పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గ స్వరూపం
నియోజకవర్గ స్వరూపం: పార్వతీపురం నియోజకవర్గం 1951లో ఏర్పడింది. 2007–08 పునర్వ్యవస్తీకరణ తరువాత పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండలాలుగా ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. మున్సిపాలిటీగా పార్వతీపురం కలదు. గ్రామాలు-219, పంచాయతీలు-89, రెవెన్యూ గ్రామాలు-129 కలవు.
విస్తీర్ణం: 629.24 (చదరపు కిలోమీటర్లు)
ఓటర్లు: మొత్తం ఓట్లు 193314. (పోలింగ్ కేంద్రాలు 233 కలవు. నియోజకవర్గంలో ప్రధానంగా కొప్పులవెలమ, ఎస్సీ కులం ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే నియోజకవర్గంలో 60శాతం వరకు కొప్పుల వెలమ కులస్తులే ఉంటారు.)
భౌగోళిక పరిస్థితులు: ఈ నియోజకవర్గంలో వరి, చెరకు , మొక్కజొన్న, బొప్పాయి పంటలు అధికంగా కలవు. తోటపల్లి కుడి ప్రధాన కాలువ సాగునీటి వసతిగా ఉపయోగపడుతుంది. పార్వతీపురం నియోజకవర్గానికి పార్వతీపురం పట్టణం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఒడిశా రాష్ట్రం ఆనుకొని ఉంది. పంటలపైనే రైతులు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు.
పేరు | పార్వతీపురం |
---|---|
జిల్లా | మన్యం |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
మొత్తం ఓటర్ల సంఖ్య | 193,314 |
పురుషులు | 94,236 |
మహిళలు | 99,039 |