Mahabubnagar
-
రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
అడ్డాకుల: మండలంలోని కందూర్ శివారులో స్వయంభూగా వెలిసి దక్షిణకాశీగా పేరొందిన శ్రీరామలింగేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు గోపూజతో మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యాగశాలలో భూతబలి కార్యక్రమం నిర్వహించి యాగశాల ప్రవేశం చేశారు. విఘ్నేశ్వర పూజ, అగ్నిప్రతిష్ఠ, అంకురారోహణ, ధ్వజారోహణం, బలిహరణ కార్యక్రమాలను పండితులు ఘనంగా నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజ స్థాపన చేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ ఆవరణలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం ఉదయం ఆలయంలో పార్వతి సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. ఈఓ రాజేశ్వరశర్మ, జూనియర్ అసిస్టెంట్ అనంతసేన్రావు, ఆలయ నిర్వాహకులు రవీందర్శర్మ, కారెడ్డి నాగిరెడ్డి, తోట శ్రీహరి, దామోదర్రెడ్డి, రవీందర్రెడ్డి, విజయలక్ష్మి, కారెడ్డి లత, దేవన్న యాదవ్, ఆలయ పూజారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నేడు పార్వతి సమేత రామలింగేశ్వరుడి కల్యాణ మహోత్సవం -
పొలం కబ్జా చేశారు.. న్యాయం చేయండి
● తహసీల్దార్ కార్యాలయం ఎదుట కుటుంబంతో కలిసి మహిళా రైతు ధర్నా రాజాపూర్(బాలానగర్): రెండెకరాల్లో ఒక ఎకరా పొలం రోడ్డులో పోగా.. మరో ఎకరా ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారని.. తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళా రైతు కుటుంబంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది. బాలానగర్ మండలకేంద్రానికి చెందిన సులోచనదేవికి సర్వే నంబర్ 139/1, 139/2లో రెండెకరాల పట్టా పొలం ఉండేది. ఒక ఎకరా రోడ్డు విస్తరణలో పోగా మరో ఎకరా పొలం ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారు. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగకపోవడంతో ఆమె తన కుమారులతో కలిసి మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ధర్నా దిగింది. జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఆల్వాల్రెడ్డి మద్దతు తెలిపారు. రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. అవసరమైతే హైదరాబాద్లో నిరాహార దీక్ష చేపడతామని పేర్కొన్నారు. -
నాగుపాముకు చికిత్స
జడ్చర్ల టౌన్: మండలంలోని ఆల్వాన్పల్లిలో పట్టుకునే క్రమంలో గాయపడిన నాగుపాముకు సర్ప రక్షకుడు డా.సదాశివయ్య చికిత్స అందించి కాపాడారు. వివరాలు.. ఆల్వాన్పల్లిలో నాగుపామును గుర్తించిన యువకులు సర్పరక్షకుడు డా. సదాశివయ్యకు ఫోన్ద్వారా సమాచారం అందించారు. దీంతో ఆయన తన శిష్యులైన రాహుల్, రవీందర్ అక్కడికి చేరుకునేలోపు నాగుపాము సమీపంలోని రంధ్రంలోకి వెళ్లింది. దాన్ని తవ్వి పామును బయటకు తీసేందుకు యువకులు గడ్డపారతో తవ్వుతుండగా పాము నడుములో దిగబడింది. అది ఒక్కసారిగా బుసలు కొడుతూ బయటికొచ్చింది. అదిగమనించిన యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. అక్కడికి చేరుకున్న రాహుల్, రవీందర్ చాకచక్యంగా పామును పట్టుకొని జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల జీవ వైవిధ్య సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చారు. అక్కడ డా.సదాశివయ్య పాముకు చికిత్స అందించి కట్టువేసి కాపాడారు. ప్రస్తుతం గాయపడిన పాము ఇదే కేంద్రంలో ఉంచారు. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
కోస్గి: స్కానింగ్ కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యశాఖ అధికారి డా. జయంతిరెడ్డి హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని పలు స్కానింగ్ కేంద్రాలను జిల్లా వైద్యాధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. స్కానింగ్ చేసే వారి వివరాలు విధిగా సమగ్రంగా నమోదు చేయాలని, ఆధార్కార్డు, పూర్తి చిరునామా, స్కానింగ్ తీయడానికి గల కారణాలు ఉండాలని సూచించారు. రేడియాలజిస్టులే స్కానింగ్ తీయాలన్నారు. ఆమె వెంట జిల్లా ఉప వైద్యాధికారి డా. శైలజ తదితరులు ఉన్నారు. -
ఉదండాపూర్ నిర్వాసితులకు మేలు జరిగేలా చర్యలు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాలకు అన్ని విధాల మేలు జరిగేలా చూస్తామని కలెక్టర్ విజయేందిర అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డితో కలిసి రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్, సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉదండాపూర్ రిజర్వాయర్ కింద వల్లూరు, ఉదండాపూర్, తుమ్మలకుంట తండా, రేగడిపట్టి తండా, చిన్నగుట్టతండా, శామగడ్డతండా, ఒంటి గుడిసె తండా, పోలేపల్లి వ్యవసాయక్షేత్రంలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు అవార్డు అందుకున్న వారందరికీ పునరావాసం కింద మూడు వందల గజాల స్థలం, వారి అవసరాలకు ప్రైమరీ హెల్త్ సెంటర్, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రా లు, వెటర్నరీ హాస్పిటల్, కమ్యూనిటీ హాల్స్, పార్కులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ వాటర్ పైపు లైన్లు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మాట్లాడుతూ ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు కొందరు అడ్డుపడుతున్నారని, భూమి కోల్పోయిన వారికి అపోహలు, భయాన్ని కలగజేస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్లో భూమి కోల్పోయిన వారికి ఎక్కువ మొత్తంలో నష్టపరిహారం అందేలా చూడాలని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించినట్లు తెలిపారు. ఆర్అండ్ఆర్ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆర్డీఓ దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో స్పెషల్ కలెక్టర్ మధుసూదన్నాయక్, ఆర్డీఓ నవీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సాగునీరు, పర్యాటక రంగం..
అచ్చంపేట నియోజకవర్గానికి సాగునీరు తేవడంపైనే ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తా. ఉన్నత విద్యపై దృష్టిపెడతాం. ఈ ప్రాంతంలో 3.50 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టుల నిర్మాణం, ఇప్పటికే మంజూరైన అమ్రాబాద్ లిఫ్టుల ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతాను. సీఎం సహకారంతో నల్లమల ప్రాంతాన్ని మరో కోనసీమగా మార్చడమే నా లక్ష్యం. నల్లమలలోని వనరుల ద్వారా ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై గళం వినిపిస్తాను. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట -
‘ఇంటర్’ వాల్యూయేషన్ ప్రారంభం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల వాల్యూయేషన్ను అధికారులు మంగళవారం ప్రారంభించారు. జిల్లాకేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలో వాల్యూయేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి 20 వేలకు పైగా సంస్కృతం సబ్జెక్టుకు సంబంధించిన జవాబుపత్రాలు క్యాంప్నకు చేరాయి. తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టులకు సంబంధించిన జవాబుపత్రాలు ఒకట్రెండు రోజుల్లో రానున్నాయి. వీటికి అధికారులు కోడింగ్ ప్రక్రియ చేపట్టారు. మొత్తంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి రెండు లక్షలకు పైగా జవాబు పత్రాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులను క్యాంప్నకు రావాలని ఆదేశించారు. మొత్తంగా రెండు వారాల్లో వాల్యూయేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 11,690 మంది హాజరు జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మ్యాథ్స్–1 ఏ, బోటనీ–1, పొలిటికల్ సైన్స్–1 పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ మేరకు మొత్తం 36 పరీక్ష కేంద్రాల్లో 11,690 మంది విద్యార్థులు హాజరయ్యారు. మరో 326 మంది గైర్హాజరయ్యారు. పలు కేంద్రాల్లో సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో పాటు ఇంటర్ బోర్డు అధికారులు పరిశీలించారు. కాగా.. మంగళవారం జరిగిన పరీక్షలో కూడా తప్పులు వచ్చినట్లు పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. -
అనుమానాస్పదంగా వృద్ధురాలి మృతి
గద్వాల క్రైం: అనుమానాస్పదంగా వృద్ధురాలు మృతి చెందిన ఘటన గద్వాలలో చోటుచేసుకున్నట్లు పట్టణ ఎస్ఐ కల్యాణ్కుమార్ తెలిపారు. వివరాలు.. మోమిన్ మహాల్ల కాలనీకి చెందిన చిన్నమ్మ(85) కొన్ని రోజుల క్రితం కిందపడి తీవ్ర అనారోగ్యానికి గురైంది. కుటుంబ సభ్యులు ఉన్నా ఆమె బాగోగులను పట్టించుకునే వారు కాదు. రాఘవేంద్ర కాలనీలోని అనాథశ్రమంలో ఉండేది. వారం రోజుల క్రితం వృద్ధురాలిని కుమారులు జలదుర్గం రమేష్, రాజు మోమిన్ మహాల్లలోని స్వంత ఇంట్లో(పాడుబడ్డ)కి తీసుకొచ్చారు. ఆమెకు వంతులవారీగా ఆహారం అందించేవారు. అయితే సోమవారం రాత్రి కుటుంబ సభ్యులు వృద్ధురాలికి ఆహారం అందించి చీకటి గది కావడంతో వెలుతురు కోసం కొవ్వొత్తిని వెలిగించి మంచం సమీపంలో పెట్టి వెళ్లారు. ఆమె నిద్రించే క్రమంంలో కొవ్వొత్తికి దుప్పటి తగిలి మంటలు వ్యాపించి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అయితే స్థానికులు మాత్రం ఆమెను కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. ఘటనాస్థలికి గద్వాల సీఐ శ్రీను చేరుకొని పరిశీలించారు. కేసు విచారణలో నిజనిజాలు నిర్ధారణ అవుతాయని ఆయన వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రైలు నుంచి పడి వ్యక్తి.. ఆత్మకూర్: ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. రైల్వే హెడ్కానిస్టేబుల్ అశోక్ కథనం మేరకు.. సోమవారం అర్ధరాత్రి మండల పరిధిలోని శ్రీరాంనగర్ రైల్వేస్టేషన్ – గద్వాల రైల్వేస్టేషన్ మధ్య 184వ కిలోమీటరు వద్ద పట్టాలపై 45 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందింది. మంగళవారం ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. మరిన్ని వివరాలకు సెల్నంబర్లు 87126 58608, 83412 52529 సంప్రదించాలని సూచించారు. బావిలో పడి.. శాంతినగర్: ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన వడ్డేపల్లి పుర పరిధిలోని శాంతినగర్ జములమ్మ ఆలయ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. బంధువులు జములమ్మ దేవర చేస్తున్నారని కలుకుంట్లకు చెందిన మద్దిలేటి (36) ఆలయానికి వచ్చి వెనక ఉన్న బావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. బంధువుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శాంతినగర్ పోలీసులు వివరించారు. లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం తాడూరు: మండల కేంద్రానికి సమీపంలోని మల్కాపూర్ గేట్ కాజ్వే బ్రిడ్జి వద్ద మంగళవారం సాయంత్రం కోళ్ల ఎరువుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. మామిడితోట దగ్ధం రాజాపూర్: మండలంలోని రాయపల్లికి చెందిన మహిళా రైతు మాధవి మామిడితోట సోమవారం రాత్రి అగ్నికి ఆహుతైంది. గ్రామస్తుల కథనం మేరకు.. పోలేపల్లి శివారులోని పరిశ్రమల నుంచి వెలువడే పొగతో పాటు నిప్పు రవ్వలు వచ్చి రైతు పొలంలో పడి ఎండిన గడ్డి అంటుకొని మంటలు వ్యాపించి మామిడి తోట కాలిపోయిందన్నారు. రైతులను నష్టపరుస్తున్న పరిశ్రమలపై అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జడ్చర్లలో పశుగ్రాసం.. జడ్చర్ల: పట్టణంలోని శ్రీనివాసనగర్లో కౌలు రైతు సంజీవ్ నిల్వ చేసిన పశుగ్రాసం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని కాలి బూడిదైంది. వరి గడ్డివాము నుంచి మంగళవారం ఒక్కసారిగా పొగలు రావడంతో రైతు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసి పొక్లెయిన్తో చెల్లాచెదురు చేసినా ఫలితం లేకపోయింది. సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని.. ప్రభుత్వపరంగా సాయం అందించి ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు. -
ముమ్మరంగా సహాయక చర్యలు
అచ్చంపేట/మన్ననూర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరుగుతున్న సహాయక చర్యలకు రోబోలను ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు మంగళవారం ఉదయం హైదరాబాద్కు చెందిన అన్వి రోబోటిక్స్ సంస్థకు చెందిన ఏఐ బేస్డ్ కెమెరా సదుపాయం గల రోబోటిక్లను తీసుకెళ్లారు. సంస్థ ప్రతినిధులు విజయ్, అక్షయ్ లోకో ట్రైన్లో సొరంగంలోకి వాటిని తీసుకెళ్లారు. అన్వి రోబోటిక్ సంస్థకు చెందిన ప్రతినిధులు టన్నెల్ దగ్గర ఆఫీసులో కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాట్లను ప్రారంభించారు. ప్రమాద ప్రదేశంలో చేపట్టే సహాయక చర్యల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకుండా రోబోలను ఉపయోగించుకుంటున్నట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ తెలిపారు. సహాయక చర్యల్లో కావాల్సిన సామగ్రితోపాటు సహాయక బృందాలు మరోమారు కాడవర్ డాగ్స్ ప్రమాద ప్రదేశానికి వెళ్లాయని తెలిపారు. సమావేశంలో ప్రస్తుత సహాయక చర్యల పురోగతిని సమీక్షించి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. టన్నెల్ సహాయక చర్యలలో అనుసరించాల్సిన విధివిధానాలు, రోబోటిక్స్, మెకానికల్ పరికరాల వినియోగం, మట్టి తొలగింపు ప్రక్రియ, భద్రతా చర్యలపై విస్తృతంగా చర్చించిన అధికారులు సహాయక చర్యలను మరింత వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. సమావేశంలో కలెక్టర్ బదావత్ సంతోష్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్వి రోబోటిక్స్, హైడ్రా, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వే తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి రోబోటిక్ సంస్థ ప్రతినిధులు కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాట్లు -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
నవాబుపేట: బైక్ అదుపు తప్పి కింద పడి తీవ్ర గాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. గత నెల 27న పత్తేపూర్కి చెందిన కమ్మరి శ్రీనివాస్చారి(40) అనే వ్యక్తి బైక్పై జిల్లా కేంద్రానికి వెళ్లాడు. పని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుండగా కాకర్లపహాడ్ సమీపంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావటంతో స్థానికులు 108 వాహనంలో జిల్లా ఆస్పత్రిలో చేర్పించి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి సోదరుడు కమ్మరి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కొప్పునూరులో మరొకరు.. చిన్నంబావి: పురుగుమందు తాగి చికిత్స పొందుతూ కోలుకోలేక ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కొప్పునూరులో చోటుచేసుకున్నట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. వివరాలు.. కొప్పనూరుకి చెందిన బంకుమిది నరసింహారెడ్డి (56) అనారోగ్య సమస్యలతో సోమవారం పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కొల్లపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నాగర్ కర్నూలు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బైక్పై నుంచి కిందపడి.. చిన్నచింతకుంట: మోటార్ సైకిల్ అదుపు తప్పి కిందపడి గాయాలపాలై చికిత్స పొందుతూ ఓ వ్యక్తి చెందినట్లు ఎస్ఐ రామ్లాల్నాయక్ తెలిపారు. వివరాలు.. మండలంలోని లక్ష్మీదేవ్పూర్కి చెందిన పల్లె పాగు ఆనందం(50) ఈ నెల 7న తన బైక్పై చిన్నచింతకుంటకు వచ్చాడు. కూరగాయలు తీసుకొని గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. మార్గమధ్యలో బైక్ అదుపు తప్పి కిందపడగా ఆనందంకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మహబూబ్నగర్ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం మృతి చెందాడు. మృతుడి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రధాన సమస్యలపై దృష్టి
అలంపూర్ రైతులు ప్రధానంగా సాగునీటిని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరు అందించడానికి మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి. అలాగే వంద పడకల ఆస్పత్రిని నిర్మించి ప్రారంభించినా.. ప్రస్తుతం వైద్య సేవలు అందించడం లేదు. దీంతో వైద్యం కోసం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అలాగే అసంపూర్తిగా ఉన్న రోడ్ల పనులు పూర్తి చేయాలని, అధ్వానంగా ఉన్న రోడ్ల ఆధునీకరణ అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తాను. – విజయుడు, ఎమ్మెల్యే, అలంపూర్ సాగునీరు, విద్య, వైద్యం గద్వాల నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టు గుడ్డెందొడ్డి జలాశయం సామర్థ్యం పెంపు, ర్యాలంపాడు మరమ్మతుతోపాటు జలాశయం పెంపుపై కూడా ప్రధానంగా ప్రస్తావిస్తాను. అదేవిధంగా మెడికల్ కాలేజీలో స్టాఫ్ నియామకం, జిల్లా ఆస్పత్రిని 500 బెడ్లకు పెంచాలని కోరుతాను. ఇదివరకే దీనిపై పలుమార్లు సీఎం, సంబంధిత మంత్రులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు వ్యక్తిగతంగా లేఖలు రాశాను. అసెంబ్లీ సమావేశాల్లో వీటిపైనే మరోసారి ప్రస్తావించి ప్రభుత్వ సాయంతో వీటిని సాధించేలా కృషి చేస్తాను. – బండ్ల కృష్ణమోహన్రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల -
గళం విప్పుతాం.. నిధులు రాబడతాం
పరిశ్రమల ఏర్పాటు కోసం పేట నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించవచ్చు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణం, నియోజకవర్గంలో ప్రైవేట్ అద్దె భవనాల్లో కొనసాగుతున్న డిగ్రీ, జూనియర్ ప్రభుత్వ కళాశాలలకు సొంత భవనాలకు నిధులు కావాలని, ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా ప్రాజెక్టుల రూపకల్పన చేయాలని కోరుతాను. – చిట్టెం పర్ణికారెడ్డి, ఎమ్మెల్యే, నారాయణపేట ముంపు గ్రామాలపై.. మక్తల్ నియోజవర్గంలో ఏళ్ల తరబడిగా ముంపు గ్రామాల ప్రజల సమస్యలు తీరడం లేదు. ఈ సమస్యలను తీర్చాలని అసెంబ్లీలో చర్చిస్తా. జూరాల బ్యాక్ వాటర్లో ముంపునకు గురైన అనుగొండ, గడ్డంపల్లి, దాదాన్పల్లి, అంకేన్పల్లి గ్రామాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. సంగంబండ, భూత్పుర్ రిజర్వాయర్ కింద ముంపునకు గురైన ఉజ్జెల్లి, గార్లపల్లి, నేరడుగం, భూత్పుర్లో ఊట నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అసెంబ్లీలో చర్చించి శాశ్వత పరిష్కారానికి కృషిచేస్తా. – వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే, మక్తల్అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో నెలకొన్న దీర్ఘకాల సమస్యలు, ప్రాజెక్టుల నిర్మాణాలు, సాగునీటి సరఫరా, నిర్వాసితుల నష్టపరిహారం, రోడ్ల విస్తరణ, విద్యాసంస్థలు, పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన తదితర వాటిపై తమ గళం వినిపించి పరిష్కారానికి కృషిచేస్తామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం నిర్వహించేది బడ్జెట్ సమావేశాలు కావడంతో అధికంగా నిధులు మంజూరుకు కృషిచేస్తామని పేర్కొన్నారు. – సాక్షి నెట్వర్క్ -
నిధుల కేటాయింపు..
అసెంబ్లీ సమావేశాల్లో విద్య, వైద్యం, ఉపాధి కల్పనపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా. నూతనంగా ఏర్పడిన మహబూబ్నగర్ కార్పొరేషన్కు ప్రత్యేక నిధుల కేటాయింపు, ఏదైనా ఉన్నత విద్యా సంస్థ మంజూరు, విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన, జిల్లాలో పరిశ్రమలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు, ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం, పెద్ద గ్రామాల్లో హెల్త్సెంటర్ల ఏర్పాటు గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. – యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్నగర్ -
‘కల్వకుర్తి’ని పూర్తి చేయడమే ధ్యేయం
నియోజకవర్గ రైతులకు వరప్రదాయిని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం. ఈ ప్రాజెక్టు ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని, డిస్ట్రిబ్యూటరీ కాల్వలు పూర్తి చేయాలని శాసనసభలో ప్రభుత్వాన్ని కోరుతాను. దీంతోపాటు విద్య, వైద్యం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించడంతోపాటు.. మంజూరైన పనులకు టెండర్లు వేయాలని ప్రభుత్వాన్ని కోరుతా. అలాగే ఇప్పటికే మంజూరైన రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని సభ దృష్టికి తీసుకెళ్తాను. – కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే, కల్వకుర్తి -
గొల్లపల్లి రిజర్వాయర్ప్రతిపాదనలపై..
నియోజకవర్గంలో మరో పదివేల ఎకరాలకు సాగునీరందించేందుకు రేవల్లి మండలం గొల్లపల్లి వద్ద నూతనంగా మినీ రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రతిపాదనను ప్రభుత్వానికి అందజేశాం. ఈ అంశంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. ఇప్పటికే కేఎల్ఐ, భీమా, జూరాల సాగునీటి కాల్వలతో చాలా మేరకు సాగునీరు అందుతుంది. ప్రభుత్వం, ఫారెస్ట్ అధికారుల నుంచి అనుమతులు లభిస్తే గొల్లపల్లి రిజర్వాయర్ పనులు వేగంగా పూర్తిచేస్తాం. రింగ్ రోడ్డు, సాగునీటి కాల్వల పనులు పెండింగ్లో ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న 2,713 మంది రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని విన్నవిస్తాం. – తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి -
కంపుకొడుతున్న కాలనీలు
డ్రెయినేజీలు అస్తవ్యస్తం ● దోమలు, ఈగలకు ఆవాసంగామురుగు కాల్వలు ● వివిధ డివిజన్లలో దుర్వాసనతో ప్రజల నరకయాతన ● ముక్కు మూసుకుని వెళ్తున్న వైనం ● పట్టించుకోని మున్సిపల్ అధికారులు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో చాలా చోట్ల డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇన్నాళ్లు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్నగర్ కాస్తా ఇటీవల కార్పొరేషన్గా మారింది. స్థాయి పెరిగినా కొత్తగా ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో నగర పరిధిలోని 49 డివిజన్లలో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. వాస్తవానికి మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం గత జనవరి 26న ముగిసి ప్రత్యేక అధికారి పాలనలోకి వచ్చినా ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదు. ముఖ్యంగా మురుగుకాల్వలు కంపు కొడుతున్నాయి. ఏ వీధి చూసినా చిన్న, చిన్న కాల్వలతో మురుగు పేరుకుపోయి పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. మర్లు, శాంతినగర్, విఘ్నేశ్వరకాలనీ తదితర ప్రాంతాల్లో అన్నీ చిన్న గల్లీలే ఉన్నాయి. చాలాచోట్ల డ్రెయినేజీలు కనిపించవు. ఎవరికి వారు ఇళ్ల యజమానులు మురుగు కాల్వలు తాత్కాలికంగా నిర్మించినవే ఉన్నాయి. దీంతో దుర్గంధం మధ్య సహవాసం చేస్తున్నామని స్థానికులు వాపోతున్నారు. 13 ఏళ్ల క్రితం మున్సిపాలిటీలో కలిసిన అప్పన్నపల్లి, ఎనుగొండ, ఎదిర, పాలకొండ, క్రిష్టియన్పల్లి, బండమీదిపల్లి, చిన్నదర్పల్లి, బోయపల్లి, దొడ్డలోనిపల్లి, తిమ్మసానిపల్లితో పాటు ఇటీవల కార్పొరేషన్లో విలీనమైన జైనల్లీపూర్, దివిటిపల్లిలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆయా గ్రామాలలో డ్రెయినేజీలు ఎక్కడా సరిగా లేవు. ఎక్కడికక్కడ రోడ్లపై మురుగు పారుతుండటంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇన్నేళ్లయినా మున్సిపల్ అధికారులు డ్రెయినేజీ నిర్మాణం గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మంగళవారం పలు డివిజన్లను ‘సాక్షి’ పరిశీలించగా ఈ విషయాలు వెలుగు చూశాయి. ఎవరూ పట్టించుకోరు.. మా ప్రాంతంలో ఇళ్ల మధ్య నుంచి ప్రవహిస్తున్న పెద్ద కాల్వతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నెలకోసారి మాత్రమే అందులోని చెత్తను పారిశుద్ధ్య కార్మికులు తొలగిస్తున్నారు. డ్రెయినేజీ నిర్మించాలని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం దక్కలేదు. ఎస్సీ కమ్యూనిటీ హాలు మొదలుకుని రైసా మసీదు వరకు అటు, ఇటు మోరీలు నిర్మించకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు, ఈగల సైర విహారంతో తరచూ రోగాల బారిన పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. – కౌకుంట్ల మహేష్, పాతపాలమూరు మురుగుతో దుర్గంధం మా ఇంటి ముందున్న చౌరస్తాలో మురుగు ఏరులైపారుతోంది. గట్టు ప్రాంతంలో నివసిస్తున్న ఇళ్లవారు కిందికి అలాగే మురుగును బయటకు వదిలేస్తున్నారు. డ్రెయినేజీ నిర్మించాలని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఉపయోగం లేదు. అప్పట్లో మున్సిపల్ కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులు వచ్చి చూసి పోయారు. ఎగువ నుంచి దిగువకు కొంత దూరం సీసీరోడ్డును తొలగించి అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మిస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. – వారాల కృష్ణ, కృష్ణ టెంపుల్చౌరస్తా, పద్మావతికాలనీ ● -
ఎల్ఆర్ఎస్ఎంతవరకు వచ్చింది?
● ఆర్పీలతో ఆరా తీసిన స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ● మున్సిపల్ కార్యాలయంలో మరో హెల్ప్లైన్ సెంటర్ మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ‘జిల్లా కేంద్రంలో ఎల్ఆర్ఎస్ ఎంతవరకు వచ్చింది.. నిత్యం దరఖాస్తుదారులకు ఫోన్లు చేస్తున్నారా? లేదా?.. వారి నుంచి సరైన స్పందన ఎందుకు రావడం లేదు’ అని ఆర్పీలతో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఆరా తీశారు. మంగళవారం మహబూబ్నగర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణ లోని మెప్మా భవనంలో ఆర్పీలతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెలాఖరు వరకే ఎల్ఆర్ఎస్కు గడువు ఉందన్నారు. వీలైనంత వరకు ఎక్కువ మంది దరఖాస్తుదారులతో ఫోన్లో మాట్లాడి అవగాహన కల్పించి పూర్తి ఫీజు చెల్లించేలా చూడాలన్నారు. కేవలం 20 రోజులే మిగిలిందని, 25 శాతం రాయితీ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాగా, సమావేశానికి ఆలస్యంగా హాజరైన ఆర్పీలనుద్దేశించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇక దరఖాస్తుదారులకు సంబంధించిన నమోదు రికార్డుల తనిఖీతో పాటు ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేశారా? లేదా? అని ర్యాండమ్గా కొందరి ఫోన్లలో వివరాలు పరిశీలించారు. అనంతరం టౌన్ ప్లానింగ్ విభాగం, పౌరసేవా కేంద్రాన్ని పరిశీలించి ఎల్ఆర్ఎస్పై సిబ్బందికి తగు సూచనలిచ్చారు. అలాగే రూంనం.2లో మరో హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో మెప్మా ఇన్చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు వరలక్ష్మి, నిర్మల, దేవమ్మ, ఆంజనేయులు, టీపీఎస్ విశాల్కుమార్, సీనియర్ అటౌంటెంట్ ఇందిర తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.7,061 జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్లో మంగళవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.7,061, కనిష్టంగా రూ.5,649 ధరలు లభించాయి. అదేవిధంగా కందులు గరిష్టంగా రూ.6,930, కనిష్టంగా రూ.4,656, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,337, కనిష్టంగా రూ.2,051, ఆముదాలు రూ.5,873, రాగులు రూ.4,211, మినుములు రూ.7,117, పొద్దుతిరుగుడు రూ.4,316 పలికాయి. -
పీయూలో 27, 28 తేదీల్లో వర్క్షాప్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 27, 28 తేదీల్లో ఎంబీఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రీసెర్చ్ మెథడాలజీ, ప్రాజెక్టుపై రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్ను ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎంబీఏ చివరి సంవత్సరం విద్యార్థులకు ఈ వర్క్షాప్ ఎంతో ఉపయోగకరం అని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ చెన్నప్ప, ప్రిన్సిపాల్ మధుసూదన్రెడ్డి, కన్వీనర్ అర్జున్కుమార్, కో కన్వీనర్ నాగసుధ, జావిద్ఖాన్, అరుంధతి, గాలెన్న తదితరులు పాల్గొన్నారు. 31 లోగా చెల్లించి రాయితీ పొందండి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న ప్లాట్ యజమానులు మార్చి 31లోగా క్రమబద్ధీకరణ రుసుం చెల్లిస్తే ప్రభుత్వం 25 శాతం రాయితీ కల్పించినట్లు కలెక్టర్ విజయేందిర మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎల్ఆర్ఎస్కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కలెక్టరేట్ టోల్ ఫ్రీ నంబర్ 08542–241165, మహబూబ్నగర్ నగర పాలక సంస్థలో హెల్ప్లైన్ నంబర్ 7093911352ను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమాచారం పొందవచ్చని ప్లాటు యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. 2020 ఆగస్టు 26 నాటికి లేఔట్లో 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయితే మిగిలిన వాటికి కూడా ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరణ అవకాశం కల్పించినట్లు తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ ద్వారా నిర్ణీత నమూనాలో నూతన దరఖాస్తులు స్వీకరించి ఎల్ఆర్ఎస్ కోసం మున్సిపల్ శాఖకు వివరాలు పంపించి క్రమబద్ధీకరిస్తారని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణాను అరికట్టాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): సమాజంలో జరుగుతున్న మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని డీఆర్డీఓ నర్సిములు అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా మహిళా సమాఖ్య భవనంలో మానవ అక్రమ రవాణా నివారణపై ఏపీఎంలు, సీసీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా, శ్రమ దోపిడీ, లైంగిక దోపిడీపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. పని ఉందని మాయమాటలు చెప్పి నిర్మానుష ప్రదేశాలకు తీసుకుపోయి లైంగికదాడికి గురిచేస్తే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరిపైనా అనుమానాలు వస్తే వెంటనే పోలీసులకు 100 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. శిక్షణ పొందిన ఏపీఎంలు సీసీలు స్థానికంగా ఉంటే వీఓలకు అవగాహన కల్పిస్తారని కోరారు. కార్యక్రమంలో డీపీఎం ఆలూరి చెన్నయ్య టీఓటీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల ఖరారు తర్వాతే ఫలితాలివ్వాలి మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి, వాటిని ఖరారు చేసే వరకు గ్రూప్–1, 2, 3 ఫలితాలను ప్రకటించవద్దని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పీయూ మెయిన్ గేట్ వద్ద మంగళవారం చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్న కొంత మంది స్వార్థపరుల ఒత్తిడి మేరకు మాదిగ విద్యార్థుల భవిష్యత్ను దెబ్బతీయాలన్న కుట్రతో ముందస్తుగా గ్రూప్స్ ఫలితాలను విడుదల చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణలో ఏబీసీడీ వర్గీకరణ అనంతరం మాత్రమే ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతామని ప్రభుత్వం చెబుతూనే ఫలితాల విడుదలకు కసరత్తు చేయడం బాధాకరమని, రిజర్వేషన్ల బిల్లు పెట్టి వర్గీకరణ చేసే వరకు నిరసన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్పీ అధ్యక్షుడు టైగర్ అంజయ్య, వీరస్వామి, జేఏసీ చైర్మన్ రాము, దాసు, శ్రీను, రవితేజ, రాము, నాగేందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
SLBC Tunnel: టన్నెల్లోకి ప్రవేశించిన రోబోలు
సాక్షి, నాగర్కర్నూల్/మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 18వ రోజు కొనసాగుతోంది. సహాయ చర్యల్లోకి రోబోలతో పాటు వాటి బృందాలు అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. నేడు ఒకటో, రెండో మృతదేహాలు బయటపడే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం అన్వి రోబో బృందంతో పాటు మొదటి షిప్ట్లో 110 మంది ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోకో ట్రైన్లో బృందాలు టన్నెల్ లోపలికి వెళ్లాయి. టన్నెల్ నుంచి ఇప్పటికే ఒక మృతదేహాన్ని వెలికితీశారు. మిగిలిన ఏడుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. మినీ జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు.ఇప్పటికే 14 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా.. సింగరేణి కారి్మకులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. సొరంగం లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా వచ్చిన కాడవర్ డాగ్స్ తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. జీపీఆర్, కాడవర్ డాగ్స్ చూయించిన ప్రదేశంలోనే ప్రధానంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆదివారం రాబిన్స్ కంపెనీలో టీబీఎం ఆపరేటర్గా పనిచేస్తున్న గురుప్రీత్సింగ్ మృతదేహం లభించింది. దీంతో మిగతా 7 మంది కోసం సహాయక బృందాలు అన్వేషణను ముమ్మరం చేశాయి. టీబీఎం విడి భాగాలను తొలగిస్తూనే ఆ ఏడు మంది కోసం సొరంగంలో గాలిస్తున్నారు. స్థానిక యంత్రాంగం గంటగంటకూ సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు.ఎస్ఎల్బీసీ సొరంగంలో 13.850 కి.మీ. వద్ద ప్రమాదం చోటుచేసుకోగా, అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడమే రెస్క్యూ బృందాలకు ప్రతిరోజు క్లిష్టతరమవుతోంది. సొరంగంలో 13 కి.మీ. లోపల రెస్క్యూ నిర్వహించే సిబ్బందికి సైతం ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. 16 రోజుల పాటు నిరంతరం శ్రమించిన రెస్క్యూ బృందాలకు ఆదివారం ఒక కారి్మకుడి మృతదేహం లభ్యమైంది. సమీపంలో గాలిస్తున్నా మిగతా వారి ఆచూకీ లభించడం లేదు. సోమవారం రెస్క్యూ బృందాలతో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్దకు ‘సాక్షి’ వెళ్లి పరిశీలించింది.సొరంగం ఇన్లెట్ నుంచి 13.850 కి.మీ. దూరంలో ఉన్న ప్రమాదస్థలం వద్దకు రెస్క్యూ బృందాలు చేరుకునేందుకే కనీసం 1.45 గంటలు పడుతోంది. లోకోట్రైన్ ద్వారా రాకపోకలకే కనీసం 3›–4 గంటలు పడుతోంది. ఒక్కో షిఫ్టులో సహాయక బృందాలు 12 గంటల పాటు పనిచేస్తున్నారు. సొరంగంలో 12 కి.మీ. వద్దకు చేరుకున్నాక సీపేజీ నీరు, బురద వస్తోంది. 13.200 కి.మీ. పాయింట్ వరకూ లోకో ట్రైన్ వెళ్లగలుగుతోంది. లోకో ట్రైన్ ట్రాక్ తర్వాత రెండు ఎస్కవేటర్లు మట్టి, శిథిలాలను తొలగిస్తున్నాయి.13.400 వద్ద టీబీఎం భాగాలు టన్నెల్ నిండా చిక్కుకుని ఉండగా, సహాయక బృందాలు లోపలికి వెళ్లేందుకు వీలుగా కుడివైపు నుంచి మిషిన్ భాగాలను కట్చేసి దారిని ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి ప్రమాదస్థలం 13.850 వరకూ కాలినడకన బురద, శిథిలాల మధ్య జాగ్రత్తలు పాటిస్తూ చేరుకోవాల్సి ఉంటుంది. సొరంగానికి కుడివైపున కన్వేయర్ బెల్టు అందుబాటులోకి తీసుకురాగలిగారు. సుమారు 150 మీటర్ల విస్తీర్ణంలో 15 ఫీట్ల ఎత్తులో టన్నెల్ నిండా మట్టి, బురద పేరుకుని ఉండటంతో వాటిని తొలగించేందుకు రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో కడావర్ డాగ్స్ సూచించిన ప్రాంతాల్లోనే తవ్వకాలను జరిపి కార్మికుల జాడ కోసం అన్వేషణ చేపడుతున్నారు.సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో గురుప్రీత్సింగ్ మృతదేహం లభ్యమైన ప్రదేశంలో పక్కనే ఆదివారం, సోమవారం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కేరళ నుంచి వచ్చిన కడావర్ డాగ్స్, జీపీఆర్ సిస్టం ద్వారా గుర్తించిన డీ1, డీ2 లొకేషన్లలో సింగరేణి కార్మికులు, ర్యాట్ హోల్ మైనర్లు, ఇతర సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సోమవారం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ పలు సూచనలు చేశారు. మంగళవారం సొరంగం వద్ద సహాయక చర్యల్లో భాగంగా రోబోలు రంగంలోకి దిగనున్నాయి. హైదరాబాద్కు చెందిన అన్వి రోబో నిపుణులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించనున్నారు. -
సెర్ప్లో.. మెప్మా విలీనం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల్లో రుణాలు ఇప్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న మెప్మా.. ఇక నుంచి డీఆర్డీఏలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో విలీనం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో పాటు ఇటీవల నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడగానే జిల్లాలోని మహబూబ్నగర్, భూత్పూర్, జడ్చర్ల, దేవరకద్ర మున్సిపాలిటీల్లోని మెప్మా ఉద్యోగులు, సిబ్బందితో పాటు జిల్లాకేంద్రంలోని మెప్మా జిల్లా కార్యాలయం ఉద్యోగులు అందరూ సెర్ప్ పరిధిలోకి వెళ్లనున్నారు. పట్టణాల్లో సర్వేలకు ఇబ్బందే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు, ఇతరత్రా పనులను క్షేత్రస్థాయిలో మెప్మా ఆర్పీలు సీఓలు సర్వే చేస్తుంటారు. మెప్మా ఆర్పీలకు కాలనీల్లో ఉండే వివరాలు తేలికగా తెలిసే అవకాశం ఉంటుందని.. ప్రతి సర్వేకు వారి సేవలను వినియోగించుకున్నారు. ఇక నుంచి వారు ఇతర శాఖ పరిధిలోకి వెళ్తే.. మున్సిపాలిటీ సేవలకు వారు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రభుత్వం చేపట్టే సర్వే చేయాలంటే ఇక నుంచి మున్సిపల్ యంత్రాంగానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మర్గదర్శకాలు రాలేదు.. డీఆర్డీఏలో మెప్మాను విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఇప్పటి దాక మాకు ఎలాంటి మర్గదర్శకాలు రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే మార్గ దర్శకాల మేరకు నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి డీఆర్డీఏ, మెప్మాలు వేరువేరుగా విదులు నిర్వహిస్తున్నాయి. – నర్సిములు, డీఆర్డీఏ ఒకే గొడుగు కిందికి రానున్న మహిళా సంఘాలు డీఆర్డీఏ పరిధిలోకి రిసోర్స్పర్సన్లు ప్రతిపాదనలు రూపొందించిన ప్రభుత్వం -
మిగిలింది 20 రోజులే..
నారాయణపేట: మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతోపాటు ఆస్తి పన్నుల రాబడితో పట్టణాల్లో ప్రగతి పరుగులు పెడుతుంది. మున్సిపాలిటీల్లోని నివాసగృహాలు, వాణిజ్య సముదాయ భవనాలకు 2024– 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తిపన్ను వసూలుపై మున్సిపల్ అధికార యంత్రాంగం డిజిటల్ చెల్లింపు (టెక్నాలజీ)లపై దృష్టిసారించింది. క్యూఆర్ కోడ్ స్కాన్, డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాట్సప్ నంబర్, ఏటీఎం ద్వారా నేరుగా ఆయా మున్సిపాలిటీ ఖాతాల్లో జమ చేయవచ్చని చెబుతోంది. అయితే ప్రభుత్వం చేపట్టిన సర్వేలతోనే మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లకు అధికారులు ఒక అడుగు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి పడినట్లు చెబుతున్నారు. అయితే మున్సిపాలిటీల్లో ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వసూలు అంతంత మాత్రమే ఉండటం.. టార్గెట్ చేరుకునేందుకు కేవలం 20 రోజులే ఉండటంతో అధికారులు సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. 80 శాతంతో నాలుగో స్థానం.. రాష్ట్రస్థాయిలో పన్నులు వసూలు చేయడంలో ఉమ్మడి జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ నాలుగో స్థానంలో నిలిచింది. సుమారు 4 వేల ఆస్తులకు రూ.98 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటికే రూ.78 లక్షలు (80 శాతం) వసూలు చేశారు. అదనపు కలెక్టర్లకు బాధ్యతలు.. ఈ ఏడాది జనవరి 26తో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో అదనపు కలెక్టర్లు (లోకల్ బాడీస్) ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు అప్పగించింది. వీరు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూళ్లపై ఎప్పటికప్పుడు మున్సిపల్ రెవెన్యూ, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, కమిషనర్లకు ఆదేశాలు ఇస్తున్నారు. వారం రోజులుగా ప్రత్యేక దృష్టిసారిస్తూ రోజూవారిగా పన్నుల వసూళ్లపై నివేదిక తెప్పించుకుంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూళ్లకు మిగిలింది కేవలం 20 రోజులేనని.. అంతలోపే లక్ష్యం చేరుకోవాలని ప్రత్యేకాధికారులు మున్సిపల్ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్తి, నీటి పన్ను చెల్లింపులు, రివిజన్ పిటిషన్ సహా ఇతర సమస్యల పరిష్కా రం కోసం సోమ, గురువారాల్లో ఉద యం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మున్సి పాలిటీల్లో రెవెన్యూమేళా నిర్వహించేందుకు చర్యలు చేప ట్టారు. ఈ మేళా ద్వారా ప్రజలకు అ నేక రకాల సేవలు అందుబాటులో ఉంటాయని అధికారు లు చెబుతున్నారు. మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి, నీటి పన్ను చెల్లింపులు, ఇతర సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. ప్రాపర్టీ పేరు మార్పు, మ్యూటేషన్, ఇంటి నంబర్ కేటాయింపు లేదా మార్పు వంటి సేవలు పొందవచ్చు. రాష్ట్రస్థాయిలో 63వ స్థానం.. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీలో 5,332 ఆస్తులకు రూ. 1.94 కోట్లు వసూలు చేయా ల్సి ఉండగా.. ఇప్పటి వరకు రూ.1.10 కోట్లు (57 శాతం) వసూలు చేశా రు. దీంతో ఈ మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో 63వ స్థానంలో నిలిచింది. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లపూర్లో సైతం 6,406 ఆస్తుల కు రూ.1.28 కోట్లకు రూ.72 లక్షలు వసూలు (56 శాతం) చేశారు. ఈ మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో 68వ స్థానంలో నిలిచింది. మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్లు అంతంతే సీఎం ఇలాఖాలో 57 శాతమే వసూలుతో రాష్ట్రస్థాయిలో 63వ స్థానం ఉమ్మడి జిల్లాలో వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లే దిక్కు ప్రత్యేకంగా సోమ, గురువారాల్లో రెవెన్యూ మేళాలు గడువు నేపథ్యంలో పరుగులు పెట్టిస్తున్న ప్రత్యేకాధికారులు -
ఆహార భద్రతకు పకడ్బందీ చర్యలు
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): జిల్లాలో సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించి ఆహార భద్రతకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలెక్టర్ చైర్మన్గా వివిధ శాఖల అధికారులతో జిల్లా ఆహార భద్రత సలహా మండలి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కమిటీలో రెవెన్యూ అదనపు కలెక్టర్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి, వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ, పరిశ్రమలశాఖ జీఎంలు, డీఈఓ, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఫుడ్ ఇన్స్పెక్టర్ తదితరులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఆహార భద్రత చట్టం అనుసరించి జిల్లాలో ఆహార భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. జిల్లాకు నూతనంగా రీజనల్ ఫుడ్ లేబరేటరీ, ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వెహికల్ కూడా రాబోతుందని పేర్కొన్నారు. వీటి ద్వారా జిల్లాలో మరింత మెరుగ్గా ఆహార కల్తీ నిరోధానికి పాటుపడాలని, ప్రభుత్వ పాఠశాలల్లో, వసతిగృహాల్లో, గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పాఠశాలల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి పరీక్షించాలని, రక్తహీనత, ఐరన్ లోపం ఉన్న వారికి తగు చికిత్స అందించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మోహన్రావు, శివేంద్ర ప్రతాప్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మనోజ్, డీఈఓ ప్రవీణ్ కుమార్, అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ శశికాంత్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి జరీనా బేగం, తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్యపై దృష్టి సారించాలి జిల్లాలో తాగునీటి సమస్య, విద్యుత్ సరఫరాపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. కలెక్టరేట్లో జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో తాగునీటి సమస్య, విద్యుత్ సరఫరాలో సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. భూగర్భ జల వనరులు తగ్గినా పంటలు ఎండిపోకుండా రెవెన్యూ, వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా కలిసి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. -
మహబూబ్నగర్కే ఎక్కువ నిధులా?
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ముడా నుంచి జిల్లాలోని మహబూబ్నగర్ నియోజకవర్గానికే ఎక్కువ నిధులు కేటాయిస్తే ఎలా అని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అధికారులను ప్రశ్నించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక ముడా కార్యాలయంలో చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిగతా నియోకవర్గాలకూ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇక నుంచి మహబూబ్నగర్ (పరిగి నియోజవకర్గంలోని రెండు మండలాలు కలుపుకొని)కు 40 శాతం, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలకు 30 శాతం చొప్పున మంజూరు చేస్తే బాగుంటుందన్నారు. అందుకు వైస్ చైర్మన్ డి.మహేశ్వర్రెడ్డి అంగీకారం తెలిపారు. ఇక గతంలోనూ మహబూబ్నగర్కు తప్పా ఇతర నియోజకవర్గాలకు అసలు కేటాయింపులే జరగలేదని ఆయన వాపోయారు. జిల్లాకేంద్రంలోని పది పార్కుల అభివృద్ధికి అయ్యే రూ.3.30 కోట్లను కేవలం మున్సిపల్ కార్పొరేషన్ నిధుల నుంచి కేటాయించాలన్నారు. ఇదివరకే చేపట్టిన పనుల్లో తన నియోజకవర్గంలో 34 పెండింగ్లో ఉన్నాయని, ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతోందన్నారు. కాగా, జిల్లాలో ఏఈల కొరత తీవ్రంగా ఉందని, చాలా చోట్ల డిప్యూటేషన్పై పని చేస్తున్నందున ఈ పరిస్థితి నెలకొందని పబ్లిక్ హెల్త్ ఈఈ విజయభాస్కర్రెడ్డి బదులిచ్చారు. ముడాకు ప్రత్యేకంగా ఈఈ, ఇద్దరు డీఈఈలు, నియోజవర్గానికి ఒక్కొక్కరు చొప్పున ఏఈ పోస్టులు కేటాయిస్తే పనులు త్వరగా చేపట్టడానికి వీలవుతుందని సమావేశం దృష్టికి తెచ్చారు. కాగా, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి, ముడా పాలకవర్గం అమోదంతో రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సూచించారు. కేటాయింపులు ఇలా.. ఇక మహబూబ్నగర్ నియోజకవర్గానికి రూ.14,05,06,000లతో 108 పనులు, జడ్చర్లకు రూ.8,21,50,000లతో 142, దేవరకద్రకు రూ.8,20,00,000లతో 192, పరిగి నియోజకవర్గంలోని మహమ్మదాబాద్, గండేడ్ మండలాలకు రూ.1,54,10,000లతో 77 పనులు (ఇలా మొత్తం రూ.32,00,66,000) చేపట్టేందుకు ప్రతిపాదనలు చేయగా పాలకవర్గం ఆమోదం తెలిపింది. అలాగే కార్పస్ఫండ్ కింద ముడాకు రూ.500 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని తీర్మానించింది. జిల్లాకేంద్రంలోని బైపాస్, భూత్పూర్ రోడ్డు, ఎన్హెచ్–167లపై ఐదు చోట్ల మొక్కల పెంపకం, సంరక్షణకు గాను నిర్వహణ ఖర్చుల కింద రూ.1.84 కోట్లు కేటాయించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, అనిరుధ్రెడ్డి, చిట్టెం పర్ణికారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని మిగతా నియోకవర్గాలకూ ప్రాధాన్యం ఇవ్వాలి పార్కుల అభివృద్ధిని మున్సిపల్ కార్పొరేషన్ చూసుకోవాలి ముడా సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి -
ఆ ఏడుగురి కోసం అన్వేషణ
ఆ చోటనే గాలింపు సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో గురుప్రీత్సింగ్ మృతదేహం లభ్యమైన ప్రదేశంలో పక్కనే ఆదివారం, సోమవారం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కేరళ నుంచి వచ్చిన కడావర్ డాగ్స్, జీపీఆర్ సిస్టం ద్వారా గుర్తించిన డీ1, డీ2 లొకేషన్లలో సింగరేణి కార్మికులు, ర్యాట్ హోల్ మైనర్లు, ఇతర సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సోమవారం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ పలు సూచనలు చేశారు. మంగళవారం సొరంగం వద్ద సహాయక చర్యల్లో భాగంగా రోబోలు రంగంలోకి దిగనున్నాయి. హైదరాబాద్కు చెందిన అన్వి రోబో నిపుణులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించనున్నారు. సాక్షి, నాగర్కర్నూల్ /అచ్చంపేట రూరల్: దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి కోసం 17 రోజులుగా చేపడుతున్న సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిలో ఒకరి మృతదేహం ఆదివారం లభించడంతో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. ఇప్పటికే 14 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటుండగా.. సింగరేణి కార్మికులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. సొరంగం లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా వచ్చిన కాడవర్ డాగ్స్ తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. జీపీఆర్, కాడవర్ డాగ్స్ చూయించిన ప్రదేశంలోనే ప్రధానంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆదివారం రాబిన్స్ కంపెనీలో టీబీఎం ఆపరేటర్గా పనిచేస్తున్న గురుప్రీత్సింగ్ మృతదేహం లభించింది. దీంతో మిగతా 7 మంది కోసం సహాయక బృందాలు అన్వేషణను ముమ్మరం చేశాయి. టీబీఎం విడి భాగాలను తొలగిస్తూనే ఆ ఏడు మంది కోసం సొరంగంలో గాలిస్తున్నారు. స్థానిక యంత్రాంగం గంటగంటకూ సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. సహాయక చర్యలకు అన్నీ సవాళ్లే.. ఎస్ఎల్బీసీ సొరంగంలో 13.850 కి.మీ. వద్ద ప్రమాదం చోటుచేసుకోగా, అక్కడి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడమే రెస్క్యూ బృందాలకు ప్రతిరోజు క్లిష్టతరమవుతోంది. సొరంగంలో 13 కి.మీ. లోపల రెస్క్యూ నిర్వహించే సిబ్బందికి సైతం ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. 16 రోజుల పాటు నిరంతరం శ్రమించిన రెస్క్యూ బృందాలకు ఆదివారం ఒక కార్మికుడి మృతదేహం లభ్యమైంది. సమీపంలో గాలిస్తున్నా మిగతా వారి ఆచూకీ లభించడం లేదు. సోమవారం రెస్క్యూ బృందాలతో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్దకు ‘సాక్షి’ వెళ్లి పరిశీలించింది. సొరంగం ఇన్లెట్ నుంచి 13.850 కి.మీ. దూరంలో ఉన్న ప్రమాదస్థలం వద్దకు రెస్క్యూ బృందాలు చేరుకునేందుకే కనీసం 1.45 గంటలు పడుతోంది. లోకోట్రైన్ ద్వారా రాకపోకలకే కనీసం 3–4 గంటలు పడుతోంది. ఒక్కో షిఫ్టులో సహాయక బృందాలు 12 గంటల పాటు పనిచేస్తున్నారు. సొరంగంలో 12 కి.మీ. వద్దకు చేరుకున్నాక సీపేజీ నీరు, బురద వస్తోంది. 13.200 కి.మీ. పాయింట్ వరకూ లోకో ట్రైన్ వెళ్లగలుగుతోంది. లోకో ట్రైన్ ట్రాక్ తర్వాత రెండు ఎస్కవేటర్లు మట్టి, శిథిలాలను తొలగిస్తున్నాయి. 13.400 వద్ద టీబీఎం భాగాలు టన్నెల్ నిండా చిక్కుకుని ఉండగా, సహాయక బృందాలు లోపలికి వెళ్లేందుకు వీలుగా కుడివైపు నుంచి మిషిన్ భాగాలను కట్చేసి దారిని ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి ప్రమాదస్థలం 13.850 వరకూ కాలినడకన బురద, శిథిలాల మధ్య జాగ్రత్తలు పాటిస్తూ చేరుకోవాల్సి ఉంటుంది. సొరంగానికి కుడివైపున కన్వేయర్ బెల్టు అందుబాటులోకి తీసుకురాగలిగారు. సుమారు 150 మీటర్ల విస్తీర్ణంలో 15 ఫీట్ల ఎత్తులో టన్నెల్ నిండా మట్టి, బురద పేరుకుని ఉండటంతో వాటిని తొలగించేందుకు రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో కడావర్ డాగ్స్ సూచించిన ప్రాంతాల్లోనే తవ్వకాలను జరిపి కార్మికుల జాడ కోసం అన్వేషణ చేపడుతున్నారు. సొరంగంలో కాడవర్ డాగ్స్ స్క్వాడ్ ప్రమాద స్థలంలో గుర్తించిన డీ2 పాయింట్ వద్ద సింగరేణి బృందాలు టన్నెల్లో కాడవర్ డాగ్స్తో గాలింపు ముమ్మరం కీలకంగా వ్యవహరిస్తున్న సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్లు ఇప్పటికే ఒక కార్మికుడి మృతదేహం లభ్యం ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న సహాయక చర్యలు అభినందనల వెల్లువ.. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో ఒకరి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చిన సహాయక బృందాలను ప్రజాప్రతినిధులు, వివిధ విపత్తుల ఉన్నతాధికారులు అభినందించారు. సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గురుప్రతీసింగ్ మృతిచెందడం బాధాకరమని, తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మున్ముందు జరగబోయే సహాయక చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్ఫూర్తితో మిగిలిన సహాయక చర్యలను మరింత వేగంగా, సమర్థవంతంగా కొనసాగించాలని సూచించారు. సహాయక బృందాలు పూర్తిస్థాయిలో పాల్గొని పనులను వేగంగా ముగించాలని ఆదేశించారు. అలాగే టన్నెల్ వద్ద సహాయక సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. సహాయక చర్యల్లో పాల్గొనే బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. సమావేశంలో ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్, ర్యాట్ మైనర్స్, దక్షిణ మధ్య రైల్వే, కేరళకు చెందిన కాడవర్ డాగ్స్ స్క్వాడ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
కొత్తపల్లి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు మద్దూర్ ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం గుర్మిట్కాల్కు బొలెరోలో తరిలిస్తున్నట్లు సమాచారం అందింది. సోమవారం తెల్లవారుజామున కొత్తపల్లి మండలం భూనీడు గ్రామ శివారులో వాహనంలో బియ్యాన్ని గుర్తించి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈవిషయమై కోస్గి ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారమివ్వగా పట్టుబడిన బియ్యాన్ని పంచనామా నిర్వహించారు. వాహనంలో 57బస్తాలు 28 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. వాహనాన్ని పోలీసులకు అప్పగించి డ్రైవర్ పరశురాం, యజమానికి శ్రీనివాస్ఐ కేసు నమోదుచేశారు. ఈ బియ్యం దేవరకద్ర మండలం పూసలపహాడ్ నుంచి కర్ణాటకకు తరలిస్తున్నట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
పెద్దకొత్తపల్లి: పంటకు నీరందించేందుకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన ఘటన పెద్దకొత్తపల్లి మండలం యాపట్ల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. యాపట్లకు చెందిన రైతు బక్కయ్యగౌడ్ (60)కు మూడెకరాల పొలం ఉండగా.. వేరుశనగ పంట సాగుచేశాడు. ఆదివారం రాత్రి పంటకు నీరందించేందుకు వెళ్లిన అతడు.. విద్యుత్ బోరుమోటారు ఆన్ చేస్తుండగా షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అతడికి భార్య కిష్టమ్మ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి కుమారుడు శివుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య అడ్డాకుల: మూసాపేట మండలం మహ్మదుస్సేన్పల్లికి చెందిన రైతు కుర్వ పూల మహేష్(39) పురుగుల మందు తాగిన ఘటనలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మూసాపేట ఎస్ఐ ఎం.వేణు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం...మహ్మదుస్సేన్పల్లి గ్రామానికి చెందిన మహేష్ ఐదేళ్ల క్రితం రూ.30 లక్షలు ఫైనాన్స్ తీసుకుని రెండు హార్వేస్టర్లు కొనుగోలు చేశాడు. వాటి ద్వారా నష్టం వాటిల్లడంతో వాటిని అమ్మేశాడు. తర్వాత గ్రామంలో కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేశాడు. పంటల సాగుకు చేసిన అప్పులు కూడా తీరకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెందిన మహేష్ ఈనెల 9న ఉదయం ఇంటి వద్ద పురుగుల మందును తాగాడు. కొద్దిసేపటికే గమనించిన తల్లి నారమ్మ వెంటనే జిల్లాకేంద్రంలోని ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆదివారం రాత్రి హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్ఐ ఎం.వేణు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిసింది. మృతుడి తల్లి నారమ్మ సోమవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. అన్నదమ్ముల గొడవలో తమ్ముడిపై కేసు నమోదు అడ్డాకుల: మండలంలోని తిమ్మాయిపల్లికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు పొలానికి నీళ్లు పెట్టుకునే క్రమంలో జరిగిన గొడవలో అన్నపై దాడి చేసిన తమ్ముడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. గ్రామానికి చెందిన బాలకిష్టయ్య ఆదివారం సాయంత్రం తన పొలానికి నీళ్లు పారిస్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వెళ్లిన తమ్ముడు రవి నీళ్లు పారించుకునే వంతుల విషయంలో గొడవపడ్డారు. ఈక్రమంలో రవి కర్రను తీసుకొని బాలకిష్టయ్యపై దాడి చేసి గాయపర్చాడు. దీంతో బాలకిష్టయ్య సోమవారం అడ్డాకుల ఠాణాలో ఫిర్యాదు చేశాడు. గాయపడిన బాలకిష్టయ్యను పోలీసులు ఆస్పత్రికి పంపించారు. తమ్ముడు రవిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఆన్లైన్లో పెట్టుబడి.. మోసపోయిన యువకుడు కొత్తకోట రూరల్: సైబర్ నేరాలపై పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. ఎక్కడో చోట ఆన్లైన్లో పెట్టుబడి పెట్టి మోసపోతున్న వారు వెలుగులోకి వస్తూనే ఉన్నారు. తాజాగా కొత్తకోటకు చెందిన ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. ఎస్ఐ ఆనంద్ వివరాల మేరకు.. కొత్తకోటకు చెందిన డి.ఉదయ్కుమార్ను ఈ నెల 3న గుర్తుతెలియ ని వ్యక్తి టెలిగ్రామ్ యాప్లో ‘బిట్ కై న్ ఇన్వెస్టర్’ గ్రూప్లో యాడ్ చేశారు. ఆ గ్రూప్లో ఒక లింక్ను పంపించి.. అందులో డబ్బులు పె ట్టుబడిగా పెడితే రెట్టింపు అవుతాయని చెప్పా రు. నమ్మిన ఉదయ్కుమార్.. అదే రోజు తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.70వేలు పెట్టుబడి పెట్టాడు. డబ్బులు పెద్ద మొత్తంలో రావడంతో సైబర్ నేరగాడు రాత్రికి రాత్రే ఆ టెలిగ్రామ్లో ఉన్న ఇన్వెస్టర్ గ్రూప్ మొత్తాన్ని తొలగించాడు. మోసపోయానని తెలుసుకున్న ఉదయ్కుమార్.. 1930కు కాల్ చేయడంతో పాటు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. నవజాత శిశువును కాపాడిన 108 సిబ్బంది నర్వ: నవజాత శిశువుకు 108 సిబ్బంది సీపీఆర్ చేసి కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని రాయికోడ్కు చెందిన గర్భిణి అఖిల మొదటి కాన్పు నిమిత్తం సోమవారం నర్వ పీహెచ్సీకి వచ్చింది. మధ్యాహ్నం సాధారణ ప్రసవమై మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే శిశువు ఉమ్మనీరు మింగడంతో శ్వాస తీసుకోలేకయింది. ఈ క్రమంలో శిశువు మరణించిందని అందరూ భావించారు. అయితే ప్రసవం చేసిన నర్సు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్నారు. శిశువు అంబులెన్స్లోకి తీసుకొని ఆర్సీపీ డాక్టర్ శివ, మరో డాక్టర్ మౌనిక సూచనలతో సీపీఆర్ చేశారు. నవజాత శిశువుకు మందులు, ఆక్సిజన్ అందిస్తూ.. మహబూబ్నగర్ ఆస్పత్రికి తరలించారు. నవజాత శిశువును సీపీఆర్తో కాపాడిన 108 సిబ్బందిని చిన్నపిల్లల వైద్యురాలు మమత అభినందించారు. -
మంటల వ్యాప్తికి కారణమైన వ్యక్తి అరెస్టు
దోమలపెంట: అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలోని దోమలపెంట రేంజ్ అటవీ ప్రాంతంలో మంటల వ్యాప్తికి కారణమైన వ్యక్తి శీలం బయన్నను సోమవారం కోర్టులో హాజరుపర్చినట్లు దోమలపెంట ఎఫ్ఆర్ఓ గురుప్రసాద్ తెలిపారు. ఈ నెల 2, 3 తేదీల్లో దోమలపెంట రేంజ్ పరిధిలోని దూబోడు, ఉల్లిందలూట బీట్లలో రాత్రివేళలో వ్యాపించిన మంటలను జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో 7 బృందాలు శ్రమించి అదుపులోకి తెచ్చాయి. అయితే ఇతర ప్రాంతాల్లో మంటలు, పొగలు వస్తుండటంతో అడవిలో అన్ని బ్లాక్లను కాలినడక ద్వారా వెళ్లి ఆర్పుతుండగా సమీపంలో నివాసముంటున్న పదర మండలం చిట్లంకుంట గ్రామానికి చెందిన శీలం బయన్న మేకలను కాయడం తారసపడిందన్నారు. అతన్ని విచారించగా లింగాలగట్టుకు చెందిన బాలచెన్నయ్యకు చెందిన మేకలు కాస్తున్నట్లు చెప్పారని, బయన్న వద్ద అగ్గిపెట్టె, బీడీలు, పొగాకును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సుమారు 150 హెక్టార్ల విస్తీర్ణం మేర అడవిలో మంటలు వ్యాపించడానికి శీలం బయన్న కారణమని, కేసు నమోదు చేసి అచ్చంపేట కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి చార్జీషీటు దాఖలు చేయాలని సూచించారన్నారు. -
నల్లమలలో కార్చిచ్చు
కొల్లాపూర్: నియోజకవర్గ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రాజుకుంది. 15 రోజుల క్రితం జాలుపెంట, చుక్కలపెంట ప్రాంతాల్లో అడవి అంటుకొని మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పివేయడంలో కొల్లాపూర్ అటవీ శాఖాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వాతావరణ మార్పుల కారణంగా మంటల వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. చిన్నపాటి మంటలే కదా అనుకున్న అటవీ అధికారులకు కార్చిచ్చు తలనొప్పిగా మారింది. కొన్ని రోజులుగా అధిక వేడితో పాటు గాలులు వీస్తుండడంతో మంటల సమీప ప్రాంతాలకు వ్యాపించాయి. జాలుపెంట, చుక్కలపెంట, పెగ్గర్లపెంట, తొంగిచూపులు ప్రాంతాల్లో మంటలు చెలరేగుతున్నాయి. మంటలను అదుపుచేయలేక సమస్యను ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో వారి ఆదేశానుసారం మంటలను ఆర్పేందుకు బ్లోయర్స్ను వినియోగిస్తున్నారు. అయినా కూడా మంటలు అదుపులోకి రావడం లేదు. శివరాత్రి సందర్భంగా అటవీ మార్గంగుండా శ్రీశైలం వెళ్లిన శివస్వాములే మంటల వ్యాప్తికి కారణమై ఉంటారని ఫారెస్టు రేంజర్ చంద్రశేఖర్ అనుమానం వ్యక్తం చేశారు. అడవిలో మంటలు వ్యాప్తి చెందుతున్నాయని గొర్రెలు, పశువుల కాపరులతో పాటు ఇతరులు ఎవరూ అనుమతుల్లేకుండా అడవిలోకి ప్రవేశించరాదని ఆయన హెచ్చరించారు. అగ్ని ప్రమాదం కారణంగా అడవిలో జీవజాలం చనిపోతుందని, దీనివల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటుందని ఆయన వివరించారు. మంటలను అదుపుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జాలుపెంట, చుక్కలపెంటల్లో 15 రోజుల క్రితం అంటుకున్న అడవి రోజురోజుకూ వ్యాప్తి చెందుతున్న మంటలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అటవీ శాఖాధికారులు ఉన్నతాధికారుల ఆదేశంతో వినియోగంలోకి బ్లోయర్స్ -
అలంపూర్ క్షేత్రం అభివృద్ధికి ప్రణాళికలు
అలంపూర్: అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఆలయ సముదాయంలోని చైర్మన్ చాంబర్లో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జోగుళాంబ ఆలయ అభివృద్ధిపై ఈ నెల 7న హైదరాబాద్లోని ప్రజాభవన్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా జోగుళాంబ ఆలయ సమగ్ర అభివృద్ధికి తాత్కాలిక, దీర్ఘకాలిక పనుల జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికీ అలంపూర్లో ఐదవ శక్తిపీఠం ఉన్నట్టు చాలా మందికి తెలియని పరిస్థితి ఉందన్నారు. ఆలయ చరిత్రతో కూడిన ప్రచార బోర్డులు పెట్టడానికి ప్రధాన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ముఖ్య ప్రదేశాలను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల ఆలయాల్లో అవినీతి జరిగిందని.. అర్చకుల పనితీరుపై మీడియాలో కథనాలు వస్తున్నాయన్నారు. అందుకు సంబంధించిన రికార్డులను దేవదాయశాఖకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. అవినీతికి పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఆలయాల ప్రతిష్ట దెబ్బతిసే విధంగా ఎవరూ ప్రయత్నించవద్దని కోరారు. సమావేశంలో ఆలయ ధర్మకర్తలు నాగశిరోమణి, జగన్మోహన్ నాయుడు, జగన్గౌడు, గోపాల్, అడ్డాకుల రాము ఉన్నారు. -
సప్లయర్ ఇంట్లో అంగన్వాడీ సరుకులు
జడ్చర్ల టౌన్: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సిన సరుకులు సప్లయర్ ఇంట్లో నిల్వ ఉండటంతో జడ్చర్ల సీడీపీఓ శోభారాణి సోమవారం పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. అంగన్వాడీ కేంద్రాలకు బాలామృతం, పప్పు, నూనెలను జడ్చర్ల వెంకటేశ్వరకాలనీకి చెందిన కృష్ణారెడ్డి సరఫరా చేసే సప్లయర్గా పనిచేస్తున్నాడు. అయితే ప్రతి సరుకు గోదాం నుంచి మాత్రమే కేంద్రాలకు తరలించాల్సి ఉంది. అలాంటిది అతడి ఇంట్లో అక్రమంగా సరుకులు నిల్వ ఉన్నాయని ఆదివారం రాత్రి అంగన్వాడీ అధికారులకు సమాచారం అందింది. దీంతో అదేరోజు రాత్రి ఆప్రాంత అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్లు వెళ్లి పరిశీలించగా 111 కిలోల బాలామృతం 80కిలోల కందిపప్పు, 8లీటర్ల వంటనూనెలు ఉండటాన్ని గుర్తించి సీడీపీఓకు సమాచారమిచ్చారు. సోమవారం ఉదయం సీడీపీఓ శోభారాణి, ఆర్ఐ హర్షవర్దన్రెడ్డిలతోపాటు పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేసి సరుకులను ఐసీడీఎస్ కార్యాలయానికి తరలించారు. గోడౌన్లో ఉండాల్సిన సరుకు ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారని సప్లయర్ను ప్రశ్నించగా కేంద్రాలకు సప్లయ్ చేయగా మిగిలినది ఇక్కడ నిల్వచేసినట్లు చెప్పుకొచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన సీడీపీఓ -
ట్రాక్టర్ను ఢీకొట్టి.. బోల్తా పడిన బొలెరో
గద్వాల క్రైం: స్వగ్రామంలో ఉపాధి లేకపోవడంతో కొందరు వ్యవసాయ కూలీలు మరో ప్రాంతానికి కూలీ పనుల కోసం బొలెరో వాహనంలో బయలుదేరారు. ఈ క్రమంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో.. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో 26 మంది కూలీలకు గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గద్వాల మండలం జమ్మిచేడ్ స్టేజీ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. కేటీదొడ్డి మండలం పాతపాల్లెం, గంగన్పల్లి, జాంపల్లి గ్రామాలకు చెందిన 26 మంది కూలీలు మానవపాడు మండలం ధర్మవరం గ్రామంలో మిర్చి తెంచేందుకు బొలెరో గూడ్స్ వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలోని జమ్మిచేడ్ స్టేజీ వద్ద క్రాస్రోడ్డు దాటేందుకు ట్రాక్టర్ వేగంగా రావడంతో బొలెరో వాహనం అదుపుతప్పి వెనక నుంచి ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో జాంపల్లికి చెందిన సవారన్న, పాతపాలెంకు చెందిన కృష్ణ, పావని, శాంతమ్మ, పద్మలకు తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారికి స్వల్పగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో సవారన్న, కృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా.. ట్రాక్టర్, బొలెరో వాహనం డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగంతో కూడిన డ్రైవింగ్ కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విషయం తెలుసుకున్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత, నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రంజిత్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ సుభాన్ తదితరులు జిల్లా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. కూలీలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ ఘటనపై గద్వాల సీఐ శ్రీను, ఎస్ఐలు శ్రీకాంత్, కళ్యాణ్కుమార్ విచారణ చేపట్టారు. ట్రాక్టర్ డ్రైవర్ నవీన్, బొలెరో వాహన డ్రైవర్ మహబూబ్ పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. ఐదుగురు కూలీలకు తీవ్రగాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం నిర్లక్ష్యం, అతివేగంతో కూడిన డ్రైవింగ్తోనే ప్రమాదం -
శాంతికుమార్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శ
పాలమూరు: బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ను ఆదివారం జిల్లాకేంద్రంలోని ఏనుగొండలోని ఆయన నివాసంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ పరామర్శించారు. శాంతికుమార్ తండ్రి బండారి లక్ష్మణ్ మృతిచెందడంతో ఆయన చిత్రపటానికి బండి సంజయ్ పువ్వులు వేసి నివాళులర్పించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్యాహ్నం 12 గంటలకు పట్టణంలోని శాంతికుమార్ ఇంటికి చేరుకోగా బీజేపీ నేతలు స్వాగతం పలికారు. నేరుగా ఇంట్లోకి వచ్చిన బండి సంజయ్ బండారి లక్ష్మణ్ చిత్రపటం దగ్గరకు వెళ్లి నివాళులర్పించారు. ఆ తర్వాత శాంతికుమార్ను పరామర్శించారు. పార్టీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలతో ఫొటోలు దిగారు. అనంతరం పార్టీ నేతలతో మాట్లాడిన మంత్రి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మహబూబ్నగర్ నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్లారు. అలాగే శాంతికుమార్ను మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీజేపీ ఎస్సీ మోర్చ జాతీయ అధ్యక్షుడు ఎస్.కుమార్, సంగప్ప, ఎన్వీ సుభాష్, బీసీ సంఘాల నాయకులు పరామర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాగూరావు నామాజీ, మయూర్నాథ్, రాములు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా రాములోరి కల్యాణం
ఎర్రవల్లి: శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించా రు. ఆలయ ప్రధాన అర్చకులు భానుమూర్తి, దత్తుస్వాముల ఆధ్వర్యంలో సీతారాములను ముస్తాబుచే సి వేదమంత్రాల నడుమ వైభవంగా కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని సీతారాముల కల్యాణాన్ని కనులారా తిలకించారు. భక్తులకు ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్నదానం చేసినట్లు ఆలయ మేనేజర్ సురేందర్రాజు పేర్కొన్నారు. -
కష్టం బీసీలది.. అధికారం రెడ్డీలదా?
మహబూబ్నగర్ న్యూటౌన్: ‘ఏళ్లకు ఏళ్లుగా భుజాలు కాయలు కాసేలా బీసీలు పార్టీల జెండాలు మోస్తూనే ఉన్నారు.. అధికారం అనుభవిస్తున్నది మాత్రం రెడ్డీలు’ అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆదివారం మహబూబ్నగర్లో నిర్వహించిన బీసీ రాజకీయ చైతన్య సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ అవకాశముంటే అక్కడ బీసీలు అధిక సంఖ్యలో పోటీ చేసి సత్తాచాటాలని పిలుపునిచ్చారు. పాలమూరు జిల్లాలోని అగ్రకుల నాయకులైన సీఎం రేవంత్రెడ్డి, ఎంపీ డీకే అరుణ, యెన్నం శ్రీనివాస్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి పార్టీలు మారుతూ అధికారాన్ని అనుభవిస్తున్నారన్నారు. బీసీ బిడ్డ ముదిరాజ్ సింహంగా పేరొందిన ఎర్రసత్యంను బుల్లెట్లతో కాల్చి చంపిన వారే ఆయన ఆశయాలను కొనసాగిస్తామని కపట ప్రేమ చూపుతున్నారని, బీసీలంతా ఈ విషయాన్ని గమనించాలన్నారు. రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న కుట్రలను దృష్టిలో ఉంచుకొని ఒక బీసీ అభ్యర్థికి ఏ పార్టీ నుంచి అవకాశం వచ్చినా బీసీలంతా ఐక్యంగా ఉండి గెలిపించుకోవాలని అన్నారు. 70 ఏళ్ల పాలనలో అధికారాన్ని అనుభవించి అగ్రకులాలు ఆస్తులు కూడగట్టుకుంటే వెనుకబడిన కులాలపై అప్పులు మోపారని మండిపడ్డారు. మీ ఓట్లు మాకొద్దని, దమ్ముంటే మా బీసీల ఓట్లు మీకొద్దని చెప్పాలని సవాల్ విసిరారు. ఇది బీసీల రాజకీయ చైతన్య సదస్సు కాదని.. రెడ్లకు, బీసీలకు విడాకుల సభ అన్నారు. 2028లో ముఖ్యమంత్రిగా బీసీలు అయి తీరుతారన్నారు. ● పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే 9 నియోజకవర్గాల్లో మీరే ఉన్నారని, పార్టీలు మారుతూ అధికారాన్ని అనుభవిస్తున్నారని, మీరు బీసీలు పార్టీలు మారొద్దని నీతులు చెబుతున్నారని విమర్శించారు. బీసీ ప్రజా ప్రతినిధులారా ఎక్కడ అవకాశమున్నా పోటీ చేయాలని, తీన్మార్ మల్లన్న పూర్తి మద్దతుతో గెలుపులో భాగమవుతామన్నారు. బీసీ రాజ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను ఎత్తివేస్తామని, దొంగదారిన వచ్చిన ఉద్యోగాలను రద్దు చేసి రికవరీ చేస్తామన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి గెలిచిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి, రజక బిడ్డ వీర్లపల్లి శంకరయ్య మంత్రి ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో బీసీ టైమ్స్ అధినేత సంగెం సూర్యారావు, సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి వడ్డే జానయ్య, సర్పంచ్ల సంఘం రాష్ట్ర నాయకుడు ప్రణీల్చందర్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాజు, నిర్మల, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, బీసీ రాజ్యాధికార సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్ మైత్రి యాదయ్య, బీసీ సమాజ్ అధ్యక్షుడు శ్రీనివాస్సాగర్, తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, లక్ష్మణ్, వన్నాడ అంజన్న, కావలి శంకర్ పాల్గొన్నారు. ‘స్థానికం’లో బీసీలు సత్తా చాటాలి అప్పులు మాకు.. ఆస్తులు మీకు పార్టీలు మారొద్దని మీరు నీతులు చెబుతారా 2028లో బీసీయే రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ రాజకీయ చైతన్య సదస్సులో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న -
రోడ్డు ప్రమాదంలోవ్యక్తి
రాజాపూర్: మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామంలో ఓ శుభకార్యంలో పూజ చేసేందుకు స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని వెనకనుంచి మోటార్సైకిల్పై వచ్చి ఢీకొట్టింది. తీవ్రగాయాల పాలైన వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్ఐ శివానంద్గౌడ్ తెలిపారు. వివరాలు.. జడ్చర్లకు చెందిన ఓరుగంటి సత్యనారాయణశర్మ(71) ఆదివారం తన స్కూటీపై ముదిరెడ్డిపల్లిలో ఓఇంట్లో బాసింగపు పూజ చేయించేందుకు వెళ్తున్నాడు. ముదిరెడ్డిపల్లి ఎక్స్రోడ్డులో గ్రామంలోకి వెళ్లేందుకు మళ్లుచుండగా వెనకనుంచి ఓమోటార్సైకిల్ వేగంగా వచ్చి ఢీకొన్నది. తీవ్రగాయాల పాలైన సత్యనారాయణను స్థానికులు చికిత్స నిమిత్తం 108లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు ఓరుగంటి ఆదిత్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
పాలమూరు యువకుడి ఘనత
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రం బోయపల్లి 16వ వార్డుకు చెందిన మల్లేష్గౌడ్ దేశంలోని జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవడానికి సైకిల్పై సాహస యాత్రకు పూనుకున్నాడు. ఈ క్రమంలో గతేడాది అక్టోబర్ 17న బోయపల్లి నుంచి సైకిల్యాత్ర చేపట్టి తాండూరు మీదుగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రంలోని రక్సౌల్ బార్డర్ మీదుగా నేపాల్లోకి ఈ ఏడాది జనవరి 23న ప్రవేశించాడు. 45 రోజులపాటు సైకిల్పై నేపాల్ దేశంలో తిరిగి అక్కడి నయాపూల్ ప్రాంతం నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ 4,130 మీటర్ల ఎత్తుగల అన్నపూర్ణ బేస్క్యాంప్ వద్దకు ఈ నెల 8న చేరాడు. మల్లేష్గౌడ్ ఇప్పటి వరకు 7,500 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసి భీమా శంకర్, త్రయంభకేశ్వర్, గ్రిస్నెశ్వర్, సోమనాథ్, నాగేశ్వర్, ఓంకారేశ్వర్, ఉజ్జయిని, కాశీ జ్యోతిర్లింగాలతోపాటు గుజరాత్లోని ధామ్ ద్వారకదేశ్ను దర్శించుకున్నాడు. ఈ నెల 15న నేపాల్ నుంచి బయలుదేరి ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, బద్రినాథ్, గంగోత్రి, యమునోత్రిని దర్శించుకుంటానని మల్లేష్గౌడ్ తెలిపారు. నా సైకిల్ యాత్రలో నీటి పొదుపు, మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు వివరించారు. సైకిల్ తొక్కడం ద్వారా ఇప్పుడున్న కలుషిత వాతావరణాన్ని కొంతమేర తగ్గించవచ్చనే ప్రధాన అంశాన్ని వివరించడం జరిగిందన్నారు. సైకిల్పై యాత్రను కొనసాగిస్తూ దేశం మొత్తం తిరగడమే తన ధ్యేయమన్నారు. సైకిల్పై ఇప్పటి వరకు 7,500 కిలోమీటర్ల ప్రయాణం ట్రెక్కింగ్ ద్వారా నేపాల్లోని అన్నపూర్ణ బేస్క్యాంప్ చేరిక -
ఆర్టీసీ బస్సు కిందపడి వృద్ధురాలు..
ఆత్మకూర్: ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో వృద్ధురాలు బస్సు కింద పడి తీవ్ర గాయాలపాలై మృతి చెందిన సంఘటన ఆత్మకూర్లో చోటుచేసుకుంది. ఎస్సై నరేందర్ తెలిపిన వివరాలు.. చిన్నచింతకుంట మండలం అప్పంపల్లికి చెందిన తిమ్మమ్మ(67) ఆదివారం గ్రామస్తులతో కలసి ఆత్మకూర్లో జరిగే సంతలో కూరగాయలు కొనేందుకు వచ్చింది. సాయంత్రం 4 గంటల సమయంలో స్థానిక గాంధీచౌక్లో బస్సుకోసం ఎదురు చూస్తుండగా మహబూబ్నగర్ డిపోకు చెందన బస్సు వచ్చింది. బస్సు ఎక్కుతుండగా ముందుకు కదలడంతో తిమ్మమ్మ వెనుక టైర్ల కింద పడి గాయాల పాలైంది. గమనించిన తోటి ప్రయాణికులు 108లో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. బస్సు డ్రైవర్ అజాగ్రత్తతోనే తిమ్మమ్మ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
సొరంగంలో ర్యాట్ మైనర్స్
సాక్షి, నాగర్కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలోపల 13.85 కి.మీ. వద్ద జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు మొత్తం 18 బృందాలు పని చేస్తున్నాయి. 16 రోజులుగా నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నా వారి ఆచూకీ లభ్యం కావడం లేదు. సొరంగంలో 13 కి.మీ. అవతల సొరంగ పైకప్పు కుప్పకూలడంతో సుమారు 18 ఫీట్ల ఎత్తులో 200 మీటర్ల విస్తీర్ణం వరకూ మట్టి, బురద, శిథిలాలు మేట వేశాయి. మట్టిని తొలగిస్తే పైనుంచి మరింత కుంగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఇన్లెట్ టన్నెల్లో ఎలాంటి ఆడిట్, ఎస్కేప్ టన్నెల్స్ లేకపోవడం, నిత్యం నీటి ఊట, బురద ఉంటుండటంతో ఇంతటి క్లిష్ట పరిస్థితి ఎక్కడా చూడలేదని రెస్క్యూ నిపుణులు అంటున్నారు. ఆయా రెస్క్యూ బృందాలతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన ర్యాట్ హోల్ మైనర్స్ బృందం వినూత్న పద్ధతిలో సేవలు అందిస్తోంది. రైల్వేలైన్లు, రహదారుల పనుల్లో సేవలు.. మేఘాలయా, ఈశాన్య రాష్ట్రాల్లోని బొగ్గు గనుల్లో ఎలుక బొరియలుగా సొరంగాలు తవ్వుతూ ర్యాట్ హోల్ మైనర్స్ బొగ్గును బయటకు వెలికితీస్తారు. ప్రమాదకరమైన ఈ మైనింగ్ను సుప్రీంకోర్టు నిషేధించింది. అయితే రైల్వే లైన్ల నిర్మాణం, జాతీయ రహదారులు, రోడ్ల నిర్మాణంలో వీరు సేవలందిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. సాధారణంగా రోడ్డు, రైల్వేలైన్ కిందుగా పైప్లైన్ వేయాలంటే జేసీబీల సాయంతో తవ్వుతూ రోడ్డును కట్ చేయాల్సి ఉంటుంది. ర్యాట్ హోల్ మైనర్స్ రవాణాకు ఆటంకం కలిగించకుండా, రోడ్డును తవ్వాల్సిన పని లేకుండానే కింద నుంచి సొరంగం తవ్వి పైప్లైన్ వేస్తారు. నిత్యం రద్దీగా ఉండే ఢిల్లీ రోడ్లపై వాహనాల రాకపోకలు కొనసాగుతుండగానే, రోడ్డు కింద నుంచి సొరంగం తవ్వి పైప్లైన్ వేయడంలో వీరి సేవలు విశేషంగా ఉపయోగపడుతున్నాయి. దారి ఏర్పాటు చేస్తూ తవ్వకాలు.. ప్రమాద స్థలంలో సుమారు 8 మీటర్ల మేర మట్టి, బురద, మిషిన్ శిథిలాలు మేట వేసి ఉన్నాయి. బురద, కాంక్రీట్ కలసి గట్టిగా ఉంది. ఒక్క పక్కగా దారి ఏర్పాటు చేస్తూ తవ్వకాలు కొనసాగిస్తున్నాం. రోజంతా అక్కడే ఉండి పనులు నిర్వహిస్తున్నాం. – మహమ్మద్ రషి, ర్యాట్హోల్ మైనర్ సభ్యుడు●వినూత్న సేవలందిస్తున్న 24 మంది సభ్యులు కార్మికుల జాడ కోసం నిరంతరం అన్వేషిస్తున్న బృందం రాత్రింబవళ్లు ప్రమాదస్థలంలోనే తవ్వకాలు జరుపుతున్న వైనం తవ్విన కొద్దీ ఊటనీరు వస్తోంది.. మేం మొత్తం 24 మంది ర్యాట్ హోల్ మైనర్స్ బృందం రెస్క్యూ పనుల్లో పాల్గొంటున్నాం. ఒక్కో షిప్టులో ఆరుగురు చొప్పున 24 గంటల పాటు ప్రమాద స్థలం వద్ద తవ్వకాలు జరుపుతున్నాం. ఇనుప కడ్డీలు, పారలతో మట్టిని తొలగించిన కొద్దీ ఊటనీరు పెరుగుతోంది. – ఖలీల్ ఖరేషి, ర్యాట్హోల్ మైనర్ సభ్యుడు 24 గంటల పాటు సొరంగంలోని ప్రమాద స్థలం వద్దే.. సొరంగంలో మట్టి కింద చిక్కుకున్న కార్మికులను బయటకు తీసేందుకు ర్యాట్ హోల్ మైనర్స్ బృందం గతనెల 25న రంగంలో దిగింది. మొత్తం 24 మంది సభ్యులు ఉండగా, వీరిలో ఎల్లప్పుడూ ఐదు, ఆరుగురు సొరంగంలోని ప్రమాదస్థలం వద్ద మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. కేవలం ఇనుప కడ్డీలు, తట్టా, పారల సాయంతో తవ్వకాలు చేపడుతూ, మట్టిని పక్కకు వేస్తున్నారు. టన్నెల్ నిండా మట్టి పేరుకుపోయిన నేపథ్యంలో రాడార్ గుర్తించిన చోటుతో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో తవ్వకాల చేపట్టి కార్మికుల జాడను అన్వేషిస్తున్నారు. వంతుల వారీగా సొరంగంలోకి వెళుతూ రాత్రింబవళ్లు ప్రమాద స్థలంలోనే తవ్వకాలు చేపడుతున్నారు. భోజనం సైతం అక్కడే చేస్తూ మళ్లీ తవ్వకాలకు ఉపక్రమిస్తున్నారు. -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
మదనాపురం: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతిచెందిన ఘటన మదనాపురం మండలం రామన్పాడులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రామన్పాడుకు చెందిన మత్స్యకారుడు వాకిటి గిరన్న (55) రోజు మాదిరిగానే తెల్లవారుజామున రామన్పాడు జలాశయంలో చేపల వేటకు వెళ్లాడు. ఉదయం 10 గంటలు దాటినా అతడు ఇంటికి రాకవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు.. జలాశయంలో గాలింపు చేపట్టడంతో మృతదేహం లభ్యమైంది. అతడి రెండు కాళ్లకు వల చుట్టుకోవడంతో నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య వాకిటి కుర్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు. -
అసంపూర్తి పనులతో అవస్థలు
జడ్చర్ల: పట్టణంలోని సిగ్నల్గడ్డ వద్ద రహదారి విస్తరణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పని ప్రదేశంలో యంత్రాలు, కార్మికులు, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ సుమారు మూడు నెలలుగా కనిపించడం లేదు. రోడ్డు, రైల్వే వంతెన ఇరుకుగా ఉండడంతో దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో రాకపోకలకు ఇబ్బందిగా ఉండేది. మూడేళ్ల కిందట రహదారి విస్తరణకు అంకురార్పణ జరిగింది. నాటి నుంచే మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. రూ.45.81 కోట్ల వ్యయం.. ఈ ప్రాంతంలో రహదారి విస్తరణ పనులకు కేంద్రం రూ.45.81 కోట్లు మంజూరు చేసింది. వంతెన నిర్మాణానికి రైల్వే విద్యుత్లైన్ ఆటంకంగా ఉండటంతో పనుల్లో జాప్యం జరిగింది. రెండునెలల కిందట రైల్వేశాఖ అధికారులు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించినా.. ఇప్పటి వరకు పనులు తిరిగి ప్రారంభం కాలేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవరిస్తుండటంతో పనులు ముందుకు సాగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● సిగ్నల్గడ్డ ప్రాంతం పట్టణానికి కూడలిలా ఉంది. అటు హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా తదితర దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలు, ఇటు ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, వనపర్తి తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ కూడలి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. నిత్యం వెయ్యికిపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ ప్రాంతంలో పనులు చేపట్టేందుకు పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో స్థానికంగా ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ చిన్న సమస్య ఎదురైనా గంటల తరబడి రాకపోకలకు నిలిచిపోతున్నాయి. రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారడం, విస్తరణ పనులు చేపట్టకపోవడంతో భారీ వాహనాలు వెళ్లే సమయంలో దుమ్ము లేస్తోంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఒకవైపు రహదారి పనులు పూర్తి చేస్తామని స్థానిక నాయకులు, ప్రజలకు కాంట్రాక్టర్ చెప్పినా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. మరో రెండునెలల్లో వర్షాకాలం ప్రారంభమైతే పనులు చేసే పరిస్థితి ఉండదు. ఇప్పటికై నా ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, కలెక్టర్ స్పందించి రోడ్డు పనులపై దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. పనుల్లో వేగం పెంచాలి.. కూడలిలో ఎక్కడికక్కడ గుంతలు ఉన్నాయి. దుమ్ము విపరీతంగా వస్తుండటంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు, పాదచారులు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలి. – బాలవర్ధన్న్గౌడ్, జడ్చర్ల దుకాణాలు మూసుకోవాల్సి వస్తుంది.. సిగ్నల్గడ్డ వద్ద రహదారి విస్తరణ పనులు ఏళ్లుగా కొనసాగుతున్నాయి. దుమ్ము విపరీతంగా వస్తుండటంతో వ్యాపారాలు సాగడం లేదు. దుమ్ము కారణంగా దుకాణాలు మూసుకోవాల్సి వస్తోంది. అధికారులు ఎంతమాత్రం స్పందించడం లేదు. త్వరగా రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలి. – అబిదాలి మహ్మద్ ,జడ్చర్ల త్వరలో బీటీ పనులు చేపడతాంబీటీ రోడ్డు పనులు త్వరలోనే చేపడతాం. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా రహదారి విస్తరణ పనులు పూర్తి చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటాం. బ్రిడ్జి కూడా త్వరితగతిన నిర్మిస్తాం. – రవి, ఏఈ, నేషనల్ హైవే అథారిటీ జడ్చర్ల సిగ్నల్గడ్డ వద్ద నిలిచిన రహదారి పనులు మట్టి, దుమ్ముతో రాకపోకలకు ఇబ్బందులు ట్రాఫిక్ సమస్యలు.. చోద్యం చూస్తున్న అధికారులు -
తగ్గిన దూకుడు
ఉమ్మడి జిల్లాలో పన్ను వసూళ్లలో ఆర్టీఏ వెనుకంజ ● ఈ ఏడాది జిల్లాలో నామమాత్రంగా తనిఖీలు ● ఫీజు, జీవితకాల పన్ను రాకపోవడంతో అంతంతగానే రాబడి ● ఆ శాఖలో వేధిస్తున్న సిబ్బంది కొరత ● గడిచిన మూడేళ్లతో పోల్చితే మహబూబ్నగర్ క్రైం: ఉమ్మడి జిల్లా రవాణా శాఖలో పూర్తిస్థాయిలో ఎంవీఐ, ఏఎంవీఐలు, ఇతర సిబ్బంది లేకపోవడంతో ఆశించిన స్థాయిలో పన్ను వసూలు కావడం లేదు. ప్రతి జిల్లాలో ఒకే ఒక్క ఎంవీఐ ఉండటంతో కార్యాలయంలో విధులు నిర్వహించడానికే సమయం సరిపోకపోవడంతో ఎన్ఫోర్స్మెంట్పై సరైన దృష్టిపెట్టడం లేదు. దీంతో బయట తనిఖీలు, ఇతర రూపాల్లో వచ్చే పన్నుల్లో జాప్యం ఏర్పడుతోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 118 మంది ఏఎంవీఐలకు పోస్టింగ్ ఇవ్వగా.. ఇందులో వనపర్తికి ఒకరు, నారాయణపేటకు ఒకరిని కేటాయించగా వారు సైతం ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. గత మూడేళ్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం కంటే ఎక్కువ మొత్తంలో పన్ను వసూలు చేసి రాష్ట్రస్థాయిలో ఉమ్మడి జిల్లాకు మొదటి స్థానం వచ్చేది. కానీ, పరిస్థితులు ఇప్పుడు జిల్లా లక్ష్యం వసూలు శాతం చేసిన పన్ను (రూ.కోట్లలో..) మహబూబ్నగర్ 90.08 82.00 89.05 నాగర్కర్నూల్ 58.14 48.04 82.63 వనపర్తి 39.76 32.63 82.07 గద్వాల 43.09 35.87 83.24 నారాయణపేట 32.65 28.16 86.25 తారుమారైన పరిస్థితులు పూర్తిగా తారుమారు అయ్యాయి. నంబర్ 1 స్థానంలో ఉన్న పాలమూరు ఇప్పుడు ఏకంగా మూడు స్థానాలు దిగజారి నాలుగో స్థానానికి పడిపోయింది. ఇక నాగర్కర్నూల్ 24, వనపర్తి 28, గద్వాల 22, నారాయణపేట 8వ స్థానంలో ఉన్నాయి. -
బ్రహ్మోత్సవాలకు ‘దక్షిణకాశి’ ముస్తాబు
● రేపటి నుంచి కందూరు రామలింగేశ్వరుడి ఉత్సవాలు ● 12న స్వామివారి కల్యాణం, 14న రథోత్సవం అడ్డాకుల: కందూరు శివారులో స్వయంభూగా వెలసి ‘దక్షిణకాశి’గా గుర్తింపు పొందుతున్న శ్రీరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. మంగళవారం నుంచి ఈ నెల 16 వరకు కొనసాగే స్వామివారి ఉత్సవాల కోసం ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శైవులకు నిజకాశీలాంటి ఆలయం వద్ద మొదలయ్యే ఉత్సవాలు ఏప్రిల్ 6న జరిగే శ్రీరామ నవమిన ముగుస్తాయి. కాశీలో తప్ప మరెక్కడా లేని కల్పవృక్షాలు (కబంధ) కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయం ఆవరణలో కనిపిస్తాయి. కాశీ తర్వాత కల్ప వృక్షాలు ఇక్కడే ఉన్నాయని పురాణం చెబుతోంది. కార్యక్రమాలు ఇలా.. ● ఈ నెల 11న భూతబలి, యాగశాల ప్రవే శం, అంకురార్పణం, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ● 12న పార్వతీసమేత శ్రీరామలింగేశ్వరస్వామి కల్యాణం జరిపిస్తారు. ● 13న స్వామివారి ప్రభోత్సవం నిర్వహిస్తారు. ● 14న అర్ధరాత్రి రథోత్సవం (తేరు) వైభవంగా కొనసాగుతుంది. ● 15న గవ్యాన్తం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, వృషభవాహన సేవ ఉంటుంది. ● 16న రుద్రహోమం, మహాపూర్ణాహుతి, త్రిశుల స్నానం కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈఓ రాజేశ్వరశర్మ తెలిపారు. మరుసటి రోజు నుంచి మొదలయ్యే జాతర ఏప్రిల్ 6న జరిగే శ్రీరామ నవమి రోజున ముగియనుంది. నేడు జడ్చర్ల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జడ్చర్ల టౌన్: మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సోమవారం నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్ పుష్పలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సమావేశం జరగాల్సి ఉండగా.. 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులో తేడాల వల్ల కొందరు వార్డు కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేయడంతో వాయిదా వేశారు. తాజాగా నిధుల కేటాయింపు సమానంగా చేస్తూ.. సోమవారం సమావేశం నిర్వహిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. -
SLBC: నేడు మరో రెండు మృతదేహాలు వెలికితీత!
సాక్షి, మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు 17వ రోజు కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని ఒక్కొక్కరికిగా గుర్తిస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా ఆదివారం ఎట్టకేలకు ఒక మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఎత్తు, చేతి కడియం తదితర ఆనవాళ్లను బట్టి పంజాబ్కు చెందిన టీబీఎం ఆపరేటర్ గుర్ప్రీత్సింగ్ (40)గా గుర్తించారు. గురుప్రీత్ సింగ్ మృతదేహాం లభ్యమైన చోటే మరో ఇద్దరి ఆనవాళ్లు గుర్తించినట్టు తెలుస్తోంది. నేడు ఇద్దరి మృతదేహాలను వెలికి తీసే అవకాశం ఉంది.గత నెల 22న ఎస్ఎల్బీసీ సొరంగంలో చోటుచేసుకున్న ప్రమాదం కారణంగా ఎనిమిది మంది టన్నెల్లో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సొరంగంలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం టీబీఎం ఆపరేటర్ గుర్ప్రీత్సింగ్ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నట్లు తెలిపారు.సహాయచర్యల్లో భాగంగా సొరంగం లోపల పేరుకుపోయిన మట్టి, టీబీఎం యంత్రం దిగువన డాప్లర్ సంకేతాలతో కొన్ని ప్రాంతాలను గుర్తించారు. కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ (స్నిఫర్స్) కూడా పలువురి ఆనవాళ్లను పసిగట్టాయి. దీంతో, శనివారం రాత్రి సహాయక బృందాలు టీబీఎం ఎడమవైపు భాగంలో తవ్వుతుండగా ఆరు అడుగుల లోతులో మొదట కుడిచేతి వేళ్లు, చేతి కడియం కనిపించాయి. అధికారుల సూచనల మేరకు గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీశారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని జాగ్రత్తగా వెలికితీశారు. ఇంజినీర్ ఆచూకీని కనుగొన్న ప్రాంతానికి కొంచెం అటూ ఇటూ మరో ముగ్గురి జాడ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈరోజు మరో ఇద్దరి జాడ లభించే అవకాశం ఉందని సహాయ బృందాలు తెలిపాయి. మిగిలినవారు సొరంగం చిట్టచివరి భాగం వద్ద టీబీఎం కట్టర్ సమీపంలో చిక్కుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.మూడేళ్లుగా గుర్ప్రీత్సింగ్ విధులు ఎస్ఎల్బీసీ సొరంగంలో మృతదేహం లభ్యమైన గుర్ప్రీత్సింగ్ స్వస్థలం పంజాబ్ రాష్ట్రంలోని తరన్తరాన్. రాబిన్స్ సంస్థలో 2022 నుంచి టీబీఎం ఆపరేటర్గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య రాజేందర్ కౌర్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాపిల్లలు స్వస్థలంలో ఉండగా.. గుర్ప్రీత్సింగ్ మూడేళ్లుగా దోమలపెంటలోని రాబిన్స్ క్యాంపులో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగాక బంధువులు వచ్చి కొన్ని రోజులు వేచిచూశారు. ఆచూకీ తెలియకపోవడంతో స్వస్థలానికి వెళ్లిపోయారు. -
భర్త మటన్ కట్టింగ్.. ప్రియుడు కిరాణం షాపు.. చివరికి..
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్నగర్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య కటకటాల పాలైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్రావు వెల్లడించారు. పాన్గల్కు చెందిన ఎండీ పర్వీన్బేగం 12 ఏళ్ల క్రితం ఏపీలోని కర్నూలుకు చెందిన ఎండీ రహమతుల్లాకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి సంతానం. వివాహమైన రెండేళ్లపాటు పాటు కర్నూలులోనే ఉండగా.. సంసారం విషయంలో గొడవలు వచ్చాయి. దీంతో పదేళ్ల క్రితమే భార్యాభర్తలు, పిల్లలు కలిసి ఆమె తల్లిగారి గ్రామమైన పాన్గల్కు వచ్చి సంతబజార్లో కిరాయి ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త రహమతుల్లా పెయింటింగ్, మటన్ కట్టింగ్ పనిచేస్తుండగా.. భార్య టైలర్ పనిచేస్తుంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న కిరాణం షాపు నడుపుతున్న కుమ్మరి రాఘవేందర్(ఎ1)తో పరిచయం ఏర్పడి.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం పసిగట్టిన రహమతుల్లా ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఆ తర్వాత కూడా రహమతుల్లా తరుచుగా ఆమెను వేధించేవాడు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన వారు రహమతుల్లాను హత్య చేయడానికి నిర్ణయించారు. ఈ క్రమంలోనే రాఘవేంద్ర తనకు పరిచయం ఉన్న కురుమూర్తితో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 1న తెల్లవారుజామున 4 గంటల సమయంలో కురుమూర్తిని రహమతుల్లా ఇంటికి పంపించి గొర్రెను కోసేది ఉంది అని చెప్పి వెంట తీసుకొని పాన్గల్ గ్రామ శివారులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని కేఎల్ఐ కాల్వ దగ్గరకు వెళ్లగా అప్పటికే రాఘవేంద్ర తన బైక్పై అక్కడికి వచ్చి హతమార్చారు. చదవండి: తెల్లారితే పెళ్లి.. అంతలోనే బలవన్మరణంరాఘవేంద్ర రహమతుల్లా గొంతు పిసకగా.. కురుమూర్తి అతని చేతులు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి రహమతుల్లా మృతదేహం, అతని వెంట తెచ్చుకున్న కత్తిని పక్కనే ఉన్న కేఎల్ఐ కాల్వలో పడేసి రాఘవేంద్ర, కురుమూర్తి కలిసి మోటార్ సైకిల్పై వెళ్లిపోయారు. ఈ మేరకు నిందితులు ఉపయోగించిన మోటార్ సైకిల్, 3 సెల్ఫోన్లు స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసులో ఎ1 కుమ్మరి రాఘవేంద్ర, ఎ2 ప్యాట కురుమూర్తి, ఎ3 పర్వీన్బేగంను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. కేసు ఛేదనలో ప్రతిభచూపిన వనపర్తి సీఐ కృష్ణ, స్థానిక ఎస్ఐ శ్రీనివాసులును, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
SLBC: కాంక్రీట్లో కూరుకుపొయిన మృతదేహం గుర్తింపు
Slbc Tunnel Rescue Operation Updates:👉జీపీఆర్, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు రెస్క్యూ ఆపరేషన్లో 130 మంది నిపుణుల బృందం పాల్గొంటున్నారు.👉ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా 8 మంది కార్మికుల జాడ తెలియలేదు. ఇక రోబోల వినియోగం తప్పదని అధికారులు అంటున్నారు. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. చివరి 50 మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. టెన్నెల్ ఎండ్ పాయింట్లో కీలక స్పాట్స్ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్లో ర్యాట్ హోల్ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. రెస్య్కూలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.👉కాగా, ఎనిమిది మందిని గుర్తించేందుకు చేపడుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు 13.50 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మిగిలిన 50 మీటర్ల ముందుకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సొరంగంలోకి నీటి ఊట వేగంగా వస్తుండటంతో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటికి తోడేస్తున్నారు. 👉కన్వేయర్ బెల్ట్ పూర్తిగా మరమ్మతు జరగడంతో.. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లు, టీబీఎం విడిభాగాలు (ఇనుము), ఊడిపోయిన కాంక్రీట్ సెగ్మెంట్లను తొలగించే రోబోలు తయారు చేసేందుకు కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రోబోలు సాయం వారం రోజుల తర్వాతే వినియోగంలోకి వస్తోంది. 👉ప్రమాదం జరిగిన సొరంగంలో పరిశోధన చేసేందుకు కేరళ నుంచి వచ్చిన కాడవర్ డాగ్స్ కూడా ఇది వరకు గుర్తించిన డాగ్స్ స్థానాల్లోనే గుర్తించాయి. 13.500 కి.మీ., అవుతల ఒకే దగ్గర ముగ్గురు వ్యక్తుల అవశేషాలు ఉన్నట్లు నిర్ధారించాయి. కారి్మకులు చిక్కుకున్నట్లు డాగ్స్ చూపించిన ప్రదేశాల్లో శనివారం రెస్క్యూ బృందాలు తవ్వకాలు ప్రారంభించాయి. టీబీఎం పరికరాలు గ్యాస్ కట్టర్తో కత్తిరించి లోకో ట్రైన్ ద్వారా సొరంగం బయటికి పంపించారు. కూలిపడిన పైకప్పు మట్టి దిబ్బలను హిటాచీతో ఒకవైపు తరలిస్తున్నారు. రోజుకో బృందాన్ని సింగరేణి నుంచి రప్పించి సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. సొరంగంలో వస్తున్న దుర్వాసన సహాయక చర్యలకు ఇబ్బంది కలిగిస్తోంది.👉టన్నెల్లో జరిగిన ప్రమాదం జాతీయ విపత్తు అని, అందులో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికత ఉపయోగిస్తున్నామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం టన్నెల్ను సందర్శించిన ఆయన రెస్క్యూ బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.👉సొరంగంలో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు ఇప్పటి వరకు జరిగిన పురోభివృద్ధి గురించి రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్కుమార్, ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సహాయక చర్యల్లో అవంతరాలను అధిగమిస్తూ వేగంగా ముందుకెళ్తున్నామని, సొరంగం లోపల ఆక్సిజన్ సరిగా లేకపోవడం, నీటి ఊట అధికంగా రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. 👉టీబీఎం దృఢమైన లోహ శకలాలు, రాళ్లు, మట్టితో కూరుకుపోయి ఇబ్బందులు ఉన్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగించేందుకు ప్రభుత్వం కృతనిత్చయంతో ఉందన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో పనిచేసే కారి్మకులకు, అధికారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, మిలటరీ ఇంజినీర్ వికాస్సింగ్, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్నకుమార్, ఎస్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రభాకర్, సింగరేణి, రైల్వే, ఎన్జీఆర్ఐ, హైడ్రా తదితర బృందాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ పరిశ్రమలకు ప్రోత్సాహం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ పరిశ్రమలకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నామని కేంద్ర రైల్వే, ఐటీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ అన్నారు. శనివారం మహబూబ్నగర్ నగర శివారులోని దివిటిపల్లి ఐటీ పార్కు ఆవరణలో అధునాతన టెక్నాలజీతో రూ.3,225 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కాను న్న నాలుగు పరిశ్రమలకు ఆయన శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యుత్ వాహనాలకు ఎంతో డిమాండ్ ఉందన్నారు.వీటికి అవసరమ య్యే లిథియం అయాన్ గిగా బ్యాటరీలను తయా రు చేసే అమరరాజా కంపెనీకి దివిటిపల్లిలో మహి ళా దినోత్సవం రోజే శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పరిశ్రమలతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈసారి కేంద్ర బ డ్జెట్లో తెలంగాణకు రైల్వేశాఖ పరంగా రూ.5,337 కోట్లు కేటాయించామని, గత పదేళ్ల కంటే ఇది ఆరు రెట్లు ఎక్కువ అని తెలిపారు. అలాగే గత 11 సంవత్సరాల్లో మహిళలకు 10 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, 14 కోట్ల తాగునీటి కుళాయి కనెక్షన్లు మంజూరు చేశామని, 54 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపించామని వివరించారు.ఇక్కడి ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని దివిటిపల్లి రైల్వే స్టేషన్ను ఆధునీకరిస్తామని చెప్పారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు మాట్లాడుతూ, తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేస్తామని పేర్కొన్నారు. పారిశ్రామికాభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్స్, ఇతర పరిశ్రమల అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని ఆయన అశ్వినీవైష్ణవ్ను కోరారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి శంకుస్థాపన చేసిన పరిశ్రమలు ఇవే.. రూ.1,900 కోట్లతో నిర్మించే అమరరాజా గిగా ఫ్యాక్టరీ–1 మూడో దశ యూనిట్, రూ.800 కోట్లతో లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్పీ) టెక్నాలజీతో బ్యాటరీలు, ఇతర కీలకమైన పదార్థాలను రూపొందించే (అల్ట్మిన్ ప్రైవేట్ లిమిటెడ్) ఫ్యాక్టరీ, రూ.502 కోట్లతో చేపట్టే వ్యర్థాల ప్రాసెసింగ్ (లోహమ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్) కంపెనీ, రూ.23 కోట్లతో తలపెట్టిన ప్రత్యేక క్యాన్, క్యాప్లను తయారు చేసే (సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్) పరిశ్రమలు ఉన్నాయి. -
బ్యాటరీ, సెల్ టెక్నాలజీపై పరిశోధన
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రస్తుతం బ్యాటరీ, సెల్ టెక్నాలజీపై పరిశోధనలు, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినివైష్ణవ్ అన్నారు. శనివారం మధ్యాహ్నం మహబూబ్నగర్ నగర శివారులోని దివిటిపల్లి ఐటీ పార్కు ఆవరణలో మొత్తం రూ.3,225 కోట్లతో ఏర్పాటు చేయనున్న అమరరాజా గిగా ఫ్యాక్టరీ–1, అల్టమిన్, లోహం మెటీరియల్స్, ఎస్సెల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్లకు ఆయనతో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి తన ప్రసంగాన్ని తెలుగులో ‘నమస్తే.. బాగున్నారా..!’ అని ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్ప సినిమాలోని ‘పుష్ప తగ్గేలే..’ డైలాగ్ను ప్రస్తావిస్తూ ‘దివిటిపల్లి అభివృద్ధి ఆగదు.. ఇక నిరంతర అభివృద్ధే..’ అని చెప్పా రు. ప్రధాని నరేంద్రమోదీ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడి అమరరాజా కంపెనీలో 80 శాతం మహిళలే పనిచేస్తుండటం అభినందనీయమన్నారు. కాగా మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకితో పాటు మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రకాలుగా అండగా ఉంటాం: మంత్రి శ్రీధర్బాబు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ డి.శ్రీధర్బాబు అన్నారు. ఇటీవల దావోస్ సమ్మిట్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వివిధ పెద్ద సంస్థలు సుమారు రూ.78 వేల కోట్లకు ఎంఓయూ కుదుర్చుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. ఇతర రాష్ట్రాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. దివిటిపల్లిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ) కోసం భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ధ్యేయమన్నారు. పరిశ్రమలను అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. పెద్ద పరిశ్రమలు రావడానికి గ్రీన్ ఎనర్జీ పాలసీ అమలు చేస్తున్నామన్నారు. అమరరాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ, చైర్మన్ గల్లా జయదేవ్ మాట్లాడుతూ దివిటిపల్లిలో ఏర్పాటు చేస్తున్న గిగా ఫ్యాక్టరీ ద్వారా సుమారు 4,500 మందికి ప్రత్యక్షంగా, మరో పది వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, టీజీఐఐసీ వీసీ అండ్ ఎండీ విష్ణువర్ధన్రెడ్డి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, పరిశ్రమల శాఖ జీఎం ప్రతాప్రెడ్డి, మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్వినివైష్ణవ్ సెమీ కండక్టర్స్ అభివృద్ధికి సహకరించాలి: మంత్రి శ్రీధర్బాబు దివిటిపల్లిలో 4 పరిశ్రమలకు శంకుస్థాపన -
జొన్నరొట్టెలతో జీవనోపాధి
బ్రహ్మణవాడికి చెందిన అలివేలమ్మకు భర్త యాదయ్యతో పాటు నలుగురు సంతానం ఉన్నారు. ఈమె 20 ఏళ్ల క్రితం శ్రీరాఘవేంద్ర మహిళా సంఘంలో సభ్యురాలిగా చేరి ప్రస్తుతం అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది. మేసీ్త్ర పనిచేస్తున్న భర్త రెండేళ్ల క్రితం కాలు విరగడంతో ఇంటికే పరిమితమయ్యారు. అప్పటి నుంచి భార్య రాంనగర్ గ్రంథాలయానికి ఎదురుగా ఓ దుకాణానికి కిరాయికి తీసుకుని జొన్నరొట్టెలు అమ్ముతోంది. నిత్యం 80 నుంచి వంద వరకు అమ్ముతుండగా రూ.1,500 గిరాకీ వస్తోంది. వీటిని తయారీ చేసే మరో ముగ్గురు మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఒక్కొక్కరికి రూ.200 చొప్పున చెల్లిస్తోంది. వీరు కూడా మహిళా సంఘాల సభ్యులే. ఇక పొదుపు నుంచి రూ.50 వేలు, సీ్త్రనిధి నుంచి రూ.లక్ష, బ్యాంకు లింకేజీ ద్వారా రూ.రెండు లక్షల చొప్పున రుణాలు తీసుకుంది. ప్రతినెలా కిస్తీలు క్రమం తప్పకుండా చెల్లిస్తూ వస్తోంది. అన్ని ఖర్చులు పోను రూ.10 వేలు సంపాదిస్తూ కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంటోంది. -
నేడు బీసీ రాజకీయ సదస్సు
స్టేషన్ మహబూబ్నగర్: జిల్లాకేంద్రంలో ఆదివారం నిర్వహించనున్న బీసీ రాజకీయ చైతన్య సదస్సును జయప్రదం చేయాలని, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్యఅతిథిగా హాజరవుతారని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు అన్నారు. జిల్లాకేంద్రంలోని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేడు బీసీ భావజాలం బలంగా ఉందని, భవిష్యత్తులో మన ఓటు మనకే వేసుకొని బీసీ రాజ్యాధికారం సాధించుకుందామని పిలుపునిచ్చారు. బీసీ రాజకీయ సదస్సుకు బీసీలు పెద్దలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్సాగర్ మాట్లాడుతూ రాజకీయ సదస్సులో ఉమ్మడి జిల్లాలోని బీసీలందరూ హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సమాజ్ నల్గొండ జిల్లా కన్వీనర్ బొడ్డుపల్లి చంద్రశేఖర్, దేవరకద్ర నియోజకవర్గ కన్వీనర్ బి.శేఖర్, భూత్పూర్ కన్వీనర్ ఆంజనేయులుసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
నెలకు సుమారు రూ.లక్ష ఆదాయం
కోయిలకొండ మండలం సూరారానికి చెందిన అనసూయ, కేశవులు దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. పొట్టకూటి కోసం 2008లో మహబూబ్నగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీకి మకాం మార్చారు. ఈమె ఆరాధన మహిళా సంఘంలో చేరి పొదుపు చేయసాగింది. 2020లో స్థానికంగా రెండు షెట్టర్లను రూ.3,500కు అద్దెకు తీసుకుని ఎంబ్రాయిడరీ, టైలరింగ్, గాజులు, చీరల దుకాణం ఏర్పాటు చేసుకుంది. ఇప్పటివరకు రూ.10 లక్షలకు పైగానే పెట్టుబడి పెట్టింది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్, పీకో మిషన్, కుట్టుమిషన్లు కొనుగోలు చేసింది. తొమ్మిది నెలల క్రితం పొదుపు నుంచి రూ.లక్ష, నాలుగు నెలల క్రితం రూ.50 వేలు అప్పుగా తీసుకుని క్రమం తప్పకుండా కిస్తీలు చెల్లిస్తోంది. బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి నుంచి సైతం రుణాలు తీసుకుంది. సీజన్లో ప్రతిరోజూ రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు గిరాకీ అవుతుండటంతో అన్ని ఖర్చులు పోను నెలకు సుమారు రూ.లక్ష ఆదాయం వస్తోందని ఆమె చెబుతున్నారు. ● 3 మున్సిపాలిటీల పరిధిలో3,781 మహిళా గ్రూపులు ● 15 ఏళ్ల క్రితం సుమారు రూ.50 లక్షలతో ప్రారంభం ● పెద్ద, చిన్న సంఘాలతో కలిపి రూ.54.35 కోట్లకు చేరిక -
రేషన్ బియ్యం పట్టివేత
జడ్చర్ల: మండలంలోని నసరుల్లాబాద్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. వివరాలు.. నసరుల్లాబాద్లోని రేషన్ డీలరు అన్వర్ పాష నిర్వహిస్తున్న రేషన్ దుకాణం దగ్గర ఓ బొలెరో వాహనంలో 40బస్తాల రేషన్ బియ్యం ఉండగా గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఎస్ఐ జయప్రసాద్ వెంటనే గ్రామానికి చేరుకొని సివిల్ సప్లయ్ అధికారులకు సమాచారమిచ్చి వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించారు. వాహనంలో మొత్తం 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసల్దార్ ఆదిత్యగౌడ్ వివరాలు సేకరించి పంచనామ నిర్వహించారు. నసరుల్లాబాద్కు చెందిన కురుమూర్తి రేషన్ బియ్యాన్ని సేకరించి తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. డ్రైవర్ రాజును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత లింగాల: స్థానిక ఎస్సీ వాడలో ఉన్న కమ్యూనిటీ భవనంలో అక్రమంగా తరలించుటకు నిల్వ ఉంచిన 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శనివారం స్వాధీన పర్చుకున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. వివిధ రేషన్ షాపుల ద్వారా అక్రమంగా కొనుగోలు చేసిన బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించుటకు సిద్ధంగా ఉంచినట్లు సమాచారం అందింంది. అచ్చంపేట సీఐ రవీందర్ ఆకమ్యూనిటీ భవనాన్ని పరిశీలించి బియ్యాన్ని స్వాధీనం చేసుకొని సివిల్ సప్లై అధికారులకు సమాచారమిచ్చినట్లు ఎస్ఐ తెలిపారు. -
పొదుపు సంఘంలో తక్కువ వడ్డీ
నేను 25 ఏళ్లుగా మహి ళా సంఘంలో సభ్యురాలిగా ఉంటున్నాను. సుమారు పదేళ్లుగా గ్రైండింగ్ షాపు నిర్వహిస్తున్నాను. మూడేళ్ల క్రితం పొదుపు సంఘం నుంచి రూ.లక్ష అప్పు తీసుకుని ప్రతినెలా కిస్తీలు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాను. కేవలం రూపాయి మిత్తీ మాత్రమే పడుతుండటం ఎంతో వెసులుబాటు కలిగింది. అదే బయట ప్రైవేట్ వ్యక్తుల వద్ద అయితే రూ.3 వడ్డీకి అప్పు తీసుకోవాల్సి ఉండేది. హోల్సేల్ షాపుల వారు కొబ్బరి, ఆవాలు, వివిధ రకాల దినుసులకు పొడుల కోసం తీసుకొచ్చి గ్రైండింగ్ పట్టిస్తుండటం కలిసి వచ్చింది. మరో ఇద్దరు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాను. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.30 వేలు మిగులుతుంది. – ఎ.పద్మ, జైసంతోషిమాత మహిళా సంఘం సభ్యురాలు, రాంనగర్ టైలరింగ్ యూనిట్స్థాపించా.. మహిళా సంఘంలో 2005 నుంచి సభ్యురాలిగా కొనసాగుతున్నా ను. ఇంటి వద్ద 2018 లో టైలరింగ్ యూనిట్ స్థాపించాను. ప్రభుత్వపరంగా హాస్టళ్లు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు సంబంధించి యూనిఫాం ఆర్డర్లు వస్తున్నాయి. క్లాత్ కటింగ్ చేసే మిషన్లు ఏర్పా టు చేసుకున్నాను. స్టిచ్చింగ్ కోసం మహిళా సంఘాల సభ్యులకు ఇంటి వద్దకే ఇస్తున్నాను. వీటితో పాటు ఆఫ్రాన్, గాగ్రా, పెట్టికోట్స్, ప్యాంటీ తయారు చేయించి అమ్ముతున్నాను. పొదుపు సంఘంతో పాటు అవసరమైనప్పుడు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రుణాలు తీసుకుని కిస్తీలు చెల్లిస్తున్నాను. – సౌధామిని, మైసమ్మ మహిళా సంఘం సభ్యురాలు, శ్రీనివాసకాలనీ ● -
దీర్ఘకాలిక కేసులు రాజీ చేసుకోవాలి
పాలమూరు: కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న కేసులను లోక్ అదాలత్ వేదికల ద్వారా పరిష్కరించుకోవచ్చునని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. చిన్నపాటి గొడవలకు కోర్టుల చూట్టు తిరగడం వల్ల సమయంతో పాటు ఆర్థిక నష్టం జరుగుతుందన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. కేసుల వల్ల జీవితకాలం నష్టపోకుండా రాజీ అయ్యే అవకాశం ఉన్న కేసులను కక్షిదారులు పరిష్కారం చేసుకోవాలన్నారు. అధిక సంఖ్యలో కేసులు రాజీ కావడానికి కోర్టుతో పాటు పోలీస్శాఖ, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రతి ఒక్కరూ కృషి చేశారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల కేసులు, ఫ్రీ లిటిగేషన్, సివిల్, క్రిమినల్, ఈ–పెట్టి, బ్యాంకు, బీఎస్ఎన్ఎల్ ఫ్రీ లిటిగేషన్ కేసులను న్యాయమూర్తుల సమక్షంలో పరిష్కారం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు శ్రీదేవి, రాజా రాజేశ్వరి, ఇందిర, రాధిక, మమతారెడ్డి, భావన, మహ్మద్ మునావర్ హుస్సేన్, రవి శంకర్, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్రెడ్డి, న్యాయవాదులు, బ్యాంకు మేనేజర్లు, ఇన్సూరెన్స్ కంపెనీల నిర్వహకులు పాల్గొన్నారు. జాతీయ లోక్ అదాలత్లో 17,254 కేసులు పరిష్కారం జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి -
మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలి
మహబూబ్నగర్ క్రైం: సమాజంలో మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలని ఎస్పీ డి.జానకి అన్నారు. సమాజంలో అత్యంత ప్రాముఖ్యత పాత్ర మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది పోషిస్తున్నారని, ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా పరేడ్ మైదానంలో శనివారం రాత్రి నిర్వహించిన మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళ పోలీసులను ప్రోత్సాహించడానికి జిల్లా పోలీస్ శాఖ కట్టుబడి ఉంటుందన్నారు. మహిళ సంక్షేమానికి అనుగుణంగా పలు కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. మహిళ సిబ్బంది విధుల్లో కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలన్నారు. మహిళ హక్కులను కాపాడేందుకు పోలీస్ మరింత కృషి చేయాలన్నారు. ● ఎప్పుడూ విధుల్లో బిజీ ఉండే పోలీస్ మహిళా అధికారులు మహిళ దినోత్సవం సందర్భంగా కాసేపు ఉల్లాసంగా గడిపారు. పరేడ్ మైదానంలో ఎస్పీ డి.జానకి సమక్షంలో పలు రకాల ఆటలు ఆడారు. పలు రకాల పాటలకు మహిళ సిబ్బంది నృత్యాలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎస్పీ బహుమతులు అందించారు. మహిళా సిబ్బందికి ప్రత్యేక జ్ఞాపికలను ఇచ్చారు. ఆనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. పరేడ్ మైదానంలో నృత్యాలు చేసి అలరించిన మహిళ పోలీసులు -
అడుగడుగునా ఆటంకాలు
సొరంగంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు శ్రమిస్తున్న రెస్క్యూ బృందాలు అచ్చంపేట: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 15 రోజులైన వారీ ఆచూకీ లభ్యం కాలేదు. ఎనిమిది మందిని గుర్తించేందుకు చేపడుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు 13.50 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మిగిలిన 50 మీటర్ల ముందుకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సొరంగంలోకి నీటి ఊట వేగంగా వస్తుండటంతో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటికి తోడేస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ పూర్తిగా మరమ్మతు జరగడంతో.. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లు, టీబీఎం విడిభాగాలు (ఇనుము), ఊడిపోయిన కాంక్రీట్ సెగ్మెంట్లను తొలగించే రోబోలు తయారు చేసేందుకు కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రోబోలు సాయం వారం రోజుల తర్వాతే వినియోగంలోకి వస్తోంది. డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో.. ప్రమాదం జరిగిన సొరంగంలో పరిశోధన చేసేందుకు కేరళ నుంచి వచ్చిన కాడవర్ డాగ్స్ కూడా ఇది వరకు గుర్తించిన డాగ్స్ స్థానాల్లోనే గుర్తించాయి. 13.500 కి.మీ., అవుతల ఒకే దగ్గర ముగ్గురు వ్యక్తుల అవశేషాలు ఉన్నట్లు నిర్ధారించాయి. కార్మికులు చిక్కుకున్నట్లు డాగ్స్ చూపించిన ప్రదేశాల్లో శనివారం రెస్క్యూ బృందాలు తవ్వకాలు ప్రారంభించాయి. టీబీఎం పరికరాలు గ్యాస్ కట్టర్తో కత్తిరించి లోకో ట్రైన్ ద్వారా సొరంగం బయటికి పంపించారు. కూలిపడిన పైకప్పు మట్టి దిబ్బలను హిటాచీతో ఒకవైపు తరలిస్తున్నారు. రోజుకో బృందాన్ని సింగరేణి నుంచి రప్పించి సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. సొరంగంలో వస్తున్న దుర్వాసన సహాయక చర్యలకు ఇబ్బంది కలిగిస్తోంది. 15 రోజులైనా లభ్యం కాని కార్మికుల ఆచూకీ ఉబికివస్తున్న నీటితో సహాయక చర్యలకు విఘాతం -
బాలుడి ప్రాణం తీసిన వాటర్ హీటర్
మల్దకల్: వాటర్ హీటర్ ఓ బాలుడి ప్రాణం తీసింది. ఈ ఘటన మల్దకల్ మండలం ఉలిగేపల్లిలో తీవ్ర విషాదం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. ఉలిగేపల్లికి చెందిన కుర్వ నాగేంద్ర – జయమ్మ కుమారుడు పవన్కుమార్ (8) గ్రామంలోని పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. శనివారం ఇంట్లో ఆడుకుంటున్న బాలుడు.. వేడి నీటి కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ వాటర్ హీటర్ను పట్టుకోవడంతో షాక్కు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు నిర్ధారించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ నందికర్ తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి పాన్గల్: తాగునీరు అనుకొని పొరపాటున గడ్డి మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. పాన్గల్ మండలం శాగాపూర్కు చెందిన పుట్టపాగ శ్రీనివాసులు (47) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి రోజు సాయంత్రం వేళలో ఇంటికి మద్యం తెచ్చుకొని తాగే అలవాటు ఉంది. మూడు రోజుల క్రితం తన పొలంలోని మామిడితోటకు పిచుకారీ చేయగా మిగిలిన గడ్డి మందును వాటర్ బాటిల్లో పోసి ఇంట్లో పెట్టాడు. ఈ నెల 7న రోజు మాదిరిగానే బయటి నుంచి మద్యం తెచ్చుకున్న శ్రీనివాసులు.. ఇంట్లో ఉంచిన మంచినీరు బాటిల్ అనుకొని పొరపాటున గడ్డి మందు ఉన్న బాటిల్ తీసుకుని మద్యంలో కలుపుకొని తాగాడు. కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడికి భార్య అలివేల, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అలివేల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. బావిలో పడి వివాహిత.. లింగాల: ప్రమాదవశాత్తు బావిలో పడి వివాహిత మృతిచెందిన ఘటన లింగాల మండలం కొత్తకుంటపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ నాగరాజు వివరాల మేరకు.. కొత్తకుంటపల్లికి చెందిన చెంచు మహిళ అనూష (19) తన భర్త పరుశరాములు, చిన్నమ్మ ఎల్లమ్మతో కలిసి గ్రామ సమీపంలోని బావి వద్ద బట్టలు ఉతికేందుకు వెళ్లింది. బట్టలు ఉతుకుతున్న క్రమంలో అనూష ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయింది. భర్త రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో గొర్రెల కాపరి.. ఆత్మకూర్: అనుమానాస్పద స్థితిలో గొర్రెల కాపరి మృతిచెందిన ఘటన ఆత్మకూర్ మండలం తూంపల్లిలో చోటు చేసుకుంది. ఎస్ఐ నరేందర్ వివరాల మేరకు.. మండలంలోని గుంటిపల్లికి గొళ్ల చెన్నయ్య (48)కు తూంపల్లికి చెందిన పద్మతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మూడునెలల క్రితం పద్మ తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే చెన్నయ్య గ్రామంలోని తన ఇంటిని అమ్ముకుని పక్షం రోజుల క్రితం భార్య వద్దకు వెళ్లిపోయాడు. తన వద్ద ఉన్న గొర్రెలు, పశువులను కాస్తూ తూంపల్లిలోనే నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి గ్రామ శివారులో అతడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి సోదరి గొళ్ల మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. మూడు తులాల బంగారం చోరీ గద్వాల క్రైం: గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి మూడు తులాల బంగారు ఆభరణాలు అపహరించిన సంఘటన శనివారం పట్టణంలోని హమాలీకాలనీలో చోటుచేసుకుంది. పరుశరాముడు కూలీ పనులుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజు వారిలాగే తన కుమారుడు ఇళ్లు పక్కనే ఉండడంతో రాత్రి నిద్ర పోయేందుకు వెళ్లాడు. తను ఉంటున్న ఇంటికి తాళం వేసి ఉండడం గమనించిన గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాలోని మూడు తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. ఉదయం ఇంటికొచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. పట్టణ పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్ఐ కళ్యాణ్కుమార్ ఘటనాస్థలికి చేరుకొని సమాచారం సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా
ఊర్కొండ: బైక్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ మండల కేంద్రంలోని కల్వకుర్తి–జడ్చర్ల ప్రధాన రహదారిపై బంధువులు శనివారం ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాంరెడ్డిపల్లి గ్రామ నివాసి అయిన చిన్న వెంకటయ్య (54) శుక్రవారం రాత్రి కల్వకుర్తి–జడ్చర్ల ప్రధాన రహదారిపై కాలినడకన స్వగ్రామం వెళ్తున్నాడు. ఈక్రమంలో బైకు బలంగా ఢీకొట్టడంతో మృతి చెందాడు. మృతుడికి భార్య తెరపోగు పద్మ, కుమారుడు, కూతురు పిల్లలు ఉన్నారు. కూలీ పనిచేస్తే తప్ప డొక్కాడని బాధిత కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. ఎస్ఐ కృష్ణదేవ ధర్నా వద్దకు చేరుకొని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. నాయకులు హరీష్, జంగారెడ్డి, ఆంజనేయులు, సుజీవన్ రెడ్డి, లాలయ్య తదితరులు ఉన్నారు. -
ఆటోలో నుంచి దూకి మహిళ మృతి
దేవరకద్ర రూరల్: క్షణికావేశంలో ప్రయాణిస్తున్న ఆటోలో నుంచి దూకి ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మండలంలోని నార్లోనికుంట్ల గ్రామానికి చెందిన కురుమూర్తికి అడవి అజిలాపూర్ గ్రామానికి చెందిన పాలెం అనూష(20)తో ఏడాది క్రితం వివాహమైంది. వీరికి ఇటీవల కుమారుడు జన్మించడంతో రెండు రోజుల క్రితం భర్త ఇంటి దగ్గర బారసాల నిర్వహించారు. ఆ ఫంక్షన్లో అత్తాకోడలుకు చిన్నపాటి వివాదం జరిగింది. ఈ క్రమంలోనే తనను ఇంటికి తీసుకెళ్లాలని అనూష బతుకుదెరువు కోసం హైదరాబాద్లో ఉంటున్న తన తల్లితండ్రులను కోరింది. భర్త కురుమూర్తి కూడా హైదరాబాద్లో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తుండటంతో భార్య, కొడుకుతో కలిసి ఆటోలో హైదరాబాద్కు బయలుదేరారు. దేవరకద్ర సమీపంలోకి రాగానే అనూష మూడు నెలల కుమారుడిని ఆటోలో వదిలేసి దూకింది. ఈ ఘటనలో అనూష తలకు తీవ్రగాయాలు కాగా, చికిత్స కోసం దేవరకద్ర ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగన్న తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మహబూబ్నగర్ క్రైం: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. రూరల్ ఎస్ఐ విజయ్కుమార్ కథనం ప్రకారం..ధర్మపూర్ గ్రామానికి చెందిన కన్నయ్య(34), దేవరకద్రకు చెందిన శివరాజ్తో కలిసి శుక్రవారం రాత్రి 11.30 ప్రాంతంలో ఏపీ 11కె 7109 నంబర్ కలిగిన బైక్పై దేవరకద్ర నుంచి మన్యంకొండ దేవస్థానంలో నిద్రచేసేందుకు బయల్దేరాడు. మన్యంకొండ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కన్నయ్యకు, శివరాజ్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని జనరల్ ఆస్పత్రికి తరలించారు. కన్నయ్యను మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లాడు..
హన్వాడ: బతుకుదెరువు కోసం 16ఏళ్ల క్రితం భార్యాపిల్లల్ని వదిలి ఓ వ్యక్తి సౌదీకి వలస వెళ్లాడు. రెండున్నర నెలల క్రితం గుండెపోటుతో మృతిచెందగా శనివారం అతడి మృతదేహం స్వగ్రామం చేరగా కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని రామాలయంతండాకు చెందిన సబావత్ రవి(45) 16 ఏళ్ల క్రితం సౌదీకి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన ఏడాదికే అతడిపై మోసానికి సంబంధించిన కేసు నమోదైంది. దీంతో తప్పించుకు తిరిగిన రవి వీసా గడువు కూడా ముగియడంతో స్వదేశానికి వచ్చే వీలు లేకుండాపోయింది. భార్యాపిల్లలకు దూరమై దుర్భరమైన ఏడాది జీవితాన్ని అనుభవించాడు. గత జనవరి 26న గుండెపోటుతో మృతి చెందాడు. అతని శవాన్ని స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. స్థానిక బీజేపీ నాయకులు ఎంపీ డీకే అరుణ దృష్టికి ఈవిషయాన్ని తీసుకెళ్లారు. ఆమె స్పందించి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రితో మాట్లాడి మృతదేహా న్ని స్వస్థలానికి రప్పించారు. శనివారం మధ్యాహ్నం మృతదేహం స్వగ్రామానికి చేరుకోగా సాయంత్రం కుటుంబీకులు అంత్యక్రియలు చేశారు. మృతుడు సౌదీ వెళ్లే సమయంలో అతని కూతురు పూజకు మూడు నెలలు. ప్రస్తుతం ఆమె స్థానిక కేజీబీవీలో 9వ తరగతి చదవుతున్నాడు. కుమారుడు సచిన్ (7వ తరగతి వరకే) చదివి మధ్యలో ఆపేసి హైదరాబాద్లో కూలీ పనులు చేసుకుంటున్నాడు. భార్య తారాబాయి ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తోంది. మృతుడి కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆదుకోవా లని స్థానికులు కోరుతున్నారు. రెండున్నర నెలల క్రితం గుండెపోటుతో మృతి శనివారం స్వగ్రామం చేరుకున్న మృతదేహం అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబీకులు -
భక్తిశ్రద్ధలతో ఆరుద్రోత్సవం
అలంపూర్: ఐదో శక్తిపీఠం జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో శనివారం ఆరుద్రోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద అర్చక స్వాములు గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ప్రదక్షిణలు, దర్భార్ సేవలు నిర్వహించారు. ఆలయంలోని రససిద్ధి గణపతికి అభిషేకాలు, పంచామృత అభిషేకాలు విశేషంగా జరిగాయి. అనంతరం బాలబ్రహ్మేశ్వరస్వామిని పండ్ల రసాలు, పంచామృతాలు, మంగళద్రవ్యాలతో అభిషేకించారు. అన్నసూక్త పఠనంతో స్వామివారికి స్వేతాన్నంతో అభిషేకాలు జరిగాయి. అన్నాన్ని లింగాకృతిలో అలంకరించి.. బిల్వదళాలు, వివిధ రకాల పూలతో అష్టోత్తర అర్చనలు, పంచభక్ష పరమాన్నాలతో మహా నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారి నామాన్ని స్మరిస్తూ అభిషేకాలు చేశారు. అదే విధంగా ఏక హారతి, నేత్ర హారతి, బిల్వ హారతి, వేద హారతి, కర్పూర పంచక హారతి, రథ హారతి, చక్ర హారతి, కుంభ హారతి, నక్షత్ర హారతులతో శతవిద నీరాజనాలు సమర్పించారు. ఆరుద్రోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అర్చక స్వాములు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశ్వీరచనాలు పలికారు. -
రాష్ట్రపతిని ఆకట్టుకున్న గద్వాల చేనేత చీరలు
గద్వాలటౌన్: రాష్ట్రపతి భవన్లో గద్వాల చేనేత చీరల ప్రదర్శన ఆకట్టుకుంది. అమృత్ కా మహోత్సవ్లో భాగంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో దక్షిణ భారతంలో ప్రసిద్ధి చెందిన హస్తకళలు, హ్యాండ్ల్యూమ్, అథెంటిక్ సౌత్ ఇండియా ఫుడ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషనల్లో తెలంగాణ నుంచి 40 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో 25 చేనేత రంగానికి సంబంధించినవి ఉన్నాయి. ఖండాంతర ఖ్యాతి గడించిన గద్వాల చేనేత జరీ చీరలు ఎగ్జిబిషన్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గద్వాల చీరలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జరీ చీరల ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. గద్వాల చేనేత జరీ చీరల ఉత్పుత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనలో సంఘం నాయకులు అక్కల శాంతరాం, అక్కల శ్రీనివాసులు, మంత్రి సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
SLBC టన్నెల్లో రోబోలతో సహాయక చర్యలు: మంత్రి ఉత్తమ్
ఎస్ఎల్బీసీ సహాయక చర్యల అప్డేట్స్..టన్నెల్లో రోబోలతో సహాయక చర్యలు: మంత్రి ఉత్తమ్టన్నెల్ వద్ద సహాయక చర్యలను పరిశీలించిన మంత్రి ఉత్తమ్మంత్రి ఉత్తమ్ కామెంట్స్..సొరంగంలో జరిగిన ప్రమాదంలో ఇలాంటి క్లిష్టమైన ప్రమాదం ఎక్కడా జరగలేదు14 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉందిచివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులుఅక్కడ సహాయక చర్యలు చేపడితే రెస్క్యూ ఆపరేషన్ చేసే వాళ్లకు సైతం ప్రమాదంఅందుకే రోబోల సాయంతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నాం 👉ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికుల కోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నేటితో సహాయక చర్యలు 15వ రోజుకు చేరుకున్నాయి. ఇక, టన్నెల్లో జీపీఆర్ గుర్తించిన అనుమానిత ప్రాంతాలనే క్యాడవర్ డాగ్స్ మళ్లీ గుర్తించాయి. మరోవైపు.. టన్నెల్లో సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి నేడు మరోసారి సమీక్షించనున్నారు. హెలికాప్టర్లో మంత్రి ఉత్తమ్ దోమలపెంట చేరుకోనున్నారు.👉ఇక, హైదరాబాద్కు చెందిన అన్వీ రోబోటిక్స్, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు వరసగా రెండోరోజు కూడా సొరంగంలోని పరిస్థితులను అంచనా వేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో టీబీఎం చుట్టుపక్కల, అక్కడి నుంచి మరికొంత దూరంలో కొన్ని ప్రదేశాలను గుర్తించినట్లు సమాచారం. ఇంతకుముందు క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలనే ఇవి కూడా గుర్తించినట్లు తెలిసింది.👉ఇదిలా ఉండగా.. సొరంగంలోకి వెళ్లిన రోబోటిక్ నిపుణులు, ఐఐటీ ప్రొఫెసర్లు టీబీఎం కత్తిరింపునకు అవసరమైన సామగ్రిని లోకో ట్రైన్ ద్వారా సొరంగంలోకి తెప్పించుకున్నారు. రాకపోకలకు అనుకూలంగా ఉండేందుకు కూలిపడిన మట్టి దిబ్బ వరకు పొక్లెయిన్ వెళ్లేలా టీబీఎంను ఒకవైపు కత్తిరిస్తున్నారు. టీబీఎం భాగాలను కత్తిరించే పనిలో సహయక సిబ్బంది వేగం పెంచారు. రోజుకు సుమారు ఐదు అడుగుల మేర తొలగించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరో రెండు రోజుల్లో మట్టి కూలిన ప్రదేశం వరకు పొక్లెయిన్ చేరుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలగించిన టీబీఎం సామగ్రిని లోకో ట్రైన్తో బయటకు పంపిస్తూ రాకపోకలకు క్లియర్ చేస్తున్నారు. -
No Headline
259 మంది గైర్హాజరు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 36 పరీక్ష కేంద్రాల్లో 11,303 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 11,044 మంది హాజరయ్యారు. 259 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారులు పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు చేశారు. 18న పీయూలో యువ ఉత్సవ్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఈనెల 18 జిల్లా యువజన సర్వీసుల ఆధ్వర్యంలో యువ ఉత్సవ్ నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ను పీయూ వీసీ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా యూత్ అధికారి కోటానాయక్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిభ ఉన్న యువతను గుర్తించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని తెలిపారు. పాటలు, ఫొటోగ్రఫీ, వ్యాసరచన, ఆర్ట్, సైన్స్మేళా, కల్చరల్ విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పీయూ పరిధిలోని వనపర్తి పీజీ సెంటర్లో 2022లో చేసుకున్న ఒప్పందం మేరకు అక్కడ భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, కంప్యూటర్ ల్యాబ్కు సంబంధించిన భవనాలు నిర్మించాల ని హైదరాబాద్ జేఎన్టీయూ వీసీ కిషన్కుమార్ను పీయూ వీసీ శ్రీనివాస్ విన్నవించారు. స్పందించిన ఆయన ల్యాబ్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
వివక్ష లేదు.. వేధింపులుతగ్గలేదు
ఇంట్లో వివక్ష లేకున్నా... బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు కొంతమేర కొనసాగుతున్నాయి. బస్టాప్, కళాశాల, ఆఫీస్తో పాటు అసభ్యపద జాలంతో పంపిస్తున్న మెసేజ్లతో ఇబ్బంది పడుతున్నారు. తెలియనివారితోనే ఎక్కువ సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు మహిళలు చెబుతున్నారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆడ–మగ వివక్ష, పని ప్రదేశంలో వివక్ష తదితర అంశాలపై ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సాక్షి సర్వే నిర్వహించగా పలు విషయాలు వెలుగుచూశాయి. – సాక్షి నెట్వర్క్ సాక్షి సర్వేలో మహిళల మనోగతం -
పెళ్లికి అడ్డంకులు..
‘మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. కూలీపని చేసి, జీవనం గడిపేవాళ్లం. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు (1985లో) జోగినిగా మార్చారు. అప్పుడు మా అమ్మానాన్నకు జోగిని వ్యవస్థ గురించి అసలే తెలియదు. తెలిస్తే అలా చేసేవారు కాదు. 1995లో ఊట్కూర్కు చెందిన లక్ష్మయ్యతో పెళ్లి నిశ్చయం కాగా.. చాలామంది గ్రామస్తులు, జోగినిలు వ్యతిరేకించారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను అడ్డుకున్నారు. ఊరోళ్లయితే పంచాయితీ పెట్టి.. జోగినికి పెళ్లి ఎలా చేస్తారని నిలదీశారు’ అని హాజమ్మ తన గాథను చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాను మూఢనమ్మకాలను పట్టించుకోనని స్పష్టం చేసినట్లు వివరించారు. తాను ఊరందరికీ భార్య అంటున్నారు కదా.. మరి మీ ఆస్తి రాసివ్వాలని అడిగితే ఎవరూ సమాధానం చెప్పలేకపోయారన్నారు. అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నానని.. తాను జోగినిని కాదని సమాజానికి తెలియజేసేందుకు చాలా సమయం పట్టిందని పేర్కొన్నారు. -
మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి
జెడ్పీసెంటర్( మహబూబ్నగర్): మహిళలకు సమాజంలో సమాన అవకాశాలు కల్పించాలని, అప్పుడు వారు అభివృద్ధి చెందుతారని కలెక్టర్ విజయేందిర పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో పని చేస్తూ ముందుకు వెళుతున్నారని అన్నారు. ఇంట్లో, పని చేసే స్థలంలో వివక్ష తొలగిపోవాలన్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం మహిళా ఉద్యోగులకు నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయగా.. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, మోహన్రావు, మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారిని జరీనా బేగం, భూగర్భ జల వనరుల శాఖ డీడీ రమాదేవి, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఇందిరా, వైద్య ఆరోగ్య శాఖ మాస్ మీడియా అధికారిణి మంజుల తదితరులు పాల్గొన్నారు. -
వనిత.. ప్రగతి బావుటా
మక్తల్: జోగిని వ్యవస్థ నిర్మూలనకు ఆమె చేసిన పోరాటం ఆదర్శనీయం.. ఒక దృఢ సంకల్పతో ముందుకు సాగుతూ.. ఏ ఒక్కరినీ జోగినిగా మార్చకుండా అడ్డుకోవడంతో పాటు ఆదర్శ వివాహాలు జరిపిస్తూ.. జోగినుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఊట్కూరుకు చెందిన దళిత మహిళ హాజమ్మ. చిన్నతనం నుంచే జోగిని వ్యవస్థను వ్యతిరేకించిన ఆమె.. ఓఎంఐఎఫ్, ఏహెచ్టీయూ సంస్థల సహకారంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జోగినులకు అండగా నిలుస్తున్నారు. ఇందుకోసం ఆశ్రయ్ సంస్థ నిర్వాహకురాలు గ్రీస్ నిర్మలతో కలిసి ‘ఆంధ్రప్రదేశ్ జోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘటన సంస్థ’ను ఏర్పాటుచేశారు. ఈ సంస్థకు హాజమ్మ ఉమ్మడి జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నారు. 20 ఏళ్లుగా జోగిని వ్యవస్థను అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకు 30 మంది జోగినులకు వివాహాలు జరిపించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 5 వేల మంది జోగినులు ఉన్నారని.. అందులో 2 వేల మందికి ప్రభుత్వం నేటికీ పునరావాసం కల్పించలేదని హాజమ్మ తెలిపారు. ● వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతున్న ‘ఆమె’ ● ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి ● ఉమ్మడి జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్న పలువురు మహిళలు -
మహిళలు నడిపే ఏకై క సాహిత్య సంస్థ
స్టేషన్ మహబూబ్నగర్: తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థను 2020 ఫిబ్రవరి 7వ తేదీన మహబూబ్నగర్కు చెందిన పలువురు మహిళా రచయిత్రులు కలిసి ఏర్పాటు చేశారు. మహిళలు నడుపుతున్న ఏకై క సాహిత్య సంస్థ ఇదే కావడం విశేషం. ఈ సంస్థ ద్వారా యువ మహిళ రచయి త్రులు, కవయిత్రులను ప్రోత్సహిస్తున్నారు. సంస్థకు అధ్యక్ష, కార్యదర్శులుగా రావూరి వనజ, జి.శాంతారెడ్డి వ్యవహరిస్తున్నారు. సంస్థ ఆధ్వర్యంలో పలు పుస్తకావిష్కరణ, కవి సమ్మేళనాలు నిర్వహించారు. ప్రతి ఏడాది మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో సేవలు చేస్తున్న మహిళలకు సీ్త్ర స్ఫూర్తి పురస్కారాలతో సత్కరిస్తున్నారు. విద్యార్థులకు పద్యంపై అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా పద్య కార్యశాల నిర్వహించారు. జిల్లాకు చెందిన సాహితీ దిగ్గజం డాక్టర్ పాకాల యశోదారెడ్డి జయంతి వేడుకలతో పాటు తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాళోజీ జయంతి వేడుకలు నిర్వహించి పలువురు రచయిత్రులకు పురస్కారాలు అందజేస్తున్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 13 పుస్తకాలను ఆవిష్కరించారు. 2023లో హైదరాబాద్లో పద్మాకర్ అవధానిచే శతవధానం నిర్వహించారు. ప్రముఖ రచయిత్రి చుక్కాయపల్లి శ్రీదేవిచే శతావధానం, పలుసార్లు అష్టావధానాలు నిర్వహించారు. గత ఏడాది సంస్థ తరఫున ప్రముఖ పద్యకవులు సందాపురం బుచ్చయ్య, గన్నోజు శ్రీనివాసాచారి, అల్వాల లక్ష్మణమూర్తి, శాసీ్త్రయ సంగీత గాయకురాలు సాయి మనస్వినిలకు ఉగాది పురస్కారాలు అందజేశారు. కాళోజీ సాహితీ పురస్కారాన్ని ప్రముఖ కవి డాక్టర్ రామరావు సూర్య ప్రకాశ్రావు, పాకాల యశోదారెడ్డి సాహితీ పురస్కారాన్ని కవయిత్రి కె.వీణారెడ్డికి అందజేసి సన్మానం చేశారు. మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం ఐదేళ్ల నుంచి సంస్థ ఆధ్వర్యంలో సాహిత్య కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు నిర్వహిస్తున్నాం. సంస్థ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలకు ప్రతి ఏడాది అందజేసే సీ్త్ర స్ఫూర్తి పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తెలంగాణ మహిళా సాహి త్య సాంస్కతిక సంస్థ ఆధ్వర్యంలో భవిష్యత్లో మరిన్ని సాహితీ కార్యక్రమాలు చేపడుతాం. నూతన రచయిత్రులు, కవిత్వంపై ఆసక్తిగల విద్యార్థులను ప్రోత్సహిస్తాం. – సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రావూరి వనజ, జి.శాంతారెడ్డి -
No Headline
మహబూబ్నగర్ క్రీడలు: కోయిలకొండ మండలం కేశ్వాపూర్ పెద్దతండాకు చెందిన అక్కా, చెల్లెలు కె.జ్యోతి, కె.ప్రియాంక బాస్కెట్బాల్లో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు. అక్క జ్యోతి 12 సార్లు జాతీయస్థాయి బాస్కెట్బాల్ టోర్నీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. 2015లో పంజాబ్లో జరిగిన జూనియర్ నేషనల్, వరంగల్లో జరిగిన జాతీయ ఆర్జీకేఏ బాస్కెట్బాల్ టోర్నీలో పాల్గొంది. 2016లో కర్ణాటకలో జరిగిన యూత్, ఉత్తరప్రదేశ్లో జరిగిన జూనియర్ నేషనల్ టోర్నీలో తెలంగాణ తరఫున ఆడిన జ్యోతి ఆ తర్వాత హైదరాబాద్, లుథియానా, ఢిల్లీ, చైన్నెలో జరిగి పలు జాతీయస్థాయి టోర్నీలో ప్రతిభ చూపారు. అలాగే 25కు పైగా రాష్ట్రస్థాయి టోర్నీల్లో పాలమూరు జట్టు తరఫున బరిలోకి దిగి సత్తా చాటారు. గుజరాత్ రాష్ట్రం భావ్నగర్లో జరిగిన 36వ జాతీయ క్రీడల్లో పాల్గొని, తెలంగాణ జట్టు స్వర్ణం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. చెల్లి ప్రియాంక 2014లో ఖమ్మంలో తన తొలి రాష్ట్రస్థాయి టోర్నీలో జిల్లాకు ప్రాతినిధ్యం వహించింది. ఇప్పటి వరకు 25కుపైగా రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొంది. అక్క జ్యోతితో కలిసి పలు సార్లు రాష్ట్రస్థాయి టోర్నీలో ఆడింది. మూడు సార్లు జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున పాల్గొంది. 2017 ఢిల్లీలో జరిగిన ఎస్జీఎఫ్ జాతీయస్థాయి టోర్నీలో తొలిసారిగా తెలంగాణ తరఫున బరిలోకి దిగారు. అలాగే 2019 ఢిల్లీలో జరిగిన అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయస్థాయి బాస్కెట్బాల్ టోర్నీలో ఆడింది. అండర్–23 విభాగంలో నేషనల్ బాస్కెట్బాల్ కోచింగ్ క్యాంపునకు ఎంపికై ంది. ప్రస్తుతం స్పోర్ట్స్ కోటాలో వీరు హైదరాబాద్లోని కేఎల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నారు. గిరిజన బిడ్డలు.. బాస్కెట్బాల్లో దిట్టలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్న అక్కాచెల్లెలుఅతివకు అందలం అన్నిరంగాల్లో రాణించాలంటే చదువు ఎంతో ముఖ్యం ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారతపై ‘సాక్షి’ డిబేట్ -
మహిళా సాధికారతతోనేసమాజం అభివృద్ధి
మహిళా సాధికారతతోనే సమాజం అభివృద్ధి జరుగుతుంది. మహిళలు తమ హక్కులను తెలుసుకోవాలి. సమాజంలో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పించాలి. మూఢ నమ్మకాల నుంచి బయటకు రావాలి. మారుతున్న కాలంతో పాటు మహిళల ఆలోచనలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళలపై వివక్ష సమాజంలో కొంతమేర ఉంది.. ఇది పూర్తిగా పోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా మహిళల కోసం మహిళా శక్తి క్యాంటీన్ను మంజూరు చేసింది. దీన్ని విజయవంతంగా నడిపిస్తున్న మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. – విజయేందిర, కలెక్టర్ -
ఆరోగ్యంపై దృష్టి సారించాలి: ఎస్పీ
మహబూబ్నగర్ క్రైం: మహిళా పోలీస్ ఉద్యోగుల ఇబ్బందులను అర్థం చేసుకుని, వారి కోసం మరిన్ని మెరుగైన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఎస్పీ డి.జానకి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో శుక్ర వారం పరేడ్ మైదానంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ సిబ్బంది కోసం ఎస్వీఎస్ ఆస్పత్రి సహకా రంతో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ మహిళా పోలీసులు తమ ఆర్యోగాన్ని నిర్లక్ష్యం చేయరాదని, ఆరోగ్యంగా ఉంటేనే మెరుగైన సేవలు అందిస్తారని తెలిపారు. ఉద్యోగ బాధ్యతల మధ్య మహిళ ఉద్యోగులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను గుర్తించి వీటిని సమర్థవంతంగా ఎదుర్కొవడానికి పోలీస్శాఖ సహాయపడుతుందన్నారు. కార్యక్రమంలో ఉమెన్ ఎస్ఐలు సుజాత, వసంత, శ్వేత, ఇందిర పాల్గొన్నారు. -
భర్తను చంపించిన భార్య
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. పాన్గల్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిన భార్య కటకటాల పాలైంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలను శుక్రవారం విలేకరుల సమావేశంలో వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్రావు వెల్లడించారు. పాన్గల్కు చెందిన ఎండీ పర్వీన్బేగం 12 ఏళ్ల క్రితం ఏపీలోని కర్నూలుకు చెందిన ఎండీ రహమతుల్లాకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి సంతానం. వివాహమైన రెండేళ్లపాటు పాటు కర్నూలులోనే ఉండగా.. సంసారం విషయంలో గొడవలు వచ్చాయి. దీంతో పదేళ్ల క్రితమే భార్యాభర్తలు, పిల్లలు కలిసి ఆమె తల్లిగారి గ్రామమైన పాన్గల్కు వచ్చి సంతబజార్లో కిరాయి ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త రహమతుల్లా పెయింటింగ్, మటన్ కట్టింగ్ పనిచేస్తుండగా.. భార్య టైలర్ పనిచేస్తుంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న కిరాణం షాపు నడుపుతున్న కుమ్మరి రాఘవేందర్(ఎ1)తో పరిచయం ఏర్పడి.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం పసిగట్టిన రహమతుల్లా ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఆ తర్వాత కూడా రహమతుల్లా తరుచుగా ఆమెను వేధించేవాడు. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన వారు రహమతుల్లాను హత్య చేయడానికి నిర్ణయించారు. ఈ క్రమంలోనే రాఘవేంద్ర తనకు పరిచయం ఉన్న కురుమూర్తితో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 1న తెల్లవారుజామున 4 గంటల సమయంలో కురుమూర్తిని రహమతుల్లా ఇంటికి పంపించి గొర్రెను కోసేది ఉంది అని చెప్పి వెంట తీసుకొని పాన్గల్ గ్రామ శివారులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని కేఎల్ఐ కాల్వ దగ్గరకు వెళ్లగా అప్పటికే రాఘవేంద్ర తన బైక్పై అక్కడికి వచ్చి హతమార్చారు. రాఘవేంద్ర రహమతుల్లా గొంతు పిసకగా.. కురుమూర్తి అతని చేతులు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి రహమతుల్లా మృతదేహం, అతని వెంట తెచ్చుకున్న కత్తిని పక్కనే ఉన్న కేఎల్ఐ కాల్వలో పడేసి రాఘవేంద్ర, కురుమూర్తి కలిసి మోటార్ సైకిల్పై వెళ్లిపోయారు. ఈ మేరకు నిందితులు ఉపయోగించిన మోటార్ సైకిల్, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసులో ఎ1 కుమ్మరి రాఘవేంద్ర, ఎ2 ప్యాట కురుమూర్తి, ఎ3 పర్వీన్బేగంను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. కేసు ఛేదనలో ప్రతిభచూపిన వనపర్తి సీఐ కృష్ణ, స్థానిక ఎస్ఐ శ్రీనివాసులును, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో సీడీసీ చైర్మన్ దుర్మరణం
కొత్తకోట: పట్టణానికి చెందిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చెరుకు అభివృద్ధి మండలి అధ్యక్షుడు, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు పాపయ్యగారి చంద్రశేఖర్రెడ్డి అలియాస్ గొల్లబాబు (55) హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గురువారం హైదరాబాద్లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై ఎల్బీనగర్లోని తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన గతేడాది అక్టోబర్ 27న ఉమ్మడి జిల్లా సీడీసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రశేఖర్రెడ్డి మరణంతో పట్టణంలో విషాదచాయలు అలుముకున్నాయి. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి ప్రగాడ సానుభూతి తెలిపి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
గడ్డు పరిస్థితులు
సొరంగంలో అచ్చంపేట/అచ్చంపేట రూరల్/బల్మూర్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ కనుగొనేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సహాయక చర్యలకు నీటి ఊట అడ్డంకిగా మారింది. సొరంగంలో 14 రోజులుగా 12 విపత్తు బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నా కార్మికుల ఆచూకీ మాత్రం లభించడం లేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ నిరంతరం పర్యవేక్షిస్తూ కావాల్సిన సహాయక చర్యలు, వనరులు సమకూరుస్తున్నారు. గురువారం కేరళలోని త్రిసూల్ నుంచి వచ్చిన కడావర్ డాగ్స్ శుక్రవారం సొరంగంలోని ప్రమాద స్థలంలో సహాయక బృందాల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టాయి. రోబోటిక్ నిపుణులు, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు టన్నెల్ లోపల పరిసరాలు పరిశీలించారు. అన్వి రోబోటిక్, హైదరాబాద్ బృందం ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా సమాచారం తెలుసుకొని అవసరమైన సహకారం అందిస్తున్నారు. సొరంగంలో సహాయక బృందాలకు రోజురోజుకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. సఫారీ వాహనంలో సిస్మాలజీ బృందం.. భూ ప్రకంపనలు, భూమిలో ప్రయాణించే ప్రత్యాస్తి తరంగాలను అధ్యయనం చేసే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం నల్లమలలో సర్వే చేస్తున్నారు. రెండు ప్రత్యేక సఫారీ వాహనాలను అటవీశాఖ అధికారులు కేటాయించారు. సొరంగంలో ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి అధికారులు సిస్మాలజీ ప్రతినిధులకు లాంగిట్యూడ్, ల్యాటిట్యూడ్ లొకేషన్ను పంపిస్తుండగా సర్వే చేపడుతున్నారు. సమగ్ర నివేదికలను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిసింది. సక్రమంగా పనిచేయని కన్వేయర్ బెల్ట్.. సొరంగంలో సింగరేణి కార్మికుల పనికి ప్రాధాన్యం ఉండటంతో అధికంగా తరలివస్తున్నారు. కాగా టీబీఎం వద్ద 7 కంటైనర్లు ఉండగా.. ఒక కంటైనర్ మాత్రం బయట పడిందని, మిగిలినవన్నీ మట్టితో కూరుకుపోయినట్లు సమాచారం. బయటపడ్డ కంటైనర్లో ఆక్సిజన్ సౌకర్యం ఉందని.. అందులో చిక్కుకున్న కార్మికులు ఉండి ఉంటే క్షేమంగా బయటపడేవారని సహాయక బృందాలు చెబుతున్నాయి. టీబీఎం విడిభాగాలను తొలగించడానికే అధిక సమయం పడుతుందని.. సరైన విద్యుత్ సౌకర్యం లేక కన్వేయర్ బెల్ట్ సక్రమంగా పని చేయకపోవడంతో మట్టి తరలింపునకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. సొరంగంలో కార్మికులు సుమారు ఆరు నుంచి 10 గంటలు పని చేస్తుండగా.. మొబైల్ టాయిలెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. కార్మికుల జాడ కనుగొనేందుకు రంగంలోకి కడావర్ డాగ్స్, రోబోటిక్ బృందం 14 రోజులైనా లభించని ఆచూకీ కొనసాగుతున్న సహాయక చర్యలు సహాయక చర్యలు ఇలా.. చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు కడావర్ డాగ్స్ బృందం శుక్రవారం ఉదయం 7.15 గంటలకు ఎస్ఎల్బీసీ సొరంగంలోకి వెళ్లింది. 15 ఫీట్ల లోపలున్న వారిని గుర్తించగలగటం ఈ శునకాల ప్రత్యేకత. సొరంగంలోని బురద, మట్టి, ఇతర శిథిలాలను తొలగించేందుకు 110 మంది ఎన్డీఆర్ఎఫ్, ఇతర బృందాలు లోకో ట్రైన్లో వెళ్లారు. నలుగురు సభ్యుల అన్వి రోబోటిక్ నిపుణుల బృందం, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు ఉదయం 11.25కు మరోమారు సొరంగంలోకి వెళ్లారు. నాగర్కర్నూల్ కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. -
అతివకు అందలం
●మహిళలు అన్నిరంగాల్లో రాణించాలంటే చదువు ఎంతో ముఖ్యం ● కుటుంబ పోషణతో పాటు ఉద్యోగాల్లోనూ రాణించడం ఆమెకే సాధ్యం ● ప్రభుత్వం మరిన్ని చట్టాలు, స్కీంలు తీసుకువస్తే మహిళా సాధికారత ● ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో మహిళళా సాధికారతపై ‘సాక్షి’ డిబేట్ అవగాహన అవసరం.. సమాజం ఎంత అభివృద్ధి చెందినా చాలామంది మహిళలకు బయటి ప్రపంచం గురించి తెలియని పరిస్థితి. అందుకే వంటిళ్లు కుటుంబమే జీవితంగా జీవిస్తున్నారు. అందుకోసం ప్రతి మహిళ తమ హక్కులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అగ్రశ్రేణి సంస్థల్లో మహిళలు ఉన్నత పదవుల్లో ఉన్నారు. కానీ, చాలా మంది అవగాహన లేనందుకు ప్రతి విషయానికి పురుషులపై ఆధారపడాల్సి వస్తోంది. – తనీష, ఎంపీసీ, ఫస్ట్ ఇయర్ కట్టుబాట్లు ప్రతిబంధకాలు.. మన సమాజంలో మహిళలు సాధికారత సాధించకపోవడానికి కట్టుబాట్లు, పద్ధతులు ఒక ప్రతిబంధకంగా మారాయి. ఉన్న ఒక్క జీవితానికి ప్రతి మహిళ తన లక్ష్యాన్ని, తన కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. చరిత్రలో ఎంతో మంది మహిళలు దేశ అస్తిత్వం కోసం పోరాటం చేశారు.. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని.. కొత్త చరిత్ర సృష్టించాలి. – వాహిని, ఎంపీసీఎస్, సెకండ్ ఇయర్ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంఎంత కష్టాన్ని అయిన భరించేతత్వం ఒక్క మహిళకే ఉంటుంది. నేనూ ఒక మహిళ అయినందుకు గర్విస్తున్నా. నాకు అన్ని విష యాల్లో సహకరించే కుటుంబ సభ్యులు, మా తల్లిదండ్రుల సహకారం మరువలేనిది. మహిళ సాధికారత, సమానత్వం సాధించాలంటే తప్పకుండా కుటుంబ సభ్యుల సహకారం ఉంటే ఏదైనా సాధ్యమే. ప్రభుత్వాలు, మరిన్ని చట్టాలు, స్కీంలు తీసుకురావాలి. – ఆలియా, ఎంజెడ్సీ, సెకండ్ ఇయర్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఆధునిక ప్రపంచంలో సమాజం ఎంతో అభివృద్ధి చెందినా మహిళలు తక్కువ, మగవారు ఎక్కువ అనే భావన తొలగిపోవడం లేదు. మహిళా సాధికారత, సమానత్వం సాధించాలంటే ప్రతి మహిళ కూడా ఉన్నత విద్యను అభ్యసించి.. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తమదైన ముద్ర వేసినప్పుడే అన్నీ సాధ్యమవుతాయని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థినులు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన డిబేట్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో డిగ్రీ, పీజీ విద్యార్థినులు, అధ్యాపకులు పాల్గొని తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మహిళగా గర్విస్తున్నా.. సమాజంలో మహిళలు ఉద్యోగం చేసేవారు ఇటు కుటుంబాన్ని.. అటు ఉద్యోగం రెండింటినీ సమన్వయం చేసే శక్తి ఒక్క మహిళకు మాత్రమే ఉంది. అంత ఓర్పు మహిళలకు ఉన్నందుకు ఒక మహిళగా గర్విస్తున్నా. మహిళ కేవలం వంటింటికే పరిమితం కాకుండా ప్రస్తుతం అనేక రంగాల్లో రాణిస్తున్న వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సమానత్వం సాధిస్తే సాధికారత సాధ్యపడుతుంది. – వసంత, ఎంజెడ్బీటీ, సెకండ్ ఇయర్ ఉన్నత విద్యతోనే.. మహిళా సాధికారత సాధించి, సమానత్వం రావాలంటే తప్పకుండా ఉన్నత విద్యను అభ్యసించి, మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. అందుకే పాఠశాల, కళాశాలలో చదువుతున్న క్రమంలో ప్రతి విద్యార్థిని కూడా అనవసర విషయాల జోలికి పోకుండా చదువులపై దృష్టి సారించినప్పుడు అవకాశాలు వాటంతట అవే వస్తాయి. – భవాని, బీకాం, ఫస్ట్ ఇయర్ ఉద్యోగావకాశాలు కల్పించాలి.. మహిళా సాధికారత రావాలంటే ప్రతి ఒక్కరు తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం చేసే విధంగా అవకాశాలు రావాలి. చదువులు ఉన్నప్పటికీ కొంత మంది ఉద్యోగాలు చేయలేని పరిస్థితి ఉంది. అందుకు ప్రభుత్వం మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ అందిస్తే సులువుగా ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉంది. – నిహారిక, బీకాం, ఫస్ట్ ఇయర్ పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయి వరకు బాలికలు చదువుతున్నప్పటికీ ఉన్నత విద్యకు వచ్చే సరికి వారి సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉంది. వీటితోపాటు స్కిల్ డెవలప్మెంట్, మరిన్ని యూనివర్సిటీలను అందుబాటులోకి తీసుకువస్తే మహిళలు చదువుకునేందుకు ఆస్కారం ఉంది. నాకు అన్ని స్థాయిల్లో కుటుంబ సభ్యులు సహకరించడం వల్ల ప్రిన్సిపాల్ స్థాయి వచ్చా. మహిళలకు కుటుంబమే బలం. అలాంటి అవగాహన అందరిలో రావాలి. – పద్మావతి, ప్రిన్సిపాల్, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల చైతన్యం అవసరం.. చాలామంది మహిళలు అవగాహన లేకకపోవడం, హక్కులు తెలియపోవడం వంటి విషయాల కారణం సాధికారత సాధ్యపడడం లేదు. అందుకోసం సామాజిక అంశాల పట్ల పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి మహిళలో కూడా చైతన్యం వచ్చి రాజకీయ, సామాజిక, ఉద్యోగాల్లో వారి సంఖ్య పెరిగితే అప్పుడు మహిళలు పురుషులతో సమానంగా రాణించగలుగుతారు. – నీలిమ, బీబీఏ, సెకండ్ ఇయర్ తోటివారికి సహకరించాలి.. సమాజంలో మహిళలకు తోటివారే సహకరించాలి. పనిచేసే ప్రదేశం, ఇతర చోట్ల ఎక్కడైనా మహిళలు ఒకరికి ఒకరు సహరించుకుంటే ముందుకు సాగేందుకు ఆస్కారం ఉంటుంది. రెండు కొప్పులు ఒక దగ్గర కలవవు అనే నానుడి నుంచి బయటికి రావాలి. ప్రతి మహిళా సాధికారత సాధించాలంటే తప్పకుండా విద్యను ఒక ఆయుధంగా మలచుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. – సుభాషిణి, ఎంవీఎస్ కళాశాల అధ్యాపకురాలు కుటుంబమే బలం.. -
ఆమె కోసం.. ఒకరోజు
అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం 2023, మార్చి 8న మహిళా క్లినిక్లను ప్రారంభించింది. జిల్లాలోని జనరల్ ఆస్పత్రులు, 24 గంటలు సేవలందించే పీహెచ్సీల్లో మహిళా క్లినిక్లు కొనసాగుతున్నాయి. ఈ క్లినిక్లలో ప్రతి మంగళవారం మహిళలకు వైద్యసేవలు అందిస్తారు. ప్రతి వారం ఒక రకమైన వైద్య సేవలు అందిస్తున్నారు. సోమవారం గర్భిణులకు వైద్య పరీక్షలు చేస్తుండగా.. బుధవారం, శనివారం టీకాలు, శుక్రవారం డ్రై డే, గురువారం హెల్త్కేర్ క్లినిక్ వృద్ధుల కోసం చేస్తుండగా.. ఖాళీగా ఉన్న మంగళవారాన్ని మహిళలకు కేటాయించారు. ఇందులో 57 రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ క్లినిక్స్లో పరీక్షలు చేసి 24 గంటల్లో రిపోర్టు అందజేస్తారు. ఈ మేరకు తెలంగాణ డయాగ్నోస్టిక్ పోర్టల్ ప్రత్యేక లింక్ రూపొందించింది. నమూనాల సేకరణ, కేంద్రాలకు తరలింపునకు వాహనాలు, స్టాప్ను నియమించారు. -
SLBC: ఆ ప్రదేశంలో ఆగిన క్యాడవర్ డాగ్స్.. రెస్క్యూ ఆపరేషన్లో కీలక పరిణామం
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో మూడు మృతదేహాల స్పాట్స్ను క్యాడవర్ డాగ్స్ గుర్తించాయి. జీపీఆర్ ద్వారా మార్క్ చేసిన ప్రదేశంలోనే క్యాడవర్ డాగ్స్ ఆగాయి. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ రెండు వారాలైనా లభించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్లో సాయం చేసేందుకు కేరళ పోలీసు శాఖకు చెందిన కడావర్ డాగ్స్ను రాష్ట్ర ప్రభు త్వం రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. కేరళలోని త్రిసూర్ నుంచి రెండు కడావర్ జాగిలాలతోపాటు వాటి శిక్షకులను దోమలపెంటకు రప్పించింది.నేషనల్ డిజా స్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ), కేంద్ర హోంశాఖ కార్యదర్శి కల్నల్ కీర్తిప్రకాశ్ సింగ్ ఆధ్వర్యంలో రెండు సైనిక హెలికాప్టర్లలో ఆ శునకాలు, శిక్షకులు వచ్చారు. ముందుగా ప్రమాదస్థలం వద్ద పరిస్థితులను పరిశీలించేందుకు కల్నల్ కీర్తి ప్రకాశ్సింగ్తోపాటు కేరళ పోలీసు అధికారి ప్రభాత్ నేతృత్వంలో కడావర్ డాగ్స్ రెస్క్యూ బృందం సొరంగంలోకి వెళ్లింది.శుక్రవారం ఉదయం 7 గంటలకు రెండు కడావర్ డాగ్స్తో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్ద కార్మికుల జాడ కోసం సహాయ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. గతేడాది కేరళలోని మున్నార్ సమీపంలో పెట్టిముడి వద్ద కొండచరియలు విరిగి మట్టిలో కూరుకుపోయిన నలుగురిని కడావర్ డాగ్స్ గుర్తించగలిగాయి. మట్టిలో 10–15 అడుగుల లోతులో కూరుకు పోయిన మానవ అవశేషాలను ఈ శునకాలు పసిగడతాయి.8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అయినా ఇప్పటి వరకు గల్లంతైన వారి జాడ దొరకలేదు.12 విభాగాలకు చెందిన దాదాపు 650 మంది సభ్యులు నిరంతం షిఫ్టుల వారిగా సహయక చర్యల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఇవాళ టన్నెల్లో చిక్కుకున్న వారి అచూకీ కనుగొనేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన రెండు క్యాడవర్ డాగ్స్ను సొరంగంలోకి పంపించారు. ఉదయం ఏడున్నర గంటలకు లోకో ట్రైన్లో వాటిని లోపలికి తీసుకెళ్లారు. తిరిగి మధ్యాహ్నం రెండున్నరకు బయటకు తీసుకొచ్చారు. తప్పిపోయిన వారి ఆనవాళ్లకు సంబంధించి పలు అనుమానిత ప్రాంతాలను డాగ్స్ గుర్తించినట్టు చెబుతున్నారు. వాటి ఆధారంగా తదుపరి చర్యలపై అధికారులు సమీక్ష చేస్తున్నారు.టన్నెల్లోకి నలుగురు సభ్యులతో కూడిన ఎన్వీ రోబోటిక్ నిపుణుల బృందం వెళ్లింది. వారితో పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కూడా వెళ్లి అందులో అధ్యయనం చేశారు. మరో వైపు కన్వేయర్ బెల్ట్ కూడ పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావటంతో సహయచర్యలు వేగవంతమయ్యాయి. సొరంగంలో కూరుకుపోయిన మట్టి, బురదను తొలగిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే నిపుణులతో ప్లాస్మాకట్టర్స్ ద్వారా టీబీఎం మిషన్ భాగాలు కట్ చేస్తూ వాటిని లోకో ట్రైన్ ద్వారా బయటికి తీసుకొస్తున్నారు.టీబీఎంపై ఉన్న మట్టిని వాటర్గన్తో తొలగిస్తున్నారు. కాని జీపీఆర్ అనుమానిత ప్రాంతాల్లో జరుపుతున్న తవ్వకాల్లో పెద్దఎత్తున సీఫేజ్ వాటర్ వస్తుండటంతో సహయక చర్యలకు కొంత అవరోధం ఏర్పడుతుంది. మరోవైపు అదనపు మోటార్లు ఏర్పాటు చేసి సీఫేజ్ వాటర్ను త్వరిత గతిన బయటికి పంపే ప్రక్రియను చేపడుతున్నారు. మొత్తంగా టన్నెల్లో ఇరుకున్న వారి ఆచూకీని కనుగొనేందుకు అనేక చర్యలు చేపడుతున్నా ఇప్పటికీ 8 మంది ఆచూకీ దొరకపోవటంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. గడచిన 14 రోజులుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. -
SLBC: టెన్నెల్లోకి క్యాడవర్ డాగ్స్ బృందం.. వీటి ప్రత్యేకత ఇదే..
సాక్షి, దోమలపెంట: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు 14వ రోజుకు చేరుకున్నాయి. సహాయక చర్యల్లో భాగంగా కార్మికుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇక, తాజాగా మరణించిన కార్మికులను గుర్తించేందుకు కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ బృందం టన్నెల్లోకి వెళ్లింది. ఇదే సమయంలో టన్నెల్లో తవ్వేందుకు అవసరమైన సామగ్రిని లోకోమోటర్ తీసుకెళ్లింది.ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికులను గుర్తించేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం ఉదయమే రెండు క్యాడవర్ డాగ్స్తో సహాయక బృందం టన్నెల్లోకి వెళ్లింది. బెల్జియం మ్యాల్నోయిస్ బ్రీడ్కు చెందిన క్యాడవర్ డాగ్స్ 15 ఫీట్ల లోపల ఉన్న వస్తువులను, మృతదేహాలను గుర్తిస్తాయి. ఇదే వీటి ప్రత్యేకత. వీరితో పాటుగా 110 మంది కూడా టెన్నెల్లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మృతదేహాల గుర్తించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎనిమిది మంది కార్మికుల అన్వేషణ అనంతరం ఈ బృందం మధ్యాహ్నం 2 గంటల తర్వాత టన్నెల్ నుంచి బయటకు రానుంది.ఇదిలా ఉండగా.. టన్నెల్లో కార్మికుల జాడ గుర్తించేందుకు జీపీఆర్ సహాయంతో సిగ్నళ్లు పంపగా.. 8 ప్రదేశాల నుంచి బలమైన సిగ్నల్స్ వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాలను, లోతును లెక్కకడుతున్నారు. ఎనిమిది ప్రాంతాల్లో మార్కింగ్ చేసి రెండుచోట్ల తవ్వకాలు జరిపితే యంత్ర పరికరాలు బయటపడ్డాయి. ఆ ప్రాంతాలను వదిలేసి మిగతా ఆరు చోట్ల తవ్వకాలు చేపట్టారు.మరోవైపు.. టన్నెల్లోని వ్యర్దాలను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపుతున్నారు. ఈ బెల్ట్ ద్వారా గంటకు 8 వందల టన్నుల వ్యర్దాలను బయటికి పంపుతున్నారు. దీంతో టన్నెల్లో భారీగా పేరుకుపోయిన మట్టి, బురదను త్వరిత గతిన తొలగించే అవకాశం ఏర్పడింది. వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు. -
ఔటర్పై ఘోర ప్రమాదం
ఇబ్రహీంపట్నం రూరల్: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ రాఘవేందర్రెడ్డి కథనం ప్రకారం.. రావిర్యాల వండర్లా సమీపంలోని ఎగ్జిట్ నంబరు 13 దాటిన అనంతరం 200 మీటర్ల దూరంలో డివైడర్పై ఉన్న మొక్కలకు హెచ్ఏండీఏ ట్యాంకర్ ద్వారా కొంగరకలాన్కు చెందిన చెనమోని రాములు (55) నీళ్లు పోస్తున్నాడు. ఉప్పల్లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై ఘట్కేసర్ వద్ద ఔటర్ ఎక్కిన వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం బెక్కం గ్రామానికి చెందిన కోషిక రవీందర్రెడ్డి, బత్తిని కృష్ణారెడ్డి (టీఎస్07జెఎం 1210) కారులో అతివేగంగా వెనుక నుంచి వచ్చి ట్యాంకర్తో నీరు పోస్తున్న రాములును ఢీకొట్టారు. దీంతో అతడు గాల్లో ఎగిరి డివైడర్పై పడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. కారు.. ట్యాంకర్ వెనుకభాగం కిందికి దూసుకెళ్లింది. దీంతో కారు ముందు సీట్లో కూర్చున్న కోషిక రవీందర్రెడ్డి (50) అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కారు నడుపుతున్న బత్తిని కృష్ణారెడ్డి (45) పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 120– 140 స్పీడ్లో ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ట్యాంకర్ కిందికి దూసుకెళ్లడంతో రవీందర్రెడ్డి మృతదేహంతో పాటు కృష్ణారెడ్డిని బయటకు తీసేందుకు పోలీసులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. సీఐ రాఘవేందర్రెడ్డితో పాటు ఎస్ఐ వెంకటేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు స్నేహితులు.. రోడ్డు ప్రమాదానికి గురైన కృష్ణారెడ్డి, రవీందర్రెడ్డి ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన స్నేహితులు. కృష్ణారెడ్డి కొండాపూర్లో ఉంటూ స్వీట్ షాప్ నిర్వహిస్తుండగా, రవీందర్రెడ్డి బోరబండలో ఉండేవాడు. వీరి మృతితో బెక్కంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్కు చెందిన రాములు ఓ కాంట్రాక్టర్ వద్ద కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతివేగంగా వచ్చి ట్యాంకర్ను ఢీకొట్టిన కారు అక్కడికక్కడే ఇద్దరి దుర్మరణం మరొకరి పరిస్థితి విషమం -
సారూ.. మా బతుకులు ఆగమైపోతున్నాయ్
కోయిలకొండ: సారూ.. మా బతుకులు ఆగమైపోయాయ్.. రైతు రుణమాఫీ రాలే.. రైతుబంధు పడలే.. కరెంటు సక్కగా లేదు.. బోర్లలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి సారు అంటూ.. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్తో ఓ రైతు తన గోడు వెళ్లబోసుకున్నారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండలంలోని దమాయపల్లి వద్ద బాలయ్య అనే రైతు వ్యవసాయ పొలంలో కొత్తగా వేస్తున్న బోరును చూసి అక్కడికి వెళ్లి రైతును పలకరించారు. దీంతో రైతు మాట్లాడుతూ నాలుగున్నర ఎకరాల వరి పూర్తిగా ఎండిపోయింది.. పంటను కాపాడేందుకు మల్లో బోరు వేస్తున్న.. 300 ఫీట్లు దాటిన చుక్క నీరు లేవు.. మొత్తం రాళ్లు, రప్పలే వస్తున్నాయి అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మీరే ఏదైనా చేయండి సార్ అంటూ వేడుకున్నారు. మళ్లీ కాంగ్రెస్ పాలనలో పాత రోజులు వచ్చినాయని వాపోయాడు. ఇది ఒక్క బాలయ్య ఆవేదనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని మాజీ మంత్రి పేర్కొన్నారు. సాగునీటి నిర్వహణ సరిగా లేకపోవడంతో జలాశయాల్లో ఉన్న నీరంతా ఖాళీ అయ్యిందని, రిజర్వాయర్ల కింద పంటలన్నీ ఎండిపోతున్నాయని, ఈ దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రైతు రుణమాఫీ చేసి ఉంటే.. రైతుబంధు సకాలంలో వేసి ఉంటే.. 24 గంటల కరెంటు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదన్నారు. ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం బాధ్యత వహించి ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీమంత్రితో ఓ రైతు ఆవేదన -
మహబూబ్నగర్
శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025వివరాలు 8లో uమహబూబ్నగర్ న్యూటౌన్: భూమి లేని పేదలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిలో పట్టాలు ఇవ్వాలని కొందరు.. పట్టాలు పొందినా తమను భూమిలోకి రానివ్వడం లేదంటూ మరికొందరు రైతులు అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నారు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో క్షేత్రస్థాయిలో పట్టాదారులు అయోమయానికి గురవుతున్నారు. రెవెన్యూ శాఖ ద్వారా అసైన్డ్ పట్టాలు ఇచ్చిన భూములు అటవీ శాఖ భూములా? లేక ప్రభుత్వ మిగులు భూములా అనేది తేలడం లేదు. ఇదిలా ఉంటే, అటవీ సరిహద్దులో ఉన్న రెవెన్యూ మిగులు భూమిలో తమకు పట్టాలివ్వాలని కొందరు రైతులు న్యాయస్థానాలను సైతం ఆశ్రయించారు. జిల్లాలోని అటవీ సరిహద్దు గ్రామాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నా.. సమస్య పరిష్కారంపై ఆయా శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గతంలో రెండు, మూడు అటవీ సరిహద్దు గ్రామాల్లో జాయింట్ సర్వే నిర్వహించినా.. ఆశించిన ఫలితాలు రాలేదు. ఉమ్మడిగా సర్వే నిర్వహించి రెవెన్యూ, అటవీ శాఖల భూముల హద్దులను నిర్ణయిస్తే.. సమస్యకు పరిష్కారం దొరికే ఆస్కారమున్నా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో సమస్య మరింత జఠిలంగా మారుతోంది. జాయింట్ సర్వే నిర్వహించి మిగులు భూముల లెక్క తేల్చాలని.. భూమిలేని పేదలకు అసైన్డ్ పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. హద్దులు లేకపోవడంతో.. రెవెన్యూ, అటవీ శాఖలకు సంబంధించిన భూములకు హద్దులు లేకపోవడంతో సమస్య మరింత పెద్దదైంది. జిల్లాలోని 15 మండలాల పరిధిలో దాదాపు 48,320 ఎకరాల భూమికి ప్రభుత్వం అసైన్డ్ పట్టాలు ఇచ్చింది. మొత్తం 52 రెవెన్యూ గ్రామాల పరిధిలో అటవీ విస్తీర్ణం దాదాపు 66,901.05 ఎకరాల్లో ఉంది. ఇందులో అటవీ సరిహద్దులోని 11 మండలాల్లో దాదాపు 38,770 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అటవీ సరిహద్దు గ్రామాల్లో హద్దులు లేకపోవడం కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయి. న్యూస్రీల్ -
తెల్లవారితే గృహప్రవేశం..
అంతలోనే గుండెపోటుతో వ్యక్తి మృతి తెలకపల్లి: ఎంతో కష్టపడి.. ఇష్టంగా నిర్మించుకున్న ఇల్లు.. తెల్లవారితే నూతన గృహప్రవేశం.. కానీ, అంతలోనే గుండెపోటుతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఆ ఇంట్లో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కారువంగ గ్రామానికి చెందిన దొడ్ల రాజు(34) గ్రామంలో నూతనంగా నిర్మించుకున్న ఇల్లు గృహ ప్రవేశం ఏర్పాట్లలో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున గృహ ప్రవేశం ఉండగా.. అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. రాజు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజుకు భార్య, కూతురు ఉన్నారు. -
ఏమైపోయారో..
అచ్చంపేట రూరల్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 13 రోజులుగా ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ గుర్తింపు కోసం అన్వేషణ కొనసాగుతోంది. తిండీ తిప్పలు దేవుడెరుగు.. కనీసం గాలి, వెలుతురు కూడా లేకుండా ఊపిరి సలపని చీకటి గుహలో తమ వారు ఎలా ఉన్నారో.. ఏమైపోయారో అంటూ టన్నెల్ వెలుపల కార్మికుల కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎదురుచూస్తూనే ఉన్నాయి. దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి కోసం 13 రోజులుగా సహాయక చర్యలు చేపడుతున్నారు. గురువారం పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ సూచనలు చేశారు. ఈ క్రమంలోనే సొరంగం లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా క్యాడావర్ డాగ్స్ రప్పించినట్లు ఆయన తెలిపారు. గురువారం ఉద యం షిఫ్టులో సింగరేణి, ఐఐటీ నిపుణులతోపాటు సైనిక అధికారులు సొరంగం లోపలికి వెళ్లారు. మట్టి తరలింపులో ఇబ్బందులు.. సొరంగంలో పేరుకుపోయిన, మట్టి, రాళ్లు, బురద బయటకు పంపడానికి సింగరేణి కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జీపీఆర్ మిషన్ చూయించిన చోట 6, 7 మీటర్ల లోపల ఉన్న అవశేషాల కోసం ప్రతిరోజు అన్వేషణ కొనసాగుతోంది. జీపీఆర్ చూయించిన ప్రదేశంలోనే ఎక్కువ శాతం పనులు కొనసాగిస్తుండటం, చివరికి ఆ ప్రాంతంలో ఎలాంటి అవశేషాలు కనిపించకపోవడంతో శ్రమిస్తున్న సింగరేణి కార్మికులకు నిరాశే మిలుగుతోంది. దీనికి తోడు 7 మీటర్ల లోతులో మట్టిని తవ్వి పక్కనే పడేస్తున్నారు. మట్టిని తవ్వడానికి కార్మికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పనులు కొనసాగితే ఆ మట్టి, రాళ్లు, ఇతర శిథిలాలను బయటకు పంపిస్తే పని సులువవుతుందని కార్మికులు అంటున్నారు. గోతులు తవ్వితే అధికంగా నీరు, బురద వస్తుంది. దీంతో ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. అందుబాటులో ఉండాలి.. సొరంగం వద్ద సహాయక చర్యల్లో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండి సహకరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. అందరూ సమన్వయంతో, సహకారం అందిస్తూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వివిధ విపత్తుల ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది సొరంగ ప్రాంతానికి వస్తున్నారని, వారికి అన్ని వసతులు కల్పిస్తూ.. సర్వే, ఇతర పనులు చేయించుకోవాలన్నారు. ఐఐటీ నిపుణులు, సింగరేణి సాంకేతిక నిపుణులు, సైనిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఉదయం ఒక చివర నుంచి మట్టిని తీసి ఎక్సలేటర్పై వేస్తూ నీటిని మరోవైపు దారి మళ్లిస్తూ ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు పడిగాపులు.. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులకు సంబంధించి కుటుంబసభ్యులు దోమలపెంట జేపీ కంపెనీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కంపెనీ యజమానితో మాట్లాడటానికి కుటుంబ సభ్యులు చూస్తుండగా.. కంపెనీ అధికారులు, సిబ్బంది పొంతన లేని సమాధానం చెబుతూ వారిని అక్కడి నుంచే పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం ఓ కార్మికుడి కుటుంబసభ్యులు కార్యాలయం వద్దకు వచ్చి ఆరా తీశారు. అదే సమయంలో జేపీ కంపెనీ యజమాని హెలికాప్టర్లో వస్తుండటంతో అక్కడి నుంచి వారిని పంపించేశారు. లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఆధారంగా.. భూ ప్రకంపనలు, భూమిలో ప్రయాణించే ప్రత్యాస్తి తరంగాలను అధ్యయనం చేసే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం సొరంగం ప్రాంతానికి చేరుకుంది. వారితో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి.. సర్వే చేసి కచ్చితమైన నివేదిక అందించాలని కోరారు. గురువారం అమ్రాబాద్ రేంజ్లో లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఆధారంగా సర్వే చేయనున్నట్లు తెలిసింది. స్థానిక ఫారెస్టు అధికారులు వారికి సహకరిస్తున్నారు. ● సహాయక చర్యలను కేంద్రం నుంచి వచ్చిన మినిస్ట్రీ ఫర్ హోం అఫైర్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ పరిశీలించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయనకు రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్కుమార్ టన్నెల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు. నేటికీ అంతుచిక్కని 8 మంది కార్మికుల ఆచూకీ ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్నసహాయక చర్యలు ఐఐటీ నిపుణులతో టన్నెల్లోకి సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు -
233 మంది విద్యార్థులు గైర్హాజరు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం మొదటి పరీక్ష పరీక్ష గురువారం ప్రశాంతంగా జరిగాయి. పేపర్–2లో తెలుగు, హిందీ, సంస్కృతం, అరబిక్లకు సంబంధించిన పరీక్షలు జరిగాయి. 36 పరీక్ష కేంద్రాల్లో 10,222 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 9,989 మంది హాజరయ్యారు. జనరల్ కోర్సుల్లో 8,295 మంది, ఒకేషనల్ కోర్సుల్లో 1,694 మంది విద్యార్ధులు హాజరు కాగా.. 233 మంది గైర్హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారులు, ఫ్లయింగ్, సిటింగ్ స్వాడ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇంటర్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ జానకి -
పుట్టెడు దుఃఖంలోనూ ఇంటర్ పరీక్ష
మరో దూడను హతమార్చిన హైనా తిమ్మాజిపేట: మండలంలోని చేగుంట శివారులో సంచరిస్తున్న హైనా గురువారం మరో దూడపై దాడిచేసి హతమార్చింది. చేగుంటకు చెందిన రైతు తుంగని బాలయ్య బుధవారం సాయంత్రం తన వ్యవసాయ పొలంలో గేదెలను కట్టివేసి ఇంటికి వచ్చారు. గురువారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా.. హైనా దాడిలో మృతిచెందిన దూడను గుర్తించారు. అయితే వ్యవసాయ పొలాల వద్ద పశువుల పాకలపై హైనా ఆకస్మిక దాడులు చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. అయితే ఫారెస్టు అధికారులు ఏ జంతువు అనేది గుర్తించక పోగా.. కనీసం బోను కూడా ఏర్పాటు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. ముగ్గురు రైతులకు చెందిన దూడలను హతమార్చిందని.. ఫారెస్టు అధికారులు మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అడవి జంతువును పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఐదుగురికి రిమాండ్ బిజినేపల్లి: గుట్టుగా గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ కనకయ్యగౌడ్ తెలిపారు. గురువారం సాయంత్రం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మండలంలోని వసంతాపూర్ శివారులో బుధవారం జార్కండ్ రాష్ట్రానికి చెందిన బిట్టుకుమార్ రాం, పుప్పుకుమార్, గుడ్లనర్వకు చెందిన మహేష్, దుర్గాప్రసాద్, ఉదయ్ బిజినేపల్లిలో గంజాయి సరఫరా చేస్తుండగా ఎస్ఐలు శ్రీనివాసులు, రాజశేఖర్ ప్రత్యేక నిఘా ఉంచి పట్టుకున్నారని తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని.. వీరి నుంచి 900 గ్రాములకు పైగా గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సమావేశంలో ఎస్లు శ్రీనివాసులు, రాజశేఖర్, ఇతర సిబ్బంది ఉన్నారు. చికిత్స పొందుతూ మహిళ మృతి మహబూబ్నగర్ క్రైం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందింది. వన్టౌన్ ఎస్ఐ శీనయ్య వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్కు చెందిన ఈశ్వరమ్మ (60) కొడుకు శివరాజ్ గతనెల 20న మృతిచెందాడు. అతడి అంత్యక్రియల కోసం వైకుంఠ రథంపై వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలోని పెద్ద శివాలయం వద్ద రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి వాహనం ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో ఈశ్వరమ్మకు తీవ్రగాయాలు కావడంతో జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి కొడుకు అంబుదాస్ ఫిర్యాదు మేరకు వైకుంఠ రథం డ్రైవర్ ఇసాక్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అలంపూర్ రూరల్: తండ్రి మరణాన్ని పంటిబిగువన ఆపి.. పుట్టెడు దుఃఖంలోనూ ఇంటర్ పరీక్ష రాశాడు ఓ విద్యార్థి. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలంలోని లింగన్వాయి గ్రామానికి చెందిన మహబూబ్బాషా(50)కు ఇద్దరు సంతానం. కాగా చిన్న కుమారుడు సమీర్ మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలోని మైనార్టీ గురుకుల పాఠశాలో ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే సమీర్ తండ్రి మహబూబ్బాషా బుధవారం మధ్యాహ్నం అనారోగ్యంతో మృతి చెందాడు. గురువారం ఇంటర్ సెకండియర్ పరీక్ష ప్రారంభం కానుండగా.. ఈ విషయాన్ని సమీర్కు ముందు తెలపకుండా పరీక్షకు వెళ్లే ముందు చెప్పారు. తండ్రి మరణ వార్త తెలిసిన సమీర్ పంటి బిగువన దుఃఖాన్ని ఆపుకొని పరీక్ష పూర్తి చేశాడు. పరీక్ష అనంతరం స్వగ్రామానికి వచ్చి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు జంకుతున్న రైతులు పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రియలకు హాజరైన విద్యార్థి -
ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఎల్ఆర్ఎస్ కోసం 2020లో దరఖాస్తు చేసుకున్న లే–అవుట్ల యజమానులకు ఫీజు చెల్లింపుపై అవగాహన కల్పించాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఆదేశించారు. గురువారం సాయంత్రం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పాలమూరు, జడ్చర్ల, భూత్పూర్, దేవరకద్ర కమిషన్లు, ఆయా విభాగాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 31లోగా నిర్ణయించిన ఫీజును చెల్లిస్తే 25 శాతం రాయితీ కల్పిస్తామన్నారు. ఈ పథకానికి సంబంధించిన ఏమైనా సందేహాలుంటే కలెక్టరేట్లోని టోల్ ఫ్రీ నం.08542–241165, మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో హెల్ప్లైన్ నంబరు 7093911352 లను సంప్రదించవచ్చన్నారు. ప్రతిరోజూ ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ నంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని దరఖాస్తుదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. https://lrs.telangana.gov.in/layouts/citizenlogin.arpx వెబ్సైట్ లాగిన్ ద్వారా కూడా ఫీజు చెల్లించవచ్చన్నారు. అంతకుముందు ఎల్ఆర్ఎస్ హెల్ప్లైన్ ను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలిచ్చారు. అనంతరం సమీక్షలో భాగంగా ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా వంద శాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని ఆదేశించారు. ప్రస్తుత వేసవికాలంలో నగరంతో మూడు పట్టణాల్లో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలన్నారు. మున్సిపల్ దుకాణాల అద్దె, నల్లాబిల్లులు సైతం బకాయిలు లేకుండా రాబట్టాలన్నారు. కాగా, ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల, లే–అవుట్ యజమానులు తాజాగా మహబూబ్నగర్ టౌన్ ప్లానింగ్ విభాగంలో కిక్కిరిసి కనిపించారు. తాము చెల్లించాల్సిన ఫీజు గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా నుంచి 2,500 మంది మహిళలు అంతకుముందు మెప్మా అధికారులతో శివేంద్రప్రతాప్ మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 8న హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి జిల్లా నుంచి కనీసం 2,500 మంది మహిళ (ఎస్హెచ్జీ)లు బస్సుల్లో తరలి వెళ్లాలని సూచించారు. ఆయా సమావేశాల్లో మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపల్ కమిషనర్లు లక్ష్మారెడ్డి, మహ్మద్ నూరుల్నజీబ్, ఇన్చార్జ్ ఎంఈ సందీప్, ఏసీపీ జోత్సా ్నదేవి, టీపీఓ లక్ష్మీపతి, టీపీఎస్ విశాల్కుమార్, మెప్మా ఇన్చార్జ్ డీఎంసీ, సీఓలు వరలక్ష్మి, దేవమ్మ, నిర్మల తదితరులు పాల్గొన్నారు. వంద శాతం ఆస్తిపన్ను వసూలు చేయాలి స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్శివేంద్రప్రతాప్ మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో సమీక్ష -
తీరొక్క పంటలు
కృష్ణానదిలో మినుములు, నువ్వులు, వేరుశనగ పంటల సాగు ●కృష్ణా నదీతీరంలో నల్లరేగడి భూమి ఎరువులు వాడం ఈ పొలాల్లో ఎరువులు వాడుకుండానే పంటలు సాగుచేస్తాం. తేమ నీళ్లకు వివిధ రకాల పంటలు పండిస్తాం. అధిక దిగుబడులు వస్తాయి. – శివ, రైతు, మంచాలకట్ట మంచి దిగుబడులు ప్రతి యేడు కాలానికి తగినట్లుగా రకరకాల పంటలు వేస్తూ సరైన మోతాదులో ఎరువులు వాడుకొని పంటలు సాగు చేస్తా. ఇతర పొలాల కంటే ఈ నల్లరేగడి పొలాల్లో మంచి దిగుబడులు వస్తాయి. – శేఖర్, మల్లేశ్వరం మినుములు, నువ్వులు పండిస్తా ప్రతి సంవత్సరం జటప్రోల్ గ్రామ శివారులో 10 ఎకరాల్లో మినుములు, నువ్వుల పంట పండిస్తా. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పంటలు పండించి లాభాలు పొందుతున్నా. – భీంరెడ్డి, జటప్రోల్ తక్కువ ఖర్చుతో.. నల్లరేగడి పొలాలు కనుక ఎకరాకు నువ్వుల పంట 6 క్వింటాళ్లు, మినుములు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తాయి. అతి తక్కువ ఖర్చుతో ఈ పంటలను పండిస్తాం. – బాలరాజు, రైతు పెంట్లవెల్లి: ప్రతి యేటా కృష్ణానదిలో నీరు తగ్గే కొద్ది తీరొక్క పంటలను రైతులు సాగు చేస్తారు. కృష్ణా నదీతీరాన ఉన్న ఒండ్రుమట్టిలో నది ఎండిన తర్వాత నాణ్యమైన రకరకాల పంటలను పండిస్తుంటారు. శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టినప్పుడు ప్రాజెక్ట్ బ్యాక్వాటర్లో దాదాపు 2000 ఎకరాల వరకు నల్లమట్టితో కూడిన ఒండ్రు మట్టి పొలాలు ఉండేవి. పెంట్లవెల్లి మండలంలోని మంచాలకట్ట, జటప్రోల్, చెల్లపాడు, మాధవస్వామినగర్, మల్లేశ్వరం, సోమశిల, అమరగిరి వాసులు కృష్ణానదిలో పొలాలున్న రైతుల దగ్గర కౌలురైతులు కౌలుకు తీసుకొని నీరు తీస్తుండేకొద్ది సాగు చేస్తూ తీరొక్క పంటలను సాగు చేస్తున్నారు. ఈ పంటలు నాణ్యతతో పాటు అధిక దిగుబడులు ఇచ్చేవి. ముఖ్యంగా మినుములు, నువ్వులు, వేరుశనగ, మొక్కజొన్న, శనగ, పొద్దుతిరుగుడు పంటలను అధికంగా సాగుచేస్తారు. వివిధ గ్రామాల రైతులు 1500 నుంచి 2000 ఎకరాల వరకు పంట సాగు అవుతున్నాయి. రూ.10వేల నుంచి రూ.15వేలు కౌలు పెట్టి.. ఈ పొలాలు కృష్ణానది నీటిలో దాదాపు ఆరు నెలలపాటు మునిగి ఉంటాయి. అందులో పదును, తేమతో ఎక్కువగా పంటలు పండుతాయి. దీంతో నీరు పెట్టడం తక్కువ మోతాదులోనే ఉంటుంది. ఎరువులు కూడా తక్కువగానే వాడుతుంటారు. ఎకరాకు రూ.10వేల నుంచి రూ.15వేలు కౌలునకు తీసుకొని మరీ ఈ పొలాలను సాగుచేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోల్ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు చేపలు పట్టడంతో పాటు పంటలు కూడా సాగు చేస్తారు. శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టినప్పుడు దాదాపు వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతాల కొన్ని గ్రామాల ప్రజలు కృష్ణానదికి దగ్గర్లో నూతనంగా గ్రామాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి సంవత్సరం కృష్ణానదిలో ఈభూములు మునకకు గురైన తర్వాత మళ్లీ నీరు తీశాక అక్కడే ఉన్న కొంతమంది రైతులు భూములను వ్యవసాయం చేసుకుంటారు. మరికొందరు మునకకు గురైనప్పుడు ఆ గ్రామాలు వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లినవారి భూములను అక్కడే ఉన్న రైతులు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుంటారు. నాణ్యతతో పాటు అధిక దిగబడులు 1500 నుంచి 2000 ఎకరాల్లో పంట పొలాలు -
ఆపద మిత్రలు అప్రమత్తంగా ఉండాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామాల్లో జరిగే విపత్తుల సందర్భంగా ఆపద మిత్రలు అప్రమత్తమై గోల్డెన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎ్స్డీఆర్ఎఫ్ రాష్ట్ర నోడల్ అధికారి గౌతమ్ అన్నారు. గురువారం జెడ్పీ హాల్లో ఆపద మిత్రలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ విపత్తుల నివారణ సంస్థతో చేసుకొన్న ఒప్పందం ప్రకారం రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ జిల్లాలో 300 మంది ఆపద మిత్ర వలంటీర్లకు 3 దశలలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ప్రమాదాలు జరినప్పుడు ఎలా వ్యవహరించాలో వారికి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో గోల్డెన్ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర అధికారులు ఆర్ఎస్ మిశ్రా, లికున్ పాత్రా, జిల్లా ఫైర్ అధికారి కిశోర్, తహసీల్దార్ జె. సువర్ణరాజు, జిల్లా శిక్షణ కేంద్ర కోఆర్డినేటర్ హన్మంతు పాల్గొన్నారు. -
జాయింట్ సర్వే నిర్వహిస్తేనే మేలు..
అసైన్డ్ పట్టాలు పొందిన రైతులు పొజిషన్లోకి వెళ్లి సాగు పనులు చేపడితే ఫారెస్టు అధికారులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో రైతులు, ఫారెస్టు అధికారులకు గొడవలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల పోలీసు కేసులు సైతం నమోదయ్యాయి. జాయింట్ సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించాలని పలుమార్లు న్యాయస్థానాలు సూచిస్తున్నా.. ఇరు శాఖల అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా జాయింట్ సర్వే నిర్వహించి.. భూములకు హద్దులు నిర్ణయిస్తే సమస్యకు పరిష్కారం లభించే ఆస్కారముంది. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
పాలమూరు: సమాజంలో ప్రతి ఒక్క అమ్మాయి ఉన్నత చదువులు చదవడంతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ మహిళ కళాశాలలో గురువారం అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి హాజరై మాట్లాడారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఆరేళ్ల నుంచి 14 ఏళ్ల బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. సమాజంలో మహిళ పాత్ర చాలా గొప్పదని, మహిళ లేకపోతే మానవ మనుగడ లేదన్నారు. కుటుంబంలో పురుషులతో పాటు మహిళలకు సమాన ఆస్తి హక్కు ఉంటుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అత్యాచారాలు, గృహహింస చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం మహిళ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ చైర్మన్ నటరాజ్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అపర్ణ తదితరులు పాల్గొన్నారు. -
రేపు మిషన్ భగీరథనీటి సరఫరా నిలిపివేత
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మన్యంకొండ నుంచి సరఫరా అయ్యే మిషన్ భగీరథ నీటిని ఒకరోజు పాటు నిలిపి వేయనున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ వెంకట్రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 8వ తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపి వేయన్నుట్లు పేర్కొన్నారు. మన్యంకొండ నుంచి మరికల్ వెళ్లే దారిలో దేవరకద్ర ఆర్చ్ వద్ద మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ అవుతున్న నేపథ్యంలో ఆ పైపులు తీసి కొత్త పైపులు అమర్చాల్సి ఉందని తెలిపారు. దీంతో దేవరకద్ర, నర్వ, మరికల్, ఊట్కూర్, నారాయణపేట, దామరగిద్ద మండలాలు పూర్తిగా, కౌకుంట్ల, చిన్నచింతకుంట, మక్తల్, ధన్వాడ మండలాలు పాక్షికంగా, మక్త ల్, నారాయణపేట మున్సిపాలిటీలు పూర్తిగా మొత్తం 245 గ్రామాలు మరియు 2 మున్సిపాలిటీల్లో నీటి సరఫరా ఉండదని వివరించారు. కృష్ణా జలాల కేటాయింపుపై పోరాడాలి పాలమూరు: కృష్ణా బేసిన్లోని అన్ని జిల్లాల్లో నీటి వాటా కోసం కృష్ణానది జలసాధన జేఏసీలు ఏర్పాటు చేసి పోరాడాల్సిన అవసరం ఉందని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు హరగోపాల్, కన్వీనర్ రాఘవాచారి గురువారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు నిధులు అన్నింటిని ఆంధ్ర ప్రాంతాల్లో వెచ్చించి, కృష్ణానది జలాల దోపిడీకి పాల్పడ్డారని ఆ క్రమంలో ఎన్నో పోరాటాలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ వచ్చినా.. పార్టీల అధికారం మారినా.. స్థానిక రైతులకు సాగునీరు ఇవ్వలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర పక్షపాత ధోరణి ప్రదర్శిస్తూ తెలంగాణకు నీటి వాటా పంపిణీ చేయలేదని, గత ప్రభుత్వం కేంద్రంతో పోరాడి నీటివాటా సాధించడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలల గడుస్తున్నా కృష్ణానది జల సాధనకు కృషి చేయడం లేదని విమర్శించారు. ప్రాజెక్టు రూపకల్పనపై అవగాహన మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో వాణిజ్యశాస్త్ర విభాగం విద్యార్థులకు ప్రాజెక్టు రూపకల్పనపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ చెన్నప్ప మాట్లాడుతూ బ్యాంకింగ్, బీమా, వ్యాపార, వాణిజ్య వంటి అంశాలను ఎన్ను కుని క్షణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. ఇలాంటి ప్రాజెక్టుల పరిశోధనల ద్వారా విద్యార్థుల వికాసం, సృజనాత్మకత, విశ్లేషణ నైపుణ్యాలు మెరుగుపడతాయని తెలిపారు. కార్యక్రమంలో కంట్రోలర్ రాజ్కుమార్, అనురాధారెడ్డి, రంగప్ప, సురేష్ పాల్గొన్నారు. ఆరుగురికి పదోన్నతి మహబూబ్నగర్ క్రైం: జోగుళాంబ జోన్–7 పరిధిలో ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్కానిస్టేబుళ్లుగా పదోన్నతి ఇస్తూ గురువారం డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి వచ్చిన వారిలో చిన్ను నాయక్, బాలయ్య, బి.రాజు, వి.నాగరాజు, ఎం.వెంకటయ్య, రాములు, రాజేషం ఉన్నారు. వీరికి ఉమ్మడి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్లు కేటాయించారు. -
పరిష్కారం చూపాలి
రెవెన్యూ, ఫారెస్టు శాఖలు సమన్వయంతో జాయింట్ సర్వే నిర్వహించి అసైన్డ్ పట్టాదారులకు ఇబ్బందులు రాకుండా పరిష్కారం చూపాలి. అసైన్డ్ పట్టాలు ఉన్నా ఫారెస్టు వారు భూముల్లో సాగు చేయనివ్వడం లేదు. ప్రభుత్వ మిగులు భూమి అందుబాటులో ఉంది. అయినా అసైన్డ్ పట్టాదారులను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదు. జాయింట్ సర్వే నిర్వహించి మిగులు భూమిని గుర్తించాలి. పేదలకు మరిన్ని అసైన్డ్ పట్టాలు ఇవ్వాలి. – బి.నాగన్న, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు -
SLBC టన్నెల్ ప్రమాదం: వీడని ఉత్కంఠ.. 13 రోజులైనా జాడే లేదు
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల వెలికితీతపై ఉత్కంఠ వీడటం లేదు. 13 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా కార్మికుల ఆచూకీ లభించలేదు. మూడు షిప్టుల్లో 24 గంటలూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 13 రోజులు గడుస్తున్నా 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు. అనుమానిత ప్రాంతాల్లో ముమ్మరంగా తవ్వకాలు చేపట్టారు. టీబీఎం మిషన్పై బుర తొలగింపునకు వాటర్ గన్స్ ఉపయోగిస్తున్నారు. రోబోల వినియోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.కాగా, కొన్ని రోజులుగా కష్టపడి పునరుద్ధరించిన కన్వేయర్ బెల్టు మళ్లీ తెగిపోయింది. సొరంగంలోని మట్టి, ఇతర వ్యర్థాలను లోకో ట్రైన్ ద్వారానే తరలిస్తున్నారు. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో నీటి ఊట ఏ మాత్రం తగ్గలేదు. టన్నెల్లో ఉబికి వస్తున్న నీటి ఊటతో డ్రిల్లింగ్ పనులు ముందుకు సాగడం లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, ఇతర సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. జీపీఆర్ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రాంతాల్లో బురద, మట్టి ఇతర వ్యర్థాల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు.అయితే సహాయక బృందాల మధ్య సమన్వయం కొరవడటంతో, ఎవరికి వారు ఇక్కడ.. అక్కడ అన్నట్టుగా పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే మరో 10 రోజులైనా సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తెచ్చే పరిస్థితి కనిపించడం లేదు. లోకో ట్రైన్ 13.5 కిలోమీటర్ల వరకు వెళ్తుండటంతో మట్టి, రాళ్లతో పాటు కట్చేసిన టీబీఎం మెషీన్ విడి భాగాలను బయటకు తరలిస్తున్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వచ్చి వెళ్లిన నాటి నుంచి అధికారుల హడావుడి అంతగా కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను బయటికి తీసుకు రావడం కష్టతరంగా మారుతోంది. టన్నెల్లో దుర్వాసన వస్తుండటంతో సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితిలో సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పేరుకుపోయిన మట్టి, శిథిలాలకు తోడు నీటి ఊట ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకు పడితే.. రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయని రెస్క్యూ బృందాలు వాపోతున్నాయి. గతనెల 22 నుంచి వివిధ విభాగాలకు చెందిన సహాయక బృందాలు సొరంగంలో జల్లెడ పడుతున్నా కార్మికుల ఆనవాళ్లు లభించడం లేదు. సొరంగం కూలిన ప్రాంతంలో భూ ప్రకంపనలకు గల అవకాశాలను నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. -
బాలుడి భద్రతకు భరోసా
వనపర్తి: సవతి తల్లి వేధింపులతో పసి బాలుడి హృదయానికి గాయమైంది. పోలీసులు చిన్నారిని ప్రేమతో ఓదార్చారు. వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అక్కున చేర్చుకొని నీకు మేము ఉన్నాం అంటూ భరోసా ఇచ్చారు. వివరాలు.. పెబ్బేరు మండలం సూగూరుకికి చెందిన గొల్ల నరసింహా, వనిత దంపతులకు తొమ్మిదేళ్ల బాలుడు ఉన్నాడు. వనిత అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మరణించింది. పెద్దల బలవంతంపై నరసింహా సమీప బంధువైన లక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. పైళ్లెన కొత్తలో లక్ష్మి ఆబాలుడిని బాగానే చూసుకునేది. కాలం గడిచేకొద్ది ఆ చిన్నారిని చీటికిమాటికీ చిత్రహింసలకు గురిచేసేది. నిప్పులో కాల్చిన సలాకితో అతడి తొడలపై వాతలు పెట్టింది. ఈ విషయాన్ని ఆచిన్నారి తండ్రికి చెప్పినా ఆమె అరాచకానికి అడ్డుకట్ట వేయలేకపోయాడు. మంగళవారం సవతితల్లి అకారణంగా చితకబాదగా ఆవిషయాన్ని ఆ అబ్బాయి తన మేనమామ రామచంద్రయ్యకు ఫోన్ ద్వారా తెలిపాడు. అతడు బాలుడిని తీసుకొని ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. సవతి తల్లి పెట్టిన ఇబ్బందులు, హింసను రామచంద్రయ్య ఎస్పీకి వివరించారు. దెబ్బలను గుర్తుకు తెచ్చుకొని కన్నీటి పర్యంతమైన బాలుడిని ఎస్పీ చేరదీసి అల్పహారాన్ని అందజేసి ఓదార్చారు. అనంతరం అతడితో సమాచారమంతా రాబట్టారు. రూరల్ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా అధికారి, జిల్లా బాలల పరిరక్షణాధికారి, భరోసా కేంద్రం కోఆర్డినేటర్ల ద్వారా బాలుడు ఎదుర్కొన్న మనోవేదనను, చిత్రహింసల వివరాలను సేకరించాలని కోరారు. వారి నివేదిక ఆధారంగా నిందితురాలిపై పెబ్బేరు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. బాలుడిలో మనోధైర్యాన్ని కలిగించి ఏదైనా పాఠశాలలో చేర్పిస్తామని ఎస్పీ తెలిపారు. సవితి తల్లి వేధింపులు పోలీసులను ఆశ్రయించిన చిన్నారి అక్కున చేర్చుకున్న ఎస్పీ -
రమణీయం.. రామలింగేశ్వరుడి రథోత్సవం
వెల్దండ: మండలంలోని గుండాల గ్రామంలో బుధవారం తెల్లవారుజామున శ్రీఅంబా రామలింగేశ్వర స్వామి పెద్ద రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద రథోత్సవంను పూలతో అలంకరణ చేసి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీరగా భక్తులు పోటాపోటీగా రథాన్ని లాగారు. శివనామస్మరణతో గుండాల గ్రామం మార్మోగింది. రథంపై ఊరేగుతున్న ఆదిదపంతులను భక్తులు దర్శించుకొని భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. రథోత్సవం సందర్భంగా సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐ కురుమూర్తి ఆధ్వర్యంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆలయ ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి భక్తులకు నచ్చజెపుతూ ఎస్ఐలు కృష్ణాదేవా, మహేందర్, పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ సందీప్రెడ్డి, వైస్ చైర్మన్ అరుణ్కుమార్, ఈఓ ప్రసాద్, ఆలయ అర్చకులు బాలస్వామిశర్మ, కృష్ణయ్యశర్మ, వీరేశంశర్మ, శివకుమార్శర్మ, నరహరిశర్మ, సంతోష్శర్మ, సురేష్శర్మ, ఆలయ కమిటీ సభ్యులు అంజయ్య, మల్లేష్ ముదిరాజ్ ఉన్నారు. గుండాలలో మార్మోగిన శివనామ స్మరణ భక్తి పారవశ్యంలో భక్తులు పోలీసుల భారీ బందోబస్తు -
రహదారి భద్రతపై సుప్రీం కమిటీ
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): రహదారి భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ నియమించినట్లు రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకితో కలిసి పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, వైద్యారోగ్య, ఆర్అండ్బీ శాఖల అధికారులతో జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరిగే రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్, ఎస్పీ, ఆర్అండ్బీ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు వివిధ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాల్లో రహదారి భద్రతపై సమావేశాలు నిర్వహించి తీసుకున్న చర్యలపై ఆయా శాఖల అధికారులు రవాణా శాఖ కమిషనర్ కార్యాలయానికి నివేదికలు సమర్పించాలన్నారు. సుప్రీంకోర్టు కమిటీకి నివేదిక సమర్పించాల్సి ఉంటుందని, ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గతేడాది జిల్లాలో 108 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు డేటా ఉందని, ఆయా శాఖలు డేటా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా 19 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నట్లు ఆయన వివరించారు. పాఠశాలల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వం నవంబర్ 16, 2024 నుంచి ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు వంద శాతం మినహాయింపు చేసిందని, ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రానున్న రోజుల్లో రోడ్డు భద్రతకు మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. జాయింట్ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్రావు, ఆర్అండ్బీ ఈఈ దేశ్యానాయక్, ట్రాన్స్ఫోర్ట్ డిప్యూటీ కమిషనర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి భద్రత చర్యలపై తీసుకున్న నిర్ణయాలపై నివేదికలు పంపండి విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలి రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
● ముగ్గురికి గాయాలుకొత్తకోట రూరల్: కారు డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందినట్లు ఎస్ఐ ఆనంద్ తెలిపారు. వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి పట్టణానికి చెందిన కనికాపురం రామయ్య, అతని భార్య వసంత, కుమారుడు లోకేష్ హైదరాబాద్లో బంధువుల పెళ్లి ఉండటంతో సొంత కారుకు డ్రైవర్గా మల్లికార్జునను తీసుకొని బయలుదేరారు. బుధవారం తెల్లవారుజామున కారు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెళ్లి సమీపంలోకి రాగానే డ్రైవర్ అజాగ్రత్తగా అతివేగంగా నడిపాడు. ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని బలంగా ఢీకొనడంతో కారు ముందు సీట్లో ఉన్న రామయ్య(58) తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. కారు డ్రైవర్తో పాటు వెనుక సీట్లో ఉన్న వసంత, లోకేష్కు స్వల్పగాయాలయ్యాయి. మృతుడి కుమారుడు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108లో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. లోకేష్ ఫిర్యాదు మేరకు డ్రైవర్ మల్లికార్జునపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వివాహిత బలవన్మరణం గద్వాల క్రైం: తీవ్రమైన తలనొప్పి, నరాల బలహీనతతో బాధపడుతున్న ఓ వివాహిత మనస్తాపం చెందిన ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని పరుమాలలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన సుమతి (34) కొంతకాలంగా తీవ్రమైన అరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికొచ్చిన భర్త నరేష్ గమనించి చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య మహబూబ్నగర్ క్రైం: ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్ఐ సయ్యద్ అక్బర్ కథనం ప్రకారం..జిల్లా కేంద్రంలోని ఏనుగొండకు చెందిన కె.నరేష్కుమార్(29) మంగళవారం రాత్రి 11.30 ప్రాంతంలో ఏనుగొండ సమీపంలో రైలు కింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నరే ష్కుమార్ కొన్ని రోజుల నుంచి ఉపాధి కోసం ప్రయత్నం చేయగా ఎలాంటి పని దొరకపోవడంతో పాటు ఆరోగ్య సమస్య వల్ల మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ● రైలు ఢీకొట్టడంతో గాయాలైన క్షతగాత్రుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఈ నెల 1న మధ్యాహ్నం కౌకుంట్ల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తిని (45) రైలు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యా యి. దీంతో ఆయనను జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సయ్యద్ అక్బర్ తెలిపారు. -
క్రేన్ మరమ్మతులకు వచ్చి.. హత్య చేశాడు
బిహార్ కూలి హత్య కేసును ఛేదించిన పోలీసులు ● హైదరాబాద్ ఎంజీబీఎస్లో నిందితుడి అరెస్ట్ ● డీఎస్పీ వెంకటేశ్వర్లు జడ్చర్ల: ఓ పరిశ్రమలో భారీ క్రేన్ను మరమ్మతు చేయడానికి వచ్చిన వ్యక్తి హత్యకు పాల్పడ్డాడు. హత్య చేసిన నిందితుడు పరారీ కాగా పోలీసులు ఛేదించి పట్టుకున్నట్లు డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం జడ్చర్ల పోలీస్స్టేషన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిందితుడు వినయ్ క్రేన్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. మండలంలోని పెద్దపల్లి గ్రామ శివారులో గల విర్కో బల్క్డ్రగ్ కంపెనీలో క్రేన్ మరమ్మతులకు గురైంది. దీని రిపేర్ చేసేందుకు గత నెల 24వ తేదీన పూణే నుంచి వినయ్ జడ్చర్లకు వచ్చాడు. అదేరోజు క్రేన్ను పరిశీలించి మరమ్మతుకు అవసరమైన విడిభాగాలను తెప్పించేందుకు క్రేన్ యజమానికి సమాచారమిచ్చి రాత్రికి పూణేకు బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. అయితే క్రేన్ ఆపరేటర్స్ ఉండేందుకు బీఆర్రెడ్డి గార్డెన్లో ఏర్పాటుచేసిన రూంలో అతడు బసచేశాడు. పూణే వెళ్లేందుకు గది నుంచి బయటకొచ్చి మెట్లపైె కూర్చున్నాడు. మెట్లు ఎక్కే క్రమంలో మద్యం మత్తులో ఉన్న హతుడు బిహార్ రాష్ట్రానికి చెందిన కూలి రషీద్ఖాన్ నిందితుడు వినయ్ను తాకుతూ వెళ్లాడు. ఈక్రమంలో వారి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. రషీద్ఖాన్ తలను వినయ్ గోడకేసి బాదడంతో బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు. మృతుడి సెల్ఫోన్ను తీసుకొని నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బీఆర్రెడ్డి గార్డెన్లో నివాసం ఉంటున్న కూలీలను విచారించారు. వినయ్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చి అతడి యజమానిని విచారించగా అసలు విషయం బయటపడింది. హత్య అనంతరం వినయ్ యజమానితో జరిగిన విషయం చెప్పాడు. దీంతో అతడు పోలీసులకు లొంగిపోవాలని యజమాని సూచించాడు. నిందితుడు మాత్రం అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం హైదరాబాద్లోని ఎంజీబీఎస్ బస్టాండ్లో నిందితుడిని అరెస్ట్చేశారు. హతుడి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సీఐ కమలాకర్, ఎస్ఐలు మల్లేష్, చంద్రమోహన్, జయప్రసాద్ పాల్గొన్నారు. -
మైసమ్మ సన్నిధిలో డీఐజీ చౌహాన్
నవాబుపేట: ప్రసిద్ధి చెందిన పర్వాతాపూర్ మైసమ్మ దేవాలయాన్ని బుధవారం డీఐజీ చౌహాన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, ఆలయ అధికారి నర్సింహులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా డీఐజీ చౌహాన్ మాట్లాడుతూ ప్రకృతి సిద్ధమైన అడవిలో వెలసిన అమ్మవారి చెంత చాలా ప్రశాంతత ఉందన్నారు. మైసమ్మ టెండర్ల ఆదాయం రూ. 51 లక్షలు.. పర్వతాపూర్ మైసమ్మ దేవాలయంలో విక్రయించే టెంకాయలు, పూజా సామగ్రి తదితర వాటికి సంబంధించిన టెండర్ల ద్వారా రూ. 51 లక్షల ఆదాయం సమకూరినట్లు దేవాలయ చైర్మన్ జనగ్మోహన్రెడ్డి, ఆలయ అధికారి నర్సింహులులు తెలిపారు. బుధవారం మైసమ్మ దేవాలయ ఆవరణలో నిర్వహించిన టెండర్లలో టెంకాయలకు సంబంధించి రూ.31.83లక్షలకు పాశం వెంకటేష్ టెండర్ దక్కించుకున్నాడు. వాహన పూజ సామగ్రికి రూ.14.07లక్షలు, పూల విక్రయానికి రూ. 5.67లక్షలకు కాకర్లపహాడ్కు చెందిన అంకం ఆంజనేయులుకు లభించాయి. వీరంతా వచ్చే నెల నుంచి దేవాలయంలో నూతన విక్రయాలు చేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వీణదరి, గోపాల్, అనుసూయమ్మ, అంజనేయులు, మల్లేష్, బాలయ్య, రమేష్, రాజు, నరేష్, వెంకటే్ష్, రాములుపాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేకపూజలు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ చైర్మన్, అధికారి -
ఏడాది గడిచినా అందని పరిహారం
ఉప్పునుంతల: మండలంలో కేఎల్ఐ కాల్వ పనులు ప్రారంభించి ఏడాది గడుస్తున్నా తమ భూములకు పరిహారం అందని లేదని తాడూరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తాడూరు గ్రామ శివారులో సాగుతున్న కేఎల్ఐ కాల్వ పనులను వారు అడ్డుకున్నారు. రెండు పర్యాయాలు స్థానిక ఎమ్మెల్యేను కలిసి సమస్యను వివరిస్తే పరిహారం డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు డబ్బులు అందలేదని రైతులు గున్నమోని లింగమయ్య, శంకరయ్య, లక్ష్మయ్య, బక్కయ్య, నీరంజన్, రాములమ్మ, బొడ్డుపల్లి చంద్రయ్య, పంగ వెంకటయ్య తెలిపారు. పక్కనే ఉన్న అచ్చంపేట మండలం పులిజాల లో రైతులకు పరిహారం అందించారని, తమకు డబ్బులు ఇవ్వడంతో జాప్యం చేస్తున్నారని వాపోయారు. పరిహారం ఇచ్చేంత వరకు పనులు చేయకూడదని అక్కడున్న సూపర్వైజర్లకు, కూలీలకు రైతులు చెప్పారు. కేఎల్ఐ కాల్వ పనులను అడ్డుకున్న తాడూరు రైతులు -
విద్యుత్ సరఫరా నిలిపివేయాలంటూ రైతుల ఆందోళన
● చివరి ఆయకట్టుకు నీరు అందడంలేదని వాదన ● కోతలు విధించలేమన్న అధికారులు ● విద్యుత్ సిబ్బందితో వాగ్వాదం ధరూరు : వ్యవసాయానికి కరెంటు ఇవ్వాలని పోరాడిన ఘటనలు ఇప్పటివరకు చూశాం.. కానీ వ్యవసాయానికి కరెంట్ కట్ చేయాలంటూ రైతులు ఆందోళన బాట పట్టిన వింత ఘటన ధరూరు మండలంలో చోటుచేసుకుంది. నిరంతరాయంగా కరెంటు ఇవ్వడంతో నెట్టెంపాడు కాల్వ కింద ఉన్న రైతులకు నీరందడం లేదని, పగలు రెండు లేదా మూడు గంటలు కరెంట్ సరఫరా నిలిపివేయాలని, రాత్రి వేళ పూర్తిగా బంద్ చేయాలని రైతులు అల్వాల పాడు సబ్స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. 104 కాల్వకు నీళ్లు వస్తున్నందున చివరి ఆయకట్టులో ఉన్న కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నె, వెంకటాపురం, ఈర్లబండ గ్రామాల రైతులకు ర్యాలంపాడు నుంచి విడుదలయ్యే నీరు అందడం లేదన్నారు. కాల్వ ముందు భాగంలో ఉన్న పొలాలకే నీళ్లు వస్తున్నాయంటూ విద్యుత్ సిబ్బందితో రైతులు వాగ్వాదానికి దిగారు. విషయాన్ని ఏఈ, ఏడీఈలకు ఫోన్లో సమాచారమివ్వగా వారు అక్కడి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడం అన్నది తమ చేతుల్లో లేదని, ఈవిషయంలో తామేమీ చేయలేమని వారు తేల్చి చెప్పారు. దీంతో రైతులు కలెక్టర్కు విన్నవిస్తామని అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
పోటెత్తిన ఉల్లి
● ఉల్లి కుప్పలతో నిండి న దేవరకద్ర మార్కెట్ ● గరిష్ట ధర రూ. 2,550 ● కనిష్టంగా రూ. 1,800 దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్కు బుధవారం ఉల్లి పోటెత్తింది. వివిధ గ్రామాల నుంచి రైతులు ఉల్లిని పెద్ద ఎత్తున అమ్మకానికి తెచ్చారు. దాదాపు ఐదు వేల బస్తాల ఉల్లి అమ్మకానికి రావడంతో మార్కెట్ యార్డు ఆవరణం అంతా ఉల్లి కుప్పలతో నిండిపోయింది. స్థలం సరిపోక గోదాంల పక్కన సీసీ రోడ్డుపై ఉల్లిని కుప్పలుగా పోశారు. ప్రస్తుతం సీజన్ కావడంతో కోతలు కోసిన ఉల్లిని రైతులు నేరుగా మార్కెట్కు తెస్తున్నారు. దిగుబడులు ఎక్కువగా వస్తుండటంతో ఒక్కో రైతు రెండు నుంచి మూడు ట్రాక్టర్ల ఉల్లిని అమ్మకానికి తెచ్చారు. ఎండలు బాగా ఉండడంతో బాగా ఆరబెట్టిన నాణ్యమైన ఉల్లి మార్కెట్కు వచ్చింది. జోరుగా కొనుగోళ్లు దేవరకద్ర మార్కెట్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన వేలం పాటలు మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగింది. ఉల్లి ఎక్కువ రావడంతో వ్యాపారులు ప్రతి కుప్ప వద్దకెళ్లి వేలం పాట పాడాల్సి వచ్చింది. మొదటి రకం ఉల్లికి గరిష్టంగా రూ.2550, కనిష్టంగా రూ.1800 వరకు ధర పలికింది. గత వారంతో పోల్చితే ధరలు నిలకడగానే ఉన్నాయి. స్థానిక వ్యాపారులతో పాటు బయట నుంచి వచ్చిన వ్యాపారులు పోటీపడి ఉల్లిని కొనుగోలు చేశారు. వేలాది బస్తాల ఉల్లిని బయటి వ్యాపారులే ఎక్కువగా ఖరీదు చేశారు. చిరు వ్యాపారులు కూడా చిన్నచిన్న కుప్పలను కొనుగోలు చేశారు. ఇక స్థానిక వ్యాపారులు కొనుగోలు చేసిన ఉల్లిని వినియోగ దారులకు బస్తాలుగా అమ్ముకున్నారు. మార్కెట్ నిబంధనల ప్రకారం తూకం వేసిన 45 కేజీల ఉల్లి బస్తా ధర గరిష్టంగా రూ. 1300, కనిష్టంగా రూ. 900 వరకు విక్రయించారు. -
చిరుత కోసం బోను ఏర్పాటు
మద్దూరు: ఉమ్మడి మద్దూరు, దామరగిద్ద మండలాల్లో కొన్నినెలలుగా చిరుత సంచారిస్తోంది. రెండు మండలా ల్లో తరుచూ ఎక్కడో ఓ చోట చిరుత లేగదూడలను, మేకలను చంపుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలో అటవీ శాఖాధికారులు మోమినాపూర్, కంసాన్పల్లి, బొమ్మన్పాడ్ శివారులోని గు ట్టల దగ్గర బోను ఏర్పా టుచేశారు. వాటి కదలి కలను గుర్తించడానికి అడవిలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు మద్దూరు సె క్షన్ అధికారి లక్ష్మణ్నాయక్ తెలిపారు. మద్దూరు, కొత్తపల్లి, దామరగిద్ద మండలాల్లో దాదాపు 4చిరుతల సంచారం ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాంతాల్లో మూడు చిరుతలు మృతిచెందగా, ఒక చిరుత బోనుకు చిక్కింది. మోమినాపూర్, దుప్పట్గట్, జాధరావ్పల్లి, నందిపాడ్, నందిగామ గుట్టల్లో చిరుతల సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. నెల రోజుల లోపే మోమినాపూర్లో చిరుతల వరుస ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో బోను, సీసీ కెమెరా లను ఏర్పాటుచేశారు. మిగితా ప్రాంతాల్లో మాత్రం బోన్లు ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరుత దాడిలో దూడ మృతి.. మద్దూరు: చిరుత దాడిలో దూడ మృతి చెందిన ఘటన మోమినాపూర్ శివారులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు కులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గూళ్ల హన్మంతు మంగళవారం రాత్రి తన పొలం దగ్గర మిగతా పశువులతో పాటు దూడ కట్టేసి ఇంటికొచ్చాడు. ఉదయం పొలానికెళ్లి చూడగా దూడ మృతి చెందినట్లు గుర్తించారు. చిరుత దాడిలో దూడ మృతిచెందినట్లు ఫారెస్ట్ సెక్షన్ అధికారి లక్ష్మణ్నాయక్ ధ్రువీకరించారు. -
నకిలీ పోలీసులతో అప్రమత్తంగా ఉండాలి
మహబూబ్నగర్ క్రైం: డిజిటల్ అరెస్ట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేయడానికి నకిలీ సీబీఐ, ఆదాయపు పన్ను, పోలీస్ అధికారులంటూ భయాందోళనకు గురి చేయడానికి చూస్తుంటారని వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని అదనపు ఎస్పీ రాములు అన్నారు. సైబర్ నేరాలపై బుధవారం ఎస్వీఎస్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మీ బ్యాంక్ ఖాతా టెర్రరిస్టులతో లింక్ అయ్యిందని, మనీలాండరింగ్ కేసులో మీ పేరు ఉందని భయపెడుతూ మెసేజ్లు చేస్తారని వెల్లడించారు. ఖాతాలు ఫ్రీజ్ కాకుండా ఉండాలంటే వాళ్లు చెప్పిన ఖాతాల్లో డబ్బులు బదిలీ చేయాలని మోసం చేస్తుంటారన్నారు. పోలీసులు ఎప్పుడూ కూడా ఫోన్లలో కేసులపై విచారణచేయడం జరగదని, ఫోన్లలో డబ్బులు అడగటం ఉండదని తెలిపారు. విద్యార్థులు సోషల్ మీడియాకు బానిసలు కావడంతో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల పేరుతో భయపెడుతారని, స్మార్ట్ఫోన్లలో యాప్ల వాడకంపై అవగాహన ఉండాలన్నారు. విద్యార్థినులను అధికంగా భయపెడతారని, వేధింపులకు గురైతే సైబర్ పోలీసులకు, 1930 టోల్ ఫ్రీ నంబర్తో పాటు 8712672222కు ఫిర్యాదు చేయాలన్నారు. ఆనంతరం సైబర్ క్రైం డీఎస్పీ సుదర్శన్ వైద్యవిద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్గించారు. సైబర్ క్రైం సీఐ గోపాల్, రూరల్ సీఐ గాంధీనాయక్, ఐటీ సెల్ ఎస్ఐ రవి పాల్గొన్నారు. ● ఏఎస్పీ రాములు -
స్థానిక సమస్యలపై సీపీఎం బస్తీబాట
మహబూబ్నగర్ రూరల్: స్థానిక సమస్యలపై సీపీఎం బస్తీబాట పట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రాములు తెలిపారు. బుధవారం మాచన్పల్లిలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ పోరాటాలకు ప్రజలను సిద్ధం చేస్తామన్నారు. కార్పొరేట్ శక్తులను కాపాడుకునేందుకు కేంద్ర బడ్జెట్ వారికే అనుకూలంగా ప్రవేశపెట్టి పేదలకు మాత్రం మొండి చెయ్యి చూపిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అసంపూర్తిగా అమలు చేస్తోందన్నారు. గ్రామాల్లో ఇప్పటి వరకు రైతులందరికీ రుణమాఫీ కాలేదని, అన్ని రకాల పెన్షన్స్ ఇంతవరకు ఇవ్వలేదన్నారు. రైతు భరోసా కూడా అసంపూర్తిగానే వేశారని తెలిపారు. సీపీఎం ఆధ్వర్యంలో నెల రోజుల పాటు గ్రామాల్లో ప్రజాసమస్యలు, స్థానిక సమస్యలు అధ్యయనం చేసి గ్రామపంచాయతీ కార్యాలయాల ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నాయకులు కడియాల మోహన్, హన్మంతు, భగవంతు, లింగంగౌడ్ పాల్గొన్నారు. -
కారం, తొక్కులే నిత్య భోజనం..
నల్లమలలో మొత్తం 88 చెంచు ఆవాసాలు ఉండగా, చెంచుల మొత్తం జనాభా 9 వేల లోపే. ప్రభుత్వం వీరి సంక్షేమం, జీవన ప్రమాణాలు పెంచేందుకు రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా, వాస్తవంలో చెంచులు కనీసం సరైన తిండికీ నోచుకోవడం లేదు. చెంచుల్లో చిన్నారులు, మహిళల నుంచి పెద్దల వరకు నిత్యం కారం, తొక్కులతోనే కాలం గడుపుతున్నారు. అప్పాపూర్, భౌరాపూర్, మేడిమల్కల తదితర చెంచుపెంటల నుంచి కూరగాయలు కావాలంటే సుమారు 40 కి.మీ.దూరంలో ఉన్న మన్ననూరుకు వెళ్లాల్సి ఉంటుంది. పదిహేను, నెలరోజులకు ఒకసారి తెచ్చుకున్న కూరగాయలు, సరుకులతోనే సరిపెట్టుకుంటున్నారు. అటవీ అధికారుల ఆంక్షల నేపథ్యంలో తేనే, చెంచుగడ్డలు తదితర ఆహారం వారికి అరకొరగా దొరికినా, వాటిని ఆహారంగా తీసుకోకుండా ఇతరులకు విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు. నల్లమలలోని కొమ్మెనపెంటలో చెంచు మహిళలు -
తిండికీ తిప్పలే..
కొమ్మెనపెంటలో చెంచుల ఆవాసాలు(బొడ్డు గుడిసెలు) నల్లమలలోని చెంచు మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నల్లమలలోని చెంచు మహిళలు, చిన్నారుల్లో అధికశాతం మందిని రక్తహీనత సమస్య వేధిస్తోంది. సరైన పౌష్టికాహారం లేక చెంచులు తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్నారు. దీంతో గర్భిణులకు ప్రసవ సమయంలో వేధన తప్పడం లేదు. కొన్ని సార్లు పుట్టిన శిశువులు సైతం మృత్యువాత పడుతుండటం కలచివేస్తోంది. మహిళల్లో హిమోగ్లోబిన్ శాతం కనీసం 12 వరకు ఉండాలి, అయితే చెంచు మహిళలు, గర్భిణులు, బాలింతల్లో 60 శాతానికి పైగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. 25 శాతం మంది మహిళలు 9 శాతం కన్నా తక్కువ రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కేసుల్లో 3–6 శాతం మాత్రమే హిమోగ్లోబిన్ ఉంటున్న తీవ్రమైన ఎనీమియా కేసులు చోటుచేసుకుంటున్నాయి. నల్లమలలోని చెంచు మహిళల్లో రక్తహీనత సమస్యపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్(ఎన్ఐఎన్) హైదరాబాద్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించింది. శిశువులు నెలలు నిండక ముందే జన్మించడం, తక్కువ బరువుతో జన్మించడం, శిశు మరణాలు, పురుషులతో పాటు మహిళల్లోనూ ఆల్కహాలిక్ లివర్ సిర్రోసిస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు గుర్తించింది. అడవినే నమ్ముకుని జీవనం గడుపుతున్న చెంచుల జీవితాలు సరైన తిండి, ఆదాయం లేక మరింత దుర్భరంగా మారుతున్నాయి. నిత్యం కారం, తొక్కులే ఆహారం చెంచు మహిళల్లో 60 శాతం మందికి ఎనీమియా సమస్య గర్భిణులు, బాలింతల్లో రక్తం లేక పెరుగుతున్న శిశుమరణాలు -
తొక్కులు, చింతపులుసే తింటాం
మేం ఎక్కువగా కారం, తొక్కులు, చింతపులుసు తింటాం. మా పిల్లలు కూడా అవే తింటారు. కూరగాయలు కావాలంటే మన్ననూరుకు పోయి తెచ్చుకుంటాం. 15 రోజులు, నెలకు ఒకసారి వెళ్లి తెచ్చుకుంటాం. వారం తర్వాత కూరగాయలు పాడవుతాయి. ఎక్కువ రోజులు కారం పొడి, తొక్కు వేసుకుని అన్నం తింటాం. – దంసాని ఈదమ్మ, కొమ్మనపెంట, అమ్రాబాద్, నాగర్కర్నూల్ జిల్లా సరైన ఆహారం లభించట్లేదు.. చెంచులు ఎక్కువగా రైస్, కారం, తొక్కులపైనే ఆధారపడుతున్నారు. కూరగాయలు, కూరలు, పౌష్టికాహారం లేక రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. పుట్టిన శిశువులు రక్తహీనతతో 2 నుంచి 2.5 కిలోల లోపే జన్మిస్తున్నారు. చలికాలంలో న్యూమోనియా, ముక్కు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. – డాక్టర్ సైఫుల్లా ఖాన్, ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ -
మహిళా సంఘాల ఉత్పత్తులకు మయూరి బ్రాండ్
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: స్వయం సహాయక మహిళా సంఘాల (ఎస్హెచ్జీలు) ద్వా రా తయారు చేసే వివిధ ఉత్పత్తులకు మయూరి బ్రాండ్ కింద అమ్మాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి సూచించారు. బుధవారం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆర్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఆయా పచ్చళ్లు, జ్యూట్, బ్యాచ్ డాల్స్ తదితర సుమారు వంద రకాల ఉత్పత్తులను రాష్ట్ర వ్యాపంగా అందరికీ పరిచయం చేసేలా కొత్త ఆలోచనలతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ కె.లక్ష్మణ్యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ఖాద్రీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, మెప్మా ఇన్చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి, సీఓలు వరలక్ష్మి, నిర్మల, దేవమ్మ పాల్గొన్నారు. -
ఉరుకులు, పరుగుల మధ్య తొలి రోజు ప్రశాంతం
పాలమూరు బాలుర కళాశాల పరీక్ష కేంద్రంలోకి వెళ్లేందుకు క్యూలైన్లో విద్యార్థులు మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ఉరుకులు, పరుగుల మధ్య చేరుకున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సి ఉండగా.. 8 గంటల నుంచే కేంద్రాల వద్దకు విద్యార్థులు, తల్లిదండ్రులు చేరుకున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు తెలుగు, అరబిక్, ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లిష్ మొదటి పేపర్కు సంబంధించి పరీక్షలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. జనరల్ కోర్సుల్లో 9,323 మంది విద్యార్థులకు 9,124 మంది హాజరయ్యారు. 199 మంది విద్యార్థులు గైర్హారజయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 2,086 మంది విద్యార్థులకు 1,993 మంది హాజరై 93 మంది గైర్హాజరయ్యారు. అన్ని కోర్సుల్లో కలిపి 11,409 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా అందులో 11,117 మంది హాజరై 292 మంది గైర్హాజరయ్యారు. ● పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రం వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించారు. పూర్తిస్థాయిలో తనిఖీల అనంతరం విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించారు. జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారిని కౌసర్ జహాన్తో పాటు పలువురు అధికారులు కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. ఫ్లయింగ్, సిటింగ్ స్క్వాడ్ అధికారులు పలు కేంద్రాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రాలకు దగ్గరగా ఉన్న జిరాక్సు సెంటర్లు మూసివేయాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ కొన్ని చో ట్ల వాటిని యథేచ్ఛగా తెరిచి ఉంచారు. 11,117 మంది విద్యార్థులు హాజరు, 292 మంది గైర్హాజరు కేంద్రాలను పరిశీలించిన అధికారులు -
12 రోజులైనా జాడే లేదు
అచ్చంపేట/అమ్రాబాద్: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల వెలికితీతపై ఉత్కంఠ వీడటం లేదు. 12 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా కార్మికుల ఆచూకీ లభించలేదు. రోజు మాదిరిగానే బుధవారం రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగించాయి. కొన్ని రోజులుగా కష్టపడి పునరుద్ధరించిన కన్వేయర్ బెల్టు మళ్లీ తెగిపోయింది. సొరంగంలోని మట్టి, ఇతర వ్యర్థాలను లోకో ట్రైన్ ద్వారానే తరలిస్తున్నారు. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో నీటి ఊట ఏ మాత్రం తగ్గలేదు. టన్నెల్లో ఉబికి వస్తున్న నీటి ఊటతో డ్రిల్లింగ్ పనులు ముందుకు సాగడం లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, ఇతర సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. జీపీఆర్ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రాంతాల్లో బురద, మట్టి ఇతర వ్యర్థాల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు. అయితే సహాయక బృందాల మధ్య సమన్వయం కొరవడటంతో, ఎవరికి వారు ఇక్కడ.. అక్కడ అన్నట్టుగా పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే మరో 10 రోజులైనా సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తెచ్చే పరిస్థితి కనిపించడం లేదు. లోకో ట్రైన్ 13.5 కిలోమీటర్ల వరకు వెళ్తుండటంతో మట్టి, రాళ్లతో పాటు కట్చేసిన టీబీఎం మెషీన్ విడి భాగాలను బయటకు తరలిస్తున్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వచ్చి వెళ్లిన నాటి నుంచి అధికారుల హడావుడి అంతగా కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
తిండికీ తిప్పలే..
కొమ్మెనపెంటలో చెంచుల ఆవాసాలు(బొడ్డు గుడిసెలు) నల్లమలలోని చెంచు మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: నల్లమలలోని చెంచు మహిళలు, చిన్నారుల్లో అధికశాతం మందిని రక్తహీనత సమస్య వేధిస్తోంది. సరైన పౌష్టికాహారం లేక చెంచులు తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతున్నారు. దీంతో గర్భిణులకు ప్రసవ సమయంలో వేధన తప్పడం లేదు. కొన్ని సార్లు పుట్టిన శిశువులు సైతం మృత్యువాత పడుతుండటం కలచివేస్తోంది. మహిళల్లో హిమోగ్లోబిన్ శాతం కనీసం 12 వరకు ఉండాలి, అయితే చెంచు మహిళలు, గర్భిణులు, బాలింతల్లో 60 శాతానికి పైగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. 25 శాతం మంది మహిళలు 9 శాతం కన్నా తక్కువ రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కేసుల్లో 3–6 శాతం మాత్రమే హిమోగ్లోబిన్ ఉంటున్న తీవ్రమైన ఎనీమియా కేసులు చోటుచేసుకుంటున్నాయి. నల్లమలలోని చెంచు మహిళల్లో రక్తహీనత సమస్యపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్(ఎన్ఐఎన్) హైదరాబాద్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించింది. శిశువులు నెలలు నిండక ముందే జన్మించడం, తక్కువ బరువుతో జన్మించడం, శిశు మరణాలు, పురుషులతో పాటు మహిళల్లోనూ ఆల్కహాలిక్ లివర్ సిర్రోసిస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు గుర్తించింది. అడవినే నమ్ముకుని జీవనం గడుపుతున్న చెంచుల జీవితాలు సరైన తిండి, ఆదాయం లేక మరింత దుర్భరంగా మారుతున్నాయి. నిత్యం కారం, తొక్కులే ఆహారం చెంచు మహిళల్లో 60 శాతం మందికి ఎనీమియా సమస్య గర్భిణులు, బాలింతల్లో రక్తం లేక పెరుగుతున్న శిశుమరణాలు -
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
● బోర్లు, మోటార్లు వెంటనే మరమ్మతులు చేయాలి: కలెక్టర్ జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ‘భగీరథ’ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటి సరఫరాలో ఇబ్బందుల్లేకుండా గ్రామాల్లో ఉన్న హ్యాండ్ పంప్లను, పైప్లైన్ లీకేజీలు ఉంటే మర్మమతులు చేయించాలన్నారు. మిషన్ భగీరథ వాటర్ ఓవర్ హెడ్ట్యాంక్ల మోటార్లు మరమ్మతులు చేయాలని అన్నారు. ప్రజలకు తాగునీటిని అందించడంలో సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్ ఉన్నచోట త్వరితగతిన పూర్తిచేయాలని, ‘ఇందిరమ్మ’ పరిశీలన త్వరగా పూర్తిచేయాలని సూచించారు. పాఠశాలలో చదివే విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ కోసం ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తున్నారని విద్యార్థులకు స్నాక్స్ తప్పక అందించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పీ సీఈఓ వెంకట్రెడ్డి, డీపీఓ పార్థసారథి, డీఆర్డీఓ నర్సింహులు, మిషన్ భగీరథ, గ్రిడ్, ఇంట్రా ఈఈలు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. బుధవారం స్థానిక కలెక్టర్ తన చాంబర్లో ఎస్పీతో జానకితో కలిసి టీజీఓ ఆధ్వర్యంలో రూపొందించిన మహిళా దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒకప్పుడు మహిళలు బయటకు రావాలనే కట్టుబాట్ల నుంచి సమాజంలో తాము భాగమేనని చాటి చెబుతున్నారన్నారు. ప్రోత్సహిస్తే మహిళలకు దేనినైనా సాధించే సామర్థ్యం ఉందన్నారు. మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణగౌడ్, జిల్లా అధ్యక్షుడు విజయ్కుమార్, టీజీఓ మహిళా విభాగం చైర్మన్ సంధ్య, కన్వీనర్ చంద్రకళ, జిల్లా కార్యదర్శి వరప్రసాద్, టైటస్పాల్, లావణ్య, నాగమణి, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.6,780 జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్యార్డులో బుధవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,780, కనిష్టంగా రూ.5,469 ధరలు లభించాయి. పెబ్బర్లు రూ.6,910, పత్తి గరిష్టంగా రూ.6,289, కనిష్టంగా రూ.5,469, కందులు గరిష్టంగా రూ.6,970, కనిష్టంగా రూ.6,210, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,371, కనిష్టంగా రూ.2,026, ఆముదాలు గరిష్టంగా రూ.6,077, కనిష్టంగా రూ.6,020 ధరలు లభించాయి. మెరుగైన కంపోస్టింగ్ విధానాలు మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగరంలోని డంపింగ్యార్డులో డీఆర్సీసీ, విండ్రో, వర్మి కంపోస్టింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఎస్డబ్ల్యూఎం) విధానాలు మెరుగ్గా అమలవుతున్నాయని సీడీఎంఏ కార్యాలయ సీడీఓ హేమలత అన్నారు. రెండోరోజు బుధవారం ఇక్కడే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మిగిలిన పది మున్సిపాలిటీల కమిషనర్లు, ఆయా విభాగాల అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఎస్హెచ్జీ, సీఈఈ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తడి, పొడి చెత్త సేకరణ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి మిగతా చోట్ల విండ్రో, వర్మి కంపోస్టు చేసే పద్ధతిని దశలవారీగా ఎలా నిర్వహించాలో క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ విధానాలను సక్రమంగా అమలు చేయాలన్నారు. ముఖ్యంగా తడి, పొడి వనరుల సేకరణ ప్రణాళికాబద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు గురులింగం, రవీందర్రెడ్డి, వజ్రకుమార్రెడ్డి, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ చరణ్, ఎస్బీఎం కన్సల్టెంట్ సుమిత్రాజ్ పాల్గొన్నారు. -
ఒకడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు
టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను బయటికి తీసుకు రావడం కష్టతరంగా మారుతోంది. టన్నెల్లో దుర్వాసన వస్తుండటంతో సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితిలో సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పేరుకుపోయిన మట్టి, శిథిలాలకు తోడు నీటి ఊట ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకు పడితే.. రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయని రెస్క్యూ బృందాలు వాపోతున్నాయి. గతనెల 22 నుంచి వివిధ విభాగాలకు చెందిన సహాయక బృందాలు సొరంగంలో జల్లెడ పడుతున్నా కార్మికుల ఆనవాళ్లు లభించడం లేదు. సొరంగం కూలిన ప్రాంతంలో భూ ప్రకంపనలకు గల అవకాశాలను నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. ఇందుకు సంబంధించిన నివేదిక అందించాల్సి ఉంది. కాగా, కార్మికుల వెలికితీతకు చేపట్టాల్సిన చర్యలపై రెస్క్యూ బృందాల ప్రతినిధులతో విపత్తుల నిర్వహణ స్పెషల్ చీఫ్ అరవింద్కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నమూనా టీబీఎంను పరిశీలించారు. -
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రోత్సహించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): కేంద్ర ప్రభుత్వ అమలుచేస్తున్న పథకాలను అధికారులు, బ్యాంకర్లు ప్రోత్సహించాలని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ అధికారులకు ఆదేశించారు. బుధవారం స్థానిక జెడ్పీ హాలులో పీఎం విశ్వకర్మ యోజన పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలోని అన్నివర్గాల అభివృద్దే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. సబ్సిడీతో కూడుకున్న అన్ని పథకాలు క్షేత్రస్థాయికి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాని మోదీ 18 కుల, చేతివృత్తులకు విశ్వకర్మ యోజన ద్వారా శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధికి రూ.10 లక్షల వరకు రుణం ఇస్తున్నట్లు తెలిపారు. ఔత్సాహికులకు శిక్షణ ఇప్పించడంలో జిల్లా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యంతో విశ్వకర్మ పథకం లక్ష్యం నీరుగారే అవకాశం ఉందని, అనుమానాలను నివృత్తి చేయడం సంతోషకరమన్నారు. విశ్వకర్మపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇవ్వాలని సూచించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పారిశ్రామిక వేత్తలు ఎదగాలన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖాధికారి ప్రతాప్రెడ్డి, ఎంఎస్ఎంఈ అధికారి శ్రీనివాస్రావు, ఎల్డీఎం భాస్కర్, వివిధ బ్యాంక్ల మేనేజర్లు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. వీటిని అధికారులు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి బ్యాంకర్లు విరివిగా రుణాలివ్వాలి: ఎంపీ డీకే అరుణ -
కారం, తొక్కులే నిత్య భోజనం..
నల్లమలలో మొత్తం 88 చెంచు ఆవాసాలు ఉండగా, చెంచుల మొత్తం జనాభా 9 వేల లోపే. ప్రభుత్వం వీరి సంక్షేమం, జీవన ప్రమాణాలు పెంచేందుకు రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా, వాస్తవంలో చెంచులు కనీసం సరైన తిండికీ నోచుకోవడం లేదు. చెంచుల్లో చిన్నారులు, మహిళల నుంచి పెద్దల వరకు నిత్యం కారం, తొక్కులతోనే కాలం గడుపుతున్నారు. అప్పాపూర్, భౌరాపూర్, మేడిమల్కల తదితర చెంచుపెంటల నుంచి కూరగాయలు కావాలంటే సుమారు 40 కి.మీ.దూరంలో ఉన్న మన్ననూరుకు వెళ్లాల్సి ఉంటుంది. పదిహేను, నెలరోజులకు ఒకసారి తెచ్చుకున్న కూరగాయలు, సరుకులతోనే సరిపెట్టుకుంటున్నారు. అటవీ అధికారుల ఆంక్షల నేపథ్యంలో తేనే, చెంచుగడ్డలు తదితర ఆహారం వారికి అరకొరగా దొరికినా, వాటిని ఆహారంగా తీసుకోకుండా ఇతరులకు విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు. నల్లమలలోని కొమ్మెనపెంటలో చెంచు మహిళలు -
స్థానిక సమస్యలపై సీపీఎం బస్తీబాట
మహబూబ్నగర్ రూరల్: స్థానిక సమస్యలపై సీపీఎం బస్తీబాట పట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ.రాములు తెలిపారు. బుధవారం మాచన్పల్లిలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ పోరాటాలకు ప్రజలను సిద్ధం చేస్తామన్నారు. కార్పొరేట్ శక్తులను కాపాడుకునేందుకు కేంద్ర బడ్జెట్ వారికే అనుకూలంగా ప్రవేశపెట్టి పేదలకు మాత్రం మొండి చెయ్యి చూపిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అసంపూర్తిగా అమలు చేస్తోందన్నారు. గ్రామాల్లో ఇప్పటి వరకు రైతులందరికీ రుణమాఫీ కాలేదని, అన్ని రకాల పెన్షన్స్ ఇంతవరకు ఇవ్వలేదన్నారు. రైతు భరోసా కూడా అసంపూర్తిగానే వేశారని తెలిపారు. సీపీఎం ఆధ్వర్యంలో నెల రోజుల పాటు గ్రామాల్లో ప్రజాసమస్యలు, స్థానిక సమస్యలు అధ్యయనం చేసి గ్రామపంచాయతీ కార్యాలయాల ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నాయకులు కడియాల మోహన్, హన్మంతు, భగవంతు, లింగంగౌడ్ పాల్గొన్నారు. -
బావిలో పడి వృద్ధురాలు మృతి
చిన్నచింతకుంట: బావిలో పడి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన చిన్నచింతకుంట మండలం గూడూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్ఐ రామ్ లాల్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. అమరచింత మండలం మస్థిపురం గ్రామానికి చెందిన ఇంకోలా గుండమ్మ (77) గత నెల 28న అమవాస్య సందర్భంగా కురుమూర్తి స్వామి దర్శనానికి వచ్చింది. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆలయ పరిసరాలలో అక్కడ ఇక్కడ తిరుగుతూ పలువురికి కనిపించింది. మంగళవారం కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. గూడూరు గ్రామ శివారులోని అబ్దుల్ ఖాదర్ వ్యవసాయ బావిలో ఆమె మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకోని మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య ఖిల్లాఘనపురం: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని హీర్లతండాలో సోమవారం రాత్రి చోటు చేసుకోగా.. మంగళవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం ఖిల్లాఘనపురం మండలంలోని హీర్లతండాకు చెందిన పాత్లావత్ హరిచంద్, వాలీబాయి భార్యభర్తలు. సోమవారం ఇంటి వ్యవహరంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనోవేదనకు గురైన హరిచంద్ రాత్రి ఎవరూ లేని సమయంలో ఇంట్లో పైపుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే గమనించిన బంధువులు, కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం ఖిల్లాఘనపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయమై మృతుడి భార్య వాలీబాయి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ బద్రునాయక్ తెలిపారు. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు బల్మూర్: బాలికను లైంగికంగా వేధించిన ప్రధానోపాధ్యాయుడు తిరుపతయ్యపై ఏఎస్పీ సీహెచ్ రామేశ్వర్ పోక్సో కేసు నమోదు చేసినట్లు షీటీం జిల్లా ఇన్చార్జ్ విజయలక్ష్మి మంగళవారం తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం చెంచుగూడెం బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలికను ప్రధానోపాధ్యాయుడు 20 రోజుల క్రితం లైంగికంగా వేధించాడని.. బాలిక కాళ్లపై పడి వేడుకున్న వినిపించుకోలేదని వివరించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు తిరుపతయ్యపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై టీడీటీఓ ఆదేశాల మేరకు ఏటీడీఓ సోమవారం ఆశ్రమ పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. ఏటీఎంలో చోరీకి యత్నం నాగర్కర్నూల్ క్రైం: పుర పరిధిలోని ఉయ్యాలవాడ ఎస్బీఐ ఏటీఎంలో ఓ వ్యక్తికి చోరీకి యత్నించిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకోగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ గోవర్ధన్ కథనం మేరకు.. బిజినేపల్లి మండలం లింగసానిపల్లికి చెందిన నారాయణ ఉయ్యాలవాడలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నిస్తుండగా అలారం మోగడంతో బ్యాంకు సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకొని నారాయణను అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. బ్యాంక్ మేనేజర్ కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు. హైనా దాడిలో లేగ దూడ మృతి తిమ్మాజిపేట: మండలంలోని చేగుంట గ్రామానికి చెందిన జగ్గని వెంకటయ్య తన వ్యవసాయ పొలంలో సోమవారం సాయంత్రం గేదెలను కట్టేసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఉదయం పొలానికి వెళ్లి చూడగా గుర్తు తెలియని జంతువు దూడను చంపి తిన్న విషయం గుర్తించాడు. ఘటనపై ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. స్థలాన్ని పరిశీలించిన అధికారులు హైనా దాడి చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వ్యవసాయ పొలం వద్ద సాయంత్రం పశువులు, గేదెలను కట్టివేసి ఇంటికి వస్తే తెల్లారే సరికి దూడలను హైనా అనే అడవి జంతువు చంపి తింటుంది. దీంతో వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటే రైతులు భయాందోళన చెందుతున్నారు. గతంలో ఇలా పలు ఘటనలు జరిగినా ఫారెస్టు అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలుమార్లు ఇలానే గుర్తు తెలియని జంతువులు ఆవు, గేదె దూడలను చంపి తింటున్నాయని పలువురు అంటున్నారు. దూడలను చంపింది హైనా అయి ఉంటుందని ఫారెస్టు అధికారులు అంచనా వేస్తున్నారే తప్పా.. ఖచ్చితంగా విషయం తెలుపడం లేదని, దానిని పట్టుకునేందుకు అధికారులు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని రైతులు వాపోతున్నారు. ఇకనైనా దూడలను చంపి తింటున్న గుర్తు తెలియని జంతువును పట్టుకోవాలని రైతులు కోరుతున్నారు. ● భయాందోళనలో రైతులు ● పట్టింపులేని అధికారులు -
కోయిల్సాగర్ నుంచి నీటి విడుదల
దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి నాలుగో తడికి నీటిని విడుదల చేశారు. యాసంగి పంటల సాగుకు ఇప్పటి వరకు మూడు తడులు నీటిని విడుదల చేయగా, ప్రస్తుతం నాలుగో తడికి కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని వదిలారు. 9 రోజుల పాటు నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 22.10 అడుగుల మేర నీటి మట్టం ఉంది. నీటి విడుదలకు ముందు ప్రాజెక్టులో 31.6 అడుగులుగా నీటి మట్టం ఉండగా, ఇప్పటి వరకు 8.8 అడుగుల నీటి మట్టం తగ్గింది. ప్రస్తుతం వదిలిన నీటి విడత పూర్తి అయితే మరింత నీటి మట్టం తగ్గే అవకాశం ఉంది. విరామం ఇస్తూ నీటి విడుదల.. కోయిల్సాగర్ ఆయకట్టు కింద యాసంగి సాగుకు విరామం ఇస్తూ తడులుగా నీటిని విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 25 నుంచి విడతల వారీగా నీటిని యాసంగి పంటలకు వదులుతున్నారు. ఇప్పటి వరకు మూడు తడులు పూర్తి కాగా, నాలుగో తడికి రెండు రోజుల నుంచి నీటి విడుదల చేస్తున్నారు. ప్రకటించిన షెడ్యూల్ కన్న రెండు రోజులు ముందుగానే నీటిని విడుదల చేశారు. తడి తరువాత చివరగా 5వ తడి కింద నీటిని విడుదల చేయాల్సి ఉంది. -
మాలలు ఉద్యమానికి సిద్ధం కావాలి
అలంపూర్: రాష్ట్రంలోని మాలలు భవిష్యత్ తరాల కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపునిచ్చారు. అలంపూర్ క్షేత్ర ఆలయాలను మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని అంబేడ్కర్ కాలనీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మాలల భవిష్యత్ ప్రమాదకరంగా మారుతుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాలలను అణగదొక్కి రిజర్వేషన్లు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 341 ప్రకారం లోక్సభలో మెజార్టీ ఎంపీలతో వర్గీకరణ చేయాల్సి ఉందన్నారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ అలంపూర్లో మాలల సమావేశం -
వేర్వేరుగా తడి, పొడి చెత్త సేకరణ
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డులకు తరలించాలని సీడీఎంఏ కార్యాలయ సీడీఓ (కంపోస్ట్ డెవలప్మెంట్ ఆఫీ సర్) హేమలత సూచించారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మి ది మున్సిపాలిటీల కమిషనర్లు, ఇతర అధికారులకు మంగళవారం కోయిల్కొండ ఎక్స్రోడ్డులోని డంపింగ్ యా ర్డులో శిక్షణఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయా పట్టణాలలోని ఫంక్షన్ హాళ్లు, మార్కెట్ల తదితర ప్రాంతాల్లో వదిలేసే కూరగాయలు, ఇతర వ్యర్థ ఆహార పదార్థాల (తడి చెత్త) ను ఎప్పటికప్పుడు సేకరించాలన్నారు. పెద్దమొత్తంలో డంపింగ్ యార్డుకు తరలించిన అనంతరం అక్కడ తడి చెత్త కుళ్లిపోయేందుకు ఇనాక్యులమ్ ద్రావణంవేసి ఎరువు (విండ్రో కంపోస్టు)గా మార్చాలన్నారు. స్వచ్ఛ ఆటోల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పట్టణ ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించాలన్నారు.మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్లు గురులింగం, వజ్రకుమార్రెడ్డి, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. సీడీఎంఏ సీడీఓ హేమలత 9 మున్సిపాలటీల అధికారులకు శిక్షణ -
బావాజీ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
మద్దూరు/కొత్తపల్లి: గిరిజనుల ఆరాధ్య దైవం గురులోకామాసంద్ ప్రభు (బావాజీ) ఉత్సవాలు ఏప్రిల్ 11 నుంచి 14 వరకు కొనసాగనున్నాయని.. జాతరకు వచ్చే గిరిజన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలోని ఆలయ ఆవరణలో కడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ బెన్షాలంతో కలిసి జాతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతర ప్రాంగణంలో మరుగుదొడ్లు, మహిళలు దుస్తులు మార్చుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతం 80 మరుగుదొడ్లు ఉన్నాయని మిషన్ భగీరథ ఈఈ రంగారావు వివరించారు. అవసరమైతే అదనంగా ఏర్పాటు చేయాలని, అలాగే మహిళలు దుస్తులు మార్చుకోవడానికి 10 గదులు నిర్మించాలని కలెక్టర్ సూచించారు. వేసవి దృష్ట్యా భక్తులకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. 210 మంది కార్మికులను సెక్టార్ల వారీగా విభజించి పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నట్లు డీపీఓ కృష్ణ వివరించారు. జాతరలో విధులు నిర్వర్తించే సిబ్బందికి ఐడీ కార్డులు ఇవ్వాలని, భక్తులు సమర్పించిన నైవేద్యాలు ఎప్పటికప్పుడు తొలగించేందుకు, ట్రాక్టర్ వెళ్లడానికి రహదారి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రథోత్సవం జరిగేటప్పుడు విద్యుత్ తీగలు తగలకుండా చూస్తామని.. ఇందుకోసం అదనంగా 20 స్తంభాలను ఏర్పాటు చేయనున్నట్లు విద్యుత్శాఖ అధికారులు కలెక్టర్కు తెలియజేశారు. ఉత్సవాల సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దేవాదాయశాఖ నుంచి 30 మంది సిబ్బందిని డిప్యుటేషన్పై పంపించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. గతేడాది రథోత్సవం సమయంలో పోలీసు బందోబస్తు సరిగా లేదని ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఉత్సవాల పర్యవేక్షణకు కలెక్టరేట్ నుంచి ప్రత్యేక అధికారిని నియమిస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం గురులోకామాసంద్ ప్రభు, కాళీకాదేవిని ఆమె దర్శించుకున్నారు. సమావేశంలో ఆర్డీఓ రాంచందర్, జెడ్పీ సీఈఓ భాగ్యలక్ష్మి, డీఎంహెచ్ఓ డా. సౌభాగ్యలక్ష్మి, పీఆర్ ఈఈ హీర్యానాయక్, మద్దూరు, కొత్తపల్లి మండలాలకు చెందిన వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు. మండల కాంప్లెక్స్ నిర్మాణ స్థల పరిశీలన.. కొత్త మండల కేంద్రం కొత్తపల్లిలో రూ.8.80 కోట్లతో నిర్మించే మండల కాంప్లెక్స్ భవన నిర్మాణానికి మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ స్థల పరిశీలన చేశారు. వెయ్యి గజాల స్థలంలో కాంప్లెక్స్ నిర్మాణ నమూనాను చూసి ప్రధాన రహదారి నుంచి కాంప్లెక్స్ వరకు రహదారి సౌకర్యం గురించి అడిగి తెలుసుకున్నారు. -
బీసీలు సంఘటితం కావాలి
బిజినేపల్లి: ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన బీసీలంతా ఐక్యం కావాలని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంఘం సూర్యారావు పిలుపునిచ్చారు. మంగళవారం బిజినేపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ చైతన్య మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బీసీలు సంఘటితం కావాలన్నారు. బీసీలు కమిటీల ద్వారా పటిష్టంగా ఉండాలని, భవిష్యత్ తరాలకు వెన్నుగా ఉండేలా కమిటీల నిర్మాణం ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యమ నేత వట్టి జానయ్య యాదవ్, కుర్మయ్య, విజయ్కుమార్, శ్రీనివాస్సాగర్, చంద్రశేఖర్, వెంకటేష్యాదవ్, వెంకట్స్వామి, రామన్గౌడు, అల్లోజీ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి తాగుతూ పట్టుబడ్డ యువకుడు
రాజాపూర్ (బాలానగర్): బాలానగర్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి ఓ యువకుడు గుట్టుగా గంజాయి తాగుతుండగా.. విషయం తెలుసుకున్న ఎకై ్సజ్ ఎస్ఐ ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ రాష్ట్రానికి చెందిన కమలేష్ బాలానగర్ శివారులోని ఓ పైపుల కంపెనీలో పనిచేస్తూ మండల కేంద్రంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కొన్ని రోజులుగా కమలేష్ గంజాయి తాగుతున్న విషయాన్ని ఇంటి పక్కలవారు గమనించి మంగళవారం రాత్రి బాలానగర్, రాజాపూర్ ఎకై ్సజ్ ఎస్ఐ నాగరాజుకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న ఎకై ్సజ్ ఎస్ఐ నాగరాజు, సిబ్బంది యువకుడిని అదుపులోకి తీసుకుని ఇంటిలో సోదాలు చేశారు. ఇంటిలో గంజాయి లభించకపోవడంతో కమలేష్కు అదుపులోకి తీసుకుని గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతుందనే కోణంలో విచారిస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
విద్యారంగం బలోపేతానికి కృషి
దేవరకద్ర రూరల్: విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కౌకుంట్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో కూరగాయలు నాణ్యతగా లేకపోవడం గమనించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. స్నాక్స్గా రోజు రాగిజావ అందిస్తున్నారని కలెక్టర్కు విద్యార్థులు చెప్పడంతో మెనూ ప్రకారం ఇవ్వకుండా రాగి జావ ఇవ్వడమేమిటని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్, ఎంపీడీఓలను ఆదేశించారు. తరగతి గదుల్లో పాఠ్యాంశాలకు సంబంధించి విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కౌకుంట్ల నూతన మండలం కావడంతో, కార్యాలయాలు, ప్రభుత్వాస్పత్రి నిర్యాణానికి గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అంతకుముందు పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీడీఓ ఆఫీస్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్ రెహమన్, ఎంపీడీఓ శివప్రసాద్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి కలెక్టర్ విజయేందిర బోయి స్నాక్స్గా రాగి జావ ఇవ్వడంపై ఉపాధ్యాయులపై ఆగ్రహం -
ఇంట్లో చోరీ
● రూ.1.30 లక్షలు అపహరణ పాన్గల్: ఇంటి తాళాలు ధ్వంసం చేసి నగదు అపహరణ చేసిన సంఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాందాపూర్ గ్రామానికి చెందిన బేగిని ఆంజనేయులు గొర్రెల కాపారిగా జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 3న భార్యతో కలిసి గొర్రెలు మేపేందుకు వ్యవసాయ పొలాలకు వెళ్లారు. భార్య వెంకటమ్మ సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు ధ్వంసమై ఉన్నాయి. ఇంట్లో బీరువా కూడా ధ్వంసం కావడంతో ఆమె విషయాన్ని వెంటనే భర్తకు ఫోన్ ద్వారా చెప్పింది. భర్త ఇంటికొచ్చి చూడగా బీరువాలో ఉన్న రూ.1.20 లక్షలు, 20 తులాల వెండి గొలుసులు అపహరణకు గురైనట్లు గుర్తించారు. నగదు, నగలు కలిపి మొత్తం రూ.1.30 లక్షలు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు బేగిని ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
అందుబాటులోకి కన్వేయర్ బెల్టు..
సొరంగంలో టీబీఎం మెషీన్తో పాటు పనిచేసే కన్వేయర్ బెల్టు ధ్వంసమైంది. దీంతో సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లను బయటికి తరలించేందుకు ఇబ్బందులు తలెత్తాయి. సింగరేణి కార్మికులు పదుల సంఖ్యలో సొరంగంలోకి వెళ్లి పనులు చేసినప్పటికీ పురోగతి కనిపించలేదు. మట్టి, నీరు, బురదను బయటకు పంపడానికి శ్రమతో కూడుకున్న పనిగా మిగిలింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 3:30 గంటలకు కన్వేయర్ బెల్టును పునరుద్ధరించారు. అయితే ప్రమాదం జరగకముందు సొరంగంలో జరిగిన పనులకు సంబంధించిన మట్టి, రాళ్లు కన్వేయర్ బెల్టుపై ఉండటంతో, వాటిని మాత్రమే బయటికి తరలించారు. -
పక్కాగా పక్కదారి
●కేసులు నమోదు చేశాం ఇప్పటి వరకు పలుచోట్ల రేషన్ బియ్యాన్ని పట్టుకొని కేసులు నమోదు చేశాం. రేషన్ బియ్యం తరలింపుపై ప్రజలు సమాచార అందిస్తే బియ్యం అక్రమ రవాణాను అడ్డుకుంటాం. ఎక్కడైన రేషన్ బియ్యం తరలిస్తున్నట్లయితే సెల్ నంబర్ 9866629460కు సమాచారం ఇవ్వండి. – ఆదిత్య గౌడ్, ఎన్ఫోర్స్మెంట్ డీటీ, మహబూబ్నగర్ ● సరిహద్దులు దాటుతున్న రేషన్ బియ్యం ● జోరుగా అక్రమ రవాణా ● పట్టుబడ్డా.. నామమాత్రపు చర్యలు ● రెచ్చిపోతున్న రేషన్ మాఫియా ● యథేచ్ఛగా కొనసాగుతున్న దందా ● పట్టించుకోని అధికారులు గండేడ్/మహమ్మదాబాద్: రేషన్ బియ్యం అక్రమ రవాణా పక్కాగా సాగుతోంది. పట్టుబడ్డ నామమాత్రపు చర్యలు ఉండటంతో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. గండేడ్ మండలంలోని సల్కర్పేట్లో ఓవ్యాపారి ఇటీవల దుకాణం తెరిచాడు. ఇక్కడ అతను నూకలు, జొన్నలు, రాగులు, వేరుశనగ వంటి వాటిని కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నా అతను చేసేది మాత్రం పక్కా రేషన్ బియ్యం అక్రమ దందానే. గత సోమవారం మూడు క్వింటాళ్ల బియ్యం పట్టుబడ్డాయి. సదరు వ్యాపారి మాత్రం వారు పట్టుకుంటూనే ఉంటారు మేము దందా చేస్తూనే ఉంటాం. ఇది షరామాములే.. అంటూబాహాటంగా చెప్పడం విశేషం. ● నంచర్లగేటులో ముగ్గురు వ్యాపారులు నిరంతరం రేషన్ దందా కొనసాగిస్తున్నారు. తరచూగా పట్టుబడ్డ వారి వ్యాపారంలో మార్పు లేదు. ప్రతినెల బియ్యం సేకరించి కోస్గిలోని రేషన్ మాఫియాకు అందజేస్తారు. వారు అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ● గండేడ్ మండలంలో ఓ మాజీ సర్పంచ్ రేషన్ బియ్యం అక్రమ దందాకు తెరలేపాడు. మహమ్మదాబాద్ను, గండేడ్ మండలంలోని పలు గ్రామాలను స్థావరంగా చేసుకొని దందా చేస్తున్నాడు. ఇటుక బట్టీల లేబర్లకు బియ్యం కావాలని చెబుతూ సేకరించిన బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నాడు. ఇతను ఇటుకబట్టీల లేబర్ పేరు చెబుతున్నా ఇతను ప్రస్తుతం ఇటుకలు తయారు చేయకపోవడం గమనార్హం. ● మొకర్లాబాద్కి చెందిన ఓవ్యాపారి కూడా రేషన్ బియ్యం అక్రమ దందా చేస్తున్నాడు. ఎక్కువగా ఇతను గిరిజనతండాల నుంచి రేషన్ బియ్యం సేకరిస్తూ పక్క రారష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. సాఫీగా సాగుతున్న వ్యాపారం రేషన్ మాఫియా యథేచ్ఛగా అక్రమ దందా కొనసాగిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పట్టుబడ్డా కఠినచర్యలు లేకపోవడంతో ఈ అక్రమ వ్యాపారం సాఫీగా సాగుతోంది. గ్రామాల్లో వ్యాపారులు సేకరించిన బియ్యం సరిహద్దులు దాటుతున్నాయి. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రాలకు తరలుతున్నాయి. కొత్లాబాద్ పగిడ్యాల్ రూట్లో రెగ్యులర్గా ఓ వాహనంలో బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం. మహమ్మదాబాద్, నంచర్ల, సల్కర్పేట్, గండేడ్ నుంచి కోస్గి, దౌల్తాబాద్లకు చెందిన వ్యాపారులు ఇక్కడి వ్యాపారులతో కొనుగోలు చేస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని అక్కడి నుంచి రాష్ట్రం దాట వేస్తున్నారు. -
ఆహార పంటలకు మోతాదులోనే ఎరువులు
బిజినేపల్లి: యాసంగిలో ఆహార పంటలను సాగు చేసే రైతులు రసాయన ఎరువులను మోతాదుకు మించి వినియోగించకూడదని పాలెం కేవీకే సమన్వయకర్త డా.ప్రభాకర్రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని మంగనూర్ శివారులో యాసంగి ఆహార పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా డా.ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ ఆహార ధాన్యం పంటలు సాగు చేసే రైతులు ఎక్కువ మొత్తంలో రసాయన ఎరువులను వినియోగించడం వలన ఆహారం విషతుల్య అవుందన్నారు. ప్రస్తుత యాసంగిలో వేరుశనగ, మొక్కజొన్న, వరి వంటి పంటలను ఎక్కువగా సాగు చేశారని, వాణిజ్య పంటల సాగు తక్కువ విస్తీర్ణంలో చేపట్టారన్నారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త రాజశేఖర్, రైతులు పరశురాములు, కొండన్న తదితరులు ఉన్నారు. -
కార్డియాలజిస్ట్లు అందుబాటులో ఉండాలి
పాలమూరు: కార్డియో(గుండె) రోగులకు క్రమం తప్పకుండా గుండె వైద్యులు(కార్డియాలజిస్ట్) అందుబాటులో ఉండేలా జనరల్ ఆస్పత్రి అధికారులు చూడాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. మంగళవారం జిల్లా జనరల్ ఆస్పత్రిలో ప్రైవేట్ గుండె వైద్యులతో పాటు ఐఎంఏతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో అతి త్వరలో రోజు విడిచి రోజు కార్డియాలజీ సేవలు, 2డీ ఎకో స్కానింగ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. దీనికి పట్టణంలోని ఆరుగురు ప్రైవేట్ గుండె వైద్యుల సేవలు వినియోగించుకోవాలన్నారు. 15 మంది రోగులకు స్కానింగ్తో పాటు ఓపీ సేవలు అందించాలన్నారు. ఈ వారం రోజుల్లో గుండె ఓపీ సేవలు ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు. సదరం క్యాంపు నిర్వహణ కోసం అర్థో విభాగం భవనం పరిశీలించి ఇకపై సదరం శిబిరం ఇక్కడే నిర్వహించి అర్థో కేసులు ఇక్కడే పరిశీలించాలన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.సంపత్కుమార్ సింగ్, ఐఎంఏ అధ్యక్షుడు డా.రాంమోహన్, డా.శ్యామూల్ తదితరులు పాల్గొన్నారు. రోజు విడిచి రోజు కార్డియో వైద్యసేవలు అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ -
విభజించే కుట్ర..
ఎస్సీ వర్గీకరణకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎందుకు అనుకూలంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా తనకు ఇష్ట్రం వచ్చినట్లు ఎస్సీల రిజర్వేషన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీలను విభజించి వారిలో ఐకమత్యం దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని షమీ కమిటీ నివేదిక కాపీలను అసెంబ్లీలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మాలల సంఖ్య తక్కువగా చూపించి ఎస్సీ వర్గీకరణ చేయడం సరికాదన్నారు. ఎస్సీలలో ఉన్న 59 ఉపకులాల్లో ఏ కులం ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాల్సి బాధ్యత ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రంలో మాదిగల కంటే మాలలే అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. త్వరలోనే జోగుళాంబ అమ్మవారి క్షేత్రం నుంచే మాలల ఉద్యమాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు రాజన్న, హరీశ్, రవికుమార్, రజిని బాబు, రాజు, నాగరాజు, ప్రేమలత తదితరులు ఉన్నారు. -
ప్రధాన కూడళ్లలో అడ్డాలు
రేషన్ బియ్యం వ్యాపారం చేసేవారు ప్రధాన గ్రామాల కూడళ్లలో అడ్డాలు పెట్టుకున్నారు. నంచర్ల, సల్కర్పేట్, మహమ్మదాబాద్, నంచర్లగేట్, పగిడ్యాల్ గ్రామాల్లో అడ్డాలున్నాయి. ఒక్క కొంరెడ్డిపల్లిలోనే 8 నుండి 10 మంది వరకు అక్రమ వ్యాపారం చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. ప్రజల నుంచి కిలోకు రూ.10 చొప్పున సేకరించి వారు బయట కిలో రూ.20 వరకు అమ్ముకుంటున్నారు. మంచి డిమాండ్ మార్కెట్లో రేషన్ బియ్యానికి మంచి డిమాండ్ ఉంది. పౌల్ట్రీ ఫారాల్లో దాణగా ఉపయోగించడంతో పాటు, బీర్ల, కల్లు, టిఫిన్ల తయారీలో సైతం వీటిని వినియోగిస్తున్నారు. ఫలితంగా అక్రమ వ్యాపారం నిరాటంకంగా సాగుతోంది. ఇందుకు అధికారులు అండదండలు మెండుగా ఉన్నాయి. క్రమం తప్పకుండా మామూళ్లు అందుతున్నట్లు సమాచారం. -
పట్టుబడ్డ ధాన్యంపై విచారణ
● పోలీసులకు ఫిర్యాదు చేసిన విజిలెన్స్ అధికారులు కృష్ణా: మండల సరిహద్దులోని చెక్పోస్టు వద్ద సోమవారం సాయంత్రం పట్టుబడిన ఆరు లారీల ధాన్యానికి సంబంధించి మంగళవారం విజిలెన్స్ స్పెషల్ ఆఫీసర్ శశిధర్ విచారణ చేపట్టి స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారి మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం, ఈ ప్రాంత మిల్లర్లు సేకరించిన వరి ధాన్యం కానీ కర్ణాటకకు తరలిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో సరిహద్దులో తాము నిఘా ఉంచి అక్రమంగా ధాన్యం తరలిప్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టుబడ్డ లారీల్లో ప్రభుత్వం అందించిన గన్నీ బ్యాగులు ఉండడంతో పాటు వాటికి సరైన ధ్రువపత్రాలు లేనందున వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు. -
8న మహిళా శ్రామిక పోరాట దినోత్సవం
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళ శ్రామిక పోరాట దినోత్సవంగా జరుపుకుందామని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కోకన్వీనర్ శ్రీదేవి అన్నారు. మంగళవారం చైతన్య మహిళ సంఘం ఆధ్వర్యంలో పాలమూరు యూనివర్సిటీ ఆవరణలో పోస్టర్ను విడుదల చేశారు. ఓటు హక్కు కోసం, కనీస వేతనాలు, పని గంటలను తగ్గించాలని సుదీర్ఘ పోరాటం చేసిన అమరుల త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, శ్రామికులు వారి త్యాగాలను మరిచిపోవద్దన్నారు. కార్యక్రమంలో చైతన్య మహిళా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కస్తూరి, చంద్రకళ, శివ, మాధురి, సురేష్, సునిత పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీసులకువినికిడి పరీక్షలు పాలమూరు: జిల్లా జనరల్ ఆస్పత్రి ఈఎన్టీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో వైద్యశిబిరం నిర్వహించారు. జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్కుమార్ సింగ్ పర్యవేక్షణలో ఈఎన్టీ వైద్య బృందం ట్రాఫిక్ పోలీసులకు వినికిడి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. మొత్తం 40 మంది పోలీస్ సిబ్బందికి హియరింగ్ పరీక్షలు చేయగా దీంట్లో ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం జనరల్ ఆస్పత్రికి పంపించగా మిగిలిన అందరికి ట్యాబ్లెట్స్ అందించారు. కార్యక్రమంలో ఈఎన్టీ వైద్యులు మహేశ్వర్రెడ్డి, సీఐ భగవంతురెడ్డి సతీష్రెడ్డి పాల్గొన్నారు. వేరుశనగ క్వింటాల్ రూ.6,620 జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్లో మంగళవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,620, కనిష్టంగా రూ.5,191 ధరలు లభించాయి. అనుములు రూ.6,752, ఉలువలు రూ.5,610, రాగులు రూ.3,305, కందులు గరిష్టంగా రూ.6,899, కనిష్టంగా రూ.6,127, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,381, కనిష్టంగా రూ.2,111, ఆముదాలు గరిష్టంగా రూ.6,062, కనిష్టంగా రూ.5,981 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్లో ఆముదాలు క్వింటాల్కు గరిష్టంగా రూ.6,011, కనిష్టంగా రూ.5,989, కందులు గరిష్టంగా రూ.6,859గా ఒకే ధర పలికింది. ● నారాయణపేట మార్కెట్లో వేరుశనగ గరిష్టంగా రూ.6,120, కనిష్టంగా రూ.4930, తెల్ల కుసుమలు క్వింటాల్ రూ.5,259, జొన్నలు గరిష్టంగా రూ.3,706, కనిష్టంగా రూ.3,275, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,469, కనిష్టంగా రూ.5,500, తెల్ల కందులు గరిష్టంగా రూ. 7,589, కనిష్టంగా రూ.6,200 ధర పలికాయి. సివిల్స్ కోచింగ్కుఒప్పందం మహబూబ్నగర్ మున్సిపాలిటీ: స్థానిక ప్రభుత్వ ఎన్టీఆర్ మహిళా డిగ్రీ–పీజీ అటానమస్ కళాశాలలో చదివే విద్యార్థినులకు సివిల్స్లో కోచింగ్ ఇచ్చేందుకు 21వ శతాబ్దపు ఐఏఎస్ అకాడమీ (హైదరాబాద్) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం ఇరుపక్షాల వారు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం 400 మంది విద్యార్థినులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఐదేళ్లపాటు యూపీఎస్సీ ఫౌండేషన్ కోర్సులో భాగంగా ఉచిత మాస్టర్ తరగతులు 12 సెషన్స్గా ఆఫ్లైన్ (ప్రతి సెషన్కు రెండు గంటల చొప్పున) లో కోచింగ్ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.వి.రాజేంద్రప్రసాద్, కెరీర్ గైడెన్స్ సెల్ కన్వీనర్ డా.పద్మ, వైస్ ప్రిన్సిపాల్ అమీనాముంతాజ్ జహాన్, కో–ఆర్డినేటర్ అనిత, 21వ శతాబ్దపు ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పి.కృష్ణప్రదీప్, డైరెక్టర్ భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉదండాపూర్ వద్ద ఉద్రిక్తత
జడ్చర్ల: ఉదండాపూర్ రిజర్వాయర్ వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిర్వాసితుల ఆందోళన కారణంగా కొన్ని రోజులుగా రిజర్వాయర్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పనులను చేపట్టేందుకు పోలీసు బలగాలు పెద్ద ఎత్తున రిజర్వాయర్ వద్దకు చేరుకుని పనులను కొనసాగించేందుకు ప్రయత్నించడంతో నిర్వాసితులు ఒక్కసారిగా అడ్డుపడ్డారు. తమ సమస్యలను పరిష్కరించకుండా పనులు ఎలా మొదలు పెడుతారని ప్రశ్నించారు. తమకు ఆర్అండ్ఆర్ పరిహారం, ప్లాట్లు, తదితర సమస్యలను పరిష్కరించి పనులు చేపట్టాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం తమ చేతిలో లేదని, కలెక్టర్ తదితర ప్రభుత్వ పెద్దల చేతుల్లో ఉందని పోలీసులు నిర్వాసితులకు నచ్చజెప్పారు. అయినా నిర్వాసితులు రిజర్వాయర్ కట్టపై అడ్డుగా బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీక్ష శిబిరంలో కూర్చోని నిరసన కొనసాగించారు. ఉదండాపూర్లో సర్వే పూర్తి చేశారని, వెంటనే తమకు ఆర్అండ్ఆర్ పరిహారం పెంచి ఇవ్వాలని కోరారు. అంతవరకు పనులను నిలిపేయాలని డిమాండ్ చేశారు. జడ్చర్ల సీఐ కమలాకర్, రూరల్ సీఐ నాగార్జున గౌడ్, ఎస్ఐలు చంద్రమోహన్, జయప్రసాద్, మల్లేష్, వివిధ మండలాల ఎస్ఐలు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు కలెక్టర్తో నిర్వాసితులు మాట్లాడేందుకు తాము కృషి చేస్తామని పోలీసులు నచ్చజెప్పి కలెక్టర్ కార్యాలయానికి నిర్వాసితులను తీసుకెళ్లారు. కలెక్టర్ను కలిసిన నిర్వాసితులు ఉదండాపూర్ నిర్వాసితులు కలెక్టర్ విజయేదిర బోయిని కలిసి తమ సమస్యలు వివరించారు. ఆర్అండ్ఆర్ పెంపుదల చేసి త్వరితగతిన పరిహారం అందే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆర్అండ్ఆర్ పెంపు ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ప్రభుత్వం నుంచిఎప్పుడైనా పరిహారం అందే అవకాశం ఉందన్నారు. రిజర్వాయర్ పనులను అడ్డుకోవద్దని పనులు కొనసాగే విధంగా సహకరించాలని కలెక్టర్ సూచించారు. దీంతో నిర్వాసితులు తాము గ్రామంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ వెనుదిరిగారు. పనులు అడ్డుకున్న నిర్వాసితులు -
కార్డియాలజిస్ట్లు అందుబాటులో ఉండాలి
పాలమూరు: కార్డియో(గుండె) రోగులకు క్రమం తప్పకుండా గుండె వైద్యులు(కార్డియాలజిస్ట్) అందుబాటులో ఉండేలా జనరల్ ఆస్పత్రి అధికారులు చూడాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. మంగళవారం జిల్లా జనరల్ ఆస్పత్రిలో ప్రైవేట్ గుండె వైద్యులతో పాటు ఐఎంఏతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో అతి త్వరలో రోజు విడిచి రోజు కార్డియాలజీ సేవలు, 2డీ ఎకో స్కానింగ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. దీనికి పట్టణంలోని ఆరుగురు ప్రైవేట్ గుండె వైద్యుల సేవలు వినియోగించుకోవాలన్నారు. 15 మంది రోగులకు స్కానింగ్తో పాటు ఓపీ సేవలు అందించాలన్నారు. ఈ వారం రోజుల్లో గుండె ఓపీ సేవలు ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు. సదరం క్యాంపు నిర్వహణ కోసం అర్థో విభాగం భవనం పరిశీలించి ఇకపై సదరం శిబిరం ఇక్కడే నిర్వహించి అర్థో కేసులు ఇక్కడే పరిశీలించాలన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.సంపత్కుమార్ సింగ్, ఐఎంఏ అధ్యక్షుడు డా.రాంమోహన్, డా.శ్యామూల్ తదితరులు పాల్గొన్నారు. రోజు విడిచి రోజు కార్డియో వైద్యసేవలు అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ -
ఆచూకీ లభించేనా..?
అచ్చంపేట రూరల్/ఉప్పునుంతల: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల ఆచూకీ ప్రశ్నార్థకంగా మారింది. రోజూ విడతల వారీగా ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నా.. సొరంగంలో చిక్కుకున్న వారి ఆచూకీ మాత్రం లభించడం లేదు. ఈ నేపథ్యంలో అధికారులు సైతం ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. సొరంగంలో చేపడుతున్న సహాయక చర్యలకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారు. షిఫ్ట్ల వారీగా సొరంగంలోకి వెళ్లి వచ్చిన వారు కూడా సమాచారం అందించడం లేదు. కాగా, సొరంగంలో ప్రమాదం జరిగిన ప్రాంతంలో నీటి ఊట రోజురోజుకూ పెరుగుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. లోకో ట్రైన్లో సహాయ బృందాలు 13.5 కిలోమీటర్లు వెళ్లడానికి సుమారు 2 గంటల సమయం పడుతోందని.. అక్కడికి వెళ్లి గంట పాటు పనులు చేసి బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. టీబీఎం మెషీన్ విడి భాగాలను రైల్వే సిబ్బంది గ్యాస్ కట్టర్తో తొలగిస్తున్నారు. ● భూ ప్రకంపనలు, భూమిలో ప్రయాణించే ప్రత్యాస్తి తరంగాలను అధ్యయనం చేసే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం ఢిల్లీ నుంచి ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు చేరుకుంది. ఈ బృందం పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. సొరంగం కుప్పకూలిన ప్రదేశంలో అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఉన్నతాధికారులతో వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉన్నతాధికారుల సమీక్ష.. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. టన్నెల్ ఇన్ లెట్ ఆఫీస్ వద్ద రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న బృందాల అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, మైనింగ్, ఫైర్ సర్వీసెస్, ర్యాట్ మైనింగ్ ప్రత్యేకతలు, ప్లాస్మా కట్టర్స్ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. కన్వేయర్ బెల్టును పునరుద్ధరించిన కారణంగా గంటకు 800 టన్నుల మట్టిని బయటకు తీసుకురాగలమని అధికారులు వెల్లడించారు. గ్రౌండ్ పేనిట్రేటింగ్ రాడార్ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయని.. కన్వేయర్ బెల్టు ద్వారా వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అదేవిధంగా రెండు ఎస్కలేటర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగాలను గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించి లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకురానున్నట్లు చెప్పారు. సహాయక బృందాలకు అవసరమైన ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. కాగా, సహాయక చర్యలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ డీజీపీ నాగిరెడ్డి ప్రత్యేకంగా పర్యవేక్షించారు. సమావేశంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, కల్నల్ పరిక్షిత్ మెహ్ర, ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న తదితరులు ఉన్నారు. ఫోరెన్సిక్ బృందం రాక.. సొరంగంలో సహాయక బృందాలకు దుర్వాసన వస్తుందని.. మట్టి తవ్వకాల్లో ఎముకలు బయటపడ్డాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి నుంచి ప్రత్యేకంగా ఫోరెన్సిక్ బృందం సొరంగ ప్రాంతానికి చేరుకోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లోసహాయక చర్యలు ముమ్మరం ఎట్టకేలకు కన్వేయర్ బెల్టు పునరుద్ధరణ ఎలాంటి సమాచారం బయటికి పొక్కనివ్వని అధికారులు -
మహిళలకు న్యాయ సలహాలు, సూచనలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఎవరైనా మహిళలు పనిచేస్తున్న చోట ఎలాంటి వేధింపులకు గురైనా తమను సంప్రదిస్తే ఉచిత న్యాయ సలహాలు, సూచనలిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ డి.ఇందిర అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. పది లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులతో ఉన్న ప్రతి పని ప్రదేశంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం మహిళలు ఎక్కడికి వెళ్లినా సరైన భద్రత కరువైందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులు న్యాయం కోసం తమ సంస్థను సంప్రదించవచ్చన్నారు. ముఖ్యంగా లైంగిక వేధింపులనేవి మహిళా ప్రాథమిక సమాన హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. పోష్ చట్టం ఇలాంటి వారికి రక్షణ కల్పిస్తుందన్నారు. అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కేక్ కట్ చేశారు. సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్రెడ్డి, ఏఈ వైష్ణవి, సీనియర్ అకౌంటెంట్ ఇందిర, కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ ఇందిర లైంగిక వేధింపుల నివారణపై అవగాహన సదస్సు -
అందుబాటులోకి కన్వేయర్ బెల్టు..
సొరంగంలో టీబీఎం మెషీన్తో పాటు పనిచేసే కన్వేయర్ బెల్టు ధ్వంసమైంది. దీంతో సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లను బయటికి తరలించేందుకు ఇబ్బందులు తలెత్తాయి. సింగరేణి కార్మికులు పదుల సంఖ్యలో సొరంగంలోకి వెళ్లి పనులు చేసినప్పటికీ పురోగతి కనిపించలేదు. మట్టి, నీరు, బురదను బయటకు పంపడానికి శ్రమతో కూడుకున్న పనిగా మిగిలింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 3:30 గంటలకు కన్వేయర్ బెల్టును పునరుద్ధరించారు. అయితే ప్రమాదం జరగకముందు సొరంగంలో జరిగిన పనులకు సంబంధించిన మట్టి, రాళ్లు కన్వేయర్ బెల్టుపై ఉండటంతో, వాటిని మాత్రమే బయటికి తరలించారు. -
క్షుద్రపూజలు, బాలిక బలి పూర్తి అవాస్తవం
బిజినేపల్లి : బంగారం నిధుల కోసం తవ్వకాలు, బాలిక నరబలి అంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు అవాస్తమని డీఎస్పీ శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం మండలంలోని వట్టెం గ్రామ సమీపంలోని రాంరెడిపల్లితండాలో ఈ వార్తలపై డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఇలాంటి వార్తలను నమ్మొద్దని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జైపాల్, తిరుపతి అనే వ్యక్తులు వ్యవసాయ కుటుంబాలకు చెందినవారని, కొద్దిరోజుల కిందట బోరుబావి పాయింట్ చూపించడం కోసం ఒక వ్యక్తి సంప్రదించారన్నారు. ఆ బోరు పాయింట్ చూసే వ్యక్తి పుట్టను చూపించి అక్కడ బంగారం లభించే అవకాశముందని చెప్పడంతో వారు బంగారం కోసం గత శనివారం పుట్టను తవ్వారు. తండా వాసులు వారిని గుర్తించి పట్టుకొని వారించి పంపించినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనలో పెద్దమనుషులు డబ్బులు తీసుకున్నారనే విషయం అవాస్తవమని న్నారు. ఇదిలా ఉంటే జైపాల్, తిరుపతిపై కేసు నమోదు చేసిన్నట్లు డీఎస్పీ తెలిపారు. సంచనాల కోసం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు రాసే వారిపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు నమ్మొద్దు డీఎస్పీ శ్రీనివాస్యాదవ్ -
విద్యార్థులూ.. విజయీభవ
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం ● సీసీ కెమెరాలతో నిఘా, కమాండ్ కంట్రోలర్ పర్యవేక్షణ ● జిల్లాలో 36 పరీక్ష కేంద్రాల ఏర్పాట్లు ● వసతులను పరిశీలించిన అధికారులు ● నాలుగు సెల్ఫ్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి ఓకేషనల్ 2,494జనరల్ 9,067సెకండియర్ విద్యార్థులు 11,561 విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే చేయాల్సిన ఫోన్ చేయాల్సిన నంబర్ 92402 0555522,48336 -
విద్యారంగం బలోపేతానికి కృషి
దేవరకద్ర రూరల్: విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కౌకుంట్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో కూరగాయలు నాణ్యతగా లేకపోవడం గమనించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. స్నాక్స్గా రోజు రాగిజావ అందిస్తున్నారని కలెక్టర్కు విద్యార్థులు చెప్పడంతో మెనూ ప్రకారం ఇవ్వకుండా రాగి జావ ఇవ్వడమేమిటని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్, ఎంపీడీఓలను ఆదేశించారు. తరగతి గదుల్లో పాఠ్యాంశాలకు సంబంధించి విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కౌకుంట్ల నూతన మండలం కావడంతో, కార్యాలయాలు, ప్రభుత్వాస్పత్రి నిర్యాణానికి గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. అంతకుముందు పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీడీఓ ఆఫీస్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్ రెహమన్, ఎంపీడీఓ శివప్రసాద్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి కలెక్టర్ విజయేందిర బోయి స్నాక్స్గా రాగి జావ ఇవ్వడంపై ఉపాధ్యాయులపై ఆగ్రహం -
గంజాయి తాగుతూ పట్టుబడ్డ యువకుడు
రాజాపూర్ (బాలానగర్): బాలానగర్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి ఓ యువకుడు గుట్టుగా గంజాయి తాగుతుండగా.. విషయం తెలుసుకున్న ఎకై ్సజ్ ఎస్ఐ ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ రాష్ట్రానికి చెందిన కమలేష్ బాలానగర్ శివారులోని ఓ పైపుల కంపెనీలో పనిచేస్తూ మండల కేంద్రంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కొన్ని రోజులుగా కమలేష్ గంజాయి తాగుతున్న విషయాన్ని ఇంటి పక్కలవారు గమనించి మంగళవారం రాత్రి బాలానగర్, రాజాపూర్ ఎకై ్సజ్ ఎస్ఐ నాగరాజుకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న ఎకై ్సజ్ ఎస్ఐ నాగరాజు, సిబ్బంది యువకుడిని అదుపులోకి తీసుకుని ఇంటిలో సోదాలు చేశారు. ఇంటిలో గంజాయి లభించకపోవడంతో కమలేష్కు అదుపులోకి తీసుకుని గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతుందనే కోణంలో విచారిస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
కీలక దశకు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో మరో ముందడుగు పడింది. సహయకచర్యలకు ఆటంకంగా ఉన్న బురద, శిథిలాలు తొలగించేందుకు కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించారు. దీంతో సహయక చర్యలు వేగవంతం కానున్నాయి. టన్నెల్లో 11 రోజుల క్రితం గల్లంతైన 8 మంది కార్మికుల జాడ కనుగొనేందుకు సహయక చర్యలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగనున్నాయి. త్వరలో తప్పిపోయిన వారి ఆచూకీ దొరుకుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో గత నెల 22న జరిగిన ప్రమాదంలో తప్పిపోయిన వారి ఆచూకీ కోసం 11 రోజులుగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, నేవీ, సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే, ర్యాట్హోల్ మైనర్స్, ఎన్జీఆర్ఐ ఇలా 12 విభాగాలకు చెందిన దాదాపు 650 సభ్యులతో నిర్విరామంగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఆచూకీ లభించకపోవటంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.ప్రమాద సమయంలో పెద్దమొత్తంలో సీపేజ్ వాటర్, మట్టి పడటంతో టన్నెల్లో బురద పేరుకుపోయి సహయక చర్యలకు ఆటంకంగా మారింది. అదే సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) ధ్వంసం అయ్యింది. మిషన్కు అను సంధానంగా పనిచేసే కన్నేయర్ బెల్ట్ సైతం దెబ్బతింది.దీంతో టన్నెల్లో ఉన్న శిథిలాలు, బురద అలాగే ప్లాస్మా కట్టర్స్ ద్వారా తొలగిస్తున్న టీబీఎం మిషన్ పరికరాల తొలగింపు సమస్యగా మారింది. ఇప్పటి వరకు లోకో ట్రైన్ ద్వారా రెండు బోగీలలో వాటిని తొలగిస్తూ వచ్చారు.ఒకసారి లోకో ట్రైన్ లోపలికి వెళ్లి రావటానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. అంటే ఈ లెక్కన బురద, శిథిలాలు తొలగించేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో సహయక చర్యలు వేగవంతం కావాలంటే కన్వేయర్ బెల్ట్ పునరద్దరణే శరణ్యమని నిర్ణయించారు. సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సమీక్షలో కూడ ఇదే అంశాన్ని ప్రతిపాదించారు. దీంతో వెంటనే కన్వేయర్ బెల్ట్ పునరుద్దరణ పనులు చేపట్టారు. ఇంజనీయర్లు రెండు రోజులు శ్రమించి ఇవాళ సాయంత్రం దాన్ని ప్రారంభించారు.ప్రస్తుతం వ్యర్దాలను ఈ బెల్ట్ ద్వార బయటికి పంపుతున్నారు. ఈ బెల్ట్ ద్వారా గంటకు 8 వందల టన్నుల వ్యర్దాలను బయటికి పంపే సామర్థ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో టన్నెల్లో భారీగా పేరుకుపోయిన మట్టి, బురదను త్వరిత గతిన తొలగించే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం దాదాపు10 వేల క్యూబిక్ మీటర్ల మేర మట్టి, బురద ఉన్నట్టు చెబుతున్నారు. కన్వేయర్ బెల్ట్ పునరుద్దరణతో తప్పిపోయిన వారి ఆచూకీ త్వరలోనే గుర్తించవచ్చని అభిప్రాయపడుతున్నారు. గ్రౌండ్ పేనిట్రేటింగ్ రాడార్ ద్వారా గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయని, కన్వేయర్ బెల్ట్ సిద్ధంగా ఉండటంతో వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు.రెండు ఎస్కలేటర్లను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగాలను గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించి లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్నట్టు తెలిపారు. సహాయక చర్యలకు ఆటంకంగా మారుతున్న నీటిని ఎప్పటికప్పుడు పంపుల ద్వారా బయటకు పంపిస్తున్నట్లు వివరించారు. మొత్తంగా కన్వేయర్ బెల్ట్ ను పునరుద్దరించి సహయకచర్యలు చేపట్టడం మాత్రం రెస్క్యూ ఆపరేషన్లో కీలకంగా మారింది. -
ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రజావాణి కార్య క్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోనీ మీటింగ్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 86 ఫిర్యాదులు అందాయి. జిల్లాలో ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్రావులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ. విద్యుత్ , తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని ప్రత్యేక అధికారులకు సూచించారు. మండలంలో గ్రామాలు, హ్యాబిటేషన్లలో విద్యుత్ సరఫరా, తాగునీటి సమస్య లేకుండా వేసవి ముగిసే వరకు పర్యవేక్షించాలని, గ్రామాల్లో ఎలాంటి సమస్య తలెత్తిన వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. చిన్నచిన్న మరమ్మతులు, అత్యవసర పనులకు నిధులు అవసరం ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. వేసవిలో అప్రమత్తంగా ఉండాలి ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు ఎక్కువగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ద్రావణంతో పాటు తాగు నీటి వసతి, టెంట్ ఏర్పాటు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే ఐసీడీఎస్, ఇతర శాఖలలో ఎండలో ఎక్కువగా పని చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలని, వడదెబ్బకు గురైన వారు తక్షణమే దగ్గరలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్ను సంప్రదించి సరైన సలహాలు తీసుకోవాలని సూచించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ వడ దెబ్బ కారణాలు, నివారణ చర్యలు, ముందు జాగ్రత్త చర్యలను వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్రావు, ఆర్డీఓ నవీన్, డీపీఓ పార్థసారథి, జిల్లా సంక్షేమ అధికారిణి, జరీనా బేగం, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. విద్యుత్, తాగునీటి సమస్య లేకుండా చూడాలి కలెక్టర్ విజయేందిర బోయి -
అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు
స్టేషన్ మహబూబ్నగర్: అరుణాచలం గిరి ప్రదక్షిణకు భక్తుల సౌకర్యార్థం మహబూబ్నగర్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ సంతోష్కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సు ఈ నెల 12న రాత్రి 7 గంటలకు మహబూబ్నగర్ బస్టాండ్ నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్ కాణిపాకం విఘ్నేశ్వరుడు, వేలూర్లోని శ్రీమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం దర్శనాంతరం 13న సాయంత్రం 6 గంటలకు అరుణాచలంకు చేరుకుంటుందని పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి 15న ఉదయం మహబూబ్నగర్కు చేరుకుంటుందని వివరించారు. భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని, ఈ టూర్ ప్యాకేజీని సంస్థ అధికారిక వెబ్సైట్ tsrtconline.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. మిగతా సమాచారం కోసం 99592 26286, 94411 62588 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
తుది దశలో నిర్మాణ పనులు
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ–బ్లాక్ మాత్రం ఈవీఎం భవనం ఉండటం వల్ల పూర్తి కాలేదు. ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. కోర్టు ఆ సమస్యను త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం. ఈవీఎం భవనంపై స్పష్టత వస్తే ఈ–బ్లాక్ కూడా పనులు ప్రారంభం అవుతాయి. ప్రభుత్వ నూతన ఆస్పత్రిని ఎప్పుడూ ప్రారంభం చేస్తుందనే అంశంపై స్పష్టత రాలేదు. – డాక్టర్ సంపత్కుమార్ సింగ్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
కొనసాగుతున్న అన్వేషణ
అచ్చంపేట/మన్ననూర్: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు చేపట్టి న సహాయక చర్యలు సోమవారం పదోరోజు కూడా కొనసాగాయి. కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే భారీస్థాయిలో పేరుకుపోయిన బురద, ఉబికి వస్తున్న నీటి ఊటతో వీరి అన్వేషణకు అవరోధాలు కలిగిస్తున్నా యి. దాదాపు 10– 20 వేల లీటర్ల మేర నీటి ఊట ఉబికి వస్తుంది. మరోవైపు తమవారి రాక కోసం కుటుంబసభ్యులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఎస్ఎల్బీసీ సందర్శించిన సీఎం రేవంత్రెడ్డి కన్వేయర్ బెల్టు మరమ్మతు సోమవారం సాయంత్రానికి పూర్తవుతాయని చెప్పారు. కానీ, ఇక్కడి పరిస్థితి చూస్తే మరో రెండు రోజులైనా కన్వేయర్ బెల్టు మరమ్మతు జరిగే అవకాశం కనిపించడం లేదు. దీనికోసం సింగరేణి, రాబిట్ బృందాలు కష్టపడుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన శిథిలాలను సింగరేణి బృందాలు మాన్యువల్ పద్ధతిలో తవ్వకాలు చేపడుతున్నారు. ఆ మట్టిని లోకో ట్రైన్ ద్వారా బయటికి పంపిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ కూడా ఒకింత ఆటంకం సృష్టిస్తుంది. దీనిని బట్టి 15 అడుగుల ఎత్తులో పేరుకుపోయిన బురద, మట్టి బయటికి తేవడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. రాడార్ (జీపీఆర్) స్కానింగ్ గుర్తించిన మూడు, నాలుగు ప్రదేశాల్లో శిథిలాలు తొలగించినా ఆనవాళ్లు దొరకలేదు. ఎంత తవ్వితే అంత ఊట బయటికి వస్తుండటంతో ఎప్పటిప్పుడు డీవాటరింగ్ చేస్తున్న పనులకు అడ్డంకులు కలిగిస్తుంది. బురద, ఊట నీరే ప్రధాన సమస్య నిమిషానికి 10– 20 వేల లీటర్ల నీటి ఊట సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తేవడంలో అవరోధాలు పదోరోజు కొనసాగిన సహాయక చర్యలు రెస్క్యూ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం -
రూ.5 లక్షలతో నాణ్యమైన ఇల్లు నిర్మించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఒక్కో యూనిట్ కింద ఐదు లక్షల రూపాయల్లో నాణ్యమైన ఇంటిని నిర్మించాలని హౌసింగ్ పీడీ వైద్యం భాస్కర్ అన్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణంపై గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నాక్ శిక్షణ కేంద్రంలో మేసీ్త్రలకు నిర్మాణ రంగంపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(నాక్)సెంటర్లో హౌసింగ్ కార్పొరేషన్ సహకారంతో ఆరు రోజుల శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్త టెక్నాలజీతో రూ.5 లక్షల బడ్జెట్లో ఇళ్లను నాణ్యతగా ఎలా నిర్మించాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాక్ ఏడీ శివశంకర్, గృహ నిర్మాణ, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.