Nirmal
-
భారీగా టేకు చెట్లు నరికివేత
ఇచ్చోడ: సిరిచెల్మ అటవీ ప్రాంతంలోని ఫకీర్పేట్ బీట్లో టేకు చెట్లు స్మగ్లర్ల చేతిలో నరికివేతకు గురవుతున్నాయి. టేకుచెట్లను నరికి సైజులుగా మార్చి బైక్లపై తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మాన్కపూర్ వద్ద చెక్పోస్టు ఉన్నప్పటికీ కలప తరలించుకుపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సిరిచెల్మలో టైగర్జోన్ అటవీ అధికారి క్యాంపు కార్యాలయం, ఫకీర్పేట్ వద్ద బెస్ క్యాంపులు ఉన్నాయి. వీటికి సమీపంలోనే టేకుచెట్లు నరికివేతకు గురికావడం అటవీశాఖ పనితీరుకు అద్దం పడుతోంది. దీనిపై టైగర్జోన్ ఎఫ్ఆర్వో నాగవత్ స్వామిని ‘సాక్షి’ వివరణ కోరగా టేకు చెట్లు నరికినట్లు తమదృష్టికి వచ్చిందని, చెట్లు నరికిన వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
ఉట్నూర్రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4, 5వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన వర్డ్ పవర్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూపీసీ)రాష్ట్రస్థాయి పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఈ పోటీల్లో స్పెల్లింగ్, రీడింగ్, అర్థం రౌండ్ల అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేశారు. 4వ తరగతి నుండి ఆడే విజయ్కుమార్ (నిర్మల్), యశ్వంత్ (ఆసిఫాబాద్), రాజేశ్ (ఆసిఫాబాద్), కోట్నాక్ కళ్యాణ్ (ఆసిఫాబాద్), కుర్సెంగ వినోద్ (ఆసిఫాబాద్) విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. 5వ తరగతి నుండి కృష్ణ ధృవ (ఆసిఫాబాద్), తొడసం వైష్ణవి(ఆదిలాబాద్), మడావి వరలక్ష్మి (ఆదిలాబాద్), రాథోడ్ బాలాజీ(నిర్మల్), లక్ష్మణ్చౌదరి (నిర్మల్), కిరణ్ రాథోడ్ (ఆసిఫాబాద్) జిల్లాలకు చెందిన విద్యార్థులు సత్తాచాటారు. విజేతలకు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏసీఎంవో జగన్, విభా ఫౌండేషన్ సీనియర్ ప్రొగ్రాం మేనేజర్ వీరనారాయణ పాల్గొన్నారు. -
వైద్యురాలు శృతికి సన్మానం
మంచిర్యాలటౌన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పు రస్కరించుకొని మంగళవారం పట్టణంలోని వైశ్యభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన మహిళలను మంచిర్యాల వాసవీ వనిత క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందించిన బర్త్రూట్ ఆస్పత్రి వైద్యురాలు శృతి గోలిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాసవీ వనిత క్లబ్ అధ్యక్షురాలు మల్యాల సంగీత, సెక్రటరి కే.గాయత్రి, కోశాధికారి గుండా సునీత, పలువురు మహిళలు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో రైతు మృతిభైంసారూరల్: మండలంలోని కోతల్గాం గ్రామానికి చెందిన రైతు పోలబోయిన భోజన్న(62) విద్యుత్ షాక్తో మంగళవారం మృతి చెందినట్లు సీఐ నైలు తెలిపారు. గ్రామానికి చెందిన భోజన్న అడవి జంతువుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు విద్యుత్ తీగలు అమర్చాడు. ఎప్పటిలాగే మంగళవారం రైతు తన పంటపొలంలోకి వెళ్లగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. ఐదుగురు జూదరుల అరెస్టుఆదిలాబాద్టౌన్(జైనథ్): భోరజ్ మండలంలోని గిమ్మ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు జైనథ్ ఎస్సై పురుషోత్తం తెలిపారు. గండ్రత్ సతీష్, అయిండ్ల కిరణ్ కుమార్, కందుల సాయికృష్ణ, జి సతీష్, ఎన్ రాకేష్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 52 పేక ముక్కలు, రూ. 43,290 నగదును సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాంత్ అనే మరో వ్యక్తి పరారయ్యాడన్నారు. భైంసాలో బైక్ చోరీ భైంసాటౌన్: పట్టణంలో చోరీల పరంపర కొనసాగుతూనే ఉంది. వరుస చోరీలు పట్టణ వాసులను కలవరపెడుతున్నాయి. తాజాగా పట్టణంలోని గాంధీగంజ్ ప్రాంతంలో బైక్ చోరీకి గురైంది. సీఐ జీ. గోపినాథ్ కథనం ప్రకారం.. మండలంలోని హంపోలికి చెందిన ఊరే సుభాష్ పట్టణంలో ప్రైవే ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం దుకాణం ఎదుట బైక్ నిలిపి ఉంచాడు. సాయంత్రం కనిపించకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
నిర్మల్
జోరుగా.. హుషారుగా..గ్యారంటీల అమలులో విఫలం ఎన్నికల వేళ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం: 6:21గురువారం: 5:108లోu బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025సిక్స్ కొడుతున్న ఉద్యోగిని జిల్లా కేంద్రంలో గత శనివారం నుంచి నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు కొండాపూర్ సమీపంలోని స్పోర్ట్స్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో వివిధ శాఖల మహిళా ఉద్యోగులు జోరుగా, హుషారుగా పాల్గొన్నారు. వివిధ క్రీడల్లో సత్తా చాటారు. క్రికెట్, టెన్నిస్ మ్యూజికల్ చైర్తోపాటు వివిధ ఇండోర్ ఆటల్లోనూ తమ నైపుణ్యం ప్రదర్శించారు. సాయంత్రం నృత్యం చేశారు. ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్డీవో రత్న కళ్యాణి, డీఎస్డీవో శ్రీకాంత్రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. – నిర్మల్చైన్గేట్/సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్వాతావరణం ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. చలి ప్రభావం చాలావరకు తగ్గుతుంది. తెల్లవారుజాము చల్లగా ఉంటుంది. -
ఒక్క ఎకరా కూడా ఎండిపోవద్దు
అంకితభావంతో విధులు నిర్వహించాలి ● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్టౌన్: పోలీస్ అధికారులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ జానకీషర్మిల సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా నిర్మల్ సబ్ డివిజన్ కార్యాలయం, రూరల్ పోలీస్ స్టేషన్ను మంగళవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. 5ఎస్ అమలు చేయాలని తెలిపారు. ఠాణా పరిధిలో ఏ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఇన్వెస్టిగేషన్లో ఉన్న సీడీ ఫైల్స్ను పరిశీలించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజల సమస్యలు తీర్చడానికి అందుబాటులో ఉండాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి క్రైం రేటు తగ్గించాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఎస్పీ వెంట నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా, నిర్మల్ రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్సై లింబాద్రి ఉన్నారు. భైంసాటౌన్: నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ అన్నారు. పట్టణంలోని జీఆర్పీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీఎం ఉష కింద రూ.3.97 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పీఎం ఉష కింద డిగ్రీ కళాశాలకు రూ.5 కోట్లు మంజూరయ్యాయని, వీటిలో రూ.3.97 కోట్లతో 12 అదనపు తరగతి గదులు, విద్యార్థులకు మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టి, సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. త్వరలోనే కళాశాలలో పీజీ తరగతులు ప్రారంభించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గంగాధర్, తూమోల్ల దత్తాత్రి, సిరం సుష్మారెడ్డి, ఈడబ్ల్యూఐడీ ఈఈ అశోక్కుమార్, డీఈఈ గంగాధర్, కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చయ్య, కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు. కడెం: మండలంలో సదర్మాట్ ఆయకట్టు పరిధిలోని పంటలు నీరు అందక ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితిపై ఈనెల 5న ‘పంట తడికి..కంటతడి’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం మండలంలోని కొత్తమద్దిపడగ శివారులో ఎండిన పొలాలను పరిశీలించారు. యాసంగిలో ఏయో పంటలు సాగు చేస్తున్నారో రైతులను అడిగి తెలుసుకున్నా రు. సాగునీరు అందక ఒక్క ఎకరా కూడా ఎండిపోవద్దని సూచించారు. ఏప్రిల్ చివరి వరకు సదర్మాట్ చివరి ఆయకట్టుకు వరకు సాగు నీరందించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఏవో అంజిప్రసాద్, ఈఈ విఠల్, తహసీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో అరుణ, ఎంపీవో కవిరాజు, రైతులు ఉన్నారు. నిర్మాణం నాణ్యతగా చేపట్టాలి ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఏప్రిల్ చివరి వరకు సాగు నీరందించాలని ఆదేశం -
● ‘భగీరథ’ నల్లాలకు ఆన్ఆఫ్లు కరువు ● కొన్నిచోట్ల సరఫరా కాక.. బోరు నీరే దిక్కు ● నిర్మల్లో రంగుమారిన నీరు సరఫరా
ఈ చిత్రం నిర్మల్ జిల్లాకేంద్రంలోని గొల్లపేటలోనిది. మిషన్ భగీరథ నల్లాల ద్వారా ఇలా రంగు మారిన నీరు వస్తోంది. పట్టణంలో చాలా కాలనీలకు కలుషిత నీరే సరఫరా అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో దుర్వాసన కూడా వస్తోంది. ఈ నీటిని తాగడానికి పట్టణవాసులు భయపడుతున్నారు. ఇతర అవసరాలకు వినియోగించి.. తాగునీటిని కొనుక్కుంటున్నారు. ఈ చిత్రం భైంసా పట్టణంలోని రాహుల్నగర్లోనిది. మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకు నీరు రాలేదని కాలనీవాసులు తెలిపారు. దీంతో మున్సిపల్ బోరు మోటార్ నీటినే తాగునీటితోపాటు ఇంటి అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు చెబుతున్నారు. వేసవికి ముందే తాగునీటికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. భూగర్భజలాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. మరోవైపు పట్టణాల్లో లీకేజీలతో నీరు వృథా అవుతోంది. కొన్ని కాలనీల్లో ప్రజలు నీటిని వృథా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో తాగునీటి పరిస్థితి తెలుసుకునేందుకు ‘సాక్షి’ మంగళవారం విజిట్ చేసింది. ప్రస్తుతానికి పెద్దగా సమస్య లేకపోయినా.. నీటి వృథాతో రాబోయే రోజుల్లో వ్యథ తప్పేలా లేదు. మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చినా, నల్లాలకు ఆన్/ఆఫ్ బిగించకపోవడంతో నీటి సరఫరా సమయంలో వృథాగా వదిలేస్తున్నారు. దీంతో 30 శాతం వరకు నీరు వృథా అవుతోంది. ఇంకా కొన్నిచోట్ల నల్లా కనెక్షన్ ఉన్నా ఇప్పటికీ మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. మున్సిపల్ బోర్ల సహాయంతో నీటిని అందిస్తున్నారు. పేదలు బోరు నీటినే తాగుతున్నారు.నిర్మల్లో కలుషిత నీరు.. నిర్మల్టౌన్: నిర్మల్ మున్సిపాలిటీలో నీటి సమస్య పెద్దగా లేకున్నా.. చాలాచోట్ల లీకేజీలు ఉన్నాయి. ఈ కారణంగా తాగునీరు కలుషితమవుతోంది. పలు కాలనీల్లో రంగు మారుతుండటంతో స్థానికులు నీటిని తాగడం లేదు. 42 వార్డులకుగాను 39 వార్డుల్లో ప్రతీరోజు మంచినీటి సరఫరా అవుతోంది. బుధవార్పేట్, గాజుల్పేట్, వైఎస్సార్ కాలనీలో రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నారు. మొత్తం 21,800 నల్లా కలెక్షన్లు ఉండగా, 174 మోటర్లు ఉన్నాయి. కార్మికులు 116 మంది అవసరం ఉండగా.. 70 మంది మాత్రమే ఉన్నారు. మాటేగావ్ నుంచి 1.5 మిలియన్ లీటర్లు తక్కువగా సరఫరా అవుతుండడంతో, మూడు వార్డుల్లో సమస్య వస్తోంది. భైంసాలో వృథా.. భైంసాటౌన్:భైంసా పట్టణంలో 26 వార్డులుండగా, 12,900 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. దాదాపు అన్నివార్డుల్లో మిషన్ భగీరథ పైప్లైన్ పనులు పూర్తిచేశారు. కానీ, ౖపైపెన పైపులు వేయడంతో వాహనాల రాకపోకలతో అవి పగిలిపోయి లీకవుతున్నాయి. నల్లాలకు ఆన్/ఆఫ్ బిగించకపోవడంతో కొందరు సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. చాలాచోట్ల ఆన్ఆఫ్ లేక నీరు వృథాగా పోతోంది. కొన్ని కాలనీలకు ఇప్పటికీ భగీరథ నీరు రావడం లేదు. భట్టిగల్లి, భాగ్యనగర్, రాహుల్నగర్, తదితర కాలనీల్లో మున్సిపల్ బోరు నీటినే వినియోగిస్తున్నారు. కొన్నిచోట్ల బోరు మోటార్లు కాలిపోతున్నాయి. మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేయిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ, భట్టిగల్లిలో బోరుమోటారు చెడిపోయి కొద్దిరోజులు కావస్తున్నా మరమ్మతు చేయడం లేదని కాలనీవాసులు తెలిపారు. పట్టణంలో 170 కి.మీ మేర నల్లా నీటి పైప్లైన్ ఉండగా, స్థానిక గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద గల మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి రోజుకు 12 ఎంఎల్డీల నీటిని సరఫరా చేస్తున్నారు.బోరు నీరే దిక్కు.. మా కాలనీలో మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు వేశారు. కానీ, ఇప్పటివరకు నీరు సరఫరా చేయడం లేదు. మున్సిపల్ బోరు మోటారు ద్వారానే నీటిని అందిస్తున్నారు. బోరు నీటినే తాగుతున్నాం. – గోదావరి, రాహుల్నగర్, భైంసా భగీరథ రాలేదు.. మిషన్ భగీరథ కింద నల్లా కనెక్షన్లు ఇచ్చారు. కానీ, ఇప్పటివరకు నీరు సరఫరా కావడం లేదు. కాలనీలోని బోరు మోటారు నీటినే వాడుతున్నాం. తాగడానికి బోరు నీటినే వినియోగిస్తున్నాం. – నేహ, రాహుల్నగర్, భైంసా నీటి కొరత లేకుండా చర్యలు.. పట్టణంలో నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. కొన్నిరోజుల ముందు మిషన్ భగీరథ రంగు నీళ్లని టెస్టింగ్ చేయించాం. ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా పరిష్కరించాం. కొన్ని చోట్ల విద్యుత్ శాఖ మరమ్మతుల వల్ల పైపులైన్లు పడిపోయాయి. వాటికి కూడా మరమ్మతులు చేయించి సమస్య లేకుండా చూస్తున్నాం. – జగదీశ్వర్గౌడ్, మున్సిపల్ కమిషనర్, నిర్మల్ అందని ‘భగీరథ’.. ఖానాపూర్:ఖానాపూర్ పట్టణంలో ఏటా వేసవిలో తాగునీటి సమస్య తలెత్తుతూనే ఉంది. ఈసారి మున్సిపల్ అధికారులు ముందస్తుగా ట్యాంకర్తో నీటిని సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్నా.. కొన్ని కాలనీలకు పూర్తిస్థాయిలో నీరు సరఫరా కావడం లేదు. కొన్నిచోట్ల లీకేజీల కారణంగా నీరు కలుషితమవుతోంది. స్లమ్ ఏరియాలైన సుభాష్ నగర్తోపాటు డబుల్ బెడ్రూం కాలనీల్లో నీటి సమస్య ఉండడంతో ట్యాంకర్తో సరఫరా చేస్తున్నారు. పట్టణంలో 5,300 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, అమృత్ పథకం కింద రూ.22 కోట్లతో పనులు కొనసాగుతున్నట్లు కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు. -
అమ్మా.. నీ తప్పుకు నన్ను చంపేశావా?
‘అమ్మా.. ఇంకో మూడు నెలలైతే లోకం చూసేవాడిని కదమ్మా.. ఎందుకమ్మ ఇంత పనిచేశావు. నీ కడుపులో నన్ము మోయలేకపోయావా.. ఆరు నెలలుగా నీ కడుపులో హాయిగా పెరుగుతున్నా.. నీవు మింగిన మాత్రలకు నాకు ఊపిరి ఆడడం లేదమ్మా.. లోకం చూపించి అనాథాశ్రమంలో పడేసినా బాగుండేది.. తెల ్లవారేసరికే నా ఊపిరి తీశావేంటమ్మా.. నీవు చేసిన తప్పుకు నన్ను బలి ఇచ్చావా..’ గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని గురుజ వాగులో పడేసిన పిండానికి మాటలు వస్తే ఇలాగే ప్రశ్నించేదేమో. క్షణికావేశంలో చేసిన తప్పుకు గర్భం దాల్చిన ఓ యువతి.. బయటి ప్రపంచానికి ఆ విషయం తెలియకుండా ఉండేందుకు ఆరు నెలల గర్భంలోనే పిండాన్ని చంపేశారు. ఈ హృదయ విదారక సంఘటన గురుజ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... మంగళవారం ఉదయం గ్రామ శివారులోని వాగు ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లిన కొందరు గ్రామస్తులకు మృత శిశువు కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై మహేందర్ సంఘటనా స్థలానికి చేరుకొని శిశువు మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టారు. స్థానికులు అందించిన వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఓ యువతి, ఇద్దరు యువకులతోపాటు ఆర్ఎంపీని అదుపులోని తీసుకున్నట్లు తెలిసింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన ఓ యువతి.. ఆరు నెలల గర్భాన్ని తీయించుకునేందుకు ఆర్ఎంపీని ఆశ్రయించినట్లు సమాచారం. మంగళవారం రాత్రి గ్రామంలో తిరిగిన సదరు ఆర్ఎంపీ ప్రాణాపాయమని తెలిసినా.. ఆరు నెలల గర్భాన్ని తొలగించారు. ఆ పిండాన్ని ఇలా వాగులో పడేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. దర్యాప్తు పూర్తి కానందున పూర్తి వివరాలు బుధవారం అందిస్తామని సీఐ భీమేష్ తెలిపారు. మృత శిశువును పరీక్షించిన వైద్యులు మగ శిశువుగా నిర్ధారించారు. పిండం వయస్సు సుమారు 6 నెలలు దాటి ఉండవచ్చని సమాచారం. గురుజలో ఆరు నెలల పిండం కడుపులోనే చంపి.. వాగులో పడేసి.. విచారణ జరుపుతున్న పోలీసులు... -
గ్రూప్–2లో మెరిసిన మనోళ్లు
టీజీపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన గ్రూప్–2 పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులు సత్తా చాటారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారుసైతం పోటీ పరీక్షలకు సన్నద్ధమై ఉత్తమ ర్యాంకులు సాధించారు. వీరంతా సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత ఉద్యోగ నియామక పత్రాలు అందుకోనున్నారు.250 ర్యాంక్ సాధించిన అశోక్కుమార్● ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు ర్యాంకులు191 ర్యాంకు సాయిరాం కౌటాల: కుమురంభీం జిల్లా కౌటాల మండలంలోని తలోడి గ్రామానికి చెందిన మండల రాజేశంగౌడ్–తారక్క దంపతుల కుమారుడు సాయిరాంగౌడ్ గ్రూప్–2లో 383 మార్కులతో రాష్ట్రస్థాయిలో 191 ర్యాంకు సాధించాడు. సాయిరాం ప్రస్తుతం బెజ్జూర్ మండలం మొగవెల్లి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్–4లో రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ కావడంతో పాటు గ్రూప్–1 మెయిన్స్లో 436 మార్కులు సాధించాడు. 97వ ర్యాంక్ లెక్కల శ్రావణ్ మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటకు చెందిన లెక్కల లింగయ్య, కళావతి దంపతుల కుమారుడు శ్రావణ్కుమార్ గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 97వ ర్యాంక్ సాధించాడు. 2019లోనే జిల్లాస్థాయిలో మొదటి ర్యాంక్, రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంక్తో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించిన శ్రావణ్ సంతృప్తి లేకపోవడంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. గతేడాది గ్రూప్–4లో జిల్లాస్థాయిలో 11వ ర్యాంక్ సాధించి బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో 394 మార్కులతో రాష్ట్రస్థాయిలో 97వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్–1లోనూ 404 మార్కులు సాధించాడు. మెరిసిన ‘బజార్హత్నూర్’ యువకులు బజార్హత్నూర్: ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రానికి చెందిన బిట్లింగు లక్ష్మణ్, సరస్వతి దంపతుల కుమారుడు ఉదయ్కుమార్ 404 మార్కులతో రాష్ట్రస్థాయిలో 51వర్యాంకు సాధించాడు. ఉదయ్ ప్రస్తుతం ఆదిలాబాద్ ట్రెజరీలో జూనియర్ అకౌంటెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. మండలంలోని కొలారి గ్రామానికి చెందిన బుద్దేవార్ రాధ, నర్శింహులు దంపతుల కుమారుడు బుద్దేవార్ ముఖేష్ గ్రూప్–2 ఫలితాల్లో 418 మార్కులతో రాష్ట్రస్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. 2019లో పంచాయతీ కార్యదర్శి, 2021లో నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు.తాంసి: మండల కేంద్రానికి చెందిన జానకొండ అశోక్ కుమార్ గ్రూప్–2లో ఫలితాల్లో 380 మార్కులతో రాష్ట్రస్థాయిలో 250వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం జైనథ్ మండలం సుందరగిరి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో 399 మార్కులు సాధించాడు. సోదరుడు శ్రీకాంత్ అందించిన సహకారంతో గ్రూప్–1, 2 పరీక్షలకు సన్నద్ధమై విజయం సాధించినట్లు అశోక్ కుమార్ పేర్కొటున్నాడు.337వ ర్యాంకు సాధించిన వెంకటేశ్ నస్పూర్: మంచిర్యాల జిల్లా నస్పూర్కు చెందిన పోలంపల్లి వెంకటేశ్ గ్రూప్–2 ఫలితాల్లో 375 మార్కులతో రాష్ట్రస్థాయిలో 337వ ర్యాంకు సాధించాడు. 2014లో నిర్వహించిన వీఆర్వో పరీక్షలలో ఉమ్మడి జిల్లా టాపర్గా నిలిచాడు. కొంతకాలం నస్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా విధులు నిర్వహించాడు. ప్రస్తుతం లక్సెట్టిపేట మోడల్ డిగ్రీ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. సత్తా చాటిన యువకులు నెన్నెల: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని ఆవుడం గ్రామానికి చెందిన యువకులు గ్రూప్–2 ఫలితాల్లో సత్తా చాటారు. చీర్ల లక్ష్మయ్య–రమక్క దంపతుల కుమారుడు సురేష్రెడ్డి రాష్ట్రస్థాయిలో 55వ ర్యాంకు సాధించగా మండల మురళిగౌడ్, ఉష దంపతుల కుమారుడు సుమంత్ 172వ ర్యాంకు సాధించాడు. సురేష్రెడ్డి ప్రస్తుతం సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూనే గ్రూపు–2లో ర్యాంకు సాధించాడు. సుమంత్ ప్రస్తుతం జీహెచ్ఎంసీలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు.19వ ర్యాంక్ శివకృష్ణ ఆసిఫాబాద్అర్బన్/ఆసిఫాబాద్రూరల్: కుమురంభీం జిల్లా కేంద్రానికి చెందిన శ్రీరామ్ సత్యనారాయణ, వాణిశ్రీ దంపతుల కుమారుడు శివకృష్ణ గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 19వ ర్యాంకు, జోన్స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. సత్యనారాయణ స్థానిక సరస్వతి శిశుమందిర్లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తుండగా శివకృష్ణ అదే పాఠశాలలో చదివి ట్రిపుల్ఐటీలో సీటు సాధించాడు. గతేడాది ప్రకటించిన గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించగా ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఆడిట్ సెక్షన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. 188వ ర్యాంకు సాయికృష్ణ సారంగపూర్: నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని బీరవెల్లి గ్రామానికి చెందిన బట్టు నర్సన్న–సురేఖ దంపతుల కుమారుడు సాయికృష్ణ గ్రూప్–2 ఫలితాల్లో 188వ ర్యాంకు సాధించి తన సత్తా చాటుకున్నాడు. నర్సన్న స్థానికంగా బిజినెస్ చేస్తుండగా సురేఖ దేగాం ఉన్నత పాఠశాలలో పీడీగా విధులు నిర్విర్తిస్తున్నారు. చిన్నతనం నుంచి చదువుపై ఆసక్తి ఉన్న సాయికృష్ణ ఇంటర్ హైదరబాద్లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో, ఢిల్లీలో బీటెక్ పూర్తి చేసి తొలి ప్రయత్నంలోనే గ్రూప్–2లో విజయం సాధించాడు. తల్లిదండ్రులు, గురువుల సహకారంతోనే విజయం సాధించానని పేర్కొన్నాడు. గ్రూప్–1 ఫలితాల్లో సత్తా నిర్మల్ఖిల్లా: నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఎర్రవోతు శ్యామల, ముత్తన్న దంపతుల కుమారుడు సాయి ప్రణయ్ టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో 557 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచాడు. సాయి ప్రణయ్ ఒకటి నుంచి ఏడో తరగతి వరకు స్థానిక సెయింట్ థామస్ పాఠశాలలో, 8 నుంచి 10 వరకు హైదరాబాద్లోని గురుకులంలో, ఇంటర్ నారాయణ జూనియర్ కాలేజీలో, బీటెక్ సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో పూర్తి చేశాడు. గతేడాది నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యాడు. తాజాగా వెల్లడైన ఫలితాల్లో అత్యున్నత మార్కులు సాధించాడు.గోలేటివాసికి 229వ ర్యాంకు రెబ్బెన: కుమురంభీం జిల్లా కౌటాల మండలంలోని గుడ్లబోరికి చెందిన కామ్రే రావూజీ, లహనుబాయి దంపతుల కుమారుడు భాస్కర్ రాష్ట్ర స్థాయిలో 229వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం బెల్లంపల్లి ఏరియాలోని ఏరియా స్టోర్స్లో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు గ్రూప్–2 కోసం సంసిద్ధమయ్యాడు. ఆన్లైన్లో కోచింగ్, సొంత ప్రిపరేషన్తో గ్రూప్–2 ఫలితాల్లో 381.065 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 229 ర్యాంకు సాధించాడు. కష్టపడి చదివితే విజయం దానంతట అదే వస్తుందని భాస్కర్ అంటున్నాడు. భాస్కర్శ్రావణ్కుమార్ -
ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి
● రూ.50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ ఈఈ ● బిల్లుల మంజూరు కోసం రూ.లక్ష డిమాండ్ ఆదిలాబాద్రూరల్: ఓ అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. ఆదిలాబాద్లోని ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జిన్నాంవార్ శంకర్ కాంట్రాక్టర్ నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. టీజీఐడీసీ డిప్యూటీ ఈఈ శంకర్ ఇటీవల కాంట్రాక్టర్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కేఆర్కే కాలనీ సమీపంలో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల పనుల కాంట్రాక్ట్ను కరుణాకర్రావు దక్కించుకున్నాడు. రూ.14.36 కోట్లతో జిల్లా కేంద్రానికి చెందిన సబ్ కాంట్రాక్టర్ నారాయణరెడ్డి తీసుకుని పనులు చేపడుతున్నాడు. విడతల వారీగా పూర్తయిన పనులకు సంబంధించి రూ.2 కోట్లు విడుదలయ్యాయి. మంజూరైన ఈ బిల్లులను డీఈఈ శంకర్ మరో భవన నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్కు చెల్లించేందుకు సిద్ధమయ్యాడు. విష యం తెలుసుకున్న నారాయణరెడ్డి మంగళవారం డిప్యూటీ ఈఈని కార్యాలయంలో కలిశాడు. తాను చేసిన పనులకు గాను మంజూరైన డబ్బులు విడుదల చేయాలని కోరాడు. 0.5 శాతం ఇవ్వాలని సదరు అధికారి సూచించాడు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. ఆ సమయ ంలోనే అధికారి ఫోన్ చేసి డబ్బులు అడిగాడు. తాను నిర్మాణం చేపడుతున్న భవనం దగ్గరికి రావాలని పేర్కొన్నాడు. మంగళవారం రూ.50వేలు, మిగతా రూ. 50వేలు బుధవారం ఇవ్వాలని కాంట్రాక్టర్తో సదరు అధికారి ఒప్పందం కుదుర్చుకున్నాడు. బిల్లులు విడుదలైన ప్రతీసారి కమీషన్ ఇవ్వాలని పేర్కొన్నాడు. మధ్యాహ్నం సదరు అధికారి నిర్మాణం చేపడుతున్న భవనం దగ్గరికి రాగా కాంట్రాక్టర్ ఆయనకు రూ.50వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అధికారి నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ అధికారిని కరీంనగర్కు తరలించారు. బుధవారం ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు పేర్కొన్నారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్, సీఐలు కిరణ్రెడ్డి, స్వామి ఉన్నారు. -
‘సైబర్’ కుట్ర భగ్నం
ఆదిలాబాద్టౌన్: సైబర్ నేరాలకు పాల్పడాలనే భా రీ కుట్రను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు భగ్నం చే శారు. అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తులను టూటౌన్, సై బర్క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మొ బైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, ద్విచక్ర వాహనాలు, మొబైల్ బ్యాటరీలను స్వాధీనం చేసుకుని ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఒకరు పరారీలో ఉండగా, ఐదుగురిని అరెస్టు చేశారు. ఎస్పీ అఖిల్ మ హాజన్ మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హె డ్క్వార్టర్లోని సమావేశ మందిరంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బిహార్ రాష్ట్రంలోని కాతిహర్ జిల్లా హతియదిర గ్రామానికి చెందిన ఆరుగురు ముఠాగా ఏర్పడి దేశ వ్యాప్తంగా సై బర్ నేరాలకు పాల్పడడానికి కుట్ర పన్నినట్లు తెలి పారు. ఇందులో ఏ–1గా ఉన్న తబారక్ మిగతా ఐదు గురిని బైక్లపై తెలంగాణ రాష్ట్రానికి పంపించాడు. వారు పాత మొబైళ్లు తీసుకొని ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తామంటూ పట్టణాలు, పల్లెల్లో తిరిగారు. పా త మొబైళ్లు సిమ్కార్డు, బ్యాటరీలను సేకరించారు. వాటిద్వారా వివిధ రాష్ట్రాల్లోని ప్రజలకు బ్యాంక్ అధికారులంటూ ఫోన్ చేసి సైబర్ బారిన పడే వి ధంగా కుట్ర పన్నారు. వారి కుట్రను ఆదిలాబాద్ పోలీసులు భగ్నం చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితులు మహ్మద్ మెరాజుల్, మహెబూబ్ ఆలం, మహ్మద్ జమాల్, ఎండీ ఉజీర్, అబ్దుల్లాను అరెస్టు చేయగా ఏ–1 నిందితుడు తబారక్ పరారీలో ఉన్న ట్లు తెలిపారు. అరెస్టయిన వారి వద్ద నుంచి 2,125 పాత మొబైల్ ఫోన్లు, 107 సిమ్ కార్డులు, ఐదు ద్విచక్ర వాహనాలతో పాటు వారు వినియోగించే మొబైల్ ఫోన్లు, 600 మొబైల్ బ్యాటరీలను స్వాఽ దీనం చేసుకుని టూటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కుట్ర భగ్నం చేసిన సై బర్ డీఎస్పీ హసీబుల్లా, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్రెడ్డి, టూటౌన్ సీఐ కరుణాకర్రావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ను ఎస్పీ అభినందించారు. ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులపై కేసు పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు 2,125 పాత మొబైళ్లు, 107 సిమ్ కార్డులు, 600 మొబైల్ బ్యాటరీలు, 5 వాహనాలు సీజ్ వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ -
‘ఎల్ఆర్ఎస్’లో 25 శాతం రాయితీ●
నిర్మల్చైన్గేట్:రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించిందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తుల పరిష్కారంపై పంచాయతీ, మున్సిపల్ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్నవారు ఈనెల 31వ తేదీలోపు పూర్తి ఫీజు చెల్లించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 46 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు, లోకల్ టీవీ ఛానెళ్లలో ప్రచారం చేయాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో టాం టాం వేయించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్గౌడ్, రాజేశ్కుమార్, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. మాస్ కాపీయింగ్ దూరంగా ఉండాలిసోన్: పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు దూరంగా ఉండాలని, సొంతంగా పరీక్షలు రాయాలని డీఈవో రామారావు సూచించారు. మండలంలోని మాదాపూర్ ఉ న్నత పాఠశాలను మంగళవారం సందర్శించా రు. తొమ్మిది, పది తరగతి విద్యార్థుల గ్రేడ్లపై సమీక్షించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా 9వ తరగతి విద్యార్థుల ఎల్ఈపీ ప్రగతి, నివేదికలను సమీక్షించారు. పదో తరగతి విద్యార్థులను ఒక్కొక్కరిని పిలిచి వారి ప్రగతి అడిగి తెలుసుకున్నారు. మొత్తం ఎన్ని రోజులు, ఎన్ని గంటలు పాఠశాలకు వ చ్చారని, అందులో ఎన్ని గంటలు పరీక్షలు రా స్తున్నారు విద్యార్థులను అడిగి తెలుసుకున్నా రు. సబ్జెక్టుల వారీగా సిలబస్ గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని సూ చించారు. 9, 10 తరగతి విద్యార్థులు సాధించిన మార్కులు గ్రేడ్లను డిస్ప్లే చేయాలని ఉపాధ్యాయులకు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 471 మంది గైర్హాజర్ నిర్మల్ రూరల్: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియెట్ పరీక్షలకు 471 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 7,343 మంది విద్యార్థులకు 6,872 మంది హాజరయ్యారు. జనరల్ కేటగిరీలో 6,501 మందికి 6,139 మంది హాజరవగా, 362 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కేటగిరీలో 842 మంది విద్యార్థులకు 733 మంది హాజరవగా, 109 మంది గైర్హాజర్ అయ్యారని డీఐఈవో పరశురాం తెలిపారు. -
పోలీస్ అక్క భద్రత.. భరోసా
‘అక్క’ అనే మాటలో ఆప్యాయత మాత్రమే కాదు... ‘భద్రత’ను ఇచ్చే ‘భరోసా’ కూడా ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో తోటిపిల్లలు ఏడిపిస్తుంటే...‘మా అక్కకు చెబుతాను’ అనడం సాధారణం. అవును. అక్క అంటే ఫ్రెండ్ కాని ఫ్రెండ్. ఏ దాపరికాలు లేకుండా మనసులోని మాటను పంచుకునే అమ్మ కాని అమ్మ! ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు. వారితో అన్నీ పంచుకుంటారు. ఇంటికి దూరంగా హాస్టల్లో ఉండే ఆడపిల్లలకు తోడెవరు? చుట్టూ ఎంతోమంది ఉన్నా, వారితో అన్ని విషయాలు పంచుకోలేక ‘నేను ఒంటరిని’ అనే భావన ఎటైనా దారితీయవచ్చు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ‘పోలీస్ అక్క’కు ప్రాణం పోసింది.ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలలో విద్యార్థినులు వేధింపులు, దాడులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది అమ్మాయిలు తమలో తామే కుమిలిపోతూ చివరకు ఆత్మహత్య వరకు వెళ్తున్నారు. ఇలాంటివి నివారించడానికి ‘నేనున్నాను’ అంటూ ముందుకు వచ్చింది పోలీసు అక్క.దత్తత తీసుకుంటారు...ఒక్కో మహిళా కానిస్టేబుల్కు ఒక్కో విద్యాలయం, వసతిగృహం బాధ్యతను అప్పగించారు. ‘మీరు అక్కడి విద్యార్థులను దత్తత తీసుకున్నట్లు భావించాలి. వారు మీ కుటుంబ సభ్యులే’ అని ఒకటికి రెండుసార్లు చె΄్పారు. ప్రతినెలా ఒకటో శనివారం మహిళా కానిస్టేబుళ్లు తమకు అప్పగించిన గురుకులానికి వెళతారు. ఆ రోజంతా అక్కడే ఉంటూ విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తారు. సొంత అక్కలా వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు.సైబర్క్రైమ్, ఉమెన్ ట్రాఫికింగ్, గుడ్టచ్–బ్యాడ్టచ్, మహిళల భద్రత, చట్టాలు.. మొదలైన విషయాలపై చర్చిస్తారు. రాత్రిపూట అక్కడే బస చేస్తారు. ప్రస్తుతం 18 పాఠశాలలకు 18 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. వీరి పని తీరును ఎస్పీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.ఆ బాధ నుంచే...ఎస్పీగా నిర్మల్ జిల్లాలోనే తొలి పోస్టింగ్ తీసుకున్న జానకీ షర్మిలకు ఇక్కడి బాసర ట్రిపుల్ ఐటీలో కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలచి వేసింది. విద్యార్థులకు అండగా నిలవడానికి, తనవంతుగా ఏదైనా చేయాలని, వారిలో భరోసా నింపాలనీ అనుకున్నారు. స్వయంప్రతిపత్తి కలిగిన ట్రిపుల్ఐటీని మూడునెలల పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచి విద్యార్థులతో మమేకమవుతూ వారి సమస్యల గురించి తెలుసుకుంటూ పరిష్కారంపై దృష్టి పెట్టారు. ప్రతి సీనియర్ ఒక జూనియర్ని గైడ్ చేయాలని సూచించారు. విజేతలుగా నిలిచిన పూర్వ విద్యార్థులు, ట్రెండింగ్ సెలబ్రిటీలు, మోటివేషనల్ స్పీకర్లతో సమావేశాలు, క్రీడాపోటీలు నిర్వహించారు. ఇవి విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపాయి. ధైర్యాన్ని ఇచ్చాయి.పెట్రోలింగ్ బాధ్యతలు...తనలాగే మహిళా పోలీసులు ప్రత్యక్ష పోలీసింగ్ చేయాలని ఎస్పీ జానకీ షర్మిల నిర్ణయించారు. మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోనే తొలిసారి మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యక్ష పోలీసింగ్ బాధ్యతలు అప్పగించారు. కేవలం స్టేషన్ లో పనులు చేయడానికి, రిసెప్షనిస్టులుగానే పరిమితమైన ఉమెన్ కానిస్టేబుళ్లు ఇక నుంచి వారానికోసారి పెట్రోలింగ్, డయల్ 100, ఎమర్జెన్సీ, డెయిలీ రూట్ చెకింగ్, వాహనాల తనిఖీలాంటి బాధ్యతలను చేపడతారు. పెట్రోలింగ్లో తొలిరోజే సత్తా చాటారు. భైంసా మండలం వట్టోలి గ్రామంలో పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. ‘పోలీసులు ప్రజల్లో కలిసిపోయినప్పుడే... ప్రజలకు భరోసా, భద్రత’ అంటారు. ‘పోలీసు అక్క’లాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఆ మాటకు బలాన్ని ఇస్తాయి.అందుకే... పోలీస్ అక్కఎక్కడైనా మహిళలకు ఇబ్బందులు, అడ్డంకులు ఉంటూనే ఉంటాయి. చాలామంది మహిళలకు కాస్త భరోసా, కాసింత ్రపోత్సాహం ఇస్తే చాలు దేన్నైనా సాధించగలరు. నిర్మల్ జిల్లాలో ప్రత్యేకంగా విద్యార్థినులకు అండగా నిలవాలనుకున్నాం. ఇందుకోసమే ‘పోలీస్ అక్క’ కార్యక్రమం చేపట్టాం. ఎన్నోఏళ్లుగా స్టేషన్ లకే పరిమితమైన మహిళా కానిస్టేబుళ్లు సైతం తాము పోలీసులం అని గర్వపడేలా ప్రత్యక్ష పోలీసింగ్ చేసేలా డ్యూటీలను అప్పగించాం.– జానకీ షర్మిల, ఎస్పీ, నిర్మల్– రాసం శ్రీధర్, సాక్షి ప్రతినిధి, నిర్మల్ -
ప్రజా ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్నిర్మల్చైన్గేట్: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలన్నారు. రెవెన్యూ, భూ సంబంధిత, అటవీ, వ్యవసాయం, డబుల్బెడ్ రూమ్, పెన్షన్, రేషన్ కార్డులు వంటి దరఖాస్తులను పరిష్కరించాలని ప్రజలు అర్జీలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్న కళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విధుల్లోకి తీసుకోవాలి నేను 16 సంవత్సరాలపాటు ఎన్ఆర్ఈజీఎస్లో ఎఫ్ఏగా విధులు నిర్వర్తించా. ఏడాదిక్రితం నుంచి అనారోగ్యం కారణంగా విధులకు హాజరు కాలేక పోయా. ప్రస్తుతం నా ఆరోగ్యం కుదుట పడింది. కావున నాయందు దయతలచి తిరిగి విధుల్లోకి అనుమతించి నా కుటుంబాన్ని ఆదుకోగలరు. – రాచర్ల రాజేశ్వర్, న్యూబొప్పారం రిజర్వేషన్ మార్చాలి మేము సారంగాపూర్ మండలం ఇప్పచెల్మ గ్రామస్తులం. మా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో టీచర్ పోస్టు ఖాళీగా ఉంది. ఇట్టి పోస్ట్ కోసం గ్రామస్తులం అంతాకలిసి అధికారులను సంప్రదించగా ఇది ఎస్సీకి కేటాయించినట్టు తెలిసింది. కానీ మా గ్రామంలో ఎస్సీ కులస్తులు లేరు. కావున ఎస్టీలకు రిజర్వేషన్ కేటాయించాలి. – గూడెం నాగోరావు, ఇప్పచెల్మ గ్రామస్తుడు -
తులం బంగారం హామీ ఎక్కడ?
● బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డినిర్మల్చైన్గేట్/దిలావర్పూర్/నర్సాపూర్(జి)/సారంగాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పెళ్లయిన ఆడబిడ్డలకు రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని ఇచ్చిన హామీ ఎక్కడా అని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, నిర్మల్ రూరల్, దిలావర్పూర్, నర్సాపూర్(జి) మండల కేంద్రాల్లో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. సారంగాపూర్ మండల కేంద్రంలో ధని నుంచి ఆలూరు వరకు బీటీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన 420 హామీలను తుంగలో తొక్కారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకల్యాణి, మండల అధికారులు, జిల్లా బీజేపీ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘టోల్ప్లాజా కార్మికులను కొనసాగించాలి’
సోన్: టోల్ప్లాజా కార్మికులందర్నీ కొనసాగించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్ అన్నారు. సోమవారం ఫెర్వేజ్ కంపెనీ టోల్ మేనేజర్ సంతోష్రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిప్పర్వాడ, నేరడిగొండ, గంజాల్ టోల్ప్లాజా కార్మికులు 15 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారన్నారు. పాత కంపెనీ రిద్ది సిద్ది ఒక్కో కార్మికుడికి రూ.24వేల నుంచి రూ.29 వేల వేతనం చెల్లించేదన్నారు. పాత జీతాన్ని కొనసాగించాలని, కొత్తవారిని తీసుకోవద్దని కోరారు. ఉద్యోగ భద్రతతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, బీమా సౌకర్యం కల్పించాలన్నారు. సమావేశంలో ఎం.రమేశ్, సందుగారి నవీన్, గంగాధర్, రాజేశ్వర్, శ్రావణ్ రాజకుమార్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. -
‘ఆయిల్పామ్’ అడ్డుకుంటున్న ఎమ్మెల్యే
నిర్మల్టౌన్: ఆయిల్పామ్ పరిశ్రమ ప్రారంభం కాకుండా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి అడ్డుకుంటున్నాడని మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం ఆయిల్పామ్ రైతులతో కలిసి ‘రైతుధర్నా’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకేరెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి పాక్పట్ల వద్ద ఏర్పాటు చేయాల్సిన ఆయిల్పామ్ పరిశ్రమను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. జిల్లాలోని 1600 మంది రైతులు 8,488 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ తోటలు సాగు చేశారని, పంటను విక్రయించేందుకు సోన్ మండలంలోని పాకుపట్లలో 40 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్పామ్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. ఈ ఏడాది ఆఖరి వరకు పంట చేతికి వస్తుందని, ఇప్పటి వరకు ఫ్యాక్టరీ పనులు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. అన్నిశాఖల నుంచి అనుమతులు వచ్చినా తనకున్న పలుకుబడితో నీటి పారుదల శాఖ క్లియరెన్స్ ఇవ్వకుండా అధికారిపై ఒత్తిడి తీసుకువచ్చి, ఫ్యాక్టరీ నిర్మాణం జరగకుండా చేస్తున్నారన్నారు. నిర్మల్ ప్రాంత అభివృద్ధికి తాను నిధులు తీసుకువస్తే వాటితో చేపట్టే పనుల్లో పర్సంటేజీలు కావాలని కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి పనులు అడ్డుకుంటున్నారన్నారు. జిల్లాలో రూ.27 కోట్లతో నాలుగు చెక్డ్యామ్లు మంజూరయ్యాయని, టెండర్లు పూర్తయినా తనకు పర్సంటేజ్ ఇచ్చిన తర్వాతనే పనులు చేపట్టాలని ఒత్తిడి తేవడంతో ఆగిపోయాయన్నారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్కు, ఆర్డీవో కార్యాలయంలోనూ రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు అరుగుమీది రామయ్య, నాయకులు పాకాల రాంచందర్, అనుముల భాస్కర్, మురళీధర్రెడ్డి, ముడుసు సత్యనారాయణ, శ్రీధర్, వొస రా జేశ్వర్, పూదరి సాయికృష్ణ, రైతులు పాల్గొన్నారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా కేంద్రంలో రైతు ధర్నా -
మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
నిర్మల్చైన్గేట్: మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్లో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిబిరంలో మహిళల సాధారణ ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, అవసరమైన చికిత్స అందించనున్నట్లు తెలిపారు. అనంతరం వైద్యులు కలెక్టర్కు బీపీ, రక్త పరీక్షలు చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్, డీఆర్డీవో విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి నిర్మల్చైన్గేట్: మహిళలు క్రీడా పోటీలలో పాల్గొని ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం కొండాపూర్ సమీపంలోని నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడాపోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ మహిళ తన సామర్థ్యాన్ని ప్రదర్శించి విజయం సాధించాలన్నారు. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేందుకు క్రీడలు మేలుచేస్తాయన్నారు. అనంతరం మహిళలతో కలిసి చెస్, క్యారం, టెన్నిస్ ఆడారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి శ్రీకాంత్రెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి రమణ, తదితరులు పాల్గొన్నారు. బాలశక్తితో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నిర్మల్చైన్గేట్: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బాలశక్తి కార్యక్రమం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో బాలశక్తి కార్యక్రమానికి హైదరాబాద్కు చెందిన స్మార్ట్ విజన్ కంటి ఆస్పత్రి వైద్యులు హర్షవర్ధన్రెడ్డి అందించిన వాహనాన్ని ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈవో పీ.రామారావు, డీఎంహెచ్వో డాక్టర్ రాజేందర్, డీఆర్డీవో విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ -
అధికారుల హామీతో ఆమరణ దీక్ష విరమణ
భైంసాటౌన్: పట్టణం నుంచి మండలంలోని ఖత్గాం–కామోల్ వరకు రోడ్డు నిర్మించాలంటూ గ్రామ మాజీ సర్పంచ్ దెగ్లూర్ రాజు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆదివారం సా యంత్రం విరమించారు. రెండోరోజు దీక్షకు మద్దతుగా భైంసా ఏఎంసీ మాజీ చైర్మన్ పిప్పె ర కృష్ణ, డైరెక్టర్ తోట రాముతో పాటు పలు వురు పాల్గొన్నారు. సాయంత్రం పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, భైంసా డీఈఈ రాజేందర్ దీక్ష విరమించాలని కోరారు. భైంసాలోని హైవే నుంచి ఖత్గాం వరకు రూ.99 లక్షలతో రోడ్డు నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయిందని, నిధుల లేమితో పనులు నిలిచాయన్నారు. ఏప్రిల్ మొదటివారంలో పనులు చేపట్టేలా చూస్తానని ఈఈ హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు దీక్ష విరమించారు. -
‘అటవీ అధికారుల దౌర్జన్యం సరికాదు’
ఖానాపూర్: నిరుపేదల గుడిసెను అటవీ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేయడం సరికాదని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేశ్ అన్నారు. ఆదివారం మండలంలోని రంగపేట పంచాయతీ పరిధి కొత్తగూడెంలో అధికారులు కూల్చివేసిన గుడిసెను పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. 2004 నుంచి భూపోరాటం ద్వారా సాధించుకున్న 70 ఇళ్లలో గ్రామపంచాయతీలో పన్నులు చెల్లించి జీవనం సాగిస్తున్న కుటుంబ సభ్యులకు నిలువ నీడ లేకుండా అధికారులు వ్యవహరించిన తీరును తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. గత కాంగ్రెస్ పాలనలో ఇదే ఇల్లుపై ఇందిరమ్మ ఇల్లు సైతం నిర్మించుకొని సగానికిపైగా బిల్లుసైతం పొందారన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేసి బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం లింగన్న, గోనె స్వామి, గోగు శేఖర్, వేగుల గంగన్న, రాములు, భీంరావు, శంకరయ్య, భూమక్క, చంద్రకళ, సావిత్రి, తదితరులు పాల్గొన్నారు. -
సామర్థ్యాల సాధన ఎంత?
నిర్మల్ఖిల్లా: ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యార్థులు సైతం చదువులో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వివిధ కార్యక్రమాలు అమలు పరుస్తోంది. ఇందులో భాగంగానే రెండేళ్లుగా ప్రభుత్వ రంగంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఎఫ్ఎల్ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసి) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. గతంలో నిర్వహించిన మదింపు పరీక్షల్లో జిల్లాలోని ప్రాథమిక స్థాయి విద్యార్థులు సామర్థ్యాలలో వెనుకంజలో ఉన్నట్లు ఫలితాల నివేదికలు వెల్లడించిన నేపథ్యంలో తాజాగా ఆ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలకు ఏ మేరకు చేరువయ్యారనే అంశంపై అంచనా వేసేందుకు విద్యాశాఖ నేటి నుంచి మూడు రోజులపాటు ప్రత్యేక సర్వే నిర్వహించనుంది. ఈ మేరకు జిల్లా పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతీ పాఠశాలలో ప్రాథమిక స్థాయి విద్యార్థులు స్వీయ పఠనం, రాయడం, గణితంలోని చతుర్విధ ప్రక్రియలు సాధించేలా రెండేళ్లుగా వివిధ కార్యక్రమాల ద్వారా కృత్యాధార బోధన చేపడుతూ బోధన కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఈ అంశాల్లో విద్యార్థుల అభ్యసనం కొనసాగుతున్న విధానాన్ని గుర్తించేందుకు ఆయా పాఠశాలల్లో రెండోతరగతి చదువుతున్న విద్యార్థులను పరీక్షించేందుకు సామర్ధ్య ఆధారిత సర్వే చేపట్టనుంది. నేటి నుంచి సర్వే... జిల్లాలో ఎంపిక చేసిన 50 ప్రభుత్వ పాఠశాలల్లో రెండో తరగతి చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను గణించేందుకు సర్వే చేపడుతోంది. జిల్లాలోని మొత్తం 19 మండలాల పరిధిలోని 50 వివిధ ప్రాథమిక పాఠశాలలను పాఠశాల విద్యాశాఖ ఇందుకోసం ఎంపిక చేసింది. ఈ సర్వే కోసం ఇప్పటికే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లను ఎంపిక చేసి శిక్షణ అందించింది. వీరు ఆయా పాఠశాలల్లో రెండోతరగతి చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు సర్వే పరీక్షలను మూడు రోజులపాటు నిర్వహిస్తారు. ఇందులో రెండో తరగతి విద్యార్థులంతా వందశాతం హాజరయ్యేలా, సర్వే సజావుగా నిర్వహించేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల జిల్లాస్థాయి విద్యాశాఖ అధికారులు సమన్వయం చేయనున్నారు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో సర్వే పూర్తి చేయనున్నారు. సర్వే సమయంలో ఆయా పాఠశాలలను సందర్శించి భాషా సామర్థ్యాలు, చతుర్విధ ప్రక్రియలపై సర్వే పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే ఈ అంశాలపై ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు, కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్లకు జిల్లా స్థాయిలో శిక్షణ పూర్తి చేశారు. తెలుగు, ఆంగ్లంలో చదవడం రాయడంతో పాటు గణితంలోని చతుర్విధ ప్రక్రియలపై ఈ సర్వేలో ప్రశ్నలుంటాయి. ఈ సర్వే ద్వారా సేకరించిన అంశాలను ప్రత్యేక యాప్లో నమోదు చేస్తారు. సజావుగా సర్వే నిర్వహణకు ఆదేశాలు ఎంపిక చేసిన పాఠశాలల్లో రెండోతరగతి విద్యార్థులు పూర్తిస్థాయిలో సర్వే పరీక్షలకు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత ఆయా పాఠశాలల హెచ్ఎంలపై ఉందని జిల్లా విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే సర్వే నిర్వాహణకు సంబంధించి ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలకు డీఈవో పి.రామారావు ఆదేశాలు జారీ చేశారు. కాంప్లెక్స్ హెచ్ఎంలు తమ పరిధిలోని పరీక్షలు నిర్వహించే పాఠశాలలను సందర్శించి సర్వే సజావుగా కొనసాగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్ఎల్ఎన్పై శాంపిల్ సర్వే రెండోతరగతి విద్యార్థుల సామర్థ్యాల మదింపు నేటి నుంచి మూడు రోజులపాటు ప్రత్యేక పరీక్షలు వివరాలు ప్రత్యేక యాప్లో నమోదు -
మూడునెలల్లో పనులు ప్రారంభించాలి
● బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి నిర్మల్: ఆయిల్పామ్ ఫ్యాక్టరీ విషయంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మతిభ్రమించి మాట్లాడటం సరికాదని, తాను ఏపార్టీలో ఉండి మాట్లాడుతున్నారో తెలుసా.. అని బీజేఎల్పీనేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి మండిపడ్డారు. ఇటీవల మాజీమంత్రి ఇంద్రకరణ్రెడ్డి తనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆదివారం తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల హయాంలో ఆయిల్పామ్ కంపెనీకి 40ఎకరాల ప్రభుత్వ భూమిని సొంత పార్టీకి చెందిన ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది వాస్తవం కాదా.. అని ప్రశ్నించారు. సిద్దిపేటలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్కు ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఇచ్చినపుడు, నిర్మల్లో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంలో ఆంతర్యం ఏమిటన్నారు. ఫ్యాక్టరీ కోసం సీఎం రేవంత్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క దగ్గర ధర్నా చేయాలన్నారు. మూడునెలల్లో జిల్లాలో ఫ్యాక్టరీ పనులు ప్రారంభించకపోతే తామే భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, మెడిసెమ్మె రాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, నాయకులు ముత్యంరెడ్డి, భూపాల్ రెడ్డి, సాదం అరవింద్, భూపతిరెడ్డి, వొడిసేల అర్జున్, తదితరులు పాల్గొన్నారు. -
కంచె.. కాటేస్తోంది..!
విద్యుత్ కంచెలతో జరిగిన కొన్ని ప్రమాదాలు..2024లో.. మృతి చెందిన రైతులు 21 మృతి చెందిన మూగజీవాలు 652025లో.. మృతి చెందిన రైతులు 13 మృతి చెందిన మూగజీవాలు 76● ఇటీవల ఉమ్రి(కే) గ్రామానికి చెందిన కదం దత్తురాం సమీపంలోని వ్యవసాయ మోటారు నుంచి నీరు తెచ్చే క్రమంలో విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ● సోన్ మండలం పాక్పట్ల గ్రామానికి చెందిన రైతు బోర నర్సయ్య ఇటీవల ఎర్త్వైర్కు ఏర్పాటు చేసిన బల్పు తీసే క్రమంలో షాక్కు గురై మృతి చెందాడు. ● రెండేళ్ల క్రితం బాసర మండలం కిర్గుల్(కె) గ్రామానికి చెందిన రాజలింగం, నర్సాపూర్(జి) మండలం గొల్లామాడ గ్రామానికి చెందిన నిమ్మన్న అనే రైతులు పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి మృతి చెందారు. ● ముధోల్ మండల కేంద్రానికి చెందిన కౌలు రైతు లక్ష్మణ్ రెండేళ్ల క్రితం మొక్కజొన్న పంటకు నీరుపెట్టేందుకు వెళ్లి విద్యుత్ కంచెకు తగిలి మృతి చెందాడు. ● మూడేళ్ల క్రితం తానూరు మండలం భోసి గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు కర్జల రాములు, మురళి పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి పొలంలోనే మృతి చెందారు. ● మూడేళ్ల క్రితం తానూరు మండలం హిప్నెల్లి తండాకు చెందిన జాదవ్ రాము, హిప్నెల్లి గ్రామానికి చెందిన విఠల్ పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు తగిలి మృతి చెందారు. ● సారంగాపూర్ మండలం ధని గ్రామంలో నిర్మల్ పట్టణానికి చెందిన కౌన్సిలర్ అంగ నరేశ్ పేకాడుతుండగా పోలీసులు దాడిచేశారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో పంటకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తాకడంతో షాక్తో మృతిచెందాడు. ● తానూర్ మండలంలోని మహలింగికి చెందిన రైతు తురాఠి గంగాధర్ ఈనెల 9న పంట రక్షణకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తీగలకు తగిలి మృతి చెందాడు. ● పంటల రక్షణకు అక్రమంగా ఏర్పాటు ● ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు ● చోద్యం చూస్తున్న అధికారులుతానూరు : జిల్లాలో ఎక్కువ మంది వ్యసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వరి, సోయా, కంది, మొక్కజొన్న, కూరగాయలు, తదితర పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలోని చాలా గ్రామాలు అడవిని ఆనుకుని ఉన్నాయి. దీంతో వన్యప్రాణులు రైతుల వ్యవసాయ క్షేత్రాలపై తరచూ దాడిచేస్తున్నాయి. పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. అడవి పందుల బెడద అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో రైతులు పంటల రక్షణకు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు సోలార్ కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే విద్యుత్ కంచెల ఏర్పాటు చట్ట విరుద్ధం. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయడం నేరం. దీంతో కంచెలు ఏర్పాటు చేసిన రైతులు ఈ విషయం ఎవరికీ చెప్పడం లేదు. దీంతో ఈ కంచెలే వన్యప్రాణులతోపాటు, రైతుల ప్రాణాలను బలి గొంటున్నాయి. వ్యవసాయానికి 24 గంటల విద్యు త్ సరఫరా చేస్తుండడంతో పొలాలకు వెళ్లిన వారు కంచెను గమనించకుండా దానికి తాకుతున్నారు. షాక్కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని గ్రామాల్లో రోడ్డు పక్కనే ఉన్న పంటలకు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తుండడంతో వాహనదారులు, రోడ్డు వెంట వెళ్లేవారు గమనించకుండా ప్రమాదాలబారిన పడుతున్నారు. విద్యుత్ చౌర్యంతో కంచెలు ఏర్పాటు చేయడం, వన్యప్రాణాల మృతికి విద్యుత్ కంచెలు కారణమవుతున్నా.. ఇటు విద్యుత్ అధికారులు, అటు అటవీశాఖ అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రైతులు, రైతు కూలీలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. వన్యప్రాణుల మృత్యువాత.. విద్యుత్ కంచెలకు తగిలి వన్యప్రాణులు సైతం మృత్యువాత పడుతున్నాయి. జింకలు, దుప్పులు, అడవి పందులు విద్యుత్ షాక్తో చనిపోతున్నాయి. అయినా వన్యప్రాణులను రక్షించేందుకు అటవీ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రైతులకు అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు. ఏడాదిన్నర వ్యవధిలోనే ... విద్యుత్ అధికారుల లెక్కల ప్రకారం.. 2024లో మొత్తం 21 మంది రైతులు, 65 మూగ జీవాలు విద్యుత్ షాక్తో మృతి చెందాయి. 2025 మార్చి వరకు 13 మంది రైతులు, 76 మూగజీవాలు మృతి చెందాయి. ఇందులో అధికంగా పంటలకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెల కారణంగా మరణించినట్లు తెలిపారు. రైతులకు అవగాహన కల్పించాలి కొంతమంది రైతులు పంట రక్షణ కోసం అక్రమంగా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయడంతో రైతులు, మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయి. తరచూ విద్యుత్ సమస్య కూడా తలెత్తుతోంది. సోలార్ కంచె ఏర్పాటు చేసుకుంటే ప్రమాదాలు జరగవు. అధికారులు గ్రామాల్లో రైతులకు విద్యుత్ కంచెతో కలిగే అనర్థాలు, సోలార్ కంచె ఏర్పాటుపై అవగాహన కల్పించాలి. – మహేశ్, యువరైతు, ఎల్వి క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం రైతులు పంటల రక్షణకు అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. పంట రక్షణ కోసం సోలార్ విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసుకోవాలి. దీనిపై గ్రామాల్లో విద్యుత్ అధికారులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. సోలార్ కంచెలతో వన్య ప్రాణులతోపాటు, రైతులకు కూడా ఎలాంటి ప్రమాదం జరగదు. – సుదర్శన్, విద్యుత్ ఎస్ఈ రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు .. విద్యుత్ మోటర్ ఆన్ఆఫ్ చేసే క్రమంలో రైతులు బోర్డు వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పొలంలో విద్యుత్ బల్బులు వెలిగించేందుకు ఏర్పాటు చేసిన ఎర్త్ వైర్కు దూరంగా ఉండాలి . పంటల రక్షణ కోసం రైతులు వేసిన కంచెకు ఉదయం విద్యుత్ సరఫరా కాకుండా చూడాలి. -
‘చాంపియన్స్’ గెలుపుతో సంబురాలు
నిర్మల్: తీవ్ర ఉత్కంఠతో కూడిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్పై గెలిచి, చాంపియన్స్ క్రికెట్ ట్రోఫీని కై వసం చేసుకుంది. దీంతో జిల్లావాసుల సంబురాలు అంబరాన్నంటాయి. క్రికెట్ అభిమానులు టీవీల ముందే కూర్చుని మ్యాచ్ ఆద్యంతం వీక్షించారు. విజయానికి మరో రెండు పరుగుల అవసరం కాగా రవీంద్ర జడేజా ఫోర్ కొట్టగానే జిల్లాలో దీపావళిని తలపించేలా పటాకులు కాల్చారు. క్రికెట్ అభిమానులు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. నిర్మల్ స్పోర్ట్స్ అకాడమీలో మ్యాచ్ చూస్తున్న అభిమానులు -
‘బాలింత కుటుంబాన్ని ఆదుకోవాలి’
కడెం: రక్తహీనతతో ఈ నెల 8న మృతి చెందిన మండలంలోని ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన బాలింత శ్రీవిద్య కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు అన్నారు. ఆదివారం వేదిక నిజ నిర్ధారణ కమిటీ బృందంతో కలిసి ఇస్లాంపూర్ వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను కలిసి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. మృతురాలిని 7, 8, 9 నెలల్లో ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించలేదని, చివరిగా ప్రసూతి కోసం ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించగా రక్తహీనత ఉందని నాలుగు బాటిళ్ల రక్తం ఎక్కించి ప్రసవం చేశారన్నారు. అనంతరం గుండె సంబంధిత వ్యాధి ఉందని, హైదరాబాద్కు తీసుకెళ్లాలని చెప్పగా తమవద్ద ఆర్థిక స్థోమతలేదని, ఆమె ఆరోగ్యంగా ఉండడంతో ఇంటివద్దే ఉంచామని ఆమె భర్త భగవంతరావు తెలిపారు. మృతురాలి కూతురు ఆలనపాలన కోసం రూ.5లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి, ఆమె భర్తకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వేదిక ప్రధాన కార్యదర్శి రఘోత్తమ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అమృతరావు, కమిటీ సభ్యులు మేడ మురళీధర్, ప్రకాష్, తదితరులు ఉన్నారు. -
నిర్మల్
ఎమ్మెల్సీ దక్కేనా..! ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనేది ఆసక్తిగా మారింది. ఒకటి ఎస్టీకి కేటాయిస్తామని ప్రచారం జరుగుతుండటం ఆసక్తి కలిగిస్తోంది. ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అంటారు. చెట్లను పెంచాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఏటా వానాకాలం ప్రారంభంలో భారీగా మొక్కలు నాటుతున్నారు. ఇందులో ప్రజలు కూడా భాగస్వాములు అవుతున్నారు. నాటిన ప్రతీ మొక్కను కాపాడేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో భారీగా పెరిగిన వృక్షాలను కొందరు నరికివేస్తున్నారు. చెట్లను కోతకు అమ్ముకుంటున్నారు. దీంతో చెట్లు నరికే దందా చేసేవారు అనుమతి లేకుండానే భారీ వృక్షాలను రంపాలతో కోసి.. కలపను తరలించుకుపోతున్నారు. దీంతో పచ్చని చెట్టే... కట్టై.. ఇటుక బట్టీల్లో కాలి బూడిదవుతోంది. న్యూస్రీల్ -
బట్టీల్లో కాలుతున్న చెట్లు
● జిల్లాలో జోరుగా కలప దందా ● ఇష్టారీతిన వృక్షాల నరికివేత ● ఇటుక బట్టీలు, ఇతర జిల్లాలకు తరలింపు భైంసాటౌన్: భైంసా అటవీ రేంజ్ పరిధిలో కలప దందా జోరుగా సాగుతోంది. చుట్టు పక్కల గ్రామాల నుంచి రైతుల పేరిట నామమాత్ర అనుమతులతో ఇష్టారీతిన చెట్లు నరికి తరలిస్తున్నారు. ఒకటి, రెండు వాహనాలకు మాత్రమే అనుమతి పొంది, ప్రతీరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో నాన్టేక్ కలపను స్థానిక ఇటుక బట్టీలతోపాటు, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు సైతం తరలిస్తున్నారు. స్థానికంగా ఉన్న సామిల్లులకు కూడా తరలించుకుపోతున్నారు. ఫలితంగా రేంజ్ పరిధిలో ఇష్టారీతిన చెట్లు నరికివేస్తున్నారు. పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది. భైంసా కేంద్రంగా... కొందరు నాన్టేక్ దందా నిర్వహకులు భైంసాతోపాటు నియోజకవర్గంలోని కుభీర్, తానూరు, ముధోల్ తదితర మండలాల్లోని గ్రామాల్లో చెట్లను నరికి ట్రాక్టర్లలో పట్టణ కేంద్రానికి తరలిస్తున్నారు. ఇలా తరలించిన కలపను ఖాళీ ప్రదేశాల్లో డంప్ చేస్తున్నారు. కొన్నింటిని ఇటుక బట్టీలకు, సామిల్లులకు తరలిస్తునానరు. పెద్ద మొత్తంలో పోగు చేసిన కలపను ఇతర ప్రాంతాలకూ తరలిస్తున్నారు. అటవీశాఖ అధికారుల వద్ద నామమాత్ర అనుమతులు తీసుకుంటూ, పెద్ద సంఖ్యలో చెట్లను నరికి తరలిస్తున్నారు. భైంసా–నిర్మల్, కుభీర్, భోకర్, బాసర మార్గాల్లో నిత్యం రాత్రివేళల్లో ట్రాక్టర్లలో జోరుగా నాన్టేక్ కలప తరలుతోంది. అధికారులు పట్టుకున్న సందర్భాల్లో ట్రాక్టర్ ఇంజిన్ చెడిపోయిందని, ట్రాలీ వేరేది అమర్చినట్లు చెబుతూ తప్పించుకుంటున్నారు. అటవీశాఖలోని కొందరు కిందిస్థాయి సిబ్బంది సహకారంతోనే అక్రమదందా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చర్యలు తీసుకుంటున్నాం.. అనుమతి లేకుండా చెట్లు నరికితే చర్యలు తీసుకుంటాం. ఇటుక బట్టీల్లో కట్టెలు వినియోగించినట్లు దృష్టికి వస్తే జరిమానా విధిస్తున్నాం. నాన్టీక్, టీక్ అక్రమ రవాణా జరగకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. – వేణుగోపాల్, ఎఫ్ఆర్వో, భైంసాఇటుక బట్టీల్లో వినియోగం.. డివిజన్ పరిధిలోని పలు ఇటుక బట్టీల్లో కట్టెలు వినియోగిస్తున్నారు. ఇటీవల అటవీశాఖ అధికారులు దాడి చేసి కట్టెలు వినియోగిస్తున్న ఇటుక బట్టీల నిర్వహకులకు జరిమానా విధించారు. అయినా, మళ్లీ కొందరు యథేచ్ఛగా కట్టెలు వినియోగిస్తున్నారు. ఫలితంగా బట్టీల్లో నుంచి వచ్చే పొగతో రోడ్లపై వాహనదారులు, బట్టీల పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
విద్యాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
నిర్మల్రూరల్: విద్యాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని డీఈవో రామారావు అన్నారు. అంతర్జాతీ య మహిళా దినోత్సవం సందర్భంగా స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) జిల్లా శాఖ భవనంలో శనివారం వేడుకలు నిర్వహించారు. డీఈవో హాజరై మాట్లాడారు. తల్లిగా, చెల్లిగా, ఆలిగా, చైతన్య వంతురాలైన ఉపాధ్యాయురాలుగా మహిళలు ఎన్నో పాత్రలు పోషిస్తూ సమాజాభివృద్ధిలో, విద్యాభివృద్ధిలో కీలకంగా మారారన్నారు. మహిళలు సహనంతో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడంలో ముందుంటారని తెలిపారు. పదో తరగతి పరీక్షలను ఎలాంటి ఒత్తిడి లేకుండా రాసే విధంగా సూచనలు ఇవ్వాలన్నారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు డీ ఈవో జ్ఞాపికలు అందించి సత్కరించారు. వేడుకల్లో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు భూమన్నయాదవ్, ప్ర ధాన కార్యదర్శి జె.లక్ష్మణ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్, వెంకటేశ్వరరావు, లక్ష్మీనారా యణ, తాళ్ల రవి, శ్రీదేవి, మీనాకుమారి, సుజాత, హేమలత, సౌజన్య, నీరజరాణి పాల్గొన్నారు. మహిళా దినోత్సవానికి హాజరైన మహిళా ఉపాధ్యాయులు -
రోడ్డు కోసం నిరాహార దీక్ష
భైంసాటౌన్: తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని మండలంలోని ఖత్గాం గ్రామస్తులు శనివారం నిరాహార దీక్ష చేపట్టారు. పట్టణంలోని ఖత్గాం ప్రవేశమార్గం వద్ద నిరాహార దీక్ష శిబిరం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. పట్టణం నుంచి తమ గ్రామానికి వెళ్లేందుకు సరైన రోడ్డు లేదని తెలిపారు. రాకపోకలకు గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. భైంసా నుంచి ఖత్గాంకు, కామోల్కు రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. దీక్షలో మాజీ సర్పంచ్ దెగ్లూర్ రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్లతో సత్వర న్యాయం
నిర్మల్టౌన్: లోక్ అదాలత్లతో కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని, సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టులో జాతీయ లోక్ అదాలత్ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణకుమార్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతాయని తెలిపారు. లోక్ అదాలత్లో సివిల్ కేసులు 06, ఫ్రీ లిటిగేషన్, బ్యాంకు సంబంధించిన కేసులు 96, క్రిమినల్ కేసులు 1,085, సైబర్ క్రైమ్ 1,220 కేసులు పరిష్కరించినట్లు వివరించారు. కార్యక్రమంలో జడ్జీలు రాధిక, శ్రీనివాస్, భవిష్య, పోలీస్ అధికారులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
ఈఎస్ఐ ధీమా!
● ఆదిలాబాద్, మంచిర్యాలలో కొత్తగా డిస్పెన్సరీలు ● అందుబాటులోకి వస్తే వైద్యం ● కార్మిక కుటుంబాలకు ఉచితంగా సేవలుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలకు వైద్యం చేరువ చేసేందుకు ఈఎస్ఐ(కార్మిక రాజ్య బీమా సంస్థ) కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో రెండు డిస్పెన్సరీల ఏర్పాటుకు నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 18డిస్పెన్సరీలు ఏర్పాటు చేస్తుండగా ఇందులో ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రెండు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్మల్ పట్టణం శాంతినగర్లో, మంచిర్యాల పట్టణం ఏసీసీ కాలనీలో ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉన్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో ఈఎస్ఐ ఆసుపత్రి ఉంది. నిర్మల్లో బీడీ కార్మికులకు ప్రత్యేకంగా మరొకటి ఉంది. ఉమ్మడి జిల్లాలో సిమెంట్ పరిశ్రమలు, మట్టి, స్పిన్నింగ్, పేపర్ మిల్లు తదితర కార్మిక వర్గాలు ఎక్కువగా ఉన్న చోట్ల ఈఎస్ఐ ఆధ్వర్యంలో కార్మికులకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటయ్యాయి. ఈ డిస్పెన్సరీ, ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ఖాళీలతో అరకొర వైద్యమే అందుతోంది. అంతేగాక సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే అసౌకర్యాల మధ్య సేవలందిస్తున్నాయి. ఇటీవల మంచిర్యాల కలెక్టరేట్ సమీపంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ నిర్మాణం కోసం భూమి కేటాయించారు. కొత్తగా ఆదిలాబాద్ పట్టణం, మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు ఆవరణలో కొత్త డిస్పెన్సరీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీంతో సేవలు మెరుగవుతాయనే ఆశలు నెలకొన్నాయి. ఈఎస్ఐ కార్డు ఉంటే.. ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు చాలీచాలని జీతాలతో తమ కుటుంబాల వైద్య ఖర్చులకే రూ.లక్షల్లో వెచ్చించాల్సి వస్తోంది. నెలకు రూ.21వేల లోపు వేతనం పొందుతున్న ప్రతీ కార్మికుడు లేదా ఉద్యోగి ఈఎస్ఐకి అర్హులు. దివ్యాంగ ఉద్యోగులైతే రూ.25వేల వరకు అవకాశం ఉంది. ఈఎస్ఐ కార్డుతో ఉచితంగా వైద్య సేవలు పొందే అవకాశం ఉంది. స్థానికంగా వైద్య పరీక్షలు చేయించుకుని సిఫారసుతో హైదరాబాద్తోపాటు దేశంలో ఎక్కడైనా ఈఎస్ఐ పెద్ద ఆసుపత్రిల్లో ఖరీదైన వైద్యం సైతం ఉచితంగా పొందవచ్చు. అలాగే ఈఎస్ఐ చెల్లిస్తున్న కార్మికులకు పని ప్రదేశాల్లో గాయపడిన, ఇతర ప్రమాదం ఏదైనా జరిగితే వేతనంతో కూడిన సెలవు, వైద్య ఖర్చులు పొందే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది ఈఎస్ఐని ఉపయోగించుకోవడం లేదు. ఇక కొన్ని సంస్థలు తమ పరిధిలో పని చేస్తున్న కార్మికులకు కనీసం ఈఎస్ఐ కూడా చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగులు తప్పనిసరిగా ప్రతీ నెలా ఈఎస్ఐ చెల్లించేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అవగాహన లేక సేవలకు దూరం ఉమ్మడి జిల్లాలో వేలాది మంది ఆయా రంగాల్లో పని చేస్తున్నారు. ప్రైవేటు విద్య, వైద్యారోగ్య సంస్థలు, మున్సిపల్, కార్పొరేషన్ సిబ్బంది, రవాణా, షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీలు, బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్, హోటల్స్, రెస్ట్రారెంట్స్, సినిమా థియేటర్లు, తదితర చోట్ల కనీసం పది మంది పని చేసే చోట ఆయా యాజమాన్యాలు ఈఎస్ఐ పరిధిలోకి రావాల్సి ఉంది. అయితే చాలా చోట్ల ఇవేమీ అమలు కావడం లేదు. దీంతో అనేక మంది కార్మికులు తమ కష్టార్జీతం వైద్యారోగ్య సేవలకే వెచ్చించాల్సి వస్తోంది. అయితే చాలామంది ఈ సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకే వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో కార్మికులకు విస్తృతంగా ప్రచారం కల్పించి అర్హులు సేవలు పొందేలా చూడాల్సిన అవసరం ఉంది. -
ఎదగని బాల్యం!
● వయసుకు తగిన బరువు, ఎత్తు లేని చిన్నారులు.. ● జిల్లా వ్యాప్తంగా 791 మంది గుర్తింపు ● 176 మంది పిల్లల్లో పోషకాహార లోపంలోకేశ్వరం: ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో అవసరం. ఎదిగే పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే సమతుల ఆహారం అందించాలి. ఇందు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్లు, బాలామృతం, మ ధ్యాహ్న భోజనం అందిస్తున్నాయి. అయినా పిల్లలు ఇంకా బలహీనంగానే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 791 మంది ఎత్తుకు దగ్గ బరువు, వయసుకు తగిన ఎత్తు లేరని, 176 మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. జిల్లా వివరాలు.. జిల్లా వ్యాప్తంగా 926 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఆరు నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులు 27,473 మంది, 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలు 25,187 మంది ఉన్నారు. వీరిలో 967 మంది చిన్నారులు ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, మరికొందరు వయసుకు తగిన ఎత్తు పెరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో 4,765 మంది గర్భిణులు ఉండగా, బాలింతలు 5,051 మంది ఉన్నారు. వీరి ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకోవడంతోపాటు పుట్టిన శిశువు ఆరేళ్ల వయసు వచ్చే వరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నాయి. అయినా వందల మంది చిన్నారులు పోషకాహారం లోపంతో బాధపడుతుండడం ఆందోళన కలిగించే అంశం. వేధిస్తున్న సిబ్బంది కొరత .. పేద, మధ్య తరగతి కుటుంబాల ఆరోగ్య కల్పతరువు అంగన్వాడీ కేంద్రాలు. అయితే ఈ కేంద్రాల్లోనే అనేక సమస్యలు ఉన్నాయి. ఒక్కో సెంటర్కు ఒక టీచర్, ఒక ఆయా తప్పనిసరిగా ఉండాలి. జిల్లావ్యాప్తంగా 926 కేంద్రాలకు 833 మంది టీచర్లు మాత్రమే ఉన్నారు. 93 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయాలు 541 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 385 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముధోల్, భైంసా సీడీపీవో పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇన్చార్జీలతో నెట్టుకొస్తున్నారు. చిన్నపిల్లలు కేంద్రాలకు రాకుంటే ఆయా ఇళ్లకు వెళ్లి కేంద్రానికి తీసుకురావాలి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెనూ ప్రకారం వంట చేసి పెట్టాలి. టీచర్ ఆట వస్తువులతో పిల్లలను ఆడిస్తూ పూర్వ ప్రాథమిక విద్యను బోధించాల్సి ఉంటుంది. సిబ్బంది కొరతతో లబ్ధిదారులకు పోషకాలతో కూడిన ఆహారం అందడం లేదు. అక్షరాలకు శ్రీకారం చుట్టే అంగన్వాడీ కేంద్రాలు చాలా వరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇరుకు గదులు, గాలి, వెలుతురు సరిగా లేకుండా, రేకుల షెడ్లు, పూరి గుడిసెల్లో కొనసాగుతున్నాయి. జిల్లా 926 కేంద్రాలకు ఉండగా వీటిలో పక్కగా భవనాలు కేవలం 194 ఉన్నాయి. 363 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 369 ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. ప్రత్యేక దృష్టి సారించాం పోషకాహార లోపం, ఇతర సమస్యలతో ఎదగని చి న్నారుల కోసం ప్రత్యేక మెనూ కొనసాగిస్తున్నాం. నిబంధనల ప్రకారం 7 నెలల నుంచి 3 ఏళ్ల పిల్లలకు నెలకు 16 గుడ్లు మాత్రమే ఇస్తాం. కానీ ఎత్తుకు తగిన బరువు, వయసుకు తగిన ఎత్తు పెరగని చిన్నారుల కోసం ప్రతీరోజు గుడ్డు, బాలామృతం ప్లస్తోపాటు భోజనం అందిస్తాం. పది రోజుల కోసారి వైద్య సిబ్బందితో పరీక్షలు చేయిస్తున్నాం. ఆందోళనకరంగా ఉన్న పిల్లలకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. – ఫైజాన్ అహ్మద్, అదనపు కలెక్టర్ నిర్మల్ప్రాజెక్టుల వారీగా పిల్లలు, అంగన్వాడీ ఖాళీల వివరాలు... ప్రాజెక్టులు 6 నెలల నుంచి బరువు తక్కువ పోషకాహార లోపం అంగన్వాడీ ఆయా 6 ఏళ్ల పిల్లలు ఉన్న పిల్లలు ఉన్న పిల్లలు టీచర్ ఖాళీలు ఖాళీలు నిర్మల్ 21,152 318 46 36 140 భైంసా 11,764 152 34 27 67 ఖానాపూర్ 11,350 221 75 14 104 ముధోల్ 9,361 100 21 16 74 మొత్తం 53,627 791 176 93 385 -
పిచ్చుకల కోసం వరికుచ్చులు
కనుమరుగైపోతున్న పిచ్చుకలను మళ్లీ మన ఇంటికి రప్పించే ఓ మంచి ప్రయత్నాన్ని నిర్మల్ మండల మహిళా సమాఖ్య చేపట్టింది. వాటి పొట్ట నింపేలా, ఇంటికి లక్ష్మీకళ తెచ్చేలా వరికుచ్చుల తయారీని చేపట్టింది. నిర్మల్రూరల్ మండలం కొండాపూర్లో గణపతి స్వయంసహాయక సంఘం మహిళలు చేస్తున్న సమీకృతసాగులో భాగంగా పండిస్తున్న వరితోనే ఈ కుచ్చులను చేస్తుండటం విశేషం. డీఆర్డీవో విజయలక్ష్మి ఆలోచనతో ప్రారంభమైన ఈ వరికుచ్చులకు డిమాండ్ పెరుగుతోంది. నిర్మల్నుంచి హైదరాబాద్, విజయవాడ, వరంగల్, సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్ తదితర జిల్లాలకూ తీసుకెళ్తున్నారు. సేవ్బర్డ్స్ నినాదంతోనే.. పిచ్చుకలను రక్షించాలన్న నేపథ్యంలో వరికుచ్చుల తయారీ ఆలోచన వచ్చింది. రెగ్యులర్గా కావాలంటూ హైదరాబాద్ నుంచి ఇటీవల చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఒక్కో వరికుచ్చును రూ.300కు విక్రయిస్తున్నాం. సభ్యులకు పనితోపాటు లాభం, పిచ్చుకలకూ ఆహారం అందుతోంది. – విజయలక్ష్మి, డీఆర్డీవో -
బస్టాప్ల్లో ఇబ్బందే..!
మంచిర్యాలఅర్బన్/మంచిర్యాలటౌన్/చెన్నూర్/నిర్మల్/వాంకిడి/బోథ్/ఆసిఫాబాద్రూరల్: మహిళలు, యువతులు, విద్యార్థినులు అవకాశాల ను అందిపుచ్చుకుంటూ అన్నిరంగాల్లో రాణిస్తున్నా రు. పురుషులకు దీటుగా పనులు చేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కానీ స మాజంలో అక్కడక్కడ మహిళలపై చిన్నచూపు ఉండడంతో అనేక అవకాశాలకు దూరమవుతున్నారు. పని ప్రదేశాల్లో వేధింపులు, ఆధిపత్య ధోరణులు మహిళలకు ప్రతిబంధకంగా మారుతున్నా యి. ఎక్కడ.. ఎవరితో వివక్షకు గురవుతున్నారనే అంశాలపై ‘సాక్షి’ మంచిర్యాలలోని శ్రీహర్ష డిగ్రీ కళాశాలతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యార్థినులు, యువతులు, మ హిళలు 350మంది నుంచి సర్వే ద్వారా వివరాలు సేకరించింది. తెలియని వారు, ఆకతాయిలతో ఇక్కట్లు పడుతున్నట్లు తేల్చిచెప్పారు. బస్టాప్ల్లో అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వె ల్లడైంది. ఇళ్లలో ఆడ, మగ అనే వివక్ష లేదని, అభిప్రాయాలకు గౌరవం లభిస్తోందని స్పష్టమైంది.సెల్ఫోన్లో వచ్చే మెస్సేజ్లతో 72ఉంది 87మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశంతెలిసిన వారే.. 146తెలియని వారు 204బస్టాప్లో 204కాలేజీ లేదా ఆఫీసులో 74 -
నిర్మల్
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025● ఇళ్లలో స్వేచ్ఛ లభిస్తోంది.. ● బయట అనుమానపు చూపులే ● తెలియని వారితోనే సమస్యలు ● మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సర్వేచెప్పలేను 59మీ కాలేజీ, పని ప్రదేశంలో మహిళగా ఏమైనా వివక్ష ఎదుర్కొంటున్నారా..లేదు 204 -
నాట్యగురువు సౌమ్య
● చిన్నారులకు కూచిపూడిలో శిక్షణ ● రికార్డ్ ప్రదర్శనల్లో భాగస్వామ్యం భైంసాటౌన్: చిన్ననాటి నుంచే నృత్యంపై ఉన్న మక్కువతో తాను నేర్చుకుని ఎంతోమంది చిన్నారులకు నేర్పుతూ దానినే ఉపాధిగా మలుచుకున్నారు భైంసాకు చెందిన రంగు సౌమ్య. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి వేదికల్లోనూ తన శిష్యబృందంతో ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. ఫలితంగా నృత్యరంగంలో భైంసాకు ప్రత్యేక గుర్తింపు తెస్తూ అందరి అభినందనలు అందుకుంటున్నారు. సౌమ్యకు చిన్నప్పటి నుంచే నృత్యంపై మక్కువ ఉన్నా పెళ్లయిన తరువాత భర్త ప్రోత్సాహంతో నిజామాబాద్లో నృత్య గురువులు భీమన్, దేవులపల్లి ప్రశాంత్ వద్ద నాలుగేళ్లపాటు కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకున్నారు. అనంతరం భైంసాలో తానే సొంతంగా శ్రీనయనం నృత్యా కళానిలయం పేరిట చిన్నారులకు ప్రధానంగా కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. మొద ట ఐదుగురు చిన్నారులతో మొదలై, నేడు వందమందికి పైగా శిక్షణ తీసుకుంటున్నారు. తన వద్ద శిక్షణ పొందిన చిన్నారులతో పలు పుణ్యక్షేత్రాల్లో ప్రదర్శనలు ఇప్పిస్తూ ఎన్నో ప్రశంసాపత్రాలు, అవార్డులు అందుకున్నారు. తన భర్త, కుటుంబీకుల ప్రోత్సాహంతోనే తాను నృత్య రంగంలో రాణిస్తున్నట్లు ఈ సందర్భంగా రంగు సౌమ్య తెలిపారు. శిష్యబృందంతో ఇచ్చిన ప్రదర్శనలు ● అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని తన శిష్యబృందంతో నృత్య ప్రదర్శన ఇచ్చి ప్రశంసాపత్రాలు అందుకున్నారు. ● ఇటీవల అరుణాచలంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు 15 మంది చిన్నారులతో కలిసి నృత్య ప్రదర్శన ఇచ్చారు. ● హైదరాబాద్లో నిర్వహించిన గిన్నిస్బుక్ రికార్డ్ నృత్య ప్రదర్శనలోనూ పాల్గొని పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందుకున్నారు. ● గతనెలలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులోని సమతా స్ఫూర్తి కేంద్రంలో సమతాకుంభ్–2025 పేరిట తృతీయ బ్రహ్మోత్సవాలు నిర్వహించగా 3వేల మంది చిన్నారులతో నృత్య రూపకాలు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు ఇండియన్ వరల్డ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కు నమోదయ్యాయి. ఇందులో భైంసా నుంచి శ్రీనయనం నృత్య కళానిలయానికి చెందిన 21 మంది చిన్నారులు పాల్గొని ప్రశంసాపత్రాలు అందుకున్నారు. -
ఈవీఎం గోదాం తనిఖీ
నిర్మల్చైన్గేట్: నిర్మల్ రూరల్ మండలం ఎల్లాపల్లి వద్ద ఉన్న ఈవీఎం, వీవీ ప్యాట్ గోదాంను కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో శుక్రవారం తనిఖీ చేశారు. తాళానికి వేసిన సీల్, సీసీ కెమెరాలో రికార్డవుతున్న విధానాన్ని పరిశీలించా రు. తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు. గోదాం తనిఖీ నివేదికను ఎన్నికల సంఘం కార్యాలయానికి పంపించాలని పర్యవేక్షకులకు సూచించారు. ఆర్డీవో రత్నకళ్యాణి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాస్, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ ప్రతినిధులు గాజుల రవికుమార్, కొరిపెల్లి శ్రావణ్రెడ్డి, మహ్మద్ నయీ మ్, నరేశ్, భద్రత సిబ్బంది, అధికారులున్నారు. -
No Headline
అన్నింటికీ ఆమే ఆధారం. అమ్మగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా, బిడ్డగా అన్ని బాధ్యతల్లోనూ మెప్పిస్తోంది. ఇంటిల్లిపాదిని చూసుకుంటూనే ఇంటి బాధ్యతల్లోనూ భర్తకు బాసటగా నిలుస్తోంది. తనకాళ్లపై తాను నిలవడమే కాకుండా తనతోపాటు పదిమందికి ఆసరా అవుతోంది. నారీశక్తి తలుచుకుంటే కానిదంటూ ఏదీ లేదని చాటుతోంది. తన పరిధిలోనే స్వయంశక్తితో, సమష్టితత్వంతో, సంఘటితంగా ఆర్థిక స్వావలంబనను సాధిస్తోంది. అన్నీ ఉండి సోమరితనంతో నిద్రపోతున్న ఎంతోమందికి ఆదర్శమూర్తిగా నిలుస్తోంది. జిల్లాలో ఒక్కో మండలంలో ఒక్కో వినూత్న ఉపాఽధితో సత్తా చాటుతున్నారు స్వయంసహాయక సంఘాల మహిళలు. తాము ఉపాధిని పొందడంతో పాటు పదిమందికి ఆదర్శంగానూ నిలుస్తున్నారు. కలెక్టర్ అభిలాషఅభినవ్, డీఆర్డీవో విజయలక్ష్మి, సంబంధిత అధికారుల ప్రోత్సాహంతో ముందడుగేస్తున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వీరిపై ప్రత్యేక కథనం. – నిర్మల్ -
● తమ కాళ్లపై తాము నిలుస్తూ..● మరికొందరికి ఉపాధినిస్తూ.. ● కుటుంబానికి తోడ్పాటునిస్తూ.. ● సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్న పలు మహిళా సంఘాల సభ్యులు ● నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
చేప పచ్చళ్లను తయారు చేస్తున్న మహిళలు వావ్.. అనిపించే ఫిష్పికిల్చేపలంటే నాన్వెజ్ ప్రియులకు చాలా ఇష్టం. కానీ.. ఎప్పుడు పడితే అప్పుడు తినలేం. అలాంటివాళ్లకు ఇంట్లోనే పికిల్ (పచ్చడి) రూపంలో చేపలను అందించే ఆలోచనతో వాళ్లు ముందుకువచ్చారు. కడెం మండల కేంద్రానికి చెందిన 50 మంది మహిళలు ఇందిరా మహిళాశక్తి పథకం, ఈడీఐఐ యాక్సెంచర్ ఎన్జీవో సహకారంతో చేపలు, రొయ్యలతో పాటు చికెన్ పచ్చళ్లు తయా రు చేస్తున్నారు. స్థానికంగా లభించే రొయ్యలను ఎండబెట్టి విక్రయిస్తున్నారు. వీరు చేసే పచ్చళ్లు నాణ్యతతో ఉండటంతో స్థానికంగానే కాకుండా మలేషియా, దుబాయి నుంచీ డిమాండ్ పెరుగుతోంది. వారికి ఆదాయమూ కలిసి వస్తోంది. నాణ్యత పాటిస్తున్నాం స్థానికంగా చేపలు ఎక్కువగా లభిస్తాయి. మాకు అవగాహన ఉన్న పచ్చళ్ల తయారీనే ఉపాధిగా మార్చుకుని నాణ్యతతో అందిస్తున్నాం. పచ్చళ్లకు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ మాకు ఆదాయం లభిస్తోంది. – రేణుక, కడెం -
శానిటరీ ప్యాడ్స్ తయారీ
రేలా.. పేరిట శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తూ జిల్లాకు పేరు తీసుకురావడమే కాదు.. వారూ ఉపాధి పొందుతున్నారు. కుంటాల మండలకేంద్రంలో డీఆర్డీవో విజయలక్ష్మి సూచనలు, రూర్బ న్ కింద వచ్చిన రూ.20లక్షల నిధులను అక్కడి మహిళలు ఇలా సద్వినియోగం చేసుకుంటున్నా రు. నిధులతో యంత్రాలు, సామగ్రి కొనుగోలు చేసి నాణ్యతతో శానిటరీ న్యాప్కీన్స్ తయారు చేస్తున్నారు. ఇతర జిల్లాలకూ పంపిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచీ ఓ కంపెనీవాళ్లు వచ్చి చూసివెళ్లారు. మండలం, జిల్లా స్వయంసహాయక సంఘాల సభ్యులు ఇక్కడ ఉపాధితో పాటు తయారీలో శిక్షణ పొందుతున్నారు. ఉపాధి లభిస్తోంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థికంగా ఆసరా అందించేందుకు రేలా పేరిట బయోడిగ్రేడెబుల్ న్యాప్కీన్స్ తయారు చేస్తున్నాం. దీంతో మాకు పనితో పాటు ఉపాధి లభిస్తోంది. ఎస్హెచ్జీ సభ్యులకు శిక్షణ కూడా ఇస్తున్నాం. – శారద, కుంటాల -
అమెరికాకు పిండివంటలు..
ఎక్కడో ఉన్న అమెరికాకు ఇక్కడి ఓ పల్లెటూరి మహిళలు పిండివంటలు చేసి పంపిస్తున్నారు. ఆస్ట్రేలియా, దుబాయి వాసులకూ తమ చేతివంటల రుచి చూపిస్తున్నారు. లోకేశ్వరం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన సరస్వతీ గ్రామైక్య సంఘం సభ్యులైన గొల్లమాడ ప్రణిత, శైలజ, వనజ, మాధురి, లక్ష్మి తమకు వచ్చిన వంటనే తమకు ఆసరాగా మార్చుకున్నారు. వారంతా కలిసి అన్నపూర్ణ క్యాటరింగ్ పెట్టుకున్నారు. చకినాలు, గారెలు, మురుకులు, అరిసెలు, లడ్డూలు తదితర పిండివంటలు చేస్తున్నారు. శుభకార్యాల కోసం కూడా వంటలు చేసిస్తున్నారు. వీరు చేస్తున్న పిండివంటలు రుచిగా ఉండటంతో అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయి తదితర దేశాలకూ తీసుకెళ్తున్నారు. ఒక్కసారి తిన్నవారు మళ్లీమళ్లీ పంపించాలని కోరుతుండటం గమనార్హం. వచ్చిన పనితోనే ఉపాధి మేము ఏదైనా ఉపాధి పొందాలనుకున్నాం. మా కు వచ్చిన వంటలనే ఉపాధిగా మలుచుకున్నాం. ఇందుకు రూ.2లక్షల రుణం తీసుకుని నెలకు రూ.8వేల చొప్పున చెల్లిస్తున్నాం. మిగిలిన లాభాన్ని అందరం పంచుకుంటున్నాం. – గొల్లమాడ ప్రణిత, కిష్టాపూర్ -
ఓ మహిళా.. చట్టం తెలుసుకో..
● సీ్త్రల కోసం ఎన్నో చట్టాలు ● అవగాహన లేక ఇబ్బందులునిర్మల్: పరసీ్త్రని కూడా తల్లితో సమానంగా చూడాలని మన ధర్మం చెబుతోంది. కానీ.. చాలామంది భార్యాపిల్లలపై దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్యనే శరణ్యమనుకుంటున్నారు. కానీ.. మన దేశంలో మహిళలకు రక్షణ కల్పించేందుకు అనేక చట్టాలున్నాయి. మహిళా దినోత్సవం నేపథ్యంలో నిర్మల్కు చెందిన న్యాయవాది సీహెచ్ అర్చన మహిళలకు సంబంధించిన చట్టాలు, హక్కుల గురించి వివరించారు. నిర్భయ చట్టం 2013: ఈ చట్టాన్ని 2013లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఢిల్లీలో జరిగిన ఘటన నేపథ్యంలో తీసుకువచ్చింది. జస్టిస్ వర్మ కమిటీ సూచనల మేర కు మహిళలపై లైంగికదాడికి పాల్పడిన వారిని కఠి నంగా శిక్షించాలని నిర్ణయించింది. అత్యాచారం, మహిళలకు సంబంధించిన ఇతర నేరా ల్లో నిందితులకు మరణ శిక్ష కూడా పడేలా కఠినతరం చేసింది. సమాన వేతన హక్కు చట్టం: ఏ యజ మాని కూడా వేతనాలు లేదా నియామకాల్లో లింగ వివక్ష చూపరాదు. వేతన వివక్ష ఎదుర్కొంటే మహిళలు లేబర్ కోర్టును సంప్రదించవచ్చు. ఆస్తి హక్కు: హిందూ వారసత్వ చట్టం–1956 ద్వా రా ఈ హక్కు కల్పించారు. 2005లో సవరించారు. కుమార్తెలకు వారి పూర్వీకుల ఆస్తిలో కొడుకులతో సమాన హక్కులున్నాయి. తండ్రి వీలు నామా లేకుండా మరణించినప్పటికీ కుమార్తె కు ఆమె సోదరులతో సమాన వాటా ఉంటుంది. ఇది వివాహిత కుమార్తెలకూ వర్తిస్తుంది. గృహ హింస నిరోధక చట్టం 2005: జీవిత భాగస్వామి, అత్తమామలు లేదా కుటుంబ స భ్యుల నుంచి శారీరక, మానసిక, లైంగిక లేదా ఆర్థి క వేధింపులను ఎదుర్కొంటున్న మహిళలు ఈ చ ట్టం కింద రక్షణ పొందవచ్చు. ఇది భర్త లేదా అత్తమామల యాజమాన్యంలో ఉన్నప్పటికీ ఉమ్మడి ఇంట్లో నివసించే హక్కును మంజూరు చేస్తుంది. జీవన భృతి, కస్టడీ ఉత్తర్వులు, రక్షణ అందిస్తుంది. లింగ ఎంపిక నిషేధ చట్టం 1994: భారతదేశంలో సీ్త్ర భ్రూణ హత్యలను ఆపడానికి, క్షీణిస్తున్న లింగ నిష్పత్తిని అరికట్టడానికి భారత పార్లమెంట్ రూపొందించిన చట్టమిది. ఈ చట్టం ప్రకారం సీ్త్రల పట్ల వివక్షత నివారించడం, లింగ ఎంపిక, గర్భస్రావం ద్వారా స్రీ్త్రభూణ హత్యలను నిషేధించారు. తల్లి/బిడ్డ ఆరోగ్యానికి ఏదైనా హాని కలిగే పరిస్థితుల్లో, జన్యుసంబంధిత వ్యాధులకు మాత్రమే తల్లి అంగీకారంతోనే గర్భస్రావం చేయించుకునే అవకాశముంది. అక్రమంగా స్కానింగ్ చేసి లింగనిర్ధారణ పరీక్ష ఫలితాలు వెల్లడి చేస్తే చట్టరీత్యా నేరంగా పరిగణించి కఠినశిక్షలు విధిస్తారు. పని ప్రదేశంలో వేధింపులు: పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించడానికి, లైంగిక వేధింపుల ఫిర్యాదులు, పరిష్కారం కోసం పని ప్రదేశాల్లో వేధింపులు, నివారణ, నిషే ధం, పరిహారం చట్టం–2013 రూపొందించారు. ఒక కీలకమైన కేసుపై తీర్పునిస్తూ సుప్రీంకోర్టు 1997లో ‘విశాఖ’ మార్గదర్శకాలను వెలువరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం 2013లో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. వరకట్న నిషేధ చట్టం–1961: ఈ చట్టం వరకట్నం ఇవ్వడం, తీసుకోవడాన్ని నిషేధించింది. ఈ చట్టా న్ని అతిక్రమిస్తే ఐదేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష, రూ.15వేలదాకా జరిమానా విధించడానికి ఆస్కా రం ఉంది. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని కట్నం అడిగితే ఆరునెలల నుంచి రెండేళ్ల వరకు జైలుశిక్ష, రూ.10వేలవరకు జరిమానా విధించవచ్చు. -
లేడీ సింగంలు..!
● ఠాణా గడప దాటి.. శాంతి భద్రతలకు కదిలి.. ● పెట్రో కారెక్కిన మహిళా పోలీసులు ● డ్యూటీలో సగమై.. గస్తీలో భాగమై.. ● మహిళా దినోత్సవం సందర్భంగా.. లేడీ పోలీసులకు కొత్త విధులు ● ఇకపై వారానికో రోజు బాధ్యతలు.. ● వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎస్పీ నిర్మల్: పోలీసుశాఖకు ఫోన్లు కామనే కదా..!? ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా..!? ఈ ఫోన్లు చేసింది మహిళా కానిస్టేబుళ్లు. ఎప్పుడూ స్టేషన్ విధుల్లో.. లేదంటే ఎక్కడైనా కార్యక్రమాల వద్ద బందోబస్తులో మాత్రమే కనిపించే ఈ లేడీ కానిస్టేబుళ్లు తొలిసారి ఠాణా గడపదాటి.. శాంతిభద్రతల పరిరక్షణకు కదిలారు. తొలిసారి లేడీ సింగంలా బాధ్యతలు నిర్వర్తించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్పీ జానకీషర్మిల గురువారం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళ కానిస్టేబుళ్లు సైతం పురుషులతో సమానంగా శాంతిభద్రతల్లో భాగం అవుతారని నిరూపించుకునేందుకు.. వారానికోసారి మహిళా కానిస్టేబుళ్లు సైతం పెట్రోకార్ డ్యూటీ చేసే అవకాశం కల్పించారు. తొలిరోజు లేడీ కానిస్టేబుళ్లు అదరగొట్టారు. ఈ తరహా ప్రయోగంపై ఏకంగా డీజీపీ జితేందర్ నుంచి ఎస్పీతోపాటు నిర్మల్ జిల్లా పోలీసులు ప్రశంసలు అందుకున్నారు. స్టేషన్కే పరిమితమై..మహిళా కానిస్టేబుళ్లు(డబ్ల్యూపీసీ) అంటే స్టేషన్ లోపల పనులకే పరిమితం.. అన్నట్లుగా పోలీసు వ్యవస్థ స్థిరపడిపోయింది. మహా అంటే.. ఎక్కడైనా ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు, ర్యాలీల్లో మహిళలు ఉంటే అక్కడికి వీరిని పంపిస్తుంటారు. ఖాకీ డ్రెస్ వేసుకున్నట్లే.. పేరుకు పోలీసన్నట్లే కానీ.. వీరికి పోలీసింగ్ బాధ్యతలు అప్పగించేవారు కాదు. ఇదిగో.. ఇలాంటి వ్యవస్థలో తొలిసారి ఎస్పీ జానకీషర్మిల ఓ కదలిక తీసుకొచ్చారు. తాను మహిళనే కదా.. ఓ జిల్లా బాధ్యతలు చూడటం లేదా.. అన్న ఆలోచనల్లో నుంచి తమ మహిళా కానిస్టేబుళ్లకూ ఓ అవకాశాన్ని కల్పించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని డబ్ల్యూపీసీలు వారానికోరోజు పెట్రోకార్ అంటే గస్తీ, డయల్ 100, చెకింగ్ పాయింట్లు తదితర పోలీసింగ్ విధులను చేపట్టాలని ఆదేశించారు. భేష్ అనిపించారు..తమపై భరోసా ఉంచి తమ పైఅధికారి కల్పించిన అరుదైన అవకాశాన్ని మహిళా కానిస్టేబుళ్లు సద్వినియోగం చేసుకున్నారు. తొలిరోజే తామేంటో నిరూపించుకునేలా పనిచేసి ఉన్నతాధికారుల మెప్పు పొందారు. డయల్ 100కు వచ్చిన ఫిర్యాదులను అందుకుని ఘటన స్థలాలకు వెళ్లారు. అక్కడి పరిస్థితిని ఉన్నతాధికారికి వివరించి చర్యలు చేప ట్టారు. రోడ్డుభద్రత చర్యలతోపాటు రోజువారీగా పెట్రోకార్ సిబ్బంది చేయాల్సిన విధులన్నీ విజయవంతంగా పూర్తిచేశారు. చాలామంది పోలీసయ్యాక ఈరోజు చాలా హ్యాపీ అనిపించిందన్నారు. -
తరగతిలోకి ఏఐ!
● ప్రాథమికస్థాయి నుంచే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై విద్యాశాఖ దృష్టి ● విద్యా ప్రమాణాల పెంపునకు దోహదం ● ఇటీవల సమీక్షలో రాష్ట్ర మంత్రి, ఉన్నతాధికారుల సూత్రప్రాయ నిర్ణయం.. ● అమలైతే మరింత ప్రయోజనంనిర్మల్ఖిల్లా: ప్రస్తుతం కృత్రిమ మేధా ప్రపంచాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లే సాధనంగా మారుతోంది. అయితే దీనిని రాష్ట్ర ఐటీ, పాఠశాల విద్యాశాఖ వి ద్యాబోధనలోనూ అమలుపరిచేందుకు కసరత్తు చే స్తోంది. ఇటీవల రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బా బు, విద్యాశాఖ కార్యదర్శి యోగితరాణాతో కలిసి విద్యాసంస్కరణలపై చర్చలో భాగంగా ఆర్టిఫీషి యల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నా ప్రైవేటు విద్యాసంస్థల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కుంటోంది. అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా పేద, దిగువ మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ బడుల్లో విద్య నాణ్యత మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశా రు. జిల్లాలోనూ దాదాపు 850 పైగా ప్రభుత్వ విద్యా సంస్థలు కొనసాగుతుండగా 70 వేలకుపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే ప్రతీ పాఠశాలలో కృత్రిమ మేధ వినియోగాన్ని అమలుపరిస్తే జిల్లా విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. క్షేత్రస్థాయి అనుభవాలు..ఆర్టిఫిఫీయల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యాబోధనలో చెప్పాలనుకున్న పాఠ్యాంశాన్ని పూర్తిస్థాయిలో క్షేత్ర పర్యటనలో మాదిరిగా విద్యార్థికి అర్థవంతంగా బోధించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రతీసారి పాఠశాల నుంచి బయటకు వెళ్లి చూపించలేని అంశాలన్నీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యార్థికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించవచ్చు. రోబోటి క్ లెర్నింగ్ కృత్రిమ మేధ వినియోగాన్ని బోధన అభ్యసన ప్రక్రియలో చేపట్టడం ద్వారా అభ్యసనం ఫలవంతమవుతుంది. విద్యార్థికి శాశ్వత జ్ఞానం ఏర్పడే అవకాశం ఉంటుంది. నేర్చుకునే అంశాలపై కుతూహలం పెరుగుతుంది. ఉపాధ్యాయుడికి విద్యార్థికి ప్రేరణాత్మకంగా ఉంటుంది.. ఇప్పటికే పెరిగిన సాంకేతికత...జిల్లాలో బోధన అభ్యసన ప్రక్రియ పరిపుష్టం చేసేందుకు ఇప్పటికే ప్రతీ పాఠశాలకు ట్యాబ్లు, ఐఎఫ్బీ పానెల్ బోర్డులు ఏర్పాటు చేశారు. వీటికి తోడు పీఎంశ్రీ పాఠశాలల ఎంపికై న 17 విద్యాసంస్థల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్లు కూడా పూర్తికానున్నా యి.. ఆడియో విజువల్ లర్నింగ్ ద్వారా పాఠ్యాంశాలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయుల కు కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యాబోధనలో సృజనాత్మక శైలులు జొప్పించేందు కు అధికారులు అంతర్గత శిక్షణలు కూడా అందిస్తున్నారు. తద్వారా ఉపాధ్యాయుడు సైతం మారుతు న్న కాలానికి అనుగుణంగా బోధన అభ్యసన ప్రక్రియను కొత్త పుంతలు తొక్కించేందుకు వీలుంటుంది..ప్రభుత్వ బడులు మరింత బలోపేతం.. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ బడుల్లో అన్నిరకాల వసతులు సమకూరుతున్నాయి. ప్రైవేటులో చదివించలేని పేద విద్యార్థులకు ప్రభుత్వ నిర్ణయం వరం లాంటిది. విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన చేయడంతో వారికి పూర్తిస్థాయిలో అర్థవంతంగా ఉంటుంది. తద్వారా ప్రభుత్వం పాఠశాలలు కూడా మరింత బలోపేతం అవుతాయి.. – ఒడ్నాల రాజేశ్వర్, విద్యార్థి తండ్రి, పరిమండల్సాంకేతికత వినియోగం అవసరమే.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తేవడం ద్వారా అభ్యసనం పూర్తిస్థాయిలో సఫలం అవుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత వినియోగం అవసర మే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో బోధన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – తోట నరేంద్రబాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు -
న్యూస్రీల్
ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం నిర్మల్ రూరల్: ఇంటర్మీడియెట్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. మొత్తం 6,102 మంది విద్యార్థులకు 5,806 మంది హాజరయ్యారు. 296 మంది గైర్హాజరయ్యారు. జనరల్ కేటగిరీలో 5,438 మంది విద్యార్థులకు 5,172 మంది హాజరవగా, 2,66 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కేటగిరీలో మొత్తం 664 మంది విద్యార్థులకు 634 మంది హాజరవగా, 30 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి పరుశురాం తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన డీఐఈవో సారంగపూర్: మండల కేంద్రంలోని ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా మాధ్యమిక విద్యాఽధికారి పరశురాం గురువారం సందర్శించారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 290 మంది విద్యార్థులు హాజరు కావాల్సి, ఉండగా 281 మంది హాజరయ్యారు. 9 మంది గైర్హాజరయ్యారని సీఎస్ శంకర్ జిల్లా మాధ్యమిక విద్యాఽధికారికి తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఐఈవో విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కాపీయింగ్కు పాల్పడవద్దని తెలిపారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఆయన వెంట సీఎస్ శంకర్, అధ్యాపకులు ఉన్నారు. -
పన్ను చెల్లించని ఇల్లు సీజ్
ఖానాపూర్: పట్టణంలోని అంబేద్కర్నగర్ కాలనీకి చెందిన రాములు రూ.15,880 ఇంటి పన్ను చెల్లించకపోవడంతో ఆ ఇంటిని సీజ్ చేశామని మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు. వార్డు అధికారులు ధీరజ్, రాహు ల్, లతీఫ్, రాజశేఖర్, బిల్ కలెక్టర్ అభినయ్ సిబ్బందితో కలిసి గురువారం ఇంటికి తాళం వేసినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి పన్నులు చెల్లించి మున్సిపల్ అధికారులు, సిబ్బందికి సహకరించాలని కమిషనర్ కోరా రు. నూతన మున్సిపాలిటీలో నిధుల కొరతను దృష్టిలో ఉంచుకుని సిబ్బంది వేతనాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు సహాకారం అందించాలన్నారు. -
బేటీ బచావో–బేటీ పడావో జిల్లాస్థాయి పోటీలు
నిర్మల్ రూరల్: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘బేటీ బచావో– బేటి పడావో’ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 8, 9 తరగతి బాలికలకు గురువారం జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. మండలాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన 100 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు. 25 మంది విద్యార్థినులను విజేతలుగా ప్రకటించారు. వీరికి మహిళా దినోత్సవం రోజున కలెక్టర్ అభిలాష అభినవ్ బహుమతులు ప్రదానం చేస్తారని డీఎస్వో వినోద్కుమార్ తెలిపారు. విజేతలను డీఈవో రామారావు అభినందించారు. -
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● కలెక్టర్ అభిలాష అభినవ్నిర్మల్చైన్గేట్: పదో తరగతి పరీక్షల్లో ఈసారి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో పదో తరగతి పరీక్షల పై గురువారం సమీక్ష నిర్వహించారు. పరీక్షల్లో జి ల్లాలోని ప్రతీ పాఠశాలలో విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించాలన్నారు. రెండేళ్లుగా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలుస్తోందని తెలిపారు. ఈసారి కూడా మొదటిస్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. పరీక్షల సన్నద్ధత కోసం ప్రత్యేక టైంటేబుల్ రూపొందించుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థుల్లో పరీక్షలపై ఉన్న భయం తొలగించాలని సూచించారు. పాఠ్యాంశాలను సులభంగా గుర్తుంచుకునేలా మెలకువలు నేర్పించాలని తెలిపారు. ఉపాధ్యాయులు అధికారులు, ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసి ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలన్నారు. పరీక్షల నిర్వహణ, ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు శాతానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో రామారావు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీల ప్రత్యే క అధికారులు పాల్గొన్నారు. -
బాధ్యతాయుతంగా విధులు..
మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎస్పీ జానకీషర్మిల తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. అంతేకాకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తాం. మొదటిరోజు విధుల్లో.. బస్టాండు వద్ద పెట్రోలింగ్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేశాం. రోడ్లపై ఉన్న బండ్లను తొలగింపజేశాం. మొదటి రోజు డ్యూటీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. –వజ్రమ్మ, నిర్మల్ పురుషులతో సమానంగా.. మొదటిసారిగా బ్లూకోల్ట్స్, పెట్రోకార్ విధులు నిర్వహించడం సంతోషంగా ఉంది. పురుషులతో సమానంగా విధులు నిర్వహించాం. నిబద్ధతతో పనిచేశాం. మాకు ఈ అవకాశం కల్పించిన ఎస్పీ జానకీషర్మిళ మేడం, ఏఎస్పీ రాజేశ్మీనా, ఎస్సై సుమలతకు కృతజ్ఞతలు. – శ్రీలత, లక్ష్మణచాంద ‘నారీశక్తి’లో భాగంగా.. మహిళలు ఏరంగంలో అయినా రాణించగలరు. మా మహిళ సిబ్బందిపై పూర్తి నమ్మకంతోనే వారికి పెట్రోకార్ బాధ్యతలు అప్పగించాం. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసుశాఖ చేపడుతున్న ‘నారీశక్తి’ కార్యక్రమాల్లో భాగంగా వారానికోసారి మహిళా కానిస్టేబుళ్లకు పెట్రోకార్ బాధ్యతలను అప్పగిస్తాం. తొలిరోజే డబ్ల్యూపీసీలు అద్భుతంగా పనిచేశారు. –జానకీషర్మిల, ఎస్పీ -
రాష్ట్రస్థాయి జిజ్ఞాస ప్రదర్శనలో భైంసా విద్యార్థులు
భైంసాటౌన్: హైదరాబాద్లోని ఇందిర ప్రియదర్శిని కళాశాలలో బుధవారం రాష్ట్రస్థాయి జిజ్ఞాస(డిగ్రీ కళాశాల విద్యార్థుల అధ్యయన ప్రాజెక్టులు)–2025 పోటీలు జరిగాయి. ఇందులో భైంసాలోని జీఆర్పీ ప్రభుత్వ డిగ్రీ కళా శాల విద్యార్థులు యోగిత, కీర్తి, అంకిత, నితి న్, వంశీ పాల్గొని ‘ఆంగ్ల భాషా పదాల అసమగ్ర అనువాదం కన్నా అనులేఖనం అనువైనది‘ అనే అంశంపై ప్రదర్శన ఇచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవికుమార్, డాక్టర్ శంకర్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు రూపొందించిన ట్లు ప్రిన్సిపాల్ బుచ్చయ్య తెలిపారు. విద్యార్థులు, పర్యవేక్షక ప్రొఫెసర్లను ప్రిన్సిపాల్, అధ్యాపకులు గురువారం అభినందించారు. -
ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలి
నిర్మల్ టౌన్: ఆర్టీసీ ఉద్యోగులు ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి సూచించారు. ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 5 వరకు ఉద్యోగులు డ్యూటీలో ఉన్నప్పుడు పాటించాల్సిన నియమాలు, నిబంధనలపై ప్రొజెక్టర్ ద్వారా తరగతులు నిర్వహించారు. గురువారం ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల్లో నైపుణ్యం, సృజనాత్మకతను పెంచడానికి ఈ తరగతులు ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగులు ఈ సంస్థను సొంత సంస్థగా భావించి పనిచేయాలని సూచించారు. అనంతరం ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, ఏఈ నవీన్కుమార్, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
బాసర ఆలయానికి రూ.2.50 లక్షల విరాళం
బాసర: బాసర శ్రీజ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలోని ఉచిత అన్నదాన సత్రంలో నూతన బాయిలర్ ఏర్పాటుకు ఓ భక్తుడు రూ.2.50 లక్షలు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. హైదరాబాద్ కు చెందిన వంగూరి గౌతమ్–కుసుమశ్రీ కుమారుడు రుద్రవిహాన్ కుటుంబ సభ్యులు గురువారం బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ మొదటి విడతగా బాయిలర్ మెషీన్ కోసం ఎస్ఎస్ ఫ్యాబ్రికేషన్ హైదరాబాద్ వారికి రూ.50 వేలు ఆలయ అధికారికి అందించారు. బాయిలర్ పనులు పూర్తయ్యాక పది రోజుల్లో మిగతా రూ.2 లక్షలు అందిస్తామని తెలిపారు. -
కేజీబీవీల్లో ‘పోలీస్ అక్క’
నిర్మల్టౌన్/కడెం/లక్ష్మణచాంద/లోకేశ్వరం/ కుంటాల: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు, బాలికల భద్రతకు ‘పోలీస్ అక్క’ పేరిట ఎస్పీ జానకీ షర్మిల సరికొత్త కార్యక్రమానికి శ్రీకా రం చుట్టారు. ప్రతీ నెలలో ఒకరోజు మహిళా కాని స్టేబుళ్లు ప్రభుత్వ బాలికల విద్యాసంస్థలను సందర్శించి హాస్టళ్లలో బస చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని 18 పాఠశాలల్లో దీనిని అమలు చేసేందు కు నిర్ణయించారు. ఒక్కో మహిళా కానిస్టేబుల్ ఒ క్కో పాఠశాలను దత్తత తీసుకుని ప్రతీ వారం పాఠశాలను సందర్శించేందుకు ప్లాన్ చేశారు. విద్యార్థిను ల మంచీచెడు తెలుసుకుని సైబర్ క్రైమ్, బ్యాడ్.. గుడ్ టచ్పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ విషయంపై బుధవారం సంబంధిత పోలీస్ అధికారులు, మహిళా కానిస్టేబుళ్లతో ఎస్పీ జూమ్ మీటింగ్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. కేజీబీవీల్లోని విద్యార్థినుల భద్రతను పర్యవేక్షించాలని, నెలకోసారైన పాఠశాలను సందర్శించాలని ఆదేశించారు. విద్యార్థినుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని, వారిలో మనోధైర్యం నింపాలని సూచించారు. మ హిళా దినోత్సవం సందర్భంగా కేజీబీవీల్లోని విద్యార్థినుల భద్రతకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలి పారు. 18 పాఠశాలలకు 18 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎప్పటికప్పుడు జూమ్ మీటింగ్ నిర్వహించి విద్యార్థినులు సమస్యలు ఎలా అధిగ మించాలో వివరిస్తామని చెప్పారు. వారి సమస్యలు అర్థం చేసుకుని కౌన్సిలింగ్ ఇస్తామని వివరించారు. జూమ్ మీటింగ్లో అదనపు ఎస్పీలు పాల్గొన్నారు. లక్ష్మణచాంద మండల కేంద్రంలో.. లక్ష్మణచాంద మండల కేంద్రంలోని కేజేబీవీలో ‘పోలీస్ అక్క’ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎస్సై సుమలత హాజరై మాట్లాడారు. ఎస్పీ ఆదేశాల మేరకు ‘బాలికల భద్రత–మా బాధ్యత’ నినా దంతో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కడెం మండల కేంద్రంలో.. మహిళలు, బాలికల సంరక్షణకు ఎస్పీ జానకీ షర్మి ల మహిళా దినోత్సవం రోజున ప్రారంభించనున్న ‘పోలీస్ అక్క’ కార్యక్రమంపై కడెం మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థినులకు పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థలు, పని ప్రదేశాల్లో మహిళా సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. లోకేశ్వరం మండల కేంద్రంలో.. లోకేశ్వరం మండల కేంద్రంలోని కేజీబీవీలో ‘పోలీస్ అక్క’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులకు బాలికల భద్రతపై మహిళా కానిస్టేబుల్ వినిత అవగాహన కల్పించారు. విద్యార్థినుల సమస్యలు తెలుసుకున్నారు. కుటుంబాల్లో ఎలాంటి సమస్యలున్నా పోలీసులకు తెలుపాలని సూచించారు. కుంటాల మండలం కల్లూరులో.. కుంటాల మండలం కల్లూరు గ్రామంలోని కేజీబీవీ లో ‘పోలీస్ అక్క’ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్సై భాస్కరాచారి బుధవారం రాత్రి బస చేశారు. మహిళల హక్కులపై విద్యార్థినులకు అవగాహన క ల్పించారు. ఇన్చార్జి ఎస్వో సంధ్యారాణి, కానిస్టేబు ల్ అశ్విని తదితరులు పాల్గొన్నారు. వినూత్న సేవలకు ఎస్పీ శ్రీకారం విద్యార్థినుల భద్రతకు భరోసా -
నిర్మల్
పక్షుల లెక్క తేలింది జన్నారం అటవీ డివిజన్లో నిర్వహించిన సర్వేలో అధికారులు 201 రకాల పక్షులను గుర్తించారు. 11 రకాల పక్షి జాతులు అంతరించిపోయే దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. గురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025ఎండిన పొలాల పరిశీలన కడెం: ఈనెల 5న ‘పంట తడికి.. కంటతడి’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా వ్యవసాయాధి కారి అంజిప్రసాద్ మండలంలోని కొత్త మద్దిపడగ, ఎలగడప గ్రామాల్లో సాగునీరు అందక ఎండిన పంట పొలాలను పరిశీలించారు. కలెక్టర్కు నివేదిక అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు. ఏవో దినేశ్, ఏఈవోలున్నారు.నిర్మల్చైన్గేట్: ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ సేవలు ఎంత అవసరమో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలతో పాటు ప్రతీ పనికి సాంకేతికత ముడిపడి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతీ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ–పాలన, ఇంటింటికీ తక్కువ ధరకే ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2017లో టీ–ఫైబర్ సేవలకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, బ్యాంకులు, రైతువేదికలు, ఇతర ప్రజాసేవల సంస్థలకు అధిక వేగంతో కూడిన ఇంటర్నెట్ సౌకర్యం అందించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా మిషన్ భగీరథ పథకం పైపులైన్లు నిర్మించే సమయంలో టీ–ఫైబర్ కేబుల్ వేశారు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లోనూ టీ–ఫైబర్ పరికరాలనూ అమర్చారు. అయితే ఇప్పటివరకు టీ–ఫైబర్ సేవలు అందుబాటులోకి రాలేదు. ఎన్నికల్లోపు అందుబాటులోకి వచ్చేనా? ప్రస్తుతం గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, నామినేషన్లు, ఎన్నికల నిర్వహణ, వి జేతల వివరాలు ఇలా ప్రక్రియ అంతా ఇంటర్నెట్ ద్వారానే నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామాల్లో సేవలు అందుబాటులో లేక మండల పరిషత్ కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాగా, గ్రామపంచాయతీల్లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించకముందే విద్యుత్ సౌకర్యం కోసం మీటర్లు బిగించారు. దీంతో పంచాయతీల్లో రూ.వేలల్లో బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. సేవల మాటేమో గాని బిల్లుల మోత తప్పడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి గ్రామపంచాయతీ కార్యాలయాల్లో టీ–ఫైబర్ సేవలు అందుబాటులోకి తేవాలని గ్రామీణ ప్రజలు కోరుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తాం జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో టీ–ఫైబర్కు సంబంధించిన పరికరాలు బిగించి విద్యుత్ కనెక్షన్లూ ఇచ్చారు. వాటి నుంచి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలకు డిజిటల్ సేవలు అందడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. డిజిటల్ సేవలు అందుబాటులోకి వస్తే పనులు సులభతరమవుతాయి. – శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి న్యూస్రీల్కార్డుల జారీ ప్రక్రియ చేపట్టాలి నిర్మల్చైన్గేట్: ప్రత్యేక వైకల్య గుర్తింపు (సదరం) కార్డుల జారీ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఈ ప్రక్రియపై కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశమై కార్డులు జారీ చేసే క్రమంలో వైద్య బృందానికి అవసరమైన పరికరాలు, సిబ్బంది తది తర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యూడీఐడీ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేలా దివ్యాంగులకు అవగాహన కల్పించాలని సూచించారు. 21 రకాల వైకల్యం కలిగినవారు యూడీఐడీ కార్డు పొందవచ్చని తెలిపారు. గతంలో సదరం ధ్రువీకరణ పత్రం కలిగినవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, వైద్యారోగ్యశాఖ అధికారులు గోపాల్, సునీల్, సురేశ్, డీపీఎం శోభారాణి తదితరులు పాల్గొన్నారు. జాడలేని ఈ–పాలన అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు, నిధుల కేటాయింపు, ఆదాయం, వ్యయాలు, జీతభత్యాలు, జనన, మరణ ధ్రువపత్రాల జారీ, ఇంటి పన్ను తదితర సేవలను గ్రామపంచాయతీల పరిధిలోని ప్రజలకు డిజిటల్ రూపంలో అందించాలన్నది ప్రధాన ఉద్దేశం. జిల్లావ్యాప్తంగా 396 గ్రామపంచాయతీలుండగా.. సుమారు 36మంది ఈ–పంచాయతీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో టీ–ఫైబర్ కేబుల్, పరికరాలు బిగించారు. విద్యుత్ సౌకర్యం కోసం సోలార్ ప్లేట్లు, ఇన్వర్టర్ బ్యాటరీలు అమర్చారు. సాంకేతిక సిబ్బంది పంచాయతీలకు వచ్చి టెస్టింగ్ కూడా నిర్వహించారు. క్లస్టర్ల వారీగా ఈ–పంచాయతీ ఆపరేటర్లను నియమించారు. కంప్యూటర్లు, ప్రింటర్లు అందించారు. అయితే పంచాయతీల్లో ఆన్లైన్ సౌకర్యం అందుబాటులోకి రాక ఈ–పాలన అమలులోకి రాలేదు. దీంతో చాలామంది ఈ–పంచాయతీ ఆపరేటర్లు మండల పరిషత్ కార్యాలయాల్లోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం గ్రామపంచాయతీ కార్యాలయాల్లో టీ–ఫైబర్ పరికరాలు నిరుపయోగమయ్యాయి. పంచాయతీ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు ప్రజలకు డిజిటల్ సేవలు అందించాలన్న సర్కారు లక్ష్యం నెరవేరడం లేదు. గ్రామపంచాయతీల పరిధిలో ప్రభుత్వ పథకాల్లో ఏమైనా అవాంతరాలుంటే లబ్ధిదారులు మండల పరిషత్ కార్యాలయాలకు వచ్చి వాకబు చేయాల్సి వస్తోంది. పన్నులు, ఇతర రుసుములు చెల్లిస్తున్న వారికి పంచాయతీ కార్యదర్శులు చేతి రాత రశీదులే ఇస్తున్నారు ఇంటర్నెట్ లేక సౌకర్యం లేక మరుగున పడిన ఈ–పాలన నిరుపయోగమైన పరికరాలు ఏ పనికై నా మండల కేంద్రానికే.. డిజిటల్ సేవలు అందేదెన్నడో! సోన్ మండలం న్యూవెల్మల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో టీ–ఫైబర్ నెట్ పరికరాలు ఇలా వృథాగా పడి ఉన్నాయి. గ్రామపంచాయతీ కార్యాలయం వరకు కేబుల్ వైర్ వేసి ఫైబర్ నెట్ పరికరాలు బిగించినా కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో కొన్నేళ్లుగా పరికరాలు ఇలా నిరుపయోగమయ్యాయి. జిల్లాలో ఫైబర్ పథకం పనుల అమలు తీరుకు ఇదొక నిదర్శనం. -
వందశాతం పూర్తి చేయాలి
నిర్మల్చైన్గేట్: ఇంటిపన్ను వసూళ్లను వందశాతం పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గృహ, వాణిజ్య పన్నుల వసూలు, శానిటేషన్ తదిత ర అంశాలపై మున్సిపల్ అధికారులతో ఆయన స మావేశం నిర్వహించారు. ఇప్పటివరకు వసూలు చే సిన పన్నులు, బకాయిలకు సంబంధించి మున్సిపాలిటీల వారీగా వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకాలంలో పన్నులు చెల్లించనివారికి రెడ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. పన్నుల వసూళ్లలో నిర్లక్షం చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాపారులు తప్పనిసరిగా వాణిజ్య లైసెన్స్లను పునరుద్ధరించుకునేలా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ భవన సముదాయాల్లో వ్యా పారం నిర్వహించుకుంటున్న వ్యాపారుల నుంచి వెంటనే అద్దె వసూలు చేయాలని సూచించారు. బ కాయిలు పేరుకుపోయిన దుకాణాలను సీజ్ చేయాలని ఆదేశించారు. శానిటేషన్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని సూచించారు. సమావేశంలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్గౌడ్, రాజేశ్కుమార్, జాదవ్ కృష్ణ, మెప్మా పీడీ సుభాష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పట్టభద్రుల సీటూ కమలానిదే!
● గ్రాడ్యుయేట్లోనూ బీజేపీ హవా ● అధిక ఓట్లతో గెలిచిన అంజిరెడ్డి ● మూడు రోజులు సాగిన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ● ముగ్గురికే 92.52శాతం ఓట్లు సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, పెద్దపల్లి: కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించారు. మూడు రోజులపాటు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో ఎలిమినేషన్ రౌండ్లతో బీజేపీ గెలుపు ఖరారైంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గెలుపునకు సరి పడా కోటా ఓట్లు రాకపోయినా అంజిరెడ్డికి అత్యధి క ఓట్లు రావడంతో ఆయననే విజేతగా ప్రకటించా రు. చివరి వరకు హోరాహోరీగా పోరాడిన కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ విజయం సాధించడంతో శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. సుదీర్ఘంగా సాగిన కౌంటింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫిబ్రవరి 27న జరగ్గా, మార్చి 3న కౌంటింగ్ ప్రారంభించారు. మూడు రోజులపాటు నిర్విరామంగా మూడు షిఫ్టుల్లో 800మంది కౌంటింగ్ సిబ్బంది కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో 21 టేబుళ్లపై లెక్కింపు పక్రియ చేపట్టారు. సోమవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు, మంగళవారం మధ్యాహ్నం వరకు చెల్లని ఓట్లను వడపోసి, కట్టలు కట్టారు. మంగళవారం రాత్రి నుంచి మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు చేపట్టి బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి ఎలిమినేషన్ రౌండ్లను ప్రారంభించారు. ఎలిమినేషన్ రౌండ్లలో బరిలో ఉన్న 54మందిలో తక్కువ ఓట్లు కలిగి ఉన్న వారిని ఒక్కొక్కరిగా తొలగిస్తూ, వారికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను మిగతా అభ్యర్థులకు పంచుతూ కౌంటింగ్ పక్రియను మూడు రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగించారు. ముగ్గురికే 92.52శాతం ఓట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. చెల్లుబాటైన ఓట్లలో 92.52శాతం (2,06,659) మొదటి ప్రాధాన్యత ఓట్లు ఈ ముగ్గురు అభ్యర్థులకే వచ్చాయి. మిగతా 53మంది స్వతంత్ర అభ్యర్థులు 16,684 ఓట్లు మాత్రమే సాధించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద సంబురాల్లో విక్టరీ సింబల్ చూపుతున్న కేంద్ర మంత్రి సంజయ్, ఎమ్మెల్సీ విజేత అంజిరెడ్డిరెండో ప్రాధాన్యత ఓట్లలోనూ బీజేపీదే హవా నిర్ధారిత కోటా ఓట్ల కోసం అభ్యర్థుల ఎలిమినేషన్ పక్రియ చేపట్టగా అందులోనూ బీజేపీ అభ్యర్థి ఆధిక్యం చూపారు. తొలుత 53మందిని ఎలిమినేషన్ చేసి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా బీజేపీ అభ్యర్థికి 78,635 ఓట్లు, కాంగ్రెస్కు 73,644 ఓట్లు, బీఎస్పీకి 63,404 ఓట్లు వచ్చాయి. 53మందిని ఎలిమినేషన్ చేసినా.. కోటా ఓట్లను ఎవరూ సాధించకపోవడంతో మూడో స్థానంలోని బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను ఎలిమినేట్ చేశారు. ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు బీఎస్పీ అభ్యర్థికి పోలైన ఓట్లలో చాలామంది రెండో ప్రాధాన్యత ఓటును అంజిరెడ్డికే వేయడంతో అతడినే విజయం వరించింది. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలిస్తున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ -
చట్టాలపై అవగాహన
నిర్మల్చైన్గేట్: బేటీ బచావో.. బీటీ పడావో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అ హ్మద్ బుధవారం పలువురు డిగ్రీ కళాశాల వి ద్యార్థినులతో సమావేశమై చట్టాలపై అవగాహ న కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. బేటీ బచావో.. బేటీ పడావో దశాబ్ది ఉత్సవాలను జనవరి 22నుంచి మార్చి 8వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ హెల్ప్లైన్ నంబర్లు 100, 1098,181, 1930, బాల్య వివాహ నిర్మూలన చట్టం–2006, బాలికలు, మహిళల హక్కులు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏసీడీపీవో నాగలక్ష్మి, మిషన్ శక్తి సమన్వయకర్త సవిత, మిషన్ శక్తి బృందం సభ్యులు, విద్యార్థినులు, అధ్యాపకులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అవగాహన కల్పిస్తున్న ఫైజాన్ అహ్మద్ -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
నిర్మల్ రూరల్: జిల్లాలో బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఫస్టియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష కొనసాగింది. ఈసారి విద్యార్థులకు ఐదు నిమిషాలు వెసులుబాటు కల్పించినా దాదాపు గంట ముందే పరీక్షాకేంద్రాలకు చేరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 23 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేయగా, 6,944 మంది విద్యార్థులకు గాను 6,510 మంది హాజరయ్యారు. 434మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కేటగిరీలో 621మంది విద్యార్థులకు 539 మంది హాజరయ్యారు. 82మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ కేటగిరీలో 6,323 మంది విద్యార్థులకు గాను 5,971 మంది హాజరయ్యారు. 352 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో పరశురాం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికలు, బాలుర పరీక్షా కేంద్రాలను కలెక్టర్ అభిలాష అభినవ్, ఏఎస్పీ ఉపేందర్రెడ్డి వేర్వేరుగా పరిశీలించారు. గురువారం నుంచి సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థిని సెంటర్కు చేర్చిన ఎస్సై ముధోల్: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షాకేంద్రంలో ఇంటర్ పరీక్షలకు హాజరు కావాల్సిన ఓ విద్యార్థి పొరపాటున గురుకుల పాఠశాలకు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక పొరపాటు తెలుసుకుని జూనియర్ కళాశాలకు వెళ్లేందుకు పరుగులు పెట్టాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న స్థానిక ఎస్సై సంజీవ్ గమనించి ఆ విద్యార్థిని తన వాహనంలో సకాలంలో సెంటర్కు చేర్చాడు. దీంతో ఎస్సైని పలువురు అభినందించారు. 6,944 మంది విద్యార్థులకు 6,510 మంది హాజరు పరీక్షాకేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్ -
ఇంటిపన్ను వసూలు చేయాలి
లోకేశ్వరం: వందశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని డీపీవో శ్రీనివాస్ సూచించారు. బుధవారం మండలంలోని మన్మద్, రాజూర గ్రామాల్లోని సెగ్రిగేషన్ షెడ్, నర్సరీ, డ్రైనేజీ లు, రోడ్లు పరిశీలించారు. ఈ సందర్భంగా డీ పీవో మాట్లాడుతూ.. నర్సరీలో పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించాలని సూచించారు. ఇంటింటా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని తెలిపారు. సెగ్రిగేషన్ షెడ్లో సేంద్రియ ఎరువు తయారు చేయాలని సూచించారు. గ్రా మాల్లో పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టాల ని తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో నిర్వహించే రికార్డులను పరిశీలించి ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయ న వెంట ఎంపీడీవో వెంకటరమేశ్, ఈవోపీఆర్డీ సోలమాన్రాజ్, సెక్రటరీ మహేశ్ ఉన్నారు. -
పకడ్బందీగా ‘పది’ పరీక్షలు
● డీఈవో రామారావు సోన్: పదో తరగతి వార్షిక పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహిస్తామని డీఈవో రామారావు తెలిపారు. మండలంలోని కడ్తాల్ ఉన్నత పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. పదో తరగతికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఇంగ్లిష్ పీరియడ్ను పరిశీలించారు. గ్రాండ్ టెస్టు మార్కుల ఆధారంగా విద్యార్థులను పిలిచి అన్ని విషయాల్లో వారి ప్రగతిని పరిశీలించారు. గణితం, ఆంగ్లంలో మంచి మార్కులు పొందాలంటే ఇంకా కష్టపడాలని సూచించారు. పరీక్షల వరకు విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా రావాలని సూచించారు. పదో తరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఉండదని, పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులు కష్టపడి చదవాలన్నారు. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. డీఈవో వెంట హెచ్ఎం వెంకటేశ్వర్, పరీక్షల సహాయ కార్యదర్శి భానుమూర్తి, ఆంగ్ల ఉపాధ్యాయురాలు శైలజ ఉన్నారు. -
పకడ్బందీగా ‘బాలశక్తి’
నిర్మల్టౌన్: బాలశక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా కొనసాగించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బాలశక్తి నిర్వహణపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య, ఆర్థిక, సామాజిక సామర్థ్యాలు, నైపుణ్యాలు పెంపునకు అమలుపరుస్తున్న బాలశక్తి కార్యక్రమాన్ని మెరుగ్గా అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిరంతరం కొనసాగించాలని వైద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షలు నిర్వహించిన విద్యార్థులందరికీ హెల్త్ కార్డులు అందించాలని సూచించారు. అనారోగ్య సమస్యలను గుర్తిస్తే ప్రత్యేక పోషక ఆహారం, మందులను అందించాలని తెలిపారు. పోషకులతో సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్య స్థితిగతుల వివరాలను తెలియజేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. పరీక్షలపై భయాన్ని తొలగించేలా, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేలా మానసిక వైద్య నిపుణులతో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వేసవి దృష్ట్యా పాఠశాలల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఈవో రామారావు, డీఎంహెచ్వో రాజేందర్, గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్గోపాల్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ -
ఆర్జీయూకేటీ అధ్యాపకురాలికి డాక్టరేట్
బాసర: ఆర్జీయూకేటీ బాసరలో ఈసీఈ విభాగంలో అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకురాలు డాక్టర్ ఆర్.పద్మశ్రీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకుంది. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ డాక్టరేట్ పొందిన పద్మశ్రీకి అభినందనలు తెలిపారు. వర్సిటీలో ఇప్పటికే చాలామంది డాక్టరేట్ పొందారని తెలిపారు. దీంతో పరిశోధనా రంగంలోనూ నాణ్యమైన విద్యను అందించడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. పద్మశ్రీ ‘సేవల నాణ్యతను మెరుగుపరచడానికి ఎంఐఎంఓ డిటెక్టర్ల పనితీరు విశ్లేషణ 6 జీహెచ్జెడ్/ఎంఎం వేవ్ నెట్వర్క్లలో అప్లింక్ డౌన్లింక్ను డీకప్లింగ్ చేయడం‘ అనే అంశంపై చేసిన పరిశోధనకు డాక్టరేట్ అందుకున్నారు. ఈసీఈ విభాగం ప్రొఫెసర్ బి.రాజేందర్నాయక్ పర్యవేక్షణలో పరిశోధన పూర్తిచేశారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పలు పరిశోధనా పత్రాలను ప్రచురించారు. -
బీజేపీలో జోష్
మరో సీటుపై ఉత్కంఠ మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి గత రెండు రోజులుగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరిక్రిష్ణ మధ్య పోటీ కనిపిస్తోంది. అభ్యర్థులు, ఓట్లు ఎక్కువగా ఉండడంతో లెక్కింపు నెమ్మదిగా సాగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నడుస్తోంది. బీజేపీ అభ్యర్థి మంగళవారం సాయంత్రం వరకు ముందంజలో ఉన్నారు. ఏ అభ్యర్థి గెలుస్తారనేది బుధవారం స్పష్టత రానుంది. ఓట్ల లెక్కింపులో ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థుల తొలగింపు ప్రక్రియ మొదలైతే తుది విజేత ఎవరనేది తేలాల్సి ఉంది. బీజేపీ శ్రేణులు తమ అభ్యర్థి గెలుస్తారనే ధీమాలో ఉన్నారు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కమలనాథుల్లో జోష్ నింపింది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాన్ని కై వసం చేసుకోవడం ఆ పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎమ్మెల్సీ పోరులో నువ్వా నేనా అన్నట్లు తలపడగా.. బీజేపీ బలపర్చిన అభ్యర్థి మల్క కొమురయ్యకే టీచర్లు పట్టం కట్టారు. ఉమ్మడి జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా నాలుగు ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లోనూ ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకుని మరోసారి సత్తా చాటింది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ల మద్దతుతో ఓ సీటులో విజయం సాధించింది. దీంతో ఉత్తర తెలంగాణలో కీలకమైన ఎమ్మెల్సీ సైతం ఆ పార్టీ ఖాతాలో చేరింది. ఉమ్మడి జిల్లాలో గత రెండేళ్లుగా బీజేపీ అనుకూల పవనాలే వీస్తున్నాయి. దీంతో భవిష్యత్లో తమ పార్టీ బలపడుతుందనే సంకేతాలు వస్తున్నాయని కేడర్లో ఉత్సాహం నెలకొంది. గత కొంతకాలంగా పార్టీ పుంజుకోవడంపై ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పాగా వేయాలనుకున్న పార్టీ సీనియర్లకు ఊరట కలుగుతోంది. మరోవైపు తాజా ఎన్నికలతో యువత, టీచర్లు, విద్యావంతులు బీజేపీ వైపు ఉన్నారని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. కలిసొచ్చిన ఆత్మీయ సమ్మేళనాలు శాసనమండలి ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మొదటి నుంచి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. పట్టభద్రులు, టీచర్ల స్థానానికి బరిలో దింపి స్థానిక నాయకులపైనే భారం వేసింది. కార్పొరేట్ వ్యక్తులుగా ప్రచారం జరిగినా మల్క కొమురయ్య, పట్టభద్రుల స్థానానికి అంజిరెడ్డికి సానుకూలత పెరిగింది. పట్టణాలు, నియోజకవర్గాల్లో ఓటర్లను అధిక సంఖ్యలో రప్పించి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం గెలుపునకు దోహదం చేశాయి. ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించి ప్రచారం చేపట్టారు. వచ్చే స్థానిక సంస్థల్లోనూ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే కొత్త జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామాలు, బూత్ స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. పట్టణాలకే పరిమితమైన ఓటు బ్యాంకును గ్రామాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లా నుంచి నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్ స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేలు సైతం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాషాయ పార్టీ బలపడేందుకు సరైన సమయం వచ్చిందని కార్యకర్తలు భావిస్తున్నారు. ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన పార్టీ ఇక గ్రామ స్థాయిలోనూ విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఫలితాలతో నాయకులకు ఊరట పట్టభద్రుల స్థానంలోనూ గెలుస్తామనే ధీమా ఉమ్మడి జిల్లా పార్టీ కేడర్లో ఉత్సాహం -
వీడని ఉత్కంఠ
తేలని ఫలితంసాక్షి,పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్– ఆదిలాబాద్– మెదక్– నిజా మాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలి తం ఉత్కంఠ రేపుతోంది. కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన కౌంటింగ్లో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు పోటాపోటీగా ఓట్లు సాధించారు. ఎవ రూ నేరుగా కోటా ఓట్లు చేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లపై ఆసక్తి నెల కొంది. మొత్తం చెల్లుబాటైన ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా ఫలి తం తేలనుంది. దీంతో ట్రయాంగిల్గా సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోరు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. త్రిముఖ పోటీ.. పట్టభద్రుల ఎమ్మెల్సీగా 56 మంది అభ్యర్థులు పోటీపడినా.. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ విస్తృత ప్రచారం చేశారు. దానికి అనుగుణంగానే ఈ ముగ్గురికి పోటాపోటీగా ఓట్లు వ చ్చాయి. 6వ రౌండ్ పూర్తయ్యే సమయానికి బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు ముగ్గురు సుమారు లక్ష ఓట్లు, బరిలో నిలిచిన 53 మంది కలిపి కేవలం 10వేల లోపు ఓట్లు మాత్రమే సాధించారు. దీంతో మూడోస్థానంలో నిలిచే అభ్యర్థి ఎవరనేదానిపై ఎమ్మెల్సీ ఫలితం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎవరికీ దక్కని విన్నింగ్ కోటా ఓట్లు పోస్టల్ ఓట్లతో కలిసి మొత్తం 2,52,100 ఓట్లు పోలవగా, అందులో సుమారు 28 వేల ఓట్లు చెల్లనివిగా అధికారులు నిర్ధారించారు. చెల్లనిఓట్లు పోగా మిగిలిన 2,24,000 ఓట్లలో సగం ఓట్లు.. అంటే.. 1,12,001 (సుమారు) ఓట్లను విన్నింగ్ కోటా ఓట్లుగా నిర్ధారించారు. పోటీలో ఉన్న ఒక్కో అభ్యర్థి నేరుగా కోటా ఓట్లను సాధించే పరిస్థితి కానరావడం లేదు. దీంతో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ చేస్తూ రెండోప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలనుంది. ఈ ప్రక్రియ పూర్తిచేసి ఫలితం తేలేందుకు బుధవారం రాత్రి వరకూ సమయం పట్టే అవకాశం ఉందని అంచనా. ప్రతీ రౌండ్లో బీజేపీకే ఆధిక్యం మొత్తం 21 టేబుళ్ల ద్వారా 12 రౌండల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థిపై 36 ఓట్ల మెజార్టీ వచ్చింది. రెండోరౌండ్లో 1,457 ఓట్ల మెజార్టీ, మూడోరౌండ్లో 3,005 ఓట్లు, నాలుగో రౌండ్లో 1,263 ఓట్లు, ఐదోరౌండ్లో 1,381 ఓట్ల మెజార్టీ వచ్చింది. 6వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి బీజేపీ అభ్యర్థిపై 211 ఓట్ల మెజార్టీ సాధించారు. మొత్తంగా మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు 45,401 ఓట్లు సాధించి, ప్రత్యర్థులపై 6,931 ఓట్ల మెజార్టీతో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు. 38,470 ఓట్లతో నరేందర్రెడ్డి సెకండ్ ప్లేస్లో, 3,1481 ఓట్లతో ప్రసన్నహరికృష్ణ మూడోస్థానంలో నిలిచారు. మందకొడిగా సాగుతున్న కౌంటింగ్ ప్రక్రియకు తోడు పోటాపోటీగా అభ్యర్థులు ఓట్లు సాధిస్తుండటంతో రౌండ్ రౌండ్కూ ఉత్కంఠ పెరుగుతోంది. రెండోప్రాధాన్యత ఓట్లపైనే బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. ‘గ్రాడ్యుయేట్’ పోటీ త్రిముఖం కోటా ఓట్ల మార్కును చేరుకోని అభ్యర్థులు ఎలిమినేషన్తో తేలనున్న ఫలితం ప్రస్తుతం ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కౌంటింగ్ వివరాలు: మొత్తం ఓట్లు(పోస్టల్ ఓట్లతో కలిపి) 2,52,100 చెల్లని ఓట్లు : 28,000(11.01శాతం) చెల్లుబాటైనవి : 2,24,000 విన్నింగ్ కోటా ఓట్లు 1,12,001(సుమారు) బరిలో నిలిచిన అభ్యర్థులు : 56 -
నిర్మల్
ఆర్జీయుకేటీలో ‘కథక్’ శిబిరం ఆర్జీయుకేటీలో ఐదు రోజుల కథక్ నృత్య శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన ఆర్తి శంకర్, రచన శిక్షణ ఇవ్వనున్నారు. బుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 20258లోu సైబర్ క్రైమ్పై అవగాహన ఉండాలి ● ఎస్పీ జానకీషర్మిల నిర్మల్టౌన్: సైబర్ నేరాలపై మహిళలు కూడా అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. సైబర్ మోసగాళ్లు వర్క్ఫ్రం హోం అని, ఆకట్టుకునే వేతనాలని, పార్ట్ టైం జాబులు అని, మహిళలు, గృహిణులను ఆకర్షిస్తున్నారని తెలిపారు. యాప్లు డౌన్లోడ్ చేయించి, ఫోన్లను హ్యాక్ చేస్తారని పేర్కొన్నారు. మహిళల వ్యక్తిగత వివరాలు సేకరించి, వాటిని చూపించి, భయపెట్టి సైబర్ మోసాలకు పాల్పడే అవకాశం ఉందని వివరించారు. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, గూగుల్ అకౌంట్ల వివరాలు ఎవరికీ ఇవ్వొద్దని సూచించారు. మీ అకౌంట్లకు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలని తెలిపారు. సైబర్ మోసం బారిన పడితే వెంటనే 1930 నంబర్కు కాల్చేసి సమాచారం అందించాలని సూచించారు. ఈనెల 8న మహిళా దినోత్సవం పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఇందులో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రమణారావు, ఆర్ఎస్ఐ రవికుమార్ పాల్గొన్నారు. కడెం: అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి.. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు కళ్లెదుటే ఎండిపోతున్నాయి. సదర్మట్ చివరి ఆయకట్టు వరకు సాగునీరందక కడెం మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటలు ఎండిపోతున్నాయి. నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం కనీసం స్పందించడం లేదు. దీంతో నెర్రెలు బారిన పంటను చూసి రైతులు యాసంగిపై ఆశలు వదులుకుంటున్నారు. వారబందీ పద్ధతిలో.. సదర్మట్ కాలువ ద్వారా కడెం మండలం లింగాపూర్, మాసాయిపేట్, నచ్చన్ఎల్లాపూర్, పెత్తర్పు, ధర్మాజీపేట్, కొత్త మద్దిపడగ, పాత మద్దిపడగ, పె ద్దూర్ తండా, వకీల్నగర్, చిట్యాల్, తదితర గ్రా మల్లోని 5 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. లక్ష్మ ణాచాంద మండలం వడ్యాల్ వద్ద సరస్వతి కెనాల్ నుంచి సదర్మట్కు వారబందీ పద్దతిన 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఖానాపూర్, క డెం మండలాల ఆయకట్టుకు ఈ నీరే అందాలి. అ యితే చివరి వరకు నీరు అందకపోవడంతో పొలా లు ఎండిపోతున్నాయి. కాలువ నీరు రాకపోవడం, వ్యవసాయ బావుల్లో నీళ్లు అడుగంటడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. బావుల్లో నీరు పది నిమి షాలు కూడా మోటార్ నుంచి రావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. సదర్మట్ కాలువ ద్వారా వ స్తున్న నీటితో కడెం ప్రాజెక్ట్కు ఫీడింగ్ చేయడం, నీ టి పారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతోనే చివరి ఆయకట్టుకు నీరందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. న్యూస్రీల్ సదర్మట్ ఆయకట్టుకు అందని సాగునీరు నెర్రెలు బారుతున్న పొలాలు పట్టించుకోని ఇరిగేషన్ అధికారులుఈచిత్రంలో కనిపిస్తున్న రైతు కడెం మండలం కొత్తమద్దిపడగ గ్రామానికి చెందిన అంకంపేట భూమన్న. సదర్మట్ కాలువ ద్వారా సాగు నీరిస్తామని అధికారులు చెప్పడంతో యాసంగిలో ఎకరంనరలో వరి సాగు చేశాడు. నెల రోజులుగా సాగునీరు అందకపోవడంతో వ్యవసాయ బావి నుంచి కొంతమేర నీరు అందించాడు. ఇప్పుడు బావిలో నీళ్లు కూడా అడుగంటాయి. కాలువ నీళ్లు రాక, బావిలో నీళ్లు లేక పంటపై ఆశలు వదులుకున్నాడు. ఇటీవలే గొర్రెలను మేపాడు. -
కరీంనగర్ తరలిన ఉపాధ్యాయ సంఘాల నేతలు
నిర్మల్ఖిల్లా: కరీంనగర్–ఆదిలాబాద్–మెదక్–నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నిర్మల్ జిల్లాలో హోరాహోరీ పోరు సాగింది. పోలింగ్ రోజునే ఉపాధ్యాయుల నిర్ణయం నిక్షిప్తమై ఉండగా, కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోమవారం కౌంటింగ్ ప్రారంభమైంది. జిల్లాలోని ప్రధాన ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఆయా అభ్యర్థుల మద్దతుదారులు పలువురు కరీంనగర్ బయలుదేరి వెళ్లారు. మరికొందరు టీవీల్లో అప్డేట్ తెలుసుకుంటున్నారు. బీజేపీ మద్దతుతో మల్క కొమరయ్య బరిలో ఉండగా, తపస్ మద్దతు ప్రకటించింది. మరోవైపు ప్రధాన ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూటీఎస్ తరఫున బరిలో ఉన్న వంగా మహేందర్రెడ్డి సైతం గట్టి పోటీ ఇచ్చారు. జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు యాటకారి సాయన్న వీఆర్ఎస్ ప్రకటించి బీఎస్పీ మద్దతుతో పోటీలో నిలిచారు. జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ సంఘాల నేతలు కరీంనగర్లోని కౌటింగ్ కేంద్రాల వద్ద సందడి చేస్తూ ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో అప్డేట్ సమాచారం చేరవేస్తున్నారు. -
వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు
8, 9 తరగతుల బాలికలకు నిర్మల్ రూరల్: బేటీ బచావో – బేటీ పడావో దశాబ్ది వేడుకల్లో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9 తరగతుల బాలికలకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో రామారా వు తెలిపారు. ఈనెల 4న పాఠశాలస్థాయిలో పోటీలు నిర్వహించి, ప్రథమ, ద్వితీయ స్థానంలో గెలు పొందిన బాలికలు 5న మండల స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొనాలని సూచించారు. మండ ల స్థాయిలో ప్రథమ, ద్వితీయస్థానాలు పొందిన బాలికలు 6న ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గల గవర్నమెంట్ హైస్కూల్లో జరిగే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనాలన్నారు. విజేతలకు ఈనెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేస్తారని తెలిపారు. వివరాలకు 9440069830 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
పెళ్లిబరాత్లో గొడవ..
● యువకుడి కణతలో కత్తిపోటునిర్మల్రూరల్: పెళ్లిబరాత్లో డ్యాన్స్ చేస్తుండగా జరిగిన గొడవ కత్తిపోటుకు దారితీసింది. ఈ ఘటన నిర్మల్రూరల్ మండలం రత్నాపూర్ కాలనీ తండాలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఏఎస్పీ రాజేశ్మీనా సోమవారం రాత్రి వివరాలు వెల్లడించారు. మండలంలోని రత్నాపూర్ కాలనీ తండాలో ఆదివారం ఓ పెళ్లి జరిగింది. రాత్రి 8 గంటల సమయంలో బరాత్ జరుగుతుండగా, గ్రామానికి చెందిన మలావత్ రాజు, పక్క గ్రామం రత్నాపూర్కాండ్లీ నుంచి సులిగెల శ్రీకర్కూడా బరాత్కు వచ్చాడు. రాజు, శ్రీకర్ కలిసి కాసేపు డ్యాన్స్ చేశారు. ఈ క్రమంలో మద్యం తాగి ఉన్న రాజు డ్యాన్స్ చేస్తూ శ్రీకర్పై పడ్డాడు. దీంతో ‘మద్యం తాగి ఎందుకు డాన్స్ చేస్తున్నావ్....? ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని గట్టిగా అరిచాడు. దీనిని అవమానంగా భావించిన రాజు అక్కడి నుండి వెళ్లిపోయాడు. బరాత్ పూర్తి అయిన తర్వాత అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో శ్రీకర్ తన స్నేహితులు కలిసి మోటార్ బైక్పై ఇంటికి వెళ్తుండగా.. మలావత్ రాజు అడ్డుకున్నాడు. జేబులో ఉన్న కత్తితో కణత భాగంలో పొడిచాడు. ఈ ఘటనలో శ్రీకర్ కన్ను, కుడిచెవి మధ్యభాగంలో ఇరుక్కుపోయింది. అతని స్నేహితులు వెంటనే బైక్పై జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడు రాజును సోమవారం సాయంత్రం అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఏఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ ఎస్సై లింబాద్రి ఉన్నారు. -
బాలాజీకి డాక్టరేట్
భైంసారూరల్: మండలంలోని ఇలేగాం గ్రామానికి చెందిన కవి, రచయిత రెడ్ల బాలాజీకి ప్రముఖ కవి, రచయిత డాక్టర్ దూడపాక శ్రీధర్ డాక్టరేట్ ప్రదానం చేశారు. హైదరాబాద్, రవీంద్ర భారతిలో శ్రీఆర్యాణి సకల కళా వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ ఉగాది పురస్కారం, జాతీయ విశ్వశాంతి పురస్కారం, బంగారు పతాకం వంటి పురస్కారాలతోపాటు, డేస్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, ఇంగ్లాండ్ తరఫున బాలాజీకి ప్రతిష్టాత్మక పురస్కారాలు, డాక్టరేట్ అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కవులు, రచయితలు, సాహితీ ప్రియులు బాలాజీనిఅభినందించారు. -
‘పది’ పరీక్షల్లో నూతన విధానం
లక్ష్మణచాంద: పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం సమూల మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగానే మొదట ఇప్పటి వరకు ఉన్న గ్రేడింగ్ విధానాన్ని జీపీఏ(గ్రేడింగ్) విధానాన్ని రద్దుచేసి పూర్వ పద్ధతిలో మార్కులు విధానం అమల్లోకి తెచ్చింది. మరోవైపు పరీక్షల జవాబు పత్రాలను బుక్లెట్ రూపంలో ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కో బుక్లెట్లో 24 పేజీలు ఉంటాయి. విద్యార్థులకు సరిపడా బుక్లెట్లు జిల్లాకు చేరుకుంటున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. వార్షిక పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. జిల్లాలో మొత్తం 47 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 9,127 విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 24 పేజీల బుక్ లెట్.. ● గతంలో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల సమయంలో ప్రశ్నాపత్రం ఓఎంఆర్ షీట్తోపాటు జవాబులు రాసేందుకు నాలుగు పేజీల బుక్లెట్ ఇచ్చేవారు. అందులో రాయడం పూర్తి అయిన తర్వాత విద్యార్థుల అవసరం మేరకు అడిషనల్ షీట్లు ఇ చ్చేవారు. ఈసారి అడిషనల్ షీట్స్కు బదులు గా 24 పేజీలతో కూడిన బుక్ లేట్ను విద్యార్థులకు అందజేయనున్నారు. సమాధానాలన్నీ ఆ బుక్లెట్లోనే రాయాల్సి ఉంటుంది. జిల్లాలో మూడు చోట్ల... పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల సందర్భంగా అందజేసే 24 పేజీలు కలిగిన బుక్లెట్లు జిల్లా కేంద్రాలకు చేరుకుంటున్నాయి. వీటిని భద్రపరిచేందుకు జిల్లాలో మూడు స్టేషనరీ రిసీవింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. నిర్మల్, ఖానాపూర్, భైంసాలో మూడు రిసీవింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్షల సమయంలో చీఫ్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఈ రిసీవింగ్ సెంటర్ల నుంచి ప్రశ్నపత్రాలతోపాటు ఆన్సర్ బుక్లెట్లను పరీక్ష కేంద్రాలకు తరలించనున్నారు. ప్రభుత్వం నిర్ణయం మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో సంస్కరణలు చేసింది. ఇందులో భాగంగానే గ్రేడింగ్ విధానాన్ని రద్దుచేసింది. అడిషనల్ షీట్స్కు బదులుగా 24 పేజీలతో కూడిన బుక్లెట్ అందజేస్తుంది. ప్రభుత్వ సూచనల మేరకు పరీక్షల నిర్వహణకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. – రామారావు, డీఈవో అడిషనల్ పేపర్లకు బదులుగా 24 పేజీల బుక్లెట్ జిల్లాలో మూడు రిసీవింగ్ కేంద్రాల ఏర్పాటు జిల్లా సమాచారం... మొత్తం ఉన్నత పాఠశాలలు 235 మొత్తం పరీక్ష కేంద్రాలు 47 మొత్తం పది విద్యార్థులు 9127 -
ఆయిల్పామ్ రైతులు ఆందోళన చెందొద్దు
నిర్మల్ఖిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయిల్పామ్ విస్తీర్ణ పథకంలో భాగంగా జిల్లాలో మూడేళ్లుగా ఆయిల్పామ్ సాగుచేస్తున్న రైతులు ఆందోళన చెందొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఆయిల్పామ్ రైతులను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. 2022–23లో 1,322 రైతులు 3,567 ఎకరాల్లో, 2023–24 లో 1,548 మంది రైతులు 3,498 ఏకరాల్లో, 2024–25లో 423 రైతులు 1,073 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగుచేశారని వివరించారు. పంట వేసిన 36 నెలల తర్వాత గెలలు కోతకు వస్తాయని తెలిపారు. జూన్ నాటికి దాదాపు 3,500 ఎకరాల ఆయిల్పామ్ దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. మొదటి ఏడాది ఎకరాకు సరాసరి 2 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాకు అధికారికంగా ప్రీ యూనిక్ కంపెనీ ద్వారా ఆయిల్ పామ్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. పరిశ్రమ ఏర్పాటు ఆలస్యమైనా ఆయిల్ పామ్ పంటలోని ప్రతీ గెలను ప్రీ యూనిక్ కంపెనీ కొంటుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఆయిల్ పామ్ గెలల కొనుగోలు కేంద్రాలను జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మండలాల వారీగా ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. ప్రీ యూనిక్ పరిశ్రమ పనులు సైతం వేగవంతం చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. -
సాగునీటి సమస్య తలెత్తొద్దు
● ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ● జిల్లాస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్మల్ఖిల్లా: యాసంగిలో పంటలకు సాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని సచివాలయం నుంచి యాసంగి పంటల సాగు, సాగునీటి వసతి, వసతి గృహాల తనిఖీ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం తదితర అంశాలపై సోమవారం సాయంత్రం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. యాసంగిలో సాగునీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు, చెరువులపై సమీక్ష చేసి ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాల వారీగా సాగు చేస్తున్న పంటల విస్తీర్ణానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ వసతి గృహాలను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు సందర్శించి పాఠశాలలో నెలకొన్న సమస్యలు గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్రామ, మండలస్థాయి కార్యాలయాలలో మొదలుకొని, జిల్లాస్థాయి కార్యాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. యాసంగి పంటలకు సాగు నీటిని అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బోరు బావుల ఆధారిత పంటలకు ఇబ్బంది కలుగకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 57 ప్రభుత్వ వసతి గృహాల్లో ఇప్పటికే అదనపు కలెక్టర్తో కలిసి తనిఖీ చేసినట్లు వెల్లడించారు. గుర్తించిన సమస్యలను పరిష్కరించామన్నారు. వసతి గృహాలకు ప్రత్యేక అధికారులను నియమించి వారానికి రెండుసార్లు విద్యార్థులతో కలిసి భోజనం చేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు. బాలశక్తి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు చేపట్టామన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేసవిలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 6305646600 ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జెడ్పీ సీఈవో గోవింద్, డీపీవో శ్రీనివాస్, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ఇరిగేషన్ ఎస్ఈ రవీందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నిర్మల్
‘టీచర్’లో కమలం పాగా వ్యవసాయంలో ఆదర్శం తానూరు మండలం బోంద్రట్కు చెందిన సాయినాథ్ గోఆధారిత, సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నాడు. ఉత్తమ రైతు పురస్కారం కూడా అందుకున్నాడు.మంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025బాలికలు అన్నిరంగాల్లో రాణించాలి ● అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ నిర్మల్ఖిల్లా: బాలికలు అన్నిరంగాలలో రాణించాలని, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని స్థానికల సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్అహ్మద్ అన్నారు. ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమం ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా కార్యక్రమ ఆవశ్యకత తెలియజేసేందుకు జిల్లాలోని పలువురు డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థినులతో సోమవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పరిపాలన విధానం, భవిష్యత్ ప్రణాళిక, మహిళా సాధికారత, బేటీ బచావో బేటీ పడావో ప్రాముఖ్యత తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ అధికారులు నాగలక్ష్మి, సవిత, మిషన్ శక్తిబృందం సభ్యులు, విద్యార్థినులు పాల్గొన్నారు. నిర్మల్/నిర్మల్రూరల్: కొన్ని నెలలుగా జిల్లా విద్యాశాఖ ఏదో ఒకరకంగా తరచూ వార్తల్లో నిలుస్తుంది. అక్రమ డిప్యూటేషన్లు, బదిలీల్లో చేతివాటం, యూబిట్ కాయిన్దందాలో టీచర్ల అరెస్టులు, విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. ఇలా వరుస ఘటనలతో ఆ శాఖ పేరు మసకబారుతోంది. పలు ఆరోపణల నేపథ్యంలో గతంలో పనిచేసిన ఇద్దరు విద్యాశాఖ అధికారులు మారారు. ఇద్దరికి పోస్టింగ్ ఇచ్చినా జిల్లాలో జాయిన్ కాలేదు. తాజాగా విద్యాశాఖపై బయట నుంచి ఆరోపణలు కాకుండా అంతర్గతంగానే ఉన్నతాధికారికి, కార్యాలయ ఉద్యోగుల మధ్య కోల్డ్వార్ జరుగుతోంది. చివరకు తమ ఉన్నతాధికారిపై కలెక్టర్కు ఉద్యోగులు ఫిర్యాదు చేయడం ఉపాధ్యాయవర్గాల్లో చర్చనీయాంశమైంది. వరుసగా రెండుసార్లు రాష్ట్రంలోనే టెన్త్ ఫలితాల్లో ప్రథమస్థానంలో నిలిచిన జిల్లాలో పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ ఇలాంటి పరిణామం కలవరపెడుతోంది. అధికారి తీరుపై నిరసన.. విద్యాశాఖలో కొన్నినెలలుగా కోల్డ్వార్ కొనసాగుతోంది. రోజురోజుకూ ఉన్నతాధికారి తీరు మారుతోందని, తమపై అనవసర ఒత్తిడి పెంచుతున్నారన్నది ఉద్యోగుల ఆరోపణ. ఇదేక్రమంలో జిల్లా కా ర్యాలయంలో ఒత్తిడి భరించలేకనే ఓ అధికారి వేరే జిల్లాకు బదిలీ చేయించుకున్నట్లు తెలిసింది. మరో అధికారి కూడా రెండు మూడు నెలల్లోనే జిల్లా నుంచి బదిలీ చేయించుకుంటానని చెబుతుండటం గమనార్హం. తమ పనితీరు బాగా లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి కానీ.. ఇలా వేధించడం సరికాదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. డీఈవో తీరుతో విసిగి వేసారిన విద్యాశాఖ జిల్లా కార్యాలయ ఉద్యోగులంతా ఏకమై ఇటీవల కలెక్టర్కు లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రథమం.. ‘పది’లమేనా..! చదువులతల్లి సరస్వతీమాత కొలువైన జిల్లా విద్యారంగంలోనూ ఇప్పుడిప్పుడే ముందడుగేస్తోంది. రెండేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ ఏడాది కూడా ఫస్ట్ రావాలని, హ్యాట్రిక్ సాధించాలని జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా కలెక్టర్ సహా సంబంధిత అధికారులు విద్యాశాఖపై దృష్టిపెడుతున్నారు. వరుసగా తనిఖీలు చేస్తూ సలహాలు, సూచనలు చేస్తున్నారు. మరో 17 రోజుల్లోనే పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి తరుణంలో జిల్లా విద్యాశాఖలో ముసలం మొదలవడం కలవరపెడుతోంది. ఈ ప్రభావం పదోతరగతి పరీక్షలపై పడితే స్టేట్ ఫస్ట్ ర్యాంకు వస్తుందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. న్యూస్రీల్వరుసగా మరకలు..జిల్లా విద్యాశాఖపై వరుసగా మరకలు పడుతూనే ఉన్నాయి. జిల్లా ఏర్పడిన మొదట్లో డీఈవోను ఖాతరు చేయకుండా కొంతమంది అధికారులు, ఉద్యోగులు వ్యవహరించిన తీరు అప్పట్లో ఫిర్యాదుల వరకూ వెళ్లింది. చివరకు డీఈవో బదిలీ కావాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన డీఈవో హయాంలోనే జిల్లా వరుసగా రెండుసార్లు పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. కానీ సదరు విద్యాశాఖ అధికారిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. 317 జీవో, టీచర్ల బదిలీలు, డిప్యూటేషన్లు, పదోన్నతులు, డీఎస్సీ పోస్టింగుల్లో ఆరోపణలు వచ్చాయి. ఆయన హయాంలోనే యూబిట్కాయిన్ దందాలో వందలమంది ఉపాధ్యాయులు కూరుకుపోయారు. ఏకంగా పలువురు జైలుకు వెళ్లడం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. ఈ దందాలో పలువురు ఉపాధ్యాయులు విదేశాలకు వెళ్లడంలో డీఈవో తీరూ వివాదాస్పదమైంది. చివరకు ఆయన కూడా బదిలీ కావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరికీ పోస్టింగ్ ఇచ్చినా జిల్లాలో జాయిన్ కాలేదు. ఇటీవల జిల్లాలో విద్యార్థినులపై ఉపాధ్యాయుల లైంగిక వేధింపుల ఘటనలు, సంబంధిత అధికారులు స్పందించిన తీరు విద్యాశాఖకు మాయనిమచ్చను తెచ్చాయి. తాజాగా విద్యాశాఖ జిల్లా కార్యాలయ ఉద్యోగులే తమ పైఅధికారిపై ఆరోపణలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా వేధింపులు ఒత్తిడి భరించలేక ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వేధింపులు మరింత పెరిగినట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు. డీఈవో వర్సెస్ ఉద్యోగులు ఉన్నతాధికారి తీరుపై నిరసన లిఖితపూర్వకంగా కలెక్టర్కు ఫిర్యాదు పరీక్షలవేళ ఇదేం పరేషాన్..!? -
● తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచిన మల్క కొమురయ్య ● కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఓట్ల వడబోత ● నేటి మధ్యాహ్నానికి మొదలవనున్న లెక్కింపు ● మందకొడి లెక్కింపుపై అభ్యర్థుల మండిపాటు ● మల్క కొమురయ్యను అభినందించిన బండి సంజయ్ ● ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమన్న కే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్–నిజామాబాద్ ఉపాధ్యాయుల నియోజకవర్గం కమలం వశమైంది. ముందు నుంచీ అనుకున్నట్లుగా మల్క కొమురయ్య ఆ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. తొలిప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందడం విశేషం. ఓట్ల లెక్కింపు సోమవారం సాయంత్రానికి ప్రారంభం కాగా.. రెండు గంటల్లోనే ఫలితం తేలడం గమనార్హం. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 27,088 ఓట్లకు గాను 25,041 ఓట్లు పోల్ అవగా.. అందులో 24,144 చెల్లుబాటు అయ్యాయి. కాగా 897 చెల్లలేదు. దీంతో గెలుపు కోటా ఓట్లు 12,073గా నిర్ధారించారు. బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959, వంగ మహేందర్రెడ్డికి 7,182, అశోక్కుమార్కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాను బీజేపీ అభ్యర్థి కొమురయ్య చేరుకున్నారు. దీంతో తొలిరౌండ్లోనే బీజేపీ మొదటి ప్రాధాన్యం ఓట్లతో గెలిచినట్లయింది. గతంలో పీఆర్టీయూ బలపరిచిన కూర రఘోత్తంరెడ్డి విజయం సాధించగా, ఈసారి టీచర్ సంఘాలు కాకుండా జాతీయ పార్టీ బీజేపీ పోటీ చేసి గెలవడం చర్చనీయాంశంగా మారింది. ‘బండి’ అభినందనలు రాత్రి 10.20 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటింగ్ సెంటర్ వద్దకు వచ్చి మల్క కొమురయ్యను అభినందించారు. ఇది చారిత్రక విజయమని, ఈ తీర్పు టీచర్లకు, మోదీకి అంకితమని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్క కొమురయ్య, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ మేయర్ సునీల్రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘చారిత్రాత్మక తీర్పునిచ్చిన ఉపాధ్యాయులందరికీ వందనాలు. ఇది మామూలు విజయం కాదు. 5,900 ఓట్ల తేడాతో మల్క కొమురయ్య భారీ విజయం సాధించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల నమ్మకం, భరోసా ఉంది. దేశవ్యాప్తంగా మేధావి వర్గమంతా మోదీపై నమ్మకంతో ఉన్నారు..’ అని అన్నారు. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ వడబోత.. సోమవారం ఉదయం నుంచి గ్రాడ్యుయేట్ ఓట్ల వ డపోత కొనసాగుతూనే ఉంది. ఉదయం 8 గంట లకు మొదలు పెట్టిన ఎన్నికల లెక్కింపు, చెల్లని, చె ల్లిన ఓట్ల విభజనపై రాత్రి 9గంటలు దాటేవరకు ఎ లాంటి ప్రకటనా చేయలేదు. దీంతో రకరకాల ప్ర చారాలు మొదలవడంతో రాత్రి ప్రకటించారు. అప్పటి వరకూ దాదాపు లక్ష ఓట్లను వడబోయగా అందులో 92,000 చెల్లుబాటు అయ్యాయని, 8,000 ఓట్లు చెల్లలేదని, మిగిలిన 1.50 లక్షల ఓట్ల వడబోత మంగళవారం మధ్యాహ్నం వరకు పూర్తవుతుందని అధికారులు ప్రకటించారు. మధ్యాహ్న ం లెక్కింపు మొదలైనా.. తొలి ప్రాధాన్యతలో కోటా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. అందులో కోటా ఓట్లు చేరుకునే వరకు ఎలిమినేషన్ రౌండ్లు కొనసాగుతాయి. ఆర్వో, సిబ్బందిపై మండిపాటు గ్రాడ్యుయేట్, టీచర్ స్థానాలకు పోటీ పడిన పలు పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్వో), లెక్కింపు సిబ్బందిపై మండిపడ్డారు. లెక్కింపు ప్రక్రియ మందకొడిగా సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రానికి నల్లగొండ టీచర్ ఎమ్మెల్సీ ఫలితం కొలిక్కి వచ్చినా.. కరీంనగర్ కౌంటింగ్ కేంద్రం నుంచి టీచర్, గ్రాడ్యుయేట్ స్థానాలకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటికి రాకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. పోలైన ఓట్లలో కొందరు 01, 02 అని వేసిన వారి ఓట్లు పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డి ఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు. టీచర్స్ ఎమ్మెల్సీకి పోలైన ఓట్ల విషయంలోనూ గందరగోళం నెలకొందని ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్ రోజు రాత్రి 24,895 ఓట్లు వచ్చాయని, మరునాడు శుక్రవారం 24,968 మంది ఓటేశారని, తాజాగా సోమవారం మొత్తంగా 25,041 ఓట్లు పోలయ్యాయని వెల్లడించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. -
నిర్మల్
ఔట్ సోర్సింగ్ గందరగోళం ఆర్టీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్ల నియామకంపై గందరగోళం నెలకొంది. అధికారిక ప్రకటన జా రీ కాకున్నా ఔట్ సోర్సింగ్ సంస్థలు పోస్టుల భర్తీకి అత్యుత్సాహం చూపాయి.సోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 20258లోఘనంగా మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి నిర్మల్ రూరల్: జిల్లా కేంద్రంలోని పోలీస్ సాయుధ దళ ముఖ్య కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించా రు. పోలీస్ అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో ఆర్ఐలు రాంనిరంజన్రావు, శేఖర్, రమేశ్, రామకృష్ణ, ఆర్ఎస్సైలు వినోద్, రవి, సిబ్బంది పాల్గొన్నారు. భైంసాటౌన్: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకుని వేలం వేసిన అధికారులు దక్కించుకున్న వ్యక్తి నుంచి గడువులోపు డబ్బులు రాబట్టడంలో విఫలమయ్యారు. సదరు వ్యక్తి పన్నాగాన్ని పసిగట్టలేక పోతున్న అధికారుల తీరుపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి లారీలో పీడీఎస్ బియ్యం తరలిస్తూ భైంసా పట్టణంలో కారును ఢీకొన్న ప్రమాదంలో పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో ఎస్పీ జానకీ షర్మిల ప్రత్యేక దృష్టి సారించి అక్రమదందా గుట్టురట్టు చేశారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్కు చెందిన ఓ వ్యాపారి జిల్లా నుంచి పీడీఎస్ బియ్యం సేకరించి తిరిగి జిల్లాకే తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ధర్మాబాద్లోని అతడి స్థావరంపై దాడి చేసి బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు కూడా నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న 360 క్వింటాళ్ల బియ్యానికి రెవెన్యూ అధికారులు ఇటీవల బహిరంగ వేలం నిర్వహించారు. ధర్మాబాద్కే చెందిన ఓ వ్యక్తి క్వింటాల్కు రూ.3,100 చొప్పున బియ్యం దక్కించుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. వేలంలో దక్కి ంచుకున్న బియ్యానికి సంబంధించి ఈనెల 24లోపు రూ.11.16లక్షలు చెల్లించాల్సి ఉంది. కానీ, సదరు వ్యక్తి ఇప్పటివరకు డబ్బులు చెల్లించకుండా తాత్సా రం చేస్తున్నాడు. రెవెన్యూ అధికారులు అడిగితే రేపు, మాపంటూ జాప్యం చేస్తున్నట్లు తెలిసింది. ఆంతర్యమేమిటంటే..? మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్లుగా పీడీఎస్ బి య్యం అక్రమదందా యథేచ్ఛగా సాగిస్తున్నాడు. జిల్లా నుంచి ఏజెంట్ల ద్వారా బియ్యం సేకరించి తిరి గి లారీల్లో జిల్లాలోని రైస్మిల్లులు, ఇతరులకు పంపుతున్నాడు. ఈ దందాలో ఆరితేరిన సదరు వ్యక్తి రూ.కోట్లు ఆర్జించినట్లు ఆరోపణలున్నాయి. గతంలో భైంసా మండలంలోని దేగాంలోనూ ఇతనికి చెందిన పీడీఎస్ బియ్యం దాదాపు 270 క్వింటాళ్లు పట్టుబడగా, అప్పుడు కూడా పట్టణంలోని ఎంఎల్ఎస్ పాయింట్లో భద్రపరిచారు. కానీ, కొద్దిరోజులకే బియ్యం రిలీజ్ చేయించుకున్నాడు. ఈసారి కూడా ఆ పద్ధతిలోనే బియ్యం రిలీజ్ చేయించుకునేందుకు యత్నించినట్లు తెలిసింది. కాగా, రెవెన్యూ అధికారులు బహిరంగ వేలం నిర్వహించడంతో అ తడి పన్నాగం ఫలించలేదు. అయినా, బియ్యం ద క్కించుకునేందుకు ధర్మాబాద్కు చెందిన అతని వ్యక్తినే వేలంలోకి దింపినట్లు తెలిసింది. కాగా, వే లానికి ఒకరోజు ముందు ప్రభుత్వ ధరను క్వింటాల్ కు రూ.2,100కు నిర్ణయించేలా సదరు వ్యాపారి ఎత్తుగడ వేసినట్లు సమాచారం. ఇందుకుగాను పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులతోనూ రెవె న్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. వా రు ససేమిరా అనడంతో కిలోకు రూ.25 నుంచి వేల ం ప్రారంభించారు. పోటీగా మరో ఇద్దరు పాల్గొనడంతో రూ.31కి కిలో చొప్పున దక్కించుకున్నాడు. కానీ, గడువులోపు డబ్బులు చెల్లించకుండా జాప్యం చేస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తగిన చర్యలు తీసుకుంటాం అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఫిబ్రవరి 22న వేలం నిర్వహించాం. ధర్మాబాద్కు చెందిన వ్యక్తి కిలోకు రూ.31 చొప్పున రూ.11.16లక్షలకు దక్కించుకున్నాడు. అదే నెల 24లోపు చెల్లించాలని గడువు విధించినా ఇప్పటివరకు చెల్లించలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటాం. – ప్రవీణ్కుమార్, తహసీల్దార్, భైంసా న్యూస్రీల్ పట్టుకున్న పీడీఎస్ రైస్కు వేలం 360 క్వింటాళ్లకు రూ.11.16 లక్షలు దక్కించుకున్న మహారాష్ట్ర వ్యక్తి పైకం చెల్లించడంలో తాత్సారం అధికారుల తీరుపై అనుమానం! తక్కువ ధరకు కొట్టేసే యత్నం వేలంలో బియ్యం దక్కించుకున్న వ్యాపారి ఏజెంట్ల ద్వారా కిలోకు రూ.25 నుంచి రూ.27వరకు సేకరిస్తుంటాడు. కానీ, గిట్టుబాటు కాకున్నా వేలంలో రూ.31కి దక్కించుకోవడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. గతంలో మాదిరి బియ్యం రిలీజ్ చేయించుకునేందుకు తెరవెనుక యత్నిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవున్నాయి. జాప్యం చేయడం ద్వారా ఎలాగైనా బియ్యాన్ని తక్కువ ధరకు దక్కించుకోవడం లేదా రిలీజ్ చేయించుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, సంబంధిత అధికారులు ప్రస్తుత వేలానికి సంబంధించిన డబ్బులు త్వరగా వసూలు చేయాలి. లేదా మరోసారి వేలం నిర్వహించి వెంటనే డబ్బులు చెల్లించేలా చర్యలు చేపట్టాలి. లేనిపక్షంలో సదరు వ్యాపారి ఎత్తుగడ ఫలించి బియ్యం గతంలోలాగా చేజిక్కుంచుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది పోటీ పడ్డారు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ నుంచి వూట్కూరి నరేందర్రెడ్డి, బీజేపీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ నుంచి బరిలో నిలిచిన ప్రసన్న హరికృష్ణ మధ్యే ప్రధాన పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. స్వతంత్రుల్లో గట్టి పోటీనిచ్చే వారు లేకపోవడంతో పట్టభద్రులు ప్రధాన పార్టీల అభ్యర్థులకే మద్దతునిచ్చినట్లుగా పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో తమదే ఆధిక్యత ఉంటుందని బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో బరిలో లేకున్నా బీఎస్పీ నుంచి పోటీ చేసిన హరికృష్ణకు అంతర్గతంగా మద్దతునిచ్చినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఈ ముగ్గురిలో తొలి ప్రాధాన్యత ఎవరికి దక్కనుందో అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయా పార్టీలతో పాటు ఓటర్లు కూడా తమ మద్దతుదారుల గెలుపునకున్న అవకాశాలు బేరీజు వేసుకుంటున్నారు. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం తేలుతుందా? లేదా రెండో ప్రాధాన్యత అవసరం ఉంటుందా? అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. -
● ‘ప్రాధాన్యత’ దక్కేదెవరికో? ● నేడు ‘ఎమ్మెల్సీ’ ఓట్ల లెక్కింపు ● కరీంనగర్లో కౌంటింగ్ ● ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ ● విజయంపై ప్రధాన పార్టీల ధీమా
కై లాస్నగర్: శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికాసేపట్లో షురూ కానుంది. కరీంనగ ర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో సోమ వారం నిర్వహించే మెదక్, నిజామాబాద్, ఆదిలా బాద్, కరీంనగర్ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్కు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గెలుపెవరిదో అనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది బరిలో నిలిచినా ప్రధాన పోటీ మా త్రం బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థుల మధ్యనే ఉంటుందని తెలుస్తోంది. టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితం తొలుత వెల్లడి కానుండగా పట్టభద్రుల కౌంటింగ్ ఆలస్యమయ్యే అవకాశముంది. తొలి ఫలితం టీచర్స్ ఎమ్మెల్సీదే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో బీజేపీ తరఫున మల్క కొ మురయ్య బరిలో నిలువగా, ఉపాధ్యాయ సంఘాల్లో ప్రధానమైన పీఆర్టీయూ టీఎస్ నుంచి వంగ మహేందర్రెడ్డి, టీపీటీఎఫ్, టీఎస్యూటీఎఫ్ పక్షాన అశోక్కుమార్ బరిలో నిలిచారు. ఇతర అభ్యర్థులు వివిధ సంఘాల మద్దతుతో బరిలో నిలిచినా ప్రధాన పోటీ మాత్రం ఈ ముగ్గురి మధ్యనే ఉండనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలను పరిశీలిస్తే పీఆర్టీయూ మద్దతుదారులే విజయం సాధించిన సందర్భాలున్నాయి. ఈ ఎన్నికల్లోనూ అదే ఫలితం పునరావృతం అవుతుందా.. లేక రాజకీయంగా ఉత్సాహంగా ఉన్న బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తాడా.. లేదంటే అశోక్ కుమార్ గెలుస్తాడా? అనే దానిపైనా ప్రధాన చర్చ సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల కంటే ఈ ఎన్నికను ఆయా ఉపాధ్యాయ సంఘాలే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విస్తృతంగా ప్రచారం చేపట్టాయి. ఉపాధ్యాయ ఓటర్లను కలుస్తూ మద్దతు కోరడంతో పాటు విందులు కూడా ఏర్పాటు చేశాయి. పోలింగ్ సరళి సాగిన తీరుపై ఆయా సంఘాలు తమ అభ్యర్థి గెలుపుపై పక్కా లెక్కలు వేసుకుంటున్నాయి. పట్టభద్రులతో పోల్చితే ఓటర్లు తక్కువగా ఉన్న టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితమే ముందుగా వచ్చే అవకాశముంది. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం వెల్లడవుతుందా? లేదా రెండో ప్రాధాన్యత ఓట్లు అనివార్యం కానున్నాయా? అనేది మరికాసేపట్లో తేలనుంది. మొత్తానికి అటు పట్టభద్రులు, ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై అన్నివర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుండటం ఆసక్తి రేపుతోంది. లెక్కింపు గణాంకాలు పట్టభద్రుల నియోజకవర్గంలో.. బరిలో నిలిచిన అభ్యర్థులు : 56 మొత్తం ఓట్లు : 3,55,109 పోలైన ఓట్లు : 2,50,328పోలింగ్ శాతం : 70.48 టీచర్స్ నియోజకవర్గంలో.. బరిలో నిలిచిన అభ్యర్థులు : 15మొత్తం ఓట్లు : 27,088 పోలైన ఓట్లు : 24,968పోలింగ్శాతం : 92.17 మాక్ కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిసాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్– మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సోమవారం మొదలు కానుంది. కరీంనగర్లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గాలకు లెక్కింపు జరగనుంది. ఇందుకోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్ల కోసం కేటాయించారు. ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. వీరిలో ఒక మైక్రోఅబ్జర్వర్, ఒక సూపర్వైజర్, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉంటారు. వీరందరికీ శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సంబంధిత అధికారులు శిక్షణ ఇచ్చారు. లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఇందులో 20 శాతం రిజర్వ్ సిబ్బందిని నియమించారు. ఆదివారం మాక్ కౌంటింగ్ను ఎన్నికల అధికారులు చేపట్టారు. ఈ ప్రక్రియను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. వేదిక: అంబేడ్కర్ స్టేడియం, కరీంనగర్ మొత్తం టేబుళ్లు: 35 పట్టభద్రుల టేబుళ్లు : 21 టీచర్ల టేబుళ్లు : 14 లెక్కింపు సిబ్బంది: 800రిజర్వ్ స్టాఫ్: 20 శాతం -
డీటీఎఫ్ నూతన కార్యవర్గం
నిర్మల్ రూరల్: డీటీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యదర్శి శామ్యూల్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అధ్యక్షుడిగా చంద్ర నాగకాంత్, ఉపాధ్యక్షులుగా రమేశ్, శకుంత ల, ప్రధాన కార్యదర్శులుగా మహేంద్రాచారి, గొలుసుల నర్సయ్య, శ్రీనివాస్, దుర్గం సుగుణాకర్, రాష్ట్ర కౌన్సిలర్గా దేశ్పాండే మధుసూదన్, ఆడిట్ కమిటీ కన్వీనర్గా దళితానంద్, సభ్యులుగా దత్తాద్రి, లాలు ఎన్నికయ్యారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామని వారంతా హామీ ఇచ్చారు. -
ఉత్తమ ఫలితాలు సాధిస్తాం
● ఇంటర్లో ఉత్తీర్ణత శాతం పెంచుతాం ● పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు ● ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డీఐఈవో నిర్మల్ రూరల్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తామని డీఐఈవో పరశురాం పేర్కొన్నారు. ఈ నెల 5నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. సాక్షి: ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? డీఐఈవో: ఉత్తీర్ణత శాతం పెరుగుదలకు 90రోజుల ప్రణాళికను ఫిబ్రవరి 20 వరకు అమలు చేశాం. అధ్యాపకులు ప్రతీరోజు ప్రణాళికాబద్ధంగా విద్యార్థులకు బోధించారు. వెనుకబడిన, గైర్హాజరైన విద్యార్థులపై దృష్టి సారించారు. విద్యార్థుల ఇంటికి వెళ్లి ప్రతీరోజు హాజరయ్యేలా చూశారు. దసరా సెలవుల తర్వాత సాయంత్రం 4 నుంచి 5గంటల వరకు ప్రత్యేక అధ్యయన తరగతులు, పునఃశ్చరణ, స్లిప్ టెస్ట్లు కూడా నిర్వహించారు. ఈ ప్రణాళిక సత్ఫలితాలనిస్తుందని ఆశిస్తున్నాం. సాక్షి: జిల్లాలో ఎన్ని పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల సంఖ్య ఎంత? డీఐఈవో: జిల్లాలో మొత్తం 23 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశాం. 13,133 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 6,571 మంది ఫస్టియర్ విద్యార్థులు కాగా, 6,562 మంది సెకండియర్ విద్యార్థులున్నారు. ఫస్టియర్ ఒకేషనల్లో 1,088, సెకండియర్లో 945 మంది విద్యార్థులున్నారు. ఉదయం 9నుంచి 12 గంటల వరకు పరీక్షలుంటాయి. సాక్షి: పరీక్షల నిర్వహణకు ఎంతమంది సిబ్బందిని నియమించారు? డీఐఈవో: పరీక్షల నిర్వహణకు 23 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 23 మంది డిపార్ట్మెంట్ అధికారులు, ప్రతీ 40 మంది వి ద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్తోపాటు ఫ్ల యింగ్ స్క్వాడ్ టీంను నియమించాం. ఈ టీంలో ఒక డిప్యూటీ తహసీల్దార్, ఎస్సై, ఏఎస్సై, సీనియర్ లెక్చరర్లు సభ్యులుగా ఉంటారు. సాక్షి: పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు చేపట్టారు? డీఐఈవో: పరీక్షలు సజావుగా నిర్వహించేందు కు ఇటీవల కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శా ఖల అధికారులతో సమీక్ష నిర్వహించాం. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల అ ధ్యాపకులతో పరీక్షలకు విద్యార్థులను స న్నద్ధం చేయడంపై సమీక్ష నిర్వహించాం. పరీక్షల కమిటీని నియమించాం. ప్రతీ పరీక్షాకేంద్రంలో మూడు నుంచి నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. విద్య, పోలీస్, ఆరోగ్యశాఖల అధికారుల సహకారం తీసుకుంటున్నాం. సాక్షి: విద్యార్థుల ప్రగతిని ఎలా అంచనా వేస్తున్నారు? డీఐఈవో: ఈ విద్యా సంవత్సరంలో నాలుగు యూనిట్, అర్ధ వార్షిక, రెండు ప్రీఫైనల్ ప రీక్షలు నిర్వహించాం. ఇటీవల ప్రాక్టికల్ ప రీక్షలు కూడా పూర్తయ్యాయి. పరీక్షలకు విద్యార్థులంతా హాజరయ్యేలా చూశాం. స మాధాన పత్రాలను ఎప్పటికప్పుడు మూ ల్యాంకనం చేశాం. పరీక్షా ఫలితాలను సమీక్షించి విద్యార్థులకు తగిన సూచనలు చేశాం. ఈ విధానంతో జిల్లాలో ఈసారి ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం మరింత మెరుగవుతుందని ఆశిస్తున్నాం. -
గల్ఫ్ మృతుల కుటుంబాలకు బాసట
● రూ.5లక్షల చొప్పున పరిహారం ● మంజూరు చేసిన రాష్ట్ర సర్కారు నిర్మల్ఖిల్లా: రెక్కాడితే గాని డొక్కాడని దిగువ మధ్యతరగతి కార్మికులు ఉపాధి కోసం గల్ఫ్ బాట పడుతున్నారు. అనుకోని ప్రమాదాలు, అనారోగ్య కారణాలతో పలువురు అక్కడ మృతి చెందితే వారి మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు నెలల తరబడి వేచి చూస్తున్న ఘటనలనేకం. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి మత్యువాత పడుతున్న వలస కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో గల్ఫ్ మృతుడి కుటుంబానికి రూ.ఐదు లక్షల పరిహారం ఇచ్చేందుకు గతంలోనే ఉత్తర్వులిచ్చింది. ఇటీవల నిధులు విడుదల చేసింది. నిర్మల్ జిల్లాకు రూ.25లక్షలు, మంచిర్యాల జిల్లాకు రూ.15లక్షల నిధులు మంజూరు చేసింది. జిల్లాలో గల్ఫ్ గాయాలెన్నో.. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి వివిధ కారణాలతో పలువురు మృతి చెందగా బాధిత కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడుతున్నాయి. వారి కష్టాల గురించి ‘సాక్షి’లో ఎన్నో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక జీవో 205 విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం డిసెంబర్–2003 నుంచి ఇప్పటివరకు గల్ఫ్ దేశాల్లో మృతిచెందిన వారి కుటుంబానికి రూ.5లక్షలు అందించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాల్లో దాదాపు 60 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నట్లు గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. కాగా, ఏటా పదుల సంఖ్యలో వివిధ కారణాలతో మృత్యువాత పడుతున్నారు. ‘ప్రవాసీ ప్రజావాణి’లో వినతులు హైదరాబాద్లోని ప్రజాభవన్లో గల్ఫ్తో పాటు ఇతర దేశాల కార్మికులు, ఎన్నారైల కోసం ఏర్పాటు చేసిన ‘ప్రవాసీ ప్రజావాణి’ ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దీనిని నిర్వహిస్తున్నారు. దీనిని ప్రారంభించిన మొదటిరోజే జిల్లా నుంచి మృతుల కుటుంబసభ్యులు పలువురు వినతిపత్రాలు అందించారు. గల్ఫ్, ఇతర దేశాల్లో ఉన్న కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ 16న జారీ చేసిన జీవో 205కు కొనసాగింపుగా, సాధారణ పరిపాలన శాఖలోని ప్రవాస భారతీయుల (జీఏడీ–ఎన్నారై) విభాగం పక్షాన ప్రవాసీ ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికి సంస్థాగతంగా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఎక్స్గ్రేషియా నిధుల విడుదల 2023 డిసెంబర్ 7నుంచి ఇప్పటివరకు గల్ఫ్దేశాల్లో 200 మందికి పైగా తెలంగాణ కార్మికులు మృతి చెందినట్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి రే వంత్రెడ్డి ఆదేశాల మేరకు గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్గ్రేషియా చెల్లింపు కోసం తెలంగాణ ప్రభుత్వ జీఏడీ ఎన్నారై విభాగం ఈనెల 1న 113 కుటుంబాలకు రూ.5.65కోట్లు వివిధ జి ల్లాలకు విడుదల చేసింది. ఇందులో నిర్మల్ జిల్లాకు రూ.25లక్షలు, మంచిర్యాల జిల్లాకు రూ.15లక్షలు కేటాయించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ప్రత్యేక ఆదేశాల ద్వారా త్వరగా పరిహారాన్ని బాధిత కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. గల్ఫ్ మృతుల సంఖ్య ప్రకారం అన్ని జిల్లాలకు విడతలవారీగా మరిన్ని నిధులు కేటాయించనున్నారు. బాధిత కుటుంబాలకు భరోసా ఉపాధి కోసం ఎడారి దేశాల బాట పడుతున్న కార్మికులెందరో విగత జీవులుగా స్వస్థలాలకు వస్తున్న దయనీయ దృశ్యాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తరచూ కనిపిస్తాయి. కొన్నిసార్లు మృతదేహాల కోసం నెలల తరబడి వేచి చూస్తున్న ఘటనలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం భరోసానిస్తోంది. విడతల వారీగా జిల్లాలోని బాధిత కు టుంబాలకు రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తోంది. – స్వదేశ్ పరికిపండ్ల, రాష్ట్ర అధ్యక్షుడు, ప్రవాసీమిత్ర కార్మికసంఘం -
పునరావాస కల్పనలో విఫలం
కడెం: పులుల సంరక్షణ పేరిట అమాయక గిరిజన కుటుంబాలను ఇతర ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు ఆరోపించారు. మండలంలోని కొత్త మద్దిపడగ సమీపంలోని రాంపూర్, మైసంపేట్ పునరావాస గ్రామాన్ని ఆదివారం మా నవ హక్కుల నిజ నిర్ధారణ కమిటీ సభ్యులతో సందర్శించి గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్నారు. ప్రతీ కుటుంబానికి ఐదెకరాలిస్తామని రెండెకరాల అటవీ భూమి ఇచ్చారని, డబుల్ బెడ్రూంలు నిర్మించినా నాసిరకంగా ఉన్నాయని ఆరోపించారు. గ్రా మస్తులు ఇక్కడికి వచ్చిన నుంచి ఎలాంటి ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అటవీ హక్కుల రక్షణ చట్టం ప్రకారం అడవిలో నివసిస్తు న్న మానవులను మనుషులుగా గుర్తించాలని కోరా రు. అటవీ హక్కుల చట్టం 2006లో ఉన్న అంశాలనూ అధికారులు ధిక్కరించారని ఆరోపించారు. చట్టాన్ని దుర్వినియోగం చేసినందుకు అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వేదిక కా ర్యవర్గ సభ్యులు రఘోత్తమ్రెడ్డి, ప్రజ్ఞశీల్, అతిశ్కుమార్, గోపీనాథ్, సోన్ కాంబ్లే తదితరులున్నారు. -
నిర్మల్ లయన్స్ క్లబ్కు పురస్కారాలు
నిర్మల్ఖిల్లా: లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ కాన్ఫరెన్స్లో నిర్మల్ లయన్స్ క్లబ్కు పలు పురస్కారాలు దక్కాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ప్రాంతీయస్థాయి కాన్ఫరెన్స్లో లయన్స్ క్లబ్ వివిధ రంగాల్లో చేసిన సామాజిక సేవలకు గుర్తింపుగా పురస్కారాలు ప్రదానం చేసినట్లు నిర్మల్ అధ్యక్షుడు కె.చంద్రమోహన్రెడ్డి తెలిపారు. ఉత్తమ సామాజిక సేవా కార్యక్రమాల విభాగంలో క్లబ్ కేటగిరీలో ఎక్సెలెంట్ క్లబ్ అవార్డుతోపాటు మూడు పురస్కారాలు.. వ్యక్తిగత విభాగంలో ఐదు పురస్కారాలు అందించారు.. పురస్కారాలు స్వీకరించిన వారిలో కె.చంద్రమోహన్రెడ్డి(ఉత్తమ అధ్యక్షుడు), శ్రీనివాస్యాదవ్(ఉత్తమ కార్యదర్శి), లక్ష్మీనారాయణగౌడ్(ఉత్తమ కోశాధికారి), వట్టిమల్ల నరసయ్య(రీజియన్ సెక్రెటరీ), లక్కడి రాజేశ్వర్రెడ్డి(జోన్ చైర్మన్) తదితరులు ఉన్నారు. లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ డీకే.రాజేశ్ శాలువా, మెమొంటోలతో సత్కరించారు. నిర్మల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గతేడాది జిల్లాలోని పలు గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. -
బడ్జెట్లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి
● పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ నిర్మల్ రూరల్: రాష్ట్రంలో వెంటిలేషన్పై ఉన్న విద్యారంగాన్ని కాపాడేందుకు రాష్ట్ర బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శనివారం మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగం నిధుల కొరతతో మౌలిక వసతులు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ విద్యారంగాన్ని బాగు చేయాలంటే 15 శాతం నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రస్తుతం హామీలు అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రతీ విద్యార్థికి రూ.5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట రాజ్, నరేశ్, నవీన్, లోకేశ్ తదితరులు ఉన్నారు. మాట్లాడుతున్న వెంకటేశ్ -
బీపీ : 79,199 మంది షుగర్ : 37, 902 మంది
జిల్లాలో..వయస్సులవారీగా బీపీ వ్యాధిగ్రస్తులు: 30 నుంచి 40 15,729 40 నుంచి 50 36,750 50 ఏళ్లు దాటినవారు 26,716 వయస్సులవారీగా షుగర్ వ్యాధిగ్రస్తులు.. 30 నుంచి 40 ఏళ్లు 10,450 40 నుంచి 50 ఏళ్లు 17,550 50 ఏళ్లు దాటినవారు 9,902పట్టణ ప్రాంతాల్లోనే అధికం.. గత ఐదేళ్లలో బీపీ, షుగర్ బారిన పడిన వారిలో 40 శాతం వరకు యువతే ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలవారితో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోని వారే ఎక్కువగా మధుమేహం, రక్తపోటు బారినపడుతున్నట్లుగా గుర్తించారు. నిర్మల్ పట్టణంలో ఇటీవల నిర్వహించిన సర్వేలో 8,386 మంది బీపీ, 4,575 మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. -
ఎరువు.. కరువు!
లింకులతో ఇక్కట్లు.. యూరియ కోసం గ్రోమోర్ ఫర్టిలైజర్తోపాటు, ప్రైౖవేట్ డీలర్ల వద్దకు వెళ్తే వారుగంట గుళికలు, పొటాషియం కొనుగోలు చేయాలని లింకు పెడుతున్నారు. ఫిబ్రవరి 18న ఖానాపూర్ పట్టణంలోని గోమ్రోర్ సెంటర్కు వెళ్లిన రైతులకు బలవంతంగా ఇతర ఎరువులు అంటగట్టే ప్రయత్నం చేశారు. దీంతో రైతులు వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికై నా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. ఖానాపూర్: జిల్లాలో యాసంగి పంటలకు యూరియా దొరకడం లేదు. ప్రస్తుతం జిల్లాలో వరి, మొక్కజొన్న పంటల్లో కలుపుతీత పనులు చేపడుతున్నారు. కలుపు తీసిన వెంటనే పంటలకు యూరియా వేయాలి. దీంతో రైతులు యూరియా కోసం సొసైటీలకు పరుగులు పెడుతున్నారు. జిల్లా అంతా ఒకేసారి యూరియా కోసం వస్తుండడంతో సొసైటీలకు వస్తున్న ఎరువు చాలడం లేదు. అదనుకు యూరియా వేయకుంటే పంట ఎదగక నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఖానాపూర్, పెంబి, దస్తురాబాద్, లోకేశ్వరం తదితర మండలాల్లో యూరియా కొరత ఎక్కువగా ఉంది. రైతులు పీఏసీఎస్ల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో పంటల సాగు వివరాలు.. జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో 1.10 లక్షల ఎకరాల్లో వరి, 1,02 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 35 వేల ఎకరాల్లో జొన్న, 55 వేల ఎకరాల్లో శనగ పంటలు సాగు చేశారు. యాసంగి పంటలకు 37 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అయితే ఇప్పటికే 39 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చింది. అయినా రైతుల ఇంకా యూరియా కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధికారులు మరో 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా కోసం ప్రభుత్వానికి నివేదించారు. ఈమేరకు సరఫరా అవుతోంది. రైతులు అవసరానికి మించి కొనుగోలు చేయడంతోపాటు సాగు చేసిన పంటలకు సైతం ఎక్కువగా వినియోగించడంతోనే కొరత ఏర్పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మూడు రోజులుగా తిప్పలు.. ఖానాపూర్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కోసం ఖానాపూర్, పెంబి మండలాలకు చెందిన రైతులు మూడు రోజులుగా వేకువ జామునే పీఏసీఎస్ల ఎదుట బారుతులు తీరుతున్నారు. కొద్ది రోజులుగా కార్యాలయాలు, దుకాణాల చుట్టూ తిరిగినా యూరియా దొరకకపోవడంతో వెనుదిరుగుతున్నారు. తప్పని అగచాట్లు.. వారం రోజులుగా ఎరువుల కోసం ఇబ్బంది పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు పేర్కొంటున్నారు. శుక్ర, శనివారాల్లో వేకువ జామున 4 నుంచి 5 గంటల ప్రాంతంలో కార్యాలయానికి చేరుకుని గేటు వద్ద వరుసలో చెప్పులు పెట్టి కాలకృత్యాలు, టీ, టిఫిన్ లేకుండా పడిగాపులు కాస్తే తప్ప యూరియా దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పంటలకు యూరియా అవసరమని, అదనుకు అందకుంటే పంటలు ఎదగక నష్టపోతామని పేర్కొంటున్నారు. ఖానాపూర్ పీఏసీఎస్ ఎదుట వరుసలో చెప్పులతో పడిగాపులు కాస్తున్న రైతులు జిల్లాలో యూరియా కొరత అదనుకు అందక రైతుల ఆందోళన సొసైటీల వద్ద అన్నదాతల బారులుకొరత లేకుండా చూస్తున్నాం జిల్లాకు ఈ యాసంగిలో గత ఏడాదికంటే ఎక్కువగా యూరియా తెప్పించాం. జిల్లాలో ఎటువంటి యూరియా కొరత లేదు. రైతులు ఆందోళన చెందవద్దు. మరో 4 రోజుల్లో 2 వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుంది. రైతులు యూరియా వినియోగంపై స్థానిక వ్యవసాయ అధికారులు సలహాలు తీసుకుంటే పెట్టుబడి తగ్గించుకోవచ్చు. అవసరానికి మించి వాడిడం అనర్థమే. – అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి -
‘పది’ పరీక్షల్లో పొరపాట్లు జరగొద్దు
● డీఈవో రామారావునిర్మల్ రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో పొరపాట్లు జరగకుండా చూడాలని డీఈవో రామారావు సూచించారు. కలెక్టరేట్లో పదో తరగతి పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై సీఎస్, డీవోలతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈ వో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలు ప్రకారం పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. పరీక్ష కేంద్రంలో వసతులు ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని తెలిపా రు. పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు నిషేధమని పేర్కొన్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆరోగ్య కార్యకర్తలు అందుబాటులో ఉండాలని, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రశ్న పత్రాలు తీసుకురావడం, జవాబు పత్రాలు తరలింపు జాగ్రత్తగా పోలీస్ సమక్షంలో జరగాలని సూచించారు. మాస్ కాపీయింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ జరగకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ పద్మ మాట్లాడుతూ.. ఈ ఏడాది మొత్తం 9,129 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, 47 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈసారి కొత్తగా 24 పేజీల జవాబు పత్రాల బుక్లెట్ ఇస్తామన్నారు. వెంకటరమణ, సమన్వయకర్త ప్రవీణ్కుమార్, డీసీఈబీ సహాయ కార్యదర్శి భానుమూర్తి, అధికారులు పాల్గొన్నారు. -
నిర్మల్
లెక్కింపు పెద్ద కథే..! పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 3న కరీంనగర్లో జరగనుంది. ఫలితం తేలేందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 20258లోu బాలుర వసతి గృహం తనిఖీ నర్సాపూర్(జి): మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్టీ బాలుర వసతి గృహాన్ని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జాదవ్ అంబాజీ శనివారం తనిఖీ చేశారు. హాస్టల్లో సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఇటీవల విద్యార్థులకు చికున్ పాక్స్ సోకడంతో వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రమోద్చంద్రారెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక, డాక్టర్ రాజశేఖర్రెడ్డి, సూపరింటెండెంట్ హేమ, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ దుర్గాభవాని, హెచ్ఎం ముత్యం పాల్గొన్నారు. సైవేని(40) అనే మహిళ కొన్నిరోజులుగా తీవ్రమైన తలనొప్పి, మైకం, వికారం వంటి లక్షణాలతో బాధపడుతుంది. ఎన్సీడీ సర్వేలో ఈమెకు పరీక్షలు నిర్వహించగా అధిక రక్తపోటు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ముందస్తుగా వ్యాధిని గుర్తించడంతో ఆమె మందులు వాడి ప్రస్తుతం రక్తపోటును అదుపులో ఉంచుకుంది. జీవన శైలిలో మార్పు రావాలి.. ప్రస్తుతం 30 ఏళ్లకే బీపీ, షుగర్ వస్తోంది. జీవన శైలిలో స్వల్ప మార్పులతోనే వీటిని అరికట్టవచ్చు. యువత జంక్ ఫుడ్కు అలవాటు పడడం, వాకింగ్ చేయకపోవడంతో ఈ వ్యాధులు వస్తున్నాయి. ఆహారంలో ఉప్పు చాలా మేరకు తగ్గించి ఒత్తిడి లేకుండా జీవించాలి. నిర్ణీత సమయంలో వ్యాధిని గుర్తించి తగిన చికిత్స చేసుకోవడం ద్వారా నియంత్రించవచ్చు. – డాక్టర్ శ్రీనివాస్, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి వ్యాయామం లేకనే.. ఒత్తిడి కారణంగా ఈ జబ్బులొస్తున్నాయి. వ్యాయామం లేదు, సరైన ఆహారం తీసుకోవడం లేదు. పిల్లలు ఎలక్ట్రానిక్ పరికరాల ప్రభావానికి లోనవుతున్నారు. దీని నుంచి బయటపడాలంటే వారిని క్రీడలవైపు మళ్లించాలి. పెద్దవారు యోగా చేయాలి. శారీరక వ్యాయామం లేకుంటే చిన్న వయసులోనే దీర్ఘకాలిక వ్యాధులబారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. – డాక్టర్ రత్నాకర్, ఫిజీషియన్ జిల్లా కేంద్రానికి చెందిన జమున(35) అనే మహిళకు కొద్ది రోజులుగా అధిక దాహం, అధిక మూత్ర విసర్జనతో ఇబ్బంది పడుతోంది. ఇటీవల జిల్లా కేంద్రంలో వైద్యారోగ్య శాఖ ద్వారా చేపట్టిన ఎన్సీడీ సర్వేలో వైద్య సిబ్బంది ఆమెకు పరీక్షలు చేశారు. ఇందులో జమునకు షుగర్ నిర్ధారణ అయింది. దీంతో వైద్య సిబ్బంది ఆమెకు మందులు అందజేసి వ్యాధి అదుపులో ఉండేందుకు సూచనలు చేశారు. ఈ రోజుల్లో ఎంతో మంది అనేక సమస్యలతో బాధపడుతున్నారు. సరైన పోషకాలున్న ఆహార పదార్థాలను తీసుకోకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి తదితర కారణాల వల్ల మనిషి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇక ఉరకలేస్తున్న యువత ఉడుకు నెత్తురులోకి బీపీ, షుగర్ ప్రవేశిస్తున్నాయి. గుట్టుగా ఒంట్లోకి జొరబడి.. మెల్లగా ఆరోగ్యాన్ని కుదేలు చేస్తున్నాయి. వృద్ధాప్యంలో రావాల్సిన ఈ జబ్బులు.. 30 ఏళ్లు దాటగానే బయటపడడం కలవరపెడుతోంది నిర్మల్చైన్గేట్: జిల్లాలో 30 ఏళ్లు దాటిన వారు వ్యాధులబారిన పడుతున్నారు. రక్తపోటు, మధుమేహం సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ రెండు వ్యాధులు వారిని ఆస్పత్రులపాలు చేస్తున్నాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీస్(ఎన్సీడీ) పేరుతో ప్రత్యేక కార్యక్రమం అమలుచేస్తూ బీపీ, షుగర్ బాధితులను గుర్తించి వైద్యంతోపాటు మందులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో చేపట్టిన స్క్రీనింగ్లో 79,199 మందికి బీపీ, 37, 902 మంది షుగర్తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు జిల్లాలోని ఎన్సీడీ కార్నర్లు, క్లినిక్ల ద్వారా అందిస్తున్న సేవలు విస్తృతం కావడం, పెద్దసంఖ్యలో పరీక్షలు చేస్తుండడంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. అదేస్థాయిలో చికిత్స కూడా అందుతోంది. వంశపారపర్యంగానూ.. డయాబెటిస్ ఎక్కువగా వంశపార్యపరంగా, వయస్సు పెరిగే కొద్దీ వస్తోంది. దీంతోపాటు స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉండటం వల్ల పాంక్రియాటిక్ గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి ఈ వ్యాధి లక్షణాలు బయటకు వస్తాయి. చిన్నారులు నిత్యం టీవీ ఎదుట కూర్చొని చిరుతిండి తినడం, ఎలాంటి వ్యాయామం లేకుండా ఉండటం వల్ల ఊబకాయం పెరిగి అది డయాబెటిస్కు దారి తీస్తోంది. దీంతో శరీరం అధికంగా లావు పెరుగుతుంది. చిన్న వయసులో ఎత్తు కంటే అధికంగా బరువు పెరగడం వల్ల రాత్రి నిద్రించే సమయంలో కొన నాలుక అడ్డుపడి నిద్ర పట్టక మానసిక ఒత్తిడికి గురవుతారు. నిర్లక్ష్యంతో పెరుగుతున్న నష్టం.. చాలా మంది బీపీ, షుగర్ బాధితులు తాము వాటి బారిన పడిన సంగతే గుర్తించడం లేదు. నిర్లక్ష్య ధోరణి కారణంగా రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, తగిన వ్యాయామం లేకపోవడం, సమయానికి తినకపోవడం వంటి కారణాలతో ఈ పరిస్థితి ఎదురవుతోందని చెబుతున్నారు. జిల్లాలో 30 ఏళ్లు పైబడిన జనాభాలో 79,199 మంది బీపీ, 37,902 మంది షుగర్తో బాధపడుతున్నట్లు తేలింది. చిన్నారులూ.. బాధితులే ఇటీవల కాలంలో పిల్లల్లోనూ డయాబెటిస్ బయట పడటం ఆందోళన కలిగిస్తోంది. జన్యుపరమైన లో పంతో పుట్టిన సమయంలోనే ఎక్కువగా పిల్లలకు ఈ వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉంది. ఇటీవల పదేళ్లలోపు పిల్లలూ ఈ వ్యాధి బారినపడుతున్నా రు. త్వరగా అలసిపోవడంతోపాటు వెనువెంటనే ఆకలిగా అనిపించడంతో బాధిత పిల్లలు చదువుతో పాటు ఇతర ఆటలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. న్యూస్రీల్ 30 ఏళ్లు దాటగానే ముసురుకుంటున్న వ్యాధులు ఎన్సీడీ స్కీన్రింగ్తో గుర్తింపు.. మారుతున్న జీవనశైలే కారణమంటున్న వైద్యులు ఒత్తిడి, తీరిక లేని శ్రమతో మానసిక స్థితిపై ప్రభావంనియంత్రణే మార్గం రక్తపోటు, మధుమేహం ఒక్కసారి సోకితే నియంత్రణ తప్ప నివారణకు అవకాశం ఉండదు. ఇలాంటి వ్యాధుల కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం కింద నాన్ కమ్యూనికేబుల్ డీసీస్ కార్యక్రమాన్ని 2018 సెప్టెంబర్లో ప్రారంభించింది. 30 ఏళ్లు పైబడి రక్తపోటు, మధుమేహం గురయ్యే వారిని గుర్తించి ముందస్తుగా వారికి వైద్యసేవలు అందించడం.. తద్వారా వారి ఆయుష్షును పొడిగించడం ఈ పథకం లక్ష్యం. జిల్లాలో పలు విడతలుగా సర్వే నిర్వహించి బీపీ, షుగర్ బాధితులను గుర్తించగా, సంబంధిత సెంటర్ల ద్వారా మందులు తీసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. -
‘సదరం’.. సరళతరం
వాతావరణం ఆకాశం అప్పుడప్పుడు మేఘావృతమవుతుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి ఎక్కువగా ఉంటుంది. చలి ప్రభావం కూడా తగ్గుతుంది. ● దివ్యాంగులకు ప్రత్యేకంగా యూడీఐడీ పోర్టల్ ● సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్.. ● కలెక్టర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్మల్ఖిల్లా: ప్రత్యేక వైకల్యగుర్తింపు (సదరం)కార్డు కోసం యూడీఐడీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ తెలిపారు. హైదరాబాద్ నుంచి సదరం క్యాంపులు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై కలెక్టర్లు, ఇతర అధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్. ఆయా శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. సదరం ధ్రువీకరణ పత్రాల కోసం యూడీఐడీ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా దివ్యాంగులకు అవగాహన కల్పించాలన్నారు. గతంలో సదరం ధ్రువీకరణ పత్రం కోసం మీసేవ, వీఎల్ఈ కేంద్రాలను ఆశ్రయించేవారని, ఇప్పుడు వీటితోపాటు యూడీఐడీ పోర్టల్, సొంత మొబైల్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్, స్లాట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. క్యాంపుల వివరాలు కూడా మెసేజ్ల ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియను ఈనెల నుంచే అమల్లోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. 21 రకాల వైకల్యం కలిగిన వారు యూడీఐడీ(యూనిక్ డిజేబిలిటీ ఐడీ) కార్డును పొందవచ్చని తెలిపారు. ఇదివరకే సదరం ధ్రువీకరణ పత్రం ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వపరంగా అందుతున్న పథకాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. దివ్యాంగులు ఎలాంటి అపోహలకు గురికాకుండా వారికి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ప్లాంట్ల ఏర్పాటు.. పీఎం కుసుం ప్రాజెక్ట్ కింద గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు గ్రామీణ మహిళా సంఘాలను ప్రోత్సహించాలని దివ్య దేవరాజన్ సూచించారు. ఆసక్తి, అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించి అనువైన స్థలాలను గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్డీవో విజయలక్ష్మి, ఆయా శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
● 2021–22 నుంచి పెండింగ్లోనే దరఖాస్తులు ● ఏళ్లుగా సాయం కోసం ఎదురుచూస్తున్న జంటలు
నిర్మల్చైన్గేట్:కుల రహిత సమాజాన్ని నిర్మించి అంతరాలను చెరిపి వేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తోంది. కులాంతర వివాహం చేసుకున్న జంటలకు కొన్నేళ్లుగా నగదు ప్రోత్సాహకాలు అందిస్తోంది. అయితే, జంటలో ఒకరు ఎస్సీ అయి ఉండాలనేది నిబంధన. ప్రస్తుత సమాజంలో పలువురు తల్లిదండ్రులు కులాంతర వివాహాలకు అడ్డుచెప్పడం లేదు. అభిరుచులు, అభిప్రాయాలు కలిస్తే పెద్దలను ఒప్పించి కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. పెద్దలు ఒప్పుకోకున్నా పోలీసులను ఆశ్రయించి ముందుకు సాగుతున్నారు. ఇదంతా బాగానే ఉన్న కులాంతర వివాహం చేసుకున్న వారిని ప్రోత్సహించేలా ప్రభుత్వం ఇచ్చే ఆర్థికసాయం ఏళ్లుగా పెండింగ్ ఉంది. రూ.2.50 లక్షలకు పెంపు... కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ఇస్తు న్న ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. గతంలో రూ.50 వేలు ఉండగా 2019లో దానిని రూ.2.50 లక్షలకు పెంచుతూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా సమాజంలో కులాంతర వివాహలపై అవగాహన పెరిగింది. పెళ్లిళ్లు చేసుకున్న జంటలను కొన్ని కుటుంబాలు తమతో కలుపుకుపోతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకం సకాలంలో అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అవసరమైన ధ్రువపత్రాలు.. వేర్వేరు కులాలకు చెందిన సీ్త్ర, పురుషులు వివాహం చేసుకుంటే.. పెళ్లికి సంబంధించిన ఆధారాలతో జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుడి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అధికారుల విచారణలో అర్హులుగా గుర్తిస్తే ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. తర్వాత సర్కారు నిధులు మంజూరు చేస్తుంది. వివాహం చేసుకున్న జంట మూడు ఫొటోలు, కుల ధ్రువపత్రాలు, వయసు ధ్రువీకరణకు విద్యాసంస్థలు ఇచ్చిన టీసీలు, మార్కుల మెమో, వివాహం చేయించిన అధికారి ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారి ద్వారా పొందిన మ్యారేజ్ సర్టిఫికెట్, వివాహం చేసుకున్న జంట కలిసి తీసిన బ్యాంక్ అకౌంట్ వివరాలు, వివాహానికి సాక్షులుగా ఉన్నవారి వివరాలు, ఆదాయ ధ్రువపత్రం, ఆధార్, రేషన్ కార్డుతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పెండింగ్లో 37 దరఖాస్తులు.. ఈ పథకం కింద ప్రభుత్వాలు ఎస్సీలకు రూ.2.50 లక్షలు అందిస్తున్నాయి. 2011 వరకు రూ.10 వేలు మాత్రమే ఇవ్వగా.. 2012లో రూ.50 వేలకు పెంచారు. ప్రస్తుతం రూ.2.50 లక్షలు అందిస్తున్నాయి. ఈ మొత్తాన్ని కులాంతర వివాహం చేసుకున్న దంపతుల సంయుక్త ఖాతాలో మూడేళ్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. మూడేళ్ల తర్వాత వడ్డీతో కలిపి రూ.3 లక్షలు అవుతుంది. జిల్లాలో 2019 నుంచి 37 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 2024–25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.15 లక్షలను విడుదల చేయగా ఆరుగురు దరఖాస్తుదారులకు అందించారు. ఇంకా 37 అర్జీలు పెండింగ్లో ఉన్నాయి. ‘కల్యాణలక్ష్మి’ వైపు మొగ్గు.. జిల్లాలో కులాంతర వివాహాలు సాధారణమయ్యాయి. గతంలో ఒకే కులం అయితేనే పెళ్లి జరిపించేవారు. సంబంధాలు కలుపుకునే వారు. ఆ పట్టింపులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో అనేక కులాలు ఉన్నప్పటికీ.. అభిరుచులు, అభిప్రాయాలు కలిస్తే చాలు చాలా మంది పెద్దలను ఒప్పించి.. కులాంతర వివాహం చేసుకుంటున్నారు. సకాలంలో ప్రోత్సాహకం అందించకపోవడంతో కులాంతర వివాహం చేసుకున్న జంటలు(పెద్దలు ఒప్పుకున్న వారు) కల్యాణలక్ష్మి పథకం వైపు మొగ్గు చూపుతున్నారు. దరఖాస్తుల వివరాలు ఐదేళ్లలో వచ్చిన దరఖాస్తులు 93 హార్డ్ కాపీ అందజేసిన వారు 82 ఇప్పటివరకు లబ్ధి పొందినవారు 56 పొందిన నగదు రూ.140 కోట్లు ఇంకా లబ్ధిపొందని వారు 37 జమ చేయాల్సిన నగదు రూ.92 లక్షలు పెండింగ్లో ఉన్న సహాయం వివరాలు: ఏడాది దరఖాస్తులు నగదు 2021–22 5 రూ.12.50 లక్షలు 2022–23 7 రూ.17.50 లక్షలు 2023–24 7 రూ.17.50 లక్షలు 2024–25 18 రూ.45 లక్షలు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం.. కులాంతర వివాహం చేసుకున్న జంటలు ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు ఇస్తే స్వీకరిస్తున్నాం. వీటిని పరిశీలించి సాయం మంజూరుపై సమాచారం కూడా చేరవేస్తున్నాం. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే పెండింగ్లో ఉన్నజంటల ఖాతాల్లో జమ చేస్తాం. – రాజేశ్వర్గౌడ్, ఎస్సీ సంక్షేమ అధికారి -
కులాంతరం.. అందని ప్రోత్సాహం
● నర్సాపూర్(జి) మండలానికి చెందిన ఓ వ్యక్తి 2022, మార్చి 23న కులాంతర వివాహం చేసుకున్నారు. అదే ఏడాది మే 24న ప్రభుత్వ ప్రోత్సాహం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. మూడేళ్లు దాటినా ప్రోత్సాహం అందలేదు. అధికారులను అడిగితే త్వరలోనే ఖాతాలో డబ్బులు జమవుతున్నాయని చెబుతున్నారు. ● మామడ మండలానికి చెందిన రవి 2024లో కులాంతర వివాహం చేసుకున్నాడు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రోత్సాహం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. ఏడాది గడిచినా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. -
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి, ఉక్కపోత పెరుగుతుంది. తెల్లవారుజామున చలి ప్రభావం ఉంటుంది. రంజాన్కు ఏర్పాట్లు చేయాలినిర్మల్చైన్గేట్: రంజాన్ మాసం నేపథ్యంలో జిల్లాలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ముస్లింలు ఉపవాసం ఉండే సమయాల్లో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రంజాన్ మాసంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ జానకీషర్మిలతో కలిసి అధికారులు, ముస్లిం మత పెద్దలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. మార్చి 2 నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మసీదుల దగ్గర నిరంతరం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తాగునీరు అందుబాటులో ఉంచాలని, ప్రార్థన సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ముస్లింల సహాయార్థం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. రంజాన్ పండుగ రోజు ఈద్గాలలో ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ జానకీ షర్మిల మాట్లాడుతూ, రంజాన్ మాసంలో ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రార్థనా సమయాల్లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దుకాణాలు అదనపు సమయాల్లో తెరిచి ఉంచేందుకు అనుమతులు ఇస్తామన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, అదనపు ఎస్పీ ఉపేంద్రారెడ్డి, మైనారిటీ సంక్షేమ అధికారి మోహన్ సింగ్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్గౌడ్, జాదవ్ కృష్ణ, రాజేశ్కుమార్, ముస్లిం మత పెద్దలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ
● మూడు దశల్లో నిర్వహణ ● సద్వినియోగం చేసుకుంటే మేలునిర్మల్ రూరల్: డీఎస్సీ–2024లో నియమితులైన ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులకు వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు 3 దశల్లో వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు శిక్షణ అందించనున్నారు. నూతనంగా నియమితులైన ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీఈటీలకు శిక్షణ అందించనున్నారు. మూడు రోజులు తరగతులు.. ఎస్టీటీ ఉపాధ్యాయులకు ఫిబ్రవరి 28, మార్చి 1, 2 తేదీల్లో నిర్మల్ జిల్లా కేంద్రంలో, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు మార్చి 4, 5, 6 తేదీల్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో, పీఈటీలకు మార్చి 10, 11, 12 తేదీల్లో హైదరాబాదులో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు శిక్షణ ఇచ్చేందుకు డీఆర్పీలను విద్యాశాఖ ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. శిక్షణ అంశాలు ఇవీ.. ఉపాధ్యాయులకు వివిధ అంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా పాఠశాలలో పాఠ్యపుస్తకాల సద్వినియోగం, తరగతిగది నిర్వహణ, విద్య అభ్యసన ప్రమాణాల పెంపు, పాఠ్య ప్రణాళికలు, మూల్యాంకన పద్ధతులు, విధానాలు, ఐసీటీ, ఐఎఫ్ఎస్సీ, బోధన, తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాలను పగడ్బందీగా అమలు తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి వచ్చిన శిక్షకులు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. ప్రతీరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ తరగతులు ఉంటాయి. మధ్యాహ్న భోజనం అందజేస్తారు. నిధులు విడుదల.. జిల్లాలో 2024 డీఎస్సీ ద్వారా మొత్తం 288 మంది ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. ఇందులో అత్యధికంగా ఎస్జీటీలు 204 మంది ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్లు 57, భాషా పండితులు 03, పీఈటీలు 04 మంది నియామకమయ్యారు. అయితే శుక్రవారం నుంచి ప్రారంభమైన శిక్షణ తరగతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఉపాధ్యాయునికి రూ.775 చొప్పున మొత్తం జిల్లాకు రూ.2.23 లక్షలు కేటాయించారు. అదేవిధంగా ఒక్కో కేంద్రానికి అదనంగా రూ.వెయ్యి విడుదలయ్యాయి. ఒక్కో శిక్షణ కేంద్రంలో గరిష్టంగా 40 నుంచి 45 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులకు అందించే శిక్షణ తరగతులను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలి. తరగతుల్లో విద్యార్థులకు బోధించే విధానాన్ని విద్యార్థులతో అవలంబించాల్సిన పద్ధతులను శిక్షకులు నేర్పిస్తారు. డిజిటల్ బోధన, అభ్యసన ప్రమాణాల పెంపు, ప్రణాళికలు, మూల్యాంకన పద్ధతులు, అవలంబించాల్సిన విధానాలపై వివరిస్తారు. కొత్త ఉపాధ్యాయులకు ఈ శిక్షణ తరగతులు ఎంతో వరం లాంటివి. విద్యార్థుల్లో విద్య ప్రమాణాల పెంపునకు దోహదం చేస్తాయి. – రామారావు, డీఈవోశిక్షణ పొందే ఉపాధ్యాయుల వివరాలు భాషా పండితులు 03 పీఈటీలు 04 ఎస్జీటీలు 204 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 20 స్కూల్ అసిస్టెంట్లు 57 మొత్తం 288 -
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
● సీఎస్ శాంతికుమారినిర్మల్ చైన్గేట్: ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలతో బీఆర్.అంబేద్కర్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య, పరీక్ష కేంద్రాల సంఖ్య, పరీక్షల విధులు నిర్వహించే సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్ష విధులు నిర్వహించే అధికారులందరికీ శిక్షణ ఇవ్వాలని సీఎస్ ఆదేశించా రు. పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీలను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ రుసుంలో 25 శాతం రాయితీని కల్పించినందున మార్చి 31లోగా క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులతో సమీక్ష చేశారు. మార్చి 5 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎల్ఆర్ఎస్ (లే అవుట్ల క్రమబద్ధీకరణ) దరఖాస్తుదారులంతా క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకునేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. -
పెరిగిన ఓటు.. మొగ్గు ఎటు?
నిర్మల్ఘనంగా సైన్సు దినోత్సవం జాతీయ సైన్సు దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సైన్స్ ఫెయిర్లో వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించారు. బాబోయ్ దొంగలు తానూరు మండలంలోని పలు గ్రామాల్లో వరుస దొంగతనాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వారం రోజుల్లోనే నాలుగు వరుస దొంగతనాలు జరిగాయి. శనివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 20259లోu ఆ ఉపాధ్యాయులను అరెస్టు చేయండి ● నర్సాపూర్ పోలీసులకు ఎస్పీ ఆదేశం నర్సాపూర్ (జి): మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఎస్పీ జానకీ షర్మిల, ఏఎస్పీ రాజేశ్మీనా శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను పరిశీలించారు. కేసుల పురోగతిపై వివరాలను ఎస్సై సాయికిరణ్ను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులపై పోక్సో కేసు నమోదు చేసినా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. వెంటనే వారు ఎక్కడ ఉన్నా అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. ‘హలో అన్న.. మీ నిజామాబాద్ల ఓట్లు ఎటేసిండ్రు.. ఎవరికి ఎక్కువచ్చేటట్లున్నయ్..? మా ఆదిలాబాద్లైతే ఎటూ చెప్పస్తలేదు. మెదక్, కరీంనగర్ల కూడా ఇట్లనే ఉన్నదట. టీచర్లదైతే పక్కా అయినట్లే కనిపిస్తున్నది కన్ని.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీదే చెప్పస్తలేదని అంటున్నరు...’ ఇలా పోలింగ్ పూర్తయిన నుంచే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఆరా తీస్తున్నారు. తమ జిల్లానే కాదు.. మిగిలిన మూడు ఉమ్మడి జిల్లాల్లోని తమ దోస్తులు, బంధువులకూ ఫోన్లు చేసి తెలుసుకుంటున్నారు. మరోవైపు గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పట్టభద్రులు, టీచర్స్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గణనీయంగా పోలింగ్ నమోదైంది. –నిర్మల్గతానికి భిన్నంగా.. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు గతానికి భిన్నంగా జరిగాయని చెప్పొచ్చు. సంబంధిత అధికారులకంటే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుని రంగంలోకి దిగిన అభ్యర్థులు ఓటర్ల ఎన్రోల్మెంట్ కోసం విశేష కృషిచేశారు. బలమైన ప్రత్యర్థులు ఉండటంతో అభ్యర్థులు ఎన్నికలతోపాటు ఎన్రోల్మెంట్ కోసమూ పోటీపడాల్సి వచ్చింది. ఇందుకోసం జిల్లాల వారీగా ప్రత్యేక టీమ్లను పెట్టుకున్నారు. ‘హలో మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎన్రోల్ చేయించుకున్నారా..!?’ అంటూ తరచూ ఫోన్లు చేస్తూ పట్టభద్రులు, టీచర్ ఓటర్లను పెంచే ప్రయత్నం చేశారు. ఈమేరకు గత ఎన్నికల కంటే ఓటర్ల సంఖ్య పెరగడం గమనార్హం. ఓటర్లుగా ఎన్రోల్ చేయించుకోవడమే కాకుండా.. ఈసారి ఓపికగా గంటలపాటు వరుసలో నిల్చోని మరీ తమ ఓటును వేశారు. క్యాస్ట్–క్యాష్ ఈక్వేషన్లో.. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి కులం, డబ్బు బాగానే ప్రభావం చూపాయన్న చర్చ కొనసాగింది. పార్టీలు సైతం వీటి ఆధారంగానే అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఇందులో ఏపార్టీకి ఏది వర్కవుట్ అయ్యిందనే దానిపైనా లెక్కలు వేస్తున్నారు. అభ్యర్థులు, పార్టీలు మాత్రం ఎవరిది వారే గెలుపు ఖాయమన్నట్లుగా చెబుతున్నారు. ఎన్నికలకు కాస్త ముందు తెరపైకి వచ్చిన బీసీ నినాదం, బరిలో నిలువకుండా ఉన్న బీఆర్ఎస్ సహకారం, అభ్యర్థుల తీరుతెన్నులు, పార్టీలకు ఉన్న ఆదరణ వీటితో పాటు చివర్లో డబ్బులూ పోలింగ్పై ప్రభావం చూపినట్లు చాలామంది ఓటర్లు అంచనా వేస్తున్నారు. ఈసారి టీచర్ల ఎమ్మెల్సీ స్థానం కంటే పట్టభద్రుల స్థానంపై ఆసక్తి ఎక్కువగా ఉంది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే.. ఎమ్మెల్సీ పోలింగ్, కౌంటింగ్ భిన్నంగా ఉండటం, పట్టభద్రులు, టీచర్లు చదువుకున్నవారు కావడం, నియోజకవర్గాలు నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉండటంతో ఫలితాలపై పక్కాగా అంచనా వేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. న్యూస్రీల్ఓట్లు ఎటుపడ్డయో..! జిల్లావ్యాప్తంగా పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా పోలింగ్ కావడమూ చర్చనీయాంశంగా మారింది. ఈ ఓట్లు ఎటుపడ్డాయోనని పోలింగ్ పూర్తయిన నుంచే లెక్కలు వేస్తున్నారు. ప్రధానంగా పోటీ చేసిన అభ్యర్థులు, వారి పార్టీల నేతలు తమ దగ్గరగా ఉండే వివిధ వర్గాల వారికి ఫోన్లు చేస్తూ.. ఓటింగ్ సరళిపై ఆరాతీస్తున్నారు. వారు చెప్పిన అంశాలను నోట్ చేసుకుంటూ ఓట్ల లెక్కలపై అంచనా వేసుకుంటున్నారు. రికార్డు స్థాయిలో ‘ఎమ్మెల్సీ’ పోలింగ్ భారీగా పెరిగిన ‘గ్రాడ్యుయేట్స్’ టీచర్స్ ఓటింగ్ కూడా.. గత ఎన్నికలను మించి పోలింగ్ ఓట్లు ఎటు పడ్డాయంటూ ఆరాపెరిగిన పోలింగ్.. గత ఎన్నికల్లో పట్టభద్రుల స్థానానికి 56.69శాతం ఓట్లు నమోదుకాగా, ఈసారి 72.59(నిర్మల్ డివిజన్–72.77 భైంసా డివిజన్–72.12)శాతం నమోదైంది. ఈలెక్కన ఈసారి పట్టభద్రులు ఏకంగా 15.9శాతం ఓటింగ్ను పెంచారు. ఉపాధ్యాయుల పోలింగ్శాతంతో పోలిస్తే మొత్తం ఓటర్లలో తక్కువగా నమోదైనా.. గత ఎన్నికలతో పోలిస్తే మాత్రం గణనీయంగా పెరిగింది. ఇక ఉపాధ్యాయుల స్థానానికి గత ఎన్నికల్లో 82 శాతం ఓట్లు పడ్డాయి. ఈసారి 89.27(నిర్మల్ డివిజన్–89.07 భైంసా డివిజన్–89.73)శాతం పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే మరో 7.27శాతం ఓటింగ్ పెరగడం గమనార్హం. తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్నప్పటికీ అందులో దాదాపు 90 శాతం పోల్ అవ్వడంపై ఉపాధ్యాయ, అధికారవర్గాలూ హర్షం వ్యక్తంచేస్తున్నాయి. -
మహిళా సాధికారతకు బ్యాంకుల చేయూత
● అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ నిర్మల్చైన్గేట్: మహిళా సాధికారతకు బ్యాంకులు చేయూత అందిస్తున్నాయని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు 2కే రన్ నిర్వహించారు. ఫైజాన్ అహ్మద్ జెండా ఊపి ప్రారంభించారు. మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించేలా, అవగాహన కల్పించేలా నినాదాలు చేస్తూ ఈ 2కే రన్ ర్యాలీ సాగింది. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాట్లాడారు. కార్యక్రమ ముఖ్య ఉద్దేశం బ్యాంకుల ద్వారా మహిళలు అన్నిరంగాల్లో పరిపుష్టి సాధించడమే అన్నారు. ఆయా పథకాలకు, రుణాలకు అర్హులైన మహిళలందరూ వాటిని సద్వినియోగం చేసుకుని ఎదగాలన్నారు. మహిళలకు సంబంధించి ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న అన్ని రకాల పథకాలపై అధికారులు మహిళలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. స్వయం సంఘాలకు చేయూతనివ్వడానికి ఎన్నోరకాల పథకాలు ఉన్నాయని, మహిళా సాధికారిత సాధించడానికి ఈ పథకాలు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. మహిళలు, ట్రాన్స్ జెండర్లు బ్యాంకు ఖాతాలు కలిగి ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్గోపాల్, జెడ్పీ సీఈవో గోవింద్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, మెప్మా పీడీ సుభాష్, వెనుకబడిన తరగతుల అధికారి రాజేశ్వర్గౌడ్, సీడీపీవో నాగలక్ష్మి, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ అశోక్కుమార్, మహిళలు, బ్యాంకర్లు, అధికారులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి నెట్బాల్ పోటీలకు ట్రిపుల్ఐటీ విద్యార్థి
బాసర: బాసరలోని ఆర్జీయూకేటీ విద్యార్థి కె.వెంకటేశ్ జాతీయస్థాయి నెట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడని ఇన్చార్జి వీసీ గోవర్ధన్ తెలిపారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 3 వరకు హర్యానాలోని కలింగలో జరుగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాడని పేర్కొన్నారు. వర్సిటీ విద్యార్థి జాతీయ పోటీలకు ఎంపిక కావడంపై ఇన్చార్జి వీసీ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి ఏడుగురు ఎంపిక కాగా, అందులో అందులో ఆర్జీయూకేటీ విద్యార్థి ఉండడం గర్వకారణమని తెలిపారు. అభినందించిన వారిలో స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్రావు, ఫిజికల్ డైరెక్టర్ శ్యాంబాబు, పీటీలు ఉన్నారు. వెంకటేశ్ -
సర్కారు బడి విద్యార్థులకు ట్యాబ్లు
మంచిర్యాలఅర్బన్: సర్కారు బడి విద్యార్థులకు ట్యాబ్లు అందుబాటులోకి రానున్నా యి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతిక విద్య అమల్లో భాగంగా చర్యలు వేగవంతం చేశాయి. ఇప్పటికే పీఎంశ్రీలో ఎంపిక చేసిన పాఠశాలలకు మొదటి విడతలో కంప్యూట ర్లు, యూపీఎస్, ఇన్వర్టర్లు మంజూరు చేయగా విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చేందుకు కసర త్తు పూర్తయింది. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకంలో భాగంగా విద్యార్థులకు ట్యా బ్ల ద్వారా బోధన చేయనున్నారు. ఉపాధ్యాయులు బోర్డుపై బోధించే అంశాలను నేరుగా చూసేలా అవకాశం కల్పించనున్నారు. ఒక్కో పాఠశాలకు 25 ట్యాబ్లను త్వరలోనే సరఫరా చేయనున్నారు. సెల్కాన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సాంసంగ్ ఏ7 లైట్(ఎస్ఎం–టీ225) ట్యాబ్లు మంజూరు చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పీఎంశ్రీ కింద ఎంపికై న ఒక్కో పాఠశాలకు 25 చొప్ప్పున 1350 ట్యాబ్లు మొదటి విడతలో మంజూరయ్యాయి. త్వరగా ట్యాబ్లను విద్యార్థులకు అందించి పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలు, అనుమానాలను నివృత్తి చేసేలా బోధన చేయనున్నారు.జిల్లా పాఠశాలలు ట్యాబ్లు ఆదిలాబాద్ 13 325 ఆసిఫాబాద్ 10 250 మంచిర్యాల 16 400 నిర్మల్ 15 375 -
‘నయనం’ ప్రధానం
● విద్యార్థి దశలోనే దృష్టి లోపాలు ● ఆర్బీఎస్కే స్కీం కింద పరీక్షలు ● జిల్లాలో 1,578 మందికి సమస్య ● త్వరలో వీరికి కళ్లద్దాల పంపిణీనిర్మల్చైన్గేట్: ఒకప్పుడు వయస్సు మీరిన వారికి వచ్చే కంటి సమస్యలు ఇప్పుడు చిన్నారులకూ వస్తున్నాయి. పోషకాహార లోపం, సెల్ఫోన్ వినియోగం, ఎక్కువ సమయం టీవీలు చూడడంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయి. విద్యార్థుల శ్రేయస్సు కోసం రాష్ట్రీయ బాల స్వాస్థ్య (ఆర్బీఎస్కే) కార్యక్రమం, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈనెల 17నుంచి ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు ఉచిత నేత్రపరీక్షలు నిర్వహిస్తున్నారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్యారోగ్య శాఖ, ఆర్బీఎస్కే కార్యక్రమం సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో ఐదు నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న వారికి కంటి పరీక్షలు నిర్వహిస్తోంది. వైద్య నిపుణుల బృందాలు పాఠశాలల్లో ఇప్పటివరకు 46,453 మందికి స్క్రీనింగ్ చేశాయి. మూడు విడతల్లో నిర్వహించిన వైద్యపరీక్షల్లో 1,578 మంది పిల్లలు కంటిచూపు సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కొంతమంది దూరపు చూపు, మరికొందరు దగ్గరి చూపు సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు నిర్ధారించారు. మెజార్టీ పిల్లలు కనీసం అక్షరాలు చదవలేకపోతున్నట్లు తేల్చారు. అతుక్కుపోతున్నందునే..పాఠశాలల నుంచి ఇంటికి చేరిన వెంటనే చాలామంది పిల్ల లు సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. గంటల తరబడి వీడియో గేమ్లు ఆడుతున్నారు.. కార్టూన్ సీరియళ్లు చూస్తున్నారు. హోం వర్క్ కంటే వీటిపైనే అధికంగా దృష్టి సారిస్తుండడంతో చిన్న వయసులోనే సోడాబుడ్డి లాంటి కంటి అద్దాలు ధరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా సమయంలో ఆన్లైన్ విద్యతో తల్లిదండ్రులు కూడా విద్యార్థులను తప్పనిగా సెల్ఫోన్ వినియోగంవైపు మళ్లించాల్సిన అవసరం ఏర్పడింది. అదికాస్త అలవాటుగా మారి దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ ఆస్పత్రులకు తరలించి..మసక చూపుతో బాధపడుతున్న నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాలకు చెందిన పిల్లలను జిల్లా జనరల్ ఆస్పత్రి, ముధోల్ నియోజకవర్గానికి చెందిన పిల్లలను భైంసా ఏరియాస్పత్రికి తరలించి పరీక్షలు చేయిస్తున్నారు. ఒక్కో ఆస్పత్రిలో రోజుకు 80–100 మంది విద్యార్థులకు మూడో విడత చెకప్ చేస్తున్నారు. వీరిలో కంటి అద్దాలు అవసరమైన వారికి నిర్ధారించిన సైట్ పర్సంటేజీ, ఫ్రేమ్లు, అద్దాలకు ఆర్డర్లు కూడా ఇస్తున్నారు. వార్షిక పరీక్షల ప్రారంభానికి ముందే వీరికి అద్దాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 1,578 మంది విద్యార్థులకు సంబంధించి అద్దాలకు ఆర్డర్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.పరీక్షలు నిర్వహిస్తున్నాం వైద్యశిబిరంలో నిపుణులైన వైద్యులు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. గతంలో దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు తిరిగి పరీక్షలు చేయిస్తున్నాం. జిల్లా జనరల్ ఆస్పత్రితో పాటు భైంసా ఏరియాస్పత్రిలో కంటి వైద్యశిబిరం కొనసాగుతుంది. – శ్రీనివాస్, ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి సమస్యలకు కారణాలివే.. కంటి సమస్యతో బాధపడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. విటమిన్ ‘ఏ’ కంటి సమస్యలు రాకుండా చూస్తుంది. ఇందుకు పిల్లలకు పాలు, గుడ్లు, కూరగాయలు, ఆకుకూరలు, చేపలు రోజువారీ ఆహారంలో ఇవ్వాలి. సెల్ఫోన్లు, టీవీలు చూసినపుడు వాటి స్క్రీన్ నుంచి వచ్చే కాంతి కిరణాలు పిల్లల కంటిపై పడి దృష్టిలోపం రావడానికి కారణమవుతున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం కూడా కంటి సమస్యలకు కారణం కావచ్చు. ఎంత చిన్న కంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యులకు చూపించాలి. – సురేశ్, సీనియర్ నేత్ర వైద్యుడు -
పోలింగ్ ప్రశాంతం
నిర్మల్: ఉపాధ్యాయులు ఓటెత్తారు.. పట్టభద్రులు పోటెత్తారు. మొత్తం మీద రికార్డుస్థాయిలో ఓటు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ పోలింగ్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు గురువారం నిర్వహించిన ఎన్నికల్లో భాగంగా జిల్లాలో 46పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. ఉదయం 8గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 4గంటల వరకు కేంద్రాల్లో ఉన్నవారిని ఓటేసేందుకు అనుమతించారు. చాలా కేంద్రాల్లో పోలింగ్ మందకొడిగా సాగడంతో రాత్రి వరకూ పోలింగ్ కొనసాగింది. పలు కేంద్రాల్లో పోలింగ్ నెమ్మదిగా సాగడంపై పలువురు పట్టభద్రులు, టీచర్లు అసహనం వ్యక్తంచేశారు. కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల, అడిషనల్ కలెక్టర్లు, ఏఎస్పీలు జిల్లాలోని వివిధ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటింగ్ ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టారు. దివ్యాంగులతో సహా ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా సిబ్బంది సహకరించారు. మందకొడిగా ప్రారంభమై..ఎమ్మెల్సీ ఎన్నిక ఉదయం 8గంటలకే ప్రారంభమైంది. ఒకరోజు ముందు శివరాత్రి పర్వదినం ఉండటం పోలింగ్పై కాస్త ప్రభావం చూపింది. పర్వదినాన రాత్రంతా జాగారం, ఉదయాన్నే ఉపవాసాలు వీడటం క్యాక్రమాలు ఉండటంతో చాలామంది ఉదయం వేళల్లో రాలేదు. 10గంటల తర్వాత నుంచే క్రమంగా ఓటర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ కేంద్రాల్లో బారులు తీరారు. అధికారులు ప్రతీ రెండు గంటలకోసారి ఓటింగ్శాతాన్ని వెల్లడించారు. ‘ఉపాధ్యాయ’ ఉత్సాహంపట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లాలో 17,141మంది పట్టభద్రుల ఓటర్లుండగా 12,442 మంది ఓటేశారు. పోలింగ్ 72.59శాతంగా నమోదైంది. టీచర్లతో పోలిస్తే గ్రాడ్యుయేట్స్ కాస్త నిరాశపర్చారు. జిల్లాలో 1,966 మంది మాత్రమే ఉన్న ఉపాధ్యాయులు ఉత్సాహంగా కనిపించారు. 1,755 మంది ఓటు వేయగా 89.27శాతంగా పోలింగ్ నమోదు కావడం విశేషం. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థితో పాటు పట్టభద్రుల అభ్యర్థికీ ఉపాధ్యాయులు ఓటేశారు. రెండు పోలింగ్బూత్లు వేర్వేరు చోట్ల ఉన్నా.. రెండుచోట్లకు వెళ్లి, దాదాపు గంటకు పైగా లైన్లలో ఓపికతో వేచి ఉండి మరీ ఓటేశారు. ఎండ వేడిని కూడా లెక్క చేయకుండా చాలామంది మధ్యాహ్నం వేళలోనే ఓటు వేయడానికి వచ్చారు. ఉపాధ్యాయ సంఘాల హల్చల్రాజకీయంగా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు సందడిగా ఉంటాయి. కానీ.. జిల్లాలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే.. రాజకీయ పార్టీల కన్నా.. ఉపాధ్యాయ సంఘాలే హల్చల్ చేశాయి. పార్టీ నాయకుల కన్నా ఈ సంఘాల నేతల సందడి కనిపించింది. ఓటర్లను గుర్తించడం, వారిని ఓటు వేసేందుకు రప్పించడంలో సంఘాలు కీలకపాత్ర పోషించాయి. ఈ మేరకే ఉపాధ్యాయ పోలింగ్శాతం అధికంగా నమోదైంది. ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఉపాధ్యాయ సంఘాలు టెంట్లు వేసుకుని మరీ కూర్చున్నాయి. సంఘాల వారీగా ఓటర్లకు తమ మద్దతు ఉన్న అభ్యర్థిని గెలిపించాలంటూ నూరిపోశాయి. ఇక పట్టభద్రుల స్థానానికి పోటీ పడుతున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఆయా పార్టీల స్థానిక నాయకులు అండగా నిలిచారు. పోలింగ్ కేంద్రాల వద్ద నుంచి ఓటర్లను రప్పించడం, ఓటేయించడం చేశారు. బీఎస్పీ నుంచి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి బరిలో ఉన్నా.. వారికి సంబంధించిన నేతలు పెద్దగా కనిపించలేదు. ఓటేసిన ముఖ్యులు..జిల్లాకు చెందిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో, డీసీసీ అ ధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు మామడ ప్రభుత్వ ఉ న్నత పాఠశాలలో ఓటు వేశారు. బీఎస్పీ టీచర్ ఎ మ్మెల్సీ అభ్యర్థి యాటకారి సాయన్న, స్వతంత్ర అ భ్యర్థి నంగె శ్రీనివాస్ జిల్లాకేంద్రంలో ఓటేశారు. బీ జేపీ జిల్లా అధ్యక్షుడు రితేశ్రాథోడ్ ఆదిలాబాద్ జి ల్లా ఉట్నూర్లో ఓటు వేయగా, బీజేఎల్పీ నేత మ హేశ్వర్రెడ్డి హైదరాబాద్లో ఉండటం గమనార్హం. కేంద్రాలను పరిశీలిస్తూ.. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి చే యడానికి యంత్రాంగమంతా శ్రమించింది. ప్రధానంగా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ ష ర్మిల తరచూ సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికలు వి జయవంతం చేశారు. కలెక్టర్, ఎస్పీ, అడిషనల్ కలెక్టర్లు, ఏఎస్పీలు జిల్లావ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 89.27 శాతం నమోదైన పోలింగ్ పట్టభద్రుల స్థానానికి 72.59 శాతం కేంద్రాలను పరిశీలించిన అధికారులుఓటేసిన అంధుడు నర్సాపూర్(జి): అవయవాలన్నీ సక్రమంగా ఉన్నా ఓటు వేయడానికి కొందరు పట్టభద్రులు బద్ధకిస్తుంటారు. అంధుడైన పట్టభద్ర ఓటరు చెల్లెలి సహకారంతో ఓటు వేసి ఆదర్శంగా నిలిచాడు. నర్సాపూర్ (జి) మండల కేంద్రానికి చెందిన ఎడ్దూర్ ప్రవీణ్కుమార్ దిలావర్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనను విధులకు తీసుకొచ్చి తీసుకెళ్లే తండ్రి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఓటు వేయాలనే సంకల్పంతో ప్రవీణ్కుమార్ చెల్లెలు సహాయంతో మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నాడు. చూపులేకపోయినా తన చెల్లెలు సాయంతో వచ్చి ఓటేసిన ప్రవీణ్కుమార్ను పలువురు అభినందించారు. పోలీసుల పనితీరు భేష్ : ఎస్పీనిర్మల్టౌన్: ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరు అభినందనీయమని ఎస్పీ జానకీ షర్మిల పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పలు పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీలు ఉపేంద్రరెడ్డి, అవినాశ్కుమార్, రాజేశ్మీనా, ఇన్స్పెక్టర్లు ప్రేమ్కుమార్, మల్లేశ్, ప్రవీణ్కుమార్, ఆర్ఐ రమేశ్, సిబ్బంది ఉన్నారు. -
న్యూస్రీల్
నేడు నేత్ర వైద్యశిబిరం నిర్మల్చైన్గేట్: హైదరాబాద్కు చెందిన గ్లోబ ల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పెన్షనర్ల సంఘ భవనంలో నేత్ర వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగన్న ఓ ప్రకటనలో తెలిపారు. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్యులు పరీక్షించి అవసరమైనవారికి ఉచి తంగా ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు. నేటి నుంచి కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ నిర్మల్ రూరల్: డీఎస్సీ–2024 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు శుక్ర, శని, ఆదివారాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈవో రామారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్జీటీ ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు కస్బా హైస్కూల్, ఎస్జీటీ తెలుగు మీడియం ఉపాధ్యాయులకు గాజుల్పేటలోని పంచశీల్ బీఎడ్ కాలేజీలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
జీవశాస్త్రం
జీవశాస్త్రంలో పాఠాలను అర్థం చేసుకుని చదవాలని నిర్మల్ జిల్లా పార్పెల్లి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు గంగ సురేష్ తెలిపారు. ● పోషణ అనే పాఠ్యాంశంలో ఆకుల్లో పిండి పదార్థాలు కలవని నిరూపించే ప్రయోగం, కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డయాకై ్సడ్ అవశ్యకత, హైడ్రిల్లా, నల్ల కాగితం ప్రయోగం, విటమిన్లు తెలిపే పట్టిక, జీర్ణ వ్యవస్థను సూచించే ఫ్లో చార్ట్, హరిత రేణువు, అమీబా–పోషణ పటం భాగాలు, స్వయం పోషణ– పరపోషణ, కాంతి చర్య–నిష్కాంతి చర్య మధ్య గల భేదాలు చదవాలి. ● శ్వాసక్రియలో ఈస్ట్తో అవాయు శ్వాసక్రియ ప్రయోగం, కార్బన్డయాకై ్సడ్ ఉష్ణోగ్రత విడుదలయ్యే ప్రయోగం, వాయుగోని పటం–భాగాలు, మైటో కాండ్రియా పటం వంటివి చదవాలి. ● ప్రసరణలో పేరు పీడనం ప్రయోగం వ్యాసరూప ప్రశ్న వేసే అవకాశం ఉంది. హృదయం అంతర్నిర్మాణం–పటం భాగాలు ఏకవలయ– ద్వివలయ రక్తప్రసరణ వ్యవస్థ బేధాలు తెలపడంలో ధమనులు–సిరలు, సిస్టోల్–డయస్టోల్, దారువు–పోషక కణజాలం మధ్య గల భేదాలు గుర్తించి అవగాహన చేసుకోవాలి. ● విసర్జన అనే పాఠ్యాంశంలో నెఫ్రాన్ నిర్మాణం వ్యాసరూప ప్రశ్నగా అడిగే అవకాశం ఉంది. ఇతర జీవుల్లో విసర్జన అవయవాలు– అల్కలైడ్ మొక్క పేరు– ఉపయోగాలు పట్టిక, మానవ మూత్రపిండం అడ్డుకోత పటం–భాగాలు బేధాల, విసర్జన– స్రావం మధ్య గల భేదాలు చూసుకోవాలి. ● వనపర్తి వడ్డిచెర్లలోని నీటి వనరుల పరిస్థితి గురించి సమాచార పట్టికలు, కొత్తపల్లిలో నీటి యాజమాన్యంపై ప్రశ్నలు ఉంటాయి. అలాగే అడవుల సంరక్షణపై సమాధానాలు రాయాలి. ● హార్మోన్ల పేర్లు, వాటి ప్రభావం, ఫైటో హార్మోన్లు–ఉపయోగాలు, సమాచార పట్టిక, మానవ మెదడు పటం–భాగాలు తదతర వాటిపై అవగాహన చేసుకోవాలి. ● ప్రత్యుత్పత్తి పాఠ్యాంశంలో మానవ శుక్రకణం పటం–భాగాలు, సీ్త్ర, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు పటం–భాగాలు, పుష్పము పటం– భాగాలు, అండం నిర్మాణం పటం, భాగాలు, భేదాలను చదవాలి. ● ఆమ్లం పత్ర ప్రయోగం సమాచార పట్టికలు, బోలాస్–కై మ్, మాస్టిఫికేషన్–రూమినేషన్ మధ్య గల భేదాలు, అంత్ర చూశకం పటం–భాగాలు చూసుకోవాలి. ● అనువంశికత–పరిణామంలో డార్విన్ సిద్ధాంతం, లామార్కు వాదం, లింగ నిర్ధారణ, ఏక సంకరీకరణ, ద్విసంకరీకరణ వివరణ భేదాలను తెలుసుకోవాలి. ● ఆహారపు గొలుసులు, ఆహారపు, జాలకం జైవిక వృద్ధి కరణ, శక్తి పిరమిడ్ సంఖ్య, పిరమిడ్, విషపూరిత పదార్థాల వాడకం వల్ల జరిగే ప్రభావం ఏంటో చదవాలి. -
కావడి పడితేనే తాగునీరు..
దహెగాం: మండలంలోని చిన్నఐనం గ్రామంలో తాగునీటి తీవ్రమైంది. మిషన్ భగీరథ పైపులైన్ సమస్య కారణంగా నీరు సరఫరా కావడం లేదు. దీంతో గ్రామంలోని మూడు వాడలకు రోజు విడిచి రోజు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. రోజురోజుకు ఎండలు తీవ్రం అవుతుండడంతో గ్రామస్తులు తాగునీటికి అల్లాడిపోతున్నారు. గ్రామానికి అర కిలోమీటరు దూరంలోని ఒర్రె నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. గురువారం గ్రామానికి చెందిన వృద్ధుడు ఏమ రాజయ్య కావడిలో బిందెలతో నీరు తెచ్చుకుంటుండగా ‘సాక్షి’ కెమెరా క్లిక్మనిపించింది. -
గణితం..
గణితం అంటే విద్యార్థులు భయపడుతారు. ప్రణాళిక ప్రకారం చదివితే గణితంలో సులువుగా మార్కులు సాధించవచ్చని నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు జె.శ్రీనివాస్ పేర్కొన్నారు. వాస్తవ సంఖ్యలు: సంయుక్త సంఖ్యలను ప్రధాన కారణాంకల లబ్దంగా రాయడం, యూక్లిడ్ భాగాహార న్యాయం ఆధారంగా గాసాభా కనుగొనడం, ధన బేసి, సరిసంఖ్య రూపం, కరణీయ సంఖ్య అని చూపడం, సంవర్గమనం, లాఘరిథమ్స్ సమస్యలను ప్రాక్టీస్ చేయాలి. సమితిలు: శూన్య, వియుక్త సమితి నిర్వచనాలు, సమితి నిర్మాణ, జాబితా రూపం రాయడం, వీటికి ఉదాహరణలు సమితి సమ్మేళనం, చేదనము సమస్యలను సాధించడం, వెన్ చిత్రాలను గీయడం ప్రాక్టీస్ చేయాలి. బహుపదులు: బహుపది శూన్య విలువలు కనుగొనడం, గ్రాఫ్ నుంచి శూన్యాలను చెప్పడం, వర్గ, ఘన బహుపదుల శూన్యాలు కనుగొనాలి. వర్గ సమీకరణాలు: విచక్షిని కనుగొని మూలాల స్వభావం చెప్పడం, ఆల్ఫా, బీటాలు మూలాలుగా గల వర్గ సమీకరణం రాయడం, రాత సమస్యలకు వర్గ సమీకరణం రాసి గ్రాఫ్ ద్వారా శూన్యాలు కనుగొనాలి. చర రాశుల్లో రేఖీయ సమీకరణాలు: సంగతా, అసంగతా, పరస్పర ఆధారిత సమీకరణాలు ఎలా అవుతాయి, వీటిని కనుగొనడం, సమీకరణాలను చరరాశిని తొలగించడం, ప్రతిక్షేపన పద్ధతి, గ్రాఫ్ పద్ధతుల ద్వారా సాధించాలి. సరూప త్రిభుజాలు: ప్రాథమిక అనుపాత సిద్ధాంతానికి అనువర్తన సమస్యలు, సరూప త్రిభుజాలు నిర్మాణాలు గీయడం. శ్రేడులు: అంక,గుణ శ్రేడుల్లో మొదటి పదం, సామాన్య భేదం, నిష్పత్తులను కనుగొనడం, అంక శ్రేడీలో N వ పదం, N పదాల మొత్తం సంబంధించి సమస్యలు సాధించాలి. సాంఖ్యక శాస్త్రం: ముడి దత్తాంశం ఇచ్చి సగటు, మధ్యగతం, భాహులకాం కనుగొనడం, సగటు, మధ్యగతం, బాహులకం సూత్రం రాసి అందులో పదాలను వివరించాలి. వర్గీకత దత్తాంశానికి సగ టు, మధ్యాగతం, బాహులకం కనుగొనాలి. ఓజీవ్ వక్రాలను గీయడం వంటి వాటిపై సాధన చేయాలి. -
గోదావరి నదికి హారతి
బాసర: మహాశివరాత్రి సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలో సనాతన వేదభారతి పీఠం, వ్యవస్థాపకుడు శ్రీ వేద విద్యానందగిరి స్వామి ఆధ్వర్యంలో గురువారం వేకువజామున గోదావరి నదికి హారతి ఇచ్చారు. గంగమ్మ తల్లి, శివలింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు తరలివచ్యారు. అనంతరం వారికి వేద భారతి పీఠం ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. పాపహరేశ్వర ఆలయంలో.. బాసరలోని శ్రీ పాపహరేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. శివరాత్రిరోజు ఉపవాసం ఉండి భిక్షను స్వీకరించారు. అర్చకుడు నాగేష్ అప్పా తదితరులు ఉన్నారు. -
సూర్యాపూర్లో అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు
కుంటాల: మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని సూర్యాపూర్లో గురువారం అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు నిర్వహించారు. నిజామాబాద్, కరీంనగర్తోపాటు కర్ణాటక మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి 150 మంది మల్లయోధులు పాల్గొన్నారు. అంతకుముందు సూర్యాపూర్ రాజరాజేశ్వర ఆలయంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ పూజలు చేశారు. అనంతరం కుస్తీ పోటీలను వీక్షించారు. పోటీల్లో గెలుపొందిన విజేతకు రూ.6100 నగదు, వెండి కడియం బహూకరించి సన్మానించారు. రెండో విజేతకు రూ.3 వేల నగదు అందజేసి సత్కరించారు. ఎస్సై సీహెచ్ భాస్కరాచారి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. జెడ్పీ మాజీ చైర్మన్ జుట్టు అశోక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్, నాయకులు వెంగల్రావు, రాజరాజేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షుడు మహేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
కాయిన్ కొడితే..కప్ పడాల్సిందే
● క్యారమ్స్లో రాణిస్తున్న సింగరేణి క్రీడాకారుడు ● కోలిండియా పోటీల్లో గోల్డ్మెడల్స్ శ్రీరాంపూర్: సింగరేణి కార్మికులు బొగ్గు ఉత్పత్తిలోనే కాదు ఆటల్లో తమకు తామే సాటి అంటున్నారు. శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 6 గనికి చెందిన జనరల్ మజ్దూర్ కార్మికుడు రేణికుంట్ల సృజన్రావు క్యారమ్స్లో జాతీయస్థాయి పోటీల్లో రాణించి శభాష్ అనిపించుకుంటున్నాడు. బోర్డుపై కూర్చొని కాయిన్స్ కొడితే కప్ తన ఖాతాలో పడాల్సిందే అంటున్నాడు. తనదైన ఆట తీరుతో పలు బహుమతులు సాధించాడు. ఈయన 2020లో కారుణ్య కింద సింగరేణిలో ఉద్యోగంలో చేరారు. సింగరేణిలో రాకముందే ఆయనకు ఈ ఆటపై పట్టుంది. హైస్కూల్ లెవల్ నుంచే క్యారమ్స్పై పట్టు సాధించాడు. ఇంటర్, డిగ్రీలో తన ఆటకు మరింత పదును పెట్టాడు. కళాశాల స్థాయిలో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించాడు. నిజామాబాద్లోని భీంగల్, హైదరాబద్లోని ఖైరతాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీల్లో ప్రతిభ కనబర్చి పలు బహుమతులు అందుకున్నాడు. జాతీయస్థాయిలో పోటీల్లో.. జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఆలిండియా పబ్లిక్ సెక్టార్ కంపెనీల పోటీల్లో ప్రతిభ కనబర్చి పలు బహుమతులు సాధించాడు. 2024 మార్చిలో ముంబయిలో జరిగిన ఈ పోటీల్లో సెమీస్ వరకు వెళ్లాడు. అదే ఏడాది మధ్యప్రదేశ్లోని సింగరోలిలో జరిగిన కోలిండియా పోటీల్లో సింగిల్స్లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. 2025 జనవరిలో జార్జండ్లోని రాంచీలో జరిగిన కోలిండియా పోటీల్లో సింగిల్స్లో గోల్డ్ మెడల్ అందుకున్నాడు. ఈ పోటీల్లో సింగరేణి జట్టు టీం ఛాంపియన్ సాధించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ప్రోత్సహిస్తే శిక్షణ ఇస్తాను కంపెనీ మరింత ప్రోత్సాహిస్తే నేను మెరుగ్గా ఆడటమే కాకుండా మరింత మందికి శిక్షణ ఇచ్చి క్రీడాకారులను తయారు చే స్తాను. కంపెనీ క్లబ్లో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అధికారులు దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే ఉద్యోగులతో పాటు వారి పిల్లలకు ఆట నేర్పించాలని ఉంది. ఈ ఆటలో మహిళలు తక్కువగా ఉన్నారు. పోటీ లేనందున వారు నేర్చుకుంటే సులువుగా రాణించగలుగుతారు. జాతీయ స్థాయిలో పాల్గొంటే చాలు బ్యాంకుల్లో తదితర సంస్థల్లో పిలిచి ఉద్యోగాలు ఇస్తున్నారు. – సృజన్రావు -
చెక్బౌన్స్ కేసులో ఒకరికి ఏడాది జైలు
మంచిర్యాలక్రైం: చెక్బౌన్స్ కేసులో ఒకరికి ఏడాది సాధారణ జైలుశిక్ష విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కె.నిరోష గురువారం తీర్పునిచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సీసీసీ నస్పూర్కు చెందిన వొంటెల సత్యనారాయణరెడ్డి వద్ద 2017లో కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన మ్యాకల సత్యనారాయణరెడ్డి రూ.8 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆ సమయంలో చెక్కులు ఇచ్చాడు. ఒప్పంద ప్రకారం తీసుకున్న అప్పు చెల్లించే గడువు తీరింది. ఆ తర్వాత బ్యాంకులో చెక్కులు డిపాజిట్ చేయగా బౌన్స్ అయ్యాయి. 2019లో కోర్టులో చెక్బౌన్స్ కేసు వేశాడు. విచారణలో భాగంగా సాక్ష్యాదారాలు పరిశీలించి నేరం రుజువు కావడంతో మ్యాకల సత్యనారాయణరెడ్డికి ఏడాది సాధారణ జైలుశిక్షతోపాటు తీసుకున్న అప్పు రూ.8 లక్షలు చెల్లించాలని మేజిస్ట్రేట్ తీర్పునిచ్చింది. దాడి కేసులో ఒకరికి జరిమానా మంచిర్యాలక్రైం: పాత మంచిర్యాలకు చెందిన ఈద శ్రీనివాస్పై దాడి చేసిన కేసులో రావుల రాజ్కుమార్కు రూ.10వేలు జరిమానా విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కె.నిరోష గురువారం తీర్పునిచ్చింది. సీఐ ప్రమోద్రావ్ కథనం ప్రకారం..శ్రీనివాస్కు చెందిన బ్యాంకు అటాచ్డ్ ఉన్న బజాజ్ ఫైనాన్స్లో రాజ్కుమార్కు నెల వాయిదా పద్ధతిలో చెల్లించేందుకు రూ.30 వేల వాషింగ్ మిషన్ ఇప్పించాడు. వాయిదాలు సకాలంలో చెల్లించలేదు. 2021 జూన్ 19న డబ్బులు చెల్లించాలని అడిగినందుకు శ్రీనివాస్పై దాడి చేసి గాయపర్చాడు. బాధితుడి ఫిర్యాదుతో రాజ్కుమార్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షాదారాలు పరిశీలించి తర్వాత నేరం రుజువుకావడంతో రాజ్కుమార్కు జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. -
మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య
దిలావర్పూర్: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని మాడేగాం అనుబంధ గ్రామమైన కదిలికి చెందిన ధానూర్ పాపన్న (34) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసై తరచూ ఇంట్లో గొడవలు చేసేవాడు. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం రాత్రి పాపాన్న.. ఆలయానికి వెళ్తాడని కుటుంబ సభ్యులు భావించారు. వెళ్లకుండా ఇంటి ఎదుట చెట్టుకు ఉరేసుకున్నాడు. గురువారం ఉదయం భార్య గంగాసాగర, కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు 10 సంవత్సరాల లోపు కుమారులు ఉన్నారు. చేపల వేటకు వెళ్లి జాలరి మృతిదిలావర్పూర్: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని జాలరి మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని సముందర్పల్లి అనుబంధ గ్రామమైన కాండ్లికి చెందిన కొత్తూరు భోజన్న (59) గురువారం ఉదయం గ్రామానికి ఆనుకుని ఉన్న ఎస్సారెస్పీ బ్యాక్వాటర్ వద్ద చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో వల చుట్టుకుని మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని దిలావర్ఫూర్ ఎస్సై సందీప్ పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. బోథ్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై ఎల్.ప్రవీణ్ కుమార్ కథనం ప్రకారం.. సొనాల మండల కేంద్రానికి చెందిన బొంపాల పోశెట్టి చేనులో పనినిమత్తం బుధవారం అదే గ్రామానికి చెందిన షేక్ ఇసాక్ వెళ్లాడు. పని ముగించుకుని సాయంత్రం పోశెట్టి బైక్పై ఇసాక్తో సొనాల గ్రామానికి వస్తున్నారు. సాయంత్రం టివిటి క్రాస్రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ వేగంగా ఢీకొట్టింది. పోశెట్టి వెనకాల కూర్చున్న ఇసాక్కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య షాహినాజ్ బేగం ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనాథ శవానికి అంత్యక్రియలు●బెల్లంపల్లి: బెల్లంపల్లిలో అనాథ శవానికి పోలీసులు, మున్సిపల్ సిబ్బంది దహన సంస్కారాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. టూటౌన్ ఎస్సై కె.మహేందర్ కథనం ప్రకారం.. పల్లపు రాజు (44) బెల్లంపల్లి కాల్టెక్స్ ఏరియాలో గత కొంతకాలం నుంచి రోడ్డుపై పడేసిన చిత్తుకాగితాలు, ప్లాస్టిక్ కవర్లు ఏరుకుని జీవనం సాగిస్తూ రోడ్డుపై నిద్రిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం రామకృష్ణ థియేటర్ ముందు రోడ్డుపై రాజు అకస్మికంగా పడిపోయాడు. గమనించిన మహిళ 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే టూటౌన్ కానిస్టేబుల్ రాజీవ్ రతన్, హోంగార్డు సంపత్ ఘటనాస్థలికి చేరుకుని రాజును పరిశీలించి మృతి చెందినట్లుగా నిర్ధారించారు. మద్యం తాగడంతో రాజు మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడికి ఎవరూ లేకపోవడంతో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సంప్రదాయ బద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసు, మున్సిపల్ సిబ్బందిని ఎస్సై మహేందర్ అభినందించారు. -
భౌతిక, రసాయన శాస్త్రం..
భౌతిక, రసాయన శాస్త్రంలో మంచి మార్కులు సాధించాలంటే పాఠాలను అర్థం చేసుకోవాలని లక్ష్మణచాంద ప్రభుత్వ ఉన్నత పాఠశాల భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయుడు సురేష్బాబు తెలిపారు. ● పుటాకార దర్పణాల, కుంభకారా దర్పణాల కిరణ చిత్రాలు బాగా సాధన చేయాలి. ● తుల్య రసాయన సమీకరణాలకు సంబంధించిన సమస్యలు ప్రాక్టీస్ చేయాలి. ● ఆమ్లా, క్షారాలా పీహెచ్ విలువలు గుర్తుంచుకోవాలి. ● దీర్ఘ దృష్టి, హ్రస్వ దృష్టి గురించి వేసే ప్రశ్నలపై సమాధానాలు రాయాలి. ● 20 మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం తెలిసి ఉండాలి. ● పౌలీ వర్జన నియమం, ఆఫ్ బౌ నియమం, హుండ్ నియమం చదువుకోవాలి. ● ఆధునిక అవర్తన పట్టిక ధర్మాలు ప్రతిసారి ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ● లోహ శాస్త్రంలో ఖనిజాలు, దాతువులు వాటి ఫార్ములాలు తెలిసి ఉండాలి. ● కర్బన రసాయన శాస్త్రంలో అల్కేన్, అల్కీ న్, ఆల్కైన్ల మధ్య భేదాలు తెలిసి ఉండా లి. నామీకరణ సూత్రాలు చదువుకోవాలి. -
ఏజెన్సీ అలవెన్స్లు..పట్టణాల నుంచి రాకపోకలు
కాసిపేట: రాష్ట్రప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రత్యేక ఏజెన్సీ అలవెన్స్ అందిస్తున్నా స్థానికంగా ఉండకపోవడంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మండలంలోని లంబాడీతండా, కాసిపేట, ముత్యంపల్లి, ధర్మరావుపే ట, దేవాపూర్ జెడ్పీ పాఠశాలలు, మోడల్, కేజీబీ వీ, రేగులగూడ, మల్కేపల్లి, దేవాపూర్ గిరిజన ఆ శ్రమ పాఠశాలలుండగా సుమారు 100 మంది వ రకు టీచర్లున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి మండలంలో 16 మంది టీచర్లు ఓటరుగా నమోదు చేసుకోగా, ఇందులో 10 మంది ఈ మండలానికి చెందిన ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నవా రే. మిగతా ఆరుగురు కాసిపేట మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ పనిచేసే స్థాని కులు ఆరుగురే ఓటర్లుగా నమోదు చేసుకోవడం చూస్తే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. అంటే తొంబై శాతానికిపైగా టీచర్లు జిల్లా కేంద్రం, ఇతర దూరప్రాంతాల నుంచి వస్తూ ఏజెన్సీ అలవెన్స్లు పొందుతున్నారు.ఎస్ఏల పరిస్థితి ఇలా ఉంటే ఎస్జీటీలు, ఉద్యోగులు, అధికారులు కూడా 85 శాతానికి పైగా ఇతర ప్రాంతాల నుంచి విధులకు హాజరవుతున్నవారే కావడం గమనార్హం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ జాబితా చూసిన స్థానికులు ముక్కున వేలేసుకున్నా రు. ఏజెన్సీ అలవెన్స్లు పొందుతూ ప ట్టణప్రాంతాల నుంచి రావడంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని మండలవాసులు కోరుతున్నారు. -
సాంఘిక శాస్త్రం..
సమకాలీన అంశాలపై పట్టు, విశ్లేషణాత్మక ధోరణి ఉంటే సాంఘిక శాస్త్రంలో విజయం తథ్యమని నిర్మల్ జిల్లా గుండంపెల్లి ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సిలారి మధు అంటున్నాడు. ● బట్టీ పద్ధతిని వదిలేసి పాఠాలను అర్థం చేసుకోవాలి. ● దేశంలోని నదులు, పీఠభూములు, ఎత్తైన శిఖరాలు, పర్వత శ్రేణులు, తీర ప్రాంతాలు, ప్రధాన నగరాలు, ప్రపంచీకరణ, పట్టణీకరణ పర్యావరణ, భూగర్భ జల సమస్యలు తదితర అంశాలపై అవగాహన చేసుకోవాలి. ● గ్రాఫ్లు పట్టికలు, పై చార్ట్లు విశ్లేషణాత్మక ధోరణిలో రాయాలి. ● ప్రపంచ పటంలో మిత్ర రాజ్య కూటమి దేశాలు, అక్షరాజ్య కూటమి దేశాలు, నినాదాలు, కరపత్రం తదితర వాటి గురించి తెలుసుకోవాలి. ● ప్రతీ సిలబస్లో ముఖ్యమైన పాయింట్లను అండర్లైన్ చేసుకుని చదవాలి. బిట్ పేపర్లో వచ్చే 20 మార్కులను సులభంగా సాధించవచ్చు. ● ప్రశ్నప్రత్రంలో ముందుగా ప్రశ్నల సరళిని అవగతం చేసుకోవాలి. -
క్లుప్తంగా
చెరువులో యువకుడి మృతదేహం లభ్యంఆదిలాబాద్టౌన్: జిల్లాకేంద్రంలోని ఖానా పూర్ చెరువులో యువకుడి మృతదేహం లభ్యమైనట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం..పట్ట ణంలోని ఖానాపూర్కు చెందిన పిట్ల సాయికుమార్ (29) ఈనెల 22న ఇంటి నుంచి బ యటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో ఆయన కుటుంబీకులు 25న అదృశ్యమైనట్లు ఫిర్యా దు చేశారు. గురువారం ఖానాపూర్ చెరువులో మృతదేహం నీటిపై తేలి ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. పేకాట ఆడుతున్న 11 మంది అరెస్ట్రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పోలీసుస్టేషన్ పరిధి తిమ్మాపూర్లోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 11 మందిని ఆరెస్టు చేసినట్లు పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ప్రదీప్ ఇంట్లో బుధవారం రాత్రి దాడి చేసి 11 మందిని అదుపులో తీసుకుని వారి వద్ద నుంచి రూ.38,290 నగదు, నాలుగు బైక్లు, ఒక కారు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముగ్గురిపై రౌడీషీట్ ఓపెన్ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని క్రాంతినగర్ కు చెందిన రవితేజను హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్న గోల్డెన్ కార్తీక్, ప్రణీ త్, సాయికిరణ్లపై రౌడీషీట్ ఓపెన్ చేసిన ట్లు టూటౌన్ సీఐ కరుణాకర్రావు తెలి పారు. ఈముగ్గురు నిందితులతో సంబంధాలు ఉండి అల్లర్లకు పాల్పడిన ఆరుగురిని ఆది లాబాద్ అర్బన్ తహసీల్దార్ ఎదుట గురువారం బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. ఆటోబోల్తా: ఒకరికి గాయాలుముధోల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ముధోల్–భైంసా ప్రధాన రహదారిపై గురువారం ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్ర ధర్మాబాద్ తాలూకా నయాగావ్ గ్రామానికి చెందిన నాగేష్ తన ఆటోలో పని నిమిత్తం భైంసాకు వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులు గమనించి 108లో భైంసా ఏరియాస్పత్రికి తరలించారు. నాగేష్ మద్యం మత్తులో ఉండడంతో ప్రమాదం చోటుచేసుకుంది. -
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
● 1,966 మంది ‘టీచర్స్’ ఓటర్లు ● 17,141 మంది పట్టభద్రులు.. ● పోలింగ్ సెంటర్లకు చేరిన సిబ్బందినిర్మల్చైన్గేట్: జిల్లాలో నేడు నిర్వహించనున్న ఎ మ్మెల్సీ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది బరిలో ఉన్నారు. జిల్లాలో 1,966 మంది ఉపాధ్యాయ ఓటర్లుండగా 19 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 17,141 మంది పట్టభద్రుల ఓటర్లుండగా 27 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఎస్పీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాలపై నిఘా పెట్టారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, ఇతర ఓటింగ్ సామగ్రితో కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బుధవారం సాయంత్రం చేరుకున్నారు. వీరికి జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సామగ్రిని అప్పగించారు. గురువారం ఉదయం 8నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య కరీంనగర్లోని రిసెప్షన్ సెంటర్లకు చేర్చనున్నారు. సమస్యలుంటే తెలుపాలి ● కలెక్టర్ అభిలాష అభినవ్ ఎన్నికల విధుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే పైఅధికారులకు సమాచారం అందివ్వాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వినియోగించుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్కుమార్, అదనపు ఎస్పీలు రాజేశ్మీనా, ఉపేంద్రరెడ్డి, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా సమాచారం టీచర్స్ అభ్యర్థులు : 15 పట్టభద్రుల అభ్యర్థులు : 56 జిల్లాలోని పోలింగ్ కేంద్రాలు : 46 నిర్మల్ డివిజన్లో.. : 31 భైంసా డివిజన్లో.. : 15 గ్రాడ్యుయేట్ పోలింగ్ కేంద్రాలు : 27 టీచర్ పోలింగ్ కేంద్రాలు : 19 మోడల్ కోడ్ కండక్ట్ టీం : 20 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ : 4 వీఎస్టీ: 2 ప్రిసైడింగ్ అధికారులు : 37 పోలింగ్ సిబ్బంది : 148 సూక్ష్మ పరిశీలకులు : 26 నోడల్ అధికారులు : 19 జోనల్ అధికారులు : 10 -
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహిస్తాం
● ఎస్పీ జానకీ షర్మిల ● పోలీస్ అధికారులతో సమావేశంనిర్మల్టౌన్: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తామని ఎస్పీ జానకీ షర్మిల పే ర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఎన్నికల భద్రత ఏర్పాట్లపై పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతలు సమర్థవంతంగా అమలయ్యేలా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 46 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 224 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 (144) సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. కేంద్రాలకు 200 మీటర్ల ప రిధిలో ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నా రు. ఎవరైనా ఎన్నికల నియమాలు ఉల్లంఘించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ఎన్నికల నియమాలు ఉల్లంఘించినట్ల యితే వారి సమాచారం ‘డయల్ 100’కు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు ఉపేంద్రరెడ్డి, అవినాష్కుమార్, రాజేశ్మీనా, ఇన్స్పెక్టర్లు నవీన్కుమార్, సైదారావు, ప్రేమ్కుమార్, నైలు, గోపీనాథ్, ప్రవీణ్కుమార్, మల్లేశ్, కృష్ణ, ఆర్ఐలు రామ్నిరంజన్, రమేశ్, రామకృష్ణ, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రం సందర్శన జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలోగల ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ జానకీ షర్మిల సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎస్పీ వెంట ఏఎస్పీ రాజేశ్ మీనా, పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ తదితరులున్నారు. -
రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
బెల్లంపల్లి: మద్యానికి బానిసై జల్సాల కోసం అప్పు చేసిన యువకుడు తీర్చేమార్గం లేక రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెల్లంపల్లి జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ రాజేశ్వర్ కథనం ప్రకారం.. కాసిపేట మండల కేంద్రానికి చెందిన దుర్గం క్రాంతి (29) జులాయిగా తిరిగేవాడు. అడపాదడపా మంచిర్యాలకు చెందిన ఓ రియల్టర్ వద్ద డ్రైవర్గా పనిచేస్తూ తెలిసిన వారి వద్ద అప్పులు చేసి మద్యం తాగేవాడు. అవివాహితుడైన క్రాంతి నెలక్రితం తల్లి దుర్గం వెంకటమ్మను బతిమిలాడటంతో ఆమె రూ.10 వేలు వేరే వ్యక్తుల వద్ద అప్పు అడిగి ఇచ్చింది. ఆ డబ్బులను తాగుడుకు ఖర్చు చేశాడు. మరోపక్క అప్పు ఇచ్చినవారు అడగడంతో తప్పించుకు తిరుగుతున్నాడు. అప్పు తీర్చేమార్గం లేక క్రాంతి సోమవారం అర్ధరాత్రి సుబ్బారావుపల్లి శివారు వైపు వెళ్లి గుర్తుతెలియని రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం మృతదేహానికి పంచనామా అనంతరం పోస్టుమార్గం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. -
అప్పుల బాధతో ఒకరు..
దస్తురాబాద్: అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శంకర్ కథనం ప్రకారం.. మండలంలోని గోడిసీర్యాల గోండుగూడ గ్రామానికి చెందిన నామెల్లిపురుక జగన్(45), రాధ దంపతులు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు. ఆయనకున్న ఎకరం భూమిలో పంట సాగు చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం జగన్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో పలువురి వద్ద చేసిన అప్పులు చేసి మద్యం తాగేవాడు. అప్పలు తీర్చే మార్గం లేకపోవడంతో మంగళవారం ఇంట్లో గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. ఆ సమయంలో భార్య రాధ పక్కింట్లోకి వెళ్లి తిరిగివచ్చింది. అప్పటికే పురుగుల మందు తాగిన జగన్ భార్యతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో నోట్లో నుంచి నురుగులు కక్కడంతో 108 సిబ్బందికి సమాచారం అందించింది. వారు అక్కడికి చేరుకుని ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు గమనించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్గం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆగస్త్యకూడం అధిరోహించిన చెన్నూర్ యువకుడు
చెన్నూర్: పట్టణానికి చెందిన యువకుడు మంచాల సూరజ్.. ఆగస్త్యకూడం (శిఖరం) అధిరోహించాడు.మంచాల రాజబాపు– పద్మజ దంపతుల కుమారుడు సూరజ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన కేరళలోని తిరువనంతపురానికి 60 కి.మీ దూరంలో ఆగస్త్యకూడం(శిఖరం) 50 మీటర్ల ఎత్తును మూడురోజుల్లో ట్రెక్కింగ్ను విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ ట్రెక్కింగ్ జనవరి నుంచి ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. శిఖరానికి ఆగస్త్య మహాముని పేరు పెట్టడంతో ఇది ప్రసిద్ధి చెందిన తీర్థయాత్రగా పేరొంది. యాత్ర చేపట్టేవారికి కేరళ ప్రభుత్వం ఆహార సదుపాయాలు కల్పిస్తోంది. ట్రెక్కింగ్ విజయవంతంగా పూర్తి చేసిన సూరజ్ను పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు. -
జాతర ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే
జైపూర్: వేలాల జాతర ఏర్పాట్లను చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మంగళవారం పరిశీలించారు. గుట్టపై భక్తులకు తాగునీటి వసతి, ఆలయం వద్ద సౌకర్యాలు, గోదావరినదిలో పుణ్యస్నానాలు, గుట్టపైకి కాలినడక మార్గంలో వెళ్లేవారికి తాగునీరు, విశ్రాంతి సౌకర్యాలు పరిశీలించి పలు సూచనలు చేశారు. రామగుండం సీపీ శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ నేతృత్వంలో ముగ్గురు ఏసీపీలు, ఆరుగురు సీఐలు, 30 మంది ఎస్సైలు, 35 మంది ఏఎస్సైలతో పాటు 600 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల, చెన్నూర్, గోదావరిఖని ప్రాంతాల నుంచి వేలాలకు 100 ఆర్టీసీ బస్సులు కేటాయించారు. యంత్రాల పనిగంటలు పెంచాలి శ్రీరాంపూర్: ఓపెన్ కాస్ట్ గనిలో భారీ యంత్రాల పనిగంటలు మరింత పెంచాలని సింగరేణి డైరెక్టర్(ఆపరేషన్) ఎల్వీ.సూర్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన శ్రీరాంపూ ర్ ఓపెన్ కాస్ట్ గని సందర్శించారు. ఓసీపీలోని ఇన్ఫిట్ క్రషర్, సర్ఫేస్ క్రషర్లను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఓపెన్ కాస్ట్ గని నుంచి ప్రతీరోజు 4రేకుల బొగ్గు రవాణా చేయాలన్నారు. శ్రీరాంపూర్ ఏరియా మొత్తం 7 రేకుల బొగు్గ్ రవాణా కావాల్సి ఉందన్నారు. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జీఎం(సీహెచ్పీ) తిరుమల్రావు, ఏరియా ఇంజినీర్ చంద్రశేఖర్రెడ్డి, ఓసీపీ అధికారి టీ.శ్రీనివాస్, డీజీఎంలు కేశవరావు, రవీందర్, క్వాలిటీ ఇంచార్జి కే.వెంకటేశ్వర్రెడ్డి, ప్రాజెక్ట్ ఇంజినీర్ నాగరాజు పాల్గొన్నారు. మహిళ మెడలో పుస్తెలతాడు అపహరణతానూరు: మహిళ మెడలో పుస్తెల తాడు అపహరించిన ఘటన మండలంలో బోంద్రట్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. బోంద్రట్ గ్రామానికి చెందిన పంచశీల మంగళవారం వ్యవసాయ పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగివస్తుంది. ఈ క్రమంలో ఎదురుగా బైక్పై ముసుగు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో పుస్తెతాడును ఎత్తుకెళ్లి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
యువకుడి దారుణహత్య
ఆదిలాబాద్టౌన్: జిల్లాకేంద్రంలో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ముగ్గురు కత్తితో ఆయన గొంతు కోసి పొడిచి చంపిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని క్రాంతినగర్కు చెందిన కొమ్మవార్ రవితేజ (26) డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాది క్రితం భోరజ్ మండలానికి చెందిన ప్రవళికతో వివాహమైంది. రవితేజ చిన్న వయస్సులోనే తండ్రి వదిలిపెట్టి మరో వివాహం చేసుకున్నాడు. ఏడేళ్ల క్రితం తల్లి భాగ్యశ్రీ మృతిచెందింది. కాగా రవితేజ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తిరిగిరాలేదు. పట్టణంలోని ఇందిరానగర్ దత్త మందిర్ సమీపంలో ముగ్గురు యువకులు గోల్డెన్ కార్తీక్, సిద్దూ, సాయికిరణ్ ఆతన్ని కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ విషయం మృతుడి భార్యకు స్థానికులు తెలియజేయడంతో ఆమె ఘటన స్థలానికి చేరుకుంది. రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి కన్నీరుమున్నీరైంది. మూడు రోజుల క్రితం ముగ్గురు యువకులతో రవితేజకు గొడవలు జరిగాయి. తమ గ్యాంగ్తో కలిసి ఉండాలని తన భర్తను హెచ్చరించినట్లు మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాత కక్షలతోనే హత్య చేసినట్లు ఆమె పేర్కొంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆరు గంటల్లోనే కేసు ఛేదించాం: డీఎస్పీ గ్యాంగ్లు నిర్వహించడంతోపాటు అసాంఘిక కా ర్యకలాపాలకు పాల్పడుతూ యువకుడిని హత్య చేసిన కేసును ఆరు గంటల్లోనే ఛేదించి నిందితుల ను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి టూటౌన్ పోలీ సుస్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి కత్తి, మూడు సెల్ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులు నేరాలకు పాల్పడుతూ తమతో కలిసి తిరగాలని రవితేజకు చెప్పినా నిరాకరించడంతో హత్యకు ఒడిగట్టినట్లు చెప్పారు. నిందితులు సోమవారం రాత్రి మద్యం తాగి పేకాట ఆడిన తర్వాత ఇందిరానగర్లో మరోసారి మద్యం తాగుతున్న సమయంలో రవితేజ బైక్పై వెళ్తుండగా అడ్డగించి కత్తితో దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఏ–1గా చిల్కూరి ల క్ష్మినగర్కు చెందిన గోల్డెన్ కార్తీక్, ఏ–2, ఏ–3గా ఇందిరానగర్కు చెందిన సిద్దూ, దేవుల సాయికిరణ్లు ఉన్నట్లు తెలిపారు. ఏ–1, ఏ–2తోపాటు మృతుడి పై పలు కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిపై రౌడీషీటర్లు ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైన కత్తులతో ఫొటోలు దిగుతూ నేరాలను ప్రేరేపించేలా సోషల్మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్టుచేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి ఆరుగంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో టూటౌన్ సీఐ కరుణాకర్రావు, వన్టౌన్ సీఐ సునీల్ కుమార్, టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాశ్ పాల్గొన్నారు. తెల్లవారుజామున కత్తితో గొంతుకోసి.. పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు పాత కక్షలే కారణం -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
ఆదిలాబాద్టౌన్: రిమ్స్లో చికిత్స పొందుతూ మహారాష్ట్రకు చెందిన యువకుడు మంగళవారం మృతిచెందినట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. యవత్మాల్ జిల్లాలోని ధగడ్లాల్ గ్రామానికి చెందిన సట్పుటే దత్తు (22) గత కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తితో ఉమర్ఖేడ్ తాలుకాలోని కొర్ట గ్రామంలో బంధువుల పంట చేనులో ఈనెల 22న పురుగుల మందు తాగాడు. గమనించిన బంధువులు అతన్ని రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. చోరీకి పాల్పడ్డ దొంగ అరెస్టుఆదిలాబాద్టౌన్: ఇటీవల చోరీకి పాల్పడిన దొంగను అరెస్టు చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణంలోని శాంతినగర్లో ఈనెల 8న తుమ్మల విజయ ఇంట్లో చోరీ జరిగింది. రూ.5వేల నగదు అపహరణకు గురైంది. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పట్టణంలోని నేతాజీ చౌక్లో మంగళవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న షేక్ తబ్రేజ్ను విచారించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు వివరించారు. ఇంట్లో చోరీతానూరు: మండలంలోని భోసి గ్రామంలో చాదల దత్తాత్రి ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. సోమవారం రాత్రి దత్తాత్రి ఇంట్లో నిద్రించాడు. భార్య గోదావరి మరో గదికి తాళం వేసి గ్రామంలో నిర్వహించిన భజన కార్యక్రమానికి వెళ్లి మంగళవారం వేకువజామున వచ్చింది. గదికి వేసిన తాళం పగిలిపోయి ఉంది. లోపలికి వెళ్లి చూసేసరికి బీరువా తాళం, గల్లగురిగి ధ్వంసమై కనిపించాయి. శనగ పంట విక్రయించిన రూ.36 వేలు, గల్లగురిగిలో పోగుచేసిన రూ.20 వేలను దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కోతుల దాడిలో మహిళకు గాయాలు ఖానాపూర్: మండలంలోని మస్కాపూర్లోకు చెందిన మమతపై మంగళవారం కోతుల దాడి చేసి గాయపర్చింది. సోమవారం రాత్రి కుక్కల దాడిలో అదే గ్రామానికి చెందిన ఆశల లచ్చన్న, చిన్నారి వేదశ్రీకి గాయాలయ్యాయి. పట్టణంలోని విద్యానగర్కు చెందిన ఓ మహిళపై కోతులు దాడి చేసి గాయపర్చింది. సాగునీటికోసం రైతుల ఆందోళనదండేపల్లి: కడెం ఆయకట్టు కింద యాసంగి పంటలకు వారబంధీ పద్ధతిలో అందిస్తున్న సాగునీరు సక్రమంగా అందడంలేదని డిస్ట్రిబ్యూటరీ 24బీ పరిధిలోని మాకులపేట, తాళ్లపేట గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం కడెం ప్రధాన కాలువలో దిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాసంగికి సాగునీరందిస్తామని అధికారులు చెప్పడంతో వరి, మొక్కజొన్న పంటలు సాగు చేశామని, పంటలకు నీరందక ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ డీఈ వెంకటేశం, ఏఈఈ శ్రావణ్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
పెద్దల సభలో..మనోళ్లు
● ఉమ్మడి జిల్లా నుంచి శాసన మండలికి పలువురి ప్రాతినిధ్యం ● చైర్మన్గా ఆదిలాబాద్కు చెందిన సయ్యద్ ముకషీర్ షా ● పి.నర్సారెడ్డి, జీవీ సుధాకర్రావు, పలువురు ఎమ్మెల్సీగా ● స్థానికసంస్థలు, ఎమ్మెల్యే కోటాలోనే అవకాశాలుసాక్షి,ఆదిలాబాద్: మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల, టీచర్స్ శాసనమండలి సభ్యుల ఎన్నికల వేడి ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇటు పట్టభద్రుల పరంగా, అటు టీచర్స్ పరంగా ఒకరంటే ఒక్కరికి కూడా అవకాశం దక్కలేదు. పలువురు పోటీ చేసినప్పటికీ నిరాధారణకు గురయ్యారు. అయితే శాసనమండలి పరంగా ఉమ్మడి జిల్లాలో ఘన చరిత్ర ఉంది. ఆదిలాబాద్కు చెందిన సయ్యద్ ముకషీర్షా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనమండలికి 6వ చైర్మన్గా వ్యవహరించారు. రెండుసార్లు ఆయన చైర్మన్గా ఉండటం గమనార్హం. ఆ సమయంలో మర్రి చెన్నారెడ్డి, టి.అంజయ్య, భవనం వెంకట్రాంరెడ్డి, కోట్ల విజయ్భాస్కర్రెడ్డి, ఎన్టీ రామారావు, నాదెండ్ల భాస్కర్రావు సీఎంలుగా ఉన్నారు. మనోళ్లు ముఖ్య పదవుల్లో.. ఉమ్మడి జిల్లా నుంచి శాసనమండలి చైర్మన్గా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ ముకషీర్ షా వ్యవహరించిన ఘనత ఉంది. కాంగ్రెస్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఒక్కసారి ఎన్నిక చేయగా, మరోసారి శాసన పరిషత్కు నామినేట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి 1958లో ఏర్పాటు కాగా, సీఎంగా వ్యవహరించిన ఎన్టీ రామారావు ఈ శాసనమండలి వ్యవస్థను 1985లో రద్దు చేశారు. అప్పుడు మండలి చివరి చైర్మన్గా ముకషీర్ షా ఉన్నారు. ఆ తర్వాత 2007లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో మళ్లీ శాసనమండలి పునరుద్ధరించారు. నిర్మల్కు చెందిన పి.నర్సారెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా, కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత ఎంపీ అయ్యారు. అప్పట్లో ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. దండేపల్లికి చెందిన జీవీ సుధాకర్రావు ఒకసారి ఎమ్మెల్సీగా వ్యవహరించారు. అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. స్థానిక సంస్థల నుంచే.. ఉమ్మడి జిల్లా స్థానికసంస్థల నుంచే జిల్లా ముగ్గురు నేతలకు అవకాశం దక్కింది. అందులో కాంగ్రెస్ నుంచి సయ్యద్ ముకషీర్ షా, ప్రేమ్సాగర్రావులు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా వ్యవహరించిన పురాణం సతీశ్ పదవీ కాలం పూర్తయ్యే వరకు పార్టీలోనే కొనసాగారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హస్తం పార్టీలో చేరారు. ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలిచిన దండే విఠల్ ఇప్పటికీ పదవిలో కొనసాగుతుండగా ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్సీలు 1.సయ్యద్ ముకషీర్ షా(మృతిచెందారు). 1979–80, 1981–85 (మండలి చైర్మన్), (స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు 2.పి.నర్సారెడ్డి (మృతిచెందారు). మూడుసార్లు ఎమ్మెల్యే, కేబినెట్ మంత్రి, ఆ తర్వాత 1981–85 వరకు ఎమ్మెల్సీగా, ఒకసారి ఎంపీగా వ్యవహరించారు. 3.జీవీ సుధాకర్రావు (మృతిచెందారు). 1977 (పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు). 4.మహ్మద్ సుల్తాన్ అహ్మద్ (మృతిచెందారు), 2007–09 (ఎమ్మెల్యే కోటా నుంచి ప్రాతినిధ్యం వహించారు) 5. ప్రేమ్సాగర్రావు, 2007–13 (స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 6. పొగాకు యాదగిరి (మృతిచెందారు). 2007 (ఎమ్మెల్యే కోటా నుంచి ప్రాతినిధ్యం వహించారు) 7. పురాణం సతీశ్, 2015–22 వరకు (స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం) 8. దండే విఠల్.. 2022 నుంచి 2028 వరకు కొనసాగనున్నారు. ‘స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం). ఎమ్మెల్యే కోటాలో.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన వారిలో ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే ఉన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చెన్నూర్కు చెందిన సుల్తాన్ అహ్మద్ను మెనార్టీ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. అంతకుముందు 1999లో ఈయన సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో మళ్లీ టికెట్ ఆశించారు. ఆ సమయంలో కోనేరు కోనప్పకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇవ్వగా, సుల్తాన్ అహ్మద్కు నామినేట్ పదవి విషయంలో భరోసానిచ్చారు. ఈమేరకే అప్పట్లో ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. మంచిర్యాలకు చెందిన పొగాకు యాదగిరి న్యాయవాదిగా వ్యవహరించేవారు. ఎన్టీ రామారావు హయాం నుంచి టీడీపీలో ఉన్నారు. చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. వీరిద్దరు మినహా ఎవరు కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించలేదు. -
షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
బజార్హత్నూర్: మండలంలోని అనంతపూర్లో సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్తో కోరెంగ హన్మంతు ఇల్లు దగ్ధమైంది. విద్యుత్ వైరు తెగి ఇంటిపై కప్పుపై పడటంతో మంటలు చెలరేగాయి. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో గ్రామస్తులు వచ్చి మంటలార్పేందుకు యత్నించారు. ఇచ్చోడ నుంచి ఫైరింజన్ అక్కడికి చేరుకుని మంటలార్పివేసింది. తహసీల్దార్ శ్యాంసుందర్ ఆదేశాలతో మంగళవారం ఎంఆర్ఐ నూర్సింగ్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంలో రూ.2.50 లక్షల నగదు, 3.5 తులాల బంగారం, 50 తులాల వెండి, టీవీ, కూలర్, సోఫాసెట్, బెడ్స్, జొన్నలు, గోధుమ పంట, కందులు, బియ్యం, సర్టిఫికెట్లు కాలిపోయాయి. సుమారు రూ. 17 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ సోయం బాపురావ్ అక్కడికి చేరుకుని పరిశీలించి బాధిత కుటుంబానికి రూ.20 వేలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
గొడిసిర్యాల రాజన్న...
దస్తురాబాద్: కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా గోడిసిర్యాల రాజన్న భక్తుల విశేష పూజలు అందుకుంటున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయం ముస్తాభైంది. ఉత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన రాత్రి శివ పార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 27న కుంకుమ పూజలు, సాముహిక హోమం, 28న అన్నపూజ, మల్లన్న, పోచమ్మ బోనాలు నిర్వహిస్తారు. గోడిసిర్యాల రాజన్న ఆలయంలో అర్ధరాత్రి 12 గంటలకు లింగద్బోవం సమయంలో నాగుపాము దర్శనం భక్తులకు ప్రత్యేక ఆకర్షణ. ఇక గోడిసిర్యాల రాజన్న ఆలయంలో ముడుపు కట్టివెళ్తే కోరిక తీరుతుందని భక్తుల ప్రాగాఢ విశ్వాసం. ఆలయ ప్రాంగణంలోని రావి, మేడి, మామిడి చెట్లు భక్తుల ముడుపులతో నిండి పోతాయి. -
ఓలాదీశ్వరుని ప్రత్యేకత..!
కుంటాల: మండలంలోని ఓలా, దౌనెల్లి శివాలయం, సూర్యాపూర్ శ్రీరాజరాజేశ్వరాలయం, కుంటాల ఉమామహేశ్వర, మహాదేవుడు, ఆత్మలింగ ఆలయాలను ముస్తాబు చేశారు. ఓలా గ్రామంలో 150 ఏళ్ల క్రితం రాతి కట్టడంతో శివాలయాన్ని నిర్మించారు. ఆలయంలో లింగమూర్తిని ప్రతిష్టించారు. ఆలయం గర్భగుడి నుంచి సొరంగం మార్గం ఉందని పెద్దలు చెబుతుంటారు. ఇక్కడి నుంచి బాసరలోని గోదావరి, కాశీకి వెళ్లి మునులు స్నానం ఆచరించేవారని చెబుతారు. సూర్యాపూర్ రాజరాజేశ్వరుడు మహారాష్ట్రలో సరిహద్దు ప్రాంతంలో వాగు, చెరువు సమీపాన కొలువుదీరి ఉన్నాడు. -
రంజాన్ ప్రశాంతంగా జరుపుకోవాలి
నిర్మల్టౌన్: శాంతియుత వాతావరణంలో రంజాన్ పండుగ నిర్వహించుకోవాలని నిర్మల్ ఏఎస్పీ రాజేశ్మీనా సూచించారు. నిర్మల్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ముస్లిం మత పెద్దలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో అందరూ సంయమనం పాటించాలన్నారు. ఘర్షణలు, గొడవలు జరగకుండా మత పెద్దలు చర్యలు చేపట్టాలని సూచించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులను నమ్మవద్దని తెలిపారు. ఎలాంటి సందేహం ఉన్న పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ప్రవీణ్కుమార్, పట్టణ మసీద్ లా మేనేజింగ్ అధ్యక్ష, కార్యదర్శులు తాజా మాజీ కౌన్సిలర్లు తౌహీద్ ఉద్దీన్, ఇమ్రాన్ ఉల్లా, అబ్దుల్ మతిన్, గుల్బర్ మస్జిద్ అధ్యక్షుడు సయ్యద్ బషీర్ అలీ, మాజీ వైస్ చైర్మన్ అజీమ్ బిన్ యహీయా తదితరులు పాల్గొన్నారు. -
ఖేలో ఇండియా పోటీలకు జిల్లా విద్యార్థి
భైంసాటౌన్: అఖిల భారత ఖేలో ఇండియా యోగా పోటీలకు తెలంగాణ నుంచి జిల్లా విద్యార్థి వార్లే దిలీప్ ఎంపికై నట్లు యోగా గురువు మల్లేశ్ తెలిపారు. తానూర్ మండలం హిప్నెల్లికి చెందిన దిలీప్ బెంగళూరులోని వ్యాస యూనివర్సిటీలో బీఎస్సీ యోగా చేస్తున్నారు. ఇటీవల భువనేశ్వర్లో జరిగిన యోగా పోటీల్లో యూనివర్సిటీ తరఫున పాల్గొని ప్రతిభ కనబర్చాడు. దీంతో మార్చిలో జమ్మూలో జరిగే ఖేలో ఇండియా జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. సీఎం కప్ రాష్ట్రస్థాయి యోగాతోపాటు, ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. -
పకడ్బందీగా బ్యాలెట్ బాక్సుల ర్యాండమైజేషన్
నిర్మల్చైన్గేట్: బ్యాలెట్ బాక్సుల ర్యాండమైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వినియోగించే బ్యాలెట్ బాక్సుల ర్యాండమైజేషన్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మంగళవారం నిర్వహించారు. అదనపు కలెక్టర్తో కలిసి ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు. ఎన్నికల సిబ్బందికి అందించే సామగ్రిని పరిశీలించారు. 25 మంది సూక్ష్మ పరిశీలకుల ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఎన్నికల సామగ్రిని రవాణా చేసే వాహనాలన్నింటికీ జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో కండీషన్లో ఉన్న వాహనాలను వినియోగించాలన్నారు. అదనంగా వాహనాలను, సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నిర్మల్, భైంసా ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్, తహసీల్దార్ రాజు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన ఎకై ్సజ్ ఎస్సై, కానిస్టేబుల్
● రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం.. భైంసాటౌన్: లంచం తీసుకుంటూ ఓ ఎకై ్సజ్ ఎస్సై, కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడిన ఘటన భైంసా ఎకై ్సజ్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జరిగింది. వివరాలిలా ఉన్నాయి... భైంసా మండలం కామోల్కు చెందిన సుభాష్గౌడ్ అనే కల్లు వ్యాపారికి, అదే గ్రామానికి చెందిన మరో కల్లు వ్యాపారికి కల్లు విక్రయాల విషయమై గొడవ తలెత్తింది. దీంతో ఈ విషయం పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది. ఈ క్రమంలో సమస్య పరిష్కరించాలని సుభాష్గౌడ్ ఎకై ్సజ్ ఎస్సై నిర్మలను సంప్రదించాడు. ఆమె కానిస్టేబుల్ సుజాత ద్వారా రూ.10 వేలు డిమాండ్ చేశారు. దీంతో సుభాష్గౌడ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారు పథకం ప్రకారం కానిస్టేబుల్ సుజాతకు డబ్బు ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీలు విజయ్కుమార్, రమణమూర్తి, సీఐలు కిరణ్, స్వామి, సిబ్బంది ఉన్నారు. -
ఎన్నికల జాగారం
● శివరాత్రి తెల్లారే ఎమ్మెల్సీ పోలింగ్ ● పట్టభద్రులు, టీచర్ అభ్యర్థుల ఆరాటం ● ప్రచారం ముగిసి తెరవెనుక మంత్రాంగం సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: Ððl$§ýl-MŠS-&MýS-È…¯]l-VýS-ÆŠ‡-&-°-gêÐ]l*-»ê§Šæ-&-B-¨-Ìê»ê§Šæ °Äñæ*-fMýS-Ð]lÆý‡Y GÐðl$Ã-ÎÞ G°²MýSÌS çœ$rt… ™èl$¨ A…M>°MìS ^ólÆý‡$-MýS$…¨. ´ùÍ…VŠæMýS$ 48VýS…-rÌS Ð]l¬…§ól {ç³^éÆý‡… °Íí³ ÐólĶæ*-ÍÞ E…yýl-yýl…-™ø ™ðlÆý‡-Ððl-¯]l$-MýS- A¿ýæÅ-Æý‡$¦ÌS Ð]l$…{™é…VýS… Ððl¬§ýl-OÌñæ…¨. ¯éË$VýS$ ´ë™èl hÌêÏ-ÌZÏ° Ððl¬™èl¢… 42AòÜ…½Ï Ý릯éÌS ç³Ç«¨ÌZ fÆý‡$-VýS$-™èl$¯]l² ç³rt¿ýæ-{§ýl$ÌS, sîæ^èlÆŠ‡ GÐðl$Ã-ÎÞ G°²MýS-ÌSOò³ DÝëÇ çÜÆý‡Ó{™é E™èlP…uý‡ ¯ðlÌS-Mö…¨. ´ùsîæ-ÌZ E¯]l² ÐéÆý‡…-§ýlÆý‡* VðSË$ç³#¯]l$ {糆Úët-™èlÃ-MýS…-V> ¡çÜ$-MøÐ]l-yýl…-™ø KrÆý‡Ï Ððl¬VýS$YOò³ BçÜMìS¢ Mö¯]l-Ýë-VýS$-™ø…¨. ™èlÐ]l$ A¿ýæÅ-Æý‡$¦ÌS ÑfĶæ$… MøçÜ… Æ>çÙ‰ A{VýS-¯éĶæ$-MýS-™èlÓ… {ç³^éÆý‡… ^ólĶæ$-yýl…-™ø VýS™èl G°²MýSÌS MýS…sôæ DÝëÇ Ð]l$Ç…™èl §ýl*MýS$-yýl$-V> A¿ýæÅ-Æý‡$¦-Ë$ ™èlÌS-ç³-yýl$-™èl$-¯é²Æý‡$. {ç³^éÆý‡…-ÌZ JMýS-Ç° Ñ$…_ Ð]l$ÆöMýSÆý‡$ àÒ$Ë$ CçÜ*¢ KrÆý‡ÏMýS$ ^ólÆý‡$-Ð]lÄôæ$Å {ç³Ä¶æ$-™èl²… ^ólÔ>Æý‡$. ¯ólyýl$ ÕÐ]l-Æ>{† ç³…yýl$VýS Ð]l¬WíÜ, VýS$Æý‡$-ÐéÆý‡… E§ýlĶæ$… 8¯]l$…^ól »êÅÌñæsŒæ õ³ç³-ÆŠ‡Oò³ {´ë«§é-¯]lÅ™èl {MýSÐ]l*-°² KrÆý‡$Ï ÐólĶæ$yýl… Ððl¬§ýl-ÌS-Ð]l#-™èl$…¨. ©…™ø A¿ýæÅ-Æý‡$¦-Ë$ G°²MýSÌS gêV>Æý‡… ^ólĶæ*-ÍÞ ˘Ð]lÝù¢…¨. టీచర్ల స్థానానికి హోరాహోరీ ఉపాధ్యాయ స్థానానికి మొత్తం 15మంది బరిలో ఉండగా, ఇందులో బీజేపీ నుంచి మల్క కొమురయ్య, పీఆర్టీయూ టీఎస్ నుంచి వంగ మహేందర్రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, ఉమ్మడి జిల్లా నుంచి ఉపాధ్యాయ సంఘాల్లో చురుగ్గా ఉన్న పీఆర్టీయూ ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు, టీఎస్సీపీఎస్ఈ యూనియన్ బలపర్చిన తిరుమల్రెడ్డి ఇన్నారెడ్డితో సహా స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. సీపీఎస్(కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) రద్దు, 317జీవో, డీఏలు మెడికల్ రీయింబర్స్మెంట్స్ పెండింగ్, పే స్కేల్, పదోన్నతుల సమస్యలే ప్రచారంలో చర్చకు వచ్చాయి. అందరూ హామీలే ఇచ్చినప్పటికీ టీచర్లు ఎవరికి పట్టం కడుతారనే ఆసక్తి నెలకొంది. గతంలో మద్దతు తెలిపిన సంఘ సభ్యులందరూ ఒకే అభ్యర్థికి ఓట్లు వేసిన దాఖలాలు లేవు. చాప కింద నీరులా కొందరు అభ్యర్థులు తెరవెనుక మంత్రాంగం నడిపించి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా ఓటర్లకు తాయిలాలు అందే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా విందులు నడుస్తున్నాయి. ఎమ్మెల్సీ ఓటర్ల వివరాలు పట్టభద్రులు 3,55,159 టీచర్లు 27,088 -
నేడు రథాలగుడిలో పల్లకియాత్ర
నిర్మల్: జిల్లా కేంద్రంలోని చారిత్రక రథాలగుడిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం పల్లకియాత్ర నిర్వహించనున్నట్లు వంశపారంపర్య పూజారులు తెలిపారు. కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర ఉత్సవ విగ్రహాలతో సాయంత్రం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రతీ మహాశివరాత్రికి నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. బ్రహ్మపురి రథాలగుడిలో కొలువైన విశ్వేశ్వరుడు -
జాతరకు సిద్ధమైన మహాదేవుడు
లక్ష్మణచాంద: బాబాపూర్ గ్రామంలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం మహాదేవుని జాతరకు సిద్ధమైంది. రెండవ వేములవాడగా బాబాపూర్ రాజేశ్వరుడు ప్రసిద్ధిగాంచాడు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని బాబాపూర్ గ్రామంలోని రాజరాజేశ్వరస్వామి ఆలయం వద్దకు బుధవారం జిల్లాలోని వివిధ మండలాల ఉండి వేలాది మంది భక్తులు వచ్చి ఉపవాస దీక్షలు స్వీకరిస్తారు. రాత్రంతా జాగరణ చేస్తారు. బాబాపూర్ గ్రామంలో స్వయంభుగా వెలసిన శివలింగం ఉంది. దీంతో ఇక్కడకు వచ్చి పూజలు చేస్తే తాము కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. కోడెలు సమర్పించడం ప్రత్యేకత... వేములవాడ తర్వాత బాబాపూర్ రాజరాజేశ్వర ఆలయంలో భక్తులు కోడెలు సమర్పిస్తారు. సామి కోర్కెలు తీరిస్తే కోడెను సమర్పిస్తామని మొక్కుకుని ఇలా చేస్తారు. -
పార్డి(బి)లో జాతర
కుభీర్: మండలంలోని పార్డి(బి) రాజరాజేశ్వర మందిరం మహాశివరాత్రి సందర్భంగా జాతర నిర్వహిస్తారు. బుధవారం మందిరంలో పూజలు, అభిషేకాలు జరుగుతాయి. గురువారం దేవతా మూర్తులకు జోడువాగులో స్నానం చేయిస్తారు. అదేరోజు రాత్రి కళ్యాణం నిర్వహిస్తారు. శుక్రవారం భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. శనివారం అంబళ్లు గ్రామంలోని మహిళలందరూ అంబళ్ల బుడ్లతో వచ్చి దేవునికి నైవేద్యం సమర్పిస్తారు. ఆదివారం కుస్తీపోటీలు జరుగుతాయి. పార్వతీల వ్యవస్థ.. గతంలో భక్తులు తమ కూతుళ్లకు దేవునితో పెళ్లి చేసి అక్కడే వదిలిపెట్టేవారు. పార్వతిగా ఉన్న మహిళ దేవుని సేవచేస్తూ భక్తులకు మార్గదర్శనం చేసేవారు. ఆమె చనిపోతే అక్కడే సమాధి చేసేవారు. ఇక్కడ ఆరుగురు మహిళలు పార్వతిలుగా మారి చనిపోయారు. చివరి పార్వతమ్మ 2011లో చనిపోయింది. ఆ తరువాత పార్వతమ్మగా ఎవరూ మారలేదు. -
పన్నుల వసూలు వేగవంతం చేయాలి
నిర్మల్చైన్గేట్: జిల్లాలోని మున్సిపాలిటీల్లో అన్నిరకాల పన్నుల వసూలు ప్రక్రియను వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీల వారీగా పన్ను వసూలు లక్ష్యం, ఇప్పటి వరకు పూర్తి చేసిన పన్నుల వివరాలు మున్సిపాలిటీల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెడ్ నోటీసులు జారీ చేసిన వారి వివరాలపై ఆరా తీశారు. నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీలలో వాణిజ్య, నీటి, వ్యాపార ప్రకటనల పన్నుల వసూలు వందశాతం పూర్తి చేయాలన్నారు. ఎక్కువ మొత్తంలో పన్నులు కట్టకుండా ఉన్నవారి జాబితా ను సిద్ధం చేసి, అందులోని మొదటి వంద మందికి రెడ్ నోటీసులు జారీ చేయాలన్నారు. ప్రభుత్వ వాణిజ్య సముదాయాల అద్దెలు వసూలు చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు జాదవ్ కృష్ణ, రాజేశ్కుమార్, నిర్మల్ మున్సిపల్ డీఈ హరిభువన్, అధికారులు పాల్గొన్నారు. -
శివాజీ మహరాజ్ అడుగుజాడల్లో నడవాలి
తానూరు: ప్రతి ఒక్కరూ శివాజీ మహరాజ్ అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే రామారావ్పటేల్ సూచించారు. కళ్యాణి గ్రామంలో మంగళవారం నిర్వహించిన శివాజీమహరాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి పూజలు నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ శివాజీ పోరాటాన్ని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు లక్ష్మణ్, శివాజీ పటేల్, చక్రధర్ పటేల్, చిన్నారెడ్డి, సోమ్నాథ్, బాలాజీ ఆయా గ్రామాల కార్యకర్తలు, శివాజీ యుత్ సభ్యులు పాల్గొన్నారు.శివాజీమహ రాజ్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే -
ఎన్నికల జాగారం
● శివరాత్రి తెల్లారే ఎమ్మెల్సీ పోలింగ్ ● పట్టభద్రులు, టీచర్ అభ్యర్థుల ఆరాటం ● ప్రచారం ముగిసి తెరవెనుక మంత్రాంగం సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: Ððl$§ýl-MŠS-&MýS-È…¯]l-VýS-ÆŠ‡-&-°-gêÐ]l*-»ê§Šæ-&-B-¨-Ìê»ê§Šæ °Äñæ*-fMýS-Ð]lÆý‡Y GÐðl$Ã-ÎÞ G°²MýSÌS çœ$rt… ™èl$¨ A…M>°MìS ^ólÆý‡$-MýS$…¨. ´ùÍ…VŠæMýS$ 48VýS…-rÌS Ð]l¬…§ól {ç³^éÆý‡… °Íí³ ÐólĶæ*-ÍÞ E…yýl-yýl…-™ø ™ðlÆý‡-Ððl-¯]l$-MýS- A¿ýæÅ-Æý‡$¦ÌS Ð]l$…{™é…VýS… Ððl¬§ýl-OÌñæ…¨. ¯éË$VýS$ ´ë™èl hÌêÏ-ÌZÏ° Ððl¬™èl¢… 42AòÜ…½Ï Ý릯éÌS ç³Ç«¨ÌZ fÆý‡$-VýS$-™èl$¯]l² ç³rt¿ýæ-{§ýl$ÌS, sîæ^èlÆŠ‡ GÐðl$Ã-ÎÞ G°²MýS-ÌSOò³ DÝëÇ çÜÆý‡Ó{™é E™èlP…uý‡ ¯ðlÌS-Mö…¨. ´ùsîæ-ÌZ E¯]l² ÐéÆý‡…-§ýlÆý‡* VðSË$ç³#¯]l$ {糆Úët-™èlÃ-MýS…-V> ¡çÜ$-MøÐ]l-yýl…-™ø KrÆý‡Ï Ððl¬VýS$YOò³ BçÜMìS¢ Mö¯]l-Ýë-VýS$-™ø…¨. ™èlÐ]l$ A¿ýæÅ-Æý‡$¦ÌS ÑfĶæ$… MøçÜ… Æ>çÙ‰ A{VýS-¯éĶæ$-MýS-™èlÓ… {ç³^éÆý‡… ^ólĶæ$-yýl…-™ø VýS™èl G°²MýSÌS MýS…sôæ DÝëÇ Ð]l$Ç…™èl §ýl*MýS$-yýl$-V> A¿ýæÅ-Æý‡$¦-Ë$ ™èlÌS-ç³-yýl$-™èl$-¯é²Æý‡$. {ç³^éÆý‡…-ÌZ JMýS-Ç° Ñ$…_ Ð]l$ÆöMýSÆý‡$ àÒ$Ë$ CçÜ*¢ KrÆý‡ÏMýS$ ^ólÆý‡$-Ð]lÄôæ$Å {ç³Ä¶æ$-™èl²… ^ólÔ>Æý‡$. ¯ólyýl$ ÕÐ]l-Æ>{† ç³…yýl$VýS Ð]l¬WíÜ, VýS$Æý‡$-ÐéÆý‡… E§ýlĶæ$… 8¯]l$…^ól »êÅÌñæsŒæ õ³ç³-ÆŠ‡Oò³ {´ë«§é-¯]lÅ™èl {MýSÐ]l*-°² KrÆý‡$Ï ÐólĶæ$yýl… Ððl¬§ýl-ÌS-Ð]l#-™èl$…¨. ©…™ø A¿ýæÅ-Æý‡$¦-Ë$ G°²MýSÌS gêV>Æý‡… ^ólĶæ*-ÍÞ ˘Ð]lÝù¢…¨. టీచర్ల స్థానానికి హోరాహోరీ ఉపాధ్యాయ స్థానానికి మొత్తం 15మంది బరిలో ఉండగా, ఇందులో బీజేపీ నుంచి మల్క కొమురయ్య, పీఆర్టీయూ టీఎస్ నుంచి వంగ మహేందర్రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, ఉమ్మడి జిల్లా నుంచి ఉపాధ్యాయ సంఘాల్లో చురుగ్గా ఉన్న పీఆర్టీయూ ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు, టీఎస్సీపీఎస్ఈ యూనియన్ బలపర్చిన తిరుమల్రెడ్డి ఇన్నారెడ్డితో సహా స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. సీపీఎస్(కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) రద్దు, 317జీవో, డీఏలు మెడికల్ రీయింబర్స్మెంట్స్ పెండింగ్, పే స్కేల్, పదోన్నతుల సమస్యలే ప్రచారంలో చర్చకు వచ్చాయి. అందరూ హామీలే ఇచ్చినప్పటికీ టీచర్లు ఎవరికి పట్టం కడుతారనే ఆసక్తి నెలకొంది. గతంలో మద్దతు తెలిపిన సంఘ సభ్యులందరూ ఒకే అభ్యర్థికి ఓట్లు వేసిన దాఖలాలు లేవు. చాప కింద నీరులా కొందరు అభ్యర్థులు తెరవెనుక మంత్రాంగం నడిపించి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా ఓటర్లకు తాయిలాలు అందే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా విందులు నడుస్తున్నాయి. ఎమ్మెల్సీ ఓటర్ల వివరాలు పట్టభద్రులు 3,55,159 టీచర్లు 27,088 -
పాపహరేశ్వరుని దర్శనం... సర్వపాపహరణం
దిలావర్ఫూర్: సహ్యాద్రిపర్వత శ్రేణుల్లోని ‘కదిలి’ లోయలో కొలువుదీరి ఉన్న శ్రీమాతాన్నపూర్ణ సహిత పాపహరేశ్వరాలయాన్ని దర్శించుకుంటే సర్వపాపాలు హరించబడతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మాడేగాం గ్రామ పంచాయతీ పరిధిలోని కదిలి గ్రామ పరిసర అటవీప్రాంతంలో వెలిసిందే శ్రీమాతాన్నపూర్ణ పాపహరేశ్వరాలయం. సహ్యాద్రి కొండల్లో మాతృహత్యాపాపం నుంచి విముక్తి పొందేందుకు పరశురాముడు ఇక్కడ స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడని ఆలయ చరిత్ర చెబుతోంది. ప్రకృతి అందాల నడుమ వెలసిన పాపహరేశ్వర స్వామి చెంతనే శ్రీమాతన్నపూర్ణేశ్వరీదేవి వెలిసింది. కదిలె శివలింగం.. గర్భగుడిలోని శివలింగం భక్తితో పరిశీలిస్తే కదులు తున్నట్లు కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఒకే కాండంలో 18 వృక్షాలు మిలితమైన వట వృక్షం అత్తకోడళ్ళ గుండాలు, సీతమ్మ అల్లుబండ, అన్నపూర్ణమాత, ఆలయ ద్వారపాలకులు సప్త రుషుల ధ్యాన మందిరం, నందీశ్వరుడు, ఆవునోటి ద్వారా కోనేరులో చేరే నీరు వంటి వి ఇచ్చట భక్తులను ఆకట్టుకుంటున్నాయి. -
పట్టభద్రుల ప్రసన్నం కోసం
కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్రెడ్డి, బీజేపీ మద్దతుతో అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరిక్రిష్ణతో సహా మొత్తం 56మంది బరిలో ఉన్నారు. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సీఎం రేవంత్రెడ్డి సహా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానిక నాయకులు చెమటోడుస్తున్నారు. బీజేపీ నుంచి కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్తో సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ప్రచారం చేశారు. బీఎస్పీ నుంచి పోటీలో ఉన్న ప్రసన్న హరిక్రిష్ణ బీసీ నినాదంతో ముందుకు వస్తున్నారు. వీరితోపాటు బక్క జడ్సన్ పలువురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే బహిరంగ సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. అంతేకాక ఎవరికివారు సామాజిక మాధ్యమాలు, ఫోన్లు, మేసేజ్లు, వాట్సాప్ల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రధానంగా ముగ్గురి మధ్యే పోటీ నెలకొనడంతో పట్టభద్రులు తమ ప్రాధాన్యతను ఎలా వ్యక్తపరుస్తారనేది ఆసక్తిగా మారింది. పట్టభద్రుల ప్రసన్నం కోసం చివరి అస్త్రంగా నగదు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం. -
పార్డి(బి)లో జాతర
కుభీర్: మండలంలోని పార్డి(బి) రాజరాజేశ్వర మందిరం మహాశివరాత్రి సందర్భంగా జాతర నిర్వహిస్తారు. బుధవారం మందిరంలో పూజలు, అభిషేకాలు జరుగుతాయి. గురువారం దేవతా మూర్తులకు జోడువాగులో స్నానం చేయిస్తారు. అదేరోజు రాత్రి కళ్యాణం నిర్వహిస్తారు. శుక్రవారం భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. శనివారం అంబళ్లు గ్రామంలోని మహిళలందరూ అంబళ్ల బుడ్లతో వచ్చి దేవునికి నైవేద్యం సమర్పిస్తారు. ఆదివారం కుస్తీపోటీలు జరుగుతాయి. పార్వతీల వ్యవస్థ.. గతంలో భక్తులు తమ కూతుళ్లకు దేవునితో పెళ్లి చేసి అక్కడే వదిలిపెట్టేవారు. పార్వతిగా ఉన్న మహిళ దేవుని సేవచేస్తూ భక్తులకు మార్గదర్శనం చేసేవారు. ఆమె చనిపోతే అక్కడే సమాధి చేసేవారు. ఇక్కడ ఆరుగురు మహిళలు పార్వతిలుగా మారి చనిపోయారు. చివరి పార్వతమ్మ 2011లో చనిపోయింది. ఆ తరువాత పార్వతమ్మగా ఎవరూ మారలేదు. -
నేడు రథాలగుడిలో పల్లకియాత్ర
నిర్మల్: జిల్లా కేంద్రంలోని చారిత్రక రథాలగుడిలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం పల్లకియాత్ర నిర్వహించనున్నట్లు వంశపారంపర్య పూజారులు తెలిపారు. కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర ఉత్సవ విగ్రహాలతో సాయంత్రం 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రతీ మహాశివరాత్రికి నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. బ్రహ్మపురి రథాలగుడిలో కొలువైన విశ్వేశ్వరుడు -
● నస్పూర్లోని మైదానంలో ఏర్పాటు ● వేలాదిగా తరలివచ్చిన పట్టభద్రులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ● ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి హామీ
నస్పూర్: మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా నస్పూర్లోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న మైదానంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంకల్పసభ ఉత్సాహంగా సాగింది. ఉమ్మడి జిల్లా నుంచి వేలాదిగా పట్టభద్రులు హాజరు కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపించింది. మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించారని తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజలు ఎల్లప్పుడూ కాంగ్రెస్ వెన్నంటే ఉన్నారని అన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని సీఎం ప్రకటించడంతో ప్రజలు, కాంగ్రెస్ శ్రేణుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఈ సభలో మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కంటోన్మెంట్, భూపాలపల్లి ఎమ్మెల్యేలు శ్రీగణేశ్, గండ్ర సత్యనారాయణరావు, రాష్ట్ర కనీస వేతన సవరణ బోర్డు చైర్మన్ జనక్ప్రసాద్, ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చా ర్జీలు శ్యాంనాయక్, అడె గజేందర్, కంది శ్రీనివాస్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రవళి, ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి ఆత్రం సుగుణ, జిల్లా, పట్టణ నాయకులు పాల్గొన్నారు.సురేఖమ్మ 24గంటలు పని చేస్తున్నరు: సీఎం‘మంచిర్యాల ప్రజలు అదృష్టవంతులు. మీరు ఒక్క ఓటు వేసి ఎమ్మెల్యేను ఎన్నుకుంటే మీకు ఇద్దరు సేవకులు వచ్చారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు రోజుకు 16గంటలు పని చేస్తే, డీసీసీ అధ్యక్షురాలిగా సురేఖమ్మ 24గంటలు పని చేస్తున్నారు’ అని సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు. -
మాస్టర్ప్లాన్కు నిధులివ్వండి..
– మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేంసాగర్రావుమంచిర్యాలలో మాస్టర్ప్లాన్ అమలుకు అనుగుణంగా పనులు మొదలుపెట్టామని, అందుకు రూ.78కోట్లు, గూడెం సత్యనారాయణస్వామి ఆలయ అభివృద్ధికి రూ.12కోట్లు కేటాయించాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరారు. మంచిర్యాలను కార్పొరేషన్గా మార్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోఎక్కడా లేని విధంగా మంచిర్యాలలో నాలుగు ఎకరాల్లో రూ.11 కోట్లతో గ్రీన్క్రిమిటోరియం పద్ధతిలో శ్మశానవాటిక నిర్మిస్తున్నామని, దీనిలో పూర్తిగా సోలార్ పవర్ వాడే విధంగా చర్యలు తీసుకున్నామని, పూర్తి కావొచ్చిందని తెలిపారు. కరకట్ట నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మాతాశిశు కేంద్రం ఆసుపత్రి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న వారికి పట్టాలు ఇప్పించాలని, సింగరేణి రిటైర్డ్ కార్మికులకు తెల్లరేషన్ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్రెడ్డి తన ప్రసంగంలో మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తానని, ఎమ్మెల్యే తన దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో సభలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. -
బాలల హక్కులు కాపాడదాం
● ఆపరేషన్ స్మైల్ 11వ విడతలో 66 మంది బాల కార్మికులకు విముక్తి ● ఎస్పీ జానకీ షర్మిల నిర్మల్టౌన్: బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. జిల్లాలో ఆపరేషన్ స్మైల్ 11వ విడతలో భాగంగా 66 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు సోమవారం ప్రశంసాపత్రాలు అందించారు. జిల్లా వ్యాప్తంగా 66 మంది బాల కార్మికులను గు ర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చామని తెలిపా రు. అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ విజయవంతం అయిందన్నారు. ఆపరేషన్ స్మైల్ విజయవంతానికి జిల్లాలో 05 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్న 30 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలి పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఉపేంద్రారెడ్డి, రాజేశ్మీనా, సీడీపీవో నాగలక్ష్మి, సీడబ్ల్యూసీ చైర్మన్ వహీద్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రాజలింగు, డీసీపీవో మురళి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
● కలెక్టర్ అభిలాష అభినవ్నిర్మల్చైన్గేట్: ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పటి ష్ట ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలి పారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ జానకీషర్మిలతో కలిసి పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మొత్తం 46 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 19,107 మంది ఓటు హక్కు పొందారని ఇందులో 17,141 మంది పట్టభద్రులు, 1,966 మంది ఉపాధ్యాయులు ఉ న్నారని వివరించారు. ఓటరు గుర్తింపు స్లిప్పుల పంపిణీ ప్రారంభమైందని తెలిపారు. ఓటర్లకు ఆర్డీవో కార్యాలయంలో సోమ, మంగళవారం అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయ సంఘాల వారికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు మాస్టర్ ట్రైనర్లతో రెండుసార్లు శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. పటిష్ట భద్రత..ఎన్నికల నిర్వహణను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసిన ట్లు ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 8 చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి రూ.38,06,830 నగదు, రూ.3,03,000 విలువ గల 827 లీటర్ల మద్యాన్ని, రూ.5,750 విలువ చేసే నిషే ధిత మత్తు పదార్థాలు, పీడీఎస్ బియ్యం, గుట్కా స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్, రాజకీయ పార్టీల ప్రతినిధులు శ్రవణ్రెడ్డి, సిరికొండ రమేశ్, గండ్రత్ రమేశ్, హైదర్, మజార్, జగన్మోహన్, అధికారులు పాల్గొన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి నిర్మల్చైన్గేట్: పదో తరగతి, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభిన వ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియెట్, పదో తరగతి బోర్డు పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాకు చేరుకున్న పరీక్షల సామగ్రికి సంబంధించిన వివరా ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 6,571 మంది ప్రథమ సంవత్స రం, 6,562 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. మార్చి 5 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయ ని వెల్లడించారు. ఈమేరకు ఏర్పాట్లు పూర్తి చేయాల ని అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్నాయన్నారు. పరీక్ష, జవాబు పత్రాల తరలింపు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల ని సూచించారు. జిల్లాకు చేరుకున్న పరీక్షల సామగ్రి ని నిర్దేశిత ప్రదేశాల్లో జాగ్రత్తగా భద్రపరచాలన్నా రు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహించా లన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో తాగునీరు, వైద్య సిబ్బంది, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇతర అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని సూ చించారు. పరీక్ష జరుగుతున్నంతసేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవా లన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సమయాని కి పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్టీసీ అధి కారులు ప్రత్యేక బస్సులు నడపాలని పేర్కొన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి పరుశురాం, డీఈవో పి.రామారావు, డీఎంహెచ్వో రాజేందర్, విద్యుత్ అధికారి వెంకటేశ్వర్లు, పోస్ట్మాస్టర్ వెంకటరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘ఎమ్మెల్సీ’ ప్రలోభాలు షురూ
● ఉన్నచోటికే మందు, విందు ● ఇంటికే పైసల్... ● టీచర్లు, గ్రాడ్యుయేట్లకు తాయిలాలు నిర్మల్ఖిల్లా: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో ప్రలోభాల పర్వం తారాస్థాయికి చేరుతోంది.. ఈనెల 27న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓటర్లుగా ఉండే గ్రా డ్యుయేట్లు, టీచర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఉదయం వాకింగ్ చేసే వారితో మొదలు పెట్టి.. రాత్రి మందు, విందు సిట్టింగ్ల వరకు సాగుతోంది. ప్రధానంగా ఉపాధ్యాయులైతే నలుగురైదుగురిని ఒక బృందంగా ఏర్పాటు చేసి హోటల్ రూంలు బుక్ చేసి.. అక్కడికే వారికి అవసరమైన మందు, విందు పంపుతున్నారు. ఎలాగైనా తమ వారికి ఓట్లు వేయించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సోష ల్ మీడియాలో సైతం తగ్గేదేలే.. అన్నట్లుగా ప్రధాన పార్టీల అభ్యర్థులు అనుచరులతోపాటు ఉపాధ్యా య సంఘాల నాయకులు ప్రచారం సాగిస్తున్నారు. మండలాల వారీగా ఇన్చార్జీలను నియమించుకుని బాధ్యతలు అప్పగించారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను కూడా ప్రచారానికి విరివిగా వినియోగిస్తున్నారు. గంపగుత్తా ఓట్ల కోసం..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. దీంతో ప్రతీ ఓటరు ఇంటికి పార్టీల నాయకులు, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుదారులు వెళ్లి కలుస్తున్నారు. ఓటరుతోపాటు వారి స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. 10 నుంచి 12 మంది వరకు బృందంగా ఉంటే వారికి ప్రత్యేక తాయిలాలు అందిస్తున్నట్లు సమాచారం. ఇక ఎన్నికలకు రెండు రోజుల ముందే మద్యం షాపులు మూసివేయనుండడంతో సరుకు నిల్వ ఉంచుతున్నారు. మరోవైపు ఆత్మీయ సమ్మేళనాల పేరిట 50, 100 మందితో ప్రత్యేక మీటింగులు ఏర్పాటు చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘం నేతలు తమ సంఘం జిల్లా, మండల కార్యవర్గ సభ్యులతో బృందాలుగా ఏర్పడి నిర్మల్ ఖానాపూర్, భైంసా తదితర పట్టణాలతోపాటు ఆయా గ్రామాల్లో ఉన్న ఓటర్లను ఇంటికి వెళ్లి మరీ కలుస్తున్నారు. మందు, విందు, నగదు...గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వారికి కావాల్సినవి సమకూరుస్తున్నారు. నిర్మల్ జిల్లాలో తయారుచేసి పెట్టుకున్న లిస్టు ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోన్లు చేసి సమయం తీసుకుంటున్నారు. సాయంత్రం వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఒక్కొక్కరికి రూ.3 వేలు, ఉపాధ్యాయ ఓటర్లకు దాదాపు రూ.5 వేల వరకు ఇప్పటికే పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.ముగ్గురి మధ్యే పోటీ..గ్రాడ్యుయేట్ ఎన్నికల సమరంలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్యే పోటీ ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున వూట్కూరి నరేందర్రెడ్డి పోటీలో ఉండగా, బీజేపీ తరఫున అంజిరెడ్డి బరిలో ఉన్నారు. ఇక బీఎస్పీ తరఫున అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ పోటీ చేస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ మద్దతుతో మల్క కొమురయ్య, పీఆర్టీయూ మద్దతుతో వంగ మహేందర్రెడ్డి పోటీలో ఉన్నారు. వారి అనుచరులు ప్రచారంలో ముందున్నారు. ఇక జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు యాటకారి సాయన్న తన ఉద్యోగానికి వీఆర్ఎస్ ప్రకటించి బీఎస్పీ మద్దతుతో బరిలో నిలిచారు. ప్రధానంగా పార్టీల మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులు అన్నిరకాల తాయిలాలు అందించేందుకు వెనకాడడం లేదు. -
పని చేసే ప్రభుత్వం
– ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకేంద్రం నుంచి ఎటువంటి సాయం లేకున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యాస్ సబ్సిడీ, రుణమాఫీ, పింఛన్లు, ఉచిత విద్యుత్ ఇస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. జీతాలు పెంచడానికి కూడా మద్దతు ఇవ్వడం లేదని తెలిపారు. బీఆర్ఎస్ మాటలతో మోసం చేసిందని, పని చేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమని, నాలుగేళ్లలో అన్ని హామీలు అమలు చేస్తామని, ఉమ్మడి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి పట్టభద్రులు కాంగ్రెస్కు ఓటెయ్యాలని కోరారు. -
పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి
– ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్రెడ్డి వూటుకూరి తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్రెడ్డి వూటుకూరి అన్నారు. ఎన్నికల్లో ఓటరు నమోదు చేసుకున్న వారందరికీ ఉచితంగా రూ.3 లక్షల ప్రమాద బీమా కల్పిస్తానని హామీ ఇచ్చారు. సింగరేణి సంస్థలో పని చేస్తున్న గ్రాడ్యుయేట్లకు ప్రమోషన్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్న టీచర్లకు కనీస వేతనం ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. ఆదిలాబాద్కు యూనివర్సిటీ తీసుకువచ్చే విధంగా ప్రభుత్వంతో చర్చిస్తానని తెలిపారు. ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్య వారధిగా ఉండి వారి సమస్యలన్నీ పరిష్కరించడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. -
మార్షల్ ఆర్ట్స్లో ప్రతిభ
నిర్మల్ఖిల్లా: ఖేలో ఇండియా సౌత్ జోన్ మార్షల్ ఆర్ట్స్(వూషూ) ఎంపిక పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. ఈనెల 18, 19 తేదీల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఆదిలాబాద్లోని ఇందిరా ప్రి యదర్శిని స్టేడియంలో ఖేలో ఇండియా ఉమె న్స్ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. ఇందులో నిర్మల్ జిల్లా నుంచి 39 మంది మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు. 5 బంగా రు, 2 రజత, 8 కాంస్య పతకాలు సాధించా రు. లోలం మమత –కేజీబీవీ(భైంసా), జి.నక్షత్ర–కేజీబీవీ(భైంసా), జే.ఈశ్వరి–జెడ్పీహెచ్ఎస్(పార్డీ–బీ), జే.గౌరీబాయి–ఎడ్బిడ్ తండా, ఎస్.భాగ్యలక్ష్మి–భైంసా బంగారు పతకా లు సాధించారు. శృతి, ప్రణతి రజత పతకా లు, మైథిలి, కౌశర్, వైష్ణవి, సోనిబాయి, స్వాతి, శైలజ, షేక్జోయా, కృషిక కాంస్య పతకాలు సాధించారు. వీరంతా త్వరలో తమిళనాడులో నిర్వహించే సౌత్జోన్ ఖేలో ఇండియా ఉమెన్స్ వూషూ పోటీల్లో పాల్గొంటారని కోచ్ శ్రీరాముల సాయికృష్ణ తెలిపా రు. ఎంపికై న క్రీడాకారులను జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్రెడ్డి, ఖేలో ఇండియా వూషూ కోచ్ జ్ఞానతేజ, మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు తేజేందర్సింగ్ భాటియా, శ్రీకాంత్, శివరాజ్గౌడ్, భూషణ్, మృణళిని, సాయినాథ్, రాజ శ్రీ, ప్రతిక్ష, చిరంజీవి, వంశీ తదితరులు అభినందించారు. -
వాలా దశాబ్ది ఉత్సవాలు
నిర్మల్టౌన్: నిర్మల్ వాకర్స్ అండ్ లాఫింగ్ అసోసియేషన్ (వాలా) దశాబ్ది ఉత్సవాలను ఆదివారం జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా క్రికెట్, చెస్, వాలీబాల్, క్యారమ్స్ తదితర ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు దేవేందర్రెడ్డి, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాలం శ్రీనివాస్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న వాలా సభ్యులు -
గజ్జలమ్మకు ప్రత్యేక పూజలు
కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీగజ్జలమ్మదేవి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. మహారాష్ట్రలోని ముంబై, నాందేడ్, ధర్మాబాద్, బోకర్ తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఆలయానికి వచ్చారు. అమ్మవారికి బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గురుస్వామి జక్కని గజేందర్, అర్చకుడు నగేశ్ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, అలంకరణ, అర్చన, సినీగేయ రచయిత తాటి శివ ఆధ్వర్యంలో పల్లకీసేవ నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. -
ఆరోగ్య కిట్లు అందేదెప్పుడో..!
● ప్రభుత్వం నుంచి నిలిచిన సరఫరా ● ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులు లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే బాలికల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గత ప్రభుత్వం శానిటరీ హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లు పంపిణీ చేసింది. 2018–19 విద్యా సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా ప్రతీ మూడు నెలలకోసారి కిట్లు అందించింది. ఏడాదిన్నర కాలం సజావుగా సాగిన ఈ కార్యక్రమం తర్వాత నిలిచిపోయింది. నాలుగేళ్లుగా విద్యార్థినులకు కిట్లు అందించడం లేదు. దీంతో బాలికల ఆరోగ్యంపై ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విద్యార్థినులతోపాటు పోషకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 8,9,10 తరగతుల నుంచి.. గత ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 8,9,10 తరగతులతోపాటు ఇంటర్ విద్యార్థినులకు శానిటరీ న్యాప్కిన్స్, సబ్బులు, కొబ్బరి నూనె, షాంపు బాటిల్, టూత్ పేస్ట్, బ్రష్, పౌడర్ తదితర 15 రకాల వస్తువులు కలిగిన హెల్త్ కిట్లను అందజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏడాదిన్న ర కాలం సజావుగా కిట్లు అందజేసింది. అనంతరం కరోనా కారణంగా పాఠశాలలకు సెలవులు రావడంతో హెల్త్ కిట్ల పంపిణీ నిలిచింది. విద్యార్థినుల వివరాలు జిల్లాలో 164 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఎనిమి దో తరగతిలో 2,855 మంది విద్యార్థినులు, తొమ్మిదో తరగతిలో 2,835 మంది, 10వ తరగతిలో 2,476 మంది విద్యార్థినులు చదువుతున్నారు. జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫస్టియర్ విద్యార్థినులు 1,013 మంది, సెకండియర్ విద్యార్థినులు 941 మంది ఉన్నారు. అందని కాస్మొటిక్ చార్జీలు జిల్లాలో 18 కేజీబీవీలు, 18 కళాశాలలున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంత్సరం విద్యార్థినులు 2,880 మంది ఉన్నారు. కేజీబీవీల్లో 6,7,8,9,10 తరగతుల్లో ఒక్కో తరగతికి 40 మంది చొప్పున 18 కేజీబీవీల్లో మొత్తం 3,600 బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ఈ సంవత్సరం నుంచి కాస్మొటిక్ చార్జీల కింద నెలకు రూ.100 చొప్పున అందజేస్తామని చెప్పడటంతో ఎస్వోలు విద్యార్థినులతో బ్యాంక్ ఖాతాలు తీయించారు. ఈ ప్రక్రియ గత డిసెంబర్ చివరి వరకు కొనసాగిందని కేజీబీవీల ఎస్వోలు చెబుతున్నారు. విద్యార్థినుల ఖాతాల్లో నేరుగా నెలకు రూ.100 జమ అవుతున్నట్లు అధికారులు తెలిపినా ఇప్పటివరకు ఏ ఒక్క విద్యార్థినికి జమ కాలేదని ఎస్వోలు తెలిపారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థినులకు హెల్త్ కిట్లు, కేజీబీవీల్లో చదివే విద్యార్థినులకు కాస్మొటిక్ చార్జీలు ఇవ్వాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఘనంగా విగ్రహ ప్రాణప్రతిష్ఠ
సోన్: మండల కేంద్రంలోని రాజరాజేశ్వరస్వామి, లోకల్ వెల్మల్ గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ధ్వజ, శిఖర, ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల వద్ద ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. బీజేపీ మండలాధ్యక్షుడు మారా గంగారెడ్డి, నాయకులు సరికెల గంగన్న, జక్క రాజేశ్వర్, నరేశ్, నర్సారెడ్డి, నర్సయ్య, సంతోష్, ప్రశాంత్, గంగన్న, సాయన్న, మక్కన్న, అమృత్, రాజు, ఉదయ్, శివ భక్తులు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. ధర్మోర హన్మాన్ ఆలయంలో.. లోకేశ్వరం: మండలంలోని ధర్మోర గ్రామంలో నూతనంగా నిర్మించిన హనూమాన్ మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రామారావుపటేల్ హాజరై పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. నాయకులు సాయన్న, మెండె శ్రీధర్, మంద భాస్కర్, మంద గణేశ్, జయసాగర్రావు, అనిల్, ఆజోబ పటేల్, ఉత్సవ కమిటీ సభ్యులు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.