-
జీతాలపై వికృత రాతలు
సాక్షి, అమరావతి: గత సర్కారు హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలు ఇవ్వకుండా పోస్ట్ డేటెడ్ జీవోలతో మభ్యపుచ్చినా ఈనాడు రామోజీకి చీమ కుట్టినట్లైనా అనిపించలేదు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, చివరకు చిరుద్యోగులైన పారిశుధ్య సిబ్బందికి జీతాల పెంపు దేవుడెరుగు.. ఆర్నెల్ల నుంచి ఏడాది పాటు కనీసం జీతాలు ఇవ్వకపోయినా ఒక్క ముక్క కూడా రాయలేదు. ఇప్పుడు పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా సకాలంలో చెల్లిస్తుంటే వక్రీకరణలతో పచ్చ పత్రికలో కట్టు కథలు ముద్రిస్తున్నారు. నాడు దళారీల దందా.. చంద్రబాబు హయాంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, కార్పొరేషన్ ఉద్యోగులకు ఒక్క నెల కూడా సమయానికి జీతాలివ్వలేదు. ఏజెన్సీల పేరిట టీడీపీ నేతలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను దోచుకుతిన్నారు. ఇప్పుడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరీ మధ్య దళారీలు లేకుండా నెల నెలా సకాలంలో వేతనాలు చెల్లిస్తున్నా రామోజీ తప్పుడు కథనాలు వండుతున్నారు. కోవిడ్ లాంటివి లేకున్నా.. ప్రభుత్వ, ప్రభుత్వ కార్పొరేషన్ ఉద్యోగులదీ నాడు అదే దుస్థితి. మొదటి వారంలో జీతాలు అందుకోవడం గగనమే. అంగన్వాడీలకు నెలల తరబడి బకాయిలే. మధ్యాహ్న భోజన కార్మికులకూ బాకీలే. ఇక 108, 104 ఉద్యోగులదీ అదే పరిస్థితి. కొందరికైతే సంవత్సరం దాటినా జీతాలు అందని దయనీయ పరిస్థితులు చంద్రబాబు పాలనలో నెలకొన్నాయి. గత సర్కారు హయాంలో కోవిడ్ లాంటి సంక్షోభం లేదు. లాక్డౌన్లు, ఆర్థిక ప్రగతి మందగమనం లాంటి పరిస్థితులూ ఉత్పన్నం కాలేదు. అయినా సరే ఏనాడూ జీతాలు సకాలంలో ఇచ్చిన పాపాన పోలేదు. సంక్షోభాలను అధిగమిస్తూ సకాలంలో.. కోవిడ్ సంక్షోభంతో పాటు ఆర్థిక మందగమనం లాంటి ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జీతాలు, పెన్షన్లు చెల్లిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రం నిర్వర్తించని విధంగా సంక్షేమాన్ని, నెలకు సుమారు రూ.1,700 కోట్లకు పైగా సామాజిక పెన్షన్ల బాధ్యతనూ నెరవేరుస్తూనే ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులను సక్రమంగా నిర్వర్తిస్తోంది. సీఎం జగన్ ప్రభుత్వం అప్కాస్ ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు తెచ్చింది. దళారీలను నిర్మూలించి ఏజెన్సీ వ్యవస్థను రూపుమాపింది. నేరుగా వారి ఖాతాల్లోకే మొదటి తారీఖు కల్లా జీతాలు జమ చేస్తోంది. ఐఏఎస్ల కంటే ముందుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు, కార్పొరేషన్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తోంది. తొలి ఏడు రోజుల్లోనే క్రమం తప్పకుండా జీతాలు ఇస్తోంది. పొరుగు రాష్ట్రాలతో పోల్చినా, దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చినా ఏపీలో జీతాల చెల్లింపులు చాలా మెరుగ్గా ఉన్నాయన్నది సుస్పష్టం. డిసెంబర్ నెలలో 12వ తేదీ నాటికి సుమారు రూ.6 వేల కోట్లను జీతాల కోసం ప్రభుత్వం చెల్లించింది. అదే పొరుగున ఉన్న రాష్ట్రంలో జిల్లాల వారీగా జీతాల చెల్లింపులు చేస్తున్నారు. ఏ రోజు కూడా మొదటి తారీఖు అనే మాటే లేదు. ప్రతి నెలా తేదీ, ఆ తర్వాతే చెల్లింపులు చేస్తున్నారు. ఇదీ చదవండి: రామోజీ.. అస్మదీయ తకథిమి -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీ అమలు జీవో విడుదల
-
AP: సెలవైనా.. శరవేగంగా
సాక్షి, అమరావతి: కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులకు జీతాలు చెల్లించేలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ట్రెజరీ కార్యాలయాలు సెలవు రోజైన ఆదివారం సైతం శరవేగంగా బిల్లుల ప్రాసెస్ నిర్వహించాయి. ఆర్థికశాఖ ఆదేశాలతో ప్రత్యక్షంగా కలెక్టర్లే రంగంలోకి దిగి ఉద్యోగులు, పెన్షనర్ల బిల్లుల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం నెలాఖరు కావడంతో సాయంత్రం కల్లా పూర్తి చేసేలా అన్ని జిల్లాల్లో ప్రాసెస్ జరుగుతోంది. శని, ఆదివారం అర్ధరాత్రి వరకు ట్రెజరీ ఉద్యోగులు బిల్లులను అప్లోడ్ చేశారు. ట్రెజరీల్లో సుమారు 2 లక్షల బిల్లులు కొత్త పీఆర్సీ ప్రకారం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పే అండ్ అకౌంట్స్లో 50 వేల బిల్లులను అధికారులు ప్రాసెస్ చేశారు. ఆర్థికశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో బిల్లులు సిద్ధం చేస్తున్నారు. నేటి నుంచి పెన్షనర్ల బిల్లులను ఉద్యోగులు సిద్ధం చేయనున్నారు. కాగా, 1వ తేదీ వరకు ఉద్యోగులకు కొత్త జీతాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ సన్నద్ధమవుతుంది. కొత్త జీతాలతో వాస్తవాలు వెల్లడి.. కొత్త పీఆర్సీ ప్రకారం పెరిగిన జీతాలను అందుకోవడం ద్వారా ఉద్యోగులు వాస్తవాలను అర్థం చేసుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది. అందరి జీతాలు పెరిగాయని స్పష్టం చేయాలన్నదే ప్రభుత్వ తాపత్రయం. అందుకనే శరవేగంగా జీతాల బిల్లుల ప్రాసెస్ చేపట్టింది. కొన్ని రాజకీయ శక్తులు పన్నిన కుట్రలకు ఉద్యోగులు బలి కాకుండా కాపాడుకుంటూ నిజం ఏమిటో తెలియజేసేలా చర్యలు చేపట్టింది. జీతాలు తగ్గుతాయన్న ఆరోపణల్లో నిజం లేదని నిరూపించనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగులు, పెన్షనర్లకు చెందిన మొత్తాలను ఫిబ్రవరి 1 నాటికి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీనికి అడ్డుపడే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని గట్టి సంకేతాలనిచ్చింది. విజయనగరంలో ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించిన డీడీవోలకు మెమోలిచ్చారు. తమ ఎత్తుగడలు పారవనే కొన్ని సంఘాలు ఉద్దేశపూర్వకంగా జీతాల బిల్లుల ప్రాసెస్ పనులకు అడ్డుపడుతున్నట్లు తెలిసింది. విజయనగరంలో మెమోలు విజయనగరం జిల్లాలో జనవరి వేతనాల ప్రక్రియ పనులను చేపట్టకుండా కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు అడ్డుకున్నారు. ఆర్థిక శాఖ ఆదేశాలను అమలు చేయని 175 మంది డీడీవోలకు జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి మెమోలు జారీ చేశారు. జిల్లా కేంద్రంలో ట్రెజరీ ప్రధాన కార్యాలయానికి అనుసంధానమైన 177 కార్యాలయాల సిబ్బందికి సంబంధించిన డీడీవోల వివరాలను సేకరించారు. 2 విభాగాల నుంచి మాత్రమే వేతనాల పనులను పూర్తి చేయగా మిగిలిన 175 శాఖల డీడీఓలు ప్రారంభించలేదని గుర్తించి వారందరికీ మెమోలను జారీ చేశారు. సోమవారం కూడా సమయం ఉన్నందున బిల్లుల ప్రాసెస్ జరిగేలా చర్యలు చేపట్టారు. చిత్తూరులో సజావుగా.. చిత్తూరు జిల్లాలో కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లకు బిల్లుల చెల్లింపు జరిగేలా కలెక్టర్ హరినారాయణన్ పర్యవేక్షించారు. జిల్లా ట్రెజరీ కార్యాలయం, 17 సబ్ ట్రెజరీ కార్యాలయాలు ఆదివారం పనిచేసినట్లు చెప్పారు. అలసత్వం వహిస్తే చర్యలుంటాయని హెచ్చరించామన్నారు. ఉత్తర్వులు పాటించాల్సిందే.. ప్రకాశం జిల్లాలో అన్ని శాఖల డీడీవోలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పని చేయాలని ఆదేశించినట్లు కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. అన్ని శాఖల హెచ్ఓడీలు, జిల్లా అధికారులకు డీడీవోలతో పని చేయించాలని, లేనిపక్షంలో మెమోలు జారీ చేయాలని ఆదేశించామన్నారు. పనిచేయని డీడీవోలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఉత్తరాంధ్రలో వేగంగా.. విశాఖపట్నం జిల్లాలో బిల్లుల ప్రక్రియను సోమవారం నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, డీఆర్వో శ్రీనివాసమూర్తి తెలిపారు. మొత్తం 1,299 మంది డీడీవోలుండగా ఇప్పటి వరకు 227 మంది వేతన బిల్లుల ప్రక్రియను ప్రారంభించారన్నారు. 39 మంది డీడీవోలు తమ పనిని పూర్తి చేశారు. మిగిలిన ప్రక్రియ సోమవారం పూర్తి కానుంది. పనిచేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి డీడీఓలు 1,068 మంది ఉండగా ఇప్పటివరకు 180 మంది బిల్లుల పని ప్రారంభించారు. వీరిలో 31 మంది పూర్తి చేశారు. ఉభయ గోదావరిలో రెండు రోజులుగా.. పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా 15 సబ్ ట్రెజరీల్లో 145 మంది ట్రెజరీ ఉద్యోగులు విధుల్లో పాల్గొని పోలీసు, అగ్నిమాపక, ట్రెజరీ, విజలెన్స్, ఏసీబీ తదితర విభాగాల్లో 1,200 మంది ఉద్యోగుల బిల్లులను ప్రాసెస్ చేశారు. 26,800 మంది పింఛనుదారుల బిల్లులను సైతం ప్రాసెస్ చేసినట్టు అధికారులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ట్రెజరీతో పాటు సబ్ ట్రెజరీల్లో రెండు రోజులుగా పోలీసు, ఏపీఎస్పీ, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, న్యాయశాఖ ఉద్యోగుల జీతాల బిల్లులు 8 వేల వరకు పూర్తి చేశారు. పెన్షన్లకు సీఎఫ్ఎంఎస్ ద్వారా ఆన్లైన్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. ఆదేశాలను కచ్చితంగా పాటిస్తాం గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలను ఖాతాల్లో జమ చేసే పనిలో ఖజానా శాఖ ఉద్యోగులు నిమగ్నమయ్యారు. జిల్లాలోని 17 సబ్ ట్రెజరీ కార్యాలయాలతోపాటు కలెక్టరేట్లోని ఖజానా కార్యాలయంలోనూ విధులు నిర్వహిస్తున్నట్లు ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.రాజగోపాలరావు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1కల్లా జిల్లాలోని 39 వేల మంది పెన్షనర్ల ఖాతాల్లోకి నగదు మొత్తం జమ అవుతుందన్నారు. జిల్లాలో 35,706 మంది ఉద్యోగులకు సంబంధించిన ప్రాసెస్ జరుగుతున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో డీడీవోలు 50 బిల్లులను ప్రాసెస్ చేశారని కలెక్టర్ నివాస్ తెలిపారు. జిల్లాలో మొత్తం 1,283 డీడీవోల పరిధిలో 34,346 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు 16,392 మంది ఉద్యోగులకు సంబంధించి ప్రాసెస్ చేసినట్లు చెప్పారు. అనంత, కర్నూలు, నెల్లూరుల్లోను.. అనంతపురం జిల్లాలో ట్రెజరీ ఉద్యోగులు ఆదివారం కూడా విధులకు హాజరయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో డీడీఓలు, ఎస్టీఓలు విధుల్లోకి వచ్చారు. కర్నూలు జిల్లాలో జనవరి నెల వేతనాలను కొత్త పీఆర్సీ ప్రకారం బిల్లులు పంపాలని అన్ని శాఖల డీడీవోలను ఆదేశించినట్టు కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు పోలీసు శాఖ నుంచి బిల్లులు రాగా ట్రెజరీ అధికారులు ప్రాసెస్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో పలు శాఖలకు చెందిన 200 మంది డీడీవోలు జనవరి జీతాల బిల్లులను సిద్ధం చేసి ట్రెజరీకి పంపినట్టు కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు చెప్పారు. మిగతావి కూడా సిద్ధమవుతున్నాయని, సోమవారం వరకు అవకాశం ఉన్నందున మోమోలు ఇవ్వలేదని చెప్పారు. -
జూనియర్లకు లక్షల్లో జీతాలు.. నెంబర్ వన్ స్థానానికి పోటీ పడుతున్న హైదరాబాద్
చారిత్రాత్మక కాస్మోపాలిటన్ నగరం హైదరాబాద్ వేలాది మంది నిరుద్యోగుల కలల స్వప్నం. దేశం నలుమూలల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి చాలా మంది వస్తుంటారు. ఇందులో చాలా మంది లక్ష్యం ఐటీ సెక్టార్లో కొలువు సంపాదించడమే. ఇలా ఉద్యోగన్వేషలో వచ్చే వారికి పెద్ద మొత్తంలో జీతాలు ఆఫర్ చేస్తున్నాయి నగరంలో కోలువైన కంపెనీలు. జీతాలు ఎలా ఉన్నాయి ఐటీ, ఫార్మా, హెల్త్కేర్ సెక్టార్లలో సీనియర్, మిడ్ లెవల్, జూనియర్ కేటగిరీల్లో జీతాలు ఎలా ఉన్నాయమనే అంశంపై రాండ్స్టాండ్ సంస్థ ఇటీవల సర్వే చేపట్టింది. రాండ్స్టాండ్ నివేదికను పరిశీలిస్తే.. ఐటీ సెక్టార్లో హైదరాబాద్ నగరం నంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతోందని తెలుస్తోంది. దేశంలో ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై, కోలక్కతా, బెంగళూరు, హైదరాబాద్, పూనే నగరాల్లో ఐటీ పరిశ్రమ ఎక్కువగా నిలదొక్కుకుంది. ఈ నగరాల డేటాను పరిశీలిస్తే ఐటీ ఎంప్లాయిస్కి ఎక్కువ జీతాలు ఇవ్వడంలో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా హైదరాబాద్ సెకండ్ పొజిషన్లో ఉంది. జీతాల తీరు ఇలా ఇక ఐటీ సెక్టార్లో సీనియర్, మిడ్ లెవల్, జూనియర్ కేటగిరీల్లో జీతాలను పరిశీలిస్తే.. ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరుకి హైదరాబాద్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఐదేళ్ల అనుభవం ఉన్న జూనియర్ లెవల్కి సంబంధించిన ఉద్యోగులకు హైదరాబాద్లో వార్షిక వేతనం రూ.5.93 లక్షలుగా ఉండగా బెంగళూరులో ఇది రూ. 6.71 లక్షలుగా ఉంది. 6 నుంచి 14 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న మిడ్ లెవల్ కేటగిరిలో హైదరాబాద్లో వార్షిక వేతనం 17.71 లక్షలు ఉండగా బెంగళూరులో రూ.18.06 లక్షలుగా ఉంది. 15 ఏళ్లకు పైగా ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ ప్రొఫెషనల్స్ కేటగిరిలో హైదారాబాద్లో యాన్యువల్ శాలరీ రూ. 29.78 లక్షలు ఉండగా బెంగళూరులో రూ. 34.47 శాతంగా ఉంది. స్వల్ప తేడా ఐటీ సెక్టార్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న బెంగళూరు, హైదరాబాద్లలో చెల్లిస్తున్న జీతాలను పరిశీలిస్తే.. జూనియర్ కేటగిరికి సంబంధించి బెంగళూరు, హైదరాబాద్ల మధ్య వ్యత్యాసం 11.6 శాతం ఉండగా మిడ్ లెవల్ కేటగిరిలో ఇది 2 శాతానికే పరిమితమైంది. సీనియర్ కేటగిరిలో మాత్రం హైదరాబాద్ కంటే బెంగళూరులో ఉన్న ఉద్యోగికి 16 శాతం అధికంగా వేతనం అందుతోంది. నవంబర్ వన్ రేసులో గడిచిన పదేళ్లుగా భారీ కంపెనీలను ఆకర్షించడంలో బెంగళూరుతో పోటీ పడుతోంది హైదరాబాద్. అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు గమ్యస్థానంగా హైదరాబాద్ మారింది. అంతేకాదు ఇటీవల కాలంలో స్టార్టప్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ విధానం ఖరారైంది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే జూనియర్, మిడ్ కేటగిరిల్లో బెంగళూనును హైదరాబాద్ దాటవచ్చనే అంచనాలు ఉన్నాయి. చదవండి: ఎక్సెల్లో కొత్త ఫీచర్లు.. చిరకాల డిమాండ్ నెరవేర్చిన మైక్రోసాఫ్ట్ -
ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు జీతాలు తగ్గించొచ్చు: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు ఉద్యోగుల జీతభత్యాలు తగ్గించవచ్చని హైకోర్టు తెలిపింది. జీతాలు తగ్గించకూడదని ఎక్కడా లేదని, అది యజమాని (రాష్ట్ర ప్రభుత్వం) సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ప్రభుత్వం ఆదాయాలు, బడ్జెట్ కేటాయింపులు తదితరాలను కూడా చూసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. జీతాలు తక్కువ ఇచ్చినా, ఎక్కువ ఇచ్చినా వాటి సర్దుబాటు పరిపాటి అని, ఎక్కువ జీతాలు ఇచ్చిన చోట రికవరీ చేస్తామని అంటే మీరెలా అభ్యంతరం చెబుతారని ఉద్యోగులను ప్రశ్నించింది. శాతాల ఆధారంగా కాకుండా వాస్తవ రూపంలో (నగదు) ఎంత పొందుతున్నారో లెక్కలు వేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇది సర్వీసు వివాదమైనందున, రోస్టర్ ప్రకారం తాము విచారణ జరపడం సమంజసం కాదని చెప్పింది. సీజేను సంప్రదించి ఈ వ్యాజ్యాన్ని తగిన బెంచ్ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బి.శ్రీభానుమతి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త వేతన సవరణతో జారీ చేసిన జీవో 1పై ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణ్ణయ్య దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. కోర్టుకు కావాల్సింది వాస్తవ చెల్లింపులే.. పిటిషనర్ తరఫు న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపిస్తూ, అశుతోష్ మిశ్రా కమిషన్ (పీఆర్సీ) నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయలేదన్నారు. ఎక్కువ జీతాలు చెల్లించి ఉంటే రికవరీ చేస్తామని ప్రభుత్వం చెబుతోందన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే జీతాలు తగ్గించవచ్చునని చెప్పింది. కొత్త వేతన సవరణ వల్ల జీతం ఏ రకంగా తగ్గిందో చెప్పాలని కోరింది. మీరు శాతాల్లో తగ్గిందంటున్నారు. శాతం తగ్గినంత మాత్రాన మీ వాస్తవ చెల్లింపులు పెరిగి ఉంటే, తగ్గిందని ఎలా అంటారు? కోర్టుకు కావాల్సింది వాస్తవ చెల్లింపులు మాత్రమే.’ అని తేల్చి చెప్పింది. సమ్మె పేరుతో బెదిరిస్తున్నారు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఏమీ తక్కువ చేయలేదు. పీఆర్సీ నివేదికను కార్యదర్శుల కమిటీ అందరికీ అందుబాటులో ఉంచింది. ఉద్యోగ సంఘాలతో 9 సార్లు చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి సమక్షంలో ఓసారి జరిగాయి. సిఫారసులు ఎలా ఉండబోతున్నాయో ప్రతి ఉద్యోగ సంఘం నేతకూ తెలుసు. ప్రభుత్వం తన ఉద్యోగుల నుంచే సమ్మె బెదిరింపును ఎదుర్కొంటోంది. ప్రజలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తామంటున్నారు. కోర్టు జోక్యాన్ని కోరారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంతో చర్చలు జరపలేరా? ప్రభుత్వం కూడా చర్చలకు ఆహ్వానించింది. చర్చలకు రావాలని స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే కోరారు. వారు చర్చలకు రాకుండా 3 గంటలకు సమ్మె నోటీసు ఇచ్చేందుకు వస్తామని చెబుతున్నారు’ అని వివరించారు. రెవెన్యూ రూ.60 వేల కోట్లకే పరిమితం ‘ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 62కు పెంచాం. గ్రాట్యుటీ రూ.16 లక్షలకు పెంచాం. ప్లాట్ల కేటాయింపులో ఉద్యోగులకు 20 శాతం రిబేటు ఇచ్చాం. వీటన్నింటినీ ఓ ప్యాకేజీ కింద ఇచ్చాం. కొత్త పీఆర్సీ వల్ల ప్రభుత్వంపై రూ.10,825 కోట్ల భారం పడుతుంది. అయినా వారి కోసం భరిస్తున్నాం. అదీ కోవిడ్ పరిస్థితుల్లో. కోవిడ్ వల్ల ప్రభుత్వ ఆదాయం బాగా పడిపోయింది. 2018–19 సంవత్సరంలో రూ.62,473 కోట్లుగా ఉన్న ప్రభుత్వ రెవెన్యూ 2019–20కి రూ.60,933 కోట్లకు, 2020–21కి రూ.60,688 కోట్లకు పడిపోయింది. సాధారణ పరిస్థితుల్లో 15 శాతం వృద్ధితో రెవెన్యూ రూ.75 వేల కోట్లకు చేరాలి. అందుకు భిన్నంగా రూ.60 వేల కోట్లకు పడిపోయింది. 2018–19లో జీతాల చెల్లింపులు రూ.52 వేల కోట్లుగా ఉంటే, 2021–22 నాటికి రూ.67 వేల కోట్లకు చేరింది. ఇవన్నీ ఉద్యోగులకు తెలుసు’ అని శ్రీరామ్ వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. 3 గంటలకు అంటున్నారు కాబట్టి, మధ్యాహ్నం 2.15కు మా ముందుకు రావాలని ఆ ప్రతినిధి బృందానికి చెప్పాలని అంది. ఆ బృందంలో కొందరు సీఎస్ వద్దకు వెళ్లొచ్చని, కొందరు వర్చువల్ విధానంలో మా ముందుకు రావాలని తెలిపింది. 12 మంది వచ్చినా కూడా అభ్యంతరం లేదంది. ఈ వ్యవహారాన్ని వివాదంగా చూడొద్దంది. ఇరుపక్షాల మధ్య ఇగో అవసరం లేదని ధర్మాసనం తెలిపింది. సమయం వృథా చేసినందుకు క్షమించండి భోజన విరామం తరువాత ధర్మాసనం స్పందిస్తూ, ‘మేం బెంచ్ దిగిపోయిన తరువాత మాకో సందేహం వచ్చింది. ఇది పిల్ కాదు. పునర్విభజన చట్ట వివాదం కూడా కాదు. సర్వీస్ వివాదం అవుతుంది. సర్వీసు వివాదంపై మా బెంచ్ ఎలా విచారిస్తుంది అన్న సందేహం వచ్చింది. దీనిపై రిజిస్ట్రీ నుంచి కూడా స్పష్టత కోరాం. ఈ వ్యాజ్యంపై రోస్టర్ ప్రకారం మేం విచారించడం సబబు కాదు. ఈ విషయం తెలియక సమయం వృథా చేశాం. ఇందుకు అందరూ క్షమించాలి’ అని కోరింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
సామాన్యులే స్టార్ క్యాంపెయినర్లు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- కబ్జాల కందికుంట
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
Advertisement