Yadadri
-
న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరిగింది
రామగిరి(నల్లగొండ): ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు వెల్లడించిన తీర్పుతో ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసిన దర్శనం నర్సింహను కమిషన్ సభ్యులు నల్లగొండ కలెక్టరేట్లో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. ప్రణయ్ హత్య కేసులో ప్రాసిక్యూటర్, పోలీసులు సమష్టిగా పనిచేసి తీర్పు రావడండలో కీలకంగా వ్యవహరించారన్నారు. ఈ కేసులో దోషులు కరడుకట్టిన నేర చరిత్ర ఉన్నవారు ఉన్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్కు రక్షణను కొనసాగించాలని పోలీసులకు సూచించారు. ఈ తీర్పుతో బలహీన వర్గాలకు న్యాయవ్యవస్థ ద్వారా న్యాయం జరుగుతందనే నమ్మకం వచ్చిందన్నారు. ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా ప్రాసిక్యూషన్ కొనసాగిందని అభినందించారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, రాంబాబు, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ పాల్గొన్నారు. ఫ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఫ ప్రణయ్ హత్య కేసు వాదించిన పీపీ దర్శనం నర్సింహకు సన్మానం -
గంజాయి తరలిస్తున్న ఐదుగురి అరెస్ట్
సూర్యాపేటటౌన్: గంజాయి తరలిస్తున్న ఐదుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నర్సింహ విలేకరులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు చెందిన మల్లెడ వెంకటవంశీ, గోకులముడి ఆనంద్ ఆంధ్రా, ఒడిశా సరిహద్దు నుంచి గంజాయిని తీసుకొచ్చి చిన్న చిన్న పాకెట్ల రూపంలో మార్చి హైదరాబాద్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరిద్దరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలానికి చెందిన చొరగుడి తేజతో కలిసి విజయవాడ నుంచి హైదరాబాద్కు బస్సులో గంజాయి తరలిస్తూ.. మార్గమధ్యలో కోదాడ శివారులోని దుర్గాపురం ఎక్స్ రోడ్డు వద్ద బస్సు దిగి రోడ్డు పక్కన మామిడి తోటలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు చెందిన ఉమ్మడిశెట్టి సంపత్ కుమార్, హేమన్ నర్సింహ సాయి, పాలపర్తి కృష్ణచైతన్య, నాగ వీరభాస్కర్రావుకు గంజాయి ఇస్తుండగా.. పక్కా సమాచారం మేరకు సోమవారం కోదాడ టౌన్ ఎస్ఐ సైదులు తన సిబ్బందితో వెళ్లి వారిని పట్టుకున్నారు. చొరగుడి తేజ, సంపత్ కుమార్, కృష్ణచైతన్య, నాగ వీరభాస్కర్రావు, హేమన్ నర్సింహ సాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. మల్లెడ వెంకట వంశీ, గోకులముడి ఆనంద్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. పరారీలో ఉన్న వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ వివరించారు. నిందితుల నుంచి 9.860 కిలోల గంజాయి, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వర్రావు, కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ పరారీలో మరో ఇద్దరు ఫ 9.860 కిలోల గంజాయి స్వాధీనం -
పోలీస్ స్టేషన్లో యువకుడి ఆత్మహత్యాయత్నం
తుంగతుర్తి: కేసు విచారణ నిమిత్తం స్టేషన్కు రావాలని పోలీసులు ఫోన్ చేయడంతో భయపడిన యువకుడు పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి జరిగింది. స్థానిక ఎస్ఐ రుద్రకాంత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి నాగయ్యకు అడ్డగూడూరు మండలం లక్ష్మిదేవికాల్వ గ్రామానికి చెందిన యువతితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా.. నాగయ్య భార్య పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో భార్యను కాపురానికి రమ్మని పిలవడానికి సోమవారం నాగయ్య అత్తవారి ఇంటికి వెళ్లగా.. మాటామాట పెరిగి ఘర్షణ జరిగింది. దీంతో అత్తింటివారు అతడిపై చేయి చేసుకున్నారు. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అడ్డగూడూరు పోలీస్ స్టేషన్కు రావాలని పోలీసులు ఫోన్ చేయడంతో భయపడి నాగయ్య తుంగతుర్తి పోలీస్ స్టేషన్కు చేరుకొని ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతడికి తుంగతుర్తి ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. నాగయ్య ఆరోగ్యం కుదుటపడ్డాక పోలీస్ స్టేషన్కు రావాలని.. భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇస్తామని ఎస్ఐ తెలిపారు. -
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
మిర్యాలగూడ: మిర్యాలగూడ మండలం నందిపాడు, రవీందర్నగర్లోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ శాఖ సీఐ ఎస్కే గౌస్ మాట్లాడుతూ.. లక్ష్మీవెంకటేశ్వర ఫర్టిలైజర్స్, మిర్యాలగూడ రైతు ఆగ్రో సేవా కేంద్రంలో దాడులు నిర్వహించి కాలం చెల్లిన మందులను గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు దుకాణ యజమానులపై కేసు నమోదు చేశామన్నారు. నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహిస్తున్నామన్నారు. కొంతమంది రైతులను సైతం విచారించినట్లు తెలిపారు. ఆయన వెంట కానిస్టేబుల్ నర్సింహారెడ్డి, ఏఓ ధీరావత్ సైదానాయక్, ఏఈఓ షఫీ తదితరులు ఉన్నారు. -
గ్రూప్–2లో సత్తాచాటిన ఉమ్మడి జిల్లావాసులు
మోత్కూరు: మోత్కూరు మున్సిపల్ కేంద్రానికి చెందిన గుర్రం మోహన్రెడ్డి, స్వరాజ్యం దంపతుల కుమారుడు గుర్రం సాయికృష్ణారెడ్డి మంగళవారం ప్రకటరించిన గ్రూప్–2 ఫలితాల్లో 600 మార్కులకు గాను 422.91 మార్కులు సాధించి స్టేట్ 11వ ర్యాంకు సాధించాడు. గతంలో ప్రకటించిన గ్రూప్–4 ఫలితాల్లో జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా డు. సాయికృష్ణారెడ్డి చెల్లె సాయిసుప్రియ కూడా గ్రూప్–4లో మంచి ర్యాంకు సాధించి మోత్కూరు మున్సిపల్ కార్యాలయంలో వార్డ్ ఆఫీసర్గా పనిచేస్తోంది. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి గ్రూ ప్–2 ఉద్యోగానికి ఎంపికై న సాయికృష్ణారెడ్డిని గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు అభినందించారు. సిరిపురం యువకుడికి రాష్ట్రస్థాయిలో 20వ ర్యాంకు రామన్నపేట: మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన సిలువేరు సత్తయ్య–మంగమ్మ దంపతుల చిన్న కుమారుడు సిలువేరు సురేష్ మంగళవారం గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 20వ ర్యాంకు సాధించాడు. సురేష్ 600 మార్కులకు గాను 411.865 మార్కులు సాధించాడు. బీటెక్ చదివిన సురేష్ మూడునెలల క్రితం గ్రూప్–4లో ఉత్తీర్ణుడై జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. అన్నదమ్ముల హవా.. పెన్పహాడ్: గ్రూప్–2 ఫలితాల్లో పెన్పహాడ్ మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన శ్రీరామ్ మధు రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు, అతడి తమ్ముడు శ్రీరామ్ నవీన్ 326వ ర్యాంకు సాధించారు. మధు 2014లో వీఆర్వోగా ఎంపికై ఇటీవల ప్రభుత్వం కల్పించిన పదోన్నతుల్లో అనంతగిరి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి తమ్ముడు నవీన్ 2020లో పంచాయతీ కార్యదర్శిగా ఎంపికై నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ గ్రూప్–2 పరీక్షలకు సన్నద్ధమై ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు ఉత్తమ ర్యాంకులు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 141వ ర్యాంకు సాధించిన వెలిదండ వాసిగరిడేపల్లి: మండల పరిధిలోని వెలిదండ గ్రామానికి చెందిన అనంత సుమన్ గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 141వ ర్యాంకు సాధించారు. 600 మార్కులకు గాను 387.75 మార్కులతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సుమన్ 2019 డీఎస్సీలో ఓపెన్ కేటగిరీలో ఎస్జీటీ ఉద్యోగాన్ని సాధించారు. వికారాబాద్ జిల్లా పోటుపల్లి మండలం నాగసానిపల్లిలో ఎస్జీటీగా పనిచేస్తూనే గ్రూప్–2 పరీక్ష రాసి 141వ ర్యాంకును సాధించాడు. సుమన్ను గ్రామస్తులు అభినందించారు. 130వ ర్యాంకు సాధించిన నాగులపాటి అన్నారం వాసిపెన్పహాడ్: మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన నాగార్జున గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 130వ ర్యాంకు సాధించారు. ఎంకాం పూర్తిచేసిన ప్రభుత్వ ఉద్యోగం సాధించిన నాగార్జునను గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అభినందించారు. గ్రూప్–1ఉద్యోగానికి ఎంపికైన గూడపూర్ యువకుడు నల్లగొండ టూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో మునుగోడు మండలం గూడపూర్ గ్రామానికి చెందిన నన్నూరు వెంకట్రామ్రెడ్డి, మంజుల దంపతుల కుమారుడు నన్నూరి మనోజ్కుమార్రెడ్డి 517 మార్కులు సాధించి టాప్ టెన్లో ఒకడిగా నిలిచాడు. టాప్ టెన్లో నిలిచిన మనోజ్కుమార్రెడ్డికి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం లభించే అవకాశం ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఏవియేషన్పై అవగాహన ఉండాలి
కోదాడ : విద్యార్థులకు ఏవియేషన్పై అవగాహన ఉండాలని, రానున్న రోజుల్లో ఏవియేషన్కు ఉజ్వల భవిష్యత్ ఉందని కోదాడకు చెందిన ఏవియేషన్ పైలెట్ ఉయ్యాల ఖ్యాతి అన్నారు. మంగళవారం కోదాడలోని తేజ టాలెంట్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తాను ఏవియేషన్లో శిక్షణ తీసుకొని 19 సంవత్సరాలకే పూర్తి స్థాయి పైలెట్గా మారానని తెలిపారు. దీని కోసం అవసరమైన ఏడురకాల లైసెన్స్లను పొందానని పేర్కొన్నారు. అమెరికా ఏవియేషన్లో తాను శిక్షణ పొందినట్లు తెలిపారు. బాలికలు కూడా ఈ రంగంలో రాణించవచ్చన్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక సభ్యు డు జాఫర్, పాఠశాల డైరెక్టర్ జానకిరామయ్య, ప్రిన్సిపాల్ అప్పారావు, సోమానాయక్, రేణుక, సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత డిండి: ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని మంగళవారం సివిల్ సప్లయ్ అధికారులు పట్టుకున్నారు. దేవరకొండ డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లయ్(డీటీసీఎస్) హన్మంతు శ్రీనివాస్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం చెర్కుపల్లి గ్రామానికి చెందిన బోయిని రమేష్ రేషన్ లబ్ధిదారుల నుంచి ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యం కొనుగోలు చేసి తన ఇంట్లో నిల్వ ఉంచాడు. పక్కా సమాచారం మేరకు సివిల్ సప్లయ్ అధికారులు రమేష్ ఇంటిపై దాడి చేసి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని స్థానిక రేషన్ డీలర్కు అప్పజెప్పామని డీటీసీఎస్ పేర్కొన్నారు. ఈ మేరకు రమేష్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతిమిర్యాలగూడ: గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం దామరచర్ల మండలం కొండ్రపోల్ పరిధిలో జరిగింది. వాడపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండ్రపోల్కు చెందిన కుంకునూరి నర్సింహారావు(70) మంగళవారం ఉదయం వాకింగ్ నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ పరిధిలోని నార్కట్పల్లి–అద్దంకి రహదారి వెంట వాకింగ్ చేస్తుండగా.. మిర్యాలగూడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సింహారావు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వాహనం ఆచూకీ కోసం రెండు స్పెషల్ టీంలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతినకిరేకల్: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని వినాయక బంకెట్ హాల్ సమీపంలో షేక్ సయ్యద్(17) అనే యువకుడు తన తల్లి, అక్కతో కలిసి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. సయ్యద్ లావుగా ఉండటంతో రోజూ వ్యాయామం, వాకింగ్ చేస్తున్నాడు. అయితే సోమవారం రాత్రి షేక్ సయ్యద్ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడి కాళ్లపై దెబ్బలు ఉండటంతో కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
నకిరేకల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం తాటికల్ గ్రామానికి చెందిన జిల్లా వెంకటయ్య(54) ఈ నెల 8వ తేదీన బైక్పై నకిరేకల్కు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో తాటికల్ ఫ్లైఓవర్ వద్ద గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటయ్యను నల్లగొండ పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి భార్య ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు. -
చెత్తకుప్పలో ఆడ శిశువు మృతదేహం లభ్యం
యాదగిరిగుట్ట: చెత్తకుప్పలో ఆడ శిశువు మృతదేహం లభించింది. ఈ ఘటన యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కన ఉన్న చెత్తకుప్పలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. మంగళవారం సాయంత్రం అటువైపు వెళ్తున్న వ్యక్తులు శిశువును గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చూసేసరికి శిశువు మృతిచెందిందని పట్టణ సీఐ రమేష్ తెలిపారు. శిశువు మృతదేహాన్ని భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. సమీపంలోని ఆస్పత్రుల్లో ప్రసవించిన వారి వివరాలను సేకరిస్తున్నామని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పురుగుల మందు తాగి కూలీ ఆత్మహత్యనకిరేకల్: ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నకిరేకల్ పట్టణంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన జటంగి లింగయ్య(45) నకిరేకల్కు వచ్చి కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న లింగయ్య సోమవారం రాత్రి స్థానిక వ్యవసాయ మార్కెట్ సమీపంలో పురుగుల మందు తాగాడు. అటుగా వెళ్తున్న వారు గమనించి లింగయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుమారుడు ధనుష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్ తెలిపారు. ఫలితాలు వాయిదా వేయాలని ధర్నా నల్లగొండ టౌన్ : రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు గ్రూప్–1, 2, 3, హాస్టల్ వెల్ఫేర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలను వాయిదా వేయాలని కలెక్టరేట్ ఎదుట మంగళశారం ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఫలితాలు ప్రకటించడం వల్ల ఎస్సీ ఉప కులాలకు అన్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఇరిగి శ్రీశైలం, బోడ సునీల్, బకరం శ్రీనివాస్, గాదె రమేష్ పాల్గొన్నారు. ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైరు చోరీమునగాల: మండల కేంద్రం శివారులో గల ఎల్–33 ఎత్తిపోతల పథకం రెండవ స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైరును గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. చోరీ జరిగినట్లు మంగళవారం గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. చోరీకి గురైన కాపర్ వైరు విలువ సుమారు రూ.4లక్షలకు పైగా ఉంటుందని తెలిసింది. -
కస్తాల శ్రవణ్ కుటుంబానికి అండగా ఉంటాం
హుజూర్నగర్: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కాంగ్రెస్ యువ నాయకుడు, హుజూర్నగర్ మున్సి పాలిటీ మాజీ కౌన్సిలర్ కస్తాల శ్రవణ్కుమార్ కుటంబానికి అండగా ఉంటామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్నగర్కు వచ్చిన మంత్రి శ్రవణ్కుమార్ ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయంపై పార్టీ జెండా కప్పి, పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రవణ్కుమార్ కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి మాట్లాడారు. శ్రవణ్కుమార్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ కోసం పని చేశారని, మంచి వ్యక్తిత్వం కలిగిన ఆయన మనకు దూరం కావడం చాలా బాధాకరమని అన్నారు. శ్రవణ్కుమార్ కుటుంబానికి తనతో పాటు పార్టీ కూడా అండగా ఉంటుందని, వారి పిల్లల చదువుల ఖర్చుల బాధ్యత కూడా తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి వెంట కాంగ్రెస్ నాయకులు తన్నీరు మల్లిఖార్జున్, యరగాని నాగన్న, సాముల శివారెడ్డి, దొంతగాని శ్రీనివాస్, కోతి సంపత్రెడ్డి, శివరాం యాదవ్, ఉపేందర్ తదితరులు ఉన్నారు. పాడె మోసిన మందకృష్ణ మాదిగ.. శ్రవణ్కుమార్ అంతిమ యాత్రలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొని పాడె మోశారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్ నాయకులు చింతిర్యాల నాగయ్య, బాలచంద్రుడు, ఎం. వెంకటేశ్వర్లు, ఎం. శ్యాంసుందర్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా సీపీఐ నాయకులు యల్లావుల రాములు, గుండు వెంకటేశ్వర్లు, జడ శ్రీనివాస్, యల్లావుల రమేష్, సోమగాని కష్ణ, జక్కుల రమణ, సీపీఎం నాయకులు పల్లె వెంకట రెడ్డి, దుగ్గి బ్రహ్మం, వట్టెపు సైదులు, పి. హుస్సేన్, ఇందిరాల త్రివేణి, వీరస్వామి, వెంకటనారాయణ, ఓయూ జేఏసీ నాయకులు తదితరులు శ్రవణ్కుమార్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఫ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
తెలుగు శాఖకు విరాళం అందజేత
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో తెలుగు విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చే విద్యార్థులకు బంగారు పతకం అందించేందుకు గాను రిటైర్డ్ ప్రొఫెసర్లు ఇంద్రసేనారెడ్డి, ఎం. ఇంద్రారెడ్డి, కె. సత్యనారాయణరెడ్డి, కె. లింగారెడ్డి, కె. విజయేందర్రెడ్డి రూ.3లక్షల చెక్కును మంగళవారం యూనివర్సిటీలో వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్కు అందజేశారు. అదేవిధంగా ప్రతి ఏటా స్మారక ఉపన్యాసానికి మరో రూ.6లక్షల విరాళం అందించారు. ఈ విరాళాలను బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ప్రతి సంవత్సరం బంగారు పతకం, స్మారక ఉపన్యాసం కోసం వెచ్చిస్తామని వైస్ చాన్స్లర్ తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, రిటైర్ట్ రిజిస్ట్రార్ నరేందర్రెడ్డి, ప్రొఫెసర్లు అంజిరెడ్డి, ఆకుల రవి, డాక్టర్ ఉపేందర్రెడ్డి, డాక్టర్ మారం వెంకటరమణారెడ్డి, డాక్టర్ హరీష్కుమార్ పాల్గొన్నారు. -
ఉన్నత విద్యా ప్రమాణాలు పాటించాలి
నల్లగొండ టూటౌన్: విద్యాసంస్థలు ఉన్నత విద్యా ప్రమాణాలు పాటిస్తూ ముందుకుసాగాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎంజీయూలో మంగళవారం నిర్వహించిన బీఈడీ కళాశాలల అకడమిక్ సమావేశంలో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బీఈడీ కళాశాలల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాలకు విద్యా ప్రమాణాలు మెరుగుపరచుటకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల హాజరుకు సంబంధించి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వై. ప్రశాంతి, డిప్యూటీ డైరెక్టర్ జయంతి, అమరేందర్, వివిధ బీఈడీ కళాశాలల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు. ఫ మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ -
యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో గవర్నర్
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కొనసాగుతున్న శ్రీస్వామి అమ్మవార్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్టా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.శ్రీస్వామిని దర్శించుకున్న గవర్నర్కు ముఖ మండపంలో ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఈఓ భాస్కర్రావు.. శ్రీస్వామి వారి లడ్డూ ప్రసాదంతో పాటు శ్రీనృసింహస్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్తర మాడవీధిలోని యాగశాలలో నిర్వహించిన మహా పూర్ణాహుతిలో పాల్గొన్నారు. ఆయన వెంట కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి తదితరులున్నారు. యాదగిరి క్షేత్రంలో వైభవంగా శ్రీచక్ర తీర్థంయాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమానుసారం కొనసాగుతున్నాయి. ఆలయంలో సోమవారం ఉదయం నిత్యపూజలు చేసిన ఆచార్యులు ప్రథమ ప్రాకారంలోని ఉత్తర దిశలో ఏర్పాటు చేసిన యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం శ్రీచక్ర ఆళ్వారుడికి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి, ఆలయ మాడ వీధుల్లో ఊరేగించి విష్ణు పుష్కరిణిలో శ్రీచక్ర తీర్థ స్నానం చేపట్టారు.ఈ సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. రాత్రి ఆలయంలో శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలను ఆగమశాస్త్రం ప్రకారం జరిపించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయంలో ఉదయం అష్టిత్తర శతఘటాభిõÙకం రాత్రి శృంగార డోలోత్సవం నిర్వహిస్తారు. శృంగార డోలోత్సవంతో 11 రోజుల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. -
పంటలు ఎండిపోకుండా చూడండి : కలెక్టర్
సాక్షి,యాదాద్రి : పంటలు ఎండిపోకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడీయో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగునీటిపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడెక్కడ పంటలు ఎండిపోతున్నాయో గుర్తించి అక్కడ ప్రత్యామ్యాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, గంగాధర్, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణంలో అక్రమాలకు తావుండొద్దు సాక్షి,యాదాద్రి : అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ఆర్డీఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం అయ్యారు. లబ్ధిదారుల ఎంపిక త్వరగా పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, డీఆర్డీఓ నాగిరెడ్డి, శేఖర్రెడ్డి, హౌసింగ్ పీడీ విజయసింగ్ తదితరులు పాల్గొన్నారు. నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలిరామన్నపేట : పదవ తరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా సిద్ధం కావాలని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ విద్యార్థులకు సూచించారు. సోమవారం జనంపల్లి బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు సూ చనలు చేశారు. ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలన్నారు. అనంతరం సుమధుర ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టే నిర్మాణాల కోసం స్థలాలను పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. ఆతరువాత ఇస్కిళ్ల గ్రామంలో గుండా సత్తయ్య మెమోరియల్ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు. ఆయనవెంట ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ లాల్బహదూర్, డీఈ యూసుఫ్, ప్రిన్సిపాల్ ఎస్. రాజా, సుమధుర ఫౌండేషన్ ప్రతినిధులు జీవన, అశ్రిత, ఉపాధ్యాయులు ఉన్నారు. -
ఆరున్నరేళ్లకు.. అంతిమతీర్పు
పకడ్బందీగా దర్యాప్తు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రణయ్ హత్య కేసును పోలీసు యంత్రాంగం పకడ్బందీగా దర్యాప్తు చేసింది. కేసు విచారణ, పక్కాగా సాక్ష్యాల సేకరణ, వాటి అథెంటికేషన్ విషయంలో అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో పోలీసు బృందాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాయి. తమిళనాడులో శంకరన్ హత్య కేసు తరహాలో ప్రణయ్ హత్య కేసు విచారణ జరిగింది. తమిళనాడులో కులాంతర వివాహం చేసుకున్న శంకరన్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.. అక్కడ ఆయన హత్యకు గురయ్యాడు. ఆ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తమిళనాడు పోలీసులు నిందితులకు కఠిన శిక్ష పడేలా పక్కాగా విచారణ జరిపారు. అందుకే ప్రణయ్ హత్య తరువాత అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో పోలీసు అధికారుల బృందం అక్కడికి వెళ్లి ఆ కేసును కూడా పరిశీలించింది. ప్రణయ్ హత్య కేసులోనూ నిందితులు తప్పించుకోకుండా, సాక్ష్యాధారాలు తారుమారు కాకుండా, సాంకేతిక పద్ధతుల్లో వాటిని భద్రపరిచారు. ముఖ్యంగా హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, బ్లడ్ శాంపిల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్ల్లో పరీక్ష చేయించారు. అంతేకాదు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రణయ్ హత్యకు ముందు నిందితులు ఏయే ప్రాంతాల్లో సంచరించారు.. ఎవరెవరు కలుసుకొని ప్లాన్ చేశారు.. అనే వివరాలు సేకరించి అన్ని ఆధారాలను కోర్టులో సమర్పించారు. ఈ కేసులో ఎలాంటి అవకతవకలకు, అనుమానాలకు తావులేకుండా నేరం రుజువయ్యేలా సేకరించిన అన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. తద్వారానే సుభాష్ కుమార్ శర్మకు అప్పట్లో బెయిల్ రాలేదు. కేసు విచారణ తుది తీర్పులో సుభాష్ శర్మకు ఉరి శిక్ష, మిగిలిన వాళ్లకు జీవిత ఖైదు పడిందని, తద్వారా బాధితులకు సత్వర న్యాయం జరిగిందని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రణయ్ హత్య కేసులో కరుడుగట్టిన నేరస్తుడు అజ్గర్ అలీఫ ప్రధాన పాత్రధారి అబ్దుల్బారి ఫ సుభాష్కుమార్ శర్మను తీసుకొచ్చింది బారీనే ఫ 1,600 పేజీల్లో చార్జిషీట్ రూపొందించి కోర్టులో సమర్పించిన పోలీసులు -
నేత్రపర్వంగా మహాపూర్ణాహుతి, పుష్పయాగం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరాయి. సోమవారం మహాపూర్ణాహుతి, శ్రీచక్రతీర్థం, పుష్పయాగం, దేవతలకు వీడ్కోలు పర్వాలను నేత్రపర్వంగా చేపట్టారు. ఉదయం యాగశాలలో నిర్వహించిన మహా పూర్ణాహుతి వేడుక సందర్భంగా.. బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన దేవతలను సుగంధద్రవ్యాలతో ఆరాధించి, పట్టు వస్త్రాలతో ఆవాహన చేసి నెయ్యితో అగ్ని భగవానుడికి సమర్పించారు. విశ్వశాంతి కోసం మహా పూర్ణాహుతి నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. ఈ వేడుకలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని పూజలు నిర్వహించారు. కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఈఓ భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీచక్రతీర్థం : మహావిష్ణువు ఆయుధమైన శ్రీచక్ర ఆళ్వారుడికి మధ్యాహ్నం ఒంటి గంటకు పూజలు చేసిన అనంతరం విష్ణు పుష్కరిణిలో శ్రీచక్రతీర్థం వేడుక వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను.. శ్రీచక్ర ఆళ్వారునికి అలంకరించి ప్రత్యేక పల్ల కిపై అధిష్టింపజేసి పూజలు చేశారు. ఆ తరువాత ఆలయ మాడ వీధుల్లో ఊరేగిస్తూ విష్ణు పుష్కరిణికి వేంచేసి శ్రీచక్రస్నానం వేడుక పూర్తి చేశారు. దేవతలకు వీడ్కోలు సాయంత్రం నిత్యరాధనల అనంతరం దేవతోద్వాసన, శ్రీపుష్పయాగం, దోపు ఉత్సవం నిర్వహించారు. ఉత్సవాల్లో దోఽషాలు జరిగితే తొలగించేందుకు ప్రా యశ్చిత్తంగా పుష్పయాగం చేపట్టారు. ఇక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన దేవతలను తిరిగి స్వస్థలానికి పంపించే వేడుక దేవతోద్వాసన అని అర్చకులు పేర్కొన్నారు. శ్రీస్వామి వారికి అత్యంత ప్రీతికరమైన వేడుక దోపు మహోత్సవం.ఫ మహా పూర్ణాహుతిలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఫ తుది అంకానికి చేరిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు -
ప్రదక్షిణలే.. పరిష్కారమేదీ?
ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం 282 అర్జీలు పెండింగ్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో 2024 జూన్ 10నుంచి 2025 జనవరి 16వ తేదీ వరకు 900 అర్జీలు వచ్చాయి. ఇందులో 618 పరిష్కారానికి నోచుకోగా ఇంకా 282 అర్జీలు వివిధ కారణాలతో పెండింగ్ ఉన్నాయి. ఇందులో అత్యధికంగా 102 దరఖాస్తులు భువనగిరి ఆర్డీఓ, 27 మోటకొండూరు, 20 యాదగిరిగుట్ట, 15 గుండాల పరిధిలో ఉన్నాయి. ఫ వివిధ కారణాలతో కాలయాపన ఫ పదేపదే కలెక్టరేట్ మెట్లు ఎక్కుతున్న బాధితులు ఫ భూ సమస్యలు, రేషన్ కార్డులు, ఇళ్లు, పింఛన్ల కోసం ఎక్కువగా విన్నపాలు సాక్షి, యాదాద్రి : ‘అడ్డగూడూరు మండలం చిర్రగూడూరుకు చెందిన నిమ్మల రాముకు మూడేళ్ల క్రితం పక్షవాతం వచ్చింది. కుడికాలు, కుడిచేయి చచ్చు పడ్డాయి. పింఛన్కోసం రెండేళ్ల క్రితం కలెక్టరేట్కు వచ్చి ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నాడు. మంజూరు కాకపోవడంతో ఆ తరువాత పలుమార్లు వినతులు అందజేశాడు. సోమవారం కూడా స్వగ్రామం నుంచి 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న కలెక్టరేట్కు భార్య, తండ్రితో కలిసి వచ్చి వినతిపత్రం అందజేశాడు. 60 ఏళ్లుగా తమ వ్యవసాయ బావుల వద్దకు ఉన్న బాటను కొందరు వ్యక్తులు ఆక్రమించారని, న్యాయం చేయాలని వలిగొండ మండలం వెల్వర్తి గ్రామానికి చెందిన ఐలమ్మ, సుగుణమ్మలు ప్రజావాణిలో కొంతకాలం క్రితం వినతులు అందజేశారు. రెవెన్యూ అధికారులను పంపి సమస్యను పరిష్కరిస్తామని అప్పట్లో ఉన్నతాధికారి వారితో చెప్పారు. ఆతరువాత ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో మరోసారి ప్రజావాణికి వచ్చి అర్జీలు అందజేశారు. ఇలా.. ఒక సమస్యతో వచ్చిన వారే పదేపదే తిరిగి వస్తూ విన్నవించుకుంటున్నారు. వినతిపత్రాలు తీసుకునే సమయంలో అధికారులు హామీలైతే ఇస్తున్నారు. కానీ, సమస్య అలాగే ఉండిపోతోంది. కలెక్టరేట్కు ప్రదక్షిణలు చేయడమే తప్ప.. సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ చాలా మంది బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా విన్నపాల్లో అధికంగా భూసమస్యలు, రేషన్కార్డులు, ఇళ్లు, పింఛన్లకు సంబంధించినవే ఉంటున్నాయి. నెల రోజుల తరువాత ప్రజావాణి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో నిలిచిపోయిన ప్రజావాణి తిరిగి సోమవారం ప్రారంభమైంది. నెల రోజుల తరువాత ప్రజావాణి కార్యక్రమాన్ని పునరుద్ధరించడంతో జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి విన్నపాలు అందజేశారు. మొత్తం 60 అర్జీలు రాగా అందులో 40 వినతులు భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి. ఐదు గ్రామీణాభివృద్ధి, 4 మున్సిపల్, 2 చేనేత, 2 పంచాయతీరాజ్కు సంబంధించినవి ఉన్నాయి. మత్స్య, వ్యవసాయ, శిశు సంక్షేమం, మార్కెటింగ్, విద్యుత్, వైద్యశాఖకు సంబంధించిన వినతులు ఒక్కోటి చ వచ్చాయి. అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, గంగాధర్, జెడ్పీ సీఈఓ శోభారాణి తదితరులు వినతులు స్వీకరించారు. సోమవారం వచ్చిన వినతుల్లో కొన్ని.. ● రోడ్డు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. 30 ఫీట్ల రోడ్డును 10 ఫీట్ల మేర ఆక్రమించారని, దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. వెంటనే విచారణ జరిపించి న్యాయం చేయాలని విన్నవించారు. ● గుండాల మండలానికి దేవాదుల నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని కోరుతూ వె ల్మజాల గ్రామానికి చెందిన రాజయ్య వేడుకున్నారు. తా ను ఐదు ఎకరాల్లో వరి సాగు చేశానని, రూ.లక్షల వరకు పెట్టుబడి పెట్టానని, భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లు సరిగా పోయడం లేదన్నారు. దీంతో ఇప్పటికే కొంత పొలం ఎండి పోయిందన్నారు. గుండాల మండలంలో చాలా మంది రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని, దేవాదుల నుంచి గోదావరి జలాలను విడుదల చేస్తే తప్ప.. పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదన్నారు. అలాగే ఎండిన పంటలు ఎకరానికి రూ.25వేల చొప్పున పరిహారం చెల్లించాలని విన్నవించారు. బోర్లు ఎండిపోతున్నాయి.. ఇసుక రవాణాను అడ్డుకోండి రాజాపేట మండలం రేణికుంట, బేగంపేట వాగుల నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, వెంటనే అడ్డుకోవాలని ఆయా గ్రామాలకు చెందిన రైతులు, నాయకులు ప్రజావాణిలో అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఇసుక తరలించడం వల్ల వాగు పరీవాహకంలో బోర్లు ఎండిపోతున్నాయని, నీరందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకునేందుకువెళ్లిన రైతులపై దాడి చేస్తున్నారని పే ర్కొన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి స్పందిస్తూ ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, సీసీ రోడ్లకు మాత్రమే ఇసుక రవాణాకు పర్మిషన్ ఉందని, ఇసుక రవాణాను అడ్డుకోవాలని రెవెన్యూ, పోలీసు అధికారులను ఆదేశించారు. -
వైద్య విద్యార్థులకు సామాజిక దృక్పథం ఉండాలి
బీబీనగర్: వైద్య వృత్తి చాలా ప్రధానమైనదని, వైద్య విద్యార్థులు సామాజిక దృక్పథంతో ఉంటూ రోగుల పట్ల ప్రేమను కలిగి ఉండాలని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి చైర్మన్, పద్మభూషన్ అవార్డు గ్రహీత డాక్టర్ నాగేశ్వర్రెడ్డి సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని ఎయిమ్స్ వైద్య కళాశాలలో సోమవారం రాత్రి నిర్వహించిన వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎయిమ్స్లోని విద్యార్థులకు చాలా చక్కటి భవిష్యత్త్ ఉందన్నారు. వరల్డ్లోనే బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాల బెస్ట్గా నిలుస్తుందన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నాయన్నారు. ఐదేళ్లలోనే అబ్బురపరిచే విధంగా భవనాల నిర్మాణాలు జరగడం సంతోషదాయకమని అన్నారు. రోగులతో సాన్నిహిత్యం కలిగి ఉండాలని సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ బాటియా మాట్లాడుతూ.. ఎయిమ్స్లోని ఔట్పేషెంట్ విభాగం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 11లక్షల మంది వైద్య సేవలు పొందారని, 34రకాల వైద్య విభాగాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం ఎయిమ్స్ పురోగతిపై ముద్రించిన మ్యాగ్జిన్ను డాక్టర్ నాగేశ్వర్రెడ్డి ఆవిష్కరించడంతో పాటు విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జలలీమ్, రాహుల్నారంగ్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రి చైర్మన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ నాగేశ్వర్రెడ్డి -
పిల్లల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి
సూర్యాపేట: పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వారి ప్రవర్తన, నడవడికను గమనిస్తూ.. తప్పడగులు వేస్తున్నారని తెలిస్తే దండించకుండా ఏది చేడు, ఏది మంచి అనే విషయాన్ని వారు గ్రహించే విధంగా అవగాహన కల్పించాలి. వివిధ రంగాల్లో విజయం సాధించిన వారి గూర్చి పిల్లలకు వివరించాలి. పిల్లలతో స్నేహంగా మెలగాలి, పిల్లల సెల్ఫోన్ను గమనిస్తూ ఉండాలి. తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే అంశాలకు దూరంగా ఉంచాలి. పిల్లలు ఎప్పుడు బిజీగా ఉండే విధంగా చదువుతో పాటు వ్యాయామం, డ్యాన్స్, చిత్రలేఖనం వంటి వాటిని నేర్పించాలి. – బొల్లెద్దు వెంకటరత్నం, న్యాయవాది -
ట్రాక్టర్ ఢీకొని వృద్ధురాలు మృతి
మునుగోడు: గొర్రెలను మేపేందుకు వెళ్తున్న వృద్ధురాలిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో మృతిచెందింది. ఈ ఘటన సోమవారం మునుగోడు మండల కేంద్రం శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం కచలాపురం గ్రామానికి చెందిన చిరగోని బాలమ్మ(58) మునుగోడులో నివాసముంటున్న తన కుమారుడు వద్ద ఉంటూ గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తోంది. రోజుమాదిరిగా సోమవారం ఉదయం 10 గంటల సమయంలో గొర్రెలను మేతకు తోలుకుని వెళ్తుండగా.. మునుగోడు మండల కేంద్రం శివారు కమ్మగూడెం సమీపంలోని చొల్లేడు రోడ్డులో అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ ఆమె ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతురాలి కుమారుడు చిరగోని లింగస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి తెలిపారు. అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతిభువనగిరి: భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపురం గ్రామంలో ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన పిన్నం నర్సింహ(63)కు తన వ్యవసాయం బావి వద్ద భూమి విషయమై, పైపులైన్ ద్వారా నీరు తరలించే విషయమై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో గొడవులు జరుగుతున్నాయి. ఆదివారం సాయంత్రం కూడా బావి వద్ద గొడవ జరగుతుండగా.. గ్రామస్తులు గమనించి నర్సింహ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. రాత్రి 9గంటల సమయంలో నర్సింహ కుటుంబ సభ్యులు బావి వద్దకు వెళ్లగా.. అతడు అక్కడ ఉన్న మంచంపై స్పృహతప్పి పడిపోయి ఉన్నాడు. వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా.. అప్పటికే మృతిచెందినట్లు 108 వాహన సిబ్బంది తెలిపారు. మృతుడి కుమార్తె మానస ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంతోష్కుమార్ తెలిపారు. అప్పుల బాధతో కౌలు రైతు బలవన్మరణం రామన్నపేట: అప్పుల బాధతో కౌలు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో జరిగింది. సిరిపురం గ్రామానికి మోటె నర్సింహ(50) కొన్నేళ్లుగా గ్రామశివారులో పద్నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. వానాకాలంలో వరితో పాటు పత్తి సాగు చేశాడు. ప్రస్తుత యాసంగిలో వరి సాగు చేశాడు. బోర్లు ఎండిపోవడంతో సగానికి పైగా వరి పొలం ఎండిపోయింది. వ్యవసాయ పెట్టుబడుల కోసం చేసిన అప్పులు పెరుగుతుండడంతో కొద్దిరోజులుగా ఆందోళన చెందసాగాడు. సోమవారం ఉదయం స్థానిక శివాలయానికి వెళ్లి పూజలు చేశాడు. అనంతరం పొలం చూడడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. పెట్టుబడి కోసం చేసిన అప్పుల ఎలా తీర్చాలో తెలియక ఆందోళనకు గురై పురుగులమందు తాగాడు. అనంతరం ఇంటికి తిరిగివచ్చి మంచంపై పడుకొని వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు గమనించి చుట్టుపక్కల వారి సహాయంతో 108 వాహనంలో రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నర్సింహ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
గ్రూప్–1 ఉద్యోగాలకు ముగ్గురు అర్హత
తిరుమలగిరి(నాగార్జునసాగర్): రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–1 మెయిన్స్ ప్రొవిజినల్ మార్కులు సోమవారం విడుదల చేయగా.. నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం బోయగూడెం గ్రామానికి చెందిన మందడి నాగార్జునరెడ్డి, అల్లి కీర్తన ఉద్యోగాలకు అర్హత సాధించారు. మందడి నాగార్జునరెడ్డి 2006 డీఎస్సీలో ఎస్జీటీగా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగుతూనే గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యారు. 2011లో అసిస్టెంట్ ట్రైబేల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఎంపికై కొద్దికాలం పనిచేసిన తర్వాత అదే ఏడాదిలో విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. నాగార్జునరెడ్డి ప్రస్తుతం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ తహసీల్దార్గా కొనసాగుతూనే గ్రూప్–1కు ప్రిపేర్ అయ్యి 488 మార్కులతో అర్హత సాధించారు. మొదటి ప్రయత్నంలోనే విజయం..బోయగూడెం గ్రామానికే చెందిన అల్లి నాగమణి, పెద్దిరాజు దంపతుల కుమార్తె అల్లి కీర్తన మొదటి ప్రయత్నంలోనే తన కలను సాకారం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూప్–4 ఫలితాల్లో ఆమె జూనియర్ అసిస్టెంట్గా ఎంపికై ంది. గ్రూప్–1 ఉద్యోగానికి 468.5 మార్కులతో అర్హత సాధించింది. గుండెపురి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం గుండెపురి పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న భూక్య సందీప్ 468.5 మార్కులతో గ్రూప్–1కు అర్హత సాధించారు. -
విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని కల్గిఉండేలా తీర్చిదిద్దాలి
సూర్యాపేట: తల్లిదండ్రులు తమ పిల్లలు చిన్నప్పటి నుంచే ఒక లక్ష్యం కలిగి ఉండేలా తీర్చిదిద్దాలి. హైస్కూల్ విద్య నుంచే తమ కుటంబ నేపథ్యం, వారి స్థాయిని పిల్లలకు తెలిసేలా చేయాలి. సమాజంలో ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి. లక్ష్యం మీదనే ఫోకస్ చేసేలా, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండేలా చూడాలి. వివిధ రంగాల్లో ప్రావీణ్యం సాధించే వారు ఏవిధంగా సెల్ఫోన్, టీవీలకు దూరంగా ఉంటున్నారో వివరించాలి. చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి. – తల్లమల్ల హుస్సేన్, పూర్వపు ప్రభుత్వ న్యాయవాది, సూర్యాపేట -
పిల్లల ప్రవర్తనను గమనించాలి
నల్లగొండ టౌన్: పిల్లల ప్రవర్తనను గమనించాలి. చదువుతో పాటు వారు ఏమి చేస్తున్నారు... ఎక్కడికి వెళుతున్నారు.. ఎలాంటి స్నేహం చేస్తున్నారు అనే దాన్ని ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాలి. ఒకవేళ ప్రేమలో పడితే వారి కుటుంబ నేపథ్యం, వారి స్థితిగతులు తెలుసుకోవాలి. అన్ని సక్రమంగా ఉంటే పిల్లల అభిప్రాయాన్ని అంగీకరించాలి. లేకపోతే వారు తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి కుటుంబ నేపథ్యమైతే ప్రేమ వివాహాలను అంగీకరించడంలో తప్పులేదు. – పనస కాశయ్యగౌడ్, గుండ్లపల్లి, నల్లగొండ -
జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహించాలి
నల్లగొండ టౌన్ : తల్లిదండ్రులు పిల్ల ల ప్రేమను ప్రోత్సహించొద్దు. ముందుగా తమ పిల్లలను సక్రమంగా చదువుకుని జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహించాలి. ఒకవేళ ప్రేమ వివాహం చేసుకున్నా చంపడం, దాడులు చేయడం, కేసులపాలు కావడం మంచి పద్ధతి కాదు. ప్రతిష్టకు పోయి వారి భవిష్యత్ను నాశనం చేసుకోవద్దు. సామరస్యంగా రెండు కుటుంబాలు కలిసి సమస్య పరిష్కరించుకుంటే మంచిది. పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని వారిని సరైన మార్గంలో పయనించేలా దిశా నిర్దేశం చేయాలి. వారి ప్రవర్తనలో మార్పు వస్తే వెంటనే గమనించి వారు సరైన రీతిలో ఉండేలా తల్లిదండ్రులు సూచనలు చేయాలి. – డాక్టర్ సుబ్బారావు, మానసిక వైద్య నిపుణుడు, నల్లగొండ -
నిరుద్యోగ యువతే టార్గెట్..
సూర్యాపేట టౌన్ : నిరుద్యోగ యువతను టార్గెట్ చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.లక్షల్లో వసూలు చేసి మోసం చేసిన నకిలీ డీఎస్పీని సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ కేసు వివరాలను ఎస్పీ కె. నర్సింహ విలేకరులకు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో నకిలీ డీఎస్పీ అవతారమెత్తాడు. తాను డీఎస్పీ అని చెప్పుకుంటూ పలువురిని పరిచయం చేసుకొని అమాయకులైన నిరుద్యోగ యువతకు పోలీస్, సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తూ బురిడీ కొట్టించాడు. కోదాడలో ఒక అమ్మాయికి ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె వద్ద రూ.36లక్షలు వసూలు చేశాడు. అదేవిధంగా ఏపీలోని మార్టూర్కు చెందిన వ్యక్తికి కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని, గురజాలకు చెందిన మరో వ్యక్తికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని పరారీలో ఉన్నాడు. కోదాడకు చెందిన అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సూర్యాపేట పట్టణ పోలీసులు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీగ్రాండ్ హోటల్ వద్ద శ్రీనివాసరావును అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరం ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి వద్ద రూ.18లక్షల నగదు, ఒక కారు, పోలీస్ యూనిఫాం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిందితుడిపై గతలంలో పలు కేసులు ఉండగా.. 2022లో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చి మళ్లీ అదే పనిచేస్తున్నట్టు ఎస్పీ చెప్పారు. ఈ కేసును ఛేదించిన సూర్యాపేట పట్టణ సీఐ పీవీ రాఘవులు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వర్రావు, డీఎస్పీ రవి, పట్టణ సీఐ పీవీ రాఘవులు పాల్గొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి బురిడీ కొట్టించిన నకిలీ డీఎస్పీ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు -
కోర్టు వద్ద తీవ్ర ఉత్కంఠ
తీర్పులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీరు భేష్ ప్రణయ్ హత్య అనంతరం తండ్రి బాలస్వామి మిర్యాలగూడ వన్టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రణయ్ తండ్రి బాలస్వామి అభ్యర్థన మేరకు కేసు వాదించేందుకు దర్శనం నరసింహను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పబ్లిక్ ప్రోసిక్యూటర్ బలమైన సాక్షాధారాలు సేకరించారు. నిందితుల ఫోన్కాల్ డేటా, లోకేషన్, సీసీ టీవి ఫుటేజీలను సేకరించి.. 472 పేజీల లిఖిత పూర్వక రిపోర్టును కోర్టుకు సమర్పించారు.● ఏ2 సుభాష్కుమార్శర్మకు మరణశిక్ష ● ఏ3 నుంచి ఏ8 వరకు ఆరుగురికి జీవితఖైదు ● తీర్పుకోసం భారీగా తరలివచ్చిన ప్రజాసంఘాల నాయకులు ● కన్నీటి పర్యంతమైన నిందితుల కుటుంబీకులు ● కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తురామగిరి(నల్లగొండ): సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో తుదితీర్పు నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచి నల్లగొండ కోర్టు వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ కేసు నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు, రెండవ అదనపు జడ్జి ఎన్.రోజారమణి సోమవారం అంతిమ తీర్పు వెల్లడించారు. సెప్టెంబర్ 14, 2018న ప్రణయ్ హత్యకు గురికాగా.. అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ విచారణ జరిపి హత్య కేసులో ప్రమేయం ఉన్న 8 మందిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నరసింహ హత్య కేసులో అన్ని సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించారు. నరసింహ వాదనలతో ఏకీభవించిన నల్లగొండ ఎస్సీ, ఎస్టీ రెండవ అనదపు జడ్జి ఎన్.రోజారమణి ఏ2 సుభాష్కుమార్శర్మకు ఉరిశిక్షతో పాటు రూ.15 వేల జరిమానా లేదా 4 నెలల జైలు శిక్ష, మిగిలిన ఆరుగురు ఏ3 అజ్గర్అలీ, ఏ4 మహ్మద్ అబ్దుల్బారీ, ఏ5 అబ్దుల్ కరీం, ఏ6 తిరునగరు శ్రవణ్కుమార్, ఏ7 సముద్రాల శివ, ఏ8 ఎంఏ.నిజాంకు జీవిత ఖైదు రూ.10 వేల జరిమాన లేదా 4 నెలల జైలుశిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించారు. ఈ కేసులో ఏ1 నిందితుడు అమృవర్షిణి తండ్రి తిరునగరు మారుతీరావు 2020 మార్చి 8న ఆత్మహత్య చేసుకోగా.. అజ్గర్అలీని అహ్మదాబాద్ సబర్మతి జైలుకు, శుభాష్కుమార్శర్మను చర్లపల్లి జైలుకు తరలించారు. మిగిలిన ఐదుగురు నిందితులకు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నల్లగొండ జిల్లా జైలుకు తరలించారు. ఈ తీర్పుతో ప్రణయ్ కుటుంబ సభ్యులు, పలువురు ప్రజా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. భారీగా తరలిన వచ్చిన ప్రజా సంఘాలు, ప్రజలు.. ప్రణయ్ హత్య కేసు తీర్పు సోమవారం వెలువడుతుందన్న విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులతో పాటు సామాన్య ప్రజలు నల్లగొండ కోర్టు వద్దకు భారీగా తరలివచ్చారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టినప్పటి నుంచి తీర్పు ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా వేచిచూశారు. నిందితుల కుటుంబాల కన్నీటి పర్యంతం.. హత్య కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురికి శిక్ష పడింది. దీంతో నిందితుల కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కోర్టు ఆవరణలో తిరునగరు శ్రవణ్కుమార్ కూతురు శృతి బోరున విలపించింది. తన తండ్రికి ఎలాంటి నేరం చేయలేదని అయినప్పటికీ శిక్ష పడిందంటూ కన్నీరు పెట్టుకుంది. వీరితో పాటు మిగతా నిందితుల కుటుంబ సభ్యులు కూడా కోర్టు వద్ద, ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో వారితో మాట్లాడుతూ, అనంతరం వాహనంలో తరలిస్తున్న క్రమంలో కన్నీరు పెట్టుకున్నారు. కోర్టు ప్రాంగంలో పోలీసుల భారీ బందోబస్తు.. ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పు నేపథ్యంలో నల్లగొండ కోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు లోపలికి ఎవరినీ రానివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. న్యాయవాదులు, సిబ్బందిని, కుటుంబ సభ్యులను మాత్రమే కోర్టు లోపలికి అనుమతించారు. -
పిల్లల కోరిక మన్నించి వివాహాలు చేయాలి
మిర్యాలగూడ: పిల్లలు ప్రేమించుకుంటే తల్లిదండ్రులు వారి కోరికను మన్నించి పెళ్లిళ్లకు అనుమతించాలి. కులం, పరువు ప్రతిష్టలు అనే అహంకారంతో హత్యలకు పాల్పడితే చట్టాల నుంచి తప్పించుకోలేరనే విషయాన్ని గుర్తించించాలి. చట్ట ప్రకారం మేజర్లు అయితే పిల్లలు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించింది. అంబేద్కర్ స్ఫూర్తితో కులరహిత సమాజం వైపు అడుగులు వేయాలి. పిల్లలు కూడా సినిమా, టీవీల ప్రభావంలో ఆకర్షణలకు లోనై అదే ప్రేమ అనుకొని తల్లిదండ్రులను శత్రువులుగా చూసే వైఖరిని మానుకోవాలి. తల్లిదండ్రులను ఒప్పించి పెద్దలను మెప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయాలి. – కస్తూరి ప్రభాకర్, సామాజికవేత్త, మిర్యాలగూడ -
పగలు భగభగ.. రాత్రి గజగజ
భువనగిరి టౌన్ : జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఉదయం 9 నుంచే ఎండతీవ్రత పెరుగుతోంది. తిరిగి సాయంత్రం 6గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. దీంతో పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. శుక్రవారం భూదాన్పోచంపల్లి మండలంలో గరిష్ట ఉష్ణోగ్రత 39.1 డిగ్రీలు నమోదు కాగా, బొమ్మలరామారంలో కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలకు పడిపోయింది. గడిచిన పది రోజులుగా వాతావరణంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడంతో జనం అనారోగ్యం బారిన పడుతున్నారు. -
టీటీడీ తరహాలోనే.. గుట్టకు పాలకమండలి
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలకమండలి త్వరలో ఏర్పాటు కానుంది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు తరహాలోనే గుట్ట పాలకమండలి ఉండాలన్నది సీఎం అభిప్రాయం. అందుకు అనుగుణంగానే పాలకమండలి ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ఇకనుంచి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో దేవస్థానం ఉంటుంది. దేవాదాయ శాఖ ఆజమాయిషీ ఉండదు. దేవస్థానం ఈఓ, ఉద్యోగుల నియామకాలు, బదిలీలు ప్రభుత్వ పరిధిలోనే జరగనున్నాయి. ఆలయ కార్యనిర్వహణ అధికారిగా ఐఏఎస్ అధికారి లేదా అదనపు కమిషనర్ క్యాడర్ స్థాయి అధికారి ఉంటారు. 17 ఏళ్లుగా అధికారుల పాలనలో కొనసాగుతున్న దేవస్థానం ప్రజాప్రతినిధుల చేతుల్లోకి రానుంది. పాలకమండలిలో ఉండేది వీరే.. చైర్మన్, 10 మంది సభ్యులతో పాలకమండలి ఏర్పాటు కానుంది. ఇందులో ఒకరు వంశపారంపర్య ధర్మకర్త కాగా మిగతా తొమ్మిది మందిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. వీరితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఆలయ ఈఓ, వైటీడీఏ వైస్ చైర్మన్, ఆలయ స్థానాచార్యులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు రూపొందించిన నోట్కు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దేవాదాయశాఖ చట్టం–1987లోని చాప్టర్ 14 కింద యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని చేర్చినట్లు సమాచారం. పాలకమండలిలో చోటు కోసం ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు. -
నయన మనోహరం.. నృసింహుడి కల్యాణం
యాదగిరిగుట్ట : యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనరసింహుడి తిరుకల్యాణోత్సవం శనివారం రాత్రి వైభవంగా సాగింది. పట్టువస్త్రాలు, వజ్రవైడూర్యాలు, బంగారు ఆభరణాలతో పెళ్లికొడుకుగా ముస్తాబైన శ్రీస్వామివారు గజవాహనంపై, నవ వధువుగా శ్రీలక్ష్మీదేవి దివ్య అలంకార శోభితమై ప్రత్యేక పల్లకిలో 8.30గంటలకు ఊరేగింపుగా బయలుదేరి ఉత్తర మాడవీఽఽధిలో ఏర్పాటు చేసిన కల్యాణవేదికపైకి చేరుకున్నారు. కల్యాణ వేదికపై శ్రీస్వామి, అమ్మవారిని ఎదురెదురుగా అధిష్టింపజేసిన అర్చకులు.. కల్యాణానికి శ్రీకారం చుట్టారు. అర్చకబృందం, వేదపండితులు, పారాయణీకులు వేదమంత్రాలు, పారాయణాలు పఠిస్తుండగా ప్రధానా ర్చకులు శ్రీస్వామివారికి జంజరాధారణ (యజ్ఞోపవీతం)గావించారు. 10.44 గంటలకు జీలకర్ర బెల్లం ధరించారు. 10.50 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, సన్నాయిమేళాలు మోగుతుండగా, భక్తులు జయజయద్వానాల మధ్య మాంగల్యధారణ గావించి, ఆతరువాత ముత్యాల తలంబ్రాల వేడుక నిర్వహించారు. పట్టువస్త్రాలు సమర్పించిన బీర్ల అయిలయ్య, ఎంపీ కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య , ఎంపీ కిరణ్కుమార్రెడ్డి స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అలాగే టీటీడీ, పోచంపల్లి పద్మశాలీ మహాజన సంఘం వారు తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను అర్చకులు స్వామి, అమ్మవారికి సమర్పించారు. కల్యాణంలో దేవాదాయ శాఖ కమి షనర్ శ్రీధర్, కలెక్టర్ హనుమంతరావు దంపతులు, జిల్లా జడ్జి జయరాజు, ఈఓ భాస్కర్రావు, అనువంశి ధర్మకర్త నరసింహమూర్తి, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉదయం శ్రీరాముడిగా దర్శనమిచ్చిన నృసింహుడు ఉదయం స్వామివారిని శ్రీరాముడి అలంకారంలో హనుమంత వాహనంపై ఊరేగించారు. ఫ యాదగిరిగుట్టలో వైభవంగా శ్రీలక్ష్మీనరసింహుడి కల్యాణం బ్రహ్మోత్సవాల్లో నేడు ఆదివారం ఉదయం శ్రీస్వామి వారు శ్రీమహావిష్ణు అలంకారంతో గరుడవాహన సేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి దివ్య విమాన రథోత్సవం నిర్వహిస్తారు. -
పంటలకు సాగునీరివ్వడంలో ప్రభుత్వం విఫలం
భువనగిరి : సాగునీరు అందక జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శనివారం భువనగిరి మండలంలోని వడపర్తి, హన్మాపురం, మన్నెవారిపంపు, బండసోమారం, చందుపట్ల, నాగిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ఎండిన వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ప్రణాళిక లేకుండా బస్వాపురం రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చేయటం వల్ల భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయడం లేదన్నారు. మల్లన్నసాగర్ నుంచి నీటిని తరలిస్తూ బస్వాపురం నీటిని విడుదల చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కేసీఆర్ పాలనలోనే రైతులు ఇబ్బంది లేకుండా ఉన్నారని, సమృద్ధిగా సాగునీరు అందిందన్నారు.పంటలకు నీరందించడంలో స్థానిక ఎమ్మెల్యే సైతం విఫలమయ్యారని మండిపడ్డారు. ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పాడి రైతులకు బిల్లులు చెల్లించాలని కోరారు. వడపర్తిలో పొలం ఎండిపోయి కంటతడి పెట్టిన మహిళను పైళ్ల శేఖర్రెడ్డి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జనగాం పాండు, మాజీ జెడ్పీటీసీ బీరు మల్లయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ అంజనేయులు, నాయకులు ర్యాకల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, పాండు, శ్రీనివాస్రెడ్డి, ప్రభాకర్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.ఫ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి -
లోక్ అదాలత్లో 24,861 కేసులు పరిష్కారం
భువనగిరిటౌన్ : జాతీయ లోక్ అదాలత్లో భాగంగా శనివారం జిల్లాలోని అన్ని కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్లలో 24,861 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో సివిల్ 12, క్రిమినల్ 2,231, ప్రిలిటిగేషన్ 27, ఇ–చలానా 22,591 కేసులు ఉన్నాయి. భువనగిరి కోర్టులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు లోక్అదాలత్ను ప్రారంభించారు. రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ పంచాక్షరి లోక్ అదాలత్ను పర్యవేక్షించి మాట్లాడారు. రాజీమార్గంతో కేసులు పరిష్కరించుకోవడం వల్ల శాంతియుత వాతావరణం ఏర్పడడంతో పాటు మానవ సంబంధాలు మెరుగుపడుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మాధవిలత, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఉషశ్రీ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి శ్యామ్సుందర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కవిత, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గంధమల్లకు లైన్ క్లియర్
ఆమోదం తెలిపిన రాష్ట్ర క్యాబినెట్ ఫ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 1.41 టీఎంసీలకు కుదింపు ఫ 1,144 ఎకరాలకు తగ్గనున్న భూ సేకరణ ఫ గంధమల్ల, వీరారెడ్డిపల్లి, ఆవాస గ్రామాలకు తప్పనున్న ముంపు ముప్పు ఫ యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి ఏర్పాటుకూ ఆమోదం సాక్షి, యాదాద్రి : జిల్లాలోని తుర్కపల్లి మండలం గంధమల్ల గ్రామ సమీపంలో ప్రతిపాదించిన గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి రాష్ట్ర కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జలాశయం నిల్వ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీలకు కుదిస్తూ ఇదివరకే నిర్ణయం తీసుకోగా అధికారికంగా ఆమోదించింది. సుమారు 65 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు ఆరేళ్ల తరువాత పట్టాలెక్కనుండడంతో ఆలేరు నియోజకవర్గ ప్రజలు, రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. దీంతో పాటు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. గంధమల్ల రిజర్వాయర్ స్వరూపం ఇదీ.. కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగంలో భాగంగా ప్యాకేజీ–15లో తుర్కపల్లి మండలంలోని గంధమల్ల చెరువును రిజర్వాయర్గా మార్చాలని గత ప్రభుత్వం 2017లో ప్రతిపాదించింది. కానీ, వివిధ కారణాల వల్ల రిజర్వాయర్ ఆరేళ్లుగా హోల్డ్లో ఉంది. 9.36 టీఎంసీల నిలువ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని తొలుత నిర్ణయించారు. ఇందుకోసం 4,027 ఎకరాలు అవసరమని, భూములను రైతుల నుంచి, అటవీభూములు సేకరించాలని, నష్టపరిహారం కింద రూ.379 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని నిర్ణయించారు. అయితే గంధమల్ల, వీరారెడ్డి గ్రామాల పరిధిలో పెద్ద ఎత్తున ఆవాసాలు ముంపునకు గురవుతుండడంతో ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో 2018లో రిజర్వాయర్ సామర్థ్యాన్ని 4.28 టీఎంసీలకు కుదించడంతో వీరారెడ్డిపల్లితో పాటు మరికొన్ని ఆవాస గ్రామాలు బయటపడ్డాయి. ఆతరువాత భూ సేకరణ 2,423 ఎకరాలకు తగ్గింది. అయినా ముంపు గ్రామాల ప్రజలు ఆందోళలు ఆపకపోవడంతో రిజర్వాయర్ నిల్వ సామర్థ్యాన్ని 1.41 టీఎంసీలకు కుదించాలని అధికారికంగా నిర్ణయించారు. దీనివల్ల గంధమల్లతో పాటు పలు ఆవాస గ్రామాలు ముంపునుంచి బయటపడనున్నాయి. అంతేకాకుండా భూ సేకరణ 1,144 ఎకరాలకు తగ్గనుంది. ప్రారంభంలో రిజర్వాయర్ నిర్మాణాన్ని రూ.860 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించగా.. నీటి నిలువ సామర్థ్యాన్ని తగ్గించడం ద్వారా రూ.575 కోట్లకు తగ్గింది. రిజర్వాయర్ నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదమద్ర వేసినందున.. పనులు ప్రారంభించడమే మిగిలింది. -
10వ తేదీ నుంచి ‘ప్రజావాణి’ పునరుద్ధరణ
భువనగిరి టౌన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల 10వ తేదీనుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేశామని, కోడ్ ముగిసినందున తిరిగి పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని, సమస్యలు ఉంటే ప్రజావాణికి వచ్చి వినతులు అందజేయాలని సూచించారు. లక్ష సంతకాల సేకరణ ప్రారంభం భువనగిరి టౌన్ : వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో శనివారం భువనగిరిలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వివిధ రాజకీయ పదవుల్లో దివ్యాంగులను నామినేట్ చేయడానికి వీలుగా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది దివ్యాంగుల నుంచి సంతకాలు సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే భువనగిరి నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్, జిల్లా అధ్యక్షుడు సుర్పంగ ప్రకాష్, కోశాధికారి కొత్త లలిత పాల్గొన్నారు. డీసీపీకి ఘనంగా వీడ్కోలుభువనగిరి : బదిలీపై కామారెడ్డి జిల్లా ఎస్పీగా వెళ్తున్న డీసీపీ రాజేశ్చంద్రకు శనివారం పోలీ సులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది ఇరువైపులా నిల్చొని పూలవర్షం కురిపించారు. డీసీపీతో కలిసి పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి రామన్నపేట : విష్ణుకుండినుల రాజధానిగా వెలుగొందిన ఇంద్రపాలనగరంను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. శనివారం సీపీఎం ఆధ్వర్యంలో ఇంద్రపాలనగరంలో పర్యటించారు. పెద్దచెరువు సమీపంలో ఆసిప్నహర్ కాలువ వంతెన, తూములను పరిశీలించారు. 120 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెనలు, తూములకు మరమ్మతులు చేయించి రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ఆసిఫ్నహర్ కాలువ ఆధునీకరణకు నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జెల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశంసభ్యులు మీర్ఖాజా, గన్నెబోయిన శ్రీనివాస్, కొంగరి నర్సింహ, కంఠేశ్వర్ రమేష్, రాధారపు మల్లేశం, బోనగిరి శ్రీనివాస్, కొమ్మగాని అశోక్, నాగు నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
పాల బిల్లులు చెల్లించాలని ధర్నా
ఆత్మకూరు(ఎం) : మదర్ డెయిరీ, విజయ డెయిరీలు బకాయి బిల్లుల చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆత్మకూర్(ఎం) మండలంలోని కూరెళ్ల పాల కేంద్రం ఎదుట శనివారం పాడి రైతులు ధర్నా చేశారు. రెండు డెయిరీల నుంచి రూ.85 కోట్లు రావాల్సి ఉందని, నెలల తరబడి బిల్లులు చెల్లించకపోవడం వల్ల పాడిపరిశ్రమ నిర్వహణ ఇబ్బందికరంగా మారిందన్నారు. పాడి పరిశ్రమను ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. దేశీయ పాలను కాకుండా విదేశాలనుంచి కేంద్రం పాలను దిగుమతి చేసుకోవడం వల్ల పాడి రైతులు నస్టాలు చవిచూడాల్సి వస్తుందన్నారు. ఈనెల 10లోగా బిల్లులు చెల్లించని పక్షంలో 11వ తేదీన కలెక్టరేట్ ఎదుట జిల్లాలోని పాడి రైతులంతా కలిసి ధర్నా చేయనున్నట్లు వెల్లడించారు. ధర్నాలో వేముల భిక్షం, రైతులు తుమ్మలగూడెం యాదయ్య, నార్కట్పల్లి మల్లయ్య, మొరుగాని శ్రీనువాస్, కన్నెబోయిన శంకరయ్య, జోగు కుమార్, బాషబోయిన నరేష్, ఎండి షకీల్, మారుపాక పరుశరాములు, ఐలమ్మ, సోమక్క అండాలు పాల్గొన్నారు. -
పాతర్లపహాడ్లో విషాదఛాయలు
ఫ ఏపీలోని నెల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన అక్క, తమ్ముడు మృతి నెల్లూరు క్రైం, ఆత్మకూర్(ఎస్): ఏపీలోని నెల్లూరు పట్టణంలోని శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన అక్క, తమ్ముడు మృతిచెందారు. దీంతో పాతర్లపహాడ్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన మోహనంది మల్లయ్య, నాగమణి దంపతులకు నిషిత (22), కార్తీక్ (20) సంతానం. మల్లయ్య సూర్యాపేటలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తూ కుమార్తెను బీటెక్, కుమారుడిని డిప్లొమా చదివిస్తున్నాడు. ఇటీవల నిషిత సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందడంతో మొక్కు చెల్లించుకునేందుకు కుటుంబంతా కలిసి తిరుపతికి వెళ్లారు. ఈ నెల 6న తిరుమలకు వెళ్లిన వారు.. దర్శనానంతరం తిరిగి తమ ఊరెళ్లేందుకు తిరుపతికి శుక్రవారం అర్ధరాత్రి చేరుకున్నారు. రైల్వేస్టేషన్కు బయల్దేరగా మార్గమధ్యలో ఇన్నోవా కారు డ్రైవర్ కలిసి తాను విజయవాడకు వెళ్తున్నానని చెప్పారు. దీంతో వీరు కారులో బయల్దేరారు. మార్గమధ్యలో నెల్లూరు పట్టణంలోని భగత్సింగ్ కాలనీ జంక్షన్ వద్దకు రాగానే కారు డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్ను ఢీకొని ఆపై లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నిషిత, కార్తీక్ అక్కడికక్కడే మృతిచెందగా, వారి తల్లిదండ్రులు, కారు డ్రైవర్ శివరామకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో హాస్పిటల్కు తరలించారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను జీజీహెచ్ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదృశ్యమైన మహిళ ఆచూకీ లభ్యంఫ కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు మద్దిరాల: నెలరోజుల క్రితం అదృశ్యమైన మద్దిరాల మండలంలోని కుంటపల్లి గ్రామానికి చెందిన ఆశ వర్కర్ కుందూరు వసంత ఆచూకీ శనివారం లభ్యమైంది. ఎస్ఐ వీరన్న తెలిపిన వివరాల ప్రకారం.. వసంత నల్లగొండ సమీపంలో కిందపడడంతో ఆమె తలకు గాయామై మతిస్థిమితం కోల్పోయింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. ఆమె ఎలాంటి వివరాలు చెప్పలేని స్థితిలో ఉండడంతో నల్లగొండలోని ఓ ఆశ్రమంలో ఉంచారు. ఇటీవల అక్కడి పోలీసులు సమాచారం అందించడంతో ఆమెను కుందూరు వసంతగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు శనివారం అప్పజెప్పినట్లు ఎస్ఐ తెలిపారు. వసంత ఆచూకీ కనిపెట్టిన పోలీసులకు, ఆశ్రమ నిర్వాహకులకు ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
మహిళా సంక్షేమానికి పెద్దపీట
ఫ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని ఓ హోటల్లో జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. వచ్చే ఎన్నికల వరకు రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 150కి పెరిగితే ఉంటే అందులో 50 మంది మహిళలే ఎమ్మెల్యేలుగా ఉంటారన్నారు. మహిళా బిల్లు కూడా త్వరలో అమలవుతుందని పేర్కొన్నారు. బీసీ కుల గణనతో 42శాతం బీసీలకు రిజర్వేషన్ వర్తిస్తుందని అన్నారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ఉచిత బస్సు సౌకర్యం, మహిళా సంఘాలకు క్యాంటీన్ల నిర్వహణ వంటి అవకాశాలు కాంగ్రెస్ ప్రభుత్వ కల్పించిందన్నారు. త్వరలో 1000 కొత్త ఆర్టీసీ బస్సుల మెయింటెనెన్స్ను మహిళా సంఘాలకు అప్పగిస్తామన్నారు. జిల్లాలోని మహిళా సంఘాలకు 50 బస్సులను కేటాయించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గోపగాని మాధవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్, రూ.500కే సిలిండర్ అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ మాజీ ప్రజాప్రతినిధులను, మహిళా కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, వంగూరి లక్ష్మయ్య, మహిళా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బ రూపఅశోక్సుందర్, రాష్ట్ర కార్యదర్శి ఎస్కే జాను, పట్టణ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కందిమల్ల నాగమణిరెడ్డి, జిల్లా కార్యదర్శి లలిత, సదాలక్ష్మి, సంకు ధనలక్ష్మి, విజయలక్ష్మి, కంచర్ల మాధవి, జూలకంటి ధనలక్ష్మి, సూరెడ్డి సరస్వతి, స్వరూప రెడ్డి సౌజన్య, సుకన్య, నిర్మలాదేవి, సువర్ణ, పద్మలు పాల్గొన్నారు. -
కుటుంబ పోషణలో భర్తకు తోడుగా..
ఆత్మకూర్ (ఎస్): కుటుంబ పోషణలో భర్తకు చేదోడు వాదోడుగా ఉండేందుకు గాను ఊరూరా మోటార్ సైకిల్పై తిరిగి కూరగాయలు అమ్ముతూ ఆదర్శంగా నిలుస్తోంది మాసారపు సుగుణమ్మ. ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామానికి చెందిన మాసారపు సుగుణమ్మ, స్వామి భార్యాభర్తలు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. చిన్న అమ్మాయి మానసిక వికలాంగురాలు. వీరికి వ్యవసాయ భూమి లేకపోవడంతో భర్త స్వామి సూర్యాపేట నుంచి కూరగాయలు హోల్సేల్గా తెచ్చి గ్రామంలో వీధి వీధి తిరుగుతూ అమ్ముతున్నాడు. అతనొక్కడి సంపాదనపై ఆధారపడి కుటుంబ పోషణ ఇబ్బందిగా మారడంతో సుగుణమ్మ అదే గ్రామంలో గంప నెత్తినెత్తుకొని కూరగాయలు అమ్మేది. ఈ క్రమంలో ఇద్దరు బిడ్డల పెళ్లిళ్లు చేశారు. అయితే సుగుణమ్మకు మోకాళ్లు, మెడ నొప్పులు రావడంతో కూరగాయల గంప నెత్తినెత్తుకొని తిరగడం ఇబ్బందిగా మారడంతో సైకిల్పై చుట్టుపక్కల గ్రామాలు వెళ్లి కూరగాయలు అమ్మేది. సైకిల్పై తిరగడం కూడా ఇబ్బందిగా ఉంటుండటంతో వారి కుమార్తె ఎనిమిది నెలల క్రితం టీవీఎస్ ఎక్సెల్ బైకులు కొనిచ్చింది. ఈ మోటార్ సైకిల్కు మూడు చక్రాలు అమర్చారు. దీంతో సుగుణమ్మ కూరగాయలను ఈ బండిపై పెట్టుకొని నెమ్మికల్తో పాటు 7, 8 కిలోమీటర్ల దూరం దాకా వెళ్లి వ్యాపారాన్ని కొనసాగించి కుటుంబ పోషణలో భర్తకు తోడుగా నిలుస్తోంది. ఇలా భార్యాభర్తలు కూరగాయలు విక్రయించి రోజుకు రూ.800 నుంచి రూ.1000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించుకోవడం సంతోషంగా ఉందని సుగుణమ్మ తెలిపింది. ఫ ఊరూరా తిరిగి మోటార్ సైకిల్పై కూరగాయలు అమ్ముతున్న భార్య -
అడవిని హరిస్తున్న అగ్నికీలలు
నాగార్జునసాగర్: సాగర్ జలాశయం తీరం వెంట గల అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ బఫర్ జోన్లో వారానికి రెండు చోట్ల మంటలు చెలరేగుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అగ్నిప్రమాదాలు ఆగడం లేదు. గత కొన్నేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. గత వారం రెండ్లు సార్లు కృష్ణా నది తీరంలో జమ్మనకోట ప్రాంతంలో రాత్రివేళ అడవికి నిప్పంటుకుంది. వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు దగ్గరలో గల తండావాసుల సహకారంతో చెట్ల కొమ్మలతో మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఒకసారి సుమారు 8 నుంచి 10ఎకరాల మేర, రెండోసారి 2 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం కాలిపోయింది. అటవీ ప్రాంతంలో రాలిపోయిన ఆకులతో పాటు చిన్న చిన్న చెట్లు తగలబడ్డాయి. రెండేళ్ల క్రితం కూడా దయ్యాలగండి సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో అధికారులు సకాలంలో స్పందించి ఆర్పివేశారు. అదేవిధంగా నల్లమల అటవీ ప్రాంతంలో నాగాలారం ప్రాంతంలో మూడేళ్ల క్రితం మంటలు అంటుకోని 100 ఎకరాల మేర అడవి తగలబడింది. అటవీ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు.. అటవీ ప్రాంతాల్లోకి బయటి వ్యక్తులు, పశువుల కాపరులు ప్రవేశించడంపై నిషేధం విధించినట్లు అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. అడవుల్లో చెట్ల ఆకులు రాలడంతో పాటు వేసవిలో ఎండలు మండుతున్న దృష్ట్యా నల్లమల, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలోని గ్రామాల్లో కళాజాతతో ప్రచారం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. నల్లగొండ–మహబూబ్నగర్ జిల్లాల మధ్యన కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో 2,166 చదరపు కిలోమీటర్ల మేర అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ విస్తరించి ఉంది. ఫిబ్రవరి నుంచి మే నెల వరకు ఆకురాలే సమయం కావడంతో తరచూ ఇక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. దీంతో అడవిలో నివసించే జంతువుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. తీసుకోవాల్సిన చర్యలు అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తుగానే అటవీ ప్రాంత శివారులో నివసించే ప్రజలకు అవగాహన కల్పించాలి. అడవిలోకి వేసవిలో జీవాలను, పశువులను రాకుండా చూడాలి. అగ్గిపెట్టె, కిరోసిన్, పెట్రోల్ లాంటి వాటిని అడవిలోకి తీసుకురాకుండా నిషేధించాలి. అడవిలో ఆకులు రాలే చోట ట్రంచులు ఏర్పాటు చేయాలి. చెక్డ్యాంలు నిర్మించి నీరు నిల్వ ఉండేలా చూడాలి. అవసరమైన సమయంలో ఆ నీటిని మంటలార్పేందుకు వాడుకునేలా చర్యలు తీసుకోవాలి. ఎత్తైన వాచ్టవర్లు ఏర్పాటు చేసి వేసవిలో మనుషులు అడవిలోకి రాకుండా గమనించాలి. ఫ నల్లమల, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ బఫర్ జోన్లో చెలరేగుతున్న మంటలు ఫ ప్రతీ వారం ఎక్కడో ఒకచోట తగలబడుతున్న అటవీ ప్రాంతం ఫ అడవిలో జీవాలను మేపడం నిషేధించిన అటవీ శాఖ అధికారులు అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం అటవీ ప్రాంతంలో తరచూ మంటలు లేచే ప్రాంతాలను గుర్తించి ఫైర్ ట్రస్సింగ్ లైన్లు కొట్టించాం. బఫర్ జోన్లో రహదారులకు ఇరువైపులా కంపచెట్లు తొలగించాం. చాలా చోట్ల ఫైర్వాల్స్ కూడా ఏర్పాటు చేశాం. అటవీ శివారు గ్రామాల్లో బేస్ క్యాంప్ హెల్పర్లు 24గంటలు కాపలాగా ఉంటారు. ఈ వేసవిలో జీవాలు అడవిలోకి వెళ్లకుండా నిషేధించాం. శివారు తండాలు, గ్రామాల ప్రజలకు అగ్నిప్రమాదాలు సంభవించకుండా అవగాహన కల్పిస్తున్నాం. – రాఘవేందర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, నాగార్జునసాగర్ -
తాగునీటి సమస్య రావొద్దు
నల్లగొండ : ‘వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య రావొద్దు.. అధికారులు మనసు పెట్టి పనిచేయాలి.. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి’ అని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శనివారం నల్లగొండలోని ఉదయాదిత్య భవన్లో సాగు, తాగునీరు, విద్యుత్పై ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో సాగు, తాగునీరు, విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ వేసవిలో తాగు, సాగు నీరు, విద్యుత్ ఇబ్బందులు ఏర్పడకుండా ఫిబ్రవరిలో సమావేశం నిర్వహించుకోవాల్సి ఉన్నా ఎన్నికల కోడ్ కారణంగా ఆలస్యమైందన్నారు. ఈ మూడు శాఖలకు చెందిన పైస్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఇందులో పోలీస్, రెవెన్యూ అధికారులను భాగస్వామ్యం చేయాలన్నారు. వేసవిలో ఏర్పడే సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కలెక్టర్ల వద్ద కొంత నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఎమ్మెల్యేల వద్ద కూడా నిధులు అందుబాటులో ఉంచేలా ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను కృష్ణాలో అనుసంధానం చేసే ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. డీఆర్సీ సమావేశాలు నిర్వహించుకునే విషయంలో కూడా అధికారులు దృష్టి సారించాలి. ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై సంబంధిత అదికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి నివేదిక ఇవ్వాలని కలెక్టర్లు వీటిపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. కాల్వల నిర్వహణ సరిగా లేదు : గుత్తా శాసనమండలి చైర్మన్ సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వల నిర్వహణ సరిగా లేదన్నారు. ఏఎమ్మార్పీ కాల్వ లైనింగ్ చేపట్టాలన్నారు. కాల్వల్లో రైతులు పెద్ద మోటార్లు వేసి నీరును లాగడం వల్ల చివరి భూములకు నీరు అందడం లేదన్నారు. విద్యుత్ కనెక్షన్ల మంజూరులో అధికారులు ఆచితూచి వ్యవహరించాలని సూచించారు.ఫ అధికారులు మనసు పెట్టి పనిచేయాలి ఫ సమస్య తలెత్తితే తక్షణమే పరిష్కరించండి ఫ కలెక్టర్ల వద్ద నిధులు ఉంచుతాం ఫ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు లో ఓల్టేజీ సమస్య పరిష్కరించాలి – మంత్రి కోమటిరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ వేసవిలో తాగునీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పంట చేతికి వచ్చే దశలో ఉన్నాయని.. ఎకరం పొలం కూడా ఎండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినప్పటికీ విద్యుత్ లోడ్ పెరిగి లోవోల్టేజీ సమస్య ఉత్పన్నమవుతోందని.. ఆ సమస్యను వెంటనే పరిష్కరించి రైతులకు ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. కలెక్టర్లు తాగునీటిపై దృష్టి సారించాలని, ప్రతి పంచాయతీకి రూ.15 వేల వరకు అందుబాటులో ఉంచాలన్నారు. ఎస్డీఎఫ్ నిధుల నుంచి తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఇలా త్రిపాఠి, హనుమంతరావు, తేజస్ నందులాల్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిలాల్, సీఈ అజయ్కుమార్, ఆర్డబ్ల్యూఎస్ సీఈ వెంకటేశ్వర్లు, నల్లగొండ ఎస్పీ శరత్చంద్రపవార్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు. -
అమృత్ మహోత్సవ్లో చేనేత కళాకారులు
‘ఇక్కత్’ను పరిశీలించిన రాష్ట్రపతి భూదాన్పోచంపల్లి: రాష్ట్రపతి భవన్లో అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ నుంచి ఏర్పాటు చేసిన హస్తకళల ఎగ్జిబిషన్ను శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ ఉప ముఖ్యమంతి భట్టి విక్రమార్క సందర్శించారు. పోచంపల్లికి చెందిన రాష్ట్ర ఉత్తమ అవార్డు గ్రహీత ఎన్నం మాధవిశివకుమార్ ఏర్పాటు చేసిన పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను వారు పరిశీలించారు. కళాత్మకమైన ఇక్కత్ డిజైన్లు, నాణ్యత, పోచంపల్లి ఇక్కత్కు అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపును తెలుసుకొని రాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారని చేనేత కళాకారిణి ఎన్నం మాధవి శివకుమార్ తెలిపారు. సంస్థాన్ నారాయణపురం: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో శనివారం నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం తరఫున సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన చేనేత కళాకారులు గూడ శ్రీను, ఆయన కుమారుడు పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత ప్రాచీన కళ తేలియారూమాల్ వస్త్రం రూపొందించడాన్ని గూడ శ్రీను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చూపించారు. వారిని రాష్ట్రపతి అభినందించినారు. కార్యక్రమంలో కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిజాసింగ్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. సిరిపురం చేనేత వస్త్రాల ప్రదర్శన రామన్నపేట: మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన కళాభారతి హ్యాండ్లూమ్ హ్యాండ్క్రాఫ్ట్ ప్రొడ్యూసర్ కంపెనీకి చెందిన జెల్ల సత్యనారాయణ, జెల్ల శ్రీనాథం పోచంపల్లి పట్టుచీరలు, మెర్స్రైజుడ్ చీరలు, బెడ్షీట్లు, డ్రెస్ మెటీరియల్, చున్నీలను రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్టాల్ను సందర్శించి సత్యనారాయణ, శ్రీనాథంను అభినందించారు. -
కుటుంబ కలహాలతో ఉరేసుకొని ఆత్మహత్య
అడ్డగూడూరు: కుటుంబ కలహాలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. శనివారం ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కోటమర్తి గ్రామానికి చెందిన నిమ్మల సతీష్(35)కు తొమ్మిదేళ్ల క్రితం తిరుమలగిరి మండలం గూడెపురి గ్రామానికి చెందిన స్వప్నతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. తనకు కుమారుడు పుట్టలేదని సతీష్ తాగి వచ్చి తరచూ భార్య స్వప్నతో గొడవపడుతుండేవాడు. ఈ నెల 5వ తేదీన సైతం స్వప్నతో గొడవపడి కొట్టడంతో ఆమె తన కుమార్తెలను తీసుకుని తల్లిగారింటికి వెళ్లింది. మరుసటి రోజు స్వప్న తల్లి కుమార్తెను తీసుకుని కోటమర్తికి వచ్చి అల్లుడికి నచ్చజెప్పింది. శుక్రవారం రాత్రి సతీష్, స్వప్న, ఇద్దరు పిల్లలు ఒక గదిలో, స్వప్న తల్లి మరో గదిలో నిద్రించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో సతీష్ బెడ్షీట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం తెల్లవారుజామున స్వప్న తల్లి ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా.. సతీష్ ఉరికి వేలాడుతుండటం గమనించి బిగ్గరగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి అప్పటికే సతీష్ మృతిచెందాడు. మృతుడి భార్య స్వప్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. -
వేసవి సన్నద్ధతపై నేడు సమీక్ష
సాక్షి,యాదాద్రి : వేసవిలో మంచినీటి ఎద్దడి, విద్యుత్ సమస్య పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్, అదనపు కలెక్టర్లు, విద్యుత్, మిషన్ భగీరథ, ఇరిగేషన్ అధికారులు హాజరుకానున్నారు. పూర్తి సమాచారంతో నివేదికలు సిద్ధం చేసుకుని రావాలని ఆయా శాఖల అధికారులకు ఉన్నతస్థాయి ఆదేశాలు అందాయి. ఇంగ్లిష్ పేపర్–1కు 6,104 మంది హాజరు భువనగిరి : ఇంటర్మీడియట్ పరీక్షలు మూడో రోజు ప్రశాంతంగా కొనసాగాయి. శుక్రవారం జరిగిన ప్రథమ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్షకు 6,411 మంది విద్యార్థులకు 6,104 మంది హాజరయ్యారు. 307 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విభా గంలో 4,757 మందికి ,4628 మంది హాజరు కాగా.. 129 మంది గైర్హాజరయ్యారు. ఓకేషనల్ విభాగంలో 1,654 మందికి గాను 1,476 మంది పరీక్ష రాశారు. 178 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. పరీక్ష కేంద్రాలను డీఐఈఓతో పాటు పలువురు అధికారులు తనిఖీ చేశారు. -
సైబర్ నేరాల కట్టడికి ప్రత్యేక వ్యూహం
అడ్డగూడూరు : శాంతిభద్రల పరిరక్షణతో పాటు సైబర్నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక వ్యూహం రూపొందిస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు. శుక్రవారం అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ను ఆయన డీసీపీ రాజేశ్చంద్రతో కలిసి తనిఖీ చేశారు. నూతన భవనం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విజిబుల్ పోలీసింగ్, సైకిల్ పెట్రోలింగ్ ద్వారా ప్రజలకు మరింత చేరువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సైబర్నేరాలు, రోడ్డు సేఫ్టీ, మహిళల భద్రత వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్టేషన్లో రికార్డులు, కేసుల దర్యాప్తు, పురోగతి, సీసీటీవీల నిర్వహణపై సమీక్షించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సిబ్బందికి సూచించారు. రూ.1.52 కోట్ల వ్యయంతోప్రత్యేక వసతులతో కూడిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ నిర్మిస్తామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజేశ్చంద్ర, ఏసీపీ మధుసూదన్రెడ్డి, రామన్న పేట సీఐ వెంకటేశ్వర్లు, అడ్డగూడూరు, మోత్కూర్,అత్మకూరు ఎస్ఐలు నాగరాజు, నాగరాజు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.ఫ రాచకొండ సీపీ సుధీర్బాబు ఫ అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ తనిఖీ -
జగన్మోహినిగా వెలిగి.. ఎదుర్కోలుకు కదిలి
శ్రీస్వామి, అమ్మవారిని ఊరేగింపుగా ఎదుర్కోలు మండపానికి తోడ్కొని వెళ్తున్న అర్చకులు, ఆలయ అధికారులు.. చిత్రంలో పట్టువస్త్రాలతో కలెక్టర్ దంపతులు, ఈఓయాదగిరిగుట్ట: యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో ఎదుర్కోలు మహోత్సవం శుక్రవారం రాత్రి వేదపండితుల మంత్రోచ్ఛరణలతో వీనులవిందుగా సాగింది. పట్టువస్త్రాలు, బంగారు ఆభరణలతో అలంకరించిన శ్రీస్వామివారిని అశ్వవాహనంపై, అమ్మవారిని ముత్యాల పల్లకిపై అధిష్టింపజేసి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం తూర్పురాజగోపురం ఎదుట మాడ వీధిలో స్వామి వారిని పశ్చిమ ముఖంగా, అమ్మవారిని తూర్పుముఖంగా అధిష్టింపజేశారు. ఆలయ ఈఓ భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటచార్యులు, అర్చకులు, ఇతర అధికారులు శ్రీస్వామి, అమ్మవారి తరఫున విడిపోయి పెద్దలుగా వ్యవహరించారు. ఇరువురి గుణగణాలు, ఆదాయం, వ్యయం, కట్నకానులకపై వివరించారు. అనంతరం తిరుకల్యాణ మహోత్సవానికి ముహూర్తం నిర్ణయించారు. అంతకుముందు ఉదయం శ్రీలక్ష్మీనరసింహుడు జగన్మోహిని అలంకారంలో ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నేడు తిరుకల్యాణోత్సవం లక్ష్మీసమేత నారసింహుడు శనివారం ఉదయం రామాలంకారంలో హనుమంత సేవపై దర్శనమిస్తారు. రాత్రి 8.30 గంటలకు గజవాహన సేవపై కల్యాణమండపానికి బయలుదేరుతారు. 10 గంటలకు తిరుకల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. -
మద్యంపై.. మహిళల సమరం
బెల్టు దుకాణాలు బంద్ చేయించిన అతివలు ఎక్కడమ్మా నువ్వు లేనిది.. ఏమిటీ నువ్వు చెయ్యలేనిది. మహిళలు ఏకమైతే సాధించలేనిది ఏమీ లేదు. గ్రామాల్లో మద్యం మహమ్మారికి యువత బానిస కావడం, కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నం కావడంతో ఆ ఊళ్లలో మహిళలు కొంగు నడుముకు చుట్టారు. మద్యం మహమ్మారిని పారదోలాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో నిర్వహించే బెల్ట్ దుకాణాలపై సమరం సాగించారు. మద్యం అమ్మకాలను అడ్డుకుని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు చిట్యాల మండలం ఏపూరు, రాజాపేట మండలం పాముకుంట మహిళలు. – చిట్యాల, రాజాపేటనెలరోజులుగా మద్యం అమ్మడం లేదు మా గ్రామంలో పదిహేనుకు పైగా బెల్ట్ దుకాణాల్లో మద్యం అమ్మేవారు. గ్రామంలోని యువతతో పాటు పెద్దవారు సైతం మద్యానికి బానిసై ఆర్థికంగా.. ఆరోగ్య పరంగా నష్టపోతున్నారు. ఇటీవల మద్యం మత్తులో ఓ యువకుడు మృతిచెందాడు. వెంటనే గ్రామంలో బెల్ట్ దుకాణాలను అరికట్టాలని మహిళలమంతా కలిసి ర్యాలీ నిర్వహించాం. మద్యం అమ్మితే జరిమానా విధించాలని తీర్మాణించాం. నెల రోజులుగా గ్రామంలోని బెల్ట్ దుకాణాలను తొలగించారు. మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. – బొంగు శ్రీలత, మహిళా సంఘం ప్రధానకార్యదర్శి, ఏపూరు ఫ మద్యం అమ్మకాలు జరిపితే జరిమానా విధించాలని నిర్ణయం ఫ ఆదర్శంగా నిలుస్తున్న చిట్యాల మండలం ఏపూరు, రాజాపేట మండలం పాముకుంటచిట్యాల మండలం ఏపూరు గ్రామం జాతీయ రహదారికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో 1950 మందికిపైగా జనాభా ఉంది. ఈ గ్రామానికి చెందిన పురుషులు ఎక్కువగా డ్రైవర్లుగా, కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామంలో పదిహేనుకుపైగా బెల్టుషాపులు ఉన్నాయి. వీటిలో అన్ని రకాల బ్రాండ్లకు చెందిన మద్యం లభిస్తుంది. దీంతో ఆ గ్రామంలోని యువకులతో పాటు చుట్టుపక్కల పరిశ్రమల్లో పనిచేసే వందలాది మంది కార్మికులు సైతం ఇక్కడ విచ్చలవిడిగా మద్యం సేవిస్తుంటారు. ఆ గ్రామానికి చెందిన పలువురు మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలలు పోగొట్టుకున్నారు. మరికొందరు చేసిన పనిచేసిన డబ్బులను మద్యానికి ఖర్చు చేస్తూ కుటుంబాలను పట్టించుకోవటం లేదు. దీంతో ఆ గ్రామ మహిళలంతా ఏకమై మద్యం మహమ్మారిని పారదోలాలని నడుం బిగించారు. మద్యంపై యుద్ధం మొదలైంది ఇలా.. ఏపూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు (20) ఫిబ్రవరి 12న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆ యువకుడి మృతికి మద్యం మహమ్మారే కారణమని భావించారు. ఆ యువకుడు మృతి చెందిన రోజే గ్రామంలో మద్యపానం నిషేధానికి నడుం బిగించారు. ఆ గ్రామంలోని మహిళ సంఘం అధ్యక్షురాలు వలిగొండ సునీత, ప్రధానకార్యదర్శి బొంగు శ్రీలత, వీబీకే బండ అనురాధ ఆధ్వర్యంలో మహిళలంతా ఏకమై బెల్ట్ దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద సమావేశమై నిరసన తెలిపారు. గ్రామంలో బెల్ట్ దుకాణాల వద్దకు వెళ్లి మద్యం అమ్మొదని హెచ్చరించారు. గ్రామంలో బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తే రూ.లక్ష, మద్యం తాగిన వారికి రూ.20 వేలు జరిమానా.. మద్యం అమ్మినవారి సమాచారం అందిస్తే రూ.10 వేల ప్రోత్సాహకం అందజేస్తామని తీర్మాణించారు. ఆ రోజు నుంచి గ్రామంలో మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. -
వేలంపాటను అడ్డుకొని..
రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పాముకుంట గ్రామంలో మూకుమ్మడిగా మద్యపాన నిషేధం పాటిస్తున్నారు. గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా బెల్టుషాపులు నడుస్తుండటంతో వృద్ధులు, యువకులు, పేదలు మద్యానికి బానిసై.. సంపాదించిందల్లా మద్యానికి ఖర్చు చేస్తునారు. అంతే కాకుండా గ్రామంలో బెల్టుషాపుల నిర్వాహణ కోసం ఇటీవల వేలం పాట నిర్వహించారు. దీంతో గ్రామంలోని కొంతమంది మహిళలు గ్రామస్తులతో కలిసి గ్రామంలో ఎలాంటి బెల్టుషాపులు నిర్వహించొద్దని, మద్యం విక్రయించచొద్దని మూకుమ్మడి నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారు. అప్పట్లో సారాపై పోరాటం పాముకుంట గ్రామంలో 2010–11 సమయంలో సారా ఏరులైపారేది. కూలినాలి చేసి వచ్చిన డబ్బంతా తాగుడుకే పోయేది. ఆ సమయంలో కుటుంబ పెద్దలను కోల్పోయి చాలా కుటుంబాలు వీధిన పడ్డాయి. దీంతో గ్రామానికి చెందిన మహిళలు ఏకమై సారా విక్రయ కేంద్రాలపై దాడిచేసి సామగ్రిని గ్రామం నడిబొడ్డున దహనం చేశారు. నా తర్వాత ప్రభుత్వం సారా విక్రయాన్ని నియంత్రించడంతో ఏడాదిపాటు గ్రామంలో సారా, మధ్యం విక్రయాలు జరగలేదు. -
యాదాద్రి భువనగిరి
అక్కడ.. ఇక్కడ కాదు.. ఎక్కడైనా వివక్షే!శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025సమాజంలో సగభాగమైన మహిళలు ఇంటా బయట ఇంకా వివక్షను ఎదుర్కొంటున్నారు. ఆధునిక సమాజంలోనూ పురాతన పోకడలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘సాక్షి’ ఉమ్మడి జిల్లాలోని ఏడు ముఖ్య పట్టణాల్లో మహిళల ఇబ్బందులపై నిర్వహించిన సర్వేలో పలు విషయాలు వెలుగుచూశాయి. 18 నుంచి 50 సంవత్సరాల వయస్సున్న 200 మంది మహిళలను సర్వే చేయగా.. ఇప్పటికీ ఇంట్లో ఆడ, మగ వివక్షను ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. –సాక్షి నెట్వర్క్ఫ ఆడ మగ వివక్ష ఇంట్లో కూడా ఉంది ఫ బయట ప్రదేశాలకన్నా ఆఫీస్, కళాశాలల్లోనే ఎక్కువ ఇబ్బంది -
మహిళలు, విద్యార్థినుల భద్రతకు షీటీంలు
మహిళా పోలీస్ స్టేషన్ సీఐ అర్జునయ్య సాక్షి యాదాద్రి : మహిళలు, విద్యార్థినుల భద్రతకు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యమిస్తోంది. ఇందుకోసం జిల్లాలో మూడు షీటీంలు ఏర్పాటు చేశాం. సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చేయడానికి టోల్ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశాం.. అని భువనగిరి మహిళా పోలీసు స్టేషన్ సీఐ అర్జునయ్య తెలిపారు. శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తాగుడుకు బానిసలై.. భర్తలు మద్యానికి, ఆన్లైన్ బెట్టింగ్కు బానిసలై భార్యలను వేధింపులకు గురిచేస్తున్న సంఘటనలు పేద, ఽమధ్య తరగతి కుటుంబాల్లో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అదనపు కట్నం కావాలని కొందరు, బెట్టింగ్లో నష్టపోయి మరికొందరు.. పుట్టింటి నుంచి డబ్బు తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నారు. మాటవినకపోతే వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో మహిళలు న్యాయంకోసం పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. అధికంగా గృహహింస కేసులే.. మహిళలు, విద్యార్థినులకు సంబంధించి 2023లో 1,118 ఫిర్యాదులు రాగా 128 కేసులు, 2024లో 999 ఫిర్యాదులు రాగా 111 కేసులు నమోదయ్యాయి. 2025 మార్చి 5వ తేదీ నాటికి 150 ఫిర్యాదులు రాగా 23 కేసులు నమోదు చేశాం. ఇందులో గృహహింసకు సంబంధించినవే అధికంగా ఉన్నాయి. దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చి వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. షీటీంలతో నిరంతర నిఘా మహిళలు, విద్యార్థునులకు షీటీంలు అండగా ఉంటున్నాయి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు తదితర ప్రాంతాల్లో మఫ్టీలో ఉంటూ నిఘా ఉంచుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మూడు షీటీంలు పనిచేస్తున్నాయి. 100 కు డయల్ చేయండి 87126 62762 షీటీం నంబర్ -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
సాక్షి,యాదాద్రి : మహిళలు అన్ని రంగాల్లో రాణించి సాధికారత సాధించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. చదువుతో పాటు ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక స్వావలంబన తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఒక మహిళ ఉన్నతస్థాయిలో ఉంటే కుటుంబానికి, సమాజానికి ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ మహిళలు సాధికారత సాధించడం వల్ల సమాజం, కుటుంబం అభివృద్ధి చెందుతుందన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ మాట్లాడుతూ నేటి సమాజాంలో మహిళలు విద్య, విజ్ఞానంతో ముందుకెళ్తుండడం అభినందనీయమన్నారు. జేఏసీ చైర్మన్ ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో తమ సహాయ సహకారం ఉంటుందన్నారు. అనంతరం ఆటలపోటీల్లో గెలుపొందిన మహిళా ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే కలెక్టరేట్లో పని చేస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. కార్యక్రమంలో కలక్టరేట్ ఏఓ జగన్మోహన్ప్రసాద్, జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఈఓ సత్యనారాయణ, టీజీఓ జనరల్ సెక్రటరీ కవిత, సెక్రటరీ ఖదీర్, నాన్ గెజిటెడ్ ట్రెజరర్ శ్రీకాంత్, శ్రీనివాస్, చైతన్య, జిల్లా కోశాధికారి సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
అసమానతలు అంతరించాలి
మహిళా చైతన్యంలో పత్రికల పాత్ర కీలకంకథనాలు పరిశీలిస్తూ.. సూచనలు చేస్తూ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక పేజీలు, కథనాలను జడ్జి బి.దీప్తి పరిశీలించారు. మహిళలపై ప్రత్యేకంగా రూపొందించిన కథనాలను చూసి ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం కోసం మహిళలు పోరాడిన కథనాలను ప్రశంసించారు. పత్రికలు మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేలా.. చైతన్యం కలిగించే కథనాలు అందించాలన్నారు. బాధిత మహిళలకు అండగా ఉండాలని సూచించారు. న్యాయ సహాయం అందిస్తాం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా బాధితులకు న్యాయ సహాయం అందిస్తున్నామని జడ్జి దీప్తి తెలిపారు. అందరికీ సమాన న్యాయం దక్కాలనేది తమ సంస్థ లక్ష్యమన్నారు. న్యాయపరంగా వెనుకబడిన వారికి అండగా న్యాయ సేవాధికార సంస్థ చేయూతనిస్తోందని.. ఇప్పటికే అనేక న్యాయ చైతన్య సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యపర్చామన్నారు. ఇరువర్గాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరించి సత్వర న్యాయం అందేలా సహకరిస్తామన్నారు. న్యాయ సహాయం పొందాలనుకునే వారు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాని సూచించారు. నల్లగొండ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి బి.దీప్తివివక్షను రూపుమాపితేనే అద్భుత సమాజం బాధిత మహిళలకు అండగా ఉండాలి మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్గా విధులు రామగిరి(నల్లగొండ) : సమాజంలో కొన్నిచోట్ల ఇంకా లింగ వివక్ష కనిపిస్తోందని అది రూపుమాపితేనే అద్భుత సమాజం ఆవిష్కృతమవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి బి.దీప్తి పేర్కొన్నారు. పత్రికలు మహిళలను చైతన్య పరిచేలా కథనాలను ప్రచురించాలని సూచించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ‘సాక్షి’ యూని ట్ కార్యాలయంలో ఆమె గెస్ట్ ఎడిటర్గా వ్యవహరించారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవ ప్రత్యేక కథనాలపై చర్చించి పలు సూచనలు చేశారు. ధైర్యంగా నిలబడాలి మహిళలు సమస్యలకు కుంగిపోకుండా ధైర్యంగా నిలబడాలని జడ్జి దీప్తి సూచించారు. మహిళా సాధికారత జరిగినప్పుడే సమాజంలోని అసమానతలు తొలగిపోతాయన్నారు. మహిళలను తక్కువ చేసి చూడకుండా సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో భాగస్వామ్యం కల్పిస్తే వారి సమస్యలను వారే పరిష్కరించుకోగలగుతారని పేర్కొన్నారు. బాధ్యతల విషయంలో మహిళలను వేరు చేసి చూడొద్దన్నారు. ఉద్యోగం చేసే మహిళలను కొందరు కుటుంబాన్ని, ఉద్యోగాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావని అడుగుతారని.. అదే ప్రశ్న మగవారిని మాత్రం అడగరని ఇది సరి కాదన్నారు. సమాజంలో మహిళలపై వివక్షను రూపుమాపితేనే మహిళలు స్వేచ్ఛాయుత ప్రయాణానికి అడుగులు పడతాయన్నారు. -
ఉత్తమ ఫలితాలకు ఏకాగ్రత అవసరం
రాజాపేట: విద్యార్థులు ఏకాగ్రతతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం రాజాపేట మండలం బొందుగుల గ్రామంలోని ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించే ప్రీఫైనల్ పరీక్షలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆస్పత్రిలో డ్రైడే సానిటేషన్ నిర్వహించాలని ఎండీఓకు సూచించారు. రాజాపేట ఆస్పత్రికి వచ్చిన గర్భిణిని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్సత్రికి తరలిస్తే అక్కడి సిబ్బంది ప్రవర్తించిన తీరుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఫ కలెక్టర్ హనుమంతరావు -
భూదాన్పోచంపల్లిలో త్రిఫ్ట్ సర్వే
భూదాన్పోచంపల్లి: పట్టణ కేంద్రంలో గురువారం చేనేత జౌళిశాఖ అధికారులు నేతన్న పొదుపు పథకం(త్రిఫ్ట్) కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల క్షేత్రస్థాయి సర్వే చేపట్టారు. ఆయా కాలనీల్లో చేనేత కార్మికుల గృహాలకు వెళ్లి మగ్గాలు నేస్తున్నారా.. అనుబంధ కార్మికులు ఏయే పనులు చేస్తున్నారని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా డీఓ మాట్లాడుతూ.. నేతన్న పొదుపు పథకానికి పోచంపల్లిలో మగ్గం నేసే కార్మికులు, అనుబంధ కార్మికులు కలిపి మొత్తం 3180 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. గత రెండు రోజులుగా ఇంటింటా తిరిగి 1480 దరఖాస్తులకు సంబంధించి సర్వే పూర్తి చేశామన్నారు. మరో మూడు రోజుల్లో మిగిలిన లబ్ధిదారుల సర్వే పూర్తి చేయనున్నట్లు చెప్పారు. నిజమైన కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందజేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే క్షేత్ర స్థాయి సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన డీఓ, ఏడీఓలు, సీడీలు పాల్గొన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి భువనగిరిటౌన్ : గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ అవైస్ ఉర్ రెహమాన్ చిస్తి అన్నారు. గురువారం భువనగిరి పట్టణ కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగులు సమయపాలన పాటించాలన్నారు. గ్రామపంచాయతీల నుంచి గ్రంథాలయ సెస్ వసూలు చేయాలని తెలిపారు. గ్రంథాలయాల్లో నూతన సభ్యులను చేర్పించాలని పేర్కొన్నారు. మోత్కూరు, బొమ్మలరామారం శాఖ గ్రంథాలయాలకు నూతన ఫర్నిచర్ కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అన్ని గ్రంథాలయాల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. ప్రతి గ్రంథాలయంలో ఆన్ డిమాండ్ రిజిస్టర్ను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో గ్రంథపాలకులు, ఉద్యోగులు, పార్ట్ టైం వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి
చౌటుప్పల్: 2035నాటికి చౌటుప్పల్ పట్టణంలో 2లక్షల మంది నివాసం ఉండనున్నారని, అందుకే భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అధికారులకు సూచించారు. మున్సిపాలిటీలో నెలకొన్న వివిధ సమస్యలు, వాటి పరిష్కారంతోపాటు అభివృద్ధిపై గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా ప్రభుత్వ స్థలాలను గుర్తించాలన్నారు. పట్టణంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను ప్రథమ ప్రాధ్యాన్యతగా విస్తరించాలని తెలిపారు. 100, 80, 50ఫీట్ల వెడల్పుతో రోడ్లు ఉండాలని చెప్పారు. చిన్నకొండూర్ రోడ్డు 80, వలిగొండ రోడ్డు, తంగడపల్లి రోడ్డు 100 ఫీట్లుగా ఉండాలన్నారు. సర్వీస్రోడ్లు శాసీ్త్రయంగా నిర్మాణం జరగాలని సూచించారు. ఊర చెరువు అలుగు, వరదనీరు సాఫీగా దిగువకు వెళ్లేందుకు అవసరమైన కాలువ కోసం ప్రణాళికలు రూపొందించాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికార యంత్రాంగం అభివృద్ధి పనుల ప్రణాళికలు రూపొందించాలని, అందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం నుంచి తీసుకువచ్చే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఈఈ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ నర్సింహారెడ్డి, డీఈ మనోహర, అధికారులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి -
వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు అరెస్ట్
వేములపల్లి(మాడ్గులపల్లి): వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన అతడి భార్యతో పాటు మరో ఇద్దరిని గురువారం మాడ్గులపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గులపల్లి మండలం ఆగామోత్కూర్ గ్రామానికి చెందిన నక్క వెంకన్న, సరిత భార్యాభర్తలు. వీరికి 14 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో మనస్పర్ధలు రావడంతో సరిత భర్త వెంకన్నకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో వెంకన్న పలుమార్లు సరితను కాపురానికి రావాలని అడిగగా ఆమె రాకపోవడమే కాకుండా కుక్కడం గ్రామానికి చెందిన ఊరుబిండు మల్లయ్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్త వెంకన్నను ఇబ్బందులకు గురిచేశారు. సరిత మేనమామ మన్నెం శ్రీను సైతం ఆమెకు సహకరించడంతో మనస్తాపానికి గురైన వెంకన్న గత నెల 22న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య సరిత, ఊరుబిండు మల్లయ్య, మన్నెం శ్రీను వేధింపుల కారణంగానే తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెంకన్న సూసైడ్ లెటర్ సైతం రాశాడు. మృతుడి తండ్రి చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం వెంకన్న భార్య సరితతో పాటు మల్లయ్య, శ్రీనును అరెస్ట్ చేసి మిర్యాలగూడ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు వారికి 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. -
గోవర్ధనగిరిధారిగా లక్ష్మీనారసింహుడు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా జరుగుతున్నాయి. ఆలయంలో గురువారం ఉదయం నిత్య పూజలు చేపట్టారు. అనంతరం అలంకార సేవను ఆలయ తిరు మాడ వీధిలో ఊరేగించారు. అదేవిధంగా ఉదయం శ్రీనృసింహస్వామి వారిని గోవర్ధనగిరిధారి అలంకర సేవలో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆలయంలో ఆచార్యులు, రుత్వికులు, పారాయణీకులు ప్రబంధ పారాయణం, మూలమంత్ర జపములు, నిత్యారాధనలు కొనసాగించారు. రాత్రి సమయంలో శ్రీస్వామి వారు ఉగ్రనారసింహుడిగా సింహ వాహనంపై విహరించారు. వేడుకల్లో ఈఓ భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటచార్యులు, అధికారులు, పారాయణీకులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీస్వామి వారిని జగన్మోహిని అలంకార సేవలో ఊరేగిస్తారు. అదేవిధంగా రాత్రి సమయంలో ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఆలయ అర్చకులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ వైభవంగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు ఫ నేడు ఎదుర్కోలు ఉత్సవానికి ఏర్పాట్లు చేస్తున్న అర్చకులు -
అర్హత లేకున్నా వైద్యం!
దాడులు చేస్తున్నాం ప్రైవేట్ ఆస్పత్రుల్లో అర్హత లేకుండా వైద్యం అందిస్తున్నట్లు గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటున్నాం. తాజాగా యాదగిరిగుట్ట, తుర్కపల్లి వంటి మండలాల్లో దాడులు నిర్వహించి అర్హత లేకున్నా వైద్య సేవలందిస్తున్నట్లు గుర్తించాం. అర్హత, అనుమతి లేకుండా ఆస్పత్రులను నిర్వహిస్తే డీఆర్ఏ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటాం. – మనోహర్, డీఎంహెచ్ఓ భువనగిరి: జిల్లాలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో చాలా వరకు అర్హత లేకున్నా వైద్య సేవలందిస్తున్నాయి. తాజాగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో దాడులు చేసి అర్హత లేని వారిని గుర్తించారు. ఈ నెల 5న యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం మండల పరిధిలో పలు ఆస్పత్రుల్లో దాడులు నిర్వహించి సీజ్ చేశారు. కానీ సీజ్ చేసిన రెండు, మూడు నెలలకే ఆస్పత్రులకు చెందిన యాజమాన్యాలు తిరిగి యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇలాంటి వారిపై వైద్యశాఖ అధికారులు శాశ్వత చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. జిల్లాలో సుమారు 160 వరకు అనుమతి పొందిన ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ప్రైవేట్ ఆస్పత్రి ఏర్పాటు చేసుకునేందుకు ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు అర్హులుగా ఉంటారు. వీరి పేరుమీదనే రిజిస్ట్రేషన్ చేసుకుని అనుమతి పొందాలి. వారే వైద్య సేవలందించాలి. థియేటర్ అసిస్టెంట్ కోర్సు చేసిన వారే ఆపరేషన్ థియేటర్లో పనిచేయాలి. అనుమతి పొందిన సంఖ్య మేరకు పడకలను ఏర్పాటు చేసుకోవాలి. ఎంఎల్టీ కోర్సు పూర్తిచేసిన వారినే ల్యాబ్లో నియమించుకోవాలి. అర్హత గల పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు కాకుండా మరొకరు వైద్య సేవలందిస్తున్నారు. అర్హత గల పారామెడికల్ సిబ్బంది, ల్యాబ్ అసిస్టెంట్లను నియమించుకోవడం లేదు. ఏ ఆస్పత్రి ఎదుట సర్వీస్ చార్జీల పట్టికను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. తుర్కపల్లి, మాదాపూర్ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో అర్హత లేని వారు వైద్య చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా బొమ్మలరామారం, మోత్కూర్, తుర్కపల్లి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట ప్రాంతాల్లో లింగ నిర్ధారణ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పలు ఆస్పత్రుల్లో అర్హత లేని వారు సైతం ప్రసవాలు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇదే మాదిరిగా జిల్లాలో చాలా వరకు ఇలాంటి పరిస్థితి నెలకొంది. కేవలం దాడులు మాత్రమే కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఫ రిజిస్ట్రేషన్ ఒకరి పేరు మీద.. వైద్యం చేసేది మరొకరు ఫ ఆస్పత్రులను గుర్తించి సీజ్ చేసిన వైద్యశాఖ అధికారులు ఫ మూడు నెలలు తిరగకుండానే తిరిగి యథావిధిగా కొనసాగిస్తున్న యాజమాన్యాలు ఫ శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు -
నష్టాల పాలు
పాడి రైతులు..ఫ బ్రహ్మోత్సవాల్లో అంజలిశుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025సాక్షి, యాదాద్రి: పాడి రైతులకు రెండు నెలలుగా పాల బిల్లులు రాక అరిగోస పడుతున్నారు. మదర్ డెయిరీ, కరీంనగర్ డెయిరీ, విజయ డెయిరీ ఇలా పలు డెయిరీల్లో పాలు పోస్తున్న రైతులకు సకాలంలో బిల్లులు అందడం లేదు. రెండు నెలలుగా మదర్ డెయిరీలోనే సుమారు రూ. 24కోట్ల పాల బిల్లులు నిలిచిపోయాయి. పాలబిల్లులు సకాలంలో రాక రైతులు మదర్డెయిరీని వదిలి విజయ డెయిరీ, ఇతర ప్రైవేట్ డెయిరీలలో పాలు పోస్తున్నారు. గత సంవత్సరం 24 వేల మంది పాడి రైతులు 80 వేల లీటర్ల పాలు పోస్తే, ప్రస్తుతం 22 వేల మంది రైతులు 60 వేల లీటర్ల పాలు పోస్తున్నారు. ప్రస్తుతం మదర్ డెయిరీ సుమారు 80 వేల లీటర్ల పాలు విక్రయిస్తోంది. మదర్ డెయిరీ రైతులకు నాలుగు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. డిసెంబర్ 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఐదు బిల్లులు రైతుల ఖాతాల్లో రూ.20 కోట్లు జమ చేయాల్సి ఉంది. బిల్లులు రాక పెరుగుతున్న అప్పులు పాడి పశువులకు ఇచ్చే పల్లీచెక్క, మక్కపిండి, పత్తిచెక్క, తవుడు, కాల్షియం, నాణ్యమైన గడ్డి ధరలు, పెంపకం, వైద్యం, కూలీల ఖర్చులు పెరిగాయి. దీంతో అప్పు చేసి తెచ్చిన పాడి పశువులను రైతులు కోతకు విక్రయిస్తున్నారు. మదర్డెయిరీ క్రమం తప్పకుండా బిల్లులు ఇస్తే పెట్టుబడులు పోను గిట్టుబాటు అయ్యేదని రైతులు పేర్కొంటున్నారు. కొన్ని పాల సంఘాలు మాత్రం తమ రైతులకు ఒకటి, రెండు నెలల బిల్లులు సొసైటీల వాటాధనం నుంచి చెల్లిస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ విజయ డెయిరీకి సంబంధించి రెండు నెలలుగా నాలుగు బిల్లులు సుమారు రూ.3.20కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ప్రతిరోజు సుమారు 15 వేల లీటర్ల పాలను 1800 మంది రైతులు పోస్తున్నారు. లీటరు పాలపై ఇచ్చే రూ.4 ప్రోత్సాహకం మదర్, విజయ డెయిరీల్లో రావడం లేదు. ఫ మదర్ డెయిరీలో రెండు నెలలుగా నిలిచిపోయిన సుమారు రూ.24కోట్ల పాల బిల్లులు ఫ విజయ డెయిరీ, ఇతర ప్రైవేట్ డెయిరీలను ఆశ్రయిస్తున్న రైతులు మదర్ డెయిరీలో పాలశీతలీకరణ కేంద్రాలు 24 పాల సొసైటీలు 435 పాలు పోసే రైతుల సంఖ్య సుమారు 22వేలు రోజువారీగా వస్తున్న పాలు 60వేల లీటర్లు మదర్ డెయిరీ విక్రయిస్తున్న పాలు 80వేల లీటర్లు ప్రైవేట్గా డెయిరీ కొనుగోలు చేస్తున్న పాలు 20వేల లీటర్లు మదర్డెయిరీకి సంబంధించి పాల ఉత్పత్తి దారులు, పోస్తున్న పాలు సంవత్సరం పాలఉత్పత్తి పోస్తున్న దారుల సంఖ్య పాలు (లీటర్లలో) 2020 32,000 1,00,000 2021 30,000 56,000 2022 27,500 55,000 2023 25,500 57,000 2024 24,000 80,000 2025 22,000 60,000 -
నేడు ఎస్ఆర్టీఆర్ఐలో జాబ్మేళా
భూదాన్పోచంపల్లి: భూదాన్పోచంపల్లి మండలం జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ(ఎస్ఆర్టీఆర్ఐ)లో శుక్రవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీ్త్రలకు రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల, కొంగరకలాన్లోని ప్రముఖ మొబైల్ కంపెనీలలో, పురుషులకు ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ప్రముఖ ఏసీ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. పదో తరగతి, ఆపై చదివిన వారు అర్హులని అన్నారు. ఎంపికై న సీ్త్ర, పురుషులకు రూ.14,500 నుంచి రూ.16,500 జీతం, ఉచిత బస్సు, భోజన సదుపాయం, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని, ఆసక్తి కల్గిన వారు విద్యార్హతల సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు. వివరాలకు 994846111, 7540084221ను సంప్రదించాలని సూచించారు. -
అమ్మ భాష తప్పనిసరి
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మాతృభాష సబ్జెక్టు (తెలుగు) తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.- 8లోపెట్టుబడి పెట్టలేక పాడి పశువులను అమ్ముకున్నా గత రెండు నెలలుగా పాల బిల్లులు చెల్లించడం లేదు. దీంతో పశువులకు దాణా, పశుగ్రాసం అప్పులు చేసి కొనాల్సి వస్తుంది. పెట్టుబడి పెట్టలేక ఇప్పటికే నాకు ఉన్న నాలుగు పశువుల్లో రెండు పశువులను విక్రయించాను. పాడి రైతులకు బిల్లులు చెల్లించే విషయంలో ఆలస్యం చేయడం సరైనది కాదు. పాలకవర్గం స్పందించి ప్రతి 15 రోజులకు ఒకసారి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. – కాకల్ల ఉప్పలయ్య, పాడి రైతు, రాజాపేట నష్టాలతో సర్దుబాటు కావడంలేదు తీవ్రమైన ఆర్థిక నష్టాలతో రైతులకు పాల బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతోంది. డిసెంబర్ నెల రెండో బిల్లు నుంచి రూ.20 కోట్ల పాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. బ్యాంకు వడ్డీలు, ఉద్యోగుల జీతాలు, మెయింటెనెన్స్ భారంగా మారింది. ప్రతినెలా వస్తున్న నష్టాలను తగ్గించే చర్యలు ప్రారంభించాం. వీలైనంత త్వరగా రైతులకు పెండింగ్లో ఉన్న పాల బిల్లులు చెల్లిస్తాం. డెయిరీ ఉద్యోగులకు కూడా జనవరి నెల సగం జీతమే ఇచ్చాం. – గుడిపాటి మధుసూదన్న్రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ -
క్రీడాశిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు
భువనగిరి: జిల్లాలో 2025 సంవత్సరానికిగాను వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 1వ తేదీ నుంచి 31 వరకు 12 నుంచి 14 సంవత్సరాల గల బాలబాలికలకు వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహించేందుకు సీనియర్ క్రీడాకారులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. సీనియర్ క్రీడాకారులు, జాతీయ స్థాయి క్రీడాకారులు వారి ప్రగతికి సంబంధించి ధ్రువపత్రాలు జత చేయాలని తెలిపారు. ఏదైనా ఒక క్రీడలో మాత్రమే శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు దరఖాస్తులను జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఈ నెల 17వ తేదీలోపు సమర్పించాలని, వివరాలకు 83099 92451 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
10న అప్రెంటిస్షిప్ మేళా
నల్లగొండ: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో ఉత్తీర్ణులైన అన్ని ట్రేడ్ల అభ్యర్థులకు ఈ నెల 10న నల్లగొండలోని ప్రభుత్వ ఐటీఐ (పాత) కళాశాలలో అప్రెంటిస్షిప్ చేసేందుకు ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎ.నర్సింహాచారి తెలిపారు. అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని కోరారు. కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థలో ఉద్యోగాల భర్తీకి సంస్థ చైర్మన్ ఎం.నాగరాజు గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఖాళీగా ఉన్న టైపిస్ట్/అసిస్టెంట్(2) పోస్టులకు మార్చి 7 నుంచి 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. -
యాదగిరిగుట్ట క్షేత్రంలో యూపీ సీఎం సురక్ష టీం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సీఎం సురక్ష టీంకు చెందిన పోలీసు బృందం గురువారం సందర్శించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(ఐఐటీఏ)లో శిక్షణ తీసుకుంటున్న యూపీ సురక్ష టీంకు చెందిన 51 మంది పోలీసు బృందం.. ఆలయాల్లో భద్రత, సీఎంతో పాటు ప్రముఖులు ఆలయాలను సందర్శించిన సమయాల్లో ఎలా వ్యవహరించాలనే అంశాలపై శిక్షణలో భాగంగా యాదగిరిగుట్ట క్షేత్రానికి వచ్చి పరిశీలించారు. ప్రముఖులు వచ్చిన సమయాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శనాలకు ఎలా పంపించాలి, ఆలయ పరిసరాల్లో ప్రముఖులు పర్యటిస్తున్న సందర్భంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, బందోబస్తు విషయంలో ఏవిధమైన చర్యలు తీసుకోవాలనే అంశాలపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సీఎం సురక్ష టీంకు వివరించినట్లు సీనియర్ ఆర్ఎస్ఐ శివలాల్ తెలిపారు. వీరి వెంట అధికారులు సాయికుమార్, గణేష్, శంకర్రెడ్డి ఉన్నారు. -
రూ.2వేల కోట్లకు చేరువలో రుణాల పంపిణీ
నల్లగొండ టౌన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా రుణాల పంపిణీ రూ.2వేల కోట్లకు చేరుకుందని బ్యాంకు చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని డీసీసీబీలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.580కోట్ల బంగారు రుణాలు, రూ.571 కోట్ల పంట రుణాలు, రూ.405 కోట్ల మార్టిగేజ్ రుణాలు, రూ.379 కోట్ల దీర్ఘకాలిక రుణాలు అందించినట్లు తెలిపారు. బ్యాంకు వ్యాపారం రూ.3వేల కోట్లకు చేరువలో ఉండగా, రూ.50 కోట్ల లాభాల దిశలో డీసీసీబీ పయనిస్తుందన్నారు. రైతుల ప్రయోజనాల కోసం గ్రామీణ ప్రాంతాల్లో గృహ రుణాలను సులభతరం చేశామని, పౌల్ట్రీ రుణాల చెల్లింపు కాల పరిమితిని పెంచామన్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద అదనపు రుణాలను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సమావేశంలో సీఈఓ శంకర్రావు, డైరెక్టర్లు లింగం యాదవ్, పాశం సంపత్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సైదయ్య, కోడి సుష్మ తదితరులు పాలొగన్నారు. ఫ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి -
విశ్వ ఉనికి రహస్యం భౌతికమే
ఫ ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కవి కిషోర్ నల్లగొండ టూటౌన్: విశ్వ ఉనికి రహస్యం భౌతికమే అని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కవి కిషోర్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. గురువారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సైన్స్ విభాగం ప్రిన్సిపాల్ ప్రేమ్సాగర్ అధ్యక్షతన నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవం కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రతి విద్యార్థి వైజ్ఞానిక దృష్టిని అలవర్చుకొని జీవన విధానములో అన్వయించుకోవాలన్నారు. సమాజంలో ఎదురయ్యే అనేక సవాళ్లకు సైన్స్ ద్వారా పరిష్కార మార్గాలను కనుగొనాలన్నారు. విశ్వ రహస్యాలను శాస్త్రవేత్తలు ఇప్పటికీ కేవలం 30 శాతం మాత్రమే విశ్లేషించగలిగారని అన్నారు. మానవుల్లో కొంత శాతం మేర జంతువుల జన్యులతో పోలిన జన్యువులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారని వివరించారు. మానవ స్వభావాలు అనేకం జన్యు ప్రేరేపితంగా ఉన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్రెడ్డి, అన్నపూర్ణ, దోమల రమేష్, కళ్యాణి, రూప, రామచందర్గౌడ్, జ్యోతి, శివరాం పాల్గొన్నారు. -
నిందితుడికి 31 ఏళ్లు జైలు శిక్ష
ఫ బాలికపై అత్యాచారం కేసులో తీర్పు వెలువరించిన సూర్యాపేట జిల్లా కోర్టు చివ్వెంల(సూర్యాపేట): బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 31 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.30వేల జరిమానా విధిస్తూ సూర్యాపేట జిల్లా కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి ఎం. శ్యామ్శ్రీ గురువారం తీర్పు వెలువరించారు. ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త చనిపోవడంతో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడిని పోషించుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన గుంజ వెంకన్న అప్పుడప్పుడు సదరు మహిళ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఆమె చిన్న కుమార్తైపె అతడి కన్నుపడింది. బాలికపై పలుమార్లు వెంకన్న అత్యాచారానికి పాల్పడ్డాడు. 2021 మార్చి 31న బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి ఆమెకు గర్భస్రావ మాత్రలు ఇచ్చాడు. అదే రోజు మళ్లీ అత్యాచారం చేశాడు. బాలికకు కడుపునొప్పి రావడంతో హాస్పిటల్కు తీకెళ్తుండగా మార్గమధ్యలో కడుపునొప్పి ఎక్కువై కడుపులోంచి పిండం బయటపడింది. బాలికను తల్లి నిలదీయగా.. గుంజ వెంకన్న తనపై అత్యాచారం చేస్తున్నాడని విషయం చెప్పింది. బాలికకు చికిత్స చేయించిన అనంతరం 2021 ఏప్రిల్ 2న ఆమె తల్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటి డీఎస్పీ మోహన్కుమార్ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. పలువురు సాక్షులను విచారించిన న్యాయమూర్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాకి రాంరెడ్డి వాదనలతో ఏకీభవిస్తూ నిందితుడికి 31 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.30 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అదేవిధంగా బాలికకు రూ.5లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్కు లైజన్ ఆఫీసర్ గంపల శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సహకరించారు. -
రాష్ట్రపతి భవన్లో చండూరు చేనేత వస్త్రాల ప్రదర్శన
చండూరు: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహిస్తున్న అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో చండూరుకు చెందిన జాతీయ అవార్డు గ్రహీత గంజి యాదగిరి, జాతీయ మెరిట్ అవార్డు గ్రహీత చిలుకూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. బుధవారం రాత్రి తాము తయారుచేసిన చేనేత వస్త్రాలను ప్రదర్శించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు వివరించారు. అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి తెలంగాణ నుంచి ఎంపికై న 20 మందిలో తాము ఉండడం, రాష్ట్రపతి భవనలో తమ ఉత్పత్తులను ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉందని గంజి యాదగిరి, చిలుకూరి శ్రీనివాసులు పేర్కొన్నారు. -
నృసింహుడి సన్నిధిలో సాంస్కృతిక వైభవం
యాదగిరిగుట్ట, భూదాన్పోచంపల్లి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు సరికొత్త వైభవాన్ని సంతరించుకున్నాయి. గురువారం ఉదయం భూదాన్పోచంపల్లికి చెందిన శ్రీపుండరీక భక్త సేవా సమాజం, యాదగిరిగుట్టకు చెందిన శ్రీభాగ్యలక్ష్మీ మహిళ భజన మండలిచే భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆస్థాన మంగళ వాయిద్యం, ఆస్థాన వైధిక ప్రార్థన చేపట్టారు. ఆ తర్వాత హైదరాబాద్కు చెందిన ఏకే శ్రీనివాసాచార్యులు భగవత్ భక్తులు, వారిని భగవానుడు రక్షించిన విధానంపై ఉపన్యాసం చేశారు. ఏపీలోని తాడేపల్లిగూడేనికి చెందిన ముదపాక బాలసుందరం భగవతార్చే విరాటపర్వం అనే హరికథా గానం చేశారు. మధ్యాహ్నాం హైదరాబాద్లోని స్మరణ డ్యాన్స్ అకాడమీ బృందంచే నిర్వహించిన భరతనాట్యం ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. హైదరాబాద్కు చెందిన మహతి ఆర్ట్స్, వింజమూరి లక్ష్మీ బృందం, దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఫైన్ ఆర్ట్స్ బృందంచే భక్తి సంగీతం నిర్వహించారు. సాయంత్రం సుముఖి నృత్యాలయం వరలక్ష్మీ బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన కొనసాగింది. తిరుమల తిరుపతి ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో సాయంత్రం అన్నమాచార్య సంకీర్తన విభావరి నిర్వహించారు. -
అగ్నివీర్ ఇండియన్ నేవీ ఉద్యోగాలకు ఎంపిక
రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామయ్య డిఫెన్స్ అకాడమీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అగ్నివీర్ ఇండియన్ నేవీ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అకాడమీలో మొదటి సంవత్సరం డిఫెన్స్ కోర్సు చదువుతున్న మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఎన్. అభిషేక్, సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రానికి చెందిన కె. ప్రదీప్ జూలై నెలలో నిర్వహించిన ఇండియన్ నేవీ అగ్నివీర్ సీనియర్ సెకండరీ జాతీయస్థాయి పరీక్షలో ప్రతిభ చాటి ఉద్యోగాలు సాధించారు. ఉద్యోగం సాధించిన విద్యార్థులను అకాడమీ డైరెక్టర్ రామయ్య, శ్రీనివాస్, అధ్యాపకులు నగేష్, బొమ్ము శంకర్ అభినందించారు. పాడి ఆవులు విక్రయిస్తామని టోకరాఫ వాట్సాప్లో ఆవుల ఫొటోలు పెట్టి రూ.85,500 కొట్టేసిన దుండగుడు భువనగిరి: వాట్సాప్లో ఫొటో పెట్టిన ఆవులను కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి రూ.85వేలు పంపి మోసపోయాడు. ఈ ఘటన భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్కు ఈ నెల 5వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి పాడి ఆవుల ఫొటోలు పెట్టి వాటిని అమ్ముతామని చెప్పాడు. వాట్సాప్లో పెట్టిన ఆవులలో మూడు మాత్రమే ఎంపిక చేసుకుని ఫోన్పే ద్వారా రూ.1,05,000 పంపాలని సూచించాడు. గుర్తుతెలియని వ్యక్తి చెప్పిన మాటలు నమ్మిన ముత్తిరెడ్డిగూడెం వాసి మూడు ఆవులను ఎంపిక చేసుకుని ఫోన్ పే ద్వారా రూ.85,500 పంపాడు. డబ్బులు పూర్తిగా పంపితేనే ఆవులను పంపిస్తామని చెప్పడంతో తాను మోసపోయినట్లు గ్రహించి 1930 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. గుర్తుతెలియని వ్యక్తులు గేదెలు, ఆవులను అమ్ముతామని ఫోన్ చేస్తే నమ్మవద్దని ఎస్ఐ సంతోష్కుమార్ సూచించారు. ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్పై విచారణ వేగవంతం ఫ నిందితులను పట్టుకునేందుకు మధ్యప్రదేశ్కు వెళ్లిన నకిరేకల్ పోలీసులు నకిరేకల్: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి డబ్బులు ఇవ్వాలని బెదిరించిన కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఎమ్మెల్యేకు వచ్చిన ఫోన్ నంబర్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి విమానంలో నకిరేకల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ లచ్చిరెడ్డి తమ సిబ్బందితో కలిసి మధ్యప్రదేశ్కు పయనయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కారు ఢీకొని యువకుడు మృతిబీబీనగర్: బైక్పై వెళ్తున్న యువకుడిని ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి బీబీనగర్ మండలం నాగిరెడ్డిపల్లికి వెళ్లే దారిలో జరిగింది. సీఐ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన పెరుమాండ్ల సూర్యప్రసాద్(24) బుధవారం అర్ధరాత్రి 12గంటల సమయంలో బీబీనగర్ నుంచి బైక్పై బ్రహ్మణపల్లికి వెళ్తుండగా.. నాగిరెడ్డిపల్లికి వెళ్లే దారిలో హిందుస్థాన్ శానిటరీ వేర్ పరిశ్రమ గోడౌన్ సమీపంలో ఎదురుగా అతివేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సూర్యప్రసాద్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి సోదరుడు భానుచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం
నల్లగొండ, నల్లగొండ టౌన్: నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం కిడ్నాపైన మూడేళ్ల బాలుడి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. నకిరేకల్లో కిడ్నాపర్ని పట్టుకొని అతడి చెర నుంచి బాలుడిని విడిపించి గురువారం తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని లైన్వాడకు చెందిన షమీమున్సీసా, హైమద్ దంపతులకు ఇద్దరు సంతానం. వీరు గత మూడేళ్లుగా నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో వాటర్ ట్యాంక్ కింద నివాసముంటూ అక్కడే ఏర్పాటు చేసిన రూ.5 భోజనం తింటూ జీవనం సాగిస్తున్నారు. నార్కట్పల్లి మండల కేంద్రానికి చెందిన సీతారాములు చెల్లెలికి ముగ్గురు కుమార్తెలు కాగా.. మగ పిల్లలు లేరని ఆమె బాధపడుతుండడంతో చూడలేక సీతారాములు వారం క్రితం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి అక్కడ ఏ ఆధారం లేకుండా జీవనం సాగిస్తున్న హైమద్ కుటుంబాన్ని చూశాడు. వారితో పరిచయం పెంచుకొని వారి కుమారుడిని మంగళవారం రాత్రి కిడ్నాప్ చేసి నకరేకల్లో ఉంటున్న తన చెల్లెలికి అప్పగించాడు. తమ కుమారుడు కనిపించకపోవడంతో హైమద్ దంపతులు నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తిని పట్టుకోవాలని ఆదేశించారు. దీంతో పోలీసు బృందాలు రెండు రోజులుగా గాలించి సీతారాములు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడు నకరేకల్లో ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నారు. గురువారం అతడిని అరెస్ట్ చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.ఫ రెండు రోజుల క్రితం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కిడ్నాపైన బాలుడు ఫ మూడు ప్రత్యేక పోలీస్ బృందాలతో గాలింపు ఫ నకిరేకల్లో కిడ్నాపర్ని పట్టుకుని బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు -
ఉరేసుకుని యువకుడి బలవన్మరణం
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో గల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ పిల్లి లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం వాడపల్లి గ్రామానికి చెందిన గంధం అరుణ్కుమార్(26) దామరచర్ల మండల కేంద్రంలోని నాగకృష్ణ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. ఈ నెల 1వ తేదీన పెట్రోల్ బంక్కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. ఆ రోజు బంక్లో డబుల్ డ్యూటీ చేసిన అరుణ్కుమార్ ఆ తర్వాత కనిపించకుండాపోయాడు. రెండు రోజుల పాటు డ్యూటీకి రాకపోవడంతో బంక్ నిర్వాహకులు అరుణ్కుమార్ ఇంటికి వెళ్లి ఆరా తీశారు. అంతేకాకుండా పెట్రోల్ బంక్లో డబ్బుల లెక్కల్లో తేడా రావడంతో వాడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో గల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద యువకుడు ఉరేసుకుని మృతిచెందినట్లు గురువారం ఉదయం పోలీసులు వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలు షేర్ చేయడంతో.. ఆ మృతదేహం అరుణ్కుమార్దిగా గుర్తించిన అతడి స్నేహితులు వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడి సెల్ఫోన్ ఆధారంగా విచారణ చేపడుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తమ్ముడు గంధం వెంకయ్య ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునప్నట్లు ఎస్ఐ తెలిపాడు. అరుణ్కుమార్ ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి ఆర్థిక ఇబ్బందులు అధికమవ్వడంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహంతో ఆందోళన.. అరుణ్కుమార్ ఆత్మహత్యకు పెట్రోల్ బంక్ యాజమానే కారణమంటూ అతడి కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో గురువారం దామరచర్ల మండల కేంద్రంలోని నాగకృష్ణ ెపెట్రోల్ బంక్ వద్ద అద్దంకి–నార్కట్పల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. బంక్ యాజమాని తమ కుమారుడిని ఇబ్బందులకు గురిచేయడం వలనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న వాడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆదోళనను విరమింపజేశారు. -
అమ్మ భాష తప్పనిసరి
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం విద్యార్థులు మాతృభాషపై పట్టు కోల్పోతున్నారు. కొంత మంది విద్యార్థులు తెలుగు వ్యాక్యాలు రాయలేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో మాతృ భాష అయిన తెలుగును కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. – రాజు, తెలుగు ఉపాధ్యాయుడు, తిరుమలగిరి తిరుమలగిరి (తుంగతుర్తి): అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మాతృభాష (తెలుగు) సబ్జెక్టు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో సీబీఎస్ఈతో పాటు ఇతర సిలబస్ను అమలు చేస్తూ మాతృభాషను పక్కన పెడుతున్నారు. దీంతో విద్యార్థులు మాతృభాషపై పట్టు కోల్పోవడమే కాదు కనీసం చదవడం కూడా రావడం లేదని గ్రహించిన ఎన్సీఈఆర్టీ తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా బోధించేలా చేయాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేసింది. అధిక మార్కుల కోసం..ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మినహా చాలా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును బోధించడం లేదు. సీబీఎస్ఈ, ఐబీహెచ్ఈ తదితర సిలబస్ను అమలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలు భాష ఎంపిక స్థానంలో విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేలా సంస్కృతం, అరబిక్ బోధిస్తున్నారు. దీంతో తెలుగులో భావ వ్యక్తీకరణ, సృజనాత్మకతను కోల్పోతున్నట్లు భాషాభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ముందు తొమ్మిదవ తరగతికి.. ఇప్పటి వరకు ఉన్నత తరగతులకు తెలుగు పాఠ్యాంశాలు అమలు చేయని పాఠశాలలకు తప్పనిసరిగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతికి, 2026–27 నుంచి 10వ తరగతికి అమలు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు బోధించాల్సిందే.. ఎన్సీఈఆర్టీ ఆదేశాలతో ప్రభుత్వ నిర్ణయం -
పరీక్షలు సరిగా రాయలేకపోతున్నానని..
కోదాడ రూరల్: పరీక్షలు సరిగా రాయలేకపోతున్నాననే మనస్తాపంతో ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండకు చెందిన బచ్చలకూర శంకర్ కుమార్తె నవ్య పెన్పహాడ్ మండలం అనాజిపురంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న నవ్య.. ఇంటి వద్ద నుంచే బుధవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ మొదటి పరీక్షకు హాజరై తిరిగి వచ్చింది. జ్వరంతో పరీక్షలు సరిగ్గా రాయలేకపోతున్నాని మనస్తాపం చెందిన నవ్య గురువారం ఇంట్లో చీరతో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి చూసేసరికి మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్రెడ్డి తెలిపారు. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య -
ఉండ్రుగొండ గుట్టల్లో చెలరేగిన మంటలు
ఫ భయాందోళనలో స్థానిక గ్రామాల ప్రజలు చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండలం ఉండ్రుగొండ శివారులోని గుట్టల్లో గురువారం మంటలు చెలరేగాయి. దీంతో గుట్టలకు సమీపంలో ఉన్న ఉండ్రుగొండ, దురాజ్పల్లి, వల్లభాపురం, మహ్మదాపురం, ఇమాంపేట తదితర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి తోడు ప్రమాదం జరిగిన స్థలం పక్కనే హెచ్పీ పెట్రోల్ బంక్ ఉండటంతో బిక్కుబిక్కుమంటున్నారు. స్థానిక గ్రామాల ప్రజలు అగ్రిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి వెళ్లిన ఫైర్ సిబ్బంది మంటలు తీవ్రంగా ఉండడంతో రాత్రివేళ చేసేదేమీ లేక వెనుదిరిగి వచ్చారు. ఈ విషయమై ఫారెస్ట్ రేంజ్ అధికారి కిరణ్కుమార్ను వివరణ కోరగా.. పశువుల కాపరులు చుట్ట లేదా బీడీలు తాగి పడేయడంతో ఎండిన ఆకులకు నిప్పు అంటుకొని మంటలు చెలరేగి ఉండవచ్చని పేర్కొన్నారు. అగ్నిమాక సిబ్బంది మంటలు వచ్చే ప్రదేశానికి వెళ్లేందుకు వీలుకావడం లేదన్నారు. -
ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యారోగ్యశాఖ తనిఖీలు
యాదగిరిగుట్ట: తుర్కపల్లి మండలం, యాదగిరిగుట్ట పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో బుధవారం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తుర్కపల్లి మండల కేంద్రంలోని ఆర్కే ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేకపోవడం, ఆపరేషన్ థియేటర్ అపరిశుభ్రంగా ఉండడం, సిజేరియన్లు అధికంగా జరగడాన్ని అధికారులు గుర్తించారు. అదే విధంగా తుర్కపల్లిలోని నక్షత్ర ఆస్పత్రి, మాదాపూర్లోని శివసాయి, సాయిజ్యోతి క్లినిక్లో ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ –2010 ప్రకారం నమోదు చేసుకున్న వైద్యులు కాకుండా ఎంబీబీఎస్ డాక్టర్లు సేవలందిస్తున్నట్లు గుర్తించారు. దీంతో పాటు యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీసాయి ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. ఎంబీబీఎస్ వైద్యుడికి బదులుగా అర్హతలేని వ్యక్తి సేవలు అందజేస్తున్నట్లు గుర్తించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ తెలిపారు.ఐదు ఆస్పత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు, ల్యాబ్లు, డయాగ్నోస్టిక్ సెంటర్ల (అల్లోపతి, ఆయూష్) నిర్వాహకులకు ఈనెల 11వ తేదీన బ్లిష్మెంట్ యాక్ట్– 2010 పై అవగాహన కల్పించనున్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. -
మహిళా చట్టాలపై అవగాహన అవసరం
భువనగిరి : మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉంటే అవే వారిని కాపాడుతాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి, జడ్జి మాధవిలత పేర్కొన్నారు. బుధవారం భువనగిరిలోని మాస్ నర్సింగ్ స్కూల్లో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. చట్ట పరమైన హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండటంతో పాటు అన్ని రంగాల్లో మహిళలు రాణించి సాధికారత సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ స్కూల్ డైరెక్టర్ మాధవరెడ్డి, అధ్యాపకులు స్వాతి తదితరులు పాల్గొన్నారు. హెడ్ కానిస్టేబుల్కు రివార్డు సాక్షి, యాదాద్రి : ఆలిండియా పోలీస్డ్యూటీ మీట్–2025లో గోల్డ్ మెడల్ సాధించిన ఆలేరు పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ యాదగిరిని బుధవారం రాచకొండ సీపీ సుధీర్బాబు రివార్డుతో సత్కరించారు. జార్ఖండ్లోని రాంచీలో ఫిబ్రవరి 10నుంచి 16వ తేదీ వరకు జరిగిన ఆలిండియా పోలీస్ డ్యూటీ మీట్లో సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్విస్టిగేషన్ విభాగంలో యాదగిరి ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించారు. కమిషనరేట్కు ఎక్కువ మెడల్స్ వచ్చేవిధంగా ప్రతిభావంతులకు శిక్షణ ఇవ్వాలని యాదగిరికి సీపీ సూచించారు. ప్రజాచైతన్య యాత్రలను విజయవంతం చేయండి రామన్నపేట: గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం రామన్నపేట మండలంలో ఈ నెల 23నుంచి 28వ తేదీ వరకు ప్రజాచైతన్య యాత్ర చేపట్టనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ తెలిపారు. రామన్నపేటలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రామన్నపేట మండలంలోని 24 గ్రామాల్లో ఆరు రోజు పాటు135 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసి సమస్యలపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. రామన్నపేట శాసనసభ నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని, ఆస్పత్రిని వండ పడకలకు పెంచాలని, అంబుజా సిమెంట్ పరిశ్రమను రద్దు చేయాలని, ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాల్వ లను ఆధునీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పైల్ల అశయ్య, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు మేక అశోక్రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్, బల్లూరి అంజయ్య, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
తొలిరోజు 6,289 మంది హాజరు
భువనగిరి : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతమైన వాతావరణలో ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సరం తెలుగు, ఊర్దూ, హిందీ, సంస్కృతం పరీక్షలు నిర్వహించారు. మొత్తం 6,613 మంది విద్యార్థులకు గాను 6,289 మంది హాజరయ్యారు. 324 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ తెలిపారు. కాగా ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష జరిగింది. విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. నిర్దేశిత సమయానికి అరగంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి ఐదు నిమిషాలు అలస్యంగా వచ్చినా కేంద్రంలోకి అనుమతిచ్చారు. దీంతో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఊరట కలిగింది. పలు పరీక్ష కేంద్రాలను డీఐఈఓ తనిఖీ చేశారు.ఫ ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
సాక్షి,యాదాద్రి : మహిళలు అన్ని రంగాల్లో రాణించి తమ కాళ్లపై తాము నిలబడే ప్రయత్నం చేయాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్ ఆవరణలో మహిళా ఉద్యోగులకు ఆటలపోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. మహిళలు తలచుకుంటే ఏదైనా అవలీలగా సాధించగలరని పేర్కొన్నారు. క్రీడల వల్ల మానసికోల్లాసం, శారీరక ధృడత్వం చేకూరుతుందన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ మాట్లాడుతూ మహిళలు ఉద్యోగులు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తుండాలని, దీనివల్ల మానసిక ఒత్తిడి తొలగిపోయి విధులపై ఏకాగ్రత ఉంటుందన్నారు. ఈనెల 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు క్రీడా పోటీలు ఉంటాయని జిల్లా యువజన, క్రీడల శాఖ జిల్లా అధికారి ధనంజనేయులు తెలిపారు. టెన్నికాయిట్, షటిల్, చెస్, క్యారమ్స్, స్కిప్పింగ్, లెమన్ అండ్ స్పూన్, స్పీడ్ వాక్, రన్నింగ్, మ్యూజికల్ బాల్, గ్లాస్ పిరమిడ్ , సింగింగ్ –మ్యూజికల్ చైర్ పోటీలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ప సీఈఓ శోభారాణి, యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓ భాస్కర్రావు, జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్ ఉపేందర్రెడ్డి, రాష్ట్ర గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్, సెక్రటరీ దశరథరెడ్డి,తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతరావు -
134 మంది కార్యదర్శులకు మెమోలు
నల్లగొండ: పంచాయతీ కార్యదర్శులకు సర్వీస్ బ్రేక్ తప్పేలా కనిపించడం లేదు. నల్లగొండ జిల్లాలో పలువురు పంచాయతీ కార్యదర్శులు ఆ శాఖ జిల్లా అధికారి అనుమతి లేకుండా సెలవుపై వెళ్లడంతో 134 మందికి చార్జి మెమోలు అందజేశారు. గతంలోనూ 109 మందికి నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా నెలల తరబడి చార్జి మెమోలు అందుకున్న వారు ఎలాంటి అనుమతి లేకుండా సెలవుపై వెళ్లారు. వారంతా వివిధ రకాల పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వెళ్లారు. తిరిగి విదుల్లో జాయిన్ అయ్యేందుకు రాగా 109 మంది కార్యదర్శుల సెలవుల సర్వీస్ కాలాన్ని కట్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి గతంలో పనిచేసిన ప్రాంతాల నుంచి బదిలీ చేశారు. దీంతో కార్యదర్శులంతా కలెక్టర్ను కలిసి మొరపెట్టుకున్నారు. వీరిని వాస్తవంగా సస్పెండ్ చేయాలి కానీ, మానవతా దృక్పథంతో సెలవు కాలానికి సంబంధించిన సర్వీస్ను రద్దు చేసి వేతనాన్ని కట్ చేసేలా ఉత్తర్వులు జారీ చేసి విధుల్లోకి తీసుకున్నారు. తాజాగా చార్జి మెమోలు అందుకున్న వారిని త్వరలో విచారించేదుకు అధికారిని నియమించునున్నట్టు తెలిసింది. -
పిల్లలతో కలిసి మహిళ అదృశ్యం
కనగల్: వైవాహిక జీవితంలో గొడవల కారణంగా మనస్తాపం చెంది తన ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైన మహిళ ఆచూకీని అర్ధగంటలో కనగల్ పోలీసులు కనిపెట్టారు. నల్లగొండ మండలం జి. చెన్నారం గ్రామానికి చెందిన కాలం నాగజ్యోతి వైవాహిక జీవితంలో గొడవల కారణంగా జీవితంపై విరక్తి చెంది మంగళవారం మధ్యాహ్నం తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. జ్యోతి భర్త, తల్లిదండ్రులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం సాయంత్రం కనగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ విష్ణుమూర్తి పోలీసులను రెండు టీంలుగా విభజించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో నాగజ్యోతి అన్న మొబైల్కు కొత్త నంబర్ నుంచి నాగజ్యోతి ఫోన్ చేసి శ్రీనేను చనిపోతున్నాను. నా గురించి ఎవరూ వెతకొద్దు, నేను పిల్లల్ని తీసుకొని చనిపోతున్నానుశ్రీ అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఈ విషయం ఆమె అన్న వెంటనే కనగల్ పోలీసులకు చెప్పడంతో ఆ నంబర్ను ట్రేస్ చేసి నాగజ్యోతి హైదరాబాద్లో ఉందని నిర్ధారించుకొని హయత్నగర్ పోలీసుల సహకారంతో నాగజ్యోతి ఆచూకీని అరగంటలో కనిపెట్టి ఆమెను క్షేమంగా వారి బంధువులకు హయత్నగర్లో అప్పగించారు. నాగజ్యోతి బంధువులు కనగల్ ఎస్ఐ విష్ణుమూర్తి, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా అర్ధగంటలో ఆచూకీ కనిపెట్టిన పోలీసులు -
హనీట్రాప్తో విలవిల!
న్యూడ్ కాల్స్తో సైబర్నేరగాళ్ల మోసం ఆలేరుకు చెందిన ఓ యువకునికి గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ లిఫ్టు చేయడంతో యువతి హిందీలో మాట్లాడుతూ న్యూడ్గా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. కొద్దిసేపటి తర్వాత ఫోన్ కట్ అయ్యింది. వెంటనే మరో కాల్ వచ్చింది. నీవు న్యూడ్కాల్ చూశావని ఆ వీడియో నాదగ్గర ఉంది, వెంటనే డబ్బులు ఇవ్వకపోతే వీడియో నీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపిస్తానని బెదిరించింది. దీంతో యువకుడు భయాందోళన చెంది పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు యువతినుంచి వచ్చిన నంబర్ను బ్లాక్ చేశారు. ఫ రూ.లక్షల్లో డిమాండ్ ఫ పరువుపోతుందని అడిగినంత సమర్పించుకుంటున్న బాధితులు ఫ కొందరు పోలీసులకు ఫిర్యాదు ఫ వెలుగురాని కేసులు అనేకం ఫ తాజాగా నకిరేకల్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్తో కలకలం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను న్యూడ్ కాల్తో సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్లు సైబర్ మోసగాళ్ల నంబర్ను బ్లాక్ చేసి విచారణ ప్రారంభించారు. సాక్షి, యాదాద్రి : ఇటీవల జిల్లాలోని ఓ మాజీ ప్రజాప్రతినిధి మొబైల్కు హాయ్ అని మెసేజ్ వచ్చింది.. అది సైబర్ నేరగాళ్ల కాల్ అని తెలియక సదరు వ్యక్తి వెంటనే రిప్లై ఇచ్చాడు. అదే నంబర్నుంచి ఓ అందమైన యువతి వీడియో కాల్.. అందులో నగ్నంగా కనిపిస్తూ మాటల్లోకి దింపింది. యువతి మాయమాటలు నమ్మి ప్రజాప్రతినిధి కూడా న్యూడ్లా కనిపించేశాడు. ఇంకేముంది ఆ దృశ్యాన్ని యువతి స్క్రీన్షాట్ తీసి అతనికి సెల్ఫోన్కు పంపించి డబ్బులు పంపాలంటూ డిమాండ్ చేసింది. లేకపోతే వీడియోనూ వైరల్ చేస్తానని బెదిరించింది. పరువుపోతుందన్న భయంతో యువతి అడిగినంత డబ్బును మాజీ ప్రజాప్రతినిధి సమర్పించుకున్నాడు. అయినా వేధింపులు ఆగకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.. హానీట్రాప్ ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. ఎంతోమందిని సైబర్కేటుగాళ్లు నిలువెల్లా దోచుకుంటున్నారు. రోజుకో రకంగా మోసం మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు వెనకాడడం లేదు. రోజుకో రకమైన మోసానికి తెరలేపుతున్నారు. ఫేక్ కాల్స్ చేస్తూ లేదా వీడియో కాల్స్చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. యువత, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. ఇలా అనిన వర్గాల వ్యక్తులు మోసపోయిన వారిలో ఉంటున్నారు.సెల్ఫోన్ వాట్సాప్ను సైబర్ నేరగాళ్లు అవకాశంగా మలుచుకుంటున్నారు. అందమైన యువతుల డీపీ ఫొటోలున్న నంబర్ నుంచి హాయ్ అని మెసేజ్ పంపుతున్నారు. కొందరు స్పందించి రిపై్ౖల ఇస్తున్నారు. చాటింగ్ చేస్తున్న క్రమంలో న్యూడ్ కాల్స్ వస్తున్నాయి. న్యూడకాల్స్ చూస్తున్నారే తప్ప.. సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడుతున్నామన్న విషయం గ్రహించడం లేదు. సైబర్ నేరగాళ్లు న్యూడ్ కాల్స్ను రికార్డు చేసి బెదిరిస్తున్నారు. మరికొందరు ఫేస్బుక్కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతారు. అందమైన యువతి ఫొటోతో వచ్చిన రిక్వెస్ట్ను ఓకే చెబుతున్నారు. దీంతో సదరు వ్యక్తికి సంబంఽధించిన ఫ్రెండ్స్, బంధువులు, కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్ల వారికి తెలిసిపోతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫాంల నుంచి నంబర్లు సేకరించి వారి న్యూడ్ కాల్ వీడియోను పంపిస్తామని, యూ ట్యూబ్లో అప్లోడ్ చేస్తానని, బంధువులకు పంపిస్తానని బెదిరింపులకు దిగుతున్నారు. సదరు వ్యక్తికి చెందిన ఒకరిద్దరికి న్యూడ్కాల్ క్లిప్లు పంపించి బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో విషయం అందరికి తెలిస్తే పరువుపోతుందన్న భయంతో చాలామంది సైబర్నేరగాళ్లకు డబ్బులు సమర్పించుకుని లబోదిబోమంటున్నారు. పరువు పోతుందన్న భయంతో పోలీస్లను ఆశ్రయించడంలేదు. కాగా ఎక్కువ కాల్స్ మధ్యప్రదేశ్ పేరుతో వస్తున్నా. రాజస్థాన్కు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. -
అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలి
భానుపురి (సూర్యాపేట): జిల్లాలో రైతులు పండించిన అన్నిరకాల పంటలకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) జిల్లా కన్వీనర్లు మల్లు నాగార్జున్రెడ్డి, మండారి డేవిడ్ కుమార్, షేక్ నజీర్, నల్లడ మాధవరెడ్డి, నారాబోయిన వెంకట యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పాత రుణాలు రద్దుచేసి కొత్త రుణాలు ఇవ్వాలన్నారు. నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నేటికీ పూర్తిస్థాయిలో అమలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. రైతులందరికీ రుణమాఫీ అమలు చేసి రైతుభరోసా అందించాలని కోరారు. ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు అందించి నూతనకల్, మద్దిరాల, ఆత్మకూరు, చివ్వెంల, మోతె, పెన్ పహాడ్, మునగాల, నడిగూడెం మండలాల రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ రెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వరికుప్పల వెంకన్న, బొడ్డు శంకర్, దండ వెంకటరెడ్డి, మట్టిపల్లి సైదులు, ములకలపల్లి రాములు, పోటు లక్ష్మయ్య, పల్లె వెంకటరెడ్డి, కరీం, కందాల శంకర్ రెడ్డి, మేకల కనకారావు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
‘సిరిపురం’ పర్సన్ ఇన్చార్జ్గా రామేశ్వరం
రామన్నపేట: మండలంలోని సిరిపురం చేనేత సహకార సంఘం పర్సన్ ఇన్చార్జ్గా అప్పం రామేశ్వరం, పాలకవర్గ సభ్యులకు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు బుధవారం రీజినల్ డిప్యూటీ డైరెక్టర్, జిల్లా చేనేత జౌళిశాఖ ఇన్చార్జ్ సహాయ సంచాలకురాలు పద్మ నియామక పత్రాలు అందజేశారు. సిరిపురం సొసైటీ ఉమ్మడి జిల్లాలోనే బెడ్షీట్లు, డ్రెస్ మెటీరియల్ ఉత్పత్తిలో పేరుగాంచింది. జిల్లాలో పదవీకాలం ముగిసిన మిగతా సొసైటీల చైర్మన్లకు పర్సన్ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించగా, 2018లో కొంతమంది ఫిర్యాదు మేరకు సిరిపురం సొసైటీ బాధ్యతలను చేనేత జౌళిశాఖ డెవలప్మెంట్ అధికారికి అప్పగించారు. తాజా ఉత్తర్వుల మేరకు సిరిపురం చేనేత సహకార సంఘం పర్సన్ ఇన్చార్జ్గా అప్పం రామేశ్వరం మరియు పాలకవర్గ సభ్యులు గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉత్తర్వులు అందుకున్న వారిలో పర్సన్ ఇన్ర్జ్ అప్పం రామేశ్వరం, ఉపాధ్యక్షురాలు రాపోలు లక్ష్మమ్మ, ప్రధాన కార్యదర్శి జెల్ల లక్ష్మీనారాయణ, కోశాధికారి ఏలె నరసింహ, కార్యవర్గ సభ్యులు రాపోలు రమేష్, గుండు రాజు, రాపోలు పాపయ్య, సంగిశెట్టి వెంకటమ్మ, అప్పం శ్రీను, రాపోలు శ్రవణ్కుమార్ ఉన్నారు. -
ప్రశాంతత కోసం బుద్ధవనాన్ని సందర్శించాలి
నాగార్జునసాగర్: జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ప్రతిఒక్కరూ బుద్ధవనాన్ని సందర్శించాలని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యదర్శి ఆర్కే మిశ్రా అన్నారు. నల్లగొండ జిల్లాలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి వచ్చిన ఆయన బుధవారం నాగార్జునసాగర్ తీరంలోని బుద్ధవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధవనంలోని బుద్ధుడి పాదాల చెంత పుష్పాంజలి ఘటించారు. అనంతరం బుద్ధచరిత వనం, ధ్యానవనం, స్థూపవనం తదితర ప్రాంతాలను సందర్శించారు. మహాస్థూపంలోని అష్టబుద్ధుల వద్ద ధ్యానం చేశారు. అనంతరం నాగార్జునసాగర్ డ్యాంను సందర్శించారు. ఆయనకు బుద్ధవనం చరిత్ర గురించి గైడ్ సత్యనారాయణ వివరించారు. వారి వెంట డీఆర్డీఏ ఏపీడీ శేఖర్రెడ్డి, పెద్దవూర మండల తహసీల్దార్ కార్యాలయం ఆర్ఐ దండ శ్రీనివాస్రెడ్డితో పాటు ఆపద మిత్ర ప్రోగ్రాం శిక్షకులు తదితరులు ఉన్నారు.ఫ జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యదర్శి ఆర్కే మిశ్రా -
పొన్నవాహనంపై నృసింహుడి విహారం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధవారం స్వామివారు మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనిమిచ్చారు. ఉదయం ప్రధానాలయంలో నిత్యారాధలు నిర్వహించిన అనంతరం నిత్యకల్యాణ మండపంలో స్వామివారిని మురళీకృష్ణుడిగా తీర్చిదిద్ది ప్రత్యేక పల్లకిపై అధిష్టింపజేశారు. అనంతరం అలంకార సేవకు అర్చకులు హారతినిచ్చి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఆ తరువాత భాజాభజంత్రీలు, సన్నాయి మేళాల మధ్య మురళీకృష్ణుడికి రాగాలాపన చేశారు. సాయంత్రం ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు పూర్తిచేసిన అనంతరం శ్రీస్వామి వారిని పొన్న వాహనసేవపై ఊరేగించారు. ఆచార్యులు, యజ్ఞాచార్యలు, అర్చక బృందం వేద మంత్రాలు, పారాయణాలు పఠిస్తుండగా శ్రీస్వామివారు పొన్నవాహనంపై విహరించారు. భక్తులు పొన్నవాహనసేవలో పాల్గొని పులకించారు. పొన్న వృక్షమును దేవ వృక్షముగా పురాణాలు పేర్కొంటున్నాయి. దీనికే కల్ప వృక్షమని అంటారని అర్చకులు తెలిపారు. ఈ వేడుకల్లో ఈఓ భాస్కర్రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, డీఈఓ దోర్భల భాస్కర్శర్మ, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం గోవర్ధనగిరిధారి అలంకారం, రాత్రి సింహ వాహన సేవ ఉంటుంది. -
‘పెద్దగట్టు’ హుండీ ఆదాయం లెక్కింపు
చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండలం దురాజ్పల్లిలోని లింగమంతులస్వామి(పెద్దగట్టు) ఆలయ హుండీ ఆదాయాన్ని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో లెక్కించారు. పెద్దగట్టు జాతర ఫిభ్రవరి 20వ తేదీన ముగియగా.. ఫిభ్రవరి 21 నుంచి మార్చి 5 వరకు వచ్చిన హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. 13 రోజులకు గాను రూ.5.24 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె. భాస్కర్, ఇన్స్పెక్టర్ బి. సుమతి, ఆలయ కమిటీ చైర్మన్ పోలేబోయిన నర్సయ్యయాదవ్, ఈఓ కుశలయ్య, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. హుజూర్నగర్లో వింత జంతువు ప్రత్యక్షంహుజూర్నగర్: హుజూర్నగర్లో బుధవారం వింత జంతువు ప్రత్యక్షమైంది. పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో నివాసముంటున్న రఫీ ఇంట్లో మామిడి చెట్టుపై నల్లని వింత జంతువు కనిపించడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నరసింహారావు వచ్చి ఆ జంతువును పరిశీలించి దానిని సీవీఎట్ క్యాట్గా పిలుస్తారని చెప్పారు. ఇది మనుషులకు హాని చేయదని, అడవుల్లోనే రాత్రివేళ ఎక్కువగా సంచరిస్తుందని పేర్కొన్నారు. 200 టేకు చెట్లు దగ్ధంఆత్మకూరు(ఎం): గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో టేకు చెట్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండలం రాయిపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. రాయిపల్లి గ్రామానికి చెందిన జెట్ట శ్రీనివాస్ వ్యవసాయ భూమిలో సుమారు 350 టేకు చెట్ల ఉన్నాయి. ఈ టేకు చెట్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 200 చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మోత్కూరు నుంచి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. సుమారు రూ.2.50లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతు పేర్కొన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
వైద్యానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత
కనగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం కనగల్ మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి మీడియాతో మంత్రి మాట్లాడారు. కనగల్ పీహెచ్సీలో కంటి పరీక్షలు చేసే గ్లూకోమా సెంటర్ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. అర్హులైన వారికి గడచిన 15 నెలల్లోనే రూ.1600 కోట్ల ఎల్ఓసీలను అందించామని, పేద ప్రజలు వైద్యం కోసం వస్తే 24 గంటలు ఎల్ఓసీలను అందజేస్తున్నామని అన్నారు. అయితే ప్రైవేట్ ఆస్పత్రులకు ఎల్ఓసీ ఇచ్చే బదులుగా ఇకపై ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అన్నిరకాల సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. హైదరాబాదులో 4 టిమ్స్ హాస్పిటళ్లను ఆర్అండ్బీ ద్వారా నిర్మిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ ఎంజీఎంను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.2600 కోట్లతో హైదరాబాద్లోని గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, పాత భవనం అలాగే కొనసాగుతుందని తెలిపారు. వచ్చేవారం దేవరకొండ నియోజకవర్గంలో గ్లూకోమా కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. నల్లగొండ ఆస్పత్రిలో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ను ఈ నెలాఖరుకు ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఇతర ప్రాంతాలలో డిప్యూటేషన్పై పనిచేస్తున్న 59 మంది డాక్టర్లను వెనక్కి పిలిపిస్తున్నామన్నారు. పేద ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారానే వైద్య సేవలు అందిస్తామన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. పైలెట్ పద్ధతిన కనగల్ పీహెచ్సీలో గ్లూకోమా సెంటర్ను ప్రారంభించామని తెలిపారు. కనగల్తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ గ్లూకోమా కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక మోడల్ పీహెచ్సీని తీర్చిదిద్దుతామని తెలిపారు. తన ప్రసవం కూడా ప్రభుత్వ ఆస్పత్రిలోనే జరిగిందని ఆమె పేర్కొన్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
‘ఉపాధి’లో 266 రకాల పనులు
ఆలేరు రూరల్: జాతీయ ఉపాధిహామీ పథకంలో కూలీలకు పనికల్పించేందేకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. మొత్తం 266 రకాల పనులు చేపట్ట డమే లక్ష్యంగా అంచనాలు రూపొందించారు. ఏప్రిల్ 1నుంచి కొత్తగా గుర్తించిన పనులను ప్రారంభించి 2026 మార్చి 31వ తేదీన పూర్తి చేయనున్నారు. సీజన్కు అనుగుణంగా పనులు గ్రామసభల్లో గుర్తించిన ఉపాధిహామీ పనులు సీజన్కు అనుగుణంగా ఉంటాయి. ఈసారి నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా చెరువులు, కాలువలు, కుంటల్లో పూడికతీత, పిచ్చిమొక్కలు, పొదలను తొలగించి శుభ్రం చేయడం, భూముల అభివృద్ధి, నీటి కుంటల నిర్మాణం ఎక్కువగా చేపట్టనున్నారు. అదే విధంగా పొలాల వద్దకు రోడ్ల అనుసంధానం, వ్యక్తిగత మరుగుదొడ్లు, హరితహారం మొక్కలకు కంచెలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో ఉపాధిహామీ కూలీల వివరాలు జిల్లాలోని 17 మండలాల్లో 428 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జాబ్ కార్డులు 1,43,205 కాగా యాక్టివ్ జాబ్ కార్డులు 93,848 ఉన్నాయి. కూలీలు 1,37,475 మంది ఉండగా 25,49,676 పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. దినసరి కూలి రూ.302 చెల్లించనున్నారు. మొత్తం రూ.32.40 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఆత్మీయభరోసాతో పెరగనున్న కూలీలు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయభరోసా పథకం ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు చెల్లిస్తుంది. దీంతో ఉపాధిహామీ పనుల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు.అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలన్న లక్ష్యంతో అధికారులు కార్యాచరణ రూపొందించారు. 2025–26 సంవత్సరానికి కార్యాచరణ ఫ 25,49,676 పని దినాలు ఫ రూ.32.40 కోట్ల బడ్జెట్ ఫ గ్రామసభల ద్వారా పనుల గుర్తింపు ఫ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు వంద రోజులు పని కల్పిస్తాం 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధిహామీ పథకంలో చేపట్టే పనులకు సంబంధించి కార్యాచరణ రూపొందించాం. పనులను గుర్తించేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నాం. ప్రతి కూలీకి వంద రోజుల పని కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వద్ద కూలీలు పెద్ద సంఖ్యలో ఉపాధి పనుల్లో పాల్గొనే అవకాశం ఉంది. అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. –నాగిరెడ్డి, డీఆర్డీఓ -
‘సిరిపురం’ పర్సన్ ఇన్చార్జ్గా రామేశ్వరం
రామన్నపేట: మండలంలోని సిరిపురం చేనేత సహకార సంఘం పర్సన్ ఇన్చార్జ్గా అప్పం రామేశ్వరం, పాలకవర్గ సభ్యులకు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు బుధవారం రీజినల్ డిప్యూటీ డైరెక్టర్, జిల్లా చేనేత జౌళిశాఖ ఇన్చార్జ్ సహాయ సంచాలకురాలు పద్మ నియామక పత్రాలు అందజేశారు. సిరిపురం సొసైటీ ఉమ్మడి జిల్లాలోనే బెడ్షీట్లు, డ్రెస్ మెటీరియల్ ఉత్పత్తిలో పేరుగాంచింది. జిల్లాలో పదవీకాలం ముగిసిన మిగతా సొసైటీల చైర్మన్లకు పర్సన్ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించగా, 2018లో కొంతమంది ఫిర్యాదు మేరకు సిరిపురం సొసైటీ బాధ్యతలను చేనేత జౌళిశాఖ డెవలప్మెంట్ అధికారికి అప్పగించారు. తాజా ఉత్తర్వుల మేరకు సిరిపురం చేనేత సహకార సంఘం పర్సన్ ఇన్చార్జ్గా అప్పం రామేశ్వరం మరియు పాలకవర్గ సభ్యులు గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉత్తర్వులు అందుకున్న వారిలో పర్సన్ ఇన్ర్జ్ అప్పం రామేశ్వరం, ఉపాధ్యక్షురాలు రాపోలు లక్ష్మమ్మ, ప్రధాన కార్యదర్శి జెల్ల లక్ష్మీనారాయణ, కోశాధికారి ఏలె నరసింహ, కార్యవర్గ సభ్యులు రాపోలు రమేష్, గుండు రాజు, రాపోలు పాపయ్య, సంగిశెట్టి వెంకటమ్మ, అప్పం శ్రీను, రాపోలు శ్రవణ్కుమార్ ఉన్నారు. -
పిల్లలతో కలిసి మహిళ అదృశ్యం
కనగల్: వైవాహిక జీవితంలో గొడవల కారణంగా మనస్తాపం చెంది తన ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైన మహిళ ఆచూకీని అర్ధగంటలో కనగల్ పోలీసులు కనిపెట్టారు. నల్లగొండ మండలం జి. చెన్నారం గ్రామానికి చెందిన కాలం నాగజ్యోతి వైవాహిక జీవితంలో గొడవల కారణంగా జీవితంపై విరక్తి చెంది మంగళవారం మధ్యాహ్నం తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. జ్యోతి భర్త, తల్లిదండ్రులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం సాయంత్రం కనగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ విష్ణుమూర్తి పోలీసులను రెండు టీంలుగా విభజించి దర్యాప్తు చేస్తున్న క్రమంలో నాగజ్యోతి అన్న మొబైల్కు కొత్త నంబర్ నుంచి నాగజ్యోతి ఫోన్ చేసి శ్రీనేను చనిపోతున్నాను. నా గురించి ఎవరూ వెతకొద్దు, నేను పిల్లల్ని తీసుకొని చనిపోతున్నానుశ్రీ అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఈ విషయం ఆమె అన్న వెంటనే కనగల్ పోలీసులకు చెప్పడంతో ఆ నంబర్ను ట్రేస్ చేసి నాగజ్యోతి హైదరాబాద్లో ఉందని నిర్ధారించుకొని హయత్నగర్ పోలీసుల సహకారంతో నాగజ్యోతి ఆచూకీని అరగంటలో కనిపెట్టి ఆమెను క్షేమంగా వారి బంధువులకు హయత్నగర్లో అప్పగించారు. నాగజ్యోతి బంధువులు కనగల్ ఎస్ఐ విష్ణుమూర్తి, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా అర్ధగంటలో ఆచూకీ కనిపెట్టిన పోలీసులు -
సైబర్ నేరాలను ఎదుర్కోవడంపై అవగాహన
నల్లగొండ: సైబర్ నేరాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. సైబర్ నేరాలపై నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్, సైబర్ స్టాకింగ్, వర్క్ ఫ్రం హోం పేరుతో మనల్ని ఆకర్షితులను చేస్తూంటారని, కొన్నిసార్లు భయభ్రాంతులకు గురిచేస్తూ మన నుంచి డబ్బులు కాజేస్తారని అన్నారు. సైబర్ క్రైంలో డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే సైబర్ 1930కి నంబర్ కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అనంతరం సమీప పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని తెలిపారు. సోషల్ మీడియా వాడకం సరైన పద్ధతిలో ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టుకోవద్దన్నారు. ఇంటర్నెట్ అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలన్నారు. విద్యార్థినులు వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడం మంచిదని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్కు స్పందించవద్దని, విద్యార్థులు బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం సైబర్ నేరాలు, మోసాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి , నల్లగొండ వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి, ఎస్ఐ సైదులు, రియాజ్, మోక్షిత్, ఫారూక్, మెడికల్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఫ సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మీనారాయణ -
బస్సులో పోగొట్టుకున్న పర్సు అప్పగింత
దేవరకొండ: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు పోగొట్టుకున్న పర్సును డ్రైవర్, కండక్టర్ గుర్తించి తిరిగి అతడికి అప్పగించారు. దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం హైదరాబాద్ నుంచి దేవరకొండకు వస్తుంది. ఈ బస్సులోని ప్రయాణికుడు ఒకరు పర్సు బస్సులోనే మర్చిపోయి కొండమల్లేపల్లిలో దిగిపోయాడు. బస్సులో పర్సును గుర్తించిన కండక్టర్ బుచ్చిరెడ్డి, డ్రైవర్ భోజ్య దేవరకొండ డిపో అధికారులకు అందజేశారు. పర్సులోని వివరాల ఆధారంగా పర్సు పోగొట్టుకున్న ప్రయాణికుడిని గుర్తించి అతడికి తిరిగి పర్సు అప్పగించారు. ఆ పర్సులో రూ.14,500 నగదు ఉన్నట్లు తెలిపారు. నిజాయితీ చాటుకున్న బస్సు డ్రైవర్, కండక్టర్ను ఆరీస్టీ అధికారులు అభినందించారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
భువనగిరి: మండలంలోని పగిడిపల్లి గ్రామ పరిధిలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పగిడిపల్లి పరిధిలోని పాత కలెక్టరేట్ భవనం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని భువనగిరి ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గత వారం రోజులుగా మృతుడు భిక్షాటన చేస్తూ సంచరిస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడి వయస్సు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని, వివరాలు తెలిసిన వారు 8712662472, 8712662733 నంబర్లను సంప్రదించాలని ఎస్ఐ సంతోష్కుమార్ సూచించారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య మోత్కూరు: మానసికస్థితి సరిగ్గా లేని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మోత్కూరు పట్టణ శివారులో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు పట్టణ పరిధిలోని అంగడిబజార్కు చెందిన బీసు లింగస్వామి(55) మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతడికి మానసికస్థితి సరిగ్గా ఉండటంలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన బుధవారం మోత్కూరు పట్టణ శివారులో మోదుగుచెట్టుకు కేబుల్ వైరుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య బీసు సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి. నాగరాజు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. భర్తపై రోకలిబండతో భార్య దాడిచౌటుప్పల్: భర్తపై భార్య రోకలిబండతో దాడి చేసింది. ఈ ఘటన బుధవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామానికి చెందిన దుర్గం శ్రీనివాస్–సునీతలు దంపతుల మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 15రోజుల క్రితం కూడా భర్తతో గొడవ జరగడంతో సునీత చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెంలోని తన తల్లిగారింటికి వెళ్లింది. ఈ సమస్యపై మాట్లాడేందుకు గాను చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో నివాసముంటున్న సునీత సోదరుడు వీరేశం ఇంటి వద్దకు రావాలని శ్రీనివాస్కు సూచించారు. ఈ క్రమంలో బుధవారం శ్రీనివాస్ చౌటుప్పల్కు వచ్చాడు. మాట్లాడుకునే క్రమంలో మాటామాట పెరగడంతో ఇంట్లో ఉన్న రోకలిబండతో సునీత తన భర్త శ్రీనివాస్పై దాడి చేసింది. ఈ దాడిలో గాయపడిన శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ పేర్కొన్నారు. బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతినాంపల్లి: బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం నాంపల్లి మండలం స్వాములవారి లింగోటం శివారులో జరిగింది. నాంపల్లి మండల కేంద్రానికి చెందిన పూల రవి(33) మర్రిగూడ మండలం వట్టిపల్లి లో నిమ్మ తోట కౌలుకు తీసుకున్నాడు. బుధవారం రాత్రి తోటలో పని ముగించుకొని తన భార్యతో కలిసి బైక్పై నాంపల్లికి వస్తుండగా.. స్వాములవారి లింగోటం శివారులో మూలమలుపు వద్ద అదుపుతప్పి కిందపడిపోయారు. రవి తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం మాల్కు తరలించారు. రవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండకు తరలించారు. మృతుడికి ఒక కుమారుడు, కుమారై ఉన్నారు. -
యాదాద్రి భువనగిరి
ఇఫ్తార్ 6–29 (గురువారం సాశ్రీశ్రీ) సహర్ 5–08 (శుక్రవారం ఉశ్రీశ్రీ)ప్రారంభానికి నోచుకోని పీహెచ్సీ బీబీనగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం పనులు పూర్తై నెలలు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. 7- 9లోగురువారం శ్రీ 6 శ్రీ మార్చి శ్రీ 2025బుద్ధవనాన్ని సందర్శించాలి జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ప్రతిఒక్కరూ బుద్ధవనాన్ని సందర్శించాలని ఆర్కే మిశ్రా పేర్కొన్నారు.- 8లో -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
సాక్షి, యాదాద్రి : వివిధ పథకాలకు సంబంధించి ఆదేశించి పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. మండల పరిషత్, పంచాయతీ అధికారులతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంజనీరింగ్ కన్సల్టెంట్, ఉపాధిహామీ పథకం, నర్సరీ, ప్లాంటేషన్ సర్వైవల్, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్షించారు. నర్సరీల్లో మొక్కల సంరక్షణకు షెడ్ నెట్ల ఏర్పాటు, రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కల సంరక్షణకు నీరందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అదే విధంగా ఉపాధిహామీ పథకంలో ఎక్కువ మందిని భాగస్వామ్యం చేసి గడువులోపు పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించార. పనులను ఫొటో తీసి పంపాలని సూచించారు. టెలీకాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్, డీఆర్డీఓ నాగిరెడ్డి పాల్గొన్నారు., సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
విత్తనాలు మార్చకుండా అవగాహన కల్పించాలి
త్రిపురారం: వరి విత్తనాలను ప్రతిసారి మార్చాల్సిన అవసరం లేదని, రైతులు తమ పొలంలోనే పండించిన వరి ధాన్యాన్ని విత్తనాలుగా వినియోగించుకోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అవగాహన కల్పించాలని హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో గల ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్(ఈఈఐ) ప్రొఫెసర్ డాక్టర్ మధుబాబు అన్నారు. బుధవారం త్రిపురారం మండలంలోని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రంలో శాసీ్త్రయ సలహా మండలి, జిల్లా స్థాయి సమన్వయ సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2024–25 సంవత్సరంలో శాస్త్రవేత్తలు వ్యసాయంలో రైతులకు అందించిన సలహాలు సూచనలు, అదేవిధంగా 2025–26వ సంవత్సరంలో అందించే సేవలపై శాస్త్రవేత్తలు సమీక్ష చేశారు. కేవీకే కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్రావు మాట్లాడుతూ.. మేలైన యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించేందుకు గాను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. స్థిరమైన వరి ఉత్పత్తికి నేరుగా విత్తే పద్ధతి, ప్రకృతి వ్యవసాయం, బేకరీ ఉత్పత్తులు, వర్మీ కంపోస్ట్, కూరగాయల సాగు, కోళ్లు, గొర్రెల పెంపకం, వాటర్ మేనేజ్మెంట్, మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ వంటి వాటిపై శిక్షణ ఇచ్చామన్నారు. చీడపీడల నివారణకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పర్యటించి రైతులకు పలు సలహాలు, సూచనలు అందజేసినట్లు పేర్కొన్నారు. అనంతరం డాక్టర్ మధుబాబు మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుకు అవసరమయ్యే వాటిపై నూతన ప్రయోగాలు చేయాలన్నారు. అనుభవం ఉన్న రైతుల ద్వారా సమాచారాన్ని సేకరించి ఇతర రైతులను ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయంలో రైతులు అధిక దిగుబడులు సాధించడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు ముందుండాలన్నారు. ఈ ఏడాది రైతులకు అందించాల్సిన సేవలపై ముందస్తుగా ప్రణాళిక ఉండాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం హెడ్ అనిల్, ఏడీఆర్ సుధాకర్, కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ చంద్రశేఖర్, రాములమ్మ, హాహలియా ఏడీఏ రవీందర్, ఉద్యానవన అధికారి మురళి, పలువురు మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ మధుబాబు -
దండంపెడతా సారూ.. అమ్ముకోనియ్యండి!
భువనగిరిటౌన్ : మీకు దండం పెడుతా.. అమ్ముకోనియ్యండి.. బత్తాయిల వ్యాపారమే జీవనాధారం.. ఇబ్బందులకు గురి చేయకండి.. అని ఓ మహిళా రైతు ట్రాఫిక్ పోలీసులను వేడుకుంది. ఈ సంఘటన బుధవారం భువనగిరిలోని బాబుజగ్జీన్రాం చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. భువనగిరి, రామన్నపేట, వలిగొండతో పాటు వివిధ మండలాల రైతులు తాము పండించిన పండ్లు, బతాయిలు, నిమ్మకాయలను కొన్నేళ్లుగా బాబుజగ్జీవన్రాం చౌరస్తాలో విక్రయిస్తున్నారు. బుధవారం ట్రాఫిక్ పోలీసులు వచ్చి ట్రాఫిక్జామ్ అవుతుందని, తొలగించాలని హెచ్చరించారు. ఈ క్రమంలో ఓ మహిళా రైతు కలగజేసుకుని బతుకుదెరువు దెబ్బతీయొద్దని ట్రాఫిక్ పోలీసును వేడుకుంది. -
బీజేపీపై రాజకీయ పోరాటం చేయాలి
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం దురదృష్టకరం ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని, సొరంగమార్గం తవ్వేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వం తీరు ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సొరంగం పనులు పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. మిర్యాలగూడ అర్బన్: రాష్ట్రానికి ప్రమాదకరంగా మారబోతున్న బీజేపీ విధానాలను ఎండగట్టడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విఫలమయ్యాయని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం ఆయన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాయమాటలతో, మతోన్మాదంతో ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలుపొందాలని బీజేపీ చూస్తోందని, దీనికి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో బీజేపీని కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేక పోతోందని విమర్శించారు. భవిష్యత్తులో బీజేపీపై రాజకీయ యుద్ధం జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాజస్తాన్లో ఓ చిన్న కేసు విషంలో పోలీసులు అర్ధరాత్రి ఇంట్లో చొరబడి ఆరునెలల చిన్నారి చావుకు కారణం అయ్యారని, ముస్లిం వ్యతిరేకంగా పాలన చేయడమే ఆ పార్టీ లక్ష్యమన్నారు. రేవంత్రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేడం లేదని విమర్శించారు. కేవలం బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ పైనే ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. 50శాతం రిజర్వేషన్ దాటవద్దని సుప్రీంకోర్టు చెపుతున్నా.. పార్లమెంట్లో బీసీ కులగణన ఆమోదం పొందదనే దృష్టితోనే బీసీ కులగణన చేసినట్లు చెప్పుకుంటున్నారని అన్నారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ నాటకమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ఖమ్మం, నల్లగొండ జిల్లాల కార్యదర్శులు నూనె నాగేశ్వర్రావు, తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, డబ్బికార్ మల్లేష్, సయ్యద్ హశం, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, ఎండీ సలీం, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, మల్లయ్య, అరుణ, పల్లా భిక్షం తదితరులు పాల్గొన్నారు. బీజేపీ విధానాలను ఎండగట్టడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ విఫలం సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం -
కొనసాగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బుధవారం హైదరాబాద్లోని కార్వాన్కు చెందిన శ్రీవిశ్వాంజనేయ భక్త సమాజం, యాదగిరిగుట్టలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహిళా భజన మండలి, వేల్పుపల్లి శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్కు చెందిన మసన చెన్నప్ప ఆధ్వర్యంలో ఉపనిషత్ వైభవంపై ఉపన్యాసం చేశారు. హాలియాకు చెందిన చేబ్రోలు నారాయణదాసు సమక్షంలో సుభద్రా పరిణయం హరికథ గానం చేశారు. స్వరరాగ ఆర్ట్స్ ఆకాడమీ ఆధ్వర్యంలో భక్తి సంగీతం, మెరుగు రాఘవేంద్రచే తబలా వాయిద్యం చేపట్టారు. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రముఖ జానపద, సినీ నేపథ్య గాయని తేలు విజయ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమం కొనసాగింది. ఇక పలువులు కళాకారులు కూచిపూడి, భరత నాట్యం, సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. -
అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలి
భానుపురి (సూర్యాపేట): జిల్లాలో రైతులు పండించిన అన్నిరకాల పంటలకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) జిల్లా కన్వీనర్లు మల్లు నాగార్జున్రెడ్డి, మండారి డేవిడ్ కుమార్, షేక్ నజీర్, నల్లడ మాధవరెడ్డి, నారాబోయిన వెంకట యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పాత రుణాలు రద్దుచేసి కొత్త రుణాలు ఇవ్వాలన్నారు. నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నేటికీ పూర్తిస్థాయిలో అమలు చేసిన పాపాన పోలేదని విమర్శించారు. రైతులందరికీ రుణమాఫీ అమలు చేసి రైతుభరోసా అందించాలని కోరారు. ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు అందించి నూతనకల్, మద్దిరాల, ఆత్మకూరు, చివ్వెంల, మోతె, పెన్ పహాడ్, మునగాల, నడిగూడెం మండలాల రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ ఏఓ సుదర్శన్ రెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వరికుప్పల వెంకన్న, బొడ్డు శంకర్, దండ వెంకటరెడ్డి, మట్టిపల్లి సైదులు, ములకలపల్లి రాములు, పోటు లక్ష్మయ్య, పల్లె వెంకటరెడ్డి, కరీం, కందాల శంకర్ రెడ్డి, మేకల కనకారావు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
భూ పంపిణీ చేయాలని ధర్నా
భువనగిరిటౌన్ : ఆలేరు మండలం కొలనుపాకలో సర్వే నంబర్లో 8లో గల రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని అర్హులైన పేదలకు పంపినీ చేయాలని కోరుతూ సీపీఎ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. గ్రామంలో ఎంతోమది నిరుపేదలు ఉన్నారని, వారికి ప్రభుత్వ భూమిని పంపిణీ చేయాలని ఎప్పటినుంచో అధికారులను కోరుతున్నా స్పందించడం లేదన్నారు. అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికై నా అధికారులు స్పందించాలని కోరారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు చెక్క వెంకటేష్, కనకయ్య, పొన్నబోయిన రవి, గిరబోయిన సామి, పోతు ప్రవీణ్, మోతే భవాని పాల్గొన్నారు. -
ఓటరునాడి పట్టలే..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ– టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందగా, టీఎస్ యూటీఎఫ్ తమ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. సంఘం పోరాట పటిమ తమ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డిని గెలిపిస్తుందన్న నమ్మకంతో ఉన్నా.. అనుకూల ఫలితాన్ని సాధించలేకపోయింది. ఇక పీఆర్టీయూ–టీఎస్ గతంలో కోల్పోయిన తమ స్థానాన్ని ఈసారి దక్కించుకోగలిగింది. ఉపాధ్యాయుల్లో పెద్ద సంఘంగా పేర్కొనే పీఆర్టీయూ ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి పింగిలి శ్రీపాల్రెడ్డిని గెలిపించుకొని తమ పాత స్థానాన్ని పదిలం చేసుకోగలిగింది. సొంత నియోజకవర్గం కాకపోయినా ఈ ఎన్నికల్లో బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి గట్టిగా పోరాడి ఓడారు. బీసీ నినాదంతో ఈ ఎన్నికల్లో బరిలోకి దిగిన పూల రవీందర్ ఆశించిన ఫలితం రాబట్టలేకపోయారు. ఇక, బీజేపీ అనుకున్నంత స్థాయిలో తమ బలాన్ని టీచర్లలో పెంచుకోలేకపోయింది. దీంతో ఆ పార్టీ తరఫున బరిలో దిగిన పులి సరోత్తంరెడ్డికి ఆశాభంగం తప్పలేదు. ఎక్కడ పొరపాటు జరిగింది.. ఈ ఎన్నికల్లో టీఎస్ యూటీఎఫ్ రెండో స్థానానికి పడిపోవడంపై ఆ యూనియన్ ఆలోచనల్లో పడింది. గెలుస్తామని ధీమాతో ఉన్నా అంచనాలు ఎక్కడ తారుమారయ్యాయి.. ఓటమికి కారణాలేంటనే విశ్లేషణ చేసుకుంటోంది. 2019 ఎన్నికలో గెలుపొందిన తాము ఈసారి ఎందుకు ఓడిపోయామనే చర్చ యూటీఎఫ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. యూనియన్కు ఉన్న సంప్రదాయ ఓట్లు అలాగే ఉన్నాయని, అవి తమ అభ్యర్థికే పడ్డాయని, అయితే తటస్థంగా ఉండే టీచర్ల ఓట్లు మాత్రం హర్షవర్దన్రెడ్డికి వేశారని అంచనా వేస్తోంది. హర్షవర్ధన్ పోటీలో ఉండటం వల్లే తమకు రావాల్సిన ఓట్లకు గండిపడి, రెండోస్థానానికి పడిపోవాల్సి వచ్చిందని భావిస్తోంది. డబ్బు, మద్యం పంపిణీ ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో పని చేసిందన్న విశ్లేషణ యూటీఎఫ్ వర్గాల్లో సాగుతోంది. గట్టి పోటీ ఇచ్చిన హర్షవర్ధన్రెడ్డి.. ఉపాధ్యాయ ఎన్నికల్లో గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి టీచర్స్ జేఏసీలోని సంఘాల మద్దతులో బరిలో దిగి చివరి వరకు పోరాడారు. ఓడిపోయినా.. గణనీయమైన ఓట్ల సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక సీఎం రేవంత్రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం వల్ల పండిట్, పీఈటీ పదోన్నతులు, ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు ఇప్పించడం వంటి విధాన నిర్ణయాల్లో హర్షవర్ధన్రెడ్డి కీలక ప్రాత పోషించిన అంశం టీచర్లలోకి బలంగానే వెళ్లింది. హర్షవర్ధన్ స్థానికేతరుడనే ప్రత్యర్థుల ప్రచారం కూడా ఆయనకు ప్రతికూలంగా మారింది. అయినప్పటికీ యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి, హర్షవర్ధన్ మధ్య వ్యత్యాసం 500లోపు ఓట్లు మాత్రమే ఉండడం గమనార్హం. పూల రవీందర్ ఎలిమినేట్ కావడానికి ముందు 16వ రౌండ్ ముగిసే వరకు నర్సిరెడ్డికి 5,660 ఓట్లు ఉండగా, హర్షవర్ధన్రెడ్డికి 5,309, శ్రీపాల్రెడ్డికి 7,673 ఓట్లు ఉన్నాయి. నర్సిరెడ్డి, హర్షవర్ధన్రెడ్డి మధ్య వ్యత్యాసం 351 ఓట్లే. రవీందర్ ఎలిమినేషన్ తరువాత కూడా అదే పరిస్థితి కొనసాగింది. దీంతో హర్షవర్ధన్రెడ్డి మూడో స్థానానికి వెళ్లాల్సి వచ్చింది. ఇద్దరికి ప్రచారం చేయడమే దెబ్బకొట్టిందా? ఈ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ అనుకున్న మేర ప్రభావం చూపలేకపోయారు. బీసీ వాదంతో, బీసీ సంఘాల మద్దతులో బరిలోకి దిగినా, అది పూర్తిగా ఫలించ లేదు. ముఖ్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒకే ఎన్నికలో ఇద్దరు బీసీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని చెప్పడం మైనస్గా మారిందనే చర్చ సాగుతోంది. ఎవరో ఒకరిని గెలిపించాలని కోరితే ఆ ఒక్కరికి ఓట్లు పడేవని, రవీందర్తోపాటు సుందర్రాజుకు ఓట్లు వేయాలని సూచించడంతో బీసీ ఓట్లు చీలిపోయాయన్న చర్చ సాగుతోంది. ఫ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన టీఎస్ యూటీఎఫ్ ఫ పాత స్థానాన్ని దక్కించుకున్న పీఆర్టీయూ–టీఎస్ ఫ సొంత నియోజకవర్గం కాకున్నా గట్టి పోటీ ఇచ్చిన హర్షవర్ధన్ రెడ్డి ఫ టీచర్లలో బలాన్ని పెంచుకోలేకపోయిన బీజేపీ -
ఈపాస్ ద్వారానే యూరియా అమ్మకాలు జరగాలి
ఆలేరురూరల్: ఎరువుల దుకాణాల్లో ప్రతిరోజు యూరియా అమ్మకాలు ఈపాస్ మిషన్ ద్వారానే జరగాలని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ అన్నారు. మంగళవారం ఆలేరు పట్టణంలో ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. ఎరువుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. యాసంగి సీజన్కు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. మొత్తం 101 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఆయన వెంట ఏఓ శ్రీనివాస్, ఏఈఓ నాగార్జున, సాకెర, శివకుమార్ తదితరులున్నారు. -
29 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు
ఫ హాజరుకానున్న 12,558 మంది విద్యార్థులు ఫ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి ఇంటర్ పరీక్షలు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో రాయాలి. పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలి. పరీక్షల సమయంలో జీరాక్స్ సెంటర్లు మూసివేయబడుతాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం. – రమణి, డీఐఈఓ భువనగిరి: ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 22వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. జనరల్ పరీక్షలు మాత్రం 20వ తేదీన ముగియనున్నాయి. పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 29 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షలకు మొత్తం 12,558 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రథమ సంవత్సరంలో జనరల్ 4,636 మంది విద్యార్థులు ఉండగా ఒకేషనల్ విద్యార్థులు 1,372 మంది ఉన్నారు. ద్వితీయ సంవత్సరంలో జనరల్ 4,873 మంది ఉండగా ఒకేషనల్ 1,477 మంది విద్యార్థులు ఉన్నారు. నిఘా నీడలో పరీక్షలు అన్ని కేంద్రాలను సీసీ కెమెరాలు పరిధిలోకి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు ఆధ్వర్యంలో ప్రతి కేంద్రంలో 5 సీసీ కెమెరాల చొప్పున బిగించారు. నేరుగా ఇంటర్ బోర్డుకు అనుసంధానం చేసిన సీసీ కెమెరాల ద్వారా పరీక్షల నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. వీటితో పాటు ఈ సారి హాల్టికెట్పై పరీక్ష కేంద్రం సులువుగా తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేశారు. ఎలాంటి సమస్యలు, సందేహాలు వచ్చినా వాటిని తెలియజేసేందుకు హాల్ టికెట్ పైనే టోల్ఫ్రీ నంబర్ను కూడా ముద్రించారు. అదేవిధంగా ప్రశ్నపత్రం పై యూనిక్ సీరియల్ పేపర్ ఎవరిదో తేలికగా గుర్తించనున్నారు. పరీక్షలు రాసేటప్పుడు ఒత్తిడికి గురైతే 14416 నంబర్కు ఫోన్ చేసి టీ మానస్ను సహాయం తీసుకునే అవకాశం కల్పించారు. కేంద్రాల్లో వసతుల కల్పన పరీక్షల నిర్వహణ కోసం 29 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 29 మంది డిపార్లమెంటల్ ఆఫీసర్లను నియమించారు. వీరితో పాటు ముగ్గురు సభ్యులతో కూడిన ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు డీఈసీ సభ్యులను నియమించారు. జిల్లా కన్వీనర్గా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి ఉండనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షణ అమల్లో ఉండనుంది. ఎండలను దృష్టిలో పెట్టుకుని పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బందితో పాటు నీటి వసతి, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి భువనగిరి: ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. పరీక్షల నేపథ్యంలో మంగళవారం సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్సు సమయానుకూలంగా వచ్చే విధంగా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో వైద్య సిబ్బందితో పాటు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 29 కేంద్రాలు ఏర్పాటు చేయగా 12,558 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఐఈఓ రమణి పాల్గొన్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
సాక్షి,యాదాద్రి: ఈ నెల 11వ తేదీ వరకు జరిగే యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు వివిధ శాఖల మంత్రులు వస్తుండడంతో అధికారులంతా అప్రమత్తంగా ఉండి ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు మంత్రుల రాక సందర్భంగా మంగళవారం స్థానిక మినీ మీటింగ్ హాల్లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ ఈఓ భాస్కర్ రావు, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్, రెవెన్యూ, దేవాదాయ, ఆర్టీసీ, మున్సిపల్ కమిషనర్, ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిసిటీ, ఫైర్, పంచాయతీ, ఎకై ్సజ్, వైద్య, మిషన్ భగీరథ, ట్రాన్స్కో, ట్రాఫిక్ తదితర శాఖల ఏర్పాట్ల పై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ శాఖలు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. పోలీస్ శాఖ అధికారులు, అగ్నిమాపక సేవలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. అదేవిధంగా సీపీఆర్ బృందాలను, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. శానిటేషన్ పనుల కోసం పంచాయతీ శాఖ దృష్టి సారించాలన్నారు. సమావేశంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, యాదగిరిగుట్ట ఏసీపీ రమేష్, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. తప్పిదాలు లేకుండా సేవలు అందించాలిభువనగిరిటౌన్: ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా వినియోగదారులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భువనగిరిలోని మీసేవ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల కోసం నూతనంగా వచ్చిన యూడీఐడీ పోర్టల్ గురించి వివరించారు. మీ సేవలో చేసే దరఖాస్తుల్లో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలన్నారు. వినియోగదారుల నుంచి అదనపు రుసుము వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, మీసేవ ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ సాయికుమార్, మీసేవ నిర్వాహకులు పాల్గొన్నారు. నేటి నుంచి సీపీఎం పోరుయాత్రభువనగిరిటౌన్: జిల్లా వ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ప్రజా సమస్యలపై సీపీఎం పోరుయాత్ర నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండి జహంగీర్ అన్నారు. మంగళవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా ఏర్పడి 8 సంవత్సరాలు గడుస్తున్నా కనీసం జిల్లాలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకవర్గాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఇప్పటికీ బస్వాపూర్ రిజర్వాయర్ పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఎం పోరుయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 27, 28, 29వ తేదీల్లో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేస్తామని, ఏప్రిల్ రెండో వారంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట 48 గంటల మహా ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు మాయ కృష్ణ, గడ్డం వెంకటేష్ పాల్గొన్నారు. -
వటపత్రశాయికి వరహాల లాలీ..
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాల్గవ రోజైన మంగళవారం ఉదయం శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు తిరు, మాడ వీధుల్లో వటపత్రశాయి అలంకార సేవలో ఊరేగించారు. వేకువజామున నిత్యారాధనలు చేపట్టిన తరువాత, పారాయణీకులు వేద పారాయణం పఠించారు. అనంతరం శ్రీస్వామి వారిని వటపత్రశాయి అలంకరణలో ప్రత్యేక పల్లకిపై అధిష్టించి ఆలయ తిరు మాడ వీధుల్లో ఊరేగించారు. వేడుకల్లో ఆలయ ఈఓ భాస్కర్రావు, అనువంఽశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆచార్యులు, పారాయణీకులు పాల్గొన్నారు. సాయంకాలం వేళ.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం ఆలయంలో నిత్యారాధనలు నిర్వహించారు. అనంతరం శ్రీనృసింహస్వామి వారిని హంస వాహన సేవలో అలంకరించి ఊరేగించారు. దక్షిణ దిశలోని ప్రథమ ప్రాకారం నుంచి ప్రారంభమైన అలంకార సేవ పడమటి రాజగోపురం నుంచి ఉత్తరం, తూర్పు, దక్షిణ రాజగోపురాల ముందు వరకు సాగింది. ఆలయంలో నేడు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో శ్రీస్వామి వారిని బుధవారం ఉదయం శ్రీకృష్ణాలంకారణ (మురళీ కృష్ణుడు) సేవ చేపట్టనున్నారు. అదేవిధంగా సాయంత్రం పొన్నవాహన సేవ నిర్వహించనున్నారు. ఫ రాత్రి హంస వాహనంపై ఊరేగిన స్వామివారు ఫ నాల్గవ రోజుకు చేరిన యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు -
పెట్టుబడి కూడా వచ్చేటట్లు లేదు
గోదావరి జలాలతో చెరువులు నింపడంతో మూడు ఎకరాల్లో వరి సాగు చేశాను. కానీ ఎండలు ఎక్కువ కావడంతో భూగర్భ జలాలు తగ్గి పంటలు ఎండిపోతున్నాయి. మూడెకరాల పంటలో ఎకరం వరి పంట నీరు లేక ఎండిపోతోంది. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. వరి నాట్ల కోసం పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోవాల్సి వచ్చింది. – గాజుల నర్సయ్య, రైతు, మహబూబ్పేట, యాదగిరిగుట్ట మండలం రెండు ఎకరాలు ఎండిపోయింది నాకున్న మూడు ఎకరాల్లో వరి సాగు చేశాం. నాటు వేసే సమయంలో బావిలో నీరు బాగానే ఉంది. కానీ వరి పొట్టకు వచ్చే దశలో నీరు పూర్తిగా అడుగంటి పోయింది. చేతికందిన రెండు ఎకరాలు వరి పంట ఎండిపోయింది. మూడు ఎకరాల సాగు కోసం వారం రోజుల క్రితం వ్యవసాయ భూమిలో రెండు బోర్లు వేశాను. చుక్క నీరు కూడా రాలేదు. రూ.1,25,000 అప్పు అయ్యింది. – చౌడబోయిన కనకయ్య, శ్రీనివాసపురం గ్రామం, ఆలేరు మండలం -
కేంద్రానికి అశాసీ్త్రయమైన డీపీఆర్ను పంపించారు
చౌటుప్పల్: రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి డీపీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అశాసీ్త్రయంగా పంపించిందని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్ ప్రాంతాలకు చెందిన ట్రిపుల్ఆర్ భూనిర్వాసితులు మంగళవారం హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్రెడ్డితో సమావేశమయ్యారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్ను కలిశారు. ఎలాగైనా నిబంధనల ప్రకారం 40కిలోమీటర్ల దూరం నుంచి అలైన్మెంట్ మార్పించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తప్పులతో కూడిన డీపీఆర్కు కేంద్రం ఏ విధంగా ఆమోదం తెలుపుతుందని ప్రశ్నించారు. తక్షణమే ఉత్తర భాగంలో శాసీ్త్రయంగా డీపీఆర్ తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అలైన్మెంట్ మార్పిడి చేస్తామని చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్ ప్రాంతంలోని బాధిత రైతులకు ఇచ్చిన హామీని నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. దక్షిణ భాగంలో 40 కిలోమీటర్ల దూరానికి రోడ్డును మార్చిన సీఎం ఉత్తర భాగం విషయాన్ని ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. సమావేశంలో సింగిల్విండో చైర్మన్, భూనిర్వాసితుల ఐక్యవేదిక కన్వీనర్ చింతల దామోదర్రెడ్డి, నిర్వాసితులు గుజ్జుల సురేందర్రెడ్డి, మారుపాక రామలింగం, జాల వెంకటేష్, దబ్బేటి రాములు, బోరెం ప్రకాష్రెడ్డి, సందగళ్ల మల్లేష్, జాల శ్రీశైలం, నర్సింహ పాల్గొన్నారు. ఫ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ -
వరి గోస!
అన్నదాత..ఫ అడుగంటుతున్న భూగర్భ జలాలు.. వట్టిపోతున్న బోరుబావులు ఫ పొట్టదశలో ఉన్న పంటను కాపాడడానికి ఇతర మార్గాల అన్వేషణ ఫ అన్ని చేసినా పంట దక్కకపోవడంతో జీవాలను మేపుతున్న రైతులుసాక్షి, యాదాద్రి: ఆరుగాలం శ్రమించి పండిస్తున్న వరి పైరు కళ్లముందే ఎండిపోతుంటే రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, అడుగంటిన భూగర్భ జలాలు, వట్టిపోతున్న బోర్లు, బావులతో పొలాలకు నీరందడం లేదు. పొట్టదశలో ఉన్న పంటను కాపాడుకోవడానికి కొత్తబోర్లు వేయడం, టాంకర్ల ద్వారా నీటిని పోయడం చేస్తున్నారు. అన్ని చేసినా పంట దక్కని స్థితిలో రైతులు జీవాలను మేపుతున్నారు. 10వేల ఎకరాల్లో పంటకు దెబ్బ జిల్లాలోని 2,75,316 ఎకరాల్లో యాసంగి సాగు చేశారు. మూసీ ఆయకట్టులో పెద్దగా నీటి ఇబ్బంది లేదు. భూగర్భ జలాలతో సాగు చేస్తున్న రైతులకే నష్టం వాటిల్లుతోంది. గడచిన పది రోజులుగా సాగునీటి ఇబ్బంది తలెత్తింది. ఆలేరు, తుర్కపల్లి, మోటకొండూరు, ఆత్మకూర్ (ఎం), గుండాల, అడ్డగూడూరు, యాదగిరిగుట్ట, రాజాపేట, మోత్కూరు, వలిగొండ, భువనగిరి మండలాల్లో సుమారు 10వేల ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. అయితే రెండు వేల ఎకరాల లోపు పంట ఎండిపోయిందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే ఫిబ్రవరి చివరి వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. గోదావరి జలాలతో చెరువులు నింపినా ప్రయోజనం లేకుండా పోయింది. వరి పంట అధికంగా ఎండిపోయిన గ్రామాలు ఇవే.. వలిగొండ మండలం పహిల్వాన్పూర్, కంచనపల్లి, పులిగిల్ల, సుంకిశాల, టేకులసోమారం, భువనగిరి మండలం వీరవెల్లి, చందుపట్ల, బండసోమారం, హుస్నాబాద్, మోత్కూర్ మండలం బుజిలాపురం, పనకబండ, రాగిబావి, దత్తప్పగూడెం, ముసిపట్ల, అనాజిపురం, దాచారం, రామన్నపేట, సిరిపురం, వెల్లంకి, జనంపల్లి, ఉత్తటూరు గ్రామాల్లో అత్యధికంగా వరి పంటలు ఎండిపోయాయి. -
భూగర్భ జలమట్టం వివరాలు ఇలా..
మండలం 2024 2025 అడ్డగూడూరు 4.45 4.98 చౌటుప్పల్ 5.86 6.18 భూదాన్ పోచంపల్లి 5.37 6.31 వలిగొండ 6.67 8.56 యాదగిరిగుట్ట 7.92 8.90 గుండాల 7.23 9.24 మోత్కూరు 9.30 10.27 రాజాపేట 8.41 10.44 మోటకొండూరు 9.57 11.36 తుర్కపల్లి 10.69 11.76 ఆలేరు 8.22 11.96 బీబీనగర్ 10.14 12.31 రామన్నపేట 9.92 12.36 భువనగిరి 8.31 12.61 బొమ్మలరామారం 11.15 14.06 ఆత్మకూరు(ఎం) 13.87 18.18 నారాయణపురం 13.25 23.09 మొత్తం 8.59 10.95 -
చిన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరించండి
భువనగిరిటౌన్ : రాజీపడదగిన కేసుల్లో సంబంధిత కక్షిదారులకు నోటీసులు ఇవ్వాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు ఆదేశించారు. ఈనెల 8న జరిగే జాతీయ లోక్అదాలత్ నేపథ్యంలో సోమవారం జిల్లాలోని న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసు అధికారులతో సమావేశమై పెండింగ్ కేసులపై సమీక్షించారు. చిన్నచిన్న కేసులను రాజీమార్గంలో పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కా ర్యదర్శి మాధవిలత, జిల్లా కోర్టు ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఉషశ్రీ, అదనపు సీని యర్ సివిల్ జడ్జి శ్యామ్సుందర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కవిత, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
శిక్షణతో బోధనపై పట్టు
భువనగిరి: నూతన ఉపాధ్యాయులు బోధనపై పట్టు పెంచుకునేందుకు శిక్షణ తరగతులు దోహపడుతాయని డీఈఓ సత్యనారాయణ పేర్కొన్నారు. డీఎస్సీ– 2024 ద్వారా గత అక్టోబర్లో నియామకమైన 133 మంది స్కూల్ సెకండరీ గ్రేడ్ (ఎస్జీటీ) టీచర్లకు భువనగిరిలోని శ్రీసాయికృప డిగ్రీ కళాశాలలో మార్చి 28నుంచి ఇస్తున్న వృత్తి శిక్షణ సోమవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి డీఈఓ హాజరై మాట్లాడారు. తరగతి గది నిర్వహణ, అభ్యసన ప్రక్రియలపై శిక్షణలో నేర్చుకున్న విషయాలను బోధనలో అమలు చేయాలని సూచించారు. విద్యార్థులు చదువులో సామర్థ్యాలను చాటేలా తీర్చిదిద్దాలని కోరారు. శిక్షణలో నేర్చుకున్న విషయాల గురించి డీఈఓ వారిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి జె.శ్రీనివాస్, రిసోర్స్పర్సన్లు యాదిరెడ్డి, వెంకటేశ్వర్లు, సంధ్య, లావణ్య, లత, శ్రీశైలం, వెంకన్న, రహీం, ఉదయ్ కుమార్, టెక్నికల్ పర్సన్ సునీల్ పాల్గొన్నారు. ఫ డీఈఓ సత్యనారాయణ -
పలకరించి.. సమస్యలు తెలుసుకొని..
రామన్నపేట : పల్లెబాట కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ హనుమంతరావు సోమవారం రామన్నపేట మండలం ఇస్కిళ్లలో పర్యటించారు. ఉదయం 5.30 గంటలకే గ్రామానికి చేరుకున్నారు. స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ గంగాధర్, డీపీఓ సునంద, డీఆర్డీఓ నాగిరెడ్డితో కలిసి సుమారు నాలుగు గంటలు గ్రామంలో పర్యటించారు. సంక్షేమ పథకాల అమలుపై నేరుగా ప్రజలతో మాట్లాడారు. రేషన్ కార్డులో పిల్లలు, కోడళ్ల పేర్లు లేవని, గ్యాస్ సబ్సిడీ రావడం లేదని, గ్యాస్ కనెక్షన్ లేదని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా పరిష్కరించాలని అక్కడికక్కడే అధికా రులను ఆదేశించారు. రైతుభరోసా రాలేదని ఒక రైతు తెలియజేయగా.. వ్యవసాయ అధికారి యాప్ లో పరిశీలించి ప్రాసెస్లో ఉందని తెలిపారు. ఉపాధి పథకం సిబ్బంది పనితీరు, వేతనాల చెల్లింపుపై ఆరా తీశారు. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాను పరిశీలించారు. బోధకాలతో బాధపడుతున్న వలీ మాబేగంకు పింఛన్ మంజూరు చేయాలని డీఆర్డీఓను ఆదేశించారు. సుమధుర పౌండేషన్వారు రూ.2 కోట్లతో నిర్మించిన పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి వసతులు, ల్యాబ్ను చూశారు. అలాగే బాలింతలు, గర్భిణులకు అందజేస్తున్న సేవలపై ఆరా తీశారు. నర్సరీని సందర్శించారు. గ్రామస్తుల విన్నపం మేరకు ప్రాథమికోన్నత పాఠశాల అప్గ్రేడ్కు అవసరమైన ప్రతి పాదనలు పంపించాలని ఎంఈఓను ఆదేశించారు. విద్యాసంస్థల సమయా నికి బస్సులు నడపాలని ఆర్ఎంను ఆదేశించారు. వీటితో పాటు మరికొన్ని ఆహామీలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లాల్బహదూర్, ఎంపీడీఓ యాకుబ్నాయక్, ఏఓ తదితరులు ఉన్నారు.పెద్దమ్మా.. పింఛన్ వస్తుందా గుండా పుష్పమ్మ ఇంటికి వెళ్లి పెద్దమ్మా.. పింఛన్ వస్తుందా అని కలెక్టర్ ఆప్యాయంగా పల కరించారు. కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీళ్లు వస్తున్నాయా, ఉచిత కరెంట్ బిల్లు కడుతున్నావా? గ్యాస్ సబ్సిడీ వస్తుందా అని అడిగారు. భగీరథ నీళ్లను వేడిచేసుకొని తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆమెకు సూచించారు. ఫ ఇస్కిళ్లలో కలెక్టర్ పల్లెబాట ఫ నాలుగు గంటలు గ్రామంలో పర్యటించి సమస్యలపై ఆరా.. -
మాడు పగిలే ఎండలు
భువనగిరిటౌన్ : జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. సోమవారం సంస్థాన్నారాయణపురం, బీబీనగర్, బొమ్మలరామారం మండలాల్లో 39 డిగ్రీలు, మరో నాలుగు మండలాల్లో 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణ కంటే నాలుగు డిగ్రీల వరకు అధికంగా నమోదవుతుండడం, ఎండవేడిమికి ఉక్కపోత తోడవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే మూడు రోజులు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో జిల్లాను ఎల్లో జోన్గా వాతావరణ శాఖ ప్రకటించింది. బయటకు బయటికెళ్లేటప్పుడు నీళ్లు, చల్లని ద్రవపదార్థాలు తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. సోమవారం ఇలా.. మండలం ఉష్ణోగ్రత నారాయణపురం 39.0బీబీనగర్ 39.0బి.రామారం 39.0మోటకొండూరు 38.4చౌటుప్పుల్ 38.3రాజాపేట 38.1ఆత్మకూరు 38.1ఆలేరు 37.9భువనగిరి 37.0మోత్కూరు 37.0రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఫ మూడు మండలాల్లో 39 డిగ్రీలు నమోదు ఫ జిల్లాను ఎల్లో జోన్గా ప్రకటించిన వాతావరణ శాఖ -
ఓడినా విద్య ప్రైవేటీకరణ కాకుండా పోరాటం
ఫ అలుగుబెల్లి నర్సిరెడ్డి నల్లగొండ: ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను ఉపాధ్యాయులు రెండోసారి వద్దనుకున్నారు.. కాబట్టి ఓడిపోయాను.. అయినా విద్య ప్రైవేటీకరణ కాకుండా పోరాటం చేస్తాను’ అని టీఎస్ యూటీఎఫ్ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి పేర్కొన్నారు. హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేషన్ తర్వాత కౌంటింగ్ సెంటర్ నుంచి ఆయన బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. ఓటమి అనేది సహజమని గతంలో తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులు ఇప్పుడు శ్రీపాల్రెడ్డికి ఇచ్చారని చెప్పారు. మరోసారి తనకు ఓట్లు వేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో విద్య, వైద్యం వ్యాపారీకరణ కావద్దన్న డిమాండ్తో పోరాటం చేస్తానన్నారు. తాను గెలుస్తాననే నమ్మకం ఉన్నప్పటికీ ఓటర్లు శ్రీపాల్రెడ్డికి అవకాశం ఇచ్చారని దీనిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. -
నృసింహుడికి అలంకార వైభవం
ఉదయం మత్స్యరూపుడై, సాయంత్రం స్వర్ణ శేషవాహనంపై దివ్యదర్శనం యాదగిరిగుట్ట : యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచనారసింహుడి అలంకార, వాహనా సేవలకు అర్చకులు సోమవారం శ్రీకారం చుట్టారు. ఉదయం స్వామివారు మత్య్సవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానాలయంలో నిత్యారాధనలు పూర్తయిన అనంతరం దక్షిణ ప్రాకార మండపంలోని నిత్యకల్యాణ మండపంలో స్వామివారిని అధిష్టింపజేసి పట్టువస్త్రాలు, బంగారు, వజ్రాభరణాలు, వివిధ రకాల పుష్పాలతో ముగ్ధమనోహరంగా అలంకరించారు. అనంతరం వేదపండితులు, రుత్వికులు, పారాయణీకుల వేదమంత్రోచ్ఛరణతో మంగళవాయిద్యాలు మోగుతుండగా, భక్తజనులు గోవిందనామస్మరణ చేస్తుండగా తిరు, మాడ వీధుల్లో అలంకార సేవను ఊరేగించారు. ఆలయంలో సాయంత్రం సాయంత్రం శ్రీస్వామివారిని స్వర్ణ శేష వాహనంపై ఊరేగించారు. ఈ వేడుకల్లో ఈఓ భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటచార్యులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీస్వామివారిని వటపత్రశాయిగా అలంకరిస్తారు. సాయంత్రం హంసవాహన సేవపై ఊరేగిస్తారు. -
అభ్యర్థులకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లు ఇవీ..
రెండో ‘సారి’ అంతే..● ఒకసారి గెలిపించిన వారిని తిరిగి గెలిపించని ఓటర్లు ● విలక్షణ తీర్పు ఇస్తున్న ఉపాధ్యాయులు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఒకసారి గెలిచిన అభ్యర్థి మరోసారి ఇక్కడ గెలిచిన దాఖలాలు లేవు. అంతేకాదు గత నాలుగు పర్యాయాయలుగా ఒకసారి గెలిచిన అభ్యర్థిని/సంఘాన్ని వరుసగా రెండోసారి ఉపాధ్యాయులు గెలిపించడం లేదు. 2007 నుంచి నలుగురుదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో శాసనమండలిని పునరుద్ధరించారు. అప్పుడు మొదటిసారి నిర్వహించిన వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావేత్త చుక్కా రామయ్య యూటీఎఫ్ తరఫున విజయం సాధించారు. ఆ తర్వాత 2013లో రెండోసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు పీఆర్టీయూ–టీఎస్ తరఫున పోటీ చేసిన పూల రవీందర్ గెలుపొందారు. 2019లో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలిచారు. ప్రస్తుతం నాలుగోసారి నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్ సోమవారం జరిగింది. ఈ ఎన్నికల్లో పీఆర్టీయూ–టీఎస్ బలపరిచిన అభ్యర్థి పింగిలి శ్రీపాల్రెడ్డి విజయం సాధించారు. ఇలా నాలుగుసార్లు వేర్వేరు అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు. ఉపాధ్యాయులకు ఓటేయడం తెలియలే ! ● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 494 చెల్లని ఓట్లు నల్లగొండ: కొంతమంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఓటు వేయడం తెలియలేదు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గత నెల 27న జరిగింది. బ్యాలెట్ పద్ధతిన నిర్వహించిన ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమం ప్రకారం ఓటు వేయాల్సి ఉంటుంది. 19 మంది పోటీలో ఉంటే 19 మందికి కూడా ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయవచ్చు. కానీ ఈ ఎన్నికల్లో కొందరు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఓటు వేయడం తెలియక వారు వేసిన ఓట్లు చెల్లలేదు. మొత్తం 24,135 ఓట్లు పోలైతే 494 మంది ఓట్లు చెల్లకపోవడం గమనార్హం. విద్యార్థులకు విద్యాబోధన చేసి ప్రయోజకులను చేయాల్సిన ఉపాధ్యాయులు.. వారి సమస్యల పరిష్కారం ఎమ్మెల్సీకి వేసే ఓటు ఏవిధంగా వేయాలో కూడా తెలియకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. బ్యాలెట్ బాక్సుల్లో కవిత్వంనల్లగొండ: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా పలు చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. కొందరు బ్యాలెట్ పేపర్పై కవితలు రాయగా.. మరి కొందరు ఓటు వేసి పేపర్ మొత్తాన్ని కోట్టేశారు. బ్యాలెట్ పేపర్తోపాటు కవిత్వాన్ని కూడా బాక్సులో వేశారు. మరికొందరైతే అభ్యర్థుల ఫొటోలకు రౌండ్లు పెట్టారు. ఇలా బ్యాలెట్ బాక్సులో చిత్ర విచిత్రాలు వెలుగు చూశాయి. ‘ఏక్’ నిరంజన్! ● ఆ అభ్యర్థికి కేవలం ఒక్కటే ఓటు పడిందినల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ అభ్యర్థి ఒక్కటే ఓటు సాధించాడు. ఈ ఎన్నికల్లో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో ముగ్గురు సింగిల్ డిజిట్ ఓట్లకే పరిమితం కాగా.. మరో ఆరుగురు డబుల్ డిజిట్లతో సరిపెట్టుకున్నారు. ఆ సింగిల్ డిజిట్ ఓట్లలో ఒక అభ్యర్థికి ఒకే ఒక్క ఓటు వచ్చింది. నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థిని పది మంది ఉపాధ్యాయులు బలపరచాలి. అయితే, బలపర్చిన వారు సైతం ఆ అభ్యర్థికి ఓటు వేయకపోవడం గమనార్హం.పీఆర్టీయూలో శ్రీపాల్రెడ్డి ప్రస్థానం ఇదీ..విద్యారణ్యపురి(వరంగల్) : ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా విజయం సాధించిన పింగిలి శ్రీపాల్రెడ్డిది ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా గూడూరు గ్రామం. శ్రీపాల్రెడ్డి 1996లో ఎస్జీటీగా నెక్కొండ మండలం గొల్లిపెల్లి యూపీఎస్లో పనిచేశారు. 2003 సంవత్సరంలో స్కూల్అసిస్టెంట్ (మ్యాథ్స్)గా నెక్కొండ మండలం అప్పల్రావుపేటలో యూపీఎస్లో చేరారు. ప్రస్తుతం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట జెడ్పీహెచ్ఎస్లో పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పీఆర్టీయూలో సభ్యుడిగా చేరిన పింగిలి శ్రీపాల్రెడ్డి 2000 సంవత్సరంలో నెక్కొండ మండల జనరల్ సెక్రటరీగా ఆ తరువాత 2002లో నెక్కొండ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2008 నుంచి 2012వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీగా, 2015లో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2016, 2017లో వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2019లో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎన్నికయ్యాక ఇప్పటివరకు కొనసాగుతున్నారు. తొమ్మిది సంవత్సరాల సర్వీస్ ఉండగానే.. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో శ్రీపాల్రెడ్డి కొంతకాలం క్రితమే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికల బరిలో ఉండేందుకు పావులు కదిపారు. తొమ్మిది సంవత్సరాల సర్వీస్ను వదులుకొని చివరికి పీఆర్టీయూ మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచి ఉత్కంఠ పోరులో విజయం సాధించారు. ఆరేళ్ల తరువాత మళ్లీ పీఆర్టీయూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుంది. పేరు ఓట్లు పులి సరోత్తంరెడ్డి 2,289 లింగిడి వెంకటేశ్వర్లు 15 అర్వ స్వాతి 19 అలుగుబెల్లి నర్సిరెడ్డి 4,820 కంటె సాయన్న 4 కొలిపాక వెంకటస్వామి 421 గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి 4,437 గోపాల్రెడ్డి పన్నాల 24 చంద్రమోహన్ ఏలె 100 చాలిక చంద్రశేఖర్ 1 జంగిటి కై లాసం 26 జె.శంకర్ 113 పురుషోత్తంరెడ్డి తలకోల 11 తాటికొండ వెంకటరాజయ్య 36 దామెర బాబురావు 128 శ్రీపాల్రెడ్డి పింగిలి 6,035 పూల రవీందర్ 3,115 బంకరాజు 7 ఎస్.సుందర్రాజు 2,040 -
బైక్ను ఢీకొట్టిన కారు.. యువకుడు మృతి
● అతడి భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలుమంచాల, మర్రిగూడ: నాగార్జునసాగర్– హైదరాబాద్ రహదారిపై రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగాపల్లి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామానికి చెందిన మైలారం జంగయ్య(27) మృతిచెందాడు. అతడి భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగయ్య కుటుంబంతో కలిసి హైదరాబాద్లో నివాసముంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జంగయ్యకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వ్యక్తిగత పని నిమిత్తం భార్య పార్వతమ్మ, కుమార్తె అశ్వితతో కలిసి స్వగ్రామం యరగండ్లపల్లికి వచ్చిన జంగయ్య సోమవారం తిరిగి బైక్పై హైదరాబాద్ వెళ్తుండగా.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగాపల్లి సమీపంలోని జేబీ వెంచర్ వద్ద వీరి బైక్ను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జంగయ్య అక్కడికక్కడే మృతిచెందగా.. పార్వతమ్మ, అశ్వితకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. జంగయ్య మృతితో యరగండ్లపల్లి విషాదఛాయలు అలుముకున్నాయి. అనారోగ్యంతో వ్యక్తి బలవన్మరణంఆత్మకూరు(ఎం): అనారోగ్యంతో బాధపడుతూ గడ్డి మందు తాగిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ సంఘటన ఆత్మకూరు(ఎం) మండలంలోని కొరటికల్ గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొరటికల్ గ్రామానికి చెందిన పల్ల్లపు విజయేందర్(38) గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఏడాది నుంచి విజయేందర్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇంట్లోనే గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య సౌందర్య, కుమారుడు రాకేష్, కుమార్తె శృతి ఉన్నారు. -
వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
భువనగిరి: బంధువుల ఇంట్లో పండుగకు వచ్చిన వ్యక్తి తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన ఒంటెద్దు అచ్చయ్య ఈ నెల 1వ తేదీన భువనగిరి మండలం నందనం గ్రామంలో తమ బంధువులు బాలమ్మ పండుగ చేస్తే వచ్చాడు. మరుసటి రోజు ఉదయం తిరిగి స్వగ్రామానికి బయల్దేరిన అచ్చయ్యను భువనగిరికి వెళ్లే ఆటోలో బంధువులు ఎక్కించారు. కానీ అచ్చయ్య ఇంటికి చేరుకోలేదు. అచ్చయ్య కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. అచ్చయ్య గోధుమ రంగు షర్ట్, ప్యాంట్ ధరించాడని, అతడికి మతిస్థిమితం సరిగ్గా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అచ్చయ్య కుమార్తె అఖిల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంతోష్కుమార్ తెలిపారు -
హాలియాలో దొంగల బీభత్సం
హాలియా: హాలియా పట్టణంలోని వీరయ్యనగర్ కాలనీలో సోమవారం దొంగలు బీభత్సం సృష్టించారు. మూడు ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరయ్యనగర్ కాలనీలో నివాసముంటున్న రిటైర్డ్ వెటర్నరీ ఉద్యోగి తుమ్మరుగొట్టి రామలింగయ్య, అతడి భార్య కళావతి ఇంటికి తాళం వేసి సోమవారం ఉదయం నల్లగొండకు వెళ్లారు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న 4.75 తులాల బంగారు గొలుసు, బంగారు ఉంగరాలు అపహరించారు. అదే ఇంటిపైన నివాసముంటున్న శాగం వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఇంట్లోకి కూడా చొరబడి బీరువాలో దాచిన 15తులాల వెండి పట్టా గొలుసులు, రూ.10వేల నగదు ఎత్తుకెళ్లారు. అదే ఇంటి పక్కన నివాసముంటున్న అలుగుబెల్లి ఇంద్రారెడ్డి ఇంట్లోనూ చోరీకి యత్నించి విఫలమయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సతీష్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్ టీంను పిలిపించి వేలిముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్రెడ్డి తెలిపారు. మూడు ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారం, నగదు చోరీ -
వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య
మోత్కూరు: ప్రేమించిన యువకుడి వేధింపులు తాళలేక బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మోత్కూరు మండల కేంద్రంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని విజయవాడకు చెందిన బాలిక ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతోంది. ఆమెకు సోషల్ మీడియా ద్వారా మోత్కూరుకు చెందిన కందుకూరి మున్నాతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. డిసెంబర్ 30వ తేదీన సదరు బాలిక కాలేజీకి వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి మోత్కూరుకు చేరుకుంది. అప్పటి నుంచి ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఆ బాలిక, మున్నా సహజీవనం చేస్తున్నారు. బాలిక ఫోన్లో తన తల్లితో అప్పుడప్పుడు మాట్లాడుతూ తాను బాగానే ఉన్నానని, తాను మున్నా అనే యువకుడిని ప్రేమిస్తున్నానని, అతడిని వివాహం చేసుకునేందుకు వచ్చానని తెలియజేసేది. కానీ తాను ఉంటున్న చిరునామాను మాత్రం తల్లిదండ్రులకు వెల్లడించలేదు. ఆదివారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో సదరు బాలిక తన తల్లికి వీడియో కాల్ చేసి రూ.15వేలు కావాలని ఏడుస్తూ అడిగింది. ఎందుకమ్మా అని కూతురుని తల్లి ప్రశ్నించగా.. ‘మీ అమ్మ దగ్గర డబ్బులు తీసుకురావాలని మున్నా తనను కొట్టాడని తల్లికి వివరించింది’. ఈ క్రమంలో అదే రోజు రాత్రి 8గంటల సమయంలో తాము అద్దెకు ఉంటున్న ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని బాలిక ఆత్మహత్య చేసుకుంది. తనను మున్నా వేధిస్తున్న విషయాలన్నీ బాలిక సూసైడ్ నోట్లో పేర్కొంది. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి. నాగరాజు తెలిపారు. మున్నా అనే యువకుడు తన కుమార్తెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని, ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బుల కోసం తీవ్రంగా కొట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు చౌటుప్పల్: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి లింగోజిగూడెం గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం బోయగుబ్బ గ్రామానికి చెందిన చీకూరు అనిల్కుమార్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భద్రాచలం నుంచి పేపర్ లోడ్తో హైదరాబాద్కు బయల్దేరాడు. మార్గమధ్యలో ఆదివారం అర్ధరాత్రి చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామ శివారులో గల వంశీ రబ్బర్ కంపెనీ వద్ద హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనిల్కుమార్ను చికిత్స నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బైక్ను కారు ఢీకొట్టడంతో.. చివ్వెంల(సూర్యాపేట): అతివేగంగా వస్తున్న కారు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టడంతో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెంకు బైక్పై వెళ్తున్న వ్యక్తిని అదే మార్గంలో ఖమ్మం పట్టణానికి వెళ్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. బాధితుడి వివరాలు తెలియాల్సి ఉంది. అతివేగమే ప్రమదానికి కారణమని తెలుస్తోంది. రైలు కింద పడి వ్యక్తి మృతిబీబీనగర్: బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. భువనగిరి రైల్వే హెడ్కానిస్టేబుల్ కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ రైల్వే స్టేషన్ నుంచి పగిడిపల్లి వెళ్లే రైల్వే మార్గంలో సోమవారం తెల్లవారుజామున రైలు కింద పడి సుమారు 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. మృతుడు నలుపు రంగు టీషర్టు, తెలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని రైల్వే హెడ్కానిస్టేబుల్ పేర్కొన్నారు. మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9848222169, 8712568454 నంబర్లను సంప్రదించాల ని సూచించారు. -
ఆకట్టుకుంటున్న సాంస్కృతిక ప్రదర్శనలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. సోమవారం భజన కార్యక్రమాలు, పోతన భాగవత అంతర్గత రహస్యాలు, నవ విధ భక్తి తత్త్వంపై ఉపన్యాసం, పాల రామాంజనేయ హరికథ, శాసీ్త్రయ సంగీతం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు అలరించాయి. సాయంత్రం గరికపాటి నరసింహరావు శ్రీనృసింహ వైభవం గురించి ప్రవచించారు. కొండ కింద గల దీక్షపరుల మండపంలో భక్తులకు ఉచిత అన్నదానం చేశారు. ఆలయ సన్నిధిలో మేడ్చల్–మలా్క్జ్గిరి జిల్లా ఘట్కేసర్లోని నీలిమ ఆస్పత్రి ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత వైద్య శిబిరం కొనసాగుతోంది. -
అనుమానంతో భార్యను కొట్టిన భర్త
● ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతితిప్పర్తి: భార్యపై అనుమానంతో భర్త ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన తిప్పర్తి మండలం సర్వా రం గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. సర్వారం గ్రామానికి చెందిన బండారి మహేశ్వరీ(23) కేతేపల్లి మండలం బండకిందిగూడెం గ్రామానికి చెందిన బండారి శ్రీకాంత్ను ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం నుంచి మహేశ్వరీపై అనుమానం పెంచుకున్న శ్రీకాంత్ ఆమెను వేధింపులకు గురిచేస్తున్నాడు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి సర్దిచెప్పడంతో ఏడాది క్రితం వారి కాపురాన్ని సర్వారం గ్రామానికి మార్చారు. అయినప్పటికీ శ్రీకాంత్లో ఎలాంటి మార్పురాలేదు. శనివారం శ్రీకాంత్ మహేశ్వరీతో గొడవపడి ఆమె తీవ్రంగా కొట్టాడు. ఇరుగుపొరుగు వారు గమనించి ఆమెను చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు నల్లగొండలోనే ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. మృతురాలి తల్లి మైనం లింగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్యచింతపల్లి: ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చింతపల్లి మండల పరిధిలోని మాల్ వెంకటేశ్వర్నగర్లో సోమవారం జరిగింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడెం మండలం అజ్మాపురం గ్రామానికి చెందిన బాణాల స్వాతి(38) కుటుంబంతో కలిసి చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వర్నగర్లో నివాసం ఉంటోంది. గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్వాతి ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి మాల్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి గాయాలు ఆత్మకూర్(ఎస్): తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్లపహాడ్ గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు బత్తుల రమేష్ రోజుమాదిరిగా సోమవారం సాయంత్రం గ్రామ పరిధిలో తాటిచెట్టు ఎక్కుతుండగా మోకు జారి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. రమేష్ను గీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మడ్డి అంజిబాబు తదితరులు ఆస్పత్రిలో పరామర్శించారు. -
శ్రీపాల్కే గురువుల పట్టం
వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పింగిలి శ్రీపాల్రెడ్డి గెలుపు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ–టీఎస్ బలపరిచిన అభ్యర్థి పింగిలి శ్రీపాల్రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో శ్రీపాల్రెడ్డి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో శ్రీపాల్రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,448 ఓట్లు వచ్చాయి. అయితే నర్సిరెడ్డి ఎలిమినేట్ కాకముందు గెలుపు కోటా ఓట్లు శ్రీపాల్రెడ్డికి కూడా లేకపోవడంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో.. శ్రీపాల్రెడ్డికి వచ్చిన 2,870 రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపారు. దీంతో శ్రీపాల్రెడ్డి 13,969 ఓట్లు సాధించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నల్లగొండలోని ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో సోమవారం నిర్వహించారు. ఉదయం 7 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బండిల్స్ కట్టడం ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. ఆ తరువాత ఓట్ల లెక్కింపు చేపట్టారు. సాయంత్రం 3 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీంతో అధికారులు మొత్తం చెల్లిన ఓట్లలో సగానికి మించి ఒక్క ఓటును గెలుపు కోటా ఓటుగా నిర్ణయించారు. మొత్తం 24,135 ఓట్లు పోల్ కాగా 494 ఓట్లు చెల్లలేదు. 23,641 ఓట్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. దీంతో గెలుపు కోటాను 11,821గా నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్రెడ్డి అత్యధికంగా 6,035 ఓట్లు వచ్చాయి. గెలుపు కోటాకు సరిపడా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించారు. చివరకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లతోనే శ్రీపాల్రెడ్డి విజయం సాధించారు. రౌండ్ రౌండ్కు ఉత్కంఠే.. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో చివరి వరకు ఉత్కంఠ నెలకొంది. 15వ రౌండ్ నుంచి ఉత్కంఠ మరింతగా పెరిగింది. శ్రీపాల్రెడ్డి ఆధిక్యంలో ఉన్నా ద్వితీయ స్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డికి చేరువలో గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి రాగలిగినా సుందర్రాజు ఎలిమినేషన్తో ఇద్దరి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఆ తరువాత పులి సరోత్తంరెడ్డి, పూల రవీందర్, గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డిని ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కించారు. అప్పటికి కూడా గెలుపు కోటా రాకపోవడంతో చివరకు అలుగుబెల్లి నర్సిరెడ్డిని కూడా ఎలిమినేషన్ చేసి ఓట్లు లెక్కించారు. ఆ తర్వాత కోటా రాకున్నా శ్రీపాల్రెడ్డిని గెలిచినట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎలిమినేషన్లో ఓట్లు పెరిగాయి ఇలా... మొదటి ప్రాధాన్యతలో ప్రధాన అభ్యర్థులైన పింగలి శ్రీపాల్రెడ్డికి 6,035 ఓట్లు రాగా, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డికి 4,437 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత పూల రవీందర్కు 3,115, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డికి 2,289 , సుందర్రాజుకు 2,040 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఇలా 14వ రౌండ్ వరకు ఎలిమినేషన్ చేస్తూ ఓట్ల లెక్కింపు చేయగా శ్రీపాల్రెడ్డికి అప్పటి వరకు 6,165 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 4,946 ఓట్లు వచ్చాయి. హర్షవర్ధన్రెడ్డికి 4,596 ఓట్లు, పూల రవీందర్కు 3,249 ఓట్లు వచ్చాయి. అంటే.. 14వ రౌండ్వరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థుల నుంచి మరో 130 రెండో ప్రాధాన్యత ఓట్లు శ్రీపాల్రెడ్డికి లభించాయి. ఈ రౌండ్ తరువాత సుందర్రాజును ఎలిమినేట్ చేసి ఓట్లు లెక్కింపు చేపట్టారు. ● 15వ రౌండ్లో శ్రీపాల్రెడ్డికి కూడా ఒక్కసారే 781 ఓట్లు పెరిగాయి. దీంతో ఆయన ఓట్లు 6,916కి చేరుకున్నాయి. రెండోస్థానంలో ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి కూడా 5,205 ఓట్లకు చేరుకున్నారు. హర్షవర్ధన్రెడ్డి 4,799 ఓట్లకు చేరుకోగా, పూల రవీందర్ 3,617 ఓట్లకు, సరోత్తంరెడ్డి 2,645 ఓట్లకు చేరుకున్నారు. ఈ రౌండ్లో అయిదుగురికి ఓట్లు పెరిగినప్పటికీ శ్రీపాల్రెడ్డి ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. ఆయన దరిదాపుల్లో మిగతా అభ్యర్థులు ఎవరూ లేరు. ● పులి సరోత్తంరెడ్డి ఎలిమినేషన్ తరువాత చేపట్టిన 16వ రౌండ్లోనూ శ్రీపాల్రెడ్డికి అదే స్థాయిలో ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్లో 757 ఓట్లు పెరిగాయి. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి, 5,660 ఓట్లకు చేరుకోగా, హర్షవర్ధన్రెడ్డి 5,309 ఓట్లకు, పూల రవీందర్రెడ్డి 3,992 ఓట్లకు చేరుకున్నారు. ● పూల రవీందర్ ఎలిమినేషన్ తరువాత 17వ రౌండ్లో శ్రీపాల్రెడ్డికి 1348 ఓట్లు పెరిగి, 9021 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 6,448 ఓట్లకి చేరుకోగా, మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్రెడ్డి 6,034 ఓట్లకు చేరుకున్నారు. . ● హర్షవర్ధన్రెడ్డి ఎలిమినేషన్ తరువాత 18వ రౌండ్లో శ్రీపాల్రెడ్డికి 2,078 ఓట్లు పెరిగి, 11,099 ఓట్లకు చేరుకున్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న నర్సిరెడ్డి 8,448 ఓట్లకు చేరుకున్నారు. బరిలో శ్రీపాల్రెడ్డి, నర్సిరెడ్డి మాత్రమే మిగిలారు. దీంతో నర్సిరెడ్డిని ఎలిమినేట్ చేసి ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో శ్రీపాల్ రెడ్డికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఇందులో వచ్చిన 2,870 ఓట్లు కలుపుకొని శ్రీపాల్రెడ్డి 13,969 ఓట్లు సాధించి గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు. ఫ రెండో ప్రాధాన్యత ఓట్లతో తేలిన ఫలితం ఫ సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీ ఫ ప్రధాన అభ్యర్థుల ఎలిమినేషన్ సమయంలో పెరిగిన ఉత్కంఠ కౌంటింగ్ సాగింది ఇలా..నల్లగొండ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రకియ నల్లగొండలోని ఆర్జాలబావి గోదాముల్లో సోమవారం పూర్తయింది. ఉదయం 7 గంటలకు పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేసి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాల్కు తీసుకొచ్చారు. స్ట్రాంగ్ రూమ్ల నుంచి 25 చొప్పున బ్యాలెట్ బాక్సులను 8 రౌండ్లలో కౌంటింగ్ హాల్కు తీసుకొచ్చారు. 25 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహించారు. కౌంటింగ్ హాల్లో బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి 25 బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టారు. ఈ ప్రక్రియ ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. ఆ తర్వాత కట్టలన్నింటినీ డ్రమ్ములో వేసి కలిపారు. ఉదయం 11.30 గంటలకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై.. సాయంత్రం 3 గంటలకు పూర్తయింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ కూడా గెలుపు కోటా రాలేదు. శ్రీపాల్రెడ్డి అధిక ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలువగా అలుగుబెల్లి నర్సిరెడ్డి రెండవస్థానంలో, హర్షవర్ధన్రెడ్డి మూడవ స్థానంలో నిలిచారు. సాయంత్రం 4 గంటలకు ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టారు. రాత్రి 9 గంటలకు 17వ రౌండ్ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. శ్రీపాల్రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, హర్షవర్ధన్రెడ్డి మిగిలారు. హర్షవర్ధన్రెడ్డిని ఎలిమినేషన్ చేసి 18వ రౌండ్ ఓట్లు లెక్కించారు. ఆ తర్వాత ఓటమిని అంగీకరిస్తూ అలుగుబెల్లి నర్సిరెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. శ్రీపాల్రెడ్డి విజయ సంకేతం చూపించి మీడియా పాయింట్కు వచ్చారు. శ్రీపాల్రెడ్డి విజయం సాధించినట్లు రిట ర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి ప్రకటించారు. -
దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా..
నకిరేకల్: దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు, యువతి మృతిచెందారు. ఈ ఘటన నకిరేకల్ పట్టణ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి బైపాస్ ఫ్లైఓవర్ సమీపంలో సోమవారం తెల్ల వారుజామున జరిగింది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం తుమ్మల పెన్పహాడ్ గ్రామానికి నల్గొండ ప్రభు(27) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రభుకు వివాహం కాగా.. భార్యాభర్తల మధ్య తగాదాలతో విడిపోయారు. తుమ్మల పెన్పహాడ్ గ్రామానికే చెందిన పూలుగుజ్జు నరేష్ సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన వైష్ణవి(25)ని ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. నరేష్, వైష్ణవిల మధ్య కూడా మనస్పర్ధలు రావడంతో గత రెండేళ్ల నుంచి వైష్ణవి తన తల్లిగారి ఊరైన టేకుమట్లలో పిల్లలతో కలిసి ఉంటుంది. చెర్వుగట్టుకు వెళ్లి వస్తూ.. వైష్ణవితో ఉన్న పరిచయం మేరకు టేకుమట్ల నుంచి ఆమెను తీసుకుని ప్రభు ఆదివారం రాత్రి నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు దేవాలయానికి వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున వారు చెర్వుగట్టు నుంచి బైక్పై తిరుగు ప్రయాణమయ్యారు. వయా నల్ల గొండ, తాటికల్ మీదుగా నకిరేకల్కు చేరుకున్నారు. అనంతరం వీరు నకిరేకల్ పట్టణ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి బైపాస్ మీదకు రాంగ్ రూట్లో ఎక్కి సూర్యాపేట వైపు కొద్దిదూరం వెళ్లగానే ఎదురుగా గుర్తుతెలియని వాహనం వీరి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రభు, వైష్ణవికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడు ప్రభు సోదరుడు ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానం వచ్చి పోస్టుమార్టం.. నకిరేకల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ లచ్చిరెడ్డి ఆస్పత్రి వద్దకు చేరకుని మృతదేహాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై అనుమానంతో నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో ఫోన్సిక్ నిపుణులచే పోస్టుమార్టం చేయించాలని డాక్టర్లు తెలిపారు. దీంతో ప్రభు, వైష్ణవి మృతదేహాలను నల్లగొండ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. పోస్టుమార్టం రిపోర్టులో రోడ్డు ప్రమాదంలో చనిపోయారని నిర్ధారణ కావడంతో పోలీసులు వారిద్దరి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు, యువతి దుర్మరణం నకిరేకల్ పట్టణ శివారులో భైక్ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం -
మొదటి ప్రాధాన్యతలో తేలని ఫలితం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థి కూడా గెలుపు కోటా సాధించలేకపోయారు. 25,797 ఓట్లకుగాను 24,135 ఓట్లు పోలయ్యాయి. అందులో 494 ఓట్లు చెల్లలేదు. 23,641 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. అందులో సగానికంటే ఒక ఓటు ఎక్కువగా పరిగణనలోకి తీసుకొని 11,821 ఓట్లను గెలుపు కోటా ఓటుగా నిర్ణయించారు. పోటీలో ఉన్న19 అభ్యర్థుల్లో ఎవరూ మొదటి ప్రాధాన్యతలో గెలుపు కోటా ఓట్లను సాధించలేకపోయారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ప్రధాన అభ్యర్థులైన పింగిళి శ్రీపాల్రెడ్డికి 6,035 ఓట్లు రాగా, అలుగుబెల్లి నర్సిరెడ్డికి 4,820 ఓట్లు, గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డికి 4,437 ఓట్లు రాగా, బీసీ సంఘాలు, ఎస్టీయూ బలపరిచిన పూల రవీందర్కు 3,115 ఓట్లు, టీపీయూఎస్ బలపరిచిన బీజేపీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డికి 2,289 ఓట్లు, ప్రైవేట్ విద్యా సంస్థల యజమాని ఎస్.సుందర్రాజు 2,040 ఓట్లు లభించాయి. మిగిలిన అభ్యర్థులకు ఒక్క ఓటు మొదలుకొని వేయిలోపే ఓట్లు రావడం గమనార్హం. మధ్యాహ్నం తరువాత ఎలిమినేషన్ ప్రక్రియ మొదటి ప్రాధాన్యతలో ఎవరికి గెలుపు కోటా ఓట్లు రాకపోవడంతో సోమవారం మధ్యాహ్నం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. 3.30 గంటల సమయంలో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. 19 మందిలో అతి తక్కువగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేసి ఆ అభ్యర్థికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. రాత్రి 7 గంటల వరకు 14 మంది ఎలిమినేషన్ తరువాత 15వ రౌండ్ ఫలితాలను అధికారులు ప్రకటించారు. అప్పటి వరకు ఎవరికీ కోటా ఓట్లు రాలేదు. దీంతో ఎలిమినేషన్ ప్రక్రియతో కౌంటింగ్ కొనసాగించారు. ఇలా రాత్రి 11 గంటల వరకు కౌంటింగ్ కొనసాగింది. చివరకు పీఆర్టీయూటీ–టీఎస్ బలపరచిన అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి విజయం సాధించారు. శ్రీపాల్రెడ్డి తన సమీప ప్రత్యర్థి నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గెలుపు కోటాగా 11,821 ఓట్లు మధ్యాహ్నం తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు 5,521 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన శ్రీపాల్రెడ్డి -
యాదాద్రి భువనగిరి
ఇఫ్తార్ 6–29 (మంగళవారం సాశ్రీశ్రీ) సహర్ 5–10 (బుధవారం ఉశ్రీశ్రీ)7అక్రమాల కట్టడికి ‘జన్మన్రే’గా ఉపాధిహామీ పథకంలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం జన్మరేగా యాప్ను తీసుకువచ్చింది. - 9లోమంగళవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2025ఆకట్టుకుంటున్న ప్రదర్శనలు యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.- 8లో -
యాదగిరిగుట్ట పాలిటెక్నిక్ కాలేజీలో నేడు టెక్ ఫెస్ట్
యాదగిరిగుట్ట : 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి నల్లగొండ జిల్లా పాలిటెక్నిక్ కళాశాలల సృజన టెక్ ఫెస్ట్కు యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ వేదిక కానుంది. మంగళవారం ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించే టెక్ ఫెస్ట్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగం విద్యార్థులు స్టాల్స్ ఏర్పాటు చేసి ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నారు.ఉత్తమ ప్రాజెక్టును ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ టెక్ ఫెస్ట్ నిర్వహిస్తుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గుట్ట పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు కోరారు. సాగునీటిపై సమీక్ష భువనగిరిటౌన్ : రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారి సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సాగునీటి సరఫరా, నీటిపారుదల శాఖ పని తీరుపై సమీక్షించారు. పంటలకు రానున్న పది రోజులు కీలకమని, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. నల్ల గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు చోట్ల సాగునీటి సమస్య ఉందని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పొలాలు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కాలువలకు విడుదల చేసి నీటిని చివరి ఆయకట్టుకు అందేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ హనుమంతరావు, విద్యుత్, వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆర్చరీలో సత్తాచాటిన సర్వేల్ గురుకులం విద్యార్థి సంస్థాన్ నారాయణపురం : సంగారెడ్డి జిల్లా కొల్లూరులో ఈనెల 2వ తేదీన నిర్వహించిన బాలబాలికల రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో సంస్థాన్నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల పాఠశాల తన్వీత్ప్రేమ్చంద్ ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. అండర్–15 విభాగంలో తృతీయ స్థానంలో నిలిచాడు. తన్వీత్ప్రేమ్చంద్ తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. అతన్ని ప్రిన్సిపాల్ సతీష్కుమార్, పీడీ రామకృష్ణ, ఉపాధ్యాయులు అభినందించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణం నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూని వర్సిటీలోని అంతర్జాతీయ ప్రమాదాలతో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తామని వీసీ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ పేర్కొన్నారు. సోమవారం ఎంజీయూలో 2,160 చదరపు మీటర్ల ఇండోర్ స్టేడియం ఫ్లోరింగ్, 400 మీటర్ల ఎనిమిది లేన్ల ట్రాక్ను సింథటిక్ ట్రాక్గా మార్చేందుకు ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వాలీబాల్, షటిల్, బాస్కెట్ బాల్, కబడ్డీ వంటి క్రీడల్లో విద్యార్థులకు అధునాతన సింథటిక్ ట్రాక్ మై దానంపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈపీఐ ప్రతినిధి నారాయణనాయక్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం వరకు క్రీడాప్రాంగణాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ అల్వాల రవి, డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ హరీష్కుమార్, ప్రొఫెసర్ ఆకుల రవి, స్పెషల్ ఆఫీసర్ సోమలింగం తదితరులు పాల్గొన్నారు. ఆస్తిపన్ను వందశాతం వసూలు చేయాలి ఆత్మకూరు(ఎం): గడువు లోపు వందశాతం ఆస్తిపన్ను వసూలు చేయాలని డీపీఓ ఆర్.సునంద అధికారులకు సూచించారు. ఆత్మకూర్(ఎం) గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సో మవారం ఆమె తనిఖీ చేసి రికార్డులను పరి శీలించారు. పన్నుల వసూళ్లలో వేగం పెంచా లని గడువులోపు లక్ష్యాన్ని చేరుకోవాలని సూ చించారు. వేసవిలో మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. -
ఇంద్రియాలలో మద్యపాన నిషేధం
భూదాన్పోచంపల్లి : గ్రామంలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతుండడంతో ఊరి జనమంతా ఒక్కటయ్యారు. గ్రామంలో బెల్టుషాపులను నిషేధిస్తూ ఆదివారం ఏకగీవ్ర తీర్మానం చేశారు. బెల్ట్ దుకాణాలు ఉండకూడదని సామూహిక ప్రతిజ్ఞ చేశారు. మద్యం విక్రయిస్తే రూ.25 వేల జరిమానా, సమాచారం ఇచ్చిన వారికి రూ.5,000 బహుమతిగా అందజేస్తామని ప్రకటించారు. ఈ సందర్బంగా మాజీ సర్పంచ్ బండి కృష్ణగౌడ్ మాట్లాడుతూ బెల్ట్ షాపుల వల్ల గ్రామంలో చాలా మంది మద్యానికి బానిసలు అవుతున్నారని, కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయన్నారు. ముఖ్యంగా మహిళల నుంచి వస్తున్న విజ్ఞప్తి మేరకు గ్రామంలో మద్యాన్ని నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మద్యం అమ్మకాలను నిషేధించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఎం.యాదగిరి, అఖిలపక్ష నాయకులు పబ్బు యాద య్య, బీమగాని నర్సింహ, ఎర్ర చిన్న శంకరయ్య, ఉడుతల సాయిరాం, పానుగంటి లింగస్వామి, బద్దం రాజేశ్వర్, గరిసె జంగయ్య, షేక్ ఇబ్రహీం, చింతల రామకృష్ణ, మహిపాల్నాయక్, శ్రీహరి, శ్రీకాంత్, వంగేటి జంగారెడ్డి, శంకరయ్య, సురేశ్, గోపాల్, ఎర్ర లక్ష్మణ్, శెట్టి మల్లేశ్, గడ్డం శెట్టి, భిక్షపతి, విక్రమ్, రాజు, సత్తయ్య, సుర్వి బాలరాజు, రసూల్ తదితరులు పాల్గొన్నారు. ఫ విక్రయిస్తే రూ.25వేలు జరిమానా, గ్రామస్తుల తీర్మానం -
పట్టు వస్త్రాలు అందజేత
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీస్వామి, అమ్మవార్లకు హైదరాబాద్కు చెందిన గడ్డమీది యాదగిరిగౌడ్– భారతి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆదివారం గర్భాలయంలో స్వయంభూల చెంత పట్టు వస్త్రాలకు పూజలు చేయించారు. అనంతరం డీఈఓ భాస్కర్శర్మ, ఆలయ అధికారి గజివెల్లి రఘు సమక్షంలో అర్చకులకు పట్టువస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో టీటీడీ లోకల్ అడ్బయిజరీ మాజీ సభ్యుడు వడ్లోజు వెంకటేష్, గడ్డమీది శ్రావణ్గౌడ్ పాల్గొన్నారు. గుట్ట ఆలయ అర్చకుడు, అధికారులకు పట్టువస్త్రాలు అందజేస్తున్న భక్తుడు గడ్డమీది యాదగిరిగౌడ్ దంపతులు -
ఫలితం తేలేది నేడే..
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధం ఫ చెల్లిన ఓట్లలో సగానికంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా.. వారే విజేత ఫ మధ్యాహ్నం వరకు పూర్తి కానున్న మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఫ మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఎవరూ గెలువకపోతే ఎలిమినేషన్ ఫ రెండో ప్రాధాన్యత ఓట్లు కౌంటింగ్సాక్షి ప్రతినిది, నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం సోమవారం తేలనుంది. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తయింది. రిహార్సల్స్ కూడా నిర్వహించారు. సోమవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. మొత్తం చెల్లిన ఓట్లలో సగం కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటించనున్నారు. 25 టేబుళ్లపై కౌంటింగ్ 3వ తేదీ ఉదయం 7 గంటలకు అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేసి బ్యాలెట్ బాక్స్లను కౌంటింగ్ హాల్కు తీసుకురానున్నారు. 7 గంటల నుంచి 8 గంటల వరకు.. 25 బ్యాలెట్లను ఒక బండిల్ చొప్పున కట్టలు కట్టి డ్రమ్ములో వేస్తారు. 8 గంటలు తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఓట్ల లెక్కింపు కూడా 25 టేబుళ్లపై నిర్వహిస్తున్నారు. ఒక్కో టేబుల్కు వేయి బ్యాలెట్ పేపర్ల చొప్పున లెక్కించనున్నారు. దీంతో మొదటి రౌండ్లోనే మొత్తం పోలైన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. పోలైన ఓట్లు 24,139 నియోజవర్గం పరిధిలో మొత్తం 25,797 ఓట్లు ఉండగా.. అందులో 24,139 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 93.57 శాతం పోలింగ్ నమోదైంది. చెల్లిన ఓట్లలో సగం ఓట్ల కంటే ఒక్క ఓటు అధికంగా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటించనున్నారు. మొదటి ప్రాధాన్యతలో ఫలితం తేలకపోతే ఎలిమినేషన్.. అభ్యర్థులు ఎవరూ మొదటి ప్రాధాన్యత ఓట్లలో విజయం సాధించలేకపోతే.. అప్పుడు ఎన్నికల అధికారులు ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రకటించి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించనున్నారు. పోటీ చేసిన 19 మంది అభ్యర్థుల్లో ఎవరికై తే అతి తక్కువగా ఓట్లు వస్తాయో ఆ అభ్యర్థిని ఎలిమినేషన్ చేసి ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేసారో చూసి ఆ అభ్యర్థులకు కలుపుతారు. అలా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. చెల్లిన ఓట్లలో సగానికి మించి ఒక ఓటును ఎవరు సాధిస్తారో.. అప్పటి వరకు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తే మాత్రం చివరి ఫలితం అర్ధరాత్రి వరకు వెల్లడయ్యే అవకాశం ఉంది. కేటాయించిన సిబ్బంది వీరే.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు 25 టేబుళ్లపై నిర్వహిస్తారు. ఒక్కో టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఒక మైక్రో అబ్జర్వర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. మొత్తం 150 మంది టేబుళ్లపై కౌంటింగ్ కోసం ఉండగా, 20 శాతం రిజర్వు సిబ్బంది ఉంటారు. మరో 200 మంది కౌంటింగ్ సమయంలో సహకరించనున్నారు. 250 మంది పోలీస్ సిబ్బంది కౌంటింగ్ బందోబస్తులో పాల్గొననున్నారు. -
స్కాన్ చేయ్.. మార్కులు వేయ్!
భువనగిరిటౌన్ : జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25 సర్వే మొదలైంది. స్వచ్ఛ భారత్ మిషన్, కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏటా మున్సిపాలిటీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో సర్వే నిర్వహిస్తారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ చర్యలపై ప్రత్యేక బృందాలు సర్వే నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేసేవి. కానీ, కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈసారి ప్రజాభిప్రాయ సేకరణను సులభతరం చేశారు.ఇందుకోసం ఆన్న్లైన్ విధానం తీసుకువచ్చింది.జిల్లావ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీలకు క్యూ ఆర్ కోడ్లను జారీ చేసింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. క్యూఆర్ కోడ్ద్వారా అభిప్రాయం తెలియజేసేందుకు మున్సిపల్ యంత్రాంగం వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తోంది. ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్నివాసికి పది ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలు శుభ్రతపై ఉంటాయి. అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఎవరైనా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయవచ్చు.అప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 ప్రారంభించండి అని చెప్పే మొదటి పేజీ ద్వారా ఒకరు పలకరిస్తారు. నివాసి తర్వాత ఓటీపీ పంపబడే ఫోన్ నంబర్ అడుగుతారు. నమోదు చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అవుతుంది. నివాసి ఇష్టపడే భాషను ఎంచుకుని కొనసాగించవచ్చు. సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవీ.. రాష్ట్రం, జిల్లా, తాము నివాసం ఉండే మున్సిపాలిటీని ఎంచుకోవాలి. మీరు ఈ పట్టణ సంస్థ, నగరంలో నివాసిగా ఉన్నారా.. లింగం, వయస్సు కూడా అడుగుతుంది. ఆపై ‘సర్వే ప్రారంభించు’ అని వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. పది ప్రశ్నలు అప్పుడు మొదలవుతాయి. ● రోజూ చెత్త సేకరణకు మీ ఇంటికి, దుకాణానికి పారిశుద్ధ్య సిబ్బంది వస్తున్నారా.. ● మీ ప్రాంతాన్ని రోజూ ఊడ్చి పరిశుభ్రంగా ఉంచుతున్నారా ● మీ ప్రాంతానికి దగ్గర చెత్త కుప్పలు పేరుకుపోయాయా ● ఇంట్లోని చెత్తను తడి, పొడిగా వేరు చేసి బుట్టల్లో అందేస్తున్నారా ● స్వచ్ఛ ఆటో, ట్రాక్టర్ వారు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారా.. కలిపి తీసుకెళ్తున్నారా.. ● మార్కెట్లు, బజార్లు, పార్కులు, ఉద్యానవనాలు, బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు ఎంత ప్రభావవంతంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు ● మీ పట్టణంలో రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్(ఆర్ఆర్ఆర్) చెత్త కేంద్రాల గురించి మీకు తెలుసా ● మున్సిపాలిటీ పరిధిలో మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయడానికి లైసెన్స్ పొందిన ఆపరేటర్లను మాత్రమే నియమించుకోవాలని మీకు తెలుసా ● మీ ప్రాంతాల్లోని పబ్లిక్ టాయిలెట్ల శుభ్రత, నిర్వహణపై ఎంత వరకు సంతృప్తి చెందారు ● మీరు ఎప్పుడైనా పారిశుద్ధ్య సమస్యను స్థానిక అధికారులకు రిపోర్టు చేశారా.. దాన్ని ఎలా పరిష్కరించారు ప్రజలు సహకరించాలి స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా మున్సిపాలిటీలు అందజేస్తున్న సేవలపై ప్రజలు ఆన్లైన్ ద్వారా సర్వేలో పాల్గొనాలి. పలు రకాల సేవలపై ప్రజలిచ్చిన అభిప్రాయాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో మున్సిపాలిటీకి ర్యాంకులు కేటాయిస్తుంది. మున్సిపాలిటీల్లో ప్రజలంతా పాల్గొంటేనే ఈ విభాగంలో మంచి మార్కులొస్తాయి. క్యూఆర్ కోడ్ విధానం ద్వారా అభిప్రాయాన్ని తెలియజేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అభిప్రాయం తెలియజేసి ఉత్తమ ర్యాంకు సాధనకు సహకరించాలి. –రామలింగం, భువనగిరి మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీల్లో పరిశుభ్రతపై సర్వే ఫ మార్కుల ఆధారంగా ర్యాంకు ఫ ప్రజాభిప్రాయ సేకరణకు ఈసారి నూతన విధానం ఫ అందుబాటులోకి క్యూ ఆర్ కోడ్ ఫ స్కాన్ చేసి అభిప్రాయం తెలియజేయాలని మున్సిపల్ యంత్రాంగం ప్రచారం మొత్తం మార్కులు 12,500ఓడీఎఫ్, మంచినీరు 1,200గార్బేజ్ ఫ్రీ సిటీ 1,300మిగిలిన అంశాలకు 10,000 -
టెన్త్ విద్యార్థులకు 6నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు
భువనగిరి : పదో తరగతి విద్యార్థులకు ఈనెల 6నుంచి 13వ తేదీ వరకు ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదివారం షెడ్యూల్ విడుదల చేశారు. ఇప్పటికే ఫ్రీ ఫైనల్ ప్రాక్టీస్ పరీక్ష – 1,2 పూర్తయ్యింది. ఈ పరీక్షలను మధ్యాహ్నం 1.15నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు నిర్వహించారు. కాగా 6నుంచి జరిగే ఫ్రీ ఫైనల్ పరీక్షల వేళల్లో మార్పులు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులు 8,631 మంది విద్యార్థులు ఉన్నారు. ఫ్రీ ఫైనల్ పరీక్షల వేళల్లో మార్పుల కారణంగా ఉర్దూ పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగనున్నాయి. మాజీ స్పీకర్ శ్రీపాదరావుకు నివాళి భువనగిరిటౌన్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా ఆదివారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి శ్రీపాదరావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక మోటకొండూర్ : మండల కేంద్రానికి చెందిన చామల భానుచందర్రెడ్డి – అర్చన దంపతుల కూతురు చామల లక్ష్మీఅభయారెడ్డి జాతీయస్థాయి అర్చరీ పోటీలకు ఎంపికై ంది. ఆదివారం హైదరాబాద్ కొల్లూరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అండర్–10 విభాగంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో లక్ష్మీఅభయారెడ్డి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం కైవసం చేసుకుంది. ఈనెల 22వ తేదీన విజయవాడలో జరిగే జాతీ యస్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొననుంది. లక్ష్మీఅభయారెడ్డి హైదరాబాద్ ఉప్పల్లోని మెరిడియన్ స్కూల్లో నాలుగో తరగతి చదువు తుంది. రాష్ట్ర అర్చరీ అసోషియేషన్ చైర్మన్ టి. రాజు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూర్ బ్రాంచ్ చైర్మన్ ఎండీ పవన్కళ్యాణ్, మాస్టర్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ రామారావు చేతుల మీదుగా బంగారు పతకం అందజేశారు. లక్ష్మీ అభయారెడ్డికి, కోచ్ వరికుప్పల స్రవంతికి పలువురు అభినందనలు తెలిపారు. రెండో విడత సర్వేపూర్తి భువనగిరిటౌన్ : పట్టణంలో సమగ్ర కుటుంబ రెండో విడత సర్వే పూర్తయినట్లు భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామలింగం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్వేలో పాల్గొనని కుటుంబాల కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 16నుంచి 28 వ తేదీ వరకు 12 రోజుల పాటు సర్వే చేపట్టినట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో పాల్గొనని 18 కుటుంబాలు రెండో దశ సర్వేలో పాల్గొన్నాయని వెల్లడించారు. ప్రజాపాలన సేవా కేంద్రాలు, టోల్ ఫ్రీనంబర్ ద్వారా, ఆన్లైన్లో ఫామ్ డౌన్ లోడ్ చేసుకుని కుటుంబ వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. -
సన్డే@ 38.2
భువనగిరిటౌన్ : సన్డే మండిపోయింది. ఎండలు మళ్లీ ఒక్కసారిగా పెరడగంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆదివారం జిల్లాలో అత్యధికంగా సంస్థాన్నారాయణపురం మండలంలో 38.2 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదైంది. సగం మండలాల్లో 37 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలుకావడంతో సాయంత్రం 4 గంటల వరకు రహదారులపై జనసంచారం తక్కువగా కనిపించింది. ఉష్ణోగ్రతలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని.. వచ్చినా తలపై టోపీ లేదా గొడుగు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. -
యాదాద్రి భువనగిరి
ఇఫ్తార్ 6–28 (సోమవారం సాశ్రీశ్రీ) సహర్ 5–10 (మంగళవారం ఉశ్రీశ్రీ)నిర్మించారు.. పడావుపెట్టారు యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల మధ్య కంపచెట్లు అధ్వానంగా మారాయి. 7-9లోసోమవారం శ్రీ 3 శ్రీ మార్చి శ్రీ 2025నంబర్ ప్లేట్లు మారుస్తూ.. కారు నంబర్ ప్లేట్లను మారుస్తూ గంజాయి తరలిస్తున్న ముఠాను చౌటుప్పల్ పోలీసులు పట్టుకున్నారు. - 8లో -
శ్రీలక్ష్మీనరసింహుడికి గొడుగులు బహూకరణ
యాదగిరిగుట్ట : సికింద్రాబాద్లోని పద్మారావునగర్కు చెందిన కందుల సురేందర్రావు–తిరుమలదేవి దంపతులు యాదగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారికి రూ.60 వేలు విలువ చేసే గొడుగులు, కర్రలు బహూకరించారు. వీటిని ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, డీఈఓ భాస్కర్శర్మకు ఆదివారం అందజేశారు. స్వామివారి నిత్యారాధనల్లో భాగంగా నిర్వహించే జోడు సేవకు గొడుగు, కర్రలను వినియోగించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీస్వామి వారి అలంకార, వాహన సేవల్లోనూ వాటిని వినియోగించాలని అధికారులను కోరారు. ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, డీఈఓ భాస్కర్శర్మకు గొడుగులు అందజేస్తున్న సురేందర్రావు దంపతులు -
దేవతలకు ఆహ్వానం
ఫ రెండో రోజూ వైభవంగా నృసింహుడి బ్రహ్మోత్సవాలు యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రెండో రోజు ఆదివారం ఆగమశాస్త్రం ప్రకారం వైభవంగా నిర్వహించారు.లోకకల్యాణం, విశ్వశాంతి కోసం ముక్కోటి దేవతలు ఆహుతులుగా సాగే బ్రహ్మోత్సవానికి యాదగిరి క్షేత్రం సిద్ధమైంది. ఆదివారం ఉదయం అగ్నిదేవుడికి ఆరాధన, హవనం, గరుడ ఆళ్వారుడికి ఇష్ట నైవేద్యం, ధ్వజపూజ, రాత్రి దేవతాహ్వాన వేడుకలు నిర్వహించారు. ధ్వజపటం ఊరేగింపు ప్రధానాలయంలో ఆదివారం ఉదయం నిత్యారాధనలు పూర్తయిన అనంతరం ఉత్తరమాడ వీధిలో ఏర్పాటు చేసిన యాగశాలలో యాజ్ఞికులు హోమాధి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వస్త్రంపై తీర్చిదిద్దిన గరుడ ఆళ్వారుడి పటాన్ని ప్రత్యేక పల్లకిపై ఊరేగింపుగా ఉత్తరద్వారం నుంచి ప్రధానాలయ ముఖమండపంలోని ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ఉత్సవమూర్తులకు ధ్వజస్తంభం వద్ద గరుడ ఆళ్వారుడి పటానికి ప్రత్యేక పూజలు చేశారు. రామానుజ కూటము నుంచి భాజాభజంత్రీలు, మేళ తాళాలతో గరుడ ముద్దలు తీసుకుచ్చి మొదటగా స్వయంభూలు, ఉత్సవమూర్తుల వద్ద, ఆ తరువాత గరుత్మంతుడి వద్ద పూజలు చేశారు. అనంతరం ధ్వజపటానికి హారతినిచ్చి, గరుడ ముద్దలను ధ్వజ స్తంభంపైకి ఎగురవేశారు. భేరీ మోగించి.. ప్రధానాలయంలో సాయంత్రం నిత్యారాధనల తర్వాత భేరీపూజ, దేవతాహ్వానం, హవన పూజ నిర్వహించారు. భేరీ మోగించి ముప్పై మూడు కోట్ల దేవతలను భువికి ఆహ్వానించే వేడుక వైభవంగా చేపట్టారు. ఆలయంలో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి అలంకార సేవలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు అలంకార సేవలకు ఆచార్యులు శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం మత్స్య అలంకరా, వేద పారాయణం, రాత్రి 7 గంటలకు శేషవాహన సేవ నిర్వహిస్తారు. -
సమ్మర్.. ఫ ుల్ పవర్
ప్రస్తుతం 8.5 మిలియన్ యూనిట్లు.. ఫిబ్రవరి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో ఇళ్లలో ప్యాన్లు, ఏసీలు, కూలర్ల వాడకం పెరిగింది, మరోవైపు వరి చేలు పొట్టదశలో ఉండడంతో వ్యవసాయానికి విద్యుత్ వినియోగం అధికమైంది. ప్రస్తుతం జిల్లాలో విద్యుత్ వినియోగం రోజూ 8.5 మిలియన్ యూనిట్లు ఉండగా మున్ముందు 9.5 మిలియన్ యూనిట్లకు చేరనుందని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు సిద్దంగా ఉన్నారు. వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా యాక్షన్ ప్లాన్భువనగిరి : ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం అధికమవుతోంది. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, మీటర్లు కాలిపోవడం, లైన్లలో లోపం తదితర అంశాలు సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో విద్యుత్ శాఖ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. వేసవిలో కోతలు లేని కరెంట్ సరఫరా చేయడానికి యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఇందులో కొన్ని పనులు పూర్తి కాగా, మరికొన్ని తుది దశలో ఉన్నాయి. అదనంగా వీటిని ఏర్పాటు చేశారు జనవరి నెలలో జిల్లాలో విద్యుత్ వినియోగం 7.9 మిలియన్ యూనిట్లు ఉండగా ఫిబ్రవరి రెండో వారం నాటికి 8.2 మిలియన్ యూనిట్లకు పెరిగింది. ఎండలు ముదరడంతో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. దీంతో లో ఓల్టేజీ, బ్రేక్డౌన్లు, లైన్లలో లోపాలు తదితర సమస్యలు తలెత్తుతున్నాయి. సమస్యలను అధిగమించి నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా అదనంగా నూతన సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లు ఏర్పాటు చేస్తున్నారు. మూడుసబ్ స్టేషన్లకు గాను రెండు పూర్తికాగా మరొకటి తుదిదశలో పనులు ఉన్నాయి. పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏడు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 101, 11 కేవీ ఫీడర్లు 26, 33 కేవీ ఫీడర్లు ఒకటి, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను 101 ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా అన్నీ పూర్తయ్యాయి. మరమ్మతులకు గురైతే విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు ఫీడర్లను వేరు చేసేలా 10 చోట్ల వీసీబీలను బిగించారు. రోజూ టీసీలు, ప్రతి సోమవారం వీసీలు ఎస్ఈ, డీఈలు, రక్షేత సిబ్బందితో విద్యుత్ శాఖ సీఎండీ రోజూ టెలీకాన్ఫరెన్స్(టీసీ), ప్రతి సోమవారం వీడియో కాన్ఫరెన్స్(వీసీ) నిర్వహించి విద్యుత్ సరఫరా, సమస్యలపై సమీక్షిస్తున్నారు. దీంతో జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఫిర్యాదు చేయాల్సిన నంబర్ 9491065938విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేయడానికి ప్రజల సౌకర్యార్థం ట్రాన్స్కో జిల్లా కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్రూంలో 9491065938 నంబర్ కూడా అందుబాటులో ఉంచారు. వినియోగదారులు నేరుగా లేదా ఫోన్ నంబర్కు కాల చేసి సమస్యను తెలియజేస్తున్నారు. సిబ్బంది తక్షణమే అప్రమత్తమై సమస్యలను పరిష్కరిస్తున్నారు.ఫ డిమాండ్కు అనుగుణంగా కరెంట్ సరఫరా చేసేందుకు చర్యలు ఫ అదనంగా సబ్స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లు ఏర్పాటు ఫ ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనేపరిష్కరించేందుకు కంట్రోల్ రూం ఫ టెలీకాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్న సీఎండీఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తున్నాం వేసవిలో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్తున్నాం. ఉన్నతస్థాయి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అప్రమత్తంగా ఉన్నాం. బ్రేక్డౌన్లు, లో ఓల్టేజీ, మరమ్మతులు.. ఏ సమస్య వచ్చినా యుద్ధప్రాతిపదికన పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నాం. ఏ చిన్న సమస్య వచ్చినా ఫిర్యాదు చేసేందుకు జిల్లా కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచాం. కంట్రోల్ రూంకు నేరుగా, సెల్ నంబర్కు వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. –ఆర్.సుధీకర్కుమార్, విద్యుత్ శాఖ ఎస్ఈ కొత్తగా ఏర్పాటు చేసినవి సబ్స్టేషన్లు 02పవర్ ట్రాన్స్ఫార్మర్లు 07డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 10111 కేవీ ఫీడర్లు 2633 కేవీ ఫీడర్లు 01వీసీబీలు 10విద్యుత్ కనెక్షన్లు ఇలా.. మొత్తం 4,46,443వ్యవసాయ 1,17,476గృహ 2,76,045 పరిశ్రమలు 603 (హైటెన్షన్) పరిశ్రమలు 3,210(లోటెన్షన్ ) ఇతర 50 వేలకు పైగా.. -
‘గుట్ట’కు చేరిన అఖండజ్యోతి
భువనగిరి, యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని చేపట్టిన అఖండజ్యోతి యాత్ర శనివారం రాత్రి యాదగిరిగుట్టకు చేరింది. గత నెల 26వ హైదరాబాద్ బర్కత్పురలోని యాదగిరి భవన్నుంచి ప్రారంభమైన అఖండజ్యోతి యాత్ర.. ఉప్పల్, ఘట్కేసర్, బీబీనగర్ మీదుగా శుక్రవారం రాత్రి భువనగిరిలోని పాత వివేరా హోటల్ వద్దకు చేరుకుంది. శనివారం ఉదయం వివేరా హోట్ల నుంచి బయలుదేరి యాదగిరిగుట్టకు చేరుకుంది. భువనగిరిలో ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, యాదగిరిగుట్టలో ఏసీపీ రమేష్ పూజలు నిర్వహించారు. యాత్ర భువనగిరి పట్టణ అధ్యక్షుడు ఫక్కీర్ కొండల్రెడ్డి, చైర్మన్ సద్ది వెంకట్రెడ్డి, నాయకులు పోత్నక్ ప్రమోద్కుమార్, బర్రె జహంగీర్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కూర వెంకటేశం, సభ్యులు దేవరకొండ నర్సింహాచారి, ఉపేందర్రావు, బాలాజీ, యాదగిరిగుట్ట దేవస్థానం అధికారులు, హిందూ సంఘాల నాయకులు అఖండజ్యోతికి ఘన స్వాగతం పలికారు. -
21న భువనగిరి మీదుగా టూరిస్టు రైలు
భువనగిరి : జిల్లా కేంద్రం భువనగిరి మీదుగా ఈ నెల 21న భారత్ గౌరవ స్పెషల్ టూరిస్టు రైలు వెళ్తుందని సౌత్ సెంట్రల్ జోన్ టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ కిషోర్ సత్య శనివారం ఒక ప్రకటలో తెలిపారు. భువనగిరి స్టేషన్లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై జనగాం, కాజీపేట్, వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడుకు చేరుకుంటుందన్నారు. ప్యాకేజీ రూ.14,250తో ప్రారంభమై కేటగిరీని బట్టి అత్యధికంగా రూ.28,440 వరకు ఉంటుందన్నారు. భారత్ స్పెషల్ టూరిస్టు రైలు ద్వారా రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, శ్రీరంగం, తంజావూర్ ప్రదేశాలకు వెళ్లవచ్చన్నారు. ప్రతి కోచ్లో అన్ని సౌకర్యాలు ఉంటాయని, ఈ అవకాశాన్ని జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 97013 60701, 92810 30711 నంబర్లను సంప్రదించాలని కోరారు. టీఎన్జీఓ అధ్యక్ష, కార్యదర్శుల నియామకం భువనగిరి : వైద్యారోగ్యశాఖ టీఎన్జీఓ(తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం) జిల్లా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకం జరిగింది. హైదరాబాద్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సమావేశ మందిరంలో శనివారం ఏర్పాటు చేసిన తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల ఫోరం సెంట్రల్ కమిటీ సమావేశంలో వారిని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొనిరెడ్డి వెంకటరమణారెడ్డి, జనరల్ సెక్రటరీగా బోనగిరి సత్యనారాయణను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మానం జగదీశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. తమ నియామకానికి సహకరించిన సంఘం పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. సూపరింటెండెంట్గా చిన్నానాయక్ రామన్నపేట : రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్గా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త (డీసీహెచ్ఎస్) డాక్టర్ చిన్నానాయక్ అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ సూపరింటెండెంట్గా పనిచేసిన డాక్టర్ ఈశ్వర్ ఉన్నత చదువుల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్ ఈశ్వర్ను వైద్యసిబ్బంది సన్మానించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని చిన్నానాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు బి.వీరన్న, శ్రీనివాస్, విజయలక్ష్మి, మాధవాచారి పాల్గొన్నారు. ఎన్హెచ్ఆర్సీ జిల్లా చైర్మన్గా భిక్షపతి మోత్కూరు : జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్హెచ్ఆర్సీ) జిల్లా చైర్మన్గా మోత్కూరు మండలం దత్తప్పగూడేనికి చెందిన ముక్కెర్ల భిక్షపతి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా అడ్డగూడూరుకు మందుల శ్రీకాంత్, అధికార ప్రతినిధిగా భువనగిరికి చెందిన బొల్లెద్దు ప్రవీణ్ను నియమించారు. -
అప్రమత్తంగా ఉండాలి
భువనగిరి : వేసవిలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ సీజీఎం చక్రపాణి సూచించారు. శనివారం భువనగిరిలోని ఎస్ఈ కార్యాలయంలో విద్యుత్ అధికారులతో సమావేశమైన వేసవిలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు రూపొందించిన యాక్షన్ప్లాన్ను సమీక్షించారు. డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయాలని, కొత్తగా చేపట్టిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. సరఫరాలో ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించాలన్నారు. సమావేశంలో ఎస్ఈ సుధీకర్కుమార్, భువనగిరి, చౌటుప్పల్ డీఈలు వెంకటేశ్వర్లు, మల్లికార్జున్, డీఈ టెక్నికల్ శ్రీనివాసచారి, డీఈఎంఎల్టీ భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేపే ఎమ్మెల్సీ కౌంటింగ్
ఓట్ల లెక్కింపునకు సహకరించాలిఫ నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్లగొండ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సవ్యంగా జరిగేందుకు సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. శనివారం ఆమె కలెక్టరేట్లో అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కౌంటింగ్ టేబుళ్లు, చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లని ఓట్ల గుర్తింపు తదితర అంశాలను వివరించారు. సాధారణ పరిశీలకుల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. 25 టేబుల్స్పై ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ఫ మధ్యాహ్నం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఫ గెలుపునకు సరిపడా ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ విధానం ఫ ఆ తరువాత రెండో ప్రాధాన్యత ఓట్లు కౌంటింగ్.. ఫ సోమవారం అర్ధరాత్రి తర్వాత తేలనున్న ఫలితంసాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులు దృష్టిసారించారు. గురువారం పోలింగ్ ముగిసిన తర్వాత 12 జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను నల్లగొండకు తరలించి ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. 3వ తేదీ ఉదయం వాటికి బయటకు తీసి అక్కడే కౌంటింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల్లో 25,797 ఓట్లకు 24,139 ఓట్లు (93.57 శాతం) పోల్ అయ్యాయి. కౌంటింగ్ టేబుల్స్, సిబ్బంది ఇలా..25 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఒక్కో టేబుల్కు ఒక సూపర్వైజర్తో పాటు ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక మైక్రోఅబ్జర్వర్ ఉంటారు. మొత్తంగా 30 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 30 మంది మైక్రోఅబ్జర్వర్లను నియమించారు. మరో 250 మంది సిబ్బందిని స్ట్రాంగ్ రూమ్ల నుంచి బ్యాలెట్ బాక్సులు తీసుకురావడానికి, కౌంటింగ్లో ఇతర పనులకు వినియోగించేందుకు నియమించారు. 250 మంది పోలీసులు భద్రతలో పాలుపంచుకోనున్నారు. ఉదయం 7గంటలకు స్ట్రాంగ్రూంలు ఓపెన్ లెక్కింపు ప్రక్రియలో భాగంగా సోమవారం ఉదయం 7 గంటలకు ఆయా అభ్యర్థులు లేదా వారి తరఫున వచ్చే కౌంటింగ్ ఏజెంట్లు, అబ్జర్వర్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేస్తారు. మొదటి రౌండ్లో 25 పోలింగ్ బూత్లకు చెందిన బాక్సులు ఓపెన్ చేస్తారు. వాటిలో ప్రతి 25 ఓట్లను బండిల్ కట్టి డ్రమ్ములో వేస్తారు. ఆ తర్వాత మళ్లీ స్ట్రాంగ్ రూమ్ల నుంచి మరో 25 పోలింగ్ బూత్లకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చి ఇస్తారు. అలా ఎనిమిదిసార్లు 200 పోలింగ్ బూత్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను తెచ్చి బండిల్స్గా కడతారు. ప్రక్రియ అంతా గంటలో పూర్తవుతుంది. పోలైన ఓట్లలో సగానికి పైగా వస్తేనే.. మొత్తం పోలైన ఓట్లలో ఎన్ని ఓట్లు చెల్లుబాటు అవుతాయో, ఆ చెల్లిన ఓట్లలో సగం ఓట్లకు మించి ఒక ఓటును కలిపి గెలుపు కోటాగా నిర్ణయిస్తారు. మొదటి రౌండ్లో పోలైన ఓట్లలో ఎవరికై తే సగానికి మించి ఒక ఓటు అధికంగా వస్తుందో వారిని మొద టి ప్రాధాన్యత ఓటుతో గెలిచినట్లుగా ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. ఒక వేళ మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా గెలుపు కోటా రాకపోతే రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించాల్సి ఉంటుంది. అంటే ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 24,139 పోల్ అయ్యాయి. అందులో సగానికి మించి 12,070 ఓట్లు సాధించిన అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలుస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడ కోటా ఎవరికి రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి ఎలిమినేట్.. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఎవ్వరు గెలవకపోయినా ఎలిమినేషన్ ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. 19 మంది అభ్యర్థుల్లో ఏ అభ్యర్థికి అతి తక్కువ ఓట్లు వస్తాయో, అతన్ని ఎలిమినేట్చేస్తారు. ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఏయే అభ్యర్థులకు వేశారో, వాటిని వారికి కలుపుతారు. అప్పటికి కూడా గెలుపుకు కోటా రాకపోతే ఆ తర్వాత తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరెవరికి వేశారో ఆయా అభ్యర్థులకు ఓ ఓట్లను కలుపుతారు. అప్పుడు మళ్లీ కోటా వచ్చిందా రాలేదా చూస్తారు. ఎవరికైనా గెలుపు కోటా వస్తే దాంతో గెలిచినట్లుగా భావిస్తా రు. ఒక వేళ కోటా రాకపోతే అదే తరహాలో చివరి అభ్యర్థి వరకు తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేస్తూ వస్తారు. అలా గెలుపు కోటా వచ్చేంత వరకు లెక్కిస్తుంటారు. ఒక వేళ చివరికి 19 మందిలో 17 మంది ఎలిమిట్ అయినప్పటికీ గెలుపు కోటా రాకపోతే చివరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరికి తక్కువ ఓట్లు వస్తాయో వారిని ఎలిమినేట్ చేసి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను 19వ అభ్యర్థికి కలుపుతారు. అప్పటికి కోటా వస్తే సరి. కోటా రాకపోయినా ఎవరైతే ఎలిమినేట్ కాకుండా చివరి వరకు ఉంటారో ఆ అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఏ అభ్యర్థికీ గెలుపు కోటా రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తే మాత్రం కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ఆర్థరాత్రివరకు సమ యం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. -
లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవం
విశ్వక్సేనుడికి తొలిపూజ, స్వస్తివాచనంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం యాదగిరిగుట్ట : భక్తజనబాంధవుడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవాలకు మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ వేదపండితులు శనివారం వైభవంగా శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు ప్రధానాలయంలోని మూలవర్యుల ఆజ్ఞ (అనుమతి)తో పూజలు ప్రారంభించి 10.15కు విశ్వక్సేన ఆరాధన, 10.50గంటలకు స్వస్తివాచన పూజలు చేసి ఉత్సవాలకు తెరలేపారు. విశ్వక్సేనుడికి తొలిపూజ : ఉత్సవాలు నిర్విఘ్నంగా సాగడానికి నిర్దేశించిన మంత్రోచ్ఛరణలతో విశ్వక్సే నుడికి తొలిపూజ నిర్వహించారు. స్వస్తివాచనం, రక్షాబంధనం : విశ్వశాంతి, లోకకల్యాణం కోసం, ప్రాణికోటి, ఇతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని భగవంతుడిని వేడుకొనుట స్వస్తివాచనం విశిష్టత. అనంతరం లోకకల్యాణార్థం సమర్పించబడిన రక్షాబంధనాన్ని స్వీకరించే వేడుక నిర్వహించారు. శాస్త్రోక్తంగా మృత్సంగ్రహణం, అంకురారోపణం సాయంత్రం నిత్య పూజల అనంతరం 6.30 గంటలకు మృత్సంగ్రహణం, అంకురారోపణ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఈఓ భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి పాల్గొన్నారు. ఉత్సవాల్లో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 8 గంటలకు అగ్ని ప్రతిష్ఠ, 11గంటలకు ధ్వజారోహణ వేడుకలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవన పూజలు ఉంటాయి. -
మూసీ శుద్ధీకరణకు డీపీఆర్ తయారు చేయాలి
భూదాన్పోచంపల్లి : మూసీ శుద్ధీకరణను సీపీఎం స్వాగతిస్తుందని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి డీపీఆర్ తయారు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్.వీరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. భూదాన్పోచంపల్లి మండలం పిలాయిపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన సీపీఎం జిల్లా నాయకత్వ స్థాయి శిక్షణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. మూసీ కలుషిత జలాల వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, పంటలు పండడం లేదని, పాడిపరిశ్రమపై ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి మూసీ కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ మాట్లాడుతూ మూసీ శుద్ధీకరణలో ఈటీపీలు, ఎస్టీపీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పార్టీ జెండావిష్కరించి అమరవీరులకు సంతాపం తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, భట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జల్లెల పెంటయ్య, గూడూరు అంజిరెడ్డి, శ్రీనివాసచారి, మండల కార్యదర్శి కోట రాంచంద్రారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, దయ్యాల నర్సింహ, మాయ కృష్ణ, బొల్లు యాదగిరి, ఎంపీ పాష, బొడ్డుపల్లి వెంకటేశ్, గుండు వెంకటనర్సు, సైదులు, యాదిరెడ్డి, అవ్వారు రామేశ్వర్, ఎంఏ ఇక్భాల్, వనం ఉపేందర్, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గడ్డం వెంకటేశం, రాగీరు కిష్టయ్య, కరుణాకర్, గణపతిరెడ్డి, అంజయ్య, శ్రీశైలం, జహాంగీర్, జగన్, అనిల్, మధు, భిక్షపతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్. వీరయ్య -
యాదాద్రి భువనగిరి
ఇఫ్తార్ 6–28 (ఆదివారం సాశ్రీశ్రీ) సహర్ 5–11 (సోమవారం ఉశ్రీశ్రీ)ఎండుతున్న వరి పొలాలు రామన్నపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో పొట్టకొచ్చిన వరి పొలాలు నీరందకపోవడంతో ఎండిపోతున్నాయి. 7- 9లోఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025కనులపండువగా కల్యాణం దంతూరులోని శ్రీబస్వలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. - 9లో -
కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు
భువనగిరి : విద్యార్థుల్లో కంటిచూపు సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని జాతీయ అంధత్వ నియంత్రణ కార్యక్రమ సంయుక్త సంచాలకుడు డాక్టర్ మోతీలాల్నాయక్, డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్ సూచించారు. శనివారం భువనగిరిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యార్థులకు నిర్వహిస్తున్న నేత్ర పరీక్షలను వారు పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 34,400 మంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు చేయగా 2,785 మందికి దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వీరికి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రీస్క్రీనింగ్ చేస్తున్నట్లు తెలిపారు. రీ స్క్రీనింగ్లోనూ దృష్టిలోపం ఉన్నట్లు తేలితే వారికి శస్త్ర చికిత్సకు రెఫర్ చేయడంతో పాటు కళ్ల అద్దాలు అందజేస్తామని చెప్పారు. పాఠశాలల్లో నిర్వహించే కంటి పరీక్షలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి : డీఈఓ
చౌటుప్పల్ : కంప్యూటర్ పరిజ్ఞానం మనిషి జీవితంలో తప్పనిసరి అవసరంగా మారిపోయిందని, దానిపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని డీఈఓ సత్యనారాయణ సూచించారు. చౌటుప్పల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు హైదరాబాద్లోని కొండాపూర్కు చెందిన ఐడీబీఐ బ్యాంకు సమకూర్చిన కంప్యూటర్లను శుక్రవారం పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైనందిన జీవితంలో కంప్యూటర్ భాగమైందన్నారు. అదే విధంగా ఇంగ్లిష్ భాషపైనా ప్రావీ ణ్యం సంపాదించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐడీబీఐ బ్యాంకు మేనేజర్ స్పూర్తి, ప్రధానోపాధ్యాయుడు శివకుమార్, బ్యాంకు అధికారులు గీత, వేణు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం భువనగిరి టౌన్ : నెలసరి అద్దె చెల్లింపు ప్రాతిపదికన సొంతకారు కారు కలిగిన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెలకు 2, 500 కిలో మీటర్ల వరకు తిరగవలసి ఉంటుందని, నెలకు రూ.33,000 అద్దె చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగినవారు ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 8న జాతీయ లోక్ అదాలత్ రామన్నపేట : మార్చి 8న జరిగే జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి ఎస్.ఉషశ్రీ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శిరీష తెలిపారు. శుక్రవారం కోర్టు ఆవరణలో న్యాయవాదులు, పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. లోక్అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చొరవ తీసుకోవాలని కోరారు. రాజీపడి కేసులను పరిష్కరించుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను కక్షిదారులకు వివరించాలని కోరారు. అనంతరంపోలీస్స్టేషన్ల వారీగా రాజీకి అవకాశం ఉన్న కేసుల గురించి చర్చించారు. సమావేశంలో ఎస్ఐలు పి.మల్లయ్య, యుగేందర్, నాగరాజు న్యాయవాదులు ఎం. వెంకట్రెడ్డి, డి.సత్తయ్య, ఎన్.స్వామి తదితరులు పాల్గొన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి యాదగిరిగుట్ట : రైతులు పండించిన పంటలకు కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు డిమాండ్ చేశారు. శనివారం యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం స్టేజీ వద్ద జరిగే అఖిలభారత తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా మహాసభల కరపత్రాలను యాదగిరిగుట్టలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులు తీవ్రంగా నష్టపోతారని, వాటిని రద్దు చేయాలన్నారు. మూసీ పునరుజ్జీవం, గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం మాటకు కట్టుబడి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు బండి జంగమ్మ, కల్లెపల్లి మహేందర్, పేరబోయిన మహేందర్, గోరేటి రాములు, పేరబోయిన బంగారు, గోపగాని రాజు, మాటూరు మల్లయ్య, పాకలపాటి రాజు పాల్గొన్నారు. -
భువనగిరికి చేరిన అఖండ జ్యోతి రథయాత్ర
బీబీనగర్ : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ బర్కత్పురలోని యాదగిరి భవన్ నుంచి బయలుదేరిన స్వామివారి అఖండజ్యోతి రథయాత్రకు బీబీనగర్లో అఖండజ్యోతి కమిటీ సభ్యులు, భక్తులు, రాజకీయ నాయకులు ఘన స్వాగతం పలికారు. బాంబినో వర్మిసెల్లీ పరిశ్రమ ఆధ్వర్యంలో అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ప్రణీతాపింగళ్రెడ్డి, మాజీ సర్పంచ్ భాగ్యలక్ష్మీశ్రీనివాస్, నాయకులు శ్యాంగౌడ్, అంజనేయులు, సత్యనారాయణగౌడ్ బాంబినో కంపెనీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, మేనేజర్ శాస్త్రి, పీఆర్ రఫిక్ తదితరులు పాల్గొన్నారు. భువనగిరి : అఖండజ్యోతి రథయాత్రకు భువనగిరి పట్టణంలో యాత్ర చైర్మన్ సద్ది వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో భక్తులు ఘన స్వాగతం పలికారు. హైదరా బాద్, నల్లగొండ, జంకానగూడెం చౌరస్తాల మీదుగా బస్టాండ్ సమీపం నుంచి వినాయక చౌరస్తా, పాత బస్టాండ్ మీదగా పాత వివేరా హోటల్ వద్దకు రథయాత్ర చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఎంపల్ల బుచ్చిరెడ్డి, జ్ఞాన ప్రకాష్రెడ్డి, ఫక్కీర్ కొండల్రెడ్డి, శెట్టి బాలయ్యయాదవ్, మంచి కంటి వెంకటేశం, దిడ్డి బాలాజీ, దేవరకొండ నర్సింహాచారి, చీకటి మల్ల రాములు, బండారు శ్రీనివాస్, చందా మహేందర్ గుప్తా, మల్లేశం, నర్సింగ్రావు పాల్గొన్నారు. శనివా రం ఉదయం రథయాత్ర యాదగిరిగుట్టకు బయ లుదేరనుందని నిర్వాహకులు తెలిపారు. -
ఎవరి లెక్కలు వారివే!
స్ట్రాంగ్ రూమ్కు ీసీల్ నల్లగొండ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసింది. అనంతరం 12 జిల్లాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను ఆర్జాలబావి సమీపంలోని గోదాం వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో శుక్రవారం భద్రపరిచారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ దగ్గరుండి.. పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్కు సీల్ వేయించారు. ఫ అంచనాలు వేసుకుంటున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫ తామంటే.. తామే గెలుస్తామని ధీమా ఫ ఐదుగురి మధ్యే గట్టి పోటీ ఉంటుందని చెబుతున్న నేతలుసాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్ –ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయన్న అంచనాల్లో అభ్యర్థులు తనమునకలయ్యారు. జిల్లాలు, మండలాల వారీగా పోలింగ్ సరళిని బట్టి గెలుపు తమదంటే.. తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బరిలో 19 మంది ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా ఐదుగురి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు అంచనా వేస్తున్నాయి. పీఆర్టీయూ బలపరిచిన అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి, యూటీఎఫ్ బలపరిచిన, ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీచర్స్ జేఏసీ, కాంగ్రెస్ మద్దతుతో పోటీలో ఉన్న హర్షవర్ధన్రెడ్డి, బీసీ వాదంతో బరిలో ఉన్న పూల రవీందర్, టీపీయూఎస్ బలపరిచిన, బీజేపీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. జిల్లాల వారీగా మారుతున్న బలాలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఒక్కో జిల్లాలో ఒక్కో అభ్యర్థి తమకు అనుకూలంగా ఉంటుందని అంచనాలు వేసుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో తమకు మొదటి ప్రాధాన్య ఓట్లు అధికంగా వస్తాయని పీఆర్టీయూ, బీజేపీ, టీచర్స్ జేఏసీ అభ్యర్థులతోపాటు వారి అనుచరులు చెబుతుండగా, ఖమ్మం జిల్లాలో తమ అభ్యర్థికి అత్యధిక ఓట్లు వస్తాయని యూటీఎఫ్ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. గురుకులాలు, కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలలు, వ్యాయామ, భాషా పండితులు, ఆదర్శ పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కాలేజీల ఉపాధ్యాయ ఓట్లలో తమకే గణనీయంగా వచ్చాయని టీచర్స్ జేఏసీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాల్రెడ్డి హర్షవర్దన్రెడ్డి అనుచరులు చెబుతున్నారు. వరంగల్తోపాటు భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండలో తనకు ఎక్కువ ఓట్లు వస్తాయని టీచర్స్ జేఏసీ అభ్యర్థి అంచనా వేసుకుంటున్నారు. అయితే బహుజన, బీసీ వాదంతో పాటు అంసతృప్తి ఓట్లు తమకే వచ్చాయని, మొదటి ప్రాధాన్య ఓట్లతోనే గెలువబో తున్నామని పూల రవీందర్ అనుచరులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న సంఘాలపై వ్యతిరేక ఓట్లతోపాటు జాతీయవాద భావజాలమున్న ఉపాధ్యాయులంతా తమకే ఓటేశారని బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి అనుచరులు పేర్కొంటున్నారు. గెలుపోటములు నిర్ణయించేది ద్వితీయ ప్రాధాన్య ఓట్లే? హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలో మొదటి ప్రాధా న్య ఓట్లతో కోటా ఓటు సాధ్యం కాదని, ద్వి తీయ ప్రాధాన్య ఓట్లే గెలుపును నిర్ణయిస్తాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. దాదాపుగా మొదటి ప్రాధాన్య ఓట్లు ఆయా సంఘాలు బలపరిచిన అభ్యర్థులకే పడతాయని చెబుతున్నారు. మొదటి ప్రాధాన్య ఓట్లతో గెలుస్తామని, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఎస్టీయూ నేతలు చెబుతున్నారు. మిగితా అభ్యర్థులను బలపరిచిన టీచర్స్ జేఏసీ, టీ పీయూఎస్, బీజేపీ మాత్రం రెండో ప్రాధాన్య ఓట్ల తోనే తుది ఫలితాలు వస్తాయని పేర్కొంటున్నాయి. -
యాదగిరీశుడికి బ్రహ్మోత్సవ శోభ
నేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ఉత్తర మాడ వీధిలో కల్యాణం శ్రీస్వామి, అమ్మవారి తిరుకల్యాణ మహోత్సవానికి రాష్ట్రంతో పాటు దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానాలయ ఉత్తర మాడవీధిలో కల్యాణవేడుక నిర్వహించనున్నారు. కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు రూ.3,000 టికెట్ తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. యాదగిరిగుట్ట : తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదగిరిగుట్ట పంచనారసింహుడి దివ్యక్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. మంగళవారం విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనంతో మొదలై శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలను పాంచరాత్ర ఆగమ సిద్ధాంతానుసారంగా, సంప్రదాయరీతిలో వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, అరటి, మామిడి తోరణా లు, పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు స్వ ర్ణ విమాన గోపురం కొత్త అనుభూతి పంచనుంది. 11 రోజులు జరిగే కార్యక్రమాలు ఇవీ.. ● 1వ తేదీన ఉదయం 10గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు మృత్సంగ్రహణం, అంకురారోపణ ఉంటుంది. ● 2న ఉదయం 8గంటలకు అగ్నిప్రతిష్ఠ, 11గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవన పూజ ● 3న ఉదయం 9 గంటలకు మత్స్యవతార అలంకార సేవ, వేద పారాయణం, రాత్రి 7గంటలకు శేష వాహన సేవ. ● 4న ఉదయం 9గంటలకు వటపత్రశాయి అలంకారం, రాత్రి 7గంటలకు హంసవాహన సేవ. ● 5న ఉదయం 9గంటలకు శ్రీకృష్ణ (మురళీకృష్ణుడు) అలంకారం, రాత్రి 7గంటలకు పొన్న వాహన సేవ. ● 6న ఉదయం 9గంటలకు గోవర్థనగిరిధారి అలంకార సేవ, రాత్రి 7గంటలకు సింహవాహన సేవ. ● 7న ఉదయం 9గంటలకు జగన్మోహిని అలంకారం, రాత్రి 8గంటలకు అశ్వవాహన సేవ, ఆ తరువాత శ్రీస్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం. ● 8న ఉదయం శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై శ్రీస్వామి వారిని ఊరేగింపు నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు గజవాహన సేవ, 8.45 గంటలకు శ్రీస్వామి,అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవం. ● 9న ఉదయం 9గంటలకు శ్రీమహావిష్ణు అలంకార సేవలో గరుఢ వాహనం సేవపై శ్రీస్వామివారి ఊరేగింపు, రాత్రి 8గంటలకు ఆలయ తిరు, మాఢ వీధుల్లో దివ్యవిమాన రథోత్సవం. ● 10న ఉదయం 10.30గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థస్నానం వేడు, రాత్రి 7 గంటలకు పుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం ● 11న ఉదయం 10గంటలకు అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవం, దోపు ఉత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. ప్రథమ ప్రాకార మండపంలో అలంకార, వాహన సేవలు శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైనవి అలంకార, వాహనసేవలు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీస్వామి వారిని అలంకరించి సేవలను తిరు, మాడ వీధుల్లో ఊరేగిస్తారు. తూర్పు మాడ వీధిలో శ్రీస్వామి వారి అలంకార సేవలను వేంచేపు చేసి.. అర్చకులు, పారాయణీకులు, రుత్వికులు పారాయణాలు పఠిస్తారు. అలంకార సేవలను భక్తులకు దర్శించుకునేందుకు వీలుగా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.రూ.3.15 కోట్లు కేటాయించాం బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశాం. ఇందుకోసం రూ.3.15 కోట్ల బడ్జెట్ కేటాయించాం. రోజూ 2,500 మంది భక్తులకు అన్న ప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేశాం. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, బస్సులు, టాయిలెట్లు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్రెడ్డితో పాటు పలువురు మంత్రులకు ఆహ్వానపత్రికలు అందజేశాం. –భాస్కర్రావు, యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓఫ విశ్వక్సేన ఆరాధనతో శ్రీకారం ఫ 7న ఎదుర్కోలు, 8న తిరుకల్యాణం ఫ విద్యుత్ దీపాలతో ఆలయం కనువిందు ఫ భక్తులకు ఈసారి స్వర్ణవిమాన గోపురంతో కొత్త అనుభూతి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలి యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు పాంచరాత్ర ఆగమశాస్త్ర అనుసారంగా నిర్వహిస్తాం. అలంకార, వాహన సేవలు 3వ తేదీన ప్రారంభం అవుతాయి. ప్రధాన ఘట్టాలు ఎదుర్కోలు ఉత్సవం తూర్పు రాజగోపురం ఎదుట, కల్యాణోత్సవం ఉత్తర మాడ వీధిలో నిర్వహిస్తాం. ఆలయ తిరు, మాడ వీధుల్లో రథోత్సవం ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీస్వామి వారి ఆశీస్సులు పొందాలి. –కాండూరి వెంకటచార్యులు, ప్రధానార్చకులు -
కొత్త టీచర్లకు పాఠాలు
భువనగిరి : డీఎస్సీ–2024 ద్వారా నియమితులైన 248 మంది ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో వృత్యంతర శిక్షణ ఇస్తున్నారు. మూడు విడతల్లో భాగంగా తొలుత ఫిబ్రవరి 28న ఎస్జీటీలకు భువనగిరిలోని సాయికృప డిగ్రీ కళాశాలలో శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయి. శిక్షణ ఈ నెల 1,3 తేదీల్లో కొనసాగనుంది. రెండో విడతలో స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులకు 4, 5, 6వ తేదీల్లో నల్లగొండలో, స్పెషల్ ఎడ్యుకేషన్, పీఈటీలకు హైదరాబాద్లో 10, 11, 12వ తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వీటిపై శిక్షణ పాఠ్యపుస్తకాల సద్వినియోగం, తరగతి గది నిర్వహణ, విద్య, అభ్యసన, ప్రమాణాల పెంపు, పాఠ్య ప్రణాళికలు, మూల్యాంకన పద్ధతులు, విధానాలు, ఐసీటీ, ఐఎఫ్పీ, డిజిటల్ బోధన, తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులు డీఎస్సీ–2024 ద్వారా జిల్లాలో 251మందికి గాను 248 మంది ఉపాధ్యాయ పోస్టుల్లో నియామకం అయ్యారు. వీరిలో ఎస్జీటీలు 133, పీఈటీలు ఇద్దరు, మిగిలిన వారు స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారు. ప్రస్తుతం 133 మంది ఎస్జీటీలు, ఎనిమిది మంది ఆర్పీలకు భువనగిరిలోని సాయికృప డిగ్రీ కళాశాలలో శిక్షణ మొదలైంది. వీరికి టీఏతో పాటు భోజన వసతి కల్పిస్తున్నారు. అభ్యసన ప్రక్రియలపై తర్ఫీదు ఫ మూడు దశల్లో శిక్షణ ఫ తొలుత ఎస్జీటీలకు, రెండు, మూడో విడతలో స్కూల్ అసిస్టెంట్లు,భాషా పండితులు, పీఈటీలకు ఫ డీఎస్సీ–2024 ద్వారా 248 మంది ఉపాధ్యాయుల నియామకం సద్వినియోగం చేసుకోవాలి కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులకు వృత్తిపరమైన అంశాలపై అవగాహన కల్పించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నాం. విడుతల వారీగా శిక్షణ ఇస్తున్నాం. ఎస్జీలకు మాత్రమే భువనగిరిలో శిక్షణ ఇస్తున్నారు. మిగతా వారికి నల్లగొండ, హైదరాబాద్లో ఉంటుంది. శిక్షణ ద్వారా తరగతి గది నిర్వహణ, విద్యా ప్రమాణాల పెంపు, బోధన, అభ్యసన ప్రక్రియలపై అవగాహన ఏర్పడుతుంది. ఈ అవకాశాన్ని కొత్త టీచర్లు సద్వినియోగం చేసుకోవాలి. –సత్యనారాయణ, డీఈఓ