప్రతిపాదన దశలో ఉన్న భద్రకాళి – భద్రాచలం సర్క్యూట్లో భాగంగా మణుగూరు దగ్గరున్న రథం గుట్టలు – వెన్నెల జలపాతం వద్ద అభివృద్ధికి అవకాశం కల్పించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. -
యూడీఐడీ కార్డుల జారీపై అపోహలు వద్దు
చుంచుపల్లి: దివ్యాంగులకు యూనిక్ డిజబిలిటీ ఐడీ కార్డుల జారీపై ఎలాంటి అపోహలు వద్దని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఐడీఓసీలో దివ్యాంగులు, మీసేవా కేంద్రాల నిర్వాహకులకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దివ్యాంగులకు ఇకపై సదరం సర్టిఫికెట్ల జారీ విధానం ఉండదని, అందుకే యూడీఐడీ కార్డులు జారీ చేయనున్నామని తెలిపారు. వైద్యులు ధ్రువీకరించిన వైకల్య శాతం సర్టిఫికెట్తో పాటు దివ్యాంగుల పూర్తి వివరాలను యూడీఐడీ పోర్టల్లో నమోదు చేస్తే ఐడీ కార్డులు స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా వారి చిరునామాకు చేరుతాయని వెల్లడించారు. ఈ కార్డుల కోసం మీ–సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుందన్నారు. గతంలో సదరం ద్వారా 8 రకాల వైకల్యాలకు మాత్రమే ఉండేదని, ఇప్పుడు యూనిక్ కార్డులను 21 రకాల వైకల్యాలు గల వారికి మంజూరు చేస్తున్నామని తెలిపారు. యూడీఐడీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ఐదు రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దరఖాస్తుదారులు పేరు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, జెండర్, ఫొటో, సంతకం, ఆధార్ కార్డు నంబర్, అడ్రస్ తదితర సమాచారాలను నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. మీసేవా కేంద్రాలకు వచ్చే దివ్యాంగులకు ఉత్తమ సర్వీస్ అందించాలని నిర్వాహకులకు సూచించారు. వారి నుంచి అధిక రుసుము వసూలు చేసినా, సేవల్లో నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. మీసేవా కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జిల్లా సంక్షేమ శాఖాధికారి స్వర్ణలత లెనినా, ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని వినియోగించుకోవాలిసూపర్బజార్(కొత్తగూడెం) : మార్చి 31 నాటికి భూ క్రమబద్ధీకరణ చేసుకునేలా ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2020 తర్వాత లేఔట్ చేసిన వెంచర్లలో ప్లాట్లు తీసుకున్న 5,488 మంది ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారని, అందులో 400 మంది మాత్రమే డబ్బు చెల్లించారని తెలిపారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల ద్వారా ఇప్పటికే నోటీసులు జారీ చేసినా ఫోన్ నంబర్లు, చిరునామాల్లో తేడాలు ఉండడంతో కొందరికి చేరడం లేదన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో 2,112 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని వినియోగించుకోకుంటే ఆయా ప్లాట్లలో ఇల్లు నిర్మించుకోవాలంటే అప్పటి ప్లాట్ విలువపై ప్రో రేటా ఫీజుతో పాటు 14 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. భవిష్యత్లో ప్లాట్ అమ్ముకోవాలన్నా ఎల్ఆర్ఎస్ ఉంటేనే విలువ పెరుగుతుందని చెప్పారు. సమావేశంలో సబ్ రిజిస్ట్రార్ వేణుమాధవ్, కొత్తగూడెం, పాల్వంచ టౌన్ ప్లానింగ్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఆన్లైన్లో ‘నవమి’ టికెట్లు
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రి ల్ 6, 7 తేదీల్లో జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణం, మహా పట్టాభి షేకం ఉత్సవాలకు బుధవారం నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. కల్యాణానికి ఉభయదాతల టికెట్లు రూ.7,500, సెక్టార్ల టికెట్లు రూ.2,500, రూ.2,000, రూ.1,000, రూ.300, రూ.150, పట్టాభిషేక మహోత్సవానికి రూ.1,500, రూ.500, రూ.100 టికెట్లను ఆన్లైన్లో ఉంచామని వివరించారు.ఉత్సవాలకు రాలేని భక్తుల గోత్రనామాలతో కల్యాణం జరిపించే సేవల కోసం రూ.5,000, రూ.1,116 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. htts://bhadradritemple.telangana.gov.in వెబ్సైట్ ద్వారా భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. వారు ఈనెల 20వ తేదీ ఉదయం 11 గంటల నుంచి.. ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు దేవస్థానం సమీపంలోని తానీషా కల్యాణ మండపంలో ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి టికెట్లు పొందాలని సూచించారు. నేరుగా విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు.. ఈనెల 20వ తేదీ నుంచి భద్రాచలంలో నేరుగా సెక్టార్ టికెట్లు విక్రయించనున్నారు. రామాలయం వద్ద మెయిన్ కౌంటర్, తానీషా కల్యాణ మండపం, సీఆర్వో కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు. భద్రాచలం ఆర్డీవో ఆఫీసు వద్ద వచ్చే నెల 1 నుంచి కౌంటర్ అందుబాటులో ఉంటుంది. -
శభాష్ లక్ష్మీరెడ్డి..
రైతును అభినందించిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల బూర్గంపాడు: బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు యారం లక్ష్మీరెడ్డిని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. సోమవారం లక్ష్మీరెడ్డికి స్వయంగా ఫోన్చేసి మాట్లాడారు. పుచ్చ సాగులో ఎకరాకు 20 టన్నుల నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నందుకు మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. పుచ్చ, బొబ్బాయి వంటి పంటల్లో అధిక దిగుబడులు, నాణ్యమైన ఉత్పత్తులు సాధించడం అభినందనీయమని అన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని రైతులు ఉద్యానవన పంటలు సాగుకు ముందుకు రావాలన్నారు. నాణ్యమైన పంటల సాగుకు రైతులకు ప్రభుత్వం ప్రోత్సహకాలను అందిస్తోందని మంత్రి తెలిపినట్లు రైతు లక్ష్మీరెడ్డి వివరించారు. అప్రెంటిస్ మేళాలో 136 మంది ఎంపికిసంగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో సోమవారం నిర్వహించిన పీఎం నేషనల్ అప్రెంటిష్ మేళాకు 300 మంది అభ్యర్థులు హాజరుకాగా, 136 మంది అప్రెంటిస్కు ఎంపికయ్యారు. టాటా ఏరోస్పేస్ 40 మంది, మేథో సర్వే డ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్ (హైదరాబాద్) 13 మంది, ఎల్అండ్టీ (చైన్నె) 54 మంది, టీ హబ్ హైదరాబాద్ కంపెనీ 29 మందిని ఎంపిక చేసుకున్నాయి. ఏజీఎం రామ్మోహన్రావు, ఐటీఐ సిబ్బంది పాల్గొన్నారు. Ayýl-ÑÌZ ^ðlÌS-Æó‡-VýS$-™èl$¯]l² Ð]l$…rË$˘ ములకలపల్లి: మండల పరిధిలోని రామాంజనేయపురం శివారులో మంటలు ఎగసి పడుతున్నాయి. సీతారామ ప్రాజెక్ట్ కాలువ వద్ద సోమవారం రాత్రి అటవీ ప్రాంతంతోపాటు, తెలంగాణా స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎఫ్డీసీ) పరిధిలోని ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. చెట్లు అగ్గికి బుగ్గి అవుతున్నాయి. పురుగుల మందు తాగి ఆత్మహత్యములకలపల్లి: పురుగుల మందు తాగి సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై కిన్నెర రాజశేఖర్ కథనం ప్రకారం.. ములకలపల్లిలోని శివాలయం వీధికి చెందిన పొదిల సతీష్ (38)కు ఏలూరుకు చెందిన జ్యోతితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన సతీష్ ఏ పనీ చేయకుండా తిరుగుతుండగా పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో భార్య మనస్తాపం చెంది రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో మనోవేదన చెందిన సతీష్ ఈ నెల 8న పురుగుల మందు తాగాడు. ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి తల్లి దుర్గ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాపు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వన సంరక్షణే ధ్యాసగా..
అవార్డులతో రాములు● అటవీప్రాంత పరిరక్షణకు పాటుపడుతున్న అన్నపురెడ్డిపల్లివాసి ● పలు అవార్డులు పొందిన చెదురుపల్లి రాములు అన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): ఓ సామాన్యుడు వన సంరక్షణకు పాటుపడుతున్నాడు. ప్రకృతి సంపద పరిరక్షణకు నిత్యం కృషి చేస్తున్నాడు. దాదాపు ఏడు వందల హెక్టార్లలో ఉన్న వనసంరక్షణ సమితి(వీఎస్ఎస్) అడవిలో ఒక్క ఎకరంలో కూడా పోడు నరకకుండా అడ్డకున్నాడు. అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన, వీఎస్ఎస్ చైర్మన్ చెదురుపల్లి రాములు గౌడ్ అటవీ ప్రాంత సంరక్షణకు చేస్తున్న కృషిని గుర్తించి ప్రభుత్వాలు పలు అవార్డులు సైతం ఇచ్చాయి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడుతోపాటు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్క్లింటన్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నాడు. శ్రీలంక దేశానికి చెందిన ప్రముఖ అధికారులు అన్నపురెడ్డిపల్లి వచ్చి అటవీ సంరక్షణకు ఇతని నుంచి సలహాలు తీసుకున్నారు. వీఎస్ఎస్ చైర్మన్ అయిన రాములు రోజూ కిలోమీటర్ల కొద్దీ కాలినడకనే తిరుగుతూ అటవీప్రాంతాన్ని పర్యవేక్షిస్తాడు. అటవీశాఖలో సామాన్య ఉద్యోగి నుంచి ఐఎఫ్ఎస్ అధికారి వరకు రాములును అన్నా అని సంబోధిస్తారు. 2002 నుంచి 2006 వరకు పలు అవార్డలు పొందిన రాములు ప్రస్తుతం 60 ఏళ్ల వయసులోనూ వన సంరక్షణకు కృషి చేస్తున్నాడు. ఎక్కువ సమయం అడవిలోనే.. చిన్ననాటి నుంచే నాకు అడవి అంటే ఇష్టం. 1996లో వనసంరక్షణ సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. అప్పటి నుంచి 700 హెక్టార్లల అడవిని కాపాడుతున్నాను. మూడు దశాబ్దాల్లో ఎక్కువకాలం అడవిలోనే గడిపాను. ఉమ్మడి జిల్లాలో అప్పట్లో 300 వనసంరక్షణ కమిటీలను ఏర్పాటు చేయగా, ప్రస్తుం మా కమిటీ ఒక్కటే పనిచేస్తోంది. – రాములు, వీఎస్ఎస్ చైర్మన్, అన్నపురెడ్డిపల్లి -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని తెలంగాణ ఉద్యోగ జేఏసీ కార్యదర్శి, టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. టీజీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంకటపుల్ల య్య, టీఎన్జీవోస్ అధ్యక్ష, కార్యదర్శులు డెక్క నర్సింహారావు, గగ్గూరి బాలకృష్ణ,తో పాటు పడిగ నరసింహారావు, సాదిక్బాషా తదితరులు పాల్గొన్నారు. 30 నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలుభద్రాచలం/దుమ్ముగూడెం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి, పర్ణశాల ఆలయాల్లో ఈ నెల 30 నుంచి వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. 30వ తేదీ ఉగాది రోజున రక్షాబంధనం, ఉత్సవాంగ స్నపనం, మృత్సంగ్రహణం, 31 ఏప్రిల్ 1 తేదీల్లో తిరువీధి సేవలు, 2న గరుడ పట లేఖనం, సార్వభౌమ వాహన సేవ, 4న అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, భేరీ పూజ, బలిహరణం, హనుమద్వాహన సేవ, 5 సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం జరగనున్నాయి. 6న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, 7న మహాపట్టాభిషేకం, 8న సదస్యం, హంసవాహన సేవ, 9న తెప్పోత్సవం, చోరోత్సవం, అశ్వవాహన సేవ, 10న ఊంజల్ సేవ, సింహవాహన సేవ, 11న వసంతోత్సవం, ఉదయం సూర్యప్రభ వాహన సేవ, రాత్రి గజవాహన సేవ, 12న చక్రతీర్థం, పూర్ణాహుతి, శేషవాహన సేవ, ధ్వజావరోహణం, పుష్పయాగంలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ రమాదేవి వెల్లడించారు. కాగా, పర్ణశాలలో ఈ నెల 14న ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా కల్యాణ తలంబ్రాలు కలపడంతో పాటు పసుపు దంచే వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్చార్జ్ అనిల్కుమార్ తెలిపారు. పెద్దమ్మతల్లి ఆలయ హుండీల లెక్కింపు137 రోజులకు రూ.41.23 లక్షల ఆదాయం పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి అమ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను సోమవారం దేవాదాయ శాఖ కొత్తగూడెం డివిజన్ పరిశీలకులు పి.భేల్సింగ్, ఈఓ ఎన్.రజనీకుమారి పర్యవేక్షణలో లెక్కించారు. 137 రోజులకు గాను రూ.41,23,907 లభించాయని, ఈ నగదుతో పాటు వివిధ విదేశీ కరెన్సీ, మిశ్రమ వెండి, బంగారం లభించాయని ఈఓ వివరించారు. కార్యక్రమంలో కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ మధుసూదన్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.డాక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానంకొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ఏరియా ఆస్పత్రుల్లో వైద్యుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ రవిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, అశ్వారావుపేటలోని ఏరియా ఆస్పత్రులు, పాల్వంచ సీహెచ్సీలో గైనకాలజిస్ట్, పిల్లల వైద్య నిపుణులు, జనరల్ ఫిజీషియన్, జనరల్ సర్జరీ, మత్తు, రేడియాలజీ, నేత్ర వైద్య నిపుణులు, ఆసక్తి గల ఇతర నిష్ణాతులైన వైద్య నిపుణులను కాంట్రాక్టు పద్ధతిన నియమిస్తామని వివరించారు. గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్, వైద్య నిపుణులకు రూ.2 లక్షలు, మత్తు, జనరల్ ఫిజీషియన్, పిల్లల వైద్య నిపుణులకు రూ.1.50 లక్షలు, ఇతర వైద్య నిపుణులకు రూ.లక్ష వేతనం ఇస్తామని పేర్కొన్నారు. -
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ప్రజావాణిలో వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్తో కలిసి వినతులు స్వీకరించారు. పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని.. ● లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామానికి చెందిన రైతు వనపర్తి వీరభద్రం.. తనకు 68 ఏళ్లు వచ్చింనదున వ్యవసాయం చేయలేకపోతున్నానని, వృద్ధాప్య పింఛన్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేయగా డీఆర్డీఓకు ఎండార్స్ చేశారు. ● సీతారామ ప్రాజెక్టు కింద నష్టపోయిన తమ భూములకు పరిహారంగా ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, బ్యాంకు సిబ్బంది కలిసి తమకు మాయమాటలు చెప్పి సంతకాలు చేయించుకుని, ఆ డబ్బును వారి ఖాతాల్లో వేసుకున్నారని అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామ రైతులు ఫిర్యాదు చేశారు. తమకు పోడుభూములు ఇప్పిస్తామని, భూముల్లో బోర్లు వేయిస్తామని నమ్మించారని, వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని చేసిన దరఖాస్తు చేయగా ఎస్పీకి ఎండార్స్ చేశారు. ● పాల్వంచ నవభారత్ గాంధీనగర్లో మున్సిపల్ రోడ్డు, డ్రైనేజీపై ఉన్న స్థలంలో నలుగురు వ్యక్తులు చట్టవిరుద్ధంగా గోడ కట్టారని, దానిని తొలగించి రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీని నిర్మించాలని శ్రావణబోయిన మల్లీశ్వరి చేసిన దరఖాస్తును పాల్వంచ మున్సిపల్ కమిషనర్కు ఎండార్స్ చేశారు. ఉద్యోగులు సమయపాలన పాటించాలి కలెక్టరేట్లో వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కావాలని, లేకుంటే చర్య తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. ఉదయం 10.30 – 10.45 వరకు విధులకు రాకుంటే గైర్హాజరుగా పరిగణిస్తామని, అవసరమైతే షోకాజ్ నోటీసు ఇస్తామని స్పష్టం చేశారు. ఏఐతో బోధన సులభం.. బూర్గంపాడు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో విద్యాబోధన సులభమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అంజనాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఏఐ విద్యాబోధనను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు, సులువుగా అర్థమయ్యేందుకు ఏఐ సహకరిస్తుందన్నారు. విద్యార్థులు ఏఐ క్లాసులను వినియోగించుకోవాలన్నారు. బూర్గంపాడు మండలంలో అంజనాపురం, మోరంపల్లిబంజర, బూర్గంపాడు–2, నాగినేనిప్రోలు, గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ తరగతులను ప్రారంభించామని తెలిపారు. అనంతరం బూర్గంపాడు గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందుతోందా అని ఆరా తీశారు. పాఠశాలలో అవసరమైన వసతులపై నివేదిక ఇవ్వాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఎంపీ బంజరలో నూతన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ యదుసింహరాజు, డీటీ రామ్నరేష్ పాల్గొన్నారు. ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
ప్రభుత్వ పథకాలు గిరిజనుల దరి చేరాలి
భద్రాచలం: ప్రభుత్వ సంక్షేమ పథకాలు గిరిజనుల చెంతకు చేర్చేలా అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన వినతులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనుల సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించాలని సూచించారు. అర్హతల మేరకు వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తుల రిపోర్టును తనకు ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు. కెరీర్ గైడెన్స్ అమలుపై అభినందనలు.. రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల పరిధిలోని గిరిజన విద్యా సంస్థల్లో పీఓ రాహుల్ ప్రారంభించిన కెరీర్గైడెన్స్ అమలు చేయడంపై అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా అధికారులు, సిబ్బందితో పీఓ కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. గిరిజన సంస్కృతి ప్రతిబింబించాలి.. గిరిజన మ్యూజియంలో చిత్రాలు, కళాకృతుల ద్వారా గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించాలని పీఓ అన్నారు. గిరిజన మ్యూజియాన్ని పరిశీలించిన ఆయన బీచ్ వాలీబాల్, బాక్స్ క్రికెట్ గ్రౌండ్, బోటింగ్ కు ఏర్పాటు చేస్తున్న చెరువు పనులను పది రోజుల్లో పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గిరిజనుల ఆరాధ్య దైవాల చరిత్ర, దేవతల ప్రతిమలు, సమ్మక్క సారక్క గద్దెలు డిజైన్ చేయించి అమర్చాలని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, డీడీ మణెమ్మ, ఎస్డీసీ రవీంద్రనాథ్, ఏఓ సున్నం రాంబాబు, ఈఈ చంద్రశేఖర్, గురుకులం ఆర్సీఓ నాగార్జున రావు, ఆర్ఓఎఫ్ఆర్ డీటీ లక్ష్మీనారాయణ, ఏపీఓ వేణు, వ్యవసాయ శాఖ ఏడీ భాస్కరన్, అధికారులు మనిధర్, ఉదయ్కుమార్, ప్రభాకర్రావు, గోపాల్రావు, నవ్య, ఆదినారాయణ, నారాయణరావు, జయరాజ్, మ్యూజియం ఇన్చార్జ్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్వృత్తి శిక్షణ తరగతులు నిర్వహించాలి భద్రాచలంటౌన్: డిగ్రీ విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు వృత్తి శిక్షణ తరగతులు నిర్వహించాలని పీఓ రాహుల్ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ (అటామస్) కళాశాల ప్రచార కరపత్రాలను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కళాశాల వివరాలతో పాటు సౌకర్యాలు, సాధించిన విజయాలు, కళాశాల ప్రాముఖ్యతను వివరించేలా కరపత్రాలను తీర్చిదిద్దారని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.జాన్ మిల్టన్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
పామాయిల్ క్షేత్రంలో పరిశీలన
దమ్మపేట : పామాయిల్ నర్సరీ డివిజనల్ ఇన్చార్జ్ మేనేజర్ నాయుడు రాధాకృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ సతీష్ జగ్గారం శివారులోని రైతు చెలికాని సూరిబాబు పామాయిల్ క్షేత్రాన్ని సోమవారం సందర్శించారు. ‘ఆఫ్టైప్ మొక్కల నరికివేత’శీర్షికన సాక్షిలో సోమవారం ప్రచురితమైన కథనానికి ఆయిల్ ఫెడ్ అధికారులు స్పందించారు. దిగుబడి రాకపోవడంతో నరికివేసిన ఆఫ్టైపు మొక్కలను పరిశీలించారు. ఆఫ్టైప్, నాణ్యతలేని గెలలు వస్తున్న మొక్కల వివరాలు, సాగు చేస్తున్న విధానంపై రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కొద్దినెలల వరకు మొక్కలను నరకొద్దని అధికారులు సూచించగా.. నాణ్యతలేని మొక్కలకు ఏమైనా భరోసా ఇవ్వగలరా అని రైతు ప్రశ్నించాడు. కానీ అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. నష్టపరిహారం కోసం బాఽధిత రైతు నుంచి దరఖాస్తు మాత్రం స్వీకరించారు. పరిహారం కోసం బాధిత రైతు నుంచి దరఖాస్తు స్వీకరించిన అధికారులు -
మారితే.. మనం ఎటు?!
అసెంబ్లీ, లోక్సభ స్థానాల పునర్విభజనపై పార్టీల్లో చర్చ ● చివరిగా 2008లో స్థానాల పునర్విభజన ● అప్పుడు తొమ్మిది నుంచి 10కి పెరిగిన అసెంబ్లీ సీట్లు ● రిజర్వేషన్లలోనూ మార్పులు ● ఈసారి పెంపు, రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠఅసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశం ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008లో జరిగిన పునర్విభజనతో నియోజకవర్గాల రూపురేఖలు, రిజర్వేషన్లు మారిపోయాయి. కొన్ని స్థానాలు జనరల్ నుంచి రిజర్వ్లోకి, రిజర్వ్డ్గా ఉన్న స్థానాలు కొన్ని జనరల్కు మారాయి. అలాగే, తొమ్మిదిగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పదికి చేరింది. ఇక వచ్చే సాధారణ ఎన్నికల సమయానికి పునర్విభజన చేపట్టేలా కేంద్రప్రభుత్వం కసరత్తు చేస్తోందనే ప్రచారంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంటుందోనని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అయితే, 2026 తర్వాత జనాభా లెక్కల అనంతరమే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని చట్ట సవరణ చేయగా.. ఇప్పడు ఈ ప్రక్రియపై ఎందుకు కసరత్తు జరుగుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంరెండుగా ఖమ్మం.. ఈసారి చేపట్టనున్న డీలిమిటేషన్ విధి విధానాలు ఇప్పటివరకై తే బయటకు రాలేదు. ఒక్కో నియోజకవర్గానికి ఎంత మంది జనాభాను పరిగణనలోకి తీసుకుంటారో తేలాల్సి ఉంది. అయితే, డీ లిమిటేషన్ చేపడితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఖమ్మంతో పాటు భద్రాద్రి జిల్లాలో 2001 జనాభా లెక్కలతో పోలిస్తే ఇప్పుడు పెరిగింది. గత పునర్విభజన సమయాన కొత్తగా అశ్వారావుపేట నియోజకవర్గం ఏర్పడింది. ప్రస్తుత జనాభాను పరిశీలిస్తే ఈసారి పునర్విభజనలో ఒక్క నియోజకవర్గమైనా పెరుగుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గం జనాభా పరంగా రెట్టింపు అయినందున ఈ నియోజకవర్గం రెండుగా ఏర్పడే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది.ఇప్పుడే ఎందుకు? పెరుగుతున్న జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుంటారు. తద్వారా నియోజకవర్గాల సంఖ్య పెరగడమే కాక సరిహద్దులు మారుతుంటాయి. ఇందుకోసం తొలిసారిగా 1963లో డీ లిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నియోజకవర్గాల సరిహద్దులు, రిజర్వేషన్లు నిర్ణయిస్తుంది. చివరిసారి 2008లో 2001 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపట్టారు. ఆ సమయంలోనే 84వ చట్ట సవరణ ద్వారా 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ఆధారంగా మరోమారు పునర్విభజన చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యాన ఇప్పుడు పునర్విభజనకు సిద్ధం కావడాన్ని కొన్ని పార్టీలు తప్పుపడుతున్నాయి. మారిన రిజర్వేషన్లు.. 2008లో చేపట్టిన డీలిమిటేషన్ కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాల పరిధి, రిజర్వేషన్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. తద్వారా కొందరు నేతలకు ఇబ్బంది ఎదురుకాగా, మరికొందరికి కలిసొచ్చింది. అప్పటి వరకు తొమ్మిది నియోజకవర్గాలు ఉండగా.. కొత్తగా అశ్వారావుపేట ఏర్పాటైంది. ఇందులో అశ్వారావుపేట, దమ్మపేట, చండ్రుగొండ, ములకలపల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు చేరాయి. రాష్ట్ర విభజన తర్వాత కుక్కునూరు, వేలేరుపాడు ఏపీలోకి వెళ్లగా.. ఇక్కడ కొత్తగా అన్నపురెడ్డిపల్లి మండలం చేరింది. ఇక బూర్గంపాడు నియోజకవర్గం రద్దయి ఆ స్థానంలో పినపాక చేరింది. అంతేకాక జనరల్ నియోజకవర్గమైన సుజాతనగర్ రద్దు కాగా.. ఆ స్థానంలో ఎస్టీ రిజర్వ్డ్గా వైరా నియోజకవర్గం ఏర్పడింది. అలాగే సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలు జనరల్ నుంచి ఎస్సీ రిజర్వ్కు, ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న పాలేరు జనరల్ కేటగిరీలోకి వచ్చింది. ఈ క్రమంలో జనరల్ కేటగిరీలో కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు మాత్రమే మిగిలాయి. ఏం చేద్దాం.. ఎలా వెళ్దాం నియోజకవర్గాల పునర్విభజన చర్చ మొదలవడంపై రాజకీయ పార్టీల నాయకులు దృష్టి సారించారు. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే తమకు బలమైన ఓటు బ్యాంక్ ఉన్న మండలాలు ఇతర నియోజకవర్గంలో కలిసే అవకాశం ఉందా అన్న అంశంపై ఆరా తీస్తున్నారు. అయితే నియోజకవర్గానికి ఎంత జనాభా ఉండాలనే అంశంపై స్పష్టత రాకపోవడంతో ఇంకొందరు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను మూడు జనరల్గా ఉన్నాయి. ఈసారి పునర్విభజనపై పూర్తి వివరాలు వెల్లడి కాకపోవడంతో రిజర్వ్ స్థానాలు తగ్గుతాయా, పెరుగుతాయా.. రిజర్వేషన్లలో మార్పులు జరుగుతాయా, స్థానాల సంఖ్య పెరుగుతుందా అన్న అంశంపై అయోమయం నెలకొంది. కాగా, గత పునర్విభజన సమయాన కీలక నేతలు కొందరు సిట్టింగ్ స్థానాలు వదిలి ఇతరచోట్ల నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. సుజాతనగర్ నుంచి రాంరెడ్డి వెంకటరెడ్డి పాలేరుకు వెళ్లగా, పాలేరులో పోటీ చేసి పలుమార్లు గెలిచిన సంభాని చంద్రశేఖర్, ఒకసారి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లికి, సత్తుపల్లి నుంచి తుమ్మల నాగేశ్వరరావు సైతం తమ కార్యక్షేత్రాన్ని మార్చా రు. ఈసారీ ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయా అన్న అనుమానాలు నేతల్లో వ్యక్తమవుతున్నాయి. -
తొమ్మిది నిమిషాలు లేట్..
ఇంటర్మీడియట్ పరీక్షకు అనుమతించని అధికారులు పాల్వంచరూరల్: నిర్దేశించిన సమయం కంటే తొమ్మిది నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని సోమవారం అధికారులు పరీక్షకు అనుమతించలేదు. వేడుకున్నా అధికారులు కనికరించకపోవడంతో రోదిస్తూ వెనుదిరిగింది. మండల పరిధిలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష రాసేందుకు చర్లకు చెందిన జి.సుభాషిణి సోమవారం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు చేరుకుంది. పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ తులసిని అర్ధగంటసేపు వేడుకున్నా కనికరించలేదు. సమయం మించిపోయిందని లోపలకు రానివ్వకుండా గేటు వద్దే నిలిపివేశారు. విషయం జిల్లా నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లినా అనుమతి ఇవ్వలేమని తెలిపారు. దీంతో విద్యార్థిని కన్నీరు పెట్టుకుని వెనుదిరిగి వెళ్లిపోయింది. కాగా సోమవారం నిర్వహించిన సెకండియర్ ఇంగ్లిష్ పరీక్షకు పాల్వంచలోని నాలుగు కేంద్రాల్లో 969 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 24మంది గైర్హాజరయ్యారు. 945 మంది హాజరయ్యారు. -
క్రీడాసామర్థ్యం లేని విద్యార్థుల తొలగింపు
పాల్వంచరూరల్: జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనేలా క్రీడాపాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. అయితే, నెలల తరబడి శిక్షణ ఇచ్చినా తగిన స్థాయిలో సామర్థ్యం కనబర్చని వారిని తొలగించాలని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం ఐటీడీఏ పర్యవేక్షణలో పాల్వంచ మండలం కిన్నెరసానిలో గిరిజన బాలురు, గుండాల మండలం కాచనపల్లిలో గిరిజన బాలికలకు క్రీడాపాఠశాలలు ఏర్పాటు చేశారు. బ్యాటరీ టెస్ట్ ద్వారా ఎంపిక చేసిన విద్యార్థులు 240మంది చొప్పున చదువుతుండగా ఉదయం, సాయంత్రం కోచ్ల ద్వారా వాలీబాల్, కబడ్డీ, ఆర్చరీ, అథ్లెటిక్స్లో శిక్షణ ఇస్తున్నారు. అయితే కొందరు క్రీడల్లో ఆశించిన స్థాయిలో ప్రతిభ చాటడం లేదు. దీంతో కిన్నెరసాని పాఠశాల నుంచి 15మంది, కాచనపల్లి పాఠశాల నుంచి 18మంది కలిపి 33మందిని వచ్చే ఏడాది స్కూల్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈవిషయమై ఐటీడీఏ స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాల్రావును వివరణ కోరగా.. అనారోగ్యం తదితర కారణంగా క్రీడల్లో రాణించలేని విద్యార్థులను తొలగించి, ఇతర పాఠశాలల్లో చేర్పిస్తామని తెలిపారు. కిన్నెరసాని, కాచనపల్లి క్రీడాపాఠశాలల్లో 33మంది -
ఆఖరులో ఆగమాగం!
● గడువు చివరలో నిధులు కేటాయింపు ● ఉపాధి హామీలో 974 పనులు మంజూరు ● సీసీ రోడ్లకు రూ.49.98 కోట్ల మేర నిధులు చుంచుపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో మట్టి రోడ్లను సీసీ రహదారులుగా మార్చడానికి ఉపాధి హామీ పథకంలో కేంద్రప్రభుత్వం జిల్లాకు భారీగా నిధులు కేటా యించింది. ఈ నిధులతో పల్లెల్లో సీసీరోడ్లు నిర్మిస్తుండగా ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేసేలా పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు ముందుకు సాగుతున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల్లో భారీగా పనులు మంజూరు చేస్తుండగా ఈ సంవత్సరం కూడా జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.49.98 కోట్లు మంజూరయ్యాయి. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పనుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించారు. 974 సీసీ రోడ్లు మంజూరు.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 974 సీసీ రోడ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటికోసం రూ.49.98 కోట్లు నిధులు కేటాయించింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో 143 పనులకు రూ.11.60 కోట్లు, కొత్తగూడెంలో 165 పనులకు రూ.6.74 కోట్లు, ఇల్లెందులో 136 పనులకు రూ.7.54 కోట్లు, భద్రాచలంలో 193 పనులకు రూ.8.44 కోట్లు, పినపాక నియోజకవర్గంలో 316 పనులకు రూ.14.15 కోట్లు, వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడు మండలంలో 21 పనులకు రూ.1.11 కోట్ల చొప్పున కేటాయించారు. ఈనెల 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా ఆ లోపే పనులన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే నిధులు వెనక్కు వెళ్లిపోతాయి. దీంతో పలుచోట్ల అధికారులు ఆగమేఘాల మీద పనులు చేపడుతున్నారు. అయితే హడావిడిగా చేపడుతున్న సీసీ రోడ్ల పనుల్లో నాణ్యత, పర్యవేక్షణ లోపిస్తోందని గ్రామస్తులు అంటున్నారు. పలు చోట్ల సిమెంట్ తక్కువగా పోయడం, అక్కడక్కడా నాణ్యత లేని ఇసుక ఉపయోగిస్తుండడం, క్యూరింగ్ సక్రమంగా చేయకపోవడం వంటి లోపాలు కనిపిస్తున్నాయి. సీసీ రోడ్ల నిర్మాణం అనంతరం కనీసం 28 రోజుల పాటు క్యూరింగ్ చేయాల్సి ఉండగా చాలాచోట్ల వరి గడ్డి వేసి వారం రోజుల పాటు నీటి తడితో ముగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎండలు ముదురుతుండడంతో సీసీ రోడ్లకు రోజూ క్రమం తప్పకుండా క్యూరింగ్ చేయాలి. లేకపోతే రోడ్డు నాణ్యతపై ప్రభావం చూపుతుందని స్థానికులు అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రతీ సారి ఈజీఎస్లో చేపడుతున్న సీసీ రోడ్ల బిల్లుల కోసం కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు నెలల కొద్దీ ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆర్థిక సంవత్సరం చివరలో మంజూరవుతున్న పనులను ఆగమేఘాల మీద చేపట్టి పూర్తి చేస్తున్నా వీరికి సకాలంలో డబ్బులు అందక ఇబ్బందులు పడుతున్నారు. పలువురు బయట నుంచి అప్పులు తెచ్చి మరీ సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తాం జిల్లాలో 974 సీసీ రోడ్లు మంజూరయ్యాయి. ఆయా పనుల్లో జాప్యం చేయకుండా ప్రతిపాదనలు సిద్ధం చేశాం. జిల్లాలో ఇప్పటికే చాలా వరకు పనులను మొదలుపెట్టాం. మిగిలిన పనులను సైతం రెండు, మూడు రోజుల్లో చేపట్టి గడువులోగా పూర్తి చేస్తాం. నాణ్యతలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పర్యవేక్షిస్తాం. – ఎస్.శ్రీనివాసరావు, పీఆర్ ఈఈ -
వన సంరక్షణే ధ్యాసగా..
అవార్డులతో రాములు● అటవీప్రాంత పరిరక్షణకు పాటుపడుతున్న అన్నపురెడ్డిపల్లివాసి ● పలు అవార్డులు పొందిన చెదురుపల్లి రాములు అన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): ఓ సామాన్యుడు వన సంరక్షణకు పాటుపడుతున్నాడు. ప్రకృతి సంపద పరిరక్షణకు నిత్యం కృషి చేస్తున్నాడు. దాదాపు ఏడు వందల హెక్టార్లలో ఉన్న వనసంరక్షణ సమితి(వీఎస్ఎస్) అడవిలో ఒక్క ఎకరంలో కూడా పోడు నరకకుండా అడ్డకున్నాడు. అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన, వీఎస్ఎస్ చైర్మన్ చెదురుపల్లి రాములు గౌడ్ అటవీ ప్రాంత సంరక్షణకు చేస్తున్న కృషిని గుర్తించి ప్రభుత్వాలు పలు అవార్డులు సైతం ఇచ్చాయి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడుతోపాటు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్క్లింటన్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నాడు. శ్రీలంక దేశానికి చెందిన ప్రముఖ అధికారులు అన్నపురెడ్డిపల్లి వచ్చి అటవీ సంరక్షణకు ఇతని నుంచి సలహాలు తీసుకున్నారు. వీఎస్ఎస్ చైర్మన్ అయిన రాములు రోజూ కిలోమీటర్ల కొద్దీ కాలినడకనే తిరుగుతూ అటవీప్రాంతాన్ని పర్యవేక్షిస్తాడు. అటవీశాఖలో సామాన్య ఉద్యోగి నుంచి ఐఎఫ్ఎస్ అధికారి వరకు రాములును అన్నా అని సంబోధిస్తారు. 2002 నుంచి 2006 వరకు పలు అవార్డలు పొందిన రాములు ప్రస్తుతం 60 ఏళ్ల వయసులోనూ వన సంరక్షణకు కృషి చేస్తున్నాడు. ఎక్కువ సమయం అడవిలోనే.. చిన్ననాటి నుంచే నాకు అడవి అంటే ఇష్టం. 1996లో వనసంరక్షణ సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. అప్పటి నుంచి 700 హెక్టార్లల అడవిని కాపాడుతున్నాను. మూడు దశాబ్దాల్లో ఎక్కువకాలం అడవిలోనే గడిపాను. ఉమ్మడి జిల్లాలో అప్పట్లో 300 వనసంరక్షణ కమిటీలను ఏర్పాటు చేయగా, ప్రస్తుం మా కమిటీ ఒక్కటే పనిచేస్తోంది. – రాములు, వీఎస్ఎస్ చైర్మన్, అన్నపురెడ్డిపల్లి -
ఎవరికి వారే.. వేసవి వ్యూహాలు
మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)ను కేంద్ర బలగాలు చేపట్టాయి. ఈక్రమంలోనే బస్తర్ అడవుల్లో నెత్తురు ఏరులై పారింది. ఎదురుకాల్పుల్లో 300 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. అయితే ప్రభుత్వ దళాల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు మావోయిస్టులు (Maoists) ఎదురుదాడులకు సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంవేసవి వ్యూహం..వేసవి (Summer) సమీపించడంతో ఆకులు రాలిపోయి అడవులు వెలవెలబోతాయి. దీంతో ప్రతి వేసవిని మావోయిస్టులు గడ్డుకాలంగానే పరిగణిస్తారు. అడవిలో చాటు తగ్గిపోవడంతో పాటు నీటి వనరుల లభ్యత పరిమితంగా ఉంటుంది. దీంతో అడవుల్లోకి పోలీసులు, భద్రతా దళాలు చొచ్చుకురాకుండా ‘ట్యాక్టిక్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్’ పేరుతో ముందుగానే ఎదురుదాడులకు దిగే వ్యూహాన్ని ఆ పార్టీ అమలు చేస్తోంది. కానీ పెరిగిన నిర్బంధం వల్ల ప్రస్తుతం బస్తర్ అడవుల్లో మావోయిస్టులు, వారి సానుభూతిపరులకు మధ్య సంబంధాలు గతంలో పోలిస్తే తగ్గిపోయాయి. సానుభూతిపరుల నుంచి అవసరమైన మేర సాయం అందే పరిస్థితి లేదు. ఈ లోటును పూడ్చుకునేందుకు తమ సాయుధ బలగాలనే ఏకం చేసి వ్యూహాత్మక దాడులు చేయాలనే ప్లాన్లో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం.ఏకమవుతున్న దళాలు.. బస్తర్ అడవులు కేంద్రంగా కేంద్ర కమిటీతో పాటు వివిధ రాష్ట్రాలు, ఏరియా కమిటీలు పనిచేస్తున్నాయి. ఈ కమిటీలకు రక్షణగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన సాయుధులు రక్షణ కల్పిస్తున్నారు. దీనికి తోడు ప్రతి కమిటీకి సాయుధ దళాలు ఉంటాయి. వేసవి ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వ భద్రతా బలగాలను ఎదుర్కోవాలంటే దళాలు వేర్వేరుగా కాకుండా కలిసికట్టుగా దాడులు చేయాలనే వ్యూహానికి మావోలు పదును పెడుతున్నట్టు సమాచారం. ఈ మేరకు దండకారణ్యం, అబూజ్మడ్ అడవుల్లో తమకు పట్టున్న ప్రాంతానికి వివిధ దళాలు చేరుకున్నట్టు తెలుస్తోంది.సురక్షితంగా ఎంట్రీ–ఎగ్జిట్.. ఒకప్పుడు రెడ్ కారిడార్ అంటే నేపాల్ నుంచి దక్షిణ భారతదేశం వరకు ఉండేది. ప్రస్తుతం బస్తర్ అడవులు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ చాలా ప్రాంతం భద్రతా దళాల అధీనంలోకి వెళ్లింది. అయినప్పటికీ దక్షిణ బస్తర్, ఏవోబీ, ఛత్తీస్గఢ్ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఇప్పటికీ మావోల గుప్పిట్లోనే ఉన్నాయి. దీంతో తమకు పట్టు ఉన్న ప్రాంతానికి చేరుకుంటున్న దళాలు... ఆయా ప్రాంతాల నుంచి ఎంట్రీ, ఎగ్జిట్, రిట్రీవ్ రూట్లు సేఫ్గా ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. తమ స్థావరాల సమీపంలోకి భద్రతా దళాలు వస్తే భీకరంగా ఎదురుదాడి చేయాలని మావోయిస్టులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. జవాన్ల జోరు తగ్గిందా? ఈ ఏడాది ఆరంభంలో జనవరి 16, 21, ఫిబ్రవరి 9న భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనల్లో 80 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి సైతం ప్రాణాలు కోల్పోయారు. కానీ గడిచిన నెలరోజులుగా భారీ ఎన్కౌంటర్లు ఎక్కడా జరగలేదు. నక్సలైట్ల వేసవి వ్యూహాలను పసిగట్టడం వల్లనే గడిచిన నెల రోజులుగా గాలింపు చర్యలను భద్రతా దళాలు ఆచితూచి చేపడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దూకుడుగా అడవుల్లోకి వెళ్లి మావోయిస్టుల వలలో చిక్కితే భారీగా ప్రాణనష్టం జరగడంతో పాటు జవాన్ల ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్లే కూంబింగ్కు సమాంతరంగా బేస్ క్యాంపులను సుస్థిరం చేయడం, కొత్తగా అధీనంలోకి వచ్చిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై భద్రతా దళాలు ఫోకస్ చేస్తున్నాయి. కవ్వింపు చర్యలు తీవ్ర నిర్బంధం కొనసాగుతున్నప్పటికీ మార్చి 6న దంతేవాడ జిల్లా కేంద్రానికి 40 కి.మీ. దూరంలో బస్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించారు. విప్లవ ద్రోహులుగా పేర్కొంటూ అక్కడ కొన్ని కుటుంబాలను ఊరు వదిలి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. గాలింపు చర్యల్లో భద్రతా దళాల దూకుడు తగ్గడంతో వారిని రెచ్చగొట్టి అడవుల్లోకి రప్పించేందుకే మావోయిస్టులు ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మావోయిస్టుల ప్రింటింగ్ సామగ్రి స్వాధీనందుమ్ముగూడెం: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా చింతల్నార్ పోలీస్స్టేషన్ పరిధిలోని గోమ్గూడ క్యాంపు బలగాలు ఆదివారం మావోయిస్టుల ప్రింటింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. గోమ్గూడ క్యాంపు నుంచి డీఆర్జీ, కోబ్రా, 241 బెటాలియన్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గోమ్గూడ క్యాంపు పరిధిలోని జాలేర్గూడ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు స్పైక్(పదునైన కడ్డీలు)లను ఏర్పాటు చేశారు. వాటిని తొలగించుకుంటూ గాలిస్తుండగా.. మావోయిస్టులకు చెందిన ప్రింటింగ్ స్థావరం బయటపడింది. అక్కడ మావోయిస్టులు దాచిపెట్టిన ప్రింటర్లు, ఇన్వర్టర్ యంత్రాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మావోయిస్టులకు లొంగుబాటే శరణ్యమా? -
అభివృద్ధిలో ముందుంచుతాం
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకుపోతోందని, ఉమ్మడి జిల్లాను అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుపుతామని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధిపై ఆదివారం ఆయన హైదరాబాద్లో నిర్వహించిన సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు రేణుకాచౌదరి, పోరిక బలరాం నాయక్, రామసహాయం రఘురాంరెడ్డితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో తాగు, సాగునీరు, విద్యుత్ సరఫరా వంటి అంశాలను కూలంకషంగా చర్చించినట్లు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో నంబర్ వన్గా నిలబెట్టేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలపై విస్తృతంగా చర్చించామన్నారు. జిల్లాలో అత్యవసర అభివృద్ధి పనులకు మినరల్ ఫండ్, జిల్లా అభివృద్ధి నిధులు, జిల్లా ఇన్చార్జ్ మంత్రి నిధులను వినియోగించుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. హ్యామ్ రోడ్ల మంజూరులో ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేస్తామని అన్నారు. సమావేశంలో పినపాక, భద్రాచలం, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లెందు ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావ్, మాలోత్ రాందాస్ నాయక్, మట్టా రాగమయి, జారే ఆదినారాయణ, కోరం కనకయ్య పాల్గొన్నారు. అత్యవసర పనులకు మినరల్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఫండ్ వినియోగించుకోండి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి, ఎంపీలు, ఎమ్మెల్యేలు -
‘తాయిలం’ అందేనా ?
● ఏటా రామాలయంపైనే ఉత్సవాల భారం ● నిర్వహణ ఖర్చులకు హుండీ ఆదాయమే మార్గం ● ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు భద్రాచలం: భద్రగిరి రామయ్యకు సర్కారు తాయిలం అందడం లేదు. ప్రతీ ఏడాది ఉత్సవాల సమయంలో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నా నిరుత్సాహమే మిగులుతోంది. దేవస్థానంలో జరిగే ప్రధాన ఉత్సవాల నిర్వహణ వ్యయం తలకు మించిన భారం అవుతుండడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. చివరికి భక్తులు సమర్పించే హుండీ ఆదాయమే దిక్కుగా మారడంతో ఆ నిధులనే ఉత్సవాల నిర్వహణకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఆలయ అభివృద్ధి కుంటుపడుతోందని ఇటు భక్తులు, అటు అధికారులు ఆవేదన చెందుతున్నారు. నవమి వ్యయం రూ.2 కోట్లకు పైగానే.. భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరిగే ఉత్సవాల్లో ముక్కోటి, శ్రీరామనవమి ముఖ్యమైనవి. వీటితో పాటు భక్తరామదాసు జయంతి ఉత్సవాలనూ ఘనంగా నిర్వహిస్తారు. అయితే వీటిలో ముక్కోటి సందర్భంగా తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం, శ్రీరామనవమి వేడుకలకు భక్తులు భారీగా హాజరవుతుంటారు. ఆ సమయాల్లో విధులు నిర్వహించే సిబ్బంది సైతం వందల సంఖ్యలో ఉంటారు. కాగా, ఈ ఉత్సవాల నిర్వహణకు అధిక మొత్తంలో ఖర్చవుతుంది. వస్తువుల ధరలు, వివిధ విభాగాల కార్మికుల జీతభత్యాలు పెరుగుతుండగా ఏటేటా నిర్వహణ వ్యయం సైతం పెరుగుతోంది. గతంలో రూ. కోటి – కోటిన్నర మధ్యలో ఖర్చు కాగా, ఈ ఏడాది రూ.రెండు కోట్లకు పైగానే అవసరమని అధికారులు అంటున్నారు. వీటిలో ఉత్సవ నిర్వహణ పనులకు రూ.కోటిన్నర, క్రతువు నిర్వహణ, తలంబ్రాలు, పట్టువస్త్రాలు, ఇతర ఖర్చులకు మరో కోటి వరకు ఖర్చవుతుందని అనధికారికంగా చెబుతున్నారు. ముక్కోటికి సైతం రూ.కోటిన్నర వరకు వ్యయం అవుతున్నట్లు అంచనా. కాంగ్రెస్ సర్కారైనా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం దేవస్థానంలో ఉత్సవాల నిర్వహణకు ఒక్క పైసా విదల్చలేదు. ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు ఇస్తామన్న హామీని సైతం విస్మరించింది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారైనా నిధులు ఇవ్వకపోతుందా అని భక్తులు కోటి ఆశలు పెట్టుకున్నారు. గతేడాది శ్రీరామనవమి ఉత్సవాలకు నిధులు కేటాయిస్తుందని భావించినా విడుదల చేయలేదు. ఈ ఏడాదైనా రామయ్యపై కరుణ చూపేనా అని భక్తులు, అధికారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ఎన్నికల కోడ్ కారణంగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. ఈ ఏడాది హాజరు కావడంతో పాటు ఆలయ అభివృద్ధిపై స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశం ఉందని పలువురు ఆశిస్తున్నారు. తక్షణమే సాయం అందించాలి భక్తుల ఆదాయం భక్తులకే చెందాలి. ఉత్సవాల నిర్వహణ పేరుతో పక్కదారి పట్టించడం సరైంది కాదు. హుండీ ఆదాయాన్ని భక్తుల వసతుల కల్పనకు కేటాయించాలి. ఆలయంలో జరిగే ఉత్సవాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం స్వీకరించాలి. వీటికి అయ్యే ప్రతి పైసా ప్రభుత్వమే భరించాలి. – బూసిరెడ్డి శంకర్ రెడ్డి, భద్రాద్రి పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఖర్చులకు కానుకలే దిక్కు.. భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అయితే ప్రభుత్వం నుంచి అందే సాయం మాత్రం రూ.15వేలు మాత్రమే. అది కూడా పేపర్లపై లెక్కలు చూపడం మాత్రమే. అంతకుమించి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి వచ్చేది లేదు. నవమి వేడుకలకు సాయం అందించాలని అటు అధికారులు, ఇటు భక్తులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ఫలితం లేదు. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు అందించే స్థాయిలో కాకున్నా భక్తుల మనోభావాలను గౌరవించి ఉత్సవాల నిర్వహణకు ఎంతో కొంత అందించాలని పలువురు కోరుతున్నారు. కాగా హుండీల ద్వారా భక్తులు సమర్పించే కానుకలనే ఉత్సవాల నిర్వహణకు వెచ్చిస్తున్నారు. గతం కంటే ఆదాయం పెరిగినా ఆలయ అఽభివృద్ధికి, భక్తులకు మరింతగా వసతుల కల్పనకు వెచ్చించాల్సిన నిధులను ఉత్సవాల కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. భద్రాచలంలో భక్తులకు వసతి కష్టాలు నిత్యం ఎదురవుతుంటాయి. ఆలయానికి వచ్చే ఆదాయంతో రంగనాయకుల గుట్ట మీద, కింద దేవస్థానం భూముల్లో డార్మెటరీ, 100 గదుల వసతి గృహాలను నిర్మిస్తే ఈ సమస్య తీరే అవకాశం ఉంటుంది. -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపరం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి అర్చకులు ఆదివారం విశేష పూజలు చేశారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు.. పసుపు, కుంకుమ, చీరలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. నేడు హుండీ లెక్కింపు.. పెద్దమ్మతల్లి అమ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను సోమవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కించనున్నట్లు ఈఓ రజనీకుమారి తెలిపారు. -
రామయ్యను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
● పెద్దమ్మతల్లి ఆలయంలో పూజలు ● కొత్తగూడెం కోర్టులో వెయిటింగ్ హాల్ ప్రారంభం భద్రాచలంఅర్బన్/పాల్వంచరూరల్/కొత్తగూడెంటౌన్ : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా ఆదివారం దర్శించుకున్నారు. ఆమెకు ఈఓ రమాదేవి స్వాగతం పలకగా వైదిక పెద్దలు ఆశీర్వచనం అందజేశారు. ప్రధాన ఆలయంతో పాటు ఆంజనేయస్వామి, లక్ష్మీతయారమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం జస్టిస్ నందా భద్రాచలం జ్యుడీషియల్ కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత బార్ అసోసియేషన్ సభ్యులు సన్మానించి రాముల వారి ప్రతిమ అందజేశారు. అనంతరం జస్టిస్ నందా పెద్దమ్మతల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా ఈఓ రజనీకుమారి జడ్జికి అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలు అందజేశారు. కొత్తగూడెం కోర్టులో.. కొత్తగూడెం కోర్టులో నిర్మించిన వెయిటింగ్ హాల్ను న్యాయమూర్తి సూరేపల్లి నందా ఆదివారం ప్రారంభించారు. ఆమెకు జిల్లా జడ్జి పాటిల్ వసంత్, కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నందా మాట్లాడుతూ.. న్యాయ సేవలను అందుబాటులోకి తేవడంలో, లీగల్ ఆవేర్నేస్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషిస్తున్నారని అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి శివనాయక్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి బత్తుల రామారావు, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.సాయిశ్రీ, మణుగూరు, దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జీలు కె. సూరిరెడ్డి, బి.భవానీ, ఎస్పీ రోహిత్రాజు, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, భద్రాచలం, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోట దేవదానం, లక్కినేని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సమానత్వం కోసం ఉద్యమించాలి
భద్రాచలంఅర్బన్: మహిళలంతా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వంపై ఉద్యమించాలని, మహిళలపై జరుగుతున్న హింసను తిప్పికొట్టాలని ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ పిలుపునిచ్చారు. పీఓడబ్ల్యూ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆదివారం భద్రాచలంలోని గిరిజన అభ్యుదయ భవన్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదస్సు పీఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు కప్పల సూర్యకాంతం అధ్యక్షతన నిర్వహించారు. అందే మంగ మాట్లాడుతూ.. నాడు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మొత్తం దెబ్బతిని పరిశ్రమలకు పనికి వెళ్లిన వారిని శ్రమదోపిడీ చేసి విశ్రాంతి తీసుకుంటే కూడా వేతనం కట్ చేసి ఇచ్చేవారని, ఈ దోపిడీ నుంచి పుట్టిన పోరాట ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని పేర్కొన్నారు. సభలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఐలయ్య ఆదర్శప్రాయుడు
సుజాతనగర్: అమరజీవి కాసాని ఐలయ్య ఆదర్శప్రాయుడని, ఆయనను ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు జాన్వెస్లీ, కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. సుజాతనగర్లో ఆదివారం జరిగిన సంస్మరణ సభలో వారు మాట్లాడారు. కొత్తగూడెం ప్రాంతంలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో కాసాని ఐలయ్య అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఐలయ్య స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాసాని ఐలయ్య అలుపెరుగని పోరాటాలు సాగించారని గుర్తు చేశారు. సభలో పలువురు జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు. 15 నుంచి చర్లలో అంతర్రాష్ట క్రికెట్ టోర్నీ చర్ల: ఈ నెల 15 నుంచి మండలంలో నక్కిబోయిన శ్రీనివాసరావు జ్ఞాపకార్థం అంతర్రాష్ట క్రికెట్ పోటీలను నిర్వహించనున్నట్లు చర్ల యూత్ ఒక ప్రకటనలో తెలిపింది. చర్ల (రాళ్లగూడెం)లోని రాళ్లగూడెం క్రీడా మైదానంలో నిర్వహించే పోటీలకు 13వ తేదీ వరకు ఎంట్రీలు నమోదు చేస్తామని, మొదటి బహుమతి రూ.60,116, రెండో బహుమతి రూ.40,116, మూడో బహుమతి రూ.20,116, నాలుగో బహుమతి రూ.10,116 నగదుతో పాటు మెమెంటోలను ఇవ్వనున్నట్లు యూత్ బాధ్యులు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 88975 29795, 96664 03331, 79972 57068 నంబర్లలో సంప్రదించాలని కోరారు. గాయనికి అవార్డు మణుగూరురూరల్: హనుమకొండలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మణుగూరు మండలానికి చెందిన గాయని పూజారి జ్యోతికి విస్డం చారిటబుల్ ట్రస్ట్.. ఉమెన్ ఐకాన్–2025 అవార్డు అందించింది. జ్యోతికి అవార్డు రావడంపై తోటి గాయకులు, పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపారు. దద్దరిల్లుతున్న బాంబుల మోత ఆరెంపుల వాసుల ఆందోళన.. ఖమ్మంరూరల్: మండలంలోని ఆరెంపుల శివారు ఇరవై ఎకరాల భూమిలో కొందరు అనుమతి లేకుండా పేలుళ్లకు పాల్పడుతున్నారు. జనావాసాల నడుమ.. రాత్రింబవళ్లు బాంబుల (జిలెటిన్ స్టిక్స్)తో బండలను పేలుస్తుండగా రాళ్లు ఎగిరి పడుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బండరాళ్లను పేల్చడానికి తోడు భూమిని చదును చేసేందుకు ఇప్పటికే వందకు పైగా తాటిచెట్లను నేలమట్టం చేయగా తాము జీవనాధారం కోల్పోతున్నామని గీతకార్మికులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్, ఎకై ్సజ్ అధికారులు అటువైపు కన్నెతి కూడా చూడకపోవడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి అక్రమంగా బ్లాస్టింగ్ చేసి, తాటిచెట్లను నరికి వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ అంశంపై రూరల్ సీఐ రాజును వివరణ కోరగా.. బ్లాస్టింగ్కు సంబంధించి ఎవరూ అనుమతులు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఎవరైనా బ్లాస్టింగ్కు పాల్పడినట్లు తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మనువాదం ప్రజలను పీడిస్తోంది
● ప్రజా పోరాటాల్లో పెద్దన్న రవన్న ● వర్ధంతి సభలో వీపీవీ నేత పట్నాయక్ ఖమ్మంమయూరిసెంటర్ : దేశంలో మనువాదం, మార్కెట్ భావజాలం అనే కవల పిల్లలు ప్రజలను పీడిస్తున్నాయని, దీనికి వ్యతిరేకంగా ప్రజలు సమరశీల పోరాటాలు నిర్వహించాలని విద్యా పరిరక్షణ వేదిక జాతీయ నాయకులు రమేష్ పట్నాయక్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ (ఎంఎల్ )మాస్లైన్–రవన్న మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రాయల సుభాస్ చంద్రబోస్ (రవన్న) 9వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ పట్నాయక్ మాట్లాడుతూ.. దేశ సంపదను లూటీ చేసేలా కార్పొరేట్ శక్తులకు పాలకులు సేవ చేస్తున్నారని అన్నారు. పేదలను మరింత బలహీనంగా మారుస్తూ సోమరిపోతులుగా చూస్తున్నారని విమర్శించారు. నిత్యావసరాల ధరలు మండుతున్నాయని, కోట్లాది కుటుంబాలు పేదరికంలో కూరుకుపోతుంటే కార్పొరేట్ వర్గాల వారు శత కోటీశ్వరులుగా మారుతున్నారని అన్నారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం విద్యుత్, సాగు, తాగునీరు, సేవా రంగం, సంక్షేమ పథకాలు ఇవన్నీ ప్రజలకు అందించాల్సిన బాధ్యత పాలకవర్గాలపై ఉందన్నారు. ప్రముఖ సంపాదకులు సతీష్ చందర్ మాట్లాడుతూ సమాజంలో అన్ని రంగాలను పెట్టుబడిదారీ వ్యవస్థ నియంత్రిస్తోందన్నారు. మనువాద చాందస భావాలకు వ్యతిరేకంగా సమష్టిగా ఉద్యమించాలని కోరారు. సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ నాయకులు కేజీ రామచందర్ మాట్లాడుతూ రవన్న అతివాద, అవకాశవాదాలకు వ్యతిరేకంగా అంతర్గత పోరటం చేసి విప్లవోద్యమాన్ని సరైన దిశలో నడిపారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, నాయకులు కెచ్చల రంగయ్య, గుర్రం అచ్చయ్య, కె.రమ, గోకినపల్లి వెంకటేశ్వర్లు, చండ్ర అరుణ, ముద్ద భిక్షం, పుసులూరి నరేందర్, చిన్న చంద్రన్న, హన్మేశ్, ఎస్ఎల్ పద్మ, ఆవుల వెంకటేశ్వర్లు, సి.వై.పుల్లయ్య జి.రామయ్య, మనోహర్ రాజు, కల్పన, ఆవుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్ముదామా.. ఆగుదామా?!
మిర్చికి ఆశించిన ధర లేక సందిగ్ధంలో రైతులు ● నిల్వ చేయడానికే ఎక్కువ మంది మొగ్గు.. వ్యాపారులదీ అదే దారి ● విదేశీ ఆర్డర్లతో ధర పెరుగుతుందని ఆశలు ● నిండిపోతున్న కోల్డ్ స్టోరేజీలు ఖమ్మంవ్యవసాయం: ఆశించిన ధర రాకపోవడంతో మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రతికూల పరిస్థితుల్లో సాగు చేసినా ఆశించిన దిగుబడి రాక.. వచ్చిన పంటకూ సరైన ధర దక్కక ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ధర లేకపోవడంతో ఎక్కువ మంది నిల్వ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు రైతుల నుంచి కొనుగోలు చేసిన వ్యాపారులు సైతం ఇదే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏ కోల్డ్ స్టోరేజీ వద్ద చూసినా మిర్చి బస్తాలతో వచ్చిన వాహనాలు బారులుదీరి కనిపిస్తున్నాయి. ఏడాదిలో ఎంత తేడా.. గతేడాది సీజన్లో క్వింటా మిర్చికి రూ.20 వేల నుంచి రూ.23వేల వరకు ధర పలకగా.. ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గత సంవత్సరం కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చికి 2024 అక్టోబర్లో రూ.19 వేలు, నవంబర్లో రూ. 18వేల ధర పలకగా.. ఈ ఏడాదిసాగు చేసిన మిర్చికి రూ.17వేల వరకు ధర పలికింది. అయితే ఆ తర్వాత ధర పతనం అవుతుండగా తొలి కోతలు కావడంతో మైలకాయకు ధర తక్కువ ఉండడం సహజమమేనని భావించారు. కానీ రోజురోజుకూ ధర మరింత పతనం కాసాగింది. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చికీ ధర పడిపోయింది. డిసెంబర్లో నిల్వ మిర్చి క్వింటా ధర రూ.16 వేలకు, కొత్త మిర్చి ధర రూ.15,500కు, జనవరిలో నిల్వమిర్చి ధర రూ. 14,500కు, కొత్త మిర్చి ధర రూ.15 వేలకు పడిపోయింది. ఇక ఫిబ్రవరిలో రెండో కోతగా నాణ్యమైన మిర్చి వచ్చినా ధరలో పురోగతి లేకవడంతో రైతులకు ఆవేదనే మిగిలింది. ఫిబ్రవరిలో గరిష్టంగా రూ.14వేలు, మోడల్ ధర రూ.13,500గా పలికింది. కోల్డ్ స్టోరేజీల బాట.. మిర్చికి ప్రస్తుతం ఆశించిన ధర లేకపోగా.. మున్ముందు గిట్టుబాటు ధర వస్తుందనే ఆశతో రైతులు నిల్వకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లాలో 2,17,360 మెట్రిక్ టన్నుల మిర్చి నిల్వచేసే సామర్థ్యం కలిగిన 48 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. ఫిబ్రవరి ఆరంభం నుంచే ధర ఆశాజనకంగా లేదని రైతులు పంట నిల్వ చేస్తుండగా, వ్యాపారులు భవిష్యత్పై అంచనాలతో నిల్వ పెడుతున్నారు. జిల్లాకు తోడు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల రైతులు కూడా ఖమ్మం బాట పడుతుండడంతో ఇక్కడ కోల్డ్ స్టోరేజీలన్నీ నిండిపోతున్నాయని తెలుస్తోంది. అన్ సీజన్పై ఆశలు ఈ ప్రాంతంలో పండించే ‘తేజా’ రకం మిర్చికి చైనా సహా పలు దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో అక్కడి ఆర్డర్ల ఆధారంగా ఎగుమతిదారులు కొనుగోలు చేయడంతో గత ఏడాది మంచి ధర పలికింది. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేక ధరలో పురోగతి లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యాన అన్ సీజన్లో గతేడాది మాదిరిగా రూ.20 వేలు – రూ.23 వేల ధర వస్తుందనే ఆశతో అటు రైతులకు తోడు ఇటు వ్యాపారులు సైతం పంట నిల్వ చేస్తున్నారు.పెట్టుబడులు కూడా రావని... జనవరిలో 50 బస్తాల మిర్చి క్వింటాకు రూ.13,200 చొప్పున విక్రయించా. రెండో కోత పంటకు ధర పెరుగుతుందనుకున్నా ప్రయోజనం లేదు. ఇప్పుడు అమ్మితే పెట్టుబడి కూడా దక్కదని 42 బస్తాలు నిల్వ చేస్తున్నా. – బానోత్ మట్టా, గోవింద్రాల, కామేపల్లి మండలం జూన్ తర్వాత ఆలోచిస్తా... ప్రస్తుత ధర పెట్టుబడులను పూడ్చే స్థితిలో లేదు. గత ఏడాది మిర్చి రూ. 20 వేలకు విక్రయిస్తే ఈసారి రూ.14 వేలే వచ్చింది. జూన్, జూలై తరువాత ధర పెరుగుతుందనే ఆశ ఉంది. అప్పటివరకు చూసి అమ్ముతా. – చిరసవాడ రాజు, ఎదుళ్లచెరువు, తిరుమలాయపాలెం మండలం -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన
అశ్వాపురం: మండలంలో నూతనంగా నిర్మించిన శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. పల్లె ప్రకృతి వనంలో ఆంజనేయస్వామి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేపట్టారు. రామాలయంతో పాటు అంతర్భాగంలో ఆంజనేయస్వామి, శివాలయం, విఘ్నేశ్వరస్వామి ఉపాలయాల్లో విగ్రహాలు, నవగ్రహాల విగ్రహాలు ప్రతిష్ఠించారు. రామనామస్మరణతో మొండికుంట మారుమోగింది. సీఐ అశోక్రెడ్డి, ఎస్ఐలు తిరుపతిరావు, రవూఫ్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాగశాల వద్ద భక్తులకు మహా అన్నదానం నిర్వహించారు. భక్తరామదాసు మునిమనమడు కంచర్ల శ్రీనివాసరావు, భద్రాచలం రామాలయం ఈఓ రమాదేవి, మణుగూరు డీఎస్పీ రవీందర్రెడ్డి, సీఐ అశోక్రెడ్డి దంపతులు, డీసీసీబీ డైరెక్టర్, కాంగ్రెస్ జిల్లా నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. -
మహిళా ఉత్పత్తులకు హైదరాబాద్లో విశేష ఆదరణ
కొత్తగూడెం అర్బన్/చుంచుపల్లి: కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆలోచన మేరకు, ‘ఎక్స్ ప్లోర్ భద్రాద్రి కొత్తగూడెం’కార్యక్రమంలో భాగంగా ఆదివారం హైదరాబాద్ మాదాపూర్లోని నాలెడ్జి సిటీలో ఓ ఆర్గనైజేషన్ నిర్వహించిన ‘రన్ ఫర్ హర్’అనే కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మహిళలు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల రన్ నిర్వహించగా సుమారు 1,000 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మహిళలు స్వయంగా తయారు చేసిన కరక్కాయ టీపౌడర్, తేనే, ఫ్లేవర్ తేనే, విప్పపూలు, విప్పనూనె, మిల్లెట్స్తో తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్స్, గిరి ప్రొడక్ట్స్ అయిన సబ్బులు, న్యూట్రిమిక్స్, డ్రైమిక్స్ వంటి వివిధ ఉత్పత్తులు ఆకర్షణీయమైన ప్యాకింగ్లో ప్రదర్శించారు. ఈవెంట్లో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వైద్యులు, వివిధ రంగాల్లో ఉన్న మహిళలు కొనుగోలు చేశారు. కార్యక్రమంలో డీపీఎం నాగజ్యోతి, ఏపీఎం వెంకయ్య తదితరులు పాల్గొని మహిళల ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించారు. -
సింగరేణిలో ముగిసిన పరీక్షలు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో ఖాళీ పోస్టులకు ఇంటర్నల్ అభ్యర్థులతో నిర్వహించిన మూడు రకాల పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. జూనియర్ మైనింగ్ ఆఫీసర్ (ఈ గ్రేడ్–1) 87 పోస్టులకు 21 మంది దరఖాస్తు చేసుకోగా 17 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఇక జూనియర్ ఆఫీసర్ (ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్) నాలుగు పోస్టులకు ఆరుగురు దరఖాస్తు చేసుకోగా ఐదుగురు, జూనియర్ సర్వే ఆఫీసర్ 64 పోస్టులకు 71 మంది దరఖాస్తు చేసుకుని 67 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం మూడు విభాగాల్లో 155 ఖాళీలకు 98 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా, అందులోనూ 89 మంది మాత్రమే పరీక్ష రాశారని సింగరేణి యాజమాన్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. స్థానిక సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్షలు నిర్వహించగా రిక్రూట్మెంట్ సెల్ జీఎం నికోలస్ పర్యవేక్షించారు. పరీక్ష ఫలితాలను ఆదివారం రాత్రికే సింగరేణి వెబ్సైట్తో పాటు, సింగరేణి ప్రధాన కార్యాలయంలోని నోటీస్ బోర్డ్లో ప్రదర్శించినట్లు తెలిపారు. -
మున్నేటిలో పడి విద్యార్థి మృతి
ఖమ్మంరూరల్: మండలంలోని గోళ్లపాడు వద్ద మున్నేటిలో ప్రమాదవశాత్తు పడి విద్యార్థి ఎర్రం మహేశ్ (22) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మొగళ్లపల్లి గ్రామానికి చెందిన మహేశ్ ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతూ.. గట్టయ్యసెంటర్లో స్నేహితులతో కలిసి అద్దెకుంటున్నాడు. కాగా, ఈ నెల 8న స్నేహితులతో కలిసి కాల్వ వద్దకు వెళ్లి అందులో పడి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు, సిబ్బంది సాయంతో మృతదేహాన్ని వెలికి తాశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు తెలిపారు. చెట్టుకు ఢీకొన్న బైక్: ఒకరు మృతి మరొకరి పరిస్థితి విషమం టేకులపల్లి: వేగంగా వచ్చిన బైక్ చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారిన ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ సురేశ్ కథనం ప్రకారం.. కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన జోగా వంశీ (22), పొడుగు ప్రవీణ్ బైక్పై టేకులపల్లి మండలంలో శుభకార్యానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో వేగంగా బైక్ నడుపుతూ తుమ్మలచెలక క్రాస్రోడ్ సమీపంలో అదుపుతప్పి చెట్టుని ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వంశీ మృతిచెందాడు. ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత చండ్రుగొండ: మండలంలోని తిప్పనపల్లి వద్ద ఎదుళ్లవాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా శనివారం రాత్రి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్ఐ శివరామకృష్ట ఆదివారం తెలిపారు. డ్రైవర్ అంచ రమేశ్, ట్రాక్టర్ యజమాని పి.రాధాకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మహిళ ఆత్మహత్యాయత్నం పాల్వంచరూరల్: కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ ఇంట్లో ఉన్న మాత్రలు అధికంగా మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పాతసూరారంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని పాత సూరారం గ్రామానికి చెందిన 28 ఏళ్ల మహిళ ఆదివారం ఇంట్లో గొడవల కారణంగా మాత్రలు అధికంగా మింగడంతో ఆపస్మారకస్థితికి చేరింది. కుటుంబ సభ్యులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. -
శ్రీనివాస గిరి కల్యాణ ప్రచార రథం ప్రారంభం
పాల్వంచ: పట్టణంలోని శ్రీనివాస కాలనీ శ్రీనివాస గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం(గుట్ట)పై మార్చి 24వ నుంచి 27 వరకు నిర్వహించే శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ చేపట్టిన ప్రచార రథాన్ని ఆదివారం కేటీపీఎస్ 7వ దశ సీఈ శ్రీనివాసబాబు, కొత్త వెంకటేశ్వర్లు, వైద్యులు బిక్కసాని సుధాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్త సమాజ మండలి అధ్యక్షుడు ఆరుట్ల లక్ష్మణాచార్యులు మాట్లాడుతూ.. ప్రచార రథం ఉమ్మడి జిల్లా, చుట్టు పక్కల ప్రాంతాల్లో పర్యటించనుందన్నారు. కార్యక్రమంలో సునీల్కుమార్, ధర్మపురి రాము, ఊకె భద్రయ్య, కందుకూరి రామకృష్ణ, తాటికొండ శ్రీలత, వంకదారు నర్సింహకుమార్, మిట్టపల్లి నర్సింహారావు, కంఠాల వెంకటేశ్వరరావు, బండి వెంకటేశ్వర్లు, కిలారు పురుషోత్తం, మేదరమెట్ల శ్రీనివాసరావు, బండి నారాయణ, ఏటుకూరి నరేశ్, రమేశ్, రాంజీ, వెంకి, వెంకట సుబ్బయ్య, చనుమోలు శ్రీనివాసరావు, కనగాల శ్రీనివాసరావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన
కొత్తగూడెంటౌన్: జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. దాదాపు 4,997 కేసులకు పరిష్కారం లభించింది. కొత్తగూడెంలో సివిల్ కేసులు 11, క్రిమినల్ కేసులు 3,174, పీఎల్సీ కేసులు 310 కేసులు మొత్తం 3495 కేసులను పరిష్కరించారు. ఇల్లెందులో సివిల్ కేసులు 6, క్రిమినల్ కేసులు 278, పీఎల్సీ కేసులు 138 మొత్తం 422 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ అదాలత్లో కక్షిదారులు సమస్యలను పరిష్కరించుకోవడం అభినందనీయమని అన్నారు. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో కుటుంబ కలహాలు పెరిగాయని, చిన్నచిన్న గొడవలు, క్షణికావేశంలో చేసిన నేరాలతో కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు. రాజీమార్గమే రాజమార్గమని, రాజీ ద్వారా సమయం, డబ్బులను ఆదా చేసుకోవచ్చని చెప్పారు. కక్షిదారులకు యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ చేశారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్జడ్జి బత్తుల రామారావు, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.సాయిశ్రీ, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరావు, ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్.ఆర్ రవిచంద్ర, మహ్మద్ సాధిక్పాషా, వి.పురుషోత్తమరావు, పి. నిరంజన్రావు పాల్గొన్నారు.జిల్లావ్యాప్తంగా 4,997 కేసుల పరిష్కారం -
బీఎస్ఎన్ఎల్.. ఏది సిగ్నల్..?
● దురదపాడులో నెలరోజులుగా పని చేయని వైనం ● టవర్ వద్ద గిరిజనుల నిరసన అశ్వారావుపేటరూరల్: అటవీ ప్రాంతాల్లోని గిరిజన పల్లెలకు సెల్ఫోన్ సేవలు అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మవోయిస్టు ప్రభావిత నిధులతో ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్ టవర్లు నిరూపయోగంగా మారాయి. దీంతో స్థానికులు టవర్ వద్ద సెల్ఫోన్లతో నిరసన వ్యక్తం చేశారు. అశ్వారావుపేట మండలంలోని దిబ్బగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని దురదపాడు గిరిజన గ్రామంలో కొన్నేళ్ల కిందట మావోయిస్టు ప్రభావిత నిధులతో బీఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటు చేశారు. దీని పరిధిలో నెల రోజులుగా సెల్ఫోన్ సిగ్నల్స్ రావడం లేదు. ఒకపక్క ప్రైవేట్ సెల్ కంపెనీలు పోటీలు పడి రోజురోజుకూ టెక్నాలజీ సాయంతో ఉత్తమ సేవలు అందిస్తుండగా, బీఎస్ఎన్ఎల్ అధికారులు మాత్రం మొద్దు నిద్ర పోతున్నారా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. బీఎస్ఎన్ఎల్కు ఆదరణ తగ్గిపోతోందనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. కాగా, నెల రోజులుగా ఈ టవర్ పరిధిలో సిగ్నల్స్ అందకపోవడంతో ఫోన్, ఇంటర్నెట్ వినియోగదారులంతా అవస్థ పడుతున్నారు. టవర్ ఉండటంతో స్థానిక గిరిజనులు అధిక సంఖ్యలో బీఎస్ఎన్ఎల్ సిమ్లనే వాడుతున్నారు. సిగ్నల్స్ అందక గ్రామంలో ఉన్న టవర్ నిరుపయోగంగా మారందని వినియోగదారులు చెబుతున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే (108 వాహనం, ఫైర్, డయల్ 100) సమాచారం ఇచ్చేందుకు దూరంలో ఉన్న మరో గ్రామానికి వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. బీఎస్ఎన్ఎల్ అధికారులకు చెప్పేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కాగా, బీఎస్ఎన్ఎల్ ఎస్డీఈ హర్షవర్దన్రెడ్డికి వివరణ కోసం ఫోన్ చేయగా స్పందించలేదు. -
వీల్చైర్ క్రికెట్ క్రీడాకారులను అభినందించిన ఎంపీ
ఖమ్మంవన్టౌన్: నేషనల్ వీల్చైర్ క్రికెట్ టోర్నీ లో ప్రతిభ చాటిన జిల్లా క్రీడాకారులను ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి శనివారం అభినందించారు. జిల్లాకు చెందిన ఎస్.కే.సమీరుద్దీ న్, బండి రాము, సురేష్, రమావత్ కోటేశ్వర్, మహ్మద్ సమీ జట్టు విజయానికి తోడ్పడ్డారు. ఈ సందర్భంగా వారిని ఎంపీ ఖమ్మంలో సన్మానించగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారా యణ, పాపానాయక్ పాల్గొన్నారు. పార్లమెంట్లో గళం విప్పుతా.. ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ పనులకు నిధులు కేటాయించేలా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి తెలిపారు. హైదరాబాద్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఎంపీల సమావేశం జరగగా ఆయన మాట్లాడారు. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు, పాలేరు నియోజకవర్గం మీదుగా వెళ్లే రైల్వేలైన్ అలైన్మెంట్ మార్పు, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారులు, ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరనున్నట్లు తెలిపారు. కొండ గొర్రె మాంసం పట్టివేత గుండాల: వేటగాళ్లకు కొండ గొర్రె మాంసాన్ని పంచుకుంటుండగా పట్టుకొని కేసు నమోదు చేశామని అటవీశాఖాధికారులు శనివారం తెలిపారు. చింతలపాడు గ్రామానికి చెందిన ఇద్దరు చేపల వేటకు వెళ్లగా కుక్కలు ఓ కొండ గొర్రెను వేటాడాయి. ఆ మాంసాన్ని తెచ్చుకున్న ఇద్దరు అటవీ శాఖ అధికారులకు పట్టుబడ్డారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వారిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించామని అటవీశాఖ అధికారులు నరసింహారావు, బాలాజీ తెలిపారు. -
ఈసారి మామిడి తింటామా?
చేతికొచ్చే పంట చేజారుతోంది.. ● ఏటా వెంటాడుతున్న తెగుళ్ల బెడద ● మాడిపోతున్న పూత, రాలుతున్న పిందెలు ● మామిడి దిగుబడిపై రైతుల్లో ఆందోళన ఇల్లెందురూరల్: వరుసగా ఆరేళ్లుగా దిగుబడి తగ్గి కుదేలైన మామిడి రైతుకు ఈ ఏడాది కూడా కాలం కలిసిరావడం లేదు. పూత, పిందె దశలో ఆశిస్తున్న చీడపీడలు రైతును కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ సారైనా కోలుకుందామనుకుంటే ఆలస్యంగా పూత రావడం, వచ్చిన పూతకు మస్సి పట్టేయడం, చిగురుగా మారడం, పిందెలు రాలిపోవడం.. వంటి కారణాలతో చేతికొచ్చే పంట చేజారుతోందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 53 వేల ఎకరాల్లో మామిడి సాగు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మామిడి 53 వేల ఎకరాల్లో సాగవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 వేల ఎకరాల్లో, ఖమ్మం జిల్లాలో 42 వేల ఎకరాల్లో మామిడి పంటను సాగు చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో అత్యధికంగా అన్నపురెడ్డిపల్లి, ముల్కలపల్లి, టేకులపల్లి, ఇల్లెందు, అశ్వారావుపేట మండలా ల్లో, ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం, తల్లాడ, పెనుబల్లి, వేంసూరు, కల్లూరు, కామేపల్లి మండలాల్లో అత్యధిక విస్తీర్ణంలో మామిడి పంట సాగవుతోంది. ఆయా తోటల్లో అత్యధికంగా బంగినపల్లి, దశేరీ, కేసరి, హిమాయత్, రాయల్ స్పెషల్, తోతాపురి, చిన్నరసాలు, పెద్దరసాలు ప్రధానంగా కనిపిస్తాయి. పూత దశలోనే చీడపీడలు ఏటా నవంబర్ నుంచి జనవరి వరకు పూత వచ్చి జనవరిలో అక్కడక్కడా కాయలు కాయడం మామిడి లక్షణం. ఈ ఏడాది మంచు ప్రభావంతో కొంత ఆలస్యంగా పూత వచ్చింది. వచ్చిన పూతకు తేనె మంచు పురుగు, బూడిద తెగులు ఆశించింది. ఇంతేకాకుండా ఆకుల నుంచి రసం కారడం ప్రారంభమైంది. దీనికితోడు పూత పెద్ద ఎత్తున రాలిపోయింది. మొదట ఒక చెట్టుకు సోకిన తెగులు మరునాడు దాని పక్కనే ఉన్న చెట్లకు ఇలా తోటంతా సోకిందని రైతులు చెబుతున్నారు. కొందరైతే అధికంగా తెగుళ్లు సోకిన కొమ్మలను తొలగిస్తూ ఉన్న కాస్త పంటనైనా దక్కిచుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితానివ్వలేదు. తెగుళ్ల ప్రభావంతో ప్రస్తుతం చెట్లపై పూత మాడిపోయి ఒట్టి కాడలే కనిపిస్తున్నాయి. ఆలస్యంగా వచ్చిన పూత చిగురుగా మారి రైతులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. వెంటాడుతున్న నష్టాలు వరుసగా ఆరేళ్లు మామిడి రైతులకు నష్టాలు తప్పడం లేదు. 2020లో భారీ వర్షాల కారణంగా పూత, పిందె పూర్తిగా రాలిపోయింది. 2021, 22లలో కాత కొంత ఆశాజనకంగా ఉన్నా కరోనా ప్రభావంతో విక్రయాలు సన్నగిల్లి ధరపై తీవ్ర ప్రభావం చూపింది. 2023లో పూత, కాత సంతృప్తిగా ఉండటంతో దిగుబడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుకు కాయ పక్వానికి వచ్చే సమయంలో నల్లి రూపంలో తీవ్ర నష్టం వాటిల్లింది. గతేడాది పూత సంతృప్తికరంగా ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించలేదు. మంచు ప్రభావంతో పూత క్రమంగా చిగురుగా మారి దిగుబడిపై ప్రారంభంలోనే నీళ్లు చల్లింది. ఈ ఏడాది పూత దశ నుంచే చీడపీడలు ఆశించడం, పిందెలు రాలిపోవడంతో దిగుబడిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు, కరోనా తదితర కారణాలతో వరుసగా ఆరేళ్లుగా మామిడి రైతులు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆందోళనలో కౌలుదారులు మామిడి రైతులు అత్యధికంగా పూత దశలోనే తోటలను కౌలుకు ఇస్తుంటారు. తోటలను పరిశీలించిన కౌలుదారులు ధర నిర్ణయించి రైతులకు ముందస్తుగా కొంత, పంట చేతికందని తరువాత మిగతా సొమ్ము చెల్లిస్తారు. ఈ ఏడాది కూడా రూ.లక్షలు కౌలు చెల్లించి మామిడి తోటలు తీసుకున్న కౌలుదారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కౌలు డబ్బు, ఎరువుల పెట్టుబడి, పురుగు మందుల పిచికారీ వారికి మరింత భారమవుతోంది. తోటల్లో చీడపీడల ప్రభావం అధికంగా ఉండటంతో నాలుగైదు సార్లు పురుగు మందు పిచికారీ చేసినా ఫలితం కనిపించక ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి భారమవుతోంది ఈ ఏడాది పూత దశలోనే చెట్లను తెనె మంచు, బూడిద, మస్సిరోగం ఆశించాయి. మంచు ప్రభావంతో చాలా చెట్లకు ఆలస్యంగా వచ్చిన పూత క్రమంగా చిగురుగా మారింది. పూతను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు తోటల్లో చీడపీడల నివారణకు పెట్టిన పెట్టుబడి భారంగా మారింది. – మంచె కృష్ణయ్య, మామిడి రైతు, కొమరారం, ఇల్లెందు మండలం వరుస నష్టాలు కుంగదీస్తున్నాయి ఆరేళ్లుగా మామిడి కలిసిరావడం లేదు. అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు.. ఏదో ఒక రూపంలో వరుస నష్టాలు కుంగదీస్తున్నాయి. నివారణకు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టినా ఫలితం కనిపించడం లేదు. ఈ ఏడాది కూడా పిందెలు రాలిపోవడం, చీడపీల ఉధృతి వంటి కారణాలు దిగుబడిపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. –తోకల జానయ్య, మామిడి రైతు, కొమరారం, ఇల్లెందు మండలం -
భవిత కేంద్రాల అభివృద్ధికి నిధులు
పాల్వంచరూరల్: విద్యావనరుల కేంద్రాల(భవిత కేంద్రాలు) అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. విద్యావనరుల కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన 5 నుంచి 18 ఏళ్ల వయస్సు బాలబాలికలకు ఆటపాటలతో కూడిన బోధన కొనసాగుతోంది. ఇందులో విద్యాబుద్ధులు నేర్పిస్తూనే మాట్లాడడం, నడిపించడం తదితర 21 రకాల వైకల్యాలను అధిగమించేందుకు సమ్మిళిత విద్యా రిసోర్స్ పర్సన్లు(ఐఈఆర్పీఎస్) విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఈ కేంద్రాల్లో వసతుల కల్పన, అవసరైన పరికరాల కొనుగోలుకు గత పదేళ్లుగా నిధులు మంజూరు కాలేదు. ప్రస్తుతం సొంత భవనాలు కలిగిన కేంద్రాలకు సామగ్రి కొనుగోలు, వసతుల కల్పన కోసం రూ.2లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లెందు కేంద్రాలకు రూ.12లక్షలు, ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు, కామేపల్లి(కొత్తలింగాల), ఖమ్మం రూరల్, కొణిజర్ల, మధిర, పెనుబల్లి, సత్తుపల్లి కేంద్రాలకు రూ.16లక్షలు మంజూరయ్యాయి.ఉమ్మడి జిల్లాకు రూ.28 లక్షలు మంజూరు -
వివరాలు సేకరించిన నిపుణులు
ఆన్లైన్ విధానంలో మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి–కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, విద్యాశాఖ కమిషనర్ నరసింహారెడ్డి, కలెక్టర్ జితేష్ వి.పాటిల్తో చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆన్లైన్ విభాగ నిపుణుడు ప్రశాంత్రెడ్డి గత గురువారం కొత్తగూడెంలో పర్యటించి కావాల్సిన సమాచారాన్ని సేకరించారు. డీఈఓ వెంకటేశ్వరాచారి, కొత్తగూడెం ఎంఈఓ ప్రభుదయాల్ నుంచి పూర్తి వివరాలు సేకరించారు. నెల పూర్తికాగానే బిల్లులు జనరేట్ అవుతూ ఏకకాలంలో చెల్లింపులు జరిగేలా మార్పులు చేయనున్నారు. -
రామాలయానికి ఈ–స్కానర్లు బహూకరణ
భద్రాచలంఅర్బన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానానికి శనివారం ఎస్బీఐ రామాలయం శాఖ మూడు ఈ–కానుక స్కానర్లను బహూకరించింది. ఈ కార్యక్రమంలో భద్రాచలం దేవస్థానం ఏఈఓ శ్రావణ్ కుమార్, దేవస్థానం ఈఓ సీసీ శ్రీనివాసరెడ్డి, ఎస్బీఐ ఆర్ఎం సత్యనారాయణ, మేనేజర్ మధుసూదన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. నాలుగు రోజుల్లో కుమార్తె వివాహం ● గుండెపోటుతో తండ్రి మృతి పాల్వంచరూరల్: మరో నాలుగు రోజుల్లో కుమార్తె వివాహం ఉండగానే అంతలోనే రైతు గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మండలంలోని మొండికట్ట గ్రామానికి చెందిన రైతు, సొసైటీ మాజీ డైరెక్టర్ చిల్లా వెంకన్న (50) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య పుణమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమార్తె వివాహానికి సంబంధించిన శుభలేఖలు పంపిణీ చేసి, ఇంటికి వచ్చి రాత్రి ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు. కొత్వాల శ్రీనివాసరావు, యర్రంశెట్టి ముత్తయ్య, రౌతు రామారావు, అంబేడ్కర్, మోహన్రావు తదితరులు వెంకన్న మృతదేహాన్ని సందర్శించారు. రేషన్ బియ్యం పట్టివేత టేకులపల్లి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని శనివారం స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ సురేశ్ కథనం ప్రకారం.. మండలానికి చెందిన భూక్య లాలు మండల కేంద్రంలోని బోడబజారు నుంచి బొలేరో వాహనంలో రేషన్ బియ్యం తరలిస్తున్నాడనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వాహనంలో 34.20 క్వింటాళ్ల బియ్యం ఉండటంతో వాటిని పౌరసరఫరాలశాఖ డీటీకి అప్పగించారు. భూక్య లాలు, డ్రైవర్ లచ్చిరాంపై కేసు నమోదు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ వివరించారు. -
‘థర్డ్ డిగ్రీ’పై విచారణ చేపట్టాలి
● పోలీస్ స్టేషన్ వద్ద బాధితుడు, దళిత సంఘాల డిమాండ్ అశ్వారావుపేట: కోడి పుంజు చోరీ కేసులో తనపై థర్డ్ డిగ్రీ, కరెంట్ షాక్ ఇచ్చిన స్థానిక అదనపు ఎస్ఐ రామ్మూర్తిని తక్షణమే సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని బాధితుడు, దళిత సంఘాల బాధ్యులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. మండలంలోని నారంవారిగూడేనికి చెందిన కలపాల నాగరాజుపై అదే గ్రామానికి చెందిన అప్పారావు కోడి పుంజు చోరీ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ నెల 1వ తేదీ రాత్రి నాగరాజును ఒప్పుకోవాలని స్థానిక అదనపు ఎస్ఐ రామ్మూర్తి థర్డ్ డిగ్రీ ప్రయోగించి, కరెంట్ షాక్ ఇచ్చినట్లు బాధితుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా, శనివారం బాధితుడిని కుటుంబీకులు, దళిత సంఘాల నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి న్యాయం చేయాలని కోరారు. అలాగే, సీఐ కరుణాకర్ను కలిసి అదనపు ఎస్ఐపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుడు, దళిత సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు తగరం రాంబాబు మాట్లాడారు. కోడి పుంజు కేసు నెపంతో తీవ్రవాదిలా వ్యవహరించి థర్డ్ డిగ్రీకి పాల్పడి, చిత్రహింసలకు గురిచేశారని పేర్కొన్నారు. దళితుడికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు, ఇలాంటి దాష్టికానికి పాల్పడటం దారుణమని మండిపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ, ఎస్పీ స్పందించి సమగ్ర విచారణ జరిపించాని డిమాండ్ చేశారు. చోరీ నిందితుడి అరెస్ట్ పాల్వంచ: పట్టణంలోని నవభారత్ ఎంప్లాయీస్ క్వార్టర్లలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సీఐ సతీశ్ వివరాలు వెల్లడించారు. శనివారం పట్టణంలోని సీ–కాలనీ వద్ద అనుమానాస్పదంగా ఓ వ్యక్తి ఉన్నట్లు సమాచారం అందడంతో సీఐ సతీశ్, పట్టణ ఎస్ఐ సుమన్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. నవభారత్ ఎంప్లాయీస్ క్వార్టర్లలో చోరీలకు పాల్పడిన, మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లా తండా పోలీస్ స్టేషన్ పరిధిలోని అనిల్ సింఘూర్గా గుర్తించారు. గత జనవరి 25న మరో ముగ్గురితో కలిసి నవభారత్ క్వార్టర్లలో చోరీలకు పాల్పడ్డాడని, అతని వద్ద నుంచి రూ.2 లక్షల నగదు, ఒక స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని సీఐ పేర్కొన్నారు. పరారీలో ఉన్న వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి మరో నెలలో పెళ్లికి సిద్ధమవుతుండగా ఘటన కారేపల్లి: మండలంలోని సూర్యతండా గ్రామానికి చెందిన యువకుడు మహబూబా బాద్ జిల్లా బయ్యారం మండలం మిర్యాలపెంట సమీపాన శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యతండాకు చెంది న బానోతు కళ్యాణ్ (26), అజ్మీరా విజయ్ ద్విచక్రవాహనంపై శుక్రవారం గంగారం మండలం ఒట్టయిగూడెంలో తన స్నేహితుడి పెళ్లికి వెళ్లి రాత్రి తిరిగి వస్తున్నారు. ఈక్రమాన మిర్యాలపెంట వద్ద బైక్ అదుపు తప్పి వాహనం నడుపుతున్న కల్యాణ్కు రోడ్డుపక్కన ఉన్న చెట్టు దుంగ బలంగా తాకడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. విజయ్ స్వల్పగాయంతో బయటపడ్డాడు. దీంతో స్థాని కులు వీరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే కళ్యాణ్ మృతి చెందా డు. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని సూర్యతండాకు శనివారం తీసుకొచ్చారు. కాగా, కళ్యాణ్కు రెండు నెలల క్రితమే వివాహం నిశ్చయమైంది. హోలీ పండుగ తర్వాత ముహూర్తం పెట్టుకోవాలని భావిస్తుండగానే ఆయన మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. -
ఇక ఆన్లైన్ చెల్లింపులు!
● మధ్యాహ్న భోజన బిల్లుల్లో జాప్యం లేకుండా చర్యలు ● భద్రాద్రితోపాటు పెద్దపల్లి జిల్లా పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక ● పూర్తిస్థాయిలో వివరాలు సేకరించిన సాంకేతిక నిపుణులు ● ఎండీఎం కార్మికుల సమస్యలకు చెక్ పెట్టేలా ప్రభుత్వ కసరత్తు కొత్తగూడెంఅర్బన్: మధ్యాహ్న భోజన పథకం(ఎండీఎం) కార్మికులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. వేతనాలు, బిల్లులు ప్రతి నెలా విడుదల కాకపోవడంతో అవస్థ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. ఆన్లైన్ బిల్లులు చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది. గత ఫిబ్రవరిలో జిల్లాలో కొత్తగూడెం మండలంలోని పాఠశాలల్లో కార్మికుల వేతనాలు, బిల్లుల పెండింగ్ తదితర అంశాలపై కలెక్టర్ జితేష్ వి.పాటిల్, డీఈఓ, ఎంఈఓతో చర్చించారు. విద్యార్థుల ఫేస్ రికగ్నేషన్ను మరింత అభివృద్ధి పరిచి కార్మికులకు వేతనాలు, బిల్లులు చెల్లిస్తే జాప్యం ఉండదని కలెక్టర్ నివేదిక ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలించి ఆమోదించింది. ట్రెజరీ ద్వారా బిల్లుల చెల్లింపుల ప్రక్రియ ఆలస్యమవుతోందని, నేరుగా ఆన్లైన్ నుంచే బిల్లులు చెల్లించే అవకాశాలను పరిశీలిస్తున్నామని, ఇందుకు యాప్ రూపొందిస్తున్నామని ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కో మండలాన్ని ఎంపిక చేసుకుని, నెల రోజులపాటు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన బిల్లులను ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఆన్లైన్ బిల్లులతో ఎదురుచూపులకు చెక్ పడే అవకాశం ఉంటుందని మధ్యాహ్న భోజన కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. 2,150 మంది కార్మికులు జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు 2,150 మంది ఉన్నారు. వీరందరికీ ఒకేసారి బిల్లులు మంజూరు కావడం లేదు. జిల్లాలోని 23 మండలాలు ఉండగా, అన్నీ మండలాలకు ఒకేసారి బిల్లులు రావడం లేదు. మూడు, నాలుగు నెలలకోసారి పది మండలాలకు వస్తే, రెండో దఫా, మూడో దఫాలో మిగతా మండలాలకు బిల్లులు మంజూరవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాను పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేయడంతో ఇక్కడి ఎండీఎం కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా బిల్లుల చెల్లింపు ప్రక్రియ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. -
భవిత కేంద్రాల అభివృద్ధికి నిధులు
పాల్వంచరూరల్: విద్యావనరుల కేంద్రాల(భవిత కేంద్రాలు) అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. విద్యావనరుల కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన 5 నుంచి 18 ఏళ్ల వయస్సు బాలబాలికలకు ఆటపాటలతో కూడిన బోధన కొనసాగుతోంది. ఇందులో విద్యాబుద్ధులు నేర్పిస్తూనే మాట్లాడడం, నడిపించడం తదితర 21 రకాల వైకల్యాలను అధిగమించేందుకు సమ్మిళిత విద్యా రిసోర్స్ పర్సన్లు(ఐఈఆర్పీఎస్) విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఈ కేంద్రాల్లో వసతుల కల్పన, అవసరైన పరికరాల కొనుగోలుకు గత పదేళ్లుగా నిధులు మంజూరు కాలేదు. ప్రస్తుతం సొంత భవనాలు కలిగిన కేంద్రాలకు సామగ్రి కొనుగోలు, వసతుల కల్పన కోసం రూ.2లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లెందు కేంద్రాలకు రూ.12లక్షలు, ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు, కామేపల్లి(కొత్తలింగాల), ఖమ్మం రూరల్, కొణిజర్ల, మధిర, పెనుబల్లి, సత్తుపల్లి కేంద్రాలకు రూ.16లక్షలు మంజూరయ్యాయి.ఉమ్మడి జిల్లాకు రూ.28 లక్షలు మంజూరు -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో స్వామివారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన పూజలు చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. రామాలయానికి రూ.5,02,116 విరాళంఅశ్వాపురం: మండల పరిధిలోని మొండికుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి మిట్టకంటి రామిరెడ్డి–చంద్రకళ దంపతుల కూతురు, అల్లుడు సామ శ్రీ హర్షిత–శ్రీకాంత్రెడ్డి శని వారం రూ.5,02,116 విరాళం అందజేశారు. ఖండాలు దాటినా పుట్టిన ఊరుపై మమకారంతో భారీ విరాళం అందజేసిన హర్షిత–శ్రీకాంత్రెడ్డి దంపతులను గ్రామస్తులు అభినందించారు. మిట్టకంటి రామిరెడ్డి ఉపాధ్యాయుడిగా గ్రామంలో ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పారని పేర్కొన్నారు. బూర్గంపాడు మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, రామకొండారెడ్డి దంపతులు రూ. 10 వేలు, ఎస్కేటీ గ్రూప్ అధినేత దోసపాటి పిచ్చేశ్వరరావు రూ.25,116 విరాళం అందజేశారు. ‘పర్ణశాల’ ముఖద్వారానికి ఇత్తడి తొడుగుదుమ్ముగూడెం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీ సీతారామ చంద్రస్వామివారి ఆలయ ము ఖ ద్వారానికి హైదరాబాద్ వాసి మహాలక్ష్మి ఇత్తడి కవచం వితరణ చేశారు. సుమా రు రూ.3 లక్షల వ్యయంతో ముఖ మండప ద్వారం, తలుపులతో సహా ఇత్తడి తొడుగు చేయించారు. ఈ తొడుగులను హైదరాబాద్కు చెందిన రాఘవ తయారుచేశారు. ఈఓ రమాదేవి, అనిల్కుమార్ పాల్గొన్నారు. వ్యవసాయ క్షేత్రంలో మంత్రి తుమ్మలదమ్మపేట : మండల పరిధిలోని అప్పారావుపేట గ్రామ శివారులో ఉన్న సొంత వ్యవసాయ క్షేత్రాన్ని శనివారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. క్షేత్రంలో సాగు చేస్తున్న క్యాబేజీ, కాలీఫ్లవర్, టమాట, సొరకాయ తదితర పంటలను పరిశీలించి కోయించారు. తుమ్మలతోపాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు కాసాని నాగప్రసాద్, తుమ్మల శేషుబాబు, ఎర్రా వసంతరావు తదితరులు ఉన్నారు. రేపటి నుంచి రెండో విడత టెండర్లు● తొలివిడతలో తునికాకు సేకరణకు రెండు యూనిట్లలోనే ఖరారు పాల్వంచరూరల్ : ఈ నెల 10, 11 తేదీల్లో రెండో విడత తునికాకు టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈసారి తునికాకు టెండర్ల ప్రక్రియలో జాప్యం జరిగింది. దీంతో కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడంలేదు. ఏజెన్సీలో ఏటా రెండు నెలలపాటు గిరిజనులు, గిరిజనేతరులకు ఉపాధి కల్పించే తునికాకు సేకరణకు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆన్లైన్లో టెండర్లు నిర్వహిస్తోంది. ఈ సీజన్లో మొదటి విడతగా గత నెల 27, 28 తేదీల్లో టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని ఆరు డివిజన్ల పరిధిలో 59 యూనిట్లు ఉండగా, కేవలం చర్ల, దుమ్ముగూడెం రేంజ్లోని రెండు యూనిట్లలో మాత్రమే తునికాకు సేకరణకు టెండర్లు ఖరారయ్యాయని డీఎఫ్ఓ జి.కృష్ణాగౌడ్ తెలిపారు. ఇంకా 57 యూనిట్లకు టెండర్లు ఖరారు కావాల్సి ఉండగా, రేపటి నుంచి రెండో విడత, ఈ నెల 20, 21 తేదీల్లో మూడో విడత టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
సమానత్వం ఇంటి నుంచే ప్రారంభం కావాలి
దుమ్ముగూడెం: మహిళల సమానత్వం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శనివారం మండలంలోని బొజ్జిగుప్ప ఎకో టూరిజం స్పాట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారతీయ సమాజంలో మహిళకు సముచిత స్థానం ఉందని పేర్కొన్నారు. టీచర్, డాక్టర్, పోలీస్ ఆఫీసర్, పైలట్గా రాణిస్తున్న ఆమె ఇంటిని కూడా చక్కదిద్దుతోందని అన్నారు. బొజ్జుగుప్ప గిరిజనులు చాలా కష్టజీవులని, టూరిజం స్పాట్ ఏర్పాటుకు ఎంతో శ్రమించి ముందుకు వచ్చారని అభినందించారు. కరక్కాయలు, ఇప్పపూల ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురోగమించేలా చేయడమే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత కలెక్టర్, ఎమ్మెల్యే కూడా మహిళలను సన్మానించి, గిరిజన మహిళలు తయారుచేసిన రాగిజావ తాగారు. పర్ణశాలలో షాపుల క్రమబద్ధీకరణ.. పర్ణశాలలో షాపుల క్రమబద్ధీకరణ చేపడతామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. శనివారం భద్రాచలం ఎమ్మెల్యేతో కలిసి పర్ణశాలలో పర్యటించి మాట్లాడారు. మార్కెట్ కమిటీ చైర్మన్ తెల్లం సీతమ్మ, సీఐ అశోక్, ఎంపీడీఓ రామకృష్ణ, ఆలయ ఇన్చార్జ్ అనిల్కుమార్, ఆర్ఐ కల్లూరి వెంకటేశ్వరరావు, సుధారాణి తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన
కొత్తగూడెంటౌన్: జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. దాదాపు 4,997 కేసులకు పరిష్కారం లభించింది. కొత్తగూడెంలో సివిల్ కేసులు 11, క్రిమినల్ కేసులు 3,174, పీఎల్సీ కేసులు 310 కేసులు మొత్తం 3495 కేసులను పరిష్కరించారు. ఇల్లెందులో సివిల్ కేసులు 6, క్రిమినల్ కేసులు 278, పీఎల్సీ కేసులు 138 మొత్తం 422 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ అదాలత్లో కక్షిదారులు సమస్యలను పరిష్కరించుకోవడం అభినందనీయమని అన్నారు. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో కుటుంబ కలహాలు పెరిగాయని, చిన్నచిన్న గొడవలు, క్షణికావేశంలో చేసిన నేరాలతో కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు. రాజీమార్గమే రాజమార్గమని, రాజీ ద్వారా సమయం, డబ్బులను ఆదా చేసుకోవచ్చని చెప్పారు. కక్షిదారులకు యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ చేశారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్జడ్జి బత్తుల రామారావు, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.సాయిశ్రీ, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరావు, ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్.ఆర్ రవిచంద్ర, మహ్మద్ సాధిక్పాషా, వి.పురుషోత్తమరావు, పి. నిరంజన్రావు పాల్గొన్నారు.జిల్లావ్యాప్తంగా 4,997 కేసుల పరిష్కారం -
అతిథులకు ఆహ్వానం..
● భద్రాచలంలో ఆధ్యాత్మికతతోపాటు వినోదం ● ఆకర్షణీయంగా మారుతున్న గిరిజన మ్యూజియం ● ఐటీడీఏ ప్రాంగణంలో పార్క్, ఓపెన్ జిమ్ పూర్తి ● ప్రత్యేకంగా దృష్టి సారించిన కలెక్టర్, పీఓ భద్రాచలం: ఏజెన్సీ అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు, రామయ్య దర్శనానికి వచ్చే భక్తులకు ఆహ్వానం పలికేందుకు భద్రాచలంలో గిరిజన మ్యూజియం సిద్ధమవుతోంది. చిన్నారులను ఆటపాటలతో అలరించనుంది. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు వీక్షకులకు తెలిసేలా రూపుదిద్దుకుంటోంది. కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్ పర్యవేక్షణలో పనులు వేగవంతంగా సాగుతున్నాయి. శరవేగంగా పనులు.. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియంలో ఆదివాసీల దుస్తులు, పనిముట్లు, వస్తువులు ప్రదర్శనకు ఉంచారు. గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా ‘గిరిజన పల్లె’తరహాలో వెదురు, మట్టి నిర్మాణాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. చిన్నారుల ఆట పాటలకు బొమ్మలతో పార్క్, ఓపెన్ జిమ్ సిద్ధం చేశారు. పెడల్ బోటింగ్కు పాండ్ రూపొందించారు. యువత, పెద్దలకు బీచ్ తరహాలో ‘ఇసుక వాలీబాల్’, బాక్స్ క్రికెట్, షెటిల్ కోర్టులను సిద్ధం చేస్తున్నారు. వీటి పనులు శరవేగంగా సాగుతుండగా, గిరిజన వంటకాలు, వస్తువులతో స్టాల్స్, గిరిజన ఉత్పత్తులను సైతం రెడీ చేస్తున్నారు. శ్రీరామనవమిలోగా అందుబాటులోకి.. ముక్కోటి నాటికి గిరిజన పల్లె పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. కానీ కలెక్టర్, పీఓ సూచనల మేరకు ఆహ్లాదం కల్పించేలా మరికొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెడల్ బోటింగ్, ఓపెన్ జిమ్, పార్క్లను సిద్ధం చేశారు. వచ్చే నెల 6న శ్రీరామనవమి జరగనున్న నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ లోపు అన్ని పనులు పూర్తి చేయాలని పీఓ ఆదేశాలు జారీ చేశారు. ఈసారి శ్రీరామనవమికి వచ్చే భక్తులు, పర్యాటకులకు ఆధ్యాత్మికతతోపాటు ఆట పాటలతో వినోదం కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. -
మంచి నడవడిక నేర్పాలి
సింగరేణి(కొత్తగూడెం): సృష్టిలో అందరికీ మొదటి గురువు అమ్మేనని, పిల్లలకు మంచినడవడిక నేర్పితే వారు మహిళల పట్ల గౌరవంగా ఉంటారని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి భానుమతి అన్నారు. శనివారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళలు ధైర్య సాహసాలతో విపత్తులను ఎదుర్కోవాలని, మహిళా సాధికారతకు కృషి చేయాలని అన్నారు. ప్రస్తుతం మహిళలు అంతరిక్ష రంగం నుంచి భూగర్భ గనుల వరకు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. విశిష్ట అతిథిగా హరిణీ సత్యనారాయణరావు హాజరయ్యారు. అన్ని రంగాల్లో రాణించాలి మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్లోని ఆర్సీఓఏ క్లబ్లో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆమె మాట్లాడారు. మహిళలు వేగవంతంగా పురోగతి సాధించాలని చెప్పారు. అనంతరం అదనపు కలెక్టర్తోపాటు ఎఫ్డీఓ శాతంపురి సుజాత, భద్రాచలానికి చెందిన డాక్టర్ కట్ట సాగరికను సన్మానించారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఆటల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సేవా ఇన్చార్జి అధ్యక్షురాలు పద్మజా కోటిరెడ్డి పాల్గొన్నారు.జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి భానుమతి -
క్రీడలతో వ్యసనాలు దూరం
ఎస్పీ రోహిత్రాజ్చర్ల: క్రీడలతో చెడు వ్యసనాలను దూరం చేసుకోవచ్చని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. చర్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన మండలస్థాయి వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఏదో ఒక క్రీడ ఆడాలని సూచించారు. పోటీల్లో మండలం నుంచి 49 జట్లు, ఛత్తీస్గఢ్ నుంచి 7 జట్లు పాల్గొనడం అభినందనీయమన్నారు. మొదటి, రెండో, మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన చీమలపాడు, సుందరయ్యకాలనీ, పెదుట్లపలి(ఛత్తీస్గఢ్), మామిడిగూడెం జట్లకు షీల్డ్లతోపాటు వరుసగా రూ. 15 వేలు, రూ.10 వేలు, రూ.8 వేలు, రూ.5 వేల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సీఆర్పీఎఫ్ కమాండెంట్ రాజ్కుమార్, సీఐ రాజువర్మ, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్, పీడీలు పి.శ్రీనివాస్, ఏ ఈశ్వర్, వీ దశమిబాబు, పీ శ్రీను, పీఈటీలు కె.వెంకటేష్, ఎన్.బాబూరావు, రాజేష్, హరికృష్ణ, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
జయహో.. జన ర ుుత్రి
●మహిళల రక్షణ, అభివృద్ధే ధ్యేయంగా.. ●కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా ఉంటూ, ప్రజలతో మమేకం. మధిర : రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు నందిని నిరంతరం ప్రజల్లో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతున్నారు. నిరంతరం శ్రమిస్తూ, ప్రజలతో మమేకమవుతూ ముదుకు సాగుతున్నారు. మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర రాజకీయూల్లో నిత్యం బిజీగా ఉంటూ, రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉండడంతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయు రాజకీయూల్లో సైతం బిజీగా ఉంటున్నారు. మల్లు నందిని నియోజకవర్గంలో కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, నాయకులకు కొండంత అండగా ఉంటున్నారు. మండలాల్లో పార్టీ నాయుకులను సమన్వయుం చేస్తూ అన్ని వర్గాల ప్రజల అభిరుచులకు అనుగుణంగా ముందుకు వెళుతున్నారు. అంతేకాకుండా తన భర్త హోదాను దుర్వినియోగం చేయుకుండా, అధికారిక కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకుండా ఆమె తనదైన శైలిలో రాణిస్తున్నారు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ, ఆప్యాయంగా చేరదీస్తూ మల్లు నందిని చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. నియోజకవర్గ ప్రజలు ఆప్యాయుతగా అమ్మ అంటూ పిలిస్తే, నేనున్నానంటూ కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. అమ్మ ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహణ, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ల్యాప్ట్యాప్లు పంపిణీ, వికలాంగులకు ట్రై సైకిళ్ళు ఉచితంగా పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల అభిమానాన్ని పొందుతున్నారు. నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు ఎవరైనా ప్రమాద ఘటనలో గాయపడినా, మృతి చెందిన వారి కుటుబాలను పరామర్శిస్తూ వారికి అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యాలకు ఫోన్ చేస్తూ వైద్య బిల్లులు తగ్గించేలా కషి చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు, నాయుకులు, కార్యకర్తలు ఆమెను తలైవిగా పిలుస్తూ ఫ్లెక్సీలు కడుతూ నందినమ్మకు మహిళా దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలుపుతున్నారు. ఖమ్మం జిల్లాలో అమ్మ ఫౌండేషన్ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
అటు ఉద్యోగం.. ఇటు ట్రెయినర్
సంస్థలో ఎంజేటీ(మేనేజ్మెంట్ ట్రెయినీ) హోదాలో ఉద్యోగం చేస్తూనే రెస్క్యూ ట్రెయినర్గానూ కొనసాగుతున్నా. కొన్ని సందర్భాల్లో గనుల్లో వెలువడే గ్యాస్తో ప్రాణాపాయం ఎదురవుతుంది. అయినా బీటెక్ మైనింగ్ తర్వాత ఈ ఉద్యోగం ఎంచుకున్నా. – అంబటి మౌనికప్రైవేట్ సంస్థ నుంచి సింగరేణిలోకి.. మైనింగ్ బీటెక్ పూర్తిచేశాక రాజస్తాన్లోని హిందుస్తాన్ జింక్ లిమిటెడ్లో మూడేళ్లు పనిచేశా. ఆ అనుభవంతో సింగరేణిలో మైనింగ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నా. కొత్తగూడెం భూగర్భగనిలో నాతో కలిపి ఆరుగురు మహిళా ఉద్యోగులం పనిచేస్తున్నాం. – చెల్లా గాయత్రి● -
అడుగు ముందుకే..
‘అమ్మే నా తొలి గురువు. ఆమె పెద్దగా చదువుకోలేదు. కానీ నన్ను ముందుకు నడిపించింది. ఎక్కడ పడిపోతే.. అక్కడి నుంచే నీ కొత్త ప్రయాణం మొదలుపెట్టమని చెప్పింది. నన్ను జడ్జిగా చూడాలన్న ఆమె కోరికను నెరవేర్చగలిగాను. మహిళలు తమ లక్ష్యాలను చేరుకోవడానికి దృఢ సంకల్పంతో ముందడుగు వేయాలి.’ అని ఖమ్మం జిల్లా ఒకటో అదనపు న్యాయమూర్తి కె.ఉమాదేవి పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ‘సాక్షి’ యూనిట్ కార్యాలయంలో కుటుంబ న్యాయస్థానం జడ్జి అర్చనా కుమారితో కలిసి ఆమె గెస్ట్ ఎడిటర్గా వ్యవహరించారు. ఈ సందర్భంగా పేజీ లే ఔట్, మహిళా దినోత్సవ ప్రత్యేక కథనాలపై చర్చించి సూచనలు చేశారు. అనంతరం న్యాయమూర్తి ఉమాదేవి మాట్లాడగా ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. –సాక్షిప్రతినిధి, ఖమ్మంనిరాశకు తావివ్వొద్దు.. మహిళలు ఏ రంగాన్ని ఎంచుకున్నా.. అందులో వంద శాతం కృషి చేయాలి. ఏ పనైనా ఇష్టంతో చేయాలి. లక్ష్యాలను చేరుకోవడానికి దృఢ సంక ల్పంతో ముందడుగు వేయాలే తప్ప ఎక్కడో ఏదో జరిగిందని కుంగిపోవద్దు. మనకు మన లక్ష్యమే కనపడాలి. మంచి, చెడును సమానంగా స్వీకరించగలిగే స్థితప్రజ్ఞత సాధించాలి. మహిళలు ఆత్మస్థైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. ఇక చాలు నా జీవితం అయిపోయిందనే భావనను మనసులోంచి తీసేయాలి. అప్పుడే అనుకున్న దాని కన్నా మంచి స్థితిలో ఉంటాం. చిన్నతనం నుంచే మహిళలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ముఖ్యం. వారి లక్ష్యాలకు అండగా ఉండాలి. అమ్మే నా మొదటి గురువు.. మేము నలుగురు ఆడపిల్లలం. నాన్న ఫిజికల్ డైరెక్టర్. ఆయన అందరినీ లెక్చరర్లుగా చేయాలనుకున్నారు. కానీ నన్ను జడ్జిగా చూడాలన్నది అమ్మ కోరిక. నా మొదటి గురువు ఆమే. ఏం చేయాలి.. ఎలా వెళ్లాలి.. ఎక్కడైతే పడిపోతామో అక్కడే లేచి నిలబడమని చెప్పేది.. అంత సపోర్ట్ ఉండడంతో ఆమె కల నెరవేర్చగలిగాను. దృఢ సంకల్పంతో సాగితేనే విజయం నన్ను జడ్జిగా చూడాలన్నదే మా అమ్మ కల జిల్లా అదనపు న్యాయమూర్తి ఉమాదేవి మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్గా విధులు ఎవరేం అనుకుంటారోనని ఆలోచించొద్దు.. మహిళల్లో ఎక్కువ మంది వాళ్లేం అనుకుంటారో.. వీళ్లేం అనుకుంటారో అని ఆలోచిస్తుంటారు. అలా కాకుండా మనమేం అనుకుంటున్నామో అదే ముఖ్యం. నలుగురు ఏమనుకుంటారో అనే భావన తీసేస్తేనే జీవితంలో ఎదగగలుగుతాం. అప్పుడే ఎంత కఠినమైన పనైనా చేయగలం. జీవితంలో ఏదీ సులువు కాదనే విషయాన్ని అంగీకరించాలి. -
ఇంట్లో ఓకే.. బయటే భయం !
మహిళలపై కొనసాగుతున్న వివక్ష ● ఇంకా కనిపిస్తున్న ఆడామగ తేడాసమాజంలో అందరూ సమానేమనే భావన నానాటికీ పెరుగుతోంది. పురుషులతో సమానంగా కుటుంబ పోషణలో పాలు పంచుకుంటున్న మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తుండడం ఇందుకు కారణమవుతోంది. కానీ అతివలపై వివక్ష మాత్రం కొన్నిచోట్ల కొనసాగుతూనే ఉంది. అయితే ఇళ్లలో తల్లిదండ్రులు, తోబుట్టువుల నుంచి ఆ పరిస్థితి ఎదురుకాకున్నా... పని ప్రదేశాలు, విద్యాసంస్థలు, బస్టాండ్ల వంటి చోట మాత్రం ఈ సమస్య తప్పడం లేదు. మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో 100 మంది మహిళలను సర్వే చేయగా ఈ విషయం వెల్లడైంది. ‘సాక్షి’ అడిగిన ప్రశ్నలకు వారు ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి. – ఖమ్మంమయూరిసెంటర్/కొత్తగూడెంఅర్బన్ -
కొత్తగూడెం ఓఎస్డీ బదిలీ
సంగారెడ్డి ఎస్పీగా నియామకం కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం ఓఎస్డీగా విధులు నిర్వర్తిస్తున్న పరితోష్ పంకజ్ను పదోన్నతిపై బదిలీ చేశారు. సంగారెడ్డి ఎస్పీగా నియమితులయ్యారు. బిహార్ రాష్ట్రం భోజ్పూర్ జిల్లాకు చెందిన ఆయన 2020 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తొలుత గ్రేహౌండ్స్ అసాల్డ్ కమాండర్గా నియమితులైన పరితోష్ 2023లో భద్రాచలం ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 2024, జూలై 1న అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం కొత్తగూడెం ఓఎస్డీగా పనిచేస్తున్నారు. గంజాయి రవాణను అరికట్టడంలో, గోదావరి వరదల సమయంలో సమర్థంగా విధులు నిర్వర్తించారనే పేరు ఉంది. మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలిఐటీడీఏ పీఓ రాహుల్ భద్రాచలం: భక్తుల కోసం భద్రాచలంలో ఐటీసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శాశ్వత మరుగుదొడ్ల పనుల వేగవంతం చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని కాపా రామలక్ష్మి ఏరియాలో, బస్టాండ్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పార్క్ పక్కన ప్రదేశాల్లో జరుగుతున్న శాశ్వత, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. భక్తులు బస చేసే ప్రదేశాల్లో టాయిలెట్లు, స్నానాల గదులు నిర్మించాలన్నారు. గ్రామపంచాయతీ ద్వారా చేపట్టిన నిర్మాణాలను ఈ నెల 25వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా తొలుత పీఓ ఏఎంసీ కాలనీ, మనుబోతుల చెరువు వద్ద ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. తాగునీరు, విద్యుత్ సమస్యలను స్థానికులు వివరించగా.. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించాలని ఏఈఈని ఆదేశించారు. విద్యుత్ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. అనంతరం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో నిర్మాణం జరుగుతున్న డైనింగ్ హాల్ పనులను పరిశీలించారు. అధికారులు చంద్రశేఖర్, హరీష్, నారాయణ రావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. నేడు జాతీయ లోక్ అదాలత్కొత్తగూడెంటౌన్ : కొత్తగూడెం జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి శుక్రవారం ఒక ప్రకటలో తెలిపారు. క్రిమినల్, ప్రమాద, సివిల్, చీటింగ్, చిట్ఫండ్, భూ తగాదాలు, వివాహ సంబంధ తదితర కేసులను ఇందులో పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సూచించారు. -
సాగు చేస్తూ.. దారి చూపిస్తూ!
● యూట్యూబర్గా రాణిస్తున్న మహిళా రైతు లక్ష్మీప్రసన్న ● 3.23 లక్షల మంది సబ్స్క్రైబర్లతో గుర్తింపు ● పంటలన్నీ సేంద్రియ విధానంలోనే.. బూర్గంపాడు: ఆమె తన భర్త సహకారంతో సేంద్రియ విధానంలో పంటలు సాగు చేస్తోంది. సాగు సమయాన ఎదురయ్యే ఇక్కట్లు, పంటలను ఆశించే తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టడం సర్వసాధారణమే. అయితే, శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలతో తీసుకుంటున్న రక్షణ చర్యలు సత్ఫలితాలను ఇస్తుండడంతో అవి తనకు మాత్రమే సొంతం కావొద్దని.. మరికొందరు రైతులకూ ఉపయోగపడాలనే భావనతో ఆ మహిళా రైతు అందరికీ అందుబాటులో ఉన్న యూట్యూబ్ను ఎంచుకుంది. సాగులో తాము అవలంబించే రక్షణ చర్యలు, జాగ్రత్తలను వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడంతో రైతుల మన్ననలు అందుకుంటోంది. ఇప్పటి వరకు ఏడేళ్లలో 200 పైగా వీడియోలు అప్లోడ్ చేయగా.. ఆమె నిర్వహిస్తున్న చానల్కు 3.23 క్షల మంది సబ్స్క్రై బర్లు ఉండడం విశేషం. మారుమూల గ్రామం నుంచి... పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన పాపాల సాయి లక్ష్మీప్రసన్న ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. ఆ తర్వాత ఆమెకు రాంబాబుతో వివాహమైంది. భర్తతో కలిసి తమకున్న పదెకరాల భూమిలో వివిధ రకాల పంటలను సేంద్రియ విధానంలో సాగుచేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు పంటల సాగులో వస్తున్న మార్పులు, నూతన సాంకేతిక విధానాలు, నాణ్యమైన ఉత్పత్తులు, మార్కెటింగ్, భూసంరక్షణపై అవగాహన పెంచుకుంది. అయితే, ఈ అంశాలన్నీ అందరికీ చేరవేయాలనే లక్ష్యంతో ‘ఎస్ఆర్ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ చానల్’ ప్రారంభించింది. ఆర్గానిక్ విధానంలో కూరగాయలు సాగు చేస్తూ ఆర్యోగకరమైన ఉత్పత్తులు సాధించే క్రమాన ఆమెకు ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు, భూసంరక్షణ, విత్తన శుద్ధి, విత్తనాల ఎంపిక, ఎరువులు, నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు, పంటలు ఆరబెట్టడం, మార్కెటింగ్ వసతులు తదితర అంశాలే కాక వ్యవసాయ అనుబంధ రంగాలైన నాటు కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమపైనా ఆమె అప్లోడ్ చేస్తున్న వీడియోలు చాలామందికి ఉపయోగపడుతున్నాయి. సాయి లక్ష్మీప్రసన్న చక్కటి మాట తీరుతో వ్యవసాయ విధానాలను కళ్లకు కట్టినట్లుగా వీడియోలను తమ సెల్ఫోన్లోనే చిత్రీకరించి ఎలాంటి ఎడిటింగ్ లేకుండానే అప్లోడ్ చేస్తుండడం విశేషం. ఈ వీడియోలు చూసిన చాలా మంది రైతులు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పిన వాటికంటే బాగా అర్థమవుతున్నాయని చెబుతుండ డం ఆమె కృషికి దక్కిన నిదర్శనం. కాగా, యూ ట్యూబ్ ద్వారా వస్తున్న పారితోషికాన్ని పొలం పనులకు సహకరిస్తున్న కూలీలు, తోటి రైతుల అవసరాలకు అందిస్తుండడం మరో విశేషం.ఆమె రాణిస్తోంది.. మరికొన్ని కథనాలు 9లో -
గనిలో నారీమణులు
సింగరేణి(కొత్తగూడెం): గతంలో వంటింటికే పరిమి తమైన మహిళలు నేడు ఉద్యోగ నిర్వహణలోనూ రాణిస్తున్నారు. అయితే, కొన్నాళ్ల పాటు కార్యాలయాలకే పరిమితమయ్యే ఉద్యోగాలను మాత్రమే ఎంచుకోగా ఇప్పుడు ఈ స్థితినీ దాటేశారు. క్లిష్టమైన పరిస్థితులు, సంక్లిష్టమైన బాధ్యతలు నిర్వర్తించడానికీ అతివలు వెనుకాడడం లేదు. అందులో భాగంగానే సింగరేణిలోని భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి, పర్యవేక్షణ బాధ్యతలను నిస్సంకోచంగా, విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. పురుషులు సైతం భయంభయంగా పనిచేసే రెస్య్కూ విధులనూ మహిళలు ఎంచుకుంటుండడం విశేషం. మైనింగ్ ఆఫీసర్లుగా మహిళలు.. సింగరేణిలో సుమారు 56 విభాగాలు విధులు నిర్వర్తిస్తేనే బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుంది. వీట న్నింటిలోనూ గతంలో పురుషులే ఉండేవారు. అయితే, ఇటీవల నియామకాల్లో మహిళలకు అన్ని విభాగాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించడం.. డిపెండెంట్ ఉద్యోగాల కల్పనలోనూ సానుకూలంగా వ్యవహరిస్తుండడంతో ఇప్పుడు సంస్థ వ్యాప్తంగా 2వేల మంది మహిళలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో కొందరు ఎగ్జిక్యూటివ్ హోదాలో ఎలక్ట్రికల్, మైనింగ్, సివిల్, ఎకౌంట్స్, ఎస్టేట్స్, పర్సనల్ విభాగాల్లో ఉండగా.. ఉత్పత్తికి సంబంధించి మరో 16 విభాగాల్లోనూ మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. కాగా, సింగరేణిలో మైనింగ్ ఆఫీసర్ విధులు క్లిష్టంగా ఉంటాయి. గనుల్లో బొగ్గు ఉత్పత్తి కోసం బ్లాస్టింగ్ చేయడం, గనుల్లో వెలువడే గ్యాస్ను గుర్తించడమే కాక మైనింగ్ విభాగంలో సర్దార్, ఓవర్మెన్లకు విధులు కేటాయించాల్సి ఉంటుంది. ఇలాంటి విధులను మహిళలు అలవోకగా నిర్వర్తిస్తూ భేష్ అనిపించుకుంటున్నారు. భూగర్భంలో సాహస విధులు సింగరేణిలో సర్దార్, ఓవర్మెన్ పర్యవేక్షణ బాధ్యతలు ఏటా సంస్థలో పెరుగుతున్న మహిళా ఉద్యోగులు -
ఆఫీస్ వేరు.. గని వేరు
బొగ్గు బ్లాస్టింగ్ సమయాన అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమరపాటుగా ఉంటే ప్రమాదమే. అందుకే పనిచేసే వారంతా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆఫీస్ పనులకు, ఇక్కడ విధులకు వ్యత్యాసమున్నా చాలెంజ్గా తీసుకుని పని చేస్తున్నాం. – ఈసం కృష్ణవేణి అత్యంత అప్రమత్తంగా.. బొగ్గు ఉత్పత్తి సమయాన ఏ మాత్రం అజాగ్రత్త వహించినా ఫలితాలు తారుమారవుతాయి. ఈక్రమాన రక్షణ సూత్రాలు తప్పక పాటించాలి. ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తూ, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా పనిచేస్తున్నాం. – రమ్యశ్రీ -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
కొత్తగూడెంఅర్బన్: అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటేల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తులు పరిశీలించాలని, ఎల్–1,ఎల్–2,ఎల్ –3 జాబితా లు తయారు చేయాలని సూచించారు. అర్హత ఉండి కూడా జాబితాలో పేరు రాని వారిని తిరిగి నమోదు చేయాలన్నారు. జాబితాలో తండ్రి పేరు ఉండి, పెళ్లయిన కుమారుడు దరఖాస్తు చేసుకుంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఎంపీడీఓలు బాధ్యతగా వ్యవహరించి అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా చూడాలని సూచించారు. భూముల క్రమబద్ధీకరణకు ఈనెల 31 వరకు కల్పి స్తున్న 25 శాతం రాయితీని అందరూ సద్వినియోగపరుచుకునే అవగాహన కల్పించాలని అన్నారు. రుచికరమైన భోజనం అందించాలి.. పాల్వంచరూరల్ : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సిబ్బందికి సూచించారు. పాత పాల్వంచ జెడ్పీ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, స్పోర్ట్స్ కిట్లను పరిశీలించారు. భోజనం బాగుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. భోజనంలో లోపాలుంటే ఉపాధ్యాయులు, నిర్వాహకులపై చర్య తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట డీఈఓ వెంకటేశ్వరాచారి, జిల్లా కోఆర్డినేటర్ సైదులు, సతీష్కుమార్, ఎంఈఓ శ్రీరాంమూర్తి, హెచ్ఎం పద్మలత ఉన్నారు. ‘ప్రైవేట్’కు దీటుగా విద్యాబోధన.. సుజాతనగర్ : ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో విద్యాబోధన అందుతోందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక బీసీ బాలుర గురుకుల పాఠశాలలో శుక్రవారం వార్షికోత్సవం జరగగా, కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలని, ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యంతో చదివితేనే అనుకున్నది సాధిస్తారని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు, పాఠశాల ప్రిన్సిపాల్ వి.బ్యూలారాణి పాల్గొన్నారు. -
ఆలయ పాలకవర్గం జాబితాపై గోప్యం
పాల్వంచరూరల్ : పెద్దమ్మగుడి పాలకవర్గ జాబితాను వెల్లడించకుండా గోప్యంగా ఉంచడం చర్చనీయాంశంగా మారింది. 14 మంది సభ్యులతో కూడిన జాబితా గురువారం ఈఓకు చేరినా.. వివరాలు వెల్లడించకుండా రహస్యంగా ఉంచారు. జాబితాలో పేర్లున్న వారితో కలిసి ఈఓ, దేవాదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ శుక్రవారం రహస్యంగా సమావేశమై మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఎటువారు అటు వెళ్లిపోయారు. ఆలయ గత పాలకవర్గ పదవీకాలం 2024 మార్చితో పూర్తికాగా, నూతన పాలకవర్గ నియామకానికి దేవాదాయ శాఖ డిసెంబర్లో నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో అసక్తి గల 30 మంది నాయకులు దరఖాస్తులు చేసుకున్నారు. అందులో ఎవరికి స్థానం దక్కిందనేది సస్పెన్స్గా మారింది. -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ఎస్పీ రోహిత్రాజ్బూర్గంపాడు: సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ రోహిత్రాజ్ అన్నారు. బూర్గంపాడు పోలీస్స్టేషన్ను గురువారం ఆయన తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని, వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సైబర్ నేరాలు నానాటికీ పెరుగుతున్నందున ప్రజల్లో విస్తృతంగా చైతన్యం తీసుకురావాలని, నేరాల తీరును వారికి అర్థమయ్యేలా అవగాహన కల్పించాలని అన్నారు. అప్పనంగా డబ్బు వస్తుందనే ఆశతో సెల్ఫోన్లోని యాప్లు, లింక్లను క్లిక్ చేయవద్దని ప్రజలకు సూచించారు. ఆయన వెంట సీఐ నాగరాజు(స్పెషల్ బ్రాంచ్), ఎస్ఐలు రాజేష్, నాగభిక్షం తదితరులు ఉన్నారు. -
ప్రశాంతంగా ఇంటర్ ‘ద్వితీయ’ పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని 36 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 9,030 మంది విద్యార్థులకు గాను 8,759 మంది పరీక్ష రాయగా, 271 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టిస్ ఘటనలు చోటుచేసుకోకుండా సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, విద్యార్థులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే తక్షణ చికిత్స కోసం వైద్యారోగ్య సిబ్బందితో పాటు మందులు అందుబాటులో ఉంచారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్ట పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 9,030 మందికి 8,759 విద్యార్థుల హాజరు -
రామయ్య సన్నిధిలో ఐఏఎస్ వివాహం
భద్రాచలంఅర్బన్: భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఓ ఐఏఎస్ అధికారి వివాహం చేసుకున్నారు. నిజామాబాద్కు చెందిన స్నేహ ప్రస్తుతం ఒడిశా కేడర్లో అదనపు కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారి అఖిల్రెడ్డితో వివాహం నిశ్చయం కాగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన మారుతీ సదనంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గురువారం వీరి వివాహం వైభవంగా సాగగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజ్, ఐటీడీఏ పీఓ బి.రాహూల్, భద్రాచలం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి శివనాయక్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. -
రుణాల మంజూరు పూర్తి చేయాలి
భధ్రాచలం: ట్రైకార్, ఎంఎస్ఎంఈ యూనిట్ల లబ్ధిదారుల రుణాల మంజూరు ను వేగవంతం చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ బ్యాంకర్లకు సూచించారు. తన చాంబర్లో గురువారం ఆయన బ్యాంక్ అఽధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రౌండ్ చేసిన 70 ట్రైకార్ యూనిట్లు ఈనెల 31 నాటికి లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. ఎంఎస్ఎంఈ పథకం కింద లబ్ధిదారులకు మంజూరైన యూనిట్లలో కొన్ని పలు కారణాలతో నిలిచిపోయాయని, అర్హులైన వారికి మంజూరు చేసేలా చూడాలని కోరారు. సమావేశంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, ఏడీ భాస్కరన్, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్రెడ్డి, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వేసవిలో బాక్సింగ్ ఉచిత శిక్షణ
కొత్తగూడెంఅర్బన్: గ్రామీణ యువతీ యువకులు బాక్సింగ్పై అవగాహన లేక నేర్చుకోలేకపోతున్నారని, వారందరికి కూడా అవగాహన కల్పిస్తామని బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ లగడపాటి రమేశ్, చీఫ్ పాట్రన్ ఎర్రా కామేశ్ తెలిపారు. గురువారం కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. బాక్సింగ్పై ఆసక్తి కలిగిన యువతీ యువకులకు రానున్న వేసవిలో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని, క్రీడా సామగ్రిని ఉచితంగానే అందిస్తామన్నారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే అసోసియేషన్ లక్ష్యమని పేర్కొన్నారు. వేసవిలో ఎన్ఐఎస్ శిక్షణ పొందిన ఈశ్వర్, జాతీయస్థాయి బాక్సింగ్లో బంగారు పతకం సాధించిన శివసుబ్రహ్మణ్యం శిక్షకులుగా వ్యవహరిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నూతన చైర్మన్గా లగడపాటి రమేశ్, అధ్యక్షులుగా ఉదయ్కాంత్, కార్య నిర్వాహక అధ్యక్షులుగా ఎం.రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా వై.శివసుబ్రహ్మణ్యం, ముఖ్య సలహాదారులుగా జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కె.సంజీవరావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంగం వెంకటపుల్లయ్య, టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షులు అమరనేని రామారావు, ఎల్టా జిల్లా అధ్యక్షులు దస్తగిరి, చీఫ్ పాట్రన్గా న్యాయవాది ఎర్రా కామేశ్, జవహర్రెడ్డి, ఉపాధ్యక్షులుగా షమీఉద్దీన్తో పాటుగా ఆర్గనైజింగ్ సెక్రటరీ, జాయింట్ సెక్రెటరీ, మిగతా సభ్యులను ఎన్నుకున్నారు. -
సుమనోహరం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం సుమనోహరంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రామయ్య సన్నిధిలో ఖమ్మం జిల్లా జడ్జి.. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారిని ఖమ్మం జిల్లా జడ్జి రాజగోపాల్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా అంతరాలయంలో మూలమూర్తులకు పూజలు చేశాక పండితులు వేదాశీర్వచనం, ప్రసాదాలను అందజేశారు. భద్రాచలం పస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ శివ నాయక్, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. -
యువకుడి ఆత్మహత్య
ఇల్లెందురూరల్: మండలంలోని రేపల్లెవాడ గ్రామ పంచాయతీ నిజాంపేటకు చెందిన వర్స సాగర్ (30) గురువారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. టేకులపల్లి మండలానికి చెందిన యువతితో సాగర్కు రెండు నెలల కిందట వివాహమైంది. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంటివద్ద ఒంటరిగా ఉన్న సాగర్ ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. పొలం పనులు ముగించుకొని ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఇంట్లో వేలాడుతున్న సాగర్ను చూసి కిందకు దించారు. అప్పటికే సాగర్ మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న సీఐ బత్తుల సత్యనారాయణ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
యువకుడిపై దాడి..
దమ్మపేట: వివాహేతర సంబంధం నెపంతో ఓ యువకుడిపై మరో వ్యక్తి ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన మండలంలోని గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పట్వారిగూడెం గ్రామానికి చెందిన సున్నం శివ (28) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఆర్లపెంటలోని డబుల్ బెడ్రూం సముదాయం వద్దకు తన మిత్రుడిని కలవాలని వెళ్లాడు. అక్కడ శివను అదే గ్రామానికి చెందిన వగ్గెల శ్రీను అసభ్య పదజాలంతో దూషించాడు. తన భార్యను కలిసేందుకు వచ్చావని పేర్కొంటూ ఇనుప రాడ్డుతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శివను స్థానికులు లంకాలపల్లి వద్దకు తీసుకురాగా.. శివ బంధువు అనుదీప్ అక్కడి నుంచి పట్వారిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి సోదరి రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి -
సీతారామ కాల్వ కళకళ..
జూలూరుపాడు: మండలంలోని వినోభానగర్ వద్ద గల సీతారామ ప్రాజెక్ట్ కాల్వ గోదావరి జలాలతో కళకళలాడుతోంది. సీతారామ కెనాల్ ద్వారా ఏన్కూర్ వద్ద రాజీవ్ లింక్ కెనాల్లోకి నీటిని మళ్లించిన విషయం తెలిసిందే. సీతారామ ప్రాజెక్ట్ పనులు చేపట్టిన తొమ్మిదేళ్లకు గోదావరి జలాలు కెనాల్లో ప్రవహించడంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏన్కూర్ రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వం రూ.96 కోట్లు మంజూరు చేయగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎట్టకేలకు పనులు పూర్తి కావడంతో అశ్వాపురం మండలం బీజీకొత్తూరు, ములకలపల్లి మండలం కమలాపురం పంప్హౌస్ల ద్వారా జూలూరుపాడు మండలం వినోభానగర్కు నీరు చేరుకుంది. అక్కడి నుంచి ఏన్కూరులోని ఎన్నెస్పీ కెనాల్ వద్ద గోదావరి, కృష్ణా జలాలు అనుసంధానం అయ్యాయి. దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద తగ్గుతున్న గోదావరి అశ్వాపురం: మండల పరిధిలోని కుమ్మరిగూడెం గ్రామంలో దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదావరి నీటి మట్టం తగ్గుతోంది. గత మూడు రోజులుగా సీతారామ ప్రాజెక్ట్ ఫేస్–1 పంప్హౌస్ ద్వారా నీరు ఎత్తిపోసి దిగువకు వదలగా, ఎన్నెస్పీ కెనాల్కు చేరింది. దీంతో పాటు జిల్లా మొత్తానికి మిషన్ భగీరథ నీరు, భారజల కర్మాగారం, బీటీపీఎస్, సింగరేణి, దుమ్ముగూడెం హైడల్ ప్రాజెక్ట్, ఐటీసీ పీఎస్పీడీకి సైతం ఇక్కడి నీటినే వినియోగిస్తారు. మూడు రోజుల క్రితం 49.6 మీటర్ల నీటి మట్టంతో ఆనకట్టపై నీరు పొంగి ప్రవహించగా గురువారం 49.2 మీటర్లకు తగ్గింది. వచ్చేది వేసవి కాలం కావడంతో నీరు భారీగా తగ్గితే తాగునీరు, పరిశ్రమలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఎన్నెస్పీ కెనాల్కు మరో రెండు రోజుల పాటు నీరు ఎత్తిపోస్తే ఇక్కడ మరింతగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. -
అడవిలో చెలరేగిన మంటలు
అశ్వాపురం: మండలంలోని మొండికుంట సమీపంలో పెద్దగుట్టపై అడవిలో గురువారం రాత్రి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బొలేరో, ఆటో ఢీ జూలూరుపాడు: మండలంలోని మాచినేనిపేటతండాలో తల్లాడ – కొత్తగూడెం ప్రధాన రహదారిపై ఆటో, బొలేరో ఢీకొన్న ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఆటో, బొలేరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో బొలేరో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. పడమటనర్సాపురానికి చెందిన ఆటోడ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో ముందు భాగం దెబ్బతిన్నది. బొలేరో వాహనం డ్రైవర్, ఆటోడ్రైవర్ ఇద్దరూ స్నేహితులని తెలిసింది. పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాలిక కిడ్నాప్ కేసులో అరెస్ట్పాల్వంచ: బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై రాఘవయ్య తెలిపారు. పట్టణంలోని ఓ బాలిక (17)ను పాత సురారం గ్రామానికి చెందిన లకావత్ ప్రవీణ్ మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు. కాగా బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈనెల 3న కేసు నమోదు చేశామని, గురువారం అరెస్ట్ చేశామని చెప్పారు. -
మిథిలా.. వ్యథ
నాడు పొగడ చెట్టు నీడన.. భక్త రామదాసు కాలంలో శ్రీరామనవమి వేడుకలు ఆలయ ప్రాంగణంలో ఉన్న పొగడ చెట్టు నీడన జరిగేవి. ఆ తర్వాత కాలంలో ఆలయం పడమర మెట్ల పక్కన ఉన్న చిత్రకూట మండపంలో ఈ వేడుక నిర్వహించారు. అయితే రానురాను భక్తుల రద్దీ పెరగడంతో ఆలయం వెలుపల చలువ పందిళ్లు వేసి కల్యాణం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో 1960లో కల్యాణమండప నిర్మాణ పనులు చేపట్టగా 1964లో ప్రారంభించారు. అనంతరం 1986లో జరిగిన నవమి, మహాసామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమం సందర్భంగా కల్యాణ మండపం చుట్టూ గ్యాలరీ నిర్మించి మిథిలా స్టేడియంగా నామకరణం చేశారు. భద్రాచలంలో జరిగే ముక్కోటి వేడుకల సమయంలోనూ ఉత్తర ద్వారంలో శ్రీరాముడిని దర్శించుకునే భక్తులు మిథిలా స్టేడియం వైపునే ఉంటారు. పొందిక లేదు.. దర్శనం కరువు మిథిలా స్టేడియాన్ని ఒకేసారి నిర్మించలేదు. 1960లో పనులు ప్రారంభిస్తే ప్రస్తుతం ప్రసాద్ పథకంలో షెడ్ల నిర్మాణం వరకు వేర్వేరు కాలాల్లో పనులు చేపట్టారు. దీంతో కల్యాణ మండపం, ప్రేక్షకుల గ్యాలరీ, ఉత్తర ద్వారం, గ్యాలరీల మధ్య పొందిక కుదరలేదు. ఈ స్టేడియం గ్యాలరీలో కూర్చునే సామాన్య భక్తులకు ఇటు కల్యాణం, అటు ఉత్తర ద్వార దర్శనం రెండూ సరిగా కనిపించవు. దీనికి తోడు పర్వదినాల్లో ఇక్కడ ఏర్పాటు చేసే పందిళ్ల కారణంగా దైవ దర్శనం మరింత దుర్లభంగా మారుతోంది. ఉచిత దర్శనానికి గ్యాలరీలకు వచ్చే భక్తులతో పాటు రూ.250, రూ.500 తదితర సెక్టార్ల టికెట్లు తీసుకునే భక్తులకు సీతారాముల దర్శనం కనిపించీ కనిపించనట్టుగా జరుగుతోంది. ప్రతీ ఏడాది ఇదే తంతు సాగుతున్నా సామాన్య భక్తుల కష్టాలను పట్టించుకునే వారు కరువయ్యారు. ‘మిథిల’పై దృష్టి సారిస్తే.. శ్రీరామనవమి, ముక్కోటి పర్వదినాలకు వచ్చే ముఖ్యమంత్రులు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, జిల్లా కలెక్టర్, ఎస్పీ మొదలు ఆయలం ఈఓ వరకు అందరూ వీఐపీ గ్యాలరీల్లో ఉంటారు. దీంతో సామాన్య భక్తులు, ఆ తర్వాత రూ.250 టికెట్ కొనుగోలు చేసే భక్తుల కష్టాలు వారి దృష్టికి రావడం లేదు. కల్యాణం, ముక్కోటి, దర్శనం ఇలా ఇక్కడికి వచ్చే మంత్రులు, సీనియర్ అధికారులు ఒక్కసారి మిథిలా స్టేడియాన్ని నిశితంగా పరిశీలిస్తే వెంటనే పునరుద్ధరణ చర్యలకు ఉపక్రమిస్తారు. కానీ వచ్చిన చిక్కంతా ఏ ఒక్కరూ ఈ స్టేడియాన్ని పట్టించుకోవడం లేదు. ఆఖరికి నవమి, ముక్కోటి సందర్భంగా నిర్వహించే సమీక్ష సమావేశాల్లోనూ మిథిలా స్టేడియంలో నెలకొన్న సమస్యలు అసలు ప్రస్తావనకే రావడం లేదు. దీంతో మిథిలా స్టేడియం కష్టాల సుడిగుండంలోనే ఉండిపోతోంది. దాతలు ముందుకొచ్చినా.. ఇప్పటికే భద్రాచంలో స్థల సమస్య తీవ్రంగా ఉంది. ఇలాంటి సందర్భంలో ఆలయం సమీపంలో రెండున్నర ఎకరాల్లో సగానికి పైగా నిరుపయోగంగా ఉన్న మిథిలా స్టేడియం పునరుద్ధరణ, పునర్ నిర్మాణంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. భద్రాచలం ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు వివిధ కార్పొరేట్ కంపెనీల వారు, దాతలు తమవంతు సహకారం అందిస్తున్నారు. ఆ దిశలో అయినా మిథిలా స్టేడియంలో నెలకొన్న సమస్యలకు మంగళం పాడాల్సిన అవసరముంది.సమస్యల వలయంలో స్టేడియం నిరుపయోగంగా మారిన హాళ్లు గ్యాలరీ నుంచి చూస్తే దైవ దర్శనం దుర్లభమే కన్నెత్తి చూసేందుకు ఇష్టపడని సర్కారు పెద్దలు భూత్ బంగ్లాలను తలపిస్తున్న హాళ్లు.. నిర్వహణపరమైన లోపాల కారణంగా మిఽథిలా స్టేడియం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది. ఈ స్టేడియం మధ్యలో కల్యాణ మండపం ఉండగా గ్యాలరీకి దిగువన గోదావరి ఉప నదులైన కిన్నెరసాని, శబరి, ప్రాణహిత, మానేరు, వార్థా, పెన్గంగా తదితర పేర్లతో ఎనిమిది పెద్ద హాళ్లు ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. చెత్తా చెదారంతో బూజుపట్టి భూత్ బంగ్లాలను తలపిస్తున్నాయి. కొబ్బరి ముక్కలు ఆరబెట్టడానికి, పనికిరాని సామాన్లు నిల్వ చేయడానికి ఉపయోగించే గోదాముగా ఉపయోగపడుతున్నాయి. కేవలం పోకల దమ్మక్క నిత్యాన్నదానసత్రం ఒక్కటే శుభ్రమైన వాతావారణంలో నడుస్తోంది. ఆ పక్కనున్న టాయిలెట్ల నుంచి మొదలుపెడితే మిగిలిన గ్యాలరీలన్నీ కనీసం అడుగు పెట్టడానికి వీలు లేనంత అపరిశుభ్రంగా ఉన్నాయి. వీటి మధ్యనే ఉన్న ఒక హాలులో అఖండజ్యోతి రామనామ సంకీర్తణలు నిర్వహిస్తున్నారు. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాలకు సిద్ధమవుతోంది. శ్రీరామనవమి, పట్టాభిషేకం వేడుకలకు సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ వేడుకలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. ఇంతటి ఘనమైన వేడుకలకు వేదికై న మిథిలా స్టేడియం మాత్రం అనేక సమస్యల నడుమ కొడగట్టిపోయినట్టుగా మిగిలిపోతోంది. ఎందరు మంత్రులు వచ్చినా, కలెక్టర్లు మారినా ఈ స్టేడియం తలరాత మాత్రం మారడం లేదు. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
సమష్టిగా పనిచేద్దాం
వాతావరణ ం జిల్లాలో శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యే ఎండ మధ్యాహ్నానికి పెరుగుతుంది. తెల్లవారుజామున, రాత్రి చలి ప్రభావం ఉంటుంది. వేడుకల విజయవంతానికి భద్రాచలం : వచ్చే నెల 6, 7 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాల విజయవంతానికి సమష్టిగా కృష్టి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. వేడుకల నిర్వహణపై గురువారం స్థానిక సబ్ కలెక్టరేట్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీఐపీలే కాకుండా సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలని సూచించారు. గతేడాది ఐక్యంగా పనిచేసి వేడుకలను విజయవంతం చేశామని సిబ్బందిని అభినందించిన కలెక్టర్.. ఈ సంవత్సరం కూడా అలాగే పని చేయాలని పిలుపునిచ్చారు. ఐటీసీ సహకారంతో శాశ్వత పద్ధతిలో మరుగుదొడ్లు నిర్మించాలని, మొబైల్ వాహనాలకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. సెల్లార్లలో నిరంతరం తాగునీరు సరఫరా చేసేలా ట్యాప్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. స్టేడియం సమీపంలో అగ్నిమాపక పరికరాలు, సిబ్బందిని ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న జనరేటర్కు అదనంగా మరో 250 కేవీ జనరేటర్ను సిద్ధంగా ఉంచాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఆయా అధికారులకు సూచించారు. ఆ రెండు రోజులు భద్రాచలంలో మద్యం దుకాణాలను మూసివేయించాలన్నారు. భక్తుల నుంచి ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు అఽధిక ధరలు వసూలు చేయకుండా చూడాలని చెప్పారు. భక్తుల రద్దీ నియంత్రణకు మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని, వంతెనపై వాహనాలు నిలిచిపోతే తరలించేందుకు క్రేన్లు సిద్ధంగా ఉంచాలని పోలీస్ అధికారులకు సూచించారు. పర్ణశాలనూ పట్టించుకోండి.. రామాలయానికి అనుబంధంగా ఉన్న పర్ణశాలలోనూ భక్తులకు సరైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పర్ణశాల వెళ్లే దారిలో సైడ్ రోడ్డు బీటీకి ప్రణాళికలు, అంచనాలు అందించాలని, అక్కడ కూడా శాశ్వత మరుగుదొడ్ల పనులను పూర్తి చేయాలని సూచించారు. షాపింగ్ కాంప్లెక్స్ షెడ్ నిర్మాణ ప్రతిపాదనలు అందించలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం ఈ నెలాఖరు వరకై నా పూర్తి చేయాలన్నారు. భక్తులకు తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసేలా దాతలను ఆహ్వానించాలని, వేడుకల అనంతరం వారిని సత్కరించాలని సూచించారు. కల్యాణ మండపంలో కూలర్లు ఏర్పాటు చేయాలన్నారు. కుటుంబసభ్యులకు ఆ తర్వాత అవకాశం.. నవమి, పట్టాభిషేకం రోజుల్లో బంధువుల, కుటుంబసభ్యుల దర్శనాలకు అధికారులు, సిబ్బంది ప్రాధాన్యత ఇవ్వొద్దని, అలాంటి నాటకాలు చేయొద్దని ఘాటుగా హెచ్చరించారు. ఆ రెండు రోజుల పాటు వారిని రావొద్దని చెప్పాలని, తాను కూడా ఇప్పటికే ఇంట్లో చెప్పానని అన్నారు. సామాన్య భక్తులు సంతృప్తిగా దర్శించుకునేలా సహకరించాలని కోరారు. వేడుకల హడావిడి ముగిశాక కుటుంబసభ్యులతో వచ్చి ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఈఓకు సూచించారు. విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వచ్చే సమావేశం నాటికి పూర్తయిన పనులు, ఏర్పాట్ల వివరాలతో హాజరు కావాలని అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పీఓ రాహుల్ మాట్లాడుతూ.. నవమి సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బందితో పాటు అదనంగా కొందరిని నియమించి పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నట్లు చెప్పారు. ఎస్పీ రోహిత్రాజ్ మాట్లాడుతూ 2వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, ఆర్డీఓలు దామోదర్రావు, మధుసూదన్, ఆలయ ఈఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. పర్ణశాలలోనూ తగిన వసతులు కల్పించాలి నవమి, పట్టాభిషేక మహోత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు రావొద్దు కుటుంబసభ్యులతో హడావిడి చేస్తే చర్య తప్పదు సన్నాహక సమావేశంలో కలెక్టర్ పాటిల్ స్పష్టీకరణ దరఖాస్తులను నిశితంగా పరిశీలించాలికొత్తగూడెంఅర్బన్: ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. దరఖాస్తులను ఎల్ –1 ఎల్ –2, ఎల్ –3గా విభజించాలని, అత్యంత పేదలు, దివ్యాంగులు, ఏ ఆధారం లేనివారికి ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అన్ని గ్రామాల్లో దరఖాస్తుల పరిశీలన వివరాలను ప్రతీ రోజు నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఈనెల 31లోగా రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ వర్తిస్తుందని తెలిపారు. ధరణి మాడ్యూల్లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, హౌసింగ్ పీడీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత నివేదన, హారతి, మంత్రపుష్పం తదితర పూజలు జరిపారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, వేద పడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్శర్మ తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ కానుకలకు క్యూఆర్ కోడ్పాల్వంచరూరల్ : పెద్దమ్మతల్లికి కానుకలు సమర్పించే భక్తులకు ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ఎస్బీఐ అధికారులు ఆలయంలో గురువారం క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. భక్తులు సెల్ఫోన్లతో స్కాన్ చేసి కానుకలు చెల్లించేలా వెసులుబాటు కల్పించినట్లు ఈఓ తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీఐ వరంగల్ డీజీఎం ఘన్శ్యామ్ సోలంకీ, రీజినల్ మేనేజర్ ఎం.సత్యనారాయణ, పాల్వంచ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఎ.బంగారయ్య పాల్గొన్నారు. కాగా, ఈనెల 10వ తేదీన హుండీల్లోని కానుకలు లెక్కించనున్నట్లు ఈఓ మరో ప్రకటనలో తెలిపారు. మణుగూరు కోర్టుకు జిల్లా జడ్జిసదుపాయాలు, వసతులపై ఆరా.. మణుగూరు టౌన్: మణుగూరు జ్యుడీషియల్ ప్రథమశ్రేణి కోర్టును జిల్లా జడ్జి పాటిల్ వసంత్ గురువారం సందర్శించారు. కోర్టులో అవసరమైన గదులు, తాగునీటి వసతి తదితర సదుపాయాలపై చర్చించారు. కోర్టుకు గేట్ ఏర్పాటుచేయాలని, రోడ్డు సౌకర్యం కల్పించాలని స్థానిక న్యాయవాదులు జడ్జిని కోరగా నిధుల మంజూరుకు హైకోర్టుకు నివేదిస్తామని చెప్పారు. కార్యక్రమంలో న్యాయవాదులు మేదరమెట్ల శ్రీనివాస్, కిషన్రావు, కందిమళ్ల నర్సింహారావు, కవిత, వాసవి, సర్వేశ్వరరావు, నగేశ్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. దమ్మపేట మెజిస్ట్రేట్గా భవానిదమ్మపేట/ కొత్తగూడెంటౌన్: దమ్మపేట కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్గా బి.భవాని గురువారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆమె కొత్తగూడెం కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సిగరేణి భవన్లో నేడు స్ట్రక్చర్ సమావేశంహాజరుకానున్న సీఎండీ, డైరెక్టర్లు సింగరేణి(కొత్తగూడెం) : హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఆరేళ్ల తర్వాత శుక్రవారం స్ట్రక్చర్ సమావేశం నిర్వహిస్తున్నారు. సీఎండీ బలరామ్, ఇద్దరు డైరెక్టర్లు, 11 మంది గుర్తింపు సంఘం ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. వాస్తవానికి ముగ్గురు డైరెక్టర్లు రావాల్సి ఉన్నా.. ప్రస్తుతం డైరెక్టర్(పా) పోస్ట ఖాళీగా ఉండడంతో ఇద్దరే హాజరవుతున్నారు. కార్మికుల సొంతింటి కల నిజం చేయాలని, ప్రతీ కార్మికుడికి 250 గజాల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి వడ్డీ లేకుండా రూ.30 లక్షల రుణం ఇవ్వాలని, కార్మికులు అనారోగ్యానికి గురైతే ఆస్పత్రి ఖర్చంతా యాజమాన్యమే భరించాలని, ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు సైతం ఉచితంగా వైద్య సేవలందిచాలని, సింగరేణి వ్యాప్తంగా పనిచేసే కార్మికులకు విశ్రాంతి షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో గుర్తింపు సంఘం నాయకులు కోరనున్నారు. -
దివ్యాంగులకు ‘శాశ్వత’ పరిష్కారం
● ఇక నుంచి యూడీఐడీ స్మార్ట్ కార్డులు జారీ ● అందుబాటులోకి వచ్చిన ప్రత్యేక పోర్టల్ ● కార్డుతో దివ్యాంగులకు మరింత ప్రయోజనం ● ఉమ్మడి జిల్లాలో 55,718 మంది దివ్యాంగులు చుంచుపల్లి: దివ్యాంగులకు జారీ చేసే సదరం సర్టిఫికెట్లకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. వాటి స్థానంలో ఇక నుంచి యూనిక్ డిసేబిలిటీ ఐడెంటిటీ కార్డు (యూడీఐడీ) ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా పోర్టల్ను అందుబాటులోకి తెచ్చి దివ్యాంగులు నేరుగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటకే ఇవి పలు రాష్ట్రాల్లో అందుబాటులో ఉండగా, ఈ నెల నుంచి మన రాష్ట్రంలో కూడా పూర్తిస్థాయిలో అమల్లోకి తెస్తున్నారు. గతంలో ఈ స్మార్ట్ కార్డులను పలు చోట్ల దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఇటీవల సదరం సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగులందరికీ ఈ యూడీఐడీ నంబర్ను జనరేట్ చేయాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్డుల కోసం ప్రభుత్వం ఇచ్చిన సంబంధిత వెబ్సైట్లో దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కేవలం 7 కేటగిరీల్లో మాత్రమే సదరం సర్టిఫికెట్లు ఇస్తుండగా, ఈ యూడీఐడీ కార్డుల అమలుతో ఇక నుంచి 21 కేటగిరీలకు అవకాశం కల్పించారు. దివ్యాంగులకు బస్సు, రైళ్ల ప్రయాణాల్లో అందించే రాయితీలు అలాగే విద్య, వైద్యం, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తదితర వాటిని ఈ గుర్తింపు కార్డు ద్వారా పరిగణనలోకి తీసుకోనున్నారు. రాష్ట్రంలో ఆసరా పింఛన్ ద్వారా దివ్యాంగులకు రూ.4,016ను ప్రతినెలా అందిస్తున్నారు. అలాగే వారు ఎవరిపై ఆధారపడకుండా ఆర్థికంగా ఎదగడానికి స్వయం ఉపాధి కోసం వివిధ రకాల రాయితీ రుణాలు సైతం అందిస్తున్నారు. మరోవైపు దివ్యాంగులకు సంక్షేమ శాఖ ద్వారా పలు రకాల ఉపకరణాలను అందిస్తున్నారు. యూడీఐడీ కార్డు ఇలా పొందాలి.. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 55,718 మంది శాశ్వత వైకల్యం కలిగినవారు ఉన్నారు. అంగవైకల్య శాతం ధ్రువీకరణ కోసం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో సదరం శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఇస్తున్న సదరం ధ్రువపత్రాలు ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే పనిచేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో వీటిని అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో వీటికి బదులు యూడీఐడీ కార్డులను ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. http:// www. swavlambancard. gov. in పోర్టల్లోకి వెళ్లి యూడీఐడీ కార్డు కోసం సమగ్ర వివరాలు పొందుపర్చాలి. ● పాస్పోర్టు సైజ్ ఫొటో, సంతకం, ఆధార్ కార్డు తదితర వివరాలు అప్లోడ్ చేయాలి. ● మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకుని సదరం శిబిరానికి హాజరుకావాల్సి ఉంటుంది. ● సదరం శిబిరానికి హాజరయ్యేలా అందుబాటులోని కేంద్రాలను ఎంపిక చేసుకోవాలి. ● తద్వారా ఏరోజు శిబిరం నిర్వహిస్తారో దరఖాస్తుదారుడి ఫోన్కు సందేశం వస్తుంది. ● ఆ రోజున వెళ్తే అక్కడి వైద్యులు పరీక్షించి వైకల్యం శాతాన్ని నిర్ధారించి పోర్టల్లో నమోదు చేస్తారు. ● ఇప్పటికే సదరం ధ్రువపత్రాలు కలిగిన వారికి కూడా స్మార్ట్ కార్డులను ఇదే తరహాలో జారీ చేస్తారు. ● వివరాలను సరిచూసి వైద్యులు నిర్ధారించిన అనంతరం స్మార్ట్ కార్డు మంజూరు చేస్తారు. డిజిటల్ సంతకాలతో కూడిన స్మార్ట్ కార్డులో ఐడీ నెంబర్, దివ్యాంగుడి పేరు, వైకల్య రకం, శాతం తదితర వివరాలు ఉంటాయి. వీటిని నేరుగా దివ్యాంగుల ఇంటి చిరునామాకు పంపుతారు. ● స్మార్ట్ కార్డులతో రైలు, బస్సు టికెట్లపై రాయితీలు పొందవచ్చు. పింఛన్లు, సంక్షేమ పథకాలు, రాయి తీ రుణాలు అందుకునే వెసులుబాటు ఉంది. ● దేశంలో ఎక్కడైనా ఉపయోగించుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ● కార్డును శాశ్వతంగా వినియోగించుకునే వీలుంటుంది. దివ్యాంగులకు స్మార్డ్కార్డు వరం దివ్యాంగులకు పూర్తిస్థాయిలో యూడీఐడీ కార్డులను ఇచ్చేందుకు ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తేవడం మంచి పరిణామం. యూడీఐడీ కార్డుల మంజూరు దివ్యాంగులకు వరం లాంటిది. సదరం సర్టిఫికెట్ల స్థానంలో వీటిని ఇవ్వటం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. దివ్యాంగుల సమగ్ర సమాచారం ఈ కార్డు ద్వారా తెలుసుకోవచ్చు. –గండపనేని సతీశ్, టీవీపీఎస్ అధ్యక్షుడు కొత్తగూడెం మరింత ప్రయోజనం ప్రభుత్వం దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల స్థానంలో యూడీఐడీ కార్డులను అమల్లోకి తెచ్చింది. వీటిపైన దివ్యాంగులకు అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ స్మార్ట్ కార్డును అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇది అన్ని ప్రాంతాల్లో చెల్లుబాటు అవుతుంది. దివ్యాంగులకు దీనివల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది. –ఎం.విద్యాచందన, డీఆర్డీఓ ఉమ్మడి జిల్లా వివరాలు ఇలా.. భద్రాద్రి ఖమ్మం సదరం శిబిరాలకు హాజరైనది 31,906 62,390 టెంపరరీ వైకల్యం కలిగినవారు 3,882 7,853 శాశ్వత వైకల్యం కలిగినవారు 19,280 36,438 అనర్హులుగా తేల్చినది 8,744 18,099 -
19న ఏఐకేఎస్ జిల్లాస్థాయి సమావేశం
చర్ల: పాల్వంచ మండలం జగన్నాథపురంలో ఈ నెల 19న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం కోరారు. చర్లలోని సీపీఐ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షుడు వామనరావు అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రైతులు పండించిన గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. ఈ మేరకు రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్న సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు కల్లూరి వెంకటేశ్వరరావు, సండ్రా నరేంద్రకుమార్, అడ్డగర్ల తాతాజీ, నర్సింహారావు, రమణయ్య, మహేశ్, తేజ పాల్గొన్నారు. ఇన్స్పైర్ అవార్డుకు సింగరేణి విద్యార్థుల ఎంపిక సింగరేణి(కొత్తగూడెం)/మణుగూరురూరల్: 2024–25 విద్యా సంవత్సరానికి అందించనున్న సైన్స్ (ఇన్స్పైర్) అవార్డులకు సింగరేణి పాఠశాలల విద్యార్థులు ఎంపికయ్యారని సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్ తెలిపారు. సింగరేణి ఎడ్యుకేషన్ సొసై టీ ఆధ్వర్యంలో నడుస్తున్న 9 సింగరేణి ఉన్నత పాఠశాలల్లో జయశంకర్ భూపాలపల్లి, మణు గూరు, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, సెక్టార్–2 పాఠశాలల్లోని ఒక్కో విద్యార్థి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఎంపికై న విద్యార్థికి రూ.10 వేలు (పలు రకాల సైన్స్ ప్రాజెక్ట్ల తయారీకి) ఇవ్వనున్నారు. కాగా, మణుగూరులోని సింగరేణి హైస్కూల్ నుంచి ఎంపికై న విద్యార్థి ఎస్డీ ఇంతియాజ్పాషాను కరస్పాండెంట్, డీజీఎం(పి) రమేశ్, హెచ్ఎం స్వరూపా రాణి, గైడ్ టీచర్ మమత అభినందించారు. అంబేడ్కర్ సన్నిధిలో అన్నప్రాసన అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ): అన్నపురెడ్డిపల్లికి చెందిన నీలం సురేశ్, సంధ్య దంపతులు తమ ఆరు నెలల కుమారుడు మోక్షకు ప్రధాన సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట అన్నప్రాసన కార్యక్రమం గురువారం నిర్వహించారు. పెన్ను, పుస్తకం, నగదు, బంగారం, పొంగలితోపాటు రాజ్యాంగం పుస్తకాన్ని ఉంచి బంధువుల సమక్షంలో వేడుక జరిపించారు. బాలుడిని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు. కుల నిర్మూలన కోసం అంబేడ్కర్ చేసిన కృషి, దేశానికి చేసిన సేవలపై గౌరవంతో తన బిడ్డకు ఆయన సన్నిధిలో అన్నప్రాసన నిర్వహించామని సురేశ్ తెలిపారు. ములకలపల్లి మండలం పూసుగూడెం జెడ్పీహెచ్ఎస్లో పీడీగా సురేశ్.. దమ్మపేట మండలం అంకంపాలెం గిరిజన సంక్షేమ గురుకులంలో లైబ్రేరియన్గా సంధ్య పనిచేస్తున్నారు. కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ బురాన్, చల్లా రమేశ్, నీలం వెంకటేశ్వర్లు, పుల్లయ్య, వెంకన్న, రాంబాబు పాల్గొన్నారు. సీపీఆర్పై అవగాహన కలిగి ఉండాలి పాల్వంచ: గుండెపోటు వచ్చిన వారికి వెంటనే సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాలు కాపాడుకోగలుగుతామని, దీనిపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కేటీపీఎస్ 5, 6 దశల సీఈ ఎం.ప్రభాకర్రావు, 7వ దశ సీఈ శ్రీనివాసబాబు సూచించారు. గురువారం స్థానిక కర్మాగారంలో ఎస్పీఎఫ్ డీజీ డాక్టర్ అనిల్కుమార్ ఆదేశాల మేరకు కేటీపీఎస్ ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎస్.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సీపీఆర్పై అవగాహన కల్పించారు. సీఈలు మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తోందని పేర్కొన్నారు. అనుకోకుండా గుండెపోటుకు గురైన వారికి వెంటనే పక్కన ఉన్న వారు సీపీఆర్ చేయాలని చెప్పారు. అనంతరం వైద్యులు సీపీఆర్పై శిక్షణ ఇచ్చారు. వైద్యులు రాకేశ్కుమార్, తేజశ్రీ, శివకుమార్, డి.కిరణ్ పాల్గొన్నారు. -
వేసవిలోనూ నిరంతర విద్యుత్
భద్రాచలంఅర్బన్: వేసవిలోనూ నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ పనిచేస్తుందని జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ) మహేందర్ అన్నారు. ఎండ వేడికి విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుందనే ముందస్తు ఆలోచనతో భద్రాచలం పట్టణంలో రూ.1.50 కోట్లతో వివిధ కాలనీల్లో 28 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. వాటిలో గురువారం 12 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఎస్ఈ మహేందర్ ప్రారంభించి, మాట్లాడారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఇప్పటికే జిల్లావ్యాప్తంగా వేసవిలో విద్యుత్ సమస్యలు తలెత్తే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేసవిలో మెరుగైన, నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా లోఓల్టేజీ సమస్యలు ఉంటే వెంటనే స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు తెలపాలని, వారు సమస్యను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొస్తారని తెలిపారు. కార్యక్రమంలో భద్రాచలం విద్యుత్ డీఈ జీవన్కుమార్, ఏడీఈ వేణు, ఏఈ రాజారావు, లైన్మెన్ త్రినాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బైక్ పైనుంచి పడి యువకులకు గాయాలు
పాల్వంచరూరల్: లారీని ఓవర్ టేక్ చేయబోయి ద్విచక్రవాహనం పైనుంచి యువకులు కిందపడి గాయపడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. మండలంలోని జగన్నాథపురానికి చెందిన కార్తీక్, గోపీచంద్ కలిసి ద్విచక్రవాహనంపై రంగాపురం వైపు వెళ్తున్నారు. ఆర్టీఏ చెక్పోస్టు సమీపంలో నాగారంకాలనీ వద్ద బీసీయం జాతీయ రహదారిపై లారీని ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పి కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలించామన్నారు. -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఎస్ఆర్ఎన్కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. కాలనీవాసి వెంకటేశ్వరరావు భార్యతో కలిసి విజయవాడ వెళ్లాడు. బుధవారం అర్ధరాత్రి తాళం పగలగొట్టిన దుండగుడు లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంటి పక్కనే ఉండే వెంకటేశ్వరరావు కుమారుడు వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించారు. టౌన్ పోలీసులు క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. కాగా, దుండగుడు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్లు సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. ఇసుక టిప్పర్ సీజ్ దమ్మపేట: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ను గురువారం పోలీసులు సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని రాజమండ్రి నుంచి మండలంలోని పట్వారిగూడెంనకు ఇసుకను టిప్పర్లో తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి పత్రాలు లేకపోవడంతో లారీని సీజ్ చేసి, కేసు నమోదు చేశామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు. చిన్ననల్లబల్లిలో ట్రాక్టర్.. దుమ్ముగూడెం: మండలంలోని చిన్ననల్లబల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను పట్టుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ గణేశ్ గురువారం తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ కృష్ణయ్య సిబ్బందితో కలిసి చిన్ననల్లబెల్లి గ్రామంలో ప్రధాన రహదారిపై వాహన తనిఖీలు చేస్తున్నారు. అటువైపు నుంచి వచ్చిన ఓ ట్రాక్టర్ణు ఆపేందుకు యత్నించగా డ్రైవర్ పోలీసులను గమనించి పారిపోయే ప్రయత్నం చేశాడు. పోలీసులు అప్రమత్తమై ట్రాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. చర్ల మండలం ఆర్.కొత్తగూడెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఏనూటి రమేశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
గద్దైపెకి ఇలవేల్పులు..
గుండాల: గద్దెలపైకి ఇలవేల్పులు చేరడంతో మండలంలోని యాపలగడ్డలో నిర్వహిస్తున్న జాతర పూరిపూర్ణత సంతరించుకుంది. ఈ సందర్భంగా డోలి చప్పుళ్లు, గజ్జెల మోత, మహిళల పూనకాలు, యువత చిందులతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. గురువారం పగిడిద్దరాజు, సమ్మక్క (వనం) గద్దైపెకి రావడంతో భక్తులు మొక్కులు చెల్లించుకుకన్నారు. వన దేవతలను తీసుకొచ్చే దారిపొడవునా భక్తుల జయజయధ్వానాలతో హోరెత్తింది. వడ్డెలు, పూజారులు చిలకల గుట్ట నుంచి వనాన్ని తీసుకొచ్చి గద్దైపె ప్రతిష్ఠించారు. అరెం వంశీయులు పూజలతో వన దేవతలను స్వాగతించారు. పగిడిద్దరాజు – సమ్మక్కకు ఎదురిళ్లు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. నాలుగు గంటలకు జోగు నిర్వహించి, రాత్రి 8 గంటలకు దేవతలకు గంగాస్థానం చేయించి ఒడి నింపారు. సమ్మక్క – పగిడిద్దరాజులకు నాగవెళ్లి నిర్వహించారు. డోలీలు, డప్పులతో గద్దెల వద్దకు భారీ సంఖ్యలో భక్తులు, మహిళలు పూనకాలతో తరలివచ్చారు. దేవతలను తాకేందుకు భక్తులు పోటీపడ్డారు. కాగా, జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గుండాల సీఐ రవీందర్, ఎస్ఐ రాజమౌళి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో పూజారులు అర్రెం అప్పయ్య, లక్ష్మీనర్సు, కాంతారావు, పెద్దకాంతారావు, నాగేశ్వరరావు, భిక్షం, లక్ష్మీనారాయణ, లచ్చుదొర, మానాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జనసంద్రమైన యాపలగడ్డ ఘనంగా పగిడిద్దరాజు – సమ్మక్క నాగబెల్లి -
చాలా బాగుంది.. ఎలా తయారు చేస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ/భద్రాచలం: ‘యే క్యాహై?.. బహుత్ అచ్ఛా హై.. ఇస్కో కైసే బనాతే హో? (ఇదేంటి? చాలా బాగుంది..! ఎలా తయారు చేస్తారు?)’.. అంటూ అగ్గిపెట్టెలో పట్టేలా చేతితో నేసిన చీరను చూసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆశ్చర్యానికి గురయ్యారు. సిరిసిల్ల చేనేత కళాకారులపై ప్రశంసలు కురిపిస్తూ చీర తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. బుధవారం రాష్ట్రపతి భవన్లోని అమృత్ ఉద్యాన్లో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా ‘వివిధతా కా అమృత్ మహోత్సవ్’ సౌత్ ఎడిషన్ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంబోత్సవానికి ముందు తెలంగాణ పెవిలియన్ను సందర్శించిన రాష్ట్రపతిని.. గవర్నర్, ఉపముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించి తెలంగాణ చేనేత కళాకారుల పనితనాన్ని, చేతివృత్తుల ప్రాముఖ్యతను వివరించారు. ఉత్సవ ప్రారంభంలో కళాకారులు ప్రదర్శించిన గుస్సాడీ నృత్యం ఆహూతులను అలరించింది. ఈనెల 9 వరకు ఉత్సవం కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెవిలియన్లో రాష్ట్రానికి చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీతలు గజం అంజయ్య, గజం గోవర్ధన్తో సహా 20 మంది పలు ప్రాంతాలకు చెందిన ప్రముఖ చేనేత కార్మికులు, 20 మంది నిపుణులతో స్టాళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్లో ‘భద్రాద్రి’ ఉత్పత్తులు తెలంగాణ నుంచి భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని మహిళలు రూపొందించిన పలు రకాల సబ్బులు, షాంపూలు, మిల్లెట్ బిస్కెట్లు, కరక్కాయ పౌడర్, తేనె, న్యూట్రీ మిక్స్ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచినట్టు పీఓ రాహుల్ తెలిపారు. ఆదివాసీ గిరిజన మహిళలు రూపొందించే ఉత్పత్తులు, వాటి వల్ల ప్రయోజనాలను ఇతర రాష్ట్రాల ప్రతినిధులు, ప్రజలకు తెలియజేసి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేలా గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ సూచనలతో ఈ స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
ఇంటర్ పరీక్షలు షురూ..
36 కేంద్రాల్లో 9,446 మంది విద్యార్థుల హాజరు ● మొదటి రోజు 493 మంది గైర్హాజరు ● ఐదు నిమిషాల వెసులుబాటు అమలు ● పరీక్ష కేంద్రంలో తనిఖీ చేసిన ఎస్పీకొత్తగూడెంఅర్బన్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు జిల్లాలో బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ముందుగానే ఆయా కేంద్రాలకు చేరుకుని రూం నంబర్లను చెక్ చేసుకున్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని అన్ని పరీక్ష కేంద్రాలకూ సుమారు అర్ధగంట ముందుగానే వచ్చారు. జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది.. విద్యార్థుల హాల్ టికెట్లను తనిఖీ చేసి లోనికి పంపించారు. వాచీలు, షూ, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించలేదు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, వైద్యులు, మందులను అందుబాటులో ఉంచారు. 144 సెక్షన్ అమల్లో ఉండడంతో గుంపులుగా రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను ముందుగానే మూయించారు. గదుల్లో విద్యుత్, ఫ్యాన్ల సమస్య రాకుండా అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. జిల్లాలో ఎలాంటి మాల్ ప్రాక్టిస్ కేసులు నమోదు కాలేదని ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. అయితే ఈ ఏడాది పరీక్ష సమయానికి మించి ఐదు నిమిషాలు వెసులుబాటు కల్పించడంతో విద్యార్థుల్లో కొంత ధైర్యం ఏర్పడింది. గతంలో పరీక్ష సమయం దాటితే లోపలికి అనుమతించకపోవడంతో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు వెనుదిరిగే వారు. ఈ ఏడాది సమయం పెంచినా.. దాదాపు అన్ని కేంద్రాల్లోనూ నిర్ణీత సమయానికి ముందే విద్యార్థులు చేరుకున్నారు. పరీక్షకు దూరంగా 493 మంది.. జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సర జనరల్ విద్యార్థులు 7,532 మందికి గాను 7,284 మంది విద్యార్థులు తొలిరోజు పరీక్షకు హాజరయ్యారు. ఒకేషనల్ గ్రూప్నకు సంబంధించి 2,407 మందికి 2,162 మంది మాత్రమే పరీక్ష రాశారు. మొత్తంగా 9,939 మంది విద్యార్థులకు గాను 9,446 మంది పరీక్ష రాయగా, 493 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ వెల్లడించారు. లక్ష్మీదేవిపల్లిలో ఎస్పీ తనిఖీ.. ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా లక్ష్మీదేవిపల్లి మండలంలోని నలంద జూనియర్ కళాశాల కేంద్రాన్ని ఎస్పీ రోహిత్రాజు తనిఖీ చేశారు. విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్షల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏరా్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్పీ వెంట కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్సైలు నరేష్, రమణారెడ్డి ఉన్నారు. -
విద్యార్థుల సామర్థ్యాల పరిశీలనకు సర్వే
కొత్తగూడెంఅర్బన్: విద్యార్థుల్లో మౌలిక భాష, గణిత అభివృద్ధి ప్రక్రియ ద్వారా సాధించిన ఫలితాలను అంచనా వేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ శాంపిల్ సర్వే చేస్తున్నట్లు సర్వే సమన్వయకర్త, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు జిల్లాలో ఎంపిక చేసిన 50 ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలల్లో సర్వే ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకోసం ఇప్పటికే 55 మంది క్షేత్ర పరిశీలకులను గుర్తించి 6వ తేదీ నుంచి రెండు రోజుల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ సర్వేలో భాగంగా రెండో తరగతి విద్యార్థుల్లో తెలుగు, ఇంగిష్, గణితం సబ్జెక్టులో సామర్థ్యాలను పరిశీలించి ఒక అంచనాకు వస్తారని, ఈ సర్వే మొత్తం ‘టాన్జరిన్‘ అనే మొబైల్ యాప్ ద్వారా జరుగుతుందని వివరించారు. ఎంపిక చేసిన 50 పాఠశాలల్లో రెండో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ప్రత్యేక విధానం ద్వారా ఎనమిది మంది పిల్లలను గుర్తించి, వారికి మాత్రమే పరీక్ష నిర్వహిస్తామని, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలను విశ్లేషిస్తామని పేర్కొన్నారు. -
ఇసుకపై ఫోకస్ !
● అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జిల్లా బాస్ల చర్యలు ● పలు ప్రాంతాల్లో చెక్పోస్ట్ల ఏర్పాటు ● ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రత్యేక నిఘా బూర్గంపాడు: మొన్నటి వరకు మూడు లారీలు.. ఆరు ట్రాక్టర్లుగా సాగిన ఇసుక అక్రమ రవాణాపై పోలీస్ శాఖ నజర్ పెట్టింది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్రాజ్ రంగంలోకి దిగారు. ఇటీవల వారు ఇసుక రీచ్ల్లో తనిఖీలు చేపట్టారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మైనింగ్, పోలీస్ శాఖల అధికారులు సంయుక్తంగా చెక్పోస్ట్లు ఏర్పాటు చేశారు. రాత్రివేళల్లో పెట్రోలింగ్ పెంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లా పోలీస్ బాస్ స్వయంగా రంగంలోకి దిగడంతో మండల, డివిజన్ స్థాయి పోలీస్ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. మొన్నటి వరకు కొన్ని మండలాల్లో చూసీచూడనట్లుగా వ్యవహరించిన పోలీస్ అధికారులు ఇప్పుడు గట్టి నిఘా పెట్టి ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెడుతున్నారు. చెక్పోస్టుల్లో నిశిత పరిశీలన.. కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వచ్చేంతవరకు అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అడ్డుకోవాలని సీఎం రేవంత్రెడ్డి గత నెలలో ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమై ఇసుక అక్రమ రవాణాపై దృష్టి పెట్టారు. కలెక్టర్, ఎస్పీ చర్ల మండలంలోని ఇసుక రీచ్లను పరిశీలించారు. పరిమితికి మించి ఇసుక రవాణా చేయకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వే బిల్లులు నిశితంగా పరిశీలించేందుకు చెక్పోస్ట్లు ఏర్పాటు చేశారు. అక్కడ పోలీసులకు డ్యూటీ వేసి రేయింబవళ్లు నిఘా పెంచారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల, డివిజన్ స్థాయి అధికారులను ఆదేశించారు. రాత్రిళ్లు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, ఇసుక అక్రమంగా తరలించే వాహనాలను సీజ్ చేయాలని సూచించారు. గోదావరి, కిన్నెరసాని పరీవాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ఎస్పీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, పాల్వంచ, ముల్కలపల్లి, అశ్వారావుపేట మండలాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కందకాలు తవ్వించి.. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రెవెన్యూ అధికారులు ఆయా ప్రాంతాల్లో కందకాలు తవ్వించారు. గతంలో కూడా ఇలా తవ్వినా.. అక్రమార్కులు వాటిని పూడ్చి ఇసుక తరలించేవారు. ప్రస్తుతం ఉన్నతాధికారుల నిఘాతో కందకాల పూడ్చివేతకు వెనుకాడుతున్నారు. ఇసుక అక్రమ రవాణాతో రూ.లక్షలు ఆర్జిస్తున్న వారికి అధికారుల చర్యలు మింగుడు పడటం లేదు. దీంతో కొందరు రాజకీయ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులతో మండల స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నారు. అయితే అక్రమ రవాణాను అడ్డుకోవాలని సీఎం ఆదేశించడంతో ప్రజాప్రతినిధులు కూడా అధికారులపై ఒత్తిడి చేయలేకపోతున్నారు. 15 రోజుల్లో 66 మందిపై కేసులు.. జిల్లాలో గత 15 రోజుల వ్యవధిలో పలు మండలాల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 34 వాహనాలను సీజ్ చేసిన అధికారులు.. 66మందిపై కేసులు నమోదు చేశారు. దీంతో నదులు, వాగుల నుంచి అక్రమంగా రవాణా చేసేందుకు పలువురు భయపడుతున్నారు. అయితే గతంలో అక్రమంగా నిల్వచేసిన రాశుల నుంచి రాత్రిళ్లు అవసరమైన వారికి సరఫరా చేస్తున్నారు. ఇలా జిల్లాలో భారీగా ఇసుక అక్రమ నిల్వలున్నాయి. వీటిపై కూడా అధికారులు దృష్టి పెడితే అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అడ్డుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చెక్పోస్ట్లు ఏర్పాటు చేశాం. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నాం. మండల, డివిజన్ స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. – రోహిత్ రాజ్, ఎస్పీ -
క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీయాలి
● ఏజెన్సీ సత్తాను ప్రపంచ దేశాలకు చాటాలి ● ఓఎస్డీ పరితోష్ పంకజ్ చర్ల: ఏజెన్సీలో ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులు ఉన్నారని, వారిలోని క్రీడా ప్రతిభను వెలికి తీయాలన్న సంకల్పంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని ఓఎస్డీ పరితోష్ పంకజ్ అన్నారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ క్రీడా సత్తాను ప్రపంచ దేశాలకు చాటేలా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. చర్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి వాలీబాల్ పోటీలను భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్తో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ క్రికెటర్, ఇండియా టీంకు కెప్టెన్గా వ్యవహరించిన మహేందర్ సింగ్ దోనీ జార్ఖండ్లోని మారుమూల గ్రామానికి చెందిన వాడైనప్పటికీ ఆయనలోని క్రీడా సత్తాను ప్రపంచ దేశాలకు చాటిచెప్పాడని అన్నారు. అదే విధంగా భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష మహిళల క్రికెట్ టీంలో ఇండియా తరఫున ఆడి ఘన విజయం సాదించిందని గుర్తు చేశారు. ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఏజెన్సీలోని ప్రతీ క్రీడాకారుడు ఉత్సాహంగా ముందుకు సాగాలన్నారు. ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ క్రీడా సత్తా ఉండి ఆర్దికంగా ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారిని ఉన్నత శిఖరాలను చేర్చేందుకు ఎస్పీ రోహిత్ రాజ్ నేతృత్వంలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పోలీసు శాఖ కృషి చేస్తోందని, వారి గ్రామాల్లో విద్య, వైద్యం, రహదారులు, కమ్యూనికేషన్ వంటి సౌకర్యాలను మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఈ పోటీలకు చర్ల మండలంలోని వివిధ గ్రామాలతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ధర్మారం, టేకులేరు, జరుపల్లి, జీడిపల్లి, పెదుఉట్లపల్లి గ్రామాలకు చెందిన 49 జట్లు హాజరయ్యాయి. సీఐ ఎ.రాజువర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ కమాండెంట్ రాజ్కుమార్, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్ తదితరులు పాల్గొన్నారు. -
సస్యశ్యామలం
ఇకపై ఉమ్మడి జిల్లా 100 కి.మీ. ప్రయాణం అశ్వాపురం వద్ద గోదావరి నదిపై కాటన్ నిర్మించిన ఆనకట్ట నుంచి నీరు ఎత్తిపోసేలా సీతారామ ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేశారు. ఈ పథకంలో భాగంగా అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు, ములకలపల్లి మండలంలోని వీ.కే.రామవరం, కమలాపురంలలో పంప్హౌస్లు నిర్మించి మోటార్లు అమర్చారు. అలాగే, ఇప్పటివరకు 100 కి.మీ. మేర కాల్వల తవ్వకం పూర్తయింది. పంప్హౌస్ల్లో మోటార్లను మూడు రోజులుగా నడిపిస్తుండగా గోదావరి జలాలు బుధవారం సాయంత్రం కల్లా జూలూరుపాడు మండలం నల్లబండబోడు వద్దకు చేరాయి. ఈసందర్భంగా పెద్దసంఖ్యలో హాజరైన గ్రామస్తులతో కలిసి వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ తదితరులు గోదావరి జలాలకు పూజలు చేశారు. అక్కడి నుంచి సీతారామ మెయిన్ కెనాల్ ద్వారా వినోభానగర్ వద్దకు రాత్రికల్లా జలాలు చేరుకున్నాయి. ఆపై కొత్తగా నిర్మించిన రాజీవ్ లింక్ కెనాల్లోకి నీటిని మంత్రి తుమ్మల విడుదల చేశారు. అనంతరం ఏన్కూరు మండలం అక్కినాపురం తండా 52వ కి.మీ. వద్ద ఎన్నెస్పీ(నాగార్జునసాగర్ ప్రాజెక్టు) కాల్వ లోకి బుధవారం అర్ధరాత్రి దాటాక చేరాయి. జూలూరుపాడు: సీతారామ ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం అవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జూలూరుపాడు మండలం వినోభానగర్ వద్ద సీతారామ కాల్వ నుంచి రాజీవ్ కెనాల్లోకి గోదావరి జలాలను ఆయన బుధవారం రాత్రి 9 గంటలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా గోదావరి జలాలకు పూజలు చేసి చీర, సారె సమర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటుచేసిన సమావేశంలో తుమ్మల మాట్లాడారు. రూ.100 కోట్లు మంజూరు చేయించా.. గత ప్రభుత్వంలో సీతారామ ప్రాజెక్టులో భాగంగా మూడు పంప్ హౌస్లను నిర్మించినా నిరుపయోగంగా ఉన్నాయని మంత్రి తుమ్మల తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ డిజైన్లో ఏన్కూర్ రాజీవ్ లింక్ కెనాల్ లేకున్నా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భద్రాచలం వచ్చినప్పుడు ఒప్పించి రూ.100 కోట్లు మంజూరు చేయించానని చెప్పారు. ఈ కాల్వ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు, వారిని ఒప్పించిన రెండు జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులతో చకచకా పూర్తయిందని తెలిపారు. కాగా, తాను ఏ పార్టీలో ఉన్నా ప్రజలు, రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసమే పనిచేశానని వివరించారు. సీతమ్మ సాగర్ నిర్మాణం పూర్తయితే 36 టీఎంసీల నీరు నిల్వ చేయవచ్చని, గోదావరి – కృష్ణా జలాల అనుసంధానంతో సాగర్ ఆయకట్టులో 1.80 లక్షల ఎకరాలను స్థిరీకరించవచ్చని వెల్లడించారు. కాగా, సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ కింద నాలుగో పంప్ హౌస్ను అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈమేరకు కెనాల్కు భూమలు ఇచ్చిన రైతులను మంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు ముజమ్మిల్ఖాన్, జితేష్ వి.పాటిల్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్రాజ్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు మాలోతు రాందాస్నాయక్, డాక్టర్ మట్టా రాగమయి, ఇరిగేషన్ సీఈ శ్రీనివాసరెడ్డి, నాయకులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, బొర్రా రాజశేఖర్, లేళ్ల వెంకటరెడ్డి, గుత్తా వెంకటేశ్వరరావు, రాధాకిశోర్, మాలోత్ మంగీలాల్ నాయక్, కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, తహసీల్దార్ స్వాతి బిందు, ఇరిగేషన్ అధికారులు శ్రీనివాసరెడ్డి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఎన్నెస్పీ ఆయకట్టుకు అందించేలా ఏన్కూరు లింక్ కెనాల్(రాజీవ్ కెనాల్) నిర్మాణం చేపట్టారు. తద్వారా జూలూరుపాడు, ఏన్కూరు మండలాల్లో 7,500 ఎకరాలు, వైరా రిజర్వాయర్తో పాటు సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో మొత్తంగా 1.20 లక్షల ఎన్నెస్పీ ఆయకట్టు గోదావరి జలాలతో స్థిరీకరణ జరగనుంది. ‘సీతారామ’ ద్వారా ఎన్నెస్పీ ఆయకట్టుకు గోదావరి జలాలు మెయిన్ కెనాల్ నుంచి రాజీవ్ లింక్ కెనాల్లోకి విడుదల పూజలు చేసి మాట్లాడిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుఎనిమిది గంటల పాటు ఎత్తిపోత అశ్వాపురం: అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్ట్ ఫేస్ –1 పంప్హౌస్ నుంచి మూడో రోజైన బుధవారం కూడా గోదావరి జలాలను ఎత్తిపోశారు. పంప్హౌస్లోని ఒక మోటార్ ద్వారా ఎనిమిది గంటల పాటు 86.4 ఎంసీఎఫ్టీ నీటిని దిగువకు విడుదల చేశారు. దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి మూడు పంప్హౌస్ల ద్వారా ఏన్కూరు లింక్ కెనాల్కు, అక్కడి నుంచి ఎన్నెస్పీ కెనాల్కు గోదావరి జలాలు చేరుతున్నాయి. -
శ్రీరామనవమి ఏర్పాట్లపై నేడు సమీక్ష
సూపర్బజార్(కొత్తగూడెం): శ్రీరామనవమి, పట్టాభిషేకం వేడుకల ఏర్పాట్లపై గురువారం ఉదయం 11 గంటలకు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి అన్ని రకాల వసతి, సౌకర్యాల కల్పనకు సమగ్ర సమాచారంతో సమావేశానికి రావాలని జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు. జాతీయ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు అభినందనకొత్తగూడెంటౌన్: ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు గుంటూరులో జరగనున్న ఆర్చరీ నేషనల్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపికై న క్రీడాకారులను కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందించారు. పోటీలకు ఎంపికై న ఎం.విక్రమ్ (కొత్తగూడెం), పి.హరీష్(పాల్వంచ), క్రాంతి వర్మ(సుజాతనగర్) ఐడీఓసీలో బుధవారం కలెక్టర్ను కలిశారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ పి.పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రామయ్య సన్నిధిలో ఎంపీ..శ్రీ సీతారామచంద్రస్వామి వారిని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ బుధవారం దర్శించుకున్నారు. అనంతరం శ్రీరామనవమి ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై ఈఓ రమాదేవితో సమీక్షించారు. రేపు జాబ్మేళాసింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పాన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపొలో ఫార్మసీలో 50 పోస్టుల భర్తీకి కంపెనీ బాధ్యులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఫార్మసిస్ట్, ట్రెయినీ ఫార్మసిస్టులు, ఫార్మసీ అసిస్టెంట్ పోస్టులకు అర్హులను ఎంపిక చేస్తారని, అభ్యర్థులు ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. ‘పది’ పరీక్షలపై ఆకాశవాణిలో అవగాహనచుంచుపల్లి: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు సబ్జెక్ట్ నిపుణులతో అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రోగ్రాం హెడ్ బైరి శ్రీనివాసన్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాల్సిన తీరు, మంచి మార్కులు సాధించేలా చదవడంలో మెళకువలు తెలియజేస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు 6వ తేదీన తెలుగు, 7న హిందీ, 10న ఇంగ్లిష్, 11న గణితం, 12న ఫిజికల్ సైన్స్, 13న బయోలాజికల్ సైన్స్, 15న సాంఘిక శాస్త్రం నిపుణులు ఉదయం 10 గంటలకు సూచనలు చేస్తారని వెల్లడించారు. ఈనెల 10న ఇంటర్వ్యూలుసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ విడుదల చేసిన మొదటి ఎక్స్టర్నల్ నోటిపికేషన్కు సంబంధించి టెక్నికల్ పరీక్షలు గతేడాది జూన్లో నిర్వహించిన విషయం విదితమే. ఆ పరీక్షలో మెరిట్ సాధించిన కొంతమంది జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వగా మిగిలిన మరో 36 మందికి ఈనెల 10వ తేదీన కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని యాజమాన్యం బుధవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. సంబంధిత అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం అందించామని పేర్కొంది. సౌర విద్యుత్ ప్లాంట్లకు 139 దరఖాస్తులు ఖమ్మంవ్యవసాయం: బీడు, బంజర భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రైతులు ముందుకొస్తున్నారు. భూముల్లో ప్లాంట్లు ఏర్పాటుచేయడం ద్వారా ఆదాయం పొందేలా రైతులను కేంద్రప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. పీఎం కుసుమ్ పథకం కింద 500కిలోవాట్లు మొదలు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశముండగా, ఉత్పత్తి అయ్యే విద్యుత్ను తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(టీజీఈఆర్సీ) నిర్ణయించిన టారిఫ్తో డిస్కంలు కొనుగోలు చేస్తాయి. ఈ పథకం కోసం దరఖాస్తు గడువును 10వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యాన బుధవారం వరకు 139 దరఖాస్తులు అందాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 38, ఖమ్మం జిల్లా నుంచి 101దరఖాస్తులు ఆన్లైన్లో అందాయని రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ పోలిశెట్టి అజయ్కుమార్ తెలిపారు. -
ఉన్నత ఆలోచనలే భవిష్యత్కు పునాదులు
దుమ్ముగూడెం : ప్రతి విద్యార్థి లక్ష్యసాధన కోసం పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని, వారి ఉన్నతమైన ఆలోచనలే భవిష్యత్కు పునాదులని గిరిజన సంక్షేమ శాఖ డీడీ మణెమ్మ అన్నారు. బుధవారం లక్ష్మీనగరం రేగుబల్లి 1 గిరిజన బాలికల పాఠశాలలో కెరీర్ గైడెన్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మణెమ్మ మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ శాఖలో చదువుతున్న 8, 9,10 తరగతుల విద్యార్థుల ఆలోచనకు పదును పెట్టేందుకు ఐటీడీఏ పీఓ రాహుల్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టారని వివరించారు. ప్రతి విద్యార్థి లక్ష్యసాధన కోసం కష్టపడి చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మామిడి అశోక్ కుమార్, ఎంఈఓ సున్నం సమ్మయ్య, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్. సావిత్రి, ఎస్సై వెంకటప్పయ్య, దుమ్ముగూడెం వైద్యాధికారి పుల్లారెడ్డి పాల్గొన్నారు.గిరిజన సంక్షేమ శాఖ డీడీ మణెమ్మ -
ఏరియా ఆస్పత్రిలో పెట్రోల్ బాంబు కలకలం
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో మంగళవారం అర్ధరాత్రి కొందరు పెట్రోల్ బాంబులతో దాడి చేశారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ స్పష్టత ఇచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి తన చాంబర్ ఎదుట పెట్రోల్ పోసి నిప్పంటించాడని, ఈ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డ్ అయిందని తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటన జరిగిన తీరును సీసీ కెమెరాల పుటేజీల ద్వారా పరిశీలించి, వివరాలు సేకరించారని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ చర్యకు పాల్పడింది భద్రాచలం పట్టణానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నట్లు సమాచారం. -
సంస్కృతానికి బదులు తెలుగు ప్రశ్నపత్రం
ఇల్లెందు: పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థిని సుదిమళ్ల గురుకులంలో ఇంటర్ పరీక్షకు హాజరైంది. ఆమె ద్వితీయ భాష సంస్కృతం కాగా, హాల్టికెట్లో తెలుగు అని ప్రింట్ అయింది. పరీక్ష నిర్వాహకులు దాని ప్రకారం తెలుగు ప్రశ్నపత్రం ఇచ్చారు. ఈ విషయాన్ని బాలిక నిర్వాహకుల దృష్టికి తేగా.. వారు వెంటనే సదరు కళాశాలకు సమాచారం అందించి వివరాలు తెలుసుకున్నారు. హాల్టికెట్లో తప్పిదం జరిగిందని గ్రహించి తిరిగి సంస్కృత ప్రశ్నపత్రం అందజేశారు. ఈ విషయమై గురుకులం ప్రిన్సిపాల్ రత్నకుమారిని వివరణ కోరగా హాల్టికెట్లో జరిగిన తప్పిదాన్ని గ్రహించి సంస్కృతం పేపర్ ఇచ్చామని చెప్పారు. ఉద్యోగం ఇప్పించాలంటూ దివ్యాంగుడి భిక్షాటనమణుగూరు టౌన్ : మున్సిపాలిటీలో వాల్ ఆపరేటర్గా పనిచేసే తనను ఉద్యోగం నుంచి అకారణంగా తొలిగించారని, తిరిగి ఉద్యోగం ఇవ్వాలని తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని విఠల్రావు నగర్కు చెందిన దివ్యాంగుడు రావుల కుమారస్వామి పూలమార్కెట్ చౌరస్తాలో భైఠాయించి యాచిస్తూ నిరసన తెలియజేశాడు. బుధవారం ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ దివ్యాంగుడిని పిలిపించి 15వ తేదీ కల్లా ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో నిరసన విరమించాడు. తనను మున్సిపాలిటీలోని కొందరు వ్యక్తులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలిడీఆర్డీఓ విద్యాచందన చుంచుపల్లి: ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరినందున బ్యాంక్ లింకేజీ రుణాలు, దివ్యాంగులకు యూడీఐడీ కార్డుల జారీ వంటి లక్ష్యాలను పూర్తి చేయాలని డీఆర్డీఓ విద్యాచందన సిబ్బందికి సూచించారు. సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ బుధవారం డీఆర్డీఓ, సెర్ప్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, ఆ తర్వాత విద్యాచందన జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లాలోని మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాల పంపిణీ, పాత బకాయిల రికవరీ, దివ్యాంగులకు స్మార్ట్ కార్డుల జారీ, పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ కుట్టడం వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఈ ఏడాది లక్ష్యాలను పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో వసూళ్ల ఆరోపణపై విచారణభద్రాచలంఅర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రికి ప్రసవం కోసం వచ్చిన ఓ గర్భిణి.. ఆస్పత్రి సిబ్బందితో తాను ఎదుర్కొన్న సమస్యలపై వాట్సప్లో ఫిబ్రవరి 6వ తేదీన పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్గా మారిన విషయం విదితమే. మణుగూరు మండలానికి చెందిన గర్భిణి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి ప్రసవం కోసం రాగా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఆమెతో ప్రవర్తించిన తీరు, ప్రసవ సమయాన ప్రతీ చిన్న పనికి కూడా లంచం ఇవ్వాల్సిందేనని, లేకుంటే సిబ్బంది రోగుల పట్ల వ్యవహరించిన తీరుపై ఫిబ్రవరి 7న డీసీహెచ్ఎస్ రవిబాబు ఆదేశాల మేరకు బూర్గంపాడు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు రెండు రోజుల పాటు విచారణ చేసి జిల్లా అధికారులకు నివేదిక అందజేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించి వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ హైదరాబాద్ నుంచి మంగళవారం మణుగూరు వెళ్లి బాధితురాలిని కలిసి ఘటనపై ఆరా తీసి వివరాలు నమోదు చేశారు. విచారణలో భాగంగా బుధవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి చేరుకొని ఘటన చోటుచేసుకున్న సమయంలో విధుల్లో ఉన్న వైద్యులు, సిస్టర్లు, శానిటేషన్, పేషెంట్ కేర్, ఓటీ అసిస్టెంట్తో పాటు ఇతర సిబ్బందితో లిఖిత పూర్వక స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. రెండు బైక్లు ఢీ : ఐదుగురికి గాయాలుపాల్వంచరూరల్: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురికి గాయాలైన ఘటన మండలంలోని జగన్నాథపురంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎం.భగవాన్కు కాలు విరగగా, మరో బైక్పై వస్తున్న భార్యాభర్తలు ఎం.శ్రీనివాస్, సుబ్బలక్ష్మి, పిల్లలు అంజలి, నాగలక్ష్మి గాయపడ్డారు. క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు
పినపాక/గుండాల/కొత్తగూడెంఅర్బన్ : మావోయిస్టులకు వ్యతిరేకంగా ట్రైబల్ యూత్ అసోసియేషన్ పేరుతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాల్పోస్టర్లు వెలిశాయి. పినపాక మండలం పిట్టతోగు, ఎర్రకుంట, చింతలపాడు, సుందరయ్య నగర్, గుండాల మండలం సాయనపల్లి, వెంకటాపురం, దామరతోగు, లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి క్రాస్ రోడ్డు, రేగళ్ల, గట్టుమల్ల, బంగారుచెలక గ్రామాల్లో పోస్టర్లు దర్శనమిచ్చాయి. ‘శాంతియుత జీవనం మన హక్కు, అనుమానితుల సమాచారం పోలీసులకు ఇద్దాం, మావోయిస్టులు వద్దు.. అభివృద్ధి ముద్దు’ అనే నినాదాలు వాటిలో ఉన్నాయి. కాగా, విషయం తెలిసిన వెంటనే పోలీసులు పోస్టర్లను తొలగించారు. -
పథకాల అమలుకు సమష్టిగా శ్రమించాలి
మణుగూరు రూరల్/కరకగూడెం : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలుకు అన్ని విభాగాల అధికారులు సమష్టిగా శ్రమించాలని జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని బుధవారం ఆమె సందర్శించారు. సిబ్బంది హాజరు పట్టికలతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలులో మండల పరిషత్లే కీలకమన్నారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై సమీక్ష నిర్వహించి, వాటిని అమలుకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ తేళ్లూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాల సందర్శన.. మండలంలోని గుట్టమల్లారం గ్రామపంచాయతీ పరిధిలో గల గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాలలను నాగలక్ష్మి పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆహార పదార్థాలు బాగున్నాయని వర్కర్లను అభినందించారు. విద్యార్థుల ఆరోగ్యంతో పాటు ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా పని చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వి.రాఘవరెడ్డి తదిరతులు పాల్గొన్నారు. అనంతరం పినపాక, కరకగూడెం మండలాల్లోనూ సీఈఓ పర్యటించారు. వేసవికాలం సమీపిస్తున్నందు నర్సరీల్లో మొక్కలకు సకాలంలో నీరందించాలని సిబ్బందికి సూచించారు. పద్మాపురం, కరకగూడెం పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. ఎంపీడీఓ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి -
నేడు డిప్యూటీ సీఎం పర్యటన
ఖమ్మం వన్టౌన్/ముదిగొండ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ హెలీకాప్టర్లో ముదిగొండ చేరుకోనున్న ఆయన ముదిగొండ–వల్లభి రహదారిలో ముదిగొండ నుంచి 5కి.మీ. మేర రూ.28కోట్ల వ్యయంతో నిర్మించే నాలుగు లేన్ల రహదారి పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే, మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాక ఖమ్మం వస్తారు. ఖమ్మంలో డిప్యూటీ సీఎం వ్యక్తిగత సహాయకుడు టి.శ్రీనివాసరావు దశదినకర్మతో పాటు ఇతర కార్యక్రమాలకు హాజరయ్యాక భట్టి హైదరాబాద్ బయలుదేరతారు. కాగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వచ్చే హెలీకాప్టర్ ల్యాండింగ్ కోసం ముదిగొండ శివారు యడవల్లి రహదారిలోని ఓ ఖాళీ స్థలాన్ని బుధవారం అధికారులు పరిశీలించారు. అక్కడ హెలీప్యాడ్ఏర్పాటు, పోలీస్ బందోబస్తును ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, ముదిగొండ సీఐ మురళి, తహసీల్దార్ సునీత ఎలిజబెత్ పరిశీలించగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొమ్మినేని రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. 121 డిగ్రీ కళాశాలల ఫలితాలు నిలిపివేతకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను మంగళవారం రాత్రి విడుదల చేశారు. యూనివర్సిటీ పరిధిలో 304ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ గురుకుల డిగ్రీ కళాశాలలు ఉండగా, ఇందులో 121 ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు యూనివర్సిటీ డీన్ అకడమిక్కు వివిధ రకాల ఫీజులు బకాయి పడ్డారు. దీంతో ఆయా కాలేజీల ఫలితాలను యూనివర్సిటీ అధికారులు నిలిపివేశారు. డిగ్రీ మొద టి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు మొదలయ్యే సమయాన్ని ఫీజు చెల్లించాల్సి ఉన్నా కళాశాలల యాజమాన్యాల బాధ్యులు కేయూ వీసీ ప్రతాప్రెడ్డిని కలిసి సమయం కోరారు. దీంతో 15 – 20 రోజుల గడువు ఇచ్చినా చెల్లించకపోగా జవాబుపత్రాల మూల్యాంకనం సమయంలో నోటీసులు పంపారు. దీంతో కొన్ని కళాశాలల యాజమాన్యాలు చెల్లించినా ఇంకా 121 కళాశాలల బాధ్యులు స్పందించలేదు. ఈమేరకు ఆయా కళాశాలల్లో విద్యార్థుల ఫలితాలను వెల్లడించలేదు. ఈమేరకు విద్యార్థులు ఆందోళనకు గురవుతుండగా, యాజమాన్యాల బాధ్యులు బుధవారం రిజిస్ట్రార్ రామచంద్రాన్ని కలిస్తే ఆయన వీసీ దృష్టికి తీసుకెళ్తానని బదులిచ్చారు. ఈ విషయమై కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ రాజేందర్ వివరణ కోరగా ఫీజులు చెల్లిస్తేనే ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. -
పెట్టుబడి భారమై..
ప్రోత్సాహం దూరమై.. ● ఊతమివ్వని సమీకృత ఉద్యాన అభివృద్ధి కార్యక్రమం ● భారంగా మారిన కూరగాయల సాగు ● ఈ ఏడాది ప్రత్యామ్నాయ పంటల వైపే రైతుల దృష్టి ● వినియోగదారులకు తప్పని ధరాభారంఇల్లెందురూరల్: కూరగాయల సాగుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నేళ్లుగా సబ్సిడీలు ఎత్తివేయడంతో జిల్లాలో ఆ పంటలపై రైతులు ఆసక్తి చూపడం లేదు. కేంద్రం గతేడాది సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం ప్రకటించినా అధికారులు అవగాహన కల్పించకపోవడంతో రైతులు ఇతర పంటలనే సాగు చేస్తున్నారు. రోజుకు 266 టన్నులు.. జిల్లాలో 13.34 లక్షలకు పైగా జనాభా ఉంది. ఒక్కో వ్యక్తి నిత్యం 200 గ్రాముల చొప్పున జిల్లాలో 266 టన్నుల కూరగాయలు అవసరం. ఇందుకోసం సమారు మూడు వేల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే గతంలో కూరగాయల సాగుకు సబ్సిడీపై నాణ్యమైన ఆకుకూరలు, కూరగాయల విత్తనాలు అందించారు. దీంతో రైతులు విస్తృతంగా సాగు చేశారు. 2016 నుంచి సబ్సిడీ విత్తనాలకు మంగళం పాడడంతో సాగు 40 శాతానికి పడిపోయింది. గత నాలుగేళ్లుగా చీడపీడలు విజృంభించడంతో సాగు విస్తీర్ణం మరింత తగ్గిపోయింది. ఏటా 500 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగయ్యే ఇల్లెందు మండలంలో గతేడాది పూర్తిగా పడిపోయింది. కాగా కేంద్ర ప్రభుత్వం 2024 వానాకాలం, ప్రస్తుత యాసంగి సీజన్కు సమీకృత ఉద్యాన అభివృద్ధి కార్యక్రమం అమల్లోకి తెచ్చింది. ఇందుకోసం రాష్ట్రానికి రూ.145 కోట్లు కేటాయించి కూరగాయల సాగును ప్రోత్సాహించాలని నిర్ణయించింది. రాష్ట్రానికి మంజూరు చేసిన నిధుల్లో జిల్లాకు రూ.4.50 కోట్లు వచ్చే అవకాశం ఉంది. కానీ అధికారులు దీనిపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడం లేదు. దీంతో జిల్లాలో కూరగాయల సాగు అంతగా లేక వినియోదారులపై భారం పడుతోంది. ప్రోత్సహిస్తే కాకరసాగు.. కూరగాయల సాగులో కాకరను రైతులు తొలిపంటగా భావిస్తారు. ఏప్రిల్లో విత్తనాలు వేస్తే జూన్ రెండో వారం నుంచి పంట దిగుబడి ప్రారంభమవుతుంది. ఈ పంట సాగుకు పందిరి వేసేందుకు గతంలో అడవి నుంచి వాసాలు తెచ్చి పందిర్లు వేసేవారు. ప్రస్తుతం వాసాల సేకరణకు అటవీ శాఖ అధికారులు అడ్డుపడుతున్నారు. కనీసం వెదురు బొంగులు కూడా తీసుకురానివ్వడం లేదు. దీంతో రైతులు సిమెంట్ స్తంభాలు కొనుగోలు చేయలేక ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తున్నారు. గతంలో సిమెంట్ స్తంభాల కొనుగోలుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. కానీ ఆ పథకం ప్రస్తుతం అమల్లో లేకపోవడంతో కాకర సాగు చేసే రైతులు పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. ప్రోత్సాహకాలు పునరుద్ధరించాలి మాకు కూరగాయల సాగు వారసత్వంగా వస్తోంది. దశాబ్దాలుగా ఈ పంటనే నమ్ముకొని జీవిస్తున్నాం. రాయితీ సౌకర్యాలు దూరం కావడం, చీడపీడలు అధికం కావడంతో ఇప్పుడు పంట సాగు భారంగా మారింది. సబ్సిడీలు పునరుద్ధరించి, మార్కెట్ సౌకర్యం కల్పిస్తే కొంతైనా మేలు జరుగుతుంది. – వాంకుడోత్ లింగా, అమర్సింగ్తండా, ఇల్లెందు మండలం ఉద్యాన అధికారుల జాడేలేదు దశాబ్దకాలంగా కూరగాయలు సాగు చేస్తున్నాం. గతంలో ఉద్యాన రైతులు నిరంతరం పర్యవేక్షించేవారు. మూడేళ్లుగా వారి జాడే లేదు. చీడపీడలు అధికమై, దిగుబడి తగ్గి గతేడాది సాగు నిలిపివేశాం. – వాంకుడోత్ బాలు, కొమరారం, ఇల్లెందు మండలంప్రతిపాదనలు సిద్ధం చేశాం సమీకృత ఉద్యాన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జిల్లాకు మంజూరైన నిధులను బొప్పాయి, జామ, సీతాఫలం సాగుకు అత్యధికంగా కేటాయించాం. రెండు మండలాల్లో ఆరెకరాల విస్తీర్ణంలో కూరగాయల పందిరి సాగుకు మంజూరు చేశాం. మరింత మంది రైతులకు ప్రోత్సాహకాలు అందేలా ప్రతిపాదనలు సిద్ధం చేశాం. – కిషోర్, జిల్లా ఇన్చార్జ్ ఉద్యాన అధికారి -
రద్దయిన రైళ్ల ఇవే...
రైలు నంబర్ పేరు / మార్గం రద్దయిన తేదీలు67767 డోర్నకల్ – విజయవాడ (పుష్పుల్) 67768 విజయవాడ – డోర్నకల్ 67215 విజయవాడ – భద్రాచలం రోడ్ 67215 భద్రాచలం రోడ్ – విజయవాడ 12705 గుంటూరు–సికింద్రాబాద్ (ఇంటర్సిటీ) 12706 సికింద్రాబాద్ – గుంటూరు (ఇంటర్సిటీ) 12713 విజయవాడ – సికింద్రాబాద్ (శాతవాహన) 12714 సికింద్రాబాద్ – విజయవాడ (శాతవాహన) 12701 గుంటూరు – సికింద్రాబాద్ (గోల్కొండ) 12702 సికింద్రాబాద్ – గుంటూరు (గోల్కొండ) 07481 తిరుపతి – సికింద్రాబాద్ (స్పెషల్) ఈనెల 9న 07482 సికింద్రాబాద్ – తిరుపతి (స్పెషల్) ఈనెల 10న 22645 ఇండోర్ – కొచివిల్ ఈనెల 10న 22646 కొచివిల్ – ఇండోర్ ఈనెల 8న 22647 కోర్బా – కొచివిల్ ఈనెల 12న 22648 కోచివిల్ – కోర్బా ఈనెల 10న 12511 గోరఖ్పూర్ – కోచివిల్ (రప్తీసాగర్) ఈనెల 6, 7, 9 12512 కోచివిల్ – గోరఖ్పూర్ (రప్తీసాగర్) ఈనెల 9, 11, 12 04717 హిస్పార్–తిరుపతి (స్పెషల్) ఈనెల 8న 07418 తిరుపతి–హిస్సార్ (స్పెషల్) ఈనెల 10నదారి మళ్లించిచేవి... 20805, 20806 విశాఖ – ఢిల్లీ, ఢిల్లీ – విశాఖకు రైళ్లను 11, 12వ తేదీల్లో దారి మళ్లిస్తారు. అలాగే, 20803, 20804 విశాఖ – గాంధీధమ్, గాంధీధమ్ – విశాకు వెళ్లే రైళ్లను 6, 9వ తేదీల్లో, శాలిమార్ – హైదరాబాద్, హైదరాబాద్ – శాలిమర్ ఎక్స్ప్రెస్(ఈస్ట్కోస్ట్)ను 11, 12, 13వ తేదీల్లో, భవనేశ్వర్ – ముంబై, ముంబై – భువనేశ్వర్ (కోణార్క్) ఎక్స్ప్రెస్ను 11, 12వ తేదీల్లో, సాయినగర్ – కాకినాడ రైలును 11, 12 తేదీల్లో దారి మళ్లించారు. ఈనెల 7నుంచి 13వ తేదీ వరకు -
విద్యుదాఘాతంతో ప్రైవేట్ ఉపాధ్యాయురాలు మృతి
దమ్మపేట : దుస్తులు ఇసీ్త్ర చేస్తున్న మహిళ విద్యుత్ షాక్తో మృతి చెందిన ఘటన దమ్మపేటలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రంగు కోకిల(31) స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. పదేళ్ల క్రితం దమ్మపేటకు చెందిన రంగు భానుతో వివాహం జరగగా.. వారికి ఇద్దరు కుమార్తెలు ఖుషిక(8), భావన(6) ఉన్నారు. బుధవారం ఉదయం కోకిల పాఠశాలకు వెళ్లేందుకు కుమార్తెల దుస్తులను కరెంట్ ఐరన్ బా క్స్తో ఇసీ్త్ర చేస్తుండగా షాక్కు గురైంది. కుటుంబసభ్యులు వెంటనే అశ్వారావుపేట ప్ర భుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కోకి ల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మేము సైతం ఫౌండేషన్ వారి అభ్యర్థన మేరకు కోకిల నేత్రాలను ఆమె కుటుంబ సభ్యులు డాక్టర్ అగర్వాల్ ఐ బ్యాంక్కు అందజేశారు. నేత్రదానం చేసిన కుటుంబసభ్యులు -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యుల ఆందోళన కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి బుధవారం మృతి చెందాడు. త్రీటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీదేవిపల్లి మండలం తెలగరామవరానికి చెందిన చంద్రగిరి సత్యనారాయణ(65)కు మంగళవారం కడుపునొప్పి రాగా కుటుంబసభ్యులు సర్వజన ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సత్యనారాయణ బుధవారం మృతి చెందాడు. దీంతో సత్యనారాయణ కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. వైద్యుల నిర్లక్షం వల్లే తమ అన్న మరణించాడని సత్యనారాయణ సోదరుడు హరికృష్ణ ఆరోపించారు. ఈ క్రమంలో త్రీటౌన్ పోలీసులు ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. గురువారం పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని, ఈ ఘటనపై సత్యనారాయణ కుటుంబసభ్యులు ఇంకా ఫిర్యాదు ఇవ్వలేదని ఎస్సై పురుషోత్తం తెలిపారు. ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి..అశ్వాపురం: మండల పరిధిలోని మొండికుంట గ్రామశివారులో మంగళవారం అర్ధరాత్రి ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో సున్నం బాలరాజు(41) అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్పై ఉన్న బండ్ల ముత్తయ్యకు కాలు విరిగింది. సమాచారం అందుకున్న సీఐ అశోక్రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. బాలరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలరాజు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై తిరుపతిరావు కేసు నమోదు చేశారు. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధంమణుగూరు టౌన్: మండలంలోని బెస్తగూడెం గ్రామానికి చెందిన చింతల చినరాములు ఇల్లు బుధవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న రూ.15వేల నగదుతో పాటు సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రభుత్వం తమకు సాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
గద్దైపెకి పగిడిద్దరాజు
గుండాల: గుట్ట నుంచి తీసుకొచ్చిన పగిడిద్దరాజు గర్భగుడిలో పూజలందుకుని గద్దెనెక్కాడు. డోలి చప్పుళ్లతో నృత్యాలు చేస్తూ పగిడిద్దరాజును గద్దైపె ప్రతిష్ఠించారు. మేడారం సమ్మక్క భర్త, యాపలగడ్డ గ్రామానికి చెందిన అరెం వంశీయుడు పగిడిద్దరాజు జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. గ్రామానికి చెందిన పూజారులు, వడ్డెల ఆధ్వర్యంలో పగిడిద్ద రాజును గుట్టనుంచి పగడాలను(జెండాలు) స్థానిక గద్దెల వద్దకు చేర్చారు. ముందుగా గర్భగుడి వద్ద ఆభరణాలకు, శివ సత్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పగిడిద్దరాజును డప్పువాయిద్యాలు, గిరిజన నృత్యాలతో ఊరేగింపుగా గద్దెల వద్దకు చేర్చి ప్రదక్షిణలు చేసి, ప్రత్యేక పూజలతో గద్దెలపై ప్రతిష్ఠించారు. గురువారం వనం(దేవత) రాకతో నిండు జాతర ప్రారంభమవుతుంది. సాయంత్రం గ్రామంలో జోగుకు వెళ్లి, అదే రాత్రి దేవతలకు గంగాస్నానం చేయిస్తారు. పగిడిద్దరాజు–సమ్మక్క దేవతలకు నాగవెళ్లి జరుపుతారు. శుక్రవారం తెల్లవారుజామున గుడి మెలిగి, దేవతలకు శ్రేలపెయ్యను హారంగా ఇస్తారు. ఉదయం నుంచి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం తిరిగి దేవతను గుట్టకు చేర్చడంతో జాతర ముగుస్తుంది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పూజారులు లక్ష్మినర్సు, లచ్చుపటేల్, పెద్ద కాంతారావు, చిన్న కాంతారావు, సత్యం, లక్ష్మయ్య, సమ్మయ్య, సత్యం, బిక్షం తదితరులు పాల్గొన్నారు. యాపలగడ్డలో జాతర ప్రారంభం -
27 రోజులు.. 12.16 మిలియన్ టన్నులు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరడం కష్టంగానే కనిపిస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం. ఇందులో 2024 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు 64.06 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయాల్సి ఉండగా, 59.84 మిలియన్ టన్నులే(93 శాతం) ఉత్పత్తి నమోదైంది. మిగిలిన నెలలో (మార్చి 3వ తేదీ వరకు అందిన గణాంకాల ప్రకారం) ఇంకా 12.16 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయాలి. అంటే సగటున రోజుకు సుమారు 4 లక్షల టన్నుల ఉత్పత్తి తప్పనిసరి. కానీ 11 ఏరియాల్లో రోజువారీ ఉత్పత్తి లక్ష్యమైన 2.80 లక్షల టన్నుల్లో 2.50 లక్షల టన్నులే నమోదవుతోంది. భూగర్భ గనుల్లో వెనుకంజసింగరేణివ్యాప్తంగా 11 ఏరియాల్లో 18 ఓపెన్కాస్ట్ గనులు, 24 భూగర్భ గనులు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఓపెన్కాస్ట్ గనుల్లో 58.57 మిలియన్ టన్నుల లక్ష్యానికిగాను 55.56 మిలియన్ టన్నులు(95 శాతం), భూగర్భ గనుల్లో 54.83 లక్షల టన్నులకు 42.73 లక్షల టన్నుల(78 శాతం) ఉత్పత్తి నమోదైంది. వాస్తవంగా భూగర్భ గనుల్లో కార్మికుల సంఖ్య ఎక్కువగానే ఉన్నా, ఓసీల కంటే తక్కువ లక్ష్యాన్ని నిర్దేశించినా, 100 శాతం ఉత్పత్తి సాధ్యం కావడం లేదు. ఈ విషయంలో ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం లేకుండాపోయింది. దీనికి అధికారుల నిర్లక్ష్యం తోడవుతోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓసీల్లో రోజుకు సుమారు 2.40 లక్షల టన్నులు సాధిస్తుంటే, భూగర్భగనుల్లో రోజుకు 16 వేల టన్నులే నమోదవుతోంది. వంద శాతం ఐదు ఏరియాల్లోనే.. గడిచిన ఫిబ్రవరిలో సింగరేణివ్యాప్తంగా ఐదు ఏరియాల్లోనే 100 శాతం బొగ్గు ఉత్పత్తి నమోదైంది. బెల్లంపల్లి ఏరియా 114 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, శ్రీరాంపూర్ ఏరియాలో 112 శాతం, మణుగూరు ఏరియాలో 111 శాతం, ఆర్జీ–1 ఏరియాలో 110 శాతం, ఆర్జీ–3లో 103 శాతం ఉత్పత్తి సాధించారు. మిగిలిన వాటిల్లో ఆర్జీ–2 ఏరియా 99 శాతం, మందమర్రి ఏరియా 95, భూపాలపల్లి 86 శాతం, కొత్తగూడెం ఏరియా 80 శాతం, ఏఎల్పీ 67, ఇల్లెందు ఏరియా 51 శాతంతో సరిపెట్టుకున్నాయి. 11 మాసాల్లో రెండు ఏరియాల్లో.. ఈ ఆర్థిక సంవత్సరం గడిచిన 11 నెలల్లో పరిశీలిస్తే 100 శాతం లక్ష్యాన్ని రెండు ఏరియాలే సాధించాయి. ఇల్లెందు ఏరియా(కొత్తగూడెం రీజియన్) 110 శాతం, ఆండ్రియాల ప్రాజెక్ట్ (రామగుండం రీజియన్) 111 శాతం ఉత్పత్తితో అగ్రస్థానంలో నిలిచాయి. ఇక కొత్తగూడెం ఏరియా 96, మణుగురు ఏరియా 97, బెల్లంపల్లి ఏరియా 95, మందమర్రి 77, శ్రీరాంపూర్ 86, ఆర్జీ–1 ఏరియా 94, ఆర్జీ–2 ఏరియా 94, ఆర్జీ–3 ఏరియా 98, భూపాలపల్లి ఏరియా 74 శాతం సాధించి వెనుకంజలో ఉన్నాయి. సమష్టిగా లక్ష్యసాధనకు కృషిప్రతీ ఉద్యోగి, అధికారి సమష్టిగా పనిచేసి వార్షిక లక్ష్యసాధనకు కృషి చేయాలి. అందరూ రోజుకు ఎనిమిది గంటలు కచి్చతంగా బాధ్యతగా పనిచేయాలి. మస్టర్ నమోదు చేయించుకొని బయటకు వెళ్లే వారిపై చర్యలు తీసుకోవడమేకాక ప్రతీ ఉద్యోగి విధులకు సకాలంలో హాజరయ్యేలా అధికారులు పర్యవేక్షించాలి. సంస్థ అభివృద్ధికి పనిచేస్తున్నామా లేదా అని అంతా ఆత్మపరిశీలన చేసుకుంటే ఫలితం ఉంటుంది. – ఎన్.బలరామ్, సింగరేణి సీఎండీ -
డయాగ్నస్టిక్ ఫీజులు 20 శాతం తగ్గించాలి
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో నిర్వహిస్తున్న ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లలో రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్రే ఫీజులను 20 శాతం మేర తగ్గించాలని డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్ నిర్వాహకులకు సూచించారు. ఆయా కేంద్రాల వారితో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఫీజుల్లో 20 శాతం మేర తగ్గిస్తూ ఆమోదించామని పేర్కొన్నారు. సమావేశంలో ఐఎంఏ అధ్యక్షుడు సీహెచ్ కృష్ణప్రసాద్, సెక్రటరీ ముక్కంటేశ్వరరావు, డాక్టర్ ప్రవీణ్, ప్రభుత్వ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరుపతి, డాక్టర్ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. -
20 కేజీల గంజాయి పట్టివేత
భద్రాచలంఅర్బన్: గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. రెండు ద్విచక్రవాహనాలపై ముగ్గురు వ్యక్తులు 20 కేజీల గంజాయి తరలిస్తూ.. పట్టణంలోని కూనవరం రోడ్డులోని ఆర్టీఏ చెక్పోస్టు వద్ద టౌన్ పోలీసులకు చిక్కారు. పట్టుబడిన వ్యక్తులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుంట పట్టణానికి చెందిన వారిగా తేలిందని, గంజాయిని మల్కన్గిరిలో కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయించేందుకు తరలిస్తూ పట్టుబడ్డారని, గంజాయి విలువ రూ.10.30 లక్షలు ఉంటుందని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. గంజాయి పట్టివేత చండ్రుగొండ: ఓ వ్యక్తి గంజాయిని అక్రమంగా తరలిస్తూ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న వాహనాల తనిఖీలో మంగళవారం పట్టుబడ్డాడు. ఎస్ఐ శివరామకృష్ట కథనం ప్రకారం.. క్లూస్ టీంతో కలిసి పోలీసుటు వాహనాల తనిఖీ చేపట్టగా చండ్రుగొండకు చెందిన డి.వెంకటేశ్వరరావు బైక్పై వెళ్తుండగా ఆపారు. తనిఖీ చేయగా 500 గ్రాముల గంజాయి లభించడంతో గంజాయితోపాటు బైక్, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశామని ఎస్ఐ చెప్పారు. -
నేటి నుంచి పగిడిద్దరాజు జాతర
గుండాల: మేడారం సమ్మక్క భర్త, అరెం వంశీయుల ఇలవేల్పు పగిడిద్దరాజు జాతర మండలంలోని యాపలగడ్డ గ్రామంలో బుధవారం ప్రారంభం కానుంది. మేడారం జాతర అనంతరం ఇక్కడ సమ్మక్క – పగిడిద్దరాజుల నాగవెల్లి జాతర నిర్వహించడం ఆనవాయితీ. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే జాతరకు గ్రామ సమీపంలోని గద్దెల వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. తొలిరోజు పగిడిద్దరాజును వనం(గుట్ట) నుంచి గుడికి తీసుకొచ్చి, రాత్రి ఎదురిల్లుట చేస్తారు. గురువారం వన దేవతను గుట్ట నుంచి తీసుకొస్తారు. దీంతో జాతర ప్రారంభమవుతుంది. పలు కార్యక్రమాల అనంతరం శనివారం ఉదయం దేవతలను గుట్టకు సాగనంపడంతో జాతర ముగుస్తుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, ములుగు జిల్లాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. కాగా, పగిడిద్ద రాజు జాతరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటు పినపాక, భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణను ప్రత్యేకంగా ఆహ్వానించారు. -
లక్ష్యాన్ని సాధించేవరకు విశ్రమించొద్దు..
గుండాల/పాల్వంచరూరల్: విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని, దానిని సాధించే వరకు విశ్రమించొద్దని ఐటీడీఏ డీడీ మణెమ్మ సూచించారు. మంగళవారం ఆళ్లపల్లి మండలం అనంతోగు, పాల్వంచ మండలం ఉల్వనూరు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలల్లో కెరీర్ గైడెన్స్పై సమీక్ష నిర్వహించారు. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించాలని, అనంతరం చదువు మధ్యలో ఆపకూండా పైచదువులకు వెళ్లాలని సూచించారు. ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ ఇలా.. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని కోర్సులను ఎంచుకోవాలని సూచించారు. వేసవి సెలవలను వృథా చేయకుండా నైపుణ్యం ఉన్న రంగాల్లో శిక్షణ తీసుకోవాలని చెప్పారు. పోలీస్, ఫారెస్ట్, వైద్య, విద్యుత్ శాఖ అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇల్లెందు ఏటీడీఓ రాధమ్మ, హెచ్ఎం భద్రమ్మ, ప్రత్యేకాధికారి మధుకర్, పాల్వంచ తహసీల్దార్ వివేక్, ఎంపీడీఓ విజయ్భాస్కర్రెడ్డి, ఎంఈఓ శ్రీరాంమూర్తి, ఏఓ శంకర్, డాక్టర్ తేజశ్రీ, డీఈ సుధా, ఎస్ఐ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం గోదావరి వద్ద గజ ఈతగాళ్ల ఏర్పాటు భద్రాచలంఅర్బన్: భద్రాచలంలోని గోదావరిలో జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు మంగళవారం అధికారులు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. ఇటీవల నీటమునిగి పలువురు భక్తులు మృతి చెందిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశాల మేరకు ప్రమాదాలు అరికట్టేందుకు భద్రాచలం ఆర్డీఓ దామోదర్రావు పంచాయతీ, రామాలయ అధికారులతో సమావేశం నిర్వహించి నలుగురు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సౌర విద్యుత్ ప్లాంట్లకు దరఖాస్తు గడువు పెంపు ఖమ్మంవ్యవసాయం: రైతులు తమ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 10వ తేదీ వరకు పొడిగించారు. పీఎం కుసుమ్ పథకం కింద వ్యవసాయ యోగ్యం కాని బీడు, బంజర భూముల్లో ప్లాంట్ల ఏర్పాటుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రైతులతో పాటు, వ్యవసాయ ఉత్పత్తి సంఘాలు, సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, వివిధ సంస్థలకు సైతం అవకాశం కల్పించారు. అయితే, దరఖాస్తు గడువు 2వ తేదీతో ముగియగా ఉమ్మడి జిల్లాలో 75 మంది ముందుకొచ్చారు. ఈనేపథ్యాన గడువు పెంచగా, ఆసక్తి ఉన్న రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ పి.అజయ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ‘వనజీవి’ని కలిసిన బీట్ ఆఫీసర్లు ఖమ్మంరూరల్: మండలంలోని రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యను రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ 35వ బ్యాచ్కు చెందిన 40మంది ఫారెస్ట్ ట్రైనింగ్ బీట్ ఆఫీసర్లు మంగళవారం కలిశారు. ఈసందర్భంగా విత్తనాల సేకరణ, మొక్కలు నాటడం, పరిరక్షణపై తన అనుభవాలను రామయ్య వివరించారు. మొక్కలు నాటడమే కాక అడవులను నరికివేయకుండా అడ్డుకోవడాన్ని అందరూ బాధ్యతగా భావించేలా అవగాహన కల్పించాలని సూచించారు. అటవీ అకాడమీ కోర్సు డైరెక్టర్ గంగారెడ్డి, కూసుమంచి రేంజ్ ఆఫీసర్ పి.శ్రీనివాసరావు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కే.వీ.రామారావుతో పాటు ఉద్యోగులు కొండల్రావు, పి.డానియేల్, వెంకటేశ్వర్లు, నర్సింహారావు, మధు తదితరులు పాల్గొన్నారు.గుండెపోటుతో ఉపాధ్యాయురాలు మృతి దమ్మపేట: మండలంలోని నాగుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న హ సవత్ కిరణ్మయి (36) మంగళవారం రాత్రి కొత్తగూడెం ఆస్పత్రిలో గుండెపోటుతో మృతిచెందింది. కిరణ్మయి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం నిమిత్తం ప్రస్తుతం సెలవులో ఉన్నారు. ఆమె మంగళవారం కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా అక్కడే అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మృతి చెందారు. ఎంఈఓ కీసర లక్ష్మి, స్థానిక ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. -
బొగ్గు పుట్టినింటికి ఆపద రావొద్దు..
ఇల్లెందు: 130 ఏళ్ల కిందట ఇల్లెందులో బొగ్గు పుట్టిందని, అలాంటి బొగ్గు పుట్టినింటికి ఆపద రావొద్దని ఎమ్మెల్యే కోరం కనకయ్య సింగరేణి అధికారులకు సూచించారు. ఈ నెలాఖరుతో జేకే–5 ఓసీ మూతపడే ప్రమాదం ఉందని, నూతన పూసపల్లి ఓసీ అనుమతులు జాప్యం అవుతున్నాయని, కార్మికులు, ఉద్యోగుల బదిలీలు తప్పవని ఆందోళన చెందుతున్న తరుణంలో జేకేఓసీని సింగరేణి అధికారులతో కలిసి ఎమ్మెల్యే మంగళవారం సందర్శించారు. అక్కడి బొగ్గు నిల్వలు పరిశీలించారు. ఓసీలో ఉన్న ఓవర్మెన్స్, సర్వే అధికారులతో మైన్ పరిస్థితితులను అడిగి తెలుసుకున్నారు. పూసపల్లి ఓసీ అనుమతులు వచ్చే వరకు ఇక్కడి అధికారులు, కార్మికులను బదిలీ చేయకుండా ఓసీని కొనసాగించాలని జీఎం కృష్ణయ్యను కోరారు. జీఎం కృష్ణయ్య మాట్లాడుతూ.. పూసపల్లి ఓసీ ఈఎస్సీ సమావేశం ఈ నెల 18న ఉందని, తుది అనుమతులు లభించినా ఏప్రిల్, మే నెలలో ఓసీ ప్రారంభమవుతుందని తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఐఎన్టీయూసీ నేతలు జనక్ప్రసాద్ గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు, ఇల్లెందు ఏరియా జీఎం వీసం కృష్ణయ్య, అధికారులు మోహన్రావు, కృష్ణమోహన్, పూర్ణచందర్, గోచికొండ సత్యనారాయణ, మహబూబ్, బండారి నాగేశ్వరరావు, పడిదల నవీన్, బొల్లెద్దుల ప్రభాకర్, కుడితి శ్రీనివాస్, బాబూరావు, కాంగ్రెస్ పట్టణ నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ల సూర్యం, దొడ్డా డానియేల్, సుదర్శన్ కోరీ తదితరులు ఉన్నారు. -
మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి బస్సులు
ఖమ్మంమయూరిసెంటర్: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేలా రాష్ట్రప్రభుత్వం వివిధ పథకాల్లో స్థానం కల్పిస్తోంది. ఇప్పటికే ఇందిరా మహిళ శక్తి పేరుతో క్యాంటీన్లు మంజూరు చేస్తుండగా, తాజాగా ఆర్టీసీ అద్దెకు తీసుకునే బస్సులను మహిళా సంఘాల నుంచే సమకూర్చుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 600 బస్సులను ఈ విధానంలో సేకరించాలనేది లక్ష్యం కాగా, మొదటి దశలో 150 బస్సులను మహిళా సమాఖ్యలకు రుణాల మంజూరు ద్వారా కొనుగోలు చేయిస్తారు. ఈక్రమాన రుణాలు మంజూరు చేసే బ్యాంకులకు ప్రభుత్వమే పూచీకత్తు ఇస్తుంది. కాగా, మొదటి దశలో కొనుగోలు చేసే 150బస్సుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మహిళా సమాఖ్యలకు సైతం స్థానం దక్కనుంది. సుమారు 30 – 35 బస్సులను ఇక్కడి మహిళా సమాఖ్యల ద్వారా కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగిస్తారు. ఆపై ఆర్టీసీ ఒక్కో బస్సుకు రూ.77,220 చొప్పున అద్దె చెల్లిస్తుంది. ఇందులో కొంత మేర రుణవాయిదాలు చెల్లిస్తూ మిగతా నగదును సమాఖ్య సభ్యులుగా వాటాలు తీసుకుంటారు. కాగా, ఈనెల 8న మహిఽళా దినోత్సవం రోజునే 50బస్సులను ప్రభుత్వం ప్రారంభించనుండగా, జిల్లాలో మహిళా సమాఖ్యలను ఎంపిక చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. మొదటి దశలోనే ఉమ్మడి జిల్లాకు స్థానం -
రంగం సిద్ధం
‘నవమి’ టెండర్లకుఫాల్గుణ మాసంలో ప్రత్యేక పూజలు.. ఫాల్గుణ మాసం సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరపనున్నారు. ఈనెల 10వ తేదీన పుష్యమి నక్షత్రం సందర్భంగా పట్టాభిషేకం, 13న వసంతోత్సవం, డోలోత్సవాలకు అంకురార్పణ, 14న పసుపు, కుంకుమలను దంచి పెళ్లి పనులకు శ్రీకారం, వసంతోత్సవం జరపనున్నారు. ఇదే రోజున స్వర్ణ లక్ష్మీ అమ్మవారికి స్నపన తిరుమంజనం గావించనున్నారు. 17న సుదర్శన హోమం, 25న సర్వ ఏకాదశి సందర్భంగా లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నట్లు వైదిక పెద్దలు తెలిపారు.భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో అంగరంగ వైభవోపేతంగా జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు హడావిడి ప్రారంభమైంది. ఏప్రిల్ 6న శ్రీరామనవమి, 7వ తేదీన పట్టాభిషేక మహోత్సవాలు జరగనుండగా, ఈ బ్రహ్మోత్సవాలను సుమారు 2.50 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే టెండర్లు.. ప్రతి ఏడాది శ్రీరామనవమి ఉత్సవాలకు ఫిబ్రవరి నెలాఖరు వరకే టెండర్లు ఖరారు కావడంతో పాటు పనులు ప్రారంభమయ్యేవి. అయితే ఈ ఏడాది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో టెండర్లు ఖరారు చేయకున్నా.. యాక్షన్ ప్లాన్ మాత్రం సిద్ధం చేశారు. ఒకటి, రెండు రోజుల్లో పనుల వ్యయాన్ని ప్రకటించి టెండర్లు పిలిచేలా ప్రణాళిక రూపొందించారు. కాగా నవమి బ్రహ్సోత్సవాలకు కేటాయించిన రూ.2.50 కోట్లలో రూ. 1.50 కోట్ల వరకు భక్తులకు ఏర్పాటు చేసే వసతులు, రామాలయం, పర్ణశాల ఆలయానికి రంగులు, విద్యుత్ దీపాలంకరణ, మిథిలా స్టేడియంలో బారికేడ్లు, కూలర్లు, తాత్కాలిక వసతి ఇతరత్రా పనులకు వెచ్చించనున్నారు. మరో రూ.కోటితో స్వామి వారికి తలంబ్రాలు, పట్టువస్త్రాలు, పూల అలంకరణ, క్రతువుకు సంబంధించి వ్యయం చేయనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో టెండర్లను ఆహ్వానిస్తే ఈ పనులకు లైన్ క్లియర్ అవుతుంది. ఇక కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు నిర్వహించి సామాన్య భక్తులకు అందాల్సిన వసతులు, కల్యాణ వీక్షణంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. హోలీ నుంచి పెళ్లి పనులు.. ఈనెల 14న హోలీ పండుగ రోజున రామాలయంలో స్వామివారి పెళ్లి పనులు ప్రారంభించనున్నారు. ప్రతి ఏడాది ఫాల్గుణ పౌర్ణమి రోజున పసుపు కొమ్ములు దంచి తలంబ్రాల తయారీతో పెళ్లి పనులకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీ. మిథిలా స్టేడియం ఎదురుగా ఉన్న వైకుంఠ ద్వారం వద్ద ఈ వేడుకలను గత రెండు సంవత్సరాలుగా జరుపుతున్నారు. భద్రాచలంలో మాత్రమే ప్రత్యేకమైన తలంబ్రాల తయారీ ఎంతో విశిష్టమైనది. భక్తులు సమర్పించిన బియ్యంలో పసుపు, రోజ్వాటర్, గులామ్, సుగంధద్రవ్యాలు, అత్తర్ కలిపి తలంబ్రాలు తయారు చేస్తారు. నిజాం నవాబుల నాటి సంప్రదాయాన్ని ఇప్పటికీ భద్రాచలం రామాలయంలో కొనసాగిస్తున్నారు. ఇదే రోజున స్వామి వారికి వసంతోత్సవం నిర్వహించనున్నారు. కాగా ప్రతి ఏడాది భక్తుల నుంచి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ముత్యాల తలంబ్రాలను సైతం ఈ ఏడాది పెంచనున్నారు. ఆలయ విక్రయశాలతో పాటు పోస్టాఫీస్లో, ఆర్టీసీ కార్గో ద్వారా విక్రయించనున్నారు. అదేవిధంగా ఈనెల 30వ తేదీ ఉగాది పండుగ రోజున బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. 30 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు శాస్త్రోక్త కార్యక్రమాలు, 6వ తేదీన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, 7వ తేదీన పట్టాభిషేకం జరగనున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో ఆహ్వానం రూ.2.50 కోట్లతో చేపట్టనున్న పనులు ఈనెల 14న రామయ్య పెళ్లి పనులు షురూ 30 నుంచి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం ఏప్రిల్ 6న శ్రీరామ నవమి, 7న పట్టాభిషేకం -
సీతారామ కాల్వల్లో ‘గోదావరి’ పరవళ్లు
సోమ, మంగళవారాల్లో 16 గంటల పాటు ఎత్తిపోత అశ్వాపురం/ములకలపల్లి : సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాలువల్లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ ముందుకు సాగుతున్నాయి. రెండు పంప్హౌస్ల్లోనూ రెండో రోజు కూడా మోటార్లు ఆన్ చేయడంతో భారీగా దిగువకు తరలుతున్నాయి. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులోని పంప్హౌస్ –1 నుంచి ములకలపల్లి మండలం వీకే రామవరం శివారులోని పంప్హౌస్–2కు చేరుకున్నాయి. దీంతో ఇక్కడ మంగళవారం డిశ్చార్చ్ పాయింట్ వద్ద నీటిని ఎత్తిపోశారు. దీంతో 35 మిలియన్ క్యూబిక్ ఫీట్ల(ఎంసీఎఫ్టీ) నీళ్లు కమలాపురం పంప్హౌస్–3కి వదిలినట్లు ఐబీ డీఈ మోతీలాత్ తెలిపారు. మంగళవారం ఒక్కరోజే ఐదున్నర గంటలపాటు మోటార్లు నడిపించి, 30 ఎంపీఎఫ్టీల నీటికి దిగువకు మళ్లించినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. కాగా, అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలోని దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి బీజీ కొత్తూరులోని సీతారామ ప్రాజెక్ట్ ఫేస్–1 పంప్హౌస్ ద్వారా సోమవారం ఎనిమిది గంటలు, మంగళవారం ఎనిమిది గంటల పాటు గోదావరి జలాలు దిగువకు ఎత్తిపోశారు. గంటకు 5.4 ఎంసీఎఫ్టీ చొప్పున 86.4 ఎంసీఎఫ్టీ నీరు దిగువకు ఎత్తిపోశారు. బీజీకొత్తూరు, పూసుగూడెం, కమలాపురం పంప్హౌస్ల ద్వారా 100.22 కిలోమీటర్ల వద్ద ఏన్కూరు లింక్ కెనాల్ మీదుగా 8.60 కిలోమీటర్లు ప్రవహించి నాగార్జున సాగర్ కెనాల్కు తరలించనున్నారు. రైతుల్లో ఆనందం.. చండ్రుగొండ : రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కల మంగళవారం సాకారమైంది. ట్రయల్రన్లో భాగంగా అధికారులు సీతారామ ప్రాజెక్ట్ కాలువలోకి నీరు వదలగా అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాలకు గోదావరి జలాలు రావడంతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రాజాపురంలో ఆదర్శరైతు భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గోదావరి జలాలకు పూజలు చేశారు. నేడు రాజీవ్ లింక్ కెనాల్ ట్రయల్ రన్.. జూలూరుపాడు: సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మెయిన్ కెనాల్ నుంచి ఏన్కూరు ఎన్నెస్పీ కెనాల్ను అనుసంధానం చేసే రాజీవ్ లింక్ కెనాల్ వద్ద బుధవారం ట్రయల్ రన్కు ఇరిగేషన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద ఉన్న దుమ్ముగూడెం ప్రాజెక్ట్ నుంచి వంద కిలోమీటర్ల దూరాన వినోభానగర్లోని మెయిన్ కెనాల్ ద్వారా ఏన్కూరు ఎన్నెస్పీ కెనాల్కు నీటి సరఫరాకు ఈ కాల్వను నిర్మించారు. కాగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ వద్ద గోదావరి జలాలకు పూజలు నిర్వహించనున్నారు. -
ఎస్హెచ్జీ సభ్యులకు పెట్రోల్ బంక్లు..
● బ్యాంక్ రుణాలతో ఏర్పాటుకు అవకాశం ● కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెల్లడిసూపర్బజార్(కొత్తగూడెం): స్వయం సహాయక బృందాల సభ్యులు పెట్రోల్ బంక్లు నిర్వహించేలా వారికి బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కల్పించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ నుంచి పలు శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నారు. పెట్రోల్ బంకుల స్థాపనకు రహదారుల వెంట 10 కుంటల స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. సదరం సేవలను సులభతరం చేస్తూ ఇటీవల కొత్తగా యూడీఐడీ పోర్టల్ ప్రవేశపెట్టినందున దివ్యాంగులకు దీనిపై అవగాహన కల్పించాలని చెప్పారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను గుర్తించి కూల్చివేయాలని, వేసవి సెలవుల్లో నూతన భవనాలను నిర్మిస్తామని అన్నారు. పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, డీఎంహెచ్ఓ భాస్కర్నాయక్, ఆర్ఎంఓ రమేష్, మిషన్ భగీరథ ఈఈలు నళిని, తిరుమలేష్, భద్రాచలం డీఎల్పీఓ సుధీర్, సహాయ కార్మిక శాఖాధికారి ఫకృద్దీన్ పాల్గొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా రాయాలి ఇంటర్ విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కలెక్టర్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలని, తద్వారా ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కానివ్వొద్దు.. భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. మంగళవారం ఆయన స్థానిక అయ్యప్పస్వామి ఆలయం పక్కన గల ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన భూమి ఎంత, వాస్తవంగా అక్కడ ఉన్నది ఎంత అనే వివరాలు సేకరించాలని ఆర్డీఓకు సూచించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాల్సి ఉన్నందున ప్రభుత్వ భూముల వివరాలు నమోదు చేయాలన్నారు. ‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి కొత్తగూడెంఅర్బన్: ఈనెల 21న ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఐడీఓసీలో డిపార్ట్మెంటల్ అధికారులకు మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. జిల్లాలో 73 కేంద్రాల్లో 12,282 మంది రెగ్యులర్, 686 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎవరూ అలసత్వం వహించొద్దని సూచించారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు కేంద్రాల్లోకి అనుమతించవద్దని చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ వెంకటేశ్వరాచారి, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ మాధవరావు తదిరులు పాల్గొన్నారు. రైల్వే ట్రాక్ నిర్వాసితులతో సమావేశం మణుగూరు టౌన్: బీటీపీఎస్ రైల్వే ట్రాక్ నిర్వాసితులతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ మణుగూరులో మంగళవారం సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాగా తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ లేదా ఉద్యోగం లేదంటే కంపెనీ లాభాల్లో వాటా ఇవ్వాలని కోరారు. అయితే ఎక్కువ మొత్తంలో భూమి సేకరిస్తేనే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం 100 పడకల ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం సూపరింటెండెంట్ సునీల్ మజ్నేకర్ ఆస్పత్రిలోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తేగా..నివేదిక అందిస్తే ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఇటీవల మెగా కంటి వైద్యశిబిరం నిర్వహించి 1,075 మందికి కంటి ఆపరేషన్లు చేయించిన నేత్ర వైద్య సహాయకులు గంజికుంట్ల సంజీవరావును అభినందించారు. కార్యక్రమంలో వైద్యులు గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ పడవ ప్రయాణం..! మణుగూరు టౌన్ : కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం పడవ ప్రయాణం చేశారు. మణుగూరు మండలం మల్లేపల్లి వద్ద పడవ ఎక్కిన కలెక్టర్.. మధ్యలో కొంతదూరం ఇసుకలో కాలినడకన, మరి కొంతదూరం బైక్పై, ఆ తర్వాత మళ్లీ పడవలో చర్ల మండలం పెద్దిపల్లి వరకు వెళ్లారు. వీరాపురం, మొగళ్లపల్లి, చింతకుంట గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఇసుక రీచ్లను పరిశీలించారు. ఇసుక ద్వారా ఎంత ఆదాయం వస్తోందని టీఎస్ఎండీసీ, రెవెన్యూ, మైనింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట చర్ల తహసీల్దార్ శ్రీనివాస్, మైనింగ్ శాఖ అధికారి దినేష్ తదితరులు ఉన్నారు. -
చెక్కు బౌన్స్ కేసు కొట్టివేత
భద్రాచలంఅర్బన్: సారపాకకు చెందిన చల్లపల్లి నాగేశ్వరరావు వరంగల్కు చెందిన కొత్త ఇందిర రూ.20 లక్షలు ఇవ్వాలని 2017లో భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో చెక్ బౌన్స్ కేసు వేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన భద్రాచలం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి వి.శివనాయక్ మంగళవారం కేసును కొట్టి వేశారు. కొత్త ఇందిర తరఫున ముత్యాల కిశోర్, దాసరి కవిత వాధించారు. కేసు నమోదు పాల్వంచ: చిట్టి డబ్బులు ఇవ్వలేదని దాడి చేసిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని ఇందిరాకాలనీకి చెందిన చింతలచెర్వు కోటేశ్వరరావు భార్య వాణి పండ్ల వ్యాపారం చేస్తోంది. వాసాల గోవర్ధని వద్ద వారం వారం చిట్టీ డబ్బులు కడుతోంది. ఇటీవల డబ్బులు కట్టక పోవడంతో గోవర్ధని, వాసాల శ్రీనివాస్, సరిత కలిసి వాణి ఇంటికి వెళ్లి డబ్బులు అడిగారు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరగడంతో దాడికి పాల్పడ్డారు. వాణి ఫిర్యాదు మేరకు మంగళవారం ఎస్ఐ రాఘవయ్య ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం భద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఇందిరా మార్కెట్లో నివాసం ఉండే కొణిజర్ల సత్యనారాయణమూర్తికి చెందిన ఇంట్లో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పంటుకుంది. ఇంట్లో ఉన్న సామగ్రి, పొలం ధ్రువపత్రాలు, బంగారం, నగదు, స్టడీ సర్టిఫికెట్లతో పాటు ఇతర పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రూ.3 లక్షల ఆస్టినష్టం జరిగినట్లు ఇంటి యజమాని సత్యనారాయణ తెలిపారు. భార్యపై భర్త కత్తితో దాడిపాల్వంచ: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త కత్తితో దాడి చేయడంతో తీవ్రగాయమైంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని బొల్లేరుగూడెం ఏరియా వర్తక సంఘం భవన్ దగ్గర రేగా రవీందర్, లక్ష్మీ ఏడాదిగా నివాసం ఉంటున్నారు. దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం మద్యం తాగేందుకు రవీందర్ లక్ష్మిని అడగగా ఆమె నిరాకరించింది. దీంతో మరోమారు గొడవ జరగగా.. రవీందర్ లక్ష్మిని కత్తితో కడుపులో పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. కాగా రవీందర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలి సోదరి లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాఘవయ్య తెలిపారు. -
లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై కేసు
పాల్వంచరూరల్: లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పాతసూరారం గ్రామానికి చెందిన భూక్యా అశోక్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని, గత నెలలో ఇంటి గోడదూకి వచ్చాడని భూక్యా అరుణ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అశోక్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. లారీడ్రైవర్పై.. మండలంలోని పెద్దమ్మగుడి వద్ద బీసీయం జాతీయ రహదారిపై పాల్వంచవైపు వస్తున్న కారును ఈ నెల 2వ తేదీన వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. కారు వెనుక భాగం దెబ్బతిన్నదని కారుడ్రైవర్ హన్మంతరావు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు లారీడ్రైవర్ గుగులోత్ రమేశ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. -
వసతి గృహాల్లో పరిశుభ్రత పాటించండి
చండ్రుగొండ : వసతిగృహాల్లో పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి అధికారులకు సూచించారు. స్థానిక కస్తూర్బా విద్యాలయం, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, ఎస్సీ బాలుర వసతిగృహాలను మంగళవారం ఆమె సందర్శించారు. వసతిగృహాల్లో విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టకుంటే సహించేది లేదని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అశ్రమ పాఠశాలల్లో మరుగుదొడ్లు సరిపడా లేవని బాలికలు ఫిర్యాదు చేయగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ నిరంజన్రావు, సీనియర్ న్యాయవాది మెండు రాజమల్లు పాల్గొన్నారు. ట్రాన్స్జెండర్లు గౌరవంగా జీవించాలికొత్తగూడెంటౌన్: ట్రాన్స్జెండర్లు గౌరవప్రదంగా జీవించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భానుమతి అన్నారు. మంగళవారం కొత్తగూడెం హనుమాన్బస్తీలో వారికి ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని, వివిధ పరిస్థితుల కారణంగా ట్రాన్స్జెండర్లుగా, సెక్స్ వర్కర్లుగా మారిన వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రతీ నెల బియ్యం పంపిణీ చేసేలా చూడాలని సెక్యూర్ ఎన్జీఓ ప్రాజెక్టు మేనేజర్ రాజేంద్రప్రసాద్ను అదేశించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భానుమతి -
పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
● జిల్లాలోని 36 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ● ఐదు నిమిషాల వెసులుబాటుతో విద్యార్థుల్లో ఆనందం ● హాజరుకానున్న 19,228 మంది ● పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు కొత్తగూడెంఅర్బన్: ఇంటర్ పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి జరిగే ఈ పరీక్షలకు జిల్లాలో 36 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 9,225 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 10,003 మంది.. మొత్తం 19,228 విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా 8.30 గంటల వరకే కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు. అయితే ఈ ఏడాది పరీక్ష సమయం ముగిసిన ఐదు నిమిషాల వరకు కూడా అనుమతిస్తామని రాష్ట్రస్థాయి అధికారులు ప్రకటించడంతో విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కొత్తగూడెంలోని ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ఈ సంవత్సరం కొత్తగా పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 36 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 13 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, 36 మంది డిపార్ట్మెంటల్ అధికారులతో పాటు మూడు సిట్టింగ్, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, కస్టోడియన్ అధికారులు ఐదుగురు, 550 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు అధికారులు వెల్లడించారు. కేంద్రాల వద్ద విద్యార్థులకు వైద్య సహాయం అందించేందుకు 72 మంది ఏఎన్ఎంలను నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. కేంద్రాల్లో వసతుల కల్పన.. ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీటి వసతి కల్పించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సిబ్బంది ఏర్పాట్లు చేశారు. కళాశాలల సిబ్బంది మంగళవారమే పరీక్ష కేంద్రాల్లో హాల్టికెట్ నంబర్లు వేశారు. విధులు కేటాయించిన సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఆయా సెంటర్లలో రిపోర్ట్ చేశారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పరీక్ష రాసే గదుల్లో ఫ్యాన్లు, సరిపడా వెలుతురు ఉండేలా లైట్లు ఏర్పాటు చేశారు. సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపించనున్నారు. ఇంకా వైద్యారోగ్య, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సేవలు అందించనున్నారు. ఆయా కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు సిద్ధం చేశారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్షల సమయంలో సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు చేపడుతున్నారు. -
నేత్రపర్వం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. కృషి, పట్టుదల ఉంటే విజయం సాధ్యంనిట్ ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి పాల్వంచరూరల్ : కృషి, పట్టుదల, అంకుఠిత దీక్ష ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించొచ్చని వరంగల్ నిట్ ప్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి అన్నారు. లక్ష్మీదేవిపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం తెలంగాణ అకాడమీ సైన్సెస్, జన విజ్ఞాన వేదిక అధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో ఆయిన మాట్లాడారు. కొందరు సామాన్య కుటుంబాల నుంచి వచ్చినా ఉన్నతంగా నిలుస్తారని, వారిలో ఉంటే పట్టుదలే దానికి కారణమని అన్నారు. ప్రిన్సిపాల్ పద్మ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక యుగంలోనూ కొందరు మూఢ నమ్మకాలతో జీవిస్తున్నారని, అలాంటి వారికి విద్యార్థులు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేవీవీ ఉపాధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వరరావు, లెక్చరర్ రాజ్యలక్ష్మి, కేజీబీవీ వైస్ ప్రిన్సిపాల్ జె.మాధవి, విజయప్రసాద్, అరుణకుమారి, డి.రమేష్, కొండల్రావు, స్వరూపారాణి, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అందుబాటులోకి డీసీసీబీ క్యూఆర్ కోడ్ సేవలు
ఖమ్మంవ్యవసాయం: ఖాతాదారులు, వినియోగదారుల సౌకర్యార్థం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) క్యూఆర్(క్విక్ రెస్పాన్స్) కోడ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సేవలను మంగళవారం ఖమ్మంలోని ప్రధాన కార్యాలయంలో చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు. బ్యాంకు ప్రణాళిక, అభివృద్ధి విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ విభాగం ద్వారా సదుపాయాల కల్పన, అవసరమైన సేవలను ప్రవేశపెడతామని.. ఇందులో భాగంగానే క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. నగదు రహిత విధానాన్ని ప్రోత్సహించేలా అమలుచేస్తున్న ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాలకవర్గ సభ్యులు, సీఈఓ ఎన్.వెంకటఆదిత్య, అధికారులు పాల్గొన్నారు. -
నేటి నుంచి పగిడిద్దరాజు జాతర
గుండాల: మేడారం సమ్మక్క భర్త, అరెం వంశీయుల ఇలవేల్పు పగిడిద్దరాజు జాతర మండలంలోని యాపలగడ్డ గ్రామంలో బుధవారం ప్రారంభం కానుంది. మేడారం జాతర అనంతరం ఇక్కడ సమ్మక్క – పగిడిద్దరాజుల నాగవెల్లి జాతర నిర్వహించడం ఆనవాయితీ. నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే జాతరకు గ్రామ సమీపంలోని గద్దెల వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. తొలిరోజు పగిడిద్దరాజును వనం(గుట్ట) నుంచి గుడికి తీసుకొచ్చి, రాత్రి ఎదురిల్లుట చేస్తారు. గురువారం వన దేవతను గుట్ట నుంచి తీసుకొస్తారు. దీంతో జాతర ప్రారంభమవుతుంది. పలు కార్యక్రమాల అనంతరం శనివారం ఉదయం దేవతలను గుట్టకు సాగనంపడంతో జాతర ముగుస్తుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, ములుగు జిల్లాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. కాగా, పగిడిద్ద రాజు జాతరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో పాటు పినపాక, భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణను ప్రత్యేకంగా ఆహ్వానించారు. -
మెరుగైన సేవలకే ‘పొలం బాట’
సూపర్బజార్(కొత్తగూడెం): రైతులకు మెరుగైన, ఉత్తమ సేవలు అందించేందుకే పొలం బాట కార్యక్రమంతో తమ శాఖ అధికారులు నేరుగా వ్యవసాయ క్షేత్రాలను సందర్శిస్తున్నారని విద్యుత్ ఎస్ఈ జి.మహేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్కిల్ పరిధిలో ఇప్పటి వరకు 137 పొలంబాట కార్యక్రమాలు నిర్వహించామని, ఒరిగిన స్తంభాలు 1,396, 1,047 లూజ్లైన్లు, 874 మధ్య స్తంభాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులకు గురి కాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. మోటార్లకు కెపాసిటర్లు పెట్టుకునేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కెపాసిటర్లు అమర్చడం ద్వారా మోటార్లు మరింతకాలం మన్నికగా ఉంటాయని తెలిపారు. లో ఓల్టేజీ సమస్య కూడా ఉండదన్నారు. ఆటోస్టార్టర్లు కూడా తొలగించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ప్రమాదాలు లేకుండా చూడడమే లక్ష్యంగా సర్కిల్ పరిధిలో డీఈ, టెక్నికల్ అధికారులను సేఫ్టీ అధికారులుగా నియమించామని తెలిపారు. విద్యుత్ ప్రమాదాల నివారణపై విస్తృత ప్రచారం చేసి రైతులను చైతన్యం చేస్తున్నామని వివరించారు. రైతులు, వినియోగదారులు సొంతంగా విద్యుత్ పనులు చేయకూడదని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా 1912 టోల్ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. విద్యుత్ ఎస్ఈ మహేందర్ -
మహిళా ఉద్యోగులకు క్రీడాపోటీలు
సింగరేణి(కొత్తగూడెం): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తించే మహిళా ఉద్యోగులకు మంగళవారం ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను జీఎం పర్సనల్(ఐఆర్పీఎం) కవితానాయుడు ప్రారంభించి మాట్లాడుతూ మహిళలు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించగా విజేతలకు ఈనెల 8న బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్లు పి.కిరణ్మయి, బి.సుమలత, డి.శారద, కె.రమ, ఎ.విజయకుమారి, జీ.బీ.అరుణకుమారి, కె.శైలజ, ఎన్.గౌతమి, బి.మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
బియ్యం దందాను ఆపేదెవరు?
సూత్రధారులు ఎవరు? తెలంగాణ నుంచి కాకినాడ షిప్యార్డుకు అక్రమంగా చేర్చిన బియ్యాన్ని అక్కడి డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ గుర్తించి ‘సీజ్ ద షిప్’ అని చెప్పడం.. ఆతర్వాత పరిణామాలూ అందరికీ తెలిసిందే. అలాగే, అశ్వారావుపేటలో ఆ స్థాయిలో హంగామా లేకున్నా విడతల వారీగా లారీల సీజ్ జరుగుతోంది. కొన్నాళ్లకు అంతా సవ్యంగానే సాగుతోందని చెబుతున్నారు. అయితే, దందాకు సూత్రధారులెవరు, అక్రమ రవాణాకు సులభ దారులు ఏమిటనే అంశాలను గత కేసులను ఆధారంగా పోలీసులు, ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై సివిల్ సప్లయీస్ డీటీ గుర్రం ప్రభాకర్ను వివరణ కోరగా లారీలను తనిఖీ చేసే అధికారం తమకు ఉందని తెలిపారు. కానీ శాశ్వత చెక్పోస్టు ఏర్పాటు అంశంలో ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు.అశ్వారావుపేట: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అశ్వారావుపేట మీదుగా ఆంధ్రాకు బియ్యం తరలించే వారి దందా అప్పుడప్పుడే వెలుగులోకి వస్తోంది. రేషన్, లెవీ, సీఎంఆర్ బియ్యం ఇలా ప్రభుత్వ ఆధీనంలో ఉండే పలు రకాల బియ్యం అశ్వారావుపేట మీదుగా అక్రమంగా రవాణా చేస్తుండగా, విజిలెన్స్ అధికారులు ఎవరైనా ఫిర్యాదు చేస్తేనో.. వారికి తీరిక ఉన్నప్పుడు మాత్రమే తనిఖీలు చేపడుతున్నారు. ఈ సమయాన లారీలు పట్ట్టుబడుతుండగా మిగతా సమయాల్లో స్థానిక సివిల్ సప్లయీస్ అధికారుల తనిఖీలు లేక అక్రమార్కులు యథేచ్ఛగా బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నారు. గతంలో మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన మిల్లర్ల మధ్య ఐక్యత లోపించి ఒకరికి చెందిన బియ్యం లారీలను అశ్వారావుపేట పోలీసులు, విజిలెన్స్ అధికారులకు పట్టించారు. ఆ తర్వాత మరోమారు ఇలాగే జరిగింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సరే అక్రమ మార్గాల్లో సేకరించిన బియ్యాన్ని అశ్వారావుపేట మీదుగానే సరిహద్దు దాటించాల్సి ఉంటుంది. కానీ విజిలెన్స్ అధికారులు మాత్రమే దాడులు చేస్తుండగా, సివిల్ సప్లయీస్ అధికారులు సరిహద్దులో చెక్పోస్టు ఎందుకు ఏర్పాటు చేయడం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడప్పుడే తనిఖీలు గడిచిన పదిహేనేళ్లలో ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం కొలువుదీరినప్పుడు ఈ తరహా తనిఖీలు జరుగుతున్నాయి. అక్రమంగా రవాణా అవుతున్న బియ్యం లారీలను అడ్డుకునే క్రమాన మొదటి మూడు, నాలుగు లారీలకు సరైన పత్రాలు లేవని చెప్పడం.. మిగతా లారీలను వదిలేయడం షరామామూలుగా మారింది. లారీల యజమానులు చెప్పిన మాట వినడం తప్ప స్థానిక అధికారులు, పోలీసులు ఎటూ తేల్చుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. లారీల యజమానులు, మిల్లర్లు, అధికారులు ఇలా మూడు నెట్వర్క్ల మధ్య అంతా సవ్యంగా ఉంటే సరి.. ఎక్కడైనా తేడా వచ్చినప్పుడు అశ్వారావుపేట దాటకముందే లారీలు పట్టుబడుతున్నాయని చెబుతున్నారు. అయితే, లారీలను సీజ్ చేసిన సమయాన తప్ప మిగతా సమయంలో అక్రమ రవాణా జరగడం లేదా అంటే ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. అయితే, అశ్వారావుపేటలో మాత్రమే బియ్యం లారీలను సీజ్ చేస్తుండగా వందల కి.మీ. దాటి వచ్చ క్రమాన ఎందుకు తనిఖీలు చేయడం లేదో అధికారులే చెప్పాలి ఉంటుంది. గత శుక్రవారం అశ్వారావుపేటలో విజిలెన్స్ అధికారులు 12 లారీలను ఆపి పోలీసులకు అప్పగించారు. ఈ తర్వాత పత్రాలన్నీ సరిగ్గా ఉన్నాయని తొమ్మిది లారీలను పంపించి, కేవలం మూడు లారీలనే సీజ్ చేయడం గమనార్హం. విడతల వారీగా విజిలెన్స్ దాడులు సాధారణ తనిఖీల లేక అక్రమార్కుల ఇష్టారాజ్యం చెక్పోస్ట్ ఏర్పాటు చేస్తేనే ఫలితం -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పట్టణంలో సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన తానీషా కల్యాణ మండంలోని డార్మిటరీలో ఉన్న బాత్రూమ్లో మంగళవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. టౌన్ ఎస్ఐ రామకృష్ణ కథనం ప్రకారం.. కల్యాణ మండపం సిబ్బంది సమాచారంతో సుమారు 45 ఏళ్ల వయసు ఉన్న ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చామనఛాయ రంగు, నలుపు రంగు నిక్కరు ధరించి ఉన్నాడు. అతని వద్ద ఓ లగేజీ బ్యాగ్ కూడా ఉంది. మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. ఎవరైనా గుర్తిస్తే భద్రాచలం స్థానిక పోలీస్ స్టేషన్లో 87126 86107 నంబర్లో సంప్రదించాలని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. -
ఎర్రచందనం చెట్లు నరికివేత
ఇల్లెందురూరల్: మండలంలోని కొమరారం శివారులో మంచె రమేశ్కు చెందిన 20 ఎర్రచందనం చెట్లను ట్రాన్స్కో అధికారులు మంగళవారం నరికివేశారు. కొమరారం సబ్స్టేషన్ నుంచి హెచ్టీ లైన్ కింది భాగంలో ఏపుగా పెరిగిన చెట్లను రెండు రోజులుగా ట్రాన్స్కో అధికారులు తొలగించే పనులు చేపట్టారు. ఈ క్రమంలో ఎర్రచందనం చెట్లు విద్యుత్ తీగలకు కింది భాగంలో ఉండటంతో రెండు వరుసలలో 20 చెట్లను పూర్తిగా నరికివేశారు. ఇదిలాఉండగా తాము మొక్కలు నాటిన తరువాతే ట్రాన్స్కో అధికారులు విద్యుత్ లైన్ వేశారని, గతంలో తీగల కింద భాగంలో చెట్లు నరికే క్రమంలో నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకునేవారని, ప్రస్తుతం చెట్లను పూర్తిగా తొలగించి తమకు భారీ నష్టం చేశారని రైతు రమేశ్ వాపోయాడు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరాడు. ఇదే విషయమై ట్రాన్స్కో ఏడీఈ కోటేశ్వరరావును వివరణ కోరగా.. నిబంధనలకు లోబడి విద్యుత్ సరఫరాలో అవాంతరాలను అధిగమించేందుకు హెచ్టీ లైన్ కింది భాగంలో ఉన్న చెట్లను తొలగించామని చెప్పారు. -
అక్రమ భవన నిర్మాణదారులకు నోటీసులు
చర్ల: మండలంలోని దానవాయిపేటలోని ఫారెస్టు భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న భవన నిర్మాణానికి సంబంధించి మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి ద్వాలియా కథనం ప్రకారం.. దానవాయిపేట శివారులోని ఫారెస్టు భూమిలో కొంత కాలంగా ఒక నిర్మాణం కొనసాగుతోంది. ఈ విషయమై గతంలో పనులు నిలిపివేయాలని హెచ్చిరంచినప్పటికీ వారు పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తుండటంతో ఉన్నతాధికారులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసి నిర్మాణం చేస్తున్న వారికి నోటీసులు జారీ చేసినట్లు రేంజ్ అధికారి తెలిపారు. ఇరవెండి ఎఫ్బీఓపై సస్పెన్షన్ వేటు బూర్గంపాడు: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంతో బూర్గంపాడు మండలంలోని ఇరవెండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్పతిని అటవీశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇరవెండి ఫారెస్ట్ బీట్లో అటవీ భూమి అన్యాక్రాంతమైందనే ఆరోపణలతో ఆయనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఇటీవల జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణగౌడ్ ఇరవెండి ఫారెస్ట్ బీట్ను పరిశీలించారు. పోడు నరికినప్రాంతాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. విధు ల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంతో బీట్ ఆఫీసర్ను సస్పెండ్ చేశారు. -
కమలాపురంలో ఎత్తిపోశాయి !
ములకలపల్లి : మండల పరిధిలోని కమలాపురం సీతారామ పంప్హౌస్– 3 నుంచి గోదావరి జలాలు దిగువకు తరలాయి. ఇక్కడి మోటార్ ద్వారా నీళ్లు ఎత్తిపోయగా, గ్రావిటీ ద్వారా ఏన్కూర్ లింక్ కెనాల్కు తరలివెళ్లాయి. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో నీటి పారుదల శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగింది. మంగళవారం సాయంత్రంలోగా గోదారి నీళ్లను సాగర్ కాల్వలో కలుపుతామని మంత్రి తుమ్మల ప్రకటించిన నేపథ్యంలో అధికారులు యుద్ధప్రాతిపదికన నీటి తరలింపుపై ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తెలుస్తోంది. గత ఆగస్టు 15న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇక్కడ మోటార్లను ప్రారంభించగా, ఆరు నెలల్లోనే నీళ్లు ఎత్తిపోయడం విశేషం. -
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
భద్రాచలం: ప్రభుత్వ సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏలో ఏర్పాటు చేసిన గిరిజన దర్బార్లో ఆయన ఆర్జీలు స్వీకరించారు. వాటిని సంబంధిత అఽఽధికారులకు అందజేసి అర్హతల మేరకు పరిష్కరించాలని సూచించారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు యూనిట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లక్ష్య సాధనకు కృషి చేయాలి.. దుమ్ముగూడెం : గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు.. లక్ష్యాలు ఏర్పాటుచేసుకుని వాటి సాధనకు కృషి చేయాలని పీఓ రాహుల్ అన్నారు. సోమవారం ఆయన రామచంద్రునిపేట బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు ఇప్పటి నుంచే కెరీర్ గైడెన్స్పై అవగాహన పెంచుకోవాలన్నారు. బాలబాలికల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారిలో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. తాను చదువుకునే రోజుల్లో పైలెట్ కావాలని అనుకునేవాడినని, కానీ ఎనిమిదో తరగతి చదివే రోజుల్లో ఓ ఐఏఎస్ అధికారి తమ పాఠశాలకు రాగా, ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఐఏఎస్ కావాలని అనుకున్నానని, ఆ మేరకు లక్ష్యాన్ని సాధించానని వివరించారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, డీడీ మణెమ్మ, ఎస్డీసీ రవీంద్రనాథ్, ఏఓ సున్నం రాంబాబు, ఏసీఎంఓ రమణయ్య, ఏటీడీఓ అశోక్ కుమార్, ఎంఈఓ సమ్మయ్య, తహసీల్దార్ అశోక్ కుమార్, ఎంపీడీవో రామకృష్ణ, హెచ్ఎంలు నరసింహారావు, బట్టు రాములు, సోమశేఖర్, నరేందర్, సర్వేశ్వర దొర, వ్యవసాయ శాఖ ఏడీ భాస్కరన్, ఐటీడీఏ ఈఈ చంద్రశేఖర్, ఏపీఓ వేణు, లక్ష్మీనారాయణ, కొండరెడ్ల విభాగం అధికారి మనిధర్, ఎఫ్డీసీ ఉదయ్కుమార్ పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
ఎండలు ‘మండే’
● మార్చిలోనే భగ్గుమంటున్న సూర్యుడు ● 40 డిగ్రీలకు చేరువైన పగటి ఉష్ణోగ్రతలు ● బొగ్గు గనుల ప్రాంతాల్లో మరింతగా వేడి.. చుంచుపల్లి: మార్చి ఆరంభంలోనే భానుడు భగ్గుమంటున్నాడు. జిల్లాలో రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సోమవారం ఏకంగా 39.7 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం పట్టణాల్లో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులు, కూడళ్లు ఎండల ప్రభావంతో మధ్యాహ్నం కొంతమేర నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. వివిధ అవసరాల కోసం బయటకు వచ్చే వారు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత మూడు రోజులుగా ఉదయం పది గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. జిల్లాలో శని, ఆది, సోమవారాల్లో 37 నుంచి 39.7 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే అదనంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లా అంతటా ఎండవేడిమి, ఉక్కపోతతో ప్రజలు ఇప్పటి నుంచే ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బొగ్గు గనులకు కేంద్రంగా ఉన్న కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, ప్రాంతాల్లో మూడు రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. 40 డిగ్రీలకు చేరువలో.. జిల్లాలో మూడు రోజులుగా పగలంతా ఎండలు పెరుగుతున్నాయి. రాత్రి పూట కాసింత చలి పెడుతున్నా పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. మార్చి నెలాఖరులో పెరగాల్సిన ఎండలు ఈసారి ముందుగానే ముదరడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అటు మూడు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 20, 21 డిగ్రీల చొప్పున నమోదవుతున్నాయి. దీని ఫలితంగా గాలిలోని తేమశాతంలో తేడాలు వస్తున్నాయని వాతావరణశాఖ నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పగలు ఎండ మండిపోతుండగా, రాత్రి నుంచి తెల్లవారే వరకు వాతావరణం కొంత చల్లగా ఉంటుందని చెబుతున్నారు. ఈసారి వేసవి ఆరంభంలోనే అదిరిపోయేలా ఎండలు కాస్తుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఇదే విధంగా ఎండలు పెరిగితే మరో రెండు రోజుల్లో 40 డిగ్రీలకు పగటి ఉష్ణోగ్రతలు చేరువయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. పెరుగుతున్న ఎండల దృష్ట్యా వృద్ధులు, పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
భద్రాచలం: ప్రభుత్వ సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏలో ఏర్పాటు చేసిన గిరిజన దర్బార్లో ఆయన ఆర్జీలు స్వీకరించారు. వాటిని సంబంధిత అఽఽధికారులకు అందజేసి అర్హతల మేరకు పరిష్కరించాలని సూచించారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు యూనిట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లక్ష్య సాధనకు కృషి చేయాలి.. దుమ్ముగూడెం : గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు.. లక్ష్యాలు ఏర్పాటుచేసుకుని వాటి సాధనకు కృషి చేయాలని పీఓ రాహుల్ అన్నారు. సోమవారం ఆయన రామచంద్రునిపేట బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు ఇప్పటి నుంచే కెరీర్ గైడెన్స్పై అవగాహన పెంచుకోవాలన్నారు. బాలబాలికల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారిలో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. తాను చదువుకునే రోజుల్లో పైలెట్ కావాలని అనుకునేవాడినని, కానీ ఎనిమిదో తరగతి చదివే రోజుల్లో ఓ ఐఏఎస్ అధికారి తమ పాఠశాలకు రాగా, ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఐఏఎస్ కావాలని అనుకున్నానని, ఆ మేరకు లక్ష్యాన్ని సాధించానని వివరించారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, డీడీ మణెమ్మ, ఎస్డీసీ రవీంద్రనాథ్, ఏఓ సున్నం రాంబాబు, ఏసీఎంఓ రమణయ్య, ఏటీడీఓ అశోక్ కుమార్, ఎంఈఓ సమ్మయ్య, తహసీల్దార్ అశోక్ కుమార్, ఎంపీడీవో రామకృష్ణ, హెచ్ఎంలు నరసింహారావు, బట్టు రాములు, సోమశేఖర్, నరేందర్, సర్వేశ్వర దొర, వ్యవసాయ శాఖ ఏడీ భాస్కరన్, ఐటీడీఏ ఈఈ చంద్రశేఖర్, ఏపీఓ వేణు, లక్ష్మీనారాయణ, కొండరెడ్ల విభాగం అధికారి మనిధర్, ఎఫ్డీసీ ఉదయ్కుమార్ పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. హైకోర్టు ఏజీపీగా భద్రాచలం వాసిభద్రాచలం: రాష్ట్ర హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా భద్రాచలానికి చెందిన సాల్మన్ రాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాచలం బార్ అసోసియేషన్లో సీనియర్ న్యాయవాదిగా సాల్మన్ రాజ్ పనిచేశారు. భద్రాచలం మొబైల్ కోర్టులో ఆరేళ్ల పాటు ఏజీపీగా పని చేసిన అనుభవం ఉంది. కాగా సాల్మన్రాజ్ను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోట దేవదానం తదితరులు అభినందించారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి ఖమ్మం సహకారనగర్: 2024–డీఎస్సీలో ఎంపికై న ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకుని బోధన మెరుగుపర్చుకోవాలని పాఠశాల విద్యాశాఖ వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణ సూచించారు. ఖమ్మం ఎన్నెస్సీ కాలనీ పాఠశాలలో ఎస్జీటీలకు ఇస్తున్న శిక్షణను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రతీ సబ్జెక్టులో కనీస అభ్యసన సామర్థ్యాలు పెరిగేలా బోధన జరగాలని, తద్వారా ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం పెరుగుతుందని చెప్పారు. తొలుత ఎన్నెస్సీ కాలనీలో ఎఫ్ఎల్ఎన్ తీరు, డైట్ కళాశాలలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. విద్యాశాఖ ఏఎంఓ రవికుమార్, డీఈఓ సోమశేఖరశర్మ, ఖమ్మం అర్బన్ ఎంఈఓ శైలజాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కమలాపురంలో ఎత్తిపోశాయి !
ములకలపల్లి : మండల పరిధిలోని కమలాపురం సీతారామ పంప్హౌస్– 3 నుంచి గోదావరి జలాలు దిగువకు తరలాయి. ఇక్కడి మోటార్ ద్వారా నీళ్లు ఎత్తిపోయగా, గ్రావిటీ ద్వారా ఏన్కూర్ లింక్ కెనాల్కు తరలివెళ్లాయి. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో నీటి పారుదల శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగింది. మంగళవారం సాయంత్రంలోగా గోదారి నీళ్లను సాగర్ కాల్వలో కలుపుతామని మంత్రి తుమ్మల ప్రకటించిన నేపథ్యంలో అధికారులు యుద్ధప్రాతిపదికన నీటి తరలింపుపై ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తెలుస్తోంది. గత ఆగస్టు 15న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇక్కడ మోటార్లను ప్రారంభించగా, ఆరు నెలల్లోనే నీళ్లు ఎత్తిపోయడం విశేషం. -
నైనీ.. మళ్లీ నిరాశే
నివేదికలకే పరిమితం.. రెండో దశ పర్యావరణ అనుమతులు వస్తేనే బొగ్గు ఉత్పత్తి ప్రారంభించడం సాధ్యం అవుతుంది. 2021లో మొదటి దశ అనుమతులు రావడంతో 2022 – 23 ఆర్థిక సంవత్సరం నుంచే సాలీనా పది మిలియన్ టన్నుల బొగ్గును నైనీ బ్లాక్ నుంచి ఉత్పత్తి చేస్తామని సింగరేణి సంస్థ తన నివేదికల్లో పేర్కొంటోంది. కానీ మూడు ఆర్థిక సంవత్సరాలు గడిచినప్పటికీ రెండో దశ పర్యావరణ అనుమతులే రాలేదు. దీంతో ఇక్కడి నుంచి ఒక్క బొగ్గు పెళ్లను కూడా తవ్వి తీయలేకపోయింది. ఇక్కడ బొగ్గు తవ్వకాలు మొదలైతే ఆ తర్వాత దశలో థర్మల్ పవర్ ప్లాంట్ను కూడా సింగరేణి ప్రాంరభించాల్సి ఉంటుంది. కానీ ఈ పనులన్నీ జరిగేందుకు ఇంకా ఎంత సమయం పడుతుందో అనేదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. నైనీతో పాటు గడిచిన మూడేళ్లుగా గోలేటి, రొంపేడు, వీకే మెగా ఓపెన్ కాస్ట్ల ద్వారా బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తామని సింగరేణి చెబుతూ వస్తోంది. కానీ ఈ గనుల పరిస్థితి కూడా నైనీ తరహాలోనే ఉంది. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తక్కువ ఖర్చుతో ఎక్కువ బొగ్గు తవ్వి తీసేందుకు అవకాశం ఉన్న నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి చేయడంలో ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు.. అన్నట్టుగా ఉంది సింగరేణి పరిస్థితి. బ్లాక్ దక్కించుకుని పదేళ్లు దాటినా ఇప్పటికీ అక్కడ బొగ్గు ఉత్పత్తి ప్రారంభమే కాలేదు. తెలంగాణేతర ప్రాంతంలో.. తెలంగాణ బయట తొలిసారిగా బొగ్గు తవ్వకాలకు సింగరేణి సిద్ధమైంది. ఈ క్రమంలో ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఉన్న నైనీ కోల్బ్లాక్ను పిట్ హెడ్ మైన్గా 2015లో సింగరేణికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే పదేళ్లు గడిచినా ఇక్కడ బొగ్గు తవ్వకాలు ఇప్పటికీ మొదలు కాలేదు. నైనీ బ్లాక్కు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించడానికే సింగరేణికి నాలుగేళ్ల సమయం పట్టింది. ఆ తర్వాత పర్యావరణ అనుమతుల కోసం ప్రయత్నించేలోగా కరోనా విపత్తు వచ్చి పడింది. ఎట్టకేలకు 2021 అక్టోబర్లో తొలిదశ పర్యావరణ అనుమతులు వచ్చాయి. ఇక కీలకమైన రెండో దశ పర్యావరణ అనుమతులు రావడమే తరువాయి అనే పరిస్థితి అప్పట్లో కనిపించింది. అటవీ శాఖ క్లియరెన్స్.. నైనీ బ్లాక్ కోసం మొత్తంగా 912 హెక్టార్ల స్థలం సేకరించాల్సి ఉండగా ఇందులో అటవీ శాఖ పరిధిలోనే 783 హెక్టార్లు ఉంది. ఇందులో రిజర్వ్ ఫారెస్టుకు సంబంధించిన స్థలం 643 హెక్టార్లు ఉంది. పైగా ఈ స్థలంలో ఎలిఫెంట్ కారిడార్ కూడా ఉండడంతో రెండో దశ అనుమతుల సాధన సంక్లిష్టంగా మారింది. దీనికి తోడు గత ప్రభుత్వం సరైన స్థాయిలో శ్రద్ధ చూపించలేదనే విమర్శలు వచ్చాయి. దానికి తగ్గట్టే మూడున్నరేళ్లు దాటినా ఇప్పటికీ రెండో దశ అనుమతులు మంజూరు కాలేదు. ఏడాది దాటినా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నైనీ బ్లాక్పై దృష్టి సారించారు. సింగరేణి ఉన్నతాధికారులు, సీఎండీ బలరాంనాయక్తో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం రంగంలోకి దిగారు. నేరుగా ఒడిశా సీఎం, సీఎస్లతో చర్చలు జరిపారు. బొగ్గు తవ్వకాలతో అడవిలో నష్టపోయే చెట్లను గుర్తించడంతో పాటు అందుకు తగిన నష్టపరిహారం అంచనా వేసేందుకు చర్యలు ముమ్మరం చేస్తామని గతేడాది ఆగస్టులో ఒడిశా సర్కారు హామీ ఇచ్చింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చినా ఇప్పటికీ ఆ పని పూర్తి కాలేదు. పదేళ్లుగా సాగుతున్న నైనీ బ్లాక్ వ్యవహారం రెండోదశ పర్యావరణ అనుమతుల్లో జాప్యం ఉత్పత్తి చేస్తామంటూ మూడేళ్లుగా చెబుతున్న సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరంలోనూ కనిపించని పురోగతి -
14 మంది మావోయిస్టుల లొంగుబాటు
కొత్తగూడెంఅర్బన్ : మావోయిస్టు పార్టీకి చెందిన 14 మంది సభ్యులు లొంగిపోయారని ఎస్పీ రోహిత్రాజ్ తెలిపారు. హేమచంద్రాపురం పోలీసు హెడ్క్వార్టర్స్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకుని, తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకుని వీరంతా లొంగిపోయారని వివరించారు. వారిలో బీజాపూర్ జిల్లా మంగలతొరు గ్రామానికి చెందిన ఎర్రవల్లి ఆర్పీసీ మిలీషియా కమాండెర్ మడివి భీమా, ఎర్రవల్లి ఆర్పీసీ సీఎన్ఎం అధ్యక్షుడు బోడి ఉంగా, మడివి అడుమ, డీఏకేఎం సభ్యులు కుంజల కోసా, కిష్టారం ఏరియా సీఎన్ఎం కమాండర్ కోవాసి నంద, సీఎన్ఎం సభ్యుడు మడివి భీమా, మడివి మాసా, బీజాపూర్ జిల్లా దొడ్డి తుమ్నర్ గ్రామానికి చెందిన టైలరింగ్ టీం కమాండర్ కుంజా లక్మా, ఆర్పీసీ సభ్యురాలు వెట్టి లక్కే, మిలీషియా సభ్యులు మడవి చుక్కయ్య, వెట్టి కోసా, మడవి భీమా, సోడి రాధికా, కుహ్రామి కాజల్ ఉన్నారని వివరించారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న వలస ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వీరంతా లొంగిపోయారని, ప్రభుత్వం కల్పించే పథకాలతో లబ్ధి పొందాలని, కుటుంబ సభ్యులతో కలిసి జీవనం గడపాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఈ రెండు నెలల్లోనే 44 మంది మావోయిస్టులు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారని చెప్పారు. లొంగిపోయి సాధారణ జీవనం గడపాలనుకునే పార్టీ సభ్యులు వారి కుటుంబ సభ్యుల ద్వారా లేదా స్వయంగా సమీప పోలీస్స్టేషన్, లేదా జిల్లా ఉన్నతాధికారులను కానీ సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన దళ సభ్యులకు జీవనోపాధి, పునరావాసానికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలు అందించేందుకు పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు. వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్రాజ్ -
ఇళ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలి
● ఇందిరమ్మ ఇళ్లలో మేసీ్త్రలదే కీలకపాత్ర ● కలెక్టర్ జితేష్ వి పాటిల్సూపర్బజార్(కొత్తగూడెం): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్మాణంలో మేసీ్త్రలదే కీలకపాత్ర అని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక ప్రగతి మైదానంలో సోమవారం మేసీ్త్రలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఇంటిని 400 చదరపు అడుగుల లోపు నిర్మించాలని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసే రూ.5 లక్షలతో నాణ్యంగా నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. బేస్మెంట్ పూర్తయ్యాక మొదటి విడత రూ. లక్ష, గోడల నిర్మాణం పూర్త్తయ్యాక రెండో విడత రూ. 1.25 లక్షలు, స్లాబ్ పూర్తయిన తర్వాత మూడో విడత రూ 1.75 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత నాలుగో విడత రూ.లక్ష మంజూరు చేస్తామని వివరించారు. శిక్షణలో భాగంగా మేసీ్త్రలకు టీ షర్ట్లు, హెల్మెట్, బ్యాగులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శంకర్, మెప్మా పీడీ రాజేష్, న్యాక్ అధికారి హెప్సిబా, ఇన్స్పెక్టర్ కరుణాకర్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు పెంచాలి.. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య విధాన పరిషత్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశుద్ధ్యం కోసం అధునాతన యంత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈఎన్టీ చికిత్సలకు అవసరమైన యంత్ర పరికరాలకు నివేదికలు అందజేయాలని సూచించారు. ఆస్పత్రుల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు సింగరేణి, ఐటీసీ, కేటీపీఎస్, నవభారత్ వంటి పరిశ్రమలు ముందుకొస్తున్నాయని, ఈ మేరకు తగిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన భద్రాచలం ప్రభుత్వ అస్పత్రి సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో.. ఆన్లైన్ ద్వారా మధ్యాహ్న భోజన చెల్లింపులకు తీసుకుంటున్న చర్యలపై విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖాధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపులకు యాప్ రూపొందించాలని ఆదేశించారు. వీసీలో డీఈఓ వెంకటేశ్వరాచారి, కొత్తగూడెం ఎంఈఓ ప్రభుదయాల్, ఎఫ్ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.ఈవీఎం గోడౌన్ తనిఖీకొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం తనిఖీ చేశారు. ఈవీఎం, వీవీ ప్యాట్లు ఉన్న గదిని, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. గోడౌన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేనిదే ఎవరినీ లోపలకు అనుమంతిచొద్దని ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్నికల సూపరింటెండెంట్ దారా ప్రసాద్, కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్య, ఎన్నికల మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయికృష్ణ పాల్గొన్నారు. అనంతరం యాసింగి సాగుపై సీఎస్ శాంతికుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన వెంట ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి బాబురావు, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మహేందర్ ఉన్నారు. -
సాగర్ ఆయకట్టుకు ‘సీతారామ’ నీరు
అశ్వాపురం : నాగార్జున సాగర్ ఆయకట్టు భూములు ఎండిపోకుండా గోదావరిలో ఉన్న కొద్దిపాటి జలాలను సీతారామ ప్రాజెక్ట్ ద్వారా సాగునీటిని అందింస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని కుమ్మరిగూడెంలో గోదావరి నదిపై ఉన్న దుమ్ముగూడెం ఆనకట్టను, నీటి మట్టాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. బీజీ కొత్తూరులో సీతారామ ప్రాజెక్ట్ ఫేస్ –1 పంప్హౌస్ను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. గోదావరిలో ఉన్న కొద్దిపాటి జలాలను సాగర్ ఆయకట్టు పరిరక్షణకు కేటాయిస్తున్నామని చెప్పారు. అశ్వాపురం మండలం బీజీకొత్తూరు, ములకలపల్లి మండలం పూసుగూడెం, కమలాపురంలోని మూడు పంప్హౌస్ల ద్వారా 100 కిలోమీటర్ల మేర గోదావరి జలాలు ప్రవహించి రాజీవ్ కెనాల్ నుంచి నాగార్జునసాగర్ కెనాల్కు మంగళవారం నాటికి మళ్లిస్తామని వివరించారు. తద్వారా సాగర్ చివరి ఆయకట్టు ఎంబీసీ మధిర బ్రాంచ్ కెనాల్, తల్లాడ, పెనుబల్లి, వేంసూరు మండలాల చివరి ఆయకట్టుకు సాగర్ జలాలు పూర్తి స్థాయిలో అందుతాయన్నారు. అశ్వాపురం మండలంలో మారెళ్లపాడు ఎత్తిపోతల ద్వారా తుమ్మలచెరువుతో పాటు పినపాక నియోజకవర్గానికి వచ్చే పంట కాలానికి సాగునీరు అందిస్తామన్నారు. ములకలపల్లి, చండ్రుగొండ మండలాల్లో కాల్వలు నిర్మించి ఆ ప్రాంతానికీ నీరందిస్తామని తెలిపారు. వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న వైరా ప్రాజెక్ట్, లంకాసాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్టు మధ్యలో ఉన్న సాగర్ ఆయకట్టును స్థిరీకరించి సుమారు 1.36 లక్షల ఎకరాలకు సీతారామ నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గండుగులపల్లిలో నాలుగో పంప్హౌస్ను పూర్తి చేస్తే దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం, భద్రాద్రి జిల్లాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. నేటి సాయంత్రానికి గోదావరి జలాలు.. ములకలపల్లి : నేటి (మంగళవారం) సాయంత్రానికి గోదావరి జలాలు ఎన్నెస్పీ కాల్వలోకి మళ్లించనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. మండలంలోని వీకే. రామవరం, కమలాపురంలోని పంప్హౌస్లను సోమవారం పరిశీలించి మాట్లాడారు. అనంతరం మాట్లాడుతూ.. సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్ఆర్ఎల్ఐపీ)లో 100 కిలో మీటర్ల మెయిన్ కెనాల్, మూడు పంప్హౌస్ల నిర్మాణం పూర్తి చేసి, లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు పంప్హౌస్ –1 నుంచి నాలుగు రోజులుగా గోదావరి జలాలు ఎత్తిపోస్తున్నందున వీకే. రామవరం పంప్హౌస్–2కు సరిపడా నీళ్లు వచ్చాయని వివరించారు. డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణాలకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు సూచించారు. సీతారామ కాల్వలకు అండర్ టన్నెల్స్ (యూటీ) ఏర్పాటు చేసి సమీప వాగుల్లోకి నీరు వదిలేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసరెడ్డిని అదేశించారు. ఆయా కార్యక్రమాల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నీటి పారుదల ఎస్ఈ రవికుమార్, ఈఈ వెంకటేశ్వరరావు, డీఈ శ్రీనివాస్, ఏఈ రమేష్, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నెల్లిపాక పీఏసీఎస్ అధ్యక్షుడు తుక్కాని మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్తో రెండు జిల్లాలు సస్యశ్యామలం నాలుగేళ్లలో సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతెలంగాణపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమవిభజన చట్టంలోని నీటి పంపకాలు, తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులు, అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 36 సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించినా నీటి పంపకాలు, నిధుల విడుదలలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. దీంతో దిగువ రాష్ట్రాలు ఎక్కువ నీరు వాడుకుంటున్నాయని, తెలంగాణకు నీరు రాక గోదావరిలో ఉన్న కొద్దిపాటి జలాలను నాగార్జున్సాగర్ ఆయకట్టుకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. విభజన చట్టంలో తాత్కాలిక పంపకాలైన 811 టీఎంసీల నీటిలో 511 టీఎంసీలు ఆంద్రా ప్రాంతానికి కేటాయించారని, మిగిలిన 300 టీఎంసీలు కూడా తెలంగాణకు ఇప్పించడంలో కేంద్రం నిరాసక్తత చూపిస్తోందని విమర్శించారు. కృష్ణా జలాల్లో ట్రిబ్యునల్ ద్వారా రాష్ట్రానికి రావాల్సిన వాటాను త్వరగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయాలన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని, దేశ ఆదాయంలో తెలంగాణ చెల్లించే సొమ్మే ఎక్కువనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. -
ట్రాక్పైకి ట్రాక్టర్.. ‘దురంతో’కు తప్పిన ముప్పు
చింతకాని: చైన్నె నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న దురంతో ఎక్స్ప్రెస్కు లోకో పైలట్ అప్రమత్తతతో ముప్పు తప్పింది. రైలు సోమవారం మధ్యాహ్నం విజయవాడ దాటాక ఖమ్మం మార్గంలో వెళ్తుండగా చింతకాని మండలం రామకృష్ణాపురం రైల్వే గేట్ వద్ద ట్రాక్పైకి ట్రాక్టర్ వచ్చింది. ఈ మార్గంలో మూడో లైన్ నిర్మాణ పనులు జరుగుతుండగా గేట్ వేయలేదు. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ వచ్చినట్లు తెలుస్తుండగా, గమనించిన లోకో పైలట్ బ్రేకులు వేసి వేగాన్ని నియంత్రించాడు. ఈమేరకు గేటు వద్దకు రైలు వచ్చేసరికి ట్రాక్పై ఉన్న ట్రాక్టర్ ముందుకు వెళ్లిపోయింది. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. కాగా దీనిపై జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 13న పండితాపురం సంత వేలం పాట కామేపల్లి: రాష్ట్రంలోనే పేరున్న కామేపల్లి మండలంలోని కొమ్మినేపల్లి(పండితాపురం) గ్రామపంచాయతీ పరిధి శ్రీకృష్ణప్రసాద్ పశువుల సంత నిర్వహణకు ఈనెల 13న వేలం నిర్వహించనున్నట్లు గ్రామ ప్రత్యేకాధికారి, ఎంపీడీఓ రవీందర్ తెలిపారు. 2025–2026 ఆర్థిక సంవత్సరానికి గాను చేపట్టే ఈ వేలం సంత ఆవరణలో జరుగుతుందని వెల్లడిచారు. జీపీ పరిధిలోని ఎస్టీలు మాత్రమే పాల్గొనేందుకు అర్హులని, ధరావత్ సొమ్ము రూ.30 లక్షలు, సాల్వెన్సీ కింద రూ.5లక్షలు చెల్లించి పాల్గొనాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు. పోలీసుల అదుపులో నలుగురు వ్యక్తులు?జూలూరుపాడు: ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వలస కూలీల్లో నక్సలైట్లు ఉన్నారనే అనుమానంతో నలుగురు వ్యక్తులను సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మండలంలోని శంభునిగూడెం గ్రామ సమీపంలో ఓ రైతు మిర్చి తోట కోసేందుకు పలువురు వలస కూలీలు వచ్చారు. వారిలో నక్సలైట్లు ఉన్నారనే అనుమానంతో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. సెల్ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసి వారిని పట్టుకున్నట్లు తెలిసింది. సివిల్ డ్రస్లో ఉన్న పోలీసులు అరెస్ట్ చేసి, ప్రత్యేక వాహనాల్లో కొత్తగూడెం తరలించారని స్థానికులు చెబుతున్నారు. గంజాయి సీజ్టేకులపల్లి: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని టేకులపల్లి పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఎస్ఐ సురేష్ కథనం ప్రకారం.. సీలేరు నుంచి హైదరాబాద్కు బైక్పై 800 గ్రాముల గంజాయిని తరలిస్తుండగా వెంకటీయ తండా స్టేజీ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. -
జేకే–5ఓసీ మూసివేత?
● ఓపెన్ కాస్టు గనిలో అడుగంటిన బొగ్గు నిల్వలు ● ఈ నెల 31తో ఉత్పత్తి నిలిపివేయనున్న సింగరేణి యాజమాన్యం! ● ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తారని కార్మికుల ఆందోళనఇల్లెందు: సింగరేణి ఇల్లెందు ఏరియాలోని జేకే–5 ఓసీ మూసివేసే దశకు చేరింది. ఓపెన్కాస్టు గనిలో బొగ్గు నిక్షేపాలు అడుగంటాయి. మార్చి, ఏప్రిల్ లోగా బొగ్గు వెలికితీత పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో యాజమాన్యం ఇక్కడి యంత్రాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. దీంతో కార్మికవర్గం ఆందోళన చెందుతోంది. ఇల్లెందు ప్రాంతంలో 1886లో బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఒకప్పుడు సమారు 10 వేల మంది కార్మికులు పనిచేశారు. క్రమంగా బొగ్గు గనులు మూత పడటం, కొత్త గనులు ప్రారంభించకపోవడంతో కార్మికుల సంఖ్య వందలకు చేరింది. బొగ్గు నిల్వలు లేకపోవడంతో ఫిబ్రవరిలో ఇల్లెందు ఏరియా ఉత్పత్తి 51శాతానికి పడిపోయింది. దీంతో ఈ నెల 31తో జేకే–5 ఓసీలో ఉత్పత్తి పనులు నిలిపివేయాలని యాజమాన్యం భావిస్తోంది. 2023–24 వరకే జేకే ఓసీలో బొగ్గు వెలికితీతకు అనుమతులు ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవతో పూసపల్లి ఓసీ విస్తరణ జరిగే వరకు కొనసాగించాలని ముందుకు సాగారు. అయితే పూసపల్లి ఓసీ అనుమతుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో షావల్, నాలగు డంపర్లను ఇప్పటికే ఇతర ప్రాంతాలకు తరలించారు. మరికొన్నింటిని తరలించేందుకు సిద్ధమవుతున్నారు. యంత్రాలతోపాటు ఇతర ఏరియాలకు వెళ్లాలని మొదటి జాబితాలో సుమారు 15 మంది డంపర్ ఆపరేటర్లకు యాజమాన్యం తాఖీదులు ఇచ్చింది. కాగా ఇప్పటివరకు పూసపల్లి ఓసీపై కార్మికులు పెట్టుకున్న ఆశలు అడియాసలుగా మారాయి. ఈ నెల 18న మరోమారు జరగనున్న ఈసీ సమావేశంలోనైనా అనుమతులు లభిస్తాయని కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఈ నెల 5న ఏఐటీయూసీ నేతలు సీఎండీని కలువనున్నారు. ఇల్లెందు మనుగడపై చర్చిస్తామని ఇల్లెందు ఏరియా బ్రాంచి కార్యదర్శి నజీర్ అహ్మద్ తెలిపారు. ఎమ్మెల్యే, ఐఎన్టీయూసీ నాయకుల ప్రయత్నం! ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఇక్కడి ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీయూసీ నాయకులు ఓసీ జీవితకాలం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం జీఎం, ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఓసీని సందర్శించి పరిశీలిస్తామని, అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించి జేకే ఓసీని కొంతకాలం పాటు కొనసాగించేలా చర్యలు తీసుకుంటారని ఐఎన్టీయూసీ నేత వెంకటేశ్వర్లు తెలిపారు. ఇదే సమస్యపై ఐఎన్టీయూసీ నేత జనక ప్రసాద్ కూడా ఒకటి రెండు రోజుల్లో ఇల్లెందులో పర్యటించే అవకాశం ఉందని ఆ సంఘం నాయకుడు గోచికొండ సత్యనారాయణ తెలిపారు. ఓసీ పొడిగింపు వ్యవహారంపై డీజీఎం (పర్సనల్) జీవీ మోహన్రావును వివరణ కోరగా.. షావెల్, నాలుగు డంపర్లు మాత్రమే తరలించామని తెలిపారు. మార్చి తర్వాత కూడా మరో రెండు నెలలపాటు బొగ్గు వెలికితీస్తామని పేర్కొన్నారు. ఇటీవల డైరెక్టర్ కూడా ఓసీని సందర్శించి పరిశీలించారని, ఉన్నతాధికారులు తగిన నిర్ణయం తీసుకుంటారని వివరించారు. -
సౌర విద్యుత్ ప్లాంట్లు
నాలుగు గ్రామాల్లో ● రెండు జిల్లాల్లో రెండేసి గ్రామాల ఎంపిక ● మహిళా సంఘాల ద్వారా ఒక మెగావాట్ చొప్పున ప్లాంట్లు ● మహిళా దినోత్సవం సందర్భంగా ఈనెల 8న శంకుస్థాపనఖమ్మంవ్యవసాయం: ప్రధాన మంత్రి కుసుమ్ పథకం కింద ఉమ్మడి జిల్లాలోని నాలుగు గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్రప్రభుత్వం సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సహిస్తుండగా, వ్యక్తిగతంగా యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి సబ్సిడీలు అందిస్తోంది. అలాగే, బంజరు, బీడు భూముల్లో ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశమిస్తున్నారు. ఇదే సమయాన మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారి ఆధ్వర్యాన ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలో నాలుగు పైలట్ ప్రాజెక్టుగా మహిళా సంఘాల ఆధ్వర్యాన ఉమ్మడి జిల్లాలో నాలుగు ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయించారు. ఈమేరకు ఖమ్మం జిల్లాలోని మధిర మండలం మడుపల్లి, కల్లూరు మండలం చిన్నకోరుకొండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లి, మణుగూరు మండలం ఉడతనేనిగుంపు గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్లాంట్లు ఏర్పాటుచేశారు. ఇందుకోసం నాలుగెకరాల చొప్పున భూమి, నిర్మాణానికి రూ.3.50 కోట్ల నిధులు అవసరమని గుర్తించారు. ఇప్పటికే స్థలాలు ఖరారైనందున నివేదికలను రెడ్కో సంస్థ ద్వారా ప్రభుత్వానికి నివేదించారు. 8న శంకుస్థాపన రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ఆధ్వర్యాన ఏర్పాటుచేసే సౌర విద్యుత్ ప్లాంట్లకు మహిళా దినోత్సవమైన ఈనెల 8న శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేయనుండగా, గ్రామాల్లో జరిగే కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యే అవకాశముంది. ఈ వారంలోనే శంకుస్థాపన మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఏర్పాట్లు చేశాం. ఉమ్మడి జిల్లాలో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నాలుగు ప్లాంట్లు తొలిదశలో ఏర్పాటుకానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాం. ఈ వారంలో శంకుస్థాపన జరిగే అవకాశముంది. – పోలిశెట్టి అజయ్కుమార్, రెడ్కో మేనేజర్ -
హత్యకేసులో నిందితుడి అరెస్ట్
మణుగూరు టౌన్: ఓబీ కాంట్రాక్ట్ కార్మికుడి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మణుగూరు డీఎస్పీ రవీందర్రెడ్డి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. మూడు రోజుల క్రితం మణుగూరులోని ఓసీ–2 పాత డంప్యార్డ్ వద్ద ఓ ఓబీ కంపెనీ మెకానిక్ ముని ప్రసాద్ బిశ్వకర్మ హత్య కలకలం సృష్టించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మధ్యప్రదేశ్కు చెందిన మునిప్రసాద్ బిశ్వకర్మ ఓ ఓబీ కంపెనీలో మెకానిక్గా పనిచేస్తున్నాడు. గుజరాత్కు చెందిన వినోద్ సిన్హ్ అదే కంపెనీలో హెల్పర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. గత నెల 27న సాయంత్రం ఓ బెల్ట్ షాపులో మద్యం, బిర్యానీ తీసుకుని క్యాంప్ సమీపంలోని కాల్వ వద్దకు వెళ్లారు. మద్యం తాగుతున్న క్రమంలో ఇద్దరి మధ్య చిన్న విషయంలో ఘర్షణ వచ్చింది. దీంతో వినోద్ సిన్హ్ క్షణికావేశానికి లోనై బిశ్వకర్మ తలపై రాయితో మోదాడు. అక్కడే ఉన్న నవారుతో గొంతు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు విధులకు హాజరయ్యాడు. హత్య సంఘటన గత నెల 28న వెలుగులోకి రాగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇద్దరు కలిసి తిరిగిన ప్రదేశాలు, బెల్ట్షాపులు, బిర్యానీ పాయింట్ వద్ద నుంచి విచారించి వివరాలు సేకరించారు. అనంతరం వినోద్ సిన్హ్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారని డీఎస్పీ తెలిపారు. రెండు రోజుల్లోనే కేసు చేధించిన మణుగూరు సీఐ సతీష్, ఎస్ఐలు ప్రసాద్, రంజిత్, సిబ్బంది రామారావు, షమీమ్, వీరలను అభినందించి రివార్డులు అందజేశారు. -
వైద్యుడు, సిబ్బందిపై ఆగ్రహం
జూలూరుపాడు: సమయపాలన పాటించకుండా, విధులకు ఆలస్యంగా హాజరైన వైద్యుడు, సిబ్బందిపై డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్నాయక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఆలస్యంగా వచ్చిన డాక్టర్, వైద్యసిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లును ఆదేశించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, ఆస్పత్రి లో ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. ఎన్సీడీ స్క్రీనింగ్ వేగవంతం చేయాలని చెప్పా రు. రానున్న వేసవి దృష్ట్యా వడదెబ్బకు డీహైడ్రేషన్ బారినపడకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ బి.వెంకటేశ్వర్లు, డెంటిస్ట్ మౌనిక, సీహెచ్ఓ ఎం.రామకృష్ణ, ఎల్టీ జగదీష్, స్టాఫ్ నర్సు సునీత పాల్గొన్నారు. సుజాతనగర్లో... సుజాతనగర్: మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ నాయక్ సందర్శించారు. రికార్డులను పరిశీలించి, సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ఎన్సీడీ వ్యాధులకు సంబంధించి స్క్రీనింగ్ నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డీఎంహెచ్ఓ ఆదేశాలు -
గుండెపోటుతో జమలాపురం ఆలయ అర్చకుడు మృతి
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ అర్చకులు ఉప్పల సుదర్శన్శాస్త్రి(59) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. నిత్యపూజల్లో కీలకంగా వ్యవహరించే ఆయన మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. ఈమేరకు సుదర్శన్శాస్త్రి మృతదేహం వద్ద ఈఓ కె.జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఆలయ చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, సీనియర్ అసిస్టెంట్ విజయకుమారి తదితరులు నివాళులర్పించారు.రోడ్డు ప్రమాదంలో కూలీ... పెనుబల్లి: మండలంలోని ఎడ్ల బంజర్లో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రోజువారీ కూలీ ఇమ్మడి భాస్కర్(55) మృతి చెందాడు. రహదారిపై నడిచి వెళ్తున్న ఆయన రోడ్డు దాటుతుండగా కొత్తగూడెం నుండి వీఎం బంజర వైపు వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన భాస్కర్ను స్థానికులు పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనాస్థలికి వీఎం బంజర పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. చికిత్స పొందుతున్న వ్యక్తి... సత్తుపల్లిటౌన్: ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి జారిపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన బేతిని సత్యం(55) ఈనెల 1వ తేదీన తన ఇంటి ఆవరణలోని చింత చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. దీంతో ఆయన వెన్నుపూస, చేతికి బలమైన గాయాలయ్యాయి. ఈమేరకు స్థానికంగా చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించగా పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీపాల్రెడ్డి
● రెండో ప్రాధాన్యత ఓట్లతో వరించిన విజయం ● సిట్టింగ్ ఎమ్మెల్సీపై 5,521 ఓట్ల మెజారిటీ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఖమ్మం – వరంగల్ – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ–టీఎస్ బలపరిచిన అభ్యర్థి పింగిలి శ్రీపాల్రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఎన్నికల్లో శ్రీపాల్రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,448 ఓట్లు వచ్చాయి. అయితే నర్సిరెడ్డి ఎలిమినేట్ కాకముందు గెలుపు కోటా ఓట్లు శ్రీపాల్రెడ్డికి కూడా లేకపోవడంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో.. శ్రీపాల్రెడ్డికి వచ్చిన 2,870 రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపారు. దీంతో శ్రీపాల్రెడ్డి 13,969 ఓట్లు సాధించగా గెలుపు ఖరారైంది. ఉదయం 7గంటల నుంచి కౌంటింగ్.. ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్లగొండలోని ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో సోమవారం నిర్వహించారు. ఉదయం 7గంటలకు ప్రక్రియ మొదలుకాగా, ఉదయం 11 గంటల వరకు బండిల్స్ కట్టాక లెక్కింపు చేపట్టారు. సాయంత్రం 3గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 24,135 ఓట్లు పోల్ కాగా 494 ఓట్లు చెల్లలేదు. ఇక 23,641 ఓట్లు చెల్లుబాటు కాగా, ఇందులో సగానికి మించి ఒక్క ఓటు కలిపి 11,821గా గెలుపు కోటా ఓటును నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్రెడ్డి అత్యధికంగా 6,035 ఓట్లు రావడం, గెలుపు కోటాకు సరిపోకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించారు. చివరకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతోనే శ్రీపాల్రెడ్డి విజయం సాధించారు. కాగా, లెక్కింపులో ఒక్కో రౌండ్ పూర్తవుతుండగా ఉత్కంఠ నెలకొంది. శ్రీపాల్రెడ్డి ఆధిక్యంలో ఉన్నా.. ద్వితీయ స్థానంలో ఉన్న నర్సిరెడ్డికి చేరువలో గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి రాగలిగినా సుందర్రాజు ఎలిమినేషన్తో ఇద్దరి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఆ తర్వాత పులి సరోత్తంరెడ్డి, పూల రవీందర్, గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డిని ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కించారు. అప్పటికి కూడా గెలుపు కోటా రాకపోవడంతో నర్సిరెడ్డిని కూడా ఎలిమినేషన్ చేసి ఓట్లు లెక్కించారు. అయినా కోటా రాకపోయినప్పటికీ శ్రీపాల్రెడ్డి గెలిచినట్లుగా అధికారులు ప్రకటించారు. ఎలిమినేషన్లో ఓట్లు పెరిగాయి ఇలా.. మొదటి ప్రాధాన్యతలో ప్రధాన అభ్యర్థులైన పింగలి శ్రీపాల్రెడ్డికి 6,035 ఓట్లు రాగా, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డికి 4,437 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పూల రవీందర్కు 3,115, బీజేపీ బలపర్చిన అభ్యర్థి సరోత్తంరెడ్డికి 2,289, సుందర్రాజుకు 2,040 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఇలా 14వ రౌండ్ వరకు ఎలిమినేషన్ చేస్తూ ఓట్ల లెక్కింపు చేయగా శ్రీపాల్రెడ్డికి అప్పటి వరకు 6,165 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 4,946 ఓట్లు వచ్చాయి. హర్షవర్ధన్రెడ్డికి 4,596 ఓట్లు, పూల రవీందర్కు 3,249 ఓట్లు వచ్చాయి. అంటే.. 14వ రౌండ్వరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థుల నుంచి మరో 130 రెండో ప్రాధాన్యత ఓట్లు శ్రీపాల్రెడ్డికి లభించాయి. ఈ రౌండ్ తరువాత సుందర్రాజును ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కింపు చేపట్టారు. ఈమేరకు 15వ రౌండ్లో శ్రీపాల్రెడ్డికి ఒక్కసారే 781 ఓట్లు పెరిగి 6,916కి చేరాయి. రెండోస్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి కూడా 5,205 ఓట్లకు చేరుకున్నారు. మిగతా వారికి కూడా ఓట్లు పెరిగినప్పటికీ శ్రీపాల్రెడ్డి ఆధిక్యం కొనసాగింది. ఇక 16వ రౌండ్లో పులి సరోత్తంరెడ్డి, 17వ రౌండ్లో పూల రవీందర్, 18వ రౌండ్లో హర్షవర్ధన్రెడ్డిని ఎలిమినేట్ చేశారు. అప్పటికి శ్రీపాల్రెడ్డి ఓట్లు 11,099కు, నర్సిరెడ్డి ఓట్లు 8,448కు చేరాయి. దీంతో నర్సిరెడ్డిని సైతం ఎలిమినేట్ చేసి ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్డ్డికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఈమేరకు 2,870 ఓట్లు కలిపి శ్రీపాల్రెడ్డి 13,969 ఓట్లు సాధించడంతో గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు. -
ట్రాక్పైకి ట్రాక్టర్.. ‘దురంతో’కు తప్పిన ముప్పు
చింతకాని: చైన్నె నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న దురంతో ఎక్స్ప్రెస్కు లోకో పైలట్ అప్రమత్తతతో ముప్పు తప్పింది. రైలు సోమవారం మధ్యాహ్నం విజయవాడ దాటాక ఖమ్మం మార్గంలో వెళ్తుండగా చింతకాని మండలం రామకృష్ణాపురం రైల్వే గేట్ వద్ద ట్రాక్పైకి ట్రాక్టర్ వచ్చింది. ఈ మార్గంలో మూడో లైన్ నిర్మాణ పనులు జరుగుతుండగా గేట్ వేయలేదు. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ వచ్చినట్లు తెలుస్తుండగా, గమనించిన లోకో పైలట్ బ్రేకులు వేసి వేగాన్ని నియంత్రించాడు. ఈమేరకు గేటు వద్దకు రైలు వచ్చేసరికి ట్రాక్పై ఉన్న ట్రాక్టర్ ముందుకు వెళ్లిపోయింది. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. కాగా దీనిపై జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 13న పండితాపురం సంత వేలం పాట కామేపల్లి: రాష్ట్రంలోనే పేరున్న కామేపల్లి మండలంలోని కొమ్మినేపల్లి(పండితాపురం) గ్రామపంచాయతీ పరిధి శ్రీకృష్ణప్రసాద్ పశువుల సంత నిర్వహణకు ఈనెల 13న వేలం నిర్వహించనున్నట్లు గ్రామ ప్రత్యేకాధికారి, ఎంపీడీఓ రవీందర్ తెలిపారు. 2025–2026 ఆర్థిక సంవత్సరానికి గాను చేపట్టే ఈ వేలం సంత ఆవరణలో జరుగుతుందని వెల్లడిచారు. జీపీ పరిధిలోని ఎస్టీలు మాత్రమే పాల్గొనేందుకు అర్హులని, ధరావత్ సొమ్ము రూ.30 లక్షలు, సాల్వెన్సీ కింద రూ.5లక్షలు చెల్లించి పాల్గొనాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు. పోలీసుల అదుపులో నలుగురు వ్యక్తులు?జూలూరుపాడు: ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వలస కూలీల్లో నక్సలైట్లు ఉన్నారనే అనుమానంతో నలుగురు వ్యక్తులను సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మండలంలోని శంభునిగూడెం గ్రామ సమీపంలో ఓ రైతు మిర్చి తోట కోసేందుకు పలువురు వలస కూలీలు వచ్చారు. వారిలో నక్సలైట్లు ఉన్నారనే అనుమానంతో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. సెల్ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసి వారిని పట్టుకున్నట్లు తెలిసింది. సివిల్ డ్రస్లో ఉన్న పోలీసులు అరెస్ట్ చేసి, ప్రత్యేక వాహనాల్లో కొత్తగూడెం తరలించారని స్థానికులు చెబుతున్నారు. గంజాయి సీజ్టేకులపల్లి: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని టేకులపల్లి పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఎస్ఐ సురేష్ కథనం ప్రకారం.. సీలేరు నుంచి హైదరాబాద్కు బైక్పై 800 గ్రాముల గంజాయిని తరలిస్తుండగా వెంకటీయ తండా స్టేజీ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. -
జేకే–5ఓసీ మూసివేత?
● ఓపెన్ కాస్టు గనిలో అడుగంటిన బొగ్గు నిల్వలు ● ఈ నెల 31తో ఉత్పత్తి నిలిపివేయనున్న సింగరేణి యాజమాన్యం! ● ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తారని కార్మికుల ఆందోళనఇల్లెందు: సింగరేణి ఇల్లెందు ఏరియాలోని జేకే–5 ఓసీ మూసివేసే దశకు చేరింది. ఓపెన్కాస్టు గనిలో బొగ్గు నిక్షేపాలు అడుగంటాయి. మార్చి, ఏప్రిల్ లోగా బొగ్గు వెలికితీత పూర్తయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో యాజమాన్యం ఇక్కడి యంత్రాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. దీంతో కార్మికవర్గం ఆందోళన చెందుతోంది. ఇల్లెందు ప్రాంతంలో 1886లో బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఒకప్పుడు సమారు 10 వేల మంది కార్మికులు పనిచేశారు. క్రమంగా బొగ్గు గనులు మూత పడటం, కొత్త గనులు ప్రారంభించకపోవడంతో కార్మికుల సంఖ్య వందలకు చేరింది. బొగ్గు నిల్వలు లేకపోవడంతో ఫిబ్రవరిలో ఇల్లెందు ఏరియా ఉత్పత్తి 51శాతానికి పడిపోయింది. దీంతో ఈ నెల 31తో జేకే–5 ఓసీలో ఉత్పత్తి పనులు నిలిపివేయాలని యాజమాన్యం భావిస్తోంది. 2023–24 వరకే జేకే ఓసీలో బొగ్గు వెలికితీతకు అనుమతులు ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవతో పూసపల్లి ఓసీ విస్తరణ జరిగే వరకు కొనసాగించాలని ముందుకు సాగారు. అయితే పూసపల్లి ఓసీ అనుమతుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో షావల్, నాలగు డంపర్లను ఇప్పటికే ఇతర ప్రాంతాలకు తరలించారు. మరికొన్నింటిని తరలించేందుకు సిద్ధమవుతున్నారు. యంత్రాలతోపాటు ఇతర ఏరియాలకు వెళ్లాలని మొదటి జాబితాలో సుమారు 15 మంది డంపర్ ఆపరేటర్లకు యాజమాన్యం తాఖీదులు ఇచ్చింది. కాగా ఇప్పటివరకు పూసపల్లి ఓసీపై కార్మికులు పెట్టుకున్న ఆశలు అడియాసలుగా మారాయి. ఈ నెల 18న మరోమారు జరగనున్న ఈసీ సమావేశంలోనైనా అనుమతులు లభిస్తాయని కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఈ నెల 5న ఏఐటీయూసీ నేతలు సీఎండీని కలువనున్నారు. ఇల్లెందు మనుగడపై చర్చిస్తామని ఇల్లెందు ఏరియా బ్రాంచి కార్యదర్శి నజీర్ అహ్మద్ తెలిపారు. ఎమ్మెల్యే, ఐఎన్టీయూసీ నాయకుల ప్రయత్నం! ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఇక్కడి ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీయూసీ నాయకులు ఓసీ జీవితకాలం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం జీఎం, ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఓసీని సందర్శించి పరిశీలిస్తామని, అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించి జేకే ఓసీని కొంతకాలం పాటు కొనసాగించేలా చర్యలు తీసుకుంటారని ఐఎన్టీయూసీ నేత వెంకటేశ్వర్లు తెలిపారు. ఇదే సమస్యపై ఐఎన్టీయూసీ నేత జనక ప్రసాద్ కూడా ఒకటి రెండు రోజుల్లో ఇల్లెందులో పర్యటించే అవకాశం ఉందని ఆ సంఘం నాయకుడు గోచికొండ సత్యనారాయణ తెలిపారు. ఓసీ పొడిగింపు వ్యవహారంపై డీజీఎం (పర్సనల్) జీవీ మోహన్రావును వివరణ కోరగా.. షావెల్, నాలుగు డంపర్లు మాత్రమే తరలించామని తెలిపారు. మార్చి తర్వాత కూడా మరో రెండు నెలలపాటు బొగ్గు వెలికితీస్తామని పేర్కొన్నారు. ఇటీవల డైరెక్టర్ కూడా ఓసీని సందర్శించి పరిశీలించారని, ఉన్నతాధికారులు తగిన నిర్ణయం తీసుకుంటారని వివరించారు. -
మావోయిస్టు కమాండర్ లొంగుబాటు
చర్ల: ఛతీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ ఎస్పీ ఎదుట ఓ మావోయిస్టు కమాండర్ సోమవారం భార్య, మూడేళ్ల కుమారుడితో కలిసి లొంగిపోయాడు. మావోయిస్టు పార్టీ గంగులూరు ఏరియా కమిటీ కమాండర్, బీజాపూర్ జిల్లా కమిటీ సభ్యుడు దినేష్ ఎస్పీ జితేందర్కుమార్ యాదవ్ ఎదుట లొంగుబాటు ప్రకటించాడు. పోలీసు బలగాలపై దాడులకు వ్యూచరచన చేయడంలో దినేష్కు మాస్టర్ మైండ్గా పేరుంది. వివిధ ప్రాంతాల్లో సుమారు 100 మంది జవాన్లను మట్టుబెట్టిన ఘటనల్లో ఆయన పాల్గొన్నట్లు పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. చిన్న నాటి నుంచే మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్న దినేష్ అధునాత ఆయుధాల వినియోగం, అంబూష్ వేయడం, మందుపాతరలు తయారు చేయడంలో నిష్ణాతుడు కావడంతో తక్కువ కాలంలోనే పార్టీలో పదోన్నతులు పొందాడు. కాగా అతనిపై ఉన్న రూ.8 లక్షల నగదును, అతనికే ఇస్తామని ఎస్పీ తెలిపారు. -
భూవివాదంలో ఇరువర్గాల దాడి
దమ్మపేట : భూవివాదాలతో సమీప బంధువులైన రెండు వర్గాలు మారణాయుధాలతో పరస్పరం దాడులు చేసుకున్న ఘటన మండల పరిధిలోని చిన్న గొల్లగూడెం శివారులో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... మండలంలోని చిన్న గొల్లగూడెం గ్రామానికి చెందిన కవులూరి సంజీవరావు కుటుంబానికి చెందిన వ్యవసాయ క్షేత్రంలోకి కవులూరి వెంకటేశ్వరరావు మరికొందరితో కలిసి అక్రమంగా ప్రవేశించి ఫెన్సింగ్ రాళ్లు, ఇనుప ముళ్లతీగను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో సంజీవరావు తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొని ఘర్షణకు దారితీసింది. పరస్పరం మారణాయుధాలతో దాడులు చేసుకున్నారు. ఇరువర్గాల వారికి తల, ఛాతీ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కవులూరు వెంకటేశ్వరరావు, కవులూరి సంజీవరావు, వెంకటమ్మ , ఏసుబాబు ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్షతగాత్రులను 108 అంబులెన్స్లో దమ్మపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వెంకటేశ్వరరావు, సంజీవరావు, వెంకటమ్మలను మెరుగైన వైద్యం కోసం సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
పాల్వంచ: వ్యక్తి ఆత్మహత్య సంఘటనపై సోమవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని పాలకోయతండాకు చెందిన కోట వెంకటేశ్వర్లు(45)కు గతంలో వివాహం జరుగగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అనంతరం ఐదేళ్ల క్రితం సైదాబీ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వీరు హోటల్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల వీరి మధ్య కూడా మనస్పర్థలు రాగా, సైదాబీ పాల్వంచలోని అక్క కూతురి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో మానసికంగా కుంగిపోయి ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు సోదరుడు కోట బాలయ్య సోమవారం ఫిర్యాదు చేయగా, ఎస్ఐ రాఘవయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యూనిఫామ్ స్టిచ్చింగ్పై శిక్షణ
చుంచుపల్లి: డీఆర్డీఏ ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్ కుట్టే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లకు సోమవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. కొత్తగూడెంలో జరిగిన ఈ సదస్సులో యూనిఫామ్ క్లాత్ బల్క్ కటింగ్, స్టిచింగ్పై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీఆర్డీఓ విద్యాచందన మాట్లాడుతూ రెండు రోజులపాటు మహిళా సంఘాలకు యూనిఫామ్ కుట్టే విధానాలపై శిక్షణ ఇస్తారని తెలిపారు. సెర్ప్ అదనపు డీఆర్డీఓ నీలేష్, డీపీఎంలు, ఏపీఎంలు, మహిళా సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.ఇంటర్ యూనివర్సిటీ టోర్నీలో రజతం ఖమ్మం స్పోర్ట్స్: ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఉషూ టోర్నీలో ఖమ్మంకు చెందిన పి.పవిత్రాచారి రజత పతకం గెలుచుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ జేఎన్టీయూలో చదువుతున్న ఆమె చండీఘర్ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన ఉషూ పోటీల్లో నాన్దావో ఈవెంట్లో ఫైనల్స్కు చేరింది. ఆతర్వాత హోరాహోరీగా జరిగిన ఫైనల్స్లో పవిత్రాచారికి ద్వితీయస్థానం దక్కించుకుంది. తెలంగాణ నుంచి పతకం దక్కించుకున్న క్రీడాకారిణి ఒక్కరే కావడం విశేషం. ఈసందర్భంగా ఆమెను అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీవైఎస్ఓ టి.సునీల్కుమార్రెడ్డి, కోచ్ పి.పరిపూర్ణాచారి సోమవారం అభినందించారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించాలి.. కొణిజర్ల: విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రఽతిభను వెలికి తీయడానికి ఉపాధ్యాయులు కృషిచేయాలని జీవశాస్త్ర విభాగం రాష్ట్ర రిసోర్స్ పర్సన్ పెసర ప్రభాకర్రెడ్డి సూచించారు. పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడంలో భాగంగా బయాలజీ ఉపాధ్యాయులకు సోమవారం కొణిజర్ల సమీపంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓరి యంటేషన్ నిర్వహించారు. జిల్లాలోని గిరిజన ఆశ్రమ పా ఠశాలల బయాలజీ ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ సమావేశంలో ఖమ్మం, వైరా సహాయ సంక్షేమ అధికారులు సత్యవతి, జహీరుద్దీన్తో కలిసి ప్రభాకర్రెడ్డి మాట్లాడారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి శ్రద్ధ కనబరిస్తే అందరి తో పాటే మంచి మార్కులు సాధించే అవకాశముంటుందని తెలిపారు. 25న పోస్టల్ పెన్షన్ అదాలత్ ఖమ్మంగాంధీచౌక్: హైదరాబాద్ రీజియన్ స్థాయిలో ఈనెల 25న పోస్టల్ పెన్షన్ అదాలత్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నట్లు ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి.వీరభద్రస్వామి తెలిపారు. పెన్షన్ సంబంధిత అంశాలపై ఫిర్యాదులు ఉన్న వారు ‘అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, పోస్టుమాస్టర్ జనరల్ కార్యాలయం, హైదరాబాద్ రీజియన్, హైదరాబాద్–1, తెలంగాణ సర్కిల్ డాక్ సదన్, 5వ ఫ్లోర్, ఆబిడ్స్, హైదరాబాద్’ చిరునామాకు చేరేలా ఈనెల 20వ తేదీ లోగా పంపించాలని తెలిపారు. కవర్పై ‘పోస్టల్ పెన్షన్ అదాలత్ ఆఫ్ హైదరాబాద్ రీజియన్’ అని రాయాలని తెలిపారు. ఆయా ఫిర్యాదులపై ఈనెల 25న ఉదయం 11:30 గంటలకు మొదలయ్యే పెన్షన్ అదాలత్తో meet. google.com/ ytf& ptji& wwf లింక్ ద్వారా పాల్గొనవచ్చని వెల్లడించారు. ఎంపీడీఓ కార్యాలయంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కూసుమంచి: మధిర అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి టి.కార్తీక్రెడ్డి సోమవారం కూసుమంచి ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు. శిక్షణలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన ఆయన ‘పంచాయతీరాజ్ శాఖ, సాధారణ పరిపాలన’ అంశంపై ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డితో చర్చించారు. కాగా, మంగళ, బుధవారాల్లో ఆయన ఖమ్మం రూరల్ తహసీల్తో పాటు ఖమ్మం ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాలను సందర్శించనున్నారు.