Medak
-
డంప్యార్డును ఎత్తి వేయాలి
నర్సాపూర్: ప్యారానగర్లో ఏర్పాటు చేస్తున్న డంప్యార్డును ఎత్తి వేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ డిమాండ్ చేశారు. నర్సాపూర్లో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న రిలే నిరాహార దీక్షలకు మంగళవారం ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. డంప్యార్డుతో నర్సాపూర్ అడవులు, చెరువు కలుషితమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తూ డంప్ యార్డు ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. దీక్షల్లో జేఏసీ నాయకులు శ్రీధర్గుప్తా, రాజేందర్, భిక్షపతి, జ్ఞానేశ్వర్, రమణరావు, మార్వాడి సంఘం నాయకులు మేఘరాజ్, రమేశ్, మోహన్ పాల్గొన్నారు. -
త్వరలో జూనియర్ సివిల్ కోర్టు ఏర్పాటు
కార్యాలయాన్ని పరిశీలించిన న్యాయమూర్తి తూప్రాన్: డివిజన్ కేంద్రంలో జూనియర్ సివిల్ కోర్టు సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు అధికారులు కార్యాచరణ మొదలెట్టారు. ఈ నేపథ్యంలో జూనియర్ సివిల్ కోర్టు ఏర్పాటు కోసం ఎంపీడీఓ కార్యాలయం భవనాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులతో కలిసి జిల్లా సివిల్ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీశారద మంగళవారం పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలు, తహసీల్దార్ కార్యాలయం, వృథాగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను పరిశీలించారు. కాగా ఎంపీడీఓ కార్యాలయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నట్లు అధికారులు ఒక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. కాగా, తూప్రాన్లో జూనియర్ సివిల్ కోర్టు భవనం అందుబాటులోకి వస్తే ప్రజలకు దూరభారం తగ్గనుంది. -
మెనూ ప్రకారం భోజనం పెట్టాలి: డీఎల్పీఓ
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని వెల్మకన్నలోని ఎస్సీ బాలుర హాస్టల్ను డీఎల్పీఓ సాయిబాబా మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లో కిచెన్రూం, హాస్టల్ గదులు, టాయిలెట్స్, ఇతర పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్, మెనూ ప్రకారం భోజనం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతీరోజు మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం వండి పెట్టాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు ఉదయం, రాత్రి స్టడీ అవర్ నిర్వహించాలని, సమస్యలుంటే చెప్పాలన్నారు. కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారి జయరాజ్, వెల్మకన్న, కొట్టాల పంచాయతీ కార్యదర్శులు ప్రవీణ్రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. చదవడం, రాయడం రావాలి ఎఫ్ఎల్ఎన్ జిల్లా కోఆర్డినేటర్ సిరి కౌడిపల్లి(నర్సాపూర్): ప్రతీ విద్యార్థికి చదవడం, రాయడం రాయాలని ఎఫ్ఎల్ఎన్ (ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ) జిల్లా కోఆర్డినేటర్ సిరి అన్నారు. మంగళవారం కౌడిపల్లి, దేవులపల్లి ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ బాలరాజుతో కలిసి సందర్శించారు. ఆయా పాఠశాలలో మధ్యాహ్న భోజనం, పాఠశాల రికార్డులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థికి చతుర్విద ప్రక్రియలు చదవడం, రాయడం, కూడికలు, గుణితం కచ్చితంగా రావాలన్నారు. అనంతరం ఎంఈఓ బాలరాజు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని తెలిపారు. పాఠశాల పరిసరాలు, బాత్రూంలు, మరగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని చెప్పారు. సమస్యలుంటే చెప్పాలని, విధులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి పూజలు పాపన్నపేట(మెదక్): ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి మంగళవారం ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు శంకరశర్మ, పార్థివశర్మ ఆయనకు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అర్చన నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఈఓ చంద్రశేఖర్ శాలువాతో సత్కరించారు. విజయసేనారెడ్డికి 259వ ర్యాంకు చేగుంట(తూప్రాన్): మండలంలోని బీకొండాపూర్కు చెందిన విజయసేనారెడ్డి గ్రూప్–2 ఫలితాల్లో 259వ ర్యాంకు సాధించారు. మండలంలోని మక్కరాజీపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మంచి ర్యాంకు సాధించిన విజయసేనారెడ్డిని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, స్నేహితులు అభినందించారు. ఐదేళ్ల కఠోర దీక్షకు తగిన ఫలితం వచ్చిందని విజయసేనారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆదర్శలో ప్రవేశానికి గడువు పెంపు చిన్నకోడూరు(సిద్దిపేట): ఆదర్శ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈ నెల 20 వరకు పొడిగించినట్లు ఇబ్రహీంనగర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సతీష్ తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థులతో పాటు 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాలలో సంప్రదించాలన్నారు. గ్రూప్ 2లో 103వ ర్యాంక్ హుస్నాబాద్: పట్టణానికి చెందిన అయిలేని మణికంఠేశ్వర్ రెడ్డి గ్రూప్ 2లో స్టేట్ ర్యాంక్ సాధించారు. గ్రూప్ 2లో 392.5 మార్కులు వచ్చాయి. గతంలో గ్రూప్ 4లో 600 ర్యాంక్ సాధించిన మణికంఠేశ్వర్ రెడ్డి ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఎండోమెంట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. -
ప్రతిభను చాటేందుకు సదావకాశం
మెదక్ కలెక్టరేట్: యువత తమ ప్రతిభను చాటేందుకు మంచి అవకాశమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు. మంగళవారం కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడా మంత్రిత్వశాఖ, మేరా యువ భారత్ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను నిర్వహించారు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి రాధాకిషన్, డీవైఎస్ఓ దామోదర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వివేకానందుని చిత్ర పటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ యువ ఉత్సవం ద్వారా యువత తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక మంచి వేదిక లభించిందన్నారు. శాస్త్ర సాంకేతిక ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు, రచనా పోటీలు వంటి అనేక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు. యువత ఈ కార్యక్రమాలలో పాల్గొని ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. అనంతరం జిల్లాస్థాయి విజేతల వివరాలను జిల్లా యువజన అధికారి రంజిత్ రెడ్డి తెలిపారు. కాగా, విజేతలకు డీఈఓ బహుమతులు అందజేశారు. వీరు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ప్రోగ్రామ్ ఆఫీసర్ కిరణ్ కుమార్, సీనియర్ అధ్యాపకులు గణపతి, తిరుమలరెడ్డి, మురళి, దీపికా, సురేష్, వెంకటేశ్వ ర్లు, అధికం రాజు, యువజన సంఘాల అధ్యక్షులు, యువజన సంఘాల ప్రతినిధులు రాజు, 640 మందిపైగా యువతి యువకులు పాల్గొన్నారు. యువజనులు సద్వినియోగం చేసుకోవాలి డీఈఓ రాధాకిషన్ -
నీటిని తోడేస్తే కఠిన చర్యలు
నీటిపారుదల శాఖ ఏఈ హరీష్కొల్చారం(నర్సాపూర్): వేసవికాలం కావడం, చెరువుల్లో నీటి నిల్వలు తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అక్రమంగా నీటిని తోడేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ ఏఈ హరీష్ హెచ్చరించారు. మండలంలోని సంగాయిపేట పెద్ద చెరువులోని నీటిని కొందరు ముందస్తు అనుమతులు లేకుండా మోటార్ల ద్వారా నీటిని తోడేస్తున్నారని రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన మత్స్యకారులు నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం చెరువును సందర్శించిన ఏఈలు హరీష్, మాధురి చెరువులో ఏర్పాటు చేసిన మోటార్లను వెంటనే తొలగించాలని సంబంధిత వ్యక్తులను ఆదేశించారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువులో పూర్తిస్థాయిలో నీటిమట్టం ఉన్నప్పుడు మాత్రమే అవసరం మేరకు అనుమతులు తీసుకొని నీటిని వాడుకునేందుకు అనుమతులు మాత్రమే ఉన్నాయన్నారు. అంతకుముందు గ్రామానికి చెందిన మత్స్యకారులు మాట్లాడుతూ.. మండుతున్న ఎండలతో చెరువులో నీటి నిల్వ రోజురోజుకు తగ్గిపోతున్నాయని, ఇప్పుడు మోటార్ల ద్వారా నీటిని తోడేస్తే నీటిమట్టం తగ్గిపోయి చెరువు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేప పిల్లలు చనిపోయి తాము ఆర్థికంగా దెబ్బ తినే పరిస్థితి వస్తుందని, మోటార్లను వెంటనే తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
మానవతా దృక్పథంతో పరిష్కరించాలి
దివ్యాంగుల సమస్యలపై కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ కలెక్టరేట్: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్.. స్వయంగా దివ్యాంగుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ప్రజావాణికి విశేష స్పందన లభిస్తుందన్నారు. దివ్యాంగుల నుంచి ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వర న్యాయం జరిగే దిశగా చర్యలు చేపడతామన్నారు. వివిధ సమస్యలపై 23 దరఖాస్తులు వచ్చాయని, వాటిని సత్వరంగా పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ పాల్గొన్నారు. చివరి ఆయకట్టుకు నీరు పాపన్నపేట(మెదక్): ఫతే నహర్ కెనాల్ కింద చివరి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం ఆయన పాపన్నపేట మండల పరిధిలోని శానాయపల్లి, పొడిచన్పల్లి గ్రామాల చివరి ఆయకట్టును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ..నీటి లభ్యత, కరెంట్ సరఫరా తీరును అడిగి తెలుసుకున్నారు. ఘనపురం ఆనకట్ట నుంచి ఇంకా ఎన్ని తడులు అవసరమవుతాయని, సన్న వరి ఎన్ని ఎకరాలు వేశారని అధికారులను అడిగారు. ఆయన వెంట ఏఇ విజయ్ ఉన్నారు. -
అలసత్వం.. సమన్వయ లోపం..
నరేందర్రెడ్డి ఓటమికి కారణాలివే.. ● ఉమ్మడి మెదక్లోనే అతి తక్కువ ఓట్లు ● ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై సుదీర్ఘ చర్చ ● ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశమైన జిల్లా మంత్రులుసాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నరేందర్రెడ్డి ఓటమికి గల కారణాలపై ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సుదీర్ఘంగా చర్చించారు. గెలిచే అవకాశాలున్న ఎమ్మెల్సీ సీటు చేజారి పోవడానికి దారితీసిన పరిస్థితులను సమీక్షించారు. ఈ ఓటమికి అభ్యర్థి నరేందర్రెడ్డి అలసత్వమే కారణమని పలువురు జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలు, కీలక నాయకులతో జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహలు మంగళవారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అభ్యర్థి నరేందర్రెడ్డి అలసత్వం కారణంగానే జిల్లాలో ఆశించిన ఓట్లు పడలేదని పలు నియోజకవర్గాల నేతలు ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే అభ్యర్థి ఎంపిక కూడా మరోకారణమని, హరికృష్ణకు టికెట్ ఇస్తే ప్రయోజనం ఉండేదని, మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని నిలపకపోవడం కూడా కారణమని పలువురు నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి చివరలో హాజరైన పీసీసీ చీఫ్ బి.మహేష్కుమార్గౌడ్తో కూడా ఈ అంశంపై జిల్లా నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది. పాత బిల్లులు క్లియర్ చేయండి త్వరలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్డీఎఫ్)లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. అయితే గతంలో మంజూరైన అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు రాక పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయని, ఒకరిద్దరు నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలల అంశాన్ని కూడా సమావేశంలో చర్చించారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఎందుకంత వ్యతిరేకత వస్తోందనే అంశం కూడా ఈ సమావేశంలో చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాకు రూ.10 కోట్ల ఎస్డీఎఫ్ నిధులుమంత్రి కొండా సురేఖ హామీ మెదక్జోన్: జిల్లాకు త్వరలో రూ.10 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేస్తానని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ అన్నారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి పలుఅంశాలపై ఎమ్మెల్యే రోహిత్రావు, నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్తో పాటు పలువురు నేతలు మంగళవారం హైదరాబాద్లో మంత్రి కొండా సురేఖ, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర నర్సింహను కలిశారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ.. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక బిల్లులను పెండింగ్లో పెట్టిందని, వాటిని కూడా క్రమంగా నిధులను విడుదల చేస్తామన్నారు. గూడెం మహిపాల్రెడ్డి గైర్హాజరు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఈ సమావేశానికి గైర్హాజరు కాగా., ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, పార్టీ నేతలు ఆవుల రాజిరెడ్డి, పూజల హరికృష్ణ, తూంకుంట నర్సారెడ్డి, నీలం మధు, కాటాశ్రీనివాస్గౌడ్, ఏ.చంద్రశేఖర్, ఎన్.గిరిధర్రెడ్డి, మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు హాజరయ్యారు. -
ఎంపీ రఘునందన్ రావుకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. నాగార్జున సాగర్ లో రఘునందన్ రావుపై నమోదైన కేసును హైకోర్టు కొట్టి వేసింది. 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావుపై ఎప్ఐఆర్ నమోదైంది. మోడల్ కోడ్ అమల్లో ఉండగా అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని ఫిర్యాదు చేశారు ఎంపీడీవో దుబ్బ సత్యం. రఘునందన్ రావు ఉట్లపల్లి, పులిచెర్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదు చేశారు ఎంపీడీవో దుబ్బ సత్యం. ఆ కేసును హైకోర్టు కొట్టివేసింది. -
పకడ్బందీగా ‘పది’ పరీక్షలు
డీఈఓ రాధాకిషన్అల్లాదుర్గం(మెదక్)/పెద్దశంకరంపేట/చేగుంట(తూప్రాన్): జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాటు చేసినట్లు డీఈఓ రాధాకిషన్ తెలిపారు. సోమవారం అల్లాదుర్గం జెడ్పీ, ప్రాథమిక పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించనున్నట్లు వివరించారు. ఆయన వెంట ఎంఈఓ ధనుంజయ్య ఉన్నారు. అనంతరం పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని బాలుర ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు సులభ రీతిలో బోధన చేయడంతో పాటు వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. ఈసందర్భంగా ఎఫ్ఎల్ఎన్ ద్వారా ఏ విధంగా బోధన చేపడుతున్నారో పరిశీలించారు. విద్యార్థులకు స్వయంగా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మక్కరాజీపేటలో పనిచేసిన సీఆర్పీల కుటుంబాలకు ఆర్థికసాయం పత్రాలను అందజేశారు. -
చివరి ఆయకట్టుకూ నీరందించాలి
మెదక్ కలెక్టరేట్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సోమవారం సచివా లయం నుంచి సాగు నీటి నిర్వహణ, సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టర్ రాహుల్రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ యాదయ్య, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. నీటి పారుదల, వ్యవసాయ, విద్యుత్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సాగు నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ ఇరిగేషన్, వ్యవసాయ అధికారులతో సమావేశమై తగు సూచనలు సలహాలు చేశారు. ఇరిగేషన్ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు కచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని నీటి వృథా లేకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నీటి పొదుపు విధానంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సమన్వయంతో పనిచేస్తూ నీటి కొరత రాకుండా చూడాలని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఏఓ వినయ్, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ
మెదక్ కలెక్టరేట్: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగ అభివృద్ధికి 30 శాతం నిధులు కేటాయించి, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం సమస్యలతో సతమతమవుతుందన్నారు. ప్రధానంగా సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఏడాదిగా హాస్టల్, మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నాయన్నారు. కార్యక్రమంలో నాయ కులు ని ఖిల్, విష్ణు సాంసన్, బాలరాజు పాల్గొన్నారు. కరస్పాండెంట్కు షోకాజ్ నోటీస్ వెల్దుర్తి(తూప్రాన్): మాసాయిపేట మండలం రా మంతాపూర్ గ్రామ శివారులో అనుమతులు రాకు ండానే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టిన తీరుపై సోమవారం సాక్షిలో ప్రచురితమైన ‘ప్రైవేట్ ఇష్టారాజ్యం’ కథనానికి అధికారులు స్పందించారు. యూకేజీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లకు సంబంధించి విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్, పాఠశాలకు సంబంధించిన కరపత్రాల పంపిణీపై మూడు రోజుల్లో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఎంఈఓ లీలావతి సోమవారం జాన్స్ అకాడమీ కరస్పాండెంట్కు షోకాజ్ నోటీస్ అందజేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఏదైనా ప్రవేశ పరీక్షను నిర్వహించే ముందు సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన సొసైటీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. పాఠశాలకు సంబంధించి పూర్తి అనుమతులు వచ్చిన తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. -
విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం
మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావుపాపన్నపేట(మెదక్)/చిన్నశంకరంపేట: రామాయంపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే రోహిత్రావు తెలిపారు. సోమవారం మండలంలోని ముద్దాపూర్లో ముత్యాల పోచమ్మ ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్య, వైద్యరంగా లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. పాపన్నపేట మండలంలో అంతర్జాతీయ స్థాయిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ముద్దాపూర్ శివారులో రెండు బ్రిడ్జిలు, ఆలయం వరకు సీసీ రోడ్డు, బోరు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట చిన్నశంకరంపేట నాయకులు ఆవుల గోపాల్రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రమేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ నాయక్, నాయకులు ప్రశాంత్రెడ్డి, ఆకుల శ్రీనివాస్, గౌస్, ఏడుపాయల మాజీ చైర్మన్ నర్సింలు తదితరులు ఉన్నారు. అనంతరం చిన్నశంకరంపేట మండలంలోని భగీరథపల్లిలో జరిగిన బీరప్ప ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించి మాట్లాడారు. పదేళ్లలో జరగని అభివృద్ధిని చేసి చూపిస్తున్నామని అన్నారు. గతంలో సొంత జిల్లాలోని ఏడుపాయలను దర్శించుకునే సమయం కూడా అప్పటి సీఎంకు లేకపోయిందని, నేడు సీఎం రేవంత్రెడ్డి దుర్గామాతను దర్శించుకొని అభివృద్ధికి నిధులు మంజూరు చేశారన్నారు. -
ఇంటిగ్రేటెడ్ స్కూల్కు నిధులు
● నిర్మాణానికి రూ. 200 కోట్లు మంజూరు ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● ఇప్పటికే 25 ఎకరాలు కేటాయింపురామాయంపేట(మెదక్): ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 200 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఉత్వర్తులు అందాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ పాఠశాల భవన సముదాయం నిర్మాణానికి రామాయంపేట పట్టణ శివారులో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న 25 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొదటి విడతలో 14 నియోజకవర్గాకు ఈ స్కూళ్లు మంజూరయ్యాయి. ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు సామాజిక అంతరాలు లేని అన్నివర్గాలకు చెందిన 2,500 పైగా విద్యార్థులకు ఇందులో అవకాశం కల్పించనున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు.. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్కూల్ భవన నిర్మాణం జరపనున్నారు. ఈ స్కూల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఉచిత బోధనతో పాటు వసతి కల్పించనున్నారు. హాస్టళ్లు, కంప్యూటర్ల గదులు, ఆడిటోరియం, అవుట్ డోర్, ఇండోర్ జిమ్, క్రీడా మైదానాలు, టెన్నీస్ కోర్టు, వంటశాల, గ్రంథాలయాలు, క్రీడలకు సంబంధించి వేర్వేరుగా భవనాలు నిర్మించనున్నట్లు సమాచారం. క్రీడలతో పాటు కళలకు ఈ స్కూల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మూడు నెలల క్రితం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్రెడ్డి స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
రవాణా శాఖలో అవినీతిని అరికట్టాలి
మెదక్ కలెక్టరేట్: జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏజెంట్ వ్యవస్థను రద్దు చేసి అవినీతిని అరికట్టాలని ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్రాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ రవాణా శాఖలో అనధికార వ్యక్తులు అన్నింటా పెత్తనం చెలాయిస్తూ చెలరేగిపోతున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. వాహనదారులు, అధికారులకు మధ్య ఏజెంట్లు మధ్యవర్తిత్వం చేస్తూ డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అన్నీ తెలిసిన ఆర్టీఏ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సంజీవులు, సంపత్కుమార్, శ్రీనివాస్, ప్రభాకర్, సంజీవులు, కృష్ణ, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
పైరవీలకు తావులేదు
మెదక్ మున్సిపాలిటీ: ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా వచ్చి సంప్రదించాలని.. పైరవీలకు తావులేకుండా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. తక్షణ పరిష్కారం కోసం సంబంధిత ఎస్ఐ, సీఐలకు ఫోన్ ద్వారా సూచనలు చేశారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్శాఖ పని చేస్తుందని తెలిపారు. ఎల్ఆర్ఎస్ను వేగవంతం చేయండి మెదక్జోన్: ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 31లోగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు ఫీజు చెల్లించిన వారికి ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీ వర్తిస్తుందనే విషయాన్ని లబ్ధిదారులకు తెలియజేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. దుర్గమ్మ సేవలో ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వన దుర్గమ్మను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి దర్శి ంచుకొని ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం గాజులమ్మగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు రంగు రంగుల గాజులతో అలంకరించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్రెడ్డి, నాయకులు కృష్ణ, సామ్యానాయక్, వెంకట్రాంరెడ్డి, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 111 మంది గైర్హాజరు మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సోమవా రం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 5,640 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా.. 5,529 హాజరయ్యారు. మరో 111 మంది వివిధ కారణాలతో పరీక్షకు హాజరు కాలేదని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి మాధవి తెలిపారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్, సమస్యలు ఉత్పన్నం కాలేదని చెప్పారు. ‘స్థానిక’ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించండి మెదక్ కలెక్టరేట్: దివ్యాంగులకు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అధ్యక్షురాలు యశోద ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం మెదక్లో సంతకాల సేకరణ చేపట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో 43 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారని తెలిపారు. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్గడ్ లాంటి రాష్ట్రాలు చట్టాలు చేసి అమలు చేస్తున్నట్లు చెప్పారు. తాము అధికారంలోకి వస్తే చట్టంలో సవరణలు చేసి దివ్యాంగులకు రెండు పోస్టులు నామినేట్ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. దీని ద్వారా దివ్యాంగులకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు కవిత, స్వరూప తదితరులు పాల్గొన్నారు. -
‘పూలే’ అణగారిన వర్గాల ఆశాజ్యోతి
మెదక్ కలెక్టరేట్: అణగారిన వర్గాల అభివృద్ధి కోసం సావిత్రిబాయి పూలే కృషి చేశారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అజ్జమరి మల్లేశం అన్నారు. సోమవారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో సావిత్రిబాయి పూలే వర్ధంతిని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమ్న జాతులు, అణగారిన వర్గాల కోసం భర్త జ్యోతిరావు పూలేతో కలిసి పాఠశాలను ప్రారంభించినట్లు తెలిపారు. మహిళ విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. మహిళలకు చాలా పరిశ్రమల్లో నేటికీ సమాన పనికి– సమాన వేతనం అందడం లేదన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల్లో అయినా వారికి 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అజయ్, నా యకులు సత్యం, శ్యాంసన్, రాణి పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి
మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాన్ని అలవర్చుకోవాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధునూదనాచారి అన్నారు. ఆదివారం చిన్నకోడూరులో జరుగుతున్న వీరభద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికతతో వ్యవహరిస్తే అన్నింటా సత్ఫలితాలు ఉంటాయన్నారు. కాకతీయుల నాటి శివాలయాలు వరంగల్ జిల్లాలో చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, నాయకులు తదితరులు ఉన్నారు. -
విలీన గ్రామం.. ప్రగతికి దూరం
రామాయంపేట(మెదక్): రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని శివారు గ్రామాల్లో కనీస వసతులు కరువై ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 2018లో ఆవిర్భవించిన మున్సిపాలిటీలో గుల్పర్తి, కోమటిపల్లి గ్రామాలతో పాటు రెండు తండాలను విలీనం చేశారు. మున్సిపాలిటీలో విలీనం అనంతరం నిబంధనల మేరకు పన్నులు పెరిగాయి. అయినా ఈ ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదని రెండు గ్రామాల ప్రజలు వాపోయారు. రెండు గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువలు పాక్షికంగా ధ్వంసం కాగా, వాటి మరమ్మతు విషయమై ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. ఈవిషయమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎంతమాత్రం పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్రామాల ప్రజలు, తండాల గిరిజనులకు ఉపాధి పనులు అత్యవసరం కాగా, మున్సిపాలిటీలో విలీనం అనంతరం ఈ పథకానికి నోచుకోకుండా పోయారు. గతంలో ప్రతి ఇంటి నుంచి ఇద్దరు, ముగ్గురు చొప్పున ఉపాధి పనులకు వెళ్లేవారు. ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ దేవేందర్ను వివరణ కోరగా.. మున్సిపాలిటీలో విలీనమైన గుల్పర్తి, కోమటిపల్లి, రెండు తండాల అబివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇప్పటికే కొన్ని అభివృద్ధి చేపట్టామని, నిధుల మంజూరును బట్టి మరిన్ని పనులు చేస్తామని పేర్కొన్నారు. -
‘ప్రైవేట్’ ఇష్టారాజ్యం!
● పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బడులు ● విద్యా హక్కు చట్టానికి తూట్లు ● ఉదాసీన వైఖరిలో విద్యాశాఖాధికారులు మెదక్జోన్: ‘మాసాయిపేట మండలం రామంతాపూర్ గ్రామ శివారులో ఇటీవల నూ తనంగా ఓ ప్రైవేట్ పాఠశాలను నిర్మించారు. అందులో సీబీఎస్ఈ విధానంలో బోధన ఉంటుందని.. యూకేజీ నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం కొనసాగుతుందని కరపత్రాల ద్వారా ప్రచారం చేపడుతున్నారు. సదరు పాఠశాల నిర్వాహకులు వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచే విద్యార్థులకు ప్రవేశ టెస్టులు నిర్వహించి ఫీజుల వసూళ్లు చేపడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఆ పాఠశాలకు అనుమతులు రాకపోవటం గమనార్హం’. నిబంధనలకు తూట్లు జిల్లాలో 220 ప్రైవేట్ పాఠశాలలు కొనసాగుతుండగా, వాటిలో 45 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే వాటిలో 90 శాతానికి పైగా పాఠశాలల యాజమాన్యా లు విద్యాహక్కు చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలకు అనుమతి కావాలంటే విద్యార్థులకు పక్కా భవన సముదాయం, క్రీడా ప్రాంగణం, ఫిట్నెస్ ఉన్న బస్సులు, ఫైర్సేఫ్టీ అనుమతి పొంది ఉండాలి. కానీ నిబంధనలు, ప్రమాణాలకు విరుద్ధంగా అధికారులు అమ్యామ్యాలకు అలవాటు పడి ప్రైవేట్ పాఠశాలలు, వాహనాలకు అనుమతులు ఇస్తున్నారని బాహాంటంగానే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే అదనుగా యా జమాన్యాలు పాఠశాల భవన నిర్మాణం నుంచి మొదలుకుని ఫీజుల వసూళ్ల వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కనీస విద్యార్హత లేని వారితో చదువులు చెప్పిస్తున్నట్లు సమాచారం. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు 25 శాతం పేద విద్యార్థులకు ఉచితంగా బోధన అందించాలి. కానీ అలాంటివి జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. నూతన పాఠశాలలు మాత్రం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నా యి. అయితే ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులకు అధికార పార్టీ నేతల అండ ఉందని, దీంతో చేసేది లేక చూసీచూడనట్లు వ్యవహరించాల్సి వస్తోందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. చర్యలు తీసుకుంటాం మాసాయిపేట మండలం రామంతాపూర్లో నూతనంగా నిర్మించిన పాఠశాలలో యూకేజీ నుంచి పదో తరగతి వరకు అనుమతులు అడిగారు. అనుమతుల కోసం రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ)కి పంపించాం. ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు ఆ పాఠశాలకు రాలేదు. అలాగే నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం. – రాధాకిషన్, డీఈఓ -
మెనూ పక్కాగా అమలు చేయాలి
కలెక్టర్ రాహుల్రాజ్ హవేళిఘణాపూర్(మెదక్): విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యనందించి, మెనూ ప్రకారం భోజనం పెట్టాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన హవేళిఘణాపూర్ ఎంజేపీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేశారు. డైనింగ్ హాల్లో భోజనం చేస్తున్న విద్యార్థులను ఆహారం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. కూరగాయలు, వంట సరకులను నిల్వ చేసే గదిని పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రయోగశాలలు, తరగతి గదులను తనిఖీ చేశారు. నిత్యం పరిశుభ్రతా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఎక్కడ నుంచి వచ్చారు..? ఎలా చదువుతున్నారు? ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం సమయానికి అందిస్తున్నారా? వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. లక్ష్యాలను ఎంచుకొని బాగా చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కలెక్టర్ వెంట ఏటీసీ సునీత, సిబ్బంది ఉన్నారు. -
సుందరంగా తీర్చిదిద్దుతాం
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్నస్వామి క్షేత్రాన్ని అన్ని విధాల సుందరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. ఆదివారం కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మల్లికార్జున స్వామి మా కుటుంబానికి ఇలవేల్పు అని, ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ కట్టుబడి ఉందని, భక్తులకు కావల్సిన సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్,ఽ దర్మకర్తలు లింగంపల్లి శ్రీనివాస్, జయప్రకాశ్ రెడ్డి, తురాయి నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలు కావాలనే బద్నాం చేస్తున్నాయి..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కావాలనే బద్నాం చేస్తున్నాయని మంత్రి పొన్నం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి ఆరోగ్యశ్రీని రూ.5 లక్షలనుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా నిధుల విడుదల చేశామని అన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లను సైతం ఇస్తామని, మహిళను కోటీశ్వరులను చేసేందుకు ప్రభత్వం అనేక పథకాలను తీసుకురానుందని తెలిపారు. వేసవిలో గ్రామాలలో తాగునీటి సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కొమురవెల్లి క్షేత్రంలో వసతులు కల్పిస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ స్వామి సన్నిధిలో కుటుంబసమేతంగా పూజలు -
తక్షణమే రిజర్వేషన్లు అమలు చేయండి
మెదక్ కలెక్టరేట్: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ కడారి నర్సమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జిల్లా సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పని ప్రదేశాల్లో రక్షణ కల్పించాలని కోరారు. ప్రభుత్వాలు మారిన మహిళల బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ప్రోత్సహించి మరింత ముందుకు నడిపించాలన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లలపై లైంగిక దాడులు, హింస పెరిగిపోయిందన్నారు. మహిళా కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు యశోద, కవిత, స్వరూప, కవిత, రేణుక, రాణి, వరలక్ష్మి, వీరమణి, రమాదేవి, మంజుల, లక్ష్మీసుజాత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మూల్యాంకన పారితోషికం ఏది: పీఆర్టీయూ మెదక్ కలెక్టరేట్: గతేడాది పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనం బిల్లులు వెంటనే చెల్లించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుంకరి కృష్ణ, స్వామ్యనాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. గత సంవత్సరం 10వ తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనం చేసిన ఉపాధ్యా యులకు ఇంతవరకు పారితోషికం చెల్లించకపోవడం శోచనీయమన్నారు. ఈసంవత్సరం మళ్లీ 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని, అయినా ఇప్పటివరకు చెల్లించకపో వడం ఏమిటని ప్రశ్నించాడు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే గత సంవత్సరం మూల్యాంకనం పారితోషికాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యం నారాయణఖేడ్: తమ ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. సిర్గాపూర్ మండలం సంగం గ్రామానికి చెందిన శ్రీనివాస్రావుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.(60 వేలు మంజూరుకాగా అందుకు సంబంధించిన చెక్కును ఆదివారం ఆయన ఖేడ్లోని తననివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...వైద్యరంగానికి ప్రాధాన్యతలో భాగంగా ఆరోగ్యశ్రీ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచిందన్నారు. కాగా, మనూరు మండలం దన్వార్ గ్రామంలో నిర్వహించిన బీరప్ప జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యా యి. జాతర ఉత్సవాల్లో పాల్గొన్న సంజీవరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భోజిరెడ్డి, మాజీ సర్పంచ్ దిగంబర్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, వెంకట్రెడ్డి పాల్గొన్నారు. సీఐటీయూతోనే కార్మికులకు న్యాయం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు పటాన్చెరు టౌన్: కార్మికుల కష్ట సుఖాల్లో ఎరజ్రెండా అండగా ఉంటుందని, సీఐటీయూ అంటేనే కార్మికులకు ఒక భరోసా అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, కిర్బీ యూనియన్ అధ్యక్షుడు చుక్కా రాములు పేర్కొన్నారు. పటాన్చెరు పట్టణంలోని శ్రామిక భవన్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాలకు చెందిన కార్మికులు సీఐటీయూలో చుక్కా రాములు సమక్షంలో పెద్ద ఎత్తున చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కార్మికులకు అండగా సీఐటీయూ ఉంటుందన్నారు. కిర్బీ పరిశ్రమలో కూడా కార్మికులకు అనేక చట్టపరమైన సౌకర్యాలు సీఐటీయూ సాధించిందని, భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు సాధిస్తామని భరోసానిచ్చారు. కార్మికులందరూ ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజయ్య, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రాజుల కోటలో రత్నాల వేట
గుప్త నిధుల తవ్వకాలతో.. ● ఆనవాళ్లు కోల్పోతున్న రంగంపేట కోట ● పట్టించుకోని ప్రభుత్వాలు ● పరిరక్షించాలంటున్న ప్రజలు కొల్చారం(నర్సాపూర్): రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి.. కానీ ఆనాటి చరిత్రను తెలిపే కోటలు మాత్రం ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తూనే ఉన్నాయి. అందులో వందల ఏళ్ల నాటి చారిత్రక నేపథ్యం కలిగిన రంగంపేట కోట ఒకటి. హైదరాబాద్ రాజ్యంలో ఉన్న 14 సంస్థానాల్లో ఒకటైన పాపన్నపేట సంస్థానం కింద నిజాం నవాబులచే రాయ్భాగన్ (ఆడ సింహం)గా బిరుదు పొందిన రాణి శంకరమ్మ దత్తపుత్రుడైన రాజా సదాశివరెడ్డి 1,700 సంవత్సర మధ్యకాలంలో ఈ కోటను నిర్మించారు. నిజాం పరిపాలనలో ఈ కోట ఆర్థిక భాండాగారంగా కొనసాగిందని చరిత్ర చెబుతుంది. అయితే ప్రస్తుతం ఆ కోట గుప్తనిధుల వేటగాళ్ల ధ్వంస రచనతో బీటలు వారింది. శిథిలావస్థకు చేరి అధ్వానంగా మారింది. ఎంతో చరిత్ర కలిగిన రంగంపేట కోట గురించి భావితరాలు తెలుసుకునేలా పురావస్తు శాఖ రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అప్పుడే నిర్మాణానికి నాంది పాపన్నపేట సంస్థానం, ఆందోల్ సంస్థానాల మధ్య రాణి శంకరమ్మ పరిపాలన సాగిస్తూ తిరుగులేని రాణిగా కొనసాగింది. వృద్ధాప్యం వచ్చే క్రమంలో రాజ్యాన్ని కాపాడాలన్న లక్ష్యంతో బాలుడైన రాజా సదాశివరెడ్డిని దత్తత తీసుకొని రాజుగా ప్రకటించింది. ఆయన ఆందోల్ నుంచి రంగంపేట మీదుగా ఎడ్ల బండిలో పాపన్నపేటకు మంది మార్బలంతో ప్రయాణం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం కోట నిర్మించిన రంగంపేట శివారులోకి రాగానే వేట కుక్కలను తరుముతున్న కుందేలు కనిపించింది. ఈ విషయమై రాజ పురోహితులతో చర్చించారని, ఇక్కడి స్థల ప్రాముఖ్యతను గుర్తించి కోట నిర్మాణానికి నాంది పలికారన్నది చరిత్ర చెబుతోంది. దాదాపు పదెకరాల విస్తీర్ణంలో శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించారు. చుట్టూ నాలుగు బురుజులు.. రెండు ప్రధా న ద్వారాలతో నిర్మాణమైన కోటలో రాణిమహల్, తాగునీటి అవసరాలకు మెట్లబావి, గుర్రపు శాల, అంతర్గత డ్రైనేజీ నిర్మాణం, అద్దాలమేడ, గోడలపై నకశిల్పాలు ఇలా.. ఎన్నెన్నో కోటలో కనిపిస్తాయి. కోట బురుజుపై నుంచి చూస్తే మెదక్ ఖిల్లా కనిపించడం విశేషం. కోటలో నుంచి పాపన్నపేట కోట వరకు రహస్య గుహ ఉందని, దానికి నిదర్శనంగా లోపల నిర్మాణం కనిపించడం మరో విశేషం. అద్భుతమైన శైలిలో అనంతపద్మనాభుని మాదిరిగా దర్శనమిచ్చే రంగనాయక స్వామి విగ్రహంతో దర్శనమిచ్చే దేవాలయం, లింగ దారుడైన సంగమేశ్వర స్వామి దేవాలయం సైతం అప్పుడే నిర్మించబడ్డాయి. అయితే కోటను కొంతైనా రక్షించాలన్న లక్ష్యంతో అధికారులు కోట చుట్టూ ఫెన్సింగ్, పల్లె ప్రకృతి వనం నిర్మించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. -
ప‘రేషన్’..!
ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025నిండుకున్న బియ్యం నిల్వలు ● తెరుచుకోని రేషన్ దుకాణాలు ● జిల్లాలో 2,13,777 కార్డుదారులు ● 6,85,178 మంది లబ్ధిదారులు ● కావాల్సిన బియ్యం 35 వేల క్వింటాళ్లుఇంకెప్పుడిస్తారు? గతంలో ప్రతి నెల 1వ తేదీన బియ్యం వచ్చేవి. రెండు నెలలుగా సకాలంలో ఇస్తలేరు. ఇప్పటికే వారం గడిచిపోయింది. డీలర్ను అడిగితే గోదాం నుంచి బియ్యం రాలేవని చెబుతున్నాడు. ఇంట్లో బియ్యం లేవు. బయట కొందామంటే ధరలు మండిపోతున్నాయి. బతికేదెట్లా? – వెంకయ్య, వై. మాందాపూర్, కొల్చారంరెండు, మూడు రోజుల్లో సరఫరా బియ్యం సరఫరాకు ఆర్డర్ కాపీ వచ్చింది. రెండు, మూడు రోజుల్లో రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తాం. ఉగాది నుంచి సన్న బియ్యం ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సన్నబియ్యం వచ్చాక దొడ్డు బియ్యం వృథా అవుతాయని గోదాముల్లో స్టాక్ ఉంచడం లేదు. దీంతో బియ్యం సరఫరా ఆలస్యమవుతోంది. – జగదీష్, జిల్లా సివిల్ సప్లై మేనేజర్మెదక్ కలెక్టరేట్: ప్రతీ నెల 1వ తేదీ నుంచి రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు బియ్యం అందించాల్సి ఉంటుంది. అయితే 8 రోజులు గడుస్తున్నా ఇంకా పంపిణీ చేయడం లేదు. పేదలు రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతుండగా, డీలర్లు గోదాముల వద్ద పడిగాపులు గాస్తున్నారు. అయితే బియ్యం నిల్వలు లేకపోవడంతో అధికారులు గోదాములు తెరవడం లేదని సమాచారం. ప్రతి నెల 20వ తేదీ నుంచి 30 వరకు మండల స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా జరుగుతుంది. వచ్చిన బియ్యాన్ని డీలర్లు ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తారు. కాని మూడు నెలలుగా బియ్యం సరఫరాల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 522 రేషన్ షాపులు జిల్లాలోని మెదక్, రామాయంపేట, పాపన్నపేట, చేగుంట, తూప్రాన్, నర్సాపూర్, పెద్దశంకరంపేటలో మండలస్థాయి స్టాక్ పాయింట్లు ఉన్నాయి. వీటి నుంచి జిల్లాలోని 21 మండలాల్లో గల రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా జరుగుతుంది. ప్రస్తుతం వీటిలో ఏ ఒక్కదానిలో బియ్యం నిల్వలు లేనట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 522 రేషన్ దుకాణాలు ఉండగా, 2,13,777 కార్డులు (కొత్తవి కాకుండా), 6,85,178 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతినెల 35 వేల క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయాల్సి ఉంటుంది. పట్టణ దుకాణాలకు సరఫరా పట్టణ ప్రజలు ఆందోళనలకు దిగుతారనే ఉద్దేశంతో ఉన్న కొద్దిపాటి నిల్వలు పట్టణంలోని 120 దుకాణాలకు సరఫరా చేసినట్లు సమాచారం. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ దుకాణాలకు సరఫరా చేసేందుకు గోదాముల్లో బియ్యం నిల్వలు కరువయ్యాయి. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే గాని గోదాములకు, అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా జరుగుతుంది. అయితే ఇప్పటికే వారం గడిచిపోయింది. అసలు బియ్యం సరఫరా చేస్తారా? లేదా అని ఇప్పటికే గ్రామాల్లో ఆందోళన మొదలైంది.న్యూస్రీల్ -
మెరుగైన వైద్యం అందించండి
కలెక్టర్ రాహుల్రాజ్ కొల్చారం(నర్సాపూర్): నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శనివారం మండలంలోని రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలు, వివరాలపై ఆరా తీశారు. ఆస్పత్రి సిబ్బంది హాజరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రం పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. రోగులకు అవసరమైన రక్త నమూనా పరీక్షలు సకాలంలో నిర్వహించి అవసరమైన మందులు అందించాలన్నారు. యాంటీబయోటిక్ మందులు, పాము కాటుకు సంబంధించిన వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి వైద్యాధికారి శివకుమార్, సిబ్బంది ఉన్నారు. -
సమాజ సేవకు సమయం కేటాయించండి
జహీరాబాద్ టౌన్: ఉన్నతస్థాయిలో ఉన్నా సొంత ఊరిని మర్చిపోకుండా కొంత సమయం సమాజ సేవకు కేటాయించాలని టీబేస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసీరామ్ రాథోడ్ అన్నారు. జహీరాబాద్ డివిజన్ పరిధిలోని మల్చల్మ, విట్టు నాయక్ తండాలకు చెందిన తుకారాం రాథోడ్, శంకర్ చవాన్లు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించగా.. పట్టణంలోని బంజారా భవన్లో శనివారం వారిని సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని కొనియాడారు. కష్టపడి చదివించిన తల్లిదండ్రులను, సొంత ఊరిని మర్చిపోవద్దని సూచించారు. సమస్యల పరిష్కారానికి కృషి పటాన్చెరు: సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నానని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. శనివారం అమీన్పూర్ పీపుల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపీని కలిసి అమీన్పూర్లో నెలకొన్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పట్టణంలో అంతర్గత రోడ్లు, పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉందని వివరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ... అమీన్పూర్ పరిధిలోని సమస్యలపై తాను ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్డు నిర్మాణం పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో పీపుల్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తిరుమలరెడ్డి, కొండ లక్ష్మణ్, మహేశ్వర్రెడ్డి, ఉదయ్కుమార్, వెంకట పుల్లారెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
ఇది పట్టభద్రుల విజయం
నర్సాపూర్: తన విజయం పట్టభద్రులకు అంకితమని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. శనివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్ మున్సిపల్ మహిళా ఉద్యోగులకు చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పట్టభద్రుల సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. చీరల పంపిణీ అభినందనీయమని కొనియాడారు. అనంతరం మురళీయాదవ్తో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరిని సన్మానించారు. విద్యుత్ సమస్యలుతలెత్తకుండా చర్యలు అల్లాదుర్గం(మెదక్): వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి తెలిపారు. శనివారం మండలంలోని గడిపెద్దాపూర్ విద్యుత్ సబ్స్టేషన్లో 5 మెగావాట్ల ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించి మాట్లాడారు. రైతులకు, వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడమే తమ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో మెదక్ విద్యుత్ శాఖ ఎస్ఈ శంకర్, డీఈ చాంద్పాషా, ఏడీ మోహన్బాబు, పాపన్నపేట ఏడీ శ్రీనివాస్, రేగోడ్ ఏఈ యాసిన్అలీ, అల్లాదుర్గం ఇన్చార్జి ఏఈ నవాజ్ పాల్గొన్నారు. రూ. 35 లక్షలతో కొత్త విద్యుత్ లైన్ పాపన్నపేట(మెదక్): మండలంలోని విద్యుత్ సమస్యలు తీర్చేందుకు రూ. 35 లక్షలతో విద్యుత్ లైన్ వేస్తున్నట్లు చీఫ్ ఇంజినీర్ బాలస్వామి తెలిపారు. పొడ్చన్పల్లి ఫీడర్లో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా ఉపకేంద్రంలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఈ సమస్య తీర్చడానికి రూ. 35 లక్షలతో కౌడిపల్లి నుంచి 33 కేవీ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు చె ప్పారు. ఆదివారం పాపన్నపేట మండలంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యేకు సన్మానం నర్సాపూర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే సునీతారెడ్డిని మాజీ మంత్రి హరీశ్రావు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం నర్సాపూర్లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో వారిద్దరు పాల్గొన్నారు. కార్మికులకు ‘ఎంఆర్ఎఫ్’ షాక్సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ‘2021 మార్చి 29న ఏడాది పాటు శిక్షణ కోసం మిమ్మల్ని తీసుకున్నాం. ఆ కాలంలో మీరు పని నేర్చుకోలేదు. పరిశ్రమలో నెలకొన్న ఆర్థిక మాద్యం నేపథ్యంలో మిమ్మల్ని తొలగిస్తున్నాం. దేశంలోని ఇతర ప్లాంట్లలో అవసరమున్న చోట పని చేయడానికి ఆసక్తి ఉంటే వారం రోజుల్లో అభిప్రాయం తెలపండి’ అని మండలంలోని అంకేనపల్లి శివారులో గల ఎంఆర్ఎఫ్ (ఏపీఎల్) ప్లాంట్లో పనిచేస్తున్న 350 మందికిపైగా కార్మికులకు యాజమాన్యం ఈనెల 7న నోటీసులు అందజేసింది. దీంతో వారి భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దిక్కుతోచని స్థితిలో కార్మికులు మనోవేదనకు గురవుతున్నారు. రిక్రూట్మెంట్ సమయంలో చేసుకున్న ఒప్పందం మేరకు పర్మనెంట్ చేయాలని కోరిన పాపానికి ఉద్యోగంలో నుంచి తీసేసి పరిశ్రమ యాజమాన్యం నియంతృత్వం ప్రదర్శిస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా కార్మికులు న్యాయ పోరాటానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. -
‘కేజీబీవీ’లో జీసీడీఓ విచారణ
కంగ్టి(నారాయణఖేడ్): మండల కేంద్రంలోని కేజీబీవీలో బాలికలను చితకబాదినట్లు తల్లిదండ్రులు చేసిన ఆందోళనతో శనివారం గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆధికారి సుప్రియ విచారణ చేపట్టారు. విద్యాలయంలో గణితం టీచర్ సురేఖ బాలికలను పనులు చేయాలని బెదిరిస్తూ చితకబాదుతుందని తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని తల్లిదండ్రులు శుక్రవారం ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మరికొందరు విద్యార్థినులను సైతం చితకబాదినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న జీసీడీఓ ఎంఈఓ రహీమోద్దీన్తో కలిసి విద్యాలయాన్ని సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా మాట్లాడారు. విచారణ నివేదికను డీఈఓతో పాటు కలెక్టర్కు అందజేయనున్నట్లు తెలిపారు. కో ఆర్డినేటర్ మాధవి, ఎస్ఓ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
మహిళ లేనిదే సమాజం లేదు
మెదక్జోన్: మహిళ లేనిదే సమాజం లేదని, ప్రస్తు త పోటీ ప్రపంచలో వంటింటి నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారని జిల్లా జడ్జి లక్ష్మీశారద అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మెదక్లో కలం స్నేహం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అతివ’ పాటల సీడీని ఆవిష్కరించి మాట్లాడారు. మహిళలు చదువులో రాణిస్తూ ఆర్థికంగా ఎదగాలని, అప్పడే మహిళా సాధికారత సాధ్య మవుతుందన్నారు. ప్రభుత్వం అన్ని పథకాలలో మహిళలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలం స్నేహం వ్యవస్థాపకుడు, సినీ సంగీత దర్శకులు శ్రీమాన్ గోపాల్ ఆచార్య, జాతీయ ప్రధాన కార్యదర్శి గీతాశ్రీ స్వర్గం,కన్వీనర్ రాధిక, సంయుక్త కార్యదర్శి సరళ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్నిరంగాల్లో రాణించాలి మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద అన్నారు. మహి ళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయస్థాయిలో రాణించిన క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసారి మరింతమంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. అంతకుముందు క్రీడాకారులతో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి దామోదర్రెడ్డి, సీ్త్ర శిశు సంక్షేమశాఖ అధికారిణి సంతోష తదితరులు పాల్గొన్నారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద -
1,500 కేసులు పరిష్కారం
షెడ్డులోని కుండలపై వివిధ రకాల పక్షులుఅతడికి పక్షులంటే ప్రాణం.. ఇష్టంతో రూ. వేలు ఖర్చు చేసి పక్షులను కొనుగోలు చేసి ప్రాణంగా పెంచుతున్నాడు. వృత్తివ్యవసాయం, ఉద్యోగం లైన్మెన్.. అయినా ఉదయం, సాయంత్రం పక్షులతోనే గడుపుతాడు. వాటి దాణా కోసం ప్రతి నెలా వేలు ఖర్చు చేస్తూ పక్షి ప్రేమికుడిగా మారాడు కౌడిపల్లి మండలం కంచన్పల్లి గ్రామానికి చెందిన మల్లాగౌడ్.– బొడ్డు పెంటయ్య, కౌడిపల్లి(నర్సాపూర్)మెదక్జోన్/నర్సాపూర్: జాతీయ లోక్ అదాలత్లో భాగంగా శనివారం జిల్లా కోర్టులో పలువురు కక్షిదారులు రాజీ అయ్యారు. జిల్లావ్యాప్తంగా పలుకోర్టుల్లో 1,500 కేసులు పరిష్కారం అయ్యాయి. అలాగే పలురకాల కేసులకు సంబంధించి బాధితులకు చెల్లించాల్సిన బీమా కంపెనీలతో పాటు ఇతర జరిమానాలు రూ. 46.32 లక్షలను కోర్టులో చెల్లించారు. ఈసందర్భంగా జిల్లా జడ్జి లక్ష్మీశారద మాట్లాడుతూ.. ఇరువురి మధ్య మనస్పర్ధలు వస్తే కూర్చొని పరిష్కరించుకోవటం మంచిదన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నర్సాపూర్ కోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి రుబీనా ఫాతిమా పాల్గొని మాట్లాడారు. కక్షిదారులు రాజీ పడడమే రాజమార్గమని అన్నారు. లోక్అదాలత్లో 137 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.8లో -
మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
మెదక్జోన్: మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నప్పటికీ మెదక్లో మాత్రం వెనుకబడి ఉన్నారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అంజలి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు, స్టాఫ్నర్స్లను ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సోషల్ సర్వీస్ చేయడంలోనూ ముందున్నారని తెలిపారు. త్వరలోనే జిల్లాలో మహిళా కాంగ్రెస్ కమిటీలు వేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మహిళా నేతలు భవాని, అరుణ, బట్టి సులోచన, గోదల జ్యోతి, హరిత, స్వరూప తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు
హవేళిఘణాపూర్(మెదక్): వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్శాఖ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి తెలిపారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని కూచన్పల్లి సబ్స్టేషన్లో 5 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్, నాగాపూర్ సబ్స్టేషన్ సుల్తాన్పూర్ ఫీడర్కు సంబంధించి 11 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఆయన ప్రారంభించారు. వేసవిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికలో భాగంగా నూతన ట్రాన్స్ఫార్మర్లు బిగించినట్లు తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్శాఖ ఎస్ఈ శంకర్, డీఈ చాంద్పాషా, ఏడీఈ మోహన్బాబు, ఏఈ వినోద్కుమార్ పాల్గొన్నారు. -
మహిళలకు ప్రత్యేక చట్టాలు
సంగారెడ్డి టౌన్ : సమాజంలో మహిళల పాత్ర గొప్పదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర పేర్కొన్నారు. శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు నేడు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారన్నారు. సమాజంలో లైంగిక దాడులు, హత్యాచారాలు, లైంగిక దోపిడీ, వరకట్నం వంటి సమస్యలు వెంటాడుతుంటాయని, వీటిని పరిష్కరించేందుకు మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. బాల్య వివాహల నిర్మూలపై అవగాహన కల్పిస్తున్నాం. మహిళలకు ఎటువంటి న్యాయం కావాలన్నా కోర్టులో ఉచితంగా న్యాయం పొందవచ్చన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీ చంద్ర -
చిన్న వయసులో.. ‘నిర్మల’మైన మనసు
● కష్టాలు ఓరుస్తూ.. కుటుంబ భారం మోస్తూ ● కూరగాయలు అమ్ముతున్న విద్యార్థిని నారాయణఖేడ్: ఆ కుటుంబానికి కష్టాలు చుట్టముట్టాయి.. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు.. ఇంటినిండా ఆడపిల్లలు.. పెద్దల నుంచి వచ్చిన అర ఎకరం పొలం.. తండాలో చిన్నపాటి ఇల్లు.. ఆ దంపతులు పడరాన్ని పాట్లు పడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ పిల్లలను పెంచి పెద్ద చేశారు. ముగ్గురు ఆడపిల్లలను పెళ్లిళ్లు చేసి పంపేసరికి రూ.12 లక్షల అప్పు. ఆ కుటుంబం మరింత కష్టాల్లోకి నెట్టి వేయబడింది. ఈ కష్టాలను చూసిన నాలుగో కూతురు ఓ రాణి రుద్రమలా ధైర్యాన్నిస్తూ తల్ల్లిదండ్రుల వెన్ను తట్టింది.. నారాయణఖేడ్ మండలం చందర్నాయక్ తండాకు చెందిన చందర్, చాందీబాయికి ఆరుగురు సంతానంలో ఐదుగురు కూతుళ్లే. లత, బూలి, బుజ్జి, నిర్మల, వైశాలి తర్వాత పవన్ పుట్టాడు. లత, బూలి, బుజ్జిబాయిల వివాహమైంది. రూ.12 లక్షల వరకు అప్పులు అయ్యాయి. అర ఎకరం పొలంలో కూరగాయలు పండిస్తూ ఖేడ్ పట్టణంలో విక్రయిస్తున్నారు. నాలుగో కూతురు నిర్మల సిద్దిపేటలో హాస్టల్లో ఉంటూ 10వ తరగతిలో 9.8 జీపీఓ ఉత్తీర్ణత సాధించింది. ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చినా తండ్రి అనారోగ్యానికి గురవ్వడం కుటుంబ భారం వల్ల వెళ్లలేదు. ఖేడ్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్లో అడ్మిషన్ అయ్యింది. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఓ కానిస్టేబుల్ కొనిచ్చిన నీట్ ప్రిపరేషన్కు సంబంధించిన పుస్తకాలను పఠనం చేస్తుంది. తమ అర ఎకరం పొలంలో నిత్యం పండిన కూరగాయలను విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. తెల్లవారు 3 గంటలకు వచ్చిన నిర్మల బీట్లో కూరగాయలు కొని దుకాణంలో సర్ది 8 గంటల వరకు వ్యాపారం.. అనంతరం తండాకు వెళ్లి 9 గంటలకు కళాశాలకు వెళ్తుంది. ఇలా కష్టపడుతున్న నిర్మల ఆ కుటుంబానికి ధైర్యం ఇస్తూ తన లక్ష్యం డాక్టర్ కావాలని.. మరో సోదరి, సోదరుణ్ణి జీవితంలో వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలని చెబుతుంది. చదువులో నిర్మల మంచి ప్రతిభ కనబరుస్తుందని ఉపాధ్యాయులూ చెబుతున్నారు. -
పేదల పాలిట పెళ్లి పెద్ద
నర్సాపూర్: పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తన వంతుగా సహాయం చేస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రఘువీరారెడ్డి. తన మిత్రుడు హకీం ఇచ్చిన సూచన మేరకు నియోజకవర్గంలో జరిగే ఆడపిల్లల పెళ్లిళ్లకు పుస్తె మెట్టెలు అందజేయాలని నిర్ణయించారు. సుమారు 12 ఏళ్ల క్రితం అమలులో పెట్టారు. అయితే వాటిని అందజేసే సమయంలో ప్రచారం కోసం ఆరాటపడటం లేదు. ఇప్పటివరకు సుమారు 2,500 మంది ఆడపిల్లలకు రఘువీరారెడ్డి పుస్తె మెట్టెలు అందజేశారు. శక్తి ఉన్నంత వరకు పేద కుటుంబాలకు అండగా నిలుస్తానని అన్నారు. గతంలో ఒక ఆడ కూతురుకు పుస్తె మెట్టెలు ఇవ్వడానికి రూ. 8 వేల వరకు ఖర్చు కాగా, ప్రస్తుతం రూ. పది వేలు అవుతున్నాయని చెప్పారు. కులమతాలకు అతీతంగా పేద వారికి సహాయం చేయడమే తన లక్ష్యమని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. -
ముళ్లబాట దాటి.. పూలదారి చేరి
మెదక్జోన్: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేటకు చెందిన నారాయణ మెదక్లో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తూ కుటుంబంతో పట్టణంలో స్థిరపడ్డారు. అంతాబాగానే ఉంది అని అను కుంటున్న సమయంలో అనూహ్య సంఘటనతో జీవితం తలకిందులైంది. 1998లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణ మృత్యువాతపడ్డారు. అప్పటికీ ఆయనకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అందులో పెద్దకూతురు గంగామణి 8వ తరగతి చదువుతుంది. ఆమె తల్లి మల్లమ్మకు అధికారులు స్వీపర్ ఉద్యోగం ఇచ్చారు. నిరక్షరాస్యురాలైన మల్ల మ్మ తన పెద్దకూతురు గంగామణికి పదో తరగతి పూర్తి కాగానే పెళ్లి చేసింది. ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం వివిధ కారణాలతో దంపతులు విడిపోయారు. దీంతో ఇద్దరు పిల్లలతోపాటు చెల్లెళ్ల భారం ఆమైపె పడింది. చిన్నప్పటినుంచి పోలీస్ కావాలనే కోరిక బలపడింది. ఈక్రమంలో 2007లో హోంగార్డుగా హైదరాబాద్లో ఉద్యోగం సంపాదించింది. తన చెల్లెళ్లు, పిల్లలను మెదక్లో తల్లి వద్ద ఉంచి హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తూనే డిస్టెన్స్లో ఇంటర్ పూర్తి చేసింది. 2013లో రెండో ప్రయత్నంలో కానిస్టేబుల్గా ఎంపికై ంది. తన ఇద్దరు చెల్లెళ్లను బీటెక్ చదివించింది. వారు 2019లో వారిద్దరూ పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికయ్యారు. అలాగే ఆమె ఇద్దరు పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దింది. కుమారుడు నవీన్చంద్ర ఎస్సైగా, కూతురు శ్రీజ 2023లో కానిస్టేబుల్గా ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం కొడుకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రొహిబిషనరీ ఎస్సైగా, కూతురు మెదక్ రూరల్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం గంగామణి చేగుంట పోలీస్స్టేషన్లో పనిచేస్తున్నారు. పురుషుల కన్నా తక్కువ అనే భావన మహిళల్లో ఉండొద్దని.. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళితే అనుకున్న లక్ష్యం సాధించటం కష్టమేమి కాదని గంగామణి అభిప్రాయపడ్డారు.చిన్నతనంలో తండ్రి మరణం, ఇద్దరు పిల్లలు పుట్టిన అనంతరం భర్త దూరం.. ఇద్దరు చెల్లెళ్లు.. వృద్ధురాలైన తల్లి.. ఒకానొక దశలో ఆమె కుంగుబాటుకు గురైంది. ఆ ముళ్లబాటనే తొక్కుకుంటూ మణిగా మెరిసింది. ఆమె కాంతులీనుతూ కుటుంబసభ్యులకు పూలబాటను పరిచింది. నారీలోకానికి స్ఫూర్తిమంత్రం వినిపించింది. మహిళా దినోత్సవం సందర్భంగా ‘గంగామణి’ విజయగాథపై ప్రత్యేక కథనం.. -
ఆకాశవాణి.. మహిళా కేంద్రం
డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంఘం రేడియో స్టేషన్లో కార్యక్రమాలన్నింటినీ మహిళలే నిర్వహిస్తున్నారు. అల్గోల్ నర్సమ్మ, జనరల్ నర్సమ్మ ప్రతి నిత్యం కార్యక్రమాలను రూపొందించుకొని ప్రసారంచేస్తున్నారు. జహీరాబాద్: గ్రామాలకు వెళ్లి సమాచారం సేకరణ ఝరాసంగం మండలంలోని మాచ్నూర్ గ్రామంలో 1998 సంవత్సరంలో సంఘం రేడియో స్టేషన్ను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్ నుంచి సుమారు 20 కిలోమీటర్ల మేర ప్రసారాలు అందుతున్నాయి. 90.4 ఫ్రీక్వెన్సీలో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు కార్యక్రమాలను అందిస్తున్నారు. మండలంలోని అల్గోల్ గ్రామానికి చెందిన అల్గోల్ నర్సమ్మ, పస్తాపూర్ గ్రామానికి చెందిన జనరల్ నర్సమ్మ 1999 నుంచి రేడియో స్టేషన్ నిర్వహిస్తున్నారు. గ్రామాలకు వెళ్లి ప్రసారాలకు కావాల్సిన సమాచారాన్ని ఆడియో రికార్డింగ్ చేసుకుంటారు. డీడీఎస్కు సంబంధించి పలు కార్యక్రమాలను చూస్తున్న ఏడుగురు మహిళలు రేడియో ప్రసారాలకు సంబంధించిన కార్యక్రమాలను గ్రామాలకు వెళ్లినప్పుడు ఆడియో రికార్డింగ్ చేసుకొని స్టేషన్ నిర్వాహకులకు అందిస్తున్నారు. వాటిని ఎడిట్ చేసుకొని ప్రసారం చేస్తారు. ముఖ్యమైన ప్రసారాలు మన ఊరి పంటలు, ఆరోగ్యం, సంఘాలు, చావిడికట్ట, భాష, మన రుచులు, పండుగలు, పాటలు, పర్యావరణం, బాలానందం, యారండ్ల ముచ్చట్లు తదితర కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తున్నారు. భాషకు సంబంధించి తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ భాషల్లో పెద్ద మనుషులతో వినిపిస్తారు. పొలంలో పనిచేసే సమయంలో, పెళ్లి సందర్భంలో, పుట్టినరోజు వేడుకలు, యువతులు పుష్పవతి అయిన సమయంలో పాడే పాటలను పరిచయం చేస్తారు. చిన్న పిల్లలకు సంబంధించి బాలానందం కార్యక్రమం నిర్వహించి పాటలు, కథలు వినిపిస్తారు. సీజన్ వ్యాధులు, చిన్న పిల్లల సంరక్షణ తదితర అంశాలపై ముచ్చటిస్తారు. వ్యవసాయ విషయానికి వస్తే పంట వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రతలు, ఏయే పంటలు వేయాలి, ఎరువులు, పశువుల పెంపకం, కోళ్ల పెంపకం గురించి సూచనలు చేస్తారు.వారే మిక్సింగ్, కంపోజింగ్.. అల్గోల్ నర్సమ్మ, జనరల్ నర్సమ్మ రేడియో స్టేషన్లో మిక్సింగ్, కంపోజింగ్, ట్రాన్స్మిషన్ నిర్వహణ, రికార్డు చేసిన కార్యక్రమాల ఎడిటింగ్ పనులను చూస్తారు. ప్రతీ నిత్యం కార్యక్రమాలను రూపొందించుకొని ప్రసారం చేసేంత వరకు వారే చూసుకుంటారు. ఇద్దరూ డీడీఎస్ డైరెక్టర్ దివంగత పీవీ సతీష్ వద్ద శిక్షణ పొందారు. అప్పటి నుంచి వారు ఈ కమ్యూనిటీ రేడియో స్టేషన్ను నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. మహిళల సంఘం రేడియో స్టేషన్ ప్రతీ నిత్యం రెండు గంటలపాటుకార్యక్రమాలు స్థానిక అంశాలే ప్రసారం -
మాదిగలకు రెండు మంత్రి పదవులివ్వాలి
మెదక్ మున్సిపాలిటీ: ఎస్సీ వర్గీకరణను మూడు గ్రూపులుగా కాకుండా ఏబీసీడీగా వర్గీకరించాలని, అలాగే మంత్రివర్గంలో మాదిగలకు రెండు పదవులు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల డప్పుల ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణలో లోపాలు ఉన్నాయని వాటిని పునః సమీక్షించి శాసీ్త్రయంగా రిజర్వేషన్లు మాదిగ ఉపకులాలకు పంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. -
విధిగా ఇళ్లు నిర్మించుకోవాలి
రాయికోడ్(అందోల్): ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన ప్రతీ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించి ప్రభుత్వం అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ నాగారం గొల్ల అంజయ్య లబ్ధిదారులను కోరారు. మండలంలోని నాగ్వార్ గ్రామంలో మండల ప్రత్యేకాధికారి జగదీశ్తో కలసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో త్వరిత గతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కో లబ్ధిదారుకు రూ.5 లక్షల బిల్లులను అందించి పేద కుటుంబాల సొంతింటి కల నెరవేర్చేందుకు కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎంఎం షరీఫ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింలు, వివిధ శాఖల సిబ్బంది నాయకులు పాల్గొన్నారు.జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ నాగారం అంజయ్య -
మెరుగైన ఫలితాలు సాధించాలి
కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ కలెక్టరేట్: పదో తరగతి పరీక్షలు జీవితానికి టర్నింగ్ పాయింట్ అని.. విద్యార్థులు పట్టుదలతో చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల కళాశాలను సందర్శించారు. అనంతరం కళాశాలలో మెనూ అమలు తీరును పరిశీలించి అభినందించారు. ఈసందర్భంగా బాలికలతో కలిసి భోజనం చేసి ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా..? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యసాధన కోసం శ్రమించాలని, భయం వీడి పట్టుదలతో చదవాలని పేర్కొన్నారు. అనంతరం మే 4న జరగనున్న నీట్ పరీక్ష కోసం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 1,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ అధికారి వినయ్, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సాగునీటి వినియోగంపై సమీక్షించారు. -
మహిళా ఉద్యోగులకు సన్మానం
మెదక్ కలెక్టరేట్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా జెడ్పీ సీఈఓ ఎల్లయ్య మాట్లాడుతూ.. సా మాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలతో సహా వివిధ రంగాల్లో మహిళామణులు సాధించిన విజయాలను గుర్తించి గౌరవించాలన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది ముందడుగు వేసేలా ప్రోత్సహించేందుకు ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్ల తనిఖీ హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని పాతూర్, పాతూర్ తండా అంగన్వాడీ కేంద్రాలను డీడబ్ల్యూఓ హైమావతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం వారికి పెడుతున్న భోజనం గురించి ఆరా తీశారు. ఆమె వెంట సీడీపీఓ వెంకటరమణమ్మ, అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. 11న జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన మెదక్ కలెక్టరేట్: ఈనెల 11న మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు డీఈఓ రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న యువ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల స్థాయి విద్యార్థులకు జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో వ్యక్తిగత, గ్రూప్ విభాగాల్లో విద్యార్థులు వారి ఎగ్జిబిట్స్ను ప్రదర్శించవచ్చని చెప్పారు. ‘ఎల్ఆర్ఎస్’ రాయితీని వినియోగించుకోండి చేగుంట(తూప్రాన్): ఎల్ఆర్ఎస్ రాయితీని వినియోగించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి అన్నారు. శుక్రవారం చేగుంట గ్రామ పంచాయతీని సందర్శించిన డీపీఓ ఎల్ఆర్ఎస్ రాయితీకి సంబంధించిన ఫ్లెక్సీని ఆవిష్కరించి మాట్లాడారు. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న ప్లాట్ల యజమానులకు మార్కెట్ రేటును అనుసరించి 25 శాతం రాయతీ కల్పించినట్లు తెలిపారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం సందర్శించి డీపీఓ ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. చేగుంటతో పాటు అనంతసాగర్ గ్రామాల్లో పారిశుద్య పనులు, డంప్యార్డులను పరిశీలించి, ఇంటిపన్నులు, మంచినీటి సరఫరా గురించి సిబ్బందికిసూచనలు చేశారు. నేడు జాతీయ లోక్ అదాలత్: ఎస్పీ మెదక్ మున్సిపాలిటీ: నేడు జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగే జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, తమ కేసులను రాజీ చేసుకోవచ్చని తెలిపారు. తమ ఆధార్ కార్డు తీసుకుని, సంబంధిత కోర్ట్ లేదా నిర్ణీత ప్రదేశంలో హాజరు కావాలన్నారు. కోర్టులో హాజరైన వెంటనే రాజీ ప్రక్రియను పూర్తి చేసి కేసును పూర్తిగా ముగించుకునే అవకాశం ఉంటుందన్నారు. లోక్ అదాలత్తో కేసుల తక్షణ పరిష్కారం సంవత్సరాల తరబడి సాగే న్యాయపరమైన చికాకుల నుంచి విముక్తి లభిస్తుందని తెలిపారు. కేసులలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శాంతి, న్యాయం పొందాలని సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మెదక్ మున్సిపాలిటీ: ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందిన సంఘటన మెదక్ పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని పిట్లంబేస్కు చెందిన కిరణ్ (25) బైక్పై వెళ్తుండగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కిరణ్ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికులు అతడిని మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ నాగరాజు తెలిపారు. -
విద్యార్థులు ఇష్టంతో చదవాలి
కౌడిపల్లి(నర్సాపూర్): చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా ఇష్టంతో చదవాలని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. గురువారం మండలంలోని తునికి ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కిచెన్, స్టోర్రూం, నిత్యావసర సరుకులు, విద్యార్థులకు పె ట్టిన భోజనం పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి మాట్లాడారు. చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తుందని వివరించారు. పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు భయపడవద్దని, శ్రద్ధగా చదవితే వందశాతం ఫలితాలు వస్తాయన్నారు. ఉపాధ్యాయులు ఎప్పటికప్పడు గమనించి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ సాయిబాబా, ప్రిన్సిపాల్ హరిబాబు, ఏటీపీ సుష్మ, జయరాజ్, డిప్యూటీ వార్డెన్ లక్ష్మణ్, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ నగేష్ -
అందుబాటులోని ఉండని వైద్యులు
● అత్యవసర పరిస్థితుల్లోహైదరాబాద్కు రెఫర్ ● నానా అవస్థలు పడుతున్న రోగులు ● పట్టించుకోని అధికారులుమెదక్జోన్: పేద, మధ్య తరగతి ప్రజలకు జబ్బు చేస్తే మొదటగా ప్రభుత్వ ధర్మాస్పత్రి వైపే చూ స్తారు. ఇక్కడ ఉచితంగా వైద్యం, మందులు, పెద్ద డాక్టర్లు ఉంటారనే నమ్మకంతో వస్తుంటారు. కానీ ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడం పేదలకు శాపంగా మారుతోంది. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావటంతో స్పెషలిస్టులతో పాటు వైద్య సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ప్రస్తుతం సుమారు 35 నుంచి 40 మంది వైద్యులు ఉన్నారు. వీరంతా ఉదయం 11 గంటల వరకు ఆస్పత్రికి రావడం లేదు. మధ్యాహ్నం పన్నెండు గంటలు అయిందంటే ఉండడం లేదని పలువురు రోగులు చెబుతున్నారు. అర్థరాత్రి రోడ్డు ప్రమాదాలు జరిగి గాయపడినా.. అత్యవసర వైద్యంతో ఆస్పత్రికి వచ్చినా.. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇంత పెద్దసంఖ్యలో ఉన్న వైద్యులు నిత్యం హైదరాబాద్ నుంచి రోజూ విధులకు హాజరవుతున్నారు. స్థానికంగా ఎవరూ ఉండటం లేదు. ఫలితంగా రోగులకు సరైన వైద్యం అందడం లేదు. వైద్య పరీక్షలకు బయటకే.. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో కనీసం సిటీ స్కాన్ అందుబాటులో లేదు. ఎంఆర్ఐ, గుండెకు సంబంధించిన పరీక్షలు కావాలన్నా సిబ్బంది బయటకు పంపిస్తున్నారు. ఎక్స్రే తీస్తే ఫిలిం ఉండడం లేదు. అంతేకాకుండా 24 గంటల పాటు అందుబాటులో ఉండాల్సిన జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్లు సరిగా విధులు నిర్వర్తించడం లేదు. కొంతకాలంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ లేకపోవటం.. ఇన్చార్జిగా కొనసాగుతున్న అధికారి చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వైద్యులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విష యాన్ని పలుమార్లు పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న నాథుడే కరువయ్యారని జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వేసవిలో నిరంతర విద్యుత్ సేవలు
కలెక్టర్ రాహుల్రాజ్పాపన్నపేట(మెదక్): వేసవిలో నిరంతర విద్యుత్ సేవలు అందించడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం ఎస్ఈ శంకర్తో కలసి మిన్పూర్ 220/132 కేవీ సబ్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మొదట కుర్తివాడ గ్రామానికి వెళ్లారు. అక్కడ విద్యుత్ సరఫరా అవుతున్న తీరును రైతుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రానున్న వేసవిలో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయాలని సిబ్బందికి సూచించారు. విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు, సరఫరా చేయడంలో విద్యుత్ సంస్థలు ఎంతో ప్రగతిని సాధించాయని కొనియాడారు. మిన్పూర్ సబ్స్టేషన్ ద్వారా జిల్లాలో పద్దెనిమిది సబ్స్టేషన్లకు నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. జిల్లాలో ఎలాంటి ఓవర్ లోడ్ లేకుండా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం విద్యుత్ బ్రేకర్లు, రికార్డులు, విద్యుత్ యూనిట్ల వాడకాన్ని పరిశీలించారు. జిల్లాలో ఎక్కడ విద్యుత్ అంతరాయం ఏర్పడినా టోల్ప్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని వినియోగదారులకు సూచించారు. ఆయన వెంట డీఈ భాషా, ఏఈ శ్రీనివాస్, ఇతర అధికారులు ఉన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు మెదక్జోన్/మెదక్ కలెక్టరేట్: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్పై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల వారీగా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో తాగునీటిపై యాక్షన్ ప్లాన్ తయారు చేసి నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ముందస్తుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉందని, ఉపాధి కూలీలకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం అనంతరం పీఎం విశ్వకర్మ పథకంపై అధికారులు, అమలు కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. టైలరింగ్, బార్బర్, భవన నిర్మాణ తదితర కులవృత్తుల లబ్ధిదారులకు లబ్ధి చేకూరే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. -
చిరుత.. భయం భయం
రైతులు జాగ్రత్తగా ఉండాలి చిరుత దాడుల నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి. తమ పశువులను సాధ్యమైనంత వరకు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే వ్యవసాయ క్షేత్రాల వద్ద ఉంచొద్దు. ఇళ్ల వద్దకు తీసుకెళ్లాలి. అలాగే రైతులు ఒంటరిగా వెళ్లవద్దు. కనీసం నలుగురు రైతులు కర్రలు పట్టుకొని వెళ్లాలి. ఎక్కడైనా చిరుత ఆనవాళ్లు ఉంటే వెంటనే తమకు సమాచారం అందజేయాలి. – విద్యాసాగర్, రామాయంపేట రేంజ్ అధికారిరామాయంపేట(మెదక్): చిరుతల భారీ నుంచి పశువులను రక్షించుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఇటీవల అటవీ ప్రాంతానికి దగ్గరగా, గిరిజన తండాల్లో ఉన్న పశువులపై చిరుతల దాడులు పెరిగాయి. గత నాలుగైదేళ్లుగా వందలాది పశువులను హతమార్చాయి. రేంజీ పరిధిలోని రామాయంపేట మండలం అక్కన్నపేట, తొనిగండ్ల, కాట్రియాల, పర్వతాపూర్, దంతేపల్లి శివారులో దట్టమైన అటవీప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో సుమారు ఆరు చిరుతలు ఉన్నట్లు సమాచారం. ఈవిషయాన్ని ఆశాఖ అధికారులు తెలపకపోయినా, రెండేళ్ల క్రితం చేపట్టిన వన్యప్రాణుల గణనలో ఈ విషయం తేలింది. చిరుతలతో పాటు ఎలుగుబంట్లు, రేసు కుక్కలు, జింకలు, నీల్గాయిలు ఇతర జంతువులు మనుగడ కొనసాగిస్తున్నాయి. నీటి కోసం పంట చేల వద్దకు.. వేసవిలో అటవీప్రాంతంలో తాగునీరు, అహారం లభించకపోవడంతో చిరుతలతో పాటు ఇతర జంతువులు గ్రామాలు, తండాల్లోకి వస్తున్నాయి. వన్యప్రాణులకు తాగు నీటి కోసం అటవీప్రాంతంలో సాసర్పిట్లతో పాటు చిన్న చిన్న కుంటలు, చెక్డ్యాంలు నిర్మించారు. వాటిలో నీరు నింపకపోవడంతో అవి గ్రామాల్లోకి వస్తూ ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఇటీవల నార్సింగి సమీపంలోని అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న చిరుత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విధితమే. అయితే ఈసారి కూడా నిధులు మంజూరు కాకపోవడంతో అధికారులు అటవీప్రాంతంలో వన్యప్రాణులకు తాగునీటి సదుపాయం కల్పించలేదు. దీనికి తోడు అడవిలో భూగర్భజలాలు ఇంకిపోయి తాగు నీరు లభించడం కష్టతరంగా మారింది. అయితే వేసవి వస్తుందంటే చాలు రైతులు భయందోళన చెందుతున్నారు. చిరుతను బంధించడానికి రామాయంపేట పట్టణ శివారులో సర్వయ్యకుంట వద్ద ఆశాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు. రైతులు తమ పశుసంపదను రక్షించుకోవడానికి పశువుల పాకల చుట్టూ ఇనున జాలీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అటవీ ప్రాంతాన్ని ఆనుకునే వ్యవసాయం చేసుకుంటున్న రైతులు ముందస్తుగా వీటిని ఏర్పాటుచేసుకొని తమ పశువులను అందులో ఉంచుతున్నారు. మరికొందరు రైతులు ముందు జాగ్రత్త చర్యగా తమ పశువులను రాత్రివేళ పంట చేల వద్ద ఉంచకుండా ఇళ్ల వద్దకు తీసుకెళ్తున్నారు. పశువుల రక్షణకు రైతుల తంటాలు పాకల చుట్టూ ఇనుప కంచెల ఏర్పాటు -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
మెదక్ కలెక్టరేట్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్లు తెలుగు, హిందీ, సంస్కృతం తదితర పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షలకు 107 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్నోడల్ అధికారి మాధవి తెలిపారు. జనరల్ 4,988 మందికి గానూ 4,889 మంది హాజరుకాగా 99 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు మరో 8 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఈ లెక్కన 98.02 హాజరు శాతం నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు వివరించారు. -
వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే
మెదక్జోన్/నర్సాపూర్: రాబోయే రోజుల్లో తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడటం ఖా యమని, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు కొమురయ్య, అంజిరెడ్డి విజయం సాధించటంతో గురువారం పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. ఇక ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్, బెండ వీణ, శివ తదితరులు పాల్గొన్నారు. అలాగే నర్సాపూర్ పట్టణంలోని బస్టాండ్ వద్ద నిర్వహించిన సంబరాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఓబీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్ద రమేష్గౌడ్, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేష్గౌడ్, నాయకులు నారాయణరెడ్డి, శంకర్, అరవింద్, రాంరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్ -
కొనసాగుతున్న రిలే దీక్షలు
నర్సాపూర్: ప్యారానగర్లో డంప్యార్డును ఎత్తి వేయాలన్న డిమాండ్తో జేఏసీ ఆధ్వర్యంలో నర్సాపూర్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 18వ రోజుకు చేరుకున్నాయి. ఈసందర్భంగా దీక్షలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్ పాల్గొని మాట్లాడారు. డంప్యార్డును ఎత్తివేసే వరకు పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. డంప్యార్డు ఏర్పాటుతో నర్సాపూర్ అడవులు, చెరువు కలుషితమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల అభిష్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీక్షలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. పౌష్టికాహారం తప్పనిసరి మెదక్ కలెక్టరేట్: పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణ చూడా లని జిల్లా బాలల పర్యవేక్షణ కమిటీ అధ్యక్షురాలు, డీసీపీఓ కరుణశీల అధికారులకు సూచించారు. గురువారం మెదక్ పట్టణంలోని బాల సదనంతో పాటు శివ్వంపేటలోని ఓరేబి మినిస్ట్రీ సీసీఐని తన బృందంతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయించి, మందులు అందజేశారు. కార్యక్రమంలో ఉప్పలయ్య, గంగాధర్, దిగంబర, చంద్రశేఖర్, చంద్రకళ, లావణ్య, రూప తదితరులు పాల్గొన్నారు. తైబజార్ డబ్బుల రికవరీలో అవినీతి రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీలో తైబజార్ వేలం పాటకు సంబంధించి డబ్బుల రికవరీలో అవినీతి చోటు చేసుకుందని సీఐటీయూ, కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి, కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రీధర్రెడ్డి, రమేశ్ గురువారం మన్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2018 నుంచి తాము తైబజార్ వేలానికి సంబంధించి వివరాల కోసం ఆర్టీఐ ద్వారా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా, తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. తైబజార్ వేలం పాటలో తీర్మాణించిన మేరకే సంబంధిత కాంట్రాక్టర్ వద్ద డబ్బులు వసూలు చేయాల్సి ఉండగా, రికార్డుల్లో మాత్రం తప్పుడు వివరాలు నమోదు చేశారని తెలిపారు. ఈవిషయమై మున్సిపల్ అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్యారానగర్లో సర్వేయర్ల బృందం పర్యటన జిన్నారం(పటాన్చెరు): గుమ్మడిదల మండలం నల్లవల్లి సమీపంలోని ప్యారానగర్ గ్రామంలో డంప్యార్డ్ ఏర్పాటుకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు సంగారెడ్డి ఏడీ ఆధ్వర్యంలో సర్వేయర్ల బృందం గురువారం అక్కడ పర్యటించింది. అటవీ రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలో సర్వే చేసి హద్దులు గుర్తించారు. సర్వే రిపోర్టును ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు అధికారుల బృందం వెల్లడించింది. కాగా ప్యారానగర్లో డంప్యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు గురువారం 30వ రోజుకు చేరుకున్నాయి. మహిళలకు ఉచిత న్యాయ సలహాలున్యాయమూర్తి స్వాతిరెడ్డి హుస్నాబాద్: మహిళలకు ఏ సమస్య తలెత్తినా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచిత న్యాయ సలహాలు పొందవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని గురువారం మహిళ సంఘా ల సభ్యులకు లీగల్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశా రు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయన్నారు. గెలిచేది ఆడ, మగ అని కాదని, నైపు ణ్యం, సమర్థత ఎవరికి ఉంటుందో వారే ఉన్నతమైన హోదాలో ఉంటారన్నారు. ఆలోచనలో మార్పు రావాలని, ఆ మార్పుకు మహిళలే తొలి అడుగు వేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, సీడీపీఓ జయమ్మ, బార్ అసొసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ రేసులో సీపీఐ
‘చాడా’కు చాన్స్ దక్కేనా? సాక్షి, సిద్దిపేట: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్సీ స్థానాల్లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డికి అవకాశం దక్కుతుందా లేదా అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు పెట్టుకున్నాయి. అందులో రెండు ఎమ్మెల్సీలకు అవకాశం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్సీలు హసన్ మీర్జా, ఎగ్గె మల్లేఽశం, శేరి సుభాష్రెడ్డి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పదవీకాలం ఈ నెల 29వ తేదీతో ముగయనుంది. దీంతో రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. వాటిని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ గత నెల 28న షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 10న నామినేషన్ల స్వీకరణ, 11న పరిశీలన, 13న నామినేషన్ల పరిశీలన, 20న పోలింగ్ ఉండనుంది. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు దక్కే వాటిలో సీపీఐకి ఒకటి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే సీపీఐ నేతలు సీఎం రేవంత్రెడ్డిని, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ను కలిశారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ నాయకులు చాడా వెంకట్రెడ్డి, తక్కల్లపల్లి శ్రీనివాస్రావు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. సీపీఐ మొదట పట్టుబట్టిన హుస్నాబాద్ సీటు.. అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్, సీపీఐ పార్టీల పొత్తులో భాగంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే సీటును సీపీఐకి కేటాయించాలని పట్టు పట్టా రు. హుస్నాబాద్, కొత్తగూడెంలలో సీపీఐకి పట్టు ఉండటంతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆ పార్టీ రెండు స్థానాలను అడిగారు. చివరకు హుస్నాబాద్ కాంగ్రెస్ అ భ్యర్థిగా పొన్నం ప్రభాకర్కు కేటాయించారు. పొత్తులలో కొత్తగూడెం సీటును కూనంనేని సాంబశివరావు కు కేటాయించారు. సీపీఐ అధిష్టానం సూచించిన ఇద్దరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని గతంలోనే హామీ ఇచ్చినట్లు ప్రచారం. -
రైతులకు సాగునీరు అందించండి
చేర్యాల(సిద్దిపేట): తపాసుపల్లి రిజర్వాయర్ను గోదావరి జలాలతో నింపి చేర్యాల ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని పలువురు కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈమేరకు గురువారం భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డితో కలిసి పలువురు కాంగ్రెస్ నాయకులు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేర్యాల ప్రాంత రైతన్నలు సాగు నీటి కోసం పడుతున్న కష్టాలను మంత్రికి వివరించామన్నారు. స్పందించిన మంత్రి రంగనాయకసాగర్ డీ10 కెనాల్ద్వారా కమాలాయపల్లి, అర్జునపట్ల, అకునూరు, జాలపల్లి, లింగాపూర్, దూల్మిట్టకు సాగునీరు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్–3 మోటార్లు ప్రారంభించి గండిరామారం, బొమ్మకూరు, వెల్దండ, తపాసుపల్లి రిజర్వాయర్లను నింపి రైతులకు సాగు నీరు ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారన్నారు. మంత్రిని కలిసిన వారిలో మద్దూరు, చేర్యాల మాజీ జెడ్పీటీసీలు గిరి కొండల్రెడ్డి, కొమ్ము నర్సింగరావు, నాయకులు, ఆయా గ్రామాల రైతులు ఉన్నారు. మంత్రి ఉత్తమ్ను కలిసిన కాంగ్రెస్ నేతలు -
రేపు జాతీయ లోక్ అదాలత్
సంగారెడ్డి టౌన్: కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా, జిల్లాలోని కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. కక్షిదారులను ఒప్పించి సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసులను పరిష్కరించేలా కృషి చేస్తున్నారు. ఒకప్పుడు సామాన్యుడికి అందనంత దూరంలో ఉన్న న్యాయసేవలు క్రమంగా కక్షిదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. సత్వరం, సమన్యాయం అందించడానికి న్యాయ సేవాధికార సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయి. ఇందుకోసం 1987లో జాతీయ లోక్అదాలత్ సేవలు ప్రారంభించారు. ‘రాజీయే రాజమార్గం’ అనే నినాదంతో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థలు లోక్అదాలత్ నిర్వహించి కేసులు పరిష్కరిస్తున్నాయి. కక్షిదారులను ఒప్పించి సాధ్యమైనంతవరకు ఎక్కువ కేసులను పరిష్కరించేలా కృషి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా కోర్టు పరిధిలో న్యాయవాదులు, పోలీసు అధికారులు, బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ అధికారులకు అవగాహన కల్పించారు. రాజీయే రాజమార్గమని, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జడ్జీలు సూచిస్తున్నారు. ఈనెల 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. లోక్ అదాలత్లో విద్యుత్, టెలిఫోన్ రికవరీ తదితర కేసులు కూడా వస్తాయి. సివిల్, కుటుంబ, ఆస్తి తగాదాలు, రోడ్డు ప్రమాదాలు, మోటార్ వెహికల్ కేసులు, బ్యాంకుల రికవరీ కేసులు, ఇన్సూరెన్స్, చెక్ బౌన్స్ కేసులు, క్రిమినల్ కాంపౌండ్ కేసుల వంటి కేసులను పరిష్కరించుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
ఏఐతో పక్కాగా విద్యాబోధన
● వచ్చే ఏడాది మరిన్ని పాఠశాలల్లో అమలు ● కలెక్టర్ రాహుల్రాజ్ వెల్దుర్తి(తూప్రాన్): జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథ)ను వినియోగిస్తూ విద్యాబోధన కార్యక్రమం పక్కాగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్రా జ్ అన్నారు. బుధవారం మండల కేంద్రం మాసాయిపేటలో విస్తృతంగా పర్యటించారు. అంగన్వాడీ కేంద్రం, పశువైద్యశాల, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరం మరిన్ని పాఠశాలల్లో ఏఐ అమలు జరిగేలా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ జ్ఙానజ్యోతి, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం బాలమణి, పశువైద్యాధికారిణి కావ్య తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఏఐ విద్యాబోధన పరిశీలించేందుకు పాఠశాలకు వచ్చిన సమయంలో విద్యుత్ లేకపోవడంతో సంబంధిత అధికారులపై కలెక్టర్ ఫోన్లో ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్ది సేపటికి విద్యుత్ రాగా పాఠశాలకు చేరుకొని ఏఐతో విద్యాబోధనల అమలుతీరును పరిశీలించారు. -
శాశ్వత పనులకే ప్రాధాన్యం
ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: తాగునీటి పరంగా ఇబ్బందులను తీర్చేందుకు చేపట్టనున్న పనుల్లో శాశ్వత పనులకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి స్పష్టం చేశారు. ఖేడ్లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తాగునీటి పథకాల పునరుద్ధరణ, ఇతర పనులకోసం ఇటీవల రూ.6.50కోట్లతో ప్రతిపాదనలు పంపగా స్థానిక అధికారులు అవసరమైన పనులను గుర్తించినట్లు చెప్పారు. మిషన్ భగీథ పథకం ద్వారా నిరంతరం నీటిసరఫరా జరిగేలా గొర్రెకల్ వద్ద డెడికేటెడ్ విద్యుత్ లైన్ పనులు చేయిస్తున్నామన్నారు. బోరంచ, శాపూర్ పథకాలను పునరుద్ధరించి బోరంచ నుంచి మార్గమధ్యలోని గ్రామాలతోపాటు ఖేడ్ మున్సిపాలిటీ అవసరాల మేర నీటిసరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యదర్శులు భగీరథ ద్వారా నీరు సక్రమంగా సరఫరా అయితేనే రిజిస్టర్లో సంతకాలు చేయాలని లేని పక్షంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీడీవోలకు సమాచారం అందించాలన్నారు. వేసవి ముగిసేవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో నాయకులు దారంశంకర్, అశోక్రెడ్డి, సంగన్న, రాజేందర్పాటిల్, రాజు, విఠల్రావు, పరశురాం పాల్గొన్నారు. -
చెక్ డ్యాం నిండుగా.. పైర్లు పచ్చగా
నీటితో కళకళలాడుతున్న చెక్ డ్యాంకొల్చారం(నర్సాపూర్): సింగూరు నీటితో మండలంలోని మంజీరా పరివాహక ప్రాంతం పచ్చదనం పరుచుకుంది. కష్టకాలంలో సాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు మండలంలోని ఎనగండ్ల, కోనాపూర్, పైతర సమీపంలోని మంజీరా నదిపై చేపట్టిన చెక్ డ్యాంలు ప్రస్తుతం నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో సమీప ప్రాంతంలోని బోర్లలో భూగర్భజలాలు పెరిగి కనుచూపు మేరలో పచ్చని పొలాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. పంటపొలాలను చూస్తూ రైతన్నలు ఆనందంతో మురిసిపోతున్నారు. -
10న మిలియన్ మార్చ్డే
రామాయంపేట(మెదక్): సీమాంధ్ర పాలనపై తెలంగాణ ప్రజల తిరుగుబాటు రోజు మార్చి 10న మిలియన్ మార్చ్డే నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు యాదగరి తెలిపారు. బుధవారం రామాయంపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 10న హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరులు కాగా, గత ప్రభుత్వం వారి గురించి ఎంతమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ఉద్యమకారుల ఆకాంక్షలను విస్మరించిందని మండిపడ్డారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు నెలకు రూ. 30 వేల గౌరవ వేతనంతో పాటు హైదరాబాద్లో 250 గజాల స్థలం ఇవ్వాలని కోరారు. సమావేశంలో జిల్లా కమిటీ అధ్యక్షుడు రమేశ్గౌడ్, ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర నాయకులు దుర్గం, శ్రీనివాస్, జేఏసీ రాష్ట్ర నాయకులు తుల్జారెడ్డి, లక్ష్మీకాంతమ్మ, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. -
తొలిరోజు 96.41 % హాజరు
ప్రారంభమైన ఇంటర్ పరీక్షలుమెదక్జోన్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షకు జిల్లావ్యాప్తంగా 6,410 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 6,180 మంది హాజరయ్యారు. 230 మంది గైర్హాజరు కాగా, 96.41 హాజరు శాతం నమోదైంది. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకున్నారు. జిల్లావ్యాప్తంగా 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీసులు 144 సెక్షన్ విధించి కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసి వేయించారు. పరీక్షకు 5 నిమిషాల ఆలస్యంగా వచ్చినా లోనికి అనుమతించారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించారు. మాల్ప్రాక్టీస్కు అవకాశం ఇవ్వొద్దు ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు అవకాశం ఇవ్వొద్దని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం పట్టణంలోని బాలుర జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. పరీక్ష పూర్తయిన వెంటనే జవాబు పత్రాలను పో లీస్ బందోబస్తు మధ్య నిర్దేశిత ప్రాంతాలకు తరలించాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్ అధికారిణి మాధవి, ఇతర అధికారులు ఉన్నారు. -
ఇబ్బందులు తలెత్తొద్దు
కొల్చారం(నర్సాపూర్)/నిజాంపేట(మెదక్): వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డీఈఓ రాధాకిషన్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫే ర్, కేజీబీవీ బాలికల పాఠశాలతో పాటు బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతుల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవి దృష్ట్యా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధా ్యపకులను ఆదేశించారు. అనంతరం నిజాంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏఐ తరగతులను పరిశీలించారు. ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోండి రామాయంపేట(మెదక్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ను ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ దేవేందర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 31వ తేదీలోగా ప్రజలు తమ ప్లాట్లను క్రమబద్దీకరించుకోవాలని సూ చించారు. గడువులోగా చేసుకున్న వారికి 25 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు. ఈమేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓ విడుదల చేసిందని వివరించారు. రాజీయే రాజమార్గం: ఎస్పీ మెదక్ మున్సిపాలిటీ: జిల్లా ప్రజలు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజీమార్గమే రాజమార్గం అనే సూత్రాన్ని అనుసరించి, వివాదాలను చక్కదిద్దుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశమన్నారు. వివాదాలు ఒకసారి ప్రారంభమైతే, జీవితాంతం కొనసాగుతూనే ఉంటాయని, వాటిని త్వరగా పరిష్కరించుకోవాలని అన్నారు. ఈనెల 8న కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కిక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శాంతి, న్యాయం పొందాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఖాయం చిన్నశంకరంపేట(మెదక్): రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆయన నార్సింగి మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలను కలిసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తుందన్నారు. పసుపు బోర్డు ద్వారా అధికశాతం తెలంగాణ రైతులకు మేలు జరగనుందన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, ఇందుకు నిదర్శనం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలేనని అన్నారు. అనంతరం బీజేపీ నాయకులు సత్యపాల్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్, నరేష్ తదితరులు గంగారెడ్డిని సత్కరించారు. కనీస వేతనం అమలు చేయాలి మెదక్ కలెక్టరేట్: కార్మికులకు కనీస వేతనం నెలకు రూ. 26,000గా నిర్ణయించాలని సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం కలెక్టరేట్లోని కార్మికశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ లేబర్ అధికారి లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘాలు ప్రతిపాదించిన వాటిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. అలాగే 74 షెడ్యూల్డ్ విడుదల చేసి కనీస వేతనాల సలహా మండలిలో కార్మిక సంఘాలన్నింటికీ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు షౌకత్, రవి నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీ వ్యూహం
పక్కా ప్రణాళిక..● కలిసొచ్చిన బీజేపీ క్యాడర్ ● ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయానికి కారణాలివే.. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పక్కా ప్రణాళిక.. పకడ్బందీ వ్యూహం. ఇవి శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలుపు తీరాలకు చేర్చాయి. ఉమ్మడి కరీంనగర్–మెదక్– నిజామాబాద్– ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రామచంద్రాపురానికి చెందిన చిన్నమైల్ అంజిరెడ్డి విజయానికి ఈ రెండు కారణాలని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రసన్న కూడా గట్టి పోటీని ఇచ్చారు. ముగ్గురు అభ్యర్థుల మధ్య హోరాహోరీగా మండలి పోరు సాగింది. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలుపు తేల్చలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించగా.. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. అండగా నిలిచిన కమలం క్యాడర్ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి గట్టి క్యాడర్ ఉంది. ఉమ్మడి మెదక్తో పాటు, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బీజేపీ బలంగా ఉంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానంతో పాటు, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎంపీలుగా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన విషయం విదితమే. అలాగే ఆయా జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేలుగా కూడా ఈ నాలుగు జిల్లాలకు చెందిన వారే ఉన్నారు. ఈ ఎన్నికలను ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ క్యాడర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు రఘునందన్రావు, ధర్మపురి అర్వింద్, బండిసంజయ్, గొడాం నగేష్లకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అలాగే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇలా ఆయా ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి గట్టి పట్టు అంజిరెడ్డిని గెలుపు తీరాలకు చేర్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ అనుబంధ సంఘాలు కీలకం.. బీజేపీ అనుబంధ సంఘాలు కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఉమ్మడి కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా బీజేపీనే కై వసం చేసుకున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితమే టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పుడు పట్టభద్రుల స్థానాన్ని కూడా కమలం పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఈ రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపులో ఆ పార్టీ క్యాడర్తో పాటు, దాని అనుబంధ సంస్థల కృషి ఎంతగానో ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరు పకడ్బందీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎలాంటి హంగూ.. ఆర్భాటాలు లేకుండా అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారని రాజకీయ నిఫుణులు విశ్లేషిస్తున్నారు. కాగా ఎన్నికల నగారా మోగక ముందు నుంచే అంజిరెడ్డి ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై దృష్టి సారించారు. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న పట్టభద్రులను పెద్ద ఎత్తున ఓటర్లు నమోదు చేయించారు. ఇలా ఓటరు నమోదు చేయించడం ఆయనకు కొంత కలిసొచ్చింది. ఎమ్మెల్యేగా పోటీ చేసి.. పారిశ్రామిక వేత్త అయిన డా.చిన్నమైల్ అంజిరెడ్డి 2009లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పటాన్చెరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎస్ఆర్.ట్రస్టు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అంజిరెడ్డి సతీమణి గోదావరి బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న విషయం విదితమే. సామాజిక సేవ.. 2002 ఎస్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ స్థాపన. పెద్ద ఎత్తున తాగునీరు, మినరల్ వాటర్, విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్లతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాల నిర్వహణ.అంజిరెడ్డి బయోడెటా.. పేరు: డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి పుట్టిన తేదీ: 18.06.1966 తల్లిదండ్రులు : సి.రాజిరెడ్డి, లక్ష్మీనరసమ్మ భార్యపేరు: సి.గోదావరి (బీజేపీ జిల్లా అధ్యక్షురాలు) సంతానం : అనీష్రెడ్డి, ఆశ్విత రెడ్డి స్వస్థలం : రామచంద్రాపురంరాజకీయ ప్రస్థానం ఇలా.. 2009ÌZ {ç³gêÆ>fÅ…ÌZ ^ólÇMýS. OÐðlG-ÝëÞÆŠḥæïÜ-ï³ÌZ ç³°^ól-Ô>Æý‡$. 2014ÌZ fÇ-W¯]l AòÜ…½Ï G°²-MýSÌZÏ ç³sꯌS^ðlÆý‡$ ¯]l$…_ çÜÓ™èl…{™èl A¿ýæÅ-ǦV> ´ùsîæ ^ólíÜ.. KrÑ$ ´ëÌSĶæ*ÅÆý‡$. ™èlÆ>Ó™èl M>…{VðS-‹ÜÌZ ^ólÇ-MýS.. iòßæ-^ŒlG…ïÜ G°²-MýSÌS çÜ…§ýl-Æý‡Â…V> ½gôæï³ÌZ ^ólÆ>Æý‡$. ´ëÆý‡ÏÐðl$…sŒæ G°²-MýSÌZÏ Ððl$§ýlMŠS G…ï³ sìæMðSPsŒæ¯]l$ BÕ…_ ¿ýæ…VýS-ç³-yézÆý‡$. Ð]l$…yýlÍ G°²-MýSÌZÏ GÐðl$Ã-ÎÞV> ÑfĶæ$…. -
ప్రగతి పరుగు
పాలన మెరుగు..నూతన ఒరవడికి శ్రీకారం ‘లెస్ ప్లాస్టిక్, లెస్ పేపర్, పవర్ సేవ్’ నినాదంతో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ముందుగా కలెక్టరేట్ నుంచే ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చినా స్టీల్ బాటిళ్లలోనే తాగునీరు అందిస్తున్నారు. పారదర్శకంగా పాలన సాగించాలనే దృఢ సంకల్పంతో ఈ ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అలాగే ఆఫీసుల్లో అవసరం లేనప్పుడు కరెంట్ను వినియోగించవద్దని, బయటకు వెళ్లే సమయంలో స్విచ్లు ఆఫ్ చేసి పవర్ సేవ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికులు హెల్మెంట్ ధరించకపోవటంతోనే మరణిస్తున్నారని గుర్తించారు. కలెక్టరేట్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ హెల్మెంట్ ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. లోనిచో ప్రవేశం లేదని హెచ్చరించారు. దీంతో సిబ్బందితో పాటు కలెక్టరేట్కు వచ్చే ప్రతి ఒక్కరూ హెల్మెంట్ ధరిస్తున్నారు. విద్య, వైద్యంపై ప్రత్యేక ఫోకస్మెదక్జోన్: కలెక్టర్ రాహుల్రాజ్ ఏడాది పాలనలో తన మార్క్ చూపెట్టారు. ప్లాస్టిక్ నిషేధం, పవర్ సేవ్, ఈ– ఆఫీస్ విధానం పక్కాగా అమలు చేస్తున్నారు. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టారు. సెలవు రోజుల్లో సైతం క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. జిల్లాస్థాయి అధికారులు స్థానికంగా ఉండాలని, ఇతర ప్రాంతాల నుంచి రావటం కుదరదని ఆదేశాలు జారీ చేశారు. విధులకు ఎగనామం పెట్టే వారిపై వేటు వేసి ప్రజల మన్ననలు పొందుతున్నారు. గురువారానికి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి ఏడాది అయిన సందర్భంగా ప్రత్యేక కథనం.. బడిపాట.. బట్టీ చదువులకు ఊరట బడిబాటపై ‘చిట్టి పొట్టి అడుగులు’ అంటూ కలెక్టర్ స్వయంగా పాట రాశారు. ప్రతీ గ్రామంలో బడీడు పిల్లలుంటే సమీప పాఠశాలల్లో చేర్పించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. నర్సాపూర్ మండలం జక్కంపల్లి అనే మారుమూల గ్రామంలో అధికారులతో కలిసి పల్లె నిద్ర చేశారు. ఆ మరుసటి రోజు ఉదయం ఇల్లిల్లూ తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు సైతం ప్రణాళికతో ముందుకెళ్లడంతో గతంలో కంటే ఈసారి ప్రవేశాలు పెరిగాయి. అలాగే ఇటీవల నర్సాపూర్ గిరిజన గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి రాత్రి అక్కడే నిద్రించారు. ప్రభుత్వం విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచిందని.. వారికి నాణ్యమైన భోజనం పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. బట్టీ చదువులతో విసిగిపోతున్న విద్యార్థులకు ఊరట కల్పించారు. సాధారణ పద్ధతిలో బోధనకు భిన్నంగా గ్రౌండ్ బేస్ లెర్నింగ్ విధానాన్ని విద్యార్థులకు పరిచయం చేయాలని సంకల్పించారు. బాలల దినోత్సవం సందర్భంగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ‘పల్లె వెలుగు’ బస్సులో ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో సరిపడా సీట్లు లేక మహిళలు ఇబ్బంది పడుతున్నారని మీడియా కథనాలను చూసిన కలెక్టర్ స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం కల్పించిన విలువైన కారు ఉన్న సాధారణ ప్రయాణికుడిగా కుటుంబంతో కలిసి కిక్కిరిసిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో ప్రయాణించారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు ఏ మేరకు వినియోగించుకుంటున్నారో తెలుసుకునేందుకు స్వయంగా మెదక్ నుంచి నర్సాపూర్ వరకు భార్య, పిల్లలలో కలిసి ప్రయాణం చేశారు. మహిళా ప్రయాణికులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ‘ధరణి’ సమస్యలు పరిష్కారం ధరణి సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపారు. జిల్లాలో 12 వేల ధరణి ఫిర్యాదులు పెండింగ్లో ఉండగా.. కలెక్టర్ వచ్చిన రెండు నెలల వ్యవధిలోనే 8,500 సమస్యలను పరిష్కరించగలిగారు. గతంలో ధరణి పెండింగ్ సమస్యల్లో రాష్ట్రంలో మెదక్ 6వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 12 స్థానంలో ఉంది. మెతుకుసీమ.. టూరిజం హబ్ జిల్లాను టూరిజం హబ్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రభుత్వం సైతం సానుకూలంగా ఉందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి, రాజుల ఏలుబడిలో నిర్మించిన ఖిల్లా, పోచారం అభయారణ్యం, నిజాంపాలనలో నిర్మించన పోచారం ప్రాజెక్టు, ఏడుపాయల దేవస్థానాలకు సంబంధించి ఫొటోలు తీయించారు. త్వరలో టూరిస్టులకు అర్థం అయ్యే విధంగా బుక్ విడుదల చేస్తామని ప్రకటించారు.తనిఖీ చేసి.. వేటు వేసి బడిబాట సక్సెస్.. గాడిలో పడిన రెవెన్యూ శాఖ ఆకస్మిక తనిఖీలతో హడల్ కలెక్టర్ రాహుల్రాజ్ ఏడాది మార్క్ పాలన గతేడాది సెప్టెంబర్ 17న కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో ఐదుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా, రిజస్టర్లో సంతకాలు పెట్టి ముగ్గురు మధ్యాహ్నమే వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన కలెక్టర్ ఆ ముగ్గురిని వెంటనే సస్పెండ్ చేశారు. వైద్య సిబ్బంది విధులకు ఎగనామం పెడుతున్నారని భావించి అన్ని ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. వాటిని కలెక్టరేట్లోని తన చాంబర్తో పాటు డీఎంహెచ్ఓ కార్యాలయానికి అనుసంధానం చేశారు. వైద్యులు సకాలంలో వస్తున్నారా..? లేదా అని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రజలకు సరైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి
మెదక్ కలెక్టరేట్: రాజీ మార్గమే రాజమార్గమని సీనియర్ సీవిల్ జడ్జి జితేందర్ తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 8న మెదక్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కక్షిదారుల సౌకర్యార్థం ఈనెల ఒకటో తేదీ నుంచే లోక్ అదాలత్ బెంచీలను ఆయా న్యాయస్థానాలలోనే ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ లోక్అదాలత్లో వేగంగా కేసులు పరిష్కారం అవటమే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నారు. కక్షిదారులు న్యాయస్థానానికి కట్టిన కోర్టు నుంచి ఫీజు తిరిగి పొందవచ్చునని వివరించారు. అలాగే.. కేసుపై అప్పీలుకు వీలులేకపోవటం వల్ల ఇదే చివరి తీర్పు అవుతుందని చెప్పారు.సీనియర్ సివిల్ జడ్జి జితేందర్ -
ఇంటర్ పరీక్షలకు వేళాయే
నేటి నుంచి ప్రారంభం ● ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి ● జిల్లాలో 30 పరీక్ష కేంద్రాలు ● ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు ● క్యూ ఆర్ కోడ్తో సెంటర్ల గుర్తింపు ● మొత్తం 12,484 విద్యార్థులు పాపన్నపేట(మెదక్): జిల్లాలో ఇంటర్ మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకుగాను అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ నిబంధన సడలించారు. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్షకు అనుమతించ నున్నారు. జిల్లాలో 30 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ,12,484 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొదటి సంవత్సరంలో 6,066 మంది, ద్వితీయ సంవత్సరంలో 6,418 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్ష కేంద్రంలో అమర్చిన సీసీ కెమెరాలతో ఇంటర్ బోర్డు అధికారులు డైరెక్ట్గా వీక్షించనున్నారు. హాల్టికెట్పై ఉన్న క్యూ ఆర్ కోడ్ ద్వారా పరీక్ష కేంద్రం లొకేషన్ తెలుసుకోవచ్చు. భారీగా సిబ్బంది పరీక్షల నిర్వాహణ కోసం హైపర్ కమిటీ సభ్యులు, కన్వీనర్, ఫ్లయింగ్ స్క్వాడ్లు ఒక్కొక్కరు, నలుగురు సిట్టింగ్ స్క్వాడ్లు, చీఫ్ సూపరింటెండెంట్లు 30, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 30 మంది, 520 మంది ఇన్విజిలేటర్లను నియామకం చేశారు. ఒక్కో కేంద్రంలో 5 సీసీ కెమెరాలు బిగించారు. వీటి ద్వారా ఇంటర్ బోర్డు అధికారులు డైరెక్ట్గా సెంటర్లోని పరిస్థితులు వీక్షించవచ్చు. ఉదయం 9 గంల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. హాల్ టికెట్ రాని వారు నేరుగా టీజీబీఐ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్న పత్రంపై సీరియల్ నంబర్ ముద్రిస్తున్నారు. ప్రశ్నాపత్రం బయటకు వెళ్తే ఎవరి పేపరో తెలుస్తుంది. ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రతీ కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించాం. విద్యార్థులు ఎవరైనా ఒత్తిడికి, మానసిక ఆందోళనకు గురైతే వెంటనే 14418 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలి. విద్యార్థులు ఎలక్ట్రానిక్ వస్తువులు వెంట తీసుకెళ్లొద్దు. వాచ్లు కూడా తీసుకురావద్దు. విద్యార్థులకు సమయం తెలిసేలా అర గంటకోసారి బెల్ మోగిస్తారు. పరీక్షలు కట్టు దిట్టంగా నిర్వహించేందుకు పూర్తి చర్యలు తీసుకున్నాం. – జి.మాధవి, డీఐఈఓ -
రూ.2కోట్లతో పవర్ ట్రాన్స్ఫార్మర్లు
మెదక్ కలెక్టరేట్: వేసవిలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని, ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందింస్తున్నట్లు విద్యుత్ శాఖ మెదక్ రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి వెల్లడించారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈ శంకర్ ఆధ్వర్యంలో వేసవి ప్రణాళికపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ వేసవిలో నిరంతర విద్యుత్ సరఫరాలో భాగంగా ఇప్పటికే రూ.2 కోట్ల వ్యయంతో పాతూరు సబ్స్టేషన్లో కొత్తగా 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను (పీటీఆర్), ర్యాలమడుగు సబ్స్టేషన్లో 3.5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే మెదక్ పట్టణంతోపాటు మండలంలోని బాలానగర్లో నూతనంగా విద్యుత్ సబ్స్టేషన్లను నిర్మించామని, మున్ముందు ఎక్కడ కూడా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో మెదక్ విద్యుత్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ శంకర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (డీఈలు) చాంద్పాషా, గరుత్మంతరాజు, శ్రీనివాసరావు, ఏడీఈలు మోహన్బాబు, ఆయా మండలాల ఏఈలు, సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేసవిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా విద్యుత్ కోతలు లేకుండా చర్యలు విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి -
సాగునీటి నిర్వహణకు పటిష్ట చర్యలు
కొల్చారం(నర్సాపూర్)/చిలప్చెడ్(నర్సాపూర్): వేసవికాలంలో వరి పంటకు అవసరమైన నీటి నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని వరిగుంతం గ్రామంలో, అలాగే..చిలప్చెడ్ మండల పరిధిలోని చండూర్ శివారులో ఎండిపోయిన పంటల వివరాలు అడిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఘనాపురం ఆనకట్ట నుంచి చివరి ఆయకట్టు వరకు నీరు అందుతుందని తెలిపారు. ప్రస్తుతం వరి పంటలకు నీటి కొరత లేదన్నారు. రైతులకు సాగునీరు సరఫరాకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని, నీటి నిర్వహణ, మోటార్లకు నిరంతర విద్యుత్ సరఫరా వంటి చర్యలు తీసుకొనేలా అధికారులను ఆదేశించామని తెలిపారు. అవసరం ఉన్న మేరకు మాత్రమే భూగర్భ జలాలు ఉపయోగించాలని, అందుకు వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు. కాగా, చిలప్చెడ్ మండలం చండూర్ శివారులో ఎండిపోయిన పంటల వివరాలు అడిగారు. సుమారు 250 ఎకరాల వరకు ఎండిపోయినట్లు ఏఓ సమాధానమిచ్చారు. ఎత్తిపోతల ప్రాజెక్టు ఎందుకు పనిచేయడం లేదని, ఏ మరమ్మతులు చేయించాలో, పూర్తి సమాచారం అందించాలని ఏఓను ఆదేశించారు. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆరుతడి పంటలు వేయాల్సిందని చెప్పారు. ఆయన వెంట ఏఈఓ కృష్ణవేణి ఉన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తొద్దు ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కొల్చారం కళాశాల సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం కళాశాలను తనిఖీ చేసిన ఆయన పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై ఆరా తీశారు. నిర్దేశించిన సమయంలోగా విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతించాలని ఆదేశించారు. తాగునీటి వసతి, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం తప్పనిసరి అన్నారు. కలెక్టర్ రాహుల్రాజ్ చివరి ఆయకట్టు వరకుఘనాపురం నీరు -
రికార్డులు పక్కా ఉండాలి
జెడ్పీ సీఈఓ ఎల్లయ్య మనోహరాబాద్(తూప్రాన్): మండల పరిషత్ కార్యాలయాల్లో ఉండే రికార్డులు పక్కాగా ఉండాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య పేర్కొన్నారు. మంగళవారం మనోహరాబాద్ మండల పరిషత్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. కార్యాలయానికి సంబంధించిన పలు అంశాలపై ఎంపీడీఓ కృష్ణమూర్తిని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలి చేగుంట(తూప్రాన్): గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. మంగళవారం చేగుంట ఎంపీడీఓ కార్యాలయంను సందర్శించారు.పాలకవర్గం లేకపోవడంతో గ్రామాల్లోని సమస్యలను త్వరగా పరిష్కరించేలా పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించాలని చెప్పారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి సమస్యలను పరిష్కరించే విధంగా సంబంధిత సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీశైలం, విజయ్ తదితరులు ఉన్నారు. -
వేసవిలో కూరగాయల సాగు బాగు
పీజేటీఏయూ శాస్త్రవేత్తలుకౌడిపల్లి(నర్సాపూర్): వేసవిలో కూరగాయల సాగు చేసి అధిక లాభాలు పొందవచ్చని పీజేటీఏయూ (ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం) శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. మంగళవారం రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌడిపల్లి రైతువేదికలో అధికారులు, రైతులు పాల్గొని వీక్షించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులు వేసవి సందర్భంగా కూరగాయలు సాగు చేయడంవల్ల మంచి లాభాలు వస్తాయని సూచించారు. కాగా నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకుని ఎండా వేడిమిని తట్టుకునేలా షెట్నెట్, నీడపందిరి పద్ధతిలో కూరగాయలు సాగు చేయాలన్నారు. వర్షాకాలం ప్రారంభం నాటికి దిగుబడి వస్తే డిమాండ్ బాగా ఉంటుందని మంచి లాభాలు వస్తాయన్నారు. రైతులు వ్యవసాయ అనుంబంధంగా పాడిపశువులను పెంచాలని పాడి అభివృద్ధితో ఆర్థిక అభివృద్ది చెందవచ్చని శాస్త్రవేత్తలు సూచించినట్లు ఏఓ స్వప్న తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సౌజన్య, సాహితి, రైతులు పాల్గొన్నారు. -
బాల్యవివాహాలపై అవగాహన
కౌడిపల్లి(నర్సాపూర్): గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించి బాల్యవివాహాలు జరగకుండా చూడాలని జిల్లా జెండర్ స్పెషలిస్ట్ నాగమణి తెలిపారు. మంగళవారం కౌడిపల్లి పీహెచ్సీలో మహిళా సాధికారత, బేటి బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా బాల్యవివాహాలపై ఆశావర్కర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాలతో అనర్థాలు జరుగుతాయని, పెళ్లీడు వచ్చే వరకు పెళ్లి చేయవద్దని చెప్పారు. లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మండల వైద్యాధికారి శ్రీకాంత్ మట్లాడుతూ గర్భిణులు, బాలింతల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలనారు. ఈ కార్యక్రమంలో రమేష్ పాల్గొన్నారు.జిల్లా జెండర్ స్పెషలిస్ట్ నాగమణి -
మహిళా సంఘాలకు రుణాలు
డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్రావు చిన్నశంకరంపేట(మెదక్): మహిళా సంఘాల సభ్యులకు రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం నార్సింగి మండలం బీమ్రావుపల్లి గ్రామంలో మహిళ సంఘాల సభ్యులు నిర్వహించిన నామొక్క–నా బాధ్యత కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అలాగే మహిళ సంఘాల సభ్యులు నిర్వహిస్తున్న వ్యాపారాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. బ్యాంకు లింకేజీ రుణాలతో పాటు సీ్త్రనిధి రుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా మరిన్ని రుణాలను పొందవచ్చన్నారు. రుణాలను తీసుకుని వ్యాపారం చేయడం ద్వారా వృద్ధి సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం ఆశోక్, సీసీలు సుల్తానా, శంకర్, గ్రామ కార్యదర్శి జగదీష్ ఉన్నారు. -
‘అష్ట’కష్టాలు
మెదక్జోన్: మెతుకు సీమకు మంజూరైన వైద్య కళాశాలకు ‘అష్ట’కష్టాలు చుట్టుముట్టాయి. ఈ కళాశాల భవననిర్మాణానికి ఎనిమిది నెలల క్రితమే నిధులు మంజూరైనా నిర్మించేందుకు ఇంకా స్థల సేకరణ మాత్రం పూర్తికాలేదు. ఈ వైద్య కళాశాల భవన నిర్మాణానికి 20 ఎకరాలు గుర్తించాల్సి ఉండగా ఇప్పటివకు 12 ఎకరాలు మాత్రమే అధికారులు గుర్తించగలిగారు. ఇంకా ఎనిమిదెకరాల స్థలాన్ని గుర్తించాల్సి ఉంది. దీంతో ఓ ప్రైవేటు అద్దె భవనంలోనే అరకొర వసతులతో వైద్య కళాశాలను కొనసాగిస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది ఆగస్టులో నిధులు మంజూరు గతేడాది ఆగస్టులో వైద్య కళాశాలను మంజూరు చేయడంతోపాటు హాస్టల్ భవన నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.180 కోట్లను మంజూరు చేసింది. దీంతో తాత్కాలికంగా ఓ ప్రైవేటు అద్దెభవనంలో కళాశాలను నిర్వహిస్తున్నారు. అయితే వైద్య కళాశాల, హాస్టల్ భవనాలకు 20 ఎకరాల స్థలం అవసరం కాగా ప్రస్తుతం పిల్లికొటాల్ శివారులోని మాతాశిశు(ఎంసీహెచ్) ఆస్పత్రి సమీపంలో 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. ఇందుకోసం మరో 8 ఎకరాల స్థలాన్ని గుర్తించాల్సింది ఉంది. టీజీఈడబ్ల్యూడీసీకి అప్పగింత మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి రూ.130కోట్లు, హాస్టల్ భవనానికి రూ.50కోట్లతో కలిపి మొత్తం రూ.180కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ భవన నిర్మాణ పనులను ముందుగా ఆర్అండ్బీ శాఖకు అప్పగించిన ఉన్నతాధికారులు మళ్లీ దానిని రద్దు చేస్తూ తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూడీసీ)కి అప్పగించారు. మంత్రి ఆదేశిస్తే తప్పా... మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు సంబంధిత శాఖ అధికారులు ఈ నెల 3న స్థలాన్ని పరిశీలించారు. సరిపడా ల్యాండ్ను గుర్తించి టీజీఈడబ్ల్యూడీసీకి అప్పగిస్తే దాన్ని లేఅవుట్ చేశాక టెండర్ పిలుస్తారు. అనంతరం పనులు మొదలు పెడతారు. అయితే అధికారుల నిర్లిప్తత కారణంగా ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయో ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. వైద్య కళాశాల భవన నిర్మాణానికి అప్పగించని భూమి 20 ఎకరాలకుగానూ గుర్తించింది 12 ఎకరాలే ఇంకా కావాల్సింది ఎనిమిదెకరాలు 8 నెలల క్రితమే నిధులు మంజూరు కాలేజీ, హాస్టల్ భవన నిర్మాణాలకు రూ.180కోట్లు అరకొర వసతులతో అద్దె భవనాల్లోనే మెడికల్ కాలేజీ కొనసాగింపు వారంలో అప్పగిస్తామన్నారు వైద్య కళాశాల భవనంతో పాటు హాస్టల్ భవన నిర్మాణంకోసం 20 ఎకరాల స్థలం అవసరం ఉంది. పిల్లికొటాల్ శివారులోని ఎంసీహెచ్ ఆస్పత్రి సమీపంలో వైద్యారోగ్య ఉన్నతాధికారులు 12 ఎకరాలను మాకు అప్పగించారు. మరో 8 ఎకరాల భూమి కావాలి. వారం రోజుల్లో అప్పగిస్తాం అని చెబుతున్నారు. స్థలం అప్పగించాక టెండర్ పిలవాల్సి ఉంటుంది. –చారీ, డీఈ, టీజీఈడబ్ల్యూడీసీ, మెదక్ -
కేతకి ఆదాయం రూ.11.10 లక్షలు
ఝరాసంగం(జహీరాబాద్): మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయ ఆదాయాన్ని లెక్కించారు. సోమవారం ఆలయ ఆవరణలో శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, లెక్కింపు ప్రారంభించారు. 13 రోజులలో రూ.11 లక్షల 70 వేల 698 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శివరుద్రప్ప, నాయకులు చంద్రశేఖర్, మల్లయ్య స్వామి, సంగారెడ్డి, ఆలయ అర్చకులు, అధికారులు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం నిధులకు కిషన్రెడ్డే అడ్డు
మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్హుస్నాబాద్రూరల్: కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అడ్డుపడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సోమవారం హుస్నాబాద్లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు.కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి జరగడం ఇష్టంలేదని, అందుకే నిధులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులకు ప్రతిపాదనలు ఇచ్చి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. వరంగల్ ఎయిర్ పోర్టు తన వల్లనే వచ్చిందని పక్క రాష్ట్రం కేంద్ర మంత్రితో చెప్పించుకోనే దుస్థితి కిషన్రెడ్డికే దక్కిందన్నారు. వరంగల్ ఎయిర్ పోర్టు కోసం ఏనాడైనా కిషన్రెడ్డి ప్రయత్నం చేశారా? అని మంత్రి ప్రశ్నించారు. మరో కేంద్రమంత్రి బండి సంజయ్ కేసీఆర్కు బీనామీగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మీకు బాధ్యత లేదా? నిధులు రాకుండా ఎందుకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తమిళనాడు వంటి రాష్ట్రాలు అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేస్తాయని, మన కేంద్ర మంత్రులు అభివృద్ధికి ఎందుకు సహకరించడం లేదన్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 70 కులాలను ఓబిసీలో కలిపినట్లు చెప్పారన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
చివరి ఆయకట్టుకూ నీరందించాలి
కలెక్టర్ రాహుల్రాజ్ హవేళిఘణాపూర్(మెదక్): ఎంఎన్ కెనాల్ మీదుగా మండలంలోని ఆయా గ్రామాలకు సాగు నీరు అందించే కాలువ గుర్రపు డెక్కతో నిండి ఉండడంతో ‘కాలువ ఇలా.. సాగునీరు ఎలా’ అనే కథనాన్ని ‘సాక్షి’ సోమవారం ప్రచురించింది. దీనికి స్పందించిన కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ మండలం మాచవరం, రాంపూర్ ఏరియాలో ఎంఎన్ కెనాల్ను ఆయన ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. వనదుర్గా ప్రాజెక్టు పరిధిలో ఉన్న పంటలు ఎండిపోకుండా సాగునీటిని అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వ ఆధారంగా సాగు నీటిని పొదు పుగా వాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారని వివరించారు. సింగూరు ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 21,625 ఎకరాలకు సాగునీరు సరఫరా చేయాల్సి ఉందని వెల్లడించారు. చివరి ఆయకట్టు రైతులకు సాగునీటికి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత ఇరిగేషన్ అధికారులదేనని స్పష్టం చేశారు. ఆయన వెంట ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, ఏఈ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. పంటలు ఎండిపోకుండా చర్యలు మెదక్జోన్: వేసవిలో పంటలు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ సచివాలయం నుంచి సీఎస్ శాంతకుమారి పంటలకు సాగునీటి వసతి కల్పించటంతో పాటు విద్యుత్ను నిరంతరంగా వ్యవసాయానికి ఇ వ్వాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. పకడ్బందీగా ఏఐ అమలుమెదక్జోన్: విద్యాశాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో డీఈఓ రాధాకిషన్ ఆధ్వర్యంలో ఏఐ సాఫ్ట్వేర్ను రూపొందించిన బెంగళూరు బృందంతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఏమైనా సమస్య ఉంటే క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సాఫ్ట్వేర్ బృందానికి సూచించారు. స్పందన -
చికెన్ అమ్మకాలు ఢమాల్!
రామాయంపేట(మెదక్): బర్డ్ ఫ్లూ భయం జిల్లాలోని చికెన్ సెంటర్లను తీవ్రంగా దెబ్బతీసింది. నెల రోజులుగా వ్యాపారం సరిగా సాగకపోవడంతో కొన్ని సెంటర్లు ఇప్పటికే మూతపడ్డాయి. రామాయంపేట, మెదక్, తూప్రాన్, నర్సాపూర్ వంటి పెద్ద పట్టణాలతో పాటు గ్రామాల్లో ప్రతిరోజు టన్నుల కొద్ది చికెన్ విక్రయాలు సాగేవని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం అడిగే వారే కరువయ్యారని వాపోతున్నారు. కనీసం తమ వద్ద పనిచేసే వర్కర్లకు వేతనాలు సైతం ఇవ్వలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 60 శాతం తగ్గిన విక్రయాలు జిల్లావ్యాప్తంగా సుమారు 180 నుంచి 210 వరకు చికెన్ సెంటర్లు కొనసాగుతున్నాయి. వీటిలో గతంలో ప్రతి రోజూ సుమారు 20 నుంచి 25 టన్నుల మేర చికెన్ విక్రయాలు జరిగేవి. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ భయంతో విక్రయాలు 60 శాతం తగ్గిపోయాయని విక్రయదారులు చెబుతున్నారు. జిల్లా కేంద్రమైన మెదక్లో 25 చికెన్ సెంటర్లు ఉండగా, ప్రతిరోజూ కనీసం రెండున్నర టన్నుల మేర చికెన్ అమ్మకాలు జరిగేవి. ప్రస్తుతం విక్రయాలు టన్నుకు పడిపోయినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాల్లో ఎల్లవేళలా రద్దీగా ఉండే చికెన్ మార్కెట్ ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తుంది. అయితే జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదని అధికారులు ప్రకటిస్తున్నా, ప్రజలు భయాన్ని వీడటం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే చికెన్ సెంటర్లు పూర్తిగా మూతపడే అవకాశం ఉందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ పిల్లలకు నో చికెన్ ! ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యమైనంతమేర విద్యార్థులకు చికెన్ పెట్టవద్దని జిల్లా పరిధిలోని ఆయా హాస్టళ్ల వార్డెన్లకు పరోక్ష ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కొన్ని హాస్టళ్లలో విద్యార్థులకు చికెన్ పెట్టడం మానేశారు. కొన్ని హాస్టళ్లలో మాత్రం వార్డెన్లు చికెన్ వండి పెడుతున్నారని పలు హాస్టళ్ల సంక్షేమాధికారులు పే ర్కొన్నారు. ఈ విషయమై అధికారుల నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు అందలేదని స్పష్టం చేశారు. ‘బర్డ్ ఫ్లూ’ భయంతో జనం విముఖత జిల్లాలో మూతపడిన పలు చికెన్ సెంటర్లు నష్టాల బాటలో నిర్వాహకులు ప్రజలను చైతన్యపర్చాలి బర్డ్ ఫ్లూపై ప్రజల్లో నెలకొన్న ఆందోళన, అపోహను తొలగించడానికి ప్రభుత్వం కృషి చేయాలి. వైరస్ పుకార్లతో పౌల్ట్రీకి అనుబంధంగా ఉన్న పలుశాఖలు ఇబ్బందుల పాలవుతున్నాయి. చికెన్ అమ్మకాలు 60 శాతం మేర తగ్గాయి. ఇప్పటికై నా ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రజలను చైతన్యపర్చాలి. – ఇంతియాజ్ (బిలాల్), జిల్లా చికెన్ సెంటర్ల సంఘం ప్రతినిధి -
‘ఏఐ’ అమలు తీరుపై ఆరా
నర్సాపూర్/తూప్రాన్: ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) కింద ఎంపికై న మండల ప్రజా పరిషత్ పాఠశాలను సోమవారం బెంగుళూరు ఈకే ఫౌండేషన్ సంస్థకు చెందిన టెక్నికల్ టీం సందర్శించింది. డీఈఓ రాధాకిషన్ వారికి పాఠశాలలో ప్రోగ్రాం అమలు తీరును వివరించారు. వారి వెంట ఎంఈఓ తారాసింగ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మక్సూద్ అలీ, సిబ్బంది తదితరులు ఉన్నారు. అనంతరం బృందం సభ్యులు తూప్రాన్ పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటాం పాపన్నపేట(మెదక్): ఇటీవల గుండెపోటుతో మరణించిన పాపన్నపేట హెడ్ కానిస్టేబుల్ వీరప్ప కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం వీరప్ప భార్య నాగప్ప గారి బుజ్జమ్మకు రూ. 8 లక్షల చెక్కును ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. వీటితో పాటు విడో ఫండ్ రూ. 10 వేలు, కార్పస్ ఫండ్ రూ. 50 వేలను చెక్కుల రూపంలో ఇచ్చారు. మిగితా బెనిఫిట్స్ సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ కుటుంబాల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, ఏఓ మణి, సూపరింటెండెంట్ అనురాధ, జూనియర్ అసిస్టెంట్ రమేష్ పాల్గొన్నారు. గోదాంలతో ఎంతోమందికి ఉపాధి మెదక్జోన్: సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) 69వ వార్షికోత్సవ వేడుకలను సోమవారం మెదక్లో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా మేనేజర్ కోటేశ్వర్రావు మాట్లాడుతూ.. దేశంలో హైదరాబాద్ రీజియన్ పరిధిలో వరుసగా మూడేళ్లుగా ఆదాయం అర్జిస్తూ ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు. గోదాంలతో ఎందరికో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. అంతకుముందు హమాలీలతో పాటు సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీరామ్ టేక్మాల్(మెదక్): ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మండలంలోని తంప్లూర్ గ్రామానికి చెందిన పట్లోళ్ల శ్రీరామ్యాదవ్ను నియమించారు. ఈసందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. 2023లో హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎన్ఎస్యూఐ తరఫున జనరల్ సెక్రటరీ పోటీ చేసి విద్యార్థుల మద్దతు పొందినట్లు చెప్పారు. తన ఎన్నికకు సహకరించిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి, జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి జీ, జాతీయ ఇన్చార్జి కన్హయ్య కుమార్ తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండల నాయకులు శ్రీరామ్ యాదవ్ను అభినందించారు. ప్రజావాణికి 24 వినతులు మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజావాణికి 24 వినతులు వచ్చాయి. గత మూడు వారాలుగా హెల్ప్డెస్క్ ద్వారా అర్జీలు స్వీకరించారు. ఈ వారం అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
డీఎంహెచ్ఓ శ్రీరామ్ మెదక్జోన్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ శ్రీరామ్ హెచ్చరించారు. సోమవారం తన కార్యాలయంలో జిల్లాలోని వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ప్రత్యేక అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆడపిల్లల భ్రూణహత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలు తగ్గించడమే స్పెషల్ డ్రైవ్ లక్ష్యమన్నారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్ చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో వైద్యులు సునీతాదేవి, సృజన, జ్ఞానేశ్వర్, మాధవి, వినయ్ సుశీల్, శివదయాల్, శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు. -
రంజాన్కు పక్కాగా ఏర్పాట్లు
అదనపు కలెక్టర్ నగేష్ మెదక్ కలెక్టరేట్: రంజాన్కు పక్కాగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్లో మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు, శాంతి కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈద్గాల వద్ద తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. తాగునీరు అవసరమైన చోట అదనంగా నీటి ట్యాంకర్ను ఏర్పాటు చేయాలన్నారు. మసీదుల వద్ద చెత్త డబ్బాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని చెప్పారు. అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. అలాగే దుకాణాల వద్ద ఆహార భద్రత నిబంధనలు తప్పకుండా అనుసరించాలన్నారు. వివిధ పదార్థాల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. మతపెద్దలు సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్లైన్ నంబర్ ఏర్పాటు చేయ నున్నట్లు వెల్లడించారు. అనంతరం ఎల్ఆర్ఎస్పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఎస్పీ ప్రసన్నకుమార్, డీఆర్ఓ భుజంగరావు, డీపీఓ యాదయ్య, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మూగజీవాలకు భరోసా..
●సంచార వైద్య సేవలతో సత్ఫలితాలు ●‘1962’కు కాల్తో అత్యవసర వైద్యంతూప్రాన్: మూగజీవాలకు సత్వర వైద్యం అందించేందుకు 2017లో అప్పటి ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. టోల్ఫ్రీ నంబర్ 1962కు ఒక్క ఫోన్ చేస్తే చాలు రైతులు కోరిన చోటుకు అంబులెన్స్లో సిబ్బంది వచ్చి పశువులకు చికిత్స అందిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో పశువులు, జీవాల మరణాలు గణనీయంగా తగ్గాయి. జిల్లావ్యాప్తంగా రెండు పశుసంచార వాహనాల ద్వారా నెలకు సుమారు 1,800కు పైగా మూగజీవాలకు చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ మారుమూల గ్రామాల్లో అత్యవసర వైద్యం కింద మూగజీవాలు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు వైద్యసేవలు అందుతున్నాయి. పశుసంచార వాహనంలో మూగజీవాలకు సంబంధించిన అన్ని రకాల మందులతో పాటు చికిత్సకు అవసరమయ్యే పరికరాలు అందుబాటులో ఉంటున్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న 2 సంచార వాహనాల్లో మొత్తం ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 10 వాహనాలతో పాటు 40 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. పశువులకు అందించిన చికిత్స వివరాలు సంవత్సరం పశువులు 2021 3,986 2022 3,794 2023 4,123 2024 3,964 2025 ఫిబ్రవరి వరకు 648జిల్లాలో ఇలా.. పశువైద్య కేంద్రాలు: 67 ఉప కేంద్రాలు: 35 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు: 29 మంది ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు: మెదక్, నర్సాపూర్, రామాయంపేట సరైన వైద్య సేవలు ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా ఉన్న రెండు పశు సంచార వాహనాల ద్వారా 35 వేల మూగజీవాలను కాపాడగలిగాం. ఎక్కడా ఎలాంటి సమస్య ఉన్నా తమకు ఫోన్్ వచ్చిన వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సరైన చికిత్స అందిస్తున్నాం. సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండటంతో పాటు వైద్య చికిత్సకు సంబంధించిన అన్ని పరికరాలు వాహనాల్లో అందుబాటులో ఉంచాం. – అప్రోజ్, పశుసంచార వాహనాల జిల్లా కో మేనేజర్ గేదెను కాపాడారు నా గేదె అనారోగ్యంతో రెండు, మూడు రోజులుగా మేత మేయలేదు. దీంతో 1962 నంబర్కు ఫోన్ చేశా. గంట వ్యవధిలో సిబ్బంది ఇంటి వద్దకు వచ్చి గేదెకు చికిత్స అందించారు. మూడు రోజుల అనంతరం గేదె ఆరోగ్యం మంచిగా అయింది. – నర్సింలు, చిన్నగొట్టిముక్ల, శివ్వంపేట -
పక్కాగా పంటల నమోదు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో పంటల నమోదు పక్కాగా జరుగుతోంది. ప్రతి రైతుకు ప్రయో జనం అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి జిల్లా లో వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. సర్వే నంబర్ల ఆధారంగా సాగు వివరాలు, పంటల ఫొటోలు యాప్లో పొందుపరుస్తున్నారు. ఒక్కో అధికారికి 2 వేల ఎకరాలు జిల్లాలో మొత్తం 21 మండలాలు, 493 గ్రామా లు ఉండగా.. వీటిని వ్యవసాయ అధికారులు 76 క్లస్టర్లుగా విభజించి డిజిటల్ సర్వే ప్రారంభించారు. ఇందులో మొత్తం 1,49,593 ఎకరాల్లో సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ముమ్మరంగా సర్వే కొనసాగిస్తున్నారు. జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులకు ఒక్కొక్కరికి 2 వేల ఎకరాలు సర్వే చేయాలని ఆదేశించారు. అయితే మహిళా అధికారులకు మాత్రం 1,800 ఎకరాల టార్గెట్ ఇచ్చారు. ఎవరైనా పంట వేయకుంటే నో క్రాప్ అని నమోదు చేస్తున్నారు. అయితే వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లినప్పుడు కొన్ని గ్రామాల శివారులో సిగ్నల్స్ సమస్య తలెత్తుతోంది. దీంతో డిజిటల్ సర్వే ఆలస్యం అవుతోంది. అయినప్పటికీ ఇప్పటివరకు 63,890 ఎకరాల్లో 40 శాతం సర్వే పూర్తయింది. ఇంకా జిల్లాలో 85,703 ఎకరాల విస్తీర్ణంలో పంటల నమోదు చేయాల్సి ఉంది. సిగ్నల్స్ సమస్యతో సర్వే జాప్యం అవుతున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రైతులకు ప్రయోజనాలు జిల్లాలో జరుగుతున్న పంటల సాగు డిజిటల్ సర్వేతో రైతులకు అనేక ప్రయోజనాలు అందనున్నాయి. సర్వే ఆధారంగా ఎక్కడ, ఏ రైతులు ఏ పంట వేస్తున్నారనే విషయం ప్రభుత్వానికి తెలుస్తుంది. రైతులు పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు ప్రభు త్వం మార్కెట్ సౌకర్యం కల్పి స్తుంది. అలాగే రైతులు ప్రకృతి విపత్తుల నుంచి నష్టపోకుండా పంటల బీమా వసతి కల్పించనుంది. పంట నష్టం అంచనా పక్కాగా ఉంటుంది.కొనసాగుతున్న డిజిటల్ క్రాప్ సర్వే20 రోజుల్లో పూర్తి చేస్తాం జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే 40 శాతం పూర్తయింది. మిగితాది మరో 15, 20 రోజుల్లో పూర్తి చేస్తాం. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ సర్వే ద్వారా రైతులకు సబ్సిడీలు, ఎరువులు, పురుగు మందులు, విత్తనొత్పత్తి , రైతుబీమా, భరోసా వంటి పథకాలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సర్వే త్వరగా పూర్తయ్యేందుకు రైతులు అధికారులకు సహకరించాలి. – వినయ్కుమార్, ఇన్చార్జి జిల్లా వ్యవసాయ అధికారి -
ఏడుపాయలలో భక్తుల సందడి
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల ఆదివారం జనసంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశా రు. అమ్మవారికి ఒడి బియ్యం పోసి, బోనాలు తీసి మొక్కులు తీర్చుకున్నారు. జాతరకు రాలేని వారు ఎక్కువ సంఖ్యలో తరలిరావడంతో ధర్మసత్రాలు దొరకక ఇబ్బంది పడ్డారు. చెట్ల కింద టెంట్లు వేసుకొని విందు చేసుకున్నారు. వాహనాల రద్దీతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈఓ చంద్రశేఖర్, ఎస్ఐ శ్రీనివాస్గౌడ్, ఆలయ ఉద్యోగులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆధ్యాత్మిక కేంద్రంగా బుదేరా మంత్రి దామోదర రాజనర్సింహ మునిపల్లి(అందోల్): ఆధ్యాత్మిక కేంద్రంగా బుదేరాను తీర్చిదిద్దుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం మండలంలోని బుదేరా శివారులో గల హనుమాన్ దేవాలయం వద్ద వైదిక పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బర్ధిపూర్ దత్తాత్రేయ పీఠాధిపతి అవధూత గిరి మహరాజ్ మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం బుదేరా శివారులో వైదిక పాఠశాలను ఏర్పాటు చేసి కులమతాలకతీతంగా పిల్లలకు వేదాలు నేర్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిద్దేశ్వర్ మహరాజ్, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ మనోహర్ యాదవ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సతీష్ కుమార్, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. జాతీయ సమైక్యత శిబిరానికి తారా అధ్యాపకుడుసంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకుడు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ జగదీశ్వర్ ఒడిశాలో జరిగే ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యత శిబిరానికి ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె ఎస్ రత్నప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సహకారంతో ఒడిశా ఎన్ఎస్ఎస్ రీజినల్ డైరెక్టరేట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ శిబిరానికి రాష్ట్రం నుంచి ఆరుగురు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కలిగిన బృందం బయలుదేరుతుందని, ఈ బృందానికి కాంటినెంట్ లీడర్గా తమ కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ జగదీశ్వర్ వ్యవహారించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు జరుగుతుందనిన్నారు. జాతీయ సమైక్యత శిబిరానికి తమ కళాశాల అధ్యాపకుడు ఎంపిక కావడం పట్ల అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేసింది. క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్ రామచంద్రాపురం(పటాన్చెరు): క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్ ఉంటుంద ని తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు టి.రాజు అన్నారు. ఆదివారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కొల్లూరు ఢీల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరిగిన రాష్ట్ర ఆర్చరీ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ పోటీలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విజేయలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలలో రాణించే వారికి విద్య, ఉపాధి, ఉద్యోగాలలో ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయని చెప్పారు. ఈ పోటీలలో సుమారు 500 మంది పాల్గొన్నారన్నారు. అందులో ఎంపికై న వారు ఈనెల 22న విజయవాడలో జరిగే జాతీయస్థాయి ఆర్చరీ క్రీడాల్లో పాల్గొంటారని చెప్పారు. అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు -
ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచాలి
చిన్నశంకరంపేట(మెదక్): ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగేలా సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. అనంతరం అస్సత్రిలోని ఆయా విభాగాలను సందర్శించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. అస్పత్రి రికార్డులు, హాజరుపట్టికను తనిఖీ చేశారు. శ్రీపాదరావుకు నివాళి మెదక్ కలెక్టరేట్: మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని ఆదివారం కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ప్రజల కోసం శ్రీపాదరావు చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి దామోదర్రెడ్డి, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
కాలువ ఇలా.. సాగు ఎలా!
గుర్రపు డెక్కతో నిండిన ఎంఎన్ కెనాల్ కాలువఘనపూర్ ఆనకట్ట నుంచి మండల పరిధిలోని ఆయా గ్రామాలకు సరఫరా అయ్యే కాలువలో గుర్రపు డెక్క పేరుకుపోయింది. మండల పరిధిలోని ఎంఎన్ కెనాల్ ద్వారా ముత్తాయికోట, కూచన్పల్లి, ముత్తాయిపల్లి, సర్దన, ఫరీద్పూర్, పోచమ్మరాల్ గ్రామ శివారులోని పొలాలకు సాగునీరు సరఫరా అవుతుంది. దీంతో కూచన్పల్లి వద్ద కాలువలో గుర్రపు డెక్క పేరుకుపోయి చివరి ఆయకట్టు రైతులకు సాగునీరందక ఇబ్బంది పడుతున్నారు. కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించి సాఫీగా సాగు నీరు సరఫరా అయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు. – హవేళిఘణాపూర్(మెదక్) -
వందలాది కోళ్ల మృత్యువాత
కొల్చారం(నర్సాపూర్): గంటల వ్యవధిలోనే వందలాది కోళ్లు మృత్యువాత పడిన సంఘటన మండలంలోని నాయిని జలాల్పూర్లో జరిగింది. గ్రామానికి చెందిన సతీష్గౌడ్ ఉపాధి కోసం కొన్నినెలల క్రితం పౌల్ట్రీ ఫాం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆదివారం ఏం జరిగిందో ఏమో ఒక్కసారిగా ఫాంలోని కోళ్లు ఒక్కొక్కటిగా మృత్యువాత పడసాగాయి. దీంతో అప్రమత్తమైన యజమాని మిగితా కోళ్లకు ప్రమాదం జరగకుండా వాటిని వెంట వెంటనే తొలగించారు. సుమారు 1,000 కోళ్లు మృత్యువాత పడ్డాయని, సుమారు రూ. 2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. అయితే ఒక్కసారిగా వందలాది కోళ్లు మృత్యువాత పడటంతో బర్డ్ ఫ్లూ వచ్చిందేమోనని గ్రామస్తులు ఆందోళన చెందారు. ఈ విషయమై జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్యను వివరణ కోరగా.. జిల్లాలో ఇప్పటివరకు ఒక్క బర్డ్ ఫ్లూ కేసు నమోదు కాలేదని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సోమవారం పౌల్ట్రీ ఫాంను సందర్శించి నిర్ధారణ చేస్తామని తెలిపారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
ఐఐటీ హైదరాబాద్లో ఉప రాష్ట్రపతి పర్యటనసంగారెడ్డి జోన్: భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖఢ్ కంది శివారులోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో పర్యటించారు. ఆదివారం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మతో కలిసి క్యాంపస్ను సందర్శించారు. మధ్యా హ్నం సుమారు 3:15 నిమిషాలకు మూడు ప్రత్యేక హెలిక్యాప్టర్ల ద్వారా క్యాంపస్కు చేరుకున్నారు. క్యాంపస్కు వచ్చిన వారికి గవర్నర్, ఐఐటీ హైదరాబాద్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ డాక్టర్ బీఆర్ మొహన్రెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ చెన్నూరి రూపేష్, ఎంపీ రఘునందన్రావు, ఐఐటీ హెచ్ డైరెక్టరు బీఎస్ మూర్తి, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి పుష్ఫగుచ్ఛాలు అందించి, మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఉపరాష్ట్రపతి పర్యటన ఉత్సాహంగా.. ఉల్లాసంగా సాగింది. క్యాంపస్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధికి ప్రోత్సహించే సంకేతంగా ఉప రాష్ట్రపతి భార్య డా.సుదేశ్ ధన్ఖఢ్తో కలిసి ఏక్ పేడ్ మా కె నామ్ పేరుతో మొక్క నాటి నీరు పోశారు. అనంతరం క్యాంపస్ సభాస్థలి వెళ్లారు. జాతీయ గీతాలాపన చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐఐటీ డైరెక్టరు బీఎస్.మూర్తి ఉప రాష్ట్రపతితో పాటు గవర్నర్కు శాలువాతో సన్మానించి, జ్ఞాపికలను బహూకరించారు. ఐఐటీ డైరెక్టరు ఐఐటీ సాధించిన ముఖ్యమైన విజయాలను వివరించారు. ఐఐటీ విద్యార్థులతో ముచ్చటించి, విద్యార్థులతో కలిసి ఫొటోలు దిగారు. అనంతరం ప్రత్యేక హెలిక్యాప్టర్లలో సుమారు 4:30 నిమిషాలకు హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఐఐటీ విద్యార్థులు, అధ్యాపకులు నాకు అతిథులు ఐఐటీ విద్యార్థులు, అధ్యాపకులు తనకు అతిథులని, పార్లమెంట్ను సందర్శించాలని ఉపరాష్ట్రపతి కోరారు. భారత దేశం వివిధ భాషల నిలయమని చెప్పారు. -
సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి
హుస్నాబాద్: వ్యవసాయ మార్కెట్ యార్డులో సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ డివిజన్ ఇన్చార్జి కవ్వ వేణుగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పంట చేతికి వస్తున్నా కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేయలేదన్నారు. సన్ ఫ్లవర్ క్వింటాలుకు రూ.6వేలు మద్దతు ధర నిర్ణయించిందన్నారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటులో జాప్యం జరుగుతుండటంతో దళారులు క్వింటాలుకు రూ. 5 వేలకే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం చొరవ తీసుకొని వెంటనే కొనుగొలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. -
‘రిజర్వేషన్ల ప్రాతిపదికనే నామినేటెడ్ పదవులు’
వర్గల్(గజ్వేల్): వివిధ నామినేటెడ్ పదవులను రిజర్వేషన్ల ప్రాతిపదికన భర్తీ చేస్తామని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. ఆదివారం వర్గల్ మండలం గౌరారం ఎస్సీవాడలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ఇక్కడి సమస్యలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని, సీఎం రేవంత్రెడ్డి గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తున్నారన్నారు. కార్యకర్తలు ప్రతిఒక్కరూ పార్టీకి విధేయులై పనిచేయాలని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. -
ఇళ్ల నిర్మాణం.. ఇక వేగవంతం
రామాయంపేట(మెదక్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకరంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మరో ముందుడుగు పడింది. ఈమేరకు జిల్లాలోని మండల కేంద్రాల్లో రూ. ఐదు లక్షలతో ఇందిరమ్మ మోడల్ హౌస్లు నిర్మించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు, వాటిని నిర్మించే మేసీ్త్రలకు అవగాహన కల్పించడానికి వీలుగా వీటిని నిర్మించనున్నారు. జిల్లాలో మొదటి విడతలో పది మండలాల్లో మోడల్ హౌస్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం రామాయంపేట, మెదక్, టేక్మాల్, పాపన్నపేట, రేగోడ్లో ఇళ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గృహా నిర్మాణ శాఖ అధికారులు దగ్గరుండి నిర్మాణాలను పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న మోడల్ హౌస్లను లబ్ధిదారులు చూసి వెళ్తున్నారు. రూ. 5 లక్షలతో ఎలా ఇళ్లు నిర్మించాలన్న విషయమై అవగాహన కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదే విషయమై గృహా నిర్మాణశాఖ డీప్యూటీ ఈఈ యాదగిరి మాట్లాడుతూ.. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు అవగాహన కల్పించడానికి గాను ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల కేంద్రాల్లో మోడల్ హౌస్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఈమేరకు ఐదు మండల కేంద్రాల్లో నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. మిగితా మండలాల్లో సైతం త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.మండలానికో ఇందిరమ్మ మోడల్ హౌస్ -
మొక్క.. ఏది లెక్క?
రామాయంపేట(మెదక్): రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో హరితహారం నిధులు రూ. లక్షలు దుర్వినియోగం అయ్యాయి. పట్టణంలో అధికారులు రెండు నర్సరీలను ఏర్పాటు చేశారు. మార్కెట్ కమిటీ కార్యాలయం వెనుక భాగంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో గతంలో ఒకటి ఏర్పాటు చేశారు. ఈ నర్సరీలో మొక్కల సంరక్షణ పేరిట రూ. లక్షలు ఖర్చు చేశారు. నర్సరీ చుట్టూ ఫెన్సింగ్ వేసి గేటు, ఆర్చ్ నిర్మించారు. ెమొక్కలకు నీరు పారించడానికి ప్రత్యేకంగా వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి బోరు తవ్వించారు. ఇందులో వేల సంఖ్యలో మొక్కలు నాటినట్లు ప్రకటించారు. నాటిన మొక్కలను పట్టణ వాసులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే నామమాత్రంగా వార్డుకు ఒకరిద్దరికి పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఈనర్సరీలో నాటిన మొక్కలు కొన్ని ఎండిపోయాయి. ఏమైందో తెలియదు కాని కేవలం నీటి వసతి లేదనే కారణంతో ఈ నర్సరీని వదిలేసి దీని స్థానంలో వెంకటేశ్వర కాలనీలో మరో నర్సరీ ఏర్పాటు చేశారు. దీనిలో కూడా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటినట్లు అధికారులు చెప్పారు. అక్కడ ప్రస్తుతం పదుల సంఖ్యలో మాత్రమే మొక్కలున్నాయి. ఈ నర్సరీ చుట్టూ ఫెన్సింగ్, బోరు తవ్వకం, ఆర్చ్ నిర్మాణం కోసం బడ్జెట్లో మళ్లీ రూ. ఐదు లక్షల వరకు కేటాయించారు. కాగా మొదటి నర్సరీ కోసం ఖర్చు చేసిన నిధులు రూ. లక్షలు బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. రహదారి పక్కనే ఉన్న నర్సీరీని వదిలివేయడంతో సామగ్రి దొంగలపాలవుతోంది. వెంకటేశ్వర కాలనీలో ఏర్పాటు చేసిన నర్సరీలో కేవలం పదుల సంఖ్యలో మొక్కలు ఉండగా, గతంలో బోరు తవ్వించారు. ఈ నర్సరీ చుట్టూ ఫెన్సింగ్, ఆర్చ్, వాటర్ ట్యాంక్ నిర్మాణానికి రూ. ఐదు లక్షలు ఇటీవల జరిగిన మున్సిపల్ సమావేశంలో మంజూరు చేశారు. ముందుగా ఏర్పాటు చేసిన నర్సరీ నిరుపయోగంగా వదిలేయడంతో పాటు రెండో నర్సరీలో తక్కువ సంఖ్యలో మొక్కలు ఉండగా, వీటి నిర్వహణ పేరిట ఖర్చు చేసిన రూ. లక్షలు దుర్వినియోగం అయ్యాయి. ఈవిషయమై పట్టణ వాసులు మాట్లాడుతూ.. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నర్సరీల పేరిట రూ. లక్షలు దుర్వినియోగంపాత నర్సరీని పునరుద్ధరిస్తాం మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారి పక్కనే గతంలో ఏర్పాటు చేసిన నర్సరీలో నీటి వసతి లేకపోవడంతో తాత్కాలికంగా పక్కన పెట్టాం. గతేడాది వెంకటేశ్వర కాలనీలో ఏర్పాటు చేసిన నర్సరీలో ఇంకా అవసరమైన మొక్కలు నాటి వాటిని పూర్తి స్థాయిలో సంరక్షిస్తాం. నిధుల దుర్వినియోగం విషయమై తన దృష్టికి రాలేదు. తన హయాంలో నిధుల దుర్వినియోగం జరగలేదు. దీనిపై విచారణ జరిపిస్తాం. – దేవేందర్, మున్సిపల్ కమిషనర్ -
రోడ్లపై చెత్త కనిపించొద్దు
మెదక్ మున్సిపాలిటీ: అధికారులు ప్రజలతో మమేకమై విధులు నిర్వర్తించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శనివారం మెదక్ పట్టణంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈసందర్భంగా ఆయా ప్రాంతాల్లో త్వరలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి స్థల పరిశీలన చేశారు.ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బంది ప్రజలతో మమేకమై వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రోడ్లు, డ్రైనేజీలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోడ్లపైన చెత్త కనిపించకుండా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మా.. వెళ్లొస్తాం
ముగిసిన ఏడుపాయల జాతరజాతర ఆదాయం రూ. 61.50 లక్షలు ఏడుపాయల జాతర హుండీ ఆదాయం రూ. 61,50,237 వచ్చినట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం గోకుల్ షెడ్లో హుండీ లెక్కింపు చేపట్టారు. నగదుతో పాటు మిశ్రమ బంగారు వెండి కానుకలు వచ్చినట్లు వివరించారు. గతేడాది జాతరకు రూ. 61,18,186 ఆదాయం వచ్చింది. అప్పటితో పోలిస్తే రూ. 32,051 అధికంగా వచ్చినట్లు తెలిపారు. కాగా గతేడాది 14 రోజుల అనంతరం హుండీ లెక్కించగా, ఈసారి 16 రోజుల అనంతరం లెక్కించారు. కార్యక్రమంలో రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు, చీఫ్ ఫెస్టివెల్ అధికారి కృష్ణ, ఉద్యోగులు పాల్గొన్నారు.పాపన్నపేట(మెదక్): మూడు రోజులుగా కొనసాగిన ఏడుపాయల జాతర శనివారం ముగిసింది. దుర్గమ్మా.. వెళ్లొస్తాం.. అంటూ భక్తులు తమ ఇళ్లకు మళ్లారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రారంభమైన ఏడుపాయల జాతరకు ఈ ఏడాది భక్తులు తక్కువగా వచ్చారు. కుంభమేళా ప్రభావం కొంతమేర కనిపించింది. కలెక్టర్ ఆధ్వర్యంలో రెండుసార్లు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. తాగు నీటి కోసం భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీరు లేక కొన్ని చోట్ల టాయిలెట్లు సైతం మూతబడ్డాయి. వివిధ శాఖల అధికారులకు ఏర్పాటు చేసిన షెడ్లలో తాగు నీటి సమస్యలు తప్పలేదు. రోజుకు కేవలం 120 లీటర్ల నీరు ఇచ్చి సరిపెట్టు కొమ్మన్నారని వైద్యారోగ్య శాఖ సిబ్బంది వాపోయారు. జాతర లో సిగ్నల్స్ పనిచేయకపోవడంతో పలువురు భక్తులు తప్పిపోయారు. చేతిలో సెల్ఫోన్లు ఉన్నా, తప్పిపోయిన వారు ఎక్కడ ఉన్నారో తెలియక పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఏడుపాయల జాతరకు వచ్చిన గంగాపూర్కు చెందిన యువకుడు శివరాత్రి రోజు ఘనపురం ఆనకట్టలో శవమై తేలాడు. శనివారం హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు మంజీరా పాయల్లో మృత్యువాత పడ్డారు. వారి కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చారు. పోలీస్ అధికారులు ట్రాఫిక్ సమస్య అరికట్టగలిగారు. అయితే ఏడుపాయల పాలక వర్గం లేని లోటు స్పష్టంగా కనిపించింది.జాతర నుంచి ఇంటి దారి పడుతున్న భక్తులు -
చదువులో పోటీ పడాలి
హవేళిఘణాపూర్(మెదక్): విద్యార్థులు పోటీ పడి చదివితే మంచి భవిష్యత్ ఉంటుందని డీఈఓ రాధాకిషన్ అన్నారు. శనివారం మండల స్థాయిలో నిర్వహించిన క్విజ్, చిత్రలేఖనం,తెలుగు, ఇంగ్లీష్ భాషలపై పఠనం తదితర వాటిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. భవిష్యత్లో విద్యార్థుల ఉన్నతికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలన్నా రు. మండల స్థాయి ప్రతిభా పోటీలు నిర్వహించిన ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో ఎంఈఓ మధుమోహన్, ఏఎంఓ సుదర్శనమూర్తి, కరుణాకర్, నాగుల్ మీరా మండలంలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు -
ఐక్యతకు చిరునామాగా ఉమ్మడి కుటుంబాలు
● అరమరికలు లేకుండా..అంతా కలిసికట్టుగా ● ఒకే ఇంట్లో ఆప్యాయత, అనురాగాల మధ్య ● ఏళ్ల నాటి నుంచి ఉమ్మడిగానే జీవనం ● కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ● ఆదర్శంగా నిలుస్తున్న పలు కుటుంబాలువివరాలు 8లోనేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలుమెదక్జోన్: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో ఆదివారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెలలో ముస్లింలు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కఠోర ఉపవాస దీక్షలను పాటిస్తారు. మసీదుల్లో ఐదువేళలా ప్రార్థనలతో పాటు పవిత్ర తరావీహ్ నమాజు, ఖురాన్ను పఠిస్తారు. నెలవంక తిరిగి దర్శనమిచ్చేంత వరకూ ఈ ఉపవాస దీక్షలను పాటిస్తారు. -
ఊరిస్తున్న మార్కెట్ కమిటీలు!
మెదక్జోన్: మెదక్ మార్కెట్ కమిటీ పదవీ కాలం 2023 సెప్టెంబర్ 13న ముగిసింది. అప్పటి నుంచి పాలకమండలిని ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం బీసీకి రిజర్వుడ్ కావటంతో చైర్మన్ పదవి కోసం సీనియర్ నేత ముత్యంగౌడ్, గూడూరి ఆంజనేయులు, జీవన్రావు, శంకర్గౌడ్, మంగ మోహన్గౌడ్, జీవన్రావు, బట్టి సులోచన పోటీ పడుతున్నారు. అయితే వీరిలో పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. రామాయంపేట మార్కెట్ కమిటీ చెర్మన్ పదవి ముగిసి రెండేళ్లు గడిచిపోయింది. ఇది ఎస్టీకి రిజర్వు కావటంతో నలుగురు గిరిజన నేతలు పోటీ పడుతున్నారు.చిన్నశంకరంపేట మండలం కామారం తండాకు చెందిన మోహన్నాయక్, ఇదే మండలం టీ మాందాపూర్ తండాకు చెందిన సురేందర్ నాయక్, అశోక్నాయక్తో పాటు నార్సింగి మండలంలోని ఓ తండాకు చెందిన రాజాసింగ్, నిజాంపేట మండలానికి చెందిన మరో ఇద్దరు పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇక్కడ పోటీదారులు ఎక్కువ కావటంతో డ్రా పద్దతిన చైర్మన్ను ఎన్నుకుంటామని కీలక నేత ఒకరు తెలిపారు. పాపన్నపేట మార్కెట్ కమిటీ పాలకవర్గం 2024 జనవరి 12వ తేదీతో ముగిసింది. ప్రస్తుతం ఇది ఎస్సీకి రిజర్వుడ్ కావటంతో చైర్మన్ పదవి కోసం వినోద, అమృతరావు, మధు, శ్రీనివాస్, అల్లారం రత్నయ్య, క్రీస్తుదాసు, సూర్య పోటీ పడుతున్నారు. చేగుంట మార్కెట్ కమిటీ పాలకవర్గం 2022 మే 27వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి పాలకమండలిని నియమించలేదు.ఇది ఓసీకి రిజర్వుడ్ కావడంతో చైర్మన్ పదవి కోసం చేగుంట కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్, వెంగళరావు, భాస్కర్ పోటీ పడుతున్నారు. నర్సాపూర్ మార్కెట్ కమిటీ 2022 సెప్టెంబర్ 25తో ముగిసింది. అప్పటి నుంచి పాలకమండలిని ఎన్నుకోలేదు. ఇది బీసీకి రిజర్వుడ్ కావటంతో నర్సాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశ్, శివ్వంపేట మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్గౌడ్ పోటీ పడుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మార్కెట్ కమిటీని రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనరల్కు రిజర్వుడు అయింది. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఉమ్మన్నగారి భాస్కర్రెడ్డి, కాళ్లకల్కు చెందిన మరో సీనియర్ నేత మల్లారెడ్డి పోటీ పడుతున్నారు.మార్కెట్ పాలకవర్గాలను ఏర్పాటుచేయకపోవడంతో రైతులు పండించిన ఉత్పత్తులను కొనుగోలు చేసే వారు కరువయ్యారు. రామాయంపేట మార్కెట్ కమిటీ పరిధిలో వరి తర్వాత మొక్కజొన్న ఎక్కువగా పండిస్తారు. పాలకమండలి లేకపోవటంతో పంటను కొనుగోలు చేసేవారు ఎవరూ లేరు. దీంతో అన్నదాతలు తక్కువ ధరకు బయటి వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే మెదక్ మార్కెట్ కమిటీ జిల్లా కేంద్రంలో ఉండటంతో ఇతర మండలాల నుంచి రైతులు మొక్కలు, కందులు, పొద్దుతిరుగుడు లాంటి ఉత్పత్తులు తీసుకొస్తారు. పాలకవర్గం లేకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. జిల్లాలోని మిగితా మార్కెట్లలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. -
విద్యుత్ సమస్యలు రాకుండా చర్యలు
చేగుంట(తూప్రాన్): గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు రాకుండా ఈ ఏడాది 800 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లలను ఏర్పాటు చేసినట్లు విద్యుత్శాఖ రూరల్ జోన్ సీఈ బాలస్వామి తెలిపారు. మండలంలోని కర్నాల్పల్లిలో విద్యుత్ సమస్యపై శుక్రవారం గ్రామస్తులు ధర్నా చేసిన విషయం తెలుసుకున్న ఆయన అధికారులతో కలిసి శనివారం సబ్స్టేషన్ను సందర్శించారు. సిబ్బందితో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం బాలస్వామి మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో గతేడాది కంటే ఈసారి పదిశాతం ఎక్కువ విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. వారం రోజుల్లో మరో 82 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గొల్లపల్లిలో ఇటీవలే సబ్స్టేషన్ ప్రారంభించడంతో లోడ్ సైతం తగ్గిపోయిందని పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలు వస్తే స్థానిక ఏఈలకు వివరించాలని, వెంటనే పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఈ శంకర్, డీఈ గరత్మంత్రాజు, ఏడీఈ ఆదయ్య, ఏఈ భరత్ గ్రామస్తులు పాల్గొన్నారు.విద్యుత్ శాఖ రూరల్ జోన్ సీఈ బాలస్వామి -
కృత్రిమ మేధతో ఉత్తమ భవిత
నర్సాపూర్: కృత్రిమ మేధతో విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కృత్రిమ మేధ కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించారు. విద్యార్థులకు చదవడం, రాయడం సామర్థ్యాల పెంపుపై నిర్వాహకులకు ఆయన అవగాహన కల్పించారు. కృత్రిమ మేధతో విద్యార్థులు ఎలా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోగలిగితే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంను నిర్మించవచ్చని వివరించారు. జిల్లాలో ఆరు పాఠశాలల్లో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని వివరించారు. కలెక్టర్ వెంట ఎంఈఓ తారాసింగ్, పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు. పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు మెదక్జోన్/మెదక్ కలెక్టరేట్: ఇంటర్ పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. ఈనెల 5వ తేదీ నుంచి 23 వరకు జరగనున్న పరీక్షల ఏర్పాట్లపై శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎక్కడా తప్పులు దొర్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. తాగునీరు, మూత్రశాలల సౌకర్యం వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ ఎస్కార్ట్తో ప్రభుత్వ వాహనంలో పరీక్ష పేపర్లను తరలించాలన్నారు. ప్రతి సెంటర్కు ఇద్దరు కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహించాలన్నారు. విద్యుత్ సరఫరా నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రాథమిక చికిత్స కిట్లు అందుబాటులో ఉండాలని, ఆశావర్కర్లను నియమించాలని చెప్పారు. పరీక్ష రాసే విద్యార్థుల గదుల్లో ఎలాంటి మెటీరియల్ లేకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పేపర్ల తనిఖీ నిర్వహించాలని.. ఎక్కడా మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఏవీఎస్గా విధులు నిర్వర్తించిన కిశోర్బాబు శుక్రవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈసందర్భంగా ఆయనను కలెక్టర్ సత్కరించి, పూలమాలతో సన్మానించారు. ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఉద్యోగికి సహజమని తెలిపారు. కార్యక్రమంలో డీపీఆర్ఓ రామచంద్రరాజు, ఏపీఆర్ఓ బా బురావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
రథోత్సవం.. రమణీయం
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జాతర చివరి రోజైన శుక్రవారం వనదుర్గమ్మ రథంపై ఊరేగారు. ఆచారం ప్రకారం దేవాలయ అధికారులు నాగ్సాన్పల్లిలోని సాయిరెడ్డి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి ఉత్సవానికి ఆహ్వానించారు. గ్రామానికి చెందిన 18 కులాలు, పనిబాటల వారు రథం ముందు పట్టు పరిచి, ముగ్గులు వేసి, మంత్రాలు చదివి, గుమ్మడి కాయ బలి ఇచ్చారు. అనంతరం వేద బ్రాహ్మణులు పూజలు చేశారు. ఆచారం ప్రకారం హక్కు బాపతుల వారిని, పూలమాలలు, శాలువాతో సన్మానించారు. అనంతరం ఆలయం నుంచి పల్లకిపై దుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి రథంపై ఉంచారు. దుర్గమ్మకు జై అంటు తాళ్లతో రథాన్ని లాగుతూ ఊరేగింపు ప్రారంభించారు. ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, ఆర్డీఓ రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆలయ ఈఓ చంద్రశేఖర్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ధూంధాంగా బోనాలు జాతర చివరి రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు తీసి మొక్కులు చెల్లించుకున్నారు. జోగిని శ్యామల శుక్రవారం తెల్లవారుజామున బోనం తీసి భక్తులను ఉర్రూతలూగించారు. పోతరాజులు చెర్న కోలలు చేతబట్టి బోనం ఎత్తి చిందులు వేశారు. జాతరలో ప్రధానంగా భక్తులు నీటి సమస్యను ఎదుర్కొన్నారు. ధర్మ సత్రాలలో నీరు లేక నానా ఇబ్బందులు పడ్డారు. సంబంధిత అధికారులు, ఆలయ సిబ్బంది పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సాయంత్రం మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్ బాలాగౌడ్ తదితరులు దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఏడుపాయల్లో జన సందోహం బోనాలు, నృత్యాలతో మురిపెం -
కృత్రిమ మేధతో ఉత్తమ భవిత
నర్సాపూర్: కృత్రిమ మేధతో విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కృత్రిమ మేధ కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించారు. విద్యార్థులకు చదవడం, రాయడం సామర్థ్యాల పెంపుపై నిర్వాహకులకు ఆయన అవగాహన కల్పించారు. కృత్రిమ మేధతో విద్యార్థులు ఎలా ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోగలిగితే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంను నిర్మించవచ్చని వివరించారు. జిల్లాలో ఆరు పాఠశాలల్లో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని వివరించారు. కలెక్టర్ వెంట ఎంఈఓ తారాసింగ్, పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు. పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు మెదక్జోన్/మెదక్ కలెక్టరేట్: ఇంటర్ పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. ఈనెల 5వ తేదీ నుంచి 23 వరకు జరగనున్న పరీక్షల ఏర్పాట్లపై శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎక్కడా తప్పులు దొర్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. తాగునీరు, మూత్రశాలల సౌకర్యం వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ ఎస్కార్ట్తో ప్రభుత్వ వాహనంలో పరీక్ష పేపర్లను తరలించాలన్నారు. ప్రతి సెంటర్కు ఇద్దరు కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహించాలన్నారు. విద్యుత్ సరఫరా నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ప్రాథమిక చికిత్స కిట్లు అందుబాటులో ఉండాలని, ఆశావర్కర్లను నియమించాలని చెప్పారు. పరీక్ష రాసే విద్యార్థుల గదుల్లో ఎలాంటి మెటీరియల్ లేకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పేపర్ల తనిఖీ నిర్వహించాలని.. ఎక్కడా మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఏవీఎస్గా విధులు నిర్వర్తించిన కిశోర్బాబు శుక్రవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈసందర్భంగా ఆయనను కలెక్టర్ సత్కరించి, పూలమాలతో సన్మానించారు. ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఉద్యోగికి సహజమని తెలిపారు. కార్యక్రమంలో డీపీఆర్ఓ రామచంద్రరాజు, ఏపీఆర్ఓ బా బురావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ రాహుల్రాజ్ -
చికెన్ కర్రీ.. నో వర్రీ
చికెన్, ఎగ్ మేళాకు ఎగబడిన జనంనర్సాపూర్: వెన్కాబ్ చికెన్ కంపెనీ, స్థానిక గోల్డెన్ చికెన్ సెంటర్ నిర్వాహకుడి ఆధ్వర్యంలో శుక్రవారం నర్సాపూర్లో చికెన్, ఎగ్ మేళా నిర్వహించారు. మేళాను ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ప్రజల్లో అపోహలు, భయాన్ని తొలగించేందుకే చికెన్ మేళా ఏర్పాటు చేశారని అన్నారు. బర్డ్ఫ్లూ మన ప్రాంతంలో లేదని, 70 డిగ్రీల వరకు చికెన్ను ఉడికించి తినవచ్చని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారని తెలిపారు. కోళ్ల పరిశ్రమపై చాలా మంది రైతులు ఆధారపడి ఉన్నారని, వారిని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వెన్కాబ్ కంపెనీ మేనేజర్లు దీరేందర్రెడ్డి, మహిపాల్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాగా మేళా లో చికెన్ తో పాటు కోడిగుడ్లు పంపిణీ చేశారు. -
యూరియా కొరత లేదు: ఏడీ ఏ
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని ఏడీఏ పుణ్యవతి అన్నారు. శుక్రవారం కౌడిపల్లిలోని ఆగ్రో స్, డీసీఎంఎస్, మన గ్రోమోర్, ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా స్టాక్ రికార్డులు, ధరల పట్టికను పరిశీలించారు. ఈసంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు మోతాదుకు మించి యూరియా వాడొద్దని తెలిపారు. యూరియా ఎక్కువగా వాడటం వల్ల పంటకు తెగులు, చీడపీడలు సోకుతాయని చెప్పారు. పంటలో సమస్య ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మాత్రమే ఎరువులు అమ్మాలని, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఓ స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
మంచి దిగుబడులతోనే మనుగడ
ప్రతి రైతు శాస్త్రవేత్తే పంటలు పండించే ప్రతి రైతు కూడ ఒక శాస్త్రవేత్తేనని షేక్ ఎన్ మీరా అన్నారు. సొంత విత్తనాలు సాగు చేయడం అనేది రైతు హక్కు అని, దీన్ని సంరక్షించుకునేందుకు సాధక బాధకాలు చాలా ఉన్నాయన్నారు. విత్తనాలను సంస్థ పరంగా, లేదా వ్యక్తిగతంగా కాని హక్కుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా విత్తనాలపై హక్కుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన రైతులు తాము రూపొందించిన రకాల విత్తనాలను ప్రదర్శనకు పెట్టారు. సమావేశంలో ప్రిన్సిపాల్ సైటింస్ట్ ఎఆర్రెడ్డి, పీపీవీఎఫ్ఆర్ రిజిస్ట్రార్ డీకే అగర్వాల్, ఎక్స్పర్ట్స్ అరవింద్కుమార్, హరిప్రసన్న, డీడీఎస్ ఈడీ దివ్య, సభ్యుడు రామాంజనేయులు, కేవీకే ప్రతినిధులు వరప్రసాద్, రమేష్, స్నేహలత, వరలక్ష్మి పాల్గొన్నారు.జహీరాబాద్: కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే) రైతులకు అవగాహన కల్పించాలని, అన్ని విధాలుగా సహకారం అందించాలని ఐటీఏఆర్–అటారి డైరెక్టర్ షేక్ ఎన్ మీరా సూచించారు. శుక్రవారం జహీరాబాద్లోని డీడీఎస్–కేవీకేలో రాష్ట్రంలోని కేవీకే శాస్త్రవేత్తలు, ముఖ్య రైతులతో సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఢిల్లీకి చెందిన ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వైరెటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ (పీపీవీఎఫ్ఆర్) చైర్పర్సన్ త్రిలోచన్ మహాపాత్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ ఎన్ మీరా మాట్లాడుతూ ప్రతి అంశంలోనూ రైతులకు సలహాలు, సూచనలిస్తూ వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించేలా సూచనలు ఇవ్వాలని కోరారు. అప్పుడే రైతులు లబ్ధి పొందగలుగుతారని పేర్కొన్నారు. ఆదాయం వస్తుందని కాకుండా రాబోయే తరానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పీపీవీఎఫ్ఆర్ దరఖాస్తులు చేపట్టడం అభినందనీయమని చెప్పారు. విత్తనాలపై రైతులకు హక్కులు కల్పిస్తామని, రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా రాబోయే కాలంలో బయో పైరసీని కూడా అరికట్టగలిగే స్థాయిలో ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్తోనే హక్కుదారులు నాలుగు దశాబ్ధాల నుంచి చిరుధాన్యాలు, ఇతర ధాన్యాల పరిరక్షణపై చేస్తున్న కృషికి.. రిజిస్ట్రేషన్ చేయడం ద్వారానే హక్కు వస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పాత పంటల విషయంలో జహీరాబాద్ ప్రాంతం పేరు తెచ్చుకున్నా.. చిన్న రిజిస్ట్రేషన్ చేయకపోవడం బాధాకరమైన విషయమన్నారు. మొదటగా పాత పంటలు, రైతుల రకాలు 100 నుంచి 120 రకాల వరకు ఉన్నాయన్నారు. వీటిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గాను రైతులు ముందుకు రావడం సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు. రైతులకు అవగాహన కల్పించడంలో కేవీకేలదే కీలకపాత్ర ఐటీఏఆర్–అటారి డైరెక్టర్ షేక్ ఎన్ మీరా -
విద్యకు 15 శాతం కేటాయించాలి
నిజాంపేట(మెదక్): రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి 15శాతం నిధులు కేటాయించాలని దళిత బహుజన ఫ్రంట్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం మండలంలోని నార్లాపూర్ నుంచి నిజాంపేట తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈసందర్భంగా డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. బడ్జెట్లో కేవలం 7 శాతం నిధులు కేటాయించిందని మండిపడ్డారు. రానున్న బడ్జెట్లోనైనా ఎన్నికల హామీ ప్రకారం 15 శాతం నిధులు కేటాయించి మాట నిలబెట్టుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో నాయకులు బత్తుల కోటేశ్వర్, స్వామి, జగన్, మద్దికుంట నర్సింలు తదితరులు పాల్గొన్నారు. పరీక్షలపై దృష్టి సారించండిచిన్నశంకరంపేట(మెదక్): పదో తరగతి విద్యార్థులు పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. పాఠ్యంశాలను రివ్యూ చేస్తూ పదికి పది గ్రేడ్ సాధించాలన్నారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం భోజన ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ గీతా, తహసీల్దార్ మన్నన్, ఆర్ఐ రాజు ఉన్నారు. షీటీమ్స్తో భరోసా: ఎస్పీ మెదక్ మున్సిపాలిటీ: షీటీమ్స్ విద్యార్థినులు, బాలికలు, మహిళలకు ఆపద సమయంలో భరోసా ఇస్తాయని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో గత నెలలో షీటీం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. జిల్లావ్యాప్తంగా 9 మంది ఈవ్టీజర్లపై కేసు నమోదు చేశామని, మరో 44 మందిని పట్టుకొని కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలన్నారు. షీటీం వాట్సాప్ నంబర్ 8712657963, పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 8712657888 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. నేటి నుంచి పోలీస్యాక్ట్మెదక్ మున్సిపాలిటీ: శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని శనివారం నుంచి ఈనెల 31 వరకు జిల్లావ్యాప్తంగా పోలీస్యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి తెలిపారు. పోలీస్ అధికారుల అనుమతి లేకుండా జిల్లాలో ప్రజలు ధర్నా, రాస్తారోకో, నిరసన, ర్యాలీ, సభలు, సమావేశాలు నిర్వహించరాదని చెప్పారు. అలాగే ప్రజాధనానికి నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు. మదన్రెడ్డికి పరామర్శ నర్సాపూర్: మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు మదన్రెడ్డిని మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి శుక్రవారం పరామర్శించారు. మదన్రెడ్డికి ఇటీవల గుండె సంబంధిత శస్త్ర చికిత్స జరగడంతో హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్యంపై ఆరా తీశారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వారి వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. -
అంగన్వాడీల బలోపేతం!
పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ తీరనున్న సిబ్బంది కొరతమెదక్జోన్: అంగన్వాడీ కేంద్రాల బలోపేతంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పోషకాహారం, చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి ఇటీవల గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లాస్థాయిలో నోటిఫికేషన్ జారీ కానుంది. జిల్లావ్యాప్తంగా 392 ఖాళీలు.. జిల్లావ్యాప్తంగా 1,076 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 3 నుంచి ఆరేళ్ల వయసు గల చిన్నారులు 19,937 మంది, గర్భిణులు 5,007, బాలింతలు 4,873 మంది ఉన్నారు. కాగా జిల్లాలో 191 మినీ, 885 మెయిన్ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. మెయిన్ సెంటర్లలో టీచర్తో పాటు ఆయా ఇద్దరు ఉంటారు. మినీ అంగన్వాడీలో కేవలం టీచర్ మాత్రమే విధులు నిర్వర్తిస్తోంది. దీంతో పిల్లలకు ఆటపాటలతో చదువు చెప్పటం, పిల్లలతో పాటు సెంటర్ పరిధిలోని గర్భిణులు, బాలింతలకు వంటచేసి పెట్టడం ఇబ్బందిగా మారింది. ఈక్రమంలో మినీ సెంటర్లకు తల్లిదండ్రులు పిల్లలను పంపడం కూడా మానేశారు. విషయాన్ని సిబ్బంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ మినీ సెంటర్లను 2024 ఏప్రిల్లో మెయిన్ సెంటర్లుగా మార్చారు. దీంతో జిల్లాలో 191 మినీ సెంటర్లు మెయిన్గా మారాయి. అయితే అందులో ఆయాలను మాత్రం నేటికీ నియమించలేదు. జిల్లాలో పదవీ విరమణ, మరణించిన వారితో కలిపి మొత్తం 340 ఖాళీలు ఏర్పడ్డాయి. వాటితో పాటు రిటైర్ట్ అయిన టీచర్ల స్థానంలో కొత్తవారిని నియమించలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ తాజా ప్రకటనతో విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు విద్య అందనుంది. మహిళల్లో చిగురించిన ఆశలు అంగన్వాడీ కేంద్రాల్లో నియామకాలకు ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారిని అర్హులుగా నిర్ణయించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. గతంలో ఉన్న నిబంధనలు మార్చి విద్యార్హతలో మార్పులు చేశారు. దీంతో నిరుద్యోగ మహిళల్లో ఆశలు చిగురించాయి.జిల్లాలో ఇలా.. అంగన్వాడీ కేంద్రాలు 1,076టీచర్ల ఖాళీలు 52 ఆయాలు 340 -
కల్యాణం.. కమనీయం
ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపంలో స్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వివిధ రకాల పూలు, పట్టు వస్త్రాలు, ముత్యాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. విఘ్నేశ్వరుని పూజతో ప్రా రంభించి.. జీలకర్ర బెల్లం, మాంగల్య ధారణ, కన్యాదాన తంతు, తలంబ్రాలు, మహామంగళ హారతితో ముగించారు. ఉదయం సమయంలో అగ్నిగుండం ప్రవేశం నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శివ రుద్రప్ప, ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునితా పాటిల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్, సీడీసీ మాజీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు రుద్రప్ప పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
పెద్దపట్నం.. నేత్రపర్వం
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న క్షేత్రంలో పెద్దపట్నం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివ రాత్రి పర్వదినం పురస్కరించుకుని తోటబావి వద్ద బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు పెద్ద ప ట్నం వేడుకలు కనులపండువగా జరిగాయి. అదే సమయంలో గర్భగుడిలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ రామాంజనేయులు, ధర్మకర్తలు, అర్చకులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు. పెద్ద పట్నం నిర్వహించే తోట బావి ప్రాంగణానికి చేర్చారు. వేడుకలను చూసేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. 41 వరుసలతో పెద్దపట్నం బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన పెద్ద పట్నాన్ని 41 వరుసలతో వేశారు. ఇందుకు సుమారు 150 మంది ఒగ్గుపూజారులు పొల్గొన్నారు. ఊరేగింపుగా బోనాలు తీసుకువచ్చి పట్నంపై పెట్టి స్వామికి నైవేద్యం సమర్పించారు. అర్చకులు యాదవ సంప్రదాయం స్వామివారి ప్రకారం కల్యాణం నిర్వహించారు. వెంటనే ఉత్సవ విగ్రహాలతో పట్నం దాటారు. స్వామి వారి పట్నాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో తోటబావి ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. బండారిమయమైన కొమురవెల్లి శిమనామస్మరణతో మారుమోగిన తోటబావి ప్రాంగణం -
బండ్ల జోరు.. జాతర హోరు
పాపన్నపేట(మెదక్): జోడెడ్ల బండ్ల జోరు.. బోనాల హోరు.. శివసత్తుల శిగాలు.. పోతరాజుల గావు కేకలు.. డప్పు చప్పుళ్లు.. యువకుల నృత్యాలతో ఏడుపా యల్లోని కొండా కోన ప్రతి ధ్వనించాయి. జాతర రెండో రోజు గురువారం ప్రధాన ఘట్టమైన బండ్ల ఊరేగింపు కనుల పండువగా జరిగింది. సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ప్రారంభం కాగా.. ఆచారం ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండికి నాగ్సాన్పల్లి వద్ద పనిబాటల వారు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. యువకుల నృత్యాల మధ్య బండ్ల ఊరేగింపు కొనసాగింది. రాజగోపురం వద్దకు చేరుకోగానే.. ఆలయ అధికారులు ప్రతి బండి ఎదుట కొబ్బరికాయ కొట్టి దుర్గమ్మ చిత్రపటాలను బహూకరించారు. మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు గురువారం తెల్లవారుజాము నుంచే ఏడుపాయలకు భక్తులు పోటెత్తారు. మంజీర నదిలో స్నానాలు చేసి, బారులు తీరి దుర్గమ్మను దర్శించుకున్నారు. సాయంత్రం బండ్ల ఊరేగింపును తిలకించారు. జాతరలో సెల్ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో చాలా మంది తప్పిపోయి, తమ వారిని చేరడానికి పోలీస్ కంట్రోల్ రూంకు తరలివచ్చారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, ఆర్డీఓ రమాదేవి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కృష్ణ, ఈఓ చంద్రశేఖర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.బోనంతో తరలివస్తున్న భ క్తులుఏడుపాయల్లో భక్తుల సందడి -
సజావుగా పోలింగ్
మెదక్జోన్: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం సజావుగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జిల్లాలో ఉపాధ్యాయ ఓటర్లు 1,347 ఉండగా 1,280 పోలయ్యాయి. ఈ లెక్కన 95.3 శాతం పోలింగ్ నమోదైంది. పట్టభద్రుల ఓటర్లు 12,477 ఉండగా 9,367 ఓట్లు పోల్ కాగా 75.26 శాతం ఓటింగ్ నమోదైంది. కాగా నాలుగు గంటల వరకు క్యూలైన్లో ఉన్న ఓటర్లకు పోలింగ్ సిబ్బంది ఓటు వేసే అవకాశం ఇచ్చారు. దీంతో పోలింగ్ శాతం మరింతగా పెరిగే అవకాశం ఉంది. కలెక్టర్, ఎస్పీల పర్యవేక్షణ MýSÌñæ-MýStÆŠ‡ Æ>çßæ$ÌŒæ-Æ>gŒæ, Gïܵ E§ýl-ÄŒæ$MýS$Ð]l*-ÆŠ‡-Æð‡yìlz hÌêÏ MóS…{§ýl…ÌZ° ç³Ë$ ´ùÍ…VŠæ MóS…{§é-ÌS¯]l$ çÜ…§ýl-ÇØ…-^éÆý‡$. ç³rt-×æ…ÌZ° »êË$Æý‡ þ°-Ķæ$ÆŠ‡ MýSâê-Ô>-ÌSÌZ ç³rt-¿ýæ-{§ýl$ÌS ´ùÍ…VŠæ MóS…{§é°² MýSÌñæMýStÆŠ‡ ™èl°T ^ólíÜ íܺ¾…¨™ø Ð]l*sêÏyéÆý‡$. M>V> ÕÐ]lÓ…õ³r E¯]l²™èl ´ëuý‡Ô>ËÌZ ¯]lÆ>Þç³NÆŠæḥ GÐðl$ÃÌôæÅ çÜ$±™éÆð‡yìlz, _¯]l²Ô¶ …MýSÆý‡…õ³r gñæyîlµ ´ëuý‡Ô>ËÌZ Ððl$§ýlMŠæ GÐðl$ÃÌôæÅ Æøííß晌 , çß Ðólãçœ$×êç³NÆŠḥÌZ GÐðl$ÃÎÞ Ôó Ç సుభాశ్ రెడ్డి ఓటు హ క్కు వినియో గించుకున్నారు. ●ఉత్సాహంగా ఓట్లేసిన ఉపాధ్యాయులు, పట్టభద్రులు ● పోలింగ్ సరళిని పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ జిల్లాలో పోలింగ్ శాతం ఇలా.. ప్రతి రెండు గంటలకు.. పట్టభద్రులు ఉపాధ్యాయులు ఉదయం 10 గంటల వరకు 8.19 % 16.41% మధ్యాహ్నం 12 గంటల వరకు 24.62%- 50.4 మధ్యాహ్నం 2 గంటల వరకు 43.50 % 77.58% సాయంత్రం 4 గంటల వరకు 75.26% 95.3% -
గోరంతే ఇచ్చినారు
మెదక్జోన్: కూరగాయల అవసరం జిల్లాకు కొండంత ఉంటే, ప్రభుత్వం గోరంత నారు ఇచ్చి చేతులు దులుపుకుంది. కొన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలను ఎత్తివేయటంతో సాగు అంతకంత తగ్గింది. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలను అధిక ధరలకు దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఫలితంగా ధరలు చుక్కలనంటడంతో పాటు నాణ్యమైనవి దొరకటం కష్టతరంగా మారింది. సబ్సిడీ విత్తనాలకు మంగళం జిల్లాలో 7.24 లక్షల పైచిలుకు జనాభా ఉండగా.. ఒక్కో వ్యక్తి నిత్యం 200 గ్రాముల కూరగాయలను తన ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఈలెక్కన రోజుకు 140 టన్నుల కూరగాయలు అవసరం. ఇందుకు గానూ కనీసం వెయ్యికి పైగా ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తే జిల్లా ప్రజల అవసరాలకు సరిపోతుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాగా గతంలో కూరగాయల సాగు కోసం సబ్సిడీపై నాణ్యమైన ఆకుకూరలు, కూరగాయల విత్తనాలను రైతులకు అందించేవారు. దీంతో రైతులు విస్తృతంగా సాగు చేశారు. 2016 నుంచి సబ్సిడీ విత్తనాలకు మంగళం పాడటంతో సాగు 60 శాతానికి పడిపోయింది. అలాగే జిల్లాలో 3.95 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటే, కూరగాయలు మాత్రం కేవలం 180 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు ఆశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా కేంద్రం 2024 వానాకాలం, ప్రస్తుత యాసంగి సీజన్కు సంబంధించి కేవలం 20 హెక్టార్లకు సరిపడా కూరగాయల నారుమళ్లను మాత్రమే జిల్లాకు మంజూరు చేసింది. ములుగు నుంచి సరఫరా సిద్దిపేట జిల్లా ములుగులో సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా వివిధ రకాల కూరగాయల మొక్కలను పెంచి వాటిని పూర్తిగా సబ్సిడీపై రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సరఫరా చేస్తుంది. ఇందులో ప్రధానంగా టమాట, వంకాయ, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యాలి ఫ్లవర్.. తదితర కూరగాయల నారుమళ్లను పెంచుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో గత ఖరీఫ్తో పాటు ప్రస్తుత రబీ సీజన్లోనూ కేవలం 20 హెక్టార్లకు సరిపడా నారుమళ్లను వందశాతం సబ్సిడీపై 28 మంది రైతులకు మాత్రమే అందించారు. కాగా నారుమళ్లను పెంచేందుకు ఒక్కో హెక్టారుకు రూ.8 వేల ఖర్చు అవుతుండగా, రూ.1.60 లక్షలతో 50 ఎకరాలకు కూరగాయల నారుమళ్లను అందించారు. ఇది ఏ మూలన సరిపోదని, కనీసం వెయ్యి ఎకరాల పైబడి కూరగాయలు సాగు చేస్తేనే జిల్లా అవసరాలకు సరిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది పైలెట్ ప్రాజెక్టు మాత్రమే సిద్దిపేట జిల్లా ములుగులో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్లో నాణ్యమైన వివిధ రకాల కూరగాయల నారుమళ్లను పెంచి రైతులకు పూర్తిగా సబ్సిడీపై ఇస్తుంది. జిల్లాకు 20 హెక్టార్లకు మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు కింద కొనసాగుతుంది. రానున్న వార్షిక సంవత్సరానికి ఎక్కువగా మంజూరు చేసే అవకాశం ఉంది. – ప్రతాప్సింగ్, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి 20 హెక్టార్లకే కూరగాయల నారు పరిమితం -
మేధావుల మౌనం దేశానికి నష్టం
ఎంపీ రఘునందన్రావు దుబ్బాక: మేధావుల మౌనం దేశానికి ప్రమాదకరమని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్రావు అన్నారు. గురువారం అక్భర్పేట–భూంపల్లి మండల కేంద్రంలో తన సతీమణితో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశాభివృద్ధికి మేధావుల ఆలోచన విధానాలు చాలా అవసరమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హ క్కు వినియోగించుకోవడం మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ఉన్నత చదువులు అభ్యసించి రాజ్యాంగం పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న మేధావులు ఓటుకు దూరంగా ఉండడం ఎంత మాత్రం దేశానికి మంచిది కాదన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు. -
ఎవరి ధీమా వారిదే!
పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ప్రచారం నర్సాపూర్/కౌడిపల్లి/వెల్దుర్తి(తూప్రాన్): ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ఆయా పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం పోలింగ్ ప్రక్రియ ముగిసేవరకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తమ పార్టీకి చెందిన అభ్యర్థులు గెలిస్తేనే ఉపాధ్యాయ, పట్టభద్రుల సమస్యలు పరష్కారం అవుతాయని కాంగ్రెస్ నేతలు హామీనిస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అభ్యర్థులు గెలిస్తేనే సమన్యాయం జరుగుతుందని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. మొత్తం మీద గురువారం ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద నాయకుల సందడి సార్వత్రిక ఎన్నికలను తలపించింది. నర్సాపూర్లో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్గౌడ్తో పాటు ఆయా పార్టీల నాయకులు పోలింగ్ కేంద్రం ఎదుట ఓట్లు అభ్యర్థించారు. ఉమ్మడి వెల్దుర్తి మండలం, కౌడిపల్లి మండలంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, జిల్లా నాయకులు నరేందర్రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్గౌడ్, జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ పరిశీలించారు. నాయకుల వద్ద ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. -
తాళి కట్టమంటే పాడె కట్టిండు
వర్గల్(గజ్వేల్): వారిది ఒకే గ్రామం.. ఇద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యం.. గుట్టుగా కొనసాగుతున్న వివాహేతర సంబంధం.. పెండ్లి చేసుకోవాలని మహిళ ఒత్తిడి జీర్ణించుకోలేక పథకం ప్రకారం హత్య చేసి ఆమెను కాటికి పంపాడు. దర్యాప్తులో పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. పది రోజుల కిందట జాడ తెలియకుండా పోయిన వర్గల్ మండలం మహిళ మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం కోమటిబండ అడవిలో మృతదేహాన్ని గుర్తించి హత్యకు గురైనట్లు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను బుధవారం గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి వెల్లడించారు.వర్గల్ మండలం అనంతగిరిపల్లికి చెందిన దార యాదమ్మ(40) 15వ తేదీన బ్యాంక్కు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. ఆమె కుమారుడు దార సాయికుమార్ ఫిర్యాదు మేరకు గౌరారం పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదుచేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పోలీసులు వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు కొనసాగించారు. సీసీ ఫుటేజీలు, లోకేషన్లు, కాల్డేటాలు విశ్లేషించారు. దర్యాప్తులో భాగంగా అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన బండ్ల చిన్న లస్మయ్య(39)ను మంగళవారం విచారించారు. ఏడాదిన్నర నుంచి అతడికి యాదమ్మతో వివాహేతర సంబంధమున్నట్లు విచారణలో వెల్లడైంది. ఆరునెలల నుంచి పెండ్లి చేసుకోవాలని యాదమ్మ ఒత్తిడి చేస్తుండటంతో ఎలాగైనా అడ్డు తొలిగించుకోవాలనుకున్నాడు. 15న మధ్యాహ్నం పథకం ప్రకారం యాదమ్మను బైక్ మీద గజ్వేల్ సమీప కోమటిబండ అడవిలోకి తీసుకెళ్లాడు. తమ వెంట తెచ్చుకున్న కల్లును ఇద్దరు తాగే సమయంలో ఆమెకు తెలియకుండా పురుగుల మందు కలిపాడు. యాదమ్మ తాగిన తర్వాత కింద పడేసి మెడచుట్టూ చీర బిగించి హతమార్చాడు. నిందితుడిపై హత్య నేరంతోపాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. గ్రామంలో ఉద్రిక్తత యాదమ్మ హత్యోదంతం నేపథ్యంలో బుధవారం ఆమె కుటుంబీకులు, బంధువులు ఆగ్రహంతో అనంతగిరిపల్లిలోని నిందితుడి ఇంటి ఎదుట బైఠాయించారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా ఏసీపీ పురుషోత్తంరెడ్డి, రూరల్సీఐ మహేందర్రెడ్డి, గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి వెంటనే గ్రామానికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని వారికి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది. -
12 గంటలు రోడ్డుపైనే మృతదేహం..
జోగిపేట(మెదక్): అభాగ్యురాలైన వృద్ధురాలి శవం రోడ్డుపై 12 గంటల పాటు ఉన్నా మున్సిపల్ సిబ్బంది కన్నెత్తి చూడలేదు. అంత్యక్రియలు నిర్వహించాలని కూతురు వేడుకున్నా కనికరించలేదు. వివరాలిలా ఉన్నాయి. జోగిపేట పట్టణంలో విద్యావతి (68) అనే వృద్ధురాలు అనారోగ్యంతో బుధవారం మృతి చెందింది. స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని ఆనుకొని ఉన్న ఒక గుడిసెలో నివాసం ఉంటూ కాగితాలు, పాత సామాన్లు సేకరించి వాటిని అమ్ముకొని తన కూతురు అశ్వినితో కలిసి జీవనం సాగిస్తుంది. కుమార్తెకు వివాహం చేసింది. కుమార్తె భర్త ఇటీవల గుండెపోటుతో మృతి చెందడంతో చౌటకూరు మండలం శివ్వంపేట ప్రాంతంలోని కంపెనీలో పని చేస్తోంది. శివరాత్రి పండుగ నేపథ్యంలో తల్లి వద్దకు వచ్చిన అశ్విని అమ్మా..అమ్మా అంటూ పిలిచినా ఉలుకు పలుకూ లేకపోవడంతో బోరున విలపిస్తూ కూర్చుంది. ఎవరూ లేకపోవడంతో పక్కనే ఉన్న మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి తన తల్లి అంత్యక్రియలు చేయాలని కోరింది. పోలీసులకు చెబితేనే చేస్తామని వారు చెప్పారు. రోడ్డుపై వెళ్తున్న పోలీసులకు కూడా చెప్పినా మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎవరూ రాకపోవడంతో పటాన్చెరు ప్రాంతంలో తనకు తెలిసిన వారికి కూతురు ఫోన్ చేసింది. వారు వచ్చి మున్సిపల్ అధికారులను వేడుకున్నా స్పందించలేదు. దీంతో రూ.2 వేలకు అంబులెన్స్ను మాట్లాడుకొని రూ.1,500కు జేసీబీతో గోతి తీయించి అంత్యక్రియలు పూర్తి చేశారు. తల్లి మృతదేహం వద్ద కూతురు ఏడవడం రోడ్డుపై వెళ్లే వారి హృదయాలను కలిచివేసింది. -
వరిపంటకు ట్యాంకర్ నీరే దిక్కు
అడుగంటుతున్న భూగర్భ జలాలు ● రైతులకు తప్పని తిప్పలు పంటలను కాపాడుకునేందుకు రైతుల తిప్పలు అన్నీఇన్నీకావు. ఎండలు ముదిరి భూగర్భజలాలు అడుగంటడంతో నీరు అందక పంటలు ఎండుముఖం పడుతున్నాయి. కొమురవెల్లి మండలం గురువన్నపేటకు చెందిన వెంకటేశ్, రాజయ్య అనే రైతులు వరి సాగుచేశారు. తలాపున తపాస్పల్లి రిజర్వాయర్ ఉన్నా పంటలు ఎండుతున్నాయి. చేసేదిలేక బుధ వారం ట్యాంకర్తో నీటిని తీసుకువచ్చి పంటను తడిపారు. ట్యాంకర్కు రూ.2వేల నుంచి రూ.3 వేల వరకు చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. – కొమురవెల్లి(సిద్దిపేట) -
నేడే మండలి పోరు
మెదక్జోన్: మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రా ౌగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం సాయంత్రం సిబ్బంది ఎన్నికల సామగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. కాగా పట్టభద్రుల ఎన్నికల బరిలో 56 మంది ఉండగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 71 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు 12,472, ఉండగా.. 22 పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. అలాగే ఉపాధ్యాయుల ఓటర్లు 1,347 ఉండగా, అందుకనుగుణంగా 21 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 43 మంది పోలింగ్ అధికారులు, 43 మంది ఏపీఓలు, 86 మంది ఓపీఓలు, 22 మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించారు. అలాగే ప్రతి మూడు పోలింగ్ కేంద్రాలకు ఒకటి చొప్పున మొత్తం 8 రూట్లుగా విభజించారు. ఇందుకోసం ప్రత్యేకంగా 8 మంది సెక్టోరియల్ అధికారులను నియమించారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిరంతర వెబ్కాస్టింగ్ మధ్య ఎన్నికలు జరగనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీస్బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. కాగా 25 సాయంత్రం నుంచే జిల్లాలో మధ్యం, కల్లు దుకాణాలను మూసి వేయించారు. కాగా ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్రాజ్ సిబ్బందిని ఆదేశించారు. సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం ఎన్నికల సామగ్రితో తరలిన సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు -
రేపు నీటి సరఫరాకు అంతరాయం
నర్సాపూర్: మిషన్ భగీరథ పథకం నల్లాల ద్వారా ఈనెల 28న తాగునీటి సరఫరా ఉండదని ఏఈ రాజ్కుమార్ తెలిపారు. బోర్పట్ల వద్ద పైపులైనుకు మరమ్మతులు చేయాల్సి రావడంతో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలతో పాటు సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల మండలాల్లోని గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. శనివారం నుంచి నీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుందని రాజ్కుమార్ వివరించారు. సిద్దేశ్వరాలయంలో అదనపు కలెక్టర్ పూజలుహవేళిఘణాపూర్(మెదక్): మహాశివరాత్రి సందర్భంగా మండల పరిధిలోని ముత్తాయికోట సిద్దేశ్వరాలయంలో అదనపు కలెక్టర్ నగేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి గోవింద్మహరాజ్ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎంతో పురాతమైన సిద్దేశ్వరాలయంలో పూజలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని నగేశ్ పేర్కొన్నారు. చర్చి ప్రెసిబెటరీ ఇన్చార్జి రాబిన్సన్ కన్నుమూత మెదక్జోన్: మెదక్ సీఎస్ఐ చర్చి ప్రెసిబెట రీ ఇన్చార్జి రాబిన్సన్ (73) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. 2010 నుంచి 2019 వరకు చర్చి ప్రెసిబెటరీ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం రిటైర్మెంట్ తీసుకున్నారు. అంతకు ముందు చర్చి అధ్యక్ష మండలంలో వైస్ చైర్మన్గా, మినిస్ట్రీయల్ కన్వీనర్గా పనిచేశారు. రాబిన్సన్కు భార్య దయాన రాబిన్, ఇద్దరు పిల్లలున్నారు. గురువారం మధ్యాహ్నం చర్చి ప్రాంగణంలోని శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. -
క్షయమించొద్దు
● జిల్లాలో క్షయ నివారణకు అధికారుల చర్యలు ● విస్తృతంగా వైద్య పరీక్షలు ● కొత్తగా 62 కేసుల గుర్తింపుమెదక్ కలెక్టరేట్: ప్రాణాంతకమైన క్షయ (టీబీ)ను సమూలంగా నిర్మూలించేందుకు అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ముమ్మరంగా క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 7వ తేదీ నుంచి ఈ ఏడాది మార్చి 17 వరకు వంద రోజుల క్యాంపెయిన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గత డిసెంబర్లో డీఎంహెచ్ఓ శ్రీరామ్, టీబీ నియంత్రణ అధికారి నవీన్ కలెక్టరేట్లో వైద్య సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. 72 వేల మందికి పరీక్షలు జిల్లాలో ఇప్పటివరకు 72,000 మందికి క్షయ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అలాగే 4,000 మందికి ఎక్సరేలు, 3,800 మందికి తెమడ పరీక్షలు చేశారు. కొత్తగా 62 మంది వ్యాధిగ్రస్తులను గుర్తించారు. క్షయ ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి. ఇది వచ్చిన వ్యక్తి తుమ్మినా.. దగ్గినా గాలిలో కలిసి ఇతరులకు సోకుతుంది. వ్యాధి సోకిన వారు ఎప్పుడూ నీరసంగా ఉంటారు. సాయంత్రం సమయాల్లో దగ్గు తో పాటు తరచూ జ్వరం వస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఊపిరితిత్తులు దెబ్బతిని చనిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే గతంలో వేల సంఖ్యలో టీబీ కేసులు నమోదయ్యేవి. ప్రస్తుతం వైద్య సిబ్బంది చేపడుతున్న విస్తృత కార్యక్రమాలతో జిల్లాలో క్షయ తగ్గుముఖం పడుతుంది. వ్యాధి తగ్గుముఖం పట్టింది గతంలో ఏడాదికి 1,000 నుంచి 1,500 వరకు టీబీ కేసులు వచ్చేవి. ఇప్పుడు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం వంద రోజుల క్యాంపెయిన్ కొనసాగుతుంది. జిల్లాలో ఎక్కడికక్కడ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేస్తున్నాం. జిల్లాలో 450 మంది వ్యాధి సోకిన వారు ఉన్నారు. వారికి అవసరమైన మందులు, న్యూట్రీషన్ కిట్లు అందిస్తూ.. నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేస్తున్నాం. – శ్రీరామ్, జిల్లా వైద్యాధికారిన్యూట్రీషన్ కిట్ల పంపిణీ జిల్లాలో ఇటీవల గుర్తించిన వారితో కలిపి మొత్తం 450 మంది క్షయ(టీబీ) వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీరు ఆరు నెలల కోర్సు మందులు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. ఈ మందులను ప్రభుత్వం సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ఉచితంగా అందజేస్తుంది. అలాగే రోగులకు ప్రతి నెల వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది. పౌష్టికాహారం కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో నెలకు రూ.500 అకౌంట్లో జమచేసేది. ప్రస్తుతం రూ.1,000 జమ చేస్తుంది. జిల్లాలో ఫార్మా కంపెనీల సౌజన్యంతో వ్యాధిగ్రస్తులకు నెలనెల న్యూట్రీషన్ కిట్లు అందజేస్తున్నారు. -
మెట్టు దిగరు.. పట్టు వదలరు
ఎంఆర్ఎఫ్ యాజమాన్యం, కార్మికుల మధ్య కుదరని సయోధ్యసదాశివపేట రూరల్(సంగారెడ్డి): సదాశివపేట మండలంలోని అంకేనపల్లి శివారులో గల ఎంఆర్ఎఫ్(ఏపీఎల్) ప్లాంట్లో పనిచేస్తున్న 338మందికి పైగా కార్మికుల భవితవ్యంపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. వీరి భవిష్యత్తును పట్టించుకోవాల్సిన అధికారులు, పరిశ్రమ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో కార్మికులు మనోవేదనకు గురవుతున్నారు. పరిశ్రమ యాజమాన్యం కార్మిక చట్టాల్ని ఉల్లంఘిస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రిక్రూట్మెంట్ సమయంలో చేసుకున్న ఒప్పందం మేరకు పర్మినెంట్ చేయాలని కోరిన పాపానికి పరిశ్రమ యాజమాన్యం పనిలో నుంచి తీసేసి నియంతృత్వాన్ని ప్రదర్శిస్తోందని కార్మికులు వాపోతున్నారు. నాలుగేళ్లయినా పర్మినెంట్ చేయని యాజమాన్యం డీఆర్డీఏ ఆధ్వర్యంలో రాత పరీక్ష,ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా నియామకం చేసుకుని వారికి ప్రత్యేక శిక్షణనిచ్చి ప్రొడక్షన్, ఇతర విభాగాల్లో 338మందికి పైగా కార్మికులను చేర్చుకున్నారు. నిబంధనల ప్రకారం మూడున్నరేళ్లు పూర్తికాగానే పర్మినెంట్ చేస్తామని పరిశ్రమ యాజమాన్యం నాడు ఒప్పందం చేసింది. యాజమాన్యం మాట ప్రకారం కార్మికులు పనిచేస్తూ వచ్చారు. తీరా నాలుగేళ్లు పూర్తయినా పర్మినెంట్ చేయకపోవడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. దీంతో కార్మికులను విధుల్లోకి రావొద్దని ఫోన్ చేసి చెప్పారు. విధుల నుంచి తొలగించిన కార్మికులను పట్టించుకోవాల్సిన కార్మికశాఖ అధికారులు పక్షం రోజుల నుంచీ నోరుమెదపడం లేదు. చర్చల పేరిట కాలయాపన.. కార్మికుల భవితవ్యంపై గతంలో రెండుసార్లు జరిగిన చర్చలు విఫలం కావడంతో తాజాగా ఈ నెల22న మరోసారి చర్చలు జరిపారు. అవి కూడా విఫలం కావడంతో పరిశ్రమ యాజమాన్యం ఈ నెల 28న తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని కార్మికశాఖ అధికారులు తెలిపారు. అయితే కార్మికులు మాత్రం చర్చల పేరిట కాలయాపన చేస్తూ తమ జీవితాలను రోడ్డుపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వనం.. భక్త జనసంద్రం
గురువారం శ్రీ 27 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025చిన్నారి నృత్య ప్రదర్శనప్రత్యేక అలంకరణలో దుర్గమ్మనిలిచిన నీటి సరఫరా జాతరలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టాయిలెట్లలో నీరు లేకపోవడంతో నిర్వాహకులు వాటికి తాళాలు వేశారు. తాగునీటి కోసం అవస్థలు తప్పలేదు. తర్వాత అధికారులు పొడిచన్ పల్లి తాగునీటి పథకం నుంచి నీటి సరఫరాను పునరుద్ధరించారు. అయితే ఉదయం భక్తుల సంఖ్య తక్కువగా కనిపించింది. సాయంత్రానికి ఎక్కువైంది. మంజీరనదిలో షవర్ బాత్ ల కింద స్నానాలు చేసిన భక్తులు దుర్గమ్మను దర్శించుకొని శివ దీక్షలు చేపట్టారు. సాయంత్రం పండ్లు తిని దీక్ష విరమించారు. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆర్డీఓ రమాదేవి, డీఎస్పీ ప్రసన్న కుమార్, ఈఓ చంద్రశేఖర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.పాపన్నపేట(మెదక్): మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏడుపాయల జాతర బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేద బ్రాహ్మణులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంజీర నదిలో ఏర్పాటు చేసిన శివుని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు ఉచిత సేవలు అందిస్తున్న ఆర్టీసీ సర్వీసులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. మంత్రి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసినిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నాయకులు అవుల రాజిరెడ్డి సుప్రభాతరావు, ప్రభాకర్ రెడ్డి, గోవింద్ నాయక్ ఉన్నారు. ఇబ్బందులు తలెత్తొద్దు: కలెక్టర్ ఏడుపాయల జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన వన దుర్గమ్మను దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ.. తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నేడు బండ్లు తిరిగే కార్యక్రమం ఉన్నందున భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని, వారికి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సైతం దుర్గమ్మను దర్శించుకొని పూజలు చేశారు. జాతరలో ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు.న్యూస్రీల్ ఏడుపాయల జాతర ప్రారంభం దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి దామోదర ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ -
జన జాతరకు వేళాయే..
జాతరకు ముస్తాబైన దుర్గమ్మ ఆలయంపాపన్నపేట(మెదక్): ఏడుపాయల జన జాతరకు వన దుర్గమ్మ ముస్తాబైంది. మహాశిరాత్రి పురస్కరించుకొని బుధవారం ప్రారంభం కానున్న జాతరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రభుత్వం తరపున హాజరై దుర్గమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.2 కోట్లు విడుదల చేసింది. ఏర్పాట్లలో ఎక్కడా రాజీలేకుండా కలెక్టర్ రాహుల్రాజ్ చర్యలు చేపట్టారు. సన్నాహక సమావేశశం ఏర్పాటు చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. భారీ ఏర్పాట్లు తెలంగాణలోనే అతి పెద్దదైన ఏడుపాయల జాతర కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సింగూరు నుంచి 0.35 టీఎంసీల నీటిని మంగళవారం విడుదల చేశారు. స్నానాల కోసం షవర్ బాత్లు, బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేశారు. నీటి ప్రమాదాలు జరగకుండా 150 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ప్రత్యేక వైద్య క్యాంపులను ఏర్పాటు చేశారు. తాగు నీటి కోసం 144 కుళాయిలు, 27 ట్యాంకర్లు, 476 శౌచాలయాలు ఏర్పాటు చేశారు. 598 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. 400 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి జాతర వరకు ఉచిత బస్సు సౌకర్యాం కల్పించనున్నారు. జాతరలో మద్య నిషేధం కోసం మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు నిరంతర విద్యుత్ అందించనున్నారు. ఆలయం ముందు షామియానాలు, క్యూలైన్లు, మంజీరా నదిలో శివుని విగ్రహం ఏర్నాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగొద్దు: కలెక్టర్ జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం అడిషనల్ కలెక్టర్ నగేష్, డీఎస్పీ ప్రసన్న కుమార్, ఆర్డీఓ రమాదేవితో కలసి ఏడుపాయల్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జాతరలో తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యం విషయాలలో అప్రమత్తంగా ఉండాలన్నారు. నోడల్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. మూడు షిఫ్ట్లలో పారిశుద్ధ్య సిబ్బంది పనులు చేయాలని ఆదేశించారు. హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి, సమన్వయ పరుచుకోవాలని సూచించారు. నేటి నుంచే ఏడుపాయల జాతర పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి దామోదర ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్883 పోలీసులతో బందోబస్తు: డీఎస్పీ జాతరలో ఎలాంటి ఇబ్బందుల కలుగకుండా 883 పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు, ముగ్గురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 61 మంది ఎస్సైలు, 45 మంది ఏఎస్ఐలు, 96 మంది హెడ్కానిస్టేబుళ్లు, 301 మంది కానిస్టేబుళ్లు, 91 మంది మహిళా కానిస్టేబుళ్లు, ,252 మంది హోంగార్డులు, 14 మంది మహిళా హోంగార్డులు విధుల్లో ఉంటారని ఆయన వివరించారు. -
పట్టాలెక్కని కల
చిన్నశంకరంపేట(మెదక్): ఎన్నో ఎళ్ల కల సాకరమైందన్న ఆనందం అంతలోనే ఆవిరైంది.. తమ గ్రామం నుంచి రైలు వెళ్తున్నా తమకు రైలు కూత తప్ప ప్రయాణం చేసే భాగ్యం లేదా అని గ్రామస్తులు శ్రమకోర్చి ఏళ్ల ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి రైలు కలను సాకారం చేసుకున్నారు. రెండు రైళ్లను హల్టింగ్ కూడా ఇచ్చారు. అంతా బాగానే నడుస్తుంది అనుకున్న నేపథ్యంలో కరోనాతో ఒక్కసారిగా కల తలకిందులైంది. కరోనా సమయంలో కేంద్రంలో చాలా వరకు రైల్వే స్టేషన్ మూసి వేయగా అందులో నార్సింగి మండలం శంకాపూర్ రైల్వే స్టేషన్ ఒకటి. అనంతరం మళ్లీ తెరిచి రైళ్లను యథావిధిగా కొనసాగిస్తున్నారని అనుకున్న గ్రామస్తుల కల మళ్లీ పట్టాలెక్కలేదు. సొంతంగా ప్లాట్ ఫారమ్, స్టేషన్ గది నిర్మాణం శంకాపూర్ గ్రామ శివారు మీదుగా ఉన్న సికింద్రాబాద్–నిజామాబాద్ రైల్వే మార్గంలో నిత్యం అనేక రైళ్లు నడుస్తుంటాయి. కానీ ఇక్కడ రైల్వేస్టేషన్ లేకపోవడంతో రైళ్లు ఆగేది కాదు. 2006 అప్పటి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయను గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి కోరడంతో రైల్వేస్టేషన్ మంజూరైంది. మంత్రి ఆదేశంతో రైల్వేస్టేషన్ ఏర్పాటుకు ముందుకొచ్చిన రైల్వే అధికారులు గ్రామస్తులు సొంతంగా ప్లాట్ ఫారమ్, స్టేషన్ గదిని నిర్మించుకోవాలని సూచించారు. దీంతో గ్రామస్తులు ఇంటికి ఇంత పోగుచేశారు. డబ్బులకు తోడు శ్రమదానం చేసేందుకు ముందుకొచ్చి ప్లాట్ ఫారం, స్టేషన్ గదిని కూడా నిర్మించుకున్నారు. పక్క స్టేషన్లకు వెళ్లి ఎక్కే పరిస్థితి నార్సింగి మండలంలోని శంకాపూర్, జప్తిశివనూర్ గ్రామాలతోపాటు చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్, కుమ్మరిపల్లి, రామాయపల్లి గ్రామాల ప్రజలకు రైలు సౌకర్యంగా ఉండేది. ఖాజాపూర్ గ్రామ శివారులో ఐరెన్ స్టీల్ పరిశ్రమ ఉండడంతో ఇతర రాష్ట్రాల కార్మికులకు అనువుగా ఉండేది. దీనికి తోడు రోజు ప్రయాణికులు సికింద్రాబాద్–నిజామాబాద్ మధ్యన ప్రయాణించేవారు. రైల్వే అధికారులు రైల్వేస్టేషన్ మూతవేయడంతో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మిర్జాపల్లి, అక్కన్నపేట రైల్వేస్టేన్లకు వెళ్లి ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంపీకి వినతి.. ఈ విషయంపై స్థానికులు రైల్వే అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఫలితం దక్కలేదు. మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్రావు దృష్టికి శంకాపూర్ గ్రామస్తులు తీసుకెళ్లారు. ఇప్పటికీ రైల్వే అధికారులు స్పందించడం లేదు. రఘునందన్రావు చొరవ తీసుకొని రైల్వేస్టేషన్ను పునరుద్దరణకు కృషి చేయాలని శంకాపూర్, ఖాజాపూర్ గ్రామ ప్రజలు వినతిపత్రం అందించారు. మూతపడిన శంకాపూర్ రైల్వేస్టేషన్ ఏళ్లుగా పున:ప్రారంభానికి నోచుకోని వైనం శ్రమకోర్చి రైల్వేస్టేషన్ ఏర్పాటు చేసుకున్న గ్రామస్తులు చందాలతో ప్లాట్ఫారం, స్టేషన్ గది నిర్మాణం మూణ్నాళ్ల ముచ్చటగానే రైలు కూత2019లో ఆగిన కూత తమ కలసాకరమైతుందన్న ఆనందంతో 2008లో అప్పటి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎంపీ సర్వే సత్యనారాయణను పిలిచి పండుగ వాతావరణంలో రైల్వేస్టేషన్ను ప్రారంభించారు. అప్పటి నుంచి రోజుకు రెండు ప్యాసింజ్ రైళ్లను నిలిపారు. దీంతో సికింద్రాబాద్–నిజామాబాద్ మధ్య రైలు ప్రయాణం చేస్తూ గ్రామస్తుల సంబురపడ్డారు. 2019లో కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్రం కొన్ని రైల్వేస్టేషన్లను మూసివేసింది. శంకాపూర్ రైల్వే స్టేషన్ను కూడా మూసివేయగా అనంతరం అన్ని రైల్వేస్టేషన్ల మాదిరిగానే తిరిగి ప్రారంభిస్తారని గ్రామస్తులు భావించారు. కానీ గ్రామస్తుల ఆశల మీద నీళ్లు చల్లుతూ రైల్వే అధికారులు స్టేషన్ను ప్రారంభించలేదు. గతంలో హల్టీంగ్ ఉన్న కాచిగూడ–సికింద్రాబాద్, బోధన్–సికింద్రాబాద్ రెండు ప్యాసింజర్ రైళ్లను కూడా నిలపకుండా ఉత్తర్వులు ఇచ్చారు. -
పండ్ల ధరలు ౖపైపెకి..
శివరాత్రి పండుగ సందర్భంగా పండ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండ్లు కొనుగోలు విషయంలో ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూ.50కు డజన్ ఉండాల్సిన అరటి పండ్లు రూ.80, ఆపిల్ పండ్లు రూ.200 నుంచి 250కి కేజీ, ద్రాక్షపండ్లు రూ.60 నుంచి రూ.100కు, 60కి కేజీ అమ్మాల్సిన జామ 100కు విక్రయిస్తున్నారు. పూల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. పండుగ సీజన్ కాబట్టి వ్యాపారులు కూడా అమాంతం ధరలు పెంచేశారు. – చేగుంట(తూప్రాన్): -
భౌతిక శాస్త్ర అధ్యయనం మరింత సులభం
మెదక్ కలెక్టరేట్: వర్చువల్ ల్యాబ్ వల్ల సైన్స్ ఉపాధ్యాయులు.. విద్యార్థులకు ప్రయోగ అనుభవాన్ని సులభంగా అందించగలరని డీఈఓ రాధా కిషన్ అన్నారు. మంగళవారం మెదక్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘సైన్స్ భావనలు – ప్రయోగ అనుభూతి, భౌతిక శాస్త్ర బోధనలో వర్చువల్ ల్యాబ్ –సిమ్యులేషన్‘అనే అంశంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డిజిటల్ పరికరాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో భౌతిక శాస్త్ర అధ్యయనాన్ని మరింత బోధనాపరంగా, ఆచరణాత్మకంగా తీర్చిదిద్దవచ్చునని తెలిపారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు తమ బోధన నైపుణ్యాలను మెరుగుపరచుకొని, సైన్స్ పాఠాలను మరింత చక్కగా బోధించగలరని వివరించారు. కార్యక్రమంలో వర్క్షాప్ కన్వీనర్ తిరుమల్ రెడ్డి, ఐఏపీటీ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్తోపాటు అధ్యాపకులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. కాగా, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ (ఐఏపీటీ) సౌజన్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం
● నేడు ఎన్నికల సామగ్రి పంపిణీ ● బరిలో 71 మంది అభ్యర్థులుమెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికలకు ఒక్కరోజే సమయం ఉండటంతో అభ్యర్థుల ప్రచారం జోరందుకొంది. 26న మహాశివరాత్రి పర్వదినం, 27న ఏడుపాయలలో మహాశివరాత్రి జాతర ఉండడంతో ఓటు వేసేందుకు ఓటర్లు వస్తారో లేదోనని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలకు సంబంధించి మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 15, పట్టభద్రుల పోటీలో 56 మంది పోటీలో ఉన్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థులు అత్యధికంగా పోటీ పడుతున్నారు. 43 పోలింగ్ కేంద్రాలు ఇప్పటికే ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి కావచ్చింది. అలాగే జిల్లాలో 1,347 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా 21 పోలింగ్ కేంద్రాలు; 12,472 మంది పట్టభద్రులు ఓటర్లు ఉండగా 22 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాలపై నిఘా పెట్టారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా పరిశీలించేందుకు రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు మహేశ్ దత్ ఇటీవల మెదక్కు చేరుకొని వివిధ నోడల్ అధికారులతో సమీక్షించారు. ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు మెదక్ సమీకృత కలెక్టరేట్లోని ఆడిటోరియంలో 24న పోలింగ్ అధికారులకు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా అదనపు కలెక్టర్ నగేశ్, మాస్టర్ ట్రైనర్ తూప్రాన్ ఆర్డీఓ జయచంద్ర రెడ్డి శిక్షణ ఇచ్చారు. పోలింగ్ ప్రక్రియకు వినియోగించే బ్యాలెట్ బాక్సులు, అన్ని రకాల ఫారంలతో పాటు నమూనా ఓటింగ్ ప్రక్రియను అధికారులతో సాధన చేయించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంటాయని, ఓటింగ్ గోప్యతను అమలయ్యేలా చర్యలు చేపట్టారు. కాగా జిల్లా కేంద్రంలో ఎన్నికల అధికారులకు బుధవారం పోలింగ్ సామగ్రి అందజేయనున్నారు.నోటాకు నో చాన్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈవీఎంలు ఉండవు కాబట్టి బ్యాలెట్ పత్రాలు ద్వారానే ఓటింగ్ నిర్వహిస్తారు. దీంతో ఈ ఎన్నికలలో నోటాకు అవకాశం లేదు. ఎన్నికల నిర్వహణకు ఆరుగురు ఫ్రయింగ్ స్క్వాడ్ సిబ్బంది, ముగ్గురు వీఎస్టీలు, 21 మంది ఏంసీసీలు, తొమ్మిది మంది సెక్టోరియల్ అధికారులు, 22 మంది పోలింగ్ అధికారులు, 22 మంది సహాయ అధికారులు, 44 మంది ఇతర సిబ్బంది, 22 మంది మైక్రో అబ్జర్వర్లను ఇప్పటికే నియమించారు. పోలింగ్, పోలీస్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అందజేస్తున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. -
ప్రలోభాలకు ఎర
మెదక్జోన్: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇక ప్రలోభాలకు తెరలేపారు. ఒక్కో ఓటుకు రూ.2వేల నుంచి రూ.5 వేల వరకు ఆఫర్ ఇస్తున్నారని సమాచారం. ఎక్కువ శాతం ఫోన్పే, గూగుల్పే ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. అలాగే.. కొన్నిచోట్ల విందులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ‘నా వద్ద పది ఓట్లున్నాయి. ఎంత ఇస్తారు. ఫలానా పార్టీవారు ఓటకు రూ.2 వేలు అంటున్నారు. మీరు ఏమైనా ఎక్కువ ఇస్తే మీకే వేస్తాం’’అంటూ బేరసారాలకు దిగుతున్నారు. దీంతో రెండు ప్రధాన పార్టీలతో పాటు ఒకరిద్దరు స్వతంత్ర అభ్యర్థులు సైతం పోటీపడి ఓట్లను కొనుగోలుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిసింది. సాధారణ ఎన్నికలను తలదన్నే విధంగా పట్టభద్రుల ఎన్నిక జరుగుతుంది. -
మహా కుంభమేళాకు వెళ్లి ముగ్గురు మృతి
న్యాల్కల్(జహీరాబాద్): మహా కుంభమేళా యాత్ర రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో మామిడ్గి, గంగ్వార్, మల్గి గ్రామాలు శోకసంద్రమయ్యాయి. రెండు రోజుల్లో తిరిగి వస్తామంటూ చిన్నారులను చెప్పి వెళ్లిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మామిడ్గికి చెందిన వెంకట్రాంరెడ్డి, భార్య విలాసిని, వదిన విశాల, ఇటికెపల్లి చెందిన జ్ఞానేశ్వర్రెడ్డి, మల్గికి చెందిన మల్లారెడ్డి, సంగారెడ్డికి చెందిన ఉపాధ్యాయుడు మోతిలాల్ కలిసి 22న కారులో మహా కుంభమేళాకు వెళ్లారు. పుణ్య స్నానాలు చేసి కాశీకి బయలు దేరగా మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ట్రక్కును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వెంకట్రాంరెడ్డి, విలాసిని, డ్రైవర్ మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు కాగా విశాల వారణాసి ట్రామా సెంటర్లో చికిత్స పొందుతున్నారు. వెంకట్రాంరెడ్డి సంగారెడ్డిలో ఉంటూ జహీరాబాద్ ఇరిగేషన్ డీఈఈగా, కోహీర్ ఇన్చార్జి అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. అలాగే.. మల్లారెడ్డి కొంత కాలంగా జహీరాబాద్లో ఉంటున్నాడు. కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు ప్రియాంశీ 5వ తరగతి, కుమారుడు సాయి స్లోక్ రెడ్డి 7వ తరగతి చదువుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తోంది. గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించడంతోపాటు మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటోంది. వెంకట్రాంరెడ్డి సౌమ్యుడు జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో మరణించిన నీటిపారుదల శాఖ డీఈఈ వెంకట్రాంరెడ్డి విధి నిర్వహణలో అందరికీ ఆదర్శంగా ఉండేవారు. తాను ఉన్నత ఉద్యోగిని అనేవిషయాన్ని పక్కన పెట్టి తానే స్వయంగా పనులు చూసేవారు. విధి నిర్వహణలో ఏ మాత్రం అలక్ష్యం చేయకుండా అన్నీ తానై చూసేవారు. పనుల నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడేవాడు కారని, పని సంతృప్తి కరంగా ఉన్నట్లయితేనే బిల్లులు మంజురు సేచేవారనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్లోని శ్రీసరస్వతీ శిశుమందిరంలో 1998లో 10వ తరగతి పూర్తి చేసుకున్నారు. అనంతరం ఉన్నత చదువులు హైదరాబాద్లో పూర్తి చేసుకుని 2007 జహీరాబాద్లో ఉద్యోగం పొందాడు. నీటిపారుదల శాఖలో ఏఈగా విధుల్లో చేరారు. అనంతరం పటాన్చెరు, నారాయణఖేడ్లో ఏఈగా పని చేశారు. డీఈఈగా పదోన్నతిపై తిరిగి జహీరాబాద్ వచ్చారు. తోటి ఉద్యోగులు, సిబ్బంది, స్నేహితులు, బంధువులతో మర్యాదగా మసలుకుంటూ సౌమ్యుడిగా పేరుతెచ్చుకున్నారు. రోడ్డుప్రమాదంలో మరణించిన డీఈఈ వెంకట్రాంరెడ్డికి దైవభక్తి అధికం. ప్రతి ఏటా కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లివచ్చే వారు. సడెన్గా యాత్రకు వెళ్లాలని నిర్ణయం ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లిరావాలనే నిర్ణయం అప్పటికప్పుడు తీసుకున్నట్లుగా బంధువుల ద్వారా తెలుస్తోంది. యాత్రకు వెళుతున్న విషయం సన్నిహితులకు కూడా సమాచారం లేదు. కుంభమేళ ముగుస్తుండడంతో ఎలాగైనా వెళ్లిరావాలని బంధువులంతా నిర్ణయించి ప్రయాణమయినట్లు బంధువర్గాల సమాచారం. -
మంటగలుస్తున్న మానవత్వం
అయిన వారే అంతమొందిస్తుండ్రు ● జిల్లాలో అమానవీయ ఘటనలుకౌన్సెలింగ్ అవసరం కుటుంబ కలహాలు, భూ తగాదాల్లో సముదాయించే వారు లేక అఘయిత్యాలకు పాల్పడుతున్నారు. దీంతో ఇరు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇలాంటి కేసులు పోలీస్ స్టేషన్లకు వచ్చినప్పుడు కౌన్సెలింగ్ చేయాలని మా సిబ్బందికి సూచించా. మా దృష్టికి రాగానే చాలా వరకు రాజీ చేస్తున్నాం. హత్యలు, దారుణాలు ఆగాలంటే కౌన్సెలింగ్ ఎంతో అవసరం. నేరాలను అరికట్టేందుకు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపడుతాం. – ఉదయ్కుమార్రెడ్డి, ఎస్పీ● అవగాహన కార్యక్రమాలు తప్పనిసరి: ఎస్పీమానవ సంబంధాలు రోజురోజుకు కనుమరుగవుతున్నాయి. మనుషుల మధ్య మమతానురాగాలు మాయమైపోతున్నాయి. ఆస్తి, కుటుంబ తగాదాలతో అయిన వారినే అంతమొందిస్తున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. జిల్లాలో నిత్యం ఏదో ఒక చోట అమానవీయ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. సమాజంలో రోజురోజుకు మానవత్వం మంటగలిసిపోతుండగా.. నేర ప్రవృత్తి పెరుగుతోంది. దెబ్బతింటున్న మానవ సంబంధాలను మళ్లీ బతికించేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెదక్ మున్సిపాలిటీ: ● పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని ఇందిరాకాలనీకి చెందిన సాయిలు–భూమమ్మలకు ఇద్దరు సంతానం. చిన్న కుమారుడు ప్రదీప్ (16) మానసిక దివ్యాంగుడు. తండ్రి సాయిలు హమాలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పనిచేయనిదే పూటగడవని ఆ కుటుంబంలో ప్రదీప్ను సమస్యగా భావించాడు. కొడుకును సాకలేక, సపర్యలు చేయలేక గతేడాది ఆగస్టు 6న మద్యం సేవించి వచ్చిన సాయిలు, తన కొడుకుపై రోకలిబండతో దాడిచేయడంతో మృతి చెందాడు.● పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన కర్రె ఆశయ్య (45) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఇటీవల పొలం వద్దకు వెళ్లిన సమయంలో కాలుజారి కింద పడటంతో వెన్నముక దెబ్బతింది. వైద్య ఖర్చులు భరించలేకనో.. అవిటితనంతో కుటుంబానికి భారం అవుతాడనో.. లేక రైతుబీమా వస్తుందన్న ఆశనో తెలియదు కాని కట్టుకున్న భార్య సొంత అల్లుడితో కలిసి భర్తను హత్య చేసింది. ● మద్యానికి బానిసై నిత్యం చంపుతానంటూ బెదిరిస్తున్న కొడుకును తండ్రి హతమార్చాడు. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటకు చెందిన మాదాసు దుర్గయ్య చిన్న కుమారుడు శ్రీకాంత్ (29) మద్యానికి బానిసై నిత్యం తల్లిదండ్రులతో గొడవపడుతూ చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఈనెల 17న రాత్రి సైతం శ్రీకాంత్ మద్యం తాగివచ్చి తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. విసుగుచెందిన దుర్గయ్య తన కొడుకు నిద్రపోతున్న సమయంలో కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. -
బీఆర్ఎస్లో గ్రూప్ వార్!
● నాయకత్వం కోసం నలుగురి ఆరాటం ● విందులతో నాయకుల మచ్చిక ● పోటాపోటీగా పర్యటనలు ● కార్యకర్తలకు సహాయ సహకారాలుమెదక్ మున్సిపాలిటీ/పాపన్నపేట(మెదక్): ‘కాంగ్రెసోల్లకు ఒక ఎమ్మెల్యే ఉంటే.. ఉంటే మాకు మాత్రం నలుగురు. వారెవరు పిలిచినా వెంట వెళ్లాల్సిందే. లేకుంటే నిష్టూర చూపులు.. సూటి పోటి మాటలు తప్పడం లేదు’అని వాపోయాడు ఓ బీఆర్ఎస్ నాయకుడు. దీనిని బట్టి మెతుకుసీమలో గులాబీ రేకులు.. బాకులై గుచ్చుకుంటున్నట్లు కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో నెలకొన్న పరిణామాలు.. ఎన్నికల అనంతరం కొత్త సమీకరణలకు దారి తీస్తున్నాయి. నాయకత్వ పోరుకు తెరలేపుతున్నాయి. ఎదురులేని పద్మారెడ్డికి కొత్త చిక్కులు టీఆర్ఎస్ ఆవిర్భవించిన కొత్తలో రామాయంపేట జెడ్పీటీసీగా రాజకీయ ఆరంగ్రేటం చేసిన పద్మారెడ్డి మెతుకుసీమలో ఎదురులేని ఏలికగా నిలిచారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా 2024 ఎన్నికల వరకు పార్టీలో ఆమె చెప్పిందే వేదం. అప్పటివరకు అంతో.. ఇంతో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి నుంచి పోటీ ఎదుర్కొన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో టికెట్ ఆశించి భంగపడ్డ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే వీరి నుంచి ఎన్నికల్లో ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుందని, అప్పట్లో పద్మారెడ్డి ఆశించారు. కాని ఎన్నికల్లో ఓటమి, తదనంతర పరిణామాలు రోజుకు రోజుకు జటిలంగా మారుతున్నాయి. అప్పట్లో అనుచరుడిగా ఉంటాడనుకున్న తిరుపతిరెడ్డి ఇప్పుడు అధి నాయకుడిగా ఎదగడానికి పావులు కదుపుతున్నాడు. ఒకప్పడు పద్మారెడ్డికి వీర విధేయులగా ఉన్న నాయకులను మచ్చిక చేసుకుంటున్నాడు. విందులు వినోదాలతో వారిని ఆకట్టుకుంటున్నాడు. మెదక్– పాపన్నపేట మండలంలోని బీఆర్ఎస్ నాయకులను తన దారికి తెచ్చుకున్నాడు. పాపన్నపేట మండల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు కాశీ, ప్రయాగయాత్రలు వెళ్లేందుకు వాహన సదుపాయం కల్పించాడు. దసరా తర్వాత అతన్ని కలవడానికి వెళ్లిన సుమారు 50 మంది బీఆర్ఎస్ నాయకులకు కొంపల్లిలోని ఓ రెస్టారెంట్లో భారీ విందు ఏర్పాటు చేశాడు. చిత్రమేమిటంటే అక్కడకు వెళ్లిన నాయకులు, 2 కి.మీ దూరంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డిని కలవకుండానే తిరిగి తమ ఇళ్లకు మళ్లారు. గతంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రిని నియోజకవర్గ నాయకులు ఎవరు కలవాలన్నా, స్థానిక ఎమ్మెల్యే ద్వారానే వెళ్లే వారు. కానీ ఎన్నికల అనంతరం పరిస్థితులు మారాయి. ఈ విషయాన్ని మాజీ మంత్రి దృష్టికి తీసుకెళ్లి డైరక్ట్గా కలిసే అవకాశాన్ని సంపాదించారు. ఇటీవల ఎర్రవల్లిలో జరిగిన మాజీ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలకు కూడా గ్రూపుల వారీగా తరలి వెళ్లినట్లు తెలుస్తుంది.ఎవరికి వారే యమునా తీరే.. మెదక్ బీఆర్ఎస్లో ప్రస్తుతం నలుగురి మధ్య అధిపత్య పోరు కొనసాగుతుంది. పద్మారెడ్డి, కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి నియోజకవర్గ నాయకత్వం కోసం పోటీ పడుతున్నారు. నియోజక వర్గంలోని కార్యకర్తల ఇళ్లలో ఎలాంటి బాధాకర సంఘటన జరిగినా, ఇద్దరు నాయకులు పోటీ పడి స్పందిస్తున్నారు. ఎవరికి తోచిన ఆర్థిక సహాయం వారు చేస్తున్నారు. ఎవరికి వారే సోషల్ మీడియా గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎక్కడ కార్యక్రమాలకు వెళ్లినా, అధిపత్య ప్రదర్శన కోసం స్థానిక నాయకులతో కలిసి భారీ కాన్వాయ్లతో సాగుతున్నారు. వీరంతా వెళ్లేది ఒకే కార్యక్రమానికి అయినా, వేర్వేరుగా వెళ్తున్నారు. తిరిగి వెళ్లేటప్పుడు ఒక నాయకుడు మాత్రం తన వెంట వచ్చిన వారికి విందు ఏర్పాటు చేస్తున్నాడు. కాగా ఈ పరిణామాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నప్పటికీ. ‘ఎద్దు పుండు కాకి ముద్దు అన్నట్లు’అధినాయకుల మధ్య ఏర్పడిన అగాథం.. స్థానిక నాయకులకు మాత్రం గుర్తింపుతో పాటు ఖుషీని పంచుతుంది. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై గ్రూపు రాజకీయాలు రచ్చకు దారి తీసే ప్రమాదం ఉందని మధ్యస్తంగా ఉన్న పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఎన్నికలపై పూర్తి అవగాహన ఉండాలి
అదనపు కలెక్టర్ నగేష్ మెదక్జోన్: పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ విధుల పట్ల సిబ్బంది సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. సోమవారం కల్టెరేట్లోని సమావేశ మందిరంలో పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, తహసీల్దార్లకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఓటింగ్ గోప్యతను ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని, ఆదేశించారు. ఈనెల 26న ఉదయం 9 గంటలకు జిల్లాలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని సూచించారు. తమకు కేటాయించిన ఎన్నికల సామగ్రిని సరిచూసుకొని, ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో విధులు సక్రమంగా నిర్వహించి, ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు.వెబ్కాస్టింగ్ ద్వారా ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవోలు జయచంద్రారెడ్డి, మహిపాల్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.వినతులు స్వీకరించిన ఎస్పీ మెదక్ మున్సిపాలిటీ: మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఎస్పీ.. చట్ట ప్రకారం ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.మహిళా సాధికారతపై వారోత్సవాలునేడు మెదక్లో 2కే రన్ మెదక్ కలెక్టరేట్: ఆర్థిక అక్షరాస్యత, మహిళా సాధికారతపై వారోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయని, మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయని అదనపు కలెక్టర్ నగేష్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం లీడ్ బ్యాంకు మేనేజర్ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. మహిళల కోసం ఆర్థిక ప్రణాళిక, పొదుపు నష్టనివారణ చర్యలు ఆర్థిక పరిపుష్టి రుణాలు పొందడం, గృహరుణాలు, ఉద్యోగినిలకు, స్వయం ఉపాధి పొందాలనే మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. బీజేపీ అభ్యర్థుల గెలుపునకుకృషి చేయాలిఆ పార్టీ కార్యవర్గ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి టేక్మాల్(మెదక్): త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విష్ణువర్దన్రెడ్డి అన్నారు. సోమవారం టేక్మాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లు తెలంగాణని దోచుకున్న బీఆర్ఎస్, ఏడాది కాలంలోనే అసమర్థ పాలనతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీలను భూస్థాపితం చేయాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల పట్టభద్రుల ఎన్నికల ఇన్చార్జి నాగరాజు, టీచర్ ఎమ్మెల్సీ ఇన్చార్జి సిద్ధిరాములు, కొందుర్గు, కొత్తూరు మండలాల అధ్యక్షులు లక్ష్మీకాంతరెడ్డి, అత్తాపూర్ మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు నర్సింహ యాదవ్, సుధాకర్ అప్ప, జిల్లా కౌన్సిల్ సభ్యులు మహేశ్, నరేందర్రెడ్డి పాల్గొన్నారు. అరుదైన భైరవుని శిల్పం చిన్నశంకరంపేట(మెదక్): మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర ఆలయంలో అరుదైన భైరవుడి విగ్రహం ఉందని చరిత్ర పరిశోధకుడు, కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. ఆయన సోమవారం ఆలయాన్ని మరోసారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉన్న శిల్పాల్లో భైరువుడి కుడివైపున మైరవి శిల్పం ఉండడం చాలా అరుదైనదన్నారు. చతుర్భుడైన భైరవుడు జటాఝాటంతో త్రిశూలం, ఢమరుకం, కత్తి, రక్తపాత్రలతో, కాళ్లకు, దండ రెట్టలకు కడియాలు, చెవులకు కుండలాలు, మెడలో కపాలమాలతో సర్వాంగ సుందరంగా చెక్కి ఉన్న ఈ భైరవుడు చాళుక్యుల కాలానికి చెందినవాడని తెలిపారు. -
అప్పుడిచ్చారు.. ఇప్పుడు లాక్కొంటున్నారు
మెదక్ కలెక్టరేట్: భూములు లాక్కొంటున్నారు.. తమకు న్యాయం చేయాలంటూ మాసాయిపేట మండలం అచ్చంపేట దళితులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అచ్చంపేటలోని 40 బీసీ, ఎస్సీ కుటుంబాలకు గ్రామ శివారులోని 61 నుండి 135 వరకు గల సర్వే నంబర్లలో 1994లో అప్పటి ప్రభుత్వం జీవనోపాధికై భూములిచ్చిందన్నారు. ఎస్సీలకు మూడెకరాలు, బీసీలకు ఎకరన్నర చొప్పు న కేటాయించారని, కాని హద్దులు చూపలేదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ భూములను సాగుకు అనువుగా మార్చుకొన్నామన్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారులు వచ్చి అడ్డుకోవడం వల్ల సాగు చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల రెవెన్యూ అధికారులు వచ్చి ఆ భూముల్లో పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారన్నారు. ఇప్పటి ప్రభుత్వం తమ భూములను లాక్కోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని వేడుకొన్నారు.కలెక్టరేట్ ఎదుట దళితుల నిరసన -
400
ప్రత్యేక బస్సులు● 50 శాతం అదనపుచార్జీలు వసూలు! ● పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ల్లోమహిళలకు ఉచితం ● రేపటి నుంచి ఏడుపాయల జాతరమెదక్జోన్: ఏడుపాయల జాతరకు 400 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సన్నద్ధం అయ్యారు. హైదరాబాద్ సహా 10 డిపోల నుంచి బస్సులను నడపనున్నారు. రద్దీని బట్టి మరిన్ని నడిపేందుకు చర్యలు చేపడుతున్నారు. కాగా గతేడాది మేడారం జాతర ఉండడంతో భక్తుల రద్దీ తగ్గింది. ఈ ఏడాది భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టుగా ఆర్టీసీ సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు.. ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఏడుపాయల జాతర కొనసాగనుంది. కాగా ప్రతి రోజు షెడ్యూల్ ప్రకారం తిరిగే బస్సులు యథావిధిగా తిరుగుతుండగా.. హైదరాబాద్, సికింద్రాబాద్, జేబీఎస్, బాలానగర్, నర్సాపూర్ డిపోల నుంచి 300 బస్సులు, అలాగే పటాన్చెరు, సంగారెడ్డి, సదాశివపేట డిపోల నుంచి 50 బస్సులు, నారాయణఖేడ్, జహీరాబాద్ డిపోల నుంచి మరో 50 చొప్పున మొత్తం 400 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. అయితే సాధారణ చార్జీల కంటే భక్తుల నుంచి 50 శాతం అదనంగా వసూలు చేయనున్నట్లు తెలిసింది. గతేడాది జాతర సందర్భంగా ఆర్టీసీకి రూ. 10.50 లక్షల ఆదాయం రాగా, ఈ సంవత్సరం రూ. 15 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. జేబీఎస్ నుంచి 90 కిలోమీటర్లు.. రాష్ట్రంలోనే ఏడుపాయల జాతర ప్రసిద్ది చెందినది కావటంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉంది. జేబీఎస్ నుంచి వయా బాలానగర్, నర్సాపూర్ మీదుగా కొల్చారం మండలం పోతన్శెట్టిపల్లి నుంచి నేరుగా జాతర సమీపంలో తాత్కాలింకంగా ఏర్పాటు చేసిన బస్టాండ్ వద్ద భక్తులను దింపనున్నారు. అక్కడి నుంచి ఆర్టీసీ సంస్థ 10 మినీ బస్సుల ద్వారా భక్తులను ఆలయం వరకు తీసుకెళ్తారు. అలాగే జేబీఎస్ వయా తూప్రాన్ మీదుగా వచ్చే భక్తులను నేరుగా మెదక్ బస్ డిపోలో దింపేస్తాయి. అక్కడి నుంచి స్పెషల్ బస్సుల్లో భక్తులను మెదక్ నుంచి నేరుగా వయా మంబోజిపల్లి, నాగ్సాన్పల్లి నుంచి జాతర సమీపంలో బస్సులు దింపివేస్తాయి. అలాగే పటాన్చెరు, సంగారెడ్డి, సదాశివపేట నుంచి వచ్చే బస్సులు పోతాన్శెట్టిపల్లి మీదుగా నారాయణఖేడ్, జహీరాబాద్ డిపోల నుంచి వచ్చే బస్సులు వయా బొడ్మట్పల్లి వయా టేక్మాల్ నుంచి పాపన్నపేట మీదుగా నాగ్సాన్పల్లి నుంచి జాతరకు నడువనున్నాయి.రద్దీని బట్టి మరిన్ని బస్సులు ఏడుపాయల జాతర నేపథ్యంలో 10 డిపోల నుంచి 400 బస్సులు నడుపుతాం. రద్దీని బట్టి మరిన్ని నడుపుతాం. అందుకోసం మరో 20 బస్సులను సిద్ధంగా ఉంచుతాం. అంతేకాకుండా సాధారణ రోజుల్లో షెడ్యూల్ ప్రకారం తిరిగే బస్సులు యథావిధిగానడిపిస్తాం. – సురేఖ, డీఎం మెదక్ -
నరేందర్రెడ్డి ఎన్నిక.. భవితకు భరోసా
పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి వెల్దుర్తి(తూప్రాన్): ఉమ్మడి మెదక్, కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బరిలో నిలిచిన నరేందర్రెడ్డి ఎన్నిక.. పట్టభద్రుల భవితకు భరోసాగా నిలుస్తుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి అన్నారు. ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నరేందర్రెడ్డికి మద్దతుగా మండలంలోని మంగళపర్తి, వెల్దుర్తిలో ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల వ్యవధిలోనే నిరుద్యోగులకు సుమారు 57 వేలు ఉద్యోగాలు కల్పించారన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు నరేందర్రెడ్డి, శ్రీనివాస్గుప్తా, రామకృష్ణారావు, సుధాకర్గౌడ్, మల్లేశం, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి
హవేళిఘణాపూర్(మెదక్): కాంగ్రెస్ అభ్యర్థి బలపర్చిన అభ్యర్థిని గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలు పరిష్కరిస్తామని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ అన్నారు. నిరుద్యోగుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన హామీనిచ్చారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డికి మద్దతుగా మండల కేంద్రం హవేళిఘణాపూర్లో మెదక్ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశురామ్, మండల నాయకులు శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే రోహిత్ -
ఎమర్జెన్సీ భవనం... పనులేమో నత్తనడక
మెదక్జోన్: మెదక్ జిల్లాలోని పిల్లికోటాల్లోని మాతాశిశు ఆస్పత్రి (ఎంసీహెచ్) పక్కనే నిర్మిస్తోన్న ప్రత్యేక అత్యవసర సేవల (ఎమర్జెన్సీ) ఆస్పత్రి భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. సరైన పనుల పట్ల ప్రణాళిక, పర్యవేక్షణ లేకపోవడం, నాణ్యతలేని పనులు, ఎక్కడా కానరాని అధికారుల పరిశీలనలతో ఈ భవన నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. గోడలు కట్టి కూల్చివేసి మరోసారి గోడలు కట్టడం వంటి చేష్టలతో ఎమర్జెన్సీ భవన నిర్మాణ పనులు అభాసుపాలవుతున్నాయి. ప్రారంభించి ఏడాదిన్నర కావొస్తున్నా కనీసం సగం నిర్మాణ పనులు కూడా పూర్తికాలేదంటే పనులు ఎంత నత్తనడకన సాగుతున్నాయో అవగతమవుతోంది. తప్పనిసరి నిబంధనతో... జిల్లాకు ఇప్పటికే వైద్య కళాశాల మంజూరు కావడంతో దానిని ప్రస్తుతం ఓ ప్రైవేటు భవనంలో కొనసాగిస్తున్నారు. అయితే ఆ కళాశాల పరిధిలో 500 పడకల ఆస్పత్రి తప్పనిసరిగా ఉండాలనే వైద్యవిధాన పరిషత్ నిబంధనతో ఎంసీహెచ్ పక్కనే రూ.23.75కోట్ల వ్యయంతో 100 పడకల ఎమర్జెన్సీ ఆస్పత్రి భవన నిర్మాణాన్ని తలపెట్టారు. ఇప్పటికే జిల్లా కేంద్ర ఆస్పత్రిలో 120 పడకలు, ఎంసీహెచ్లో 100 పడకలున్న సంగతి తెలిసిందే. మరో 180 పడకల ఆస్పత్రి కోసం (మెడికల్) కళాశాల భవనంతోపాటు నర్సింగ్ కళాశాల నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరయ్యాయి. ఇందుకోసం స్థలాన్ని సైతం పరిశీలించారు. కానీ ఇది టెండర్ దశలో ఉంది. పర్యవేక్షణ ఏది? మెడికల్ ఇంజనీర్ పర్యవేక్షణలో ఎమర్జెన్సీ ఆస్పత్రి భవన నిర్మాణాన్ని 2023 జూన్లో ప్రారంభించారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా ఈ పనులను పర్యవేక్షించిన పాపాన లేదు. సరైన ప్రణాళిక లేకపోవడంతో గోడలు కట్టి కొంత పూర్తయ్యక వాటిని కూల్చేస్తున్నారు. తిరిగి మళ్లీ అదే పద్ధతిలో గోడలు కడుతున్నారు. నాసిరకం ఇసుక, వాటర్ క్యూరింగ్ లేకపోవడంతో కట్టిన గోడలు ఎన్నేళ్లు మన్నిక ఉంటాయనే ఆందోళన లేకపోలేదు. ప్రజాధనం వృథా.. ఎమర్జెన్సీ ఆస్పత్రి భవన నిర్మాణ పరిస్థితి రాజుల పైసా రాళ్లపాలు అన్న చందనా తయారైంది. కోట్లాది రూపాయలతో సాగుతున్న నిర్మాణపనుల్ని దగ్గరుండి పర్యవేక్షించాల్సి అధికారులు ఎక్కడా కానరావడంలేదు. నిర్మాణ పనులు ఆన్లైన్ టెండర్ను దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులను మాత్రం మరో సబ్ కాంట్రాక్టర్కు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో పనుల్లో పూర్తిగా నాణ్యత లోపిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారమంతా అధికారుల కనుసనల్లోనే జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ఈ భవన నిర్మాణ పనుల్లో నాణ్యత, వేగం పెంచాలని స్థానికులు కోరుతున్నారు. రూ.23.75కోట్ల వ్యయంతో ఆస్పత్రి నూతన భవన నిర్మాణం గోడలు కట్టి.. కూల్చి.. మళ్లీ కట్టి... ఏడాదిన్నరగా ఇదే తంతు పట్టించుకోని అధికారులు... పర్యవేక్షణ లోపం -
రెండు రోజుల్లో జాతర.. నిధులేవీ..?
ఏడుపాయల జాతరపై ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నీడలు కమ్ముకున్నాయి. ఈనెల 26వ తేదీ నుంచి జరిగే మహా జాతరలో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం కరువైంది. నోటిఫికేషన్ విడుదలైనా.. ఆలయ పాలక మండలి ఏర్పాటు చేయక పోవడంతో జాతర నిర్వహణ భారమంతా అధికారులపైనే పడింది. ఇన్చార్జి ఈవో అరకొర సిబ్బందితో ఇబ్బంది పడుతున్న వేళ.. ఈ మహా జాతర నిర్వహణ సవాల్గా మారింది. మరో రెండు రోజుల్లో జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇప్పటి వరకు జాతర ఏర్పాట్ల కోసం నిధులు విడుదల కాలేదు. పాపన్నపేట(మెదక్): తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన ఏడుపాయల జాతర ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు జరగనుంది. ప్రతియేటా సుమారు 15 లక్షల వరకు భక్తులు హాజరవుతారు. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం కరువైంది. ఇప్పటి వరకు కలెక్టర్ రాహుల్ రాజ్. అడిషనల్ కలెక్టర్ నగేష్ ఆధ్వర్యంలో రెండు సార్లు సన్నాహక సమావేశం నిర్వహించారు. చివరగా 25న ఏడుపాయల్లో మరో సమావేశం నిర్వహించనున్నారు. పాలకవర్గ సభ్యులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం లేకపోవడంతో ,స్థానిక సమస్యలు ,పరిష్కార మార్గాలు, సూచనలు కరువయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి .తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రతి యేటా ఏడుపాయల జాతర ఏర్పాట్లకు రూ.2 కోట్లు విడుదల చేస్తున్నారు. ఈసారి ఇంత వరకు నిధులు విడుదల కాలేదు. అయినా ఎప్పటిలాగే పనులు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఏటా మహాశివరాత్రి రోజున ప్రభుత్వం తరపున మంత్రి, లేదా ఎమ్మెల్యే దుర్గమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించి జాతర ప్రారంభిస్తారు. అయితే ఈసారి ఎవరు పట్టు వస్త్రాలు సమర్పిస్తారో ఇంత వరకు ఖరారు కాలేదు. ఇన్చార్జి ఈవో, అరకొర సిబ్బంది తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల 6ఏ టెంపుల్గా గుర్తింపు పొందింది. రూ.10 కోట్లకు పైగా ఆదాయం ఉండటంతో డిప్యూటీ కమిషనర్ స్థాయి ఈవో ఇక్కడ ఉండాలి. కనీసం రెగ్యులర్ ఈవో కూడా లేరు. ఆగస్టులో ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్గా పని చేస్తున్న చంద్రశేఖర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో ఇక్కడ 9 మంది జూనియర్ అసిస్టెంట్లు ఉండే వారు. ప్రస్తుతం నలుగురు మాత్రమే పని చేస్తున్నారు. జాతర కోసం కొంత మంది సిబ్బందిని డిప్యూటేషన్పై పంపాల్సిందిగా కమిషనర్ కార్యాలయానికి ఈవో విజ్ఞప్తి చేయగా.. కొండగట్టు దేవస్థానంలో పనిచేసి జనవరిలో రిటైరైన వై.అంజయ్యను రెండేళ్ల కోసం, తాత్కాలిక ప్రాతిపదికన ఏడుపాయల్లో అసిస్టెంట్ ఈవోగా నియామకం చేస్తూ అడిషనల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా అతని నియామకం వివాదాస్పదం కావడంతో, విధుల్లో చేరకుండానే నిలిచి పోయినట్లు తెలిసింది. పేరుకు పోయిన ప్లాస్టిక్ చెత్తా చెదారం ప్రారంభమైన ఏర్పాట్లు ఏడుపాయల జాతర కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మంజీరా నది చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రదేశాలు, తాత్కాలిక టాయిలెట్లు, ఆలయం ముందు క్యూలైన్లు నిర్మిస్తు్ాన్నరు. ఆదివారం సాయంత్రం ఏడుపాయలకు సింగూరు నుంచి 0.35 టీఎంసీ నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. అయితే ఏడుపాయల్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్, చెత్తా చెదారం పేరుకుపోయింది. దాన్ని వెంటనే తొలగించాల్సిన అవసరం ఉంది. ‘ఏడుపాయల’పై ఎన్నికల కోడ్ నీడలు ఏర్పాట్లు అంతంతమాత్రమే దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించేదెవరు.? అధికారులకు సవాల్గా మారిన నిర్వహణ -
చికెన్ వ్యాపారానికి బర్డ్ఫ్లూ దెబ్బ
మెదక్ మున్సిపాలిటీ: బర్డ్ ఫ్లూతో చికెన్ వ్యాపారానికి బ్రేక్ పడగా, మటన్ దుకాణాలు, చేపల విక్రయాలు జోరందుకున్నాయి. ఇదే అదనుగా భావించిన మటన్, చేపల వ్యాపారులు అమాంతం ధరలు పెంచేశారు. సండే వచ్చిందంటే.. ముక్క లేనిదే ముద్ద దిగదు...చికెన్ ప్రియులకు బర్ద్ ఫ్లూతో కాస్త బ్రేక్ పడింది. ఆదివారమైతే చాలు నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్, చేపల కొనుగోలు ఎగపడుతారు. అయితే చికెన్తో బర్ద్ ఫ్లూ సోకుతుందన్న ప్రచారం జోరుగా కొనసాగుతోంది. దీంతో చికెన్ కిలో రూ.200 నుంచి రూ.250 వరకు అమ్మేవారు. ప్రస్తుతం రూ.150లకు విక్రయిస్తున్న కొనేవారు లేక దుకాణాలు వెలవెలబోతున్నాయి. క్వింటాళ్ల కొద్ది అమ్మే చికెన్.. ప్రస్తుతం కిలోలలో మాత్రమే అమ్ముడుపోతుందని వ్యాపారులు తెలిపారు. ఇదే క్రమంలో మటన్ డిమాండ్ విపరీతంగా పెడిగింది. కిలో మటన్ ధర రూ.720 ఉన్న రేట్లను 850 వరకు విక్రయిస్తున్నారు. చేపల అమ్మకాల జోరు చేపల అమ్మకాల జోరు కూడా విపరీతంగా పెరిగింది. కిలో చేపలు బొచ్చ, రౌటలు రూ.150 నుంచి 200 వరకు ఉండేది. ప్రస్తుతం కిలో చేపలు రూ.250 నుంచి రూ.350ల వరకు బొచ్చలు విక్రయిస్తున్నారు. అలాగే కొర్రమీను కిలో రూ.600ల వరకు విక్రయిస్తున్నారు. వెలవెలబోతున్న సెంటర్లు మటన్ దుకాణాల కిటకిట -
అద్దె భవనాలే దిక్కు!
అల్లాదుర్గం(మెదక్): పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం ఎనిమిదేళ్ల క్రితం సబ్ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటివరకు సొంత భవనాలు నిర్మించలేదు. కనీసం స్థల పరిశీలన చేయలేదు. దీంతో అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాల మధ్య అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే సరిపడా సిబ్బందిని సైతం నియమించలేదు. దీంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. ఇది అల్లాదుర్గంలోని ప్రభుత్వ కార్యాలయాల దుస్థితి. 2016లో అప్పటి ప్రభుత్వం పునర్విభజనలో భాగంగా జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేసింది. ఇందులో సంగారెడ్డి జిల్లాలో ఉన్న అల్లాదుర్గం మండలాన్ని మెదక్ జిల్లాలో కలిపింది. అల్లాదుర్గం, రేగోడ్, టేక్మాల్, పెద్దశంకరంపేట మండలాలను కలిపి అల్లాదుర్గం సబ్డివిజన్గా ఏర్పాటు చేసింది. పంచాయతీరాజ్ సబ్ డివిజన్, పోలీస్ సర్కిల్ కార్యాలయం, ఇరిగేషన్ సబ్ డివిజన్, ఐసీడీఎస్ ప్రాజెక్టు, ఉద్యానవనం, పీఏసీఎస్ సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. అయితే అరకొర వసతుల మధ్య అద్దె ఇంటిలో ఐసీడీఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లతో సమావేశం నిర్వహించేందుకు సరిపడా హాల్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమావేశం నిర్వహించేందుకు కల్యాణ మండపం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే మూడేళ్లుగా ఇన్చార్జిలతోనే అల్లాదుర్గం సీడీపీఓ కార్యాలయం కొనసాగుతుంది. పంచాయతీరాజ్ సబ్డిజన్ కార్యాలయం ఐకేపీ కార్యాలయంలో కొనసాగుతుంది. సొంత భవనం కోసం ఎవరు కృషి చేయడం లేదు. ఈ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రిటైర్ అయినా, ఆయన స్థానంలో ఎవరిని నియమించలేదు. కార్యాలయంలో డీఈఈ, ఇద్దరు అటెండర్లు మాత్రమే ఉన్నారు. కార్యాలయ పరిధిలో నలుగురు ఏఈలకు ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇరిగేషన్ కార్యాలయం ఆర్అండ్బీ అతిఽథి గృహంలో చిన్న గదిలో కొనసాగుతుంది. ఈ కార్యాలయంలో అటెండర్, రికార్డు అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లు లేరు. అల్లాదుర్గం పోలీస్ సర్కిల్ కార్యాలయం, హౌసింగ్ శాఖ నిర్మించిన మోడల్ హౌస్లో కొనసాగుతుంది. ఇరుకై న రెండు గదులలో కార్యాల యం నిర్వహిస్తున్నారు. సర్కిల్ పరిధిలోని ఎస్ఐలతో కార్యాలయంలో సమా వేశాలు నిర్వహించేందుకు అధికారులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా 2017 జనవరి 16న అల్లాదుర్గంలో ప్రాథమిక వ్యవసాయ సర్కిల్, ఉద్యానవన కార్యాలయాలను అప్పటి ఎమ్మెల్యే బాబూమోహన్ ప్రారంభించారు. అప్పట్లో ఎంపీపీ కార్యాలయంలోని గదులలో కార్యాలయాలు కొనసాగించారు. రెండేళ్ల తర్వాత 161 జాతీయ రహదారి విస్తరణలో సగం కూల్చివేశారు. దీంతో ఈ కార్యాలయాలకు భవనాలు లేక ఎత్తివేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు కరువు అరకొర వసతుల మధ్య అధికారుల విధులు పోస్టుల భర్తీలోనూ అలసత్వం ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన కలెక్టర్ అల్లాదుర్గంలో బీసీ గురుకుల పాఠశాల, ఐటీఐ, ఐసీడీఎస్, ఫైర్స్టేషన్, పీఆర్ సబ్ డివిజన్ కార్యాలయాలకు స్థలాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 23న స్థలాలను పరిశీలించారు. అయితే స్థలాలు కేటాయించిన ప్రభుత్వం భవన నిర్మాణాలకు నిధులు ఎప్పుడు మంజూరు చేస్తుందో, అవి ఎప్పుడు పూర్తవుతాయో వేచి చూడాల్సిందే. -
‘ఈ–బాహసే’ విద్యార్థులకు చేయూత
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్నర్సాపూర్: మనదేశంలో యువత ప్రతిభకు తగ్గ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి చెప్పారు. స్థానిక బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీలో 20న ప్రారంభమైన ఈ–బాహ సే ఇండియా పోటీలు ఆదివారం ముగిశాయి. ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ ఈ–బాహ లాంటి కార్యక్రమాలు విద్యార్థులకు చేయూతనిస్తాయన్నారు. కాలేజీ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, ప్రిన్సిపాల్ సంజయ్దూబె మాట్లాడుతూ ఈ పోటీలలో 85 జట్లు నమోదు చేసుకున్నాయని, 44 జట్లు పోటీలలో చివరి దశకు చేరాయన్నారు. పోటీలలో పాల్గొన్న ఆయా కాలేజీల విద్యార్థులకు పలు విభాగాలలో బహుమతులు అందజేశారు. పూణెకు చెందిన పింప్రి చించ్వర్డ్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన జట్టు ప్రథమ స్థానంలో నిలువగా, భీమవరానికి చెందిన విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ మహిళలు రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. స్థానిక బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీ జట్టు తృతీయస్థానాన్ని దక్కించుకుంది. కార్యక్రమంలో భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్ డైరెక్టర్ సుఖ్మల్ జైన్, విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్, ఈ– బాహ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ బాల్రాజ్ సుబ్రమణ్యం, ఆటోమోటివ్ టెస్ట్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ రామనాథన్ పాల్గొన్నారు. -
’ఆవాసం’.. పేద విద్యార్థులకు వరం
నేడు 19వ వార్షికోత్సవంరామాయంపేట(మెదక్): రామాయంపేటలోని ఆవాస విద్యాలయం నిరుపేద విద్యార్ధులకు వరంగా మారింది. 2006లో ప్రారంభమైన పాఠశాల ఇంతింతై వటుడింతైనట్లు దినదినాభివృద్ధి చెందుతుంది. పేద విద్యార్థుల్లో వెలుగులు నింపుతుంది. వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుంది. ఆదివారం 19వ వార్షికోత్సవం జరుపుకోనున్న సందర్భంగా ప్రత్యేక కథనం..ట్రాన్స్కో మాజీ ఉద్యోగి కృష్ణారెడ్డి సేవాభారతి సంస్థ ద్వారా ఈ పాఠశాలను ప్రారంభించారు. మొదల్లో కేవలం 10 మందితో ప్రారంభం కాగా.. నేడు 60 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. కృష్ణారెడ్డి సేవాభావాన్ని ప్రత్యక్షంగా చూసిన కొందరు దాతలు స్వచ్ఛందంగా విరాళాలు అందజేస్తూ విద్యాలయం అభివృద్ధికి తోడ్పడుతున్నారు. కొంద రు ప్రవాస భారతీయులు సైతం విద్యార్థులను దత్తత తీసుకొని చదివిస్తున్నారు. ఇందులో చదువుకుంటున్న వారంతా ప్రతిభ ఉన్న నిరుపేదలే. ఇక్క డ కుల మతాలకు తావు లేదు. అన్నివర్గాల వారు ఈ విద్యాలయంలో చదువుకుంటున్నారు. కాగా తల్లిదండ్రులు లేని పిల్లలకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగతా విద్యార్థుల అడ్మిషన్ల కోసం ఏటా పాఠశాలలోనే ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసుకుంటున్నారు. అనంతరం ఎంపికైన విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి కుటుంబ పరిస్థితులను ప్రత్యక్ష్యంగా చూసిన తర్వాతే విద్యాలయంలో చేర్చుకుంటున్నారు. వారికి భోజనంతో పాటు దుస్తులు, దుప్ప ట్లు, ట్రంక్ పెట్టెలు, ఇతర సామగ్రి అందజేస్తున్నారు. యోగా, కర్రసాములో శిక్షణ ఇందులో చదువుతున్న విద్యార్థులకు దేశభక్తి విషయమై ప్రత్యేకంగా బోధించడంతో పాటు చదువు, సంస్కారం నేర్పుతారు. విద్యార్థులు సమాజంలో తమ బాధ్యతలను గుర్తెరిగి ముందుకు సాగే విధంగా తర్పీదు ఇస్తున్నారు. వీటితో పాటు కర్ర సాము, యోగాలో శిక్షణ ఇస్తున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థులు గుర్తింపు పొందారు. -
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
పెద్దశంకరంపేట(మెదక్): బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యలకు మొద టి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, ఆ పార్టీ గెలవడం కష్టమన్నారు. అనంతరం గొట్టిముక్కులలో ఆత్మలింగ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు పత్రి రామకృష్ణ, మండల అధ్యక్షుడు కోణం విఠల్, నాయకులు శ్రావణ్, కృష్ణ, సుధాకర్, సాయిలు పాల్గొన్నారు. జీపీ కార్మికుల వినూత్న నిరసన మనోహరాబాద్(తూప్రాన్): నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోతే తాము ఎలా బతికేదని పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి ఆసిఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కార్మికులతో కలిసి మండల కేంద్రంలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ.. తమతో నిత్యం పనులు చేయించుకుంటున్నారు, గాని జీతాల గురించి మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. మహాశివరాత్రికి ఏడుపాయలకు వెళ్లాలని అధికారులు చెబుతున్నారని.. జీతాలిస్తేనే వెళ్తామని స్పష్టం చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్మికులు స్వా మి, అంజయ్య, అర్జున్, రాములు, బాలమణి, నవనీత, శోభ, లక్ష్మి, ఎల్లమ్మ, ముత్యాలమ్మ, సూరి, ఎల్లం తదితరులు పాల్గొన్నారు. ఓటర్లకు ఇబ్బందులు ఉండొద్దు ఆర్డీఓ రమాదేవి టేక్మాల్(మెదక్): త్వరలో జరగబోయే పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు ఇబ్బందులు కల్గనివ్వొద్దని ఆర్డీఓ రమాదేవి తెలిపారు. శనివారం టేక్మాల్ ఉన్నత పాఠశాలలోని పోలీంగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం చేయరాదన్నారు. అన్ని రకాల వసతులను కల్పించాలని సూచించారు. ఓటు ఉన్న ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందులో తహసీల్దార్ తులసీరామ్, ఆర్ఐ సాయిశ్రీకాంత్ తదితరులు ఉన్నారు. 150 మందికి క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు తూప్రాన్: మున్సిపల్ పరిధిలో శనివారం ప్రజలకు క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొన్ని రోజులుగా దగ్గు, దమ్ము, బరువు తగ్గుదల, జ్వరంతో బాధపడుతున్న 150 మందిని గుర్తించి వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు పీహెచ్సీ వైద్యులు జ్యోత్స్న, సమత పేర్కొన్నారు. ప్రజలు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం తప్పదన్నారు. పైన పేర్కొన్న లక్షణాలతో బాధపడుతున్న వారు వెంటనే వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా పరీక్షలతో పాటు మందులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సీహెచ్ఓ బాలనర్సయ్య, సూపర్వై జర్లు శారద, పల్లవి, సిబ్బంది దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డిమెదక్ మున్సిపాలిటీ: ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సూచించారు. శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బందోబస్తు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని, క్షేత్రస్థాయిలో పోలీస్ స్టేషన్లో పోలింగ్ బూతుల వద్ద పరిస్థితుల వివరాలను సేకరించాలని సూచించారు. జిల్లాలో 21 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని వాటికి ఆయు ధాలు కలిగిన ఎనిమిది రూట్ మొబైల్ పార్టీలు విధులు నిర్వహిస్తాయన్నారు. డీఎస్పీ ఆధ్వర్యంలో క్యూఆర్టీలు, స్టాకింగ్ ఫోర్స్లు ఎల్లప్పుడు పోలింగ్ కేంద్రాలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 26న జరగబోయే ఏడుపాయల వన దుర్గామాత జాతర సందర్బంగా సూచనలు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ డైవర్షన్ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. శివరాత్రి సందర్భంగా భక్తులు ఏడుపాయల ప్రాంగణంలోనే నిద్రిస్తారు. కాబట్టి రాత్రి సమయంలో మఫ్టీ పార్టీలు, క్యూఆర్టీ పార్టీలు పెట్రోలింగ్ నిర్వహించి దొంగతనాలు జరగకుండా చూడాలన్నారు. స్నానపు ఘాట్ల వద్ద అతిఉత్సాహంతో కొందరు లోతు ప్రదేశాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వారిని హెచ్చరించి ప్రమాదాలను నివారించాలి. ఆకతాయిల చర్యలను నివారించడానికి షీ టీం బృందాలు, మఫ్టీ పార్టీలు ఎల్లప్పుడు నిఘా ఉంచాలని సూచించారు. -
శతశాతం ఉత్తీర్ణత సాధించాలి
● మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలి ● కలెక్టర్ రాహుల్రాజ్ హవేళిఘణాపూర్(మెదక్): మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, వందశాతం ఉతీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం మండల కేంద్రం హవేళిఘణాపూర్ మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే బాలుర పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరును సరుకుల నిల్వ, అకౌంట్ రిజిష్టార్లను పరిశీలించిచారు. ప్రతిరోజూ సమయపాలన కచ్చితంగా పాటించాలని తెలిపారు. అలాగే సరుకుల నిల్వ గదిని పర్యవేక్షించి, కూరగాయలు, ఆకుకూరలు, బియ్యం బస్తాలను, గుడ్ల నాణ్యతను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వంట గదిని పరిశీలించి, పరిశుభ్రత చర్యలను అనుసరించాలని, వండే విధానంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించి, ప్రతిరోజూ మెనూ ప్రకారం వంట చేయాలని, పోషకాలతో కూడిన శుచిరుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలన్నారు. అనంతరం 9 వ తరగతి విద్యార్థులతో ముఖాముఖి సమావేశమయ్యారు. వారికి అందించే భోజనం, తదితర సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు వెనుక పడి ఉన్న ఏదేని సబ్జెక్టులపై ఎక్కువ శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టర్ వెంట ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలకు పాతర
ఏడుపాయలలో మొక్కుబడి పనులు ● అందినకాడికి పంచుకుంటున్న నాయకులు ● గతేడాది జాతరకు రూ. 2 కోట్లు మంజూరు ● రూ. 2.28 కోట్ల బిల్లుల సమర్పణ ● తాత్కాలిక పనులతోనే సరి.. పాపన్నపేట(మెదక్): ’ఏడుపాయల జాతరలో కేవలం డెకరేషన్, వీడియో కవరేజీ, సాంగ్ రికార్డింగ్, లైటింగ్ తదితర ఏర్పాట్లకు రూ. 75 లక్షలు ఖర్చు అయ్యాయి’ అంటే.. ఏ మేర నిధులు విచ్చలవిడిగా ఖర్చు అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. జాతర నిధులు వెల్లువలా పారుతుండగా.. నిబంధనలకు పాతరేసి అధికారులు, నాయకులు అందినకాడికి పంచుకుంటున్నారు. ఏటా ప్రభుత్వం మంజూరు చేస్తున్న రూ. 2 కోట్లు.. తాత్కాలిక పనులకే హారతి కర్పూరమవుతున్నాయి. మట్టి కొట్టు.. ట్యాంకర్లు పెట్టు.. పైసలు పట్టు అన్నట్లు స్థానిక నాయకులు పోటీ పడి మొక్కుబడి పనులు చేస్తున్నారు. పనికి తగిన చెల్లింపులు చేయాల్సిన డిపార్ట్మెంట్ అధికారులు కమీషన్లకు ఆశపడి వారికి అనుకూలంగా ఎంబీ రికార్డులు చేస్తున్నారు. గతేడాది జాతరకు రూ. 2 కోట్లు మంజూరు కాగా, అధికారులు రూ. 2,28,16,117 బిల్లులు రికార్డు చేసి మంజూరు చేయాలంటూ సిఫారసు చేశారు. అయితే కలెక్టర్ బిల్లులు పునః పరిశీలించి వాటిని రూ. 1,99,79,795కు కుదించి మంజూరు చేశారు. 2016 నుంచి నిధులు విడుదల రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన ఏడుపాయల జాతరకు 2016 నుంచి ప్రత్యేక నిధులు విడుదల చేస్తున్నారు. అప్పటి నుంచి ఏటా పెంచుతూ ప్రస్తుతం రూ. 2 కోట్లు మంజూరు చేస్తున్నారు. ఏటా జాతరలో కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చేలా తాత్కాలిక పనులే చేపడుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఈ నిధులను సంబంధిత శాఖల అధికారులు ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ చేసేది మాత్రం అధికార పక్షంలో ఉన్న నాయకులు మాత్రమే. గతేడాది డెకరేషన్, వీడియో కవరేజ్, తాగునీరు, సానిటేషన్, బారికేడ్లు, తాత్కాలిక ఘాట్లు, పార్కింగ్, ఫ్లెక్సీలు, క్యూలైన్లు తదితర పనులకు సుమారు రూ. 1.50 కోట్లు ఖర్చు అయినట్లు చూపారు. ఇందులో కర్రలతో చేసే బారికేడింగ్ కోసం గత 8 ఏళ్ల నుంచి చేస్తున్న ఖర్చుతో, పర్మనెంట్గా మంజీరా చుట్టూ ఇనుప రాడ్లు వేసి జాలి వేయొచ్చని పలువురు భక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ప్రతిఏటా అధికారుల కోసం వేసే షెడ్లు, తాత్కాలికంగా నిర్మించే టాయిలెట్ల బదులు పర్మనెంట్వి ఏర్పాటు చేయొచ్చని అభిప్రాయపడుతున్నారు. -
కులగణన ఘనత కాంగ్రెస్దే..
మెదక్ను చార్మినార్ జోన్లో కలిపేందుకు చర్యలు ● నరేందర్రెడ్డిని పెద్దల సభకు పంపాలి ● మంత్రులు దామోదర, కొండా సురేఖమెదక్జోన్: దేశంలో ఇప్పటి వరకు కులగణన చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని.. ఆ ఘనత కాంగ్రెస్కే దక్కిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సన్నాహాక సమావేశంలో ఆయన హాజరై, మాట్లాడుతూ... సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ తీర్మానం చేశామన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్దే కీలకపాత్రని అన్నారు. 14 నెలల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పి 56 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. నిరుద్యోగులు, విద్యావేత్తల కోరిక మేరకు మెదక్ను చార్మినార్ జోన్లో కలిపేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. వచ్చే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావాలని ఆకాంక్షించారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. నరేందర్రెడ్డి విద్యావంతుడని.. అలాంటి వ్యక్తిని పెద్దల సభకు పంపాలని పిలుపునిచ్చారు. ఎంపీ రఘునందన్రావు ఒక్క రూపాయి నియోజకవర్గ అభివృద్ధికి తీసుకురాలేదన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు బీజేపీకి మద్ధతు ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మిగిలింది గాడిద గుడ్డేనన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచటంతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేశామన్నారు. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే రాష్ట్రంలో చేసేది ఏమి ఉండదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్రావు, మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మెన్ చంద్రపాల్, నేతలు హఫిజొద్దీన్, చౌదరి శ్రీనివాస్, జీవన్రావు, ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
డీపీఎం మోహన్● కుక్కలకు పెరుగుతున్న క్రేజ్ ● కుటుంబంలో ఒకటిగా స్థానం కల్పిస్తున్న పెట్ లవర్స్ ● ఇంటి రక్షణ కోసం పెంపకం ● జాతిని బట్టి రూ.వేల నుంచి రూ.లక్షల్లో ఖరీదు ● పెట్ క్లబ్లకూ భలే డిమాండ్ ● మంచి ఆహారం, కాస్మోటిక్స్, బాతింగ్‘ఏం బతుకురా నీది.. కుక్క బతుకు’ అని చాలా తేలిగ్గా మాట్లాడుతాం. ఈ తిట్టుకు ఇప్పుడు అర్థం మార్చేస్తోంది ఆధునిక సమాజం. పూట కూడా గడవని మనుషులు ఒకవైపు.. విలాసాలకు అలవడిన ధనికులు మరోవైపుగా చీలిపోతున్న సమాజంలో పెంపుడు కుక్కలకూ మనషుల జీవనశైలి అలవాటు చేస్తోంది. ఇప్పుడు కుక్కలు పార్కులకు వెళ్తాయి.. స్విమ్మింగ్ పూల్లో ఈత కొడతాయి..వాటికి నచ్చిన ఆహారం తింటాయి.. ఉదయాన్నే బయటికి వెళ్లి షికార్లు కొడతాయి. పుట్టిన రోజులు కూడా చేసుకుంటాయి. తోటి కుక్కలతో కలసి పార్టీలు చేసుకుంటాయి. మనిషి, శునకాల జీవనశైలికి అంతగా తేడాలేకుండా పోతుందని ఆశ్చర్యపడుతున్నారా? అవును.. రూ.లక్షలు ఖర్చు చేసి మరీ వాటి బాగోగులు చూస్తున్నారు. డాగ్ లవర్స్ అనే పరిధి దాటి పెట్ పేరెంట్స్గా చెప్పే స్థాయికి చేరుకుంది ఎలైట్ సొసైటీ. పెట్ను పెంచుకోవడమంటే వారి కుటుంబంలోకి ఓ వ్యక్తిని ఆహ్వానించినట్లే.. మరి ఆ అతిథిని వీరంతా ఎలా చూసుకుంటున్నారనే దానిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – పర్చ శ్రీనాథ్, రామచంద్రాపురం(పటాన్చెరు)చిలప్చెడ్(నర్సాపూర్): సరైన పోషకాహారాలు భుజిస్తేనే సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తామని డీపీఎం మోహన్ అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రమైన చిలప్చెడ్లోని ఐకేపీ కార్యాలయంలో మహిళలకు పోషకాహారాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహారంతోనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. పరిశుభ్రమైన పదార్థాలతో, పరిశుభ్రంగా వంటలు చేసుకోవాన్నారు. చిన్నారులకు సరైన పోషకాహారాలు అందజేస్తేనే, వారు సరైన రీతిలో ఎదుగతారన్నారు. మహిళల్లో రక్తహీనత సమస్య రాకుండా తీసుకోవాల్సిన పోషకాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఏపీఎం ప్రేమలత, సీసీలు నర్మ, వెంకటలక్ష్మి, వరలక్ష్మి, ఆయా గ్రామ సంఘాల అధ్యక్షులు, ఆరోగ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు.వివరాలు 8లో u -
హెల్మెట్ లేకుంటే నో ఎంట్రీ
మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్లోకి వచ్చే వాహనదారులు హెల్మెట్ ధరించాల్సిందేనని హవేళిఘణాపూర్ ఎస్ఐ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈసందర్భంగా హెల్మెట్ లేకుండా కలెక్టరేట్లోకి వచ్చిన 12 మంది వాహనదారులకు జరిమానా విధించి కౌన్సెలింగ్ నిర్వహించారు. రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాద మరణాలను నివారించేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. ఉద్యోగులు, ఇతర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పారు. అలాగే వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. -
అప్పుల పాలయ్యాం.. ఆదుకోండి
శివ్వంపేట(నర్సాపూర్): పంచాయతీలలో సొంత డబ్బులతో పనులు చేయించి అప్పుల పాలయ్యామని.. డబ్బులు ఇప్పించాలని కోరుతూ ఎంపీడీఓకు పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏడాదికాలంగా పంచాయతీలకు నిధులు లేకపోవడంతో సొంత డబ్బులు ఖర్చు చేసి పనులు చేయిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు సరిపోకపోవడంతో అప్పులు చేశామని వాపోయారు. గ్రామాల్లో ట్రాక్టర్ డీజిల్, పారిశుద్ధ్య పనులు, బోరు మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ తదితర.. ఖర్చులకు డబ్బులు లేవన్నారు. ప్రభుత్వం స్పందించి మా డబ్బులు చెల్లించాలని కోరారు. -
విద్యుత్ బిల్లులు చెల్లించాలి
తూప్రాన్: గ్రామాల్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న విద్యుత్ బిల్లులను వెంటనే చెల్లించాలని జిల్లా విద్యుత్శాఖ అధికారి శంకర్ అన్నారు. శుక్రవారం తూప్రాన్లో పర్యటించిన ఆయన విద్యుత్ బిల్లులు, సమస్యలపై ఆరా తీశారు. పలు వీధుల్లో పర్యటించి విద్యుత్ బకాయిలు లేకుండా చూసుకోవాలని ఇంటి యజమానులకు సూచించారు. అనంతరం తూప్రాన్ డివిజన్ విద్యుత్ కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యుత్ సమస్యలు వస్తే వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వేసవి వస్తుండటంతో సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బకాయిలు చెల్లించకుంటే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. కార్యక్రమంలో డీఈ గర్ముంతరాజు, ఏడీ శ్రీనివాస్, ఏఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి: ఎస్టీయూ పెద్దశంకరంపేట(మెదక్): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎస్టీయూ ఎల్లప్పుడు కృషి చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పర్వతరెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేటలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కూర రఘోత్తంరెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ఉపాధ్యాయులను కోరారు. ఈనెల 27న జరగబోయే ఎన్నికల్లో ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, విశ్రాంత ఉపాధ్యాయులు రామచంద్రాచారి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, కోశాధికారి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. విత్తనాల నాణ్యతపై అవగాహన వెల్దుర్తి(తూప్రాన్): మండల కేంద్రం మాసాయిపేట రైతు వేదికలో శుక్రవారం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతులకు వరి విత్తనాల నాణ్యత ప్రమాణాలపై అవగాహన కల్పించారు. సదస్సుకు కౌడిపల్లి డివిజన్ ఏడీఏ పుణ్యవతి, తహసీల్దార్ జ్ఙానజ్యోతి హాజరై రైతులకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వరి కోత సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. ధాన్యాన్ని రైతులు కల్లాల దగ్గరే తూర్పారా పట్టుకొని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా ధాన్యం ఉన్నప్పుడే కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతుందని, ఇందుకు రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ రామ్శివరావు, ఏఈఓ రజిత, కిరణ్, రైతులు పాల్గొన్నారు. అంతకుముందు ఏడీఏ పుణ్యవ తి వెల్దుర్తి పీఏసీఎస్లో ఎరువుల స్టాక్ను పరిశీలించారు. పౌష్టికాహారంతోనే ఆరోగ్యం చేగుంట(తూప్రాన్): పౌష్టికాహారంతోనే మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఐకేపీ డీపీఎం మోహన్ అన్నారు. శుక్రవారం చేగుంట ఐకేపీ కార్యాలయంలో మహిళా సంఘాల సీఏలు, గ్రామైక్య సంఘం అధ్యక్షులకు మహిళల సంపూర్ణ ఆరోగ్యం అంశంపై అవగాహన కల్పించారు. రక్తహీనతకు గురికాకుండా ఉండేందుకు ఆకుకూరలు, పౌషక విలువలు గల ఆహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, ఆయా గ్రామాల సీఏలు, సీసీలు, గ్రామైక్య సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు. -
సకాలంలో మందులు సరఫరా చేయండి
కలెక్టర్ రాహుల్రాజ్ మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలకు సకాలంలో మందులు సరఫరా చేయాలని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకూడదని కలెక్టర్ రాహుల్రాజ్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డ్రగ్ స్టోర్తో పాటు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో వైద్య సేవలు ప్రణాళికాబద్ధంగా విస్తృతపర్చాలని, అన్ని వ్యాధులకు సంబంధించిన మందులు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో వందశాతం ఇమ్యునైజేషన్ సేవలు అందించాలన్నారు. అనంతరం మెదక్ ఏరియా ఆస్పత్రిలో వ్యాధి నిరోధక టీకాల నిల్వ గది, డెంటల్ విభాగం, ఫిజియోథెరఫీ, కంటి పరీక్ష సెంటర్లను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్వయంగా కంటి పరీక్ష చేయించుకున్నారు. అలాగే డిప్యూటీ కార్యాలయాన్ని పరిశీలించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. ఏఐ పైలెట్ ప్రాజెక్ట్గా మెదక్ ఏఐ పైలెట్ ప్రాజెక్టుగా మెదక్ జిల్లా ఎంపికై నట్లు కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. శుక్రవారం రాత్రి రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారానా హైదరాబాద్ నుంచి నిర్వహించిన జూమ్ మీటింగ్లో డీఈఓ రాధాకిషన్తో కలిసి పాల్గొన్నారు. కృత్రిమ మేధా, ఏఐని జిల్లాలోని ఆరు మండల పరిషత్ పాఠశాలల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్తో కలిసి పాల్గొన్నారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ వివరించారు. -
నిధులు లేక నిస్తేజం!
ఏడాదిగా పల్లెల్లో ప్రత్యేక పాలన ● నిలిచిన ఆర్థిక సంఘం నిధులు ● అప్పులు చేసి పనులు చేయిస్తున్న కార్యదర్శులు ● బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు మెదక్జోన్: నిధులు లేక గ్రామ పంచాయతీలు నిస్తేజంలో పడ్డాయి. ఏడాదికి పైగా ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పైసా నిధులు విడుదల కాకపోవటంతో పంచాయతీల నిర్వహణ భారం కార్యదర్శులపై పడింది. ఇటీవల మెదక్ మండలంలోని ఓ మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి తన మెడలోని బంగారు గొలుసును బ్యాంకులో కుదువపెట్టి రూ. 1.50 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బులతో తను విధులు నిర్వర్తించే పంచాయతీ నిర్వహణను నెట్టుకొస్తున్నాడు. ఈ సమస్య ఆ ఒక్క కార్యదర్శిది కాదు.. ప్రస్తుతం జిల్లాలోని అన్ని పంచాయతీ కారదర్శులది. జిల్లాలో 493 గ్రామ పంచాయతీలు జిల్లాలో 493 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో పదుల సంఖ్యలో మేజర్ గ్రామాలుండగా.. వందల సంఖ్యలో చిన్న పంచాయతీలు ఉన్నాయి. సర్పంచ్ల పదవీకాలం ముగిసిన వెంటనే ప్రభుత్వం పలు శాఖలోని సీనియర్ అసిస్టెంట్లను గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా నియమించి చేతులు దులుపుకుంది. ప్రస్తుతం పాలకమండలి లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన విడుదల చేయాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడం లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల రావాల్సిన ఎస్ఎఫ్సీ నిధులు ఆగిపోయాయి. అయితే 2024 సెప్టెంబర్లో స్వచ్ఛదనం.. పచ్చదనం కింద ప్రతి పంచాయతీకి రూ. 50 వేల చొప్పున నిధులు విడుదల చేసింది. దీంతో కొంతమేర ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని భావించిన పంచాయతీ కార్యదర్శులు, ఆ చెక్లను ట్రెజరీలో జమచేశారు. కానీ ఆ చెక్లు పాస్ కావడం లేదని, అకౌంట్లు ఫ్రీజింగ్లో ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. పన్నులు వసూలైనా.. మేజర్ పంచాయతీలతో పాటు పరిశ్రమలు ఉన్న గ్రామాల్లో ఫ్యాక్టరీల నుంచి వచ్చే సెస్, వృత్తి పన్నులు, షాపుల అద్దెలు, లైసెన్స్ ఫీజులు, ఇంటి పన్నులు, ఇతర ట్యాక్స్లు వసూళ్లు అయినప్పటికీ వాటిని నేరుగా ఖర్చు చేయడానికి వీల్లేదు. వాటిని సైతం ట్రెజరీలో జమ చేశాక పంచాయతీ అకౌంట్ నుంచి చెక్ రూపంలో ఆన్లైన్ ద్వారా డ్రా చేసుకోవాలి. కానీ ట్రెజరీలో జమ చేసిన వెంటనే ఫ్రీజింగ్ వస్తోందని.. దీంతో పన్నులు వసూలైనా గ్రామాల్లో సైతం ఆర్థిక వెతలు తప్పడం లేదని కార్యదర్శులు వాపోతున్నారు. ముఖ్యంగా ట్రాక్టర్ల డీజిల్, వీధి లైట్ల ఏర్పాటు, పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్, బ్లీచింగ్ ఫౌడర్, నల్లాల లీకేజీలకు మరమ్మతులు.. ఇలా గ్రామాల్లో అత్యవసరం కోసం ఖర్చు చేసే ప్రతి పైసా పంచాయతీ సెక్రటరీ భరిస్తున్నారు. కాగా కలెక్టర్తో పాటు జిల్లాస్థాయి అధికారులు నిత్యం ఏదో ఒక పల్లెను సందర్శిస్తున్నారు. వారు గ్రామాలను సందర్శించినప్పుడు ఏదేని సమస్య కనిపించినా, గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నామని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, అధికారులు కార్యదర్శులను మందలిస్తున్నారు. నిర్వహణకు నిధులు లేవని, ఈ సమస్యపై తమకు ఊరట కలిగించాలని పలువురు కార్యదర్శులు కోరుతున్నారు. -
మాటలు కోటలు దాటుతున్నాయి
మెదక్జోన్: సీఎం రేవంత్రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి.. ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరటం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. శుక్రవారం మెదక్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విస్మరించిందన్నారు. ఈనెల 27న జరిగే టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను బలపర్చాలని కోరారు. ఎన్నికల తర్వాత ప్రజా సమస్యలపై ఉద్యమబాటలో పయనిస్తామన్నారు. రాష్ట్రంలో సీఎంలు మారినా, పాలన ఏ మాత్రం మారలేదన్నారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చాయని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు, రిటర్మెంట్ బెన్ఫిట్స్ ఇవ్వటం లేదన్నారు. ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ.. సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో అంజిరెడ్డి, కొమురయ్యలు శాసన మండలిలో పోటీపడుతున్నారన్నారు. మా అభ్యర్థుల గెలుపు ఎప్పుడో ఖరారైందని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు విద్యావేత్తలు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్గౌడ్, గోదావరి అంజిరెడ్డి, వీణ, తదితరులు పాల్గొన్నారు. పనులు మాత్రం జరగటం లేదు ీసీఎం రేవంత్రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఫైర్ -
‘దళారులను నమ్మి మోసపోవద్దు’
మనోహరాబాద్(తూప్రాన్): రైతులు పండించిన ధా న్యం ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సురేష్రెడ్డి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తేవాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల ఏర్పాటుకు రెండు నెలల సమయం ఉందని, ఆ లోపు రైతులు సన్నద్ధం కావాలన్నారు. గన్నీ బ్యాగులు, ఇతర సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, వ్యవసాయ అధికారి స్రవంతి, ఏఈఓలు నరేందర్గౌడ్, సచిన్, ఏపీఎం పెంటాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
నర్సాపూర్: తెలంగాణ మోడల్ పాఠశాలలో 2025– 26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండలంలోని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పర్హానా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 28 వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉందన్నారు. తమ పాఠశాలలో 6వ తరగతితో పాటు 7 నుంచి 10 తరగతులలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. కాగా ఏప్రిల్ 13వ తేదీన పరీక్ష ఉంటుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్లూఎస్ విద్యార్థులకు ఫీజు రూ. 125, ఓసీలకు రూ. 200 ఫీజు ఉంటుందని ప్రిన్సిపాల్ వివరించారు.