హిందూపురం మొదటి నుంచి ఓ ప్రముఖ వర్తక కేంద్రం,రాజకీయంగా పలుకుబడి కలిగిన పట్టణం. మరాఠా యోధుడు మురారి రావు ఈ గ్రామాన్ని కట్టించి తన తండ్రి బిరుదైన హిందూరావు పేరుమీద హిందూపురం అని పేరు పెట్టినట్టు తెలుస్తుంది. ఇక్కడ వర్తకులు ఎక్కువగా వున్నారు సుప్రసిద్ధి గాంచిన లేపాక్షి హిందూపురం తాలూకా లోనిది. కల్లూరి సుబ్బారావు హిందూపురానికి చెందిన వాడే. కళాశాల స్థాపించి ఎందరికో విద్యా దానం చేసిన దాసా గోవిందయ్య చిరస్మరణీయుడు. ఇచ్చట యల్.జి.బాలకృష్ణన్ సూపర్ స్పిన్నింగ్ మిల్లులు స్థాపించి అనేక వేల మందికి ఉపాధి కల్పించాడు. పట్టణ జనాభాలో దాదాపు 25 శాతం మంది ఈ మిల్లుల వల్ల జీవనోపాధి పొందుతున్నారు.